TS Inter 1st Year History Study Material Chapter 6 రాజపుత్రుల యుగం

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 6th Lesson రాజపుత్రుల యుగం Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 6th Lesson రాజపుత్రుల యుగం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాజపుత్రుల పరిపాలనా ముఖ్య లక్షణాలను తెలపండి. –
జవాబు.
5 శతాబ్దాల రాజపుత్రుల పాలనలో భారతదేశం ఎన్నో రకాల అభివృద్ధిని సాధించింది. రాజపుత్రులు గుప్తుల, హర్షవర్ధునుని పాలనా వారసత్వాన్ని స్వీకరించారు. కొన్ని దురదృష్ట పరిస్థితుల వల్ల వారి కీర్తిప్రతిష్టలు క్షీణించాయి. మహ్మదీయుల దండయాత్రల వల్ల రాజపుత్రయుగం విషాదంతో ముగిసింది.

పరిపాలనా విధానం : రాజపుత్రులు చిన్న చిన్న రాజ్యాలను స్థాపించడంవల్ల, వీటిల్లో స్థానికమైన మార్పులతో, చాలావరకు పూర్వపాలనా విధానాన్ని అనుసరించారు. వారి శాసనాల్లో మంత్రి, మహామాత్య, ధర్మాధ్యక్ష, సంధివిగ్రహక, బాండాగారాధిపతి, దండాధ్యక్ష మొదలైన పేర్లతో ఉద్యోగులున్నట్లు తెలుస్తుంది. వీరిలో చాలామంది గుప్త, హర్షయుగా ల్లోని ఉద్యోగులే. పరిపాలనా సౌలభ్యం కోసం తమ రాజ్యాన్ని ‘భోగ’ (రాష్ట్రం) అనే పేరుతో విభజించారు. భోగను కొన్ని విషయాలుగా, విషయాలను మళ్ళీ గ్రామాలుగా విభజించారు. పరిపాలనకు గ్రామమే మౌళికమైన పునాది. సైన్యం : రాజపుత్రులు గొప్ప యోధులు. సమర్థవంతమైన సైన్యాన్ని పోషించారు. రాజపుత్ర సైనికులు సంప్రదాయసిద్ధమైన యుద్ధపద్ధతులను అవలంభించారు. కత్తులు, ఈటెలు, బాణాలు, విల్లంబులు మొదలైనవి ఉపయోగించారు. రాజపుత్రులు .యుద్ధప్రియులైనప్పటికి, వ్యూహరచనలో కాని, ఆయుధాల్లోకాని అవసరమైన మార్పులను తీసుకురాలేకపోవడం వల్ల మహ్మదీయుల దాడిలో సులభంగా ఓడిపోయారు. మహ్మదీయుల సైన్యాలు క్రమశిక్షణ కలిగి యుద్ధంలో ఆరితేరి ఉన్నాయి.

TS Inter 1st Year History Study Material Chapter 6 రాజపుత్రుల యుగం

మతం : గుప్తయుగంలో ప్రారంభమైన మత, సాంస్కృతిక ఉద్యమాలు రాజపుత్రయుగంలో పతాకస్థాయికి చేరుకొన్నాయి. వీరి పోషణలో హిందూ మతానికి నూతన చైతన్యం, బలం చేకూరాయి. ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వల్లభాచార్యులు, నింబార్కుడు, కుమారిలభట్టు చైతన్యుడు, రామానందుడు మొదలైన మతబోధకుల కార్యక్రమాలవల్ల హిందూ మతానికి నూతన ఉత్తేజం వచ్చింది. పురాణాలే వారికి ప్రామాణిక గ్రంథాలైనవి. పురాణాలు తీర్థయాత్రలు చేయడం, వ్రతాలు చేయడం, పురాణాలను పఠించడం వంటి వాటివల్ల కలిగే ప్రయోజనాలను నిర్దేశించాయి. రాజపుత్రులలో చాలామంది శైవులు. కాని విష్ణు, ఆదిత్య, గణపతి వంటి అనేకమంది దేవతలను పూజించారు. ఈ దేవతలకోసం అద్భుతమైన దేవాలయాలను నిర్మించారు. మఠాలు వెలసి ప్రజల్లో ఆధ్యాత్మిక ఐహికజ్ఞానాన్ని వ్యాప్తి చేశాయి. గుజరాత్లో సోలంకీలు జైనమతాన్ని పోషించారు. గుజరాత్లో వారు నిర్మించిన జైన దేవాలయాలు ఈ యుగంనాటి గొప్ప వాస్తునిర్మాణాలుగా పేర్కొనవచ్చు.

ఆర్థికవ్యవస్థ : ప్రజల ముఖ్యవృత్తి వ్యవసాయం. రాజపుత్రులు నీటిపారుదల సౌకర్యాలకోసం విశేషమైన కృషిచేశారు. అందుకోసం, తటాకాలు, కాలువలు, బావులను త్రవ్వించారు. పరమార రాజు ముంజరాజు’సుప్రసిద్ధమైన ముంజేశ్వర్ తటాకమును నిర్మించాడు. రాజపుత్రయుగంలో భూమిశిస్తు అధికంగా ఉండేది. 1/3 నుంచి 1/6 వరకు వసూలు చేసేవారు. వ్యవసాయంతోపాటు వడ్రంగి, నౌకానిర్మాణం, యుద్ధసామాగ్రి తయారి లాంటి పరిశ్రమలు కూడా ఉండేవి. దేశీయ, అంతర్జాతీయ వ్యాపారాన్ని ప్రోత్సహించారు. దేబల్, కాంబే, సొపార, క్విలాన్ పశ్చిమతీరంలోని ప్రధాన ఓడరేవులు. అరబ్ దేశాలతో రాజపుత్రులు వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్నారు.

సమాజం : ఐదు శతాబ్దాల రాజపుత్రుల పాలనలో సామాజికవ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. రాజపుత్రయుగంలో వర్ణవ్యవస్థ కఠినమైంది. స్త్రీలకు సమాజంలో గౌరవం ఉండేది. ఎందరో స్త్రీలు విద్యావంతులై, సాహిత్య, మత చర్చల్లో, లలితకళల్లో, ప్రభుత్వ నిర్వహణలోనే గాక, ఆయుధాలను ఉపయోగించడంలో కూడా ఆరితేరాడు. సుగంధ, దిడ్డ అనే కాశ్మీర్కు చెందిన వితంతురాణులు సైతం విశాల రాజ్యాలను పాలించారు. మందనమిశ్ర భార్య గొప్ప పండితురాలు. మందన మిశ్ర, శంకరాచార్యుల మధ్య జరిగిన సంవాదంలో ఈమే న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. రాజశేఖరుడి భార్య అవంతిసుందరి అసాధారణమైన ప్రతిభ కలిగిన మహిళ.

మొత్తం మీద ఈ యుగంలో స్త్రీల పరిస్థితి దిగజారింది. వారిని మేధాపరంగా తక్కువగా చూసేవారు. స్త్రీలపై అనేక రకాల ఆంక్షలు విధించబడ్డాయి.

ప్రశ్న 2.
రాజపుత్ర యుగం నాటి సాంస్కృతిక పరిస్థితుల ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు.
సాహిత్యం : రాజపుత్రయుగం నాటి సాహిత్యం, కళలు గుప్తయుగం నుంచి ప్రేరణపొందాయి. రాజపుత్రరాజులు వివిధ రకాల విద్యల్లో పాండిత్యాన్ని సంపాదించారు. వీరు తమ ఆస్థానాల్లో సారస్వతాన్ని, కళలను ప్రోత్సహించారు. నలందా విశ్వవిద్యాలయం అంతర్జాతీయ ఖ్యాతిగాంచింది. దూరప్రాచ్యానికి చెందిన శైలేంద్రరాజులు కూడా దీని పోషణకు కృషిచేశారు. బెంగాల్ పాలరాజులు బీహార్లో విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని, ఉద్ధంతపురి, జగద్దల విద్యాకేంద్రాలను స్థాపించి, పోషించారు. పరమార రాజు భోజుడు తన రాజధాని ధారానగరంలో ఒక కళాశాలను స్థాపించాడు. కాశ్మీర్ కవి మంఖ తన శ్రీకంఠచరిత్ర అనే గ్రంథంలో రాజ్యంలో చాలా శాస్త్రపరిషత్తులు ఉండేవని తరువాత. అవి అంతరించిపోయాయని పేర్కొన్నాడు.

రాజపుత్ర రాజుల్లో కొందరు స్వయంగా కవులు, కవి పండిత పోషకులు. పరమార ముంజరాజు, కాశ్మీర్ లొహార రాజులు, అనిహిల్వాడ్ మహిపాలుడు, బెంగాల్ లక్ష్మణసేనుడు, ధారానగరానికి చెందిన భోజరాజు ఈ యుగంనాటి గొప్ప పండితులు. లక్ష్మణసేనుడి ఆస్థానంలో సంస్కృత సాహిత్యంలో “పంచరత్నాలు” అనబడే కవులుండేవారు.. భోజరాజును “కవుల్లో రాకుమారుడు” అంటారు. భోజరాజు కవితలమీద సరస్వతీ కంఠాభరణం, శృంగార ప్రకాశ, రాజనీతిపై యుక్తికల్పతరువు, యోగ సూత్రాలపై వ్యాఖ్యానాలు (రాజమార్తాండ) అనేవి రాసాడు.

వాస్తు శిల్పాలు : రాజపుత్రులు, వాస్తుశిల్పాలకు విశేషమైన కృషిచేశారు. కలంజర్, అజ్మీర్, గ్వాలియర్, చితోడ్, ఉదయ్ పూర్ మొదలైన చోట్ల గిరి దుర్గాలు, అందమైన రాజభవనాలు నిర్మించారు. వారి ఆలయాలు శిథిలాలు నేటికీ ఆ యుగం నాటి కళాత్మక ఔన్నత్యాన్ని చాటి చెబుతున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్, మధ్యభారతదేశంలో మహ్మదీయుల దండయాత్రల మూలంగా చాలావరకు ఇవి పతనమైనాయి. ఢిల్లీలోని ‘కువత్-ఉల్-ఇస్లాం’ మసీదు నిర్మాణంకోసం 26 దేవాలయాలను కూల్చిన సామాగ్రిని ఉపయోగించారు. అజ్మీర్లోని అర్ఘాయి-దిన్-జోంప్రాలోని వేయిస్తంభాలు కనీసం 50 దేవాలయాలు శిథిలాలతో నిర్మించారు. రాజపుత్రయుగం నాటి దేవాలయాల్లో ఎక్కువగా మహ్మదీయ దాడుల్లో శిథిలం అయినప్పటికి ఇంకా నేటికి సజీవంగా ఉన్న నిర్మాణాలు వారి వాస్తుకళానైపుణ్యాన్ని, వాటిపట్ల వారి కళాభిమానాన్ని చాటుతున్నాయి.

పూరీ జగన్నాథాలయం, కోనార్క్ సూర్యదేవాలయం, ఒరిస్సా ఆలయ వాస్తురీతికి ఉదాహరణలు. కోనార్క్ దేవాలయంలోని శిల్పసంపద అద్భుతమైంది. శిల్పకళకు మరొక ముఖ్యకేంద్రం చందేలుల రాజధాని ఖజుర. రాజస్థాన్, గుజరాత్లోని దేవాలయాలు ఉత్తరభారతవాస్తువు ‘నగర’ శైలిలో నిర్మించారు. అబూ పర్వతంపై వస్తుపాల, తేజపాల అనే ఇద్దరు వర్తక సోదరులు, రెండు ‘అందమైన జైన దేవాలయాలను నిర్మించారు. ఇవి గుజరాత్ శైలికి ఉదాహరణలు. ముగింపు : ప్రతీహారులు, పరమారులు, చౌహారులు, గహద్వాలులు మొదలైన రాజపుత్రవంశాలు భారతదేశంలోని వివిధ ప్రాంతాలను పాలించారు. రాజపుత్రవంశాలు భారతదేశంలోని వివిధ ప్రాంతాలను పాలించారు. రాజపుత్ర రాజులు ఎంతోమంది కవులను పోషించారు. స్వయంగా వారు కూడా కవులు, నాటకాలు, వివిధ సాహిత్య గ్రంథాలను రాసారు. ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో నగర శైలిలో దేవాలయాలు నిర్మించారు. వ్యాపారాభివృద్ధి కోసం ఓడరేవులు నిర్మించారు. విక్రమశిల, వల్లభి మొదలైన విశ్వవిద్యాలయాలు ఈ యుగంలోనే స్థాపించబడ్డాయి.

ప్రశ్న 3.
అరబ్బుల దండయాత్రకు గల కారణాలు, ఫలితాలను పేర్కొనండి.
జవాబు.
ఇస్లాం మత విజృంభణ అరేబియా, మధ్య ఆసియా చరిత్రలో ఒక విశిష్ట ఘట్టం. మహ్మద్ ప్రవక్త క్రీ.శ.570-632 ఇస్లాం మత స్థాపకుడు. క్రీ.శ.612లో మహ్మద్ గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని పొందాడు. తాను పొందిన జ్ఞానాన్ని అరేబియాలో బోధించాడు. క్రీ.శ. 632లో తన 62వ ఏట మహ్మద్ ప్రవక్త మరణించాడు. ఏకేశ్వరోపాసన, నిర్గుణోపాసన, పూజారుల ప్రమేయం లేని నిరాడంబర ఆరాధన విధానం, సాంఘిక సమానత్వం మొదలైనవి మహ్మద్ బోధించిన ఇస్లాం మత ముఖ్య సూత్రాలు. ప్రవక్త మరణానంతరం ఉమయ్యద్ వంశ ఖలీఫాలు, ఇస్లాం మత వ్యాప్తికి కృషి చేశారు. వీరి తర్వాత ‘అబ్బాసిద్’ వంశం ఖలీఫా పదవిని పొందింది. ఇస్లాం మతస్థులు ఖలీఫాను తమ రాజకీయ, మతాధినేతగా గుర్తించి గౌరవించారు.

భారతదేశంపై దండెత్తిన మొదటి విదేశీయుల్లో అరబ్బులు మొదటివారు. ప్రాచీన కాలం నుంచే భారతదేశంలో వీరికి వర్తక సంబంధాలు, సాంస్కృతిక సంబంధాలున్నాయి. ఇస్లాం అవతరణ, వ్యాప్తి అరబ్బుల దృక్పథంలో మార్పును తెచ్చింది. అరబ్లు మతం పేరున ఐక్యం అయ్యారు. వారు సిరియా, ఈజిప్ట్, ఉత్తర ఆఫ్రికా, స్పెయిన్ మొదలైన రాజ్యాలను ఆక్రమించి ఇస్లాం వ్యాప్తి చేసారు. ఇదే క్రమంలో ఆఫ్ఘనిస్తాన్, సింద్లను ఆక్రమించాలని వ్యూహం పన్నారు.

ఇస్లాం మతాన్ని అరేబియా నుంచి తూర్పు దిశగా వ్యాప్తి చేయాలన్న అరబ్బుల లక్ష్యం వారిని కాబుల్ ఆక్రమణకు ప్రోత్సహించింది. కాబుల్ విజయం వారిని భారతదేశ సరిహద్దుకు సన్నిహితం చేసింది. వారు అనేకసార్లు భారతదేశ తీరంపై దాడులు చేసి, దోపిడీ చేశారు. క్రీ.శ. 711కంటే ముందు జరిగిన అరబ్బుల దాడులు కేవలం నాటి తీరప్రాంత సిరిసంపదలను కొల్లగొట్టాయి. కానీ భారత భూభాగాలు ఆక్రమించలేదు. ఖలీఫా వాలిద్ అరేబియాను పరిపాలిస్తున్న కాలంలో సింధ్ రాజ్యాన్ని ‘దాహిర్’ పరిపాలించేవాడు. సింధ్ రాజ్యానికి చెందిన కొందరు సముద్ర దొంగలు. ఖలీఫా వాలిద్ కోసం తీసుకొని వెళుతున్న ఓడలపై దాడిచేసి దోచుకున్నారు. ఈ సంఘటన సింధ్ రాజ్యంలోని దేవాల్ ఓడరేవులో చోటుచేసుకుంది. ఖలీఫా తన వైస్రాయిని సింధ్ ప్రాంత సముద్ర దొంగలను శిక్షించమని ఆదేశించారు. సింధ్ రాజ్య పాలకుడైన దాహిర్ న్ను జరిగిన సంఘటనపై సంజాయిషీ అడిగాడు. కానీ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వనందున ఆగ్రహించి ఖలీఫా హజ్జాజ్ను సింధ్ రాష్ట్రంపై భారీ సైన్యంతో దండెత్తమని ఆదేశించాడు. సింధు జయించడానికి రెండుసార్లు బలమైన సైన్యాలను హజాజ్ పంపాడు. కానీ అరబ్బు సేనాధిపతులు ఓడిపోయారు. తుదకు తన అల్లుడైన మహ్మద్ బీన్ ఖాసిం అనేవానిని అపారసైన్యంతో పంపాడు.

TS Inter 1st Year History Study Material Chapter 6 రాజపుత్రుల యుగం

ఖాసిం 25,000 అరబ్బు సైన్యంతో దేబాల్ను ఆక్రమించి దారుణ రక్తపాతానికి తలపడ్డాడు. ఇస్లాం మతం స్వీకరించని వారిని కత్తికి బలి ఇచ్చాడు. నెరూన్, శ్వాన్, శాలమ్ ప్రాంతాలు తేలికగా ఆక్రమించుకున్నాడు. క్రీ.శ. 712లో ఖలీఫా సైన్యాలను, హజ్జాజ్ సేనాధిపతి మహ్మబ్బీన్ ఖాసిం నడిపాడు. అలోర్ వద్ద జరిగిన యుద్ధంలో సింధ్ రాజ్యపాలకుడు దాహిర్ ఓడి, యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విజయం అరబ్బులకు నూతనోత్సాహాన్ని నిచ్చింది. ముల్తాన్పై దండెత్తి ఖాసిం దాన్ని వశపరచుకున్నాడు. ఆ తరువాత ‘కనౌజ్’పై దండెత్తడానికి పథకం రూపొందిస్తున్న సమయంలో తమ యజమాని, ఖలీఫా ఆదేశాలపై స్వదేశం తిరిగి వెళ్ళాడు. అక్కడకు చేరుకోకముందు పన్నిన కుట్రకు బలయ్యాడు.

అరబ్బుల దండయాత్ర విజయవంతం కావడానికి నాటి భారతదేశంలో లోపించిన రాజకీయ అనైక్యత దోహదపడింది. ఈ దండయాత్ర వలన భారతీయ రాజకీయ వ్యవస్థ, సాంఘిక పరిస్థితులు, ఆర్థిక స్థితి, మతాచారాలు తీవ్రంగా మార్పులకు గురయ్యాయి. సుప్రసిద్ధ చరిత్రకారుడు లేన్పల్ అరబ్బుల సింధు ఆక్రమణను సత్ఫలితాలు ఇవ్వని ఘన విజయంగా అభివర్ణించారు. భారతదేశంపై అరబ్బుల దండయాత్రలు విజయవంతమైనప్పటికీ అది శాశ్వతంగా వారి అధికారాన్ని నెలకొల్పలేకపోయింది. ఈ తరువాత కొన్ని సంవత్సరాల పాటు భారతీయులకు విదేశీ దాడుల బెడద తప్పింది. అరేబియా ఇతర ప్రాంతాలలో ఖలీఫా ఆధిపత్యం, హోదా క్రమంగా క్షీణించాయి. అరబ్బుల పతనంలో తురుష్కులు క్రియాశీల పాత్ర పోషించారు.

TS Inter 1st Year History Study Material Chapter 6 రాజపుత్రుల యుగం

ప్రశ్న 4.
మహమ్మద్ గజనీ దండయాత్రల స్వభావం, ఫలితాలను వివరించండి.
జవాబు.
మహ్మద్ ఘజనీ పూర్వీకులు ‘ఘజనీ’ రాజ్యం కేంద్రంగా స్వతంత్ర రాజ్యాన్ని నెలకొల్పారు. సబక్తజిన్ కుమారుడైన ఘజనీ మహ్మద్ క్రీ.శ. 998లో రాజ్యసింహాసనం అధిష్టించాడు. ఇతడు గొప్ప సేనాని. పరిపాలన తొలి దశలోనే అనేక యుద్ధాలు చేసాడు. ఘజనీ సైనిక విజయాలతో ప్రభావితుడైన ఖరీఫా అతడికి సుల్తాన్ హోదాతోపాటు ‘యామన్-ఉద్-దౌలా’ అనే బిరుదుతో సత్కరించాడు. ఆ తరువాత భారతదేశ సిరిసంపదలకు ఆకర్షితుడై, భారతదేశంలో ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయాలన్న పట్టుదలతో తన దృష్టిని భారతదేశంవైపు మరల్చాడు. క్రీ.శ. 1000-1027 మధ్యకాలంలో ఘజనీ భారతదేశంపై దాదాపుగా ప్రతి ఏడాదీ దాడులు జరిపాడని చరిత్రకారుల అభిప్రాయం. తన జీవితకాలంలో సుమారుగా పదిహేడు పర్యాయాలు దాడులు జరిపాడు.

ఘజనీ దండయాత్రల కాలంలో భారతదేశ పరిస్థితులు : నాటికి దేశంలో రాజకీయ అనైక్యత నెలకొంది. అనేక చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలున్నాయి. సింధ్, ముల్తాన్లు అరబ్ అధికారంలో ఉన్నాయి. ఇతర రాజ్యాలలో స్వదేశీ హిందూ పాలకులు అధికారంలో ఉన్నారు. వీరి మధ్య తరచు యుద్ధాలు జరుగుతుండేవి. నాటికి దక్షిణ భారతదేశంలో కళ్యాణి చాళుక్యులు, తంజావూరు చోళులు పరిపాలించేవారు. స్వదేశీ పాలకుల్లో నెలకొన్న శతృత్వం, అనైక్యత, దూరదృష్టి లోపం విదేశీ దాడులు విజయవంతం కావడానికి దోహదం చేసాయి.

ఘజనీ దండయాత్రలు : ఘజనీ తొలి దండయాత్ర క్రీ.శ. 1002లో భటిండా రాజ్యంపై జరిగింది. యుద్ధంలో దాని పాలకుడైన జయపాలుడిని బంధించాడు. అవమానభారాన్ని తట్టుకోలేని జయపాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దండయాత్రతో అపార ధన, కనక రాశులను దోచుకున్నాడు.

క్రీ.శ. 1004లో రెండో దండయాత్ర బెహ్రా రాజ్యంపై జరిపాడు. దీని పాలకుడైన రాయ్ పరాజయం పొందాడు. క్రీ.శ. 1005లో ముల్తాన్ రాజ్యంపై దాడి చేశాడు. ఆ తరువాత దాడిలో ఆనందపాలుడ్ని అతడి మిశ్రులను ఓడించాడు.నాగర్ కోట్, నారాయణపూర్, కాశ్మీర్, స్థానేశ్వరం, మధుర మొదలైన ప్రాంతాలపై దాడులు జరిపాడు.

12వ ధండయాత్ర కనౌజ్ రాజ్యంపై చేశాడు. రాజ్యపాలుడు ఘజనీ సేనల చేతిలో పరాజయం పొందాడు. కనౌజ్జ్య సిరి సంపదలను ఘజనీ సేనలు దోచుకున్నాయి. తరువాత జరిగిన 14వ దాడి గ్వాలియర్పై, 15వ దండయాత్ర కళింజర్పై జరిగాయి.

క్రీ.శ. 1025 సంవత్సరంలో ఘజనీ మహ్మద్ గుజరాత్, కదియవార్ లోని సుప్రసిద్ధ శైవక్షేత్రమైన సోమనాథ్ ఆలయంపై దాడిచేశాడు. అక్కడి శివలింగాన్ని ధ్వంసం చేశాడు. ఆలయ ధనాన్ని, నగలు, ఆభరణాలు దోచుకున్నాడు. క్రీ.శ. 1027 సంవత్సరంలో చివరి దండయాత్ర జాట్లపై జరిగింది. సోమనాథ్ దండయాత్ర నుంచి అపార ధన, కనకరాశులతో తిరిగి వస్తున్న తన సేనలపై జాట్లు జరిపిన దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఘజనీ వారిపై దండెత్తాడు. నిరంతర యుద్ధాలతో, క్షీణించిన ఆరోగ్యంతో క్రీ.శ. 1029లో మరణించాడు.

ఘజనీ ఓటమి : ప్రఖ్యాత చరిత్రకారుడు కొమర్రాజు లక్ష్మణరావు ఘజనీ తన ఏడవ, ఎనిమిదవ, పదవదాడులలో ఓడిపోయాడని భావించారు. అల్బెరూనీ కితాబ్ ఉల్ హింద్ రచన ప్రకారం ఆనందపాలుడి చేతిలో ఘజనీ ఓడిపోయాడు. “నేను “నిన్ను పూర్తిగా పరాభవించాను, ఆ గౌరవం ఇంకెవరికీ దక్కకూడదని నా కోరిక” అని ఉత్తరం కూడా రాసాడని తెలుస్తుంది.

ఘజనీ దండయాత్రల ఫలితాలు : విగ్రహారాధకులను శిక్షించి, ఇస్లాం మతం వ్యాప్తి చేయాలని, భారతదేశంలోని సిరిసంపదలను కొల్లగొట్టాలని అనేకమార్లు జరిపిన దండయాత్రలలో మధుర, కథియావర్, కనౌజ్లలోని అనేక దేవాలయాలు విధ్వంసం అయ్యాయి. ఇస్లాం భారతదేశంలోని అంతర్ భూభాగాలకు విస్తరించింది. ఘజనీకి భారతదేశంపై అధికారాన్ని నెలకొల్పాలనే ఉద్దేశం, లక్ష్యం లేవని చరిత్రకారుల అభిప్రాయం. పంజాబ్ ఆక్రమణ తర్వాత దాన్ని మాత్రమే అతడు ఘజ్నవీడ్ రాజ్యంలో విలీనం చేసుకున్నాడు.

ఘజనీ మహ్మద్ గొప్ప యోధుడు. పట్టుదలకు మారుపేరు. చిన్న ఘజనీ రాజ్యాన్ని సువిశాల మహాసామ్రాజ్యంగా తీర్చిదిద్దాడు. ఇతడు సున్నీమతశాఖను నిష్టగా ఆచరించాడు. మత ఛాందసవాది. ఇతని వారసుల అసమర్థత వలన ఘజనీ వంశం నుంచి అధికారులు ఘోరీ సర్దారుల కైవసం చేసుకున్నారు.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాజపుత్రయుగం నాటి మహిళల స్థితిగతులను వివరించండి.
జవాబు.
ఐదు శతాబ్దాల రాజపుత్రుల పాలనలో సామాజికవ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. రాజపుత్రయుగంలో వర్ణవ్యవస్థ కఠినమైంది. స్త్రీలకు సమాజంలో గౌరవం ఉండేది. ఎందరో స్త్రీలు విద్యావంతులై, సాహిత్య, మత చర్చల్లో, లలితకళల్లో, ప్రభుత్వ నిర్వహణలోనే గాక, ఆయుధాలను ఉపయోగించడంలో కూడా ఆరితేరాడు. సుగంధ, దిడ్డ అనే కాశ్మీర్కు చెందిన వితంతురాణులు సైతం విశాల రాజ్యాలను పాలించారు. మందనమిశ్ర భార్య గొప్ప పండితురాలు. మందన మిశ్ర, శంకరాచార్యుల మధ్య జరిగిన సంవాదంలో ఈమే న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. రాజశేఖరుడి భార్య అవంతిసుందరి అసాధారణమైన ప్రతిభ కలిగిన మహిళ. మొత్తం మీద ఈ యుగంలో స్త్రీల పరిస్థితి దిగజారింది. వారిని మేధాపరంగా తక్కువగా చూసేవారు. స్త్రీలపై అనేక రకాల ఆంక్షలు విధించబడ్డాయి.

ప్రశ్న 2.
తరాయిన్ యుద్ధాల గురించి సంక్షిప్తంగా రాయండి.
జవాబు.
మధ్యయుగ భారతదేశ చరిత్రలో విశేష ప్రాముఖ్యతగల యుద్ధాలివి. క్రీ.శ. 1191, 1192లో జరిగాయి. ఘోరీ పంజాబ్ తర్వాత ఢిల్లీపై దృష్టి కేంద్రీకరించాడు. ఆ రోజుల్లో ఢిల్లీ, అజ్మీర్ ప్రాంతాలను చౌహాన్ వంశానికి చెందిన ‘పృథ్వీరాజ్ చౌహాన్’ పాలించేవాడు. పృథ్వీరాజ్ రాజపుత్రులలో అసమాన ప్రతిభ, ధైర్యసాహసాలు గల పాలకుడు. తన వైపు ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గ్రహించి సోదర రాజపుత్రులతో కలిసి పోరాడాడు. క్రీ.శ.1191లో మొదటిసారి తరైన్ వద్ద జరిగిన యుద్ధంలో ఘోరీ సేనలను ఓడించాడు. పట్టుదలగా ఘోరీ ఏడాది తిరగకముందే క్రీ.శ. 1192లో రెండోసారి ఢిల్లీ పాలకుడైన పృథ్వీరాజ్పై దాడి చేస్తాడు. ఇరుపక్షాలు రెండోసారి తరైన్ వద్ద తలపడ్డాయి. ఘోరీని రాజపుత్రులు అత్యంత ధైర్యసాహసాలతో ఎదుర్కొన్నప్పటికీ ఓటమి పాలయ్యారు. పృథ్వీరాజ్ యుద్ధంలో వీరమరణం పొందాడు. ఈ విజయంతో ఘోరీ ఢిల్లీ, అజ్మీర్ లను వశపరుచుకున్నాడు. ఆ తరువాత ఘోరీ సరస్సుతీ, సమానా, కుహ్రాన్, హన్సీ ప్రాంతాలను ఆక్రమించాడు. భారతదేశంలో తాను ఆక్రమించిన ప్రాంతాలకు తనకు భానిస, విశ్వాసపాత్రుడైన కుతుబుద్దీన్ ఐబకన్ను రాజప్రతినిధిగా నియమించి తన స్వదేశం తిరిగి వెళ్ళాడు. క్రీ.శ.1194లో ఘోరీ మరోసారి రాజపుత్రుల శక్తిని సంపూర్ణంగా అంతమొందించాలని మరోసారి భారీ సైన్యంతో దండెత్తి వచ్చాడు. కనౌజ్ రాజ్యాన్ని పాలిస్తున్న జయచంద్రుడు ఘోరీని ఎదిరించి చందావర్ వద్ద జరిగిన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ యుద్ధ సందర్భంలో బనారస్ సమీపంలోని అనేక దేవాలయాలను ధ్వంసం చేసాడు. ఆ మరుసటి ఏడాదీ క్రీ.శ.1195 లో బయానా, గ్వాలియర్లపై దండెత్తి వాటిని ఆక్రమించాడు.

మహ్మద్ ఘోరీ క్రీ.శ. 1205లో చివరిసారి భారతదేశంపై ఘక్కర్ల తిరుగుబాటును అణచివేయడానికై దండెత్తాడు. ఘోరీ సేనాధిపతులైన భక్తియార్ ఖిల్జీ, వైస్రాయి కుతుబుద్దీన్లు మీరట్, అలీఘర్, కాశ్మీర్ బులందర్, బెంగాల్, బీహార్ మొదలైన ప్రాంతాలను ఆక్రమించారు. ఘక్కర్ల తిరుగుబాటును అణచివేసి, విజయంతో వెనుతిరుగుతున్న మహ్మద్ ఘోరీ ఘక్కర్లో ఆకస్మిక దాడిలో చనిపోయాడు.

ప్రశ్న 3.
రాజపుత్రయుగం నాటి వాస్తుశిల్పాల గురించి తెలపండి.
జవాబు.
రాజపుత్రులు వాస్తుశిల్పాలకు విశేషమైన కృషిచేశారు. కలంజర్, అజ్మీర్, గ్వాలియర్, చితోడ్, ఉదయ్పూర్ మొదలైన చోట్ల గిరి దుర్గాలు, అందమైన రాజభవనాలు నిర్మించారు. వారి ఆలయాల శిథిలాలు నేటికీ ఆ యుగం నాటి కళాత్మక ఔన్నత్యాన్ని చాటి చెబుతున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్, మధ్యభారతదేశంలో మహ్మదీయుల దండయాత్రల మూలంగా చాలావరకు ఇవి పతనమైనాయి. ఢిల్లీలోని ‘కువత్-ఉల్-ఇస్లాం’ మసీదు నిర్మాణం కోసం 26 దేవాలయాలను కూల్చిన సామాగ్రిని ఉపయోగించారు. అజ్మీర్ లోని అర్ఘాయి-దిన్-జోంప్రాలోని వేయిస్తంభాలు కనీసం 50 దేవాలయాల శిథిలాలతో నిర్మించారు. రాజపుత్రయుగం నాటి దేవాలయాల్లో ఎక్కువగా మహ్మదీయ దాడుల్లో శిథిలం అయినప్పటికి ఇంకా నేటికి సజీవంగా ఉన్న నిర్మాణాలు వారి వాస్తుకళానైపుణ్యాన్ని, వాటిపట్ల వారి కళాభిమానాన్ని చాటుతున్నాయి.

పూరీ జగన్నాథాలయం, కోనార్క్ సూర్యదేవాలయం, ఒరిస్సా ఆలయ వాస్తురీతికి ఉదాహరణలు. కోనార్క్ దేవాలయంలోని శిల్పసంపద అద్భుతమైంది. శిల్పకళకు మరొక ముఖ్యకేంద్రం చందేలుల రాజధాని ఖజుర. రాజస్థాన్, గుజరాత్లోని దేవాలయాలు ఉత్తరభారతవాస్తువు ‘నగర’ శైలిలో నిర్మించారు. అబూ పర్వతంపై వస్తుపాల, తేజపాల అనే ఇద్దరు వర్తక సోదరులు, రెండు అందమైన జైన దేవాలయాలను నిర్మించారు. ఇవి గుజరాత్ శైలికి ఉదాహరణలు.

TS Inter 1st Year History Study Material Chapter 6 రాజపుత్రుల యుగం

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పృధ్వీరాజ్ రాసో గురించి రాయండి.
జవాబు.
రాజపుత్రుల పుట్టుక గురించి మరొక ఆసక్తికరమైన విషయాన్ని “పృధ్వీరాజ్ రాసో” అనే హింది కావ్యంలో చాంద్ బర్దాయ్ అనే కవి తెలియజేసాడు. ఇతడి ప్రకారం అబూ పర్వతం మీద వశిష్ఠుడు చేసిన హోమాగ్ని నుంచి ఉద్భవించిన వీరుడి సంతతి వారైనందువల్ల వీరు అగ్నికుల క్షత్రియులయ్యారని పేర్కొన్నాడు. ఈ యజ్ఞగుండం నుంచి నలుగురు వీరులు ఉద్భవించారని వారు ఒక్కొక్కరు ఒక్కొక్క రాజపుత్ర రాజ్యాన్ని స్థాపించారనే అభిప్రాయం కలదు. చౌహానులు, సోలంకీలు లేదా చాళుక్యులు, పరమారులు, ప్రతీహారులు ఈ వంశీయులని పేర్కొన్నాడు.

ప్రశ్న 2.
రాజతరంగిణి ప్రాధాన్యత,
జవాబు.
ప్రాచీన భారతదేశంలోని ముఖ్యమైన చారిత్రక రచన కల్హణుడు రచించిన ‘రాజ తరంగిణి’. ఇది క్రీ.శ. 1148 సం||లో రచించబడినది. ఇది కాశ్మీర్ : రాజుల చరిత్ర. కాశ్మీర్ వారు చరిత్రపట్ల అత్యంత ఆసక్తిని కనబరిచారని కల్హణుడు తెలియజేసినాడు. చరిత్రపట్ల ఆసక్తిని కలిగిన కల్హణుడు లభించిన ఆధారాలను ఉపయోగించి గొప్పగా రచించాడు.

ప్రశ్న 3.
భోజరాజు రచనలు ఏవి ?
జవాబు.
భోజరాజును “కవుల్లో రాజకుమారుడు” అంటారు. భోజరాజు కవితల మీద ‘సరస్వతీ కంఠాభరణం’, ‘శృంగార ప్రకాశ’ రాజనీతిపై ‘యుక్తికల్ప తరువు’, యోగ సూత్రాలపై ‘రాజమార్తాండ’ వ్యాఖ్యానం రచించాడు.

ప్రశ్న 4.
అరబ్ దండయాత్రల ప్రభావం.
జవాబు.
ఇస్లాం మతాన్ని అరేబియా నుంచి తూర్పుదిశగా వ్యాప్తి చేయాలనేది అరబ్ల లక్ష్యం. దీనికై వారు అనేకసార్లు -దాడులు చేసారు. ఖలీఫా వాలిద్ అరేబియాను పాలిస్తున్న రోజులలో సింధ్ను ‘దాహిర్’ పరిపాలించేవాడు. సింధ్ రాజ్య సముద్ర దొంగలు. ఖలీఫా కోసం తీసుకెళుతున్న ఓడలను దోచుకున్నారు. దీనిపై దాహిర్ను వివరణ అడిగి సరైన సమాధానం లేదనే సాకుతో క్రీ.శ. 712లో మహ్మద్-బీన్-ఖాసిం నేతృత్వంలో దండెత్తాడు. ‘అలోర్’ వద్ద జరిగిన యుద్ధంలో దాహిర్ ఓడి ప్రాణాలు కోల్పోయాడు. భారతీయుల అనైక్యత అరబ్బుల దాడి విజయవంతం కావడానికి తోడ్పడింది. అయితే ఆచార్య లేనప్పూల్ అరబ్బుల సింధు ఆక్రమణను సత్ఫలితాలివ్వని ఘనవిజయంగా వర్ణించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 8 ఢిల్లీ సుల్తానుల యుగం

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 8th Lesson ఢిల్లీ సుల్తానుల యుగం Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 8th Lesson ఢిల్లీ సుల్తానుల యుగం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బాల్బన్ గొప్పతనాన్ని వివరించండి.
జవాబు.
ఘియాసుద్దీన్ – బాల్బన్ (క్రీ.శ. 1266 – 1287) : బానిస వంశ పాలకులందరిలోకెల్లా గొప్ప సుల్తాన్ బాల్బన్. ఇతడు క్రీ.శ. 1205లో మధ్య ఆసియాలోని ఒక చిన్న ‘ఇల్బారీ’ తెగకు చెందిన ప్రభువుల కుటుంబంలో జన్మించాడు. .బాల్యంలో ఇతన్ని మంగోలులు దొంగిలించుకుపోయారు. చివరికి ఎన్నో కష్టాలుపడి భారతదేశానికి చేరుకుని, ఇలుట్మిష్ కొలువులో చేరాడు. జీవిత ఆరంభంలో ఢిల్లీలో నీరుమోసే కూలీగా పనిచేసాడు. క్రీ.శ. 1233 నాటికి ఇలుట్మిష్ కొలువులో ‘ఖాస్టార్’ పదవిని పొందాడు. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి క్రీ.శ. 1233 నాటికే ‘చిహల్గనీ’ ముఠాలో సభ్యుడైనాడు. క్రీ.శ. 1240-1242 నాటి మంగోల్ల దాడి నుంచి ఢిల్లీ రాజ్యాన్ని ప్రజలను రక్షించాడు. సుల్తానా నాసిరుద్దీన్ అభిమానం పొందాడు. సుల్తాన్ తన కూతురునిచ్చి వివాహం జరిపించాడు. క్రీ.శ. 1259, 1260 సంవత్సరాల్లో ఢిల్లీ సుల్తానేత్పై జరిగిన మంగోల్ దాడులను వీరోచితంగా ఎదుర్కొని తిప్పికొట్టాడు. ఇతని శక్తిసామర్థ్యాలు, సుల్తాన్తో ఉన్న సాన్నిహిత్యాన్ని జీర్ణించుకోలేని బాల్బన్ రాజ ధర్మ స్వరూపం – రాజకీయ భావాలు : బాల్బన్ సాధించిన గొప్ప విజయాల్లో పేర్కొనదగినది, ఢిల్లీ సుల్తాన్ హోదాను, స్థాయిని, గౌరవాన్ని ఇనుమడింపచేయుటం. బాబర్ దృష్టిలో సుల్తాన్ పదవి పవిత్రమైంది. రాజరికం దైవదత్తం. సుల్తాన్ భూమిపై భగవంతుని ప్రతినిధి. కాబట్టి అతడు సామాన్య మానవులకంటే ఉన్నతుడు. ప్రజలందరూ అతని మాటను శాసనంగా గౌరవించాలి. ఆచరణలో పెట్టాలి. రాజు ధర్మబద్ధంగా పరిపాలించాలి. సుల్తాన్ పదవి హుందా తనాన్ని పెంచడానికై అతడు పర్షియన్, అరబిక్ రాజరిక సాంప్రదాయాలను తన దర్బారులో ప్రవేశపెట్టాడు. సుల్తాన్ పాదాలకు కాని, సింహాసనాన్ని గాని మంత్రులు, సర్దారులు సాష్టాంగ నమస్కారం చేయాలి. దీన్ని సిబ్డి అని అంటారు. సుల్తాన్ కాలును లేదా సింహాసనాన్ని ముద్దుపెట్టుకోవాలి. దీనినే ‘పైబోస్’ అంటారు. ‘పర్షియనుల పండగ’ ‘నౌరోజ్’ను తన ఆస్థానంలో ప్రవేశపెట్టాడు. సర్దారుల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి గూఢాచారులను నియమించాడు. సుల్తాన్ తన సమానులతోనే తిరగాలి. నలుగురిలో నవ్వరాదు. మద్యం సేవించరాదు. దుఃఖాన్ని బహిరంగంగా వ్యక్తీకరించరాదు. తన నాణేలపై ఖలీపా పేరు ముద్రించాడు. చిహాలనీ – నిర్మూలన : బాల్బన్ ఢిల్లీ సింహాసనం అదిష్టించే నాటికే చిహల్గనీ ముఠా బలోపేతమైంది. గతంలో తాను స్వయంగా, ఆ ముఠా సభ్యుడైన బాల్బన్ దాన్ని విచ్ఛిన్నం చేయడానికి సామ, దాన, భేద, దండోపాయాలు ఉపయోగించాడు. వీని సభ్యులకు గతంలో సుల్తానులు ఇచ్చిన జాగీర్లను రద్దుచేసాడు. ముఠా సభ్యుల్లో కొందరికి పదవులు ఇచ్చి విభజించారు. గూఢాచారి శాఖ నివేదిక ప్రకారం కొందరిని శిక్షించాడు. ఉదా : బెంగాల్ గవర్నరైన (మాలిక్ బక్)ను అవద్ గవర్నరైన హైబతాఖాన్ మొదలైనవారిని అంతమొందించాడు. సుల్తాన్ పదవికి చిహల్గనీ స్వార్థ రాజకీయాల నుంచి శాశ్వత విముక్తి కలిగించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 8 ఢిల్లీ సుల్తానుల యుగం

తుగ్రిలాఖాన్ తిరుగుబాటు : బెంగాల్ గవర్నర్ తుమ్రిలాన్ 1279లో బాల్బను వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. బాల్బన్ తిరుగుబాటును అణచివేసి శిరచ్ఛేధం చేయించాడు.

మంగోలుల దండయాత్ర – మహ్మద్ రాజకుమారుని మరణం : బాల్బన్ సుల్తాన్ గా ఉన్న కాలంలో మంగోలులు ‘ ఢిల్లీ, దాని పరిసరాలపై అనేకసార్లు దండయాత్రలు జరిపినారు. వీరి దాడులను రాజ్యాన్ని, ప్రజానీకాన్ని రక్షించడానికై తన కుమారుడైన ‘మహ్మదు’, బందువులైన షేరన్ను, బుగ్రాఖాణ్ను వ్యాయవ్య సరిహద్దు ప్రాంతాలైన ముల్తాన్, -నయానా, దీపాల్పూర్ రాష్ట్రాల వైస్రాయిలుగా నియమించాడు. ఈ ప్రాంతంలో అదనపు సేనలు నిలిపాడు. క్రీ.శ. 1270లో మంగోలులు ‘లాహోర్’ పై దాడి చేసారు. బాల్బన్ స్వయంగా లాహోర్ సందర్శించి సైన్యాన్ని అక్కడ అదనంగా నిలిపాడు. క్రీ.శ. 1286లో జరిగిన మంగోల్ల దాడిని ఎదుర్కొంటూ బాల్బన్ కొడుకైన మహ్మద్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనతో బాల్బన్ మానసికంగా, శారీరకంగా కృంగిపోయి 1287లో మరణించాడు. బాల్బన్ మరణాంతరం అతని మనవడు కైకుబాద్ ఢిల్లీ సుల్తాన్ అయినాడు. ఇతడి నాలుగు సంవత్సరాల అసమర్థ పాలనను అవకాశంగా తీసుకొని జలాలుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించి 1290లో ఖిల్జీ వంశాన్ని స్థాపించాడు.

ప్రశ్న 2.
అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలనా, మార్కెటింగ్ సంస్కరణలను చర్చించండి.
జవాబు.
అల్లావుద్దీన్ ఖిల్జీ (1296-1316) : ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన వెంటనే అల్లావుద్దీన్ ఖిల్జీ తన మద్దతుదారులైన సర్దారులకు అమీర్లకు అనేక రూపాల్లో బహుమతులు ఇచ్చాడు. ఎవరైతే తన అధికారాన్ని ధిక్కరించారో, వారిని నిర్ధాక్షిణ్యంగా అణచివేశాడు. భారీ సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. వారి రిపోర్టుల ఆధారంగా తన వ్యతిరేకులను క్రూరంగా అంతమొందించాడు. బహిరంగంగా మద్యం అమ్మకాన్ని, సేవించడాన్ని నిషేధించాడు. పండుగలు, ఉత్సవాలు జరుపుకొనడానికై ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేశాడు. రాష్ట్రపాలకుల కదలికలపై, గూఢాచారుల నివేదికల ఆధారంగా శిక్షలు విధించాడు.

దండయాత్రలు : అల్లావుద్దీన్ ఖిల్జీ గొప్ప సైనిక విజేత. విశాల సామ్రాజ్య నిర్మాత. భారీ సైన్యాలను నియమించాడు. వారికి శిక్షణ ఇచ్చాడు. వారికి జీతభత్యాలు చెల్లించడానికి అవసరమైన ధనం ఖజానాలో లేనందువల్ల మిలిటరీ క్యాంటీన్లను పోలిన దుకాణాలను ఢిల్లీ, భటెండా మొదలైన చోట్ల ఏర్పాటు చేసాడు. మార్కెటింగ్ సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు. మంగోల్దాడులను అరికట్టాడు. వేలకొద్ది మంగోల్లను నిర్ధాక్షిణ్యంగా అంతమొందించాడు. వాయవ్య భారతావని సరిహద్దు రక్షణకై అక్కడి కోటలను పటిష్టంచేసి, అదనపు సేవలను నిలిపాడు. గాజీమాలిక్ ఆ ప్రాంతం రక్షణాధికారిగా నియమించాడు. క్రీ.శ. 1296 1325 మధ్యకాలంలో ఉత్తర, మధ్య, దక్షిణ భారతదేశంలోని అనేక రాజ్యాలపై నిరంతర దండయాత్రలు చేసాడు. క్రీ.శ. 1297లో మొదట గుజరాత్పై దండెత్తినాడు. అల్లావుద్దీన్ సేనాధిపతులైన ఉల్లూఖాన్, నస్రతాన్, గుజరాత్లోజైన వాఘేలా వంశానికి చెందిన కర్ణదేవున్ని ఓడించారు. అపార – ధన, కనకరాశులు అల్లావుద్దీన్ సేనల వశమైనాయి.

మార్కెట్ సంస్కరణలు : అల్లావుద్దీన్ ఖిల్జీ గొప్ప పరిపాలనవేత్త. సుల్తాన్ అధికారాలను ఎవరూ ప్రశ్నించే హక్కు లేకుండా నిరంకుశంగా పరిపాలన చేశాడు. తన ఆజ్ఞలను, ఆదేశాలను తప్పనిసరిగా ఆచరణలో పెట్టాడు. ధిక్కరించిన వారిని నిర్ధాక్షిణ్యంగా శిక్షించాడు. సమకాలీన చరిత్రకారులైన పెరిష్టా భారీ సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేసాడనీ, అతని సైన్యం 4,75,000 అశ్వదళం ఉండేదని పేర్కొన్నాడు. ఏ రకమైన మోసాలకు అవకాశం లేకుండా గుర్రాలపై ‘డాగ్’ వేసే పద్ధతి ప్రవేశపెట్టాడు. ప్రతి సైనికుడికి సంబంధించిన వివరాలు ఉన్న ‘హుళియా’ (బయోడాటా) తయారు చేయించాడు. సైన్యానికి చక్కటి శిక్షణ ఇప్పించాడు. సైనికులకు నగదు రూపంలో జీతాలు చెల్లించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. సైనికులకు జీతాలు చెల్లించి, జాగీర్లు ఇచ్చే పద్ధతిని రద్దుచేశాడు. సైనికులకు అవసరమైన ధాన్యాన్ని, ఇతర నిత్యావసర సరుకులను, గుర్రాలను, దాసీలను, మేకలను, వస్త్రాలు, దుప్పట్లు విక్రయించే మండీలను ఏర్పాటు చేశాడు. సుల్తాన్ నిర్ధారించిన ధరలకే ఇక్కడ చౌకగా సైనికులకు అందుబాటులోకి తెచ్చాడు. ‘షహానా-ఇ-మండీ’ కార్యాలయాన్ని ఈ మార్కెటింగ్ సంస్కరణలను పర్యవేక్షించడానికై స్థాపించాడు. ఇది ఢిల్లీ ‘అలమ్ దర్వాజ’ సమీపంలో ఏర్పాటు చేశాడు. మార్కెటింగ్ సంస్కరణలను ధిక్కరించినా, ఆచరణలో పెట్టకపోయినా వర్తకులను శిక్షించడానికి, వారికి లైసెన్సులు జారీ చేయడానికి దివాన్-ఇ-రియాసత్ అనే కార్యాలయాన్ని స్థాపించి దీనికి ఉన్నతాధికారిగా ‘నాయబ్-ఇ-రియాసత్’ అనే ఉన్నతాధికారిని నియమించాడు. అన్ని రకాల వస్తువుల, సరుకుల ధరలు నిర్ణయించి బహిరంగంగా తెలియచేసారు. తక్కువ కొలతలు, తుకాలు వేసి విక్రయించిన వారిని శిక్షించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. శిక్షలు చాలా కఠినంగా ఉండేట్లు ఏర్పాట్లు చేశాడు. బానిస, కూలీ పిల్లల ద్వారా వివిధ రకాల వస్తువులను ఖరీదు చేయించి, తక్కువ తూకం వేసిన వర్తకులను కఠినంగా శిక్షించాడు. ఈ మార్కెటింగ్ సంస్కరణలు యావత్ సామ్రాజ్యంలోని అన్ని వర్గాల ప్రజలకూ, అన్ని ప్రాంతాల్లో ఆచరణలో ఉన్నావన్న కొందరి చరిత్రకారుల వాదన సత్యంకాదు. అల్లావుద్దీన్ ఖిల్జీ సంస్కరణలు అతని మరణంతోనే అంతరించాయి. అవి ప్రజల ఆమోదంతో కాక సైనిక బలం మీద ఆధారపడి కొనసాగించారు.

అల్లావుద్దీన్ భూమిశిస్తు సంస్కరణలు చేశాడు. గ్రామకరణాల, పట్వారీలవద్ద ఉన్న భూమి రికార్డుల ప్రకారం సర్వే చేయించి, భూమి రికార్డులు, పట్టాదార్ రికార్డులు తయారుచేయించాడు. పెద్ద పెద్ద భూస్వాములు కూడా సుల్తాన్ ఖజానాకు భూమిశిస్తు చెల్లించేటట్లు ఆదేశించాడు. అమలు చేయించాడు. అల్లావుద్దీన్ సైనిక విజయాలు, పరిపాలనా సంస్కరణలు అతనికి మధ్యయుగ చరిత్రలో విశేష స్థానాన్ని సంపాదించి పెట్టాయి.

ప్రశ్న 3.
మధ్యయుగం నాటి భక్తి ఉద్యమంపై ఒక వ్యాసం రాయండి.
జవాబు.
ప్రాచీన కాలం నుంచి మధ్యయుగం వరకు నడిచిన భక్తి ఉద్యమంలో క్రింది ప్రధాన లక్షణాలను గమనించవచ్చు.
1) ఈశ్వరుని ఏకత్వంపై గాఢానురక్తి ప్రధాన లక్షణం. ఇందులో ముక్తి సాధనకై భగవంతుడి కృపను పొందడమే భక్తుడి లక్ష్యంగా భావించబడింది.

2) పూజా పునస్కారాలు, కర్మకాండలను వ్యతిరేకించిన భక్తి ఉద్యమకారులు పవిత్రమైన మనస్సు, జీవనం, మానవత్వం, భక్తి వంటివి అనుసరించడం ద్వారా భగవంతుడి కృపను పొందవచ్చు అని బోధించారు.

3) భక్తి ఉద్యమకారులు ఏకేశ్వరోపాసనను బోధించారు. కొందరు సగుణోపాసనను, మరికొందరు నిర్గుణోపాసనను ప్రోత్సహించారు. వైష్ణవుల్లో సగుణోపాసన ప్రసిద్ధమైంది. వారు శ్రీమహావిష్ణువు అవతారాలైన రాముడు లేదా కృష్ణుడిని తమ దేవుడిగా భావించారు. కాగా నిర్గుణోపాసన విగ్రహారాధనను వ్యతిరేకించింది. దేవుడు సర్వాంతర్యామి, మానవుల హృదయాల్లోనే భగవంతుడు ఉన్నాడు అని వారు ప్రచారం చేశారు. సగుణోపాసన, నిర్గుణోపాసనలను రెండింటినీ చిన్న మార్పులతో శంకరాచార్యుడి అద్వైత సిద్ధాంతములో చెప్పబడ్డాయి.

4) ఉత్తర, దక్షిణ భారతదేశ భక్తి ఉద్యమకారులు జ్ఞానం పొందడం ‘భక్తి’లో భాగంగా చెప్పారు. నిజమైన జ్ఞానాన్ని పొందేందుకు గురువు అవసరమని వారు బోధించారు.

5) భక్తి ఉద్యమకారులందరూ కుల వ్యవస్థను వ్యతిరేకించారు. అందువల్ల తక్కువ కులాలవారికి వారు ఆశాజ్యోతి అయ్యారు. భక్తి ఉద్యమకారుల్లో అధికమంది తక్కువ వర్గాల నుంచి వచ్చిన వారు కావడం విశేషం. నామదేవుడు (1270–1350), దర్జీ కుటుంబం, తుకారామ్ (1601-1649) శూద్ర కుటుంబం, కబీర్ దాస్ ముస్లిం మతంలోని నేతకుటుంబం నుంచి వచ్చారు.

6) భక్తి ఉద్యమకారులు పూజారుల పెత్తనాన్ని, సంస్కృత భాషను వ్యతిరేకించారు. ప్రజల భాషలోనే తమ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. అందువల్ల బెంగాలీ, గుజరాతీ, మరాఠి, హిందీ వంటి ప్రాంతీయ భాషలకు స్వర్ణయుగం ప్రారంభమై అభివృద్ధి చెందాయి.

ఈ విధంగా భారతీయ సమాజంలోని అన్ని వర్గాలను భక్తి ఉద్యమం ఆకర్షించింది. హిందూ ప్రజల్లో నూతన నమ్మకాన్ని కలిగించేలా హిందూ మతాన్ని సంస్కరించి, హిందూ, ముస్లిం ప్రజల మధ్య సహృద్భావం సాధించడమే భక్తి ఉద్యమకారుల ప్రధాన లక్షణాలు.

TS Inter 1st Year History Study Material Chapter 8 ఢిల్లీ సుల్తానుల యుగం

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఇలుట్మిష్ సాధించిన విజయాలను వివరించండి.
జవాబు.
ఇలుట్మిష్ (క్రీ.శ. 1211 – 1236) : ఢిల్లీ సుల్తానుల్లో ఇల్ల్యుట్మిష్ పరిపాలించిన పదహేనేండ్ల కాలానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇతడు సాధారణ బానిసస్థాయి నుంచి సుల్తాన్ స్థాయికి ఎదిగినాడు. శక్తిసామర్థ్యాలకు పట్టుదలకు, విశ్వాసానికి ప్రతీక ఇట్టుట మిష్, కుతుబుద్దీన్ ఐబక్ వద్ద బానిసగా పనిచేసాడు. సైన్యాలను నడపడంలో గొప్ప దిట్ట. తన తెలివితేటలచే సుల్తానును ఒప్పించి అతని కుమార్తెనే వివాహమాడాడు.

తన పరిపాలనా కాలంలో అంతరంగిక తిరుగుబాట్లను, విదేశీ దాడులను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. క్రీ.శ. 1214లో గజనీ రాజ్యపాలకుడైన ‘తాజాఉద్దీనాల్డజ్’, ఢిల్లీపై దండెత్తి రాగా దాన్ని ఇలుట్మిష్ తిప్పికొట్టాడు. తన అధికారాన్ని అంగీకరించక, తిరుగుబాటు లేవదీసిన ముల్తాన్ గవర్నర్ ‘నాసిరుద్దీన్ కబాచాను’ క్రీ.శ. 1217లో అణచివేసాడు. ఇతడు బెంగాల్లో చెలరేగిన తిరుగుబాటును అణచివేసాడు. క్రీ.శ. 1227 నాటికి ఇలుట్మిష్ రాజ్య హద్దులు, అధికారం ఢిల్లీ, గ్వాలియర్, ముల్తాన్, ఉచ్, గుజరాత్, బెంగాల్, మాండా, మాళ్వాల వరకు విస్తరించింది. .ఢిల్లీ సుల్తాన్గా ఇల్గుట్మిష్ ‘ఖలీఫా’ను గౌరవించాడు. క్రీ.శ. 1229లో మొదటి ముస్లిం సుల్తాన్ అబ్లాసిద్ ఖలీఫా అల్ మస్తాన్ బిల్హ’ నుంచి అధికారికంగా ఢిల్లీ సుల్తాన్గా గుర్తింపు పొందాడు. ఇతడి మరో గొప్ప విజయం, ఢిల్లీపై జరిగిన చెంఘీజ్ ఖాన్ నేతృత్వంలో జరిగిన మంగోల్ దండయాత్రను తిప్పికొట్టుట.

ఇల్టుట్మిష్ గొప్ప రాజనీతిజ్ఞుడు, పరిపాలనవేత్త, భారతదేశంలో ముస్లిం పరిపాలనా వ్యవస్థకు రూపకల్పన చేసి ఆచరణలో పెట్టినది ఇతడే. భారీ సైన్యాన్ని పోషించాడు. ‘ఇక్తా’ దారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఇతని కాలంలో ‘చిహల్గనీ’ ముఠా (40 మంది స్వార్థ సర్దారుల ముఠా) ఏర్పడింది.

ప్రశ్న 2.
రజియా సుల్తానా గురించి వివరించండి.
జవాబు.
ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన ఏకైక మహారాణి సుల్తానా రజియా. ఇట్టుట్మిష్ కొడుకులు సమర్థులు కానందువల్ల తన వారసురాలిగా తన కుమార్తె రజియాను సుల్తానుగా ప్రకటించాడు. కాని ఇలుట్మిష్ మరణానంతరం ఢిల్లీ సర్దారులు ఇలుట్మిష్ కొడుకుల్లో పెద్దవాడైన ఫిరోజ్ షాను ఢిల్లీ సుల్తాన్ ప్రకటించారు. అయితే అతడు వ్యసనపరుడు కావటంచేత అతడి తల్లి షా తుర్కాన్ పాలించసాగింది. కాని ఆమె అవినీతిపరురాలవటం చేత రజియా సైనికదళ సానుభూర్తి తో ఫిరోజ్న వధించి, ఢిల్లీ సింహాసనాన్ని (క్రీ.శ. 1236-1240) అధిష్టించింది. ఈమె గొప్ప ధైర్య సాహసాలున్న స్త్రీ, సైన్యాలను నడపటంలోను, ప్రభుత్వ నిర్వహణలోను కడు సమర్థురాలు. కాని ఒక స్త్రీ సుల్తాను కావటం తురుష్క సర్దారులు అవమానంగా భావించారు. ఇట్టుటిష్ కాలంలో బానిసలుగా చేరిన వీరు క్రమంగా అమీరులై తమ ప్రాబల్యమును పెంచుకొని ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఈ కూటమినే చిహల్గనీ అంటారు. ఈ కూటమి రజయాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నసాగింది. చిహల్గ్న నిరంకుశాధికారాలను నిర్మూలించి, సుల్తాన్ అధికారమును పెంపొందించటానికి రజియా కొన్ని చర్యలు చేపట్టింది. తురుష్కులు కాని వారికి అనేక ఉన్నతో ద్యోగములలో నియమించింది. రాష్ట్ర గవర్నర్లుగా కొత్త వారిని ఎంపిక చేసింది. మాలిక్ యాకూబ్ అనే అబిసీనియా బానిసను అత్యంత గౌరవప్రదమైన అశ్వదళాధిపతిగా నియమించి అతని పట్ల ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శించింది. రజియా యాకూబైపై అభిమానము చూపటాన్ని సహించలేని ఢిల్లీ సర్దారులు రజియాను పదవీచ్యుతురాలిగా చేయుటకు భటిండా రాష్ట్ర పాలకుడైన కబీర్ ఖాన్తో చేతులు కలిపి రజియాపై కుట్రచేసి ఆమెను అంతము చేయదలచారు. ఈ విషయము తెలిసిన రజియా అపార సైనిక బలముతో బయలుదేరి మొదట లాహోర్ పాలకుడైన కబీర్ ఖాన్ తిరుగుబాటును అణచివేసింది. కాని అల్ తునియా చేతిలో ఓటమి పొంది బందీగా చిక్కుకుంది. ఢిల్లీ సర్దారులు యాకూబు ‘వధించారు. అంతట రజియా ఢిల్లీ నుంచి పారిపోయి. అల్లునియాను వివాహం చేసుకొని పెద్ద సైన్యాన్ని సమకూర్చుకొని ఢిల్లీపై దండెత్తింది. కాని మార్గమధ్యంలోనే రజియా, అల్ తునియాలు హత్యకు (క్రీ.శ 1240) గురయ్యారు.

ప్రశ్న 3.
అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెటింగ్ సంస్కరణలను చర్చించండి.
జవాబు.
ఢిల్లీ సుల్తానుల్లో అత్యంత ప్రతిభావంతుడైన పరిపాలనావేత్తగా అల్లావుద్దీన్ ఖిల్జీ కీర్తింపబడ్డాడు. ప్రపంచ విజేత కావాలని భారీ సైన్యాన్ని పోషించి వారికి జీతం చెల్లించలేక, ప్రతి సైనికుడికి నెల జీతం 234 టంకాలుగా నిర్ణయించాడు. ఈ జీతంతోనే సుఖప్రదమైన జీవితం గడపడానికి నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించి సరఫరా చేయించాడు. నిర్ధారిత సైనిక శిబిరాలున్న చోట నిర్ణీత ధరలకు సుల్తాన్ నుంచి లైసెన్స్ పొందిన వర్తకుల ద్వారా సరుకుల అమ్మకాలను ఏర్పాటు చేయించాడు. దీని వలన సైనికులు లాభపడ్డారు. అన్ని వర్గాల వారికి ఈ సౌకర్యం లేదు. మార్కెటింగ్ సంస్కరణలు పర్యవేక్షించడానికి ‘మాలిక్ యాకూబ్’ అనే అధికారిని నియమించాడు. మార్కెట్ సంస్కరణలు, ధరల నియంత్రణ చేసే శాఖకు దివాన్-ఇ-రియానత్, దానికి ఉప అధికారిగా ‘షహాన-ఇ-మండీ’ నియమించాడు. బి. సంస్కరణలు పకడ్బందీగా అమలు చేసి, తూనికలు, తూకలు, కొలతల్లో మోసానికి పాల్పడిన వర్తకులను కఠినంగా శిక్షించాడు.

ఈ సంస్కరణల ఫలితంగా సైనికులకు చెల్లించిన 234 టంకాల్లో అన్ని ఖర్చులు పోనూ కొంత ధనం మిగిలేదని సైనికులు సంతృప్తి చెందేవారని మొగల్ చక్రవర్తుల సైన్యం కంటే మెరుగ్గా అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యం జీవించారని

ప్రశ్న 4.
మహ్మద్ – బీన్ – తుగ్లక్ కరెన్సీ నాణేలపై ఒక వివరణ రాయండి.
జవాబు.
మహ్మద్-బీన్-తుగ్లక్ ఢిల్లీ సింహాసనము అధిష్టించేనాటికి అతని సామ్రాజ్యంలో వెండి, బంగారు లోహాలతో చేసిన టంకా, జిటాల్ వంటి నాణాలు వాడుకలో ఉన్నాయి. కాని అదేకాలంలో బంగారం, వెండి లోహాల తీవ్ర కొరత ఏర్పడింది. ఈ సమస్యను అధిగమించడానికై సుల్తాన్ కొత్త పథకం రూపొందించాడు. కాని స్పష్టమైన మార్గ నిర్దేశనాలు లేనందువల్ల రాగి, ఇత్తడి నాణాలు ప్రతి కంసాలి ఇంట్లో ముద్రించబడ్డాయి. ద్రవ్యం విలువ గణనీయంగా పడిపోయింది. తప్పును గ్రహించిన సుల్తాన్ టోకెన్ కరెన్సీని రద్దు చేశాడు. అప్పటికే చాలా నకిలీ నాణాలు మార్కెట్లో చెలామణి అయ్యాయి. చివరకు ఈ పథకాన్ని సుల్తాన్ రద్దు చేశాడు.

ప్రశ్న 5.
సికందర్లోడి సాధించిన విజయాలు.
జవాబు.
1451-1481 మధ్యకాలంలో పాలించిన బహలూల్ క్రీ.శ. 1481లో మరణించాడు. ఇతని కుమారుడైన సికిందర్ డీ ఢిల్లీ సింహాసనం అధిష్టించాడు. ఇతడు క్రీ.శ. 1489-1517 వరకు పాలించాడు. ఇతడు సమర్థుడు. ఢిల్లీ సింహాసనంపై ’25 ఏండ్లకుపైగా తన ఆధిపత్యం కొనసాగించాడు. బీహార్ను జయించి తన ఆధిపత్యాన్ని నెలకొల్పాడు. అనేకమంది రాజపుత్ర యోధులను ఓడించాడు. పంజాబ్పై సుల్తాన్ అధికారాన్ని నెలకొల్పాడు. ఇతడు మంచి పరిపాలనావేత్త, రోడ్లు, రహదారులు వేయించాడు. నీటిపారుదల వసతులు కల్పించాడు. హిందువుల పట్ల ఇతడు క్రూరంగా వ్యవహరించి, అనేక దేవాలయాలను ధ్వంసం చేసాడు. క్రీ.శ. 1517లో ఇతడు మరణించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 8 ఢిల్లీ సుల్తానుల యుగం

ప్రశ్న 6.
ఫిరోజ్ తుగ్లక్ పరిపాలనా సంస్కరణలను చర్చించండి.
జవాబు.
మహమ్మద్ బీన్ తుగ్లక్ మరణానంతరం అతని పినతండ్రి కుమారుడు ఫిరోజా తుగ్లక్ ఢిల్లీ సింహాసనాన్ని (క్రీ.శ. 1351-1388) అధిష్టించాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే మహమ్మద్ బీన్ తుగ్లక్ వైఫల్యానికి దారితీసిన కారణాలను గుర్తించి వాటిని సరిదిద్దటానికి పూనుకున్నాడు.
1) యమునా నది నుంచి హిస్సార్ వరకు, సట్లేజ్ నుండి గాగ్రా వరకు, సిరూర్ పరిసర ప్రాంతాల నుంచి హన్సీ వరకు, గాగ్రా నుంచి ఫిరోజాబాద్ వరకు, యమునా నది నుంచి ఫిరోజాబాద్ వరకు మొత్తం ఐదు కాలువలను త్రవ్వించి నీటి వనరులను కల్పించి, బంజరు భూములను సాగులోనికి తీసుకువచ్చి వ్యవసాయమును అభివృద్ధి చేశాడు. దీనివల్ల నీటి పారుదల పన్ను రూపంలో చాలా ఆదాయం రావటమే కాక బంజరు భూముల సాగువల్ల భూమి శిస్తు కూడా గణనీయంగా పెరిగింది.

2) ఫతేబాద్, హిస్సార్, ఫిరోజాబాద్, జౌన్పూర్ మొదలగు నగరాలను నిర్మించాడు. ఢిల్లీ చుట్టూ 1200 ఉద్యానవనాలను వేయించాడు. మహమ్మదీయ పకీర్లకు, హిందూ సన్యాసులకు ఎంతో ధనాన్ని విరాళాలుగా ఇచ్చాడు. దివానీ ఖైరత్ అ ౫౦ ఒక భవనాన్ని నిర్మించి దానిలో పేద మహమ్మదీయ బాలికలకు వివాహాలు జరిపించేవాడు.

3) సిద్ధ ఏర్పాటు చేయక సామంతరాజులు సరఫరా చేసే సైన్యం మీదనే ఆధారపడ్డాడు.

4) బానిసల అవసరాల కోసం ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశాడు. ఈ శాఖ కింద 1,80,000 మంది బానిసలుండే వారు. వీరి నిర్వహణ ఖజానాకు చాలా భారమైంది. పైగా బానిసలు రాజ్య వ్యవహారాల్లో జోక్యం చేసుకొని అనేక కుట్రలు చేసి సుల్తానత్ పతనానికి కారకులయ్యారు.

5) శిస్తును వసూలు చేసుకొనే అధికారాన్ని సర్దారులకిచ్చాడు. కఠిన శిక్షలను రద్దు చేశాడు.

6) రాజ్య పాలనలలో ఉలేమాలను జోక్యం చేసుకోనిచ్చాడు. మత మౌఢ్యంతో ఒరిస్సాలోని భువనేశ్వర ఆలయం, మాళ్వాలోని నాగర్ కోట ఆలయాల ధ్వంసం చేశాడు. ఇతడు షియాల పట్ల కఠినంగా ఉన్నాడు. ఇతని మతవిధానం వలన ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది.

ప్రశ్న 7.
బాల్బన్ రాజరిక ధర్మాన్ని వర్ణించండి.
జవాబు.
ఢిల్లీ సుల్తాన్ హోదాను, అధికారాన్ని, సార్వభౌమత్వాన్ని పరిరక్షించడానికి ఇనుమడింపచేయడానికి బాల్బన్ తన రాజకీయ అభిప్రాయాలను ఆచరణలో పెట్టి విజయం సాధించాడు. బాల్బన్ తన రాజకీయ అభిప్రాయాలను ఆచరణలో పెట్టి విజయం సాధించాడు బాల్బన్. ‘రాజరికం దైవదత్తం’ అని ప్రగాఢంగా విశ్వసించాడు. ‘నియాబత్-ఇ-ఖుదాయి’ (కింగ్ ఈజ్ ది వైస్ రిజెన్సీ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్) ‘రాజు భూమండలంపై భగవంతుని ప్రతినిధి, నీడ అని అతని భావం’, సుల్తాన్ హోదాకు గౌరవస్థానం కల్పించి, ప్రజల్లో, సర్దారుల్లో, ఉన్నతాధికారుల్లో అతనంటే ప్రత్యేక గౌరవభావన పెంపొందించి బాల్బన్ అనేక కొత్త ఆచారాలు, సంప్రదాయాలు, నియమ నిబంధనలు ప్రవేశపెట్టాడు. రాజరికం ‘నిరంకుశత్వానికి ప్రతిబింబం’ అని తన కుమారుడైన బుఖాన్కు బోధించాడు. తాను ‘జిల్లీ ఇల్హా’ (భగవంతుని నీడ) అని ప్రకటించాడు. సుల్తాన్ పట్ల గౌరవాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో పర్షియన్ సుల్తానుల దర్బారులో ఆచరణలో ఉన్న ‘జమిన్బోస్’, ‘ఫాయిబోస్’ సుల్తాన్కు సాష్టాంగ నమస్కారం చేయడం లేదా సుల్తాన్ పాదాలను గాని సింహాసనాన్ని గాని ముద్దుపెట్టుకోవడం వంటి పద్ధతులు ప్రవేశపెట్టాడు.

సుల్తాన్ అన్ని వేళలా రాజదర్పం ఉట్టిపడేలా రాజదుస్తుల్లో కనబడాలని కోరుకొన్నాడు. తాను సుల్తాన్ పదవిచేపట్టిన తరువాత తన హోదాకు తగిన అధికారులతోనే మాట్లాడేవాడు. బహిరంగంగా సమావేశాల్లో నవ్వేవాడు కాదు. దర్బారులో మద్యం సేవన, జూదం ఆడటం నిషేధించాడు. క్రమశిక్షణకు ప్రాధాన్యత కల్పించాడు. తాను ముద్రించిన నాణాలపై ఖలీఫా పేరును ముద్రించాడు. సుల్తాన్ పట్ల ప్రజలు, అధికారులు గౌరవంతో ప్రేమతో వ్యవహరించాలనీ, అదే విధంగా సుల్తాన్ ప్రజలను తన కన్నబిడ్డల్లా భావించి వారి సంక్షేమానికి సర్వవేళలా శ్రమించాలని పేర్కొన్నాడు. పటిష్టమైన క్రమశిక్షణ కలిగిన సైన్యం రాజ్య రక్షణకు అత్యావశ్యకమని గుర్తించి అనేక సైనిక సంస్కరణలు చేశాడు. ‘దివాన్-ఇ-ఆరీజ్’ (సైన్య వ్యవహారాలు) శాఖాధిపతులుగా తనకు విశ్వాసపాత్రుడైన ఇమాద్-ఉల్-ముల్క్న నియమించాడు. సైనికులకు జీతభత్యాల ఏర్పాటు చేశాడు. జాగీరులను రద్దుచేయించాడు. ప్రతి సైనికుడికి శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత దివాన్-ఇ-అరీజ్ శాఖకు, ఉన్నత సైనికాధికారులకు అప్పగించాడు. కోటలను నిర్మించారు. పాత కోటలకు మరమ్మత్తులు చేయించాడు.

ప్రశ్న 8.
సూఫీలపై ఒక వివరణ రాయండి.
జవాబు.
మధ్యయుగ భారతదేశంలో భక్తి ఉద్యమం లాగానే సూఫీ ఉద్యమం కూడా హిందూ ముస్లింలను ఒకే వేదికపైకి తేవటానికి ప్రయత్నించింది. ముస్లిం మత విశ్వాసానికి మరొక పేరే సూఫీమతం. అరేబీ ప్రారంభమై తరువాత భారతదేశానికి వ్యాప్తి చెందింది. సూఫీమతాన్ని భారతదేశానికి తెచ్చి దక్కుతుంది.

క్రీ.శ 19వ శతాబ్దంలో ‘సూఫీఇజం’ అనే ఆంగ్లపదం వాడుకలోని వచ్చింది. సూఫీ అనే పదం ‘తసావూఫ్’ అనే ఇస్లాం గ్రంథాల్లో ఉంది. ‘సఫా’ అనే పదం నుంచి సూఫీ ఆవిర్భవించిందని కొందరు పండితులు అభిప్రాయపడ్డారు. మరికొందరు ‘సుఫా” అనే పదం నుంచి ఆవిర్భవించిందని పేర్కొన్నారు. ‘సుఫా’ అంటే మహ్మద్ మసీదు వెలుపల ఆయన శిష్యులు మత సమావేశాలను జరిపే ‘అరుగు’ అని అర్థం. బస్రాకు చెందిన జహీజ్ మొదటిసారిగా సూఫీ అనే పదాన్ని ఉపయోగించాడు. క్రీ.శ 10వ శతాబ్దం కంటే పూర్వం సూఫీ మతం అరేబియా, పర్షియా ప్రజల సాంఘిక, మత జీవనాన్ని ప్రభావితం చేసింది. భగవంతుడిని ప్రేమించడమే అతన్ని చేరే ప్రధాన మార్గమని సూఫీ బోధకుల దృఢ నమ్మకం. ఎక్కువ మంది సూఫీ బోధకులు సమాజానికి దూరంగా ఏకాంతంగా గడిపి మోక్ష సాధనకై ప్రయత్నించారు. ఉలేమాల ఆధిపత్యాన్ని వారి ఖురాన్ వర్గీకరణను సూఫీ బోధకులు వ్యతిరేకించారు. ఉలేమాలు ఖురాన్ వాస్తవ స్ఫూర్తి అయిన ప్రజాస్వామ్య సమానత్వ భావాలకు వ్యతిరేకంగా వ్యవహరించేవారు. సూఫీ బోధకులు హిందూ, జైన, బౌద్ధ, క్రైస్తవ, జొరాస్ట్రియన్ మతాల వల్ల ప్రభావితులయ్యాయి.

హిజ్రా యుగానికి చెందిన మొదటి రెండు శతాబ్దాల్లో సూఫీ బోధకులు పశ్చాత్తాపం, దేవుడిపై విశ్వాసం వంటి . ప్రాథమిక సూత్రాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వారు కఠిన నియమాలను పాటించారు. మంచి ప్రవర్తన, స్వయంకృషి, సమానత్వాన్ని బోధించారు. వారు గురువులను ‘పీర్’గా గౌరవంగా పిలిచేవారు. వారు బహుమతులను స్వీకరించక దయ, నిరాడంబరత, సహనం, దైవంపై అపార విశ్వాసం, మోక్షాలను విశ్వసించారు.

ప్రశ్న 9.
చిష్ఠీశాఖ – దాని ప్రాధాన్యతను వివరించండి.
జవాబు.
భారతదేశంలోని చిట్టీ, సూఫీ బోధకుల్లో ఖ్వాజా మొయినుద్దీన్ శిష్యులైన షేక్ హమీదుద్దీన్, షేక్ కుతుబుద్దీన్ భక్తియార్ కాకిలు ప్రధానమైనవారు. వారు సమానత్వాన్ని బోధిస్తూ సామాన్య జీవితాన్ని గడిపారు. శాకాహారులైన వారు స్థానిక హిందువులతో సన్నిహితంగా మెలిగారు. రాజపోషణ, దానాలు తీసుకోవడాన్ని వారు వ్యతిరేకించారు. గాత్ర, వాయిద్య సంగీతాలలో గొప్ప ఆధ్యాత్మికత ఉన్నట్లువారు పేర్కొన్నారు. భక్తియార్ కాకికి ఆధ్యాత్మిక సంగీతం అంటే ఇష్టం. సూఫీ బోధకులు, తమ ఆశ్రమాల్లో ఏర్పాటు చేసిన హిందూ, ముస్లిం సంగీత విభావరులు అశేష ప్రజానీకాన్ని ఆకట్టుకొన్నాయి.

షేక్ ఫరీద్ లేదా బబాఫరీద్ ఢిల్లీ సుల్తానుల కాలానికి చెందిన మరొక సూఫీ బోధకుడు. అతడు అతి సామాన్య జీవితాన్ని గడిపాడు. భక్తి బోధకుల సంగీతాన్ని ఇష్టపడేవాడు. ఆయన శిష్యుల్లో నిజాముద్దీన్ అలియా ముఖ్యుడు. ఢిల్లీలోని ఘజియాపూర్లో తన కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు.

హజరత్ నిజాముద్దీన్ వినయశీలి. ఇతడు అత్యంత సామాన్య జీవితాన్ని గడిపాడు. పేదవారిని ప్రేమించాడు. ఢిల్లీ సుల్తానుల బహుమానాలను ఆయన తిరస్కరించాడు. నసీరుద్దీన్ చిరాగ్, షేక్ సలీం చిష్టిలు ఆయన ప్రధాన శిష్యులు. షేక్ సలీమ్ చిప్టీ అక్బర్ సమకాలీకుడు. ఇతని సిద్ధాంతాలు, జీవనవిధానం అక్బర్ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. అక్బర్ స్వయంగా ఫతేపూర్ సిక్రిని సందర్శించి చిష్టీ ఆశీస్సులను పొందాడు. తనకు కుమారుడు జన్మించాక అతనికి సలీమ్ అని అక్బర్ నామకరణం చేశాడు. చిష్టీ సమాధిపై అక్బర్ నిర్మించిన దర్గా ఉరుసు సందర్భంగా అన్ని ప్రాంతాల, అన్ని మతాల ప్రజలను విశేషంగా ఆకర్షిస్తూ ఉంది.

ప్రశ్న 10.
భక్తి ఉద్యమంలో రామానందుడు, కబీర్ ల పాత్రను పేర్కొనండి.
జవాబు.
రామానందుడు : భక్తి ఉద్యమ ప్రవక్తలలో మొదటివాడు రామానందుడు. తమ సొంత బ్రాహ్మణ కులానికి చెందినవారి ఆధిపత్యాన్ని తిరస్కరించాడు. గంగాతీర ప్రాంతంలో తన సిద్ధాంత ప్రచారానికి హిందీ భాషను ఉపయోగించారు. రామానుజాచార్యుల విశిష్టాద్వైత మతాన్ని స్వీకరించి మరింత ప్రచారం కల్పించాడు. సాంఘిక దురాచారాలను, కర్మకాండలను తిరస్కరించిన రామానందుడు సంస్కృతం, హిందీ భాషకు ప్రాధాన్యం ఇచ్చాడు. తన రచన ‘ఆనంద భాష్యం’లో శూద్రులు వేదాలను అధ్యయనం చేయడాన్ని గుర్తించలేదు. తక్కువకులం వారిని శిష్యులుగా స్వీకరించాడు. ఇతని శిష్యుల్లో ధర్మాజాట్, సేనానాయి బ్రాహ్మణుడు, రవిదాస్ చర్మకారుడు, కబీర్ మహ్మదీయుడు, మహిళలు కూడా తన శిష్యులయ్యారు. వారిలో పద్మావతి, సురస్త్రీలు.

TS Inter 1st Year History Study Material Chapter 8 ఢిల్లీ సుల్తానుల యుగం

కబీర్ (1440–1510) : కబీర్ మధ్యయుగంలోని ప్రముఖ సంఘ, మతసంస్కర్త. రామానందుడి శిష్యుల్లో కబీర్ విప్లవ భావాలు కలవాడు. తన గురువు సాంఘిక సిద్ధాంతానికి అచరణాత్మక రూపును ప్రసాదించాడు. కబీర్ కులవ్యవస్థను ఖండించాడు. ఇతడు విగ్రహారాధనను, కర్మకాండలను ఖండించాడు. తీర్థయాత్రలను చేయడాన్ని వ్యతిరేకించాడు. మహిళల పరదా పద్ధతిని తిరస్కరించాడు. కబీర్ సాధారణ జీవనాన్ని విశ్వసించాడు. కబీర్ స్వయంగా బట్టలు కుట్టి వాటిని మార్కెట్లో విక్రయించాడు. ఆయనకు ‘లోయ్’ అనే మహిళతో వివాహం అయ్యింది. ఆయన కుమారుడు కమల్. ఆలోచనా పరుడు, భక్తుడు, దేవుడు ఒక్కడే అని కబీర్ విశ్వాసం. రాముడు, రహీం ఒక్కరే అని ప్రచారం చేశాడు. హిందూ-ముస్లింల మధ్య మైత్రి సాధించడానికి కబీర్ తీవ్రంగా కృషి చేశాడు. “హిందూ, ముస్లింలు ఇద్దరూ సర్వోన్నతమైన భగవంతుడి బిడ్డలు అని స్పష్టంగా అనేకసార్లు గట్టిగా చెప్పిన మొట్టమొదటి సాంఘిక, మతసంస్కర్త కబీర్” అని కె.ఎస్. లాల్ అనే పండితుడు పేర్కొన్నాడు. కబీర్ శిష్యులను “కబీర్ పంథీస్” అని అంటారు. కబీర్ రచించిన దోహాలకు ‘బీజక్’ అని పేరు. వీరు ఇరువురు ఒకే మట్టితో చేసిన రెండు కుండల వంటి వారని కబీర్ పేర్కొన్నాడు. “పవిత్రమైన హృదయం లేకుండా విగ్రహాన్ని ఆరాధించడం వల్ల, గంగానదిలో స్నానమాచరించడం వల్ల ప్రయోజనం ఏముంది ? మక్కాకు యాత్ర చేయడం వల్ల ప్రయోజనం ఏముంది ?” అని కబీర్ ప్రశ్నించాడు.

ప్రశ్న 11.
భక్తి ఉద్యమ ప్రభావాన్ని చర్చించండి.
జవాబు.
ప్రాచీన కాలం నుంచి మధ్యయుగం వరకు నడిచిన భక్తి ఉద్యమంలో క్రింది ప్రధాన లక్షణాలను గమనించవచ్చు.
1) ఈశ్వరుని ఏకత్వంపై గాఢానురక్తి ప్రధాన లక్షణం. ఇందులో ముక్తి సాధనకై భగవంతుడి కృపను పొందడమే భక్తుడి లక్ష్యంగా భావించబడింది.

2) పూజా పునస్కారాలు, కర్మకాండలను వ్యతిరేకించిన భక్తి ఉద్యమకారులు పవిత్రమైన మనస్సు, జీవనం, మానవత్వం, భక్తి వంటివి అనుసరించడం ద్వారా భగవంతుడి కృపను పొందవచ్చు అని బోధించారు.

3) భక్తి ఉద్యమకారులు ఏకేశ్వరోపాసనను బోధించారు. కొందరు సగుణోపాసనను, మరికొందరు నిర్గుణోపాసనను ప్రోత్సహించారు. వైష్ణవుల్లో సగుణోపాసన ప్రసిద్ధమైంది. వారు శ్రీమహావిష్ణువు అవతారాలైన రాముడు లేదా కృష్ణుడిని తమ దేవుడిగా భావించారు. కాగా నిర్గుణోపాసన విగ్రహారాధనను వ్యతిరేకించింది. దేవుడు సర్వాంతర్యామి, మానవుల హృదయాల్లోనే భగవంతుడు ఉన్నాడు అని వారు ప్రచారం చేశారు. సగుణోపాసన, నిర్గుణోపాసనలను రెండింటినీ చిన్న మార్పులతో శంకరాచార్యుడి అద్వైత సిద్ధాంతములో చెప్పబడ్డాయి.

4) ఉత్తర, దక్షిణ భారతదేశ భక్తి ఉద్యమకారులు జ్ఞానం పొందడం ‘భక్తి’లో భాగంగా చెప్పారు. నిజమైన జ్ఞానాన్ని పొందేందుకు గురువు అవసరమని వారు బోధించారు.

5) భక్తి ఉద్యమకారులందరూ కుల వ్యవస్థను వ్యతిరేకించారు. అందువల్ల తక్కువ కులాలవారికి వారు ఆశాజ్యోతి అయ్యారు. భక్తి ఉద్యమకారుల్లో అధికమంది తక్కువ వర్గాల నుంచి వచ్చిన వారు కావడం విశేషం. నామదేవుడు (1270–1350), దర్జీ కుటుంబం, తుకారామ్ (1601-1649) శూద్ర కుటుంబం, కబీర్దాస్ ముస్లిం మతంలోని నేతకుటుంబం నుంచి వచ్చారు.

6) భక్తి ఉద్యమకారులు పూజారుల పెత్తనాన్ని, సంస్కృత భాషను వ్యతిరేకించారు. ప్రజల భాషలోనే తమ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. అందువల్ల బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, హిందీ వంటి, ప్రాంతీయ భాషలకు స్వర్ణయుగం ప్రారంభమై అభివృద్ధి చెందాయి.

ప్రశ్న 12.
అల్లావుద్దీన్ – ఖిల్జీ సామ్రాజ్యపటంలో ఈ కింది పట్టణాలను, ప్రదేశాలను గుర్తించండి.
(ఎ) లాహోర్
(బి) ముల్తాన్,
(సి) అజ్మీర్,
(డి) మధుర,
(ఇ) రణతంబోర్
(ఎఫ్) చితోడ్
జవాబు.
TS Inter 1st Year History Study Material Chapter 8 ఢిల్లీ సుల్తానుల యుగం 1

TS Inter 1st Year History Study Material Chapter 8 ఢిల్లీ సుల్తానుల యుగం

ప్రశ్న 13.
విజయనగర సామ్రాజ్య విస్తీర్ణాన్ని ఇచ్చిన పటంలో చూపి ఈ క్రింది నగరాలను గుర్తించండి.
(ఎ) హంపి
(బి) కంపిలి
(సి) పెనుగొండ
(డి) చంద్రగిరి
(ఇ) రాయచూర్
(ఎఫ్) ముద్గల్
(జి) ఉదయగిరి
జవాబు.
TS Inter 1st Year History Study Material Chapter 8 ఢిల్లీ సుల్తానుల యుగం 2

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కుతుబుద్దీన్ ఐబక్
జవాబు.
ఇతడు మహ్మద్ ఘోరీ వద్ద బానిస. విశ్వసనీయతకు, నిజాయితీకి, సమర్ధతకు మారుపేరు. ఇతడు మహ్మద్ ఘోరీ మరణానంతరం భారతదేశంలోని తన ఆధీనంలో ఉన్న ఘోరీ రాజ్యానికి సుల్తాన్ ప్రకటించుకున్నాడు. సుల్తాన్ అయిన తర్వాత అనేక తిరుగుబాట్లను సమర్థవంతంగా అణచివేశాడు. ఇతడు అనేకమంది కవి, పండితులను ఆదరించాడు. ఇతడికి ‘లాభక్ష్’ (లక్షల రూపాయలు ఇచ్చేవాడు) అని బిరుదు. భారతదేశంలో ఇస్లాం విజయానికి, ఇస్లాం మత వ్యాప్తికి చిహ్నంగా ఢిల్లీ నగరంలో కుతుబ్మనార్ నిర్మాణానికి పునాదులు వేశాడు. ప్రసిద్ధ చరిత్రకారుడు ఈశ్వరీప్రసాద్ భారతదేశంలోని ముస్లిం విజేతలలో ఇతడు అగ్రగణ్యుడని పేర్కొన్నాడు. క్రీ.శ. 1210 లాహోర్లో బౌగాన్(పోలో) ఆడుతూ గుర్రం పైనుండి పడి మరణించాడు.

ప్రశ్న 2.
జిల్లే-ఇలాహీ
జవాబు.
బాల్బన్ సాధించిన విజయాలలో పేర్కొనదగినది ఢిల్లీ సుల్తాన్ హోదాను, స్థాయిని, గౌరవాన్ని ఇనుమడింపచేయుట. బాల్బన్ దృష్టిలో సుల్తాన్ పదవి పవిత్రమైనది. రాజరికం దైవదత్తం. సుల్తాన్ భూమిపై భగవంతుని ప్రతినిధి అని జిల్లేఇలాహీ భావం. కాబట్టి అతను సామాన్య మానవుల కంటే ఉన్నతుడు. ప్రజలంతా అతని మాట శాసనంగా
గౌరవించాలి.

ప్రశ్న 3.
మహ్మద్ బీన్ తుగ్లక్ నాణేల సంస్కరణలు.
జవాబు.
మహ్మద్-బీన్-తుగ్లక్ ఢిల్లీ సింహాసనము అధిష్టించేనాటికి అతని సామ్రాజ్యంలో వెండి, బంగారు లోహాలతో చేసిన టంకా, జిటాల్ వంటి నాణాలు వాడుకలో ఉన్నాయి. కాని అదేకాలంలో బంగారం, వెండి లోహాల తీవ్ర కొరత ఏర్పడింది. ఈ సమస్యను అధిగమించడానికై సుల్తాన్ కొత్త పథకం రూపొందించాడు. కాని స్పష్టమైన మార్గ నిర్దేశనాలు లేనందువల్ల రాగి, ఇత్తడి నాణాలు ప్రతి కంసాలి ఇంట్లో ముద్రించబడ్డాయి. ద్రవ్యం విలువ గణనీయంగా పడిపోయింది. తప్పును గ్రహించిన సుల్తాన్ టోకన్ కరెన్సీని రద్దు చేశాడు. అప్పటికే చాలా నకిలీ నాణాలు మార్కెట్లో చెలామణి అయ్యాయి. చివరకు ఈ పథకాన్ని సుల్తాన్ రద్దు చేశాడు.

ప్రశ్న 4.
అలయ్ దర్వాజా
జవాబు.
ఇది సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీచే క్రీ.శ. 1311లో కట్టబడింది. ఢిల్లీలోని కవ్వతుల్ ఇస్లామ్. మసీదుకు దక్షిణ ద్వారం ఉంది. ఎర్రటి ఇసుకరాతితో కట్టిన కట్టడం. చతురస్రాకారంలో ఉండి పైన పెద్ద డోమ్ను నిర్మించారు. ఇండో- ఇస్లామిక్ వాస్తు శిల్పకళారీతి ఈ కట్టడంలో ప్రతిఫలిస్తుంది. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలో చేర్చింది.

ప్రశ్న 5.
అమీరుస్రో ప్రవేశపెట్టిన సంగీత వాయిద్యాలను, రాగాలను పేర్కొనండి.
జవాబు.
అమీరుస్రో అనేక కొత్త రాగాలను కనుకొన్నాడు. ‘ఘోరా’, ‘సనమ్’ అతడు కనుగొన్న మరిన్ని రాగాలు. ‘ఖవ్వాలి’ అనే సాంప్రదాయాన్ని ఇతడే ఆరంభించాడు. ‘సితార’ను ఇతడే రూపొందించాడు.

ప్రశ్న 6.
మన్ కుతూహల్ అంటే ఏమిటి ?
జవాబు.
రాజామాన్ సింగ్ (గ్వాలియర్) గొప్ప సంగీత ప్రియుడు. ‘మన కుతూహల్’ అనే సంగీత గ్రంథాన్ని రాయడానికి ప్రోత్సహించాడు.

ప్రశ్న 7.
అమీర్ ఖుస్రో.
జవాబు.
అమీర్ ఖుస్రూ ఢిల్లీ సుల్తానుల యుగానికి చెందిన గొప్ప పండితుడు, కవి. ఇతని కాలం క్రీ.శ. 1253 – 1325. ఇతడు అనేక చారిత్రక మస్నవీలను, దివాన్ లను రచించాడు. బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశాలకు చెందిన ఆరుగురు ఢిల్లీ సుల్తానులతో కలిసి పనిచేసిన అరుదైన గౌరవం దక్కింది. ‘కోరాన్-ఉస్-సదైన్’, ‘మిఫ్లూ ఉల్పుతూ’, ‘నుహ్-సిఫిర్’, ‘ఆషికా’, ‘తారీఖ్-ఇ-అలాయి’, ‘తుగ్లక్ నామా’ఇతని ప్రసిద్ధ రచనలు.

ప్రశ్న 8.
కుతుబుద్దీన్ ఐబక్ కట్టడాలు.
జవాబు.
ఢిల్లీలోని కుతుబ్మనార్, అలైదర్వాజాలు ఆనాటి అద్భుత, భారీ కట్టడాలు. 71 అడుగుల ఎత్తైన కుతుబ్మినార్ నిర్మాణాన్ని సూఫీ సన్యాసి కుతుబుద్దీన్ – భక్తియార్ కాకి జ్ఞాపకార్ధం నిర్మించారు. ఈ భారీ కట్టడాన్ని ఐబక్ ప్రారంభించగా, ఇల్టుట్మిష్ పూర్తి చేసాడు.

TS Inter 1st Year History Study Material Chapter 8 ఢిల్లీ సుల్తానుల యుగం

ప్రశ్న 9.
అద్వైత సిద్ధాంతాన్ని వివరించండి.
జవాబు.
భక్తి ఉద్యమకారుల్లో జగద్గురు శంకరాచార్యులు శిఖరం వంటివాడు. ఇతడు క్రీ.శ. 788లో కేరళలోని ‘కలాడి’లో జన్మించాడు. ఇతని బోధనలే ‘అద్వైతసిద్ధాంతంగా’ ఖ్యాతి గడించాయి. బనారస్క చెందిన గోవిందయోగి బోధనలు, శంకరాచార్యులను విశేషంగా ప్రభావితం చేసాయి. సామాన్య ప్రజానీకానికి శంకరులవారి అద్వైతతత్త్వం అంత శీఘ్రంగా అర్థం కాలేదు. నిర్గున బ్రహ్మ, సగుణబ్రహ్మ భావనలు సామాన్య ప్రజానీకానికి అంత తేలిగ్గా అర్థం కావు. శంకరాచార్యులు మోక్షప్రాప్తికి జ్ఞాన మార్గాన్ని సూచించి, ఆచరించారు. ఇతని బోధనలను, అద్వైతాన్ని మరింతగా సులభతరం చేసి ఇతని వారసులు కృషిచేసారు.

ప్రశ్న 10.
రామానుజాచార్యుల బోధనలు.
జవాబు.
భక్తి ప్రబోధకుల్లో శంకరాచార్యుల తర్వాత, ఎక్కువ పేరుగాంచిన వారు రామానుజాచార్యులు. ఇతడు శ్రీ పెరంబుదూర్లో జన్మించాడు. ఇతడు బోధించిన తత్వాన్ని ‘విశిష్టాద్వైతం’ అంటారు. ఇతని ప్రకారం భగవంతుడు ‘సగుణబ్రహ్మ’. యావత్ ప్రపంచం అతని సృష్టి. జీవరాశులు అతని సృష్టి. ఇవి కల్పితం కావు. ఇతని ప్రకారం, దేవుడు. ఆత్మ, పదార్థం అన్ని శాశ్వతం. వాస్తవాలు భగవంతునికి పూర్తిగా సమర్పించుకోవడం (ప్రభత్తి మార్గం ద్వారా మానవులు మోక్షం పొందవచ్చనీ బోధించాడు. అట్టడుగు వర్గాలవారిని ఇతడు వైష్ణవంలోకి ఆహ్వానించాడు.

ప్రశ్న 11.
కబీర్ ‘ బోధనల ప్రభావం.
జవాబు.
మధ్యయుగ భక్తి ప్రబోధకులలో గొప్ప సంఘ, మత, సంస్కరణ భావాలు కలవాడు కబీర్. ఇతడి గురువు రామానందుడు. ఇతడు బనారస్లో ఒక్క బ్రాహ్మణ స్త్రీకి జన్మించాడని కొందరు పడింతులవాదం. ముస్లింనేత పనిచేసే ‘నీరు, నీమా’ అనే దంపతులు ఇతన్ని పెంచి పెద్ద చేసారు. బనారస్ లో ఉన్నప్పుడే హిందూమతం, హిందు ప్రాచీన గ్రంథాల గురించి, వాటి సారాంశాన్ని తెలుసుకున్నాడు. ఇదే కాలంలో ఇస్లాంలోని పవిత్ర సూత్రాలు గ్రహించాడు. ఈ రెండు వర్గాల మధ్య సఖ్యతకు కృషి చేసాడు. ఇతని దృష్టిలో భగవంతుడు ఒక్కడే, నిరాకారుడు, భక్తి ఒక విశ్వాసం, రాయిని, చెట్టును పూజించడం అవివేకం, ఉత్తమ గుణాల ప్రతిరూపమే దైవం. విగ్రహరాధనను, సాంప్రదాయాలను, ఆచారాలను, నమ్మకాలను ఖండించాడు. భగవంతుడు మంచి ఆలోచనలకు, పనులకు ప్రతిరూపం. ‘రాం – రహీం’ ఒక్కటేనని, హిందూ – ముస్లిం ఒకే తల్లి పిల్లలనీ, ఒకే మట్టితో చేసిన కుండలనీ పేర్కొన్నాడు. పవిత్ర హృదయం మంచి ఆలోచనలు, నిజాయితీ, మోక్షానికి మెట్లు అని పేర్కొన్నాడు. ఇతని శిష్యులనే ‘కబీర్ పంథీలు’ అంటారు.

ప్రశ్న 12.
గురునానక్ సూత్రాలు.
జవాబు.
గురునానక్ క్రీ.శ. 1469లో ‘తుల్వండీ’ గ్రామంలో జన్మించాడు. ఇతడు కబీర్ సమకాలికుడు. వీరి ఆలోచనా
`నాలు చాలా వరకు ఏకీభవిస్తాయి. గురునానక్ బోధనలు నమ్మిన శిష్యులే చివరికి ‘శిక్కు’ మతంగా మారారు.
ల ..శోర్, తుల్వండి ఇతని కేంద్రాలు. కులవ్యవస్థను, సామాజిక అసమానతలను ఖండించాడు. నిరాడంబరత, ఆత్మ పవిత్రత, నిజాయితీలో జీవించడం, నిస్వార్థ సేవ మొదలైనవి ఇతడు బోధించాడు. హిందూ – ముస్లిం ప్రజల మధ్య సఖ్యతకు కృషి చేసి, కబీర్ కార్యక్రమాలకు బలం చేకూర్చాడు.

ప్రశ్న 13.
మరాఠీ భక్తి బోధకుల సూత్రాలు.
జవాబు.
మహారాష్ట్రలో భక్తి ఉద్యమాన్ని నడిపిన తొలి మహానీయుడు సంత్ జ్ఞానేశ్వర్. ఇతని బోధనలను ‘మహారాష్ట్ర ధర్మం’ అంటారు. భగవద్గీతపై ఇతడు రాసిన భాష్యానికే ‘జ్ఞానేశ్వరీ’ అంటారు. నామదేవుడు మరో ప్రధాన భక్తి ప్రబోధకుడు.

ఇతడు మానవులందరూ ఒకటేనని కుల, మతాలు మానవ కల్పితాలనీ, సదాచారం, సచ్ఛీలం ద్వార మోక్షం పొందవచ్చని, బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ఖండించాడు. మరాఠా వాసుల్లో సంఘ సంస్కరణ ద్వారా ఐక్యతా కల్గించాడు. భావాన్ని సంత్ ఏకనాథ్ కులవ్యవస్థను వ్యతిరేకించాడు. మానవులందరూ ఒక్కటేనని ప్రచారం చేసాడు. నిమ్న కులాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు. అనేక భజనలు, సంకీర్తనలు రాశాడు. సంత్ తుకారం మరో ప్రసిద్ధ మరాఠి భక్తి సన్యాసి, ఇతడు శివాజీ సమకాలికుడు.

ప్రశ్న 14.
అష్టదిగ్గజాలు.
జవాబు.
శ్రీకృష్ణ దేవరాయలు గొప్ప పండితులు ‘ఆముక్తమాల్యద’ శ్రీకృష్ణదేవరాయల మహోన్నత రచన. దీన్ని పండితులు ఎంతో ప్రశంసించారు. ఇతని ఆస్థానంలో ‘అష్టదిగ్గజాలనీ’ పేరుగాంచిన ఎనిమిది మంది కవులున్నట్లు ప్రతీతి. అల్లసాని పెద్దన్న ఇతని ఆస్థానకవి.

TS Inter 1st Year History Study Material Chapter 8 ఢిల్లీ సుల్తానుల యుగం

ప్రశ్న 15.
వాస్తు – శిల్ప కళలకు విజయనగర రాజుల సేవ.
జవాబు.
హిందుమతం, హిందూధర్మ పరిరక్షణలో భాగంగా వీరు అనేక గొప్ప దేవాలయాలను పునరుద్ధరించారు. కొత్తవి నిర్మించారు. వీటికి భారీ ఎత్తున ధాన ధర్మాలు చేశారు. అనేక మఠాలను పరిరక్షించారు. కవులను, కళాకారులను ఆదుకొన్నారు. తమ ఆస్థానాల్లో సముచిత స్థానం ఇచ్చి గౌరవించారు. హంపి, తిరుపతి, పెనుగొండ, లేపాక్షి మొదలైనచోట్ల ఉన్న పాతదేవాలయాలకు మరమ్మతులు చేయించారు. కొత్తవి కట్టించారు. విజయనగర ఆలయాల ప్రధాన లక్షణ రంగ మంటపాలు, నునుపుగా చెక్కిన స్తంభాలు. హంపీలోని శ్రీవిరూపాక్ష ఆలయం, హజార రామాలయం, విఠలా స్వామి ఆలయం, శ్రీకృష్ణదేవరాయలు కొత్తగా కట్టించిన బాలకృష్ణ స్వామి (ఈ విగ్రహం ఒరిస్సా నుంచి కళింగ దండయాత్ర విజయవంతం అయిన సందర్భంగా తీసుకొచ్చాడు) ఆలయం ముఖ్యమైనవి. హంపి శిథిలాల్లో `నేటికీ గంభీరంగా నిలబడి ఉన్న ఉగ్రనరసింహస్వామి శిలా విగ్రహం ఆనాటి శిల్పుల పనితనానికి ప్రతీక.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics

Telangana TSBIE TS Inter 1st Year Chemistry Study Material 6th Lesson Thermodynamics Textbook Questions and Answers.

TS Inter 1st Year Chemistry Study Material 6th Lesson Thermodynamics

Very Short Answer Type Questions

Question 1.
What is the information given by the term thermodynamics?
Answer:
The branch of science which deals with the energy transformations such as chemical energy into mechanical energy or the transformation of energies electrical energy, radiant energy, chemical energy and nuclear energy into one another is called thermodynamics.

Question 2.
What is the relationship between the laws of thermodynamics and equilibrium state?
Answer:
Laws of thermodynamics apply only when a system is in equilibrium.

Question 3.
Define a system. Give an example.
Answer:
A small part of the universe that is chosen for thermodynamic study is called system. E.g : water in beaker

Question 4.
The wall is adiabatic and AU = Wad. What do you understand about the heat and work with respect to the system?
Answer:
In the adiabatic system, neither matter nor energy is exchanged with the surroundings. So the wall will not allow the transmission of heat into surroundings or from the surroundings.

Question 5.
The system loses ‘q’ amount of heat though no work is done on the system. What type of wall does the system have?
Answer:
The walls which allow the transmission of heat through them into or out of the system are called diathermal walls.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics

Question 6.
Work is done by the system and ‘q amount of heat is supplied to the system. What type of system would it be?
Answer:
When q amount of heat is supplied to the system work is done by the system on its surroundings. So it is closed system.

Question 7.
What is the work done in the free expansion of an ideal gas in reversible and irreversible processes?
Answer:
In both cases work done is zero because during free expansion of an ideal gas external pressure becomes zero.

Question 8.
From the equation ∆U = q – pex ∆V, if the volume is constant what is the value of ∆U?
Answer:
When volume is constant the amount of heat q supplied increases the internal energy of gas
∆U = q v ∵ ∆V = 0 pex ∆V = 0

Question 9.
In isothermal free expansion of an ideal gas find the value of q and ∆U.
Answer:
∆U = 0, q = 0, since W = 0 l Pext = 0

Question 10.
In isothermal irreversible change of ideal gas what is the value of q?
Answer:
For isothermal irreversible change
q = – W = pex (Vf – Vi)

TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics

Question 11.
In isothermal reversible change of an ideal gas, what is the value of q?
Answer:
q = – W = 2.303 nRT log \(\frac{V_f}{V_i}\)

Questin 12.
For an adiabatic change in an ideal gas what is the relationship between its AU and W (adiabatic)?
Answer:
For adiabatic change, q = 0 ; AU = Wad

Question 13.
State the first law of the thermodynamics. [Mar. ’18 (TS) (AP ’16)]
Answer:
Energy can neither be created nor be destroyed.

Question 14.
What are the sign conventions of the work done on the system and work done by the system?
Answer:
When work is done on the system it is represented with + ve sign while work done by the system is given with – ve sign.
Work done by the system = – ve
Work done on the system = + ve.

Question 15.
Volume (V), Pressure (P) and Temperature (T) are state functions. Is the statement true?
Answer:
Yes, it is true. Volume (V), Pressure (P) and Temperature (T) are state functions and depend only on the initial and final states.

Question 16.
What are the heat (q) sign conventions when heat is transferred from the surroundings to the system and that transferred from system to the surrounding?
Answer:
When heat is transferred from surroundings to the system its internal energy increases. So it is represented with + ve sign.

When heat is transferred from system to surroundings the internal energy of the system decreases. So it is represented with – ve sign.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics

Question 17.
No heat is absorbed by the system from the surroundings, but work (w) is done on the system. What type of wall does the system have?
Answer:
Adiabatic wall

Question 18.
No work is done on the system, but heat (q) is taken out from the system by the surroundings. What type of wall does the system have?
Answer:
The walls which allow the transmission of heat through them into or out of the system are called diathermal walls. So the system has diathermal walls.

Question 19.
Work is done by the system and heat (q) is supplied to the system. What type of system would it be?
Answer:
∆U = q-W (or) ∆U = q – Pext ∆V, closed system.

Question 20.
q = w = – Pextf – υi) is for irreversible ……….. change.
Answer:
Isothermal.

Question 21.
q = – w = nRT In (vf- vt) is for isothermal change.
Answer:
Reversible.

Question 22.
What are the ‘∆H’ sign conventions for exothermic and endothermic reactions? [TS ’16]
Answer:
For exothermic reaction, ∆H = – ve
For endothermic reaction, ∆H = + ve

Question 23.
What are intensive and extensive properties? [AP Mar. ’19; (AP ’15)]
Answer:
Measurable properties of a system may be classified into two types
i) extensive properties
ii) intensive properties.

i) Extensive Properties :
The properties of a system which depend on the total amount of the material present in the system are called extensive properties.
Examples:
Mass (m), volume (V), internal energy (E), heat content (H), gibbs energy (G), entropy (s), heat (v) capacity, etc. are extensive properties.

ii) Intensive properties :
Properties of a system which are independent of the amount of the material in the system are called intensive properties.
Examples :
Density, molar properties such as molar volume, molar entropy, molar heat capacity, surface tension(S), viscosity, specific heat, refractive index, pressure, temperature, boiling point, freezing point and vapour pressure are intensive properties.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics

Question 24.
In the equation q = C.m – ∆T, if ∆T is change in temperature ‘m’ mass of the substance, and ‘q’ is heat required, what is ‘C’?
Answer:
C is the heat capacity.

Question 25.
Give the equation that gives the relation-ship between ∆U and ∆H.
Answer:
∆H = ∆U + ∆nRT
∆H = enthalpy change
∆U = change in internal energy
∆n = change in no.of moles
R = Universal gas constant
T = Temperature

Question 26.
What is the relationship between Cp and Cv?
Answer:
CP = CV + R or CP – CV = R
CP = Heat capacity at constant pressure
CV = Heat capacity at constant volume
R = Universal gas constant

Question 27.
1 g of graphite is burnt in a bomb calorimeter in excess of Oz at 298 K and 1 atm. pressure according to the equation.
C(graphite) + O2 (g) → CO2 (g)
During the reaction the temperature rises from 298 K to 299 K. Heat capacity of the bomb calorimeter is 20.7 kJK-1. What is the enthalpy change for the above reaction at 298 K and 1 atm?
Answer:
Heat absorbed by calorimeter = CV ∆T
= (20.7 kJ k-1) × 1 = 20.7 kJ
Heat evolved during combustion of 1 gm of graphite = – 20.7 kJ
cHθ = \(\frac{-20.7\times12}{1}\) = 248.4kJ

Question 28.
For the above reaction what is the inter-nal energy change, ∆U?
Answer:
∆H = ∆U + p∆V
Since the volume of the bomb calorimeter is constant ∆H = ∆U. i.e., 20.7 kJ.

Question 29.
What is ∆rH for
CH4(g) + 2O2(g) → CO2(g) + 2H2O(l)
in terms of molar enthalpies of the respective reactants and products?
Answer:
rH = ∑molar enthalpies of products – ∑molar enthalpies of reactants.
The molar enthalpies of the elements in the standard state are taken as zero.
∴ ∆rH = ∑molar enthalpy of CO2 and H2O – molar enthalpy of CH4.

Question 30.
Enthalpy decrease is not the criterion for spontaneity. Why?
Answer:
For the spontaneity of a reaction ∆G must be negative. Though the enthalpy increases if T∆S is more negative then ∆G becomes negative in the equation
∆G = ∆H – T∆S

So decrease in enthalpy is not a criterion for the spontaneity of the reaction.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics

Question 31.
Is increase of entropy the criterion for spontaneity? Why?
Answer:
No. For the spontaneity of the reaction, ∆G must be negative. Even though entropy does not increase if the ∆H is more negative than T∆S in the equation ∆G = ∆H – TAS, ∆G becomes negative and the reaction becomes spontaneous.

Question 32.
Explain the relationship between Gibbs energy change and equilibrium constant.
Answer:
Gibbs energy ∆rGθ is related to the equilibrium constant of the reaction as follows.
O = ∆rGθ + RT In K
or ∆rGθ = – RT /n K
or ∆rGθ = – 2.303 RT log K.

Question 33.
If we measure AHθ and ASθ it is possible to estimate AGθ. Is it true? Why?
Answer:
Gibbs Helmholtz equation is ∆Gθ = ∆Hθ – T∆Sθ Standard values of ∆Hθ, ∆Sθ and ∆Gθ are measured at standard temperature 298 K. So, if we measure ∆Hθ and ∆Sθ it is possible to estimate ∆Gθ according to the above relation.

Question 34.
Equilibrium constant ‘K’ is measured accurately in the laboratory at given temperature. Is it possible to calculate ∆Gθ at any other temperature? How?
Answer:
Gibbs energy for a reaction ∆Gθ is related to equilibrium constant of the reaction as follows.
O = ∆rGθ + RT ln K
or ∆rGθ = – RT ln K
or ∆rGθ = -2.303 RT log K.

If kx is measured, the value of ∆rGθ at any temperature can be calculated. By substituting the kx value at a different temperature Tx we can calculate ∆Gθ at that temperature
rGθ = – 2.303 RTx log Kx

Question 35.
Comment on the thermodynamic stability of NO(g) given that
\(\frac{1}{2}\)N2(g) + \(\frac{1}{2}\)O2(g) → NO(g); ∆rHθ = 90kJmol-1
NO(g) + \(\frac{1}{2}\)O2(g) → NO2(g); ∆rHθ = -74 kJmol-1
Answer:
Exothermic compounds are stable while endothermic compounds are unstable.
NO is endothermic compound so unstable.
NO2 is exothermic compound so stable.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics

Question 36.
Calculate the entropy change in surroundings when 1.00 mole of H2O(l) is formed under standard conditions
fHθ= -286 kJmol-1.
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics 1

Question 37.
The equilibrium constant for a reaction is 10. What will be the value of ∆Hθ?
R = 8.314 JK-1mol-1, T = 300 K.
Answer:
∆Hθ =-2.303 RT log k
= – 2.303 × 8.314 Jk-1 × 300 k × log 10
= – 2.303 × 8.314 Jk-1 × 300 k × 1
= – 5.744 kJ

Question 38.
State the third law of thermodynamics. [AP Mar. ’19; (TS ’16)]
Answer:
At absolute zero the entropy of any pure crystalline sybstance approaches zero.

Short Answer Questions

Question 1.
What are open, closed and isolated systems? Give one example for each.
Answer:
Types of systems :
Basing on the fact that whether energy or matter or both are exchanging between the system and the surroundings the systems are classified into three types, a) open system b) closed system c) isolated system.

a) Open system :
A system which can exchange both matter and energy with its surroundings is called open system.
Ex : A liquid in an open vessel. It can absorb heat energy from the surroundings and can give heat energy to the surroundings during evaporation and condensation. Similarly water can go as vapour into the surroundings and vapour can condense as liquid into the beaker.

b) Closed system :
A system which can exchange energy but not matter with its surroundings is called closed system.
Ex: Water taken in a closed non porous vessel. This can take heat from the surroundings and is evaporated. The vapour can condense back into liquid releasing heat to the surroundings. But water cannot leave or enter the vessel because it is closed.

c) Isolated system:
A system in which neither matter nor energy is exchanged with surroundings.
Ex : Liquid taken in a closed thermos flask. Heat can neither enter nor leave the flask. Similarly liquid or its vapour cannot go into the surroundings.

Question 40.
Define the state function and state variables. Give examples.
Answer:
The thermodynamic properties whose values depend only on the initial and fihal state of the system and are independent of matter or the manner as to how the change is brought about are called state functions.

In thermodynamics, some common state functions are internal energy (U), enthalpy (H), entropy (S), Gibbs energy (G), pressure (P), temperature (T), volume (V) etc.

Variables such as P, V, T are called state variables. These are used to describe the system completely.

Question 2.
“Internal energy is a state function.” Explain.
Answer:
If some mechanical work of about 1 kJ is carried by rotating a set of small paddles and thereby churning water, heat is produced. Thus the temperature increases. The new state of system B may have temperature Tb‘. This state of system is brought from a state A at a temperature TA. If the internal energy of system in the state A is UA and in the state B is UB, the change in internal energy ∆U = UB – UA.

In another way the system in the state A can be brought to the state B by dipping a hot rod into water which supply same amount of energy 1 kJ. Then we find the change in temperature is same as in the first case say TB – TA.

This shows that a given amount of work done irrespective of path produced the same change of state.

The internal energy U is characteristic of the state of the system. The adiabatic work Wad required to bring about a change of state is equal to the difference between the value of U in one state and that in another state ∆U.
∆U = U2 – U1 = Wad

Therefore internal energy U of the system is a state function.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics

Question 3.
“Work is not a state function.” Explain.
Answer:
A change of state is brought about both by doing work and by transfer of heat. The change in internal energy for this case as
∆U = q + w

For a given change in state q and w vary depending on how the change is carried out. However q + w = ∆U depend only on the initial and final state. It will be independent of the way the change is carried out.

Thus work and heat depend on the path in which the state changes. So work is not state function but path function.

Question 4.
What is heat? Explain.
Answer:
Heat is a form of energy.

Consider two identical balls of iron, one at 50°C and the other at 100°C. Of these one is hotter than the other. The relation between heat and work is
W = J . Q.

where ‘J’ is a constant known as the mechanical equivalent of heat. W = Work done, Q = Heat liberated. The value of J is 4.8 × 107 ergs/calorie. In the C.G.S system mechanical work is measured in units of erg. Heat is measured in units of calorie. Thus 4.18 × 107 ergs of work must be done to produce one calorie of heat.

Question 5.
Derive the equation for ‘Wrev’ in isothermal reversible process.
Answer:
Work done during the expansion of a gas against external pressure can be expressed as
W = Pext(-∆V) = -Pext(Vf – Vi)
In isothermal reversible process the above equation can be written as
TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics 2

Since dP × dV is very small it can be neglected and we can write the equation as
TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics 3

Now the pressure of the gas Pin can be written as P.

This can be obtained from ideal gas equation.
P = \(\frac{nRT}{V}\)
Therefore at constant temperature (isothermal process)
TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics 4

Question 6.
Two litres of an ideal gas at a pressure of 10 atm expands isothermally into a vacuum until its total volume is 20 litres. How much heat is absorbed and how much work is done in the expansion?
Answer:
Pressure of the gas 10 atm.
q = – W = P∆V
Since the gas expands into vacuum the pressure, P = 0
∴ q = -W = 0(20-2) = 0
∴ Heat change and work done are zero.

Question 7.
If the ideal gas given in the problem 45 expands against constant external pressure of 1 atm what is the q value?
Answer:
q = – W = P∆V = 1 (20 – 2) = 18 L atm.

Question 8.
If the ideal gas given in the problem 45 expands to a final volume of 10 L con-ducted reversibly what is q value?
Answer:
V1 = 2 lit, V2 = 10 lit
In the reversible isothermal expansion,
q = – W
∴ q = – W = 2.303 log \(\frac{20}{2}\) = 2.303 × log 10
= 46.06 lit. atm.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics

Question 9.
Explain the state function ‘enthalpy, H’. What is the relationship between ∆U and ∆H?
Answer:
The heat absorbed at constant volume is equal to change in the internal energy ∆U = qv. But in the heat absorbed at constant pressure, a part of it increases the internal energy ∆U and the remaining part is used in the expansion work done by the system. If the initial state is represented with a subscript 1 and the final state with a subscript 2. Then the above equation can be written as
U2 – U1 = qp – p (V2 – V1)
or qp = (U2 + pV2) – (U1 + pV1)
The value of U + pV is called enthalpy and represented by H. So enthalpy,
H = U + pV
qp = H2 – H1 = ∆H

Though ‘q’ is path function, H is a state function because it depends on U, p and V, all of which are state functions.
Therefore ∆H is independent of path.
The relation between ∆U and ∆H is
∆H = ∆U + p∆V (∵ p∆V = W)

Question 10.
Show that ∆H = ∆U + ∆n(g), RT
Answer:
When the reaction takes place between solids or liquids pressure has no effect. With change in temperature since the volume change of solids or liquids is negligible with temperature is negligible. But in the reactions involving gaseous substances there is significant difference in ∆H and ∆U.

If VA is the total volume of the gaseous reactants VB is the total volume of the gaseous products, nA is the number of moles of gaseous reactants and nB is the number of moles of gaseous products, all at constant pressure and temperature, then using ideal gas law,
pVA = nART
and pVB = nBRT
Thus, pVB – pVA = nBRT – nART
or pVB – pVA = (nB – nA)RT
P(VB – VA = (nB – nA) RT
or p∆V = AngRT

Here, ∆ng is number of moles of gaseous products – number of moles of gas-eous reactants.
Substituting the value of p∆V in f
∆H = ∆U + p∆V
We get, ∆H = ∆U + ∆ngRT

Question 11.
If water vapour is assumed to be a perfect gas, molar enthalpy change for vapouration of 1 mole of water at 1 bar and 100°C is 41 kJ mol-1. Calculate the internal energy change when
a) 1 mol of water is vapourised at 1 bar and 100°C
b) 1 mol of water liquid is converted into ice.
Answer:
a) H2O(1) → H2O(g)
∆n = 1
∆H = ∆U + ∆ngRT
41 = ∆U + (1 × 8.314 × 10-3 × 373)
∆E = 41 – 3.1 = 37.9 kJ.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics 5
∆n = 0
∆H = ∆U + ∆ngRT
∴ ∆H = AU (∵ ngRT = 0)
So, ∆U = 41

Question 12.
Explain extensive and intensive properties.
Answer:
Measurable properties of a system may be classified into two types
i) extensive properties
ii) intensive properties.

i) Extensive Properties :
The properties of a system which depend on the total amount of the material present in the system are called extensive properties.
Examples:
Mass (m), volume (V), internal energy (E), heat content (H), gibbs energy (G), entropy (s), heat (v) capacity, etc. are extensive properties.

ii) Intensive properties :
Properties of a system which are independent of the amount of the material in the system are called intensive properties.
Examples :
Density, molar properties such as molar volume, molar entropy, molar heat capacity, surface tension(S), viscosity, specific heat, refractive ipdepf, pressure, temperature, boiling point, freezing point and vapour pressure are intensive properties.

Question 13.
Define heat capacity. What are Cp and Cv? Show that Cp – Cv = R.
Answer:
Heat capacity of a substance is defined as the amount of heat required to raise its temperature through one degree.

The heat capacity at constant volume is represented by Cv. Cv gives the measure of the change of internal energy (E) of a system with temperature.

If heat is absorbed by the system at a constant pressure, heat capacity is represented by Cp. It is called heat capacity at constant pressure.

At constant pressure when heat is absorbed the volume of the gas increase. While the gas expands it does some work, for which extra heat amount is required. Hence Cp always greater than CV. The Cp is equal to change in internal energy and the work done. The work done is equal to PV where V is the change in volume.

Relation between CP and CV:
For an ideal gas H = E + PV

Differentiating with temperature
\(\frac{dH}{dT}=\frac{dE}{dT}+\frac{d(PV)}{dT}\)
For one mole of ideal gas PV = RT
TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics 6

Question 14.
Explain the determination of ∆U of a reaction calorimetrieally.
Answer:
The change in internal energy ∆U in a chemical reaction can be determined using bomb calorimeter. The bomb is a steel vessel. It is immersed in a water bath. The whole device is called calorimeter.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics 7

A combustible substance is burnt in pure oxygen supplied in the steel bomb. The heat evolved during the reaction measured from the rise in the temperature. Since the bomb calorimeter is sealed, the energy changes taking place in it are considered as that taking place at constant volume. Temperature change of the calorimeter produced by the reaction is then converted to qv by using the known heat capacity of the calorimeter.
q = – C × \(\frac{M}{W}\) × ∆T
where C’ is the heat capacity of calorimeter
∆T is the change in temperature
W is the mass of substance
M is the molecular mass of substance taken.

Question 15.
Explain the determination of ∆H of a reaction calorimetrieally.
Answer:
The change of enthalpy ∆H of a reaction can be measured in a calorimeter as shown in the figure. However the calorimeter is kept open to the atmosphere.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics 8

The calorimeter is immersed in an insulated water bath fitted with stirrer and thermometer. The temperature of the bath is recorded in the beginning and after the end of the reaction and change in temperature is recorded. Knowing the heat capacity of water bath and calorimeter and also the change in temperature, the heat absorbed or evolved in the reaction can be calculated. This gives the enthalpy change (∆H) of the reaction.

Question 16.
What is enthalpy of a reaction? Explain the standard enthalpy of a reaction.
Answer:
The enthalpy of a reaction is defined as the enthalpy change accompanying the chemical reaction when the molar quantities of reactants and products are the same as indicated in the chemical equation. It is also known as heat of reaction. It is represent id by ∆H.

The enthalpy change at the standard state conditions is called standard enthalpy of the reaction. It is denoted by ∆rHθ. The superscript (θ) represents standard state.

Standard state of a substance is its most stable state at one bar pressure and 298 k.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics

Question 17.
What is the standard enthalpy of formation? Explain it with example.
Answer:
Standard heat of formation of a compound is defined as the heat change accompanying the formation of one mole of a compound from its constituent elements, all the substances being in their standard states (1 bar pressure and 298 k).

Standard enthalpy of formation of the substance is also called its standard enthalpy and denoted by Hθ. Standard enthalpies of free elements are taken to be zero e.g.

C(graphite) + O2(g) → CO2(g); ∆Hθ = – 393,5 kJ

Question 18.
Define and explain enthalpy of phase transformation.
Answer:
The conversion of solid to liquid is called melting or fusion and the process of conversion of liquid into gas is called vapourisation. These processes are collectively called phase transformations or phase changes.

The enthalpy change accompanying the conversion of 1 mole of a solid substance into the liquid state at its melting point is called enthalpy of fusion.

The enthalpy change accompanying the conversion of one mole of a liquid into its vapours at the boiling is called enthalpy of vapourisation.

Question 19.
Define and explain the standard enthalpy of fusion (Molar enthalpy of fusion).
Answer:
The enthalpy change accompanying the conversion of 1 mole of a solid substance into the liquid at its melting point is called the standard enthalpy of fusion.

The standard enthalpy of fusion of a substance depends largely on the strength of intermolecular forces in the substance undergoing fusion. For example ionic solids have very strong interparticle forces. Such substances have high values of enthalpy of fusion. Molecular solids have weak interparticle forces. They have low enthalpy values of fusion.

Question 20.
Define and explain the standard enthalpy of vapourisation (Molar enthalpy of vapourisation).
Answer:
The enthalpy change accompanying the conversion of one mole of a liquid into its vapours at its boiling point is called standard molar enthalpy of vapourisation.

The values of enthalpy of vapourisation give some idea about the magnitude of interparticle forces in liquids. More the enthalpy of vapourisation stronger the inter particle forces.

Question 21.
Define and explain the standard enthalpy of sublimation.
Answer:
It is the enthalpy change accompanying the sublimation of one mole of a solid substance into gaseous state at a constant temperature below its melting point at the standard pressure.

Sublimation is direct conversion of a solid into vapour. The enthalpy of sublimation can be calculated with the help of Hess’s law.

The enthalpy of sublimation is the sum of enthalpy of fusion and enthalpy of vapourisation
subH = ∆fusH + ∆vapH

Question 22.
Define and explain the standard enthalpy of formation (∆fHθ).
Answer:
The enthalpy of formation is the heat change accompanying the formation of one mole of a compound from its constituent elements. It is generally denoted by ∆fH. For example the enthalpy of formation of carbondioxide can be represented as
C(graphite) + O2(g) → CO2(g) ; ∆H = – 396.5 kJ

When all the species of the chemical reaction are in their standard states, the enthalpy of formation is called standard heat of formation. It is denoted by ∆Hθ.

The standard heat of formation is defined as the heat change accompanying the formation of one mole of a compound from its constituent elements all the substances being in their standard states (1 bar pressure and 298 k).

Question 23.
State and explain the Hess’s law of constant heat summation. [Mar. ’18(AP&TS) AP ’17, ’16, ’15, ; TS ’16, ’15; Mar. ’13]
Answer:
Hess’s law :
Energy changes remains constant whether the reactions takes place in single step or in several steps. [TS Mar. ’19]

I. Formation of CO2 : CO2 can be formed either in one step or in two steps.
a) C(graphite) + O2 (g) → CO2 (g), ∆H = – 393.5 kJ
b) C(graphite) + \(\frac{1}{2}\)O2 (g) → CO (g), ∆H = -110.5 kJ
CO (g) + \(\frac{1}{2}\)O2(g) → CO2(g),
∆H = – 283.5 kJ ,
Total ∆H = – 393.52 kJ

Reaction ‘a’ is completed in single step and reaction ‘b’ is completed in two steps. But in both the cases energy changes remain constant, which proves Hess’s law.

II. Formation of NH4Cl (aq) :
a) NH3 (g) + H2O (l) → NH3 (aq), ∆H = – 35.1 kJ
HCl (g) + H2O (l) → HCl (aq), ∆H = – 72.9 kJ
NH3 (aq) + HCl (aq) → NH4Cl (aq), ∆H = -51.5 kJ
Total ∆H = – 159.5 kJ

b) NH3(g) + HCl (g) → NH4Cl (g), ∆H = -176.1 kJ
NH4Cl (S) + H2O (l) → NH4Cl (aq), ∆H = + 16.3 kJ .
Total ∆H = – 159.8 kJ

In both reactions (a) and (b), the heat of formation of NH4Cl (aq.) is the same, which proves Hess’s law.

Uses of Hess’s law: It is used to determine

  1. Heat of formation.
  2. Heat of reaction.
  3. Crystal lattice energy.
  4. Transition temperatures of allotropic forms.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics

Question 24.
Define and explain the enthalpy of combustion (∆cHθ).
Answer:
It is the enthalpy change accompanying the complete combustion of one mole of a substance in excess of oxygen or air.

For example, the enthalpy of combustion of carbon is represented as
C(s) + O2 (g) → CO2(g) ; ∆H = -393.5 kJ

Combustion reactions are always accompanied by the evolution of heat, therefore, the value of ∆cH is always negative.

Question 25.
Define and explain the enthalpy of atomisation (∆cHθ).
Answer:
It is the enthalpy change on breaking one mole of bonds completely to obtain neutral atoms in the gas phase.

In case of diatomic molecules, like H2, HCl etc., the enthalpy of atomisation is also the bond dissociation enthalpy. In the case of metals enthalpy of atomisation is the enthalpy of sublimation.

Question 26.
Define and explain the bond enthalpy (∆bondHθ).
Answer:
The bond dissociation enthalpy is the change in enthalpy when one mole of covalent bonds of a gaseous covalent compound is broken to form products in the gas phase.

In the case of diatomic molecules like H2, HCl etc., the enthalpy of atomisation is also the bond dissociation enthalpy. In the case of polyatomic molecules, bond dissociation enthalpy is different for different bonds within the same molecule.

Question 27.
What is the bond enthalpy of C-H bond of CH4?
Answer:
The overall thermochemical equation for its atomisation reaction is
CH4 (g) → C(g) – 4H(g) ; ∆aHθ = 1665 Id mol-1

In methane, all the four C-H bonds are similar in bond length and energy. However the energies required to break the individual C – H bonds in each successive step differ.
CH4(g) → CH3(g) +H(g); ∆bondHθ = +427 kJmol-1
CH3(g) → CH2(g) + H(g); ∆bondHθ = +439kJmol-1
CH2(g) → CH(g) + H(g); ∆bondHθ = +452kJmol-1
CH(g) → C(g) + H(g); ∆bondHθ = +347kJmol-1
Therefore,
CH4(g) → C(g) + 4H(g); ∆aHθ = 1665 kJmol-1

In such cases we use mean bond enthalpy of C-H bond.
So in CH4C-HHθ is 1665 kJmol-1/4
= 416 kJ mol-1

Question 28.
Define heat of solution (∆solHθ) and heat of dilution.
Answer:
Enthalpy of solution of a substance is the enthalpy change when one mole of it dissolves in a specified amount of solvent.

Enthalpy change associated with the addition of a specified amount of solute for the specified amount of solvent at a constant temperature and pressure is known as the enthalpy of dilution.

Question 29.
Define ionisation enthalpy and electron affinity.
Answer:
Ionisation enthalpy is the energy required to remove an electron from an isolated gaseous atom in its ground state.
X(g) → X+4(g) + e

The ionisation enthalpy is expressed in units kJ mol-1.

The enthalpy change accompanying the process of conversion of a neutral gaseous atom into negative ion by adding an electron is called electron gain enthalpy.
X(g) + e → X(g)

The electron gain enthalpy is also known as electron affinity of the atom under consideration.

Question 30.
Explain the spontaneity of a process.
Answer:
The process which takes place on its accord without the aid of an external agency is called spontaneous process.
Ex : (1) Heat flows from hot end to cold end (2) Water flows from higher level to lower level.

Spontaneous process is an irreversible process and may only be reversed by some external agency. In general for a spontaneous reaction ∆H is +ve. But for a spontaneous reaction ∆G must be -ve. All natural processes are spontaneous.

Question 31.
Is decrease in enthalpy a criterion for spontaneity? Explain.
Answer:
For the spontaneity of a reaction AG must be negative. Though the enthalpy increases if T∆S is more negative then AG becomes negative in the equation
∆G = ∆H – T∆S

So decrease in enthalpy is not a crite-rion for the spontaneity of the reaction.

Question 32.
What is entropy? Explain with examples.
Answer:
Entropy :
Entropy means transformation. It is denoted by ‘S’.

Entropy is a measure of disorder or randomness in a system.

The greater the disorder in a system the higher is the entropy. Entropy is a state function. Entropy change (∆S) between any two states is therefore given by the equation.
∆S = \(\frac{q_{rev}}{T}\)

qrev is the heat absorbed by the system isothermally and reversibly at T during the state change.

A substance in solid state have lowest entropy because the particles are orderly arranged. The gaseous state of the same substance have highest entropy because the particles are moving most disorderly. The liquid state of the same substance have entropy in between the values for solid and the gaseous state.

For a spontaneous process in an isolated system the change in entropy (∆S) is positive.

Question 33.
Is increase in entropy a criterion for spontaneity? Explain.
Answer:
No. For the spontaneity of the reaction ∆G must be negative. Even though entropy does not increase if the ∆H is more negative than T∆S in the equation ∆G = ∆H – T∆S, AG becomes negative and the reaction be-comes spontaneous.

Question 34.
Can ∆U and AS discriminate between irreversible and reversible processes? Explain.
Answer:
AU does not discriminate between irreversible and reversible process. For isothermal process involving ideal gas T is constant. Hence ∆U = 0 for both reversible and irreversible process.

∆S discriminates the irreversible and reversible process.

In an isothermal reversible process if the amount of heat Q is absorbed from the surroundings at a temperature T, the increase in the entropy of the system will be
sys = + \(\frac{Q}{T}\)

On the other hand surroundings lose the same amount of heat at the same temperature. The decrease in entropy of the surroundings will
TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics 9

In the irreversible process the system is at higher temperature T1 and its surroundings at lower temperature T2. ‘Q’ amount of heat goes irreversibly from system to surroundings
TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics 10

Hence entropy increases in an irreversible process.

Question 35.
In which of the following processes entropy increases?
a) A liquid evaporates to vapour.
b) Temperature of a crystalline solid lowered from 115 K to 0 K.
c) CaCO3(s) → CaO(s) + CO2(g)
d) Cl3(g) → 2Cl(g)
Answer:
a) A liquid evaporates vapour:
During the vapourisation, the liquid absorbs heat at constant temperature. In this process the liquid state converts into gaseous state. In the liquid state the particles are close to one another and somewhat the order of the particles is more. In gaseous state the order of the particles is less and disorder increases due to the random motion of gaseous particles. So entropy increases during the vapourisation of a liquid.

b) Temperature of a crystalline solid lowered from 115K to OK:
Ina crystalline solid the particles are arranged in an orderly maimer. Due to decrease in temperature there will be no change in the order but due to decrease in vibrational energies the entropy decreases.

c) CaCO3(s) → CaO(s) + CO2(g):
Here one of the product is gas in which randomness increases than in the solid reactant. So entropy increases.

d) Cl2(g) → 2Cl(g):
Here both are gases but one Cl2 molecule converts into 2 Cl atoms due to which randomness increases. So entropy increases.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics

Question 36.
For the oxidation of iron
4Fe(s) + 3O2(g) → 2Fe(2)O3(s),
the entropy change is – 549.45 JK-1 mol-1 at 298 K. Though it has negative entropy change the reaction is spontaneous. Why? (∆rHθ = – 1648 × 10³ J ml-1)
Answer:
∆G = ∆H – T∆S
= 1648 × 10³ J mol-1 – 298 (-549.45)
= 1648 × 10³ + 163 × 10³ = – 1485 × 10³
∆G is negative.
Since ∆G is negative, though entropy change is negative the reaction takes place spontaneously.

Question 37.
Which formulae in the following are correct?
TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics 11
Answer:
a) Correct.
b) Correct.
c) Correct.
d) Correct.
e) Correct.

Question 38.
Calculate ∆rHθ for conversion of oxygen to ozone \(\frac{3}{2}\)O2(g) → O3(g) at 298 K. Kp for the reaction is 2.43 × 10-29
Answer:
rGθ = -2.303 RT log Kp
Kp = 2.43 × 10-29
rGθ = – 2.303 × 8.314 × 298 (log 2.43 × 10-24)
rGθ = 163 kJ

Question 39.
State the second law of thermodynamics and explain it.
Answer:
Second law of thermodynamics may be stated as
Heat cannot flow from a colder body to a hotter body on its own.
(or)

Heat cannot be converted into work completely without causing some permanent changes in the system involved or in the surroundings.
(or)
All spontaneous processes are thermodynamically irreversible and entropy of the system increases in all spontaneous processes.
(or)
It is impossible to construct a machine which is working in cycles that can transform heat from lower temperature to higher temperature without the help of an external agency.

Second law of thermodynamics is useful in predicting

  1. Whether a process occurs in a specified direction or not on its own without the intervention of any external agency i.e., whether a process is spontaneous or not in the specified direction.
  2. If a transformation or a process occurs, what fraction of one form of energy is converted into another form of energy in this transformation or process.
  3. A machine which transfers heat from lower temperature to higher temperature on its own is called perpetual motion machine of second
    kind. Second law of thermodynamics predicts that perpetual motion machine is not possible.

Question 40.
State the third law of thermodynamics. What do you understand by it?
Answer:
Third law of Thermodynamics :
The entropy of a pure and perfectly crystalline substance is zero at the absolute zero temperature (- 273°C).
Slim T → 0 = o

Third law of thermodynamics is also known as Nernst heat theorem.

Third law of thermodynamics imposes a limitation on the value of entropy
TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics 12

Third law of thermodynamics is useful for calculating the entropy (S) of a substance at any temperature if temperature dependence Cp is known in evaluating the absolute value of entropy.

Basing on the third law of thermodynamics, standard molar entropy of a substance can be calculated at any specified temperature. Cp cannot be measured at absolute zero (-273°C) or around absolute zero. The heat capacity at constant volume (Cv) is measured at various temperatures upto as low temperatures as possible. Cv value at absolute zero is obtained by using extrapolating technique and the Debye equation.
Cv = aT³ (α is constant for a substance)

Near to absolute zero Cp – Cv is negligible. So Cp = Cv. Hence absolute entropy S° can be calculated using Cv value.

Question 41.
Explain “Entropy” concept.
Answer:
Entropy :
Entropy means transformation. It is denoted by ‘S’.

Entropy is a measure of disorder or randomness in a system.

The greater the disorder in a system the higher is the entropy. Entropy is a state function. Entropy change (∆S) between any two states is therefore given by the equation.
∆S = \(\frac{q_{rev}}{T}\)

qrev is the heat absorbed by the system isothermally and reversibly at T during the state change.

A substance in solid state have lowest entropy because the particles are orderly arranged. The gaseous state of the same substance have highest entropy because the particles are moving most disorderly. The liquid state of the same substance have entropy in between the values for solid and the gaseous state.

For a spontaneous process in an isolated system the change in entropy (∆S) is positive.

Question 42.
Explain spontaneity of a process in terms of Gibbs energy.
Answer:
Gibbs Energy :
Gibbs energy is a thermodynamic function. This is the difference in the enthalpy (H) and the product of entropy and absolute temperature (T) of the system.
G = H – TS
Gibbs energy is the amount of energy available from a system which can be put to useful work at constant temperature and pressure.

The change in Gibbs energy for the system ∆Gsystem at constant temperature is
∆Gsystem = ∆Hsystem – T∆ssystem
If ∆Gsystem is negative (< 0) the process is spontaneous.
If ∆ Gsystem is positive (> 0) the pro-cess is non-spontaneous.
If ∆ Gsystem is zero the system has attained equilibrium.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics

Question 43.
The sign and magnitude of Gibbs energy change of a chemical process tells about its spontaneity and useful work that could be extracted from it. Explain.
Answer:
The process which takes place on its own accord without the aid of an external agency is called spontaneous process. To sum up, the criteria for spontaneity of a process in terms of AG can be given as
i) If ∆G is -ve the prodess is spontaneous
ii) If ∆G is zero, the process does not occur (or) the system is in equilibrium
iii) If ∆G is +ve, the process does not occur in the forward direction The spontaneity of a reaction and the algebraic signs of ∆H, ∆S, ∆G and the magnitude of T are related to each other as given in the below table.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics 13

For a spontaneous process in an isolated system the change in entropy should be positive. But many reactions with ∆S is negative are known to occur spontaneously. These reactions takes place on account of coupling of these reactions with reactions of large negative ∆G values.

Question 44.
In a process, 701 J of heat is absorbed by a system and 394 J of work is done by the system. What is the change in internal energy for the process?
Answer:
dq = dU – dW
701 = dU -(- 394 J)
dU = 701 – 394 = 307 J
So the change in internal energy for the process = 307 J.

Question 45.
The reaction of cyan amide (s), with dioxygen, was carried out in a bomb calorimeter and ∆U was found to be – 742.7 kJ mol-1 at 298 K. Calculate the enthalpy change for the reaction at 298 K.
NH2CN(g) + \(\frac{3}{2}\)O2(g) → N2(g) + CO2(g) + H2O(l)
Answer:
Number of gaseous molecules of reactants
= 1 + 1.5 = 2.5
Number of gaseous molecules of products
= 1 + 1 +0 = 2
∆n = 2-2.5 = -0.5
∆H = ∆U + ∆nRT
= – 742.7 + (- 0.5 × 8.314 × 10-3 × 298)
= – 743.9 kJ

Question 46.
Calculate the number of kJ of heat necessary to rise the temperature of 60.0 g of aluminium from 35°C to 55°C. Molar heat capacity of aluminium is 24 J mol-1 K-1.
Answer:
q = msdT
q = heat liberated
m = mass of aluminium
s = molar heat capacity of aluminium
dT = change in temperature
q = \(\frac{60}{27}\) × 24 × 20 = 1.09 kJ.

Question 47.
Calculate the enthalpy change on freezing of 1.0 mol of water at 10,0°C to ice at – 10.0°C.
fusH = 6 03 kJ-1 at 0°C.
Cp[H2 O(l)] = 75.3 J mol-1K-1
Cp[H2O(s)] = 36.8 J mol-1K-1
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics 14
In the first step heat evolved ∆H = nCpdT = – 75.3 × 10 = – 753 J
In the second step heat evolved ∆H = – 6.0312 J
In the third step heat evolved ∆H = nCpdT = + 36.8 × 10 = + 368 J
∴ ∆H = – 6.03 + (- 0.753) + (+ 0.368) = – 6.415 kJ

Question 48.
Enthalpy of combustion of carbon to CO2 at 298 K. Calculate the enthalpy change is – 393.5 kJ mol-1. Calculate the heat released upon formation of 35.2 g of CO2
Answer:
Moles of CO2 = \(\frac{35.2}{44}\) = 0.8
Heat of formation of CO2 = (- 393.5) (0.8)
= – 315 kJ

Question 49.
Enthalpies of formation of CO(g), CO2(g), N2O(g) and N2O4(g) are -110, – 393.81 and 9.7 kJ mol-1 respectively. Find the value of DrH for the reaction :
N2O4(g) + 3CO(g) → N2O(g) + 3CO2(g)
Answer:
N2O4(g) + 3CO(g) → N2O(g) + 3CO2(g)
∆H = (3HCO2 + HN2O – (HN2O4 + 3HCO)
= [3 × (-389) + 8l]-[9.7 + 3(-110)]
= -778kJ

Question 50.
Given N2(g) + 3H2(g) → 2NH3(g);
rHθ = – 92.4 kJ mol-1
What is the standard enthalpy of formation of NH3 gas?
Answer:
The heat of reaction ∆rHθ is – 92.4 kJ mol-1

This is the heat of formation of 2 moles of ammonia.

The enthalpy of formation of 1 mol of NH3 = \(\frac{-94.4}{2}\) =-462kJ
∴ Standard enthalpy of formation of ammonia = – 46.2 kJ

Question 51.
Calculate the standard enthalpy of formation of CH3OH(I) from the following data:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics 15
Answer:
The given data
TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics 16
Multiply the equation with 2 and then add the three reactions after reversing the equation,
TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics 17

Question 52.
Calculate the enthalpy change for the process
CCl4(g) → C(g) + 4 Cl(g)
and calculate bond enthalpy of C – Cl in CCl4(g).
vapHθ (CCl4) = 30.5 kJ mol-1
fHθ (CCl4) = – 135.5 kJ mol-1
0Hθ (C) = 715.0 kJ mol-1, where
aHθ is enthalpy of atomisation
aHθ(Cl2) = 242 kJ mol-1.
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics 18

Question 53.
For an isolated system, ∆U = 0 what will be ∆S?
Answer:
Entropy increases (i.e.,) ∆S > 0

Question 54.
For the reaction at 298 K,
2A + B → C
∆H = 400 kJ mol-1 and ∆S = 0.2 kJ K-1mol-1. At what temperature will the reaction become spontaneous considering ∆H and ∆S to be constant over the temperature range?
Answer:
At equilibrium ∆G = 0
Tequl = \(\frac{\Delta \mathrm{H}}{\Delta \mathrm{S}}=\frac{400}{0.2}\) = 2000k
The reaction is spontaneous over 2000 °k.

Question 55.
For the reaction,
2Cl(g) → Cl2(g), what are the signs of ∆H and ∆S?
Answer:
In the bond formation energy is released.
∴ ∆H = – ve
In this reaction two chlorine atoms combine to form one Cl2 molecule. Entropy decreases
∴ ∆S = – ve

Question 56.
For the reaction
2A(g) + B(g) → 2D(g)
∆Uθ = -10.5 kJ and ∆Sθ = -44.1 JK-1.
Calculate ∆Gθ for the reaction, and predict whether the reaction can occur spontaneously or not.
Answer:
∆H = ∆U + ∆ngRT
∆H = – 10.5 + (- 1) × 8.314 × 10-3 × 298
= -12.97 kJ

∆G = ∆H – T∆S
= -12.97-298 (-44.1 × 10-3) = 0.164 kJ

Question 57.
The equilibrium constant for a reaction is 10. What will be the value of ∆G?
R = 8.314 JK-1mol-1, T = 300 K.
Answer:
∆Gθ = -2.303 RT log Kp
= – 2.303 × 8.314 × 300 × 1
= – 5.744 kJ mol

TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics

Question 58.
State the first law of thermodynamics. Explain its mathematical notation.
Answer:
Energy can neither be created nor be destroyed but energy in a process may be converted from one form to another form. First law of thermodynamics is also known as law of conservation of energy.

Mathematically first law of thermodynamics can be represented as
Q = ∆E + W

where
Q = Amount of heat absorbed by the system
∆E = Increase in internal energy of the system
W = Work done on a system
For infinitesimally small changes
q = dE + W

According to first law of thermodynamics, a part of the amount of heat (Q) absorbed by the system is used for increasing the internal energy (∆E) of the system and the remaining part is used for doing work (w).

Heat absorbed by the system is given + sign, heat given out by the system is given – sign.
Work done by a system is given – sign and work done on a system is given + sign.

Question 59.
State the second law of thermodynamics in any two ways.
Answer:
Second law of thermodynamics may be stated as
Heat cannot flow from a colder body to a hotter body on its own.
(or)

Heat cannot be converted into work completely without causing some permanent changes in the system involved or in the surroundings.
(or)
All spontaneous processes are thermodynamically irreversible and entropy of the system increases in all spontaneous processes.
(or)
It is impossible to construct a machine which is working in cycles that can transform heat from lower temperature to higher temperature without the help of an external agency.

Second law of thermodynamics is useful in predicting

  1. Whether a process occurs in a specified direction or not on its own without the intervention of any external agency i.e., whether a process is spontaneous or not in the specified direction.
  2. If a transformation or a process occurs, what fraction of one form of energy is converted into another form of energy in this transformation or process.
  3. A machine which transfers heat from lower temperature to higher temperature on its own is called perpetual motion machine of second
    kind. Second law of thermodynamics predicts that perpetual motion machine is not possible.

Question 60.
Explain Gibbs energy.
Answer:
Gibbs Energy :
Gibbs energy is a thermodynamic function. This is the difference in the enthalpy (H) and the product of entropy and absolute temperature (T) of the system.
G = H – TS
Gibbs energy is the amount of energy available from a system which can be put to useful work at constant temperature and pressure.

The change in Gibbs energy for the system ∆Gsystem at constant temperature is
∆Gsystem = ∆Hsystem – T∆ssystem
If ∆Gsystem is negative (< 0) the process is spontaneous.
If ∆ Gsystem is positive (> 0) the pro-cess is non-spontaneous.
If ∆ Gsystem is zero the system has attained equilibrium.

Question 61.
Explain the spontaneity of a reaction in terms of Gibbs energy.
Answer:
The process which takes place on its own accord without the aid of an external agency is called spontaneous process. To sum up, the criteria for spontaneity of a process in terms of AG can be given as
i) If ∆G is -ve the prodess is spontaneous
ii) If ∆G is zero, the process does not occur (or) the system is in equilibrium
iii) If ∆G is +ve, the process does not occur in the forward direction The spontaneity of a reaction and the algebraic signs of ∆H, ∆S, ∆G and the magnitude of T are related to each other as given in the below table.

For a spontaneous process in an isolated system the change in entropy should be positive. But many reactions with ∆S is negative are known to occur spontaneously. These reactions takes place on account of coupling of these reactions with reactions of large negative ∆G values.

Long Answer Questions

Question 1.
State and explain Hess’s law of constant heat summation. Give example. [AP ’17]
Answer:
Hess’s law :
Energy changes remains constant whether the reactions takes place in single step or in several steps. [TS Mar. ’19]

I. Formation of CO2 : CO2 can be formed either in one step or in two steps.
a) C(graphite) + O2 (g) → CO2 (g), ∆H = – 393.5 kJ
b) C(graphite) + \(\frac{1}{2}\)O2 (g) → CO (g), ∆H = -110.5 kJ
CO (g) + \(\frac{1}{2}\)O2(g) → CO2(g),
∆H = – 283.5 kJ ,
Total ∆H = – 393.52 kJ

Reaction ‘a’ is completed in single step and reaction ‘b’ is completed in two steps. But in both the cases energy changes remain constant, which proves Hess’s law.

II. Formation of NH4Cl (aq) :
a) NH3 (g) + H2O (l) → NH3 (aq), ∆H = – 35.1 kJ
HCl (g) + H2O (l) → HCl (aq), ∆H = – 72.9 kJ
NH3 (aq) + HCl (aq) → NH4Cl (aq), ∆H = -51.5 kJ
Total ∆H = – 159.5 kJ

b) NH3(g) + HCl (g) → NH4Cl (g), ∆H = -176.1 kJ
NH4Cl (S) + H2O (l) → NH4Cl (aq), ∆H = + 16.3 kJ .
Total ∆H = – 159.8 kJ

In both reactions (a) and (b), the heat of formation of NH4Cl (aq.) is the same, which proves Hess’s law.

Uses of Hess’s law: It is used to determine

  1. Heat of formation.
  2. Heat of reaction.
  3. Crystal lattice energy.
  4. Transition temperatures of allotropic forms.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics

Question 2.
Explain the experiment to determine the internal energy change of a chemical reaction.
Answer:
The change in internal energy ∆U in a chemical reaction can be determined using bomb calorimeter. The bomb is a steel vessel. It is immersed in a water bath. The whole device is called calorimeter.
Bomb Calorimeter

A combustible substance is burnt in pure oxygen supplied in the steel bomb. The heat evolved during the reaction measured from the rise in the temperature. Since the bomb calorimeter is sealed, the energy changes taking place in it are considered as that taking place at constant volume. Temperature change of the calorimeter produced by the reaction is then converted to qv by using the known heat capacity of the calorimeter.
q = – C × \(\frac{M}{W}\) × ∆T
where C’ is the heat capacity of calorimeter
∆T is the change in temperature
W is the mass of substance
M is the molecular mass of substance taken.

Question 3.
Explain the experiment to determine the enthalpy change of a chemical reaction.
Answer:
The change of enthalpy ∆H of a reaction can be measured in a calorimeter as shown in the figure. However the calorimeter is kept open to the atmosphere.
Calorimeter for measuring heat changes at constant pressure (atmospheric pressure)

The calorimeter is immersed in an insulated water bath fitted with stirrer and thermometer. The temperature of the bath is recorded in the beginning and after the end of the reaction and change in temperature is recorded. Knowing the heat capacity of water bath and calorimeter and also the change in temperature, the heat absorbed or evolved in the reaction can be calculated. This gives the enthalpy change (∆H) of the reaction.

Question 4.
Explain the spontaneity of a reaction in terms of enthalpy change, entropy change and Gibbs energy change.
Answer:
The process which takes place on its own accord without the aid of an external agency is called spontaneous process. To sum up, the criteria for spontaneity of a process in terms of AG can be given as
i) If ∆G is -ve the prodess is spontaneous
ii) If ∆G is zero, the process does not occur (or) the system is in equilibrium
iii) If ∆G is +ve, the process does not occur in the forward direction The spontaneity of a reaction and the algebraic signs of ∆H, ∆S, ∆G and the magnitude of T are related to each other as given in the below table.

For a spontaneous process in an isolated system the change in entropy should be positive. But many reactions with ∆S is negative are known to occur spontaneously. These reactions takes place on account of coupling of these reactions with reactions of large negative ∆G values.

Additional Questions & Answers

Question 1.
Express the change in internal energy of a system when
i) No heat is absorbed by the system from the surroundings, but work (w) is done on the system. What type of wall does the system have?
ii) No work is done on the system, but q amount of heat is taken out from the system and given to the surroundings. What type of wall does the system have?
iii) w amount of work is done by the system and q amount of heat is supplied to the system. What type of system would it be?
Answer:
i) ∆U = wad’ wall is adiabatic

ii) ∆U = – q, thermally conducting walls

iii) ∆U = q – w, closed system.

Question 2.
Two litres of an ideal gas at a pressure of 10 atm expands isothermally into a vacuum until its total volume is 10 litres. How much heat is absorbed and how much work is done in the expansion?
Answer:
We have q = -w = pex (10 – 2) = 0(8) = 0 No work is done; no heat is absorbed.

Question 3.
Consider the same expansion, but this time against a constant external pressure of 1 atm.
Answer:
We have q = – w = pex (8) = 8 iitre-atm

TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics

Question 4.
Consider the same expansion, to a final volume of 10 litres conducted reversibly.
Answer:
We have q = – w = 2.303 × 20 log \(\frac{10}{2}\) = 32.2 litre-atm.

TS Inter 2nd Year English Study Material Chapter 7 The Awakening of Women

Telangana TSBIE TS Inter 2nd Year English Study Material 7th Lesson The Awakening of Women Textbook Questions and Answers.

TS Inter 2nd Year English Study Material 7th Lesson The Awakening of Women

Annotations (Section A, Q.No. 1, Marks: 4)
Annotate the following in about 100 words each.

a) Undoubtedly women in ancient India enjoyed a much higher status than their descendants in the eighteenth and nineteenth centuries. (Revision Test – II)

The given lines occur in the informative essay “The Awakening of Women”. This article was composed by a committed writer K.M. Phanikkar. The article deals with the status of women over various periods. Every statement is backed with supporting details. The essay focuses mainly on the impact the Gandhian Movement had on the progress of women. Yet, the writer states how women’s status was in the past. Women ancient India had a respectable position. It is only in the eighteenth and nineteenth centuries that women’s condition touched a pathetic low. The given lines highlight the fact that writer is balanced but not biased.

ఇచ్చిన పంక్తులు సమాచార వ్యాసం “ది అవేకనింగ్ ఆఫ్ ఉమెన్”లో ఉన్నాయి. ఈ వ్యాసాన్ని నిబద్ధత గల రచయిత కె.ఎం. పనిక్కర్. వివిధ కాలాలలో స్త్రీల స్థితిగతుల గురించి వ్యాసం వ్యవహరిస్తుంది. ప్రతి ప్రకటనకు సహాయక వివరాలతో మద్దతు ఉంటుంది. ఈ వ్యాసం ప్రధానంగా గాంధేయ ఉద్యమం మహిళల పురోగతిపై చూపిన ప్రభావంపై దృష్టి పెడుతుంది. అయితే గతంలో స్త్రీల స్థితిగతులు ఎలా ఉండేవో రచయిత్రి పేర్కొన్నారు. ప్రాచీన భారతదేశంలో స్త్రీలకు గౌరవప్రదమైన స్థానం ఉండేది. పద్దెనిమిదవ మరియు పంతొమ్మిదవ శతాబ్దాలలో మాత్రమే స్త్రీల పరిస్థితి దయనీయమైన స్థితికి చేరుకుంది. అందించిన పంక్తులు రచయిత సమతుల్యతతో ఉన్నప్పటికీ పక్షపాతంతో లేడనే వాస్తవాన్ని హైలైట్ చేస్తాయి.

b) From the first days of his movement Gandhiji realised that there was a source of immense untapped power in the women hood of India.

The given lines occur in the informative essay “The Awakening of Women”. This article was composed by a committed writer K.M. Phanikkar. The article deals with the status of women over various periods. Every statement is backed with supporting details. Women are definitely strong. They are not weaker, certainly, than men. They have more emotional strength and power of concentration than men. Yet, for various factors, only a few persons realise and accept this fact. Among those rare personalities. Gandhiji stands first. He understood the fact that womanhood of India was treasure house of power. It had till then been not used. It could be an asset to his movement.

ఇవ్వబడిన పంక్తులు “ది అవేకనింగ్ ఆఫ్ ఉమెన్” అనే సమాచార వ్యాసంలో ఉన్నాయి. ఈ వ్యాసాన్ని నిబద్ధత గల రచయిత కె.ఎం. ఫణిక్కర్. వివిధ కాలాలలో స్త్రీల స్థితిగతుల గురించి వ్యాసం వ్యవహరిస్తుంది. ప్రతి ప్రకటనకు సహాయక వివరాలతో మద్దతు ఉంటుంది. మహిళలు ఖచ్చితంగా బలవంతులు. వారు ఖచ్చితంగా పురుషుల కంటే బలహీనులు కాదు. వారు పురుషుల కంటే ఎక్కువ భావోద్వేగ ఏకాగ్రత శక్తిని కలిగి ఉంటారు. అయినప్పటికీ, వివిధ కారణాల వల్ల, కొంతమంది వ్యక్తులు మాత్రమే ఈ వాస్తవాన్ని గ్రహించి అంగీకరిస్తారు. ఆ అరుదైన వ్యక్తుల్లో. గాంధీజీ మొదటి స్థానంలో నిలిచారు. భారతదేశం యొక్క స్త్రీత్వం శక్తి యొక్క నిధి అని అతను అర్థం చేసుకున్నాడు. అప్పటి వరకు దాన్ని ఉపయోగించలేదు. అది ఆయన ఉద్యమానికి అస్త్రం కావచ్చు.

TS Inter 2nd Year English Study Material Chapter 7 The Awakening of Women

c) It was a matter of surprise to the outside world independent India should have appointed women to highest posts so freely, as members of the Cabinet. (Revision Test – II)

The given lines occur in the informative essay “The Awakening of Women”. This article was composed by a committed writer, K.M. Phanikkar. The article deals with the status of women’s over various periods. Every statement is backed with supporting details. The position of women started to improve with their active participation in the Gandhian Movement, showed constant progress in all fields. In pre-independent India, legislation was made in favour of their rights. After India became independent, women were appointed in both key government and administrative posts. This surprised the world. People outside India thought that India was very conservative regarding women’s position. Thus the lines play an important role in clearing certain prejudices.

ఇవ్వబడిన పంక్తులు “ది అవేకనింగ్ ఆఫ్ ఉమెన్” అనే సమాచార వ్యాసంలో ఉన్నాయి. ఈ వ్యాసాన్ని నిబద్ధత గల రచయిత కె.ఎం. ఫణిక్కర్. వివిధ కాలాలలో స్త్రీల స్థితిగతుల గురించి వ్యాసం వ్యవహరిస్తుంది. ప్రతి ప్రకటనకు సహాయక వివరాలతో మద్దతు ఉంటుంది. గాంధేయ ఉద్యమంలో చురుకుగా పాల్గొనడంతో మహిళల స్థానం మెరుగుపడటం ప్రారంభమైంది, అన్ని రంగాలలో స్థిరమైన పురోగతిని చూపింది. స్వాతంత్ర్యానికి పూర్వం భారతదేశంలో, వారి హక్కులకు అనుకూలంగా చట్టం చేయబడింది.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, కీలకమైన ప్రభుత్వ మరియు పరిపాలనా పదవుల్లో మహిళలు నియమితులయ్యారు. ఇది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. భారతదేశం వెలుపల ఉన్న ప్రజలు భారతదేశం స్త్రీల స్థానానికి సంబంధించి చాలా సంప్రదాయవాదమని భావించారు. అందువల్ల కొన్ని పక్షపాతాలను తొలగించడంలో పంక్తులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

d) The contribution of women to modern India may therefore said to have led to a reintegration of social relationships

The given lines occur in the informative essay ‘The Awakening of Women”. This article was composed by a committed writer K.M. Phanikkar. The article deals with the status of women over various periods. Every statement is backed with supporting details. Active role of women in the Gandhian Movement impacted their status in the Indian society. Women played a vital role in developing modern India. That led to many important changes in social, economic and political areas. Relationships have been redefined. Rights have been reinforced. Legislation has been enacted and enforced. Thus, women’s contribution to modern India resulted in important developments.

‘ది అవేకనింగ్ ఆఫ్ ఉమెన్’ అనే సందేశాత్మక వ్యాసంలో ఈ పంక్తులు ఉన్నాయి. ఈ కథనాన్ని నిబద్ధత కలిగిన రచయిత కె.ఎం. ఫణిక్కర్ రచించారు. కథనం వివిధ కాలాల్లో మహిళల స్థితిగతులను వివరిస్తుంది. ప్రతి ప్రకటనకు సహాయక వివరాలతో మద్దతు ఉంది. క్రియాశీల పాత్ర గాంధేయ ఉద్యమంలో మహిళలు భారతీయ సమాజంలో వారి స్థితిని ప్రభావితం చేశారు. ఆధునిక భారతదేశాన్ని అభివృద్ధి చేయడంలో మహిళలు కీలక పాత్ర పోషించారు.

అది సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ రంగాలలో అనేక ముఖ్యమైన మార్పులకు దారితీసింది. సంబంధాలు పునర్నిర్వచించబడ్డాయి. హక్కులు బలోపేతం చేయబడ్డాయి. చట్టం ఈ విధంగా, ఆధునిక భారతదేశానికి మహిళల సహకారం ముఖ్యమైన పరిణామాలకు దారితీసింది.

Paragraph Questions & Answers (Section A, Q.No.3, Marks: 4)
Answer the following Questions in about 100 words

a) Why were Indian women in the nineteenth century most backward of all women in the world?
Answer:
The essay “The Awakening of Women” traces the evolution of women’s progress in India over ages. K.M. Panikkar. Multifaceted genius, discusses the theme at length. Facts have been presented in a systematic order. Supporting details have a been provided. Women in ancient India enjoyed an enviable position. Their status touched a pathetic low in the nine and teenth century. Reasons for that fall are quite many. Women were separated from the general public. The ‘Purdah’ distanced them from others. Education was a distant dream for them, Early marriages, maternity at a young age and widowhood in many cases were the order rather than an exception: These factors led them to their desperate condition!

“ది అవేకనింగ్ ఆఫ్ ఉమెన్” అనే వ్యాసం భారతదేశంలో యుగాల తరబడి స్త్రీల పురోగతి యొక్క పరిణామాన్ని తెలియజేస్తుంది. కె.ఎం. ఫణిక్కర్ బహుముఖ ప్రజ్ఞాశాలి, ఇతివృత్తాన్ని సుదీర్ఘంగా చర్చిస్తారు. వాస్తవాలు ఒక క్రమపద్ధతిలో సమర్పించబడ్డాయి. సహాయక వివరాలు అందించబడ్డాయి. ప్రాచీన భారతదేశంలో స్త్రీలు ఆశించదగిన స్థానాన్ని పొందారు. వారి స్థితి తొమ్మిది మరియు టీనేజ్ శతాబ్దాలలో దయనీయమైన స్థాయికి చేరుకుంది. ఆ పతనానికి చాలా కారణాలు ఉన్నాయి.

స్త్రీలు సాధారణ ప్రజల నుండి వేరు చేయబడ్డారు. ‘పర్దా’ వారిని ఇతరుల నుండి దూరం చేసింది. విద్య అనేది వారికి సుదూర స్వప్నం, బాల్య వివాహాలు, చిన్న వయస్సులో ప్రసూతి మరియు అనేక సందర్భాల్లో వితంతువులకు మినహాయింపులు కాకుండా ఉన్నాయి: ఈ అంశాలు వారిని వారి తీరని స్థితికి దారితీశాయి!

b) But when the movement was actually started, women were everywhere at the forefront. Elaborate. (Revision Test – II)
Answer:
The essay “The Awakening of Women” traces the evolution women’s progress in India over ages. K.M. Panikkar, a multifaceted genius, discusses the theme at length. Facts have been presented in a systematic order. Supporting details have been provided, Gandhiji understood the power of women. He believed that women could be an inexhaustible source of power. He gave a call to them to participate in his movement.

But, he had certain doubts about their readiness. His doubts were proved to be baseless. Women were very active in every area. They picketed liquor shops. They boycotted foreign goods. They took part in civil disobedience. Nowhere were women inferior to men. It was in fact the other way round.

“ది అవేకనింగ్ ఆఫ్ ఉమెన్” అనే వ్యాసం భారతదేశంలో యుగాల తరబడి స్త్రీల పురోగతిని గుర్తించింది. కె.ఎం. ఫణిక్కర్ బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పనిక్కర్ ఇతివృత్తం గురించి సుదీర్ఘంగా చర్చించారు. వాస్తవాలు ఒక క్రమపద్ధతిలో సమర్పించబడ్డాయి. సహాయక వివరాలు అందించబడ్డాయి, గాంధీజీ మహిళల శక్తిని అర్థం చేసుకున్నారు. స్త్రీలు శక్తికి తరగని మూలం అని ఆయన నమ్మారు.

తమ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కానీ, వారి సంసిద్ధతపై అతనికి కొన్ని సందేహాలు ఉన్నాయి. అతని సందేహాలు నిరాధారమైనవని రుజువైంది. ప్రతి ప్రాంతంలో మహిళలు చాలా చురుకుగా ఉండేవారు. మద్యం దుకాణాలను పికెటింగ్ చేశారు. విదేశీ వస్తువులను బహిష్కరించారు. శాసనోల్లంఘనలో వారు పాల్గొన్నారు. స్త్రీలు పురుషుల కంటే ఎక్కడా తక్కువ కాదు. ఇది నిజానికి మరో విధంగా ఉంది.

TS Inter 2nd Year English Study Material Chapter 7 The Awakening of Women

c) What is the true test of the changed position of women in India?
Answer:
The essay “The Awakening of Women” traces the evolution of women’s progress in India over ages. K.M. Panikkar multifaceted genius discusses the theme at length. Fact been presented in a systematic order. Supporting details been provided. Participation of women in the Gandhian Movement began a change in their status in society. That change is real, tangible and measurable.

Women’s participation in all spheres of national activity is revolutionary. They played a pivotal role right from work in villages to the government of the country. Progress of a few women in a small sphere cannot pass the true test of change. The real test is that the change pervades every area.

“ది అవేకనింగ్ ఆఫ్ ఉమెన్” అనే వ్యాసం భారతదేశంలో యుగాల తరబడి స్త్రీల పురోగతి యొక్క పరిణామాన్ని తెలియజేస్తుంది. కె.ఎం. పణిక్కర్ బహుముఖ ప్రజ్ఞాశాలి ఇతివృత్తాన్ని సుదీర్ఘంగా చర్చిస్తారు. వాస్తవం ఒక క్రమపద్ధతిలో సమర్పించబడింది. సహాయక వివరాలను అందించారు. గాంధేయ ఉద్యమంలో మహిళలు పాల్గొనడం వల్ల సమాజంలో వారి హోదాలో మార్పు మొదలైంది.

ఆ మార్పు నిజమైనది, ప్రత్యక్షమైనది మరియు కొలవదగినది. జాతీయ కార్యాచరణ యొక్క అన్ని రంగాలలో మహిళల భాగస్వామ్యం విప్లవాత్మకమైనది. గ్రామాలలో పని నుండి దేశ ప్రభుత్వం వరకు వారు కీలక పాత్ర పోషించారు. ఒక చిన్న గోళంలో కొంతమంది మహిళల పురోగతి మార్పు యొక్క నిజమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించదు. అసలు పరీక్ష ఏమిటంటే మార్పు ప్రతి ప్రాంతానికీ వ్యాపిస్తుంది.

d) Name some legislative reforms mentioned in the essay “The Awakening of Women” that seek to establish the equality of women. (Revision Test – II)
Answer:
“The Awakening of Women” traces the evolution women’s progress in India over ages. K.M. Panikkar, a multifaceted genius, discusses the theme at length. Facts have been presented in a systematic order. Supporting details have been provided. Women’s active part in the struggle for freedom initiated a positive change in their status. Even before India attained independence, laws were enacted and enforced in their favour. And that process continued after independence.

Rights to property, to freedom of marriage, to education and employment, raising the age of marriage and the prevention of the dedication of women to temple services were some major legislative reforms.

“ది అవేకనింగ్ ఆఫ్ ఉమెన్” భారతదేశంలో యుగాల తరబడి స్త్రీల పురోగతిని గుర్తించింది. బహుముఖ ప్రజ్ఞాశాలి కె.ఎం. పణిక్కర్ ఈ ఇతివృత్తాన్ని సుదీర్ఘంగా చర్చించారు. వాస్తవాలు ఒక క్రమపద్ధతిలో అందించబడ్డాయి. సహాయక వివరాలు అందించబడ్డాయి. మహిళల క్రియాశీలక భాగం స్వాతంత్య్రం కోసం పోరాటం వారి స్థితిగతులలో సానుకూల మార్పుకు నాంది పలికింది.

భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందే చట్టాలు రూపొందించబడ్డాయి మరియు వారికి అనుకూలంగా అమలు చేయబడ్డాయి మరియు స్వాతంత్ర్యం తర్వాత ఆ ప్రక్రియ కొనసాగింది. ఆస్తి హక్కులు, వివాహ స్వేచ్ఛ, విద్య మరియు ఉపాధి, వయస్సు పెంపు వివాహం మరియు ఆలయ సేవలకు స్త్రీలను అంకితం చేయడాన్ని నిరోధించడం కొన్ని ప్రధాన శాసన సంస్కరణలు.

The Awakening of Women Summary in English

About Author

TS Inter 2nd Year English Study Material Chapter 7 The Awakening of Women 1

Kavalam Madhava Panikkar (June 1895 – 10 December 1963), popularly known as Sardar K. M. Panikkar, was an Indian statesman and diplomat. He was also a professor, newspaper editor, historian and novelist.

Few of his notable works in English:

1920: Essays on Educational Reconstruction in India 1932: Indian States and the Government of India
1938: Hinduism and the modern world
1943: Indian States 1954: A Survey of Indian History 1954: In Two Chinas: memoirs of a diplomat
1964: A Survey of Indian History
1966: The Twentieth Century

KM Phanikkar is versatile. As a political leader, ambassador, columnist, historian and writer, he showed unparalleled talent. A current article entitled “Women’s Race Awakening” describes the sentiments of the Vanita Loka in India. Women’s world was a light in ancient India. But in the 18th and 19th centuries the condition of Ativah deteriorated drastically. Gandhi The movement contributed greatly to the empowerment of women. That woman was in the most respected position in the world.

They were deprived of education, isolated in society, abused, widowed and degraded. They tried for the upliftment of the nation. But not so much
Gandhi said that the power of the nation is the power of the nation, and its power can be used for development as much as it is actually used

The national movement led by the women’s race once in the world of Indian women in the 18th and 19th centuries kept them away from education, pressured them into early marriages, widowhood, and people like the Brahmo society did not succeed in the upliftment of the race. Women’s power is not inexhaustible and the consumers of their power for the development of rural India have realized. Called.

No matter where you look, there is no doubt that there is no demand for response, boycott of all kinds of goods, all-round movement and non-cooperation. Women. As a result of the long national movement, the Ativalas have attained the top position in all fields. Before independence some laws like their right to property, right to education, minimum age for marriage were enacted.

After independence, he won the highest posts and dazzled the world. Thus the women’s development which started with Gandhi’s movement spread and progressed rapidly to all fields. It goes on and on. Continuity Social | Beneficiary!

TS Inter 2nd Year English Study Material Chapter 7 The Awakening of Women

The Awakening of Women Summary in Telugu

Note: This summary is only meant for Lesson Reference, not for examination purpose

KM ఫణిక్కర్ బహుముఖ ప్రజ్ఞాశాలి. రాజకీయ నేతగా, రాయబారిగా, కాలమిస్టుగా, చరిత్రకారుడిగా, రచయితగా అసమాన ప్రతిభ కనబరిచారు. “మహిళల జాతి మేల్కొలుపు” పేరుతో ప్రస్తుత వ్యాసం భారతదేశంలోని వనితా లోకం యొక్క భావాలను వివరిస్తుంది. ప్రాచీన భారతదేశంలో స్త్రీ ప్రపంచం ఒక వెలుగు. కానీ 18వ మరియు 19వ శతాబ్దాలలో అతివా పరిస్థితి బాగా క్షీణించింది. గాంధీ ఉద్యమం మహిళా సాధికారతకు ఎంతో దోహదపడింది.

ఆ మహిళ ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన స్థానంలో ఉంది వారు విద్యకు దూరమయ్యారు, సమాజంలో ఒంటరిగా ఉన్నారు, దుర్భాషలాడారు, వితంతువులు మరియు అధోకరణం చెందారు. దేశాభివృద్ధికి కృషి చేశారు. కానీ అంత కాదు దేశం యొక్క శక్తి దేశం యొక్క శక్తి అని, దాని శక్తి వాస్తవానికి ఎంత ఉపయోగించబడుతుందో అంతే అభివృద్ధికి ఉపయోగించవచ్చని గాంధీ చెప్పారు.

18, 19 శతాబ్దాలలో భారతీయ మహిళా లోకంలో ఒకప్పుడు మహిళా జాతి నేతృత్వంలోని జాతీయోద్యమం వారిని చదువుకు దూరం చేసి, బాల్య వివాహాలు, వితంతువులంటూ ఒత్తిడి తెచ్చి, బ్రహ్మ సమాజం వంటివారు జాతి ఉద్ధరణలో విజయం సాధించలేకపోయారు.. మహిళా శక్తి తరగనిది కాదు మరియు గ్రామీణ

భారతదేశ అభివృద్ధికి వారి శక్తిని వినియోగదారులు గ్రహించారు. పిలిచారు. ఎక్కడ చూసినా స్పందన, అన్నిరకాల వస్తువుల బహిష్కరణ, ఆల్ రౌండ్ ఉద్యమం, సహాయనిరాకరణకు డిమాండ్ లేదనడంలో సందేహం లేదు. స్త్రీలు.

సుదీర్ఘ జాతీయోద్యమం ఫలితంగా అతివలసలు అన్ని రంగాల్లో అగ్రస్థానానికి చేరుకున్నారు. స్వాతంత్ర్యానికి ముందు వారి ఆస్తి హక్కు, విద్యాహక్కు, వివాహానికి కనీస వయస్సు వంటి కొన్ని చట్టాలు రూపొందించబడ్డాయి. స్వాతంత్య్రానంతరం అత్యున్నత పదవులు సాధించి ప్రపంచాన్ని అబ్బురపరిచారు. అలా గాంధీ ఉద్యమంతో ప్రారంభమైన మహిళా వికాసం అన్ని రంగాలకు వేగంగా విస్తరించింది. ఇది కొనసాగుతూనే ఉంటుంది. కొనసాగింపు సామాజిక లబ్దిదారు!

The Awakening of Women Summary in Hindi

Note: This summary is only meant for Lesson Reference, not for examination purpose

के.एम. फणिक्कर बहुमुखी प्रतिभा के धनी हैं । एक राजनैतिक नेता, राजदूत, स्तंभकाल, इतिहासकार और लेखक के रूप में उन्होंने अद्वितीय प्रतिभा दिखाई । “महिलाओं की दौड़ | जागृति” नामक एक वर्तमान लेख भारत में वनिता लोक की भावना ओं का वर्णन करता है । प्रयीन भारत मे नारी जगत् एक ज्योति था । लेकिन 18- वीं और 19 वीं शताब्दी में अतिवा की स्थिति बहुत शराब होगई । गाँधी आंदोलन ने महिलाओं के सशक्तीकरण में बहुत योगदान दिया । वह महिला दुनिया में सब से सम्मानित स्तान पर थी। वे शिक्षा से वंचित समाज में अलग थलग दुर्व्यवहार, विधवा और अपमानित थे । उन्होंने राष्ट्र के उत्थान के लिए प्रयास किया।

लेकिन उतना नहीं । गाँधी ने कहा राष्ट्र की शक्ति राष्ट्र की शक्ति है और उसकी शक्ति का विकास के लिए उतना ही उपयोग किया जा सकता है, जितना वास्तव में इसका उपयोग किया जाता है । 18 वीं और 19 शताब्दी में भारतीय महिलाओं की दौड़ के नेतृत्व में राष्ट्रीय आंदोलन ने उन्हें शिक्षा से दूर रखा, उन्हें असामयिक विवाह, विधवापन और ब्रह्म समाज जैसे लोगों के लिए दबाव डाला ।

जाति के उत्थान में सफल नहीं हुए। नारी शक्ति अटूट नहीं है और उपभोक्ताओं ने ग्रामीण भारत के विकास के लिए अपनी शक्ति का एहसास किया है । बुलाया कोई फर्क नहीं पड़ता कि आप कहाँ देखते हैं, इसमें कोई संदेह नहीं हैं कि प्रतिक्रिया की कोई माँग नहीं है, सभी प्रकार के सामानों का बहिष्कार, चौतरफा आंदोलन और असहयोग हैं। महिलाएँ। लंबे राष्ट्रीय आंदोलन के परिणामस्वरूप, अंतिवालों ने सभी क्षेत्रों में शीर्षस्थान प्राप्त किया है। आजादी से पहले संपत्ति का अधिकार, शिक्षा का अधिकार, शाती के लिए न्यूनतम उम्र जैसे कुछ कानुन बनाए गए थे । आजाती के बाद उन्हें सर्वोच्च पदों पर जीत हासिल की ओर और दुनिया को चकाचौंथ कर दिया । इस प्रकार गाँधी के आंदोलन से शुरू हुआ और महिला विकास तेजी से सभी क्षेत्रों में फैल गया और आगे बढ़ा। यह चलता ही जाता है । निरंतरता सामाजिक लाभार्थी ।

Meanings and Explanations

spectacular (adj) / (స్పెక్ట్యాక్యులర్)/ spek’tæk.jə.lər/ : amazing; worthy of special notice, అద్భుతమైన; ప్రత్యేక నోటీసుకు అర్హమైనది, शानदार : अद्भुत ; विशेष सूचना के योग्य

transformation (n)/ (ట్య్రాన్ స్ ఫ(ర్) మెషన్) /træens.fə”meɪ.ʃən/ : a marked change: గుర్తించదగిన మార్పు परिवर्तन : एक उल्लेखनीय परिवर्तन

descendants (n-pl) / (డిసెన్టన్)/ di’sen.dənts : children and their children: పిల్లలు మరియు వారి పిల్లలు, वंश : बच्चे और उनके बच्चे

secluded (v-pp) / (సిక్లూడిడ్)/ si’klu:.did : kept away from company; isolated కంపెనీకి దూరంగా ఉంచబడింది; ఒంటరిగా , कांत : कंपनी से दूर खा गया ; पृथक

subjection (n) / (సబ్ జెక్షన్)/ sab’dzek.fən : the process of bringing a country or a group of people under one’s control, especially by force ఒక దేశాన్ని లేదా వ్యక్తుల సమూహాన్ని ఒకరి నియంత్రణలోకి తెచ్చే ప్రక్రియ, ముఖ్యంగా బలవంతంగా, अधीनता : किसी देश या लोगों के समूह को किसी के नियंत्रण में लाने की प्रक्रिया, विशेष रूप से बल द्वारा

emancipation (n) / imæn.sı’peɪ.ʃən/ : liberation; freedom: విముక్తి; స్వేచ్ఛ स्वतंत्रता

disinclination (n)/ (డిసిన్క్లినెఇషన్)/ dɪs.ɪŋ.klı’neɪ.ʃən/ : a lack of willingness to do, చేయడానికి సుముఖత లేకపోవడం, कुछ करने की इच्छा की कमी

rehabilitation (n)/ (రీహబిలిటెఇష్న్)/ ri:.hə’bıl.ı.teıt/ : the process of helping somebody to return to a normal life: ఎవరైనా సాధారణ జీవితానికి తిరిగి రావడానికి సహాయపడే ప్రక్రియ, किसी को सामान्य जीवन में लौटने में मदद करने की प्रक्रिया

enforcing (wting gerund)/ (ఇన్ఫో(ర్) సింగ్)/ m’fɔ:sıŋ/ : bringing into effect; making something happen, అమలులోకి తీసుకురావడం; ఏదో జరిగేలా చేయడం, लागु करना : प्रभाव में लाना, कुछ घटित करना

boycott (v)/(బాయికాట్) / ‘bɔɪ.kɒt : to refuse to buy, use or take part in something as a way of protesting:
నిరసించే మార్గంగా ఏదైనా కొనడానికి, ఉపయోగించడానికి లేదా పాల్గొనడానికి నిరాకరించడం
किसी चीज को खरीदने, इस्तेमाल करने या उसमें हिस्सा लेने से इनकार करना

TS Inter 2nd Year English Study Material Chapter 7 The Awakening of Women

defying (v+ing) / (డిఫయింగ్)/ dɪ’ faɪɪŋ : not following a set of rules, customs నియమాలు, ఆచారాల సమితిని పాటించకపోవడం, नियमों से समूह, प्रथाओं का पालन नहीं करना

taboos (n-pl)/(5)/ tə’bu:s/ : customs that do not allow some persons to do certain things: కొంతమంది వ్యక్తులు కొన్ని పనులు చేయడానికి అనుమతించని ఆచారాలు, रीति रिवाज जो कुछ व्यक्तियों को कुछ चीजें कर नेकी अनुमति नहीं देते हैं ।

validity (n)/ (వ్యాలిడిటి)/ və’lıd.ə.ti : the state of being in force: అమలులో ఉనన్ సాథ్ త, लागू होनो की अवस्था

motto (n) / (మొటఉ)/ ‘mɒt.əʊ : aim, belief, లకష్ యం, విశ్వాస్, लक्ष्य, विश्वास

prolongation (n) / (ప్రోలాంగేషన్)/ prəʊ.lɒngeɪ.ʃən : the act of making something last longer ఏదైనా ఎక్కువ కాలం ఉండేలా చేసే చర్య, बनाने की क्रिया, कुछ अधिक समय तक रहता है

suffragette (n) / (35) / sʌf.rə’dʒet/ : a person fighting for women’s right to vote, మహిళల ఓటు హక్కు కోసం పోరాడుతున్న వ్యక్తి महिलाओं के वोट के अधिकार के लिए लड़नेवाला व्यक्तिः

feminism (n)/(p)/ (ఫెమనిజమ్)/’fem.ɪ.nɪ.zəɪm/ : struggle to achieve rights for women, మహిళలకు హక్కులను సాధించడానికి పోరాటం, महिलाओं के अधिकारों को प्राप्त करने के लिए संघर्ष

oriental (adj) / (ఓరిఎంటల్) / ɔ:ri’entəl : eastern : తూరమ్, पूर्व का

epochal (adj)/ (ईपाकल)/ ‘i:.pɒk.əl : highly important; very significant : అత్యంత ముఖ్యమైన; చాలా ముఖ్యమైనది, अर्थधिक महत्वपूर्ण, बड़ा सार्थक

emphasised (v-pt) / ’em.fə.saɪz : stressed: gave extra importance, ప్రధానిన్నిత, अतिरिक्त महत्व दिया

imposed (v-pt) ౯ డ్ జ ఉయ్ఎఇ / Im’ pəʊz : forced someone to endure something unwanted, ఒత్తిడిచేయు, किसी को कुछ अवांछित सहने के लिए मजबूर किया

conservatism (n) / (కన్ స (ర్)వటిజ్ మ్) / kan’s3:.va.tɪ.zəm : the tendency to resist change: inclination to follow existing spheres of national inclination to follow existing practices, అనేది మార్పును నిరోధించే ధోరణి: ఇప్పటికే ఉన్న పద్ధతులను, అనుసరించడానికి జాతీయ వంపు యొక్క ప్రస్తుత రంగాలను అనుసరించడానికి మొగ్గు.

reintegration (n) / (రీఇంటిగ్రేషన్)/ ɪn.tɪ’greɪ.ʃən / : restoration of something to its place in the whole: మొత్తంలో ఏదో దాని స్థానానికి పునరుద్ధరించడం, किसी चीज को उसके स्थान पर पूरी तरह से बहाल करना

TS Inter 1st Year History Study Material Chapter 11 యూరోపియన్ల రాక

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 11th Lesson యూరోపియన్ల రాక Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 11th Lesson యూరోపియన్ల రాక

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న1.
బేగాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికార స్థాపనను వర్ణించండి.
జవాబు.
కో కర్ణాటక యుద్ధం సందర్భంగా క్లైవ్ తీసుకున్న నిర్ణయాలు యుద్ధ నిర్వహణలో చూపిన చురకుతనం, ఇంగ్లీష్ విజయానికి కారణమైంది. కర్ణాటక రాజ్య రాజధానియైన ఆర్కాట్ను ఆక్రమించాడు. ఈ విజయం రెండో కర్ణాటక యుద్ధ గమనాన్ని మార్చింది. ఫ్రెంచి వారి పరాజయానికి నాంది పలికింది. ఫ్రెంచివారి భవిష్యత్కు, డూప్లేకు ఈ యుద్ధం తీరని నష్టం కలిగించింది. బెంగాల్లో ఆంగ్లేయుల భవిష్యత్ వ్యూహాలకు ఈ విజయం మార్గం సుగమం చేసింది.

ఫ్లాసీ యుద్ధం (క్రీ.శ. 1757, 23 జూన్) : భారతదేశంలో ఆంగ్లేయుల లేదా తూర్పు ఇండియా కంపెనీ వారి అధికార విస్తరణకు కర్ణాటక విజయాలు ఎంత దోహదం చేసాయో, భవిష్యత్లో ఈస్ట్ ఇండియా కంపెనీ విజయాలకు, పేరు ప్రతిష్ఠలు ఇనుమడింపచేయడానికి బెంగాల్లో రాబర్ట్ క్లైవ్ సేనాధిపత్యంలో చేసిన ప్లాసీయుద్ధం (క్రీ.శ. 1757) అంత కంటే ఎక్కువ పేరు తెచ్చిపెట్టిందని చరిత్రకారుల వాదన. ప్లాసీ యుద్ధం బెంగాల్ నవాబ్ సిరాజ్ ఉద్గాలా (అలీవర్దీఖాన్ మనవడు), బ్రిటిష్ సైన్యాలకు జరిగింది. ఈ యుద్ధానికి ముఖ్య కారణాలు (1) బెంగాల్ సహజ వనరులను స్వాధీనం చేసుకోవాలన్న బ్రిటిష్ వారి కోరిక, (2) ఫ్రెంచి వారితో బెంగాల్ నవాబ్లకు గల సంబంధాన్ని విచ్ఛిన్నం చేయడం, (3) బెంగాల్లో ఫ్రెంచి ప్రాబల్యాన్ని అంతం చేయడం, (4) సిరాజ్ ఉదౌలా స్థానంలో బెంగాల్ నవాబుగా తమకు అనుకూలమైన వ్యక్తిని నవాబుగా చేయాలన్న ఆంగ్లేయుల కోరిక.

సిరాజ్ ఉదౌలా సేనాధిపతియైన మీర్ జాఫర్, అమీర్ చంద్ అనే వ్యాపారి మొదలైన సిరాజ్ ద్రోహులను తమ వైపు త్రిప్పుకున్న రాబర్ట్క్లెవ్ యుద్ధానికి సిద్ధమైనాడు. పైన పేర్కొన్న వారితోపాటు మాణిక్ చంద్ (బ్యాంకరు) జగత్ సేవ్, రాయుర్లబ్లు సిరాజ్న మోసగించి, రాబర్ట్ క్లైవ్ పక్షం చేరారు. చివరికి సిరాజ్ ఉదౌలా సేనాని మీర్ కాసీం కూడా క్లైవ్ పక్షం చేరాడు. ఇరుపక్షాల సేనలకు, జూన్ 23, 1757న, ప్లాసీ వద్ద నామమాత్రం యుద్ధం జరిగింది. నమ్మకద్రోహం చేసిన మీరాఫర్ క్లైవు విజయం చేకూర్చారు. సిరాజ్ ఉద్దెల ఓడింపబడి వధింపబడ్డాడు. మీర్జాఫర్ బెంగాల్ నవాబు అయ్యాడు. ఫ్రెంచి వారి స్థావరమైన చంద్రనగర్ను బ్రిటిష్వారు ఆక్రమించడంతో బెంగాల్లో ఫ్రెంచివారి ప్రాభల్యం అంతరించింది. బెంగాల్లో కంపెనీకి స్వేచ్ఛ రాజ్యాధికారాన్ని సంపాదించింది. కలకత్తా సమీపంలోని 24 పరగణాల జమీందారీని పొందింది.

బక్సార్ యుద్ధం (22 అక్టోబర్ 1764) : మీర్ జాఫర్ నేతృత్వంలోని, బెంగాల్ ఈస్ట్ ఇండియా కంపెనీ, దోపిడి చేయడం వల్ల బెంగాల్ ప్రజలు అన్ని రకాలు నష్టపోయారు. మద్రాస్, బొంబాయిలలోని ఈస్ట్ ఇండియా కంపెనీ ఖర్చులు కూడా బెంగాల్పై రుద్దారు. మీరజాఫర్కు బెంగాల్ నవాబగిరి ముల్లకంచెగా మారింది. క్లైవ్ అ భారతదేశంలో బెంగాల్ కొత్త గవర్నర్గా నియమించబడిన వాని ్సత్తార్ మీర్జాఫర్ను నవాబ్ పదవి నుంచి తొలగించి, అతని అల్లుడైన మీర్ ఖాసింను చేశాడు. దీనికి బదులుగా కొత్త బెంగాల్ నవాబ్ ఆంగ్లేయులకు బర్ద్వాన్, మిడాపూర్, చిట్టగాంగ్ జిల్లాలను అప్పగించాడు. కంపెనీ అధికారులకు మీరఖాసిం 29 లక్షలు చెల్లించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 11 యూరోపియన్ల రాక

మీరాసిం కొంతకాలం తరువాత బెంగాల్ రాష్ట్ర ప్రజల హితాన్ని కోరి చేపట్టిన వివిధ సంస్కరణలు బ్రిటీష్ వారికి నచ్చలేదు. దీనితో ఆగ్రహించిన కంపెనీ అధికారులు అతడిని పదవి నుంచి తొలగించారు. మళ్ళీ మీర్జాఫర్ను బెంగాల్ నవాబ్ చేశారు.

చివరికి పదవికోల్పోయిన మీర్ ఖాసిం, మొగల్ చక్రవర్తి షాఆలం, అవద్ నవాబ్ షుజా ఉద్దేలా మొదలైనవారి సహకారం, సేనలతో బక్సార్ వద్ద క్రీ.శ. 1764 అక్టోబర్ 22న, బ్రిటీష్ సేనలతో యుద్ధం చేశాడు. బ్రిటీష్ సేనాధిపతి మేజర్ మన్రో చేతిలో పరాజయం పొందాడు. చివరికి యుద్ధంలో మొగల్ చక్రవర్తి షా ఆలం, అవద్ నవాబ్లు ఓడిపోయారు. క్రీ.శ. 1765లో కుదిరిన అలహాబాద్ సంధి ప్రకారం అలహాబాద్ సంధి (1765) బెంగాల్లో ద్వంద్వపాలనకు శ్రీకారం చుట్టారు. బెంగాల్, బీహార్, ఒరిస్సాలో దివానీ అధికారాన్ని అనగా భూమిశిస్తు వసూలు అధికారం బ్రిటీష్ వారు పొందారు. సివిల్ అధికారులు నవాబ్కు ఇచ్చారు. కారా, అలహాబాద్ జిల్లాలను అయోధ్య నుండి వేరు చేసి మొగల్ చక్రవర్తికి ఇవ్వడం జరిగింది. సాలుకు 26 లక్షల రూపాయలు కంపెనీ, చక్రవర్తికి ఇవ్వడానికి అంగీకరించింది. ఈ విధంగా క్రీ.శ. 1757, 1764లలో జరిగిన ఫ్లాసీ, బక్సార్ యుద్ధాల్లో బెంగాల్ నవాబ్ పరాజయం, భవిష్యత్లో బ్రిటీష్ అధికార విస్తరణకు బీజాలు వేసింది. స్వదేశీ ప్రజల కష్టాలు రెట్టింపైనాయి. ఈ యుద్ధం భారతీయ పాలకుల సైనిక బలహీనతను తెలియజేసింది. ఈ యుద్ధంలో మొగల్ చక్రవర్తి కూడా ఓడిపోయాడు. కంపెనీ దివానీ అధికారాన్ని పొందడంతో ఇండియాలో ఇంగ్లీష్ వారి అధికారం స్పష్టంగా స్థాపించడం
జరిగింది.

ప్రశ్న 2.
ఈస్ట్ ఇండియా కంపెనీ భూమిశిస్తు విధానాలను వివరించండి.
జవాబు.
1785కు పూర్వం బెంగాల్లో ప్రతి ఏటా భూమి శిస్తు వసూలు చేసే అధికారాన్ని వేలం పాట ద్వారా అత్యధిక రేటు చెల్లించడానికి సిద్ధమైన వారికి ఇచ్చేవారు. వీరినే జమీందార్లు అనేవారు. దీనివల్ల కంపెనీకి అనేక నష్టాలుండేవి. ఈ సమస్య పరిష్కారానికి ‘వారన్ హేస్టింగ్స్’ గవర్నర్ జనరల్ గా ఉన్న కాలంలో ‘ఐదు సంవత్సరాల ఒడంబడిక’ పద్ధతిని ప్రవేశపెట్టాడు. కాని ఇంగ్లాండ్లోని గృహ ప్రభుత్వం ‘వార్షిక రెవిన్యూ ఒడంబడిక పద్దతినే సమర్థించింది. క్రీ.శ. 1786వ సంవత్సరంలో బ్రిటీష్ గవర్నర్ జనరల్గా భారతదేశం వచ్చిన లార్డ్ కారన్ వాలీస్ బెంగాల్లో అమలులో ఉన్న భూమిశిస్తు విధానాన్ని సరిదిద్దడానికి కొత్త విధానాన్ని రూపొందించాడు.

క్రీ.శ. 1768లో ‘కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్’ కారన్ వాలీస్ ను, పదిఏండ్ల భూమిశిస్తు ఒడంబడిక చేసుకోవల్సిందిగా సూచించింది. దీన్నే తరువాత కాలంలో ‘శాశ్వత భూమిశిస్తు’ విధానంగా వర్ణించారు. సరానార్ సహకారంతో క్రీ.శ. 1786-1789 మధ్యకాలంలో కారన్ వాలీస్ బెంగాల్లో భూమి సర్వే, రికార్డుల పరిశీలన, అంతవరకు అమలులో ఉన్న పద్దతులు మొదలైనవి అధ్యయనం చేశాడు. 1793లో శాశ్వత భూమిశిస్తు విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ పద్ధతిలో కారన్ వాలీస్ గతంలో కేవలం భూమిశిస్తు వసూలు అధికారాలు పొందిన జమీందార్లను, సమాజంలో అత్యంత ప్రభావవంతులైన వారిగా మార్చాడు. వారిని బ్రిటిష్ సామ్రాజ్యవాద పరిరక్షణకు, వలసవాడ పరిరక్షణకు భారతదేశంలో సరైన ఏజెంటులుగా మార్చాడు. ప్రతి జమీందారు ప్రభుత్వానికి నిర్ధారించిన భూమిశిస్తు మొత్తాన్ని పదేండ్లకాలానికి ముందుగానే నిర్ణయించిన కాలానికే చెల్లించేట్లు అంగీకరింపచేశాడు. దీనివల్ల భూమిపై జమిందార్కు గతంలో కంటే తక్కువ యాజమాన్యపు హక్కు చేకూరింది. అన్ని రకాలుగా కంపెనీ ఆధిపత్యం నెలకొల్పబడింది. రైతాంగం జమీందార్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసి వచ్చింది. వారి కష్టనష్టాలు నేరుగా ప్రభుత్వానికి చెప్పుకునే అవకాశాలు అంతరించాయి. బ్రిటీష్వారికి వినయంగా, విధేయులుగా ఉన్నంతకాలం ఈ జమీందార్లు తమ ప్రాంతాల్లో అధికారం చెలాయించారు. క్రమంగా ఈ జమీందార్లు వంశపారంపర్యపు హక్కులు పొందారు. కంపెనీకి ఈ కొత్త భూమి శిస్తు విధానం వల్ల అన్ని రకాల లాభాలు సమకూరాయి. భారతదేశంలో బ్రిటీష్ అధికార రక్షకులుగా ఈ జమిందార్లు ఎదిగారు. 1857 తిరుగుబాటుకాలంలో వారు చేసిన సహాయాన్ని బ్రిటీష్ అధికారులు స్వయంగా ప్రశంసించారు.

కారన్ వాలీస్ ప్రవేశపెట్టిన శాశ్వత భూమిశిస్తు విధానం రైతాంగం పాలిట శాపంగా మారింది. వారిపై పన్ను భారం పెరిగింది. భూమిపై ఎలాంటి హక్కు లేకుండాపోయింది. కరువు కాటకాలు, అతివృష్టి, అనావృష్టి కాలాల్లో కూడా రైతాంగం తమ గోడును ప్రభుత్వానికి విన్నవించుకునే అవకాశం లేకుండా పోయింది. వ్యవసాయం భారంగా, లాభహీనంగా మారింది. రైతులు, రైతుకూలీలు నష్టపోయారు.

రైత్వారీ విధానం : ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో ప్రవేశపెట్టిన భూమిశిస్తు (రెండో) విధానం రైత్వారీ పద్ధతి. దీన్ని సరాథామస్మన్రో, మద్రాస్ ప్రసిడెన్సీలో ప్రవేశపెట్టాడు. దీనికి ఆనాటి బ్రిటీష్ గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లస్లీ అంగీకరించాడు. రైతుతో ప్రత్యక్ష ఒడంబడిక చేసుకోవాలన్నది రైత్వారీ పద్ధతి అతి ముఖ్య లక్ష్యం. క్రీ.శ. 1792లో ముందుగా ఈ పద్ధతిని బారాముల్లా (సేలం)లో ప్రవేశపెట్టారు. దీనికి కెప్టెన్ రీడ్ మూలసూత్రధారి. కెప్టెన్ రీడ్ అనుచరుల్లో ఒకడైన థామస మన్రో 1800 సంవత్సరంలో సీడెడ్ జిల్లాల (దత్తమండలాల) కలెక్టర్గా నియమించబడ్డాడు. అక్కడ దీన్ని మన్రో విజయవంతంగా అమలుచేశాడు. రైత్వారీ పద్దతిని మన్రో రైతు సంక్షేమ దృష్టితో అమలు చేశాడు. దీని వల్ల రైతులే భూమికి యజమానులయ్యారు. పండించిన పంటలో 1/3 వంతు ప్రభుత్వం శిస్తు రేటుగా నిర్ణయించింది. రైతులందరికీ ‘పట్టాలు’ ఇప్పించాడు. దీనివల్ల వారికి రక్షణ చేకూరింది. ఆ తరువాత కాలంలో దక్షిణ భారతదేశంలోని తంజావూర్, ఆర్కాట్, కోయంబత్తూర్, మలబార్ మొదలైన ప్రాంతాల్లో ఈ రైత్వారీ పద్ధతిని ప్రవేశపెట్టారు. క్రీ.శ. 1818 నాటి మూడో మరాఠా ఆంగ్లో యుద్ధం తరువాత బొంబాయి ప్రసిడెన్సీలోని అత్యధిక ప్రాంతాలపై కంపెనీ ఆధిపత్యం నెలకొల్పబడింది. ఇక్కడ కూడా ‘రైత్వారీ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఇక్కడ పండిన పంటలో 55% ప్రభుత్వ వాటాగా (శిస్తు రేటుగా) నిర్ణయించారు.

వాస్తవానికి ఈ రైత్వారీ భూమిశిస్తు పద్ధతి జమీందారీ వ్యవస్థ కంటే మెరుగైన ఫలితాలను ఇచ్చింది. ప్రతిరైతు, గ్రామాలు లాభపడ్డాయి. సామాజిక చైతన్యానికి రైత్వారీ పద్ధతి పునాదులు వేసింది. సమాజంలో అంతవరకు కొనసాగిన భూమి ఆధారిత యాజమాన్యపు హక్కు, సామాజిక హోదా తగ్గింది. కాని గవర్నమెంట్ ఏజెంట్లు రైతాంగాన్ని మళ్ళీ పీడించారు. ఫలితంగా ఆర్థికంగా రైతులు పూర్తిస్థాయిలో పేదరిక చక్రం నుంచి విముక్తి పొందలేరు. సీడెడ్ జిల్లాలో మన్రో ప్రయత్నం గొప్ప విజయాలు సాధించినప్పటికీ మిగతా ప్రాంతాల్లో మధ్యవర్తుల, ఏజెంట్లు స్వార్థం, లంచగొండతనం వల్ల విఫలమైంది.

ప్రశ్న 3.
కర్ణాటక యుద్ధాలకు దారితీసిన కారణాలు, ఫలితాలను చర్చించండి.
జవాబు.
ఆధునిక యుగంలో యూరోపియన్లు వ్యాపారార్థం భారతదేశానికి వచ్చారు. కాల – క్రమంలో వ్యాపార ఆధిపత్యానికై ఇంగ్లీషు, ఫ్రెంచి వారి మధ్య మూడు యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాల వల్ల భారతదేశంలో ఫ్రెంచి వారి శక్తి పూర్తిగా దిగజారిపోయింది. నాటి నుండి ఆంగ్లేయుల విజృంభణకు ఎదురులేకపోయింది.

మొదటి కర్ణాటక యుద్ధం (1744 – 48) : 1742లో ‘డూప్లే’ ఫ్రెంచ్ గవర్నర్ గా నియమించబడ్డాడు. భారతదేశంలో ఆంగ్లేయులు ఫ్రెంచి వారి స్థావరమైన పుదుచ్చేరిని ఆక్రమించాలనే ఆలోచనలో ఉన్నారు. దీనితో ఫ్రెంచి వారు కర్ణాటక నవాబు అన్వరుద్దీన్ సహాయం కోరాడు. దీనితో ఆంగ్లేయులు యుద్ధవిరమణ చేశారు. ఇట్టి పరిస్థితుల్లో ఫ్రెంచి సైన్యం లాబొర్డినాయి నాయకత్వంలో భారతదేశం వచ్చింది. ఆ ధైర్యంతో 1746లో ఫ్రెంచివారు ఆంగ్లేయులు సెయింట్ జార్జ్ కోటను స్వాధీనపరచుకున్నారు. ఈలోగా ఆంగ్లేయులు అన్వరుద్దీన్ చేరారు. దాంతో నవాబు ఫ్రెంచి వారిని వైదొలగమని హెచ్చరించాడు. ‘శింధోమ్’ వద్ద నవాబు సైన్యం ఫ్రెంచి సైన్యానికి జరిగిన యుద్ధంలో అన్వరుద్దీన్ ఓటమి పాలయ్యాడు. ఈలోగా యూరప్లో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ముగిసింది. దానితో భారతదేశంలో కూడా యుద్ధం ముగిసింది. సంధి షరతుల ప్రకారం మద్రాస్ను ఆంగ్లేయులకు అప్పగించారు. రెండవ కర్ణాటక యుద్ధం (1749 – 1754) : 1748లో హైదరాబాద్ నిజాం ఉలుల్క్ మరణించటంతో, సింహాసనం కోసం కుమారుడు నాజర్ంగ్, మనుమడు ముజఫర్లాంగ్ల మధ్య అంతర్యుద్ధం మొదలైంది. అలాగే కర్ణాటక సింహాసనం కోసం చందాసాహెబ్కు అన్వరుద్దీన్ కు మధ్య యుద్ధం ప్రారంభమైంది. చందాసాహెబ్, ముజఫర్లాంగ్లు ఫ్రెంచి గవర్నర్ డూప్లే సాయాన్ని కోరారు. వీరికి సహాయం చేసి దక్కన్లో తమ ప్రాభవాన్ని పెంచుకుందామని డూప్లే భావించాడు. 1749లో ఆయూర్ వద్ద జరిగిన యుద్ధంలో అన్వరుద్దీన్ ను వధించారు. నాజర్డింగ్ ఆంగ్లేయుల సాయంతో ముజఫర్ జంగ్ను ఓడించాడు, కానీ ఫ్రెంచి వారి చేతిలో హత్యకు గురయ్యాడు. ఫ్రెంచివారు ముజఫర్ంగ్ను నవాబును చేసారు. ‘బుస్సీ’ హైదరాబాద్లో రక్షణగా ఉన్నాడు. 1751లో జరిగిన యుద్ధంలో ఫ్రెంచివారు ఓడారు. తరువాత 1752లో రాబర్ట్ క్లైవ్ కర్ణాటకలో చందాసాహెబ్ను ఓడించి వధించాడు. ఈ స్థితిలో డూప్లే స్థానంలో గాడెహ్యును నియమించారు. దీంతో కర్ణాటకలో ఆంగ్లేయుల ప్రాబల్యం పెరిగింది. మూడవ కర్ణాటక యుద్ధం (1756 61) : ఐరోపాలో సప్తవర్ష సంగ్రామం ప్రారంభమైంది. ఫ్రెంచి గవర్నర్గా కౌంట్జిలాలి నియమితుడయ్యాడు. ఇతడు కడలూర్ ఆంగ్లేయుల కోటను ఆక్రమించి మద్రాసు ఆక్రమించడానికి విఫలయత్నం చేశాడు. ఆంగ్లేయులకు సర్ ఐర్ర కూట్ నాయకత్వం వహించాడు. బుస్సీని సాయం రమ్మని ఆజ్ఞాపించాడు. దాంతో ఆంగ్లేయులు నైజాంతో ఒప్పందం చేసుకున్నారు. 1760లో ‘వందవాసి’ వద్ద జరిగిన యుద్ధంలో ఫ్రెంచి సైన్యాన్ని ఓడించి పుదుచ్చేరిని ఆక్రమించి ‘డిలాలి’నిబందీగా ఇంగ్లాండ్ పంపాడు. 1763లో సప్తవర్ష సంగ్రామం ముగియడంతో మూడవ కర్ణాటక యుద్ధం ముగిసింది.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న1.
మైసూర్ యుద్ధాలపై ఒక లఘు వ్యాసం రాయండి.
జవాబు.
ఆంగ్లేయులు మైసూర్ రాజ్యంలో క్రీ.శ. 1766 నుంచి 1799 మధ్య నాలుగు యుద్ధాల్లో ఎదుర్కొన్నారు. మొదటి మైసూర్ యుద్ధం క్రీ.శ. 1766 – 1769 మధ్యకాలంలో హైదర్అలీ సేనలకు, ఈస్ట్ ఇండియా సేనలకు జరిగింది. హైదర్ కంపెనీ సేనలను వారి మిత్ర రాజ్యాల సేనలు ఓడించాడు. మద్రాస్ సంధి షరతులను కంపెనీ అంగీకరించింది. రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం (క్రీ.శ. 1780 – 1784) : రెండోసారి 1780వ సంవత్సరంలో మద్రాస్ సంధి షరతులను బ్రిటిష్వారు ఉల్లంఘించినందువల్ల, మైసూర్ పాలకుడైన హైదర్అ లీ యుద్ధానికి సిద్ధమైనాడు. ఇదే కాలంలో మరాఠా సేనలతో హైదర్ నిమగ్నమై ఉండగా,, ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలాంటి సహాయం అందించలేదు. మద్రాస్ సంధి షరతులను ఉల్లంఘించింది. అందువల్ల, హైదరాలీ, తన కుమారుడై టిప్పుతో కలిసి రెండోసారి యుద్ధానికి సిద్ధమైనాడు. యుద్ధం కొనసాగుతున్న కాలంలోనే హైదరాలీ కాన్సర్ వ్యాధితో మరణించాడు. టిప్పు సుల్తాన్ బాధ్యతలు స్వీకరించాడు. చివరికి మంగళూరు సంధితో టిప్పు యుద్ధాన్ని విరవించాడు. ఇరువర్గాలవారు మరాఠాలతో, నిజాంతో స్నేహం చేయమనీ, శ్రీరంగపట్టనాన్ని టిప్పుకు ఇవ్వడానికి అంగీకరించాయి. మూడో మైసూర్ యుద్ధం : మూడోసారి బ్రిటీష్ సేనలు క్రీ.శ. 1790వ సంవత్సరంలో మైసూర్ రాజ్యంపై 1789లో యుద్ధం ప్రకటించాయి. లార్డ్ కారన్ వాలీస్ బ్రిటీష్ సేనలకు నాయకత్వం వహించాడు. టిప్పుసేనలు పరాజయం పొందాయి. శ్రీరంగపట్టణం ఆంగ్లేయుల వశమైంది. క్రీ.శ. 1792లో టిప్పు శ్రీరంగపట్టణం సంధి షరతులను అంగీకరించాడు. ఈ సంధి షరతుల ప్రకారం మైసూర్ రాజ్యం విస్తీర్ణంలో అర్థభాగం కోల్పోయింది. టిప్పుసుల్తాన్ 3.30 కోట్లు యుద్ధ నష్ట పరిహారం చెల్లించాలి. అతని ఇద్దరి కుమారులను జామీనుగా కంపెనీ బందీలుగా ఉంచింది.

నాల్గో మైసూర్ యుద్ధం (క్రీ.శ 1798 – 1799) : ఆంగ్లేయులకు టిప్పు సుల్తాన్లకు మధ్య శ్రీరంగపట్టణం సంధి శాశ్వత శాంతిని ప్రసాదించలేదు. 1798 – 1799లో చివరిసారిగా టిప్పుసుల్తాన్ సైన్యం, ఆంగ్ల సేనలతో తలపడింది. దీన్నే నాల్గో మైసూర్ యుద్ధం అంటారు. ఈ యుద్ధంలో టిప్పు ప్రాణాలు కోల్పోయాడు. పూర్వపు ఒడియార్ వంశానికి చెందిన ఒక మైనర్ బాలున్ని కంపెనీ మైసూర్ పాలకునిగా నియమించింది. మైసూర్ రాజ్యం సైన్యసహాకార ఒప్పందంలో చేరింది.

ప్రశ్న 2.
ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం నాటి న్యాయవ్యవస్థను వివరించండి.
జవాబు.
బ్రిటీష్ వారు, తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో నూతన న్యాయవ్యవస్థను ఏర్పాటు చేశారు. రాబర్ట్ క్లెవ్, వారన్ హేస్టింగ్స్, కారన్ వాలీస్ సివిల్, క్రిమినల్ కేసుల పరిష్కారానికి అనేక స్థాయిల్లో కోర్టులను ఏర్పాటు చేశారు. 1772 – 73 నాటి రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బెంగాల్లో సుప్రీంకోర్టు నెలకొల్పబడింది. 1781 నాటికి సుప్రీంకోర్టు అధికారులు, పనితీరు మొదలైన అంశాలు నిర్ధారించారు. వారన్ హేస్టింగ్స్ కాలంలో జిల్లాస్థాయిలో దివాన్ – ఇ – అదాలత్, ఫౌజ్ దారీ ఇ – అదాలత్ను ఏర్పాటు చేశారు. దివాన్ అదాలత్ సివిల్ కేసులను, కలెక్టర్ నేతృత్వంలో విచారించేది. ఫౌజ్రీ ఇ – అదాలత్ భారతీయ సంతతి అధికారుల ఆధ్వర్యంలో ముస్తీలు, ఖాజీల సలహాలతో పనిచేసేది.

లార్డ్ కారన్ వాలీస్ కాలంలో సివిల్, క్రిమినల్ కోర్టుల విషయంలో గ్రేడింగ్లను ఏర్పాటు చేశారు. మున్సిఫ్ కోర్టులు ఏర్పాటు చేశారు. భారతీయ న్యాయనిపుణులను మున్సిఫ్ కోర్టు అధికారులుగా నియమించారు. కారన్ వాలీస్ బెంగాల్, బీహార్లలో సర్క్యూట్ కోర్టులు ఏర్పాటు చేశాడు. ఇతడు కార్యనిర్వాహక శాఖ అధికారాలను, న్యాయశాఖ అధికారాలను విభజించాడు. క్రిమినల్ కేసులు నవాబ్ బాధ్యత. గవర్నర్ జనరల్ క్రిమినల్ కేసుల తీర్పుల విషయంలో అత్యున్నత న్యాయాధికారి. ‘కారన్ వాలీస్ న్యాయస్మృతి’గా పేరుగాంచిన కోడ్ (సివిల్, క్రిమినల్ సూత్రాలు) ఇతని కాలంలోనే భారతీయ (హిందూ – ఇస్లామిక్) న్యాయసూత్రాలను అమలు చేసే విధానాన్ని న్యాయాధికారులకు వివరించే ప్రయత్నం జరిగింది. న్యాయశాఖలో చాలా వరకు విచక్షణ లేకుండా చేశాడు కారన్వాలీస్.

లార్డ్వెల్లస్లీ కాలంలో సదర్ – నిజామత్ అదాలత్లో రెగ్యులర్ జడ్జీలను నియమించే సంప్రదాయాన్ని ప్రారంభించాడు. విలియం బెంటింక్ కాలంలో బెంగాల్లో లార్డ్కరన్ వాలీస్ నెలకొల్పిన నాలుగు సర్క్యూట్ కోర్టులను రద్దు చేశాడు. అతడు బెంగాల్ను 20 డివిజన్లుగా విభజించాడు. ప్రతి విడిజన్కు ఒక న్యాయాధికారిని నియమించాడు. వీరందరిపై అధికారి కమీషనర్. ప్రజాసంక్షేమానికి వారి రక్షణకు అన్ని చర్యలు తీసుకున్నారు. జమిందార్ల, భూస్వాముల రక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అలహాబాద్ సంధి షరతులు.
జవాబు.
క్రీ.శ. 1765లో కుదిరిన అలహాబాద్ సంధి ప్రకారం అలహాబాద్ సంధి (1765) బెంగాల్లో ద్వంద్వపాలనకు శ్రీకారం చుట్టారు. బెంగాల్, బీహార్, ఒరిస్సాలో దివానీ అధికారాన్ని అనగా భూమిశిస్తు వసూలు అధికారం బ్రిటీష్ వారు పొందారు. సివిల్ అధికారాలు నవాబ్కు ఇచ్చారు. కారా, అలహాబాద్ జిల్లాలను అయోధ్య నుండి వేరు చేసి మొగల్ చక్రవర్తికి ఇవ్వడం జరిగింది. సాలుకు 26 లక్షల రూపాయలు కంపెనీ, చక్రవర్తికి ఇవ్వడానికి అంగీకరించింది.

TS Inter 1st Year History Study Material Chapter 11 యూరోపియన్ల రాక

ప్రశ్న 2.
శ్రీ రంగపట్టణం సంధి షరతులు.
జవాబు.
మూడోసారి బ్రిటీష్ సేనలు క్రీ.శ. 1790వ సంవత్సరంలో మైసూర్ రాజ్యంపై 1789లో యుద్ధం ప్రకటించాయి.
లార్డ్ కారన్ వాలీస్ బ్రిటీష్ సేనలకు నాయకత్వం వహించాడు. టిప్పుసేనలు పరాజయం పొందాయి. శ్రీరంగపట్టణం ఆంగ్లేయుల వశమైంది. క్రీ.శ. 1792లో టిప్పు శ్రీరంగపట్టణం సంధి షరతులను అంగీకరించాడు. ఈ సంధి షరతుల ప్రకారం మైసూర్ రాజ్యం విస్తీర్ణంలో అర్ధభాగం కోల్పోయింది. టిప్పుసుల్తాన్ 3.30 కోట్లు యుద్ధ నష్ట పరిహారం చెల్లించాలి. అతని ఇద్దరి కుమారులను జామీనుగా కంపెనీ బందీలుగా ఉంచింది.

ప్రశ్న 3.
డూప్లే విజయాలు.
జవాబు.
క్రీ.శ. 1697లో జన్మించిన జోసెఫ్ ఫ్రాంకోయిస్ డూప్లే సమర్థుడైన పాలనావేత్త. తండ్రి ప్రభావంతో ఉన్నత విద్యనభ్యసించి ప్రభుత్వ కొలువులో చేరి ఫ్రెంచి ప్రభుత్వం తరపున పాండిచ్ఛేరికి చేరాడు. తన శక్తి సామర్థ్యాలు, తెలివి తేటలతో చంద్రనగర్లో ఫ్రెంచి గవర్నర్గా నియమించబడ్డాడు.

డ్యూమస్ తరువాత డూప్లే ఫ్రెంచి గవర్నర్గా బాధ్యతలు స్వీకరించాడు. ఆంగ్లేయులకు, ఫ్రెంచివారి సైన్యాలకు మధ్య జరిగిన మొదటి, రెండో కర్ణాటక, యుద్ధాల్లో డూప్లే తన దౌత్యనీతిని ప్రదర్శించాడు. ఆంగ్లేయులకు, ఫ్రెంచివారి సైన్యాలకు మధ్య జరిగిన మొదటి, రెండో కర్ణాటక, యుద్ధాల్లో డూప్లే తన దౌత్యనీతిని ప్రదర్శించాడు. ఈ రకంగా 16, 17వ శతాబ్దం నాటికి భారతదేశంలో ఐరోపా వర్తక సంఘాలు స్థిరపడ్డాయి.

క్రీ.శ. 1741 నాటికి గవర్నర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించాడు. రెండో కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచి సేనల పరాజయం ఇతని పతనానికి దారి తీసింది.

ప్రశ్న 4.
రాబర్ట్ క్లైవ్ సేవలు.
జవాబు.
భారతదేశంలో బ్రిటీష్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఘనుడు రాబర్టెవ్. క్లైవ్ చిన్న గుమస్తాగా జీవితం ప్రారంభించి స్వయంకృషి వల్ల గవర్నర్ పదవికి ఎదిగాడు. ఈస్టిండియా కంపెనీ సామ్రాజ్య స్థాపకుడిగా ఆధునిక భారతదేశ చరిత్రలో రాబర్ట్ క్లైవ్ ప్రముఖ స్థానం.

ప్రశ్న 5.
కర్ణాటక యుద్ధాల్లో ఫ్రెంచి వారి ఓటమికి కారణాలు.
జవాబు.

  1. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రైవేట్ కంపెనీ, ఫ్రెంచి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వంపై ఆధారపడిన కంపెనీ.
  2. ఆంగ్లేయులు మాతృదేశం నుంచి శీఘ్రగతిలో అన్ని రకాల సహాయం పొందారు. ఫ్రాన్స్ పాలకులు ఫ్రెంచి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇలాంటి సహకారం అందించలేదు.
  3. ఆంగ్లేయుల వద్ద సమర్థవంతమైన సేనాధిపతులు ఐర్ కూట్, రాబర్కైవ్, లారెన్స్లు ఉండేవారు, డూప్లే, బుస్సీలు వీరికి ఏ విధంగా పోలికలేదు.
  4. ఆంగ్లేయులకు మూడు కేంద్రాలు (మద్రాస్, కలకత్తా, బొంబాయి) ఉండగా, ఫ్రెంచి వారికి కేవలం ఒక పాండిచ్చేరి మాత్రమే ఉంది. మూడో కర్ణాటక యుద్ధం భారతదేశంలో ఫ్రెంచి వారి రాజకీయ సామ్రాజ్యవాదానికి తెరదించింది.

TS Inter 1st Year History Study Material Chapter 11 యూరోపియన్ల రాక

ప్రశ్న 6.
చీకటిగది ఉదంతం.
జవాబు.
కలకత్తాలోని ఫోర్ట్ విలియంలోని ఒక చిన్న జైలు గది. జూన్ 20, 1756న సిరాజ్ ఉద్ దౌలా అనుచరులు బ్రిటీష్ సైనికులు, ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులను దాదాపు 146 మందిని చిన్న గదిలో కుక్కారు. వీరిలో దాదాపు 123 మంది ఊపిరి ఆడక మరణించారు. దీనినే చీకటి గది ఉదంతం అంటారు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 1 శ్రీకృష్ణ రాయబారం

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material 1st Poem శ్రీకృష్ణ రాయబారం Textbook Questions and Answers.

TS Inter 2nd Year Telugu Study Material 1st Poem శ్రీకృష్ణ రాయబారం

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
శ్రీకృష్ణుని రాయబారాన్ని వివరించండి. (V.Imp)
జవాబు:
“ఓ జననాథ అని శ్రీకృష్ణుడు తన మాటలను ధృతరాష్ట్రుని ఎదుట మొదలు పెట్టాడు. సమాజ సౌఖ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. నీకు తెలియని విషయాలు ఏమున్నాయి ? ఐనప్పటికీ, భరతవంశం సంతోషించేటట్లు మీ ఇరు కుటుంబాల వారికి న్యాయమూ, పరమహితమూ చెప్పటం ఉచితమని నేనిక్కడికి వచ్చాను. మీ ఇద్దరు తనకు సమానమని తెలిపాడు. పాండవులు కౌరవులు పాలూ, నీరూ లాగ కలసి మెలసి జీవించటం మంచిదని వారు కలిసిమెలసి ఉండేటట్లు నడిపించవలసిన బాధ్యత ధృతరాష్ట్రునిదని తెలియపరిచాడు. పాండవులు వేరు, కౌరవులు వేరు అనే భేదభావన చూపకూడదన్నాడు.

భరతవంశం ధర్మం, న్యాయం, సత్యం, ఐకమత్యం, గౌరవం, కారుణ్యం మొదలైన సద్గుణాలు గలిగి కీర్తి పొందిందని తెలిపి దానిని కాపాడాలన్నాడు. కురు వంశములో పెద్దవాడివి కావున నీ కుటుంబంలోని వారి నడవడికల బాధ్యత నీదే అన్నాడు.

యుద్ధం వస్తే అక్కడున్న భీమార్జునులను యుద్ధరంగంలో మించేవారు ఇక్కడెందరున్నారు ? ఇక్కడున్న ద్రోణ, భీష్ముల పరాక్రమాన్ని ఎదుర్కొనగలవారు అక్కడ కూడా లేరు. ఇట్లా ఉభయ పక్షాలలోని వీరులు యుద్ధంలో చావటం కన్న నీ బలగాలన్నీ కలసి మెలసి వర్తించటం మంచిదని హితవు పలికాడు. రాజా ! నీవు కురుపాండవుల విషయంలో శ్రద్ధ వహించకుంటే ఈ ఉభయ వర్గాలకే కాదు, పుడమిలోని జనులందరికీ హాని చేసినట్లే అవుతుందని, ఆ కీడు నీకే కలుగుతుందని హెచ్చరించాడు.

రాజా ! కురు పాండవులలో ఎవరికి మరణం సంప్రాప్తించినా, బాధలు కలిగినా, నీకు దుఃఖం కలుగుతుంది. కౌరవ పాండవుల కోమలమైన శరీరాల నుండి మొనలుదేలిన బాణాలు ఆవలికి దూసుకొని వెళ్ళేటట్లు గ్రుచ్చుకోగా నేలమీద కూలటం చూచి సహించటం సరైనది కాదు కావున కురుపాండవులు సంగ్రామంలో నశించకుండా సంరక్షించుకోవాలని చెప్పాడు. పాండురాజు చనిపోయిన తరువాత వారిని చక్కగా పెంచిన నీవు ఇప్పుడు వారికి అన్యాయం చేయడం సరికాదన్నాడు. పాండవుల శక్తియుక్తులను గుర్తు చేస్తూ వారి ఔదార్యాన్ని వివరించాడు. ఉత్తమమైన ధర్మం, నిర్మలమైన సత్యం పాపం చేతను, అబద్ధం చేత లక్ష్యాన్ని చేరలేని స్థితిలో భగవంతుడు ధర్మమును ఉద్ధరించటానికి, సత్యానికి శుభం కలిగించటానికి ముందుకు వస్తాడని తెలిపాడు.

నీ పుత్రుడైన దుర్యోధనుడి అకృత్యాలకు పరోక్షంగా మద్దతు తెలిపినందుకు మీకందరికి తగిన శిక్ష పడుతుందన్నాడు. దుర్యోధనుని మనసులో ఉన్న పరమ దురాశను తొలగించి, పాండవులకు రావలసిన అర్థ రాజ్యాన్ని వారికి అప్పగించేలా చూడాలని చెప్పాడు. పాండవులను నీ చెంతకు పిలిపించుకోమన్నాడు.

పాండవులు ఎంతటి శాంత స్వభావులో అంతటి వీరాగ్రేసరులు. వారికి మీతో కలసి మెలసి ఉండటం ఇష్టం కాకపోతే ఈపాటికి యుద్ధానికి బయలుదేరి వచ్చేవారు. సంధి, సంగ్రామం ఈ రెండింటిలో మీకేది హితమని తోస్తుందో దానిని నిర్ణయించి వెల్లడించమని పలికాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు కౌరవ వంశ ప్రతిష్టను, దుర్యోధనాదుల దుష్టబుద్ధిని, పాండవుల పరాక్రమాన్ని, ఔదార్యాన్ని తెలిపి సంధి చేసుకోకుంటే వచ్చే అనర్థాలను తన రాయబారం ద్వారా వివరించాడు.

ప్రశ్న 2.
యుద్ధం వల్ల జరిగే నష్టాల్ని శ్రీకృష్ణుడు ఏ విధంగా వివరించాడు ?
జవాబు:
యుద్ధం జరిగితే అక్కడున్న భీమార్జునులను యుద్ధరంగంలో ఎదిరించేవారు ఇక్కడెందరున్నారు ? ఇక్కడున్న ద్రోణ, భీష్ముల పరాక్రమాన్ని ఎదుర్కొనగలవారు అక్కడ ఎందరున్నారు ? ఇట్లా ఉభయ పక్షాలలోని వీరులు యుద్ధంలో చావటం కన్న నీ బలగాలై కలసి మెలసి వర్తించటం మంచిది అని హితము పలికాడు. కురు పాండవులలో ఎవరికి మరణం సంప్రాప్తించినా, ఎవరికీ బాధలు కలిగినా ధృతరాష్ట్రునికే దుఃఖం కలుగుతుందని

తెలిపాడు. కౌరవులూ, పాండవులూ మంచి చదువరులు, పరాక్రమవంతులు, భుజదర్పం గలవారు గనుక ఎవ్వరూ వీరి నడ్డగించలేరు. ఇట్లాంటివారు తమలో తమకేర్పడిన యుద్ధంలో మరణించటానికి సిద్ధపడుతుండగా అడ్డుపడక చూస్తూ ఊరకుండటం నీ వంటి వారికి తగిన పని కాదు. ఎంతో కోమలమైన వారి శరీరాల నుండి మొనలుదేలిన బాణాలు దూసుకొని వెళ్ళేటట్లు గ్రుచ్చుకోగా నేలమీద కూలటం చూచి సహించటం సరైనది కాదు. రాజా ! నీ గొప్పతనమును రాజనీతినీ, శాంతిని సమస్త ప్రజలు మెచ్చుకొనేటట్లు కురుపాండవులు సంగ్రామంలో నశించకుండా సంరక్షించుకొనుము అని శ్రీకృష్ణుడు చెప్పడంలో భవిష్యత్ కాలంలో జరిగే అనర్థాలు స్ఫురిస్తాయి. యుద్ధమైతే అందరికీ మహాపద కలుగుతుంది. దాన్ని లెక్కలోనికి తీసుకోవాలన్నాడు.

కౌరవ, పాండవ యుద్ధంలో యాదవ కుటుంబ సభ్యులు కొందరైనాపోవటం శ్రీకృష్ణుడికేర్పడే ఆపద. కొడుకులందరూ మరణించి తర్పణాలు ఇవ్వటానికి కూడా ఎవ్వరూ మిగలని మహాపద ధృతరాష్ట్రుడిది. కౌరవులందరూ నశించటం వంశజుల కేర్పడే మహాపద. యుద్ధంలో సహాయపడే రాజులు కోల్పోతారు. దానివలన భూమి వీరులను కోల్పోతుంది. రక్తంతో తడుస్తుంది. జననాశం ఏర్పడుతుంది. వితంతువుల విషాదం పెల్లుబికుతుంది. ఇవన్నీ లోకానికేర్పడే ఆపదలు, వీటిని పరిగణించి తప్పక సంధి చేయుమని హితవు చెప్పి హెచ్చరించాడు శ్రీకృష్ణుడు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 1 శ్రీకృష్ణ రాయబారం width=

II సంగ్రహరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
సభలో శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడు ?
జవాబు:
ధృతరాష్ట్రుని సభలో శ్రీకృష్ణుని కంఠస్వరం మేఘ గర్జన లాగా గంభీరంగా, హృదయంగమంగా ఉంది. ఆయన దంతాల కాంతులు మెరుపులవలె ప్రకాశిస్తున్నాయి. వర్షాకాల ప్రకృతి రమణీయతతో శ్రీకృష్ణుణ్ణి తిక్కన పోల్చి ఉపమాలంకారంతో చెప్పాడు. గంభీరమైన సన్నివేశాన్ని గంభీరంగా తిక్కన చిత్రించాడు.

ప్రశ్న 2.
శ్రీకృష్ణుడు ఎందుకు వచ్చానన్నాడు ?
జవాబు:
ధృతరాష్ట్రుని సభలో ఉన్న వారందరూ శ్రద్ధగా వింటుండగా పాండవులు పంపిన సంధి సమాచారాన్ని ధృతరాష్ట్ర మహారాజుతో చెప్పాడు. “ఓ జననాథ ! నీకు తెలియని విషయాలు ఏమున్నాయి ? ఐనప్పటికీ, భరతవంశం సంతోషించేటట్లు నా ఇరు కుటుంబాల వారికి న్యాయమూ, పరమహితమూ చెప్పటం ఉచితమని నేనిక్కడికి వచ్చాను అని శ్రీకృష్ణుడు అన్నాడు. ఇందులో జననాథ అనడం ద్వారా కేవలం నీ కొడుకుల గురించి మాత్రమే కాకుండా సమస్త ప్రజల గురించి ఆలోచించాలి అనే విషయాన్ని గుర్తు చేశాడు.

నీకు తెలియని విషయాలు ఏమున్నాయి అనడం ద్వారా తన విషయాన్ని ప్రదర్శించాడు. ఇరు కుటుంబాల వారికి అనడం ద్వారా కౌరవ పాండవులు ఇరువురు తనకు కావలసిన వారే అని చెప్పాడు. న్యాయము, పరమ హితము చెప్పడానికి వచ్చాననడం లోకకళ్యాణాన్ని సూచిస్తుంది. కావున శ్రీకృష్ణుడు లోకకళ్యాణం కోసం యుద్ధాన్ని మాన్పించడానికి వచ్చానని చెప్పాడు.

ప్రశ్న 3.
భరతవంశం గొప్పతనం తెలుపండి.
జవాబు:
భరతవంశం ధర్మం, న్యాయం, సత్యం, ఐకమత్యం, గౌరవం, కారుణ్యం అనే ఆరు గుణాలకు ప్రసిద్ధి. ఆ భరత వంశంలో పుట్టిన వారందరూ పై సద్గుణాలు గలిగి కీర్తి పొందారు. అట్టి వంశంలో నీవూ, నీ ప్రియ సహోదరుడు పాండురాజూ సద్గుణాలయందు శ్రేష్టులు అనడంలో పాండురాజు ఔన్నత్యం తెలపడంతోపాటు ధృతరాష్ట్రుని ముందు కాళ్ళకి బంధం వేయడం కనిపిస్తుంది. నీ కుమారులు కూడా కీర్తి భారం వహించ జాలినవారు అవడం వల్ల యుద్ధం చేసి చెడ్డపేరు పొందకూడదు అనే సూచనా కనిపిస్తుంది.

TS Inter 2nd Year Telugu Study Material Poem 1 శ్రీకృష్ణ రాయబారం width=

ప్రశ్న 4.
సారపు ధర్మం ఎలాంటిది ?
జవాబు:
ధర్మం ఎప్పుడూ సారవంతమైనది. శక్తివంతమైనదే, సత్యం ఎల్లప్పుడూ కల్మషం లేనిదే, నిర్మలమైనదే, స్వచ్ఛమైనదే. అవి రెండు స్వయం సమర్థములైనవే. అయితే వాటిని వ్యతిరేకించేవీ, కలతపెట్టేవీ, నశింపజేయ యత్నించేవి పాపం, అసత్యం. సత్యధర్మాలు ఫలవంతమయ్యే తరుణంలో పాపం, అబద్ధాలు అడ్డుపడి చెడగొట్టే యత్నాలు చేస్తాయి. కాని, అవి చెడిపోవు. ధర్మాన్ని రక్షించేవారు దానికొరకు తమ శక్తిని ధారపోయాలి. సత్యాన్ని రక్షించేవారు సత్యాచరణంలో త్రికరణశుద్ధిని ప్రదర్శించాలి.

అప్పుడు ధర్మసత్యాలు తమ సార నిర్మలత్వాలను రక్షించుకో గలుగుతాయి. దీనిని తెలిసిన విజ్ఞులు తమ బాధ్యతను తెలుసుకొని వాటిని రక్షించి తమను తాము రక్షించుకోవాలి. ఆ విషయంలో ఉపేక్ష చేస్తే వారి చరిత్రలకు ధర్మసత్య కవచాలు తొలగిపోయి బలహీనులై పాపాలకూ, అసత్యాలకూ బలి అయిపోతారు. దక్షులై కూడా తమ ధర్మాన్ని నిజాయితీతో నిర్వహించని వారికి చేటు రాకతప్పదని ఈ సందేశం.

III ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కౌరవ సభకు రాయబారిగా ఎవరు వచ్చారు ?
జవాబు:
శ్రీకృష్ణుడు

ప్రశ్న 2.
కౌరవపాండవులు వేటిలాగా కలిసి ఉండాలని కృష్ణుడు చెప్పాడు ?
జవాబు:
పాలు నీళ్ళు లాగ

ప్రశ్న 3.
యుద్ధం సంభవిస్తే ఏం జరుగుతుంది ?
జవాబు:
యుద్ధం సంభవిస్తే చాలా త్వరగా కురువంశానికి, రాజులకు మహాపద కలుగుతుంది.

ప్రశ్న 4.
సంధికార్యం ఎవరి చేతిలో ఉంది ?
జవాబు:
ధృతరాష్ట్రుని

ప్రశ్న 5.
తిక్కన ఎవరి ఆస్థాన కవి ?
జవాబు:
తిక్కన నెల్లూరు మండలాన్ని పరిపాలించిన మనుమసిద్ధి యొక్క ఆస్థానకవి.

ప్రశ్న 6.
శాంతశూరులు ఎవరు ?
జవాబు:
పాండవులు

TS Inter 2nd Year Telugu Study Material Poem 1 శ్రీకృష్ణ రాయబారం width=

ప్రశ్న 7.
తిక్కన రచనలు తెలుపండి.
జవాబు:
తిక్కన, ఆంధ్ర మహాభారతంలో విరాటపర్వము నుండి స్వర్గారోహణ పర్వం వరకూ ఆంధ్రీకరించాడు. ఇదికాక

  1. నిర్వచనోత్తర రామాయణం
  2. కృష్ణశతకం
  3. విజయసేనం
  4. కవివాగ్బంధం-మొదలైన రచనలు చేశాడు.

ప్రశ్న 8.
తీక్కన సోమయాజ మహాభారతం ఎవరికి వినిపించాడు ? (V.Imp) (M.P.)
జవాబు:
హరి హర నాథునికి

IV సందర్భసహిత వ్యాఖ్యలు

1. సుచరితక్రమమిప్పుడు తప్పనేటికిన్ (V.Imp) (M.P.)

కవి పరిచయం : ఈ వాక్యం తిక్కన రాసిన మహాభారతం ఉద్యోగ పర్వం తృతీయాశ్వాసం నుండి తీసుకున్న శ్రీకృష్ణ రాయబారం అనే పాఠ్యాంశంలోనిది. తిక్కనకు ఉభయకవి మిత్రుడు అనే బిరుదు ఉంది. పదమూడవ శతాబ్దికి చెందిన నెల్లూరు పాలకుడు మనుమసిద్ధి ఆస్థానంలో ఉండేవాడు.

సందర్భం : శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునికి భరతవంశ ప్రాశస్త్యాన్ని వివరిస్తున్న సందర్భంలోనిది.

అర్థం : మంచి వంశ క్రమాన్ని ఇప్పుడు ఎందుకు తప్పుతారు ?

వివరణ : మహారాజా ! మీ భరతవంశం ధర్మం, న్యాయం, సత్యం, ఐకమత్యం, గౌరవం, కారుణ్యం మొదలైన సద్గుణాలు గలిగి కీర్తి పొందింది. అట్టి వంశంలో నీవూ, నీ ప్రియ సహోదరుడు పాండురాజూ, సద్గుణాలయందు శ్రేష్టులు, మరి నీ కుమారులూ కీర్తి భారం వహించ జాలినవారు. కళ్యాణ స్వభావులు. ఇంత మంచి నడవడిగల వంశ సంప్రదాయం ఇప్పుడు కూడా తప్పించడం ఎందుకు ? అని శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునితో అన్నాడు.

2. ప్రజల యెడ విరోధంబు వాటించుటెంతమేలు (V.Imp)

కవి పరిచయం : ఈ వాక్యం తిక్కన రాసిన మహాభారతం ఉద్యోగపర్వం తృతీయాశ్వాసం నుండి తీసుకున్న శ్రీకృష్ణ రాయబారం అనే పాఠ్యాంశంలోనిది. తిక్కనకు ఉభయకవి మిత్రుడు అనే బిరుదు ఉంది. పదమూడవ శతాబ్దికి చెందిన నెల్లూరు పాలకుడు మనుమసిద్ధి ఆస్థానంలో ఉండేవాడు.

సందర్భం : శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునికి యుద్ధం వల్ల కలిగే నష్టాన్ని వివరిస్తున్న సందర్భంలోనిది.

అర్థం : మీ పిల్లల పట్ల నిర్లక్ష్యం వహించడం సరైనదేనా ?

వివరణ : లోకంలోని రాజులందరూ నీ పాదపీఠాన్ని ప్రీతితో సేవిస్తుండగా సముద్రపు చెలియలికట్టచేత చుట్టబడిన పుడమినంతటిని నీవే ఏకచ్ఛత్రంగా పరిపాలించటం తగును, తల్లి తన బిడ్డలపట్ల శత్రుత్వం వహించటం ఎంత సమంజసమో నీవే ఆలోచించు అని శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునితో అన్నాడు.

3. దురితంబొనరించిట్ల తుదిఁ గీడు సుమీ (V.Imp)

కవి పరిచయం : ఈ వాక్యం తిక్కన రాసిన మహాభారతం ఉద్యోగ పర్వం తృతీయాశ్వాసం నుండి తీసుకున్న శ్రీకృష్ణ రాయబారం అనే పాఠ్యాంశంలోనిది. తిక్కనకు ఉభయకవి మిత్రుడు అనే బిరుదు ఉంది. పదమూడవ శతాబ్దికి చెందిన నెల్లూరు పాలకుడు మనుమసిద్ధి ఆస్థానంలో ఉండేవాడు.

సందర్భం : శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునికి తన బాధ్యతను గుర్తుచేస్తున్న సందర్భంలోనిది.

అర్థం : జనులందరికీ పాపం చేసినట్లే ఔతుంది. చివరకు మీకే కీడు కలుగుతుంది.

వివరణ : రాజా ! నీవు కురుపాండవుల విషయంలో శ్రద్ధ వహించకుంటే ఈ ఉభయ వర్గాలకే కాదు, పుడమిలోని జనులందరికీ పాపం చేసినట్లే ఔతుంది. చివరకు నీకే హాని కలుగుతుంది అని శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునితో అన్నాడు.

4. సత్యశుభదాయకమయ్యును దైవముండెడున్ (V.Imp)

కవి పరిచయం : ఈ వాక్యం తిక్కన రాసిన మహాభారతం ఉద్యోగ పర్వం తృతీయాశ్వాసం నుండి తీసుకున్న శ్రీకృష్ణ రాయబారం అనే పాఠ్యాంశంలోనిది. తిక్కనకు ఉభయకవి మిత్రుడు అనే బిరుదు ఉంది. పదమూడవ శతాబ్దికి చెందిన నెల్లూరు పాలకుడు మనుమసిద్ధి ఆస్థానంలో ఉండేవాడు.

సందర్భం : శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునికి సంధి చేసుకోకుంటే దైవం తన పని తాను చేస్తాడని హెచ్చరిస్తున్న సందర్భంలోనిది.

అర్థం : సత్యమునకు శుభం కలిగించటానికి భగవంతుడు ముందుకు వస్తాడు.

వివరణ : ఉత్తమమైన ధర్మం, నిర్మలమైన సత్యం పాపం చేతను, అబద్దం చేత దరి చేరలేక చెడటానికి సంసిద్ధంగా ఉన్న స్థితిలో వాటిని రక్షించే శక్తి ఉన్నా ఎవరు అడ్డుపడక అశ్రద్ధ వహిస్తారో అది వారలకే హానికరమవుతుంది. ఆ స్థితిలో భగవంతుడు ధర్మమును ఉద్ధరించటానికి, సత్యమునకు శుభం కలిగించటానికి ముందుకు వస్తాడు అని శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునితో అన్నాడు.

పద్యములు – ప్రతిపదార్థ – తాత్పర్యములు

1వ పద్యం :

కం॥ జలదస్వన గంభీరత
నెలుఁగొప్పఁగ దంత దీప్తు లెసగ ముకుందుం
డలరుచు సభ నఖిల జనం
బులు విన ధృతరాష్ట్ర భూవిభున కిట్లనియెన్

ప్రతిపదార్థం:

ముకుందుఁడు = శ్రీకృష్ణుడు
జలదస్వన గంభీరతన్ = మేఘ ధ్వని యొక్క గాంభీర్యంతో
ఎలుగు + ఒప్పన్ = తన కంఠ ధ్వని సొంపారగా
దంత దీప్తులు + ఎసగన్ = దంతాల యొక్క కాంతులు అతిశయించగా
సభన్ = సభలో
అలరుచున్ = ప్రకాశిస్తూ
అఖిలజనంబులు = ధృతరాష్ట్రుడి కొలువులో ఉన్న సమస్త ప్రజలు
వినన్ = వింటుండగా
ధృతరాష్ట్ర భూవిభునకు = ధృతరాష్ట్ర మహారాజుకు
ఇట్లు + అనియెన్ = ఈ విధంగా అన్నాడు.

తాత్పర్యం : శ్రీకృష్ణుడు మేఘధ్వనివలె గంభీరమైన తన కంఠధ్వనితో, దంత కాంతులు ప్రసరిస్తూ ఉండగా, సభలో వెలుగొందుతూ, సదస్యులందరూ చెవులు నిక్కరించుకొని ఆలకిస్తుండగా ధృతరాష్ట్ర మహారాజుతో ఇలా అన్నాడు.

విశేషం :

  1. కృష్ణుని కంఠస్వర గాంభీర్యం, సభ్యులను పరవశింప చేస్తున్నదని, కవి తిక్కన ఇందులో సూచిస్తున్నాడు.
  2. జలదస్వనానికి అనగా ఉరుముకు తోడుగా, దంతదీప్తులు మేఘము నుండి వచ్చే మెఱపులుగా భాసిస్తున్నాయని, కవి ఇక్కడ సూచించాడు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 1 శ్రీకృష్ణ రాయబారం width=

2వ పద్యం :

కం॥ జననాథ ! నీ యెఱుంగని
పనులు గలవె ? యైనఁ దగవుఁ బరహితంబుం
దనవారికిఁ జెప్పగ తగు
నని వచ్చితి భారతాన్వయము ప్రియమొందన్

ప్రతిపదార్థం :

జననాథ = ఓ మహారాజా (ధృతరాష్ట్ర చక్రవర్తీ !)
నీ యెఱుంగని పనులు
(నీ + ఎఱుంగని, పనులు) = నీకు తెలియని పనులు
కలవె (కలవు + ఎ) = ఉన్నాయా ? (లేవని భావము)
ఐనన్ = అయినప్పటికీ
తన వారికిన్ = తన బంధువులకు
తగవున్ = న్యాయమునూ, ధర్మమునూ
పరమ హితంబున్ = ఉత్తమమయిన మంచి (మంచి మాట) నూ
చెప్పన (చెప్పన్ + అ) = చెప్పడమే
తగునని (తగును + అని) = ధర్మమని
భారతాన్వయము (భారత + అన్వయము) = భరత వంశము
ప్రియమొందన్
(ప్రియము + ఒందన్) = సంతోషపడేటట్లు
వచ్చితిన్ = (నేను) ఇక్కడికి వచ్చాను

తాత్పర్యం : ధృతరాష్ట్ర మహారాజా ! నీకు తెలియని విషయాలు ఏమున్నాయి ? అయినా, తన చుట్టాలకు న్యాయాన్నీ, ఉపయోగపడే మంచిమాటనూ చెప్పడమే ధర్మము అనే భావంతో, భారత వంశీయులు అందరూ, సంతోషపడతారని, నేను ఇక్కడికి వచ్చాను.

3వ పద్యం :

కం॥ క్షీరోదక గతిఁ బాండవ
కౌరవు లొడఁగూడి మనికి కార్యం ఐది నీ
వారసి నడపుము వా రన
నీ రనఁ గురుముఖ్య ! నీకు వేఱుంగలదే ?

ప్రతిపదార్థం :

కురుముఖ్య ! = కురువంశంలో ప్రధానమైనవాడా !
క్షీర + ఉదక గతిన్ = పాలూ, నీరు లాగ
పాండవ కౌరవులు = పాండవులు, కౌరవులు
ఒడన్ + కూడి = కలిసి మెలిసి
మనికి = జీవించటం
కార్య౦బు = చేయదగ్గ పని
అది = దానిని
నీవు = నీవు
ఆరసి = పరిశీలించి
నడపుము = సాగించుము
నీకున్ = నీకు
వారు + అనన్ = పాండవులనగా
వీరు + అనన్ = కౌరవులు అనగా
వేఱుం + కలదే = భేదమున్నదా? (లేదని అర్థం)

తాత్పర్యం : కురునాథా ! పాండవ కౌరవులు పాలూ నీరూ వలె కలసిమెలసి జీవించటం మంచిపని. వారు అట్లా ఒద్దికతో ఉండేటట్లు నీవు వారిని నడపించవలసి ఉంది. పాండవులు వేరు, కౌరవులు వేరు అనే భేదభావన నీకు లేదు కదా !

4వ పద్యం :

శా ||
ఈ వంశంబున కెల్ల నీవ కుదు; రిం దెవ్వారి చందంబు లె
ట్లై వర్తిల్లినఁ గీడు మేలుఁ దుది నీయం దొందెడు గాన స
ద్భావం బారసి లోనిపొత్తు వెలివృత్తంబున్ జనస్తుత్యముల్
గావింపం దగు నీక యెవ్విధమునం గౌరవ్యవంశాగ్రణీ!

ప్రతిపదార్థం :

కౌరవ్యవంశ + అగ్రణి = కురువంశంలో శ్రేష్టుడా!
ఈ వంశంబునకున్ + ఎల్లన్ = ఈ కురుకులాని కంతటికి
నీవు + అ (నీవ) = నీవే
కుదురు = ఆశ్రయం (మూలం)
ఇందున్ = ఈ కురువంశస్థులలో
ఎవ్వారి చందంబులు = ఎవ్వరి నడవడులు
ఎట్లు + ఐ వర్తిల్లినన్ = ఏ విధంగా ఉండునో వాటిననసరించి
కీడు = హాని
మేలూ = వృద్ధి
తుదిన్ = కడపటి
నీ అందున్ + ఒందెడున్ = నీకే చెందగలవు
కానన్ = కనుక
సద్భావంబు + అరిసి = మంచి తలంపునకు వచ్చి
లోనిపొత్తు = అంతరంగంలో ఒద్దిక
వెలి వృత్తంబున్ = బహిరంగ ప్రవర్తన
జనస్తుత్యముల్ = ప్రజలచేత మెచ్చదగినవిగా
కావింపన్ = చేయటానికి
నీకున్ + అ(నీక) = నీకే
ఏ విధమునన్ = ఏ విధంగానైనా
తగున్ = యోగ్య౦

తాత్పర్యం : ధృతరాష్ట్ర మహారాజా ! నీవు కురు వంశంలో ఆగ్రేసరుడివి. ఈ వంశానికంతటికీ నీవే ఆధారం. నీ కుటుంబంలో ఎవ్వరెవ్వరి నడవడికలు ఎట్లుగా ఉంటాయో, వాటిని బట్టి కలిగే మేలు కీడు నీకే చెందుతాయి. కాబట్టి నీవు ఇరుకుటుంబాల వారి శ్రేయస్సు నూహించి అంతరంగంలో స్నేహం, బహిరంగ ప్రవర్తన జనులు మెచ్చేటట్లుగా ఏవిధంగానైనా వారిని చక్కదిద్దవలసి ఉంటుంది.

5వ పద్యం :

చ|| వినుము ! సుయోధనాదులగు వీరు సధర్ములు గాక కార్యము
ల్గొనక మహార్థసిద్ధి యెడలుం దమ కిట్లన కన్వయంబు వ
ర్తనమిది గాదు నాక బెడిదంపుఁదనంబున బంధుకోటికి
న్మనసులు నొవ్వఁగా నవగుణంబులకుం బుయిలోడ రేమియున్

ప్రతిపదార్థం :

వినుము = (మహారాజా) నామాటలాలకించండి
సుయోధన + ఆదులు + అగువీరు = దుర్యోధనుడు మొదలైన నీ కుమారులు
సధర్ములు కాక = ధర్మము ననుసరించే వారు కాక
కార్యముల్ + కొనక = చేయదగిన మంచి పనులు చేయక
ఇట్లు = ఈ రీతిగ మెలగితే
తమకున్ = తమకు
మహా + అర్థసిద్ధి = గొప్ప ప్రయోజనాలు చేకూరుట
ఎడలున్ + అనక = తొలగిపోవునని తలంచక
అన్వయంబు వర్తనము = వంశపు నడవడి
ఇది కాదు = ఇటువంటిది కాదు
నాక = అనక
బెడిదంపు దనంబునన్ = దారుణ స్వభావంతో
బంధుకోటికిన్ = బంధువర్గానికి
మనసులు నొవ్వగాన్ = హృదయాలు వ్యధ చెందేటట్లు
అవగుణంబులకున్ = దుర్గుణాలకు
ఏమియున్ = ఇంచుకయు
బుయి లోడర = వెనుదీయరు

తాత్పర్యం: రాజా ! వినుము. దుర్యోధనాదులైన వీరు ధర్మపరులుగాక, సత్కార్యాలాచరించక ఇట్లా ఉంటే మహార్థసిద్ధికి దూరమవుతామని తలంచక, వంశ నడవడి ఇట్టిది కాదనక ఈ దారుణ బుద్ధితో బంధువుల మనస్సులు బాధ చెందేటట్లుగా దుష్టచేష్టలు చేయటానికి ఏమాత్రం వెనుదీయకున్నారు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 1 శ్రీకృష్ణ రాయబారం width=

6వ పద్యం :

ఉ ||
కౌరవ పాండవుల్ తెఱఁగు గైకొని శాంతతఁ బొందియున్కి మే
లారయ నాకు నీకుఁ గులమంతకు నీ నృపకోటి కుర్వికిం
బోరితమైన నింతకును బుట్టు మహాపద గావునన్ ధరి
త్రీ రమణాగ్రగణ్య ! గణుతించి యవశ్యముఁ బొం దొనర్పవే !

ప్రతిపదార్థం :

ధరిత్రీ రమణ + అగ్రగణ్య = రాజులలో ఉత్తముడా !
కౌరవపాండవుల్ = కౌరవులూ, పాండవులూ
తెఱగు + కైకొని = సంధి నిర్ణయానికి వచ్చి
శాంతతన్ + పొంది = ప్రసన్నత్వం వహించి
ఉన్కి = ఉండటం
ఆరయున్ = పరికించగా
నాకున్ = నాకును
నీకున్ = నీకును
కులము అంతకున్ = కురువంశానికంతటికి
ఈ నృప కోటికిన్ = ఈ రాజ సమూహానికి
ఉర్వికిన్ = ఈ జగత్తునకూ
మేలు = శ్రేయం (మంచి)
పోరితము + ఐనన్ = యుద్ధం జరిగితే
ఇంతకును = ఈ సమస్తమునకునూ
మహా + ఆపద + పుట్టున్ = గొప్ప విపత్తు సంభవిస్తుంది
కావునన్ = కనుక
గణుతించి = నా మాటలు లెక్కించి
అవశ్యమున్ = తప్పక
పొందు + ఒనర్పవే = సంధి చేసుకోండి

తాత్పర్యం : కౌరవులు పాండవులు ఒక మంచి నిర్ణయానికి వచ్చి, శాంతం వహించి, జీవించటం మంచిది. ఇట్లు వారు ప్రసన్నచిత్తులై ఉండటం నాకూ, నీకూ, కురువంశానికి, ఈ రాజ సమూహానికీ, ఈ భూమండలానికి మంచిది. అట్లాకాక యుద్ధమే సంభవిస్తే మనందరికీ మహా విపత్తు కలుగుతుంది. కనుక రాజోత్తమా! నా మాటలపై విశ్వాసముంచి తప్పక సంధి చేసుకోండి.

7వ పద్యం :
ఉ || అందు వృకోదరార్జునుల నాహవ రంగమునందు మీఱువా
రెందఱో యెన్నుమా యిచట; నీ గురుభీష్ములఁ గ్రేణిసేయువా
రెందఱో; వారు వీరు నని నీల్గుటకంటె భవర్బలంబులై
యందఱుఁగూడు టొప్పదె జనాధిప ! శాంతి యొనర్పు మెమ్మెయిన్

ప్రతిపదార్థం :

అందున్ = అక్కడ ఉన్న
వృకోదర + అర్జునులన్ = భీమార్జునులను
ఆవహరంగమునందున్ = యుద్ధరంగంలో
మీఱువారు = మించగలవారు
ఎందఱో + ఎన్నుమా = ఇక్కడ ఎందరున్నారో నీవే లెక్కించు
ఇచటన్ = ఇక్కడ ఉన్న
ఈ గురు భీష్ములన్ = ఈ ద్రోణుడిని; భీష్ముడిని
క్రేణి + చేయువారు = పరిహరింపగలవారు
ఎందఱో ? = అక్కడెందరున్నారు ?
వారున్, వీరున్ = అక్కడివారూ, ఇక్కడివారూ
అనిన్ = యుద్ధంలో
ఈల్గుట కంటెన్ = చావటం కంటే
భవత్ + బలంబులు + ఐ = నీ బలగాలై
అందరున్ = వీరందరూ
కూడుట + ఒప్పదే = కలసిమెలసి ఉండటం తగదా ?
ఏ + మెయిన్ = ఏ విధంగానైనా
శాంతి + ఒనర్పుము = సంధి చేయుము

తాత్పర్యం : అక్కడున్న భీమార్జులను యుద్ధరంగంలో మించేవారు ఇక్కడెందరున్నారో చెప్పుము ? ఇక్కడున్న ద్రోణభీష్ముల పరాక్రమాన్ని లక్ష్యపెట్టక పరిహసించగలవారు అక్కడ కూడా లేరు. ఇట్లా ఉభయ పక్షాలలోని వీరులు యుద్ధంలో చావటం కన్న నీ బలగాలై కలసి మెలసి వర్తించటం మంచిది. ఏ విధంగానైనా వీరిని శాంతింప జేయుము.

8వ పద్యం :

తే ||
జగతిఁగల జనపతులు నీ చరణపీఠ
మర్థిఁ గొలువ సముద్ర వేలావృతోర్వి
యెల్ల నేలుట యొప్పదే ? తల్లి ప్రజల
యెడ విరోధంబు వాటించు టెంత మేలు ?

ప్రతిపదార్థం :

జగతిన్ + కల = లోకంలో ఉన్న
జనపతులు = రాజులు
నీ చరణ పీఠము = నీ పాదపీఠమును
అర్థిన్ = కోరికలు
కొలువన్ = సేవిస్తుండగా
సముద్ర వేలా + అవృత = సాగరం యొక్క చెలియలి కట్టచేత చుట్టబడిన
ఉర్వి + ఎల్లన్ = పుడమి నంతయు
ఏలుట = నీవు పాలించటం
ఒప్పదే ? = తగదా ?
తల్లి = జనని
ప్రజల + ఎడన్ = తన బిడ్డల విషయంలో
విరోధంబు పాటించుట = వైరం వహించటం
ఎంత మేలు = ఏపాటి మంచిది ?

తాత్పర్యం : లోకంలోని రాజులందరూ నీ పాదపీఠాన్ని ప్రీతితో సేవిస్తుండగా సముద్రపు చెలియలికట్టచేత చుట్టబడిన పుడమినంతటినీ నీవే ఏకచ్ఛత్రంగా పరిపాలించటం తగును. తల్లి తన బిడ్డలపట్ల శత్రుత్వం వహించటం ఎంత సమంజసమో నీవే ఆలోచించు.

9వ పద్యం :

క||
నరనాథ ! నీవుపేక్షా
పరుఁడ వయినఁ గౌరవులక పాండవులక కా
దరయఁగ భూ ప్రజకెల్లను
దురితం బొనరించి నట్ల తుదిఁ గీడు సుమీ !

ప్రతిపదార్థం:

నరనాథ ! = రాజా
నీవు + ఉపేక్షాపరుఁడవు + అయినన్ = ఈ విషయంలో అశ్రద్ధ వహిస్తే
కౌరవులకున్ + ఆ, పాండవులకున్ + ఆ కాదు = కురుపాండవులకే కాదు
అరయగన్ = ఆలోచిస్తే
భూప్రజకున్ + ఎల్లన్ = పుడమిలోని అందరికి
దురితంబు + ఒనరించిన + అట్లు + అ = పాపం చేసినట్లే ఔతుంది
తుదిన్ = చివరకు
కీడు + చుమీ ! = నీకే హాని సుమా !

తాత్పర్యం : రాజా ! నీవు కురుపాండవుల విషయంలో శ్రద్ధ వహించకుంటే ఈ ఉభయ వర్గాలకే కాదు, పుడమిలోని జనులందరికీ పాపం చేసినట్లే ఔతుంది. చివరకు నీకే హాని కలుగుతుంది.

10వ పద్యం :

క||
కౌరవ పాండవులం దె
వ్వారలకుం జావు నొవ్వు వచ్చిన మే లు
ర్వీరమణ ! చిత్తమున నె
ట్లారయునూ నీకు దుఃఖమగు నెట్లయినన్

ప్రతిపదార్థం :

ఉర్వీమణ = భూనాథా !
కౌరవ పాండవులందున్ = కౌరవులలో పాండవులలో
ఏ + వారలకున్ = ఎవరికైనా
చావు = మరణం
నొవ్వు = బాధ
వచ్చినన్ = కలిగినా
చిత్తమునన్ = మనస్సులో
ఎట్లు మేలు = ఏ విధంగా మేలవుతుందో
ఆరయుమా = పరిశీలించుము
ఎట్లు + అయినన్ = వారికి ఏలాగైనా
నీకున్ = నీకు
దుఃఖము + అగున్ = విషాదం కలుగుతుంది
చావు = మరణం

తాత్పర్యం : కురు పాండవులలో ఎవరికి మరణం సంప్రాప్తించినా, బాధలు కలిగినా నీకు ఎట్లా మేలవుతుందో మనస్సులో ఆలోచించుము. వారిలో ఎవరికి చావు లేదా బాధ వచ్చినా నీకు ఏవిధంగానైనా దుఃఖం కలుగుతుంది.

TS Inter 2nd Year Telugu Study Material Poem 1 శ్రీకృష్ణ రాయబారం width=

11వ పద్యం :

ఆ||
ఇట్లు గాక యుండ నీ రెండు దెఱఁగుల
వారి గాచికొనుము వసుమతీశ !
నీదు ప్రాభవంబు నీతియు శాంతియు
నఖిల జనులుఁ బొగడునట్లుఁగాగ

ప్రతిపదార్థం :

వసుమతీ + ఈశ = భూవల్లభా (ధృతరాష్ట్రా!)
నీదు ప్రాభవంబు = నీయొక్క గొప్పతనం
నీతియున్ = రాజనీతి
శాంతియున్ = కామక్రోధాది రాహిత్యము
అఖిల జనులు = సమస్త ప్రజలు
పొగడునట్లు కాగన్ = ప్రశంసించునట్టి తీరులో
ఇట్లు + కాక + ఉండన్ = ఇట్లా చావు నొవ్వుల పాలుగాకుండా
ఈ రెండు తెఱగులవారిన్ = ఈ ఉభయ పక్షాల వారిని
కాచి కొనుము = రక్షించుకొనుము

తాత్పర్యం : నీ గొప్పతనమును, రాజనీతిని, శాంతిని సమస్త ప్రజలు మెచ్చుకొనేటట్లు కురుపాండవులు సంగ్రామంలో నశించకుండా సంరక్షించుకొనుము.

12వ పద్యం :

తే||
పాండవులు తండ్రి సచ్చిన ప్రజలు వారి
నరసి ప్రోచితి శైశవ మాదిగాఁగ
నడుమ నిష్కారణము దిగవిడువఁ దగునె ?
పారమొందంగ రక్షింపు గారవమున

ప్రతిపదార్థం :

పాండవులు = ధర్మజాదులు
తండ్రి చచ్చిన ప్రజలు = తండ్రిలేని బిడ్డలు
వారిన్ = వారలను
శైశవము + ఆగాగన్ = చిన్నప్పటి నుంచి
అరసి ప్రోచితి(వి) = చక్కగ కాపాడావు
నడుమన్ = మధ్యలో
నిష్కారణము + అ = కారణం లేకుండా
దిగన్ + విడువన్ + తగునే = వదలి వేయవచ్చునా ?
పారము + ఒందగన్ = ఆవలిగట్టు చేరువరకూ (చివరి వరకు)
గారవమునన్ = ఆదరంతో రక్షింపు(ము), కాపాడుము

తాత్పర్యం : పాండవులు తండ్రిలేని పిల్లలు. వారిని పసితనం నుంచి చల్లగా కాపాడావు. ఇప్పుడు వారిని కారణం లేకుండా మధ్యలోనే విడిచిపెట్టటం న్యాయం కాదు. చివరివరకు నీవు ప్రేమతో వారిని కాపాడవలసి ఉంది.

13 వచనం :

పాండుకుమారులు నీకుం బరమభక్తిం బ్రణమిల్లి యందరు నొక్కమాటగా నీతోఁ జెప్పుమని నాకుం జెప్పిన విధంబు వినుము: తన పంపునం బండ్రెండు వత్సరంబులు వనంబున వసియించితిమి పదమూఁడగునేడు జనపదంబున నజ్ఞాతవాసంబునుం జలిపితిమి; మా తండ్రి సమయంబు పరిపాలించియే మర్ధరాజ్యం బెట్లునుం బడయుడు మని కృతనిశ్చయులమై పడితిమి ? తల్లియుఁ దండ్రియు నెల్ల చుట్టంబులు నేడుగడయునను మాకుఁ దాన: మావలన నేరమి గల్గినం గినిసి యిట్లుగా దట్లని చక్కం బెట్టునది. తనగల పది వేలేండ్లకుం దన్నకాని మఱియెఱుంగ మెట్టివారమైనను మమ్మును దుర్యోధనాదులనుం దలంపరు తనయందుఁ దెఱంగు గలిగిన నెవ్వరు గొఱగాకున్నను గులంబుపాడి సెడక చెల్లునని’ రని పలికి మఱియు నిట్లనియె.

ప్రతిపదార్థం :

పాండు కుమారులు = పాండవులు
నీకున్ = నీకు
పరమ భక్తిన్ = మిక్కిలి భక్తితో
ప్రణమిల్లి = నమస్కరించి
అందఱున్ = అందరూ కలిసి
ఒక్కమాటగా = ఏకవాక్యంగా
నీతోన్ = నీతో
చెప్పుము + అని = చెప్పండి అని
నాకున్ చెప్పిన విధంబు వినుము = నాకు చెప్పిన మాటలు
తన పంపునన్ = తన ఆజ్ఞచేత వినుము
పండ్రెండు వత్సరంబులూ = పన్నెండేళ్ళు
వనంబునన్ = అడవిలో
వసియించితిమి = నివసించాము
పదమూఁడగు + ఏడు = పదమూడవ సంవత్సరం
జనపదంబునన్ = జనులుండే స్థలంలో
అజ్ఞాతవాసంబునన్ + చలిపితిమి = ఇతరులు మమ్మెరుగకుంకుండునట్లుగా జీవించాము
మా తండ్రి సమయంబు పరిపాలించి = మా తండ్రి ఏర్పరచిన ఒడంబడికను నెరవేర్చి
ఏము = మేము
అర్థరాజ్యంబు = సగం రాజ్యాన్ని
ఎట్టును = ఏ విధంగానైనా
పడయుదుము = పొందగలం
అని, కృతనిశ్చయులము + ఐ = తీర్మానించు కొన్నవారమై
పడితిమి = కష్టాలు అనుభవించాం
తల్లియున్ తండ్రియున్ = తల్లిదండ్రులు
ఎల్లచుట్టంబులున్ = అందరు చుట్టాలు
ఏడుగడును = సర్వ విధాలు రక్షించేవాడు.
మాకున్ = మాకు (పాండవులకు)
తాన్ + అ = అతడే
మా వలనన్ = పాండవుల వల్ల
నేరమి + కల్గినన్ = దోషముంటే
కనిసి = కోపించి
ఇట్లు కాదు = ఇలాకాదు
అట్లు + అని = అలా అని
చక్కన్ + పెట్టునది = సరిదిద్దవలెను
తన కల పదివేల + ఏండ్లకున్ = తాను జీవించిన పదివేల సంవత్సరాలకైనా
తన్నున్ + ఆకాని = తననే తప్పు
మఱి + ఎఱుంగుము = ఇతరుల నాశ్రయించం
ఎట్టివారము = ఐనను
మేము = ఎటువంటి వాళ్ళమైనా
మమ్మును = మమ్మల్ని
దుర్యోధన + ఆదులను = దుర్యోధనుడు మొదలైన కౌరవులను
తలంపరు = లోకులు భావింపరు
తనయందున్ + తెఱంగు + కల్గినన్ = తనకు కార్యం సరిదిద్దవలెనన్న తలంపు ఉంటే
ఎవ్వరు కొఱ + కాకున్నను = ఎవరు పనికిమాలిన వారైనా
కులంబుపాడి = వంశధర్మం
చెడకు = చెడకుండా
చెల్లును = సాగును
అనిరి = (పాండవులు) అన్నారు
అని పలికి = అని చెప్పి
మణియున్ ఇట్లు + ఆనియున్ = మరల ఇలా (కృష్ణుడు) అన్నాడు.

తాత్పర్యం : ధృతరాష్ట్ర మహారాజా ! పాండునందనులు నీకు పరమభక్తితో నమస్కరించి ఒకే గొంతుతో చెప్పుమని నాతో చెప్పి పంపిన మాటలు చెపుతాను వినుము, “తండ్రీ ! నీ ఇష్టప్రకారం పన్నెండు సంవత్సరాలు అరణ్యాలలో నివసించాము. పదమూడవ సంవత్సరం విరటుడి పట్టణంలో అజ్ఞాతవాసం కావించాము. ఈ విధంగా ఒడంబడికను నెరవేర్చి మేము రాజ్యంలో సగపాలు పొందగలమని దృఢనిశ్చయంతో ఉన్నాము. మాకు తల్లి, తండ్రి, చుట్టములు వెయ్యేల సర్వవిధ రక్షకులు మీరే. మా వలన ఏమైనా అపరాధముంటే కోపించి ఇలా కాదు అలా నడుచుకోవాలని చెప్పి చక్కబెట్టండి. నీవు పదివేలేండ్లు జీవించినప్పటికిని నిన్ను తప్ప మరెవ్వరినీ ఎరుగము, ఎట్టివాళ్ళమైననూ, మమ్మూ, దుర్యోధనాదులనూ లోకులు అనుకోరు. నీకు సదభిప్రాయముంటే మాలో ఎవరు కొరగాకపోయినా వంశ ధర్మం చెడక నిలుస్తుంది అని నీతో చెప్పుకున్నారు ? అంటూ శ్రీకృష్ణుడు ఆయనతో ఇంకా ఇట్లా అన్నాడు.

14 వచనం :

అని యీ సభ్యులకుం జెప్పుమనిరి; నీవును సభాసదులైన రాజులు నేమనియెద రనుం; డేను ధర్మంబును
నీయుఁ జుట్టఱికంబును మున్నిడుకొని మనోవాక్పప్రకారంబు లేక రూపంబైన సత్యంబకాఁజెప్పితి, నిత్తెఱంగు
మీకు మేలు క్రోధమాన మత్సరంబులు విడిచి యిట్లు సేయుండు

ప్రతిపదార్థం :

అని = చెప్పి
ఈ సభ్యులకున్ = సభలోని పెద్దలకు
చెప్పుము + అనిరి = చెప్పవలసినదిగా పాండవులు నన్ను కోరారు
నీవును = నీవు
సభాసదులు+ఐనరాజులు = సభలో ఉన్న దొరలు
ఏమి + అనియెదరు + అనుండు = ఏమిచెపుతారో చెప్పండి
ఏను = నేను
ధర్మంబును = న్యాయమును
నీతియును = రాజనీతిని
చుట్టరికంబును = బాంధవ్యమును
మున్ను + ఇడుకొని = ముందుంచుకొని
మనఃవాక్ + ప్రకారంబులు = మనసు యొక్క వాక్కు యొక్క వైఖరులు
ఏకరూపంబున = ఒకే విధముగ ఉండునట్లు
సత్యంబకాన్ = సత్యమునే
చెప్పితిన్ = చెప్పాను
ఈ తెఱంగుల = ఈ పద్ధతి
మీకున్ = మీకు
మేలు = మంచిని కలిగిస్తుంది.
క్రోధమానమత్సరంబులు = కోపం, గర్వం, ద్వేషం
విడిచి = వదిలి
ఇట్లు + చేయుండు = నేను చెప్పిన రీతిని ఆచరించండి

తాత్పర్యం : పాండవులు సభలోని పెద్దలకు నన్ను చెప్పుమని కోరిన మాటలు చెప్పాను. మహారాజా ! నీవూ, సభలోని రాజులూ ఇందుకు బదులేమి చెపుతారో చెప్పండి. నేను నీతి, ధర్మాలనూ, బాంధవ్యాన్ని ముందుంచుకొని మనో వాక్కులు ఏకరూపంగా (త్రికణ శుద్ధిగా) ఉన్న సత్యమునే చెప్పాను. నేను చెప్పిన పద్ధతి మీకు మేలు గలిగిస్తుంది. కోపం, గర్వం, ద్వేషం వదలి నేను చెప్పినట్లు చేయండి.

TS Inter 2nd Year Telugu Study Material Poem 1 శ్రీకృష్ణ రాయబారం width=

15వ పద్యం :

కం ||
అని పలికి మహారాజా
వినుమని ధృతరాష్ట్రు తోడ వెండియుఁ దా ని
ట్లనిచెప్పె వాసుదేవుఁడు,
తనమది నఱలేక కార్యదశ దెలియంగన్

ప్రతిపదార్థం:

అని పలికి = అని చెప్పి
మహారాజా! = భూ వల్లభా (ధృతరాష్ట్రా)
వినుము + అని = వినుమని
ధృతరాష్ట్రతోడన్ = ధృతరాష్ట్రునితో
వెండియున్ = మరల
కార్యదశ తెలియంగన్ = కార్యపద్ధతి విశదమయ్యేటట్లు
వాసుదేవుఁడు = శ్రీకృష్ణుడు
తన మదిన్ = తన హృదయంలో
అఱ లేక = మర్మం లేకుండా
తాన్+ఇట్లు+అని చెప్పన్ = తాను ఈ విధంగా పలికాడు

తాత్పర్యం : ఇట్లా వచించి శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడితో రాజా! నా మాటలు వినుమంటూ మనుసులో మర్మం ఉంచుకోక కార్యపద్ధతి తేటతెల్లమయ్యేటట్లు మళ్ళీ ఈ విధంగా పలికాడు.

16వ పద్యం :

ఆ ||
వారి తండ్రిపాలు వారికి నిచ్చి నీ
పాలు నీవుఁ బుత్ర పౌత్ర చేయము
ననుభవించి సఖులరై యుండుఁ డిది బంధు
మిత్ర సుజనకోటి మెచ్చు తెఱఁగు

ప్రతిపదార్థం :

వారి తండ్రిపాలు = పాండవుల తండ్రి భాగం
వారికిన్ + ఇచ్చి = పాండవులకు ఇచ్చి
నీ పాలు = నీ రాజ్య భాగం
నీవున్ = నీవూ
పుత్రపౌత్ర చయమున్ = నీ కొడుకుల, మనుమల సమూహం
అనుభవించిన = అనుభవించి
సుఖులురు+ఐ+ఉండుఁడు = హాయిగా జీవించండి
ఇది = ఇట్లా ఉండటం,
బంధుమిత్ర సుజనకోటి = చుట్టముల, స్నేహితుల, సత్పురుషుల యొక్క సముదాయం
మెచ్చుతెఱగు = కొనియాడు విధమై ఉన్నది

తాత్పర్యం : రాజా! పాండవుల తండ్రి భాగం పాండవుల కిచ్చి, నీ రాజ్యభాగం, నీ కుమారులు, నీ మనుమళ్ళూ హాయిగా అనుభవిస్తూ ఉంటే చుట్టాలూ, స్నేహితులూ, సత్పురుషులు అందరు మిమ్ములను కొనియాడుతారు.

17వ పద్యం :

కం||
ఎఱుఁగవె యజాతశత్రుని
నెఱియును ధర్మంబు సత్యనిష్ఠయు మిము నె
త్తెఱగున ననువర్తించెనొ
యెఱుఁగవె ? తగు చేవ గలుగు టెఱుఁగవె ? యధిపా !

ప్రతిపదార్థం :

అధిపా ! = రాజా!
అజాతశత్రుని = ధర్మరాజు యొక్క
నెఱియును = న్యాయమును
ధర్మంబున్ = ధర్మమును
సత్యనిష్ఠయు = సత్యమునందలి నమ్మకము
ఎఱగవె ? = తెలియదా ?
మిమున్ = మిమ్ము
ఏ + తెఱఁగునన్ = ఏ విధంగా
అనువర్తించెనొ = అనుసరించిమెలగెనో
ఎఱుగవె ? = తెలియదా ?
తగుచేవ = తగినశక్తి
కలుగుట = అతడు కల్గియుండటం
ఎఱుంగవె ? = తెలియదా ?

తాత్పర్యం : మహారాజా! ధర్మజుడి న్యాయమూ, ధర్మమూ, సత్యప్రవృత్తి నీకు తెలుసు. అతడు మిమ్మాశ్రయించుకొని ఎట్లా ఉన్నాడో నీకు తెలుసు. అతని సామర్థ్యం కూడా నీకు తెలుసు.

18వ పద్యం :
చ||
మద మడగించి భూపతిసమాజము నెల్లను నిన్నుఁ గొల్వఁజే
యుదునని పూని దిగ్విజయ మున్నతిఁజేసి మహావిభూతితో
మదిమదినుండ నీ సుతుఁడు మంత్రులు సౌబలు జూదమార్చి సం
పద కొని యంతఁ బోవక సభన్ ద్రుపదాత్మజ భంగపెట్టరే

ప్రతిపదార్థం :

మదము + అడఁగించి = గర్వాన్ని తొలగించి
భూపతి సమాజమున్ + ఎల్లన్ = రాజలోకమంతటినీ
నిన్నున్ = నిన్ను
కొల్వన్+చేయుదున్+అని = సేవించేటట్లు చేయుదునుగాక
అని పూని = పూనుకొని
దిగ్విజయము = విజయ యాత్రను
ఉన్నతిన్ చేసి = గొప్పగా కావించి
మహా విభూతితోన్ = గొప్ప ఐశ్వర్యంతో
మది మదిన్ + ఉండక = నెమ్మదిగా ఉండగా
నీ సుతుడు = నీ కుమారుడైన (దుర్యోధనుడు)
మంత్రులు = అతడికి ఆలోచన చెప్పే (కర్ణ దుశ్శాసనులు)
సౌబలున్ = సుబలును పుత్రుడు (శకుని)
జూదము + ఆర్చి = జూదము ఆడించి
సంపదన్ + కొని = సిరిని హరించి
అంతన్ + పోవక = అంతటితో విడువక
ద్రుపద + ఆత్మజన్ = ద్రౌపదిని
సభన్ = కొలువులో
భంగపెట్టరే = అవమానించిన వారు గదా !

తాత్పర్యం : రాజుల దర్పమడచి వారందరు నిన్ను కొలిచేటట్లు చేయడానికై ధర్మనందనుడు గొప్పగా దిగ్విజయం చేసి మిక్కుటమైన సిరిసంపదతలో తులతూగుతూ నిమ్మళంగా ఉన్నాడు. అప్పుడు నీ తనయుడూ, అతని మంత్రులూ చేరి శకునిచే జూదమాడించి ధర్మజుడి సంపదనెల్ల హరించారు. అంతటితో తృప్తిపడక నిండుసభలో ద్రౌపదిని పరాభవించారు.

19వ పద్యం :

ఉ ||
దానికి నీ వొడంబడితి; ధర్మజుఁ డంతయుఁ జూచి సత్యముం
బూని వృకోదరార్జునులు భుగ్నులుగాఁ బెదచేతఁ గన్ను నీ
రూనఁగ నొత్తుకొంచుఁ జని యుగ్ర వనంబున దుఃఖమగ్నుఁడై
దీనత నుండి పూన్కి దగఁ దీర్చియుఁ గూడి మనంగఁ గోరెడిన్

ప్రతిపదార్థం :

దానికిన్ = దుర్యోధనుడి దుష్టచేష్టకు
నీవు + ఒడంబడితి(వి) = నీవు సమ్మతించావు
ధర్మజుఁడు = ధర్మరాజు
అంతయున్ + చూచి = పరిస్థితి నాకళించుకొని
సత్యమున్ + పూని = సత్యం అవలంభించి
వృకోదర + అర్జునులు = భీమార్జునులు
భుగ్నులుగాన్ = క్రుంగినవారుకాగా
కన్ను = కళ్ళలో
నీరు + ఊనఁగన్ = కన్నీరు నిండగా
పెడచేతన్ = వెనక చెయ్యితో
ఒత్తుకొంచున్ = తుడుచుకొంటూ
చని = వెళ్ళి
ఉగ్ర వనంబునన్ = ఘోరారణ్యంలో
దుఃఖమగ్నుడు + ఐ = శోకమునందు మునిగినవాడై
దీనతన్ + ఉండి = దైన్యంతో పడియుండి
పూన్కిన్ = ప్రతిజ్ఞను
తగన్ + తీర్చియున్ = సక్రమంగా నిర్వహించికూడా
కూడి = మీతో కలసి మెలసి
మనంగన్
కోరె = జీవించాలని
కోరెడిన్ = కోరుకొంటున్నాడు.

తాత్పర్యం: దుర్యోధనుడి దుష్కృత్యాలకు నీవు సమ్మతించావు. ధర్మరాజు తనకేర్పడిన సంకటాన్ని గమనించి సత్యం తప్పక, తన ఆజ్ఞచేత భీమార్జునులు బలముడిగి క్రుంగిపోగా, కంటినుండి కారుతున్న కన్నీటిని ఎడమచేతితో తుడుచుకుంటూ ఘోరారణ్యాలకు వెళ్ళాడు. అక్కడ దుఃఖాలలో మునిగి దైన్యం అనుభవిస్తూ ప్రతిజ్ఞను సక్రమంగా నెరవేర్చికూడా నేడు మీతో ఒద్దికగా జీవించవలెనని కోరుకుంటున్నాడు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 1 శ్రీకృష్ణ రాయబారం width=

20వ పద్యం :

కం||
తనుఁ దాన పోలుగా కే
మనవచ్చు ? నజాతశత్రు నతిశాంతతయున్
వినయుము సత్యము మున్నే
జనపతులకుఁ గలవు సెపుమ ? సౌజన్యనిధీ !

ప్రతిపదార్థం :
సౌజన్యనిధీ ‘ = మంచితనానికి స్థానమైనవాఁడా!
తనున్+తాను+అ+పోలున్+కాక = అతడికి అతడే సాటి అగును
ఏమి + అనన్ వచ్చున్ ? = అతడిని ఎంతని కొనియాడగలము ?

అజాతశత్రు = ధర్మజుడి యొక్క
అతి = ఎక్కువైనా
శాంతతయున్ = శాంతస్వభావమూ,
వినయమున్ = అణకువా
సత్యమున్ = సత్యమూ
మున్ను = పూర్వ౦
ఏ జనపతులకున్+కలవు = ఏ రాజులకున్నాయో
చెపుము + అ = చెప్పుము

తాత్పర్యం : ధర్మపుత్రుడికి సాటి ధర్మపుత్రుడే. అతడిని ఎంతని కొనయాడగలం ? ఆయన శాంతస్వభావం, అణకువ, సత్యనిష్ఠ ఇంతకు మునుపు ఏరాజులకున్నవో చెప్పు.

21వ పద్యం :

కం॥ ఏ నిం తాడితి నీ సం
తానం బిరుదెఱఁగునకు హితము గోరి భవ
త్సూనుని మతి యతిలోభము
మానిచి పాండవులఁ దెమ్ము మనుజాధీశా !

ప్రతిపదార్థం :

మనుజ + అది + ఈశ = నరనాథా !
నీ సంతానంబు = నీ బిడ్డలైన
ఇరు తెఱుగునకున్ = రెండు పక్షాల వారికి,
హితమున్ + కోరి = మేలు దలచి
ఏను = నేను
ఇంత + ఆడితిన్ = ఇన్ని మాటలు చెప్పాను
భవత్ + సూనుని = నీ కొడుకైన దుర్యోధనుడి యొక్క
మతి + అతి లోభమున్ = మనస్సునందలి మిక్కిలి దురాశను
మానిచి = తొలగించి,
పాండవులన్ + తెమ్ము = పాండవులను నీ దగ్గరకి రప్పించుకొనుము

తాత్పర్యం : మంచితనంగల ధృతరాష్ట్ర మహారాజా ! నీ బిడ్డలైన కురుపాండవుల మేలు గోరి నేనిన్ని మాటలు చెప్పవలసి వచ్చింది. నీ పుత్రుడైన దుర్యోధనుడి మనసులో ఉన్న పరమ దురాశను తొలగించి, పాండవులను నీ చెంతకు పిలిపించుకొనుము.

22వ పద్యం :

చం||
అనవుడు రోమహర్షణము లంగములం బొడమన్ సదస్యు లె
ల్లను బ్రియమంది నెమ్మనములం బురుషోత్తముఁ డింత యొప్పఁ బ
ల్కునె ? మఱుమాటలాడ నయకోవిదుఁ దెవ్వఁడు ? ధీరుఁడెవ్వఁ? డిం
దనువరి యెవ్వఁ డంచు నచలాకృతులై నెఱి నూరకుండఁగన్

ప్రతిపదార్థం :

అనవుడున్ = (శ్రీకృష్ణుడు) అట్లా పలుకగా;
అంగములన్ = శరీరములందు
రోమహర్షణములు = గగుర్పాటు
పొడమన్ = కలుగగా
సదస్యులు + ఎల్లను = కొలువులోని వారంతా
ప్రియము + అంది = హర్షించి,
నెమ్మనములన్ = తమ నిండుమనసులలో
పురుషోత్తముఁడు = శ్రీకృష్ణుడు
ఇంత + ఒప్పన్ + పల్కునే = ఇంత బాగా మాట్లాడుతాడా ? (ఎంత బాగా మాట్లాడాడు ? అని భావం)
మఱుమాటలు + ఆడన్ = ఆ మాటలకు బదులు పలకటానికి
ఇందున్ = ఈ సభలో
నయకోవిదుడు+ఎవ్వఁడు ? = నీతి శాస్త్ర నిపుణుడు ఎవడున్నాడు ?
ధీరుఁడు + ఎవ్వడు ? = ధైర్యశాలి ఎవడున్నాడు ?
అనువరి + ఎవ్వడు ? = ఉపాయలి ఎవడున్నాడు ?
అంచున్ = అని పలుకుతూ
ఆచల :- ఆకృతులు + ఐ = చలించని ఆకారాలు గలవారె
నెతిన్ = ఒప్పుగా
ఊరక + ఉండఁగన్ = మిన్నకుండగా

తాత్పర్యం : శ్రీకృష్ణుడి మాటలు వినగానే సభ్యులందరి శరీరాలు గగుర్పాటు వహించాయి. వారు మనస్సులలో ఎంతో సంతోషించి, నారాయణు డెంత ఒప్పిదంగా మాట్లాడాడు ! శౌరి మాటలకు ప్రతివచనాలు పల్కగల నీతి నిపుణుడు, ధీరుడు, ఉపాయశాలి ఈ కొలువులో ఎవరున్నారు అని కదలక మెదలక నోరు విప్పక అట్లాగే ఉండిపోయారు.

కంఠస్థం చేయవలసిన పద్యాలు, ప్రతిపదార్థ, తాత్పర్యములు

కవి పరిచయం : ఈ పద్యం తిక్కన రాసిన మహాభారతం, ఉద్యోగ పర్వం, తృతీయాశ్వాసం నుండి తీసుకున్న శ్రీకృష్ణ రాయబారం అనే పాఠ్యాంశం లోనిది. తిక్కనకు కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు అనే బిరుదులున్నాయి. పదమూడవ శతాబ్దికి చెందిన నెల్లూరు పాలకుడు మనుమసిద్ధి ఆస్థానంలో ఉండేవాడు.

1వ పద్యం :
(ప్రతిపదార్థ తాత్పర్యాలు రాసే ముందు కవి పరిచయం రాయాలి.)

చ ||
భరతకులంబు ధర్మమును బాడియు సత్యముఁ బొత్తుఁ బెంపునుం
గరుణయుఁ గల్గి యుందు ననఁగా నుతిఁ గన్నది : యందు సద్గుణో
త్తరులరు నీవు నీ యనుఁగుఁ దమ్ముఁడు; నీ తనయుల్ యశోధురం
ధర శుభ శీలు; రీ సుచరిత క్రమ మిప్పుడుఁ దప్పనేటికిన్!

ప్రతిపదార్థం :

భరతకులంబు = భరతుడు జన్మించిన =
ధర్మమును = ధర్మమును
పాడియున్ = న్యాయమును
సత్యమున్ = సత్యమును
పొత్తున్ = ఐకమత్యమును
పెంపునున్ = గొప్పతనమును
కరుణయున్ = దయయును
కల్గి+ఉండున్+అనఁగాన్ = కల్గియుంటుందని
నుతిన్ + కన్నది = ప్రఖ్యాతి వహించినది
అందున్ = అట్టి వంశంలోని
నివున్ = నీవూ
నీ + అనుగుఁ దమ్ముడున్ = నీ ప్రియమైన తమ్ముడు (పాండురాజు)
సద్గుణ + ఉత్తరులు = మంచి గుణాలచేత శ్రేష్టులు
నీ తనయుల్ = నీ కొడుకులునూ, నీ తమ్ముడి కొడుకులున్నూ
యశోధురంధర శుభశీలురు = కీర్తి భారాన్ని వహిస్తున్న మంచి స్వభావం కలవారు
ఈ సుచరిత క్రమము = పరంపరగా వస్తున్న ఈ మంచి ప్రవర్తనా తీరును
ఇప్పుడున్ = ఇప్పుడు కూడా
తప్పన్ + ఏటికిన్ ? = తప్పడం ఎందుకు ?

తాత్పర్యం : మహారాజా ! మీ భరతవంశం ధర్మం, న్యాయం, సత్యం, ఐకమత్యం, గౌరవం, కారుణ్యం మొదలైన సద్గుణాలు గలిగి కీర్తి పొందింది. అట్టి వంశంలో నీవూ, నీ ప్రియ సహోదరుడు పాండురాజు, సద్గుణాలయందు శ్రేష్టులు, మరి నీ కుమారులు కీర్తి భారం వహించ జాలినవారు. కళ్యాణ స్వభావులు. ఇంత మంచి నడవడిగల వంశ సంప్రదాయం ఇప్పుడు కూడా తప్పడం ఎందుకు ?

2వ పద్యం :
ఉ ||
వీరును వారుఁ బండితులు, విక్రమవంతులు, బాహుగర్వదు
ర్వారులు; పూని రిత్త బవరంబున నాఱడిఁ జావఁబోవ నె
ట్లూరక యుండవచ్చుఁ ? గడు నొప్పెడు మేనులు వాఁడి కైదువుల్
గూరఁగ నాటినం బుడమిఁ గూలుట కక్కట ! యోర్వవచ్చునే ?

ప్రతిపదార్థం :

వీరును = ఈ కౌరవులు
వారున్ = ఆ పాండవులు
పండితులు = చదువు, సాములు నేర్చినవారు
విక్రమవంతులు = పరాక్రమం కలవారు
బాహు గర్వ దుర్వారులు = భుజబలంచేత అడ్డగించ రానివారు
పూని = ఉద్యమించి
రిత్త బవరంబునన్ = తమలో తమకు ఏర్పడిన వ్యర్థమైన కలహం వల్ల
ఆఱ డిన్ = యుద్ధంలో
కావడ్ + పోవన్ = మరణించటానికి సిద్ధపడగా
ఎట్లు + ఊరక + ఉండన్* + వచ్చున్ = నివారించక మౌనంగా ఎట్లుండదగును ?
వాడి కైదువుల్ = పదునైన ఆయుధాలు (బాణాలు)
కూరఁగన్ = దూసుకొని పోయేటట్లు
నాటినన్ = గ్రుచ్చుకొనగా
కడున్ = మిక్కిలి
ఒప్పెడు మేనులు = సుందర (సుకుమారమైన) శరీరాలు
పుడమిన్ + కూలుటకున్ = నేలపై కూలటం
అక్కట = అయ్యో
ఓర్వన్ వచ్చునే = సహింపశక్యము ?

తాత్పర్యం : కౌరవులూ పాండవులూ మంచి చదువరులు, పరాక్రమవంతులు, భుజదర్పం గలవారు గనుక ఎవ్వరూ వీరిని అడ్డగించలేరు. ఇట్లాంటివారు తమలో తమ కేర్పడిన కొరమాలిన యుద్ధంలో ఊరక మరణించటానికి సిద్ధపడుతుండగా అడ్డుపడక చూస్తూ ఊరకుండటం మంచిది కాదు. ఇంత కోమలమైన శరీరాలు వాడి బాణాలు ఆవలికి దూసుకొని వెళ్ళేటట్లు గ్రుచ్చుకోగా నేలమీద కూలటం చూచి సహించటం సరైనది కాదు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 1 శ్రీకృష్ణ రాయబారం width=

3వ పద్యం:
ఉ||
‘సారపు ధర్మమున్ విమల సత్యముఁ బాపముచేత బొంకుచేఁ
బారముఁ బొందలేక చెడఁ బాఱినదైన యవస్థ దక్షు లె
వ్వారలుపేక్ష సేసి రది వారల చేటగుఁగాని ధర్మని
స్తారక మయ్యు సత్యశుభదాయక మయ్యును దైవ ముండెడున్’.

ప్రతిపదార్థం :

సారపు ధర్మమున్ = శ్రేష్టమైన ధర్మమును;
విమల సత్యమున్ = నిర్మలమైన సత్యమును,
పాపముచేతన్ = దురిత చేత
బొంకు చేన్ = అబద్ధం చేత
పారమున్+పొందన్+లేక = గట్టుకు చేరలేక
చెడన్ పారినది + ఐన + అవస్థన్ = చెడటానికి సిద్ధంగా ఉన్న దుర్దశలో
దక్షులు = చక్కదిద్దటానికి సమర్థులు
ఏ + వారు = ఎవరు
ఉపేక్ష + చేసిరి = అశ్రద్ధ వహిస్తారో
అది = అట్లా ఊరుకోవడం
వారల చేటు + అగున్ = వారికే హాని కలిగిస్తుంది
కాని = కానీ
ధర్మ నిస్తారికము + అయ్యున్ = ధర్మమును ధరించేదిగాను
సత్య శుభదాయకము + ఆయ్యును = సత్యానికి మేలు కల్గించేదిగా
దైవము ఉండెడున్ = దైవం ఆధారంగా ఉంటుంది

తాత్పర్యం : ఉత్తమమైన ధర్మం, నిర్మలమైన సత్యం పాపం చేతను, అబద్ధం చేత దరి (లక్ష్యాన్ని) చేరలేక చెడటానికి సంసిద్ధంగా ఉన్న స్థితిలో వాటిని రక్షించే శక్తి ఉన్నా ఎవరు అశ్రద్ధ వహిస్తారో అది వారలకే హానికరమవుతుంది. ఆ స్థితిలో భగవంతుడు ధర్మమును ఉద్ధరించటానికి, సత్యమునకు శుభం కలిగించటానికి ముందుకు వస్తాడు.

4వ పద్యం :

ఉ ||
వారలు శాంతశూరులు; భవచ్చరణంబులు గొల్వఁబూని యు
న్నారటుఁగాక మీ కది మనంబున కప్రియమేని నింతకుం
బోరికి వచ్చుచుండుదురు; భూవర ! రెండు దెఱంగులందు ని
కారయఁ బథ్యమేది యగు నవ్విధ మేర్పడ నిశ్చయింపుమా !

ప్రతిపదార్థం :

వారలు = కౌంతేయులు
శాంత శూరులు = శాంతస్వభావులు, పరాక్రమవంతులు
భవత్ + చరణంబులు = నీ పాదాలు
కొల్వన్ = సేవించటానికి
పూని + ఉన్నారు = సంసిద్ధంగా ఉన్నారు
అటున్ + కాక = అట్లాకాక
మీకున్ = మీకు
అది = పాండవుల పొత్తు
మనంబునకున్ = మీ మనస్సులకు
అప్రియము + ఏనిన్ = ఇష్టం కానిచో
ఇంతకున్ = ఈపాటికి
పోరికిన్ = యుద్ధానికి
వచ్చుచున్ + ఉండుదురు = వస్తూ ఉంటారు
భూవర = రాజా
రెండు తెలుగులందున్ = సంధి సంగ్రామాలలో
నీకున్ = నీకు
అరయన్ = ఆలోచించగా
ఏది పథ్యము + అగున్ = ఏది హితమౌతుందో
ఆ + విధము = ఆ తెఱగు
ఏర్పడన్ + నిశ్చయింపుమా ! = తేటపడేటట్లు తీర్మానించుము

తాత్పర్యం : మహారాజా ! పాండవులు ఎంతటి శాంత స్వభావులో అంతటి వీరాగ్రేసరులు. వారు నీ పాదసేవ చేయటానికి సంసిద్ధంగా ఉన్నారు. వారట్లా మీతో కలసి మెలసి వర్తించటం మీకు ఇష్టం కాకపోతే కదనం కావించటానికి బయలుదేరి వస్తారు. సంధి, సంగ్రామం ఈ రెండింటిలో మీ కేది హితమని తోస్తుందో దానిని నిర్ణయించి వెల్లడించండి.

శ్రీకృష్ణ రాయబారం Summary in Telugu

(ఆంధ్ర మహాభారతం: హశ్వాసము నుండి)

TS Inter 2nd Year Telugu Study Material Poem 1 శ్రీకృష్ణ రాయబారం 1

కవి పరిచయం

పాఠ్యాంశం పేరు : శ్రీకృష్ణ రాయబారం
కవి పేరు : తిక్కన సోమయాజి
గ్రంథం : మహాభారతం – ఉద్యోగపర్వం – తృతీయాశ్వాసంలోనిది
బిరుదులు : కవి బ్రహ్మ, ఉభయకవి మిత్రుడు
కాలం : 13వ శతాబ్ది (క్రీ.శ. 1205 నుండి 1288)
‘ఆస్థానం : నెల్లూరును పరిపాలించిన మనుమసిద్ధి ఆస్థానం.
ఇంటి పేరు : కొట్టరువు
రచనలు : వ్యాసభారతంలోని విరాటపర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు – 15 పర్వాలు అనువదించాడు. నిర్వచనోత్తర రామాయణం, కృష్ణశతకం, విజయసేనం, కవివాగ్బంధం (కవిసార్వభౌమఛందం).
తిక్కన శైలి : తిక్కనది నాటకీయ శైలి, రాసాభ్యుచిత బంధం.
తిక్కనను ఆదరించిన రాజు : తిక్కన క్రీ.శ. 1205 నుండి 1288 వరకు నెల్లూరు మండలాన్ని పాలించిన, మనుమసిద్ధి యొక్క ఆస్థాన కవి.
మనుమసిద్ధికి తిరిగి
రాజ్యాన్ని ఇప్పించడం : తిక్కన తన జీవితకాలంలో దాయాదుల చేతిలో ఓటమిపాలైన మనుమసిద్ధికి అతని రాజ్యాన్ని తిరిగి ఇప్పించేందుకు, నాటి కాకతీయ ప్రభువైన గణపతిదేవుడి దగ్గరకు వెళ్ళి రాయబార కార్యాన్ని సఫలం చేశాడు.
హరిహరాద్వైత మతస్థాపన: సమాజం శాంతిగా ఉండేందుకు హరిహరాద్వైత సిద్ధాంతాన్ని పునఃప్రతిపాదించాడు. తమ సమకాలీన కవులందరిచేత సమున్నత గౌరవం పొందాడు. ఎందరో శిష్య ప్రశిష్యులను తన మార్గంలో నడిపించాడు.

తిక్కన గారి శిష్యుడు
కేతన చెప్పిన వివరాలు : కవిత్రయంలో ద్వితీయుడైనా కవితారచనలో అద్వితీయుడు తిక్కన సోమయాజి. తిక్కన శిష్యుడు కేతన దశకుమార చరిత్రలో తిక్కనను మయూర సన్నిభకవి, ఆర్యభోజ, భారవికల్పుడు, ఉభయ భాషాకర్త, త్రివిధకావ్య పారీణుడు అని పేర్కొన్నాడు.

పాఠ్యభాగ సందర్భం

పంచమ వేదంగా ప్రసిద్ధి పొందిన ఇతిహాసం మహాభారతం. శంతన మహారాజుకు. సత్యవతికి పుట్టిన సంతానం చనిపోయిన తరువాత వేదవ్యాసుని ద్వారా ధృతరాష్ట్ర, పాండురాజులు జన్మిస్తారు. పుట్టుకతో అంధుడైన ధృతరాష్ట్రునికి రాజయ్యే అవకాశం లేనందున పాండురాజుకు పట్టాభిషేకం చేస్తారు. పాండు రాజుమరణానంతరం ధృతరాష్ట్రున్ని తాత్కాలిక రాజునూ చేస్తారు. దుర్యోధనునికి రాజ్యంపై కోరిక పెరగడంతో వారిని చంపాలని ప్రయత్నిస్తాడు. దుర్యోధనుడు అసూయతో పాండవులను అనేకసార్లు కష్టనష్టాలకు గురిచేశాడు. లక్కయిల్లు దహనం, ద్రౌపదీ వస్త్రాపహరణం, మాయాజూదంతో పాండవులతో అరణ్యవాసం చేయించడం వంటి అనేక దుష్కృత్యాలకు దుర్యోధనుడు పాల్పడ్డాడు. అవన్నీ పూర్తయిన తరువాత తన అర్థరాజ్యం తనకిమ్మని రాయబారం పంపిస్తాడు. రాజు స్థానంలో ఉన్న ధృతరాష్ట్రుడు మౌనంగా కూర్చున్నాడు. సంజయుడు, ద్రుపద పురోహితుల రాయబారం ఇరుపక్షాల వద్ద జరిగినా ఫలితం లేకపోయింది. చివరకు శ్రీకృష్ణుడే రంగంలోకి దిగి ధృతరాష్ట్రునికి యుద్ధనష్టాలు, శాంతి గొప్పదనం, పాండవుల పరాక్రమం చెప్పేందుకు వెళ్ళిన సందర్భమే ‘శ్రీకృష్ణ రాయబారం’ అనే ప్రస్తుత మన పాఠ్యాంశం.

TS Inter 2nd Year Telugu Study Material Poem 1 శ్రీకృష్ణ రాయబారం width=

పాఠ్యభాగ సారాంశం

శ్రీకృష్ణుడు మేఘధ్వని వంటి గంభీరమైన తన కంఠధ్వనితో, దంతాల కాంతులు ప్రసరిస్తూ ఉండగా, ధృతరాష్ట్రుని సభలో ఉన్న వారందరూ శ్రద్ధగా వింటుండగా పాండవులు పంపిన సంధి సమాచారాన్ని ధృతరాష్ట్ర మహారాజుతో చెప్పాడు. “ఓ మహారాజా ! నీకు తెలియని విషయాలు ఏమున్నాయి ? అయినప్పటికీ, భరతవంశం సంతోషించేటట్లు నా ఇరు కుటుంబాల వారికి న్యాయమూ, పరమహితమూ చెప్పటం ఉచితమని నేనిక్కడికి వచ్చాను.

శ్రీకృష్ణుడు కురువంశ కీర్తిని గుర్తు చేయుట : కురునాథా ! పాండవ కౌరవులు పాలూ, నీరు లాగా కలిసిమెలిసి జీవించటం మంచిది. వారు కలిసిమెలిసి ఉండేటట్లు నడిపించవలసిన బాధ్యత తమరిది. పాండవులు వేరు, కౌరవులు వేరు అనే భేదభావన నీకు లేదు. మహారాజా ! మీ భరతవంశం ధర్మం, న్యాయం, సత్యం, ఐకమత్యం, గౌరవం, కారుణ్యం మొదలైన సద్గుణాలు గలిగి కీర్తి పొందింది. అట్టి వంశంలో నీవూ, నీ ప్రియ సహోదరుడు పాండురాజు సద్గుణాలతో గొప్ప పేరు పొందారు. నీ కుమారులు కూడా కీర్తి భారం వహింప జాలినవారు. కళ్యాణ స్వభావులు. ఇంత మంచి నడవడిగల వంశ సంప్రదాయం ఇపుడు తప్పడం ఎందుకు ?

యుద్ధం సంభవిస్తే జరిగే కీడుకు ధృతరాష్ట్రున్ని బాధ్యుణ్ణి చేయుట : ధృతరాష్ట్ర మహారాజా ! నీవు కురువంశంలో పెద్దవాడివి. ఈ వంశానికంతటికీ నీవే ఆధారం. నీ కుటుంబంలో ఎవ్వరెవ్వరి నడవడికలు, వాటిని బట్టి కలిగే మేలు, కీడు అంతా నీకే చెందుతాయి. కాబట్టి నీవు ఇరుకుటుంబాల వారి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని జనులు మెచ్చేటట్లుగా వారిని చక్కదిద్దవలసిన బాధ్యత నీపై ఉంది. రాజా ! దుర్యోధనాదులైన వీరు ధర్మపరులుగాక, సత్కార్యాలు చేయక ఇట్లా ఉంటే మహార్థసిద్ధికి దూరమవుతామని తలచటం లేదు. మీ వంశ నడవడి ఇట్టిది కాదు అని తెలిసి కూడా దారుణ బుద్ధితో బంధువుల మనస్సులు బాధ చెందేటట్లుగా ప్రవర్తిస్తున్నారు. కౌరవులు, పాండవులు ఒక మంచి నిర్ణయానికి వచ్చి, శాంతం వహించి, జీవించటం మంచిది. ఇట్లు వారు ప్రసన్న చిత్తులై ఉండటం నాకూ, నీకూ, కురువంశానికి, ఈ రాజ సమూహానికి, ఈ భూమండలానికి అంతటికి మంచిది. అట్లాకాక యుద్ధమే సంభవిస్తే మనందరికీ మహావిపత్తు కలుగుతుంది. కనుక రాజోత్తమా ! నా మాటలపై విశ్వాసముంచి తప్పక సంధి చేసుకోండి.

ఇరువైపులా గల బలాలను వారిని కలిపి ఉంచే ప్రయత్నం చేయుట : అక్కడున్న భీమార్జునులను యుద్ధరంగంలో వివరించి నిలువరించగలవారు ఇక్కడెందరున్నారు ? ఇక్కడున్న ద్రోణ, భీష్ముల పరాక్రమాన్ని ఎదుర్కొనగలవారు అక్కడ ఎందరున్నారు ? ఇట్లా ఉభయ పక్షాలలోని వీరులు యుద్ధంలో చావటం కన్న నీ బలగాలై కలిసి మెలిసి జీవించటం మంచిది. మహారాజా! ఏ విధంగానైనా వీరిని శాంతింపజేయుము. లోకంలోని రాజులందరూ నీ పాదపీఠాన్ని ప్రీతితో సేవిస్తుండగా సముద్రముచే చుట్టబడిన పుడమినంతటినీ నీవే ఏకచ్ఛత్రంగా పరిపాలించటం మంచిది. తల్లి తన బిడ్డల పట్ల శత్రుత్వం వహించటం ఎంత సమంజసమో నీవే ఆలోచించు. నీవు కురుపాండవుల విషయంలో శ్రద్ధ వహించకుంటే ఈ ఉభయవర్గాలకే కాదు, పుడమిలోని జనులందరికీ పాపం చేసినట్లే అవుతుంది. చివరకు దానివల్ల నీకే హాని కలుగుతుంది.

రాజా ! కురు పాండవులలో ఎవరికి మరణం సంప్రాప్తించినా, బాధలు కలిగినా నీకు దుఃఖం కలుగుతుంది. కౌరవులూ, పాండవులూ మంచి చదువరులు, పరాక్రమవంతులు, భుజదర్పం గలవారు గనుక ఎవ్వరూ వీరి నడ్డగించలేరు. ఇట్లాంటివారు తమలో తమకేర్పడిన కొరమాలిన యుద్ధంలో మరణించటానికి సిద్ధపడుతుండగా అడ్డుపడక చూస్తూ ఊరకుండటం నీ వంటి వారికి తగిన పని కాదు. ఇంత కోమలమైన శరీరాల నుండి మొనలుదేలిన బాణాలు ఆవలికి దూసుకొని వెళ్ళేటట్లు గ్రుచ్చుకోగా నేలమీద కూలటం చూచి సహించటం సరైనది కాదు. రాజా ! నీ గొప్పతనమును, రాజనీతిని, శాంతిని సమస్త ప్రజలు మెచ్చుకొనేటట్లు కురుపాండవులు సంగ్రామంలో నశించకుండా సంరక్షించుకొనుము,

పాండవుల సందేశాన్ని అందించుట : ధృతరాష్ట్ర మహారాజా ! పాండవులు తండ్రిలేని పిల్లలు. వారిని పసితనం నుంచి చక్కగా కాపాడావు. ఇప్పుడు వారిని కారణం లేకుండా మధ్యలోనే విడిచిపెట్టడం న్యాయం కాదు. పాండునందనులు నీకు పరమభక్తితో నమస్కరించి ఒకే గొంతుకతో నీకు చెప్పమని నాతో చెప్పి పంపిన మాటలు చెపుతాను వినుము. “తండ్రీ ! నీ ఇష్టప్రకారం పన్నెండు సంవత్సరాలు అరణ్యాలలో నివసించాము. పదమూడవ సంవత్సరం విరాట మహారాజు దగ్గర అజ్ఞాతవాసం చేశాము. ఈ విధంగా ఒప్పందాన్ని నెరవేర్చాము. మేము రాజ్యంలో సగపాలు పొందగలమని దృఢనిశ్చయంతో ఉన్నాము. మాకు తల్లి, తండ్రి, చుట్టములు వెయ్యేల సర్వవిధ రక్షకులు మీరే. మావల్ల ఏమైనా అపరాధముంటే కోపించి చక్కబెట్టండి”.

యుద్ధాన్ని తప్పించకుంటే దైవం చూసుకుంటుందని హెచ్చరిక : ఉత్తమమైన ధర్మం, నిర్మలమైన సత్యం పాపం చేతను, అబద్ధం చేత లక్ష్యాన్ని చేరలేని స్థితిలో వాటిని రక్షించే శక్తి ఉన్నా, ఎవరు అడ్డుపడక అశ్రద్ధ వహిస్తారో అది వారలకే హానికరమవుతుంది. ఆ స్థితిలో భగవంతుడు ధర్మమును ఉద్ధరించటానికి, సత్యానికి శుభం కలిగించటానికి ముందుకు వస్తాడు.

పాండవులు సభలోని పెద్దలకు నన్ను చెప్పమని కోరినమాటలు చెప్పాను. మహారాజా ! నీవూ, సభలోని రాజులూ ఇందుకు బదులేమి చెపుతారో చెప్పండి. నేటి నీతి ధర్మాలనూ, బాంధవ్యాన్ని ముందుంచుకొని మనోవాక్కులు ఏకరూపంగా ఉన్న సత్యమునే చెప్పాను. నే చెప్పిన పద్ధతి మీకు మేలు గలిగిస్తుంది. కోపం, గర్వం, ద్వేషం వదలి నేను చెప్పినట్లు చేయండి.

పాండవుల ఔన్నత్యాన్ని వివరించుట : రాజా ! పాండవుల తండ్రి భాగం పాండవులకిచ్చి, నీ రాజ్యభాగం నీ కుమారులు, నీ మనుమళ్ళూ హాయిగా అనుభవిస్తూ ఉంటే చుట్టాలూ, స్నేహితులూ, సత్పురుషులు అందరు మిమ్ములను కొనియాడుతారు. మహారాజా ! ధర్మజుడి న్యాయమూ, ధర్మమూ, సత్యప్రవృత్తి నీకు తెలుసు. అయినప్పటికీ స్పష్టంగా చెపుతాను విను. అతడు ఇంద్రప్రస్థపురంలో ఉంటూ నీకు గౌరవ ఖ్యాతులు కలిగించడానికి రాజులను ఓడించి వారందరు నిన్ను కొలిచేటట్లు చేయటానికి గొప్పగా దిగ్విజయ యాత్ర చేశాడు. సిరిసంపదలతో తులతూగుతూ నిమ్మళంగా ఉన్నప్పుడు

నీ తనయుడూ, అతని మంత్రులూ చేరి శకునిచే జూదమాడించి ధర్మజుడి సంపదనెల్ల హరింపచేశాడు. అంతటితో తృప్తిపడక నిండుసభలో ద్రౌపదిని పరాభవించారు. దుర్యోధనుడి దుష్కృత్యాలకు నీవు సమ్మతించావు. ధర్మరాజు తనకేర్పడిన సంకటాన్ని గమనించి సత్యం తప్పక తన ఆజ్ఞచేత భీమార్జునులు బలముడిగి క్రుంగిపోగా కంటి నుండి కారుతున్న కన్నీటిని ఎడమచేతితో తుడుచుకొంటూ ఘోరారణ్యాలకు వెళ్ళాడు. అక్కడ దుఃఖాలలో మునిగి దైన్యం అనుభవిస్తూ ప్రతిజ్ఞను సక్రమంగా నెరవేర్చాడు. అయినా మీతో కలిసి జీవించవలెనని కోరుకుంటున్నాడు.

ధర్మరాజుకు సాటియైన వాడు ధర్మరాజే. ఆయన శాంతస్వభావం, అణకువ, సత్యనిష్ట ఇంతకుమునుపు ఏ రాజులలో కూడా కానరాదు. మంచితనం గల ధృతరాష్ట్ర మహారాజా ! నీ బిడ్డలైన కురుపాండవుల మేలు గోరి నేను ఇన్ని మాటలు చెప్పవలసి వచ్చింది, నీ పుత్రుడైన దుర్యోధనుడి మనసులో ఉన్న పరమదురాశను తొలగించి, పాండవులను నీ చెంతకు పిలిపించుకొనుము. మహారాజా ! పాండవులు ఎంతటి శాంత స్వభావులో అంతటి వీరాగ్రేసరులు. వారు నీ పాదసేవ చేయటానికి సంసిద్ధంగా ఉన్నారు. వారికి మీతో కలిసి మెలిసి ఉండటం ఇష్టంలేకపోతే ఈపాటికి యుద్ధానికి బయలుదేరి వచ్చేవారు. సంధి, సంగ్రామం ఈ రెండింటిలో మీకేది హితమని తోస్తుందో దానిని నిర్ణయించి చెప్పండి.

శ్రీకృష్ణుడి మాటలు వినగానే సభ్యులందరి శరీరాలు గగుర్పాటు వహించాయి. వారు మనస్సులలో ఎంతో సంతోషించి, నారాయణుడెంత చక్కగా మాట్లాడాడు ! శౌరి మాటలకు బదులు చెప్పగల నీతి నిపుణుడు, ధీరుడు, ఉపాయశాలి ఈ కొలువులో ఎవరున్నారు ? అని కదలక మెదలక నోరు విప్పక అట్లాగే ఉండిపోయారు.

TS 10th Class Maths Solutions Telangana | 10th Class Maths Textbook SSC Solutions Telangana

TS SCERT 10th Maths Solutions | TS 10th Class Maths Study Material Guide Pdf Free Download Telangana

TS 10th Class Maths Solutions Telangana Chapter 1 Real Numbers

10th Class Maths Textbook SSC Solutions Telangana Chapter 2 Sets

SSC 10th Class Maths Guide Pdf Telangana Chapter 3 Polynomials

TS SCERT 10th Maths Solutions Chapter 4 Pair of Linear Equations in Two Variables

TS 10th Class Maths Study Material Pdf Telangana Chapter 5 Quadratic Equations

10th Class Maths Textbook Solutions Telangana Chapter 6 Progressions

TS SCERT Class 10 Maths Solutions Chapter 7 Coordinate Geometry

SCERT Maths Textbook Class 10 Solutions Telangana Chapter 8 Similar Triangles

TS 10 Maths Solutions Chapter 9 Tangents and Secants to a Circle

10th Class Maths Question Bank Pdf Telangana State Chapter 10 Mensuration

TS SSC Class 10 Maths Solutions Chapter 11 Trigonometry

TS Maths Solutions Class 10 Chapter 12 Applications of Trigonometry

Telangana SCERT 10th Class Maths Solutions Chapter 13 Probability

Telangana State 10th Class Maths Solutions Chapter 14 Statistics

TS 10th Class Study Material

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

These TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ will help the students to improve their time and approach.

TS 9th Class Telugu 3rd Lesson Important Questions వలసకూలీ

PAPER – I : PART – A

I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)

అ) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
పాలమూరు జిల్లా ప్రజలు అధికంగా వలస కూలీలుగా ఎందుకు జీవిస్తున్నారు ?
జవాబు:
పాలమూరులో కూలీలకు పని దొరికేదికాదు. కనీసం వారికి తిండి ఉండేది కాదు. త్రాగడానికి నీరు కూడా దొరికేది కాదు. ఆ ప్రాంతంలోని భూస్వాములకు వ్యవసాయం చేసేందుకు సాగునీటి సౌకర్యం లేదు. వర్షాలు లేవు. దానితో కూలీలు తిండిలేక, పస్తులు పడుకోవలసి వచ్చేది. వారి పిల్లలకు చదువు సంధ్యలు లేవు. వారికి జబ్బుచేస్తే మందులు వేసికోడానికి కూడా డబ్బులు వారి వద్ద ఉండేవి కావు. అందుకే వారు కూలీ దొరికే ప్రాంతాలకు వలసలు పోయి జీవిస్తున్నారు.

ప్రశ్న 2.
వలస జీవితంలో ఉన్న అవస్థలేవి?
జవాబు:
ఒక ప్రాంతంలోని జనం, ఆ ప్రాంతంలో వారు జీవించడానికి అనువైన పరిస్థితులు లేనపుడు, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వారి జీవనానికి అనువైన మరో ప్రాంతానికి వలసలు పోతారు. అక్కడైనా సరైన సదుపాయాలు ఉంటాయా అంటే ! అనుమానమే. ముఖ్యంగా స్థానికంగా ఉండేవారి వల్ల ఇబ్బందులు.

ఇక తినటానికి, ఉండటానికి తిండి, జాగా దొరకక ‘ నానా ఇబ్బందులు పడాలి. తమ పిల్లల చదువులు గాని, వైద్యపరంగా సదుపాయాలు గాని ఉండవు. రేషన్ కార్డులు, పింఛన్లు వంటివి కూడా ఉండవు. అటు ఉన్న ఊరును కాదనుకొని వచ్చినందుకు ఈ ఊరులోనివారు వీరిని కాదంటారు. మొత్తం మీద వీరి అవస్థ “రెండిటికి చెడ్డ రేవడి పరిస్థితి”.

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 3.
పల్లె జీవనం కష్టతరంగా మారింది. కారణాలు ఏమై ఉంటాయని భావిస్తున్నావు ?
జవాబు:
పల్లెలు వ్యవసాయ క్షేత్రాలు. రైతులే ప్రత్యక్ష దేవుళ్ళు. చెమటోడ్చి తన రక్తాన్నే పెట్టుబడిగా పెట్టి పంట పండించి, లోకానికి అన్నం పెడుతున్న రైతు ‘అన్నదాత’. ఆ అన్నదాతకు నేడు కష్టకాలం వచ్చింది. మన విపరీత ధోరణుల వల్ల ప్రకృతి వికృతిగా మారింది. రైతును కుంగదీస్తోంది. ఒకసారి అతివృష్టి, మరొకసారి అనావృష్టితో ప్రకృతి విలయతాండవం చేసి, రైతును అతలాకుతలం చేస్తుంది. రాబడి లేకపోగా అప్పులు, వడ్డీలు పెరిగి బ్రతుకు భారంగా మారి, చివరకు మరణమే మేలు అని భావిస్తున్నాడు రైతు.

ఇలాగే కొద్ది తేడాలతో అన్ని వృత్తులవారి పరిస్థితి ఇలాగే ఉంది. ఒకప్పుడు ఒకరి కష్టంలో మరొకరు పాలుపంచుకునే స్థితి నుండి ప్రస్తుతం ఎవరికి వారే యమునా తీరే అన్న స్థితికి చేరింది. ప్రభుత్వం నుండి కూడా ఎటువంటి సాయం అందకపోవడం ప్రధాన కారణం. చెట్టుకున్న పళ్ళను గమనిస్తామేగాని.

చెట్టును గమనించనట్లు పల్లెలలోనివారి బ్రతుకులూ ఉన్నాయి. కనుకనే పల్లెజీవనం కష్టతరంగా మారింది. విద్యా, వైద్య సదుపాయాలు, విద్యుత్ సౌకర్యం, యువకులకు సరైన ఉపాధి మొదలైనవి లేకపోవడం మరో కారణం.

ఆ) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
పల్లెవాసులు వలసపోవడానికి కారణాలేమిటో వివరించండి.
జవాబు:
నీటి వసతికి నోచుకోలేక, పంటలు పండక, నిరంతరం కరవు రక్కసి కోరల్లో చిక్కుకున్నవారు, బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళదీయలేక బతుకటానికి పల్లెవాసులు వలస పోవడం జరుగుతుంది.

మానవజన్మ ఉదాత్తమైనది. ఇది లభించడం ఒక వరం. లభించిన జీవితం సార్ధకం చేసుకోవాలన్నది ప్రతి ఒక్కరి తపన, ఆశ. కానీ కాలం కలిసిరాని అభాగ్యజీవులు, తమ జీవితాన్ని నెట్టుకురావడమే ఒక ‘కల’గా భావించవలసి వస్తే అందంగా ఉండాల్సిన ‘కల’ కూడా ‘పీడకల’గా పరిణమిస్తే, బతుకు బండి నడిపేటందుకు తన కలలన్నీ, కల్లలు కాగా పొట్టచేత పట్టుకొని ఒంటరిగా పరాయి దేశం పోయి మనసును పంచుకొనేందుకు మనుషులు లేక, బాధను పంచుకొనేందుకు బంధువులు లేక, సమాజం నుండి దూరమౌతున్న వ్యథార్థ జీవితాలు గడుపుతున్న పల్లెవాసుల బతుకులు దయనీయంగా ఉన్నాయి.

పల్లెవాసులు వలసపోవడానికి కారణాలు : పని ఎక్కువ దొరుకుతుందని, పైసలు ఎక్కువ వస్తాయని ఆశే వలసలకు ప్రధాన కారణం. వానలు లేక పంటలు ఎండిపోయి, పశువులకు మేతలు కరువవటం పల్లెవాసుల వలసలకు మరొక కారణం. సరైన ఉపాధి లేకపోవడం, ప్రభుత్వం నుండి సరైన ఆదరణలేక కూలీలు, యువకులు వలసల బాట పడుతున్నారు. సరైన విద్య, వైద్య సదుపాయాలు పల్లెలలో లేకపోవడం వలసలకు దారితీస్తున్నది.

ప్రశ్న 2.
‘కోస్తబెస్తల పడవలలో కూలివయ్యిన కర్మమెందుకు ?” అని కవి ఎందుకు అనవలసి వచ్చింది ?
జవాబు:
‘కోస్తబెస్తల పడవలలో కూలివయ్యిన కర్మమెందుకు ?’ ఈ వాక్యం డా॥ ముకురాల రామారెడ్డిగారి ‘హృదయశైలి’ అనే గేయ సంకలనంలోనిది. తెలంగాణ రాష్ట్రంలో నీటివసతిలేక పంటలు పండక, ఎప్పుడూ కరవు రాక్షసి కోరల్లో చిక్కుకున్న ప్రాంతం ‘పాలమూరు’. బ్రతుకు భారాన్ని మోస్తూ, కాలాన్ని వెళ్ళదీసే మార్గం లేక, బ్రతుకు తెరువు కోసం వలస పోవడం పాలమూరు (మహబూబ్నగర్) జిల్లాలోని కూలీలకు పరిపాటి.

ఈ విధంగా 1977లో పాలమూరు నుండి తూర్పుతీర ప్రాంతానికి వలస కూలీలుగా వెళ్ళి, తుపానులో చిక్కుకొని తిరిగిరాలేదు. ఆ సందర్భంలో కవి హృదయంలో కలిగిన ఆవేదనలోంచి వచ్చిన మాటల్లో ఇదొకటి.

కోస్తాబెస్తల పడవల్లో కూలీగా పనిచేసే కర్మ నీకు, కృష్ణా ఎగువ ఆనకట్ట కట్టకపోవడం వల్లనే కదా ! అని కవి విచారిస్తున్నాడు. కృష్ణానదిపై ఎగువ ఆనకట్ట కడితే, ఆ నీళ్ళు మహబూబ్ నగర్ జిల్లా పొలాలకు అందుతాయి.

ఆ నీళ్ళు లభ్యమైతే, అక్కడి ప్రజలు వర్షాధారంగా జీవించాల్సిన పనిలేదు. కృష్ణా జలాలతో తమ పంటలు పండించుకోవచ్చు.. ప్రస్తుతం ఆ ఆనకట్ట కట్టకపోవడం, వర్షాలు లేకపోవడం వల్ల పాలమూరు జనులకు ఈ పరిస్థితి వచ్చిందని కవి ఆవేదన చెందారు.

PAPER – 1 : PART – B

భాషాంశాలు – పదజాలం :

I. సొంతవాక్యాలు :

అ) కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

1. మస్తుగ : ఒకటి కొంటే ఒకటి ఉచితం అని అమ్ముతున్న దుకాణం ముందు జనం మస్తుగ జమైనారు.
2. గడువు : మీరు గడువు దాటిన మందులు కొనకండి.
3. పైరు : వెన్ను వేసి, నిలిచిన మొక్కజొన్న పైరు కన్నుల పండుగగా ఉంది.
4. వలస : కరవు తాండవించడంలో వ్యవసాయదారులు కూలీలుగా నగరాలకు వలస వెళ్ళిపోతున్నారు.

II. అర్థాలు :

ఆ) కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.

ప్రశ్న 1.
వరుగులు – అంటే అర్థం
A) ఎండిన కాయ గింజలు
B) బక్కచిక్కిన
C) ఒరిగిన
D) తరిగిన
జవాబు:
A) ఎండిన కాయ గింజలు

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 2.
“జలపిడుగు” అనే పదం కవి ఈ అర్థంలో వాడాడు.
A) ఒకరకం చేప
B) వరద
C) ఉరుము
D) నిప్పు
జవాబు:
B) వరద

ప్రశ్న 3.
తిరగడం మరిగితే చదవడం తగ్గుతుంది – గీత గీసిన పదానికి అర్థం
A) కోపం
B) అలవాటుపడు
C) చల్లార్చు
D) మొదలుపెట్టు
జవాబు:
B) అలవాటుపడు

ప్రశ్న 4.
“క్రమ్ముకొను” అనే అర్థం గల పదం
A) కొమ్ములు మొలుచు
B) చుట్టుప్రక్కల అంటే సరియైన అర్థం
C) ముసురుకొను
D) మొక్క మొలుచు
జవాబు:
C) ముసురుకొను

ప్రశ్న 5.
జాలరి – అంటే సరియైన అర్ధం
A) పొడగరి
B) కూలి
C) చేపలు పట్టువాడు
D) కోస్తావాడు
జవాబు:
C) చేపలు పట్టువాడు

ప్రశ్న 6.
ముద్దతు – అంటే అర్థం
A) గడువు సమయం
B) మద్దతు
C) ముదిరిన
D) సౌకర్యం
జవాబు:
A) గడువు సమయం

ప్రశ్న 7.
నిరంతరం కరవు రక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రాంతం పాలమూరు – గీత గీసిన పదానికి అర్థం
A) ఆకలి
B) మనిషి
C) రాక్షసి
D) బాధ
జవాబు:
C) రాక్షసి

ప్రశ్న 8.
సమాజం నుండి దూరమౌతున్న వ్యథార్త జీవితాలు ఎన్నో – గీత గీసిన పదానికి అర్థం
A) నిజం
B) బాధ
C) లేమి
D) కలిమి
జవాబు:
B) బాధ

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 9.
జాలరిని గూర్చి భార్యాపిల్లలు యాది జేసుకోవడం ఎంత ఆర్ధ్ర్రంగా ఉంటుందో – గీత గీసిన పదానికి అర్థం
A) తడిసినది
B) తడిపి
C) గుర్తు
D) సంతోషం
జవాబు:
B) తడిపి

III. పర్యాయపదాలు:

ప్రశ్న 1.
బర్లు, గొడ్లు, పసులు – అనే పర్యాయపదాలు గల పదం
A) సొమ్ములు
B) గేదెలు
C) గోర్లు
D) పాడి
జవాబు:
B) గేదెలు

ప్రశ్న 2.
“పల్లె” అనే పదానికి పర్యాయపదాలు
A) పల్లె, ఇల్లు
B) జనపదం, గ్రామం
C) ఊరు, పేట
D) పేట, నగరం
జవాబు:
B) జనపదం, గ్రామం

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 3.
కొలనులోని చేపలు ఎగిరెగిరి పడుతున్నాయి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) మెరిగెలు, చందమామలు
B) మీనములు, మత్స్యములు
C) కొర్రలు, జలపుష్పాలు
D) బాడిస, రొయ్యలు
జవాబు:
B) మీనములు, మత్స్యములు

ప్రశ్న 4.
మబ్బు – అనే పదానికి పర్యాయపదాలు కానిది.
A) మేఘము, మొయిలు
B) జీమూతం, చీకటి
C) అంబుదము, జలదము
D) వారిదము, జీమూతం
జవాబు:
B) జీమూతం, చీకటి

ప్రశ్న 5.
కూలి మస్తుగ దొరుకుతాదని, కోస్త దేశం పోతివా ?
A) వేతనం, పెత్తనం
B) మూల్యం, అమూల్యం
C) భరణం, భారం
D) భృతి, భృత్యం
జవాబు:
D) భృతి, భృత్యం

IV. ప్రకృతి, వికృతులు:

గీత గీసిన పదానికి పర్యాయపదాలు

ప్రశ్న 1.
దేశనాయకులు దేశసేవ చేయాలని “ఆశ” – గీత గీసిన పదానికి వికృతి
A) దిక్కు
B) ఆస
C) ఆశలు
D) అసు
జవాబు:
B) ఆస

ప్రశ్న 2.
పూర్ణిమ, పౌర్ణమి – అనే పదాలకు సరియైన వికృతి
A) పూర్ణము
B) పురాణము
C) పున్నమి
D) పూస
జవాబు:
C) పున్నమి

ప్రశ్న 3.
“సింగం” వికృతిగా గల పదం
A) సింహం
B) సింగిడి
C) సిగ
D) సికరం
జవాబు:
A) సింహం

ప్రశ్న 4.
కవి హృదయంలో ఆవేదన – గీత గీసిన పదానికి వికృతి
A) ఎద
B) గుండె
C) మనసు
D) చిత్తం
జవాబు:
A) ఎద

V. నానార్థాలు

ప్రశ్న 1.
ముకురాల ప్రజల కోసం కలం పట్టిన కవి – గీత గీసిన పదానికి
A) కావ్యకర్త, పండితుడు
B) నీటికాకి, కవిలె
C) శుక్రుడు, కుజుడు
D) గణపతి, పవి
జవాబు:
A) కావ్యకర్త, పండితుడు

ప్రశ్న 2.
వైపు, దిశ, ఆధారము – అనే నానార్థాలు గల పదం
A) నిశి
B) దిక్కు
C) తాళము
D) మూల
జవాబు:
B) దిక్కు

ప్రశ్న 3.
“కాలము” అను పదమునకు నానార్థాలు
A) సమయము, వానాకాలము
B) సమయము, నలుపు
C) నలుపు, ఋతువు
D) పత్రికలో భాగం, వెల
జవాబు:
B) సమయము, నలుపు

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 4.
చాలు వానే పడదు సరళా సాగరం నిండేది కాదని – గీత గీసిన పదానికి నానార్థాలు
A) మదం, మందం
B) సంద్రం, సంఖ్య
C) మృగం, మెకం
D) నేతిసిద్దె, గిన్నె
జవాబు:
B) సంద్రం, సంఖ్య

VI. వ్యుత్పత్యర్థములు

ప్రశ్న1.
జాలరి – అనే పదానికి వ్యుత్పత్తి అర్థం
A) చేపలు పట్టువాడు
B) జాలము (వల) కలిగినవాడు
C) చాలాకాలము నీటిలో ఉండువాడు.
D) జాలమునకు శత్రువు
జవాబు:
B) జాలము (వల) కలిగినవాడు

ప్రశ్న2.
కృత్తికా నక్షత్రం పౌర్ణిమనాడు గల మాసం – దీనికి వ్యుత్పత్తి పదం
A) మార్గశిరం
B) కార్తీకం
C) మాఘం
D) చైత్రం
జవాబు:
B) కార్తీకం

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

ప్రశ్న3.
అక్షమునకు అభిముఖమైనది – దీనికి వ్యుత్పత్తి పదం
A) పరోక్షం
B) అక్షయ
C) ప్రత్యక్షం
D) అక్షాంశం.
జవాబు:
C) ప్రత్యక్షం

PAPER – II : PART – A

అపరిచిత పద్యాలు

1. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

కోపమునను ఘనత కొంచమై పోవును
కోపమునను గుణము కొరత వడును
కోపమునను బ్రతుకు కొంచమై పోవును
విశ్వదాభిరామ ! వినుర వేమ !

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
దేనివలన గొప్పదనము తగ్గిపోతుంది ?
జవాబు:
కోపము వలన గొప్పదనము తగ్గుతుంది.

ప్రశ్న 2.
గుణము ఏలా కొరతపడుతుంది ?
జవాబు:
కోపము వలన గుణము కొరతపడుతుంది.

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 3.
కోపము వలన బ్రతుకు ఏమౌతుంది ?
జవాబు:
కోపము వలన బ్రతుకు కొంచమై పోతుంది.

ప్రశ్న 4.
పై పద్యానికి సరైన శీర్షిక పెట్టండి.
జవాబు:
కోపము

ప్రశ్న 5.
పై పద్యానికి ఒక ప్రశ్న తయారు చేయండి.’
జవాబు:
పై పద్యం ఏ శతకంలోనిది ?

2. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

పరగ రాతి గుండు పగులఁ గొట్టఁగవచ్చు
కొండలన్ని పిండి కొట్టవచ్చు
కఠినచిత్తు మనసు కరిగింపఁగా రాదు
విశ్వదాభిరామ ! వినుర వేమ !

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
వేటిని పగుల గొట్టవచ్చును ?
జవాబు:
రాతి గుండులను పగుల గొట్టవచ్చును.

ప్రశ్న 2.
వేటిని పిండి కొట్టవచ్చును ?
జవాబు:
కొండలను పిండి కొట్టవచ్చును.

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 3.
ఎవరి మనస్సుని కరిగించలేము ?
జవాబు:
కఠిన చిత్తుని మనస్సుని కరిగించటము కష్టము.

ప్రశ్న 4.
పై పద్యము ఏ శతకములోనిది ?
జవాబు:
పై పద్యము వేమన శతకము లోనిది.

ప్రశ్న 5.
పై పద్యాన్ని ఎవరు రచించారు ?
జవాబు:
పై పద్యాన్ని వేమన రచించారు.

3. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమునఁ దా
నెక్కిన బాఱని గుఱ్ఱము
గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ !

ప్రశ్నలు

ప్రశ్న 1.
ఎటువంటి చుట్టమును విడిచిపెట్టాలి ?
జవాబు:
సమయమునకు సహాయము చేయని చుట్టమును విడిచిపెట్టేయాలి.

ప్రశ్న 2.
ఎటువంటి దైవమును విడిచిపెట్టాలి ?
జవాబు:
నమస్కరించిననూ వరమీయని దేవుణ్ణి విడిచి పెట్టవలెను.

ప్రశ్న 3.
యుద్ధములో ఎవరిని విడిచిపెట్టాలి ?
జవాబు:
యుద్ధములో తానెక్కగా పరిగెత్తని గుఱ్ఱమును వెంటనే విడిచిపెట్టాలి.

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 4.
పై పద్యములోని నీతి ఏమిటి ?
జవాబు:
అవసరానికి ఉపయోగపడని వాటిని వెంటనే విడిచిపెట్టాలి.

ప్రశ్న 5.
పై పద్యం ఏ శతకంలోనిది ?
జవాబు:
పై పద్యం సుమతీ శతకంలోనిది.

4. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

అన్ని దానములను నన్నదానమె గొప్ప
కన్నతల్లి కంటె ఘనము లేదు
ఎన్న గురుని కన్న నెక్కుడు లేదయా
విశ్వదాభిరామ! వినుర వేమ !

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
దానములన్నింటి కన్నా ఏ దానము గొప్పది ?
జవాబు:
దానములన్నింటి కన్నా అన్నదానమే గొప్పది.

ప్రశ్న 2.
ఎవరి కంటే మించినది లేదు ?
జవాబు:
కన్నతల్లి కంటే మించినది లేదు.

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 3.
ఎవరికన్న మించిన వ్యక్తి లేడు ?
జవాబు:
గురువు కంటే మించిన వ్యక్తి లేడు.

ప్రశ్న 4.
ఈ పద్యము ఏ శతకములోనిది ?
జవాబు:
ఈ పద్యము వేమన శతకములోనిది.

ప్రశ్న 5.
పై పద్యంలో ఏ దానం గురించి చెప్పారు ?
జవాబు:
పై పద్యంలో అన్నదానము గురించి చెప్పారు.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
సంభాషణ

బతుకు భారాన్ని నడిపేందుకు కూలీలు వలసలకు వెళుతున్నారు. దీనికి గల కారణాలను తెలుపుతూ ‘సంభాషణను’ రాయండి.
జవాబు:
సోములు : ఓరేయ్ చంద్రయ్యా ! రాములుగాడు, ఆడిపెళ్ళాం పిల్లలు రెండు రోజులు నుండి కనిపించడం లేదు ఏడకు ఎల్లిండ్రు ?

చంద్రయ్య : నీకు ఏంది మావా, తినటానికి తిండిలేక, పస్తులుండలేక టౌనుకు పోయినడు గందా.

సోములు : ఒర్రేయ్ అల్లుడూ ! ఎంత కస్టమొచ్చినాది. నిజంగా నాకు తెల్దు. ఔను గానీ, ఇక్కడే ఏదో పని చేసుకోవాలి గాని ఊరు ఒదిలి యెత్తే కొత్త ఊళ్ళో ఎవరు పని ఇత్తాడ్రా ?

చంద్ర : నిజమే మామ. కాని ఊళ్ళో ఏం పనుందే. వానలు లేక పొలం పన్లు లేవు. పసులకే గడ్డి లేదు. వాడికి పనిచ్చేదెవరు.

సోములు : అవున్రా. వానల్లేక అందరికి ఇబ్బందిగానే కాలం గడస్తొంది. మరి ఓబులేసు, సుబ్బారావు వాళ్ళంతా ఏం చేస్తుండ్రు.

చంద్ర : వాళ్ళా, ఓ పూట గంజినీళ్ళు, ఓ పూట పస్తులు.

సోములు : ఉన్న చెరువును పూడ్చి మిద్దెలు కట్టాలని ఆ కాంట్రాక్టరు సెప్పినాడని ఊ గొట్టినామ్. ఆ పని మన నోళ్ళలో మట్టి కొట్టినాది.

చంద్ర : అవును మామ. డబ్బులు సూసేసరికి రాబోయే కష్టకాలం యాదికి రానేదు. ఇప్పుడదే నోటి కూడు తీసినాది.

సోములు : ప్రభుత్వమైనా సాయం సేయదా ?

చంద్ర : ఎందుకు సేయదు. కాని వెంబడినే జరక్కపోవచ్చు.

సోములు : అక్కడ వాడు ఎలా బతుకుతుండో ఎంటో, బాధగా ఉందిరా.

చంద్ర : మనం చేసుకున్న పనులే మనకు కాని కాలాన్ని తెచ్చాయి మావ, చెట్లు నరుకున్నాం. చెరువు పాడు చేసుకున్నాం.

సోములు : మన పెద్దలు మనకిచ్చింది. మళ్ళీ మనం మన బిడ్డలకు ఈనేక పోతున్నాం. ఏది ఏమైన ఉన్న ఊరుని కాదని పొరుగూరు వెళ్తే ఎట్టా ఉంటదో తెలిసి కూడా ఎట్టా వెళ్ళాలిరా ?

చంద్ర : తప్పదు సోములు మావ. తిండిలేదు, వైద్దిగం కూడా నేదు. పిల్లల సదువులకు పట్నం పోవల్సిందే. ఇక్కడే ఉంటే జరుగుబాటు కావద్దా ?

సోములు : నిజమే లేరా. కలికాలం అంటేనే కాని కాలం. సీకటి పడినాది పోదాం పదా.

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 2.
గేయం

“ఆకలి మంటలు ఆరని మంటలు. బడుగుల బతుకులు, అతుకుల బొంతలు, నలిగిన బతుకులు. తీరని వెతలు – పట్టెడు మెతుకులే పరమాన్నాలు” ఇటువంటి ప్రాస పదాలను వాడుతూ వలస జీవుల బ్రతుకులపై గేయాన్ని రాయండి.
జవాబు:

వలస జీవుల బతుకులు

పొట్ట చేత బట్టి, పెళ్ళాం బిడ్డలను విడిచిపెట్టి
నోరు కట్టి, వలసకు వెళ్ళావా ? వనాల కెళ్ళావా ?
గంపెడు ఆశతో గుండెలవిశేలా కష్టం చేసి
కూలీ కోసం రక్తాన్ని చెమటగా మార్చేసి
గుండెను బండగ చేసావా ఎందయ్యా ?

చాలీ చాలక ఆకలి తీరక
గుండె మంటలు ఆర్పలేక పోతున్నావా ?
ఇంటి ఆడది మాది కొస్తోందా ?
పిల్లల కోసం మనసు లాగేస్తోందా ?
గుండెను బండను చేసాయా ఏందయ్యా ?

నిన్ను నిన్నుగానే చూడాలనుకొనే కళ్ళు
వేయికళ్ళతో వెదుకుతున్న ఆనవాళ్ళు
నీకు తెలియవచ్చే నాటికి గడిచేను ఎన్నో యేళ్ళు
నీ వాళ్ళు గుర్తు రావటం లేదా ఇన్నాళ్ళు
గుండెలవిసేలా రోదిస్తున్నావా ఏందయ్యా ?

ప్రశ్న 3.
వ్యాసం
వలస కూలీల కష్టసుఖాలను వ్యాసరూపంలో రాయండి.
జవాబు:
పూర్వం గ్రామాల్లో భూస్వాములు ఉండేవారు. పెద్ద వ్యవసాయం ఉండేది. దానితో గ్రామాల్లో కూలీలందరికి పని దొరికేది. ఇప్పుడు ఆ భూస్వాములు లేరు. ఉపాధి లేదు. పైగా యంత్రాలు అమల్లోకి వచ్చాయి. దానితో కూలీల అవసరం తగ్గింది. గ్రామాల్లో కూలీల పిల్లలకు విద్యా, వైద్య ఉపాధి సౌకర్యాలు అంతగా లేవు.

గ్రామాల్లో ఉన్న యువకులు తమ జీవనభృతిని సంపాదించుకోగల స్థితులు గ్రామాల్లో నేడు లేవు. ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమితో వారికి కావలసిన సదుపాయాలు లభించడం లేదు. వ్యవసాయదారులకు ప్రభుత్వ సహాయం ఉండడం లేదు.

గ్రామాల్లో 24 గంటలూ విద్యుచ్ఛక్తి సౌకర్యం ఉండడంలేదు. రవాణా సౌకర్యాలు లేవు. త్రాగునీరు, సాగునీరు సదుపాయాలు లేవు.

తినడానికి తిండి, తాగటానికి నీరు, బతకటానికి కావల్సిన విద్యా, వైద్య సదుపాయాలు లేనప్పుడు ప్రజలు అక్కడే ఎందుకు ఉంటారు ? అందుకే వలసల బాట పట్టారు. జీవనాధారం లేకపోతే గంపెడు సంసారం మోయటం ఎవరికైనా కష్టమే. తోటివారే కాదు, నారు పోసినవాడు (దేవుడు) కూడా కన్నెర్ర చేస్తే పొట్ట చేతపట్టినవాడి పని ఏమిటి ? అందుకే వలస పోతున్నారు.

గ్రామాల్లోని వృత్తిపనివారలకు నగరాల్లో చక్కని జీవనభృతి లభిస్తోంది. భవన నిర్మాణ కార్మికులకు నగరాల్లో 365 రోజులూ పని దొరుకుతోంది. అందుకే గ్రామాల నుండి ప్రజలు నగరాలకు వలస వెళుతున్నారు.

ఈ వలస కూలీలకు వలస ప్రాంతంలో కూడా చెల్లేట్లుగా వారికి రేషన్ కార్డులు, పింఛన్లు వంటి సదుపాయాలు కల్పించాలి. వారి పిల్లలకు, వారికి విద్యా, వైద్య సదుపాయాలు కల్పించాలి. వారికై ఇళ్ళు నిర్మించాలి. వారి కష్టనష్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వసతులు ఏర్పాటు చేయాలి.

పనికి ఆహార పథకం ద్వారా వారికి పనులు చూపాలి. ప్రభుత్వం అందించేవి వీరికి అందుతున్నాయా, లేదా పర్యవేక్షించాలి. అప్పుడే వీరు సుఖంగా జీవించడానికి వీలవును.

PAPER – II : PART – B

భాషాంశాలు – వ్యాకరణం

కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.

1. సంధులు:

ప్రశ్న 1.
“ఉత్వ సంధి”కి ఉదాహరణ కానిది.
A) ఎట్లు + అని
B) కాలము + అంటూ
C) వరుగులు + అయ్యే
D) సముద్రము + నీరు
జవాబు:
D) సముద్రము + నీరు

ప్రశ్న 2.
“ఎప్పుడు + ఒస్తవు” – ఉత్వ సంధి చేయగా.
A) ఎప్పుడొస్తవు
B) ఎప్పుడునొస్తవు
C) ఎప్పడువచ్చెదవు
D) ఎప్పుడొచ్చినావు
జవాబు:
A) ఎప్పుడొస్తవు

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 3.
గోకులాష్టమినే కృష్ణాష్టమి అంటారు – గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి.
A) గో + కులాష్టమి
B) గోకులా + ష్టమి
C) గోకుల + అష్టమి
D) గోకులము యొక్క అష్టమి
జవాబు:
C) గోకుల + అష్టమి

ప్రశ్న 4.
“ఎక్కడ + ఉంటివి → ఎక్కడుంటివి” – సంధి జరిగిన తీరు
A) ఉత్వ సంధి
B) ఆమ్రేడిత సంధి
C) అత్వ సంధి
D) యడాగమ సంధి
జవాబు:
C) అత్వ సంధి

II. సమాసములు :

ప్రశ్న 1.
“భద్రాచలం” – అను పదం యొక్క సమాసం నామం
A) విశేషణ పూర్వపద కర్మధారయము
B) సంభావనా పూర్వపద కర్మధారయము
C) ఉపమాన పూర్వపద కర్మధారయము
D) విశేషణ ఉత్తరపద కర్మధారయము
జవాబు:
A) విశేషణ పూర్వపద కర్మధారయము

ప్రశ్న 2.
“సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము”నకు ఉదాహరణ కానిది.
A) కోయిల సాగరము
B) సరళా సాగరము
C) కోస్త దేశం
D) ఎగువ కృష్ణా
జవాబు:
D) ఎగువ కృష్ణా

ప్రశ్న 3.
ఈ కింది వానిలో “రూపక సమాసము” కానిది.
A) విద్యా అనెడు ధనము
B) కృప అనెడు రసము
C) దయ అనెడు ఆభరణం
D) భద్రాచలం అనే పట్టణం
జవాబు:
D) భద్రాచలం అనే పట్టణం

ప్రశ్న 4.
జీవితంలో వెలుగుల కోసం జ్ఞానజ్యోతిని వెలిగించాలి – గీత గీసిన పదానికి సరియైన విగ్రహవాక్యం
A) జ్ఞానము కొరకు జ్యోతి
B) జ్ఞానము అనెడి జ్యోతి
C) జ్ఞానము తోడి జ్యోతి
D) జ్ఞానమును, జ్యోతియును
జవాబు:
B) జ్ఞానము అనెడి జ్యోతి

ప్రశ్న 5.
“గొడ్లడొక్కలు” – సమాసము పేరు
A) రూపక సమాసము
B) షష్ఠీ తత్పురుష సమాసము
C) తృతీయా తత్పురుష సమాసము
D) ద్వంద్వ సమాసము
జవాబు:
B) షష్ఠీ తత్పురుష సమాసము

III. ఛందస్సు:

ప్రశ్న 1.
పద్యపాదములో రెండవ అక్షరమును ఇలా అంటారు.
A) యతి.
B) ప్రాస యతి
C) ప్రాస
D) గణము
జవాబు:
C) ప్రాస

ప్రశ్న 2.
య గణం – గురులఘువులలో
A) UUI
B) UII
C) IUU
D) IIU
జవాబు:
C) IUU

ప్రశ్న 3.
“ఉత్పలమాల” పద్యానికి యతి
A) 10
B) 11
C) 13
D) 14
జవాబు:
A) 10

IV. అలంకారములు:

ప్రశ్న 1.
……….. రాకనే పోతివా,
……. మరిచే పోతివా;
పై వాక్యాలలో ఉన్న అలంకారము
A) అంత్యానుప్రాస
B) ఛేకానుప్రాస
C) వృత్త్యనుప్రాస
D) లాటానుప్రాస
జవాబు:
A) అంత్యానుప్రాస

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 2.
ఒక వస్తువునకు మరొక వస్తువునకు పోలిక ఉపమాలంకారంలో ఒకటిగా ఉండేది
A) సమాన ధర్మం
B) ఉపమానము
C) ఉపమేయము
D) క్రియ
జవాబు:
A) సమాన ధర్మం

V. వాక్యాలు:

ప్రశ్న 1.
“రామయ్య ఊరికి వెళ్ళి పొలం పనులు చూసుకున్నాడు.” – సామాన్య వాక్యాలుగా మారిస్తే
A) రామయ్య ఊరికి, పొలానికి వెళ్ళాడు.
B) రామయ్య ఊరికి వెళ్ళాడు, రామయ్య పొలం పనులు చూసుకున్నాడు.
C) రామయ్య పొలం పనులు చూడటానికి ఊరు వెళ్ళాడు.
D) ఊరికి వెళ్ళి పొలం పనులు చూసుకున్నాడు.
జవాబు:
B) రామయ్య ఊరికి వెళ్ళాడు, రామయ్య పొలం పనులు చూసుకున్నాడు.

ప్రశ్న 2.
“తెలంగాణ కోసం ఎందరో ఉద్యమాలు చేశారు. తెలంగాణ సాధించారు.” – సంక్లిష్ట వాక్యం గుర్తించండి.
A) తెలంగాణ కోసం ఎందరో ఉద్యమాలు చేశారు మరియు సాధించారు.
B) తెలంగాణ సాధించారు కాని ఎన్నో ఉద్యమాలు చేశారు.
C) తెలంగాణ కోసం ఎందరో ఉద్యమాలు చేసి, సాధించారు.
D) తెలంగాణ సాధించే వరకు ఎందరో ఉద్యమాలు చేశారు.
జవాబు:
C) తెలంగాణ కోసం ఎందరో ఉద్యమాలు చేసి, సాధించారు.

ప్రశ్న 3.
“వర్షాలు బాగా పడ్డాయి. పంటలు పండలేదు.” – సరియైన సంయుక్త వాక్యాన్ని గుర్తించండి.
A) వర్షాలు బాగా పడే పంటలు పండలేదు.
B) వర్షాలు బాగా పడ్డాయి కాని పంటలు పండలేదు.
C) పంటలు పండలేదు కాబట్టి వర్షాలు బాగా పడ్డాయి.
D) వర్షాలు బాగా పడలేదు కాబట్టి పంటలు పండలేదు.
జవాబు:
B) వర్షాలు బాగా పడ్డాయి కాని పంటలు పండలేదు.

ప్రశ్న 4.
“అమ్మ వంట చేసి, దేవుని పూజ చేసింది.” – ఈ వాక్యాన్ని సామాన్య వాక్యాలలోకి మార్చండి.
A) అమ్మ వంట చేయాలి. అమ్మ దేవుని పూజ చేయాలి.
B) అమ్మ వంట చేసింది. అమ్మ దేవుని పూజ చేసింది.
C) అమ్మ వంట చేస్తూ అమ్మ దేవుని పూజ చేసింది.
D) అమ్మ వంట చేస్తే దేవుని పూజ చేస్తుంది.
జవాబు:
B) అమ్మ వంట చేసింది. అమ్మ దేవుని పూజ చేసింది.

TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల

These TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల will help the students to improve their time and approach.

TS 9th Class Telugu 2nd Lesson Important Questions నేనెరిగిన బూర్గుల

PAPER – I : PART – A

1. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)

అ) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
బూర్గుల వాదనాపటిమ గలవాడని పి.వి. ఎందుకన్నాడు ?
జవాబు:
పి.వి.నరసింహారావుగారు, బూర్గులవారి వద్ద జూనియర్ న్యాయవాదిగా ఉండేవారు. బూర్గులవారు తమ విశిష్ట వ్యక్తిత్వంతో, పి.వి.గారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. బూర్గులవారి వాదనా పటిమను పి.వి. ప్రత్యక్షంగా చూసారు.

బూర్గులవారి వాదనాపటిమ : బూర్గులవారు న్యాయవాదిగా కేసు చేపట్టేటప్పుడే, విషయం శ్రద్ధగా విని, ఆ ఫైలుపైనే అస్పష్టంగా, రేఖామాత్రంగా నోట్సు రాసుకునేవారు. కోర్టులో ఆ నోట్సు ఆధారంగా, తమ విశేష ప్రతిభతో, ఎదుటి న్యాయవాదులను ఎదుర్కొని నిలిచేవారు. న్యాయవాద వృత్తిలో గొప్ప మేధాసంపత్తిని ఆయన ప్రదర్శించి, కోర్టులో కేసులో గెలిచేవారు. అందుకే బూర్గుల వాదనాపటిమ గలవారని పి.వి. పేర్కొన్నారు.

ప్రశ్న 2.
దున్నేవారికే భూమి అంటే మీకేమర్థమయింది ?
జవాబు:
సామాన్యంగా భూస్వాములు తమ పొలాలను రైతులకు సేద్యానికి ఇచ్చి, వారి నుండి సంవత్సరానికి కొంత శిస్తు తీసుకుంటారు. రైతులు, ఆ చేలలో పంట పండినా, పండకపోయినా నిర్ణయించుకున్న శిస్తును కామందులకు చెల్లించాలి. అదీగాక భూకామందులు తమ ఇష్ట ప్రకారం, తమ పొలాన్ని రైతుల నుండి ఎప్పుడైనా తిరిగి తీసుకుంటారు. దీనివల్ల రైతులు నష్టపోతారనే భావనతో రైతులకు కొన్ని రక్షణలు కల్పించడానికి దున్నేవారికే భూమి అనే కౌలుదారి చట్టాన్ని రూపొందించారని గ్రహించాను.

TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 3.
బూర్గుల సౌజన్యానికి మారుపేరు అని ఎలా చెప్పగలరు ?
జవాబు:
బూర్గుల రామకృష్ణారావుగారు మతాతీత వ్యక్తి. ఆయన సుగుణాలు మూర్తీభవించిన వ్యక్తి. ఈయన సౌజన్యానికి మారుపేరు. నిజాంకు బూర్గులవారు వ్యతిరేకులయినా, రాష్ట్రంలోని ముసల్మానులు అందరికీ ఈయన స్నేహితులుగా, ఆప్తులుగా ఉండేవారు. బూర్గులవారు నిరాడంబరంగా, మతానికి అతీతంగా ఉండేవారు.

ఆయన డ్రాయింగ్ రూమ్ సంస్కృతీ ప్రదర్శనశాలలా ఉండేది. అక్కడ కుచ్చుటోపీల మౌల్వీలు, గడ్డాల ముల్లాలు, తలపాగాల పండితులు, మహామహోపాధ్యాయులు, గాంధీ టోపీలవారు, ఖద్దరు ధారులు, టెరిలీన్ యువకులూ ఇలా అన్నిరకాల వారూ బూర్గులవారితో స్నేహపూర్వకంగా ఉండేవారు. కనుకనే ఆయన సౌజన్యానికి మారుపేరు అని చెప్పవచ్చు.

ప్రశ్న 4.
“బూర్గులవారు మతాతీతవ్యక్తులు” – అని ఎలా చెప్పగలరు ?
జవాబు:
బూర్గుల రామకృష్ణారావుగారు, మతాతీతవ్యక్తి. ఆయన సుగుణాలు మూర్తీభవించిన వ్యక్తి. ఈయన సౌజన్యానికి మారుపేరు. ఆనాటి నిజాం నవాబు మతదురభిమానాన్ని పెంపొందిస్తూ రాజ్యం ఏలేవాడు. రామకృష్ణారావుగారు నిజాంకు బద్ధ వ్యతిరేకి.

నిజాంకు బూర్గులవారు వ్యతిరేకులయినా, రాష్ట్రంలోని ముసల్మానులు అందరికీ ఈయన స్నేహితులుగా, ఆప్తులుగా ఉండేవారు. బూర్గులవారు నిరాడంబరంగా, మతానికి అతీతంగా ఉండేవారు. బూర్గులవారి డ్రాయింగ్ రూమ్, సంస్కృతీ ప్రదర్శనశాలలా ఉండేది. అక్కడ కుచ్చుటోపీల, మౌల్వీలు, గడ్డాల ముల్లాలు, తలపాగాల పండితులు, మహామహోపాధ్యాయులు, గాంధీ టోపీలవారు, ఖద్దరు ధారులు, టెరిలిన్ యువకులూ, ఇలా అన్ని రకాలవారూ బూర్గులవారిని పిలవడానికి అక్కడకు వచ్చేవారు.

పై విధంగా బూర్గులవారు, విశిష్ట వ్యక్తిత్వంతో, మతాతీత వ్యక్తిగా ఉండేవారు.

ప్రశ్న 5.
బూర్గులవారిని గురించి చరిత్రకారులు ఏయే విషయాలు పొందుపరచి ఉంటారని చెప్పారు.
జవాబు:
చరిత్రకారులు, బూర్గులవారిని గురించి ఈ కింది విషయాలు రాసి ఉండేవారు.

  1. బూర్గుల రామకృష్ణారావుగారు పుట్టిన గ్రామం గురించి రాసేవారు. పూనాలో ఆయన ఫెర్గూసన్ కాలేజీలో పర్షియన్ ‘భాష చదివి, పట్టభద్రులయ్యారని, పర్షియన్ ట్యూటర్గా కొంతకాలం పనిచేశారని రాసి ఉండేవారు.
  2. న్యాయవాద పట్టా తీసుకొని న్యాయవాదిగా పనిచేశారని రాసి ఉండేవారు.
  3. ప్రజా ఉద్యమాల్లో పాల్గొని, జైలుకు వెళ్ళారని రాసి ఉండేవారు. హైదరాబాదు స్టేటు కాంగ్రెస్లో బూర్గులవారు ప్రముఖ నాయకులని, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, రెండు రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశారని రాసి ఉండేవారు.

ప్రశ్న 6.
పాఠ్యాంశ రచయిత పి.వి. నరసింహారావుగారి గొప్పతనం గురించి తెలపండి.
జవాబు:
పి.వి. నరసింహారావుగారు భారత ప్రధానిగా, బహుభాషావేత్తగా, భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరు పొందారు. స్వామి రామానందతీర్ధకు పి.వి. గారు శిష్యులు. బూర్గుల వారు, పి.వి. గార్కి గురుతుల్యులు. విద్యార్థిగా హైద్రాబాదు విముక్తి పోరాటంలో వీరు పాల్గొన్నారు. కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలలో మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దేశ ప్రధానిగా సేవ చేశారు. ఈయన గొప్ప రాజనీతిజ్ఞుడు.

17 భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారు. ఈయన ఆత్మకథ “ఇన్ సైడర్” అనేక భాషల్లోకి అనువాదం అయ్యింది. పి.వి. గారు, నిరాడంబర జీవితం, నిజాయితీ, దేశభక్తి కలిగి, స్థిత ప్రజ్ఞుడిగా వెలుగొందారు. విశ్వనాథ వారి ‘వేయి పడగలు’ నవలను ‘సహస్రఫణ్’ అనే పేరుతో వీరు హిందీలో రాశారు.

TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 7.
రామకృష్ణారావుగారి విశిష్ట వ్యక్తిత్వం గురించి పి.వి. గారు ఏమని తెలిపారు ?
జవాబు:
పి.వి. నరసింహారావుగారు, బూర్గులవారి వద్ద జూనియర్ న్యాయవాదిగా ఉండేవారు. పి.వి. గారు బూర్గులవారి ఆఫీసుకు వెళ్ళి, జూనియర్లకు అర్థంకాని చిక్కు కేసులను చదివేవారు. దానితో బూర్గులవారి సీనియర్ గుమస్తా, పి.వి. గారిపై కోపపడేవాడు. కాని బూర్గులవారు పి.వి. గార్ని సమర్థించేవారు.

అంతేకాక పి.వి. గారితో కేసులను గురించి స్వయంగా తాను చర్చించేవారు. దానితో పి.వి.లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ ఆత్మవిశ్వాసం, తరువాత కాలంలో పి.వి. గార్కి శ్రీరామరక్ష అయ్యింది. ఈ విధంగా బూర్గులవారు తమ విశిష్ట వ్యక్తిత్వంతో, పి.వి. గారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి,
ఆయనకు మేలు చేశారు.

ఆ) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘బాహ్య సౌందర్యం కన్నా అంతర సౌందర్యం అతిముఖ్యం’ ఈ వాక్యం బూర్గుల వారి జీవితానికి ఎలా సరిపోతుంది – వివరించండి.
జవాబు:
ప్రతి మానవునిలోనూ సాధారణంగా ఉన్నదాని కంటే తనను గురించి ఘనంగా చిత్రించుకొనే స్వభావం ఉంటుంది. ఇందుకు భిన్నంగా ప్రవర్తించేవారు చాలా అరుదుగా ఉంటారు. ఇటువంటి వ్యక్తిత్వం కలిగిన బూర్గులవారిని తలచుకోవడం, వారిని అనుసరించడం మనందరికి శుభదాయకం. లోకంలో వ్యక్తులకు వారసత్వంగా వచ్చే ఆర్థిక, రాజకీయ పరమైన గుర్తింపే కాని, వారి వ్యక్తిత్వాలకు గుర్తింపనేది నేతిబీరకాయ చందంగానే ఉంటుంది.

వ్యక్తిత్వం లేనివారు ఎంత గొప్ప పేరుప్రఖ్యాతులు పొందినప్పటికీ అది వారితో ఉన్న అవసరాలు ఇతరులచేత ఆహా ! ఓహో అనిపిస్తాయి. అదీ ఆ అవసరాలు తీరేదాకే. అదే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు తమ వ్యక్తిత్వానికి మచ్చతెచ్చుకొనే పనులు చేయకుండా ‘పరోపకార్థమ్ ఇదమ్ శరీరం’ అన్నట్లు జీవిస్తారు.

ఈ కోవకు చెందినవారే శ్రీ బూర్గుల రామకృష్ణారావుగారు. వారెల్లప్పుడు అన్ని విషయాల్లో ఆఖరికి తమలోని లోపాలను కూడా ఉన్నవి ఉన్నట్లుగా చెప్పేవారు. బూర్గుల వారి కీర్తి ఎంత పెద్దదో మూర్తి అంత చిన్నది. తన పొట్టితనాన్ని గూర్చి వారే ఇలా అనుకొనేవారు, ‘నన్ను గమనించకుండా ఎవరూ ఉండలేరు.

పొడుగు మనుషుల మధ్య పొట్టివాణ్ణి కదా ! అని అవసరం వచ్చినప్పుడు వారు అలనాటి వామనమూర్తి వలె ఇంతింతై ముల్లోకాలు ఆక్రమించి తమ విరాట్ రూపాన్ని ప్రదర్శించేవారు. అందుచేత బూర్గులవారు కావాలని నిరాడంబరంగా తెరమరుగున ఉండడం జరుగలేదు. శరీరాకృతిలో అందం లేకపోయిన మంచి మనసు కలిగి అందరూ బాగుండాలనే బూర్గులవారి జీవితానికి ‘బాహ్య సౌందర్యం కన్నా అంతఃస్సౌందర్యం అతిముఖ్యం’ అనే వాక్యం చక్కగా సరిపోతుంది.

ప్రశ్న 2.
బూర్గుల రామకృష్ణారావుగారి వ్యక్తిత్వం ద్వారా మనం నేర్చుకోదగిన అంశాలేవి ?
జవాబు:
మనం నివసిస్తున్న ఈ సమాజంలో మంచి ప్రభావశక్తి కలవారు కొద్దిమంది మాత్రమే ఉంటారు. అటువంటి వారితో కలిసినా, వారిని గురించి తెలిసికొన్నా మనకు మంచి స్ఫూర్తి కలుగుతుంది. వారు నడిచిన దారిలో మనం కూడా నడవడానికి అవకాశం కలుగుతుంది.

ఈ విధంగా స్ఫూర్తిని ఇచ్చేవారిలో కీ.శే. బూర్గుల రామకృష్ణారావుగారు ఒకరు. ఈయన హైదరాబాదు రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజనీతిజ్ఞుడు, బహుభాషావేత్త, పరిపాలనాదక్షుడు. ప్రతివ్యక్తికి, తన గురించి ఉన్నదాని కంటే ఎక్కువగానే చిత్రించుకొనే స్వభావం ఉంటుంది.

దీనికి భిన్నంగా ఉండేవారు బహుకొద్దిమందే ఉంటారు. వారిలో ముందుగా చెప్పదగినవారు బూర్గుల. అనేక విధాలైన ఒడిదుడుకులు వచ్చినా, విపత్కర పరిస్థితులు చుట్టుముట్టినా, చలించలేపోవడం, మనః స్థైర్యాన్ని, సమచిత్తాన్ని విడిచిపెట్టకపోవడం వంటి లక్షణాలు రామకృష్ణారావుగారి వ్యక్తిత్వం ద్వారా మనం నేర్చుకోవచ్చు.

జయాపజయాలను సమానంగా స్వీకరించడం, మిత్రులు సైతం ద్రోహం చేసినా, శత్రువులు దూషించినా “అవన్నీ ఆటలో భాగమేగా” అని స్థితప్రజ్ఞులుగా నిలవడం, అందరికీ సాధ్యం కాదు. అటువంటి విశిష్ట వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి శ్రీ బూర్గులవారు. ఈయన మతాతీత వ్యక్తి. సుగుణాలు మూర్తీభవించిన మహోన్నత వ్యక్తి. సౌజన్యానికి మారుపేరు. నిరాడంబరంగా జీవించే బూర్గులవారి వ్యక్తిత్వం ఆనాటివారికే కాదు ఏనాటివారికైనా, ప్రాతఃస్మరణీయమైనది.

ప్రశ్న 3.
“రాజకీయాలలో బూర్గులవారి సమ్యక్ దృష్టికోణం, సంకుచిత సైద్ధాంతిక అరలకు తావివ్వలేదు” దీనిని బట్టి మీరేమి గ్రహించారు?
జవాబు:
బూర్గుల రామకృష్ణారావుగారిని గూర్చి పి.వి. నరసింహారావు గారు చెప్పిన సత్యమిది. బూర్గుల వారికి రాజకీయాలపై సంపూర్ణమైన దృష్టికోణం ఉందట. బూర్గులవారు సంకుచిత దృష్టితో వీరు నావారు, వారు పేదవారు అనే భేదాన్ని వారు చూపించేవారు కారట.

హైదరాబాదు సంస్థానంలో జాగీర్దారీ వ్యవస్థ తరతరాల నుండీ వస్తోంది. భూములు అన్నీ కొద్దిమంది చేతులలోనే ఉండేవి. అది గమనించిన బూర్గులవారు, హైదరాబాదు రాష్ట్రంలో దున్నేవానికి భూమి హక్కును ఇచ్చే కౌలుదారీ చట్టాన్ని తయారు చేసి, సామ్యవాద వ్యవస్థకు వారు మార్గదర్శకులు అయ్యారు.

ఈ కౌలుదారీ చట్టాన్ని ముందుగా బూర్గులవారు, కొన్ని జిల్లాల్లో అమలు పరచడానికి ఎంపిక చేశారు. ఆ చట్టం అమలు వల్ల ఎక్కువగా నష్టపోయిన భూకామందులు అందరూ, బూర్గుల వారికి బంధువులూ, రాజకీయ సహచరులు. దీనిని బట్టి బూర్గుల వారికి రాజకీయాల్లో సమ్యక్ దృష్టి కోణం ఉందనీ, వారికి సంకుచిత సిద్ధాంత భేదాలు లేవని తెలుస్తోంది.

PAPER – I : PART – B

భాషాంశాలు – పదజాలం :

I. సొంతవాక్యాలు :

అ) కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

1. శ్రీరామరక్ష : మంచి గూఢచార వ్యవస్థ దేశానికి, ప్రజలకు శ్రీరామరక్ష.
2. గీటురాయి : క్రీడాకారుల ప్రతిభకు వారు సంపాదించిన బహుమతులే గీటురాళ్ళు.
3. రూపుమాపడం : ఆధునిక వైద్య విజ్ఞానం మశూచి, కలరా వంటి అంటువ్యాధుల్ని రూపుమాపగలిగింది.
4. కారాలు మిరియాలు నూరడం : కారు అద్దం పగిలి సంవత్సరమయినా మా స్నేహితులందరిమీద మా పక్కింటాయన ఇప్పటికి కారాలు మిరియాలు నూరుతునే ఉన్నాడు.
5. స్వస్తివాచకం : పాత పెద్దనోట్లకు ప్రధాని మోదీ స్వస్తివాచకం పలికాడు.
6. ప్రాతఃస్మరణీయులు : భగవంతునితో పాటు, విజ్ఞాన వేత్తలు, సంఘ సంస్కర్తలు అందరూ మనకు ప్రాతః స్మరణీయులే.
7. శక్తిసామర్థ్యాలు : మనం మన శక్తిసామర్థ్యాలు, శారీరక, మానసిక, వైజ్ఞానిక విషయాలలో పెంపొందించుకోవాలి.
8. సౌజన్య సౌహార్దాలు : గాంధీ, బుద్ధుడు, క్రీస్తు మొదలగు వారిని చూసినప్పుడు సౌజన్య సౌహార్దాలు కూడా ప్రపంచాన్ని గెలవడానికి ఉపయోగపడతాయి అని అనిపిస్తుంది.
9. కంచుకోట : అవినీతిపరులు కంచుకోట వంటి ఇంటిని నిర్మించుకొని దొంగసొత్తును దాస్తారు కదా !

TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల

II. అర్థాలు :

ఆ) కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.

ప్రశ్న 1.
నిరాఘాటంగా – అనే పదానికి అర్థం
A) ఆటంకాలుగా
B) అడ్డులేకుండా
C) సాఫీగా
D) పడుతూలేస్తూ
జవాబు:
B) అడ్డులేకుండా

ప్రశ్న 2.
ప్రమాణం – అనే అర్థం వచ్చే పదం
A) ప్రయాణం
B) గీటురాయి
C) తిరుగలి
D) గుండ్రాయి
జవాబు:
B) గీటురాయి

ప్రశ్న 3.
సచిన్ నిష్క్రమణతో భారతజట్టు ధోని వైపు తిరిగింది – గీత గీసిన పదానికి అర్థం
A) రాక
B) క్రమశిక్షణ
C) తప్పుకోవడం
D) బాధలతో
జవాబు:
C) తప్పుకోవడం

ప్రశ్న 4.
ఒక విషయం గురించి అనర్గళంగా మాట్లాడు – గీత గీసిన పదానికి సరియైన అర్థం
A) ఆటంకం లేకుండా
B) గొంతుతో
C) ఎదిరించి
D) ఆలోచించి
జవాబు:
A) ఆటంకం లేకుండా

ప్రశ్న 5.
“కడగొట్టు” అనే పదానికి అర్థం
A) కనిపెట్టు
B) గట్టిగా కొట్టు
C) చిట్టచివరి
D) పడగొట్టు
జవాబు:
C) చిట్టచివరి

TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 6.
ప్రాతఃస్మరణీయుడు – అను పదానికి అర్థం
A) ప్రతి ఉదయం జ్ఞప్తికి తెచ్చుకోతగినవాడు.
B) పాతకాలములో గుర్తున్నవాడు.
C) ఉదయమే గుర్తుకు వచ్చిన మనిషి.
D) గుర్తుంచుకోవలసిన విషయము (పాత సంఘటన).
జవాబు:
A) ప్రతి ఉదయం జ్ఞప్తికి తెచ్చుకోతగినవాడు.

ప్రశ్న 7.
“సునిశితమేధ” – అను పదానికి సరియైన అర్థం
A) ఒక రకమైన మేధ
B) చురుకైన బుద్ధి
C) మందబుద్ధి
D) సరియైన మేధావి
జవాబు:
B) చురుకైన బుద్ధి

ప్రశ్న 8.
“కలగలుపు” – అనే అర్థం గల పదం
A) అన్నము
B) కలుపు మొక్క
C) మేళవించు
D) విడివిడిగా
జవాబు:
C) మేళవించు

ప్రశ్న 9.
“సాహితీ జగత్తు” లో కాళిదాసు మొదటివాడు – గీత గీసిన పదానికి అర్థం
A) ప్రాచీన గ్రంథంలో
B) సాహిత్యం అనే ప్రపంచంలో
C) వీణా జగత్తులో
D) కవి పండితులలో
జవాబు:
B) సాహిత్యం అనే ప్రపంచంలో

ప్రశ్న 10.
అతని సౌజన్యం అందరిని ఆకర్షించింది – గీత గీసిన పదానికి అర్థం
A) మంచితనం
B) సౌందర్యం
C) వేషధారణ
D) సంపద
జవాబు:
A) మంచితనం

ప్రశ్న 11.
రామకృష్ణారావుగారి పేరు వినగానే గత స్మృతులెన్నో ముప్పిరిగొన్నాయి – గీత గీసిన పదానికి అర్థం
A) తలుపు
B) బాధ
C) తలపు
D) సంతోషం
జవాబు:
C) తలపు

ప్రశ్న 12.
వీసం ఎత్తు ఎక్కువా లేదు – గీత గీసిన పదానికి అర్థం
A) 1/16
B) 1/8
C) 1/4
D) 1/32
జవాబు:
A) 1/16

ప్రశ్న 13.
రామకృష్ణారావుగారు ప్రధానంగా సాహితీ జగత్తుకు చెందినవారు – గీత గీసిన పదానికి అర్థం
A) ప్రజలు
B) గ్రంథాలు
C) దేశాల
D) లోకం
జవాబు:
D) లోకం

III. ప్రకృతి, వికృతులు :

ప్రశ్న 1.
భూమి తిరముగా ఉండదు – గీత గీసిన పదానికి ప్రకృతి
A) పల్లము
B) స్థిరము
C) తిన్నగా
D) వేడి
జవాబు:
B) స్థిరము

ప్రశ్న 2.
దోసము, దొసగు – అనే వికృతి పదాలకు ప్రకృతి పదం
A) దోసకాయ
B) రోషము
C) దోషము
D) దుష్టుడు
జవాబు:
C) దోషము

ప్రశ్న 3.
“జాతరలో పిల్లలు తప్పిపోతారని యాత్ర మానుకొన్నారు.” – ఈ వాక్యంలో ప్రకృతి ఉన్న పదం
A) జాతర
B) పిల్లలు
C) మాను
D) తప్పిపోవు
జవాబు:
A) జాతర

ప్రశ్న 4.
ఊరేగింపులో దేవుని దవ్వు నుండి చూడగలిగాము – గీత గీసిన పదానికి ప్రకృతి
A) పువ్వు
B) ఎత్తు
C) వెనుక
D) దూరము
జవాబు:
D) దూరము

ప్రశ్న 5.
“పగ్గె, సాల” – అను వికృతి పదాలకు సరియైన ప్రకృతి పదాలు
A) ప్రజ్ఞ, శాల
B) ప్రతిజ్ఞ, విశాల
C) పగ్గము, శాల
D) ప్రజ్ఞ, సాలీడు
జవాబు:
A) ప్రజ్ఞ, శాల

TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 6.
శక్తి – అనే పదానికి వికృతి
A) శక్యము
B) సత్తి
C) సత్తెము
D) సకియ
జవాబు:
B) సత్తి

ప్రశ్న 7.
సంతసము – అను పదానికి ప్రకృతి
A) సంతోషము
B) సంతానము
C) ఆనందము
D) సంగతి
జవాబు:
A) సంతోషము

ప్రశ్న 8.
గౌరవము – అనే పదానికి వికృతి
A) గార్దభము
B) గారాబు
C) గౌరు
D) గారవము
జవాబు:
D) గారవము

ప్రశ్న 9.
బూర్గుల వారు పర్షియన్ భాష ఐచ్ఛికంగా తీసుకున్నారు – గీత గీసిన పదానికి వికృతి
A) పుస్తకం
B) గ్రంథం
C) బాస
D) బాష
జవాబు:
C) బాస

ప్రశ్న 10.
రామకృష్ణారావు గారు ప్రాచీన కావ్యాలు చదివేవారు – గీత గీసిన పదానికి వికృతి
A) కవ్వం
B) కబ్బం.
C) కవనం
D) కాననం
జవాబు:
B) కబ్బం.

ప్రశ్న 11.
కష్టాలు సంభవించినపుడు అధైర్యంతో క్రుంగిపోనూ లేదు – గీత గీసిన పదానికి వికృతి
A) కసటు
B) కసాటు
C) కషటు
D) కసటం
జవాబు:
A) కసటు

IV. పర్యాయపదాలు :

ప్రశ్న 1.
లోకము, జగము, ప్రపంచము – అను పర్యాయపదాలు కల పదం
A) లోకనము
B) జగత్తు
C) స్వర్గము
D) పంచాస్యం
జవాబు:
B) జగత్తు

ప్రశ్న 2.
మిత్రుడు- అనే పదానికి పర్యాయపదాలు
A) నేస్తం, దోస్తు
B) స్నేహితుడు, మైత్రి
C) బంధువు, చెలికాడు.
D) చెలువుడు, సంగడి
జవాబు:
A) నేస్తం, దోస్తు

ప్రశ్న 3.
రక్తము – అనే పదానికి పర్యాయపదాలు
A) శోణితము, రుధిరము
B) నెత్తురు, వర్ణము
C) కీలాలం, ద్రవము
D) పలాశము, పలలము
జవాబు:
A) శోణితము, రుధిరము

TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 4.
తనువు, కాయము, మేను – పర్యాయపదాలుగా గల పదం
A) శబ్దం
B) ప్రాణం
C) శరీరం
D) దేశం
జవాబు:
C) శరీరం

ప్రశ్న 5.
అబ్దం, సాలు, వర్షం – పర్యాయపదాలుగా గల పదం
A) సంవత్సరము
B) వాన
C) నీటిచాలు
D) సముద్రం
జవాబు:
A) సంవత్సరము

ప్రశ్న 6.
“దక్షత” – అను పదమునకు మరియొక పర్యాయపదము
A) శిక్షణ
B) సామర్ధ్యము
C) ఒక రాజు
D) దక్షిణం
జవాబు:
B) సామర్ధ్యము

ప్రశ్న 7.
“జనకుడు” – అను పదానికి పర్యాయపదం కాని పదం
A) కొడుకు
B) తండ్రి
C) పిత
D) నాన్న
జవాబు:
A) కొడుకు

ప్రశ్న 8.
‘సహస్రఫణ్” కు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) కానుక, కనుక
B) బహుమానం, సన్మానం
C) గౌరవం, మర్యాద
D) బహూకరణ, నమూనా
జవాబు:
B) బహుమానం, సన్మానం

ప్రశ్న 9.
సౌజన్యానికి ఆయన మారుపేరు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) సౌజన్య, సుజన
B) సౌశీల్యం, సుశీల
C) సుజనత్వం, మంచితనం
D) దయ, కరుణ
జవాబు:
C) సుజనత్వం, మంచితనం

ప్రశ్న 10.
బూర్గులవారి విశేష నైపుణ్యానికి నేను ఎల్లప్పుడు జోహారులర్పిస్తాను – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) నమస్కారం, అంజలి
B) కైమోడ్పు, మౌనం
C) చేమోడ్పు, చేయిముడు
D) దండం, దండ
జవాబు:
A) నమస్కారం, అంజలి

ప్రశ్న 11.
స్నేహితులు ద్రోహం తలపెట్టినా పట్టించుకోరు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) మేలు, మంచి
B) కీడు, శుభం
C) చెడు, సంతోషం
D) ఆపద, కీడు
జవాబు:
D) ఆపద, కీడు

V. నానార్థాలు:

ప్రశ్న 1.
“వాహిని” – అనే పదానికి నానార్థాలు
A) కాండము, నీరు
B) వాహనం, దేవత
C) నది, సేన
D) ప్రవాహము, కొండ
జవాబు:
A) కాండము, నీరు

ప్రశ్న 2.
సూర్యుడు, స్నేహితుడు – అనే నానార్థాలు గల పదం
A) రాజు
B) మిత్రుడు
C) గ్రహం
D) నక్షత్రం
జవాబు:
B) మిత్రుడు

TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 3.
“మరుగు” – అనే పదానికి నానార్థాలు
A) చాటు, అలవాటుపడు
B) వేడెక్కు, దానం
C) దాగు, దాచు
D) తెర, తెరచాప
జవాబు:
A) చాటు, అలవాటుపడు

ప్రశ్న 4.
నాకు క్షేత్రములన్న ప్రీతి – గీత గీసిన పదానికి నానార్థములు
A) వరిమడి, పుణ్యస్థానం
B) దేవాలయము, గుడి
C) శరీరము, దానము
D) భార్య, విశేషము
జవాబు:
A) వరిమడి, పుణ్యస్థానం

ప్రశ్న 5.
అన్ని మతములు శ్రేయస్సును కోరునవి – గీత గీసిన పదానికి నానార్ధములు –
A) కులము, అతుకు
B) ముత్యము, భాష
C) మతాబులు, పూజా విధానము
D) అభిప్రాయము, శాస్త్రం, సమ్మతి
జవాబు:
D) అభిప్రాయము, శాస్త్రం, సమ్మతి

VI. వ్యుత్పత్యర్థములు :

ప్రశ్న 1.
“గురువు”నకు సరియైన వ్యుత్పత్త్యర్థము
A) లావుగా ఉండువాడు.
B) అజ్ఞానమనే అంధకారమును పోగొట్టువాడు.
C) గుండ్రముగా తిరుగువాడు.
D) దేవతలను ఆజ్ఞాపించువాడు.
జవాబు:
B) అజ్ఞానమనే అంధకారమును పోగొట్టువాడు.

ప్రశ్న 2.
మనవు సంతతి వారు – అను వ్యుత్పత్తి అర్థము గల పదము
A) మనవి
B) మానవులు
C) మానినులు
D) రాక్షసులు
జవాబు:
B) మానవులు

ప్రశ్న 3.
ద్రవ్యము – అను పదమునకు సరియైన వ్యుత్పత్తి
A) పొందదగినది
B) దున్నుటకు వీలైనది
C) ద్రవించునది
D) అవ్యయము వంటిది
జవాబు:
A) పొందదగినది

ప్రశ్న 4.
అజ్ఞానాన్ని తొలిగించువాడు – అను వ్యుత్పత్తి అర్థము గల పదము
A) రక్షకభటుడు
B) గురువు
C) వైద్యుడు
D) దొంగ
జవాబు:
B) గురువు

TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 5.
తిథి, వార, నియమం లేనివాడు – అను వ్యుత్పత్తి అర్థము గల పదము
A) జులాయి
B) మిత్రుడు
C) అతిథి.
D) చుట్టం
జవాబు:
C) అతిథి.

PAPER – II : PART – A

అపరిచిత గద్యాలు

ప్రశ్న 1.
కింది గద్యభాగాన్ని చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలను తయారుచేయండి.

“శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దివాడు. సాహిత్యంపై ప్రత్యేక అభిమానం కలవాడు. భువనవిజయమనే సభామండపంలో సాహిత్యగోష్ఠి నిర్వహించేవాడు. అనేక కవి పండితులను పోషించేవాడు. ఆయన ఆస్థానంలోని ఎనిమిది మంది ప్రసిద్ధ కవులను అష్టదిగ్గజాలు అని పిలిచారు. అందులో అల్లసాని పెద్దన అగ్రగణ్యుడు. వారిలో తెనాలి రామకృష్ణుడు వికటకవిగా పేరు పొందాడు. రాయలు రాజు మాత్రమే కాదు, కవి కూడా. దేశభాషలందు తెలుగు లెస్స అని చాటాడు. ఆయన కాలం తెలుగుభాషకు స్వర్ణయుగమై భాసిల్లింది.

జవాబు:

ప్రశ్నలు

  1. శ్రీకృష్ణదేవరాయలు ఏ కాలము వాడు ?
  2. శ్రీకృష్ణదేవరాయల సభాభవనం పేరు ఏమి ?
  3. ‘అష్టదిగ్గజాలు’ అంటే ఎవరు ? వారిలో అగ్రగణ్యుడు ఎవరు ?
  4. తెలుగుభాషకు ఎవరి కాలం స్వర్ణయుగం ?
  5. తెనాలి రామకృష్ణుడు ఏ విధంగా పేరు పొందాడు ?

ప్రశ్న 2.
కింది పేరా చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రూపొందించండి.

“ఏకశిలా నగరాన్ని రాజధానిగా చేసుకొని, తెలుగునేలను వైభవ స్థితిలో నిలిపిన కాకతీయ రాజులలో చివరివాడు రెండవ ప్రతాపరుద్రుడు. అతడు ఉత్తమ పరిపాలకుడు మాత్రమే కాదు, మానవ ధర్మాన్ని, కళామర్మాన్ని ఎరిగిన సాహితీమూర్తి. సంస్కృతాంధ్రభాషల్లో అనుపమానమైన పాండిత్యాన్ని సొంతం చేసుకున్న సత్కవీంద్రుడు. సంగీత, సాహిత్య, నృత్య, చిత్రలేఖన, శిల్పకళలకు ఇతోధిక ప్రాధాన్యత నిచ్చి, వాటి విస్తృతికి విశేష సహకారమందించిన రసహృదయుడు, సహృదయుడు. ఎంతటి మహోన్నతులకయినా, చంద్రునిలో మచ్చలా ఏవో బలహీనతలుంటాయి. వేట ప్రతాపరుద్రుని బలహీనత. క్రమం తప్పకుండా వేట వినోదాన్ని ఆస్వాదించేవాడు ప్రతాపరుద్రుడు. ఆ వ్యసనం నుండి మహారాజును దూరం చేయాలని ఎంతగా ప్రయత్నించినా సఫలం కాలేకపోయినాడు మంత్రి యుగంధరుడు.

జవాబు:

ప్రశ్నలు

  1. కాకతీయుల రాజధాని ఏది ?
  2. రెండవ ప్రతాపరుద్రుడు ఏయే భాషల్లో పండితుడు ?
  3. ప్రతాపరుద్ర చక్రవర్తి యొక్క బలహీనత ఏమిటి ?
  4. యుగంధరుడు ఎవరు ?
  5. ప్రతాపరుద్రుడు లలితకళలను ఎలా పోషించాడు ?

ప్రశ్న 3.
కింది గద్యాన్ని చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రూపొందించండి.
“సాహితీ సృజనలో అంతర్జాతీయ కీర్తి నందుకొన్న మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్. కవిగా, రచయితగా, తత్త్వవేత్తగా, సంగీతజ్ఞుడిగా, చిత్రకారుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. వీరి పేరు వినగానే చప్పున స్ఫురించేవి ‘జనగణమన గీతం’, ‘గీతాంజలి’. జనగణమన గీతం భారత జాతీయ గీతంగా గుర్తింపబడింది. బంగ్లాదేశ్ జాతీయ గీతం కూడా వీరి లేఖిని నుండి వెలువడినదే. ఇలా రెండు జాతీయ గీతాలనందించిన కవిగా, అపూర్వ చరిత్రను సృష్టించారు. “శాంతి నికేతన్” పేరున ఆదర్శ విద్యాలయాన్ని స్థాపించి, ‘గురుదేవుడు’ గా కీర్తింపబడ్డారు.

జవాబు:

ప్రశ్నలు

  1. అంతర్జాతీయ కీర్తినందుకొన్న భారతీయ మహాకవి ఎవరు ?
  2. ఏ రెండు దేశాలకు ఠాగూర్ జాతీయ గీతాలను అందించాడు ?
  3. రవీంద్రనాథ్ ఠాగూర్ నెలకొల్పిన విద్యాసంస్థ ఏది ?
  4. రవీంద్రుని ప్రసిద్ధ రచనలు రెండింటిని రాయండి.
  5. రవీంద్రుని బహుముఖ ప్రజ్ఞను వివరించండి.

ప్రశ్న 4.
కింది గద్యభాగాన్ని చదువండి. కింద ఇచ్చిన ఐదు వాక్యాలలోని తప్పొప్పులను గుర్తించి బ్రాకెట్లలో రాయండి. “అంతరించిపోతున్న తెలుగుభాషా సంస్కృతులకు పునరుజ్జీవనం కల్పించుటకై రంగంలోకి దిగిన కందుకూరి పూర్తి సంఘసంస్కరణ దృక్పథంతో పనిచేశారు. ఒకే రంగాన్ని ఎంచుకోకుండా, సంఘంలో అపసవ్యంగా సాగుతున్న పలు అంశాలవైపు దృష్టిని సారించాడాయన. ప్రధానంగా స్త్రీల అభ్యున్నతిని కాంక్షించిన మహామనీషిగా వాళ్ళ చైతన్యం కోసం అనేక రచనలు చేశారు. చంద్రమతి చరిత్ర, సత్యవతి చరిత్ర వంటివి అందులో కొన్ని. వారి బ్రహ్మవివాహం నాటకం, పెద్దయ్య గారి పెళ్ళి పేరుతో, వ్యవహార ధర్మబోధిని, ప్లీడర్ నాటకం పేరుతోనూ, ప్రసిద్ధి పొందాయి.

వాక్యాలు

1. కందుకూరి పూర్తిపేరు వీరేశలింగం పంతులు.
జవాబు:
ఒప్పు

2. చంద్రమతి చరిత్ర కందుకూరి రాసిన గొప్ప నాటకం.
జవాబు:
తప్పు

TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల

3. సంఘంలోని సవ్యమైన అంశాలపై దృష్టి సారించాడాయన.
జవాబు:
తప్పు

4. కందుకూరి గొప్ప సంఘసంస్కర్త.
జవాబు:
ఒప్పు

5. తెలుగుభాషా సంస్కృతులను పునరుజ్జీవింపచేశారు కందుకూరి.
జవాబు:
ఒప్పు

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
మాతృభాష గొప్పదనాన్ని తెల్పుతూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

బాసర,
X X X X.

ప్రియమైన స్నేహితురాలు శ్రీవల్లికి,

నేను బాగా చదువుతున్నాను. నీవూ బాగా చదువుతున్నావని తలుస్తాను. ముఖ్యంగా ఈ లేఖలో మాతృభాష గొప్పతనాన్ని తెలియజేస్తున్నాను. తల్లి నుండి వచ్చిన భాషను మాతృభాష అంటారు. మన మాతృభాష తెలుగు. ‘తేనె లొలుకు భాష తెలుగు భాష’ అని పండితులు కీర్తించారు. పరభాషా మోజులో పడి మన మాతృభాషను మరిచిపోకూడదు. మాతృభాషలో నేర్చుకోని విద్య మెట్లు లేకుండ ఇంటిపైకి ఎక్కినట్లుంటుంది. ఏ జాతి సంస్కృతి అయినా ఆ జాతివాడే భాష మనుగడపైనే ఆధారపడి ఉంటుంది. మనిషి ఊహాశక్తికి, భావ వ్యక్తీకరణకు, నూతన సృజనకు ఆధారం ఈ మాతృభాషే, ఇంతటి మహత్తర శక్తి ఉంది కాబట్టే ఐక్యరాజ్య సమితి ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా జరుపుకోవాలని 1999లో నిర్ణయించింది. ఆంగ్లం అవసరమే కాని అనివార్యం మాత్రం కాదు. మాతృభాషను గౌరవించడమంటే తల్లిని గౌరవించడంతో సమానం. నికోలా కాంటే తెలుగుభాష గొప్పదనాన్ని కొనియాడుతూ “ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్”గా అభివర్ణించాడు. “దేశభాషలందు తెలుగు లెస్స” అని శ్రీకృష్ణదేవరాయలు ప్రశంసించాడు. మాతృభాష ఏ జాతి సంస్కృతి కైనా జీవగర్ర ! దీనిని ఎవరూ మరువకూడదు.

నీవు కూడా మాతృభాషను గూర్చిన విషయాలు తెలిసినవి రాస్తావని కోరుకుంటున్నాను.

ఇట్లు,
నీ ప్రియ స్నేహితురాలు,
కె.లలిత.

చిరునామా :

సిహెచ్. శ్రీవల్లి,
9వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూల్,
భద్రాచలం, ఖమ్మం జిల్లా.

PAPER – II : PART-B

భాషాంశాలు – వ్యాకరణం

కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.

1. సంధులు:

ప్రశ్న 1.
విమానాశ్రయం – విడదీసి రాయగా
A) విమా + నాశ్రయము
B) విమాన + ఆశ్రయం
C) విమానా + శ్రయము
D) విమానముల + ఆశ్రయం
జవాబు:
B) విమాన + ఆశ్రయం

ప్రశ్న 2.
“సవర్ణదీర్ఘ సంధి”కి ఉదాహరణ కానిది.
A) శరీర + ఆకృతి
B) గిరి + ఈశుడు
C) మత + అతీత
D) ఆ + అవసరము
జవాబు:
D) ఆ + అవసరము

TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 3.
ఈ కింది వానిలో “గుణసంధి”కి ఉదాహరణ కానిది.
A) భావ + ఉద్రేకం
B) భావ + ఆవేశం
C) ప్ర + ఉత్సాహం
D) దేవ + ఇంద్రుడు
జవాబు:
B) భావ + ఆవేశం

ప్రశ్న 4.
“యణాదేశ సంధి”కి ఉదాహరణ
A) మహెూన్నతము
B) ముఖ్యాంశం
C) ప్రత్యర్థులు
D) సారాంశం
జవాబు:
C) ప్రత్యర్థులు

ప్రశ్న 5.
కర్మధారయములలో మువర్ణకమునకు పు, ౦పు లు వచ్చు సంధి పేరు
A) ముగాగమ సంధి
B) పుంప్వాదేశ సంధి
C) రుగాగమ సంధి
D) లులనల సంధి
జవాబు:
B) పుంప్వాదేశ సంధి

ప్రశ్న 6.
“ఇంత + ఇంత” సంధి కలిపి రాయగా
A) ఇంతయింత
B) ఇత
C) ఇంతింత
D) ఇంతయునింత
జవాబు:
C) ఇంతింత

ప్రశ్న 7.
పుష్పమాలా + అలంకృతులు – అని విడదీయగా వచ్చు సంధి పేరు
A) సవర్ణదీర్ఘ సంధి
B) లులనల సంధి
C) అత్వ సంధి
D) యడాగమ సంధి
జవాబు:
A) సవర్ణదీర్ఘ సంధి

ప్రశ్న 8.
అతిశయ + ఉక్తి – సంధి పేరు
A) గుణసంధి
B) యడాగమ సంధి
C) యణాదేశ సంధి
D) ఉత్వ సంధి
జవాబు:
A) గుణసంధి

II. సమాసములు :

ప్రశ్న 1.
“మూల్యము కానిది – అమూల్యము.” – ఇది ఏ సమాసము ?
A) విశేషణ పూర్వపదము
B) నఞ తత్పురుష
C) చతుర్థీ తత్పురుష
D) ద్విగు సమాసము
జవాబు:
B) నఞ తత్పురుష

ప్రశ్న 2.
“విశేషణ పూర్వపద కర్మధారయ సమాసమునకు ఉదాహరణ
A) అమూల్య సంపద
B) పద్మముఖి
C) జలజాకరము
D) తల్లిప్రేమ
జవాబు:
A) అమూల్య సంపద

ప్రశ్న 3.
“దేశ చరిత్ర” – సరియైన విగ్రహవాక్యమును గుర్తించుము.
A) దేశములు, చరిత్రలు
B) దేశము నుండి చరిత్ర
C) దేశము యొక్క చరిత్ర
D) చరిత్ర గల దేశము
జవాబు:
C) దేశము యొక్క చరిత్ర

ప్రశ్న 4.
“వాదన యందు పటిమ” – సమాసము చేయగా
A) వాదనలో పటిమ
B) వాదనా పటిమ
C) వాదనలు, పటిమలు
D) వాదోపవాదము
జవాబు:
B) వాదనా పటిమ

TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 5.
“ద్విగు సమాసము”నకు ఉదాహరణ
A) ప్రాచీన కావ్యాలు
B) శక్తి సామర్థ్యాలు
C) నెలతాల్పు
D) రెండు రాష్ట్రాలు
జవాబు:
D) రెండు రాష్ట్రాలు

ప్రశ్న 6.
“దొంగ వలన భయము” – ఏ సమాసము
A) పంచమీ తత్పురుష
B) షష్ఠీ తత్పురుష
C) బహువ్రీహి
D) సంభావనా పూర్వపద కర్మధారయము
జవాబు:
A) పంచమీ తత్పురుష

ప్రశ్న 7.
“తృతీయా తత్పురుష సమాసమునకు ఉదాహరణ
A) గురువు కొఱకు దక్షిణ
B) నెలను తాల్చినవాడు
C) మూడు కన్నులు కలవాడు
D) వయస్సు చేత వృద్ధుడు
జవాబు:
D) వయస్సు చేత వృద్ధుడు

ప్రశ్న 8.
“విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము”నకు ఉదాహరణ కానిది
A) అమూల్య సమయం
B) పూర్ణ పురుషులు
C) పెద్ద కుటుంబం
D) నెలతాల్పు
జవాబు:
D) నెలతాల్పు

III. ఛందస్సు:

ప్రశ్న 1.
ఈ కింది గణాలలో “భ గణం” గుర్తించండి.
A) UIU
B) UII
C) IIU
D) UUI
జవాబు:
B) UII

ప్రశ్న 2.
“తాయెత్తు” గణ విభజన చేయగా
A) UII
B) UIU
C) UUI
D) UUU
జవాబు:
C) UUI

ప్రశ్న 3.
ఉత్పలమాల పద్యములో వచ్చు గణములు
A) గగ, భ, జ, స, నల
B) భ, ర, న, భ, భ, ర, వ
C) మ, స, జ, స, త, త, గ
D) నల, నగ, భ, ర, త
జవాబు:
B) భ, ర, న, భ, భ, ర, వ

ప్రశ్న 4.
చంపకమాలలో యతి ఎన్నవ అక్షరము ?
A) 10
B) 13
C) 14
D) 11
జవాబు:
D) 11

ప్రశ్న 5.
పద్యపాదంలో రెండవ అక్షరాన్ని ఇలా అంటారు.
A) ప్రాస
B) యతి
C) ప్రాసయతి
D) గణ
జవాబు:
A) ప్రాస

TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల

IV. అలంకారములు :

ప్రశ్న 1.
ఒకే అక్షరం పలుమార్లు ఆవృత్తి అయితే ఆ అలంకారం
A) వృత్త్యనుప్రాస
B) అనుప్రాస
C) అంత్యానుప్రాస
D) లాటానుప్రాస
జవాబు:
A) వృత్త్యనుప్రాస

ప్రశ్న 2.
“అమందానందంబున నందనందను డిందు వచ్చె” పై వాక్యంలో గల అలంకారం
A) ఉపమాలంకారం
B) వృత్త్యనుప్రాసాలంకారం
C) ఛేకానుప్రాసాలంకారం
D) లాటానుప్రాసాలంకారం
జవాబు:
B) వృత్త్యనుప్రాసాలంకారం

ప్రశ్న 3.
వృత్త్యనుప్రాసాలంకారానికి ఉదాహరణ
A) అది ఒక గోడ, గోడ పక్కన నీడ, నీడలో ఆవు దూడ
B) కలికి, చిలుకల కొలికి కిలకిల నవ్వె
C) భవనము వనములో ఉన్నది
D) తుమ్మెద ఝుం ఝుమ్మని పాడింది
జవాబు:
A) అది ఒక గోడ, గోడ పక్కన నీడ, నీడలో ఆవు దూడ

V. వాక్యాలు :

ప్రశ్న 1.
కింది వాటిలో ప్రత్యక్ష కథనంలో ఉన్న వాక్యం
A) తన తండ్రి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు.
B) “నా యీ చొరవ సీనియర్ గుమస్తా కోప కారణమైంది” అని పి.వి. అన్నాడు.
C) అతడు నాతో సినిమాకి వస్తానన్నాడు.
D) అందరూ అధికులు కావాలని చూస్తారు.
జవాబు:
B) “నా యీ చొరవ సీనియర్ గుమస్తా కోప కారణమైంది” అని పి.వి. అన్నాడు.

ప్రశ్న 2.
“నేను ఒక్కడినే చదువుకొంటున్నాను” అని అన్నాడు చైతన్య. ఈ వాక్యాన్ని పరోక్ష కథనంలోకి మార్చగా
A) నేను చదువుకొంటున్నాను అని చైతన్య అన్నాడు.
B) తాను ఒక్కడే చదువుకొంటున్నానని చైతన్య అన్నాడు.
C) నేను చదువుకొంటున్నాను ఒక్కడినే అని చైతన్య అన్నాడు.
D) వాడు ఒక్కడే చదువుతున్నాడని చైతన్య అన్నాడు.
జవాబు:
B) తాను ఒక్కడే చదువుకొంటున్నానని చైతన్య అన్నాడు.

ప్రశ్న 3.
“నరేష్ తాను రానని నాతో చెప్పాడు.” ఈ వాక్యాన్ని ప్రత్యక్ష కథనంలోకి మార్చగా
A) నరేష్ “నేను రాను” అని నాతో చెప్పాడు.
B) నరేష్ నాతో రానని చెప్పాడు.
C) నాతో రానని నరేష్ చెప్పాడు.
D) తనతో నేను రానని నరేష్ చెప్పాడు.
జవాబు:
A) నరేష్ “నేను రాను” అని నాతో చెప్పాడు.

ప్రశ్న 4.
రాజు “నా పుట్టినరోజుకు తప్పక రావాలి” అని కృష్ణతో అన్నాడు.
A) రాజు పుట్టినరోజుకి తప్పక రావాలని కృష్ణ అన్నాడు.
B) రాజు నేను పుట్టినరోజుకు తప్పక వస్తానని కృష్ణతో అన్నాడు.
C) రాజు, కృష్ణ పుట్టినరోజుకు రావాలన్నాడు.
D) రాజు తన పుట్టినరోజుకు తప్పక రావాలని కృష్ణతో అన్నాడు.
జవాబు:
D) రాజు తన పుట్టినరోజుకు తప్పక రావాలని కృష్ణతో అన్నాడు.

TS 9th Class Telugu Important Questions 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

These TS 9th Class Telugu Important Questions 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి will help the students to improve their time and approach.

TS 9th Class Telugu 4th Lesson Important Questions రంగాచార్యతో ముఖాముఖి

PAPER – I : PART – A

I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)

అ) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
దాశరథి రంగాచార్యకు తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం ఉందని ఎలా చెప్పగలవు ?
జవాబు:
తెలుగు సాహిత్యంలో దాశరథి రంగాచార్యులుగారికి విశిష్ట స్థానం ఉంది. ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్య ఈయన సోదరుడు. రంగాచార్య విశిష్టమైన నవలలు రచించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసాడు. నాలుగు వేదాలను, పది ఉపనిషత్తులను తెలుగులోకి అనువదించారు. రామాయణ, భారత, భాగవతాలను సరళ వచనంలో రాసి, ప్రజలకు అందుబాటులో వాటిని తెచ్చారు.

తెలుగు నవలలో ‘పాత్రోచితయాస’ను మొదటగా ప్రవేశపెట్టి, ప్రశంసలందుకొన్నారు. వీరి రచనలు ఇతర భారతీయ భాషలలోకి అనువదించబడ్డాయి అంటే వీరి సాహిత్య విలువలు ఎలా ఉంటాయో గమనించాలి. వీరి “చిల్లర దేవుళ్ళు” నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. తెలంగాణ జనజీవనం, రైతాంగ పోరాటం వంటి అంశాల నేపథ్యంగా రచనలు చేసి, తన విశిష్ట రచనాశైలితో పాఠకుడిని ఆకట్టుకొనే రంగాచార్యకు తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం ఉందని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా ఏం కావాలి ?

ప్రశ్న 2.
వాడుకభాష వలన ప్రయోజనం ఏమిటి?
జవాబు:
తెలుగుభాష బోధనలో, వ్యాసాలూ, వార్తల రచనల్లో, కథాకథనంలో గ్రాంథికం గాక, వాడుకలో ఉన్న పదాలతో, ఎలా సామాన్యంగా మాట్లాడతామో అలా తెలుగు వాక్యాలను వ్రాయడం ద్వారా విద్య పండితులకే అన్న భావన తొలిగి విద్య అందరిదీ అన్న భావనను మహనీయులైన ఎందరో కవులు తెచ్చారు.

పూర్వం మాట్లాడే భాషకు, రాసే భాషకు అంతరం ఉండేది. దానివల్ల కవుల గ్రంథాలు కేవలం పండితులకే పరిమితం అయ్యాయి. రానురాను కవులు, రచయితల ఆలోచనలలో మార్పువచ్చి పండిత పామర రంజకంగా రాయాలంటే వాడుకభాషే సరైనదని భావించి, రచనలు చేశారు. వాడుకభాష వల్ల సామాన్యుడు సైతం తేలికగా అర్ధం చేసుకోవడానికి వీలుంటుంది. కవి ఆంతర్యం, ఆలోచన లోకానికి తొందరగా చేరుతుంది.

TS 9th Class Telugu Important Questions 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ప్రశ్న 3.
“సిద్ధాంతం కన్నా కర్తవ్యం గొప్పది” అంటే మీకు ఏమర్థమయ్యింది ?
జవాబు:
‘సిద్దాంతము’ అనగా అక్షర రూపు దాల్చిన స్థిరమైన విధానము. మనం ఏమి చేయాలనుకున్నామో, ఎట్లా చేయాలనుకున్నామో ఇదంతా ఒక మాటగానో, పుస్తకంగానో ఉండటమే సిద్ధాంతం. ఇక ‘కర్తవ్యం’ అంటే విధి. మనం చేయాల్సిన పనిని తెలిపేది. బాధ్యతను గుర్తుచేసేది అని చెప్పవచ్చు. మాటలకన్నా చేతల్లో చూపించడం అనేది ఎప్పుడూ గొప్పే. కనుక అక్షర (మాటలు) రూపంలోని సిద్ధాంతాలతో కూర్చోవడం కన్నా మనిషిగా మన కర్తవ్యాన్ని గుర్తించి ప్రవర్తించడం గొప్ప విషయం. ఇది పెద్దల మాట. గాంధీగారు “డూ ఆర్ డై” అన్నారు. అది ఆయన సిద్ధాంతం కాదు. కర్తవ్యం అని అర్థం చేసుకున్నాను.

ప్రశ్న 4.
ఇంటర్వ్యూ ఎన్ని రకాలు ? అవి ఏవి ?
జవాబు:
ఇంటర్వ్యూలు రెండు రకాలు. ఉద్యోగాల ఎంపికకు అభ్యర్థుల ప్రతిభను పరీక్షించడానికి చేసే ఇంటర్వ్యూలు మొదటి రకం. ప్రముఖుల జీవిత విశేషాలను తెలుసుకోడానికి చేసే ఇంటర్వ్యూలు రెండో రకం.

ఆ) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
తెలంగాణ ప్రజల జీవనాన్ని, అస్తిత్వాన్ని, పోరాటాలను దాశరథి తన రచనల్లో ప్రతిబింబించిన తీరును సొంతమాటల్లో వివరించండి.
జవాబు:
తెలుగు సాహిత్యంలో దాశరథి రంగాచార్యుల గారికి విశిష్ట స్థానం ఉంది. ఈయన తెలంగాణ పోరాటం పూర్వరంగాన్ని, తన జీవశక్తిగా మార్చుకొని, తెలుగువారి సాంస్కృతిక జీవనాన్ని అద్భుతంగా చిత్రించారు. రంగాచార్య నవలల్లో ప్రధాన విషయం ‘తెలంగాణ సాయుధ పోరాటం’. దాశరథి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ఉద్యమశీలి. తెలంగాణలో పోలీసు యాక్షన్ తరువాత రైతుల భూములను దొరలు కాజేశారు.

తరువాత వచ్చిన ఉద్యమాలు, వాటి పేరున జరిగిన మోసాలు, రాజకీయాలు, ఎంత దిగజారాయో మొదలైన విషయాలు ప్రజలకు తెలియాలి అనే భావనతో ‘జనపదం’ నవలలో వివరించారు. “మోదుగుపూలు” నవల ద్వారా ‘సిద్దాంతం కన్నా కర్తవ్యం గొప్పది. విశ్వాసం కంటే కర్తవ్యం గొప్పది’ – అని ప్రకటించారు.

కమ్యూనిస్టు ఉద్యమం దాశరథికి జీవితాన్ని నేర్పింది. సమాజం కోసం ఏదైనా చేయాలి అనే తపన కల్గించింది. “నేను రచనలు ప్రజాజీవితాన్ని చిత్రించడానికి రాశాను. నా ప్రజలకోసం రాశాను” అనడంలో దాశరథికి తెలంగాణ ప్రజలపట్ల ఉన్న అభిమానం వ్యక్తమౌతుంది. “ఆదర్శం, ఆవేశం, అక్షరం” ఇవి ఉన్నప్పుడే వ్యక్తికైనా, సమాజానికైనా కావాల్సినవి సిద్ధిస్తాయని తన రచనల ద్వారా సందేశమిచ్చిన దాశరథి ప్రాతఃస్మరణీయులు.

TS 9th Class Telugu Important Questions 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ప్రశ్న 2.
ప్రముఖ సాహితీవేత్త డా॥ దాశరథి రంగాచార్య చేసిన సాహిత్య సేవను వివరించండి. (లేదా) రంగాచార్యతో ముఖాముఖి ఆధారంగా ఆయన రచనల గురించి వివరించండి.
జవాబు:
మహాకవి దాశరథి రంగాచార్యగారు తెలంగాణ సాయుధపోరాటం నేపథ్యంగా చిల్లర దేవుళ్ళు, జనపదం, మోదుగుపూలు, మాయజలతారు వంటి అద్భుతమైన నవలలు రాశారు. చారిత్రాత్మకమైన తెలంగాణ పోరాట చరిత్రను తన రచనల ద్వారా భావితరాలకు వారు అందజేశారు.

ఇంతేకాక, నాలుగు వేదాలనూ, పది ఉపనిషత్తులనూ తెలుగులోకి అనువదించారు. రామాయణ, భారత, భాగవతాలను సరళవచనంలో రాశారు. తెలంగాణ జనజీవనం, రైతాంగ పోరాటం, వంటి అంశాలు నేపథ్యంగా ఈయన విశిష్టమైన నవలలు రచించి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. తెలుగు నవలలో పాత్రోచితయాసను మొదటగా ప్రవేశపెట్టారు. వీరి రచనలు ఇతర భారతీయ భాషలలోకి కూడా అనువదింపబడ్డాయి.

ఈయన నవలలు చలన చిత్రాలుగా వచ్చాయి. ఈయన రచనాశైలి, పాఠకుడిని ఆకట్టుకొంటుంది. ఈయన రాసిన “చిల్లర దేవుళ్ళు” నవలకు, రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈయనను ‘గద్య దాశరథి’ అనేవారు. ఈయన సంస్కృతాంధ్ర భాషల్లో మహాపండితుడు. ఈయన జీవిత చరిత్రను ‘మోదుగుపూలు’ నవలలో చిత్రించారు. రంగాచార్య గొప్ప రచయిత.

PAPER – I : PART – B

భాషాంశాలు – పదజాలం

1. సొంతవాక్యాలు

అ) కింది పదాలను సొంతవాక్యాల్లో ప్రయోగించండి.

1. బుగులు పడడం (కలత చెందడం)
వాక్యప్రయోగం : రాష్ట్రం విపరీతమైన ఎండలతో బుగులు పడింది.

2. బృహత్ కార్యము: (పెద్దపని)
వాక్యప్రయోగం : ముఖ్యమంత్రి రాష్ట్రమును బంగారు తెలంగాణగా రూపొందించడం అనే బృహత్ కార్యక్రమమును చేపట్టారు.

3. గర్వకారణము :
వాక్యప్రయోగం : మా పాఠశాలలో పదవతరగతి పరీక్షల్లో నూటికి నూరుశాతం పాసుకావడం, మాకు గర్వకారణం

4. సాంప్రదాయసిద్ధము :
వాక్యప్రయోగం : మేము సాంప్రదాయ సిద్ధమైన వస్త్రాలనే ధరిస్తాము.

5. వసుధైక కుటుంబం :
వాక్యప్రయోగం : ప్రపంచ ప్రజలు కులమత భేదాలు విడిచి వసుధైక కుటుంబ భావనతో జీవించాలి.

ఆ) కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు గుర్తించి, వాటి సంకేతాన్ని (A, B, C, D) రాయండి.

ప్రశ్న 1.
నా నవలలు ఆ వ్యధ, బాధ అనే తమస్సులోంచి ఆవిర్భవించాయి.
A) పుట్టడం
B) బాధపడడం
C) తపస్సు చెయ్యడం
D) రాయడం
జవాబు:
A) పుట్టడం

ప్రశ్న 2.
నీ కర్తవ్యం నీవు మరువకు.
A) మాట
B) చేయవలసిన పని
C) ఆలోచన
D) ప్రార్థన
జవాబు:
B) చేయవలసిన పని

TS 9th Class Telugu Important Questions 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ప్రశ్న 3.
ప్రణాళికలను బాగా అధ్యయనం చేయాలి.
A) రాయడం
B) పరిశీలించడం
C) చదవడం
D) నేర్చుకోడం
జవాబు:
B) పరిశీలించడం

ఇ) కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు సరియైన పర్యాయపదాలు గుర్తించి, వాటి సంకేతాన్ని (A, B, C, D) రాయండి.

ప్రశ్న 1.
ఈ వ్యధ బాధ ఆవేదనలోంచి పుట్టాయి.
A) విచారం, గొప్ప
B) గరువము, కావరము
C) గౌరవం
D) రంధి, కష్టం
జవాబు:
C) గౌరవం

ప్రశ్న 2.
కమ్యూనిస్టు ఉద్యమం నన్ను మనిషిని చేసింది.
A) నరుడు, మానవుడు
B) మనుజుడు, యోగ్యుడు
C) మర్త్యుడు, సరసుడు
D) నరుడు, దేవత
జవాబు:
A) నరుడు, మానవుడు

ప్రశ్న 3.
ప్రజల జీవితం నేపథ్యంగా నవలలు రాశారు.
A) బతుకు, కష్టం
B) బతుకు, సంసారం
C) బతుకు, జీవనం
D) మనికి, నడవడి
జవాబు:
C) బతుకు, జీవనం

ప్రశ్న 4.
రామప్పగుడి సోయగం వర్ణనాతీతం.
A) అందం, చందం
B) అందం, సొగసు
C) సొగసు, గొప్పతనం
D) అందం, రంగు
జవాబు:
B) అందం, సొగసు

ఈ) కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు ప్రకృతులకు వికృతులు, వికృతులకు ప్రకృతులను గుర్తించి, వాటి సంకేతాన్ని (A, B, C, D) రాయండి.

ప్రశ్న 1.
రావణుని గర్వమునకు కారణం ఏమిటి ?
A) ఖర్వం
B) గరువము, కారవము
C) గౌరవం
D) గారం
జవాబు:
B) గరువము, కారవము

ప్రశ్న 2.
ఆలస్యం ఎందుకంటే కత చెప్తావేం? గీత గీసిన పదానికి ప్రకృతి
A) కతలు
B) కొత్త
C) కథ
D) కైత
జవాబు:
C) కథ

TS 9th Class Telugu Important Questions 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ప్రశ్న 3.
నీ కష్టం నాకు అర్ధం అయ్యింది.
A) కస్తి
B) నష్టం
C) కలహం
D) ఇష్టం
జవాబు:
A) కస్తి

ప్రశ్న 4.
తమిళంలో ఒక్క అక్షరం రాయరాదు.
A) అక్ష
B) అవసరం
C) అక్కరం
D) అక్షయం
జవాబు:
C) అక్కరం

ప్రశ్న 5.
నాకు పద్యము చదవడం ఇష్టం.
A) పద్దెము
B) గద్యం
C) గం
D) పాట
జవాబు:
A) పద్దెము

ఉ) కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు నానార్థాలను గుర్తించి, వాటి సంకేతాన్ని (A, B, C, D) రాయండి.

ప్రశ్న 1.
తెలంగాణలో రైతుపోరాట ఉద్యమం ఉవ్వెత్తున సాగింది.
A) యత్నం, ప్రయత్నం
B) యత్నం, పోరాటం
C) కలహం, సిద్దమవడం
D) యత్నం, కృషి
జవాబు:
B) యత్నం, పోరాటం

ప్రశ్న 2.
రాష్ట్ర సాధనలో విద్యార్థుల కృషి అమోఘమైనది.
A) ప్రయత్నం, వ్యవసాయం
B) వ్యవసాయం, చేత
C) పని, నడక
D) ప్రయత్నం, సాధక
జవాబు:
A) ప్రయత్నం, వ్యవసాయం

ప్రశ్న 3.
ఈ రోజు పాఠశాలలో సభ జరిగింది.
A) జూదం, మీటింగు
B) పరిషత్తు, కొలువు
C) ఇల్లు, జూదం
D) పరిషత్తు, ఉద్యమం
జవాబు:
C) ఇల్లు, జూదం

ప్రశ్న 4.
ఈ మధ్య సమాజం పూర్తిగా, కొత్తపుంతలు తొక్కుతోంది.
A) సభ, మనుషుల గుంపు
B) మనుషుల గుంపు, సమితి
C) సమితి, జనం
D) జనం, సభ
జవాబు:
A) సభ, మనుషుల గుంపు

PAPER – II : PART – A

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
దాశరథి రంగాచార్యగారిని అభినందిస్తూ కవిత/గేయం రాయండి.
జవాబు:
కవిత
– కంచిభొట్ల ఫణిరామ్

ఎవరయ్యా అతడు ! ఎవరయ్యా !
జనపదం ఆయన పథం
మోదుగు పూలు వారి హృది పథం.
చరిత్రను చెరపలేరంటాడు
రానున్న తరాలకు అందిస్తానంటాడు.
వారి నవలలు కావా ప్రజా జీవితాలూ ?
ఎందరో యువకులకు ప్రబోధ గీతాలు.

ఎవరయ్యా ఇతడు ! ఎవరయ్యా !

సత్యం ఆయన నమ్మిన మార్గం.
కర్తవ్యానికి నిలువెత్తు దుర్గం.
తెలంగాణం అంటే అభిమానం.
తెలంగాణేతరం పట్ల లేదు దురభిమానం.

‘ఆదర్శం, ఆవేశం, అక్షరం’ నా జీవితం
బాధ్యత, విలువలు గల ఈ సమాజానికే అంకితం.
అన్నది ఇంకెవరయ్యా ఆయనే దాశరథి రంగాచార్య.

TS 9th Class Telugu Important Questions 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ప్రశ్న 2.
మీ తెలుగు పాఠ్యపుస్తక రచయిత మీ పాఠశాలకు వస్తే ఆయనతో ముఖాముఖికి అవసరమైన ప్రశ్నావళిని తయారుచేయండి.
జవాబు:
మా పాఠశాలకు డా॥ ఇరివెంటి కృష్ణమూర్తిగారు వస్తే, ఈ క్రింది ప్రశ్నలతో ఆయనను ఇంటర్వ్యూ చేస్తాను.

  1. యువభారతి అధ్యక్షా ! ‘కవి సమయములు’ అంటే ఏమిటి ? .
  2. విద్వత్తులేని వక్తృత్వం ఎంతోకాలం అంతటా రాణించదు అన్నారు. ఎందుకు ?
  3. వక్తకు జ్ఞాపకశక్తి ఉండాలా ?
  4. వక్త అంగాంగ విన్యాసం చెయ్యాలనే నియమం ఏదీ లేదన్నారు. ఎలా ?
  5. ఉపన్యాసం వ్యంగ్యార్థాన్ని ఆశ్రయించాలా ?
  6. ఉపన్యాసానికి ఆత్మ ఏది ?
  7. బాగా ఆలోచించేవాడు తక్కువ మాట్లాడతాడా ?
  8. శ్రోతలను శిలామూర్తులనుకోవడం ఎలా ?

ప్రశ్న 3.
మీ పాఠశాలకు వచ్చిన పదవీ విరమణ పొందిన ఒక ఉపాధ్యాయునితో ఆయన ఉద్యోగ జీవితాన్ని గురించి తెలుసుకునేందుకు ప్రశ్నావళి తయారుచేయండి.
జవాబు:
మా పాఠశాలకు ఇటీవల పదవీ విరమణ పొందిన తెలుగు ఉపాధ్యాయుడు వస్తే, కింది ప్రశ్నలతో ఆయన గూర్చి ఇలా అడుగుతా.

  1. నమస్కారమండి గురువుగారు! మీ ఆరోగ్యం ఎలా ఉంది ?
  2. మీ ఊరిలో ఉన్నప్పుడు మేము గుర్తుకొస్తామా ?
  3. మీకు కాలక్షేపం ఎలా అవుతోంది ?
  4. ఖాళీ సమయాల్లో ఏం చేస్తారు ?
  5. ఏవైనా పుస్తకాలు రాశారా ?
  6. మేమేమైనా ఇబ్బంది పెట్టి ఉన్నామా ?
  7. మేము మీ మనసుకు బాగా కష్టపెట్టిన సందర్భం ఏది ?
  8. మీరు ఎన్నో ఊళ్ళు మారి ఉంటారు. ఎందరినో విద్యార్థులను చూసి ఉంటారు. వారిలో బాగా నచ్చిన దెవరు ? బాధపెట్టిన దెవరు ?
  9. మీకు ఇష్టమైన కవి ఎవరు ?
  10. మీకు బాగా నచ్చిన పుస్తకం ఏది ?

PAPER – II : PART – B

భాషాంశాలు – వ్యాకరణం

1. సంధులు

1) మహోద్యమం = మహా + ఉద్యమం – గుణసంధి
2) మహోజ్జ్వలం = మహా + ఉజ్జ్వలం – గుణసంధి
3) అన్నయ్య = అన్న + అయ్య – అత్వసంధి
4) ప్రభావాత్మకము = ప్రభావ + ఆత్మకము – సవర్ణదీర్ఘ సంధి
5) సంస్కృతాంధ్రభాషలు = సంస్కృత + ఆంధ్రభాషలు – సవర్ణదీర్ఘ సంధి
6) వసుధైక కుటుంబం = వసుధా + ఏకకుటుంబం – వృద్ధిసంధి
7) మరొకటి = మరి + ఒకటి – ఇత్వసంధి
8) విద్యార్థులు = విద్యా + అర్థులు – సవర్ణదీర్ఘ సంధి

2. సమాసాలు

సమాస పదం – విగ్రహవాక్యం – సమాస నామం

1) మహోద్యమము – గొప్పదైన ఉద్యమం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
2) విద్యార్థులు – విద్యను అర్థించువారు – ద్వితీయా తత్పురుష సమాసం
3) ప్రజాజీవితాలు – ప్రజల యొక్క జీవితాలు – షష్ఠీ తత్పురుష సమాసం
4) పోరాటగాథ – పోరాటము యొక్క గాథ – షష్ఠీ తత్పురుష సమాసం
5) జీవనచిత్రాలు – జీవనము యొక్క చిత్రాలు – షష్ఠీ తత్పురుష సమాసం
6) భారతదేశము – భారతము అనే పేరుగల దేశము – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
7) కొత్త దృక్పధము – కొత్తదైన దృక్పధము – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
8) గర్వకారణం – గర్వమునకు కారణం – షష్ఠీ తత్పురుష సమాసం
9) చదువు రాణి – చదువులకు రాణి – షష్ఠీ తత్పురుష సమాసం
10) భగవదనుగ్రహం – భగవంతుని యొక్క అనుగ్రహం- షష్ఠీ తత్పురుష సమాసం
11) వారసత్వసంపద – వారసత్వం అనెడి సంపద – రూపక సమాసం
12) సాహిత్యకృషి – సాహిత్యమందు కృషి – సప్తమీ తత్పురుష సమాసం
13) జీవనవైభవము – జీవనము యొక్క వైభవము – షష్ఠీ తత్పురుష సమాసం

ప్రశ్న 3.
‘సభ కొఱకు భవనం’ – ఈ విగ్రహవాక్యాన్ని సమాసపదంగా మార్చి, సమాసనామం రాయండి.
జవాబు:
సభా భవనం – చతుర్థీ తత్పురుష సమాసం

ప్రశ్న 4.
‘తల్లియు బిడ్డయూ’ విగ్రహవాక్యాన్ని సమాసపదంగా మార్చి, సమాసనామం రాయండి.
జవాబు:
తల్లీ బిడ్డలు – ద్వంద్వ సమాసం

ప్రశ్న 5.
‘వసుధైక కుటుంబము’ – విడదీసి సంధి పేర్కొనండి.
జవాబు:
వసుధా + ఏక కుటుంబము – వృద్ధిసంధి.

TS 9th Class Telugu Important Questions 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ప్రశ్న 6.
‘భారతదేశము’ విగ్రహవాక్యం రాసి, సమాసనామాన్ని పేర్కొనండి.
జవాబు:
భారతం అనే పేరుగల దేశం- సంభావన పూర్వపద కర్మధారయం

ప్రశ్న 7.
‘వారసత్వ సంపద’ – సమాసానికి విగ్రహం రాసి, సమాసం పేరు చెప్పండి.
జవాబు:
వారసత్వం అనే సంపద – రూపక సమాసం

ప్రశ్న 8.
‘మహా + ఉద్యమం’ – సంధి కలిపి సంధి జరిగిన విధానాన్ని రాయండి.
జవాబు:
మహోద్యమము – గుణసంధి, ‘మహా’ పదం చివర ‘అ’కు, ‘ఉ’ పరమై గుణసంధి వచ్చింది.

ప్రశ్న 9.
రాముడు రావణుని చంపాడు. (కర్మణి వాక్యంగా మార్చండి.)
జవాబు:
రావణుడు రామునిచే చంపబడ్డాడు. (కర్మణి వాక్యం)

ప్రశ్న 10.
బాలురచే సెలవు తీసికోబడింది. (కర్తరి వాక్యంగా మార్చండి.)
జవాబు:
బాలురు సెలవును తీసుకున్నారు. (కర్తరి వాక్యం)

TS 9th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson స్వామి వివేకానంద

Telangana SCERT 9th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం 5th Lesson స్వామి వివేకానంద Questions and Answers.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson స్వామి వివేకానంద

TS 9th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson స్వామి వివేకానంద 1
భారతీయ ధర్మం అన్ని మతాల్ని అంగీకరిస్తుందనీ, గౌరవిస్తుందనీ, అన్ని మతాలు సత్యాలేననీ, అవన్నీ భగవంతుని చేరుకోడానికి మార్గాలనీ స్వామీజీ చెప్పారు. ఎవరూ మతాన్ని మార్చుకోనవసరం లేదనీ, నా మతమే గొప్పది. నా మతమే నిలవాలి అనుకునేవారు బావిలో కప్పవంటివారనీ స్వామీజీ తెలిపారు. మిగతా వక్తలు తమ తమ మతాలకే ప్రాతినిధ్యం వహిస్తే, స్వామీజీ మాత్రం అన్ని ధర్మాల తరఫునా మాట్లాడి నిజమైన మతసామరస్యాన్ని చూపించాడు. సదస్యులందరికి స్వామీజీ ప్రసంగమే నచ్చింది.

PAPER – I : వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన) (మార్కులు: 6)

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
నరేంద్రుని బాల్యం, విద్యాభ్యాసం గురించి రాయండి.
జవాబు:
నరేంద్రుడు ఆరవ ఏట విద్యాభ్యాసం మొదలుపెట్టాడు. మొదట్లో ఇంట్లోనే తల్లిదండ్రులు నియమించిన గురువు వద్ద చదువుకున్నాడు. గురువు ఒకసారి చెప్పగానే నేర్చుకొని, అప్పచెప్పగలిగేవాడు.
ఏడవ ఏట ఈశ్వరచంద్ర విద్యాసాగర్ స్థాపించిన మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూషన్లో చేరాడు. నరేన్ తెలివితో, చురుకుతో తోటి బాలురందరికీ నాయకుడయ్యాడు. నరేన్కు ఆటలంటే ప్రాణం.
– నరేన్కు ఇష్టమైన ఆట “రాజు – దర్బారు”. ఇంటిలోనే సొంతంగా ఒక వ్యాయామశాల ఏర్పాటుచేశాడు. తర్వాత వ్యాయామశాలలో చేరి కర్రసాము, కత్తిసాము, గుర్రపుస్వారీ నేర్చాడు.

నరేన్కు క్రమంగా పుస్తకాలు చదవడంపై ఆసక్తి పెరిగింది. తండ్రిగారు బదిలీకావడంతో, రాయపూర్ వెళ్ళి తిరిగి కలకత్తా వచ్చి మూడేళ్ళ చదువు ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేశాడు. ఆ పరీక్ష మొదటిశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. పాఠశాలలో ఆ శ్రేణిలో పాసైన ఏకైక విద్యార్థి నరేన్ ఒక్కడే.

తరువాత ప్రెసిడెన్సీ కాలేజీలోనూ, మరుసటి సంవత్సరం నేడు స్కాటిష్చర్స్’ అని పిలువబడే కళాశాలలోనూ చేరాడు. ప్రిన్సిపాలూ, గురువులూ నరేన్ ప్రతిభాపాటవాలకు ఆశ్చర్యపోయేవారు. నరేంద్రుడు ఎన్నో గ్రంథాలు చదివాడు. 1884లో బి.ఏ. పాసయ్యాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson స్వామి వివేకానంద

ప్రశ్న 2.
వివేకానందుని అమెరికా పర్యటన విశేషాలను తెల్పండి.
జవాబు:
స్వామీజీయైన నరేంద్రుడు అమెరికాలో జరుగబోయే సకల మతముల మహాసభకు వెళ్ళి, భారతదేశ ధర్మాన్ని ప్రపంచానికి తెలియపరుద్దామనుకున్నాడు. మద్రాసులో యువకులు అందుకు సహాయం చేశారు. ఖేత్రీ మహారాజు నరేంద్రునికి కెనడా వెళ్ళే ఓడలో టిక్కెట్టుకొని ఇచ్చాడు. నరేంద్రుని, “వివేకానంద” అనే నామాన్ని స్వీకరింపమన్నాడు.

వివేకానందుడు 1893 మే 31న అమెరికాకు బయలుదేరాడు. ఓడ కెనడా దేశంలోని ‘వాంకోవర్ ‘ లో ఆగింది. అక్కడ నుండి రైలులో “షికాగో” నగరానికి వివేకానంద వెళ్ళాడు. రైల్లో’ ‘సాన్ బోర్న్’ అనే మహిళతో పరిచయం అయ్యింది. ఆమె వివేకానందుడు ‘బోస్టన్’ నగరానికి వచ్చినపుడు తన ఇంటికి రమ్మంది.

షికాగో ధనవంతుల నగరం. విశ్వమత మహాసభలకు ఇంకా రెండు నెలల వ్యవధి ఉంది. అదీగాక, ఆ సభలో మాట్లాడేందుకు వివేకానందుని వద్ద ధ్రువపత్రాలు లేవు. దానితో వివేకానందుడు ‘బోస్టన్’లో సాన్ బోర్న్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ హార్వర్డ్ ప్రొఫెసర్ జె.హెచ్.రైట్తో పరిచయమైంది. రైట్, వివేకానందుని విశ్వమత మహాసభలో హైందవ ధర్మం గురించి మాట్లాడమన్నాడు. తనవద్ద ధ్రువపత్రాలు లేవని వివేకానందుడు చెప్పాడు.

ఆ ప్రొఫెసర్ విశ్వమత మహాసభల అధ్యక్షుడికి వివేకానందుని గూర్చి అమెరికాలోని పండితులందరి కంటే వివేకానందుడు గొప్పవాడని రాశాడు. వివేకానందుని ఆ ప్రొఫెసర్ చికాగోకు పంపాడు. కానీ రైట్ ఇచ్చిన కాగితం కనబడలేదు. వివేకానందుడు చికాగోలో భిక్షాటన చేశాడు. చెట్టు కింద పడుకున్నాడు. జార్జ్. డబ్ల్యూ. హేల్ అనే ఆమె వివేకానందుని చూసి, విశ్వమత మహాసభలకు వచ్చిన భారతీయ సన్యాసి అని గౌరవించింది. ఆమె సాయంవల్లనే వివేకానందుడు విశ్వమత మహాసభలో మాట్లాడాడు.

సభలో వివేకానందుడు “నా అమెరికా దేశ సోదర సోదరీమణులారా ! అంటూ తన ఉపన్యాసం ప్రారంభించాడు. ఆ కమ్మని పిలుపుకు సభ్యులు ఆనందించి మూడు నిమిషాలపాటు లేచి చప్పట్లు కొట్టారు. వివేకానంద ఆ సభలో అన్ని ధర్మాల తరపునా మాట్లాడి, సర్వమత సామరస్యాన్ని చూపాడు. వివేకానందుని ఖ్యాతి దేశదేశాలకూ పాకింది.

ప్రశ్న 3.
వివేకానందుడు జాతికిచ్చిన సందేశమేమి ?
జవాబు:
వివేకానందుని సందేశము: “మన భారతదేశం పుణ్యభూమి. సంపద, అధికారం మన భారతజాతికి ఎప్పుడూ ఆదర్శాలు కాలేదు. భారతీయుడు ఎవరైనా సరే, జాతిమత తారతమ్యం లేకుండా, పేద, గొప్ప వివాదం లేకుండా, కుల వివక్షతను దగ్గరకు రానీయకుండా, అందరూ నా సహోదరులే అని చాటాలి. భారతదేశానికి అంతటికీ ఏది హితమో, అదే తనకు కూడా హితము అని ప్రకటించాలి.

భారతదేశానికి మంచి జరగాలంటే, స్త్రీ జనోద్ధరణ, జన చైతన్యం ప్రధానంగా సంభవించాలి. పేద జనానికి ఆహారం ఇవ్వాలి. విద్యావ్యాప్తి సక్రమంగా జరగాలి. సర్వజనులకూ తగినంత ఆహారం, జీవనోపాధి అవకాశాలు కల్పించాలి. వ్యావహారిక భాషలోనే కళాత్మకంగా, సహజంగా శాస్త్ర పాండిత్యం సాధించాలి. పరిశోధనలను కూడా వాడుక భాషలోనే నిర్వహించాలి. విద్య సమస్త సమస్యలనూ పరిష్కరించే మార్గం కావాలి.

వివేకానంద యువకులకు ఇలా సందేశం ఇచ్చారు – “మీకు ప్రేమ, నిజాయితీ, సహనం కావాలి. నిరుపేదలనూ, అమాయక ప్రజలనూ, అణగద్రొక్కబడిన వారినీ ప్రేమించండి. వారి కొరకు పరితపించండి. పిరికితనాన్ని విడచి, ధైర్యంగా సమస్యలను ఎదుర్కోండి. దీనజనులను ఉద్ధరించండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. ఓర్పుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు వస్తాయని మరువకండి. లేవండి మేల్కొనండి. శ్రేష్ఠులైన ఆచార్యుల బోధనలు అనుసరించండి.”

ప్రశ్న 4.
వివేకానందుని సందేశాల ఆధారంగా ఏకపాత్రాభినయం చేయండి.
జవాబు:
ఏకపాత్రాభినయం “వివేకానంద” :

నా భారతీయ సహోదరులారా !
మన భారతదేశం ఒక్కటే అసలైన పుణ్యభూమి, మన భారతజాతి శతాబ్దాలుగా శక్తిమంతమైన జాతి. ఐనా అది ఇతర రాజ్యాలపై దండయాత్ర చేయలేదు. మన భారతీయుడు ఎవరైనా సరే, జాతిమత భేదం, పేద – గొప్ప తేడా, కుల భేదం లేకుండా, అందరూ నా సోదరులే అని చాటాలి. భారతీయ సమాజం నా బాల్యడోలిక, నా యౌవన ఉద్యానం, నా వార్ధక్యంలో వారణాసి. భారతీయ సమాజం నాకు స్వర్గతుల్యం.

మన భారతదేశానికి మంచి జరగాలంటే, స్త్రీ జనోద్ధరణ, జనచైతన్యం ప్రధానంగా సంభవించాలి. నాకు ఈ లోకంలో సరిపడ తిండిని ప్రసాదించలేక, స్వర్గంలో ఆనందాన్నిచ్చే భగవంతుని నేను విశ్వసించలేను. ముందు కడుపునిండా తిండి. తర్వాతనే మతం.

మనం వ్యావహారిక భాషలోనే శాస్త్రపాండిత్యం సాధించాలి. మన పరిశోధనలు వ్యావహారిక భాషలోనే నిర్వహించాలి. సాహసం గల యువకులారా ! మీకు ప్రేమ, నిజాయితీ, సహనం కావాలి. నిరుపేదలను, అమాయకులను, అణగద్రొక్కబడిన వారిని ప్రేమించండి. దీనుల కోసం శ్రమించండి.

“ఉత్తిష్ఠత ! జాగ్రత ! ప్రాప్య వరాన్ నిబోధత !” (లేవండి! మేల్కొనండి ! శ్రేష్ఠులైన ఆచార్యుల బోధనలను అనుసరించండి !)

PAPER – II : పరిచిత గద్యాలు (మార్కులు : 5)

1. కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

కాశీలో ఒక సంఘటన జరిగింది. ఒకరోజు దుర్గ అమ్మవారి ఆలయానికి వెళ్ళి వస్తూంటే దారిలో ఒక కోతులగుంపు కనిపించింది. అవి ఆయనవైపు తిరిగి పరుగెత్తి రాసాగాయి. అవి కరుస్తాయనే తలంపుతో వివేకానంద స్వామిజీ వెనుదిరిగి చిన్నగా పరుగెత్త నారంభించాడు. అవి ఇంకా వెంబడిస్తూనే ఉన్నాయి. ఏం చేయాలి అని ఆలోచిస్తూ పరుగెడుతున్న స్వామికి అటుగా వెళ్తున్న ఒక వృద్ధ సన్యాసి కనిపించాడు. అడగకుండానే ఆ సన్యాసి అంతా గమనించి, “ఆగు! వెనుదిరిగి ఆ జంతువుల నెదుర్కో” అని గట్టిగా అరిచాడు. స్వామిజీ ఆగి వెనక్కి తిరగగానే, కోతులు కూడా ఆగి వెనుదిరిగాయి. స్వామిజీ రెండు మూడడుగులు వేసి భయపెట్టగానే అవి పరుగులంకించుకున్నాయి. తరువాతి కాలంలో స్వామిజీ అమెరికాలో ప్రసంగిస్తూ ఇది తన జీవితంలో తాను నేర్చుకున్న ఒక గొప్ప పాఠం అనీ, ఆ కోతుల్లాగ కష్టాలు మనల్ని వెన్నాడుతున్నాయనీ, ఎప్పుడైతే ఆగి మనం వెనుదిరిగి వాటినెదుర్కొంటామో, అప్పుడు అవే పారిపోతాయని బోధించాడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
కోతులు ఎప్పుడు పరుగుపెట్టాయి ?
జవాబు:
స్వామీజీ వెనుదిరిగి రెండు మూడడుగులు వేసి భయపెట్టగానే కోతులు పరుగుపెట్టాయి.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson స్వామి వివేకానంద

ప్రశ్న 2.
వివేకానంద స్వామిజీకి కోతులు ఎప్పుడు కనిపించాయి ? ఎక్కడ కనిపించాయి ?
జవాబు:
వివేకానంద స్వామిజీకి దుర్గ అమ్మవారి ఆలయానికి వెళ్ళి వస్తున్నప్పుడు కోతులు కాశీలో దారిలో కనిపించాయి.

ప్రశ్న 3.
‘ఆ జంతువులనెదుర్కో’ అని ఉపదేశించిన వ్యక్తి ఎవరు ?
జవాబు:
‘ఆ జంతువుల నెదుర్కో’ అని ఒక వృద్ధ సన్యాసి స్వామికి అరిచి చెప్పాడు.

ప్రశ్న 4.
వివేకానందస్వామి కోతుల సంఘటన నుండి నేర్చుకున్న పాఠం ఏమిటి ?
జవాబు:
కోతుల్లాగే కష్టాలు మానవులను వెన్నాడుతాయనీ, ఎప్పుడైతే, ఆగి మనం వెనక్కు తిరిగి ఆ కష్టాలను ఎదుర్కుంటామో అప్పుడు అవి పారిపోతాయనీ, స్వామికి కోతుల సంఘటనను బట్టి నేర్చుకున్నాడు.

ప్రశ్న 5.
కోతులు సంఘటనను గూర్చి వివేకానంద ఎక్కడ చెప్పారు ?
జవాబు:
కోతుల సంఘటనను గూర్చి స్వామిజీ అమెరికాలో చెప్పాడు.

2. కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

వివేకానంద స్వామి బొంబాయి నుండి 1893 మే 31 వ తారీఖున అమెరికాకు బయలుదేరాడు. ఓడ దారిలో సిలోను, సింగపూరు, హాంగ్కాంగ్, చైనా, జపాన్ లోని రేవులలో ఆగింది. స్వామిజీ ఆయా ప్రాంతాలను ఎంతో ఆసక్తితో గమనించేవాడు. కొన్నాళ్ళకు ఓడ కెనడా దేశంలోని వాంకోవర్లో ఆగింది. స్వామిజీ అక్కడి నుండి షికాగోకి రైలులో వెళ్ళాడు. రైల్లో సాన్బోర్న్ అనే ఒక మహిళ స్వామిజీతో మాట్లాడింది. స్వామిజీ ప్రతిభాపాండిత్యాలనీ, పవిత్రతనీ, గమనించి, ‘స్వామీ మీరెప్పుడైనా బోస్టన్ నగరానికి వస్తే, దయచేసి మా ఇంటికి అతిథిగా వచ్చి మమ్మానందింపజేయండి’ అని తన చిరునామా ఇచ్చింది. జూలై నెల మధ్యలో స్వామీ షికాగో చేరుకున్నాడు. అదొక చిత్రమైన కొత్త ప్రపంచం. అక్కడి భవంతులు రోడ్లు, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలూ, యంత్రాలూ, కర్మాగారపు తయారీలూ, కళలూ మొదలైనవన్నీ చూసి స్వామీజీ విస్తుపోయాడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
స్వామీజీ వేటిని చూసి విస్తుపోయారు ?
జవాబు:
స్వామిజీ, షికాగోలో భవంతులు, రోడ్లు, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలూ, యంత్రాలూ, కర్మాగారపు తయారీలూ, కళలూ మొదలయినవి చూసి విస్తుపోయారు.

ప్రశ్న 2.
వివేకానంద స్వామి ప్రయాణించిన ఓడ ఎక్కడ ఆగింది ?
జవాబు:
వివేకానందస్వామి ప్రయాణించిన ఓడ కెనడా దేశంలోని వాంకోవర్ లో ఆగింది.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson స్వామి వివేకానంద

ప్రశ్న 3.
స్వామిజీకి రైల్లో కనబడిన మహిళ ఎవరు ? ఆమె ఏ నగరానికి చెందినది ?
జవాబు:
స్వామిజీకి రైల్లో కనబడిన మహిళ పేరు “సాన్బోర్న్”. ఆమె బోస్టన్ నగరానికి చెందినది.

ప్రశ్న 4.
స్వామిజీ బొంబాయిలో ఎప్పుడు బయలుదేరారు ?
జవాబు:
స్వామిజీ బొంబాయిలో 1893 మే 31వ తారీఖున అమెరికాకు బయలుదేరారు.

ప్రశ్న 5.
స్వామిజీ ఎప్పుడు చికాగో చేరుకున్నారు?
జవాబు:
స్వామిజీ జూలై నెల మధ్యలో చికాగో చేరుకున్నారు.