TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana అమరులు

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 9th Lesson అమరులు Textbook Questions and Answers.

అమరులు TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana

బొమ్మను చూడండి ఆలోచించి చెప్పండి

TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana అమరులు 1

1. బొమ్మలో ఏం జరుగుతున్నది?
జవాబు.
బొమ్మలో అమరవీరుల స్తూపం ఉన్నది. దాని ముందు ప్రజలు నిలబడి అమరవీరులకు వందన సమర్పణ చేస్తున్నారు.

2. స్థూపాలను ఎందుకు కట్టిస్తారు ?
జవాబు.
గొప్పవారికి గుర్తుగా, వారు చేసిన పనులకు గుర్తుగా స్థూపాలను కట్టిస్తారు.

TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana అమరులు

3. స్తూపం వద్ద ఎందుకు నివాళులు అర్పిస్తారు ?
జవాబు.
జాతి కోసం ప్రాణాలర్పించిన అమరులను గుర్తు చేసుకుంటూ, తాము కూడా వారి బాటలో నడుస్తామని ఆశిస్తూ వారిని గౌరవించటానికి స్తూపం వద్ద నివాళులు అర్పిస్తారు.

4. అమరవీరులకు ఎట్లా నివాళులు అర్పించాలో మీకు తెలుసా ?
జవాబు.
నిటారుగా నిలబడి తల నిటారుగా ఉంచి కుడిచేయి కుడి కణత మీద ఉంచి గౌరవ పూర్వకంగా నివాళులు అర్పించాలి. కొంతమంది కవితల ద్వారా గాని, పాటల ద్వారా గాని, ఇతర కళల ద్వారాగాని నివాళులు అర్పిస్తారు..

ఆలోచించండి – చెప్పండి

1. “మాకై అసువులు బాసిన” అనటంలో మాకు అంటే ఏవరు ?
జవాబు.
మాకై అసువులు బాసిన అంటే ‘మా కోసం ప్రాణాలర్పించిన’ అని అర్థం . మాకు అంటే తెలంగాణ ప్రజలు.

2. “జోహార్లు అంటే ఏమిటి ? ఎవరికి జోహార్లు సమర్పిస్తాం ?” ఎందుకు సమర్పించాలి ?
జవాబు.
జోహార్లు అంటే నమస్కారాలు. ప్రజల సమస్యల కోసం పోరాడి మరణించిన వారికి, ప్రజాసేవలో మరణించిన వారిని, అమర జవానులకు జోహార్లు సమర్పిస్తాం. మనకోసం మన బాగు కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు గనుక వారిపట్ల కృతజ్ఞతా సూచకంగా జోహార్లు సమర్పించాలి. (నేటి కాలంలో జోహార్లు అంటే చనిపోయిన వారికి ఇచ్చే శ్రద్ధాంజలి అని పొరబడుతున్నారు. జోహార్లు బ్రతికున్న వారికీ చెబుతారు. జోహారు శిఖిపింఛమౌళి… అని ప్రసిద్ధ గేయం కూడా ఉంది).

3. “కడుపు పంటల – కడుపు మంటల” – దీనిని గురించి మీకేమి అర్థమయింది ?
జవాబు.
కడుపు పంటలు అంటే ప్రేమతో కడుపార కన్న సంతానం. కడుపు మంటలు మనసుకు కలిగిన గాయాలు, కడుపార కన్న సంతానాన్ని కోల్పోవడం. ఒక తల్లి కన్న బిడ్డను బ్రతికించడానికి మరొక తల్లి కన్నబిడ్డ బలియై పోయాడు అని ఈ వాక్యానికి అర్థం.

4. ఈ “పాపాత్ముల పరిపాలన” అని అనడంలో కవి ఉద్దేశం ఏమై ఉంటుంది ?
జవాబు.
పాపాత్ములు అంటే పాపం చేసినవారు. దుర్మార్గాలు చేసేవారంతా పాపాత్ములే. అటువంటి దుష్టులు దేశాన్ని పాలిస్తుంటే ప్రజల బాధలు వర్ణించరానివి. అందుకే పాపాత్ముల పరిపాలన అంతం చేస్తాం అన్నాడు కవి.

5. “మీ యడుగుజాడల్లో మాయడుగుల నుంచేస్తాం!” దీనిని మీరెట్లా అర్థం చేసుకున్నారు ?
జవాబు.
మంచివారు తన తరువాతి వారికి ఆదర్శమయ్యేలా ఎలా ఎలా నడుచుకున్నారో అలాగే మేము నడుచుకుంటాం అని అర్థం. మీ అడుగు జాడల్లో మా అడుగు వేసి నడుస్తాం అంటే మిమ్మల్ని మేం అనుసరిస్తాం అని అర్థం.

TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana అమరులు

6. ఈ ‘అమృతవర్షం కురిపించడం అంటే ఏమిటి ?
జవాబు.
అమృతం అంటే చావులేనిది. చనిపోయిన వారు మనకిక కనిపించరు. అమృతం తాగటం వల్ల అసలు చావే ఉండదు. దేశం కోస ప్రాణత్యాగం చేసిన వారు కనిపించకుండా పోయినా వారి ఆత్మల మీద అమృతం చల్లితే మన దగ్గరే ఉన్నట్లు ఉంటుందని భావం.

ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. తెలంగాణ రాష్ట్రసాధన కోసం జరిగిన ఉద్యమం గురించి మాట్లాడండి.
జవాబు.
తెలంగాణా రాష్ట్రం కోసం ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పటి నుండి అంటే 60 ఏళ్ళుగా ఉద్యమాలు సాగుతూనే ఉన్నాయి. 1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణా ఉద్యమం యావత్తు ప్రపంచాన్ని ఆకర్షించింది. కానీ అది చల్లారిపోయింది. ఆ తర్వాత గత 15 ఏళ్ళగా జరిగిన ఉద్యమం 2009లో పల్లెపల్లెలకూ పాకి తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయ్యేలా చేసింది.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

1. కింది వాక్యాలు చదువండి. అవి పాఠంలో ఎక్కడున్నాయో గుర్తించి, వాటి సందర్భం రాయండి.
(అ) సకలజనుల సమూహములు.
జవాబు.
పరిచయం : ఈ వాక్యం ఆచార్య రుక్నుద్దీన్ రాసిన అమరులు పాఠంలోనిది.
సందర్భం : తెలంగాణా విమోచన కోసం పాటుపడి ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పిస్తున్న ప్రజలు పలికిన మాటలు ఇవి.
అర్థం : మాన్యులు, ధన్యులు, శివ స్వరూపులైన అమర వీరులారా! మీకు ప్రజలంతా మంచి మనసుతో నివాళులు అర్పిస్తున్నాము.

(ఆ) క్రాంతి విడదు శాంత పడదు.
జవాబు.
పరిచయం : ఈ వాక్యం ఆచార్య రుక్నుద్దీన్ రాసిన అమరులు పాఠంలోనిది.
సందర్భం : ప్రత్యేక తెలంగాణా కోసం ఉద్యమించిన వీరుల రక్తం ఏరులై ప్రవహించింది. ఈ దుర్మార్గుల పాలన అంతమయ్యే వరకు ఈ ప్రవాహం ఆగదు అని ప్రజలు అమరుల ముందు ప్రతిజ్ఞ చేశారు.
అర్థం : ఈ రక్త ప్రవాహం ఆగదు. శాంతించదు.

(ఇ) రుధిరసిక్త యమపాశం.
జవాబు.
పరిచయం : ఈ వాక్యం ఆచార్య రుక్నుద్దీన్ రాసిన అమరులు పాఠంలోనిది.
సందర్భం : అమర వీరులు నుదుట ధరించిన రక్తతిలకం ప్రజలకు దీక్షా కంకణం వంటిది. అధికారుల మదాన్ని
అణచివేస్తుంది. అని ప్రజలు అమరులకు జోహారులర్పిస్తూ పలికారు.
అర్థం : వీరులు ధరించిన రక్తతిలకం అధికారుల పాలిట నెత్తుటితో తడిసిన యమపాశమౌతుంది.

TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana అమరులు

(ఈ) అమృతవర్షం కురిపిస్తాం.
జవాబు.
పరిచయం : ఈ వాక్యం అమరులు పాఠంలోనిది రాసిన కవి ఆచార్య రుక్నుద్దీన్.
సందర్భం : ప్రజలు అమర వీరుల బాటలో నడుస్తామని, వారివలనే మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించియైనా
ప్రత్యేక తెలంగాణా సాధిస్తామని, వారి ఆత్మలకు శాంతి కలిగిస్తామని ప్రతిజ్ఞ చేసిన సందర్భం.
అర్థం : వీరుల ఆత్మలు శాంతించేలా అమృతం వానగా కురిపిస్తాము.

(ఉ) రక్తితోడ ఇచ్చేస్తాం.
జవాబు.
పరిచయం : ఈ వాక్యం అమరులు పాఠంలోనిది. కవి ఆచార్య రుక్నుద్దీన్.
సందర్భం : అమర వీరులకు జోహార్లు చేస్తూ ప్రజలు పలికిన మాటలివి. అమరు వీరుల త్యాగాలతో ప్రజలందరికీ ప్రోత్సాహం లభించింది. వారిలో స్ఫూర్తి నింపింది. అని చెప్పిన సందర్భంలోనిదీ వాక్యం.
అర్థం : మాతృభూమి రక్షణ కోసం మీరిచ్చిన స్ఫూర్తితో రక్తం ధారపోయమన్నా సంతోషంగా ధార పోస్తాం.

(ఊ) బాహాటంగా సాధిస్తాం.
జవాబు.
పరిచయం : ఈ వాక్యం అమరులు పాఠంలోనిది. రచించిన కవి ఆచార్య రుక్నుద్దీన్.
సందర్భం : తెలంగాణా విమోచన కోసం ప్రాణత్యాగం చేసిన వీరులకు జోహారులర్పిస్తూ ప్రజలు ప్రతిజ్ఞ చేస్తూ
పలికిన మాటలివి.
అర్థం : : లోకమంతా తెలిసేలా ప్రత్యేక తెలంగాణా సాధిస్తాం.

2. కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 2009 నాటికి మహోద్యమమయింది. ఈ మలిదశ ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు, కవులు, కళాకారులు, నాయకులు, పిల్లల నుండి పెద్దల వరకు సకల జనులు పాల్గొన్నారు. ఉద్యమం శాంతియుతంగా నడవాలని ఉద్యమ నాయకత్వం కోరింది. తెలంగాణకై ప్రజలందరు ఆత్మవిశ్వాసంతో పోరాడాలని, అధైర్యంతో బలిదానాలు చేయవద్దని చెప్పింది.

ఆ ఉద్యమాల ఫలితంగా 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అమరవీరుల ఆశయం సిద్ధించింది. ప్రభుత్వం అధికారికంగా వేడుకలు నిర్వహించింది. తెలంగాణలోని ఆబాలగోపాలం ఘనంగా సంబురాలు జరుపుకున్నది. సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి అందరం కృషి చేయాలి. అదే మనం అమరవీరులకు ఇచ్చే ఘనమైన నివాళి.

ప్రశ్నలు :
అ. తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగింది ?
జవాబు.
తెలంగాణ ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగింది.

ఆ. ఉద్యమంలో ఎవరెవరు పాల్గొన్నారు ?
జవాబు.
ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు, కవులు, కళాకారులు, నాయకులు అందరూ పాల్గొన్నారు.

ఇ. ఉద్యమం పట్ల నాయకత్వానికి ఉన్న ఆలోచన ఏమిటి ?
జవాబు.
ఉద్యమం శాంతియుతంగా నడవాలని, ఆత్మహత్యలు వంటి ప్రాణాలు పోగొట్టుకునే పనులు చేయకుండా ఆత్మవిశ్వాసంతో ఉద్యమం నడపాలని నాయకత్వం కోరింది.

TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana అమరులు

ఈ. ఆబాలగోపాలం అంటే అర్థమేమిటి ?
జవాబు.
పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ అని అర్థం.

ఉ. అమరవీరులకు మనమిచ్చే నివాళి ఏమిటి ?
జవాబు.
తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దటమే మనం అమర వీరులకిచ్చే నివాళి.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. అమరవీరులను కవి “తెలంగాణ గర్భమ్మున గలిగిన శ్రీ రుద్రులారా!” అని ఎందుకు సంబోధించారు ?
జవాబు.
అమరవీరులను కవి ‘తెలంగాణ గర్భమ్మున గలిగిన శ్రీ రుద్రులారా!’ అని సంబోధించాడు. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో వీరశైవం వ్యాప్తిలో ఉండేది. శివ భక్తులను సాక్షాత్తు శివ స్వరూపులుగా భావిస్తారు. అందుకే అక్కడి ప్రజలనందరినీ కవి రుద్రులుగానే భావించి శ్రీరుద్రులారా అని సంబోధించాడు. ఓరుగల్లును పాలించిన కాకతీయులందరి పేర్లలోనూ ‘రుద్ర’ అనే పేరు చేరుతుంది. రుద్రదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు. రుద్రుడు అంటే కోపం, పరాక్రమానికి గుర్తు కనుక కవి అమర వీరులను శ్రీరుద్రులారా అని సంబోధించాడు.

ఆ. అమరవీరుల పట్ల మనమెట్లాంటి గౌరవాన్ని చూపాలి ?
జవాబు.
మాతృభూమి కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులకు మన మందరం కలిసి నివాళులర్పించాలి. వారి త్యాగాలను ఆదర్శంగా తీసుకొని మనం వారి బాటలోనే నడవాలి. మనదేశాన్ని గౌరవించాలి. మన తోడివారిని కాపాడటానికి ఎటువంటి త్యాగనికైనా సిద్ధపడాలి. అమరవీరుల ఆత్మలకు శాంతి కలిగించాలి. మనకు సిద్ధించిన స్వేచ్ఛను దుర్వినియోగం చెయ్యకూడదు. మన రాజ్యం అభివృద్ధి కోసం మనమందరం కలిసి కృషి చెయ్యాలి. సుఖశాంతులతో ఐకమత్యంతో జీవించాలి. ఇదే మన అమర వీరులు కోరినది. అప్పుడే వారి ఆత్మ శాంతిస్తుంది.

ఇ. అధికారాంధుల ప్రవర్తన ఎట్లా ఉంటుంది ?
జవాబు.
అధికారాంధులు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. అధికారమదంతో వారి కళ్ళు మూసుకుపోయి ఇతరులను తమ బానిసలుగా చూస్తారు. వారి స్వేచ్ఛను హరిస్తారు. వారి ప్రవర్తన, ఆహార విహారాలు, జీవితం తమ ఆధీనంలో ఉంచుకుంటారు. వారి చేత వెట్టి చాకిరీ చేయిస్తారు. ఇక చదువు సంధ్యల గురించి చెప్పవలసిన పనిలేదు. అటువంటి వారి అధికారాన్ని సహించకూడదు. ఆత్మవిశ్వాసంతో వారిని ఎదుర్కొని తమ హక్కులను కాపాడుకోవలసిన బాధ్యత ప్రజలదే.

ఈ. కవి ప్రతిజ్ఞలోని విషయాన్ని మీరెట్లా అర్థం చేసుకున్నారు ?
జవాబు.
కవి ‘ప్రత్యేక’ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీరతామని బాహాటంగా ప్రతిజ్ఞ చేస్తున్నారు తెలంగాణా వీరులు’ అని రాశాడు. సుమారు పన్నెండు సంవత్సరాల నించి ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం సాగుతూనే ఉన్నది. ఎప్పటికప్పుడు అధికారులు మంత్రులు ఏవేవో కారణాలు చెబుతూ వారి ఉద్యమాన్ని నీరుకారుస్తున్నారు. తమకు న్యాయం జరగాలంటే తెలంగాణ ప్రజలంతా సుఖసంతోషాలతో సమృద్ధంగా జీవించాలంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పడాల్సిందే. అప్పుడే ఏ అభివృద్ధియైనా సాధ్యమౌతుంది. కాబట్టి తెలంగాణా సాధించే తీరతామని ప్రతిజ్ఞ చేస్తున్నాడు.

ఉ. కవి అమరులు అనే కవితలో అమరవీరులను ఎలా సంబోధించాడు ? ఎందుకు ?
జవాబు.
కవి ఈ కవితలో అమరవీరులను ‘మాన్యులార; ధన్యులార, ప్రబలులార, శ్రీరుద్రులార, ఘనులార’ అని సంబోధించాడు. ఇది చాలా గౌరవించదగిన ఆశయం. అందుకే ‘మాన్యులార’ అని సంబోధించాడు. అమరవీరులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం దీక్ష వహించారు. ఇది చాలా గౌరవించదగిన ఆశయం. అందుకే ‘మాన్యులారా’ అని సంబోధించాడు.

వీరులు వారి ప్రయత్నంలో వీరమరణం పొంది తల్లి భూమి రుణం తీర్చుకున్నారు. అందుకే ‘ధన్యులార’ అనే సంబోధన పరాక్రమంలో సాక్షాత్తు రుద్రులే కనుక ‘శ్రీరుద్రులార’ అని సంబోధించాడు. పోరాటంలో తమ బల పరాక్రమాలు చూపించారు గనుక ‘ప్రబలులార’ అని సంబోధించాడు. ఇంతటి ఘనకార్యానికి పూనుకున్నారు కాబట్టి ‘ఘనులార’ అని సంబోధించాడు.

ఊ. ఈ కవితలో కవి ‘రక్తం’ అనే పదం ఎన్ని చోట్ల ఎలా ఉపయోగించాడు ?
జవాబు.

  1. ప్రత్యేక తెలంగాణ కోసం అమర వీరులు చిందించిన రక్తం పాపాత్ముల పరిపాలన అంతమయే వరకు శాంతించదు. ప్రవహిస్తూనే ఉంటుంది.
  2. అమరువీరుల ఒక్కొక్క రక్తపు చుక్క అధికంగా విషాన్ని కక్కుతుంది. శత్రువులను అంతం చేస్తుంది.
  3. అమరవీరులు దిద్దిన రక్త తిలకం ప్రజలకు దీక్షా కంకణం వంటిది.
  4. వారి రక్తం అధికార మదంతో విర్రవీగే వారి పాలిట రక్తంతో తడిసిన యమపాశం వంటిది.
  5. ప్రజలు తమ రక్తం తర్పణ చేసియైనా తెలంగాణ విముక్తికోసం పోరాడుతారు.

TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana అమరులు

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.
అ. కవి నాడు చేసిన ప్రతిజ్ఞ నేడు సాకారమైంది కదా! దీనికి పాటుబడిన వారిని గురించి వివరించండి.
జవాబు.
కవి ఆచార్య రుక్నుద్దీన్ పన్నెండేళ్ళ క్రితం రాసిన కవిత ఇది. ప్రత్యేక తెలంగాణ కోసం అమరవీరులు ముమ్మరంగా పోరాటం జరిపారు. లెక్కలేనంత మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలంతా వారి త్యాగాలను మరచి పోకుండా వారి బాటలోనే నడుస్తామని ప్రత్యేక తెలంగాణ సాధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆ ప్రతిజ్ఞ నిలబెట్టుకోడానికి నాటి నుండి నేటి వరకు ఉద్యమం ఆపలేదు. ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నారు. చివరికి ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది.

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటులో ప్రొఫెసర్ శ్రీ జయశంకర్, ఆమరణ నిరాహారదీక్ష చేసిన. శ్రీ.కె.సి.ఆర్. ఐ.కా.స. నాయకుడు శ్రీ కోదండరాం వంటి మేధావులు, రాజకీయ నాయకులతో పాటు వేలాది మంది సామాన్యజనం కూడా భాగస్తులే. ఉద్యమంలో భాగంగా ఆత్మాహుతి చేసుకున్న విద్యార్థుల పాత్ర తక్కువేమీ కాదు. సుమారు 60 రోజలు విధులు బహిష్కరించి సకల జనుల సమ్మెలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులు, దుకాణాలు మూసివేసి నిరసన వ్యక్తం చేసిన వ్యాపారస్తులు ఇలా అందరూ తమ వంతు కృషివల్లే తెలంగాణా రాష్ట్రం సాకారమైంది.

ఆ. అమరులు కవితా సారాంశాన్ని రాయండి.
జవాబు.
‘అమరులు’ అనే కవితను ఆచార్య కె. రుక్నుద్దీన్ రచించారు. ఈ కవితలో అమరవీరులకు ప్రజాసమూహం నివాళులర్పించిన విధాన్ని కవి వివరించాడు.
తెలంగాణ ప్రజలకోసం, మాతృభూమి విముక్తి కోసం ప్రాణత్యాగం చేసిన ధన్యజీవులారా! మీకు జోహార్లు. వీరులారా! మీ జీవితం తెలంగాణ భూమిపుత్రుల సేవలలోనే తరించింది. ఈ సమాజమంతా మీకు జోహార్లు అర్పిస్తుంది. ఇక్కడి ప్రజల సుఖసంతోషాల కోసం మీరు, మీ కుటుంబసభ్యులు ఎన్నో బాధలను అనుభవించారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం పారిన రక్తం పాపాత్ముల పరిపాలన అంతమయ్యేవరకు విశ్రమించదు.

శాంతించదు. మీ ఒక్కొక్క రక్తపుచుక్క తెలంగాణ వ్యతిరేకులపై విషం చిమ్ముతుంది. మీ ఆవేశం ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని ప్రతి నిమిషం ప్రబోధిస్తుంది. మీరు ధరించిన రక్తతిలకం మాకు స్ఫూర్తినందిస్తుంది. అది అధికార మదంతో బలిసిన వారికి యమపాశమవుతుంది. మీ అడుగులలో అడుగేస్తూ మా నెత్తురు ధారపోస్తాం. రక్తతర్పణలను చేస్తాం. నింగి, నేలలో విస్తరించిన సమస్త ప్రాణులారా! మా ప్రతిజ్ఞ వినండి. బాహాటంగానే తెలంగాణను సాధిస్తాం. అమరుల ఆత్మలు శాంతించే విధంగా అమృతవర్షం కురిపిస్తాం.

IV. సృజనాత్మకత/ప్రశంస

1. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి త్యాగాన్ని గురించి ఒక కవిత/గేయం రాయండి.

అమరవీరులకు భక్త్యంజలి
మరణించిన మహావీరులు
నిజంగా మరణించరు
అమరులైన ఆ వీరులు
ఆ చంద్ర తారార్కంగా
అందరి హృదయాల్లోనూ
అత్యున్నతమైన ప్రేమ
పీఠాలను అధివసించి ఉంటారు
ఆదిత్యుని అంశువుల వలె
అనంతమైన ప్రకాశాన్ని వెదజల్లుతుంటారు
నిరంతరం మనకు నిండు వెలుగు బాటల్ని
చూపుతుంటారు నిత్యం మనకు
అభ్యుదయ పథం నిర్దేశిస్తుంటారు.

V. పదజాల వినియోగం

1. కింది పదాలకు పర్యాయపదాలు (అదే అర్థం వచ్చే పదాలను) రాయండి.

(అ) సమూహం  =
జవాబు.
గుంపు, సముదాయం

(ఆ) అసువులు  =
జవాబు.
ప్రాణములు, ఉసురు

ఇ) స్వేచ్ఛ =
జవాబు.
విడుదల, స్వాతంత్ర్యం

ఈ) సఖులు =
జవాబు.
స్నేహితులు, మిత్రులు, సోపతిగాళ్ళు

2. కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు గల నానార్థాలు (వేరు వేరు అర్థాలు) రాయండి.

(అ). ఈ వర్షంలో కురిసిన పెద్ద వర్షం ఇది.
జవాబు.
సంవత్సరం – వాన

(ఆ) అమృతంతో పాయసం చేశారు. అమృతంతో చేతులు కడిగారు.
జవాబు.
పాలు – నీరు

3. కింది వృత్తంలో గల ప్రకృతి, వికృతి పదాలను గుర్తించి రాయండి.

ప్రకృతి – వికృతి
ప్రతిజ్ఞ – ప్రతిన
ఆకాశం – ఆకసం
భాగ్యం – బాగ్గెం
శ్రీ – సిరి

VI. భాషను గురించి తెలుసుకుందాం

సంధులు

1. కింది పదాలను విడదీసి, సంధిపేరు రాయండి.

(అ) ఉద్రేకాస్త్రం = ఉద్రేక + అస్త్రం = సవర్ణదీర్ఘసంధి
(ఆ) మొట్టమొదలు = మొదలు + మొదలు = ఆమ్రేడిత సంధి
(ఇ) లావైన = లావు + ఐన = ఉత్వసంధి
(ఈ) అనంతాకాశం = అనంత + ఆకాశం =సవర్ణదీర్ఘ సంధి
(ఉ) ఒక్కొక్క = ఒక్క + ఒక్క = ఆమ్రేడిత సంధి

2. కింది వాక్యాలను చదువండి. తేడా చెప్పండి

ఆమె ముఖం అందంగా ఉన్నది.
ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది.

పై వాక్యాల్లోని తేడాను చూస్తే ‘ఆమె ముఖం అందంగా ఉన్నది’ అనే దానికి బదులు ‘ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది’ అనే వాక్యం బాగా ఆకట్టుకుంటుంది. కదా! ఇట్లా ఆకట్టుకునేటట్లు చెప్పడానికి చంద్రబింబం అనే పోలికను తీసుకున్నాం. ఇట్లా చక్కని పోలికతో చెప్పడాన్నే ‘ఉపమాలంకారం’ అంటాం. పై వాక్యాన్నిబట్టి చూస్తే ఉపమాలంకారంలో నాలుగు అంశాలను గమనించవచ్చు. అవి :

1. ఉపమేయం – దేనిని లేక ఎవరిని పోలుస్తున్నామో తెలిపేది. (ఆమె ముఖం – ఉపమేయం)
2. ఉపమానం – దేనితో లేక ఎవరితో పోలుస్తున్నామో తెలిపేది. (చంద్రబింబం – ఉపమానం)
3. సమానధర్మం – ఉపమేయ, ఉపమానాల్లో ఉండే ఒకేవిధమైన ధర్మం. (అందంగా ఉండడం – సమానధర్మం)
4. ఉపమావాచకం – పోలికను తెలిపే పదం. (వలె – ఉపమావాచకం)
“ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ఉపమాలంకారం.”

TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana అమరులు

3. కింది ఉదాహరణలు చదువండి. దేనిని దేనితో పోల్చారో, వాటిలోని సమానధర్మం ఏమిటో చెప్పండి.
(అ) ఏకలవ్యుడు అర్జునుడి వలె గురితప్పని విలుకాడు.
జవాబు.
ఉపమాన ఉపమేయాలకు చక్కనిపోలిక చెప్పటమే ఉపమాలంకారం. ఈ వాక్యంలో ఏకలవ్యుడిని అర్జునునితో పోల్చారు. (ఏకలవ్యుడు – ఉపమేయం, అర్జునుడు – ఉపమానం) గురి తప్పకుండా బాణాలు వేయడం సమానధర్మం. పోలికను తెలిపే పదం ‘వలె’ ఉపమావాచకం.

(ఆ) తోటలో పిల్లలు సీతాకోక చిలుకల్లాగా అటూ ఇటూ తిరుగుతున్నారు.
జవాబు.
ఈ వాక్యంలో పిల్లలను సీతాకోకచిలుకలతో పోల్చారు. కనుక ఉపమాలంకారం. పిల్లలు – ఉపమేయం. సీతాకోక చిలుకలు – ఉపమానం. అటూ ఇటూ తిరగడం – సమానధర్మం. ‘లాగా’ అనే పోలికను తెలిపే పదం ఉపమావాచకం.

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని

1. తెలంగాణ ఉద్యమం సందర్భంగా వచ్చిన పాటలను లేదా ఉద్యమకాలంలో జరిగిన ఒక కార్యక్రమం గురించి వివరాలు సేకరించి నివేదిక రాయండి. తరగతిలో ప్రదర్శించండి.
జవాబు.
(అ) ప్రాథమిక సమాచారం :

  1. ప్రాజెక్టు పని పేరు
  2. సమాచారాన్ని సేకరించిన విధానం

(ఆ) నివేదిక :
1. నాగేటి సాళ్ళల్లొ నా తెలంగాణ

పల్లవి : నాగేటి సాళ్ళల్లొ నా తెలంగాణా నా తెలంగాణా
నవ్వేటి బతుకులా నా తెలంగాణా నా తెలంగాణా || 2 ||

చరణం 1 : పారేటి నీళ్ళల్ల పానాదులల్లా
పూసేటి పువ్వుల్ల ……………… పునాసాలల్లా || 2 ||
కొంగు జాపిన నేల …………….. నా తెలంగాణా నా తెలంగాణా
పాలు తాపిన తల్లి …………….. నా తెలంగాణా నా తెలంగాణా || నాగేటి ||

చరణం 2 :
తంగేడి పువ్వుల్ల ……………… తంబాల మంతా
తీరాక్క రంగుల్ల ………………. తీరిచ్చినావూ
తీరొ రంగుల్ల ………………… తీరిచ్చి నావూ
బంగారు చీరలు బాజారులన్నీ || 2 ||
బతుకమ్మ పండుగ నా తెలంగాణా ………….. నా తెలంగాణా
బంతిపూల తోట నా తెలంగాణా …………… నా తెలంగాణా || నాగేటి ||

చరణం 3 : వరద గూడు గడితె వానొచ్చునంటా
బురద పొలం దున్న బురి సున్న రంతా || 2 ||
శివుని గుళ్ళో నీరు ……………… సీమలకు సెక్కరి
వాన కొరకు జడకొప్పులేసీ
వాగుల్లా వంకల్ల నా తెలంగాణా ……………….. నా తెలంగాణా || నాగేటి ||

చరణం 4 :
కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు
పాల పిట్టల జూసి పడుచు చప్పట్లు || 2 ||
పాల పిట్టల జూసి పడుచు చప్పట్లు
జొన్న కర్రల జండ జోరున్న దేమీ || 2 ||
అళై భళై తీసె నా తెలంగాణా ………………. నా తెలంగాణా
తిండి పంచిన ఆర్తి నా తెలంగాణా …………….. నా తెలంగాణా || నాగేటి ||

2. ఉస్మానియా క్యాంపస్ లో

ఉస్మానియా క్యాంపస్ లో …………….. ఉదయించిన కిరణమా ……………. వీర తెలంగాణమా
వీర తెలంగాణమా …………….. నాలుగు కోట్ల ప్రాణమా
కాకతీయ ప్రాంగణంలో …………. కురిసిన ఓ వర్షమా వీర తెలంగాణమా
వీర తెలంగాణమా ………….. నాలుగు కోట్ల ప్రాణమా || వీర ||
భలె …………… భలె ……………… భలె ……………… || ఉస్మానియా ||

నల్లగొండ నడిబొడ్డున నాటిన ఓ ఖడ్గమా వీర తెలంగాణమా
వీర తెలంగాణమా ……………. నాల్గు కోట్ల ప్రాణమా
మహబూబ్నగర్ మట్టిలోన
మొలచిన మందారమా ………………. వీర తెలంగాణమా
వీర తెలంగాణమా ……………… నాల్గు కోట్ల ప్రాణమా
భలె …………… భలె ……………… భలె ……………… || ఉస్మానియా ||

హైదరాబాద్ బడిలోన చేసిన బలిదానమా వీర తెలంగాణమా
వీర తెలంగాణమా ……………. నాల్గు కోట్ల ప్రాణమా
రంగారెడ్డి ఫ్యాక్టరీలో మోగిన నగారమా వీర తెలంగాణమా
భలె …………… భలె ……………… భలె ……………… || ఉస్మానియా ||

మెదక్ సీమ గాలిలోన త్యాగాలా గంధమా వీర తెలంగాణమా
వీర తెలంగాణమా ……………. నాల్గు కోట్ల ప్రాణమా
నిజామాబాద్ నుదుటి మీద దిద్దిన ఓ కుంకుమ ……………. వీర తెలంగాణమా
వీర తెలంగాణమా నాల్గు కోట్ల ప్రాణమా …………..
భలె …………… భలె ……………… భలె ……………… || ఉస్మానియా ||

కరీంనగర్ రైతుకూలీ చిందించిన రక్తమా వీర తెలంగాణమా
వీర తెలంగాణమా ………………… నాల్గు కోట్ల ప్రాణమా
అరెరె రరెరె ఆదిలాబాద్ అడవుల్లో రాజుకున్న రౌద్రమా …………… వీర తెలంగాణమా
వీర తెలంగాణమా …………………. నాల్గు కోట్ల ప్రాణమా
భలె …………… భలె ……………… భలె ……………… || ఉస్మానియా ||

వరంగల్లు గడ్డమీద చేసిన నినాదమా …………………. వీర తెలంగాణమా
వీర తెలంగాణమా …………… నాల్గు కోట్ల ప్రాణమా
ఖమ్మం, మొట్టు పెల్లలోన ఉప్పొంగిన కెరటమా వీర తెలంగాణమా
వీర తెలంగాణమా …………… నాల్గు కోట్ల ప్రాణమా
భలె …………… భలె ……………… భలె ……………… || ఉస్మానియా ||

TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana అమరులు

(ఇ) ముగింపు :
మాట కన్నా పాట సామాన్యులకు తొందరగా చేరుతుంది. వారిని ఉత్తేజితుల్ని చేస్తుంది. తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎంతో మంది కవులు రాసిన పాటలు ప్రజలలో చైతన్యం నింపడానికి ఎంతగానో తోడ్పడ్డాయి.
TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana అమరులు 3

తెలంగాణ ఉద్యమ కాలంలో జరిగిన ఒక కార్యక్రమం:

(ఆ) నివేదిక :

సకల జనుల సమ్మె

తెలంగాణ ఉద్యమ కాలంలో జరిగిన వివిధ రకాల కార్యక్రమాలలో నేను ప్రత్యక్షంగా చూచిన సకలజనుల సమ్మె గూర్చి పొందు పరుస్తున్నాను.
సిరిసిల్ల R.D.O ఆఫీస్ ఎదురుగా టెంట్ వేసిన తెలంగాణ ఉద్యోగుల జాయింట్ ఆక్షన్ కమిటి 42 రోజుల పాటు వివిధ రూపాలలో తెలంగాణ ఇవ్వాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ రకరకాల కార్యక్రమాలు నిర్వహించింది. డివిజన్లోని అన్ని మండలాల్లోని ఉద్యోగులు స్వచ్ఛందంగా 42 రోజులు తమ విధులను బహిష్కరించి ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. రోజుకు కొంతమంది నిరాహార దీక్షలో కూర్చోవడం … జానపద గీతాలు పాడే గాయకులను తీసుకువచ్చి ఉద్యమ గీతాలు పాడించడం, వంటా వార్పు, రోడ్ల దిగ్బంధనం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఉద్యోగులు చేస్తున్న ఈ ఉద్యమానికి అటు రాజకీయ నాయకులు, ఇటు ప్రజల నుండి భారీ మద్దతు లభించింది. రోజుకో కుల సంఘాలు ర్యాలీగా వచ్చి వీరి ఉద్యమానికి మద్దతు తెలియజేశాయి. రోజురోజుకు తీవ్రమౌతున్న ఈ ఉద్యమాన్ని అణచడానికి అప్పటి ప్రభుత్వం ఎన్నో బెదిరింపులకు పాల్పడింది. తాత్కాలిక ఉద్యోగులతో పని చేయిస్తామని… ఉద్యోగాలు పోతాయని ఎన్ని రకాలుగా భయపెట్టినా ఉద్యోగులు లొంగలేదు.

చివరకు ………. విద్యార్థులు నష్టపోతారని, ప్రజలకు బాగా ఇబ్బంది అవుతుందని …….. ఉద్యోగ సంఘాలు సమ్మె విరమించాయి. ఉద్యమం జరుగుతున్నన్ని రోజులు వక్తలచే తెలంగాణ ఆవశ్యకత గూర్చి ఉపన్యాసాలు ఇప్పించడం, కళాకారులచే పాటలు పాడించడం, వంటా వార్పు లాంటి కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలు … కొన్ని రాజకీయ పార్టీల విజ్ఞప్తితో సమ్మె విరమించి విధుల్లో చేరారు.

(ఇ) ముగింపు :
ఒక నెల జీతం 4 రోజులు లేటైతేనే తల్లడిల్లే ఉద్యోగులు 42 రోజులు “సకల జనుల సమ్మె” లో పాల్గొనడం చాలా గొప్ప విషయం. ఈ 42 రోజుల సమ్మె కాలంలో ఇంటి అద్దె, పాల బిల్లు, పేపరు బిల్లు, కరంటు బిల్లు చెల్లించలేని పరిస్థితి వచ్చింది. అయినా ఉద్యోగులు ధైర్యంగా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రజలు కూడా వీరికి బాగా సహకరించారు.

TS 8th Class Telugu 9th Lesson Important Questions అమరులు

పర్యాయపదాలు

  • జనని = మాత, అమ్మ, తల్లి, అంబ
  • తనువు = శరీరం, దేహం, మేను
  • ఆకాశం = గగనం, విహాสసం, ఖం
  • అస్త్రం = శరం, బాణం, తూపు
  • అధికారం = పదవి, ఏలుబడి
  • భూమి = ధర, ధాత్తి, ధరణి
  • గర్ఖము = కడుపు, పొట్ట
  • రక్తము = రుధిరము, నెత్తురు

నానార్థాలు

  • తనువు = శరీరం, అల్పమైనది
  • వర్షం = వాన, సంవత్సరం,
  • అమృతం = పాలు, నీరు, నేయి, సుధ
  • పాసిన = వదలిన, పాడైపోయిన

ప్రకృతిలు – వికృతిలు

  • భూమి – బూమి
  • విషము – విసము

TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana అమరులు

సంధులు

మాకై = మాకు + ఐ = ఉత్వసంధి
తనువొడ్డిన = తనువు + ఒడ్డిన = ఉత్వసంధి
రక్తతర్పణమ్మయినా = రక్త తర్పణమ్ము + అయిన = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైతే సంధి అవుతుంది.

అధికారాంధులు = అధికార + అందులు = సవర్ణదీర్ఘ సంధి
ఉద్బోధార్థ = ఉద్బోధ + అర్థం = సవర్ణదీర్ఘ సంధి
పాపాత్ములు = పాప + ఆత్ములు = సవర్ణదీర్ఘసంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.

స్వేచ్ఛ = స్వ + ఇచ్ఛ = గుణసంధి
సూత్రం : అకారానికి ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమంగా ఏ, ఓ, అర్ లు ఏకాదేశమవుతాయి.

సమాసములు

  • తెలంగాణ గర్భము = తెలంగాణ యొక్క గర్భము = షష్ఠీ తత్పురుష సమాసం
  • జనుల సమూహములు = జనుల యొక్క సమూహములు = షష్ఠీ తత్పురుష సమాసం
  • రక్తపు చుక్క = రక్తము యొక్క చుక్క = షష్ఠీ తత్పురుష సమాసం
  • రక్తపు తిలకం = రక్తము యొక్క తిలకం = షష్ఠీ తత్పురుష సమాసం
  • అధికారాంధులు = అధికారముతో అంధులు = తృతీయాతత్పురుష సమాసం
  • రుధిర సిక్తం = రుధిరముతో సిక్తం = తృతీయాతత్పురుష సమాసం

గేయాలు – ప్రతిపదార్థాలు – భావాలు:

మాకై అసువులు బాసిన
మాన్యులార ! ధన్యులార !
మాతృభూమి స్వేచ్ఛ కొరకు
బలియయ్యిన ప్రబలులార !
తెలంగాణ గర్భమ్మున
గలిగిన శ్రీ రుద్రులార
జనని, సఖుల, సేవలకై
తను వొడ్డిన ఘనులారా !
ప్రాణాలను వదిలారు.
సౌహార్దతతోడ నిచ్చు
బలైనారు. తెలంగాణ
జోహారులు, జోహారులు
సకలజనుల సమూహములు
సమర్పించు జోహారులు

అర్థాలు :
మాకై = మాకోసం
అసువులు = ప్రాణాలను
పాసిన = వదిలిన
మాన్యులార = గౌరవనీయులారా !
ధన్యులార = ధన్లులారా!
మాతృభూమి = జన్మభూమి యొక్క
స్వేచ్ఛ కొరకు = స్కాతంత్రం క్రోసం
బలి + అయ్యిన = (ప్రాణాలు కోల్పోయిన
ప్రబలులార = బలవంతులారా !
తెలంగాణ గర్భమ్మున = తెలంగాణ తల్లి కడుపులో నుండి
కలిగిన = జన్మించిన
శ్రీ రుద్రులారా = శివ స్వరూపులారా !
జనని = తల్లి యొక్క
సఖుల = మిత్రుల యొక్క
సేవలకు + ఐ = సేవకోసం
తనువు + ఒడ్డిన = శరీరం త్యాగం చేసిన
ఘనులారా = మహనీయులారా !
సౌహార్దత తోడన్ = మంచి మనసుతో
ఇచ్చు = మేమిచ్చు
జోహారులు = నివాళులు
సకల జనుల సమూహములు = పజలందరూ కలసి
సమర్పించు = మీకు అందించు
జోహారులు = నివాళులు (అందుకోండి)

భావం : ఓ మాన్యులారా! ధన్యులారా!మహనీయులారా! రుద్రరూపులారా! ఈ తెలంగాణ తల్లి కడుపున పుట్టి మాతృభూమికి స్వేచ్ఛ కలిగించటానికి మీరు మీ ప్రాణాలనే త్యాగంచేశారు. అటువంటి ఘనులైన మీకు మా ప్రజలందరం కలిసి జోహారు చేస్తున్నాము. అందుకోండి.

2. ఏ తల్లి కడుపు పంటల కొరకో
నీ తల్లి కడుపు మంటల మాడెను
ఏ సతి సౌభాగ్ముల్ముల కొరకో
నీ సతి కుంకుమ గోల్పోయెను
ప్రత్యేక తెలంగాణ కొరక్న
ప్రవహించిన నీ రక్తం
పాపాత్ముల పరిపాలన
పటాపంచలా పర్యంతం
(కరాంతి విడదు – శాంత పడదు

అర్థాలు :
ఏ తల్లి = ఎవరో తల్లి
కడుపు పంటల కొరకు + ఓ = కన్న బిడ్డల కోసమో
మీ తల్లి కడుపు = మీ అమ్మసంతానం (మీరు)
మంటల మాడను = మంట గలిసి పోయింది
ఏ సతి = ఎవరో భార్లల యొక్క
సౌభాగ్మ్ముల కౌరకు + ఓ = పసుపు కుంకుమల కోసం
నీ సతి = నీ భార్య
కుంకుమ + కోల్పోయెను = తన నుదుటి కుంకుమ పోగొట్టుకుంది
ప్రతి + ఏక= ప్రత్యేక = ప్రత్యేకమైన
తెలగగాణా కొరు + ఐ = తెలంగాణ రాష్టం కోసం
ప్రవహించిన = కాలువలు గట్టిన
నీ రక్తం = నీ నెత్తురు
పాప + ఆత్ముల = దుర్మార్గుల యొక్క
పరిపాలన = ఏలుబడి
పటాపంచలు + ఔ = నాశనమయ్యే
పర్యంతం = సమయం వచ్చే వరకు
(కాంతి విడదు = విప్లవం ఆగదు
శాంత పడదు = శాంతింపదు

భావం : ఎవరో తల్లి కన్న సంతానాన్ని కాపాడటానికి, ఎవరో పతివ్రతల సౌభాగ్రం కాపాడటానికి నీ ప్రాణాలను ధార పోశావు. తెలంగాణ గడ్డపై దుర్మార్గల పాలన అంతమయ్యే వరకు ప్రత్యేక తెలంగాణ ఏర్పడేవరకు కాల్వలు గట్టిన అమరవీరుల రక్తం ప్రవాహం ఆగదు. శాంతించదు.

3. మీ వొక్కొక్క రక్తపు చుక్కే
లారైన విషమ్ముల గ్రక్కే
ఈ వీరుల ఉద్రేకాస్త్రం
ఈ వీరుల ఉద్బోధార్థం
నీ పెట్టిన రక్తపు తిలకం
నా పాలిటి దీక్షా బంధం
అధికారాంధుల పాలిటి
రుధిరసిక్త యమపాశం

అర్థాలు :
మీ = అమరవీరులైన మీ యొక్క
ఒక్క ఒక్క = ప్రతి ఒక్క
రక్తము + చుక్క + ఏ = నెత్తురు బొట్టూ
ఈ వీరుల = ఈ ఉద్యమ వీరుల యొక్క
లావు + ఐన = అధికమైన
విషములన్ + క్రక్కే = విషాన్ని (పసరించే
ఉద్రేక + అస్త్రం = ఆవేశం అనే ఆయుధం
ఈ వీరుల = పోరాటం సాగిస్తున్న వీరులను
ఉద్బోధ + అర్థం = ప్రోత్సహించటానికే
నీవు + పెట్టిన = నీవు దిద్దిన
రక్తము + తిలకం = వీర తిలకం
దీక్షా బంధం అధికార + అంధుల = దీక్షపూని కట్టిన కంకణం
పాలిటి = అధికార మదంతో కళ్ళు మూసుకుపోయిన వారికి
రుధిరసిక్త = రక్తంతో తడిసిన
యమపాశం యముని పాశం వంటిది

భావం : అమర వీరులైన మీ యొక్క ప్రతి నెత్తురు చుక్కా ఉద్యమ వీరుల చేతిలో విషాన్ని చిమ్మే ఆవేశమనే ఆయుధం ఔతుంది. వీరులను ఉత్సాహపరుస్తుంది. మీరు ధరించిన రక్తతిలకం నాచేతికి కట్టుకున్న దీక్షా కంకణం. అధికారమదంతో కళ్ళుమూసుకుపోయిన పాలకులకు నెత్తురుతో తడిసిన యమపాశం వంటిది.

4. రక్త తర్పణమ్మయినా
రక్తితోడ యిచ్చేస్తాం
మీ యడుగుల జాడల్లో
మాయడుగుల నుంచేస్తాం

అనంతాకాశం
సువిశాల భూవలయం
మధ్నున్న ఓ సమస్త ఫ్రాణులారా !
మా ఘతిన వినుడు

పత్యేక తెలంగాణా
బాహటటంగా సాధిస్తాం !
మృతవీరుల ఆత్మలలో
అమృత వర్షం కురిపిస్తాం.

అర్థాలు :
రక్త తర్పణమ్ము + అయినా = నెత్తురు ధార పోయుమన్నా
యిచ్చేస్తాం = త్యాగం చేస్తాం
మీ + అడుగు జాడల్లో = మీ కాలి గుర్తుల్లో
మా + అడుగులన్ = మా పాదాలను
ఉంచేస్తాం = కలిపేస్తాం
అనంత + ఆకాశం = విశాలమైన ఆకాశానికి
సువిశాల = మిక్కిలి వసస్తారమైన
భూవలయం = భూగోళానికీ
మధ్యన + ఉన్న = మధ్లలో ఉన్న
ఓ సమస్త ప్రాణులారా = సమస్తమైన జీవులారా!
మా ప్రతిన = మా ప్రతిజ్ఞను
వినుడు = వినండ
ప్రతి + ఏక = ప్రత్యేకమైన
తెలంగాణా = తెలంగాణా రాజ్యాన్ని
సాధిస్తాం = సంపాదిస్తాం
మృతవీరుల = చనిపోయిన వీరుల యొక్క
ఆత్మలలో = ఆత్మలపైన
అమృతవర్షం = అమృతాన్ని వర్షంలాగా
కురిపిస్తాం = కురిసేట్లు చేస్తాం

భావం : సంతోషంతో మా నెత్తురు ధారపోస్తాం. మీ కాలి జాడలను అనుసరించి వేంు నడుస్తాం. ఆకాశానికి భూమికి మధ్య నివసించే ప్రాణులందరూ మా ప్రతిజ్ఞ వినండి. ప్రత్యేక తెలంగాణ రాజ్యాన్ని మేము సాధించి తీరుతాం. అమర వీరుల ఆత్మల మీద అమృత వర్షం కురిపిస్తాం.

నేపథ్యం / ఉద్దేశీ

ప్రశ్న. 1.
అమరులు పాఠ్యభాగ నేపథ్యం వివరించండి.
జవాబు.
ప్రత్యేక తెలంగాణను కాంక్షిస్తూ 1969లో పెద్ద ఎత్తున తెలంగాణ (ప్రజలు ఉద్యమం చేశారు. నాటి పోరాటంలో 360 కి పైగా విద్యార్థులు, యువకులు (్రాణత్యాగం చేశారు. ఆ అమరవీరులకు ప్రజలు, కవులు, కళాకారులు తమదైన రీతిలో నివాళులు అర్పించారు. ఆచార్య రుక్నుద్దీన్ అమరవీరులకు తన కవితల ద్వారా నివాళులు అర్బించాడు. తెలంగాణ ఉద్యమంలో నాటి నుండి నేటివరకు అమరులైన వీరి త్యాగాలను స్మరించుకోవడమే ఈ పాఠం ఉద్దేశం. (1969 సంఘటనకు సంబంధించి అప్పుడు రాసిన కవిత కాబట్టి పాఠంలో “[ప్రత్యేక తెలంగాణా బాహాటంగా సాధిస్తాం” అని ఉన్నది. దాన్ని గమనించండి.)

TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana అమరులు

ప్రశ్న 2.
అమరులు పాఠ్యభాగ వివరాలు తెల్పండి.
జవాబు.
ఈ పాఠం గేయ (ప్రక్రియకు చెందినది. ఇది ఆచార్య క. రుక్నుద్దీన్ రాసిన ‘విప్లవ ఢంకా’ అనే కవితా సంకలనంలోనిది.

కవి పరిచయం:

కవి పేరు : ఆచార్య కె. రుక్నుద్దీన్
పాఠ్యభాగం పేరు : అమరులు
కాలం : 2/5/1947 – 26/5/2013
జన్మస్థలం : నాగర్ కర్నూలు జిల్లా రాచూరు గ్రామం.
వృత్తి : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు.
పరిశోధనాత్మక గ్రంథం : జానపద సాహిత్యంలో అలంకార విధానం.
పాఠ్యభాగ గ్రంథం : విప్లవఢంకా
ఇతర రచనలు : ప్రయాణం, సూక్తిసుధ, శెలిమె, కిన్నెరమెట్లు, మోదుగపూలు, విశ్వదర్శనం
సత్కారాలు : వివిధ సాహిత్య సంస్థల నుండి పురస్కారాలు.
విశేషాంశాలు : బహుముఖ ప్రజ్ఞాశాలిగా, సామాజిక స్పృహ కలిగిన సాహిత్యవాదిగా, పాలమూరు ఆణిముత్యంగా కీర్తి పొందారు.

ప్రవేశిక:

ప్రశ 1.
అమరులు పాఠ్యభాగ ప్రవేశికను వివరించండి.
జవాబు.
వలస పాలనలోని వివక్షపై, తమ ప్రాంత విముక్తి కోసం, స్వపరిపాలన కోసం, సహజవనరుల సంరక్షణ కోసం, తమదైన భాష, సంస్కృతలులను కాపాడుకోవటం కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమాలు చేశారు. 1969 ఉద్యమంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయక ఆశయసిద్ధి కొరకు పోరాడి అమరులైన వీరులకు కవి ఎట్లా నివాళులు అర్పించాడో తెలుసుకుందాం.

కఠినపదాలకు అర్థాలు:

అసువులు – ప్రాణాలు
మాన్యులు – గౌరవనీయులు
పాసిన – పాయుట, వదిలిపెట్టుట
రుద్రుడు – శివుడు
సౌహార్దత – మంచి మనసు
జోహారులు – నివాళులు
పరిపాలన – ఏలుబడి
క్రాంతి – విప్లవం
సతి – భార్య
పతి – భర్త
లావు – బలము, ఎక్కువ, అధికం
ఉద్బోధ – సందేశం
అంధులు – గ్రుడ్డివారు, కళ్ళు లేనివారు
రుధిరం – రక్తం
సిక్త – తడిసిన
యమపాశం – యముని చేతిలోని దండం
ప్రతిజ్ఞ – ప్రతిన
భూవలయం – భూమండలం

నేనివి చేయగలనా?

TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana అమరులు 2

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 3rd Lesson బండారి బసవన్న Textbook Questions and Answers.

బండారి బసవన్న TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana

చదువండి ఆలోచించి చెప్పండి.

గోల్కొండ పాలకుడు అబుల్ హసన్ తానాషా. ఇతని పాలనా కాలంలో భద్రాచలం తహశీల్దారుగా కంచర్ల గోపన్న ఉండేవాడు. ఆయన శ్రీరామభక్తుడు. ప్రజల నుండి వసూలు చేసిన సుమారు ఆరు లక్షల రూపాయల పన్నుతో భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించాడు. సీతారాములకు విలువైన నగలు చేయించాడు. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశాడనే నెపంతో గోపన్నను కారాగారంలో బంధించారు. గోపన్న తన కీర్తనలతో శ్రీరాముడిని వేడుకొన్నాడు. శ్రీరాముడే తానాషాకు ఆ సొమ్ము చెల్లించి బంధవిముక్తుడిని చేశాడు.

ప్రశ్నలు

ప్రశ్న 1.
కంచర్ల గోపన్న ఎవరు ?
జవాబు.
కంచర్ల గోపన్న గోలకొండ పాలకుడైన అబుల్ హసన్ తానాషా పాలనాకాలంలో భద్రాచలం తహశీల్దారుగా ఉండేవాడు. గోపన్న గొప్ప శ్రీరామభక్తుడు.

ప్రశ్న 2.
అతనిపై మోపిన అభియోగమేమిటి ?
జవాబు.
ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశాడని అతనిపై అభియోగం మోపబడింది.

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న

ప్రశ్న3.
గోపన్న ఎట్లా బంధ విముక్తుడయ్యాడు ?
జవాబు.
గోపన్న తన కీర్తనలతో శ్రీరాముని వేడుకున్నాడు. కరుణించిన శ్రీరాముడు గోపన్న ఇవ్వవలసిన సొమ్ము తానే చెల్లించి బంధవిముక్తుడిని చేశాడు.

ప్రశ్న 4.
గోపన్న వంటి భక్తులను గురించి మీకు తెలుసా ?
జవాబు.
గోపన్న వంటి భక్తులకు మనదేశం పెట్టింది పేరు. అన్నమయ్య శ్రీ వేంకటేశ్వరుని మీద భక్తితో సుమారు ముప్పై మూడువేల సంకీర్తనలు రాశాడు. దైవాన్ని తప్ప మానవులను స్తుతించను, వారిపై కీర్తనలు రాయను అన్నందుకు ఘోరశిక్షలను అనుభవించాడు. క్షేత్రయ్య మొవ్వ వేణుగోపాలస్వామి భక్తుడు. మధురభక్తితో పదాలు రచించి ఆ దేవుని కీర్తించాడు. తరిగొండ వెంగమాంబ, అక్క మహాదేవి రచయిత్రులు కూడ భగవంతునిపై కీర్తనలు, వచనాలు రాశారు.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.24)

ప్రశ్న 1.
‘సురతరువు, కనకాచలం, సురధేనువు, భక్తి చింతామణి అనే పదాలను వాడడంలో కవి ఉద్దేశం ఏమిటి ?
జవాబు.
సురతరువు పాలసముద్రం నుండి పుట్టి దేవలోకంలో ఉన్న గొప్ప వృక్షము. కనకాచలం దేవలోకంలో ఉన్న బంగారపుకొండ. పార్వతీదేవి నివాసం చాలా ఎత్తైనది. సురధేనువు పాలసముద్రం నుండి పుట్టి బ్రహ్మర్షి వసిష్ఠుని ఆశ్రమంలో పూజలందుకుంటున్న కామధేనువు. చింతామణి పాలసముద్రం నుంచి పుట్టింది. కోరిన కోరికలు తీర్చే రత్నం. ఇలా ఇవన్నీ చాలా గొప్పవి. వాటిని తుచ్ఛమైన వాటితో పోల్చరాదు. అలాగే శివభక్తులు చాలా గొప్పవారు. ఆ భక్తిలో మునిగినవారు అల్పమైన కోరికలకు లొంగరు అని చెప్పటం కవి ఉద్దేశం.

ప్రశ్న 2.
‘బగుతుడాసించునే పరధనమునకు’ దీనిపై మీ అభిప్రాయమేమిటి ?
జవాబు.
పగతుడు అంటే శత్రువు. శత్రువు మనపైన దాడిచేయటానికి కారణం రాజ్యం మీదనో, భూమి మీదనో, ధనం మీదనో ఆశ కలిగి ఉండటం. అటువంటి శత్రువు కూడా శివభక్తి కలిగి ఉన్నప్పుడు ఇతరుల ధనాన్ని కోరడు. అటువంటిది శివభక్తి వ్రతంగా బ్రతికే బసవన్న రాజు ధనాన్ని కోరడు అని కవి బసవని భక్తిని గురించి వర్ణించాడు అని నా అభిప్రాయం.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.25)

ప్రశ్న 1.
‘శివ భక్తులను హంస, చిలుక, చకోరం, తుమ్మెదలతో కవి ఎందుకు పోల్చి ఉంటాడు ?
జవాబు.
హంస శ్రేష్ఠమైన పక్షి. మానస సరోవరంలో విహరిస్తుంది. చిలుక పలుకు నేర్చి రామనామం జపించే ఉత్తమమైన పక్షి. అల్పమైన పండ్లను కోరదు. మామిడిపండ్లు మాత్రమే తింటుంది. చకోరం వెన్నెలపక్షి. చంద్ర కిరణాలతో అమృతాన్ని ఆస్వాదిస్తుందే తప్ప మంచుతుంపర్లు పీల్చదు. తుమ్మెద… పూలలో రాణియైన తామర పువ్వులోని సుగంధాన్ని పీలుస్తూ తిరుగుతుంది. ప్రబ్బలి పూల జోలికి పోదు. శివభక్తులు కూడ అల్పులను ఆశ్రయించరు. వారు గొప్పవారు అని చెప్పడానికే కవి అలా పోల్చాడు.

ప్రశ్న 2.
“ఒడయల కిచ్చితి నొడయల ధనము” అనడంలో అర్థం ఏమై ఉంటుంది ?
జవాబు.
ఈ సమస్త ప్రపంచము ఈశ్వరుని ప్రసాదమే. మనం నాది నాది అని భ్రమ పడుతున్నాం. మనది అనేది ఏదైనా శివుడిచ్చినదే. జంగం దేవరలు సాక్షాత్తు శివుని అవతారం. కాబట్టి వారికి మనమిచ్చేది ఏదైనా మనసొంతంకాదు. వారి సొమ్మే వారికిస్తున్నాము అని కవి వివరించాడు.

ఇవి చేయండి

విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

I. “అచంచల భక్తి పారవశ్యం కల్గిన వాళ్ళు ధనాశకు లోనుకారు” దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు.
ఏనుగు కుంభస్థలాన్ని బద్దలుచేసి తినే సింహం గడ్డిమేయదు. పాలసముద్రంలో హాయిగా విహరించే హంస నీటిమడుగులలో నీరు తాగదు. దోరమామిడిపళ్ళ రుచి మరిగిన చిలుక బూరుగు చెట్టుపైన కాసే దూదికాయలను తినదు. స్వచ్ఛమైన పున్నమి వెన్నెలను ఆస్వాదించే చకోర పక్షి చీకట్లను ఆరగించదు. విరిసిన పద్మాలలో సుగంధాన్ని పీల్చి ఆనందించే తుమ్మెద బబ్బిలి పూలవాసన కోరదు. దేవతల ఏనుగు యొక్క సంతానము పందిపాలను తాగటానికి ఇష్టపడదు. అలాగే అచంచల భక్తి పారవశ్యం కల్గినవాళ్ళు ధనాశకు లోనుకారు.

2. ద్విపదను రాగయుక్తంగా పాడండి.
జవాబు.
విద్యార్థి కృత్యం.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

1. పాఠంలో కింది భావాలున్న పాదాలను గుర్తించండి. వీటిని ఎవరు ఎవరితో అన్నారో చెప్పండి.

అ) మా ధనాన్ని అప్పగించి వెళ్ళు.
జవాబు.
“మా యర్థ మొప్పించి పొమ్ము.”
ఈ పాదం రాజు బిజ్జలుడు దండనాయకుడైన బసవన్నతో అన్నాడు.
ఇది పాల్కురికి సోమనాథుడు రాసిన బసవ పురాణం నుండి తీసుకున్న బండారి బసవన్న పాఠంలోనిది.

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న

ఆ) తామర పూల వాసనలో విహరించే తుమ్మెద ఉమ్మెత్త పూలను ఎట్లా ఆస్వాదిస్తుంది ?
జవాబు.
“విరిదమ్మి వాసన విహరించు తేఁటి
పరిగొని సుడియునే బబ్బిలి విరుల”
ఈ పాదములు దండనాయకుడైన బసవన్న రాజైన బిజ్జలునితో అన్నాడు.
ఇది పాల్కురికి సోమనాథుడు రాసిన బసవ పురాణం నుండి తీసుకున్న బండారి బసవన్న పాఠంలోనిది.

ఇ) సింహం ఎక్కడైనా గడ్డిమేస్తుందా ?
ప్రశ్న : ఈ వాక్యం ఏ పాఠంలోనిది ? ఎవరు అన్నారు ? ఎవరితో అన్నారు ?
(లేదా)
“మృగపతి యెద్దెస మేయునే పుల్లు” ఈ వాక్యం ఏ పాఠంలోనిది ? ఎవరు ఎవరితో అన్నారు ?
జవాబు.
ఈ పాదం మంత్రి, దండనాయకుడు ఐన బసవన్న ప్రభువైన బిజ్జలునితో అన్నాడు.
ఇది పాల్కురికి సోమనాథుడు రాసిన బసవ పురాణం నుండి తీసుకున్న బండారి బసవన్న పాఠంలోనిది.

2. కింది పద్యం చదువండి. ఖాళీలను పూరించండి.

గంగిగోవు పాలు గరిటెడైనను చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినురవేమ !

అ) ఖరము అంటే _________
జవాబు.
గాడిద

ఆ) కూడు అంటే _________
జవాబు.
తిండి

ఇ) గంగిగోవు పాలను _________ తో పోల్చాడు.
జవాబు.
భక్తి

ఈ) ఈ పద్యాన్ని _________ రాశాడు.
జవాబు.
వేమన

ఉ) ఈ పద్యం _________ శతకంలోనిది.
జవాబు.
వేమన

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) బండారి బసవన్న స్వభావాన్ని రాయండి.
జవాబు.
బండారి బసవన్న గురించి పాల్కురికి సోమనాథుడు గొప్పగా రాశాడు. బండారి బసవన్న గొప్ప శివభక్తుడు. జంగమ దేవరలను సాక్షాత్తు పరమశివునిగా భావించి పూజిస్తాడు. ఈ జగమంతా ఈశ్వర వరప్రసాదమని భావించాడు. అందుకే ఈశ్వరుడు మనకిచ్చినదానిని శివభక్తులకు సమర్పించటంలో తప్పులేదంటాడు. పరులధనానికి ఎప్పుడూ ఆశించడు. సత్యధర్మవ్రతుడు కనుక రాజుముందైనా సరే నిర్భయంగా మాట్లాడగలడు. ఎంతటి రాజోద్యోగులైనా అతడిని తప్పు పట్టాలంటే భయపడతారు. బసవన్న తన ఉద్యోగ విధులను, గృహధర్మాలను, శివారాధనను క్రమం తప్పకుండా సమర్థవంతంగా నిర్వహించేవాడు.

ఆ) బండారి బవసన్న రాజుతో నిర్భయంగా మాట్లాడాడు కదా ! ఇట్లా ఎప్పుడు నిర్భయంగా మాట్లాడగలుగుతారు?
జవాబు.
బండారి బసవన్న రాజుతో నిర్భయంగా మాట్లాడాడు. ఎందుకంటే అతడు తన విధి నిర్వహణలో ఏ లోపమూ రానివ్వలేదు. సత్యాన్ని, ధర్మాన్ని ఆచరించాడు. అన్నింటిని మించి గొప్ప శివభక్తుడు.
అలాగే మనం మనసులో కల్మషం లేకుండా ఉండాలి. సత్యం మాట్లాడాలి. ధర్మాన్ని ఆచరించాలి. ఏ తప్పు చేయకూడదు. ఎవరికీ కీడు చెయ్యాలని ప్రయత్నించకూడదు. అలా మంచి ప్రవర్తన కలవారిలో ఆత్మవిశ్వాసం దృఢంగా ఉంటుంది. అలాంటప్పుడు మనం నిర్భయంగా మాట్లాడగలం.

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న

ఇ) భక్తుడు పరధనాన్ని ఆశించడు. ఎందుకు ?
(లేదా)
బండారి బసవన్న పాఠంలో భక్తుడిని వేటితో పోల్చారు ? పరధనాన్ని వేటితో పోల్చారు ?
జవాబు.
భక్తుడు ఎప్పుడూ పరధనాన్ని ఆశించడు. ఎందుకంటే పరుల సొమ్ము పామువంటిది. నీచమైనది. కష్టపడి సంపాదించుకున్నదే మన సొంతం అని భక్తుడు నమ్ముతాడు. శివభక్తుడు మానవులలో ఉత్తమమైనవాడు. ఆ భక్తి అతనికి కల్పతరువు, కామధేనువు, మేరుపర్వతం, చింతామణి వంటిది. ఇవి ఉన్నవాడికి ఏది కోరితే అది లభిస్తుంది. అలాగే శివభక్తి కలవాడు పరధనాన్ని కోరడమంటే సింహం గడ్డి మేసినట్లు. అందుచేత శివభక్తుడు పరధనాన్ని ఆశించడు.

ఈ) “క్షీరాబ్ధి లోపలఁ గ్రీడించు హంస గోరునే పడియల నీరు ద్రావంగ” అని బసవన్న అనడంలో గల ఉద్దేశం ఏమిటి?
(లేదా)
బండారి బసవన్న పాఠంలో శివభక్తుణ్ణి వేటితో పోల్చారు ?
జవాబు.
సింహం గడ్డిమేయడానికి ఇష్టపడదు. మామిడిపళ్ళు తినే చిలుక బూరుగు పళ్ళు తినదు. పున్నమి వెన్నెలను ఆస్వాదించే చకోరపక్షి చీకటిని ఆస్వాదించదు. తామరపూల వాసన పీల్చే తుమ్మెద ఉమ్మెత్త పూల దగ్గరకి పోదు. ఏనుగుపిల్ల పంది దగ్గర పాలు తాగదు. అలాగే పాలసముద్రంలో విహరించే హంస కుంటలలో నీరు తాగదు అని కవి వర్ణించాడు. ఉత్తమమైనవారు ఉత్తమమైన వాటినే కోరుకుంటారు. అల్పమైన వాటికి ఆశపడరు అని కవి ఉద్దేశం.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

బసవని గురించి తెలుసుకున్నారు కదా ! భక్తుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటో రాయండి.
(లేదా)
బండారి బసవన్న పాఠం ఆధారంగా శివభక్తుల గుణగణాలు రాయండి.
(లేదా)
బసవన్న భక్తితత్పరత గురించి రాయండి.
జవాబు.
పాల్కురికి సోమనాథుడు బండారి బసవన్న ద్వారా భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు చెప్పాడు.
బసవన్న భక్తి : బసవన్న పరమ శివభక్తుడు. చిత్తశుద్ధితో పూజలతో పాటు తన కర్తవ్యాన్ని నిర్వహించేవాడు. అందుకే అతనిలో ఆత్మవిశ్వాసం నిండుగా ఉన్నది. ఎవ్వరితోనైనా నిర్భయంగా మాట్లాడగలిగేవాడు. అందరూ అతడిని గౌరవించేవారు.

భక్తుని లక్షణాలు : బసవని వ్యక్తిత్వం తెలుసుకున్న తరువాత భక్తుని లక్షణాలు ఎలా ఉండాలో మనకు అర్థమౌతుంది. భక్తునికుండవలసిన ప్రధాన లక్షణం స్వచ్ఛమైన మనసు. నిర్మలమైన మనసుతో భగవంతుని ఆరాధిస్తే తప్పక అనుగ్రహిస్తాడు. భక్తుడైనవాడు దేవుని మాత్రమే గాక ఆయన భక్తులను కూడ దేవునితో సమంగా భావించాలి. వారిని ఆదరించి వారి కోరికలు నెరవేర్చాలి. భక్తులు కోరినదిచ్చేటప్పుడు మనదేదో వారికి దానం చేస్తున్నామన్న అహంకారం ఉండకూడదు. వారి సొమ్ము వారికిస్తున్నామన్న భావనతో దానం చేయాలి. భక్తుడు ఇతరుల సొమ్మును ఆశించకూడదు. సత్యవ్రతం కలిగి ఉండాలి. ఆడినమాట తప్పకూడదు. ఇలా నడుచుకొనేవాడు నిజమైన భక్తుడు.

IV. సృజనాత్మకత/ ప్రశంస

1. కింది ప్రశ్నకు జవాబును సృజనాత్మకంగా రాయండి.

అ) ద్విపద రూపంలోనున్న ఈ పాఠ్యాంశ విషయాన్ని సంభాషణ రూపంలో రాయండి.

బండారి బసవన్న … కోశాగారంలోని సొమ్మును జంగందేవరకు దానం చేశాడని అధికారులు బిజ్జల మహారాజుకు నివేదించారు. రాజు అతనిని దండించాలని సైనికులను పిలుచుకురమ్మని పంపించాడు.

V. పదజాల వినియోగం:

1. గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి.

అ) క్షీరాబ్ధిని మథించినప్పుడు అమృతం పుట్టింది.
జవాబు.
పాలసముద్రం

ఆ) కొండ గుహలలో నివసించే మృగపతి అడవికి రాజు.
జవాబు.
సింహం

ఇ) పుడమీశులు ప్రజలను చక్కగా పరిపాలించారు.
జవాబు.
రాజులు

2. కింది ప్రకృతి – వికృతి పదాలను జతపరచండి.

ప్రకృతివికృతి
అ) ఆశ్చర్యంఎ) బత్తి
ఆ) భక్తిబి) దెస
ఇ) దిశసి)  పుడమి
ఈ) పృథ్విడి) అచ్చెరువు

జవాబు.

ప్రకృతివికృతి
అ) ఆశ్చర్యండి) అచ్చెరువు
ఆ) భక్తిఎ) బత్తి
ఇ) దిశబి) దెస
ఈ) పృథ్విసి)  పుడమి

 

VI. భాషను గురించి తెలుసుకుందాం.

1. కింది పట్టికను పూరించండి.

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న 1
జవాబు.

సంధి పదంవిడదీసి రాయండి.సంధి పేరు
ఉదా : క్షీరాబ్ధిక్షీర + అబ్దిసవర్ణదీర్ఘ సంధి
1. కనకాచలంకనక + అచలంసవర్ణదీర్ఘ సంధి
2. నాకొకనాకు + ఒకఉత్వసంధి
3. కాదేనికాదు + ఏనిఉత్వసంధి
4. అతనికిచ్చెనుఅతనికి + ఇచ్చెనుఇకారసంధి
5. పుట్టినిల్లుపుట్టిన + ಇಲ್ಲುఅత్వసంధి
6. ఏమిటిదిఏమిటి + ఇదిఇత్వ సంధి
7. నాయనమ్మనాయన + అమ్మఅత్వసంధి
8. పుడమీశపుడమి + ఈశఇత్వ సంధి

 

గుణసంధి:

2. కింది పదాలను విడదీయండి.

ఉదా : రాజేంద్రుడు = రాజ + ఇంద్రుడు (అ + ఇ = ఏ)
అ) గజేంద్రుడు = గజ + ఇంద్రుడు (అ + ఇ = ఏ)

ఉదా : పరమేశ్వరుడు = పరమ + ఈశ్వరుడు (అ + ఈ = ఏ)
ఆ) సర్వేశ్వరుడు = సర్వ + ఈశ్వరుడు (అ + ఈ = ఏ)

ఉదా : వసంతోత్సవం = వసంత + ఉత్సవం (అ + ఉ = ఓ)
ఇ) గంగోదకం = గంగ + ఉదకం (అ + ఉ = ఓ)

ఉదా : దేవర్షి = దేవ + ఋషి
(అ + ఋ = అర్)
ఈ) మహర్షి = మహా + ఋషి
(అ + ఋ = అర్)

పై పదాలను గమనించండి. వాటిని మూడు రకాలుగా విడదీయటం జరిగింది. మూడు సందర్భాల్లోను పూర్వస్వరం ‘అకారం’ ఉన్నది. పరస్వరం స్థానంలో ఇ, ఈ, ఉ, ఋ లు ఉన్నాయి.”

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న

‘అ’ కారానికి ‘ఇ/ఈ’ – పరమైనప్పుడు ‘ఏ’ (ే)
అకారము అంటే ‘అ’ లేదా ‘ఆ’.
”అ’ కారానికి ‘ఉ’ – పరమైనప్పుడు ‘ఓ’ (ో)
‘అ’ కారానికి ‘ఋ’ – పరమైనప్పుడు ‘అర్’
ఏ, ఓ, అర్ లను గుణాలు అంటారు.
‘అ’ కారం స్థానంలో ఏ, ఓ, అర్ లు ఆదేశంగా వచ్చాయి. ఇట్లా ఏర్పడిన సంధిని గుణసంధి అంటారు.
‘అ’ కారానికి ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమంగా ఏ, ఓ, అర్ లు ఆదేశంగా వస్తాయి.

3. కింది పదాలను కలిపి, సంధి ఏర్పడిన విధానాన్ని తెలుపండి.
TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న 2
జవాబు.
ఉదా : మహా + ఇంద్రుడు = మహేంద్రుడు (అ + ఇ = ఏ) (ే)
అ) దేవ + ఇంద్రుడు = దేవేంద్రుడు (అ + ఇ = ఏ) (ే)
ఆ) గణ + ఈశుడు = గణేశుడు (అ + ఈ = ఏ) (ే)
ఇ) నర + ఉత్తముడు = నరోత్తముడు (అ + ఉ = ఓ) (ో)
ఈ) నవ + ఉదయం = నవోదయం (అ + ఉ = ఓ) (ో)
ఉ) బ్రహ్మ + ఋషి = బ్రహ్మర్షి (అ + ఋ = అర్) (ర్షి)

భాషా కార్యకలాపాలు / ప్రాజెక్టు పని

ప్రశ్న 1.
ఈ బసవని వంటి పరమ భక్తులలో ఒకరి కథను సేకరించి, మీ సొంతమాటల్లో రాసి దాన్ని తరగతిలో చెప్పండి.
జవాబు.
అ) ప్రాథమిక సమాచారం :
1) ప్రాజెక్టు పని పేరు : “మహా శివభక్తుడు – చిఱుతొండ నంబి”
2) సమాచారాన్ని సేకరించిన విధానం : గ్రంథాలయ పుస్తకం ద్వారా
ఆ) నివేదిక :
విషయ వివరణ:
చిఱుతొండ నంబి మహా శివభక్తుడు. అతని భార్య తిరువెంగనాచి కూడా మహా శివభక్తురాలు. వారికి లేక లేక కలిగిన ముద్దుల సంతానమే సిరియాళుడు. ఈ దంపతులిరువురు ప్రతిరోజు స్నానం – పూజ ముగించుకొన్న పిమ్మట, మడితో వంట వండి, ఒకరిద్దరు అతిథులకు భోజనం పెట్టిన పిమ్మట తాము భుజించే సాంప్రదాయం గలవారు. వీరి కుమారుడు సిరియాళుడు కూడా తల్లిదండ్రుల మాట జవదాటని వాడై, మహా శివభక్తి గలవాడై, దిన దిన ప్రవర్ధమానంగా అనేక విద్యలనభ్యసిస్తూ పెరుగుతున్నాడు.

ఈ దంపతులిద్దర్నీ పరీక్షించాలనే ఉద్దేశంతో శివుడు, పార్వతి ఇద్దరూ వృద్ధ దంపతుల రూపంలో చిఱుతొండ నంబి ఇంటికి వచ్చారు. వారి రాకకు ఎంతో ఆనందించిన చిఱుతొండ నంబి దంపతులు ఆ వృద్ధ బ్రాహ్మణులను సాదరంగా ఆహ్వానించి, వారికి శాకాహార భోజనం వండి, తినడానికి పిలిచారు. అప్పుడు ఆ కపట బ్రాహ్మణుడు మాకు నరమాంసం లేనిదే గొంతులోకి ముద్ద దిగదని చెప్పగా విని చిఱుతొండ నంబి దంపతుల గుండెల్లో రాయి పడ్డట్టయ్యింది. మనిషి మాంసం ఎలా తేగలమని బెంగతో వారు చింతాక్రాంతులై ఉండగా తనను చంపి వండమని వారి పుత్రుడు సిరియాళుడు కోరాడు.

ఎంతో దుఃఖభరితమైన మనసుతో వారు తమ పుత్రుణ్ణి చంపి వండడానికి సిద్ధపడ్డారు. అప్పుడు శివుడు, సిరియాళుని వద్దకు వెళ్ళి నీ తల్లిదండ్రులు నిన్ను చంపి వండుతారు, ఇల్లు వదలి పారిపొమ్మనగా సిరియాళుడు తిరస్కరించి, శివపూజకు నా దేహం అర్పించుటకంటే భాగ్యమేమున్నదని పలికాడు. చివరకు అతణ్ణి చంపి వృద్ధ బ్రాహ్మణులకు వండి పెట్టారు. నీ కుమారుడు సిరియాళుడు లేనిదే నేను భుజింపనని శివుడనగా, చిఱుతొండ నంబి దుఃఖించుచుండగా ‘చిఱుతొండా ! ఒక్కసారి సిరియాళా అని పిలువు’ అని శివుడు అనగానే చిఱుతొండడు ‘సిరియాళా’ అని పిలువగానే శివ వర ప్రభావంతో సిరియాళుడు బ్రతికి వచ్చాడు.

ఇ) ముగింపు :
శివుని పూజకోసం, అతిథి దేవుళ్లను సంతృప్తి పరచడం కోసం కన్న కొడుకునే చంపిన తల్లిదండ్రులను చూచి వారి మూఢ భక్తికి ఆశ్చర్యం వేసింది. చివరికి సిరియాళుడు బ్రతికి రావడం మాత్రం నాకు చాలా ఆనందం
కలిగించింది.
TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న 4

TS 8th Class Telugu 3rd Lesson Important Questions బండారి బసవన్న

ప్రశ్న 1.
బండారి బసవన్న పాఠం సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
(లేదా)
బండారి బసవన్న గొప్ప శివభక్తుడని నిరూపించండి.
జవాబు.
బిజ్జలుడు దండనాయకుడైన బండారి బసవన్నను పిలిచి ధనాగారం నుండి తీసిన ధనం మాకు అప్పగించి మీరిక వెళ్ళవచ్చు. ఖజానా అంతా ఖాళీ చేశావు. ఇతరుల ధనం ఆశించనని ప్రతిజ్ఞ చేశారుకదా! అని అన్నాడు. బసవన్న “శివభక్తి అనే కల్పవృక్షం, శంకరునిపై భక్తి అనే బంగారు (మేరు పర్వతం నా అధీనంలో ఉండగా ఇతరుల ధనాన్ని ఆశిస్తానా” అని అన్నాడు.

హంస మడుగు నీటిని త్రాగనట్లే, మామిడి పండ్లు తినే చిలుక బూరుగ చెట్టు పండ్ల వైపు కన్నెత్తి చూడనట్లే, చకోరపక్షి చీకటిని ఆస్వాదించనట్లే, ఏనుగుపిల్ల పందిపాలు త్రాగదని తెలియదా! శివభక్తుల ఇండ్ల సంప్రదాయం నీకేం తెలుసు? స్వామి సొమ్ము స్వామికే ఇచ్చాను. ఇతరుల ధనంతో నాకేంపని? మీ ధనంకోసం నేను చేయిచాపను. నేను న్యాయం తప్పను. మీకు నామీద నమ్మకం లేకపోతే మీ సొమ్ము లెక్కచూసుకోండి అని బసవన్న పలికాడు.

ధనాగారంలోని పెట్టెలన్నీ తెప్పించి, తాళాలు తీయించి, మూతలు తెరిపించారు. అప్పుడు బిజ్జలుడు చూసుకుంటే పెట్టెలనిండా బంగారు నాణేలు (మాడలు) ఉన్నాయి. తళతళలాడుతున్న ఆ నాణేలను లెక్కించిచూడగా, లెక్కకన్నా ఎక్కువగానే ఉన్నాయి. నిజాయితీపరుడైన బసవన్న ఏ రాజద్రోహం చేయలేదని బిజ్జలుడు గ్రహించాడు. శివుని భక్తివల్ల తీసిన ధనమంతా మరల ధనాగారంలోకే రావటంతో బసవన్న పరమ శివభక్తుడు అని చెప్పవచ్చును.

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న

ప్రశ్న2.
బండారి బసవన్న రాజద్రోహం చేయలేదని ఎలా చెప్పగలవు ?
(లేదా)
బసవన్న నిజాయితీ ఎటువంటిది ?
జవాబు.
బసవన్న తన విధి నిర్వహణలో ఏ లోపమూ రానివ్వలేదు. సత్యాన్ని, ధర్మాన్ని ఆచరించిన గొప్ప భక్తుడు. మనసులో కల్మషం లేకుండా సత్యం పల్కుతూ, ధర్మాన్ని ఆచరిస్తూ, ఆత్మవిశ్వాసంతో ఎవరికీ కీడు చేయకుండా, ఉ న్న విషయం నిర్భయంగా మాట్లాడేవాడు. ప్రపంచమంతా ఈశ్వర వరప్రసాదమని భావించాడు.

అందుకే ఈశ్వరుడు మనకిచ్చిన దానిని శివభక్తులకు సమర్పించడంలో తప్పులేదంటాడు బసవన్న. తన ఉద్యోగ విధులను, గృహధర్మాన్ని, శివారాధనను క్రమం తప్పకుండా నిజాయితీగా ఆచరించే బసవన్న రాజద్రోహం చేయలేదని చెప్పవచ్చు. ఎందుకంటే బిజ్జలుడు ఆ సొమ్ము ఉన్న పెట్టెలను తెచ్చి తెరిపించగా అందులో మాడలు అందులోనే తళతళలాడుతూ ఉన్నాయి. సొమ్ము అంతా లెక్కకు సరిపోయింది కనుక రాజద్రోహం చేయలేదని చెప్పవచ్చు.

ప్రశ్న3.
మీ పాఠం ఆధారంగా “భక్తి” అంటే మీరేమనుకుంటున్నారో రాయండి.
(లేదా)
బండారు బసవన్న పాఠం ఆధారంగా “భక్తి” భావన గురించి రాయండి.
జవాబు.
బండారి బసవన్న పరమ శివభక్తుడు. చిత్తశుద్ధితో పూజలు చేయటమే కాకుండా కర్తవ్యాన్ని నిర్వహించేవాడు. ఆత్మవిశ్వాసం, నిర్భయత్వంగల ఇతడిని అందరూ గౌరవించేవారు. భక్తులకుండాల్సిన లక్షణాలన్నీ బసవన్నలో ఉన్నాయి. స్వచ్ఛమైన మనసు, దైవభక్తులను దైవస్వరూపులుగా భావించుట, వారిని ఆదరించి వారి కోర్కెలు తీర్చుట, అహంకారం లేకుండా మనవద్ద ఉన్న వారి సొమ్ము వారికిస్తున్నామనే భావనతో సంతోషంగా దానం చేయటం, పరుల సొమ్ము ఆశించకుండా సత్యవ్రతం కల్గి, ఆడినమాట తప్పకుండా నడుచుకొనేవాడే నిజమైన భక్తుడు అని బసవన్నను చూస్తే తెలుస్తుంది.

సంభాషణ

రాజు : భటులారా ! బసవన్న దండనాయకుని వెంటనే పిలుచుకురండి.
భటులు : చిత్తం మహాప్రభూ ! (భటులు బసవన్నతో కలిసి ప్రవేశం)
రాజు : దండనాయకా ! నీవు ధనాగారంలోని సొమ్ము దానం చేశావని అభియోగం. దీనికి నీ సమాధానమేమి?
బస : ప్రభూ ! మీ సొమ్ము నేను తాకలేదు. ఇది అబద్ధం.
రాజు : మా అధికారులు కళ్ళతో చూసిన నిజం నాకు చెప్పారు. వెంటనే మా సొమ్ము మాకప్పగించు. నువ్వు పదవి నుండి తప్పుకో.
బస : నేను అపరాధం చెయ్యలేదు.
రాజు : నీ మాటలు భయం కలిగిస్తున్నాయి. మా ధనం మా కప్పగించి వెంటనే వెళ్ళిపో. పరధనానికి ఆశించను అని ప్రతిజ్ఞ చేసి ఇలా మా ధనం కాజేయవచ్చునా ?
బస : (చిరునవ్వుతో) కామధేనువు, కల్పవృక్షము, మేరుపర్వతము, చింతామణి వంటి శక్తివంతమైన ఈశ్వరభక్తి నా దగ్గర ఉండగా నా కంటె ధనవంతుడెవరు ? నీ సొమ్ము నేనాశిస్తానా ? సింహం గడ్డిమేస్తుందా ? పాలసముద్రంలో తిరిగే హంస నీటిగుంటలలో తిరుగుతుందా? మామిడిపళ్ళు తినే చిలుక బూరుగు పళ్ళు తింటుందా ? వెన్నెల తాగే చకోర పక్షి చీకటిని కోరుతుందా ? తామరపూల సుగంధాన్ని పీల్చే తుమ్మెద ప్రబ్బలి పూలజోలికి వెళుతుందా ? ఏనుగుపిల్ల పంది పాలు తాగుతుందా ? జంగం దేవరలకు దాసుడను. డబ్బు నాకొకలెక్కా? మీ డబ్బు కోసం నేనెప్పుడూ చెయ్యి జాపను. ఆడిన మాట తప్పేవాడిని కాను. ఈశ్వర ప్రసాదితమైన సొమ్ము ఈశ్వరభక్తునికే ఇచ్చాను. నమ్మకపోతే లెక్కలు చూసుకో.
రాజు : ఖజానాలో ధనం పెట్టెలు తీసుకురండి. (భటులు తెస్తారు) తెరవండి. (తెరిచారు) ఏమి ఆశ్చర్యం ! ఉండవలసిన సొమ్ము కంటె ఎంతో ఎక్కువ సొమ్మున్నది ! మమ్మల్ని మన్నించు బసవన్నా ! నీ భక్తి తెలుసుకున్నాము.

పర్యాయపదాలు:

  • బాస =ఒట్టు, ప్రతిజ్ఞ, వాగ్దానం
  • ధనం = అర్థం, డబ్బు
  • జననాథుడు = ప్రజాపతి, రాజు, పుడమీశుడు
  • హరుడు = శివుడు, పరమేశుడు, సోమార్థ ధరుడు
  • చూతము = రసాలము, ఆమ్రము, మామిడి
  • తమి = తామర, కమలం, పద్మం
  • సురధేనువు = కామధేనువు, సురభి
  • పగతుడు = శత్రువు, విరోధి, అరి
  • కనకము = బంగారము, కాంచనము
  • తేటి = తుమ్మెద, బంభరం

నానార్థాలు:

  • అర్థము = డబ్బు, ప్రయోజనము, పదానిక చెప్పే భావం
  • దెస = దిక్కు, విధము
  • మృగము = జింక, జంతువు

ప్రకృతి – వికృతులు:

  • ప్రకృతి – వికృతి
  • భాష – బాస
  • భక్తి – బత్తి
  • మృగం – మెకము
  • హంస – అంచ

సంధులు:

  • మాయర్థము = మా + అర్థము = యడాగమసంధి
  • బాసయండ్రు = బాస + అండ్రు = యడాగమసంధి
  • మంత్రియని = మంత్రి + అని = యడాగమసంధి
  • చింతామణియుండ = = చింతామణి + ఉండ = యడాగమసంధి
  • సూత్రం : సంధి లేనిచోట స్వరం కంటె పరంగా ఉన్న స్వరానికి యడాగమం ఔతుంది.
  • రాకామల = రాకా + అమల = సవర్ణదీర్ఘ సంధి
  • కామారి = కామ + అరి = సవర్ణదీర్ఘ సంధి
  • సోమార్థధరుడు = సోమ + అర్థధరుడు = సవర్ణదీర్ఘసంధి
  • ప్రహసితాస్యుడు = ప్రహసి + ఆస్యుడు = సవర్ణదీర్ఘ సంధి
  • సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమౌతాయి.
  • అరమొప్పించి = అర్థము + ఒప్పించి = ఉత్వ సంధి
  • తప్పేమి = తప్పు + ఏమి = ఉత్వసంధి
  • ఎట్లొకో = ఎట్లు + ఒకో = ఉత్వసంధి
  • అరుదగు = అరుదు + అగు ఉత్వసంధి
  • మాడలుప్పొంగుచు = మాడలు + = ఉత్వసంధి
  • సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి ఔతుంది.
  • పాడుచేసితివి = పాడు + చేసితివి = గసడదవాదేశ సంధి
  • ఫలంబులు సుంబించు = ఫలంబులు + చుంబించ = గసడదవాదేశసంధి
  • పండ్లు గగ్గోనునె = పండ్లు + కన్గొనునే = గసడదవాదేశ సంధి
  • ఆకాంక్ష సేయునే = ఆకాంక్ష + చేయునే = గసడదవాదేశసంధి
  • చను సీక = చను + చీక = గసడదవాదేశసంధి
  • లెక్కలు సూడు = లెక్కలు + చూడు గసడదవాదేశ సంధి
  • సూత్రం : ప్రథమ మీది పరుషాలకు గసడదవలు బహుళంగా వస్తాయి.

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న

సమాసాలు:

  • సమాసపదం – విగ్రహవాక్యం – సమాసం పేరు
  • సమాసపదం – విగ్రహవాక్యం – సమాసం పేరు
  • పరధనము – పరుల యొక్క ధనం – షష్ఠీ తత్పురుష సమాసం
  • జననాథుడు – జనములకు నాథుడు – షష్ఠీ తత్పురుష సమాసం
  • మృగపతి – మృగములకు పతి – షష్ఠీ తత్పురుష సమాసం
  • కామారి – కాముని యొక్క అరి (శత్రువు) – షష్ఠీ తత్పురుష సమాసం
  • సోమార్థధరుడు – సోమార్థుని ధరించినవాడు – ద్వితీయాతత్పురుష సమాసం
  • ప్రహసితాస్యుడు – ప్రహసితమైన ఆస్యము కలవాడు. – బహువ్రీహి సమాసం
  • బసవన దండనాయకుడు – బసవన అనే పేరుగల దండనాయకుడు – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
  • చూత ఫలంబులు – చూతము అనే పేరు గల ఫలములు – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
  • హరుభక్తి – హరుని యందు భక్తి – సప్తమీ తత్పురుష సమాసం

పద్యాలు – ప్రతిపదార్థాలు – భావాలు

I. ప్రతిపదార్థాలు – భావాలు:

బండారి బసవన దండనాయకుని
రప్పించి “మాయర్ద మొప్పించి పొమ్ము
దప్పేమి ? సాలుఁ బ్రధాని తనంబు
‘దండింప రా’ దను తలఁపున నిట్లు
బండార మంతయుఁ బాడు సేసితివి
పరధనం బపహరింపని బాస యండ్రు
పరధనం బెట్లొకో బసవ ! కైకొంటి
వేయు మాటలు నేల వెఱతుము నీకు
మాయర్థ మొప్పించి నీయంత నుండు”
మనవుడుఁ గించి త్ప్రహసితాస్యుఁడగుచు
జననాథునకు బసవన మంత్రి యనియె
“బరమేశు భక్తియన్ సురతరువుండ
హరుభక్తియన్ కనకాచలంబుండ
గామారి భక్తి చింతామణి యుండ
సోమార్ధ ధరు భక్తి సురధేనువుండ
బగుతుఁడాసించునే పరధనంబునకు
మృగపతి యెద్దె మేయునే పుల్లు ?

ప్రతిపదార్థం :
బండారి బసవన్న= బండారి బసవన్న అనే పేరుగల సేనాపతిని
దండనాయకుని = సేనాపతిని
రప్పించి = పిలిపించి
మా + యర్థము = మా సొమ్మును
ఒప్పించి = అప్పగించి
పొమ్ము = వెళ్ళు
తప్పు + ఏమి = అలా చేయడంలో తప్పులేదు.
ప్రధానితనంబు = మీ మంత్రిత్వము
చాలున్ = ఇకపై మాకు అక్కరలేదు.
దండింపరాదు = నన్నెవరూ శిక్షించరులే
అనుతలపునన్ = అనే ఆలోచనతో
బండారము + అంతయు = ధనాగారమంతా
పాడు చేసితివి = నాశనం చేశావు
పరధనంబు = ఇతరుల సొమ్మును
అపహరింపని = దొంగిలించనని
బాసయండ్రు = ప్రతిజ్ఞ చేశావు
పరధనంబు = ఇతరుల ధనాన్ని
బెట్లోకొ = ఎట్లు
బసవా = ఓ బసవా !
కైకొంటి = తీసుకున్నావు.
వేయి మాటలు = వేలకొలది మాటలు
ఏల = ఎందుకు ?
మా అర్ధము = మా సంపద
ఒప్పించి = అప్పగించి
నీయంత నుండు = నీవు వెళ్ళు
అనవుడు = అని పలుకగా
కించిత్ = కొద్దిపాటి
ప్రవసిత = నవ్వబడిన
ఆస్యుడు = ముఖము కలవాడు
అగుచు = అయి
జననాథునకు = రాజుకు
బసవనమంత్రి = బసవ మంత్రి
అనియె = ఇట్లు పలికాడు
పరమేశు = శంకరునిపై
భక్తియన్ = భక్తి అనే
సురతరువు + ఉండ = కల్పవృక్షము ఉండగా
హరుభక్తియన్ = పరమేశ్వరుని యందు భక్తి అనే
కనక = బంగారుమయమైన
అచలము + ఉండ = కొండ ఉండగా
కామ + అరి = మన్మథుని వైరి అయిన శివుని యందు
భక్తి = భక్తి అనే
చింతామణి ఉండ = చింతామణి ఉండగా
సోమార్ధధరు = చంద్రుని శిరసున ధరించిన శివుని యందు
భక్తి = భక్తి
సురధేనువు ఉండ = కామధేనువు ఉండగా
పగతుడు = భక్తుడు
పరధనంబు = ఇతరుల ధనాన్ని
ఆశించునే = ఆశిస్తాడా ?
మృగపతి = సింహం
ఎద్దె = ఎప్పుడైనా
పుల్లు = గడ్డిని
మేయునే = మేస్తుందా ?

భావం :
బిజ్జలుడు దండనాయకుడైన బండారి బసవన్నను పిలిపించాడు. “మా ధనాన్ని అప్పగించి పోవటంలో తప్పేమీ లేదు. ఇక చాలు మీ ప్రధాని పదవి. నన్నెవరు దండించలేరనే ధీమాతో ఖజానా అంతా ఖాళీ చేశావు. ఇతరుల ధనాన్ని ఆశించనని ప్రతిజ్ఞ చేశావు కదా! మరి ఎట్లా దొంగిలించావు ? ఎక్కువ మాటలు ఎందుకు గానీ నిన్ను ఏమయిన అనడానికి నాకు భయం కలుగు తున్నది. మా సొమ్ము మాకిచ్చి మీరిక దయచేయవచ్చు” అన్నాడు. అప్పుడు మంత్రి బసవన్న చిరునవ్వుతో ‘పరమశివుని పట్ల భక్తి అనే కల్పవృక్షం మాకు అండగా ఉండగా, శంకరునిపై భక్తి అనే బంగారు పర్వతం (మేరు -పర్వతం) నా అధీనంలో ఉండగా, పరమేశ్వరుని భక్తి అనే చింతామణి నా చెంత ఉండగా, శంభుని భక్తి అనే కామధేనువు నన్ను కనిపెట్టి ఉండగా నా వంటి భక్తుడు ఇతరుల ధనాన్ని ఆశిస్తాడా ? సింహం ఎక్కడైన గడ్డి మేస్తుందా ?

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న

II.
క్షీరాబ్ధి లోపలఁ గ్రీడించు హంస
గోరునే పడియల నీరు ద్రావంగం ?
జూత ఫలంబులు సుంబించు చిలుక
బ్రాతి బూరుగు మ్రాని పండ్లు గల్గినునె ?
రాకామల జ్యోత్స్నఁ ద్రావు చకోర
మాకాంక్ష సేయునే చీకటిఁ ద్రావ
విరిదమ్మి వాసన విహరించుతేఁటి
పరిగొని సుడియునే బబ్బిలి విరులు ?
నెఱుఁగునే యల దిగ్గజేంద్రంబు కొదమ
యెఱపంది చను సీక ? నెఱుఁగవు గాక
యరుదగు లింగ సదర్థుల యిండ్ల
వరవుడ నా కొక సరకెయర్థంబు
పుడమీశ ! మీధనంబునకుఁ జేస్వాప
నొడయల కిచ్చితి నొడయలధనము
పాదిగదఱిఁగిన భక్తుండఁగాను
గాదేని ముడుపు లెక్కలు సూడు” మనుచు
దట్టుఁడు బసవన దండనాయఁకుఁడు
పెట్టెలు ముందటఁ బెట్టి తాళములు
పుచ్చుడు మాడ లుప్పొంగుచుఁ జూడ
నచ్చెరువై లెక్క కగ్గలంబున్న

ప్రతిపదార్థం :

క్షీర + అబ్ధిలోపల = పాలసముద్రంలో
క్రీడించు హంస = విహరించే హంస
పడియల = నీటి మడుగులలోని
నీరు + త్రావంగన్ = నీళ్ళు తాగడానికి
కోర్టును + ఏ = ఇష్టపడుతుందా ?
చూతఫలంబులు = మామిడిపళ్ళను
చుంబించు = ముద్దాడే (తినేటువంటి)
చిలుక = రామ చిలుక
బ్రాతి = ఏ విధంగానైనా
బూరుగ మ్రాని = బూరుగ చెట్టు యొక్క
పండ్లు = పళ్ళు
కన్గొనునె = చూస్తుందా ?
రాకా+అమంజ్యోత్స్నన్ = పున్నమినాటి స్వచ్ఛమైన వెన్నెలను
త్రావు = తాగుతుండే
చకోరము = వెన్నెల పక్షి
చీకటి = చీకటిని
త్రావన్ = తాగడానికి
ఆకాంక్ష+చేయును+ఏ = కోరుతుందా ?
విరి+తమ్మి వాసన = విరిసిన కమలం యొక్క సువాసనలో
విహరించు తేటి = తిరుగాడే తుమ్మెద
పరిగొని = పక్కకు తిరిగి
బబ్బిలి విరులన్ = ప్రబ్బలి పూలను
సుడియును + ఏ = చుట్టుకుంటూ తిరుగుతుందా?
అల దిక్+గజ +ఇంద్రంబు = ఆ దిగ్గజము యొక్క
కొదమ = పిల్ల
ఎఱపందిచను+చీక = పంది దగ్గర పాలు తాగడానికి
ఎఱుగును + ఏ = ఇష్టపడుతుందా ?
పుడమి + ఈశ = ఓ రాజా!
ఎఱుగవు + కాక = నీకు తెలియదేమో !
అరుదు + అగు = విశిష్టులైన
లింగ = లింగధారులైన
సదర్థుల + ఇండ్ల = గొప్ప జంగమదేవరల ఇళ్ళలో
వరవుడ = దాసుడను
అర్థము = ధనము
నాకున్+ఒక సరకు+ఎ = లెక్కలోనిదా ?
మీ ధనంబునకు = మీ డబ్బు కోసం
చేయి + చాపన్ = అడగన
ఒడయలకున్+ఇచ్చితిన్ = దేవరలకే ఇచ్చాను
పాదిగ + తఱిగిన = స్థిరత్వం తప్పిన
భక్తుండన్ + కాను = భక్తుణ్ణి కాను
కాదు + ఏని = కాదనుకుంటే (నీవు నమ్మకుంటే)
ముడుపు లెక్కలు = ధనము యొక్క లెక్కలు
చూడు = చూడుము
అనుచు = అంటూ
దండ నాయకుడు = దండ నాయకుడు
పెట్టెలు = పెట్టెల్ని
ముందటన్ = ఎదుట
పెట్టి = ఉంచి
తాళములు = తాళాలను
పుచ్చుచుచూడ = తెరచి చూడగానే
అచ్చెరువు = ఆశ్చర్యం
జూడ = కలుగునట్లుగా
మాడలు = బంగారు నాణేలు
లెక్క తగ్గలంబున్న = లెక్కకు తగినట్లుగా
ఉప్పొంగుచున్ = ఉప్పొంగినాయి

భావం :
పాల సముద్రంలో క్రీడించే హంస మడుగులలో నీరు తాగుతుందా ? మామిడి పండ్లను తినే చిలుక బూరుగు చెట్టు పండ్లను కన్నెత్తి ఐనా చూస్తుందా ? నిండు పున్నమి నాటి వెన్నెలను తాగే చకోరపక్షి చీకటిని ఆస్వాదిస్తుందా ? తామరపూల సుగంధంలో విహరించే తుమ్మెద ప్రబ్బలి పూలకోసం పరుగులు తీస్తుందా ? ఏనుగు పిల్ల పంది పాలు తాగడానికి తహతహలాడుతుందా ? నీకు విచక్షణ లేకపోతే నేనేం చేయాలి ? శివభక్తుల ఇండ్ల సంప్రదాయం నీకేం తెలుసు ?

స్వామి సొమ్ము స్వామికే ఇచ్చాను. ఇతరుల ధనంతో నాకేం పని ? మీ ధనం కోసం నేను చేయి చాపను. నేను న్యాయం తప్పను. నీకు నా మీద నమ్మకం లేకపోతే నీ సొమ్ము లెక్క చూసుకో” అని పలికాడు. ధనాగారంలోని పెట్టెలన్నీ తెప్పించి తాళాలు తీసి బిజ్జలుడి ముంగటే వాటి మూతలు తీయించారు. అప్పుడు బిజ్జలుడు చూసుకుంటే పెట్టెల నిండ మాడలు (బంగారు నాణేలు) తళతళలాడు తున్నాయి. లెక్కపెట్టి చూడగా ఉండవలసిన వాటికన్న ఎక్కువనే ఉన్నాయి.

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న

పాఠం ఉద్దేశం

ప్రశ్న.
బండారి బసవన్న పాఠం ఉద్దేశం తెల్పండి.
జవాబు.
బిజ్జలుడి కొలువులో బండారి బసవన్న దండనాయకుడుగా ఉన్నాడు. ఇతడు గొప్ప శివభక్తుడు. ఒకరోజు ఒక జంగమయ్య బసవన్న దగ్గరకు వచ్చి “నాకు ఈ క్షణంలో ఇంత ధనం కావాలి. లేకపోతే మీ సపర్యలు స్వీకరించను” అన్నాడు. అప్పుడు బసవన్న కోశాగారంలోని పేటికల్లో ఉ న్న మాడలను (బంగారు నాణేలు) జంగమయ్యకు సమర్పించాడు. అది చూసిన ఇతర మంత్రులు బిజ్జలుడి దగ్గరకు పోయి బసవన్న రాజద్రోహం చేశాడని చెప్పారు.
బసవన్న ఔదార్య బుద్ధి, భక్తితత్వం తెలియజేయటం ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ప్రశ్న.
ద్విపద ప్రక్రియను పరిచయం చేయండి.
జవాబు.
ఈ పాఠం ద్విపద. ఇది దేశికవితా ప్రక్రియ. ఇది రెండేసి పాదాల చొప్పున మాత్రాగణాలతో సాగే రచన. మొత్తం కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాస్తే దాన్ని “ద్విపద కావ్యం” అంటారు. ఈ పాఠం పాల్కురికి సోమనాథుడు రాసిన ‘బసవపురాణం’ తృతీయాశ్వాసంలోనిది.

కవి పరిచయం

ప్రశ్న.
పాల్కురికి సోమనాథకవి పరిచయం రాయండి.
జవాబు.
దేశి సంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి పాల్కురికి సోమనాథుడు. తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి. బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించి ద్విపదకు కావ్య గౌరవం కలిగించిన శైవకవి. ఓరుగల్లు సమీపాన గల పాలకుర్తి (పాలకురికి) పాల్కురికి సోమన జన్మస్థలం. బసవ పురాణము, అనుభవసారము, బసవోదాహరణము, వృషాధిపశతకము, చతుర్వేదసారము, చెన్నమల్లు సీసములు, పండితారాధ్య చరిత్రము మొదలయినవి సోమన కృతులు. రగడ, గద్య, పంచకం, అష్టకం, ద్విపద, శతకం, ఉదాహరణం మొదలయిన సాహితీ ప్రక్రియలకు ఈయన ఆద్యుడు. సంస్కృత, తమిళ, కన్నడ, మరాఠీభాషా పదాలను యధేచ్ఛగా తన రచనలో ఉపయోగించిన బహుభాషా కోవిదుడు. తెలుగులో ‘మణి ప్రవాళ శైలి’ని వాడిన తొలికవి.

ప్రవేశిక

ప్రశ్న.
బండారి బసవన్న పాఠ్యభాగం సందర్భం తెల్పండి.
జవాబు.
సదుద్దేశంతో చేసే పనులు ఎప్పుడూ మనిషిని సచ్చీలుడుగనే నిలబెడతాయి. భగవంతుడు కూడా ఇటువంటి పనులను చేసేవారిని మెచ్చుకుంటాడు. దీనికి ఉదాహరణలు పురాణేతిహాసాలలో అనేకం కనిపిస్తాయి. ఆ కోవలోని వాడే బండారి బసవన్న. అతని జీవితంలో జరిగిన ఒక మహత్తర ఘట్టం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కఠిన పదాలకు అర్ధాలు

దండ నాయకుడు = సేనాధిపతి మంత్రిత్వము
ప్రధానితనము = దొంగిలించు, కాజేయు
దండించు = ధనం
అపహరించు =
= కయి = చేయి
గైకొను = తీసుకొను
కించిత్ = కొంచెం
ఆస్యము = ముఖము
ప్రహసితం = నవ్వు
జననాథుడు = రాజు
సురతరువు = దేవతావృక్షం, కల్పవృక్షం
కామారి = కామ + అరి = మన్మథుని శత్రువైన శివుడు
సోముడు = చంద్రుడు
పుల్లు = గడ్డి
మృగపతి = మృగరాజు = సింహం
పడియ = నీటి మడుగు
చూతం = మామిడి
తమ్మి = తామర
తేటి = తుమ్మెద
మ్రాను = చెట్టు
వరవుడు = దాస్యము
ఒడయల ధనము = దేవరల సొమ్ము
పాదిగా తఱిగిన = కుదురు తప్పిన, స్థిరత్వం లేని
దట్టుడు = సమర్థుడు
మాడలు = బంగారు నాణేలు
అగ్గలము = అధికము
కొదమ = పిల్ల
చకోరము = వెన్నెల పక్షి

నేనివి చేయగలనా ?

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న 5

TS 8th Class English Guide Study Material Telangana State Pdf

Telangana SCERT Class 8 English Solutions – TS 8th Class English Guide Study Material Telangana

Telangana SCERT 8th Class English Solutions Unit 1 Family

8th Class English Guide Pdf Telangana Unit 2 Social Issues

Telangana 8th Class English Workbook Answers Unit 3 Humanity

Telangana SCERT Class 8 English Solutions Unit 4 Science and Technology

TS 8th Class English Study Material Unit 5 Education and Career

8th Class English Guide Pdf TS Unit 6 Art and Culture

8th Class English Guide Telangana State Unit 7 Women Empowerment

8th Class English Textbook Pdf with Answers Telangana Unit 8 Gratitude

TS 8th Class English Guide Study Material Telangana State Pdf

TS 8th Class Study Material

TS 8th Class Hindi Guide Study Material Pdf Download Telangana

TS 8th Class Hindi Study Material Telangana Pdf Download | 8th Class Hindi Guide Telangana

Telangana SCERT Class 8 Hindi Solutions | TS 8th Class Hindi Study Material Pdf

TS 8th Class Study Material

TS 8th Class Study Material Telangana Pdf Textbook Solutions

TS 8th Class Study Material Pdf Telangana | TS 8th Class Textbook Solutions Guide

TS Board Solutions

TS 8th Class Telugu Guide Answers Study Material Telangana

TS 8th Class Telugu Guide Study Material Telangana Pdf Download

Class 8 Telugu Textbook Solutions Telangana

TS 8th Class Telugu Guide Telangana ఉపవాచకం

TS 8th Class Study Material

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 2nd Lesson సముద్ర ప్రయాణం Textbook Questions and Answers.

సముద్ర ప్రయాణం TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana

చదువండి – ఆలోచించి చెప్పండి

పడవలో ఇంకా ఇద్దరు భారతీయ విద్యార్థులుండిరి. వారు నాతో మాట్లాడుతూ ఉండిరి. సర్కారువారు వారిని స్కాలర్షిప్ ఇచ్చి పంపినది. కొంతమంది తల్లిదండ్రుల పైసాతో వచ్చుచుండిరి. నేను ఎక్కువ సామాను లేకుండా 22 పౌండ్లతోనే ఇంగ్లండుకు బయలుదేరినాను. ఉన్ని బట్టలు నా వద్ద సరిపోయేటన్ని లేకుండె. ధోతి, పయిజామా, షేర్వాణీతోనే పడవలో తిరిగేవాణ్ణి. దేవునిపైన భారం వేసినాను. బొంబాయి నుండి గ్రేట్ బ్రిటన్కు బయలుదేరినాను. గ్రేట్ బ్రిటన్ పడమటి తీరం పొడుగున ఉత్తరం వైపు మా ప్రయాణం సాగుచుండెను. గ్రేట్ బ్రిటన్ భూమి కనబడుచుండెను. దేవుడు నన్ను తుదకు గ్రేట్ బ్రిటన్ చేర్చినందుకు సంతోషించి, కృతజ్ఞతా వందనం చేసితిని.

ప్రశ్న1.
పడవలోని వాళ్ళు ఎక్కడికి ప్రయాణమైపోతున్నారు ?
జవాబు.
పడవలోని వాళ్ళు బొంబాయి నుండి ఇంగ్లండుకు ప్రయాణమైపోతున్నారు.

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం

ప్రశ్న2.
వాళ్ళు బ్రిటన్ క్కు ఎందుకు వెళ్ళి ఉండవచ్చు ?
జవాబు.
వాళ్ళు చదువుకోవడానికి బ్రిటన్కు వెళ్ళి ఉండవచ్చు.

ప్రశ్న3.
పడవలో ప్రయాణించిన వ్యక్తి దేవుడికి కృతజ్ఞతా వందనం చెప్పటానికి గల కారణాలు ఏమై ఉంటాయి ?
జవాబు.
ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, అనుకున్నచోటుకు క్షేమంగా చేరినందుకు దేవుడికి కృతజ్ఞతా వందనం చెప్పి ఉండవచ్చు. ఎంతో దూరంలో ఉన్న బ్రిటన్కు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా చేరినందుకు కృతజ్ఞతలు చెప్పి ఉండవచ్చు.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No. 13)

ప్రశ్న 1.
వాహనాలు కాన్వాయ్గా వెళ్ళడం ఎప్పుడైనా చూశారా ? దేని కొరకు అట్లా వెళ్తాయి ?
జవాబు.
వాహనాలు కాన్వాయ్గా వెళ్ళటం చాలాసార్లు చూశాము. రాజకీయ నాయకులు, మంత్రులు ప్రయాణం చేస్తున్నపుడు వారికి రక్షణగా బందోబస్తు కొరకు కాన్వాయ్లు వెళ్తుంటాయి.

ప్రశ్న 2.
సైరన్ లేదా అలారం ఎందుకు మోగిస్తారు ?
జవాబు.
ఒక సంకేతాన్ని గాని, హెచ్చరికను గాని సూచించటానికి సైరన్ లేదా అలారం మోగిస్తారు.

ప్రశ్న 3.
దూర ప్రయాణాలకు ఎట్లా సిద్ధం కావాలి ?
జవాబు.
దూర ప్రయాణాలకు సిద్ధమయ్యేటప్పుడు మనం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. కావలసినంత డబ్బు, దుస్తులు, వస్తు సామగ్రిని, మందులను సిద్ధంగా ఉంచుకోవాలి.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No. 14)

ప్రశ్న 1.
ఇప్పుడు ప్రయాణంలో కాలక్షేపం కొరకు ప్రయాణీకులు ఏమేం చేస్తుంటారో చెప్పండి.
జవాబు.
ఇప్పుడు ప్రయాణంలో కాలక్షేపం కొరకు ఎఫ్.ఎమ్. రేడియోలు, లాప్టాప్లు, సెల్ఫోన్లు వాడుతున్నారు. వీటితోపాటుగా హౌసీ, చదరంగం వంటి ఆటలు ఆడుతున్నారు. కొంతమంది అంత్యాక్షరి పోటీలు కూడా పెట్టుకుంటారు.

ప్రశ్న 2.
ప్రయాణం చేసేటప్పుడు తోటి ప్రయాణీకులతో ఎట్లా ఉండాలి ? ఎందుకు ?
జవాబు.
ప్రయాణం చేసేటప్పుడు తోటి ప్రయాణీకులతో సౌమ్యంగా, మర్యాదగా ప్రవర్తించటానికి ప్రయత్నించాలి. వారితో కలిసిపోయి ఉండటానికి ప్రయత్నించాలి. ఇలా చేస్తే వారి భావాలు మనకు, మన భావాలు వారికి తెలుస్తాయి. నలుగురిలో ఎలా మసలుకోవాలో తెలుస్తుంది.

ప్రశ్న 3.
కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడి భాష అర్థం కాకపోతే ఎటువంటి చిక్కులెదురవుతాయి ? అప్పుడు మీరేం చేస్తారు?
జవాబు.
కొత్త ప్రదేశానికి వెళ్ళినపుడు అక్కడి భాష అర్థంకాకపోతే చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటప్పుడు వారు మాట్లాడేటప్పుడు వారి హావభావాలను బట్టి అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తాం. లేదా ‘దుబాసీ’ని ఏర్పాటు చేసుకుంటాం.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No. 15)

ప్రశ్న 1.
విదేశాలకు వెళ్ళేటప్పుడు గడియారంలో సమయాన్ని సరిచేసుకోవాలి. దీనికి కారణం ఏమిటి ?
జవాబు.
సూర్యుడు తూర్పు నుండి పడమరకు ప్రయాణం చేస్తాడు. కాబట్టి పశ్చిమ దేశాలకు వెళ్ళేటప్పుడు గడియారంలో సమయాన్ని పెంచుకోవాలి. తూర్పుదేశాలకు వెళ్ళేటప్పుడు సమయాన్ని తగ్గించుకోవాలి. గ్రీన్విచ్ మీన్ అని దీనిని వ్యవహరిస్తారు.

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం

ప్రశ్న 2.
విదేశాలలో మనకు తెల్సినవారు, బంధువులుంటే ఎట్లాంటి సౌకర్యాలు పొందవచ్చో చెప్పండి.
జవాబు.
విదేశాలలో మనకు తెల్సినవారు బంధువులు ఉంటే ఒక రకమైన ఊరట కలుగుతుంది. ఆ ప్రాంతంలోని చారిత్రాత్మక, విశిష్ట ప్రదేశాలను తెలుసుకునే అవకాశం, చూసే అవకాశం ఉంటుంది. భాష అంతగా రాకపోయినా బాధపడవలసిన అవసరం ఉండదు.

ప్రశ్న 3.
“ఈశ్వరా నీవే దిక్కు” అని రచయిత అనుకోటానికి కారణమేమిటి ? మీకెదురైన అట్లాంటి సందర్భాన్ని చెప్పండి.
జవాబు.
భారతదేశం నుండి ఇంగ్లండుకు చేరిన వారివద్ద తగినంత డబ్బు లేకపోతే అట్లాంటి వారిని డీ పోర్టు చేసి వాపసు పంపుతారని, బ్రిటీషు పోలీసులు చాలా స్ట్రిక్ట్ అని రచయితకు ఆంగ్లో ఇండియన్ ఫాల్సెట్ చెప్పారు. అపుడు రచయిత తనను ఇంగ్లండులో దిగనివ్వకుండా వెనక్కు పంపుతారని భయపడి “ఈశ్వరా నీవే దిక్కు” అని అనుకున్నాడు. నేను ఒకసారి నా మిత్రునితో కలసి బెంగుళూరు వెళ్ళాను. అపుడు మా టికెట్ను ఎక్కడో పోగొట్టుకున్నాం. టి.సి. టికెట్ చూపించకపోతే జైలుకు పంపిస్తాడేమోనని భయపడి “ఈశ్వరా నీవే దిక్కు” అని అనుకున్నాం.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No. 16)

ప్రశ్న 1.
రచయితకు సురేశ్ బాబు సహాయం లేకుండానే పర్మిషన్ దొరకడానికి కారణం ఏమై ఉంటుంది ?
జవాబు.
బ్రిటన్ పోలీసులు రచయితను చూసి చదువు కొరకు వచ్చారని అనుకున్నారు. అదే విషయం రచయితను అడిగారు. రచయిత అవునని చెప్పేటప్పటికి ఇంకా ఏమీ అడగకుండానే ‘పర్మిటెడ్’ అని స్టాంపు వేశారు. అందువల్ల రచయితకు సురేశ్బాబు సహాయం అవసరం లేకపోయింది.

ప్రశ్న 2.
ఏఏ సందర్భాల్లో మీరు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటారో తెల్పండి.
జవాబు.
కష్టంలో నుండి బయటపడ్డప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటాము. కుటుంబ సభ్యులలో, స్నేహితులలో ఎవరైనా అనారోగ్య స్థితి నుండి బయటపడవేసినందుకు దేవునికి కృతజ్ఞతను చెప్పుకుంటాం.

ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
1. ఏదైనా సాధించాలంటే పట్టుదల, దృఢ సంకల్పం అవసరం. దీన్ని సమర్థిస్తూ మాట్లాడండి.
(లేదా)
ముద్దు రామకృష్ణయ్య పట్టుదల, ఆత్మవిశ్వాసం గలవాడని ఎలా చెప్పగలవు ?
జవాబు.
ఏదైనా సాధించాలంటే పట్టుదల, దృఢ సంకల్పం అవసరం. ఈ రెండూ లేకపోతే దేనినీ సాధించలేము. ఉదాహరణకు మన పాఠంలోని సముద్ర ప్రయాణం వ్రాసిన ముద్దు రామకృష్ణయ్యనే తీసుకుందాం ! ఆయన ప్రయాణ కాలం రెండవ ప్రపంచ యుద్ధకాలం. అపుడు ప్రయాణం చేయాలంటే మనసును రాయి చేసుకోవాల్సిందే ! ఎక్కడో మారుమూల గ్రామంలో జన్మించిన కృష్ణయ్య దృఢ సంకల్పంతో, పట్టుదలతో తన మనసులోని కోరికను, లక్ష్యాన్ని సాధించటానికి సుదూర ప్రాంతమైన గ్రేట్ బ్రిటన్కు ప్రయాణమయ్యాడు. పైసలు లేవు, తెలిసినవారు లేరు. అయినా మంచి సంకల్ప బలం ఆయనను ఇంగ్లండుకు నడిపించింది. ఆయనలోని కృతనిశ్చయం, దృఢ సంకల్పం ఆయన విజయానికి దారితీశాయి. గ్రేట్ బ్రిటన్ వెళ్ళి అక్కడి లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి యం.ఇడి. పట్టా పొందారు కదా ! కాబట్టి పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చు.

II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం.

1. కింది వాక్యాలు. పాఠంలోని ఏ పేరాలో ఉన్నవో గుర్తించి, పేరాకు శీర్షికను పెట్టండి.

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం 1
జవాబు.

వాక్యంపేరా సంఖ్యశీర్షిక
1. పడవలో రిసెప్షన్ రూం కూడా ఉంటుంది.13వ పేజీలో 4వ పేరాపడవ ప్రయాణంలో సౌకర్యాలు
2. నేను ధోవతి శేర్వానీతో ఉంటిని1 పేజీ 1వ పేరావేషధారణ
3. ఏవేళ ప్రాణం పోతుందో12వ పేజీ 1వ పేరారెండవ ప్రపంచ యుద్ధం
4. మేము పడవ నుండి దిగేవరకు సూర్యాస్తమయం అయింది.16వ పేజీ  చివరి పేరాగ్రేట్ బ్రిటన్

 

2. కింది పేరాను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

హైదరాబాద్ నుండి నేను రైలులో బాసర రైల్వేస్టేషన్కు చేరుకున్నాను. అక్కడి నుండి బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతీ దేవి ఆలయానికి చేరుకున్నాను. ఆధ్యాత్మికత విలసిల్లే ప్రశాంత సుందర ప్రదేశంలో, గోదావరినది తీరాన ఈ సుందర ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉన్నది.

ఇక్కడి సరస్వతీదేవి సైకతమూర్తిని వ్యాసమహర్షి మలిచాడని ప్రసిద్ధి. ఈ వాగ్దేవతా సమక్షంలో వసంతపంచమిరోజు పిల్లలకు విద్యాభ్యాసం చేయిస్తే మంచి విద్యావంతులు అవుతారని ప్రతీతి. దసరా పండుగ రోజుల్లో అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. ఒక్కొక్కరోజు ఒక్కొక్క అవతార మూర్తిగా అమ్మవారిని అలంకరిస్తారు. ఈ రోజుల్లో భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ పుణ్యక్షేత్రం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నది.

అ) బాసర పుణ్యక్షేత్రంలోని దేవత ఎవరు ?
జవాబు.
బాసర పుణ్యక్షేత్రంలో వెలసిన దేవత శ్రీ జ్ఞాన సరస్వతీదేవి.

ఆ) సరస్వతీదేవి ఆలయం ఏ నది తీరాన ఉన్నది ?
జవాబు.
సరస్వతీదేవి ఆలయం గోదావరి నదీ తీరాన ఉన్నది.

ఇ) సరస్వతీదేవి సైకతమూర్తిని మలచినవారు ఎవరు ?
జవాబు.
సరస్వతీదేవి సైకతమూర్తిని మలచినవారు వేదవ్యాస మహర్షి.

ఈ) నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి ?
జవాబు.
నవరాత్రి ఉత్సవాలు దసరా పండుగ రోజుల్లో జరుగుతాయి.

ఉ) పై పేరాకు శీర్షిక సూచించండి.
జవాబు.
ఆధ్యాత్మికతకు మారుపేరు – బాసర.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) దూర ప్రయాణాలకు పోయేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ?
జవాబు.
దూర ప్రయాణాలకు పోయేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా డబ్బు చేతినిండా ఉంచుకోవాలి. ఆయా ప్రాంతాన్ని బట్టి దుస్తులను సమకూర్చుకోవాలి. అక్కడ ఎవరైనా తెలిసిన వారుంటే వారి చిరునామా, ఫోన్ నంబర్లను తీసుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యమైంది ఆ ప్రాంతంలో మాట్లాడే భాషను కొంతన్నా మాట్లాడగలగాలి. ముందే ఆ భాషను నేర్చుకొని ఉండాలి. లేదా ప్రపంచ భాషగా ప్రసిద్ధి చెందిన ఏదో ఒక భాషను నేర్చుకొని ఉండాలి. దానితోబాటుగా మన భాషలోను, ఆ ప్రాంతం భాషలోను చక్కగా మాట్లాడగలిగే వారిని ముందుగా కలుసుకోవటం చేయాలి.

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం

ఆ) రచయిత ఉన్నతవిద్య కోసం పట్టుదలతో ఇంగ్లాండు వెళ్ళాడు కదా ! దీని ద్వారా మీరేం గ్రహించారు ?
జవాబు.
కృషి, పట్టుదల ఉంటే దేన్నైనా సాధించగలమన్న విషయాన్ని రచయిత ఇంగ్లాండుకు వెళ్ళిన సంఘటన ఋజువు చేస్తోంది. జ్ఞానాన్ని సంపాదించటానికి ఎల్లలుండవు. దేన్నైనా సాధించాలనే దృఢ సంకల్పం ఎటువంటి ఆటంకాలనైనా ఎదుర్కొని విజయం సాధించేందుకు తోడ్పడుతుంది. మంచి సంకల్పం ఉంటే విజయాలు వాటంతట అవే వెతుక్కుని వస్తాయట. కనుక మనం దేనిలో విజయం సాధించాలనుకున్నామో దానిని సాధించటానికి పట్టుదలతో కృషిచేయాలని గ్రహించాము.

ఇ) “ఉన్నత లక్ష్యం, పట్టుదలతో, దేనినైనా సాధించవచ్చు” వివరించండి. (లేదా) సముద్ర ప్రయాణం పాఠం ఆధారంగా పట్టుదలతో దేనినైనా సాధించవచ్చును అని వివరించండి.
జవాబు.
ఉన్నత లక్ష్యంతో, పట్టుదలతో దేనినైనా సాధించవచ్చన్నది యథార్థం. స్వామి వివేకానంద భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాడు. దానికోసం ఆయన ప్రపంచదేశాలన్నీ చుట్టి వచ్చాడు. చేతిలో డబ్బుల్లేకపోయినా, ఎన్నో రోజులు పస్తులున్నా ఆయన ముందు తన దేశభక్తిని ప్రపంచానికి చాటాలనే లక్ష్యం ఉండటం చేత ఆ సమస్యలు ఆయనను ఏమి చేయలేక పోయాయి. చికాగోలో ఉపన్యాసానికి ముందు ఆయన ఆహారం లేక సొమ్మసిల్లి పడిపోతే ఆయనను ఎక్కడో చూసిన ఒక స్త్రీ రక్షించి ఆహారాన్నిచ్చి ఆయనను చికాగో నగరానికి పంపించింది. కాబట్టి ఉన్నత లక్ష్యం, పట్టుదల ఉంటే దేన్నైనా సాధించగలం అన్నది నిజం.

ఈ) ఒక కొత్త ప్రదేశాన్ని దర్శించినప్పుడు అక్కడ తెలియని విషయాలను తెల్సుకోవడానికి మీరేంచేస్తారు ?
జవాబు.
క్రొత్త ప్రదేశాన్ని దర్శించినపుడు అక్కడ తెలియని విషయాలను తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాం. ఆ ప్రదేశంలో పరిచయమున్నవారితో స్నేహం చేసి తెలుసుకుంటాం. ఆ ప్రాంతానికి సంబంధించిన అట్లాసు, గైడ్లపై ఆధారపడతాం. తెలిసిన బంధువులు, స్నేహితులు, మన వూరివారు ఆ ప్రాంతంలో ఎవరున్నారనే విషయాన్ని తెలుసుకుంటాం. అక్కడున్న పర్యాటక ఏజెన్సీలలో సంప్రదిస్తాం. అక్కడి వింతలు, విశేషాలు తెలుసుకుని వాటిని చూడటానికి ప్రయత్నిస్తాం: నేటి సాంకేతిక పరిణామాలను అనుసరించి ‘నెట్’ ద్వారా సమాచారాన్ని తెలుసుకుంటాం. ‘వికిపీడియా’ ప్రపంచాన్నంతటిని మన చేతుల్లోకి తెచ్చింది కదా ! దానిని ఉపయోగించి మరింత సమాచారాన్ని తెలుసుకుంటాం. (అదనపు ప్రశ్న)

ఉ) గ్రేట్ బ్రిటన్ని చేరిన రచయిత మనఃస్థితిని వివరించండి.
జవాబు.
రచయిత ఎన్నో అడ్డంకులను అధిగమించి చదువుకోసం చివరికి గ్రేట్ బ్రిటన్ చేరుకున్నారు. పడవలో నుండి బయటకు అడుగుపెట్టగానే ఆయనకు పట్టరాని సంతోషం కలిగింది. గ్రేట్ బ్రిటన్ని చూస్తూ అలా నిలబడిపోయారు. సాధ్యం కాదనుకున్న దానిని దేవుడు సాధ్యం చేశాడు. “ఎక్కడో తెలంగాణలో మారుమూల గ్రామంలో పుట్టిన నేనెక్కడ, బ్రిటన్ ఎక్కడ ! పైసా లేకుండా రావటం ఎంత ఆశ్చర్యం. ఆ ఈశ్వరుడే నన్ను రక్షించి ఇక్కడకు తీసుకువచ్చాడు.” అని రచయిత అనుకున్నాడు. బ్రిటన్ సుందర దృశ్యాలను చూసే అదృష్టాన్ని ఉన్నత చదువులు చదివే అదృష్టాన్ని తనకు కల్పించినందుకు దేవునికి కృతజ్ఞతలను తెలుపుకున్నాడు.

ఊ) సురేష్ బాబుకు, రచయితకు మధ్య జరిగిన సంభాషణను వివరించండి.
జవాబు.
(అదనపు ప్రశ్న) రచయిత గ్రేట్ బ్రిటన్కు ప్రయాణమయ్యాడు. ఆయనతో పాటు కరీంనగర్కు చెందిన జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు గారి అబ్బాయి సురేష్ బాబు ప్రయాణించాడు. ఆయన స్కాలర్షిప్తో పాటు దండిగా డబ్బులు తెచ్చుకుంటున్నాడు. రచయిత తనని తాను పరిచయం చేసుకొని క్లుప్తంగా తన దీన పరిస్థితిని, చదువుకోవాలన్న ఆసక్తిని వినిపించాడు. తన దగ్గర డబ్బు లేదన్న రహస్యాన్ని ఎవరికి చెప్పవద్దని వాగ్దానం తీసుకున్నాడు.

సురేష్ రచయిత “బాబు ! నీకు డబ్బు ప్రశ్న లేదు. నీ దగ్గరున్న 150 పౌండ్ల డ్రాఫ్ట్ ఉంది. అందులో వంద పౌండ్లు నావి అని చెప్పు” అని వేడుకున్నాడు. “నీ డబ్బు అడగను నన్ను పడవ దిగేటట్లు చూడు” అని కోరాడు. సురేష్ బాబు సరేనని ఒప్పుకున్నాడు. అయితే రచయితకు సురేష్ బాబు సహాయం లేకుండానే చివరికి ‘పర్మిటెడ్’ అని స్టాంపు వేశారు బ్రిటన్ పోలీసులు. అయినా తనకు ఒక ధీమాను, ఓదార్పును ఇచ్చిన సురేష్ బాబుకు రచయిత కృతజ్ఞతలను చెప్పుకున్నాడు.

ఋ) రచయిత ఎడెన్లో దిగినప్పటి అనుభవాలను రాయండి. (అదనపు ప్రశ్న)
జవాబు.
గ్రేట్ బ్రిటన్లో మొదటి మజిలీ ఆడెన్ (ఎడెన్). ఎడెన్ పట్టణంలోకి వెళ్ళటానికి రచయిత తోటి ప్రయాణీకులకు అనుమతి లభించింది. రచయిత తోటి ప్రయాణికుడి బంధువులు ఆడెన్లో ఉన్నారు. అందులో ఒకరు కారును తీసుకువచ్చి ఆడెన్ ప్రాంతంలోని చారిత్రాత్మక ప్రాంతాలన్నీ చూపించాడు. వారింటిలోనే శాకాహార భోజనాన్ని వీరికి అందించాడు. కొంత విశ్రాంతి అనంతరం రచయితను ఆయనతో ఉన్న గుజరాతీ పిల్లలను మరల ఓడరేవులో దించేశాడు. ఆడెన్లో ఉండే వారందరూ దాదాపు అరబ్బీ ముస్లింలే. హైదరాబాద్ లోని ముస్లింల మొహల్లా ఉన్నట్లు ఆడెన్ ఉంటుంది. అది ఒక గొప్ప అనుభవంగా రచయిత భావించాడు.

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) “అనుకున్నది సాధించటంలో కలిగే తృప్తి అనంతమైనది.” ముద్దు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణం ఆధారంగా వివరించండి. (లేదా) “అనుకున్నది సాధించడంలో ముద్దు రామకృష్ణయ్య ఎంతో సంతృప్తి పొందాడు.” (లేదా) అనుకున్నది సాధించినపుడు పొందే తృప్తి ఎట్లాంటిది?
జవాబు.
ముద్దు రామకృష్ణయ్య జనన విశేషాలు :
ముద్దు రామకృష్ణయ్య కరీంనగర్ జిల్లాలోని మంథని గ్రామంలో అక్టోబరు 18, 1907 లో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు ముద్దు రాజన్న, తల్లి ముద్దు అమ్మాయి. ఈయన ఒక బడి పంతులు. ఉన్నత విద్య కోసం రామకృష్ణయ్య గ్రేట్ బ్రిటన్ వెళ్ళాలనుకున్నాడు. తగినంత ధనం లేకపోయినా అనుకున్నది సాధించాడు.

గ్రేట్ బ్రిటను ప్రయాణం :
అది రెండవ ప్రపంచయుద్ధం జరుగుతున్న రోజులు. ప్రయాణం మొదలయింది. బ్రిటన్లో ఎవరిని కలవాలో తెలీదు. ఎలాంటి ప్రతిఘటనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని తెచ్చుకున్నాడు రచయిత. తనకున్న రెండు జతల బట్టలను పైజమా కుర్తాలను సర్దుకుని పాస్పోర్టు 22 పౌండ్ల ధనాన్ని తీసుకుని పడవ ఎక్కాడు. ఆయన కండ్ల ముందు ఒకటే లక్ష్యం. ఆ లక్ష్య సాధనే ఆయన సిద్ధాంతం. తాను అనుకున్న ఉన్నత విద్యను సాధించాలని ప్రయాణం ప్రారంభించాడు.

సహాయకులు :
ఆయనకు పడవలో తొలి పరిచయస్తుడు ఆంగ్లో ఇండియన్ ఫాల్సెట్టు. ఆయన బ్రిటన్ గురించి అక్కడి అలవాట్లను గురించి వివరించాడు. తరువాత కరీంనగర్ నుండి బయలుదేరిన సురేష్ బాబు పరిచయం ఏర్పడి పడవ దిగేవరకు రచయితకు భరోసా ఇచ్చాడు.

బ్రిటన్లో కాలుపెట్టిన రచయిత అనుభూతి :
స్టడీస్ కొరకు వచ్చాడని తెలుసుకున్న పోలీసులు తేలికగానే పర్మిషన్ ఇవ్వటంతో బ్రతుకు జీవుడా అనుకున్నాడు. గ్రేట్ బ్రిటన్ న్ను చూస్తూ అలా నిలబడిపోయాడు అనుకున్న లక్ష్యాన్ని సాధించాననుకున్నాడు. సంకల్పం, పట్టుదల ఉంటే అనుకున్నది సాధించగలం అన్న నమ్మకాన్ని అందరికి కలిగించాడు ముద్దు రామకృష్ణయ్య. అనిర్వచనీయమైన సంతృప్తి పొందుతాడు.

IV. సృజనాత్మకత/ప్రశంస

1. కింది వానిలో ఒకదానికి జవాబు రాయండి.

అ) చదువును కష్టంగా భావించవద్దు. ఉన్నత లక్ష్యం పెట్టుకొని, ఇష్టంగా చదువుకుని, అనుకున్నది సాధించాలని తెలుపుతూ మిత్రునికి లేఖ రాయండి.

జనగాం,
ది. XX. XX. XXXX

ప్రియమైన మిత్రుడు యాదగిరికి,

నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని భావిస్తున్నాను. నీ చదువు ఎలా సాగుతోంది. కష్టపడి పనిచేయాలి ఇష్టంగా చదవాలి అంటారు పెద్దలు. మొక్కుబడిగా చదివే చదువు బుర్రలోకి ఎక్కదు. జ్ఞాపకం ఉండదు. అందువల్ల ఎన్నిగంటలు చదివినా, చదవడం అవగానే మరచిపోతాము. అదే ఇష్టపడి చదివితే, మనసులోకి ఎక్కుతుంది. ఎన్నాళ్ళైనా మరచిపోవడం జరగదు. అందుకే చదువును ఎప్పుడూ కష్టంగా భావించకూడదు. ఉన్నత లక్ష్యాలను సాధించటానికి చదువు మూలం. చదువు మనకు సంస్కారాన్నిస్తుంది. జ్ఞానాన్నిస్తుంది. కాబట్టి చక్కగా చదువుకుని లక్ష్యాన్ని సాధించి మంచి జీవితానికి బాటలు వేసుకోవాలి. లక్ష్యం ఉన్నతంగా ఉంటే, దానిని సాధించడానికి క్రమశిక్షణతో కృషిచేస్తాము. లక్ష్యాన్ని సాధించడానికి బాగా కష్టపడతాము. ఇలా కష్టపడి సాధించిన లక్ష్యం ఎంతో ఆనందాన్నిస్తుంది.

ఈ విషయంలో నీ అభిప్రాయాన్ని వినాలని కోరిక. తప్పక రాస్తావు కదూ !

ఇట్ల
నీ ప్రియమైన మిత్రుడు,
జమలయ్య.
ఖమ్మం.

చిరునామా :
కె. యాదగిరి
8వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,

ఆ) మీరు చేసిన ఒక ప్రయాణ అనుభవాన్ని వివరిస్తూ వ్యాసం రాయండి.

(లేదా)

ప్రయాణం చేసే సమయంలో ఇబ్బందులేమైనా ఉన్నాయా? ఉంటే వ్రాయండి.
జవాబు.
మేము మా కుటుంబంతో కలసి వేసవి సెలవులలో ఎక్కడికన్నా వెళ్లామనుకున్నాం. మా తాతగారు ఒరేయ్ మీకు ప్రకృతి అంటే ఏమిటో చూపిస్తాను వస్తారా ? అన్నారు. అందరం సరేనన్నాం. ఒక గంటలోనే అందరం ప్రయాణానికి సిద్ధం అయ్యాం. పెద్ద టాటా సుమో కారు మా యింటి ముందుకు వచ్చి ఆగింది. ఎక్కడికో ఏమిటో చెప్పనేలేదు. అందరం దాన్లో ఎక్కి కూర్చున్నాం. నేను తాతగారు ముందు, మిగిలిన వారందరూ వెనుక కూర్చున్నాం. అప్పుడన్నారు తాతగారు మనం భద్రాచలం నుండి రాజమండ్రి వెళ్తున్నాం అని. ఇది కూడా ఒక ప్రయాణమేనా అని అందరం ఉసూరుమన్నాం. వాహనం ముందుకు సాగింది. భద్రాచలం అడవుల గుండా ప్రారంభమైన మా ప్రయాణం ఖమ్మం, చింతూరుల మీదుగా సాగింది.

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం

అది చిన్న ఘాట్ రోడ్. కొండలు, గుట్టలు, లోయలు దారంతటా దర్శనమిస్తున్నాయి. నిజమైన ప్రకృతి సంపద వృక్షసంపద. ఆకాశాన్నంటే ఎత్తైన వృక్షాలు, ఋషుల జడలు లాగా అల్లుకున్న తీగలు, కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి లాగా ఉంది ఆ అడవి. పెద్ద పెద్ద సెలయేళ్ళు జలజలా ప్రవహిస్తుంటే ఒళ్ళు జలదరించింది.

పక్షుల కిలకిలా రావాలు, కీచురాళ్ళు పెట్టే ధ్వని మధ్యమధ్యలో అడవిలో తిరుగాడే కోతులు, చిరు జంతువుల అరుపులు, తోడేళ్ళ, నక్కల ఊళలు నిజంగా ప్రకృతి అంటే ఇదేగా అన్నట్లున్నది. ఆ ఘాట్రోడ్డులో జనసంచారమే కాదు వాహన సంచారం కూడా చాలా అరుదు. కొండమలుపుల్లో మాలో కలిగిన ఆందోళన అంత ఇంత కాదు. ఇబ్బందిగా ఉంటుందని అనుకున్నాం. భయపడ్డాం. కానీ, అక్కడ వాతావరణం చూస్తే పళ్ళు, పూలతో అలరిస్తున్న చెట్లు నిజంగా అది ఒక స్వర్గలోకం అనిపించింది. తాతగారు చెప్పిన ప్రకృతి అర్థం ఇదా అని, ఇంతటి సుందర ప్రాంతాన్ని చూపించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకున్నాం.

V. పదజాల వినియోగం

1. కింది వాక్యాల్లో గీత గీసిన పదానికి తగిన అర్థాన్ని గుర్తించండి.

అ) పై చదువుకు సరిపడా ద్రవ్యం నా వద్ద లేకుండె.
అ) శక్తి
ఆ) సామర్థ్యం
ఇ) డబ్బు
ఈ) వస్తువు
జవాబు.
ఇ) డబ్బు

ఆ) నా మిత్రునికి సహాయపడతానని నేను వాగ్దానం చేశాను.
అ) మాటతీసుకొను
ఆ) మాటయిచ్చు
ఇ) మాట మార్చు
ఈ) డబ్బు యిచ్చు
జవాబు.
ఆ) మాటయిచ్చు

2. కింది జాతీయాలను సొంతవాక్యాలలో రాయండి.

ఉదా : అందెవేసిన చేయి
సీస పద్యాలు రాయడంలో శ్రీనాథుడిది అందెవేసిన చేయి.

ఆ) పట్టరాని సంతోషం
జవాబు.
నా కథకు మొదటి బహుమతి రావటం పట్టరాని సంతోషాన్నిచ్చింది.

ఆ) దేవునిపై భారంవేయు :
జవాబు.
కష్టకాలంలో దేవునిపై భారం వేయటం. కష్టం తీరగానే మరచిపోవడం మానవ నైజం.

ఇ) గుండె జల్లుమను
జవాబు.
రోడ్డు ప్రమాదాన్ని చూసి నా గుండె జల్లుమన్నది.

ఈ) చెమటలు పట్టు
జవాబు.
పామును చూడగానే నాకు చెమటలు పట్టాయి.

VI. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది వాక్యాలలో గీత గీసిన పదాలు ఏ సమాసాలో గుర్తించి, వాటి పేర్లు రాయండి.

అ) ఆదిశేషునికి వేయితలలు : ______________________
జవాబు.
వేయి సంఖ్య గల తలలు – ద్విగు సమాసం

ఆ) కృష్ణార్జునులు సిద్ధమైనారు : ______________________
జవాబు.
కృష్ణుడును, అర్జునుడును – ద్వంద్వ సమాసం

ఇ) రవి, రాము అన్నదమ్ములు : ______________________
జవాబు.
అన్నయును, తమ్ముడును – ద్వంద్వ సమాసం

ఈ) వారానికి ఏడురోజులు : ______________________
జవాబు.
ఏడు సంఖ్య గల రోజులు – ద్విగు సమాసం

ఉ) నూరేండ్లు జీవించు : ______________________
జవాబు.
నూరు సంఖ్య గల ఏండ్లు – ద్విగు సమాసం

2. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.

అ) విద్యాభ్యాసం = ________ + ________ = _____________
జవాబు.
విద్య మొదలు + అభ్యాసం = సవర్ణదీర్ఘ సంధి

ఆ) మొదలయింది = ________ + ________ = _____________
జవాబు.
మొదలు + అయింది = ఉత్వసంధి

ఇ) విద్యార్థులు = ________ + ________ = _____________
జవాబు.
విద్య + అర్థులు = సవర్ణదీర్ఘ సంధి ఇత్వసంధి

ఈ) ఏదైనా = ________ + ________ = _____________
జవాబు.
ఏది + ఐన = ఇత్వసంధి

ఉ) వారందరు = ________ + ________ = _____________
జవాబు.
వారు + అందరు = ఉత్వసంధి

అత్వ సంధి 

కింది పదాలను పరిశీలించండి.

అ) రామయ్య = రామ + అయ్య
ఆ) మేనత్త/మేనయత్త = + అత్త
ఇ) సెలయేరు = సెల + ఏరు
ఈ) ఒకానొక = ఒక + ఒక

సంధిని విడదీసినప్పుడు ఏర్పడే రెండు పదాలలో మొదటి పదాన్ని “పూర్వపదం” అని, రెండవ పదాన్ని “పరపదం” అని అంటారు.

పూర్వపదం చివర ఉన్న అచ్చు ఏది ?
పరపదం మొదట ఉన్న అచ్చు ఏది ?
పూర్వపదం చివరి అచ్చుకు పరపదం మొదటి అచ్చు కలిస్తే ఏం ఏర్పడింది ?

పై ఉదాహరణలు చూసినప్పుడు మొదటి పదం చివరన ‘అ’ అచ్చు ఉంటుంది. రెండవ పదం మొదట అ, ఏ, ఒ మొదలైన అచ్చులు ఉన్నాయి. సంధి జరిగినప్పుడు మొదటి పదం చివరి అచ్చు ‘అ’ లోపించి రెండో పదం మొదటి అచ్చు. వచ్చి చేరితే కింది విధంగా ఉంటాయి.

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం

రామయ్య → లాంటి పదాల్లో సంధి ఎప్పుడూ అవుతుంది. (నిత్యం)
మేనత్త, మేనయత్త లాంటి పదాల్లో సంధి జరగవచ్చు, జరుగకపోవచ్చు. (వైకల్పికం)
సెలయేరు → లాంటి పదాలు ‘సెలేరు’ లాగా మారకుండా ‘సెలయేరు’ లాగానే ఉంటాయి. (నిషేధం)
ఒకానొక → లాంటి పదాలు ‘ఒకొక్కలాగా మారకుండా మరోరూపంలోకి అంటే ‘ఒకానొక’లాగా మారుతాయి. (అన్యకార్యం)
(మొదటి పదం చివరి అచ్చు పూర్వస్వరం. రెండోపదం మొదటి అచ్చు పరస్వరం.)
‘అ’ కు అచ్చులు (అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ ఔ) పరమైతే ఏర్పడే సంధి ‘అత్త్వసంధి’.
సూత్రం : (అత్తు అంటే హ్రస్వమైన ‘అ’) నకు అచ్చు పరమైనప్పుడు సంధి బహుళముగానగు.

3. కింది పదాలను కలిపి రాయండి. ఏం జరిగిందో చెప్పండి.

ఉదా : తగిన + అంత = తగినంత.

అ) చాలిన + అంత = ________
జవాబు.
చాలినంత

ఆ) సీత + అమ్మ = ________
జవాబు.
సీతమ్మ

ఇ) అక్కడ + ఇక్కడ = ________
జవాబు.
అక్కడిక్కడ

ఈ) అందక + ఉండెను = ________
జవాబు.
అందకుండెను

ఉ) చెప్పుట + ఎట్లు = ________
జవాబు.
చెప్పుటెట్లు

ఊ) రాక + ఏమి = ________
జవాబు.
రాకేమి

బహుళం :
సంధి నిత్యంగా, వైకల్పికంగా, నిషేధంగా, అన్యకార్యంగా జరుగడాన్ని “బహుళం” అంటారు.

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని

వివిధ పత్రికలలో వచ్చే యాత్రారచనలను చదివి, వాటిలో ఒక దానికి నివేదిక రాయండి.

అ) ప్రాథమిక సమాచారం :
1) ప్రాజెక్టు పని పేరు
2) సమాచారాన్ని సేకరించిన విధానం

ఆ) నివేదిక :
విషయ వివరణ :
దర్శనీయ యాత్రాస్థలం – వేములవాడ : పత్రికలు చదివి తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి సుమారు 32 కి.మీ. దూరంలో నెలకొని ఉన్న వేములవాడ ప్రసిద్ధ యాత్రాస్థలం. ఇక్కడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంతో పాటు, భీమేశ్వర ఆలయం, బద్ది పోచమ్మ ఆలయం కలవు. సుదూర ప్రాంతాల నుండి ఎంతో మంది భక్తులు వేములవాడకు వచ్చి శ్రీ రాజరాజేశ్వరస్వామిని, అమ్మవారిని దర్శించుకొంటారు. రాత్రి ఒకపూట ఇక్కడ నిద్రచేసి వెళ్తే తమ దోషాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు.
TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం 2
భక్తులు బసచేయుటకు ప్రభుత్వ వసతి గృహాలతో పాటు, ప్రైవేటు లాడ్జ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఆలయాన్ని వినయాదిత్య యుద్ధమల్లుని మనుమడు, రాజాదిత్య కట్టించినట్లు చరిత్రకారులు చెబుతారు. దేవాలయానికి ఉత్తరాన ధర్మగుండం అనే కోనేరు కలదు. దీనిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ఇతర ఏ దేవాలయంలో లేని విధంగా భక్తులు కోడెలను కట్టివేసి మొక్కు చెల్లించుకొనే సాంప్రదాయం ఈ గుళ్ళో కలదు.

1830 ప్రాంతంలో కాశీయాత్రలో భాగంగా, నాటి నైజాం ప్రాంతాలలో మజిలీ చేస్తూ వెళ్ళిన ఏనుగుల వీరాస్వామి, తన “కాశీయాత్ర” అనే పుస్తకంలో ఈ పుణ్యక్షేత్రం గురించి ప్రస్తావించారు. శివరాత్రి రోజున 3 లక్షల మంది భక్తులు రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకుంటారు. వంద మంది అర్చకులు మహాలింగార్చన చేస్తారు. రాత్రిపూట శివరాత్రి రోజున విద్యుద్దీపాల కాంతిలో ఈ దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతుంటే అది కళ్ళారా చూసి తరించాల్సిందే తప్ప నోటితో పొగడడం ఎవరి శక్యమూ కాదు.

కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరం లను పావనం చేసిన తర్వాత శివుడు వేములవాడకు వేంచేశాడని పురాణ కథనం. మూల విరాట్టు రాజరాజేశ్వరస్వామి ఎడమవైపున శ్రీ రాజరాజేశ్వరిదేవి, కుడివైపున శ్రీ లక్ష్మీ సహిత సిద్ది వినాయక విగ్రహాలున్నాయి. దేవాలయ ప్రాంగణంలో 400 ఏళ్లనాటి మసీదు ఉంది. ఇలా ఈ ఆలయం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నది. అతి పురాతనమైన భీమేశ్వర ఆలయంలో భక్తులు శనిగ్రహ దోష నివారణకు శని పూజలు జరుపుకుంటారు. ఈ దేవాలయంలో కోడెను కట్టివేయడం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయని, సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.

ఇ) ముగింపు :
ఇంత ఘన చరిత్ర కలిగిన దేవాలయానికి ఒక్కసారి వెళ్ళి కనులారా ఆ దేవదేవుని దర్శించుకోవాలని కోరిక కలిగింది. మన గత వైభవానికి ప్రతీకలు, సంస్కృతీ సాంప్రదాయాలకు వారధులైన దర్శనీయ స్థలాల గూర్చి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదనే భావన నాలో కలిగింది.

TS 8th Class Telugu 2nd Lesson Important Questions సముద్ర ప్రయాణం

ప్రశ్న1.
రచయిత గ్రేట్ బ్రిటన్ కు వెళ్ళిన పడవ ప్రయాణంలోని సౌకర్యాలను వివరించండి.
(లేదా)
ముద్దు రామకృష్ణయ్య ప్రయాణించిన పడవలోని సౌకర్యాలు ఏమిటి ?
జవాబు.
రచయిత ముద్దు రామకృష్ణయ్య ప్రయాణం చేసిన పడవలో సౌకర్యాలకు కొదవలేదు. పడవ క్యాబిన్లో ఒక్కొక్కదానిలో 6 బెర్తులు ఉన్నాయి. ప్రతి పడవలోను ‘Life Boats’ ఉన్నట్లు ఈ పడవలో కూడా ఉన్నాయి. పడవ అటు చిన్నది కాదు, ఇటు పెద్దది కాదు. కొత్తగా పడవ ఎక్కినవారికి సముద్ర రోగం వస్తుంది. సముద్రం ప్రశాంతంగా ఉంటే ఈ జబ్బు రాదు. తలనొప్పి, వాంతులు అవుతాయి. డబ్బు తీసుకోకుండా పడవలోని డాక్టర్లు మందులు ఇస్తారు. రోగులు లేవలేని స్థితిలో డాక్టర్ క్యాబిన్లోకి వచ్చి మందులిస్తారు. పడవలో పోస్టాఫీసు కూడా ఉంది.

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం

ప్రయాణీకులకు జాబు వస్తే క్యాబిను తెచ్చి అందిస్తారు. అలాగే టెలిగ్రాఫ్ ఆఫీసు కూడా ఉంది. పడవలోని దుకాణాలలో మనకు కావలసిన వస్తువులను తెచ్చుకోవచ్చు. పడవ పైన రేడియో డెట్లు, లౌడ్ స్పీకర్లు అమర్చబడి ఉంటాయి. వార్తలు ఎప్పటికప్పుడు తెలుపబడతాయి. పీరియాడికల్స్ లాంజ్లో ఉంటాయి. గొప్పవారి హోదాకు తగ్గట్లుగా లాంజ్లుంటాయి. చిన్నపిల్లలకు నర్సరీ సెక్షన్ మరియు కిండర్ గార్డెన్ సెక్షన్లుంటాయి.

వారి పూర్తి బాధ్యత పడవవారే చూసుకుంటారు. పడవలో లైబ్రరీ కూడా ఉంటుంది. ఆటలు కూడా ఆడుకునే వీలుంటుంది. స్విమ్మింగ్పల్ కూడా ఉంటుంది. సకల సౌకర్యాలతో పాటు అది రెండవ ప్రపంచయుద్ధం జరుగుతున్న కాలం అవటం చేత పడవల దిశానిర్దేశం చేస్తూ ఆకాశంలో విమానాలు అనుసరిస్తూ ఉన్నాయి. ప్రయాణీకుల భద్రత ప్రథమలక్ష్యంగా అవి సాగుతుండేవి.

ప్రశ్న2.
బ్రిటన్ పోలీసుల నిబద్ధతను వివరించండి.
జవాబు.
బ్రిటన్ పోలీసులు చాలా నిబద్ధత కలిగినవారు. వారు ప్రతి విషయాన్ని చాలా సునిశితంగా పరిశీలించేవారు. ఏ మాత్రం తేడా ఉన్నా ఊరుకునేవారు కాదు. ఈ విషయం పట్ల పూర్తి అవగాహన రచయితకు ఆంగ్లో ఇండియన్ మిత్రుడు ఫాల్సెట్టు కలిగించాడు. బ్రిటన్ పోలీసులు చాలా స్ట్రిక్ట్ ఉండేవారు. తగినంత డబ్బు లేకుండా విదేశీయులను బ్రిటన్లో దిగనిచ్చేవారు కాదు. అలాంటివారిని డీపోర్ట్ చేసి వెనక్కి పంపించేవారు. రచయిత కూడా ఈ విషయం విని చాలా భయపడ్డారు. ఎందుకంటే ఆయన వద్ద కూడా తగినంత డబ్బు లేదు.

రచయితకు తనని కూడా డీపోర్టు చేసి ఇండియాకు పంపిస్తారన్న భయం పట్టుకుంది. అందుకే ఆయన “ఈశ్వరా నీవే దిక్కు” అని అనుక్షణం భగవంతునికి మొక్కుకున్నాడు. స్కాట్లాండ్ యొక్క గ్లాస్కో రేవు పట్టణంలో పడవ ఆగింది. అక్కడికి పడవ చేరకముందే పోలీసులు పడవలోకి వచ్చారు. ప్యాసింజర్ల పాస్పోర్టులను చెక్చేశారు. కొందరికి దిగటానికి పర్మిషన్ ఇవ్వలేదు. కారణం వారి దగ్గర సరైన పేపర్లు లేకపోవటం.

చివరకు రచయిత వంతు వచ్చింది. ఆయన పాస్పోర్టును చూసి మీరు “స్టడీస్ కొరకు వచ్చారా” అని అడిగి పర్మిటెడ్ అని స్టాంపు వేశారు. రచయిత బ్రతుకు జీవుడా అనుకున్నారు. ప్రతి విషయంలోనూ బ్రిటీషు పోలీసువారు మంచి నిబద్ధతతో వ్యవహరిస్తారనడానికి ఇవన్నీ కొన్ని నిదర్శనాలు.

ప్రశ్న3.
ముద్దు రామకృష్ణ వివరించిన సముద్ర ప్రయాణాన్ని సొంతమాటల్లో రాయండి.
(లేదా)
గ్రేట్ బ్రిటన్ వెళ్ళడానికి ముద్దు రామకృష్ణయ్య పడిన ఇబ్బందులేవి?
(లేదా)
గ్రేట్ బ్రిటన్ వెళ్ళిన రచయిత ప్రయాణ అనుభవాలేవి? ఎలా ప్రయాణం సాగించాడు?
జవాబు.
18 -10 -1907 లో ముద్దు రాజన్న, అమ్మాయి దంపతులకు కరీంనగర్ జిల్లా మంథని గ్రామంలో ముద్దు రామకృష్ణ జన్మించాడు. ఉన్నత విద్య కోసం గ్రేట్ బ్రిటన్ వెళ్ళాలనుకొన్నాడు. తగినంత ధనం లేకున్నా రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్న ఆ రోజుల్లో ఎవర్ని కలవాలో, ఎక్కడ దిగాలో, ఏం చేయాలో తెలియకుండానే రెండు జతల బట్టలు, పైజమా కుర్తా సర్దుకొని, 22 పౌండ్ల ధనంతో పడవ ఎక్కాడు.

పడవ ప్రయాణంలో ఆంగ్లో ఇండియన్ “ఫాల్సెట్” అక్కడి అలవాట్లు, పరిస్థితులు వివరించాడు. ధనంలేక డీపోర్టు చేస్తారని భయపడి కరీంనగర్ వాడైన సురేష్బాబు ఇతనికి భరోసా ఇచ్చాడు. స్టడీస్ కోసం వచ్చాడని గమనించిన పోలీసులు ఇతని పాస్పోర్టు చూసి “పర్మిటెడ్” అని అనగానే పట్టరాని సంతోషం కల్గింది. గ్రేట్ బ్రిటన్ చూస్తూ నిలబడ్డాడు. అనుకున్న లక్ష్యాన్ని కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో సాధించాలని అనుకున్నాడు రామకృష్ణయ్య.

ప్రశ్న 4.
విద్యయొక్క అవసరాన్ని తెలియజేస్తూ ఒక వ్యాసం రాయండి.
జవాబు.
చదవనివాడు అజ్ఞాని అని, చదువుకుంటే వివేకము కలుగుతుందని, మనిషిగా పుట్టినవాడు జ్ఞానాన్ని సంపాదించాలని పోతన భాగవతంలో వివరించాడు. “విద్య లేనివాడు వింత పశువన్న” నానుడి లోకంలో ఉండనే ఉంది. చదువులు నేర్చిన వారు ఏ రంగంలోనైనా రాణించగలరు. విద్య సుఖ సంతోషాలనిస్తుంది. ఏ దేశమైతే సంపూర్ణ అక్షరాస్యతను సాధిస్తుందో ఆ దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. మన తెలంగాణ రాష్ట్రం చదువులలో వెనుకబడి ఉంది.

గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు ఎంతోమంది నిరక్షరాస్యులుగా ఉండిపోతున్నారు. బాలకార్మిక వ్యవస్థ చదువులలో వెనుకబడటానికి ఒక కారణం. బంగారు తెలంగాణ కావాలంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం చదువులపై శ్రద్ధపెట్టాలి. రాష్ట్రంలోని వారినందరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి.

వయోజనులలో కూడా చదువు పట్ల ఆసక్తిని పెంపొందించాలి. ఉచిత నిర్బంధ విద్యను ప్రవేశపెట్టి అందరూ చదువుకునేటట్లు చేయాలి. విద్యను వ్యాపారంగా మార్చే ధోరణిని అరికట్టాలి. విద్యాభ్యాసం తరువాత ఉద్యోగం వచ్చి జీవనానికి ఆసరాగా నిలుస్తుందన్న నమ్మకాన్ని కలిగించాలి.

ప్రశ్న 5.
మీరే ముద్దు రామకృష్ణయ్య అయితే, విద్యార్థులకు మీరిచ్చే సందేశం ఏమిటి ?
జవాబు.
నేనే ముద్దు రామకృష్ణయ్యను అయితే విద్య యొక్క ఉపయోగాలను గురించి విద్యార్థులకు వివరిస్తాను. ‘కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు” అన్న విషయాన్ని వివరించి వారికి చక్కని మార్గాన్ని చూపిస్తాను. నైతిక విలువలతో కూడిన విద్యను నేర్వమని బోధిస్తాను. కృత నిశ్చయం, దృఢ సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని చెప్తాను.

విద్యార్థులందరు లక్ష్యసాధన దిశగా పయనించి ఉన్నత విద్యలను నేర్చి దేశ పురోభివృద్ధిలో భాగస్వాములు కావాలని వివరిస్తాను. నీతి నిజాయితీకి నిలువుటద్దంగా తెలంగాణ పౌరులు నిలవాలని ప్రబోధిస్తాను. పల్లెలు ప్రగతికి పట్టుగొమ్మలు, ఆ పల్లెలలోని ప్రజలు చదువుబాట పట్టి విద్యాధికులు కావటానికి వారిలో చైతన్యాన్ని తీసుకువస్తాను. స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ విద్యాధికులు కావాలని కోరుకుంటాను.

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం

పర్యాయపదాలు:

  • యుద్ధము = సమరము, రణము
  • సముద్రము = జలధి, కడలి
  • ఈశ్వరుడు = శివుడు, త్రినేత్రుడు
  • దిక్కు = దిశ, మార్గము
  • ఇల్లు = గృహము, నివాసము
  • తీరము = దరి, ఒడ్డు
  • భూమి = పుడమి, ధరణి
  • నెల = మాసము, 30 రోజులు

నానార్థాలు:

  • దిక్కు = దిశ, శరణము
  • వనము = అడవి, సమూహము
  • శక్తి = బలము, పార్వతి
  • సుధ = పాలు, అమృతము
  • తలపు = ఆలోచన, అభిప్రాయం
  • చీకటి = అంధకారము, దుఃఖము

వ్యుత్పత్త్యర్థాలు:

  • ఈశ్వరుడు పయోధి పుత్రుడు = శుభములను కలిగించువాడు. (శివుడు)
  • పయోధి = వయస్సుకు నెలవైనది (సముద్రం)
  • పుత్రుడు = పున్నామ నరకాన్ని తప్పించువాడు (కుమారుడు)

ప్రకృతి – వికృతులు:

  • ప్రకృతి – వికృతి
  • ప్రాణము – పానము
  • భాష – బాస
  • భోజనము – బోనము
  • సంతోషము – సంతసము
  • ఆశ్చర్యము – అచ్చెరువు
  • కులము – కొలము
  • దీపము – దివ్వె
  • ధర్మము – దమ్మము
  • రాత్రి – రాతిరి
  • వైద్యుడు – వెజ్జు

సంధులు:

  • చారిత్రకమైన = చారిత్రకము + ఐన = ఉత్వసంధి
  • అడుగుతారని = అడుగుతారు + అని = ఉత్వసంధి
    సూత్రం : ఉత్తునకు అచ్చుపరమైనపుడు సంధి అవుతుంది.
  • చేర్చినందుకు = చేర్చిన + అందుకు = అత్వసంధి
  • చింతాకు = చింత + ఆకు = అత్వసంధి
    సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.

సమాసములు:

  • తల్లిదండ్రులు – తల్లియును తండ్రియును – ద్వంద్వ సమాసము
  • రాత్రి – రాత్రియును పగలును – ద్వంద్వ సమాసము
  • నా ఉచ్చారణ – నా యొక్క ఉచ్చారణ – షష్ఠీ తత్పురుష సమాసము
  • గ్రంథాలయము – గ్రంథములకు ఆలయము – షష్ఠీ తత్పురుష సమాసము
  • భారతదేశము – భారతము అను పేరు గల దేశము – సంభావన పూర్వపద కర్మధారయ సమాసము
  • మర్రిచెట్టు – మర్రి అను పేరు గల చెట్టు – సంభావన పూర్వపద కర్మధారయ సమాసము
  • సుందర దృశ్యాలు – సుందరమైన దృశ్యాలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
  • రమ్య స్థలము – రమ్యమైన స్థలము – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
  • ప్రియభాషణం – ప్రియమైన భాషణం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము

పాఠం ఉద్దేశం

రెండవ ప్రపంచ యుద్ధకాలంలో లండనుకి వెళ్ళి చదువుకోవడం వ్యయప్రయాసలతో కూడుకొన్న పని. అయినప్పటికీ ఉన్నత విద్యకోసం, కరీంనగర్ జిల్లా మంథని గ్రామ వాసియైన ముద్దు రామకృష్ణయ్య సుదూర దేశమైన గ్రేట్ బ్రిటన్ కు సముద్ర ప్రయాణం చేశాడు. ఆయన సముద్ర ప్రయాణ అనుభవాలే ఈ పాఠం నేపథ్యం. కార్యసాధకులు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కృత నిశ్చయంతో, దృఢసంకల్పంతో పూర్తిచేసుకుని విజయాన్ని సాధించగలుగుతారని తెలియజేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం.

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం

పాఠ్యభాగ వివరాలు

ప్రశ్న.
‘యాత్రా చరిత్ర’ ప్రక్రియను పరిచయం చేయండి.
జవాబు.
‘యాత్రా చరిత్ర’ ప్రక్రియకు చెందినదీ పాఠం. యాత్రవల్ల తమకు కలిగిన అనుభవాలను వివరిస్తూ రాసేదే యాత్రాచరిత్ర. దేశ, విదేశాలలో నెలకొన్న నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులను కూడా ఇవి వివరిస్తాయి. ఈ పాఠం ముద్దు రామకృష్ణయ్య రాసిన “నా ప్రథమ విదేశీ యాత్ర” పుస్తకంలోనిది.

కవి పరిచయం

ప్రశ్న.
ముద్దు రామకృష్ణయ్య గారిని గురించి రాయండి.
జవాబు.
ముద్దు రామకృష్ణయ్య పూర్వపు కరీంనగర్ జిల్లా నేటి పెద్దపల్లి జిల్లాలోని మంథని గ్రామంలో జన్మించాడు. వీరి తండ్రి ముద్దు రాజన్న, తల్లి ముద్దు అమ్మాయి. 1946లో బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి యం. ఇడి. పట్టా పొందాడు. 1951-58 మధ్య కాలంలో ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా ఖండాలలోని పలుదేశాలు పర్యటించి, అక్కడి విద్యావిధానాలను 18-10-1907 అధ్యయనం చేశాడు. మనదేశపు విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చాడు. అవి నేటికీ ఆదర్శప్రాయాలైనాయి. సమయపాలనకు ఆయన పెట్టింది పేరు. నిరక్షరాస్యత నిర్మూలన కోసం ‘ఈచ్ వన్ టీచ్ వన్’ ఉద్యమాన్ని జీవిత చరమాంకం వరకు కొనసాగించిన గొప్ప విద్యావేత్త.

ప్రవేశిక

ప్రయాణం మొదలయ్యింది. ఎక్కడికి పోవాలో తెలవదు. ఎవరిని కలవాలో తెలవదు. కాని, ఏదైనా ఎదుర్కొనే ధైర్యం ఉన్నది. జీవితమంటే అన్నీ ఉంటాయి. కండ్ల ముందు ఒకటే లక్ష్యం. లక్ష్యసాధనే నా సిద్ధాంతం. ఏదో ఒక దారి దొరుకకపోదు. అనుకున్న విధంగా ఉన్నత విద్య పూర్తి చెయ్యాలి. దేశం కోసం ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి ? ఎట్లా చెయ్యాలి ? పరి పరి విధాలుగా ఆలోచిస్తున్నది మనసు. ప్రయాణం కొనసాగుతున్నది ! అనంతాకాశంలాగా పరుచుకున్న దరిలేని సాగరంలో ఆ ప్రయాణం ఏ తీరం చేరుకున్నది ? ఎట్లా చేరుకున్నది తెలుసుకుందాం.

కఠిన పదాలకు అర్ధాలు

  • దినము = రోజు
  • పాశ్చాత్యులు = విదేశీయులు
  • క్లోజు = దగ్గరగా
  • ఉచ్చారణ = పలుకుబడి
  • తలంపు = ఆలోచన
  • భారము = బరువు
  • తుద = చివర
  • కృతజ్ఞత = చేసిన మేలు మరువకుండుట
  • వందనము = నమస్కారము
  • శరము = బాణము
  • శరణు = ప్రార్ధన
  • క్లుప్తంగా = తక్కువగ
  • వాగ్దానము = మాట ఇవ్వడం
  • స్కాలర్షిప్ = ఉపకార వేతనము
  • బందోబస్తు = జాగ్రత్త చేయు
  • కాన్వాయి = రక్షకదళ సమూహం
  • క్యాబిన్ = చిన్నగది
  • డెక్ = ఓడలో నేలవంటి అడుగు భాగం
  • ఇన్స్పెక్ట్ = తనిఖీ
  • రిసెప్షన్ రూం = వేచియుండు గది
  • ఖుల్లా = తెరచియుండు
  • కనెక్టు = కలుపబడు
  • లాంజ్ = ఆవిరిపడవ (ఓడ)
  • సైక్లోస్టైల్ = నకలు ముద్రణ
  • పీరియాడికల్స్ = నియమిత కాలంలో సంభవించెడిది, కాల నిర్ణయంతో వచ్చే పత్రిక
  • ఫర్నీచర్ = వస్తు సామగ్రి
  • ఫ్లోరు = నేల
  • మఖ్మల్ = వెల్వెటు
  • తివాసీ = కార్పెట్ = నేల మీద పరిచే మందపాటి దుప్పట్టా
  • కంఫర్టబుల్ = సౌకర్యవంతం
  • నర్సరీ = శిశు విహారశాల, బిడ్డలకై ప్రత్యేకింపబడిన గది
  • కిండర్ గార్టెన్ = వస్తువులను చూపించి బోధించే పద్ధతి
  • లైబ్రరీ = గ్రంథాలయం
  • ఔట్ డోర్ గేమ్స్ = బయట ఆటస్థలంలో ఆడే ఆటలు
  • టూర్నమెంట్ = అంతర్గత పోటీలు
  • స్విమ్మింగ్ = ఈత
  • ఓపెన్ ఏర్ = బయటి గాలి
  • మందలించు = కోప్పడు
  • డిఫోర్టు = వెనుకకు తిరిగి పంపుట
  • మొహల్లా = భవంతి
  • డిస్ట్రాయర్లు = నాశనం చేసే పనిముట్లు
  • డేంజరు = అపాయం
  • వైల్డ్ = భయంకరం
  • కస్టం = తనిఖీ
  • పౌండు = సుమారుగా 1 and 1/2 kg, బ్రిటన్ కరెన్సీ
  • పాస్పోర్టు = విదేశాలకు వెళ్ళుటకు అనుమతినిచ్చే అనుమతి పత్రం
  • పర్మిటెడ్ = అనుమతించిరి

నేనివి చేయగలనా ?

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం 3

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 4th Lesson అసామాన్యులు Textbook Questions and Answers.

అసామాన్యులు TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana

బొమ్మను చూడండి. ఆలోచించి చెప్పండి.

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు 1
ప్రశ్న1.
బొమ్మను చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు ?
జవాబు.
వీధుల్లో పోగయిన చెత్తను, వ్యర్థాలను తీసి శుభ్రం చేస్తున్నారు.

ప్రశ్న2.
అట్లా చెత్తను ఎత్తిపోసే వారు లేకుంటే ఏమవుతుంది ?
జవాబు.
అట్లా చెత్తను ఎత్తిపోసేవారు లేకుంటే వీధులన్నీ మురికి కూపాలుగా మారతాయి. దోమలు, ఈగలు చేరి మలేరియా వంటి అంటురోగాలు వ్యాపిస్తాయి.

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు

ప్రశ్న3.
ఇట్లా మనకు సేవలు చేసేవారు ఇంకా ఎవరెవరున్నారు ? వారి గొప్పదనమేమిటి ?
జవాబు.
ఇట్లా మనకు సేవ చేసే వారిలో వీధులను ఊడ్చేవారు, మురికి కాల్వలను బాగుచేసేవారు, హాస్పిటల్స్లో రోగులను శుభ్రం చేసేవారు ఉన్నారు. వీరే లేకపోతే మానవ మనుగడకే చేటు వస్తుంది. అంటురోగాలు విజృంభిస్తాయి.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.33)

ప్రశ్న 1.
ఈ నిజ జీవితంలో మీకు ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఉన్నాయా ? వాటి గురించి చర్చించండి.
జవాబు.
నిజ జీవితంలో ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటనలు ఎన్నో ఉంటాయి. ఆకాశం మేఘావృతమై జడివాన కురుస్తుంది. అంతలోనే వర్షం ఆగగానే ఆకాశంలో వెలసిన ఇంద్రధనుస్సును చూస్తుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. అది ప్రకృతి అందించిన అందాల హరివిల్లు. దాన్ని చూసి ఆశ్చర్యానందాలను పొందని వారెవరుంటారు ? ఎంత జడివాన కురిసినా, సాలెగూడు తడవదు. సాలెపురుగు ఇంజనీరింగ్ నైపుణ్యం ఆశ్చర్యమేస్తుంది.

ప్రశ్న 2.
ప్రతి వృత్తి పవిత్రమైందే, అని అనడంలో ఆంతర్యం ఏమై ఉంటుంది ?
జవాబు.
ప్రతి వృత్తి పవిత్రమైందే. విమానం నడిపేవాని వృత్తి ఎంత గొప్పదో, ఆటో నడిపేవాని వృత్తీ అంత గొప్పదే. ఏ వృత్తీ తక్కువకాదు. ఒక వృత్తి లేనిదే మరొకటి లేదు. ప్రతి వృత్తిలోను ఎంతో కష్టం, నైపుణ్యం, త్యాగం కలగలసి ఉంటాయి. ఒకరికొకరు చేదోడుగా ఉంటే తప్ప సమాజం సజావుగా సాగదు.

ప్రశ్న 3.
చక్రం సమాజగతిని మార్చినది అని ఎట్లా చెప్పగలవు ?
జవాబు.
చక్రాన్ని కనుగొనడానికి ముందు ఒక చోట నుండి మరొకచోటకు వెళ్ళడానికి నడక తప్ప వేరే మార్గంలేదు. చక్రం ఆవిష్కరణతో మానవ జీవనంలో పరుగు మొదలయింది. ప్రయాణం మొదలయింది. చరిత్ర గతి మారింది.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.35)

ప్రశ్న 1.
బంగారానికే సౌందర్యం తెచ్చే స్వర్ణకారుల జీవితాలు ఎందుకు కళ తప్పుతున్నాయో చర్చించండి.
జవాబు.
బంగారం అంత సులభంగా కరగదు. మూసలో పెట్టి బొగ్గుల కొలిమిలో ఉంచి కరిగిస్తారు. దానికోసం బాగా ఊదాల్సివస్తుంది. అద్భుతమైన బంగారు నగలు చేసే వృత్తి కళాకారుల జీవితాలు యాంత్రిక విధానం రావటంతో కళతప్పాయి. బంగారాన్ని కరిగించటానికి ఊది ఊది రోగాల బారిన పడుతున్నారు. వారి శ్రమకు తగ్గ ఫలితం దొరకడంలేదు.

ప్రశ్న 2.
“కమ్మరి పని ఒక ఇంజనీరు ప్రక్రియ” అని ఎట్లా చెప్పగలవు ?
జవాబు.
ఇంజనీరింగ్ ప్రక్రియ అంటే సాంకేతిక ప్రక్రియ. ఇనుముతో నిత్యం సహవాసం చేసేవారు కమ్మరులు. ఎంతో నైపుణ్యంతో గొడ్డలి, పార, కొడవలి, బండి చక్రాలను తయారు చేస్తారు. సరైన కొలతలు తెలియందే అవి తయారుకావు. అందుకే పైకి తేలికగా కనపడే కమ్మరి పనిలో ఇంజనీరు ప్రక్రియ దాగి ఉంది.

ప్రశ్న 3.
వస్తుసామగ్రి, ఇంటిసామగ్రి తయారుచేయడంలో వడ్రంగి శ్రమ విలువను గురించి మాట్లాడండి.
(లేదా)
వడ్రంగుల పనితనం గురించి రాయండి.
జవాబు.
వడ్రంగి శ్రమకు మారుపేరు. కలపను ఎంపిక చేసుకునే దగ్గర నుండి దానిని వివిధ ఆకారాలలోకి మార్చటం కోసం ఎంతగా శ్రమిస్తాడో చెప్పలేము. వ్యవసాయపు పనిముట్లు, ఇండ్లకు వాడే కలప దూలాలు, వాసాలు, కిటికీలు, తలుపులు, కుర్చీలు, బల్లలు వీటి తయారీలో ఆయన శ్రమ విలువ దాగి ఉంటుంది. ఏమాత్రం కొలతలు తప్పినా, తయారు చేసిన వస్తువులు సరిగా కుదరవు.

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు

ప్రశ్న 4.
ఈ వ్యర్థ పదార్థాల నుండి పాదాలకు రక్షణ ఇచ్చే చెప్పులు సృష్టించిన వారి తెలివి ఎంత గొప్పదో చెప్పండి.
జవాబు.
మనం అడుగు బయట పెట్టాలంటే చెప్పుల్లో కాళ్ళు పెట్టాల్సిందే; ఒక చనిపోయిన జంతువు యొక్క చర్మమనే వ్యర్థ పదార్థం నుండి అందరికి అవసరమైన వస్తు సృష్టి చేయటం వారి తెలివికి నిదర్శనం.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.37)

ప్రశ్న 1.
ఈ మానవుని సౌందర్యం వెనుక క్షురకుని పాత్ర ఉన్నది. దీన్ని సమర్థిస్తూ మాట్లాడండి.
జవాబు.
క్షురకుడంటే తల వెంట్రుకలను కత్తిరించే వాడని అర్థం. ఆ వెంట్రుకలను కత్తిరించడంలో ఒక పద్ధతి ఉంది, ఒక అమరిక ఉంది. వారు సరిగా వెంట్రుకలను కత్తిరించకపోతే వికారంగా తయారవుతాము.

ప్రశ్న 2.
ఈ అగ్గిపెట్టెలో పట్టేటంత చీరను నేసిన నేతపనివారి పనితనాన్ని ప్రశంసిస్తూ మాట్లాడండి.
జవాబు.
శరీరాన్ని కప్పుకోవటానికి బట్టలు కావాలి. వాటిని తయారుచేసేవారు నేతపనివారు. బట్టలు నేసే మగ్గంలో గొప్ప సాంకేతిక పరిజ్ఞానం ఉంది. అగ్గిపెట్టె చిన్నది. చీర పెద్దది. అంత పెద్ద చీరను చిన్న అగ్గిపెట్టెలో పట్టేలా, చీరను నేయడం అంటే మాటలు కాదు. ఎంతో పనితనం, నైపుణ్యం ఉండాలి.

ప్రశ్న 3.
దేశానికి అన్నంపెట్టే రైతు జీవనం దుర్బరంగా ఎందుకు మారిందో చర్చించండి.
జవాబు.
దేశానికి వెన్నెముక రైతు. రైతులు కష్టపడి పనిచేసి పంట పండిస్తే సరైన గిట్టుబాటు ధర లభించటం లేదు. దళారి వ్యవస్థ ప్రజలకు, రైతుకు మధ్య ఉండి ఇద్దరినీ దోపిడీకి గురిచేస్తోంది. అందుకే రైతు జీవనం దుర్భరంగా మారింది. దీనికి తోడు అతివృష్టి, అనావృష్టి, నాణ్యమైన విత్తనాల కొరత, చీడ పీడలు….. ఇలా పెట్టిన పెట్టుబడి రాక, వ్యవసాయం గిట్టుబాటు కాక, రైతు జీవనం దుర్భరంగా మారింది.

ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. “ఒక్కొక్క వృత్తి దేనికదే గొప్పది” దీనిని సమర్థిస్తూ మాట్లాడండి.

జవాబు.
వృత్తి అంటే చేతివృత్తులని అర్థం. భారతదేశంలో చేతివృత్తులపై ఆధారపడి జీవించేవారు ఎక్కువ. చేతి వృత్తులవారిలో కుమ్మరి, కంసాలి, కమ్మరి, వడ్రంగి, చర్మకారులు, మంగళ్ళు, నేతవారు, చాకలివారు, వ్యవసాయదారులు ఉన్నారు. వారిలో ఎవరి వృత్తి వారికి గొప్ప.

కుమ్మరి కుండలు చేసే చాకచక్యం కంసాలికి ఉండదు. అలాగే కంసాలి చేసే నగల సున్నితమైన పనితనం కుమ్మరికి ఉండదు. అలాగే మిగిలిన వృత్తుల వారికి కూడా! ఏ వృత్తి గొప్పదనం దానిదే. కుమ్మరి చక్రం తిప్పందే కుండ తయారవదు. ఆ చక్రం కావాలంటే వడ్రంగి, కమ్మరి చెక్కపని, ఇనుము పని చేయాలి. ఇలా ఒక వృత్తి మరొక వృత్తి మీద ఆధారపడి ఉంది. అందుకే దేనికది గొప్పది.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం
1. కింది పేరాను చదవండి. దాని ఆధారంగా కింద ఇచ్చిన పట్టికలో వివరాలు రాయండి.

లక్కతో తయారయ్యే గాజులకు హైదరాబాదు ప్రసిద్ధి. వాటికి అద్దంముక్కలు, పూసలు, విలువైన రంగురాళ్ళతో అలంకరిస్తారు. హైదరాబాద్ను సందర్శించేవారు వీటిని తప్పక కొనుక్కుంటారు. కళాత్మక కుట్టుపనులలో, వివిధ ఆకారాలలో ఉన్న చిన్నచిన్న అద్దంముక్కలు, పూసలు అందంగా తీర్చిదిద్దుతారు. దుప్పట్లు, దిండ్లు, కుషన్కవర్లు, లంగాలు, జాకెట్లు వంటి దుస్తులకు అత్యంత గిరాకీ ఉన్నది. నిర్మల్ వర్ణచిత్రాలు ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నవి. గృహోపకరణాలైన కొయ్యసామగ్రి, తేలికపాటి చెక్కల బొమ్మలు ఎంతో సృజనాత్మకంగా తయారు చేయబడతాయి.

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు

వెండి నగిషీ కళను ‘ఫెలిగ్రీ’ అంటారు. కరీంనగర్ ఈ కళకు పెట్టింది పేరు. ఇక్కడ సన్నని వెండి దారాలతో, ఆకర్షణీయమైన వస్తువులు తయారుచేస్తారు. గంధపుగిన్నెలు, పళ్లాలు, పెట్టెలు, గొలుసులు, పక్షుల, జంతువుల బొమ్మలు వంటివి కళాకారులు కళాత్మకంగా తయారుచేస్తారు. వరంగల్లు జిల్లాలోని ‘పెంబర్తి’ గ్రామం లోహపు పనివారలకు ప్రసిద్ధి. అపురూపమైన జ్ఞాపికలు, గోడకు తగిలించే చిత్రాలు, పూలకుండీలు, విగ్రహాలు, స్టేషనరీ సామానులు, లోహపు రేకులతో వివిధ అంశాల తయారీ, ఇంకా అనేక రకాల అలంకరణ వస్తువులు వీరి చేతిలో తయారవుతాయి.
TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు 2

జవాబు.

హస్తకళల పేర్లుదొరికే ప్రాంతంవాటి ప్రత్యేకతలు
1. లక్క గాజులుహైదరాబాదుఅద్దం ముక్కలు, పూసలు, విలువైన రంగు రాళ్ళతో చేతులకు అందాన్నిస్తాయి.
2. చెక్క బొమ్మలు, వర్ణ చిత్రాలునిర్మల్చెట్ల కొమ్మలతో అద్భుతమైన కళారూపాలను, బొమ్మలను తయారు చేస్తారు.
3. ఇత్తడి సామగ్రివరంగల్లు జిల్లా పెంబర్తిఇత్తడి ఖనిజంతో వివిధరకాలైన సామానులు, కళారూపాలను తయారుచేయు వృత్తి కళాకారులున్నారు.
4. వెండి నగిషీకళ (ఫెలిగ్రీ)కరీంనగర్సన్నని వెండిదారాలతో ఆకర్షణీయమైన వస్తువులను తయారుచేస్తారు.

 

2. ఆయా వృత్తిపనులవారు తయారుచేసేవి, వాడే వస్తువుల పేర్లను పాఠం ఆధారంగా వివరాలను పట్టికలో రాయండి.

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు 3

జవాబు.

వృత్తులువాటికి సంబంధించిన పేరా సంఖ్యపేరాలో ఇచ్చినవారు వాడే వస్తువులు
1. కుమ్మరి33వ పేజీలో 1, 2 పేరాలులేదా తయారుచేసే వస్తువుల పేర్లు కుండలు, కూజాలు, అటికెలు, గురుగులు, మట్టి బొమ్మలు (చక్రం, సారెలు వాడతారు.)
2. కంసాలి33వ పేజీలో 3, 4 పేరాలుహారాలు, గాజులు, చెవి కమ్మలు, ముక్కుబిళ్ళ, వడ్డాణం, కడియాలు, ఉంగరాలు, గజ్జెలు, గొలుసులు మొదలగునవి. వీటిని తయారు చేయటానికి కొలిమి, చిన్నపాటి సుత్తులను వాడతారు.
3. కమ్మరి3వ పేజీ 2వ పేరానాగటికర్రు, పార, గొడ్డలి, కొడవలి, సుత్తి, ఇరుసులు, బండిచక్రము మొదలగునవి. వీటిని తయారుచేయటానికి సుత్తి, కొలిమి, దాయి మొదలగువాటిని వాడతారు.
4. వడ్రంగి34వ పేజీ 3వ పేరానాగలి, గుంటుక, గొర్రు, దూలాలు, వాసాలు కిటికీలు, గుమ్మాలు, కుర్చీలు, బెంచీలు మొదలగునవి. వీటిని తయారు చేయటానికి ఉలి, బాడిశ మొదలగు వాటిని వాడతారు.
5. తోలు పనివాళ్ళు35వ పేజీ 1, 2, 3 పేరాలుచెప్పులు, డప్పులు, మోట బావిలో నీళ్ళు తోడే బొక్కెనలకు తొండాలను చర్మంతో తయారు చేస్తారు.
6. నేత పనివాళ్ళు36వ పేజీ 2, 3 పేరాలుబట్టలు, కలంకారీ దుస్తులు, పట్టు వస్త్రాలు కంబళ్ళు మొదలగునవి తయారు చేస్తారు.

 

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) ‘ఆదివాసులు మనందరికీ మార్గదర్శకులు’ – అని ఎట్లా చెప్పగలరు ? రాయండి.
జవాబు.
ఆదివాసులు అడవులే అమ్మ ఒడిగా జీవించేవారు. ప్రకృతిలో రేయింబవళ్ళు కలసిపోయి ఉండేవారు. ప్రకృతి పరిశీలకులు వారు. ఏమి తినాలో ఏమి తినకూడదో పరిశీలించి ఆ జ్ఞానాన్ని మనకు అందించారు. ఈ పరిశీలన కోసం ఎందరో తమ ప్రాణాలను వదిలి ఉంటారు. వారికున్న విజ్ఞానం చాలా గొప్పది. వాళ్ళు నిజంగా వృక్ష శాస్త్రజ్ఞులే! వన మూలికా వైద్యాన్ని వారి నుండే సభ్య ప్రపంచం తెలుసుకుంది. ప్రజలు రోగాల బారిన పడినప్పుడు చెట్ల ఆకుల రసాలతో ఆరోగ్యవంతులను చేయటం వారికి తెలిసినంతగా మనకు తెలీదు. యుద్ధాల్లో గాయపడిన వారికి స్వస్థతచేకూర్చగల శక్తి వారి నాటు వైద్యానికి ఉందంటే ఆశ్చర్యపడనవసరం లేదు. కావున వారు సభ్య సమాజానికి మార్గదర్శకులని చెప్పాలి.

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు

ఆ) కుమ్మరి గొప్పతనం గురించి మీరు ఏమనుకుంటున్నారో రాయండి.
(లేదా)
నీకు తెలిసిన ఒక వృత్తి గొప్పతనాన్ని తెల్పండి
జవాబు.
కుమ్మరి వేసవి కాలపు చంద్రుడు. చల్లని నీటిని అందించే మట్టి కుండల తయారీలో నేర్పరి. చక్రం త్రిప్పుతూ తయారు చేసిన బంకమట్టిని దానిపై ఉంచి చేతి వేళ్ళతో సున్నితంగా నొక్కుతూ ఆశ్చర్యపడే విధంగా వివిధ రూపాలలో మట్టి వస్తువులను తయారు చేయగల నేర్పరి. ఆయన చేతుల్లో ఇంద్రజాల విద్య ఉందా అనిపిస్తుంది. మనం ఉపయోగించుకునే మట్టి పాత్రల వెనుక నైపుణ్యం కుమ్మరిదే. వేసవిలో పేదవాడి ఫ్రిజ్ నీటి కుండల నుండి అందమైన మట్టి బొమ్మలు తయారు చేయగల నేర్పరి అతడు. ఆయనకు ఆధారభూతమైన వస్తువు ‘సారె’ ఒక్కటే. కుమ్మరి చేసే కుండలు, మట్టిపాత్రలు, దీపపు ప్రమిదలు లేనిదే ఇప్పటికీ మనకు రోజు గడవదంటే, కుమ్మరి గొప్పదనం అర్థమవుతుంది.

ఇ) “రైతులు మన అన్నదాతలు” – సమర్థిస్తూ రాయండి.
(లేదా)
“రైతుకు చేతులెత్తి నమస్కరిస్తాను” అని కవి అనడంలోని ఉద్దేశం ఏమిటి ?
జవాబు.
రైతులు మన అన్నదాతలు. రైతే దేశానికి వెన్నెముక. అతడు పంట పండించకపోతే మనకు ఆహారం ఉండదు. కష్టపడి ఆరుగాలం పంటను సంరక్షించుకుంటూ దాన్నే తన జీవిత సర్వస్వంగా భావించేవాడు రైతు. ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణికి, సమస్యలతో నలిగి సడలని ధైర్య సాహసములతో పంటలు పండించి అన్నదాత అనిపించుకున్నాడు. ఆయన కష్టం మనకు భుక్తినిస్తుంది. ఒక్కపూట ఆహారం లేకపోతే అల్లాడిపోతాం. పిడికెడు మెతుకుల కోసం పడరాని పాట్లు పడతాం. కోటి విద్యలు కూటికొరకే కదా! మనం తినే అన్నం, కూరగాయలు, పండ్లు ఊరికే రావు కదా! రైతు కష్టించి పని చేస్తేనే మన కడుపులు నిండుతాయి. అందుకే రైతు మన అన్నదాత. అతనికి చేతులెత్తి నమస్కరిస్తానని కవి అన్నాడు.

ఈ) “దేహానికి అవయవాలు ఎంత ముఖ్యమో, సమాజానికి అన్ని వృత్తులవాళ్ళూ అంతే అవసరం” – దీన్ని సమర్థిస్తూ, మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు.
దేహానికి అవయవాలు ఎంత ముఖ్యమో, సమాజానికి అన్ని వృత్తుల వాళ్ళూ అంతే అవసరం. ఇది నిజం. ఏ అవయవం లేకపోయినా దేహానికి పరిపూర్ణత ఉండదు. అలాగే ఏ వృత్తిదారుడు లేకపోయినా అది సమాజం అనిపించుకోదు. ఒక వృత్తిని ఆధారం చేసుకొని మరొక వృత్తి నిలబడుతుంది. ప్రతి వృత్తిలోను శ్రమ, నైపుణ్యాలుంటాయి. ప్రతివృత్తి పవిత్రమైందే. ఏ వృత్తినీ చిన్నచూపు చూడకూడదు. ఒక శుభకార్యం జరగాలంటే ఎంతో మంది వృత్తిదారుల ప్రమేయం దానిపై ఉంటుంది. మంగళవాద్యాలు, కుండలు, ప్రమిదలు, ఆభరణాలు, వస్త్రాలు కావాలి. వాటిని తయారు చేసే అన్ని వృత్తులవారి సహకారం కావాలి కదా! ఇలా ఒకరికొకరై ఒకరితో ఒకరు సహకరించుకొంటేనే సమాజం నిలబడుతుంది. మన శరీరంలో కళ్ళు, ముక్కు, నోరు, కాళ్ళు చేతులు వీటిలో ఏది గొప్ప అంటే ఏం చెబుతాం. దేనికదే గొప్ప. అన్ని అవయవాలు కలసి ఉండి పనిచేస్తేనే దేహం, అన్ని వృత్తులవారు కలసి ఉంటేనే సమాజం.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) “శ్రమ పునాదిపైనే అభివృద్ధి అనే భవనం నిర్మించబడుతుంది” అని ఎట్లా చెప్పగలరు ? కారణాలు వివరిస్తూ రాయండి. (లేదా) కార్మిక లోకానికి ఈ దేశం ఎంతో ఋణపడి ఉన్నది. సమర్థిస్తూ క్లుప్తంగా రాయండి.
జవాబు.
శ్రమ పునాదిపైనే అభివృద్ధి అనే భవనం నిర్మించబడుతుంది. ఇది వాస్తవం. ‘శ్రమయేవ జయతే’. ‘కృషి ఉంటే మనుషులు ఋషిలవుతారు’ అన్న నానుడులు ఉండనే ఉన్నాయి. శ్రమించటానికి ఎవరూ సిగ్గుపడనవసరం లేదు. సోమరితనం దరిద్రాన్ని తెచ్చిపెడ్తుంది. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని శ్రీశ్రీ గారి భావన. శ్రమను గౌరవించటం నేర్చుకోవాలి. శ్రమ సంస్కృతిలో జీవించటం నేర్చుకోవాలి.

సమాజం అభివృద్ధి చెందాలంటే సమాజంలో ఉన్న వారందరి కృషి అవసరం. రెండవ ప్రపంచయుద్ధంలో జపాన్ పూర్తిగా సర్వస్వాన్ని కోల్పోయింది. దేశ ప్రజలందరు ఆ దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములై శ్రమించి ప్రపంచంలో అత్యున్నత దేశంగా తీర్చిదిద్దారు. కాబట్టి శ్రమ పునాదులపైనే అభివృద్ధి అనే భవనం నిర్మించబడుతుందన్నది యథార్థం. దానికి సమాజంలోని ప్రజలందరూ కులమత వృత్తి భేదం లేకుండా ఒకరికొకరు కలసిమెలసి సహజీవనం చేస్తూ శ్రమించాల్సి ఉంటుంది.

అప్పుడే నిజమైన సమాజపు భవనం నిర్మించబడుతుంది. రైతు నాకెందుకులే అని వ్యవసాయం మానేస్తే, ఒక్కపూట కూడా మనకు తిండి గడవదు. ఇలాగే ఇతర వృత్తుల వాళ్ళు శ్రమ చేయనిదే మనకు రోజు గడవదు. అసలు మన శరీరమే శ్రమను కోరుతుంది. కేవలం తిండితిని కూర్చుంటే, ఆ తిండి అరగక, అనారోగ్యం పాలవుతాము. అందుకే శ్రమలోనే అభివృద్ధి ఉంది.

IV. సృజనాత్మకత/ప్రశంస

1. మీ గ్రామంలోని వృత్తిపనుల వారిని గురించిన ఒకరి వివరాలను సేకరించడానికి ప్రశ్నావళిని తయారు చేయండి.

ఉదా ॥ 1. నమస్కారం! మీ పేరేమిటి ?
జవాబు.
ఉదా : 1. నమస్కారం! మీ పేరేమిటి ?
2. మీరు ఏం చేస్తుంటారు ?
3. మీది కులవృత్తా ? కాదా ?
4. దీనిని ఎవరి దగ్గర నేర్చుకున్నారు ?
5. ఇది మీకు తృప్తినిస్తుందా ?
6. ఈ వృత్తి మీకు భుక్తినిస్తుందా ?
7. మీ వృత్తిలోని ప్రత్యేకత ఏమిటి ?
8. మీ వృత్తిలో మీరు ఏం సాధించారు ?
9. సమాజంలో మీ వృత్తికి మంచి ఆదరణ ఉందా ?
10. ప్రజల అభిమానాన్ని పొందాలంటే మీ వృత్తి పట్ల మీరు ఎలాంటి శ్రద్ధను చూపుతారు ?
11. మీ వృత్తిదారులకు మీరిచ్చే సందేశం ఏమిటి ?

V పదజాల వినియోగం

1. కింది పదాలకు సొంత వాక్యాలు రాయండి.

అ) చేదోడు వాదోడు : పిల్లలు తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండాలి.
ఆ) చాకచక్యం : చాకచక్యంగా వ్యవహరించటం తెలివిగల వారి లక్షణం.

2. కింది పట్టికలోని ప్రకృతి వికృతులను గుర్తించి వేరుచేసి రాయండి.

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు 4

జవాబు.
ప్రకృతి – వికృతి
ఉదా : విద్య – విద్దె
అ) గౌరవం – గారవం
ఆ) ఆహారం – ఓగిర
ఇ) భక్తి – బత్తి
ఈ) రాత్రి – రాతిరి

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు

3. కింది వాటికి పర్యాయపదాలు రాయండి.

అ) చెట్టు : ___________, ___________, ___________
జవాబు.
వృక్షము, తరువు, భూరుహము

ఆ) పాదము : ___________, ___________, ___________
జవాబు.
పద్యపాదము, కాలిఅడుగు, చరణము

ఇ) శరీరం : ___________, ___________, ___________
జవాబు.
దేహం, తనువు, కాయం

VI. భాషను గురించి తెలుసుకుందాం.

1. కింది పట్టికలోని వాక్యాలలో క్రియాభేదాలను గుర్తించి రాయండి.

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు 5

జవాబు.

వాక్యంఅసమాపక క్రియసమాపక క్రియ
ఉదా : సీత బజారుకు వెళ్ళి, బొమ్మ కొన్నది.వెళ్ళికొన్నది
1. రాజు పద్యం చదివి, భావం చెప్పాడు.చదివిచెప్పాడు.
2. వాణి బొమ్మ గీసి, రంగులు వేసింది.గీసివేసింది
3. కావ్య మెట్లు ఎక్కి పైకి వెళ్ళింది.ఎక్కివెళ్ళింది
4. రంగయ్య వచ్చి, వెళ్ళాడు.వచ్చివెళ్ళాడు.
5. వాళ్ళు అన్నం తిని నీళ్ళు తాగారు.తినితాగారు

 

సంక్లిష్ట వాక్యం :

కింది వాక్యాలు చదవండి. కలిపి రాసిన విధానం చూడండి.

ఉదా : గీత బజారుకు వెళ్ళింది. గీత కూరగాయలు కొన్నది.
గీత బజారుకు వెళ్ళి కూరగాయలు కొన్నది.

2. కింది వాక్యాలను కలిపి రాయండి.

అ) విమల వంటచేస్తుంది. విమల పాటలు వింటుంది.
జవాబు.
విమల వంట చేస్తూ పాటలు వింటుంది.

ఆ) అమ్మ నిద్ర లేచింది. అమ్మ ముఖం కడుక్కుంది.
జవాబు.
అమ్మ నిద్ర లేచి ముఖం కడుక్కుంది.

ఇ) రవి ఊరికి వెళ్ళాడు. రవి మామిడి పండ్లు తెచ్చాడు.
జవాబు.
రవి ఊరికి వెళ్ళి మామిడి పండ్లు తెచ్చాడు.
పై వాక్యాలను కలిపి రాసినప్పుడు ఏం జరిగిందో చెప్పండి.
మొదటి వాక్యంలోని సమాపక క్రియ అసమాపక క్రియగా మారింది. కర్త పునరుక్తం కాలేదు.
ఇట్లా రెండు లేక మూడు వాక్యాలు కలిపి రాసేటప్పుడు చివరి వాక్యంలోని సమాపక క్రియ అలాగే ఉంటుంది.
ముందు వాక్యాల్లోని సమాపక క్రియలు, అసమాపక క్రియలుగా మారుతాయి. కర్త పునరుక్తం కాదు. దీనినే, ‘సంక్లిష్ట వాక్యం’ అంటారు.

3. కింది వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా రాయండి.

అ) రజిత అన్నం తిన్నది. రజిత బడికి వెళ్ళింది.
జవాబు.
రజిత అన్నం తిని బడికి వెళ్ళింది.

ఆ) వాళ్ళు రైలు దిగారు. వాళ్ళు ఆటో ఎక్కారు.
జవాబు.
వాళ్ళు రైలు దిగి ఆటో ఎక్కారు.

ఇ) రామయ్య వ్యవసాయదారుడా ? రామయ్య ఉద్యోగస్తుడా?
జవాబు.
రామయ్య వ్యవసాయదారుడా ? ఉద్యోగస్తుడా? రెండు నామవాచకాలలో ఒకటి లోపించడం.

ఈ) రాజన్న లడ్డూలు తెచ్చాడు. రాజన్న అందరికీ పంచాడు.
జవాబు.
జవాబు. రాజన్న లడ్డూలు తెచ్చి అందరికీ పంచాడు.

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు

సంయుక్త వాక్యం :

4. కింది వాక్యాలు చదవండి. కలిపి రాయండి.

ఉదా : రైలు వచ్చింది. చుట్టాలు రాలేదు.
రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు.

అ) వర్షాలు కురిసాయి. పంటలు బాగా పండాయి.
జవాబు.
వర్షాలు కురిసాయి కాబట్టి పంటలు బాగా పండాయి.

ఆ) అతనికి కనిపించదు. అతడు చదువలేడు.
జవాబు.
అతనికి కనిపించదు కాబట్టి చదువలేడు.

పై వాక్యాలను కలిపి రాసినప్పుడు ఏం జరిగిందో చెప్పండి.
పై వాక్యాలను కలిపి రాసేటప్పుడు క్రియలలో మార్పురాలేదు. వాక్యాలమధ్య కొన్ని అనుసంధాన పదాలు వచ్చాయి. ఇట్లా రెండు వాక్యాలను కలిపి రాసేటప్పుడు క్రియలలో మార్పు లేకుండా మధ్యలో అనుసంధాన పదాలు రాస్తే అవి ‘సంయుక్త వాక్యాలు’ అవుతాయి. అనుసంధాన పదాలు అంటే కావున, కానీ, మరియు, అందువల్ల మొదలైనవి.

సంయుక్తవాక్యంగా మారేటప్పుడు వాక్యాల్లో వచ్చే మరికొన్ని మార్పులు ఎట్లా ఉంటాయో గమనించండి.

అ) వనజ చురుకైనది. వనజ అందమైనది.
వనజ చురుకైనది. అందమైనది. రెండు నామ పదాల్లో ఒకటి లోపించడం.

ఆ) దివ్య అక్క, శైలజ చెల్లెలు.
దివ్య, శైలజ అక్కాచెల్లెళ్ళు – రెండు నామ పదాలు ఒకేచోట చేరి చివర బహువచనం చేరడం.

ఇ) రామయ్య వ్యవసాయదారుడా ? రామయ్య ఉద్యోగస్తుడా ?
రామయ్య వ్యవసాయదారుడా ? ఉద్యోగస్తుడా ? రెండు నామవాచకాలలో ఒకటి లోపించడం.

ఈ) ఆయన డాక్టరా ? ఆయన ప్రొఫెసరా ?
ఆయన డాక్టరా, ప్రొఫెసరా ? – రెండు సర్వనామాలలో ఒకటి లోపించటం.

5. కింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.

అ) వారు గొప్పవారు. వారు తెలివైనవారు.
జవాబు.
వారు గొప్పవారు, తెలివైనవారు.

ఆ) సుధ మాట్లాడదు. సుధ చేసి చూపిస్తుంది.
జవాబు.
సుధ మాట్లాడదు, చేసి చూపిస్తుంది.

ఇ) మేము రాము. మేము తేలేము.
జవాబు.
మేము రాము, తేలేము.

భాషా కార్యకలాష్ట్రాలు / ప్రాజెక్టు పని

వివిధ వృత్తి పనులవారు పాడుకొనే పాటలను సేకరించండి. ఒక పాటపై మీ అభిప్రాయం ఆధారంగా నివేదిక రాయండి. ప్రదర్శించండి.

జవాబు.

అ) ప్రాథమిక సమాచారం :
1) ప్రాజెక్టు పని పేరు : వివిధ వృత్తుల వారు పాడుకొనే పాటలు
2) సమాచారాన్ని సేకరించిన విధానం : ఆయా వృత్తి పనుల వారిని కలిసి సేకరించడం

ఆ) నివేదిక :

1. రైతు కూలీల పాట

వానమ్మ వానమ్మ వానమ్మా
ఒక్కసారైనా వచ్చిపోవే వానమ్మా ॥వానమ్మ॥ 2

తెలంగాణ పల్లెలన్నీ ఎండి మండుతున్నాయి
తినటానికి తిండిలేక … ఉండడానికి గుడిసె లేక
తాగేందుకు నీరు లేక … కాపాడే నాథుడు లేక ॥వానమ్మ॥ 2

చెర్లర్లో నీళ్ళూలేవూ … సెలకల్లో నీళ్ళూలేవూ
వాగుల్లో నీళ్ళూలేవూ … వంపుల్లో నీళ్ళూలేవూ
నిన్నే నమ్మిన రైతూ … కళ్ళల్లో నీళ్ళూలేవూ ॥వానమ్మ॥ 2

ఎదిగేటి మిరపసేనూ … ఎండల్లో ఎండిపోయే
సక్కని మొక్కజొన్న ఎక్కెక్కి ఏడ్వబట్టె…
పాలోసుకున్న కంకి … పాలన్నీ ఉడిగిపాయె
నీళ్ళోసుకున్నా నేను … నీళ్ళడలేకపాయే ॥వానమ్మ॥ 2

నల్లానీ గౌడీ బర్రె … తెల్లాని ఎల్లన్నావు
సైదన్నా మేకపోతూ … సక్కని లేగదూడా
కరువంటూ పీనుగెల్లా … కటికోని కమ్ముకునిరి ॥వానమ్మ॥ 2

కొంగునా నీళ్ళూ దెచ్చే … నింగిలో మబ్బులేవీ
చెంగూ చెంగూనా ఎగిరే … చెరువుల్లో చేపాలేవీ
తెల్లనీ కొంగ బావా … కళ్ళల్లో ఊసూలేవీ ॥వానమ్మ॥ 2

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు

2. కుమ్మరిపాట
అన్నల్లారా రారండోయ్ … తమ్ముల్లారా చూడండోయ్
కుండలు చేసే కుమ్మరి నేను
కూజాలు చేసే కుమ్మరి నేను
గిర గిర సారెను తిప్పేస్తా
గురుగులు ముంతలు చేసేస్తా
బంకమట్టికే ఆకృతినిస్తూ
మట్టి ముంతలకు సొగసులద్దుతూ
ఇళ్ళలో వాడే మట్టి పాత్రలను
చల్లని నీటి మట్టి కూజాలను
తయారుచేసే కుమ్మరి నేనూ
పెళ్ళిళ్ళకు వాడే కూరాళ్ళను
దీపవళి నాటి దీపపు ప్రమిదలను
చక చక తయారుచేస్తాను
చిటికెలో మీకు ఇస్తాను ॥అన్నల్లారా రారండోయ్॥

ఇ) ముగింపు :
ఇలా వివిధ వృత్తి పని వాళ్ళు తాము పనిచేస్తున్నప్పుడు కలిగే అలసటను పోగొట్టుకోవడానికి, మానసిక ఉ ల్లాసానికి ఇలాంటి పాటలు పాడుకుంటూ పని చేస్తారు. పల్లెటూళ్ళు మన సంస్కృతీ సంప్రదాయాలకు, ప్రాచీన కళలకు పట్టుగొమ్మలు. ఈ కళలను కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

(లేదా)

మీకు తెలిసిన వృత్తిపనివారిని కలవండి. వారు ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యల గురించి నివేదిక రాయండి.
జవాబు.
అ) ప్రాథమిక సమాచారం :
1) ప్రాజెక్టు పని పేరు : వివిధ వృత్తిపని వారి సమస్యలు
2) సమాచారాన్ని సేకరించిన విధానం : ఆయా వృత్తిపని వారిని కలువడం ద్వారా

ఆ) నివేదిక :
విషయ వివరణ :

మన దేశంలో ఎన్నో రకాల వృత్తుల వాళ్లు ఉన్నారు. యాంత్రీకరణ జరిగిన తర్వాత వారి చేతి వృత్తులకు గిరాకీ తగ్గి చాలామంది వారి కుల వృత్తులు వదిలివేసి వేరే పనులు చేస్తున్నారు. వృత్తినే నమ్ముకొని జీవిస్తున్న వారి బతుకులు దుర్భరంగా ఉన్నాయి. మా ప్రాంతంలో గల చేనేత, కుమ్మరి, మేదర వృత్తి పనుల వారిని కలిసి వారి సాదక బాధకాల గూర్చి నివేదిక తయారుచేశాను.

1. చేనేత వృత్తి
పూర్వకాలం చేనేత వృత్తికి ఎంతో ఆదరణ ఉండేది. మగ్గంపై చేతితో నేసిన చీరలు, ధోవతులకు చాలా గిరాకీ ఉండేది. కానీ మరమగ్గాలు వచ్చిన తర్వాత చేనేత బట్టలకు ఆదరణ తగ్గిపోయింది. కారణం, మరమగ్గం మీద నేసిన దుస్తుల కంటే వీటి నాణ్యత, మన్నిక తక్కువ, ధర ఎక్కువ. ఒక చేనేత కార్మికుడు గుంట మగ్గంపై 10 గం||లు కూర్చుండి నేస్తే అతడి రోజువారీ కూలీ రూ. 150/- లు మాత్రమే ! కేవలం 10 గజాల గుడ్డను మాత్రమే నేయగలడు. 150 రూ॥లు ఈ కాలంలో అతని జీవితావసరాలను ఎంతమాత్రం తీర్చలేవు.
TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు 6
ఇక మరమగ్గాల కార్మికుల జీవితాలేమైన సవ్యంగా ఉన్నాయా అంటే అదీ లేదు. ఒక మరమగ్గం కార్మికుడు రోజుకు 12 గం||లు పనిచేయాలి. ఒక వారం Day shift లో పనిచేస్తే, మరో వారం Night shift లో పనిచేయాలి. ఏక కాలంలో 8 మరమగ్గాలను చూసుకోవాలి. 10 పీకుల గుడ్డకు 30 పైసలు, అంటే సుమారు 1 మీటర్ గుడ్డకు 1 రూపాయి గిట్టుబాటవుతుంది. ఒక్కో మగ్గంపై 40 మీటర్ల గుడ్డ నేయగలడు. అంటే 8 మరమగ్గాలపై 12 గం||లలో 320 మీటర్ల గుడ్డ మాత్రమే నేయగలడు. సగటున వారానికి 6 రోజులు పనిచేస్తే, 320 × 6 = 1920 రూ॥ నెలకు 1920 × 4 = 7680 రూ॥ సంపాదించగలడు. కానీ, శబ్ద కాలుష్యం, నిద్రలేమి, 12 గంటలు నిలబడే పనిచేయడం లాంటి సమస్యల వల్ల నెలకు 6000/- కంటే ఎక్కువగా సంపాదించలేక పోతున్నారు. అది ఇల్లు కిరాయి, పిల్లల చదువు, జీవించడానికి సరిపోక ఎంతోమంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు.

2. కుమ్మరి వృత్తి
పూర్వకాలం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విలసిల్లిన వీరి వృత్తి యాంత్రీకరణ తర్వాత, అల్యూమినియం, స్టీలు పాత్రలు, వంట ఇళ్ళను ఆక్రమించిన తర్వాత, వెల వెల బోయింది. చేతినిండా పనిలేక పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లుతున్నారు.
TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు 7
ఎవరో యోగా సాధకులు, కుండలో నీరు, మట్టి పాత్రల్లో వంటకు ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప, ఎవరూ వీటిని వాడడం లేదు. పెళ్లికి వాడే కూరాటి కుండలు, దీపావళి నాడు వాడే ప్రమిదలు తప్ప, ఇతర మృణ్మయ పాత్రల వాడకం శూన్యం.

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు

3. మేదర వృత్తి
వీరు వెదురు బొంగును బద్దలుగా చీల్చి, ఆ బద్దలతో గాదెలు, తట్టలు, చేటలు, తడికెలు లాంటివి తయారుచేస్తారు. పూర్వం ప్రతి గ్రామంలో ఈ మేదరవాళ్లు ఉండేవారు. ఒక ఇంటిని రెండు భాగాలుగా వేరు చేయుటకు తడికెలు వాడేవారు. దానికి బదులు ఇప్పుడు కార్డుబోర్డును వాడుతున్నారు.
TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు 8
పెళ్ళిళ్ళలో తడికెల పందిరి వేసేవారు, దాని స్థానంలో ఇప్పుడు టెంట్లు వచ్చాయి. ప్లాస్టిక్ చేటలు, తట్టలు, బుట్టలు వచ్చి వెదురుతో చేసిన చేటలు, తట్టలు, బుట్టల స్థానాన్ని ఆక్రమించాయి. చేయడానికి పనిలేక వీరు పట్టణాలకు వలస వెళుతున్నారు.

ఇ) ముగింపు :
ఈ విధంగా యాంత్రీకరణ, వివిధ చేతి వృత్తుల వారికి పనిలేకుండా చేసింది. వీరి సాదక బాధకాలు, ప్రభుత్వం తెలుసుకొని చేయూత నివ్వాలి. చేతివృత్తుల వారి ఉత్పత్తులకు మార్కెట్లో స్థానం కల్పించి, తగిన ధర ఇప్పించాలి. వీరు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు నెలకొల్పుకోవడానికి, తక్కువ వడ్డీకే బ్యాంకులు అప్పులు ఇవ్వాలి.

TS 8th Class Telugu 4th Lesson Important Questions అసామాన్యులు

ప్రశ్న 1.
నేతపనివారల కళా నైపుణ్యాన్ని వివరించండి.
జవాబు.
బట్టలను తయారు చేసేవారు నేతపనివారు. మన శరీరాన్ని కప్పుకోవటానికి బట్టలు కావాలి. మగ్గం ద్వారా బట్టలను తయారుచేసి అందించే నేతపనివారి నైపుణ్యం చాలా గొప్పది. బట్టలు నేయడానికి వాడే మగ్గం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కూడినది. నేతపనివారు అగ్గిపెట్టెలో పట్టేంత చీరలను తయారు చేస్తారంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అది ఒక సుదీర్ఘ ప్రక్రియ. దూది నుండి సన్నని దారాన్ని తీయటం, దాన్ని పడుగు పేకలలో అమర్చటం, మగ్గంపై వస్త్రాలను తయారుచేయటం నేత పనివారలు ఎంతో నైపుణ్యంతో చేస్తారు. గొర్రెల బొచ్చును కత్తిరించి ఉన్నిదారం వడికి కంబళ్ళను చేస్తారు. పట్టువస్త్రాల తయారీ వీరి నైపుణ్యానికి ఒక మచ్చుతునక.

ప్రశ్న 2.
క్షురకుల సేవలు మరువలేనివి. సమర్థించండి.
(లేదా)
సమాజంలో వృత్తి చాలా గొప్పది. మీకు తెలిసిన ఒక వృత్తిని గురించి ఐదు వాక్యాలు రాయండి.
జవాబు.
క్షురకుల సేవలు మరువరానివి. ప్రజల ఆరోగ్యాన్ని రక్షించటంలో వీరి పాత్ర అనిర్వచనీయమైనది. కత్తి, కత్తెరలతో వారు చూపే పనితనం ఎంతో నైపుణ్యంతో కూడినది. వీరికి తెలిసిన మరొక విద్య దేశీయమైన వైద్యం. చెట్ల వేళ్ళతో, ఆకులతో, చేపలతో చేసే మందుల పట్ల వీరికి మంచి అవగాహన ఉంది. తైలంతో శరీర మర్దన వీరి నైపుణ్యానికి నిదర్శనం. స్త్రీలకు క్షురకస్త్రీలే పూర్వం ప్రసవం చేసేవారట. వీరి సేవలన్నీ ఆరోగ్యకరమైనవి. సమాజానికి వీరి సేవలు అత్యవసరం.

ప్రశ్న 3.
“అన్నమయములైనవన్నీ జీవమ్ములు” అని కవి అనడంలోని ఉద్దేశమేమి?
జవాబు.
సకల ప్రాణులు అన్నం తినే జీవిస్తాయి. ఆ అన్నమే లేకపోతే ప్రాణికోటి లేదు. ఇంత ప్రాధాన్యం ఉన్న ఆహార నియమాల గురించి ఆదివాసులకు మొదటనే తెలుసు. అన్నం అందరికీ అవసరం అని కవి చెప్పాడని భావం.

ప్రశ్న 4.
గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉండాలంటే ఏం చేయాలి ?
జవాబు.
గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉండాలంటే గ్రామంలోని ప్రజలందరి సమిష్టి కృషి ఎంతో అవసరం. ఒకప్పుడు
గ్రామాలు స్వయం సమృద్ధిగా వెలిగాయి. ప్రజా జీవనానికి అవసరమైన వస్తువులను అన్ని వృత్తులవారు కలసి మెలసి తయారు చేసుకునేవారు. ఒకరి అవసరాలకు మరొకరు చేదోడు వాదోడుగా నిలిచేవారు. కులాల కుమ్ములాటలు ఉండేవి కావు. అందరూ అక్కా, బావా, మావా, అత్తా… అని నోరారా పిలుచుకుంటూ ఆత్మీయతతో జీవించేవారు.

మానవత్వాన్ని చాటిన మధుర జీవనం వారిది. కలసి ఉండటం, ఒకరిపై ఒకరు ఆధారపడటం, ఒకరికొకరు సహకరించుకోవటం మన సంస్కృతిలో గొప్పతనం. వీటిని అలవరచుకొని పాటిస్తే గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉంటాయనటంలో ఎటువంటి సందేహం అక్కరలేదు. సమాజంలోని వారు ఒకరినొకరు సహకరించుకోకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటే గ్రామాలు స్వయం సమృద్ధిని సాధించలేవు.

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు

ప్రశ్న 5.
అసామాన్యులు వ్యాసం రాయటంలో ఉద్దేశమేమిటి ? చర్చించండి.
జవాబు.
భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, జీవన విధానం వృత్తి జీవనంపై ఆధారపడి ఉంది. మన సమాజంలోని రహస్యమిదే. పనిని విభాగించటం. మన సమాజం నేర్చుకున్న ఈ చేతివృత్తులు అందరికి సామాజిక స్థాయిని అందిస్తున్నాయి. ఉదాహరణకు ఒక వివాహం జరగాలనుకోండి దానికి కావలసిన వస్తు సామగ్రి ఒక్కరే తయారు చేయటం అసాధ్యం. ధాన్యం ఒకరు, పప్పు ఉప్పులు ఒకరు, కుండలు ఒకరు, తాళిబొట్టు ఒకరు, వస్త్రాలు ఒకరు, పాలు మిగిలిన ఆహార పదార్థాలు ఇంకొకరు. ఇలా సమాజంలోని వారు ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువును లేక పదార్థాన్ని తయారుచేసి సిద్ధంగా ఉంచితేనే కదా, వివాహం జరిగేది.

భారతదేశంలోని ప్రజల మధ్య ఉండే సహకారం సమన్వయాలకు ఒక నిదర్శనం వృత్తులు అని చెప్పేందుకు ఈ వ్యాసాన్ని రచించారు. బ్రాహ్మణుడు లేకపోయినా. కుమ్మరి లేకపోయినా పెళ్ళితంతు జరగటం కష్టమే! సమసమాజ నిర్మాణం ధ్యేయంగా కులవృత్తులు ఏర్పడ్డాయి. కాని ఇప్పుడు నిరాదరణకు గురై వ్యక్తులకు జీవన భృతిని కల్పించలేకపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం సాంకేతిక పరిజ్ఞానం.

ప్రశ్న 6.
రజకుల కాయకష్టం మనకు ఆరోగ్యాన్నందిస్తుంది. సమర్థించండి.
జవాబు.
భారతీయ సమాజంలో చేతివృత్తులకు ఒక విశిష్టత ఉంది. “కులవృత్తికి సాటిరాదు గువ్వల చెన్నా” అన్నమాటలు మన సమాజానికి ప్రతినిధిగా వచ్చినవే! రజకుల కాయకష్టం నిజంగా మనకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. బట్టల మురికిని శుభ్రం చేయటం ద్వారా మనకు వారు ఆరోగ్యాన్ని అందిస్తున్నారు. బట్టలను శుభ్రంగా ఉతికి ఆరేయటంతో వాటికి అంటుకున్న మురికితోపాటు చాలా క్రిములు నశిస్తాయి. అలా ఉతికిన బట్టలకు గంజిపెట్టి చలువ చేసి, ఇస్త్రీ చేయటంతో శుభ్రమైన బట్టలుగా అవి తయారవుతాయి.

ఇస్త్రీతో మిగిలిన క్రిములు కూడా నశిస్తాయి. శుభాశుభ కార్యాలు వీరి ప్రమేయం లేకుండా జరుగవు. ఇంట్లో జరిగే కార్యక్రమాలన్నింటిలో చేతివృత్తుల వారి ప్రమేయమే ఎక్కువ. అందునా రజకుల ప్రమేయం మరీ ఎక్కువ. శుభకార్యక్రమాల శుభవార్తలను బంధువులకు తెలియజేయటం దగ్గర నుండి ఆ సమయంలో ఇళ్ళను, గుమ్మాలను మామిడి తోరణాలతో అలంకరించే బాధ్యతను వీరు చక్కగా నిర్వహిస్తారు. ఇవన్నీ మనకు ఆరోగ్యాన్ని అందించే కార్యక్రమాలే! కనుక రజకుల కాయకష్టం మనకు ఆరోగ్యాన్ని, సౌభాగ్యాన్ని ఇస్తుందనటంలో అతిశయోక్తి లేదు.

పర్యాయపదాలు

  • ఆకాశము = నింగి, గగనము
  • సొమ్ములు = డబ్బు, సంపద
  • హలము = నాగలి, సీరమ
  • కర్షకుడు = రైతు, హాలికుడు
  • పశువులు = జంతువులు, పసరములు
  • విప్లవం = ఉద్యమము, మేలుకొలువు

నానార్థాలు

  • కాలము = సమయము, మరణము
  • చేవ = సారము, ధైర్యము
  • పాడి = ధర్మము, న్యాయము, క్షీర సంపద (పెరుగు, పాలు, నెయ్యి మొదలైనవి)
  • శక్తి = బలము, పార్వతి
  • అర్థము = శబ్దార్థము, ప్రయోజనం

ప్రకృతి – వికృతులు

  • ప్రకృతి – వికృతి
  • ఆశ్చర్యము – అచ్చెరువు
  • శక్తి – సత్తి
  • ఆకాశము – ఆకసము
  • త్యాగము – చాగము
  • అటవి – అడవి
  • విజ్ఞానము – విన్నాణము
  • కష్టము – కస్తి
  • ధర్మము – దమ్మము
  • స్త్రీ – ఇంతి

వ్యుత్పత్త్యర్థాలు

  • గురువ = అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవాడు (ఉపాధ్యాయుడు)
  • హాలికుడు = హలముతో నేలను దున్నువాడు (రైతు)
  • పక్షి = పక్షములు కలది
  • పౌరుడు = పురంలో నివసించువాడు

సంధులు

  • దేశాభివృద్ధి = దేశ + అభివృద్ధి – సవర్ణదీర్ఘసంధి
  • సూత్రము : అ, ఇ, ఉ, ఋలకు సవర్ణాలైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమౌతాయి.
  • సున్నితమైన = సున్నితము + ఐన – ఉత్వసంధి
  • అద్భుతమైన = అద్భుతము + ఐన – ఉత్వసంధి
  • సూత్రము : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.
  • ప్రత్యక్షము = ప్రతి + అక్షము – యణాదేశసంధి
  • అత్యంతము = అతి + అంతము – యణాదేశసంధి
  • సూత్రము : ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు పరమైనపుడు క్రమంగా యవరలు వచ్చును.

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు

సమాసములు

  • వ్యర్థ పదార్థం = వ్యర్థమైన పదార్థం – విశేషణ పూర్వపద కర్మధారయము
  • మహా పురుషుడు = గొప్పవాడైన పురుషుడు – విశేషణ పూర్వపద కర్మధారయము
  • మధుర జీవనము = మధురమైన జీవనము – విశేషణ పూర్వపద కర్మధారయము
  • తోడు నీడ = తోడుయును నీడయును – ద్వంద్వ సమాసం
  • రేయింబవలు = రేయియును పవలును – ద్వంద్వ సమాసం
  • బండి చక్రము = బండి యొక్క చక్రము – షష్ఠీ తత్పురుష సమాసం
  • జంతువుల మనసు = జంతువుల యొక్క మనసు – షష్ఠీ తత్పురుష సమాసం
  • కళా దృష్టి = కళ యొక్క దృష్టి – షష్ఠీ తత్పురుష సమాసం
  • మూడు తరాలు = మూడు అను సంఖ్యగల తరాలు – ద్విగు సమాసం
  • నవగ్రహాలు = తొమ్మిది అను సంఖ్యగల గ్రహాలు – ద్విగు సమాసం
  • మృదుమధురము = మృదువైనది మధురమైనది – విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం
  • శీతోష్ణము = శీతలమైనది ఉష్ణమైనది – విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం

పాఠం ఉద్దేశం

అన్ని వృత్తుల సమిష్టి సహకారంతో సమాజం కొనసాగుతుంది. వృత్తులు సమాజ సేవలో తమవంతు పాత్రను పోషిస్తాయి. దేశాభివృద్ధికి మూలస్తంభాలుగా నిలిచినవి వృత్తులే! అయినా వాటికి ఆదరణ కరువైంది. వివిధ వృత్తుల వారిపట్ల గౌరవాన్ని, శ్రమ విలువలను పెంపొందించడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ప్రశ్న.
‘వ్యాస ప్రక్రియను పరిచయం చేయండి.
జవాబు.
ఈ పాఠం వ్యాసప్రక్రియకు చెందినది. వృత్తులు వ్యక్తి గౌరవానికి, సమాజాభివృద్ధికి ఎట్లా తోడ్పడుతాయో వివరిస్తూ, శ్రమ సౌందర్యాన్ని తెలియజేసే వ్యాసమిది.

ప్రవేశిక

శ్రమ జీవన సౌందర్యాన్ని వర్ణించడం ఎవరితరం ? ఒక్కొక్క వృత్తి ఒక్కొక్క ప్రత్యేకతను సంతరించుకుంది. అయినా అన్ని వృత్తుల సమిష్టి జీవనమే సమాజం. ఎవరి వృత్తి ధర్మాన్ని వారు నిబద్ధతతో నిర్వహిస్తే సమాజం సుసంపన్నం అవుతుంది. ప్రతి వృత్తి గౌరవప్రదమైనదే! అన్ని వృత్తుల మేలు కలయికతోనే వసుధైక కుటుంబ భావన పెరుగుతుంది. కొన్ని వృత్తుల విశేషాలను తెలుసుకుందాం!

కఠిన పదాలకు అర్ధాలు

  • దృష్టి = చూపు
  • ప్రతిభ = నేరు
  • పరిశీలన = నిశితమైన గమనింపు
  • మార్గం = దారి / త్రోవ
  • అద్భుతం = గొప్పది.
  • ఆపాదమస్తకం = కాలిగోటి నుండి తల వరకు
  • సొమ్ములు = ధనము / పశువులు
  • ఆకృతి = రూపం
  • ఔదార్యము = ఉదారగుణం
  • క్షుధ = ఆకలి
  • ఇక్కట్లు = కష్టాలు
  • కృషీవలుడు = రైతు
  • చిచ్చు = అగ్ని
  • హలము = నాగలి
  • గొంగడి = కంబళి, రగ్గు
  • ఆవిష్కరణ = కనిపెట్టుట
  • తోవ = మార్గము
  • అమాంతం = ఒక్కసారిగా
  • గురుగుల = ఆడపిల్లలు చిన్న వయస్సులో ఆడుకొనే బొమ్మలు (వంటసామగ్రితో ఉన్నవి)
  • గిరాకీ = ఎక్కువగా కావలసినవి, ప్రియమైనవి, బాగా కావలసినవి (డిమాండ్)
  • సెగ = వేడి బాగా తగులుట, దగ్గరగా వేడి ఉండుట
  • తొలి = మొదటి, రంధ్రం
  • వెల = రేటు
  • వక్కాణించు = గట్టిగా చెప్పు
  • కాటికి = కాడు + కి = శ్మశానానికి
  • బొక్కెన = బక్కెట్టు
  • బాయి = బావి
  • క్షురము = కత్తి
  • క్షురకుడు = మంగలి
  • శరీరమర్దనం = మసాజ్ లేదా మాలిష్

నేనివి చేయగలనా ?

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు 9

TS 8th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సింగరేణి

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 10th Lesson సింగరేణి Textbook Questions and Answers.

TS 8th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సింగరేణి

బొమ్మను చూడండి ఆలోచించి చెప్పండి
TS-8th-Class-Telugu-Guide-10th-Lesson-సింగరేణి-1

ప్రశ్న 1.
చిత్రంలో కనపడుతున్నవాళ్ళు ఏం పనులు చేస్తున్నారు ?
జవాబు.
చిత్రంలో కనపడుతున్నవాళ్ళు బొగ్గు గనుల నుండి బొగ్గును బయటకు తెస్తున్నారు.

ప్రశ్న 2.
చిత్రంలో ఏయే వస్తువులు కనపడుతున్నాయి ?
జవాబు.
చిత్రంలో బ్యాటరీలైట్లు, బొగ్గుతో నిండిన గంపలు, తలలకు హెల్మెట్లు కన్పిస్తున్నాయి.

TS 8th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సింగరేణి

ప్రశ్న 3.
చిత్రం దేనికి సంబంధించిందని మీరు అనుకొంటున్నారు ?
జవాబు.
ఈ చిత్రం బొగ్గు గనులకు సంబంధించిందని అనుకుంటున్నాను.

ప్రశ్న 4.
తెలంగాణలో బొగ్గు గనులు ఏ ఏ జిల్లాలలో ఉన్నాయి ?
జవాబు.
తెలంగాణలో కరీంనగర్, వరంగల్లు, ఖమ్మం జిల్లాలలో బొగ్గు గనులున్నాయి.

ప్రశ్న 5.
నేలబొగ్గు వల్ల ఉపయోగాలేవి ?
జవాబు.
నేలబొగ్గు పరిశ్రమలకు ఇంధనంగా, విద్యుత్ ఉత్పత్తికి, రోడ్లు వేయటానికి తారుగా, ప్లాస్టిక్ను తయారు చేయటానికి, తలకు రాసే సువాసన నూనెలను తయారు చేయటానికి, బట్టలకు వేసే అద్దకాల రంగులను తయారుచేయటానికి ఉపయోగపడుతుంది.

ఆలోచించండి – చెప్పండి

1. “శ్రమజీవే జగతికి మూలం … చెమటోడ్చక జరుగదు కాలం’ అన్న వాక్యాన్ని ఏవిధంగా అర్థం చేసుకున్నారు?
జవాబు.
మానవ జీవితం సుఖమయం కావాలంటే అందరి అవసరాలు తీరాలి. అందరి అవసరాలు తీరాలంటే జాతీయోత్పత్తులు పెరగాలి. జాతీయోత్పత్తులు పెరగాలంటే అందరూ కష్టపడి పని చేయాలి. అందుకే శ్రమజీవే జగతికి మూలం అని అర్థం చేసుకున్నాం.

2. ఈ నేల బొగ్గును ‘నల్ల బంగారం’ అని ఎందుకంటారు ?
జవాబు.
బంగారం ఎన్ని రకాలుగా ఉపయోగపడుతూ మన విలువను పెంచుతుందో అన్నివిధాలుగా బొగ్గుకూడా ఉపయోగపడుతున్నది. కావున బొగ్గును బంగారంతో పోల్చి ‘నల్ల బంగారం’ అని అంటున్నాం.

TS 8th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సింగరేణి

3. ‘సహజ సంపదను వినియోగించుకొనే విజ్ఞానం పైననే మానవ నాగరికత నిర్మించబడుతున్నది’ చర్చించండి.
జవాబు.
ఒకదేశం తనకున్న సహజవనరులను ఎంత విరివిగా ఉపయోగించుకుంటే అంత అభివృద్ధిని సాధిస్తుంది. ఉదాహరణకు ప్రకృతి ప్రసాదించిన సహజ సంపద బొగ్గు. దానిని పలు పరిశ్రమలు పలురకాలుగా వాడుకుంటున్నాయి. అలాగే అటవీ సంపద, జల సంపద వీటిని పూర్తి వినియోగంలోనికి తేవటం ద్వారా సామాజిక ఎదుగుదలకు అవకాశాలుంటాయి.

4. ఈ ‘దేశంలో మరే ఇతర బొగ్గు సంస్థకు లేని ప్రత్యేకత సింగరేణి గనులకు ఉన్నది’ ఎందుకో చర్చించండి.
జవాబు.
సింగరేణి గనుల్లో అపారంగా, తరిగిపోనన్ని బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఈ గనుల్లోని బొగ్గు నాణ్యమైంది. ఇవి తెలంగాణా గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పిస్తూ, సామాజిక, ఆర్థిక స్థితులను మెరుగుపరిచాయి.

5.”బొగ్గు ఉత్పత్తిలో కార్మికుడే అత్యంత కీలకమైన పనిముట్టు” అని ఎందుకన్నారు?
జవాబు.
సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషించేది కార్మికులే! వారందరూ తెలంగాణ గ్రామీణ ప్రాంత వాసులు. గనులలోకి వెళ్ళి బొగ్గును త్రవ్వి పోగుచేసి తట్టల్లో ఎత్తి వెలుపలికి పంపిస్తారు. ఆ నైపుణ్యం గని కార్మికులకే ఉంటుంది. అందుకే బొగ్గు ఉత్పత్తిలో కార్మికుడే అత్యంత కీలకమైన పనిముట్టు అని అన్నారు.

6. ‘గడియారం ముండ్లవలె పనిచేస్తున్న కార్మికులు’ అన్న వాక్యాన్ని మీరెట్లా అర్థం చేసుకున్నారు?
జవాబు.
శ్రమకు ప్రతినిధిగా గడియారం ముల్లును సూచిస్తాం. అట్లాగే బొగ్గుగనిలో పనిచేసే కార్మికులు కోడికూత కంటే ముందే లేచి గనులలోకి వెళ్ళేవారు వెళ్తుంటారు, వచ్చేవారు వస్తుంటారు. ఇలా గడియారం ముల్లులు తిరిగినట్లు కార్మికులు కూడా విరామం లేకుండా మూడు షిఫ్టుల్లో పనిచేస్తూనే ఉంటారని అర్థమయింది.

TS 8th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సింగరేణి

7. ప్రమాదాల అంచున నిలబడి పని చేయటం అంటే ఏమిటి?
జవాబు.
ప్రమాదాల అంచున నిలబడి పనిచేయట మంటే గనిలోకి వెళ్ళిన కార్మికులకు ఎపుడు ఏవిధంగా ప్రమాదం ఏర్పడుతుందో తెలియదు. గనులు విరిగిపడి, గనులలోకి నీరువచ్చి, గాలి వెలుతురులు లేక ఊపిరితిత్తుల సమస్యలు తరచు వారి ఆరోగ్యాన్ని పాడుచేస్తుంటాయి. అందుకే వారు ప్రమాదాల అంచున పనిచేసే కార్మికులని అర్థమౌతుంది. ఏ ప్రమాదం ఎక్కడ పొంచి వున్నదో చెప్పలేని పరిస్థితి..

ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. సింగరేణి కార్మికులు కాయకష్టం చేసి బొగ్గు తీస్తున్నారు కదా! కార్మికుల జీవితాల గురించి మీకేం అర్థమయిందో చెప్పండి.
జవాబు.
తెలంగాణ ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనులు దేశంలోనే ప్రసిద్ధి వహించినవి. దానికి కారకులు సింగరేణి గనులలో పనిచేసే గని కార్మికులే! ఆ కార్మికులందరూ తెలంగాణ గ్రామీణ ప్రాంతంలోని పేద ప్రజలే! వారి సామాజిక ఆర్థిక స్థితిగతులు సింగరేణికి ఊపిరులయ్యాయి. బ్రతుకు భారాన్ని మోయటానికి కష్టం చేయక తప్పిందికాదు. ప్రారంభంలో వారి శ్రమకు తగిన ఫలితం కూడా వచ్చేది కాదు.

తరువాత కార్మిక సంఘాల చైతన్యంతో తగిన కూలీ రెట్లతో వారి జీవితాలు కొంతలో కొంత మెరుగు పడ్డాయి. బొగ్గు గనుల్లో పనిచేయట మంటే ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవటమే! ఏ బతుకుదెరువు లేకపోతే ఈ పనిలో చేరేవారు. కార్మికులు రాత్రి పగలు అను భేదం లేకుండా కష్టపడి పనిచేస్తుంటారు. గడియారంలో ముల్లు విరామం లేకుండా ఎట్లా తిరుగుతుందో సింగరేణి కార్మికులు కూడా నిరంతరం కృషికి ప్రతినిధులని అర్థమౌతుంది.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం చదువడం-అర్థం

1. కింది గేయాన్ని చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఇష్టదేవతకు దండం పెట్టి
గనిలోనికి నువు అడుగుబెట్టి
బళ్ళున బొగ్గు కూలుత ఉంటే
ప్రాణాలకు వెనుకాడక నువ్వు
రక్తమాంసాలు చెమటగ మార్చి
టబ్బుల్లోన బొగ్గు నింపుతవ్
జాతికి వెలుగులు అందిస్తుంటవు
“నల్లసూర్యుని”వై వెలుగొందుతవు.

ప్రశ్నలు :

అ. గేయం ఎవరిని గురించి తెలుపుతుంది?
జవాబు.
ఈ గేయం బొగ్గు కార్మికుని గురించి తెలుపుతుంది.

ఆ. ఇష్టదేవతకు ఎందుకు దండం పెడతారు ?
జవాబు.
ఇష్టదేవతకు తమకు కష్టం రానీయవద్దని దండం పెడతారు.

ఇ. కార్మికుడిని ‘నల్లసూర్యుడు’ అని ఎందుకన్నారు?
జవాబు.
సూర్యుడు లోకాలకు వెలుగులను పంచినట్లు, నల్లసూర్యునిగా పిలువబడుతున్న గని కార్మికుడు ప్రపంచానికి కరెంటు కాంతిని అందిస్తున్నాడు. అందుకే బొగ్గుగని కార్మికుడిని నల్లసూర్యుడని అన్నారు.

TS 8th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సింగరేణి

ఈ. జాతికి వెలుగు అందించడమంటే ఏమిటి?
జవాబు.
జాతికి వెలుగు అందించట మంటే జాతి పురోభివృద్ధికి పాటుపడటమని అర్థం.

ఉ. తెలంగాణలో బొగ్గుగనులు ఎక్కడున్నాయి?
జవాబు.
తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఇల్లందులోను, అదిలాబాద్ జిల్లా తాండూరులోను, కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోను, తెలంగాణలోని గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో బొగ్గుగనులు విస్తరించి ఉన్నాయి.

2. కింది పేరా చదువండి. అయిదు ప్రశ్నలను తయారు చేయండి.

తెలంగాణ బట్టల అద్దకం విషయంలో అనాదిగా ప్రాముఖ్యత వహించిన ప్రదేశం. ఒకప్పుడు ఆ పరిశ్రమ ఉన్నతదశలో ఉండేది. కాని దేశంలో వచ్చిన ఆర్థిక చిక్కులు ఈ పరిశ్రమను కష్టనష్టాలకు గురిచేశాయి. విదేశాలలో యంత్రాలపై తయారైన బట్టలకు అలవాటుపడిన ఈ నాటి వారికి మన చేతి పనుల వలన తయారయ్యే సుందర వస్త్రాల గురించి నేటికైనా కనువిప్పు కలిగింది.

అ. ఈ పేరా మనకు దేనిని గురించి వివరిస్తుంది?
ఆ. ఒకప్పుడు తెలంగాణ దేనికి ప్రాముఖ్యత వహించిన ప్రదేశం?
ఇ. ఒకప్పుడు ఏ కుటీర పరిశ్రమ తెలంగాణలో ఉన్నతస్థితిలో ఉండేది?
ఈ. బట్టల అద్దకం పరిశ్రమ ఎందుకు కష్టనష్టాలకు గురి అయింది?
ఉ. విదేశాలలోని యంత్రాలపై ఎట్లాంటి వస్తువులు తయారయ్యేవి?
ఊ. చేతి పనులపై తయారయ్యే వస్తువులు ఎలా ఉంటాయి?
ఎ. నేటికి ప్రజలలో ఏ విషయంలో కనువిప్పు కలిగింది?

III. స్వీయరచన:

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. సహజ సంపదలను వినియోగించుకునే విజ్ఞానం పైన మానవ నాగరికత నిర్మించబడుతుందని ఎట్లా చెప్పగలవు?
జవాబు.
ఒక దేశం తనకున్న సహజ వనరులను చక్కగా వినియోగించుకుంటేనే మంచి అభివృద్ధిని సాధించగలుగుతుంది. ప్రపంచదేశాలన్నీ పారిశ్రామికంగా ముందంజలో ఉన్నాయి. భారతదేశం కూడా వాటితో పోటీ పడాలంటే పారిశ్రామిక అభివృద్ధిని సాధించాలంటే సహజ సంపదలను వినియోగించుకోక తప్పదు. అప్పుడే నిజమైన మానవ నాగరికత నిర్మించబడుతుంది. ఉదాహరణకు జలవనరులను, ఖనిజ సంపదను ఉపయోగించుకోవటం ద్వారా మనం దేశాభివృద్ధిని చేసుకోగలిగాం. అట్లాగే పలు పరిశ్రమలకు, విద్యుదుత్పత్తికి, రంగుల తయారీకి, రోడ్లకు మూలమైన నేలబొగ్గును ఒక సహజవనరుగా ఉపయోగించటం వలన అభివృద్ధికి రాచబాటలు వేసుకోగలమని చెప్పగలను.

ఆ. “బుక్కెడు బువ్వకోసం బతుకు పోరాటానికి సిద్ధమైనారు” దీనిని మీరెట్లా అర్థం చేసుకున్నారో తెల్పండి.
జవాబు.
తెలంగాణా పోరాటగడ్డ. వారు జీవితంలో తిండికి గుడ్డకు, స్వాతంత్ర్యానికి పోరాటం అనాదిగా సాగిస్తూనే ఉన్నారు. శ్రమలేకుండా సుఖం లేదన్నది వారి సిద్ధాంతం. శ్రమజీవే జగతికి మూలం. చెమటోడ్చక జరుగదు కాలం. అందుకే శ్రమజీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని శ్రీశ్రీ అని ఉంటారు. తెలంగాణ గ్రామీణులు మిక్కిలి పేదవారు. నీటికి కటకట పడుతున్న ప్రాంతమది. నీటి సదుపాయం లేకపోవటం వలన వర్షం మీద ఆధారపడి పంటలు పండిస్తారు. వర్షం పడకపోతే క్షామం తప్పనిసరి. అందుకే ‘బుక్కెడు బువ్వకోసం బతుకు పోరాటానికి సిద్దమై ప్రమాదం పొంచి ఉన్నా బొగ్గు గనులలో పనిచేయుటకు సిద్ధమయ్యారు. బొగ్గుగనులు వారికి జీవన భృతినిస్తున్నాయి.

TS 8th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సింగరేణి

ఇ. పగలు, రేయి తేడా లేకుండా గడియారం ముండ్లవలె పని చేయటం అంటే ఏమిటి ? కార్మికుల పనితో అన్వయించి రాయండి.
జవాబు.
సింగరేణి కార్మికులు పగలు రేయి తేడా లేకుండా గడియారం ముండ్లవలే పనిచేస్తుంటారు. కోడి కూతకు ముందే లేచి తయారై గనిలోకి పోయేవారు కొందరైతే, పగలు మూడు గంటలకు గనులలోకి పోయేవారు మరికొందరు. అర్ధరాత్రి పనికి పోయేవారు ఇంకొందరు. ఇట్లా ప్రొద్దున నుండి అర్ధరాత్రి వరకు మూడు షిఫ్టుల్లో గనుల్లో పని చేస్తూనే ఉంటారు. ఇలా గడియారం ముళ్ళు విసుగు విరామం లేకుండా ఎట్లా పనిచేస్తాయో అట్లానే సింగరేణి కార్మికులు కూడా పనిచేస్తున్నారని తెలుస్తుంది.

ఈ. డాక్టర్ కింగ్ పరిశోధనల వల్ల కల్గిన మేలు ఏమిటి?
జవాబు.
సింగరేణి గనుల విశిష్టతలను లోకానికి తెలియజేసిన వాడు డాక్టర్ కింగ్. ఆయన పరిశోధనల వలన దేశంలోని ఏ ఇతర బొగ్గు గనులకు లేని విశిష్టత వీటికి వచ్చింది. 1841లో ఖమ్మం జిల్లా ఇల్లందు గ్రామానికి చెందిన కొందరు గ్రామస్థులు భూమిని త్రవ్వుతుండగా బొగ్గు విషయం లోకానికి తెలిసింది. ఈ సంఘటన ఆధారంతో 1871లో డాక్టర్ కింగ్ ఇల్లందు గ్రామ పరిసరాలలో శ్రేష్టమైన బొగ్గు ఉన్నదని తన పరిశోధనలో గుర్తించాడు. ఈ బొగ్గు భూమి లోపల ఆరు పొరల్లో నిక్షిప్తమై ఉన్నదని కనుగొన్నాడు. గనిలోని క్రింది బొగ్గుపొరకు ‘కింగ్ సీమ్’ అని, పై బొగ్గు పొరకు ‘క్వీన్ సీమ్’ అని పేరు పెట్టారు. కింగ్ పరిశోధనల వలన వేలాది కార్మికులకు ఉపాధి, ప్రకృతి వనరులను ఉపయోగించుకోగలిగిన అవకాశం మనకు లభించింది.

ఉ. బొగ్గు గనులలో కార్మికులను ఎలా ఎంపిక చేసేవారు?
జవాబు.
తెలంగాణ గ్రామీణ ప్రజలు బతుకు పోరాటానికి అలవాటు పడినవారు. బుక్కెడు బువ్వకోసం తెలంగాణ పల్లెల నుండి గనులలో కూలీలుగా తరలి వచ్చేవారు. చదువురాకపోయినా, బరువులు మోయటం, గుంజీలు తీయటం, పరుగు పోటీలు వంటి వాటిద్వారా అర్హులను ఎంపిక చేసి వారిని బొగ్గు గని కార్మికులుగా తీసుకొనేవారు. వారు మూడు షిఫ్టులలో పనిచేయాల్సి వచ్చేది. గనుల్లో పనిచేయటం ప్రాణాలకు ముప్పు అని తెలిసినా గత్యంతరం లేక వారు పెట్టే పరీక్షలలో నెగ్గి గని కార్మికులుగా చేరిపోయేవారు. తరువాత తరువాత గనుల యజమానులు కార్మికుల రక్షణకు శ్రద్ధ చూపించటంతో ఎక్కువ మంది గనులలో పనిచేయటానికి ముందుకు వచ్చారు. యూనియన్ల ద్వారా ప్రస్తుతం మంచి జీవన భృతిని అందుకుంటున్నారు.

ఊ. సింగరేణి గని కార్మికుడు వ్రాసిన పాటకు అర్థాన్ని తెలుపండి.
జవాబు.
ఆలోచనలను ప్రక్కనపెట్టి హాయిగా కష్టపడు. అరవై ఐదు అంగుళాల సమతలంలో నలభై అంగుళాల లోతు వరకు రంధ్రం చేసి ఆ రంధ్రంలో మందుకూరి మందుపాతరను పేల్చమని షార్టు ఫైరన్నకు వివరిస్తున్నాడు. పైకప్పు కూలకుండా బోల్టులు వేసి ప్రమాదాలను జరుగకుండా చూడమంటున్నాడు. బొగ్గు జారిపోకుండా దిమ్మలను సరిచేయమంటున్నాడు. టబ్బు తరువాత టబ్బును పెట్టి మెల్ల మెల్లగా టబ్బును నింపమని ఫిల్లరన్నకు చెప్తున్నాడు.

చక్కగా ఆ బొగ్గుతో నిండిన టబ్బులను రోప్తో పైకి నడిపించమని హాలరన్నను కోరుతున్నాడు. బాధ లెన్నో పడి చక్కని కష్టం చేసి బొగ్గును పైకి చేర్చాము. దానికి తగిన ఫలితాన్ని బ్యాంకు ద్వారా మాకు అందించమని సింగరేణి గని కార్మికుడు పాట ద్వారా తన కష్టాన్ని మరచి పోతున్నాడు అని దీని అర్థం.

ఎ. బొగ్గు గనులు ఎలా ఏర్పడి ఉంటాయి ? అవి సహజ వనరులు ఎలా అయ్యాయి?
జవాబు.
బొగ్గు గనులు గోదావరి నది పరీవాహక ప్రాంతమంతా వ్యాపించి ఉన్నాయి. పూర్వం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిండి ఉండేది. రెండు వందల మిలియన్ సంవత్సరాలకు పూర్వం ఆ అడవులు తగలబడి భూమి మీదున్న ఆ వృక్షముల అవశేషాలు క్రమ క్రమంగా భూమిలోకి కూరుకుపోయాయి.

అట్లా కూరుకుపోయిన వాటి మీద మట్టి, రాళ్ళు పడి లోపలికి చేరి పొరలు పొరలుగా బొగ్గు ఏర్పడిందని శాస్త్రజ్ఞుల భావన. అట్లా ఏర్పడిన బొగ్గు మనకు ఇపుడు పలు అవసరాలకు ఉపయోగపడుతోంది. ప్రకృతి ప్రసాదించిన సహజవనరుల్లో ఇది కూడా ఒకటి అయింది. సహజంగా ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా భూమి నుండి తీసుకొని వాడుకుంటున్నాం కాబట్టి ఇది ఒక సహజ వనరు అయింది.

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. సింగరేణి కార్మికులతో ప్రత్యక్ష సంబంధం మనకు లేకపోవచ్చు. కానీ పరోక్ష సంబంధం ఉన్నది. ఎట్లాగో వివరించండి.
జవాబు.
సింగరేణి కార్మికులతో ప్రత్యక్ష సంబంధం మనకు లేకపోయినా ఆ కార్మికులు ఉత్పత్తి చేసిన బొగ్గు మన అవసరాల నెన్నింటినో తీరుస్తున్నది కావున మనకు వారితో పరోక్ష సంబంధం ఉన్నట్లే. వారు తయారుగా ఉంచిన బొగ్గు యంత్రాలు నడపటానికి ఉపకరిస్తుంది. దానివలన ఎందరికో ఉపాధి కలుగుతున్నది. బొగ్గుతో విద్యుచ్ఛక్తి తయారవుతుంది. అది లేనిదే ఈ మన దైనందిన జీవితం చాలా కష్టతరమౌతుంది.

బొగ్గుతో ఎన్నో పరిశ్రమలు నడుస్తున్నాయి. ఆ పరిశ్రమలలో పనిచేసేవారికి ఉపాధికారి అవుతుంది. మనం నడవటానికి సరైన రహదారులు కావాలి. రహదారుల నిర్మాణంలో బొగ్గు నుండి ఉత్పత్తి చేసే తారు ప్రధానపాత్ర వహిస్తుంది. పంట పొలాలకు వేస్తున్న రసాయనిక ఎరువులు బొగ్గుతో తయారవుతున్నాయి. బట్టలకు అద్దకం పనిచేయటానికి రంగులను బొగ్గుతోనే తయారు చేస్తున్నారు. మనదేశంలో విరివిగా అందుబాటులో ఉన్న సహజవనరు బొగ్గు, ఆ బొగ్గును అందించే కార్మికుడితో మన సమాజంలో బతుకుతున్న వారందరికి పరోక్ష సంబంధం ఉన్నది.

చివరకు బట్టలను ఇస్త్రీ చేయటానికి కూడా ఈ బొగ్గు ఉపయోగింప బడుతున్నది కదా! కాబట్టి సింగరేణి కార్మికులు అక్కడ బొగ్గు గనులలో పనిచేస్తున్నా వారితో మనకు పరోక్ష సంబంధం తప్పనిసరి అవుతుంది. ఎంతో మందికి జీవనోపాధిని కల్పించి, ఎన్నెన్నో అవసరాలు తీర్చే సింగరేణి తెలంగాణ ప్రాంతానికి తలమానికం అని చెప్పవచ్చు.

TS 8th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సింగరేణి

ఆ. ఆ సింగరేణి గనుల పూర్వాపరాలను తెలియజేయండి. (లేదా) సింగరేణి తెలంగాణాకు తలమానికం వంటిదని ఎలా చెప్పగలవు ?
జవాబు.
ఏ దేశం తన సహజ సంపదను సమర్థవంతంగా వినియోగించుకుంటుందో ఆ దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. మన నేలల్లో అపారమైన ఖనిజ సంపద ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనులు చెప్పుకోదగినవి.
గోదావరి నదీ పరీవాహక ప్రాంతమంతా ఒకప్పుడు దట్టమైన అడవులతో నిండి ఉండేది. రెండు మిలియన్ సంవత్సరాలకు పూర్వం ఆ అడవులు తగలబడి ఆ చెట్ల అవశేషాలు భూమిలోపలకు చేరి పొరలు పొరలుగా ఏర్పడ్డాయి. అవే బొగ్గుగనులు. దానినే నేలబొగ్గు అని, నల్ల బంగారం అని పిలుస్తున్నాం.

మొట్టమొదటిగా ఖమ్మం జిల్లా ఇల్లందు గ్రామస్తుల త్రవ్వకాలలో ఈ బొగ్గు గనుల చరిత్ర బయటపడింది. భారత ప్రభుత్వానికి చెందిన భూగర్భ పరిశోధన శాఖ పరిశోధనలు చేసి ఇది అంత మంచిది కాదని తేల్చింది. ఆ తరువాత 1871లో డాక్టర్ కింగ్ అనే శాస్త్రజ్ఞుడు ఇల్లందు గ్రామ పరిసరాలలో శ్రేష్టమైన బొగ్గును గుర్తించాడు. ఇది భూమి అడుగు పొరలలో ఉందని అన్నాడు. 1886లో హైదరాబాద్ దక్కన్ కంపెనీవారు తొలి భూగర్భ గనిని ఇల్లందులో ప్రారంభించారు.

దీనిలోని క్రింది బొగ్గుపొరకు ‘కింగ్సీమ్’ అని పైపొరకు ‘క్వీన్ సీమ్’ అని పేరుపెట్టారు. బొగ్గును రవాణా చేయటానికి డోర్నకల్ నుండి ఖాజీపేట వరకు రైల్వేలైను వేసి దానికి ‘సింగరేణి కాలరీస్’ అను పేరు పెట్టారు. హైదరాబాద్ దక్కన్ కంపెనీ, సింగరేణి కాలరీస్ కంపెనీగా మారిపోయింది. ఎంతోమందికి జీవనోపాధిని కల్పించి, ఎన్నెన్నో అవసరాలు తీర్చే సింగరేణి తెలంగాణ ప్రాంతానికి తలమానికం అని చెప్పవచ్చు.

ఇ. బొగ్గు గనులలో పనిచేసే విభాగాలు, వాటి పేర్లు, కార్మికుల హోదాలను రాయండి.
జవాబు.
బొగ్గుగనులలో పనిచేసేవారు గడియారం ముళ్ళవలే శ్రమజీవులు. మూడు షిఫ్ట్లలో పనిచేస్తారు. గనిలోకి పోయేముందు హాజరు వేయించుకుంటారు. ‘ఓర్మెన్’ పనిని విభజించి ఎవరెవరు ఏం చేయాలో చెప్తాడు. పొట్టినిక్కరు, కాళ్ళకు బూట్లు, తలపై లైటుతో ఉన్న టోపి, నడుముకు బాటరీ కట్టుకొని కార్మికులు గనిలోకి ప్రవేశిస్తారు. సర్దార్ పని ప్రదేశాన్ని పరిశీలించి టింబర్మెన్ చేయవలసిన పనిని నిర్దేశిస్తాడు. ‘కోల్ కట్టర్’ ఉళ్ళు కోసి మందుపాతరలను పెడతాడు. ‘షార్ట్ ఫైర్మెన్’ వాటిని పేలుస్తాడు. తర్వాత ‘సర్దార్’ ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తాడు.

ఇతడు పైకప్పు కూలకుండా ప్రమాదాలను పసికడుతుంటాడు. ‘కోల్ ఫిల్లర్’లు చెమ్మత్తో బొగ్గును తట్టల్లోకి ఎత్తి టబ్బులు నింపుతారు. ‘హాలర్’ టబ్బులన్నీ నిండిన తరువాత రోప్ సాయంతో పైకి చేరుస్తాడు. ఇట్లా సేఫ్టీ అధికారి, అండర్మెన్, సర్వేయర్, చైర్మెన్, ఓర్మెన్, సర్దార్ (మొకద్దం) షార్ట్ఫర్, కోల్కట్టర్, టింబర్మెన్, లైన్మెన్, ట్రామర్, హాలర్, కోల్ ఫిల్లర్, జనరల్ మద్దూర్లు, బొగ్గును వెలికి తీసే పనిలో భాగస్వాములు అవుతారు. వీరందరూ కలసికట్టుగా పనిచేస్తేనే బొగ్గు త్రవ్వి తీయటం సాధ్యమౌతుంది. అపుడే దేశ పురోభివృద్ధి సాధ్యమౌతుంది.

TS 8th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సింగరేణి

ఈ. “సింగరేణిని వెలుగులు విరజిమ్మే సింగరేణి” అని ఎందుకు అన్నారు ?
జవాబు.
సింగరేణిని “సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం” అని అంటారు. ఎందుకంటే మొత్తం దక్షిణ భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి చేసే ఏకైక కంపెనీ; వేల మందికి ముఖ్యంగా గ్రామీణ పేద ప్రజలకి జీవనోపాధిని, పనిని కల్పించిన కంపెనీ అయిన సింగరేణికి తెలంగాణలో ఎంతో విశిష్టత ఉంది. సామాజిక జీవితంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పరిశ్రమల్లో సింగరేణి ఒకటి. దేశ ప్రగతికి తోడ్పడే సింగరేణి గనులు, బొగ్గు, థర్మల్ స్టేషన్ గొప్పతనం చెప్పారు.

బొగ్గును అందించి పరిశ్రమలు పనిచేసేలా భగభగమండి వెలుగులు విరజిమ్ముతుంది. ఆ గనుల్లో, కర్మాగారాలలో పనిచేసే కార్మికుల జీవితాలలో వెలుగును నింపుతుంది. అక్కడ పనిచేసే వారి జీవితాలకు సిరిసంపదలనిస్తుంది. ఎంతో సహజ ఖనిజ సంపద అణువణువున కల్గి ఉంది. అక్కడి బొగ్గుతో విద్యుచ్ఛక్తి తయారుచేసి వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తారు. ఆ విద్యుత్ వెలుగులను సింగరేణి ఇస్తుంది. కనుక సింగరేణిని “వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం” అని, “అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం” అని అంటారు.

IV. సృజనాత్మకత/ప్రశంస:

1. సింగరేణి కార్మికులు గనిలో తీసుకోవలసిన జాగ్రత్తలను తెలుపుతూ ఒక పోస్టరు తయారుచేయండి.

గనిలో పాటించవలసిన జాగ్రత్తలు.

  1. గనులలోకి పోయే కార్మికులు ‘మస్టర్’ (హాజరు) తప్పనిసరిగా వేయించుకోవాలి.
  2. తన పనేదో దానికే పరిమితం కావాలి.
  3. సులువుగా నడవటానికి, పరిగెత్తటానికి వీలయ్యే పొట్టి నిక్కరునే ధరించాలి.
  4. కాళ్ళకు దెబ్బలు తగలకుండా బూట్లు వేసుకోవాలి.
  5. తలపై టోపీకున్న లైటు సరిగా వెలుగుతుందో లేదో పరీక్షించుకోవాలి.
  6. నడుముకున్న బాటరీ సరిగా ఉన్నదో లేదో చూసుకోవాలి.
  7. మందు పాతరలు పెట్టేటప్పుడు, పేల్చేటప్పుడు అందరినీ అప్రమత్తం చేయాలి.
  8. గనులలోకి నీరు ప్రవేశించినపుడు వెంటనే బయటకు వచ్చేయాలి.
  9. గనులు కూలిపోతాయన్న అనుమానం వచ్చినపుడు వేగంగా బయటకు రావాలి.
  10. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి.
  11. మత్తుపానీయాలు సేవించి గనులలోకి ప్రవేశించరాదు.
  12. నిప్పుపట్ల జాగ్రత్త వహించాలి.
  13. బొగ్గును పైకి చేర్చే రోప్ ను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండాలి.
  14. ఆరోగ్య విషయంలో తరచుగా డాక్టర్ను సంప్రదించాలి.
  15. ఒంటికి శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి.

(లేదా)

2. సింగరేణి గనులు / కార్మికుల గురించి ఒకపాట రాయండి.

పల్లవి: చీకటిలో కష్టపడే శ్రమ జీవన సాంద్రుడు
పరుల బతుకులకు వెలుగులు పంచు నల్ల చంద్రుడు. ॥

అనుపల్లవి: శ్రేష్ఠుడురా మాయన్న సింగరేణి కార్మికుడు
నిష్ఠాయుతుడైన నల్ల బంగారం ప్రేమికుడు. ॥

1 చరణం: ఫ్యాక్టరీ కూత విని పరుగెత్తే సైనికుడు
పగలు రేయి పని వీణను మోగించే వైణికుడు
ఊపిరాడలేని గనుల లోపల ఒక యాత్రికుడు
చెమటను బంగారంగా చేయగలుగు మాంత్రికుడు.

2 చరణం: చావుకు వెరువక పోరే ఒక సాహస వీరుడు
కఠిన పరిస్థితులనైన కరిగించే ధీరుడు
తన వాళ్ళ సుఖం కోసం తపియించు ఋషీంద్రుడు
పెనుసవాళ్ళు ఎదురైనా వెరవని గంభీరుడు.

3 చరణం: జీవితమొక పోరాటంగా సాగే యోధుడు
త్యాగ జీవనానికే నిదర్శనమౌ ధన్యుడు
కడలివంటి కన్నీళ్ళను దాచుకునే సాగరుడు
జనతకు ప్రభుతకు జాతికి నిజమైన సేవకుడు.

V. పదజాల వినియోగం:

1. కింద ఇచ్చిన జాతీయాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

ఉదా : కోడికూత = తెల్లవారు సమయం
పల్లె ప్రజలు కోడికూత కు ముందే లేచి పనులు మొదలు పెడతారు.

(అ) చెమటోడ్చు = కష్టపడు
తెలంగాణ ప్రజలందరు చెమటోడ్చి పనిచేస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమౌతుంది.

(ఆ) మూలస్తంభం = ముఖ్యమైనది
దేశ అభివృద్ధిలో కార్మికులే మూలస్తంభాలు

(ఇ) బతుకుపోరు = కష్టపడి పనిచేసేవారే బతుకు పోరులో విజయం సాధిస్తారు.

(ఈ) మసిబారు = చేతి వృత్తుల వారి జీవితాలు రోజురోజుకు మసిబారుతున్నాయి.

(ఉ) తలమానికం = శ్రేష్ఠము – గొప్పది
సింగరేణి గనులు మనదేశానికి తలమానికం

2. కింద ఇవ్వబడిన పదాలకు పట్టికలోని పదాల సహాయంతో పర్యాయపదాలు రాయండి.

శరీరంపుడమినిశీథినిసుగంధం
సౌరభంరాత్రివసుధమేను
ధరణిదేహంయామినిపరిమళం

(అ) తనువు = శరీరము మేను దేహం
(ఆ) భూమి = పుడమి, వసుధ, ధరణి
(ఇ) రేయి = నిశీథిని, రాత్రి, యామిని
(ఈ) సువాసన = సుగంధం, పరిమళం, సౌరభం

కింది పదాలకు పాఠం ఆధారంగా ప్రకృతి, వికృతులను రాయండి.

(అ) అచ్చెరువు అచ్చెరువు
(ఆ) ఖని
(ఇ) జంత్రము
(ఈ) ప్రాణం

(అ) అచ్చెరువు – ఆశ్చర్యము (ప్ర)
(ఆ) ఖని (ప్ర) – గని (వి)
(ఇ) జంత్రము (వి) – యంత్రము (ప్ర)
(ఈ) ప్రాణం (ప్ర) – పానం (వి)

TS 8th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సింగరేణి

VI. భాషను గురించి తెలుసుకుందాం:

1. కింది విడదీసిన పదాలను కలిపి రాయండి. సంధిపేరు రాయండి.

(అ) కావాలి + అంటే = కావాలంటే – ఇత్వ సంధి
సూత్రం : ఏమి మొదలైన పదాలలోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.

(ఆ) మూల + ఆధారం = మూలాధారం – సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋలకు సవర్ణాలైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.

(ఇ) ప్రాంతము + అంతా = ప్రాంతమంతా – ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.

(ఈ) ఎప్పుడు + ఎప్పుడు = ఎప్పుడ్సండు – ఆమ్రేడితసంధి
సూత్రం : అచ్చునకు ఆమ్రేడితం పరమైనపుడు సంధి తరచుగా అవుతుంది.

(ఉ) మహా + ఉద్యమం = మహోద్యమం – గుణసంధి
సూత్రం : అకారానికి ఇ, ఉ, ఋలు పరమైనపుడు క్రమంగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమవుతాయి.

2. కింది విగ్రహ వాక్యాలకు సమాసపదం రాయండి. సమాసం పేరు రాయండి.

(అ) మానవుని యొక్క నాగరికత = మానవ నాగరికత – షష్ఠీతత్పురుష సమాసము
(ఆ) సాధ్యం కానిది = అసాధ్యము -నఞ తత్పురుష సమాసము
(ఇ) రక్తమును, మాంసమును = రక్తమాంసాలు – ద్వంద్వ సమాసము
(ఈ) నేలలోని బొగ్గు = నేలబొగ్గు – షష్ఠీతత్పురుష సమాసము
(ఉ) మూడైన పూటలు = మూడు పూటలు – ద్విగు సమాసము

3. కింది వాక్యం చదువండి.

“ఈ మేఘాలు గున్న ఏనుగులా! అన్నట్టు ఉన్నాయి.”
దేన్ని దేనితో పోల్చారు ?
పై వాక్యంలో కనిపిస్తున్న పోలిక ఊహించి చెప్పబడింది. పై వాక్యంలో
ఉపమేయం : మేఘాలు
ఉపమానం : గున్న ఏనుగులు
అంటే మేఘాలను ఏనుగు పిల్లలవలె ఊహిస్తున్నామన్న మాట
దీనిని బట్టి పోలికను ఊహించి చెబితే అది “ఉత్ప్రేక్ష” అలంకారం.

4. కింది వాక్యాల్లో దేనిని దేనిగా ఊహించి చెప్పారో రాయండి.

(అ) మండే ఎండ నిప్పుల కొలిమా! అన్నట్లు ఉన్నది.
జవాబు.
మండే ఎండను నిప్పుల కొలిమితో ఊహించి చెప్పారు. ఇలా ఊహించి పోలిక చెప్తే దానిని ఉత్ప్రేక్షాలంకారం అంటారు. దీనిలో ఉపమేయం మండే ఎండలు. ఉపమానం నిప్పుల కొలిమి.

(ఆ) ఆకాశంలో నక్షత్రాలు కొలనులోని పువ్వులా! అన్నట్లు ఉన్నాయి.
జవాబు.
ఆకాశంలోని నక్షత్రాలను కొలనులోని పువ్వులుగా ఊహించి చెప్పారు. ఇలా ఊహించి పోలిక చెప్తే దానిని ఉత్ప్రేక్షాలంకారమంటారు. దీనిలో ఉపమేయం ఆకాశంలోని నక్షత్రాలు. ఉపమానం కొలనులోని పువ్వులు.

TS 8th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సింగరేణి

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని:

1. మీ ప్రాంతంలోని కార్మికులను / శ్రామికులను కలిసి, పనిలో వారు పొందిన అనుభవాలను, అనుభూతులను తెలుసుకొని, ఆ వివరాలను నివేదిక రూపంలో వ్రాసి తరగతిలో ప్రదర్శించండి.
జవాబు.

(అ) ప్రాథమిక సమాచారం :
(1) ప్రాజెక్టు పని పేరు : : కార్మికులు/శ్రామికులు పనిలో వారు పొందిన అనుభవాలు, అనుభూతులు
2) సమాచారాన్ని సేకరించిన విధానం : ఆయా కార్మికులు/శ్రామికులను కలువడం ద్వారా

(ఆ) నివేదిక :

విషయ వివరణ :
ఇటీవలే నేను మా ఊరికి దగ్గరలో ఉన్న సిరిసిల్లకు బంధువుల ఇంటికి వెళ్ళాను. సిరిసిల్ల ప్రముఖ వస్త్ర ఉత్పత్తి కేంద్రం. అందులో మరమగ్గాలపై ఆధారపడి వందలాది మంది నేతన్నలు జీవిస్తున్నారు. పనిలో వారి అనుభవాలు, అనుభూతులు తెలిసికోవడానికై వారి పని గూర్చి, ఆ పని పట్ల వారి అభిప్రాయం అడిగాను. చాలా మంది వారి వృత్తి పట్ల అసంతృప్తితో ఉన్నట్లు వారి మాటల ద్వారా నాకు అర్థమైంది. సొంత ఊరు విడిచి, పొట్ట చేత పట్టుకుని వచ్చిన నేతన్నలకు ఈ వస్త్ర పరిశ్రమ తగిన ఉపాధి కల్పించడం లేదనే చెప్పాలి.

ఇంటి అద్దె, పిల్లల చదువులు, జీవనయానంకై అయ్యే కిరాణ సామాను ఖర్చు, కూరగాయల ఖర్చు .. ఇలా ఎన్నో ఉన్నాయి. వారికి ఈ పనిలో లభించే డబ్బు సరిపోవడం లేదు … కుటుంబాన్ని నెట్టుకు రావడానికో, పిల్లల చదువులకో, పిల్లల పెళ్ళిళ్ళకో చేసిన అప్పు తీర్చే మార్గం కన్పించక కొందరు నేతన్నలు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. తాగుడుకు బానిసలై తమ ఇంటిని, ఒంటిని గుల్ల చేసుకొంటున్నారు.

  1. రోజుకు 12 గంటలు పనిచేయాలి. కార్మిక చట్టం 8 గంటలు పనే అని చెబుతున్నా పట్టించుకొనే నాథుడే లేడు.
  2. డే & నైట్ రెండు షిఫ్టులలో పనిచేయాలి. నైట్ షిఫ్ట్లో పనిచేసేప్పుడు నిద్రలేక …. అనారోగ్యం బారిన పడుతున్నారు.
  3. విపరీతమైన శబ్దం మధ్య పనిచేయడంవల్ల వినికిడి శక్తి తగ్గడం, తలనొప్పి, రోజంతా చికాకుగా ఉండడం లాంటి లక్షణాలు వేధిస్తున్నాయి.
  4. ఒక్కసారి 8 మరమగ్గాలను పర్యవేక్షించాలి … ఎంతో ఒత్తిడి మధ్య నిలబడే పని చేయాల్సి వస్తుంది.
  5. చిన్న చిన్న దారపు పోగులు గాలిలో కలిసి, శ్వాస వ్యవస్థలో ప్రవేశించి శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉదా ॥ ఆస్త్మా లాంటివి వస్తున్నాయి.
  6. 12 గంటల పనిలో కనీసం 300 రూ॥లు సంపాదించ లేకపోతున్నారు. ఇంకా స్త్రీలకు ఈ రంగంలో మరీ అన్యాయం జరుగుతోంది. 12 గంటల పాటు కండెలు చుడితే 50-60 రూ॥లే వస్తున్నాయి. ఈ విధంగా వృత్తిలో వారెదుర్కొంటున్న సాదక బాధకాలు వివరించారు.

(ఇ) ముగింపు :
నేత కార్మికుల సాదక బాధకాలు వింటుంటే చాలా బాధనిపించింది. 8 గంటల పని అమలు చేస్తే బాగుండు ననిపించింది. పెరిగిన రేట్ల కనుగుణంగా వారి కూలీ రేట్లు కూడా పెంచితే బాగుండు ననిపించింది. వారి నెల జీతంలో కొంత డబ్బు మినహాయించుకొని వారిని, వారి కుటుంబాలను Health scheme లో చేర్పిస్తే బాగుండు ననిపించింది.

TS 8th Class Telugu 10th Lesson Important Questions సింగరేణి

పర్యాయపదాలు:

  • వ్యవసాయం – సేద్యము, కృషి
  • ప్రపంచము – లోకము, జగత్తు
  • సిరి – సంపదలు, ఐశ్వర్యము
  • నీరు – జలము, ఉదకము
  • బంగారము – స్వర్ణము, పసిడి

నానార్థాలు:

  • కాలము – సమయము, నలుపు
  • కార్యము – పని, పయోజనము
  • కుప్స – ధాన్యరాళ, ప్రోగు
  • కులము – వంశము, జాతి
  • కృషి. – ప్రయత్నము, వ్యవసాయం
  • గుహ – కొండ యందలి బిల్వము, హ్దయము
  • చరణము – పాదము, పద్యపాదము
  • చీకటి – అంధకారము, దుఃఖము

ప్రకృతిలు – వికృతిలు:

  • భూమి = బూమి
  • శక్తి = సత్తి
  • బంగారము = బంగరము
  • స్థిరము = తిరము
  • శ్రద్ధ = సడ్డ
  • భారము = బరువు
  • నిద్ర = నిదుర

సంధులు:

నడవాలంటే = నడవాలి + అంటే = ఇత్వసంధి
సూత్రం : క్రియా పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.

విస్తారమైన = విస్తారము + ఐన = ఉత్వసంధి
నిలయమై = సిలయము + ఐన = ఉత్వసంధి
అద్భుతమైన = అద్భుతము + ఐన = ఉత్వసంధి
కష్టమైన = కష్టము + ఐన = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చుపరమైనపుడు సంధి అవుతుంది.

దశాబ్దము = దశ + అబ్దము = సవర్ణదీర్ఘసంధి
దేశాభివృధద్ధి = దేశ + అభివృద్ధి = సవర్ణదీర్ఘసంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.

TS 8th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సింగరేణి

సమాసాలు:

  • నల్ల బంగారము = నల్లనైన బంగారము – విశేషణ పూర్వపద కర్మధారయము
  • శ్రద్ధాసక్తులు = శ్రద్ధయును, ఆసక్తియును – ద్వంద్వ సమాసము
  • కష్టనష్టాలు = కష్టమును నష్టమును – ద్వంద్వ సమాసము
  • జీతభత్యాలు = జీతమును భత్యమును – ద్వంద్వ సమాసము
  • కార్మికలోకము = కార్మికుల యొక్క లోకము – షష్ఠీ తత్పురుష సమాసం
  • ఊపిరితిత్తుల సమస్యలు = ఊపిరితిత్తుల యొక్క సమస్యలు – షష్ఠీ తత్పురుష సమాసం
  • దేశాభివృద్ధ = దేశము యొక్క అభివృద్ధి – షష్ఠీ. తత్పురుష సమాసం
  • ఆరు పొరలు = ఆరు సంఖ్య గల పొరలు – ద్విగు సమాసము
  • భారతదేశము = భారతమను పేరుగల దేశము – సంభావనా పూర్వపద కర్మధారయము
  • గోదావరినది = గోదావరి అను పేరు గల నది – సంభావనా పూర్వపద కర్మధారయము

పాఠం ఉద్దేశం:

ఏ దేశం తన సహజ సంపదను సమర్థంగా వినియోగించుకోగలుగుతుందో ఆ దేశం అభివృద్ధి దిశలో పయనిస్తుంది. మన దేశం సకల సంపదలకు నిలయం. ఇక్కడి నేలల్లో అపారమైన ఖనిజ సంపద దాగి ఉన్నది. ప్రత్యేకంగా మన తెలంగాణ ప్రాంతంలోని సింగరేణి దొగ్గుగనులు దేశంలోనే ప్రసిద్దిపొందాయి. దేశ ప్రగతికి దోహదపడే ‘సింగరేణి గనుల’ గురించి తెలియజేయటమే ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. సింగరేణి దాగ్గు గనులు, దాగ్గు ఉత్పత్తి గురించి సమాచారాన్ని తెలిపే వ్యాసం.

ప్రవేశిక:

ఒక దేశ పారిశ్రామిక పురోగమనానికి, ఆర్థిక పుష్టికి అతి ప్రధానమైన వనరుల్లో దొగ్గు ఒకటి. తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తిలో ‘సింగరేణి కాలరీస్’ ప్రధాన భూమికను పోషిస్తున్నది. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని శ్రీశ్రీ అన్నాడు. ఆధునిక ప్రపంచంలో కార్మికుల పాత్ర అమోఘమైనది. ఉాగ్గు ఉత్పత్తిలో కార్మికుల శ్రమ వెలకట్టలేనిది. ప్రతి రోజూ పొంచివున్న ప్రమాదాలను కూడా లెక్క చేయకుండా…. గనుల్లో పనిచేస్తూ…. తమ స్వేదాన్ని శక్తిగా మార్చి నేల బొగ్గును వెలికి తీస్తున్న సింగరేణి కార్మికుల జీవితాలను ఆవిష్కరించే విషయాన్ని ఈ పాఠంలో చదువుదాం.

కఠినపదాలకు అర్థాలు:

  • సిరి – సంపద
  • విశిష్టత – గొప్పతనం
  • విరివిగా – ఎక్కుయగా
  • అనూహ్యంగా – ఊహించనివిధంగా
  • (శేష్ఠము – మేలైన / ప్రసిద్ధి చెందిన
  • సిక్షిప్తము – దాచిన
  • మస్టర్ – హాజరు
  • రంగరించు – కలిపినా
  • దుర్ఖరంగ – ఈష్టంగా, భారంగా
  • సౌకర్యాలు – వసతులు
  • జగతి – లోకం
  • పరీవాహకం – ప్రవహించే పరిసర ప్రాంతం
  • డాంబరు – తారు
  • తనువు – శరీరం
  • సింగారం – అలంకారం
  • ఖ్యాతి – ప్రసిద్ధి
  • గని – ఖని
  • బదిలీ – షిఫ్ట్ట = విధి పూర్తి అయిన తర్వాత వ్యక్తులు మూరే సమయం
  • తెరువు – మార్గం
  • సాదాసీదాగా – అతిసామాన్యంగా
  • మజ్దూర్ – కార్మికుడు
  • ఎన్. టి. పి. సి – నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్
  • సల్ల బంగారం – బొగ్గు
  • ప్రగతి – పురోగతి, అభివృద్ధి
  • సీదీ – సమానంగా

TS 8th Class Hindi Guide 10th Lesson अनमोल रत्न

Telangana SCERT TS 8th Class Hindi Guide Pdf 10th Lesson अनमोल रत्न Textbook Questions and Answers.

TS 8th Class Hindi 10th Lesson Questions and Answers Telangana अनमोल रत्न

प्रश्न :

प्रश्न 1.
चित्र में क्या – क्या दिखाई दे रहे हैं?
उत्तर :
चित्र में अध्यापिका और छात्र – छात्राएँ दिखाई दे रहे हैं।

प्रश्न 2.
वे क्या कर रहे हैं ?
उत्तर :
अध्यापिका हिन्दी पाठ पढ़ा रही हैं। छात्र ध्यान से सुन रहे हैं।

TS 8th Class Hindi Guide 10th Lesson अनमोल रत्न

प्रश्न 3.
श्यामपट पर लिखे सुवचन से आप क्या समझते हो ?
उत्तर :
हर एक अच्छी बात अधिक मूल्यवान होती है। अर्थात अच्छी बातों का अधिक मह्त्व होता है।

सुनो – बोलो :

प्रश्न 1.
पाठ में दिये गये चित्र के बारे में बातचीत कीजिए।
उत्तर :
इस चित्र में एक हीरा है। इसके बारे में दो मित्रों के बीच में बातचीत इस प्रकार चल रहा है।
अशोक : यह क्या है ? इसे क्या कहते हैं ?
कुमार : यह हीरा है।
अशोक : मैं ने सुना था कि हीरा बहुत मूल्यवान होता है।
कुमार : हाँ, तुमने सच ही सुना । हीरा बहुत मूल्यवान होता है। इसका मूल्य लाखों या करोडों रुपये होता है।
अशोक : इसके बारे में एक कहावत भी है। उसे मैं भूल गया। एक बार याद करो।
कुमार : हीरे का परख जौहरी ही जानते हैं।

प्रश्न 2.
पाठ का शीर्षक आपको कैसा लगा और क्यों ?
उत्तर :
पाठ का शीर्षक अनमोल रव्भ मुझे अच्छा लगा। क्योंकि ये दोहे नीति से युक्त हैं। नीतिपरक हैं। सचमुच अनमोल रन्न हैं।

पढ़ो :

अ. नीचे दिये गये वाक्यों के भाव बतलाने वाले अंश दोहों में पहचानकर उत्तर – पुस्तिका में लिखिए।

प्रश्न 1.
हमारा शरीर खेत के समान है।
उत्तर :
तुलसी काया खेत है, मनसा भयो किसान।

प्रश्न 2.
लाख प्रयन्न करने पर भी बात नहीं बनती है।
उत्तर :
बिगरी बात बनै नहि, लाख करो किन कोय।

TS 8th Class Hindi Guide 10th Lesson अनमोल रत्न

आ. नीचे दी गयी पंक्तियों के बाद आनेवाली पंक्ति लिखिए।

1. तुलसी साथी विपत्ति- विदया – विनय – विवेक।
2. रहीमन हीरा कब कहै – लाख टका मेरो मोल।

लिखो :

अनीचे दिये गये प्रश्नों के उत्तर लिखिए।

प्रश्न 1.
तुलसीदास ने शरीर की खेत व मन की किसान से तुलना क्यों की होगी ?
उत्तर :
तुलसीदास ने शरीर की तुलना खेत से और मन की तुलना किसान से की है। क्योंकि पाप और पुण्य दो बीजों में मन रूपी किसान, शरीर रूपी खेत में जो बोये जाते हैं, उसीके फल को हम प्राप्त करते हैं।

प्रश्न 2.
रहीम के दोहों के भाव अपने शब्दों में लिखिए।
रहीम के अनुसार जब बात बिगड जाती है तो किसी के लाख प्रयद्न करने पर भी बनती नहीं हैं। इसके लिए रहीम यह उदाहरण दिये कि एक बार दूध फट जाता है तो उसे कितने बार मथने पर भी मक्खन नहीं बनता।
रहीम के दूसरे दोहे के अनुसार जो सचमुच बडे होते हैं वे अपनी बंडाई कभी नहीं किया करते। बडे – बडे बोल बोला नहीं करते। इसके लिए रहीम यह उदाहरण दिये कि हीरा कभी भी अपने बारे में स्वयं नहीं कहता कि उसका मोल लाख टके का है। इस प्रकार तुलसी और रहीम अपने – अपने दोहों के माध्यम से अमूल्य रत्नों को दिये।

आ. “अनमोल रव्न” दोहों का भाव अपने शब्दों में लिखिए।
तुलसीदास जी के अनुसार शरीर खेत के समान है। और मन किसान के समान। पाप और पुण्य दो बीउत्तर – हैं, जो बोया जाता है, उसी को प्राप्त करना पडता है।
तुलसीदास जी के अनुसार विपति के समय शिक्षा, विनय, विवेक, साहस अच्छे कार्य और सच्चाई ही साथ देते हैं।
रहीम जी के अनुसार जब बात बिगड जाती है तो किसी के लाख प्रयन्न करने पर भी बनती नहीं है। जिस तरह एक बार दूध फट जाते हैं तो उसे मथने पर भी मकखन नहीं बनता।
रहीम जी के अनुसार जो सचमुच बडे होते हैं। वे अपनी बडाई नहीं किया करते। बडे-बडे बोल नही बोला करते । हीरा स्वयं कभी नहीं कहता कि उसका मोल ताख टके का है।

TS 8th Class Hindi Guide 10th Lesson अनमोल रत्न

शब्द भंडार :

अ. दोहे में आये कुछ शब्द नीचे दिये गये हैं। इन शब्दों से एक – एक वाक्य बनाइए।
उत्तर :

खेतकिसान खेत में काम करते हैं।
विपत्तिविपत्ति में धीरज के साथ रहना चाहिए।
विनयसदा विनय से बडों से बातें करना चाहिए।
दूधबच्चा दूध पीता है।
हीरावस्तु संग्रहालय में कई हीरे हैं।

आ. नीचे दी गयी पंक्ति पढ़िए। समझिए।
‘लाख टका मेरो मोल।’
इस पंक्ति में ‘टका’ शब्द का प्रयोग विशेष अर्थ के लिए हुआ है। पुराने समय में टके का बड़ा महत्व था। अंग्रेजों के समय यह भारत की मुद्रा थी, जिसका मूल्य दो आना था। इसी शब्द पर कई मुहावरे भी हैं, जैसे –
1. टका-सा मुँह लेकर रह जाना। (उदास होना)
2. टके-टके को मोहताज होना। (गरीब होना)
3. टका पास न होना। (धन की कमी होना)
अब तुम पता लगाइए कि टका को इन भाषाओं में क्या कहते हैं?
TS 8th Class Hindi Guide 10th Lesson अनमोल रत्न 2
उत्तर :
1. तेलुगु – बेडा
2. कन्नड़ – टका
3. तमिल – बेडा
4. मराठी – बेडा

सृजनात्मक अभिव्यत्ति :

अ. पाठ में बताई गयी नीतियों के आधार पर नारे बनाइए।
उत्तर :
1. जैसी करनी वैसी भरनी।
2. विद्या विपत्ति में साथ रहती है।
3. लाख प्रयत्न से भी बिगडी बात नहीं बनती।
4. बडे लोग अपने बडप्पन की प्रशंसा कभी नही करते।

TS 8th Class Hindi Guide 10th Lesson अनमोल रत्न

प्रशंसा :

अ. तुलसीदास और रहीम के दोहों का हमारे जीवन में क्या महत्व है ?
उत्तर :
तुलसीदास जी के दोहे भगवान श्रीराम से संबंधित और नीतिपरक होते हैं। रहीम के दोहे नीतिपरक और उपदेशात्मक होते हैं। उनकी कविता में कल्पना की प्रचुरता के साथ – साथ भावुकता की अधिकता भी है।

भवा की बात :

अ. पढ़िए – समझिए।
उत्तर :
TS 8th Class Hindi Guide 10th Lesson अनमोल रत्न 3

आ. ऊपर दिये गये शब्दों में से किन्हीं दो शब्दों से वाक्य प्रयोग कीजिए।

किसान – गाँवों में किसान रहते हैं।
विवेक – नायक को विवेक से रहना चाहिए।
बोल – बच्चों के बोल में मिठास होती है।

परियोजना कार्य :

तुलसी और रहीम के अन्य दोहे ढूँढ़ए। उन्हें लिखिए और कक्षा में लगाइए।

तुलसीदास :
1. तुलसी रा के कहत ही, निकसत पाप पहार।
फिरि भीतर आवत नहीं, देत मकार विकार॥
2. जड़ चेतन गुन दोषमय, विस्व कीन्ह करतार।
संत हंस गुन गहहि पय, परिहरि वारि विकार।।

रहीम :
1. सर सूखे पंछी उड़ै, और सरन समाहि।
दीनमीन बिन पच्छ के, कहु रहीम कहँ जाहि॥
2. रहिमन देखि बड़ेन को, लघु न दीजिये डारि।
जहाँ काम आवै सुई, कहा करे तरवारि।।

TS 8th Class Hindi Guide 10th Lesson अनमोल रत्न

Essential Material For Examination Purpose :

I. पढ़ो :
पठित – पद्यांश

नीचे दिये गये पद्यांश को पढ़कट प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए।

I. तुलसी काया खेत है, मनसा भयो किसान।
पाप – पुण्य दोक बीज है, बुवै सो लुनै निदान।

प्रश्न :
1. शरीर किसके समान है?
2. मन किसके समान है ?
3. दो बीज क्या है?
4. अनमोल रत्न कैसा पाठ है?
उत्तर :
1. शरीर संत के समान है।
2. मन किसान की समान है।
3. पाप और पुण्य दो बीज हैं।
4. कविता पाठ है।

II. तुलसी साथी विपत्ति, विद्या – विनय – विवेक।
साहस, सुकृति, सुसत्य व्रत, राम भरोसे एक।।

प्रश्न :
1. तुलसी के अनुसार विपत्ति के समय हमारे साथ कौन देते हैं?
2. “सुकृति” का अर्थ क्या है?
3. विवेक का उल्टा शब्द क्या है ?
4. इस दोहे के कवि कौन है?
उत्तर :
1. शिक्षा, विनय, विवेक, साहस, अच्छे कार्य और सचाई हमारे साथ देते हैं।
2. अच्छे कार्य
3. अविवेक
4. तुलसीदास

TS 8th Class Hindi Guide 10th Lesson अनमोल रत्न

III. बिगरी बात बनै नहि, लाख करो किन कोय।
रहिमन फाटे दूध को, मथे न माखन होया।

प्रश्न :
1. रहीम के अनुसार फटे दूध से क्या नहीं बनता है?
2. लाख करो किन कोय। इसका भाव क्या है?
3. “कोय” का अर्थ क्या है?
4. रहीम का पूरा नाम क्या है?
उत्तर :
1. माखन नहीं बनता।
2. लाख प्रयत्न करने पर भी बात नहीं बनती है।
3. कोय का अर्थ ‘कोई’ है।
4. रहीम का पूरा नाम अब्दुल रहीम खानखाना है।

IV. बडे बड़ाई न करैं, बड़ो न बोलैं बोल।
रहीमन हीरा कब कहै, लाख टका मेरो मोल।।

प्रश्न :
1. बडे क्या नहीं करते हैं?
2. बडे क्या नहीं बोलते हैं?
3. लाख टका मेरो मोल का अर्थ लिखिए।
4. कौन अपना मोल स्वयं नहीं कहता ?
उत्तर :
1. बडे बड़ाई नहीं करते हैं।
2. बडे बडे – बडे बोल नहीं बोलते हैं।
3. मेरा मोल लाख टके का है।
4. हीरा अपना मोल स्वयं नही कहता।

TS 8th Class Hindi Guide 10th Lesson अनमोल रत्न

अपठित – पद्यांश :
नीचे दिये गये पद्यांश को पढ़कर प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए।

1. श्रमर छूटकर पंकज दल से,
करने लगे विहार।
आनुकरों ने खोल दिया है,
कारावृह का द्वार।
कल किरणें हैं शयन सदन की,
मंजुल बंदनवार।
सजनी। रजनी की सुख स्मृति ही।
बस अब है आधार।

प्रश्न :
1. भ्रमर छूटकर क्या करने लगे हैं?
2. भानुकरों ने क्या किया है?
3. शयन सदन की बंदनवार क्या है?
4. सजनी ! अब आधार क्या है?
5. बंदनवार की क्या विशेषता है?
उत्तर :
1. भ्रमर छूटकर विहार करने लगे हैं।
2. भानुकरों ने कारागृह का द्वार खोल दिया।
3. कल किरणें शयन सदन की बंदनवार है।
4. सजनी ! रजनी की सुख स्मृति ही अब आधार है।
5. बंदनवार की विशेषता है कि वे मंजुल हैं।

TS 8th Class Hindi Guide 10th Lesson अनमोल रत्न

II. बह वाई उस काल एक ऐसी हवा।
बूँद समुंदर की ओर आई अनमनी।
एक सुंदर सीप का मुँह था खुला।
वह उसी में जा पडी मोती बनी।
लोग यों ही हैं इिझकते सोचते।
जब कि उनको छोडना पडता है घर।
किन्तु घर को छोडना अकसर उन्हें।
बूँद सा कुछ और हीं देता है कर।

प्रश्न :
1. बूँद समुंदर की ओर कैसी आयी ?
2. किसका मुँह खुला हुआ था ?
3. बूँद किसके मुँह में जा पडी और क्या बनी ?
4. लोग घर छोडते समय क्या करते हैं?
5. घर को छोडने से उनको क्या मिलता है?
उत्तर :
1. बूँद समुंदर की ओर अनमनी आयी।
2. एक सीप का मुँह खुला हुआ था।
3. बूँद सीप के मुँह में जा पडी और मोती बनी।
4. लोग घर छोडते समय सोचते हैं।
5. घर को छोडने से उनको बूँद सा कुछ और ही मिलता है।

III. मेरे घर के पास लठा है
पेड नीम का हरा – भरा,
उसकी डाली झुक – झुक छूतीं
मेरे रहले का कमरा।
अभी – अभी निकली फुनगी में,
नयी – नयी प्यारी कोंपल,
लाल, बैंगनी रंग देखकर
मेरा मन बनता शीतल।

प्रश्न :
1. नीम का पेड कैसा है?
2. नीम की डाली क्या करती है?
3. नयी – नयी प्यारी कोंपल कहाँ निकल पडी है?
4. कोंपल किस रंग में हैं?
5. लाल, बैंगनी रंग देखकर मन कैसे बनता है?
उत्तर :
1. नीम का पेड हरा – भरा है।
2. नीम की डाली झुकती कवि के कमरे को छूती है।
3. नयी – नयी प्यारी कोंपल फुनगी में निकल पडी है।
4. कोंपल लाल और बैंगनी रंग में हैं।
5. लाल, बैंगनी रंग देखकर मन शीतल बनता है।

TS 8th Class Hindi Guide 10th Lesson अनमोल रत्न

IV. मेरा भारत है महान
चाँद सितारों से शोभित है आसमान
यह रहा नदियों का संगम पुण्य स्थान
मन्दिर, मसजिद, विरजाघर एक समान
रंग, बिरंगो, फूलों से है विराजमान
लोगों का है विविध परिधान
होता है सब धर्मों का सम्मान
मेरा भारत है महान।

प्रश्न :
1. आसमान किस प्रकार शोभित है ?
2. नदियों का संगम पुण्य स्थान क्या है?
3. भारत किस तरह विराजमान है?
4. लोगों का विविध परिधान कहाँ होता है?
5. भारत में किसका सम्मान होता है?
उत्तर :
1. आसमान चाँद, सितारों से शोभित है।
2. नदियों का संगम पुण्य स्थान भारत है।
3. भारत रंगबिरंगे फूलों से विराजमान है।
4. लोगों का विविध परिधान भारत में होता है।
5. भारत में सब धर्मो का सम्मान होता है।

I. लिखो :

लघु प्रश्न :

प्रश्न 1.
तुलसी और रहीम के समय की स्थिति कैसी रही होगी ?
उत्तर :
तुलसीदास और रहीम भक्ति काल के प्रमुख कवि थे। आचार्य रामचंद्र शुक्ल के अनुसार भक्ति काल का समय सन् 1375 से 1700 तक माना है। तत्कालीन भारतीय समाज में हिंदु – मुर्लिम दो संस्कृतियों व विचार धाराओं का पारस्परिक संघर्ष हो रहा था। साहित्य की दृष्टि से हिंदी साहित्य के भक्ति काल को उसका स्वर्णयुग मानते हैं। ज्ञानाश्रयी – प्रेमाश्रयी, सगुण – निर्गुण, राम भक्ति – कृष्ण भक्ति, संत – सूफ़ी इस प्रकार के तरह तरह की भक्ति धाराओं से समाज प्रभावित होने लगा।

प्रश्न 2.
तुलसीदास ने शरीर और मन की तुलना किसके साथ की है?
उत्तर :
तुलसीदास ने शरीर की तुलना खेत से और मन की तुलना किसान से की है।

प्रश्न 3.
रहीम के अनुसार फटे दूध से क्या नहीं बनता है?
उत्तर :
रहीम के अनुसार फटे दूध से मक्खन नहीं बनता है।

TS 8th Class Hindi Guide 10th Lesson अनमोल रत्न

प्रश्न 4.
हीरा अपने बारे में क्या नहीं कहता ?
उत्तर :
हीरा अपने बारे में स्वयं कभी नहीं कहता कि उसका मोल लाख टके का है।

प्रश्न 5.
विपत्ति के समय हमारा साथ कौन देता है ?
उत्तर :
वेपत्ति के समय शिक्षा, विनय, विवेक, साहस, अच्छे कार्य और सच्चाई ही हमारा साथ देते हैं।

प्रश्न 6.
तुम विपत्ति का सामना कैसे करोगे ? क्यों ?
उत्तर :
में विपत्ति का सामना विद्या, विनय, विवेक, साहस, अच्छे कार्य और सच्चाई से करूँगा। क्योंकि ये सभी विपत्ति का सामना करने के लिए आवश्यक हैं।

लघु निबंध प्रश्न :

प्रश्न 1.
तुलसीदास जी के बारे में लिखो।
उत्तर :
तुलसीदास जी का जन्म सन् 1532 में राजापुर नामक गाँव में हुआ था। उनकी मृत्यु सन् 1623 में काशी में हुयी। माता का नाम हुलसी तथा पिता का नाम आत्माराम दुबे था। गुरु का नाम नरहरिदास था। उनकी पन्नी का नाम रत्नावली था। तुलसीदास भक्तिकाल के कवि थे।
तुलसीदास राम भक्त थे। अवधी और ब्रज भाषा दोनों में उन्होंने काव्य रचना की। उन्होंने दर्जनों काव्य ग्रंथ लिखें। उनका सुप्रसिद्ध ग्रंथ का नाम था रामचरितमानस।
उनके अन्य ग्रंथ थे – कवितावली, दोहावली, विनय-पत्रिका, बरवै रामायण, पार्वती मंगल और जानकी मंगल आदि।

TS 8th Class Hindi Guide 10th Lesson अनमोल रत्न

సారాంశము :

तुलसीदास (తులసీదాస్) :

ఈ పద్యంలో కవి తులసీదాస్ శరీరమును వ్యవసాయ క్షేత్రం (పొలము)తో, మనస్సును రైతుతో పోల్చుచున్నాడు. పాపం పుణ్యం అనునవి రెండు విత్తనములు. మనం ఈ రెండు విత్తనాలలో దేనిని నాటితే వాటినే పొందుతాము.
తులసీదాస్ గారు ఈ పద్యంలో ఆపదల వేళ మనల్ని రక్షించే సాధనములను గురించి పేర్కొనుచుండెను. మనల్ని ఆపదల నుండి విద్య, వినయము, వివేకము (మంచి, చెడు విచక్షణాగుణము) సాహసము, మంచి పనులు, నీతి-నిజాయితీ అనునవి రక్షించును. ఇవన్నియు ఆపదల వేళలలో మనకు తోడుగా ఉండును.

रहीम (రహీమ్) :

ఈ పద్యంలో కవి రహీమ్ చెడిపోయిన (పాడైపోయిన) పనుల స్వభావాన్ని గురించి వివరించుచుండెను. ఏదైనా పని చెడిపోయి (పాడైపోయి)నప్పుడు మనం లక్షలకొలది ప్రయత్నాలు చేసినా ఆ పనిని చేయలేము. అదెట్లనగా ఒకసారి పాలు విరిగిపోయినట్లయిన వాటిని చిలికి వెన్నతీయలేము కదా !
కవి రహీమ్ గారు ఈ పద్యంలో పెద్దవారి (గొప్పవారి) యొక్క లక్షణాలను తెలియజేయుచున్నారు.
ఎవరైతే గొప్పవారో వారు తమ గొప్పతనాన్ని గురించి గొప్పలు చెప్పుకోరు. (పెద్దవారు గొప్పవారు కానివారే గొప్పలు చెప్పుకుంటారు) అదెట్లనగా వజ్రం ఎప్పుడూ తన విలువ లక్ష టంకములు ఉంటుందని స్వయంగా మనతో చెప్పదు కదా!

वचन :

  • खेत – खेत
  • किसान – किसान
  • पाप – पाप
  • पुण्य – पुण्य
  • बीज – बीज
  • साथी – साथी
  • विपत्ति – विपत्तियाँ
  • कृति – कृतियाँ
  • व्रत – व्रत
  • बात – बातें
  • हीरा – हीरे

TS 8th Class Hindi Guide 10th Lesson अनमोल रत्न

उल्टे शब्द :

  • पाप × पुण्य
  • साहसी × डरपोक
  • बनना × बिगडना
  • विनय × घमंड
  • सुकृति × दुष्कृति
  • बडा × छोटा
  • विवेक × अविवेक
  • सत्य × असत्य/झूठ
  • साथी × शत्रु

उपसर्ग :

  • निदान – नि
  • सुसत्य – सु
  • सज्जन – सत्
  • विविध – वि
  • सुसंगति – सु
  • अनुसार – अनु
  • सुकृति – सु
  • दुर्जन – दुर

प्रत्यय :

  • मनसा – सा
  • बिगरी – ई
  • महात्मा – आत्मा
  • सुकृति – कृति
  • बड़ाई – आई
  • सुसत्य – सत्य
  • दुर्जन – जन

TS 8th Class Hindi Guide 10th Lesson अनमोल रत्न

पर्यायवाची शब्द :

  • काया – शरीर
  • विद्या – शिक्षा
  • मोल – मूल्य, दाम, भाव
  • किसान – कृषक
  • साहस – धैर्य
  • बड़ाई – बडप्पन
  • साथी – मित्र
  • दूध – क्षीर

वाक्य प्रयोग :

1. किसान – किसान खेतीबारी करके जीते हैं।
2. विवेक – सदा विवेक के साथ रहना चाहिए।
3. माखन – माखन में विटमिन ए मिलता है।
4. बड़ाई – बडे लोग जो होते कभी बडाई बातें नहीं करते।

मुहावरे वाले शब्द :

1. बात बनाना = प्रयोजन सिद्ध होना ; उसने टेलीफ़ोन से बात बनायी।
2. बात आना = चर्चा होना ; वहाँ इसी विषय पर बात आयी।
3. बड़े आदमी = प्रतिष्ठावान ; बड़े आदमी ऐसी बातें नहीं करते।
4. बडी – बडी बातें करना = बडाई करना, बढ-चढकर बातें करना
वह हमेशा बडी – बडी बातें करता रहता है।

TS 8th Class Hindi Guide 10th Lesson अनमोल रत्न

शब्दार्थ (అర్ధములు) (Meanings) :

TS 8th Class Hindi Guide 10th Lesson अनमोल रत्न 1

TS 8th Class Hindi Guide 12th Lesson बढ़ते क़दम

Telangana SCERT TS 8th Class Hindi Guide Pdf 12th Lesson बढ़ते क़दम Textbook Questions and Answers.

TS 8th Class Hindi 12th Lesson Questions and Answers Telangana बढ़ते क़दम

प्रश्न :

प्रश्न 1.
चित्र में दिखायी दे रहे महापुरुष का नाम बताओ।
उत्तर :
चित्र में दिखायी दे रहे महापुरुष का नाम महात्मा गाँधीजी हैं।

प्रश्न 2.
वे क्या कर रहे हैं ?
उत्तर :
वे डायरी लिख रहे हैं।

TS 8th Class Hindi Guide 12th Lesson बढ़ते क़दम

प्रश्न 3.
तुम्हें लिखना कैसा लगता है ? अपने शब्दों में बताओ।
उत्तर :
मुझे लिखना बहुत अच्छा लगता है। मैं पढ़ने से लिखना ही अधिक पसंद करता हूँ।

सुनो – बोलो :

प्रश्न 1.
इस डायरी की घटनाओं के आधार पर बताओ समीना कैसी लडकी है?
उत्तर :
इस डायरी की घटनाओं के आधार पर बताये तो समीना एक अच्छी लड़की है। वह बड़ों का आदर करती है। साथियों से मिजजुलकर रहती है। बडों की सेवा करती है। गुरुजनों की आज्ञा का पालन करती है।

प्रश्न 2.
समीना के पाठशाला न जाने के क्या कारण हो सकते हैं ?
उत्तर :
समीना के माँ की तबीयत ठीक नहीं है। उसे माँ का काम करना पड रहा होगा। या दीदी की सहता करना पड रहा होगा।

पढ़ो :

अ. नीचे दिये गये वाक्य पढ़िए। इनके अर्थवाले वाक्य पाठ में रेखांकित कीजिए।

प्रश्न 1.
मैं अपने मित्रों से मिलना चाहती हूँ।
उत्तर :
और फिर ममता रवि, शमीम से भी तो कई दिनों से नहीं मिली।

TS 8th Class Hindi Guide 12th Lesson बढ़ते क़दम

प्रश्न 2.
भय के कारण पूछ न सकी।
उत्तर :
मुझे तो कुछ समझ में नहीं आ रहा था कि क्या करना है। पहले डर के मारे पूछा नहीं। फिर थोडी देर बाद पूछा तो अध्यापिका जी ने मेरी ओर देखते हुए पूछा – “समीना ! कल तुम क्यों नहीं आयी।?”

आ. नीचे दिये गये वाक्यों में गलत पहचानकर सही लिखिए।

प्रश्न 1.
आज मैं पाठशाला खेलना चाहती है।
उत्तर :
आज मैं पाठशाला जाना चाहती हूँ।

प्रश्न 2.
सरकार का तारा है – “सब पढ़ें – सब बढ़ें।”
उत्तर :
TS 8th Class Hindi Guide 12th Lesson बढ़ते क़दम 2
सरकार का नारा है – “सब पढ़ें – सब बढ़ें”।

लिखो :

अ. नीचे दिये गये प्रश्नों के उत्तर लिखिए।

प्रश्न 1.
समीना के घर की स्थिति कैसी थी ?
उत्तर :
समीना के घर में उसकी माँ की तबीयत ठीक नहीं थी समीना को माँ का काम करना पडता था। इसलिए वह एक सप्ताह से स्कूल नहीं जाती है। हर दिन समीना को दीदी की सहायता भी करनी पडती है।

TS 8th Class Hindi Guide 12th Lesson बढ़ते क़दम

प्रश्न 2.
‘सब पढ़ें – सब बढ़ें’ इस नारे से आप क्या समझते हो ?
उत्तर :
‘सब पढ़ें – सब बढ़ें’ का अर्थ है सभी लोगों को खूब पढ़कर आगे बढ़ना चाहिए। देश को उन्नति के पथ पर ले जाना चाहिए।

आ. प्रधानाध्यापक जी ने बच्चों को क्या बताया होगा?
उत्तर :
प्रधानाध्यापक जी ने बच्चों को बताया होगा कि भारत सरकार 01 अप्रैल, 2010 से बच्चों के लिए शिक्षा का अधिकार कानून अमल में ला रही है। इस कानून के अनुसार 6 से 14 वर्ष के सभी बच्चों को निशुल्क और अनिवार्य रूप से शिक्षा पाने का अधिकार है। उन्हें अपनी पढ़ाई के लिए एक पैसा भी खर्च नहीं करना होगा। भारत सरकार हर बच्चे के चेहरे पर खुशी देखना चाहती है।
आगे उन्होंने कहा कि सरकार पौष्टिक भोजन, बालिका शिक्षा, पेयजल की सुविधा, खेल सामग्री, खेल का मैदान, पोषाक, निशल्क पाठ्य पुस्तकें और विविध प्रकार की सुविधाएँ प्रोत्साहन आदि दे रही हैं। सरकार चाहती है कि भारत का हर नागरिक पढा-लिखा बनें। सौ प्रतिशत साक्षरता दर प्राप्त करें। सरकार का नारा है – ‘सब पढ़ें – सब बढ़ें।’ जिस दिन भारत का हर बच्चा शिक्षित होकर अच्छा नागरिक बनेगा, उसी दिन हमारे महापुरुषों के सपने साकार होंगे। जयहिंदा”

शब्द अंडार :

अ. नीचे दिये गये शब्दों के वचन बदलिए। वाक्य प्रयोग कीजिए।
उदा : कहानी – मुझे पंचतंत्र की कहानियाँ पसंद है।
छुट्टी, खुशी, ताली, समिति

छुट्टीबच्चों के लिए छुट्टियाँ बहुत पसंद हैं।
खुशीरवि अपने जन्मदिन पर खुशियाँ मनाता है।
तालीकविता सुनकर सब लोगों ने तालियाँ बजाई।
समितिहमारे कौलनी में विभिन्न समितियाँ हैं।

आ. पाठ में समीना के दोस्तों के नाम दिये गये हैं। आप अपने दोस्तों के नाम लिखिए।
उत्तर :
गोपाल, गौरी, शंकर, रहीम, विनय, सुरेश, हरीष आदि मेरे दोस्तों के नाम है।

TS 8th Class Hindi Guide 12th Lesson बढ़ते क़दम

सृजनात्मक अभिव्यक्ति :

अ. अभी अपने समीना की डायरी पढ़ी। डायरी की घटनाएँ बताते हुए मित्र को पत्र लिखिए।

निज्जामाबाद,
दि : ××××

प्रिय मित्र कैलाश,
में यहाँ कुशल हुँ। आशा करता हूँ कि तुम भी वहाँ सकुशल हो।
में मुख्यत : इस पत्र में समीना की डायरी के बारे में लिखना चाहता हूँ।
पहले दिन की डायरी (20 सितंबर, 2012 गुरुवार) में लिखे समाचार से हमें मालूम होता हैं कि समीना की माँ की तबीयत ठीक न होने के कारण समीना एक सप्ताह से पाठशाला नही गयी है उसे घर में माँ का काम करना पडता था। एक दिन वह पाठशाला जाना चाहती है और अपने दोस्त रवि, ममता और शमीम से मिलना चाहती है । लेकिन उसकी दीदी कुछ मदद करने उसे रोकती है।
दूसरे दिन की डायरी (21 सितंबर, 2012 शुक्रवार) में लिखी समाचार से हमें मालूम होता है कि समीना इस दिन पाठशाला जाने तैयार है। लेकिन बारिश के कारण देर हो जाती हैं।
पाठशाला में उसे आज लोमडी की कहानी लिखनी थी। लेकिन उसे कुछ न समझ में आया। उसने डर के मारे अध्यापिका से कुछ नहीं पूछा। अध्यापिका ने उसे स्कूल न आने का कारण पूछकर उसे हर दिन स्कूल आने को समझाती है। श्याम और सायना तो कहानी लिख देते। रवि और इरफ़ान एक दूसरे के बाल खींचने के कारण अध्यापिका उन्हें डांटती हैं।
दस मिनिट की छुट्टी में समीना, शमीम खूब सारे बातें करते हैं। शाम को खूब खेलते हैं।
तीसरे दिन की डायरी (22 सितंबर, 2012 शनिवार) में लिखे समाचार से हमें यह मालूम होता है कि उस दिन पाठशाला में पाठशाला सामिति की बैठक हुई। सरपंच और प्रधानाध्यापक जी बातचीत की। इसमें बच्चों के लिए शिक्षा का अधिकार कानून जो भारत सरकार के द्वारा 01 अप्रैल, 2010 से अमल में लाया गया। उसके बारे में बातचीत हुई। इसमें प्रधानाध्यापक जी बताते हैं कि 06 से 16 वर्ष के सभी बच्चों को निशुल्क अनिवार्य शिक्षा पाने का अधिकार है।
में आशा करता हूँ कि तुम भी इसे अवश्य पढे।
बडों को मेरा नमस्कार।

तुम्हारा प्यारा मित्र,
××××

पता :
के. कैलाश,
पिता. कुटुंबराव,
घर – 10-20-30,
मंदिर वीधि, हैदराबाद।

TS 8th Class Hindi Guide 12th Lesson बढ़ते क़दम

प्रशंसा :

अ. डायरी लिखना अच्छी आदत है, इस पर अपने विचार लिखिए।
उत्तर :
डायरी लिखना अच्छी आदत है। दिन में घटी सभी घटनाओं के बारे में सूक्ष्म रूप से डायरी में लिखते हैं। इससे हमें यह जानकारी मिलती है हम किस दिन क्या किये हैं। देश के महान लोग जो भी हुए वे सभी डायरी लिखने का आदत रखते थे। डायरी लिखने से हर दिन हमने क्या कार्य किये हैं, उनमें अच्छे कितने हैं बुरे कितने हैं। इसका आत्म विश्लेषण कर सकते हैं। हमारे व्यवहार में परिवर्तन ला सकते हैं। मुख्य विषय, तिथि उसमें लिख सकते हैं। उस साल घटी सभी घटनाओं को हम जब चाहे तब पढ़ सकते हैं।

वर्यिजना कार्य :

अ. अपनी पाठशाला के पुस्तकालय से किसी महापुरुष की डायरी पढ़िए। उसके मुख्य अंश लिखिए।
उत्तर :
हमारी पाठशाला के पुस्तकालय से ‘गाँधीजी की आत्मकथा’ नामक एक किताब मिली है। उसमें ‘मेरा छात्र जीवन” एक है। इसमें गाँधीजी के छात्र जीवन के कुछ अंश वर्णित हैं। बचपन में गाँधीजी का मन व्यायाम में, खेल में, क्रिकेट में नही लगता था। इसका एक कारण गाँधीजी का झेंपूपन था। लेकिन अब बडे होने के बाद गाँधीजी बहुत पछताते थे। और इस प्रकार कहते थे कि “अब मैं देखता हूँ कि कसरत की ओर वह अरुचि मेरी भूल थी। उस समय मेरे गलत विचार थे कि कसरत का शिक्षा से कोई संबंध नहीं है।बाद में मेंने समझा कि व्यायाम और शारीरिक शिक्षा के लिए भी विद्याध्ययन में उतना ही स्थान होना चाहिए जितना मानसिक शिक्षा को है। इस प्रकार गाँधीजी ‘मेरा छात्र – जीवन’ नामक आत्म कथा में व्यायाम के संबंध में अपने विचार व्यक्त किए हैं।

भाषा की बात :

अ. नीचे दिया गया अनुच्छेद पढ़िए।
उत्तर :
एक सप्ताह से मैं पाठशाला नहीं गयी थी – माँ का काम जो करना पड़ता था। आज मैं पाठशाला जाना चाहती थी। पता नहीं गुरूजी ने क्या-क्या पढ़ा दिया होगा? और फिर ममता, रवि, शमीम से भी तो कई दिनों से नहीं मिली। पर दीदी ने कहा कि माँ की बीमारी के बाद आज काम पर जाने का उनका पहला दिन है। इसलिए तू यहीं रहकर मेरी मदद कर। वैसे तो में दीदी की सहायता हमेशा करती हूँ। जो भी हो काम ज़्यादा होने के कारण आज मैं स्कूल नहीं जा पायी। काम करते – करते दिन कैसे गुज़र गया, इसका पता ही नहीं चला।
ऊपर दिये अनुच्छेद में आज, यहीं, वैसे और ज़्यादा जैसे क्रिया – विशेषण के भेदों के उदाहरण हैं। क्रिया-विशेषण के चार भेद हैं –

1. स्थानवाचक क्रिया – विशेषण : जो क्रिया की स्थान संबंधी विशेषता प्रकट करते है, उसे स्थानवाचक क्रिया-विशेषण कहते है। उदा : रामू यहाँ बैठता है।
2. कालवाचक क्रिया – विशेषण : जो क्रिया के होने का समय बतायें, उसे कालवाचक क्रियाविशेषण कहते हैं। उदा : रामू आज आता है।
3. परिमाणवाचक क्रिया – विशेषणः जो क्रिया के परिमाण को प्रकट करें, उसे परिमाणवाचक क्रिया – विशेषण कहते है। उदा : रामू बहुत खेलता है।
4. रीतिवाचक क्रिया – विशेषण : जो क्रिया के रीति का संकेत करें, उसे रीतिवाचक क्रियाविशेषण कहते है। उदा : रामू ऐसा खेलता है।

क्रिया-विशेषण भेदों का प्रयोग करते हुए पाँच वाक्य लिखिए।
उत्तर :
1. यहाँ लड़कियाँ आपस में डाँटने लरी।
2. कल में ज़रूर यह काम करूँगा।
3. अधिक भोजन मत खाइए।
4. जैसे काम करें, वैसे ही फल मिले।
5. वह जोर दार भाषण दे रहा है।

TS 8th Class Hindi Guide 12th Lesson बढ़ते क़दम

विचार – विमर्श :

बच्चों की सुरक्षा के लिए सरकार ने POCSO कानून बनाया। जिसमें बच्चों को तंग करने, शारीरिक और व्यक्तिगत नियम तोडने पर कई साल की सज़ा है। यदि कोई जानबूझकर इन्हें तोडे तो हमारा दोष नहीं। उसे हम ‘नहीं’, ‘रुको’ कह सकते हैं। मौका मिलने पर दूर जाकर किसी भरोसेमंद बड़े व्यक्ति की रहायता से असुरक्षित व्यक्ति से वच सकते हैं। ऐसे असुरक्षित व्यक्ति को उसके व्यवहार पर शर्मिदगी नी चाहिए। इन्हें रोकें। ऐसे कौन-कौन से सुरक्षित व्यक्ति है जिनसे तुम सहायता ले सकते हो?
उत्तर : द्यार्थी कृत्य।

Essential Material for Examination Purpose :

I. पढ़ो :
पठित – गद्यांश :

नीचे दिये गये गद्यांश को पढ़कर प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए।

1. आज माँ की तबीयत कुछ टीक है । सुबह जब में उठी तो देखा कि बे काम पर निकल चुकीं थीं। एक सप्ताह से मैं पाठशाला नहीं गयी थी – माँ का काम जो करना पड़ता था । आज में पाटशाला जाना चाहती थी । पता नहीं गुरुजी ने क्या – क्या पढ़ा दिया होगा ? और फिर ममता, रचि, शमीम से भी तो कई दिनों से नहीं मिली। पर दीदी ने कहा कि माँ की बीमारी के बाद आज काम पर जाने का उनका पहला दिन है । इसलिए तू यहाँ रहकर मेरी मदद कर । बैसे तो में दीदी की सहायता हमेशा करती हूँ। जो भी हो काम ज्यादा होने के कारण आज मैं स्कूल नहीं जा पायी। काम करते – करते दिन कैसे गुज़र गया, इसका पता ही नहीं चला ।

प्रश्न :
1. किसकी तबीयत खराब थी ?
2. वह कितने दिनों से पाठशाला नहीं गई थी ?
3. दोस्तों के नाम क्या थे ?
4. . वह किसकी सहायता हमेशा करती थी ?
5. यह गद्यांश किस पाठ से है?
उत्तर :
1. माँ की तबीयत खराब थी।
2. वह एक सप्ताह से पाठशाला नहीं गई थी।
3. उसके दोस्तों के नाम ममता, रवि और शमीम थे।
4. वह अपनी दीदी की सहायता हमेशां करती थी ।
5. यह गद्यांश ‘बढ़ते कदम’ पाठ से है।

TS 8th Class Hindi Guide 12th Lesson बढ़ते क़दम

II. लोमड़ी की कहानी लिखनी थी। मुझे तो कुछ समझ में नहीं आ रहा था कि क्या करना है । पहले डर के मारे पूछा नहीं । फिर थोड़ी देर बाद पूछा तो अध्यापिका जी ने मेरी ओर देखते हुए पूछा – “समीना ! कल तुम क्यों नहीं आयी ?”‘ तो में ने उन्हें पाठशाला न आने का कारण बताया। तब उन्होंने मुझे हर दिन पाठशाला आने के लिए समझाया। फिर कहानी पढ़ने को कहा। में पढ़ने लगी। मज़ेदार लगी। में तो पढ़ ही रही थी पर श्याम और सायना ने तो अपनी कहानी उत्तर – पुस्तिका में लिख भी ली थी।

प्रश्न :
1. किसकी कहानी लिखनी थी ?
2. यह डायरी कौन लिख रही है?
3. अध्यापिका ने समीना को क्या पढ़ने को कहा ?
4. समीना को कहानी कैसी लगी ?
5. किसने कहानी उत्तर पुस्तिका में लिख ली थी ?
उत्तरः
1. लोमड़ी की कहानी लिखनी थी।
2. यह डायरी समीना लिख रही है।
3. अध्यापिका ने समीना को कहानी पढ़ने को कहा।
4. समीना को कहानी मज़ेदार लगी।
5. श्याम और सायना ने कहानी उत्तर पुस्तिका में लिख ली थी।

अपठित – गद्यांश :
निम्न लिखित गद्यांश पढ़कर दिये गये प्रश्नों के उत्तर एक वाक्य में दीजिए।

I. सरदार सुजानसिंह देवगढ रियासत के दीवान थे। राजा भी अपने इस नीतिकुशल दीवान का आदर करते थे। चालीस वर्ष तक सेबा करने के बाद एक दिन सुजानसिंह ने राजा के पास आकर प्रार्थना की – मुझे सेवानियृत्ति देने की कृपा करें। यह सुनकर राजा ने नये दीवान चुनने का भार सुजानसिंह को ही सौंप दिया।

प्रश्न :
1. सुजान सिंह कौन थे ?
2. सुजानसिंह ने कितने वर्ष तक सेवा की ?
3. मुझे सेवा निवृत्ति देने की बात किसने कही ?
4. नये दीवान चुनने का भार सुजानसिंह को किसने सौंपा ?
5. सुजानसिंह किस रियासत के दीवान थे ?
उत्तर:
1. सुजान सिंह देवगढ़ रियासत के दीवान थे।
2. सुजान सिंह ने चालीस वर्ष तक सेवा की।
3. सेवा निवृत्ति देने की बात दीवान सुजान सिंह ने की।
4. नये दीवान चुनने का भार सुजान सिंह को राजा ने सौंपा।
5. सुजानसिंह देवगढ़ रियासत के दीवान थे।

TS 8th Class Hindi Guide 12th Lesson बढ़ते क़दम

II. यमुना के तट पर खडा लालकिला एक ऐतिहासिक किला है। इसकी जीवन कथा बडी रोचक है। मुगल बादशाह शाहजहाँ ने आगरे की गर्मी से ऊबकर एक गर्म जगह खोजने का हुकुम दिया। तदनुसार दिल्ली शहर के बाहर यमुना के किनारे एक स्थान चुना गया। वह नूरगढ नाम से प्रसिद्ध था और वहाँ मुगल सेना का जमाव होता था। वहीं 12 मई, 1639 ई. को लालकिले की नींव डाली गयी। इसके निर्माण के लिए देश के कुशल कारीगरों और सिल्पियों को बुलाया गया और लाल पत्थर तथा संगमरमर दूर – दूर से लाये गये।

प्रश्न :
1. लालकिला कहाँ है?
2. लालकिले को किसने बनवाया ?
3. लालकिला किस नाम से प्रसिद्ध है ?
4. लालकिला नींव कब हुई ?
5. लालकिला किस पत्थर से बनाया गया ?
उत्तर:
1. लाल किला दिल्की शहर के बाहर यमुना नदी के तट पर है।
2. लाल किले को मुगल बादशाह शाहजहाँ ने बनवाया।
3. लाल किला नूरगढ़ नाम से प्रसिद्ध है।
4. लाल किला की नीव 12 मई, 1639 ई को हुई।
5. लाल किला लाल पत्थर और संगमरमर से बनाया गया।

II. लिखो :

लघु प्रश्न :

प्रश्न 1.
तुम अपनी पाठशाला में क्या – क्या करते हो?
उत्तर :
में अपनी पाठशाला में अध्यापकों के पाठ सुनता हूँ। छात्रों से खूब खलेता हूँ। खाली समय में दोस्तों के साथ विज्ञान संबंधित या गणित के बारे में बातचीत करता हूँ।

प्रश्न 2.
समीना की कक्षा में और तुम्हारी कक्षा में क्या अंतर है ? बताओ।
उत्तर :
समीना की कक्षा तो छोटी हैं। मेरी कक्षा तो बडी है। हमारी कक्षा में साठ लडके और पैंतीस लडकियाँ है। बहुत बडा श्यामपट है।

TS 8th Class Hindi Guide 12th Lesson बढ़ते क़दम

प्रश्न 3.
समीना अध्यापक से डर रही थी। क्यों?
उत्तर :
जब समीना एक सप्ताह के बाद स्कूल गई तब स्कूल में लोमडी की कहानी लिखनी थी। उसे तो कुछ भी समझ में नहीं आया। समीना इस प्रकार सोचती है कि अगर वह्, कहानी के बारे में पूछे तो अध्यांपिका डाँटेगी। इसलिए वह् डर रही थी।

लघु निबंध प्रश्न :

प्रश्न 1.
इस पाठ को अपने शब्दों में बताओ।
उत्तर :
यह एक डायरी पाठ है। इस डायरी को समीना ने लिखा है। इसका सारांश इस प्रकार है – समीना कुछ दिनों से (एक सप्ताह से) पाठशाला नहीं जाती है। उसकी माँ की तबीयत ठीक नहीं हैं। इसलिए वह घर में रहकर माँ के काम करती है।
आज ही उसकी माँ की तबीयत कुछ ठीक है समीना पाठशाला जाना चाहती है। तो उसकी दीदी आज एक दिन के लिए न जांने को कहती है।
समीना अपने दोस्त ममता, रवि और शमीम से भी नहीं मिलती। इसलिए पाठशाला में क्या पढ़ाया इसके बारे में उसे पता नहीं चलता।
शुक्रवार के दिन समीना पाठशाला गयी। वह वर्षा के कराण देर से पाठशाला पहुँची सब छात्र लोमडी की कहानी लिखते है। समीना चुप बैठी रही। तो अध्यापिका ने उससे पाठशाला न आने का कारण पूछकर समझाती है कि हर दिन पाठशाला जरूर आना श्याम और सायना कहानी लिख डाले। दस मिनिट की छुट्टी में सब खूब सारे बातें करते हैं। शाम को खूब खेलते हैं।
शनिवार के दिन तो पाठशाला में पाठशाला समिति की बैठक होती है। सरपंच भी आते हैं। सरपंच और प्रधानाध्यापक दोनों ने बारी -बारी में छात्रों से बातचीत करते हैं।
उन दोनों ने 01 अप्रैल, 2010 से भारत सरकार से अमल में लाये शिक्षा का अधिकार कानन के बारे में बातचीत करते हैं। निशुल्क शिक्षा के बारे में बताते हैं। सरकार का नारा -‘सब पढे-सव वते के बारे में वे बताते हैं।

సారాంశము :

20 సెప్టెంబరు, 2012,
గురువారం
ఈరోజు అమ్మ. ఆరోగ్యం కొంచెం బాగున్నది. ఉదయాన్నే నేను లేచినప్పుడు ఆమె పని మీద వెళ్ళడం నేను చూచితిని. ఒక వారం రోజుల నుండి నేను పాఠశాలకు వెళ్ళుటలేదు. అమ్మ పని చేయవలసి వచ్చుచున్నది. ఈరోజు నేను బడికి వెళ్ళదలచితిని. గురువుగారు ఏమేమి చదివించారో తెలీదు. అంతేకాక మమత, రవి, శమీమ్లను కూడా చాలా రోజులనుండి నేను కలవలేదు. అమ్మ జబ్బు పడిన తర్వాత ఈరోజు తను పనికి వెళ్ళడం మొదటి రోజు కదా ! అందువల్ల నీవు ఇక్కడే ఉండి నాకు సహాయం చేయమని అక్క నాతో అన్నది. నేను అక్కకు ఎల్లప్పుడూ సహాయం చేస్తూనే ఉంటాను అనుకోండి. ఏది ఏమైనప్పటికీ పని ఎక్కువగా ఉన్నందున నేను ఈరోజు బడికి వెళ్ళలేకపోయాను. పనిచేస్తూ చేస్తూ రోజు ఎలా గడచిపోయిందో నాకు తెలవనే తెలవదు.
21 సెప్టెంబరు, 2012
శుక్రవారం
ఈరోజు నేను పాఠశాలకు బయలుదేరినప్పుడు వర్షం సన్నసన్నగా పడుచున్నది. వర్షం ఆగేంతవరకు ఉండడం. వలన ఆలస్యమైనది. సమయం పది గంటలైనది. నేను సంచి తీసుకుని బడికి పరుగెత్తాను. అయినప్పటికీ ఆలస్యమైనది. అందరూ తమ తమ పనులలో నిమగ్నమైయుండిరి.

నక్క కథ వ్రాయవలసి ఉన్నది. నేనేమి చేయాలో నాకు అర్థం కావడం లేదు. మొదట భయం కారణంగా అడగలేదు. కొంచెం సమయం తర్వాత అడిగితే ఉపాధ్యాయురాలు నా వైపు చూస్తూ “సమీనా ! నిన్న నీవు ఎందుకు రాలేదు? ” అని అడిగెను. అప్పుడు నేను పాఠశాలకు రాని కారణం చెప్పితిని. అప్పుడు ఆమె నన్ను ప్రతిరోజు పాఠశాలకు రావలసినదిగా నచ్చచెప్పినారు మళ్ళీ కథ చదవమని చెప్పినారు.
నేను చదవసాగాను. మజాగా అనిపించింది. నేను చదువుతూ ఉండగానే శ్యామ్ మరియు సాయ్ని ఇరువురు తమ సమాధాన పత్రాలలో కథ వ్రాసివేసిరి. వాళ్ళు ఉపాధ్యాయురాలికి చూపించసాగిరి. రవి, ఇర్ఫాన్లిద్దరూ అదే సమయంలో ఒకరి జుట్టు మరొకరు గుంజుకొనుచుండిరి (పీక్కొనుచుండిరి.) ఉపాధ్యాయురాలు వారిని తిట్టినది.
ఇంతలో పది నిమిషాల విరామం లభించింది. నేను శమీమ్ మరియు మమతలతో బాగా మాట్లాడితిని. సాయంత్రం బాగా ఆడుకొంటిమి. రోజు ఎలా గడిచినదో తెలియనే తెలీదు.

22 సెప్టెంబరు, 2012
శనివారం
నేను ఈరోజు సమయానికి పాఠశాల చేరితిని. పాఠశాలలో పాఠశాల సమితి సమావేశం ఉన్నది. సర్పంచ్ కూడా వచ్చియుండిరి. మమ్మల్నందరినీ వరండాలో కూర్చోబెట్టిరి. ప్రధానోపాధ్యాయులు మరియు సర్పంచ్గా రులిరువురూ వంతుల వారీగా మాతో మాట్లాడిరి. ప్రధానోపాధ్యాయులవారు భారత ప్రభుత్వం 01 ఏప్రిల్, 2010 నుండి పిల్లల విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చినది. ఈ చట్టం అనుసరించి 6 నుండి 14 సం॥ల వయస్సు గల పిల్లలందరికి ఉచిత అనివార్య విద్యను పొందు అధికారం కలదు. వారికి తమ చదువు నిమిత్తం ఒక పైసా కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. భారత ప్రభుత్వం ప్రతి పిల్లవాని ముఖాన సంతోషాన్ని చూడగోరుచున్నది. అప్పుడే సాయ్నీ ప్రధానో పాధ్యాయుల వారిని “ప్రభుత్వం మన కోసం ఏమేమి సౌకర్యాలను కల్పించుచున్నది?” అని ప్రశ్నించెను. అప్పుడు ప్రధానోపాధ్యాయుల వారు అతనిని ప్రశ్నించినందులకు పొగిడిరి. ఇంకా ఆయన అన్నారు కదా ప్రభుత్వం పౌష్టిక భోజనం, బాలికా విద్య, ఆటవస్తువులు, ఆటస్థలము, దుస్తులు, ఉచిత పాఠ్యపుస్తకాలు మరియు వివిధ రకాల సౌకర్యాలు మరియు ప్రోత్సాహాలను కల్పించుచున్నది. ప్రభుత్వం భారత ప్రతి పౌరుడు విద్యావంతుడు కావాలని కోరుకుంటోంది. నూటికి నూరు శాతం అక్షరాస్యతను కోరుచున్నది. ప్రభుత్వం యొక్క నినాదం ఏమనగా ‘అందరూ చదవాలి అందరూ ఎదగాలి’. ఏ రోజున భారతదేశపు ప్రతి పిల్లవాడు చదువుకొని మంచి పౌరుడవుతాడో ఆ రోజునే మన దేశంలోని మహాపురుషుల కలలు సాకారమౌతాయి (నెరవేరతాయి). జైహింద్.

ప్రధానోపాధ్యాయుల వారి మాటలు విని మేమందరం కరతాళధ్వనులు చేసితిమి. నేను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఇంటికి తిరిగి వచ్చి తల్లిదండ్రులకు, అక్కకు ప్రధానోపాధ్యాయులవారు చెప్పిన అన్ని విషయాలను చెప్పితిని.

TS 8th Class Hindi Guide 12th Lesson बढ़ते क़दम

वचन :

  • बच्चा – बचे
  • पुस्तक – पुस्तके
  • बीमारी – बीमार्टियां
  • पाठशाला – पाठशालाएँ
  • लडका – लडके
  • पैसा – पैसे
  • बात – बाते
  • कहानी – कह्मानियाँ
  • छुी – छद्टियाँ
  • सुविधा – सविधाएँ
  • पुरुष – पुरुष
  • गुर – गुरुजन
  • खुीशी – खुशियाँ

लिंग :

  • गुरु – गुरुआनी
  • माँ – बाप
  • पुरुष – स्ती
  • नर – मादा
  • प्राध्यापक – प्राध्यापिका
  • बच्चा – बच्ची
  • माता – पिता
  • बालक – बालिका
  • अध्यापक – अध्यापिका
  • प्रधानाध्यापक – प्रधानाध्यापिका
  • पुत्र – पुत्री
  • छात्र – छात्रा

TS 8th Class Hindi Guide 12th Lesson बढ़ते क़दम

पर्यायवाची शब्द :

  • कानून – शासन
  • शिक्षा – विद्या
  • प्रश्न – सवाल
  • माता – मॉं, जननी
  • सुबह – प्रातः काल
  • बारिश – वर्षा
  • वर्ष – उम्र
  • पढ़ाई – विद्या
  • प्रशंसा – स्तुति
  • पिता – बाप
  • गुरु – अध्यापक
  • कहानी – कथा
  • बच्चे – लड़के
  • प्रधानाध्यापक – प्राध्यापक, हेडमारटर
  • खेल – क्रीडा
  • तबीयत – तंदुरुस्त, स्वारथ्य
  • पाठशाला – स्कूल, मदरसा
  • उत्तर – जवाब

उल्टे शब्द :

  • आज × कल
  • हल्का × जोर
  • खुशी × दुखी
  • शिक्षित × अशिक्षित
  • ठीक × गलत
  • डर × निडर
  • सुविधा × असुविधा
  • सुबह × शाम
  • साकार × निराकार
  • शुल्क × निशुल्क
  • प्रशंसा × निदा
  • पहला × अंतिम, आख़िरी

TS 8th Class Hindi Guide 12th Lesson बढ़ते क़दम

उपसर्ग :

  • पाठशाला – पाठ
  • विविध – वि
  • पढ़ाई – पढ़
  • निशुल्क – नि
  • साकार – सा
  • मज़ेदार – मजे
  • अनुसार – अनु
  • पेयजल – पेय
  • प्रतिशत – प्रति
  • अधिकार – अधि
  • अनिवार्य – अ
  • सुविधा – सु
  • साक्षरता – सा

प्रत्यय :

  • नागरिक – इक
  • साक्षरता – ता
  • साकार – कार
  • बीमारी – ई
  • शिक्षित – इत
  • प्रतिशत – शत
  • बैठक – क
  • सहायता – ता
  • पढ़ाई – आई
  • पौष्टिक – इक
  • मज़ेदार – दार

संधि :

  • समझाना = समझ + आना
  • निशुल्क = नि: + शुल्क
  • साक्षरता = स + अक्षरता
  • साकार = स + आकार
  • प्रधानाध्यापक = प्रधान + अध्यापक
  • नागरिक = नागर + इक
  • मह्रापुरुष = महा + पुरुष

TS 8th Class Hindi Guide 12th Lesson बढ़ते क़दम

वाक्य प्रयोग :

1. मदद – मैं हमेशा अपनी माँ की मदद करती हूँ।
2. छुट्टी – अभी दस मिनिट की छुट्टी दी गयी।
3. अधिकार – हर एक नागरिक को कई अधिकार मिलते हैं।
4. साकार – हरिश्चंद्र सत्य का साकार रूप हैं।

मुहावरे वाले शब्द :

1. भागना = दूर जाना, पीछे हट जाना।
वह समस्याओं से सदा दूर भाग जाता है।
2. देर हो जाना =नियत समय के बाद में
पाठशाला जाने में मुझे आज बहुत देर हो गयी।
3. समझा जाना = निपटना
सारी बातें अध्यापिका जी से समझा जायेगी।
4. यश फैलना = नाम कमाना
हम अच्छे काम किये तो मृत्यु के बाद भी हमारी यश फैलेगी।

शब्दार्थ (అర్ధములు) (Meanings) :

TS 8th Class Hindi Guide 12th Lesson बढ़ते क़दम 1