TS 9th Class Telugu Important Questions 2022-2023

TS 9th Class Telugu Important Questions 2022-2023

TS 9th Class Study Material

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ

Telangana SCERT 9th Class Telugu Guide Telangana 3rd Lesson వలసకూలీ Textbook Questions and Answers.

TS 9th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వలసకూలీ

చదువండి – ఆలోచించి చెప్పండి (Textbook Page No. 25)

ఊరిలో నీకిల్లు లేదు – ఊరి వెలుపల పొలము లేదు
కూలి నిర్ణయ మింతని లేదు – కూలి పని స్థిరమైనది కాదు
ఆలుపిల్లల నేలేదెట్లా – అనే చింత నిన్నిడదోయి వ్యవసాయకూలి.
బతుకు దెరువు లేక నీవు – భార్యపిల్లల నొదిలి పెట్టి
బస్తి చేరి రిక్షలాగి – బలముగ జ్వరమొచ్చి పంటే
కాస్త నీకు గంజినీళ్ళు – కాసి పోసే దిక్కెవరోయి వ్యవసాయ కూలి.
– సుద్దాల హనుమంతు

ప్రశ్న 1.
ఈ పంక్తులు ఎవరి గురించి తెలుపుతున్నాయి ? రాసింది ఎవరు ?
జవాబు:
ఈ పంక్తులు వ్యవసాయ కూలీలను గూర్చి తెలుపుతున్నాయి. ఈ గేయాన్ని “సుద్దాల హనుమంతు” రాశాడు.

ప్రశ్న 2.
కూలిపని స్థిరమైనది కాదు అనడంలో అంతరార్థమేమిటి ?
జవాబు:
‘కూలిపని’ అంటే ఏ రోజుకు ఆ రోజు, ఎవరికైనా ఏదో పని చేసిపెట్టి, ఆ చేసిన పనికి కూలి తీసుకోవడం. ఈ పని ఉద్యోగంలా స్థిరమైనది కాదు. ప్రతిరోజూ కూలిపని ఎక్కడ దొరకుతుందో. అని వెతుక్కోవాలి. ఒక్కొక్క రోజు ఏ పనీ దొరకదు. వర్షం వచ్చిన రోజున ఎవరూ కూలిపని చెప్పరు. కూలిపని కోసం నిత్యం వేటాడాలి.

ఒకరోజు పని ఉంటుంది. మరొకరోజు ఏ పనీ ఉండదు. లేదా ఏ రిక్షాయో అద్దెకు తీసుకుని దాన్ని తొక్కుతూ జీవనం సాగించాలి. అందుకే కూలిపని స్థిరమైనది కాదు.

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 3.
కుటుంబ పోషణ ఎట్లా జరుగుతుంది ?
జవాబు:
కూలిపని దొరికితే, వచ్చిన కొద్ది డబ్బుతో ఏదోరకంగా సంసారం నడుపుకుంటారు. డబ్బు లేనప్పుడు అప్పులు చేస్తారు. ఋణాలు తీసుకుంటారు. ఏమీ దొరకకపోతే, కాసిని మంచినీళ్ళు తాగి, కడుపులో కాళ్ళు పెట్టుకొని ముడుచుకొని పడుకుంటారు. లేదా, ఏ రిక్షాయో తొక్కి దానితో వచ్చిన కొద్దిపాటి డబ్బుల్లో రిక్షా అద్దె కట్టి, మిగిలినది ఉంటే దానితో బతకాలి.

ప్రశ్న 4.
ఊళ్ళు వదిలిపోయేటందుకు కారణమయ్యే పరిస్థితులేవి ?
జవాబు:
తాము ఉంటున్న ఊళ్ళలో సరైన వ్యవసాయపనులు, తమ వృత్తిపనులు లేకపోవడం వల్ల, నగరాల్లో కూలి చేసుకొని బ్రతకవచ్చని గ్రామీణ జనం, తమ ఊర్లు వదలి నగరాలకు పోతారు.

వర్షాలు లేకపోతే వ్యవసాయపనులు గ్రామాల్లో దొరకవు. వ్యవసాయ ఆదాయం లేకపోతే, పెద్ద రైతులు చేతివృత్తులవారికి తగిన పనులు చూపించలేరు. అలాగే కొందరు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడానికి నగరాలకు వలసపోతారు. పిల్లల చదువుల కోసం కోందరు గ్రామాలు వదలి నగరాలకు వెడతారు. గ్రామాల్లో ఉపాధి సౌకర్యాలు బొత్తిగా లేకపోవడం వల్లనే ప్రజలు ఊళ్ళు వదలి పోతున్నారు.

ఆలోచించండి – చెప్పండి. (Textbook Page No. 27)

ప్రశ్న 1.
‘గొడ్ల డొక్కలు గుంజడం’ అంటే మీకు ఏమి అర్థమైంది ?
జవాబు:
గొడ్లు అంటే పశువులు. ‘డొక్కలు గుంజడం’ అంటే వాటి పొట్టలు తిండిలేక లోపలకు నొక్కుకుపోవడం. పశువులకు తిండిలేక వాటి శరీరాలు ఎండిపోయి, వాటి డొక్కలు లోపలకు దిగిపోయాయన్నమాట. ఆ పాలమూరు జిల్లాలో వర్షాలు లేనందున, ప్రజలకు తిండి, పశువులకు గ్రాసం లేకపోయిందని నాకు అర్థమయ్యింది.

ప్రశ్న 2.
కోస్తా ప్రాంతానికి ఎవరు, ఎందుకు వెళ్ళారు ?
జవాబు:
కోస్తా ప్రాంతానికి పాలమూరు జిల్లాలోని కూలీలతో పాటు, ఒక జాలరి వెళ్ళాడు. పాలమూరు ప్రాంతంలో వర్షాలు లేవు. కృష్ణాష్టమి వెళ్ళిపోయింది. పశువులకు ఆహారం లేదు. వాగుల్లో నీళ్ళులేక వానపాములు సైతం ఎండిపోయాయి. చెరువులు, కుంటలు బీటలు తీశాయి. వానపడుతుందన్న ఆశ లేకపోయింది. ఆ పరిస్థితుల్లో, కోస్తా దేశంలో కూలి ఎక్కువగా దొరుకుతుందని, కూలి పని చేసుకొనేవారు, కోస్తా ప్రాంతానికి వెళ్ళిపోయారు.

ప్రశ్న 3.
పల్లెబతుకుల కష్టానికి కారణం ఏమిటి ?
జవాబు:
పల్లెల్లో ప్రజలు పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి ‘ జీవిస్తారు. పశువుల పాడిపై ఆధారపడతారు. వర్షాలు పడకపోతే, వ్యవసాయం పనులుండవు.. పశువులకు మేత దొరకదు. కూలివారికి కూలిపనులు దొరకవు. మొత్తంపై వర్షాలు లేక, వ్యవసాయం పనులు లేకపోవడం, వ్యవసాయం వల్ల, పాడిపంటల వల్ల వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉండడం, అనేవే పల్లె బ్రతుకుల కష్టాలకు కారణాలు.

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ

ఆలోచించండి – చెప్పండి’ (Textbook Page No. 28)

ప్రశ్న 1.
కృష్ణా ఆనకట్టను కట్టకపోవటానికి, పాలమూరు జనం కూలీలుగా మారడానికి గల సంబంధం ఏమై ఉంటుంది ?
జవాబు:
కృష్ణానదిపై ఎగువన ఆనకట్ట కడితే, ఆ నీళ్ళు మహబూబ్ నగర్ జిల్లా పంటపొలాలకు అందుతాయి. ఆ నీళ్ళు లభ్యమైతే, ఆ పాలమూరు జిల్లా ప్రజలు వర్షాధారంగా జీవించవలసిన పనిలేదు. హాయిగా కృష్ణాజలాలతో తమ పొలాల్లో పంటలు పండించు కోవచ్చు. ప్రస్తుతం ఆ ఆనకట్ట నిర్మించనందువల్ల, వర్షాలు లేకపోవడం వల్ల, పాలమూరు జనం కూలీలుగా మారిపోయి యుంటారు.

ప్రశ్న 2.
‘చీకు మబ్బుల ముసురులో కార్తీకపున్నం వెళ్ళి పోయిందని’ కవి ఎందుకు ఆవేదన చెందాడు ?
జవాబు:
సామాన్యంగా వర్షాలు శ్రావణ భాద్రపద మాసాల్లో ఎక్కువగా పడతాయి. కార్తీక పౌర్ణమి వచ్చే నాటికి వర్షాలు పూర్తిగా వెనుకపడతాయి. కార్తీక పౌర్ణమి వెళ్ళిపోయిందంటే, ఇంక ఆ సంవత్సరానికి వర్షాలు లేనట్లే లెక్క

ఇక చీకు మబ్బుల ముసురు సంగతి చూద్దాము. ఆ ప్రాంతంలో మబ్బులు ముసురుకున్నాయి. కాని అవి- చీకుమబ్బులు. అంటే చితికిపోయిన చిన్న చిన్న మబ్బులు అన్నమాట. దట్టమైన నల్లని మబ్బులు కావు. అందువల్ల చిన్న చిన్న జల్లులు తప్ప, పెద్ద వర్షం పడలేదన్నమాట.

అంతవరకూ పెద్ద వర్షం లేదు. కార్తీక పౌర్ణమి కూడా వెళ్ళిపోయింది కాబట్టి ఇక ఆ సంవత్సరం వర్షం పడదు. అందుకే సరియైన వర్షం రాలేదని కవి ఆవేదన పడ్డాడు.

ఇవి చేయండి

I అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
ఒక ప్రాంతంలోని జనం ఇతర ప్రాంతాలకు ఎందుకు వలసలు వెళతారు? దీనిని అరికట్టడానికి ఏం చేస్తే బాగుంటుంది? చర్చించండి.
జవాబు:
ఒక ప్రాంతంలోని జనం, ఆ ప్రాంతంలో వారు జీవించడానికి అనువయిన పరిస్థితులు లేనపుడు, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వారి జీవనానికి అనువైన మరో ప్రాంతానికి వలసవెడుతూ ఉంటారు.

  1. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురియక, తినడానికి తిండి, త్రాగడానికి నీరు దొరకదు. త్రాగేనీరు సహితం వారు కొనవలసి వస్తుంది. ఆ పరిస్థితుల్లో జనం వలసలు పోతారు.
  2. కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయపనులు లేక, జీవనాధారం లేక, మరో ఉద్యోగం సంపాదించే సావకాశం లేక, ఏదైనా పని చేసుకొని బ్రతుకవచ్చనే ఆశతో, నగరాలకు వలసపోతారు.
  3. తాము నివసించే ప్రాంతాలలో విద్యా వైద్య, ప్రయాణ సౌకర్యాలు లేక, ఆ సదుపాయాల కోసం జనం వలసలు పోతారు. ముఖ్యంగా జనం, జీవనభృతి కోసం, అది సంపాదించగల ప్రాంతాలకు వలసలు పోతుంటారు. వలసలు నిరోధించాలంటే, ప్రజలకు కావలసిన అన్ని సదుపాయాలు గ్రామ ప్రాంతాల్లోనే దొరికేలా ప్రభుత్వాలు చర్యలు తీసికోవాలి. కూలీలకు వ్యవసాయపనులు లేనపుడు, పనికి ఆహారపథకం వంటి పథకాల ద్వారా, ప్రజలకు పనులు చూపించాలి. గ్రామాల్లో సాగునీటి, త్రాగునీటి సదుపాయాలు కల్పించాలి.

ప్రశ్న 2.
పాఠం చదువండి. ‘అంత్యానుప్రాస’ పదాలు రాయండి.
జవాబు:

  1. ఎన్నడొస్తవు లేబరీ
    పాలమూరి జాలరీ !
  2. గొడ్ల డొక్కలు గుంజినా
    వానపాములు ఎండినా
  3. సరళా సాగరం నిండేది కాదని
    కోయిల సాగరం నిండేది కాదని
  4. గుడిసెకు విసిరి పోతివా
    నడుం చుట్టుక పోతివా
  5. మరిగి రాకనె పోతివా
    చారు మరిచే పోతివా
  6. కర్మ మెందుకు
    వేయ నందుకు
  7. మొక్కుతు పోతివా
    కోస్తదేశం పోతివా

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 3.
కింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

తెలంగాణ ప్రాంతంలో చెరువుల నిర్మాణం శాతవాహనుల కాలం కంటే ముందునుంచే ఉన్నప్పటికీ కాకతీయుల కాలంలో ఉన్నతదశకు చేరుకుంది. ఆ తర్వాత తెలంగాణను పాలించిన కుతుబ్షాహీలు, అసఫ్జాహీలు, సంస్థానాధీశులు, తెలంగాణలో చెరువుల నిర్మాణాన్ని అభివృద్ధిపరిచి, వ్యవసాయాభివృద్ధికి తోడ్పడ్డారు. తర్వాత కాలంలో ఈ చెరువుల వ్యవస్థ సరైన నిర్మాణానికి నోచుకోక విధ్వంసానికి గురి అయ్యింది.

దీనివలన స్వయంపోషక గ్రామాలుగా ఉన్న తెలంగాణ గ్రామాలు కరవు పీడిత గ్రామాలుగా మారాయి. ఈ పరిణామం కూడా వలసలకు కారణమైంది. లక్షలాది మంది తెలంగాణ ప్రజలు పొట్టచేత పట్టుకొని ఇతర రాష్ట్రాలకు, గల్ఫ్ దేశాలకు వలసపోయారు. తెలంగాణలో చెరువుల పునర్నిర్మాణం ద్వారా వ్యవసాయాభివృద్ధి సాధిస్తే, ప్రజలకు ఉపాధి దొరికి, వలసలు ఆగిపోతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరువులను పునరుద్ధరించడానికి ‘మిషన్ కాకతీయ’ అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది.

ప్రశ్నలు :

అ) పై పేరా దేని గురించి చెప్తున్నది ?
జవాబు:
పై పేరా తెలంగాణ రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం గురించి చెప్తున్నది.

ఆ) ‘మిషన్ కాకతీయ’ అంటే ఏమిటి ?
జవాబు:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో చెరువులను పునరుద్ధరించే కార్యక్రమాన్ని చేపట్టింది. దానికి ‘మిషన్ కాకతీయ’ అని పేరు పెట్టింది.

ఇ) తెలంగాణ ప్రజలు ఎందుకు వలసలు వెళ్ళుతున్నారు?
జవాబు:
తెలంగాణలో చెరువుల వ్యవస్థ కాలక్రమంలో సరైన నిర్మాణానికి నోచుకోక విధ్వంసానికి గురి అయ్యింది. దానితో తెలంగాణ గ్రామాలు కరవుపీడిత గ్రామాలుగా మారడంతో, తెలంగాణ ప్రజలు వలసలు వెడుతున్నారు.

ఈ) వలసలు ఆగిపోవడానికి చేపట్టవలసిన చర్యలేవి?
జవాబు:
తెలంగాణలో చెరువుల పునర్నిర్మాణం ద్వారా, వ్యవసాయాభివృద్ధి సాధిస్తే ప్రజలకు ఉపాధి దొరికి, వలసలు ఆగిపోతాయి.

ఉ) చెరువుల అభివృద్ధి కోసం కృషిచేసిన వారెవరు?
జవాబు:
చెరువుల అభివృద్ధి కోసం కాకతీయులు, కుతుబ్షాహీలు, అసఫ్జాహీలు, సంస్థానాధీశులు కృషిచేశారు.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) ముకురాల రామారెడ్డి పాట విన్నారు కదా! దీని ఆధారంగా పాలమూరు కూలీ జీవితం ఎట్లా ఉండేదో ఊహించి రాయండి.
జవాబు:
పాలమూరులో కూలీలకు పని దొరికేదికాదు. కనీసం వారికి తిండి ఉండేది కాదు. త్రాగడానికి నీరు కూడా దొరికేది కాదు. ఆ ప్రాంతంలోని భూస్వాములకు వ్యవసాయం చేసేందుకు సాగునీటి సౌకర్యం లేదు. వర్షాలు లేవు. దానితో కూలీలు తిండిలేక, పస్తులు పడుకోవలసి వచ్చేది. వారి పిల్లలకు చదువు సంధ్యలు లేవు. వారికి జబ్బుచేస్తే మందులు వేసికోడానికి కూడా డబ్బులు వారి వద్ద ఉండేవి కావు. అందుకే వారు కూలీ దొరికే ప్రాంతాలకు వలసలు పోయేవారు.

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ

ఆ) ఒకప్పుడు గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉండేవి. అలాంటి గ్రామాల నుండి ప్రజలు ఎందుకు వలసలు పోతున్నారు?
జవాబు:
గ్రామాల్లో పూర్వము పెద్ద పెద్ద భూస్వాములు ఉండేవారు. పెద్ద పెద్ద వ్యవసాయ చెరువులు, ఆ చెరువుల నుండి పొలాలకు సాగునీరు లభించేది. దానితో గ్రామాల్లో పని కావలననే రైతు కూలీలందరికీ పని దొరికేది. ఇప్పుడు పెద్ద భూస్వాములు లేరు. పిల్లలకు భూములు పంచడంతో అవి చిన్న చిన్న భూకమతాలుగా మారాయి. ఆ చిన్నరైతులు వ్యవసాయ కూలీలకు 365 రోజులూ ఉపాధిని చూపించలేరు.

చిన్న రైతులకే సంవత్సరం పొడుగునా పని ఉండదు. యంత్రాలు అమల్లోకి వచ్చాయి. దానితో కూలీల అవసరం తగ్గింది. గ్రామాల్లో కూలీల పిల్లలకు, విద్యా వైద్య ఉపాధి సౌకర్యాలు అంతగా లేవు.

గ్రామాల్లో ఉన్న యువకులు తమ జీవనభృతిని సంపాదించుకోగల పరిస్థితులు గ్రామాల్లో నేడు లేవు. ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమితో వారికి కావలసిన సదుపాయాలు లభించడంలేదు. వ్యవసాయదారులకు ప్రభుత్వ సహాయం ఉండడం లేదు.

అందువల్ల పిల్లలకు ఉద్యోగసంపాదనకు తగిన చదువులు చెప్పించడానికీ, తమ పిల్లలు మంచి ఉద్యోగాలు పొందడానికీ, తాము సుఖంగా జీవితాలు గడపడానికీ, ప్రజలు గ్రామాలు విడిచి, నగరాలకు వలసలు పోతున్నారు.

గ్రామాల్లో 24 గంటలూ విద్యుచ్ఛక్తి సౌకర్యం ఉండడం లేదు. గ్రామాల్లోని వృత్తి పనివారలకు నగరాల్లో చక్కని జీవనభృతి లభిస్తోంది. భవన నిర్మాణ కార్మికులకు నగరాల్లో 365 రోజులూ పని దొరుకుతోంది.

పై కారణాల వల్లనే నేడు గ్రామాల నుండి ప్రజలు నగరాలకు వలసలు పోతున్నారు.

ఇ) “ఎప్పుడొస్తవు లేబరీ, పాలమూరి జాలరీ” అని అనడంలో కవి ఉద్దేశాన్ని రాయండి.
జవాబు:
‘లేబరీ’ అంటే పనిచేసుకొని జీవించే కూలివాడు అని అర్థము. ఈ పాటలో కూలి, జాలరివాడు. అంటే చేపలు పట్టుకొని వాటిని అమ్ముకొని జీవించేవాడు. పాలమూరు ప్రాంతాల్లో వాగులు, వంకలూ ఎండిపోయాయి. దానితో ఈ జాలరికి చేపలు పట్టుకొనే పనిలేకుండా పోయింది.

కోస్తా ప్రాంతంలో సముద్రం ఉంటుంది. అక్కడి జాలర్లు పడవలపై సముద్రంలోకి నైలాన్ వలలతో చేపల వేటకు వెడతారు. అందుకే ఈ పాలమూరి జాలరి ఇక్కడ తనకు పనిలేక, కోస్తా బెస్తల పడవల్లో లేబరీగా మారాడు. అందుకే కవి జాలరిని, ఎప్పుడొస్తవు లేబరీ అని రాశాడు.

ఈ) గ్రామాల్లోని ప్రజలకు ఉపాధి ఎప్పుడు దొరుకుతుంది ?
జవాబు:
గ్రామాల్లోని పంటచేలకు సాగునీటి సౌకర్యం కల్పిస్తే గ్రామాల్లోని బీడు భూములన్నీ చక్కని పంటపొలాలుగా మారుతాయి. అప్పుడు గ్రామాల్లో ప్రజలందరికీ చేసుకోడానికి పని దొరుకుతుంది. గ్రామాల్లోని పూర్వం చెరువులన్నింటినీ పునరుద్ధరించాలి. పంటలు బాగా పండితే, ప్రజలు మంచి గృహాలు నిర్మించుకుంటారు. అప్పుడు వృత్తిపనివారలకు అందరికీ మంచి ఉపాధి దొరుకుతుంది. గ్రామాల్లో విద్యా వైద్య రవాణా సౌకర్యాలు కల్పిస్తే, గ్రామాల్లో ఉపాధి సౌకర్యాలు పెరుగుతాయి. అప్పుడు ఎక్కువమందికి ఉపాధి దొరుకుతుంది.

గ్రామాల్లో వ్యవసాయానికి తోడు అనుబంధ పరిశ్రమలు ప్రారంభించాలి. ముఖ్యంగా పాడి పరిశ్రమను గ్రామాల్లో ప్రోత్సహించాలి. కోళ్ళు, మేకలు, గొట్టెలు వంటివాటిని పెంచాలి. సేంద్రియ ఎరువులను తయారుచేసే యూనిట్లు ప్రారంభించాలి. గ్రామాలను స్వయంపోషకంగా తయారుచేయాలి. యువకులకు గ్రామాల్లో లఘు పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి చూపించాలి. గ్రామాల్లో ఉపాధి పుష్కలంగా లభించేటట్లు ప్రభుత్వం కృషిచేయాలి.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) “వలసకూలీ” గురించి కవి ఆవేదనను మీ సొంతమాటల్లో రాయండి.
‘వలసకూలీ’ గేయ సారాంశాన్ని రాయండి.
(లేదా)
జవాబు:
ఓ పాలమూరి జాలరీ ! కూలి ఎక్కువ ఇస్తారని, కోస్తా దేశం వెళ్ళావా ! ఎప్పుడు తిరిగి వస్తావు ?
గోకులాష్టమి వెళ్ళిపోయింది. పశువులు డొక్కలు ఎండిపోయాయి. వాగులలో, వంకలలో వానపాములు సైతం ఎండిపోయాయి. చెరువులు, కుంటలు బీటలు తీశాయి. అయినా చినుకుపడే ఆశలేదని కోస్తా దేశం వెళ్ళావా ! ఎప్పుడు తిరిగి వస్తావు ?

వానపడదు. సరళా కోయిల సాగరాలు నిండనే నిండవు. చౌట మడుగులు ఎండిపోయాయి. పైరులు వరుగులయ్యాయి. పల్లెల్లో బతకడం ఎలాగా అనీ, కూలి బాగా ఇస్తారనీ, కోస్తాకు వలసపోయావా !
ఓ జాలరీ ! నావ, గాలం గుడిసెలో పడేసి నైలాను వల తీసుకొని, మన్నెంకొండ దేవుడు వేంకటేశ్వరుడికి మొక్కుతూ, కోస్తాకు వెళ్ళావా ! తిరిగి ఎప్పుడొస్తావు ?

మెరిగె, బొచ్చె చేపలకు అలవాటుపడి, చందమామల, పరకపిల్లల చారు మరిచిపోయావా ! కోస్తా బెస్తల పడవల్లో కూలీగా పనిచేసే కర్మ నీకు కృష్ణా ఎగువ ఆనకట్ట కట్టకపోడం వల్లనే కదా !

నీవు తిరిగి ఇంటికి వస్తానన్న గడువు దాటి వారాలయ్యింది. కార్తీక పౌర్ణమి వెళ్ళింది. ఇక్కడ నుండి వెళ్ళిన జనం అంతా చచ్చే కాలం వచ్చిందన్నట్లు, జలపిడుగు భద్రాచలం మెట్లు తాకిందట. ఎక్కడున్నావు ? ఎప్పుడొస్తావు ?

(లేదా)

ఆ) వలసకూలీల బతుకుల్లో వెలుగులు నింపడానికి ఎట్లాంటి చర్యలు అవసరమో వివరించండి.
జవాబు:
వలసకూలీలు సామాన్యంగా గ్రామీణప్రాంతాల నుండి నగరాలకు వస్తూ ఉంటారు.

  1. వలసకూలీలకు గ్రామాల్లో ఉన్న రేషనుకార్డులు, పింఛన్లు వంటి సదుపాయాలన్నీ, వలసకు వారు వచ్చిన నగర ప్రాంతాల్లో కూడా కల్పించాలి.
  2. వలసకూలీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వారికి ఇళ్ళు కట్టించి ఉచితంగా ఇవ్వాలి.
  3. వలసకూలీలందరికీ నగరాల్లో పట్టణ ఉపాధి పథకాల ద్వారా పనులు చూపించాలి. రెవెన్యూ అధికారులు వలస కూలీలకు రేషన్కార్డులు ఇచ్చి, వారికి చౌకగా బియ్యం, పంచదార వంటి వస్తువులు ఇప్పించాలి.
  4. వలసకూలీల పిల్లలకు, విద్యా వైద్య సదుపాయాలు కల్పించాలి.
  5. నగరాల్లో వలసకూలీలు ప్రయాణం చేయడానికి సిటీబస్సుల్లో కన్సెషన్ టిక్కెట్లు ఇవ్వాలి.
  6. ప్రభుత్వం చేయించే పనులలో వలసకూలీలకు పనిలో ప్రాధాన్యం ఇవ్వాలి. వలసకూలీల కాలనీల్లో రోడ్లు, మంచినీటి కుళాయిలు వగైరా సదుపాయాలు కల్పించాలి.
  7. వలసకూలీలు తమ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళడానికి కనీసం ఏడాదిలో రెండుసార్లు ప్రయాణ సదుపాయాలు ఏర్పాటుచేయాలి.
  8. వలసకూలీల కష్ట సుఖాలను మునిసిపల్ కౌన్సిలర్సు తెలిసికొని, ప్రభుత్వాధికారులకు తెలియజేయాలి. వలస కూలీలు నగరాల్లో స్వేచ్ఛగా జీవించేందుకు కావలసిన ఏర్పాట్లు ప్రభుత్వం కలుగజెయ్యాలి.

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా రాయండి.

అ) శ్రమజీవులైన కూలీలు పనిదొరకక పొట్టచేత పట్టుకొని వలసపోతున్నారు. వారి జీవనాన్ని ఊహిస్తూ ఒక కవిత/గేయం రాయండి.
జవాబు:
కూలీ గొప్పగ ముట్టుతుందని
నగర మార్గమై సాధనమ్మని
గ్రామం విడిచి పట్నవాసము
దారి పడితివి అయ్యోపాపము !

ఉన్న ఊరిలో పనులు లేవయా
కన్న తల్లిని విడిచి నావయా.
అమ్మా నాన్నలు దూరమయ్యిరీ
బంధు లందరూ నిన్ను విడిచిరీ

తిండి కోసమీ తిప్పలు తప్పవు
నగరములో మరి పనులు దొరకెనా ?
కడుపు నిండుగా తిండి దొరకెనా ?
ఉండడానికి ఇల్లు దొరకెనా ?

రోడ్డు పక్కనే చోటు దొరకెనా
అమ్మా నాన్నలు గుర్తుకొచ్చిరా
భార్యా బిడ్డలు గుర్తుకొచ్చిరా
అయ్యో కంటను కన్నీరొచ్చెనా

ఎవరైనా నీ పనిని మెచ్చెనా
కడుపు కోసమా ఇంత పరీక్ష
అయ్యా ఎందుకు నీకీ శిక్ష
కండబలమూ ఉన్నవాడవు

మొండితనమూ పట్టినాడవు
కలుగును తప్పక నీకు విజయము
దైవము తోడగు నీకిది నిజము.

(లేదా)

ఆ) వలసలను నిరోధించడానికి ప్రజలకు గ్రామాల్లోనే ఉపాధి లభించేటట్లు ప్రభుత్వం చేపట్టవలసిన చర్యలను గురించి పత్రికలకు లేఖ రాయండి.

నిజామాబాద్,
X X X X X.

ప్రధాన సంపాదకులు,
ఈనాడు దినపత్రిక,
సోమాజీగూడ,
హైదరాబాదు.
ఆర్యా,

నమస్కారాలు. నేను ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను. మా పరిసర ప్రాంతాల పల్లెల నుండి ఎందరో. గ్రామీణ జనం, మా నగరాలకు వలస వస్తున్నారు. గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వము కింది సాయం చేస్తే వలసలను అరికట్టవచ్చు.

  1. గ్రామాల్లో ప్రజలకు సాగునీరు, త్రాగునీరు, విద్యా వైద్య సదుపాయాలు కల్పించాలి.
  2. గ్రామాల నుండి రవాణా సదుపాయాలు కల్పించాలి.
  3. గ్రామాల్లో ప్రజలకు పనికి ఆహారపథకం ద్వారా 365 రోజులూ పనులు చూపించాలి. ప్రతి మండల కేంద్రాల్లో పిల్లల చదువులకు సక్సెస్ పాఠశాలలు ఏర్పాటుచేయాలి.

ప్రతి గ్రామానికి రోజూ 24 గంటలూ విద్యుచ్ఛక్తి సదుపాయం కల్పించాలి. ప్రతి మండల కేంద్రాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటుచేయాలి. ప్రతి గ్రామాలకూ ఆర్.టి.సి బస్సు సౌకర్యం ఉండాలి.

వ్యవసాయానికి కావలసిన ఆధునిక పనిముట్లను, చౌకగా ప్రజలకు అందించాలి. వ్యవసాయదారులకు బ్యాంకుల ద్వారా అప్పులు తక్కువ వడ్డీకి ఇప్పించాలి. ఈ విషయాలను మీ పత్రిక ద్వారా ప్రభుత్వం దృష్టికి తేవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ముందుగానే మీకు నా కృతజ్ఞతలు. తప్పక ఈ విషయాలు ప్రభుత్వం దృష్టికి మీ పత్రిక ద్వారా తీసుకురండి.

ఇట్లు,
భవద్విశ్వసనీయుడు,
పి. రాజా,
తొమ్మిదవ తరగతి,
ప్రభుత్వ పాఠశాల,
నిజామాబాద్.

చిరునామా :

ప్రధాన సంపాదకులు,
ఈనాడు దినపత్రిక,
సోమాజీగూడ,
హైదరాబాదు.

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ

III. భాషాంశాలు

పదజాలం

1. కింది వాక్యాల్లోని గీత గీసిన పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

అ) పుస్తకాల నిండ మస్తుగ బొమ్మలు ఉన్నవి.
జవాబు:
మస్తుగ = అధికంగా
వాక్యప్రయోగం : ప్రభుత్వం దగ్గర మస్తుగ డబ్బు ఉంది.

ఆ) పరీక్ష రుసుం చెల్లించడానికి నేటితో గడువు ముగిసింది.
జవాబు:
గడువు = కాలవ్యవధి
వాక్యప్రయోగం : ఈ నెల పదవ తారీకు వరకూ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొనే గడువు ఉంది.

ఇ) పల్లెదారి పంట పైరులతో అందంగా ఉన్నది.
జవాబు:
పైరు = సస్యము
వాక్యప్రయోగం : ఈ సంవత్సరము మా చేలలో పైరులన్నీ పురుగుపట్టి పాడయ్యాయి.

2. కింది పదాలు/వాక్యాలు వివరించి రాయండి.

అ) గొడ్లడొక్కలు గుంజినా…
జవాబు:
వివరణ : ‘గొడ్లు’ అంటే పశువులు. ‘డొక్కలు’ అంటే వాటి పొట్టలు. గుంజడం అంటే ‘లాగడం’. పశువులకు కడుపునిండా తిండి లేకపోతే, వాటి డొక్కలు ఎండి లోపలకు దిగిపోతాయి. మొత్తంపై పశువుల శరీరాలు ఎండి లోపలకు దిగిపోడాన్ని ‘గొడ్లడొక్కలు గుంజడం’ అంటారు.

ఆ) చెర్లుకుంటలు పర్రెవడెనని………..
జవాబు:
వివరణ : చెర్లు అంటే చెరువులు. కుంటలు అంటే నీటి గుంటలు. వర్షాలు లేనందున చెరువులు, గుంటలు ఎండిపోయాయి. చెరువులు, గుంటలలోని నేల ‘పర్రెలు పడింది’ అంటే నెరలు తీసింది అనగా బీటలు పడిందని భావం.

ఇ) పైరులన్నీ వరుగులయ్యె….
జవాబు:
వివరణ : పైరులు పచ్చగా ఉంటాయి. ‘వరుగులు’ అంటే పచ్చి కూరగాయలు ఎండబెట్టిన ముక్కలు. పచ్చి కాయగూరలు ఎండబెడితే, బాగా ఎండి అవి వరుగులు అవుతాయి. పైరులు నీరులేక పచ్చదనం పోయి అవి వరుగులుగా మారిపోయాయని భావము.

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ

ఈ) జల పిడుగు…….
జవాబు:
వివరణ : పిడుగు ఆకాశం మీది నుండి వర్షం వచ్చేటప్పుడు నేలపై పడుతుంది. పిడుగు పడ్డట్లయితే ఆ పడ్డ వస్తువు లేక మనిషి మాడిపోతాడు. మరణిస్తాడు.

ఇది ‘జలపిడుగు’. పిడుగుపాటులా జలము పొంగి పొర్లిందన్న మాట. వరదలు వస్తే ఆ నీరు ప్రజలపై పిడుగులా వచ్చి పడుతుంది. కాబట్టి ‘జలపిడుగు’ అంటే పిడుగువలె వచ్చిపడిన ‘వరద ఉధృతి’ అని భావం. తుపాను వస్తే సముద్రం పొంగి పిడుగులా సముద్రం నీరు మీద పడుతుంది. కాబట్టి తుపాను, నదుల వరద వంటివి “జల పిడుగులు” అని భావం.

3. కింది వ్యాక్యాలలోని ప్రకృతి, వికృతులను గుర్తించండి.

అ) మానవుడు ఆశాజీవి. అతని ప్రయత్నాన్ని బట్టి ఆసలు నెరవేరుతాయి.
జవాబు:
ఆశ (ప్రకృతి) – ఆస (వికృతి)

ఆ) సింహాలు కొండ గుహల్లో ఉన్నాయి. జడివానకు కుహరాలలోని సింగాల గుండెలు పగిలాయి.
జవాబు:
సింహాలు (ప్రకృతి) – సింగాలు (వికృతి)

వ్యాకరణాంశాలు

ప్రశ్న 1.
కింది పదాలను పరిశీలించండి. వాటిని విడదీసి సంధిని గుర్తించి, సూత్రం రాయండి.

అ) ఎట్లని
జవాబు:
ఎట్లని = ఎట్లు + అని = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధియగు.

ఆ) కాలమంటూ
జవాబు:
కాలమంటూ = కాలము + అంటూ = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధియగు.

ఇ) వరుగులయ్యే = వరుగులు + అయ్యే = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధియగు.

శబ్దాలంకారాలు :

అంత్యానుప్రాస

కింది వాక్యాలు పరిశీలించండి. ప్రత్యేకతను గుర్తించండి.
……….. గొడ్లడొక్కలు గుంజినా
………. వానపాములు ఎండినా
………. గుడిసెకు విసిరి పోతివా
………. నడుం చుట్టుక పోతివా
…….. ఎన్నడొస్తవు లేబరీ ;
……… పాలమూరి జాలరీ!

గమనిక : పై పాదాలు చివర అక్షరాలు, పునరుక్తమైనాయని గమనించారు కదా ! అక్షరాలు పునరుక్తమవడాన్ని “అంత్యానుప్రాస” అంటారు.

అంత్యానుప్రాస లక్షణం : పదాల, పాదాల, వాక్యాల చరణాల చివరలో అక్షరాలు పునరుక్తమైతే అది అంత్యానుప్రాసాలంకారం.

ప్రశ్న 2.
అభ్యాసము : పాఠంలోని అంత్యానుప్రాసాలంకార పంక్తులను గుర్తించి రాయండి.
జవాబు:

  1. ఎన్నడొస్తవు లేబరీ
    పాలమూరి జాలరీ !
  2. గొడ్లడొక్కలు గుంజినా
    వానపాములు ఎండినా
  3. సరళాసాగరం నిండేది కాదని
    కోయిలసాగరం నిండేది కాదని
  4. గుడిసెకు విసరి పోతివా
    నడుం చుట్టుక పోతివా
  5. దిక్కు మొక్కుకు పోతివా
    కోస్తదేశం పోతివా
  6. మరిగి రాకనె పోతివా
    చారు మరిచే పోతివా
  7. …….. కర్మ మెందుకు
    ……… వేయ నందుకు

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ

సంభావన పూర్వపద కర్మధారయ సమాసం

ఈ కింది వాక్యాలలో గీత గీసిన సమాస పదాలను పరిశీలించండి.
ఉదా : భద్రాచలం ఒక పుణ్యక్షేత్రం.
గమనిక : పై ‘భద్రాచలం’ అనే సమాస పదంలో భద్ర, అచలం అనే రెండు పదాలున్నాయి కదా! ‘అచలం’ అంటే కొండ అని అర్థం. ‘అచలం’ అనేది నామవాచకం.
‘భద్ర’ అనేది పేరు. అనగా “సంజ్ఞ”.
సంజ్ఞనే సంభావన అని అంటారు.
ఈ విధంగా పూర్వపదం (మొదటి పదం)లో సంభావన ఉన్నట్లయితే, ఆ సమాసపదాన్ని “సంభావన పూర్వపద కర్మధారయ సమాసము” అని అంటారు.

ప్రశ్న 3.
ఈ పాఠంలో ఉన్న సంభావన పూర్వపద కర్మధారయ సమాస పదాలను గుర్తించి, విశ్లేషించండి.
రూపక సమాసం
జవాబు:

  1. సరళా సాగరం – విశ్లేషణ : ‘సరళా’ అనే పేరు గల సాగరం.
  2. కోయిల సాగరం – విశ్లేషణ : ‘కోయిల’ అనే పేరు గల సాగరం
  3. కోస్త దేశం – విశ్లేషణ : ‘కోస్తా’ అనే పేరు గల దేశం
  4. మన్నెం కొండ – విశ్లేషణ : ‘మన్నెం’ అనే పేరు గల కొండ
  5. మెరిగె చాప – విశ్లేషణ : ‘మెరిగె’ అనే పేరు గల చేప
  6. బొచ్చె చాప – విశ్లేషణ : ‘బొచ్చె’ అనే పేరు గల చేప

కింద గీత గీసిన సమాస పదాన్ని పరిశీలించండి.

ధనాలన్నింటిలో శ్రేష్ఠమైనది విద్యాధనం.
పై గీత గీసిన పదములో విద్యకు ధనమునకు భేదం లేనట్లు చెప్పబడింది.
“విద్య అనెడు ధనం” అని ‘విద్యాధనం’ అనే సమాసానికి అర్థం.
‘విద్యాధనం’ అనే సమాసపదంలో, ‘ధనం’ అనేది ఉపమానం.
‘విద్యాధనం’ అనే సమాసపదంలో, ‘విద్య’ అనేది ‘ఉపమేయము’.

అభ్యాసము : కింద గీత గీసిన సమాసపదాలలోని ఉపమాన, ఉపమేయాలను గుర్తించండి.

1. “దయాభరణము”ను ధరించినవాడు భగవంతుడు.
వివరణ : “దయాభరణము” అనే సమాసపదంలో, ‘ఆభరణము’ అనే పదం ఉపమానము. ‘దయ’ అనేది ఉపమేయం.

2. పేదలపై కృపారసము కలిగియుండాలి.
వివరణ : ‘కృపారసము’ అనే సమాసపదంలో, “రసము” అనే పదం, ‘ఉపమానం’, ‘కృప’ అనేది ఉపమేయము.
గమనిక : ఈ విధంగా ఉపమానం యొక్క ధర్మాన్ని, ఉపమేయమందు ఆరోపించడాన్ని, ‘రూపక సమాసం’ అంటారు. లేదా “అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం” అంటారు.

ప్రశ్న 4.
కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి ఏ సమాసాలో గుర్తించండి.

సమాస పదం – విగ్రహవాక్యం – సమాస నామం

అ) పాలమూరు జిల్లా – ‘పాలమూరు’ అను పేరు గల జిల్లా – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
ఆ) సరళాసాగరం – ‘సరళా’ అనే పేరు గల సాగరం – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
ఇ) మన్నెంకొండ – ‘మన్నెం’ అనే పేరు గల కొండ – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
ఈ) కీర్తికన్యక – కీర్తి అనే కన్య – రూపక సమాసం
ఉ) జ్ఞానజ్యోతి – జ్ఞానము అనే జ్యోతి – రూపక సమాసం

ప్రాజెక్టు పని

మీ గ్రామంలో లేదా వాడలో వలసకూలీల వద్దకు/ వాళ్ల బంధువుల వద్దకు వెళ్లి, వలస ఎందుకు వచ్చారో తెలుసుకుని, వాళ్ళ కష్టసుఖాల గురించి ఇంటర్వ్యూ చేసి నివేదిక రూపొందించండి.
జవాబు:
నేను మా గ్రామంలోని వలస కూలీల వద్దకు, వాళ్ళ బంధువుల వద్దకు వెళ్ళి వారు ఏ ప్రాంతం నుండి వచ్చారో, ఎప్పటి నుండి వచ్చారో, ఏ కారణాలతో వచ్చారో ప్రశ్నావళి ద్వారా వివరాలను తెలుసుకున్నాను. కరవుకాటకాల వల్ల, ఉపాధి అవకాశాలు లేనందువల్ల, కూలీ పనులు లేని కారణంగా వలస వచ్చినట్లుగా గ్రహించాను. వారు ప్రతి రోజు దుర్భర జీవితాన్ని గడుపుతున్నట్లుగా అర్థమయ్యింది. అందువల్ల ఇలాంటి వలసకూలీల సంక్షేమానికి ప్రభుత్వం చేయూతను అందివ్వాలి. సంపన్నులు, స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలి. వారిని మనలో ఒకరిగా గుర్తించాలి. వారికి ఉపాధి అవకాశాలను కల్పించాలి. ఉన్నతంగా జీవించే అవకాశాలను కల్పించాలి.

(లేదా)

కార్మికుల, కూలీల బతుకు జీవనం గురించి వచ్చిన కథ/కవిత/గేయం/ పాటలను సేకరించి, నివేదిక రాయండి. చదివి వినిపించండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ

గేయ పంక్తులు – భావం

I

1వ గేయం

కూలి మస్తుగ దొరుకుతాదని!
కోస్తదేశం పోతివా!
ఎన్నడొస్తవు లేబరీ,
పాలమూరి జాలరీ!

భావార్థం :

కూలిమస్తుగ దొరుకుతాదని = కూలి ఎక్కువగా దొరుకుతుందని (కూలి ఎక్కువగా వస్తుందని)
కోస్తదేశం పోతివా = కోస్తా ప్రాంతానికి వెళ్ళావా ?
(ఆంధ్రదేశంలో శ్రీకాకుళం జిల్లా నుండి, నెల్లూరు జిల్లా వరకూ సముద్రతీర ప్రాంతాన్ని కోస్తా దేశం అంటారు. ).
ఎన్నడొస్తవు లేబరీ = ఓ కూలివాడా ! ఎప్పుడు తిరిగి వస్తావు ?
(లేబరర్ = LABORER = కూలివాడు)
పాలమూరి జాలరీ = పాలమూరు జిల్లాలోని
బెస్తవాడా ! (మహబూబ్ నగర్
జిల్లాలో ఉండే బెస్తవాడా !)
(జాలరి = చేపలు పట్టేవాడు)

భావం:కూలి బాగా ముడుతుందని, కోస్తా దేశం వెళ్ళావా ? ఓ పాలమూరి జిల్లా జాలరీ ! ఎప్పుడు తిరిగి వస్తావు ?

2వ గేయం

గోకులాష్టమి దాటిపోయినా, గొడ్లడొక్కలు గుంజివా,
వాగులల్లో, వంకలల్లో వానపాములు ఎండినా,
చినుకురాలే ఆశలేదని, చెర్లుకుంటలు పర్రెవడెవని
కూలి మస్తుగ దొరుకుతాదని కోస్తదేశం పోతివా!

ఎన్నడొస్తవులేబరీ,
పాలమూరి. జాలరీ!

భావార్థం :

గోకులాష్టమి = కృష్ణాష్టమి (గోకులాష్టమి శ్రావణ బహుళ అష్టమినాడు వస్తుంది) (శ్రావణమాసం వెళ్ళిపోతున్నా వర్షాలు రాలేదన్నమాట)
దాటిపోయినా = వెళ్ళిపోయినా
గొడ్లడొక్కలు గుంజినా = పశువుల శరీరాలు, లోపలకు లాగుకుపోయినా; (తిండిలేక వాటి పొట్టలు ఎండి లోతుకు పోయినా)
వాగుల్లో, వంకలల్లో = సెలయేఱులలో, చిన్న ఏఱుల్లో ఉండే
వానపాములు ఎండినా = వానపాములు ఎండిపోయినా (చాలాకాలంగా ఆ వాగులలో, వంకలలో నీరు లేనందున, ఆ మట్టిలోని వానపాములు సైతం ఎండిపోయాయన్న మాట)
చినుకురాలే ఆశలేదని = వానచినుకు పడుతుందని ఆశ ఇంక లేదని ;
చెర్లుకుంటలు = చెరువులూ, గుంటలూ
పర్రెవడెనని = బీటలు తీశాయని ; (నెఱ్ఱలు పడ్డాయని)
కూలి మస్తుగ దొరుకుతాదని = కూలి ఎక్కువగా ఇస్తారని
కోస్తదేశం పోతివా ! = కోస్తాకు వెళ్ళావా !
ఎన్నడొస్తవు లేబరీ = ఓ కూలివాడా! ఎప్పుడు తిరిగి వస్తావు ?
పాలమూరి జాలరీ = పాలమూరులో ఉండే ఓ బెస్తవాడా!

భావం: ఓ పాలమూరు జాలరీ ! కృష్ణాష్టమి వెళ్ళిపోయినా, పశువుల డొక్కలు ఎండిపోయినా, వాగులలో, వంకలలో, వానపాములు ఎండిపోయినా, ఇక్కడ వర్షపు చినుకు నేలపై రాలిపడే ఆశ కనబడటల్లేదని, చెరువులూ, గుంటలూ బీటలు తీశాయనీ, అక్కడ కూలీ బాగా దొరుకుతుందనీ, కోస్తా ప్రాంతానికి వెళ్ళిపోయావా ? ఓ కూలివాడా ! ఎప్పుడు తిరిగి వస్తావో చెప్పు.

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ

3వ గేయం

చాలు వానే పడదు సరళాసాగరం నిండేది కాదని,
చౌట మడుగులె యెండె, కోయిలసాగరం నిండేది కాదని,
పైరు లన్నీ వరుగులయ్యే పల్లెలో బతికేది ఎట్లని,
కూలి మస్తుగ దొరుకుతాదని కోస్తదేశం పోతివా
ఎన్నడొస్తవు లేబరీ,
పాలమూరి జాలరీ!

భావార్థం :

పాలమూరి జాలరీ = ఓ పాలమూరు జిల్లాలో ఉండే జాలరివాడా !
చాలు = ఇంక ఆశలు చాలు
వానే పడదు = ఈ సంవత్సరం ఇంక వాన పడదు
సరళాసాగరం = ‘సరళాసాగరం’ అనే నీటిమడుగు
నిండేది కాదని = ఈ సంవత్సరానికి ఇంక నిండదని;
చౌట మడుగులె = చౌడు నేలల్లో ఉన్న నీటిమడుగులే;
ఎండె = ఎండిపోయాయని;
‘కోయిల సాగరం’
నిండేది కాదని = ‘కోయిల సాగరం’ మడుగు ఇక ఈ సంవత్సరం నిండదని
పైరులన్నీ = పంటచేలన్నీ
పరుగులయ్యే
(వరుగులు + అయ్యే) = వరుగులవలె ఎండిపోతే,
పల్లెలో = గ్రామంలో
బతికేది ఎట్లని = జీవించడం ఎలా అని,
కూలి మస్తుగ దొరుకుతాదని = కూలి బాగా దొరుకుతుందని
కోస్తదేశం పోతివా = కోస్తాకు వెళ్ళావా (సముద్రతీర ప్రాంతం)
ఎన్నడొస్తవు లేబరీ = ఓ కూలివాడా ! ఎప్పుడు వస్తావు ?

భావం: ఓ పాలమూరి జాలరీ ! ఇంక వానపడదని, సరళా సాగరం ఇంక నిండదని, చౌడు నేలల్లో నీటిగుంటలు ఎండిపోయాయనీ, కోయిల సాగర్ ఇంక నిండదని, పైరులన్నీ వరుగుల్లా ఎండిపోయాయనీ, ఇంక పల్లెల్లో బ్రతకడం కష్టమనీ, కూలి ఎక్కువగా దొరకుతుందనీ, కోస్తా దేశానికి వెళ్ళిపోయావా ? ఓ కూలివాడా ! తిరిగి ఎప్పుడు వస్తావు ?

II

4వ గేయం

కొడిమెలూ, గాలాల గడెలూ గుడిసెకు విసిరిపోతివా!
నజాకతు నైలాను వలనే నడుం చుట్టుక పోతివా,
తిరిగి మన్నెంకొండ దేవుని దిక్కు మొక్కుతు పోతివా,
కూలి మస్తుగ దొరుకుతాదని కోస్తదేశం పోతివా
ఎన్నడొస్తవు లేబరీ,
పాలమూరి జాలరీ !

భావార్థం:

పాలమూరి జాలరీ = ఓ పాలమూరు జిల్లా బెస్తవాడా!
కొడిమెల = నావలూ (చేపల బుట్టలు)
గాలాల గడెలు = చేపలను పట్టే గాలముల, కఱ్ఱులూ
(గడె = చేపలు పట్టేసాధనం).
గుడిసెకు విసిరిపోతివా = నీవు ఉండే తాటియాకుల ఇంటిలోకి విసరిపడేసి వెళ్ళిపోయావా ?
నజాకతు, నైలాను వలనే = సున్నితమైన నైలాను దారంతో అల్లిన వలను మాత్రం.
నడుం చుట్టుక పోతివా = నీ నడుముకు చుట్టుకొని వెళ్ళావా ? (కూడా తీసుకువెళ్ళావా అని భావం)
తిరిగి = వెళ్ళిపోతూ వెనుకకు తిరిగి
మన్నెంకొండ దేవుని = మన్నెంకొండలో వేలిసిన వేంకటేశ్వరుడి
దిక్కు మొక్కుతు పోతివా = ధిక్కు చూస్తూ దండం పెడుతూ వెళ్ళావా ?
కూలి మస్తుగ దొరుకుతాదని = కూలి ఎక్కువగా దొరుకుతుందని
కోస్తదేశం పోతివా = కోస్తా దేశానికి వెళ్ళావా ?
ఎన్నడొస్తవు లేబరీ = కూలివాడా ! ఎప్పుడు వస్తావు ?

భావం : ఓ పాలమూరి జాలరీ ! పడవలు, గాలాల కఱ్ఱులు →గుడిసెలోకి విసరిపోయావా ? సున్నితమైన నైలాను వలను నీ నడుముకు చుట్టుకొని వెళ్ళిపోయావా ? వెళ్ళిపోతూ వెనక్కు తిరిగి మన్నెంకొండ వేంకటేశ్వరుడి వైపు చూసి నమస్కారం చేస్తూ వెళ్ళిపోయావా ? కూలి బాగా వస్తుందని, కోస్తా దేశానికి వెళ్ళిపోయావా ? కూలివాడా ! ఎప్పుడు తిరిగివస్తావు ?

5వ గేయం

మెరిగె చాపకు బొచ్చె చాపకు మరిగి రాకనె పోతివా,
చందమానుల, పరక పిల్లల చారు మరిచే పోతినా,
ఎన్నడోస్తవు లేబరీ,
పాలమూరి జాలరీ !

భావార్థం:

మెరిగే చాపకు = మెరిగె అనే చేపలకూ
బొచ్చె చాపకు = ‘బొచ్చెలు’ అనే చేపలకూ (మెరిగెలు, బొచ్చెలు కోస్తాలో దొరికే చేపలు).
మరిగి = అలవాటుపడి (కోస్తా ప్రాంతంలో దొరికే మెరిగె, బొచ్చెలు అనే చేపలు తినడానికి అలవాటుపడి)
రాకనె పోతివా = తిరిగి పాలమూరు. రాకుండా పోయావా ?
చందమామల, పరక పిల్లల= చందమామలు, పరకలు అనే చేపపిల్లలతో పెట్టే;
చారు మరిచే పోతివా = చారు రుచి మరచిపోయావా!
పాలమూరి జాలరీ = ఓ పాలమూరి జాలరీ !
ఎన్నడొస్తవు లేబరీ = ఓ కూలివాడా ! ఎప్పుడు వస్తావు ?

భావం: ఓ పాలమూరి జాలరీ ! కోస్తా ప్రాంతంలో దొరికే మెరిగెలు, బొచ్చెలు అనే చేపలకు అలవాటుపడి, తిరిగి ఇక్కడకు రాకుండా పోయావా ? ఇక్కడ దొరికే చందమామల, పరక పిల్లల చారు రుచిని మరచిపోయావా ? ఓ కూలివాడా ! ఎప్పుడు వస్తావు ?

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ

6వ గేయం

కోస్తబెస్తల పడవలల్లో కూలివయ్యిన కర్మమెందుకు ?
ఎగువ కృష్ణా ఆనకట్టను ఇంత వరకూ వేయవందుకు
ఏడ ఉంటివొ లేబరీ,
ఎన్నడొస్తవు జాలరీ !

భావార్థం:

కోస్తబెస్తల = కోస్తా తీరంలోని చేపలు పట్టే బెవాండ్ర
పడవలల్లో = పడవలలో
కూలివయ్యిన కర్మమెందుకు = కూలిగా పడి ఉండవలసిన కర్మము నీకు ఎందుకు ?
ఎగువ కృష్ణా ఆనకట్టను = కృష్ణా నదిపై ఎగువ భాగాన (పై భాగాన) ఆనకట్టను
ఇంతవరకూ వేయనందుకు = ఇంతవరకూ కట్టనందువల్లనే కదా !
ఏడ ఉంటివొ లేబరీ = ఓ కూలివాడా ! ఎక్కడ ఉన్నావు ?
ఎన్నడొస్తవు జాలరీ = ఓ జాలరీ ! ఎప్పుడు తిరిగి పాలమూరు వస్తావు ?

భావం : కృష్ణా నదిపై ఎగువన ఆనకట్ట కడితే, పాలమూరు జిల్లాకు నీరు వచ్చేది. అప్పుడు ఆ ప్రాంత ప్రజలు వలసలు వెళ్ళవలసిన అవసరం ఉండేది కాదని గేయకర్త అభిప్రాయం.

7వ గేయం

ఇంటికొస్తానన్న గడువుకు ఇప్పటికి వారాలు దాటె,
చీకు మబ్బుల ముసురులో కార్తీకపున్నం వెళ్ళిపాయె,
ఇటే పోయిన జనం – అంతా అటే చచ్చే కాలమంటు,
జలపిడుగు పొర్లాడి భద్రాచలం మెట్లకు తాకెవంటా
ఎక్కడుంటివి లేబరీ,
ఎన్నడొస్తవు జాలరీ !

భావార్థం :

ఇంటికొస్తానన్న గడువుకు = నీవు ఇంటికి తిరిగి వస్తానన్న కాలవ్యవధికి;
ఇప్పటికి వారాలు దాటే = ఇప్పటికే వారాలు దాటిపోయాయి
చీకు మబ్బుల = చితికిపోయిన చిన్న చిన్న మబ్బుల
ముసురులో = ఎడతెగని చిరు వానలో
కార్తీకపున్నం = కార్తీక పౌర్ణమి
వెళ్ళి పాయె = వెళ్ళిపోయింది
ఇటే పోయిన జనం = ఇక్కడి నుండి కోస్తా వెళ్ళిన జనము
అంతా అటే చచ్చే కాలమంటు = అంతా అక్కడే చచ్చే కాలము వచ్చిందన్నట్లు;
జలపిడుగు పొర్లాడి = ‘నీటి ఉధృతి’ అనగా గోదావరి నది వరద పొంగి
భద్రాచలం మెట్లకు తాకెనంటా = భద్రాచలంలోని శ్రీరామ పాదాలను తాకిందట కదా !
ఎక్కడుంటివి లేబరీ = ఓ కూలివాడా! ఎక్కడ ఉన్నావు?
ఎన్నడొస్తవు జాలరీ = ఓ జాలరివాడా ! ఎప్పుడు వస్తావు ?

భావం : ఓ కూలివాడా ! నీవు ఇంటికి తిరిగివస్తానన్న కాలవ్యవధి, ఇప్పటికే వారాలు దాటిపోయింది. చిన్నమబ్బుల ముసురువానలో కార్తీక పౌర్ణమి కూడా వెళ్ళిపోయింది. ఇక్కడి నుండి కోస్తా ప్రాంతానికి వెళ్ళిన జనం, అంతా అక్కడే చచ్చే కాలం వచ్చినట్లు, గోదావరి వరద భద్రాచలంలోని రామ పాదాలను తాకిందట. నీవు ఎక్కడ ఉన్నావు ? ఓ జాలరీ! ఎప్పుడు తిరిగి వస్తావు ?

పాఠం నేపథ్యం

తెలంగాణ రాష్ట్రంలో నీటివసతికి నోచుకోక, పంటలు పండక, నిరంతరం కరువురక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రాంతం పాలమూరు, నాటి పాలమూరు జిల్లానే నేటి మహబూబ్నగర్ జిల్లా. బతుకుభారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళదీయలేక బతుకటానికి వలసపోవడం అక్కడి కూలీలకు పరిపాటి.

1977లో తూర్పు తీరప్రాంతానికి వలస వెళ్ళిన, కొందరు పాలమూరు కూలీలు అక్కడ వచ్చిన తుపానుకు గురై తిరిగిరాలేదని, వాళ్ళెక్కడున్నరో జాడతెలియనప్పుడు కవి హృదయంలో కలిగిన ఆవేదన ఇది.

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం గేయ ప్రక్రియకు సంబంధించినది. “లయాత్మకంగా ఉండి, ఆలపించేందుకు వీలుగా ఉండేది గేయం”. ఈ గేయం, పల్లవి, చరణాలతో కూడి ఉంటుంది. పల్లవి మాత్రం పునరావృతమవుతుంది. సంగీత సాహిత్యాల మేళవింపే ‘గేయం’.
ప్రస్తుత పాఠ్యభాగం, డా॥ ముకురాల రామారెడ్డిగారి ‘హృదయశైలి’ అనే గేయ సంకలనంలోనిది.

కవి పరిచయం

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ 1
01.01.1929
24.02.2003

పాఠ్యభాగము : ‘వలసకూలీ !’

కవి : డా॥ ముకురాల రామారెడ్డి

దేని నుండి గ్రహింపబడింది : కవి రాసిన ‘హృదయశైలి’ గేయ సంకలనం నుండి గ్రహింపబడింది.

జననము : వీరు 01.01.1929న జన్మించారు.

జన్మస్థలము : నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ‘ముకురాల’ గ్రామంలో వీరు జన్మించారు.

రచనలు :

  1. మేఘదూత (అనువాద కవిత్వం),
  2. దేవరకొండ దుర్గం,
  3. నవ్వేకత్తులు (దీర్ఘకవిత),
  4. హృదయశైలి (గేయ సంపుటి),
  5. రాక్షసజాతర (దీర్ఘకవిత),
  6. ఉపరిశోధన (పరిశోధనా పత్రాల సంకలనం),
  7. తెలుగు సాహిత్య నిఘంటువు మొదలగునవి రచించారు.

పరిశోధనా గ్రంథం : “ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావపరిణామం” అనే అంశంపై పరిశోధనా గ్రంథం వెలువరించారు.

సన్మానాలు:

  1. వీరి ‘విడిజోడు’ కథకు, కృష్ణాపత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతిని ఇచ్చారు.
  2. ఆకాశవాణి ఢిల్లీ వారు 1967లో ఆంధ్రప్రదేశ్ నుండి జాతీయ కవిగా వీరిని గుర్తించి, సన్మానం చేశారు.

ప్రవేశిక

మానవ జన్మ ఎంతో ఉదాత్తమైనది. ఇది లభించడం ఒక వరం. లభించిన జీవితం సార్ధకం చేసుకోవాలన్నది ప్రతి ఒక్కరి తపన. ఆశ. కానీ ………….
కాలం కలిసి రాని అభాగ్యజీవులు, తమ జీవితాన్ని నెట్టుకురావడమే ఒక ‘కల’గా భావించవలసి వస్తే …………
అందంగా ఉండవలసిన ‘కల’ కూడా ‘పీడకల’గా పరిణమిస్తే ……………..

బతుకు బండి నడిపేటందుకు తన కలలన్నీ, కల్లలు కాగా పొట్టచేత పట్టుకొని ఒంటరిగా పరాయి దేశం పోయి ….
మనసును పంచుకొనేటందుకు మనుషులు లేక,
బాధను పంచుకొనేటందుకు బంధువులు లేక,
సమాజం నుండి దూరమౌతున్న వ్యథార్థజీవితాలను గురించి,
ముకురాలవారు రాసిన గేయం చదువుదాం.

TS 9th Class Telugu Study Material Guide Pdf Download Telangana

TS 9th Class Telugu Guide Study Material Pdf Telangana

9th Class Telugu Guide Pdf Download Telangana | 9th Class Telugu Study Material Telangana

ఉపవాచకం

TS 9th Class Telugu Grammar Telangana

TS 9th Class Study Material

TS 9th Class Study Material Telangana Pdf Textbook Solutions

TS 9th Class Study Material Pdf Telangana | TS 9th Class Textbook Solutions Guide

TS Board Solutions

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

These TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ will help the students to improve their time and approach.

TS 9th Class Telugu 3rd Lesson Important Questions వలసకూలీ

PAPER – I : PART – A

I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)

అ) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
పాలమూరు జిల్లా ప్రజలు అధికంగా వలస కూలీలుగా ఎందుకు జీవిస్తున్నారు ?
జవాబు:
పాలమూరులో కూలీలకు పని దొరికేదికాదు. కనీసం వారికి తిండి ఉండేది కాదు. త్రాగడానికి నీరు కూడా దొరికేది కాదు. ఆ ప్రాంతంలోని భూస్వాములకు వ్యవసాయం చేసేందుకు సాగునీటి సౌకర్యం లేదు. వర్షాలు లేవు. దానితో కూలీలు తిండిలేక, పస్తులు పడుకోవలసి వచ్చేది. వారి పిల్లలకు చదువు సంధ్యలు లేవు. వారికి జబ్బుచేస్తే మందులు వేసికోడానికి కూడా డబ్బులు వారి వద్ద ఉండేవి కావు. అందుకే వారు కూలీ దొరికే ప్రాంతాలకు వలసలు పోయి జీవిస్తున్నారు.

ప్రశ్న 2.
వలస జీవితంలో ఉన్న అవస్థలేవి?
జవాబు:
ఒక ప్రాంతంలోని జనం, ఆ ప్రాంతంలో వారు జీవించడానికి అనువైన పరిస్థితులు లేనపుడు, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వారి జీవనానికి అనువైన మరో ప్రాంతానికి వలసలు పోతారు. అక్కడైనా సరైన సదుపాయాలు ఉంటాయా అంటే ! అనుమానమే. ముఖ్యంగా స్థానికంగా ఉండేవారి వల్ల ఇబ్బందులు.

ఇక తినటానికి, ఉండటానికి తిండి, జాగా దొరకక ‘ నానా ఇబ్బందులు పడాలి. తమ పిల్లల చదువులు గాని, వైద్యపరంగా సదుపాయాలు గాని ఉండవు. రేషన్ కార్డులు, పింఛన్లు వంటివి కూడా ఉండవు. అటు ఉన్న ఊరును కాదనుకొని వచ్చినందుకు ఈ ఊరులోనివారు వీరిని కాదంటారు. మొత్తం మీద వీరి అవస్థ “రెండిటికి చెడ్డ రేవడి పరిస్థితి”.

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 3.
పల్లె జీవనం కష్టతరంగా మారింది. కారణాలు ఏమై ఉంటాయని భావిస్తున్నావు ?
జవాబు:
పల్లెలు వ్యవసాయ క్షేత్రాలు. రైతులే ప్రత్యక్ష దేవుళ్ళు. చెమటోడ్చి తన రక్తాన్నే పెట్టుబడిగా పెట్టి పంట పండించి, లోకానికి అన్నం పెడుతున్న రైతు ‘అన్నదాత’. ఆ అన్నదాతకు నేడు కష్టకాలం వచ్చింది. మన విపరీత ధోరణుల వల్ల ప్రకృతి వికృతిగా మారింది. రైతును కుంగదీస్తోంది. ఒకసారి అతివృష్టి, మరొకసారి అనావృష్టితో ప్రకృతి విలయతాండవం చేసి, రైతును అతలాకుతలం చేస్తుంది. రాబడి లేకపోగా అప్పులు, వడ్డీలు పెరిగి బ్రతుకు భారంగా మారి, చివరకు మరణమే మేలు అని భావిస్తున్నాడు రైతు.

ఇలాగే కొద్ది తేడాలతో అన్ని వృత్తులవారి పరిస్థితి ఇలాగే ఉంది. ఒకప్పుడు ఒకరి కష్టంలో మరొకరు పాలుపంచుకునే స్థితి నుండి ప్రస్తుతం ఎవరికి వారే యమునా తీరే అన్న స్థితికి చేరింది. ప్రభుత్వం నుండి కూడా ఎటువంటి సాయం అందకపోవడం ప్రధాన కారణం. చెట్టుకున్న పళ్ళను గమనిస్తామేగాని.

చెట్టును గమనించనట్లు పల్లెలలోనివారి బ్రతుకులూ ఉన్నాయి. కనుకనే పల్లెజీవనం కష్టతరంగా మారింది. విద్యా, వైద్య సదుపాయాలు, విద్యుత్ సౌకర్యం, యువకులకు సరైన ఉపాధి మొదలైనవి లేకపోవడం మరో కారణం.

ఆ) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
పల్లెవాసులు వలసపోవడానికి కారణాలేమిటో వివరించండి.
జవాబు:
నీటి వసతికి నోచుకోలేక, పంటలు పండక, నిరంతరం కరవు రక్కసి కోరల్లో చిక్కుకున్నవారు, బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళదీయలేక బతుకటానికి పల్లెవాసులు వలస పోవడం జరుగుతుంది.

మానవజన్మ ఉదాత్తమైనది. ఇది లభించడం ఒక వరం. లభించిన జీవితం సార్ధకం చేసుకోవాలన్నది ప్రతి ఒక్కరి తపన, ఆశ. కానీ కాలం కలిసిరాని అభాగ్యజీవులు, తమ జీవితాన్ని నెట్టుకురావడమే ఒక ‘కల’గా భావించవలసి వస్తే అందంగా ఉండాల్సిన ‘కల’ కూడా ‘పీడకల’గా పరిణమిస్తే, బతుకు బండి నడిపేటందుకు తన కలలన్నీ, కల్లలు కాగా పొట్టచేత పట్టుకొని ఒంటరిగా పరాయి దేశం పోయి మనసును పంచుకొనేందుకు మనుషులు లేక, బాధను పంచుకొనేందుకు బంధువులు లేక, సమాజం నుండి దూరమౌతున్న వ్యథార్థ జీవితాలు గడుపుతున్న పల్లెవాసుల బతుకులు దయనీయంగా ఉన్నాయి.

పల్లెవాసులు వలసపోవడానికి కారణాలు : పని ఎక్కువ దొరుకుతుందని, పైసలు ఎక్కువ వస్తాయని ఆశే వలసలకు ప్రధాన కారణం. వానలు లేక పంటలు ఎండిపోయి, పశువులకు మేతలు కరువవటం పల్లెవాసుల వలసలకు మరొక కారణం. సరైన ఉపాధి లేకపోవడం, ప్రభుత్వం నుండి సరైన ఆదరణలేక కూలీలు, యువకులు వలసల బాట పడుతున్నారు. సరైన విద్య, వైద్య సదుపాయాలు పల్లెలలో లేకపోవడం వలసలకు దారితీస్తున్నది.

ప్రశ్న 2.
‘కోస్తబెస్తల పడవలలో కూలివయ్యిన కర్మమెందుకు ?” అని కవి ఎందుకు అనవలసి వచ్చింది ?
జవాబు:
‘కోస్తబెస్తల పడవలలో కూలివయ్యిన కర్మమెందుకు ?’ ఈ వాక్యం డా॥ ముకురాల రామారెడ్డిగారి ‘హృదయశైలి’ అనే గేయ సంకలనంలోనిది. తెలంగాణ రాష్ట్రంలో నీటివసతిలేక పంటలు పండక, ఎప్పుడూ కరవు రాక్షసి కోరల్లో చిక్కుకున్న ప్రాంతం ‘పాలమూరు’. బ్రతుకు భారాన్ని మోస్తూ, కాలాన్ని వెళ్ళదీసే మార్గం లేక, బ్రతుకు తెరువు కోసం వలస పోవడం పాలమూరు (మహబూబ్నగర్) జిల్లాలోని కూలీలకు పరిపాటి.

ఈ విధంగా 1977లో పాలమూరు నుండి తూర్పుతీర ప్రాంతానికి వలస కూలీలుగా వెళ్ళి, తుపానులో చిక్కుకొని తిరిగిరాలేదు. ఆ సందర్భంలో కవి హృదయంలో కలిగిన ఆవేదనలోంచి వచ్చిన మాటల్లో ఇదొకటి.

కోస్తాబెస్తల పడవల్లో కూలీగా పనిచేసే కర్మ నీకు, కృష్ణా ఎగువ ఆనకట్ట కట్టకపోవడం వల్లనే కదా ! అని కవి విచారిస్తున్నాడు. కృష్ణానదిపై ఎగువ ఆనకట్ట కడితే, ఆ నీళ్ళు మహబూబ్ నగర్ జిల్లా పొలాలకు అందుతాయి.

ఆ నీళ్ళు లభ్యమైతే, అక్కడి ప్రజలు వర్షాధారంగా జీవించాల్సిన పనిలేదు. కృష్ణా జలాలతో తమ పంటలు పండించుకోవచ్చు.. ప్రస్తుతం ఆ ఆనకట్ట కట్టకపోవడం, వర్షాలు లేకపోవడం వల్ల పాలమూరు జనులకు ఈ పరిస్థితి వచ్చిందని కవి ఆవేదన చెందారు.

PAPER – 1 : PART – B

భాషాంశాలు – పదజాలం :

I. సొంతవాక్యాలు :

అ) కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

1. మస్తుగ : ఒకటి కొంటే ఒకటి ఉచితం అని అమ్ముతున్న దుకాణం ముందు జనం మస్తుగ జమైనారు.
2. గడువు : మీరు గడువు దాటిన మందులు కొనకండి.
3. పైరు : వెన్ను వేసి, నిలిచిన మొక్కజొన్న పైరు కన్నుల పండుగగా ఉంది.
4. వలస : కరవు తాండవించడంలో వ్యవసాయదారులు కూలీలుగా నగరాలకు వలస వెళ్ళిపోతున్నారు.

II. అర్థాలు :

ఆ) కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.

ప్రశ్న 1.
వరుగులు – అంటే అర్థం
A) ఎండిన కాయ గింజలు
B) బక్కచిక్కిన
C) ఒరిగిన
D) తరిగిన
జవాబు:
A) ఎండిన కాయ గింజలు

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 2.
“జలపిడుగు” అనే పదం కవి ఈ అర్థంలో వాడాడు.
A) ఒకరకం చేప
B) వరద
C) ఉరుము
D) నిప్పు
జవాబు:
B) వరద

ప్రశ్న 3.
తిరగడం మరిగితే చదవడం తగ్గుతుంది – గీత గీసిన పదానికి అర్థం
A) కోపం
B) అలవాటుపడు
C) చల్లార్చు
D) మొదలుపెట్టు
జవాబు:
B) అలవాటుపడు

ప్రశ్న 4.
“క్రమ్ముకొను” అనే అర్థం గల పదం
A) కొమ్ములు మొలుచు
B) చుట్టుప్రక్కల అంటే సరియైన అర్థం
C) ముసురుకొను
D) మొక్క మొలుచు
జవాబు:
C) ముసురుకొను

ప్రశ్న 5.
జాలరి – అంటే సరియైన అర్ధం
A) పొడగరి
B) కూలి
C) చేపలు పట్టువాడు
D) కోస్తావాడు
జవాబు:
C) చేపలు పట్టువాడు

ప్రశ్న 6.
ముద్దతు – అంటే అర్థం
A) గడువు సమయం
B) మద్దతు
C) ముదిరిన
D) సౌకర్యం
జవాబు:
A) గడువు సమయం

ప్రశ్న 7.
నిరంతరం కరవు రక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రాంతం పాలమూరు – గీత గీసిన పదానికి అర్థం
A) ఆకలి
B) మనిషి
C) రాక్షసి
D) బాధ
జవాబు:
C) రాక్షసి

ప్రశ్న 8.
సమాజం నుండి దూరమౌతున్న వ్యథార్త జీవితాలు ఎన్నో – గీత గీసిన పదానికి అర్థం
A) నిజం
B) బాధ
C) లేమి
D) కలిమి
జవాబు:
B) బాధ

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 9.
జాలరిని గూర్చి భార్యాపిల్లలు యాది జేసుకోవడం ఎంత ఆర్ధ్ర్రంగా ఉంటుందో – గీత గీసిన పదానికి అర్థం
A) తడిసినది
B) తడిపి
C) గుర్తు
D) సంతోషం
జవాబు:
B) తడిపి

III. పర్యాయపదాలు:

ప్రశ్న 1.
బర్లు, గొడ్లు, పసులు – అనే పర్యాయపదాలు గల పదం
A) సొమ్ములు
B) గేదెలు
C) గోర్లు
D) పాడి
జవాబు:
B) గేదెలు

ప్రశ్న 2.
“పల్లె” అనే పదానికి పర్యాయపదాలు
A) పల్లె, ఇల్లు
B) జనపదం, గ్రామం
C) ఊరు, పేట
D) పేట, నగరం
జవాబు:
B) జనపదం, గ్రామం

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 3.
కొలనులోని చేపలు ఎగిరెగిరి పడుతున్నాయి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) మెరిగెలు, చందమామలు
B) మీనములు, మత్స్యములు
C) కొర్రలు, జలపుష్పాలు
D) బాడిస, రొయ్యలు
జవాబు:
B) మీనములు, మత్స్యములు

ప్రశ్న 4.
మబ్బు – అనే పదానికి పర్యాయపదాలు కానిది.
A) మేఘము, మొయిలు
B) జీమూతం, చీకటి
C) అంబుదము, జలదము
D) వారిదము, జీమూతం
జవాబు:
B) జీమూతం, చీకటి

ప్రశ్న 5.
కూలి మస్తుగ దొరుకుతాదని, కోస్త దేశం పోతివా ?
A) వేతనం, పెత్తనం
B) మూల్యం, అమూల్యం
C) భరణం, భారం
D) భృతి, భృత్యం
జవాబు:
D) భృతి, భృత్యం

IV. ప్రకృతి, వికృతులు:

గీత గీసిన పదానికి పర్యాయపదాలు

ప్రశ్న 1.
దేశనాయకులు దేశసేవ చేయాలని “ఆశ” – గీత గీసిన పదానికి వికృతి
A) దిక్కు
B) ఆస
C) ఆశలు
D) అసు
జవాబు:
B) ఆస

ప్రశ్న 2.
పూర్ణిమ, పౌర్ణమి – అనే పదాలకు సరియైన వికృతి
A) పూర్ణము
B) పురాణము
C) పున్నమి
D) పూస
జవాబు:
C) పున్నమి

ప్రశ్న 3.
“సింగం” వికృతిగా గల పదం
A) సింహం
B) సింగిడి
C) సిగ
D) సికరం
జవాబు:
A) సింహం

ప్రశ్న 4.
కవి హృదయంలో ఆవేదన – గీత గీసిన పదానికి వికృతి
A) ఎద
B) గుండె
C) మనసు
D) చిత్తం
జవాబు:
A) ఎద

V. నానార్థాలు

ప్రశ్న 1.
ముకురాల ప్రజల కోసం కలం పట్టిన కవి – గీత గీసిన పదానికి
A) కావ్యకర్త, పండితుడు
B) నీటికాకి, కవిలె
C) శుక్రుడు, కుజుడు
D) గణపతి, పవి
జవాబు:
A) కావ్యకర్త, పండితుడు

ప్రశ్న 2.
వైపు, దిశ, ఆధారము – అనే నానార్థాలు గల పదం
A) నిశి
B) దిక్కు
C) తాళము
D) మూల
జవాబు:
B) దిక్కు

ప్రశ్న 3.
“కాలము” అను పదమునకు నానార్థాలు
A) సమయము, వానాకాలము
B) సమయము, నలుపు
C) నలుపు, ఋతువు
D) పత్రికలో భాగం, వెల
జవాబు:
B) సమయము, నలుపు

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 4.
చాలు వానే పడదు సరళా సాగరం నిండేది కాదని – గీత గీసిన పదానికి నానార్థాలు
A) మదం, మందం
B) సంద్రం, సంఖ్య
C) మృగం, మెకం
D) నేతిసిద్దె, గిన్నె
జవాబు:
B) సంద్రం, సంఖ్య

VI. వ్యుత్పత్యర్థములు

ప్రశ్న1.
జాలరి – అనే పదానికి వ్యుత్పత్తి అర్థం
A) చేపలు పట్టువాడు
B) జాలము (వల) కలిగినవాడు
C) చాలాకాలము నీటిలో ఉండువాడు.
D) జాలమునకు శత్రువు
జవాబు:
B) జాలము (వల) కలిగినవాడు

ప్రశ్న2.
కృత్తికా నక్షత్రం పౌర్ణిమనాడు గల మాసం – దీనికి వ్యుత్పత్తి పదం
A) మార్గశిరం
B) కార్తీకం
C) మాఘం
D) చైత్రం
జవాబు:
B) కార్తీకం

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

ప్రశ్న3.
అక్షమునకు అభిముఖమైనది – దీనికి వ్యుత్పత్తి పదం
A) పరోక్షం
B) అక్షయ
C) ప్రత్యక్షం
D) అక్షాంశం.
జవాబు:
C) ప్రత్యక్షం

PAPER – II : PART – A

అపరిచిత పద్యాలు

1. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

కోపమునను ఘనత కొంచమై పోవును
కోపమునను గుణము కొరత వడును
కోపమునను బ్రతుకు కొంచమై పోవును
విశ్వదాభిరామ ! వినుర వేమ !

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
దేనివలన గొప్పదనము తగ్గిపోతుంది ?
జవాబు:
కోపము వలన గొప్పదనము తగ్గుతుంది.

ప్రశ్న 2.
గుణము ఏలా కొరతపడుతుంది ?
జవాబు:
కోపము వలన గుణము కొరతపడుతుంది.

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 3.
కోపము వలన బ్రతుకు ఏమౌతుంది ?
జవాబు:
కోపము వలన బ్రతుకు కొంచమై పోతుంది.

ప్రశ్న 4.
పై పద్యానికి సరైన శీర్షిక పెట్టండి.
జవాబు:
కోపము

ప్రశ్న 5.
పై పద్యానికి ఒక ప్రశ్న తయారు చేయండి.’
జవాబు:
పై పద్యం ఏ శతకంలోనిది ?

2. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

పరగ రాతి గుండు పగులఁ గొట్టఁగవచ్చు
కొండలన్ని పిండి కొట్టవచ్చు
కఠినచిత్తు మనసు కరిగింపఁగా రాదు
విశ్వదాభిరామ ! వినుర వేమ !

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
వేటిని పగుల గొట్టవచ్చును ?
జవాబు:
రాతి గుండులను పగుల గొట్టవచ్చును.

ప్రశ్న 2.
వేటిని పిండి కొట్టవచ్చును ?
జవాబు:
కొండలను పిండి కొట్టవచ్చును.

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 3.
ఎవరి మనస్సుని కరిగించలేము ?
జవాబు:
కఠిన చిత్తుని మనస్సుని కరిగించటము కష్టము.

ప్రశ్న 4.
పై పద్యము ఏ శతకములోనిది ?
జవాబు:
పై పద్యము వేమన శతకము లోనిది.

ప్రశ్న 5.
పై పద్యాన్ని ఎవరు రచించారు ?
జవాబు:
పై పద్యాన్ని వేమన రచించారు.

3. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమునఁ దా
నెక్కిన బాఱని గుఱ్ఱము
గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ !

ప్రశ్నలు

ప్రశ్న 1.
ఎటువంటి చుట్టమును విడిచిపెట్టాలి ?
జవాబు:
సమయమునకు సహాయము చేయని చుట్టమును విడిచిపెట్టేయాలి.

ప్రశ్న 2.
ఎటువంటి దైవమును విడిచిపెట్టాలి ?
జవాబు:
నమస్కరించిననూ వరమీయని దేవుణ్ణి విడిచి పెట్టవలెను.

ప్రశ్న 3.
యుద్ధములో ఎవరిని విడిచిపెట్టాలి ?
జవాబు:
యుద్ధములో తానెక్కగా పరిగెత్తని గుఱ్ఱమును వెంటనే విడిచిపెట్టాలి.

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 4.
పై పద్యములోని నీతి ఏమిటి ?
జవాబు:
అవసరానికి ఉపయోగపడని వాటిని వెంటనే విడిచిపెట్టాలి.

ప్రశ్న 5.
పై పద్యం ఏ శతకంలోనిది ?
జవాబు:
పై పద్యం సుమతీ శతకంలోనిది.

4. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

అన్ని దానములను నన్నదానమె గొప్ప
కన్నతల్లి కంటె ఘనము లేదు
ఎన్న గురుని కన్న నెక్కుడు లేదయా
విశ్వదాభిరామ! వినుర వేమ !

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
దానములన్నింటి కన్నా ఏ దానము గొప్పది ?
జవాబు:
దానములన్నింటి కన్నా అన్నదానమే గొప్పది.

ప్రశ్న 2.
ఎవరి కంటే మించినది లేదు ?
జవాబు:
కన్నతల్లి కంటే మించినది లేదు.

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 3.
ఎవరికన్న మించిన వ్యక్తి లేడు ?
జవాబు:
గురువు కంటే మించిన వ్యక్తి లేడు.

ప్రశ్న 4.
ఈ పద్యము ఏ శతకములోనిది ?
జవాబు:
ఈ పద్యము వేమన శతకములోనిది.

ప్రశ్న 5.
పై పద్యంలో ఏ దానం గురించి చెప్పారు ?
జవాబు:
పై పద్యంలో అన్నదానము గురించి చెప్పారు.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
సంభాషణ

బతుకు భారాన్ని నడిపేందుకు కూలీలు వలసలకు వెళుతున్నారు. దీనికి గల కారణాలను తెలుపుతూ ‘సంభాషణను’ రాయండి.
జవాబు:
సోములు : ఓరేయ్ చంద్రయ్యా ! రాములుగాడు, ఆడిపెళ్ళాం పిల్లలు రెండు రోజులు నుండి కనిపించడం లేదు ఏడకు ఎల్లిండ్రు ?

చంద్రయ్య : నీకు ఏంది మావా, తినటానికి తిండిలేక, పస్తులుండలేక టౌనుకు పోయినడు గందా.

సోములు : ఒర్రేయ్ అల్లుడూ ! ఎంత కస్టమొచ్చినాది. నిజంగా నాకు తెల్దు. ఔను గానీ, ఇక్కడే ఏదో పని చేసుకోవాలి గాని ఊరు ఒదిలి యెత్తే కొత్త ఊళ్ళో ఎవరు పని ఇత్తాడ్రా ?

చంద్ర : నిజమే మామ. కాని ఊళ్ళో ఏం పనుందే. వానలు లేక పొలం పన్లు లేవు. పసులకే గడ్డి లేదు. వాడికి పనిచ్చేదెవరు.

సోములు : అవున్రా. వానల్లేక అందరికి ఇబ్బందిగానే కాలం గడస్తొంది. మరి ఓబులేసు, సుబ్బారావు వాళ్ళంతా ఏం చేస్తుండ్రు.

చంద్ర : వాళ్ళా, ఓ పూట గంజినీళ్ళు, ఓ పూట పస్తులు.

సోములు : ఉన్న చెరువును పూడ్చి మిద్దెలు కట్టాలని ఆ కాంట్రాక్టరు సెప్పినాడని ఊ గొట్టినామ్. ఆ పని మన నోళ్ళలో మట్టి కొట్టినాది.

చంద్ర : అవును మామ. డబ్బులు సూసేసరికి రాబోయే కష్టకాలం యాదికి రానేదు. ఇప్పుడదే నోటి కూడు తీసినాది.

సోములు : ప్రభుత్వమైనా సాయం సేయదా ?

చంద్ర : ఎందుకు సేయదు. కాని వెంబడినే జరక్కపోవచ్చు.

సోములు : అక్కడ వాడు ఎలా బతుకుతుండో ఎంటో, బాధగా ఉందిరా.

చంద్ర : మనం చేసుకున్న పనులే మనకు కాని కాలాన్ని తెచ్చాయి మావ, చెట్లు నరుకున్నాం. చెరువు పాడు చేసుకున్నాం.

సోములు : మన పెద్దలు మనకిచ్చింది. మళ్ళీ మనం మన బిడ్డలకు ఈనేక పోతున్నాం. ఏది ఏమైన ఉన్న ఊరుని కాదని పొరుగూరు వెళ్తే ఎట్టా ఉంటదో తెలిసి కూడా ఎట్టా వెళ్ళాలిరా ?

చంద్ర : తప్పదు సోములు మావ. తిండిలేదు, వైద్దిగం కూడా నేదు. పిల్లల సదువులకు పట్నం పోవల్సిందే. ఇక్కడే ఉంటే జరుగుబాటు కావద్దా ?

సోములు : నిజమే లేరా. కలికాలం అంటేనే కాని కాలం. సీకటి పడినాది పోదాం పదా.

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 2.
గేయం

“ఆకలి మంటలు ఆరని మంటలు. బడుగుల బతుకులు, అతుకుల బొంతలు, నలిగిన బతుకులు. తీరని వెతలు – పట్టెడు మెతుకులే పరమాన్నాలు” ఇటువంటి ప్రాస పదాలను వాడుతూ వలస జీవుల బ్రతుకులపై గేయాన్ని రాయండి.
జవాబు:

వలస జీవుల బతుకులు

పొట్ట చేత బట్టి, పెళ్ళాం బిడ్డలను విడిచిపెట్టి
నోరు కట్టి, వలసకు వెళ్ళావా ? వనాల కెళ్ళావా ?
గంపెడు ఆశతో గుండెలవిశేలా కష్టం చేసి
కూలీ కోసం రక్తాన్ని చెమటగా మార్చేసి
గుండెను బండగ చేసావా ఎందయ్యా ?

చాలీ చాలక ఆకలి తీరక
గుండె మంటలు ఆర్పలేక పోతున్నావా ?
ఇంటి ఆడది మాది కొస్తోందా ?
పిల్లల కోసం మనసు లాగేస్తోందా ?
గుండెను బండను చేసాయా ఏందయ్యా ?

నిన్ను నిన్నుగానే చూడాలనుకొనే కళ్ళు
వేయికళ్ళతో వెదుకుతున్న ఆనవాళ్ళు
నీకు తెలియవచ్చే నాటికి గడిచేను ఎన్నో యేళ్ళు
నీ వాళ్ళు గుర్తు రావటం లేదా ఇన్నాళ్ళు
గుండెలవిసేలా రోదిస్తున్నావా ఏందయ్యా ?

ప్రశ్న 3.
వ్యాసం
వలస కూలీల కష్టసుఖాలను వ్యాసరూపంలో రాయండి.
జవాబు:
పూర్వం గ్రామాల్లో భూస్వాములు ఉండేవారు. పెద్ద వ్యవసాయం ఉండేది. దానితో గ్రామాల్లో కూలీలందరికి పని దొరికేది. ఇప్పుడు ఆ భూస్వాములు లేరు. ఉపాధి లేదు. పైగా యంత్రాలు అమల్లోకి వచ్చాయి. దానితో కూలీల అవసరం తగ్గింది. గ్రామాల్లో కూలీల పిల్లలకు విద్యా, వైద్య ఉపాధి సౌకర్యాలు అంతగా లేవు.

గ్రామాల్లో ఉన్న యువకులు తమ జీవనభృతిని సంపాదించుకోగల స్థితులు గ్రామాల్లో నేడు లేవు. ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమితో వారికి కావలసిన సదుపాయాలు లభించడం లేదు. వ్యవసాయదారులకు ప్రభుత్వ సహాయం ఉండడం లేదు.

గ్రామాల్లో 24 గంటలూ విద్యుచ్ఛక్తి సౌకర్యం ఉండడంలేదు. రవాణా సౌకర్యాలు లేవు. త్రాగునీరు, సాగునీరు సదుపాయాలు లేవు.

తినడానికి తిండి, తాగటానికి నీరు, బతకటానికి కావల్సిన విద్యా, వైద్య సదుపాయాలు లేనప్పుడు ప్రజలు అక్కడే ఎందుకు ఉంటారు ? అందుకే వలసల బాట పట్టారు. జీవనాధారం లేకపోతే గంపెడు సంసారం మోయటం ఎవరికైనా కష్టమే. తోటివారే కాదు, నారు పోసినవాడు (దేవుడు) కూడా కన్నెర్ర చేస్తే పొట్ట చేతపట్టినవాడి పని ఏమిటి ? అందుకే వలస పోతున్నారు.

గ్రామాల్లోని వృత్తిపనివారలకు నగరాల్లో చక్కని జీవనభృతి లభిస్తోంది. భవన నిర్మాణ కార్మికులకు నగరాల్లో 365 రోజులూ పని దొరుకుతోంది. అందుకే గ్రామాల నుండి ప్రజలు నగరాలకు వలస వెళుతున్నారు.

ఈ వలస కూలీలకు వలస ప్రాంతంలో కూడా చెల్లేట్లుగా వారికి రేషన్ కార్డులు, పింఛన్లు వంటి సదుపాయాలు కల్పించాలి. వారి పిల్లలకు, వారికి విద్యా, వైద్య సదుపాయాలు కల్పించాలి. వారికై ఇళ్ళు నిర్మించాలి. వారి కష్టనష్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వసతులు ఏర్పాటు చేయాలి.

పనికి ఆహార పథకం ద్వారా వారికి పనులు చూపాలి. ప్రభుత్వం అందించేవి వీరికి అందుతున్నాయా, లేదా పర్యవేక్షించాలి. అప్పుడే వీరు సుఖంగా జీవించడానికి వీలవును.

PAPER – II : PART – B

భాషాంశాలు – వ్యాకరణం

కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.

1. సంధులు:

ప్రశ్న 1.
“ఉత్వ సంధి”కి ఉదాహరణ కానిది.
A) ఎట్లు + అని
B) కాలము + అంటూ
C) వరుగులు + అయ్యే
D) సముద్రము + నీరు
జవాబు:
D) సముద్రము + నీరు

ప్రశ్న 2.
“ఎప్పుడు + ఒస్తవు” – ఉత్వ సంధి చేయగా.
A) ఎప్పుడొస్తవు
B) ఎప్పుడునొస్తవు
C) ఎప్పడువచ్చెదవు
D) ఎప్పుడొచ్చినావు
జవాబు:
A) ఎప్పుడొస్తవు

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 3.
గోకులాష్టమినే కృష్ణాష్టమి అంటారు – గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి.
A) గో + కులాష్టమి
B) గోకులా + ష్టమి
C) గోకుల + అష్టమి
D) గోకులము యొక్క అష్టమి
జవాబు:
C) గోకుల + అష్టమి

ప్రశ్న 4.
“ఎక్కడ + ఉంటివి → ఎక్కడుంటివి” – సంధి జరిగిన తీరు
A) ఉత్వ సంధి
B) ఆమ్రేడిత సంధి
C) అత్వ సంధి
D) యడాగమ సంధి
జవాబు:
C) అత్వ సంధి

II. సమాసములు :

ప్రశ్న 1.
“భద్రాచలం” – అను పదం యొక్క సమాసం నామం
A) విశేషణ పూర్వపద కర్మధారయము
B) సంభావనా పూర్వపద కర్మధారయము
C) ఉపమాన పూర్వపద కర్మధారయము
D) విశేషణ ఉత్తరపద కర్మధారయము
జవాబు:
A) విశేషణ పూర్వపద కర్మధారయము

ప్రశ్న 2.
“సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము”నకు ఉదాహరణ కానిది.
A) కోయిల సాగరము
B) సరళా సాగరము
C) కోస్త దేశం
D) ఎగువ కృష్ణా
జవాబు:
D) ఎగువ కృష్ణా

ప్రశ్న 3.
ఈ కింది వానిలో “రూపక సమాసము” కానిది.
A) విద్యా అనెడు ధనము
B) కృప అనెడు రసము
C) దయ అనెడు ఆభరణం
D) భద్రాచలం అనే పట్టణం
జవాబు:
D) భద్రాచలం అనే పట్టణం

ప్రశ్న 4.
జీవితంలో వెలుగుల కోసం జ్ఞానజ్యోతిని వెలిగించాలి – గీత గీసిన పదానికి సరియైన విగ్రహవాక్యం
A) జ్ఞానము కొరకు జ్యోతి
B) జ్ఞానము అనెడి జ్యోతి
C) జ్ఞానము తోడి జ్యోతి
D) జ్ఞానమును, జ్యోతియును
జవాబు:
B) జ్ఞానము అనెడి జ్యోతి

ప్రశ్న 5.
“గొడ్లడొక్కలు” – సమాసము పేరు
A) రూపక సమాసము
B) షష్ఠీ తత్పురుష సమాసము
C) తృతీయా తత్పురుష సమాసము
D) ద్వంద్వ సమాసము
జవాబు:
B) షష్ఠీ తత్పురుష సమాసము

III. ఛందస్సు:

ప్రశ్న 1.
పద్యపాదములో రెండవ అక్షరమును ఇలా అంటారు.
A) యతి.
B) ప్రాస యతి
C) ప్రాస
D) గణము
జవాబు:
C) ప్రాస

ప్రశ్న 2.
య గణం – గురులఘువులలో
A) UUI
B) UII
C) IUU
D) IIU
జవాబు:
C) IUU

ప్రశ్న 3.
“ఉత్పలమాల” పద్యానికి యతి
A) 10
B) 11
C) 13
D) 14
జవాబు:
A) 10

IV. అలంకారములు:

ప్రశ్న 1.
……….. రాకనే పోతివా,
……. మరిచే పోతివా;
పై వాక్యాలలో ఉన్న అలంకారము
A) అంత్యానుప్రాస
B) ఛేకానుప్రాస
C) వృత్త్యనుప్రాస
D) లాటానుప్రాస
జవాబు:
A) అంత్యానుప్రాస

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 2.
ఒక వస్తువునకు మరొక వస్తువునకు పోలిక ఉపమాలంకారంలో ఒకటిగా ఉండేది
A) సమాన ధర్మం
B) ఉపమానము
C) ఉపమేయము
D) క్రియ
జవాబు:
A) సమాన ధర్మం

V. వాక్యాలు:

ప్రశ్న 1.
“రామయ్య ఊరికి వెళ్ళి పొలం పనులు చూసుకున్నాడు.” – సామాన్య వాక్యాలుగా మారిస్తే
A) రామయ్య ఊరికి, పొలానికి వెళ్ళాడు.
B) రామయ్య ఊరికి వెళ్ళాడు, రామయ్య పొలం పనులు చూసుకున్నాడు.
C) రామయ్య పొలం పనులు చూడటానికి ఊరు వెళ్ళాడు.
D) ఊరికి వెళ్ళి పొలం పనులు చూసుకున్నాడు.
జవాబు:
B) రామయ్య ఊరికి వెళ్ళాడు, రామయ్య పొలం పనులు చూసుకున్నాడు.

ప్రశ్న 2.
“తెలంగాణ కోసం ఎందరో ఉద్యమాలు చేశారు. తెలంగాణ సాధించారు.” – సంక్లిష్ట వాక్యం గుర్తించండి.
A) తెలంగాణ కోసం ఎందరో ఉద్యమాలు చేశారు మరియు సాధించారు.
B) తెలంగాణ సాధించారు కాని ఎన్నో ఉద్యమాలు చేశారు.
C) తెలంగాణ కోసం ఎందరో ఉద్యమాలు చేసి, సాధించారు.
D) తెలంగాణ సాధించే వరకు ఎందరో ఉద్యమాలు చేశారు.
జవాబు:
C) తెలంగాణ కోసం ఎందరో ఉద్యమాలు చేసి, సాధించారు.

ప్రశ్న 3.
“వర్షాలు బాగా పడ్డాయి. పంటలు పండలేదు.” – సరియైన సంయుక్త వాక్యాన్ని గుర్తించండి.
A) వర్షాలు బాగా పడే పంటలు పండలేదు.
B) వర్షాలు బాగా పడ్డాయి కాని పంటలు పండలేదు.
C) పంటలు పండలేదు కాబట్టి వర్షాలు బాగా పడ్డాయి.
D) వర్షాలు బాగా పడలేదు కాబట్టి పంటలు పండలేదు.
జవాబు:
B) వర్షాలు బాగా పడ్డాయి కాని పంటలు పండలేదు.

ప్రశ్న 4.
“అమ్మ వంట చేసి, దేవుని పూజ చేసింది.” – ఈ వాక్యాన్ని సామాన్య వాక్యాలలోకి మార్చండి.
A) అమ్మ వంట చేయాలి. అమ్మ దేవుని పూజ చేయాలి.
B) అమ్మ వంట చేసింది. అమ్మ దేవుని పూజ చేసింది.
C) అమ్మ వంట చేస్తూ అమ్మ దేవుని పూజ చేసింది.
D) అమ్మ వంట చేస్తే దేవుని పూజ చేస్తుంది.
జవాబు:
B) అమ్మ వంట చేసింది. అమ్మ దేవుని పూజ చేసింది.

TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల

These TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల will help the students to improve their time and approach.

TS 9th Class Telugu 2nd Lesson Important Questions నేనెరిగిన బూర్గుల

PAPER – I : PART – A

1. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)

అ) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
బూర్గుల వాదనాపటిమ గలవాడని పి.వి. ఎందుకన్నాడు ?
జవాబు:
పి.వి.నరసింహారావుగారు, బూర్గులవారి వద్ద జూనియర్ న్యాయవాదిగా ఉండేవారు. బూర్గులవారు తమ విశిష్ట వ్యక్తిత్వంతో, పి.వి.గారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. బూర్గులవారి వాదనా పటిమను పి.వి. ప్రత్యక్షంగా చూసారు.

బూర్గులవారి వాదనాపటిమ : బూర్గులవారు న్యాయవాదిగా కేసు చేపట్టేటప్పుడే, విషయం శ్రద్ధగా విని, ఆ ఫైలుపైనే అస్పష్టంగా, రేఖామాత్రంగా నోట్సు రాసుకునేవారు. కోర్టులో ఆ నోట్సు ఆధారంగా, తమ విశేష ప్రతిభతో, ఎదుటి న్యాయవాదులను ఎదుర్కొని నిలిచేవారు. న్యాయవాద వృత్తిలో గొప్ప మేధాసంపత్తిని ఆయన ప్రదర్శించి, కోర్టులో కేసులో గెలిచేవారు. అందుకే బూర్గుల వాదనాపటిమ గలవారని పి.వి. పేర్కొన్నారు.

ప్రశ్న 2.
దున్నేవారికే భూమి అంటే మీకేమర్థమయింది ?
జవాబు:
సామాన్యంగా భూస్వాములు తమ పొలాలను రైతులకు సేద్యానికి ఇచ్చి, వారి నుండి సంవత్సరానికి కొంత శిస్తు తీసుకుంటారు. రైతులు, ఆ చేలలో పంట పండినా, పండకపోయినా నిర్ణయించుకున్న శిస్తును కామందులకు చెల్లించాలి. అదీగాక భూకామందులు తమ ఇష్ట ప్రకారం, తమ పొలాన్ని రైతుల నుండి ఎప్పుడైనా తిరిగి తీసుకుంటారు. దీనివల్ల రైతులు నష్టపోతారనే భావనతో రైతులకు కొన్ని రక్షణలు కల్పించడానికి దున్నేవారికే భూమి అనే కౌలుదారి చట్టాన్ని రూపొందించారని గ్రహించాను.

TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 3.
బూర్గుల సౌజన్యానికి మారుపేరు అని ఎలా చెప్పగలరు ?
జవాబు:
బూర్గుల రామకృష్ణారావుగారు మతాతీత వ్యక్తి. ఆయన సుగుణాలు మూర్తీభవించిన వ్యక్తి. ఈయన సౌజన్యానికి మారుపేరు. నిజాంకు బూర్గులవారు వ్యతిరేకులయినా, రాష్ట్రంలోని ముసల్మానులు అందరికీ ఈయన స్నేహితులుగా, ఆప్తులుగా ఉండేవారు. బూర్గులవారు నిరాడంబరంగా, మతానికి అతీతంగా ఉండేవారు.

ఆయన డ్రాయింగ్ రూమ్ సంస్కృతీ ప్రదర్శనశాలలా ఉండేది. అక్కడ కుచ్చుటోపీల మౌల్వీలు, గడ్డాల ముల్లాలు, తలపాగాల పండితులు, మహామహోపాధ్యాయులు, గాంధీ టోపీలవారు, ఖద్దరు ధారులు, టెరిలీన్ యువకులూ ఇలా అన్నిరకాల వారూ బూర్గులవారితో స్నేహపూర్వకంగా ఉండేవారు. కనుకనే ఆయన సౌజన్యానికి మారుపేరు అని చెప్పవచ్చు.

ప్రశ్న 4.
“బూర్గులవారు మతాతీతవ్యక్తులు” – అని ఎలా చెప్పగలరు ?
జవాబు:
బూర్గుల రామకృష్ణారావుగారు, మతాతీతవ్యక్తి. ఆయన సుగుణాలు మూర్తీభవించిన వ్యక్తి. ఈయన సౌజన్యానికి మారుపేరు. ఆనాటి నిజాం నవాబు మతదురభిమానాన్ని పెంపొందిస్తూ రాజ్యం ఏలేవాడు. రామకృష్ణారావుగారు నిజాంకు బద్ధ వ్యతిరేకి.

నిజాంకు బూర్గులవారు వ్యతిరేకులయినా, రాష్ట్రంలోని ముసల్మానులు అందరికీ ఈయన స్నేహితులుగా, ఆప్తులుగా ఉండేవారు. బూర్గులవారు నిరాడంబరంగా, మతానికి అతీతంగా ఉండేవారు. బూర్గులవారి డ్రాయింగ్ రూమ్, సంస్కృతీ ప్రదర్శనశాలలా ఉండేది. అక్కడ కుచ్చుటోపీల, మౌల్వీలు, గడ్డాల ముల్లాలు, తలపాగాల పండితులు, మహామహోపాధ్యాయులు, గాంధీ టోపీలవారు, ఖద్దరు ధారులు, టెరిలిన్ యువకులూ, ఇలా అన్ని రకాలవారూ బూర్గులవారిని పిలవడానికి అక్కడకు వచ్చేవారు.

పై విధంగా బూర్గులవారు, విశిష్ట వ్యక్తిత్వంతో, మతాతీత వ్యక్తిగా ఉండేవారు.

ప్రశ్న 5.
బూర్గులవారిని గురించి చరిత్రకారులు ఏయే విషయాలు పొందుపరచి ఉంటారని చెప్పారు.
జవాబు:
చరిత్రకారులు, బూర్గులవారిని గురించి ఈ కింది విషయాలు రాసి ఉండేవారు.

  1. బూర్గుల రామకృష్ణారావుగారు పుట్టిన గ్రామం గురించి రాసేవారు. పూనాలో ఆయన ఫెర్గూసన్ కాలేజీలో పర్షియన్ ‘భాష చదివి, పట్టభద్రులయ్యారని, పర్షియన్ ట్యూటర్గా కొంతకాలం పనిచేశారని రాసి ఉండేవారు.
  2. న్యాయవాద పట్టా తీసుకొని న్యాయవాదిగా పనిచేశారని రాసి ఉండేవారు.
  3. ప్రజా ఉద్యమాల్లో పాల్గొని, జైలుకు వెళ్ళారని రాసి ఉండేవారు. హైదరాబాదు స్టేటు కాంగ్రెస్లో బూర్గులవారు ప్రముఖ నాయకులని, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, రెండు రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశారని రాసి ఉండేవారు.

ప్రశ్న 6.
పాఠ్యాంశ రచయిత పి.వి. నరసింహారావుగారి గొప్పతనం గురించి తెలపండి.
జవాబు:
పి.వి. నరసింహారావుగారు భారత ప్రధానిగా, బహుభాషావేత్తగా, భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరు పొందారు. స్వామి రామానందతీర్ధకు పి.వి. గారు శిష్యులు. బూర్గుల వారు, పి.వి. గార్కి గురుతుల్యులు. విద్యార్థిగా హైద్రాబాదు విముక్తి పోరాటంలో వీరు పాల్గొన్నారు. కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలలో మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దేశ ప్రధానిగా సేవ చేశారు. ఈయన గొప్ప రాజనీతిజ్ఞుడు.

17 భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారు. ఈయన ఆత్మకథ “ఇన్ సైడర్” అనేక భాషల్లోకి అనువాదం అయ్యింది. పి.వి. గారు, నిరాడంబర జీవితం, నిజాయితీ, దేశభక్తి కలిగి, స్థిత ప్రజ్ఞుడిగా వెలుగొందారు. విశ్వనాథ వారి ‘వేయి పడగలు’ నవలను ‘సహస్రఫణ్’ అనే పేరుతో వీరు హిందీలో రాశారు.

TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 7.
రామకృష్ణారావుగారి విశిష్ట వ్యక్తిత్వం గురించి పి.వి. గారు ఏమని తెలిపారు ?
జవాబు:
పి.వి. నరసింహారావుగారు, బూర్గులవారి వద్ద జూనియర్ న్యాయవాదిగా ఉండేవారు. పి.వి. గారు బూర్గులవారి ఆఫీసుకు వెళ్ళి, జూనియర్లకు అర్థంకాని చిక్కు కేసులను చదివేవారు. దానితో బూర్గులవారి సీనియర్ గుమస్తా, పి.వి. గారిపై కోపపడేవాడు. కాని బూర్గులవారు పి.వి. గార్ని సమర్థించేవారు.

అంతేకాక పి.వి. గారితో కేసులను గురించి స్వయంగా తాను చర్చించేవారు. దానితో పి.వి.లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ ఆత్మవిశ్వాసం, తరువాత కాలంలో పి.వి. గార్కి శ్రీరామరక్ష అయ్యింది. ఈ విధంగా బూర్గులవారు తమ విశిష్ట వ్యక్తిత్వంతో, పి.వి. గారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి,
ఆయనకు మేలు చేశారు.

ఆ) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘బాహ్య సౌందర్యం కన్నా అంతర సౌందర్యం అతిముఖ్యం’ ఈ వాక్యం బూర్గుల వారి జీవితానికి ఎలా సరిపోతుంది – వివరించండి.
జవాబు:
ప్రతి మానవునిలోనూ సాధారణంగా ఉన్నదాని కంటే తనను గురించి ఘనంగా చిత్రించుకొనే స్వభావం ఉంటుంది. ఇందుకు భిన్నంగా ప్రవర్తించేవారు చాలా అరుదుగా ఉంటారు. ఇటువంటి వ్యక్తిత్వం కలిగిన బూర్గులవారిని తలచుకోవడం, వారిని అనుసరించడం మనందరికి శుభదాయకం. లోకంలో వ్యక్తులకు వారసత్వంగా వచ్చే ఆర్థిక, రాజకీయ పరమైన గుర్తింపే కాని, వారి వ్యక్తిత్వాలకు గుర్తింపనేది నేతిబీరకాయ చందంగానే ఉంటుంది.

వ్యక్తిత్వం లేనివారు ఎంత గొప్ప పేరుప్రఖ్యాతులు పొందినప్పటికీ అది వారితో ఉన్న అవసరాలు ఇతరులచేత ఆహా ! ఓహో అనిపిస్తాయి. అదీ ఆ అవసరాలు తీరేదాకే. అదే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు తమ వ్యక్తిత్వానికి మచ్చతెచ్చుకొనే పనులు చేయకుండా ‘పరోపకార్థమ్ ఇదమ్ శరీరం’ అన్నట్లు జీవిస్తారు.

ఈ కోవకు చెందినవారే శ్రీ బూర్గుల రామకృష్ణారావుగారు. వారెల్లప్పుడు అన్ని విషయాల్లో ఆఖరికి తమలోని లోపాలను కూడా ఉన్నవి ఉన్నట్లుగా చెప్పేవారు. బూర్గుల వారి కీర్తి ఎంత పెద్దదో మూర్తి అంత చిన్నది. తన పొట్టితనాన్ని గూర్చి వారే ఇలా అనుకొనేవారు, ‘నన్ను గమనించకుండా ఎవరూ ఉండలేరు.

పొడుగు మనుషుల మధ్య పొట్టివాణ్ణి కదా ! అని అవసరం వచ్చినప్పుడు వారు అలనాటి వామనమూర్తి వలె ఇంతింతై ముల్లోకాలు ఆక్రమించి తమ విరాట్ రూపాన్ని ప్రదర్శించేవారు. అందుచేత బూర్గులవారు కావాలని నిరాడంబరంగా తెరమరుగున ఉండడం జరుగలేదు. శరీరాకృతిలో అందం లేకపోయిన మంచి మనసు కలిగి అందరూ బాగుండాలనే బూర్గులవారి జీవితానికి ‘బాహ్య సౌందర్యం కన్నా అంతఃస్సౌందర్యం అతిముఖ్యం’ అనే వాక్యం చక్కగా సరిపోతుంది.

ప్రశ్న 2.
బూర్గుల రామకృష్ణారావుగారి వ్యక్తిత్వం ద్వారా మనం నేర్చుకోదగిన అంశాలేవి ?
జవాబు:
మనం నివసిస్తున్న ఈ సమాజంలో మంచి ప్రభావశక్తి కలవారు కొద్దిమంది మాత్రమే ఉంటారు. అటువంటి వారితో కలిసినా, వారిని గురించి తెలిసికొన్నా మనకు మంచి స్ఫూర్తి కలుగుతుంది. వారు నడిచిన దారిలో మనం కూడా నడవడానికి అవకాశం కలుగుతుంది.

ఈ విధంగా స్ఫూర్తిని ఇచ్చేవారిలో కీ.శే. బూర్గుల రామకృష్ణారావుగారు ఒకరు. ఈయన హైదరాబాదు రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజనీతిజ్ఞుడు, బహుభాషావేత్త, పరిపాలనాదక్షుడు. ప్రతివ్యక్తికి, తన గురించి ఉన్నదాని కంటే ఎక్కువగానే చిత్రించుకొనే స్వభావం ఉంటుంది.

దీనికి భిన్నంగా ఉండేవారు బహుకొద్దిమందే ఉంటారు. వారిలో ముందుగా చెప్పదగినవారు బూర్గుల. అనేక విధాలైన ఒడిదుడుకులు వచ్చినా, విపత్కర పరిస్థితులు చుట్టుముట్టినా, చలించలేపోవడం, మనః స్థైర్యాన్ని, సమచిత్తాన్ని విడిచిపెట్టకపోవడం వంటి లక్షణాలు రామకృష్ణారావుగారి వ్యక్తిత్వం ద్వారా మనం నేర్చుకోవచ్చు.

జయాపజయాలను సమానంగా స్వీకరించడం, మిత్రులు సైతం ద్రోహం చేసినా, శత్రువులు దూషించినా “అవన్నీ ఆటలో భాగమేగా” అని స్థితప్రజ్ఞులుగా నిలవడం, అందరికీ సాధ్యం కాదు. అటువంటి విశిష్ట వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి శ్రీ బూర్గులవారు. ఈయన మతాతీత వ్యక్తి. సుగుణాలు మూర్తీభవించిన మహోన్నత వ్యక్తి. సౌజన్యానికి మారుపేరు. నిరాడంబరంగా జీవించే బూర్గులవారి వ్యక్తిత్వం ఆనాటివారికే కాదు ఏనాటివారికైనా, ప్రాతఃస్మరణీయమైనది.

ప్రశ్న 3.
“రాజకీయాలలో బూర్గులవారి సమ్యక్ దృష్టికోణం, సంకుచిత సైద్ధాంతిక అరలకు తావివ్వలేదు” దీనిని బట్టి మీరేమి గ్రహించారు?
జవాబు:
బూర్గుల రామకృష్ణారావుగారిని గూర్చి పి.వి. నరసింహారావు గారు చెప్పిన సత్యమిది. బూర్గుల వారికి రాజకీయాలపై సంపూర్ణమైన దృష్టికోణం ఉందట. బూర్గులవారు సంకుచిత దృష్టితో వీరు నావారు, వారు పేదవారు అనే భేదాన్ని వారు చూపించేవారు కారట.

హైదరాబాదు సంస్థానంలో జాగీర్దారీ వ్యవస్థ తరతరాల నుండీ వస్తోంది. భూములు అన్నీ కొద్దిమంది చేతులలోనే ఉండేవి. అది గమనించిన బూర్గులవారు, హైదరాబాదు రాష్ట్రంలో దున్నేవానికి భూమి హక్కును ఇచ్చే కౌలుదారీ చట్టాన్ని తయారు చేసి, సామ్యవాద వ్యవస్థకు వారు మార్గదర్శకులు అయ్యారు.

ఈ కౌలుదారీ చట్టాన్ని ముందుగా బూర్గులవారు, కొన్ని జిల్లాల్లో అమలు పరచడానికి ఎంపిక చేశారు. ఆ చట్టం అమలు వల్ల ఎక్కువగా నష్టపోయిన భూకామందులు అందరూ, బూర్గుల వారికి బంధువులూ, రాజకీయ సహచరులు. దీనిని బట్టి బూర్గుల వారికి రాజకీయాల్లో సమ్యక్ దృష్టి కోణం ఉందనీ, వారికి సంకుచిత సిద్ధాంత భేదాలు లేవని తెలుస్తోంది.

PAPER – I : PART – B

భాషాంశాలు – పదజాలం :

I. సొంతవాక్యాలు :

అ) కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

1. శ్రీరామరక్ష : మంచి గూఢచార వ్యవస్థ దేశానికి, ప్రజలకు శ్రీరామరక్ష.
2. గీటురాయి : క్రీడాకారుల ప్రతిభకు వారు సంపాదించిన బహుమతులే గీటురాళ్ళు.
3. రూపుమాపడం : ఆధునిక వైద్య విజ్ఞానం మశూచి, కలరా వంటి అంటువ్యాధుల్ని రూపుమాపగలిగింది.
4. కారాలు మిరియాలు నూరడం : కారు అద్దం పగిలి సంవత్సరమయినా మా స్నేహితులందరిమీద మా పక్కింటాయన ఇప్పటికి కారాలు మిరియాలు నూరుతునే ఉన్నాడు.
5. స్వస్తివాచకం : పాత పెద్దనోట్లకు ప్రధాని మోదీ స్వస్తివాచకం పలికాడు.
6. ప్రాతఃస్మరణీయులు : భగవంతునితో పాటు, విజ్ఞాన వేత్తలు, సంఘ సంస్కర్తలు అందరూ మనకు ప్రాతః స్మరణీయులే.
7. శక్తిసామర్థ్యాలు : మనం మన శక్తిసామర్థ్యాలు, శారీరక, మానసిక, వైజ్ఞానిక విషయాలలో పెంపొందించుకోవాలి.
8. సౌజన్య సౌహార్దాలు : గాంధీ, బుద్ధుడు, క్రీస్తు మొదలగు వారిని చూసినప్పుడు సౌజన్య సౌహార్దాలు కూడా ప్రపంచాన్ని గెలవడానికి ఉపయోగపడతాయి అని అనిపిస్తుంది.
9. కంచుకోట : అవినీతిపరులు కంచుకోట వంటి ఇంటిని నిర్మించుకొని దొంగసొత్తును దాస్తారు కదా !

TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల

II. అర్థాలు :

ఆ) కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.

ప్రశ్న 1.
నిరాఘాటంగా – అనే పదానికి అర్థం
A) ఆటంకాలుగా
B) అడ్డులేకుండా
C) సాఫీగా
D) పడుతూలేస్తూ
జవాబు:
B) అడ్డులేకుండా

ప్రశ్న 2.
ప్రమాణం – అనే అర్థం వచ్చే పదం
A) ప్రయాణం
B) గీటురాయి
C) తిరుగలి
D) గుండ్రాయి
జవాబు:
B) గీటురాయి

ప్రశ్న 3.
సచిన్ నిష్క్రమణతో భారతజట్టు ధోని వైపు తిరిగింది – గీత గీసిన పదానికి అర్థం
A) రాక
B) క్రమశిక్షణ
C) తప్పుకోవడం
D) బాధలతో
జవాబు:
C) తప్పుకోవడం

ప్రశ్న 4.
ఒక విషయం గురించి అనర్గళంగా మాట్లాడు – గీత గీసిన పదానికి సరియైన అర్థం
A) ఆటంకం లేకుండా
B) గొంతుతో
C) ఎదిరించి
D) ఆలోచించి
జవాబు:
A) ఆటంకం లేకుండా

ప్రశ్న 5.
“కడగొట్టు” అనే పదానికి అర్థం
A) కనిపెట్టు
B) గట్టిగా కొట్టు
C) చిట్టచివరి
D) పడగొట్టు
జవాబు:
C) చిట్టచివరి

TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 6.
ప్రాతఃస్మరణీయుడు – అను పదానికి అర్థం
A) ప్రతి ఉదయం జ్ఞప్తికి తెచ్చుకోతగినవాడు.
B) పాతకాలములో గుర్తున్నవాడు.
C) ఉదయమే గుర్తుకు వచ్చిన మనిషి.
D) గుర్తుంచుకోవలసిన విషయము (పాత సంఘటన).
జవాబు:
A) ప్రతి ఉదయం జ్ఞప్తికి తెచ్చుకోతగినవాడు.

ప్రశ్న 7.
“సునిశితమేధ” – అను పదానికి సరియైన అర్థం
A) ఒక రకమైన మేధ
B) చురుకైన బుద్ధి
C) మందబుద్ధి
D) సరియైన మేధావి
జవాబు:
B) చురుకైన బుద్ధి

ప్రశ్న 8.
“కలగలుపు” – అనే అర్థం గల పదం
A) అన్నము
B) కలుపు మొక్క
C) మేళవించు
D) విడివిడిగా
జవాబు:
C) మేళవించు

ప్రశ్న 9.
“సాహితీ జగత్తు” లో కాళిదాసు మొదటివాడు – గీత గీసిన పదానికి అర్థం
A) ప్రాచీన గ్రంథంలో
B) సాహిత్యం అనే ప్రపంచంలో
C) వీణా జగత్తులో
D) కవి పండితులలో
జవాబు:
B) సాహిత్యం అనే ప్రపంచంలో

ప్రశ్న 10.
అతని సౌజన్యం అందరిని ఆకర్షించింది – గీత గీసిన పదానికి అర్థం
A) మంచితనం
B) సౌందర్యం
C) వేషధారణ
D) సంపద
జవాబు:
A) మంచితనం

ప్రశ్న 11.
రామకృష్ణారావుగారి పేరు వినగానే గత స్మృతులెన్నో ముప్పిరిగొన్నాయి – గీత గీసిన పదానికి అర్థం
A) తలుపు
B) బాధ
C) తలపు
D) సంతోషం
జవాబు:
C) తలపు

ప్రశ్న 12.
వీసం ఎత్తు ఎక్కువా లేదు – గీత గీసిన పదానికి అర్థం
A) 1/16
B) 1/8
C) 1/4
D) 1/32
జవాబు:
A) 1/16

ప్రశ్న 13.
రామకృష్ణారావుగారు ప్రధానంగా సాహితీ జగత్తుకు చెందినవారు – గీత గీసిన పదానికి అర్థం
A) ప్రజలు
B) గ్రంథాలు
C) దేశాల
D) లోకం
జవాబు:
D) లోకం

III. ప్రకృతి, వికృతులు :

ప్రశ్న 1.
భూమి తిరముగా ఉండదు – గీత గీసిన పదానికి ప్రకృతి
A) పల్లము
B) స్థిరము
C) తిన్నగా
D) వేడి
జవాబు:
B) స్థిరము

ప్రశ్న 2.
దోసము, దొసగు – అనే వికృతి పదాలకు ప్రకృతి పదం
A) దోసకాయ
B) రోషము
C) దోషము
D) దుష్టుడు
జవాబు:
C) దోషము

ప్రశ్న 3.
“జాతరలో పిల్లలు తప్పిపోతారని యాత్ర మానుకొన్నారు.” – ఈ వాక్యంలో ప్రకృతి ఉన్న పదం
A) జాతర
B) పిల్లలు
C) మాను
D) తప్పిపోవు
జవాబు:
A) జాతర

ప్రశ్న 4.
ఊరేగింపులో దేవుని దవ్వు నుండి చూడగలిగాము – గీత గీసిన పదానికి ప్రకృతి
A) పువ్వు
B) ఎత్తు
C) వెనుక
D) దూరము
జవాబు:
D) దూరము

ప్రశ్న 5.
“పగ్గె, సాల” – అను వికృతి పదాలకు సరియైన ప్రకృతి పదాలు
A) ప్రజ్ఞ, శాల
B) ప్రతిజ్ఞ, విశాల
C) పగ్గము, శాల
D) ప్రజ్ఞ, సాలీడు
జవాబు:
A) ప్రజ్ఞ, శాల

TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 6.
శక్తి – అనే పదానికి వికృతి
A) శక్యము
B) సత్తి
C) సత్తెము
D) సకియ
జవాబు:
B) సత్తి

ప్రశ్న 7.
సంతసము – అను పదానికి ప్రకృతి
A) సంతోషము
B) సంతానము
C) ఆనందము
D) సంగతి
జవాబు:
A) సంతోషము

ప్రశ్న 8.
గౌరవము – అనే పదానికి వికృతి
A) గార్దభము
B) గారాబు
C) గౌరు
D) గారవము
జవాబు:
D) గారవము

ప్రశ్న 9.
బూర్గుల వారు పర్షియన్ భాష ఐచ్ఛికంగా తీసుకున్నారు – గీత గీసిన పదానికి వికృతి
A) పుస్తకం
B) గ్రంథం
C) బాస
D) బాష
జవాబు:
C) బాస

ప్రశ్న 10.
రామకృష్ణారావు గారు ప్రాచీన కావ్యాలు చదివేవారు – గీత గీసిన పదానికి వికృతి
A) కవ్వం
B) కబ్బం.
C) కవనం
D) కాననం
జవాబు:
B) కబ్బం.

ప్రశ్న 11.
కష్టాలు సంభవించినపుడు అధైర్యంతో క్రుంగిపోనూ లేదు – గీత గీసిన పదానికి వికృతి
A) కసటు
B) కసాటు
C) కషటు
D) కసటం
జవాబు:
A) కసటు

IV. పర్యాయపదాలు :

ప్రశ్న 1.
లోకము, జగము, ప్రపంచము – అను పర్యాయపదాలు కల పదం
A) లోకనము
B) జగత్తు
C) స్వర్గము
D) పంచాస్యం
జవాబు:
B) జగత్తు

ప్రశ్న 2.
మిత్రుడు- అనే పదానికి పర్యాయపదాలు
A) నేస్తం, దోస్తు
B) స్నేహితుడు, మైత్రి
C) బంధువు, చెలికాడు.
D) చెలువుడు, సంగడి
జవాబు:
A) నేస్తం, దోస్తు

ప్రశ్న 3.
రక్తము – అనే పదానికి పర్యాయపదాలు
A) శోణితము, రుధిరము
B) నెత్తురు, వర్ణము
C) కీలాలం, ద్రవము
D) పలాశము, పలలము
జవాబు:
A) శోణితము, రుధిరము

TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 4.
తనువు, కాయము, మేను – పర్యాయపదాలుగా గల పదం
A) శబ్దం
B) ప్రాణం
C) శరీరం
D) దేశం
జవాబు:
C) శరీరం

ప్రశ్న 5.
అబ్దం, సాలు, వర్షం – పర్యాయపదాలుగా గల పదం
A) సంవత్సరము
B) వాన
C) నీటిచాలు
D) సముద్రం
జవాబు:
A) సంవత్సరము

ప్రశ్న 6.
“దక్షత” – అను పదమునకు మరియొక పర్యాయపదము
A) శిక్షణ
B) సామర్ధ్యము
C) ఒక రాజు
D) దక్షిణం
జవాబు:
B) సామర్ధ్యము

ప్రశ్న 7.
“జనకుడు” – అను పదానికి పర్యాయపదం కాని పదం
A) కొడుకు
B) తండ్రి
C) పిత
D) నాన్న
జవాబు:
A) కొడుకు

ప్రశ్న 8.
‘సహస్రఫణ్” కు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) కానుక, కనుక
B) బహుమానం, సన్మానం
C) గౌరవం, మర్యాద
D) బహూకరణ, నమూనా
జవాబు:
B) బహుమానం, సన్మానం

ప్రశ్న 9.
సౌజన్యానికి ఆయన మారుపేరు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) సౌజన్య, సుజన
B) సౌశీల్యం, సుశీల
C) సుజనత్వం, మంచితనం
D) దయ, కరుణ
జవాబు:
C) సుజనత్వం, మంచితనం

ప్రశ్న 10.
బూర్గులవారి విశేష నైపుణ్యానికి నేను ఎల్లప్పుడు జోహారులర్పిస్తాను – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) నమస్కారం, అంజలి
B) కైమోడ్పు, మౌనం
C) చేమోడ్పు, చేయిముడు
D) దండం, దండ
జవాబు:
A) నమస్కారం, అంజలి

ప్రశ్న 11.
స్నేహితులు ద్రోహం తలపెట్టినా పట్టించుకోరు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) మేలు, మంచి
B) కీడు, శుభం
C) చెడు, సంతోషం
D) ఆపద, కీడు
జవాబు:
D) ఆపద, కీడు

V. నానార్థాలు:

ప్రశ్న 1.
“వాహిని” – అనే పదానికి నానార్థాలు
A) కాండము, నీరు
B) వాహనం, దేవత
C) నది, సేన
D) ప్రవాహము, కొండ
జవాబు:
A) కాండము, నీరు

ప్రశ్న 2.
సూర్యుడు, స్నేహితుడు – అనే నానార్థాలు గల పదం
A) రాజు
B) మిత్రుడు
C) గ్రహం
D) నక్షత్రం
జవాబు:
B) మిత్రుడు

TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 3.
“మరుగు” – అనే పదానికి నానార్థాలు
A) చాటు, అలవాటుపడు
B) వేడెక్కు, దానం
C) దాగు, దాచు
D) తెర, తెరచాప
జవాబు:
A) చాటు, అలవాటుపడు

ప్రశ్న 4.
నాకు క్షేత్రములన్న ప్రీతి – గీత గీసిన పదానికి నానార్థములు
A) వరిమడి, పుణ్యస్థానం
B) దేవాలయము, గుడి
C) శరీరము, దానము
D) భార్య, విశేషము
జవాబు:
A) వరిమడి, పుణ్యస్థానం

ప్రశ్న 5.
అన్ని మతములు శ్రేయస్సును కోరునవి – గీత గీసిన పదానికి నానార్ధములు –
A) కులము, అతుకు
B) ముత్యము, భాష
C) మతాబులు, పూజా విధానము
D) అభిప్రాయము, శాస్త్రం, సమ్మతి
జవాబు:
D) అభిప్రాయము, శాస్త్రం, సమ్మతి

VI. వ్యుత్పత్యర్థములు :

ప్రశ్న 1.
“గురువు”నకు సరియైన వ్యుత్పత్త్యర్థము
A) లావుగా ఉండువాడు.
B) అజ్ఞానమనే అంధకారమును పోగొట్టువాడు.
C) గుండ్రముగా తిరుగువాడు.
D) దేవతలను ఆజ్ఞాపించువాడు.
జవాబు:
B) అజ్ఞానమనే అంధకారమును పోగొట్టువాడు.

ప్రశ్న 2.
మనవు సంతతి వారు – అను వ్యుత్పత్తి అర్థము గల పదము
A) మనవి
B) మానవులు
C) మానినులు
D) రాక్షసులు
జవాబు:
B) మానవులు

ప్రశ్న 3.
ద్రవ్యము – అను పదమునకు సరియైన వ్యుత్పత్తి
A) పొందదగినది
B) దున్నుటకు వీలైనది
C) ద్రవించునది
D) అవ్యయము వంటిది
జవాబు:
A) పొందదగినది

ప్రశ్న 4.
అజ్ఞానాన్ని తొలిగించువాడు – అను వ్యుత్పత్తి అర్థము గల పదము
A) రక్షకభటుడు
B) గురువు
C) వైద్యుడు
D) దొంగ
జవాబు:
B) గురువు

TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 5.
తిథి, వార, నియమం లేనివాడు – అను వ్యుత్పత్తి అర్థము గల పదము
A) జులాయి
B) మిత్రుడు
C) అతిథి.
D) చుట్టం
జవాబు:
C) అతిథి.

PAPER – II : PART – A

అపరిచిత గద్యాలు

ప్రశ్న 1.
కింది గద్యభాగాన్ని చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలను తయారుచేయండి.

“శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దివాడు. సాహిత్యంపై ప్రత్యేక అభిమానం కలవాడు. భువనవిజయమనే సభామండపంలో సాహిత్యగోష్ఠి నిర్వహించేవాడు. అనేక కవి పండితులను పోషించేవాడు. ఆయన ఆస్థానంలోని ఎనిమిది మంది ప్రసిద్ధ కవులను అష్టదిగ్గజాలు అని పిలిచారు. అందులో అల్లసాని పెద్దన అగ్రగణ్యుడు. వారిలో తెనాలి రామకృష్ణుడు వికటకవిగా పేరు పొందాడు. రాయలు రాజు మాత్రమే కాదు, కవి కూడా. దేశభాషలందు తెలుగు లెస్స అని చాటాడు. ఆయన కాలం తెలుగుభాషకు స్వర్ణయుగమై భాసిల్లింది.

జవాబు:

ప్రశ్నలు

  1. శ్రీకృష్ణదేవరాయలు ఏ కాలము వాడు ?
  2. శ్రీకృష్ణదేవరాయల సభాభవనం పేరు ఏమి ?
  3. ‘అష్టదిగ్గజాలు’ అంటే ఎవరు ? వారిలో అగ్రగణ్యుడు ఎవరు ?
  4. తెలుగుభాషకు ఎవరి కాలం స్వర్ణయుగం ?
  5. తెనాలి రామకృష్ణుడు ఏ విధంగా పేరు పొందాడు ?

ప్రశ్న 2.
కింది పేరా చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రూపొందించండి.

“ఏకశిలా నగరాన్ని రాజధానిగా చేసుకొని, తెలుగునేలను వైభవ స్థితిలో నిలిపిన కాకతీయ రాజులలో చివరివాడు రెండవ ప్రతాపరుద్రుడు. అతడు ఉత్తమ పరిపాలకుడు మాత్రమే కాదు, మానవ ధర్మాన్ని, కళామర్మాన్ని ఎరిగిన సాహితీమూర్తి. సంస్కృతాంధ్రభాషల్లో అనుపమానమైన పాండిత్యాన్ని సొంతం చేసుకున్న సత్కవీంద్రుడు. సంగీత, సాహిత్య, నృత్య, చిత్రలేఖన, శిల్పకళలకు ఇతోధిక ప్రాధాన్యత నిచ్చి, వాటి విస్తృతికి విశేష సహకారమందించిన రసహృదయుడు, సహృదయుడు. ఎంతటి మహోన్నతులకయినా, చంద్రునిలో మచ్చలా ఏవో బలహీనతలుంటాయి. వేట ప్రతాపరుద్రుని బలహీనత. క్రమం తప్పకుండా వేట వినోదాన్ని ఆస్వాదించేవాడు ప్రతాపరుద్రుడు. ఆ వ్యసనం నుండి మహారాజును దూరం చేయాలని ఎంతగా ప్రయత్నించినా సఫలం కాలేకపోయినాడు మంత్రి యుగంధరుడు.

జవాబు:

ప్రశ్నలు

  1. కాకతీయుల రాజధాని ఏది ?
  2. రెండవ ప్రతాపరుద్రుడు ఏయే భాషల్లో పండితుడు ?
  3. ప్రతాపరుద్ర చక్రవర్తి యొక్క బలహీనత ఏమిటి ?
  4. యుగంధరుడు ఎవరు ?
  5. ప్రతాపరుద్రుడు లలితకళలను ఎలా పోషించాడు ?

ప్రశ్న 3.
కింది గద్యాన్ని చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రూపొందించండి.
“సాహితీ సృజనలో అంతర్జాతీయ కీర్తి నందుకొన్న మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్. కవిగా, రచయితగా, తత్త్వవేత్తగా, సంగీతజ్ఞుడిగా, చిత్రకారుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. వీరి పేరు వినగానే చప్పున స్ఫురించేవి ‘జనగణమన గీతం’, ‘గీతాంజలి’. జనగణమన గీతం భారత జాతీయ గీతంగా గుర్తింపబడింది. బంగ్లాదేశ్ జాతీయ గీతం కూడా వీరి లేఖిని నుండి వెలువడినదే. ఇలా రెండు జాతీయ గీతాలనందించిన కవిగా, అపూర్వ చరిత్రను సృష్టించారు. “శాంతి నికేతన్” పేరున ఆదర్శ విద్యాలయాన్ని స్థాపించి, ‘గురుదేవుడు’ గా కీర్తింపబడ్డారు.

జవాబు:

ప్రశ్నలు

  1. అంతర్జాతీయ కీర్తినందుకొన్న భారతీయ మహాకవి ఎవరు ?
  2. ఏ రెండు దేశాలకు ఠాగూర్ జాతీయ గీతాలను అందించాడు ?
  3. రవీంద్రనాథ్ ఠాగూర్ నెలకొల్పిన విద్యాసంస్థ ఏది ?
  4. రవీంద్రుని ప్రసిద్ధ రచనలు రెండింటిని రాయండి.
  5. రవీంద్రుని బహుముఖ ప్రజ్ఞను వివరించండి.

ప్రశ్న 4.
కింది గద్యభాగాన్ని చదువండి. కింద ఇచ్చిన ఐదు వాక్యాలలోని తప్పొప్పులను గుర్తించి బ్రాకెట్లలో రాయండి. “అంతరించిపోతున్న తెలుగుభాషా సంస్కృతులకు పునరుజ్జీవనం కల్పించుటకై రంగంలోకి దిగిన కందుకూరి పూర్తి సంఘసంస్కరణ దృక్పథంతో పనిచేశారు. ఒకే రంగాన్ని ఎంచుకోకుండా, సంఘంలో అపసవ్యంగా సాగుతున్న పలు అంశాలవైపు దృష్టిని సారించాడాయన. ప్రధానంగా స్త్రీల అభ్యున్నతిని కాంక్షించిన మహామనీషిగా వాళ్ళ చైతన్యం కోసం అనేక రచనలు చేశారు. చంద్రమతి చరిత్ర, సత్యవతి చరిత్ర వంటివి అందులో కొన్ని. వారి బ్రహ్మవివాహం నాటకం, పెద్దయ్య గారి పెళ్ళి పేరుతో, వ్యవహార ధర్మబోధిని, ప్లీడర్ నాటకం పేరుతోనూ, ప్రసిద్ధి పొందాయి.

వాక్యాలు

1. కందుకూరి పూర్తిపేరు వీరేశలింగం పంతులు.
జవాబు:
ఒప్పు

2. చంద్రమతి చరిత్ర కందుకూరి రాసిన గొప్ప నాటకం.
జవాబు:
తప్పు

TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల

3. సంఘంలోని సవ్యమైన అంశాలపై దృష్టి సారించాడాయన.
జవాబు:
తప్పు

4. కందుకూరి గొప్ప సంఘసంస్కర్త.
జవాబు:
ఒప్పు

5. తెలుగుభాషా సంస్కృతులను పునరుజ్జీవింపచేశారు కందుకూరి.
జవాబు:
ఒప్పు

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
మాతృభాష గొప్పదనాన్ని తెల్పుతూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

బాసర,
X X X X.

ప్రియమైన స్నేహితురాలు శ్రీవల్లికి,

నేను బాగా చదువుతున్నాను. నీవూ బాగా చదువుతున్నావని తలుస్తాను. ముఖ్యంగా ఈ లేఖలో మాతృభాష గొప్పతనాన్ని తెలియజేస్తున్నాను. తల్లి నుండి వచ్చిన భాషను మాతృభాష అంటారు. మన మాతృభాష తెలుగు. ‘తేనె లొలుకు భాష తెలుగు భాష’ అని పండితులు కీర్తించారు. పరభాషా మోజులో పడి మన మాతృభాషను మరిచిపోకూడదు. మాతృభాషలో నేర్చుకోని విద్య మెట్లు లేకుండ ఇంటిపైకి ఎక్కినట్లుంటుంది. ఏ జాతి సంస్కృతి అయినా ఆ జాతివాడే భాష మనుగడపైనే ఆధారపడి ఉంటుంది. మనిషి ఊహాశక్తికి, భావ వ్యక్తీకరణకు, నూతన సృజనకు ఆధారం ఈ మాతృభాషే, ఇంతటి మహత్తర శక్తి ఉంది కాబట్టే ఐక్యరాజ్య సమితి ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా జరుపుకోవాలని 1999లో నిర్ణయించింది. ఆంగ్లం అవసరమే కాని అనివార్యం మాత్రం కాదు. మాతృభాషను గౌరవించడమంటే తల్లిని గౌరవించడంతో సమానం. నికోలా కాంటే తెలుగుభాష గొప్పదనాన్ని కొనియాడుతూ “ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్”గా అభివర్ణించాడు. “దేశభాషలందు తెలుగు లెస్స” అని శ్రీకృష్ణదేవరాయలు ప్రశంసించాడు. మాతృభాష ఏ జాతి సంస్కృతి కైనా జీవగర్ర ! దీనిని ఎవరూ మరువకూడదు.

నీవు కూడా మాతృభాషను గూర్చిన విషయాలు తెలిసినవి రాస్తావని కోరుకుంటున్నాను.

ఇట్లు,
నీ ప్రియ స్నేహితురాలు,
కె.లలిత.

చిరునామా :

సిహెచ్. శ్రీవల్లి,
9వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూల్,
భద్రాచలం, ఖమ్మం జిల్లా.

PAPER – II : PART-B

భాషాంశాలు – వ్యాకరణం

కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.

1. సంధులు:

ప్రశ్న 1.
విమానాశ్రయం – విడదీసి రాయగా
A) విమా + నాశ్రయము
B) విమాన + ఆశ్రయం
C) విమానా + శ్రయము
D) విమానముల + ఆశ్రయం
జవాబు:
B) విమాన + ఆశ్రయం

ప్రశ్న 2.
“సవర్ణదీర్ఘ సంధి”కి ఉదాహరణ కానిది.
A) శరీర + ఆకృతి
B) గిరి + ఈశుడు
C) మత + అతీత
D) ఆ + అవసరము
జవాబు:
D) ఆ + అవసరము

TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 3.
ఈ కింది వానిలో “గుణసంధి”కి ఉదాహరణ కానిది.
A) భావ + ఉద్రేకం
B) భావ + ఆవేశం
C) ప్ర + ఉత్సాహం
D) దేవ + ఇంద్రుడు
జవాబు:
B) భావ + ఆవేశం

ప్రశ్న 4.
“యణాదేశ సంధి”కి ఉదాహరణ
A) మహెూన్నతము
B) ముఖ్యాంశం
C) ప్రత్యర్థులు
D) సారాంశం
జవాబు:
C) ప్రత్యర్థులు

ప్రశ్న 5.
కర్మధారయములలో మువర్ణకమునకు పు, ౦పు లు వచ్చు సంధి పేరు
A) ముగాగమ సంధి
B) పుంప్వాదేశ సంధి
C) రుగాగమ సంధి
D) లులనల సంధి
జవాబు:
B) పుంప్వాదేశ సంధి

ప్రశ్న 6.
“ఇంత + ఇంత” సంధి కలిపి రాయగా
A) ఇంతయింత
B) ఇత
C) ఇంతింత
D) ఇంతయునింత
జవాబు:
C) ఇంతింత

ప్రశ్న 7.
పుష్పమాలా + అలంకృతులు – అని విడదీయగా వచ్చు సంధి పేరు
A) సవర్ణదీర్ఘ సంధి
B) లులనల సంధి
C) అత్వ సంధి
D) యడాగమ సంధి
జవాబు:
A) సవర్ణదీర్ఘ సంధి

ప్రశ్న 8.
అతిశయ + ఉక్తి – సంధి పేరు
A) గుణసంధి
B) యడాగమ సంధి
C) యణాదేశ సంధి
D) ఉత్వ సంధి
జవాబు:
A) గుణసంధి

II. సమాసములు :

ప్రశ్న 1.
“మూల్యము కానిది – అమూల్యము.” – ఇది ఏ సమాసము ?
A) విశేషణ పూర్వపదము
B) నఞ తత్పురుష
C) చతుర్థీ తత్పురుష
D) ద్విగు సమాసము
జవాబు:
B) నఞ తత్పురుష

ప్రశ్న 2.
“విశేషణ పూర్వపద కర్మధారయ సమాసమునకు ఉదాహరణ
A) అమూల్య సంపద
B) పద్మముఖి
C) జలజాకరము
D) తల్లిప్రేమ
జవాబు:
A) అమూల్య సంపద

ప్రశ్న 3.
“దేశ చరిత్ర” – సరియైన విగ్రహవాక్యమును గుర్తించుము.
A) దేశములు, చరిత్రలు
B) దేశము నుండి చరిత్ర
C) దేశము యొక్క చరిత్ర
D) చరిత్ర గల దేశము
జవాబు:
C) దేశము యొక్క చరిత్ర

ప్రశ్న 4.
“వాదన యందు పటిమ” – సమాసము చేయగా
A) వాదనలో పటిమ
B) వాదనా పటిమ
C) వాదనలు, పటిమలు
D) వాదోపవాదము
జవాబు:
B) వాదనా పటిమ

TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 5.
“ద్విగు సమాసము”నకు ఉదాహరణ
A) ప్రాచీన కావ్యాలు
B) శక్తి సామర్థ్యాలు
C) నెలతాల్పు
D) రెండు రాష్ట్రాలు
జవాబు:
D) రెండు రాష్ట్రాలు

ప్రశ్న 6.
“దొంగ వలన భయము” – ఏ సమాసము
A) పంచమీ తత్పురుష
B) షష్ఠీ తత్పురుష
C) బహువ్రీహి
D) సంభావనా పూర్వపద కర్మధారయము
జవాబు:
A) పంచమీ తత్పురుష

ప్రశ్న 7.
“తృతీయా తత్పురుష సమాసమునకు ఉదాహరణ
A) గురువు కొఱకు దక్షిణ
B) నెలను తాల్చినవాడు
C) మూడు కన్నులు కలవాడు
D) వయస్సు చేత వృద్ధుడు
జవాబు:
D) వయస్సు చేత వృద్ధుడు

ప్రశ్న 8.
“విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము”నకు ఉదాహరణ కానిది
A) అమూల్య సమయం
B) పూర్ణ పురుషులు
C) పెద్ద కుటుంబం
D) నెలతాల్పు
జవాబు:
D) నెలతాల్పు

III. ఛందస్సు:

ప్రశ్న 1.
ఈ కింది గణాలలో “భ గణం” గుర్తించండి.
A) UIU
B) UII
C) IIU
D) UUI
జవాబు:
B) UII

ప్రశ్న 2.
“తాయెత్తు” గణ విభజన చేయగా
A) UII
B) UIU
C) UUI
D) UUU
జవాబు:
C) UUI

ప్రశ్న 3.
ఉత్పలమాల పద్యములో వచ్చు గణములు
A) గగ, భ, జ, స, నల
B) భ, ర, న, భ, భ, ర, వ
C) మ, స, జ, స, త, త, గ
D) నల, నగ, భ, ర, త
జవాబు:
B) భ, ర, న, భ, భ, ర, వ

ప్రశ్న 4.
చంపకమాలలో యతి ఎన్నవ అక్షరము ?
A) 10
B) 13
C) 14
D) 11
జవాబు:
D) 11

ప్రశ్న 5.
పద్యపాదంలో రెండవ అక్షరాన్ని ఇలా అంటారు.
A) ప్రాస
B) యతి
C) ప్రాసయతి
D) గణ
జవాబు:
A) ప్రాస

TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల

IV. అలంకారములు :

ప్రశ్న 1.
ఒకే అక్షరం పలుమార్లు ఆవృత్తి అయితే ఆ అలంకారం
A) వృత్త్యనుప్రాస
B) అనుప్రాస
C) అంత్యానుప్రాస
D) లాటానుప్రాస
జవాబు:
A) వృత్త్యనుప్రాస

ప్రశ్న 2.
“అమందానందంబున నందనందను డిందు వచ్చె” పై వాక్యంలో గల అలంకారం
A) ఉపమాలంకారం
B) వృత్త్యనుప్రాసాలంకారం
C) ఛేకానుప్రాసాలంకారం
D) లాటానుప్రాసాలంకారం
జవాబు:
B) వృత్త్యనుప్రాసాలంకారం

ప్రశ్న 3.
వృత్త్యనుప్రాసాలంకారానికి ఉదాహరణ
A) అది ఒక గోడ, గోడ పక్కన నీడ, నీడలో ఆవు దూడ
B) కలికి, చిలుకల కొలికి కిలకిల నవ్వె
C) భవనము వనములో ఉన్నది
D) తుమ్మెద ఝుం ఝుమ్మని పాడింది
జవాబు:
A) అది ఒక గోడ, గోడ పక్కన నీడ, నీడలో ఆవు దూడ

V. వాక్యాలు :

ప్రశ్న 1.
కింది వాటిలో ప్రత్యక్ష కథనంలో ఉన్న వాక్యం
A) తన తండ్రి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు.
B) “నా యీ చొరవ సీనియర్ గుమస్తా కోప కారణమైంది” అని పి.వి. అన్నాడు.
C) అతడు నాతో సినిమాకి వస్తానన్నాడు.
D) అందరూ అధికులు కావాలని చూస్తారు.
జవాబు:
B) “నా యీ చొరవ సీనియర్ గుమస్తా కోప కారణమైంది” అని పి.వి. అన్నాడు.

ప్రశ్న 2.
“నేను ఒక్కడినే చదువుకొంటున్నాను” అని అన్నాడు చైతన్య. ఈ వాక్యాన్ని పరోక్ష కథనంలోకి మార్చగా
A) నేను చదువుకొంటున్నాను అని చైతన్య అన్నాడు.
B) తాను ఒక్కడే చదువుకొంటున్నానని చైతన్య అన్నాడు.
C) నేను చదువుకొంటున్నాను ఒక్కడినే అని చైతన్య అన్నాడు.
D) వాడు ఒక్కడే చదువుతున్నాడని చైతన్య అన్నాడు.
జవాబు:
B) తాను ఒక్కడే చదువుకొంటున్నానని చైతన్య అన్నాడు.

ప్రశ్న 3.
“నరేష్ తాను రానని నాతో చెప్పాడు.” ఈ వాక్యాన్ని ప్రత్యక్ష కథనంలోకి మార్చగా
A) నరేష్ “నేను రాను” అని నాతో చెప్పాడు.
B) నరేష్ నాతో రానని చెప్పాడు.
C) నాతో రానని నరేష్ చెప్పాడు.
D) తనతో నేను రానని నరేష్ చెప్పాడు.
జవాబు:
A) నరేష్ “నేను రాను” అని నాతో చెప్పాడు.

ప్రశ్న 4.
రాజు “నా పుట్టినరోజుకు తప్పక రావాలి” అని కృష్ణతో అన్నాడు.
A) రాజు పుట్టినరోజుకి తప్పక రావాలని కృష్ణ అన్నాడు.
B) రాజు నేను పుట్టినరోజుకు తప్పక వస్తానని కృష్ణతో అన్నాడు.
C) రాజు, కృష్ణ పుట్టినరోజుకు రావాలన్నాడు.
D) రాజు తన పుట్టినరోజుకు తప్పక రావాలని కృష్ణతో అన్నాడు.
జవాబు:
D) రాజు తన పుట్టినరోజుకు తప్పక రావాలని కృష్ణతో అన్నాడు.

TS 9th Class Telugu Important Questions 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

These TS 9th Class Telugu Important Questions 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి will help the students to improve their time and approach.

TS 9th Class Telugu 4th Lesson Important Questions రంగాచార్యతో ముఖాముఖి

PAPER – I : PART – A

I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)

అ) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
దాశరథి రంగాచార్యకు తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం ఉందని ఎలా చెప్పగలవు ?
జవాబు:
తెలుగు సాహిత్యంలో దాశరథి రంగాచార్యులుగారికి విశిష్ట స్థానం ఉంది. ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్య ఈయన సోదరుడు. రంగాచార్య విశిష్టమైన నవలలు రచించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసాడు. నాలుగు వేదాలను, పది ఉపనిషత్తులను తెలుగులోకి అనువదించారు. రామాయణ, భారత, భాగవతాలను సరళ వచనంలో రాసి, ప్రజలకు అందుబాటులో వాటిని తెచ్చారు.

తెలుగు నవలలో ‘పాత్రోచితయాస’ను మొదటగా ప్రవేశపెట్టి, ప్రశంసలందుకొన్నారు. వీరి రచనలు ఇతర భారతీయ భాషలలోకి అనువదించబడ్డాయి అంటే వీరి సాహిత్య విలువలు ఎలా ఉంటాయో గమనించాలి. వీరి “చిల్లర దేవుళ్ళు” నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. తెలంగాణ జనజీవనం, రైతాంగ పోరాటం వంటి అంశాల నేపథ్యంగా రచనలు చేసి, తన విశిష్ట రచనాశైలితో పాఠకుడిని ఆకట్టుకొనే రంగాచార్యకు తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం ఉందని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా ఏం కావాలి ?

ప్రశ్న 2.
వాడుకభాష వలన ప్రయోజనం ఏమిటి?
జవాబు:
తెలుగుభాష బోధనలో, వ్యాసాలూ, వార్తల రచనల్లో, కథాకథనంలో గ్రాంథికం గాక, వాడుకలో ఉన్న పదాలతో, ఎలా సామాన్యంగా మాట్లాడతామో అలా తెలుగు వాక్యాలను వ్రాయడం ద్వారా విద్య పండితులకే అన్న భావన తొలిగి విద్య అందరిదీ అన్న భావనను మహనీయులైన ఎందరో కవులు తెచ్చారు.

పూర్వం మాట్లాడే భాషకు, రాసే భాషకు అంతరం ఉండేది. దానివల్ల కవుల గ్రంథాలు కేవలం పండితులకే పరిమితం అయ్యాయి. రానురాను కవులు, రచయితల ఆలోచనలలో మార్పువచ్చి పండిత పామర రంజకంగా రాయాలంటే వాడుకభాషే సరైనదని భావించి, రచనలు చేశారు. వాడుకభాష వల్ల సామాన్యుడు సైతం తేలికగా అర్ధం చేసుకోవడానికి వీలుంటుంది. కవి ఆంతర్యం, ఆలోచన లోకానికి తొందరగా చేరుతుంది.

TS 9th Class Telugu Important Questions 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ప్రశ్న 3.
“సిద్ధాంతం కన్నా కర్తవ్యం గొప్పది” అంటే మీకు ఏమర్థమయ్యింది ?
జవాబు:
‘సిద్దాంతము’ అనగా అక్షర రూపు దాల్చిన స్థిరమైన విధానము. మనం ఏమి చేయాలనుకున్నామో, ఎట్లా చేయాలనుకున్నామో ఇదంతా ఒక మాటగానో, పుస్తకంగానో ఉండటమే సిద్ధాంతం. ఇక ‘కర్తవ్యం’ అంటే విధి. మనం చేయాల్సిన పనిని తెలిపేది. బాధ్యతను గుర్తుచేసేది అని చెప్పవచ్చు. మాటలకన్నా చేతల్లో చూపించడం అనేది ఎప్పుడూ గొప్పే. కనుక అక్షర (మాటలు) రూపంలోని సిద్ధాంతాలతో కూర్చోవడం కన్నా మనిషిగా మన కర్తవ్యాన్ని గుర్తించి ప్రవర్తించడం గొప్ప విషయం. ఇది పెద్దల మాట. గాంధీగారు “డూ ఆర్ డై” అన్నారు. అది ఆయన సిద్ధాంతం కాదు. కర్తవ్యం అని అర్థం చేసుకున్నాను.

ప్రశ్న 4.
ఇంటర్వ్యూ ఎన్ని రకాలు ? అవి ఏవి ?
జవాబు:
ఇంటర్వ్యూలు రెండు రకాలు. ఉద్యోగాల ఎంపికకు అభ్యర్థుల ప్రతిభను పరీక్షించడానికి చేసే ఇంటర్వ్యూలు మొదటి రకం. ప్రముఖుల జీవిత విశేషాలను తెలుసుకోడానికి చేసే ఇంటర్వ్యూలు రెండో రకం.

ఆ) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
తెలంగాణ ప్రజల జీవనాన్ని, అస్తిత్వాన్ని, పోరాటాలను దాశరథి తన రచనల్లో ప్రతిబింబించిన తీరును సొంతమాటల్లో వివరించండి.
జవాబు:
తెలుగు సాహిత్యంలో దాశరథి రంగాచార్యుల గారికి విశిష్ట స్థానం ఉంది. ఈయన తెలంగాణ పోరాటం పూర్వరంగాన్ని, తన జీవశక్తిగా మార్చుకొని, తెలుగువారి సాంస్కృతిక జీవనాన్ని అద్భుతంగా చిత్రించారు. రంగాచార్య నవలల్లో ప్రధాన విషయం ‘తెలంగాణ సాయుధ పోరాటం’. దాశరథి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ఉద్యమశీలి. తెలంగాణలో పోలీసు యాక్షన్ తరువాత రైతుల భూములను దొరలు కాజేశారు.

తరువాత వచ్చిన ఉద్యమాలు, వాటి పేరున జరిగిన మోసాలు, రాజకీయాలు, ఎంత దిగజారాయో మొదలైన విషయాలు ప్రజలకు తెలియాలి అనే భావనతో ‘జనపదం’ నవలలో వివరించారు. “మోదుగుపూలు” నవల ద్వారా ‘సిద్దాంతం కన్నా కర్తవ్యం గొప్పది. విశ్వాసం కంటే కర్తవ్యం గొప్పది’ – అని ప్రకటించారు.

కమ్యూనిస్టు ఉద్యమం దాశరథికి జీవితాన్ని నేర్పింది. సమాజం కోసం ఏదైనా చేయాలి అనే తపన కల్గించింది. “నేను రచనలు ప్రజాజీవితాన్ని చిత్రించడానికి రాశాను. నా ప్రజలకోసం రాశాను” అనడంలో దాశరథికి తెలంగాణ ప్రజలపట్ల ఉన్న అభిమానం వ్యక్తమౌతుంది. “ఆదర్శం, ఆవేశం, అక్షరం” ఇవి ఉన్నప్పుడే వ్యక్తికైనా, సమాజానికైనా కావాల్సినవి సిద్ధిస్తాయని తన రచనల ద్వారా సందేశమిచ్చిన దాశరథి ప్రాతఃస్మరణీయులు.

TS 9th Class Telugu Important Questions 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ప్రశ్న 2.
ప్రముఖ సాహితీవేత్త డా॥ దాశరథి రంగాచార్య చేసిన సాహిత్య సేవను వివరించండి. (లేదా) రంగాచార్యతో ముఖాముఖి ఆధారంగా ఆయన రచనల గురించి వివరించండి.
జవాబు:
మహాకవి దాశరథి రంగాచార్యగారు తెలంగాణ సాయుధపోరాటం నేపథ్యంగా చిల్లర దేవుళ్ళు, జనపదం, మోదుగుపూలు, మాయజలతారు వంటి అద్భుతమైన నవలలు రాశారు. చారిత్రాత్మకమైన తెలంగాణ పోరాట చరిత్రను తన రచనల ద్వారా భావితరాలకు వారు అందజేశారు.

ఇంతేకాక, నాలుగు వేదాలనూ, పది ఉపనిషత్తులనూ తెలుగులోకి అనువదించారు. రామాయణ, భారత, భాగవతాలను సరళవచనంలో రాశారు. తెలంగాణ జనజీవనం, రైతాంగ పోరాటం, వంటి అంశాలు నేపథ్యంగా ఈయన విశిష్టమైన నవలలు రచించి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. తెలుగు నవలలో పాత్రోచితయాసను మొదటగా ప్రవేశపెట్టారు. వీరి రచనలు ఇతర భారతీయ భాషలలోకి కూడా అనువదింపబడ్డాయి.

ఈయన నవలలు చలన చిత్రాలుగా వచ్చాయి. ఈయన రచనాశైలి, పాఠకుడిని ఆకట్టుకొంటుంది. ఈయన రాసిన “చిల్లర దేవుళ్ళు” నవలకు, రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈయనను ‘గద్య దాశరథి’ అనేవారు. ఈయన సంస్కృతాంధ్ర భాషల్లో మహాపండితుడు. ఈయన జీవిత చరిత్రను ‘మోదుగుపూలు’ నవలలో చిత్రించారు. రంగాచార్య గొప్ప రచయిత.

PAPER – I : PART – B

భాషాంశాలు – పదజాలం

1. సొంతవాక్యాలు

అ) కింది పదాలను సొంతవాక్యాల్లో ప్రయోగించండి.

1. బుగులు పడడం (కలత చెందడం)
వాక్యప్రయోగం : రాష్ట్రం విపరీతమైన ఎండలతో బుగులు పడింది.

2. బృహత్ కార్యము: (పెద్దపని)
వాక్యప్రయోగం : ముఖ్యమంత్రి రాష్ట్రమును బంగారు తెలంగాణగా రూపొందించడం అనే బృహత్ కార్యక్రమమును చేపట్టారు.

3. గర్వకారణము :
వాక్యప్రయోగం : మా పాఠశాలలో పదవతరగతి పరీక్షల్లో నూటికి నూరుశాతం పాసుకావడం, మాకు గర్వకారణం

4. సాంప్రదాయసిద్ధము :
వాక్యప్రయోగం : మేము సాంప్రదాయ సిద్ధమైన వస్త్రాలనే ధరిస్తాము.

5. వసుధైక కుటుంబం :
వాక్యప్రయోగం : ప్రపంచ ప్రజలు కులమత భేదాలు విడిచి వసుధైక కుటుంబ భావనతో జీవించాలి.

ఆ) కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు గుర్తించి, వాటి సంకేతాన్ని (A, B, C, D) రాయండి.

ప్రశ్న 1.
నా నవలలు ఆ వ్యధ, బాధ అనే తమస్సులోంచి ఆవిర్భవించాయి.
A) పుట్టడం
B) బాధపడడం
C) తపస్సు చెయ్యడం
D) రాయడం
జవాబు:
A) పుట్టడం

ప్రశ్న 2.
నీ కర్తవ్యం నీవు మరువకు.
A) మాట
B) చేయవలసిన పని
C) ఆలోచన
D) ప్రార్థన
జవాబు:
B) చేయవలసిన పని

TS 9th Class Telugu Important Questions 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ప్రశ్న 3.
ప్రణాళికలను బాగా అధ్యయనం చేయాలి.
A) రాయడం
B) పరిశీలించడం
C) చదవడం
D) నేర్చుకోడం
జవాబు:
B) పరిశీలించడం

ఇ) కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు సరియైన పర్యాయపదాలు గుర్తించి, వాటి సంకేతాన్ని (A, B, C, D) రాయండి.

ప్రశ్న 1.
ఈ వ్యధ బాధ ఆవేదనలోంచి పుట్టాయి.
A) విచారం, గొప్ప
B) గరువము, కావరము
C) గౌరవం
D) రంధి, కష్టం
జవాబు:
C) గౌరవం

ప్రశ్న 2.
కమ్యూనిస్టు ఉద్యమం నన్ను మనిషిని చేసింది.
A) నరుడు, మానవుడు
B) మనుజుడు, యోగ్యుడు
C) మర్త్యుడు, సరసుడు
D) నరుడు, దేవత
జవాబు:
A) నరుడు, మానవుడు

ప్రశ్న 3.
ప్రజల జీవితం నేపథ్యంగా నవలలు రాశారు.
A) బతుకు, కష్టం
B) బతుకు, సంసారం
C) బతుకు, జీవనం
D) మనికి, నడవడి
జవాబు:
C) బతుకు, జీవనం

ప్రశ్న 4.
రామప్పగుడి సోయగం వర్ణనాతీతం.
A) అందం, చందం
B) అందం, సొగసు
C) సొగసు, గొప్పతనం
D) అందం, రంగు
జవాబు:
B) అందం, సొగసు

ఈ) కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు ప్రకృతులకు వికృతులు, వికృతులకు ప్రకృతులను గుర్తించి, వాటి సంకేతాన్ని (A, B, C, D) రాయండి.

ప్రశ్న 1.
రావణుని గర్వమునకు కారణం ఏమిటి ?
A) ఖర్వం
B) గరువము, కారవము
C) గౌరవం
D) గారం
జవాబు:
B) గరువము, కారవము

ప్రశ్న 2.
ఆలస్యం ఎందుకంటే కత చెప్తావేం? గీత గీసిన పదానికి ప్రకృతి
A) కతలు
B) కొత్త
C) కథ
D) కైత
జవాబు:
C) కథ

TS 9th Class Telugu Important Questions 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ప్రశ్న 3.
నీ కష్టం నాకు అర్ధం అయ్యింది.
A) కస్తి
B) నష్టం
C) కలహం
D) ఇష్టం
జవాబు:
A) కస్తి

ప్రశ్న 4.
తమిళంలో ఒక్క అక్షరం రాయరాదు.
A) అక్ష
B) అవసరం
C) అక్కరం
D) అక్షయం
జవాబు:
C) అక్కరం

ప్రశ్న 5.
నాకు పద్యము చదవడం ఇష్టం.
A) పద్దెము
B) గద్యం
C) గం
D) పాట
జవాబు:
A) పద్దెము

ఉ) కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు నానార్థాలను గుర్తించి, వాటి సంకేతాన్ని (A, B, C, D) రాయండి.

ప్రశ్న 1.
తెలంగాణలో రైతుపోరాట ఉద్యమం ఉవ్వెత్తున సాగింది.
A) యత్నం, ప్రయత్నం
B) యత్నం, పోరాటం
C) కలహం, సిద్దమవడం
D) యత్నం, కృషి
జవాబు:
B) యత్నం, పోరాటం

ప్రశ్న 2.
రాష్ట్ర సాధనలో విద్యార్థుల కృషి అమోఘమైనది.
A) ప్రయత్నం, వ్యవసాయం
B) వ్యవసాయం, చేత
C) పని, నడక
D) ప్రయత్నం, సాధక
జవాబు:
A) ప్రయత్నం, వ్యవసాయం

ప్రశ్న 3.
ఈ రోజు పాఠశాలలో సభ జరిగింది.
A) జూదం, మీటింగు
B) పరిషత్తు, కొలువు
C) ఇల్లు, జూదం
D) పరిషత్తు, ఉద్యమం
జవాబు:
C) ఇల్లు, జూదం

ప్రశ్న 4.
ఈ మధ్య సమాజం పూర్తిగా, కొత్తపుంతలు తొక్కుతోంది.
A) సభ, మనుషుల గుంపు
B) మనుషుల గుంపు, సమితి
C) సమితి, జనం
D) జనం, సభ
జవాబు:
A) సభ, మనుషుల గుంపు

PAPER – II : PART – A

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
దాశరథి రంగాచార్యగారిని అభినందిస్తూ కవిత/గేయం రాయండి.
జవాబు:
కవిత
– కంచిభొట్ల ఫణిరామ్

ఎవరయ్యా అతడు ! ఎవరయ్యా !
జనపదం ఆయన పథం
మోదుగు పూలు వారి హృది పథం.
చరిత్రను చెరపలేరంటాడు
రానున్న తరాలకు అందిస్తానంటాడు.
వారి నవలలు కావా ప్రజా జీవితాలూ ?
ఎందరో యువకులకు ప్రబోధ గీతాలు.

ఎవరయ్యా ఇతడు ! ఎవరయ్యా !

సత్యం ఆయన నమ్మిన మార్గం.
కర్తవ్యానికి నిలువెత్తు దుర్గం.
తెలంగాణం అంటే అభిమానం.
తెలంగాణేతరం పట్ల లేదు దురభిమానం.

‘ఆదర్శం, ఆవేశం, అక్షరం’ నా జీవితం
బాధ్యత, విలువలు గల ఈ సమాజానికే అంకితం.
అన్నది ఇంకెవరయ్యా ఆయనే దాశరథి రంగాచార్య.

TS 9th Class Telugu Important Questions 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ప్రశ్న 2.
మీ తెలుగు పాఠ్యపుస్తక రచయిత మీ పాఠశాలకు వస్తే ఆయనతో ముఖాముఖికి అవసరమైన ప్రశ్నావళిని తయారుచేయండి.
జవాబు:
మా పాఠశాలకు డా॥ ఇరివెంటి కృష్ణమూర్తిగారు వస్తే, ఈ క్రింది ప్రశ్నలతో ఆయనను ఇంటర్వ్యూ చేస్తాను.

  1. యువభారతి అధ్యక్షా ! ‘కవి సమయములు’ అంటే ఏమిటి ? .
  2. విద్వత్తులేని వక్తృత్వం ఎంతోకాలం అంతటా రాణించదు అన్నారు. ఎందుకు ?
  3. వక్తకు జ్ఞాపకశక్తి ఉండాలా ?
  4. వక్త అంగాంగ విన్యాసం చెయ్యాలనే నియమం ఏదీ లేదన్నారు. ఎలా ?
  5. ఉపన్యాసం వ్యంగ్యార్థాన్ని ఆశ్రయించాలా ?
  6. ఉపన్యాసానికి ఆత్మ ఏది ?
  7. బాగా ఆలోచించేవాడు తక్కువ మాట్లాడతాడా ?
  8. శ్రోతలను శిలామూర్తులనుకోవడం ఎలా ?

ప్రశ్న 3.
మీ పాఠశాలకు వచ్చిన పదవీ విరమణ పొందిన ఒక ఉపాధ్యాయునితో ఆయన ఉద్యోగ జీవితాన్ని గురించి తెలుసుకునేందుకు ప్రశ్నావళి తయారుచేయండి.
జవాబు:
మా పాఠశాలకు ఇటీవల పదవీ విరమణ పొందిన తెలుగు ఉపాధ్యాయుడు వస్తే, కింది ప్రశ్నలతో ఆయన గూర్చి ఇలా అడుగుతా.

  1. నమస్కారమండి గురువుగారు! మీ ఆరోగ్యం ఎలా ఉంది ?
  2. మీ ఊరిలో ఉన్నప్పుడు మేము గుర్తుకొస్తామా ?
  3. మీకు కాలక్షేపం ఎలా అవుతోంది ?
  4. ఖాళీ సమయాల్లో ఏం చేస్తారు ?
  5. ఏవైనా పుస్తకాలు రాశారా ?
  6. మేమేమైనా ఇబ్బంది పెట్టి ఉన్నామా ?
  7. మేము మీ మనసుకు బాగా కష్టపెట్టిన సందర్భం ఏది ?
  8. మీరు ఎన్నో ఊళ్ళు మారి ఉంటారు. ఎందరినో విద్యార్థులను చూసి ఉంటారు. వారిలో బాగా నచ్చిన దెవరు ? బాధపెట్టిన దెవరు ?
  9. మీకు ఇష్టమైన కవి ఎవరు ?
  10. మీకు బాగా నచ్చిన పుస్తకం ఏది ?

PAPER – II : PART – B

భాషాంశాలు – వ్యాకరణం

1. సంధులు

1) మహోద్యమం = మహా + ఉద్యమం – గుణసంధి
2) మహోజ్జ్వలం = మహా + ఉజ్జ్వలం – గుణసంధి
3) అన్నయ్య = అన్న + అయ్య – అత్వసంధి
4) ప్రభావాత్మకము = ప్రభావ + ఆత్మకము – సవర్ణదీర్ఘ సంధి
5) సంస్కృతాంధ్రభాషలు = సంస్కృత + ఆంధ్రభాషలు – సవర్ణదీర్ఘ సంధి
6) వసుధైక కుటుంబం = వసుధా + ఏకకుటుంబం – వృద్ధిసంధి
7) మరొకటి = మరి + ఒకటి – ఇత్వసంధి
8) విద్యార్థులు = విద్యా + అర్థులు – సవర్ణదీర్ఘ సంధి

2. సమాసాలు

సమాస పదం – విగ్రహవాక్యం – సమాస నామం

1) మహోద్యమము – గొప్పదైన ఉద్యమం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
2) విద్యార్థులు – విద్యను అర్థించువారు – ద్వితీయా తత్పురుష సమాసం
3) ప్రజాజీవితాలు – ప్రజల యొక్క జీవితాలు – షష్ఠీ తత్పురుష సమాసం
4) పోరాటగాథ – పోరాటము యొక్క గాథ – షష్ఠీ తత్పురుష సమాసం
5) జీవనచిత్రాలు – జీవనము యొక్క చిత్రాలు – షష్ఠీ తత్పురుష సమాసం
6) భారతదేశము – భారతము అనే పేరుగల దేశము – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
7) కొత్త దృక్పధము – కొత్తదైన దృక్పధము – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
8) గర్వకారణం – గర్వమునకు కారణం – షష్ఠీ తత్పురుష సమాసం
9) చదువు రాణి – చదువులకు రాణి – షష్ఠీ తత్పురుష సమాసం
10) భగవదనుగ్రహం – భగవంతుని యొక్క అనుగ్రహం- షష్ఠీ తత్పురుష సమాసం
11) వారసత్వసంపద – వారసత్వం అనెడి సంపద – రూపక సమాసం
12) సాహిత్యకృషి – సాహిత్యమందు కృషి – సప్తమీ తత్పురుష సమాసం
13) జీవనవైభవము – జీవనము యొక్క వైభవము – షష్ఠీ తత్పురుష సమాసం

ప్రశ్న 3.
‘సభ కొఱకు భవనం’ – ఈ విగ్రహవాక్యాన్ని సమాసపదంగా మార్చి, సమాసనామం రాయండి.
జవాబు:
సభా భవనం – చతుర్థీ తత్పురుష సమాసం

ప్రశ్న 4.
‘తల్లియు బిడ్డయూ’ విగ్రహవాక్యాన్ని సమాసపదంగా మార్చి, సమాసనామం రాయండి.
జవాబు:
తల్లీ బిడ్డలు – ద్వంద్వ సమాసం

ప్రశ్న 5.
‘వసుధైక కుటుంబము’ – విడదీసి సంధి పేర్కొనండి.
జవాబు:
వసుధా + ఏక కుటుంబము – వృద్ధిసంధి.

TS 9th Class Telugu Important Questions 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ప్రశ్న 6.
‘భారతదేశము’ విగ్రహవాక్యం రాసి, సమాసనామాన్ని పేర్కొనండి.
జవాబు:
భారతం అనే పేరుగల దేశం- సంభావన పూర్వపద కర్మధారయం

ప్రశ్న 7.
‘వారసత్వ సంపద’ – సమాసానికి విగ్రహం రాసి, సమాసం పేరు చెప్పండి.
జవాబు:
వారసత్వం అనే సంపద – రూపక సమాసం

ప్రశ్న 8.
‘మహా + ఉద్యమం’ – సంధి కలిపి సంధి జరిగిన విధానాన్ని రాయండి.
జవాబు:
మహోద్యమము – గుణసంధి, ‘మహా’ పదం చివర ‘అ’కు, ‘ఉ’ పరమై గుణసంధి వచ్చింది.

ప్రశ్న 9.
రాముడు రావణుని చంపాడు. (కర్మణి వాక్యంగా మార్చండి.)
జవాబు:
రావణుడు రామునిచే చంపబడ్డాడు. (కర్మణి వాక్యం)

ప్రశ్న 10.
బాలురచే సెలవు తీసికోబడింది. (కర్తరి వాక్యంగా మార్చండి.)
జవాబు:
బాలురు సెలవును తీసుకున్నారు. (కర్తరి వాక్యం)

TS 9th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson స్వామి వివేకానంద

Telangana SCERT 9th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం 5th Lesson స్వామి వివేకానంద Questions and Answers.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson స్వామి వివేకానంద

TS 9th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson స్వామి వివేకానంద 1
భారతీయ ధర్మం అన్ని మతాల్ని అంగీకరిస్తుందనీ, గౌరవిస్తుందనీ, అన్ని మతాలు సత్యాలేననీ, అవన్నీ భగవంతుని చేరుకోడానికి మార్గాలనీ స్వామీజీ చెప్పారు. ఎవరూ మతాన్ని మార్చుకోనవసరం లేదనీ, నా మతమే గొప్పది. నా మతమే నిలవాలి అనుకునేవారు బావిలో కప్పవంటివారనీ స్వామీజీ తెలిపారు. మిగతా వక్తలు తమ తమ మతాలకే ప్రాతినిధ్యం వహిస్తే, స్వామీజీ మాత్రం అన్ని ధర్మాల తరఫునా మాట్లాడి నిజమైన మతసామరస్యాన్ని చూపించాడు. సదస్యులందరికి స్వామీజీ ప్రసంగమే నచ్చింది.

PAPER – I : వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన) (మార్కులు: 6)

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
నరేంద్రుని బాల్యం, విద్యాభ్యాసం గురించి రాయండి.
జవాబు:
నరేంద్రుడు ఆరవ ఏట విద్యాభ్యాసం మొదలుపెట్టాడు. మొదట్లో ఇంట్లోనే తల్లిదండ్రులు నియమించిన గురువు వద్ద చదువుకున్నాడు. గురువు ఒకసారి చెప్పగానే నేర్చుకొని, అప్పచెప్పగలిగేవాడు.
ఏడవ ఏట ఈశ్వరచంద్ర విద్యాసాగర్ స్థాపించిన మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూషన్లో చేరాడు. నరేన్ తెలివితో, చురుకుతో తోటి బాలురందరికీ నాయకుడయ్యాడు. నరేన్కు ఆటలంటే ప్రాణం.
– నరేన్కు ఇష్టమైన ఆట “రాజు – దర్బారు”. ఇంటిలోనే సొంతంగా ఒక వ్యాయామశాల ఏర్పాటుచేశాడు. తర్వాత వ్యాయామశాలలో చేరి కర్రసాము, కత్తిసాము, గుర్రపుస్వారీ నేర్చాడు.

నరేన్కు క్రమంగా పుస్తకాలు చదవడంపై ఆసక్తి పెరిగింది. తండ్రిగారు బదిలీకావడంతో, రాయపూర్ వెళ్ళి తిరిగి కలకత్తా వచ్చి మూడేళ్ళ చదువు ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేశాడు. ఆ పరీక్ష మొదటిశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. పాఠశాలలో ఆ శ్రేణిలో పాసైన ఏకైక విద్యార్థి నరేన్ ఒక్కడే.

తరువాత ప్రెసిడెన్సీ కాలేజీలోనూ, మరుసటి సంవత్సరం నేడు స్కాటిష్చర్స్’ అని పిలువబడే కళాశాలలోనూ చేరాడు. ప్రిన్సిపాలూ, గురువులూ నరేన్ ప్రతిభాపాటవాలకు ఆశ్చర్యపోయేవారు. నరేంద్రుడు ఎన్నో గ్రంథాలు చదివాడు. 1884లో బి.ఏ. పాసయ్యాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson స్వామి వివేకానంద

ప్రశ్న 2.
వివేకానందుని అమెరికా పర్యటన విశేషాలను తెల్పండి.
జవాబు:
స్వామీజీయైన నరేంద్రుడు అమెరికాలో జరుగబోయే సకల మతముల మహాసభకు వెళ్ళి, భారతదేశ ధర్మాన్ని ప్రపంచానికి తెలియపరుద్దామనుకున్నాడు. మద్రాసులో యువకులు అందుకు సహాయం చేశారు. ఖేత్రీ మహారాజు నరేంద్రునికి కెనడా వెళ్ళే ఓడలో టిక్కెట్టుకొని ఇచ్చాడు. నరేంద్రుని, “వివేకానంద” అనే నామాన్ని స్వీకరింపమన్నాడు.

వివేకానందుడు 1893 మే 31న అమెరికాకు బయలుదేరాడు. ఓడ కెనడా దేశంలోని ‘వాంకోవర్ ‘ లో ఆగింది. అక్కడ నుండి రైలులో “షికాగో” నగరానికి వివేకానంద వెళ్ళాడు. రైల్లో’ ‘సాన్ బోర్న్’ అనే మహిళతో పరిచయం అయ్యింది. ఆమె వివేకానందుడు ‘బోస్టన్’ నగరానికి వచ్చినపుడు తన ఇంటికి రమ్మంది.

షికాగో ధనవంతుల నగరం. విశ్వమత మహాసభలకు ఇంకా రెండు నెలల వ్యవధి ఉంది. అదీగాక, ఆ సభలో మాట్లాడేందుకు వివేకానందుని వద్ద ధ్రువపత్రాలు లేవు. దానితో వివేకానందుడు ‘బోస్టన్’లో సాన్ బోర్న్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ హార్వర్డ్ ప్రొఫెసర్ జె.హెచ్.రైట్తో పరిచయమైంది. రైట్, వివేకానందుని విశ్వమత మహాసభలో హైందవ ధర్మం గురించి మాట్లాడమన్నాడు. తనవద్ద ధ్రువపత్రాలు లేవని వివేకానందుడు చెప్పాడు.

ఆ ప్రొఫెసర్ విశ్వమత మహాసభల అధ్యక్షుడికి వివేకానందుని గూర్చి అమెరికాలోని పండితులందరి కంటే వివేకానందుడు గొప్పవాడని రాశాడు. వివేకానందుని ఆ ప్రొఫెసర్ చికాగోకు పంపాడు. కానీ రైట్ ఇచ్చిన కాగితం కనబడలేదు. వివేకానందుడు చికాగోలో భిక్షాటన చేశాడు. చెట్టు కింద పడుకున్నాడు. జార్జ్. డబ్ల్యూ. హేల్ అనే ఆమె వివేకానందుని చూసి, విశ్వమత మహాసభలకు వచ్చిన భారతీయ సన్యాసి అని గౌరవించింది. ఆమె సాయంవల్లనే వివేకానందుడు విశ్వమత మహాసభలో మాట్లాడాడు.

సభలో వివేకానందుడు “నా అమెరికా దేశ సోదర సోదరీమణులారా ! అంటూ తన ఉపన్యాసం ప్రారంభించాడు. ఆ కమ్మని పిలుపుకు సభ్యులు ఆనందించి మూడు నిమిషాలపాటు లేచి చప్పట్లు కొట్టారు. వివేకానంద ఆ సభలో అన్ని ధర్మాల తరపునా మాట్లాడి, సర్వమత సామరస్యాన్ని చూపాడు. వివేకానందుని ఖ్యాతి దేశదేశాలకూ పాకింది.

ప్రశ్న 3.
వివేకానందుడు జాతికిచ్చిన సందేశమేమి ?
జవాబు:
వివేకానందుని సందేశము: “మన భారతదేశం పుణ్యభూమి. సంపద, అధికారం మన భారతజాతికి ఎప్పుడూ ఆదర్శాలు కాలేదు. భారతీయుడు ఎవరైనా సరే, జాతిమత తారతమ్యం లేకుండా, పేద, గొప్ప వివాదం లేకుండా, కుల వివక్షతను దగ్గరకు రానీయకుండా, అందరూ నా సహోదరులే అని చాటాలి. భారతదేశానికి అంతటికీ ఏది హితమో, అదే తనకు కూడా హితము అని ప్రకటించాలి.

భారతదేశానికి మంచి జరగాలంటే, స్త్రీ జనోద్ధరణ, జన చైతన్యం ప్రధానంగా సంభవించాలి. పేద జనానికి ఆహారం ఇవ్వాలి. విద్యావ్యాప్తి సక్రమంగా జరగాలి. సర్వజనులకూ తగినంత ఆహారం, జీవనోపాధి అవకాశాలు కల్పించాలి. వ్యావహారిక భాషలోనే కళాత్మకంగా, సహజంగా శాస్త్ర పాండిత్యం సాధించాలి. పరిశోధనలను కూడా వాడుక భాషలోనే నిర్వహించాలి. విద్య సమస్త సమస్యలనూ పరిష్కరించే మార్గం కావాలి.

వివేకానంద యువకులకు ఇలా సందేశం ఇచ్చారు – “మీకు ప్రేమ, నిజాయితీ, సహనం కావాలి. నిరుపేదలనూ, అమాయక ప్రజలనూ, అణగద్రొక్కబడిన వారినీ ప్రేమించండి. వారి కొరకు పరితపించండి. పిరికితనాన్ని విడచి, ధైర్యంగా సమస్యలను ఎదుర్కోండి. దీనజనులను ఉద్ధరించండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. ఓర్పుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు వస్తాయని మరువకండి. లేవండి మేల్కొనండి. శ్రేష్ఠులైన ఆచార్యుల బోధనలు అనుసరించండి.”

ప్రశ్న 4.
వివేకానందుని సందేశాల ఆధారంగా ఏకపాత్రాభినయం చేయండి.
జవాబు:
ఏకపాత్రాభినయం “వివేకానంద” :

నా భారతీయ సహోదరులారా !
మన భారతదేశం ఒక్కటే అసలైన పుణ్యభూమి, మన భారతజాతి శతాబ్దాలుగా శక్తిమంతమైన జాతి. ఐనా అది ఇతర రాజ్యాలపై దండయాత్ర చేయలేదు. మన భారతీయుడు ఎవరైనా సరే, జాతిమత భేదం, పేద – గొప్ప తేడా, కుల భేదం లేకుండా, అందరూ నా సోదరులే అని చాటాలి. భారతీయ సమాజం నా బాల్యడోలిక, నా యౌవన ఉద్యానం, నా వార్ధక్యంలో వారణాసి. భారతీయ సమాజం నాకు స్వర్గతుల్యం.

మన భారతదేశానికి మంచి జరగాలంటే, స్త్రీ జనోద్ధరణ, జనచైతన్యం ప్రధానంగా సంభవించాలి. నాకు ఈ లోకంలో సరిపడ తిండిని ప్రసాదించలేక, స్వర్గంలో ఆనందాన్నిచ్చే భగవంతుని నేను విశ్వసించలేను. ముందు కడుపునిండా తిండి. తర్వాతనే మతం.

మనం వ్యావహారిక భాషలోనే శాస్త్రపాండిత్యం సాధించాలి. మన పరిశోధనలు వ్యావహారిక భాషలోనే నిర్వహించాలి. సాహసం గల యువకులారా ! మీకు ప్రేమ, నిజాయితీ, సహనం కావాలి. నిరుపేదలను, అమాయకులను, అణగద్రొక్కబడిన వారిని ప్రేమించండి. దీనుల కోసం శ్రమించండి.

“ఉత్తిష్ఠత ! జాగ్రత ! ప్రాప్య వరాన్ నిబోధత !” (లేవండి! మేల్కొనండి ! శ్రేష్ఠులైన ఆచార్యుల బోధనలను అనుసరించండి !)

PAPER – II : పరిచిత గద్యాలు (మార్కులు : 5)

1. కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

కాశీలో ఒక సంఘటన జరిగింది. ఒకరోజు దుర్గ అమ్మవారి ఆలయానికి వెళ్ళి వస్తూంటే దారిలో ఒక కోతులగుంపు కనిపించింది. అవి ఆయనవైపు తిరిగి పరుగెత్తి రాసాగాయి. అవి కరుస్తాయనే తలంపుతో వివేకానంద స్వామిజీ వెనుదిరిగి చిన్నగా పరుగెత్త నారంభించాడు. అవి ఇంకా వెంబడిస్తూనే ఉన్నాయి. ఏం చేయాలి అని ఆలోచిస్తూ పరుగెడుతున్న స్వామికి అటుగా వెళ్తున్న ఒక వృద్ధ సన్యాసి కనిపించాడు. అడగకుండానే ఆ సన్యాసి అంతా గమనించి, “ఆగు! వెనుదిరిగి ఆ జంతువుల నెదుర్కో” అని గట్టిగా అరిచాడు. స్వామిజీ ఆగి వెనక్కి తిరగగానే, కోతులు కూడా ఆగి వెనుదిరిగాయి. స్వామిజీ రెండు మూడడుగులు వేసి భయపెట్టగానే అవి పరుగులంకించుకున్నాయి. తరువాతి కాలంలో స్వామిజీ అమెరికాలో ప్రసంగిస్తూ ఇది తన జీవితంలో తాను నేర్చుకున్న ఒక గొప్ప పాఠం అనీ, ఆ కోతుల్లాగ కష్టాలు మనల్ని వెన్నాడుతున్నాయనీ, ఎప్పుడైతే ఆగి మనం వెనుదిరిగి వాటినెదుర్కొంటామో, అప్పుడు అవే పారిపోతాయని బోధించాడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
కోతులు ఎప్పుడు పరుగుపెట్టాయి ?
జవాబు:
స్వామీజీ వెనుదిరిగి రెండు మూడడుగులు వేసి భయపెట్టగానే కోతులు పరుగుపెట్టాయి.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson స్వామి వివేకానంద

ప్రశ్న 2.
వివేకానంద స్వామిజీకి కోతులు ఎప్పుడు కనిపించాయి ? ఎక్కడ కనిపించాయి ?
జవాబు:
వివేకానంద స్వామిజీకి దుర్గ అమ్మవారి ఆలయానికి వెళ్ళి వస్తున్నప్పుడు కోతులు కాశీలో దారిలో కనిపించాయి.

ప్రశ్న 3.
‘ఆ జంతువులనెదుర్కో’ అని ఉపదేశించిన వ్యక్తి ఎవరు ?
జవాబు:
‘ఆ జంతువుల నెదుర్కో’ అని ఒక వృద్ధ సన్యాసి స్వామికి అరిచి చెప్పాడు.

ప్రశ్న 4.
వివేకానందస్వామి కోతుల సంఘటన నుండి నేర్చుకున్న పాఠం ఏమిటి ?
జవాబు:
కోతుల్లాగే కష్టాలు మానవులను వెన్నాడుతాయనీ, ఎప్పుడైతే, ఆగి మనం వెనక్కు తిరిగి ఆ కష్టాలను ఎదుర్కుంటామో అప్పుడు అవి పారిపోతాయనీ, స్వామికి కోతుల సంఘటనను బట్టి నేర్చుకున్నాడు.

ప్రశ్న 5.
కోతులు సంఘటనను గూర్చి వివేకానంద ఎక్కడ చెప్పారు ?
జవాబు:
కోతుల సంఘటనను గూర్చి స్వామిజీ అమెరికాలో చెప్పాడు.

2. కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

వివేకానంద స్వామి బొంబాయి నుండి 1893 మే 31 వ తారీఖున అమెరికాకు బయలుదేరాడు. ఓడ దారిలో సిలోను, సింగపూరు, హాంగ్కాంగ్, చైనా, జపాన్ లోని రేవులలో ఆగింది. స్వామిజీ ఆయా ప్రాంతాలను ఎంతో ఆసక్తితో గమనించేవాడు. కొన్నాళ్ళకు ఓడ కెనడా దేశంలోని వాంకోవర్లో ఆగింది. స్వామిజీ అక్కడి నుండి షికాగోకి రైలులో వెళ్ళాడు. రైల్లో సాన్బోర్న్ అనే ఒక మహిళ స్వామిజీతో మాట్లాడింది. స్వామిజీ ప్రతిభాపాండిత్యాలనీ, పవిత్రతనీ, గమనించి, ‘స్వామీ మీరెప్పుడైనా బోస్టన్ నగరానికి వస్తే, దయచేసి మా ఇంటికి అతిథిగా వచ్చి మమ్మానందింపజేయండి’ అని తన చిరునామా ఇచ్చింది. జూలై నెల మధ్యలో స్వామీ షికాగో చేరుకున్నాడు. అదొక చిత్రమైన కొత్త ప్రపంచం. అక్కడి భవంతులు రోడ్లు, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలూ, యంత్రాలూ, కర్మాగారపు తయారీలూ, కళలూ మొదలైనవన్నీ చూసి స్వామీజీ విస్తుపోయాడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
స్వామీజీ వేటిని చూసి విస్తుపోయారు ?
జవాబు:
స్వామిజీ, షికాగోలో భవంతులు, రోడ్లు, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలూ, యంత్రాలూ, కర్మాగారపు తయారీలూ, కళలూ మొదలయినవి చూసి విస్తుపోయారు.

ప్రశ్న 2.
వివేకానంద స్వామి ప్రయాణించిన ఓడ ఎక్కడ ఆగింది ?
జవాబు:
వివేకానందస్వామి ప్రయాణించిన ఓడ కెనడా దేశంలోని వాంకోవర్ లో ఆగింది.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson స్వామి వివేకానంద

ప్రశ్న 3.
స్వామిజీకి రైల్లో కనబడిన మహిళ ఎవరు ? ఆమె ఏ నగరానికి చెందినది ?
జవాబు:
స్వామిజీకి రైల్లో కనబడిన మహిళ పేరు “సాన్బోర్న్”. ఆమె బోస్టన్ నగరానికి చెందినది.

ప్రశ్న 4.
స్వామిజీ బొంబాయిలో ఎప్పుడు బయలుదేరారు ?
జవాబు:
స్వామిజీ బొంబాయిలో 1893 మే 31వ తారీఖున అమెరికాకు బయలుదేరారు.

ప్రశ్న 5.
స్వామిజీ ఎప్పుడు చికాగో చేరుకున్నారు?
జవాబు:
స్వామిజీ జూలై నెల మధ్యలో చికాగో చేరుకున్నారు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson ఆచార్య కొత్తపల్లి జయశంకర్

Telangana SCERT 9th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం 4th Lesson ఆచార్య కొత్తపల్లి జయశంకర్ Questions and Answers.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson ఆచార్య కొత్తపల్లి జయశంకర్

TS 9th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 1

తెలంగాణ చెరువు తీరు
మన జయశంకరు సారూ
అలుగు దుంకి పారూ
పదునైన మాట జోరు
పాలు పోసుకున్న పజ్జోన్న కంకులల్ల
పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్ల
మీ ఆశయాల వ్రాలూ
కనిపించే ఆనవాలూ ….
కన్నులలో ఆవేశం కదలాడిన రుద్రుడు
ఆధిపత్య శక్తులపై అతడు వీరభద్రుడు
ఆలోచనల అవసరాన్ని తెలిపిన నిబద్ధుడు
తెలంగాణ కనుగొన్న అతడు మరో

PAPER – I : వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన) (మార్కులు: 6)

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
జయశంకర్ బాల్యం, విద్యాభ్యాసం గురించి రాయండి.
జవాబు:
తెలంగాణను శ్వాసించిన మహోపాధ్యాయుడు, జయశంకర్, వరంగల్లు జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో లక్ష్మీకాంతరావు, మహాలక్ష్మీ దంపతులకు 1934 ఆగస్టు 6న జన్మించాడు. ఆ రోజుల్లో ఉర్దూ మీడియం పాఠశాలలు మాత్రమే ఉండేవి. జయశంకర్ ఆ రోజుల్లో హన్మకొండలోని మర్కజీ పాఠశాలలో ప్రాథమిక విద్య నేర్చాడు. హన్మకొండ న్యూ హైస్కూలులో మాధ్యమిక వరకు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్.ఎస్. సీ వరకు చదువుకున్నాడు.

జయశంకర్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ. పూర్తి చేశాడు. బెనారస్ విశ్వవిద్యాలయం, ఆలీగఢ్ విశ్వవిద్యాలయాల నుండి పి.జి. పూర్తి చేశాడు. ఆ రోజుల్లో వరంగల్లో డిగ్రీ కళాశాల లేదు. డిగ్రీ చదవాలంటే, హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చేది. లెక్చరర్ గారి ప్రోద్బలంతో కాలేజీ కావాలని విద్యార్థులు ఉద్యమం చేశారు. అందులో జయశంకర్ ముందువరుసలో నిలిచాడు.

ఊరేగింపులో జయశంకర్ నినాదాలిస్తున్నాడు. “వరంగల్కు డిగ్రీ కాలేజి కావాలి” అని నినాదాలు ఇవ్వడానికి బదులు, యూనివర్సిటీ కావాలి అని జయశంకర్ నినాదం ఇచ్చాడు. అందరూ నవ్వుకున్నారు. అప్పుడు జయశంకర్ను బాగా ఇష్టపడే ఒక లెక్చరరు, “ఏయ్ పిచ్చిపిల్లాడా ! ఏమయ్యింది” అని జయశంకరుని మందలించాడు. చిత్రంగా ఈ సంఘటన జరిగిన పదేళ్ళకు డిగ్రీ కాలేజి, 30 ఏళ్ళకు యూనివర్సిటీ వరంగల్లులో ప్రారంభమయ్యాయి. అంతేకాదు. పిచ్చిపిల్లాడనిపించుకున్న ఆ జయశంకర్, వరంగల్లు యూనివర్సిటీ వైసాఛాన్సలరు అయ్యాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson ఆచార్య కొత్తపల్లి జయశంకర్

ప్రశ్న 2.
జయశంకర్ ఉద్యోగ జీవితం గురించి తెలపండి.
జవాబు:
జయశంకర్ 1960లో ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టాడు. దానితో జయశంకర్ ఉద్యోగ జీవితం మొదలయ్యింది. తరువాత హన్మకొండలో ఉపాధ్యాయుడిగా నియమింపబడ్డాడు. అక్కడి నుండి లెక్చరర్గా ఆదిలాబాద్కు వెళ్ళాడు. 1975-79 వరకు సి.కె. యం. కళాశాల ప్రిన్సిపాలుగా, బోర్డు మెంబరుగా జయశంకర్ సేవలందించాడు.

1982 – 91 వరకు, సీఫెల్ రిజిష్ట్రారుగా పనిచేశాడు. ఈయన 1991 94 వరకు కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు. ఇవియే కాకుండా, వివిధ ప్రభుత్వ హోదాల్లో, సంఘాల పదవుల్లో పనిచేసి, తనదైన ముద్ర వేశాడు.

జయశంకర్ ఎన్నో పదవుల్లో పనిచేశాడు. తనకు వైస్ ఛాన్సలర్గా చేసిన పనిలో తృప్తి కంటే, సి.కె. ఎం. కళాశాల ప్రిన్సిపాలుగా పనిచేయడం, ఎక్కువ తృప్తినిచ్చిందని జయశంకర్ సార్ చెప్పేవాడు. ఈ విధంగా హన్మకొండలో టీచర్ గా మొదలైన జయశంకర్ ఉద్యోగ జీవితం, అదే ఊళ్ళో వైస్ ఛాన్సలర్గా పదవీ విరమణతో ముగిసింది.

ప్రశ్న 3.
తెలంగాణ ఉద్యమంలోని మూడు దశల్లో జయశంకర్ నిర్వహించిన పాత్రను గురించి రాయండి.
జవాబు:
తెలంగాణ ఉద్యమంలో మూడు ప్రధాన దశలు ఉన్నాయి. మొదటిది భావజాల వ్యాప్తి. రెండవది ఆందోళనా కార్యక్రమం. మూడవది రాజకీయ ప్రక్రియ. ఈ మూడు దశల్లోనూ జయశంకర్ పాత్ర మరచిపోలేనిది. అందుకే, జయశంకర్ తెలంగాణ సిద్ధాంతకర్త.

ఇందులో మొదటిది తెలంగాణ భావజాల వ్యాప్తి :
తెలంగాణ భావజాలం ఎంతగా ప్రజల్లోకి వెళ్ళిందో జయశంకర్ ఒకరోజు ఇలా చెప్పాడు. “ఎందుకమ్మా తెలంగాణ” అని అడిగితే, తెలంగాణ వస్తే మా పొలాలకు నీళ్ళొస్తాయి. మా పిల్లలకు ఉద్యోగాలొస్తాయి అని చదువు రాని ఆడవాళ్ళు చెప్పారు” – ఈ విధంగా తెలంగాణ భావజాలం వ్యాపించింది.

రెండవది ఆందోళన కార్యక్రమం. తెలంగాణలో జరిగిన ఆందోళనలు, ఉద్యమాన్ని రెండింతలు చేశాయి. ఈ ఉద్యమాల వెనుక జయశంకర్ వంటి మేథావులు, ఉద్యమ కార్యకర్తల సూచనలు, సలహాలు ఉన్నాయి. జయశంకర్ ఆందోళనకారులకు కావలసిన పూర్తి వివరాలు, విశ్లేషణలతో ముందుంచేవాడు.

మూడవ దశ రాజకీయ ప్రక్రియ. జయశంకర్ రాజకీయ ప్రక్రియలో పాల్గొనకపోయినా, తెలంగాణ రాజకీయ నాయకులందరికీ, తన సహకారం అందించాడు. చెన్నారెడ్డి నుండి చంద్రశేఖరరావు వరకు ప్రతి రాజకీయ పార్టీకి జయశంకర్ తన మేథోశ్రమను ధారపోశాడు. జయశంకర్ ఊహించినట్టే, చివరకు రాజకీయ ప్రక్రియతోనే తెలంగాణ వచ్చింది.

ప్రశ్న 4.
జయశంకర్ సమయపాలన, నిబద్ధతల గురించి తెలిపే సంఘటనలను తెలపండి.
జవాబు:
జయశంకర్ నీతి,నిజాయితి, నిరాడంబరత, నిబద్ధత సమయపాలన వంటి లక్షణాలు ఉన్న మహా మనీషి. ఈయన సమయపాలన, నిబద్ధతలను గురించి తెలిపే ఒక సంఘటనను పరిశీలిద్దాం. జయశంకర్ సీఫెల్ రిజిష్ట్రారుగా ఉన్న సమయంలో సాయంత్రం 5.30 నుండి రాత్రి 10.30 వరకు తన పరిశోధక విద్యార్థికి సమయం కేటాయించేవారు. తన భోజన సమయంలో విద్యార్థిని కూర్చోబెట్టుకొని, మెటీరియల్ చూసేవారు. ఒకసారి జయశంకర్ సార్ స్నేహితుడొకడు 5 గంటల వరకూ ఆయనతో గడపి, తృప్తిలేక ఇంకా మాట్లాడడానికి ప్రయత్నించాడు.

జయశంకర్ నిర్మొహమాటంగా తన పి.హెచ్.డి విద్యార్థి వచ్చే సమయమయ్యిందనీ మిత్రునితో మరొకసారి కలుద్దామని చెప్పి, మిత్రుని బయటకు పంపించారు. పై పరిశోధక విద్యార్థే తరువాతి కాలంలో ఖమ్మం కళాశాల ప్రిన్సిపాల్ అయ్యాడు. అప్పుడు జయశంకర్ కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా ఉండేవారు. పై ప్రిన్సిపాలు వైస్ ఛాన్స్లర్గా ఉన్న జయశంకర్ సార్తో ఒకసారి సమయం తెలియకుండా మాట్లాడుతున్నాడు. అప్పుడు జయశంకర్ “నీకు రైలు టైం అవుతుంది. స్టేషన్కు వెళ్ళడం ఆలస్యం అవుతుంది నీవు వెళ్ళు” అని చెప్పి పంపించివేశారట. దీనిని బట్టి జయశంకర్ సమయానికి విలువ ఇస్తారని అర్థమవుతోంది.

ప్రశ్న 5.
జయశంకర్ సార్ వ్యక్తిత్వాన్ని గురించి రాయండి.
జవాబు:
జయశంకర్ తెలంగాణకు చిరునామా. తెలంగాణకు మార్గదర్శి. జయశంకర్ జీవితాంతం ఉద్యమాల్లో తిరిగాడు. పెళ్ళి చేసుకోలేదు. ఉద్యోగం ద్వారా వచ్చిన జీతాన్ని ఉద్యమాల కోసం ఖర్చు పెట్టాడు. తన ఉమ్మడి కుటుంబానికి జయశంకర్ చేదోడువాదోడుగా ఉండేవాడు. ఉమ్మడి కుటుంబంలో వారందరూ పెరిగి పెద్దవారు అయ్యారు. జయశంకర్ ఒంటరిగా మిగిలాడు. జయశంకర్ తనకు సాయంగా ఉండడానికి తల్లిదండ్రులు లేని అనాథ పిల్లవాడిని చేరదీశాడు. అతడిని చదివించి పెళ్ళి చేశాడు. వారికో పిల్ల పుట్టింది. వారితో కలసి జయశంకర్ చివరి దశలో గడిపాడు. తనకు తల్లిదండ్రులిచ్చిన పాత ఇల్లు అమ్మి వరంగల్లులో ఒక ఫ్లాట్ తీసుకున్నాడు, అదే జయశంకర్ ఆస్తి.

ఉదాత్తమైన వ్యక్తిత్వం, మృదుభాషణం, ఉద్యమస్ఫూర్తి, స్థితప్రజ్ఞత – అనేవి కలిస్తే జయశంకర్. తెలంగాణ వారందరిచే ఈయన జయశంకర్ సార్ అని ప్రేమగా పిలిపించుకున్నాడు. జయశంకర్ ఉద్యమ పితామహులుగా, తెలంగాణ జాతిపితగా పేరు పొందాడు. ఈయనకు కార్యకర్తకు కావాల్సిన కార్యదక్షత ఉన్నది. కె.సి. ఆర్. వంటి నాయకులకు ఆత్మ విశ్వాసాన్ని
ఈయన అందించారు.

జయశంకర్ సార్ శనివారం భోజనం చేసేవారు కాదు. ఈయన జీవితంలో రెండు విషయాల్లో రాజీ పడలేదు.

1) శనివారం పస్తుండటం.

2) తెలంగాణ అంశం మాట్లాడకుండా ఉండలేకపోవడం. తెలంగాణ రాకముందే, జయశంకర్ అస్తమించాడు.
జయశంకర్ జీవితాంతం, ఒకే మార్గంలో నడిచాడు. ఒకే మాటపై నిలబడ్డాడు. అందరినీ తన మార్గంలో నడిపించాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson ఆచార్య కొత్తపల్లి జయశంకర్

PAPER – II : పరిచిత గద్యాలు (మార్కులు : 5)

1. కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

1996లో నాటి ప్రధాని 15 ఆగస్టు ఎర్రకోట నుండి చేసిన ఉపన్యాసం తెలంగాణా వాదులందరిని తట్టిలేపింది. తెలంగాణ సాధనకు ఎలాంటి వ్యూహాలు రచించాలో జయశంకర్కు తెలుసు. మొత్తం తెలంగాణ ఉద్యమానికి మూడు దశలున్నాయి. మొదటిది భావజాల వ్యాప్తి. అది జరిగింది. రెండోది ఆందోళనా కార్యక్రమం. అది కొనసాగుతున్నది. ఇక మిగిలింది రాజకీయ ప్రక్రియ. అది జరగాల్సి ఉంది. దానిని పూర్తి చేయడమే ఉద్యమ కర్తవ్యం కావాలి. దానికి రాజకీయ చిత్తశుద్ధి అవసరం. ‘ఇప్పుడున్న రాజకీయ నాయకత్వం ఆ పని పూర్తిచేస్తుందని నేను నమ్ముతున్నాను’ అని అన్నాడు. ఈ మూడు దశల్లో కూడా జయశంకర్ పాత్ర మరువలేనిది. అందుకే అతడు తెలంగాణ సిద్ధాంతకర్త. మొదటిది తెలంగాణ భావజాల వ్యాప్తి. అది ఎంతగా ప్రజల్లోకి చొచ్చుకపోయిందో జయశంకర్ ఒక రోజు ఇట్లా చెప్పిండు. “ఎందుకమ్మా తెలంగాణ అంటే ? ‘ఏం సార్ తెలంగాణ వస్తె మా పొలాలకు నీళ్ళొస్తయ్, మా పోరగానికి కొలువొస్తది” అనే భావన వారికి కలిగిందని” చదువురాని ఆడవాళ్ళు చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకొన్నాడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
తెలంగాణ ఉద్యమంలో రెండవదశ ఏది ?
జవాబు:
తెలంగాణ ఉద్యమంలో రెండవ దశ “ఆందోళన కార్యక్రమం”.

ప్రశ్న 2.
తెలంగాణ వస్తే ఏమవుతుందని చదువురాని ఆడవాళ్ళు చెప్పారు ?
జవాబు:
తెలంగాణ వస్తే వారి పొలాలకు నీళ్ళు వస్తాయని, వారి పిల్లలకు ఉద్యోగాలొస్తాయని ఆడవాళ్ళన్నారు.

ప్రశ్న 3.
తెలంగాణ వాదులను తట్టిలేపింది ఏది ?
జవాబు:
1996లో ఆగస్టు 15, నాటి ప్రధాని ఎర్రకోట నుండి చేసిన ఉపన్యాసం తెలంగాణ వాదులను తట్టిలేపింది.

ప్రశ్న 4.
జయశంకర్ తెలంగాణ సిద్ధాంతకర్త ఎలా అయ్యాడు ?
జవాబు:
తెలంగాణ ఉద్యమం మూడు దశల్లోనూ జయశంకర్కు గల పాత్ర మరువలేనిది. అందుకే జయశంకర్ తెలంగాణ సిద్ధాంతకర్త అయ్యాడు.

ప్రశ్న 5.
తెలంగాణ ఉద్యమంలో ప్రధానమైన మూడు దశలు తెల్పండి.
జవాబు:

  1. భావజాల వ్యాప్తి
  2. ఆందోళన కార్యక్రమం
  3. రాజకీయ ప్రక్రియ అనేవి తెలంగాణ ఉద్యమంలో మూడు దశలు.

2. ఈ కింది పేరా చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

జీవితాంతం పదవుల్లో ఉద్యమాల్లో తిరిగిన జయశంకర్ పెండ్లి చేసుకోలేదు. ఉద్యోగరీత్యా సంపాదించినదంతా ఉద్యమాల కోసం ఖర్చు బెట్టాడు. ఉమ్మడి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్నాడు. జీవిత కాలం ఎక్కువగా ఇట్లాగే ఖర్చు అయింది. ఉమ్మడి కుటుంబంలోని వాళ్ళందరు పెరిగి, ఎవరి సంసారాలు వాళ్ళకు అయినంక జయశంకర్ ఒంటరిగా మిగిలాడు. జయశంకర్ తనకు సహాయంగా ఉండటానికి తల్లిదండ్రులు లేని అనాథ పిల్లవాడిని చేరదీశాడు. అతడిని చదివించాడు. అనాథ పిల్లతో పెండ్లి చేశాడు. వారికో పాప పుట్టింది. వాళ్ళతో కలిసి జీవితం చివరిదశలో గడిపాడు. తల్లిదండ్రులు ఇచ్చిన పాత ఇల్లు అమ్మి, వరంగల్లో ఫ్లాట్ తీసుకున్నాడు. అదే అతని ఆస్తి. పెన్షన్తో కాలం
గడిపాడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
జయశంకర్ తన సంపాదనను ఎలా ఖర్చు చేశాడు ?
జవాబు:
జయశంకర్ తన సంపాదనను అంతా ఉద్యమాల కోసం ఖర్చు చేశాడు.

ప్రశ్న 2.
జయశంకర్ పెండ్లి ఎందుకు చేసికోలేదు ?
జవాబు:
జయశంకర్ జీవితాంతం పదవుల్లో, ఉద్యమాల్లో తిరిగినందున పెండ్లి చేసుకోలేదు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson ఆచార్య కొత్తపల్లి జయశంకర్

ప్రశ్న 3.
జయశంకర్ చివరి దశలో ఎవరితో గడిపాడు ?
జవాబు:
జయశంకర్ చివరి దశలో తాను చేరదీసిన అనాథ పిల్లవాడితో, అతని భార్యాపిల్లలతో గడిపాడు.

ప్రశ్న 4.
జయశంకర్ ఆస్తి ఏమిటో చెప్పండి.
జవాబు:
జయశంకర్ తనకు తల్లిదండ్రులు ఇచ్చిన పాత ఇల్లును అమ్మి, వరంగల్లులో ఒక ఫ్లాట్ తీసుకున్నాడు. అదే ఆయన ఆస్థి.

ప్రశ్న 5.
జయశంకర్ ఒంటరివాడు ఎందుకు అయ్యాడు ?
జవాబు:
‘ జయశంకర్ ఉమ్మడి కుటుంబ సభ్యులు అందరూ పెరిగి, ఎవరి సంసారాలు వారు చేసుకుంటున్నారు. అందువల్ల జయశంకర్ ఒంటరివాడయ్యాడు.

TS 9th Class Telugu Important Questions 9th Lesson కోరస్

These TS 9th Class Telugu Important Questions 9th Lesson కోరస్ will help the students to improve their time and approach.

TS 9th Class Telugu 9th Lesson Important Questions కోరస్

PAPER – I : PART – A

I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)

అ) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
పాఠం ఆధారంగా సలంద్ర లక్ష్మీనారాయణ గురించి రాయండి.
జవాబు:
దళిత సాహిత్యోద్యమానికి పునాదివేసిన ‘దళిత మానిఫెస్టో’ కవితా రచయిత సలంద్ర లక్ష్మీనారాయణగారు రాసిన పాఠ్యాంశమే ‘కోరస్’. సమాజం కొత్త ధోరణులనూ, వాస్తవాలనూ అంత తొందరగా అంగీకరించదనే విషయాన్ని గురించి సలంద్ర ఆవేదన పడుతున్నారు.

తనచుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న సంఘటనలపై అవగాహన కల్పించాలని, తన పాటకు సమాజం ‘కోరస్’ అవుతుందని ఆత్మవిశ్వాసంతో ప్రకటించాడు. సంఘం తనతో గొంతు కలుపుతుందన్నాడు. దళితులూ, అగ్రవర్ణాలవారూ అందరూ సమానమని తన కవిత ద్వారా చెప్పాడు. ప్రగతిశీల భావాలతో సమాజం అభివృద్ధి వైపు నడవాలని కోరిన సలంద్ర మహాకవి, అభ్యుదయ కవి.

TS 9th Class Telugu Important Questions 9th Lesson కోరస్

ప్రశ్న 2.
‘వాస్తవాలు కఠినంగా ఉంటాయి’- కోరస్ ఆధారంగా ఉదాహరణలు తెలుపండి.
జవాబు:
నిజం ఎప్పుడూ కఠినంగా ఉంటుంది. సంఘం కొత్త పోకడలను అంతవేగంగా అంగీకరించదు. పాఠంలో చెప్పినట్లు, అగ్రవర్ణాలవారు ఆకాశం వలె గొప్పవారమని, దళితులు భూమిలా అడుగునుండి పోవాలనే భావన తప్పని అంతా సమానమని కవి చెప్పేది వాస్తవం. కాని ఆచరణ కఠినం. సమాజం ఒక ప్రవాహం లాంటిది. పాతపోయి కొత్తదనం వస్తూ ఉంటుంది.

సమాజంలో వస్తున్న మార్పులను ఆహ్వానించకుండా పాతచింతకాయ పచ్చడి మనస్తత్వాన్ని విడవాలని కవి చెప్పేది వాస్తవం. మేధావి కూడా మూర్ఖుడిలాగానే ఇతరులు చెప్పింది వినడని కవి కఠినమైన వాస్తవం చెబుతున్నాడు. మనుషుల్లో సున్నిత తత్త్వాన్ని మేలుకొల్పాలని, కాఠిన్యాన్ని తొలిగించుకోవాలని కవి తెలియజేస్తున్నాడు.

PAPER – I : PART – B

భాషాంశాలు – పదజాలం :

1. సొంతవాక్యాలు:

అ) కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

1. ససేమిరా : SSCప్రీఫైనల్ పరీక్షలు ఉండటంతో మామయ్య వాళ్ళింట్లో పెళ్ళికి ససేమిరా రానని మా అన్నయ్య పట్టుపట్టాడు.
2. అపార్థం : పెళ్ళికి వెళ్ళకపోతే మామయ్య అపార్థం చేసుకొంటాడని అమ్మ చెప్పింది.
3. ముక్కలు చెక్కలు : గంధం దుంగలను ముక్కలు చెక్కలు చేసినా దాని విలువ మారదు.
4. గొంతెత్తు : జాతీయగీతం గొంతెత్తి పాడితేనే అందం అంటాడు మా తాతయ్య.
5. ఆచరణ : రామరాజ్యం పేరు చెప్పే నాయకులేగాని ఆచరణలో పెట్టినవారు లేరు.
6. ప్రతిబింబం :

  1. సినిమాలో కొన్ని పాత్రల ప్రతిబింబాలు మాట్లాడటం గమ్మత్తుగా ఉంటుంది.
  2. సింహం నూతిలో తన ప్రతిబింబాన్ని చూసి వేరొక సింహం అనుకున్నది.

TS 9th Class Telugu Important Questions 9th Lesson కోరస్

7. నిశ్చలత : తుళ్ళిపడే చేపలతో చెరువు నిశ్చలత కోల్పోతుంది.
8. కోరస్ : మేము చెప్పే కోరస్ సమాధానాలను చూసి మా తెలుగు సారు విసుక్కుంటాడు కాని వెంటనే నవ్వుతాడు.

II. అర్థాలు :

ఆ) కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.

ప్రశ్న 1.
“ఎట్టిపరిస్థితుల్లోను” అనే అర్థం వచ్చే పదం
A) నిరభ్యంతరం
B) ససేమిరా
C) గదరగండ
D) అన్ని విధాలు
జవాబు:
B) ససేమిరా

ప్రశ్న 2.
కాళిదాసుకు సామ్యం రాగల కవి ఎవరు? – గీత గీసిన పదానికి అర్థం
A) పోలిక
B) భేదము
C) పోటీ
D) రూపం
జవాబు:
A) పోలిక

TS 9th Class Telugu Important Questions 9th Lesson కోరస్

ప్రశ్న 3.
మేధస్సుకు గణితంలో పదునుపెట్టవచ్చు – గీత గీసిన పదానికి అర్థం
A) తపస్సు
B) ఆలోచన
C) తెలివి
D) కోపం
జవాబు:
C) తెలివి

ప్రశ్న 4.
పిల్లలు కోరస్ గా జనగణమన పాడారు – గీత గీసిన పదానికి అర్థం
A) వరుసగా నిలబడి
B) విడివిడిగా
C) ఒకరి తరువాత ఒకరు
D) అందరూ గొంతు కలిపి
జవాబు:
D) అందరూ గొంతు కలిపి

ప్రశ్న 5.
చిన్నతనం నుండే హేతువాద దృష్టిని ఏర్పర్చుకున్నాడు – గీత గీసిన పదానికి అర్థం
A) కన్నులు
B) చూపు
C) కళ్ళు
D) నేత్రాలు
జవాబు:
B) చూపు

TS 9th Class Telugu Important Questions 9th Lesson కోరస్

ప్రశ్న 6.
వాస్తవాలు కఠినంగా ఉంటాయి – గీత గీసిన పదానికి అర్థం
A) అబద్ధం
B) అసత్యం
C) నిజం
D) హింస
జవాబు:
C) నిజం

ప్రశ్న 7.
ప్రజల పక్షం నిలబడని వాళ్ళు నిజమైన మేధావులు కాదు – గీత గీసిన పదానికి అర్థం
A) వైపు
B) రెక్క
C) 15 రోజులు
D) స్వార్థం
జవాబు:

III. ప్రకృతి, వికృతులు:

ప్రశ్న 1.
“ఆకాశము” పదానికి వికృతి
A) ఆకారము
B) ఆకసము
C) అచశము
D) అతిశయం
జవాబు:
B) ఆకసము

TS 9th Class Telugu Important Questions 9th Lesson కోరస్

ప్రశ్న 2.
మొరకు – అనే పదానికి వికృతి
A) మొండి
B) జగమొండి
C) మూర్ఖుడు
D) మొరియము
జవాబు:
C) మూర్ఖుడు

ప్రశ్న 3.
ఆదర్శము – అనే పదానికి ప్రకృతి
A) అద్దము
B) చూడతగినది
C) అధర్మము
D) అదర్శ
జవాబు:
A) అద్దము

ప్రశ్న 4.
సింహం ముఖము వెడల్పుగా ఉంటుంది – గీత గీసిన పదానికి వికృతి
A) ముగం
B) మొగము
C) ముకురం
D) మొకము
జవాబు:
B) మొగము

TS 9th Class Telugu Important Questions 9th Lesson కోరస్

ప్రశ్న 5.
మూర్ఖున్ననీ చూపుడు వేళ్ళతో చంపేస్తారు – గీత గీసిన పదానికి అర్థం
A) మొఱకు
B) మూరుకు
C) మూర్కు
D) ముర్కు
జవాబు:
A) మొఱకు

ప్రశ్న 6.
మేధస్సుకీ – మూర్ఖత్వానికి సామ్యం చూపితే వీళ్ళు నా మీద రాళ్ళు విసురుతారు – గీత గీసిన పదానికి వికృతి
A) బుద్ధి
B) మేధస్సు
C) ఆలోచన
D) మెదడు
జవాబు:
D) మెదడు

IV. పర్యాయపదాలు :

ప్రశ్న 1.
భూమి – అనే పదానికి పర్యాయపదాలు
A) మేదిని, పుడమి, పృథ్వి
B) నేల, నేలతల్లి, పొలము
C) వసుధ, సుధ, మట్టి
D) మహి, మహిమ, మన్ను
జవాబు:
A) మేదిని, పుడమి, పృథ్వి

TS 9th Class Telugu Important Questions 9th Lesson కోరస్

ప్రశ్న 2.
ఆకాశంలో చుక్కలు రాత్రి మాత్రమే కనిపిస్తాయి. గీతగీసిన పదానికి పర్యాయపదాలు
A) నింగి, మిన్ను, అంబరం.
B) మేఘము, అంతరిక్షం
C) అంతరిక్షం, ఖగోళం
D) కాంతి, వినీలం
జవాబు:
A) నింగి, మిన్ను, అంబరం

ప్రశ్న 3.
గళము, కంఠము, కుత్తుక – పర్యాయపదాలుగా గల పదం
A) విరళము
B) ధ్వని
C) మెడ
D) గొంతు
జవాబు:
D) గొంతు

ప్రశ్న 4.
“ముఖము” పర్యాయపదాలు
A) ఆస్యము, ఆననము, వదనము
B) నోరు, నాలుక, మెకము
C) మొదట, ప్రతిబింబం
D) బిందువు, ద్వారము, ఇంటిముందు
జవాబు:
A) ఆస్యము, ఆననము, వదనము

TS 9th Class Telugu Important Questions 9th Lesson కోరస్

ప్రశ్న 5.
గీతం, గేయం – అనే అర్థాలు ఇచ్చే పదం
A) భగవద్గీత
B) పాట
C) కీర్తన
D) గానం
జవాబు:
B) పాట

V. నానార్థాలు :

ప్రశ్న 1.
అద్దంలో నీ రూపం చూడు. గీత గీసిన పదానికి నానార్థాలు
A) ప్రతిబింబం, వస్తువు
B) ఆకారం, అందం
C) ఆకర్షణ, దేహం
D) ధనము, ధాన్యము
జవాబు:
B) ఆకారం, అందం

ప్రశ్న 2.
ప్రవాహానికీ, నిశ్చతలకీ రూపం కల్పిస్తే వీళ్ళు ససేమిరా ఒప్పుకోరు.
A) పారుదల, పదర
B) వరద, పరద
C) ధార, పరంపర
D) ఉత్తమాశ్వం, ప్రసవం
జవాబు:
C) ధార, పరంపర

TS 9th Class Telugu Important Questions 9th Lesson కోరస్

VI. వ్యుత్పత్యర్థములు :

ప్రశ్న 1.
కావ్యకర్త
A) రచయిత
B) కర్త
C) కవి
D) కవయిత్రి
జవాబు:
C) కవి

PAPER – II : PART – A

అపరిచిత పద్యాలు

ప్రశ్న 1.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

కమలములు నీటఁ బాసినఁ
కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు తప్పినఁ
దమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ!

ప్రశ్నలు – సమాధానాలు
1. కమలములు నీటిని విడిచిపెట్టి బయటికి వస్తే ఏం జరుగుతుంది?
జవాబు:
కమలములు నీటిని విడిచిపెట్టి బయటికి వస్తే సూర్యరశ్మి సోకి వాడిపోతాయి.

2. ఎప్పుడు మిత్రులు శత్రువులౌతారు?
జవాబు:
తమ తమ స్థానాలను విడిచిపెడితే మిత్రులు శత్రు లౌతారు.

3. తామరలకు మిత్రుడెవరు?
జవాబు:
తామరలకు మిత్రుడు సూర్యుడు.

4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘స్థానబలం’.

5. ఇది ఏ శతకంలోని పద్యం ?
జవాబు:
ఇది సుమతీ శతకంలోని పద్యం.

TS 9th Class Telugu Important Questions 9th Lesson కోరస్

ప్రశ్న 2.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ఎఱుక గలవారి చరితలు
గఱచుచు సజ్జనుల గోష్ఠి గదలక ధర్మం
బెఱుగుచు నెఱిగినదానిని
మఱువ కనుష్ఠించునది సమంజసబుద్ధిన్

ప్రశ్నలు – సమాధానాలు
1. ఎవరి చరిత్ర తెలుసుకోవాలి ?
జవాబు:
జ్ఞానవంతుల చరిత్ర తెలుసుకోవాలి.

2. ధర్మాన్ని ఎక్కడి నుంచి తెలుసుకోవాలి ?
జవాబు:
ధర్మాన్ని సజ్జనుల సమావేశం నుంచి తెలుసుకోవాలి.

3. దేనిని అనుష్ఠించాలి ?
జవాబు:
ధర్మాన్ని అనుష్ఠించాలి.

4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘నీతిబోధ’.

5. గోష్ఠి అంటే ఏమిటి ?
జవాబు:
గోష్ఠి అంటే సభ.

TS 9th Class Telugu Important Questions 9th Lesson కోరస్

ప్రశ్న 3.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

పూజకన్న నెంచ బుద్ధి ప్రధానంబు
మాటకన్న నెంచ మనసు దృఢము
కులముకన్న మిగుల గుణము ప్రధానంబు
విశ్వదాభిరామ! వినురవేమ!

ప్రశ్నలు – సమాధానాలు
1. పూజకంటె ముఖ్యమైనది ఏది ?
జవాబు:
పూజకంటె ముఖ్యమైనది బుద్ధి.

2. మాటకంటె దృఢమైనది ఏది?
జవాబు:
మాటకంటె దృఢమైనది మనస్సు.

3. కులముకంటె ప్రధానమైనది ఏది?
జవాబు:
కులముకంటె ప్రధానమైనది గుణం.

4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘దేనికంటే ఏది ప్రధానం?’

5. ఇది ఏ శతకంలోని పద్యం.
జవాబు:
ఇది వేమన శతకంలోని పద్యం.

TS 9th Class Telugu Important Questions 9th Lesson కోరస్

ప్రశ్న 4.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

తను లోకము గొనియాడగ
విని యుబ్బడు సజ్జనుండు వెండియుఁ గడు మే
లొనరించుఁ గీడొకించుక.
యును దనదెసఁ దోఁపనీక యుడుపుచు వచ్చున్.

ప్రశ్నలు – సమాధానాలు
1. లోకం తనను పొగిడితే పొంగిపోనివాడు ఎవరు ?
జవాబు:
లోకం తనను పొగిడితే పొంగిపోనివాడు సజ్జనుడు.

2. సజ్జనుడు లోకానికి ఏం చేస్తాడు?
జవాబు:
సజ్జనుడు లోకానికి మేలు చేస్తాడు.

3. తనవల్ల ఏమాత్రం హాని కలుగకుండ చూసేవాడు ఎవరు ?
జవాబు:
తనవల్ల ఏమాత్రం హాని కలుగకుండ చూసేవాడు. సజ్జనుడు.

4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘సజ్జన స్వభావం’.

5. ‘మేలు’ అంటే ఏమిటి ?
జవాబు:
‘మేలు’ అంటే ఉపకారం.

TS 9th Class Telugu Important Questions 9th Lesson కోరస్

ప్రశ్న 5.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

సదోష్ఠి సిరియు నొసగును
సదోష్ఠియె కీర్తిఁబెంచు; సంతుష్టియు నా
సన్గోష్ఠియె యొనగూర్చును;
సదోష్ఠియె పాపములను చఱచు కుమారా!

ప్రశ్నలు – సమాధానాలు
1. సద్దోష్ఠి దేన్ని ఇస్తుంది?
జవాబు:
సద్దోష్ఠి సంపదను ఇస్తుంది.

2. కీర్తిని పెంచేది ఏది?
జవాబు:
కీర్తిని పెంచేది సద్దోష్ఠి.

3. పాపములను పోగొట్టేది ఏది?
జవాబు:
పాపములను పోగొట్టేది సదోష్ఠి.

4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘సదోష్ఠి ప్రయోజనం’.

5. ఇది ఏ శతకంలోని పద్యం ?
జవాబు:
ఇది కుమార శతకంలోని పద్యం.

TS 9th Class Telugu Important Questions 9th Lesson కోరస్

ప్రశ్న 6.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

పాలను గలసిన జలమును
బాల విధంబుననె యుండుఁ బరికింపంగా
బాల చవిఁ జెరచుఁ గావున
బాలసుఁడగు వాని పొందు వలదుర సుమతీ!

ప్రశ్నలు – సమాధానాలు
1. పాలతో కలిసిన నీరు ఎలా ఉంటుంది?
జవాబు:
పాలతో కలిసిన నీరు పాలలాగానే ఉంటుంది.

2. పాల రుచిని చెడగొట్టేది ఏది?
జవాబు:
పాల రుచిని చెడగొట్టేది అందులో కలిసిన నీరు.

3. ఎవరితో స్నేహం చేయగూడదు?.
జవాబు:
చెడ్డవారితో స్నేహం చేయగూడదు.

4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘దుర్జన స్నేహం’.

5. ఇది ఏ శతకంలోని పద్యం ?
జవాబు:
ఇది సుమతీ శతకంలోని పద్యం.

TS 9th Class Telugu Important Questions 9th Lesson కోరస్

PAPER – II : PART – B

భాషాంశాలు – వ్యాకరణం

కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.

I. సంధులు:

ప్రశ్న 1.
“అప + అర్థం” – కలిపి రాయండి.
A) అపఅర్థం
B) అపరం
C) అపార్థం
D) ఆపదర్థం
జవాబు:
C) అపార్థం

ప్రశ్న 2.
గొంతెత్తి – ఏ సంధి ?
A) అత్వ సంధి
B) ఉత్వ సంధి
C) గుణసంధి
D) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
B) ఉత్వ సంధి

TS 9th Class Telugu Important Questions 9th Lesson కోరస్

ప్రశ్న 3.
“పగులన్ + కొట్టు – పగులఁగొట్టు” → సంధి నామము
A) గసడదవాదేశ సంధి
B) నుగాగమ సంధి
C) సరళాదేశ
D) అత్వ సంధి
జవాబు:
C) సరళాదేశ

II. సమాసములు :

ప్రశ్న 1.
ముక్కలు చెక్కలు – సమాసము పేరు
A) ద్వంద్వ సమాసము
B) షష్ఠీ తత్పురుష సమాసము
C) రూపక సమాసము
D) ద్విగు సమాసము
జవాబు:
A) ద్వంద్వ సమాసము

ప్రశ్న 2.
“గొంతునొక్కేయడం” – విగ్రహవాక్యం
A) గొంతులు నొక్కినవారు
B) గొంతును నొక్కేయడం
C) గొంతు వరకు నొక్కేయడం
D) గొంతును నొక్కగలవారు
జవాబు:
B) గొంతును నొక్కేయడం

TS 9th Class Telugu Important Questions 9th Lesson కోరస్

ప్రశ్న 3.
నా యొక్క పాట → సమాస రూపము
A) నాదైన పాట
B) నా పాట
C) నాకు పాట
D) నేను పాట
జవాబు:
B) నా పాట

III. అలంకారములు :

ప్రశ్న 1.
“వాడి ముఖం చిరంజీవి ముఖంలాగ ఉంటుంది.” – ఈ వాక్యంలో ఉన్న అలంకారం
A) ఉపమా
B) అంత్యానుప్రాస
C) యమకము
D) ఉత్ప్రేక్ష
జవాబు:
A) ఉపమా

TS 9th Class Telugu Important Questions 9th Lesson కోరస్

ప్రశ్న 2.
“రాలనంటోంది చినుకు, రైతుకు రానంది కునుకు” – ఈ వాక్యాలలో ఉన్న అలంకారం
A) వృత్త్యనుప్రాస
B) ఛేకానుప్రాస
C) అంత్యానుప్రాస
D) యమకము
జవాబు:
C) అంత్యానుప్రాస

TS 9th Class Telugu Important Questions 7th Lesson చెలిమి

These TS 9th Class Telugu Important Questions 7th Lesson చెలిమి will help the students to improve their time and approach.

TS 9th Class Telugu 7th Lesson Important Questions చెలిమి

PAPER – I : PART – A

I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన). –

అ) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘చెలిమి’ పాఠ్యభాగ కవి విశేషాలు తెలుపండి. (రచయిత)
జవాబు:
పాఠం పేరు : ‘చెలిమి’

కవి పేరు : ‘పొన్నికంటి తెలగన’

కవి కాలం : 16వ శతాబ్దం

పొన్నికంటి తెలగన ప్రసిద్ధి : పొన్నికంటి తెలగన, అచ్చతెనుగులో నియమబద్ధమైన కావ్య రచనకు పూనుకున్న “అచ్చ తెనుగు ఆదికవిగా” ప్రసిద్ధుడు.

నివాస స్థలము : గోలకొండ పరిసరాలలోని ‘పొట్లచెరువు’ (సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరువు)

తండ్రి : తెలగన తండ్రి పేరు, “భావనామాత్యుడు”.

మార్గదర్శకుడు : అచ్చతెనుగు కావ్యరచనకు, తెలగనయే నియమాలను ఏర్పరచి, అచ్చతెనుగు కావ్యరచనకు “మార్గదర్శకుడు”గా నిలిచాడు.

యయాతి చరిత్ర : ‘యయాతి చరిత్ర’ కావ్యం, తెలుగు సాహిత్యంలో అచ్చతెనుగు కావ్యాల్లో మొదటిది మరియు అత్యుత్తమమైనది.

కావ్య విశిష్టత అంకితము : ఈ యయాతి చరిత్రను తెలగన, “అమీన్ ఖాన్” అనే మహ్మదీయ సర్దారుకు, అంకితం చేశాడు.
సూచన : ‘పొన్నికంటి తెలగన’ గూర్చి రాయండి. అని కూడా అడిగినా పై జవాబే.

TS 9th Class Telugu Important Questions 7th Lesson చెలిమి

ప్రశ్న 2.
అసూయను ఎందుకు కలిగి ఉండరాదు?
జవాబు:
అహంకారానికి పుట్టిన అజ్ఞానపు శిశువు అసూయ. ఇది కాలుతున్న కట్టెవంటిది. నిప్పు మండటానికి ఆధారమైన కట్టెను ముందు దహించి, తర్వాత ఎదుటున్న వాటిని దహిస్తుంది. అలాగే అసూయ ఎవరిని ఆవహించి ఉందో ముందు వారినే నాశనం చేస్తుంది.

అసూయను గూర్చి భమిడిపాటి కామేశ్వరరావుగారు చెబుతూ “నన్ను మెచ్చుకోలేదని కాదురా నా ఏడుపు. వాణ్ణి మెచ్చుకుంటున్నారనే నా ఏడుపు” అన్నారు. నేను ఎలా ఉన్నా సరే, ఎదుటివాడు బాగుండకూడదనే భావనే అసూయ. పురుగు దుస్తుల్ని పిప్పి చేసినట్లు, అసూయ మనిషిని నాశనం చేస్తుంది. కనుక అసూయను ఎప్పటికి దగ్గరకు రానీయకూడదు.

ప్రశ్న 3.
మీ స్నేహితులతో వివాదం రాకుండా ఉండడానికి నీవు ఏం చేస్తావు?
జవాబు:
జీవితంలో ఒక మధురస్మృతి స్నేహం. ద్వేషం వల్ల అందరూ దూరమైతే, స్నేహం వల్ల అందరూ దగ్గరవుతారు. బడిలో చదువుకొనేటప్పుడు, ఆటలు ఆడేటప్పుడు మనకు ఎందరో మిత్రులు పరిచయమవుతారు. వారితో మంచిగా ప్రవర్తించడం వలన మేలే జరుగుతుంది. ఆడుకొనేటప్పుడు క్రీడా స్ఫూర్తితో ఉంటాను. దీనివల్ల వివాదం వచ్చినా వెంటనే తొలిగిపోతుంది.

TS 9th Class Telugu Important Questions 7th Lesson చెలిమి

పుస్తకాలు, పెన్నులు, చిరుతిండి విషయాల్లో నేనే ముందుగా కానుకల రూపంలో వారికి ఇవ్వడం వల్ల మా మధ్య వివాదం వచ్చే అవకాశాలుండవు. నీవు గొప్పా ! నేను గొప్పా ! వంటి చర్చలు రానీయకుండా చూసుకుంటాను. మంచి . స్నేహం త్యాగాన్ని కోరుతుంది. మా స్నేహం కలకాలం నిలవడానికై వారితో ఎటువంటి వాదాలకు దిగను. అవసరమైతే వారికి ఆర్థిక సాయం చేయడానికి మా తల్లిదండ్రుల సహకారం తీసుకుంటాను.

ఆ) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘చెలిమి’ పాఠ్యాంశాన్ని మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
సృష్టిలో తీయనిది స్నేహం. ఎంతో కలిసిమెలిసి ఉండే స్నేహితులు ఒక్కొక్కసారి హఠాత్తుగా శత్రువులవుతారు. వారలా మారటానికి దానిలో గల మంచిని, చెడునూ విశ్లేషించి చూసుకోవడానికి ఈ కథ ఎంతో తోడ్పడుతుంది.

యయాతి ప్రతిష్ఠానపురానికి రాజు. ఈయన ఒకసారి వేటకు వెళ్ళినపుడు దాహంతో దగ్గరలోని నూతివద్దకు వెళ్ళాడు. ఆ నూతిలో ఒక కన్య ఉంది. ఆమె తనను రక్షించమని ఏడ్చింది. ఆమెను యయాతి కాపాడగా, అదే సమయానికి అక్కడికి చేరిన ఆమె చెలికత్తె ఘార్ణికకు, యయాతి మహారాజుకు మధ్య జరిగిన సంభాషణే ‘చెలిమి’ పాఠ్యాంశం.

“ఓ మహారాజా ! ఈమె దానవ గురువు శుక్రాచార్యుని కుమార్తె దేవయాని. ఈమెను ఒక తప్పుకొరకు వృషపర్వుని కూతురు, ఈ బావిలో తోసింద”ని చెప్పగా యయాతి ఆ వివరాలు వివరంగా చెప్పమని అడుగుతాడు. వృషపర్వుడు ఒక అసురరాజు. అతని కుమార్తె శర్మిష్ఠ. ఈమె, దేవయాని మిక్కిలి స్నేహంతో ఉండేవారు. ఒకరోజు వారు జలక్రీడ చేస్తున్న సమయంలో సుడిగాలికి వారి చీరలు చెల్లాచెదరయ్యాయి.

ఆ కంగారులో ఒకరి చీర మరొకరు ధరించారు. శర్మిష్ఠ దీన్ని గమనించి కోపంతో “నీ చీరను నేను కట్టుకుంటానా ? నీకింతా పొగరా ?” అని దేవయానిని అడిగింది. మనం ప్రాణం ఒకటియై శరీరాలు రెండుగా బ్రతుకుతున్నాం”. వస్త్రాలు మారినంత మాత్రానా కసురుకుంటావా ? ఇది న్యాయమేనా ? ‘అని దేవయాని అనినా, శర్మిష్ఠ నిష్ఠూరాలాడింది.

చివరకు విసిగిపోయిన దేవయాని “నేను రాక్షస గురువైన శుక్రాచార్యుని కుమార్తెను. నేను నీవు కట్టిన వస్త్రాన్ని కట్టవచ్చునా ?” అన్నది. శర్మిష్ఠ ఆ మాటలు వినక గయ్యాళితనంతో దేవయానిని బావిలో తోసి, వెళ్ళిందని చెలికత్తె చెప్పగా విని జాలిపడి, రాజు తన పట్టణానికి వెళ్ళిపోయాడు.

TS 9th Class Telugu Important Questions 7th Lesson చెలిమి

ప్రశ్న 2.
‘చెలిమి’ పాఠంలో శర్మిష్ఠ, దేవయానిలో మీకు ఎవరి స్వభావం నచ్చింది ? ఎందుకు ?
జవాబు:
పొన్నికంటి తెలగన అచ్చు తెనుగులో రచించిన యయాతి చరిత్ర కావ్యం నుండి గ్రహించబడినది ‘చెలిమి’ పాఠం. దీనిలో శర్మిష్ఠ అసుర రాజు వృషపర్వుని కుమార్తె. దేవయాని రాక్షస కులగురువు శుక్రాచార్యుని కుమార్తె. వీరిరువురు మంచి స్నేహితులు. ముఖ్యంగా దేవయాని శర్మిష్ఠ పట్ల గొప్ప స్నేహాన్ని ప్రదర్శించింది. దేవయాని స్వభావం నాకు బాగా నచ్చింది.

దేవయానిలా నిజమైన స్నేహాన్ని నేను ఇష్టపడతాను. ఈ కథలో శర్మిష్ఠకు తాను రాజు కుమార్తెననే అహంకారం ఉంది. కాని మనసులో ఎక్కడో శుక్రాచార్యుల పట్ల భయం ఉంది. అందువల్లనే దేవయానితో స్నేహాన్ని నటించింది. దొరకనంతసేపు అందరూ దొరలే. దొరికినపుడే దొంగలు. ఈ చందాననే శర్మిష్ఠ బయటపడింది.

శర్మిష్ఠ, దేవయాని ఒక సమయంలో జలక్రీడ ఆడుతుండగా, సుడిగాలికి బట్టలు కొట్టుకుపోయాయి. ఆ సమయంలో ఒకరి బట్టలు మరొకరు కట్టుకుంటారు. తన బట్టలు చూసుకొన్న శర్మిష్ఠ తాను రాజు కుమార్తెను, నా బట్టలు నీవు కట్టుకుంటావా ? నీవు విడిచిన బట్టలు నేను కట్టుకుంటానా ? అని అంటుంది. నిజమైన స్నేహితురాలైతే ఇలా మాట్లాడుతుందా ? మనసులో స్నేహం లేదు కాబట్టే ఇలా అనగల్గింది. కాని దేవయాని వెంటనే రోషంతో మాట్లాడలేదు.

“అదేంటి చెలి ! శరీరాలు రెండయినా ప్రాణం ఒకటిగా ఉన్నామే ఈ మాత్రం దానికే ఇంతగా కసరటం న్యాయమేనా ?” అని దేవయాని అడిగిన విధం నాకు బాగా నచ్చింది. శర్మిష్ఠలోని దుర్గుణాలు – ఓర్వలేనితనం, ఆవేశం. ఆవేశం ఉన్నవారు ఎదుటివారి మాటలు వినరు. తాపట్టిన కుందేలుకి మూడేకాళ్ళు అనే రకం. శర్మిష్ఠ గయ్యాళితనంతో దేవయానిని నూతిలో తోయడం మూర్ఖత్వం. ఇలా అన్నిరకాలుగా ఉత్తమగుణాలున్న దేవయాని స్వభావం నాకు నచ్చింది.

TS 9th Class Telugu Important Questions 7th Lesson చెలిమి

ప్రశ్న 3.
ప్రయాణాల్లో, విహారాల్లో, నీటి పరిసరాల్లో తిరిగేటప్పుడు, నీటిలోనికి దిగేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలేవి ?
జవాబు:
ప్రయాణాలు చేసేటప్పుడు మన వస్తువులను మనం జాగ్రత్తగా ఒకచోట పెట్టుకోవాలి. పెట్టెలకు తాళాలు వేయాలి. ప్రమాద హెచ్చరికలను తెలిసికొని, జాగ్రత్తపడాలి. అక్కడ ఉన్న విద్యుచ్ఛక్తి సాధనాలను ఉపయోగించే ముందు, షాక్ కొడతాయేమో పరీక్షించాలి.

నీళ్ళల్లోకి కొత్తచోట్ల దిగేటప్పుడు అక్కడ ఎంత లోతు ఉందో తెలిసికొని దిగాలి. ఈత రానివారు నీళ్ళల్లోకి ఒంటరిగా దిగరాదు. ప్రక్కనున్న మిత్రులను సంప్రదించి, నిర్ణయాలు తీసుకోవాలి.

నీటి పరిసరాల్లో తిరిగేటప్పుడు అకస్మాత్తుగా వరదలు వచ్చే ప్రమాదం ఉందేమో గమనించుకోవాలి. రిజర్వాయర్ల నుండి నీరు వదలుతున్నారేమో గమనించాలి. తెలియని ప్రదేశాల్లో గైడ్ లేకుండా, వారి సలహా లేకుండా, నీటిపరిసరాల్లో స్వేచ్ఛగా తిరగరాదు.

నీరు ఉన్నచోట్ల నీటిలో దిగేవారు ఈత తప్పక నేర్చుకోవాలి. పడవలు, లాంచీలు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఎక్కాలి. పడవలలో, లాంచీలలో ప్రయాణించేటప్పుడు, మనుష్యులు నడిచే ఫుట్ బోర్డుపై జాగ్రత్తగా నడవాలి.

ప్రక్కవారిని సంప్రదిస్తూ, అతి జాగ్రత్తగా గైడ్ల సూచనలనూ, మనవెంట వచ్చే పెద్దల సూచనలనూ, సలహాలనూ తప్పక పాటించాలి.

TS 9th Class Telugu Important Questions 7th Lesson చెలిమి

PAPER – I : PART – B

భాషాంశాలు – పదజాలం :

I. సొంతవాక్యాలు :

అ) కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

1. అనగిపెనగి : (చుట్టి పెనవేసుకొను) అనగిపైనగిన తీగె పందిరిలాగ, సంస్కృతి సభ్యతలు పెనవేసుకోవాలి.
2. చెలువలు : (అందమైన స్త్రీలు) పేరంటమునకు వచ్చిన చెలువలు పాడిన పాటలు అందరిని సంతోషపెట్టాయి.
3. వేవురు : (వేయిమంది) పతంగి పండుగనాడు మైదానంలోకి వేవురు వచ్చి పతంగులు ఎగురవేశారు.
4. నెగులు : (విచారము) మంచి మార్కులు పొందిన తరువాత దానికై పడిన నెగులు మరచిపోయాను.
5. అరమరికలు : (అనుమానము) అరమరికలు లేకుండా’ రాసిన సమాధానం మంచి మార్కులు తెచ్చిపెడుతుంది.
6. తడబడిపోవు : (తొట్రుపాటుపడు) ఒకప్పుడు స్త్రీలు, పురుషుల ముందుకు రావాలంటేనే తడబడిపోయేవారు, నేడు రాజ్యాలనేలగలుగుతున్నారు.
7. కేరడములాడు : (ఎగతాళిచేయు) దుర్యోధనుని కేరడములాడు మాటలు భీముని మరింత రెచ్చగొట్టాయి.
8. తెగువ : (సాహసం) అన్ని సమయాల్లో తెగువ పనికి రాదు.
9. కూరిమి : (స్నేహం) కూరిమి ఉంటే నేరములు కనిపించవు.

II. అర్థాలు :

ఆ) కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.

ప్రశ్న 1.
“కలసిమెలసి” అనే అర్థం వచ్చే పదం .
A) కలయిక
B) అనగి పెనగి
C) తామరతంపర
D) చుట్టుకొను
జవాబు:
B) అనగి పెనగి

TS 9th Class Telugu Important Questions 7th Lesson చెలిమి

ప్రశ్న 2.
చెలువలు వారైనా చెలరేగి ఆడారు – గీత గీసిన పదానికి అర్థం
A) స్నేహితులు
B) చెఱువులు
C) స్త్రీలు
D) కలువలు
జవాబు:
C) స్త్రీలు

ప్రశ్న 3.
“నెగులు” అనే పదానికి అర్థం
A) పొగలు
B) విచారము
C) కన్నము
D) పెద్ద
జవాబు:
B) విచారము

ప్రశ్న 4.
కరువలి పీల్చి మనం బతుకుతున్నాం – గీత గీసిన పదానికి అర్థం
A) గాలి
B) కొడవలి
C) కాలుష్యము
D) సువాసన
జవాబు:
A) గాలి

TS 9th Class Telugu Important Questions 7th Lesson చెలిమి

ప్రశ్న 5.
“తొందరగా, వెంటనే” – అనే అర్థం గల పదము
A) వైతాళికుడు
B) వైళము
C) తడబడు
D) తత్తరపడు
జవాబు:
B) వైళము

ప్రశ్న 6.
“కొట్నములు” అనే పదానికి అర్థం
A) కట్నములు
B) కొట్లాట
C) సేవలు
D) ఊహలు
జవాబు:
C) సేవలు

ప్రశ్న 7.
అర్మిలి, కూర్మి – అనే పదాలకు అర్థం
A) ఊర్మిళ
B) స్నేహము
C) దాస్యము
D) ప్రేమ
జవాబు:
D) ప్రేమ

TS 9th Class Telugu Important Questions 7th Lesson చెలిమి

ప్రశ్న 8.
బొందిలో ప్రాణమున్నంతవరకు ధనము, విద్యలు సంపాదించాలి – గీత గీసిన పదానికి అర్థం
A) శరీరము
B) సందు
C) గుండెకాయ
D) ముక్కు
జవాబు:
A) శరీరము

ప్రశ్న 9.
విధము, క్రమము – అను అర్థం వచ్చు పదము
A) వితాకు
B) తెఱగు
C) వరుస
D) ఆనతి
జవాబు:
B) తెఱగు

ప్రశ్న 10.
జనకుని పట్టి రాముని పెండ్లాడినది – గీత గీసిన పదానికి అర్థం
A) పట్టుపట్టి
B) చేతివస్త్రం
C) భూమి
D) కూతురు (లేక కొడుకు)
జవాబు:
D) కూతురు (లేక కొడుకు)

TS 9th Class Telugu Important Questions 7th Lesson చెలిమి

ప్రశ్న 11.
మనతో చెలిమి చేయ నొక్క మిత్రుండైన యుండవలెను – గీత గీసిన పదానికి అర్థం
A) బంధం
B) స్నేహం
C) శత్రుత్వం
D) ద్వేషం
జవాబు:
B) స్నేహం

ప్రశ్న 12.
పొన్నికంటి తెలగన అచ్చ తెనుగు ఆదికవిగా ప్రసిద్ధుడు – గీత గీసిన పదానికి అర్థం
A) చివరి
B) మధ్య
C) తొలి
D) ప్రధాన
జవాబు:
C) తొలి

ప్రశ్న 13.
రాక్షసులకు ఒజ్జయైన శుక్రాచార్యుని కూతురు దేవయాని – గీత గీసిన పదానికి అర్థం
A) తండ్రి
B) గురువు
C) అన్న
D) శత్రువు
జవాబు:
B) గురువు

TS 9th Class Telugu Important Questions 7th Lesson చెలిమి

ప్రశ్న 14.
గయ్యాళితనంతో దేవయానిని నూతిలో తోసింది – గీత గీసిన పదానికి అర్థం
A) గొయ్య
B) బావి
C) గుంట
D) చెరువు
జవాబు:
B) బావి

సూచన :-
11. నెలంత, నెలత, అలరుబోడి, వాలుగంటి, కొమ్మ, ఎలనాగ, పడుచు, కలికి, అతివ – ఈ పదములన్నిటికి “స్త్రీ” అని అర్థము

III. ప్రకృతి, వికృతులు :

ప్రశ్న 1.
“రక్కసి” అనే పదానికి ప్రకృతి
A) యక్షుడు
B) రాక్షసి, రాక్షసుడు
C) తాటకి
D) ముళ్ళు
జవాబు:
B) రాక్షసి, రాక్షసుడు

ప్రశ్న 2.
“అద్భుతము” అనే పదానికి వికృతి
A) అదుభుతము
B) అప్పనము
C) అబ్బురము
D) అచ్చెరువు
జవాబు:
C) అబ్బురము

TS 9th Class Telugu Important Questions 7th Lesson చెలిమి

ప్రశ్న 3.
“వంగడము – ఓలి” అను పదాలకు ప్రకృతి
A) వంశము – ఆళి
B) వంగపండు – వల్లె
C) వంకర – ఓసి
D) బంగాళము – వలయు
జవాబు:
A) వంశము – ఆళి

ప్రశ్న 4.
“శ్రీ – రాత్రి” అను పదములకు వికృతి
A) లచ్చి – రాయి
B) సిరి రాయి
C) సిరి – రేయి, రాతిరి
D) రాతిరి – రేయి
జవాబు:
C) సిరి – రేయి, రాతిరి

ప్రశ్న 5.
పాలసముద్రపు కన్య మహాలక్ష్మి – గీత గీసిన పదానికి వికృతి
A) కనకము
B) కన్నె, కన్నియ
C) కందు
D) తనయ
జవాబు:
B) కన్నె, కన్నియ

TS 9th Class Telugu Important Questions 7th Lesson చెలిమి

ప్రశ్న 6.
పురములో ధనవంతులకు కొదవలేదు – గీత గీసిన పదానికి వికృతి
A) ప్రోలు
B) పురం
C) వూరు
D) నగరము
జవాబు:
A) ప్రోలు

ప్రశ్న 7.
చీరె అనే అర్థంలో “పటము”నకు వికృతి
A) పట్టణము
B) పుట్టము
C) పఠాణి
D) పతనము
జవాబు:
B) పుట్టము

ప్రశ్న 8.
“గర్వము” అనే పదానికి వికృతి
A) గరువము
B) గరణము
C) గరుకు
D) గౌరవం
జవాబు:
A) గరువము

TS 9th Class Telugu Important Questions 7th Lesson చెలిమి

ప్రశ్న 9.
చురుకైన మతి గలవాడు – గీత గీసిన పదానికి వికృతి
A) మమత
B) మనసు
C) అనుమతి
D) మది
జవాబు:
D) మది

ప్రశ్న 10.
వృషపర్వుని పట్టి శర్మిష్ఠ – గీత గీసిన పదానికి వికృతి
A) కూతురు
B) కొమరిత
C) పుత్రి
D) కుమార్తె
జవాబు:
C) పుత్రి

ప్రశ్న 11.
కూర్మి సకియలు వేగురు గొల్పనెపుడు – గీత గీసిన పదానికి వికృతి
A) సఖి
B) చెలి
C) సకి
D) చెలికత్తె
జవాబు:
B) చెలి

TS 9th Class Telugu Important Questions 7th Lesson చెలిమి

IV. పర్యాయపదాలు :

ప్రశ్న 1.
సముద్రుని కూతురు లక్ష్మి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) సుతుడు, పుత్రుడు, కుమారుడు
B) సుత, పట్టి, దుహిత
C) కూతు, దౌహిత్రుడు, జాత
D) కొమరిత, సంభవము, జన్మించినది
జవాబు:
B) సుత, పట్టి, దుహిత

ప్రశ్న 2.
స్త్రీ – అనే పదానికి ఇవి పర్యాయపదాలు కావు.
A) ఎలనాగ, నెలత, వాలుగంటి
B) పడుచు, కలికి, నెలంత
C) లక్ష్మి, సరస్వతి, పార్వతి
D) కొమ్మ, అలరుబోడి, వనిత
జవాబు:
C) లక్ష్మి, సరస్వతి, పార్వతి

ప్రశ్న 3.
బొంది, మేను, మై – అనే పర్యాయపదాలున్న పదం
A) శరీరము
B) ధనువు
C) నేను
D) కారణం
జవాబు:
A) శరీరము

TS 9th Class Telugu Important Questions 7th Lesson చెలిమి

ప్రశ్న 4.
దనుజులు, రక్కసులు, దానవులు – పర్యాయపదాలుగా ఉన్న పదం
A) అనుజులు
B) దుష్టులు
C) కిరాతులు
D) రాక్షసులు
జవాబు:
D) రాక్షసులు

ప్రశ్న 5.
“చీర” అను పదానికి పర్యాయపదాలు
A) వలువ, కోక, పుట్టము
B) చీర, ధోవతి, పంచ
C) అంగి, వస్త్రము
D) ఉతికినవి, ఉతకనివి
జవాబు:
A) వలువ, కోక, పుట్టము

ప్రశ్న 6.
గోత్రము, వంగడము, కులము – అను పర్యాయపదాలు గల పదము
A) వంశము
B) కొండ
C) పొలము
D) అనువంశము
జవాబు:
A) వంశము

TS 9th Class Telugu Important Questions 7th Lesson చెలిమి

ప్రశ్న 7.
సింహము నోరు పెద్దది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) పైపెదవి, నోరు
B) నాలుక, ముఖము
C) ఆస్యము, వాయి, వక్త్రము
D) అంగిలి, కంఠము
జవాబు:
C) ఆస్యము, వాయి, వక్త్రము

ప్రశ్న 8.
గాలి అనే పదానికి సరియైన పర్యాయపదాలు
A) జలము, వాయసము
B) ఖగము, గగనము
C) అనిలము, అనలము
D) కరువలి, అనిలము, వాయువు
జవాబు:
D) కరువలి, అనిలము, వాయువు

ప్రశ్న 9.
వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠ – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) పుత్రిక, పుత్ర
B) కూతురు, కుమరా
C) పుత్రిక, కూతురు
D) స్తుత, సునీత
జవాబు:
C) పుత్రిక, కూతురు

TS 9th Class Telugu Important Questions 7th Lesson చెలిమి

ప్రశ్న 10.
దేవతలు ఎల్లప్పుడు ఊడిగం చేస్తారు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) ఖేచరులు, నిశాచరులు
B) రాక్షసులు, ప్రజలు
C) దైత్యులు, కింపురుషులు
D) అమరులు, సురులు
జవాబు:
D) అమరులు, సురులు

ప్రశ్న 11.
శరీరాలు వేరైనా ప్రాణం ఒక్కటిగా ఉన్నాము · గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) మై, మే
B) మేను, కాయం
C) దేహం, కాయ
D) తోలుతిత్తి, చర్మం
జవాబు:
B) మేను, కాయం

V. నానార్థాలు :

ప్రశ్న 1.
కొమ్మ – అను పదమునకు నానార్థాలు
A) తీసుకో, పసుపుకొమ్ము
B) స్త్రీ, చెట్టుకొమ్మ
C) సంతానము, కుమార్తె
D) చెట్టు, చెట్టుకొమ్మ
జవాబు:
B) స్త్రీ, చెట్టుకొమ్మ

TS 9th Class Telugu Important Questions 7th Lesson చెలిమి

ప్రశ్న 2.
శుక్రుడు – అను పదమునకు నానార్థములు
A) భార్గవుడు, చక్రము
B) దేవతల గురువు, వెలుగు
C) దేవతల గురువు, ఒక గ్రహము, అగ్ని
D) భార్గవుడు, పురోహితుడు
జవాబు:
C) దేవతల గురువు, ఒక గ్రహము, అగ్ని

ప్రశ్న 3.
శుక్రాచార్యుడు రాక్షసుల గురువు – గీత గీసిన పదానికి నానార్థాలు
A) తండ్రి, తాత
B) ఒజ్జ, ఉపాధ్యాయుడు
C) ఆచార్యుడు, బృహస్పతి
D) దేవగురువు, బృహస్పతి
జవాబు:
C) ఆచార్యుడు, బృహస్పతి

ప్రశ్న 4.
వృషపర్వుడు రాక్షస రాజు – గీత గీసిన పదానికి నానార్థాలు
A) ప్రభువు, రేడు
B) నృపతి, చంద్రుడు
C) ఇంద్రుడు, శచీ
D) భూపతి, నృపుడు
జవాబు:
B) నృపతి, చంద్రుడు

TS 9th Class Telugu Important Questions 7th Lesson చెలిమి

ప్రశ్న 5.
దేవతలంతా రేయింబవళ్ళు సేవలు చేస్తున్నారు – గీత గీసిన పదానికి నానార్థాలు
A) స్తోత్రం, స్తవం
B) గౌరవం, మర్యాద
C) శుశ్రూష, కొలుపు
D) పూజ, అర్చన
జవాబు:
C) శుశ్రూష, కొలుపు

ప్రశ్న 6.
నీవు చీర తారుమారైనందుకే ఇంతగా కసురుతున్నావు – గీత గీసిన పదానికి నానార్థాలు
A) నారచీర, జుట్టు
B) గోచి, నక్షత్రం
C) రేఖ, గీత
D) వస్త్రం, అస్త్రం
జవాబు:
A) నారచీర, జుట్టు

VI. వ్యుత్పత్యర్థములు :

ప్రశ్న 1.
“అలరు (పువ్వు) వంటి మేను కలది స్త్రీ” అను వ్యుత్పత్తి గల పదము
A) అలరులు
B) అలరుబోడి
C) అరుతల్లి
D) అలిగినవారు
జవాబు:
B) అలరుబోడి

TS 9th Class Telugu Important Questions 7th Lesson చెలిమి

ప్రశ్న 2.
వాలుగంటి (స్త్రీ) – అనే పదానికి సరియైన వ్యుత్పత్తి
A) క్రిందకు వాలిన కన్నులుగలది.
B) విశాలమైన (దీర్ఘమైన) కన్నులు కలది.
C) గరిటె వంటి కన్నులు కలది.
D) రెండు కన్నులు కలది.
జవాబు:
B) విశాలమైన (దీర్ఘమైన) కన్నులు కలది.

PAPER – II : PART – A

అపరిచిత పద్యాలు

ప్రశ్న 1.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ద్యుమణి పద్మాకరము వికచముగఁ జేయుఁ
గుముద హర్షంబు గావించు నమృతసూతి,
యర్థితుడుగాక జలమిచ్చు నంబుధరుడు;
సజ్జనులు దారె పరహితాచరణమతులు

ప్రశ్నలు – సమాధానాలు
1. పద్మాకరమును వికసింపజేసేది ఎవరు?
జవాబు:
సూర్యుడు (ద్యుమణి) పద్మాకరమును వికసింపజేస్తాడు.

2. చంద్రుడు వేటిని వికసింపజేస్తాడు?
జవాబు:
చంద్రుడు కలువలను వికసింపజేస్తాడు.

3. కోరకుండానే నీటిని ఇచ్చేది ఎవరు?
జవాబు:
కోరకుండానే నీటిని ఇచ్చేది మేఘుడు.

4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘పరోపకారుల స్వభావం’.

5. అమృతసూతి అంటే ఎవరు ?
జవాబు:
అమృతసూతి అంటే చంద్రుడు.

TS 9th Class Telugu Important Questions 7th Lesson చెలిమి

ప్రశ్న 2.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ధరణి ధేనువుఁ బిదుకంగఁ దలఁచితేని
జనులు బోషింపు మధిప! వత్సముల మాడ్కి
జనులు పోషింపబడుచుండ జగతి కల్ప.
లత తెఱంగున సకల ఫలంబు లొసఁగు.

ప్రశ్నలు – సమాధానాలు

1. అధిపులు ఎవరిని పోషించాలి ?
జవాబు:
అధిపులు జనులను పోషించాలి.

2. జగతి ఏమి యొసంగును ?
జవాబు:
జగతి సకల ఫలము లొసగును.

3. ధరణి దేనితో పోల్చబడినది ?
జవాబు:
ధరణి ధేనువుతో పోల్చబడినది.

4. పై పద్యమునకు శీర్షిక నిర్ణయింపుము.
జవాబు:
ఈ పద్యమునకు శీర్షిక ‘రాజ్యపాలన’.

5. ఈ పద్యం ఎవరిని సంబోధిస్తూ చెప్పబడింది ?
జవాబు:
ఈ పద్యం అధిపుని (రాజుని) సంబోధిస్తూ చెప్పబడింది.

TS 9th Class Telugu Important Questions 7th Lesson చెలిమి

ప్రశ్న 3.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

మొదలు జూచినఁ గడు గొప్ప పిదపఁ గుఱుచ,
యాదిఁ గొంచెము తర్వాత నధిక మగుచుఁ
దనరు, దిన పూర్వ పరభాగ జనితమైన
ఛాయపోలిక గుజన సజ్జనుల మైత్రి

ప్రశ్నలు – సమాధానాలు
1. కుజనుల మైత్రి ఎటువంటిది ?
జవాబు:
కుజనుల మైత్రి ఉదయకాలపు నీడవలె మొదట ఎక్కువగా ఉండి తరువాత తగ్గిపోతూ ఉంటుంది.

2. సజ్జనుల మైత్రి ఎటువంటిది ?
జవాబు:
సజ్జనుల మైత్రి సాయంకాలపు నీడవలె మొదట తక్కువగా ఉండి తరువాత పెరుగుతూ ఉంటుంది.

3. కుజన, సజ్జనుల మైత్రిని కవి దేనితో పోల్చి చెప్పాడు ?
జవాబు:
కవి కుజనుల మైత్రిని ఉదయకాలపు నీడతోను, సజ్జనుల మైత్రిని సాయంకాలపు నీడతోను పోల్చి చెప్పాడు.

4. ఈ పద్యం వల్ల మనకు ఏం తెలుస్తోంది ?
జవాబు:
ఈ పద్యం వల్ల మనకు సజ్జనుల మైత్రి మంచిదని తెలుస్తోంది.

5. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘మైత్రి’.

TS 9th Class Telugu Important Questions 7th Lesson చెలిమి

ప్రశ్న 4.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

అఘము వలన మరల్చు, హితార్థ కలితుఁ
జేయుఁ గోప్యంబు దాచుఁ, బోషించుగుణము,
విడువ డాపన్ను, లేవడివేళ నిచ్చు,
మిత్రు డీలక్షణమ్ముల మెలగుచుండు

ప్రశ్నలు – సమాధానాలు
1. మిత్రుడు దేని నుండి మరలిస్తాడు?
జవాబు:
మిత్రుడు పాపం నుండి మరలిస్తాడు.

2. మిత్రుడు ఎట్టివారిని విడిచిపెట్టడు ?
జవాబు:
మిత్రుడు ఆపదలో నున్నవారిని విడిచిపెట్టడు.

3. మిత్రుడు పోషించేది ఏది?
జవాబు:
మిత్రుడు సద్గుణాన్ని పోషిస్తాడు.

4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘మిత్ర లక్షణం’.

5. గోప్యము అంటే ఏమిటి ?
జవాబు:
గోప్యము అంటే రహస్యం.

TS 9th Class Telugu Important Questions 7th Lesson చెలిమి

ప్రశ్న 5.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

తివిరి యిసుమునఁ దైలంబుఁ దీయవచ్చుఁ
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చుఁ
దిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చుఁ
జేరి మూర్ఖుల మనసు రంజింపరాదు

ప్రశ్నలు – సమాధానాలు
1. ఎవరి మనసు రంజింపచేయలేము ?
జవాబు:
మూర్ఖుని మనసు రంజింపచేయలేము.

2. ఇసుక నుండి ఏమి తీయవచ్చును ?
జవాబు:
ఇసుక నుండి తైలము తీయవచ్చు.

3. మృగతృష్ణలో ఏమి త్రాగవచ్చు ?
జవాబు:
మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు.

4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక “మూర్ఖుని స్వభావం”.

TS 9th Class Telugu Important Questions 7th Lesson చెలిమి

5. మృగతృష్ణ అంటే అర్థం ఏమిటి ?
జవాబు:
మృగతృష్ణ అంటే ఎండమావి.

వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
స్నేహం విలువను తెలిపేలా కథను రాయండి.
జవాబు:
‘చిత్రగ్రీవుడు’ పావురాల రాజు. అతగాడు తన పావురాలతో ఆకాశంలో తిరుగుతున్నాడు. గోదావరీ తీరంలో ఒక మర్రిచెట్టు ఉంది. ఒక బోయవాడు వచ్చి ఆ చెట్టు దగ్గరలో నూకలు చల్లి దానిమీద వల వేశాడు. “పక్షులు నూకల కోసం వల మీద వాలతాయి. వాటిని పట్టుకొని అమ్ముకుందాం” అనుకున్నాడు.

చిత్రగ్రీవుడితో ఎగురుతున్న పావురాలు ఆ నూకలను చూశాయి. అవి నేలమీద వాలి, నూకలను తిందామనుకున్నాయి. “ఇది మనుష్యుల సంచారం లేని అడవి. ఈ నూకలు ఇక్కడకు ఎందుకు వస్తాయి ? కాబట్టి ఈ నూకలను ఆశపడకండి” అని చిత్రగ్రీవుడు స్నేహితులకు సలహా చెప్పాడు. ఒక ముసలిపావురం చిత్రగ్రీవుడి మాటలు కాదంది. నూకలు తిందామంది. సరే అని పావురాలు కిందికి దిగాయి. వలలో చిక్కుకున్నాయి.

పావురాలు అప్పుడు ముసలి పావురాన్ని తిట్టాయి. చిత్రగ్రీవుడు “తిట్టకండి. మనం అంతా కలసి ఎగిరిపోదాం. నాకో స్నేహితుడు ఉన్నాడు మనల్ని రక్షిస్తాడు” అని చెప్పింది. పావురాలు అన్నీ కలసి వల ఎత్తుకొని, చిత్రగ్రీవుడి స్నేహితుడు హిరణ్యకుడు అనే ఎలుక ఉండే కన్నం దగ్గర వాలాయి. హిరణ్యకుణ్ణి చిత్రగ్రీవుడు గొంతెత్తి పిలిచాడు. హిరణ్యకుడు స్నేహితుని మాట విని పావురాల బంధాలన్నీ తన పళ్లతో కొరికివేశాడు. పావురాలు చిత్రగ్రీవుణ్ణి, హిరణ్యకుణ్ణి మెచ్చుకున్నాయి. అందుకే మనందరికీ మంచి స్నేహితులు ఉండాలి.

TS 9th Class Telugu Important Questions 7th Lesson చెలిమి

PAPER – II : PART – B

భాషాంశాలు – వ్యాకరణం

కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.

I. సంధులు:

ప్రశ్న 1.
“నెఱ + మది” – కలిపి రాయగా
A) నెఱమది
B) నెమ్మది
C) నెనరుమది
D) నింమది
జవాబు:
B) నెమ్మది

ప్రశ్న 2.
“గసడదవాదేశ సంధి”కి ఉదాహరణ
A) నెగులుగ్రము
B) అనుగుఁగూతు
C) నెమ్మది
D) వేలుపుంగన్నియ
జవాబు:
A) నెగులుగ్రము

ప్రశ్న 3.
“అయ్యెలనాగ” ఎవతె అని ప్రశ్నించాడు – గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి.
A) ఆ + యెలనాగ
B) అయ్యెల + నాగ
C) అయ్యె + లనాగ
D) ఆ, ఈ + ఎలనాగ
జవాబు:
A) ఆ + యెలనాగ

TS 9th Class Telugu Important Questions 7th Lesson చెలిమి

ప్రశ్న 4.
“ఆ + కలికి → అక్కలికి” – ఇది ఏ సంధి ?
A) ఆ, ఈ, ఏ సంధి
B) త్రిక సంధి
C) అత్వ సంధి
D) సరళాదేశ సంధి
జవాబు:
B) త్రిక సంధి

ప్రశ్న 5.
బాలురు నీరాటలో మైమరచిపోయారు – గీత గీసిన పదం ఏ సంధి. ?
A) గసడదవాదేశ సంధి
B) త్రిక సంధి
C) అత్వ సంధి
D) ఉత్వ సంధి
జవాబు:

II. సమాసములు :

ప్రశ్న 1.
రక్కసుల యొక్క యొజ్జ – సమాస నామము
A) షష్ఠీ తత్పురుష
B) ప్రథమా తత్పురుష
C) విశేషణ పూర్వపద
D) సంభావనా పూర్వపద
జవాబు:
A) షష్ఠీ తత్పురుష

TS 9th Class Telugu Important Questions 7th Lesson చెలిమి

ప్రశ్న 2.
“విశేషణ పూర్వపద కర్మధారయము”నకు ఉదాహరణ
A) రక్కసుల యొజ్జ
B) రక్కసుల రేడు
C) వృషపర్వు కూతురు
D) అనుగు కూతురు
జవాబు:
D) అనుగు కూతురు

ప్రశ్న 3.
నేలవేలుపు బిడ్డ దేవయానిని యయాతి ఉద్ధరించెను – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం రాయండి.
A) నేలకు వేలుపు బిడ్డ
B) నేలవేలుపు యొక్క బిడ్డ
C) నేలవేలుపు వంటి బిడ్డ
D) బిడ్డ వంటి నేలవేలుపు
జవాబు:
B) నేలవేలుపు యొక్క బిడ్డ

ప్రశ్న 4.
శర్మిష్ఠకు కూరిసకియలు పెక్కుమంది కలరు – గీత గీసిన పదం ఏ సమాసం?
A) షష్ఠీ తత్పురుష సమాసం
B) బహువ్రీహి సమాసం
C) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
D) సప్తమీ తత్పురుష సమాసం
జవాబు:
C) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

TS 9th Class Telugu Important Questions 7th Lesson చెలిమి

ప్రశ్న 5.
“నీటి యందలి ఆట” సమాస రూపము
A) నీరాట
B) నీటిఆట
C) నీటియాటలు
D) నీటితో ఆట
జవాబు:
A) నీరాట

III. ఛందస్సు:

ప్రశ్న 1.
TS 9th Class Telugu Important Questions 7th Lesson చెలిమి 1
పై పద్యము ఏ పద్యము యొక్క పాదము. ?
A) చంపకమాల.
B) తేటగీతి
C) ఆటవెలది
D) కందం
జవాబు:
B) తేటగీతి

ప్రశ్న 2.
న, హ గలములను ఏమని పిలుస్తారు ?
A) ఇంద్రగణములు
B) వృత్తగణములు
C) సూర్యగణములు
D) చంద్రగణములు
జవాబు:
C) సూర్యగణములు

TS 9th Class Telugu Important Questions 7th Lesson చెలిమి

ప్రశ్న 3.
“శార్దూల పద్యము”లో వచ్చు గణములు
A) న, జ, భ, జ, జ, జ, ర
B) భ, ర, న, భ, భ, ర, వ
C) మ, స, జ, స, త, త, గ
D) స, భ, ర, న, మ, య, వ
జవాబు:
C) మ, స, జ, స, త, త, గ

IV. వాక్యాలు:

ప్రశ్న 1.
రాము పూలను కోసాడు. రాము పూలను పూజారికి ఇచ్చాడు.
పై వాక్యములను సంక్లిష్ట వాక్యములుగా మార్చగా
A) రాము పూలు కోసాడు కాబట్టి పూజారికిచ్చాడు.
B) రాము పూలు కోసి, కోసిన పూలను పూజారికిచ్చాడు.
C) రాము పూలు కోసి, పూజారికిచ్చాడు.
D) కోసిన పూవులన్నీ రాము పూజారికి ఇచ్చాడు.
జవాబు:
C) రాము పూలు కోసి, పూజారికిచ్చాడు.

ప్రశ్న 2.
రాము బడికి వెళ్ళాడు, పరీక్ష రాశాడు – ఏ వాక్యము ?
A) సంక్లిష్ట వాక్యము
B) సంయుక్త వాక్యము
C) ప్రశ్నార్థకము
D) క్రియారహిత వాక్యం
జవాబు:
B) సంయుక్త వాక్యము

TS 9th Class Telugu Important Questions 7th Lesson చెలిమి

ప్రశ్న 3.
సీత పాటలు పాడుతుంది, నాట్యం కూడా చేస్తుంది – ఏ వాక్యము ?
A) సంయుక్త వాక్యం
B) ప్రత్యక్ష కథనం
C) సంక్లిష్ట వాక్యం
D) సామాన్య వాక్యం.
జవాబు:
A) సంయుక్త వాక్యం

ప్రశ్న 4.
సామాన్య వాక్యాన్ని గుర్తించండి.
A) సీత వంట చేసి, వడ్డించింది.
B) రాము డిగ్రీ పాసయ్యాడు, ఉద్యోగంలో చేరాడు.
C) రాము చదరంగం మరియు వాలీబాల్ ఆడతాడు.
D) మీరు నిన్న వచ్చారు.
జవాబు:
D) మీరు నిన్న వచ్చారు.

TS 9th Class Telugu Important Questions 7th Lesson చెలిమి

ప్రశ్న 5.
ఈ కింది వాటిలో కర్మణి వాక్యం.
A) ఈ నాయకుని ప్రజలు ఎన్నుకున్నారు.
B) ఆ నాయకుడు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు.
C) ఏ నాయకుని మంచివాడని ఎన్నుకున్నారు ?
D) ఆ నాయకుడు డబ్బున్నవాడే కాని ఓడిపోయాడు.
జవాబు:
B) ఆ నాయకుడు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు.