TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds

Telangana TSBIE TS Inter 1st Year Chemistry Study Material 8th Lesson Hydrogen and its Compounds Textbook Questions and Answers.

TS Inter 1st Year Chemistry Study Material 8th Lesson Hydrogen and its Compounds

Very Short Answer Type Questions

Question 1.
The three isotopes of hydrogen differ in their rates of reaction. Give the reasons.
Answer:
Due to the difference in the bond dissociation enthalpies of the H2, D2 and T2 molecules differ in their rates of reaction. The reactivity order is H2 > D2 > T2.

Question 2.
Why is dihydrogen used in weldipg of high melting metals?
Answer:
Atomic hydrogen and oxy-hydrogen torches generate very high temperature of 4000K. So dihydrogen is used in welding of high-melting metals.

Question 3.
Describe one method of producing high-purity hydrogen.
Answer:
High purity (> 99.95%) dihydrogen can be obtained by electrolysing warm aqueous barium hydroxide solution using nickel electrodes.

Question 4.
Explain the term “SYNGAS”.
Answer:
The mixture of CO and H2 is called as water gas or SYNGAS because it is used in the synthesis of methanol and a number of hydrocarbons.

Question 5.
What is meant by coal gasification? Explain with relevant, balanced equation.
Answer:
The process of producing SYNGAS from coal is called coal gasification.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 1

TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds

Question 6.
Define the term Hydride. How many categories of hydrides are known? Name them.
Answer:
The binary compounds of hydrogen with other elements are called hydrides.
The hydrides are classified into three categories.

  1.  Ionic or saline or salt like hydrides.
  2. Covalent or molecular hydrides.
  3. Metallic or non-stoichiometric hydrides.

Question 7.
The unusual property of water in condensed phase leads to its high heat of vapourization. What is that property?
Answer:
The unusual property of water in condensed phase that leading to its high heat of vapourisation is due to the presence of extensive hydrogen bonding between water molecules.

Question 8.
During photosynthesis, water is oxidized to O2. Which element is reduced?
Answer:
The photosynthesis reaction is
6 CO2 + 6 H2O → C6 H12 O6 + 6 O2

The oxidation number of carbon in CO2 is + 4 but in carbohydrate formed the oxidation number of carbon is O. Thus carbon is reduced.

Question 9.
What do you mean by autoprotolysis? Give the equation to represent the auto-protolysis of water.
Answer:
Self – ionisation of water is known as autoprotolysis.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 2

Because of this property, water acts as Bronsted acid when dissolved in alkalis and also acts as Bronsted base when dissolved in acids.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds

Question 10.
Water behaves as an amphoteric substance in the Bronsted sense. How do you explain?
Answer:
Water can donate a proton and also can accept a proton. So it can act as both acid and base in bronsted sense. A substance which can act both as an acid and a base is called amphoteric substance. Hence, we can say that water is an amphoteric oxide.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 3

Short Answer Questions

Question 1.
The boiling points of NH3 H2O and HF are higher than those of the, hydrides of the subsequent members of the group. Give your reasons.
Answer:
Hydrogen is covalently bonded with more electronegative atoms such as F, O and N. The weak electrostatic attractive force is called hydrogen bond.

Because of the association of molecules through hydrogen bonds these hydrides have high boiling points. This is because some extra energy is required to break the hydrogen bond.

The electronegativities of the higher members of N, O, F groups are less. So their hydrides are less polar and cannot form hydrogen bonds. Hence the boiling points of the hydrides of the subsequent members of the N, O, F groups have low boiling points.

Question 2.
Discuss the position of hydrogen in the periodic table on the basis of its electronic configuration.
Answer:
Basing on its electronic configuration (1s¹), hydrogen has to be placed in the 1st period in group I along with alkali metals. Hydrogen resembles the alkali metals in its ability to form hydrated uni + ve ion (H+aq).

Hydrogen can also form uni -ve ion (H). Hence, it can be clubbed with VILA group elements.

However, the position of hydrogen in the periodic table is not satisfactory. It is a matter of choice of the individual to place it in group I along with alkali metals or with group VII along with halogens. Some prefer to place hydrogen separately at the top of the periodic table.

Question 3.
How is the electronic configuration of hydrogen suitable for its chemical reactions?
Answer:
The electronic configuration of hydrogen is 1s¹. It can participate in reactions (i) by losing one electron, (ii) by gaining one electron and (iii) by sharing its electrons.
eg : 1. By losing electron :
In the reaction with fluorine it gives electron but H+ ion cannot exist independently but in water it exist by combining with water.
HF + H2O → H3O+ + F

2. By gaining electron :
With highly electropositive metals it form hydrides by gaining electron.
Na+ + H → NaH

3. By sharing electrons. It forms sev¬eral compounds by sharing electrons.
H : Cl

Question 4.
What happens when dihydrogen reacts with a) Chlorine and b) Sodium metal? Explain.
Answer:
a) When chlorine react with hydrogen hydrogen chloride is formed.
H2 + Cl2 → 2HCl

In HCl, hydrogen shares its electron with chlorine. Hydrogen reduces chlorine to HCl.

b) When sodium reacts with hydrogen, sodium hydride is formed.
2Na + H2 → 2NaH

In this reaction, sodium loses electron while hydrogen gains electron forming Na+ and H ions. Here sodium is oxidised while hydrogen is reduced.

Question 5.
Write a note on heavy water.
Answer:
Heavy water is deuterium oxide. Its formula is D2O. It contains heavier deuterium atoms in the place of normal, hydrogen atoms of water molecule. It is prepared by the prolonged repeated electrolysis of \(\frac{M}{2}\) NaOH solution. The electrolytic cell consists of a steel tank which acts as cathode. A perforated nickel sheet acts as anode and 0.5M NaOH solution acts as electrolyte. The electrolysis is carried in 7 stages. At the end of seventh stage 99% heavy water is obtained.

Properties:
1) It reacts with CaC2 and liberates heavy acetylene.
CaC2 + 2D2O → C2D2 + Ca (OD)2

2) It reacts with S03 and produce heavy sulphuric acid.
SO3 + D2O → D2SO4

Hydrolysis reactions of salts with heavy water are called deuterolysis reactions.
Ex : AlCl3 + 3D2O → Al(OD)3 + 3DCl

Uses :
It is extensively used in nuclear reactors as a moderator and in exchange reactions for the study of reaction mechanism.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds

Question 6.
Name the isotopes of hydrogen. What is the ratio of the masses of these isotopes?
Answer:
Hydrogen 1¹H
Deuterium 1²H or 1²D
Tritium : 1³H or 1³T

The masses of these isotopes are H = 1.008,
D = 2.014 and T = 3.016.

Question 7.
What is water – gas shift reaction? How can the production of dihydrogen be increased by this reaction?
Answer:
Generally water gas produced by passing steam over red hot coke contain less percentage of H2.
C + H2O → CO + H2

The amount of H2 in water gas can be increased by reacting CO of syngas with steam in the presence of Iron chromate catalyst.

CO (g) + H2O (g) → CO2 + H2. This is called water gas shift reaction.

The CO2 formed is removed by scrubbing with sodium arsenite solution.

Question 8.
Complete and balance the following reactions :
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 4
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 5

Question 9.
What is the nature of the hydrides formed by elements of 13 group?
Answer:
Group 13 elements form covalent hydrides. These are mainly electron deficient hydrides. They act as Lewis acids.

Boron form large number of hydrides called boranes. Aluminium form a single polymeric hydride called allane. Gallium forms a dimerichydride and indium forms a polymeric hydride which are not stable. Thallium does not from any hydride.

Question 10.
Discuss the principle and the method of softening of hard water by synthetic, ion-exchange resins.
Answer:
The water which is free from all the dissolved mineral salts is called deionised water.

Deionised water can be prepared in two steps.
1) Removal of cations :
Hard water is passed through a tank containing cation exchange resin. Then the Ca+2 and Mg+2 ions present in the water are replaced by H+ ions from the resin.
2R COOH + Ca+2 → [R (COO)]2 Ca + 2H+

2) Removal of anions:
Now the water coming from the cation tank is passed through a tank containing anion exchange resin. This resin absorbs anions like Cl, SO-24 etc. from the hard water and OH ions are released.
RNH+3 OH + Cl → RNH+3 Cl + OH
2RNH+3 OH + SO-24 → (R – NH+3)2 SO-24 + 2OH

The H+ and OH ions unite to form Deionised water.

After some time the cation resin and the anion resin lose their capacities to remove the cations and anions from the hard water. Then the resins are said to be exhausted. Then they are to be regenerated. The cation resin is regenerated by passing a solution of H2SO4. Anion resin is regenerated by passing a moderately concentrated solution of NaOH.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds

Question 11.
Write a few lines on the utility of hydrogen as a fule. [Mar. ;13]
Answer:
Hydrogen releases large quantity of heat energy on combustion. Hence it is widely used as industrial fuel. Moreover, the pollutants released in the combustion of hydrogen will be less. Atomic hydrogen and oxy-hydrogen torches are used for welding and cutting metals. Hydrogen is also used as rocket fuel. It is also used in fuel cells for generating electric energy. On combination with carbon monoxide (water gas) it is used as industrial fuel.

Question 12.
A 1% solution of H2O2 is provided to you. What steps do you take to prepare pure H2O2 from it?
Answer:
The concentration of H2O2 involves three stages.
Stage (1) :
The dilute solution of H2O2 is carefully evaporated on a water bath under reduced pressure. Then 30% H2O2 solution is obtained.

Stage (2):
The 30% H2O2 solution is heated in a distillation flask under reduced pressure. Then 90% H2O2 is obtained.

Stage (3) :
The 90% H2O2 solution is subjected to crystallisation using solid CO2 and ether. Then 100% H2O2 separates out.

Question 13.
Mention any three uses of H2O2 in modern times.
Answer:

  1. Used as antiseptic in medicine and surgery.
  2. Used to bleach silk, wool, ivory, hair etc.
  3. Used to restore the colour of old and spoiled lead paintings.
  4. Used as an oxidising agent in the labo¬ratory.

Long Answer Questions

Question 1.
White an essay on the commercial preparation of dihydrogen. Give balanced equations.
Answer:
Commercially hydrogen is prepared by the following methods.

1) Electrolysis method :
Electrolysis of . acidified or alkaline water gives hydrogen.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 6

2) It is obtained as a byproduct during the manufacture of sodium hydroxide.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 7

3) By passing a mixture of steam and hydrocarbons over a catalyst gives a mixture of CO and H2.
CH4 + H2O → CO + 3H2
CnH2n+2 + nH2 → nCO + (2n + 1) H2

4) When steam is passed over red hot coke water gas is formed.
C + H2O → CO + H2

The hydrogen present in water gas obtained from hydrocarbons and steam or coke and steam is separated by water gas shift reaction. The water gas is mixed with steam and passed over iron chromate catalyst. Then CO converts into CO2 which is removed by scrubbing with sodium arsenate.
CO + H2O → CO2 + H2

Question 2.
Illustrate the chemistry of dihydrogen by its reaction with
i) N2
ii) Metal ions and metal oxides and
iii) Organic compounds
How is dihydrogen used in the manufac-ture of chemicals?
Answer:
i) Reaction with N2:
Hydrogen react with nitrogen in the presence of iron powder as catalyst forming ammonia.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 8

This reaction is used for the manufacture of ammonia by Haler’s process.

ii) Reaction with metal ions, metal oxides:
Hydrogen is a good reducing agent and reduces several metal oxides and metal ions to their corresponding metals.
Pd2+ + H2 → Pd + 2H+
CuO + H2 → CU + H2O

iii) Organic compounds :
Hydrogen will be added to the double bonds and triple bonds present in the unsaturated organic compounds in the presence of catalyst.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 9

A mixture of H2 and CO is added to 1 – alk- ene to give aldehydes which are further reduced to alcohols. This reaction is known as hydroformylation.
R CH = CH2 + H2 + CO → R CH2 – CH2 CHO
R CH2 CH2 CHO + H2 → R CH2 CH2 CH2OH

In the manufacture of chemicals:
a) HCl is manufactured by burning H2 in Cl2.
H2 + Cl2 → 2HCl

b) Ammonia is manufactured by Haber’s process.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 10

c) Methyl alcohol is manufactured by passing a mixture of CO and H2 over catalyst.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 11

Question 3.
Explain, with suitable examples, the following ; [AP Mar. ’19; (AP ’16; IPE ’14)]
i) electron-deficient
ii) electron-precise and
iii) electron-rich hydrides
Answer:
Dihydrogen forms molecular compounds with most of the p – block elements. These are three types.
i) Electron-deficient hydrides:
These are formed by elements of 13 group (Boron family). In these hydrides the electrons available are not sufficient for making the bonds. They do not have octet around the central atom. So they act as Lewis acids. Eg Diborane B2H6.

For writing the Lewis structure the number of available electrons are 12 but required are 14.

ii) Electron precise hydrides :
The hydrides whose central atom is having octet and all the electron pairs around the central are bond pairs are called electron precise hydrides. Eg: CH4, SiH4, CeH4, SnH4. Electron precise hydrides have required number of electrons for writing the Lewis diagrams.

iii) Electron rich hydrides :
The hydrides whose central atom is having octet and among the electron pairs around the central atom if some are bond pairs and some are lone pairs are called electron rich molecule. Eg NH3, H2O. These contain excess electrons which are present as lone pairs.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds

Question 4.
Write in brief on [AP Mar. ’19]
i) ionic hydrides
ii) interstitial hydrides.
Answer:
i) Ionic hydrides :
These are formed by the highly electropositive s – block metals. In s- block metal hydrides LiH, BeH2 and MgH2 have some covalent character. The ionic hydrides are crystalline. They are non-volatile compounds. They are non-conducting in solid state. But in molten condition, if electrolysed they give metal at cathode and hydrogen at anode.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 12

This reaction confirms that ionic hydrides contain H ion.

Ionic hydrides liberate hydrogen forming alkaline solution when dissolved in water.
NaH + H2O → NaOH + H2

So ionic hydrides are used as a source of hydrogen.

ii) Interstitial hydrides:
These are formed by many of d – and f – block elements. But metals of 7, 8 and 9 groups do not form hydride. This part of the periodic table is called hydride gap. These are non-stoichiometric compounds. Earlier it was thought the hydrogen atoms occupy the interstitial voids of metal crystals. So they are as interstitial compounds. This is correct only in the case of Ni, Pd, Ce and Ac. In most of other cases the crystal structure of metals is changing during the formation of these hydrides.

Some metals like Pd and Pt absorb large amounts of hydrogen. This property is known as occlusion. This property is also used as a storage of H2 and purification of H2. Also used in catalytic reduction / hydrogenation reactions.

Question 5.
Explain any four of the chemical properties of water.
Answer:
1. Amphoteric nature:
Water can act both as acid and base. In the Bronsted sense it acts as an acid with NH3 and a base with H2S.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 13

2. Reaction with Metals:
Water react with metals liberating hydrogen. Here water is reduced to hydrogen and metals is oxidised.
2Na + 2H2O → 2NaOH + H2

3. Hydrolysis reaction :
Several ionic and covalent compounds hydrolyse in water.
P4O10 + 6H2O → 4H3PO4
SiCl4 + 2H2O → SiO2 + 4HCl

4. Hydrates formation:
When several salts crystalysed as hydrated salts
Eg : i) [Cr (H2O)6] Cl3 – Coordinated water
ii) BaCl2.2H2O – Lattice water
iii) [Cu (H2O)4] SO4 . H2O. The H2O molecule outside the coordination sphere is hydrogen bonded water.

Question 6.
Explain the terms hard water and soft water. Write a note on the [Mar. ’18 (AP)]
i) ion-exchange method and
ii) Calgon method for the removal of hardness of water. [AP ’16; TS ’15 TS Mar. ’19]
Answer:
Water which gives ready and permanent lather with soap is called soft water.

Water which do not give ready and permanent lather with soap is called hard water.

Hardness of water is due to the presence of soluble chloride, sulphate and bicarbonate compounds of magnesium and calcium such as MgCl2, MgSO4, Mg(HCO3)2, CaCl2, CaSO4, Ca(HCO3)2.

1) Ion exchange method :
The water which is free from all the dissolved mineral salts is called deionised water.

Deionised water can be prepared in two steps.
1) Removal of cations :
Hard water is passed through a tank containing cation exchange resin. Then the Ca+2 and Mg+2 ions present in the water are replaced by H+ ions from the resin.
2R COOH + Ca+2 → [R (COO)]2 Ca + 2H+

2) Removal of anions:
Now the water coming from the cation tank is passed through a tank containing anion exchange resin. This resin absorbs anions like Cl, SO-224 etc. from the hard water and OH ions are released.
RNH33 OH + Cl → RNH+3 Cl + OH
2RNH+3 OH + SO-224 → (R – NH+3)2 SO-224 + 2OH

The H+ and OH ions unite to form Deionised water.

After sometime the cation resin and the anion resin lose their capacities to remove the cations and anions from the hard water. Then the resins are said to be exhausted. Then they are to be regenerated. The cation resin is regenerated by passing a solution of H2SO4. Anion resin is regenerated by passing a moderately concentrated solution of NaOH.

2) Calgon method :
Sodium hexametaphos- phate is commercially called as calgon.
When calgon is added to hard water it reacts with calcium and magnesium ions forming complex anions.
Na2 [Na4 (PO3)6] + 2Mg2+ → Na2 [Mg2 (PO3)6] + 4Na+
Na2 [Na4 (PO3)6] + 2Ca2+ → Na2 [Ca2 (PO3)6] + 4Na+

Due to the formation of the complex the Mg2+ and Ca2+ become inactive and cannot react with soap. So the water can give good lather. This method is used only for laundry process.

Question 7.
Write the chemical reaction to justify that hydrogen peroxide can function as an oxidizing as well as reducing agent. [TS Mar. ’18, (TS ’16; AP ’15]
Answer:
Hydrogen peroxide can act as both oxidising and reducing agent in both acid and basic medium.

Oxidation properties:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 14
Eg : H2O2 oxidises PbS to PbSO4 in acid medium
PbS + 4H2O2 → PbSO4 + 4H2O.

H2O2 oxidises formaldehyde to formic acid in basic medium.
2HCHO + H2O2 → 2HCOOH + H2

Reduction properties:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 15
Eg : H2O2 reduces acidified potassium per-manganate in acid medium.
2KMnO4 + 3H2SO4 + 5H2O2 → K2SO4 + 2MnSO4 + 8H2O + 5O2

H2O2 reduces potassium ferrycyanide in basic medium.
2K3 [Fe (CN)6] + 2KOH + H2O2 → 2K4[Fe (CN)6] + 2H2O + O2

Question 8.
Complete and balance the following chemical reactions:
i) PhS (s) + H2O2(aq) →
ii) MnO4 (aq) + H2O2 (aq) →
iii) CaO (s) + H2O (g) →
iv) Ca3 N2 (s) + H2O (l) →
Classify the above into (a) hydrolysis (b) redox and (c) hydration reactions.
Answer:
i) PbS + 4H2O2(aq) → PbSO4 + 4H2O
This reaction is redox reaction. Pbs is oxidised, H2O2 is reduced.

ii) 2MnO4 (aq) + 6H+ + 5H2O2 (aq) → 2Mn2+ + 8H2O + 5O2
This reaction is redox reaction. Here MnO4 is reduced while H202 is oxidised.

iii) CaO (s) + H2O (g) → Ca (OH)2
This reaction is hydration.

iv) Ca3 N2 (s) + 6H2O → 3Ca(OH)2 + 2NH3
This is hydrolysis reaction.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds

Question 9.
Discuss, with relevant chemical equations, various methods of preparing hydrogen peroxide. Which of these methods is useful to prepare D2 O2?
Answer:
Hydrogen peroxide can be prepared by the following methods.
1) By adding ice cold dilute sulphuric acid to barium peroxide gives hydrogen peroxide.
BaO2.8H2O (s) + H2SO4 (aq) → BaSO4 + H2O2 + 8 H2O

BaSO4 can be removed by filtration. Excess water can be removed by evaporation under reduced pressure.

2) Electrolysis of 50% H2SO4 using platinum anode and lead cathode gives H2O2.
2H2SO4 → 2H+ + 2HSO4
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 16

Hydrolysis of perdisulphuric acid gives hydrogen peroxide.
H2S2O8 + 2H2O → 2H2SO4 + H2O2.

3) Industrially it is prepared by the auto oxidation of 2 – alkylanthraquinols.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 17
K2S2O8 is used for the preparation of D2O2.
D2O2 can be prepared by dissolving K2S2O6 in heavy water.
K2S2O8 + 2D2O → 2KDSO4 + D2O2

Question 10.
In how many ways can you express the strength of H2O2? Calculate the strength of 15 volume solution of H2O2.in g/l. Express this strength in normality and molarity.
Answer:
i) Strength of H2O2 expressed in volumes:
Eg : 10 vol. H2O2, 20 vol. H2O2 and 100 vol. H2O2
20 vol. H2O2 means 1 ml of this solution liberates 20 ml of O2 gas at STP.
∴ 10 ml of 20 vol liberates 200 ml of oxygen at STP.
10 vol. H2O2 solution means 1 ml of this solution liberates 10 ml of O2 gas at STP.

ii) To express the strength in % (W/V) :
H2O2 decomposes, as shown below
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 18
1 mole of O2 gas is liberated from 2 notes of H2O2.
i.e., 22.4 lit of O2 is given by 2 × 34 g of H2O2.
∴ 10 lit of O2 gas at STP can be given by?
Weight of H2O2 in 1 lit of solution \(\frac{2\times34\times10}{22.4}\) = 30.36 g

30.36g (W/V) refers to the weight of H2O, in 1000 ml of solution.
∴ Strength of H2O2 = 3.036 % (W/V)
(Wt. of H2O2 in 100 ml solution is called its strength.)

iii) Molarity of H2O2 solution = \(\frac{30.36}{34}\) = 0.893 M

iv) Normality of solution is the number of gram equivalents of solute present in 1 lit of solution.
Equivalent weight of H2O2

TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 19

Strength of 15 vol H2O2 :
10 volume H2O2 is 3% W/V
15 volume H202 is
\(\frac{15\times3}{10}\) = 4.5 gm/100ml

∴ The wt. of H202 in 1 litre = 45 g/L
Normality of 10 vol. H2O2 is 1.786
Normality of 15 vol. H2O2 is
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 20

TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds

Question 11.
Explain the structure of the Hydrogen peroxide molecule.
Answer:
H2O2 has an open book structure. It is non-linear and non-polar. The two oxygen atoms are considered to be present on the spine of an open book. The two hydrogen atoms can be considered to be present on the two covers. H-O-O bond angle is 94° 48¹. O-O bond length is 1.48 A.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 21

TS Inter 2nd Year Telugu Study Material Poem 3 జ్ఞానబోధ

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material 3rd Poem జ్ఞానబోధ Textbook Questions and Answers.

TS Inter 2nd Year Telugu Study Material 3rd Poem జ్ఞానబోధ

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
సిద్ధప్ప జ్ఞానబోధలోని నీతులు వివరించండి. (V.Imp) (M.P)
జవాబు:
నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్ధప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండని చెప్తూ వరకవి సిద్ధప్ప తన జ్ఞానబోధలో నీతులను వివరించాడు. కుమ్మరి చేసే కుండల్లో కొన్ని చేస్తున్నప్పుడు, కొన్ని సారెమీద, కొన్ని తెలియకుండానే పగిలిపోతాయి. కొన్ని ఆవములో పగలగా కొన్ని మాత్రమే మంచిగా తయారై కొన్ని రోజులు ఉపయోగపడిన తరువాత పగిలిపోతాయి.

అలాగే మానవులు కూడా మర్యాదతో ప్రవర్తిస్తేనే ఈ భూమిపై మోక్షాన్ని పొందుతారు. కోపంతో మానవత్వం పోతుంది. కోపం నష్టపరుస్తుంది, పాపం పెరిగేలా చేస్తుంది. కోపం వల్ల నిందలు వస్తాయి. కోపం ఎలా పోతుందో ఎవరికీ తెలియదు. కోపం స్నేహితులను అవమానపరుస్తుంది. కోపంతో శాపాలు వస్తాయి. చూస్తుండగానే కొరివిగా మారి మానవులను నాశనం చేస్తుంది. కాబట్టి కోపానికి దూరం ఉండాలని చెప్పాడు.

డబ్బు ఉన్నవారిని గౌరవిస్తారు. కాని పేదవారి గుర్తించరు. సమయం ఎప్పటికీ ఒకే విధంగా గడవదు. నేనే బలవంతుణ్ణి అని గర్వించడం సరికాదు. చలిచీమలు కూడా పామును చంపుతాయి. కాబట్టి ఎదుటి వారి ముందు గొప్పలు చెప్పుకోవద్దు. కుండవంటి ఈ శరీరాన్ని నమ్మరాదు. తొమ్మిది రంధ్రాలున్న ఇల్లు ఇది. బతుకమ్మలాగా ఎప్పుడైనా నీటిలో ప్రవేశించవచ్చు. చనిపోయిన తరువాత తల్లి, తండ్రి, బంధువులు ఎవరూ తిరిగి చూడరు. మరిచిపోతారు. కాటికి వెళ్ళేటపుడు ఒక్క కాసుకూడా వెంటరాదు.

సంసారం అంతా అబద్ధం అని తెలియక పప్పు తినడానికి వెళ్ళిన ఎలుక లాగ అనేక రకాలుగా డబ్బును సంపాదిస్తుంది. ఆస్తులు, కులం, అధికారం, సంసారం ఇలా అనేక విషయాలపై మోహంతో భక్తి లేక ఉన్నతమైన మానవ జన్మ ఎత్తి కూడా చేప గాలాన్ని మింగినట్లు మనుషులు సంసారమనే మాయలో పడి యమధర్మరాజు చేతికి చిక్కి బాధపడతారు.

వేదాలు తెలిసిన వేమన తాతలాంటి వాడు. సురలను ఆనందింపచేసే సుమతి శతక కర్త బద్దెన పెద్దమ్మ వంటి వాడు. కాలజ్ఞానాన్ని రాసిన పోతులూరి వీరబ్రహ్మం తండ్రి లాంటి వారు. ఈశ్వరమ్మ అక్క లాంటిది. సిద్ధప్ప అన్న వంటి వాడు. కాళిదాసు మా చిన్నన్న. అమరసింహుడు, యాగంటి ఆత్మ బంధువుల వంటి వారు. వీరంతా చనిపోయికూడా జనాల హృదయాలలో బతికే ఉన్నారు. వారిలాగా లోక కళ్యాణం కోసం జీవించాలి.

నాలుక తండ్రి పరమాత్మ వంటిది. కళ్ళు అల్లుళ్ల వంటివి, రెండు చేతులు ఆత్మ బంధువుల వంటివి. కడుపు పెద్ద నాన్న కొడుకు, చూసే రెండు కళ్ళు మేనమామలు, వినే రెండు చెవులు అన్నదమ్ములు, ముక్కు ప్రియురాలు, ముఖం మేనత్త, దంతాలు చుట్టాలు, భక్తులు. నాలుక ఆదిపరాశక్తి అయిన మా ఇంటి దేవత. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మానవ జీవనానికి అత్యంత ప్రధానమైనవి వాటిని పవిత్రంగా, జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు.

చేదుగా ఉన్న ఆనగపు కాయను చేతిలో పట్టుకొని గంగానదిలో స్నానం చేసి దాని రుచిచూస్తే అంతకు ముందు ఉన్న చేదు రుచి పోదు. లేని తీపి రుచి రాదు. ఆ సొరకాయలాగా మానవులు కూడా గంగలో మునిగి తేలితే వారి మూర్ఖత్వం పోదు. ఎన్ని నదుల దగ్గరికి వెళ్ళినా, ఎన్ని వ్రతాలు పట్టినా పాపాత్ములు మోక్ష పదవిని అలంకరించలేరు. వంకరగా ఉన్న కుక్క తోకకు వెదురు కర్రలు ఎంత లాగి కట్టినా దాని వంకర గుణం పోదు. గురువును మనస్సులో నిలిపితే పైన చెప్పిన అసాధ్యమైన పనులు చేసి ప్రతిష్ఠ పొందవచ్చు.

ఎవరైతే తన ఆత్మను పరమాత్మతో సమానంగా భావించి, అన్ని జీవులను సమానంగా చూసి జ్ఞాన వైరాగ్యాలనే యజ్ఞాన్ని, దానాలను, తపస్సులను చేస్తారో వారు మోక్షాన్ని పొందుతారు. తామరాకులు నీటిలో ఉండి కూడా తడవకుండా ఉన్నట్లుగానే భూమిపై జీవిస్తున్న జ్ఞానులు కూడా అలసిపోయినట్లు, కళా విహీనంగా కనిపిస్తారు. కాని తరువాత వారి ముఖంలో కళ వస్తుందని సిద్దప్ప నీతులను చెప్పాడు.

ప్రశ్న 2.
జ్ఞానబోధ పాఠ్యాంశ సందేశాన్ని తెలియజేయండి. (V. Imp)
జవాబు:
నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్ధప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండని చెప్తూ వరకవి సిద్ధప్ప తన జ్ఞానబోధను రచించాడు. దీనిలో మానవులకు కావలసిన సందేశాన్ని ఇచ్చాడు. కుమ్మరి చేసిన కుండలన్ని ఎలా అయితే పనికిరావో అలానే మానవులు అందరూ మోక్షాన్ని పొందలేరని చెప్పాడు. కేవలం మర్యాదతో మంచి పనులు చేసినవారే మోక్షాన్ని పొందుతారు.

కోపం వల్ల డబ్బు, పరువు, ఆరోగ్యం అన్ని నశిస్తాయి. కోపం కొరివిగా మారి మానవులను నాశనం చేస్తుంది. కాబట్టి కోపానికి దూరం ఉండాలని హితవు పలికాడు. ఏళ్ల కాలం ఒక్క తీరుగా గడవదు. ఎత్తుగా, పొడువుగా, లావుగా, ఎర్రగా ఉన్నప్పటికీ గొడ్డలి దెబ్బకు చెట్టు కూలుతుంది. కాబట్టి తెలివిగలవారు, పుణ్యం సంపాదించుకున్నవారు తమ ప్రజ్ఞను గురించి ఎదుటివారి ముందు చెప్పుకోకూడదనే సందేశాన్ని ఇచ్చాడు.

కుండవంటి ఈ శరీరాన్ని నమ్మరాదు. తొమ్మిది రంధ్రాలున్న ఇల్లు ఇది. బతుకమ్మలాగా ఎప్పుడైనా నీటిలో ప్రవేశించవచ్చు. కాటికి వెళ్ళేటపుడు ఒక్క కాసుకూడా వెంటరాదు. సంసారం అంతా అబద్ధం అని తెలియక పప్పు తినడానికి వెళ్ళిన ఎలుక లాగ అనేక రకాలుగా డబ్బును సంపాదిస్తుంది. ఆస్థులు శాశ్వతమని భావించరాదు.

ప్రజలు సంసారంపై గల కోరికను వదిలిపెట్టక, తిండి బట్టలకు అలవాటుపడి మా కులమే గొప్పది అనుకుంటూ గర్వాన్ని ప్రదర్శిస్తారు. అలా ఉంటే ఉన్నతమైన మానవ జన్మ ఎత్తి కూడా చేప గాలాన్ని మింగినట్లు మనుషులు సంసారమనే మాయలో పడి యమధర్మరాజు చేతికి చిక్కి బాధపడతారని హెచ్చరించాడు.

వేమన, బద్దెన, వీరబ్రహ్మంగారు, ఈశ్వరమ్మ, సిద్ధప్ప, కాళిదాసు, అమరసింహుడు, యాగంటి మొదలైన మహానుభావులు కవికి ఆత్మ బంధువుల వంటివారని చెప్పడం ద్వారా వారిలాగా ప్రజల మేలు కొరకు జీవించాలని సూచించాడు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మానవ జీవనానికి అత్యంత ప్రధానమైనవి వాటిని పవిత్రంగా, జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపాడు. వంకరగా ఉన్న కుక్క తోకకు వెదురు కర్రలు ఎంత లాగి కట్టినా దాని వంకర గుణం పోదు. జ్ఞానం లేని వానికి ఒక పుస్తకం ఇచ్చి జ్ఞానవంతునిగా చేయగలవాడే నిజమైన జ్ఞాన సంపన్నుడు.

ఊపిరిని బిగపట్టి శరీరం పైకి లేచేలా చేయవచ్చు. ప్రతీ గడియకు ఒక వేషం వేయవచ్చు. అన్న -పానాలు లేకుండా అడవిలో తిరగవచ్చు. నీళ్ళలో కప్పలాగా ప్రయత్నం చేసి పైకి తేలవచ్చు. బలంగా వెయ్యి సంవత్సరాలు బతకవచ్చు. ప్రతీగ్రామం తిరిగి ఉపన్యాసాలు ఇవ్వవచ్చు. మోసపూరితమైన వారి మనస్సును మార్చవచ్చు. భూమిపై ఎన్నో వేషాలు వేయవచ్చు. గురువును మనస్సులో నిలిపితే పైన చెప్పిన అసాధ్యమైన పనులు చేసి ప్రతిష్ఠ పొందవచ్చు. ఎవరైతే తన ఆత్మను పరమాత్మతో సమానంగా భావించి, అన్ని జీవులను సమానంగా చూసి జ్ఞాన వైరాగ్యాలనే యజ్ఞాన్ని, దానాలను, తపస్సులను చేస్తే మోక్షాన్ని పొందుతారు.

తామరాకులు నీటిలో ఉండి కూడా తడవకుండా ఉన్నట్లుగానే భూమిపై జీవిస్తున్న జ్ఞానులు కూడా అలసిపోయినట్లు, కళా విహీనంగా కనిపిస్తారు. కాని తరువాత వారి ముఖంలో కళ వస్తుంది. వారు ఒకరిని తిట్టి, మరొకరిని మెచ్చుకోరు. వారు ఎల్లప్పుడూ సుఖాన్ని దుఃఖాన్ని ఒకే విధంగా చూస్తారని సందేశాన్ని ఇచ్చాడు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 3 జ్ఞానబోధ

II సంగ్రహరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
“కోపమంత చేదు ఫలము లేదు” వివరించండి ?
జవాబు:
కోపంతో మానవులు మానవత్వాన్ని కోల్పోతారు. కోపం మానవులను నష్టపరుస్తుంది. కోపం వల్ల పాపం పెరుగుతుంది. కోపం వల్ల నిందలు వస్తాయి. కోపం ఎలా పోతుందో ఎవరికీ తెలియదు. కోపం స్నేహితులను తగ్గిస్తుంది అవమానపరుస్తుంది. కోపంతో శాపాలు వస్తాయి. చూస్తుండగానే కొరివిగా మారి మానవులను నాశనం చేస్తుంది. కాబట్టి కోపానికి దూరం ఉండాలని భావం.

ప్రశ్న 2.
బుద్ధిమంతులు ఎలా ఉంటారు ?
జవాబు:
డబ్బు ఉన్నవారికి కుర్చీలు ఇస్తారు కాని పేదవాడు కూర్చోవడానికి కనీసం చెక్కపీటను కూడా ఇవ్వరు. సమయం ఎప్పటికీ ఒకే విధంగా గడవదు. ఒక్కోసారి దోమ కూడా ఏనుగును ఎత్తుతుంది. నేనే బలవంతుణ్ణి అని గర్వించడం సరికాదు. చిన్న చలిచీమలు కూడా పామును చంపడం సాధ్యమే కదా. ఎత్తుగా, పొడువుగా, లావుగా, ఎర్రగా ఉన్నప్పటికీ గొడ్డలి దెబ్బకు చెట్టు కూలుతుంది కదా. కాబటి బుద్ధిమంతులు, పుణ్యం సంపాదించుకున్నవారు తమ ప్రజ్ఞను గురించి ఎదుటివారి ముందు చెప్పుకోరు.

ప్రశ్న 3.
సిద్ధప్ప తన ఆత్మ బంధువులుగా ఎవరిని భావించాడు ?
జవాబు:
వరకవి సిద్ధప్ప వేదాలు తెలిసిన వేమన మా తాతలాంటి వాడు. సురలను ఆనందింప చేసే సుమతి శతక కర్త బద్దెన మా పెద్దమ్మ వంటి వాడు. కాలజ్ఞానాన్ని రాసిన పోతులూరి వీరబ్రహ్మం గారు తండ్రి లాంటి వారు. బ్రహ్మం గారి మనుమరాలు ఈశ్వరమ్మ అక్క లాంటిది. బ్రహ్మంగారి శిష్యుడు సిద్ధప్ప అన్న వంటి వాడు. సంస్కృత కవి కాళిదాసు మా చిన్నన్న. అమర కోశం రాసిన అమరసింహుడు, యాగంటి ఆత్మ బంధువుల వంటి వారు. వీరంతా చనిపోయికూడా జనాల హృదయాలలో బతికే ఉన్నారు అని చెప్పాడు. వీరందరూ వరకవి సిద్దప్పకు ఆదర్శప్రాయులని సూచించాడు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 3 జ్ఞానబోధ

ప్రశ్న 4.
శరీర అవయవాలను సిద్ధప్ప ఏమని భావించాడు ?
జవాబు:
నాలుక నాకు తండ్రి, పరమాత్మ వంటిది. కళ్ళు అల్లుళ్ల వంటివి, రెండు చేతులు ఆత్మ బంధువుల వంటివి. కడుపు పెద్దనాన్న కొడుకు, చూసే రెండు కళ్ళు మేనమామలు, వినే రెండు చెవులు అన్నదమ్ములు, ముక్కు ప్రియురాలు, ముఖం మేనత్త, దంతాలు చుట్టాలు, భక్తులు. నాలుక ఆదిపరాశక్తి అయిన మా ఇంటి దేవత అన్నాడు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మానవ జీవనానికి అత్యంత ప్రధానమైనవి వాటిని పవిత్రంగా, జాగ్రత్తగా చూసుకోవాలి అని కవి భావం.

III. ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు (V. Imp) (Model Paper)

ప్రశ్న 1.
వరకవి సిద్ధప్ప ఎప్పుడు జన్మించాడు ?
జవాబు:
జూలై 9, 1903

ప్రశ్న 2.
వరకవి సిద్ధప్పకు ఏయే విద్యలలో ప్రావీణ్యం ఉన్నది?
జవాబు:
జ్యోతిష్యం, ఆయుర్వేదం, వాస్తు యోగ విద్యల్లో

ప్రశ్న 3.
కుండలను చేసేది ఎవరు ?
జవాబు:
కుమ్మరి

ప్రశ్న 4.
ఒక్కరీతిగా నడవనిది ఏది ?
జవాబు:
కాలం

ప్రశ్న 5.
బతుకమ్మలాగ నీటిలో మునిగి ముగిసేది ఏది ?
జవాబు:
తొమ్మిది రంధ్రాల మానవ శరీరం

ప్రశ్న 6.
చేప దేనిని మింగుతుంది ?
జవాబు:
గాలాన్ని

ప్రశ్న 7.
సుఖదుఃఖాలను ఒకే విధంగా చూసేదెవరు ?
జవాబు:
సుజ్ఞానులు

ప్రశ్న 8.
వెళ్ళిపోయేనాడు వెంటరానిది ఏమిటి ?
జవాబు:
ఒక కాసు కూడా రాదు

IV. సందర్భసహిత వ్యాఖ్యలు

1. ఐక్యమయ్యెదరు నిటులు అవని విడిచి ★(Imp)

కవి పరిచయం : సిద్దిపేట జిల్లాకు చెందిన వరకవి సిద్ధప్ప రాసిన “సిద్ధప్ప వరకవి జ్ఞానబోధిని” అనే గ్రంథం నుండి తీసుకున్న “జ్ఞానబోధ” అనే పాఠ్యాంశం లోనిది ఈ వాక్యం. వరకవి సిద్ధప్ప నలభైకి పైగా పుస్తకాలు రాశాడు.

సందర్భం : కుమ్మరి చేసే కుండల్లో కొన్ని చేస్తున్నప్పుడే పాడైపోతాయి. కొన్ని సాకెమీద పాడవుతాయి. కొన్ని తెలియకుండానే పగిలిపోతాయి. కొన్ని ఆవములో పెట్టి కాల్చినప్పుడు పగిలిపోతాయి. కొన్ని మాత్రం క్షేమంగా తయారై కొన్ని రోజులు ఉపయోగపడిన తరువాత పగిలిపోతాయి. నీటిలో పడి కొన్ని పోతాయి. అంత్యక్రియలలో కొన్ని పగిలిపోతాయి. అలాగే మానవులు కూడా మర్యాదతో ప్రవర్తిస్తేనే ఈ భూమిని వదిలి మోక్షాన్ని పొందుతారని వరకవి సిద్ధప్ప చెప్పిన సందర్భంలోనిది.

అర్థం : దైవంలో ఐక్యమవుతారని అర్థం

వివరణ : కుమ్మరి చేసిన కుండలన్నీ ఉపయోగపడనట్లే మానవులందరూ మోక్షాన్ని పొందలేరని భావం.

TS Inter 2nd Year Telugu Study Material Poem 3 జ్ఞానబోధ

2. కోపము నరుని సాంతము కూల్చునిలను

కవి పరిచయం : సిద్దిపేట జిల్లాకు చెందిన వరకవి సిద్ధప్ప రాసిన “సిద్ధప్ప వరకవి జ్ఞానబోధిని” అనే గ్రంథం నుండి తీసుకున్న “జ్ఞానబోధ” అనే పాఠ్యాంశం లోనిది ఈ వాక్యం. వరకవి సిద్ధప్ప నలభైకి పైగా పుస్తకాలు రాశాడు.

సందర్భం : కోపంతో మానవులు మానవత్వాన్ని కోల్పోతారు. కోపం మానవులను నష్టపరుస్తుంది. కోపం వల్ల పాపం పెరుగుతుంది. కోపం వల్ల నిందలు వస్తాయి. కోపం ఎలా పోతుందో ఎవరికీ తెలియదు. కోపం స్నేహితులను అవమానపరుస్తుంది. కోపంతో శాపాలు వస్తాయి. చూస్తుండగానే కొరివిగా మారి మానవులను పూర్తిగా నాశనం చేస్తుందని వరకవి చెప్పిన సందర్భంలోనిది. (కాబట్టి)

అర్థం : కోపం మానవులను పూర్తిగా నాశనం చేస్తుందని అర్థం.

వివరణ : కోపానికి దూరం ఉండాలని భావం.

3. నాలుకయు మాకు నిలవేల్పునాది శక్తి

కవి పరిచయం : సిద్దిపేట జిల్లాకు చెందిన వరకవి సిద్ధప్ప రాసిన “సిద్ధప్ప వరకవి జ్ఞానబోధిని” అనే గ్రంథం నుండి తీసుకున్న “జ్ఞానబోధ” అనే పాఠ్యాంశం లోనిది ఈ వాక్యం. వరకవి సిద్ధప్ప నలభైకి పైగా పుస్తకాలు రాశాడు.

సందర్భం : నాలుక తండ్రి, పరమాత్మ వంటిది. కళ్ళు అల్లుళ్ల వంటివి, రెండు చేతులు ఆత్మ బంధువుల వంటివి. కడుపు పెద్దనాన్న కొడుకు, చూసే రెండు కళ్ళు మేనమామలు, వినే రెండు చెవులు అన్నదమ్ములు, ముక్కు ప్రియురాలు, ముఖం మేనత్త, దంతాలు చుట్టాలు, భక్తులు. నాలుక ఆదిపరాశక్తి అయిన మా ఇంటి దేవత అని వరకవి సిద్దప్ప చెప్పిన సందర్భంలోనిది.

అర్థం : నాలుక మాకు ఇంటి దేవత అయిన ఆదిశక్తితో సమానం అని అర్థం.

వివరణ : జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మానవ జీవనానికి అత్యంత ప్రధానమైనవి వాటిని పవిత్రంగా, జాగ్రత్తగా చూసుకోవాలి అని భావం.

4. గురుని మదిలోన నిల్పుట గుర్తువచ్చు

కవి పరిచయం : సిద్దిపేట జిల్లాకు చెందిన వరకవి సిద్ధప్ప రాసిన “సిద్దప్ప వరకవి జ్ఞానబోధిని” అనే గ్రంథం నుండి తీసుకున్న “జ్ఞానబోధ” అనే పాఠ్యాంశం లోనిది ఈ వాక్యం. వరకవి సిద్ధప్ప నలభైకి పైగా పుస్తకాలు రాశాడు.

సందర్భం : ఊపిరిని బిగపట్టి శరీరం పైకి లేచేలా చేయవచ్చు. ప్రతీ గడియకు ఒక వేషం వేయవచ్చు. అన్న పానాలు లేకుండా అడవిలో తిరగవచ్చు. జపమాలను సరిగ్గా తిప్పవచ్చు. నీళ్ళలో కప్పలాగా ప్రయత్నం చేసి పైకి తేలవచ్చు. బలంగా వెయ్యి సంవత్సరాలు బతకవచ్చు. ప్రతీగ్రామం తిరిగి ఉపన్యాసాలు ఇవ్వవచ్చు. మోసపూరితమైన వారి మనస్సును మార్చవచ్చు. భూమిపై ఎన్నో వేషాలు వేయవచ్చు. గురువును మనస్సులో నిలిపితే పైన చెప్పిన అసాధ్యమైన పనులు చేసి ప్రతిష్ఠ పొందవచ్చునని వరకవి సిద్ధప్ప చెప్పిన సందర్భంలోనిది.

అర్థం : గురువును మనస్సులో నిలిపితే మనకు గుర్తింపు వస్తుందని అర్థం.

వివరణ : గురువును నమ్ముకుంటే అసాధ్యాలను సుసాధ్యాలు చేసి పేరు పొందవచ్చునని భావం.

పద్యములు – ప్రతిపదార్థ తాత్పర్యములు

1వ పద్యం :

సీ ||
కుమ్మరాతడు జేయు కుండలు నవికొన్ని
చేయుచుండగ బోవు చేతిలోన
కొన్ని సానముమీద కొన్ని చాటునబోవు
కాలి నావము కొన్ని కూలిపోవు
కొన్ని క్షేమము బొంది కొన్నాళ్లకును బోవు
కొన్ని భిన్నములయ్యి కొంతబోవు
కొన్ని యుర్విలొ బోవు కొన్ని వనమున బోవు
కొన్ని మృతికి బోవు కొరివి నుండి
తే.గీ॥ మానవులు మరియాదతో మంచిరీతి
ఐక్యమయ్యెదరు నిటుల అవని విడిచి
వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప.

ప్రతిపదార్థం :

మా + అప్ప వినుడి = మా నాయనలారా!(సంబోధన)
వినుడి = వినండి
విహితుడు + అప్ప = నాయనా! మీ హితమును కోరేవాడు
సిద్దప్ప = ఈ సిద్ధప్ప
కనకము + అప్ప = బంగారం వంటిది
కవికుప్ప = కవిత్వపు రాశిని (సిద్ధప్ప రాసిన కవిత్వాన్ని)
కనుడి కరమొప్ప = జాగ్రత్తగా గమనించండి
కుమ్మరి + అతడు = కుండలు చేసే వారు
చేయు కుండలున్ + అవి = చేసే కుండలలో
కొన్ని సానముమీద = కొన్ని కుండలు చేసే సారె (సానె) మీద
కొన్ని = కొన్ని
చేయుచుండగన్ = = తయారు చేస్తుండగానే
చేతిలోన పోవు = చేతిలోనే
కొన్ని చాటునబోవు = కొన్ని తెలియకుండా పగిలి పోతాయి
కాలిన + ఆవము = కాల్చే ఆవము (బట్టి) లో
కొన్ని కూలిపోవు = కొన్ని పగిలి పోతాయి
కొన్ని క్షేమము బొంది = కొన్ని మంచిగా తయారై
కొన్నాళ్లకు బోవు = కొన్ని రోజులు ఉండి
కొన్ని భిన్నములయ్యి = కొన్ని పగిలిపోయి
కొంతబోవు = కొన్ని పగిలిపోతాయి
కొన్ని యుర్విలొ బోవు = కొన్ని నేలపై పడి పగిలి పోవును
కొన్ని వనమున బోవు = కొన్ని నీటిలో పగిలి పోతాయి
కొరివి నుండి = తల కొరివి పెట్టినప్పుడు
కొన్ని మృతికి బోవు = కొన్ని పగిలిపోతాయి.
మానవులు = మనుషులు
మరియాదతో = మర్యాదపూర్వకంగా
మంచిరీతి = మంచి రీతితో
ఇటల = ఈ విధంగా
అవని = భూమిని
విడిచి = వదిలిపెట్టి
ఐక్యమయ్యెదరు = కలిసిపోతారు (మోక్షం పొందుతారు)

తాత్పర్యం: నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్ధప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండి. కుమ్మరి చేసే కుండల్లో కొన్ని చేస్తున్నప్పుడే పాడైపోతాయి. కొన్ని సారెమీద పాడవుతాయి. కొన్ని తెలియకుండానే పగిలిపోతాయి. కొన్ని ఆవములో పెట్టి కాల్చినప్పుడు పగిలిపోతాయి. కొన్ని మాత్రం క్షేమంగా తయారై కొన్ని రోజులు ఉపయోగపడిన తరువాత పగిలిపోతాయి. కొన్ని భూమిపై పడిముక్కలై పోతాయి. నీటిలో పడి కొన్ని పోతాయి. అంత్యక్రియలలో కొన్ని పగిలిపోతాయి. అలాగే మానవులు కూడా మర్యాదతో ప్రవర్తిస్తేనే ఈ భూమిని వదిలి మోక్షాన్ని పొందుతారు. (మంచి పనుల ద్వారా జీవితాన్ని సార్థకం చేసుకోవాలని భావం).

TS Inter 2nd Year Telugu Study Material Poem 3 జ్ఞానబోధ

2వ పద్యం :

సీ|| కోపంబుచే నరుల్ క్రూరాత్ములగుదురు
కోపంబు మనుషుల కొంప ముంచు
కోపంబు వలననె పాపంబులును హెచ్చు
కోపంబు ననె నిందగూడవచ్చు
కోపంబు తనచావు కొంచెంబు నెరగదు
కోపంబు మిత్రులన్ కొంచపరచు
కోపంబు హెచ్చినన్ శాపంబులున్ వచ్చు
కోపంబు జూడగాకొరివియగును.
తే.గీ॥ కోపము నరుని సాంతము కూల్చునిలను
లేదు వెదికిన యిటువంటి చేదుఫలము
వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప

ప్రతిపదార్థం :

మా + అప్ప వినుడి = మా నాయనలారా! (సంబోధన)
వినుడి = వినండి
విహితుడు + అప్ప = నాయనా! మీ హితమును కోరేవాడు
సిద్దప్ప = ఈ సిద్ధప్ప
కనకము + అప్ప = బంగారం వంటిది
కవికుప్ప = కవిత్వపు రాశిని (సిద్ధప్ప రాసిన కవిత్వాన్ని)
కనుడి కరమొప్ప = జాగ్రత్తగా గమనించండి
కోపంబుచే = కోపంతో
నరుల్ = మానవుల
క్రూర + ఆత్ములగుదురు = మానవత్వ౦ లేని వారుగా మారుతారు
కోపంబు = కోపమే
మనుషుల = మానవుల
కొంప ముంచు(జాతీయం) = కొంపలు ముంచుతుంది, నష్టపరుస్తుంది
కోపంబు వలననె = కోపం వల్ల
పాపంబులును హెచ్చు = పాపాలు పెరుగుతాయి
కోపంబుననే = కోపంతోనే
నింద గూడవచ్చు = నిందలు కూడా వస్తాయి
కోపంబు = కోపం
తన చావున్ = తన చావును
కొంచెంబున్ + ఎరుగదు = కొంచెం కూడా ఎరుగదు
కోపంబు = కోపం
మిత్రులన్ = స్నేహితులను
కొంపరచు = తగ్గిస్తుంది (అవమాన పరుస్తుంది)
కోపంబు హెచ్చినన్ = కోపం పెరిగితే
శాపంబులున్ వచ్చు = శాపాలు వస్తాయి
కోపంబు జూడగా = చూస్తుండగానే కోపం
కొరివియగును = పెద్ద ఆపదగా మారుతుంది
కోపము = కోపం
నరుని = మానవులను
సాంతము కూల్చున్ = పూర్తిగా నాశనం చేస్తుంది
ఇలను = భూమిపై
లేదు వెదికిన = వెతికినా దొరకదు
యిటువంటి = దీనివంటి
చేదుఫలము (జాతీయం) – చేదుగా ఉండే ఫలం, చెడు చేసేది

తాత్పర్యం : నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్ధప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండి. కోపంతో మానవులు మానవత్వాన్ని కోల్పోతారు. కోపం మానవులను నష్టపరుస్తుంది. కోపం వల్ల పాపం పెరుగుతుంది. కోపం వల్ల నిందలు వస్తాయి. కోపం ఎలా పోతుందో ఎవరికీ తెలియదు. కోపం స్నేహితులను తగ్గిస్తుంది. (అవమానపరుస్తుంది.) కోపంతో శాపాలు వస్తాయి. చూస్తుండగానే కొరివిగా మారి మానవులను పూర్తిగా నాశనం చేస్తుంది. (కాబట్టి కోపానికి దూరం ఉండాలని భావం.)

3వ పద్యం :

సీ||
విత్తంబు గలవారి కిత్తురే కుర్చీలు
పేదవారికియరు పీటచెక్క
కాలంబు నొకరీతి గడవ దెల్లప్పుడు
యేనుగు దోమచే యెత్తబడద
నేనే బలియుడని నిక్కుచునుంటేమి
చలిచీమలు ఫణుల జంపలేద
నిడివి పొడవు దొడ్డు నెట్టగ నుంటేమి
గొడ్డలిచే మాను కోలుపోద
తే.గీ॥ బుద్ధిమంతులు పుణ్యంపు పురుషులైన
వారు పదిమందిలో ప్రజ్ఞ బలుకబోరు
వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప

ప్రతిపదార్థం:

మా + అప్ప = మా నాయనలారా! (సంబోధన)
వినుడి = వినండి
విహితుడు + అప్ప = నాయనా! మీ హితమును కోరేవాడు
సిద్దప్ప = ఈ సిద్దప
కనకము + అప్ప = బంగారం వంటిది
కవికుప్ప = కవిత్వపు రాశిని (సిద్దప్ప రాసిన కవిత్వమును)
కనుడి కరమొప్ప = జాగ్రత్తగా గమనించండి
విత్తంబు గలవారికి = డబ్బు ఉన్న వారికి
ఇత్తురే కుర్చీలు = కుర్చీలను ఇస్తారు
పేదవారికి = డబ్బు లేని పేదవారికి
పీటచెక్క = చెక్క పీట కూడా ఇవ్వరు
ఇయర = ఇవ్వరు
కాలంబున్ = సమయమంతా
ఒకరీతి = ఒకే విధంగా
గడవదు + ఎల్లప్పుడు = ఎప్పటికి నడవదు
యేనుగు = ఏనుగు
దోమచే = దోమతో
యెత్తబడద = ఎత్త బడుతుంది
నేనే బలియుడన్ + అని = నేనే బలవంతుణ్ణి అని
నిక్కుచునుంటే + ఏమి = గర్వాన్ని ప్రదర్శిస్తే ఏం లాభం
చలిచీమలు = చిన్న చీమలు కూడా
ఫణుల = పాములను
జంపలేద = చంపాయి కదా
నిడివి పొడవు = ఎత్తు, పొడువు
దొడ్దున్ = లావు
ఎఱ్ఱగన్ = మంచి రంగు
ఉంటేమి = ఉన్నా కాని
గొడ్డలిచే = గొడ్డలితో
మాను = చెట్టు
కోలుపోద = ప్రాణం పోతుంది కదా
బుద్ధిమంతులు = తెలివి గలవారు
పుణ్యంపు = పుణ్యం సంపాదించుకున్న
పురుషులు +అయినవారు = మానవులు
పదిమందిలో = అందరి ఎదురుగా
ప్రజ్ఞ = తమ తెలివిని
బలకబోర = చెప్పుకోరు

తాత్పర్యం : నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్ధప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండి. డబ్బు ఉన్నవారికి కుర్చీలు ఇస్తారు కాని పేదవాడు కూర్చోవడానికి కనీసం చెక్క పీటను కూడా ఇవ్వరు. సమయం ఎప్పటికీ ఒకే విధంగా గడవదు. ఒక్కోసారి దోమ కూడా ఏనుగును ఎత్తుతుంది. నేనే బలవంతుణ్ణి అని గర్వించడం సరికాదు. చిన్న చలిచీమలు కూడా పామును చంపడం సాధ్యమే కదా. ఎత్తుగా, పొడువుగా, లావుగా, ఎర్రగా ఉన్నప్పటికీ గొడ్డలి దెబ్బకు చెట్టు కూలుతుంది కదా. కాబట్టి తెలివిగలవారు, పుణ్యం సంపాదించుకున్నవారు తమ ప్రజ్ఞను గురించి ఎదుటివారి ముందు చెప్పుకోరు.

4వ పద్యం :

సీ|| నమ్మరాది ఘటము నవరంధ్రముల కొంప
బతుకమ్మవలె నీళ్ళబడును యెపుడొ
యుర్విలో నున్నాళ్ళు ఉయ్యాలలును బాడి
పొయ్యెద రొకరోజు శయ్యమీద
తల్లి యెవ్వరు తండ్రి తన బాంధవులెవరు
మళ్ళి జూడక నరుల్ మరుతురయ్య
వెళ్ళిపోయెడినాడు వెంట రాదొక కాసు
కల్ల సంసారంబు గానలేక
తే.గీ॥ పప్పు దినబోయి చిక్కాన బడిన యెలుక
విధము నర్ధంబు చేకూర్చు వివిధ గతుల
వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప

ప్రతిపదార్థం :

మా + అప్ప = మా నాయనలారా ! (సంబోధన)
వినుడి = వినండి
వివాహితుడు + అప్ప = నాయనా! మీ హితమును కోరేవాడు
సిద్ధప్ప = ఈ సిద్ధప్ప
విహితుడు + అప్ప = బంగారం వంటి
కవికుప్ప = కవిత్వపు రాశిని (సిద్ధప్ప రాసిన కవిత్వాన్ని)
కనుడి కరమొప్ప = జాగ్రత్తగా గమనించండి
నమ్మరాదు + ఈ ఘటము = కుండ వంటి ఈ శరీరాన్ని నమ్మరాదు
నవరంధ్రముల కొంప = తొమ్మిది రంధ్రాలతో ఉన్న ఇల్లు
బతుకమ్మవలె = బతుకమ్మ లాగ
యెపుడొ = ఎప్పుడైనా
నీళ్ళబడును = నీటిలో పడుతుంది
యుర్విలోన్ + ఉన్నాళ్ళు = భూమిపై జీవించినంతకాలం
ఉయ్యాలలును బాడి = ఊయల పాటలు పాడి
శయ్యమీద = మరణ శయ్యపై, పాడెపై
పొయ్యెదరు + ఒకరోజు = ఒకరోజు వెళ్లిపోతారు
తల్లి = కన్నతల్లి
తండ్రి = కన్న తండ్రి
యెవ్వరు = ఎవరు కూడా
తన బాంధవులెవరు = బంధువులు, చుట్టాలు ఎవరూ
మళ్ళి జూడక = తిరిగి చూడరు
నరుల్ = మనుషులు
మారుతురయ్య = మర్చిపోతారు
వెళ్ళిపోయెడినాడు = కాటికి వెళ్ళే రోజు
ఒక్క కాసు = ఒక్క కాసు కూడా
వెంట రాదు = తన వెంబడి రాదు
కల్ల సంసారంబు = సంసారం అంతా అబద్ధమని
గానలేక = తెలియక
పప్పు దినబోయి = పప్పును తినడానికి వెళ్లి
చిక్కాన బడిన = బోనులో చిక్కిన
యెలుక విధమున్ = ఎలుక లాగ
వివిధ గతుల = అనేక రకాలుగా
అర్ధంబు చేకూర్చు = (ఈ శరీరం) డబ్బును సంపాదిస్తుంది.

తాత్పర్యం : నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్ధప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండి. కుండవంటి ఈ శరీరాన్ని నమ్మరాదు. తొమ్మిది రంధ్రాలున్న ఇల్లు ఇది. బతుకమ్మలాగా ఎప్పుడైనా నీటిలో ప్రవేశించవచ్చు. కాని భూమిపై ఉన్నంతకాలం ఊయల పాటలు పాడి ఏదో ఒకరోజు మరణశయ్యపై వెళ్ళిపోతుంది. చనిపోయిన తరువాత తల్లి, తండ్రి, బంధువులు ఎవరూ తిరిగి చూడరు. మరిచిపోతారు. కాటికి వెళ్ళేటపుడు ఒక్క కాసు కూడా వెంటరాదు. సంసారం అంతా అబద్ధం అని తెలియక పప్పు తినడానికి వెళ్ళిన ఎలుక లాగ అనేక రకాలుగా డబ్బును సంపాదిస్తుంది.

TS Inter 2nd Year Telugu Study Material Poem 3 జ్ఞానబోధ

5వ పద్యం :

ఎత్తుమేడలు యిండ్లు యిరువైన సంపదల్
నిత్యమని జనులు నిహమునందు
మమకార మొదలక మదిలొ సద్గురువుని
గనలేక సంసార కాంక్ష విడక
కూటిగుడ్డకు మర్గి కులము నెక్కువ యంచు
యెత్తు పై గూర్చుండు హెచ్చునరులు
భక్తి హీనతగాను పావన భవులయ్యి
మీనంబు గాలమున్ మ్రింగు విధము
తే.గీ॥ మానవులు మాయసంసార మగ్నులగుచు
చిక్కెదరెముని చేతిలో చింతపడుచు
వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప

ప్రతిపదార్థం :

మా + అప్ప = మా నాయనలారా ! (సంబోధన)
వినుడి = వినండి
విహితుడు + అప్ప = నాయనా! మీ హితమును కోరేవాడు
సిద్ధప్ప = ఈ సిద్ధప్ప
కనకము + అప్ప = బంగారం వంటిది
కవికుప్ప = కవిత్వపు రాశిని (సిద్ధప్ప రాసిన కవిత్వాన్ని)
కనుడి కరమొప్ప = జాగ్రత్తగా గమనించండి
ఎత్తుమేడలు = ఎత్తైన భవనాలు
యిండ్లు = ఇళ్ళు
యిరువైన సంపదల్ = స్థిరాస్తులు
నిత్యమని = శాశ్వతమని
జనులున్ = ప్రజలు
ఇహమునందు = భూమిపై
మమకారము + ఒదలక = ఇష్టాన్ని వదులుకోలేక
మదిలొ = మనసులో
సద్గురువుని = మంచి గురువును
గనక = చూడక, దర్శించక
సంసార కాంక్ష = సంసారంపై గల కోరిక
విడక = వదలక
కూటిగుడ్డకు = తిండికి, బట్టలకు
మర్గి (మరిగి) = అలవాటు పడి
కులము నెక్కువ యంచు = మా కులమే గొప్పది అని
హెచ్చునరులు = గర్వంతో ఉన్న నరులు
యెత్తు పై గూర్చుండు = ఎత్తులపై కూర్చొంటారు
భక్తి హీనతగాను = భక్తి లేని కారణంగా
పావన భవులయ్యి = మంచి జన్మ ఎత్తి కూడా
మీనంబు = చేప
గాలమున్ = గాలాన్ని
మ్రింగు విధము = మింగిన తీరుగా
మానవులు = మనుషులు
మాయసంసార = సంసారమనే మాయలో
మగ్నులగుచు = మునిగి
యముని చేతిలో = యమధర్మరాజు చేతికి
చింతపడుచు = బాధపడుతూ
చిక్కెదరు = చిక్కుకుంటారు

తాత్పర్యం : నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్ధప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండి. ఎత్తైన భవనాలు, ఇళ్ళు, స్థిరమైన ఆస్థులు శాశ్వతమని భావించి ప్రజలు ఈ భూమిపై ఇష్టాన్ని వదులుకోలేక, మనసులోనైన మంచి గురువును దర్శించక, సంసారంపై గల కోరికను వదిలిపెట్టక, తిండి బట్టలకు అలవాటుపడి మా కులమే గొప్పది అనుకుంటూ, ఎత్తైన ఆసనాలపై కూర్చుంటారు. భక్తి లేని కారణంగా ఉన్నతమైన మానవ జన్మ ఎత్తి కూడా చేప గాలాన్ని మింగినట్లు మనుషులు సంసారమనే మాయలో పడి యమధర్మరాజు చేతికి చిక్కి బాధపడతారు.

6వ పద్యం :

సీ|| వేమన్న మా తాత వేదవేద్యులు మాకు
సుమతి మా పెదతల్లి సురవినోది
వీరబ్రహ్మముగారు వినుడి నా జనకుండు
నింపుగా మాయక్క ఈశ్వరమ్మ
ననువుగా సిధ్ధప్ప నన్న గావలె నాకు
కడగొట్టు మాయన్న కాళిదాసు
అమరసింహుడు మాకు నాత్మబంధువులౌను
యాగంటివారు మాయన్న గారు
తే.గీ॥ ఆత్మబంధువులండి మా కంత వీరు
చచ్చిన బ్రతికియున్నారు జగతి యందు
వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప

ప్రతిపదార్థం :

మా + అప్ప = మా నాయనలారా ! (సంబోధన)
వినుడి = వినండి
విహితుడు + అప్ప = నాయనా! మీ హితమును కోరేవాడు
సిద్దప్ప = ఈ సిద్దప్ప
కనకము + అప్ప = బంగారం వంటిది.
కవికుప్ప = కవిత్వపు రాశిని (సిద్ధప్ప రాసిన కవిత్వాన్ని)
కనుడి కరమొప్ప = జాగ్రత్తగా గమనించండి
వేదవేద్యులు = వేదాలు తెలిసిన
వేమన్న = వేమన శతకకర్త
మా తాత = మాకు తాత వంటి వాడు
సురవినోది = సురలకు వినోదాన్ని కలిగించే వాడు
సుమతి = సుమతి శతకకర్త బద్దెన
మా పెదతల్లి = మా పెద్ద అమ్మ వంటి వాడు
వీరబ్రహ్మముగారు = కాలజ్ఞానం చెప్పిన బ్రహ్మం గారు
వినుడి = వినండి
నా జనకుండును = నాకు తండ్రి వంటి వారు
ఇంపుగా = ఇష్టంతో
మా + అక్క = అక్కలాంటిది
ఈశ్వరమ్మ = ఈశ్వరమ్మ
అనువుగా = అనుకూలంగా
సిద్ధప్ప = బ్రహ్మం గారి శిష్యుడు సిద్ధప్ప
అన్న గావలె నాకు = అన్న లాంటి వాడు
కడగొట్టు = చిన్న
మా + అన్న = అన్న
కాళిదాసు = సంస్కృత కవి కాళిదాసు
అమరసింహుడు = అమర కోశం రాసిన
మాకున్ = అమర సింహుడు మాకు
ఆత్మ బంధువులౌను = ఆత్మ బంధువుల వంటి వారు
యాగంటివారు = యాగంటి అనే గొప్ప వారు
మా + అన్న గారు = అన్న వంటి వారు
మాకు అంత = వీరందరూ మాకు
ఆత్మబంధువులండి = ఆత్మ బంధువులు
వీరు = పైన చెప్పిన వారందరూ
చచ్చిన = చనిపోయి కూడా
జగతి యందు = ఈ భూమిపై
బ్రతికియున్నారు = (ప్రజల హృదయాలలో) జీవించే ఉన్నారు.

తాత్పర్యం : నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్ధప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండి. వేదాలు తెలిసిన వేమన మా తాతలాంటి వాడు. సురలను ఆనందింప చేసే సుమతి శతక కర్త బద్దెన మా పెద్దమ్మ వంటి వాడు. కాలజ్ఞానాన్ని రాసిన పోతులూరి వీరబ్రహ్మం గారు తండ్రి లాంటి వారు. బ్రహ్మం గారి మనుమరాలు ఈశ్వరమ్మ అక్క లాంటిది. బ్రహ్మంగారి శిష్యుడు సిద్ధప్ప అన్న వంటి వాడు. సంస్కృత కవి కాళిదాసు మా చిన్నన్న. అమర కోశం రాసిన అమరసింహుడు, యాగంటి ఆత్మ బంధువుల వంటి వారు. వీరంతా చనిపోయికూడా జనాల హృదయాలలో బతికే ఉన్నారు. (వీరందరూ వరకవి సిద్ధప్పకు ఆదర్శప్రాయులని అర్థం)

7వ పద్యం :

సీ|| జిహ్వయే మాతండ్రి జీవేశ్వరుడు మాకు
కాళ్ళు మా కల్లుండ్రు గానవినుడి
హస్తంబులును రెండు నాత్మబంధువులైరి
కడుపు నా పెదతండ్రి, కొడుకు నరయ
నయనంబులును రెండు నా మాతృ ననుజులు
చెవులు సోదరులును శ్రవణపరులు
ముక్కు నా ప్రియురాలు ముఖము నా మేనత్త
నడుము నా పెదమామ నడిపికొడుకు
తే.గీ॥ పండ్లు మా యింటి చుట్టాలు భక్తవరులు
నాలుకయు మాకు నిలవేల్పు నాదిశక్తి
వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప

ప్రతిపదార్థం:

మా + అప్ప = మానాయనలారా! (సంబోధన)
వినుడి = వినండి
విహితుడు + అప్ప = నాయనా! మీ హితమును కోరేవా
సిద్ధప్ప = ఈ సిద్ధప్ప
కనకము + అప్ప = బంగారం వంటిది
కవికుప్ప = కవిత్వపు రాశిని (సిద్ధప్ప రాసిన కవిత్వాన్ని)
కనుడి కరమొప్ప = జాగ్రత్తగా గమనించండి
జిహ్వయే = నాలుకయే
మాతండ్రి = మా తండ్రి లాంటి
జీవేశ్వరుడు = జీవానికి ఆధారం అయిన దైవం
మాకు కాళ్ళు = మా కాళ్ళు
మాకు + అల్లుండ్రు = అల్లుళ్ల వంటివి
గానవినుడి = కావున వినండి
హస్తంబులును రెండు = రెండు చేతులు
ఆత్మ బంధువులైరి = ఆత్మ బంధువుల వంటివి
కడుపు = కడుపు
నా పెదతండ్రి కొడుకు = పెద నాన్న కొడుకు
అరయ = చూడగా
నయనంబులును రెండు = రెండు కళ్ళు
నా మాతృ అనుజులు = నా కన్నా తల్లి అన్నతమ్ములు (మేన -మామలు)
శ్రవణ పరులు చెవులు = వినడానికి ఉపయోగపడే చెవులేమో
సోదరులును = అన్నదమ్ములు
ముక్కు నా ప్రియురాలు = ముక్కు ప్రియురాలు
ముఖము నా మేనత్త = ముఖం మేనత్త (తండ్రి సోదరి)
నడుము = నడుమేమో
నా పెదమామ = పెద్దమామ నడిమి
నడిపికొడుకు = కొడుకు
పండ్లు మా యింటి చుట్టాలు = పండ్లేమో చుట్టాలు
భక్తవరులు = భక్తులు
నాలుకయు మాకున్ = నాకున్న నాలుక
ఇలవేల్పు = ఇంటి దేవత
ఆదిశక్తి = ఆదిశక్తి

తాత్పర్యం : నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్ధప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండి. నాలుక నాకు తండ్రి పరమాత్మ వంటిది. కళ్ళు అల్లుళ్ల వంటివి, రెండు చేతులు ఆత్మ బంధువుల వంటివి. కడుపు పెద్ద నాన్న కొడుకు, చూసే రెండు కళ్ళు మేనమామలు, వినే రెండు చెవులు అన్నదమ్ములు, ముక్కు ప్రియురాలు, ముఖం మేనత్త, దంతాలు చుట్టాలు, భక్తులు. నాలుక ఆదిపరాశక్తి అయిన మా ఇంటి దేవత. (జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మానవ జీవనానికి అత్యంత ప్రధానమైనవి వాటిని పవిత్రంగా, జాగ్రత్తగా చూసుకోవాలి అని భావం)

TS Inter 2nd Year Telugu Study Material Poem 3 జ్ఞానబోధ

8వ పద్యం :

సీ|| చేదు ఆన్గపుకాయ చేతిలో చేకొని
గంగ స్నానము చేసి గనుడిచేదు
పోదు తీపికిరాదు బుర్రకాయ విధము
మునిగి తేలిన పోదు మూర్ఖతనము
నదులెల్ల దిరిగియు నేమముల్ బట్టినా
పదవి జేరుట యెట్లు పాపినరుడు
వెదురు బద్దలు కుక్క వాలంబునకు వేసి
గుంజికట్టిన దాని గుణముబోదు
తే.గీ॥ జ్ఞానహీనుల కెప్పుడు గ్రంథ మెచ్చి
జ్ఞానులను జేయువాడెపో జ్ఞానుడతడు
వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప

ప్రతిపదార్థం :

మా + అప్ప = మానాయనలారా! (సంబోధన)
మా + అప్ప = మా నాయనలారా! (సంబోధన)
వినుడి = వినండి
విహితుడు + అప్ప = నాయనా! మీ హితమును కోరేవాడు
సిద్ధప్ప = ఈ సిద్ధప్ప
కనకము + అప్ప = బంగారం వంటిది
కవికుప్ప = కవిత్వపు రాశిని (సిద్ధప్ప రాసిన కవిత్వాన్ని)
కనుడి కరమొప్ప = జాగ్రత్తగా గమనించండి.
చేదు ఆన్గపుకాయ = చేదుగా ఉన్న ఆనగపుకాయ (సొరకాయ)
చేదుపోదు = ఉన్న చెడు పోదు
తీపికిరాదు = లేని తీపి రాదు
బుర్రకాయ విధము = ఆ సొరకాయ లాగ
మునిగి తేలిన = (గంగలో) మునిగి తేలితే
మూర్ఖతనము పోదు = మూర్కత్వం పోదు
నదులెల్ల = అన్ని నదుల దగ్గరికి
దిరిగియు = వెళ్ళినా.
నేమముల్ బట్టినా = నియమాలు (వ్రతాలు) పట్టినా
పాపినరుడు = పాపం గల మానవుడు
పదవి జేరుట యెట్లు = మోక్ష పదవిని ఎలా చేరగలడు
వెదురు బద్దలు = వెదురు కర్రలతో
కుక్క, వాలంబునకు = కుక్క తోకకు
వేసి గుంజికట్టిన = గట్టిగా లాగి కట్టినా
దాని గుణముబోదు = దాని (వంకర) గుణం పోదు
జ్ఞానహీనులకు = జ్ఞానం లేని వారికి
ఎప్పుడు = ఎప్పుడైనా
గ్రంథ మిచ్చి = పుస్తకాన్ని ఇచ్చి
జ్ఞానులను = జ్ఞానవంతులుగా చేసేవాడే
చేయువాడెపో = చేసేవాడు
జ్ఞానుడతడు = నిజమైన జ్ఞానవంతుడు

తాత్పర్యం : నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్ధప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండి. చేదుగా ఉన్న ఆనగపు కాయను చేతిలో పట్టుకొని గంగానదిలో స్నానం చేసి దాని రుచిచూస్తే అంతకు ముందు ఉన్న చేదు రుచి పోదు. లేని తీపి రుచి రాదు. ఆ సొరకాయలాగా మానవులు కూడా గంగలో మునిగి తేలితే వారి మూర్ఖత్వం పోదు. ఎన్ని నదుల దగ్గరికి వెళ్ళినా, ఎన్ని వ్రతాలు పట్టినా పాపాత్ములు మోక్ష పదవిని అలంకరించలేరు. వంకరగా ఉన్న కుక్క తోకకు వెదురు కర్రలు ఎంత లాగి కట్టినా దాని వంకర గుణం పోదు. జ్ఞానం లేని వానికి ఒక పుస్తకం ఇచ్చి జ్ఞానవంతునిగా చేయగలవాడే నిజమైన జ్ఞాన సంపన్నుడు.

9వ పద్యం :

సీ|| ప్రాణముల్ బిగబట్టి పైకి లేవగవచ్చు
ఘడియకో వేషంబు గట్టవచ్చు
అన్నహారములేక అడవి తిరగవచ్చు
తిన్నగా జపమాల ద్రిప్పవచ్చు
కప్పలా చెరువులొ గడగి తేలగవచ్చు
బలువుగా వెయినాళ్ళు బ్రతుకవచ్చు
వూరూరు తిరుగుచు ఉపమివ్వగావచ్చు
కపటవృత్తుల మనసు గరపవచ్చు
తే.గీ॥ ధరణిలో వేషముల్ చాల దాల్చవచ్చు
గురుని మదిలోన నిల్పుట గుర్తువచ్చు
వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప

ప్రతిపదార్థం :

మా + అప్ప = మా నాయనలారా! (సంబోధన)
వినుడి = వినండి
విహితుడు + అప్ప = నాయనా! మీ హితమును కోరేవాడు
సిద్ధప్ప = ఈ సిద్ధప్ప
కనకము + అప్ప = బంగారం వంటిది.
కవికుప్ప = కవిత్వపు రాశిని (సిద్ధప్ప రాసిన కవిత్వాన్ని)
కనుడి కరమొప్ప = జాగ్రత్తగా గమనించండి
ప్రాణముల్ = ప్రాణాలు (ఊపిరి)
బిగబట్టి = ఆపి
పైకి లేవగవచ్చు = పైకి లేవవచ్చు
ఘడియకో = సమయాన్ని సూచించే పదం
వేషంబు = వేషాలు
కట్టవచ్చు = వేయవచ్చు
అన్న హారములేక = అన్నము ఆహారము లేకుండా
అడవి తిరగవచ్చు = అడవిలో తిరగవచ్చు
తిన్నగా = సరిగ్గా
జపమాల = జపమాలను
ద్రిప్పవచ్చు = తిప్పవచ్చు
కప్పలా = కప్పలాగ
చెరువులో = చెరువులో
కడగి = ప్రయత్న పూర్వకంగా
తేలగవచ్చు = నీళ్ళలో తేలవచ్చు
బలువుగా = బలంగా
వెయినాళ్ళు = వెయ్యి సంవత్సరాలు
బ్రతుకవచ్చు = బతికి ఉండవచ్చు
వూరూరు తిరుగుచు = ప్రతీ గ్రామం తిరిగి
ఉపమివ్వగావచ్చు = ఉపన్యాసం ఇవ్వవచ్చు
కపటవృత్తుల మనసు = మోసపూరిత మనస్సు కలిగిన వారిని
గరపవచ్చు = మార్చవచ్చు
ధరణిలో = భూమిపై
వేషముల్ చాల దాల్చవచ్చు = ఎన్నో వేషాలు వేయవచ్చు
గురుని = గురువు
మదిలోన = మనస్సులో
నిల్పుటన్ = నిలిపితే
గుర్తు = పేరు, ప్రతిష్ఠ
వచ్చు = వస్తుంది.

తాత్పర్యం: నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్దప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండి. ఊపిరిని బిగపట్టి శరీరం పైకి లేచేలా చేయవచ్చు. ప్రతీ గడియకు ఒక వేషం వేయవచ్చు. అన్న పానాలు లేకుండా అడవిలో తిరగవచ్చు. జపమాలను సరిగ్గా తిప్పవచ్చు. నీళ్ళలో కప్పలాగా ప్రయత్నం చేసి పైకి తేలవచ్చు. బలంగా వెయ్యి సంవత్సరాలు బతక వచ్చు. ప్రతీగ్రామం తిరిగి ఉపన్యాసాలు ఇవ్వవచ్చు. మోసపూరితమైన వారి మనస్సును మార్చవచ్చు. భూమిపై ఎన్నో వేషాలు వేయవచ్చు. గురువును మనస్సులో నిలిపితే పైన చెప్పిన అసాధ్యమైన పనులు చేసి ప్రతిష్ఠ పొందవచ్చు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 3 జ్ఞానబోధ

10వ పద్యం :

సీ||
ఎవరు తనాత్మను యేకంబుగా జేసి
సర్వభూతాలని సమము జూచి
జ్ఞాన వైరాగ్య యజ్ఞము దానతపములన్
చేయుచుండిన ముక్తి చెందగలరు
తామరాకులు నీళ్ళ దడువకుండిన యట్లు
నుందురు సుజ్ఞానులుర్విలోన
నలసియుందురు చూడకళలేని విధముగ
గానవత్తురుధవ కాంతిబొందు
తే.గీ॥ నొకరి దూషించి భూషింపరొకరి నెపుడు
సుఖము దుఃఖమొక పదము జూతురయ్య
వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప

ప్రతిపదార్థం :

మా + అప్ప వినుడి = మా నాయనలారా! (సంబోధన)
వినుడి = వినండి
విహితుడు + అప్ప = నాయనా! మీ హితమును కోరేవాడు
సిద్దప్ప = ఈ సిద్ధప్ప
కనకము + అప్ప = బంగారం వంటిది
కవికుప్ప = కవిత్వపు రాశిని (సిద్ధప్ప రాసిన కవిత్వాన్ని)
కనుడి కరమొప్ప = జాగ్రత్తగా గమనించండి
ఎవరు = ఎవరైతే
తన + ఆత్మను = తన ఆత్మను
యేకంబుగా జేసి = పరమాత్మతో సమానంగా చేసి
సర్వభూతాలని = అన్ని జీవులను
సమము జూచి = సమానంగా చూసి
జ్ఞాన వైరాగ్య యజ్ఞము = జ్ఞానము, వైరాగ్యము అనే యజ్ఞం
దాన, తపములన్ = దానాలు తపస్సులు
చేయుచుండిన = చేస్తే
ముక్తి చెందగలరు = మోక్షాన్ని పొందుతారు
తామరాకులు = తామర ఆకులు
నీళ్ళ = నీటిలో
తడువకుండిన యట్లు = తడవకుండా ఉన్నట్లు
ఉందురు = ఉంటారు
సుజ్ఞానులు + ఉర్విలోన = భూమిపై జ్ఞానం ఉన్నవారు
అలసి యుందురు = అలసిపోయి ఉంటారు.
చూడ = చూస్తే
కళలేని విధముగ = మొఖంలో కళ లేకుండా
గానవత్తురు = కనిపిస్తారు
అధవ = తరువాత
కాంతిబొందు = కాంతి వస్తుంది
నొకరి దూషించి = ఒకరిని తిట్టి
భూషింపరు + ఒకరిని = మరొకరిని మెచ్చుకోరు
ఎపుడు = ఎల్లప్పుడు
సుఖము = సుఖాన్ని
దుఃఖము = దుఃఖాన్ని
ఒక పదము = ఒకే విధంగా
చూతురయ్య = చూస్తారు

తాత్పర్యం : నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్ధప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండి. ఎవరైతే తన ఆత్మను పరమాత్మతో సమానంగా భావించి, అన్ని జీవులను సమానంగా చూసి జ్ఞాన వైరాగ్యాలనే యజ్ఞాన్ని, దానాలను, తపస్సులను చేస్తే మోక్షాన్ని పొందుతారు. తామరాకులు నీటిలో ఉండి కూడా తడవకుండా ఉన్నట్లుగానే భూమిపై జీవిస్తున్న జ్ఞానులు కూడా అలసిపోయినట్లు, కళా విహీనంగా కనిపిస్తారు. కాని తరువాత వారి ముఖంలో కళ వస్తుంది. వారు ఒకరిని తిట్టి, మరొకరిని మెచ్చుకోరు. వారు ఎల్లప్పుడూ సుఖాన్ని దుఃఖాన్ని ఒకే విధంగా చూస్తారు.

జ్ఞానబోధ Summary in Telugu

(సిద్దప్ప వరకవి ‘జ్ఞానబోధిని’ గ్రంథ౦ నుండి)

TS Inter 2nd Year Telugu Study Material Poem 3 జ్ఞానబోధ 1

* కవి పరిచయం *

పాఠ్యాంశం పేరు : జ్ఞానబోధ
కవి పేరు : “వరకవి సిద్ధప్ప
ఇది దేని నుండి గ్రహించబడినది : ఈ పాఠ్యభాగము సిద్దప్ప వరకవి ‘జ్ఞానబోధిని’ గ్రంథములో నుండి గ్రహింపబడినది
కాలం :  జననం: జూలై 9, 1903 – మరణం: మార్చి 23, 1984
స్వస్థలం : సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డిపల్లి
తల్లిదండ్రులు : లక్ష్మి, పెదరాజయ్య
చదువు : ఉర్దూ మీడియంలో 7వ తరగతి
ప్రావీణ్యం గల భాషలు : తెలుగు, హిందీ, ఉర్దూ, పార్శీ, ఇంగ్లీష్, సంస్కృతం
వృత్తి : ఉపాధ్యాయుడు
మకుటం : “వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప – కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప’
విశేషతలు : ‘గొప్పవాడను గాను కోవిదుడగాను తప్పులున్నను దిద్దుడి తండ్రులార’ అంటూ వినయంగా చెప్పుకున్నాడు.
నిరాడంబర జీవితాన్ని గడిపాడు. సాహిత్యంతోపాటు జ్యోతిష్యం, వాస్తు, ఆయుర్వేదం, యోగ విద్యల్లో ప్రావీణ్యం సాధించాడు.
సిద్దప్ప వరకవి రచనలు : సుమారు 40 గ్రంథాలు రచించాడు. సిద్దప్ప వరకవి జ్ఞానబోధిని (నాలుగు భాగాలు), వర్ణమాల కందార్థములు, కాలజ్ఞాన వర్థమాన కందార్థములు, యాదగిరి నరసింహస్వామి వర్ణమాల, విష్ణు భజనావళి, శివభజనావళి, నీతిమంతుడు, గోవ్యాఘ్ర సంభాషణ, కాకి హంసోపాఖ్యానం, అర్చకుల సుబోధిని, అశోక సామ్రాజ్యము యక్షగానము, జీవ నరేంద్ర నాటకము మొదలైనవి. ఈయనకు ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి సందర్భంగా గుండారెడ్డిపల్లెలో సమారాధనోత్సవం జరుగుతుంది. గోలుకొండ కవుల సంచికలో ఈయన పద్యాలు ప్రచురితమయ్యాయి.

పాఠ్యభాగ సందర్భం

సిద్ధప్పకు తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటకలలో భక్తులు, అభిమానులు ఉన్నారు. వారి మనసులను చూరగొన్నాడు. పండిత పామర జనులు సైతం అలవోకగా పాడుకునే విధంగా రచనలు చేసిన సిద్ధప్ప పద్యాల్ని రాశాడు. వారు రాసిన పద్యాలను నేటికి భజన మండళ్లలో పాడుతుంటారు. సిద్దప్ప వరకవి జ్ఞానబోధిని పేరుతో రాసిన పద్యాలు బహుళ ప్రచారం పొందాయి. సమాజంలోని మూఢాచారాలను నిరసిస్తూ ఆత్మజ్ఞానాన్ని ఎరుకచేస్తూ సిద్ధప్ప రాసిన సీస పద్యాలను పరిచయం చేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం.

TS Inter 1st Year History Study Material Chapter 7 దక్షిణ భారతదేశ రాజ్యాలు

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 7th Lesson దక్షిణ భారతదేశ రాజ్యాలు Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 7th Lesson దక్షిణ భారతదేశ రాజ్యాలు

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పృధ్వీరాజ్ రాసో గురించి రాయండి.
జవాబు.
రాజపుత్రుల పుట్టుక గురించి మరొక ఆసక్తికరమైన విషయాన్ని “పృధ్వీరాజ్ రాసో” అనే హింది కావ్యంలో చాంద్ బర్దాయ్ అనే కవి తెలియజేసాడు. ఇతడి ప్రకారం అబూ పర్వతం మీద వశిష్టుడు చేసిన హోమాగ్ని నుంచి ఉద్భవించిన వీరుడి సంతతి వారైనందువల్ల వీరు అగ్నికుల క్షత్రియులయ్యారని పేర్కొన్నాడు. ఈ యజ్ఞగుండం నుంచి నలుగురు వీరులు ఉద్భవించారని వారు ఒక్కొక్కరు ఒక్కొక్క రాజపుత్ర రాజ్యాన్ని స్థాపించారనే అభిప్రాయం కలదు. చౌహానులు, సోలంకీలు లేదా చాళుక్యులు, పరమారులు, ప్రతీహారులు ఈ వంశీయులని పేర్కొన్నాడు.

ప్రశ్న 2.
రాజతరంగిణి ప్రాధాన్యత.
జవాబు.
ప్రాచీన భారతదేశంలోని ముఖ్యమైన చారిత్రక రచన కల్హణుడు రచించిన ‘రాజ తరంగిణి’. ఇది క్రీ.శ. 1148 సం॥లో రచించబడినది. ఇది కాశ్మీర్ రాజుల చరిత్ర. కాశ్మీర్ వారు చరిత్రపట్ల అత్యంత ఆసక్తిని కనబరిచారని కల్హణుడు తెలియజేసినాడు. చరిత్రపట్ల ఆసక్తిని కలిగిన కల్హణుడు లభించిన ఆధారాలను ఉపయోగించి గొప్పగా రచించాడు.

ప్రశ్న 3.
భోజరాజు రచనలు ఏవి ?
జవాబు.
భోజరాజును “కవుల్లో రాజకుమారుడు” అంటారు. భోజరాజు కవితల మీద ‘సరస్వతీ కంఠాభరణం’, ‘శృంగార ప్రకాశ’ రాజనీతిపై ‘యుక్తికల్ప తరువు’, యోగ సూత్రాలపై ‘రాజమార్తాండ’ వ్యాఖ్యానం రచించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 7 దక్షిణ భారతదేశ రాజ్యాలు

ప్రశ్న 4.
అరబ్ దండయాత్రల ప్రభావం.
జవాబు.
ఇస్లాం మతాన్ని అరేబియా నుంచి తూర్పుదిశగా వ్యాప్తి చేయాలనేది అరబ్ల లక్ష్యం. దీనికై వారు అనేకసార్లు -దాడులు చేసారు. ఖలీఫా వాలిద్ అరేబియాను పాలిస్తున్న రోజులలో సింధ్ను ‘దాహిర్’ పరిపాలించేవాడు. సింధ్ రాజ్య సముద్ర దొంగలు. ఖలీఫా కోసం తీసుకెళుతున్న ఓడలను దోచుకున్నారు. దీనిపై దాహిర్ను వివరణ అడిగి సరైన సమాధానం లేదనే సాకుతో క్రీ.శ. 712లో మహ్మద్-బీన్-ఖాసిం నేతృత్వంలో దండెత్తాడు. ‘అలోర్’ వద్ద జరిగిన యుద్ధంలో దాహిర్ ఓడి ప్రాణాలు కోల్పోయాడు. భారతీయుల అనైక్యత అరబ్బుల దాడి విజయవంతం కావడానికి తోడ్పడింది. అయితే ఆచార్య లేనప్పూల్ అరబ్బుల సింధు ఆక్రమణను సత్ఫలితాలివ్వని ఘనవిజయంగా వర్ణించాడు.

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రెండో పులకేశి వ్యక్తిత్వాన్ని, విజయాలను వివరించండి.
జవాబు.
రెండో పులకేశి (క్రీ.శ. 609-642): రెండో పులకేశి బాదామి చాళుక్యుల్లోనే గాక ప్రసిద్ధ భారతీయ చక్రవర్తుల్లో ఒకడు. గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత దక్షిణాపథాన్ని పూర్తిగా జయించి ఏలిన మొదటి సార్వభౌముడు రెండో పులకేశి. ఇతని విజయాలను రవికీర్తి అనే జైన పండితుడు ‘ఐహోలు’ (ఐహోళి) శాసనంలో వివరించాడు. అధికారాన్ని . సుస్థిరం చేసుకున్న తర్వాత, రెండో పులకేశి దిగ్విజయ యాత్రలు సాగించాడు. ఇతడు బనవాసి, కొంకణ రాజ్యాలను జయించాడు. లాట, మాళవ, అళుప (ఉడిపి మండలం), ఘూర్జర ప్రభువులనణచి సామంతులుగా చేసుకున్నాడు. దక్షిణ కోసల, కళింగ రాజ్యాల మీద దండయాత్రలను నిర్వహించాడు. పిష్ఠపురం, కునాల (కొల్లేరు) యుద్ధాల్లో విజయాన్ని సాధించి వేంగిని ఆక్రమించాడు. అనంతరం తన తమ్ముడైన కుబ్జవిష్ణువర్ధనుణ్ణి ఈ ప్రాంతానికి రాజుగా నియమించాడు. పులకేశి మరణం తర్వాత, వేంగీ పాలకులు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుని, తూర్పు చాళుక్యులు లేదా వేంగీ చాళుక్యులుగా ప్రసిద్ధి గాంచారు. తర్వాత ఇతడు చేర, చోళ, పాండ్యరాజుల మైత్రిని సంపాదించి, పల్లవ రాజ్యంపై దండెత్తి, మహేంద్రవర్మను పుల్లలూరు యుద్ధంలో ఓడించాడు. చాళుక్య, పల్లవ రాజ్యాల మధ్య సంఘర్షణకు ఇది నాంది. పులకేశి విజయాలన్నిటిలో ఘనమైంది హర్షవర్ధనుణ్ణి ఓడించడం. ‘సకల ఉత్తరాపథేశ్వరుడైన’ హర్షవర్ధనుడు దక్షిణాపథాన్ని జయించాలని దండెత్తి వచ్చినప్పుడు పులకేశి అతణ్ణి నర్మదానది ఒడ్డున ఓడించి ‘పరమేశ్వర’ బిరుదును స్వీకరించాడు.

ఈ విజయ పరంపరలతో పులకేశి కీర్తి ప్రతిష్ఠలు దిగంతాలకు వ్యాపించాయి. పారశీక చక్రవర్తి రెండో ఖుస్రూ పులకేశి శక్తి సామర్థ్యాలను గురించి విని అతనితో దౌత్య సంబంధాలను నెలకొల్పుకున్నాడు. అజంతా మొదటి గుహలోని రెండు చిత్రాలు, ఈ రాయబారాలకు సంబంధించినవేనని కొందరి అభిప్రాయం. క్రీ.శ. 640-641 ప్రాంతంలో చైనా యాత్రికుడైన హూయాన్ త్సాంగ్ చాళుక్య రాజ్యాన్ని దర్శించి తన అనుభవాలను వివరించాడు. పులకేశి సామ్రాజ్యం సారవంతమై, సిరి సంపదలతో తులతూగుతున్న దేశమని అతను తెలిపాడు. అక్కడి ప్రజలు యుద్ధప్రియులని, మేలు చేసిన వారిపట్ల కృతజ్ఞులై ఉంటారని వారికోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సంసిద్ధులవు తారని, అలాగే కీడు తలపెట్టిన వారిపై ప్రతీకారం తీర్చుకోనిదే నిద్రపోరని అతను వివరించాడు. వారి రాజు పు-లో-కే-షి (పులకేశి) క్షత్రియ వీరుడని, తన ప్రజలను, సైనిక బలాన్ని చూసుకుని అతడు గర్విస్తాడని, పొరుగు రాజ్యాలంటే అతనికి లక్ష్యం లేదని అతను వర్ణించాడు.

ఇన్ని గొప్ప విజయాలను సాధించిన పులకేశి జీవితం విషాదాంతమైంది. క్రీ.శ.641లో పులకేశి రెండోసారి పల్లవరాజ్యం మీద దండెత్తినపుడు పల్లవరాజైన నరసింహవర్మ పులకేశిని బాదామి వరకు తరిమి వధించాడు. ఈ పరాజయం నుంచి బాదామి చాళుక్యులు ఒక శతాబ్దం వరకు కోలుకోలేదు.

ప్రశ్న 2.
దక్షిణభారతదేశ సంస్కృతికి పల్లవుల యొక్క సేవను వివరించండి.
జవాబు.
దాదాపు రెండున్నర శతాబ్దాల కాలం పాటు కాంచీపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన వారు పల్లవులు. వీరు క్రీ.శ 557 నుంచి క్రీ.శ 796 వరకు పరిపాలించారు. బాదామి చాళుక్యులు, మధురై పాండ్యులు వీరికి సమకాలికులు. వీరు ప్రస్తుత తమిళ, కన్నడ ప్రాంతాలను పరిపాలించారు. కావేరీ, తుంగభద్ర డెల్టాపై అధికారం సాధించేందుకు వీరు నిరంతరం యుద్ధాలలో మునిగి ఉండేవారు. సింహవిష్ణు నాయకత్వంలో తమిళదేశంలో అత్యంత శక్తివంతులుగా పేరొందారు. సింహవిష్ణు అనంతరం అతడి కుమారుడు మహేంద్రవర్మ రాజయ్యాడు. ఇతడు రెండవ పులకేశి చేతిలో క్రీ.శ 610లో పరాజితుడయ్యాడు. మహేంద్రవర్మ తర్వాత అతడి కుమారుడు నరసింహవర్మ రాజయ్యాడు. ఇతడు మణి మంగళం యుద్ధంలో రెండవ పులకేశిని ఓడించి, చంపి వారి రాజధాని బాదామిని దోచుకున్నాడు. ‘వాతాపికొండన్’ అనే బిరుదు ధరించాడు. చైనా యాత్రికుడు హూయాన్ త్సాంగ్ ఇతని ఆస్థానాన్ని దర్శించాడు. ఇతడి వారసులు బలహీనులు.

పల్లవుల రాజకీయ వ్యవస్థ: పల్లవులు దక్షిణ భారతదేశంలో సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించారు. భారతదేశ సాంస్కృతిక చరిత్రలో పల్లవయుగం గొప్పదశ. భారతదేశ సాంస్కృతిక ఐక్యత వీరి కాలంలో జరిగింది. పల్లవులు సంప్రదాయ నిరంకుశ రాజరిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. పరిపాలనా వ్యవస్థకు రాజే ప్రధాన సూత్రధారి. రాజుకు సర్వాధికారాలు ఉండేవి. అయినా నిరంకుశుడు కాదు. ధర్మాన్ని రక్షిస్తూ ఉండేవాడు. దైనందిన పరిపాలనలో రాజుకు అనేకమంది అధికారులు సహకరించేవారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని రాష్ట్రాలు, కొట్టాలు, గ్రామాలుగా విభజించారు. భూమిశిస్తు రాజ్యానికి ప్రధాన ఆదాయం. దీనికి తోడు వాణిజ్య పన్నులు, వస్తువులపై పన్నుల ద్వారా ఆదాయం లభించేది.

మతాభివృద్ధి: పల్లవులు వైదిక మతాభిమానులు. వీరిలో చాలామంది శైవులు. రాజసింహుడు వంటి కొంతమంది వైష్ణవ మతాభిమానులుండేవారు. శైవులను నాయనార్లని పిలిచేవారు. వీరిలో ‘అప్పార్’, ‘సంబంధార్’, ‘సుందరమూర్తి’, ‘మాళిక్కవాళగర్’ మొదలైనవారు శైవమత వ్యాప్తికి ఈ యుగంలో అంకితమయ్యారు. విప్రనారాయణ, తిరుమంగై మొదలైన ఆళ్వారులు వైష్ణవమత వ్యాప్తికి అంకితమయ్యారు. పల్లవ యుగంలో తిరుపతి, శ్రీరంగం మొదలైన వైష్ణవ క్షేత్రాలు భక్తులను ఆకర్షించాయి. జైన, బౌద్ధమతాలు కూడా ఈ యుగంలో విలసిల్లాయి. కాంచీపురంలో 180 బౌద్ధారామాలున్నట్లు హూయాన్ త్సాంగ్ రాశాడు. అయితే శైవమతం, వైష్ణవమతాల వ్యాప్తితో జైన, బౌద్ధమతాలు కొంతవరకు క్షీణించాయి.

విద్యాసారస్వతాల ప్రగతి: ప్రాచీన పల్లవుల కాలంలో సంస్కృతం రాజభాష అయింది. నవీన పల్లవులు తమ శాసనాలన్నిటినీ సంస్కృతంలోనే వేయించారు. వీరు ఘటికలను స్థాపించి, సంస్కృతాన్ని, వైదిక విద్యలను పోషించారు. ఈ ఘటికల్లో చతుర్విద విద్యలు అంటే అన్వీక్షకి (Philosophy), త్రయీ (Three Vedas), వార్తా (Economics), దండనీతి (Politics) బోధించేవారు. కాంచీపుర ఘటికా స్థానం, దేశవ్యాప్తంగా ప్రసిద్ధి వహించి, దూర ప్రాంతాల నుంచి విద్యార్థులను ఆకర్షించింది. సంస్కృత కవులైన భారవి, దండి వీరి కాలం వారే. విద్యలతోబాటు, తమిళదేశంలో నాట్య సంగీతాల్లో కూడా విశేషమైన కృషి జరిగింది. ఆనాటి వాఙ్మయంలో మృదంగం, యాళి, విరళి మొదలైన వాయిద్యాల పేర్లున్నాయి.

వాస్తు శిల్పాల్లో పల్లవుల కృషి: దక్షిణ భారతదేశంలో వాస్తు చరిత్ర పల్లవుల కాలంలోనే ప్రారంభమైందని విన్సెట్ స్మిత్ అభిప్రాయం. మనోహరమైన భారతీయ శిల్పరీతుల్లో పల్లవశైలి ఒకటి. వీరి కాలంనాటి శిల్పాలు, నిర్మాణాలు అపురూప కళాఖండాలు. ముఖ్యంగా కొండను తొలిచి ఆలయాలను నిర్మించే అద్భుతమైన కొత్త పద్ధతిని, మహేంద్రవర్మ తమిళ దేశంలో ప్రవేశపెట్టాడు. ఇదే పద్ధతిలో నరసింహవర్మ మహామల్లవరం (మహాబలిపురం)లో పంచపాండవుల రథాలను తొలిపించాడు. రాజసింహుడు మహాబలిపురంలో తీరదేవాలయాన్ని, కాంచీపురంలో కైలాసనాథ ఆలయాన్ని నిర్మించాడు. పల్లవుల వాస్తు ప్రత్యేకత కైలాసనాథ ఆలయంలో ప్రతిబింబిస్తుంది. శిల్పాల్లో మహామల్లపురంలో ఉన్న ‘గంగావతరణ’ శిల్పం విదేశీ కళావిమర్శకుల ప్రశంసలందుకున్నది.

ప్రశ్న 3.
చాళుక్యుల కాలంలో దక్కనులో నెలకొన్న పరిస్థితులను చర్చించండి.
జవాబు.
దక్కన్, దక్షిణ భారతదేశాన్ని పాలించిన రాజవంశాలలో చాళుక్యులు ప్రధానమైనవారు. చాళుక్యులు బాదామీ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, వేంగి చాళుక్యులు అనే మూడు ప్రధాన వంశాలుగా ఉన్నారు. వీరు కంచిని ఏలిన పల్లవులకు సమకాలీనులు. క్రీ.శ. 6వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం వరకు తిరిగి క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు సుదీర్ఘకాలం పరిపాలించారు.

రాజ్య విస్తరణ: బాదామీ చాళుక్యుల రాజ్యాన్ని పాలించిన మొదటిరాజు జయసింహ వల్లభుడు. వింధ్య పర్వతాలు, కృష్ణానది మధ్య ఉన్న దక్షిణా పథాన్ని పాలించాడు. బాదామీ చాళుక్యులలో గొప్పవాడు మొదటి పులకేశి. రెండవ పులకేశి అందరిలోకి గొప్పవాడు. ఇతను క్రీ.శ. 609-642 సంవత్సరం వరకు పరిపాలించాడు. క్రీ.శ. 609లో సింహాసనం అధిష్టించి అంతర్గత సమస్యలను అణచివేసాడు. కదంబులు, గాంగులను జయించాడు. లాటపాలకులు, మాళవులు, ఘార్జరులు ఇతని సార్వభౌమత్వాన్ని అంగీకరించారు. పల్లవ మహేంద్రవర్మను ఓడించాడు. వేంగి ప్రాంతాన్ని ఆక్రమించి తన సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుని పాలకుడిగా నియమించాడు. తరువాత వేంగి తూర్పు చాళుక్యుల రాజధాని అయింది. వారు రెండు శతాబ్దాలపాటు ఆంధ్రదేశాన్ని పరిపాలించారు.

రెండవ పులకేశి కాలంలో చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ బాదామీ చాళుక్యరాజ్యాన్ని సందర్శించాడు. హుయానాత్సాంగ్ రెండవ పులకేశి గొప్పతనాన్ని, సైనిక బలాన్ని కొనియాడాడు. రెండవ పులకేశి నర్మదా యుద్ధంలో హర్షవర్ధనుని ఓడించి నర్మదానదిని హర్షవర్ధనుని రాజ్యానికి హద్దుగా నిర్ణయించాడు. అయితే రెండవ పులకేశి చివరి రోజులు విషాదాంతమయ్యాయి. క్రీ.శ. 642లో జరిగిన మణమంగళం యుద్ధంలో రెండవ పులకేశి పల్లవరాజు చేతిలో ఓడిపోయి మరణించాడు. రెండవ పులకేశి వారసులు బలహీనులవుట వలన, రాష్ట్రకుట దంతిదుర్గుని దాడుల వలన బాదామీ చాళుక్యుల పాలన అంతమైంది.

పాలనా విధానం: చాళుక్యులది వంశపారంపర్య నిరంకుశ రాజరిక వ్యవస్థ. రాజుకు సర్వాధికారాలు ఉండేవి. రాజును దైవాంశ సంభూతుడిగా భావించేవారు. రాజులు ‘శ్రీ పృథ్వీ వల్లభ’ అనే బిరుదు ధరించారు. చాళుక్యుల పాలనలో నిర్దిష్టమైన మంత్రి పరిషత్ లేదు. రాజ కుటుంబానికి విశ్వాసపాత్రులు అయిన వారు పరిపాలనా వ్యవహారాలు · నిర్వహించేవారు. చాళుక్య రాజ్యంలో పాలన వికేంద్రీకరించబడింది. రాష్ట్రాలు, విషయాలు, నాడులు అనే పాలనావ్యవస్థలు ఉండేవి. విషయపతులు, సమర్థులు, గ్రామభోజకులు అనే అధికారుల గురించి చాళుక్యుల రికార్డులలో ప్రస్తావన లభిస్తుంది. పాలనా వ్యవహారంలో గ్రామం అత్యంత చిన్న విభాగం. ‘గాముండ’ అనే అధికారి గ్రామపాలనను నిర్వహించేవాడు. ఇతను గ్రామానికి, రాజుకు మధ్య వారధిగా ఉండేవాడు. సమర్థవంతమైన పన్నుల వ్యవస్థ అమలులో ఉండేది. సొంత గృహాలు, ఇంటి స్థలాలు ఉన్నవారు పన్నులు చెల్లించాల్సి ఉండేది.

TS Inter 1st Year History Study Material Chapter 7 దక్షిణ భారతదేశ రాజ్యాలు

సాంఘిక పరిస్థితులు:
విద్యా విధానం: ప్రజలు విద్యాభ్యాసం పట్ల శ్రద్ధ కనబరచేవారని హూయాన్ త్సాంగ్ పేర్కొన్నాడు. వీరి శాసనాల్లో బ్రాహ్మణులు పద్నాలుగు విద్యల్లో పాండిత్యం కలవారని చెప్పబడింది. బాదామీలో నాలుగు రకాల శాస్త్ర బోధన జరిగేదని తెలుస్తోంది. చాళుక్యుల సంప్రదాయం ప్రకారం పద్నాలుగు విద్యల్లో చతుర్వేదాలు, ఆరు అంగాలు, పురాణాలు, మీమాంస, న్యాయ, ధర్మశాస్త్రాలు ఉండేవి. వేదాలు, తత్త్వశాస్త్రం, అర్థశాస్త్రం, దండనీతి అనే నాలుగు విద్యలు ప్రధానమైనవిగా భావించేవారు.
మత విశ్వాసాలు: చాళుక్యులు సంప్రదాయ హిందూ మతస్థులు. వారు వైదిక బలిదానాలను పునరుద్ధరించారు. మొదటి పులకేశి అశ్వమేధయాగం చేశాడు. చాళుక్యులు బాదామీ, ఐహోలు, పట్టడకల్లలో గొప్ప ఆలయాలను నిర్మించారు.

సైనిక వ్యవస్థ: చాళుక్యులు పటిష్టమైన సైనిక వ్యవస్థను కలిగి ఉండేవారు. హర్షవర్ధనుడంతటి గొప్ప చక్రవర్తి రెండవ పులకేశి చేతుల్లో ఓడిపోవటం వీరి సైనిక శక్తికి నిదర్శనం.

కళాపోషణ: చాళుక్యరాజులు గొప్పవాస్తు శిల్పకళా పోషకులు. వీరి పోషణలో గొప్ప ప్రెస్కో చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. వీరు బాదామీ, ఐహోలు, పట్టడకల్లో నిర్మించిన ఆలయాలు గొప్ప కళాఖండాలు. ఈ ఆలయాలు సాంఘిక, సాంస్కృతిక రంగాలకు కేంద్రాలుగా విలసిల్లాయి.

ప్రశ్న 4.
ఘనులైన చోళరాజులు సాధించిన విజయాలను వివరించండి.
జవాబు.
దక్షిణ భారతదేశ చరిత్రలో రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో విశేషమైన విజయాలను సాధించిన తంజావూరు చోళులకు ప్రత్యేక స్థానం ఉంది.

రాజ్యస్థాపన: అశోకుని 2వ, 12వ శిలా శాసనాలలో చోళులను గురించిన ప్రస్తావన ఉంది. క్రీ.శ. 850 సంవత్సరంలో విజయాలయుడు స్వతంత్ర చోళ రాజ్యాన్ని స్థాపించాడు. అతడి రాజధాని ఉరయ్యార్. ఇతడు పల్లవుల వద్ద ఉద్యోగి. ముత్తరియార్ పాలకుల నుంచి విజయాలయుడు తంజావూరు స్వాధీనం చేసుకున్నాడు.

రాజ్యవిస్తరణ – సైనిక విజయాలు: చోళరాజులలో మొదటి ఆదిత్యుడు రెండో గొప్పరాజు. పల్లవరాజు అపరాజితవర్మను అంతమొందించాడు. అతని కుమారుడు పరాంతకుడు పాండ్యులను ఓడించి మధురై స్వాధీనం చేసుకొని, మధురైకొండ అనే బిరుదు ధరించాడు. అయితే ఇతను రాష్ట్రకూట పాలకుడు మూడవ కృష్ణుని చేతిలో ఓడిపోయాడు.

రెండవ పరాంతకుని కుమారుడైన రాజరాజు, తరువాత వచ్చిన మొదటి రాజేంద్రచోళుడు, తరువాతివాడైన రాజాధిరాజులు చోళపాలకుల్లో గొప్పవారు. క్రీ.శ. 985లో రాజరాజు సింహాసనాన్ని అధిష్టించాడు. అతడు చేర, పాండ్య రాజ్యాలను జయించాడు. రాజరాజు గొప్ప నౌకాదళాన్ని ఏర్పాటు చేసుకొని సిలోన్ (శ్రీలంక) ఉత్తర ప్రాంతాన్ని జయించాడు. తూర్పు చాళుక్యరాజు విమలాదిత్యుడు తన కుమార్తె కుందవైని రాజరాజుకిచ్చి వివాహం చేశాడు. రాజరాజు పరమత సహనం గల పాలకుడు. తంజావూరులోని బృహదీశ్వరాలయాన్ని నిర్మింపజేశాడు. బృహదీశ్వరాలయ గోపురం గొప్ప వాస్తు శిల్పకళాఖండం. నేటికీ ప్రపంచంలోని వివిధ ప్రాంతాల సందర్శకులను ఆకర్షిస్తోంది. తరువాత వచ్చిన మొదటిరాజేంద్ర చోళుడు సిలోన్పై దండయాత్ర చేశాడు. గాంగ, పాలరాజులపై విజయాలు సాధించి ‘గంగైకొండ రాజేంద్రచోళ’ అని పేరుగాంచాడు.

రాజేంద్ర చోళుడు గొప్ప పాలకుడు. గంగైకొండ చోళపురం (తిరుచినాపల్లి) అనే నూతన రాజధాని నగరాన్ని నిర్మింపజేసాడు. ఇది ఆగ్నేయాసియా దేశాలతో పటిష్ట వ్యాపార సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి తోడ్పడింది. పెద్ద కృత్రిమ రిజర్వాయర్ను నిర్మింపజేసి కొలెరుమ్, వెల్లార్ నదుల నుంచి కాలువల ద్వారా నీటిని నింపాడు.
రాజేంద్రచోళుడి తర్వాత వచ్చిన రాజాధిరాజు కాలం నాటికి అంతర్గత, బహిర్గత సమస్యలు ఎక్కువయ్యాయి. ఇతను పాండ్య, కేరళ పాలకులను అణచివేశాడు. పశ్చిమచాళుక్య పాలకుడైన మొదటి సోమేశ్వరునితో జరిగిన యుద్ధంలో రాజాధిరాజు మరణించాడు.

చోళుల పాలన – సామాజిక విశేషాలు: రాజు సర్వాధికారి. పాలనలో రాజుకి ‘ఉదంకుట్టం’ అనే ఉన్నతాధికారులు అండగా ఉండేవారు. చోళులు పటిష్టమైన ఉద్యోగ వ్యవస్థను ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థలకు పాలనలో విశేషాధికారాలు కల్పించారు. ఉత్తర మేరూరు శాసనం చోళుల కాలంనాటి స్థానిక స్వపరిపాలన విషయాలను తెలియజేస్తుంది. గ్రామపాలన, గ్రామ అసెంబ్లీలో సభ్యులుగా ఎన్నిక కావడానికి కావలసిన అర్హతలను ఈ శాసనం వివరించింది.

స్థానిక పాలన: చోళుల పరిపాలనా వ్యవస్థలోని గొప్ప అంశం, వారికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది గ్రామపాలనా వ్యవస్థ పట్టణాలు, గ్రామాలు అసెంబ్లీలను కలిగి ఉండేవి. ఊర్, సభ అనే రెండు రకాల అసెంబ్లీలు ఉండేవి. ‘ఊర్’ సాధారణ సభ్యులతో కూడిన అసెంబ్లీ కాగా, ‘సభ’ బ్రహ్మాండ గ్రామ పాలనా వ్యవహారాలకు సంబంధించింది. గ్రామ అసెంబ్లీ తన విధులను ‘వారియం’ అనే కమిటీల ద్వారా నిర్వహించేది. ఈ అసెంబ్లీ ‘తోట వారియం’, ‘చెరువు వారియం’ ఇలా అనేక కమిటీలు ఏర్పరిచేది. గ్రామ అసెంబ్లీలు పాలనలో సంపూర్ణ సార్వభౌమాధికారాన్ని చెలాయించేవి. గ్రామంలోని ఉమ్మడి భూములపై అధికారాన్ని కలిగి ఉండటంతో పాటు ప్రైవేట్ భూములపై క్రమబద్ధమైన అధికారాన్ని కలిగి ఉండేది.

గ్రామసభల కార్యనిర్వాహక కమిటీ సభ్యులను ప్రజలు ఎన్నుకొనేవారు. ప్రతి గ్రామం, పట్టణం అనేక వార్డులుగా విభజింపబడేవి. వార్డులను ‘కుటుంబం’ అని పిలిచేవారు. వీరికి కొన్ని అర్హతలను ఏర్పాటుచేసారు.

అర్హతలు:: 35-70 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి; వేదాలలో పాండిత్యాన్ని కలిగి గ్రామ నివాసి అయి ఉండాలి.
ఈ విధంగా చోళులు సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో తమదైన ముద్రవేసి దక్షిణ భారతదేశ చరిత్రలోనే కాక భారతదేశ చరిత్రలోనే ప్రత్యేక స్థానాన్ని కలిగివున్నారు.

TS Inter 1st Year History Study Material Chapter 7 దక్షిణ భారతదేశ రాజ్యాలు

ప్రశ్న 5.
చోళుల పరిపాలన ప్రధాన లక్షణాలను చర్చించండి.
జవాబు.
చోళుల పాలనా వ్యవస్థలోని ముఖ్య లక్షణం వారి స్థానిక స్వపరిపాలనా విధానం. చోళుల గ్రామ పరిపాలననే “స్థానిక స్వపరిపాలన” అని కూడా అంటారు. మొదటి పరాంతకుని ఉత్తరమేరూర్ శాసనంలోను, కులోత్తుంగుని శాసనాల్లోను చోళుల గ్రామ పాలనా పద్ధతి వివరించబడింది.

గ్రామ పాలన: చోళుల సామ్రాజ్యంలో ప్రతి గ్రామానికి స్వయం పాలనాధికారం ఉంది. ప్రతి గ్రామంలోను గ్రామ పెద్దల సభ వుండేది. ఈ గ్రామ సభ స్వరూప స్వభావాలను గ్రామ గ్రామానికి మారుతుండేవి.

గ్రామ సభలు: చోళుల కాలంలో గ్రామాల్లో మూడు రకాల సభలుండేవి. అవి: 1) ఊర్ 2) సభ 3) నగరం ఊర్ అనే సభలో గ్రామంలోని భూస్వాములందరూ సభ్యులే. “సభ”లో బ్రాహ్మణ అగ్రహారంలోని వారు మాత్రమే సభ్యులుగా ఉండేవారు. ‘నగరం’ అనేది వర్తకులకు సంబంధించిన సభ. బ్రాహ్మణ అగ్రహారంలోని సభ్యులకు దేవాలయమే సమావేశపు స్థలం. కొన్ని గ్రామాల్లో ప్రత్యేకించి కచేరీలుండేవి.

సభ్యుల ఎన్నిక: చోళుల కాలంలో ప్రతి గ్రామాన్ని 30 వార్డులుగా విభజించారు. ప్రతి వార్డు నుండి ఒక సభ్యుడ్ని లాటరీ పద్ధతిపై ఎన్నుకునేవారు. ఈ సభ్యులను గ్రామసభ ఉపసంఘాలుగా నియమించేది. చెరువులు, సత్రాలు, ఆలయాలు, తోటలు, పాఠశాలలు, నేర విచారణ, పన్నుల వసూలు మొదలైన వాటికి ప్రత్యేక ఉపసంఘాలుండేవి. “పంచదార వారియం” అనే ఉపసంఘం మిగిలిన సంఘాల కార్యక్రమాలను పరిశీలించేది.

అర్హతలు: గ్రామసభలోని సభ్యుల అర్హతలను గురించి ప్రత్యేక నిబంధనావళిని రూపొందించి అమలు చేశారు. సభ్యులుగా ఎన్నుకోబడుటకు ఒక వ్యక్తికి కొన్ని అర్హతలుండాలి. అతడు:

  1. 30 నుండి 70 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వుండాలి.
  2. విద్యావంతుడై వుండాలి.
  3. సొంత ఇల్లు కలిగి భూమికి యజమానై వుండాలి. అనర్హతలు: గ్రామసభ సభ్యులకు కొన్ని అర్హతలతో పాటు కొన్ని అనర్హతలు కూడా నిర్దేశించారు.

గ్రామసభకు ఎన్నుకోబడదలచుకున్న వ్యక్తి:

  1. పంచ మహాపాపాలు చేసినవాడై ఉండకూడదు.
  2. గత మూడు సంవత్సరాలుగా ఏ ఉపసంఘంలోను సభ్యుడిగా ఉండరాదు.
  3. ఒకసారి సభ్యుడిగా ఉండి లెక్కలను సరిగా అప్పగించని వాడు కూడా అనర్హుడే,
  4. నేరస్థులు వారి బంధువులు కూడా ఈ ఎన్నికల్లో పాల్గొనకూడదు.

గ్రామ సభ అధికారాలు: గ్రామంలోని భూములపై యాజమాన్యపు హక్కు సభకు ఉన్నది. పన్నులను విధించుట, అడవులను నరికించి కొత్త భూములను సాగులోకి తీసుకువచ్చుట మొదలగునవి ఈ సభ ముఖ్య విధులు. వీటితోపాటు భూమి, నీటి తగవులను పరిష్కరించుట, నేరాలను విచారించుట కూడా దీని విధులుగా చెప్పుకోవచ్చు. అయితే ఆదాయ వనరులు తక్కువ కావటంతో కేంద్ర ప్రభుత్వమే రహదారులు నిర్మించగా వాటిపై అజమాయిషీని సభ నిర్వహించేది. గ్రామసభలకు సలహాలివ్వటానికి అధికారులుండేవారు. కేంద్ర ప్రభుత్వము యొక్క అనవసర జోక్యము ఈ సభలలో ఉండేది కాదు.

ముగింపు: చోళుల గ్రామ పాలన సమర్థవంతమైనది, ఆదర్శవంతమైనది. చోళులు గ్రామ పరిపాలనను ఏర్పరచి అందులో ప్రజలను భాగస్వాములను చేయటం వల్ల పాలనలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సమన్వయం సాధ్యపడింది.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బాదామి చాళుక్య రాజ్యస్థాపనకు దారితీసిన పరిస్థితులను వివరించండి.
జవాబు.
దక్షిణాపథాన్ని పరిపాలించిన గొప్పపాలకుల్లో కర్ణాటకలోని ‘బాదామి’ కేంద్రంగా పరిపాలించిన చాళుక్యులు ఒకరు. వీరు 7వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం తొలిదశ వరకు పరిపాలించారు. వీరిలో రెండవ పులకేశిన్ సుప్రసిద్ధుడు. వీరినే పశ్చిమ చాళుక్యులు అని వర్ణిస్తారు. స్వతంత్ర్య బాదామి చాళుక్య రాజ్య స్థాపకుడు జయసింహుడు. ఇతడు మహాపరాక్రమవంతుడు. వీరు వింద్యాపర్వతాలకూ, కృష్ణానదికి మధ్య కల భూభాగాలను పరిపాలించి శాశ్వతకీర్తి గడించారు. జయసింహుడి అనంతరం అతని కుమారుడైన రణరంగుడు. ఇతడి అనంతరం పరిపాలించిన బాదామి చాళుక్య రాజుల్లో మొదటి పులకేశిన్ రణరంగుని కుమారుడు. ఇతడు క్రీ.శ. 535 – 566 మధ్యకాలంలో రాజ్యపాలన చేసాడు. బాదామి పట్టణం ఇతని రాజధాని. ఇతని వారసుడే ‘కీర్తివర్మ’. ఇతడు ‘మహారాజు’ అనే బిరుదు ధరించాడు. ఇతడు నలవాడి (కర్నూల్, బళ్ళారి) పాలకులను, బనవాసి కదంబులను ఓడించాడు. ఇతని కుమారుడైన రెండోపులకేశి బాలుడైనందున సోదరుడు మంగళేశుడు రాజ్య వ్యవహారాలు నిర్వహించాడు. ఇతడు కాలచురులను ఓడించి రేవతి .ద్వీపాన్ని ఆక్రమించాడు. క్రీ.శ. 609లో రెండో పులకేశి సింహాసనానికి వచ్చాడు.

ప్రశ్న 2.
మొదటి నర్సింహవర్మన్ సాధించిన విజయాలను చర్చించండి.
జవాబు.
ఇతను మహేంద్రవర్మ కుమారుడు. పల్లవ రాజులందరిలోనూ అగ్రగణ్యుడు. సింహాసనమెక్కిన వెంటనే నరసింహవర్మ చాళుక్యుల దండయాత్రను ఎదుర్కోవలసి వచ్చింది. క్రీ.శ. 641లో రెండో పులకేశి పల్లవ రాజ్యంపైకి దండెత్తినప్పుడు పల్లవసేనలు అతణ్ణి ఓడించి తరమడమేకాక నరసింహవర్మ నాయకత్వంలో బాదామి వరకు నడిచి పులకేశిని వధించి బాదామిని దోచుకొన్నాయి. తర్వాత చోళ, పాండ్య ప్రభువులు నరసింహవర్మకు సామంతులయ్యారు. ఈ విజయాలకు నిదర్శనంగా నరసింహవర్మ ‘వాతాపికొండ’, ‘మహామల్ల’ బిరుదులను ధరించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 7 దక్షిణ భారతదేశ రాజ్యాలు

నరసింహవర్మ కూడా తండ్రి మహేంద్రవర్మలాగా సారస్వతాన్నీ, వాస్తు, లలితకళలనూ పోషించాడు. ఇతను మహామల్లపురం (మహాబలిపురం)లో ఏకశిలా రథాలనే దేవాలయాలను నిర్మింపచేశాడు. సంస్కృతంలో ‘కిరాతార్జు నీయం’ అనే కావ్యాన్ని రచించిన భారవి కవిని ఇతను ఆదరించినట్లుగా తెలుస్తున్నది. నరసింహవర్మ కాలంలోనే హ్యూయాన్ త్సాంగ్ అనే చైనా యాత్రికుడు కాంచీపురాన్ని దర్శించాడు. పల్లవుల రాజ్యాన్ని తమిళ దేశంగా వర్ణిస్తూ ఇక్కడి ప్రజలు నీతిపరులని, సత్యప్రియులని, శ్రమజీవులని, వీరికి విద్యావ్యాసాంగాలలో శ్రద్ధాసక్తులు అధికమని చెప్పాడు. కాంచీపురంలో దాదాపు 100 బౌద్ధారామాలు, 80 దేవాలయాలు ఉన్నట్లుగా కూడా ఇతను తెలిపాడు. నలందా విశ్వవిద్యాలయానికి ఆచార్యుడైన ధర్మపాలుడి జన్మస్థలం కాంచీపురమని ఇతను రాశాడు.

ప్రశ్న 3.
పల్లవ చాళుక్యుల సంఘర్షణను వివరించండి.
జవాబు.
పల్లవ రాజులలో గొప్పవాడు మొదటి మహేంద్రవర్మ. ఇతడు సింహవిష్ణువు కుమారుడు. ఇతడు తన రాజ్యాన్ని. ఉత్తరాన కృష్ణానది వరకు విస్తరింపచేసాడు. ఇతని కాలం నుంచే పల్లవ బాదామి చాళుక్యుల మధ్య రాజ్య విస్తరణకై సంఘర్షణ ఆరంభమైంది. బాదామి చాళుక్యరాజైన రెండో పులకేశిన్ పల్లవరాజుకు చెందిన ‘కర్మ’ రాష్ట్రాన్ని ఆక్రమించాడు. ఆ తరువాత రెండో పులకేశిన్ పల్లవరాజును ‘పుల్లలూరు’ యుద్ధంలో (క్రీ.శ. 630) ఓడించాడు.

మొదటి నరసింహవర్మ మహేంద్రవర్మ కుమారుడు. యువరాజుగా ఉన్నపుడే మణిమంగళంగా యుద్ధంలో రెండో పులకేశిన్ సేనలను ఓడించి తన శక్తి, ప్రతాపాలను నిరూపించుకున్నాడు. చాళుక్యుల రాజధానియైన బాదామిని ధ్వంసం చేసాడు. రెండో పులకేశిన్ కుమారుడైన విక్రమాదిత్యుడు క్రీ.శ. 655లో పల్లవరాజైన నర్సింహవర్మను ఓడించి కాంచీపురాన్ని ఆక్రమించాడు. చోళ, పాండ్య రాజుల గర్వాన్ని అణచివేసాడు. వినయాదిత్యుడి తండ్రి అనంతరం బాదామి చాళుక్యరాజ్య సింహాసనం అధిష్టించాడు. ఇతని అనంతరం చాళుక్య రాజ్యం క్షీణదశకు చేరుకుంది. ఇదేకాలంలో అరబ్ల దండయాత్ర జరిగింది.

ప్రశ్న 4.
సాహిత్యం, వాస్తు, శిల్పకళల పురోభివృద్ధికి పల్లవులు చేసిన సేవను అంచనావేయండి.
జవాబు.
పల్లవుల రాజకీయ వ్యవస్థ: పల్లవులు దక్షిణ భారతదేశంలో సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించారు. భారతదేశ సాంస్కృతిక చరిత్రలో పల్లవయుగం గొప్పదశ. భారతదేశ సాంస్కృతిక ఐక్యత వీరి కాలంలో జరిగింది. పల్లవులు సంప్రదాయ నిరంకుశ రాజరిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. పరిపాలనా వ్యవస్థకు రాజే ప్రధాన సూత్రధారి. రాజుకు సర్వాధికారాలు ఉండేవి. అయినా నిరంకుశుడు కాదు. ధర్మాన్ని రక్షిస్తూ ఉండేవాడు. దైనందిన పరిపాలనలో రాజుకు అనేకమంది అధికారులు సహకరించేవారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని రాష్ట్రాలు, కొట్టాలు, గ్రామాలుగా విభజించారు. భూమిశిస్తు రాజ్యానికి ప్రధాన ఆదాయం. దీనికి తోడు వాణిజ్య పన్నులు, వస్తువులపై పన్నుల ద్వారా ఆదాయం లభించేది.

మతాభివృద్ధి: పల్లవులు వైదిక మతాభిమానులు. వీరిలో చాలామంది శైవులు. రాజసింహుడు వంటి కొంతమంది వైష్ణవ మతాభిమానులుండేవారు. శైవులను నాయనార్లని పిలిచేవారు. వీరిలో ‘అప్పార్’, ‘సంబంధార్’, ‘సుందరమూర్తి’, ‘మాళిక్కవాళగర్’ మొదలైనవారు శైవమత వ్యాప్తికి ఈ యుగంలో అంకితమయ్యారు. విప్రనారాయణ, తిరుమంగై మొదలైన ఆళ్వారులు వైష్ణవమత వ్యాప్తికి అంకితమయ్యారు. పల్లవ యుగంలో తిరుపతి, శ్రీరంగం మొదలైన వైష్ణవ క్షేత్రాలు భక్తులను ఆకర్షించాయి. జైన, బౌద్ధమతాలు కూడా ఈ యుగంలో విలసిల్లాయి. కాంచీపురంలో 180 బౌద్ధారామాలున్నట్లు హూయాన్ త్సాంగ్ రాశాడు. అయితే శైవమతం, వైష్ణవమతాల వ్యాప్తితో జైన, బౌద్ధమతాలు కొంతవరకు క్షీణించాయి.

విద్యాసారస్వతాల ప్రగతి: ప్రాచీన పల్లవుల కాలంలో సంస్కృతం రాజభాష అయింది. నవీన పల్లవులు తమ శాసనాలన్నిటినీ సంస్కృతంలోనే వేయించారు. వీరు ఘటికలను స్థాపించి, సంస్కృతాన్ని, వైదిక విద్యలను పోషించారు. ఈ ఘటికల్లో చతుర్విద విద్యలు అంటే అన్వీక్షకి (Philosophy), త్రయీ (Three Vedas), వార్తా (Economics), దండనీతి (Politics) బోధించేవారు. కాంచీపుర ఘటికా స్థానం, దేశవ్యాప్తంగా ప్రసిద్ధి వహించి, దూర ప్రాంతాల నుంచి విద్యార్థులను ఆకర్షించింది. సంస్కృత కవులైన భారవి, దండి వీరి కాలం వారే. విద్యలతోబాటు, తమిళదేశంలో నాట్య సంగీతాల్లో కూడా విశేషమైన కృషి జరిగింది. ఆనాటి వాఙ్మయంలో మృదంగం, యాళి, విరళి మొదలైన వాయిద్యాల పేర్లున్నాయి.

వాస్తు శిల్పాల్లో పల్లవుల కృషి: దక్షిణ భారతదేశంలో వాస్తు చరిత్ర పల్లవుల కాలంలోనే ప్రారంభమైందని విన్సెట్ స్మిత్ అభిప్రాయం. మనోహరమైన భారతీయ శిల్పరీతుల్లో పల్లవశైలి ఒకటి. వీరి కాలంనాటి శిల్పాలు, నిర్మాణాలు అపురూప కళాఖండాలు. ముఖ్యంగా కొండను తొలిచి ఆలయాలను నిర్మించే అద్భుతమైన కొత్త పద్ధతిని, మహేంద్రవర్మ తమిళ దేశంలో ప్రవేశపెట్టాడు. ఇదే పద్ధతిలో నరసింహవర్మ మహామల్లవరం (మహాబలిపురం)లో పంచపాండవుల రథాలను తొలిపించాడు. రాజసింహుడు మహాబలిపురంలో తీరదేవాలయాన్ని, కాంచీపురంలో కైలాసనాథ ఆలయాన్ని నిర్మించాడు. పల్లవుల వాస్తు ప్రత్యేకత కైలాసనాథ ఆలయంలో ప్రతిబింబిస్తుంది. శిల్పాల్లో మహామల్లపురంలో ఉన్న ‘గంగావతరణ’ శిల్పం విదేశీ కళావిమర్శకుల ప్రశంసలందుకున్నది.

ప్రశ్న 5.
రాజరాజచోళుని ఘనతను చర్చించండి.
జవాబు.
రెండవ పరాంతకుడి కుమారుడైన రాజరాజు క్రీ.శ 985 నుండి 1014 వరకు పరిపాలించారు. మొదటి రాజరాజు కాలం నుంచి చోళ రాజ్యంలో నూతన శకం ప్రారంభమైంది. రాజరాజు అనేక ఘన విజయాలను సాధించి చోళ రాజ్యాన్ని మహాసామ్రాజ్యంగా విస్తరింపచేశాడు. రాజరాజుకు ‘జయంగొండ’, ‘చోళమార్తాండ’ మొదలైన బిరుదు లున్నాయి. పాండ్యులను, చేర రాజులను ఓడించి వారి సామ్రాజ్య భాగాలైన కొడమలై, కొళ్ళంలను ఆక్రమించాడు. నౌకాదళంతో దాడి చేసి, మలయా ద్వీపాన్ని ఆక్రమించడమే కాకుండా శ్రీలంక మీద యుద్ధం చేసి అనూరాధపురాన్ని (ఉత్తర సింహళం) నాశనం చేశాడు. ఉత్తర సింహళానికి “ముమ్ముడి చోళమండల”మని నామకరణం చేశాడు. ఇతని కాలంలోనే కళ్యాణి చాళుక్యులకు, వేంగీ చాళుక్యులకు పోరు ప్రారంభమైంది. రాజరాజు వేంగీ చాళుక్యులకు మద్దతునిచ్చి తన ప్రాబల్యాన్ని వేంగీలో నెలకొల్పాడు.

రాజరాజు తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేయడమే కాకుండా క్రమబద్ధమైన పాలనా విధానాన్ని ప్రవేశపెట్టాడు. పంటపొలాలను సర్వే చేయించి, న్యాయసమ్మతమైన పన్నులను వసూలు చేశాడు. రాజరాజు శివభక్తుడు. తంజావూర్లో ‘రాజరాజేశ్వర’మనే పేరున్న బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. శైవుడైనప్పటికీ రాజరాజు పరమత సహనం ఉన్నవాడు.. శైలేంద్ర రాజైన శ్రీమార విజయోత్తుంగ వర్మకు నాగపట్టణంలో బౌద్ధ విహారాన్ని నిర్మించడానికి అనుమతినివ్వడమే కాకుండా ఆ విహారానికి ఒక గ్రామాన్ని దానం చేశాడు. ఇతను లలితకళల అభివృద్ధికి కూడా ఎంతో కృషి చేశాడు.

TS Inter 1st Year History Study Material Chapter 7 దక్షిణ భారతదేశ రాజ్యాలు

ప్రశ్న 6.
చోళులకాలంలో అభివృద్ధిచెందిన స్థానిక పరిపాలన పద్ధతిని వివరించండి.
జవాబు.
చోళుల పాలనా వ్యవస్థలోని ముఖ్య లక్షణం వారి స్థానిక స్వపరిపాలనా విధానం. చోళుల గ్రామ పరిపాలననే “స్థానిక స్వపరిపాలన” అని కూడా అంటారు. మొదటి పరాంతకుని ఉత్తరమేరూర్ శాసనంలోను, కులోత్తుంగుని శాసనాల్లోను చోళుల గ్రామ పాలనా పద్ధతి వివరించబడింది.

గ్రామ పాలన: చోళుల సామ్రాజ్యంలో ప్రతి గ్రామానికి స్వయం పాలనాధికారం ఉంది. ప్రతి గ్రామంలోను గ్రామ పెద్దల సభ వుండేది. ఈ గ్రామ సభ స్వరూప స్వభావాలను గ్రామ గ్రామానికి మారుతుండేవి.

గ్రామ సభలు: చోళుల కాలంలో గ్రామాల్లో మూడు రకాల సభలుండేవి. అవి: 1) ఊర్ 2) సభ 3) నగరం. ఊర్ అనే సభలో గ్రామంలోని భూస్వాములందరూ సభ్యులే. “సభ”లో బ్రాహ్మణ అగ్రహారంలోని వారు మాత్రమే సభ్యులుగా ఉండేవారు. ‘నగరం’ అనేది వర్తకులకు’ సంబంధించిన సభ. బ్రాహ్మణ అగ్రహారంలోని సభ్యులకు దేవాలయమే సమావేశపు స్థలం. కొన్ని గ్రామాల్లో ప్రత్యేకించి కచేరీలుండేవి.

సభ్యుల ఎన్నిక: చోళుల కాలంలో ప్రతి గ్రామాన్ని 30 వార్డులుగా విభజించారు. ప్రతి వార్డు నుండి ఒక సభ్యుడ్ని లాటరీ పద్ధతిపై ఎన్నుకునేవారు. ఈ సభ్యులను గ్రామసభ ఉపసంఘాలుగా నియమించేది. చెరువులు, సత్రాలు, ఆలయాలు, తోటలు, పాఠశాలలు, నేర విచారణ, పన్నుల వసూలు మొదలైన వాటికి ప్రత్యేక ఉపసంఘాలుండేవి. “పంచదార వారియం” అనే ఉపసంఘం మిగిలిన సంఘాల కార్యక్రమాలను పరిశీలించేది.

అర్హతలు: గ్రామసభలోని సభ్యుల అర్హతలను గురించి ప్రత్యేక నిబంధనావళిని రూపొందించి అమలు చేశారు. సభ్యులుగా ఎన్నుకోబడుటకు ఒక వ్యక్తికి కొన్ని అర్హతలుండాలి. అతడు:

  1. 30 నుండి 70 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వుండాలి,
  2. విద్యావంతుడై వుండాలి,
  3. సొంత ఇల్లు కలిగి భూమికి యజమానై వుండాలి.

అనర్హతలు: గ్రామసభ సభ్యులకు కొన్ని అర్హతలతో పాటు కొన్ని అనర్హతలు కూడా నిర్దేశించారు. గ్రామసభకు ఎన్నుకోబడదలచుకున్న వ్యక్తి:

  1. పంచ మహాపాపాలు చేసినవాడై ఉండకూడదు,
  2. గత మూడు సంవత్సరాలుగా ఏ ఉపసంఘంలోను సభ్యుడిగా ఉండరాదు,
  3. ఒకసారి సభ్యుడిగా ఉండి లెక్కలను సరిగా అప్పగించని వాడు కూడా అనర్హుడే,
  4. నేరస్తులు వారి బంధువులు కూడా ఈ ఎన్నికల్లో పాల్గొనకూడదు.

గ్రామ సభ అధికారాలు: గ్రామంలోని భూములపై యాజమాన్యపు హక్కు సభకు ఉన్నది. పన్నులను విధించుట, అడవులను నరికించి కొత్త భూములను సాగులోకి తీసుకువచ్చుట మొదలగునవి ఈ సభ ముఖ్య విధులు. వీటితోపాటు భూమి, నీటి తగవులను పరిష్కరించుట, నేరాలను విచారించుట కూడా దీని విధులుగా చెప్పుకోవచ్చు. అయితే ఆదాయ వనరులు తక్కువ కావటంతో కేంద్ర ప్రభుత్వమే రహదారులు నిర్మించగా వాటిపై అజమాయిషీని సభ నిర్వహించేది. గ్రామసభలకు సలహాలివ్వటానికి అధికారులుండేవారు. కేంద్ర ప్రభుత్వము యొక్క అనవసర జోక్యము ఈ సభలలో ఉండేది కాదు.

ముగింపు: చోళుల గ్రామ పాలన సమర్థవంతమైనది, ఆదర్శవంతమైనది. చోళులు గ్రామ పరిపాలనను ఏర్పరచి అందులో ప్రజలను భాగస్వాములను చేయటం వల్ల పాలనలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సమన్వయం సాధ్యపడింది.

ప్రశ్న 7.
మొదటి రాజేంద్రుని విజయాలను చర్చించండి.
జవాబు.
మొదటి రాజేంద్రుడు (క్రీ.శ. 1014-1044): రాజరాజు తరువాత చోళ సింహాసనాన్ని అధిష్టించినవాడు అతని కుమారుడు రాజేంద్ర చోళుడు. ఇతడు తండ్రిని మించిన శూరుడుగా కీర్తి ప్రతిష్టలను పొందాడు. అతడు తండ్రివలెనే దిగ్విజయ యాత్రలు సాగించి సామ్రాజ్య వ్యాప్తికి పాటుపడ్డాడు. మొదట పాండ్య, చేర రాజ్యములను జయించాడు. ఆ తరువాత సింహళముపై నౌకాదండయాత్రలు సాగించి దానినంతటిని జయించి తన ఆధిపత్యము క్రిందకు తెచ్చాడు. చాళుక్యరాజ్యంలో జరిగిన వారసత్వ యుద్దాల్లో వేంగి చాళుక్యుల పక్షాన నిలిచి రాజరాజ నరేంద్రునకు సహాయం చేశాడు. రాజరాజనరేంద్రునికి తన కుమార్తె అమ్మంగదేవినిచ్చి వివాహం చేశాడు. తరువాత గంగానది వరకు దండయాత్రలు చేసి, బెంగాల్ పాలవంశీయుడైన మహీపాలుని ఓడించి “గంగైకొండచోళ” అను బిరుదు ధరించాడు. ఈ విజయానికి గుర్తుగా “గంగైకొండ చోళపురము” అను నగరాన్ని నిర్మించి దానిని తన రాజధానిగా చేసుకున్నాడు. తరువాత గొప్ప నౌకాబలమును రూపొందించుకొని జావా, సుమత్రా ప్రాంతములను పాలించే శ్రీవిజయ సామ్రాజ్యాధినేతయైన సంగ్రామ విజయోత్తుంగవర్మను ఓడించి, అతని రాజధాని కడారం స్వాధీనం చేసుకొన్నాడు. ఈ విజయమునకు చిహ్నంగా “కడారంకొండ” అనే బిరుదును ధరించాడు. ఇట్టి దిగ్విజయముల వలన రాజేంద్రచోళుడు భారతదేశ సుప్రసిద్ధ పాలకులలో ఒకడుగా కీర్తిని పొందాడు. ఇతడు తన తండ్రివలె గొప్ప పరిపాలనాదక్షుడు. వ్యవసాయాభివృద్ధి కొరకు అనేక నీటివనరులను ఏర్పరచాడు. వైదిక కళాశాలను స్థాపించి, దాని పోషణకు కొంత భూభాగమును దానము చేశాడు. ఇతడు గొప్ప భవన నిర్మాత. ప్రజాసంక్షేమ పాలన సాగించి, “తండ్రిని మించిన తనయుడు” అనే కీర్తిని పొందాడు. ఇతడు శిల్పకళను ఆదరించాడు. గంగైకొండ చోళపురంలో ఒక శివాలయాన్ని నిర్మించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 7 దక్షిణ భారతదేశ రాజ్యాలు

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బాదామి చాళుక్యుల వంశపతనానికి దారితీసిన కారణాలు చర్చించండి.
జవాబు.
బాదామి చాళుక్య వంశరాజుల్లో రెండో కీర్తివర్మ సింహాసనం అధిష్టించాడు. ఇతడు క్రీ.శ. 746 757 మధ్యకాలంలో పాలనచేసాడు. పల్లవ – చాళుక్య సంఘర్షణవల్ల బాదామి చాళుక్యరాజ్యం బలహీనమైంది. ఆర్థికంగా, సైనికంగా చాలా శక్తి నశించింది. సామంతులు ఎదురుతిరిగారు. రాష్ట్రకూటులు దంతిదుర్గుని నేతృత్వంలో స్వతంత్ర్యం ప్రకటించుకున్నారు. దంతిదుర్గుడు ముఖాముఖి యుద్ధంలో రెండో కీర్తివర్మను ఓడించాడు. ఈ విధంగా దక్షిణభారతదేశ చరిత్రలో బాదామిచాళుక్యుల పాలన ముగిసింది.

ప్రశ్న 2.
చాళుక్యుల వాస్తుశిల్పకళ లక్షణాలను వివరించండి.
జవాబు.
చాళుక్యరాజులు గొప్ప వాస్తు – శిల్పకళ, సాహిత్య అభిమానులు. వీరికాలంలో అనేక భారీ దేవాలయాల నిర్మాణం జరిగింది. రాజుల పోషణలో వాస్తు – శిల్పులు సుందరమైన, భారీ దేవాలయాలను బాదామి, ఐహోలు, పట్టడకల్, ఆలంపూర్ మొదలైన ప్రదేశాల్లో నిర్మించారు. దేవాలయం, గుడి సామాజిక – సాంస్కృతిక కార్యకలాపాలకు కేంద్రమైంది. ఇక్కడ నిర్మించిన దేవాలయాల్లోని స్తంభాలు, విగ్రహాలు ఆనాటి శిల్పుల చాతుర్యానికి, శిల్పకళావైభవానికి నిదర్శనం. వీరి శిల్పకళారీతులచే ‘చాళుక్య శిల్పకళారీతి’ అని వర్ణించారు.

ప్రశ్న 3.
మొదటి రాజాధిరాజు సాధించిన విజయాలను చర్చించండి.
జవాబు.
మొదటి రాజాధిరాజు, మొదటి రాజేంద్రచోళుని కుమారుడు. ఇతని 11 ఏండ్ల పాలనంతా పొరుగు రాజ్యాలతో యుద్ధాల్లో గడిసింది. క్రీ.శ. 1052లో జరిగిన భీకర ‘కొప్పం’ యుద్ధంలో చాళుక్యరాజ్య సైన్యాలచేతిలో మొదటి రాజాధిరాజు ప్రాణాలు కోల్పోయాడు. ఇతని అనంతరం సోదరుడైన రెండో రాజేంద్రుడు సింహాసనం అధిష్టించాడు. కుడాల్ సంగం యుద్ధంలో (క్రీ.శ. 1062) ఇతడు మొదటి సోమేశ్వరున్ని ఓడించాడు.

ప్రశ్న 4.
ఐహోల్ శాసనం ప్రాధాన్యతను వివరించండి.
జవాబు.
ఐహోల్ కర్ణాటక రాష్ట్రములో ఉన్నది. ఈ ప్రదేశంలో పశ్చిమ చాళుక్యరాజు రెండవ పులకేశి యొక్క సేనాని రవికీర్తి వేయించిన ఐహోల్ శాసనం ఉంది. ఈ శాసనంలో రెండవ పులకేశి యొక్క దిగ్విజయ యాత్ర, హర్షునిపై అతని విజయం వర్ణించబడ్డాయి. ఐహోల్లో పశ్చిమ చాళుక్యుల కాలం నాటి దేవాలయాలున్నాయి.

ప్రశ్న 5.
మహాబలిపురంలోని రాతి ఆలయాలను (Rock-cut) వివరించండి.
జవాబు.
మహేంద్రవర్మ – I కాలంనుంచే పల్లవరాజ్యంలో శిల్పులు కొండలను తొలిచి ఆలయాలను నిర్మించారు. వీటినే ‘గుహాలయాలు’ లేదా మండపాలు అని వర్ణిస్తారు. మొదటి మహేంద్రవర్మకాలంలో నిర్మించిన ప్రసిద్ధ గుహాలయాల్లో. పేర్కొనదగినవి ‘పల్లవరం’ దళవనూర్ లో కట్టించిన ‘పంచపాండవ గుహాలయాలు’, ‘మల్లేశ్వరాలయం’ పేర్కొనదగినవి. మొదటి వర్మ స్వయంగా తాను ఎలాంటి ఇటుకలను, వెదురును, లోహాన్ని ఉపయోగించకుండా త్రిమూర్తి ఆలయాన్ని నిర్మించినట్లు తన ‘మండగపట్టుశాసనంలో పేర్కొన్నాడు. ఈ ఆలయంలో సువిశాల మండపాలు, విశాలమైన స్తంభాలపై నిర్మించాడు. స్తంభాలను చెక్కడంలో ఆనాటి శిల్పులు చూపిన ప్రతిభ అద్భుతమనీ వాస్తు శిల్ప పండితుల అభిప్రాయం.

TS Inter 1st Year History Study Material Chapter 7 దక్షిణ భారతదేశ రాజ్యాలు

ప్రశ్న 6.
అమోఘవర్షుని విజయాలను చర్చించండి.
జవాబు.
రాష్ట్రకూట పాలకుల్లో మొదట అమోఘవర్షుడు గొప్ప పాలకుడు. ఇతని పాలనాకాలం క్రీ.శ.814 – 878. ఇతడు మూడవ గోవిందుడి కుమారుడు. అతడు స్థానిక పాలకుల, సామంతుల తిరుగుబాట్లు అణచివేశాడు. అతడు వేంగి పాలకుడు విజయాదిత్యుడితో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. గంగరాజును ఓడించాడు. అతడు స్వయంగా గొప్ప కవి, కవి పండిత పోషకుడు. కన్నడంలో ‘కవిరాజ మార్గం’ అనే వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు. ‘మంఖేడ్’ అనే నూతన రాజధాని నగరాన్ని నిర్మింపజేశాడు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 5 కోకిలా! ఓ కోకిలా !!

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material 5th Poem కోకిలా! ఓ కోకిలా !! Textbook Questions and Answers.

TS Inter 2nd Year Telugu Study Material 5th Poem కోకిలా! ఓ కోకిలా !!

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
కోకిల స్వభావాన్ని వర్ణించండి. (V.Imp)
జవాబు:
కోకిల గానం భగవద్గీతలా ఆనందాన్ని, జాతీయగీతమైన జనగణమన లాగ ఉత్సాహాన్ని కలిగిస్తున్నది. ఏ కరెంటు స్తంభం పైననో, ఏ` ఏడంతస్తుల మేడపైననో కనబడకుండా ఉంది. కోకిలను కళాకారులకు ప్రతీకగా తీసుకొని ఆధ్యాత్మికతను, దేశభక్తిని ప్రబోధించే కళాకారులు కనబడకుండా ఉన్నారని కవి భావించాడు. కొందరు కళాకారులు ఏడంతస్తుల మేడలో రాజభోగాలు అనుభవిస్తుంటే మరికొందరు డబ్బులేక పేదరికంలో ఉన్నారని ధ్వనింప జేశాడు. ఈ పట్టపగలు, మండుటెండలో కోకిల పాడుతున్న పాటతో కవి గుండె కరిగింది.

ఎంతో హడావిడిగా ఉండే ఈ కోఠీ సెంటర్లో ఎవరో కోటిమందిలో ఒకడు కవి వంటి వాడికి తప్ప పాట వినే అంత ఖాళీ సమయం ఎవరికి ఉంది ? కోకిల ఎవరో వన్స్ మోర్ అని అన్నట్లు పాడిన పాటనే మళ్ళీ మళ్ళీ పాడుతుంది. ఆహా ఓహో అనే పొగడ్తల మాటలే తప్ప డబ్బు ఎవరూ ఇవ్వరే అని చెప్తున్నాడు కవి. కళాకారులకు చప్పట్లు తప్ప నగదు బహుమతులు, ప్రోత్సాహాలు ఉండడం లేదని భావం.

కోకిల కుహు కుహు అని పాడినప్పుడల్లా ఒక మినీ కవిత వెలువడ్డట్లు అనిపిస్తుంది. అంటే కోకిల చేసిన ప్రతీ శబ్దంలో ఒక కొత్త అర్థం స్ఫురిస్తుందని భావం. కోకిల గొంతు ఒక మధురమైన కవితల క్యాసెట్ లాగ అనిపిస్తుందని కవి చెప్పాడు. కొత్తగా వృత్తిలోకి వచ్చిన బిచ్చగాడు సమయ సందర్భాలు తెలియకుండా అడుక్కున్నట్లు ఎందుకోసం పాడుతున్నావు. సంవత్సరకాలం పాటు పాటించిన మౌనవ్రతానికి ఈ రోజు ముగింపు పలుకుతున్నావా? అని కవి కోకిలను అడిగాడు. నిజమే నోరు మూసుకొని కూర్చొంటే ఎవరూ గుర్తించరు.

కవులు మాత్రమె కోకిల గానంలోని మాధుర్యాన్ని తమ కవితల్లో నింపుకోవాలని చూస్తారని కూడా అన్నాడు. చిలకల్లా, హంసల్లా, నెమలిలాగా అందంగా ఉంటే ఏ దేవుడైన వాహనంగా ఉపయోగించుకుంటాడు కాని నల్లగా ఉన్న వారిని సమాజం గుర్తించదు అని కవి అన్నాడు.

కోకిలా ఎవరో వచ్చి సన్మానాలు చేయాలనే కోరిక నీకు లేదనే విషయం కవికి తెలుసు. కోకిలకు సూర్యుడు చూపిన మార్గం మాత్రమే తెలుసు కాని పైరవీలు చేసి సన్మానాలు పొందే దారి తెలియదు అని కవి అన్నాడు. అంటే కొంతమంది కళాకారులు పైరవీల ద్వారా గుర్తింపును పొందుతున్నారని ఆ గుర్తింపు కోసమే ప్రదర్శనలు చేస్తారని చెప్తున్నాడు. కోకిల అలా కాకుండా తనకు దేవుడు ఇచ్చిన కళను నిస్వార్థంగా ప్రదర్శిస్తుందని తెలిపాడు.

కోకిల చేదుగా ఉండే మామిడి లేత చిగుళ్లను తిన్నందుకే ఇంతమందికి ఆనందాన్ని కలిగించే విధంగా మధురంగా పాడుతుంది. కాని మానవులు మాత్రం తియ్యని మామిడి పళ్ళను తిని కూడా మనసులకు బాధకలిగించే మాటలనే మాట్లాడుతున్నారు. తినే తిండిలో కాకుండా నేర్చుకునే సంస్కారంలోనే మానవుల మాట తీరు ఉంటుందని కవి చెప్పాడు.

కోకిల చార్మినార్ పైనా, నౌబత్ పహాడ్ పైన గల బిర్లామందిర్ పైనా స్వేచ్ఛగా వాలగలదు. మత విద్వేషాల రక్తాలు పారే ప్రదేశంలో కూడా రాగాలతో అనురాగాలను పంచగలదు. కుల మతాల భేదం పాటించని కోకిల సామాజిక సమానతను ఎవరూ అర్థం చేసుకోరు. అందరూ సమానము అని చెప్పే మంచి మాటలు ఎవరికీ నచ్చవు. దాని కారణంగా పెంచి పోషించిన వారి ద్వారానే దూరం కొట్టబడ్డ పేదరాలు కోకిల అని కవి అంటున్నాడు. కోకిలలకు గూడు నిర్మించుకోవడం తెలియదు అది తన గుడ్లను కాకి గూటిలో పెడితే కాకి ఆ గుడ్లను పొదిగి పిల్లను చేస్తుంది.

కోకిల పెరిగి శబ్దం చేసినప్పుడు అది తనపిల్ల కాదని కాకి దానిని వెళ్లగొడుతుంది. అదే విధంగా తమ జాతి, తమ కులం, తమ మతం కాదు అని అనేకమంది మంచివారిని దూరం చేసుకుంటున్నారని కవి ఆవేదనను వ్యక్తం చేశాడు. ఓ కోకిలా ఆ పక్కకు చూడు. ఆ పెద్దకోకిలకు నీ మీద ఎంత ద్వేషం ఉందొ నీతో పోటీ పెట్టుకున్నట్లు నువ్వు ఎలా కూస్తే అది కూడా అలాగే కూస్తుంది. తెలివితేటలకు కులభేదాలు లేనట్టే ఈర్ష్యాద్వేషాలకు వయస్సు భేదం లేదు అని కవి చెప్పాడు. ఒక స్థాయిలో ఉన్న కళాకారులు వెనుక వస్తున్న కొత్త తరం కళాకారులను ఎదగనివ్వడం లేదని కవి భావన. దీనిలో కోకిల స్వభావాన్ని కవి కనపర్తి రామచంద్రాచార్యులు వర్ణించారు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 5 కోకిలా! ఓ కోకిలా !!

ప్రశ్న 2.
కోకిలకు సమాజానికి ఉన్న సంబంధాన్ని వివరించండి.
జవాబు:
కోకిల భగవద్గీతలా ఆనందాన్ని, జాతీయగీతమైన జనగణమన లాగ ఉత్సాహాన్ని సమాజానికి కలిగిస్తుంది. పట్టపగలు, మండుటెండలో కోకిల పాడుతున్న పాటతో కవి గుండెను కరిగించింది. ఎంతో హడావిడిగా ఉండే ఈ కోరీ సెంటర్ లో ఎవరో కోటిమందిలో ఒకడు తప్ప పాట వినే అంత ఖాళీ సమయం ఎవరికి ఉంది ? ఆర్థిక సంపాదనపైన ఉన్న శ్రద్ధ మనసులకు ఆనందాన్ని కలిగించే కళలను ఆస్వాదించడంపై లేదని భావం.

ఈ నగర జనాల్లో ఎవరి తొందర వారికి ఉంది. ఎవరి పనులు వారికి ఉన్నాయి. ఇష్టం ఉన్నా లేకున్నా వేగంగా వెళ్ళాల్సిన స్థితిలో ఉన్నారు. అందరూ ఒకరిని తొక్కి పైకి రావాలని ఆశిస్తున్నవారే. అందరూ తమ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న వారిని అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నవారే. కోకిల ఎవరో వన్స్ మోర్ అని అన్నట్లు పాడిన పాటనే మళ్ళీ మళ్ళీ పాడుతున్నావు. ఆహా ఓహో అనే పొగడ్తల మాటలే తప్ప డబ్బు ఎవరూ ఇవ్వరే అని చెప్తున్నాడు కవి. కళాకారులకు చప్పట్లు తప్ప నగదు బహుమతులు, ప్రోత్సాహాలు ఉండడం లేదని భావం.

కోకిల నువ్వు కుహు కుహు అని పాడినప్పుడల్లా ఒక మినీ కవిత వెలువడ్డట్లు అనిపిస్తుంది. కోకిల శబ్దంలో ఒక కొత్త అర్థం స్ఫురిస్తుందని భావం. కోకిల గొంతు ఒక మధురమైన కవితల క్యాసెట్ లాగ అనిపిస్తుందని కవి చెప్పాడు. కొత్తగా వృత్తిలోకి వచ్చిన బిచ్చగాడు సమయ సందర్భాలు తెలియకుండా అడుక్కున్నట్లు ఇందుకోసం ఈ సమయంలో సంవత్సరకాలం పాటు పాటించిన మౌనవ్రతానికి ఈ రోజు ముగింపు పలుకుతున్నట్లు కోకిలను అడిగాడు.

నిజమే నోరు మూసుకొని కూర్చొంటే ఎవరూ గుర్తించరు. కవులు మాత్రమె కోకిల గానంలోని మాధుర్యాన్ని తమ కవితల్లో నింపుకోవాలని చూస్తారు. చిలకల్లా, హంసల్లా, నెమలిలాగా అందంగా ఉంటే ఏ దేవుడైన వాహనంగా ఉపయోగించుకుంటాడు కాని నల్లగా ఉన్న నిన్ను సమాజం గుర్తించదు అని కవి అన్నాడు.

కోకిలకు ఎవరో వచ్చి సన్మానాలు చేయాలనే కోరిక లేదనే విషయం నాకు తెలుసు. కోకిలకు సూర్యుడు చూపిన మార్గం మాత్రమె తెలుసు కాని పైరవీలు చేసి సన్మానాలు పొందే దారీ తెలియదు అని కవి అన్నాడు. కోకిల చేదుగా ఉండే మామిడి లేత చిగుళ్లను తిన్నందుకే నువ్వు ఇంతమందికి ఆనందాన్ని కలిగించే విధంగా మధురంగా పాడుతున్నది. మానవులు మాత్రం తియ్యని మామిడి పళ్ళను తిని కూడా మనసులకు బాధకలిగించే మాటలనే మాట్లాడుతున్నారు.

తినే తిండిలో కాకుండా నేర్చుకునే సంస్కారంలోనే మానవుల మాట తీరు ఉంటుందని కవి చెప్పాడు. కోకిలకు ఇల్లు వాకిలి వంటి ఆస్తులు లేవు, బరువు బాధ్యతలు అసలే లేవు. మనుషుల లాగ బస్సులకోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఆకులు అలములు ఇలా ఏది దొరికితే అదే తినుకుంటూ సంతృప్తిగా జీవిస్తుంది.

కోకిల చార్మినార్ పైనా, నౌబత్ పహాడ్ పైన గల బిర్లామందిర్ పైనా స్వేచ్ఛగా వాలగలదు. మత విద్వేషాల రక్తాలు పారే ప్రదేశంలో కూడా రాగాలతో అనురాగాలను పంచుతావు. కుల మతాల భేదం పాటించని సామాజిక సమానతను ఎవరూ అర్థం చేసుకోరు. అందరూ సమానము అని చెప్పే కోకిల మంచి మాటలు ఎవరికీ నచ్చవు. దాని కారణంగా కోకిలను పెంచి పోషించిన వారి ద్వారానే దూరం కొట్టబడ్డ పేదరాలివి అని కవి అంటున్నాడు.

పెద్దకోకిలకు నీ మీద ఎంత ద్వేషం ఉందో కోకిలతో పోటీ పెట్టుకున్నట్లు నువ్వు ఎలా కూస్తే అది కూడా అలాగే కూస్తుంది. తెలివితేటలకు కులభేదాలు లేనట్టే ఈర్ష్యాద్వేషాలకు వయస్సు భేదం లేదు అని కవి చెప్పాడు. ఒక స్థాయిలో ఉన్న కళాకారులు వెనుక వస్తున్న కొత్త తరం కళాకారులను ఎదగనివ్వడం లేదని కవి భావన.

నీ కళకు గుర్తింపు లేని ఈ పట్నంలో ఎందుకు ఉండటం ? నాతో మా పల్లెకు పోదాం రా. అక్కడ ప్రతీచెట్టు నీకు కట్టని వేదికలాగా, పైరగాలి పెట్టని మైకులాగా అబద్దాలు, మోసాలు తెలియని పల్లెజనం నీ కళను ఆస్వాదించే శ్రోతలుగా ఉంటారని కవి చెప్పాడు. అంటే పట్నాలలో భారీ వేదికలు, మైకులు, హంగులు, ఆర్భాటాలు అన్నీ ఉన్నా ఆ కళను ఆస్వాదించే శ్రోతలు లేరని, ఆ లోటు పల్లెటూరిలో తీరుతుందని భావం.

ఆ పల్లెటూరికి వెళ్లి ప్రతీకొమ్మను తన గానమాధుర్యంతో పరవశించే విధంగా, ప్రతీ చెట్టు తన కమ్మని గానంతో నిండిపోవాలని, ప్రతీ హృదయం, ప్రతీ ఇల్లు తన మధురమైన పాటలతో నిండాలని కవి సూచించాడు. అంటే కళకు గుర్తింపు ఉన్న దగ్గరే కళాకారుడు ఉండాలని కవి సూచన. ఇలా కోకిలకు సమాజానికి సంబంధం ఉందని కనపర్తి రామచంద్రాచార్యులు వివరించాడు.

II సంగ్రహరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
కోకిల ఎక్కడ ఉంది ? దాని పాటకు స్పందన ఎలా ఉంది ? (V.Imp) (M.P)
జవాబు:
కోకిల భగవద్గీతలా ఆనందాన్ని, జాతీయగీతమైన జనగణమనలాగ ఉత్సాహాన్ని కలిగిస్తున్నది. ఏ కరెంటు స్తంభం పైననో, ఏ ఏడంతస్తుల మేడపైననో కనబడకుండా ఉంది. కోకిలను కళాకారులకు ప్రతీకగా తీసుకొని ఆధ్యాత్మికతను, దేశభక్తిని ప్రబోధించే కళాకారులు కనబడకుండా ఉన్నారని కవి భావించాడు.

ఈ పట్టపగలు, మండుటెండలో కోకిల పాడుతున్న పాటతో కవి గుండెను కరిగించింది. ఎంతో హడావిడిగా ఉండే కోరీ సెంటర్ లో ఎవరో కోటి మందిలో ఒకడికి తప్ప కోకిల పాట వినే అంత ఖాళీ సమయం ఎవరికి ఉంది ? ఆర్థిక సంపాదనపైన ఉన్న శ్రద్ధ మనసులకు ఆనందాన్ని కలిగించే కళలను ఆస్వాదించడంపై లేదని అందుకే స్పందన తక్కువగా ఉందని కనపర్తి రామచంద్రాచార్యులు చెప్పాడు.

ప్రశ్న 2.
కోకిల పాట ఎలా అనిపిస్తుంది ? అది ఏం చేస్తున్నట్టుంది ?
జవాబు:
కోకిల కుహు కుహు అని పాడినప్పుడల్లా ఒక మినీ కవిత వెలువడ్డట్లు అనిపిస్తుంది. అంటే కోకిల చేసే ప్రతీ శబ్దంలో ఒక కొత్త అర్థం స్ఫురిస్తుందని భావం. కోకిల గొంతు ఒక మధురమైన కవితల క్యాసెట్ లాగ అనిపిస్తుందని కవి చెప్పాడు. కొత్తగా వృత్తిలోకి వచ్చిన బిచ్చగాడు సమయ సందర్భాలు తెలియకుండా అడుక్కున్నట్లు ఇందుకోసం ఈ సంవత్సరం పాటు పాటించిన మౌనవ్రతానికి ఈ రోజు ముగింపు పలుకుతున్నట్లు అనిపించిందని కోకిలను అడిగాడు.

ప్రశ్న 3.
కోకిల మార్గము, సంస్కారము ఎలాంటిది ?
జవాబు:
కోకిలకు ఎవరో వచ్చి సన్మానాలు చేయాలనే కోరిక లేడు. కోకిలకు పైన ఉన్న సూర్యుడు చూపిన మార్గం మాత్రమె తెలుసు కాని పైరవీలు చేసి సన్మానాలు పొందే దారి తెలియదు. అంటే కొంతమంది కళాకారులు పైరవీల ద్వారా గుర్తింపును పొందుతున్నారని ఆ గుర్తింపు కోసమే ప్రదర్శనలు చేస్తారని కనపర్తి రామచంద్రాచార్యులు చెప్తున్నాడు. కోకిల అలా కాకుండా తనకు దేవుడు ఇచ్చిన కళను నిస్వార్థంగా ప్రదర్శిస్తుందని తెలిపాడు.

కోకిల చేదుగా ఉండే మామిడి లేత చిగుళ్లను తిన్నందుకే ఇంతమందికి ఆనందాన్ని కలిగించే విధంగా మధురంగా పాడుతున్నది. మానవులు మాత్రం తియ్యని మామిడి పళ్ళను తిని కూడా మనసులకు బాధకలిగించే మాటలనే మాట్లాడుతున్నారు. తినే తిండిలో కాకుండా నేర్చుకునే సంస్కారంలోనే మానవుల మాట తీరు ఉంటుందని కవి చెప్పాడు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 5 కోకిలా! ఓ కోకిలా !!

ప్రశ్న 4.
పట్టణంలో విహరిస్తూ కోకిల ఏం చేస్తుంది ?
జవాబు:
కోకిల చార్మినార్ పైనా, నౌబత్ పహాడ్ పైన గల బిర్లామందిర్ పైనా స్వేచ్ఛగా వాలగలదు. మత విద్వేషాల రక్తాలు పారే ప్రదేశంలో కూడా రాగాలతో అనురాగాలను పంచగలదు. కుల మతాల భేదం పాటించని సామాజిక సమానతను ఎవరూ అర్థం చేసుకోరు. అందరూ సమానము అని చెప్పే కోకిల మంచి మాటలు ఎవరికీ నచ్చవు. దాని కారణంగా కోకిలను పెంచి పోషించిన వారి ద్వారానే దూరం కొట్టబడ్డ పేదరాలు అని కవి అంటున్నాడు.

కోకిలలకు గూడు నిర్మించుకోవడం తెలియదు అది తన గుడ్లను కాకి గూటిలో పెడితే కాకి ఆ గుడ్లను పొదిగి పిల్లను చేస్తుంది. కోకిల పెరిగి శబ్దం చేసినప్పుడు అది తనపిల్ల కాదని కాకి దానిని వెళ్లగొడుతుంది. అదే విధంగా తమ జాతి, తమ కులం, తమ మతం కాదు అని అనేకమంది మంచివారిని దూరం చేసుకుంటున్నారని కవి ఆవేదనను వ్యక్తం చేశాడు.

III ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కనపర్తి రాసిన కోకిల కవిత ఏ కావ్యంలోనిది ?
జవాబు:
నైమిశారణ్యం కవితా సంపుటి లోనిది

ప్రశ్న 2.
కనపర్తికి ఉన్న బిరుదు ఏమిటి ?
జవాబు:
వచన కవితా ప్రవీణ

ప్రశ్న 3.
కోకిల ఎలాంటి ఉత్తేజాన్నిస్తుంది ?
జవాబు:
జాతీయ గీతం వంటి

ప్రశ్న 4.
కోకిలను ఎవరు ఆవాహన చేసుకుంటారు ?
జవాబు:
కవులు

ప్రశ్న 5.
కోకిలను ఎవరు తరిమి కొడతారు ?
జవాబు:
తనను పెంచిన వారు, కాకులు

ప్రశ్న 6.
ప్రతిభకు ఏది ఉండదు ?
జవాబు:
వర్ణ భేదం

ప్రశ్న 7.
ధవళ పారావతం అంటే ఏమిటి ?
జవాబు:
తెల్లని పావురం

ప్రశ్న 8.
కోకిలకు వేదిక ఏది ?
జవాబు:
పచ్చని చెట్టు

IV సందర్భసహిత వ్యాఖ్యలు

ప్రశ్న 1.
ఎవరికుందే నీ పాట వినే తీరిక (V.Imp) (M.P)
జవాబు:
కవి పరిచయం : వచన కవితా ప్రవీణ బిరుదాంకితుడైన కనపర్తి రామచంద్రాచార్యులు రాసిన నైమిశారణ్యం అనే కవితా సంపుటి నుండి తీసుకున్న కోకిలా ! ఓ కోకిలా !! అనే పాఠ్యభాగం లోనిది ఈ వాక్యం. రామచంద్రాచార్యులు 48 కావ్యాలు రాశాడు.

సందర్భం : పట్టపగలు, మండుటెండలో నీవు పాడుతున్న పాటతో నా గుండెను కరిగించావు. ఎంతో హడావిడిగా ఉండే ఈ కోఠీ సెంటర్లో ఎవరో కోటిమందిలో ఒకడు నా వంటి వాడికి తప్ప నీ పాట వినే అంత ఖాళీ సమయం ఎవరికి ఉంది ? అని కవి కోకిలను అడిగిన సందర్భం లోనిది ఈ వాక్యం.

అర్థం : నీ కమ్మని పాట వినే తీరిక ఎవరికి ఉంది ? అని అర్థం.

వ్యాఖ్య : ఆర్థిక సంపాదనపైన ఉన్న శ్రద్ధ మనసులకు ఆనందాన్ని కలిగించే కళలను ఆస్వాదించడంపై లేదని
భావం.

2. నీ గళమే ఒక మధుర కవితల క్యాసెట్ (V.Imp)
జవాబు:
కవి పరిచయం : వచన కవితా ప్రవీణ బిరుదాంకితుడైన కనపర్తి రామచంద్రాచార్యులు రాసిన నైమిశారణ్యం అనే కవితా సంపుటి నుండి తీసుకున్న కోకిలా! ఓ కోకిలా!! అనే పాఠ్యభాగం లోనిది ఈ వాక్యం. రామచంద్రాచార్యులు 48 కావ్యాలు రాశాడు.

సందర్భం : ఓ కోకిలా నువ్వు కుహు కుహు అని పాడినప్పుడల్లా ఒక మినీ కవిత వెలువడ్డట్లు అనిపిస్తుంది. అంటే నీ ప్రతీ శబ్దంలో ఒక కొత్త అర్థం స్ఫురిస్తుందని భావం. నీ గొంతు ఒక మధురమైన కవితల క్యాసెట్ లాగ అనిపిస్తుందని కవి చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం : నీ గొంతు మధురమైన కవితలతో కూడిన క్యాసెట్ వంటిది అని అర్థం.

వ్యాఖ్య : కోకిల ప్రతీ కూతలో కొత్త భావాలు వస్తున్నాయని భావం.

TS Inter 2nd Year Telugu Study Material Poem 5 కోకిలా! ఓ కోకిలా !!

3. ఏ దేవుళ్లు నిన్ను వాహనం చేసుకొంటారు ?
జవాబు:
కవి పరిచయం : వచన కవితా ప్రవీణ బిరుదాంకితుడైన కనపర్తి రామచంద్రాచార్యులు రాసిన నైమిశారణ్యం అనే కవితా సంపుటి నుండి తీసుకున్న కోకిలా ! ఓ కోకిలా !! అనే పాఠ్యభాగం లోనిది ఈ వాక్యం. రామచంద్రాచార్యులు 48 వ్యా రాశాడు.

సందర్భం : కొత్తగా వృత్తిలోకి వచ్చిన బిచ్చగాడు సమయం తెలియకుండా అడుక్కున్నట్లు ఎందుకోసం ఈ సమయంలో పాడుతున్నావు. సంవత్సర కాలం పాటు పాటించిన మౌనవ్రతానికి ఈ రోజు ముగింపు పలుకుతున్నావా అని కవి కోకిలను అడిగాడు. నిజమే నోరు మూసుకొని కూర్చొంటే ఎవరూ గుర్తించరు. అని సమాధానం చెప్పుకున్నాడు. కవులు మాత్రమే కోకిల గానంలోని మాధుర్యాన్ని తమ కవితల్లో నింపుకోవాలని చూస్తారని, చిలకల్లా, హంసల్లా, నెమలిలాగా అందంగా ఉంటే ఏ దేవుడైన వాహనంగా ఉపయోగించుకుంటాడు కాని నల్లగా ఉన్న నిన్ను ఏ దేవుడు వాహనంగా అగీకరిస్తాదని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం : ఉద్యోగాలు ఇచ్చేవారు కూడా శరీరపు రంగును చూస్తున్నారని వ్యంగ్య అర్థం.

వ్యాఖ్య : వాహనంగా వాడుకోవడం అంటే ఉపాధి ఉద్యోగాలను చూపడం అని భావం.

4. కల్లాకపటమెరుగని పల్లె ప్రజలే నిన్ను గుర్తించే శ్రోతలు
జవాబు:
కవి పరిచయం : వచన కవితా ప్రవీణ బిరుదాంకితుడైన కనపర్తి రామచంద్రాచార్యులు రాసిన నైమిశారణ్యం అనే కవితా సంపుటి నుండి తీసుకున్న కోకిలా! ఓ కోకిలా !! అనే పాఠ్యభాగం లోనిది ఈ వాక్యం. రామచంద్రాచార్యులు 48 కావ్యాలు రాశాడు.

సందర్భం : నీ కళకు గుర్తింపు లేని ఈ పట్నంలో ఎందుకు ఉండటం ? నాతో మా పల్లెకు పోదాం రా. అక్కడ ప్రతీచెట్టు నీకు కట్టని వేదికలాగా, పైరగాలి పెట్టని మైకులాగా అబద్దాలు, మోసాలు తెలియని పల్లెజనం నీ కళను ఆస్వాదించే శ్రోతలుగా ఉంటారని కవి చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం : అమాయకులైన పల్లె ప్రజలు కోకిల గానాన్ని ఆస్వాదిస్తారని అర్థం.

వ్యాఖ్య : పట్నాలలో భారీ వేదికలు, మైకులు, హంగులు, ఆర్భాటాలు అన్నీ ఉన్నా ఆ కళను ఆస్వాదించే శ్రోతలు లేరని, ఆ లోటు పల్లెటూరిలో తీరుతుందని భావం.

గేయ పంక్తులు – భావములు

1 నుండి 5వ పంక్తి వరకు :

భగవద్గీతలా ఉల్లాసాన్ని కల్గిస్తున్నావు ;
జాతీయగీతంలా ఉత్తేజాన్నందిస్తున్నావు;
ఏ ఎలక్ట్రికల్ స్తంభంమీద కూర్చున్నావో ?
ఏ ఏడంతస్తుల మేడమీద దాక్కున్నావో,
కోకిలా! ఓ కోకిలా!!

అరాలు:

కోకిలా! ఓ కోకిలా!! = ఇలా కోకిల సంబోధిస్తున్నాడు కవి
భగవద్గీతలా = భగవద్గీత లాగా ఉల్లాసాన్ని కల్గిస్తున్నావు: సంతోషాన్ని
జాతీయగీతంలా = జనగణమన లాగా
ఉత్తేజాన్ని + అందిస్తున్నావు = ఉత్సాహాన్ని కలిగిస్తున్నావు
ఏ ఎలక్ట్రికల్ స్తంభంమీద = యే కరెంటు స్థంభం పైన
కూర్చున్నావో ? = కూర్చున్నావో
ఏ ఏడంతస్తుల మేడమీద = యే ఏడు అంతస్తుల భవనం మీద
దాక్కున్నావో = కనబడకుండా ఉన్నావో

భావం : ఓ కోకిలా! భగవద్గీతలా ఆనందాన్ని, జాతీయగీతమైన జనగణమన లాగ ఉత్సాహాన్ని కలిగిస్తున్నావు. నువ్వు ఏ కరెంటు స్తంభం పైన, ఏ ఏడంతస్తుల మేడపైన కనబడకుండా ఉన్నావో అని కోకిలను కళాకారులకు ప్రతీకగా తీసుకొని ఆధ్యాత్మికతను, దేశభక్తిని ప్రబోధించే కళాకారులు కనబడకుండా ఉన్నారని కవి భావించాడు. కొందరు కళాకారులు ఏడంతస్తుల మేడలో రాజభోగాలు అనుభవిస్తుంటే మరికొందరు డబ్బులేక పేదరికంలో ఉన్నారని ధ్వనింప జేశాడు.

6 నుండి 10వ పంక్తి వరకు :

ఈ మధ్యాహ్నం మండుటెండలో-
నీ పాటతో నా గుండెలు తోడేస్తున్నావు !
ఈ ‘కోఠీ సెంటర్’లో ………
ఏ కోటికొక్కడో నా బోటివాడు తప్ప
ఎవరికుందే నీ పాట వినే తీరిక ? !

అర్థాలు :

ఈ మధ్యాహ్నం = ఈ పట్టపగలు
మండుటెండలో = మండుతున్న ఎండలో
నీ పాటతో = నీవు పాడే ఈ పాటతో
నా గుండెలు = నా (కవి) గుండెలు
తోడేస్తున్నావు! = కరిగిస్తున్నావు
ఈ కోఠీ సెంటర్’లో = చాలా బిజీ గా ఉండే కోఠీ సెంటర్లో
ఏ కోటికి +ఒక్కడు +ఓ = కోటి మందిలో ఒక్కడు
నా బోటివాడు తప్ప = నా వంటి వాడు తప్ప
నీ పాట వినే తీరిక ?! = నీ పాట వినే అంత ఖాళీ సమయం
ఎవరికి + ఉందే = ఎవరికి ఉంది.

భావం : ఈ పట్టపగలు, మండుటెండలో నీవు పాడుతున్న పాటతో నా గుండెను కరిగించావు. ఎంతో హడావిడిగా ఉండే ఈ కోఠీ సెంటర్లో ఎవరో కోటిమందిలో ఒకడు నా వంటి వాడికి తప్ప నీ పాట వినే అంత ఖాళీ సమయం ఎవరికి ఉంది ? ఆర్థిక సంపాదనపైన ఉన్న శ్రద్ధ మనసులకు ఆనందాన్ని కలిగించే కళలను ఆస్వాదించడంపై లేదని భావం.

TS Inter 2nd Year Telugu Study Material Poem 5 కోకిలా! ఓ కోకిలా !!

10 నుండి 16వ పంక్తి వరకు :

ఎవడి తొందర వాడిది.
ఎవరి పనులు వారివి;
రొప్పుకుంటూ, రోజుకుంటూ-
అంతా పరుగెత్తే వాళ్ళే !
త్రొక్కుకుంటూ, త్రోసుకుంటూ-
అంతా ఎక్కివెళ్లే వాళ్లే !

అర్థాలు :

ఎవడి తొందర వాడిది = ఈ ప్రజల్లో ఎవరి వేగిరపాటు వాళ్లకు ఉంది
ఎవరి పనులు వారివి = ఎవరి పనులు వారికి ఉన్నాయి
రొప్పుకుంటూ = వేగంగా నడవడం వల్ల వచ్చే అధిక శ్వాస
రోజుకుంటూ = ఆయాసపడుతూ (ఇష్టం లేకున్నా)
అంతా పరుగెత్తే వాళ్ళే = అందరూ వేగంగా వెళ్ళే వారే
త్రొక్కుకుంటూ = ఒకరినొకరు తొక్కుతూ (బలవంతులు బలహీనులను తొక్కుతున్నారు)
త్రోసుకుంటూ = మరొకరిని తోసేస్తూ (అభివృద్ధి మార్గంలో అడొచ్చిన వారిని తోసేస్తున్నారు)
అంతా ఎక్కివెళ్లే వాళ్లే != అందరూ ఎదో ఒక వాహనం ఎక్కి వెళ్ళే వారే (అందరూ ఇతరుల పై అధికారాన్ని ప్రదర్శించాలని ఆలోచించే వారే)

భావం : ఈ నగర జనాల్లో ఎవరి తొందర వారికి ఉంది. ఎవరి పనులు వారికి ఉన్నాయి. ఇష్టం ఉన్నా లేకున్నా వేగంగా వెళ్ళాల్సిన స్థితిలో ఉన్నారు. అందరూ ఒకరిని తొక్కి పైకి రావాలని ఆశిస్తున్నవారే. అందరూ తమ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న వారిని అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నవారే.

17 నుండి 21వ పంక్తి వరకు :

అయినా ఎవరో ‘వన్స్ మోర్’ అన్నట్లు
పాడిందే పాడుతున్నావు.
‘ఆహా ఓహో’ల నోటి పదాలు తప్ప – ‘
నూటపదార్లె’వరిస్తారే నీకు ?
కోకిలా ! ఓ కోకిలా !!

అర్థాలు :

అయినా = అయిననూ
ఎవరో = ఎవరో రసికుడు
‘వన్స్ మోర్’ అన్నట్లు = మళ్ళీ పాడండి అని చెప్పినట్లుగా
పాడిందే పాడుతున్నావు = పాడిన పాటనే మళ్ళీ పాడుతున్నావు
‘ఆహా ఓహో’ల = ఆహా, ఓహో అనే పొగడ్తల మాటలు
నోటి పదాలు తప్ప = నోటినుండి వచ్చే మాటలే తప్ప
‘నూటపదార్లె’వరిస్తారే నీకు ? = నూట పదహారు రూపాయలు ఎవరు ఇస్తారు నీకు (డబ్బు ఎవరూ ఇవ్వరు అని భావం)

భావం: ఓ కోకిలా! ఎవరో వన్స్ మోర్ అని అన్నట్లు పాడిన పాటనే మళ్ళీ మళ్ళీ పాడుతున్నావు. ఆహా ఓహో అనే పొగడ్తల మాటలే తప్ప డబ్బు ఎవరూ ఇవ్వరే అని చెప్తున్నాడు కవి. కళాకారులకు చప్పట్లు తప్ప నగదు బహుమతులు, ప్రోత్సాహాలు ఉండడం లేదని భావం.

22 నుండి 25వ పంక్తి వరకు :

నువు ‘కుహూ కుహూ’ అన్నప్పుడల్లా
ఓ ‘మినీ కవిత’ రాలిపడ్డట్లనిపిస్తుంది !
నీ గళమే ఒక
“మధుర కవితల క్యాసెట్’ లా కనిపిస్తుంది !

అర్థాలు :

నువు ‘కుహూ కుహూ’ అన్నప్పుడల్లా = నువ్వు పాడుతున్నప్పుడల్లా
ఓ ‘మినీ కవిత’ = ఒక చిన్న కవిత (ప్రక్రియ)
రాలిపడ్డట్లు + అనిపిస్తుంది! = వేలువడ్డట్లు అనిపిస్తుంది
నీ గళ ఒక = నీ గొంతు ఒక
మధుర = మధురమైన
కవితల క్యాసెట్ లా = కవితలు ఉన్న టేపు రికార్డర్లో వేసి నే క్యాసెట్ లాగా
కనిపిస్తుంది! = అనిపిస్తుంది

భావం: ఓ కోకిలా నువ్వు కుహు కుహు అని పాడినప్పుడల్లా ఒక మినీ కవిత వెలువడ్డట్లు అనిపిస్తుంది. అంటే నీ ప్రతీ శబ్దంలో ఒక కొత్త అర్థం స్ఫురిస్తుందని భావం. నీ గొంతు ఒక మధురమైన కవితల క్యాసెట్ లాగ అనిపిస్తుందని కవి చెప్పాడు.

26 నుండి 29వ పంక్తి వరకు :

“కొత్త బిచ్చగాడు పొద్దెరుగ”నట్లు
ఎందుకే ఈ వేళ కూస్తున్నావు,
ఏడాదిపాటు సాగిన ‘మౌనవ్రతా’నికి
‘ఉద్యాపన’ చేస్తున్నావా ?

అర్థాలు :

కొత్త బిచ్చగాడు = కొత్తగా వృత్తిలోకి వచ్చిన బిచ్చగాడు
పొద్దెరగనట్లు = సమయ సందర్భాలు తెలియకుండా అడుక్కున్నట్లు
ఎందుకే = ఎందుకోసం
ఈ వేళ కూస్తున్నావు = ఈ సమయంలో పాడుతున్నావు
ఏడాదిపాటు సాగిన = సంవత్సరం పాటు పాటించిన
మౌనవ్రతానికి = మౌనంగా ఉండటం అనే వ్రతానికి
‘ఉద్యాపన’ చేస్తున్నావా? = ఈ రోజు ముగింపు పలుకుతున్నావా ?

భావం : కొత్తగా వృత్తిలోకి వచ్చిన బిచ్చగాడు సమయ సందర్భాలు తెలియకుండా అడుక్కున్నట్లు ఎందుకోసం ఈ సమయంలో సంవత్సరకాలం పాటు పాటించిన మౌనవ్రతానికి ఈ రోజు ముగింపు పలుకుతున్నావా అని కవి కోకిలను అడిగాడు.

30 నుండి 37వ పంక్తి వరకు :

ఔను మరి,
నువు ‘నోరుమూసు’క్కూర్చుంటే
ఎవరునిన్ను గుర్తిస్తారు ?
మా కవులు ‘ఆవాహనం’ చేసుకోవడం తప్ప –
చిలుకలా, హంసలా, నెమిలిలా
ఏ దేవుళ్లు నిన్ను ‘వాహనం’ చేసుకొంటారు ?
నల్లని వాళ్ల బ్రతుకు ఎప్పుడూ
ఈ సమాజంలో ఇంతే :

అర్థాలు :

ఔను మరి = నిజమే
నువు ‘నోరుమూసుకు’ + కూర్చుంటే = నువ్వు నోరుతెరవకుండా కూర్చొంటే
ఎవరునిన్ను గుర్తిస్తారు ? = ఎవరూ నిన్ను గుర్తించరు
మా కవులు = కవిత్వాన్ని చెప్పేవారు
‘ఆవాహనం’ చేసుకోవడం తప్ప = మాధుర్యాన్ని తమలో నింపుకోవాలని అనుకుంటారు తప్ప
చిలుకలా, హంసలా, నెమిలిలా = చిలుకలాగా, హంసలాగా, నెమలి లాగా
ఏ దేవుళ్లు నిన్ను ‘వాహనం’ చేసుకొంటారు ? = దేవుళ్ళెవరూ నిన్ను తమ వాహనంగా చేసుకోరు
నల్లని వాళ్ల బ్రతుకు ఎప్పుడూ = నల్లగా ఉండే వారి జీవితం ఎప్పటికి
ఈ సమాజంలో ఇంతే = ఈ సమాజం తక్కువగానే చూస్తుంది

భావం : నిజమే నోరు మూసుకొని కూర్చొంటే ఎవరూ గుర్తించరు. కవులు మాత్రమె కోకిల గానంలోని మాధుర్యాన్ని తమ కవితల్లో నింపుకోవాలని చూస్తారు. చిలకల్లా, హంసల్లా, నెమలిలాగా అందంగా ఉంటే ఏ దేవుడైన వాహనంగా ఉపయోగించుకుంటాడు కాని నల్లగా ఉన్న నిన్ను సమాజం గుర్తించదు అని కవి అన్నాడు. వాహనంగా వాడుకోవడం అంటే ఉపాధి ఉద్యోగాలను చూపడం. ఉద్యోగాలు ఇచ్చేవారు కూడా శరీరపు రంగును చూస్తున్నారని వ్యంగ్యంగా చెప్పాడు. చిలుకపలుకులు అనడంలో ఆంగ్ల విద్య ప్రభావం కనిపిస్తుంది.

TS Inter 2nd Year Telugu Study Material Poem 5 కోకిలా! ఓ కోకిలా !!

38 నుండి 42వ పంక్తి వరకు :

కోకిలా! నాకు తెలుసు
ఎవరో సన్మానించాలన్న ఆశ నీకులేదు;
పై రవి మార్గం తప్ప –
‘పైరవి’ మార్గం నీకు తెలియదు
దైవమిచ్చిన కళను గళంవిప్పి ప్రదర్శిస్తున్నావు!

అర్థాలు:

కోకిలా ! = ఓ కోకిలా
ఎవరో సన్మానించాలన్న = ఎవరో వచ్చి సన్మానాలు చేయాలనే
ఆశ నీకులేదు = కోరిక నీకు లేదని
నాకు తెలుసు = నాకు బాగా తెలుసు
పై రవి మార్గం తప్ప = పైన ఉన్న సూర్యుడు చూపిన మార్గం తప్ప
‘పైరవి’ మార్గం = పైరవీలు చేసే దారి
నీకు తెలియదు = నీకు తెలియదు
దైవమిచ్చిన కళను = దేవుడు ప్రసాదించిన కళను
గళంవిప్పి ప్రదర్శిస్తున్నావు! = నీ గొంతు విప్పి ప్రదర్శిస్తున్నావు

భావం: ఓ కోకిలా ఎవరో వచ్చి సన్మానాలు చేయాలనే కోరిక నీకు లేదనే విషయం నాకు తెలుసు. నీకు పైన ఉన్న సూర్యుడు చూపిన మార్గం మాత్రమె తెలుసు కాని పైరవీలు చేసి సన్మానాలు పొందే దారి తెలియదు అని కవి అన్నాడు. అంటే కొంతమంది కళాకారులు పైరవీల ద్వారా గుర్తింపును పొందుతున్నారని ఆ గుర్తింపు కోసమే ప్రదర్శనలు చేస్తారని చెప్తున్నాడు. కోకిల అలా కాకుండా తనకు దేవుడు ఇచ్చిన కళను నిస్వార్థంగా ప్రదర్శిస్తుందని తెలిపాడు.

43 నుండి 48వ పంక్తి వరకు :

మావి చివుళ్లు మేస్తే నే –
నీ వింత మధురంగా కూస్తున్నావు !
మావిపళ్లు తిన్నా మేము
కఱకు కూతలే కూస్తున్నాము!!
ఆహారంలో ఏముందే కోకిలా
ఆ ‘సంస్కారం’ లో ఉంది కాని !

అర్థాలు :

కోకిలా = ఓ కోకిలా
మావి చివుళ్లు = మామిడి చిగురాకులు
మేస్తేనే = తిన్నందుకే
నీవు+ఇంత మధురంగా = నీవు ఇంత సంతోషాన్ని కలిగించే విధంగా
కూస్తున్నావు ! = పాడుతున్నావు
మావిపళ్లు తిన్నా = మామిడి పళ్ళు తిని కూడా
మేము = మానవులమైన మేము
కఱకు కూతలే = = బాధకల్గించే మాటలే
కూస్తున్నాము!! = మాట్లాడుతున్నాము
ఆహారంలో ఏముందే = తినే తిండిలో ఏముంటుంది
ఆ సంస్కారంలో ఉంది కాని ! = నేర్చుకునే సంస్కారంలోనే మన మాట తీరు ఉంటుంది

భావం : ఓ కోకిలా చేదుగా ఉండే మామిడి లేత చిగుళ్లను తిన్నందుకే నువ్వు ఇంతమందికి ఆనందాన్ని కలిగించే విధంగా మధురంగా పాడుతున్నావు. మానవులమైన మేము మాత్రం తియ్యని మామిడి పళ్ళను తిని కూడా మనసులకు బాధకలిగించే మాటలనే మాట్లాడుతున్నాము. తినే తిండిలో కాకుండా నేర్చుకునే సంస్కారంలోనే మానవుల మాట తీరు ఉంటుందని కవి చెప్పాడు.

49 నుండి 56వ పంక్తి వరకు :

కోకిలా ! ఓ కోకిలా !!
నీకు ఇల్లు లేదు, వాకిలి లేదు ;
బరువు – బాధ్యతలసలే లేవు ;
నాలాగా బస్సు కోసం –
ఎదిరి చూడాల్సిన పని అంతకంటే లేదు !
‘ఆకులలములు’ మేసుకొంటూ,
హాయిగా ఆడుకొంటూ పాడుకొంటూ,
ఆకాశంలో విహరించే “రాగాల” దొరసానివి !

అరాలు:

కోకిలా ! కోలా ఓ కోలా !! = కోకిలా
నీకు ఇల్లు లేదు, వాకిలి లేదు = నీకు ఇల్లువాకిలి వంటి ఆస్తులు లేవు
బరువు బాధ్యతలు = చేయాల్సిన పనులు
అసలే లేవు; = అసలే లేవు
నాలాగా బస్సు కోసం = నా లాగ (మానవుల లాగ) బస్సుల కోసం
ఎదిరి చూడాల్సిన పని = ఎదురు చూడాల్సిన అవసరం (ఎవరిపైనా ఆధారపడవలసిన అవసరం నీకు లేదు. నీ రెక్కల కష్టాన్ని నమ్ముకున్నావని భావం)
అంతకంటే లేదు ! = అసలే లేదు
‘ఆకులలములు’ = ఆకులు అలములు (ఏది దొరికితే అదే తిని సంతోషిస్తావని అర్థం)
మేసుకొంటూ = తినుకుంటూ
హాయిగా = ఆనందంగా
ఆడుకొంటూ = ఆటలు ఆడుకుంటూ
పాడుకొంటూ = పాటలు పాడుకుంటూ
ఆకాశంలో విహరించే = ఆకాశంలో తిరిగే
“రాగాల” దొరసానివి ! = రాగాల దొరసానివి

భావం : కోకిలా నీకు ఇల్లు వాకిలి వంటి ఆస్తులు లేవు, బరువు బాధ్యతలు అసలే లేవు. మా మనుషుల లాగ బస్సులకోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఆకులు అలములు ఇలా ఏది దొరికితే అదే తినుకుంటూ సంతృప్తిగా జీవిస్తావు. ఆటలాడుతూ పాటలు పాడుతూ ఆకాశంలో తిరిగే రాగాల దొరసానివి.

57 నుండి 68వ పంక్తి వరకు :

“చార్మినార్” కొమ్ముమీద వాలుతావు,
“నౌబతపహాడ్” తొమ్ము మీద కాలూనుతావు;
మత విద్వేషాల రక్తం చిందేచోట –
సరిగమల రాగరక్తిమలారబోస్తావు !
“వర్ణ, వర్గ విభేదం” లేని
స్వేచ్ఛాపూరిత “సమతా” విహంగానివి నీవు !
నీ “జాతి సమైక్యత”ను అర్థంచేసుకోలేక,
నీ మధుర వాక్కుల్ని భరించలేక,
ఈ “కాకులు” నిన్ను తరిమికొడతాయి !
మంచి మాటలు ఎవరికి రుచిస్తాయి ?
“పెంచి పోషించే వాళ్ల” చేతనే
దూరం కొట్టబడే అభాగ్యురాలివి !

అర్థాలు :

“చార్మినార్” కొమ్ము మీద = చార్మినార్ మినార్ మీద
వాలుతావు = ఆగుతావు
“నౌబత్పహాడ్” తొమ్ము మీద = బిర్లా మందిరం పైనా
కాలూనుతావు; = కాలు పెడతావు
మత విద్వేషాల రక్తం = మతాల మధ్య విద్వేషాలు అనే రక్తం
చిందేచోట = ప్రవహించే స్థలాల్లో
సరిగమల రాగరక్తిమలు ఆరబోస్తావు ! = సరిగమలతో రాగాలు అనే అనురాగాలను పంచుతావు
“వర్ణ, వర్గ విభేదం” లేని = కులం, వర్గం అనే భేదాలు లేకుండా
స్వేచ్ఛాపూరిత = స్వేచ్ఛ కలిగిన
“సమతా” = సమానతను చాటి చెప్పే
విహంగానివి నీవు ! = పక్షివి
నీ “జాతి సమైక్యత”ను = అందరిని సమానంగా చూసే భావనను
అర్ధంచేసుకోలేక, = అర్థం చేసుకోలేని వారు
నీ మధుర వాక్కుల్ని = నీ అందమైన మాటలను
భరించలేక = భరించలేక, సహించలేక
ఈ “కాకులు” నిన్ను = లోకులు అనే కాకులు
తరిమికొడతాయి ! = తరిమి కొడుతాయి
మంచి మాటలు = మంచిని కలిగించే మాటలు
ఎవరికి రుచిస్తాయి ? = ఎవరికీ నచ్చావు అని భావం
“పెంచి పోషించే వాళ్ల చేతనే = నిన్ను పెంచిన పోషించిన వారి ద్వారానే
దూరం కొట్టబడే = దూరం కొట్టబడ్డ
అభాగ్యురాలివి ! = పేదరాలివివి

భావం : ఓ కోకిలా! నీవు చార్మినార్ పైనా, నౌబత్ పహాడ్ పైన గల బిర్లామందిర్ పైన స్వేచ్ఛగా వాలగలవు. మత విద్వేషాల రక్తాలు పారే ప్రదేశంలో కూడా నీ రాగాలతో అనురాగాలను పంచుతావు. కుల మతాల భేదం పాటించని నీ సామాజిక సమానతను ఎవరూ అర్థం చేసుకోరు. అందరూ సమానము అని చెప్పే నీ మంచి మాటలు ఎవరికీ నచ్చవు. దాని కారణంగా నిన్ను పెంచి పోషించిన వారి ద్వారానే దూరం కొట్టబడ్డ పేదరాల్సివి అని కవి అంటున్నాడు. కోకిలలకు గూడు నిర్మించుకోవడం తెలియదు అది తన గుడ్లను కాకి గూటిలో పెడితే కాకి ఆ గుడ్లను పొదిగి పిల్లను చేస్తుంది. కోకిల పెరిగి శబ్దం చేసినప్పుడు అది తనపిల్ల కాదని కాకి దానిని వెళ్లగొడుతుంది. అదే విధంగా తమ జాతి, తమ కులం, తమ మతం కాదు అని అనేకమంది మంచివారిని దూరం చేసుకుంటున్నారని కవి ఆవేదనను వ్యక్తం చేశాడు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 5 కోకిలా! ఓ కోకిలా !!

69 నుండి 75వ పంక్తి వరకు :

కోకిలా, అటుచూడు !
కోకిలా, అటుచూడు ! ఆ పెద్దకోకిలకు
నీ మీద ఎందుకే అంత ద్వేషం.
నువ్వు “కుహూ కుహూ” అంటే –
అదీ “కుహూ కుహూ” అని
నీతో పోటీపడి కూస్తుంది !
“ప్రతిభ”కు “వర్ణభేదం” లేనట్లే
“ఈర్యా-ద్వేషాలకు” “వయోభేదం” లేదు !

అర్థాలు :

కోకిలా = ఓ కోకిలా!
అటుచూడు! = ఆ వైపు చూడు
ఆ పెద్ద కోకిలకు = వయసులో పెద్దదయిన ఆ కోకిలకు
నీ మీద ఎందుకే అంత ద్వేషం = నీ మీద ఎందుకు అంత కసి
నువ్వు “కుహూ కుహూ” అంటే = నువ్వు కుహు కుహు అంటే
అదీ కుహూ కుహూ” అని = అదికూడా కుహు కుహు అంటుంది
నీతో పోటీపడి కూస్తుంది ! = నీతో పోటీ పెట్టుకున్నట్లు కూస్తుంది
“ప్రతిభ”కు = తెలివికి, ప్రజ్ఞకు
“వర్ణ భేదం” = కులమతాల భేదం
లేనట్లే = లేని విధంగానే
“ఈర్ష్యా ద్వేషాలకు” =
ఈర్ష్య ద్వేషాలకు కూడా
“వయోభేదం” లేదు ! = వయస్సులలో భేదం లేదు

భావం : ఓ కోకిలా ఆ పక్కకు చూడు. ఆ పెద్దకోకిలకు నీ మీద ఎంత ద్వేషం ఉందో నీతో పోటీ పెట్టుకున్నట్లు నువ్వు ఎలా కూస్తే అది కూడా అలాగే కూస్తుంది. తెలివితేటలకు కులభేదాలు లేనట్టే ఈర్ష్యాద్వేషాలకు వయస్సు భేదం లేదు అని కవి చెప్పాడు. ఒక స్థాయిలో ఉన్న కళాకారులు వెనుక వస్తున్న కొత్త తరం కళాకారులను ఎదగనివ్వడం లేదని కవి భావన.

76 నుండి 84వ పంక్తి వరకు :

కోకిలా ! ఓ కోకిలా !!
నీ వెంతపాడినా
నీ పాటనూ, నీ పాటునూ గుర్తించదు – ఈ “విశ్వ” విద్యాలయం !
నిన్ను గుర్తించడానికి నువ్వు – “జాతీయ పక్షివి” కాదు, “ధవళ పారావతానివీ” కాదు; ప్రజలచే మొక్కులందుకోవడానికి – పాలపిట్టవూ కాదు !
కోకిలా ! ఓ కోకిలా !!
నీవు + ఎంతపాడినా

అర్థాలు :

కోకిలా ! ఓ కోకిలా = ఓ కోకిలా
నీవు + ఎంతపాడినా = నీవు ఎంతసేపు పాడినా
నీ పాటనూ = నీ పాట మాధుర్యాన్ని
నీ పాటనూ = నీ కష్టాన్ని
ఈ “విశ్వ” విద్యాలయం ! = ఈ విశ్వం అనే విద్యాలయం
గుర్తించదు = గుర్తింపును ఇవ్వదు
నిన్ను గుర్తించడానికి నువ్వు = నిన్ను గుర్తించి గౌరవించడానికి
“జాతీయ పక్షివి” కాదు = నీవు నెమలివి కావు
“ధవళ పారావతానివీ” కాదు = తెల్లని పావురానివి కావు
ప్రజలచే మొక్కులందుకోవడానికి = ప్రజలందరిచేత పూజలు పొందడానికి
పాలపిట్టవూ కాదు ! = పాలపిట్టవూ కావు

భావం : ఓ కోకిలా! నీవు ఎంతసేపు పాడినా నీ పాటలోని మాధుర్యాన్ని గాని, ఆ పాట పాడడానికి నువ్వు పడుతున్న కష్టాన్ని గాని ఈ విశ్వమనే విద్యాలయము గుర్తించడు అని కవి అనడంలో ఈ రోజుల్లో విశ్వవిద్యాలయాల గుర్తింపు కూడా రాజకీయాలతో ముడిపడి ఉందని సూచించాడు. జాతీయ పక్షి నెమలిని, తెల్లని పావురాన్ని, పాలపిట్టలను అగ్రవర్ణాలకు లేదా డబ్బున్న వారికి ప్రతీకలుగా తీసుకొని డబ్బుద్వారా లేదా కులం ద్వారా మాత్రమే గుర్తింపు లభిస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు.

85 నుండి 97వ పంక్తి వరకు :

అందుకే – ఈ పట్నంలో ఎందుకే ?
రా, పోదాం మా పల్లెకు !
అక్కడ –
పచ్చని చెట్టే నీకు కట్టని వేదిక,
పైరగాలే నీకు పెట్టని మైకు;
కల్లా కపట మెరుగని పల్లెప్రజలే –
నిన్ను గుర్తించే శ్రోతలు !
ప్రతి “కొమ్మా” నీ “కళా” కౌశలంతో
పులకించి పోవాలి !
ప్రతి చెట్టూ నీ కమ్మని రాగంతో
సంగీత నిలయమైపోవాలి.
ప్రతి గుండె, ప్రతి గూడూ –
నీ మధుర గీతాలలో నిండిపోవాలి !

అర్థాలు :

అందుకే = అందుకే
ఈ పట్నంలో ఎందుకే ? = ఎవరూ పట్టించుకోని ఈ పట్నంలో ఎందుకుంటావు
మా పల్లెకు ! = మా పల్లెటూరికి
రా, పోదాం = రా పోదాం
అక్కడ = మా పల్లెటూరిలో
పచ్చని చెట్టే = పచ్చగా ఉన్న చెట్టు
నీకు కట్టని వేదిక = కట్టకుండా ఏర్పడ్డ వేదిక వంటిది
పైరగాలే, నీకు = చల్లని గాలి, నీకు
పెట్టని మైకు; = పెట్టకుండానే నీ పాటను మోసుకెళ్ళే మైకు వంటిది
కల్లా కపట మెరుగని = అబద్ధాలు, మోసాలు తెలియని
పల్లెప్రజలే = ఆ జానపదులే
నిన్ను గుర్తించే = నీ కళను గుర్తించి ఆస్వాదించే
శ్రోతలు ! = శ్రోతలు, వినేవారు
ప్రతి “కొమ్మా” = ఆ ఊరిలో ఉండే ప్రతీ కొమ్మా
నీ “కళా” కౌశలంతో = నీ గళ మాధుర్యంతో
పులకించి పోవాలి ! = పరవశించి పోవాలి
ప్రతి చెట్టూ = ఆ పల్లెలోని ప్రతీ చెట్టూ
నీ కమ్మని రాగంతో = నీ కమ్మని గానంతో
సంగీత నిలయమైపోవాలి = సంగీత భరితం కావాలి
ప్రతి గుండె = ప్రతీ వ్యక్తి హృదయం
ప్రతి గూడూ = ప్రతీ ఇల్లు, నివాసం
నీ మధుర గీతాలలో = నీ మధురమైన పాటలతో
నిండిపోవాలి ! = నిండాలి

భావం: నీ కళకు గుర్తింపు లేని ఈ పట్నంలో ఎందుకు ఉండటం ? నాతో మా పల్లెకు పోదాం పద. అక్కడ ప్రతీచెట్టు నీకు కట్టని వేదికలాగా, పైరగాలి పెట్టని మైకులాగా అబద్దాలు, మోసాలు తెలియని పల్లెజనం నీ కళను ఆస్వాదించే శ్రోతలుగా ఉంటారని కవి చెప్పాడు. అంటే పట్నాలలో భారీ వేదికలు, మైకులు, హంగులు, ఆర్భాటాలు అన్నీ ఉన్నా ఆ కళను ఆస్వాదించే శ్రోతలు లేరని, ఆ లోటు పల్లెటూరిలో తీరుతుందని భావం.

ఆ పల్లెటూరికి వెళ్లి ప్రతీకొమ్మను తన గానమాధుర్యంతో పరవశించే విధంగా, ప్రతీ చెట్టు తన కమ్మని గానంతో నిండిపోవాలని, ప్రతీ హృదయం, ప్రతీ ఇల్లు తన మధురమైన పాటలతో నిండాలని కవి సూచించాడు. అంటే కళకు గుర్తింపు ఉన్న దగ్గరే కళాకారుడు ఉండాలని కవి సూచన.

కోకిలా! ఓ కోకిలా ! Summary in Telugu

(‘నైమిశారణ్యం’ కవితా సంపుటిలో నుండి)

TS Inter 2nd Year Telugu Study Material Poem 5 కోకిలా! ఓ కోకిలా !! 1

కవి పరిచయం

పాఠం పేరు : కోకిలా ! ఓ కోకిలా!
గ్రంథం : నైమిశారణ్యం అనే కవిత సంపుటి
దేని నుండి గ్రహించబడినది : “నైమిశారణ్యం” అనే కవితా సంపుటి నుండి గ్రహింపబడింది.
రచయిత : కనపర్తి రామచంద్రాచార్యులు
కాలం : జననం : ఆగస్టు 8, 1947 మరణం : జూన్ 16, 2011
స్వస్థలం : పూర్వీకులది మెదక్ జిల్లా గట్లమల్యాల – జననం భద్రాచలంలో
తల్లిదండ్రులు : భూలక్ష్మమ్మ, రంగయ్య

ఇతరాలు :

  • కనపర్తి తల్లి భూలక్ష్మమ్మ తెలుగు పండిట్గా పనిచేసింది.
  • తండ్రి రంగయ్య తెలంగాణ విమోచనోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లాడు.
  • ఆ భద్రాద్రిరాముని సన్నిధిలో జన్మించినందున రామచంద్రుడు అని పేరు పెట్టారు.
  • తల్లి దగ్గర భారత, భాగవత, రామాయణాది కావ్యాలు చదివాడు.

విద్యాభ్యాసం :

  • ఉపనిషత్తులపట్ల అమితాసక్తి ఉండేది.
  • పి.యు.సి సిద్దిపేటలో, బి.ఓ.యల్ హైదరాబాదులోని ఆంధ్రసారస్వత పరిషత్లో పూర్తి చేశాడు. తరువాత తెలుగు పండిత శిక్షణ తీసుకున్నాడు.

వృత్తి : మొదట పశుసంవర్ధకశాఖలో ఉద్యోగిగా, విద్యాశాఖలో ఉపాధ్యాయునిగా పనిచేశాడు.

రచనలు :

  • ఈయన మొత్తం 48 కావ్యాలు రాశాడు.
  • ఈయన వచన కవిత్వం, పద్యం, గేయం, కథ, అనువాద సాహిత్యం, వ్యాసాలు రాశాడు. ‘హృదయాంజలి’ పేరుతో రవీంద్రుని గీతాంజలి తెలుగులోకి అనువాదం చేశాడు. + వచన కవితా విస్తృతి కోసం విశేషంగా కృషిచేశాడు.
  • ఈయనకు తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, సంస్కృత భాషలలో మంచి ప్రావీణ్యం ఉంది.
  • బెర్నార్డ్ షా రచనలు, తులసీదాస్ ‘దోహాలు’ చిన్న చిన్న నీతికథలుగా అనువదించాడు.

పురస్కారాలు : ‘అక్షర శిల్పాలు’ కావ్యానికి వేముగంటి పురస్కారం,

బిరుదులు :

  • వెలుతురుపూలు’ కావ్యానికి జాతీయ సాహిత్య పరిషత్ పురస్కారం
  • వచన కవితాప్రవీణ బిరుదు, స్వర్ణకంకణ పురస్కారం అందుకున్నాడు.

కనపర్తి విద్యాభ్యాసం జరిగిన ప్రదేశాలు : “కనపర్తి’ విద్యాభ్యాసం మిట్టపల్లి, సిద్ధిపేట, చిన్నకోడూరులలో జరిగింది.
రచయిత ఇంటిపేరు ఎలా స్థిరపడింది : రచయిత తల్లి పేరు “కనపర్తి భూలక్ష్మమ్మ” కావడంతో ‘కనపర్తి’ అనేది, రచయిత ఇంటిపేరుగా స్థిరపడింది.

TS Inter 2nd Year Telugu Study Material Poem 5 కోకిలా! ఓ కోకిలా !!

పాఠ్యభాగ సందర్భం

ఒకరోజు హైదరాబాద్ కోఠి సెంటర్లో బస్సుకోసం ఎదురు చూస్తున్నప్పుడు వినిపించిన కోకిల కుహూరావాలకు ప్రతిస్పందించి రాసింది కోకిలా! ఓ కోకిలా! అనే ఈ కవిత. కోకిల పాటను ఆలంబనగా చేసుకొని నగర జీవితాన్ని, సమాజంలోని వర్ణవివక్షను, సామాన్యుల ప్రతిభను అందంగా వ్యంగ్య గర్భితంగా చెప్పాడు కవి. జాతి సమైక్యతను, సమతాభావాన్ని చాటిచెప్పే ప్రబోధాత్మక కవిత ఇది.

పాఠ్యభాగ సారాంశం

పట్నంలో కళను ఆస్వాదించే సమయం లేదని చెప్పడం : ఓ కోకిలా! భగవద్గీతలా ఆనందాన్ని, జాతీయగీతమైన జనగణమన లాగ ఉత్సాహాన్ని కలిగిస్తున్నావు. నువ్వు ఏ కరెంటు స్తంభం పైన, ఏ ఏడంతస్తుల మేడపైన కనబడకుండా ఉన్నావో అని, కోకిలను కళాకారులకు ప్రతీకగా తీసుకొని ఆధ్యాత్మికతను, దేశభక్తిని ప్రబోధించే కళాకారులు కనబడకుండా ఉన్నారని కవి భావించాడు. కొందరు కళాకారులు ఏడంతస్తుల మేడలో రాజభోగాలు అనుభవిస్తుంటే మరికొందరు డబ్బులేక పేదరికంలో ఉన్నారని ధ్వనింపజేశాడు.

ఈ పట్టపగలు, మండుటెండలో నీవు పాడుతున్న పాటతో నా గుండెను కరిగించావు. ఎంతో హడావిడిగా ఉండే ఈ కోఠీ సెంటర్లో ఎవరో కోటిమందిలో ఒకడు నా వంటి వాడికి తప్ప నీ పాట వినే అంత ఖాళీ సమయం ఎవరికి ఉంది ? ఆర్థిక సంపాదనపైన ఉన్న శ్రద్ధ మనసులకు ఆనందాన్ని కలిగించే కళలను ఆస్వాదించడంపై లేదని భావం.

ఈ నగర జనాల్లో ఎవరి తొందర వారికి ఉంది. ఎవరి పనులు వారికి ఉన్నాయి. ఇష్టం ఉన్నా లేకున్నా వేగంగా వెళ్ళాల్సిన స్థితిలో ఉన్నారు. అందరూ ఒకరిని తొక్కి పైకి రావాలని ఆశిస్తున్నవారే. అందరూ తమ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న వారిని అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నవారే. ఓ కోకిలా ! ఎవరో వన్స్ మోర్ అని అన్నట్లు పాడిన పాటనే మళ్ళీ మళ్ళీ పాడుతున్నావు. ఆహా ఓహో అనే పొగడ్తల మాటలే తప్ప డబ్బు ఎవరూ ఇవ్వరే అని చెప్తున్నాడు కవి. కళాకారులకు చప్పట్లు తప్ప నగదు బహుమతులు, ప్రోత్సాహాలు ఉండడం లేదని భావం.

కళాకారులను వారి కులం రంగు ఆధారంగా గౌరవించడం : ఓ కోకిలా నువ్వు కుహు కుహు అని పాడినప్పుడల్లా ఒక మినీ కవిత వెలువడ్డట్లు అనిపిస్తుంది. అంటే నీ ప్రతీ శబ్దంలో ఒక కొత్త అర్థం స్ఫురిస్తుందని భావం. నీ గొంతు ఒక మధురమైన కవితల క్యాసెట్ లాగ అనిపిస్తుందని కవి చెప్పాడు. కొత్తగా వృత్తిలోకి వచ్చిన బిచ్చగాడు సమయ సందర్భాలు తెలియకుండా అడుక్కున్నట్లు ఎందుకోసం ఈ సమయంలో పాడుతున్నావు. సంవత్సర కాలం పాటు పాటించిన మౌనవ్రతానికి ఈ రోజు ముగింపు పలుకుతున్నావా అని కవి కోకిలను అడిగాడు.

నిజమే నోరు మూసుకొని కూర్చొంటే ఎవరూ గుర్తించరు. కవులు మాత్రమె కోకిల గానంలోని మాధుర్యాన్ని తమ కవితల్లో నింపుకోవాలని చూస్తారు. చిలకల్లా, హంసల్లా, నెమలిలాగా అందంగా ఉంటే ఏ దేవుడైన వాహనంగా ఉపయోగించుకుంటాడు కాని నల్లగా ఉన్న నిన్ను సమాజం గుర్తించదు అని కవి అన్నాడు. వాహనంగా వాడుకోవడం అంటే ఉపాధి ఉద్యోగాలను చూపడం. ఉద్యోగాలు ఇచ్చేవారు కూడా శరీరపు రంగును చూస్తున్నారని వ్యంగ్యంగా చెప్పాడు. చిలుకపలుకులు అనడంలో ఆంగ్ల విద్య ప్రభావం కనిపిస్తుంది.

కళాకారుల నిస్వార్థత : ఓ కోకిలా ! ఎవరో వచ్చి సన్మానాలు చేయాలనే కోరిక నీకు లేదనే విషయం నాకు తెలుసు. నీకు పైన ఉన్న సూర్యుడు చూపిన మార్గం మాత్రమె తెలుసు కాని పైరవీలు చేసి సన్మానాలు పొందే దారీ తెలియదు అని కవి అన్నాడు. అంటే కొంతమంది కళాకారులు పైరవీల ద్వారా గుర్తింపును పొందుతున్నారని ఆ గుర్తింపు కోసమే ప్రదర్శనలు చేస్తారని చెప్తున్నాడు. కోకిల అలా కాకుండా తనకు దేవుడు ఇచ్చిన కళను నిస్వార్థంగా ప్రదర్శిస్తుందని తెలిపాడు. ఓ కోకిలా ! చేదుగా ఉండే మామిడి లేత చిగుళ్లను తిన్నందుకే నువ్వు ఇంతమందికి ఆనందాన్ని కలిగించే విధంగా మధురంగా పాడుతున్నావు.

మానవులమైన మేము మాత్రం తియ్యని మామిడి పళ్ళను తిని కూడా మనసులకు బాధకలిగించే మాటలనే మాట్లాడుతున్నాము. తినే తిండిలో కాకుండా నేర్చుకునే సంస్కారంలోనే మానవుల మాట తీరు ఉంటుందని కవి చెప్పాడు. ఓ కోకిలా ! నీకు ఇల్లు వాకిలి వంటి ఆస్తులు లేవు, బరువు బాధ్యతలు అసలే లేవు. మా మనుషుల లాగ బస్సులకోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ఆకులు అలములు ఇలా ఏది దొరికితే అదే తినుకుంటూ సంతృప్తిగా జీవిస్తావు. ఆటలాడుతూ పాటలు పాడుతూ ఆకాశంలో తిరిగే రాగాల దొరసానివి.

కోకిల సామాజిక సమరసత : ఓ కోకిలా! నీవు చార్మినార్ పైనా, నౌబత్ పహాడ్ పైన గల బిర్లామందిర్ పైనా స్వేచ్ఛగా వాలగలవు. మత విద్వేషాల రక్తాలు పారే ప్రదేశంలో కూడా నీ రాగాలతో అనురాగాలను పంచుతావు. కుల మతాల భేదం పాటించని నీ సామాజిక సమానతను ఎవరూ అర్థం చేసుకోరు. అందరూ సమానము అని చెప్పే నీ మంచి మాటలు ఎవరికీ నచ్చవు. దాని కారణంగా నిన్ను పెంచి పోషించిన వారి ద్వారానే దూరం కొట్టబడ్డ పేదరాలివి అని కవి అంటున్నాడు. కోకిలలకు గూడు నిర్మించుకోవడం తెలియదు అది తన గుడ్లను కాకి గూటిలో పెడితే కాకి ఆ గుడ్లను పొదిగి పిల్లను చేస్తుంది. కోకిల పెరిగి శబ్దం చేసినప్పుడు అది తనపిల్ల కాదని కాకి దానిని వెళ్లగొడుతుంది. అదే విధంగా తమ జాతి, తమ కులం, తమ మతం కాదు అని అనేకమంది మంచివారిని దూరం చేసుకుంటున్నారని కవి ఆవేదనను వ్యక్తం చేశాడు.

ఓ కోకిలా ! ఆ పక్కకు చూడు. ఆ పెద్దకోకిలకు నీ మీద ఎంత ద్వేషం ఉందొ నీతో పోటీ పెట్టుకున్నట్లు నువ్వు ఎలా కూస్తే అది కూడా అలాగే కూస్తుంది. తెలివితేటలకు కులభేదాలు లేనట్టే ఈర్ష్యాద్వేషాలకు వయస్సు భేదం లేదు అని కవి చెప్పాడు. ఒక స్థాయిలో ఉన్న కళాకారులు వెనుక వస్తున్న కొత్త తరం కళాకారులను ఎదగనివ్వడం లేదని కవి భావన.

ఓ కోకిలా ! నీవు ఎంతసేపు పాడినా నీ పాటలోని మాధుర్యాన్ని గాని, ఆ పాటపాడడానికి నువ్వు పడుతున్న కష్టాన్ని గాని ఈ విశ్వమనే విద్యాలయము గుర్తించదు అని కవి అనడంలో ఈ రోజుల్లో విశ్వవిద్యాలయాల గుర్తింపు కూడా రాజకీయాలతో ముడిపడి ఉందని సూచించాడు. జాతీయ పక్షి నెమలిని, తెల్లని పావురాన్ని, పాలపిట్టలను అగ్రవర్ణాలకు లేదా డబ్బున్న వారికి ప్రతీకలుగా తీసుకొని డబ్బుద్వారా లేదా కులం ద్వారా మాత్రమే గుర్తింపు లభిస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు.

పల్లెల్లో కళకు గౌరవం : నీ కళకు గుర్తింపు లేని ఈ పట్నంలో ఎందుకు ఉండటం ? నాతో మా పల్లెకు పోదాం రా. అక్కడ ప్రతీచెట్టు నీకు కట్టని వేదికలాగా, పైరగాలి పెట్టని మైకులాగా అబద్దాలు, మోసాలు తెలియని పల్లెజనం నీ కళను ఆస్వాదించే శ్రోతలుగా ఉంటారని కవి చెప్పాడు.

అంటే పట్నాలలో భారీ వేదికలు, మైకులు, హంగులు, ఆర్భాటాలు అన్నీ ఉన్నా ఆ కళను ఆస్వాదించే శ్రోతలు లేరని, ఆ లోటు పల్లెటూరిలో తీరుతుందని భావం. ఆ పల్లెటూరికి వెళ్లి ప్రతీకొమ్మను తన గానమాధుర్యంతో పరవశించే విధంగా, ప్రతీ చెట్టు తన కమ్మని గానంతో నిండి పోవాలని, ప్రతీ హృదయం, ప్రతీ ఇల్లు తన మధురమైన పాటలతో నిండాలని కవి సూచించాడు. అంటే కళకు గుర్తింపు ఉన్న దగ్గరే కళాకారుడు ఉండాలని కవి సూచన.

TS Inter 1st Year History Study Material Chapter 1 చరిత్ర, భౌగోళిక పరిస్థితులు

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 1st Lesson చరిత్ర, భౌగోళిక పరిస్థితులు Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 1st Lesson చరిత్ర, భౌగోళిక పరిస్థితులు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశపు భౌగోళిక లక్షణాలను చర్చించండి ?
జవాబు.
చరిత్రకూ భూగోళ విజ్ఞానానికి అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. ఒక దేశ చరిత్రను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ఆ దేశ భౌగోళిక స్వరూపం గురించి తెలుసుకోవడం అవసరం. భారతదేశం భౌగోళిక వైవిధ్యం కలిగిన పురాతన భూభాగం. ఎన్నో నాగరికతలు, సామ్రాజ్యాలు ఈ భూభాగంలో ఏర్పడి, అంతరించిపోయినప్పటికీ, ఒక అవిచ్ఛిన్న సంస్కృతి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. ప్రాచీన కాలంలో భారతదేశాన్ని ‘భరతవర్షం’గా పిలిచేవారు. భరతుని భూమిగా, దేశప్రజలను భరతసంతతిగా అభివర్ణించారు. భారతదేశాన్ని పురాణాల్లో జంబూద్వీపం అనేవారు. ఈ దేశానికి ‘ఇండియా’ అనేది మరొక పేరు. సింధూనది ప్రవహిస్తున్న దేశం కాబట్టి దీన్ని సింధూదేశంగా గ్రీకులు, పారశీకులు వ్యవహరించారు. క్రమంగా ‘సింధు’ పారశీకుల ఉచ్చారణలో ‘హిందు’గా, గ్రీకుల ఉచ్చారణలో ‘ఇండ్’గా మారింది. కాలగమనంలో హిండ్గా, హిందూస్తాన్ గా ఈ దేశం వ్యవహరింపబడింది.

TS Inter 1st Year History Study Material Chapter 1 చరిత్ర, భౌగోళిక పరిస్థితులు

భారత ఉపఖండానికి భౌగోళిక పరిస్థితులు సహజ రక్షణను కల్పిస్తున్నాయి. ఉత్తరాన హిమాలయ పర్వతశ్రేణి, తూర్పువైపు బంగాళాఖాతం, దక్షిణం వైపు హిందూమహాసముద్రం, పడమటివైపు అరేబియా సముద్రం సహజమైన ఎల్లలుగా ఉన్నాయి. దేశంలోని పర్వతాలు, మైదానాలు, పీఠభూములు, తీర ప్రాంతాలు దేశచరిత్ర గతిని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించాయి.

హిమాలయ పర్వత శ్రేణి పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ నుంచి తూర్పున మయన్మార్ (బర్మా) వరకు వ్యాపించి ఉంది. దాదాపు 2400 కి.మీ. పొడవు, 300 కి.మీ ఎత్తులో ఇవి ఉత్తరాన పెట్టని గోడ వలే ఉన్నాయి. వీటి విస్తీర్ణం దాదాపు ఐదు లక్షల చదరపు కిలోమీటర్లు. ఎవరెస్టు లేదా గౌరీశంకర్ (ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం). కాంచనగంగ, దౌళగిరి, నంగప్రభాత్, నందాదేవి లాంటి పర్వతశ్రేణులు హిమాలయాల్లోనే ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత పురాతన పర్వతాలుగా చెప్పబడే ఆరావళి పర్వతాలు దేశంలో వాయవ్య ప్రాంతంలో ఉన్నాయి.

దేశంలోని పీఠభూములను మాళ్వా, ఛోటానాగపూర్, దక్కన్ పీఠభూములుగా వర్గీకరించారు. మాళ్వా పీఠభూమి, దక్కన్ పీఠభూములను వింధ్య, సాత్పూరా పర్వతాలు వేరు చేస్తున్నాయి. దక్కన్ పీఠభూమికి మూడువైపులా సముద్రం ఆవరించి ఉండటం వల్ల ఇది ద్వీపకల్పంగా ఏర్పడింది.

మైదానాల్లో గంగా-సింధూ మైదానాలు ముఖ్యమైనవి. హిమాలయాలనుంచి ప్రవహించే జీవనదులు తీసుకొచ్చిన ఒండ్రుమట్టితో ఈ సారవంతమైన మైదానాలు ఏర్పడ్డాయి. సింధు, గంగ వాటి ఉపనదుల పరీవాహక ప్రాంతాలు ఈ మైదానాల్లో అంతర్భాగాలు. మరోవైపు తూర్పు, పశ్చిమ కనుమల్లో జన్మించే కృష్ణ, గోదావరి లాంటి నదులు, వాటి ఉపనదుల వల్ల దక్షిణ భారతదేశంలో కూడా మైదానాలు ఏర్పడ్డాయి. నదీపరీవాహక ప్రాంతాలతో పాటుగా దేశ వాయువ్య ప్రాంతంలో ఉన్న థార్ ఎడారిని ఒక ప్రత్యేక భౌగోళిక లక్షణంగా చెప్పవచ్చు. ఈ ప్రాంతం భారత, పాకిస్తాన్ దేశాలకు సహజ సరిహద్దుగా ఉంది.

తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన హిందూమహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రాలు భారతదేశానికి చాలా పొడవైన తీర రేఖను ఏర్పరుస్తున్నాయి. ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన దేశాలలో భారత్ ఒకటిగా నిలిచింది. ద్వీపకల్ప పశ్చిమ భాగం వైపు డామన్ నుంచి తిరువనంతపురం వరకు పశ్చిమ కనుమలు(సహ్యాద్రి) వ్యాపించి ఉన్నాయి. ఉత్తర తీరాన్ని కొంకణ తీరమని, దక్షిణాన భాగాన్ని మలబార్ తీరంగా వ్యవహరిస్తున్నారు. పశ్చిమ కనుమలు దాదాపు 1600 కిలోమీటర్ల పొడవు మేర వ్యాపించి ఉన్నాయి. వీటి సరాసరి ఎత్తు 900 నుంచి 1100 మీటర్లు. వీటికి భిన్నంగా తూర్పు కనుమలు అవిచ్ఛిన్నంగా బంగాళాఖాతం వైపు ఉన్నాయి. ఇవి ఒరిస్సాలోని మహేంద్రగిరి (గంజాం జిల్లా) నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు వ్యాపించి ఉన్నాయి. ఈ కనుమలు ఎన్నో చిన్న, పెద్ద నదులకు జన్మస్థానాలుగా ఉన్నాయి.

ప్రశ్న 2.
భారతదేశ చరిత్ర, సంస్కృతిపై భౌగోళిక పరిస్థితుల ప్రభావాన్ని వివరించండి.
జవాబు.
భారత ఉపఖండం భౌగోళిక పరిస్థితుల్లో గొప్ప వైవిధ్యం ఉంది. ఇవి భారతదేశ చరిత్రను ఎంతగానో ప్రభావితం చేశాయి. రాజకీయ సరిహద్దుల్ని, సామాజిక స్థితిగతుల్ని, జాతి విస్తరణను ఈ భౌగోళిక పరిస్థితులే నిర్దేశించాయి. ఉత్తరాన హిమాలయాలు, మిగిలిన మూడువైపులా సముద్రాలు సువిశాల భారతదేశానికి సహజ సరిహద్దులుగా ఉండటంతో ఇది ఒక ప్రత్యేక భౌగోళిక ప్రాంతంగా ఏర్పడింది. ఈ భౌగోళిక పరిధిలో ఉండటం వల్ల తామంతా ఒకటనే భావన, ఇది తమ మాతృదేశమని ప్రజలు భావించారు. భారతీయుల్లో ఐక్యతకు దోహదం చేశాయి. ఇవి భారతీయ సంస్కృతికి ఒక ప్రత్యేక స్వరూపాన్ని ఇవ్వగలిగాయి.

హిమాలయాలు దేశానికి పెట్టని కోటవలె రక్షణ సమకూర్చటమేగాక, ఉత్తర ఆర్కిటిక్ నుంచి వచ్చే అతి శీతల పవనాల తీవ్రత నుంచి దేశానికి రక్షణను కల్పిస్తున్నాయి. హిమాలయాలు లేనట్లయితే, ఉత్తర భారతదేశం ఒక శీతల ఎడారిగా మారి ఉండేది. భారతీయ మత, సారస్వతాల్లో ఈ పర్వతాలు ఒక ప్రత్యేక స్థానాన్ని పొందాయి. కాబట్టి ఇవి జాతీయ పర్వతశ్రేణిగా భారతీయుల మనస్సుల్లో ప్రత్యేక స్థానాన్ని పొందాయి. ఉత్తరాన పెట్టనిగోడ వలే ఉండి విదేశీ దండయాత్రల నుంచి దేశానికి రక్షణ కల్పిస్తున్నాయి. అయితే ఇవి బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా చేయలేదు. కైబర్, బోలాన్ లాంటి కనుమల ద్వారా పశ్చిమ, మధ్య ఆసియా దేశాలతో మనదేశానికి అనేక వేల సంవత్సరాల ద్వారా సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటి ద్వారానే విదేశీ ఆక్రమణదార్లు భారతదేశాన్ని జయించాలని చూశారు. అలెగ్జాండర్ దండయాత్ర దీనికొక ఉదాహరణ. విదేశీయులు వచ్చిన ఈ రహదార్ల ద్వారా వర్తక వ్యాపారాలు జరిగాయి. సాంస్కృతిక మార్పిడికి, ప్రభావాలకు కూడా ఇవి కారణమయ్యాయి. దీనివల్ల రహదార్ల ప్రాముఖ్యత హెచ్చి, ప్రముఖ వర్తక కేంద్రాలు ఏర్పడ్డాయి. ఈ ప్రాంతంలోని వివిధ సంస్కృతులు ఒకటయ్యాయి. భారతీయ, గ్రీకు శిల్పకళల సమ్మేళనంగా ఏర్పడిన గాంధార శిల్పకళలు దీనికి ఉదాహరణగా పేర్కొవచ్చు. ఇది కళాచరిత్ర జగత్తులో ఒక అద్భుతాన్ని సృష్టించగలిగింది.

భారతదేశ చరిత్రను ప్రభావితం చేసిన భౌగోళిక అంశాల్లో గంగా సింధూ మైదానాలు ముఖ్యమైనవి. ఈ ప్రాంతంలో అనేక సంస్కృతులు ఆవిర్భవించాయి. వైదిక, వైదికేతర మతోద్యమాలు, పట్టణీకరణ మూలాలన్నీ కూడా ఈ మైదానాల్లోనే చూడవచ్చు. మౌర్యులు, గుప్తులు లాంటి ఎన్నో సామ్రాజ్యాల విజృంభణకు ఈ ప్రాంతం నిలయమైంది. వ్యవసాయ సంపదకు ఆధారనిలయమైంది. ఈ ప్రాంతంపై ఆధిపత్యం కోసం ఎన్నో యుద్ధాలు జరిగాయి.

ప్రపంచంలోనే అత్యంత పురాతన భూభాగమైన దక్కన్ పీఠభూమి ప్రాక్ చరిత్రకు సంబంధించిన సంస్కృతులకు నిలయం. ఈ ప్రాంతం కూడా ఎన్నో సంస్కృతులకు, సంప్రదాయాలకు, భాషలకు పుట్టినిల్లు. శాతవాహనులు, కాకతీయులు, విజయనగర, బహమనీ లాంటి రాజకీయ శక్తులు ఈ ప్రాంతం నుంచే విజృంభించాయి. ఈ ప్రాంతంలో నిక్షిప్తమైన బంగారు, వజ్రాలు ఇతర అమూల్యమైన సంపదల కోసం అనేక రాజవంశాలు యుద్ధాలు చేశాయి. వింధ్య పర్వతశ్రేణి దక్షిణ, ఉత్తర భారతదేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు ఏర్పడేందుకు కారణమైంది. అందుకే దక్కన్ పీఠభూమి దక్షిణ, ఉత్తర దేశ సంస్కృతుల కలయిక ప్రదేశంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. పశ్చిమ

కనుమలు మహారాష్ట్రులకు సహజ సిద్ధమైన రక్షణ సదుపాయం కలగజేశాయి. పశ్చిమ కనుమల ఉపరితలాలు కోటల నిర్మాణానికి అనుకూలంగా ఉండి మహారాష్ట్రుల విజృంభణకు దోహదం చేశాయి. రాజస్థాన్లోని ఆరావళీ పర్వతాలు రాజపుత్రుల చరిత్రలో ప్రముఖపాత్రను నిర్వహించాయి. ఇవి రాజపుత్రులకు సహజసిద్ధమైన రక్షణ సౌకర్యాలు కలగజేయడమే కాకుండా వారిని వీరులుగా తీర్చిదిద్దాయి.

హిమాలయాల నుంచి ప్రవహించే జీవనదులు వ్యవసాయరంగ సంపద వృద్ధి చెందడానికి, రవాణా సౌకర్యాలు మెరుగుపడడానికి ఉపయోగపడ్డాయి. ఈ నదీ పరీవాహక ప్రాంతాల్లోనే నాగరికతా కేంద్రాలు వికసించాయి. అంతర్గతంగా మహానదులన్నీ సంస్కృతీ, వర్తక వ్యాపారాలు పెంపొందడానికి కారణమైతే, మూడువైపులా ఉన్న మహాసముద్రాలు మనదేశానికి మిగిలిన ప్రపంచంతో సంబంధం ఏర్పడటానికి కారణమయ్యాయి.

భారతదేశ వాతావరణ పరిస్థితుల్లో చాలా తేడాలున్నాయి. భారతదేశ దక్షిణ భాగం ఉష్ణమండలంలోను, ఉత్తర ప్రాంతం సమశీతోష్ణ మండలంలో ఉంది. ఈ ఉష్ణోగ్రతా వ్యత్యాసాలు వర్షపాతాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఉష్ణ వాతావరణం కంటే శీతల, సమశీతోష్ణ వాతావరణంలోనే దేశవాసులు ఎక్కువ సమయం శ్రమించగలుగుతారు. దీని కారణంగానే రాజపుత్రులు, శిక్కులు, మరాఠాలు తమ పరాక్రమాన్ని, ధైర్యసాహసాల్ని చూపగలిగారు.

దేశానికి సుదీర్ఘమైన సముద్రతీరం ఉండటం వల్ల దక్షిణంలో పరిపాలించిన ఆంధ్రులు, కళింగులు, చోళులు మొదలైన వారు ఆగ్నేయాసియా దేశాలతో సముద్రం మీదగా వ్యాపార సంబంధాలు ఏర్పరచుకున్నారు. కంబోడియా, థాయ్లాండ్, జావా, సుమిత్రా, బోర్నియో, బర్మా, నేపాల్ దేశాల్లో భారతీయులు స్థిరనివాసాలేర్పరచుకొని వర్తక వ్యాపారాలను పెంపొందించారు. ఈ విధంగా ఏర్పడిన వ్యాపార సంబంధాలు క్రమంగా భారతీయ సంస్కృతి వ్యాప్తికి తోడ్పడ్డాయి. ఈ విధంగానే బౌద్ధమతం ఆగ్నేయాసియాలో వ్యాపించగలిగింది. అట్లాగే హిందూమతం కూడా విస్తరించింది. సుదీర్ఘమైన తీరప్రాంతం భారతదేశానికి ఉంది కనుకనే పోర్చుగీసు, డచ్చి, ఫ్రెంచి, ఆంగ్లేయ వ్యాపారులు సముద్రం మీదుగా ఈ దేశానికి వచ్చి క్రమంగా తమ వలసలను ఇక్కడ విస్తరించుకోగలిగారు.

TS Inter 1st Year History Study Material Chapter 1 చరిత్ర, భౌగోళిక పరిస్థితులు

ప్రశ్న 3.
భారతదేశ చరిత్ర నిర్మాణంలో సాహిత్య ఆధారాల ప్రాముఖ్యత గురించి రాయండి.
జవాబు.
చారిత్రక ఆధారాలలో సాహిత్య ఆధారాలు ముఖ్యమైనవి. ఇవి సమకాలీన సమాజపు పరిస్థితులను ప్రతిబింబిస్తాయి. సాహిత్య ఆధారాలను స్థూలంగా దేశీయ సాహిత్య ఆధారాలు మరియు విదేశీ సాహిత్య ఆధారాలు అనీ రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.

A) దేశీయ సాహిత్య ఆధారాలు (Native Literary Sources): దేశీయ సాహిత్య ఆధారాలు అంటే అవి ఇక్కడే రూపుదిద్దుకొన్న ఆధారాలని అర్థం. ఈ ఆధారాలు చరిత్ర రచనకు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. ప్రాచీన భారతదేశ సాహిత్యం చాలావరకు మతపరమైన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో బాటుగా లౌకిక రచనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్రాచీన భారత దేశ చరిత్ర పునర్నిర్మాణానికి ఎంతగానో దోహదపడుతున్నాయి.

మతపరమైన సాహిత్యం: ప్రాచీన భారతదేశంలో రచనలన్నీ దాదాపుగా మతపరమైనవి. అయినప్పటికీ వీటిలో చారిత్రక వ్యక్తులు మరియు చారిత్రక సంఘటనల గురించి కూడా రాయబడ్డాయి.

బ్రాహ్మణీక గ్రంథాలు: బ్రాహ్మణీక గ్రంథాలు లేదా వేద సాహిత్యం ప్రాచీన భారతదేశ చరిత్ర పునర్నిర్మాణానికి ముఖ్యమైన ఆధారంగా ఉంది. వీటిని సంస్కృత భాషలో రాశారు. వాటిలో పేర్కొనదగ్గవి వేదాలు, వేదాంగాలు, ఉపవేదాలు, ఉపనిషత్లు, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు. ఈ సాహిత్యం అంతా కూడా నాటి సమాజాన్ని ప్రతిబింబించింది. భారతదేశంలోనే అత్యంత ప్రాచీన సాహిత్యమైన ఋగ్వేదం తొలి ఆర్యుల రాజకీయ, సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులను తెలియచేస్తోంది. మిగిలిన మూడు వేదాలైన యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం మలివేద కాలం నాటి ఆర్యుల జీవన విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఉపనిషత్లు భారతీయ తాత్విక ధోరణుల గురించి వివరిస్తాయి. ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలు మలివేద ఆర్యుల కాలం నాటి రాజ్య విస్తరణ, భౌగోళిక, సాంఘిక, ఆర్థిక మత, పరిస్థితులను తెలియచేస్తాయి. అలాగే అష్టాదశ పురాణాలు కూడా ముఖ్యమైన ఆధారాలుగా పరిగణింపబడుతున్నాయి. వీటిలో మత్స్య, వాయు, భవిష్య, విష్ణు, భాగవత పురాణాలు చారిత్రకంగా ముఖ్యమైనవి. ఈ పురాణాల వల్ల ముఖ్యంగా హర్యంక, శిశునాగ, నంద, మౌర్య, శాతవాహన మొదలగు రాజవంశాల చరిత్ర తెలుసుకోవచ్చు.

బౌద్ధ గ్రంథాలు: ఇవి బౌద్ధుల తాత్విక, మతపరమైన గ్రంథాలు. పాళీ, సంస్కృత, మిశ్రమ సంస్కృత భాషల్లో ఈ గ్రంథాలు ఉన్నాయి.

పాళీ గ్రంథాలు: హీనయాన బౌద్ధం పాళీ గ్రంథాలను అనుసరించింది. బుద్ధుడి జ్ఞాన సముపార్జనానంతరం త్రిపిటకాలు ఏర్పడ్డాయి. అవి: 1. సుత్తపీటకం, 2. వినయపీటకం, 3. అభిదమ్మ పీటకం. ఇవి బౌద్ధమత ధర్మం గురించి, ఆచార వ్యవహారాల గురించి, బౌద్ధతత్వాన్ని గురించి చెబుతాయి.

బౌద్ధ సంస్కృత గ్రంథాలు: మహాయాన బౌద్ధం సంస్కృత గ్రంథాలను అనుసరించినట్లు తెలుస్తున్నది. మహాయానంలో బుద్ధుణ్ణి దేవునిగా కొలిచారు. “వైపుల్య సూత్రం” మహాయాన బౌద్ధానికి ముఖ్య గ్రంథం. “లలిత విస్తరం” బుద్ధుని చరిత్రను, బౌద్ధ ప్రపంచాన్ని తెలియజేస్తుంది. “సధర్మ పుండరీక” మహాయానుల మరో పవిత్ర గ్రంథం.

జైనగ్రంథాలు: జైనుల మత గ్రంథాలు అర్థమాగధి, ప్రాకృత భాషల్లో రాశారు. వీటిని పన్నెండు అంగాలు, పన్నెండు ఉపాంగాలు, పరి ప్రకీర్ణాలు, ఆరు చేదసూత్రాలు, నాలుగు మూల సూత్రాలు, నాలుగు వివిధ రకాలైన గ్రంథాలుగా విభజించారు. పన్నెండు అంగాలు జైన భిక్షువులు ఉపాసించవలసిన విధానాలను, జైనమతి తత్వాన్ని, మత జ్ఞానాన్ని, కథలను, జైన గురువులను, స్వర్గ నరకాల వివరణను తెలియజేస్తున్నాయి.

చారిత్రక గ్రంథాలు (Historical Texts): పాళీభాషలో రచించిన ‘దీపవంశ’, ‘మహావంశలు’ శ్రీలంక చరిత్రను వివరిస్తాయి. భారతదేశంలోని బౌద్ధమత వ్యాప్తిని, శ్రీలంకలోని బౌద్ధమత వ్యాప్తిని ఈ గ్రంథాలు వివరిస్తాయి. ఇవి దక్షిణ భారతదేశ చరిత్రను, రాజకీయ పరిస్థితులను కూడా తెలుపుతాయి. దీపవంశం నాలుగు లేదా ఐదో శతాబ్దిలో విరచితమైనట్లు తెలుస్తున్నది. మహావంశ ఐదో శతాబ్ది చివర్లో మహానాముడు రచించాడు. సంస్కృతంలో వెలువడిన మరొక చారిత్రక గ్రంథం కల్హణుడు రచించిన “రాజతరంగిణి” (క్రీ.శ. 1148). ఇది కాశ్మీర్ దేశ రాజుల వంశావళిని వివరిస్తుంది. దీనిలోని కథల్లో చారిత్రక వాస్తవాలు కూడా ఉన్నాయి.

జీవితచరిత్రలు (Biographies): గురువుల, రాజుల జీవిత చరిత్రలను గురించి రాసిన సాహిత్యం మనకు ప్రాచీన కాలంలో చాలా కనిపిస్తుంది. వాటిలో ముఖ్యమైనవి అశ్వఘోషుడు రచించిన “బుద్ధచరితం”, బాణభట్టు రచించిన “హర్షచరితం”, ప్రాకృతభాషలో ముంజరాజు (వాక్పతి) రచించిన “గౌడవహూ” చాంద్ బర్దాయ్ రచించిన “పృధ్వీరాజ్ సో”. బుద్ధచరితం కనిష్కుని కాలానికి సంబంధించింది. హర్షచరితం హర్షుని చరిత్రను, గౌడవూ కనోజ్ రాజైన యశోవర్మని కాలానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తున్నాయి.

శాస్త్రీయ, సాంకేతిక గ్రంథాలు (Scientific and Technical Books): ఈ గ్రంథాలు ప్రాచీన భారతదేశంలోని శాస్త్ర, సాంకేతిక ప్రగతితో పాటుగా చారిత్రక విషయాలను వివరిస్తాయి. ఆనాటి ప్రపంచంలో భారతదేశం ఖగోళం, గణితం వైద్య రంగాలలో, ఏవిధమైన ప్రగతి సాధించిందనే విషయాన్ని ఇవి తెలియచేస్తాయి. వరాహమిహురుడు రాసిన ‘పంచసిద్ధాంతిక’ భారతీయ ఖగోళ శాస్త్రానికి బైబిల్ లాంటిది. అలాగే ఆర్యభట్టు దశగీతికసూత్ర, సూర్యసిద్ధాంత, రోమక సిద్ధాంత, ఆర్యభట్టీయం అనేవి రచించాడు. చరక సంహిత అనేది వైద్య రంగానికి సంబంధించిన గ్రంథం. సంగం సాహిత్యం: ప్రాచీన భారత చరిత్ర రాయడానికి మరో ముఖ్యమైన ఆధారంగా తమిళంలో విరచితమైన “సంగమ సాహిత్యం”ను చెప్పవచ్చు. సంగం సాహిత్యమనేది తమిళ కవుల సృష్టి. ఈ సాహిత్యం చేర, చోళ, పాండ్య రాజుల వంశావళిని పేర్కొంది. వీటిలో తమిళదేశ సంస్కృతి, సమకాలీన స్థితిగతులు స్పష్టంగా ప్రతిఫలిస్తున్నాయి

B) విదేశీ వాఙ్మయాధారాలు (Foreign Literary Sources): అనాది కాలం నుంచి విదేశీ యాత్రికులు భారతదేశాన్ని సందర్శించి, తమ అనుభవాలను గ్రంథస్తం చేశారు. ఈ విధంగా గ్రీకులు, చైనీయులు, ముస్లింలు, ఐరోపా వారి రచనలు మన దేశానికి సంబంధించిన ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. వీటి సహాయంలో చరిత్రను పునర్నిర్మించవచ్చు.

గ్రీక్ ఆధారాలు: ప్రాచీన భారత చరిత్ర రాయడానికి గ్రీక్ ఆధారాలు చాలా ముఖ్యమైనవి. స్కైలాక్స్ రాసిన “ది అకౌంట్ ఆఫ్ ది జర్ని ఆఫ్ స్కైలాక్స్” మనకు లభించలేదు. హెరోడోటస్ (క్రీ.పూ. 483-430) భారతదేశాన్ని గురించి తన గ్రంథంలో రాశాడు. డేరియస్ ద్వారా వాయవ్య భారతదేశం గురించి తెలుసుకొన్న సమాచారాన్ని హెరోడోటస్ గ్రంథ రూపంలో రాశాడు, ఇది మన చరిత్రకు ఆధారం అయింది.

మెగస్తనీస్ అనే గ్రీస్ దేశస్థుడు సెల్యూకస్ నికేటర్ రాయబారిగా చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి విచ్చేసి, ఆ కాలపు పరిస్థితులను వివరంగా “ఇండికా” అనే గ్రంథంలో రాశాడు. అయితే ఆ గ్రంథం ఇప్పుడు లభ్యం కావడం లేదు. ఆ గ్రంథంలోని కొన్ని ముఖ్యాంశాలను స్ట్రాబో, డియోరస్, ఆరియన్ తమ గ్రంథాల్లో పేర్కొన్నారు. అలాగే టాలమీ రాసిన “భూగోళం” (Ptolemy’s Geography), ఒక అజ్ఞాత రచయిత రాసిన “ది పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియక్ సి” (The Periplus of the Erythraean Sea)లు భారతదేశంలోని తీర ప్రాంతాల గురించి వివరించాయి. చైనా ఆధారాలు: బౌద్ధ పవిత్ర స్థలాలను చూడటానికి, బౌద్ధమత గ్రంథాలను సేకరించడానికి చైనా బౌద్ధబిక్షువులు భారతదేశం వచ్చారు. వారు తమ గ్రంథాల్లో ఆనాటి భారతదేశాన్ని గురించి వివరంగా రాస్తూ, తాము చూసిన సందర్శించిన ప్రదేశాల గురించి వివరంగా తెలిపారు. వారిలో ప్రముఖుడు ఫాహియాన్. అతను ఐదో శతాబ్దంలో “ఫో-కో-కి” (Fa kosuoki) అనే గ్రంథంలో మధ్య ఆసియా గురించి, వాయవ్య భారతదేశం, గంగాలోయ గురించి, శ్రీలంక, జావాలను గురించి వివరంగా రాశాడు. హ్యూయాన్ త్సాంగ్ అనే మరో చైనా దేశస్థుడైన బౌద్ధభిక్షువు హర్షుని కాలంలో భారతదేశానికి వచ్చి, హర్షుడి ఆస్థానాన్ని దర్శించాడు. అతడు “సి-యూ-కి” అనే గ్రంథంలో విశిష్టమైన విలువలు ఉన్న చారిత్రక విషయాలను స్పష్టంగా వివరించాడు. ఇత్సింగ్ (Itsing) అనే మరో యాత్రికుడు ఇండోనేషియా నుంచి సముద్రయానం చేసి భారతదేశాన్ని చేరాడు. సంస్కృత గ్రంథాలు, బౌద్ధుల ఆచార వ్యవహారాల గురించి తన గ్రంథంలో స్పష్టంగా తెలిపాడు.

ముస్లిం ఆధారాలు: మహ్మదీయ చరిత్రకు సంబంధించిన ఆధారాలు క్రీ.శ. 7 లేదా 8 శతాబ్దాల నుంచి లభ్యమవు తున్నాయి. అల్బెరూనీ ఇబ్బతూత, బరౌనీ, అమీర్ ఖుస్రూ, ఫెరిష్టా మొదలైనవారి రచనలు మధ్యయుగ భారతదేశ చరిత్రకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.

ప్రశ్న 4.
ప్రాచీన భారతదేశ చరిత్ర పునర్నిర్మాణానికి పురావస్తు ఆధారాలు ఏవిధంగా దోహదపడతాయో చర్చించండి ?
జవాబు.
ప్రాచీన కాలపు అవశేషాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పురాతత్త్వశాస్త్రం అని అంటారు. ఇది ప్రాచీన భారతదేశ చరిత్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోంది. తవ్వకాలు, అన్వేషణలో లభించిన శిథిలాలు, అవశేషాలు, కట్టడాలు (వాస్తు), శిల్పాలు, చిత్రాలు, శాసనాలు, నాణేలు, మట్టి పాత్రలను పురావస్తు ఆధారాలుగా పేర్కొంటారు.
భారతదేశంలో పురావస్తు పరిశోధనకు, జాతీయ స్మారక భవనాల పరిరక్షణకు, సంరక్షణకు భారత పురావస్తు శాఖ (ASI) బాధ్యత వహిస్తుంది.

భౌతిక అవశేషాలు (Material remains): భౌతిక అవశేషాలలో భాగంగా వివిధ రకాలైన మానవ, జంతు అవశేషాలు, రాతి, ఎముక పరికరాలు, ఇనుము, మృణ్యయ పాత్రలు, భవన శిధిలాలు ఉంటాయి. సింధులోయ, నర్మదాలోయ, కృష్ణ, గోదావరి తీరప్రాంతాల్లో, మధ్య భారతదేశంలోని జొహల్ పూర్, బళ్ళారి, ఛోటానాగపూర్, అస్సాం, పాండిచ్చేరి, పరిసర ప్రాంతాల్లో వీటిని కనుక్కోగలిగారు. ఇవి భారతదేశ ప్రాక్ చరిత్ర పునర్నిర్మాణానికి దోహదం చేశాయి.

కట్టడాలు (Monuments): భారతదేశం ప్రాచీనకాలం నుంచి వాస్తు సంపదకు పెట్టింది పేరు. దీన్ని హిందూ, బౌద్ధ, జైనఇండో-ఇస్లామిక్, ఆధునిక వాస్తుగా పేర్కోవచ్చు. ఈ కట్టడాలు ప్రాచీన, మధ్య, ఆధునిక కాలాలకు సంబంధించినవి. ఉపయోగించిన విధానాన్ని బట్టి వాస్తును మతపరమైన, లౌకికమైన వాస్తుగా కూడా గుర్తించవచ్చు. (Religious and Secular Architecture) ఇందుకు ముఖ్య కారణం వీటిని నిర్మించిన విధానాలే. ఇవి కూడా ఆ కాలపరిస్థితుల ప్రతిబింబాలే. వీటిని క్షుణ్ణంగా పరీక్షిస్తే వాటి లక్షణాలను బట్టి అవి ఏకాలానికి చెందినవో మనకు తెలుస్తుంది.

శిల్పాలు (Sculptures): సింధులోయ నాగరికత కాలం నుంచి నేటి వరకు, మనకు అనేక రకాలైన శిల్పాలు లభ్యమయ్యాయి. వీటిని వివిధ రకాలైన పదార్థాలతో తయారుచేశారు. శిల్పాల తయారీ విధానం, లక్షణాలు, ఆకాల పరిస్థితులను ప్రతిబింబిస్తాయి.

చిత్రాలు (Paintings): మొదటి నుంచి భారతదేశంలో చిత్రకళ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రాక్ చరిత్రకు సంబంధించిన ప్రాక్ చారిత్రక చిత్రాలు (Pre-Historic Paintings) మనకు లభించాయి. అలాగే, క్రీ.పూ. రెండో శతాబ్దం నుంచి నేటివరకు, అనేక ప్రదేశాల్లో కుడ్య చిత్రాలు, లఘుచిత్రాలు, వస్త్రంపై చిత్రాలు (Canvas paintings) మొదలైనవి లభ్యమయ్యాయి.

మట్టిపాత్రలు: మట్టిపాత్రలు కూడా తవ్వకాల్లో సింధులోయ నాగరికత నుంచి నేటి వరకు లభ్యమౌతున్నాయి. వీటిని అనేక రకాల మట్టితో చేసినట్లు తెలుస్తున్నది. కాల్చని మట్టి పాత్రలతోపాటు కాల్చిన మట్టి పాత్రలు కూడా తవ్వకాల్లో లభించాయి. వీటిపై మెరుగులు (Polish) పెట్టేవారు. కొన్ని రకాలైన మట్టిపాత్రల పై బొమ్మలను కూడా చిత్రించారు. వీటిలో కొన్నింటిమీద విదేశీ ప్రభావం కూడా కనిపిస్తున్నది. దీనికి నాగార్జున కొండ, పాండిచ్చేరిలో దొరికిన మట్టిపాత్రలే నిదర్శనం. భారతదేశంలో లభ్యమైన మట్టి పాత్రలు అనేక రూపాల్లో, పరిమాణాల్లో (చిన్న, పెద్ద) ఉన్నాయి. ఇలాగే రకరకాలైన మట్టి పూసలు అనేక రంగుల్లో, పరిమాణాల్లో లభించాయి. వీటివల్ల ఆ కాలంలో అలంకరణకు ఉన్న ప్రాముఖ్యం అర్థమౌతుంది.

శాసనాలు (Inscriptions): పురావస్తు ఆధారాల్లో అత్యంత విశ్వసనీయమైనవి మరియు ముఖ్యమైనవి శాసనాలు. ఇవి చరిత్రకు సంబంధించిన వాస్తవాలను అందిస్తాయి. శాసనాల అధ్యయనాన్ని ఎపిగ్రఫీ అని అంటారు. శాసనాలను రాళ్లపైన, స్తంభాలపైన, భవనాల గోడలపైన, దేవాలయ గోడలపైనా గమనించవచ్చు. ఇవే కాకుండా ముద్రికలపైనా, రాగి రేకులపైనా (తామ్ర శాసనాలు) కూడా శాసనాలను లిఖించడం జరుగుతుంది. వివిధ ప్రయోజనాల కోసం శాసనాలు రాయబడుతాయి. శాసనాల్లో తెలిపిన సమాచారం ఆధారంగా వాటిని వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. కొన్ని శాసనాలు వంశ వృక్షాలను, రాజ ఉత్తర్వులను, రాజులు సాధించిన ఘనతను, వారి దిగ్విజయాలను (ప్రశస్తి), మతపరంగా ఇచ్చిన దాన విశేషాలను తెలియచేస్తాయి. భారతదేశంలో సంస్కృతం, పాళీ, తమిళం, కన్నడం, తెలుగు మొదలైన వివిధ భాషల్లో శాసనాలు లభించాయి. అలాగే పురాతన లిపులైన ఖరోష్టి, బ్రహ్మీల్లో రాయబడిన శాసనాలు కూడా లభించాయి. వీటిలో కనిపించే భాషాశైలి, విషయాలు, మనకు ఆ కాలపు పరిస్థితులను స్పష్టంగా తెలియజేస్తాయి.

భారతదేశంలో మొదటిసారిగా అధికసంఖ్యలో లభ్యమైన శాసనాలు అశోకునివి. అతడు చక్రవర్తి అయినప్పటినుంచి వేయించిన రాతి శాసనాలు నేటి వరకు కూడా పదిలంగా ఉన్నాయి.

తాళపత్ర గ్రంథాలు కూడా చరిత్ర నిర్మాణానికి తోడ్పడతాయి. గుజరాత్లోని జైనతాళపత్ర గ్రంథాల్లో చిత్రాలను కూడా గీశారు. అలాగే మొగలుల కాలానికి చెందిన “అక్బర్ నామా” “బాబర్ నామా”లు గుడ్డపై రాసినవి. ముస్లిమ్ రాజులు కూడా అనేక శాసనాలను వేయించారు. ఈ విధంగా వంశ చరిత్రలను, రాజకీయ, పరిపాలన, సామాజిక, ఆర్థిక, మత విషయాలను శాసనాలు తెలియజేస్తున్నాయి.

నాణేలు (Coins): చారిత్రక ఆధారాల్లో నాణేలు ముఖ్యమైనవి. నాణేలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘న్యూమిస్మాటిక్స్’ అని అంటారు. నాణేలను భూమిలోనుంచి తవ్వకాల ద్వారా కానీ భూఉపరితలం పైనుంచి కానీ సేకరిస్తారు. నాణేలను సాధారణంగా బంగారు, వెండి, కంచు, మిశ్రమ లోహాలతో తయారుచేస్తారు. నాణేలపై అనేక రకాలైన బొమ్మలు, దేవతాప్రతిమలు, రాజుల ప్రతిమలు, వారి పేర్లు, తేదీలను కూడా ముద్రించేవారు. అవి దొరికిన ప్రదేశాన్ని ‘ బట్టి, అవి చలామణీలో ఉన్న ప్రాంతంను, పరోక్షంగా ఆ రాజ్య సరిహద్దులను కూడా సూచిస్తాయి. అవి ఏ కాలానికి చెందినవో, ఏ రాజువో అవి దొరికిన ప్రదేశాన్ని బట్టి కూడా చెప్పవచ్చు. నాణేల ముద్రణలో, వాటిపై ముద్రించిన భాష, లిపి, ప్రతిమల విషయంలో ప్రతి రాజవంశం కూడా తనదైన శైలిని అనుసరించింది. ప్రజల ఆర్థిక స్థితిగతులను తెలియచేయడంలో కూడా నాణేల ప్రాధాన్యత ఉంది. వ్యాపార, వాణిజ్య విషయాలను తెలియచేస్తూ, అనేక రాజవంశాల చరిత్రను పునర్నిర్మించడానికి నాణేలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇవే కాకుండా ఇతర ఎన్నో చారిత్రక విషయాలను వెలుగులోకి తేవడంలో నాణేలు ముఖ్యమైన పాత్ర పోషించాయి.

TS Inter 1st Year History Study Material Chapter 1 చరిత్ర, భౌగోళిక పరిస్థితులు 1
మొత్తం మీద నాణేల ద్వారా ఆ కాలంనాటి రాజకీయ, ఆర్థిక సామాజిక మరియు మత పరిస్థితులను తెలుసుకోవచ్చు.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న1.
చరిత్ర ప్రాముఖ్యతను గురించి రాయండి.
జవాబు.
చరిత్ర సామాజిక శాస్త్రాలకు తల్లి లాంటిది. చరిత్ర అంటే రాజ్యాలు, రాజవంశాలకు చెందిన సంఘటనలు, తేదీల వర్ణన మాత్రమేకాదు. అంతకన్నా సమాజం, మానవ పరిణామ క్రమాన్ని తీర్చిదిద్దిన అన్నీ అంశాలను సమగ్రంగా వివరించేదే చరిత్ర. దీని అధ్యయనం అంటే లక్షల సంవత్సరాల మానవుల గత చిహ్నాలను తెలుసుకోవడమే. ప్రజలు ఎక్కడ, ఎప్పుడు, ఏవిధంగా తమ సంస్కృతులను అభివృద్ధి పరచుకున్నారనే విషయాన్ని చరిత్ర తెలియచేస్తుంది. అనేక కారణాల దృష్ట్యా చరిత్ర అధ్యయనం అనేది ప్రాముఖ్యత కలిగిన అంశంగా చెప్పవచ్చు. ప్రస్తుత మన సాంస్కృతిక మూలాలను చరిత్ర తెలియచేస్తుంది. ఆలోచించడం, అర్థం చేసుకోవడం, పరిశోధనా వైఖరిని అలవరుచుకోవడం లాంటి జీవన నైపుణ్యాలను చరిత్ర మనకు అందిస్తుంది.

TS Inter 1st Year History Study Material Chapter 1 చరిత్ర, భౌగోళిక పరిస్థితులు

ప్రశ్న 2.
భారతదేశ భౌగోళిక లక్షణాలు.
జవాబు.
ప్రాచీన కాలంలో భారతదేశాన్ని ‘భరతవర్షం’గా పిలిచేవారు. భరతుని భూమిగా, దేశప్రజలను భరతసంతతిగా అభివర్ణించారు. భారతదేశాన్ని పురాణాల్లో జంబూద్వీపం అనేవారు. ఈ దేశానికి ‘ఇండియా’ అనేది మరొక పేరు.

సింధూనది ప్రవహిస్తున్న దేశం కాబట్టి దీన్ని సింధూదేశంగా గ్రీకులు, పారశీకులు వ్యవహరించారు. క్రమంగా ‘సింధు’ పారశీకుల ఉచ్చారణలో ‘హిందు’గా, గ్రీకుల ఉచ్చారణలో ‘ఇండ్’గా మారింది. కాలగమనంలో హిందా, హిందూస్తాన్ ఈ దేశం వ్యవహరింపబడింది.

భారత ఉపఖండానికి భౌగోళిక పరిస్థితులు సహజ రక్షణను కల్పిస్తున్నాయి. ఉత్తరాన హిమాలయ పర్వతశ్రేణికి, తూర్పువైపు బంగాళాఖాతం, దక్షిణం వైపు హిందూమహాసముద్రం, పడమటివైపు అరేబియా సముద్రం సహజమైన ఎల్లలుగా ఉన్నాయి. దేశంలోని పర్వతాలు, మైదానాలు, పీఠభూములు, తీర ప్రాంతాలు దేశచరిత్ర గతిని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించాయి.

ప్రశ్న3.
బ్రాహ్మణీక గ్రంథాలు.
జవాబు.
బ్రాహ్మణీక గ్రంథాలు లేదా వేద సాహిత్యం ప్రాచీన భారతదేశ చరిత్ర పునర్నిర్మాణానికి ముఖ్యమైన ఆధారంగా ఉంది. వీటిని సంస్కృత భాషలో రాశారు. వాటిలో పేర్కొనదగ్గవి వేదాలు, వేదాంగాలు, ఉపవేదాలు, ఉపనిషత్లు, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు. ఈ సాహిత్యం అంతా కూడా నాటి సమాజాన్ని ప్రతిబింబించింది. భారతదేశంలోనే అత్యంత ప్రాచీన సాహిత్యమైన ‘ఋగ్వేదం తొలి ఆర్యుల రాజకీయ, సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులను తెలియచేస్తోంది. మిగిలిన మూడు వేదాలైన యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం, మలివేద కాలం నాటి ఆర్యుల జీవన విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఉపనిషత్లు భారతీయ తాత్విక ధోరణుల గురించి వివరిస్తాయి. ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలు మలివేద ఆర్యుల కాలం నాటి రాజ్య విస్తరణ, భౌగోళిక, సాంఘిక, ఆర్థిక మత, పరిస్థితులను తెలియచేస్తాయి. అలాగే అష్టాదశ పురాణాలు కూడా ముఖ్యమైన ఆధారాలుగా పరిగణింపబడుతున్నాయి. వీటిలో మత్స్య, వాయు, భవిష్య, విష్ణు, భాగవత పురాణాలు చారిత్రకంగా ముఖ్యమైనవి. ఈ పురాణాల వల్ల ముఖ్యంగా హర్యంక, శిశునాగ, నంద, మౌర్య, శాతవాహన మొదలగు రాజవంశాల చరిత్ర తెలుసుకోవచ్చు.

ప్రశ్న4.
బౌద్ధ సాహిత్యం.
జవాబు.
బౌద్ధగ్రంథాలు: ఇవి బౌద్ధుల తాత్విక, మతపరమైన గ్రంథాలు. పాళీ, సంస్కృత, మిశ్రమ సంస్కృత భాషల్లో ఈ గ్రంథాలు ఉన్నాయి.
పాళీ గ్రంథాలు: హీనయాన బౌద్ధం పాళీ గ్రంథాలను అనుసరించింది. బుద్దుడి జ్ఞాన సముపార్జనానంతరం త్రిపిటకాలు ఏర్పడ్డాయి. అవి: 1. సుత్తపీటకం, 2. వినయపీటకం, 3. అభిదమ్మ పీటకం. ఇవి బౌద్ధమత ధర్మం గురించి, ఆచార వ్యవహారాల గురించి, బౌద్ధతత్వాన్ని గురించి చెబుతాయి.

సంస్కృత గ్రంథాలు: మహాయాన బౌద్ధం సంస్కృత గ్రంథాలను అనుసరించినట్లు తెలుస్తున్నది. మహాయానంలో బుద్ధుణ్ణి దేవునిగా కొలిచారు. “వైపుల్య సూత్రం” మహాయాన బౌద్ధానికి ముఖ్య గ్రంథం. “లలిత విస్తరం” బుద్ధుని చరిత్రను, బౌద్ధ ప్రపంచాన్ని తెలియజేస్తుంది. “సద్ధర్మ పుండరీక” మహాయానుల మరో పవిత్ర గ్రంథం.

ప్రశ్న5.
జైన సాహిత్యం.
జవాబు.
జైనుల మత గ్రంథాలు అర్థమాగధీ, ప్రాకృత భాషల్లో రాశారు. వీటిని పన్నెండు అంగాలు, పన్నెండు ఉపాంగాలు, పరి ప్రకీర్ణాలు, ఆరు చేదసూత్రాలు, నాలుగు మూల సూత్రాలు, నాలుగు వివిధ రకాలైన గ్రంథాలుగా విభజించారు. పన్నెండు అంగాలు జైన భిక్షువులు ఉపాసించవలసిన విధానాలను, జైనమతి తత్వాన్ని, మత జ్ఞానాన్ని, కథలను, జైన గురువులను, స్వర్గ నరకాల వివరణను తెలియజేస్తున్నాయి.

ప్రశ్న6.
సంగం సాహిత్యం.
జవాబు.
ప్రాచీన భారత చరిత్ర రాయడానికి మరో ముఖ్యమైన ఆధారంగా తమిళంలో విరచితమైన “సంగమ సాహిత్యం”ను చెప్పవచ్చు. సంగం సాహిత్యమనేది తమిళ కవుల సృష్టి. ఈ సాహిత్యం చేర, చోళ, పాండ్య రాజుల వంశావళిని పేర్కొంది. వీటిలో తమిళదేశ సంస్కృతి, సమకాలీన స్థితిగతులు స్పష్టంగా ప్రతిఫలిస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనవి “కురల్”, “శిలప్పాధికారం”, “ఎట్టుతోగై”, “పట్టుపట్టు”, “పదినెన్ కిల్ కణక్కు మొదలైనవి. ఇవి క్రీ.శ నాలుగో శతాబ్దం వరకు గల విషయాలను అందిస్తున్నాయి.

TS Inter 1st Year History Study Material Chapter 1 చరిత్ర, భౌగోళిక పరిస్థితులు

ప్రశ్న7.
గ్రీకు రచనలు.
జవాబు.
ప్రాచీన భారత చరిత్ర రాయడానికి గ్రీక్ ఆధారాలు చాలా ముఖ్యమైనవి. స్కైలాక్స్ రాసిన “ది అకౌంట్ ఆఫ్ ది జర్ని ఆఫ్ స్కైలాక్స్” మనకు లభించలేదు. హెరోడోటస్ (క్రీ.పూ. 483-430) భారతదేశాన్ని గురించి తన గ్రంథంలో. రాశాడు. డేరియస్ ద్వారా వాయవ్య భారతదేశం గురించి తెలుసుకొన్న సమాచారాన్ని హెరోడోటస్ గ్రంథ రూపంలో
రాశాడు, ఇది మన చరిత్రకు ఆధారం అయింది.

మెగస్తనీస్ అనే గ్రీస్ దేశస్థుడు ‘సెల్యూకస్ నికేటర్ రాయబారిగా చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి విచ్చేసి, ఆ కాలపు పరిస్థితులను వివరంగా “ఇండికా” అనే గ్రంథంలో రాశాడు. అయితే ఆ గ్రంథం ఇప్పుడు లభ్యం కావడం లేదు. ఆ గ్రంథంలోని కొన్ని ముఖ్యాంశాలను స్ట్రాబో, డియోరస్, ఆరియన్ తమ గ్రంథాల్లో పేర్కొన్నారు. అలాగే టాలమీ రాసిన “భూగోళం” (Ptolemy’s Geography), ఒక అజ్ఞాత రచయిత రాసిన “ది పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సి” (The Periplus of the Erythraean Sea) లు భారతదేశంలోని తీర ప్రాంతాల గురించి వివరించాయి. టాలమీ గ్రంథం ద్వారా భారతదేశంలోని నౌకాశ్రయాలు మరియు రేవు పట్టణాల సమాచారం లభ్యమవుతోంది. అయితే గ్రీకులకు ఇక్కడి భాషా, సంప్రదాయాలపై పూర్తి అవగాహన లేకపోవడం వల్ల వారి రచనల్లో కొన్ని అవాస్తవాలు, వివాదాస్పదాంశాలు చోటుచేసుకొన్నాయి.

ప్రశ్న 8.
చైనా రచనలు.
జవాబు.
బౌద్ధ పవిత్ర స్థలాలను చూడటానికి, బౌద్ధమత గ్రంథాలను సేకరించడానికి చైనా బౌద్ధబిక్షువులు భారతదేశం వచ్చారు. వారు తమ గ్రంథాల్లో ఆనాటి భారతదేశాన్ని గురించి వివరంగా రాస్తూ, తాము చూసిన సందర్శించిన ప్రదేశాల గురించి వివరంగా తెలిపారు. వారిలో ప్రముఖుడు. ఫాహియాన్. అతను ఐదో శతాబ్దంలో “ఫో-కో-కి” (Fa kosuoki) అనే గ్రంథంలో మధ్య ఆసియా గురించి, వాయవ్య భారతదేశం, గంగాలోయ గురించి, శ్రీలంక, జావాలను గురించి వివరంగా రాశాడు. హ్యూయాన్ త్సాంగ్ అనే మరో చైనా దేశస్థుడైన బౌద్ధభిక్షువు హర్షుని కాలంలో భారతదేశానికి వచ్చి, హర్షుడి ఆస్థానాన్ని దర్శించాడు. అతడు “సి-యూ-కి” అనే గ్రంథంలో విశిష్టమైన విలువలు ఉన్న చారిత్రక విషయాలను స్పష్టంగా వివరించాడు. ఇత్సింగ్ (Itsing) అనే మరో యాత్రికుడు ఇండోనేషియా నుంచి సముద్రయానం చేసి భారతదేశాన్ని చేరాడు. సంస్కృత గ్రంథాలు, బౌద్ధుల ఆచార వ్యవహారాల గురించి తన గ్రంథంలో స్పష్టంగా తెలిపాడు.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
చరిత్ర రచనాశాస్త్రం.
జవాబు.
చరిత్ర రచన గురించి తెలిపే శాస్త్రమే చరిత్ర రచనా శాస్త్రం. అంటే ఇది చారిత్రక ఆలోచనల చరిత్ర. చరిత్ర ఏ విధంగా రాయబడింది అనే విషయాన్ని తెలియజేస్తుంది. చరిత్రకారుడు యదార్థ సంఘటనలను ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ద్వారా విషయనిష్ఠత సాధించవలెను.

ప్రశ్న 2.
చరిత్ర పరిధి.
జవాబు.
క్రీ.శ. 18వ శతాబ్దం ప్రారంభం వరకు గత సంఘటనలను వివరించేందుకే చరిత్ర పరిమితమై ఉండేది. అయితే నేడు కాలం, ప్రాంతాలను ఆధారంగా చేసుకొని మానవుని కార్యక్రమాలను అధ్యయనం చేయడం వల్ల చరిత్ర పరిధి విస్తృతమైంది. మానవ ఆవిర్భావం నుంచి నేటి దాకా దీని పరిధి విస్తరించి ఉంది. యుద్ధాలు, విప్లవాలు, సామ్రాజ్య ఔన్నత్య పతనాలు, చక్రవర్తుల అదృష్ట దురదృష్టాలు, సామాజిక వ్యవస్థ పరిణామం, సామాన్యుల జీవితాలు చరిత్రకు ప్రధాన విషయాలు. చరిత్ర అన్ని విజ్ఞాన శాస్త్రాలు, పాఠ్యాంశాలను కలుపుకొని ఉన్న చరిత్ర పరిధికి హద్దులు నిర్దేశించలేం.

ప్రశ్న 3.
హిమాలయాలు.
జవాబు.
హిమాలయ పర్వత శ్రేణి పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ నుంచి తూర్పున మయన్మార్ (బర్మా) వరకు వ్యాపించి ఉంది. దాదాపు 2400 కి.మీ. పొడవు, 300 కి.మీ ఎత్తులో ఇవి ఉత్తరాన పెట్టని గోడ వలే ఉన్నాయి. వీటి విస్తీర్ణం దాదాపు ఐదు లక్షల చదరపు కిలోమీటర్లు. ఎవరెస్టు లేదా గౌరీశంకర్ (ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం). కాంచనగంగ, దౌళగిరి, నంగప్రభాత్, నందాదేవి లాంటి పర్వతశ్రేణులు హిమాలయాల్లోనే ఉన్నాయి.

ప్రశ్న 4.
ఎపిగ్రఫి.
జవాబు.
పురావస్తు ఆధారాల్లో అత్యంత విశ్వసనీయమైనవి మరియు ముఖ్యమైనవి శాసనాలు. ఇవి చరిత్రకు సంబంధించిన వాస్తవాలను అందిస్తాయి. శాసనాల అధ్యయనాన్ని ఎపిగ్రఫీ అని అంటారు. శాసనాలను రాళ్లపైన, స్తంభాలపైన, భవనాల గోడలపైన, దేవాలయ గోడలపైనా గమనించవచ్చు. ఇవే కాకుండా ముద్రికలపైనా, రాగి రేకులపైనా (తామ్ర శాసనాలు) కూడా శాసనాలను లిఖించడం జరుగుతుంది.

ప్రశ్న 5.
భారత పురావస్తుశాఖ.
జవాబు.
ప్రాచీన కాలపు అవశేషాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పురాతత్త్వశాస్త్రం అని అంటారు. ఇది ప్రాచీన భారతదేశ చరిత్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోంది. తవ్వకాలు, అన్వేషణలో లభించిన శిథిలాలు, అవశేషాలు, కట్టడాలు(వాస్తు), శిల్పాలు, చిత్రాలు, శాసనాలు, నాణేలు, మట్టి పాత్రలను పురావస్తు ఆధారాలుగా పేర్కొంటారు. భారతదేశంలో పురావస్తు పరిశోధనకు, జాతీయ స్మారక భవనాల పరిరక్షణకు, సంరక్షణకు భారత పురావస్తు శాఖ (ASI) బాధ్యత వహిస్తుంది.

ప్రశ్న 6.
న్యూమిస్ మాటిక్స్.
జవాబు.
చారిత్రక ఆధారాల్లో నాణేలు ముఖ్యమైనవి. నాణేలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘న్యూమిస్మాటిక్స్’ అని అంటారు. నాణేలను భూమిలోనుంచి తవ్వకాల ద్వారా కానీ భూఉపరితలం పైనుంచి కానీ సేకరిస్తారు. నాణేలను సాధారణంగా బంగారు, వెండి, కంచు, మిశ్రమ లోహాలతో తయారుచేస్తారు.

TS Inter 1st Year History Study Material Chapter 1 చరిత్ర, భౌగోళిక పరిస్థితులు

ప్రశ్న 7.
జీవితచరిత్రలు.
జవాబు.
గురువుల, రాజుల జీవిత చరిత్రలను గురించి రాసిన సాహిత్యం మనకు ప్రాచీన కాలంలో చాలా కనిపిస్తుంది. వాటిలో ముఖ్యమైనవి అశ్వఘోషుడు రచించిన “బుద్ధచరితం”, బాణభట్టు రచించిన “హర్షచరితం”, ప్రాకృతభాషలో ముంజరాజు (వాక్పతి) రచించిన “గౌడవ హెూ”, చాంద్బర్దాయ్ రచించిన “పృధ్వీరాజ్ సో”. బుద్ధచరితం కనిష్కుని కాలానికి సంబంధించింది. హర్షచరితం హర్షుని చరిత్రను, గౌడవ హెూ కనోజ్ రాజైన యశోవర్మని కాలానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తున్నాయి.

TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material 4th Poem దుందుభి Textbook Questions and Answers.

TS Inter 2nd Year Telugu Study Material 4th Poem దుందుభి

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
‘దుందుభి’ ప్రవాహ దృశ్యాలను వివరించండి. (V.Imp)
జవాబు:
దుందుభి ప్రవాహ దృశ్యాలను గంగాపురం హనుమచ్ఛర్మ మనోహరంగా వర్ణించాడు. తొలకరి వాన కురవగానే పెద్ద అలలతో స్నేహం చేసి, గట్లతో యుద్ధంచేసి వాటిని తాకుతూ ప్రవహిస్తుంది. గ్రామాల్లోని భూముల బాధ పోగొట్టడానికి వచ్చి, కోరికలు తీర్చే విధంగా పైరు పంటలతో మనసులను ‘ఆనందపరిచి, గోదావరి కృష్ణా నదులు అందడం లేదనే బాధను తీర్చి ప్రసిద్ధి పొందింది.

తలచుకోగానే హృదయమనే వీణ తెగలపై ఝం అనే ధ్వనులు చేస్తూ, కదలగానే అమాయకత్వము నీరుగా మారి, రాళ్లు కరిగి, హృదయంలో కీర్తించే భర్తపై ప్రేమలు గిలిగింతలు పెడుతుంటే ఆగకుండా వస్తున్నది.

దుందుభి అధికమైన కరుణతో పేదల వైపు నిలిచి, ధనమే ప్రధానమని భావించే గుణాన్ని అసహ్యించుకుంటూ, జనుమును తుంగ గడ్డిని, చాలా పొడుగ్గా పెంచి, వారు నివసించడానికి గుడిసెలను కట్టిచ్చి, తాగడానికి మంచి నీటిని ఇచ్చినందుకు కలిగిన సంతోషంతో గంతులు వేస్తున్నది.

రాయిని ఉలితో మలచి, మూసలో కరిగించి పోసిన చిత్రాల లాగా, స్వేచ్ఛగా కల్పించిన ఆకారాలకు రూపం ఇచ్చి చూసిన ప్రజలకును ఆనందపరచి, పేరుకూడా ఆశించని శిల్పకులంలోని గొప్పవారి చేతి నైపుణ్యం లాగ ఆనందింప చేయడానికి ప్రతీ వర్షాకాలంలో ప్రవహిస్తుంది.

కత్తిని, కలాన్ని సమానంగా ఉపయోగించి కావ్యాలలోను, ప్రవృత్తిలోను రౌద్ర రసాలను కోరేవారికి ఆనందాన్ని కలిగించేలా చేసిన కళాకారుడైన వీరుడు గోన బుద్ధారెడ్డి నీస్నేహం కారణంగా అపూర్వమైన చరిత్ర రంగనాథ రామాయణాన్ని రచించాడు. అటువంటి సుకుమారమైన నీ శరీరంలో వరదల సమయంలో కఠినత్వాన్ని పెంచుకుని ప్రవహిస్తుంది.

తెలియని సమయంలో కూడా శైవానికి, వైష్ణవానికి సంబంధించిన అంశాలపై నీ మనస్సులో అనాసక్తత లేదు. మంచి తులసి చెట్ల వరుసలతో, మారేడు వృక్షాల సమూహాలతో నీ రెండు తీరాలను నింపి ఉంచుతూ, తిక్కన కలము చెప్పిన హరి హరాద్వైత తత్వాన్ని తెలుసుకొని సంపన్నురాలవై ప్రవహిస్తున్నది. అందంగా ప్రవహించే ఓ దుందుభి వినసొంపైన చిన్న మాటలతో అందంగా రంగులు వేసినట్లున్న రెక్కలు ప్రకాశిస్తుండగా, గర్వంతో మంచి శకునాలను చూపించి, మా పొలాలలో కొత్తగా పండిన పంట గింజలతో ఆకలిని తీర్చుకుంటున్న పాలపిట్టల జంటలను చూస్తూ హడావిడిగా ముందుకు సాగిపోతున్నది.

హైదరాబాదుకు అతి సమీపంలో జన్మించి, మహబూబ్ నగర్ జిల్లాలో ఆనకట్టచే బంధించబడి, నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతంలోని భూములలో పంటలు పండించి, ఇంకా ముందుకు అలాఅలా ప్రవహించి, పలనాటి బ్రహ్మనాయుడు పాలించిన ప్రాంతంలో పారి కృష్ణానదికి అతి దగ్గరలో ఏలేశ్వర స్వామి పూజలు చేసి అక్కడి భక్తులకు ఆచార్య నాగార్జునుని కీర్తిని చెప్పి చరిత్ర రాయడానికి వెలుగు బాటలు చూపి, ఇక్ష్వాకులు పరిపాలించిన విజయపురాన్ని చేరి, ఆచార్య నాగార్జునున్ని చూసి ధన్యతను పొంది, తెలుగు నేలను పైరు పంటలతో నింపి, శాశ్వతంగా తెలుగు బిడ్డలకు నీ ఆశిస్సులనే అక్షతలను, మంచి నడవడిని అందించి, ఈ లోకంలో, లోకంలో అన్ని కోరికలను తీర్చి మమ్మల్ని పెంచే తల్లిగా మాకు పాలవెల్లిగా, పాల ఏరుగా ప్రవహించింది.

ప్రశ్న 2.
దుందుభి గొప్పతనాన్ని తెలుపండి. (V.Imp) (M.P)
జవాబు:
గంగాపురం హనుమచ్ఛర్మ దుందుభి నది గొప్పతనాన్ని చక్కగా వర్ణించాడు. కొంతమంది స్వార్థపరులు వారి విలాసాలకోసం ఏవో చట్టాలు చేసి ఈ భూమిని ఆక్రమించుకుని గర్వాన్ని పొంది వారి ఆనందం కోసం చేసిన ఒత్తిడి కారణంగా సమయానికి ఆహారం తీసుకోలేక బాధతో మరణించి దీనస్థితిలో ఎండిపోయిన వారి అస్థిపంజరాలు దుందుభి ఒడిలో శాశ్వతమైన శాంతిని సుఖాన్ని పొందాయన్నారు.

పట్టుకున్న ప్రతీ రాయి శిల్పంగా మారి, భూమిలో పాతిన బండలన్ని శాసనాలుగా మారి, కట్టించిన దేవాలయాల అభివృద్ధి తెలుగు జాతికి జీవనాధారంగా మారి జన్మ సార్థకం చేసుకున్న ఎందరో శ్రీ చాళుక్య చక్రవర్తులు దుందుభి తీరంలోనే రాజులుగా అదృష్టాన్ని పొందారు.

అద్దంలాగా స్వచ్ఛంగా ఉన్న నీటిలో తన రూపాన్ని చూసుకుంటున్న ఆ అందమైన చందమామ దుందుభి ఒడిలో నిద్రపోతున్నప్పుడు కీచురాయి శబ్దాలతో జోలపాటలు పాడిన విధంగా ఊగుతున్న అలలు అనే ఊయలలో ముద్దుగొలిపే విధంగా ప్రకాశవంతమైన శరత్కాలంలోని వెన్నెలలో తల్లిలాగామారి నిద్రపుచ్చుతుంది. పేదవారి ఇండ్లకోసం తమ శరీరాన్ని పెంచి, భిన్నత్వం లేని విధంగా పేర్చుచు, తాటికమ్మలతో గుడిసె కప్పును తయారు చేసి మెప్పును పొందుచు, వాటి శక్తి నశించగానే తాటి ఆకుల కుప్పతో వేసిన చలి మంటలతో పేదవారు చలిని పోగొట్టుకుంటారు. దుందుభి పెంచిన కారణంగా తాటిచెట్లపై ప్రేమలు పెరిగాయి.

లోకంలో సాగిన హింసను లేకుండా చేయడానికి పాదాల దగ్గర ఉన్న చీమలుకూడా చనిపోకుండా చూసే, నశించి పోతున్న మానవత్వాన్ని తిరిగి నిలపడానికి ప్రయత్నించిన జైన తీర్థంకరులకు కూడా తాగడానికి అనువైన జలాన్ని ఇచ్చిన కీర్తిని పొందింది. పరిశుద్ధమైన, ప్రకాశవంతమైన దుందుభి నదిని బంధించడం పిచ్చి పని. పవిత్రమైన భావాలను ఆపడం సాధ్యమా ? మిక్కిలి తీవ్రమైన అగ్నిని తీసుకొని మూటలో బంధించడం, నీటిని ఆపడం స్వేచ్ఛయే జీవితంగా కల దుందుభి విషయంలో సాధ్యపడదు.

సగం పేగును తడపడానికి సరిపోని అత్యంత తక్కువ ఆహారం కూడా లేని, రక్తాన్ని ఆవిరిగా చేసి, లోకానికి మంచి చేయడానికి ప్రయత్నం చేసి ఈ భూమిని తమ చెమటతో తడిపి కష్టాలతో బాధపడే మానవులకు అత్యంత ప్రేమతో మంచి మొదటి పంటగా సీతాఫలాలను ఇచ్చి తన కారుణ్యాన్ని చూపినందుకు కవి మెచ్చుకున్నాడు.

అలలు అనే చేతులతో ఆడే ఆటలు చూసి చెట్లు పూలతో పులకరించాయి. ఒక్కొక్క పులకరింత ఒక్కొక్క పుష్పమై వికసించింది. పుష్పించిన ఒక్కొక్క పూవు ఒక్కొక్క తేనె నిండిన పాత్రగా ఆతిథ్యం ఇచ్చింది. దుందుభి ప్రవహించి తెలుగు భూములను పవిత్రంగా మార్చింది. తెలుగు సంస్కృతులతో ప్రకాశించే దుందుభి పంట భూములకు పాలు ఇవ్వడానికి ప్రవహించింది కావున తన గొప్పతనాన్ని కావ్యంలో పెట్టాడు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి

II సంగ్రహరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
దుందుభిని తలచుకొని కవి పొందిన అనుభూతి ఏమిటి ?
జవాబు:
తొలకరి వాన కురవగానే పెద్ద అలలతో స్నేహం చేసి, గట్లతో యుద్ధంచేసి వాటిని తాకుతూ, గ్రామాల్లోని భూముల బాధ పోగొట్టడానికి వచ్చిందని గంగాపురం హనుమచ్ఛర్మ భావించాడు. తమ కోరికలు తీర్చే విధంగా పైరు పంటలతో మనసులను ఆనందపరిచిందని, గోదావరి కృష్ణా నదులు మాకు అందడం లేదనే బాధను తీర్చడమే నిజమైన ప్రసిద్ధి అవుతుందని అనుకున్నాడు. ఇంకా బంగారు రంగులు నిండిన సంధ్యా సమయాలు, మామిడి పూతను తిని ఎక్కువగా సంతోషించి కోకిలలు చేస్తున్న శబ్దాలు, తొలకరి వర్షానికి ముందు కనిపించే నల్లని మేఘాలు, ఆ మబ్బుల్లోంచి తొంగి చూసే మెరుపులు నాకు ఒక ఆలోచనను కలిగించి కొత్త గీతాలతో నిన్ను ఆనంద పరచుమన్నవని గంగాపురం హనుమచ్ఛర్మ అనుభూతిని పొందాడు.

ప్రశ్న 2.
దుందుభితో కవులకున్న సంబంధాన్ని తెలుపండి. (V.Imp) (M.P)
జవాబు:
కత్తిని, కలాన్ని సమానంగా ఉపయోగించి కావ్యాలలోను, ప్రవృత్తిలోను రౌద్ర రసాలను కోరేవారికి ఆనందాన్ని కలిగించేలా చేసిన కళాకారుడైన వీరుడు గోనబుద్ధారెడ్డి. అతని దుందుభి స్నేహం కారణంగా అపూర్వమైన చరిత్ర రంగనాథ రామాయణాన్ని రచించాడు. తెలియని సమయంలో కూడా శైవానికి, వైష్ణవానికి సంబంధించిన అంశాలపై దుందుభి మనస్సులో అనాసక్తత లేదు. మంచి తులసి చెట్ల వరుసలతో, మారేడు వృక్షాల సమూహాలతో రెండు తీరాలను నింపి ఉంచుతూ, తిక్కన కలము చెప్పిన హరి హరాద్వైత తత్వాన్ని తెలుసుకొని సంపన్నురాలుగా ప్రవహిస్తున్నదని చెప్పడం ద్వారా దుందుభికి కవులకు ఉన్న సంబంధాన్ని గంగాపురం హనుమచ్ఛర్మ వివరించాడు.

ప్రశ్న 3.
జంతువులను, పక్షులను దుందుభి ఎలా ఆదరిస్తుంది ?
జవాబు:
కదులుతున్న గడ్డిపోచకు కూడా భయపడి చెల్లాచెదరుగా పారిపోయే జింకలు, దుప్పుల సమూహాలు అడవిలో తిరిగితిరిగి అలిసిపోయి దాహంతో నీరు తాగడానికి దుందుభి దగ్గరకు వస్తాయి. కింది పెదవులు ఆనించి నీరు తాగుతుండగా చేపలు గంతులు వేస్తుంటే భయపడతాయి. దాహం తీరక కలిగే బాధతో అవి దిక్కులు పట్టుకొని పారిపోతుంటే దుందుభి ఉపాయంతో చూస్తుంది. వినసొంపైన చిన్న మాటలతో అందంగా రంగులు వేసినట్లున్న రెక్కలు ప్రకాశిస్తుండగా, గర్వంతో మంచి శకునాలను చూపించి, పొలాలలో కొత్తగా పండిన పంట గింజలతో ఆకలిని తీర్చుకుంటున్న పాలపిట్టల జంటలను చూస్తూ హడావిడిగా ముందుకు పోతుంది.

ప్రశ్న 4.
దుందుభి ఎక్కడ పుట్టి ఎక్కడెక్కడ పారింది ?
జవాబు:
హైదరాబాదుకు అతి సమీపంలో జన్మించి, మహబూబ్ నగర్ జిల్లాలో ఆనకట్ట దగ్గర కొంత ఆగుతుంది. నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతంలోని భూములలో పంటలు పండించి, ఇంకా ముందుకు అలాఅలా ప్రవహిస్తుంది. పలనాటి బ్రహ్మనాయుడు పాలించిన ప్రాంతంలో పారి కృష్ణానదికి అతి దగ్గరలో ఏలేశ్వర స్వామికి పూజలు చేస్తుంది. అక్కడి భక్తులకు ఆచార్య నాగార్జునుని కీర్తిని చెప్పి చరిత్ర రాయడానికి వెలుగు బాటలు చూపుతుంది.

ఇక్ష్వాకులు పరిపాలించిన విజయపురాన్ని చేరి, ఆచార్య నాగార్జునున్ని చూసి ధన్యతను పొంది, తెలుగు నేలను పైరు పంటలతో నింపుతుంది. శాశ్వతంగా తెలుగు బిడ్డలకు ఆశిస్సులనే అక్షతలను, మంచి నడవడిని అందించి, ఈ లోకంలో, పరలోకంలో అన్ని కోరికలను తీర్చి తల్లిగా, పాలవెల్లిగా, పాల ఏరుగా ప్రవహిస్తుంది.

III. ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
గంగాపురం హనుమచ్ఛర్మ స్వగ్రామం ఏది ?
జవాబు:
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి దగ్గర ఉన్న గూడూరు. జన్మ స్థలం వేపూరు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి

ప్రశ్న 2.
దుందుభి ఒడిలో శాంతి పొందినవి ఏవి ?
జవాబు:
దైన్య, శుష్క కంకాలములు. ఎండిన అస్థిపంజరాలు

ప్రశ్న 3.
జాతి వికాసానికి జీవగఱ్ఱ ఏది ?
జవాబు:
దేవాలయాల వికాసం

ప్రశ్న 4.
హనుమచ్ఛర్మ అముద్రిత సుప్రభాతం పేరేమిటి ?
జవాబు:
గంగాపురం చెన్నకేశవ సుప్రభాతం

ప్రశ్న 5.
దుందుభి అద్దాన్ని చూసి రూపము దిద్దుకొనేదెవరు ?
జవాబు:
చందమామ

ప్రశ్న 6.
తొలి పంటగా దుందుభి ఏ ఫలాలనిస్తుంది ?
జవాబు:
సీతాఫలాలను

ప్రశ్న 7.
విజయపురిని ఏలిన వారెవరు ?
జవాబు:
ఇక్ష్వాకులు

ప్రశ్న 8.
దుందుభి నది ఎక్కడ పుట్టింది ?
జవాబు:
భాగ్యనగరానికి అత్యంత సమీపంలో.

IV సందర్భసహిత వ్యాఖ్యలు

1. నీదు తీరమున రాచరికమ్ముల నోచిరెందరో
జవాబు:
కవి పరిచయం : గంగాపురం హనుమచ్ఛర్మ రాసిన దుందుభి కావ్యం నుండి గ్రహించిన దుందుభి అనే పాఠం నుండి తీసుకున్నది ఈ వాక్యం. హనుమచ్ఛర్మ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కవి.

సందర్భం : పట్టుకున్న ప్రతీ రాయి శిల్పంగా మారి, భూమిలో పాతిన బండలన్ని శాసనాలుగా మారి, కట్టించిన దేవాలయాల అభివృద్ధి తెలుగు జాతికి జీవనాధారంగా మారి, జన్మ సార్థకం చేసుకున్న ఎందరో శ్రీ చాళుక్య చక్రవర్తులు దుందుభి తీరంలోనే రాజులుగా అదృష్టాన్ని పొందారని కవి చెప్పిన సందర్భం లోనిది ఈ వాక్యం.

అర్థం : నీ సమీపంలోనే రాజ్య పాలన చేసే అదృష్టాన్ని పొందారు అని అర్థం.

వివరణ : దుందుభి నదీ తీరంలో ఎంతో మంది చాళుక్య రాజులు చాల ఆనందంగా రాజ్య పాలన చేశారని

2. పారెదవు తాత్వికత న్శివకేశవాఢ్యవై
జవాబు:
కవి పరిచయం : గంగాపురం హనుమచ్ఛర్మ రాసిన దుందుభి కావ్యం నుండి గ్రహించిన దుందుభి అనే పాఠం నుండి తీసుకున్నది ఈ వాక్యం. హనుమచ్ఛర్మ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కవి.

సందర్భం : ప్రాచీన కాలంలో కూడా శైవానికి, వైష్ణవానికి సంబంధించిన అంశాలపై దుందుభి మనస్సులో అనాసక్తత లేదు. విష్ణువుకు ఇష్టమైన మంచి తులసి చెట్ల వరుసలతో, శివునికి ఇష్టమైన మారేడు వృక్షాల సమూహాలతో రెండు తీరాలను నింపి ఉంచుతూ, తిక్కన కలము చెప్పిన హరి హరాద్వైత తత్వాన్ని తెలుసుకొని సంపన్నురాలిగా ప్రవహిస్తుందని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం : శివ కేశవ అద్వైత తత్వాన్ని తెలుసుకొని సంపన్నురాలిగా ప్రవహిస్తావని అర్థం.

వివరణ : దుందుభి నదికి రెండు వైపులా తులసీ, మారేడు చెట్లు ఉన్నవి కావున హరి హరాద్వైతాన్ని పాటించిందని భావం.

3. విమలభాస్వద్రూప శైవాలినీ
జవాబు:
కవి పరిచయం : గంగాపురం హనుమచ్ఛర్మ రాసిన దుందుభి కావ్యం నుండి గ్రహించిన దుందుభి అనే పాఠం నుండి తీసుకున్నది ఈ వాక్యం. హనుమచ్ఛర్మ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కవి.

సందర్భం : పరిశుద్ధమైన, ప్రకాశవంతమైన, ఓ దుందుభి నదీ ! నిన్ను బంధించారు. ఇదెక్కడి పిచ్చి తెలివి? పవిత్రమైన భావాలను ఆపడం సాధ్యమా ? మిక్కిలి తీవ్రమైన అగ్నిని తీసుకొని మూటలో బంధించడం, నీటిని ఆపడం స్వేచ్ఛయే జీవితంగా కలదానివైన నీ విషయంలో సాధ్యమవుతుందా ? అని కవి ప్రశించిన సందర్భం లోనిది ఈ వాక్యం.

అర్థం : పరిశుద్ధమైన, ప్రకాశవంతమైన, ఓ దుందుభి నదీ అని అర్థం.

వివరణ : పవిత్రమైన భావాలను ఆపడం సాధ్యం కానట్టే పవిత్రమైన దుందుభిని ఆపడం సాధ్యం కాదని భావం.

TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి

4. మముబెంచు తల్లివై మా పాలవెల్లివై
జవాబు:
కవి పరిచయం : గంగాపురం హనుమచ్ఛర్మ రాసిన దుందుభి కావ్యం నుండి గ్రహించిన దుందుభి అనే పాఠం నుండి తీసుకున్నది ఈ వాక్యం. హనుమచ్ఛర్మ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కవి.

సందర్భం : ఇక్ష్వాకులు పరిపాలించిన విజయపురాన్ని చేరి, ఆచార్య నాగార్జునున్ని చూసి ధన్యతను పొంది, తెలుగు నేలను పైరు పంటలతో నింపి, శాశ్వతంగా తెలుగు బిడ్డలకు నీ ఆశిస్సులనే అక్షతలను, మంచి నడవడిని అందించి, ఈ లోకంలో, పరలోకంలో అన్ని కోరికలను తీర్చి మమ్మల్ని పెంచే తల్లిగా, మాకు పాల వెల్లిగా ప్రవహిస్తావా ! అని దుందుభిని కవి అడుగుతున్న సందర్భం లోనిది ఈ వాక్యం.

అర్థం : మమ్మల్ని పెంచి తల్లివి, మా పాలిట పాల నదివి అని అర్థం.

వివరణ : దుందుభి తెలుగు వారందరికీ తల్లిలాగా పోషణకు కావలిసినవన్నీ ఇస్తుందని భావం.

పద్యములు – ప్రతిపదార్థ తాత్పర్యములు

1వ పద్యం :

మ॥ తొలిజల్లు ల్గురియంగ ! పేరలల పొత్తుంగొంచు పోరాడి యొ
డ్డులతో రాయుచు గ్రామసీమలకు గోడుంబాప నేతెంచి, మా
తలపు ల్ముట్టియు సస్యపాకముల నాత్మ ల్దేర్చి; గోదమ్మ
కృ స్థలు మాకందని కుందు దీర్చితి ప్రశస్తం బిద్దియౌ ! దుందుభీ !

ప్రతిపదార్థం :

దుందుభీ ! = ఓ దుందుభి నదీ!
తొలిజల్లుల్ = తొలకరి వాన
కురియం = పడగానే
పేరు + అలల = పెద్ద అలలతో
పొత్తుంగొంచు = స్నేహం చేసి
పోరాడి = పోరాటం చేసి
ఒడ్డులతో రాయుచు = గట్లను తాకుతూ
గ్రామసీమలకు = గ్రామాల్లోని భూములకు
గోడు = బాధ
బాపన్ = పోగొట్టడానికి
ఏతెంచి = వచ్చి
మా తలపులు = మా కోరికలు
ముట్టియు = తాకి, తీర్చి
సస్య = పైరు
పాకములన్ = పంటలతో
ఆత్మల్ + తేర్చి = మనసులను ఆనందపరచి
గోదమ్మ = గోదావరి నదీ
కృష్ణలు = కృష్ణా నది మొదలైనవి
మాకు + అందని = మాకు అందడం లేవు అనే
కుందున్ = “బాధ
తీర్చితి = తీర్చావు
ప్రశస్తంబు + ఇద్దియౌ ! = ఇదే నిజమైన ప్రసిద్ధి అవుతుంది

తాత్పర్యం : ఓ దుందుబి,! తొలకరి వాన కురవగానే పెద్ద అలలతో స్నేహం చేసి, గట్లతో యుద్ధంచేసి వాటిని తాకుతూ, మా గ్రామాల్లోని భూముల బాధ పోగొట్టడానికి వచ్చి, మా కోరికలు తీర్చే విధంగా పైరు పంటలతో మా మనసులను ఆనందపరిచి, గోదావరి కృష్ణా నదులు మాకు అందడం లేదనే బాధను తీర్చావు. ఇదే నిజమైన ప్రసిద్ధి అవుతుంది.

2వ పద్యం :

ఉ||
బంగరు రంగుల న్విరియఁ బారిన సంధ్యలు మావిపూత ను
ప్పొంగిన కోయిలమ్మ రుతముల్ ! తొలికారు మొయిళ్ళు ! వానిలో
వంగి చలించు చంచలలు ! నాకొక భావన నేర్పరించి ని
న్నుం గిలిగింతగొల్పుమనె నూతనగీతి మదంబ దుందుభీ !

ప్రతిపదార్థం :

మత్+అంబ దుందుభీ != మా అమ్మ వంట దుందుభి
బంగరు రంగులన్ = బంగారపు రంగులు
విరియం బారిన = వ్యాపించిన
సంధ్యలు = సంధ్యా సమయాలు (ఉదయాలు, సాయంత్రాలు)
మావి పూతన్ = మామిడి పూతతో
ఉప్పొంగిన = ఎక్కువ సంతోషించి
కోయిలమ్మ రుతముల్ = కోకిలలు చేసే శబ్దాలు, ధ్వనులు
తొలికారు మొయిళ్ళు! = తొలకరి వర్షానికి ముందు ఉండే నల్లని మబ్బులు
వానిలో = ఆ మేఘాలలో నుండి
వంగి చలించు = వంపులతో కదిలే
చంచలలు! = మెరుపులు
నాకున్ + ఒక = నాకు ఒక రకమైన
భావనన్ = ఆలోచనను, ఊహను
ఏర్పరిచి = కలిగించి
నిన్నుం = నిన్ను (దుందుభిని)
నూతనగీతి = కొత్త పాటలతో
గిలిగింత గొల్పుము+అనె = ఆనంద పరుచుమన్నవి

తాత్పర్యం : మా అమ్మ వంటి దుందుభి! బంగారు రంగులు నిండిన సంధ్యా సమయాలు, మామిడి పూతను తిని ఎక్కువగా సంతోషించి కోకిలలు చేస్తున్న శబ్దాలు, తొలకరి వర్షానికి ముందు కనిపించే నల్లని మేఘాలు, ఆ మబ్బుల్లోంచి తొంగి చూసే మెరుపులు నాకు ఒక ఆలోచనను కలిగించి కొత్త గీతాలతో నిన్ను ఆనంద పరచుమన్నవి.

3వ పద్యం :

చ||
తలచినయంతనే హృదయ తంత్రుల ఝమ్మని మ్రోతలెత్తెనో
మలచినగుండెలోపలి యమాయికత ల్జలమై స్రవించెనో
శిలలు ద్రవించెనో, యెద భజించు ప్రియుండగు స్వీయనాథుపై
వలపులు పుల్కరించుడు నభంగురతం జనుదెంతు దుందుభీ!

ప్రతిపదార్థం :

దుందుభీ! = ఓ దుందుభి
తలచిన అంతనే = మనసులో తలుచుకోగానే, అనుకోగానే
హృదయ తంత్రుల = హృదయమనే వీణ తీగలపై
ఝం + అని = ఝం అనే
మ్రోతలు+ఎత్తైన్+ఓ = ధ్వనులు వచ్చాయా ?
మలచిన = కదిలిన
అమాయికతల్ = అమాయకత్వం, తెలియనితనం
జలమై = నీరై
స్రవించెనో = కారిందా
శిలలు = రాళ్లు
ద్రవించెనో = కరిగాయా
ఎద = హృదయంలో
భజించు = కీర్తించే
ప్రియుండు + అగు = ప్రియమైన వాడైన
స్వీయ నాథుపై = భర్తపై
వలపులు = ప్రేమలు
పుల్కరించుడున్ = గిలిగింతలు పెడుతున్నాయా
అభంగురతన్ = ఆగకుండా (భంగం = ఆటంకం)
చనుదెంతు = వస్తున్నావు

తాత్పర్యం : ఓ దుందుభి ! తలచుకోగానే నీ హృదయమనే వీణ తీగలపై ఝం అనే ధ్వనులు వెలువడ్డాయా ? కదలగానే నీ అమాయకత్వము నీరుగా మారిందా ? రాళ్లు కరిగాయా ? నీ హృదయంలో కీర్తించే నీ ప్రియుడైన భర్తపై ప్రేమలు గిలిగింతలు పెడుతున్నాయా ? ఆగకుండా వస్తున్నావు ?

TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి

4వ పద్యం :

ఉ||
కూళలు కొంద రేవొ తమ కోసము శాసనముల్ సృజించి, భూ
గోళము నాక్రమించుకొని, క్రొవ్వగ వారి విలాసఘట్టనన్
వేళకు కూడుగానక తపించి గతించిన దైన్య శుష్క కం
కాళము లెన్నొ నీయొడిని గాంచె నిరంతర శాంతి సౌఖ్యముల్.

ప్రతిపదార్థం:

కొందరు = కొంత మంది
కూళలు = క్రూరులు
తమ కోసము = స్వార్థం కోసం
శాసనముల్ = చట్టాలను
సృజించి = తయారు చేసి
భూగోళమున్ = భూమిని
ఆక్రమించుకొని = వశపరచుకొని
క్రొవ్వగ = గర్వాన్ని పొంది
వారి విలాస ఘట్టనన్ = వారి యొక్క ఆనందం కోసం చేసే ఒత్తిడివల్ల
వేళకు = సమయానికి
కూడు గానక = తిండి పొందక
తపించి = బాధపడి
గతించిన = మరణించిన
దైన్య = దీనస్థితిలో
శుష్క = ఎండిన
కంకాళములు+ఎన్నో = ఎన్నో అస్థిపంజరాలు
నీయొడినిన్ = నీ ఒడిలో
నిరంతర = ఎల్లప్పుడు
శాంతి సౌఖ్యముల్ = శాంతిని సుఖాలను
కాంచెన్ = చూశాయి, పొందాయి

తాత్పర్యం : కొంతమంది స్వార్థపరులు వారి విలాసాలకోసం ఏవో చట్టాలు చేసి ఈ భూమిని ఆక్రమించుకుని గర్వాన్ని పొంది వారి ఆనందం కోసం చేసిన ఒత్తిడి కారణంగా సమయానికి ఆహారం తీసుకోలేక బాధతో మరణించి దీన స్థితిలో ఎండిపోయిన వారి అస్థిపంజరాలు నీ ఒడిలో శాశ్వతమైన శాంతిని, సుఖాన్ని పొందాయి.

5వ పద్యం :

ఉ|| మాయురె దుందుభీ! ప్రబల మైన కృపాధిషణన్ దరిద్రనా
రాయణ పక్షమై ధన పరత్వము రోయుచు ‘జమ్ము’ ‘తుంగ’ ల
త్యాయతవృత్తి బెంచి నిలయమ్ముగ బాకను గూర్చి స్వాదుపా
నీయము నిచ్చి త్రావగ జనించిన ప్రేమను చిందె దీగతిన్,

ప్రతిపదార్థం :

మాయురె దుందుభీ ! = ఆహా దుందుభి !
ప్రబలమైన = బలమైన, అధికమైన
కృపాధిషణన్ = కరుణతో
దరిద్రనారాయణ పక్షమై = పేదల వైపు ఉండి
ధన పరత్వము = ధనమే ప్రధానమనే గుణాన్ని
రోయుచు = అసహ్యించుకుంటూ
జమ్ము, తుంగ ల = జనుమును, తుంగ అనే గడ్డిని
అతి + ఆయత వృత్తి = చాలా పొడుగ్గా
బెంచి = పెంచి
నిలయమ్ముగ = నివాసంగా
పాకను గూర్చి = గుడిసెను కట్టి
స్వాదు పానీయమును = = తీయటి నీటిని
త్రావగ ఇచ్చి = తాగడానికి ఇచ్చి
జనించిన = పుట్టిన
ప్రేమను = ప్రేమతో
చిందెదు ఈ గతిన్ = ఈ విధంగా గంతులు వేస్తున్నావు

తాత్పర్యం : ఆహా! ఓ దుందుభి! అధికమైన కరుణతో పేదల వైపు నిలిచి, ధనమే ప్రధానమని భావించే గుణాన్ని అసహ్యించుకుంటూ, జనుమును తుంగ గడ్డిని, చాలా పొడుగ్గా పెంచి, వారు నివసించడానికి గుడిసెలను కట్టి ఇచ్చి, తాగడానికి మంచి నీటిని ఇచ్చినందుకు కలిగిన సంతోషంతో గంతులు వేస్తున్నావు.

6వ పద్యం :

చ||
శిల నులిమూసలోఁ గరగి చిత్తరువుంబలె స్వేచ్చ రూపురే
ఖల వరభావ మచ్చునిడి, కాంచు జగమ్ముల నేలి పేరులన్
వలవని మేటి శిల్పకుల వర్యుల మంజుల దివ్యహస్తకౌ
శలమును బోలి వర్షములు సాగెదవా మము దేర్చ వాహినీ.

ప్రతిపదార్థం :

వాహినీ = నదీ (దుందుభి)
శిలన్ = రాయిని
ఉలి = ఉలితో
మూసలో = అచ్చులో
కరగి = కరిగిన
చిత్తరువున్ బలె = చిత్రాల వంటి
స్వేచ్చన్ = స్వేచ్ఛతో
రూపురేఖలన్ = ఆకారాలను
వరభావము = గొప్ప కల్ప
అచ్చునిడి = రూపం ఇచ్చి
కాంచు = చూసే
జగమ్ములన్ = ప్రజలను
ఏలి = పాలించి, ఆనందపరచి
పేరులన్ = ప్రఖ్యాతులను
వలవని = ఆశించని
మేటి = గొప్ప
శిల్ప కుల వర్యుల = శిల్పులలో గొప్పవారి
మంజుల = అందమైన, మనోజ్ఞమైన
దివ్య = గొప్ప
హస్త కౌశలమును = చేతి నైపుణ్యం
బోలి = లాగా
మము దేర్చ = మిమ్మల్ని ఆనందపరచడానికి
వర్షములన్ = వర్షాకాలంలో, సంవత్సరాల పాటు
సాగెదవా = పారుతున్నావా

తాత్పర్యం : ఓ దుందుభి నదీ! రాయిని ఉలితో మలచి, మూసలో కరిగించి పోసిన చిత్రాల లాగా స్వేచ్ఛగా కల్పించిన ఆకారాలకు రూపం ఇచ్చి చూసిన ప్రజలను ఆనందపరచి పేరుకూడా ఆశించని శిల్పకులంలోని గొప్పవారి చేతి నైపుణ్యం లాగ మమ్మల్ని ఆనందింప చేయడానికి ప్రతీ వర్షాకాలంలో ప్రవహిస్తావా ?

7వ పద్యం :

ఉ||
కత్తిని గంటము నెదిపి కావ్యరసమ్మున రౌద్రవృత్తి రే
కెత్త రసజ్ఞచిత్త ముడికించు కళాత్మక వీరమూర్తి నీ
పొత్తున గోనబుద్ధుడు సపూర్వచరిత్ర రచించే తద్విధిన్
మెత్తనిమేనిలో బిరుసు మీరెదవా వరద ల్వరించినన్.

ప్రతిపదార్థం:

కత్తిని = కరవాలాన్ని, ఖడ్గాన్ని
గంటమున్ = గంటమును, కలమును
మెదిపి = కదిలించి, ఉపయోగించి
కావ్యరసమ్మున = కావ్యంలోని రసాలను
రౌద్రవృత్తి రేకెత్త = రౌద్రస్వభావంతో
రసజ్ఞ చిత్తము = రసాన్ని గుర్తించి ఆనందించే మనసు
ఉడికించు = తపించే విధంగా
కళాత్మక = సృజనశీలి అయిన
వీరమూర్తి = వీరుడు
నీ పొత్తున = నీ స్నేహంలో (నీ పక్కన ఉండి)
గోనబుద్ధుడున్ = గోన బుద్ధారెడ్డి అనే పేరుగల వాడు
అపూర్వ చరిత్రన్ = ముందు లేని గొప్ప చరిత్రను (రంగనాథ రామాయణాన్ని) రచించాడు
రచించే = రచించాడు
తత్ + విధిన్ మెత్తని = అటువంటి
మెత్తని = సుకుమారమైన
మేనిలో = శరీరంలో
వరదల్+వరించినన్ = వరదలు వచ్చినప్పుడు
బిరుసు = గట్టిదనాన్ని, కఠినత్వాన్ని
మీరెదవా = పెంచుకుంటావా

తాత్పర్యం : కత్తిని, కలాన్ని సమానంగా ఉపయోగించి కావ్యాలలోను, ప్రవృత్తిలోను రౌద్ర రసాలను కోరేవారికి ఆనందాన్ని కలిగించేలా చేసిన కళాకారుడైన వీరుడు గోనబుద్ధారెడ్డి. నీస్నేహం కారణంగా అపూర్వమైన చరిత్ర రంగనాథ రామాయణాన్ని రచించాడు. అటువంటి సుకుమారమైన నీ శరీరంలో వరదల సమయంలో కఠినత్వాన్ని పెంచుకుంటావా?

TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి

8వ పద్యం :

చ||
అవమతిలేదు నీయెద రహస్యపు వేళలనైన శైవవై
ష్ణవములపైన దానికిల సత్తులసీద్రుమపాళి బిల్వప
త్రవనము తీరదేశముల దాల్చుచు తిక్కన గంటమీను స
త్కవితను బోలి పారెదపు తాత్వికత నివకేశవాఢ్యవై.

ప్రతిపదార్థం:

రహస్యము+వేళలన్+ ఐనన్ = తెలియని సమయంలో కూడా (ప్రాచీన కాలంలో)
శైవ = శివునికి సంబంధించిన
వైష్ణవము = విష్ణుకు సంబంధించిన
ల పైన = అంశాలపై
దానికి = ఆ మతాలకు సంబంధించి
ఇలన్ = ఈ భూమిపై
నీ యెద = నీ మనసులో
అవమతిలేదు = అనాసక్తత లేదు
సత్ + తులసీ = మంచి తులసి
ద్రుమపాళి = చెట్ల వరుసతో
బిల్వపత్ర వనము = మారేడు పత్ర వృక్షాల సమూహంతో
తీర దేశముల = నీ రెండు అంచులు,
తాల్చుచు = నింపి ఉంచుతూ
తిక్కన = కవిబ్రహ్మ తిక్కన
గంటము + ఈను = కాలము ఇచ్చిన
సత్కవితను బోలి = మంచి కవిత తీరుగా
శివ = శివుని
కేశవ = నారాయణుని
తాత్వికతన్ = తత్వాలతో
ఆఢ్యపై = సంపన్నురాలవై
పారెదవు = ప్రవహిస్తావు

తాత్పర్యం : తెలియని సమయంలో (ప్రాచీన కాలంలో) కూడా శైవానికి, వైష్ణవానికి సంబంధించిన అంశాలపై నీ మనస్సులో అనాసక్తత లేదు. (విష్ణువుకు ఇష్టమైన) మంచి తులసి చెట్ల వరుసలతో, (శివునికి ఇష్టమైన) మారేడు వృక్షాల సమూహాలతో నీ రెండు తీరాలను నింపి ఉంచుతూ, తిక్కన కలము చెప్పిన (హరి హరాద్వైత) శివకేశవ తత్వాన్ని తెలుసుకొని సంపన్నురాలవై ప్రవహిస్తున్నావు.

9వ పద్యం :

ఉ|| పేదలయిండ్లకై తనువు బెంచి యభిన్నత బేర్చు బుద్ధి సాం
ద్రాదర భావవీచుల విధమ్మగు కమ్మల కప్పుగూర్చి; మె
ప్పూదుచు చేవ బోవ తమ ప్రోవుల మంట దరిద్రశీతముల్
ఏదెడు తాళవృక్షముల కేర్పడె ప్రేమలు నీవుబెంచుటన్.

ప్రతిపదార్థం:

పేదలయిండ్లకి + ఐ = పేదవారి ఇండ్లకోసం
తనువు బెంచి = శరీరాన్ని పెంచి
అభిన్నత = భిన్నత్వం లేని విధంగా
పేర్చు = పేర్చుచు
బుద్ది సాంద్ర = మనసులో గాఢమైన
ఆదర బావ వీచులన్ = గౌరవ భావమనే తరంగాల
విధమ్ము + అగు = విధంగా
కమ్మలన్ = తాటి ఆకులతో (తాటి ఆకులను కమ్మలు అంటారు)
కప్పు గూర్చి = కప్పును తయారు చేసి
మెప్పుదుచున్ = మెప్పును పొందుచు
చేవ బోవన్ = శక్తి నశించగా
తమ ప్రోవుల = తమ సమూహంతో (తాటి ఆకుల కుప్పతో) వేసిన
మంటన్ = చలి మంటలతో
దరిద్ర శీతముల్ = దరిద్రమైన చలినుండి
ఏదెడు = పోగొట్టుకుంటారు
నీవు బెంచుటన్ = నీవు పెంచిన కారణంగా
తాళ వృక్షములకున్ = తాటిచెట్లపై
ప్రేమలు = ప్రేమలు
ఏర్పడెన్ = ఏర్పడ్డాయి, పెరిగాయి

తాత్పర్యం : పేదవారి ఇండ్లకోసం తమ శరీరాన్ని పెంచి, భిన్నత్వం లేని విధంగా పేర్చుచు, మనసులో గాఢమైన గౌరవ భావతరంగాల వలె తాటి కమ్మలతో గుడిసె కప్పును తయారు చేసి మెప్పును పొందుచు, వాటి శక్తి నశించగానే తాటి ఆకుల కుప్పతో వేసిన చలి మంటలతో పేదవారు చలిని పోగొట్టుకుంటారు. నీవు పెంచిన కారణంగా తాటి చెట్లపై ప్రేమలు పెరిగాయి.

10వ పద్యం :

ఉ||
శంకను దక్కి లోకమున సాగిన హింసను రూపుమాపఁ బా
దాంకములందుఁ జీమలు గతాసువులై చెడకుండునట్లు క్షే
మంకరబుద్ధి మాసి చను మానవతం బ్రకటించు జైన తీ
ర్ధంకర పానయోగ్య జల దాయినివై యశము స్వహింపవా!

ప్రతిపదార్థం :

శంకను దక్కి = అనుమానం లేకుండా, భయం లేకుండా
లోకమున = లోకములో
సాగిన హింసను = నడిచిన హింసను
రూపుమాపన్ = లేకుండా చేయడానికి
పాద + అంకములందున = పాదాల దగ్గర ఉన్న
చీమలు = చీమలు
గత + అసువులు + ఐ = పోయిన ప్రాణాలు
చెడకుండునట్లు = చెడిపోకుండా ఉండేటట్లు
క్షేమంకరబుద్ధి = శుభాన్ని కలిగించే మనసుతో
మాసి = నశించి
చను = పోయె
మానవతన్ = మానవత్వాన్ని
ప్రకటించు = తెలపడానికి, నిలపడానికి
జైన తీర్థంకర = జైన తీర్థంకరులకు
పానయోగ్య = తాగడానికి అనుకూలమైన
జల దాయినివై = నీటిని ఇచ్చే దానివై
యశమున్ = కీర్తిని
వహింపవా ! = పొందవా

తాత్పర్యం : భయంలేకుండా లోకంలో సాగిన హింసను లేకుండా చేయడానికి పాదాల దగ్గర ఉన్న చీమలుకూడా చనిపోకుండా చూసే శుభాన్ని కలిగించే మనసుతో, నశించి పోతున్న మానవత్వాన్ని తిరిగి నిలపడానికి ప్రయత్నించిన జైన తీర్థంకరులకు కూడా తాగడానికి అనువైన జలాన్ని ఇచ్చిన కీర్తిని పొందవా (పొందావు అని భావం).

11వ పద్యం :

మ|
నిను బంధించి రిదేటి వెర్రితల పాండిత్యమ్ము? శక్యంబె పా
వనభావమ్ముల నిగ్రహింప కడు తీవ్రంబైన జ్వాలావళిన్
గొనిమూట న్బిగియింపగా సలిల సంకోచంబు స్వేచ్ఛెకజీ
వనవౌ నీయెడ సాగునే విమల భాస్వద్రూప శైవాలినీ!

ప్రతిపదార్థం :

విమల = పరిశుద్ధమైన
భాస్వత్రూప = ప్రకాశవంతమైన
శైవాలినీ! = ఓ నదీ
నిను బంధించిరి = నిన్ను బంధించారు
ఇది ఏటి = ఇదెక్కడి
వెర్రితల = పిచ్చెక్కిన
పాండిత్యమ్ము = తెలివి
పావన = పవిత్రమైన
భావమ్ముల = భావాలను
నిగ్రహింప = ఆపడం
శక్యంబె = సాధ్యమా
కడు = మిక్కిలి
తీవ్రంబైన = తీవ్రమైన
జ్వాల + ఆవళిన్ కొని = అగ్ని సమూహాన్ని
కొని = “తీసుకొని
మూటన్ + బిగియింపగా = మూటలో బంధించడం
సలిల = నీటిని
సంకోచంబు = ఆపడం, చిన్నగా చేయడం
స్వేచ్ఛ + ఏక జీవనవు + ఔ = స్వేచ్ఛయే జీవితముగా కలదానివి అయిన నీ విషయంలో
నీయెడ = నీ విషయంలో
సాగునే = సాధ్యమవుతుందా ?

తాత్పర్యం:పరిశుద్ధమైన, ప్రకాశవంతమైన, ఓ దుందుభి నదీ! నిన్ను బంధించారు. ఇదెక్కడి పిచ్చి తెలివి ? పవిత్రమైన భావాలను ఆపడం సాధ్యమా ? మిక్కిలి తీవ్రమైన అగ్నిని తీసుకొని మూటలో బంధించడం, నీటిని ఆపడం స్వేచ్ఛయే జీవితంగా కలదానివైన నీ విషయంలో సాధ్యమవుతుందా ?

12వ పద్యం :

ప్రతిపదార్థం :

చ||
కదలెడు పూరిపుల్లకు గకావికలై భయమొంది డప్పితో
బొదలిన జింక దుప్పి కదుపుల్ జలముల్గొన నిన్నుజేరి
బెదవుల ముట్టువేళ గని పెంపగు చేపల బల్లటీ ల్గొనం
గదిమి తృష్ణార్తతన్ వెరవు గల్గియు దిక్కుల బార జూతువా ?

ప్రతిపదార్థం :

కదలెడు = కదులుతున్న
పూరిపుల్లకు = గడ్డిపోచకు కూడా
భయమొంది = భయపడి
కకావికలై = చెల్లాచెదురై
పొదలిన = తిరిగి అలసిన
డప్పితో = దాహంతో
జింక, దుప్పి కదుపుల్ = జింకల దుప్పుల గుంపులు
జలముల్ + గొనన్ = నీరు తాగడానికి
నిన్ను + చేరి = నీ దగ్గరికి వచ్చి
క్రీ = కింది
పెదవుల = పెదవులతో
ముట్టువేళన్ = నీటిని తాకుతుండగా
కని = చూసి
కదిమి = స్వార్థంతో
పెంపు + అగు = పెరిగిన
చేపల పల్లటీల్ = చేపలు గంతులు
కొనన్ = వేస్తుంటే
తృష + ఆర్తతన్ = దాహం తీరక కలిగే బాధతో
దిక్కులన్ = దిక్కులు పట్టుకొని
వెరవు గల్గియు = ఉపాయంతో
పారన్ + చూతువా ? = వెళ్ళడం చూస్తావా ?

తాత్పర్యం : కదులుతున్న గడ్డిపోచకు కూడా భయపడి చెల్లాచెదరుగా పారిపోయే జింకల, దుప్పుల, సమూహాలు అడవిలో తిరిగి తిరిగి అలిసిపోయి దాహంతో నీరు తాగడానికి నీ దగ్గరకు వచ్చి కింది పెదవులు ఆనించి నీరు తాగుతుండగా చూసి స్వార్థంతో పెరిగిన చేపలు గంతులు వేస్తుంటే దాహం తీరక కలిగే బాధతో అవి దిక్కులు పట్టుకొని పారిపోతుంటే ఉపాయంతో చూస్తావా ?

13వ పద్యం :
మ||
అరప్రేవుం దడుపంగజాలని నిర ల్పాహారమై, రక్త మా
విరిగా, లోకహితార్థమై కడగు చుర్విం జెమ్మట న్ముంచి, క
ష్టరతిం గుందెడు మానవాళికి గరిష్ఠప్రేమ “సీతాఫలో”
త్కరమున్ మేలొలిపంటగా నొసగు నీకారుణ్యమగ్గించెదన్.

ప్రతిపదార్థం :

అర ప్రేవున్ = సగం పేగును కూడా
తడుపంగ = తడపడానికి
చాలని = సరిపోని
నిర్ + అల్పాహారము + ఐ = అల్పాహారము లేని వారై
రక్తము + ఆవిరిగా = రక్తాన్ని ఆవిరిగా చేసి
లోకహిత + అర్థమై = లోకానికి మంచి చేయడానికి
కడగుచు = ప్రయత్నం చేసే
ఉర్విన్ = ఈ భూమిని
చెమ్మటన్ = చెమటతో, స్వేదంతో
ముంచి = మునిగేలా చేసి, తడిపి
కష్టరతిం = కష్టాలతో
కుందెడు = బాధపడే
మానవాళికి = మానవులకు
గరిష్ఠప్రేమన్ = అత్యంత ఎక్కువ ప్రేమతో
మేల్ తొలిపంట గాన్ = మంచి మొదటి పంటగా
సీతాఫల + ఉత్కరమున్ = సీతాఫలాలను
ఒసగు
నీ కారుణ్యము +  = ఇచ్చే
+ అగ్గించెదన్ = నీ కరుణను స్థుతిస్తాను, మెచ్చుకుంటాను

తాత్పర్యం : సగం పేగును తడపడానికి సరిపోని అత్యంత తక్కువ ఆహారం కూడా లేని, రక్తాన్ని ఆవిరిగా చేసి, లోకానికి మంచి చేయడానికి ప్రయత్నం చేసి ఈ భూమిని తమ చెమటతో తడిపి కష్టాలతో బాధపడే మానవులకు అత్యంత ప్రేమతో మంచి మొదటి పంటగా సీతాఫలాలను ఇచ్చే నీ కారుణ్యాన్ని మెచ్చుకుంటాను.

TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి

14వ పద్యం :

తే.గీ॥ ప్రచురతర రసవాదాన బ్రభవమందు
స్వర్ణయోగం బదేమాయె ? సరవి నష్ట
సిద్ధు లేనీట మునిగె ? యజించు క్రమము
డెలియలేనట్టి జడబుద్ధి తేలివచ్చె !

ప్రతిపదార్థం:

ప్రచురతర = ప్రచారంలో గల
రసవాదాన = రసవాద విద్య (బంగారాన్ని తయారు చేసే విద్య)
ప్రభవము అందు = పుట్టు
స్వర్ణయోగంబు = బంగారు యోగము
అది + ఏమాయె ? = అది (స్వర్ణ యోగం) ఏమైనది
సరవిన్ అష్టసిద్ధులు = క్రమంగా అష్టసిద్ధులు
ఏనీట మునిగె ? = ఏ నీటిలో మునిగి పోయాయి
యజించు క్రమము = యజ్ఞాలు చేసే పద్ధతులు
తెలియలేనట్టి = తెలుసుకోలేని
జడబుద్ధి = తెలివి తక్కువతనం
తేలివచ్చె ! = ప్రకటితమైనది

తాత్పర్యం : గతంలో ప్రచారంలో ఉన్న రసవాద విద్యద్వారా బంగారాన్ని పుట్టించే స్వర్ణయోగం ఏమైనది ? వరుసగా అష్టసిద్ధులు ఏ నీటిలో మునిగి పోయాయి. యజ్ఞ యాగాలు చేసే విధానాలు తెలుసుకోలేని తెలివి తక్కువతనం ప్రకటితమయింది. (తెలివి తక్కువతనం అందరికి తెలిసింది అని భావం).

15వ పద్యం :

తే.గీ॥ ఆర్ష జీవిత పద్దతులంతరింప
నవనవోన్మేష పాశ్చాత్య నాగరకత
పెల్లుగ గమించి తుది కొక పొల్లునైతి
భారతాంబ సహింపని బరువుగానొ.

ప్రతిపదార్థం :

ఆర్ష = ఋషుల ద్వారా తెలుపబడిన
జీవిత పద్ధతులు = = జీవన విలువలు
అంతరింప = నశించగా
నవనవ + ఉన్మేష = కొత్తగా వికసించిన
పాశ్చాత్య = పశ్చిమ దేశాల
నాగరకత = నాగరికతను
పెల్లుగన్ = ఎక్కువగా
గమించి = వెంట నడిచి, ఆచరించి
తుదికి + ఒక = చివరికి ఒక
పొల్లును + ఐతి = పొల్లు గింజగా పనికి రాకుండా పోతిని
భారత + అంబ = భారతమాతకు
సహింపని = భరించలేని
బరువు గానొ = బరువుగా మారాను కదా

తాత్పర్యం : ఋషుల ద్వారా (వేదాల ద్వారా) తెలుపబడిన జీవన విలువలను పాటించక కొత్తగా వచ్చిన పాశ్చాత్య నాగరికతను ఆచరించి చివరికి ఒక పొల్లు గింజలాగా ఎందుకు పనికి రాకుండా పోయాను. భారతమాత భరించలేని భారంగా మారాను కదా !

16వ పద్యం :

ఉ||
జేనెడు పొట్టకై పరుల సేవకు కాయము నమ్మి నైచ్యసం
ధానపు జీవితమ్మున వ్యథం గొని చాల కృశించు వ్యక్తి, సం
ఘానికి జాతికౌ నొక విఘాతము మాన్పగలేడు ఎట్టిదౌ
పూనికతోడ కొల్వునకుఁ బోయిన స్వేచ్ఛ నశించు దుందుభీ !

ప్రతిపదార్థం :

దుందుభీ ! = ఓ దుందుభి !
జానెడు పొట్టకై = జానెడు ఉన్న కడుపు కోసం
పరుల సేవకు = ఇతరులక సేవచేయడానికి
కాయమును + అమ్మి = శరీరాన్ని అమ్మి
నైచ్య సంధానపు = నీచత్వంతో కూడిన
జీవితమ్మున = జీవితంలో
వ్యథన్ + కొని = జీవితంలో
చాల కృశించు = చాల బాధపడే
వ్యక్తి = మనిషి
సంఘానికి = సమాజానికి
జాతికి ఔ = జాతికి కూడా
నొక = ఒక
విఘాతము = చేటును
మాన్పగలేడు = పోగొట్టలేడు
ఎట్టిది + ఔ = ఎటువంటిది అయినా
పూనికతోడ = ప్రయత్నముతో
కొల్వునకున్ = సేవకు, ఉద్యోగానికి
పోయిన = వెళ్ళినా, వెళ్తే
స్వేచ్ఛ నశించు = స్వేచ్ఛ నశిస్తుంది.

తాత్పర్యం : ఓ దుందుభి! జానెడు పొట్టకోసం ఇతరులకు సేవ చేయడానికి శరీరాన్ని అమ్మి నీచత్వాన్ని ఇచ్చే జీవితంలో దుఃఖాన్ని పొంది చాలా బాధపడే వ్యక్తి సమాజానికి, తన జాతికి ఒక చేటును కూడా పోగొట్టలేడు. ఎటువంటిది అయినా ప్రయత్నపూర్వకంగా ఉద్యోగానికి వెళ్తే స్వేచ్ఛ నశిస్తుంది.

17వ పద్యం :

దుందుభీ ! అలల చేతుల నెత్తి నీ వాడు
నాటలన్ గని తరుపు లలరులం బులకించె
పులకపులకయు నొక్క పుష్పమై వికసించె
పుష్ప మొక మధుపాత్రబోలి విందులు వెట్ట
ప్రవహించి మాసీమ పావనమ్ముగ జేసి
తెలుగు సంస్కృతులతో తేజరిల్లెడి నీవు
మా పొలాలకు పాలు జేప బారితిగాన
నీ యుదంతము కొంత నిలిపితిని కావ్యాన.

ప్రతిపదార్థం :

దుందుభి ! = ఓ దుందుభి
అలల చేతుల నెత్తి = అలలు అనే చేతులతో
నీవు + ఆడున్ = నీవు ఆడే
ఆటలన్ గని = ఆటలు చూసి
తరువులు = = చెట్లు
అలరులన్ = పూవులతో
పులకించె = పులకరించాయి
పులక పులకయున్ = ఒక్కొక్క పులకరింత
ఒక్క = ఒక్కొక్క
పుష్పము + ఐ = పూవుగా
వికసించే = వికసించింది
పుష్పము + ఒక = ప్రతీ పూవు ఒక
మధు పాత్రన్ + బోలి = తేనె నింపిన పాత్ర లాగా
విందులు + పెట్టన్ = ఆతిథ్యమివ్వగా
ప్రవహించి = ప్రవహించి
మా సీమన్ = మా భూమిని
పావనమ్ముగ జేసి = పవిత్రంగా మార్చి
తెలుగు సంస్కృతులతో = తెలుగు వారి సంస్కృతులతో
తేజరిల్లెడి = ప్రకాశించే
నీవు = నీవు
మా పొలాలకున్ = మా పంట భూములకు
పాలు చేపన్ = పాలు ఇవ్వడానికి
పారితి కానన్ = ప్రవహించావు కావున
నీ + ఉదంతము = నీ చరిత్రను,
కావ్యాన = కావ్యంలో
కొంత = కొద్దిగా
నిలిపితిన్ = నిలిపాను, తెలిపాను

తాత్పర్యం : ఓ దుందుభి ! అలలు అనే చేతులతో నీవు ఆడే ఆటలు చూసి చెట్లు పూలతో పులకరించాయి. ఒక్కొక్క పులకరింత ఒక్కొక్క పుష్పమై వికసించింది. పుష్పించిన ఒక్కొక్క పూవు ఒక్కొక్క తేనె నిండిన పాత్రగా ఆతిథ్యం ఇచ్చింది. నీవు ప్రవహించి మా సీమను పవిత్రంగా మార్చావు. తెలుగు సంస్కృతులతో ప్రకాశించే నీవు మా పంట భూములకు పాలు (పాలవంటి బలమైన నీరు) ఇవ్వడానికి ప్రవహించావు కావున నీ చరిత్రను కొంచెం కావ్యంలో నిలిపాను.

18వ పద్యం :

భాగ్యనగరాత్యంత పరిసరమ్ముల బుట్టి
పాలమూ ర్మండలపు భాగాన బంధింప
బడి నీలగిరిసీమ బరగు దేవరకొండ
భూముల బండించి ముందు కటునటు సాగి
పలనాటి బ్రహ్మయ్య పరగణాలో బారు
కృష్ణమ్మలో గలసి కెలకుల నడయాడి
ఏలేశ్వరుని పూజ కేగి భక్తులతోడ
అట నుపాధ్యాయు కీర్త్యంశముల గొన్నింటి
వెలువరచి చరిత కొక వెలుగుబాటను జూపి

ప్రతిపదార్థం :

భాగ్యనగర = హైదరాబాదుకు
అత్యంత పరిసరమ్ములన్ = అతి సమీపములో
పుట్టి = జన్మించి
పాలమూరు మండలపు భాగాన = పాలమూరు (మహబూబ్నగర్) జిల్లా ప్రాంతంలో
బంధింపబడి = ఆనకట్టచే నిలుపబడి
నీలగిరిసీమన్ + పరగు = నీలగిరి (నల్లగొండ జిల్లా) ప్రాంతంలో ఉన్న
దేవరకొండ = దేవరకొండ
భూములన్ పండించి = పొలాలను పండే విధంగా చేసి
ముందుకు = ఇంకా ముందుకు
అటునటు = అలా అలా
సాగి = ప్రవహించి
పలనాటి బ్రహ్మయ్య = పలనాటి బ్రహ్మనాయుడు
పరగణాలో = పాలించిన ప్రాంతంలో
పారు = పారి
కృష్ణమ్మలో గలసి = కృష్ణానదిలో
కెలకుల = దగ్గరలో
నడయాడి = ప్రవహించి
ఏలేశ్వరుని పూజకు ఏగి = ఏలేశ్వర స్వామి పూజకు పోయి
భక్తుల తోడ = భక్తులతో
అటన్ = అక్కడ
ఉపాధ్యాయున్ = నాగార్జునుని
కీర్తి + అంశములన్ = కీర్తికి సంబంధించిన అంశాలను
కొన్నింటి = కొన్నిటిని
వెలువరచి = చెప్పి
చరితకు ఒక = చరిత్ర రాయడానికి ఒక
వెలుగుబాటను = కాంతి మార్గాన్ని
చూపి = చూపించి

తాత్పర్యం : హైదరాబాదుకు అతి సమీపంలో జన్మించి, మహబూబ్ నగర్ జిల్లాలో ఆనకట్టచే బంధించబడి, నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతంలోని భూములలో పంటలు పండించి, ఇంకా ముందుకు అలాఅలా ప్రవహించి, పలనాటి బ్రహ్మనాయుడు పాలించిన ప్రాంతంలో పారి కృష్ణానదికి అతి దగ్గరలో ఏలేశ్వర స్వామి పూజలు చేసి అక్కడి భక్తులకు ఆచార్య నాగార్జునుని కీర్తిని చెప్పి చరిత్ర రాయడానికి వెలుగు బాటలు చూపి,

TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి

19వ పద్యం :

ఇక్ష్వాకువంశీయు లేలిన విజయపురిం
దరిసి నాగార్జునుని దర్శించి ధన్యవై
తెలుగుభూముల సస్యఫలభరితముల జేసి
ఆచంద్రతారార్క మాంధ్రసంతతికి ఆ
శీరక్షతలను సచ్చీలంబు జేకూర్చి
ఇహపరమ్ములను సర్వేప్పితమ్ము లొసంగి
మము బెంచు తల్లివై మా పాలవెల్లివై
ప్రవహింతువా దుందుభీ !
మా సీమ
పాలయేఱుగ దుందుభీ !

ప్రతిపదార్థం :

దుందుభి! = ఓ దుందుభి
ఇక్ష్వాకువంశీయు లేలిన = ఇక్ష్వాకు వంశస్థులు పరిపాలించిన
విజయపురిన్ = విజయపురాన్ని
తరిసి = చేరి
నాగార్జునుని = ఆచార్య నాగార్జునున్ని
దర్శించి = చూసి
ధన్యవై = ధన్యతను పొంది
తెలుగు భూములన్ = తెలుగు నేలలో
సస్య ఫల భరితముల జేసి = పైరు పంటలతో నింపి
ఆ చంద్ర తార + అర్కము = నక్షత్రాలు, సూర్య చంద్రులు ఉన్నంతకాలం (శాశ్వతంగా)
ఆంధ్ర సంతతికి = తెలుగుతల్లి బిడ్డలకు
ఆశీః + అక్షతలను = ఆశీర్వదపూర్వక అక్షతలను
సత్ + శీలంబున్ = మంచి నడవడిని
చేకూర్చి = అందించి
ఇహ పరమ్ములను = ఈ లోకములో, పరలోకంలో
సర్వ + ఈప్పితమ్ములు = అన్ని కోరికలను
ఒసంగి = తీర్చి
మము బెంచు తల్లివై = మమ్మల్ని పెంచే తల్లిగా మారి
మా పాలవెల్లివి + ఐ = మాకు పాల ప్రవాహానివై
ప్రవహించువా = ప్రవహిస్తావా
మా సీమ = మా ప్రాంతాలలో
పాలయేఱుగ = పాల నదిలాగా
దుందుభీ! = దుందుభి నదీ!

తాత్పర్యం : ఓ దుందుభి ! ఇక్ష్వాకులు పరిపాలించిన విజయపురాన్ని చేరి, ఆచార్య నాగార్జునున్ని చూసి ధన్యతను పొంది, తెలుగు నేలను పైరు పంటలతో నింపి, శాశ్వతంగా తెలుగు బిడ్డలకు నీ ఆశిస్సులనే అక్షతలను, మంచి నడవడిని అందించి, ఈ లోకంలో, పరలోకంలో (బతికుండగా, చనిపోయిన తరువాత) అన్ని కోరికలను తీర్చి మమ్మల్ని పెంచే తల్లిగా మాకు పాలవెల్లిగా ప్రవహిస్తావా ! మా ప్రాంతంలో పాల ఏరుగా ప్రవహిస్తావా !

కంఠస్థం చేయవలసిన పద్యాలు, ప్రతిపదార్థ, తాత్పర్యములు :

కవి పరిచయం : ఈ పద్యం గంగాపురం హనుమచ్ఛర్మ గారు రాసిన దుందుభి కావ్యం నుంచి గ్రహింపబడినది.
(ప్రతిపదార్థ తాత్పర్యాలు రాసే ముందు కవి పరిచయం రాయాలి.)

1వ పద్యం :

ఉ||
పట్టినరాయి శిల్పమయి, పాతిన బండలు శాసనమ్ములై,
కట్టిన దేవళమ్ముల వికాసము జాతికి జీవగఱ్ఱయై,
పుట్టువు సార్ధతం బొరయ పొల్పుమిగిల్చిన శ్రీచళుక్య స
మ్రాట్టులు నీదు తీరమున రాచరికమ్ముల నోచి రెందరో.

ప్రతిపదార్థం :

పట్టినరాయి = (వారు) పట్టుకున్న ప్రతీ రాయి
శిల్పము + ఐ = శిల్పంగా మరి
పాతిన = భూమిలో నిలిపిన
బండలు = రాళ్లు అన్ని
శాసనమ్ములు + ఐ = శాసనాలుగా మారి
కట్టిన = కట్టించిన
దేవళమ్ముల = దేవాలయాల
వికాసము = అభివృద్ధి
జాతికి = తెలుగు జాతికి
జీవగఱ్ఱయై = జీవనాధారమై
పుట్టువు = జన్మ
సార్ధతంబు ఒరయ = సాఫల్యం చెందగా
పొల్పు మిగిల్చిన = స్థిరత్వాన్ని పొందిన
శ్రీచళుక్య సమ్రాట్టులు శ్రీ చాళుక్య వంశానికి చెందిన చక్రవర్తులు
నీదు = నీ యొక్క
తీరమున = తీరంలో
ఎందరో = ఎంతో మంది
రాచరికమ్ములన్ = రాజులుగా
నోచిరి = నోచుకున్నారు, అదృష్టాన్ని పొందారు

తాత్పర్యం : పట్టుకున్న ప్రతీ రాయి శిల్పంగా మారి, భూమిలో పాతిన బండలన్ని శాసనాలుగా మారి, కట్టించిన దేవాలయాల అభివృద్ధి తెలుగు జాతికి జీవనాధారంగా మారి జన్మ సార్థకం చేసుకున్న ఎందరో శ్రీ చాళుక్య చక్రవర్తులు నీ తీరంలోనే రాజులుగా అదృష్టాన్ని పొందారు.

2వ పద్యం :

ఉ||
అద్దమువంటి నీజలము లందు స్వరూపము దిద్దుచున్న యా
నిద్దపు చందమామ యొడి నిద్దుర నొందగ కీచురాళ్ళతో
దద్దయు జోలబాడిన విధమ్మున, నూగు తరంగడోలికన్
ముద్దుగ నిద్రబుచ్చెదు ప్రపుల్లశరత్తుల మాతృమూర్తివై.

ప్రతిపదార్థం:

అద్దమువంటి = అద్దం లాంటి స్వచ్ఛమైన
నీ జలముల+అందు = నీ నీటిలో
స్వరూపమున్ = తన రూపాన్ని
దిద్దుచున్న = చూసుకుంటున్న, అలంకరించుకుంటున్న
ఆ నిద్దపు = ఆ అందమైన
చందమామ = చందమామ
ఒడి నిద్దురన్ ఒందగ = నీ ఒడిలో నిద్ర పోతున్నప్పుడు
కీచురాళ్ళతో = కీచురాయి కీటకాల శబ్దాలతో
తద్దయు జోల = మంచి జోల పాటలను
పాడిన విధమ్మునన్ = పాడిన తీరుగా
ఊగు = ఊగుతున్న
తరంగ డోలికన్ = అలలు అనే ఉయ్యాలలో
ముద్దుగ = ముద్దుగొలిపే విధంగా
ప్రపుల్ల = ప్రకాశవంతమైన
శరత్తుల = శరత్కాలంలోని వెన్నెలలో
మాతృమూర్తివై = తల్లిలాగ మారి
నిద్రపుచ్చెదు = నిద్రపుచ్చుతున్నావు

అద్దంలాగా స్వచ్చంగా ఉన్న నీ నీటిలో తన రూపాన్ని చూసుకుంటున్న ఆ అందమైన చందమామ నీ ఒడిలో నిద్రపోతున్నప్పుడు కీచురాయి శబ్దాలతో జోలపాటలు పాడిన విధంగా ఊగుతున్న అలలు అనే ఊయలలో ముద్దుగొలిపే విధంగా ప్రకాశవంతమైన శరత్కాలంలోని వెన్నెలలో తల్లిలాగామారి నిద్రపుచ్చుతున్నావు.

అలతులు శ్రావ్యమౌ పలుకు లందము చిందగ రంగు దిద్దిన
ట్టులు తమరెక్క లొప్ప నుదుటుం గొని సచ్ఛకునాళిఁ జూపి మా
పొలముల క్రొత్తగింజల బుభుక్షల బాసెడు పాలపిట్ట జం
టలఁ గనుగొంచు ముందుకు హుటాహుటి సాగుము రమ్యవాహినీ !

రమ్యవాహినీ ! = అందంగా ప్రవహించేదానా!, దుందుభి !
అలతులు = అతి కానివి, చిన్నవి
శ్రావ్యము + ఔ = వినడానికి బాగున్న, విన సొంపైన
పలుకుల = మాటలతో
అందము చిందగ = అందం ఏర్పడగా
రంగు దిద్దినట్టులు = రంగులు వేసినట్లు
తమరెక్కలు + ఒప్ప = తమ రెక్కలు ప్రకాశించగా
ఉదుటుం గొని = గర్వంతో
సత్ + శకున + ఆళిన్ = మంచి శకునాల సమూహాన్ని
చూపి = చూపించి
మా పొలముల = మా పొలాలలోని
క్రొత్తగింజల = కొత్తగా పండిన పంట గింజలను
బుభుక్షల బాసెడు = ఆకలిని తీర్చుకునే
పాలపిట్ట జంటలన్ = పాలపిట్టల జంటలను
కనుగొంచు = చూస్తూ
హుటాహుటి = హడావిడిగా
ముందుకు = ముందు వైపు
సాగుము = సాగిపొమ్ము

అందంగా ప్రవహించే ఓ దుందుభి! వినసొంపైన చిన్న మాటలతో అందంగా రంగులు వేసినట్లున్న రెక్కలు ప్రకాశిస్తుండగా, గర్వంతో మంచి శకునాలను చూపించి, మా పొలాలలో కొత్తగా పండిన పంట గింజలతో ఆకలిని తీర్చుకుంటున్న పాలపిట్టల జంటలను చూస్తూ హడావిడిగా ముందుకు సాగిపొమ్ము.

TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి

దుందుభి Summary in Telugu

(‘దుందుభి ‘ కావ్యంలోనిది)

TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి 1

కవి పరిచయం

పాఠ్యాంశం పేరు దేని నుండి : దుందుభి
గ్రహింపబడినది : ‘దుందుభి’ కావ్యము నుండి గ్రహింపబడింది.
కవి పేరు : గంగాపురం హనుమచ్ఛర్మ
కాలం : జననం : 1925 మరణం : ఆగష్టు 15, 1996
స్వస్థలం : నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి దగ్గరున్న గుండూరు (జన్మస్థలం: వేపూరు)
తల్లిదండ్రులు : సీతమ్మ, రామకిష్టయ్య
చదువు : సంస్కృతాంధ్రసాహిత్యం, వ్యాకరణం, అలంకారశాస్త్రం క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. ఋగ్వేదాన్ని నేర్చుకోవడమేగాక తర్వాత కాలంలో నృసింహ దీక్షితులతో కలిసి “ఋగ్వేద విజ్ఞానం” రచించాడు.
విశేషతలు : స్వాతంత్రోద్యమం, భూదానోద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. తన స్వగ్రామంతోపాటు కల్వకుర్తి తాలూకాలో అనేక గ్రామాల్లో విద్యార్థుల కొరకు పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు కృషిచేశాడు. అన్ని కులాల వారి ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు, వ్రతాలు ఇతర పౌరోహిత కార్యక్రమాలు హనుమచ్ఛర్మ చేస్తుంటే అందరూ ఆ కాలంలో వింతగా చూసేవారు. అది అతనిలోని సామాజిక సమరసతకు నిదర్శనం. హనుమచ్ఛర్మకు బాల్యంనుంచి కవిత్వంపై కూడా ఆసక్తి ఎక్కువ.
రచనలు : హనుమచ్ఛర్మ ‘దుందుభి’ కావ్యం ముద్రితంకాగా మల్కిభరాముడు, గోపన, గంగాపురం చెన్నకేశవ సుప్రభాతం అముద్రితాలు.

పాఠ్యభాగ సందర్భం

పూర్వ పాలమూరు (మహబూబ్ నగర్) జిల్లా జీవనాధారం దుందుభి నది. ఈ నది షాబాద్ కొండల్లో పుట్టి డిండి దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. హనుమచ్ఛర్మ ఈ నదిని చూసి ఉప్పొంగి కవిత్వం రాశాడు. దుందుభిలా సాగిన హనుమచ్ఛర్మ పద్య ధార శ్రావ్యంగా ఉంటుంది. దుందుభి అందచందాలను, విశిష్టతను పరిచయం చేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం.

పాఠ్యభాగ సారాంశం

ఓ దుందుభి ! తొలకరి వాన కురవగానే పెద్ద అలలతో స్నేహం చేసి, గట్లతో యుద్ధంచేసి వాటిని తాకుతూ, మా గ్రామాల్లోని భూముల బాధ పోగొట్టడానికి వచ్చి, మా కోరికలు తీర్చే విధంగా పైరు పంటలతో మా మనసులను ఆనందపరిచి, గోదావరి కృష్ణా నదులు మాకు అందడం లేదనే బాధను తీర్చావు. ఇదే నిజమైన ప్రసిద్ధి అవుతుంది. మా అమ్మ వంటి దుందుభి ! బంగారు రంగులు నిండిన సంధ్యా సమయాలు, మామిడి పూతను తిని ఎక్కువగా సంతోషించి కోకిలలు చేస్తున్న శబ్దాలు, తొలకరి వర్షానికి ముందు కనిపించే నల్లని మేఘాలు, ఆ మబ్బుల్లోంచి తొంగి చూసే మెరుపులు నాకు ఒక ఆలోచనను కలిగించి కొత్త గీతాలతో నిన్ను ఆనంద పరచుమన్నవి.

ఓ దుందుభి ! తలచుకోగానే నీ హృదయమనే వీణ తెగలపై ఝం అనే ధ్వనులు వెలువడ్డాయా ? కదలగానే నీ అమాయకత్వము నీరుగా మారిందా ? రాళ్లు కరిగాయా ? నీ హృదయంలో కీర్తించే నీ ప్రియుడైన భర్తపై ప్రేమలు గిలిగింతలు పెడుతున్నాయా ? ఆగకుండా వస్తున్నావు ? కొంతమంది స్వార్థపరులు వారి విలాసాలకోసం ఏవో చట్టాలు చేసి ఈ భూమిని ఆక్రమించుకుని గర్వాన్ని పొంది వారి ఆనందం కోసం చేసిన ఒత్తిడి కారణంగా సమయానికి ఆహారం తీసుకోలేక బాధతో మరణించి దీనస్థితిలో ఎండిపోయిన వారి అస్థిపంజరాలు నీ ఒడిలో శాశ్వతమైన శాంతిని, సుఖాన్ని పొందాయి.

పట్టుకున్న ప్రతీ రాయి శిల్పంగా మారి, భూమిలో పాతిన బండలన్ని శాసనాలుగా మారి, కట్టించిన దేవాలయాల అభివృద్ధి తెలుగు జాతికి జీవనాధారంగా మారి జన్మ సార్థకం చేసుకున్న ఎందరో శ్రీ చాళుక్య చక్రవర్తులు నీ తీరంలోనే రాజులుగా అదృష్టాన్ని పొందారు.

ఆహా! ఓ దుందుభి! అధికమైన కరుణతో పేదల వైపు నిలిచి, ధనమే ప్రధానమని భావించే గుణాన్ని అసహ్యించుకుంటూ, జనుమును తుంగ గడ్డిని, చాలా పొడుగ్గా పెంచి, వారు నివసించడానికి గుడిసెలను కట్టిచ్చి, తాగడానికి మంచి నీటిని ఇచ్చినందుకు కలిగిన సంతోషంతో గంతులు వేస్తున్నావు.

ఓ దుందుభి నదీ! రాయిని ఉలితో మలచి, మూసలో కరిగించి పోసిన చిత్రాల లాగా స్వేచ్ఛగా కల్పించిన ఆకారాలకు రూపం ఇచ్చి చూసిన ప్రజలను ఆనందపరచి, పేరుకూడా ఆశించని శిల్పకులంలోని గొప్పవారి చేతి నైపుణ్యం లాగ మమ్మల్ని ఆనందింప చేయడానికి ప్రతీ వర్షాకాలంలో ప్రవహిస్తావా ?

కత్తిని, కలాన్ని సమానంగా ఉపయోగించి కావ్యాలలోను, ప్రవృత్తిలోను రౌద్ర రసాలను కోరేవారికి ఆనందాన్ని కలిగించేలా చేసిన కళాకారుడైన వీరుడు గోనబుద్ధారెడ్డి నీస్నేహం కారణంగా అపూర్వమైన చరిత్ర రంగనాథ రామాయణాన్ని రచించాడు.

అటువంటి సుకుమారమైన నీ శరీరంలో వరదల సమయంలో కఠినత్వాన్ని పెంచుకుంటావా ? తెలియని సమయంలో (ప్రాచీన కాలంలో) కూడా శైవానికి, వైష్ణవానికి సంబంధించిన అంశాలపై నీ మనస్సులో అనాసక్తత లేదు. (విష్ణువుకు ఇష్టమైన) మంచి తులసి చెట్ల వరుసలతో, (శివునికి ఇష్టమైన) మారేడు వృక్షాల సమూహాలతో నీ రెండు తీరాలను నింపి ఉంచుతూ, తిక్కన కలము చెప్పిన (హరి హరాద్వైత) శివకేశవ తత్వాన్ని తెలుసుకొని సంపన్నురాలవై ప్రవహిస్తున్నావు.

అద్దంలాగా స్వచ్చంగా ఉన్న నీ నీటిలో తన రూపాన్ని చూసుకుంటున్న ఆ అందమైన చందమామ నీ ఒడిలో నిద్రపోతున్నప్పుడు కీచురాయి శబ్దాలతో జోలపాటలు పాడిన విధంగా ఊగుతున్న అలలు అనే ఊయలలో ముద్దుగొలిపే విధంగా ప్రకాశవంతమైన శరత్కాలంలోని వెన్నెలలో తల్లిలాగామారి నిద్రపుచ్చుతున్నావు.

పేదవారి ఇండ్లకోసం తమ శరీరాన్ని పెంచి, భిన్నత్వం లేని విధంగా పేర్చుచు, మనసులో గాఢమైన గౌరవ భావతరంగాల వలె తాటి కమ్మలతో గుడిసె కప్పును తయారు చేసి మెప్పును పొందుచు, వాటి శక్తి నశించగానే తాటి ఆకుల కుప్పతో వేసిన చలి మంటలతో పేదవారు చలిని పోగొట్టుకుంటారు.

నీవు పెంచిన కారణంగా తాటి చెట్లపై ప్రేమలు పెరిగాయి. భయంలేకుండా లోకంలో సాగిన హింసను లేకుండా చేయడానికి పాదాల దగ్గర ఉన్న చీమలుకూడా చనిపోకుండా చూసే, శుభాన్ని కలిగించే మనసుతో, నశించి పోతున్న మానవత్వాన్ని తిరిగి నిలపడానికి ప్రయత్నించిన జైన తీర్థంకరులకు కూడా తాగడానికి అనువైన జలాన్ని ఇచ్చిన కీర్తిని పొందవా (పొందావు అని భావం)

పరిశుద్ధమైన, ప్రకాశవంతమైన, ఓ దుందుభి నదీ! నిన్ను బంధించారు. ఇదెక్కడి పిచ్చి తెలివి ? పవిత్రమైన భావాలను ఆపడం సాధ్యమా ? మిక్కిలి తీవ్రమైన అగ్నిని తీసుకొని మూటలో బంధించడం, నీటిని ఆపడం స్వేచ్ఛయే జీవితంగా కలదానివైన నీ విషయంలో సాధ్యమవుతుందా ?

కదులుతున్న గడ్డిపోచకు కూడా భయపడి చెల్లాచెదరుగా పారిపోయే జింకల, దుప్పుల, సమూహాలు అడవిలో తిరిగి తిరిగి అలిసిపోయి దాహంతో నీరు తాగడానికి నీ దగ్గరకు వచ్చి కింది పెదవులు ఆనించి నీరు తాగుతుండగా చూసి స్వార్థంతో పెరిగిన చేపలు గంతులు వేస్తుంటే దాహం తీరక కలిగే బాధతో అవి దిక్కులు పట్టుకొని పారిపోతుంటే ఉపాయంతో చూస్తావా !

సగం పేగును తడపడానికి సరిపోని అత్యంత తక్కువ ఆహరం కూడా లేని, రక్తాన్ని ఆవిరిగా చేసి, లోకానికి మంచి చేయడానికి ప్రయత్నం చేసి ఈ భూమిని తమ చెమటతో తడిపి కష్టాలతో బాధపడే మానవులకు అత్యంత ప్రేమతో మంచి మొదటి పంటగా సీతాఫలాలను ఇచ్చే నీ కారుణ్యాన్ని మెచ్చుకుంటాను. అందంగా ప్రవహించే ఓ దుందుభి ! వినసొంపైన చిన్న మాటలతో అందంగా రంగులు వేసినట్లున్న రెక్కలు ప్రకాశిస్తుండగా, గర్వంతో మంచి శకునాలను చూపించి, మా పొలాలలో కొత్తగా పండిన పంట గింజలతో ఆకలిని తీర్చుకుంటున్న పాలపిట్టల జంటలను చూస్తూ హడావిడిగా ముందుకు సాగిపొమ్ము.

గతంలో ప్రచారంలో ఉన్న రసవాద విద్యద్వారా బంగారాన్ని పుట్టించే స్వర్ణయోగం ఏమైనది ? వరుసగా అష్టసిద్ధులు ఏ నీటిలో మునిగిపోయాయి. యజ్ఞ యాగాలు చేసే విధానాలు తెలుసుకోలేని తెలివి తక్కువతనం ప్రకటితమయింది. (తెలివి తక్కువతనం అందరికి తెలిసింది అని భావం)

ఋషుల ద్వారా (వేదాల ద్వారా) తెలుపబడిన జీవన విలువలను పాటించక కొత్తగా వచ్చిన పాశ్చాత్య నాగరికతను ఆచరించి చివరికి ఒక పొల్లు గింజలాగా ఎందుకు పనికి రాకుండా పోయాను. భారతమాత భరించలేని భారంగా మారాను కదా ! ఓ దుందుభి ! జానెడు పొట్టకోసం ఇతరులకు సేవ చేయడానికి శరీరాన్ని అమ్మి నీచత్వాన్ని ఇచ్చే జీవితంలో దుఃఖాన్ని పొంది చాలా బాధపడే వ్యక్తి సమాజానికి, తన జాతికి ఒక చేటును కూడా పోగొట్ట లేడు. ఎటువంటిది అయినా ప్రయత్నపూర్వకంగా ఉద్యోగానికి వెళ్తే స్వేచ్ఛ నశిస్తుంది.

ఓ దుందుభి ! అలలు అనే చేతులతో నీవు ఆడే ఆటలు చూసి చెట్లు పూలతో పులకరించాయి. ఒక్కొక్క పులకరింత ఒక్కొక్క పుష్పమై వికసించింది. పుష్పించిన ఒక్కొక్క పూవు ఒక్కొక్క తేనె నిండిన పాత్రగా ఆతిథ్యం ఇచ్చింది. నీవు ప్రవహించి మా సీమను పవిత్రంగా మార్చావు. తెలుగు సంస్కృతులతో ప్రకాశించే నీవు మా పంట భూములకు పాలు (పాలవంటి బలమైన నీరు) ఇవ్వడానికి ప్రవహించావు కావున నీ చరిత్రను కొంచెం కావ్యంలో నిలిపాను.

హైదరాబాదుకు అతి సమీపంలో జన్మించి, మహబూబ్నగర్ జిల్లాలో ఆనకట్టచే బంధించబడి, నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతంలోని భూములలో పంటలు పండించి, ఇంకా ముందుకు అలాఅలా ప్రవహించి, పలనాటి బ్రహ్మనాయుడు పాలించిన ప్రాంతంలో పారి కృష్ణానదికి అతి దగ్గరలో ఏలేశ్వర స్వామి పూజలు చేసి అక్కడి భక్తులకు ఆచార్య నాగార్జునుని కీర్తిని చెప్పి చరిత్ర రాయడానికి వెలుగు బాటలు చూపి, ఇక్ష్వాకులు పరిపాలించిన విజయపురాన్ని చేరి, ఆచార్య నాగార్జునున్ని చూసి ధన్యతను పొంది, తెలుగు నేలను పైరు పంటలతో నింపి, శాశ్వతంగా తెలుగు బిడ్డలకు నీ ఆశిస్సులనే అక్షతలను, మంచి నడవడిని అందించి, ఈ లోకంలో, పరలోకంలో (బతికుండగా, చనిపోయిన తరువాత) అన్ని కోరికలను తీర్చి మమ్మల్ని పెంచే తల్లిగా మాకు పాలవెల్లిగా ప్రవహిస్తావా! మా ప్రాంతంలో పాల ఏరుగా ప్రవహిస్తావా ! దుందుభి !

TS Inter 1st Year History Study Material Chapter 10 మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 10th Lesson మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 10th Lesson మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మరాఠాల విజృంభణకు దారితీసిన పరిస్థితులను వివరించండి.
జవాబు.
మరాఠా ప్రజల శీలమును, వారి చరిత్ర గతిని నిర్ణయించడంలో ఆ ప్రాంతపు భౌగోళిక అంశాలు గొప్ప ప్రభావాన్ని చూపాయి. మహారాష్ట్ర ప్రాంతానికి రెండువైపుల నుంచి సహ్యాద్రి, వింధ్య, సాత్పూరా పర్వత శ్రేణులు రక్షణ కవచంలా ఉండగా, నర్మదా, తపతి నదులు మహారాష్ట్ర ప్రాంతాన్ని రక్షిస్తూ రక్షణకు ఉపకరించే పర్వత కోటల నిర్మాణానికి కారణమయ్యాయి. ఫలితంగా ఈ ప్రాంతంలో అత్యంత, వ్యూహాత్మక, సహజ రక్షణలకు అనువై, శత్రు దుర్భేద్యమైన కోటలు నిర్మించబడి, శత్రువులు వశపరచుకోవడానికి అంతగా సాధ్యపడలేదు. అత్యల్ప వర్షపాతం పైగా సారవంతం కాని భూములు వల్ల మరాఠాలు ధృడ శరీరులై కష్టపడితే తప్ప కడుపు నిండని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా మహారాష్ట్రులలో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా తట్టుకొనే లక్షణాలు స్వతహాగా ఏర్పడ్డాయి.

పైన పేర్కొన్న భౌగోళిక అంశాల ప్రభావంతోపాటుగా, మహారాష్ట్ర భక్తి ఉద్యమకారులైన తుకారాం, రామదాస్, వామన పండితుల బోధనలు మరాఠాలను చైతన్యపరిచాయి. ఫలితంగా, భగవంతుని ముందు అందరూ సమానులేనన్న భావన ప్రజల్లో బాగా పాతుకుపోయింది. వారు విభేదాలు మరిచిపోయి, ఏక జాతిగా రూపొందేందుకు దోహదపడ్డాయి. ఈ భావనను మహారాష్ట్ర సాహిత్యం మరింత పెంపొందించింది. సమర్థరామదాసు రచించిన ‘దశబోధ’ గ్రంథం శివాజీని మాత్రమే ఉత్తేజపరచకుండా, యావత్ మహారాష్ట్ర జాతిలో తమ ఆత్మ గౌరవం కాపాడుకోవడానికి స్వతంత్ర మరాఠా రాజ్యస్థాపన ఆవశ్యకతను తెలియజేసింది.

TS Inter 1st Year History Study Material Chapter 10 మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

అంతేకాకుండా బీజాపూర్, అహ్మద్ నగర్, గోల్కొండ రాజ్యాల్లో మరాఠా నాయకులు వివిధ హోదాల్లో పనిచేసి సైనిక, పాలనానుభవాన్ని గడించారు. మరాఠా సర్దారులు అందించిన సేవలకు గాను దక్కన్ సుల్తానులు వారిని నాయక్, రావ్ లాంటి బిరుదులతో సత్కరించారు. చందర్రావ్ మోరే, యశ్వంత్ రావ్, నాయక్ నింబాల్కర్, లోక్ జాదవ్వ్, షాజీ భోంస్లే లాంటి మరాఠా సర్దారులు దక్కన్ రాజ్యాల్లో మంచి కీర్తిప్రతిష్టలు సంపాదించుకొన్నారు. ఈ విధంగా పైన పేర్కొన్న కారణాలన్నీ శివాజీ నాయకత్వంలో మహారాష్ట్ర జాతి రాజ్య నిర్మాణానికి దోహదపడ్డాయి.

ప్రశ్న 2.
శివాజి సాధించిన విజయాలు, ఘనతలు చర్చించండి.
జవాబు.
మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన శివాజీ 1627లో షాజీ భోంస్లే, జిజియాబాయి దంపతులకు పూనాకు సుమారు యాభైమైళ్ల దూరంలోని ‘శివనేర్’ దుర్గంలో జన్మించాడు. షాజీభోంస్లే మేవార్ను పాలించిన సిసోడియా వంశానికి `చెందినవాడు. తల్లి జిజియాబాయి దేవగిరిని పాలించిన యాదవ వంశానికి చెందిన ఉన్నత కుటుంబీకురాలు. 1636లో షాజీ భోంస్లే శివనేర్ దుర్గాన్ని కోల్పోవడంతో, దాదాజీ కొండదేవ్ రక్షణలో శివాజీ తన తల్లితో కలసి పూనాకు మకాం మార్చడం జరిగింది. శివాజీ పూనాలో అతని తల్లి పర్యవేక్షణలో పెరిగాడు. ఆమె తన బోధనల ద్వారా, ఆచరణ ద్వారా హిందూ మత పరిరక్షణపై శివాజీకి అపరిమితమైన ఉత్సాహాన్ని కలిగించింది. సమర్థుడు, ప్రజ్ఞాశాలి అయిన దాదాజీ కొండదేవ్ శిక్షణలో శివాజీ ఆరితేరిన యోధుడుగా, దక్షుడైన పరిపాలకుడుగా తీర్చిదిద్దబడ్డాడు. తన సంరక్షకుడైన దాదాజీ కొండదేవ్ 1647లో మరణించడంతో, శివాజీ పూనా జాగీరు బాధ్యతలను స్వతంత్రంగా నిర్వహించడం మొదలుపెట్టాడు. ఇదే క్రమంలో తనకు నమ్మకమైన మావళీ తెగ నాయకులతో సంబంధాలను బలోపేతం చేసుకొన్నాడు. మావళీలే తర్వాత కాలంలో శివాజీ సైన్యంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

శివాజీ తన పంతొమ్మిదో ఏట నుంచి తన సైనిక జీవితాన్ని ప్రారంభించాడు. మొదటగా 1646లో తోరణ దుర్గాన్ని ఆక్రమించాడు. తదనంతరం వరుసగా చాకనా, కొండన, రాయఘడ్, పురంధర్ మొదలైన దుర్గాలను వశపరచుకొన్నాడు. రాయగడ్ వద్ద నూతన దుర్గాన్ని నిర్మించి, దాన్ని తన కార్యకలాపాలకు కేంద్రంగా చేసుకొన్నాడు. శివాజీ కళ్యాణ్ దుర్గాన్ని ముట్టడించినప్పుడు బీజాపూర్ సుల్తాన్ అప్రమత్తమయ్యాడు. శివాజీని లొంగదీసుకోవాలని అతని తండ్రి షాజీ భోంస్లేను బందీగా పట్టుకొన్నాడు. చివరకు శివాజీ బెంగుళూరు, కొండన దుర్గాలను బీజాపూర్ సుల్తాన్కు ఇచ్చి తన తండ్రిని విడిపించుకొన్నాడు. తర్వాత శివాజీ ఆరు సంవత్సరాలపాటు (1649-1655) తన దండయాత్రలు మానివేసి, తాను గెలిచిన ప్రాంతాలను సాధన సంపత్తిని సుస్థిర పరచుకొనే ప్రయత్నం చేశాడు.

శివాజీ బీజాపూర్ ప్రాంతంపై 1656 నుంచి మళ్లీ తన దండయాత్రలను ప్రారంభించాడు. 1656లో మొదటగా చంద్రరావ్ మోర్ను ఓడించి జావళీ దుర్గాన్ని వశపరుచుకొన్నాడు. నాటి నుంచి జావళి దుర్గం, శివాజీ సైనిక చర్యలకు కీలక స్థావరమైంది. తర్వాత ఉత్తర కొంకణ తీరాన్ని, కళ్యాణ్ దుర్గాన్ని జయించాడు. పోర్చుగీసు వారి స్థావరమైన డామన్ ఓడ రేవును దోచుకున్నాడు. శివాజీ దాడులతో అప్రమత్తమైన బీజాపూర్ సుల్తాన్ క్రీ. శ. 1659లో శివాజీని పట్టుకొని రావలిసిందిగా తన సేనాని అఫ్టలానన్ను పంపించాడు.

ఎలాగైనా రెచ్చగొట్టి శివాజీని పర్వత ప్రాంతం (ప్రతాపర్) నుంచి మైదానాల వైపుకు తీసుకురావాలనేదే అల్ఫాన్ వ్యూహం. ఎందుకంటే పర్వత ప్రాంతాలలో శివాజీ గెరిల్లా యుద్ధ తంత్రంలో ఆరితేరినవాడు, అతన్ని లొంగదీసుకోవడం చాలా కష్టం. శివాజీని మైదాన ప్రాంతానికి రప్పించడంలో విఫలమైన అఫ్ఘలాఖాన్ చివరకు కృష్ణాజీ భాస్కర్ అనే రాయబారిని శివాజీతో సంప్రదింపులకై పంపాడు. అలాన్తో జరుపబోయే సమావేశంలో శివాజీ ప్రాణాలకు హాని జరుగవచ్చనే సంకేతాలను రాయబారి వెల్లడించాడు. అలాఖాన్ కుట్రను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధమైన శివాజీ రక్షణ కవచాన్ని ధరించి, తగిన ఆయుధాలను సమకూర్చుకొని సమావేశ మందిరానికి చేరుకొన్నారు. వారిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకోవడంతో పోరు ప్రారంభమయింది. ఆత్మరక్షణకై శివాజీ బాగ్ నఖ్ (పులిగోళ్లు) అనే మారణాయుధంతో అఫ్ఘలాన్ను హతమార్చాడు. తదనంతరం శత్రుసైనిక శిబిరంపై దాడి జరిపి పూర్తిగా ఓడించాడు. భారీస్థాయిలో ధనాన్ని కొల్లగొట్టాడు. ఈ ఘనవిజయంతో శివాజీ ఖ్యాతి మరింత ఇనుమడించి, మరాఠా ప్రజానీకంలో గొప్ప పరాక్రమవంతుడిగా, పురాణ పురుషుడిగా పేరు సంపాదించుకొన్నాడు.

మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ తన మేనమామ షాయిస్తఖాన్ను 1659లో దక్కన్ ప్రాంతానికి గవర్నర్గా నియమించాడు. శివాజీని ఎలాగైనా అణచాలని ఔరంగజేబ్ షాయిస్తఖాన న్ను ఆజ్ఞాపించాడు. దీంతో షాయిస్తఖాన్ తన దండయాత్రను ప్రారంభించి చకాన్, ఉత్తర కొంకణ తీరాన్ని (1661) ఆక్రమించాడు. శివాజీ 1663 ఏప్రిల్ నెలలో పూనే చేరుకొని షాయిస్తఖాన్పై మెరుపుదాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిచాడు. తన సైనిక అవసరాల కోసం శివాజీ 1664లో అతి సంపన్నమైన సూరత్ రేవు పట్టణాన్ని కొల్లగొట్టాడు.

TS Inter 1st Year History Study Material Chapter 10 మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

నానాటికీ పెరుగుతున్న శివాజీ ప్రాబల్యాన్ని, షాయిస్తఖాన్ సంఘటనతో భీతి చెందిన ఔరంగజేబ్ పరిస్థితులను అదుపులో తెచ్చేందుకు ప్రయత్నించాడు. జైసింగ్ పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే వ్యూహాత్మకంగా వ్యవహరించి. శివాజీపై ఒత్తిడి పెంచాడు. జైసింగ్ పురంధర్ వద్ద శివాజీని ఓడించి, పురంధర్ సింధి (1665)కి ఒప్పించాడు. ఈ సంధి షరతుల ప్రకారం శివాజీ తన ఆధీనంలో ఉన్న 35 కోటల్లో ఇరవై మూడు కోటలను మొగులుల వశం చేశాడు. మొగల్ చక్రవర్తి ఆస్థానాన్ని సందర్శించాలనే సంధి షరతును కూడా శివాజీ అంగీకరించాడు.

పురంధర్ సంధిని అనుసరించి శివాజీ 1666లో ఆగ్రాకు వెళ్లి మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ను కలిశాడు. అయితే అక్కడ శివాజీ అమర్యాదకు లోనయ్యాడు. దీంతో శివాజీ ఆగ్రహించడంతో, ఔరంగజేబ్ అతన్ని నిర్బంధించాడు. 1670లో సూరత్ పట్టణంపై రెండోసారి దాడి జరిపి అరవై లక్షల రూపాయల ధనాన్ని దోచుకున్నాడు.
శివాజీ పట్టాభిషేకం 1674 జూన్ 16న రాజ్గఢ్ మిక్కిలి వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ పట్టాభిషేకాన్ని వారణాసికి చెందిన వేద పండితుడైన (విశ్వేశ్వర్) గాగ భట్టు నిర్వహించాడు. మేవార్ రాజపుత్రుల సంప్రదాయం ప్రకారం దీన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ‘శివాజీ ఛత్రపతి’, “హైందవ ధర్మోద్ధారక” అనే బిరుదులు ధరించాడు.

ప్రశ్న 3.
శివాజీ పరిపాలన గురించి రాయండి.
జవాబు.
పరిపాలన: శివాజీ కృషితో స్వతంత్ర మహారాష్ట్ర రాజ్యం ఏర్పడింది. శివాజీ గొప్ప వీరుడు. సైనిక నాయకుడే కాకుండా గొప్ప పాలకుడిగా కూడా పేరు పొందాడు.
శివాజీ పాలన సమానత్వం, న్యాయం, సహనంలపై ఆధారపడి కొనసాగింది. శివాజీ తన రాజ్యానికి ‘స్వరాజ్యం’ అని పేరు పెట్టాడు. తన రాజ్యం పరిసర ప్రాంతాల నుంచి చౌత్, సర్దేశ్ముఖి వంటి పన్నులను వసూలు చేశాడు.

శివాజీ కేంద్రీకృత పాలనావ్యవస్థను ఏర్పాటు చేశాడు. చక్రవర్తి అయిన శివాజీ సర్వాధికారి. అధికారులను నియమించే, తొలగించే అధికారం శివాజీకి ఉండేది. శివాజీ తనకు పరిపాలనలో సహకరించేందుకు ఎనిమిది మంది సభ్యులు గల అష్టప్రధానులు అనే మంత్రిమండలిని ఏర్పాటుచేశాడు. మంత్రులకు వివిధ శాఖలను కేటాయించాడు.

అష్ట ప్రధానులు:
a) పీష్వా: ప్రధానమంత్రి – సాధారణ పాలనా వ్యవహారాలను చూసేవాడు.
b) అమాత్య: ఆర్థిక మంత్రి – ఆదాయ వ్యయాలు, బడ్జెట్ చూసేవాడు.
c) మంత్రి: ఆంతరంగిక వ్యవహారాల మంత్రి.
d) సచివ: సమాచారశాఖా మంత్రి.
e) సుమంత్: విదేశీ వ్యవహారాల మంత్రి.
f) పండితరావు: దానధర్మాలు, ధర్మాదాయం.
g) సేవాపతి: సర్వసైన్యాధ్యక్షుడు.
h) న్యాయాధీశుడు: అత్యున్నత న్యాయాధికారి.

కేవలం సామర్థ్యాన్ని బట్టి మాత్రమే మంత్రిమండలిలో స్థానం లభించేది. వంశపారంపర్య హక్కు ఉండేది కాదు. మంత్రులు, పాలనా వ్యవహారాలతో పాటు అవసరమైనప్పుడు సైనిక విధులను కూడా నిర్వహించేవారు.

పరిపాలనా విభాగాలు: పరిపాలనా సౌలభ్యం కోసం శివాజీ తన స్వరాజ్యంను నాలుగు రాష్ట్రాలుగా విభజించి దాని పాలనకు వైశ్రాయ్ లేదా గవర్నర్ను నియమించాడు. రాష్ట్రాలను తిరిగి జిల్లాలుగా విభజించాడు. జిల్లాను తిరిగి గ్రామాలుగా విభజించాడు. గ్రామ పాలనకు పంచాయితి, పటేల్, కులకర్ణి అనే అధికారులు నిర్వహించేవారు.
వీటికి తోడు మొగల్ రాజ్యంలోని కొన్ని ప్రాంతాలు పరోక్షంగా శివాజీ ఆధీనంలో ఉండేవి. వారి నుంచి చౌత్ అనే పేరున పన్నులు వసూలు చేశాడు.

భూమిశిస్తు విధానం: శివాజీ జాగిర్దారీ విధానాన్ని రద్దుచేశాడు. మత సంస్థల భూములను శివాజీ స్వాధీనం చేసుకొని వాటికి నగదు చెల్లించాడు. భూమిని సర్వే చేయించి రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. పన్నులను ధన రూపంలోగాని, ధాన్య రూపంలోగాని చెల్లించే అవకాశాన్ని కల్పించాడు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు రుణాలను ఇచ్చి, వాటిని సులభ వాయిదాల్లో తిరిగి చెల్లించే ఏర్పాటు చేశాడు.

భూమి శిస్తుతోపాటు వాణిజ్య పన్నులు, నాణాల నుంచి ఆదాయం, చౌత్, సర్దేశముఖి మొదలైన వాటి ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభించేది. చౌత్ అనే 1/4 వ వంతు పన్ను యుద్ధాల నుంచి రక్షించినందున తన రాజ్య పరిసరాల్లోని వారి నుంచి వసూలు చేసేవాడు. 1/10 వ వంతు వసూలు చేసే సర్దేశముఖి రాజు పట్ల గౌరవంతో చెల్లించే పన్ను.

సైనిక పాలన: శివాజీ బలమంతా అతని సైన్యంపై ఆధారపడి ఉంది. శివాజీ ప్రతిభావంతమైన, అంకితభావం గల సైన్యాన్ని ఏర్పాటు చేసుకొన్నాడు. ముస్లిం పాలకులను మహారాష్ట్రకు దూరంగా ఉంచి హిందూ ధర్మాన్ని రక్షించడం ప్రధాన లక్ష్యంగాగల శివాజీ అందుకు అనువైన సైన్యాన్ని ఏర్పాటు చేసుకొన్నాడు. శివాజీ సైన్యంలో 45 వేల అశ్విక దళం, 60 వేల కాల్బలం, లక్షమందితో పదాతి దళం ఉండేది. వీటికి తోడు ఏనుగులు, ఒంటెలు, ఫిరంగి దళం కూడా ఉండేది. జాగీరులకు బదులు మొదటిసారిగా ధనరూపంలో వేతనాలను చెల్లించేవారు. శివాజీ కోటల రక్షణకు ప్రత్యేక చర్యలను తీసుకొన్నాడు. సమర్థులైన వారికి బిరుదులు ఇవ్వడం, ప్రతిభావంతులకు అదనపు సౌకర్యాలను కల్పించడం వంటివి శివాజీ చేశాడు. యుద్ధరంగానికి స్త్రీలను తీసుకువెళ్ళడాన్ని నిషేధించాడు. దీన్ని ఉల్లంఘించిన వారికి మరణ శిక్ష విధించేవాడు. యుద్ధంలో స్వాధీనం చేసుకొన్న సొమ్మంతా చక్రవర్తికి అప్పగించాల్సి ఉండేది.

న్యాయపాలన: న్యాయ వ్యవస్థలో శివాజీ సంప్రదాయ పద్ధతులను పాటించాడు. సమన్యాయాన్ని అనుసరించాడు. ధనవంతుడు, పేదవాడు అనే తేడాలు కానీ, మత తేడాలు కానీ చూపించేవాడు కాదు. గ్రామస్థాయిలో గ్రామ పంచాయితీలు న్యాయపాలన చేసేవి. కేంద్ర స్థాయిలో న్యాయపాలన కోసం ‘న్యాయాధీశ్’ నియమించబడ్డాడు. కేసులు విచారించడంలోనూ, తీర్పులను ఇవ్వడంలోనూ ప్రాచీన హిందూ చట్టాలను పరిగణనలోకి తీసుకొనేవారు.

దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్న మొగలులతో వీరోచితంగా పోరాడి శివాజీ విజయం సాధించాడు. గతంలో అనైక్యంగా చిన్నచిన్న భాగాలుగా ఉన్న హిందూమత శక్తులను ఉన్నతమైన ఆశయాలతో ఏకంచేశాడు.

వీటన్నింటికి తోడు శివాజీ గొప్ప రాజకీయవేత్త, చురుకైన నాయకుడు. జె.ఎన్. సర్కార్ అనే చరిత్రకారుడు అన్నట్లు “శివాజీ మహారాష్ట్రులకు వెలుగు …. మొగలుల పాలిట సింహస్వప్నం తన వారసులకు స్ఫూర్తిప్రదాతగా నిలిచాడు. శివాజీ గొప్పతనం అతని వ్యక్తిత్వంలోను ఆచరణలోనూ బయల్పడుతుంది”.

TS Inter 1st Year History Study Material Chapter 10 మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

ప్రశ్న 4.
మూడోపానిపట్టు యుద్ధం కారణాలు, గమనం, ఫలితాలను వివరించండి.
జవాబు.
ఆధునిక భారతదేశ చరిత్ర గతిని మలుపు తిప్పిన యుద్ధాల్లో మూడో పానిపట్ యుద్ధం ఒకటి. మూడో పీష్వా తమ్ముడైన రఘునాథ రావు (రఘోబా), అహ్మద్ షా అబ్దాలీ రాజ్యంలో భాగంగా ఉన్న పంజాబ్ను ఆక్రమించి, అతని రాజ్య ప్రతినిధిని తరిమివేశాడు. దీంతో అహ్మర్షి అబ్దాలీ మహారాష్ట్రులపై పెద్ద సైన్యంతో దండెత్తాడు. చారిత్రాత్మకమైన పానిపట్ యుద్ధభూమిలో 14 జనవరి, 1761వ తేదిన ఇరు సైన్యాల మధ్య తీవ్ర యుద్ధం జరిగింది.

యుద్ద విశేషాలు: మహారాష్ట్ర సైన్యాధ్యక్షుడుగా సదాశివరావు (బావో సాహెబ్), మూడో పీష్వా కుమారుడైన విశ్వాసరావు ఉపసైన్యాధ్యక్షుడుగా వ్యవహరించారు. బావో సమర్థుడైన వ్యక్తి, కానీ అతని అహంకారం, గర్వం కారణంగా తన సేనా నాయకుల మాటలను వినక పెడచెవిన పెట్టాడు. ముఖ్యంగా జాట్ల నాయకుడైన సూరజ్మల్ ప్రత్యక్ష యుద్ధం (బహిరంగ యుద్ధం) వద్దని, గెరిల్లా యుద్ధమే తమకు లభిస్తుందని చెప్పినా వినలేదు. తన మాటలు లెక్క చేయనందుకు సూరజ్మల్ తన సైన్యంతో వెనుదిరిగాడు. మరోవైపు అహ్మద్ అబ్దాలీ రోహిల్లాలు, అవధ్ నవాబ్ సహకారాన్ని సకాలంలో పొందగలిగాడు.

అబ్దాలీ తెలివిగా మరాఠా సైనిక శిబిరాన్ని చుట్టుముట్టి వారికి ఆహారపదార్థాలు అందకుండా వ్యూహం పన్నాడు. దక్కన్ నుంచి రాకపోకలను పూర్తిగా స్తంభింపచేశాడు. రెండునెలల పాటు మరాఠా సైన్యాలు తీవ్ర బాధలకు గురి అయ్యాయి. ప్రత్యక్ష యుద్ధంలో అంతగా ప్రావీణ్యం లేని మరాఠా సైన్యం చిత్తుగా ఓడిపోయింది. విశ్వాసరావు, సదాశివరావు వంటి వీరులు సైతం మరణించారు. దాదాపు రెండు లక్షలకు పైగా మరాఠా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వేలమందికి పైగా క్షతగాత్రులయ్యారు.

ఫలితాలు:

  1. మూడో పానిపట్ యుద్ధంలో ఓటమి కొంతవరకు మహారాష్ట్రుల అధికారాన్ని, ప్రాభవాన్ని అంతమొందించింది. అఖిల భారత హిందూ సామ్రాజ్య స్థాపన అనే ఆశయం నెరవేరలేదు.
  2. మహారాష్ట్రులు, ముస్లింలు బలహీనమైనందున, ఆంగ్లేయులకు తమ అధికారాన్ని విస్తరించుకొనే అవకాశం కలిగింది. పరోక్షంగా బ్రిటిష్ వారు ఈ యుద్ధం వల్ల లాభపడినట్లయింది.
  3. ఈ యుద్ధంవల్ల శిక్కులు పంజాబ్లో తమ ఆధిక్యతను స్థాపించుకొనేందుకు మార్గం సులభమైంది. శిక్కులు పఠానులను తరిమివేయడంతో వారు స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయారు.

మహారాష్ట్రుల ఓటమికి కారణాలు: మహారాష్ట్రులు ఓటమికి ప్రధాన కారణాలు ఇవి:

  1. అహ్మద్ షా అబ్దాలీ ఆరితేరిన సైన్యాధ్యక్షుడు. ఇతని సైన్యం ఆయుధాలలో, క్రమశిక్షణలో మహారాష్ట్రుల కంటే ఉత్తమమైంది.
  2. భావో గర్విష్టి. అతడు ఇతరుల సలహాలను లక్ష్యపెట్టలేదు. మహారాష్ట్రులు జాట్ల సలహాలు విననందున వారి అభిమానాన్ని, సహాయాన్ని కోల్పోయారు. మరోవైపు అహ్మద్ షా అబ్దాలీ రోహిల్లాలు, అవధ్ నవాబ్ సహకారాన్ని సకాలంలో పొందగలిగాడు.
  3. మహారాష్ట్రులు వారికి పట్టున్న గెరిల్లా యుద్ధాన్ని ఎంచుకోకుండా, అంతగా అభ్యాసనం లేని బహిరంగ యుద్ధం చేయడం.
  4. అబ్దాలి మహారాష్ట్రుల సైన్యానికి ఆహార పదార్థాలు అందకుండా చేయడంతో, వారు పస్తులు ఉండాల్సి వచ్చింది.

ప్రశ్న 5.
పీష్వాల గురించి సంక్షిప్త వ్యాసం రాయండి.
జవాబు.
శివాజీ తన పట్టాభిషేక సమయంలో ఎనిమిది మంది సభ్యులు గల మంత్రి మండలి (అష్టప్రధానులు) బాధ్యతలు, విధుల గురించి స్పష్టంగా వివరించడం జరిగింది. ఛత్రపతి తర్వాత పీష్వా చాలా ప్రధానమైన వ్యక్తి. పరిపాలనలో ఇతనిదే అగ్రస్థానం. శివాజీ కాలంలో మోరోపంత్ త్రయంబక్ మొదటి పీష్వాగా నియమించబడ్డాడు. శివాజీ వారసులు కూడా పరిపాలనలో పీష్వాలపైనే చాలా ఎక్కువగా ఆధారపడ్డారు. తారాబాయితో జరిగిన అంతర్యుద్ధంలో సాహూ విజయం సాధించి ఛత్రపతిగా సింహాసనం అధిష్టించడంలో నాటి పీష్వా బాలాజీ విశ్వనాథ్ కీలక పాత్ర పోషించాడు. ఇతని కాలం నుంచే పీష్వాలు మరాఠా సర్దారులందరిలోకి అగ్రగణ్యులయ్యారు. అష్టప్రధానులందరిపైనే కాకుండా ఛత్రపతి కంటే కూడా పీష్వా అధికుడనే భావనను బలపరిచే విధంగా పీష్వా పదవిని బాలాజీ విశ్వనాథ్ తీర్చిదిద్దాడు. మొత్తం మీద మరాఠా చరిత్రలో 1713 నుంచి 1818 వరకు ఏడుగురు పీష్వాలు పాలించారు. బాలాజీ విశ్వనాథ్ (1713 – 20): బాలాజీ విశ్వనాథ్ కొంకణ్ తీరంలోని చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. ఇతను మరాఠా సర్దారుల దగ్గర గుమస్తాగా జీవితాన్ని ప్రారంభించాడు. ‘తదనంతరం కాలంలో పూనా, దౌలతాబాద్లకు సర్ సుబేదార్ గా పనిచేసాడు. ఈ కాలంలో బాలాజీ విశ్వనాథ్ మొగల్ చక్రవర్తితో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉండడం వల్ల సాహూకి దగ్గరయ్యాడు. సాహూని ఛత్రపతి చేసే విషయమై మరాఠా సర్దారులతో దౌత్యం నెరపడంలోనూ, వారిని లొంగదీసుకోవడంలో బాలాజీ విశ్వనాథ్ విజయం సాధించాడు. అతని సేవలకు గుర్తింపుగా సాహూ అతన్ని 16 నవంబర్, 1713లో పీష్వాగా నియమించాడు. తన అత్యుత్తమ ప్రతిభా పాటవాలచే బాలాజీ విశ్వనాథ్ మరాఠా సామ్రాజ్యానికి పీష్వానే వాస్తవాధినేతగా మార్చాడు. పూనాను రాజకీయ కేంద్రంగా మార్చి, పీష్వా పదవిని వంశపారంపర్యం చేశాడు. అందుకనే బాలాజీ విశ్వనాథన్ను పీష్వా వంశ స్థాపకుడని అంటారు. మొగల్ రాజ్యంలోని అంతర్గత విభేదాలను ఆసరాగా తీసుకొని మరాఠాల ప్రాబల్యాన్ని పెంచడంలో బాలాజీ విశ్వనాథ్ విజయం సాధించాడు. కొంకణ తీరంలోని నావికాదళాధ్యక్షుడు కన్హోజీ అంగ్రేతో 1714లో చేసుకొన్న ‘లోనావాలా సంధి’ ఇతని తొలి దౌత్యవిజయం. దీని ద్వారా కన్హోజీ సాహూని ఛత్రపతిగా అంగీకరించాడు. మొదటి బాజీరావ్ (1720 40): బాలాజీ విశ్వనాథ్ తరువాత అతని 20 సంవత్సరాల కుమారుడు మొదటి బాజీగాన్ కీ ష్వాగా బాధ్యతలు చేపట్టాడు. అతడు విజ్ఞుడైన రాజనీతిజ్ఞుడు, మిక్కిలి వివేకం కలవాడు. చక్కని యోధుడు. యుద్ధ తంత్రంలో ప్రతిభాశాలి. తన తండ్రి వద్ద నుంచి రాజతంత్రాన్ని, దౌత్యాన్ని అనుభవపూర్వకంగా నేర్చుకొన్నాడు. గెంల్లా యుద్ధ తంత్రంలో శివాజీ తరువాత అంతగా ఆరితేరినవాడుగా ప్రసిద్ధి చెందాడు. ధైర్యసాహసాలు, రాజతంత్రం దృష్ట్యా అతడు పీష్వాలలో కడు సమర్థుడిగా పరిగణింపబడ్డాడు.

అఖిల భారత హిందూ సామ్రాజ్యం (హింద్పద్ పద్ షాహీ) స్థాపన అనేది బాజీరావు మహోన్నత ఆశయం. మొగల్ సామ్రాజ్య పతనాన్ని దృష్టిలో పెట్టుకొని, “చెట్టు కాండాన్ని ఛేదిస్తే కొమ్మలు వాటంతట అవే పడిపోతాయని”, అప్పుడు మరాఠా కీర్తి పతాకం సింధూ నుంచి కృష్ణా వరకు ఎగురవేయవచ్చని భావించాడు. బాజీరావు నిజాం సైన్యాలను మర్చి 6, 1728లో పాల్టేడ్ వద్ద ఓడించి అతన్ని మునిషివగావ్ సంధికి ఒప్పించాడు. దీని ప్రకారం సాహూకి వ్యతిరేకంగా రెండో శంభాజీకి నిజాం ఎటువంటి సహాయం అందించరాదనీ, దక్కన్లో పన్నులు వసూలు చేసుకొనేందుకు అధికారాన్ని ఇచ్చాడు.

మొగల్ రాజ్య అలహాబాద్ గవర్నర్ అయిన మహ్మదాఖాన్ భంగాష్ 1727లో బుందేల్ఖండ్ పై దాడి జరిపాడు. అక్కడి రాజుని, అతని కుటుంబ సభ్యులని బందీలుగా పట్టుకొన్నాడు. రాజా అభ్యర్థన మేరకు 1729లో బాజీరావు మరాఠా సైన్యాలను బుందేల్ఫండ్కు పంపి మహ్మదఖాన్ను ఓడించి రాజాను తిరిగి సింహాసనంపై నిలిపాడు. దీంతో ఈ ప్రాంతంలో మరాఠాల ప్రాబల్యం అనూహ్యంగా పెరిగిపోయింది. బాజీరావుకు బుందేలులతోనే కాకుండా అంబర్ రాజులతో కూడా స్నేహ బంధాలు బలపడ్డాయి.

బాజీరావును కట్టడి చేసేందుకు మొగల్ చక్రవర్తి నిజాంను ప్రోత్సహించాడు. దీంతో నిజాంను మరాఠా సైన్యాలు రెండోసారి భోపాల్ యుద్ధంలో (1737) ఓడించి దురైసరై సంధికి ఒప్పించాయి. దీని ప్రకారం నిజాం యుద్ధ పరిహారం కింద యాభై లక్షలు చెల్లించడమే కాకుండా నర్మద, చంబల్ ప్రాంతాల మధ్య ఉన్న ప్రాంతంపై మరాఠాల సార్వభౌమత్వాన్ని అంగీకరించాడు.

బాజీరావ్ సిద్దీలకు (జింజీ) వ్యతిరేకంగా దండయాత్ర చేపట్టి వారిని ప్రధాన భూభాగం నుంచి వెళ్లిపోయేలా చేశాడు. పోర్చుగీసు వారిని 1739లో ఓడించి సాల్సెట్టి, బేసిన్ ప్రాంతాలను ఆక్రమించాడు. దీంతో మరాఠాల ప్రతిష్ట మరింత పెరిగింది.

బాలాజీ బాజీరావ్ (1740-61): మొదటి బాజీరావు మరణం తర్వాత అతని పద్దెనిమిది సంవత్సరాల కుమారుడు బాలాజీ బాజీరావు (నానాసాహెబ్) పీష్వాగా బాధ్యతలు చేపట్టాడు. ఇతను తండ్రి అంతటి సమర్థుడు కాడు. ఇతను ఎల్లపుడూ తన బంధువైన సదాశివరావ్ బావో సలహాలపైనే ఆధారపడేవాడు. బాలాజీ బాజీరావు పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే తన తండ్రి ఆశయాన్ని పూర్తి చేయదలిచాడు. బాలాజీ బాజీరావు నాయకత్వంలోని మరాఠా సర్దారులు అనేక కొత్త ప్రాంతాలను జయించారు. రఘోజీ భోంస్లే మధ్య భారతాన్ని జయించి, బెంగాల్పై దండయాత్రలు జరిపాడు. దీంతో బెంగాల్ నవాబ్ అలీవర్ధనాఖాన్ ఒరిస్సాను దత్తం చేసి బెంగాల్ బీహార్ తో కూడిన రాష్ట్రానికి చౌత్, సర్దేశముఖి పన్నులను చెల్లించడానికి ఒప్పుకొన్నాడు.

మహారాష్ట్రులు 1757లో అహ్మద్ అబ్దాలీ ప్రతినిధి నుంచి ఢిల్లీ ప్రాంతాన్ని జయించారు. 1758లో పీష్వా తమ్ముడైన రఘునాథరావు (రఘోబా) పంజాబు వశం చేసుకొని, అక్కడి నుంచి అహ్మద్ అబ్దాలీ రాజప్రతినిధిని తరిమివేశాడు. ఈ విధంగా మూడో పీష్వా హయాంలో మరాఠాల అధికారం, భారతదేశం ఒక కొన నుంచి మరో కొన వరకు విస్తరించింది. తమ ఆధీనంలో లేని ప్రాంతాల నుంచి కూడా మరాఠాలు చౌత్, సర్దేశముఖి పన్నులను వసూలు చేశారు. ఇలాంటి సమయంలో అహ్మదా అబ్దాలీ మరాఠాలను మూడో పానిపట్ యుద్ధంలో ఓడించాడు. ఈ ఓటమి మహారాష్ట్ర అధికారానికి, ప్రాభవానికి తీవ్ర విఘాతమైంది. ఈ పరాజయంతో కృంగిపోయిన పీష్వా కొద్ది కాలానికే 1761లో మరణించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 10 మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

ప్రశ్న 6.
రంజిత్సింగ్ ఘనతను చర్చించండి.
జవాబు.
రంజిత్ సింగ్ (1792-1839): సిక్కు సామ్రాజ్య స్థాపకుడైన రంజిత్ సింగ్కు ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇతను 13 నవంబరు, 1780లో మహాన్సింగ్, రాజ్కార్ దంపతులకు గుజ్రన్వాలాలో (ప్రస్తుతం ఆధునిక పాకిస్తాన్లో ) జన్మించాడు. మహాన్ సింగ్ ‘సుకరెకియా మిజిల్కు’ అధిపతి. పంజాబ్కు పశ్చిమంగా ఉన్న ప్రాంతం ఇతని ఆధీనంలోనే ఉండేది. ఇతని రాజధాని గుజ్రన్ వాలా. చిన్నతనంలో మశూచి సోకడంతో ఇతను ఎడమ కన్నును కోల్పోయాడు. పది సంవత్సరాల చిన్న వయస్సులోనే ఇతను తండ్రితో కలిసి యుద్ధాల్లో పాల్గొన్నాడు. అతని తండ్రి 1792లో మరణించడంతో మిజిల్ నాయకత్వ బాధ్యతలు 12 సంవత్సరాల రంజిత్ సింగ్కు దక్కాయి. 1797 వరకు అతను తల్లి సంరక్షణలో పాలనాబాధ్యతలు నిర్వహించినా, తరువాత స్వతంత్రంగా వ్యవహరించాడు. నాటి రాజకీయ అస్థిర పరిస్థితుల్ని రంజిత్ సింగ్ తనకు అనుకూలంగా మలుచుకొని రాజకీయంగా ఎదీగాడు.

రంజిత్ సింగ్ తనకు అందించిన సేవలకు ప్రతిఫలంగా, తన ప్రతినిధిగా లాహోర్ను పాలించమని జమాన్షా 1789లో ప్రకటించాడు. రంజిత్ సింగ్ 12, ఏప్రిల్ 1801 నాడు పంజాబ్ మహారాజాగా ప్రకటించుకొన్నాడు. 1802లో ఇతను తన రాజధానిని గుజ్రన్వాలా నుంచి లాహోరు మార్చాడు. 1799 నుంచి 1805 మధ్యకాలంలో రంజిత్ సింగ్ లాహోర్, అమృత్సర్ ప్రాంతాలను బంగీ మిజిల్ సర్దారుల నుంచి కైవసం చేసుకొన్నాడు. తదనంతర కాలంలో లూధియానా (1806), కాంగ్రా (1809), అటక్ (1813), ముల్తాన్ (1818), కాశ్మీర్ (1819), పెషావర్ (1823)లను ఆక్రమించాడు. ఫలితంగా రంజిత్సింగ్ సట్లెజ్, జీలం నదుల మధ్య ప్రాంతంలో తన అధికారాన్ని నెలకొల్పాడు. భారతదేశంలో ఫ్రెంచ్ వారి ప్రాబల్యాన్ని నిరోధించేందుకు బ్రిటిష్ వారు 1809లో రంజిత్ సింగ్తో అమృత్సర్ సంధిని చేసుకొన్నారు. ఈ సంధి ప్రకారం సట్లెజ్ నదికి ఉత్తరాన ఉన్న భూభాగంపై రంజిత్ సింగ్ సార్వభౌమత్వాన్ని బ్రిటిష్వారు గుర్తించారు. అహ్మద్ షా అబ్దాలీ మనుమడైన షాషుజా అతని సోదరుడి వల్ల పదవీచ్యుతుడైనప్పుడు, రంజిత్ సింగ్ సహకారంతో అతను సింహాసనాన్ని తిరిగి సంపాదించుకోగలిగాడు. దీనికి ప్రతిఫలంగా రంజిత్ సింగ్కు కోహినూర్ వజ్రాన్ని తిరిగి అప్పగించాడు.

రంజిత్ సింగ్ ఖాల్సా (సైన్యం)ను ఆధునీకరించాడు. అధునాతన ఆయుధాలను సైన్యంలో ప్రవేశపెట్టాడు. ఐరోపావాసుల చేత, ముఖ్యంగా నెపోలియన్ దగ్గర పనిచేసిన సైనికాధికారులచే తన సైన్యానికి శిక్షణ ఇప్పించాడు. ఫలితంగా రంజిత్ సింగ్ సైన్యం భారతదేశంలోనే మొట్టమొదటి సుశిక్షుతులైన సైన్యంగా తీర్చిదిద్దబడింది. ఆయుధ కర్మాగారాలను ఫిరంగుల తయారీ కేంద్రాలను, మందుగుండు సామాగ్రి తయారీ కర్మాగారాలను రంజిత్ సింగ్ ఏర్పాటు చేశాడు.

రంజిత్ సింగ్ సామ్రాజ్యం లౌకికమైంది. పాలనలో మతపరమైన వివక్ష ఎక్కడా చూపలేదు. అమృత్సర్లోని శిక్కుల పవిత్ర దేవాలయాన్ని అతనే బంగారు పూతతో, చలువరాళ్లతో సుందరీకరించాడు. అప్పటి నుంచి అది స్వర్ణదేవాలయంగా ప్రసిద్ధి చెందింది. అలాగే వారణాశిలోని కాశీ విశ్వనాథుని దేవాలయ గోపురానికి బంగారు తాపడం కోసమని 820 కిలోల బంగారాన్ని రంజిత్ సింగ్ 1839లో బహుకరించాడు. రంజిత్ సింగ్ ఏనాడూ కూడా సిక్కుమత విశ్వాసాలను పాలనలో చొప్పించలేదు. శాంతి భద్రతలను అదుపులో ఉంచి, కఠిన శిక్షలను రద్దు చేశాడు.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అష్ట ప్రధానులు.
జవాబు.
శివాజీ కేంద్రీకృత పాలనావ్యవస్థను ఏర్పాటు చేశాడు. శివాజీ తనకు పరిపాలనలో సహకరించేందుకు ఎనిమిది మంది సభ్యులు గల అష్టప్రధానులు అనే మంత్రిమండలిని ఏర్పాటు చేశాడు. మంత్రులకు వివిధ శాఖలు కేటాయించాడు.

  1. పీష్వా: ప్రధానమంత్రి – సాధారణ పాలనా వ్యవహారాలను చూసేవాడు.
  2. అమాత్య: ఆర్థిక మంత్రి – ఆదాయ వ్యయాలు, బడ్జెట్ చూసేవాడు.
  3. మంత్రి: ఆంతరంగిక వ్యవహారాల మంత్రి.
  4. సచివ: సమాచారశాఖా మంత్రి.
  5. సుమంత్: విదేశీ వ్యవహారాల మంత్రి.
  6. పండితరావు: దానధర్మాలు, ధర్మాదాయం.
  7. సేవాపతి: సర్వసైన్యాధ్యక్షుడు.
  8. న్యాయాధీశుడు: అత్యున్నత న్యాయాధికారి.

ప్రశ్న 2.
బాలాజీ విశ్వనాథ్
జవాబు.
మహారాష్ట్రలో పీష్వాల రాజ్యానికి పునాదులు వేసిన బాలాజీ విశ్వనాథన్ను మహారాష్ట్ర సామ్రాజ్య రెండవ స్థాపకుడిగా పిలుస్తారు. శివాజీ మరణానంతరం మహారాష్ట్ర రాజ్యం అంతర్యుద్ధంలో మునిగి పతనావస్థకు చేరుకుంది. ఆ కల్లోల సమయంలో శివాజీ వదిలి వెళ్ళిన బాధ్యతలను, ఆశయాలను నెరవేర్చి, మహారాష్ట్ర సంస్కృతిని కాపాడిన ఘనత పీష్వాలది.

ఆ పీష్వాల వంశ మూలపురుషుడు బాలాజీ విశ్వనాథ్. ఛత్రపతి సాహూచే వంశపారంపర్య పీష్వాగా నియమింపబడ్డాడు. మరాఠా నౌకాదళాధిపతి కన్హోజీతో ఒప్పందం కుదుర్చుకుని పోర్చుగీస్, ఆంగ్లేయులను ఓడించాడు. సయ్యద్ సోదరులతో ఒప్పందం కుదర్చుకొని ఒకప్పటి శివాజీ భూములన్నీ స్వాధీనం చేసుకున్నాడు. మహారాష్ట్రులు కూటమిని ఏర్పాటు చేసి మరాఠాలలో ఐక్యత సాధించాడు. సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన యోధుడు బాలాజీ విశ్వనాథ్.

ప్రశ్న 3.
మొదటి బాజీరావు
జవాబు.
బాలాజీ విశ్వనాథ్ తరువాత అతని 20 సంవత్సరాల కుమారుడు మొదటి బాజీరావ్ పీష్వాగా బాధ్యతలు చేపట్టాడు. అతడు విజ్ఞుడైన రాజనీతిజ్ఞుడు, మిక్కిలి వివేకం కలవాడు. చక్కని యోధుడు. యుద్ధ తంత్రం ‘ప్రతిభాశాలి. తన శివాజీ తండ్రి వద్ద నుంచి రాజతంత్రాన్ని, దౌత్యాన్ని అనుభవపూర్వకంగా నేర్చుకొన్నాడు. గెరిల్లా యుద్ధ తంత్రంలో తరువాత అంతగా ఆరితేరినవాడుగా ప్రసిద్ధి చెందాడు. ధైర్యసాహసాలు, రాజతంత్రం పీష్వాలలో కడు సమర్థుడిగా పరిగణింపబడ్డాడు.

అఖిల భారత హిందూ సామ్రాజ్యం (హింద్పద్ పదాహీ) స్థాపన అనేది బాజీరావు మహోన్నత ఆశయం. మొగల్ సామ్రాజ్య పతనాన్ని దృష్టిలో పెట్టుకొని, “చెట్టు కాండాన్ని ఛేదిస్తే కొమ్మలు వాటంతట అవే పడిపోతాయని”, అప్పుడు మరాఠా కీర్తి పతాకం సింధూ నుంచి కృష్ణా వరకు ఎగురవేయవచ్చని భావించాడు. బాజీరావు నిజాం సైన్యాలను మర్చి 6, 1728లో పాల్టేడ్ వద్ద ఓడించి అతన్ని మునిషిగావ్ సంధికి ఒప్పించాడు. దీని ప్రకారం సాహూకి వ్యతిరేకంగా రెండో శంభాజీకి నిజాం ఎటువంటి సహాయం అందించరాదనీ, దక్కన్లో పన్నులు వసూలు చేసుకొనేందుకు అధికారాన్ని ఇచ్చాడు.

మొగల్ రాజ్య అలహాబాద్ గవర్నర్ అయిన మహ్మద్భన్ భంగాష్ 1727లో బుందేల్ ఖండ్ పై దాడి జరిపాడు. అక్కడి రాజుని, అతని కుటుంబ సభ్యులని బందీలుగా పట్టుకొన్నాడు. రాజా అభ్యర్థన మేరకు 1729లో బాజీరావు మరాఠా సైన్యాలను బుందేలఖండ్కు పంపి మహ్మదఖాన్ ను ఓడించి రాజాను తిరిగి సింహాసనంపై నిలిపాడు. దీంతో ఈ ప్రాంతంలో మరాఠాల ప్రాబల్యం అనూహ్యంగా పెరిగిపోయింది. బాజీరావుకు బుందేలులతోనే కాకుండా అంబర్ రాజులతో కూడా స్నేహ బంధాలు బలపడ్డాయి.

TS Inter 1st Year History Study Material Chapter 10 మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

బాజీరావును కట్టడి చేసేందుకు మొగల్ చక్రవర్తి నిజాంను ప్రోత్సహించాడు. దీంతో నిజాంను మరాఠా సైన్యాలు రెండోసారి భోపాల్ యుద్ధంలో (1737) ఓడించి దురైసరై సంధికి ఒప్పించాయి. దీని ప్రకారం నిజాం యుద్ధ పరిహారం కింద యాభై లక్షలు చెల్లించడమే కాకుండా నర్మద, చంబల్ ప్రాంతాల మధ్య ఉన్న ప్రాంతంపై మరాఠాల సార్వభౌమత్వాన్ని అంగీకరించాడు.

బాజీరావ్ సిద్దీలకు (జింజీ) వ్యతిరేకంగా దండయాత్ర చేపట్టి వారిని ప్రధాన భూభాగం నుంచి వెళ్లిపోయేలా చేశాడు. పోర్చుగీసు వారిని 1739లో ఓడించి సాల్సెట్టి, బేసిన్ ప్రాంతాలను ఆక్రమించాడు. దీంతో మరాఠాల ప్రతిష్ట మరింత పెరిగింది.

ప్రశ్న 4.
మూడోపానిపట్టు యుద్ధం
జవాబు.
ఆధునిక భారతదేశ చరిత్ర గతిని మలుపు తిప్పిన యుద్ధాల్లో మూడో పానిపట్ యుద్ధం ఒకటి. మూడో పీష్వా తమ్ముడైన రఘునాథ రావు (రఘోబా), అహ్మద్ షా అబ్దాలీ రాజ్యంలో భాగంగా ఉన్న పంజాబ్ను ఆక్రమించి, అతని రాజ్య ప్రతినిధిని తరిమివేశాడు. దీంతో అహ్మర్షి అబ్దాలీ మహారాష్ట్రులపై పెద్ద సైన్యంతో దండెత్తాడు. చారిత్రాత్మకమైన పానిపట్ యుద్దభూమిలో 14 జనవరి, 1761వ తేదిన ఇరు సైన్యాల మధ్య తీవ్ర యుద్ధం జరిగింది. యుద్ధ విశేషాలు: మహారాష్ట్ర సైన్యాధ్యక్షుడుగా సదాశివరావు (బావో సాహెబ్), మూడో పీష్వా కుమారుడైన విశ్వాసరావు ఉపసైన్యాధ్యక్షుడుగా వ్యవహరించారు. బావో సమర్థుడైన వ్యక్తి, కానీ అతని అహంకారం, గర్వం కారణంగా తన సేనా నాయకుల మాటలను వినక పెడచెవిన పెట్టాడు. ముఖ్యంగా జాట్ల నాయకుడైన సూరజ్మల్ ప్రత్యక్ష యుద్ధం (బహిరంగ యుద్ధం) వద్దని, గెరిల్లా యుద్ధమే తమకు లభిస్తుందని చెప్పినా వినలేదు. తన మాటలు లెక్క చేయనందుకు సూరజ్మల్ తన సైన్యంతో వెనుదిరిగాడు. మరోవైపు అహ్మద్ అబ్దాలీ రోహిల్లాలు, అవధ్ నవాబ్ల సహకారాన్ని సకాలంలో పొందగలిగాడు.

అబ్దాలీ తెలివిగా మరాఠా సైనిక శిబిరాన్ని చుట్టుముట్టి వారికి ఆహారపదార్థాలు అందకుండా వ్యూహం పన్నాడు. దక్కన్ నుంచి రాకపోకలను పూర్తిగా స్తంభింపచేశాడు. రెండునెలల పాటు మరాఠా సైన్యాలు తీవ్ర బాధలకు గురి అయ్యాయి. ప్రత్యక్ష యుద్ధంలో అంతగా ప్రావీణ్యం లేని మరాఠా సైన్యం చిత్తుగా ఓడిపోయింది. విశ్వాసరావు, సదాశివరావు వంటి వీరులు సైతం మరణించారు. దాదాపు రెండు లక్షలకు పైగా మరాఠా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వేలమందికి పైగా క్షతగాత్రులయ్యారు.

ప్రశ్న 5.
రంజిత్ సింగ్
జవాబు.
రంజిత్ సింగ్ (1792-1839): సిక్కు సామ్రాజ్య స్థాపకుడైన రంజిత్ సింగ్కు ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇతను 13 నవంబరు, 1780లో మహాన్సింగ్, రాజ్ ్కర్ దంపతులకు గుజ్రన్వాలాలో (ప్రస్తుతం ఆధునిక పాకిస్తాన్లో) జన్మించాడు. మహాన్సింగ్ ‘సుకరెకియా మిజిల్కు’ అధిపతి. పంజాబు పశ్చిమంగా ఉన్న ప్రాంతం ఇతని ఆధీనంలోనే ఉండేది. ఇతని రాజధాని గుజ్రన్ వాలా. చిన్నతనంలో మశూచి సోకడంతో ఇతను ఎడమ కన్నును కోల్పోయాడు. పది సంవత్సరాల చిన్న వయస్సులోనే ఇతను తండ్రితో కలిసి యుద్ధాల్లో పాల్గొన్నాడు. అతని తండ్రి 1792లో మరణించడంతో మిజిల్ నాయకత్వ బాధ్యతలు 12 సంవత్సరాల రంజిత్ సింగ్కు దక్కాయి. 1797 వరకు అతను తల్లి సంరక్షణలో పాలనాబాధ్యతలు నిర్వహించినా, తరువాత స్వతంత్రంగా వ్యవహరించాడు. నాటి రాజకీయ అస్థిర పరిస్థితుల్ని రంజిత్ సింగ్ తనకు అనుకూలంగా మలుచుకొని రాజకీయంగా ఎదిగాడు.

రంజిత్ సింగ్ ఖాల్సా (సైన్యం)ను ఆధునీకరించాడు. అధునాతన ఆయుధాలను సైన్యంలో ప్రవేశపెట్టాడు. ఐరోపావాసుల చేత, ముఖ్యంగా నెపోలియన్ దగ్గర పనిచేసిన సైనికాధికారులచే తన సైన్యానికి శిక్షణ ఇప్పించాడు. ఫలితంగా రంజిత్ సింగ్ సైన్యం భారతదేశంలోనే మొట్టమొదటి సుశిక్షుతులైన సైన్యంగా తీర్చిదిద్దబడింది. ఆయుధ కర్మాగారాలను ఫిరంగుల తయారీ కేంద్రాలను, మందుగుండు సామాగ్రి తయారీ కర్మాగారాలను రంజిత్ సింగ్ ఏర్పాటు చేశాడు.

రంజిత్ సింగ్ 27, జూన్ 1839లో మరణించాడు. అతని వారసుడిగా కరక్సింగ్ పదవీబాధ్యతలు చేపట్టాడు. అతని మరణం తర్వాత పంజాబ్ రాజ్యంలో రాజకీయ అస్థిర పరిస్థితులు, అంతర్యుద్ధం ఏర్పడింది. దీన్ని అదనుగా తీసుకొని బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ఆంగ్లో – సిక్కు యుద్ధాలకు తెరలేపింది. రెండో ఆంగ్లో – సిక్కు యుద్ధం తరువాత బ్రిటిష్ వారు దులీపింగ్ నుంచి పంజాబ్ను ఆక్రమించారు.

TS Inter 1st Year History Study Material Chapter 10 మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
దాదాజి కొండదేవ్
జవాబు.
క్రీ.శ. 1636లో ఫాజీభోంస్లే శివనేర్ దుర్గాన్ని కోల్పోవడంతో దాదాజీ కొండదేవ్ రక్షణలో శివాజీ తన తల్లితో కలిసి మకాం మార్చాడు. దాదాజీ కొండదేవ్ పర్యవేక్షణలో శివాజీ ఆరితేరిన యోధుడిగా, దక్షుడైన పరిపాలకుడిగా తీర్చిదిద్ద బడ్డాడు. శివాజీ సంరక్షకుడైన దాదాజీ కొండదేవ్ 1647లో మరణించడంతో, శివాజీ పూనా జాగీరు బాధ్యతలను స్వతంత్రంగా నిర్వహించాడు.

ప్రశ్న 2.
సమర్థ రామదాసు
జవాబు.
మహారాష్ట్ర భక్తి ఉద్యమకారుడైన సమర్థరామదాస్ క్రీ.శ. 1608 సంవత్సరంలో జన్మించారు. అణగారిపోయిన హిందూ జాతిని జాగృతం చేయడంలో ప్రత్యేకమయిన వ్యూహాత్మక ప్రణాళిక అమలు చేసాడు. శివాజీకి మత గురువు. ఛత్రపతి శివాజీ హైందవ స్వరాజ్యాన్ని ఏర్పరచడంలో వీరిది గురుతుల్య పాత్ర. సమర్థ రామదాసు రచించిన ‘దశబోధ’ గ్రంథం ‘శివాజీని ఉత్తేజపరిచింది. యావత్ మహారాష్ట్ర జాతిలో తమ ఆత్మగౌరవం కాపాడుకోవడానికి స్వతంత్ర మరాఠా రాజ్యస్థాపన ఆవశ్యకతను తెలియజేసింది.

ప్రశ్న 3.
తోరణదుర్గం
జవాబు.
తోరణ దుర్గం పూనె నగరానికి సమీపంలో ఉంది. ఈ దుర్గాన్ని ‘ప్రచండ గఢ్’ అని కూడా అంటారు. ఈ కోట చరిత్ర ప్రసిద్ధికెక్కింది. ఛత్రపతి శివాజీ తన పందొమ్మిదో ఏట అనగా క్రీ.శ. 1646లో ఈ తోరణ దుర్గాన్ని ఆక్రమించాడు. శివాజీ యొక్క విజయపదానికి, స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి తొలి అడుగుగా తోరణ దుర్గ విజయం ప్రసిద్ధికెక్కింది.

ప్రశ్న 4.
అన్జలాఖాన్
జవాబు.
శివాజీ దాడులతో అప్రమత్తమైన బీజాపూర్ సుల్తాన్ క్రీ.శ. 1659లో శివాజీని పట్టుకొని రావలిసిందిగా తన సేనాని అఫ్ఘలానన్ను పంపించాడు. శివాజీని మైదాన ప్రాంతానికి రప్పించడంలో విఫలమైన అల్ఫాన్ చివరకు కృష్ణాజీ భాస్కర్ అనే రాయబారిని శివాజీతో సంప్రదింపులకై పంపాడు. అఫ్టలాఖాన్ తో జరుపబోయే సమావేశంలో శివాజీ ప్రాణాలకు హాని జరుగవచ్చనే సంకేతాలను రాయబారి వెల్లడించాడు అఫ్ఘల్ఫాన్ కుట్రను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధమైన శివాజీ రక్షణ కవచాన్ని ధరించి, తగిన ఆయుధాల ను సమకూర్చుకొని సమావేశ మందిరానికి చేరుకొన్నారు. వారిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకోవడంతో పోరు ప్రారంమయింది. ఆత్మరక్షణకై శివాజీ బాగ్నఖ్ (పులిగోళ్లు) అనే మారణాయుధంతో అల్ఫాన్ ను హతమార్చాడు.

ప్రశ్న 5.
పురందర్ సంధి
జవాబు.
క్రీ.శ. 1665 సం॥లో మొగల్ సేనాని రాజా జైసింగ్కు, మరాఠా నాయకుడు అయిన శివాజీకి మధ్య పురంధర్ వద్ద కుదిరిన సంధిని పురంధర్ సంధి అని అంటారు. ఈ సంధి ప్రకారం:

  1. శివాజీ తన స్వాధీనంలోని సాలీనా నాలుగు లక్షల రూపాయల ఆదాయాన్ని ఇచ్చే ఇరవై మూడు కోటలను మొగలులు స్వాధీనం చేసుకున్నారు.
  2. బీజాపూర్ మొగలులు చేసే యుద్ధాలలో సహాయం చేసేందుకు శివాజీ అంగీకరించాడు.
  3. తన కుమారుడు శంభూజీని ఐదువేల మంది అశ్వికులతో మొగల్ ఆస్థానానికి పంపేందుకు శివాజీ అంగీకరించాడు.
  4. 13 సంవత్సరాల కాలంలో నలభై లక్షల పన్నులను చెల్లించేందుకు శివాజీ అంగీకరించాడు.
  5. ఐదు లక్షల పన్నులను ఇచ్చే బీజాపూర్ రాజ్యంలోని ప్రాంతాలపై శివాజీ అధికారాన్ని మొగలులు గుర్తించారు.

ఈ సంధి వల్ల మొగలులు ప్రయోజనం పొందారు. వారి ప్రాభవం వృద్ధి చెందింది. దీనితో శివాజీ అవమానానికి గురి అయినాడు. పురంధర్ సంధి ప్రకారం రాజా జైసింగ్ ప్రోద్బలంతో ఆగ్రాలోని మొగల్ దర్బారును శివాజీ దర్శించింది.

ప్రశ్న 6.
అష్ట ప్రధానులు
జవాబు.
శివాజీ కేంద్రీకృత పాలనావ్యవస్థను ఏర్పాటు చేశాడు. శివాజీ తనకు పరిపాలనలో సహకరించేందుకు ఎనిమిది మంట సభ్యులు గల అష్టప్రధానులు అనే మంత్రిమండలిని ఏర్పాటు చేశాడు. మంత్రులకు వివిధ శాఖలు కేటాయించాడు.

  • పీష్వా: ప్రధానమంత్రి – సాధారణ పాలనా వ్యవహారాలను చూసేవాడు.
  • అమాత్య: ఆర్థిక మంత్రి – ఆదాయ వ్యయాలు, బడ్జెట్ చూసేవాడు.
  • మంత్రి: ఆంతరంగిక వ్యవహారాల మంత్రి.
  • సచివ: సమాచారశాఖా మంత్రి.
  • సుమంత్: విదేశీ వ్యవహారాల మంత్రి.
  • పండితరావు: దానధర్మాలు, ధర్మాదాయం.
  • సేవాపతి: సర్వసైన్యాధ్యక్షుడు.
  • న్యాయాధీశుడు: అత్యున్నత న్యాయాధికారి.

ప్రశ్న 7.
మూడో పానిపట్టు యుద్ధం
జవాబు.
మూడవ పానిపట్టు యుద్ధం అహ్మదా అబ్దాలీ సామ్రాజ్య కాంక్ష ఫలితం. 1761 జనవరి 14న చారిత్రాత్మక పానిపట్టు వద్ద మహారాష్ట్ర, అబ్దాలీ సైనికులు తలపడ్డారు. ఈ యుద్ధంలో ఆఫ్గన్లు విజయం సాధించారు. సదాశివరావు, విశ్వాసరావు అంతటి వీరులు సైతం నేలకొరిగారు. వేలాది సైనికులు చనిపోయారు. ఈ యుద్ధం వలన నష్టపోని మహారాష్ట్ర కుటుంబం లేదు. ఈ పరాజయ వార్త విన్న పీ+3 బాలాజీ బాజీరావు కృంగి మరణించాడు.
రోహిల్లాలు, అయోధ్య నవాబు ంటి స్వదేశీయులు అబ్దాలీకి సహాయపడటం, మహరాష్ట్రులకు ఎటువంటి సహాయం అందకపోవడం మరాఠాల పరాజయానికి కారణాలయ్యాయి. దీనితో పీష్వా అధికారం క్షీణించి మహారాష్ట్ర సమాఖ్య విచ్ఛిన్నమైంది. మొగల్ సామ్రాజ్యం ఇంకా నిర్వీర్యమైపోయింది.

TS Inter 1st Year History Study Material Chapter 10 మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

ప్రశ్న 8.
అమృత్సర్ సంధి
జవాబు.
భారతదేశంలో ఫ్రెంచ్ వారి ప్రాబల్యాన్ని నిరోధించేందుకు బ్రిటిష్ వారు 1809లో రంజిత్ సింగ్తో అమృత్సర్ సంధిని చేసుకొన్నారు. ఈ సంధి ప్రకారం సట్లెజ్ నదికి ఉత్తరాన ఉన్న భూభాగంపై రంజిత్ సింగ్ సార్వభౌమత్వాన్ని బ్రిటిష్వారు గుర్తించారు.

TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 9th Lesson మొగల్ ల యుగం Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 9th Lesson మొగల్ ల యుగం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
షేర్షా పరిపాలనా విధానంపై ఒక వ్యాసం రాయండి.
జవాబు.
మొగల్ పాలనా వ్యవస్థకు రూపకల్పన చేసినవాడు అక్బర్. అక్బర్కు ప్రభుత్వ విధానాల్లో షేరా కొంతవరకు మార్గదర్శి. షేర్షా విధానాలను మెరుగుపరచి, కొత్త విధానాలను ప్రవేశపెట్టి, సమర్థవంతమైన పాలకునిగా అక్బర్ చక్రవర్తి మొగల్ చరిత్రలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు.

కేంద్ర ప్రభుత్వం:మొగల్ పరిపాలనా యంత్రాంగానికి చక్రవర్తి సర్వాధికారి. అధికారాలన్నీ అతడి చేతిలో కేంద్రీకృతమై ఉంటాయి. మొగల్ చక్రవర్తి ప్రాజ్ఞ నిరంకుశ ప్రభువు. “నా కింది ఉద్యోగులు నిర్వహించాల్సిన బాధ్యతలను నేను నిర్వహించనవసరం లేదు. పాలకుడు కింది ఉద్యోగుల తప్పులను దిద్దుకుంటూపోతూ నివారించుకుంటే సరిపోతుంది” అని అక్బర్ చెప్పుకున్నాడు. ప్రభుత్వంలో చక్రవర్తికి (పాదుషాకు) సలహాలిచ్చేందుకు నలుగురు మంత్రులున్నారు. వారు :

  1. వకీల్ లేక వకీల్-ఇ-ముత్లాక్ లేక ప్రధానమంత్రి:ఇతడు చక్రవర్తికి ముఖ్య సలహాదారు. అన్ని శాఖలను పర్యవేక్షిస్తాడు.
  2. దివాన్ లేక వజీర్ లేక ఆర్థికమంత్రి:ఇతడు సామ్రాజ్య ఆర్థిక వనరులను పర్యవేక్షించేవాడు. భూమిశిస్తు ఇతర పన్నుల వసూలు, సామ్రాజ్య ఖర్చులు ఇతని పర్యవేక్షణలో ఉండేవి.
  3. మీర్భక్షి:ఇతడు యుద్ధ మంత్రి. పెద్ద ఉద్యోగులకు జీతాలను కూడా బట్వాడా చేసేవాడు. మున్సబార్ల పేర్లు, వారి హోదాలు, వారి జీతాలు ఇతడు నమోదు చేసుకొనేవాడు. రాజప్రాసాద రక్షణ నిమిత్తం గస్తీ ఉద్యోగులను నియమించేవాడు. రాష్ట్రాలలో వార్తాహరులను, గూఢచారులను నియమించటం కూడా ఇతని విధి.
  4. సదర్-ఉస్-సదర్:మత విషయాలలో చక్రవర్తికి సలహాలివ్వడం, చక్రవర్తి దానధర్మాలను పర్యవేక్షించటం, ముఖ్య న్యాయాధీశునిగా వ్యవహరించటం ఇతడి విధులు.

రాష్ట్ర ప్రభుత్వం:పరిపాలనా సౌలభ్యం కొరకు మొగల్ సామ్రాజ్యం సుబాలుగా విభజింపబడింది. అక్బర్ కాలంలో దాదాపు 15 సుబాలుండేవి. ఒక రకంగా వీటిని రాష్ట్రాలుగా పరిగణించవచ్చు. రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ, కేంద్ర పాలనావ్యవస్థకు ప్రతిరూపం లేక ప్రతీక అని చెప్పవచ్చు. సుబాను పాలించే అధికారి సుబేదార్. సుబాలో శాంతి భద్రతలు కాపాడే బాధ్యతను సుబేదార్ నిర్వహిస్తాడు. దివాన్, భక్షి, సదర్, ఖాజీ అను అధికారులు కూడా రాష్ట్రపాలనా నిర్వహణలో బాధ్యత స్వీకరిస్తారు. వారి విధులు కేంద్ర ప్రభుత్వంలో అదే పేరుగల అధికారులు విధులను పోలి ఉంటాయి.

ప్రధాన నగరాలలో న్యాయ వ్యవహారాలను చూసేందుకు కొత్వాలు అనే ఉద్యోగి ఉండేవాడు. అతడు నగరాలలో శాంతి భద్రతలను కాపాడేవాడు. ప్రభుత్వ ఆజ్ఞలను అమలుపరిచేవాడు. విదేశీయుల కార్యకలాపాలను గమనించేవాడు. సర్కారు పాలన:”సుబాలు” సర్కారులుగా విభజింపబడ్డాయి. సర్కార్లను నేటి జిల్లాలతో పోల్చవచ్చు. సర్కార్లను పాలించడానికి ఈ క్రింది అధికార్లు ఉంటారు.

TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం

ఎ) ఫౌజార్:ఇతడు సర్కారు అధిపతి, సైనికాధికారి, తిరుగుబాట్లను అణచివేసి రెవిన్యూ అధికారులకు సహాయం చేయడం ఇతని ముఖ్య విధులు.
బి) అమల్ గుజార్:ఇతడు రెవిన్యూ శాఖాధిపతి. భూమిశిస్తు వసూలు చేయడం, ఋణాలను మంజూరు చేయడం ఇతని ముఖ్య విధులు.
సి) ఖజానాదార్:ఇతడు కోశాధికారి. వసూలైన భూమిశిస్తును ఖజానాలో భద్రపరచి కేంద్రానికి జాగ్రత్తగా పంపడం ఇతని విధి.
డి) బిలక్సి:ఇతడు భూములకు, భూమిశిస్తులకు సంబంధించిన వివరాలను తయారుచేస్తాడు.

పరగణా పాలన ; సర్కార్లు పరగణాలుగా విభజింపబడ్డాయి. ఈ క్రింది అధికారులు పరగణాల యొక్క నిర్వహించేవారు.
ఎ) షికార్: ఇతడు పరగణా యొక్క ముఖ్య కార్యనిర్వహణాధికారి. ఇతడు కూడా సైనికాధికారియే: పరగణా యొక్క శాంతిభద్రతలను పర్యవేక్షిస్తాడు.
బి) అమీన్: ఇతడు రెవిన్యూ ఉద్యోగి. భూమిశిస్తు విషయాలను నిర్వహిస్తాడు.
సి) కానుంగో: పట్వారీలపై అధికారి. ఇతడు భూములకు సంబంధించిన వివరాలను తయారుచేస్తాడు.
డి) పోద్దార్: ఇతడు పరిగణా యొక్క కోశాధికారి.

గ్రామ పాలన:పరగణాలు గ్రామాలుగా విభజింపబడ్డాయి. గ్రామం పరిపాలనా వ్యవస్థలో తుది అంశము. ముఖద్దమ్, పట్వారీలు గ్రామాధికారులు. ముఖద్దమ్ శాంతిని పర్యవేక్షిస్తాడు. పట్వారీ భూమిశిస్తు వివరాలను తయారు చేస్తాడు. గ్రామాలలో పంచాయితీ విధానం అమలులో ఉండేది. పంచాయితీలు న్యాయనిర్వహణ బాధ్యతలను నిర్వహించేవి.

సైనికపాలన:మొగల్ చక్రవర్తులు సమర్థవంతమైన సైన్యమును పోషించిరి. వీరి సైనిక విధానమును ‘మున్సబ్రీ’ విధానమందురు. ‘మున్సబ్’ అంటే ‘హోదా’ లేదా ‘ఉద్యోగం’ అని అర్థం. ఒక విధముగా ఢిల్లీ సుల్తానుల జాగీర్దార్ విధానం వంటిది.

ఆర్థిక విధానం:మొగలుల ఆర్థిక విధానం సమర్థవంతమైనది. ఖరాజ్, ఖమ్స్, జకాత్, జిజియా అనే నాలుగు రకాల పన్నులు వసూలు చేసిరి.

భూమిశిస్తు విధానం:మొగలుల భూమిశిస్తు విధానానికి పూర్తి రూపాన్ని కల్గించినవారు అక్బర్ మరియు ఆయన రెవిన్యూ మంత్రి రాజాతోడరమల్. మొగలుల భూమిశిస్తు విధానంను ‘బందోబస్త్’ విధానమందురు. న్యాయపాలన:చక్రవర్తితో కూడిన న్యాయమండలి మొగల్ రాజ్యంలో అత్యున్నత న్యాయస్థానం. అతి ముఖ్యమైన వివాదాలను ఈ న్యాయస్థానమే పరిష్కరించేది. చక్రవర్తియే ఉన్నత న్యాయాధీశుడు. ఉద్యోగులలో ప్రధాన ఖాజీ ఉన్నత న్యాయాధికారి. అతడు దిగువ న్యాయస్థానాల యొక్క న్యాయాధిపతులను నియమించేవాడు. ఆ న్యాయస్థానాల నుండి వచ్చే అప్పీళ్లను కూడా ప్రధాన ఖాజీ విచారించేవాడు. చీఫ్ సదర్ మత వివాదాలను పరిష్కరించేవాడు. రాష్ట్రాలలో (సుబాలలో) సదర్ క్రిమినల్ కేసులను, దివాన్ రెవిన్యూ వివాదాలను, ఖాజీ సివిల్ కేసులను పరిష్కరించే వారు. సర్కార్లలో ఫౌజార్లు, ఖాజీలు, పరగణాలలో షికార్లు, అమీన్లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించేవారు. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయితీలు నేర విచారణ చేసేవి.

ముగింపు:మొగలుల పాలనా విధానము ఉదారమైనది, సమర్థవంతమైనది. ప్రజాక్షేమాన్ని కాంక్షించేది. మహమ్మదీయుల పరిపాలనా వ్యవస్థ మొదటిసారిగా మొగలుల కాలంలోనే ఔన్నత్యాన్ని పొందింది.

ప్రశ్న 2.
మొగల్ పరిపాలన ముఖ్య లక్షణాలు చర్చించండి.
జవాబు.
మొగల్ పాలనా వ్యవస్థకు రూపకల్పన చేసినవాడు అక్బర్. అక్బర్కు ప్రభుత్వ విధానాల్లో షేరా కొంతవరకు మార్గదర్శి. షేర్షా విధానాలను మెరుగుపరచి, కొత్త విధానాలను ప్రవేశపెట్టి సమర్థవంతమైన పాలకునిగా అక్బర్ చక్రవర్తి మొగల్ చరిత్రలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు.

కేంద్ర ప్రభుత్వం:మొగల్ పరిపాలనా యంత్రాంగానికి చక్రవర్తి సర్వాధికారి. అధికారాలన్నీ అతడి చేతిలో కేంద్రీకృతమై ఉంటాయి. మొగల్ చక్రవర్తి ప్రాజ్ఞ నిరంకుశ ప్రభువు. నా కింది ఉద్యోగులు నిర్వహించాల్సిన బాధ్యతలను నేను నిర్వహించనవసరం లేదు. పాలకుడు కింది ఉద్యోగుల తప్పులను దిద్దుకుంటూపోతూ తాను చేసే తప్పులను నివారించుకుంటే సరిపోతుంది” అని అక్బర్ చెప్పుకున్నాడు. ప్రభుత్వంలో చక్రవర్తికి (పాదుషాకు) సలహాలిచ్చేందుకు నలుగురు మంత్రులున్నారు. వారు:

  1. వకీల్ లేక వకీల్-ఇ-ముత్లాక్ లేక ప్రధానమంత్రి:ఇతడు చక్రవర్తికి ముఖ్య సలహాదారు. అన్ని శాఖలను పర్యవేక్షిస్తాడు.
  2. దివాన్ లేక వజీర్ లేక ఆర్థికమంత్రి:ఇతడు సామ్రాజ్య ఆర్థిక వనరులను పర్యవేక్షించేవాడు. భూమిశిస్తు ఇతర పన్నుల వసూలు, సామ్రాజ్య ఖర్చులు ఇతని పర్యవేక్షణలో ఉండేవి.
  3. మీర భక్షి:ఇతడు యుద్ధ మంత్రి. పెద్ద ఉద్యోగులకు జీతాలను కూడా బట్వాడా చేసేవాడు. మున్సబార్లా పేర్లు, వారి హోదాలు, వారి జీతాలు ఇతడు నమోదు చేసుకొనేవాడు. రాజప్రాసాద రక్షణ నిమిత్తం గస్తీ ఉద్యోగులను నియమించేవాడు. రాష్ట్రాలలో వార్తాహరులను, గూఢచారులను నియమించటం కూడా ఇతని
    విధి.
  4. సదర్-ఉన్-సదర్:మత విషయాలలో చక్రవర్తికి సలహాలివ్వడం చక్రవర్తి దానధర్మాలను పర్యవేక్షించటం, ముఖ్య న్యాయాధీశునిగా వ్యవహరించటం ఇతడి విధులు.

రాష్ట్ర ప్రభుత్వం:పరిపాలనా సౌలభ్యం కొరకు మొగల్ సామ్రాజ్యం సుబాలుగా విభజింపబడింది. అక్బర్ కాలంలో దాదాపు 15 సుబాలుండేవి. ఒక రకంగా వీటిని రాష్ట్రాలుగా పరిగణించవచ్చు. రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ, కేంద్ర పాలనావ్యవస్థకు ప్రతిరూపం లేక ప్రతీక అని చెప్పవచ్చు. సుబాను పాలించే అధికారి సుబేదార్. సుబాలో శాంతి భద్రతలు కాపాడే బాధ్యతను సుబేదార్ నిర్వహిస్తాడు. దివాన్, భక్షి, సదర్, ఖాజీ అను అధికారులు కూడా రాష్ట్రపాలనా నిర్వహణలో బాధ్యత స్వీకరిస్తారు. వారి విధులు కేంద్ర ప్రభుత్వంలో అదే పేరుగల అధికారులు విధులను పోలి ఉంటాయి.

ప్రధాన నగరాలలో న్యాయ వ్యవహారాలను చూసేందుకు కొత్వాలు అనే ఉద్యోగి ఉండేవాడు. అతడు నగరాలలో శాంతి భద్రతలను కాపాడేవాడు. ప్రభుత్వ ఆజ్ఞలను అమలు పరిచేవాడు. విదేశీయుల కార్యకలాపాలను గమనించేవాడు. సర్కారు పాలన:“సుబాలు” సర్కారులుగా విభజింపబడ్డాయి. సర్కార్లను నేటి జిల్లాలతో పోల్చవచ్చు. సర్కార్లను పాలించడానికి ఈ క్రింది అధికార్లు ఉంటారు.

ఎ) ఫౌజార్: ఇతడు సర్కారు అధిపతి, సైనికాధికారి, తిరుగుబాట్లను అణచివేసి రెవిన్యూ అధికారులకు సహాయం చేయడం ఇతని ముఖ్య విధులు.
బి) అమల్ గుజార్: ఇతడు రెవిన్యూ శాఖాధిపతి. భూమిశిస్తు వసూలు చేయడం, ఋణాలను మంజూరు చేయడం ఇతని ముఖ్య విధులు.
సి) ఖజానాదార్: ఇతడు కోశాధికారి. వసూలైన భూమిశిస్తును ఖజానాలో భద్రపరచి కేంద్రానికి జాగ్రత్తగా పంపడం ఇతని విధి.
డి) బిలక్సీ: ఇతడు భూములకు, భూమిశిస్తులకు సంబంధించిన వివరాలను తయారుచేస్తాడు.

TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం

పరగణా పాలన: సర్కార్లు పరగణాలుగా విభజింపబడ్డాయి. ఈ క్రింది అధికారులు పరగణాల యొక్క పరిపాలనను నిర్వహించేవారు.
ఎ) షికార్:ఇతడు పరగణా యొక్క ముఖ్య కార్యనిర్వహణాధికారి. ఇతడు కూడా సైనికాధికారియే. పరగణా యొక్క శాంతిభద్రతలను పర్యవేక్షిస్తాడు.
బి) అమీన్:ఇతడు రెవిన్యూ ఉద్యోగి. భూమిశిస్తు విషయాలను నిర్వహిస్తాడు.
సి) కానుంగో:పట్వారీల-పై అధికారి. ఇతడు భూములకు సంబంధించిన వివరాలను తయారుచేస్తాడు.
డి) పోద్దార్:ఇతడు పరిగణా యొక్క కోశాధికారి.

గ్రామ పాలన:పరగణాలు గ్రామాలుగా విభజింపబడ్డాయి. గ్రామం పరిపాలనా వ్యవస్థలో తుది అంశము. ముఖద్దమ్, పట్వారీలు గ్రామాధికారులు. ముఖద్దమ్ శాంతిని పర్యవేక్షిస్తాడు. పట్వారీ భూమిశిస్తు వివరాలను తయారు చేస్తాడు. గ్రామాలలో పంచాయితీ విధానం అమలులో ఉండేది. పంచాయితీలు న్యాయనిర్వహణ బాధ్యతలను నిర్వహించేవి.

సైనిక పాలన:మొగల్ చక్రవర్తులు సమర్థవంతమైన సైన్యమును పోషించిరి. వీరి సైనిక విధానమును ‘మున్సబారీ’ విధానమందురు. ‘మున్సబ్’ అంటే ‘హోదా’ లేదా ‘ఉద్యోగం’ అని అర్థం. ఒక విధముగా ఢిల్లీ సుల్తానుల జాగీర్దార్ విధానం వంటిది.

ఆర్థిక విధానం:మొగలుల ఆర్థిక విధానం సమర్థవంతమైనది. ఖరాజ్, ఖమ్స్, జకాత్, జిజియా అనే నాలుగు రకాల పన్నులు వసూలు చేసిరి.

భూమిశిస్తు విధానం:మొగలుల భూమిశిస్తు విధానానికి పూర్తి రూపాన్ని కల్గించినవారు అక్బర్ మరియు ఆయన రెవిన్యూ మంత్రి రాజాతోడర్మల్. మొగలుల భూమిశిస్తు విధానంను ‘బందోబస్త్’ విధానమందురు.

న్యాయపాలన:చక్రవర్తితో కూడిన న్యాయమండలి మొగల్ రాజ్యంలో అత్యున్నత న్యాయస్థానం. అతి ముఖ్యమైన వివాదాలను ఈ న్యాయస్థానమే పరిష్కరించేది. చక్రవర్తియే ఉన్నత న్యాయాధీశుడు. ఉద్యోగులలో ప్రధాన ఖాజీ ఉన్నత న్యాయాధికారి. అతడు దిగువ న్యాయస్థానాల యొక్క న్యాయాధిపతులను నియమించేవాడు. ఆ న్యాయస్థానాల నుండి వచ్చే అప్పీళ్లను కూడా ప్రధాన ఖాజీ విచారించేవాడు. చీఫ్ సదర్ మత వివాదాలను పరిష్కరించేవాడు. రాష్ట్రాలలో (సుబాలలో) సదర్ క్రిమినల్ కేసులను, దివాన్ రెవిన్యూ వివాదాలను, ఖాజీ సివిల్ కేసులను పరిష్కరించేవారు. సర్కార్లలో ఫౌజ్దార్లు, ఖాజీలు, పరగణాలలో షికార్లు, అమీన్లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించేవారు. గ్రామస్థాయిలో గ్రామ పంచాయితీలు నేర విచారణ చేసేవి.

ముగింపు:మొగలుల పాలనా విధానము ఉదారమైనది, సమర్థవంతమైనది. ప్రజాక్షేమాన్ని కాంక్షించేది. మహమ్మదీయుల పరిపాలనా వ్యవస్థ మొదటిసారిగా మొగలుల కాలంలోనే ఔన్నత్యాన్ని పొందింది.

ప్రశ్న 3.
మొగల్ సామ్రాజ్య పతనానికి ఔరంగజేబు ఎంతవరకు బాధ్యుడు ?
జవాబు.
ఔరంగజేబు (క్రీ.శ. 1658 – 1707):సమర్థులైన మొగల్ చక్రవర్తులలో ఔరంగజేబు ఒకడు. “అలంగీర్” (ప్రపంచ విజేత) అనే బిరుదు ధరించి సింహాసనానికి వచ్చాడు. ఇతడి మొదటి పది సంవత్సరాల పాలనలో అనేక విజయాలు సాధించాడు. చిన్న చిన్న తిరుగుబాట్లను అణచివేశాడు. కాని పాలన చివరి రోజుల్లో అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. జాట్లు, సత్నామీలు, సిఖ్ు అతనికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేశారు. ఇతడి సంకుచిత మత దురభిమానం మూలంగానే ఈ తిరుగుబాట్లు జరిగాయి.

దక్కన్ విధానం:మొగలుల దక్కన్ విధానం అక్బర్తో ప్రారంభమైంది. ఖాందేశ్, బెరార్లను ఆక్రమించాడు. జహాంగీర్ అహ్మద్ నగర్ మంత్రి మాలిక్ అంబర్కు వ్యతిరేకంగా యుద్ధం చేశాడు. షాజహాన్ కాలంలో దక్కన్ గవర్నర్గా ఉన్న ఔరంగజేబు దక్కన్ రాజ్యాల పట్ల దుడుకైన విధానాన్ని అనుసరించాడు. కాని జౌరంగజేబు చక్రవర్తైన మొదటి అయిదు సంవత్సరాలు తన దృష్టిని పూర్తిగా పశ్చిమోత్తర సరిహద్దుపై కేంద్రీకరించాడు.

ఇదే సమయంలో మరాఠా నాయకుడు శివాజీ ఉత్తర, దక్షిణ కొంకణ్ణను జయించి స్వతంత్ర మరాఠా రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. మరాఠాల విజృంభణను అరికట్టడానికి ఔరంగజేబు బీజాపూర్, గోల్కొండ రాజ్యాలపై దండయాత్ర చేశాడు. సికిందర్షాను ఓడించి బీజాపూర్ను ఆక్రమించాడు. కుతుబ్షాహి సుల్తానును 1687లో ఓడించి గోల్కొండను ఆక్రమించాడు. దక్కన్ రాజ్యాలను ఆక్రమించడం ఔరంగజేబు చేసిన రాజకీయ తప్పిదం. దీనివల్ల మొగలులకు, మరాఠాలకు మధ్య ఉన్న ఆటంకం తొలగిపోయింది. మహారాష్ట్రులు ప్రత్యక్షంగా తమ బలాన్ని మొగలులపై కేంద్రీకరించడానికి మార్గం ఏర్పడింది. ఇతడి దక్కన్ విధానం మొగల్ సామ్రాజ్యానికి అపార నష్టాన్ని కలిగించింది. జాదునాధ్ సర్కార్ “దక్కన్ పుండు (ulcer) ఔరంగజేబును నాశనం చేసింది” అన్నాడు.

మత విధానం:ఔరంగజేబుకు సనాతన సున్నీ మతంలో విశ్వాసం కలదు. మహసీబ్ అనే అధికారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి, ప్రజలు నైతిక పత్రాలను పాటించేటట్లు కృషి చేశాడు. మద్యపానాన్ని నిషేధించాడు. భంగ్, మత్తు పదార్థాలను నిషేధించాడు. ఆస్థానంలో సంగీతాన్ని నిషేధించాడు. “తులాదానం” (చక్రవర్తిని వెండి, బంగారంతో తూకం వేయడం ఝరోకా దర్శనం” (చక్రవర్తి ప్రజాదర్శనం) వంటి ఆచారాలను నిలిపేశాడు. దీపావళి, దసరా, నౌరోజ్ పండుగలను జరుపరాదన్నాడు. జ్యోతిష్యులను ఆస్థానం నుంచి బహిష్కరించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం

ఔరంగజేబు మొదట కొత్త దేవాలయాల నిర్మాణాన్ని, పాత దేవాలయాల మరమ్మత్తును నిషేధించాడు. తరువాత సంవత్సరంలో హిందూ దేవాలయాలను కూల్చివేయాలని ఆదేశించాడు. మధుర, బెనారస్ లోని ‘దేవాలయాలు కూల్చివేయబడ్డాయి. ఔరంగజేబు 1679లో జిజియా పన్నును, తీర్థయాత్రికుల పన్నును తిరిగి విధించాడు. మహ్మదీయులలోని ఇతర శాఖల వారిపై కూడా మత వ్యతిరేకతను ప్రదర్శించాడు. మొహర్రం పండుగను నిషేధించాడు. షియా మతస్తులనే కారణంపై ఔరంగజేబు దక్కన్ రాజ్యాలపై దండయాత్ర చేశాడు. సిఖ్ తొమ్మిదవ మత గురువు గురు తేజ్బహదూర్ను చంపించాడు. దీనితో సిబ్లు సైన్యంగా ఏర్పడి మొగలాయిలతో నిరంతరం పోరాడారు.

ఔరంగజేబు మత విధానం వల్ల రాజపుత్రులు, మహారాష్ట్రులు, సిబ్లు మొగల్ సామ్రాజ్యానికి శతృవులుగా మారారు. మధుర జాట్లు, మేవార్ సత్నామీలు ఔరంగజేబు మత విధానం మూలంగా తిరుగుబాటు చేశారు. అందుకే మొసలి సామ్రాజ్య పతనానికి ఔరంగజేబు అనుసరించిన మత విధానం కూడా ఒక కారణంగా పేర్కొంటారు. ఔరంగజేబు వ్యక్తిత్వం, శీలం:ఔరంగజేబు వ్యక్తిగత జీవితం చాలా ఆదర్శప్రాయమైంది. ఇతడు క్రమశిక్షణ, కష్టపడి పని చేసే స్వభావం కలవాడు. ఆహార పానీయాలు, వస్త్రధారణ విషయంలో చాలా నిరాడంబరంగా జీవించాడు. విలాసాలకు దూరంగా ఉండేవాడు. తన వ్యక్తిగత ఖర్చుల కోసం ఖురాన్కు నకళ్ళురాసి, వాటిని అమ్మించేవాడు. మద్యపానం సేవించేవాడుకాదు. అరబ్బీ, పార్శీ భాషల్లో మంచి ప్రావీణ్యత కలదు. గ్రంథపఠనం చేసేవాడు. దైవభీతి కలిగిన మహ్మదీయుడిగా ఔరంగజేబు ప్రతిరోజు అయిదు సార్లు నమాజ్ చేసేవాడు. రంజాన్ ఉపవాసాలకు తు.చ. తప్పకుండా పాటించేవాడు.

ఔరంగజేబు రాజకీయ విషయాల్లో కొన్ని తీవ్రమైన తప్పిదాలు చేశాడు. మరాఠాల ఉద్యమ స్వభావాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల వారు ఔరంగజేబుకు విరోధులైనారు. మరాఠాల సమస్యలను పరిష్కరించలేకపోయాడు. దక్కన్ సుల్తానుల పట్ల అతడి విధానం కూడా పెద్ద నష్టాన్ని కలిగించాయి.

ఔరంగజేబు మత విధానం కూడా ఒక అనాలోచితమైన చర్య. తన సున్నీ మతసూత్రాలను మహ్మదీయేతరులపైన బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించాడు. మహ్మదీయులు సైతం అతన్ని సమర్థించలేదు. పైగా వారు మొగల్ సామ్రాజ్యానికి వ్యతిరేకులైనారు.

ప్రశ్న 4.
మొగల్ యుగం నాటి సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులపై వ్యాసం రాయండి.
జవాబు.
మొగల్ల కాలంనాటి సాంఘిక పరిస్థితులు:మొగల్ యుగం నాటి సమాజంలో హిందువులు, ఆఫ్ఘన్లు, ఇరానియన్లు, మంగోళులు, టర్క్లు, సిఖిు, క్రిస్టియన్లు మొదలైన వర్గాలవారు జీవించేవారు. పూర్వం కంటే మొగలుల నాటి సామాజిక వ్యవస్థ చాలా సరళంగా ఉంది. సమాజంలో మూడు ప్రధాన వర్గాలుండేవి. అవి రాజకుటుంబం, ప్రభువులు, మధ్యతరగతి వర్గం, సామాజిక వ్యవస్థలో చివరి వర్గం సామాన్యులు. జనాభాలో అధిక సంఖ్యాకులు వీరే. సామాన్యులు వ్యవసాయం, పరిశ్రమలు, ధనవంతుల ఇండ్లలో పని చేసేవారు. హిందువులు, మహ్మదీయులిద్దరికి జ్యోతిష్యం, శకునాలలో విశ్వాసం కలదు. బాల్యవివాహాలు, సతీసహగమనం, వరకట్నం, బహు భార్యత్వం మొదలైనవి ఆనాటి సామాజిక దురాచారాలు. నౌరోజ్, రంజాన్, షబ్బేబరాత్, దసరా, హోళి, దివాళి మొదలైనవి ఆనాటి ముఖ్యమైన పండుగలు. హిందూ-ముస్లిం పండుగలతోపాటు పాదుషా జన్మదినాన్ని కూడా జరుపుకొనేవారు. ప్రభువులు, రాజ కుటుంబీకుల సరదా కోసం ప్రత్యేక దుకాణ మేళాలను నిర్వహించేవారు. వీటిని నుమా-బజార్లు, ఖుషి బజార్లు అని
పిలిచేవారు.

మొగల్ల నాటి ఆర్థిక వ్యవస్థ:మొగలుల కాలంలో దేశం ఆర్థికంగా చాలా పరిపుష్టంగా ఉండేది. వ్యవసాయం, వాణిజ్యం, చేతివృత్తులు ఉన్నత స్థితిలో ఉండేవి. వ్యవసాయం, వాణిజ్యాభివృద్ధి కోసం మొగలులు అనేక చర్యలు తీసుకొన్నారు. ఆహారధాన్యాల పంటలను, వాణిజ్య పంటలను ప్రోత్సహించారు. బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశు చెరకు పంటకు, బెంగాల్, గుజరాత్, దక్కన్లు పత్తిసాగుకు పేరుగాంచాయి. ఇండిగో, పప్పుధాన్యాలు, నల్లమందు మొదలైన వాటిని కూడా కొన్ని ప్రాంతాల్లో పండించేవారు. జౌళి, ఇనుము – ఉక్కు, తివాచీలు, గాజు, సుగంధ పరిమళాలు, కలంకారీ మొదలైన పరిశ్రమలు బెంగాల్, గుజరాత్, కాశ్మీర్, ఢాకా, మచిలీపట్నంలో విలసిల్లాయి. అంతర్గత వ్యాపారాన్ని స్థానిక వ్యాపారులే నిర్వహించేవారు. భూమార్గ వ్యాపారానికి ఎద్దులు, గాడిదలు, ఒంటెలు, ఎద్దుల బండ్లను ఉపయోగించేవారు. మసాలా దినుసులు, ప్రత్తి, వస్త్రాలు, మిరియాలు, వజ్రాలు మొదలైనవి ఆనాటి ముఖ్యమైన ఎగుమతులు. విదేశీ వ్యాపారం గోవా, హుగ్లీ, కలకత్తా, మచిలీపట్నం ద్వారా జరిగేది. గాజు సామగ్రి, చక్కెర, అశ్వాలు, బానిసలను పర్షియా మధ్య ఆసియా నుంచి దిగుమతి చేసుకొనేవారు.

మొగలుల నాటి సాంస్కృతికాభివృద్ధి:మొగల్ యుగంలో భారతదేశం సాంస్కృతికంగా అద్భుతమైన ప్రగతిని సాధించింది. కళలు, వాస్తు నిర్మాణం, చిత్రలేఖనం, సంగీతం, సాహిత్యం మొదలైన అన్ని రంగాలలో ప్రస్ఫుటమైంది. మొగలులు భారతదేశంలో టర్కీ-పర్షియన్ సంప్రదాయాలను ప్రవేశపెట్టగా, ఇందులో భారతీయ సంప్రదాయం కూడా మేళమించబడింది.

ప్రశ్న 5.
మొగలుల సాంస్కృతిక సేవను వివరించండి.
జవాబు.
మొగలుల నాటి సాంస్కృతికాభివృద్ధి:మొగల్ యుగంలో భారతదేశం సాంస్కృతికంగా అద్భుతమైన ప్రగతిని సాధించింది. కళలు, వాస్తు నిర్మాణం, చిత్రలేఖనం, సంగీతం, సాహిత్యం మొదలైన అన్ని రంగాలలో ప్రస్ఫుటమైంది. మొగలుల భారతదేశంలో టర్కీ-పర్షియన్ సంప్రదాయాలను ప్రవేశపెట్టగా, ఇందులో భారతీయ సంప్రదాయం కూడా మేళమించబడింది.

వాస్తుకళ:మొగలుల వాస్తు నిర్మాణాలలో విశాలమైన కోటలు, రాజభవనాలు, ప్రజలందరు ఉపయోగించుకొనే కట్టడాలు, మసీదులు, సమాధులు మొదలైనవెన్నో కలవు. ఎప్పుడూ నీరు అందుబాటులో ఉండే విధంగా ఉద్యానవనాలను ఏర్పాటు చేశారు. కాశ్మీర్ లోని నిషాత్బాగ్, లాహోర్ లోని షాలిమార్, పంజాబ్లో ని పింజోర్ ఉద్యానవనం మొదలైన మొగలుల ఉద్యానవనాలు నేటికి కూడా సజీవంగా ఉన్నాయి. షేర్షా బీహార్లోని ససారాం వద్ద తన కోసం నిర్మించుకొన్న సమాధి, ఢిల్లీలోని పురానా ఖిలాలోని మసీదు మధ్యయుగ వాస్తు కళారంగంలో అద్భుతాలుగా పరిగణించ బడ్డాయి.

అక్బర్ కాలం నుంచి పెద్ద ఎత్తున భవనాల నిర్మాణం ప్రారంభమైంది. అక్బర్ చాలా కోటలను నిర్మించాడు. అందులో ముఖ్యమైంది ఆగ్రా కోట. ఇది ఎర్రటి ఇసుక రాయితో నిర్మించబడింది. అక్బర్ లాహోర్, అలహాబాద్లో ఇతర కోటలను నిర్మించాడు. .ఢిల్లీలో షాజహాన్ నిర్మించిన ఎర్రకోట కోటల నిర్మాణ రీతిలో అత్యంత విశిష్టమైంది. ఇందులోని రంగమహల్, దివాన్-ఇ-ఆమ్, దివాన్-ఇ-ఖాస్లు కూడా ఇతని నిర్మాణాలే.

అక్బర్ కూడా ఫతేపూర్ సిక్రీ వద్ద రాజభవనం – కోటల సముదాయం నిర్మించాడు. ఇది ఆగ్రాకు 36 కి.మీ. దూరంలో కలదు. గుజరాత్, బెంగాలీ నిర్మాణ శైలి అందులో ప్రతిబింబిస్తుంది. గుజరాత్ నిర్మాణ శైలిని రాజపుత్ర రాణుల కోసం నిర్మించిన భవనాలలో వినియోగించాడు. కాని అన్నింటికంటే ముఖ్యమైన నిర్మాణం మాత్రం అక్కడి జమా మసీదు, ఫతేపూర్ సిక్రీకి ద్వారమైన బులంద్ దర్వాజా. దీని ఎత్తు 176 అడుగులు. అక్బర్ గుజరాత్ విజయానికి చిహ్నంగా దీనిని నిర్మించాడు. ఫతేపూర్ సిక్రీలోని ఇతర ముఖ్యమైన భవనాలలో జోధాభాయి రాజభవనం, అయిదు అంతస్థులతో ఉన్న పంచమహల్ కలవు.

అక్బర్ కాలంలో ఢిల్లీలో హుమాయూన్ సమాధి నిర్మించబడింది. దీని భారీ గుమ్మటం పాలరాతితో నిర్మించబడింది. అందుకే దీనిని తాజ్మహల్కు పూర్వపు రూపంగా భావిస్తారు. ఆగ్రా సమీపంలో సికింద్రా వద్ద అక్బర్ సమాధిని జహంగీర్ పూర్తి చేశాడు. భవన నిర్మాణ కళలో తాజ్మహల్ ఒక అద్భుతంగా నిలిచిపోయింది. మొగలులు అభివృద్ధి పరచిన అన్ని వాస్తు కళాశైలుల సమ్మేళనమే తాజ్మహల్. తాజ్మహల్ అందానికి కారణం దాని విశాలమైన పాలరాతి గోపురం, నాలుగు సన్నటి మినార్లు. అందమైన తోట మధ్యలో నిర్మితం కావడంతో ఆ కట్టడానికి ఎనలేని అందం తెచ్చిపెట్టింది.

షాజహాన్ పాలనలో మసీదుల నిర్మాణం కూడా ఉన్నత దశకు చేరుకొంది. ఆగ్రా కోటలో పాలరాతితో మోతి మసీదు నిర్మించబడింది. ఢిల్లీలో జామా మసీదు ఎర్రటి ఇసుక రాయితో నిర్మించబడింది.

చిత్రలేఖనం, సంగీతం: చిత్రకళారంగానికి మొగలులు చెప్పుకోదగిన కృషి చేశారు. మొగలుల చిత్రకళకు పునాదులు వేసినవాడు హుమాయూన్. అక్బర్ అనేక సాహిత్య, మత గ్రంథాలకు చిత్రీకరణలు వేయించాడు. అక్బర్ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన చిత్రకారులను ఆహ్వానించాడు.

జహాంగీర్ కాలంలో మొగల్ చిత్రలేఖనం ఉన్నత శిఖరాలకు చేరుకొంది. అబ్దుల్సమద్, బిషన్దాస్, మధు, అనంత్, మనోహర్, గోవర్థన్, ఉస్తాద్ మన్సూర్ లాంటి ఎంతోమంది చిత్రకారులను జహంగీర్ నియమించుకొన్నాడు. వేట, యుద్ధం, ఆస్థాన దృశ్యాలు, చిత్రలేఖనంతో పాటు వ్యక్తిగత చిత్రాల లేఖణన ప్రక్రియ (Portrait painting) జంతువుల చిత్రలేఖనం అభివృద్ధి చెందాయి. చిత్రాలు, దస్తూరి (Calligraphy) లతో కూడిన అనేక ఆల్బమ్లు మొగలుల కాలంలో రూపొందించబడ్డాయి. తరువాత కాలంనాటి చిత్రకళపై యూరప్ చిత్రలేఖనం ప్రభావం కన్పిస్తుంది. మొగలుల కాలంలో సంగీతం కూడా అభివృద్ధి చెందింది. అక్బర్ ఆస్థానంలో గ్వాలియర్కు చెందిన తాన్సేన్ అనే గొప్ప గాయకుడుండేవాడు. తాన్సేన్ గోరా, సనమ్ మొదలైన రాగాలకు స్వరాలెన్నింటినో కూర్పు చేశాడు. జహంగీర్, షాజహాన్లకు కూడా సంగీతంలో ప్రవేశం ఉండేది.

TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అక్బర్ రాజపుత్ర విధానాన్ని వివరించండి.
జవాబు.
రాజపుత్రులతో సంబంధాలు:అక్బర్ అనుసరించిన రాజపుత్ర విధానం ప్రసిద్ధమైంది. ఇతడు అంబర్రాజు రాజా భారామల్ కుమార్తెను వివాహమాడాడు. అక్బర్ అనేక రాజపుత్ర రాజ్యాలతో వివాహ సంబంధాలను ఏర్పాటు చేసుకొన్నాడు. ఇది మొగల్ చరిత్రలోనే ఒక ముఖ్యమైన మలుపు అని చెప్పవచ్చు. రాజపుత్రులు మొగలాయిలకు సేనాధిపతులుగా, మంత్రులుగా సేవలందించారు. రాజా భగవాన్ దాస్, రాజామాన్ సింగ్, రాజాతోడరమల్లను అక్బర్ సేనాధిపతులుగా నియమించుకొన్నాడు. జైసల్మీర్, బికనేర్, రణతంభోర్ మొదలైన రాజపుత్ర రాజ్యాలు అక్బర్కు లొంగిపోయాయి. కాని మేవార్ను పాలిస్తున్న రాణా ఉదయ సింహుడు, అతని కుమారుడు రాణా ప్రతాప సింహుడు అక్బర్ను ఎదిరించారు. 1576లో జరిగిన హాల్దీఘాట్ యుద్ధంలో రాణాప్రతాపసింహుడిని అక్బర్ సైన్యాధిపతి రాజామాన్ సింగ్ ఓడించాడు. మేవార్ ఓటమి తరువాత అనేక రాజపుత్ర రాజ్యాలు అక్బర్ సార్వభౌమత్వాన్ని అంగీకరించాయి.

అక్బర్ రాజపుత్ర విధానం అతడి విశాలమైన పరమత సహనంతో ముడిపడి ఉంది. అతడు తీర్థయాత్రల పన్నును, జిజియా పన్నును రద్దుచేశాడు. అక్బర్ రాజపుత్ర విధానం మొగలాయిలకు, రాజపుత్రులకు పరస్పరం మేలు చేసింది. రాజపుత్రులు తమ శక్తి సామార్థ్యాలను దేశానికి వినియోగపరచే అవకాశం లభించింది. దీని మూలంగా రాజస్థాన్లో శాంతి చేకూరింది. రాజపుత్రులు మొగలుల సేవలో చేరి ఉన్నతోద్యోగాలు పొందారు.

ప్రశ్న 2.
నూర్జహాన్పై లఘు సమాధానం రాయండి.
జవాబు.
జహాంగీర్ 1611లో నూర్జహాన్ (ప్రపంచ వెలుగు) ను వివాహమాడాడు. ఈమె అసలు పేరు మెహర్ ఉన్నీసా. ఈమె తండ్రి ఇతిమాదుద్దేలా (ఫియాస్ బేగ్)ను ముఖ్య దివాన్ గా నియమించుకొన్నాడు. జహాంగీర్ నూర్జహాన్ వివాహం తరువాత ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ప్రయోజనం పొందారు. నూర్జహాన్ జ్యేష్ఠ సోదరుడు ఆసఫ్గన్ ఖాన్-ఎ-సమన్ (అంతఃపుర వ్యవహారాలు) గా నియమింపబడ్డాడు. ఆసఖాన్ కూతురు అర్జమందా బానూ బేగం (ముంతాజ్)ను జహాంగీర్ మూడవ కుమారుడు కుర్రం (షాజహాన్) వివాహమాడాడు. నూర్జహాన్ వీరందరితో ఒక వర్గాన్ని ఏర్పాటు చేసిందని కొందరు ఆధునిక చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. నూర్జహాన్ వ్యతిరేకులు మరొక వర్గాన్ని ఏర్పాటు చేశారు. మొగలుల ఆస్థానంలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. జహాంగీర్ పూర్తిగా నూర్జహాన్ ప్రభావానికి లోనయ్యాడని భావించిన షాజహాన్ 1622లో తన తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. కాని ఈ వాదనను ఇతర చరిత్రకారులు అంగీకరించలేదు. ఎందుకంటే తన ఆరోగ్యం క్షీణించేవరకు అన్ని ముఖ్యమైన రాజకీయ నిర్ణయాలను తానే స్వయంగా తీసుకొన్నట్లు తన “స్వీయ చరిత్ర” లో జహంగీర్ పేర్కొన్నాడు.

నూర్జహాన్ షహ్రియార్ (జహాంగీర్ చిన్న కుమారుడు)ను చక్రవర్తిగా ప్రకటిస్తుందని భావించాడు. 1627లో జహాంగీర్ మరణించిన తరువాత షాజహాన్ సర్దారులు, సైన్యం మద్దతుతో తన వ్యతిరేకులందరినీ ఓడించి ఆగ్రా చేరుకొన్నాడు. నూర్జహాన్ అధికారాలు కోల్పోయి రాజకీయాల నుంచి నిష్క్రమించింది. షాజహాన్ నూర్జహాన్కు పింఛను ఏర్పాటు చేశాడు. జహాంగీర్ మరణించిన 18 సంవత్సరాల తరువాత నూర్జహాన్ లాహోర్లో మరణించింది.

ప్రశ్న 3.
మొగల్ సామ్రాజ్య పతనానికి గల కారణాలను రాయండి.
జవాబు.
బాబర్ 1526లో మొగల్ అధికారాన్ని స్థాపించగా, అక్బర్ కాలం నాటికి అత్యున్నత స్థాయికి చేరుకొంది. ఔరంగజేబు విశాలమైన సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. కాని జౌరంగజేబు మరణం తరువాత మొగల్ సామ్రాజ్యం త్వరితగతిన పతనమైంది. మొగల్ సామ్రాజ్య పతనానికి అనేక కారణాలున్నాయి.

(i) బలహీనమైన వారసులు:ఔరంగజేబు తరువాత వచ్చిన వారసులెవ్వరూ రాజ్యానికి సుస్థిరత కల్పించలేకపోయారు. వారిలో చాలామంది అసమర్థులు. మరికొందరు మంత్రుల చేతుల్లో కీలుబొమ్మలైనారు. 1707 నుంచి 1719 వరకు జరిగిన వారసత్వ యుద్ధాలు ఢిల్లీ నగరాన్ని రక్తసిక్తం చేశాయి. దీనివల్ల మొగల్ సామ్రాజ్యం బలహీనపడింది.

TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం

(ii) ప్రభువుల పాత్ర:ప్రభువుల మధ్య పర్షియన్, తురానీ, హిందుస్తానీ అనే విభేదాలుండేవి. ప్రభువుల మధ్య అంతఃకలహాలు మొగల్ సామ్రాజ్య పతనానికి దారితీశాయి. ప్రభువులు విశేషాధికారాలు పొందారు. వీరిలో చాలా మంది స్వార్థపరులై రాజకీయ కుట్రలు చేసి స్వాతంత్య్రం ప్రకటించుకొన్నారు.

(iii) విదేశీ దండయాత్రలు:మధ్య ఆసియా దండయాత్రలు మొగల్ సామ్రాజ్యానికి పెద్ద బెడదగా మారాయి. 1738-39 లో సాదిర్షా దండయాత్ర చేసి ఢిల్లీ నగరాన్ని దోచుకొన్నాడు. అహ్మద్ అబ్దాలీ (1748-1767) భారతదేశంపై ఏడుసార్లు దండయాత్ర చేసి మొగల్ సంపదను దోచుకొన్నాడు.

(iv) ఔరంగజేబు మత విధానం మొగల్ సామ్రాజ్య పతనానికి ప్రధాన కారణం – సిఖిు, మహారాష్ట్రులు విజృంభణ మొగల్ అధికారాన్ని ఆటంకపరచాయి.

(v) షాజహాన్ భవన నిర్మాణాల కోసం చాలా ఖర్చు చేశాడు. ఇది ఆర్థిక దివాలాకు దారితీసింది.

(vi) అధిక పన్నుల భారం, తప్పుడు ఆర్థిక విధానాలు, వ్యవసాయం, పరిశ్రమల్లో వెనకబాటుతనం, సైనిక బలహీనత, ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం మొదలైనవి మొగల్ సామ్రాజ్య పతనానికి దారి తీసింది.

ప్రశ్న 4.
మొగల్ వాస్తు, కళలపై సమాధానం రాయండి.
జవాబు.
మొగల్ పాలకులు యుద్ధ విజేతలే కాక కళా, సాంస్కృతిక రంగాల పోషకులుగా కూడా ప్రసిద్ధి చెందారు. ఔరంగజేబు మినహా మిగతావారందరూ పండితులు, చిత్రకారులు, శిల్పులను పోషించారు. అంతేకాక కొందరు రాజులు, కవులు, చిత్రకారులు. బాబర్, హుమాయూన్, జహంగీర్లు స్వయంగా రచయితలే కాక పండిత పోషకులు. అక్బర్ నిరక్షరాస్యుడైనప్పటికీ కళల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాడు.

బాబర్ కేవలం సమాధులు, చెరువులను నిర్మించాడు. అక్బర్ నిర్మాణాలలో పర్షియన్, హిందూ పద్ధతులు కనిపిస్తాయి. జామియా మసీద్, బీర్బల్ భవనం, ఆగ్రా కోట, జహంగీర్ భవనం, దివాన్-ఇ-ఆమ్, దివాన్-ఇ-ఖాస్, బులంద్ దర్వాజా మొదలైనవి అక్బర్ కాలంనాటి నిర్మాణాలు. జహంగీర్ శిల్పకళ కంటే చిత్రకళపై ప్రత్యేక ఆసక్తిని కనబరచాడు. అబ్దుల్ సమద్, దశావంత్, బసవన్, హసన్ మొగలుల కాలంనాటి ప్రఖ్యాత చిత్రకారులు. షాజహాన్ కాలంలో శిల్పకళ ఉన్నతస్థాయికి చేరి స్వర్ణయుగంగా పేరొందింది. షాజహానాబాద్, దివాన్-ఇ-ఆమ్, దివాన్-ఇ-ఖాస్, ఎర్రకోట, తాజ్మహల్, ముసల్మాన్ బురుజు, మోతీమసీదు షాజహాన్ కాలంనాటి నిర్మాణాలు. వీటివలన షాజహాన్ ‘ఇంజనీర్ రాజు’గా పిలవబడ్డాడు. ఔరంగజేబు శిల్పకళ, చిత్రకళను నిషేధించాడు.

ప్రశ్న 5.
మొగలుల కాలంలో సాహిత్యాభివృద్ధిని చర్చించండి.
జవాబు.
జహాంగీర్ ఆత్మకథ ‘తుజుక్-ఇ-జహాంగీరి’ రచనా శైలిలో ప్రముఖమైంది. ఘియాస్ బేగ్, నఖీబ్ ఖాన్, నయామతుల్లా లాంటి అనేక మంది పండితులను జహాంగీర్ ఆదరించాడు. అబ్దుల్ హామీద్ లాహోరి, ఇనాయత్ ఖాన్ వంటి రచయితలు, చరిత్రకారులను షాజహాన్ ఆదరించాడు. అబ్దుల్హామీద్ లాహోరి ‘పాదుషానామా’ను ఇనాయత్ ఖాన్ “షాజహాన్ నామా” ను రచించారు. షాజహాన్ కుమారుడు దారాషికో భగవద్గీత, ఉపనిషత్తులను పర్షియా భాషలోకి అనువదించాడు. ఔరంగజేబు కాలంలో కూడా చాలా చారిత్రక గ్రంథాలు రాయబడ్డాయి. పార్శీ భాషలోనున్న ప్రముఖ పదకోశాలన్నీ మొగలుల కాలంలో సంకలనం చేయబడ్డాయి.

మొగల్ యుగంలో బెంగాల్, ఒడియా, హిందీ, రాజస్థాని, గుజరాతి మొదలైన ప్రాంతీయ భాషలు అభివృద్ధి చెందాయి. భర్తి పూర్వక గ్రంథాలు ముఖ్యంగా రామాయణ, మహాభారతం లాంటి గ్రంథాలు ప్రాంతీయ భాషల్లోకి అనువదించబడ్డాయి. అక్బర్ కాలం నుంచి హిందీ కవులు, పండితులు ఆదరణ పొందారు. వీరిలో తులసీదాసు చాలా గొప్పవాడు. ఇతడు రామాయణాన్ని హిందీ భాషలో ‘రామచరితమానస్’ పేరుతో రాశాడు.

ప్రశ్న 6.
మీకు ఇచ్చిన పటంలో అక్బర్, షేర్షా సామ్రాజ్యాలను సూచించి కింది ప్రదేశాలను గుర్తించండి.
జవాబు.
ఎ) ఢిల్లీ
బి) ఆగ్రా
సి) మేవార్
డి) గుజరాత్
ఇ) బెంగాల

ఎ) పానిపట్
బి) కనూజ్
సి) చిత్తోర్
డి) ఉజ్జయిని
ఇ) అమర్కోట

ఎ) చూనార్
బి) ససారాం
సి) గౌర్
డి) చందేరి
ఇ) ఆగ్రా
జవాబు.
TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం 1
TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం 2

TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బాబర్ నామా ప్రాధాన్యత.
జవాబు.
మధ్యయుగ భారతదేశ చరిత్రలో గణనీయమైన వ్యక్తులలో బాబర్ ఒకడు. భారతదేశంలో మొగల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఘనుడు బాబరు. క్రీ.శ. 1526లో మొదటి పానిపట్టు యుద్ధంలో ఢిల్లీ సుల్తాన్ అగు ఇబ్రహీం లోడిని వధించి ఢిల్లీ, ఆగ్రాలు ఆక్రమించి మొగల్ సామ్రాజ్యస్థాపన చేసాడు.

బాబర్ టర్కీ భాషలో గొప్ప పండితుడు. టర్కీ భాషలో బాబర్ రాసుకున్న స్వీయచరిత్ర తుజ్-కె-ఇ-బాబరీ (తన ఆత్మకథ). మొగల్ యుగమున రాయబడిన తొలి చారిత్రక గ్రంథము. ఈ గ్రంథం బాబర్ తురుష్క భాషా ప్రావీణ్యాన్ని, నాటి సమకాలీన పరిస్థితులను, హుమాయూన్ తొలి జీవితాన్ని తెలుసుకోవడానికి దోహదపడుతుంది. మధ్యయుగ ఆత్మకథల్లో దీనికి గణనీయమైన ప్రాధాన్యం ఉంది.

ప్రశ్న 2.
మొగల్ చరిత్రలో నూర్జహాన్ స్థానం.
జవాబు.
మొగల్ చక్రవర్తి జహంగీర్ నూర్జహాన్ను వివాహం చేసుకోవడమనేది జహంగీర్ కాలంలో మరొక ప్రధాన ఘట్టం. నూర్జహాన్ అసలు పేరు మెహ్రున్నీసా. ఈమెను సలీం (జహంగీర్) ప్రేమించాడని, వీరి ప్రేమని ఇష్టపడని అక్బర్ ఈమెను షేర్ ఆఫ్ఘనికిచ్చి వివాహం చేసాడని, సలీం రాజైనాక షేర్ ఆఫ్గన్ను వధించి ఆమెను వివాహం చేసుకున్నాడని కొందరు చరిత్రకారుల కథనం. క్రీ.శ.1611లో వివాహానంతరం ప్రధాన పాత్రధారి అయి అధికారాన్నంతా హస్తగతం చేసుకుని సింహాసనం వెనకుండి పాలన చేసింది. నాణాలపై తన పేరు ముద్రింపజేసుకుంది. తన తల్లిదండ్రులను, బంధువులను దర్బారు ఉన్నత పదవుల్లో నియమించింది. ఇది ఖుర్రం తిరుగుబాటుకు, వారసత్వ యుద్ధానికి కారణమైంది.

ప్రశ్న 3.
తాజ్మహల్ కీర్తిని చర్చించండి.
జవాబు.
షాజహాన్ గొప్ప భవన నిర్మాత. షాజహాన్ ఎర్రకోట జామామసీద్, దివాన్-ఇ-ఆమ్, దివాన్ ఖాస్ కట్టించాడు.
షాజహాన్ నిర్మాణాలన్నింటిలోను తలమానికమైనది తాజ్మహల్. ఆగ్రాలో యమునానది ఒడ్డున తన పట్టమనిషి ముంతాజ్భగం సంస్మరణార్థం నిర్మించాడు. దీనిని ప్రపంచ అద్భుత కట్టడాలలో ఒకటిగా భావిస్తారు. దీని నిర్మాణానికి 22 సంవత్సరాలు పట్టింది. ఆ రోజుల్లోనే నాలుగున్నర మిలియన్ల పౌన్లు ఖర్చయింది. ఉస్తాద్ ఈసా దీని శిల్పి. అయితే తాజ్మహల్ను షాజహాన్ కట్టించలేదని, బాబర్ కాలం నాటికే అక్కడ ఉందని ఇది రాజపుత్రుల నిర్మాణమని ఇటీవల కొందరు చారిత్రక పరిశోధకులు ప్రకటించారు. తాజ్మహల్ శివాలయమని ప్రొ.పి.యన్.వోక్ కథనం. కాలగమనంలో నిజం నిగ్గుతేలుతుందని ఆశిద్దాం. ఏది ఏమైనా తాజ్మహల్ కట్టడం ఓ అద్భుతం.

ప్రశ్న 4.
రెండవ పానిపట్ యుద్ధం ప్రాధాన్యత.
జవాబు.
అక్బర్ (క్రీ.శ. 1556–1605):భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో అక్బర్ ఒకరు. ఇతని తండ్రి హుమాయూన్ మరణించిన తరువాత రాజ్యానికి వచ్చాడు. ఆఫ్ఘనుల సేనాధిపతి హేము ఢిల్లీని ఆక్రమించి ‘విక్రమాదిత్య’ అనే బిరుదు ధరించాడు. 1556లో జరిగిన రెండవ పానిపట్ యుద్ధంలో మొదట హేముకే విజయావకాశాలు దగ్గరయ్యాయి. కాని కంటికి బలమైన గాయం తగలడం వల్ల అతడు స్పృహ కోల్పోయాడు. నాయకత్వం కోల్పోయిన ఆఫ్ఘన్ సైన్యం చెల్లాచెదురైంది. మొగలాయిలు అఫ్ఘనులపై శాశ్వతంగా విజయం సాధించారు. భారతదేశంలో మొగల్ సామ్రాజ్యం సుస్థిరమైంది.

TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం

ప్రశ్న 5.
ఇబాదత్ ఖానా గురించి రాయండి.
జవాబు.
తన కొత్త రాజధాని ఫతేపూర్ సిక్రిలో 1575లో ఇబాదత్ ఖానా (పూజామందిరం) అనే భవనాన్ని నిర్మించాడు. హిందూ, జైన, బౌద్ధ, పారశీక, క్రైస్తవ, ఇస్లాం మొదలైన అన్ని మతాల పండితులను ఆహ్వానించి మత చర్చలు జరిపాడు.

ప్రశ్న 6.
దీన్-ఇ-ఇలాహి ముఖ్య లక్షణాలు.
జవాబు.
అక్బర్ విభిన్న మతగురువులతో ఆయా మత సిద్ధాంతాల గురించి తరచూ చర్చలు జరిపేవాడు. వాటి ఫలితంగా అతనికి కలిగిన అవగాహనతో క్రీ.శ. 1581లో దీన్-ఇ-ఇలాహి అనే నూతన మతాన్ని స్థాపించాడు. ఈ మతం వారు చక్రవర్తి కోసం ధన, మాన, ప్రాణాలను అర్పించాలి, మాంసాహారాన్ని మానివేయాలి, ఒకరికొకరు ఎదురైనపుడు అల్లాహా అక్బర్ అని సంభోదించుకోవాలి. అయితే ఈ మతాన్ని స్వీకరించమని అక్బర్ ఎవరినీ బలవంతపెట్టలేదు. బీర్బల్, అబుల్ఫజర్ వంటి కొందరే చేరారు. అబుల్ఫజల్ దీన్-ఇ-ఇలాహిన గురించి పేర్కొంటూ ఇది అందరి దీవెనలను అందుకోవడానికి ఉద్దేశింపబడిన నూతన విశ్వాసమార్గమన్నాడు. ఇది అక్బర్తోనే అంతరించిపోయింది.

ప్రశ్న 7.
ఫతేపూర్ సిక్రీ.
జవాబు.
అక్బర్ కూడా ఫతేపూర్ సిక్రీ వద్ద రాజభవనం కోటల సముదాయం నిర్మించాడు. ఇది ఆగ్రాకు 36 కి.మీ. దూరంలో కలదు. గుజరాత్, బెంగాలీ నిర్మాణ శైలి అందులో ప్రతిబింబిస్తుంది. గుజరాత్ నిర్మాణ శైలిని రాజపుత్ర రాణుల కోసం నిర్మించిన భవనాలలో వినియోగించాడు. కాని అన్నింటికంటే ముఖ్యమైన నిర్మాణం మాత్రం అక్కడి జమా మసీదు, ఫతేపూర్ సిక్రీకి ద్వారమైన బులంద్ దర్వాజా. దీని ఎత్తు 176 అడుగులు. అక్బర్ గుజరాత్ విజయానికి చిహ్నంగా దీనిని నిర్మించాడు. ఫతేపూర్ సిక్రీలోని ఇతర ముఖ్యమైన భవనాలలో జోధాభాయి రాజభవనం, అయిదు అంతస్థులతో ఉన్న పంచమహల్ కలవు.

ప్రశ్న 8.
షాజహాన్ కాలంనాటి నిర్మాణాల గురించి రాయండి.
జవాబు.
షాజహాన్ తాజ్మహల్ నిర్మాణంలో ‘పీత్రదురా’ పద్ధతిని భారీ ఎత్తున ఉపయోగించాడు. భవన నిర్మాణ కళలో తాజ్మహల్ ఒక అద్భుతంగా నిలిచిపోయింది. మొగలులు అభివృద్ధిపరచిన అన్ని వాస్తు కళాశైలుల సమ్మేళనమే తాజ్మహల్. తాజ్మహల్ అందానికి కారణం దాని విశాలమైన పాలరాతి గోపురం, నాలుగు సన్నటి మినార్లు. అందమైన తోట మధ్యలో నిర్మితం కావడంతో ఆ కట్టడానికి ఎనలేని అందం తెచ్చిపెట్టింది.

TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం

షాజహాన్ పాలనలో మసీదుల నిర్మాణం కూడా ఉన్నత దశకు చేరుకొంది. ఆగ్రా కోటలో పాలరాతితో మోతి మసీదు నిర్మించబడింది. ఢిల్లీలో జామా మసీదు ఎర్రటి ఇసుక రాయితో నిర్మించబడింది.

మొగల్ వాస్తుకళ 18, 19వ శతాబ్దం తొలి దశకాల వరకు నిరాఘాటంగా కొనసాగింది. మొగల్ నిర్మాణ శైలి ప్రాంతీయ, స్థానిక రాజ్యాల కట్టడాలపై సైతం ప్రభావం చూపింది. అమృత్సర్లోని సిఖి స్వర్ణదేవాలయం కూడా మొగల్ వాస్తు సంప్రదాయ శైలిలో నిర్మితమైంది.

TS Inter 1st Year History Study Material Chapter 15 జాతీయ ఉద్యమం – మలిదశ

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 15th Lesson జాతీయ ఉద్యమం – మలిదశ Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 15th Lesson జాతీయ ఉద్యమం – మలిదశ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
1920 – 22లో జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని వివరించండి.
జవాబు.
గాంధీ నాయకత్వంలో జాతీయ కాంగ్రెస్ నిర్వహించిన ఉద్యమాల్లో మొదటిది సహాయ నిరాకరణోద్యమం. ఖిలాఫత్ ఉద్యమ సందర్భంగా వ్యక్తమైన హిందూ, ముస్లిం సంఘీభావం గాంధీని సహాయ నిరాకరణోద్యమానికి పురికొల్పింది. 1920 సెప్టెంబరులో కలకత్తాలో లాలాలజపతిరాయ్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమ తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. తీర్మానం ఆమోదించడమైంది. 1920 డిసెంబర్లో విజయరాఘవాచారి అధ్యక్షతన నాగపూర్లో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశంలో దాన్ని ధృవీకరించడమైంది. రెండు సమావేశాల్లోనూ బెంగాల్ నాయకుడు చిత్తరంజన్దాస్ నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. దాస్ సూచనలను కూడా తీర్మానంలో చేర్చడం ద్వారా గాంధీ ఆయనను సమ్మతింపచేశాడు.

TS Inter 1st Year History Study Material Chapter 15 జాతీయ ఉద్యమం – మలిదశ

ఉద్యమ కార్యక్రమం: ఈ ఉద్యమానికి మూడు అంశాల కార్యక్రమం కలదు. అవి: బహిష్కరణ, నిర్మాణాత్మక కార్యక్రమాలు, శాసనోల్లంఘనం.

బహిష్కరణ:

  1. ప్రభుత్వం ఇచ్చిన బిరుదులు, పదవులను త్యజించడం.
  2. ప్రభుత్వం ఏర్పాటు చేసే సన్మానాలు, తదితర కార్యక్రమాలను బహిష్కరించడం.
  3. విద్యార్థులు ప్రభుత్వ విద్యాలయాలను బహిష్కరించడం.
  4. ప్రభుత్వోద్యోగాలకు రాజీనామా చేయడం.
  5. ప్రభుత్వ న్యాయస్థానాలను బహిష్కరించడం.
  6. విదేశీ వస్త్రాలను, వస్తువులను బహిష్కరించడం.
  7. శాసనసభలకు జరిగే ఎన్నికలను బహిష్కరించడం.
  8. 1921లో ఇంగ్లాండ్ దేశపు యువరాజు పర్యటన బహిష్కరించడం మొదలైనవి బహిష్కరణోద్యమంలో ముఖ్యమైనవి.

నిర్మాణాత్మక కార్యక్రమాలు:

  1. తిలక్ స్మారక నిధికి విరాళాలు వసూలు చేయడం.
  2. రాట్నాలపై నూలు వడికి, ఖద్దరు వస్త్రాలు తయారుచేయడం.
  3. అస్పృశ్యతను నిర్మూలించడం.
  4. మద్యపాన నిషేధానికి అనుకూలంగా ఉద్యమం నడపడం.
  5. జాతీయ విద్యాలయాలు నెలకొల్పడం.
  6. హిందూ, ముస్లిం సమైక్యతను సాధించడం అనేవి నిర్మాణాత్మక కార్యక్రమాలు.

శాసనోల్లంఘనం: పన్నులు చెల్లించటం, నిరాకరించటం ద్వారా కాంగ్రెస్ శాసనోల్లంఘనాన్ని చేపట్టాలని నిర్ణయించింది.

ఉద్యమ గమనం: 1920లో ప్రారంభించిన ఈ ఉద్యమంలో ప్రజలు తమ విభేదాలను మరిచి చురుకుగా పాల్గొన్నారు. బ్రిటిష్ విద్యాసంస్థలను బహిష్కరించి జాతీయ విద్యాసంస్థలను నెలకొల్పారు. నెహ్రూ, చిత్తరంజన్ దాస్, ప్రకాశం పంతులు మొదలైన నాయకులు న్యాయస్థానాలను బహిష్కరించి న్యాయవాద వృత్తిని త్యజించారు. సుభాష్ చంద్రబోస్ మొదలైనవారు తమ ప్రభుత్వ పదవులకు రాజీనామా చేశారు. ప్రజలు విదేశీ వస్తువులను బహిష్కరించి ఖద్దరు వాడకాన్ని ప్రోత్సహించారు. హిందువుల ఐక్యతను పెంపొందించటానికి అస్పృశ్యతా నివారణను చేపట్టారు.

ఈ ఉద్యమం ఆంధ్రాలో అద్భుత విజయాన్ని సాధించింది. చీరాల-పేరాల సత్యాగ్రహం, పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం, పల్నాడు పుల్లరి సత్యాగ్రహాలు జరిగాయి. పంజాబ్లో అకాలీలు మహంతులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వహించారు. భారతదేశ సందర్శనానికి వచ్చిన వేల్స్ యువరాజు బహిష్కరించబడ్డాడు. ఈ ఉద్యమాన్ని అణచడానికి ప్రభుత్వం దమనకాండను సాగించింది. అయినప్పటికి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇంతలోనే ఉత్తరప్రదేశ్లోని చౌరీచౌరా అనేచోట హింస చెలరేగి అది అనేకమంది పోలీసులు సజీవదహనానికి దారితీసింది. హింసను సహించలేని గాంధీజీ ప్రజలు ఇంకా అహింసా పద్ధతులకు అలవాటుపడలేదని భావించి ఉద్యమాన్ని నిలుపు చేశాడు.

ఫలితాలు: సహాయ నిరాకరణోద్యమం అనేక గొప్ప ఫలితాలనిచ్చింది.

  1. భారత ప్రజలలోను, కాంగ్రెస్ నాయకులలోను నిరాశ ఏర్పడింది. దీని ఫలితంగా కాంగ్రెస్లోలో చీలిక వచ్చింది.
  2. ఉద్యమ కాలంలో హిందూ – మహమ్మదీయుల ఐక్యత సాధించబడింది.
  3. ఈ ఉద్యమ ప్రభావం వల్ల జాతీయభావం దేశం నలుమూలలా విస్తరించింది.
  4. ప్రజలలో ప్రభుత్వమంటే భయంపోయి వారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది.
  5. కాంగ్రెస్లో వామపక్ష ధోరణులు ప్రారంభమైనాయి.
  6. ప్రభుత్వం దమననీతిని ఎదుర్కొనేందుకు భారతీయ యువత విప్లవోద్యమానికి దిగింది.
  7. ఈ ఉద్యమ విరమణ అనంతరం కాంగ్రెస్-లీగ్ మిత్రత్వం రద్దయింది. ఫలితంగా హిందువులు, ముస్లింల మధ్య మత కల్లోలాలు చెలరేగాయి.

ప్రశ్న 2.
1935 భారత ప్రభుత్వ చట్టంలోని లక్షణాలను వివరించండి.
జవాబు.
ఈ చట్టంలోని ముఖ్య అంశాలు:

  1. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించడం.
  2. కేంద్రంలో భారతీయులకు పరిమిత అధికారాలను కల్పించడం.
  3. సమాఖ్య ఏర్పాటు.
  4. ఫెడరల్ కోర్టు ఏర్పాటు.

కేంద్ర ప్రభుత్వం: 1919 చట్టం ప్రకారం రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తూ ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది.

కేంద్ర శాసనసభ: ఇందులో ఎన్నుకోబడిన సభ్యులు ఉండేవారు. ఓటర్ల సంఖ్య 10 శాతం పెంచబడింది. శాసన సభలో రాష్ట్రం శాసనసభల నుంచి 260 మంది సభ్యులు, సమాఖ్య శాసనసభలో 375 మంది ఉండేవారు. అయితే స్థానిక పాలకులు ఇందులో చేరేందుకు ఆసక్తి చూపకపోవడంతో సమాఖ్య శాసనసభ అమలులోకి రాలేదు. ఈ చట్టం భారతదేశం నుంచి బర్మాను వేరు చేసింది.

TS Inter 1st Year History Study Material Chapter 15 జాతీయ ఉద్యమం – మలిదశ

ప్రాంతీయ ప్రభుత్వం: ఈ చట్టం ప్రాంతీయ ప్రభుత్వాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని నిషేధించి ప్రాంతీయ ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తిని కల్గించింది. శాసన సభలోని అత్యధిక మెజారిటీ సాధించిన పార్టీ నుంచి గవర్నర్ మంత్రులను నియమిస్తాడు. ఈ మంత్రులు బదిలీ చేయబడిన అంశాలకు బాధ్యత వహిస్తారు. వీరు శాసన సభకు మాత్రమే బాధ్యత వహిస్తారు. గవర్నర్లు మంత్రుల సలహాలకై బద్ధులై ఉంటారు. కానీ ఆచరణలో శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తిరస్కరించేవాడు. స్థానిక ప్రభుత్వంలో 1935 చట్టం అమలు చేయడానికి రెండు సంవత్సరాలు పట్టింది.

ప్రశ్న 3.
క్రిప్స్ రాయబారాన్ని వివరించండి.
జవాబు.
1942లో జపాన్, బర్మాలోని రంగూన్ను ఆక్రమించినపుడు భయపడిన బ్రిటీష్ ప్రభుత్వం కాబినెట్ సభ్యుడు స్టాఫర్డ్ క్రిప్సన్న చర్చల నిమిత్తం భారతదేశానికి పంపింది. యుద్ధంలో బ్రిటీష్వారి పరిస్థితి ఓడిపోయే పరిస్థితిలో ఉంది. భారతదేశం అవసరం తప్పనిసరి అయింది. అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్డ్ ఇంగ్లాండ్ ప్రధాని విన్సెంట్ చర్చిల్పై భారతదేశాన్ని యుద్ధంలోకి చేర్చుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. ఫలితంగా 1947లో క్రిప్స్ రాయబారం భారతదేశానికి వచ్చి కొన్ని ప్రతిపాదనలను సూచించింది. అవి:

  1. యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశానికి అధిక దేశ ప్రతిపత్తినియ్యాలి.
  2. నూతన రాజ్యాంగం ఏర్పాటు చేయడానికి ఎన్నికైన సభ్యులతో రాజ్యాంగ రచన కమిటీని వేయాలి.
  3. కేంద్రంలో సమాఖ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. రాష్ట్రాలు అందులో చేరుతాయా లేదా అనేది వాటి నిర్ణయానికి వదిలివేయాలి.

కాంగ్రెస్ ఈ ప్రతిపాదనలను తిరస్కరించింది. గాంధీ దీన్ని దివాలా తీసిన బ్యాంకుపై రాబోయే తేదీ వేసిన చెక్కుగా వల్లించాడు. దానిలో పాకిస్థాన్ ప్రస్థావన లేనందున ముస్లింలీగ్ కూడా ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. ఫలితంగా క్రిప్స్ రాయబారం తన ఉద్దేశాన్ని నెరవేర్చడంలో విఫలమయింది.

ప్రశ్న 4.
1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహాన్ని వివరించండి.
జవాబు.
భారత స్వాతంత్ర పోరాటంలో ఉప్పు సత్యాగ్రహంతో ప్రారంభమైన శాసనోల్లంఘన ఉద్యమం ఒక ప్రధాన ఘట్టం. ఈ ఉద్యమం ద్వారా లక్షలాది ప్రజలు స్వతంత్ర పోరాటంలో భాగమయ్యారు. విదేశీ పాలనకు వ్యతిరేకంగా గాంధీ నాయకత్వంలో శాసనోల్లంఘన ఉద్యమం ఒక ప్రజా ఉద్యమంగా ఉపఖండమంతా వ్యాపించింది.

1929 డిసెంబర్లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన లాహోర్ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్యమే అంతిమ లక్ష్యంగా ప్రకటించారు. రౌండ్ టేబుల్ సమావేశాలను బహిష్కరించి శాసనోల్లంఘన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు.

గాంధీజీ నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ 1930, మార్చి 12న చారిత్రాత్మకమైన శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించింది. కాంగ్రెస్ శాసనసభ్యులందరూ తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామాలు సమర్పించాలని ఆదేశించింది. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకుల ఆవేశాలను చల్లార్చేందుకు గాంధీజీ ప్రయత్నించాడు. ఈ సందర్భంలో గాంధీజీ చివరి ప్రయత్నం చేస్తూ రాజ ప్రతినిధి ఇర్విన్ను సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నించాలని హెచ్చరించాడు. రాజ ప్రతినిధి ఇర్విన్ ఆ హెచ్చరికను పెడచెవిన పెట్టడంతో గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించేందుకు నిర్ణయించాడు.

శాసనోల్లంఘన ఉద్యమం మూడు దశలుగా జరిగింది. అవి:

  1. మొదటి దశ (1930 మార్చి 12 – 1932 జనవరి 3 వరకు)
  2. రెండో దశ (1932 జనవరి 4 – 1933 జులై 11 వరకు)
  3. మూడో దశ (1933 జులై 12 – 1934 మే వరకు)

మొదటి దశ: దీనినే ఉప్పు సత్యాగ్రహ దశగా వర్ణించవచ్చు. ఈ ఉద్యమంను గాంధీజీ 1930, మార్చి 12వ తేదీన సబర్మతీ ఆశ్రమం నుంచి 78 మంది అనుచరులతో ప్రారంభించాడు. అతడు 200 మైళ్ళ దూరంలో అరేబియా సముద్రతీరం వద్ద గల దండి గ్రామాన్ని కాలిబాటన చేరుకొని ఉప్పును తయారుచేసేందుకు ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించాడు. దీంతో దేశవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు సామూహిక ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా గాంధీజీ ప్రజలకు విజ్ఞప్తి చేసిన కార్యక్రమాలు:

  1. మద్యపాన దుకాణాలు, విదేశీ వస్త్ర విక్రయశాలల ఎదుట పికెటింగ్.
  2. రాట్నాల ద్వారా ఖద్దరు వడకటం.
  3. హిందూ-ముస్లింల మధ్య సంబంధాల పటిష్టత.
  4. అస్పృశ్యతా నివారణ.

ఉప్పు సత్యాగ్రహ పర్యవసానం:

  • బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీని నిర్బంధంలోనికి తీసుకొని ఎర్రవాడ కారాగారంలో ఉంచింది. దీంతో కోపోద్రిక్తులైన ప్రజలు దేశమంతటా హర్తాళ్ పాటించారు.
  • అనేకమంది ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేశారు.
  • 1930-32 మధ్యకాలంలో లండన్లో బ్రిటిష్ ప్రభుత్వం మూడు రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పరచింది.
  • రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీజీ పాల్గొని అల్పసంఖ్యాకుల ప్రాతినిధ్యం కంటే రాజ్యాంగ నిర్మాణమే ప్రధాన అంశమని వాదించాడు.
    కాని ఆయన వాదనలు ఆమోదయోగ్యం కాకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి.

రెండో దశ:

  1. ఈ దశలో గాంధీజీని, ఇతర నాయకులను 1932, జనవరి 14న నిర్బంధంలో ఉంచడం జరిగింది. కాని ప్రజలు పికెటింగ్ను చేపట్టడం జరిగింది.
  2. బ్రిటీష్ ప్రభుత్వం విధించిన నిషేధాజ్ఞలు ధిక్కరించి సమావేశాలు నిర్వహించడం, కరపత్రాల ముద్రణ వంటి చర్యలు అమలుచేయడం జరిగింది.
  3. బ్రిటీష్ ప్రభుత్వం అన్ని రకాల ఊరేగింపులను నిషేధించింది.
  4. ముస్లిం నాయకులు మినహా, జాతీయ నాయకులందరూ బ్రిటీష్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ 1932, ఆగస్టు 10న ప్రకటించిన “కమ్యూనల్ అవార్డు”ను వ్యతిరేకించారు.
  5. కమ్యూనల్ అవార్డును వ్యతిరేకిస్తూ ఎర్రవాడ కారాగారంలో గాంధీజీ 1932, సెప్టెంబర్ 20న ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించారు.
  6. బ్రిటీష్ ప్రభుత్వం, గాంధీజీ సంప్రదింపుల ఫలితంగా బ్రిటీష్ ప్రభుత్వం గాంధీజీ డిమాండ్లలో కొన్నింటికి ఆమోదం
    తెలిపింది.
  7. బ్రిటీష్ ప్రభుత్వం తమకు విధేయులైన నాయకులతో లండన్లో 1932, నవంబర్ 17 డిసెంబర్ 24 మధ్య మూడో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో మహిళలకు ఓటుహక్కు వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

మూడో దశ:-

  1. 1933 జులైలో గాంధీజీ, మరికొంతమంది నాయకులు వ్యక్తిగత శాసనోల్లంఘన ఉద్యమానికి ఉపక్రమించారు. వారిని బ్రిటీష్ ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది.
  2. కారాగారంలో గాంధీజీ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయనను బ్రిటీష్ ప్రభుత్వం విడుదల చేసింది.
  3. 1934 మే నెలలో పాట్నాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఉపసంహరించుకొంటున్నట్లు ప్రకటించింది.

ప్రశ్న 5.
భారత స్వాతంత్రోద్యమంలో సుభాష్ చంద్రబోస్ పాత్రను వివరించండి.
జవాబు.
భారత జాతీయోద్యమ చరిత్రలో ప్రముఖ స్థానాన్ని పొందిన దేశభక్తుడు సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ ఐ.సి.ఎస్ పరీక్ష పాసై సివిల్ సర్వెంట్గా తన జీవితాన్ని ప్రారంభించాడు. అయితే సహాయ నిరాకరణోద్యమ ప్రభావానికిలోనై తన సివిల్ సర్వీసు ఉద్యోగానికి రాజీనామా చేసి జాతీయోద్యమంలో పాల్గొన్నాడు.

కాంగ్రెస్ పాత్ర: సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ రాజకీయాల్లో పాల్గొన్నాడు. 1938లో హరిపూర్లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడయ్యాడు. 1939లో త్రిపుర కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ అభ్యర్థియైన భోగరాజు పట్టాభి సీతారామయ్యను ఓడించి పార్టీ అధ్యక్షుడిగా గెలుపొందాడు. అయితే కాంగ్రెస్ అనుసరిస్తున్న శాంతియుత విధానాల యెడల బోస్కు విశ్వాసం లేదు. అందువల్ల గాంధీజీతో బోస్కు తీవ్రమైన భేదాభిప్రాయాలు -కలిగాయి. అందువల్ల కాంగ్రెస్ నుంచి వైదొలగి ‘ఫార్వర్డ్ బ్లాక్’ అనే కొత్త పార్టీని స్థాపించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 15 జాతీయ ఉద్యమం – మలిదశ

ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపన: బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి వెళ్లగొట్టాలంటే రెండవ ప్రపంచ యుద్ధం సరైన అవకాశమని బోస్ భావించాడు. అయితే యుద్ధకాలంలో బోస్ ను ప్రభుత్వం నిర్బంధించింది. బోస్ 1941లో నిర్భంధం నుంచి తప్పించుకొని మొదట రష్యాకు, తరువాత జర్మనీకి, జపాన్కు వెళ్ళాడు. యుద్ధసమయంలో ఆ దేశాల సహాయంతో ఇంగ్లీషువారితో పోరాడి, దేశానికి స్వాతంత్య్రం సాధించవచ్చని బోస్ తలచాడు. యుద్ధంలో జపాన్కు చిక్కిన భారతీయ యుద్ధఖైదీలందరినీ కూడగట్టుకొని 1943లో సింగపూర్లో ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ లేక ‘ఇండియన్ నేషనల్ ఆర్మీ’ని స్థాపించాడు. ఐ.ఎన్.ఏ. స్థాపనలో బోస్కు రాస్ బిహారీ బోస్, మోహన్సింగ్లు సహకరించారు. ఐ.ఎన్.ఏలో చేరిన సేనలు బోసు “నేతాజీ” అని గౌరవంగా పిలిచేవారు. “జైహింద్” అనే నినాదాన్ని చేపట్టి బోస్ తన అనుచరులందరితో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి “ఛలో ఢిల్లీ” అంటూ భారతదేశంలో ఇంఫాల్ సమీపంలోని మోయిరాంగ్ వరకు వచ్చాడు. ఆయనకు తోడుగా వీరవనిత కెప్టెన్ లక్ష్మి మహిళలతో ఏర్పడిన ఝాన్సీరాణి దళనేత అయింది. ఆయన నాయకత్వంలోని ఐ.ఎన్.ఏ. సైన్యాలు దేశ స్వాతంత్ర్యానికి ప్రాణాలొడ్డి పోరాడాయి. కానీ దురదృష్టవశాత్తు 1945 సెప్టెంబర్లో జపాన్ ఓడిపోవటంతో బోస్ ప్రయత్నాలు విఫలమైనాయి. తన ప్రయత్నాలు కార్యరూపం ధరించకుండానే బోస్ 1945లో ఒక విమాన ప్రమాదంలో మరణించాడు.

ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యుల విచారణ: యుద్ధానంతరం ప్రభుత్వం ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ సేనలను ఇండియాపై దాడిచేయడానికి ప్రయత్నించినందున దేశద్రోహులుగా ప్రకటించి ఎర్రకోటలో విచారణ జరిపించింది. సైనిక నాయకులైన మేజర్ జనరల్ షానవాజ్ ఖాన్ (ముస్లిం), కల్నల్ జి.ఎస్. ధిల్లాన్ (సిక్కు), మేజర్ ప్రేమ్ సెహగల్ (హిందూ) లపై విచారణ జరిపించింది. వారి తరఫున జవహర్లాల్ నెహ్రూ, తేజబహదూర్ సప్రూ, భూలాబాయ్ దేశాయ్ు వాదించారు. అయినప్పటికీ ప్రత్యేక న్యాయస్థానం వారికి శిక్షలు విధించింది. కానీ ఆ శిక్షలకు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవటంతో ప్రజాభిప్రాయాన్ని మన్నించి, ప్రభుత్వం వారిని విడుదల చేసింది. దీనితో ప్రజలకు, సైనికులకు ప్రభుత్వం పట్ల భయభక్తులు పోయాయి. హిందూ, సిక్కు, ముస్లింల సేనలను విచారించటం వలన కాంగ్రెస్, లీగ్లు సమైక్యంగా పోరాడాయి.

ఘనత: సుభాష్ చంద్రబోస్ విజయాన్ని సాధించలేకపోయినా, ఆయన ధైర్యసాహసాలు దేశంలో చాలామందికి స్ఫూర్తినిచ్చాయి. ఆయన అచంచల దేశభక్తి, క్రమశిక్షణ, కార్యదీక్ష తరతరాల భారతీయులకు ఆదర్శప్రాయం.

ప్రశ్న 6.
జాతీయోద్యమంలో ముస్లింలీగ్ పాత్రను విశ్లేషించండి.
జవాబు.
హిందూ ముస్లింల మధ్య ఐక్యతను నాశనం చేయడానికి బ్రిటీష్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూనే ఉంది. 1905లో జరిగిన బెంగాల్ విభజన ఒక ఉదాహరణ. అయితే హిందూ, ముస్లింల ఐక్యత ఎప్పుడూ కనిపిస్తూనే ఉండేది. ముఖ్యంగా 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో ఇది బ్రిటీష్ వారిలో ఉద్రిక్తతను, ఒత్తిడిని కలుగజేసింది. దాంతో వీరి మధ్య ఐకమత్యాన్ని, సామరస్యాన్ని తొలగించడం కోసం ప్రభుత్వం ‘విభజించు పాలించు’ అనే విధానాన్ని అమలు చేసింది. విచారకరమైన విషయం ఏమిటంటే ఈ విధానంలో వారు సఫలీకృతులయ్యారు. విద్యావేత్త, సంఘసంస్కర్త సర్సయ్యద్ అహ్మద్ ఖాన్ స్వయంగా హిందూ, ముస్లింల ఐక్యతను కోరినవాడు. వారి ఐక్యతకు కృషి చేశాడు. బ్రిటీష్వారి ప్రభావంతో ముఖ్యంగా అలిఘర్ ఆంగ్లో ముస్లిం పాఠశాల ప్రిన్సిపల్ బెక్ ప్రభావానికి లోనయ్యాడు. ఆయన కాంగ్రెస్తో చేరవద్దని ముస్లింలకు విజ్ఞప్తి చేశాడు.

1906లో డైకానవాబు సలీముల్లాఖాన్, ఆగాఖాన్, మొహిసిన్ ఉలములు బ్రిటీష్వారి సహకారంతో ముస్లింలీగ్ను స్థాపించారు. ఇది ముస్లింలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం, వారికి ప్రత్యేకమత నియోజక వర్గాల కోసం, ముస్లింలకు ప్రత్యేక రక్షణ కోసం విజ్ఞప్తి చేసింది. వైస్రాయ్ మింటో ముస్లింలీగ్ను సమర్థించాడు. ఫలితంగా 1909 చట్టం ద్వారా 1909లో ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా పాకిస్తాన్ అనే ఆలోచనకు భావనకు విత్తనం వేసినట్లు అయింది. బ్రిటీష్వారు విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని అవలంబించినంత కాంగ్రెస్ హిందూ, ముస్లింల ఐక్యతకు ఎంతో కృషి చేసింది. ఫలితంగా 1916లో లక్నో ఒప్పందం జరిగింది. గాంధీ హిందూ ముస్లింల ఐక్యత కోసం ఖిలాఫత్ ఉద్యమాన్ని నడిపారు.

కానీ 1935 భారత ప్రభుత్వ చట్టం జారీ చేయబడ్డప్పుడు జరిగిన ఎన్నికల్లో ముస్లింలీగ్ను వెనుకకు నెట్టి కాంగ్రెస్ ఎన్నో చోట్ల విజయం సాధించింది. దాంతో, జిన్న కాంగ్రెస్ ముస్లింలు భాగస్వాములుగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ప్రతిపాదించాడు. కానీ కాంగ్రెస్ జిన్న ప్రతిపాదనలకు ఒప్పుకోలేదు. ఇది ఇద్దరి మధ్య దూరాన్ని పెంచింది. అంతేగాక ముస్లింలలో తాము వేరు అన్న భావాలకి పెంపొందించింది. ఫలితంగా ఇద్దరిలో మతతత్వ ద్వేషభావనలు అభివృద్ధి చెందాయి.

ప్రశ్న 7.
కాబినెట్ మిషన్ ప్రతిపాదనలను వివరించండి.
జవాబు.
రెండవ ప్రపంచ యుద్ధానంతరం బ్రిటన్ గొప్పదనం బహిర్గతమయింది. దాని సంపద హరించింది. విజయం సాధించినప్పటికీ బలహీనంగా మారింది. దాంతో భారతదేశంలో ప్రభుత్వాన్ని వారికే అప్పగించాలని నిర్ణయించింది. దానికోసం భారతదేశానికి ఒక కమిటీని పంపింది. ఈ కమిటీలో పెథిక్ లారెన్స్, స్టాఫర్డ్ క్రిప్స్, ఎ.వి. అలెగ్జాండర్లు సభ్యులు. ఈ కమిటీ భారతదేశంలో ఉన్న నాయకులతో వివిధ పార్టీలతో వివరంగా చర్యలు జరిపి ఈ కింది విష లను ప్రకటించింది.

  1. స్థానిక సంస్థానాలతో కలిపి భారతదేశాన్నంతటిని సమాఖ్యగా ఏర్పాటు చేయడం.
  2. సంస్థానాలకు స్వయం ప్రతిపత్తి నీయడం.
  3. సంస్థానాలను వివిధ వర్గాలుగా చేయడం.
  4. భారతీయులకు ఒక మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం.
  5. ప్రాంతీయ శాసన సభలకు ఎన్నికైన సభ్యులతో, సంస్థానాలతో కలిపి రాజ్యాంగ ఏర్పాటు కోసం ఒక రాజ్యాంగ సభను ఏర్పాటుచేయడం.

కాంగ్రెస్, ముస్లింలీగ్ రెండు ఈ ప్రతిపాదనలను అంగీకరించాయి. 1946లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత ప్రభుత్వం ఏర్పడింది. బ్రిటీష్ ప్రభుత్వం రక్షణ రంగంతో సహా అన్ని అధికారాలను నెహ్రూ ప్రభుత్వ హస్తగతం చేసింది. ముస్లింలీగ్ కేంద్ర కేబినెట్లో ముస్లింలీగ్చే ఎంపిక చేయబడిన ముస్లింలు మాత్రమే ఉండాలని డిమాండ్ చేసింది. దానికి నిరసనగా వారు అక్టోబరు వరకు మంత్రివర్గంలో చేరలేదు. లీగ్ రాజ్యాంగ సభను బహిష్కరించింది.

ప్రశ్న 8.
1942 క్విట్ ఇండియా ఉద్యమాన్ని వివరించండి.
జవాబు.
క్రిప్స్ రాయబారం విఫలం కాడంతో కాంగ్రెస్ మరొక ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించడానికి నిర్ణయించింది. 1942 ఆగస్టు 8న అఖిలభారత కాంగ్రెస్ కమిటీ బొంబాయిలో సమావేశమయింది. ఈ సమావేశం క్విట్ ఇండియా తీర్మానాన్ని ప్రతిపాదించింది. అది బ్రిటీష్ వారిని సత్వరమే భారతదేశాన్ని వదిలి వెళ్ళాలని డిమాండ్ చేసింది. ఇది గాంధీ ఆధ్వర్యంలో అహింసాయుత పద్ధతులలో ప్రారంభించాలని ప్రతిపాదించబడింది. ఈ ఉద్యమంలో గాంధీ ‘డూ ఆర్ డై’ ‘సాధించండి లేదా చావండి’ అనే నినాదాన్ని ఇచ్చాడు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ తీర్మానాన్ని చేసిన వెంటనే బ్రిటీష్ ప్రభుత్వం గాంధీని అరెస్ట్ చేసి పూనలోని ఆగాఖాన్ భవనంలో ఉంచింది. గాంధీతో పాటు నెహ్రూ, పటేల్, అబ్దుల్ కలాం, ఆజాద్, డా॥ పట్టాభి సీతారామయ్య, టంగుటూరి ప్రకాశం, సంజీవరెడ్డి మొదలైన నాయకులందరిని చెరసాలలో వేసింది.

క్విట్ ఇండియా ఉద్యమంలో ఫార్వర్డ్ బ్లాక్, సోషలిస్టు పార్టీ విప్లవకారులు పాల్గొన్నారు. ముఖ్యమైన నాయకులు లేకపోవటం వల్ల ఉద్యమ పగ్గాలను ప్రజలే తీసుకున్నారు. వారు ప్రభుత్వాన్ని లెక్కచేయలేదు. కొందరు అరెస్ట్ కాని యువనాయకులైన జయప్రకాష్ నారాయణ్, రామ్మోహన్ లోహియా, అరుణా అసఫలీ మొదలైనవారు ఉద్యమాన్ని కొనసాగించారు. హర్తాళ్ళు, నిరసన ప్రదర్శనలు, నిరసన సమావేశాలు దేశమంతటా కొనసాగాయి. ప్రజలు అధిక సంఖ్యలో ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ బొంబాయి నుండి రహస్య రేడియో ప్రసారాలను కూడా చేసింది. ఉత్తర ప్రదేశ్లోని బాలియాలోను, బెంగాల్లోని మిడ్నపూర్ జిల్లాలోను మహారాష్ట్రలోని సతారాలోనూ ప్రజా ప్రభుత్వాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఉద్యమంలో దేశమంతటా హింస వ్యాప్తి చెందింది. ప్రజలు ఆందోళనలు చెయ్యడమే గాక ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. రైల్వే స్టేషన్లను, పోస్టాఫీసులను, పోలీస్ స్టేషన్లను కాల్చివేశారు.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఖిలాఫత్ ఉద్యమం గురించి రాయండి.
జవాబు.
అక్టోబర్ 17, 1919 రోజును ఖిలాఫత్ దినంగా పాటించబడింది. భారతదేశమంతటా హర్తాళ్ పాటించబడింది. గాంధీజి కూడా ఈ ఉద్యమానికి తన మద్దతు తెలిపాడు. హిందూ ముస్లింల ఐక్యతకు ఇది గొప్ప అవకాశం అని భావించాడు. అంతేగాక వారి లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముస్లింలను ప్రోత్సహించాడు. ఈ విషయంలో గాంధీ సఫలీకృతుడు గావడమే గాక గొప్ప నాయకునిగా ప్రశంసించబడ్డాడు.

TS Inter 1st Year History Study Material Chapter 15 జాతీయ ఉద్యమం – మలిదశ

ప్రశ్న 2.
స్వరాజ్ పార్టీ పనిని అంచనా వేయండి.
జవాబు.
1922లో గయలో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశంలో చిత్తరంజన్ దాస్ కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీని స్థాపించాడు.ఇది కాంగ్రెస్ యొక్క శాఖ. దానికి ఆయన అధ్యక్షుడు, మోతీలాల్ నెహ్రూ కార్యదర్శి. నవంబర్ 1923లో . జరిగిన ఎన్నికలలో స్వరాజ్యపార్టీకి 101 స్థానాలకు 42 నియోజకవర్గ స్థానాలను దక్కించుకుంది. కేంద్ర శాసన సభలో ప్రవేశించి బ్రిటీష్ వారి ప్రతిపాదనలను వ్యతిరేకించాలనుకున్నారు. 1925లో విఠలాభాయి పటేల్ స్వరాజ్ పార్టీ తరుఫున కేంద్ర శాసనసభలో స్పీకర్గా ఎన్నుకోబడ్డాడు. 1925లో చిత్తరంజన్ దాస్ మరణించడంతో ఈ పార్టీ కూడా పతనమైపోయింది.

ప్రశ్న 3.
రౌండ్ టేబుల్ సమావేశంలోని అంశాలను అంచనా వేయండి.
జవాబు.
బ్రిటీష్ ప్రభుత్వం రాజ్యాంగ సంస్కరణలను అమలు చేయాలని నిర్ణయించింది. దాంతో బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్సేమాక్డోనాల్డ్, భారత ప్రతినిధులు లండన్కు ఆహ్వానించాడు. మొదటి రౌండ్ టేబుల్ సమావేశాలు నవంబర్ 1930 నుండి జనవరి 1931 వరకు జరిగాయి. దీనికి స్థానిక పరిపాలకులు, రాజకీయ పార్టీలు హాజరయ్యాయి. కానీ కాంగ్రెస్ హాజరు కాలేదు. కాంగ్రెస్ హాజరుకానందున సమావేశం విఫలమయింది. దాంతో రెండవ రౌండ్ టేబుల్ సమావేశం సెప్టెంబర్ 1931లో మొదలై, డిసెంబర్ చివరి వరకు జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ తరఫున గాంధీ అతనితోపాటు సరోజినినాయుడు హాజరయ్యారు. ఈ సమావేశంలో గాంధీ కేంద్ర, రాష్ట్రాల్లో ఇంగ్లాండు సమానమైన బాధ్యతాయుతమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాడు. ఈ సమావేశం కేవలం కేంద్రంలో సమాఖ్య ఏర్పాటు, భారతదేశంలో మైనారిటీల హక్కులను గురించి చర్చించింది. కానీ బాధ్యతాయుత ప్రభుత్వమనే అంశంపై ని ‘యం తీసుకోవడంలో విఫలమయింది.

1932 లో జరిగిన మూడవ రౌండ్డేబుల్ సమావేశాన్ని కాంగ్రెస్ బహిష్కరించింది. తరువాత 1933లో బ్రిటీష్ గ సంస్కరణల ప్రతిపాదనలతో శ్వేతపత్రం విడుదల చేసింది.

ప్రశ్న 4.
1947 భారత స్వతంత్ర చట్టంలోని నిబంధనలను వివరించండి.
జవాబు.
4 జులై 1947న బ్రిటీష్ పార్లమెంట్ లోని కామన్స్ సభలో భారత స్వాతంత్ర్య చట్టం ప్రవేశపెట్టబడింది. జులై 15న కామన్స్ సభలో బిల్లు ఆమోదించబడింది. మరుసటి రోజున ప్రభువుల సభ (లార్డ్స్ సభ) లో ఆమోదించబడింది. జులై 10 నాడు రాజు ఆమోదం పొందింది. ఈ చట్టం భారతదేశాన్ని విభజించి రెండు కొత్త అధినివేశ ప్రాంతాలను సూచించింది. అదే ఇండియా, పాకిస్తాన్. ప్రతి అధినివేశ ప్రాంతంలో రాజు చేత నియమింపబడిన గవర్నర్ జనరల్ కూడా ఉంటాడు. ఒకవేళ వారికిష్టమైతే రెండు అధినివేశ ప్రాంతాలకు ఒకే గవర్నర్ జనరల్ కూడా ఉండవచ్చు.

రెండు ప్రాంతాల్లో శాసనాలు చేయడం కోసం శాసనసభలు ఏర్పాటు చేయబడతాయి. భారతదేశంలో బ్రిటీష్ పార్లమెంట్ అధికార పరిధి 15, ఆగస్ట్ 1947 నుంచి నిలుపుచేయబడుతుంది. ఈ చట్టానికి అనుగుణంగా ఆగస్ట్ 14న పాకిస్తాన్ ఏర్పడింది. దానికి జిన్న గవర్నర్ జనరల్ అయ్యాడు. భారతదేశానికి ఆగస్టు 15న స్వాతంత్ర్యం ఇయ్యబడింది. మౌంట్ బాటిన్ గవర్నర్ జనరల్, నెహ్రూ ప్రధానిగా స్వతంత్ర భారతదేశంలో ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రశ్న 5.
స్వతంత్రోద్యమ కాలంలోని విప్లవకారులు కార్యకలాపాలను వివరించండి.
జవాబు.
కాంగ్రెస్ నిష్క్రియాత్మక విధానాలు నచ్చని కొందరు యువకులు విప్లవవాదులుగా మారారు. వారి లక్ష్యం భయోత్పాతాన్ని సృష్టించి తొందరగా బ్రిటీష్ వారి నుంచి స్వాతంత్ర్యాన్ని పొందడం. వీరు చాలా నిర్భయస్థులు. దేశం కోసం ప్రాణ త్యాగానికైనా స్థిరపడినవారు. అటువంటి వారిలో ఆంధ్రలో అల్లూరి సీతారామరాజు బ్రిటీష్వారి నియంతృత్వం నుండి గిరిజనులను దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేశాడు. 1922 నుండి 1924 వరకు ఏజెన్సీ ప్రాంతంలో బ్రిటీష్ వారి పరిపాలన దాదాపుగా అంతమయిందని చెప్పవచ్చు. ఈ పరిస్థితిని అధిగమించడానికి బ్రిటీష్ ప్రభుత్వం రూథర్ ఫర్డ్ అనే ప్రత్యేక అధికారిని నియమించింది. బెంగాల్లో సూర్యాసేన్ అతని అనుచరుడు సాహు క్రియాశీల పాత్ర వహించారు. సాహు బ్రిటీష్ అధికారి డేని చంపాడు. ఉత్తరప్రదేశ్కి చెందిన రాంప్రసాద్ బిస్మిల్ తన సహచరులతో కలిసి అలంపూర్కు వెళ్తున్న రైలును కాకోరి దగ్గర ఆపి గార్డు దగ్గర నుండి నగదు పెట్టెలను దోచాడు. ఇదే కాకోరి కుట్రకేసుగా ప్రసిద్ధి. ప్రభుత్వం రాంప్రసాద్ బిస్మిల్ను అతని అనుచరుడు అశ్వకుల్లాఖాన్ ను ఉరితీసింది. 1930 – 32లో హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీ తరఫున సూర్యాసేన్ చిటగాంగ్, ఇతర ప్రాంతాలలో దాడులను రచించాడు. అతన్ని ప్రభుత్వం ఉరితీసింది. ఉత్తరప్రదేశ్లో చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్లు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ను స్థాపించారు. తదనంతరం భగత్సింగ్ పోలీసు అధికారి సాండర్స్ను చంపాడు. బతుకేశ్వర్ దత్తో కలిసి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలోకి ఏప్రిల్ 8, 1929న బాంబులు, కరపత్రాలు విసిరారు. ప్రభుత్వం భగత్సింగ్, రాజగురు, సుఖదేవ్లను 23 మార్చి 1931న ఉరితీసింది.

ప్రశ్న 6.
వేవెల్ ప్రణాళికను వివరించండి.
జవాబు.
1943లో లిన్లిత్అ అనంతరం వేవెల్ వైస్రాయ్ అయ్యాడు. అతని పరిస్థితి చాలా క్లిష్టతరంగా మారింది. బెంగాల్ ఒకవైపు కరువుకోరలు మరియు మతపరమైన ప్రశ్నలు ఉదయించడంతో ప్రభుత్వ ప్రతిష్ఠంభన ఏర్పడింది. 1944లో వేవెల్ గాంధీని విడుదల చేశాడు. భారతదేశంలోని ఐక్యతలో ఒత్తిడిని ప్రతిష్ఠంభనను పరిష్కరించడానికి ప్రయత్నం చేశారు. అనంతరం గాంధీ జిన్నతో కలిసి ఒక పరిష్కారాన్ని కనుగొనాలని అనుకున్నాడు. కాం దీని పరిష్కారానికి 1945లో వేవెల్ లండన్ వెళ్ళాడు. రాజకీయ ప్రతిష్ఠంభనను తొలగించి భాగ లక్ష్యాన్ని సాధించడానికి తోడ్పడే ప్రణాళికతో తిరిగి వచ్చాడు.

ద్విపరిపాలనా నూతన రాజ్యాంగం ఏర్పడి భారతీయుల ఆమోదం పొందే లోపల ఒక తాత్కాలిక ఏర్పాటును ప్రణాళిక ప్రతిపాదించింది. వివిధ రాజకీయ సంస్థల ప్రతినిధులతో వైస్రాయ్ ఒక కార్య నిర్వాహక సమితిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో అధ్యక్షుడుగా వైస్రాయ్, యుద్ధ వ్యవహారాలను చూస్తున్న ముఖ్య సైన్యాధిపతి ఇద్దరు మాత్రమే ఆంగ్లేయులు ఉంటారు. మిగిలిన వారు వివిధ పార్టీల నుంచి ఎన్నుకోబడిన వాళ్ళుంటారు. వారిలో హిందూ, ముస్లింలు సమాన సంఖ్యలో ఉంటారు. కార్యనిర్వాహక సంస్థలకు ఎన్నుకోబడిన సభ్యులకు వేవెల్ ఒక సమావేశాన్ని సిమ్లాలో ఏర్పాటు చేశాడు. అయితే ఈ ఎంపికను జిన్నా అంగీకరించలేదు. దాంతో సిమ్లా సమావేశం విఫలమయ్యింది.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
చంపారన్ సత్యాగ్రహం.
జవాబు.
చంపారన్ బీహార్ రాష్ట్రంలో వెనుకబడ్డ జిల్లా. ఇక్కడి రైతులు బ్రిటీష్ వారి బలవంతంతో ‘నీలిమందు (ఇండిగో) పండించేవారు. ఈ రైతులు ఆంగ్లేయుల ఆధీనంలో ఉండేవారు. నీలిమందును ఆంగ్లేయులు పండించిన ధరకే అమ్మాలి. ఆంగ్లేయులు రైతులను ఎంతగానో పీడించేవారు.

దక్షిణాఫ్రికాలో గాంధీ నిర్వహించిన ఉద్యమాలను గురించి విన్న చంపారన్ రైతులు తమకు సహాయం చేయాల్సిందిగా గాంధీని ఆహ్వానించారు. అక్కడ గాంధీజీ సత్యాగ్రహం ఆరంభించాడు. వేలాది రైతులు జత కలవడంతో, చివరకు ప్రభుత్వం చంపారన్ వ్యవసాయ బిల్లును ఆమోదించింది. ఇది గాంధీకి, సత్యాగ్రహానికి లభించిన విజయం.

ప్రశ్న 2.
రౌలట్ చట్టం.
జవాబు.
1917లో బ్రిటీష్ ప్రభుత్వం భారతదేశంలో జరుగుతున్న విప్లవాత్మక నేరాలపై దర్యాప్తు చేయడానికి న్యాయాధికారి సిడ్నిరౌలత్ నాయకత్వంలో ఒక కమిటీని వేసింది. ఈ కమిటీ వీటన్నింటిని అణచివేయమని సిఫార్సు చేసింది. ఫలితంగా 1919లో రౌలత్ చట్టం అమలు చేయబడింది. ఈ చట్టం ప్రకారం ఎవరినైనా వారంటు లేకుండా అరెస్ట్ చేసే అధికారం, వారి ఇంటిని సోదా చేసి ఆస్తులను జప్తు చేసే అధికారాన్ని ప్రభుత్వానికి ఇచ్చింది. దీనికి వ్యతిరేకంగా భారత సాక్ష్యాల చట్టం ఆధారంగా కోర్టులో అప్పీల్ చేయడం గానీ, సాక్ష్యాలను విచారించడం మొదలైన నిబంధనలేవీ లేవు. విచారణ లేకుండా రెండేళ్ళ కంటే ఎక్కువ సమయం నిర్బంధించవచ్చు అనే నిబంధన భారత పౌరుల ప్రాథమిక హక్కులను హరించివేసింది. ఇది భారతీయులలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఈ పరిస్థితులు గాంధీ మొదటి అఖిల భారత ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. ప్రముఖ నాయకులు స్వామి శ్రద్ధానంద కూడా పాల్గొన్నారు. దేశమంతటా నిరసన ఉద్యమాలు జరిగాయి. గందరగోళాన్ని అల్లర్లను సృష్టిస్తున్నాడన్న నెపంపైన గాంధీ అరెస్ట్ చేయబడ్డాడు.

ప్రశ్న 3.
రౌండ్ టేబుల్ సమావేశాలు.
జవాబు.
1930- 32 సంవత్సరాల మధ్యకాలంలో సైమన్ కమీషన్ నివేదిక ఆధారంగా భారతదేశంలో జరపవలసిన రాజ్యాంగ సంస్కరణలను చర్చించడానికి ఆంగ్ల ప్రభుత్వం భారతదేశంలో వివిధ పార్టీలు, సంస్థానాల ప్రతినిధులతో మూడు సమావేశాలను లండన్లో ఏర్పాటు చేశారు. వీటిని రౌండ్ టేబుల్ సమావేశాలు అంటారు.

మొదటి సమావేశం: 1930లో శాసనోల్లంఘన జరిగే సమయంలో ఏర్పాటైన ఈ సమావేశాన్ని భారత జాతీయ కాంగ్రెస్ బహిష్కరించింది. 1931లో జరిగిన గాంధీ – ఇర్విన్ ఒప్పందం ఫలితంగా రాజకీయ ఖైదీలను బ్రిటీష్ వారు విడుదల చేశారు.

రెండో రౌండ్ టేబుల్ సమావేశం: రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీజీ పాల్గొన్నారు. ఈ సమావేశం ఎలాంటి సత్ఫలితాలివ్వలేదు. తిరిగి వచ్చిన గాంధీ మరల శాసనోల్లంఘన చేపట్టారు.

మూడో రౌండ్ టేబుల్ సమావేశం: ఈ సమావేశానికి పెద్దగా ప్రాధాన్యం లేదు. కాంగ్రెస్ వారు, బ్రిటీష్ లేబర్ పార్టీ కూడా దీనిని బహిష్కరించింది.
ఈ సమావేశాల ఫలితంగా 1935 భారత ప్రభుత్వ చట్టం ఏర్పడింది.

TS Inter 1st Year History Study Material Chapter 15 జాతీయ ఉద్యమం – మలిదశ

ప్రశ్న 4.
సైమన్ కమీషన్,
జవాబు.
భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణల గురించి సిఫారసు చేయాల్సిందిగా బ్రిటీష్ ప్రభుత్వం 1927లో జాన్ సైమన్ అధ్యక్షుడిగా సైమన్ కమీషన్ ను నియమించింది. ఈ సంఘంలో అందరూ ఆంగ్లేయులే ఉండటం, అందులో భారతీయులెవరికీ ఇందులో స్థానం కల్పించకపోవడం భారతీయులకు ఆగ్రహం తెప్పించింది. దాంతో దేశవ్యాప్తంగా కమీషన్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, హర్తాళ్లు జరిగాయి. సైమన్ కమీషన్ను ప్రజలు బహిష్కరించారు. ‘సైమన్ గో బ్యాక్’ నినాదాలు దేశమంతటా మార్మోగాయి. అయినప్పటికీ దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి నివేదిక రూపొందించింది.

ప్రశ్న 5.
మౌంట్ బాటెన్ ప్రణాళిక.
జవాబు.
1947లో వేవెల్ స్థానంలో మౌంట్బాటెన్ వైస్రాయ్ గా నియమింపబడ్డాడు. అట్లే ప్రభుత్వం అతనికి అధికార బదిలీ కార్యక్రమాన్ని పూర్తి చేయమని అనుజ్ఞనిచ్చింది. మౌంట్బాటెన్ కాంగ్రెస్, ముస్లిం లీగుతో చర్చించాడు. వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ఎంతో కష్టపడ్డాడు. అయినా చివరికి దేశ విభజన అనివార్యమయింది. ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతంలో పాకిస్థాన్ ను ఏర్పాటు చెయ్యాలని అతను ప్రతిపాదించాడు. వీటిలో సింధ్, బలూచిస్థాన్ వాయువ్య ప్రావిన్సులు పంజాబ్లోని కొన్ని ప్రాంతాలు, తూర్పు బెంగాల్లున్నాయి. పరిస్థితి దిగజారుతుండటంతో తప్పనిసరై కాంగ్రెస్ కూడా ఈ ప్రతిపాదనను ఒప్పుకోవలసి వచ్చింది. విభజనకు అనుగుణంగా మౌంట్బాటెన్. నిర్ణయాలు తీసుకున్నాడు.

TS Inter 2nd Year English Study Material Chapter 12 A Gift for Christmas

Telangana TSBIE TS Inter 2nd Year English Study Material 12th Lesson A Gift for Christmas Textbook Questions and Answers.

TS Inter 2nd Year English Study Material 12th Lesson A Gift for Christmas

Paragraph Questions & Answers (Section A, Q.No.5, Marks: 4)
Answer the following Questions in about 100 words

Question 1.
“Love, sacrifice and generosity are the essential elements for happy living.” Explain this statement with reference to the story “A Gift for Christmas”. (Revision Test – II)
Answer:
“A Gift for Christmas” is a well-known short story by O. Henry. The original name of the author is William Sydney Porter. This story was first published in 1905.

A Gift for Christmas” is a Christmas story, and it functions as a parable about both the nature of love and the true meaning of generosity. Della’s earnest desire to buy a meaningful Christmas gift for Jim drives the plot of the story, and Jim’s reciprocity of that sentiment is shown when he presents Della with the tortoise-shell combs. Both Jim and Della give selflessly, without expectation of reciprocity. Their sole motivation is to make the other person happy. This, combined with the personal meaning imbued in each of the gifts, conveys the story’s moral that true generosity is both selfless and thoughtful.

Della scours every store in town for two hours before finding the perfect gift for Jim. She notes the similarities between the simple yet valuable watch chain and her understated but loving husband. The watch chain is not merely a shiny trinket; instead, it represents Della’s regard for Jim, and the inherent value she sees in him. Similarly, the combs are not merely an extravagant bauble meant to impress Della; instead, they represent Jim’s commitment to Della and to their relationship. He willingly sells his most valuable possession, handed down from his father, in order to buy Della the combs, suggesting that for Jim, Della and their future family are the most important things in his life.

“ఎ గిఫ్ట్ ఫర్ క్రిస్మస్” అనేది ఓ. హెన్రీ రాసిన చిన్న కథ. రచయిత అసలు పేరు విలియం సిడ్నీ పోర్టర్. ఈ కథ మొదట 1905లో ప్రచురించబడింది.

క్రిస్మస్ కోసం ఒక బహుమతి” అనేది ఒక క్రిస్మస్ కథ, మరియు ఇది ప్రేమ యొక్క స్వభావం మరియు దాతృత్వం యొక్క నిజమైన అర్ధం రెండింటి గురించి ఒక ఉపమానంగా పనిచేస్తుంది. జిమ్ కోసం అర్థవంతమైన క్రిస్మస్ బహుమతిని కొనుగోలు చేయాలనే డెల్లా యొక్క గంభీరమైన కోరిక కథ యొక్క కథాంశాన్ని నడిపిస్తుంది మరియు డెల్లాకు తాబేలు-పెంకు దువ్వెనలను అందించినప్పుడు జిమ్ యొక్క ఆ సెంటిమెంట్ యొక్క అన్యోన్యత చూపబడుతుంది. జిమ్ మరియు డెల్లా ఇద్దరూ పరస్పరం ఆశించకుండా నిస్వార్థంగా ఇస్తారు. ఎదుటి వ్యక్తిని సంతోషపెట్టడమే వారి ఏకైక ప్రేరణ. ఇది, ప్రతి బహుమతులలో నింపబడిన వ్యక్తిగత అర్ధంతో కలిపి, నిజమైన దాతృత్వం నిస్వార్థంగా మరియు ఆలోచనాత్మకంగా ఉంటుందని కథ యొక్క నైతికతను తెలియజేస్తుంది.

డెల్లా జిమ్కి సరైన బహుమతిని కనుగొనడానికి ముందు పట్టణంలోని ప్రతి దుకాణాన్ని రెండు గంటల పాటు వెతుకుతాడు. ఆమె సరళమైన ఇంకా విలువైన వాచ్ చైన్ మరియు తన పేలవమైన కానీ ప్రేమగల భర్త మధ్య సారూప్యతలను పేర్కొంది. వాచ్ చైన్ కేవలం మెరిసే ట్రింకెట్ కాదు; బదులుగా, ఇది జిమ్ పట్ల డెల్లా యొక్క గౌరవాన్ని మరియు అతనిలో ఆమె చూసే స్వాభావిక విలువను సూచిస్తుంది. అదేవిధంగా, దువ్వెనలు కేవలం డెల్లాను ఆకట్టుకోవడానికి ఉద్దేశించిన విపరీతమైన బాబుల్ కాదు; బదులుగా, వారు డెల్లా పట్ల మరియు వారి సంబంధానికి జిమ్ యొక్క నిబద్ధతను సూచిస్తారు. అతను ఇష్టపూర్వకంగా డెల్లా దువ్వెనలను కొనుగోలు చేయడానికి తన తండ్రి నుండి అందజేసిన తన అత్యంత విలువైన ఆస్తిని విక్రయిస్తాడు, జిమ్కు డెల్లా మరియు వారి భవిష్యత్తు కుటుంబం తన జీవితంలో అత్యంత ముఖ్యమైనవి అని సూచిస్తూ.

Question 2.
Analyse the character of Della?
Answer:
A Gift for Christmas” is a well-known short story by O. Henry. The original name of the author is William Sydney Porter. This story was first published in 1905.

Della is a beautiful and fashionable women. She had so beautiful hair that it would make the jewels of Queen of Sheba look worthless. She loves her husband and sees a world in him. She is a really caring wife who would do anything for her husband. She even sold her beautiful hair to buy a present for her husband.

ఎ గిఫ్ట్ ఫర్ క్రిస్మస్” అనేది ఓ. హెన్రీ రాసిన చిన్న కథ. రచయిత అసలు పేరు విలియం సిడ్నీ పోర్టర్. ఈ కథ మొదట 1905లో ప్రచురించబడింది.

డెల్లా ఒక అందమైన మరియు ఫ్యాషన్ మహిళల. ఆమె చాలా అందమైన జుట్టును కలిగి ఉంది, అది షెబా రాణి యొక్క ఆభరణాలకు విలువ లేకుండా చేస్తుంది. ఆమె తన భర్తను ప్రేమిస్తుంది మరియు అతనిలో ఒక ప్రపంచాన్ని చూస్తుంది. ఆమె తన భర్త కోసం ఏదైనా చేసే నిజంగా శ్రద్ధగల భార్య. తన భర్తకు కానుక కొనడానికి తన అందమైన జుట్టును కూడా అమ్మేసింది.

TS Inter 2nd Year English Study Material Chapter 12 A Gift for Christmas

Question 3.
Sketch the character of Jim (Revision Test – II)
Answer:
A Gift for Christmas” is a well-known short story by O. Henry. The original name of the author is William Sydney Porter. This story was first published in 1905.

Jim is a thin man of twenty two. He does not have enough income to support his wife. He bears the burden of fulfilling everyday demands of his wife. He is a very punctual person that why he constantly looks at his watch.

ఎ గిఫ్ట్ ఫర్ క్రిస్మస్” అనేది ఓ. హెన్రీ రాసిన చిన్న కథ. రచయిత అసలు పేరు విలియం సిడ్నీ పోర్టర్. ఈ కథ మొదట 1905లో ప్రచురించబడింది.

జిమ్ ఇరవై రెండు సంవత్సరాల సన్నటి మనిషి. భార్యను పోషించేంత ఆదాయం అతనికి లేదు. అతను తన భార్య యొక్క రోజువారీ డిమాండ్లను నెరవేర్చే భారాన్ని మోస్తున్నాడు. అతను చాలా సమయపాలన ఉన్న వ్యక్తి, అతను నిరంతరం తన గడియారం వైపు చూస్తాడు.

Question 4.
‘A Gift for Christmas” is an example of O. Henry’s comic irony. Justify.
Answer:
A Gift for Christmas” is a well-known short story by O. Henry. The original name of the author is William Sydney Porter. This story was first published in1905.

A Gift for Christmas is a classic example of irony in literature. Irony is a literary tech- nique in which an expectation of what is supposed to occur differs greatly from the actual outcome. In this case, Jim and Della sacrifice their most treasured posses- sions so that the other can fully enjoy his or her gift. Jim sells his watch to buy Della’s combs, expecting her to be able to use them. Della sells her hair to buy Jim a chain for his watch. Neither expects the other to have made that sacrifice. The irony here works both on a practical and on a deeper, more sentimental level. Both Della and Jim buy each other a gift that ultimately seems financially foolish. Being poor, they can’t afford to waste money on things they can’t use. However, what they get is something they don’t expect: a more intangible gift that reminds them how much they love each other and are willing to sacrifice to make each other happy.

ఏ గిఫ్ట్ ఫర్ క్రిస్మస్” అనేది ఓ. హెన్రీ రాసిన చిన్న కథ. రచయిత అసలు పేరు విలియం సిడ్నీ పోర్టర్. ఈ కథ మొదట 1905లో ప్రచురించబడింది.

క్రిస్మస్ కోసం బహుమతి అనేది సాహిత్యంలో వ్యంగ్యానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. వ్యంగ్యం అనేది ఒక సాహిత్య సాంకేతికత, దీనిలో ఏమి జరుగుతుందనే అంచనా వాస్తవ ఫలితం నుండి చాలా భిన్నంగా ఉంటుంది. ఈ సందర్భంలో, జిమ్ మరియు డెల్లా వారి అత్యంత విలువైన ఆస్తులను త్యాగం చేస్తారు, తద్వారా మరొకరు అతని లేదా ఆమె బహుమతిని పూర్తిగా ఆనందిస్తారు. జిమ్ డెల్లా యొక్క దువ్వెనలను కొనడానికి తన గడియారాన్ని విక్రయిస్తాడు, ఆమె వాటిని ఉపయోగించగలదని ఆశించాడు. డెల్లా జిమ్ తన వాచ్ కోసం గొలుసు కొనడానికి తన జుట్టును అమ్ముతుంది. మరొకరు ఆ త్యాగం చేసి ఉంటారని ఎవరూ ఊహించరు. ఇక్కడ వ్యంగ్యం ఆచరణాత్మకంగా మరియు లోతైన, మరింత సెంటిమెంట్ స్థాయిలో పనిచేస్తుంది. డెల్లా మరియు జిమ్ ఇద్దరూ ఒకరికొకరు బహుమతిని కొనుగోలు చేస్తారు, అది చివరికి ఆర్థికంగా మూర్ఖంగా కనిపిస్తుంది. పేదవారు కావడంతో వారు ఉపయోగించలేని వస్తువులపై డబ్బును వృథా చేయలేరు. అయినప్పటికీ, వారు పొందేది వారు ఊహించనిది: ఒకరినొకరు ఎంతగా ప్రేమిస్తున్నారో మరియు ఒకరినొకరు సంతోషపెట్టడానికి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారని వారికి గుర్తుచేసే మరింత కనిపించని బహుమతి.

TS Inter 2nd Year English Study Material Chapter 12 A Gift for Christmas

A Gift for Christmas Summary in English

About Author

TS Inter 2nd Year English Study Material Chapter 12 A Gift for Christmas 1

William Sydney Porter (September 11, 1862 – June 5, 1910), better known by his pen name O. Henry, was an American writer known primarily for his short stories, though he also wrote poetry and non-fiction. His works include “The Gift of the Magi”, “The Duplicity of Hargraves”, and “The Ransom of Red Chief”, as well as the novel Cabbages and Kings. Porter’s stories are known for their naturalist observations, witty narration and surprise endings.
Porter’s legacy includes the O. Henry Award, an annual prize awarded to outstanding short stories.

A Gift for Christmas” is a well-known short story by O. Henry. The original name of the author is William Sydney Porter. This story was first published in1905.

The story narrates the life of a young married couple James who is known as Jim and Della Dillingham. The couple lives in a modest apartment. They have only two valuable possessions: Jim’s gold pocket watch that belonged to his grandfather and Della’s long hair that falls almost to her knees.

It is Christmas Eve. Della wants to buy Jim a Christmas present. But, she has only $1.87. When Della looks at herself in the mirror, she suddenly gets an idea. She sells her hair for $20.00. With that money, she buys a platinum chain for $21.00. She is very happy about the present. She thinks that the chain will add beauty to his watch.

When Jim comes home from work, he stares at Della. She prays to God that he should not find the absence of her hair at first sight. She admits that she sold her hair to buy his present. Before she can give it to him, however, Jim pulls a package out of his overcoat pocket and gives it to her. Inside, Della finds a pair of costly decorative hair combs that she admired cnce. Eut, they are now completely useless since she has cut off the hair. Hiding her tears, she holds out her gift for Jim- the watch chain. Jim tells Della that he has sold his watch to buy her present. He asks her to forget about the presents and enjoy Christmas eve saying “They’re too nice to use just at present”.

The story ends with a comparison of Jim and Della’s gifts to the gifts that the A Gift for Christmas the three wise men who visited Baby Jesus. The narrator concludes that Jim and D’ella are far wiser than the Magi because their gifts are gifts of love. Those who give out of love and self-sacrifice are truly the wisest since they know the value love. Their deed is nothing but, as the writer says, “generosity added to love”.

A Gift for Ch is mis is a classic example of irony in literature. The author ends the story with a twist which surprises the readers. Thus, O. Henry illustrates true love in the story A Gift for Christmas.

A Gift for Christmas Summary in Telugu

Note: This summary is only meant for Lesson Reference, not for examination purpose

“ఎ గిఫ్ట్ ఫర్ క్రిస్మస్” అనేది ఓ. హెన్రీ రాసిన చిన్న కథ. రచయిత అసలు పేరు విలియం సిడ్నీ పోర్టర్. ఈ కథ మొదట 1905లో ప్రచురించబడింది.

ఈ కథ జిమ్ మరియు డెల్లా డిల్లింగ్హామ్ అని పిలువబడే యువ వివాహిత జంట జేమ్స్ జీవితాన్ని వివరిస్తుంది. ఈ జంట నిరాడంబరమైన అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. వారి వద్ద కేవలం రెండు విలువైన ఆస్తులు మాత్రమే ఉన్నాయి: జిమ్ తన తాతకు చెందిన బంగారు జేబు గడియారం మరియు దాదాపు మోకాళ్ల వరకు పడిపోయే డెల్లా పొడవాటి జుట్టు.

ఇది క్రిస్మస్ ఈవ్. డెల్లా జిమ్కి క్రిస్మస్ కానుకను కొనాలనుకుంటోంది. కానీ, ఆమె వద్ద $1.87 మాత్రమే ఉంది. డెల్లా అద్దంలో తనను తాను చూసుకున్నప్పుడు, ఆమెకు అకస్మాత్తుగా ఒక ఆలోచన వస్తుంది. ఆమె తన జుట్టును $20.00కి అమ్ముతుంది. ఆ డబ్బుతో, ఆమె ప్లాటినం చైన్ని $21.00కి కొనుగోలు చేసింది. ఆమె వర్తమానం గురించి చాలా సంతోషంగా ఉంది. ఆ గొలుసు అతని వాచీకి అందం చేకూరుస్తుందని ఆమె అనుకుంటోంది.

జిమ్ పని నుండి ఇంటికి వచ్చినప్పుడు, అతను డెల్లా వైపు చూస్తూ ఉంటాడు. మొదటి చూపులో తన జుట్టు లేకపోవడం అతనికి కనిపించకూడదని ఆమె దేవుడిని ప్రార్థిస్తుంది. అతని బహుమతిని కొనడానికి తన జుట్టును అమ్మినట్లు ఆమె అంగీకరించింది. అయితే, ఆమె అతనికి ఇవ్వడానికి ముందు, జిమ్ తన ఓవర్ కోట్ జేబులోంచి ఒక ప్యాకేజీని తీసి ఆమెకు ఇచ్చాడు. లోపల, డెల్లా ఒకప్పుడు మెచ్చుకున్న ఒక జత ఖరీదైన అలంకార జుట్టు దువ్వెనలను కనుగొంటుంది. కానీ, ఆమె జుట్టు కత్తిరించినందున అవి ఇప్పుడు పూర్తిగా పనికిరావు. తన కన్నీళ్లను దాచిపెట్టి, ఆమె జిమ్- వాచ్ చైన్ కోసం తన బహుమతిని అందజేస్తుంది. జిమ్ డెల్లాకు బహుమతిగా కొనడానికి తన గడియారాన్ని అమ్మినట్లు చెప్పాడు. బహుమతుల గురించి మరచిపోయి, “ప్రస్తుతం వాటిని ఉపయోగించడం చాలా బాగుంది” అని క్రిస్మస్ సందర్భంగా ఆనందించమని అతను ఆమెను అడుగుతాడు.

జిమ్ మరియు డెల్లా యొక్క బహుమతులను, క్రిస్మస్ బహుమతిగా బేబీ జీసస్ను సందర్శించిన ముగ్గురు జ్ఞానులు బహుమతులతో పోల్చడంతో కథ ముగుస్తుంది. జిమ్ మరియు డెల్లా మాగీల కంటే చాలా తెలివైనవారని కథకుడు ముగించారు ఎందుకంటే వారి బహుమతులు ప్రేమ బహుమతులు. ప్రేమ మరియు ఆత్మత్యాగంతో ఇచ్చే వారు నిజంగా తెలివైనవారు, ఎందుకంటే వారికి ప్రేమ విలువ తెలుసు. వారి దస్తావేజు మరొకటి కాదు, రచయిత చెప్పినట్లుగా, “ప్రేమకు దాతృత్వం జోడించబడింది”.

క్రిస్మస్ కోసం బహుమతి అనేది సాహిత్యంలో వ్యంగ్యానికి ఒక అద్భుమైన ఉదాహరణ. పాఠకులను ఆశ్చర్యపరిచే ట్విస్ట్లో రచయిత కథను ముగించారు. ఈ విధంగా, ఓ. హెన్రీ ఎ గిఫ్ట్ ఫర్ క్రిస్మస్ కథలో నిజమైన ప్రేమను వివరిస్తాడు.

A Gift for Christmas Summary in Hindi

Note: This summary is only meant for Lesson Reference, not for examination purpose

‘ए गिफ़्ट ऑफ़ क्रिसमस’ एक प्रसिद्ध लघु कथा है, जो ओ. हेनवी द्वारा लिखित है । यह कहानी पहली बार 1905 में प्रकाशित हुई थी ।

यह कहानी एक युवा विवाहित जोड़े जेम्स के जीवन का वर्णन करती हैं जिसे जिम और डेला डिलिंघम के नाम से जाना जाता है । दंपति एक मामूली अपार्टमेंट में वहते हैं । उनके पास केवल मूल्यवान संपत्तियाँ हैं : जिम के सोने की जेब घड़ी जो उनके दादाजी की थी और डेला के लंबे केश जो लगभग उसके घूटनों तक गिरते हैं ।

यह क्रिस्मस की पूर्व संध्या है । डेला जिम को क्रिस्मस का उपहार खरीदना चाहती है । लेकिन उसके पास $ 1.87 है । जब डेला खुद को आईने में देखती है, तो उसे अचानक एक विचार आता है । वह अपने केशों को $ 20.00 में बेचती है। उस पैसे से वह 21.00 डॉलर में एक प्लैटिनम चेन खरीदती है । वह उपहार के लेकर बहुत खुश है । वह सोचती है कि चेन उसकी घड़ी की सुंदरता में चार चांद लगा देगी ।

जब जिम काम से घर आता है, तो वह डेली को देखता है । वह भगवान से प्रार्थना करती है कि पहली नजर में जिम डेला के केशों की अनुपस्थिति न पहचाने। वह स्वीकार करती है कि उसने अपने उपहार खरीदने के लिए अपने केश बेचे । इससे पहले कि वह उसे दे पाती, जिम अपने ओवर कोट की जेब से एक पैकेट निकालता है और उसे देता है। पैकेट के अंदर डेला को एक मूल्यवान जोड़ा मिलता हैं । पहली नजर में इसके केशों की अनुपस्थिति | वह स्वीकार करती है कि उसने अपना उपहार खरीदने के लिए अपने बाल बेचे । इसने पहले कि वह उसे दे पाती, हालांकि, जिम अपने ओवरकोट की जेब से एक पैकेज निकालता है और उसे देता है। उसके अंदर डेला को मूल्यवान केशों की सजावटी कंघी की जोड़ी मिलती है । जिसकी उसने एक बार प्रशंसा की थी । लेकिने वे अब पूवी तरह से बेकार हैं क्यों कि उसने केश काट दिए हैं |

अपने आँसुओं को छिपाते हुए, वह जिम के लिए अपना उपहार रखती है – घड़ी की चेन । जिम डेला को बताता है कि उसने उसे उपहार खरीदने के लिए अपनी घड़ी बेच दी है । वह उसे उपबरों के बारे में भूल जाने और क्रिस्मस की पूर्व संध्या का आनंद लेने के लिए कहता है, “वे अभी उपयोग करने के लिए बहुत अच्छे साथ समाप्त होती है, जो कि क्रिस्मस के हैं ।” कहानी जिम और डेला के उपहारों की तुलना के लिए एक उपहार तीन बुद्धिमान पुरुष जो बेबी जीसस का दोरा करते थे । वशकार ने निष्कर्ष निकालता है कि जिम और उपहार प्रेम के उपहार हैं। जो लोग प्रेम और आत्म – बलिदान से देते हैं, वे वास्तव में सब से बुद्धिमान हैं क्यों कि वे प्रेम का मूल्य जानते हैं । उनका काम कुछ भी नहीं है । लेकिन, जैसा कि लेखक कहते हैं, “उदारता जुड़ गई प्यार से”

‘क्रिस्मस के लिए एक उपहार’ साहित्य में बिडंबना का एक उत्कृष्ट उदाहरण है । लेखक कहानी का अंत एक ऐसे ट्विस्ट के साथ करता है जो पाठकों को हरान कर देता है । इस प्रकार ओ. हेमरी ‘ए गिफ़्ट फ़र क्रिस्मस’ कहानी में सच्चें प्यार का चित्रण रकते हैं ।

Meanings and Explanations

dollar (n) / (డాలర్) / ‘dɒl.ər : a monetary unit of the US – US: všL KIS v265 अमरिका की मौद्रिक इकाई

cent (n)/(సెంట్)/sent : a monetary unit equal to one hundredth of a dollar
-ఒక డాలర్లో వందవ వంతుకు సమానమైన ద్రవ్య యూనిట్
एक डॉलर के सौवें हिस्से के बराबर एक मौद्रिक इकाई

couch (n)/(కౌచ్) / kaʊtʃ : a long upholstered piece of furniture for several people to sit on – అనేక మంది వ్యక్తులు కూర్చోవడానికి ఒక పొడవైన అప్రోల్స్టర్డ్ ఫర్నిచర్, कई लोगों के बैटने के लिए फ़र्नीचर के सोफ़े का एक हिस्सा

furnished (adj) / (ఫ (ర్)నిష్ ట్) / ‘f3:.nɪʃt : (of accommodation) with furniture -ఫర్నిచర్తో అమర్చిన వసతి, फ़नीचिर से सुसज्जित

TS Inter 2nd Year English Study Material Chapter 12 A Gift for Christmas

dully (adv)/dalli/(డల్లి)/ ‘dʌl.li : excitement – ఉత్సాహం, निरुत्साह

looking-glass (n)/(లుకింగ్ గ్లాస్)/ ‘lʊk.ɪŋ, a mirror, ఒక అద్ధం, एक दर्पण

expenses (n-pl) / (ఎక్స్ పెన్స్)/ik’spens : money needed or used to do or buy something డబ్బు అవసరం లేదా ఏదైనా చేయడానికి లేదా కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తారు, कुछ खरीदने, या करने के लिए उपयोग किस जाता है

worthy (adj) / (వర్తి)/ ‘w3:.ði : suitable for or characteristic of something – దేనికైనా అనుకూలం లేదా లక్షణం, किसी चीज के लिए उपयुक्त था उसकी विशेषता के लिए

lost its colour (phrase) : became pale – లేతగా మారింది, पीला हो जाना

rapidly (adv)/(ర్యాపిడ్ లి)/’ræp.ɪd.li : very quickly; at a great rate a grey cat walking on a grey fence; an expression to state one is staring – చాలా త్వరగా; గొప్ప రేటుతో బూడిద కంచె మీద నడిచే బూడిద పిల్లి; ఒక వ్యక్తి తదేకంగా చూస్తున్నట్లు చెప్పడానికి ఒక వ్యక్తీకరణ बहुत तेजी से, बहुत रफ़्तार से

in a grey background : at nothing; a state of blankness or desperation ఏమీ లేదు; ఖాళీ లేదా నిరాశ స్థితి, एक अभिव्यक्ति यह बताने के लिए है कि कुछ भी नही देख रहा है । खालीपन या हताश की स्थिति

possession (n) / (పజె షన్ జ్) / pəzeʃ.ən, a thing owned-ఒక వస్తువు స్వ౦తం, स्वामित्ववाली वस्तु

pride (n) / (ఫ్రైడ్) / praɪd a feeling or deep pleasure or satisfaction derived from one’s own achievements – ఒకరి స్వ౦త విజయాల నుండి పొందిన అనుభూతి లేదా లోతైన ఆనందం లేదా సంతృప్తి एक भावना या गहरा आनंद था संतुस्ट जो स्वयं से प्राप्त होती है

faltered (v-pt)/(ఫోల్ ట (ర్)డ్)/ ‘fɒl.tər : became weaker – బలహీనంగా మారింది, कमजोर हो गया

fluttered (v-pt)/(ఫ్లట(ర్)డ్)/ ‘flʌt.ər : moved with a light irregular or trembling motion – తేలికపాటి సక్రమంగా లేదా వణుకుతున్న కదలికతో కదిలింది, एक हलकी अनिभमित या कंपन के साथ चली गई गति

cascade (n)/(క్యాస్ కె ఇడ్)/kæs’keɪd : large amount of something like hair falling down – వెంట్రుకలు రాలడం వంటి వాటి మొత్తం, बालों के गिरने जैसी किली चीज की एक बदी मात्रा

nervous (adj) / (నర్వస్)/ tense /’n3:vəs : anxious – ఆతృతగా, तनावग्रस्त स्थिति

burdened (v-pt)/(బర్డెన్ డ్)//b3:dən : loaded heavily, difficult to bear – భారంగా లోడ్ చేయబడింది, భరించడం కష్టం भारी भरी हुई, मुश्किल से सहना

stared (v-pt) /(స్టార్డ్)/ steər : looked fixedly or vacantly at someone or something with one’s eyes wide open, లేదా దేనినైనా కళ్ళు పెద్దవి చేసి చూసారు, निश्चित रूप से यारिक्त रूप से किसी को देखा गया
थार खुली आँखों से किसी को देखा गया

TS Inter 2nd Year English Study Material Chapter 12 A Gift for Christmas

strange (adj)/(స్ట్రెంజ్) / streɪndʒ : unusual or surprising – అసాధారణమైన లేదా ఆశ్చర్యకరమైన, असामान्य या आश्चर्यजनक

expression (n) / (ఎక్స్ ప్రెషన్)/ ik’spreʃ.ən : a look on someone’s face that conveys a particular emotion – ఒక నిర్దిష్ట భావోద్వేగాన్ని తెలియజేసే వ్యక్తి ముఖం, किसी के चेहरे पर एक नज़र जो बता देती है, एक विशेष भावना

cut off (phrase)/(కట్ ఆఫ్) / kʌt.ɒf : remove something using a sharp tool- పదునైన సాధనాన్ని ఉపయోగించి ఏదైనా తీసివేయండి, किसी नुकीले उपकरण का उपयोग करके किसी चीज़ को हटाना

remembered (v-pt) / remembered (రిమెంబర్డ్)/ ri’mem.bər : recalled-గుర్తుచేసుకున్నారు, कोयाद किया

TS Inter 1st Year History Study Material Chapter 5 గుప్తుల యుగం

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 5th Lesson గుప్తుల యుగం Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 5th Lesson గుప్తుల యుగం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సముద్రగుప్తుని సైనిక విజయాలను తెలపండి.
జవాబు.
గుప్త చక్రవర్తులలో సముద్రగుప్తుడు అగ్రగణ్యుడు. సముద్రగుప్తుని విజయాలను, వ్యక్తిత్వాన్ని అతడు జారీచేసిన శాసనాల ఆధారంగా తెలుసుకోవచ్చు. సముద్రగుప్తుడు మొదటి చంద్రగుప్తుడు, కుమారదేవీలకు జన్మించాడు. సైనిక విజయాలు: సముద్రగుప్తుడు గొప్ప విజేత. విదేశీదాస్యం నుంచి భారతదేశానికి విముక్తిని కలిగించి భారతదేశమంతటిని ఒకే పాలన క్రిందకు తీసుకురావాలని ఇతడు ఆశించాడు. ఇతని ఆస్థాన పండితుడు, సేనాపతి అయిన హరిసేనుడు అలహాబాద్లో అశోక స్తంభం మీద వ్రాయించిన “అలహాబాద్ ప్రశస్థి” .ద్వారా ఇతని సైనిక విజయాలను తెలుసుకోవచ్చు. దీని ప్రకారం సముద్రగుప్తుని విజయాలను మూడు భాగాలుగా విభజించవచ్చు.
అవి:

  1. మొదటి ఆర్యావర్త విజయాలు
  2. దక్షిణభారత విజయాలు
  3. రెండో ఆర్యావర్త విజయాలు.

1) మొదటి ఆర్యావర్త విజయాలు: సింహాసనాన్ని అధిష్టించిన వెంటనే సముద్రగుప్తుడు తన అధికారాన్ని ధిక్కరించిన ఉత్తర భారతంలోని రాజులను జయించి పాటలీపుత్రంలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఈ యుద్ధాల్లో సముద్రగుప్తుడు ఓడించిన రాజులు: అహిచ్ఛత్రాన్ని పాలిస్తున్న అచ్యుతుడు, గ్వాలియర్ సమీపంలో పద్మావతీపురాన్ని పాలిస్తున్న నాగసేనుడు, మధురాపురాధీశుడైన గణపతి నాగుడు, ఇంకా చంద్రవర్మ, రుద్రదేవ వంటి మొత్తం ‘ మంది రాజులను అణచి సముద్రగుప్తుడు తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇతని పరాక్రమాన్ని గుర్తించి సP రాజ్యాలైన సమతట, కామరూప, నేపాల్, దావక, కర్రిపుర మొదలైన రాజ్యపాలకులు సముద్రగుప్తుడితో మైత్రి చేసుకున్నారు. మాళవ, యౌధేయ, అభీర వంటి గణరాజ్యాలు ఇతని ఆధిపత్యాన్ని అంగీకరించాయి. ఈ విజయాల ఫలితంగా ఇతని సామ్రాజ్యం హిమాలయాల నుంచి ‘భిల్సా’ వరకు, పంజాబ్ నుంచి బెంగాల్ వరకు విస్తరించింది.

TS Inter 1st Year History Study Material Chapter 5 గుప్తుల యుగం

2) దక్షిణ భారత విజయాలు: మొదటి ఆర్యావర్త యుద్ధాల తరువాత సముద్రగుప్తుడు దక్షిణభారతంపై దండెత్తాడు. ఈ దండయాత్రలో సముద్రగుప్తుడు 12 మంది రాజ్యపాలకులను ఓడించి వారి రాజ్యాలను తిరిగి వారికే అప్పగించాడు. ఆ పాలకులు: 1) కోసల పాలకుడైన మహేంద్రరాజు 2) మహాకాంతార పాలకుడైన వ్యాఘ్రరాజు 3) ఏరండపల్లి దమనుడు 4) పిష్టపుర రాజు మహేంద్రుడు 5) కొత్తూరును పాలించే స్వామిదత్తుడు 6) దేవరాష్ట్ర పాలకుడైన కుబేరుడు 7) వేంగి పాలకుడైన హస్తివర్మ 8) పాలక్క రాజైన ఉగ్రసేనుడు 9) కేరళ రాజ్యాన్ని పాలించే మంత్రరాజు 10) కుశస్థలపురం పాలకుడు ధనంజయుడు 11) అవముక్త పాలకుడు నీలరాజు 12) కంచిని పాలించిన విష్ణుగోపుడు.
సముద్రగుప్తుని ఈ దండయాత్ర మార్గాన్ని గురించి చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

3) రెండో ఆర్యావర్త విజయాలు: సముద్రగుప్తుడు దక్షిణ భారత విజయాల్లో మునిగివున్న సమయంలో ఉత్తరభారతంలోని రాజులు వాకాటక రాజు రుద్రసేనుని నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. సముద్రగుప్తుడు వారిని “కౌశాంబి” యుద్ధంలో ఓడించి, అశ్వమేధయాగాన్ని చేసి సామ్రాట్టుగా ప్రకటించుకున్నాడు. ఈ విజయాలను గుర్తించి మధ్యభారతంలోని అనేక అటవీ రాజ్యాల అధిపతులు ఇతని ఆధిపత్యాన్ని అంగీకరించారు.

ఇట్టి విజయ పరంపరల వలన చరిత్రకారులు సముద్రగుప్తుని ఇండియన్ నెపోలియన్ అని కీర్తించారు.
ఇతర దేశాలతో సంబంధాలు: విజేతగా సముద్రగుప్తుడి కీర్తి, ప్రతిష్టలు విదేశాలకు కూడా వ్యాపించాయి. అనేకమంది విదేశీరాజులు ఇతనితో దౌత్య సంబంధాలనేర్పరుచుకొన్నారు. సింహళరాజైన మేఘవర్ణుడు క్రీ.శ. 851లో ఇతని ఆస్థానానికి రాయబారులను, కానుకలను పంపడమే కాకుండా తన దేశం నుంచి భారతదేశం వచ్చే బౌద్ధ యాత్రికుల కోసం బుద్ధగయ సమీపంలో ఒక విహారాన్ని నిర్మింపజేశాడు.

ప్రశ్న 2.
గుప్తుల పరిపాలనా ముఖ్యాంశాలను వెలికితీయండి.
జవాబు.
భారతదేశ చరిత్రలో గుప్తుల యుగం స్వర్ణయుగంగా భావించబడింది. గుప్తుల పాలనలో ప్రధానాంశాలు.

కేంద్రపాలన:
చక్రవర్తి: కేంద్రపాలనలో చక్రవర్తి అత్యున్నత అధికారి. రాజును దైవాంశ సంభూతుడిగా భావించేవారు. ‘అలహాబాద్ ప్రశస్తి’ సముద్రగుప్తుడిని దేవుడిగా వర్ణించింది. చక్రవర్తికి అపరిమిత అధికారాలున్నాయి. గవర్నర్లు, ఇతర పౌర అధికారులను అతనే నియమిస్తాడు. వారందరూ చక్రవర్తికి జవాబుదారీగా ఉండేవారు.

మంత్రులు: పాలనా వ్యవహారాలలో మంత్రుల కూటమి చక్రవర్తికి సహాయపడుతుంది. వీరిని ‘మంత్రులు’ లేదా ‘సచివులు’ అంటారు. మంత్రులు వారికి కేటాయించిన శాఖల బాధ్యతలు నిర్వర్తించేవారు.

ఇతర అధికారులు: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పరగణాలకు, జిల్లాలకు ప్రత్యేక దూతల ద్వారా తెలిపే అధికారి సర్వాధ్యక్షుడు. సైన్యంపై అధికారాలను కలిగిన మంత్రి ‘మహాసేనాపతి’. మహాదండనాయకుడు, ప్రధాన న్యాయమూర్తి, విదేశీ వ్యవహారాలు, ‘మహాసంధి విగ్రహకుడు’ నిర్వహిస్తాడు. భాండాగారాధికృత అనే అధికారి ప్రభుత్వ ఖజానాధికారి. వీరేగాక ప్రతీహారులు, రాజసన్యాసులు, కుమారామాత్యుడు, ఇలా అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించేవారు. రాష్ట్రపాలన: పరిపాలనా సౌలభ్యం కోసం గుప్తులు తమ విశాలమైన రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించారు. రాష్ట్ర విభాగాలను ‘దేశ’ లేదా ‘భుక్తి’ అంటారు. ‘భుక్తి’ పాలకుడిని ఉపరికుడు అంటారు. యువరాజుకాని, రాజకుటుంబీకులు కాని ఉపరికులుగా నియమింపబడతారు. రాష్ట్రాలను మరల జిల్లాలుగా విభజించారు. వాటిని ‘? చూలు’ అంటారు. ‘విషయ’ పాలనాధికారిని ‘విషయపతి’ అంటారు. డా॥ ఎ.యస్. ఆల్టేకర్ చెప్పినట్లు ప్రభ వికేంద్రీకరించబడింది. చాలావరకు జిల్లా పాలనకు విధులు బదిలీ చేయబడ్డాయి.

పాలనాపరంగా ప్రాంతీయ పాలన: గుప్తుల కాలంలో ప్రాంతీయ పాలన రెండు రకాలుగా అభివృద్ధి చెందింది. 1. మునిసిపల్ లేదా నగర పాలన 2. గ్రామీణ పాలన. నేటి ప్రధాన నగరాలైన పాటలీపుత్ర, తక్షశిల, మండసార్, ఉజ్జయినిలలో నగర పాలన ఉండేది. నగరపాలనను విషయపతి నిర్వహిస్తాడు. ఆరోగ్యం, పరిశుభ్రత, ప్రాథమిక విద్య మొదలైనవి ‘పరిషత్’ కున్న ప్రధాన విధులు.

గ్రామం పరిపాలనలో అతి చిన్న విభాగం. గ్రామ పాలనను నిర్వహించడానికి ‘గ్రామికుడు’లేదా గ్రామాధ్యక్షుడు నియమించబడ్డాడు. గ్రామ రక్షణ, శాంతిభద్రతలు ఇతడి ప్రధాన విధులు. గ్రామాధ్యక్షుడికి సహాయంగా ‘పంచ మండలం’ అనే సభ ఉంటుంది. గ్రామ పెద్దలతో ఈ సంఘం ఏర్పడుతుంది.

న్యాయపాలన: చక్రవర్తి అత్యున్నత న్యాయాధికారి. గ్రామస్థాయి నుంచి ఉన్నత న్యాయస్థానాల వరకు ఉండేవి. ` ప్రధాన న్యాయమూర్తిని మహాదండనాయకుడు అంటారు. ఫాహియాన్ రచనలలో న్యాయవ్యవస్థ వివరాలు ఉన్నాయి. నాడు చట్టాలు సరళంగా ఉండేవి. శిక్షలు కూడా సాధారణంగా ఉండేవి.

సైనికపాలన: గుప్త పాలకులకు బలమైన సైన్యం ఉండేది. గజబలం, అశ్వికబలం, కాల్బలం ఉండేవి. రథాలు కూడా ఉండేవి. ఎడారి ప్రాంతాల్లో ఒంటెలు కూడా వాడారు. సైన్యంలో ప్రధాన అధికారి ‘మహాసేనాధిపతి’, ‘రణభాండాగారాధికరణ’ సైనికులకు అవసరమయ్యే ఏర్పాట్లు చేసేవారు. అలహాబాద్ స్తంభ శాసనంలో వారు వాడిన ఆయుధాల వివరాలు తెలియజేయబడ్డాయి.

ప్రశ్న 3.
గుప్తులు సాహిత్యం, మతాభివృద్ధికి చేసిన సేవను వివరించండి.
జవాబు.
ప్రాచీన భారతదేశ చరిత్రలో గుప్తుల కాలాన్ని స్వర్ణయుగమంటారు. ఈ కాలాన్ని గ్రీస్ చరిత్రలోని పెరిక్లిస్ యుగంతోను, రోమన్ చరిత్రలోని అగస్టస్ యుగంతోను పోలుస్తారు. ఈ యుగంలో భారతదేశం అన్ని రంగాల్లోను అభివృద్ధిని సాధించింది.

రాజకీయ ఐక్యత: గుప్తపాలకులు ఉత్తర భారతదేశాన్ని అనైక్యత నుండి కాపాడి, దేశ సమైక్యతను సాధించారు. మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, చంద్రగుప్త విక్రమాదిత్యుడు మొదలగు పాలకులు తమ దిగ్విజయ యాత్రల ద్వారా దేశ రాజకీయ ఏకీకరణను సాధించారు.

విజ్ఞులైన చక్రవర్తులు: గుప్త చక్రవర్తులు సమర్థులు, పండితులు, శూరులు. వీరిలో సముద్రగుప్తుడు అగ్రగణ్యుడు. ఇతడు అజేయుడైన వీరుడే కాక మంచి కవి కూడా. గుప్త చక్రవర్తులందరూ మత సహనమును పాటించారు. వీరి వ్యక్తిగత ప్రతిభాసంపత్తి గుప్తయుగము స్వర్ణయుగము కావటానికి దోహదపడింది.

ఆర్థికాభివృద్ధి: గుప్తుల సమర్థవంతమైన పాలన వలన రాజ్యంలో సుఖశాంతులు ఏర్పడి ఆర్థికాభివృద్ధి జరిగింది. ప్రజలు సంపన్నులై, సంతోషంగా జీవించేవారని ఫాహియాన్ పేర్కొన్నాడు. శిక్షలు స్వల్పంగా ఉండేవి. బాటసారులకు దొంగల భయం లేకుండా ఉండేది. స్వదేశీ, విదేశీ వాణిజ్యం పురోగమించుటచే దేశసంపద పెరిగింది. పరిశ్రమలు వర్ధిల్లాయి. వ్యవసాయమునకు మంచి ప్రోత్సాహం లభించింది.

మతసామరస్యము:
ఎ) గుప్త చక్రవర్తులు హిందువులవటంతో అశ్వమేథము మొదలగు వైదిక కర్మలను ఆచరించారు. త్రిమూర్తులకు ప్రాధాన్యతనిచ్చారు. గుప్తుల ఇష్టదైవం విష్ణువు కనుక విష్ణుపురాణం, విష్ణుస్మృతి, భాగవతం మున్నగు గ్రంథములు ఆదరింపబడ్డాయి. శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి మున్నగు దేవతలను కూడా వీరు పూజించారు. ఈ కాలంలో సగుణోపాసనకు ప్రాముఖ్యం పెరిగింది.

బి) తాము వైదిక మతమును అవలంబించినప్పటికి గుప్త చక్రవర్తులు జైన, బౌద్ధమతముల యెడల అపారమైన సహనాన్ని పాటించారు. ప్రసిద్ధ బౌద్ధపండితుడైన వసుబంధుని సముద్రగుప్తుడు ఆదరించాడు. సింహళ ప్రభువు మేఘవర్ణుడు భారతదేశములో బౌద్ధవిహారము నిర్మించుటకు ఇతడు అనుమతించాడు. కుమారగుప్తుడు నలందా బౌద్ధ విశ్వవిద్యాలయమును స్థాపించాడు. నాటి బౌద్ధ, జైన ప్రతిమలు అసంఖ్యాకముగా లభించుటయే గుప్తుల మత సహనమునకు తార్కాణం. కాలక్రమేణా బౌద్ధమతం క్షీణించింది. మహాయాన బౌద్ధమతము హిందూమత శాఖవలె తోచుటయే ఇందుకు కారణం. జైనమతం మాత్రమే కొన్ని ప్రాంతాలలో కొనసాగింది. గుప్తులు ఉన్నత ఉద్యోగాలలో మత ప్రమేయం లేకుండా బౌద్ధులను, జైనులను నియమించారు.

సారస్వతాభివృద్ధి: గుప్తుల కాలంలో సంస్కృత భాష పూర్తి వికాసాన్ని పొందింది. సముద్రగుప్తుడు స్వయంగా కవి. “కవిరాజు” అను బిరుదాంకితుడు. సముద్రగుప్తుని సేనాని హరిసేనుడు అలహాదాబ్ ప్రశస్థి శాసనాన్ని వ్రాశాడు. రెండో చంద్రగుప్తుని ఆస్థానంలో ‘నవరత్నాలు’ అనే కవులుండేవారు. వారు

  1. కాళిదాసు
  2. అమరసింహుడు
  3. శంకు
  4. ధన్వంతరి
  5. క్షపణికుడు
  6. బేతాళభట్టు
  7. ఘటకర్షకుడు
  8. వరరుచి
  9. వరాహమిహిరుడు.

కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతల’మనే కావ్యం అనేక ప్రపంచ భాషల్లోకి అనువదించబడింది. ‘మృచ్ఛకటికం’ నాటకాన్ని రచించిన శూద్రకుడు ఈ కాలంవాడే. నాడు వసుబంధు, దిజ్ఞాగుడు, బుద్ధపాలితుడు, భావవివేకుడు వంటి. బౌద్ధ రచయితలు నిరుపమానమైన రచనలు చేశారు. ఈ రచనల ద్వారా ఆనాటి రాజాస్థాన జీవితం, ప్రభువర్గాల జీవన విధానం గురించి తెలుస్తుంది.

విజ్ఞాన శాస్త్రాభివృద్ధి: విజ్ఞానశాస్త్రంలో కూడా గుప్తుల కాలం అద్భుతమైన ప్రగతిని సాధించింది. ఆర్యభట్టు ‘సూర్యసిద్ధాంత’మనే గ్రంథాన్ని, వరాహ మిహిరుడు ‘బృహత్సంహిత’ అనే గ్రంథాన్ని రచించారు. బ్రహ్మ గుప్తుడు గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టి తన పుస్తకం ద్వారా దానిని లోకానికి వెల్లడి చేశాడు. వైద్యశాస్త్రాభివృద్ధికి విశేషంగా కృషిచేసిన శుశ్రుతుడు, వాగ్భటుడు, ధన్వంతరి మొదలైనవారు గుప్తుల కాలంవారే.

కళాభివృద్ధి: గుప్తుల కాలంలో కళలు కూడా పరాకాష్టనందుకొన్నాయి. ఈ కాలంలో జరిగిన నిర్మాణాలన్నీ మతం వలన ప్రేరేపితమైనవే. ఉదాహరణకు దేవఘర్లోని దశావతార దేవాలయం, తిగావా, భూమారా ఆలయాలు, సాంచి, సారనాథ్ లోని బౌద్ధాలయాలు ఈ కాలంలో వాస్తుకళ సాధించిన ప్రగతికి నిదర్శనాలు. గుప్తుల కాలంలో శిల్పకళ కూడా పరిపక్వతను పొందింది. అజంతా గుహల్లోని కొన్ని కుడ్యచిత్రాలు ఈ కాలానికి చెందినవే. లోహాలతో విగ్రహాలను, ఉక్కుతో స్తంభాలను పోతపోయడంలోను, రకరకాల అందమైన నాణాల తయారీలో కూడా గుప్తయుగం తన ప్రత్యేకతను నిలబెట్టుకొంది.

ముగింపు: గుప్తుల యుగం భారతదేశ చరిత్రలో ఒక విశిష్టయుగం. ఈ విశిష్టత ప్రధానంగా సాహిత్యం, విజ్ఞానశాస్త్రాలు కళారంగాలలో కనిపిస్తుంది.

TS Inter 1st Year History Study Material Chapter 5 గుప్తుల యుగం

ప్రశ్న 4.
హర్షవర్ధనుని అంచనా వేయండి.
జవాబు.
గుప్త సామ్రాజ్య పతనానంతరం ఉత్తర భారతదేశం అనేక చిన్న స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయింది. పాటిలో ఒకటి స్థానేశ్వర రాజ్యం. స్థానేశ్వరాన్ని పాలించిన పుష్యభూతి వంశస్థులలో హర్షుడు ప్రముఖుడు. ఇతను క్రీ.శ. 606 – 647 వరకు రాజ్యపాలన చేస్తాడు. తన దండయాత్రలతో ఉత్తర భారత రాజకీయ ఏకీకరణ సాధించాడు.

చారిత్రక ఆధారాలు: బాణుడి హర్షచరిత్ర, హుయాన్ త్సాంగ్ రచించిన సీ- యు- కి హర్షుని శాసనాలు ముఖ్య ఆధారాలు. హర్షుడు రచించిన నాటకాల ద్వారా నాటి సాంఘిక పరిస్థితిని అంచనా వేయవచ్చు.

తొలి విజయాలు: తండ్రీ, సోదరుల మరణానంతరం క్రీ.శ. 606లో హర్షుడు తన పదహారవ ఏట రాజ్య సింహాసనాన్ని రాజపుత్ర’ అనే బిరుదుతో అధిష్టించాడు. సింహాసనానికి వచ్చిన వెంటనే హర్షుడు కామరూప దేశాధిపతి భాస్కరవర్మతో మైత్రిని పొంది, తరువాత మాళవ, గౌడాధీశులను శిక్షించాడు. ఆత్మహత్య చేసుకోబోతున్న సోదరి రాజ్యశ్రీని కాపాడుకున్నాడు. కనోజ్ మంత్రివర్గ విన్నపం మేరకు స్థానేశ్వర, కనోజ్ రాజ్యాలను కలిపి ‘కనోజ్ రాజధానిగా పాలించాడు. “శీలాదిత్య” అనే బిరుదు ధరించాడు. క్రీ.శ. 606 నుండి 647 వరకు పరిపాలించాడు.

జైత్రయాత్రలు: హర్షుడు విశాల సైన్యాన్ని సమకూర్చుకుని ఆరు సంవత్సరాల పాటు చేసిన దిగ్విజయ యాత్రలలో మాళవరాజ్యం, వల్లభి, వంగ, మగధ, గంజామ్ ప్రాంతాలను జయించాడు.

ఓటమి: హర్షుని జీవితంలో చూసిన ఏకైక ఓటమి రెండవ పులకేశి చేతిలో ఓటమి ఉత్తరాపథాన్ని జయించిన హర్షవర్ధనుడు దక్షిణాపథాన్ని జయించాలనుకున్నాడు. కానీ పశ్చిమ చాళుక్యరాజైన రెండవ పులకేశి, హర్షుని నర్మదానదీ తీరంలో ఓడించి వెనుకకు మళ్ళించాడు. నర్మద రెండు రాజ్యాలకు సరిహద్దు అయిందని రెండవ పులకేశి ఐహోల్ శాసనం వలన తెలుస్తుంది. ఈ విధంగా హర్షవర్ధనుడు ఆర్యవర్తానికి చక్రవర్తిగా ఉన్నాడనీ ‘సకలోత్తరపధేశ్వరుని’గా ఐహోల్ శాసనం పేర్కొనటం వలన తెలుస్తుంది.
పాలన: హర్షుడు సమర్థుడైన పాలకుడు. ప్రజా సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపాడు. హర్షుడు విరామమెరుగక రాజ్యభారాన్ని నిర్వహించేవాడని హుయాన్ త్సాంగ్ వ్రాశాడు. పండిన పంటలో 6వ వంతును మాత్రమే పన్నుగా వసూలు చేసాడు. హర్షుని శిక్షాస్మృతి కఠినంగా ఉండేది. నేరాలు అధికంగా ఉండేవని తెలుస్తుంది.

మహామోక్ష పరిషత్: దానధర్మాలలో అశోకునికి సాటిరాగల చక్రవర్తి. ప్రయాగలో మహామోక్ష పరిషత్ ఐదేండ్లకొకసారి జరిపి తన ఖజానాలోని సర్వాన్ని దానం చేసేవాడని, తాను ఆరవ మహామోక్ష పరిషత్కు హాజరయ్యానని హుయాన్త్సాంగ్ రాసుకున్నాడు. ఇందు మొదటిరోజు బుద్ధుని, రెండవరోజు సూర్యుని, మూడవరోజు శివుని పూజించి ఐదు లక్షల జనులకు దానధర్మాలు చేసాడు.

సారస్వత పోషణ: హర్షుడు నలంద విశ్వవిద్యాలయానికి 100 గ్రామాలను దానం చేసాడు. స్వయంగా కవి. రత్నావళి, నాగానందం, ప్రియదర్శిక అనే నాటకాలు రచించాడు. బాణుడు, భర్తృహరి, మయూమడు, మతంగ దివాకరుడు ఇతని ఆస్థాన కవులు, ఉత్తర భారతదేశాన్ని పాలించిన ఆఖరు చక్రవర్తి హర్షుడు. ఇతడు బ: ముఖ ప్రజ్ఞాశాలి.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
చంద్రగుప్తు విక్రమాదిత్యుని విజయాలపై ఒక లఘు వ్యాసం రాయండి.
జవాబు.
విక్రమాదిత్యునిగా పేరుగాంచిన రెండవ చంద్రగుప్తుడు దాదాపు 35 సంవత్సరాలు పరిపాలించాడు. శకులపై ఇతడు సాధించిన విజయం, ధృవాదేవి గౌరవాన్ని కాపాడటం అనేవి ఇతనికి వీరోచిత, ప్రసిద్ధఖ్యాతిని అందించాయి. విశాఖదత్తుడు రాసిన “దేవీచంద్రగుప్తుం” అనే నాటకంపై విషయాన్ని వివరించింది. ఇతడు శకులను ఓడించి పశ్చిమ భారతదేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇతడు నాగవంశ కుటుంబానికి చెందిన కుబేరనాగను వివాహం చేసుకోగా ప్రభావతి గుప్తు అనే కూతురు పుట్టింది. ఈమెను వాకాటక రెండవ రుద్రసేనునికిచ్చి వివాహం చేయగా ఆ రాజ్యం కూడా గుప్త సామ్రాజ్యంలో అంతర్భాగమైంది. రెండవ చంద్రగుప్తుని పాలన కళా వైభవానికి, సాహిత్య పోషణకు ప్రసిద్ది చెందింది. చాలా ప్రసిద్ధి చెందిన కవి, నాటక రచయిత కాళిదాసు ఇతని ఆస్థానంలోనివాడే. ఈ కాలంలోనే ఫాహియాన్ అనే చైనా యాత్రికుడు భారతదేశాన్ని సందర్శించాడు.

ప్రశ్న 2.
గుప్త సామ్రాజ్యం పతనానికి గల కారణాలను పరీక్షించండి.
జవాబు.
పురుగుప్తుని కుమారుడైన బుధగుప్తుడు క్రీ.శ. 477లో సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడు క్రీ.శ. 500 సంవత్సరంలో చనిపోయి ఉండవచ్చు. జయనాధుడు, మహారాజ లక్ష్మణుడు తదితర సామంతరాజులు చక్రవర్తి సార్వభౌమాధికారాన్ని అంగీకరించలేదు. దక్షిణ ప్రాంతంలోని గుప్త సామ్రాజ్యాన్ని నరేంద్రసేనుని నాయకత్వంలోని వాకాటకులు ఆక్రమించారు. ఆ కాలంలో హూణుల దాడులు కూడా గుప్తు సామ్రాజ్య పతనానికి ఒక కారణం. ఈ కారణాలన్నింటివల్ల అతి పెద్దదైన గుప్త సామ్రాజ్యం చిన్న చిన్న ముక్కలుగా, స్వతంత్ర ఉపరాజ్యాలుగా చీలిపోయింది. బుధగుప్తుని మరణానంతరం ‘ గుప్తవంశం పతనమైనందున అతని తరువాత వచ్చినటువంటి రాజుల పేర్లు నిర్దిష్టంగా తెలియరాలేదు. ఆ తరువాత తోరమానుని నాయకత్వంలో హూణులు పంజాబు, పశ్చిమ భారతదేశంలోని పెద్ద భూభాగాన్ని ఎరాన్ వరకు జయించారు. గుప్త పాలకులలో చివరివారు నరసింహగుప్తుడు, కుమారగుప్తుడు, విష్ణుగుప్తుడు. అయితే, ఆనాడు రాజ్యంలో వీరి అధికారం నామమాత్రంగానే ఉండేది.

ప్రశ్న 3.
గుప్తుల కాలంనాటి శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధిని విశ్లేషించండి.
జవాబు.
గుప్తుల కాలంలో భారతీయులు గణిత, ఖగోళ శాస్త్రాలలో అద్భుత ప్రగతిని సాధించారు. ప్రపంచం ఆశ్చర్యపోయే ఆవిష్కరణలు వచ్చాయి. ఈ యుగానికి చెందిన వారే ‘సున్నా’, ‘దశాంశ’ పద్ధతులకు రూపకల్పన చేశారు. ఆర్యభట్టు, వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు నాటి ప్రసిద్ధ ఖగోళ శాస్త్రజ్ఞులు, గణితశాస్త్ర పండితులు.

ఆర్యభట్టు: క్రీ.శ. 5 – 6 శతాబ్దాల మధ్య కాలంలో ఆర్యభట్టు ‘సూర్య సిద్ధాంతం’ సూర్య, చంద్ర గ్రహణాలు వివరిస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని మొదట కనుగొన్న మేధావి అతడే. “ఆర్యభట్టీయం” అనే గ్రంథాన్ని రచించాడు. అందులో గణితశాస్త్ర అంశాలున్నాయి.

వరాహమిహిరుడు: ఇతడు బృహత్సంహిత గ్రంథం రాశాడు. అది ఖగోళశాస్త్ర గ్రంథం. భౌతిక భూగోళశాస్త్రం, వృక్షశాస్త్రం, సహజ చరిత్ర అండలో కలదు. పంచ సిద్ధాంతక బృహతాతక మొదలైన గ్రంథాలు రచించాడు. బ్రహ్మగుప్తుడు: క్రీ.శ. 6,7 శతాబ్దాలలోనే న్యూటన్ చెప్పిన అంశాలను చాలా ముందు కాలంలోనే తెలిపిన గొప్ప ఖగోళ శాస్త్రజ్ఞుడు. ప్రకృతి సూత్రం ప్రకారం అన్ని వస్తువులు భూమిపైన పడాల్సిందే. బ్రహ్మస్ఫుట, సిద్ధాంత, ఖండఖండ్యక `అనే గ్రంథాలు రాశాడు.

ఇతర విజ్ఞాన శాస్త్రాలు: వరాహమిహిరుడు, పాదరసం, ఇనుము ఉపయోగించటం, వైద్యం కోసం లోహసంబంధ తయారీలు రసాయనశాస్త్ర వృద్ధిని సూచిస్తున్నాయి. ‘నవనీతకం’ అనే వైద్య గ్రంథంలో మందుల వివరాలు, వాటి తయారీ వివరించబడింది. పశువైద్యశాస్త్రానికి చెందిన ‘హస్తాయుర్వేద’ గ్రంథాన్ని రచించింది ‘పాలకాప్య’. చరకుడు, సుశ్రుతుడు ఈ కాలానికి చెందిన ప్రసిద్ధ వైద్యులు. ధన్వంతరి కూడా ఈ కాలానికి చెందినవాడే.

ప్రశ్న 4.
గుప్తులు కళలు, శిల్పకళా వైభవానికి చేసిన సేవకై ఒక వివరణ ఇవ్వండి.
జవాబు.
నిర్మాణాలు: భారతీయ నిర్మాణాలలో గుప్తుల కాలానికి ప్రత్యేక స్థానం ఉంది. నగర, ద్రావిడ పద్ధతుల్లో గుప్తుల కళ భారతీయ నిర్మాణ చరిత్ర వైభవానికి ప్రతీకగా నిలిచింది.
గుప్తుల కళ: గుప్తుల కాలం శిల్ప కళారంగం స్వర్ణయుగంగా ప్రసిద్ధిచెందింది. భవనాలు, దేవాలయాలు, స్తంభాలు, స్తూపాలు అనేకం నిర్మించారు. వీరు నిర్మించిన అద్భుతమైన దేవాలయాల్లో హూణులు, ముస్లిం దాడుల తరువాత మిగిలినవి:

  1. ఝాన్సీ జిల్లాలోని దేవఘడ్ వద్దగల దశావతార దేవాలయం.
  2. మధ్యప్రదేశ్లోని భూమారా వద్దగల శివాలయం.

పెర్సీ బ్రౌన్ అభిప్రాయంలో భిట్టర్గావ్ దేవాలయ శిల్ప నిర్మాణం సుదీర్ఘ సంప్రదాయానికి ప్రతీకగా ఉంది. ఇంకా కొన్ని స్తూపాలు, గుహలు, విహారాలు కూడా నిర్మించబడ్డాయి. సారనాథ్ స్తూపం, అజంతా, ఉదయగిరి గుహలు ఆనాటి గొప్ప నిర్మాణాలు. అందమైన బుద్ధుని విగ్రహాలు రాతితో, లోహంతో, బంకమట్టితో చేయడంతోపాటు వివిధ పౌరాణిక బొమ్మలు రాతిపై అందంగా చెక్కారు.

శిల్ప నిర్మాణం:
a. రాతి శిల్పం: సారనాథ్ బుద్ధ విగ్రహం, ఉదయగిరి వద్దగల గుహ ప్రవేశ ద్వారం వద్దగల వరాహ ప్రతిమ చక్కటి ఉదాహరణలు. గ్వాలియర్ వద్ద ఒక నృత్యకారిణితో మహిళా సంగీత విద్వాంసుల చిత్రాలు అద్భుతమైనవి.
b. లోహ నిర్మాణం: 18 అడుగుల ఎత్తైన బుద్ధుని రాగి విగ్రహం, క్రీ.శ. 6వ శతాబ్దంలో బీహారులో నలంద వద్ద నిర్మించారు. సుల్తాన్ గంజ్లోని బుద్ధ విగ్రహం 72 అడుగుల ఎత్తు ఉంది. ఢిల్లీలో మెహరోలి వద్ద ఉన్న ఇనుప స్తంభం గుప్తుల సాంకేతిక పరిజ్ఞానానికి మచ్చుతునక.
కనిష్కుడు గొప్ప భవన నిర్మాత. కనిష్కపురం, పురుషపురం అనే రెండు నగరాలను నిర్మించాడు.

ప్రశ్న 5.
హర్షవర్థనుని పరిపాలనా విధానం గురించి రాయండి.
జవాబు.
పరిపాలన సౌలభ్యం కోసం సామ్రాజ్యాన్ని భుక్తులుగాను, భుక్తులను విషయాలుగాను, విషయాలను గ్రామాలుగాను విభజించారు. పాలనా విధానంలోను, విద్యా, సాంస్కృతిక రంగాల్లోను హర్షుడు గుప్తయుగం సంప్రదాయాలనే అనుసరించాడు. రాజుకు సలహాలిచ్చి సహాయం చేయడానికి మంత్రిపరిషత్ ఉండేది. ప్రభుత్వ విధానంలో మంత్రి పరిషత్కు గౌరవప్రదమైన స్థానం ఉంది. వారసత్వాన్ని నిర్ణయించడానికి కూడా మంత్రిపరిషత్తుకు అధికారం ఉంది. హర్షచరిత్ర నుంచి, శాసనాల నుంచి అనేకమంది ఉద్యోగుల పేర్లు తెలుస్తున్నాయి. వారిలో మహాసంధి – విగ్రహాధికృత (యుద్ధ వ్యవహారాలు), రాజస్థానీయ (విదేశీ వ్యవహారాలు), మహాబలాధికృత (సేనాపతి), ఆయుక్తక, భోగక (పన్నుల వసూలు), భాండాగారాధికృత (కోశాధికారి) మొదలైనవారు ముఖ్యులు. వీరికి జీతాలకు బదులు భూములను ఇచ్చేవారు. సైనికోద్యోగులకు మాత్రం జీతాలిచ్చేవారు.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
హరిసేనుని సేవ గురించి రాయండి.
జవాబు.
గుప్తుల చరిత్ర తెలుసుకోవడానికి ప్రధాన ఆధారాలలో ఒకటైన అలహాబాద్ స్తంభ శాసనం సముద్రగుప్తుని సర్వ సైన్యాధికారియైన హరిసేనుడు రచించాడు. ఇది సముద్రగుప్తుని సైనిక దండయాత్రలని, అతని విజయాలని, ఉత్తర, దక్షిణ భారతదేశ రాజకీయ భౌగోళికతను తెలుపుతుంది. ఇంత ప్రాధాన్యత కలిగిన ఈ శాసనం సంస్కృత భాషలో రచింపబడింది. హరిసేనుడు కవిగా కూడా గుర్తింపు పొందాడు.

TS Inter 1st Year History Study Material Chapter 5 గుప్తుల యుగం

ప్రశ్న 2.
రామగుప్తునిపై ఒక లఘుటీక రాయండి.
జవాబు.
విశాఖదత్తుని దేవీచంద్రగుప్తుం అనే గ్రంథం సముద్రగుప్తుని మరణానంతర సంఘటనల్లో భాగంగా, శకరాజు దాడులకు భయపడిన రామగుప్తుడు తన పట్టపురాణియైన ధృవాదేవిని అప్పగించాలని భావించడంతో, సహించలేని సోదరుడు రెండవ చంద్రగుప్తుడు శకులను పారద్రోలి, అసమర్థుడైన రామగుప్తుని సంహరించి, రాణిని కాపాడుతాడు.

ప్రశ్న 3.
విజ్ఞాన శాస్త్రాభివృద్ధికి ఆర్యభట్టు చేసిన సేవను పరీక్షించండి.
జవాబు.
విజ్ఞాన శాస్త్రాలు కూడా గుప్తుల కాలంలో ఎంతగానో అభివృద్ధి చెందాయి. ప్రసిద్ధిగాంచిన భారత ఖగోళ శాస్త్రవేత్తలైన ఆర్యభట్టు తన “ఆర్యభట్టీయం” అనే గ్రంథంలో గ్రీకులతో మనకు గల సంబంధాల వల్ల ఖగోళశాస్త్ర రంగంలో మనం సాధించిన అభివృద్ధిని గురించి వివరించాడు. ఇతడు ఖగోళ శాస్త్రాన్ని ఉన్నత స్థాయిలోనికి తీసుకొని వచ్చినవాడుగా గణతికెక్కాడు. ఇతడు గ్రహణాలను శాస్త్రీయ పద్ధతిలో వివరించాడు. భూమి తన అక్షంపై తిరగడం వల్ల భూమి నీడ చంద్రునిపై పడుతూందని, తత్ఫలితంగా గ్రహణం ఏర్పడుతుందని ఆర్యభట్టు అభిప్రాయపడ్డాడు. ఇతని సిద్ధాంతాలు శాస్త్రీయంగా ఉండి, మతాన్ని, సంప్రదాయాలను కలిపి ఆచరించే వారిని వ్యతిరేకించాయి. ఇంకా, ఇతడు గణితంలో దశాంశస్థాన విలువల పద్ధతిని కూడా ఆనాడే ఉపయోగించాడు.

ప్రశ్న 4.
ఫాహియాన్ గురించి రాయండి.
జవాబు.
చైనా యాత్రికుడైన ఫాహియాన్ చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో, క్రీ.శ. 405 సంవత్సరంలో భారతదేశానికి వచ్చాడు. ఇతడు బౌద్ధ సన్యాసి, బుద్ధుని జన్మభూమి అయిన భారతదేశాన్ని సందర్శించాలనే ఉత్సాహం కలిగినవాడు. రెండవ చంద్రగుప్తుని పాలనా కాలంనాటి రాజకీయ, సామాజిక, మత, ఆర్థిక పరిస్థితులను తన ‘ఫో-కు-వోకి’ అనే గ్రంథంలో వివరించాడు. గుప్తుల కాలంనాటి చరిత్రకు ఇది ప్రధాన ఆధార గ్రంథం.

ప్రశ్న 5.
అలహాబాద్ స్థంభ శాసన ముఖ్యాంశాలను తెల్పండి.
జవాబు.
అలహాబాద్ ప్రశస్థిని సముద్రగుప్తుని సేనాని హరిసేనుడు సంస్కృతభాషలో వ్రాయించాడు. ఇది ఒక శాసనం రూపంలో ఉంది. దీనిలో సముద్రగుప్తుని దిగ్విజయాలు వివరించబడ్డాయి. దీనిని కావ్యశైలిలో రచించారు. ఇది అలహాబాద్ లోని అశోక స్తంభంపై వ్రాయబడి ఉంది.

ప్రశ్న 6.
హూణుల దండ్రయాతను వర్ణించండి.
జవాబు.
హూణులు చైనా పరిసర ప్రాంతాలకు చెందిన అనాగరిక మోటుజాతి ప్రజలు. వీరిలో నల్లహూణులు, తెల్లహూణులు అను రెండు శాఖలవారున్నారు. తెల్లహూణులు భారతదేశముపై దాడిచేసి గుప్తుల సామ్రాజ్యంలో శాంతిభద్రతలకు అంతరాయం కలిగించారు. వీరిలో తోరమాణుడు, మిహిరకులుడు ముఖ్యులు. వీరి దండయాత్రల వలన గుప్త సామ్రాజ్యం బలహీనపడింది. గణతంత్ర రాజ్యాలు అంతరించాయి. బౌద్ధమతం నాశనమైంది. కాలక్రమంలో హూణులు క్షత్రియులుగా గుర్తింపు పొందారు.

ప్రశ్న 7.
హర్షుని మహామోక్ష పరిషత్ను వర్ణించండి.
జవాబు.
హర్షుడు ప్రయాగ వద్ద ప్రతి 5 సంవత్సరములకొకసారి సర్వస్వదాన కార్యక్రమాన్ని నిర్వహించేవాడు. దీనినే మహామోక్ష పరిషత్ అంటారు. ఇటువంటి పరిషత్లను హర్షుడు ఆరింటిని జరిపాడు. క్రీ.శ. 643లో జరిగిన 6వ పరిషత్కు -హుయాన్ త్సాంగ్ హాజరయ్యాడు. ఈ పరిషత్తులో హర్షుడు తన సర్వస్వాన్ని బ్రాహ్మణులకు, అనాథలకు పంచి, కట్టుగుడ్డలతో రాజధానికి తిరిగి వచ్చేవాడు.

TS Inter 1st Year History Study Material Chapter 5 గుప్తుల యుగం

ప్రశ్న 8.
హుయానా త్సాంగ్ రచనలపై ఒక వివరణ ఇవ్వండి.
జవాబు.
హర్షుని కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ (క్రీ.శ. 630 – 644). ఇతడు దేశంలోని అనేక ప్రాంతాల్లో, బౌద్ధమత పవిత్ర స్థలాల్లో నలందా విశ్వ విద్యాలయంలో గడిపి అనేక బౌద్ధ గ్రంథాలను అధ్యయనం చేశాడు. హర్షునికి సన్నిహితుడైనాడు. హర్షుడు కనోజ్, ప్రయాగలో జరిపిన మోక్ష పరిషత్లలో పాల్గొన్నాడు. భారతదేశంలో అనేక బౌద్ధ గ్రంథాలను, బుద్ధుని ధాతువులను సేకరించాడు. తన పర్యటన అనుభవాలను సి-యు-కి అను గ్రంథంగా రచించాడు. ఈ గ్రంథం హర్షుని రాజ్యంలోని రాజకీయ, సాంఘిక, మత పరిస్థితులను వివరిస్తుంది.