TS Inter 1st Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

Telangana TSBIE TS Inter 1st Year Economics Study Material 8th Lesson ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం Textbook Questions and Answers.

TS Inter 1st Year Economics Study Material 8th Lesson ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
సంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించండి.
జవాబు.
ఆడమ్స్మిత్, రికార్డో, జె.బి.సే, జె.యస్. మిల్ మొదలగు వారిని సాంప్రదాయ ఆర్థికవేత్తలంటారు. వీరు ప్రతిపాదించిన ఉత్పత్తి, ఉద్యోగితా సిద్ధాంతాన్నే సంప్రదాయ సిద్ధాంతం అని అంటారు. ఈ సిద్ధాంతం ప్రధానంగా జె.బి. సే మార్కెట్ సూత్రంపై ఆధారపడింది. జె.బి. సే అభిప్రాయంలో “సప్లై తనకు తానే డిమాండ్ సృష్టించుకుంటుంది”. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ కొరతగాని లేదా నిరుద్యోగితగాని ఏర్పడవు.

పరిపూర్ణ పోటీ పరిస్థితులలో దీర్ఘ కాలంలో ఒక పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగితా స్థాయి వద్ద స్థిర సమతౌల్యంలో ఉంటుందని సాంప్రదాయ ఆర్థికవేత్తలు భావించారు. సంపూర్ణ ఉద్యోగిత ఒక సాధారణ లక్షణం అని, నిరుద్యోగిత ఒక అసాధారణ పరిస్థితి అని భావించారు.

ప్రభుత్వ జోక్యం లేకపోతే మార్కెట్ శక్తుల స్వేచ్ఛా ప్రవర్తన ద్వారా ఆర్థిక వ్యవస్థలో స్వయం చాలకంగా సర్దుబాటు జరుగుతుంది. ఈ అభిప్రాయాలను స్థూలంగా సంప్రదాయ ఉత్పత్తి, ఉద్యోగితా సిద్ధాంతం అంటారు.

సంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం ఈ క్రింది అంశాల మీద ఆధారపడి ఉంటుంది.

  1. సే మార్కెట్ సూత్రం – ధరల సరళత్వం.
  2. . పొదుపు, పెట్టుబడుల సమానత్వం.
  3. వేతనాల సరళత్వం.

1. సే మార్కెట్ సూత్రం – ధరల సరళత్వం :
‘సే’ విశ్లేషణ ప్రకారం, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలలో “సప్లై తన డిమాండ్ను తానే సృష్టించుకుంటుంది” అంటే మార్కెట్లో ఎంత ఉత్పత్తి చేస్తే అంతకు డిమాండ్ ఏర్పడుతుంది. అందువల్ల అధికోత్పత్తి సమస్య ఉండదని ‘సే’ అభిప్రాయం.

స్వల్పకాలంలో ఉత్పత్తిదార్లు డిమాండ్కు సంబంధించిన అంచనాలలో వచ్చే తప్పిదాల వల్ల అధికోత్పత్తి, అల్పోత్పత్తి సమస్యలు రావచ్చు. కాని దీర్ఘకాలంలో ఈ పొరపాట్లను ధరలో సరళత్వం ద్వారా సర్దుబాటు చేయడం వల్ల సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లైల మధ్య సమతౌల్యం సాధించవచ్చు.

2. పొదుపు, పెట్టుబడుల సమానత్వం:
దీర్ఘకాలంలో ‘సే’ ప్రకారం సమిష్టి పొదుపు, పెట్టుబడి సమానంగా ఉంటాయి. ఈ సమానత్వం ఉన్నంత వరకు ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగిత ఉండదు. ‘సే’ అభిప్రాయంలో పొదుపు, పెట్టుబడుల మధ్య అసమతౌల్యం ఏర్పడినట్లయితే వడ్డీరేటులో మార్పు చేయడం ద్వారా వాటి మధ్య సమానత్వం చేకూరి సమతౌల్య స్థితిలో సంపూర్ణ ఉద్యోగిత సాధించవచ్చు. దీనిని ఇచ్చిన రేఖా పటం ద్వారా వివరించవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 8th Lesson ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం 1

ఆ ప్రక్క రేఖాపటంలో ‘X’ అక్షం మీద పొదుపు, పెట్టుబడి, S “Y” అక్షంపై వడ్డీ రేటు సూచించబడింది. ‘E’ బిందువు వద్ద పొదుపు, పెట్టుబడులు సమానం. పొదుపు ఎక్కువగా ఉంటే వడ్డీరేటు తగ్గుతుంది. పొదుపు తక్కువగా ఉంటే వడ్డీరేటు పెరుగుతుంది.

3. వేతనాల సరళత్వం :
పిగూ అభిప్రాయం ప్రకారం శ్రామిక సప్లై, డిమాండ్ నిజవేతనాలపై ఆధారపడి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగ సమస్య ఏర్పడినప్పుడు ద్రవ్య వేతనాలను తగ్గించడం ద్వారా సంపూర్ణ ఉద్యోగితను సాధించవచ్చని పిగూ వివరించారు. పిగూ సూచించిన విధానాన్నే “వేతన కోత విధానం” అంటారు.

సంప్రదాయక ఆర్థికవేత్తల ప్రకారం సంపూర్ణోద్యోగిత అనేది, ఆర్థిక వ్యవస్థలో దీర్ఘకాలంలో తప్పనిసరిగా చేరుకొనే వాస్తవిక పరిస్థితి. స్వల్పకాలంలో నిరుద్యోగ సమస్య తలెత్తితే, అది కూడా తాత్కాలికమైంది. ఇలాంటి సంపూర్ణ ఉద్యోగిత ఆర్థిక వ్యవస్థలో ఐచ్ఛిక, సంఘృష్ట నిరుద్యోగిత ఉండే అవకాశం ఉంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రమేయాలు : సాంప్రదాయ సిద్ధాంతం ఈ క్రింది ప్రమేయాలపై ఆధారపడి ఉంది.

  1. సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది.
  2. ఆర్థిక కార్యకలాపాలలో ప్రభుత్వ జోక్యం ఉండదు.
  3. ఆర్థిక వ్యవస్థలో పరిపూర్ణ పోటీ మార్కెట్ కలిగి ఉంటుంది.
  4. శ్రామికులు ఒకే రకమయిన సామర్థ్యం కలిగి ఉండాలి.
  5. వేతనాలు, ధరలు స్థిరంగా ఉండక మారుతూ ఉంటాయి.
  6. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం తటస్థంగా ఉంటుంది.
  7. ఆర్థిక వ్యవస్థలో పొదుపు, పెట్టుబడి వడ్డీరేటుపై ఆధారపడి ఉంటాయి.

సంప్రదాయ సిద్ధాంతం – విమర్శ:
1930 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ‘ఆర్థిక మాంద్యాన్ని’ ఎదుర్కోవడంలో సంప్రదాయ సిద్ధాంతాలు విఫలమవడంతో, జె.యమ్. కీన్స్ సంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతాన్ని కింది విధంగా విమర్శించడం జరిగింది.

1. సహజంగా ఉండేది అల్ప ఉద్యోగిత సమతౌల్యం అని, సంప్రదాయ ఆర్థికవేత్తలు వివరించిన సంపూర్ణ ఉద్యోగిత సత్య దూరమని కీన్స్ విమర్శించాడు.

2. వేతనాలను తగ్గించడం ద్వారా ఉద్యోగితను పెంచవచ్చునన్న పిగూ వాదనను కీన్స్ తీవ్రంగా విమర్శించాడు. పటిష్టమైన కార్మిక సంఘాల ప్రతిఘటనను విస్మరించడాన్ని తీవ్రంగా ఖండించాడు. శ్రామికుల సప్లయ్ నిజ వేతనాలపై కాకుండా ద్రవ్య వేతనాలపై ఆధారపడుతుందని కీన్స్ పేర్కొన్నాడు.

కీన్స్ అభిప్రాయంలో వేతనాల స్థాయి తగ్గిస్తే కార్మిక సంఘాలు అంగీకరించవు. అంతేకాకుండా వేతనాలు తగ్గిస్తే ఉద్యోగిత పెరగడానికి బదులు ఉత్పత్తి, ఉద్యోగితలు తగ్గుతాయి.

3. కీన్స్ అభిప్రాయంలో పొదుపు పరిమాణం ఆదాయంపై ఆధారపడుతుందే కాని, వడ్డీ రేట్లలోని మార్పులచే ప్రభావితం కాదు. అందువల్ల వడ్డీ రేటులో మార్పుల ద్వారా పొదుపు పెట్టుబడుల మధ్య సమానత్వాన్ని సాధించలేం.

4. డిమాండ్, సప్లయ్ల మధ్య సమతౌల్యం స్వయంచాలకంగా ఏర్పడదు. 1930లో ఏర్పడిన గొప్ప ఆర్థిక మాంద్యం దీనికి ఉదాహరణ. ఆర్థిక మాంద్య నివారణలో స్వయంచాలక సర్దుబాటు పని చేయలేదు. మార్కెట్ శక్తులు విఫలమైనందున ప్రభుత్వ జోక్యం ద్వారా సమగ్ర డిమాండ్ను పెంచాలని కీన్స్ సూచించాడు.

5. దీర్ఘకాలంలో సంపూర్ణ ఉద్యోగిత సమతౌల్యం ఉంటుందనే సంప్రదాయ ఆర్థికవేత్తల వాదనను కీన్స్ ఖండించాడు. “దీర్ఘ కాలంలో మనమందరం మరణిస్తాం” (in the long run we all are dead) అని కీన్స్ పేర్కొన్నాడు. నిరుద్యోగిత స్వల కాలానికి సంబంధించినదని కీన్స్ తన ఆదాయ సిద్ధాంతంలో తెలియజేశాడు.

6. ఆర్థిక వ్యవహారాల్లో ద్రవ్యం తటస్థంగా ఉండదు. ద్రవ్యం వినిమయ మాధ్యమంగా మరియు విలువ నిధిగా తన విధిని నిర్వర్తిస్తుందని కీన్స్ తెలిపాడు. వినియోగం, పెట్టుబడి మరియు ఉత్పత్తి వంటి వాటిని ద్రవ్యం ప్రభావితం చేస్తుందని పేర్కొన్నాడు.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 2.
కీన్స్ ఉద్యోగితా సిద్ధాంతాన్ని వివరించండి.
జవాబు.
కీన్స్ ఉద్యోగితా సిద్ధాంతానికి డిమాండ్ ఒక ముఖ్య భావన. సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లయ్ సమానంగా ఉండే స్థితిలో సార్థక డిమాండ్ నిర్ణయమౌతుంది. వివిధ ఉద్యోగితా స్థాయిలలో సమిష్టి డిమాండ్ వివిధ రకాలుగా ఉంటుంది.

ఏ, ఉద్యోగితా స్థాయిలో సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లైతో సమానమౌతుందో అది ఆర్థిక వ్యవస్థ సమతౌల్యాన్ని సూచిస్తుంది. కాని అది స్వల్పకాలిక సమతౌల్యం. అది సార్థక డిమాండ్ని సూచిస్తుంది. ఆర్థిక వ్యవస్థలో సమిష్టి సప్లై, సమిష్టి డిమాండ్కు అనుగుణంగా మారుతుంది.

సమిష్టి సప్లై ధర :
సమిష్టి సప్లై ధరను వివిధ ఉత్పత్తి రాశులను అమ్మటం వల్ల వ్యవస్థాపకుడు పొంది తీరవలసిన కనిష్ట ఆదాయంగా కీన్స్ వర్ణించాడు. సమిష్టి సప్లై పట్టిక వ్యవస్థాపకులు వివిధ ఉత్పత్తి రాశుల వద్ద పొందిన ఆదాయాన్ని కాకుండా పొంది తీరవలసిన వ్యయ, ఆదాయపు అంచనాలను మాత్రమే తెలియజేయును.

సమిష్టి డిమాండ్ ధర :
సమిష్టి డిమాండ్ వివిధ ఉత్పత్తి స్థాయిల వద్ద వ్యయసంస్థలు వ్యయ సేవలపై ఖర్చు పెట్టడానికి సిద్దపడే మొత్తాలను చూపుతుంది. వివిధ ఉత్పత్తి రాశులపై వ్యయ సంస్థలు ఖర్చు పెట్టే మొత్తాలను చూపే పట్టిక సమిష్టి డిమాండ్ పట్టిక. అనగా నిర్దిష్ట పరిమాణంలో వస్తువును ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్మడం ద్వారా భవిష్యత్తులో పొందగలిగే రాబడిని సమిష్టి డిమాండ్ ధర అంటారు.

సార్థక డిమాండ్:
సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై రేఖలు ఒకదానినొకటి ఖండించుకున్న బిందువు సార్థక డిమాండ్ను సూచిస్తుంది. ఈ బిందువు వద్ద సమిష్టి డిమాండ్ ధర, సమిష్టి సప్లై ధరకు సమానమవటం వల్ల ఆ డిమాండ్ సార్థక డిమాండ్ అవుతుంది. ఆ స్థాయిలో జాతీయాదాయపు ఉద్యోగితాస్థాయిలు సమతౌల్య స్థితికి చేరుకుంటాయి. ఈ సార్థక డిమాండ్ వ్యవస్థలో ఉద్యోగితా స్థాయిని నిర్ణయిస్తుందని కీన్స్ పేర్కొన్నాడు.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

సార్థక డిమాండ్ను ఈ క్రింది పట్టిక ద్వారా వివరించవచ్చు.

ఉద్యోగితా పరిమాణ స్థాయి (లక్షల్లో)సమిష్టి డిమాండ్ ధర (కోట్లలో)సమిష్టి సప్లై ధర (కోట్లలో)
10600500
11625550
12650600
13675650
14700700
15725750
16750800

 

TS Inter 1st Year Economics Study Material 8th Lesson ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం 2

పై పట్టికలో 14 లక్షల మందిని నియమించి ఉత్పత్తి చేస్తున్న స్థాయి వద్ద సమిష్టి డిమాండ్ ధర, సమిష్టి సప్లై ధర, శ్రీ 700 కోట్లు వద్ద రెండు సమానమై సమతౌల్యం ఏర్పడింది. అంతకంటే తక్కువ ఉద్యోగితా స్థాయి వద్ద సమిష్టి సప్లై ధర కంటే సమిష్టి డిమాండ్ ధర అధికం. అదే విధంగా అధిక ఉద్యోగితాస్థాయి వద్ద సమిష్టి డిమాండ్ ధర కంటే సమిష్టి సప్లై ధర అధికంగా ఉంటుంది. దీనిని ఇచ్చిన రేఖాపటం ద్వారా వివరించవచ్చు.

పై రేఖాపటంలో ‘E’ బిందువు వద్ద AS మరియు AD రేఖలు సమానమై సార్థక డిమాండున్ను తెలియజేయును.

ఈ బిందువు వద్ద 14 లక్షల సమతౌల్య ఉద్యోగితా పరిమాణం తెలుపుచున్నది. అందువల్ల 14 లక్షల మంది శ్రామికుల నియామకం వద్ద ఆర్థిక వ్యవస్థ సమతౌల్య స్థితిని చేరుకుంది. ఆర్థిక వ్యవస్థలో 16 లక్షల మందిని నియమించినట్లయితే సమిష్టి సప్లై, సమిష్టి డిమాండ్ కంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించవచ్చు. ఈ స్థితిని కీన్స్ “అల్ప ఉద్యోగితా సమతౌల్య స్థితి” గా పేర్కొనెను.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 3.
ప్రభుత్వ విత్త భావనను చర్చించండి. ప్రభుత్వ రాబడి ఆధారాలను విపులీకరించండి.
జవాబు.
ప్రభుత్వ ఆదాయ వ్యయాలను వివరించేది ప్రభుత్వ విత్తశాస్త్రం. ఇక్కడ ‘ప్రభుత్వం’ అనే పదం కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు వర్తిస్తుంది. సాంప్రదాయపరంగా వాడుతున్న ‘ప్రభుత్వ విత్తశాస్త్రం’ అనే అంశాన్ని ఆర్థికవేత్తలు వివిధ రకాలుగా నిర్వచించారు.

ఆచార్య డాల్టన్ అభిప్రాయం ప్రకారం, “ప్రభుత్వాల ఆదాయ, వ్యయాలను గురించి వీటి మధ్య సర్దుబాట్లకు సంబంధించిన విషయాలను అధ్యయనం చేసేదే ప్రభుత్వ విత్తశాస్త్రం.”

ఆధునిక ప్రభుత్వాలు ఆర్థిక, సాంఘిక అవస్థాపనా పరికల్పనలను ఏర్పాటు చేయడంలో కీలక పాత్రను పోషిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలు కోట్ల కొద్ది రూపాయలను రోడ్ల నిర్మాణం, రైల్వే మార్గాల పొడిగింపులు, రవాణా, తంతి తపాలా సౌకర్యాలలో పెంపు, విద్యా, ఆరోగ్యం, విద్యుచ్ఛక్తి, నీటి పారుదల సౌకర్యాలపై వెచ్చిస్తున్నాయి.

పేద, బడుగు వర్గాల కోసం అనేక కొత్త కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఈ వ్యయాలను అవి వసూలు చేసే వివిధ పన్నులు, ఇతర మార్గాల ద్వారా పొందుతాయి. సరిపడా ఆదాయ వనరులు లభించనప్పుడు, ప్రభుత్వాలు రుణాలను స్వదేశంలోను, విదేశీ మార్గాల ద్వారా పొందుతాయి. కొన్ని సందర్భాల్లో లోటు బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా కూడా వనరులు సమకూర్చుకొంటాయి.

ప్రభుత్వ ఆదాయం / రాబడి :
ఆధునిక ప్రభుత్వాలు అనేక విధులను నిర్వహించడమే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించడంవల్ల ప్రభుత్వ వ్యయం క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని సేకరిస్తుంది.

పన్నులు, ఫీజులు, ప్రత్యేక విధింపులు, గ్రాంట్లు, వాణిజ్య ఆదాయాలు, రుణ సేకరణ, కరెన్సీ నోట్ల ముద్రణ మొదలైన మార్గాలద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. వాటిని ప్రధానంగా

  1. పన్నుల ద్వారా రాబడి అని
  2. పన్నేతర రాబడి అని రెండుగా వర్గీకరించవచ్చు. వాటిలో పన్నులు ముఖ్యమైనవి.

1. పన్నుల ద్వారా రాబడి :
వ్యక్తులు, సంస్థలు ప్రభుత్వానికి నిర్బంధంగా చెల్లించేవి ‘పన్నులు’. వాటిని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తాయి. ఈ పన్నులు రెండు రకాలు. అవి :

  • ప్రత్యక్ష పన్నులు
  • పరోక్ష పన్నులు.

TS Inter 1st Year Economics Study Material 8th Lesson ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం 3

2. పన్నేతర రాబడులు :
ప్రభుత్వానికి పన్నులు కాకుండా ఇతర మార్గాల ద్వారా లభించే ఆదాయాలను ‘పన్నేతర రాబడులు’ అంటారు. పన్నేతర రాబడుల ఆధారాలను కింది విధంగా పేర్కొనవచ్చు.

ఎ) పాలనా రాబడులు :
కొన్ని సేవలను అందించడం ద్వారా ఇలాంటి రాబడి ప్రభుత్వానికి లభిస్తుంది. ఉదా : లైసెన్స్ ఫీజు, ట్యూషన్ ఫీజు, జరిమానాలు, పెనాల్టీలు.

బి) వాణిజ్య రాబడులు :
ప్రభుత్వ సంస్థల్లో ఉత్పత్తి అయిన వస్తుసేవలను విక్రయించగా వచ్చిన ఆదాయాలను ‘వాణిజ్య రాబడులు’ అంటారు.
ఉదా : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, BSNL, రైల్వేలు, స్టేట్ రోడ్డు రవాణా, ఎయిర్ ఇండియా, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్.

సి) రుణాలు :
పైన తెలిపిన వివిధ మార్గాల ద్వారా సేకరించిన రాబడి సరిపోయినంతగా లేనప్పుడు, ప్రభుత్వం స్వదేశీ, విదేశీ రుణాలను, అంతర్గత, బహిర్గత రుణాలను సేకరిస్తుంది.

డి) గ్రాంట్లు :
ఒక ప్రభుత్వం మరొక ప్రభుత్వానికి చేసే ద్రవ్య సహాయాన్నే ‘గ్రాంట్లు’ అంటారు.
ఉదా : కేంద్రం రాష్ట్రానికి, రాష్ట్రాలు స్థానిక ప్రభుత్వాలకు ఇచ్చే గ్రాంట్లు. కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి గ్రాంట్లు పొందవచ్చు. వీటిని తిరిగి చెల్లించనవసరం లేదు.

గ్రాంట్లు రెండు రకాలు.

  1. సాధారణ గ్రాంట్లు : ఎలాంటి ప్రత్యేక ఉద్దేశానికి. (purpose) కాకుండా సాధారణ ఆర్థిక వనరుల కొరత ఏర్పడినప్పుడు ఇచ్చే గ్రాంట్లు.
  2. ప్రత్యేక గ్రాంట్లు : ఒక ప్రత్యేక ఉద్దేశానికి నిర్దేశించి ఇచ్చే గ్రాంట్లు. ఉదా : విద్య, ఆరోగ్యం, ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం ఇచ్చే గ్రాంట్లు.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 4.
ప్రభుత్వ రుణ భావనను వివరించండి. వివిధ రుణ విమోచన పద్దతులను విపులీకరించండి. జవాబు. ప్రభుత్వం చేసిన రుణాన్ని తిరిగి చెల్లించటాన్ని రుణవిమోచన / విముక్తి అంటారు.
పద్ధతులు :
1. మిగులు బడ్జెట్ :
ప్రభుత్వాలు ఆదాయ వనరులు ప్రభుత్వ వ్యయం కంటే ఎక్కువ ఉండేటట్లు చేసుకోగలిగితే, పెరిగిన ఆదాయ వనరుల / మిగులు నుంచి రుణాలను తిరిగి చెల్లించడం జరుగును.

2. రుణ పరివర్తనం :
పాత రుణాన్ని చెల్లించటానికి మరలా కొత్త రుణం చేయటం రుణవిమోచన జరగదు – కానీ ఈ పద్ధతి ద్వారా రుణ విమోచన జరుగదు.

3. రుణ విమోచన నిధి :
ప్రభుత్వం అనుసరించే వివిధ పద్ధతులలో ఇది మంచి పద్ధతి అని చెప్పబడింది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం తన రెవిన్యూ బడ్జెట్ నుంచి కొంత మొత్తాన్ని ఈ నిధికి బదిలీ చేస్తుంది. ఈ నిధిలో జమచేసిన మొత్తంపై వచ్చే వడ్డీని కూడా రుణాలు తిరిగి చెల్లించడానికి ఉపయోగించడం జరుగుతుంది.

4. రుణ నిరాకరణ :
వడ్డీనికాని, అసలు కాని లేదా రెండూ కలిపి చెల్లించడానికి నిరాకరించడం. ఏ ప్రభుత్వం కూడా ఈ పద్ధతిని అనుసరించదు. ప్రభుత్వ పరపతి దెబ్బతినే ప్రమాదం ఉండటం వల్ల, సాధారణంగా ఈ పద్ధతిని అనుసరించదు.

5. మూలధనంపై పన్ను :
ఈ పద్ధతిలో ప్రజల వద్ద ఉన్న మూలధనంపై ఒకసారి పన్ను విధిస్తారు. అందువల్ల ఇది ఉత్తమమైనదిగా డాల్టన్ భావించాడు.

6. మిగులు వ్యాపార చెల్లింపుల శేషం :
మిగులు వ్యాపార చెల్లింపుల శేషం ఏర్పడగలిగితే వాటిలో కొంతవరకు విదేశీ రుణాల నుంచి విముక్తి కలగడానికి అవకాశం ఉంటుంది.

ప్రశ్న 5.
భారతదేశంలో కేంద్ర – రాష్ట్ర ఆర్థిక సంబంధాలను విశ్లేషించండి.
జవాబు.
కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఆర్థిక సంబంధాలు భారత రాజ్యాంగంలో పేర్కొనబడ్డాయి. కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ రాజ్యాంగంలో వివరణాత్మకంగా రూపొందించబడింది. పన్నులను ఏ విధంగా విధించాలి, పన్నుల రాబడిని కేంద్ర రాష్ట్రాల మధ్య ఏ విధంగా పంపిణీ చేయాలనే విషయం రాజ్యాంగంలో తెలపబడింది.

అంటే పన్నును విధించిన ప్రభుత్వమే పన్ను రాబడిని పొందాలనే నియమం లేదు. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం కొన్ని విధాలైన పన్నులను విధించి, వాటి రాబడిని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిణీ చేస్తుంది.

రాజ్యాంగం ప్రకారం పన్ను విధింపుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక అధికారాలను కలిగి ఉన్నాయి. కేంద్ర జాబితా (union list) లోని అంశాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం పన్నులను విధించగా, రాష్ట్ర జాబితా (state list)లోని అంశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులను విధిస్తాయి.

1. పన్ను విధింపుకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ అధికారాలు :
కింద పేర్కొన్న అంశాలపై పన్ను విధింపుపై కేంద్ర ప్రభుత్వానికి అధికారాలుంటాయి. అవి :

  • కస్టమ్స్ పన్ను
  • కార్పొరేషన్ పన్ను
  • మూలధన సంపాదన
  • ఆదాయ పన్ను
  • రైల్వే ఛార్జీలు మొదలైనవి.

2. పన్ను విధింపుకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు :
కింద పేర్కొన్న అంశాలపై పన్ను విధింపుపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలుంటాయి. అవి :

  • భూమి శిస్తు
  • స్టాంప్ డ్యూటీ
  • ఎస్టేట్ డ్యూటీ
  • వ్యవసాయ ఆదాయం
  • ఎంట్రీ పన్ను
  • అమ్మకపు పన్ను
  • వాహనాలు మరియు విలాసాలపై పన్ను మొదలైనవి.

కేంద్ర, రాష్ట్ర జాబితాలలో పేర్కొనని ఇతర అంశాలపై పన్నును విధించే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికే ఉంది. పైన పేర్కొన్న కేంద్ర, రాష్ట్ర జాబితాల్లోని అంశాలే కాకుండా కింద తెలిపిన మూడు అంశాలపై పన్ను విధింపు అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది.

a) పన్నులను కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది. కాని వాటి రాబడిని రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసుకొంటాయి.
ఉదా : బిల్లుల మారకంపై స్టాంపు డ్యూటీ, ఔషధాల తయారీపై ఎక్సైజ్ పన్ను.
b) కేంద్ర ప్రభుత్వం పన్నులను విధించి రాబడిని వసూలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు పంచుతుంది. వ్యవసాయ భూమిని మినహాయించి ఎస్టేట్ డ్యూటీ, రైల్వే చార్జీలపై పన్ను, వార్తాపత్రికల అమ్మకాలు, అడ్వర్టైజ్మెంటు పై పన్నులు ఈ కోవకు సంబంధించినవి.
c) కేంద్ర ప్రభుత్వం పన్నులను విధించి, వసూలు చేసిన రాబడిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకొనేవి. ఆర్టికల్ 270 ప్రకారం వ్యవసాయేతర ఆదాయంపై పన్ను, ఎక్సైజ్ పన్నులు ఈ కోవలోకి వస్తాయి.

3. ఇతర అధికారాలు :

  1. 73, 74వ రాజ్యాంగ సవరణల ప్రకారం గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలకు వనరుల కల్పన కోసం సమీకృత నిధి (consolidated fund)ని ఏర్పాటు చేయాలి.
  2. 360వ ఆర్టికల్ ప్రకారం, ఆర్థిక అత్యయిక పరిస్థితి ఉంటే రాష్ట్రపతి వివిధ రాష్ట్రాలకు ఆర్థిక సంబంధిత నిర్దేశాలివ్వవచ్చు.

ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు a) కేంద్ర రుణాలు, b) గ్రాంట్స్ కూడా సమకూరుస్తాయి. ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వానికి అవసరానికి మించిన ద్రవ్యం అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే వివిధ రాష్ట్రాల కలయికలో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్రను పోషిస్తుంది. కాబట్టి సహజంగా కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ మొత్తంలో రాబడి మార్గాలుంటాయి.

అంతేకాక రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి భద్రతలు, సంక్షేమ పథకాల అమలు, విద్య, వైద్య సౌకర్యాలపై వ్యయాలు మొదలగు వ్యయాల దృష్ట్యా వాటి రాబడులను వ్యయాలు మించుతాయి. అందుకే ఇవి కేంద్రంపై ఆధారపడతాయి.

ఇలాంటి పరిస్థితి నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 275 ప్రకారం గ్రాంట్లను ఇస్తుంది. గిరిజనుల సంక్షేమ, ప్రకృతి వైపరీత్యాలైన వరదలు, క్షామం లాంటి వాటికి గ్రాంటులు ఉపకరిస్తాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 6.
ఫెడరల్ విత్తంపై ఒక వ్యాసం రాయండి.
జవాబు.
కేంద్ర రాష్ట్రాల మధ్య ఉండే ఆర్థిక సంబంధాలను తెలిపేదే ఫెడరల్ విత్తం. ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ వివరాలు ఉంటాయి.

1. ఫెడరల్ విత్త వ్యవస్థ లక్షణాలు : (Characteristics of Federal Finance)
ఫెడరల్ విత్త వ్యవస్థకు సంబంధించిన ప్రధాన లక్షణాలు కింది విధంగా ఉంటాయి :

  1. ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ రాజ్యాంగంలో స్పష్టంగా తెలుపబడుతుంది. వీటి అధికారాలు, చట్ట సంబంధమైన ప్రాంతం (jurisdiction) రాజ్యాంగంలో పేర్కొనబడుతుంది.
  2. ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రాంట్లను ఇస్తుంది.
  3. ఈ వ్యవస్థలో ప్రభుత్వాలకు స్వయంగా ప్రతిపత్తి ఉన్నా అవి కేంద్ర ప్రభుత్వ ఆజమాయిషీలో పనిచేయాలి.
  4. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తగాదాలేర్పడితే వాటి పరిష్కార మార్గాలు రాజ్యాంగంలో ఏర్పాటు చేయబడతాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి ప్రాంతాల (భౌగోళిక వైశాల్యం) దృష్ట్యా స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. అయితే వీటి విధులు, అధికారాలు రాజ్యాంగంలో పొందుపరచబడతాయి. వాటి ఆధికారాలు, విధులననుసరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ మార్గాలు ద్వారా ఆర్థిక వనరులకు సమీకరించుకొంటాయి. ఫెడరల్ వ్యవస్థ విజయవంతమవడానికి రెండు ముఖ్య నిబంధనలు పాటించాలి.

  1. ప్రతి ప్రభుత్వం స్వతంత్రంగా రాబడి వనరులు కలిగి ఉండటం
  2. ప్రతి ప్రభుత్వం దాని అవసరాలను తీర్చుకోవడానికి సరిపోయినంత రాబడిని కలిగి ఉండటం.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 7.
బడ్జెట్ భావనను, భాగాలను, రకాలను విశదీకరించండి.
జవాబు.
ప్రభుత్వ ఆదాయ – వ్యయాల పట్టికనే ‘బడ్జెట్’గా పేర్కొనవచ్చు. దీన్ని ప్రభుత్వం రాబోయే ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ – మార్చి) రాబడి అంచనాలు మరియు చేపట్టబోయే వివిధ ఆర్థిక, సంక్షేమ కార్యక్రమాలపై వెచ్చించబోయే వ్యయాల వివరాలతో శాసనసభ ఆమోదానికి ఆర్థిక మంత్రి ద్వారా సమర్పిస్తుంది.

శాసనసభ ఆమోద ముద్ర లేకుండా సాధారణంగా ప్రభుత్వం వివిధ పథకాలపై వ్యయం చేయడానికి అవకాశం లేదు. పన్నుల ప్రతిపాదనలు, వివిధ కార్యక్రమాల అమలు ప్రభుత్వం తలపెట్టిన వ్యయాల కేటాయింపు, సంక్షేమ పథకాల వ్యయ కేటాయింపుల కోసం ప్రభుత్వం బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందాలి.

కొన్ని సందర్భాలలో ప్రభుత్వాలు ‘పూర్తి’ బడ్జెట్ను సమర్పించే వీలు లేనప్పుడు ‘ఓట్ ఆన్ అకౌంట్’ బడ్జెట్ను తాత్కాలికంగా కొన్ని నెలల కోసం సమర్పిస్తాయి.
ఉద్దేశాలు : పన్ను ప్రతిపాదనలు, వివిధ ప్రభుత్వ కార్యకలాపాలకు వనరుల కేటాయింపు గురించి చట్టసభ ఆమోదం పొందుట బడ్జెట్ ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వం తన విధానాలను, కార్యక్రమాలను వివరించడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది.

బడ్జెట్ అంచనాలు :
బడ్జెట్లో ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనాలు ఉంటాయి. అట్లాగే బడ్జెట్లో గత సంవత్సరంలో వివిధ అంశాలపై జరిగిన వాస్తవిక వ్యయ వివరాలు (actual expenditure) ప్రస్తుత సంవత్సరపు అంచనాలతోబాటు సవరించబడిన అంచనాలు ఉంటాయి.

బడ్జెట్ నిర్మాణం దానిలోని అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోవడానికి వీలుగా పట్టిక (ఈ సమాధానం చివర పొందుపరచబడింది) లో కేంద్ర ప్రభుత్వ 2017-18 వార్షిక బడ్జెట్ చూపబడింది.

బడ్జెట్ లోని అంశాలు (Components of the Budget) :
బడ్జెట్లో రాబోయే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి లభించబోయే ఆదాయ అంచనా వివరాలతోపాటు చేయదలచిన వ్యయ వివరాలు పొందుపరచడం జరుగుతుంది. భారత ప్రభుత్వ బడ్జెట్లో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి.

1. బడ్జెట్ రాబడులు :
ఇందులో (a) రెవిన్యూ రాబడులు రాబడులు – రుణాల వసూళ్ళు, ఇతర రాబడులు, రుణాలు, అప్పులు ఉంటాయి.

2. బడ్జెట్ వ్యయాలు :
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ బడ్జెట్ వ్యయాన్ని రెండు రకాలుగా విభజించడం జరిగింది. అవి : ప్రణాళికా వ్యయం, ప్రణాళికేతర వ్యయం. కాని కేంద్ర ప్రభుత్వం 2017 18 యూనియన్ బడ్జెట్ ద్వారా ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం భావనలను తొలగించి, వాటిస్థానంలో రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయంను ప్రవేశపెట్టింది.

పైన పేర్కొన్న రాబడుల, వ్యయాల సమగ్ర అవగాహన కోసం భారతదేశంలో ఆచరణలో ఉన్న బడ్జెట్ నిర్మాణం, బడ్జెట్ లోని అంశాలు పట్టిక (ఈ సమాధానం చివర పొందుపరచబడింది. )లో చూడండి.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

బడ్జెట్ రకాలు (Types of Budget) :
రాబడి, వ్యయాల మధ్య తేడాను అనుసరించి బడ్జెట్ మూడు రకాలని చెప్పవచ్చు.

1. మిగులు బడ్జెట్ (Surplus Budget) :
మొత్తం వ్యయాల (E) కంటే మొత్తం రాబడులు (R) ఎక్కువగా ఉన్నట్లయితే ‘మిగులు బడ్జెట్ ‘గా పేర్కొంటారు. (R > E).

2. లోటు బడ్జెట్ (Deficit Budget) :
మొత్తం రాబడుల కంటే మొత్తం వ్యయాలు ఎక్కువగా ఉన్నట్లయితే ‘లోటు బడ్జెట్’గా పేర్కొంటారు. (R < E).

3. సంతులిత బడ్జెట్ (Balanced Budget) :
మొత్తం రాబడులు, మొత్తం వ్యయాలు సమానంగా ఉంటాయి. (R = E).

బడ్జెట్ ద్రవ్యలోటు (Budget Deficit) :
సాధారణంగా బడ్జెట్లో మొత్తం రాబడులను మొత్తం వ్యయాలు అధిగమిస్తే ‘బడ్జెట్ లోటు’ ఏర్పడిందని అంటారు. సాంకేతికంగా బడ్జెట్ లోటును నాలుగు రకాలుగా పేర్కొనవచ్చు.

1. రెవెన్యూ లోటు :
రెవెన్యూ ఖాతాలో రెవెన్యూ రాబడిని రెవెన్యూ వ్యయం అధిగమించడాన్ని రెవెన్యూ లోటు (revenue deficit) అంటారు.
రెవెన్యూ లోటు = రెవెన్యూ రాబడులు – రెవెన్యూ వ్యయాలు.

2. బడ్జెట్ లోటు :
మొత్తం రాబడుల కంటే మొత్తం వ్యయాలు ఎక్కువ ఉన్నట్లయితే బడ్జెట్ లోటు (budget deficit) ఏర్పడుతుంది. ”
బడ్జెట్ లోటు = మొత్తం రాబడులు మొత్తం వ్యయాలు.

3. కోశపరమైన లోటు :
మొత్తం రాబడి మరియు మొత్తం వ్యయాల తేడాకు మార్కెట్ రుణాలు, ఇతర అప్పులు కలిపినట్లయితే కోశపరమైన లోటు (fiscal deficit) తెలుస్తుంది.
కోశపరమైన లోటు = (మొత్తం రాబడులు మొత్తం వ్యయాలు) + మార్కెట్ రుణాలు, ఇతర అప్పులు లేదా, కోశపరమైన లోటు = బడ్జెట్ లోటు + మార్కెట్ రుణాలు, ఇతర అప్పులు.

4. ప్రాథమిక లోటు :
ఇందుకోసం కోశపరమైన లోటు నుంచి వడ్డీ చెల్లింపులు తీసేయాలి. -ప్రాథమిక లోటు = కోశపరమైన లోటు – వడ్డీ చెల్లిపులు.

వివిధ రకాలైన ఆర్థికాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వ్యయాలు క్రమంగా పెరుగుతున్నందున ఆధునిక ప్రభుత్వాలు లోటు బడ్జెట్లను ప్రతిపాదిస్తున్నాయి. అయితే ఎక్కువ మోతాదులో లోటు ముఖ్యంగా తీవ్ర కోశ లోటు ఆర్థిక వ్యవస్థలో ప్రతికూల పరిస్థితులను ఏర్పరుస్తుంది.

భారత ప్రభుత్వ 2017 – 18 బడ్జెట్ ప్రతిపాదనల వివరాలు పట్టిక – 8.4లో పొందుపరచబడినవి.

అందులోని లెక్కల వివరాల ప్రకారం : (అన్ని విలువలు రూపాయలు కోట్లలో)
1. రెవెన్యూ లోటు = రెవెన్యూ రాబడి – రెవెన్యూ వ్యయం
రూ. 321163 = రూ.1515771 – రూ.1836934
2. బడ్జెట్ లోటు = మొత్తం రాబడులు – మొత్తం వ్యయాలు
(శూన్యం) = రూ. 2146735 – రూ.2146735
3. కోశపరమైన లోటు = బడ్జెట్ లోటు + మార్కెట్ రుణాలు, ఇతర అప్పులు.
రూ.546532 = 0 + రూ.546532
4. ప్రాథమిక లోటు కోశపరమైన లోటు – వడ్డీ చెల్లింపులు
రూ.23,454 = రూ.546532 – రూ.523078.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
‘సప్లయి తన డిమాండ్ను తానే సృష్టించుకుంటుంది’ అను జె.బి. సే వ్యాఖ్యను వివరించండి.
జవాబు.
సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం ‘సే’ మార్కెట్ సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. మార్కెట్ సూత్రాన్ని జె.బి. సే ప్రతిపాదించాడు. అతని అభిప్రాయం ప్రకారం, “సప్లయి తన డిమాండ్ను తానే సృష్టించుకుంటుంది”.

S = D లేదా సప్లై ఎప్పుడు డిమాండ్కు సమానంగా ఉంటుందని ఈ సూత్రాన్ని సాధారణంగా వివరిస్తారు.

ఆర్థికవ్యవస్థలో ఎప్పుడు అదనపు ఉత్పత్తి ఏర్పడినా, ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్న ఉత్పత్తి కారకాలు భాటకం, వేతనం, వడ్డీ లాభం ప్రకారం రూపంలో ఆదాయాలను ఆర్జిస్తాయి. ఆ విధంగా పెరిగిన ఆదాయం మొత్తం అదుపులో ఉంచడానికి అదనపు ఉత్పత్తి కారకాల విలువకు సమానంగా ఉంటుంది.

ఆ ఆదాయం అదనపు ఉత్పత్తి అమ్మకానికి అవసరమైన అదనపు డిమాండ్ను సృష్టిస్తుంది. మొత్తం ఆదాయం వస్తువుల కొనుగోలు మీద వ్యయం చేయబడుతుందని భావించడమైంది. అలాంటి వ్యయం కొంతవరకు వినియోగ వస్తువుల మీద కొంతవరకు మూలధన వస్తువుల మీద వ్యయం చేయబడుతుంది.

ముఖ్యాంశాలు : ‘సే’ మార్కెట్ సూత్రంలోని ముఖ్యాంశాలను క్రింది విధంగా చెప్పవచ్చు.

  1. సాధారణ అత్యుత్పత్తి, సాధారణ నిరుద్యోగం ఉండవు.
  2. ప్రభుత్వ జోక్యం అవసరం లేదు.
  3. ఆదాయం మొత్తం ఖర్చు చేయబడుతుంది. ఒకవేళ కొంత పొదుపు చేసినప్పటికీ ఆ పొదుపు మూలధన వస్తువులపై వ్యయం చేయటం జరుగుతుంది. అంటే పొదుపు, పెట్టుబడి సమానం.
  4. ఆర్థిక వ్యవస్థలో ఉపయోగంలో లేని వనరులు ఉన్నంతవరకు ఉత్పత్తి, ఉద్యోగితలను పెంచటం సాధ్యం అవుతుంది.
  5. వస్తువులు, వస్తువులతో వినిమయం చేయటం జరుగుతుంది. ఆ విధమైన వస్తు వినిమయానికి ద్రవ్యం ఉపయోగపడుతుంది.
  6. శ్రామిక మార్కెట్లో సరళ వేతన రేటువల్ల సమతౌల్యం ఏర్పడుతుంది.
  7. సరళ వడ్డీరేటు ద్వారా పొదుపు, పెట్టుబడి సమతౌల్యం చేరుకుంటాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 2.
సంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంత ప్రమేయాలను, ప్రధాన అంశాలను పేర్కొనండి.
జవాబు.
సాంప్రదాయ అర్థశాస్త్రం అనే పదాన్ని మొదట కార్ల్ మార్క్స్ ఉపయోగించారు. ఆడమస్మిత్, డేవిడ్ రికార్డో, రాబర్ట్ మాల్టస్, జె.ఎస్. మిల్ మొదలైనవారి సిద్ధాంతాలను సాంప్రదాయ అర్థశాస్త్రంగా పేర్కొన్నారు.

ప్రమేయాలు :

  1. స్వేచ్ఛాపూరిత పెట్టుబడి ద్వారా ఆర్థిక కార్యకలాపాలలో మార్కెట్ శక్తులకు పూర్తి స్వేచ్ఛ.
  2. పరిపూర్ణ పోటీ పరిస్థితులు.
  3. ఆర్థిక కార్యకలాపాలలో ప్రభుత్వ జోక్యం ఉండదు.
  4. దీర్ఘకాలిక విశ్లేషణ.
  5. సంపూర్ణ ఉద్యోగిత.
  6. పొదుపులన్నీ నేరుగా పెట్టుబడిగా మారడం S = I, వడ్డీరేటు ద్వారా.
  7. వడ్డీ సరళత్వం.
  8. వేతనాల సరళత్వం.
  9. అపరిమిత మార్కెట్ల పరిధి.
  10. ద్రవ్యం వినిమయ మాధ్యమం అనే విధిని మాత్రమే నిర్వర్తిస్తుంది. ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో ద్రవ్యం తటస్థంగా వ్యవహరిస్తుంది.

11. స్వయంచాలక సర్దుబాటు :
ఆర్థిక వ్యవస్థలో ఉండే స్వయంచాలక సర్దుబాటు మూలంగా మొత్తం సప్లై, మొత్తం డిమాండ్ సమానమౌతాయి.

క్రింద పేర్నొన్న మూడు ముఖ్యమైన భావనల సహాయంతో సంప్రదాయ ఆదాయ ఉద్యోగితా సిద్ధాంతాన్ని వివరించవచ్చు.

  • వస్తువు మార్కెట్ సమతౌల్యం.
  • ద్రవ్య మార్కెట్ సమతౌల్యం.
  • శ్రామికుల మార్కెట్ సమతౌల్యం.

పైన పేర్కొన్న వాటిలో మొదటి రెండు భావనలను జె.బి. సే ప్రతిపాదించగా మూడవ బావనను ఎ.సి.పిగూ అభివృద్ధి చేశాడు.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 3.
సమిష్టి సప్లయ్ ధర, సమిష్టి డిమాండ్ ధర భావనలను విభేదించండి.
జవాబు.
ఆర్థిక వ్యవస్థలో మొత్తం వస్తురాశికి ఉండే డిమాండ్ను సమిష్టి డిమాండ్ తెలియజేస్తుంది. వివిధ ఉత్పత్తులు రాశుల వద్ద సమాజంలో ప్రజలు ఎంత మొత్తంలో వ్యయం చేయటానికి సిద్ధపడతారో దానిని సమిష్టి డిమాండ్ పట్టిక తెలియజేస్తుంది. వస్తు సేవలపై సమాజం ఖర్చు చేసిన ఆదాయం ఉత్పాదక సంస్థలకు ఆదాయం అవుతుంది.

నిర్ణీత సంఖ్యలో శ్రామికులను నియమించి నిర్ణీత స్థాయిలో ఉత్పత్తి కొనసాగించి మార్కెట్లో విక్రయించగా వాస్తవంగా తమకు ఆదాయం వస్తుందని ఉద్యమదారులు ఆశించే ఆదాయాన్ని సమిష్టి డిమాండ్ ధర అంటారు. వివిధ ఉద్యోగితా స్థాయిలకు ఆ స్థాయిల వద్ద ఉత్పాదక సంస్థలు వాస్తవంగా పొందగలమని ఆశించే ఆదాయ ప్రవాహానికి మధ్య ఉండే సంబంధాన్ని సమిష్టి డిమాండ్ ధర పట్టిక తెలియజేస్తుంది.

సమిష్టి డిమాండ్ పట్టిక:

ఉద్యోగితా స్థాయి (వేలల్లో)సమిష్టి డిమాండ్ ధర (లక్షల రూపాయిలలో)
20200
30250
40300
50350
60400

పై పట్టికననుసరించి సమిష్టి డిమాండ్కు, ఉద్యోగితా స్థాయికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంటుందని తెలుసుకోవచ్చును. ఉద్యోగితా స్థాయి పెరిగినప్పటికి సమిష్టి డిమాండ్ కూడా పెరుగుతుంది.

ఆర్థిక వ్యవస్థలోని మొత్తం వస్తురాశి సప్లైని తెలియజేస్తుంది. సమిష్టి సప్లై పట్టిక వివిధ రకాల ధరల వద్ద ఎంత వస్తురాశి ఉత్పత్తి అవుతుందో తెలియజేస్తుంది. ఉత్పత్తి పెరిగిన కొద్దీ ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఉత్పత్తి వ్యయానికి సమానమైన ధరను ఉత్పాదక సంస్థలు పొంది తీరవలెను.

వివిధ ఉత్పత్తి రాశులకు ఉత్పాదక సంస్థలు పొంది తీరవలసిన కనీస ఆదాయాన్ని సమిష్టి సప్లై ధర అంటారు. వివిధ ఉద్యోగితా స్థాయిలకు ఆ ఉద్యోగితా స్థాయిల వద్ద ఉద్యమదారులు పొందాలని ఆశించే కనీస ఆదాయాలకు ఉన్న సంబంధాన్ని సమిష్టి సప్లై ధర పట్టిక తెలియజేస్తుంది. సమిష్టి సప్లై పట్టికని ఈ క్రింద పరిశీలింపవచ్చును.

సమిష్టి సప్లై పట్టిక:

ఉద్యోగితా స్థాయి (వేలల్లో)సమిష్టి డిమాండ్ ధర (లక్షల రూపాయిలలో)
20200
30250
40300
50350
60400

పై పట్టికననుసరించి సమిష్టి సప్లై ధరకు, ఉద్యోగితా స్థాయికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని తెలుస్తుంది. ఉద్యోగితా స్థాయి సమిష్టి సప్లై కూడా పెరుగుతుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 4.
సంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతంపై విమర్శలను వివరించండి.
జవాబు.
సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం జె.బి. సే మార్కెట్ సూత్రంపై ఆధారపడింది. జె.బి. సే అనే ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం, “సప్లై దానికి తగిన డిమాండ్ను తానే సృష్టించుకొంటుంది”. ఉత్పత్తి విలువకు సరిపడ ఆదాయం ఏర్పడును. కనుక ఉత్పత్తి అంతటికీ డిమాండ్ ఏర్పడుతుంది. అందువల్ల అత్యుత్పత్తి ఏర్పడక సప్లై అంతటికీ డిమాండ్ ఏర్పడుతుంది.

సాంప్రదాయ సిద్ధాంతం ప్రకారం సప్లై పెరిగినంతమేరకు డిమాండ్ కూడా పెరుగుతుంది. అందువల్ల మార్కెట్ విస్తరణకు పరిమితి ఉండదు. ఈ సిద్ధాంతం ప్రకారం సార్వత్రిక అత్యుత్పత్తి ఉండదు. కనుక సార్వత్రిక నిరుద్యోగిత కూడా ఉండదు. వేతనాల రేటులో మార్పులు సప్లై, డిమాండ్లను సమానం చేస్తుంది. సాంప్రదాయ సిద్ధాంతం ప్రకారం వేతనాల తగ్గింపు వల్ల ఉద్యోగితాస్థాయి పెరుగుతుంది.

విమర్శలు : కీన్స్ అను ఆర్థిక శాస్త్రవేత్త సాంప్రదాయ సిద్ధాంతాన్ని ఈ క్రింది విధంగా విమర్శించాడు.

1. సప్లై దానికి తగిన డిమాండ్ను సృష్టించదు :
సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం ప్రకారము పొదుపు, పెట్టుబడి సమానంగా ఉండుట వలన సప్లయ్ దానికి తగిన డిమాండ్ను సృష్టించును, కాని వాస్తవానికి పొదుపు, పెట్టుబడులు సమానంగా ఉండవు. అందువలన సప్లై దానికి తగిన డిమాండ్ను సృష్టించదు.

2. వేతనాల తగ్గుదల ఉండదు :
సాంప్రదాయ ఉత్పత్తి ఉద్యోగితా సిద్ధాంతం ప్రకారం సప్లై కన్నా డిమాండ్ తక్కువైనపుడు వేతనాలు, ధరలు తగ్గును. కానీ వాస్తవానికి కార్మిక సంఘాలు వేతనాల తగ్గుదలను ప్రతిఘటిస్తాయి.

3. పరిపూర్ణ పోటీ ప్రమేయం వాస్తవం కాదు :
సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతంలో పరిపూర్ణ పోటీ మార్కెట్ ఉండుననే ప్రమేయం తీసుకొనడమైనది. కాని వాస్తవానికి పరిపూర్ణ పోటీ ఎక్కడా ఉండదు.

4. స్వల్ప కాలానికి అన్వయించబడదు:
దీర్ఘకాలంలో సాంప్రదాయక ఆర్థికవేత్తలు చెప్పిన ప్రకారము సప్లై, డిమాండ్లు సమానము కావచ్చు. కాని స్వల్పకాలంలో సప్లై, డిమాండ్లు సమానము కావు. అందువలన సాంప్రదాయ ఉద్యోగితా సిద్దాంతము స్వల్పకాలానికి అన్వయించబడదు.

5. ఉత్పత్తి, వినియోగం సమానంగా ఉండవు :
సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం ప్రకారం ఉత్పత్తి, ఆదాయం, వినియోగం సమానంగా ఉంటాయి. కాని ధనవంతుల విషయంలో వినియోగం కంటే ఆదాయం ఎక్కువగా ఉండును. పేదవారి విషయంలో ఆదాయం తక్కువగా ఉండును. అందువలన ఉత్పత్తి, వినియోగము సమానంగా ఉండవు.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 5.
‘సార్థక డిమాండ్’ భావనను వివరించండి.
జవాబు.
కీన్స్ ఉద్యోగితా సిద్ధాంతానికి డిమాండ్ భావన ఆయువు పట్టు. సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై సమానంగా ఉండే స్థితిలో సార్థక డిమాండ్ నిర్ణయమౌతుంది. వివిధ ఉద్యోగితా స్థాయిలలో సమిష్టి డిమాండ్ వివిధ రకాలుగా ఉంటుంది.

ఏ ఉద్యోగితా స్థాయిలో సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లైతో సమానమౌతుందో అది ఆర్థిక వ్యవస్థ సమతౌల్యాన్ని సూచిస్తుంది. కానీ అది స్వల్పకాల సమతౌల్యం. అది సార్థక డిమాండ్ని సూచిస్తుంది. ఆర్థిక వ్యవస్థలో సమిష్టి సప్లై సమిష్టి డిమాండ్కు అనుగుణంగా మారుతుంది.

సార్థక డిమాండ్ :
సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై రేఖలు ఒకదానికొకటి ఖండించుకున్న బిందువు సార్థక డిమాండ్ను సూచిస్తుంది. ఈ బిందువు వద్ద సమిష్టి డిమాండ్ ధర, సమిష్టి సప్లై ధరకు సమానమవటం వల్ల ఆ డిమాండ్ సార్థక డిమాండ్ అవుతుంది.

సమతౌల్య స్థాయి వద్ద ఉత్పత్తైన వస్తురాశిని కొనడానికైన మొత్తం వ్యయం సార్థకమైన డిమాండ్ అవుతుంది. సార్థకమైన డిమాండ్ ఉత్పత్తైన వస్తురాశి విలువకు సమానం. వస్తురాశి విలువ జాతీయాదాయానికి సమానం. ఆదాయం మొత్తం వ్యయానికి సమానమౌతుంది. దీనిని ఈ క్రింది విధంగా చెప్పవచ్చు.

సార్థకమైన డిమాండ్ = జాతీయ ఆదాయం వినియోగ వ్యయం + పెట్టుబడి వ్యయం.
ఈ విధంగా సార్థకమైన డిమాండ్ వినియోగ వ్యయం, పెట్టుబడికి సమానం. ఆదాయము మొత్తం వ్యయానికి సమానం.
Y = C + I
విదేశీ వ్యాపారం ఉన్న ఆర్థిక వ్యవస్థలో నికర ఎగుమతులు (X – M)కు సమిష్టి డిమాండ్లో చేరి ఉంటుంది.
Y = C + I + G + (X – M)
Y = జాతీయోత్పత్తి
C = వినియోగ వ్యయం
I = పెట్టుబడి
G = ప్రభుత్వ వ్యయం
X = ఎగుమతి విలువ
M = దిగుమతి విలువ
సార్థక డిమాండు ఈ క్రింది పట్టిక పటముల సహాయంతో వివరించవచ్చు.

సార్థక డిమాండ్ పట్టిక:

ఉద్యోగితా స్థాయి (వేలల్లో)సమిష్టి డిమాండ్ ధర (లక్షల రూపాయిలలో)సమిష్టి సప్లై ధర (లక్షలలో)
20200175
30250225
40300300
50350325
60400425

 

TS Inter 1st Year Economics Study Material 8th Lesson ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం 4

పై పటములో X అక్షంపై ఉద్యోగిత, Y అక్షంపై సమిష్టి డిమాండ్ ధర, సమిష్టి సప్లై ధర చూపాం. AS సమిష్టి సప్లై రేఖ, AD సమిష్టి డిమాండ్ రేఖ. ఇది ‘E’ బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి. కనుక ‘E’ బిందువు సార్థక డిమాండున్ను తెలియజేయును.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 6.
ప్రభుత్వ రాబడి మార్గాలేవి ?
జవాబు.
ఆధునిక ప్రభుత్వాలు అనేక విధులను నిర్వహించడమే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రభుత్వ వ్యయం క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని సేకరిస్తుంది.

పన్నులు, ఫీజులు, ప్రత్యేక విధింపులు, గ్రాంట్లు, వాణిజ్య ఆదాయాలు, రుణ సేకరణ, కరెన్సీనోట్ల ముద్రణ మొదలైన మార్గాల ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. వాటిలో పన్నులు ప్రధానమైనవి.

1. పన్నులు : వ్యక్తులు, సంస్థలు ప్రభుత్వానికి నిర్బంధంగా చెల్లించేవి ‘పన్నులు’ ఇవి రెండు రకాలు.

  • ప్రత్యక్ష పన్నులు : వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేటు పన్ను.
  • పరోక్ష పన్నులు : వస్తువు, సేవలపై విధించే పన్నులు, ఎక్సైజ్ డ్యూటీ.

ప్రశ్న 7.
ప్రభుత్వ వ్యయంలోని వివిధ అంశాలను పేర్కొనండి.
జవాబు.
ప్రభుత్వ విత్తంలోని ముఖ్యమైన భాగాలలో ప్రభుత్వ వ్యయం ఒకటి. ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలు నిరంతరం పెరుగుతూ ఉండటంతో అన్ని దేశాలలోను ప్రభుత్వ వ్యయం పెరిగింది. ప్రభుత్వ వ్యయ పరిమాణం ఆయా ప్రభుత్వాల రాజకీయ ఆర్థిక విధానాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఈ క్రింది అంశాలపై ఖర్చు చేస్తుంది.

1. దేశ రక్షణ :
అంతర్గత, బహిర్గత ఒడిదుడుకుల నుండి దేశాన్ని రక్షించుకోవడానికి జాతీయాదాయంలో కొంత భాగాన్ని దేశ రక్షణకై ఖర్చు చేయవలసి ఉంటుంది.

2. ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణ :
ప్రజా శ్రేయస్సు పెంపొందే విషయంలో ప్రభుత్వ రంగంలో కొన్ని వస్తూత్పత్తి సంస్థలను ప్రారంభించి నిర్వహించాల్సి వస్తోంది. ప్రభుత్వం విస్తరించిన కొద్దీ వ్యయం పెరుగుతుంది.

3. ప్రజాస్వామ్య సంస్థలు :
పార్లమెంటు, అసెంబ్లీ మొదలైన ప్రజాస్వామ్య సంస్థల పట్ల ప్రభుత్వానికి నిర్వహణ వ్యయం పెరుగుతుంది. భూములు, భవనాలు కొనుగోలు చేస్తుంది.

4. పాలనా వ్యయం :
ప్రభుత్వ కార్యకలాపాలు పెరుగుతున్నప్పుడు వాటిని నిర్వహించవలసిన సిబ్బందిని పెంచాల్సి ఉంటుంది.

5. వృద్ధాప్యపు భృతి, నిరుద్యోగ భృతి :
వృద్ధాప్యపు భృతి, నిరుద్యోగ భృతి వృద్ధాప్యపు భృతి, నిరుద్యోగ భృతి మొదలైన బదిలీ చెల్లింపులను సాంఘిక భద్రతల కల్పన దృష్ట్యా చెల్లించవలసి ఉంటుంది.

6. వడ్డీ చెల్లింపులు :
ప్రభుత్వ స్వదేశీ, విదేశీ ఋణాలపై వడ్డీలు చెల్లించాలి.

7. ప్రజోపయోగ కార్యక్రమాలు :
ప్రజోపయోగ కార్యకలాపాల కోసం ఆధునిక ప్రభుత్వాలు ఎక్కువగా ఖర్చు చేస్తున్నాయి. త్రాగు నీరు, రవాణా మొదలైన వాటిపై ప్రభుత్వం ఖర్చు చేస్తుంది.

8. అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి :
ఆర్థికాభివృద్ధిని సాధించటానికి అవసరమైన అవస్థాపనా సౌకర్యాలను ప్రభుత్వం అభివృద్ధి పరచవలసి ఉంటుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 8.
ప్రభుత్వ ఋణ విమోచన పద్ధతులను పేర్కొనండి.
జవాబు.
ప్రభుత్వం చేసిన రుణాన్ని తిరిగి చెల్లించటాన్ని రుణ విమోచన / విముక్తి అంటారు. ప్రభుత్వాలు రుణ విమోచన కోసం కింది పద్ధతులను అనుసరిస్తారు. అవి :

i) మిగులు బడ్జెట్ (Surplus Budget) :
ప్రభుత్వాలు ప్రభుత్వ వ్యయం కంటే ఆదాయ వనరులు ఎక్కువగా వుండేటట్లు చేసుకొనగలిగితే, పెరిగిన ఆదాయ వనరుల / మిగులు నుంచి రుణాలను తిరిగి చెల్లించడం.

ii) రీఫండింగ్ (Refunding) :
ప్రభుత్వం కొత్తగా బాండులను, సెక్యూరిటీలను జారీచేయడం ద్వారా పరిపక్వమైన రుణాన్ని వాయిదా వేయవచ్చు.

iii) వార్షిక పద్ధతి (Annuities) :
ఈ పద్ధతి ప్రకారం ప్రభుత్వం తాను తీసుకొన్న రుణాన్ని సంవత్సరవారీగా అంటే సంవత్సరానికొకసారి చెల్లిస్తుంది. తీసుకొన్న రుణం మొత్తం చెల్లుబాటు అయ్యేంతవరకు ఇది కొనసాగుతుంది.

iv) రుణ విమోచన నిధి (Sinking Fund) :
ప్రభుత్వం అనుసరించే వివిధ పద్ధతులలో ఇది మంచి పద్ధతి ‘అని చెప్పబడింది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం తన రెవెన్యూ బడ్జెట్ నుంచి కొంత మొత్తాన్ని ఈ నిధికి బదిలీ చేస్తుంది. ఈ నిధిలో జమచేసిన మొత్తంపై వచ్చే వడ్డీని కూడా రుణాలు తిరిగి చెల్లించడానికి ఉపయోగించడం జరుగుతుంది.

v) రుణ పరివర్తనం (Conversion) :
పాత రుణాన్ని చెల్లించడానికి మరలా కొత్త రుణం చేయడం – కానీ ఈ పద్ధతి ద్వారా రుణ విమోచన జరగదు. అయితే ప్రస్తుతం పొందిన రుణంపై చెల్లించే వడ్డీ రేటు కంటే గతంలో పొందిన రుణంపై చెల్లించే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే ఈ రుణం లాభదాయకం.

vi) అదనపు పన్నులు (Additional Taxation) :
కొన్ని సందర్భాల్లో రుణ విమోచన కోసం ప్రభుత్వాలు అదనపు పన్నులను విధించి రాబడితో రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు. ఈ విధానంలో కొత్త పన్నులు విధించబడతాయి.

vii) మూలధనంపై పన్ను (Capital Levy) :
ఈ పద్ధతిలో ప్రజల వద్ద ఉన్న మూలధన ఆస్తులపై లేదా ఎస్టేట్ల పై ఒకేసారి పన్ను విధిస్తారు. అందువల్ల ఇది ఉత్తమమైందిగా డాల్టన్ భావించాడు.

viii) మిగులు వర్తక శేషం (Surplus Balance of Trade) :
ఎగుమతుల విలువ, దిగుమతుల విలువ కంటే ఎక్కువగా ఉండి మిగులు వర్తక శేషం ఏర్పడగలిగితే, వాటిలో కొంత వరకు విదేశీ రుణాల నుంచి విముక్తి కలగడానికి అవకాశం ఉంటుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 9.
ఫెడరల్ విత్త లక్షణాలేవి ?
జవాబు.
కేంద్ర రాష్ట్రాల మధ్య ఉండే ఆర్థిక సంబంధాలను తెలిపేదే ఫెడరల్ విత్తం. ఫెడరల్ విత్త వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల మధ్య ఆర్థిక పంపిణీ వివరాలు ఉంటాయి.

ఫెడరల్ విత్త వ్యవస్థ లక్షణాలు (Characteristics of Federal Finance)
ఫెడరల్ విత్త వ్యవస్థకు సంబంధించిన ప్రధాన లక్షణాలు కింది విధంగా ఉంటాయి :

  1. ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ రాజ్యాంగంలో స్పష్టంగా తెలుపబడుతుంది. వీటి అధికారాలు, చట్ట సంబంధమైన ప్రాంతం (jurisdiction) రాజ్యాంగంలో పేర్కొనబడుతుంది.
  2. ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రాంట్లను ఇస్తుంది.
  3. ఈ వ్యవస్థలో ప్రభుత్వాలకు స్వయంగా ప్రతిపత్తి ఉన్నా అవి కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో పనిచేయాలి.
  4. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తగాదాలేర్పడితే వాటి పరిష్కార మార్గాలు రాజ్యాంగంలో ఏర్పాటు చేయబడతాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి ప్రాంతాల (భౌగోళిక వైశాల్యం) దృష్ట్యా స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. అయితే వీటి విధులు, అధికారాలు రాజ్యాంగంలో పొందపరచబడతాయి. వాటి అధికారాలు విధులనుసరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ మార్గాల ద్వారా ఆర్థిక వనరులను సమీకరించుకొంటాయి.

ఫెడరల్ వ్యవస్థ విజయవంతమవడానికి రెండు ముఖ్య నిబంధనలు పాటించాలి. అవి :

  1. ప్రతి ప్రభుత్వం స్వతంత్రంగా రాబడి వనరులను కలిగి ఉండటం
  2. ప్రతి ప్రభుత్వం దాని అవసరాలను తీర్చుకోవడానికి సరిపోయినంత రాబడిని కలిగి ఉండటం.

ప్రశ్న 10.
ఆర్థిక (విత్త) సంఘం దాని విధులపైన ఒక వ్యాఖ్య వ్రాయండి.
జవాబు.
మన దేశంలో 1951లో ఆర్థిక సంఘం లేదా విత్త సంఘం ఆవిర్భవించింది. రాజ్యాంగంలోని 280వ ఆర్టికల్ ప్రకారం భారత రాష్ట్రపతి దీన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీని ఇది చేపడుతుంది.

ఆర్థిక సంఘ సభ్యుల నియామకానికి సంబంధించిన అర్హతలు, పదవీకాలం లాంటి నియమ నిబంధనలు ఆర్థిక సంఘపు 1951 చట్టంలో రూపొందించబడ్డాయి. ఈ చట్టం ప్రకారం ప్రతీ 5 సంవత్సరాలకొకసారి ఈ సంఘ సభ్యులను నియమిస్తారు.

మొదటి ఆర్థిక సంఘం 1952లో తన నివేదికను సమర్పించింది. వివిధ రకాల పన్నుల నుంచి వచ్చే ఆదాయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కేటాయింపు విషయంలో రాష్ట్రపతికి ఆర్థిక సంఘం సలహాలనిస్తుంది.

ఆర్థిక సంఘం పనిచేయడం ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు భారత ఆర్థిక వ్యవస్థలో చెప్పుకోదగిన స్థూల ఆర్థిక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు 14 ఆర్థిక సంఘాలు వాటి నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాయి.

ఆర్థిక (విత్త) సంఘం విధులు :
ఆర్థిక సంఘం ప్రధాన విధులు కింద పేర్కొన్న విధంగా ఉంటాయి.

  1. పన్నుల ద్వారా సమీకరించిన రాబడిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ చేయడం.
  2. వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేయవలసిన గ్రాంట్ల రూపంలో సహాయానికి సంబంధించిన సిఫారసులు చేయడం.
  3. 73, 74వ రాజ్యాంగ సవరణల ప్రకారం గ్రామ పంచాయితీలకు, మున్సిపాలిటీలకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ‘సమీకృత నిధి’ (consolidated fund) నుంచి పంపిణీ చేసే వనరుల పెంపుదలకు సంబంధించిన అంశాల్లో రాష్ట్రపతికి సలహాలనివ్వడం.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 11.
బడ్జెట్ లోటులను వివరించండి.
జవాబు.
సాధారణంగా మొత్తం రాబడులను మొత్తం వ్యయాలు అధిగమిస్తే ‘బడ్జెట్ లోటు’ ఏర్పడిందని అంటారు. సాంకేతికంగా బడ్జెట్ లోటును నాలుగు రకాలుగా పేర్కొనవచ్చు.

1. బడ్జెట్ రెవెన్యూ లోటు (ద్రవ్య) :
రెవెన్యూ ఖాతాలో రెవెన్యూ రాబడిని రెవెన్యూ వ్యయం అధిగమించడాన్ని బడ్జెట్ రెవెన్యూ లోటు (revenue deficit) అంటారు.
రెవెన్యూ లోటు = రెవెన్యూ రాబడులు – రెవెన్యూ వ్యయాలు.

2. బడ్జెట్ లోటు (ద్రవ్య) :
మొత్తం రాబడుల కంటే మొత్తం వ్యయాలు ఎక్కువ ఉన్నట్లయితే ‘బడ్జెట్ లోటు’ (budget deficit) ఏర్పడుతుంది.
బడ్జెట్ లోటు = మొత్తం రాబడులు – మొత్తం వ్యయాలు.

3. కోశపరమైన లోటు :
మొత్తం రాబడి మరియు మొత్తం వ్యయాల తేడాకు మార్కెట్ రుణాలు మరియు అప్పులు కలిపినట్లయితే కోశపరమైన లోటు (fiscal deficit) తెలుస్తుంది.
కోశపరమైన లోటు = ద్రవ్యలోటు + మార్కెట్ రుణాలు, ఇతర అప్పులు.
లేదా కోశపరమైన లోటు = (మొత్తం రాబడులు మొత్తం వ్యయాలు) + మార్కెట్ రుణాలు, అప్పులు.

4. ప్రాథమిక లోటు :
ఇందుకోసం కోశపరమైన లోటు నుంచి వడ్డీ చెల్లింపులు తీసేయాలి.
ప్రాథమిక లోటు = కోశపరమైన లోటు – వడ్డీ చెల్లింపులు.

వివిధ రకాలైన ఆర్థిక మరియు సంక్షేమ కార్యక్రమాలపై వ్యయాలు క్రమంగా పెరుగుతున్నందున ఆధునిక ప్రభుత్వాలు అదనపు వనరుల సమీకరణ కోసం లోటు బడ్జెట్లను ప్రతిపాదిస్తున్నాయి. అయితే ఎక్కువ మోతాదులో లోటు బడ్జెట్ ప్రతిపాదనలు తీవ్ర కోశ లోటుకు దారితీసి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
సంప్రదాయక అర్థశాస్త్రం భావనను నీవేవిధంగా వివరిస్తావు ?
జవాబు.
18వ శతాబ్దం చివరి అర్థభాగం నుంచి 20వ శతాబ్దపు ఆరంభం వరకు అభివృద్ధి చేయబడిన ఆర్థిక సిద్ధాంతాలు సంప్రదాయ అర్థశాస్త్ర విశ్లేషణలో ప్రస్ఫుటిస్తాయి. సంప్రదాయవాదులు “స్వేచ్ఛా వ్యాపార” (laissez-faire) భావనను సమర్థించారు.

వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రైవేట్ ఆస్తి, ప్రైవేట్ వ్యాపార స్వేచ్ఛలాంటి వాటిని స్వేచ్ఛా వ్యాపార విధానం బలపరుస్తుంది.
ఉదా : సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై మొదలగునవి. దీనిని అభివృద్ధిపరిచినది J.M. కీన్స్.

ప్రశ్న 2.
ద్రవ్య మార్కెట్ సమతౌల్యం అంటే ఏమిటి ?
జవాబు.

TS Inter 1st Year Economics Study Material 8th Lesson ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం 5

ద్రవ్య, శ్రామిక మార్కెట్ల సమతౌల్యానికి వస్తు మార్కెట్ సమతౌల్యం దారితీస్తుంది. వస్తు మార్కెట్లో ఉత్పత్తి కారకాలు సంపాదించినదంతా ఖర్చు చేయబడుతుందని ప్రమేయం చేయబడింది. అయితే సంపాదించిన మొత్తం ఖర్చు చేయకుండా కొంత పొదుపు (S) చేయవచ్చు.

ఒకవేళ పొదుపు చేసినా దాన్ని వారు మూలధన వస్తువులపై ఖర్చు చేస్తారనేది సంప్రదాయవాదుల వాదన. మూలధన వస్తువులపై వ్యయమే పెట్టుబడి (I), వీరి ప్రకారం పొదుపును, పెట్టుబడికి సమానం (S = I) చేసే ముఖ్య కారకం సరళత్వ వడ్డీ రేటు (i). ఈ పరిస్థితిని పటం ద్వారా వివరించబడింది.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 3.
సే మార్కెట్ సూత్రం అంటే ఏమిటి ?
జవాబు.
సంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం ప్రధానంగా జె.బి. సే మార్కెట్ సూత్రంపై ఆధారపడింది. జె.బి. అను ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం సప్లై తనకు తగిన డిమాండ్ను తానే సృష్టించుకొంటుంది. ఈ సిద్ధాంతం ప్రకారం ఉత్పత్తికి సమానంగా ప్రజలకు ఆదాయం వస్తుంది.

దీనికి సమానంగా ప్రజలకు కొనుగోలు శక్తి ఏర్పడుతుంది. దీని వలన వస్తువులకు సరిపడా డిమాండ్ ఏర్పడుతుంది. ఈ విధంగా ఎవరి ప్రమేయం లేకుండా సప్లయ్ మేరకు డిమాండ్ దానంతట అదే ఏర్పడుతుంది. దీనినే ‘సే’ మార్కెట్ సూత్రం అంటారు.

ప్రశ్న 4.
సంపూర్ణోద్యోగితను నీవేవిధంగా గ్రహిస్తావు ?
జవాబు.
ఇవ్వబడిన వేతనం దగ్గర పనిచేసే శక్తి, ఆసక్తి ఉన్న శ్రామికులందరికి ఉపాధి అవకాశాలు కల్పించగలిగే స్థితిని సంపూర్ణ ఉద్యోగిత అని అంటారు. సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతంలో సంపూర్ణ ఉద్యోగితా భావం ప్రాముఖ్యాన్ని వహించింది.

సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత సమతౌల్యం ఏర్పడుతుంది. కీన్స్ అభిప్రాయం ప్రకారం సమిష్టి డిమాండ్ను పెంచుట ద్వారా సంపూర్ణ ఉద్యోగితా సమతౌల్యం ఏర్పడును.

ప్రశ్న 5.
సమిష్టి డిమాండ్ ఫలం అంటే ఏమిటి ?
జవాబు.
సమిష్టి డిమాండ్ రాగల ఆదాయాన్ని ఊహించి తెలుపుతుంది. వినియోగ వస్తువులు, పెట్టుబడి వస్తువులపై చేసిన మొత్తం వ్యయం సమిష్టి డిమాండ్. ఉత్పత్తి విలువ ప్రజల ఆదాయానికి సమానం. ఉత్పత్తి పెరిగితే ఆదాయం కూడా పెరుగుతుంది. కనుక వస్తువుల డిమాండ్ కూడా పెరుగుతుంది.

వివిధ ఉద్యోగితా స్థాయిల వద్ద చేసిన ఉత్పత్తిని అమ్మినందువల్ల ఉత్పత్తిదారులు రాగలదని ఊహించే ఆదాయాన్ని సమిష్టి డిమాండ్ అని అంటారు. ఆర్థిక వ్యవస్థలో వివిధ ఉద్యోగితా స్థాయిల వద్ద ఏర్పడే సమిష్టి డిమాండ్ ధరను చూపించే పట్టికను సమిష్టి డిమాండ్ ఫలం అంటారు.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 6.
ఉద్యోగితస్థాయి, సమిష్టి సప్లయ్ ధరకు ఏ విధమైన సంబంధం గలదు ?
జవాబు.
ఆర్థిక వ్యవస్థలో ఒక ఉద్యోగితా స్థాయి వద్ద ఉత్పత్తిదారులు అందరూ చేసిన అన్నీ వస్తువుల ఉత్పత్తిని సమిష్టి సప్లయ్ తెలుపుతుంది. ఉద్యోగితా స్థాయిపైన సమిష్టి సప్లయ్ స్థాయి ఆధారపడుతుంది. ఉద్యమదారులు భూమి, మూలధనం, శ్రమ ఉత్పత్తి కారకాలను ఉపయోగించి వస్తువులను ఉత్పత్తి చేస్తారు.

మార్కెట్లో కొనసాగుతున్న ధరల ప్రకారం ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలాలు చెల్లింపబడతాయి. ఉత్పత్తి కారకాలపై చేసిన వ్యయమే (సాధారణ లాభంతో కలుపుకొని) ఉత్పత్తి వ్యయం.

ఉత్పత్తిదారులు అదే స్థాయిలో వస్తూత్పత్తి చేయాలంటే వస్తూత్పత్తికయ్యే వ్యయం కంటే వస్తువుల అమ్మకం ద్వారా వారు పొందే రాబడి ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువగా ఉండరాదు. ఆర్థిక వ్యవస్థలోని ఉద్యమదారులు మొత్తం ఉత్పత్తికి ధరగా తప్పక పొందాల్సిన ఈ కనిష్ట మొత్తాన్ని సమిష్టి సరఫరా ధర అంటాం.

ప్రశ్న 7.
సార్థక డిమాండ్ అంటే ఏమిటి ?
జవాబు.
సమిష్టి సప్లయికి సమానంగా ఉన్న సమిష్టి డిమాండే సార్థక డిమాండ్. అంటే సమతౌల్యంలోని సమిష్టి డిమాండు.

ప్రశ్న 8.
వేతన – కోత విధానాన్ని నీవెట్లు గ్రహించితివి ?
జవాబు.
సాంప్రదాయవాదుల ప్రకారం స్వల్పకాలంలో నిరుద్యోగిత ఉండవచ్చు. వీరి ప్రకారం, ప్రభుత్వ జోక్యం లేదా ఉద్యోగ సంఘాల చర్యల ఫలితంగా వేతనాలు పెరగడం వలన నిరుద్యోగిత ఏర్పడుతుంది. అంతేకాని డిమాండు తగినంత లేకపోవడం వలనకాదు.

A.C. పిగూ ప్రకారం, ఈ విధమైన నిరుద్యోగిత నివారించి సంపూర్ణ ఉద్యోగితను సాధించాలంటే తన కోత చేయాలని సూచించాడు. వేతన నిధి స్థిరంగా ఉండి వేతనరేటును తగ్గిస్తే, ఉద్యోగిత పెరుగుతుందని నా పేర్కొన్నాడు.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 9.
ప్రభుత్వంను నిర్వచించండి.
జవాబు.
ఇది ప్రభుత్వాలు అంటే కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల ఆదాయం, వ్యయాల గురించి వివరిస్తుంది.

ప్రశ్న 10.
పన్ను రాబడి, పన్నేతర రాబడిని విభేదించండి.
జవాబు.
పన్ను రాబడి :
ప్రభుత్వం ప్రజల నుండి పన్నుల రూపంలో పొందిన రాబడి పన్ను రాబడి. రాజ్యాంగంలో కేటాయించబడిన ప్రకారంగా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులను వసూలు చేస్తాయి. స్థూలంగా పన్నులను రెండు రకాలుగా విభజించవచ్చును. అవి :

  1. ప్రత్యక్ష పన్నులు
  2.  పరోక్ష పన్నులు.

పన్నేతర రాబడి :
ప్రభుత్వానికి పన్నులు కాకుండా ఇతర మార్గాల ద్వారా లభించే ఆదాయాలను ‘పన్నేతర రాబడులు’ అంటారు.

ప్రశ్న 11.
ప్రభుత్వ వ్యయం అంటే ఏమిటి ?
జవాబు.
ప్రభుత్వ వ్యయ స్వభావం, ఆయా ప్రభుత్వాలు చేపట్టే సంక్షేమ కార్యకలాపాలపై ఆధారపడి ఉంటుంది. ఆధునిక ప్రభుత్వాలు రక్షణ, శాంతిభద్రతలపై మాత్రమే కాకుండా అవస్థాపన సౌకర్యాల కల్పన, ప్రజా సంక్షేమం మరియు ప్రజా సేవా కార్యకలాపాల పైన చేసే వ్యయాన్ని ప్రభుత్వ వ్యయం అంటారు.

ప్రభుత్వ కార్యకలాపాలు అధిక రెట్లు పెరగటం వలన, ప్రభుత్వ వ్యయం కూడా అధిక మొత్తంలో పెరుగుతుంది. ప్రభుత్వ వ్యయ పరిమాణం ఆయా ప్రభుత్వాల రాజకీయ, ఆర్థిక విధానాలపై ఆధారపడి ఉంటుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 12.
ప్రభుత్వ రుణం అంటే ఏమిటి ?
జవాబు.
వివిధ రకాల కార్యకలాపాలపై పెరుగుతున్న ప్రభుత్వ వ్యయం రాబడిని మించి ఉంటే రుణాల ప్రభుత్వం సమకూర్చుకుంటుంది. ఇందుకోసం ప్రభుత్వాలు స్వదేశంతోబాటు విదేశాల నుంచి కూడా రుణాలను వివిధ మార్గాలలో సేకరిస్తాయి. దీనివల్ల ప్రభత్వ రుణం ఏర్పడుతుంది.

ప్రశ్న 13.
రుణ విమోచన పద్ధతులేవి?
జవాబు.
ప్రభుత్వ రుణభారం నుండి విముక్తి అవ్వడం.

ప్రశ్న 14.
మూలధన లెవి అంటే ఏమిటి ?
జవాబు.
మూలధన ఆస్తులు మరియు ఎస్టేటులపై ఒకేసారి విధించే పన్నును మూలధన లేవి అంటారు.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 15.
ఫెడరల్ విత్తం అంటే ఏమిటి ?
జవాబు.
కేంద్ర రాష్ట్రాల మధ్య ఉండే ఆర్థిక సంబంధాలను తెలిపేదే ఫెడరల్ విత్తం. ఫెడరల్ విత్తవ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ వివరాలు ఉంటాయి.
ఫెడరల్ విత్తం లక్షణాలు క్రింది విధంగా ఉంటాయి.

  1. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రాంట్లను ఇస్తుంది.
  2. ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తి ఉన్నా అవి కేంద్ర ప్రభుత్వ ఆజమాయిషీలో పనిచేయాలి.
  3. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తగాదాలేర్పడితే రాజ్యాంగ పరిధిలో పరిష్కరించుకో”.

ప్రశ్న 16.
ఆర్థిక సంఘం విధులను పేర్కొనండి.
జవాబు.
ఆర్థిక సంఘం ప్రధాన విధులు క్రింద పేర్కొన్న విధంగా ఉన్నాయి.

  1. పన్నుల ద్వారా సమీకరించిన నికర రాబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పన్నులలో వాటి సంబంధిత తోడ్పాటులను బట్టి పంపిణీ చేయడం.
  2. వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేయవలసిన గ్రాంట్ల రూపంలో సహాయానికి, గ్రాంట్ల పరిమాణానికి సంబంధించిన సిఫారసులు చేయడం.
  3. గ్రామ పంచాయితీలకు, మున్సిపాలిటీలకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ‘సమీకృత నిధి’ (consolidated fund) నుంచి పంపిణీ చేసే వనరుల పెంపుదలకు సంబంధించిన అంశాల్లో రాష్ట్రపతికి సలహాలనివ్వడం.

ప్రశ్న 17.
బడ్జెట్ అంటే ఏమిటి ?
జవాబు.
ఒక ఆర్థిక సంవత్సరానికి (ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు) ప్రభుత్వానికి చెందిన అంచనావేసిన రాబడి, వ్యయాల పట్టిక.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 18.
బడ్జెట్ లోని అంశాలు ఏవి ?
జవాబు.
బడ్జెట్లో రాబోయే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి లభించబోయే ఆదాయ అంచనా వివరాలతోపాటు చేయదలచిన వ్యయ వివరాలు పొందుపరచడం జరుగుతుంది. భారత ప్రభుత్వ బడ్జెట్లో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి.

1. బడ్జెట్ రాబడులు : ఇందులో

  • రెవెన్యూ రాబడులు పన్నులు, పన్నేతర రాబడులు
  • మూలధన రాబడులు రుణాల వసూళ్ళు, ఇతర రాబడులు, రుణాలు, అప్పులు, ఉంటాయి.

2. బడ్జెట్ వ్యయాలు :
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో బడ్జెట్ వ్యయాన్ని రెండు రకాలుగా విభజించడం జరిగింది. అవి : ప్రణాళికా వ్యయం, ప్రణాళికేతర వ్యయం. కాని కేంద్ర ప్రభుత్వం 2017-18 యూనియన్ బడ్జెట్ ద్వారా ప్రణాళికా, ప్రణాళికేతర వ్యయం భావనలను తొలగించి, వాటిస్థానంలో రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయంను ప్రవేశపెట్టింది.

ప్రశ్న 19.
రెవెన్యూ అకౌంట్, మూలధన అకౌంట్ను విభేదించండి.
జవాబు.
బడ్జెట్లో రాబోయే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి లభించబోయే ఆదాయ అంచనా వివరాలతోపాటు గత ఆర్థిక సంవత్సరం వ్యయ వివరాలు పొందుపరచడం జరుగుతుంది. భారత ప్రభుత్వ బడ్జెట్ లో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి.

1. బడ్జెట్ రాబడులు : ఇందులో
a) రెవిన్యూ రాబడులు – పన్నులు, పన్నేతర రాబడులు.
b) మూలధన రాబడులు – రుణాల వసూళ్ళు, ఇతర రాబడులు ఉంటాయి.

2. బడ్జెట్ వ్యయాలు : కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో వ్యయాన్ని రెండు రకాలుగా విభజించడం జరిగింది.
1. ప్రణాళికా వ్యయం
2. ప్రణాళికేతర వ్యయం.

ప్రణాళిక వ్యయంలో

  • రెవెన్యూ ఖాతాలో ప్రణాళికా వ్యయం,
  • మూలధన ఖాతాలో ప్రణాళికా వ్యయంగా

ప్రణాళికేతర వ్యయంలో

  • రెవెన్యూ ఖాతాలో ప్రణాళికేతర వ్యయం
  • మూలధన ఖాతాలో ప్రణాళికేతర వ్యయంగా విభజింపబడి వ్యయం చేయబడతాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 20.
ప్రాథమిక లోటు అంటే ఏమిటి ?
జవాబు.
ఇందుకోసం కోశపరమైన లోటు నుంచి వడ్డీ చెల్లింపులు తీసేయాలి.
ప్రాథమిక లోటు = కోశపరమైన లోటు – వడ్డీ చెల్లింపులు.

వివిధ రకాలైన ఆర్థిక మరియు సంక్షేమ కార్యక్రమాలపై వ్యయాలు క్రమంగా పెరుగుతున్నందున ఆధునిక ప్రభుత్వాలు అదనపు వనరుల సమీకరణ కోసం లోటు బడ్జెట్లను ప్రతిపాదిస్తున్నాయి. అయితే ఎక్కువ మొతాదులో లోటు బడ్జెట్ ప్రతిపాదనలు తీవ్ర కోశ లోటుకు దారితీసి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి.

ప్రశ్న 21.
లోటు బడ్జెట్ వాంఛనీయమా ?
జవాబు.
మొత్తం రాబడుల కంటే మొత్తం వ్యయాలు ఎక్కువగా ఉన్నట్లయితే ‘లోటు బడ్జెట్’గా పేర్కొంటారు (R < E).

ప్రశ్న 22.
కేంద్ర ప్రభుత్వానికున్న ప్రత్యేక అధికారాలెట్టివి ?
జవాబు.
కింద పేర్కొన్న అంశాలపై పన్ను విధింపుపై కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక అధికారాలుంటాయి.

  1. కస్టమ్స్ డ్యూటీ
  2. కార్పొరేషన్ పన్ను
  3. మూలధన సంపాదనలు
  4. ఆదాయ పన్నుపై సర్చార్జీ
  5. రైల్వే ఛార్జీలు మొదలైనవి.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 23.
కోశలోటు అంటే ఏమిటి ?
జవాబు.
మొత్తం రాబడి మరియు మొత్తం వ్యయాల తేడాకు మార్కెట్ రుణాలు మరియు అప్పులు కలిపినట్లయితే కోశపరమైన లోటు (fiscal deficit) తెలుస్తుంది.
కోశపరమైన లోటు = ద్రవ్యలోటు + మార్కెట్ రుణాలు, ఇతర అప్పులు.
లేదా కోశపరమైన లోటు = (మొత్తం రాబడులు మొత్తం వ్యయాలు) + మార్కెట్ రుణాలు, అప్పులు.

ప్రశ్న 24.
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రాధాన్యత ఎట్టిది ?
జవాబు.
కొన్ని సందర్భాలలో ప్రభుత్వం “పూర్తి’ బడ్జెట్ను సమర్పించే వీలులేనప్పుడు “ఓట్ ఆన్ అకౌంట్” బడ్జెట్ను తాత్కాలికంగా కొన్ని నెలల కోసం సమర్పిస్తుంది. పూర్తిస్థాయి బడ్జెట్కు అనుమతి పెండింగ్లో ఉన్నా ప్రభుత్వం వ్యయం చేయుటకు ఇది వెసులుబాటు కల్పిస్తుంది.

ప్రశ్న 25.
14వ ఆర్థిక సంఘం గురించి వ్రాయండి.
జవాబు.
ప్రథమ ఆర్థిక సంఘం నివేదికను 1952 సంవత్సరంలో సమర్పించింది. ఆర్థిక సంఘం రాష్ట్రపతికి ఆదాయపన్ను రాబడిలో కేంద్రానికి ఎంత శాతం ఉండాలి మరియు రాష్ట్రాల మధ్య ఆదాయపన్ను రాబడి పంపిణీకి ఏ సూత్రాలు అమలుపరచాలో సలహాలిస్తుంది.

ప్రథమ ఆర్థిక సంఘం సమయం నుంచే భారత ఆర్థిక వ్యవస్థలో గట్టి మార్పులు సంభవించిన ఫలితంగా స్థూల ఆర్థిక పరిస్థితిలో (scenario) మార్పులు ఏర్పడ్డాయి.

కాబట్టి ఆర్థిక సంఘం సిఫారసులలో గొప్ప మార్పులు ఏర్పడ్డాయి. అందుచేత పద్నాలుగవ ఆర్థిక సంఘం (2015-20) సూచనలను పరిశీలించడం ఆవశ్యకం. ఈ కమిటీ ప్రత్యేకంగా దేశంలో స్థిరమైన, సుస్థిరమైన కోశ పర్యావరణాన్ని కొనసాగించడానికి తగిన చర్యలను సూచించింది. 14వ ఆర్థిక సంఘం జనవరి 2, 2013 నాడు వై.వి. రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైంది. ఇది నివేదికను 15 డిసెంబరు 2014న సమర్పించింది.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 26.
15వ ఆర్థిక సంఘం గురించి వ్రాయండి.
జవాబు.
భారత ప్రభుత్వం పదిహేనవ ఆర్థిక సంఘంను నవంబర్ 27, 2017న ఎన్.కె.సింగ్ అధ్యక్షతన నియమించింది. ఈ సంఘ సిఫారసులు 5 సంవత్సరాల (2020-25) కాలానికి వర్తిస్తాయి. నివేదికను అక్టోబర్ 30, 2019 నాటికి సమర్పించవలసిందిగా కమీషన్ను ఆజ్ఞాపించడమైనది.

వివిధ రాష్ట్రాల వ్యయ అవసరాల లెక్కింపునకు 2011 జనాభా గణాంకాలను ఆధారంగా పరిగణించమని సంఘానికి సూచనను ఇచ్చారు. ఈ సంఘం, జి.ఎస్.టి. (GST) అనంతర కాలంలో సిఫారసులను ప్రతిపాదించే ప్రథమ కమీషన్ గా గుర్తించబడుతుంది.

ప్రశ్న 27.
GST గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు. వస్తువులు, సేవలపై పన్ను (Good and Services Tax – GST) :
ఇది ఒక పరోక్ష పన్ను, భారతదేశంలో అనేక పరోక్ష పన్నుల స్థానంలో ఇది ప్రవేశపెట్టబడినది. పార్లమెంట్లో మార్చి 29, 2017 నాడు వస్తువులు మరియు సేవల పన్ను చట్టం ఏర్పాటుచేయబడినది. ఈ చట్టం జూలై 1, 2017 నుంచి అమలులోకి వచ్చింది. GST ఒక సమగ్రమైన, బహుళదశల (Multistage), గమ్యస్థాన ఆధారిత పన్ను, ఏర్పడే ప్రతి విలవపై ఈ పన్ను విధించబడుతుంది.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 2nd Poem మిత్రధర్మం Textbook Questions and Answers.

TS Inter 1st Year Telugu Study Material 2nd Poem మిత్రధర్మం

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు సమాధానములు

ప్రశ్న 1.
శ్రీకృష్ణుడు కుచేలుడిని ఎలా గౌరవించాడో వివరించండి.
జవాబు:
కుచేలుడును, శ్రీకృష్ణుడును బాల్య స్నేహితులు. నిరంతర దరిద్ర పీడితుడైన కుచేలుడు భార్య ఆప్తమైన ఉపదేశముచే శ్రీకృష్ణుని దర్శించుటకై ద్వారకానగరమునకు బయలుదేరెను. కక్ష్యాంతరములు దాటి మణిమయ సౌధములో – అంతఃపురములో హంసతూలికా తల్పముపై కూర్చుండి ప్రియురాలితో కలసి వినోద క్రీడలలో మునిగియున్న శ్రీకృష్ణుని గాంచి బ్రహ్మాయనందమును పొందెను.

శ్యామల కోమలాకారుడును, ఇంద్రాది దేవతలచే స్తుతింపబడు వాడును, కౌస్తుభముడిన అలంకారముగా ధరించినవాడును, సమస్తలోకములచే ఆరాధింపబడు వాడును, పాల సముద్రము నందు విహరించువాడును ఐన శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని చూచెను. అట్టి శ్రీకృష్ణ పరమాత్ముడు నిరంతర దారిద్య్రము చేత పీడింపబడువాడు, బక్క చిక్కిన శరీరముతో, చినిగిపోయిన వస్త్రములతో పరిహాసమునకు స్థానమైన ఆ పేద విప్రుని గాంచి గబగబ తన పాన్పు మీది నుండి క్రిందికి దిగి, ఆదరముతో ఎదురుగా వచ్చి బాల్యమిత్రుడైన ఆ కుచేలుని కౌగిలించుకొనెను. తీసుకొని వచ్చి, తన పట్టు పాన్పుపై కూర్చుండబెట్టెను. ప్రేమతో బంగారు కలశము నందలి నీటితో వాని కాళ్ళు కడిగెను. కాళ్ళు కడిగిన ఆ నీటిని తన శిరస్సుపై చల్లుకొనెను.

తరువాత కుచేలుని శరీరమునకు మంచి గంధము నలదెను. ప్రయాణ ప్రయాస పోవుటకై వింజామరలతో వీచెను. సువాసనా భరితమైన ధూపముల నొసగెను. మణిమయం దీపములతో ఆరతి పట్టెను. సిగలో పూలమాలలు అలంకరించెను. కర్పూర తాంబూలము నొసంగెను. గోవును దానముగా సమర్పించెను. ఈ విధముగా శ్రీకృష్ణుడు చేసిన సేవలను గాంచి, కుచేలుని శరీరము పులకించిపోయెను.

గగుర్పాటుతో ఆయన వెంట్రుకలు నిక్కపొడుచుకొనెను. ఆయన కన్నుల నుండి ఆనంద బాష్పములను స్రవించెను. అంతేకాదు
– శ్రీకృష్ణుని భార్యామణియగు రుక్మిణీ దేవి స్వయముగా చామరములు వీచుచుండెను. ఈ విధముగా రుక్మిణీ కృష్ణులు చేయు సపర్యలను అందుకొనుచున్న ఆ కుచేలుని భాగ్యమునకు ఆశ్చర్యపోయి అంతఃపుర కాంతలు ఇట్లు ప్రశంసించిరి.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

ఈ బ్రాహ్మణుడు పూర్వ జన్మమునందు ఎటువంటి తపస్సు చేసెనో గదా ! యోగులచే ఉపాసింపబడు జగత్ప్రభువు, లక్ష్మీదేవి ప్రియుడైన శ్రీకృష్ణుని తల్పముపై కూర్చుండినాడు ఎటువంటి మునీశ్వరులైనను ఈ మహనీయమూర్తికి సాటియగునా ?

“తన భార్యమణియైన రుక్మిణీదేవి ఏమనుకొనునోయని కూడ భావింపక, యదువంశేఖరుడైన శ్రీకృష్ణుడు ఎదురుగా వెళ్ళి, ఆలింగనము కావించుకొని, వివిధములైన సేవలచే ఆయనను సంతృప్తుని కావించినాడు. ఈ బ్రాహ్మణోత్తముడెంత అదృష్టశాలియో గదా !” ఆ అంతఃపురకాంతలు కుచేలుని భాగ్యమున కచ్చెరువందినారు.

ఇట్లు కుచేలుడు కృష్ణుని దర్శించి, ఆయన అనుగ్రహమునకు పాత్రుడై, సాక్షాత్తు భగవంతుని చేతనే సేవలు చేయించుకొనినాడు. మధురమైన స్నేహమునకు కుచేలోపాఖ్యానము ఉజ్జ్వలమైన ఉదాహరణము.

ప్రశ్న 2.
‘మిత్రధర్మం’ పాఠ్యభాగ సారాంశం వివరించండి.
జవాబు:
కుచేలుడు శ్రీకృష్ణుని బాల్యమిత్రులు – వారిరువురు సాందీపుని సన్నిధిలో విద్యాభ్యాసం చేశారు. తరువాత శ్రీకృష్ణుడు ద్వారకా నగరాధిపతియైనాడు. కుచేలుడు దుర్భరమైన దారిద్య్ర బాధ అనుభవించాడు. కుచేలుని భార్య మహాపతివ్రత, అభిమనవతి. ఆ ఇల్లాలు దారిద్య్ర బాధతో పిల్లలు మలమలమాడిపోబడం చూచి – భర్తను, శ్రీకృష్ణుని ఆయన అనుగ్రహంతో తమను కాపాడుమని ప్రార్థించు సన్నివేశంతో కథ ప్రారంభమగుచున్నది.

భర్తకు కర్తవ్యోపదేశము చేసిన అర్ధాంగిగా కుచేలుని భార్య ఎంతటి దుర్భరమైన దారిద్ర్యము అనుభవించినను నోరు తెరచి సహాయమును అర్థింపని అభిమనధనుడుగా కుచేలుడు – అవధులు ఆదరాభిమానాలతో బాల్య మిత్రునికి సర్వ సంపదలను అనుగ్రహించిన ఆర్తజన రక్షకుడిగా శ్రీకృష్ణుడు మనకు ఈ పాఠ్యభాగములో సాక్షాత్కరిస్తారు. కుచేల శ్రీకృష్ణుల మధురమైన స్నేహానికి, శ్రీకృష్ణుని భక్తజన వాత్సల్యమునకు కుచేలోపాఖ్యానం నిదర్శనంగా నిలుస్తుంది.

మహాపతివ్రతయు, క్రుంగికృశించి పోయినది. యునైన కుచేలుని భార్య దుర్భరమైన దరిద్రపీడచే అలమటించుచు, పిల్లలు ఆకులు, గిన్నెలు పట్టుకొని. తల్లి వద్దకు వచ్చి పట్టెడన్నము పెట్టుమని యడిగిరి. వారి మాటలు వినినంతనే పట్టరాని దుఃఖముతో భర్త కడకరిగి “ప్రాణేశ్వరా ! ఇంటిలో దారిద్ర్యము తాండ వించుచున్నది. దానిని తొలగించుటకు మార్గమును ఆలోచింపరైతిరి.

మీ బాల్య మిత్రుడైన శ్రీకృష్ణుని దర్శించి, దారిద్య్రమనెడి అంధకారము నుండి మమ్ము కాపాడుము. ఆర్తజన శరణ్యుడు, దయా సాగరుడైన శ్రీకృష్ణుడు మిమ్ములను చూచినంతనే, అపారమైన సంపదలను అనుగ్రహించును. కలలోనైన తనను తలవని నీచుని పైతము, కష్ట సమయములో ఆదుకొను జగత్ప్రభువు, ఎల్లవేళల ఆయనను భక్తితో సేవించు మీకు విశేష సంపదల ననుగ్రహింపడా ?” అని పలికెను.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

భార్య మాటలను విని, ఆమె ధర్మయుతమైన వాక్యములకు సంతసించి, శ్రీకృష్ణుని దర్శనము ఇహపరసాధనముగా భావించెను. “ నీవు చెప్పినట్లుగా శ్రీకృష్ణుని పాదపద్మములను ఆశ్రయించుటశుభకరమే- ఆ చక్రపాణికిచ్చుటకేమైన కానుకగలదా ? – యని అడుగగా ఆ ఇల్లాలు కుచేలుని ఉత్తరీయపు కొంగునకు కొన్ని అటుకులు ముడి వేసెను. గోవింద సందర్శనమునకై వెడలుచున్న ఆనందముతో కుచేలుడు ద్వారకా పట్టణమునకై బయలుదేరెను.

“ద్వారకా నగరమునకు నేనెట్లు వెళ్ళగలను ? అచ్చట అంతఃపురములో నుండు శ్రీకృష్ణుని ఎట్లు దర్శింపగలను ? ద్వారపాలకులు ఈ బీద బ్రాహ్మణుని చూచి, నీ వెక్కడ నుండి వచ్చుచుంటివి ? ఎందులకు వచ్చితివని అడిగినచో – వారికి బహుమానమిచ్చుటకు -” అనుకొనుచు కుచేలుడు కూడ కాసు డబ్బు లేదు. ఆయన దయ నా భాగ్యము ద్వారకా నగరమును ప్రవేశించి, కక్ష్యాంతములు దాటి, అంతఃపుర మందిరములో హంసతూలికా తల్పముపై ప్రియురాలితో వినోద క్రీడలలో మునిగి తేలుచున్న శ్రీకృష్ణుని బ్రహ్మానందమును అనుభవించెను.

అల్లంత దూరముననే కుచేలుని గాంచి, శ్రీకృష్ణుడు గబగబ పాన్పు దిగి, మిత్రునకు ఎదురుగా వచ్చి, ప్రేమతో ఆలింగనము కావించుకొని, పట్టు పాన్పుపై కూర్చుండబెట్టెను. బంగారు కలశము నందలి నీటితో కుచేలుని కాళ్ళు కడిగి, ఆ నీటిని తలపై చల్లుకొనెను. మంచి గంధమును శరీరమునకు అలదెను.

వింజామరలతో గాలి విసరి మార్గాయాసమును పోగెట్టేను. కర్పూర తాంబూలము నొసంగెను. ఆదరముతో గోవును దానము చేసెను. మణిమయ దీపములతో ఆరతి పట్టెను, సాక్షాత్తు రుక్మిణీదేవి కుచేలునికి వింజామరలు వీచెను. ఇట్లు శ్రీకృష్ణునిచే సేవులు చేయించుకొనుచున్న కుచేలుని గాంచి కాంతలు ఆశ్చర్యపడుచు, కుచేలుని అదృష్టమును అనేక విధములుగా ప్రశంసించిరి.

శ్రీమహావిష్ణువు అవతారమగు శ్రీకృష్ణుని చేతను, లక్ష్మీదేవి స్వరూపిణియగు రుక్మిణి చేతను సేవలు పొందిన మహనీయ మూర్తిగా కుచేలుడు ఈ పాఠ్యభాగమందు గోచరించును శ్రీకృష్ణ, కుచేలుల నిర్మలమైన స్నేహమును ఈ పాఠ్యభాగము నిరూపించును.

కృష్ణుడు ప్రేమతో కుచేలుని చేతిని తన చేతిలోకి తీసుకుని తాము గురుకులంలో చదివిన రోజులలోని సంఘటనలు గుర్తుచేసాడు. కుచేలుని భార్యా పిల్లల కుశలమడిగాడు. ధర్మనిష్ఠతో, కర్తవ్య నిష్ఠతో జీవించే ఉత్తములను భక్తితో గురువును సేవించే వారిని ప్రేమిస్తాను. మనం గురు నివాసంలో ఉంటు ఒక రోజు కట్టెల కోసం అడవికి వెళ్ళాం గుర్తుంది కదా ! దారి తెన్నూ కనపడకుండా పడిన ఆ కష్ట సమయంలో ఒకరికొకరు ఆసరాగా ఆ అడవిలో చలికి వణుకుతూ గడిపాము. ఇంతలో తెల్లవారడంతోనే మనకోసం గురువుగారు వెతుకుతూ వచ్చి మనలను దీవించారు.

కృష్ణుని మాటలకు పొంగిపోయిన కుచేలుడు శ్రీకృష్ణుని గొప్పతనాన్ని శ్లాఘించాడు. నా కోసం ఏమి తెచ్చావు అని అడుగగా సిగ్గుతో తలదించుకుని కూర్చున్న కుచేలుని ఉత్తరీయం ముడిలో ఉన్న అటుకులను ప్రేమతో తిని అతనికి సకల సంపదలను అనుగ్రహించాడు. తిరిగి ఇంటికి వెళ్ళిన సుధామునికి (కుచేలుడు) ఇదంతా కృష్ణలీల అని గ్రహించి ఆనందించాడు. స్నేహంలో ఆస్తుల తారతమ్యం, ధనిక బీద తేడాలుండకూడదని శ్రీకృష్ణభగవానుడు ఈ విధంగా లోకానికి చాటి చెప్పాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

II. సంగ్రహరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
పోతన గురించి తెలుపండి.
జవాబు:
భక్తకవిగా ప్రసిద్ధి చెందిన బమ్మెర పోతన 15వ శతాబ్దపు కవి. కేసన, లక్కమాంబ తల్లిదండ్రులు. వ్యాస భాగవతాన్ని రసరమ్యంగా తెలుగువారికి అందించాడు. పోతనకు సహజపండితుడు అనే బిరుదు ఉంది. పోతన వీరభద్ర విజయం, భోగినీ దండకం కూడా రచించాడు.

ప్రశ్న 2.
కుచేలుడి దారిద్ర్యాన్ని వర్ణించండి.
జవాబు:
కుచేలుడు అతని భార్యాపిల్లలు ఆకలి బాధతో కృశించిపోయారు. కుచేలుడు పేదరికంలో చిక్కి శల్యమైన శరీర అవయవములు కలిగి ఉన్నాడు. చినిగిన బట్టలు ధరించాడు. మనసులో శ్రీకృష్ణుడు సహాయం చేస్తాడనే గొప్ప ఆశతో ఉండి, చూడగానే నవ్వు పుట్టించే వాడుగా ఉన్నాడు. చినిగిన వస్త్రాన్ని ధరించి తన మిత్రుడైన శ్రీకృష్ణుని చూసి తొట్రుపాటుతో దూరంగా నిలబడ్డాడు అని కుచేలుని దారిద్ర్య స్థితిని వర్ణించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

ప్రశ్న 3.
శ్రీకృష్ణుడిని దర్శించేందుకు కుచేలుడు భార్యకు చెప్పిన కారణమేమిటి ? –
జవాబు:
శ్రీకృష్ణుని పాదపద్మములను ఆశ్రయించుట మిక్కిలి శుభదాయకమే. కాని ఆయనకు తీసుకొని వెళ్లుటకై మన దగ్గర ఏదైన కానుక ఉన్నదా ?” అని కుచేలుడు భార్యనడిగెను.అప్పుడు కుచేలుని భార్య ‘సరే’ యని కొన్ని అటుకులను భర్త యొక్క చినిగిన వస్త్రము చివర ముడివేసి ప్రయాణమునకు సిద్ధము చేసినది – శ్రీకృష్ణ సందర్శనోత్సాహంతో కుచేలుడు ద్వారకకు బయలుదేరెను. నేనెట్లు ద్వారకా నగరమును చేరగలను ?

దివ్వ దీప్తితో ప్రకాశించు అంతఃపురము నేనెట్టు ప్రవేశింపగలను ? సర్వేశ్వరుడైన ఆ కృష్ణుని ఎట్లు దర్శింపగలను ? నీవెవ్వడవు ? ఎక్కడినుండి, ఎందులకు వచ్చితివి ? అని ప్రశ్నించి ద్వారపాలకులు అడ్డు పెట్టినచో – వారికేమైన బహుమానమిచ్చి వెళ్ళవచ్చునన్నచో, నేను డబ్బు లేనివాడును. అయినను ఆయన దయ – నా భాగ్యము. ఆలోచింపగా మరేమి యున్నది ? ఐనను బాలమిత్రుడైన ఆ కృష్ణుడు నన్నేల అశ్రద్ధ చేయును ?” అని తలచుచు కుచేలుడు ద్వారకా నగరములో ప్రవేశించెను.

ప్రశ్న 4.
శ్రీకృష్ణుడు, కుచేలుడిని ఏవిధంగా ఆదరించాడు ?
జవాబు:
శ్రీకృష్ణుడు మిక్కిలి ఆదరముతో ఎదురుగా వెళ్లి కుచేలుని ప్రేమతో కౌగిలించు కొనాడు. బంధుత్వము, మిత్రత్వము వెల్లడియగునట్లుగా తీసుకొని వచ్చి, ప్రేమాదరములతో తన పాన్పుపై కూర్చుండబెట్టినాడు. కుచేలుని తన పాన్పుపై కూర్చుండబెట్టినాడు. ప్రేమతో బంగారు చెంబులోని నీటితో ఆయన పాదములు కడిగినాడు.

ఆ కాళ్లు కడిగిన నీటిని భక్తితో తన శిరస్సు మీద చల్లుకొనినాడు. కస్తూరి పచ్చకర్పూరము కలిపిన మంచి గందమును కుచేలుని శరీరమునకు పూసెను. అగరుధూపము వేసి, అలసట పోవునట్లుగా మిత్రునకు విసనకర్రతో విసరెను. మణిమయ దీపాలతో హారతి పట్టెను. మంచి సువాసనలు గల పూలదండలు కుచేలుని జుట్టుముడిలో అలంకరించెను. కర్పూర తాంబూలము నొసంగెను. గోదానమిచ్చెను.

ఇట్లు కృష్ణుడు తనకు సాదరముగా స్వాగతము పలుకగా, కుచేలుని శరీరమున గగుర్పాటుతో వెంట్రుకలు నిక్కబొడుచుకొనెను. ఆయన కన్నుల నుండి ఆనంద బాష్పములు స్రవించెను. ఆ సమయమున సాక్షాత్తు శ్రీకృష్ణుని సతీమణియైన రుక్మిణీదేవి అప్పుడు పుట్టిన చేతుల గాజులు ఘుల్లుఘల్లు మనుచుండగా వింజామరలు విసరెను. చల్లని గాలులు మార్గాయాసముచేత పుట్టిన కుచేలుని శరీరము నందలి చెమట బిందువులను పోగొట్టెను. ఈ ఘట్టమును చూచి, అంతఃపుర కాంతామణులు ఆశ్చర్యపోయి, తమలో తామిట్లనుకొనసాగిరి.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

III. ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సంస్కృత భాగవతాన్ని ఎవరు రచించారు ?
జవాబు:
వేదవ్యాసుడు.

ప్రశ్న 2.
భక్తితో సమర్పిస్తే శ్రీకృష్ణుడు ఏం స్వీకరిస్తాడు ?
జవాబు:
ప్రీతితో దాన్ని మధురాన్నంగా భావించి ఆరగిస్తాను అన్నాడు.

ప్రశ్న 3.
కుచేలుడికి మరోపేరు ఏమిటి ?
జవాబు:
సుధాముడు.

ప్రశ్న 4.
శ్రీకృష్ణ – కుచేలులు ఎవరి వద్ద విద్యాభ్యాసం చేసారు ?
జవాబు:
సాందీపని

ప్రశ్న 5.
కుచేలుడు శ్రీకృష్ణుని ఇచ్చేందుకు ఏమి తీసుకొని వెళ్ళాడు ?
జవాబు:
అటుకులు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

ప్రశ్న 6.
శ్రీకృష్ణుడు కుచేలుడికి ఏమి ప్రసాదించాడు.
జవాబు:
ఇంద్రాది దేవతలకు సాధ్యంకాని అనేక సంపదలిచ్చాడు.

ప్రశ్న 7.
కుచేలుడు ఇంటికి వెళ్ళగానే భార్య ఎలా కనిపించింది ?
జవాబు:
మానవ రూపం దాల్చిన లక్ష్మీదేవి వలె కనిపించింది.

ప్రశ్న 8.
‘మిత్ర ధర్మం’ పాఠ్యభాగం ఏ గ్రంథం నుండి తీసుకోబడింది ?
జవాబు:
శ్రీమదాంధ్ర మహాభాగవతం దశమ స్కంధం నుండి గ్రహించబడింది.

IV. సందర్భ సహిత వ్యాఖ్యలు

ప్రశ్న 1.
గోవింద దర్శనోత్సాహియగుచు.
జవాబు:
కవి పరిచయం :
భక్త కవి పోతన రచించిన ఆంధ్రమహాభాగవతం నుండి గ్రహింపబడిన మిత్రధర్మం అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడింది. పోతనకు “సహజపాండిత్యుడని” బిరుదు.

సందర్భము :
తన భార్య పలికిన ధర్మ వాక్యములకు సంతరించి కుచేలుడు శ్రీకృష్ణుని దర్శనము ఇహపర సాధనమని భావించి, శ్రీకృష్ణ దర్శనార్థమై కుచేలుడు బయలుదేరు సందర్భములోనిదీ వాక్యము.

వివరణ :
“నీవు చెప్పినట్లుగా శ్రీకృష్ణుని పాదపద్మములను దర్శించుట శుభకర మైనది-వానికి సమర్పించుటకు కానుక ఏమైనా కలదా ?” – యని కుచేలుడు అడుగగా సరేని కొన్ని అటుకులను కుచేలుని చినిగిపోయిన వస్త్రము కొంగున ముడివేసెను. అంత కుచేలుడు గోవిందుని సందర్శన ఉత్సాహముతో ద్వారకకకు బయలుదేరు సన్నివేశమును పోతన మహాకవి వర్ణించు సందర్భములోనిదీ పద్యపాదము.

విశేషము :
భగవంతుని దర్శించుటకై వెళ్ళు సందర్భము నందు భక్తుని భావోద్వేగమును ఈ పద్యపాదము సూచించును. ఇది “తేటగీతి” పద్యపాదము.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

ప్రశ్న 2.
సంభ్రమ విలోలుండై దిగెం దల్పమున్
జవాబు:
కవి పరిచయం :
భక్త కవి పోతన రచించిన ఆంధ్రమహాభాగవతం నుండి గ్రహింపబడిన మిత్రధర్మం అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడింది.

సందర్భము :
తన భార్య కోరికపై కుచేలుడు శ్రీకృష్ణ సందర్శనార్థమై ద్వారకా నగరము చేరుకొని-అంతఃపుర మందిరములో హంసతూలికా తల్పముపై ప్రియురాలితో వినోదములలో మునిగియున్న శ్రీకృష్ణుని గాంచెను. వచ్చిన తన బాల్యమిత్రుడైన కుచేలుని చూచి, శ్రీకృష్ణుడు హంసతూలికా తల్పము నుండి దిగి, ప్రేమతో ఎదురేగి స్వాగతము పల్కు సందర్భములోనిదీ పద్యపాదము.

వివరణ :
ఎడతెగని దారిద్య్రముచేత పీడింపబడువాడును, చిక్కిపోయిన అవయవ ములు కలవాడును, చినిగిపోయిన వస్త్రములను ధరించినవాడును, హాస్యమునకు నిలయమైన వాడునగు ఆ పేద విప్రుని గాంచి, శ్రీకృష్ణుడు గబగబ తన పాన్పుపై నుంది క్రిందికి దిగెనని పోతన వర్ణించినాడు.

ప్రశ్న 3.
చరితములని కొన్ని నుడివి చతురత మఱియున్.
జవాబు:
కవి పరిచయం :
భక్త కవి పోతన రచించిన ఆంధ్రమహాభాగవతం నుండి గ్రహింపబడిన మిత్రధర్మం అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడింది.

సందర్భము :
తనను దర్శించడానికి వచ్చిన కుచేలుని చూసి అతిధి సత్కారాలు చేసి కుచేలునితో చిన్ననాటి సంఘటనలు గుర్తుచేసుకున్న సందర్భంలోనిది.

వివరణ :
కుచేలుని అదృష్టానికి అంతఃపుర కాంతలు ఆశ్చర్యపోతున్న సమయంలో కృష్ణుడు ప్రేమతో కుచేలుని చేతిని తన చేతిలోకి తీసుకుని ఇద్దరూ కలిసి గురుకులవాసం చేసిన రోజులలోని విశేషాలను కొన్నింటిని శ్రీకృష్ణుడు గుర్తుచేసుకున్నాడు అని భావం.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

ప్రశ్న 4.
రుచిరాన్నముగనే యేను భుజింతున్.
జవాబు:
కవి పరిచయం :
భక్త కవి పోతన రచించిన ఆంధ్రమహాభాగవతం నుండి గ్రహింపబడిన మిత్రధర్మం అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడింది.

సందర్భము :
నాకోసం ఏమి తెచ్చివు అని కుచేలుని కృష్ణుడు అడుగుతూ ప్రేమ, భక్తి యొక్క గొప్పదనాన్ని చెబుతున్న సందర్భంలోనిది.

భావం :
పత్రమైనా, పుష్పమైనా, జలమైనా, ఫలమైనా సరే నిశ్చల భక్తితో నాకు సమర్పిస్తే దాన్ని మధురాన్నంగా భావించి ఆరగిస్తాను అని శ్రీకృష్ణుడు కుచేలునితో అన్నాడు.

V. సంధులు

1. పేదరికమిట్లు : పేదరికము + ఇట్లు = ఉకార సంధి
సూత్రం : ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు

2 జీవితాశ : జీవిత + ఆశ = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అకార, ఇకార, ఉకార, ఋకారములకు సవర్ణములు పరమైనచో వాని దీర్ఘమేకాదేశమగును.

3. పదాఙ్ఞాతంబు : పద + అఙ్ఞాతంబు = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అకార, ఇకార, ఉకార, ఋకారములకు సవర్ణములు పరమైనచో వాని దీర్ఘమేకాదేశమగును.

4. దారిద్ర్యాంధకార : దారిద్య్ర + అంధకార = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం. : అకార, ఇకార, ఉకార, ఋకారములకు సవర్ణములు పరమైనచో వాని దీర్ఘమేకాదేశమగును.

5. వాలుఁగన్నులు : వాలున్ + కన్నులు = సరళాదేశ సంధి
సూత్రం : ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములుగు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

6. సేసెనొకొ : సేసెను + ఒకొ = ఉత్వ సంధి
సూత్రం : ఉ

7. దర్శనోత్సాహి దర్శన + ఉత్సాహి = గుణ సంధి
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ వర్ణములు పరమైనచో క్రమముగా ఏ, ఓ, అర్ – లు ఏకాదేశమగును

8. అప్పద్మనేత్రం : ఆ + పద్మనేత్రు = త్రిక సంధి
సూత్రం :

  1. ఆ, ఈ, ఏ – అను సర్వనామములు త్రికమనబడును.
  2. త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు.
  3. ద్విరుక్తంబగు హల్లు స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు యడాగమగును.

9. దివ్యాంబర : దివ్య + అంబర = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అకార, ఇకార, ఉకార, ఋకారములకు సవర్ణములు పరమైనచో వాని దీర్ఘమేకాదేశమగును.

VI. సమాసాలు

1. శిథిలవస్త్రంబు : శిధిలమైన వస్త్రము – విశేష పూర్వపద కర్మధారయ సమాసము
2. చక్రపాణి : చక్రము పాణియందుకలవాడు – బహువ్రీహి కర్మధారయ సమాసము
3. గరుగృహం : గురువుయొక్క గృహం – షష్ఠీతత్పురుష సమాసము
4. దయాపయోనిధి : దయా పయోధి – షష్ఠీ తత్పురుష సమాసము
5. దయార్ద్ర దృష్టి : దయార్ద్రమైన దృష్టి – విశేష పూర్వపద కర్మధారయ సమాసము
6. మురసంహరుడు : ముర అనే రాక్షసుని సంహరించినవాడు – బహువ్రీహి సమాసము
7. రాజీవనేత్రుడు : రాజీవము వంటి నేత్రములు కలవాడు – బహువ్రీహి సమాసము
8. కరకంకణ రవంబు : కరకంకణముల యొక్క రవంబులు – షష్ఠీ తత్పురుష సమాసము
9. ద్వారకానగరంబు : ద్వారక అను పేరుగల నగరము – సంభావన పూర్వపద కర్మధారయ సమాసము

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

అర్థ తాత్పర్యములు

“పరీక్షిన్మహారాజా ! శ్రీకృష్ణుని బాల్య సఖుడు కుచేలుడు. ఆ బ్రాహ్మణోత్తముడు అభిమానధనుడు – విజ్ఞాని. రాగద్వేషాలు లేనివాడు. పరమ శాంతమూర్తి. ధర్మ తత్పరుడు జితేంద్రియుడు. తన గృహములో దారిద్ర్యము తాండవించుచున్నను ఎవ్వరిని దీనము యాచించి యెరుగడు. తనకు ప్రాప్తించిన కాసును కూడ పదివేలుగా భావించి ఏదో ఒక విధముగా భార్యాపుత్రులను పోషించుచుండెను.

1వ పద్యం :

తే. బాలసఖుండైనయప్పద్మపత్ర నేత్రుం
గాన నేఁగి దారిద్య్రంధకార మగ్ను
లైన మనుమునుద్ధరింపుమున; హరికృపా క
“టాక్ష రవిదీప్తి వదసి మహాత్మ ! నీవు,

అర్థాలు :
మహా + ఆత్మ = మహానుభావా !
నీవు = నీవు (కుచేలుడు)
బాలసఖుడైన = చిననాటి స్నేహితుడైనట్టి
ఆ + పద్మపుత్ర నేత్రున్ = తామరరేకుల వంటి కన్నులు గల ఆ శ్రీకృష్ణుని
కానన్ = చూచుటకు
ఏగి = వెళ్ళి
దరిద్ర + అంధకార = బీదఱికమనెడి చీకటిలో
మగ్నులయిన =
మమున్ = మమ్ములను
హరి కృపాకటాక్ష = శ్రీకృష్ణుని దయతో కూడిన కడకంటి చూపు అనెడి
రవిదీప్తిన్ = సూర్యకాంతిని
పడసి = పొంది
ఉద్దరింపుము = రక్షింపుము, ఆపద నుండి తొలగింపుము

భావం:
“మహాత్మా ! నీ చిననాటి స్నేహితుడైన, వాడును, తామరరేకుల వంటి కన్నులు కలవాడును అగు శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి, ఆ హరి యొక్క కడకంటి చూపు అనెడి సూర్యకాంతి చేత దారిద్ర్యమనెడి చీకటిలో మునిగియున్న మమ్ములను కాపాడుము” భార్య తన భర్తను కోరెనని భావము.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

2వ పద్యం :

చ. వరదుఁడు సాధుభక్తజన వత్సలుఁ దార్తశరణ్యం ఉందిరా
వరుఁడు దయాపయోనిధి భగవంతుఁడు కృష్ణుఁడు దాం గుతస్థలీ
పురమున యాదవ ప్రకరముల్ భజియింపఁగ నున్నవాఁదు; నీ
వరిగిన నిన్నుఁ జూచి విభుఁడప్పుడు యిచ్చు ననూస సంపదల్.

అర్థాలు :
విభుడు = విశ్వ ప్రభువైన ఆ కృష్ణుడు
వరదుడు = వరములనిచ్చువాడు
సాధు భక్తజనవత్సలుడు = సత్పురుషులను భక్తుల యందు దయ గలవాడు
ఆర్త శరణ్యుడు = దీనులను రక్షించువాడు
దయాపయోధి = దయకు సముద్రుని వంటివాడు
భగవంతుడు = సకల సంపదలు కలవాడునగు
కృష్ణుడు = శ్రీకృష్ణ పరమాత్ముడు
తాన్ = తాను
కుశస్థలీ పురమునన్ = ద్వారకా నగరమందు
యాదవ ప్రకరముల్ = యాదవుల సమూహములు
భుజియింపగన్ = సేవింపగా
ఉన్నవాడు = నివసించుచున్నాడు
నీవు + అరిగినన్ = నీవు వెళ్ళినచో
నినున్ + చూచి = నిన్ను గాంచి
అప్పుడ = అప్పుడే – అనగా వెంటనే
అనూన సంపదల్ = అపారమైన సంపదలను
ఇచ్చు = ప్రసాదించును

భావం :
“వరములను ప్రసాదించువాడును, భక్తుల యందు దయగలవాడును, దీన జనులను రక్షించువాడును, దయకు సముద్రుని వంటివాడును, సకల సంపదలు కలవాడును అగు శ్రీకృష్ణ పరమాత్మడు యాదవుల సేవలందుకొనుచు ద్వారకాపురములో నున్నాడు. నీవు వెళ్ళినచో నిన్ను చూచి, మరుక్షణమే ఆ విశ్వవిభుడు అపారమైన సంపదలనిచ్చును”. అని కుచేలుని భార్య తన భర్తతో పలికెను. భక్తుల పట్ల శ్రీకృష్ణ పరమాత్మునికి గల కృపా విశేషమును పోతన ఈ పద్యములో వర్ణించినాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

3వ పద్యం :

మ. కలలోనం దను మున్నెఱుంగని మహాకష్టాత్ముడై నట్టి దు
ర్బలుఁ దావత్సమయంబునన్ నిజపదాఙ్ఞాతంబు లుల్లంబులో
దలఁప న్నంతన మెచ్చి యార్తిహరుఁడై తన్నెన నిచ్చున్, సుని
శ్చలభక్తిని భజియించు వారి కిడఁడే సంపద్విశేషోన్నతుల్ (శ్రీకృష్ణుడు – కర్త)

అర్థాలు :
తను = తనను (శ్రీకృష్ణుని)
కలనైనన్ = స్వప్నము నందైనను
మున్ను = పూర్వమ
ఎరుంగని = తెలియని, స్మరింపని
మహా కష్టాత్ముడు + ఐనట్టి = మిక్కిలి చెడ్డ మనస్సు కలవాడగు
దుర్భలుడు = హీనుడు
ఆపత్ + సమయమ్మునన్ = కష్ట కాలమునందు
నిజ = తనయొక్క
పద + అఙ్ఞాతంబములు = పద్మముల వంటి పాదములను
ఉల్లంబులోన్ = మనస్సులో
తలపన్ = స్మరింపగా
అంతనే = వెంటనే
మెచ్చి= మెచ్చుకొని
ఆర్తిహరుడై = బాధను పోగొట్టినవాడై
తన్నైనన్ + ఇచ్చును = తన్ను తానే సమర్పించుకొనును
సునిశ్చల భక్తిన్ = ఏ మాత్రము చలిపంని భక్తితో
భజియించు వారికిన్ = సేవించువారికి
సంపత్ + విశేష + ఉన్నతుల్ = అపారమైన సంపదలను
ఇడడే = ఈయడా!

భావం :
ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు కలలో కూడ తన్ను స్మరింపని నీచాత్ముడు కష్ట సమయంలో తన పాద పద్మములను మనస్సులో తలచినంత మాత్రముననే మెచ్చుకొని వాని ఆపదను బట్టి తన్ను తాను సమర్పించుకొనును. అట్టి కరుణామయుడు తనను నిశ్చలమైన భక్తితో సేవించు వారికి అపారమైన సంపదలను ఈయడా ? (ఇచ్చునని భావము) – అని కుచేలుని భార్య తన భర్తతో పలికెను.

ఈ పద్యమునుందు భగవంతుని భక్తజన వాత్సల్యమును పోతన మహాకవి వర్ణించినాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

3వ పద్యం :

క. అని చెప్పిన న మ్మానిని
సునయోక్తుల కలరి భూమిసురుఁ దా కృష్ణుం
గున నేయుట యిహపద సా
“ధన మగు నని మదిఁ దలంచి తన పతితోడన్

అర్ధాలు :
అని పలికినన్ = అని పలుకగా
ఆ + మానిని = ఆ అభిమానవతి యొక్క
సునయ + ఉక్తులకున్ = మంచి మాటలకు
అలరి = సంతసించి
భూమిసురుడు = ఆ బ్రాహ్మణుడగు కుచేలుడు
ఆ కృష్ణున్ + కనన్ + ఏగుట = ఆ కృష్ణుని చూచుటకై వెళ్లుట
ఇహ పర = ఇహలోక, పరలోక సుఖములకు
సాధనము + అగును + అని = ఉపకరణమగునని
మదిన్ = మనసునందు
తలంచి = భావించి
తన సతితోడన్ = తన భార్యతో (తరువాత పద్యముతో అన్వయము)

భావం :
భార్య మాటలకు కుచేలుడు సంతోషించాడు. శ్రీకృష్ణుని చూచుట ఇహలోక, పరలోక సుఖములకు సాధనమగునని భావించి, తన భార్యతో ఇట్లు పలికినాడని (తరువాతి పద్యముతో అన్వయము)

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

5వ పద్యం :

చు. నీవు సెప్పిన యట్ల రాజీవనేత్రు
పాదపద్మంబు లాశ్రయింపంగం జనుట.
పరమశోభన మా చక్రపాణి కిపుడు
గానమైన గొంపోవఁ గలదె మనకు ?

అర్థాలు :
నీవు చెప్పిన + అట్ల = నీవు పలికిన విధముగనే
రాజీవనేత్రం = పద్మముల వంటి కన్నులు గలగిన శ్రీకృష్ణుని యొక్క
‘పాద పద్మమలు = పద్మముల వంటి పాదములు
ఆశ్రయింపగన్ = చేరుటకు
చనుట = వెళ్లుట
పరమ శోభనము = మిక్కిలి శుభము
ఇపుడు = ఈ సమయమున
ఆ చక్రపాణి = చక్రము పాణియందు కలిగిన ఆ శ్రీకృష్ణునకు
కానుక + ఏమైన = ఏదైన కానుక
కొంపోవన్ = తీసుకొని వెళ్లుటకు
మనకున్ = మనకడ
కలదె = ఉన్నదా !

భావం :
“నీవన్నట్లు శ్రీకృష్ణుని పాదపద్మములను ఆశ్రయించుట మిక్కిలి శుభదాయకమే. కాని ఆయనకు తీసుకొని వెళ్లుటకై మన దగ్గర ఏదైన కానుక ఉన్నదా ?” అని కుచేలుడు భార్యనడిగెను.

6వ పద్యం :

తే. అనిననయ్యింతి యౌఁగాక యనుచు విభుని,
శిథిల వస్త్రంబు కొంగునఁ బృథుక తండు
లముల నొకకొన్ని ముడిచి నెయ్యమున ననుపఁ
జనియె గోవింద దర్శనోత్సాహి యగుచు.

అర్థాలు :
అనినన = అని పలుకగా
ఆ + ఇంతి = ఆ స్త్రీ (కుచేలుని భార్య)
ఔన్ + కాక = సరే
అనుచు = అనుచు
విభుని = భర్త యొక్క
శిథిల = చినిగిన
వస్త్రంబు + కొంగునన్ = వస్త్రము యొక్క కొంగున
పృథుకతండులములన్ = అటుకులను
ఒకకొన్ని = కొన్నింటిని
ముడిచి = కట్టి
నెయ్యమునన్ = ప్రేమతో
అనుపన్ = పంపగా
గోవింద = శ్రీకృష్ణుని యొక్క
దర్శన = చూచుటయందు
ఉత్సాహి + అగుచు = ఉల్లాసము కలవాడై
చనియెన్ = వెళ్ళెను

భావం :
అప్పుడు కుచేలుని భార్య ‘సరే’ యని కొన్ని అటుకులను భర్త యొక్క చినిగిన వస్త్రము చివర ముడివేసి ప్రయాణమునకు సిద్ధము చేసినది – శ్రీకృష్ణ సందర్శనోత్సాహంతో కుచేలుడు ద్వారకకు బయలుదేరెను.

అర్థాలు :
చనుచు = వెళ్ళుచు
తనమనంబునన్ = తన మనస్సులో ఇట్లు భావించెనని

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

7వ పద్యం :

వ. అట్లు సనుచుం దన మనంబున.

8వ పద్యం :

సీ. ద్వారకానగరంబు నే రీతిఁ జొత్తును ?
భాసురాంతఃపురవాసి యైన
య పుండరీకాక్షు నఖిలేశు నెబ్భంగిఁ
దర్శింపఁ గలనా ? తద్వారపాలు
రెక్కడి విప్రుఁడ ? విందేల వచ్చెద ?
పని యడ్డ పెట్టిరే నపుడు వారి
కే మైనం బంచాన మిచ్చి చొచ్చెద నన్ను
సూహింప సర్దశూన్యుండ నేను ;
తే. నయిన నా భాగ్య; మతని దయార్ద్రదృష్టి
గాక తలపోయంగా నొండు గలదె ? యాతం.
డేల నన్ను ముపేక్షించు 2 వేటమాట ?
లనుచు నా ద్వారకాపుర మతండు సొచ్చి.

అర్థాలు :
ద్వారకానగరంబున్ = ద్వారకా పట్టణమును
ఏ రీతిన్ = ఏవిధముగ
చొత్తును = ప్రవేశింతును ?
భాసుర = దివ్వ దీప్తితో ప్రకాశించు
అంతఃపురవాసి + ఐన = అంతఃపురములో నుండునట్టి
ఆ + పుండరీక + అక్షున్ = పద్మముల వంటి కన్నులు కలిగిన వాడగు ఆ కృష్ణుని
అఖిల + ఈశున్ = సర్వేశ్వరుని
ఏ + భంగిన్ = ఏ రీతి
దర్శింపగలను = చూడగలను ?
తత్ + ద్వార పాలకులు = ఆయన యొక్క అంతఃపుర ద్వార పాలకులు
ఎక్కడి విప్రుండవు = ఎక్కడి నుండి వచ్చిన బ్రాహ్మణుడవు
ఇందున్ + ఏల + వచ్చెదవు = అవి = ఇక్కడికెందులకు వచ్చితివని
అడ్డు పెట్టిరేని = నన్ను నిరోధించినచో
పరిదానము + ఇచ్చి = బహుమానమిచ్చి
చొచ్చెదన్ + అన్న = ప్రవేశించెదమన్నచో
ఊహింపన్ = ఆలోచింపగా
అర్థ శూన్యుండను = డబ్బు లేని వాడను
నా భాగ్యము = నా అదృష్టము
అతని = ఆ కృష్ణుని యొక్క
దయా దృష్టి = దయతో తడిసిన చూపు (కటాక్ష వీక్షణము)
కాక = అంతేగాని
ఒండగలదె = ఇతర మేమున్నది ?
అతడు = ఆ కృష్ణుడు
నన్నున్ + ఏల + ఉపేక్షించును = నన్నెందులకు అశ్రద్ధ చేయును ?
ఏటి మాటలు = ఇన్ని మాటలెందులకు ?
చొచ్చి = ప్రవేశించి

భావం :
నేనెట్లు ద్వారకా నగరమును చేరగలను ? దివ్వ దీప్తితో ప్రకాశించు అంతః పురము నేనెట్టు ప్రవేశింపగలను ? సర్వేశ్వరుడైన ఆ కృష్ణుని ఎట్లు దర్శింపగలను ? నీవెవ్వ డవు ? ఎక్కడినుండి, ఎందులకు వచ్చితివి ? అని ప్రశ్నించి ద్వారపాలకులు అడ్డు పెట్టిన చో-వారికేమైన బహుమానమిచ్చి వెళ్ళవచ్చునన్నచో, నేను డబ్బు లేనివాడను. అయిననుఆయన దయ-నాభాగ్యము. ఆలోచింపగా మరేమి యున్నది ? ఐనను బాల్యమిత్రుడైన ఆ కృష్ణుడు నన్నేల అశ్రద్ధ చేయును ?” అని తలచుచు కుచేలుడు ద్వారకా నగరములో ప్రవేశించెను.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

9వ పద్యం :

ఎ. ఇట్లు ప్రవేశించి రాజమార్గంబునం జని చని కక్ష్యాంతరంబులు గడచి చనిముందట.

అర్థాలు :
కక్ష్యాంతరంబులు = లోగిళ్ళ వాకిళ్ళు
కడచి = దాటి
చని = వెళ్లి
ముందటన్ = ఎదుట

భావం :
ఇట్లు కుచేలుడు ద్వారకలో ప్రవేశించి, కొన్ని లోగిళ్ళ వాకిళ్ళు దాటి, ముందుకు వెళ్ళి – (తరువాతి పద్యముతో అన్వయము)

10వ పద్యం :

మ. కని దాయం జనునంతఁ గృష్ణుండు దళత్కకంజాక్షుఁ డ ప్పేద వి
పుని నశ్రాంత దరిద్రపీడితుఁ గృశీభూతాంగు జీర్ణాంబరున్
ఘనతృష్ణాతురచిత్తు హాస్యనిలయున్ ఖందోత్తరీయం గుణే
లుని నల్లంతనే చూచి సంభ్రమ విలోలుండై దిగెం డల్పమున్

అరాలు :
కని = కుచేలుడు కృష్ణుని చూచి
డాయన్ + చనునంతన్ = సమీపించగానే
దళత్ + కంజ + అక్షుడు = విరిదామరల వంటి కన్నులు కలవారునగు కృష్ణుడు
ఆ + పేద విప్రునిన్ = ఆ బీద బ్రాహ్మణుని
అశ్రాంత = ఎడతెగని
దరిద్ర పీడితున్ = పేదరికము చేత బాధపడు వాడను
కృశీభూత + అంగున్ = చిక్కి శల్యమైన శరీర అవయవములు కలవాడును
జీర్ణ + అంబరున్ = చినిగిన బట్టలు కలవాడను
ఘన + ఆతుర + చిత్తున్ = గొప్ప ఆశతో కూడిన మనస్సు కలవాడును (ఆశాపూరిత చిత్తుడును)
హాస్య నిలయమున్ = పరిహాసమునకు స్ధానమైన వాడును
ఖండ + ఉత్తరీయున్ = ముక్కలైన ఉత్తరీయము కలవాడును (అయిన)
కుచేలునిన్ = తన మిత్రుడైన కుచేలుని
అల్లంతన చూచి = కొంచెము దూరము నందు చూచి
సంభ్రమ విలోలుండై = తొట్రుపాటు కలవాడై
తల్పమున్ = హంస తూలికా తల్పమును (శయ్యను)
దిగెన్ = దిగెను

భావం :
కుచేలుడు శ్రీకృష్ణుని సమీపించాడు శ్రీకృష్ణుడు నిరంతరము బీదఱికము చేత బాధపడు పేద బ్రాహ్మణుడును, చిక్కి శల్యమైన శరీరము కలవాడును, చినిగిన వస్త్రములను ధరించినవాడును, ఆశాపూరిత చిత్తుడును, హాస్యమునకు స్థానమైన వాడును, అయిన బాల్యమిత్రుడైన కుచేలుని అల్లంత దూరములో చూచి, గబగబ తన పాన్పుపై నుండి క్రిందికి దిగెను.

మహాకవి పోతన ఈ పద్యమునుందు కుచేలుని స్వరూపమును, స్వభావమును అద్భుతముగా వర్ణించినాడు. మాసినట్టిగాని, చినిగి నట్టిగాని వస్త్రములు కట్టువాడు కుచేలుడు. (చేలమనగా వస్త్రము).

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

11వ పద్యం :

మ. కరమర్థి నెదురుగాఁ జని
పరిరంభణ మాచరించి, బంధు స్నేహ
స్ఫురణం దోచ్చి, సమా
ధడమునఁ గేర్చుందఁ బెట్టెఁదన్ తల్పమునన్,

అర్థాలు :
కరమున్ + అర్ధిన్ = మిక్కిలి ఆసక్తితో
ఎదురుగా + చని = ఎదురుగావెళ్ళి
పరిరంభణము + ఆచరించి = ప్రేమతో కౌగిలించుకొని
బంధు స్నేహ స్ఫురణన్ = చుట్టరికము,మైత్రీభావములు వెల్లడి యగునట్లు
తోడైచ్చి = తీసుకొని వచ్చి
సమాదరమునన్ = మిక్కిలి ఆదరముతో
తన తల్పమునన్ = తన పాన్పుపై
కూర్చుండన్ + పెట్టెన్ = కూర్చుండబెట్టెను

భావం :
శ్రీకృష్ణుడు మిక్కిలి ఆదరముతో ఎదురుగా వెళ్లి కుచేలుని ప్రేమతో కౌగిలించు కొనినాడు. బంధుత్వము, మిత్రత్వము వెల్లడియగునట్లుగా తీసుకొని వచ్చి, ప్రేమాధారములతో తన పాన్పుపై కూర్చుండబెట్టినాడు.

12వ పద్యం :

తే. అట్లు గూర్చుండఁబెట్టి నెయ్యమునఁ గనక
కలశ సలిలంబుచేఁ గాళ్ళు గడిగి భకిం
దుజ్జలంబులు దనడు మస్తమునఁ దాల్చి,
లలిత మృగమద ఘనసార మిళిత మైన

అర్థాలు :
నెయ్యమునన్ = స్నేహముతో
కనక కలశ సలిలంబుచే = బంగారు చెంబు నందలి నీటితో
కాళ్లు కడిగి = కుచేలుని పాదములు కడిగి
తత్ + జలంబున్ = ఆ నీటిని
తనదు మస్తకమునన్ = తన శిరస్సుపై
తాల్చి = ధరించి
లలిత = మనోహరమైన
మృగమద = కస్తూరి
ఘనసార = పచ్చ కర్పూరములతో
మిళితము = అయిన = కలిపినట్టి

భావం :
కుచేలుని తన పాన్పుపై కూర్చుండబెట్టినాడు. ప్రేమతో బంగారు చెంబులోని నీటితో ఆయన పాదములు కడిగినాడు. ఆ కాళ్లు కడిగిన నీటిని భక్తితో తన శిరస్సు మీద చల్లుకొనినాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

13వ పద్యం :

తే. మలయజము మేన తొబ్బిల్ల నలంది యంత,
శ్రమము వాయంగఁ దాళవృంతమున విసరి
బంధురామోదకలిత ధూపంబు లొసఁగి,
మించు మణిదీపముల నివాళించు మఱియు.

అర్థాలు :
మలయజము = మంచి గంధము
మేనన్ = శరీరమున
జొబ్బిల్లన్ + అలది = దట్టముగా పూసి
అంతన్ = పిమ్మట
శ్రమము + పాయంగన్ = అలసట పోవునట్లుగా
తాళ వృంతమునన్ = విసనకర్రతో
బంధుర = అధికమైన
ఆమోద = సువాసనతో
కలిత = కూడిన
ధూపంబులు + ఒసగి = సుగంధపు పొగవేసి
మించు = అతిశయించిన
మణి దీపములన్ = మణిమయ దీపములతో
నివాళించి = ఆరతి యిచ్చి
మఱియు = మఱియు (తరువాతి పద్యముతో అన్వయము)

భావం :
కస్తూరి పచ్చకర్పూరము కలిపిన మంచి గంధమును కుచేలుని శరీరమునకు పూసెను. అగరుధూపము వేసి, అలసట పోవునట్లుగా మిత్రునకు విసనకర్రతో విసరెను. మణిమయ దీపాలతో హారతి పట్టెను.

14వ పద్యం :

వ. సురభికుసుమ మాలికలు సిగ్గముడం దుఱిమి, కర్పూరమిళిత తాంబూలంబు విడి.
ధేనువు నొసంగి, సాదరంబుగా స్వాగతం బడిగిన నప్పుడవ్వివుండు మేనం
బులకాంకురంబు లంకురింప నానందబాష్ప జలబిందు సందోహుందయ్యెం, నట్టియెడు
బద్మలోచనుందు మన్నించు సంగనామణి యగు రుక్మిణి కరకంకణ రవంబు లొలయం
జామరలు వీవం దజ్ఞాత వాతంబున ఘర్మ సలిలంబు నివారించుచుండఁ జూచి
శుద్ధాంత కాంతా నివహంబులు దమ మనంబుల సద్భుతం బండి యిట్లనిరి.

అర్థాలు :
సురభి = సువాసనగల
కుసుమ మాలికలు = పూల దండలు
సిగమున్ = జుట్టు ముడిలో
తుఱిమి = ముడిచి
కర్పూర మిళిత = పచ్చ కర్పూరము కలిపిన
తాంబూలంబులు + ఇడి = తాంబూలములు ఇచ్చి
ధేనువున్ + ఒసంగి = గోదానము చేసి
సాదరంబు గాన్ = ఆదరముతో
స్వాగతంబు + అడిగినన్ = దయ చేయుడని కోరగా
ఆ + విప్రుండు = ఆ కుచేలుడు
మేనన్ = శరీరమున
పులక + అంకురంబులు = గగుర్పాటులు
అంకురింపన్ = కలుగగా
ఆనంద బాష్ప జల బిందు సందోహుండు + అయ్యెన్ = ఆనందముతో కూడిన కన్నీటి బిందువులు కలవాడయ్యెను
అట్టి + ఎడన్ = ఆ సమయము నందు
పద్మలోచనుండు = పద్మముల వంటి కన్నులు కలబాడగు శ్రీకృష్ణుడు
మన్నించ = గౌరవించు
అంగనామణి + అగు = స్త్రీ రత్నము
రుక్మిణీ = రుక్మిణీ దేవి యొక్క
కరకంకణంబులు = చేతి గాజులు
మెఱయన్ = ప్రకాశించుచుండ,
చామరలు వీనన్ = వీననలు విసరగా
తత్ + జాత వాతంబు = పుట్టిన గాలుల చేత
ఘర్మ సలిలంబు = చెమట పట్టిన
నివారింపుచుండన్ = పోగొట్టగా
శుద్ధాంత కాంతా జనంబులు = అంతఃపురము నందలి స్త్రీలు
మనంబునన్ = మనస్సు నందు
అద్భుతంబు + అంది = ఆశ్చర్యపడి
ఇట్లు + అరి = ఇట్లు పలికిరి

భావం :
మంచి సువాసనలు గల పూలదండలు కుచేలుని జుట్టుముడిలో అలంకరించెను. కర్పూర తాంబూలము నొసంగెను. గోదానమిచ్చెను. ఇట్లు కృష్ణుడు తనకు సాదరముగా స్వాగతము పలుకగా, కుచేలుని శరీరమున గగుర్పాటుతో వెంట్రుకలు నిక్కబొడుచుకొనెను. ఆయన కన్నుల నుండి ఆనంద బాష్పములు స్రవించెను.

ఆ సమయమున సాక్షాత్తు శ్రీకృష్ణుని సతీమణియైన రుక్మిణీదేవి చేతుల గాజులు ముల్లుఘల్లు మనుచుండగా వింజామరలు విసరెను – అప్పుడు పుట్టిన చల్లని గాలులు మార్గాయాసముచేత పుట్టిన కుచేలుని శరీరము నందలి చెమట బిందువులను పోగొట్టెను. ఈ ఘట్టమును చూచి, అంతఃపుర కాంతామణులు ఆశ్చర్యపోయి, తమలో తామిట్లను కొనసాగిరి.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

15వ పద్యం :

వ. ఏమి తపంబు సేసినాకా ! యీ ధరణీదివిజోత్తముందు తొల్
బామున ! యోగివిస్పర మపాస్యకుఁడై తనరారు నీ జిగ
త్స్వామి రమాధినాథ నిజతల్పమునన్ వసియించి యున్నవాఁ;
డీ మహనీయమూర్తి కెనయే మునిపుంగవు లెంతవారలున్ ?

అర్థాలు :
ఈ ధరణీ దివిజ + ఉత్తముండు = ఈ జగత్ స్వామిన్
తొల్ బామునన్ = పూర్వ జన్మమునందు
ఏమి తపంబు = ఎంత గొప్ప తపస్సును
చేసెనొకొ = చేసి యుండెనో కదా !
యోగి = యోగుల చేత
విస్ఫురత్ + ఉపాస్యకుడై = చక్కగా ఉపాసింపబడువాడునై
తనరారు = ఒప్పునట్టి
ఈ బ్రాహ్మణ శ్రేష్ఠుడు = ఈ లోకేశుని
రమా + అధినాథున్ =లక్ష్మీదేవి భర్తయగు విష్ణుమూర్తి యొక్క
నిజ తల్పమునన్ = సొంత పడకమీద
వసియించి + ఉన్నవాడు = కూర్చుండియున్నాడు
మునిపుంగవులు = ముని శ్రేష్టులు
ఎంతవారలున్ = ఎంత గొప్పవారయినను
ఈ మహనీయ మూర్తికిన్ = గొప్ప తేజస్సు గల ఈ బ్రాహ్మణునికి
ఎనయే = సాటియగునా ! (కారని భావము)

భావం :
ఈ బ్రాహ్మణోత్తమునకు పూర్వ జన్మమునందు ఎట్టి గొప్ప తపస్సు చేసినాడో కదా ! మహర్షుల చేత ఉపాసింపబడునట్టి ఈ జగత్ప్రభువు, లక్ష్మీదేవి భర్తయగు శ్రీకృష్ణుని పాన్పుపై కూర్చుండినాడు. మునీశ్వరులు ఎంత గొప్పవారైనను అఖండ తేజస్సుతో ఒప్పునట్టి ఈ కుచేలునితో సాటిరారు గదా !” అని అంతఃపుర కాంతామణులు ఆశ్చర్యపోయిరని భావము. శ్రీకృష్ణుని అపారమైన ప్రేమకు పాత్రుడైన కుచేలుని అదృష్టమును పోతన ఈ పద్యము వర్ణించినాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

16వ పద్యం :

అర్థం :
అదియునుగాక = అంతేగాక

17వ పద్యం :

చ. తన మృదుతల్పమందు పనితామణి యైన రమాలలాను సాం
దును నెదఁగాఁ దలంపక యడుప్రవరుం డెదురేఁగి మోచముం
దనుకంగఁ గౌఁగిలించి యుచితక్రియలం బరితుష్టుఁ జేయుచున
వినయమునన్ భజించె; ధరణీసురుఁ దెంతటి భాగ్యవంతుదో ?

అర్థాలు :
యదువరుండు = యదు వంశంలో శ్రేష్ఠుడు
తన మృదు తల్పమందున్ = తన యొక్క మెత్తని పాన్పునందు
వనితామణి + ఐన = స్త్రీ రత్నమగు
రమాలలాసు = లక్ష్మీదేవి యొక్క
పొందును = సామీప్యమును
ఎవగాన్ + తలంపక = అడ్డుగా భావింపక
ఎదురేగి = ఎదురుగా వెళ్ళి
మోదమున్ + తనుకగన్ = సంతోషముప్పొంగగా
కౌగిలించి = కౌగిలించుకొని
ఉచితక్రియలన్ = సముచితమైన పనుల చేత
పరితుష్టన్ + చేయుచున్ = సంతృప్తుని కావించుచు
వినయమునన్ = వినమ్రతతో
భజించెన్ = సేవించెను
ధరణీసురుడు = బ్రాహ్మణుడైన ఈ కుచేలుడు
ఎంతటి భాగ్యవంతుడో = ఎంత గొప్ప అదృష్టవంతుడో కదా !

భావం :
“ఆహా !. యాదవవంశ శ్రేష్ఠుడగు శ్రీకృష్ణుడు తన సతీమణియగు సాక్షాత్తు లక్ష్మీదేవియైన రుక్మిణి ఏమనుకుంటుందో అని కూడ భావింపక, తాను ఎదురుగా వెళ్ళి సంతోషముతో మిత్రుడైన కుచేలుని కౌటిలించుకున్నాడు. సముచితమైన సేవలతో ఆయనను సంతృప్తిని కావించాడు. ఈ బ్రాహ్మణుడెంతగి అదృష్టవంతుడో కదా !” అని అంతఃపుర కాంతలు ఆశ్చర్యముతో భావించిరి.

ఈ పద్యము నందు శ్రీకృష్ణుని అపారమై, అనుగ్రహమునకు పాత్రుడైన బాల్యమిత్రుడైన కుచేలుని అదృష్టమును పోతన మహాకవి అద్భుతముగా అభివర్ణించినాడు.

సూచన : గుర్తు గలవి పాఠ్య గ్రంథములోని “అధ్యయన వేదిక” లో యిచ్చినవిగా గుర్తింపగలరు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

18వ పద్యం :

మ అను వ య్యవసరంబుగ

అర్థాలు :
అయ్యవసరంబుగ = ఆ సమయంలో
అను = అనుకుంటుండగా

19వ పద్యం :

క. మురసంహరుడు కుచేలుని
కరము గరంబునం దెమల్ని కథంకన్ మన ‘మా
గురుగృహమున వర్తించిన.
చరితములని కొన్ని మడిని చతురత మరియున్,

అర్ధాలు :
మురసంహరుడు = ముర అనే రాక్షసుని సంహరించిన శ్రీకృష్ణుడు.
కుచేలుని = సుదాముని
కరము = చేతిని
కరంబున = తన చేతిలో
తెమల్చి = ఒడిసి పట్టుకొని
కడకన్ = పూని
మనమా = మనము
ఆ = ఆ యొక్క
గురుగృహమున = గురువుగారి ఇంటిలో
వర్తించిన. = నడచిన (ప్రవర్తించిన
చింతములని = గడచిన సంఘటనలని
కొన్ని = కొన్నింటిని
నుడివి = చెప్పి
చతురత = నేర్పరితనంతో
మఱియున్ = ఇంకను

భావం :
అంతఃపుర కాంతలు అలా అనుకున్న సమయంలో కృష్ణుడు ప్రేమతో కుచేలుని చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. తాము గురుకుల వనం చేసిన దినాలలో జరిగిన విశేషాలను కొన్నింటిని ప్రస్తావించి ఇలా అన్నాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

20వ పద్యం :

సీ బ్రాహ్మణోత్తమ! వేదపారనబడ
క్షత గల చారువంశంబు వలనం
బరిణయం బైనట్టి భార్య సుశీలప
ర్తనములఁ దగ భవత్సదృశ యగునె ?
తలఁప గృహ క్షేత్రధనదారపుత్రాడు.
లందు నీ చిత్తంబు సెందకుంట
తోఁచుచున్నది; యేను దుది లోకసంగ్రహా
ర్థంబు కర్మాచరణంబు సేయు

తే. గతి, మనంబులఁ గామమోహితులు గాక
యర్థిపై యుక్త కర్మంబు లాచరించి
ప్రకృతి సంబందములు వాసి భవ్యనిష్ఠ
దవిలి యుందురు కొంద ఱుత్తములు భువిని.

అర్థాలు :
బ్రాహ్మణ + ఉత్తమ = బ్రాహ్మణులలో ఉత్తముడా
వేద = వేదములను
పాఠన = చదువుచుండుటచే
లబ్ది = లభించిన
దక్షత = సామర్థ్యము
కల = కలిగినట్టి
చారువంశంబున్ = చక్కని వంశస్థురాలు
వలన = తోట
పరిణయంబైనట్టి = వివాహము అయినట్టి
భార్య = భార్య
సుశీల = మంచి స్వభావం చేత
వర్తనములన్ = నడవడిక చేత
తగన్ = చక్కగా
భవత్యదృశ = నీకు సరిపడునామె
అగునె = అయి ఉన్నదా ?
తలపన్ = విచారించినచో (ఆలోచిస్తే)
గృహ = ಇಲ್ಲು
క్షేత్ర = పొలములు
ధన = సంపదలు
దార = భార్య
పుత్ర = పిల్లలు
ఆదులు = మొదలైనవి
అందున్ = ఎడల
నీ = నీ యొక్క
చిత్తంబు = మనస్సు
సెందకుంట = తగుల్కొనకుండుట
తోచుచున్నది = తోచుచున్నది (కనబడుతున్నది)
ఏనుతుదిన్ = నేను చివరకు
లోక = లోకాచరమును
సంగ్రహార్థంబు = స్వీకరించుటకు
కర్మాచరణంబు = కర్మములు ఆచరించుట
సేయు = చేసెడి
గతి = విధముగా
మనంబునన్ = మనస్సు
కావు = కోరికలందు
మోహితులు = భ్రమ చెందినవారు.
కాకన్ = కాకుండగా
అర్థమై = ప్రీతితో
యుక్త కర్మలు = తగినట్టి కర్మలు
ఆచరించి = చేసి
ప్రకృతి సంబంధములు = మాయా సంబంధములు
వసి = దూరమై
భవ్యనిష్ఠన్ = గొప్ప నియములతో
తనివి = పూని
ఉందురు = ఉంటారు
కొందరు+ఉత్తములు = కొందరు గొప్పవారు
భువిన్ = = భూలోకమందు

భావం :
భూగురోత్తమా! వేదాధ్యయనంలో దక్షులైన వారి యింట పుట్టిన నభార్య సద్గుణాలతో నీకు తగినట్లు ప్రవర్తిస్తున్నదా? ఇంతకూ నీ మనస్సు గృహక్షేత్రాల మీద పతనము మీద లగ్నమై ఉన్నట్లు కనిపించడం లేదు. లోక కళ్యాణం కోసం నేను కర్మాచరణలో ప్రవర్తించినట్లు కొందరు ఉత్తములు కామ మోహాలకు వశం కాకుండా తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అలాంటివారు ప్రకృతి సంబంధాలకు అతీతంగా ఉంటూ కర్తవ్యనిష్ఠతో, జీవిస్తారు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

21వ పద్యం :

వ ఆదియునుగాక సకల భూతాత్మకుండవైన యేసు దపో వ్రత యజ్ఞ దాన శము దమాదులచేత
సంతసింపను, గురుజనంబులం బరమభక్తి సేవించు వారలం బరిణమించునని
మఱియు మనము గురుమందిరమున నున్న యెడ నొక్క నాఁడు గుపల్నీ నియుక్తులమై
బంధనార్థం బడవికిం జనిన నయ్యవసరంబును

అర్థాలు :
ఆదియునుంగాన్ = అంతేకాకుండా
సకల = సర్వ
భూతాత్మకుండనైన = ప్రాణులందు ఉండేవాడైన
ఏను = నేను
తపః = తపస్సులచే
వ్రత = వ్రత ములచే
యజ్ఞ = యజ్ఞములచే
దాన = దానములచే
శవు = బహిరింద్రియనిగ్రహములచేత
దమదులచేత = అంతరింద్రియ నిగ్రహములు
సంతసింపను = సంతషింపను
గురు = గురువులైన
జనంబులన్ = వారిని
పరిణమించున్ = హర్షింతును
అని =అని
చెప్పి = చెప్పి
మరియు = ఇంకను
మనము = మనము
గురుమందిరమున = గురువు యొక్క గృహంలో
ఉన్న = ఉన్నట్టి
ఎడన్ = సమయంలో
ఒక్క = ఒకానొక
నడు = దినమున
గురు = గురువు యొక్క
పత్నీనియుక్తులమై = భార్యచేత పంపబడినవారమై
ఇంధన = కట్టెల
అర్థంబు = కొరకు
అడవికిన్ = అడవికి
చవినన్ = వెళ్ళగా
ఆ+అనవసరంబునన్ = ఆ సమయంనందు

భావం :
అంతేగాక సకల భూతాలలో ఆత్మగా ఉన్న నేన తపోదాన యజ్ఞాదులవల్ల సంతోషించవు. భక్తితో గురువును సేవించే వారిని ప్రేమిస్తాను. ఈ విధంగా పలికె కృష్ణుడు కుచేలునితో ఇలా అన్నాడు. మనం గురుగృహంలో ఉన్న దినాలలో ఒకనాడు గురుపత్ని ఆజ్ఞానుసారం కట్టెలు తేవడానికి అడవికి వెళ్ళాము గుర్తుంది కదూ!’

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

22వ పద్యం :

తే. బయలు గొందియుఁ బెను మిఱ్ఱుపల్లములును,
రహిత సహితస్థలంబు తీర్చఱుపరాక
యున్న యచ్చటి మనము నొండొరుల చేతు
లూతఁగాఁ గొని నదచుచు నుండునంత.

అర్ధాలు:
బయలు = బహిప్రదేశము
గొందియున్ = సందు
పెను = పెద్ద
మిఱ్ఱు = ఎత్తున్న ప్రదేశము
పల్లములును = కిందున్న ప్రదేశము
రహిత = లేనివి
సహిత = ఉన్నవి ఐన
స్థలంబుల = ప్రదేశములు
ఏర్పఅయి పరాక = తేడా తెలియకుండ
యున్న = ఉన్న
ఆ+తఱిన్ = ఆ సమయంలో
మనము = మనము
ఒండొరులు = పరస్పరము
చేతులను = చేతులున్
ఊతగాన్ = ఆసరాగా
కొని = తీసుకొని
నడుచుచున్ = నడుస్తూ
ఉండున్ = ఉండగా
అంతట = అంతటి

భావం :
తోవలు, డొంకలూ, ఎత్తు పల్లాలు కనపడకుండా వాన నీరు ఉన్నసమయంలో మనం ఒకరి చేతిని ఇంకొక ఆసరాగా తీసుకొని ఆ అడవిలో నడిచాము.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

23వ పద్యం :

క. బిసబిన నెప్పుడు నుడుగక,
విసరెడ్డి వలిచేత వడఁకు విడువక మనముం
బస చెడి మార్గముఁ గానక,
మసలితి మంతటను సంశుమంతుఁడు పొడిచెస్.

అరాలు :
బిసబిస = బిసబిస అను
ఎప్పడున్ = ఎప్పుడు
ఉడుగక = ఆగకుండ
విసరెడి = వస్తున్నట్టు
వలి = చల్లనిగాలి
చేత = వలన
వడకు = వణుకు
విడువక = వదలకుండ
మనమున్ = మనము
వలిచేడి = శక్తిపోయి
మార్గమున్ = దారి
కానక = కనబడక
మసలితిమి = అక్కడే తిరిగాము
అంతటను = పిమ్మట
అంశుమంతుడు = సూర్యుడు (కిరణములుగలవాడు)
పొడిచెన్ = ఉదయించెన్

భావం :
బిసబిసమని తీవ్రంగా వీచే చలిగాలులకు మన శరీరాలు కనిపించాయి. మనం శక్తి కోల్పోయి దిక్కూ తెన్నూ తెలియన్ వనమంతా తిరిగాము. ఎట్టకేలకు సూర్యోదయమైంది.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

24వ పద్యం :

క. తెలతెలవాజెడి వేళం
గలగల మని పంకం బక్షిగణ మెలెడున
మిలమిలని ప్రొద్దుపొడుపున,
దళ ధళ మను మెఱుగు దిగ్వికాసము నిండెన్.

అరాలు :
తెల = తెల్లగా
తెలవాఱెడి = ఉదయించెడి
వేళన్ = సమయంలో
కలకలమని = కలకల అని
పక్షి = పక్షుల
గణము = సమూహములు
ಎಲ್ಲ = అన్ని
ఎడలన్ = చోట్ల
పలికెన్ = కూసేను
మిలమిల = మిలమిల మెరుస్తూ అని వేళ
ప్రొద్దుపొడుపునన్ = సూర్యోదయవేళ
ధళధళయను = తళతళలాడునట్టు
మెఱుగు = వెలుగులు
దిక్ = దిక్కులు
విలూను =సమూహములు
నిండెన్ = నిండిపోయెను

భావం :
తెల్లవారింది. పక్షుల కలకలారావాలు అతిశయించాయి. మిలమిల మెరిసే సూర్యోదయ కాంతుల తళతళ వెలుగులు నలు దిక్కులా నిండిపోయింది.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

25వ పద్యం :

క. అప్పుడు సాందీపని మన,
చొ ప్పరయుచు వచ్చి వాససాంకునను వలిం
……………………….
బుసృతిం బలికె నకట ! యో ! పటులారా !

అర్థాలు :
అప్పుడు = ఆ సమయంలో
సాందీపని = గురువు సాందీపనుడు
మన = మన యొక్క
చొప్పు = జాడ
అరయుచు = వెతుకుతు
వచ్చి = వచ్చి
వాన = వర్షముకు తడిసి
సోకునన్ = తగులుటచే
వలిన్ = చలికి
తెప్పఱిలుటన్ = తెరుకొనుచుండుట
కని = చూసి
భేదురున్ = దుఃఖము
ఉప్పతిలన్ = పొంగిపొర్లగా
అకట = అయ్యో
ఓ = ఓయి
వటులార = పిల్లలూ
పలికెన్ = అనెను

భావం :
అప్పుడు మన గురువుగారైన సాందీపని మనలను వెదుక్కుంటూ వచ్చారు. వానలో తడిసి చలికి గజగజమని వణుకుతున్న మనలని చూచి బాధతో అయ్యో ఓ పిల్లలూ అనెను.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

26వ పద్యం :

చ. కటకట ! యిట్లు మా కొడకుఁగాఁ జనుదెంచి మహానిని సము
త్కటపరిపీడ నొందితిరి; గావున శిష్యులు ! మీ ఋణంబు నం
గట కిది కారణంబు సమకూరెడిన బో యిట మీద మీకు ఎ
స్ఫుట ధన బంధు దార బహుపుత్ర విభూతి జయాయురున్నతులె.

అర్ధాలు :
కటకట = అయ్యో
ఇట్ల = ఇలా
మా కొఱకున్ = మా కోసము
కాన్ = అయి
చనుదెంచి = వచ్చి
మహా + అటవిన్ = గొప్ప అడవిలో
సమ+ఉత్కలు = మిక్కిలి ఎక్కువైన
పరిపీడన్ = మిక్కిలి ఎక్కువైన
ఒందితిరి = పొందారు
కావునన్ = లావుంది కాబట్టి
శిష్యులు = శిష్యులుగా
మీ = మీ యొక్క
ఋణంబున్ = ఋణమును (చేసిన మేలుకు తీర్చని ప్రతిఫలం)
ఈగుట = తీర్చుకొనుటకు
ఇది = దని
కారణంబు = నిమిత్తమున్
సమకూరెడిచో = తప్పక కలుగునుగాక
ఇటు = ఇక
మీదన్ = మీదట
మీకున్ = మీకు
విస్ఫుట = విస్తారమైన
ధన = సంపదలు
బంధు = బంధువులు
దార = భార్య
బహు = పెక్కుమంది
పుత్ర = కొడుకులు అనే
విభోంది = వైభవములు
జయ = జయములు
ఆయుస్  = జీవితకాలము
ఉన్నాతల్ = గౌరవములు

భావం :
అయ్యో ఇలా మాకోసం వచ్చి ఘోర అడవిలో చాలా బాధలు పడ్డారు. శిష్యులుగా మీరు మీ ఋణం తీర్చుకున్నారు. మీకు విస్తారమైన సంపదలు, బంధువులు, భార్యలు, అనేక మంది కుమారులు, దీర్ఘాయువు, ఉన్నతులు, విజయశ్రీలు చేకూరగలవు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

27వ పద్యం :

క. కని గౌరవించి యాయన
మనలం దోడ్కొనుచు నాత్యమందిరమునకుం
జనుదెంచుట లెల్లను నీ
“మనమునఁ దలఁతే యటంచు మఱియుం బలికెన్,

అర్ధాలు :
కని = చూసి
గౌరవించి = గారాబములు చూపి
ఆయన = ఆ సాందీపని గురువు
మనలన్ = మనలను
తోడ్కొనుచున్ = కూడా తీసుకొని వెళుతూ
ఆత్మ = తన
మందిరమునమున్ = ఇంటికి
చనదెంచుట = వచ్చుట
ఎల్లను = అంత
నీ = నీ యొక్క
మనమునన్ = మనసునందు
తలతే = గుర్తు చేసుకుంటావా
అటంచు = అది అంటూ
మఱియున్ = ఇంకను
పలికెన్ = చెప్పెను

భావం :
అలా దీవించిన సాందీపని వాత్సల్యంలో మనలను తన మందిరానికి తీసుకుని వెళ్ళాడు. ఇవన్నీ నీకు గుర్తున్నాయా? ఎప్పుడైనా అనుకుంటూ ఉంటావా ? అని కృష్ణుడు కుచేలునితో ఇంకా ఇలా అన్నాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

28వ పద్యం :

వ. ‘అనఘ ! మన సుద్యయనంబు సేయుచు నన్యోన్య స్నేహ వాత్సల్యంబులం
జేయు కృత్యంబులు ముఱవవు గదా !” యని యని యెల్లం దలంచి యాడు.
మాధవు మధురాలాపంబులు ఏవి యతనిం గనుంగొని కుచేలుం డిట్లననియె:

అర్ధాలు :
అనఘ = పుణ్యుడా
మనము = మనము
అధ్యయనంబు = చదువుకొనుట
చేయుచున్ = చేస్తూ
అన్యోన్య = పరప్సర
స్నేహ = చెలిమితో
వాత్సల్యంబులన్ = ప్రీతికత
చేయి = చేయునట్టి
కృత్యంబులున్ = పనులు
మఱువవుకదా = మరవలేదుకదా
అవి = అవి
అది = వాటిని
ఎల్లన్ = అన్నింటినీ
తలచి = జ్ఞాపకం చేసుకొని
ఆడు = పలికెడు
మాధవు = కృష్ణుని
మధుర = తీయని
ఆలాపంబులు = మాటలు
విని = విని
అతనికి = అతనిది
కనుంగొని = చూసి
కుచేలుండు = కుచేలుడు
ఇట్ల = ఈ విధంగా
అనియె = పలికాడు

భావం :
పుణ్యాత్మా! మనం చదువుకున్న దినాలలో అన్యోన్య స్నేహ వాత్సల్యాలతో చేసిన పనులన్నీ నీవు మరువవు కదా! ఈ విధంగా కృష్ణుడు తాము చిన్ననాటి ముచ్చటలను పేర్కొని పలికిన మధుర వచనాలను విని కుచేలుడు ఉప్పొంగిపోయాడు. అతడు కృష్ణునితో ఇలా అన్నాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

29వ పద్యం :

గురుమతిఁ దలఁపఁగల ద్రిజగ
దురంద వనం దగిన నీమ గురుఁ దనఁగా నౌ
దొరుఁ దెవ్వ ? ఉంతయును నీ
కరయంగ విదంబనంబ యగుఁ గాదె హరీ !”

అర్ధాలు :
గురు = గొప్ప
మతిన్ = ಬುದ್ಧಿ
తలపగన్ = విచారించగా
త్రిజగత్ = ముల్లోకములను
అనన్ = చెప్పు
తగిన = తగినట్టి
నీకు = నీకు
గురుడు = గురువు
అనగన = అనుటకు
ఒండొరుండ = ఇంకొకడు
ఎవ్వడు = ఎవరు
ఇంతయున్ = ఇదంతా
నీకు = నీవు
అరయంగన్ = తరచిచూసినచో
విడంబునంబు = లోకమర్యాదకై
అగున్గాదె = అవునుకదా
హరీ = కృష్ణా

భావం :
గొప్పబుద్ధిలో ఆలోచించిచూస్తే నీవు ముల్లోకాలకు గురుడవు. నీకు గురుడయీ మరొక్కటున్నదా? ఇదంతా నీవు లోక మర్యాదకై ఆడిన లీలే కాని మరేమీ కాదు కృష్ణా!

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

30వ పద్యం :

వ. అని సాభిప్రాయంబుగాఁ బలికిన పలుకులు విని సమస్త భావాభిజుండైన పుండరీకాక్షుండు
మందస్మిత వదనారవిందుండగుచు నతనిం జూచి ‘నీ విచ్చటికి వచ్చునప్పుడు
నాయందుల భక్తింజేసి నాకు సుపాయంబుగ నేమి పదార్థంబు దెచ్చితి ? వప్పదార్థంబు
లేశమాత్రంబైనఁ బదివేలుగా సంగీకరించు, నట్లు గాక నీచవర్తనుండై మద్భక్తిం
దగులని దుష్టాత్ముందు హేమాచల తుల్యంబైన పదార్థంబు నొసంగిన నది నా మనంబునకు
సమ్మతంబు గాదు; కావున,

అర్థాలు :
అది = అని
సాభిప్రాయంబుగాన్ = సాభిప్రాయముగా
పలికిన = చెప్పిన
పలుకులు = మాటలు
విని = విని
సమస్త = ఎల్లవారి
భావ = అభిప్రాయములు
అభిజ్ఞుడు = తెలిసినవాడు
ఐన = అయిన
పుండరీకాక్షుడు = కృష్ణుడు
మందస్మిత = చిరునవ్వుగల
వదన = మోము అనె
అరవిందుడు = పద్మములు కలవాడు
అగుచున్ = అవుతూ
అతనినే =అతనిని (కుచేలుడు)
చూచి = చూసి
నీవిచ్చటికి = నీవు ఇక్కడికి
మార్చునప్పుడు = వచ్చేటపుడు
నాయందుల = నాఎడల
భక్తింజేసి = ప్రేమతో (భక్తితో)
నాకున్ = నాకు
ఉపాయనంబు = కానుక
కన్ = అగునట్లు
ఏమి = ఏ
పదార్ధంబున్ = పదార్ధమును
తెచ్చితి = తీసుకొచ్చావు
అదార్థంబు = ఆ పదార్ధాన్ని
లేశమాత్రంబు = రవ్వంత
ఐనను = అయినను
పదివేలు = పదివేలు
కాన్ = అయినట్లుగా
అంగీకరింతున్ = గ్రహించెదను
అట్లుగాక = అలాకాకుండా
నీచవర్తనుండై = అల్పబుద్ధికల నడవడిక కలవాడు
మత్ = నాయొక్క
భక్తిన్ = భక్తియందు
తగులని = ఆసక్తిలేని
దుష్టాత్ముండు = దుష్టుడు
హేమ + అచల = బంగారపు కొండ
తుల్యంబు = అంత
ఐనన్ = అయినట్లు
పదార్థంబునన్ = పదార్థమును
ఒసంగినన్ = ఇచ్చినవు
అది = అది
నమనంబునకు = నామనస్సునకు
సమ్మతంబుగాదు = అంగీకారముకాదు
కావునన్ = కాబట్టి

భావం :
కుచేలుడు సాభిప్రాయంగా పలికిన మాటల్లోని ఆంతర్యాన్ని కృష్ణుడు గ్రహించాడు. శ్రీకృష్ణుడు మందస్మిత వదనార విందుడై కుచేలునితో నీవిక్కడికి వస్తూ భక్తితో నాకేమి బహుమానం తెచ్చావు? ఆ పదార్థం లేశమైనా పదివేలుగా స్వీకరిస్తాను. నాపై భక్తిలేని నచుడు పర్వతమంత బంగారం ఇచ్చినా అది నాకంగీకారం కాదు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

31వ పద్యం :

క. దళ……………………….
ఫలమైనను సలిలమైనం బాయని భక్తం
గొలిచిన జనులర్పించిన,
నెలమిన్ రుచివాన్నముగణ యేసు ………………

అర్థాలు :
దళము = అకులరెమ్మ
పుష్పము = పువ్వు
ఐనను = అయినను
ఫలము = పండు
సలిలము = నీళ్ళు
ఐనను = అయినను
పాయని = పాడవని
భక్తిన్ = భక్తితో
కొలిచినన్ = సేవించినచో
జనులు = మానవులు
సమర్పించిన = ఇచ్చినచో
ఎలమిన్ = ప్రీతితో
రుచిర = పరిశుద్ధమైన
అన్నము = అన్నము
కనె = అయినట్లే
ఏను = నేను
భుజింతున్ = ఆరగించెదను

భావం :
పత్రమైనా, పుష్పమైనా, జలమైనా, ఫలమైనా సరే నిశ్చల భక్తితో నాకు సమర్పిస్తే దాన్ని మధురాన్నంగా భావించి ఆరగిస్తాను అని కృష్ణుడన్నాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

32వ పద్యం :

క. అని పద్మోదరుఁ వాడిన,
వినియోక్తుల కాత్మ నలరి విప్రందు దాఁ దె
చ్చిన యదుకులు దగ్గ నర్పిం
పను నేరక మోము వాంచి పలుకక యున్నస్.

అర్థాలు :
అని = అని
పద్మ+ఉదరుడు = కృష్ణుడు
ఆడిన = = పలికిన
వినయోక్తులకు = వినయపు మాటలకు
ఆత్మన్ = మనసులో
అలరి = సంతోషించు
విప్రుడు = బ్రాహ్మణుడు
తాన్ = తాను
తెచ్చిన = తీసుకొచ్చినట్లు
అటుకులన్ = అటుకులను
తగన్ = తగినట్లు
సమర్పింపన్ రక = ఇవ్వలేక
మోము = ముఖమును
వాంచి = వంచి
పలుకకన్ = ఏమీ మాట్లాడకుండా
ఉన్నానన్ = ఉండగా

భావం :
కృష్ణుని వినయపూరిత మాటలకు కుచేలుడు మనసులో సంతోషించాడు. తాను తెచ్చిన అటుకులను ఇవ్వలేక తలదించుకుని మౌనంగా ఉన్నాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

33వ పద్యం :

వ. అవ్విప్రుండు సనుదెంచిన కార్యంబు కృష్ణుఁడు దన దివ్యచిత్తంబున నెఱింగి ‘యితండు
పూర్వభవంబున నైశ్వర్యముండై నన్ను సేవింపండైన నిక్కుచేలుండు నిజకాంతా
ముఖోల్లాసంబు కొఱకు నా యొద్దకుఁ జనుదెంచినవాఁ డితనికి నిద్రాదులకుం
బడయరాని బహువిధంబులైన సంపద్విశేషంబు లీ క్షణంబ యెడఁ గూర్పవలయు’
నని తలంచి యతండు జీర్ణ వస్త్రంబు కొంగున ముడిచి తెచ్చిన యదుకుల ముడియం
గని ‘యిది యేమి’ యని యొయ్యన నమ్ముడియఁ దన కరకమలంబుల విడిచి
యయ్యడుకులు కొన్ని పుచ్చుకొని ‘యివియ సకల లోకంబులను సన్నును ఇరితృపిం
బొందిందఁజాలు’ నని యప్పుడు.

అర్ధాలు :
ఆ + విప్రుడు = ఆ బ్రాహ్మణుడు
చనుదెంచిన = వచ్చిన
కార్యంబున్ = పనిని
కృష్ణుండు = కృష్ణుడు
తన = తన
దివ్య = దివ్యమైన
చిత్తంబునన్ = మనసులో
ఎఱింగి = తెలుసుకొని
పూర్వ = ముందటి
భావంబునన్ = జన్మమునందు
ఐశ్వర్య కాముడై = సంపదకోరినవాడు అయ్యి
నన్నున్ = నన్ను
సేవింపండు = సేవించినవాడుకాదు
ఐన = అయినట్టి
ఈ కుచేలుండు = కుచేలుడు
నిజ = తన
కాంత = భార్య యొక్క
ముఖ = ముఖమున
ఉల్లాసంబు = సంతోషం
కొఱకున్ = కోసం
నాయొద్దకు = నాదగ్గరకు
చనుదెంచినవాడు = వచ్చాడు
ఇతనికిన్ = ఇతనికి
ఇంద్రాదులకుం = ఇంద్రుడు మున్నగువారికి
పడయరాని = పొందలేని
బహువిధములైన = పెక్కువిధములు అయిన
సంపద = సంపదలు
శ్రీవిశేషంబులున్ = అధికములు కలుగుట
ఈక్షణంబు = ఈక్షణంలోనే
ఒడిగూర్చవలయం = కలుగజేయవలెను
అని = అని
తలంచి = భావించి
అతడు = ఆ కృష్ణుడు
జీర్ణవస్త్రరంబు = చినిగిపోయిన బట్ట యొక్క
కొంగున్ = మూలన
ముడిచి = ముడివేసి
తెచ్చిన = తీసుకొచ్చినట్టు
అటుకులున్ = అటుకులను
ముడియన్ = మూటను
కని = చూసి
ఇదియేని = ఇది ఏమిటి ?
అని = అని
ఒయ్యనన్ = మెల్లిగా
ఆముడియన్ = ఆ ముడిన
తన = తన యొక్క
కర = చేతులు అనే
కమలంబులన్ = కమలములతో
విడిచి = విప్పి
ఆ అటుకులున్ = ఆ అటుకులు
కొన్ని = కొన్నింటిని
పుచ్చుకుని = తీసుకుని
ఇదియ = ఇవే
సకల = ఎల్ల
లోకంబులను = లోకములను
నన్నున్ = నన్ను
పరితృప్తిం = సంతృప్తి
పొందింపన్ = పొందించుటకు
చాలున్ = సరిపడును
అని = అని
అప్పుడు = అప్పుడు

భావం :
కుచేలుడు వచ్చిన కారణాన్ని కృష్ణుడు గ్రహించాడు. పూర్వ జన్మలో ఇతడైశ్వర్యాన్ని కోరి నన్ను సేవింపలేదు. ఇప్పుడు తన భార్య సంతోషం కోసం నా వద్దకు వచ్చాడు. కావున ఇంద్రాదులకు సైతం లభించని బహువిధాలైన సంపదల్ని ఈ క్షణమే అతనికి ఇవ్వాలని భగవంతుడు (శ్రీకృష్ణుడు) నిశ్చయించుకున్నాడు.

కుచేలుడు చినిగిన ఉత్తరీయలో ముడివేసి తెచ్చిన అటుకుల ముడిని చూచి కృష్ణుడు ఇదేమిటి? అని అడుగుతూ ముడిని విప్పి అటుకులు గుప్పెడు తీసుకున్నాడు. నాకూ సమస్త లోకాలకూ సంతృప్తినివ్వడానికి ఇవి చాలునంటూ కృష్ణుడు ఆ అటుకుల్ని ఆరగించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

34వ పద్యం :

క. మురహరుఁడు పిడికెర వడుకులు,
గర మొప్పఁగ నారగించి కౌతూహలియై
మఱియుడు విడికెడు గౌనం ద
త్కర మప్పుడు పళ్లెం గమల కరకమలములని,

అర్థాలు :
మురహరుడు = శ్రీకృష్ణుడు
పిడికెడు = గుప్పెడు
అటుకులు = అటుకులు
కరమొప్పగన్ = మిక్కిలి యుక్తంగా
ఆరగించి = తిని
కౌతూహలియై = కుతూహలము కలవాడై
మఱియును = మరికొంచెం
పిడికెడు = గుప్పెడు
కోనన్ = తీసుకొనగా
తత్ = అతని
కరముని = చేతిని
అప్పుడు = అప్పుడు
పట్టెన్ = పట్టుకొనెను
కమల = రుక్మిణీదేవి
కర = చేతులు అనే
కమలములన్ = పద్మములతో

భావం :
శ్రీకృష్ణుడు పిడికెడు అటుకుల్ని తిన్న తర్వాత మళ్ళీ ఇంకొక్క పిడికెడు తీసుకున్నాడు. అప్పుడు రుక్మిణీదేవి భర్త చేతిని తన చేతులతో వారిస్తూ ఇలా అన్నది.

35వ పద్యం :

క. సాంసారంగ నతనికి బహు,
సంపద అందింప నివియ చాలును నింక
క్షింపఁగ వలవదు త్రిజగ
తృపత్కర ! దేవ దేవ ! సర్వాత్మ ! హరి !

అర్ధాలు :
సొంపారన్ = సమృద్ధిగా కలవు
ఇతనికిన్ = ఇతనికి
బహు = పెక్కు
సంపదలన్ = సంపదలను
అందింపన్ = ఇచ్చుటకు
ఇవియున్ = ఇవే
చాలునున్ = సంపదను
ఇక = మరికొంచము
భక్షింపగన్ = తినుట
వలవదు = వద్దు
త్రిజగత్సపత్కర = ముల్లోకాలను సంపదనిచ్చేవాడు
వేదదేవ = కృష్ణ
సర్వాత్మ = జగత్తంతా నిండినవాడు
హరీ = కృష్ణా

భావం:
స్వామీ ఇతనికి సకల సంపదలను అందించడానికి ఇందాక మీరు తిన్న అటుకులే చాలు. ఇక భక్షించకండి అని భర్తను వారించింది.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

36వ పద్యం :

సి. పరికింపఁ గృపణస్వభావుండ నై నట్టి
యే నేడు ? నిఖిలావనీశ్వరి యగు
నిందిరాదేవికి నెనయంగ నిత్య ని
డై యొప్పు నవ్వాసుదేవుల
డేడ ? సన్నధ్ధమైఁ దోడఁబుట్టిన వాని
కైవడిఁ గౌఁగిటఁ గదియఁ జేర్చి
దైవంబుగా నన్ను భావించి నిజతల్ప
మున నుంచి సత్రియల్ పూని నడపి

తే. చారు నిజవధూ కరసరోజాత కలిత,
చామరానిలమున గతశ్రమునిఁజేసి
శ్రీకుచాలిస్త చందనాంచితకరాబ్జ,
తలములను సద్గు లొతై వత్సలత మెఱసి.

అరాలు :
పరికింపన్ = తరచి చూసినచో
కృపణ = లోభపూరితమైన
స్వభావుండ = లక్షణములు కలవాడను
ఐన = అయినట్టి
యేనే = నేను ఎక్కడ
నిఖిల = సమస్తమైన
అవనీ = లోకములకు
ఈశ్వరి = సర్వనియామకురాలు
అగు = ఐన
ఇందిందేనికి = లక్ష్మీదేవికి
ఎనయంగన్ = పొందికగా
నిత్యనివాసుడు = శాశ్వతనివాసస్థానమైనవాడు
ఐ = అయ్యి
ఒప్పు = ఉండెడి
ఆవాసుడేవుడు = కృష్ణుడు
ఏడన్ = ఎక్కడ
అర్థమైన్ = ప్రీతితో
తోడబుట్టిన = సహోదరుడైన
వారి = అతని
కైవడిన్ = వలె
కౌగిటన్ = కౌగిట్లో
కదియున్ = దగ్గరకు
చేర్చి = తీసుకుని
దైవంబు = దేవుని
కాన్ = ఐనట్లు
నన్నున్ = నన్ను
భావించి = అనుకుని
నిజతల్పమున = తన పాన్పుపైకి
ఉంచి = కూర్చోబెట్టి
సత్రియల్ = మర్యాదలు
పూని = పట్టుగా
నడపి = జరిపించి
చారు = మనోజ్ఞమైన
నిజవధూ = తన భార్య యొక్క
కరసరోజాత = చేయి అనే పద్మమువంటి
కలిత = ఉన్నట్టి
చామర = విసనకర్ర
అనిలమనన్ = గాలివలన
గతశ్రమునిఁజేసి = తొలగిన శ్రమకలవాడుచేసి
శ్రీకుచాలిస్త = రుక్మిణీదేవి స్తనముపై పూయబడిన
చందన = మంచిగంధముల చేత
అంచిత = అలంకరించబడిన
కర = చేతులను
బ్దములను = కమలయుచేత
అడ్డలు = కాళ్ళు
ఒత్తెన్ = పిసికెన్
వత్సలతన్ =ప్రేమతో

భావం:
కుచేలుడు ఇలా భావించాడు. గర్భదరిద్రుడనైన నేనెక్కడ ? లక్ష్మీ నివాస స్థానమైన వాసుదేవుడెక్కడ ? అచ్చుతుడు అనురాగంతో తన తోడబుట్టిన వానిగా తలంచి కౌగిట చేర్చాడు. దైవసమానంగా భావించి తన పాన్పుమీద కూర్చుండబెట్టు కున్నాడు. నన్ను గొప్పగా సత్కరించాడు. ఆయన పట్టపుదేవి నాకు వింజామర వీచి నా శ్రమను పోగొట్టింది. శ్రీకృష్ణుడే సాక్షాత్తు లక్ష్మీదేవిని లాలించే తన చేతులతో ఆప్యాయంగా నా పాదాలొత్తాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

37వ పద్యం :

వ. అని తన మనంబున విత్కరించుచు నిజపురంబునకుఁ జని చని ముందట.
సీ. న చంద్ర ప్రభా భాసమాన స్వర్ణ
చంద్రకాంతోపల సౌధములును
గలకంఠ శుక నీలకంఠ సముత్కంఠ
మానిత కూజితోద్యానములును
పుల్లసితాంభోజ హల్లక కహ్లార
కైరవోల్లసిత కాసారములను
మణిమయం కనక కంకణ ముఖాభరణ వి
భ్రాజిత దాసదాసీజనములుఁ

అర్థాలు :
అని = అని
తన = తనయొక్క
మనంబున = మనస్సులో
వితర్కించుచు = ఆలోచిస్తూ
నిజ = తన
పురంబునకు = ఊరికి
చని చని = వెళ్ళిపోయి
ముందటన్ = ఎదుట

భావం :
అని ఈ రీతిగా ఆలోచిస్తూ కుచేలుడు తన నగరాన్ని చేరుకున్నాడు.

38వ పద్యం :

తే. గలిగి చెలువొందు సదనంబుఁ గాంచి విస్మ
యమును బొందుచు నెట్టి పుణ్యాత్ముఁ డుందు
నిలయ మొక్కొ ! యపూర్వమై నెగడె మహిత
వైభవోన్నత లక్ష్మీనివాస మగుచు
వ. ఇట్లు సనుదేర నతని భర్యయైన సతీలలామంబు తన మనంబున నానంద రసమన్న యగుచు

అర్థాలు :
భాను = సూర్యుని వంటి
చంద్ర = చంద్రుని వంటి
ప్రభా = కాంతులచే
భాసమాన = ప్రవేశించుచున్న
స్వర్ణ = బంగార
చంద్రకాంత = చలువరాళ్ళు
ఉపల = మొర్ర రాతి
సౌధములను = మేడలు
కలకంఠ = పావురములు
శుక = చిలుకలు
నీలకంఠ = నెమళ్ళు
సమ + ఉత్కంఠ = మిక్కిలి తహతహతో
మానిత = గౌరవింపబడిన
కుజత = కూతలు గల
ఉద్యానవనములు = తోటలు
ఫుల్ల = వికసించిన
సీత = తెల్లని
అంభోజ = తామరల చేత
హల్లన్ = ఎర్రకలువలు చేత
కహ్లార = కలువపూల చేత
కైరవ = తెల్లకలువల చేత
ఉల్లసిత = ప్రవేశించునట్టి
కాసారము = చెరువులును
మణిమయ = రత్నాలు పొదిగిన
కనక = బంగారం
కంకణ = చేతిగాజులు
ముఖాభరణ = మున్నగు ఆభరణాలచే
విభ్రాజిత = మిక్కిలి మెరుస్తున్న
దాస = సేవకులు
దాసీ = సేవకురాళ్ళు
కలిగి = ఉండి
చెలువొందు = అందగించుచున్న
సదనంబున్ = భవనమును
కాంచి = చూసి
విస్మయమును = ఆశ్చర్యమును
పొందుచున్ = పొందుతూ
ఎట్టి = ఎంతటి గొప్ప
పుణ్యాత్ముడు = పుణ్యపురుషుడు
ఉండు = ఉండెడి
నిలయమొక్క = నివాసమో కదా
అపూర్వము = అద్భుతమైనది
ఐ = అయ్యి
నెగడెన్ = అతిశయించింది
మహిత = గప్ప
వైభవ = వైభవములు
ఉన్నత = మేలైన
లక్ష్మీ = సంపదను
నివాసము = నిలయము
అగచున్ = అయినది

భావం :
కుచేలుడు తనయొక్క సూర్యచంద్రుల కాంతితో ప్రవేశించే పాలరాతి కట్టడాలు, శుక; పిక వలయాంత నిండిన చక్కని ఉద్యానవనాలు, వికసించిన పలువన్నెల తామరలతో కలువలతో కనుల పండువు చేస్తున్న సరోవరాలు, మణికంకణాలు బహువిధాలైన భూషణలు ధరించిన దాసదాస జనమా కలిగి వెలుగొందే మహోన్నత మందిరానన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. ఇది ఏ పుణ్యాత్ముని భవనమో ! సిరిసంపదలకు నిలయమై అపూర్వమై ప్రకావిస్తున్నదని కుచేలుడు భావించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

39వ పద్యం :

సీ. తన విధురాకు ముందటఁ గని మనమన
హర్షించి వైభవం బలర మనుజ
కామినీరూపంబు గైకొన్న యిందిరాస
పనిత చందంబునఁ దనరుచున్న
కలకంఠి తన వాలుఁగన్నులు క్రేవల
నానందబాష్పంబు లంకురింప
నతని పాదంబుల కాత్మలో మ్రొక్క భా
నవంబున నాలింగనంబు సేసె

అర్థాలు :
ఇట్లు = ఈ విధముగా
చనుదేర = రాగా
అతని = కుచేలుని యొక్క
భార్య = ఇల్లాలు
ఐన = అయినటువంటి
సతీలలామంబు = స్త్రీలలో ఉత్తమురాలు
తన = తనయొక్క
మనంబునన్ = మనస్సునందు
ఆనందరస = ఆనందరసమున
మగ్న = మునిగినామె
అగుచున్ = అవుతూ

భావం :
అలా వచ్చిన కుచేలుని చూసి అతని భార్య ఆనందంతో తేలియాడింది.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

40వ పద్యం :

తే. నా ధరాదేవుఁ డతుల దివ్యాంబరాభ
రణ విభూషితులై రతిరాజు సాయ
కముల గరి నొప్పు పరిచారికలు భజింప,
లలిత సౌభాగ్య యగు నిజ లలనఁ జూచి.

అర్థాలు :
తన = తనయొక్క
విభురాక = బర్త వచ్చుటకు
ముందటన్ = ఎదురుగా
కని = చూసి
మనముననె = మనస్సునందు
హర్చించు = ఆనందించి
వైభవంబులు = వైభవములు
అలరన్ = వికసించగా
మనుజ = మానవ
కామినీ = స్త్రీ
రూపంబున్ = రూపమును
కైకన్నా = వహించినట్టి
ఇందిరా = లక్ష్మి
వనిత = దేవి
చందంబునన్ = వలె
తనరుచున్న = ఒప్పుచున్న
కలకంఠి = స్త్రీ
తన = తనయొక్క
వాలుగన్నులక్రేవల = కంటికొనల చివరన
ఆనంద = సంతోషము వలన
భాష్పంబులున్ = కన్నీరు
అంకురింపన్ = ఊరుతుండగ
అతనిన్ = అతని
పాదంబులకున్ = కాళ్ళకు
ఆత్మలోన్ = మనస్సులోనే
మ్రొక్కి = నమస్కరించి
భావంబునన్ = మనస్సునందు
ఆలింగనంబు = కౌగిలించుకొనుట
చేసెన్ = చేసెను
ఆ ధరాధేవుడు = ఆ బ్రాహ్మణుడు
అతుల = సాటిలేని
దివ్య = దివ్యమైన
అంబర = బట్టలు
ఆభరణ = అలంకారములతో
విభూషితలై = అలంకరింపబడిన వారై
రతిరాజు = మన్మధుని
సాయకము = బాణముల
గతిన్ = వలె
ఒప్పు = చక్కగా ఉన్న
పరిచారకులు = సేవకురాండ్రు
భజింపన్ = సేవిస్తుండగా
లలిత = మనోజ్ఞమైన
సౌభాగ్య = సౌభాగ్యవతి
అగు = అయిన
నిజ = తన
లలనన్ = భార్యను
చూచి = చూసి

భావం :
ఆ ఇల్లాలు తన భర్త వస్తున్నాడని తెలుసుకొని ఎంతో ఆనందంతో ఎదురు వచ్చింది. మానవరూపం ధరించిన మహాలక్ష్మిలాగా ఉన్న ఆమో కనుకొలకుల్లో ఆనందభాష్పాలు రాలుతుండగా భర్త పాదాలకు నమస్కరించి మనస్సులో కౌగిలించుకొంది. దివ్యాంబరాలు, ఆభరణాలు ధరించి మన్మధుని బాణలలాగా ఉన్న పరిచారికల సేవలందుకొంటూ ఐశ్యర్యంతో తులదూగే తన భార్యను కుచేలుడు చూచాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

41వ పద్యం :

ఆ. ఎన్నం క్రొత్తులైన యిట్టి సంపదలు నా
కబ్బుటెల్ల హరిదయావలోక
నమునఁ జేసి కాదె ! నళినాక్షుసన్నిధి
కర్ది నగుచు నేను నరుగుటయును.

అర్థాలు :
ఎన్నన్ = ఎంచిచూసినచో
క్రొత్తలు = నేతనములు
ఐన = అయిన
సంపదలు = కలుములు
నాకున్ = నాకు
అబ్బుట = కలుగుట
ఎల్లన్ = అంతా
హరి = శ్రీకృష్ణుని
దయా = కృపతో కూడిన
అవలోకమునన్ = చూపు
చేసి = వలన
కాదె = కదా
నళినాక్షు = కృష్ణుని
సన్నిధికిన్ = వద్దకు
అర్దిన్ = కోరువాడ
అగుచున్ = అగుచూ
నేను = నేను
అదుగుటయున్ = వెళ్ళుట

భావం :
ఆలోచించి చూస్తే ఈ నూతన సమస్త సంపదలూ శ్రీహరి కృపాకటాక్షం వలనే నాకు ప్రాప్తించాయి. సంపద కోరుతూ కృష్ణుని వద్దకు నేనే వెళ్ళుట.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

42వ పద్యం :

క. నను నా వృత్తాంతంబును
ధనమనమనఁ గనియు నేమి దడవక ననుఁ బొ
కమ్మని యీ సంపద లెల్లను,,
నొనరఁగ వొడఁగూర్చి నన్ను నొడయినఁ జేసెన్.

అర్థం :
ననున్ = నన్ను
నా = నా యొక్క
వృత్తాంతంబును = విషయము
తన = తనయొక్క
మనమునన్ = మనస్సునందు
కనియున్ = తెలుసుకొనినావు
ననున్ = నన్ను
పొమ్ము = వెళ్ళు
అని = అని
ఈ = ఈ
సంపదలు = సంపదలు
ఎల్లనున్ = సమస్తమును
ఒనరన్ = చక్కగా
ఒడగూర్చి = కలుగజేసి
నన్నున్ = నన్ను
ఒడయునిన్ = ప్రభువునకు
చేసెను = చేసెను

భావం:
ధనం కోసం నేను శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళాను. ఆ మహానుభావుడు నా సంగతి తెలిసి కూడా నన్నేమీ అడగలేదు. నాకు వీడ్కోలిచ్చి పంపి తరువాత ఈ సకల సంపదలూ అనుగ్రహించాడు, నన్ను ప్రభువును చేసాడు.

మిత్రధర్మం Summary in Telugu

కవి పరిచయం

  1. మిత్ర ధర్మం ‘ఆంధ్రమహాభాగవతం’ లోనిది.
  2. భాగవత భాగములకు స్కంధములని పేరు.
  3. భాగవతములో పండ్రెండు (12) స్కంధములు కలవు.
  4. మధురస్నేహము దశమ స్కంధము నుండి గ్రహించబడినది.
  5. సంస్కృతములో వేదవ్యాసుడు భాగవతమును రచించెను.
  6. “మిత్ర ధర్మం” అను పాఠ్యభాగమును రచించినది మహాకవి పోతన.
  7. పోతన ఇంటి పేరు, ఊరు పేరును “బమ్మెర” యే.
  8. బమ్మెర గ్రామము వరంగల్ జిల్లాలో ఉన్నది.
  9. పోతన తల్లి లక్కమాంబ – తండ్రి కేసన.
  10. పోతన బిరుదు “సహజపాండిత్యుడు”.
  11. పోతన కృతులు : భోగినీ దండకము, వీరభద్ర విజయము నారాయణ శతకం, ఆంధ్రమహాభాగవతం.
  12. పోతన కీర్తి సౌధానికి మూలస్తంభం భాగవతం.
  13. నవ విధ భక్తులలో కుచేలుని భక్తి “సఖ్య భక్తి”.
  14. పోతన కవితా లక్షణములు : నిశ్చలమైన భక్తి – అద్భుత కథా కథన శిల్పం – లోకోత్తరమైన భావుకత – సజీవ పాత్ర చిత్రణ.
  15. పోతన కాలం : 15వ శతాబ్దము.
  16. మాధుర్యాన్నీ, ప్రేమతత్త్వాన్నీ స్నేహం పటిష్ఠం చేస్తుందని నిరూపించేది ఈ పాఠ్యభాగం.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

పాఠ్యభాగ సందర్భం

పరీక్షిత్తు శుకమహర్షిని – “మునీంద్రా ! శ్రీకృష్ణుని అనంత గుణసంపదలను గురించి ఎన్ని మారులు విన్నా తనివి తీరదు. ఆ హరిని పూజించే చేతులే చేతులు. ఆయనకు నమస్కరించే శిరస్సే శిరస్సు. ఆ పరమాత్ముని చూచే కన్నులే కన్నులు. ఆ స్వామిని పొగడే నోరే నోరు, ఆయన కథలను వినే చెవులే చెవులు. ఆ పరమాత్ముని తెలుసుకునే మార్గమును వివరింపు” మని కోరాడు. అప్పుడు అభిమన్యుని కుమారుడైన ఆ పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి కుచేలుడు దారిద్య్ర బాధను అనుభవిస్తూ, తన బాల సఖుడైన శ్రీకృష్ణుని దర్శించి, ఆయన అనుగ్రహంతో ఎలా అపారమైన సంపదలు పొందాడో వర్ణించే సందర్భములోనిదీ పాఠ్యాంశం.

పాఠ్యభాగ సారాంశం

కుచేలుడు శ్రీకృష్ణుని బాల్యమిత్రులు – వారిరువురు సాందీపుని సన్నిధిలో విద్యాభ్యాసం చేశారు. తరువాత శ్రీకృష్ణుడు ద్వారకా నగరాధిపతియైనాడు. కుచేలుడు దుర్భరమైన దారిద్య్ర బాధ అనుభవించాడు. కుచేలుని భార్య మహాపతివ్రత, అభిమనవతి. ఆ ఇల్లాలు దారిద్య్ర బాధతో పిల్లలు మలమలమాడిపోబడం చూచి భర్తను, శ్రీకృష్ణుని దర్శించి ఆయన అనుగ్రహంతో తమను కాపాడుమని ప్రార్థించు సన్నివేశంతో కథ ప్రారంభమగుచున్నది.

భర్తకు కర్తవ్యోపదేశము చేసిన అర్ధాంగిగా కుచేలుని భార్య – ఎంతటి దుర్భరమైన దారిద్ర్యము అనుభవించినను నోరు తెరచి సహాయమును అర్థింపని అభిమనధనుడుగా కుచేలుడు – అవధులు ఆదరాభిమానాలతో బాల్య మిత్రునికి సర్వ సంపదలను అనుగ్రహించిన ఆర్తజన రక్షకుడుగా శ్రీకృష్ణుడు మనకు ఈ పాఠ్యభాగములో సాక్షాత్కరిస్తారు. కుచేల శ్రీకృష్ణుల మధురమైన స్నేహానికి, శ్రీకృష్ణుని భక్తజన వాత్సల్యమునకు కుచేలోపాఖ్యానం నిదర్శనంగా నిలుస్తుంది.

మహాపతివ్రతయు, అభిమనవతియునైన కుచేలుని భార్య దుర్భరమైన దరిద్రపీడచే క్రుంగికృశించి పోయినది. ఆకలిమంటచే అలమటించుచు, పిల్లలు ఆకులు, గిన్నెలు పట్టుకొని తల్లి వద్దకు వచ్చి పట్టెడన్నము పెట్టుమని యడిగిరి. వారి మాటలు వినినంతనే పట్టరాని దుఃఖముతో భర్త కడకరిగి “ప్రాణనాథా ! ఇంటిలో దారిద్ర్యము తాండ వించుచున్నది. దానిని తొలగించుటకు మార్గమును ఆలోచింపరైతిరి.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

మీ బాల్య మిత్రుడైన శ్రీకృష్ణుని దర్శించి, దారిద్య్రమనెడి అంధకారము నుండి మమ్ము కాపాడుము. ఆర్తజన శరణ్యుడు, దయాసాగరుడైన శ్రీకృష్ణుడు మిమ్ములను చూచినంతనే, అపారమైన సంపదలను అనుగ్రహించును. కలలోనైన తనను తలవని నీచుని పైతము, కష్ట సమయములో ఆదుకొను జగత్ప్రభువు, ఎల్లవేళల ఆయనను భక్తితో సేవించు మీకు విశేష సంపదల ననుగ్రహింపడా ?” అని పలికెను.

భార్య మాటలను విని, ఆమె ధర్మయుతమైన వాక్యములకు సంతసించి, శ్రీకృష్ణుని దర్శనము ఇహపరసాధనముగా భావించెను. “ నీవు చెప్పినట్లుగా శ్రీకృష్ణుని పాదపద్మములను ఆశ్రయించుటశుభకరమే ఆచక్రపాణికిచ్చుటకేమైన కానుకగలదా ? యని అడుగగా – ఆ ఇల్లాలు కుచేలుని ఉత్తరీయపు కొగునకు కొన్ని అటుకులు ముడివేసెను. గోవింద సందర్శనమునకై వెడలుచున్న ఆనందముతో కుచేలుడు ద్వారకా పట్టణమునకై బయలుదేరెను.

“ద్వారకా నగరమునకు నేనెట్లు వెళ్ళగలను ? అచ్చట అంతఃపురములో నుండు శ్రీకృష్ణుని ఎట్లు దర్శింపగలను ? ద్వారపాలకులు ఈ బీద బ్రాహ్మణుని చూచి, నీ వెక్కడ నుండి వచ్చుచుంటివి ? ఎందులకు వచ్చితివని అడిగినచో – వారికి బహుమానమిచ్చుటకు కూడ కాసు డబ్బు లేదు. ఆయన దయ నా భాగ్యము -” అనుకొనుచు కుచేలుడు ద్వారకా నగరమును ప్రవేశించి, కక్ష్యంతరములు దాటి, అంతఃపుర మందిరములో హంసతూలికా తల్పముపై ప్రియురాలితో వినోద క్రీడలలో మునిగి తేలుచున్న గాంచి – శ్రీకృష్ణుని బ్రహ్మానందమును అనుభవించెను.

అల్లంత దూరముననే కుచేలుని గాంచి, శ్రీకృష్ణుడు గబగబ పాన్పు దిగి, మిత్రునకు ఎదురుగా వచ్చి, ప్రేమతో ఆలింగనము కావించుకొని, పట్టు పాన్పుపై కూర్చుండబెట్టెను. బంగారు కలశము నందలి నీటితో కుచేలుని కాళ్ళు కడిగి, ఆ నీటిని తలపై చల్లుకొనెను. మంచి గంధమును శరీరమునకు అలదెను.

వింజామరలతో గాలి విసరి మార్గాయాసమును పోగెట్టెను. కర్పూర తాంబూలము నొసంగెను. ఆదరముతో గోవును దానము చేసెను. మణిమయ దీపములతో ఆరతి పట్టెను, సాక్షాత్తు రుక్మిణీదేవి కుచేలునికి వింజామరలు వీచెను. ఇట్లు శ్రీకృష్ణునిచే సేవులు చేయించుకొనుచున్న కుచేలుని గాంచి – అంతఃపురకాంతలు ఆశ్చర్యపడుచు, కుచేలుని అదృష్టమును అనేక విధములుగా ప్రశంసించిరి.

శ్రీమహావిష్ణువు అవతారమగు శ్రీకృష్ణుని చేతను, లక్ష్మీదేవి స్వరూపిణియగు రుక్మిణి చేతను సేవలు పొందిన మహనీయ మూర్తిగా కుచేలుడు ఈ పాఠ్యభాగమందు గోచరించును శ్రీకృష్ణ, కుచేలుల నిర్మలమైన స్నేహమును ఈ పాఠ్యభాగము నిరూపించును.

TS Inter 1st Year English Study Material Chapter 7 Father, Dear Father

Telangana TSBIE TS Inter 1st Year English Study Material 7th Lesson Father, Dear Father Textbook Questions and Answers.

TS Inter 1st Year English Study Material 7th Lesson Father, Dear Father

Annotations (Section – A, Q.No. 2, Marks : 4)

Question 1.
Yes. My first rank slipped to the second.
Answer:
Introduction:
This sentence is taken from the prose piece, Father, Dear Father written by Raj Kinger. Actually this is an article published in the English daily, The Hindu.
TS Inter 1st Year English Study Material Chapter 7 Father, Dear Father 2
Context & Explanation: Rahul is the class topper in his school. His first rank slips to the second. Admitting the guilt, he writes a letter to his father. His father’s advice to think before studying, before answering the papers makes him think and think. The word think makes him reflect on several issues including many pitfalls in our education system. Further, he says that the sense of life is not taught to him. He feels that the education should give a feel of life to him and should be useful in life.

Critical Comment:
Rahul, the class topper in his school, presents his anguish over the present education system through a letter to his father in this context.

కవి పరిచయం :
రాజ్ కింగర్ రచించిన ‘ఫాదర్, డియర్ ఫాదర్’ అను గద్యభాగం నుండి ఈ వాక్యం గ్రహించబడినది. వాస్తవంగా ఇది ఆంగ్ల దినపత్రిక ‘హిందూ’లో ప్రచురించబడినది.

సందర్భం :
తరగతిలో మొదటి ర్యాంక్ విద్యార్థి అయిన రాహుల్ ఒక ఉత్తర రూపంలో ప్రస్తుత విద్యావిధానం మీద తన ఆవేదనను, బాధను తన తండ్రికి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాడు.

వివరణ :
తరగతిలో మొదటి ర్యాంక్ విద్యార్థి రాహుల్. అతని మొదటి ర్యాంకు రెండవ ర్యాంకుకు జారింది. ఆ విషయాన్ని ఒప్పుకుంటూ, తన తండ్రికి లేఖ వ్రాస్తున్నాడు. తన తండ్రి సలహా చదువుటకు ముందు, సమాధానం వ్రాయుటకు ముందు. ఆలోచించు అను తన తండ్రి సలహా ఇతన్ని ఆలోచింపచేస్తుంది. ఆలోచన అనుపదం, ఇతన్ని మన విద్యావిధానంలోని అనేక లోపాలతో సహా అనేక విషయాల మీద ప్రతిబింబింపజేస్తుంది, లోపాలను లోతుగా విమర్శింపజేస్తుంది. అంతేగాక, జీవితసారం గురించి తనకు బోధించలేదు అంటున్నాడు. విద్య తనకు జీవిత అనుభూతి ఇవ్వాలని భావిస్తున్నాడు. అది తనకు జీవితంలో ఉపయోగపడాలని భావిస్తున్నాడు.

TS Inter 1st Year English Study Material Chapter 7 Father, Dear Father

Question 2.
But in your Departmental Store, do you apply Pythagoras Theorem or Newton’s Law of Gravity ? *(Imp, Model Paper)
Answer:
Introduction:
This sentence is taken from the prose piece, Father, Dear Father written by Raj Kinger. Actually this is an article published in the English daily, The Hindu.

Context & Explanation :
Rahul is a school boy. He is the class topper in his school. His first rank slips to the second. His father is angry with it. In response to his father’s disappointment, he writes a letter to his father. He raises several pertinent questions about our education system. He also wants his father to be his friend, philosopher and guide. Further, he loves a simple and natural life. He wants to get practical education.

Critical Comment:
Rahul presents his anguish over the present education system through this letter to his father.

కవి పరిచయం :
రాజ్ కింగర్ రచించిన ‘ఫాదర్, డియర్ ఫాదర్’ అను గద్యభాగం నుండి ఈ వాక్యం గ్రహించబడినది. వాస్తవంగా ఇది ఆంగ్ల దినపత్రిక ‘హిందూ’లో ప్రచురించబడినది.

సందర్భం :
తన తండ్రికి ఈ లేఖ ద్వారా ప్రస్తుత విద్యావిధానం గురించి తన ఆవేదన, బాధను తెలియజేస్తున్నాడు.

వివరణ :
రాహుల్ ఒక బడి పిల్లవాడు. తరగతిలో మొదటి ర్యాంక్ వాడు. అతని మొదటి ర్యాంకు రెండవ ర్యాంకుకు జారింది. దీనితో అతని తండ్రి కోపపడ్డాడు. తన తండ్రి అసంతృప్తికి సమాధానంగా, రాహుల్ తన తండ్రికి లేఖ వ్రాస్తున్నాడు. మన విద్యావ్యవస్థ గురించి అనేక యుక్తమైన ప్రశ్నలు లేవనెత్తాడు. తన స్నేహితుడుగా, తత్వజ్ఞుడుగా మరియు మార్గదర్శకుడుగా ఉండమని తన తండ్రిని కోరుకుంటున్నాడు, ఆశపడుతున్నాడు. ఇంకను సామాన్యమైన, సహజమైన జీవితాన్ని ఇష్టపడుతున్నాడు. నిజజీవితంలో ఉపయోగపడే ఆచరణలో పెట్టదగిన విద్యావిధానం కోరుకుంటున్నాడు.

TS Inter 1st Year English Study Material Chapter 7 Father, Dear Father

Question 3.
And she was cross. She said go ask the guy who keeps gardening things
Answer:
Introduction:
This sentence is taken from the prose piece, Father, Dear Father written by Raj Kinger. Actually this is an article published in the English daily, The Hindu.

Context & Explanation:
Rahul has an unpleasant experience with his Biology teacher. When his rose plant is attacked by pests he seeks advice of his teacher to save his plant. But, the teacher gets irritated as she thinks it a question out of their syllabus and asks him to approach a gardener for advice. The teacher serves as a warning to all those teachers who do not show any interest or reverence towards their profession. Therefore, Rahul criticizes such an education system which curbs independent thinking and encourages blind adherence to whatever the teacher teaches.

Critical Comment:
Here, Rahul narrates the incident of his biology teacher not able to help him with a practical science related problem.

కవి పరిచయం :
రాజ్ కింగర్ రచించిన ‘ఫాదర్, డియర్ ఫాదర్’ అను గద్యభాగం నుండి ఈ వాక్యం గ్రహించబడినది. వాస్తవంగా ఇది ఆంగ్ల దినపత్రిక ‘హిందూ’లో ప్రచురించబడినది.

సందర్భం :
ఇక్కడ, ఆచరణలో పెట్టుటకు వీలైన శాస్త్రజ్ఞాన సంబంధమైన సమస్యకు సహాయం చేయలేని అతని జీవశాస్త్రం ఉపాధ్యాయురాలి సంఘటనను రాహుల్ వివరిస్తున్నాడు.

వివరణ :
రాహుల్ ఒక చెడ్డ అనుభవం చవిచూశాడు తన జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు నుండి. తన రోజా మొక్క క్రిముల వల్ల తెగులుకి గురైనప్పుడు, దాన్ని కాపాడటానికి అతని ఉపాధ్యాయురాలు సలహా కోరాడు. కానీ, ఆమె కోపగించుకొని, అది సిలబస్లో లేని ప్రశ్నగా భావించింది మరియు సలహా కోసం తోటమాలిని కలవమని చెప్తుంది. వృత్తిపట్ల శ్రద్ధ, గౌరవంలేని ఉపాధ్యాయులందరికీ ఒక హెచ్చరికలా ఈమె పనిచేస్తుంది, కనిపిస్తుంది. కావున ఉపాధ్యాయులు ఏది చెప్తే దానిని గుడ్డిగా అనుసరించడాన్ని ప్రోత్సహించడాన్ని మరియు స్వతంత్ర ఆలోచనను తుంచివేసే విద్యావిధానాన్ని రాహుల్ విమర్శిస్తున్నాడు.

TS Inter 1st Year English Study Material Chapter 7 Father, Dear Father

Question 4.
This was only to lighten my over n burdened heart.
Answer:
Introduction:
This sentence is taken from the prose piece, Father, Dear Father written by Raj Kinger. Actually this is an article published in the English daily, The Hindu.

Context & Explanation:
This letter ends up with a postscript. Postscript is an addition to a letter, written after the writer’s name has been signed. It shows Rahul’s feelings and speaks out his heart. He feels that his father will not see his anguished plea. And he doesn’t understand his over-burdened heart. Therefore, it is to lighten his heart-rending condition.

Critical Comment:
Here, Rahul writes the postscript to lighten his over-burdened heart.

కవి పరిచయం :
రాజ్ కింగర్ రచించిన ‘ఫాదర్, డియర్ ఫాదర్’ అను గద్యభాగం నుండి ఈ వాక్యం గ్రహించబడినది. వాస్తవంగా ఇది ఆంగ్ల దినపత్రిక ‘హిందూ’లో ప్రచురించబడినది.

సందర్భం:
ఇక్కడ, తన హృదయబరువును తగ్గించుకోవటానికి రాహుల్ కవి అదనపు వ్రాత.

వివరణ :
ఈ లేఖ అదనపు వ్రాతతో ముగుస్తుంది. అదనపు రాతంటే రచయిత సంతకం చేసిన తరువాత అదనంగా వ్రాసేది. ఇది రాహుల్ యొక్క భావాలను మరియు మనస్సును చెప్తుంది. అతని వేదనతో కూడిన ప్రార్థనను తన తండ్రి చూడడంటున్నాడు. మరియు గుండెభారాన్ని అతను అర్థం చేసుకోలేడు. కావున, ఇది తన హృదయ విదారకర పరిస్థితిని తగ్గించుకోవటానికి !

TS Inter 1st Year English Study Material Chapter 7 Father, Dear Father

Paragraph Questions & Answers (Section – A, Q.No. 4, Marks : 4)

Question 1.
What does the boy think of his grandparents in his letter?
Answer:
Raj Kinger’s Father, Dear Father is a thought provoking commentary on the education system prevailing now. This short write-up is a letter to a father.
TS Inter 1st Year English Study Material Chapter 7 Father, Dear Father 3
Rahul is a school boy. He is very much happy with his grandparents who enjoy life. He says that his grandfather had a carefree and beautiful childhood. His grandfather recollects how enjoyed in the mango and guava gardens. He says that his grandfather studies were secondary and living and experiencing was the major subject. He asks his father very innocently whether his grandfather is lying. And his grandmother is semi- literate. But, she is happy with her kitchen work, gardening and reading the Bhagavad Geeta and other holy books. Thus, he thinks of his grandparents.

ప్రస్తుతం ప్రబలమైయున్న విద్యా వ్యవస్థ మీద ఒక ఆలోచనను రేకెత్తించే వివరణ వ్యాసం రాజ్ కింగర్ యొక్క ఫాదర్ డియర్ ఫాదర్. ఇది తండ్రికి వ్రాసిన లేఖ.

రాహుల్ ఒక బడి పిల్లవాడు. జీవితాన్ని ఆస్వాదిస్తున్న తన తాత, నాయనమ్మలతో రాహుల్ చాలా సంతోషంగా ఉన్నాడు. అతని తాత అందమైన, సరదా బాల్యదశను గడిపాడు అంటున్నాడు. ఇతని తాత జామ, మామిడి తోటలలో ఎలా సంతోషంగా గడిపాడో గుర్తుతెచ్చుకుంటున్నాడు.

తన తాతకు విద్యాభ్యాసం ముఖ్యం కాదు, జీవించుట మరియు అనుభవించటం ప్రధాన విషయం అంటున్నాడు. తన తాత అబద్దం చెప్తున్నాడా! అని తన తండ్రిని అమాయకంగా అడుగుతున్నాడు. ఇతని నాయనమ్మ కొంత వరకు చదువుకుంది. కానీ ఆమె వంట పనితో, తోటపని మరియు భగవద్గీత మరియు ఇతర పవిత్ర పుస్తకాలు చదువుకుంటూ సంతోషంగా ఉంది. అలా తన తాత, నాయనమ్మల గురించి ఆలోచిస్తున్నాడు.

TS Inter 1st Year English Study Material Chapter 7 Father, Dear Father

Question 2.
Write a paragraph on the present day education system as described in Rahul’s letter.
Answer:
Raj Kinger’s Father, Dear Father is a heart wrenching letter addressed to a father by his son, Rahul. In his letter, Rahul condemns our educational system and explains the reason for losing his first rank. If was due to his disagreement with his teacher regarding an answer in English Grammar. Although the teacher was wrong, he was adamant that he was correct. Rahul criticizes such an education system which curbs independent thinking and encourages blind adherence to whatever the teacher teachers. Thus, he condemns the emphasis placed on examinations, marks and ranks. For him practical education matters more than theoretical.
TS Inter 1st Year English Study Material Chapter 7 Father, Dear Father 4
రాజ్ కింగర్ వ్రాసిన ‘ఫాదర్, డియర్ ఫాదర్’, రాహుల్ అనే పిల్లాడు తన తండ్రికి వ్రాసిన హృదయ విదారక లేఖ. ఈ లేఖలో, రాహుల్ మన విద్యావ్యవస్థను ఖండించుతున్నాడు మరియు తన మొదటి ర్యాంక్ జారిపోవటానికి కారణం వివరిస్తున్నాడు. English లోని ఒక ప్రశ్నకు సంబంధించిన సమాధానంలో అభిప్రాయభేదమే దీనికి కారణం. ఉపాధ్యాయుడు చెప్పిన సమాధానం తప్పయినప్పటికీ అతను చాలా మొండి. అతని సమాధానం సరైందన్నాడు. రాహుల్, అలాంటి స్వతంత్ర ఆలోచనను తుంచివేసేది మరియు ఉపాధ్యాయుడు చెప్పినదానినే గుడ్డిగా అనుసరించమని ప్రోత్సహించు విద్యావ్యవస్థను తీవ్రంగా విమర్శిస్తున్నాడు.

TS Inter 1st Year English Study Material Chapter 7 Father, Dear Father

Question 3.
What is the attitude of teachers towards learners as illustrated in Father, Dear Father?
Answer:
Raj Kinger’s Father, Dear Father is a thought provoking commentary on the present education system. It highlights the defects in the mind sets of parents, learners, teachers and the government bodies. It sets all to a new wave of thinking. However, the attitude of teachers towards learners are rude and adamant. When Rahul seeks advice of his Biology teacher to save his rose plant, she gets irritated.

She thinks it a question out of their syllabus and asks him to approach a gardener for advice. Her response to Rahul reveals her crossness, irritability and rudeness. She serves as a warning to all those teachers who do not show any interest or reverence towards their profession. The letter also illustrates Rahul’s experience with his English teacher who was adamant.

రాజ్ కింగర్ యొక్క ‘ఫాదర్ డియర్ ఫాదర్’ ప్రస్తుత విద్యావ్యవస్థ మీద ఒక ఆలోచనను రేకెత్తించే వ్యాఖ్యానం. తల్లిదండ్రుల, అభ్యాసకుల, ఉపాధ్యాయుల, ప్రభుత్వ విద్యాశాఖ ఆలోచనల్లోని లోపాలను బహిర్గతం చేస్తుంది. క్రొత్త ఆలోచనా మార్గాన్ని ఏర్పరుస్తుంది. అందరికి ఏదైనప్పటికీ, అభ్యాసకుల పట్ల, ఉపాధ్యాయుల వైఖరి కఠినం మరియు మొండి.

తన రోజా మొక్కను కాపాడుకోవటానికి రాహుల్ తన ఉపాధ్యాయురాలి సలహా కోరినప్పుడు ఆమె కోప్పడుతుంది. అది సిలబస్లో లేని ప్రశ్నని, సలహా కొరకు తోటమాలిని సంప్రదించమని చెప్తుంది. రాహుల్ పట్ల ఆమె వైఖరి, ఆమె కఠినత్వం, చిరచిరలాడు కోపంను తెలియజేస్తుంది. వృత్తిపట్ల శ్రద్ధ, గౌరవంలేని ఉపాధ్యాయులందరికీ ఆమె ఒక హెచ్చరికను ఇస్తుంది. మొండివాడైన ఆంగ్ల ఉపాధ్యాయుడితో రాహుల్ అనుభవంను కూడా విశదపరుస్తుంది.

Question 4.
What is the significance of the postscript to the text in Father, Dear Father
Answer:
Raj Kinger’s Father, Dear Father is a thought provoking commentary on the present education system. It describes the defects in the mind sets of parents, learners, teachers and the government bodies. This is a letter written to a father by his son Rahul. The letter ends with a postscript. Postscript is an addition to a letter written after the writer’s name has been signed.

It describes Rahul’s feelings and speaks out his heart. Here we can understand Rahul ‘Father’s rigid mind-set. Rahul feels that his father’s eyes will not see Rahul’s feels that his father’s eyes will not see Rahul’s anguished plea. It is only to lighten his heart wrenching feeling. Thus, the postscript plays a significant role in expressing heart rending plight of Rahul, a school boy.

TS Inter 1st Year English Study Material Chapter 7 Father, Dear Father
TS Inter 1st Year English Study Material Chapter 7 Father, Dear Father 5
రాజ్ కింగర్ యొక్క ‘ఫాదర్, డియర్ ఫాదర్’ ప్రస్తుత విద్యా విధానం గురించి ఆలోచనను రేకెత్తించే వ్యాఖ్యానం. ప్రభుత్వ పరిపాలన యంత్రాంగాలు, ఉపాధ్యాయుల, అభ్యాసకుల, తల్లిదండ్రుల ఆలోచన విధానంలోని లోపాలను వివరిస్తుంది. రాహుల్ అనే పిల్లవాడు తన తండ్రికి వ్రాసిన లేఖ ఇది. ఈ లేఖ జాబు ముగిసిన తరువాత మరల రాయడంతో ముగుస్తుంది.

లేఖ వ్రాసిన వ్యక్తి సంతకం చేసిన తర్వాత అదనంగా రాయబడినదే తాజా కలం. ఇది రాహుల్ యొక్క భావాలను, బాధలను వివరిస్తుంది. తన మనస్సును చెప్తుంది. దీన్ని బట్టి మనం రాహుల్ తండ్రి యొక్క కఠినమైన ఆలోచనను తెలుసుకోవచ్చు. తన తండ్రి కళ్ళు తన వేదనను చూడవంటున్నాడు. ఇది కేవలం తన హృదయ విదారకర బాధను తగ్గించుకోవటానికి అంటున్నాడు. అలా, తాజాకలం బడి పిల్లవాడు రాహుల్ తన గుండెలు పిండే బాధను వ్యక్తపరచటంలో ప్రముఖపాత్ర పోషిస్తుంది.

Father, Dear Father Summary in English

TS Inter 1st Year English Study Material Chapter 7 Father, Dear Father 1
Raj Kinger’s article, ‘Father, Dear Father’ is an excellent thought-provoking commentary on the present Indian education system. It highlights the defects in the mind sets of parents, learners, teachers and the government bodies. It sets all to a new way of thinking. This is a letter written to a father by his son, Rahul, a school boy. Rahul is the class topper. His first rank slips to the second. Admitting the guilt, he writes this letter in response to his father’s disappointment.

There are essential differences between the father and son. Father believes in high score and doesn’t trust his son but he trusts his teachers. Rahul believes in simple life and practical education therefore, Rahul’s father asks his son to think twice before studying and before answering the papers. Now, his father’s advice makes him think and think. The word, think, makes him reflect on several issues including many pitfalls in our education system. He wants his father to be his friend, philosopher and guide.

Rahul is inspired by the life system of his grandparents. He says that his grandfather had a carefree and beautiful childhood. His grandfather recollects how he enjoyed in the mango and guava gardens, the picnics on the banks of the river where men cooked mouth watering food and playing marbles and gilli danda. To his grandfather studies were only secondary. Living and experiencing was the major subject. Rahul asks his father very innocently whether his grandfather is lying or the world has turned upside down during this period of 70 years.

TS Inter 1st Year English Study Material Chapter 7 Father, Dear Father

Rahul’s grandmother is semi-literate while his mother is highly qualified. Yet his grandmother is happy with her kitchen work, gardening and reading the Gita. Rahul’s mother, on the other hand, is always tensed and nervous. He questions his father whether literacy has become a harbinger of restlessness, fear and frustration.

Rahul explains to his father that whatever he learns in school has no practical application. He narrates his unpleasant experience with his Biology teacher to save his rose plant. The teacher gets irritated as she thinks it a question out of their syllabus. She asks him to approach a gardener for advice.

She serves as a warning to all the teachers who do not show any reverence towards their profession. He says that the essence of life is not taught to him. He feels that education should teach us how to we practically in life.

Rahul explains the reason for losing his first rank. It was due to his disagreement with his teacher over an answer in English grammar. Although the teacher was wrong, he was adamant that he was correct. Rahul criticizes such an education system which curbs independent thinking and encourages blind adherence to what the teacher says. For Rahul, practical education matters more than theoretical. He condemns the emphasis placed on marks and ranks. Classroom knowledge should come handy in our day to day life.

Father, Dear Father Summary in Telugu

శ్రీ రాజ కింగర్ యొక్క వ్యాసం ‘Father, Dear Father’ ప్రస్తుత విద్యావిధానం మీద ఆలోచనను రేకెత్తించే అద్భుతమైన వాఖ్యానం. తల్లిదండ్రుల, అభ్యాసకుల, ఉపాధ్యాయుల, ప్రభుత్వ సంస్థల ఆలోచనల్లోని లోపాలను ఎత్తి చూపుతుంది. అందరికి ఒక కొత్త ఆలోచనా మార్గాన్ని చూపుతుంది. ఈ లేఖ ఒక పిల్లవాడు తన తండ్రికి వ్రాసినది. రాహుల్ తరగతిలో ప్రథమ ర్యాంకు పిల్లవాడు. ఇతని మొదటి ర్యాంక్ కాస్త రెండుకు జారింది. అతని పొరపాటును ఒప్పుకుంటూనే, తన తండ్రి నిరుత్సాహానికి ఈ ప్రత్యుత్తరం వ్రాస్తున్నాడు.

తండ్రి కొడుకుల మధ్య ప్రధానమైన తేడాలున్నాయి. తండ్రికి మార్కుల పిచ్చి, తన కుమారుడ్ని నమ్మడు, కానీ ఉపాధ్యాయులను నమ్ముతాడు. రాహుల్ సమస్య జీవితం మరియు ఆచరణాత్మకమైన విద్యను నమ్ముతాడు. కావున, సమాధానం వ్రాసేముందు, చదివేముందు ఒకటి రెండుసార్లు ఆలోచించమని రాహుల్ని కోరతాడు తండ్రి. అతని తండ్రి సలహానే ఆలోచింపచేస్తుంది. ఆలోచించు అను పదం మన విద్యావిధానంలోని లోపాలతో సహా అనేక విషయాల మీద ప్రతిస్పందింపజేస్తుంది. తన తండ్రి తన స్నేహితుడిగా, తాత్వికుడిగా మరియు మార్గదర్శకుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు.

TS Inter 1st Year English Study Material Chapter 7 Father, Dear Father

తన తాత, నాయనమ్మల జీవన విధానంచే స్ఫూర్తి పొందుతాడు. తన తాతగారు అందమైన, సరదా బాల్యం గడిపాడు। జామ, మామిడి తోటల్లో విలాసంగా తిరిగాడో గుర్తుచేసుకుంటున్నాడు. తన తాతగారు నోరూరించే ఆహారంను తయారు చేస్తున్న మనుషులు, గోళీలు మరియు చిట్కా క్యాట్ ఆటలు ఆడుతున్న మనుషులు ఉన్న నదీ ఒడ్డున వెంట విహారయాత్రలు చేశాడు. అతని తాతగారికి అధ్యయనం తరువాతది అనుభవించటం ఆశీర్వదించటం ప్రధానమైన విషయం. ఈ 70 సంవత్సరాల్లో ప్రపంచం తలక్రిందులైందా లేదా తన తాతగారు అబద్దమాడుతున్నాడా అని తన తండ్రిని రాహుల్ అమాయకంగా అడుగుతున్నాడు.

రాహుల్ నాయనమ్మ సగం చదువుకొంది. కానీ తన తల్లి బాగా చదువుకున్న స్త్రీ. అయినప్పటికీ, తన నాయనమ్మ వంట పనితో, తోట పనితో మరియు భగవద్గీత చదువుతూ సంతోషంగా ఉంది. కానీ రాహుల్ తల్లి మాత్రం ఎప్పుడూ చూసిన ఒత్తిడి, ఆందోళన, కోపంతోనే ఉంటుంది అని తన తండ్రిని ప్రశ్నిస్తున్నాడు.

తాను, బడిలో ఏదినేర్చుకున్నా అది ఆచరణలో లేదని తన తండ్రికి వివరిస్తున్నాడు. తన రోజా మొక్కను కాపాడుకోవటానికి తన జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు దగ్గరకు వెళ్ళినపుడు కలిగిన అవమానకరమైన సంఘటనను వివరిస్తున్నాడు. ఆ ప్రశ్న తన సిలబస్లో లేనిదిగా భావించి ఆమె చిరాకుపడుతుంది. సహాయం కోసం తోటమాలి దగ్గరకు వెళ్ళమని కోపంగా చెప్తుంది. వృత్తి పట్ల శ్రద్ధ, గౌరవం లేని ఉపాధ్యాయులందరికి ఇది ఒక హెచ్చరికను ఇస్తుంది. జీవితసారం బోధించుట లేదని రాహుల్ చెప్తున్నాడు. విద్య అనేది జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో బోధించాలని భావిస్తున్నాడు.

తను మొదటి ర్యాంకు కోల్పోవడానికి గల కారణం వివరిస్తున్నాడు. ఇంగ్లీషు వ్యాకరణంలో సమాధానంకి సంబంధించి తన ఉపాధ్యాయుడితో ఏర్పడ్డ అసమ్మతే కారణం. ఉపాధ్యాయుడి సమాధానం తప్పయినప్పటికీ అతను మొండిగా ఉన్నాడు. ఉపాధ్యాయుడు చెప్పిన దాన్నే గుడ్డిగా అనుసరించుట ప్రోత్సహించే మరియు స్వతంత్ర ఆలోచనా విధానాన్ని తుంచివేసే విద్యావిధానాన్ని విమర్శిస్తున్నాడు. సైద్దాంతిక విద్య కన్నా ప్రాక్టికల్ విద్యే ముఖ్యం. మార్కులు, ర్యాంకులు మీద ఒత్తిడిని ఖండిస్తున్నాడు.

Father, Dear Father Summary in Hindi

प्रस्तुत पाठ्यांश, ‘पिताजी, प्रिय पिताजी’ – ‘Father, Dear Father’, राज किंगर द्वाश द् हिंदू अंग्रेजी दैनिक को प्रेषित पत्र है। राहुल नामक विद्यार्थी से अपने पिता को लिखित पत्र है, यह । यह लड़का कहता कि मैं अपने हृदय – भार उतारने के लिए यह पत्र लिख रहा हुँ । राहुल ने वर्तमान शिक्षा – पद्धति की कमियों को एवं माता- पिताऊा और आचार्यों से बच्चों पर डाते जानेवाते दबाव को जीता जागता चित्रित किया है ।

TS Inter 1st Year English Study Material Chapter 7 Father, Dear Father

द्वितीय पद (सेकंड रैंक) क्यों पाया ? पिताजी के इस प्रश्न का उत्तर है, यह पत्र । पुत्र पिताजी से कहता है कि हमने कभी मानसिक रूप से निकट नहीं हो पाया । वह सीधा प्रश्न करता है कि हम अपने असली जीवन में शिक्षा का कहाँ उपयोग करते हैं। दादा – दादी ने उच्च शिक्षा नहीं पाई, फिरभी वे अपने जीवन के पद पद पर आस्वादन कव रहे हैं। उनके मुख पर मुस्कराहट नहीं हटती । उच्च शिक्षा प्राप्त माँ तो हमेशा दबाव, परेशानी, नाराजगी से रहती है । तो क्या शिक्षा ने हमें उद्वेग, उद्वेलन, कलेश, क्रोध ही दिए हैं ? क्या हम वास्तव में जी रहे हैं ?

मेरे प्यारे गुलाब – पौधे को पीड़क जीवों से कै से बचाना है ? यह प्रश्न करने पर हमारे आचार्या ने नाराज होकर कीटनाशक दवा दुकानदार से पूछने को कहा। कौन मेधावी है ? कौन समझदार है ? मेरी शिक्षा मेरे पसंद का कोई काम सिखा नहीं रही है ? यह शिक्षा वास्तविक जीवन केलिए उपयोगी नहीं है । यह शिक्षा सुहावने सपनों की दुनिया में विचरित नहीं करने देती । क्या, हमारे जीवन अबोध्य एवं अनर्थकारी विषयों की जानकारी को कंठस्थ करने केलिए है ?

फिर भी अपने रेंक खो जाने का कारण मैं नहीं हुँ । पिताजी, अपने आचार्यों की गलतियों से हम बलिपशु हो रहे हैं । तो भी, आपके कहने के अनुसार ज्यादा मेहनत कर, सोच विचार कर प्रथम पद पाने के लिए प्रयास करता हूँ । पिताजी, मेरी चिंता आपको समझ में नहीं आती । मेरा हृदय न केवल रकत – मांस से भश बलिक अनुभूतियों से भी भाश है। इस पंकित से राहुल इस पत्र को समाप्त करता है ।

पाठकों की आँखों आँसू उमड पड़ते हैं। शिक्षा नीति और शिक्षा पद्धति बच्चों के के आधातों को पहचानकर सुधार लाने और अच्छे दिन आने की आशा करेंगे ।

Meanings and Explanations

transgression (n) / trænzgrefn / (ట్రాన్గ్రేషన్ ) (trisyllabic): doing wrong, violation of a code, అపరాధం, నియమావళి, ఉల్లంఘన, अतिक्रमन, उल्लंधन , अपराध

muse (v) / mjʊ:z / (మ్యూ జ్ ) (monosyllabic): reflect, think over, లోతుగాచెప్పు, ఆలోచించుట , चिंतन करना, ध्यान करना

ancillary (adj)/ ænsiləri (యాన్సిలరి) (polysyllabic – 4): secondary, additional,, సహాయక, అదనపు వ్యక్తి , सहायक, गौण, अनुषंगी

fibbing (v+ing) / fibiŋ / (ఫిబింగ్) (disyllabic): telling a trivial lie, చిన్న అబద్దమాడుట, , झूठ बोलना, गप उड़ाना

highly strung (phrase) / p (r)z / (హైలీ స్ట్రాంగ్): nervous and easily upset, లేతగా, అధైర్యపడు, కలవరపడుట, अति संवेदनशली

TS Inter 1st Year English Study Material Chapter 7 Father, Dear Father

harbinger (n) / ha: (r) bindzǝ(r) / (హా(ర్) బింజ(ర్)) (trisyllabic): something that foretells the coming of something, రాబోవుదానిని సూచించు, अग्रदूत

frustration (n) / frastreifen / (ఫ్రస్ట్రేషన్ )risyllabic) preventing somebody from seing, నిరుత్సహం, భంగం , नैराश्य, आशाभंग, क्रोध

cross (adj) / kros / (క్రోస్) (monosyllabic): annoyed, angry, చిరాకుగానున్న, కోపంగానున్న , अप्रसन्न, क्रोधित

obvious (adj) / pbies/ (ఒబ్విఅస్) (disyllabic) clear, స్పష్టమైన, सुस्पस्ट, प्रत्यक्ष, प्रकट

prattles (v)/prætlz/(ప్యాట్ ల్ జ్) (t). repeats meaninglessly, పిచ్చిమాటలు, పనికిరాని మాటలు , बकबक करना

hibiscus (n) / hibiskǝs / (హిబిస్కస్) (trisylaoic): a flower plant, ఒక పూలముక్క , गुड़हर

traverse (v) / trǝvç:(r)s / (ట్రావ(ర్)స్) (go across): travel across, అడంగాపోవు, అంతా ప్రయాణించు , पार करना, आर-पार जाना, आड़ा पड़ा होना

adamant (adj) / ædəmənt / (యాదమన్ ట్) (trisyllabic) : unyielding, inflexible, లొంగని , कठोर, सुदृढ, वज्र- सम

at stake (idiom): at risk to be lost, ప్రమాదంలోనున్న , दाँव पर , ख़तरे में

strive (v) / strarv /(స్ట్రీవ్) (monosyllabic) : undeavour, struggle, గట్టిగా ప్రయత్నించు, పోరాడు, , प्रयास करना, मेहनत करना

anguished (adj) /ængwist/(యాంగ్విష్ ట్) (trisyllabic): expressing great mental pain, ఆవేదన, బాధ , मनोव्यथित, तीत्र वेदना में मग्न

plea (n) / pli: / (ప్లి) (monosyllabic) : appeal, pray, request, ప్రార్ధన, విన్నపం , निवेदन, अनुनय, विनय, अभिवचन

TS Inter 1st Year English Study Material Chapter 1 Happiness

Telangana TSBIE TS Inter 1st Year English Study Material 1st Lesson Happiness Textbook Questions and Answers.

TS Inter 1st Year English Study Material 1st Lesson Happiness

Annotations

NOTE: We are providing an EXAMPLE for Annotation to your reference.

What is Annotation ?
Annotations are used in order to add notes or more information about a topic. It is common to see highlighted notes to explain content listed on a page or at the end of publication.

  • A student nothing important ideas from the content by highlighting or underlining passages in their text book.
  • A student nothing examples or quotes in the margins of a text book.
  • A reader noting content to be revisited at a later time.

Why we should Annotate ?
Annotations will ensure that you understand what is happening in a text when you come back to it.
What docs “Annotate” mean ?
TS Inter 1st Year English Study Material Chapter 1 Happiness 1
Examples of annotations (or notes to make)

  • m Underline key passage.
  • Starring what you think is important.
  • Responding with your own written comments.
  • TS Inter 1st Year English Study Material Chapter 1 Happiness 2 Circling words you do not know so you can look them up.
  • ✓ n I understand.
  • ? n I don’t understand
  • ∞ n I made a connection

TS Inter 1st Year English Study Material Chapter 1 Happiness

How to write an annotation. We are providing an example for your reference.
Eg : I asked the professors who teach the meaning of life to tell me what happiness is.
TS Inter 1st Year English Study Material Chapter 1 Happiness 3
happiness. So, he asks the professors to tell about the meaning of happiness.
Finally, he finds the real meaning of happiness from a crowd of Hungarians with their women and children under a tree.

Section – A (Q.No. 2, Marks: 4)

Question 1.
I asked the professors who teach the meaning of life to tell me what happiness is.
Answer:
Introduction :
This line is taken from the poem ‘Happiness’ written by Carl Sandburg. He is a famous American poet. The poem is extracted from his collection of poems, ‘Chicago Songs’.

Context & Explanation :
It depicts the narrator’s experience. He wants to know what happiness is. First, he consults the professors for the answer. They represent the intelligence and success. But, they can’t answer it. They claim that they teach the meaning of life. Finally, he finds the real meaning of happiness from a crowd of Hungarians with their women and children under a tree.

Critical Comment:
Here the line describes the narrators experience. He asks the professors about the meaning of happiness.

కవి పరిచయం :
పై వాక్యం అమెరికన్ కవి కార్ల్ సాండ్బర్గ్ వ్రాసిన ‘సంతోషం’ అనే తాత్విక పద్యంలో కనిపిస్తుంది. సాదాగా కనిపిస్తున్న పద్యం ఒక గంభీర అంశాన్ని అందిస్తుంది. ఇది వారి కవితల సంకలనం ‘షికాగో పాటల’ నుండి వ్రాయబడినది.

సందర్భం :
ఇచ్చిన వాక్యం పద్యాన్ని ప్రారంభిస్తుంది. ” అనే పదం కథకుడిని సూచిస్తుంది. ‘సంతోషం’ అనే పదానికి అసలు అర్థం తెలుసుకోవాలనుకుంటున్నారు వారు. సత్యం తెలుసుకోవాలనే వారి తపన అభినందనీయము. ‘సంతోషం’ అంటే, అనేదానికై వారి వేట వారిని విశ్వవిద్యాలయ ఆచార్యుల వద్దకు నడిపింది. ఆచార్యులు అంటే వారికి ఆరాధ్య భావము. ఆచార్యులు జీవితానికే అర్థము చెప్పగలవారు అంటున్నారు కథకులు. మొట్టమొదటి వాక్యమే కథకుడి ఉద్దేశ్యాన్ని తేటగా ప్రకటిస్తుంది. ఇది ప్రాధాన్యత కల అంశం. చివరగా కథకుడు ‘సంతోషం’ యొక్క నిజమైన అర్థాన్ని ఒక హంగేరియన్ సమూహం, తమ స్త్రీలు, పిల్లలతో చెట్ల క్రింద సంతోషంగా ఉండటంతో తెలుసుకుంటాడు.

వివరణ :
ఈ వాక్యం రచయిత అనుభవాన్ని తెలియజేస్తోంది. ‘సంతోషం’ యొక్క అర్థాన్ని అతడు ఆచార్యులను అడుగుతున్నాడు.

TS Inter 1st Year English Study Material Chapter 1 Happiness

Question 2.
They all shook their heads and gave me a smile as though. I was trying to fool with them. ★(Imp, Model Paper)
Answer:
Introduction :
These lines are extracted from the poem, ‘Happiness’ written by Carl Sandburg, a famous American poet. This poem is from his collection of poems, Chicago Songs. It is a simple poem with a valuable message.

Context & Explanation :
The narrator seeks to know what happiness is. He enquires with many professors but in vain. Even the top executives are consulted to help him in this regard. But they express their inability. The professors and the executives smile to him as a reply of the question asked by the narrator. They look at him as if he is trying to fool them.

Critical Comment:
The narrator asks professors and top executives to tell the meaning of happiness, but in.vain.

కవి పరిచయం :
పై వాక్యం అమెరికన్ కవి కార్ల్ సాండ్బర్గ్ వ్రాసిన ‘సంతోషం’ అనే తాత్విక పద్యంలో కనిపిస్తుంది. సాదాగా కనిపిస్తున్న పద్యం ఒక గంభీర అంశాన్ని అందిస్తుంది. ఇది వారి కవితల సంకలనం ‘షికాగో పాటల’ నుండి వ్రాయబడినది.

సందర్భం :
‘సంతోషం’ అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారు కథకులు. ముందుగా వారు ఆచార్యులను విచారించారు. అక్కడ వారికి వైఫల్యం ఎదురయింది. తన ప్రయత్నాలు కొనసాగించారు వారు. అప్పుడు వారు ప్రముఖ ఉన్నతాధికారుల వద్దకు వెళ్ళారు. వారు వేలకొలది ఉద్యోగుల పనిని పర్యవేక్షిస్తారు. వారి స్థానమును, అనుభవమును కథకులు గౌరవిస్తారు.

అయితే, దురదృష్టవశాత్తు నిరుత్సాహము వారికి ఎదురయింది ఇక్కడ. ఆచార్యులు, అధికారులు కూడా వారి తలలను అడ్డంగా ఊపారు అననుకూల సంకేతంగా, వారు చిరునవ్వులు మాత్రమే విసిరారు కథకుల వైపు. వాటి అర్థము ఏదో ఎత్తుగడతో కథకులు అక్కడికి వచ్చినట్లుంది అని. కవళికలు, కదలికలు ఇక్కడ సమాచారాన్ని అందిస్తాయి. సమర్థ సమాచార వ్యక్తీకరణలో అదొక మంచి పాఠం. వివరణ : రచయిత ‘సంతోషం’ యొక్క అర్థం గురించి ఆచార్యులు మరియు గొప్ప కార్యనిర్వాహకులను అడిగాడు. కానీ ఫలితం దక్కలేదు.

TS Inter 1st Year English Study Material Chapter 1 Happiness

Question 3.
And then one Sunday afternoon I wondered out along the Desplaines river.
Answer:
Introduction :
This line is taken from the simple poem, ‘Happiness’ written by Carl Sandburg a famous American poet. It is from his collection of poems, Chicago Songs.

Context & Explanation :
The narrator enquires many professors and the top executives to know what happiness is. But, they are unable to answer it. At last, one Sunday afternoon he wanders along the Desplaines river. He sees a group of Hungarians with women and children under a tree. They are spending happy moments under the tree. He at once understands what happiness is. One should live in the present in order to enjoy the life. Wisdom lives in lives but in libraries.

Critical Comment :
It depicts the narrator’s experience in finding out what happiness is”…

కవి పరిచయం :
పై వాక్యం అమెరికన్ కవి కార్ల్ సాండ్ ్బర్గ్ వ్రాసిన ‘సంతోషం’ అనే తాత్విక పద్యంలో కనిపిస్తుంది. సాదాగా కనిపిస్తున్న పద్యం ఒక గంభీర అంశాన్ని అందిస్తుంది. ఇది వారి కవితల సంకలనం ‘షికాగో పాటల’ నుండి వ్రాయబడినది.

సందర్భం :
‘సంతోషం’ అంటే ఏమిటి అని తెలుసుకోవాలనే కథకుల కోరిక చాలా బలమైనది. సత్యాన్వేషణ వారిని నిరంతరం వెంటాడుతూనే ఉంది. ఆచార్యుల నుండి, అధికారుల నుండి నేర్చుకోవాలనే వారి ప్రయత్నాలు ఏ ఫలితాలు ఇవ్వలేదు. అలా అందని సమాచారానికై అతను నిరంతరం ఆసక్తితో అన్వేషిస్తున్న సమయంలో, ఒక ఆదివారం మధ్యాహ్నం వారు డెస్పెయిన్ అనే నదీతీరమునకు వెళ్ళారు. ఆ నది అమెరికాలో ప్రవహిస్తుంది. -కథకుడు నదీతీరాన చెట్లక్రింద తమ స్త్రీలు, పిల్లలతో సంతోషంతో ఉన్న హంగేరియన్ సమూహాన్ని చూసాడు. వారు తమ సంతోషకర క్షణాలను అక్కడి చెట్ల కింద గడుపుతున్నారు. అప్పుడు కథకుడు ‘సంతోషం’ అంటే ఏమిటో తెలుసుకున్నాడు.

వివరణ :
ఇది రచయిత ‘సంతోషం’ గురించి తెలుసుకునే సందర్భంలో అతనికి కలిగిన అనుభవాన్ని తెలుపుతుంది.

TS Inter 1st Year English Study Material Chapter 1 Happiness

Question 4.
And 1 saw a crowd of Hungarians under the trees with their women and children and a keg of beer and an accordion.
Answer:
Introduction :
These lines are taken from the poem ‘Happiness’ written by Carl Sandburg, a famous American poet. The poem is extracted from his collection of poems, ‘Chicago Songs’.

Context & Explanation :
The poet wants to know the meaning of happiness. He asks professors and top executives to help him on this regard. But, they express their inability. At last he sees a group of Hungarians under the trees with their women and children. They do not have money, intelligence or success. They are spending happy moments under the tree. They are the symbol of real meaning of happiness. The poet at once understands what happiness is.

Critical Comment :
Here the poet describes how he came across a group of Hungarians, beside a river and beneath the tree.

కవి పరిచయం :
పై వాక్యం అమెరికన్ కవి కార్ల్ సాండ్బర్గ్ వ్రాసిన ‘సంతోషం’ అనే తాత్విక పద్యంలో కనిపిస్తుంది. సాదాగా కనిపిస్తున్న పద్యం ఒక గంభీర అంశాన్ని అందిస్తుంది. ఇది వారి కవితల సంకలనం ‘షికాగో పాటల’ నుండి వ్రాయబడినది.

సందర్భం :
కథకుల జ్ఞానాన్వేషణ విరామము లేనిది. సంతోషం గురించి అతడు అనుభవజ్ఞులైన ఆచార్యులను, ఉన్నత అధికారులను కలుస్తాడు. కానీ ఫలితము లేదు. చివరకు ఒక ఆదివారం మధ్యాహ్నం కథకుడు ఒక నదీతీరమున సంచరించుచుండిరి. అక్కడ వారొక హంగేరియనుల సమూహమును చూసిరి. వారు స్త్రీలు, పిల్లలతో కలిసి ఉన్నారు.

నది పక్కన, చెట్ల క్రింద వారు తింటూ, తాగుతూ, సంగీతం వింటూ జీవితమును పండుగలా గడుపుతుండిరి. కథకులు ఎంతకాలం నుండో వెతుకుతున్న ‘సంతోషం అంటే’ హంగేరియనులు సజీవంగా కళ్ళకు కట్టినట్లు చూపిరి. ‘సంతోషం’ జీవించటంలో, ఆస్వాదించటంలో ఉంటుంది. అది సంపదలో, ఖ్యాతిలో, అధికారంలో ఉండదు. ఇక్కడ ప్రశ్నలు, సమాధానములు లేవు. ‘సంతోషం’ అక్షరాలా చూపబడింది.

వివరణ :
ఇక్కడ కవి నది దగ్గర చెట్ల క్రింద సంతోషకర క్షణాలను గడుపుతున్న హంగేరియన్ సమూహం గూర్చి వివరిస్తున్నాడు.

Paragraph Questions & Answers (Section – A Q.No. 4 Marks : 4)

Question 1.
Explain the narrator’s experience in finding out what happiness is.
Answer:
The poem ‘Happiness’ is written by Carl Sandburg. It conveys a beautiful message. It is extracted from his collection of poems. Chicago songs. The poem is an expression of the narrator’s search for the meaning of happiness and his ultimate realization.

The narrator seeks to know what happiness is. He enquires with many professors but in vain. Even, the top executives are consulted, but to no avail. One Sunday afternoon, he wanders along a river. There, he sees a group of Hungarians with their women and children under the trees. They are spending happy moments there. He at once understands what happiness is. Happiness is living in the present. It is not wealth or success or fame.

TS Inter 1st Year English Study Material Chapter 1 Happiness

కార్ల్ సాండబర్గ్ కవిత ‘సంతోషం’ తాత్వికము. అది సాదాగా కనిపిస్తుంది. కానీ చాలా విలువైన సందేశాన్ని అందిస్తుంది. ‘సంతోషం’ అంటే ఏమిటో తెలుసుకోవాలని కథకునికి ఆసక్తి. అనుభవజ్ఞ ఆచార్యులు, ఉన్నత అధికారులు తనకు ‘సంతోషం’ అంటే వివరించగలరని భావిస్తాడు, కథకుడు. వారిని కలుస్తారు ఆయన. వైఫల్యమే ఎదురైంది ఆయనకు. అప్పుడు కథకుడు ఒక నదీతీరములో, చెట్ల కింద ఒక హంగేరియనుల సమూహాన్ని చూశాడు. పురుషులు, స్త్రీలు మరియు పిల్లలు తింటూ, తాగుతూ, వింటూ జీవితాన్ని గొప్పగా గడుపుతున్నారు. కథకుడు ‘సంతోషం’ అంటే ఏమిటో కళ్ళారా చూశాడు. అది, జీవితాన్ని అనుభవించటము, ఆస్వాదించటము, మనకు ఎలా వస్తే అలా. అది చూసి కథకుడు ఆనందించాడు.

Question 2.
Seeing helps one better in understanding then listening to. Justify the statement with reference to the poem, ‘Happiness’.
Answer:
Carl Sandburg’s poem, ‘Happiness’ conveys a beautiful message.
TS Inter 1st Year English Study Material Chapter 1 Happiness 4
It is extracted from his collection, Chicago songs. It shows how the narrator tries to find out the real meaning of happiness and his ultimate realization.

This seems like a more light hearted poem. The poet depicts the narrator’s experience. He asks people what they think of happiness. The first two he asks are the people who should know what happiness is. But, both look at him as if he is trying to fool them. He then ventures out to observe some of the lower class. He examplifies, what he sees, his image of happiness. The poem centers around the difference between the lower and the upper class. He favours the lower class for their simplicity.

They value the things in their lives. It is proved in the lives of Hungarians. They show him what happiness is. They enjoy then food, drink, music and fun. At last, seeing Hungarians helps the narrator in understanding how they spend happy moments under a tree. Then he realizes what happiness is. Even if they are not very well educated or wealthy, they stand as a symbol of sharing and helping mentality people.

TS Inter 1st Year English Study Material Chapter 1 Happiness

‘సంతోషం’ అనే కవిత, కార్ల్ స్యాండ్బర్గ్ విరచితము, ఆలోచనాత్మకము మరియు బోధనాత్మకము. అది ఒక సంఘటనను వివరించినట్లుగానే ఉంటుంది. కానీ, అది పాఠకులకు గుర్తుంచుకోదగిన చాలా పాఠాలను నేర్పుతుంది. ‘సంతోషం’ అంటే ఏమిటో తెలుసుకోవాలని కథకులకు ప్రత్యేక పట్టింపు. వారు బాగా చదువుకుని అనుభవము ఉన్న ఆచార్యులను, అధికారులను సంప్రదిస్తారు ఈ విషయమై. వారు కథకుల వైపు చూసి చిరునవ్వు విసురుతారు, మరియు వారిని అనుమానిస్తారు.

అయితే అక్కడ వారికి ఏమీ ఉపయోగం లేకపోయింది. అప్పుడు కథకులు ఒక నది ఒడ్డున, చెట్ల కింద తింటూ, తాగుతూ, వింటూ ఆనందపు అలలపై తేలిపోతున్న హంగేరియను గుంపును చూస్తారు. హంగేరియన్లు సమూహం బాగా చదువుకున్నవారు కానప్పటికి, సంపదలేకపోయినా వారు సంతోషానికి మరియు సహాయ దృక్పథం కలిగిన మనస్సులకు గుర్తింపుగా నిలిచారు. సజీవంగా చూసారు వారు సంతోషం అంటే ఏమిటో. ‘సంతోషం’ అంటే ఏమిటనేది అర్థం చేసుకోవటంలో కథకుడికి ఉపయోగపడింది చూడటం. ‘వినటం’ అంటే కేవలం సైద్ధాంతికము. ‘చూడటం’ సజీవము, ఆచరణాత్మకము. అందుకే అది మొదలైనది.

Happiness Summary in English


The poem ‘Happiness’ written by Carl Sandburg, a famous American Poet. Winner of three | Pulitzer prizes, he is popular for his biography of Abraham Lincoln. His works are mainly based j on the concept of industry, agriculture, and common man. The present poem talks about a man | who tries to find the meaning of happiness from different people and different perspectives. At last he finds the real meaning of happiness from a crowd of Hungarians with their women and children beside a river.

The poet begins the poem by asking the professors about the meaning of happiness. In spite of their intelligence and success, they can’t answer it. They claim that they teach the meaning of life. Then, he goes to the top executives and asks them the same question. Even though they boss | ten thousand men and represent money, they are unable to answer it. Both look at him as if he is ! trying to fool them.

He then ventures out to observe some of the lower class. One Sunday afternoon, he wanders j along the Desplaines river. There, he sees a crowd of Hungarians under the trees with their women | and children the poet at once understands what happiness is. These people do not have money, intelligence or success but they are spending happy moments under the trees. They share the time with people they care. They feel the moment through all their soul. Therefore, happiness is living in the present, feeling but not wealth or success.

TS Inter 1st Year English Study Material Chapter 1 Happiness

At last, it is known that the people who know the way to live in the moment are happy. The poem shows the difference between the upper and the lower class. The upper class represent the professors and the executives who do not know the meaning of happiness. But, the lower class represent the Hungarians. They know to lead a happy life in the moment in accordance with nature. They enjoy their food, drink, music and fun. They stand as a symbol of sharing and helping mentality people. Therefore, one should live in the present in order to enjoy the life. Wisdom lives in lives but not in libraries.

Happiness Summary in Telugu

కార్ల్ సాండ్ ్బర్గ్ సంతోషం అను పద్యంను రచించాడు. ఇతను ప్రముఖ అమెరికా కవి, రచయిత, జీవిత చరిత్రకారుడు మరియు సంపాదకుడు. ఇతని రచనలు పరిశ్రమలు, వ్యవసాయం మరియు సామాన్య మానవుడు ఆధారంగా ఉంటాయి. ప్రస్తుత పద్యం ‘సంతోషం’. ‘సంతోషం’ అంటే ఏమిటో అర్థం తెలుసుకోవటానికి అనేక మంది నుండి అనేక దృక్పథాలలో ప్రయత్నించారో తెలియజేస్తుంది. కథకుడు, చివరికి ఒక నది ప్రక్కన చెట్ల క్రింద వారి స్త్రీలు మరియు పిల్లలతో ఉన్న హంగేరియన్లను చూచి సంతోషం అంటే ఏమిటో తెలుసుకుంటాడు.

ఆచార్యులను (Professors) ‘సంతోషం’ అంటే ఏమిటి అని కవి అడుగుతూ పద్యంను ప్రారంభిస్తాడు. జ్ఞానవంతులు మరియు విజేయులు అయినప్పటికీ వారు సమాధానం చెప్పలేరు. వారు జీవితాంతం భోదించుతా మంటారు. ఆ తర్వాత, గొప్ప నిర్వహణదారులు దగ్గరకు వెళ్తాడు. డబ్బును మరియు అధికారానికి ప్రతినిధులైనప్పటికీ, వారు కూడా చెప్పలేరు. అలా ఆచార్యులు మరియు కార్యనిర్వాహకులు అతని వైపు నవ్వుముఖం పెడతారు. వారిని, అవివేకులుగా చేయడానికి అడిగాడని చూస్తుంటారు.

ఆ తర్వాత కొంతమంది దిగువ తరగతి వారిని గమనించుటకు పూనుకుంటాడు. ఒక ఆదివారం మధ్యాహ్న వేళ, Desplaines నది వెంబడి సంచరిస్తుంటాడు. అక్కడ ఒక హంగేరియన్ సమూహంను చూస్తాడు. వారు తమ స్త్రీలు మరియు పిల్లలతో చెట్ల క్రింద సంతోషంగా ఉంటారు. అలాగ కవి ‘సంతోషం’ అంటే తెలుసుకుంటాడు. వారికి ధనం, జ్ఞానం, విజయాలు లేవు. కానీ ఆ చెట్ల క్రింద సంతోషకరమైన క్షణాలను గడుపుతుంటాడు. వారు సంరక్షించాల్సిన వారితో గడుపుతుంటారు. మనస్ఫూర్తిగా ఆ క్షణాలను ఆనందిస్తుంటారు. కావున, సంతోషం అంటే ప్రస్తుతంలో జీవించటం. సంపద కాదు మరియు విజయం కాదు.

చివరికి, ఎవరైతే ప్రస్తుతంను ఆనందించటం తెలుసుకుంటారో వారే సంతోషవంతులని తెలిసింది. ఉన్నత మరియు దిగువ తరగతి వారికి మధ్యగల తేడాను చూపిస్తుంది. సంతోషం అంటే తెలియని ఎగువ తరగతి వారికి ప్రతినిధులుగా ప్రొఫెసర్లను మరియు కార్యనిర్వాహకులను చిత్రీకరించాడు. దిగువ తరగతి వారికి ప్రతినిధులుగా హంగేరియన్లను వివరించాడు. వారికి ప్రకృతిలో ఈ క్షణాన్ని సంతోషంగా ఎలా జీవించాలో తెలుసు. తమ ఆహారం, సంగీతం మరియు ఆనందాన్ని ఆస్వాదించగలరు. ఇతరులతో పంచుకోవటం మరియు సహాయం చేసే మనస్సుగల వారికి ప్రతిబింబంలా నిలిచారు వీరు. కాబట్టి ప్రతిఒక్కరూ, జీవితాన్ని ఆనందించడం కోసం ప్రస్తుతంలో జీవించాలి. జ్ఞానం జీవితాల్లో వుంది కాని గ్రంథాలయాల్లో కాదు.

TS Inter 1st Year English Study Material Chapter 1 Happiness

Happiness Summary in Hindi

बहुत विख्यात् अमरीका कवि कार्ल स्यांडबर्ग के कविता संग्रह ‘शिकागो गीत’ से उद्धृत है, प्रस्तुत गीत ‘आनंद’ (Happiness) | यह छोटा, लेकिन बहुत मीठा संदेशात्मक गीत है । यह तात्विक | गीत है, लेकिन इसमें वर्णित विषय आचरणीय है । उाठ – बाट के बिना सही अर्थ देनेवाला है, यह लगाता है कि यह छोटी घटना का वर्णन करनेवाला है, लेकिन गंभीर संदेश देनेवाला है ।

कथक की ‘आनंद’ (Happiness) का अर्थ जानने की इच्छा है। उसने आचार्यों से, अनुभवी एवं | जीवन परमार्थ पर चर्चा करनेवाले पंडितों से, तथा सर्वोच्च अधिकारियों से पूछा कि आनंद क्या है। लेकिन सभी ने असमर्थता से अपने अपने सिर हिलाए। उन्होंने उसे संदेह से देखा और समझा कि वह हमारी बेवकूपी, प्रकट करने जाया है । कथक निराश हुआ ।

कथक एक रविवार के दोपहर, एक नदी – तट पर धूम रहा था। एक दृश्य पर उसकी दृष्टि | पड़ी  तब उसका आनोदय हुआ । उस नदी – तट पर हंगरी देश का एक वृंद आनंद – तंरगों में लहराता दिखाई दिया । स्त्री- पुरुष, बाल बच्चे सभी खात-पीते, खेलते-कूदते, गाते – संगीत – साधना करते तन्मय होकर बता रहे थे मानो जीवन का अर्थ यही है । कथक को अनंद का मतलब मालूम होगया । आनंद का मतलब है कि क्षण क्षण जीवन का अनुभव करना, जीवन को आस्वादित करना और जिंदगी के मजे उड़ाना । संपदाएँ, नाम, यश, पद आदि आनंद नही दे सकते । जो आवश्यकता है, वह नहीं है । आवश्यकता है उनुभवसिद्ध ज्ञान की । यह छोटा गीत देता है मीठी
शिक्षा ।

Meanings and Explanations

professors (n-pl) / prǝfesə (r)z/((ప్రొఫెసర్ (ర్) జ్)) (trisyllabic): senior teachers in a university, ఆచార్యులు, విశ్వవిద్యాలయ స్థాయి బోధకులు, आचार्य

famous (adj) / ferməs / (ఫేమస్ ) (disyllabic): well known, ప్రసిద్ధిగాంచిన, प्रसिदध नामी

executives (n-pl) (ఇగ్జక్యుటి వ్ జ్ ) (polysyllabic) : top level administrators, కార్యనిర్వాహకులు , कार्यपालक

boss (v) bps / (బోస్ ) (monosyllabic) order others to work / supervise other’s work, అజమాయిషీ చేయటం, పర్యవేక్షించటం, मालिक होना, नियंतणा करना

shook head : moved head either way as to say no, తెలియదని అటు ఇటు తల ఊపటం

no fool (v) / fu: 1/(ఫూల్ ) (monosyllabic): to trick, తెలివి తక్కువవాడు , मुर्ख बनाना

wandered (v) / wondǝ(r) / (r) (వోన్ డర్) (disyllabic) : walked around without any particular purpose, సంచరించుట, घूमना

TS Inter 1st Year English Study Material Chapter 1 Happiness

desplaines : name of a river in US, నది పేరు, नदी का नाम

crowd (n) / krand / (క్రౌడ్ ) (monosyllabic): group, గుంపు, సమూహము ,भीड, जन – समूह
Note: It is singular inform but plural in meaning.

hungarians : హంగేరియన్లు

accordion (n) /ǝkǝ: (r)diǝn / (అకో(ర్)డి అన్ ) (trisyllabic): a portable box shaped musical instrument, చిన్నసైజు సంగీత వాయిద్యపు పెట్టె, बकस

keg (n) / keg / (35) (monosyllabic): a container, ఒక పాత్ర , पीपा

TS Inter 1st Year History Study Material Chapter 11 యూరోపియన్ల రాక

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 11th Lesson యూరోపియన్ల రాక Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 11th Lesson యూరోపియన్ల రాక

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న1.
బేగాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికార స్థాపనను వర్ణించండి.
జవాబు.
కో కర్ణాటక యుద్ధం సందర్భంగా క్లైవ్ తీసుకున్న నిర్ణయాలు యుద్ధ నిర్వహణలో చూపిన చురకుతనం, ఇంగ్లీష్ విజయానికి కారణమైంది. కర్ణాటక రాజ్య రాజధానియైన ఆర్కాట్ను ఆక్రమించాడు. ఈ విజయం రెండో కర్ణాటక యుద్ధ గమనాన్ని మార్చింది. ఫ్రెంచి వారి పరాజయానికి నాంది పలికింది. ఫ్రెంచివారి భవిష్యత్కు, డూప్లేకు ఈ యుద్ధం తీరని నష్టం కలిగించింది. బెంగాల్లో ఆంగ్లేయుల భవిష్యత్ వ్యూహాలకు ఈ విజయం మార్గం సుగమం చేసింది.

ఫ్లాసీ యుద్ధం (క్రీ.శ. 1757, 23 జూన్) : భారతదేశంలో ఆంగ్లేయుల లేదా తూర్పు ఇండియా కంపెనీ వారి అధికార విస్తరణకు కర్ణాటక విజయాలు ఎంత దోహదం చేసాయో, భవిష్యత్లో ఈస్ట్ ఇండియా కంపెనీ విజయాలకు, పేరు ప్రతిష్ఠలు ఇనుమడింపచేయడానికి బెంగాల్లో రాబర్ట్ క్లైవ్ సేనాధిపత్యంలో చేసిన ప్లాసీయుద్ధం (క్రీ.శ. 1757) అంత కంటే ఎక్కువ పేరు తెచ్చిపెట్టిందని చరిత్రకారుల వాదన. ప్లాసీ యుద్ధం బెంగాల్ నవాబ్ సిరాజ్ ఉద్గాలా (అలీవర్దీఖాన్ మనవడు), బ్రిటిష్ సైన్యాలకు జరిగింది. ఈ యుద్ధానికి ముఖ్య కారణాలు (1) బెంగాల్ సహజ వనరులను స్వాధీనం చేసుకోవాలన్న బ్రిటిష్ వారి కోరిక, (2) ఫ్రెంచి వారితో బెంగాల్ నవాబ్లకు గల సంబంధాన్ని విచ్ఛిన్నం చేయడం, (3) బెంగాల్లో ఫ్రెంచి ప్రాబల్యాన్ని అంతం చేయడం, (4) సిరాజ్ ఉదౌలా స్థానంలో బెంగాల్ నవాబుగా తమకు అనుకూలమైన వ్యక్తిని నవాబుగా చేయాలన్న ఆంగ్లేయుల కోరిక.

సిరాజ్ ఉదౌలా సేనాధిపతియైన మీర్ జాఫర్, అమీర్ చంద్ అనే వ్యాపారి మొదలైన సిరాజ్ ద్రోహులను తమ వైపు త్రిప్పుకున్న రాబర్ట్క్లెవ్ యుద్ధానికి సిద్ధమైనాడు. పైన పేర్కొన్న వారితోపాటు మాణిక్ చంద్ (బ్యాంకరు) జగత్ సేవ్, రాయుర్లబ్లు సిరాజ్న మోసగించి, రాబర్ట్ క్లైవ్ పక్షం చేరారు. చివరికి సిరాజ్ ఉదౌలా సేనాని మీర్ కాసీం కూడా క్లైవ్ పక్షం చేరాడు. ఇరుపక్షాల సేనలకు, జూన్ 23, 1757న, ప్లాసీ వద్ద నామమాత్రం యుద్ధం జరిగింది. నమ్మకద్రోహం చేసిన మీరాఫర్ క్లైవు విజయం చేకూర్చారు. సిరాజ్ ఉద్దెల ఓడింపబడి వధింపబడ్డాడు. మీర్జాఫర్ బెంగాల్ నవాబు అయ్యాడు. ఫ్రెంచి వారి స్థావరమైన చంద్రనగర్ను బ్రిటిష్వారు ఆక్రమించడంతో బెంగాల్లో ఫ్రెంచివారి ప్రాభల్యం అంతరించింది. బెంగాల్లో కంపెనీకి స్వేచ్ఛ రాజ్యాధికారాన్ని సంపాదించింది. కలకత్తా సమీపంలోని 24 పరగణాల జమీందారీని పొందింది.

బక్సార్ యుద్ధం (22 అక్టోబర్ 1764) : మీర్ జాఫర్ నేతృత్వంలోని, బెంగాల్ ఈస్ట్ ఇండియా కంపెనీ, దోపిడి చేయడం వల్ల బెంగాల్ ప్రజలు అన్ని రకాలు నష్టపోయారు. మద్రాస్, బొంబాయిలలోని ఈస్ట్ ఇండియా కంపెనీ ఖర్చులు కూడా బెంగాల్పై రుద్దారు. మీరజాఫర్కు బెంగాల్ నవాబగిరి ముల్లకంచెగా మారింది. క్లైవ్ అ భారతదేశంలో బెంగాల్ కొత్త గవర్నర్గా నియమించబడిన వాని ్సత్తార్ మీర్జాఫర్ను నవాబ్ పదవి నుంచి తొలగించి, అతని అల్లుడైన మీర్ ఖాసింను చేశాడు. దీనికి బదులుగా కొత్త బెంగాల్ నవాబ్ ఆంగ్లేయులకు బర్ద్వాన్, మిడాపూర్, చిట్టగాంగ్ జిల్లాలను అప్పగించాడు. కంపెనీ అధికారులకు మీరఖాసిం 29 లక్షలు చెల్లించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 11 యూరోపియన్ల రాక

మీరాసిం కొంతకాలం తరువాత బెంగాల్ రాష్ట్ర ప్రజల హితాన్ని కోరి చేపట్టిన వివిధ సంస్కరణలు బ్రిటీష్ వారికి నచ్చలేదు. దీనితో ఆగ్రహించిన కంపెనీ అధికారులు అతడిని పదవి నుంచి తొలగించారు. మళ్ళీ మీర్జాఫర్ను బెంగాల్ నవాబ్ చేశారు.

చివరికి పదవికోల్పోయిన మీర్ ఖాసిం, మొగల్ చక్రవర్తి షాఆలం, అవద్ నవాబ్ షుజా ఉద్దేలా మొదలైనవారి సహకారం, సేనలతో బక్సార్ వద్ద క్రీ.శ. 1764 అక్టోబర్ 22న, బ్రిటీష్ సేనలతో యుద్ధం చేశాడు. బ్రిటీష్ సేనాధిపతి మేజర్ మన్రో చేతిలో పరాజయం పొందాడు. చివరికి యుద్ధంలో మొగల్ చక్రవర్తి షా ఆలం, అవద్ నవాబ్లు ఓడిపోయారు. క్రీ.శ. 1765లో కుదిరిన అలహాబాద్ సంధి ప్రకారం అలహాబాద్ సంధి (1765) బెంగాల్లో ద్వంద్వపాలనకు శ్రీకారం చుట్టారు. బెంగాల్, బీహార్, ఒరిస్సాలో దివానీ అధికారాన్ని అనగా భూమిశిస్తు వసూలు అధికారం బ్రిటీష్ వారు పొందారు. సివిల్ అధికారులు నవాబ్కు ఇచ్చారు. కారా, అలహాబాద్ జిల్లాలను అయోధ్య నుండి వేరు చేసి మొగల్ చక్రవర్తికి ఇవ్వడం జరిగింది. సాలుకు 26 లక్షల రూపాయలు కంపెనీ, చక్రవర్తికి ఇవ్వడానికి అంగీకరించింది. ఈ విధంగా క్రీ.శ. 1757, 1764లలో జరిగిన ఫ్లాసీ, బక్సార్ యుద్ధాల్లో బెంగాల్ నవాబ్ పరాజయం, భవిష్యత్లో బ్రిటీష్ అధికార విస్తరణకు బీజాలు వేసింది. స్వదేశీ ప్రజల కష్టాలు రెట్టింపైనాయి. ఈ యుద్ధం భారతీయ పాలకుల సైనిక బలహీనతను తెలియజేసింది. ఈ యుద్ధంలో మొగల్ చక్రవర్తి కూడా ఓడిపోయాడు. కంపెనీ దివానీ అధికారాన్ని పొందడంతో ఇండియాలో ఇంగ్లీష్ వారి అధికారం స్పష్టంగా స్థాపించడం
జరిగింది.

ప్రశ్న 2.
ఈస్ట్ ఇండియా కంపెనీ భూమిశిస్తు విధానాలను వివరించండి.
జవాబు.
1785కు పూర్వం బెంగాల్లో ప్రతి ఏటా భూమి శిస్తు వసూలు చేసే అధికారాన్ని వేలం పాట ద్వారా అత్యధిక రేటు చెల్లించడానికి సిద్ధమైన వారికి ఇచ్చేవారు. వీరినే జమీందార్లు అనేవారు. దీనివల్ల కంపెనీకి అనేక నష్టాలుండేవి. ఈ సమస్య పరిష్కారానికి ‘వారన్ హేస్టింగ్స్’ గవర్నర్ జనరల్ గా ఉన్న కాలంలో ‘ఐదు సంవత్సరాల ఒడంబడిక’ పద్ధతిని ప్రవేశపెట్టాడు. కాని ఇంగ్లాండ్లోని గృహ ప్రభుత్వం ‘వార్షిక రెవిన్యూ ఒడంబడిక పద్దతినే సమర్థించింది. క్రీ.శ. 1786వ సంవత్సరంలో బ్రిటీష్ గవర్నర్ జనరల్గా భారతదేశం వచ్చిన లార్డ్ కారన్ వాలీస్ బెంగాల్లో అమలులో ఉన్న భూమిశిస్తు విధానాన్ని సరిదిద్దడానికి కొత్త విధానాన్ని రూపొందించాడు.

క్రీ.శ. 1768లో ‘కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్’ కారన్ వాలీస్ ను, పదిఏండ్ల భూమిశిస్తు ఒడంబడిక చేసుకోవల్సిందిగా సూచించింది. దీన్నే తరువాత కాలంలో ‘శాశ్వత భూమిశిస్తు’ విధానంగా వర్ణించారు. సరానార్ సహకారంతో క్రీ.శ. 1786-1789 మధ్యకాలంలో కారన్ వాలీస్ బెంగాల్లో భూమి సర్వే, రికార్డుల పరిశీలన, అంతవరకు అమలులో ఉన్న పద్దతులు మొదలైనవి అధ్యయనం చేశాడు. 1793లో శాశ్వత భూమిశిస్తు విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ పద్ధతిలో కారన్ వాలీస్ గతంలో కేవలం భూమిశిస్తు వసూలు అధికారాలు పొందిన జమీందార్లను, సమాజంలో అత్యంత ప్రభావవంతులైన వారిగా మార్చాడు. వారిని బ్రిటిష్ సామ్రాజ్యవాద పరిరక్షణకు, వలసవాడ పరిరక్షణకు భారతదేశంలో సరైన ఏజెంటులుగా మార్చాడు. ప్రతి జమీందారు ప్రభుత్వానికి నిర్ధారించిన భూమిశిస్తు మొత్తాన్ని పదేండ్లకాలానికి ముందుగానే నిర్ణయించిన కాలానికే చెల్లించేట్లు అంగీకరింపచేశాడు. దీనివల్ల భూమిపై జమిందార్కు గతంలో కంటే తక్కువ యాజమాన్యపు హక్కు చేకూరింది. అన్ని రకాలుగా కంపెనీ ఆధిపత్యం నెలకొల్పబడింది. రైతాంగం జమీందార్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసి వచ్చింది. వారి కష్టనష్టాలు నేరుగా ప్రభుత్వానికి చెప్పుకునే అవకాశాలు అంతరించాయి. బ్రిటీష్వారికి వినయంగా, విధేయులుగా ఉన్నంతకాలం ఈ జమీందార్లు తమ ప్రాంతాల్లో అధికారం చెలాయించారు. క్రమంగా ఈ జమీందార్లు వంశపారంపర్యపు హక్కులు పొందారు. కంపెనీకి ఈ కొత్త భూమి శిస్తు విధానం వల్ల అన్ని రకాల లాభాలు సమకూరాయి. భారతదేశంలో బ్రిటీష్ అధికార రక్షకులుగా ఈ జమిందార్లు ఎదిగారు. 1857 తిరుగుబాటుకాలంలో వారు చేసిన సహాయాన్ని బ్రిటీష్ అధికారులు స్వయంగా ప్రశంసించారు.

కారన్ వాలీస్ ప్రవేశపెట్టిన శాశ్వత భూమిశిస్తు విధానం రైతాంగం పాలిట శాపంగా మారింది. వారిపై పన్ను భారం పెరిగింది. భూమిపై ఎలాంటి హక్కు లేకుండాపోయింది. కరువు కాటకాలు, అతివృష్టి, అనావృష్టి కాలాల్లో కూడా రైతాంగం తమ గోడును ప్రభుత్వానికి విన్నవించుకునే అవకాశం లేకుండా పోయింది. వ్యవసాయం భారంగా, లాభహీనంగా మారింది. రైతులు, రైతుకూలీలు నష్టపోయారు.

రైత్వారీ విధానం : ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో ప్రవేశపెట్టిన భూమిశిస్తు (రెండో) విధానం రైత్వారీ పద్ధతి. దీన్ని సరాథామస్మన్రో, మద్రాస్ ప్రసిడెన్సీలో ప్రవేశపెట్టాడు. దీనికి ఆనాటి బ్రిటీష్ గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లస్లీ అంగీకరించాడు. రైతుతో ప్రత్యక్ష ఒడంబడిక చేసుకోవాలన్నది రైత్వారీ పద్ధతి అతి ముఖ్య లక్ష్యం. క్రీ.శ. 1792లో ముందుగా ఈ పద్ధతిని బారాముల్లా (సేలం)లో ప్రవేశపెట్టారు. దీనికి కెప్టెన్ రీడ్ మూలసూత్రధారి. కెప్టెన్ రీడ్ అనుచరుల్లో ఒకడైన థామస మన్రో 1800 సంవత్సరంలో సీడెడ్ జిల్లాల (దత్తమండలాల) కలెక్టర్గా నియమించబడ్డాడు. అక్కడ దీన్ని మన్రో విజయవంతంగా అమలుచేశాడు. రైత్వారీ పద్దతిని మన్రో రైతు సంక్షేమ దృష్టితో అమలు చేశాడు. దీని వల్ల రైతులే భూమికి యజమానులయ్యారు. పండించిన పంటలో 1/3 వంతు ప్రభుత్వం శిస్తు రేటుగా నిర్ణయించింది. రైతులందరికీ ‘పట్టాలు’ ఇప్పించాడు. దీనివల్ల వారికి రక్షణ చేకూరింది. ఆ తరువాత కాలంలో దక్షిణ భారతదేశంలోని తంజావూర్, ఆర్కాట్, కోయంబత్తూర్, మలబార్ మొదలైన ప్రాంతాల్లో ఈ రైత్వారీ పద్ధతిని ప్రవేశపెట్టారు. క్రీ.శ. 1818 నాటి మూడో మరాఠా ఆంగ్లో యుద్ధం తరువాత బొంబాయి ప్రసిడెన్సీలోని అత్యధిక ప్రాంతాలపై కంపెనీ ఆధిపత్యం నెలకొల్పబడింది. ఇక్కడ కూడా ‘రైత్వారీ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఇక్కడ పండిన పంటలో 55% ప్రభుత్వ వాటాగా (శిస్తు రేటుగా) నిర్ణయించారు.

వాస్తవానికి ఈ రైత్వారీ భూమిశిస్తు పద్ధతి జమీందారీ వ్యవస్థ కంటే మెరుగైన ఫలితాలను ఇచ్చింది. ప్రతిరైతు, గ్రామాలు లాభపడ్డాయి. సామాజిక చైతన్యానికి రైత్వారీ పద్ధతి పునాదులు వేసింది. సమాజంలో అంతవరకు కొనసాగిన భూమి ఆధారిత యాజమాన్యపు హక్కు, సామాజిక హోదా తగ్గింది. కాని గవర్నమెంట్ ఏజెంట్లు రైతాంగాన్ని మళ్ళీ పీడించారు. ఫలితంగా ఆర్థికంగా రైతులు పూర్తిస్థాయిలో పేదరిక చక్రం నుంచి విముక్తి పొందలేరు. సీడెడ్ జిల్లాలో మన్రో ప్రయత్నం గొప్ప విజయాలు సాధించినప్పటికీ మిగతా ప్రాంతాల్లో మధ్యవర్తుల, ఏజెంట్లు స్వార్థం, లంచగొండతనం వల్ల విఫలమైంది.

ప్రశ్న 3.
కర్ణాటక యుద్ధాలకు దారితీసిన కారణాలు, ఫలితాలను చర్చించండి.
జవాబు.
ఆధునిక యుగంలో యూరోపియన్లు వ్యాపారార్థం భారతదేశానికి వచ్చారు. కాల – క్రమంలో వ్యాపార ఆధిపత్యానికై ఇంగ్లీషు, ఫ్రెంచి వారి మధ్య మూడు యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాల వల్ల భారతదేశంలో ఫ్రెంచి వారి శక్తి పూర్తిగా దిగజారిపోయింది. నాటి నుండి ఆంగ్లేయుల విజృంభణకు ఎదురులేకపోయింది.

మొదటి కర్ణాటక యుద్ధం (1744 – 48) : 1742లో ‘డూప్లే’ ఫ్రెంచ్ గవర్నర్ గా నియమించబడ్డాడు. భారతదేశంలో ఆంగ్లేయులు ఫ్రెంచి వారి స్థావరమైన పుదుచ్చేరిని ఆక్రమించాలనే ఆలోచనలో ఉన్నారు. దీనితో ఫ్రెంచి వారు కర్ణాటక నవాబు అన్వరుద్దీన్ సహాయం కోరాడు. దీనితో ఆంగ్లేయులు యుద్ధవిరమణ చేశారు. ఇట్టి పరిస్థితుల్లో ఫ్రెంచి సైన్యం లాబొర్డినాయి నాయకత్వంలో భారతదేశం వచ్చింది. ఆ ధైర్యంతో 1746లో ఫ్రెంచివారు ఆంగ్లేయులు సెయింట్ జార్జ్ కోటను స్వాధీనపరచుకున్నారు. ఈలోగా ఆంగ్లేయులు అన్వరుద్దీన్ చేరారు. దాంతో నవాబు ఫ్రెంచి వారిని వైదొలగమని హెచ్చరించాడు. ‘శింధోమ్’ వద్ద నవాబు సైన్యం ఫ్రెంచి సైన్యానికి జరిగిన యుద్ధంలో అన్వరుద్దీన్ ఓటమి పాలయ్యాడు. ఈలోగా యూరప్లో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ముగిసింది. దానితో భారతదేశంలో కూడా యుద్ధం ముగిసింది. సంధి షరతుల ప్రకారం మద్రాస్ను ఆంగ్లేయులకు అప్పగించారు. రెండవ కర్ణాటక యుద్ధం (1749 – 1754) : 1748లో హైదరాబాద్ నిజాం ఉలుల్క్ మరణించటంతో, సింహాసనం కోసం కుమారుడు నాజర్ంగ్, మనుమడు ముజఫర్లాంగ్ల మధ్య అంతర్యుద్ధం మొదలైంది. అలాగే కర్ణాటక సింహాసనం కోసం చందాసాహెబ్కు అన్వరుద్దీన్ కు మధ్య యుద్ధం ప్రారంభమైంది. చందాసాహెబ్, ముజఫర్లాంగ్లు ఫ్రెంచి గవర్నర్ డూప్లే సాయాన్ని కోరారు. వీరికి సహాయం చేసి దక్కన్లో తమ ప్రాభవాన్ని పెంచుకుందామని డూప్లే భావించాడు. 1749లో ఆయూర్ వద్ద జరిగిన యుద్ధంలో అన్వరుద్దీన్ ను వధించారు. నాజర్డింగ్ ఆంగ్లేయుల సాయంతో ముజఫర్ జంగ్ను ఓడించాడు, కానీ ఫ్రెంచి వారి చేతిలో హత్యకు గురయ్యాడు. ఫ్రెంచివారు ముజఫర్ంగ్ను నవాబును చేసారు. ‘బుస్సీ’ హైదరాబాద్లో రక్షణగా ఉన్నాడు. 1751లో జరిగిన యుద్ధంలో ఫ్రెంచివారు ఓడారు. తరువాత 1752లో రాబర్ట్ క్లైవ్ కర్ణాటకలో చందాసాహెబ్ను ఓడించి వధించాడు. ఈ స్థితిలో డూప్లే స్థానంలో గాడెహ్యును నియమించారు. దీంతో కర్ణాటకలో ఆంగ్లేయుల ప్రాబల్యం పెరిగింది. మూడవ కర్ణాటక యుద్ధం (1756 61) : ఐరోపాలో సప్తవర్ష సంగ్రామం ప్రారంభమైంది. ఫ్రెంచి గవర్నర్గా కౌంట్జిలాలి నియమితుడయ్యాడు. ఇతడు కడలూర్ ఆంగ్లేయుల కోటను ఆక్రమించి మద్రాసు ఆక్రమించడానికి విఫలయత్నం చేశాడు. ఆంగ్లేయులకు సర్ ఐర్ర కూట్ నాయకత్వం వహించాడు. బుస్సీని సాయం రమ్మని ఆజ్ఞాపించాడు. దాంతో ఆంగ్లేయులు నైజాంతో ఒప్పందం చేసుకున్నారు. 1760లో ‘వందవాసి’ వద్ద జరిగిన యుద్ధంలో ఫ్రెంచి సైన్యాన్ని ఓడించి పుదుచ్చేరిని ఆక్రమించి ‘డిలాలి’నిబందీగా ఇంగ్లాండ్ పంపాడు. 1763లో సప్తవర్ష సంగ్రామం ముగియడంతో మూడవ కర్ణాటక యుద్ధం ముగిసింది.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న1.
మైసూర్ యుద్ధాలపై ఒక లఘు వ్యాసం రాయండి.
జవాబు.
ఆంగ్లేయులు మైసూర్ రాజ్యంలో క్రీ.శ. 1766 నుంచి 1799 మధ్య నాలుగు యుద్ధాల్లో ఎదుర్కొన్నారు. మొదటి మైసూర్ యుద్ధం క్రీ.శ. 1766 – 1769 మధ్యకాలంలో హైదర్అలీ సేనలకు, ఈస్ట్ ఇండియా సేనలకు జరిగింది. హైదర్ కంపెనీ సేనలను వారి మిత్ర రాజ్యాల సేనలు ఓడించాడు. మద్రాస్ సంధి షరతులను కంపెనీ అంగీకరించింది. రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం (క్రీ.శ. 1780 – 1784) : రెండోసారి 1780వ సంవత్సరంలో మద్రాస్ సంధి షరతులను బ్రిటిష్వారు ఉల్లంఘించినందువల్ల, మైసూర్ పాలకుడైన హైదర్అ లీ యుద్ధానికి సిద్ధమైనాడు. ఇదే కాలంలో మరాఠా సేనలతో హైదర్ నిమగ్నమై ఉండగా,, ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలాంటి సహాయం అందించలేదు. మద్రాస్ సంధి షరతులను ఉల్లంఘించింది. అందువల్ల, హైదరాలీ, తన కుమారుడై టిప్పుతో కలిసి రెండోసారి యుద్ధానికి సిద్ధమైనాడు. యుద్ధం కొనసాగుతున్న కాలంలోనే హైదరాలీ కాన్సర్ వ్యాధితో మరణించాడు. టిప్పు సుల్తాన్ బాధ్యతలు స్వీకరించాడు. చివరికి మంగళూరు సంధితో టిప్పు యుద్ధాన్ని విరవించాడు. ఇరువర్గాలవారు మరాఠాలతో, నిజాంతో స్నేహం చేయమనీ, శ్రీరంగపట్టనాన్ని టిప్పుకు ఇవ్వడానికి అంగీకరించాయి. మూడో మైసూర్ యుద్ధం : మూడోసారి బ్రిటీష్ సేనలు క్రీ.శ. 1790వ సంవత్సరంలో మైసూర్ రాజ్యంపై 1789లో యుద్ధం ప్రకటించాయి. లార్డ్ కారన్ వాలీస్ బ్రిటీష్ సేనలకు నాయకత్వం వహించాడు. టిప్పుసేనలు పరాజయం పొందాయి. శ్రీరంగపట్టణం ఆంగ్లేయుల వశమైంది. క్రీ.శ. 1792లో టిప్పు శ్రీరంగపట్టణం సంధి షరతులను అంగీకరించాడు. ఈ సంధి షరతుల ప్రకారం మైసూర్ రాజ్యం విస్తీర్ణంలో అర్థభాగం కోల్పోయింది. టిప్పుసుల్తాన్ 3.30 కోట్లు యుద్ధ నష్ట పరిహారం చెల్లించాలి. అతని ఇద్దరి కుమారులను జామీనుగా కంపెనీ బందీలుగా ఉంచింది.

నాల్గో మైసూర్ యుద్ధం (క్రీ.శ 1798 – 1799) : ఆంగ్లేయులకు టిప్పు సుల్తాన్లకు మధ్య శ్రీరంగపట్టణం సంధి శాశ్వత శాంతిని ప్రసాదించలేదు. 1798 – 1799లో చివరిసారిగా టిప్పుసుల్తాన్ సైన్యం, ఆంగ్ల సేనలతో తలపడింది. దీన్నే నాల్గో మైసూర్ యుద్ధం అంటారు. ఈ యుద్ధంలో టిప్పు ప్రాణాలు కోల్పోయాడు. పూర్వపు ఒడియార్ వంశానికి చెందిన ఒక మైనర్ బాలున్ని కంపెనీ మైసూర్ పాలకునిగా నియమించింది. మైసూర్ రాజ్యం సైన్యసహాకార ఒప్పందంలో చేరింది.

ప్రశ్న 2.
ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం నాటి న్యాయవ్యవస్థను వివరించండి.
జవాబు.
బ్రిటీష్ వారు, తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో నూతన న్యాయవ్యవస్థను ఏర్పాటు చేశారు. రాబర్ట్ క్లెవ్, వారన్ హేస్టింగ్స్, కారన్ వాలీస్ సివిల్, క్రిమినల్ కేసుల పరిష్కారానికి అనేక స్థాయిల్లో కోర్టులను ఏర్పాటు చేశారు. 1772 – 73 నాటి రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బెంగాల్లో సుప్రీంకోర్టు నెలకొల్పబడింది. 1781 నాటికి సుప్రీంకోర్టు అధికారులు, పనితీరు మొదలైన అంశాలు నిర్ధారించారు. వారన్ హేస్టింగ్స్ కాలంలో జిల్లాస్థాయిలో దివాన్ – ఇ – అదాలత్, ఫౌజ్ దారీ ఇ – అదాలత్ను ఏర్పాటు చేశారు. దివాన్ అదాలత్ సివిల్ కేసులను, కలెక్టర్ నేతృత్వంలో విచారించేది. ఫౌజ్రీ ఇ – అదాలత్ భారతీయ సంతతి అధికారుల ఆధ్వర్యంలో ముస్తీలు, ఖాజీల సలహాలతో పనిచేసేది.

లార్డ్ కారన్ వాలీస్ కాలంలో సివిల్, క్రిమినల్ కోర్టుల విషయంలో గ్రేడింగ్లను ఏర్పాటు చేశారు. మున్సిఫ్ కోర్టులు ఏర్పాటు చేశారు. భారతీయ న్యాయనిపుణులను మున్సిఫ్ కోర్టు అధికారులుగా నియమించారు. కారన్ వాలీస్ బెంగాల్, బీహార్లలో సర్క్యూట్ కోర్టులు ఏర్పాటు చేశాడు. ఇతడు కార్యనిర్వాహక శాఖ అధికారాలను, న్యాయశాఖ అధికారాలను విభజించాడు. క్రిమినల్ కేసులు నవాబ్ బాధ్యత. గవర్నర్ జనరల్ క్రిమినల్ కేసుల తీర్పుల విషయంలో అత్యున్నత న్యాయాధికారి. ‘కారన్ వాలీస్ న్యాయస్మృతి’గా పేరుగాంచిన కోడ్ (సివిల్, క్రిమినల్ సూత్రాలు) ఇతని కాలంలోనే భారతీయ (హిందూ – ఇస్లామిక్) న్యాయసూత్రాలను అమలు చేసే విధానాన్ని న్యాయాధికారులకు వివరించే ప్రయత్నం జరిగింది. న్యాయశాఖలో చాలా వరకు విచక్షణ లేకుండా చేశాడు కారన్వాలీస్.

లార్డ్వెల్లస్లీ కాలంలో సదర్ – నిజామత్ అదాలత్లో రెగ్యులర్ జడ్జీలను నియమించే సంప్రదాయాన్ని ప్రారంభించాడు. విలియం బెంటింక్ కాలంలో బెంగాల్లో లార్డ్కరన్ వాలీస్ నెలకొల్పిన నాలుగు సర్క్యూట్ కోర్టులను రద్దు చేశాడు. అతడు బెంగాల్ను 20 డివిజన్లుగా విభజించాడు. ప్రతి విడిజన్కు ఒక న్యాయాధికారిని నియమించాడు. వీరందరిపై అధికారి కమీషనర్. ప్రజాసంక్షేమానికి వారి రక్షణకు అన్ని చర్యలు తీసుకున్నారు. జమిందార్ల, భూస్వాముల రక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అలహాబాద్ సంధి షరతులు.
జవాబు.
క్రీ.శ. 1765లో కుదిరిన అలహాబాద్ సంధి ప్రకారం అలహాబాద్ సంధి (1765) బెంగాల్లో ద్వంద్వపాలనకు శ్రీకారం చుట్టారు. బెంగాల్, బీహార్, ఒరిస్సాలో దివానీ అధికారాన్ని అనగా భూమిశిస్తు వసూలు అధికారం బ్రిటీష్ వారు పొందారు. సివిల్ అధికారాలు నవాబ్కు ఇచ్చారు. కారా, అలహాబాద్ జిల్లాలను అయోధ్య నుండి వేరు చేసి మొగల్ చక్రవర్తికి ఇవ్వడం జరిగింది. సాలుకు 26 లక్షల రూపాయలు కంపెనీ, చక్రవర్తికి ఇవ్వడానికి అంగీకరించింది.

TS Inter 1st Year History Study Material Chapter 11 యూరోపియన్ల రాక

ప్రశ్న 2.
శ్రీ రంగపట్టణం సంధి షరతులు.
జవాబు.
మూడోసారి బ్రిటీష్ సేనలు క్రీ.శ. 1790వ సంవత్సరంలో మైసూర్ రాజ్యంపై 1789లో యుద్ధం ప్రకటించాయి.
లార్డ్ కారన్ వాలీస్ బ్రిటీష్ సేనలకు నాయకత్వం వహించాడు. టిప్పుసేనలు పరాజయం పొందాయి. శ్రీరంగపట్టణం ఆంగ్లేయుల వశమైంది. క్రీ.శ. 1792లో టిప్పు శ్రీరంగపట్టణం సంధి షరతులను అంగీకరించాడు. ఈ సంధి షరతుల ప్రకారం మైసూర్ రాజ్యం విస్తీర్ణంలో అర్ధభాగం కోల్పోయింది. టిప్పుసుల్తాన్ 3.30 కోట్లు యుద్ధ నష్ట పరిహారం చెల్లించాలి. అతని ఇద్దరి కుమారులను జామీనుగా కంపెనీ బందీలుగా ఉంచింది.

ప్రశ్న 3.
డూప్లే విజయాలు.
జవాబు.
క్రీ.శ. 1697లో జన్మించిన జోసెఫ్ ఫ్రాంకోయిస్ డూప్లే సమర్థుడైన పాలనావేత్త. తండ్రి ప్రభావంతో ఉన్నత విద్యనభ్యసించి ప్రభుత్వ కొలువులో చేరి ఫ్రెంచి ప్రభుత్వం తరపున పాండిచ్ఛేరికి చేరాడు. తన శక్తి సామర్థ్యాలు, తెలివి తేటలతో చంద్రనగర్లో ఫ్రెంచి గవర్నర్గా నియమించబడ్డాడు.

డ్యూమస్ తరువాత డూప్లే ఫ్రెంచి గవర్నర్గా బాధ్యతలు స్వీకరించాడు. ఆంగ్లేయులకు, ఫ్రెంచివారి సైన్యాలకు మధ్య జరిగిన మొదటి, రెండో కర్ణాటక, యుద్ధాల్లో డూప్లే తన దౌత్యనీతిని ప్రదర్శించాడు. ఆంగ్లేయులకు, ఫ్రెంచివారి సైన్యాలకు మధ్య జరిగిన మొదటి, రెండో కర్ణాటక, యుద్ధాల్లో డూప్లే తన దౌత్యనీతిని ప్రదర్శించాడు. ఈ రకంగా 16, 17వ శతాబ్దం నాటికి భారతదేశంలో ఐరోపా వర్తక సంఘాలు స్థిరపడ్డాయి.

క్రీ.శ. 1741 నాటికి గవర్నర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించాడు. రెండో కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచి సేనల పరాజయం ఇతని పతనానికి దారి తీసింది.

ప్రశ్న 4.
రాబర్ట్ క్లైవ్ సేవలు.
జవాబు.
భారతదేశంలో బ్రిటీష్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఘనుడు రాబర్టెవ్. క్లైవ్ చిన్న గుమస్తాగా జీవితం ప్రారంభించి స్వయంకృషి వల్ల గవర్నర్ పదవికి ఎదిగాడు. ఈస్టిండియా కంపెనీ సామ్రాజ్య స్థాపకుడిగా ఆధునిక భారతదేశ చరిత్రలో రాబర్ట్ క్లైవ్ ప్రముఖ స్థానం.

ప్రశ్న 5.
కర్ణాటక యుద్ధాల్లో ఫ్రెంచి వారి ఓటమికి కారణాలు.
జవాబు.

  1. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రైవేట్ కంపెనీ, ఫ్రెంచి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వంపై ఆధారపడిన కంపెనీ.
  2. ఆంగ్లేయులు మాతృదేశం నుంచి శీఘ్రగతిలో అన్ని రకాల సహాయం పొందారు. ఫ్రాన్స్ పాలకులు ఫ్రెంచి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇలాంటి సహకారం అందించలేదు.
  3. ఆంగ్లేయుల వద్ద సమర్థవంతమైన సేనాధిపతులు ఐర్ కూట్, రాబర్కైవ్, లారెన్స్లు ఉండేవారు, డూప్లే, బుస్సీలు వీరికి ఏ విధంగా పోలికలేదు.
  4. ఆంగ్లేయులకు మూడు కేంద్రాలు (మద్రాస్, కలకత్తా, బొంబాయి) ఉండగా, ఫ్రెంచి వారికి కేవలం ఒక పాండిచ్చేరి మాత్రమే ఉంది. మూడో కర్ణాటక యుద్ధం భారతదేశంలో ఫ్రెంచి వారి రాజకీయ సామ్రాజ్యవాదానికి తెరదించింది.

TS Inter 1st Year History Study Material Chapter 11 యూరోపియన్ల రాక

ప్రశ్న 6.
చీకటిగది ఉదంతం.
జవాబు.
కలకత్తాలోని ఫోర్ట్ విలియంలోని ఒక చిన్న జైలు గది. జూన్ 20, 1756న సిరాజ్ ఉద్ దౌలా అనుచరులు బ్రిటీష్ సైనికులు, ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులను దాదాపు 146 మందిని చిన్న గదిలో కుక్కారు. వీరిలో దాదాపు 123 మంది ఊపిరి ఆడక మరణించారు. దీనినే చీకటి గది ఉదంతం అంటారు.

TS Inter 1st Year English Study Material Chapter 6 Two Sides of Life

Telangana TSBIE TS Inter 1st Year English Study Material 6th Lesson Two Sides of Life Textbook Questions and Answers.

TS Inter 1st Year English Study Material 6th Lesson Two Sides of Life

Annotations (Section – A, Q.No. 2, Marks : 4)

Question 1.
In thought, in talk, in action, I think you will find that you can separate life into these two divisions-the dark side and the bright side, the discouraging side and the encouraging side.
Answer:
Introduction :
This sentence is taken from the prose piece, “Two Sides of Life”, penned by Booker T Washington. This is a speech extracted from his popular book, Character Building.

Context & Explanation:
While analyzing a number of divisions in human life, he finds two most important ones which are significant. They are the dark side of life and the bright side of life or the discouraging side and the encouraging side. These two are found in thought, in talk and in action of a person.
TS Inter 1st Year English Study Material Chapter 6 Two Sides of Life 2
Critical Comment:
Here, Booker T Washington discusses two sides – the bright, the dark of life though many more divisions are possible.

కవి పరిచయం :
బుకర్ టి వాషింగ్టన్ రచించిన “టూ సైడ్స్ ఆఫ్ లైఫ్” అను గద్యభాగం నుండి ఈ వాక్యం తీసుకొనబడింది. ఇతని ప్రసంగాల సంపుటి అయిన “Character Building” అను ప్రసిద్ధి చెందిన పుస్తకం నుండి తీసుకొనబడిన ప్రసంగం.

సందర్భం :
అనేక భాగాలుగా అవకాశాలున్నప్పటికీ, జీవితాన్ని ఆశ, నిరాశలుగా ఇక్కడ వివరిస్తున్నాడు.

వివరణ :
మానవుడి జీవితంలోని అనేక భాగాలను విశ్లేషిస్తున్న తరుణంలో, రెండు ముఖ్యమైన భాగాలను కనుగొన్నాడు. అవి సంతోషకరమైన జీవితం మరియు చీకటిమయమైన జీవితం లేదా నిరుత్సాహకరమైన జీవితం మరియు ఉత్సాహకరమైన జీవితం. మనిషి ఆలోచన, మాట మరియు చేసే పనిలో, ఈ రెండు భాగాలు కనుగొనబడ్డాయి.

TS Inter 1st Year English Study Material Chapter 6 Two Sides of Life

Question 2.
Education is not what a person is able to hold in his head, so much as it is what a person is able to find
Answer:
Introduction:
This beautiful sentence is taken from the character building speech. “Two Sides of Life” delivered by Booker T Washington. This speech is extracted from his popular book ‘Character Building’.

Context & Explanation:
The writer gives very forceful explanation of character building. He inspires teacher traines how they should be in their profession. He tells them to be honest. If they don’t know anything, they have to accept it frankly and honestly. Their students will respect them for it. It is because education is not possible to hold in one’s head. It is what a person is able to find. It is not the correct notion that the teacher should know everything.

Critical Comment:
Here, the writer addresses the teacher trainees and advises them to have the character of frankness and honesty.

కవి పరిచయం :
ఈ అందమైన వాక్యం బుకర్ టి వాషింగ్టన్ ప్రసంగం “టూ సైడ్స్ ఆఫ్ లైఫ్” నుండి గ్రహింపబడినది. ఇది వ్యక్తిత్వ నిర్మాణం అను తన ప్రసిద్ధ పుస్తకం నుండి తీసుకొనబడింది.

సందర్భం :
వాస్తవత, నిజాయితి కలిగి వుండమని ఉపాధ్యాయ వృత్తి శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులను ఉద్దేశించి సలహా ఇస్తున్నాడు రచయిత.

వివరణ :
వ్యక్తిత్వ నిర్మాణం గురించి గట్టి వివరణ ఇస్తున్నాడు. వారి వృత్తిలో ఎలా ఉండాలో వారిలో స్ఫూర్తిని నింపుతున్నాడు. వారిని నిజాయితీగా ఉండమంటున్నాడు. వారికి ఏదైనా తెలియకపోతే వారిని నిజాయితీగా ఒప్పుకోమంటున్నాడు. అప్పుడు వారి విద్యార్థులు గౌరవిస్తారు వారిని. ఎందుకంటే విద్య అనేది వ్యక్తి మనస్సులో నిల్వ ఉంచలేరు. ఒక వ్యక్తి కనుగొనగలది, తెలుసుకోగలదే విద్య. ఉపాధ్యాయుడు అంతా తెలిసి ఉండాలనేది సరైన ఆలోచన కాదు అంటున్నాడు.

TS Inter 1st Year English Study Material Chapter 6 Two Sides of Life

Question 3.
They are the people who never go forward. They never suggest a line of activity. They live simply on the negative side of.
Answer:
Introduction:
These lines are taken from the inspiration essay Two Sides of Life written by Booker T Washington. This is a speech extracted from his popular book Character Building.

Context & Explanation:
The writer addresses his students. He tells the about two types of people. Here, he explains to them about the people who are negative about this thing and that thing. They always make the atmosphere unpleasant. They are undesirable. They become negative characters. They never go forward. They make every one miserable. Therefore, he advises his students not to emulate them and not to become a negative force.

Critical Comment:
Here, the writer tells his students about the people who always look on the dark side of life.

కవి పరిచయం :
ఈ వాక్యాలు స్ఫూర్తిదాయకమైన ‘జీవితం రెండు వైపులు’ అను బుకర్ టి వాషింగ్టన్ రచించిన వ్యాసం నుండి గ్రహించబడింది. వ్యక్తిత్వ నిర్మాణం అను అతని ప్రసిద్ధ పుస్తకం నుండి తీసుకొనబడిన ప్రసంగం ఇది.

సందర్భం :
ఇక్కడ రచయిత విద్యార్థులతో నిరాశావాదులు జీవితంలో ఎల్లప్పుడూ చీకటినే చూస్తారని చెబుతున్నాడు.

వివరణ :
రచయిత తన అభ్యాసకులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. వారికి రెండు రకాల వ్యక్తుల గురించి చెప్తున్నాడు. ఇక్కడ దీని గురించి దాని గురించి నిరాశ, అననుకూలంగా ఉండే వారిని గురించి విద్యార్థులకు చెప్తున్నాడు. నిరాశవాదులు చుట్టూ వాతావరణాన్ని నిరుత్సాహపరుస్తారు. వారు కోరదగినవారు. వారు నిరాశావాదులు. వారు ఎప్పటికీ ముందుకు వెళ్ళలేరు. వారు ప్రతి ఒక్కరిని దుఃఖితులను చేస్తారు. కావున, వారిని అనుసరించవద్దని, నిరాశవాదులు కావద్దని తన విద్యార్థులకు సలహా ఇస్తున్నాడు రచయిత.

TS Inter 1st Year English Study Material Chapter 6 Two Sides of Life

Question 4.
Do not be satisfied until you have put yourselves into that atmosphere where you can seize and hold on to the very highest and most beautiful things that can be got out of life.
Answer:
Introduction:
There motivational lines are at the concluding lines taken from the essay ‘Two Sides of Life’ written by Booker T Washington. It is a speech taken from his popular book Character Building.

Context & Explanation:
The writer concludes his speech by inspiring his students to be positive in life. He advises them to cultive positive attitude to become the strong individual. He tells them to be the best people in life. He warns them not satisfy with the second hand things in life. He inspires them to be in the highest position in the life by achieving great and beautiful things in life.
TS Inter 1st Year English Study Material Chapter 6 Two Sides of Life 3
Critical Comment:
He advises his students to see the happier side and spread cheer all round.

కవి పరిపరిచయం :
ఈ స్ఫూర్తిదాయకమైన ముగింపు వాక్యాలు బుకర్ టి వాషింగ్టన్ రచించిన జీవితం రెండు వైపుల అను వ్యాసం నుండి గ్రహించబడింది. ఈ ప్రసంగం అతని ప్రసిద్ధ పుస్తకం వ్యక్తిత్వ నిర్మాణం నుండి గ్రహించబడింది.

సందర్భం :
రచయిత తన విద్యార్థులతో జీవితంలో ఆనందంవైపు చూడాలని, సంతోషంగా గడపాలని చెబుతున్నాడు.

వివరణ :
జీవితంలో ఆశావాదంలో ఉండమని తమ విద్యార్థులకు ప్రేరణ కల్పిస్తూ తన ప్రసంగాన్ని ముగిస్తున్నాడు. దృఢమైన వ్యక్తిగా రూపుదిద్దుకోవటానికి అనుకూల వైఖరిని అలవరుచుకోమని తన విద్యార్థులకు సలహా ఇస్తున్నాడు. జీవితంలో గొప్పవారిని కమ్మని సలహా ఇస్తున్నాడు. రెండవ రకం, ప్రత్యామ్నాయంతో సంతృప్తి చెందవద్దని తన విద్యార్థులను హెచ్చరిస్తున్నాడు. గొప్ప విజయాలు సాధించి జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని తన విద్యార్థులకు ప్రేరణ కల్పిస్తున్నాడు.

TS Inter 1st Year English Study Material Chapter 6 Two Sides of Life

Paragraph Answer Questions (Section – A, Q.No. 4, Marks : 4)

Question 1.
How do the two types of persons react to an overcast morning?
Answer:
Booker T Washington’s addresses are very forceful explanations of character building. In his speech Two Sides of Life he describes how people react to an overcast morning. To a person who constantly looks at the dark side of things in life, the morning appears gloomy, dull and the streets full of muddy water. Everything looks disagreeable to him. Whereas for a person who always looks at the bright side of things in life, the morning appears beautiful in all aspects. He speaks of the beauties in the rain drops, of the freshness in the newly bathed flowers, shrubs and trees.

వ్యక్తిత్వ నిర్మాణంకు బుకర్ టి వాషింగ్టన్ ఉపన్యాసాలు చాలా శక్తివంతమైన వ్యాఖ్యలు. ఇతని ప్రసంగం Two Sides of Life లో మబ్బుపట్టిన ఉదయంకు వ్యక్తులు ఎలా స్పందిస్తారో ఇతను వివరిస్తున్నాడు. జీవితంలో, నిరాశావాదంలో చూసే వ్యక్తికి, ఆ ఉదయం చీకటిగా, మబ్బుగా, నిరుత్సాహంగా మరియు వీధులన్నీ మురికి నీటితో నిండినట్లు కనిపిస్తాయి. ప్రతిదీ అసహ్యంగా కనిపిస్తుంది అతనికి. అదే ఆశావాదికి ఆ ఉదయం అన్ని రకాలుగా అందంగా కనిపిస్తుంది. వర్షపు బిందువులలో అందం గురించి, వర్షంలో స్నానం చేసిన పుష్పాల తాజాదనం గురించి, పొదలు మరియు చెట్ల నవీనతను గురించి మాట్లాడతాడు.

TS Inter 1st Year English Study Material Chapter 6 Two Sides of Life

Question 2.
How does Booker T Washington advise the teacher-trainees to develop frankness and honesty in their teaching? *(Imp, Model Paper)
Answer:
Booker T Washington is a world-famous Afro-American writer, activist and educator. His collection of speeches comes in the form of Character Building. A selection from that celebrated book our present lesson. It discusses the two sides of life. It recommends the positive side. The address is to teacher-trainees.

So, frankness and honesty on the part of teacher is highlighted here. It needs a very good teacher and a great person to say “I don’t know.” None knows everything of any subject. In fact, knowing that one doesn’t know something is the true education. To admit that fact, one needs frankness. Admitting the fact is honesty. Intellectual integrity is the need of the hour!

వ్యక్తిత్వ నిర్మాణంకు బుకర్ టి వాషింగ్టన్ ఉపన్యాసాలు చాలా శక్తివంతమైన వ్యాఖ్యలు. ఇతని ప్రసంగం Two Sides of Life లో మబ్బుపట్టిన ఉదయంకు వ్యక్తులు ఎలా స్పందిస్తారో ఇతను వివరిస్తున్నాడు. అది జీవితం యొక్క ఇరు పార్శ్వాలను చర్చిస్తుంది. సానుకూల దృక్కోణాన్ని అది మనకు సిఫారస్ చేస్తుంది. ఈ సంబోధన ఉపాధ్యాయ శిక్షకులకు, అందుకే, నిర్మొహమాటము, నిజాయితీ ఉపాధ్యాయులకు ఎంత అవసరమో నొక్కి చెబుతుంది ఇది.

“నాకు తెలియదు” అని చెప్పటానికి ఒక మంచి ఉపాధ్యాయుడు, ఒక గొప్ప వ్యక్తి అవసరం. ఏ అంశానికి సంబంధించైనా సంపూర్ణ పరిజ్ఞానం ఏ ఒక్క వ్యక్తికీ స్వంతం కాదు. నిజానికి ‘మనకు కొంత తెలియదు అని తెలుసుకోవడమే’ నిజమయిన విద్య. ఆ వాస్తవం ఒప్పుకోవడానికి నిర్మొహమాటం కావాలి. ఆ సత్యాన్ని ఒప్పుకోవడం నిజాయితీ. మేధోపర సమగ్రత ఇప్పటి అత్యవసరం !

Question 3.
Why does the speaker feel it unfortunate about the students who fail in assessing property the personality of their teachers ?
Answer:
Booker T Washington is a world-famous Afro-American writer, activist and educator. His collection of speeches comes in the form of Character Building. A selection from that celebrated book is our present lesson. It discusses the two sides of life. It recommends the positive side.

TS Inter 1st Year English Study Material Chapter 6 Two Sides of Life

Washington lists some mistakes students make about their teachers. He makes it clear that every teacher makes mistakes at times. It is human to err. He advises students to ignore such mistakes. He asks them to see the positive aspects of the lesson as well as the teacher. He emphasises the need to see the good and forget the bad. Good advice indeed!

వ్యక్తిత్వ నిర్మాణంకు బుకర్ టి వాషింగ్టన్ ఉపన్యాసాలు చాలా శక్తివంతమైన వ్యాఖ్యలు. ఇతని ప్రసంగం Two Sides of Life లో మబ్బుపట్టిన ఉదయంకు వ్యక్తులు ఎలా స్పందిస్తారో ఇతను వివరిస్తున్నాడు. అది జీవితం యొక్క ఇరు పార్శ్వాలను చర్చిస్తుంది. సానుకూల దృక్కోణాన్ని అది మనకు సిఫారస్ చేస్తుంది. ఉపాధ్యాయుల గురించి విద్యార్థులు చేసే కొన్ని పొరపాట్ల జాబితా ఇస్తున్నారు వాషింగ్టన్ ఇక్కడ.

ప్రతీ ఉపాధ్యాయుడు ఏదో ఒక సమయంలో పొరపాట్లు చేస్తారు అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు వారు. తప్పు చేయడం మానవ సహజం. అలాంటి లోటుపాట్లను పట్టించుకోవద్దని విద్యార్థులకు సలహా ఇస్తున్నారు వారు. అంతేకాక, ఉపాధ్యాయుల, మరియు వారి పాఠములలోని సానుకూల అంశాలపై దృష్టిపెట్టమని అడుగుతున్నారు. మంచిని చూసి చెడును వదిలివేయమని నొక్కి చెబుతున్నారు. నిజంగా గొప్ప సలహా !

Question 4.
The whole speech is on human traits. Comment with reference to Booker T Washington’s Two Sides of Life.
Answer:
Booker T Washington is a world-famous Afro-American writer, activist and educator. His collection of speeches comes in the form of Character Building. A selection from that celebrated book is our present lesson. It discusses the two sides of life. It recommends the positive side. Yes. The lesson discusses various traits of man. Indeed, it is about and from Character Building. It focuses on the optimism and pessimism mainly. It touches upon the need to be honest and frank. It dwells upon the world’s view of positive and negative sided people. It analyses man’s view of education. It highlights the desirable traits of teachers. Thus the entire piece is devoted to a debate on multiple human traits.
TS Inter 1st Year English Study Material Chapter 6 Two Sides of Life 4
వ్యక్తిత్వ నిర్మాణంకు బుకర్ టి వాషింగ్టన్ ఉపన్యాసాలు చాలా శక్తివంతమైన వ్యాఖ్యలు. ఇతని ప్రసంగం Two Sides of Life లో మబ్బుపట్టిన ఉదయంకు వ్యక్తులు ఎలా స్పందిస్తారో ఇతను వివరిస్తున్నాడు. అది జీవితం యొక్క ఇరు పార్శ్వాలను చర్చిస్తుంది. సానుకూల దృక్కోణాన్ని అది మనకు సిఫారస్ చేస్తుంది. అవును, ఈ పాఠం మనిషి యొక్క విభిన్న లక్షణముల గురించి చర్చిస్తుంది.

నిజానికి అది వ్యక్తిత్వ నిర్మాణం నుండి మరియు గురించి. అది ప్రధానంగా ఆశావాదము, నిరాశావాదముల మీద దృష్టి పెడుతుంది. నిజాయితీగా, నిర్మొహమాటంగా ఉండాల్సిన ఆవశ్యకతను కూడా స్పృశిస్తుంది. సానుకూల, అననుకూల దృక్పథం గలవారి పట్ల ప్రపంచానికి ఉన్న అభిప్రాయాన్ని కూడా వివరిస్తుంది. విద్యపట్ల మనిషి భావనలను విశ్లేషిస్తుంది. ఉపాధ్యాయుల యందు- ఉండవలసిన అభిలషణీయ లక్షణాలను నొక్కి చెబుతుంది. ఈ విధంగా మనిషి యొక్క అసంఖ్యాక లక్షణాలపై చర్చకు ఈ ఖండిక మొత్తం అంకితమవుతుంది.

TS Inter 1st Year English Study Material Chapter 6 Two Sides of Life

Question 5.
Match the following words in column’ A’ with their meanings in column ‘B’.
TS Inter 1st Year English Study Material Chapter 6 Two Sides of Life 5
Answers:
i) i
ii) h
iii) j
iv) d
v) a
vi) g
vii) e
viii) b
ix) f
x) c

Two Sides of Life Summary in English

TS Inter 1st Year English Study Material Chapter 6 Two Sides of Life 1
Booker T Washington was an American educator, author, orator and adviser to several Presidents of the United States. He founded Tuskegee Institute. He had had the habit of delivering practical, straightforward. Sunday Evening Talks to the students and teachers for many years in Tuskegee Institute. These addresses have had much to do with the building up of the characters of his race they are very forceful explanations of character building. They have been put together in a volume called Character Building. The present essay is a speech from this popular book.

TS Inter 1st Year English Study Material Chapter 6 Two Sides of Life

In this essay, the writer discusses the two sides-the bright, the dark of life through many more divisions are possible. Like the two sides of life, even people are of two classes. They are those who see only the bright side; the others who see only the dark. Both are likely to make mistakes by seeing only one side of the two. For example, the writer explains the reaction of the two types of persons to an overcast morning. The pesssimist feels that the morning is gloomy. He speaks of the mud-puddles. Whereas the optimist speaks of the beauties in the rain drops and the freshness of flowers, shrubs and trees.

In the same way, teachers may make mistakes sometimes. Then, they should say frankly and plainly that they have made a mistake. If they do not know anything, they have to accept it. A good teacher will say frankly and clearly. No teacher knows everything about every subject. It improves their honesty. Then students will respect them for their honesty. Therefore, each one who wishes to be a teacher must get that of discipline. They must get such training in life to be an honest teacher. They try their best to send out students with skills to see the bright side.

The writer also inspires the teacher train us to cultivate the habit of looking on the bright side of life. He advises them not emulate the people who are always negative. It is because they are undesirable. They make everyone mistake and unhappy. They never go forward.

They live on the negative side of life. On the other hand, the people who cultivates the habit of positive thinking encourage things in life. He is the strongest individual. Finally he advises his students to be a strong, positive, helpful force in the world. He warns them not to satisfy with second or third hand things in life. He also tells them to see the happier side more and spread cheer all round.

Two Sides of Life Summary in Telugu

బుకర్ టి వాషింగ్టన్ అమెరికన్ విద్యావేత్త, రచయిత, వక్త మరియు అనేక మంది అమెరికా అధ్యక్షులకు సలహాదారుడిగా కూడా ఉన్నాడు. తుస్కీజీ సంస్థను స్థాపించాడు. ఆ సంస్థలో వాస్తవ, సూటిగా ఆదివార సాయంత్ర ప్రసంగాలు విద్యార్థులు మరియు విద్యార్థునులకు అనేక సంవత్సరాలు ఇచ్చాడు. ఈ ప్రసంగాలు తన జాతి వ్యక్తిత్వ లక్షణాల నిర్మాణానికి తోడ్పడ్డాయి. అవి చాలా వ్యక్తిత్వ నిర్మాణానికి చాలా బలమైన వివరణలు ఆ ప్రసంగాల సంపుటిని వ్యక్తిత్వ నిర్మాణ పుస్తకంగా రూపుదిద్దుకుంది. ప్రస్తుత వ్యాసం కూడా ఆ పుస్తకం నుండి తీసుకొనబడిన ప్రసంగము.

TS Inter 1st Year English Study Material Chapter 6 Two Sides of Life

ఈ వ్యాసంలో అనేక రకాలుగా వివరించటానికి అవకాశం ఉన్నా, రచయిత జీవితం రెండువైపుల గురించి చర్చిస్తున్నాడు. అవి ఆశావాదం మరియు నిరాశావాదం. జీవితంలో రెండు వైపున జనులు కూడా రెండు రకాలు. వారు ఒకరు ఆశావాదులు మరొకరు నిరాశావాదులు. ఈ ఇద్దరూ కూడా రెండు వైపుల్లో ఒకవైపు మాత్రమే చూసి తప్పులు చేస్తారు. ఉదాహరణకు, రచయిత రెండు రకాల వ్యక్తులు వర్షం పడిన ఉదయానికి ఎలా ప్రతిస్పందిస్తారో వివరిస్తున్నాడు. నిరాశావాది ఆ ఉదయాన్ని మసకబారిన, మబ్బు పట్టిన దానిగా చూస్తాడు. అతడు బురదగుంతలు గురించి అసహనం వ్యక్తపరుస్తాడు. దీనికి భిన్నంగా ఆశావాది వర్షపు చుక్కల్లో అందాలను, పుష్పాల నూతన ఉత్తేజాన్ని, చిన్న పొదలను, ఆహ్లాదమైన మొక్కలను చూస్తాడు.

ఇదే విధంగా, అధ్యాపకులు కూడా తప్పులు చేయవచ్చు కొన్ని సందర్భాల్లో, అప్పుడు వారు బహిరంగముగా వాటిని ఒప్పుకోవాలి. వారికి ఏదైనా తెలియకపోతే, దాన్ని ఒప్పుకోవాలి. ఒకమంచి అధ్యాపకుడు వాస్తవాన్ని చెప్తాడు. ఏ ఒక్కరూ కూడా ప్రతి విషయాన్ని తెలిసి ఉండరు. దీన్ని ఒప్పుకోవటం వలన, వారి గౌరవం పెరుగుతుంది. నిజాయితీవారి విద్యార్థులు వారిని గౌరవిస్తారు. కావున, అధ్యాపకుడు కావాలనుకొన్న ప్రతి ఒక్కరూ అలాంటి నడవడిక అలవర్చుకోవాలి. నిజాయితీ గల అధ్యాపకుడిగా ఉండే విధంగా శిక్షణ పొందాలి. వారు సాధ్యమైనంతవరకూ విద్యార్థులు ఆశావాదంవైపు ఉండేలా బయటకు పంపాలి.

అనుకూల, ఆశావాదం వైపు చూసే విధంగా అలవాటు కల్పించుకోవాలని ఆ అభ్యాసకులకు స్ఫూర్తి నింపుతున్నాడు. నిరాశావాదులను అనుసరించ వద్దని వారికి సలహా ఇస్తున్నాడు. ఎందుకంటే వారు కోరదగిన వారు కాదు. వారెప్పుడూ ముందుకు వెళ్ళరు. వారు ప్రతి ఒక్కరిని నిరాశావాదులు. దుఃఖాలను చేస్తారు. వారు నిరాశవాదులుగా జీవిస్తారు.

మరొక వైపు ఆ ఆశావాదంలో ఉండేవారు జీవితంలో పనులను ప్రోత్సహిస్తారు. అతనే గట్టి వ్యక్తి. చివరగా, అతను, తన విద్యార్థులకు బలంగా, అనుకూల ఆలోచన (ఆశావాదం) సహాయ బలం కలిగి ఉండమని సలహా ఇస్తున్నాడు. మరొకరి నుండి పొందిన వాటి నుండి సంతృప్తి చెందవద్దని తన విద్యార్థులను హెచ్చరిస్తున్నాడు. సంతోషకరం వైపు మాత్రమే చూస్తూ, చుట్టూ సంతోషంను వ్యాప్తి చెందించమని వారికి చెప్తున్నాడు.

Two Sides of Life Summary in Hindi

garళ లే alf itc7 (1856-1915) YAA loni Mandal, cor, Af, aftra fH निपुण तथा सलाहकार थे । वे अमीरीका में स्थित अफ्रीकियों के प्रतिभासंपन्न नेता थे । वे ‘टस्किगी’ नामक शिक्षा – संस्था की स्थापनाकर शिक्षार्थियों और शिक्षकों को व्यक्तित्व विकास भाषण क्रमशः देते थे । उन प्रेरणाप्रद भाषणों का समाहार ही उनकी ‘व्यक्तित्व निर्माण’ – ‘Character Building’ नामक पुस्तक है । उसी (The Two sides of Life)।

जीवन बहुपार्खमय है, तो वे यहाँ दो पार्खों की चर्चा ही करते हैं – सकारातमक और नकारात्मक | उसी प्रकार व्यक्ति भी दो तरह के हैं – रात मन से प्रकासित मुख को देखनेवेले और इसके विरुद्ध विपुत्साह एवं विषाद से सभी में अंधकारमय कोण को देखनेवेले । आशावह मनोवृत्ती ही होकर अंधकारमय कोण को सभी न देखना ठीक नहीं हैं । नकारात्मक वाद ज्यादातर निवारणनीय हैं। दुनिया तो सकारात्मक आलोचनीय व्यक्तियों का आदर करती है, उनसे प्रेम करती है और उनका समर्थन करती है । ये व्यक्ति बरसती वर्षा का आस्वादन करनेवाले हैं । बौछार और दलदल से घृणा करनेवाले दूसरे व्यक्ति होते हैं ।

TS Inter 1st Year English Study Material Chapter 6 Two Sides of Life

कक्षाओं में पदाते समय आचार्यों से गलतियाँ हो सकती हैं, क्योंकि इस विषय में कोई भी सर्वज्ञ नहीं है | आचार्य उनको पहचानकर सीधा । मानलेना चाहिए । विद्यार्थियों को भी आचार्यों में स्थित अच्छाई को देखकर उनकी कमियों की उपेक्षा करनी चाहिए । आचार्यो बननेवाले विद्यार्थियों को भी अपनी सच्चाई का संबर्धनकर अपनी गलतियों को मानना चाहिए ।

सकारात्मक मनोवृत्ति को अभ्यास से पाकर चारों ओर महदानंद – प्रकाश फैला सकते हैं। सकारात्मक मनोवृत्ति धारणकर अंधकारमय कोण एवं विषाद को देखनेवाले अधिक संख्या में दिखाई देते हैं । दुर्भाग्य से वे ही ज्यादातर लोगों को आसानी से प्रभावित कर रहे हैं । अच्छाई की अपेक्षा बुराई ही ज्यादा जल्दी फैल रही है । अतः सुनहले भविष्यवाली युवापीढ़ी को अच्छाई और बुराई को अपनी स्वीय आलोचना से पहचानकर सकारात्मक मनोवृत्ति से अह्लादानंद समाज का सृजन करना चाहिए ।

Meanings and Explanations

schooling (v+ing) / sku:liŋ/ (స్కూలింగ్ ) (disyllabic) : training, educating, శిక్షణ ఇస్తున్న, విద్యాబ్యాసం చేస్తున్న , शिक्षा की शखा

consciously (adv) /konsəs//i/ (కొష్యస్ లి ) (trisyllabic) : knowingly, deliberately, తెలిసి, అవగాహనతో, ఉద్దేశ్యపూర్వకంగా , जानकारी

constantly (adv) /konstentli/ (కోన్ స్టెన్ ట్ లి ) (trisyllabic) : continuously, steadily, నిరంతరంగా , स्थिर

notwithstanding (prep-here) / notwinståndin / (నోట్ విద్ స్టాండింగ్) (polysyllabic – 4 syllables) : in spite of, అయినప్పటికీ

accomplish (v) /ōkamplirf/ (అకమ్ ప్లిష్) (trisyllabic) : attain, achieve, సాధించు , हासिले कहना

on account of (phrasal prep.): because of, ఈ కారణం వలన

appreciating (v+ing) /pri:fieitin/ (అప్రిషిఎఇటింగ్ ) (polysyllabic) : realising the value, విలువను గుర్తిస్తూ ఉన్న , मूल्य बढाना

overcast (adj) /suva(r)ka:st/ (అఉవ(ర్) కాస్ట్) (trisyllabic) : cloudy, మేఘావృతమైన , मेघाच्छादित

gloomy (adj) /glumi/ (గ్లుమి) (disyllabic) : dim, మసక మసకగా ఉన్న

disconsolate (adj) / diskonsa lot / ( డిస్ కోన్ సలట్) : extremely sad, చాలా విచారముగా ఉన్న

TS Inter 1st Year English Study Material Chapter 6 Two Sides of Life

standpoint (n) /ståndpoint/ (స్టాండ్ పోఇన్ ట్) (disyllabic) : a way of thinking, perspective, ఆలోచనా విధానము, దృక్పదము , परिप्रेद्य

unpalatable (adj) / (అన్ ప్యాలటబ్ ల్) (polysyllabic): not tasting good, రుచిగా లేని

dwell upon (phrasal verb) : to think or discuss a lot about something, ఏదైనా ఒక అంశం గురించి చాలా ఆలోచించుట లేదా చర్చించుట

frankly (adv) /fraærkhi/ (ఫ్ర్యాంక్) (disyllabic) openly, ముక్కు సూటిగా, నిర్మొహమాటంగా, నిజాయితీగా, स्पष्टवादी, निष्कपट

proportion (n) /prapo:(r)(n/ (ప్రపో(ర్)షన్) (trisyllabic): part, భాగము, మోతాదు, अलग करना

overlook (v) /auva (r)luk/ (అఉవ(ర్)లుక్) (trisyllabic): not to take notice of, ignore, పట్టించుకొనకుండా, 377cut l

earnestness (n)/3:(r)nistnes/ (అ(ర్)నిస్టిస్) (trisyllabic) : sincerity, గాంభీర్యము, అంకిత భావము

seize (v) /si:z/ (సీజ్) (monosyllabic) : catch hold of, తీసుకొను

influence (v-here) /mfluons/ (ఇన్ఫ్లుఅన్స్) (trisyllabic) : to have an effect on, ప్రభావితము చేయు

tales (n-pl) /teilz/ (టెఇల) (monosyllabic): stories, కథలు, कहानी

woe (n) /wau/ (వఉ) (tri): grief, gloom, బాధ, విచారము, शोक

disposition (n)/dispozi(n / (డిస్పజిషన్) (polysyllabic) : nature, character, స్వభావం, వ్యక్తిత్వము, स्वभाव

cultivates (v) /kAliveit/ (కల్టివెఇట్) (trisyllabic) : nurture, forster, అలవరచుకొను, పెంపొందించుకొను

TS Inter 1st Year English Study Material Chapter 13 The Short-sighted Brothers

Telangana TSBIE TS Inter 1st Year English Study Material 13th Lesson The Short-sighted Brothers Textbook Questions and Answers.

TS Inter 1st Year English Study Material 13th Lesson The Short-sighted Brothers

Paragraph Answer Questions (Section – A, Q.No. 5, Marks : 4)

Question 1.
Is the title, “The Short-sighted Brothers” apt to the story ? Explain.
Answer:
Yes. The name “The Short-sighted Brothers” and the content of the story look like made-for- each-other things. The title matches perfectly well with the theme. Three brothers are the lead characters. All the three brothers were very short-sighted. It was a physical disability. And they all suffered from the related mental disability too. They failed to see the possible result of their crooked,plans. They were selfish. They were greedy. They tried to cheat one another. Finally their follies were exposed. As the entire story deals with their physical and mental short- sightedness, the title is appropriate to this ancient chinese folk tale.

అవును. “హ్రస్వదృష్టి కల సోదరులు” అనే పేరు, ఆ కథ ప్రధానాంశం ఒకరికోసం ఒకరు సృష్టించబడినవి లాగా కనిపిస్తాయి. కథ నామము, కథ అంశము సరిగ్గా జతకలుస్తాయి. ముగ్గురు సోదరులు ప్రధాన పాత్రలు. ముగ్గురికీ తీవ్ర హ్రస్వదృష్టి. అది భౌతిక, శారీరక లోపము. అయితే వారికి సంబంధిత మనోవైకల్యం కూడా ఉంది. వారి యొక్క హేయ, దురుద్దేశ పూర్వక ఎత్తుగడల పరిణామాలను ఊహించలేకపోయారు. వారు స్వార్థపరులు. వారిది అత్యాశ. వారు ఒకరినొకరు మోసం చేయాలనుకున్నారు. అంతిమంగా వారి మూర్ఖత్వం బహిర్గతం చేయబడింది. కథ మొత్తం కూడా వారి యొక్క భౌతిక, మనోవైకల్యాల (హ్రస్వదృష్టి) గురించిన చర్చే కాబట్టి, ఈ ప్రాచీన చైనీయుల జానపద గాథకు ఆ పేరు సరిగ్గా సరిపోయింది.

TS Inter 1st Year English Study Material Chapter 13 The Short-sighted Brothers

Question 2.
How did the three brothers try to outsmart one another ?
Answer:
“The Short-sighted Brothers” is a famous Chiness folk story. It exposes the folly of the three brothers. All the three brothers were very short-sighted. Even their personality suffered from the same flaw. They tried to deceive themselves and one another. The youngest brother one day proposed to take charge of their family finances.

He cited his eldest brother’s short- sightedness to support his claim. The second brother too joined the race. The eldest brother proposed a test to prove the power of their sight. They should read the inscription on the newly installed tablet on the door way of the nearest monastery. To outsmart one another, each met the monk secretly and learnt about the writing on it.

“హ్రస్వదృష్టి కల సోదరులు” అనేది ప్రఖ్యాత చైనీయుల జానపద గాథ. అది ఆ ముగ్గురు సోదరుల మూర్ఖత్వాన్ని ఎత్తి చూపుతుంది. ఆ ముగ్గురు సోదరులూ చాలా తీవ్రంగా హ్రస్వదృష్టి కలవారు. వారి వ్యక్తిత్వంలో కూడా అదే లోపము. వారిని వారు మోసం చేసుకుంటూ, ఒకరినొకరు మోసం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఒక రోజున అందరిలో చిన్న సోదరుడు కుటుంబ ఆర్థిక వ్యవహారాల బాధ్యతను తనకు అప్పగించమని ప్రతిపాదన చేస్తాడు.

అందుకు మద్దతుగా పెద్దన్నయ్య హ్రస్వదృష్టిని కారణంగా పేర్కొంటాడు. రెండవ సోదరుడూ పోటీలో జతకలుస్తాడు. వారి చూపుడు శక్తిని పరీక్షించుకోవడానికి పెద్ద సోదరుడు ఒక ప్రతిపాదన చేస్తాడు. వారు కొత్తగా, సమీప సన్యాశ్రమ ద్వారంపై ఏర్పాటు చేసిన శిలాఫలకంపై రాతను చదవాలి. మోసపూరితంగా తమదే పై చేయి అనిపించుకొనుటకు, ప్రతి ఒక్కరూ రహస్యంగా ఒక సన్యాసిని కలిసి, ఆ రాతి పలకపైన ఉన్న రాత గురించి తెలుసుకుంటారు.

TS Inter 1st Year English Study Material Chapter 13 The Short-sighted Brothers

Question 3.
Were the three brothers successful in executing their tricks ? Support your answer.
Answer:
No. The three brothers failed in their efforts. The famous Chinese folk tale “The Short-sighted Brothers”, explains their failure. All the three brothers were very short-sighted. Once, they wanted to prove the power of their sight. They were to read an inscription. Each learnt secretly from the monk about the writing.

They thought they could outsmart the others. They visited the monastery the next day. They started READING from the TABLET. Each one READ out. Then the monk came out. He told them that the TABLET was not yet put up! They READ from the TABLET that WAS NOT there! Their folly was exposed. They realised it!

లేదు. ఆ ముగ్గురు సోదరులు తమ ప్రయత్నాలలో విఫలమయ్యారు. ఈ ప్రఖ్యాత చైనీయుల జానపద గాథ. “హ్రస్వదృష్టి కల సోదరులు” వారి వైఫల్యాన్ని వివరిస్తుంది. ఆ ముగ్గురు సోదరులు అందరిదీ తీవ్ర హ్రస్వదృష్టి లోపము. ఒకసారి వారు తమ దృష్టి శక్తిని నిరూపించుకోదలిచారు. వారు ఒక రాతిపలక మీద రాతను చదవాలి. ఒక సన్యాసి ద్వారా వారిలో ప్రతి ఒక్కరూ రహస్యంగా ఆ రాత గురించి తెలుసుకున్నారు.

వారు ప్రతి ఒక్కరు ఇతరులపై తమదే పై చేయి అని నిరూపించగలము అనుకున్నారు. మరుసటి రోజు వారు ఆ సన్యాసాశ్రమాన్ని సందర్శించారు. వారు ఆ శిలాఫలకము చూసి చదవనారంభించారు. ప్రతి ఒక్కరూ చదివారు. అప్పుడు ఆ సన్యాసి బయటకు వచ్చారు. వారితో ఆ రాతి పలకను ఇంకా ఏర్పాటు చేయలేదు అని వివరిస్తారు. అక్కడ లేని రాతిపలకపై రాతను వారు చదివారు ! వారి మూర్ఖత్వం బహిర్గతమైంది. వారూ గుర్తించారు దాన్ని,

Question 4.
Does the story “The Short-sighted Brothers’ support the wise saying, ‘Honesty is the best policy’ ? Discuss. * (Imp) (Model Paper)
Answer:
Yes. Honesty is undoubtedly the best policy. It is certainly very difficult to practise the policy. The story, The Short-sighted Brothers’ proves both these points clearly. All the three brothers were short-sighted. They were selfish. They had no ethical values. They thought they could easily cheat others.

TS Inter 1st Year English Study Material Chapter 13 The Short-sighted Brothers

They got by heart the inscription ‘Be Honest At All Times’. But they never understood its meaning or its importance. They followed dishonest means to prove the power of their sight. Their follies were exposed. Thus, they learnt that their deceptive tricks failed. Only honesty shines forever! And through the brothers, the readers too get a valuable lesson.

అవును. నిజాయితీ నిస్సందేహంగా అత్యుత్తమ విధానం. ఆ విధానాన్ని పాటించడం నిశ్చయంగా చాలా కష్టము. “హ్రస్వదృష్టి కల సోదరులు” అనే కథ ఈ రెండు విషయాలను స్పష్టంగా నిరూపిస్తుంది. వారికి నైతిక విలువలు లేవు. వారు ఇతరులను తేలికగా మోసం చేయగలము అనుకున్నారు. ‘అన్ని వేళలా నిజాయితీగా ఉండండి’ అనే శిలాక్షరాలను కంఠస్థము అయితే చేశారు.

కాని దాని భావాన్ని అర్థం చేసుకోవటం కాని, దాని ప్రాధాన్యతను గుర్తించటం కానీ ఎప్పుడూ చేయలేదు. వారి దృష్టి శక్తిని నిరూపించుకోవడానికి తప్పుడు మార్గాలు అవలంబించారు. వారి మూర్ఖత్వము బహిర్గతం చేయబడింది. ఈ విధంగా వారు గ్రహించారు తమ మోసపూరిత ఎత్తుగడలు విఫలమయ్యాయని. కేవలం నిజాయితీ మాత్రమే శాశ్వతంగా వర్ధిల్లుతుంది. ఆ ముగ్గురు సోదరుల ద్వారా పాఠకులకు కూడా ఒక విలువైన పాఠం అందుతుంది.

The Short-sighted Brothers Summary in English

TS Inter 1st Year English Study Material Chapter 13 The Short-sighted Brothers 1
The folk tale, ‘The Short-sighted Brothers’ makes an interesting reading. With its gripping narration, the story excites the reader thoroughly. In the end takes a sudden twrist, stunning and surprising the reader. Equally shocked were the brothers in the story. It exposes the follies of the brothers, prompting many a reader to introspent.

The three aged brothers were the central characters in the story. They were short sighted, both physically and mentally. They were selfish and greedy. Citing their eldest brother’s short- sightedness as a reason, the youngest brother proposed to manage their family finales. He was blind to his own disability. All of them suffered from the same flow, sight problems and lack of values. Yet, each tried to outmart the other.

TS Inter 1st Year English Study Material Chapter 13 The Short-sighted Brothers

Therefore, they planned to test their own vision by reading the inscription above the doorway of nearby monastery. Each knew that he couldn’t read it. So, they secretly and separately enquired with monk there as to what was written on the tablet. And later, they pretended they were reading the inscription with their own eyes. In the process, they fooled themselves they memorised the quotation, “Be honest at all times”. But, they did not adopt it in their own lives! They failed to see the outcome of their evil plans. It was then, that the monk revealed that the tablet was not put up yet. The brothers realized how foolish they were !

Finally, the story clearly shows the physical weakness of the brothers. It also exposes their follies. Hence, we can very strongly say that the title suits the story well. If at once tells us what we are going to find in it.

The Short-sighted Brothers Summary in Telugu

హ్రస్వదృష్టి కల సోదరులు. (The Short-sighted Brothers) అనే కథ ఒక చైనీయుల జానపద గాథ. అది చక్కని సందేశాన్ని, ఆకట్టుకునే రీతిలో తెలుపుతుంది. మితిమీరిన స్వార్థం, ముందు చూపు లోపించి చేసే తప్పుడు పనులు మనల్ని నవ్వుల పాలు చేస్తాయి అని వివరిస్తుంది ఈ కథ. ఒక నగరంలో (చైనాలో) ముగ్గురు అన్నదమ్ములు నివసించేవారు. ముగ్గురికీ తీవ్ర స్థాయిలో హ్రస్వదృష్టి. చాలా దగ్గరలో ఉంటే మాత్రమే కనిపిస్తాయి. అపరిమిత స్వార్థం. అడ్డదారిలో కోరికలు నెరవేర్చుకోవాలని తపన. ఒక రోజు చిన్న తమ్ముడు అంటాడు : పెద్ద అన్నయ్య చూపు లోపాన్ని ఇతరులు దుర్వినియోగం చేసుకుంటారు.

కావున ఇంటి డబ్బు విషయాలు నేను చూస్తాను అని. ఆ విషయానికి వస్తే, అందరికన్నా నా చూపు మెరుగు, కావున ఆ పెత్తనం నాకు కావాలి అంటాడు, రెండవ సోదరుడు. అలానా ? అయితే, ఎవరి చూపు నిజంగా బాగా ఉందో పరీక్షించుకుందాము అని పెద్ద సోదరుడు ప్రతిపాదిస్తాడు. ఊరి చివరి ఉన్న ఒక సన్యాసాశ్రమం ముఖద్వారంపై ఒక మంచి సూక్తి చెక్కబడిన శిలాఫలకాన్ని ఈ రాత్రి ఏర్పరుస్తారట.

రేపు ఉదయం _ ముగ్గురం అక్కడికి వెళ్ళి, ఎవరు ఎంత చక్కగా చూడగలరో తేల్చుకుందాము అంటాడు. అందరూ ఒప్పుకుంటారు. ఆ రాత్రి ఒకరికి తెలియకుండా ఒకరు రహస్యంగా ఆ ఆశ్రమానికి వెళ్ళి, అక్కడి సన్యాసిని వివరాలు అడుగుతారు. “ఎప్పటికీ నిజాయితీగా ఉండు” అనే సూక్తి, చైనీయుల ప్రసిద్ధ తత్వవేత్త కన్ఫ్యూషన్ చెప్పినది, ఆ రాతి పలక మీద చెక్కించాము అని సన్యాసి వివరిస్తారు పెద్ద అన్నయ్యకు.

TS Inter 1st Year English Study Material Chapter 13 The Short-sighted Brothers

రెండవ సోదరుడు ఏమైనా అలంకారం ఉందా అని ప్రశ్నించి, పువ్వుల తీగ అలంకారం ఉంది అనే సమాధానాన్ని పొంది, తన తెలివికి తానే సంతోషిస్తూ వెను తిరుగుతాడు. అందరికంటే చిన్నవాడు, మరింత అదనపు సమాచారం కింద ఒక మూలగా, దాత పేరు ఉన్నట్లు సేకరిస్తాడు. మరునాడు ఏమీ ఎరగనట్లు ముగ్గురు సోదరులూ సన్యాశ్రమం చేరుకుంటారు. పెద్దవాడు ముఖ ద్వారం వైపు చూస్తూ, రాత్రి తెలుసుకున్న సూక్తిని “చదువుతాడు”.

దానికి అదనంగా రెండవ వాడు పూవుల తీగ అలంకారం ఉంది అంటాడు. ఆ ఇద్దరికన్నా మిన్నగా దాత పేరు “చదువుతాడు” చిన్నవాడు. ఒకరిని మరొకరు ఓడించగలిగినట్లు సంబరపడుతున్న సమయంలో, రాత్రి వీరు ముగ్గురూ మాట్లాడిన సన్యాసి బయటికి వచ్చి, వారితో “క్షమించండి. రాత్రి ఆ శిలాఫలకం పెట్టలేకపోయాము. ఈ రోజు ఏర్పరుస్తాము. మీరు అది చూడాలని వచ్చారు” అంటాడు. వారి మూర్ఖత్వం బయటపడింది. తమ తెలివితక్కువతనం బయటపడగా, తలలు వంచుకున్నారు. “ఎప్పుడూ నిజాయితీగా ఉండండి” అనే సూక్తిని కంఠస్థం చేశారు. ఆచరించలేకపోయారు.

The Short-sighted Brothers Summary in Hindi

‘हस्व दुष्टि होनेवाले भाई” – The Short- Sights Brootters’ नामक कहानी चीनी देश को लोक कथा है | यह कथ शिक्षा देती है कि अति स्वार्थ, दुर दर्षित के अभाव के कारण होने वाली वाले गलत काम हमें अपहास करते है । एक चीनी शहर में तीन भाई रहते हैं। तीनों ह्रस्व दृष्टि वाले हैं। सभी अपरमित स्वार्थी, बेर्ढतनी से अपनी इच्छाएँ पूरे करने के लिए छटपटानेवाले हैं । एक दिन छोटा भाई कहता है कि वड़े बाई की ह्रस्व दृष्टि का दूसरे लोग दुरुपयोग करते है ।

इसलिए प्यार के पैसे का मामला मैं देख लेता हुँ । दुसरा भाई कहता है कि ऐसा है। बड़ाभाई कहता है कि किसकी दृष्टि अच्छी है, इसकी जाँच करेंगे । गाँव के एक कोने में स्थित सन्यासाश्रम के मुख्यद्वार पर इस रात को सूक्ति अचित शिलाफलक आयोगित किया जाएगा । पालुस करेगे कि कल सबेरे तीनों जाकर कौन कितना अच्छा देख सकता है । सभी मान लेते हैं । उस रात को सभी एक-एक करके रहस्य से अश्रम जाकर वहाँ के सन्यासी से जानाकारी लेते हैं। अगले दिन तीनों जाकर बडा भाई पहली पंक्ति याद रखकर पढता है । दूसरा भाई दूसरी पंक्ति याद रखकर पढता है ।

TS Inter 1st Year English Study Material Chapter 13 The Short-sighted Brothers

छोटा भाई अंतिम पंक्ति याद रखकर पढता है। हर एक भाई खुशी में है कि उसने बाकी दूसरों को हराया है । इनकी बातों को सुनकर सन्यासी बाहर आकर बताता है कि माफ़ कीजिए, कल रात को शिलाफलक का प्रबंध नहीं हो पाया । आज इसका आयोजन किया जाएगा । इस देखने आप लोग आए होंगे। उनकी मूर्खता मालूम होने पर सब अपना-अपना सिर ॠकाते हैं। शिलाफलक पर उत्कीर्ण सूक्ति ‘हमेशा ईमानदारी से रहो का कंठस्थ करते हैं, लेकिन ने उस सूक्ति का पालन नहीं कर पाते हैं ।

Meanings and Explanations

short-sighted (adj) /sɔ:(r)t saıtıd/ (షో(ర్)ట్ సైటిడ్) (trisyllabic) = not able to see things etc clearly when they are not very near to that person; హ్రస్వదృష్టి లోపం కల; దగ్గరి వస్తువులను మాత్రమే చూడగల.

folklore (n) /fǝuklɔ:(r)/ (ఫఉక్ లో(ర్)) (disyllabic) a collection of conventional tales passed on to posterity orally : మౌఖికంగా భావితరాలకు అందించబడే సాంప్రదాయ కథలు; జానపద గాథలు

to take charge of (phrasal verb) to be in the control of; to take responsibility of : అదుపులో, అధీనంలో ఉంచుకొను; బాధ్యత వహించు

to take advantage of (phrasal verb) = to make use of a situation for one’s selfish interests: ఒక పరిస్థితిని తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకొను

sneer (v) /sniǝ(r)/ (స్నిఅ(ర్)) (monosyllabic) = speak harshly; say something without respect: కఠినంగా, అవమానకరంగా మాట్లాడు, अवहेलना, तिरस्कार

monastery (n) /monǝstri/ (మొనస్ ట్ రి) (trisyllabic) = a place where sages, ascetics, etc. live: సన్యాసాశ్రమము, मट

tablet (n) /tæblet/ (ట్యాబ్ లెట్ ) (disyllabic) = a slab of stone/clay for carving: రాతి (మట్టి) పలక; pill = మాత్ర; an electronic device = ఒక ఎలక్ట్రానిక్ పరికరము; చిన్న కంప్యూటర్, गोली

inscription (n) /inskripsən/ (ఇన్ స్ క్రిప్ షన్) (trisyllabic) = writing or carving on a stone surface : రాతిపలకపైని రాత

strain (n) /strein/ (స్ట్రైఇ న్) (monosyllabic) pressure; difficulty: ఒత్తిడి, కష్టము, कसकर तीनाना

TS Inter 1st Year English Study Material Chapter 13 The Short-sighted Brothers

in unison (phrase – functions as an adverbial) = all together and at a time: అందరూ కలిసి ఒకే సమయంలో (చెప్పు)

get a few winks (idiom) = sleep for a little while: కొద్దిసేపు నిద్రించు

sneak (v) /sni:k/(స్నేక్ ) (monosyllabic) = go without anyone’s knowledge: ఎవరికీ తెలియకుండా (రహస్యంగా) వెళ్ళు, जाव

monk (n) /maŋk/ (మంక్ ) (monosyllabic) a member of an all male-member religious group : సన్యాసి; అందరూ మగవారు మాత్రమే ఉండే మత బృంద సభ్యుడు, मट

Confucius (proper noun) /kənfjʊ:səs/ (కన్ ఫ్యూషన్) = a very famous philosopher from ancient China (550-479 B.C) : చైనాకు చెందిన ప్రాచీన కాలపు ప్రఖ్యాత తత్వవేత్త

chuckle (v) /tsakǝl/ (చకల్) (disyllabic) = laugh silently and inwardly : తమలో తాము నిశ్శబ్దాన్గా నవ్వుకొను

triumphantly (adv) /trai^mfǝntli/ (ట్రయ్ అమ్ షన్ ట్ లి) (polysyllabic-4 syllables) over the success : విజయ గర్వంతో, ఆనందంగా

applaud (v) /ǝplɔ:d/ (అప్లౌడ్) (disyllabic) = praise; appreciate; పొగడు, మెచ్చుకొను

TS Inter 1st Year English Study Material Chapter 13 The Short-sighted Brothers

besides (preposition) /basardz/ (బసైడ్) (disyllabic) = in addition to : అదనముగా

face falling (phrase) = looking sad; విచారంగా కనిపించు

intone (v) /Intaun/ (ఇన్టఉన్) (disyllabic) = say something and emphatically; నెమ్మదిగా, నొక్కి, నొక్కి అను, చెప్పు

follies (n-pl. of ‘folly’) /foliz/ (ఫొలిజ్) = foolishness; మూర్ఖత్వము, క్లాత్

TS Inter 1st Year History Study Material Textbook Solutions Telangana

TS Intermediate 1st Year History Study Material Textbook Solutions Telangana

TS Inter 1st Year Maths 1A Study Material Pdf Download | TS Intermediate Maths 1A Solutions

TS Inter 1st Year Maths 1A Textbook Solutions Pdf Download | TS Inter Maths 1A Study Material Pdf

TS Inter 1st Year Maths 1A Functions Solutions

TS Inter 1st Year Maths 1A Mathematical Induction Solutions

TS Inter 1st Year Maths 1A Matrices Solutions

TS Inter 1st Year Maths 1A Addition of Vectors Solutions

TS Inter 1st Year Maths 1A Products of Vectors Solutions

TS Inter 1st Year Maths 1A Trigonometric Ratios upto Transformations Solutions

TS Inter 1st Year Maths 1A Trigonometric Equations Solutions

TS Inter 1st Year Maths 1A Inverse Trigonometric Functions Solutions

TS Inter 1st Year Maths 1A Hyperbolic Functions Solutions

TS Inter 1st Year Maths 1A Properties of Triangles Solutions

TS Inter 1st Year Maths 1B Blue Print Weightage

TS Inter 1st Year Chemistry Notes

TS Intermediate 1st Year Chemistry Notes

TS Inter 1st Year Chemistry Notes in Telugu Medium

TS Inter 1st Year Chemistry Notes in English Medium

TS Inter 1st Year Accountancy Notes

TS Intermediate 1st Year Accountancy Notes