TS Inter 1st Year History Study Material Chapter 7 దక్షిణ భారతదేశ రాజ్యాలు

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 7th Lesson దక్షిణ భారతదేశ రాజ్యాలు Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 7th Lesson దక్షిణ భారతదేశ రాజ్యాలు

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పృధ్వీరాజ్ రాసో గురించి రాయండి.
జవాబు.
రాజపుత్రుల పుట్టుక గురించి మరొక ఆసక్తికరమైన విషయాన్ని “పృధ్వీరాజ్ రాసో” అనే హింది కావ్యంలో చాంద్ బర్దాయ్ అనే కవి తెలియజేసాడు. ఇతడి ప్రకారం అబూ పర్వతం మీద వశిష్టుడు చేసిన హోమాగ్ని నుంచి ఉద్భవించిన వీరుడి సంతతి వారైనందువల్ల వీరు అగ్నికుల క్షత్రియులయ్యారని పేర్కొన్నాడు. ఈ యజ్ఞగుండం నుంచి నలుగురు వీరులు ఉద్భవించారని వారు ఒక్కొక్కరు ఒక్కొక్క రాజపుత్ర రాజ్యాన్ని స్థాపించారనే అభిప్రాయం కలదు. చౌహానులు, సోలంకీలు లేదా చాళుక్యులు, పరమారులు, ప్రతీహారులు ఈ వంశీయులని పేర్కొన్నాడు.

ప్రశ్న 2.
రాజతరంగిణి ప్రాధాన్యత.
జవాబు.
ప్రాచీన భారతదేశంలోని ముఖ్యమైన చారిత్రక రచన కల్హణుడు రచించిన ‘రాజ తరంగిణి’. ఇది క్రీ.శ. 1148 సం॥లో రచించబడినది. ఇది కాశ్మీర్ రాజుల చరిత్ర. కాశ్మీర్ వారు చరిత్రపట్ల అత్యంత ఆసక్తిని కనబరిచారని కల్హణుడు తెలియజేసినాడు. చరిత్రపట్ల ఆసక్తిని కలిగిన కల్హణుడు లభించిన ఆధారాలను ఉపయోగించి గొప్పగా రచించాడు.

ప్రశ్న 3.
భోజరాజు రచనలు ఏవి ?
జవాబు.
భోజరాజును “కవుల్లో రాజకుమారుడు” అంటారు. భోజరాజు కవితల మీద ‘సరస్వతీ కంఠాభరణం’, ‘శృంగార ప్రకాశ’ రాజనీతిపై ‘యుక్తికల్ప తరువు’, యోగ సూత్రాలపై ‘రాజమార్తాండ’ వ్యాఖ్యానం రచించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 7 దక్షిణ భారతదేశ రాజ్యాలు

ప్రశ్న 4.
అరబ్ దండయాత్రల ప్రభావం.
జవాబు.
ఇస్లాం మతాన్ని అరేబియా నుంచి తూర్పుదిశగా వ్యాప్తి చేయాలనేది అరబ్ల లక్ష్యం. దీనికై వారు అనేకసార్లు -దాడులు చేసారు. ఖలీఫా వాలిద్ అరేబియాను పాలిస్తున్న రోజులలో సింధ్ను ‘దాహిర్’ పరిపాలించేవాడు. సింధ్ రాజ్య సముద్ర దొంగలు. ఖలీఫా కోసం తీసుకెళుతున్న ఓడలను దోచుకున్నారు. దీనిపై దాహిర్ను వివరణ అడిగి సరైన సమాధానం లేదనే సాకుతో క్రీ.శ. 712లో మహ్మద్-బీన్-ఖాసిం నేతృత్వంలో దండెత్తాడు. ‘అలోర్’ వద్ద జరిగిన యుద్ధంలో దాహిర్ ఓడి ప్రాణాలు కోల్పోయాడు. భారతీయుల అనైక్యత అరబ్బుల దాడి విజయవంతం కావడానికి తోడ్పడింది. అయితే ఆచార్య లేనప్పూల్ అరబ్బుల సింధు ఆక్రమణను సత్ఫలితాలివ్వని ఘనవిజయంగా వర్ణించాడు.

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రెండో పులకేశి వ్యక్తిత్వాన్ని, విజయాలను వివరించండి.
జవాబు.
రెండో పులకేశి (క్రీ.శ. 609-642): రెండో పులకేశి బాదామి చాళుక్యుల్లోనే గాక ప్రసిద్ధ భారతీయ చక్రవర్తుల్లో ఒకడు. గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత దక్షిణాపథాన్ని పూర్తిగా జయించి ఏలిన మొదటి సార్వభౌముడు రెండో పులకేశి. ఇతని విజయాలను రవికీర్తి అనే జైన పండితుడు ‘ఐహోలు’ (ఐహోళి) శాసనంలో వివరించాడు. అధికారాన్ని . సుస్థిరం చేసుకున్న తర్వాత, రెండో పులకేశి దిగ్విజయ యాత్రలు సాగించాడు. ఇతడు బనవాసి, కొంకణ రాజ్యాలను జయించాడు. లాట, మాళవ, అళుప (ఉడిపి మండలం), ఘూర్జర ప్రభువులనణచి సామంతులుగా చేసుకున్నాడు. దక్షిణ కోసల, కళింగ రాజ్యాల మీద దండయాత్రలను నిర్వహించాడు. పిష్ఠపురం, కునాల (కొల్లేరు) యుద్ధాల్లో విజయాన్ని సాధించి వేంగిని ఆక్రమించాడు. అనంతరం తన తమ్ముడైన కుబ్జవిష్ణువర్ధనుణ్ణి ఈ ప్రాంతానికి రాజుగా నియమించాడు. పులకేశి మరణం తర్వాత, వేంగీ పాలకులు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుని, తూర్పు చాళుక్యులు లేదా వేంగీ చాళుక్యులుగా ప్రసిద్ధి గాంచారు. తర్వాత ఇతడు చేర, చోళ, పాండ్యరాజుల మైత్రిని సంపాదించి, పల్లవ రాజ్యంపై దండెత్తి, మహేంద్రవర్మను పుల్లలూరు యుద్ధంలో ఓడించాడు. చాళుక్య, పల్లవ రాజ్యాల మధ్య సంఘర్షణకు ఇది నాంది. పులకేశి విజయాలన్నిటిలో ఘనమైంది హర్షవర్ధనుణ్ణి ఓడించడం. ‘సకల ఉత్తరాపథేశ్వరుడైన’ హర్షవర్ధనుడు దక్షిణాపథాన్ని జయించాలని దండెత్తి వచ్చినప్పుడు పులకేశి అతణ్ణి నర్మదానది ఒడ్డున ఓడించి ‘పరమేశ్వర’ బిరుదును స్వీకరించాడు.

ఈ విజయ పరంపరలతో పులకేశి కీర్తి ప్రతిష్ఠలు దిగంతాలకు వ్యాపించాయి. పారశీక చక్రవర్తి రెండో ఖుస్రూ పులకేశి శక్తి సామర్థ్యాలను గురించి విని అతనితో దౌత్య సంబంధాలను నెలకొల్పుకున్నాడు. అజంతా మొదటి గుహలోని రెండు చిత్రాలు, ఈ రాయబారాలకు సంబంధించినవేనని కొందరి అభిప్రాయం. క్రీ.శ. 640-641 ప్రాంతంలో చైనా యాత్రికుడైన హూయాన్ త్సాంగ్ చాళుక్య రాజ్యాన్ని దర్శించి తన అనుభవాలను వివరించాడు. పులకేశి సామ్రాజ్యం సారవంతమై, సిరి సంపదలతో తులతూగుతున్న దేశమని అతను తెలిపాడు. అక్కడి ప్రజలు యుద్ధప్రియులని, మేలు చేసిన వారిపట్ల కృతజ్ఞులై ఉంటారని వారికోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సంసిద్ధులవు తారని, అలాగే కీడు తలపెట్టిన వారిపై ప్రతీకారం తీర్చుకోనిదే నిద్రపోరని అతను వివరించాడు. వారి రాజు పు-లో-కే-షి (పులకేశి) క్షత్రియ వీరుడని, తన ప్రజలను, సైనిక బలాన్ని చూసుకుని అతడు గర్విస్తాడని, పొరుగు రాజ్యాలంటే అతనికి లక్ష్యం లేదని అతను వర్ణించాడు.

ఇన్ని గొప్ప విజయాలను సాధించిన పులకేశి జీవితం విషాదాంతమైంది. క్రీ.శ.641లో పులకేశి రెండోసారి పల్లవరాజ్యం మీద దండెత్తినపుడు పల్లవరాజైన నరసింహవర్మ పులకేశిని బాదామి వరకు తరిమి వధించాడు. ఈ పరాజయం నుంచి బాదామి చాళుక్యులు ఒక శతాబ్దం వరకు కోలుకోలేదు.

ప్రశ్న 2.
దక్షిణభారతదేశ సంస్కృతికి పల్లవుల యొక్క సేవను వివరించండి.
జవాబు.
దాదాపు రెండున్నర శతాబ్దాల కాలం పాటు కాంచీపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన వారు పల్లవులు. వీరు క్రీ.శ 557 నుంచి క్రీ.శ 796 వరకు పరిపాలించారు. బాదామి చాళుక్యులు, మధురై పాండ్యులు వీరికి సమకాలికులు. వీరు ప్రస్తుత తమిళ, కన్నడ ప్రాంతాలను పరిపాలించారు. కావేరీ, తుంగభద్ర డెల్టాపై అధికారం సాధించేందుకు వీరు నిరంతరం యుద్ధాలలో మునిగి ఉండేవారు. సింహవిష్ణు నాయకత్వంలో తమిళదేశంలో అత్యంత శక్తివంతులుగా పేరొందారు. సింహవిష్ణు అనంతరం అతడి కుమారుడు మహేంద్రవర్మ రాజయ్యాడు. ఇతడు రెండవ పులకేశి చేతిలో క్రీ.శ 610లో పరాజితుడయ్యాడు. మహేంద్రవర్మ తర్వాత అతడి కుమారుడు నరసింహవర్మ రాజయ్యాడు. ఇతడు మణి మంగళం యుద్ధంలో రెండవ పులకేశిని ఓడించి, చంపి వారి రాజధాని బాదామిని దోచుకున్నాడు. ‘వాతాపికొండన్’ అనే బిరుదు ధరించాడు. చైనా యాత్రికుడు హూయాన్ త్సాంగ్ ఇతని ఆస్థానాన్ని దర్శించాడు. ఇతడి వారసులు బలహీనులు.

పల్లవుల రాజకీయ వ్యవస్థ: పల్లవులు దక్షిణ భారతదేశంలో సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించారు. భారతదేశ సాంస్కృతిక చరిత్రలో పల్లవయుగం గొప్పదశ. భారతదేశ సాంస్కృతిక ఐక్యత వీరి కాలంలో జరిగింది. పల్లవులు సంప్రదాయ నిరంకుశ రాజరిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. పరిపాలనా వ్యవస్థకు రాజే ప్రధాన సూత్రధారి. రాజుకు సర్వాధికారాలు ఉండేవి. అయినా నిరంకుశుడు కాదు. ధర్మాన్ని రక్షిస్తూ ఉండేవాడు. దైనందిన పరిపాలనలో రాజుకు అనేకమంది అధికారులు సహకరించేవారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని రాష్ట్రాలు, కొట్టాలు, గ్రామాలుగా విభజించారు. భూమిశిస్తు రాజ్యానికి ప్రధాన ఆదాయం. దీనికి తోడు వాణిజ్య పన్నులు, వస్తువులపై పన్నుల ద్వారా ఆదాయం లభించేది.

మతాభివృద్ధి: పల్లవులు వైదిక మతాభిమానులు. వీరిలో చాలామంది శైవులు. రాజసింహుడు వంటి కొంతమంది వైష్ణవ మతాభిమానులుండేవారు. శైవులను నాయనార్లని పిలిచేవారు. వీరిలో ‘అప్పార్’, ‘సంబంధార్’, ‘సుందరమూర్తి’, ‘మాళిక్కవాళగర్’ మొదలైనవారు శైవమత వ్యాప్తికి ఈ యుగంలో అంకితమయ్యారు. విప్రనారాయణ, తిరుమంగై మొదలైన ఆళ్వారులు వైష్ణవమత వ్యాప్తికి అంకితమయ్యారు. పల్లవ యుగంలో తిరుపతి, శ్రీరంగం మొదలైన వైష్ణవ క్షేత్రాలు భక్తులను ఆకర్షించాయి. జైన, బౌద్ధమతాలు కూడా ఈ యుగంలో విలసిల్లాయి. కాంచీపురంలో 180 బౌద్ధారామాలున్నట్లు హూయాన్ త్సాంగ్ రాశాడు. అయితే శైవమతం, వైష్ణవమతాల వ్యాప్తితో జైన, బౌద్ధమతాలు కొంతవరకు క్షీణించాయి.

విద్యాసారస్వతాల ప్రగతి: ప్రాచీన పల్లవుల కాలంలో సంస్కృతం రాజభాష అయింది. నవీన పల్లవులు తమ శాసనాలన్నిటినీ సంస్కృతంలోనే వేయించారు. వీరు ఘటికలను స్థాపించి, సంస్కృతాన్ని, వైదిక విద్యలను పోషించారు. ఈ ఘటికల్లో చతుర్విద విద్యలు అంటే అన్వీక్షకి (Philosophy), త్రయీ (Three Vedas), వార్తా (Economics), దండనీతి (Politics) బోధించేవారు. కాంచీపుర ఘటికా స్థానం, దేశవ్యాప్తంగా ప్రసిద్ధి వహించి, దూర ప్రాంతాల నుంచి విద్యార్థులను ఆకర్షించింది. సంస్కృత కవులైన భారవి, దండి వీరి కాలం వారే. విద్యలతోబాటు, తమిళదేశంలో నాట్య సంగీతాల్లో కూడా విశేషమైన కృషి జరిగింది. ఆనాటి వాఙ్మయంలో మృదంగం, యాళి, విరళి మొదలైన వాయిద్యాల పేర్లున్నాయి.

వాస్తు శిల్పాల్లో పల్లవుల కృషి: దక్షిణ భారతదేశంలో వాస్తు చరిత్ర పల్లవుల కాలంలోనే ప్రారంభమైందని విన్సెట్ స్మిత్ అభిప్రాయం. మనోహరమైన భారతీయ శిల్పరీతుల్లో పల్లవశైలి ఒకటి. వీరి కాలంనాటి శిల్పాలు, నిర్మాణాలు అపురూప కళాఖండాలు. ముఖ్యంగా కొండను తొలిచి ఆలయాలను నిర్మించే అద్భుతమైన కొత్త పద్ధతిని, మహేంద్రవర్మ తమిళ దేశంలో ప్రవేశపెట్టాడు. ఇదే పద్ధతిలో నరసింహవర్మ మహామల్లవరం (మహాబలిపురం)లో పంచపాండవుల రథాలను తొలిపించాడు. రాజసింహుడు మహాబలిపురంలో తీరదేవాలయాన్ని, కాంచీపురంలో కైలాసనాథ ఆలయాన్ని నిర్మించాడు. పల్లవుల వాస్తు ప్రత్యేకత కైలాసనాథ ఆలయంలో ప్రతిబింబిస్తుంది. శిల్పాల్లో మహామల్లపురంలో ఉన్న ‘గంగావతరణ’ శిల్పం విదేశీ కళావిమర్శకుల ప్రశంసలందుకున్నది.

ప్రశ్న 3.
చాళుక్యుల కాలంలో దక్కనులో నెలకొన్న పరిస్థితులను చర్చించండి.
జవాబు.
దక్కన్, దక్షిణ భారతదేశాన్ని పాలించిన రాజవంశాలలో చాళుక్యులు ప్రధానమైనవారు. చాళుక్యులు బాదామీ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, వేంగి చాళుక్యులు అనే మూడు ప్రధాన వంశాలుగా ఉన్నారు. వీరు కంచిని ఏలిన పల్లవులకు సమకాలీనులు. క్రీ.శ. 6వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం వరకు తిరిగి క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు సుదీర్ఘకాలం పరిపాలించారు.

రాజ్య విస్తరణ: బాదామీ చాళుక్యుల రాజ్యాన్ని పాలించిన మొదటిరాజు జయసింహ వల్లభుడు. వింధ్య పర్వతాలు, కృష్ణానది మధ్య ఉన్న దక్షిణా పథాన్ని పాలించాడు. బాదామీ చాళుక్యులలో గొప్పవాడు మొదటి పులకేశి. రెండవ పులకేశి అందరిలోకి గొప్పవాడు. ఇతను క్రీ.శ. 609-642 సంవత్సరం వరకు పరిపాలించాడు. క్రీ.శ. 609లో సింహాసనం అధిష్టించి అంతర్గత సమస్యలను అణచివేసాడు. కదంబులు, గాంగులను జయించాడు. లాటపాలకులు, మాళవులు, ఘార్జరులు ఇతని సార్వభౌమత్వాన్ని అంగీకరించారు. పల్లవ మహేంద్రవర్మను ఓడించాడు. వేంగి ప్రాంతాన్ని ఆక్రమించి తన సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుని పాలకుడిగా నియమించాడు. తరువాత వేంగి తూర్పు చాళుక్యుల రాజధాని అయింది. వారు రెండు శతాబ్దాలపాటు ఆంధ్రదేశాన్ని పరిపాలించారు.

రెండవ పులకేశి కాలంలో చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ బాదామీ చాళుక్యరాజ్యాన్ని సందర్శించాడు. హుయానాత్సాంగ్ రెండవ పులకేశి గొప్పతనాన్ని, సైనిక బలాన్ని కొనియాడాడు. రెండవ పులకేశి నర్మదా యుద్ధంలో హర్షవర్ధనుని ఓడించి నర్మదానదిని హర్షవర్ధనుని రాజ్యానికి హద్దుగా నిర్ణయించాడు. అయితే రెండవ పులకేశి చివరి రోజులు విషాదాంతమయ్యాయి. క్రీ.శ. 642లో జరిగిన మణమంగళం యుద్ధంలో రెండవ పులకేశి పల్లవరాజు చేతిలో ఓడిపోయి మరణించాడు. రెండవ పులకేశి వారసులు బలహీనులవుట వలన, రాష్ట్రకుట దంతిదుర్గుని దాడుల వలన బాదామీ చాళుక్యుల పాలన అంతమైంది.

పాలనా విధానం: చాళుక్యులది వంశపారంపర్య నిరంకుశ రాజరిక వ్యవస్థ. రాజుకు సర్వాధికారాలు ఉండేవి. రాజును దైవాంశ సంభూతుడిగా భావించేవారు. రాజులు ‘శ్రీ పృథ్వీ వల్లభ’ అనే బిరుదు ధరించారు. చాళుక్యుల పాలనలో నిర్దిష్టమైన మంత్రి పరిషత్ లేదు. రాజ కుటుంబానికి విశ్వాసపాత్రులు అయిన వారు పరిపాలనా వ్యవహారాలు · నిర్వహించేవారు. చాళుక్య రాజ్యంలో పాలన వికేంద్రీకరించబడింది. రాష్ట్రాలు, విషయాలు, నాడులు అనే పాలనావ్యవస్థలు ఉండేవి. విషయపతులు, సమర్థులు, గ్రామభోజకులు అనే అధికారుల గురించి చాళుక్యుల రికార్డులలో ప్రస్తావన లభిస్తుంది. పాలనా వ్యవహారంలో గ్రామం అత్యంత చిన్న విభాగం. ‘గాముండ’ అనే అధికారి గ్రామపాలనను నిర్వహించేవాడు. ఇతను గ్రామానికి, రాజుకు మధ్య వారధిగా ఉండేవాడు. సమర్థవంతమైన పన్నుల వ్యవస్థ అమలులో ఉండేది. సొంత గృహాలు, ఇంటి స్థలాలు ఉన్నవారు పన్నులు చెల్లించాల్సి ఉండేది.

TS Inter 1st Year History Study Material Chapter 7 దక్షిణ భారతదేశ రాజ్యాలు

సాంఘిక పరిస్థితులు:
విద్యా విధానం: ప్రజలు విద్యాభ్యాసం పట్ల శ్రద్ధ కనబరచేవారని హూయాన్ త్సాంగ్ పేర్కొన్నాడు. వీరి శాసనాల్లో బ్రాహ్మణులు పద్నాలుగు విద్యల్లో పాండిత్యం కలవారని చెప్పబడింది. బాదామీలో నాలుగు రకాల శాస్త్ర బోధన జరిగేదని తెలుస్తోంది. చాళుక్యుల సంప్రదాయం ప్రకారం పద్నాలుగు విద్యల్లో చతుర్వేదాలు, ఆరు అంగాలు, పురాణాలు, మీమాంస, న్యాయ, ధర్మశాస్త్రాలు ఉండేవి. వేదాలు, తత్త్వశాస్త్రం, అర్థశాస్త్రం, దండనీతి అనే నాలుగు విద్యలు ప్రధానమైనవిగా భావించేవారు.
మత విశ్వాసాలు: చాళుక్యులు సంప్రదాయ హిందూ మతస్థులు. వారు వైదిక బలిదానాలను పునరుద్ధరించారు. మొదటి పులకేశి అశ్వమేధయాగం చేశాడు. చాళుక్యులు బాదామీ, ఐహోలు, పట్టడకల్లలో గొప్ప ఆలయాలను నిర్మించారు.

సైనిక వ్యవస్థ: చాళుక్యులు పటిష్టమైన సైనిక వ్యవస్థను కలిగి ఉండేవారు. హర్షవర్ధనుడంతటి గొప్ప చక్రవర్తి రెండవ పులకేశి చేతుల్లో ఓడిపోవటం వీరి సైనిక శక్తికి నిదర్శనం.

కళాపోషణ: చాళుక్యరాజులు గొప్పవాస్తు శిల్పకళా పోషకులు. వీరి పోషణలో గొప్ప ప్రెస్కో చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. వీరు బాదామీ, ఐహోలు, పట్టడకల్లో నిర్మించిన ఆలయాలు గొప్ప కళాఖండాలు. ఈ ఆలయాలు సాంఘిక, సాంస్కృతిక రంగాలకు కేంద్రాలుగా విలసిల్లాయి.

ప్రశ్న 4.
ఘనులైన చోళరాజులు సాధించిన విజయాలను వివరించండి.
జవాబు.
దక్షిణ భారతదేశ చరిత్రలో రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో విశేషమైన విజయాలను సాధించిన తంజావూరు చోళులకు ప్రత్యేక స్థానం ఉంది.

రాజ్యస్థాపన: అశోకుని 2వ, 12వ శిలా శాసనాలలో చోళులను గురించిన ప్రస్తావన ఉంది. క్రీ.శ. 850 సంవత్సరంలో విజయాలయుడు స్వతంత్ర చోళ రాజ్యాన్ని స్థాపించాడు. అతడి రాజధాని ఉరయ్యార్. ఇతడు పల్లవుల వద్ద ఉద్యోగి. ముత్తరియార్ పాలకుల నుంచి విజయాలయుడు తంజావూరు స్వాధీనం చేసుకున్నాడు.

రాజ్యవిస్తరణ – సైనిక విజయాలు: చోళరాజులలో మొదటి ఆదిత్యుడు రెండో గొప్పరాజు. పల్లవరాజు అపరాజితవర్మను అంతమొందించాడు. అతని కుమారుడు పరాంతకుడు పాండ్యులను ఓడించి మధురై స్వాధీనం చేసుకొని, మధురైకొండ అనే బిరుదు ధరించాడు. అయితే ఇతను రాష్ట్రకూట పాలకుడు మూడవ కృష్ణుని చేతిలో ఓడిపోయాడు.

రెండవ పరాంతకుని కుమారుడైన రాజరాజు, తరువాత వచ్చిన మొదటి రాజేంద్రచోళుడు, తరువాతివాడైన రాజాధిరాజులు చోళపాలకుల్లో గొప్పవారు. క్రీ.శ. 985లో రాజరాజు సింహాసనాన్ని అధిష్టించాడు. అతడు చేర, పాండ్య రాజ్యాలను జయించాడు. రాజరాజు గొప్ప నౌకాదళాన్ని ఏర్పాటు చేసుకొని సిలోన్ (శ్రీలంక) ఉత్తర ప్రాంతాన్ని జయించాడు. తూర్పు చాళుక్యరాజు విమలాదిత్యుడు తన కుమార్తె కుందవైని రాజరాజుకిచ్చి వివాహం చేశాడు. రాజరాజు పరమత సహనం గల పాలకుడు. తంజావూరులోని బృహదీశ్వరాలయాన్ని నిర్మింపజేశాడు. బృహదీశ్వరాలయ గోపురం గొప్ప వాస్తు శిల్పకళాఖండం. నేటికీ ప్రపంచంలోని వివిధ ప్రాంతాల సందర్శకులను ఆకర్షిస్తోంది. తరువాత వచ్చిన మొదటిరాజేంద్ర చోళుడు సిలోన్పై దండయాత్ర చేశాడు. గాంగ, పాలరాజులపై విజయాలు సాధించి ‘గంగైకొండ రాజేంద్రచోళ’ అని పేరుగాంచాడు.

రాజేంద్ర చోళుడు గొప్ప పాలకుడు. గంగైకొండ చోళపురం (తిరుచినాపల్లి) అనే నూతన రాజధాని నగరాన్ని నిర్మింపజేసాడు. ఇది ఆగ్నేయాసియా దేశాలతో పటిష్ట వ్యాపార సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి తోడ్పడింది. పెద్ద కృత్రిమ రిజర్వాయర్ను నిర్మింపజేసి కొలెరుమ్, వెల్లార్ నదుల నుంచి కాలువల ద్వారా నీటిని నింపాడు.
రాజేంద్రచోళుడి తర్వాత వచ్చిన రాజాధిరాజు కాలం నాటికి అంతర్గత, బహిర్గత సమస్యలు ఎక్కువయ్యాయి. ఇతను పాండ్య, కేరళ పాలకులను అణచివేశాడు. పశ్చిమచాళుక్య పాలకుడైన మొదటి సోమేశ్వరునితో జరిగిన యుద్ధంలో రాజాధిరాజు మరణించాడు.

చోళుల పాలన – సామాజిక విశేషాలు: రాజు సర్వాధికారి. పాలనలో రాజుకి ‘ఉదంకుట్టం’ అనే ఉన్నతాధికారులు అండగా ఉండేవారు. చోళులు పటిష్టమైన ఉద్యోగ వ్యవస్థను ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థలకు పాలనలో విశేషాధికారాలు కల్పించారు. ఉత్తర మేరూరు శాసనం చోళుల కాలంనాటి స్థానిక స్వపరిపాలన విషయాలను తెలియజేస్తుంది. గ్రామపాలన, గ్రామ అసెంబ్లీలో సభ్యులుగా ఎన్నిక కావడానికి కావలసిన అర్హతలను ఈ శాసనం వివరించింది.

స్థానిక పాలన: చోళుల పరిపాలనా వ్యవస్థలోని గొప్ప అంశం, వారికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది గ్రామపాలనా వ్యవస్థ పట్టణాలు, గ్రామాలు అసెంబ్లీలను కలిగి ఉండేవి. ఊర్, సభ అనే రెండు రకాల అసెంబ్లీలు ఉండేవి. ‘ఊర్’ సాధారణ సభ్యులతో కూడిన అసెంబ్లీ కాగా, ‘సభ’ బ్రహ్మాండ గ్రామ పాలనా వ్యవహారాలకు సంబంధించింది. గ్రామ అసెంబ్లీ తన విధులను ‘వారియం’ అనే కమిటీల ద్వారా నిర్వహించేది. ఈ అసెంబ్లీ ‘తోట వారియం’, ‘చెరువు వారియం’ ఇలా అనేక కమిటీలు ఏర్పరిచేది. గ్రామ అసెంబ్లీలు పాలనలో సంపూర్ణ సార్వభౌమాధికారాన్ని చెలాయించేవి. గ్రామంలోని ఉమ్మడి భూములపై అధికారాన్ని కలిగి ఉండటంతో పాటు ప్రైవేట్ భూములపై క్రమబద్ధమైన అధికారాన్ని కలిగి ఉండేది.

గ్రామసభల కార్యనిర్వాహక కమిటీ సభ్యులను ప్రజలు ఎన్నుకొనేవారు. ప్రతి గ్రామం, పట్టణం అనేక వార్డులుగా విభజింపబడేవి. వార్డులను ‘కుటుంబం’ అని పిలిచేవారు. వీరికి కొన్ని అర్హతలను ఏర్పాటుచేసారు.

అర్హతలు:: 35-70 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి; వేదాలలో పాండిత్యాన్ని కలిగి గ్రామ నివాసి అయి ఉండాలి.
ఈ విధంగా చోళులు సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో తమదైన ముద్రవేసి దక్షిణ భారతదేశ చరిత్రలోనే కాక భారతదేశ చరిత్రలోనే ప్రత్యేక స్థానాన్ని కలిగివున్నారు.

TS Inter 1st Year History Study Material Chapter 7 దక్షిణ భారతదేశ రాజ్యాలు

ప్రశ్న 5.
చోళుల పరిపాలన ప్రధాన లక్షణాలను చర్చించండి.
జవాబు.
చోళుల పాలనా వ్యవస్థలోని ముఖ్య లక్షణం వారి స్థానిక స్వపరిపాలనా విధానం. చోళుల గ్రామ పరిపాలననే “స్థానిక స్వపరిపాలన” అని కూడా అంటారు. మొదటి పరాంతకుని ఉత్తరమేరూర్ శాసనంలోను, కులోత్తుంగుని శాసనాల్లోను చోళుల గ్రామ పాలనా పద్ధతి వివరించబడింది.

గ్రామ పాలన: చోళుల సామ్రాజ్యంలో ప్రతి గ్రామానికి స్వయం పాలనాధికారం ఉంది. ప్రతి గ్రామంలోను గ్రామ పెద్దల సభ వుండేది. ఈ గ్రామ సభ స్వరూప స్వభావాలను గ్రామ గ్రామానికి మారుతుండేవి.

గ్రామ సభలు: చోళుల కాలంలో గ్రామాల్లో మూడు రకాల సభలుండేవి. అవి: 1) ఊర్ 2) సభ 3) నగరం ఊర్ అనే సభలో గ్రామంలోని భూస్వాములందరూ సభ్యులే. “సభ”లో బ్రాహ్మణ అగ్రహారంలోని వారు మాత్రమే సభ్యులుగా ఉండేవారు. ‘నగరం’ అనేది వర్తకులకు సంబంధించిన సభ. బ్రాహ్మణ అగ్రహారంలోని సభ్యులకు దేవాలయమే సమావేశపు స్థలం. కొన్ని గ్రామాల్లో ప్రత్యేకించి కచేరీలుండేవి.

సభ్యుల ఎన్నిక: చోళుల కాలంలో ప్రతి గ్రామాన్ని 30 వార్డులుగా విభజించారు. ప్రతి వార్డు నుండి ఒక సభ్యుడ్ని లాటరీ పద్ధతిపై ఎన్నుకునేవారు. ఈ సభ్యులను గ్రామసభ ఉపసంఘాలుగా నియమించేది. చెరువులు, సత్రాలు, ఆలయాలు, తోటలు, పాఠశాలలు, నేర విచారణ, పన్నుల వసూలు మొదలైన వాటికి ప్రత్యేక ఉపసంఘాలుండేవి. “పంచదార వారియం” అనే ఉపసంఘం మిగిలిన సంఘాల కార్యక్రమాలను పరిశీలించేది.

అర్హతలు: గ్రామసభలోని సభ్యుల అర్హతలను గురించి ప్రత్యేక నిబంధనావళిని రూపొందించి అమలు చేశారు. సభ్యులుగా ఎన్నుకోబడుటకు ఒక వ్యక్తికి కొన్ని అర్హతలుండాలి. అతడు:

  1. 30 నుండి 70 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వుండాలి.
  2. విద్యావంతుడై వుండాలి.
  3. సొంత ఇల్లు కలిగి భూమికి యజమానై వుండాలి. అనర్హతలు: గ్రామసభ సభ్యులకు కొన్ని అర్హతలతో పాటు కొన్ని అనర్హతలు కూడా నిర్దేశించారు.

గ్రామసభకు ఎన్నుకోబడదలచుకున్న వ్యక్తి:

  1. పంచ మహాపాపాలు చేసినవాడై ఉండకూడదు.
  2. గత మూడు సంవత్సరాలుగా ఏ ఉపసంఘంలోను సభ్యుడిగా ఉండరాదు.
  3. ఒకసారి సభ్యుడిగా ఉండి లెక్కలను సరిగా అప్పగించని వాడు కూడా అనర్హుడే,
  4. నేరస్థులు వారి బంధువులు కూడా ఈ ఎన్నికల్లో పాల్గొనకూడదు.

గ్రామ సభ అధికారాలు: గ్రామంలోని భూములపై యాజమాన్యపు హక్కు సభకు ఉన్నది. పన్నులను విధించుట, అడవులను నరికించి కొత్త భూములను సాగులోకి తీసుకువచ్చుట మొదలగునవి ఈ సభ ముఖ్య విధులు. వీటితోపాటు భూమి, నీటి తగవులను పరిష్కరించుట, నేరాలను విచారించుట కూడా దీని విధులుగా చెప్పుకోవచ్చు. అయితే ఆదాయ వనరులు తక్కువ కావటంతో కేంద్ర ప్రభుత్వమే రహదారులు నిర్మించగా వాటిపై అజమాయిషీని సభ నిర్వహించేది. గ్రామసభలకు సలహాలివ్వటానికి అధికారులుండేవారు. కేంద్ర ప్రభుత్వము యొక్క అనవసర జోక్యము ఈ సభలలో ఉండేది కాదు.

ముగింపు: చోళుల గ్రామ పాలన సమర్థవంతమైనది, ఆదర్శవంతమైనది. చోళులు గ్రామ పరిపాలనను ఏర్పరచి అందులో ప్రజలను భాగస్వాములను చేయటం వల్ల పాలనలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సమన్వయం సాధ్యపడింది.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బాదామి చాళుక్య రాజ్యస్థాపనకు దారితీసిన పరిస్థితులను వివరించండి.
జవాబు.
దక్షిణాపథాన్ని పరిపాలించిన గొప్పపాలకుల్లో కర్ణాటకలోని ‘బాదామి’ కేంద్రంగా పరిపాలించిన చాళుక్యులు ఒకరు. వీరు 7వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం తొలిదశ వరకు పరిపాలించారు. వీరిలో రెండవ పులకేశిన్ సుప్రసిద్ధుడు. వీరినే పశ్చిమ చాళుక్యులు అని వర్ణిస్తారు. స్వతంత్ర్య బాదామి చాళుక్య రాజ్య స్థాపకుడు జయసింహుడు. ఇతడు మహాపరాక్రమవంతుడు. వీరు వింద్యాపర్వతాలకూ, కృష్ణానదికి మధ్య కల భూభాగాలను పరిపాలించి శాశ్వతకీర్తి గడించారు. జయసింహుడి అనంతరం అతని కుమారుడైన రణరంగుడు. ఇతడి అనంతరం పరిపాలించిన బాదామి చాళుక్య రాజుల్లో మొదటి పులకేశిన్ రణరంగుని కుమారుడు. ఇతడు క్రీ.శ. 535 – 566 మధ్యకాలంలో రాజ్యపాలన చేసాడు. బాదామి పట్టణం ఇతని రాజధాని. ఇతని వారసుడే ‘కీర్తివర్మ’. ఇతడు ‘మహారాజు’ అనే బిరుదు ధరించాడు. ఇతడు నలవాడి (కర్నూల్, బళ్ళారి) పాలకులను, బనవాసి కదంబులను ఓడించాడు. ఇతని కుమారుడైన రెండోపులకేశి బాలుడైనందున సోదరుడు మంగళేశుడు రాజ్య వ్యవహారాలు నిర్వహించాడు. ఇతడు కాలచురులను ఓడించి రేవతి .ద్వీపాన్ని ఆక్రమించాడు. క్రీ.శ. 609లో రెండో పులకేశి సింహాసనానికి వచ్చాడు.

ప్రశ్న 2.
మొదటి నర్సింహవర్మన్ సాధించిన విజయాలను చర్చించండి.
జవాబు.
ఇతను మహేంద్రవర్మ కుమారుడు. పల్లవ రాజులందరిలోనూ అగ్రగణ్యుడు. సింహాసనమెక్కిన వెంటనే నరసింహవర్మ చాళుక్యుల దండయాత్రను ఎదుర్కోవలసి వచ్చింది. క్రీ.శ. 641లో రెండో పులకేశి పల్లవ రాజ్యంపైకి దండెత్తినప్పుడు పల్లవసేనలు అతణ్ణి ఓడించి తరమడమేకాక నరసింహవర్మ నాయకత్వంలో బాదామి వరకు నడిచి పులకేశిని వధించి బాదామిని దోచుకొన్నాయి. తర్వాత చోళ, పాండ్య ప్రభువులు నరసింహవర్మకు సామంతులయ్యారు. ఈ విజయాలకు నిదర్శనంగా నరసింహవర్మ ‘వాతాపికొండ’, ‘మహామల్ల’ బిరుదులను ధరించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 7 దక్షిణ భారతదేశ రాజ్యాలు

నరసింహవర్మ కూడా తండ్రి మహేంద్రవర్మలాగా సారస్వతాన్నీ, వాస్తు, లలితకళలనూ పోషించాడు. ఇతను మహామల్లపురం (మహాబలిపురం)లో ఏకశిలా రథాలనే దేవాలయాలను నిర్మింపచేశాడు. సంస్కృతంలో ‘కిరాతార్జు నీయం’ అనే కావ్యాన్ని రచించిన భారవి కవిని ఇతను ఆదరించినట్లుగా తెలుస్తున్నది. నరసింహవర్మ కాలంలోనే హ్యూయాన్ త్సాంగ్ అనే చైనా యాత్రికుడు కాంచీపురాన్ని దర్శించాడు. పల్లవుల రాజ్యాన్ని తమిళ దేశంగా వర్ణిస్తూ ఇక్కడి ప్రజలు నీతిపరులని, సత్యప్రియులని, శ్రమజీవులని, వీరికి విద్యావ్యాసాంగాలలో శ్రద్ధాసక్తులు అధికమని చెప్పాడు. కాంచీపురంలో దాదాపు 100 బౌద్ధారామాలు, 80 దేవాలయాలు ఉన్నట్లుగా కూడా ఇతను తెలిపాడు. నలందా విశ్వవిద్యాలయానికి ఆచార్యుడైన ధర్మపాలుడి జన్మస్థలం కాంచీపురమని ఇతను రాశాడు.

ప్రశ్న 3.
పల్లవ చాళుక్యుల సంఘర్షణను వివరించండి.
జవాబు.
పల్లవ రాజులలో గొప్పవాడు మొదటి మహేంద్రవర్మ. ఇతడు సింహవిష్ణువు కుమారుడు. ఇతడు తన రాజ్యాన్ని. ఉత్తరాన కృష్ణానది వరకు విస్తరింపచేసాడు. ఇతని కాలం నుంచే పల్లవ బాదామి చాళుక్యుల మధ్య రాజ్య విస్తరణకై సంఘర్షణ ఆరంభమైంది. బాదామి చాళుక్యరాజైన రెండో పులకేశిన్ పల్లవరాజుకు చెందిన ‘కర్మ’ రాష్ట్రాన్ని ఆక్రమించాడు. ఆ తరువాత రెండో పులకేశిన్ పల్లవరాజును ‘పుల్లలూరు’ యుద్ధంలో (క్రీ.శ. 630) ఓడించాడు.

మొదటి నరసింహవర్మ మహేంద్రవర్మ కుమారుడు. యువరాజుగా ఉన్నపుడే మణిమంగళంగా యుద్ధంలో రెండో పులకేశిన్ సేనలను ఓడించి తన శక్తి, ప్రతాపాలను నిరూపించుకున్నాడు. చాళుక్యుల రాజధానియైన బాదామిని ధ్వంసం చేసాడు. రెండో పులకేశిన్ కుమారుడైన విక్రమాదిత్యుడు క్రీ.శ. 655లో పల్లవరాజైన నర్సింహవర్మను ఓడించి కాంచీపురాన్ని ఆక్రమించాడు. చోళ, పాండ్య రాజుల గర్వాన్ని అణచివేసాడు. వినయాదిత్యుడి తండ్రి అనంతరం బాదామి చాళుక్యరాజ్య సింహాసనం అధిష్టించాడు. ఇతని అనంతరం చాళుక్య రాజ్యం క్షీణదశకు చేరుకుంది. ఇదేకాలంలో అరబ్ల దండయాత్ర జరిగింది.

ప్రశ్న 4.
సాహిత్యం, వాస్తు, శిల్పకళల పురోభివృద్ధికి పల్లవులు చేసిన సేవను అంచనావేయండి.
జవాబు.
పల్లవుల రాజకీయ వ్యవస్థ: పల్లవులు దక్షిణ భారతదేశంలో సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించారు. భారతదేశ సాంస్కృతిక చరిత్రలో పల్లవయుగం గొప్పదశ. భారతదేశ సాంస్కృతిక ఐక్యత వీరి కాలంలో జరిగింది. పల్లవులు సంప్రదాయ నిరంకుశ రాజరిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. పరిపాలనా వ్యవస్థకు రాజే ప్రధాన సూత్రధారి. రాజుకు సర్వాధికారాలు ఉండేవి. అయినా నిరంకుశుడు కాదు. ధర్మాన్ని రక్షిస్తూ ఉండేవాడు. దైనందిన పరిపాలనలో రాజుకు అనేకమంది అధికారులు సహకరించేవారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని రాష్ట్రాలు, కొట్టాలు, గ్రామాలుగా విభజించారు. భూమిశిస్తు రాజ్యానికి ప్రధాన ఆదాయం. దీనికి తోడు వాణిజ్య పన్నులు, వస్తువులపై పన్నుల ద్వారా ఆదాయం లభించేది.

మతాభివృద్ధి: పల్లవులు వైదిక మతాభిమానులు. వీరిలో చాలామంది శైవులు. రాజసింహుడు వంటి కొంతమంది వైష్ణవ మతాభిమానులుండేవారు. శైవులను నాయనార్లని పిలిచేవారు. వీరిలో ‘అప్పార్’, ‘సంబంధార్’, ‘సుందరమూర్తి’, ‘మాళిక్కవాళగర్’ మొదలైనవారు శైవమత వ్యాప్తికి ఈ యుగంలో అంకితమయ్యారు. విప్రనారాయణ, తిరుమంగై మొదలైన ఆళ్వారులు వైష్ణవమత వ్యాప్తికి అంకితమయ్యారు. పల్లవ యుగంలో తిరుపతి, శ్రీరంగం మొదలైన వైష్ణవ క్షేత్రాలు భక్తులను ఆకర్షించాయి. జైన, బౌద్ధమతాలు కూడా ఈ యుగంలో విలసిల్లాయి. కాంచీపురంలో 180 బౌద్ధారామాలున్నట్లు హూయాన్ త్సాంగ్ రాశాడు. అయితే శైవమతం, వైష్ణవమతాల వ్యాప్తితో జైన, బౌద్ధమతాలు కొంతవరకు క్షీణించాయి.

విద్యాసారస్వతాల ప్రగతి: ప్రాచీన పల్లవుల కాలంలో సంస్కృతం రాజభాష అయింది. నవీన పల్లవులు తమ శాసనాలన్నిటినీ సంస్కృతంలోనే వేయించారు. వీరు ఘటికలను స్థాపించి, సంస్కృతాన్ని, వైదిక విద్యలను పోషించారు. ఈ ఘటికల్లో చతుర్విద విద్యలు అంటే అన్వీక్షకి (Philosophy), త్రయీ (Three Vedas), వార్తా (Economics), దండనీతి (Politics) బోధించేవారు. కాంచీపుర ఘటికా స్థానం, దేశవ్యాప్తంగా ప్రసిద్ధి వహించి, దూర ప్రాంతాల నుంచి విద్యార్థులను ఆకర్షించింది. సంస్కృత కవులైన భారవి, దండి వీరి కాలం వారే. విద్యలతోబాటు, తమిళదేశంలో నాట్య సంగీతాల్లో కూడా విశేషమైన కృషి జరిగింది. ఆనాటి వాఙ్మయంలో మృదంగం, యాళి, విరళి మొదలైన వాయిద్యాల పేర్లున్నాయి.

వాస్తు శిల్పాల్లో పల్లవుల కృషి: దక్షిణ భారతదేశంలో వాస్తు చరిత్ర పల్లవుల కాలంలోనే ప్రారంభమైందని విన్సెట్ స్మిత్ అభిప్రాయం. మనోహరమైన భారతీయ శిల్పరీతుల్లో పల్లవశైలి ఒకటి. వీరి కాలంనాటి శిల్పాలు, నిర్మాణాలు అపురూప కళాఖండాలు. ముఖ్యంగా కొండను తొలిచి ఆలయాలను నిర్మించే అద్భుతమైన కొత్త పద్ధతిని, మహేంద్రవర్మ తమిళ దేశంలో ప్రవేశపెట్టాడు. ఇదే పద్ధతిలో నరసింహవర్మ మహామల్లవరం (మహాబలిపురం)లో పంచపాండవుల రథాలను తొలిపించాడు. రాజసింహుడు మహాబలిపురంలో తీరదేవాలయాన్ని, కాంచీపురంలో కైలాసనాథ ఆలయాన్ని నిర్మించాడు. పల్లవుల వాస్తు ప్రత్యేకత కైలాసనాథ ఆలయంలో ప్రతిబింబిస్తుంది. శిల్పాల్లో మహామల్లపురంలో ఉన్న ‘గంగావతరణ’ శిల్పం విదేశీ కళావిమర్శకుల ప్రశంసలందుకున్నది.

ప్రశ్న 5.
రాజరాజచోళుని ఘనతను చర్చించండి.
జవాబు.
రెండవ పరాంతకుడి కుమారుడైన రాజరాజు క్రీ.శ 985 నుండి 1014 వరకు పరిపాలించారు. మొదటి రాజరాజు కాలం నుంచి చోళ రాజ్యంలో నూతన శకం ప్రారంభమైంది. రాజరాజు అనేక ఘన విజయాలను సాధించి చోళ రాజ్యాన్ని మహాసామ్రాజ్యంగా విస్తరింపచేశాడు. రాజరాజుకు ‘జయంగొండ’, ‘చోళమార్తాండ’ మొదలైన బిరుదు లున్నాయి. పాండ్యులను, చేర రాజులను ఓడించి వారి సామ్రాజ్య భాగాలైన కొడమలై, కొళ్ళంలను ఆక్రమించాడు. నౌకాదళంతో దాడి చేసి, మలయా ద్వీపాన్ని ఆక్రమించడమే కాకుండా శ్రీలంక మీద యుద్ధం చేసి అనూరాధపురాన్ని (ఉత్తర సింహళం) నాశనం చేశాడు. ఉత్తర సింహళానికి “ముమ్ముడి చోళమండల”మని నామకరణం చేశాడు. ఇతని కాలంలోనే కళ్యాణి చాళుక్యులకు, వేంగీ చాళుక్యులకు పోరు ప్రారంభమైంది. రాజరాజు వేంగీ చాళుక్యులకు మద్దతునిచ్చి తన ప్రాబల్యాన్ని వేంగీలో నెలకొల్పాడు.

రాజరాజు తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేయడమే కాకుండా క్రమబద్ధమైన పాలనా విధానాన్ని ప్రవేశపెట్టాడు. పంటపొలాలను సర్వే చేయించి, న్యాయసమ్మతమైన పన్నులను వసూలు చేశాడు. రాజరాజు శివభక్తుడు. తంజావూర్లో ‘రాజరాజేశ్వర’మనే పేరున్న బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. శైవుడైనప్పటికీ రాజరాజు పరమత సహనం ఉన్నవాడు.. శైలేంద్ర రాజైన శ్రీమార విజయోత్తుంగ వర్మకు నాగపట్టణంలో బౌద్ధ విహారాన్ని నిర్మించడానికి అనుమతినివ్వడమే కాకుండా ఆ విహారానికి ఒక గ్రామాన్ని దానం చేశాడు. ఇతను లలితకళల అభివృద్ధికి కూడా ఎంతో కృషి చేశాడు.

TS Inter 1st Year History Study Material Chapter 7 దక్షిణ భారతదేశ రాజ్యాలు

ప్రశ్న 6.
చోళులకాలంలో అభివృద్ధిచెందిన స్థానిక పరిపాలన పద్ధతిని వివరించండి.
జవాబు.
చోళుల పాలనా వ్యవస్థలోని ముఖ్య లక్షణం వారి స్థానిక స్వపరిపాలనా విధానం. చోళుల గ్రామ పరిపాలననే “స్థానిక స్వపరిపాలన” అని కూడా అంటారు. మొదటి పరాంతకుని ఉత్తరమేరూర్ శాసనంలోను, కులోత్తుంగుని శాసనాల్లోను చోళుల గ్రామ పాలనా పద్ధతి వివరించబడింది.

గ్రామ పాలన: చోళుల సామ్రాజ్యంలో ప్రతి గ్రామానికి స్వయం పాలనాధికారం ఉంది. ప్రతి గ్రామంలోను గ్రామ పెద్దల సభ వుండేది. ఈ గ్రామ సభ స్వరూప స్వభావాలను గ్రామ గ్రామానికి మారుతుండేవి.

గ్రామ సభలు: చోళుల కాలంలో గ్రామాల్లో మూడు రకాల సభలుండేవి. అవి: 1) ఊర్ 2) సభ 3) నగరం. ఊర్ అనే సభలో గ్రామంలోని భూస్వాములందరూ సభ్యులే. “సభ”లో బ్రాహ్మణ అగ్రహారంలోని వారు మాత్రమే సభ్యులుగా ఉండేవారు. ‘నగరం’ అనేది వర్తకులకు’ సంబంధించిన సభ. బ్రాహ్మణ అగ్రహారంలోని సభ్యులకు దేవాలయమే సమావేశపు స్థలం. కొన్ని గ్రామాల్లో ప్రత్యేకించి కచేరీలుండేవి.

సభ్యుల ఎన్నిక: చోళుల కాలంలో ప్రతి గ్రామాన్ని 30 వార్డులుగా విభజించారు. ప్రతి వార్డు నుండి ఒక సభ్యుడ్ని లాటరీ పద్ధతిపై ఎన్నుకునేవారు. ఈ సభ్యులను గ్రామసభ ఉపసంఘాలుగా నియమించేది. చెరువులు, సత్రాలు, ఆలయాలు, తోటలు, పాఠశాలలు, నేర విచారణ, పన్నుల వసూలు మొదలైన వాటికి ప్రత్యేక ఉపసంఘాలుండేవి. “పంచదార వారియం” అనే ఉపసంఘం మిగిలిన సంఘాల కార్యక్రమాలను పరిశీలించేది.

అర్హతలు: గ్రామసభలోని సభ్యుల అర్హతలను గురించి ప్రత్యేక నిబంధనావళిని రూపొందించి అమలు చేశారు. సభ్యులుగా ఎన్నుకోబడుటకు ఒక వ్యక్తికి కొన్ని అర్హతలుండాలి. అతడు:

  1. 30 నుండి 70 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వుండాలి,
  2. విద్యావంతుడై వుండాలి,
  3. సొంత ఇల్లు కలిగి భూమికి యజమానై వుండాలి.

అనర్హతలు: గ్రామసభ సభ్యులకు కొన్ని అర్హతలతో పాటు కొన్ని అనర్హతలు కూడా నిర్దేశించారు. గ్రామసభకు ఎన్నుకోబడదలచుకున్న వ్యక్తి:

  1. పంచ మహాపాపాలు చేసినవాడై ఉండకూడదు,
  2. గత మూడు సంవత్సరాలుగా ఏ ఉపసంఘంలోను సభ్యుడిగా ఉండరాదు,
  3. ఒకసారి సభ్యుడిగా ఉండి లెక్కలను సరిగా అప్పగించని వాడు కూడా అనర్హుడే,
  4. నేరస్తులు వారి బంధువులు కూడా ఈ ఎన్నికల్లో పాల్గొనకూడదు.

గ్రామ సభ అధికారాలు: గ్రామంలోని భూములపై యాజమాన్యపు హక్కు సభకు ఉన్నది. పన్నులను విధించుట, అడవులను నరికించి కొత్త భూములను సాగులోకి తీసుకువచ్చుట మొదలగునవి ఈ సభ ముఖ్య విధులు. వీటితోపాటు భూమి, నీటి తగవులను పరిష్కరించుట, నేరాలను విచారించుట కూడా దీని విధులుగా చెప్పుకోవచ్చు. అయితే ఆదాయ వనరులు తక్కువ కావటంతో కేంద్ర ప్రభుత్వమే రహదారులు నిర్మించగా వాటిపై అజమాయిషీని సభ నిర్వహించేది. గ్రామసభలకు సలహాలివ్వటానికి అధికారులుండేవారు. కేంద్ర ప్రభుత్వము యొక్క అనవసర జోక్యము ఈ సభలలో ఉండేది కాదు.

ముగింపు: చోళుల గ్రామ పాలన సమర్థవంతమైనది, ఆదర్శవంతమైనది. చోళులు గ్రామ పరిపాలనను ఏర్పరచి అందులో ప్రజలను భాగస్వాములను చేయటం వల్ల పాలనలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సమన్వయం సాధ్యపడింది.

ప్రశ్న 7.
మొదటి రాజేంద్రుని విజయాలను చర్చించండి.
జవాబు.
మొదటి రాజేంద్రుడు (క్రీ.శ. 1014-1044): రాజరాజు తరువాత చోళ సింహాసనాన్ని అధిష్టించినవాడు అతని కుమారుడు రాజేంద్ర చోళుడు. ఇతడు తండ్రిని మించిన శూరుడుగా కీర్తి ప్రతిష్టలను పొందాడు. అతడు తండ్రివలెనే దిగ్విజయ యాత్రలు సాగించి సామ్రాజ్య వ్యాప్తికి పాటుపడ్డాడు. మొదట పాండ్య, చేర రాజ్యములను జయించాడు. ఆ తరువాత సింహళముపై నౌకాదండయాత్రలు సాగించి దానినంతటిని జయించి తన ఆధిపత్యము క్రిందకు తెచ్చాడు. చాళుక్యరాజ్యంలో జరిగిన వారసత్వ యుద్దాల్లో వేంగి చాళుక్యుల పక్షాన నిలిచి రాజరాజ నరేంద్రునకు సహాయం చేశాడు. రాజరాజనరేంద్రునికి తన కుమార్తె అమ్మంగదేవినిచ్చి వివాహం చేశాడు. తరువాత గంగానది వరకు దండయాత్రలు చేసి, బెంగాల్ పాలవంశీయుడైన మహీపాలుని ఓడించి “గంగైకొండచోళ” అను బిరుదు ధరించాడు. ఈ విజయానికి గుర్తుగా “గంగైకొండ చోళపురము” అను నగరాన్ని నిర్మించి దానిని తన రాజధానిగా చేసుకున్నాడు. తరువాత గొప్ప నౌకాబలమును రూపొందించుకొని జావా, సుమత్రా ప్రాంతములను పాలించే శ్రీవిజయ సామ్రాజ్యాధినేతయైన సంగ్రామ విజయోత్తుంగవర్మను ఓడించి, అతని రాజధాని కడారం స్వాధీనం చేసుకొన్నాడు. ఈ విజయమునకు చిహ్నంగా “కడారంకొండ” అనే బిరుదును ధరించాడు. ఇట్టి దిగ్విజయముల వలన రాజేంద్రచోళుడు భారతదేశ సుప్రసిద్ధ పాలకులలో ఒకడుగా కీర్తిని పొందాడు. ఇతడు తన తండ్రివలె గొప్ప పరిపాలనాదక్షుడు. వ్యవసాయాభివృద్ధి కొరకు అనేక నీటివనరులను ఏర్పరచాడు. వైదిక కళాశాలను స్థాపించి, దాని పోషణకు కొంత భూభాగమును దానము చేశాడు. ఇతడు గొప్ప భవన నిర్మాత. ప్రజాసంక్షేమ పాలన సాగించి, “తండ్రిని మించిన తనయుడు” అనే కీర్తిని పొందాడు. ఇతడు శిల్పకళను ఆదరించాడు. గంగైకొండ చోళపురంలో ఒక శివాలయాన్ని నిర్మించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 7 దక్షిణ భారతదేశ రాజ్యాలు

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బాదామి చాళుక్యుల వంశపతనానికి దారితీసిన కారణాలు చర్చించండి.
జవాబు.
బాదామి చాళుక్య వంశరాజుల్లో రెండో కీర్తివర్మ సింహాసనం అధిష్టించాడు. ఇతడు క్రీ.శ. 746 757 మధ్యకాలంలో పాలనచేసాడు. పల్లవ – చాళుక్య సంఘర్షణవల్ల బాదామి చాళుక్యరాజ్యం బలహీనమైంది. ఆర్థికంగా, సైనికంగా చాలా శక్తి నశించింది. సామంతులు ఎదురుతిరిగారు. రాష్ట్రకూటులు దంతిదుర్గుని నేతృత్వంలో స్వతంత్ర్యం ప్రకటించుకున్నారు. దంతిదుర్గుడు ముఖాముఖి యుద్ధంలో రెండో కీర్తివర్మను ఓడించాడు. ఈ విధంగా దక్షిణభారతదేశ చరిత్రలో బాదామిచాళుక్యుల పాలన ముగిసింది.

ప్రశ్న 2.
చాళుక్యుల వాస్తుశిల్పకళ లక్షణాలను వివరించండి.
జవాబు.
చాళుక్యరాజులు గొప్ప వాస్తు – శిల్పకళ, సాహిత్య అభిమానులు. వీరికాలంలో అనేక భారీ దేవాలయాల నిర్మాణం జరిగింది. రాజుల పోషణలో వాస్తు – శిల్పులు సుందరమైన, భారీ దేవాలయాలను బాదామి, ఐహోలు, పట్టడకల్, ఆలంపూర్ మొదలైన ప్రదేశాల్లో నిర్మించారు. దేవాలయం, గుడి సామాజిక – సాంస్కృతిక కార్యకలాపాలకు కేంద్రమైంది. ఇక్కడ నిర్మించిన దేవాలయాల్లోని స్తంభాలు, విగ్రహాలు ఆనాటి శిల్పుల చాతుర్యానికి, శిల్పకళావైభవానికి నిదర్శనం. వీరి శిల్పకళారీతులచే ‘చాళుక్య శిల్పకళారీతి’ అని వర్ణించారు.

ప్రశ్న 3.
మొదటి రాజాధిరాజు సాధించిన విజయాలను చర్చించండి.
జవాబు.
మొదటి రాజాధిరాజు, మొదటి రాజేంద్రచోళుని కుమారుడు. ఇతని 11 ఏండ్ల పాలనంతా పొరుగు రాజ్యాలతో యుద్ధాల్లో గడిసింది. క్రీ.శ. 1052లో జరిగిన భీకర ‘కొప్పం’ యుద్ధంలో చాళుక్యరాజ్య సైన్యాలచేతిలో మొదటి రాజాధిరాజు ప్రాణాలు కోల్పోయాడు. ఇతని అనంతరం సోదరుడైన రెండో రాజేంద్రుడు సింహాసనం అధిష్టించాడు. కుడాల్ సంగం యుద్ధంలో (క్రీ.శ. 1062) ఇతడు మొదటి సోమేశ్వరున్ని ఓడించాడు.

ప్రశ్న 4.
ఐహోల్ శాసనం ప్రాధాన్యతను వివరించండి.
జవాబు.
ఐహోల్ కర్ణాటక రాష్ట్రములో ఉన్నది. ఈ ప్రదేశంలో పశ్చిమ చాళుక్యరాజు రెండవ పులకేశి యొక్క సేనాని రవికీర్తి వేయించిన ఐహోల్ శాసనం ఉంది. ఈ శాసనంలో రెండవ పులకేశి యొక్క దిగ్విజయ యాత్ర, హర్షునిపై అతని విజయం వర్ణించబడ్డాయి. ఐహోల్లో పశ్చిమ చాళుక్యుల కాలం నాటి దేవాలయాలున్నాయి.

ప్రశ్న 5.
మహాబలిపురంలోని రాతి ఆలయాలను (Rock-cut) వివరించండి.
జవాబు.
మహేంద్రవర్మ – I కాలంనుంచే పల్లవరాజ్యంలో శిల్పులు కొండలను తొలిచి ఆలయాలను నిర్మించారు. వీటినే ‘గుహాలయాలు’ లేదా మండపాలు అని వర్ణిస్తారు. మొదటి మహేంద్రవర్మకాలంలో నిర్మించిన ప్రసిద్ధ గుహాలయాల్లో. పేర్కొనదగినవి ‘పల్లవరం’ దళవనూర్ లో కట్టించిన ‘పంచపాండవ గుహాలయాలు’, ‘మల్లేశ్వరాలయం’ పేర్కొనదగినవి. మొదటి వర్మ స్వయంగా తాను ఎలాంటి ఇటుకలను, వెదురును, లోహాన్ని ఉపయోగించకుండా త్రిమూర్తి ఆలయాన్ని నిర్మించినట్లు తన ‘మండగపట్టుశాసనంలో పేర్కొన్నాడు. ఈ ఆలయంలో సువిశాల మండపాలు, విశాలమైన స్తంభాలపై నిర్మించాడు. స్తంభాలను చెక్కడంలో ఆనాటి శిల్పులు చూపిన ప్రతిభ అద్భుతమనీ వాస్తు శిల్ప పండితుల అభిప్రాయం.

TS Inter 1st Year History Study Material Chapter 7 దక్షిణ భారతదేశ రాజ్యాలు

ప్రశ్న 6.
అమోఘవర్షుని విజయాలను చర్చించండి.
జవాబు.
రాష్ట్రకూట పాలకుల్లో మొదట అమోఘవర్షుడు గొప్ప పాలకుడు. ఇతని పాలనాకాలం క్రీ.శ.814 – 878. ఇతడు మూడవ గోవిందుడి కుమారుడు. అతడు స్థానిక పాలకుల, సామంతుల తిరుగుబాట్లు అణచివేశాడు. అతడు వేంగి పాలకుడు విజయాదిత్యుడితో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. గంగరాజును ఓడించాడు. అతడు స్వయంగా గొప్ప కవి, కవి పండిత పోషకుడు. కన్నడంలో ‘కవిరాజ మార్గం’ అనే వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు. ‘మంఖేడ్’ అనే నూతన రాజధాని నగరాన్ని నిర్మింపజేశాడు.

Leave a Comment