TS Inter 1st Year Commerce Study Material Chapter 10 Micro, Small and Medium Enterprises (MSMEs)

Telangana TSBIE TS Inter 1st Year Commerce Study Material 10th Lesson Micro, Small and Medium Enterprises (MSMEs) Textbook Questions and Answers.

TS Inter 1st Year Commerce Study Material Chapter 10 Micro, Small and Medium Enterprises (MSMEs)

Long Answer Questions

Question 1.
Define MSMEs and explain their significance in the Indian economy.
Answer:
Definition:
MSMEs means Micro, Small, and Medium Enterprises. The Small and Medium Enterprise Development Bill, of 2005 was enacted in June 2006 as the “Micro, Small and Medium Enterprises Development Act, 2006”. As per the MSMED Act, 2006, Micro, Small, and Medium Enterprises (MSMEs) are classified into two classes. They are:

  • Manufacturing Enterprises
  • Service Enterprises.

1) Manufacturing Enterprises: Manufacturing enterprises are those enterprises that are engaged in the manufacturing or production of goods. These enterprises are involved in converting raw material into finished products by using plants and machinery.

As per MSMEDs Act 2006, manufacturing enterprises are classified into micro, small and medium enterprises, and those are defined on the base of investment made in plant and machinery.

  • A micro enterprise is an enterprise where investment in plant and machinery does not exceed. ₹ 25 lakhs.
  • A small enterprise is an enterprise where the investment in plant and machinery is more than ₹ 25 lakhs but does not exceed ₹ 5 crores.
  • A medium enterprise is an enterprise where investment in plant and machinery is more than ₹ 5 crores but does not exceed ₹ 10 crores.

2) Service Enterprises: The enterprises involved in providing or rendering of services are known as Service enterprises. As per MSMEDs act 2006, Service enterprises are divided into micro, small and medium enterprises and there are defined as below.

  • A micro enterprise is an enterprise where the investment in equipment does not ex¬ceed ₹ 10 Lakhs.
  • A small enterprise is an enterprise where the investment in equipment is more than ₹ 10 lakhs but does not exceeds ₹ 2 crores.
  • A medium enterprise is an enterprise where the investment in equipment is more than ₹ 2 crores but does not exceed ₹ 5 crores.

Significance of MSMEs:
Micro, Small and Medium Enterprises are integral part of the economy world wide it is accepted that Micro, Small and Medium Enterprises (MSMEs) are engine of economic growth and for promoting economic development.

In India, the MSMEs play an important role in the overall industrial economy of the country. They are widely dispersed across the country and produce a diverse range of products and services to meet the needs of local market and also global market. The significance of MSMEs is given below.

  • MSME contributes 45% of India’s produced output.
  • MSME contributes approximately 40% of India’s exports.
  • MSMEs are contributing 8% of the country’s GDP.
  • MSMEs gives employment to 73 million people in more than 31 million units spread across the nation [40% of the employment opportunity in India is provided by MSME Sector].
  • 90% of MSMEs in India are unregistered (out of which nearly 80% are sole proprietor Firms].
  • MSMEs provide opportunities to the small entrepreneurs by providing various channels of Investment opportunity according to their class of investment.
  • MSMEs provide a good market for foreign companies to start venture capital business in India.
  • MSMEs manufactures more than 6,000 products arraying from hi-tech to traditional industries.

Question 2.
Explain the problems faced by Indian MSME sector in detail.
Answer:
The Indian MSMEs are facing different types of problems.

Various problems faced by Indian MSMEs are given below:
1) Lack of Credit from Banks: The MSMEs are facing the problems of non availability of credit from banks. The banks are not providing the adequate amount of loan to the MSMEs. The promotors of the MSMEs have to produce different types of documents to prove their worthiness. The loan providing process of the banks is very time consuming.

TS Inter 1st Year Commerce Study Material Chapter 10 Micro, Small and Medium Enterprises (MSMEs)

2) Competition from Multinational Companies: Due to globalization, the MSMEs are facing the tough competition from the multinational companies who are providing quality goods at cheapest prices. Therefore, it is very difficult for MSMEs to compete with the multinational companies.

3) Poor Infrastructure: MSMEs are developing so rapidly but their infrastructure is very poor. With poor infrastructure, their production capacity is very low while production cost is very high.

4) Non Availability of Raw Material and Other Inputs: For establishment of MSMEs required raw material, skilled work labour and other inputs which are not available in the market. Due to unavailability of these essentials, it is very difficult to produce the products at affordable prices.

5) Lack of Advanced Technology: The owners of MSMEs are not aware of advanced technologies of production. Their methodology of production is outdated.

6) Lack of Distribution of Marketing Channels: The MSMEs are not adopting the innovative channels of distribution. Their advertisement and sales promotion strategies are comparatively weaker than the multinational companies. Thus, they get low profits.

7) Lack of Training and Skill Development Program: The proprietors of MSMEs are not aware of the innovative methods of production. Lack of proper training and skill enhancement programs in respect of MSMEs are very low. The skill development pro-grams organised by the state and central governments are not reaching properly to all the units across the country.

Question 3.
Discuss the privileges offered to MSMEs in India.
Answer:
MSMEs are enjoying specific privileges and advantages when compared to other enter-prises. The MSMED Act, provides the following privileges on micro, small and medium enterprises.

1) Exclusive Manufacturing of Certain Products by MSMEs: The major benefit for MSMEs is the reservation policy, which reserves certain items, for exclusive manufacture by these enterprises. The Government has put in place policies and has reserved three hundred fifty (350) items for purchase from MSMEs, under the Government Stores Purchase Programme.

2) Space Allocation: To encourage the MSMEs, the Special Economic Zones (SEZs) are required to allocate 10% space for the small-scale units.

3) Timely Payment for Goods and Services: Under MSMED Act, protections are offered in relation to timely payment for goods and services by buyers to MSMEs. It lays an obligation upon the buyers of any goods or services of MSMEs to make payment on specified date as per the agreement.

4) Strong Support and Encouragement from the Government: The Government has been encouraging and supporting this sector by offering packages of schemes and incentives through its specialized institutions in the form of assistance in obtaining finance, help in marketing, technical guidance, training and technology upgradation etc.

5) Interest for Delayed Payment by the Buyer: When a buyer fails to make payment as required by the seller, he shall be liable to pay interest on the outstanding amount, for the period of delay from the date immediately following the agreed date. The interest shall be payable at a rate three times the bank rate and compounded at monthly rates.

6) Reference of Disputes: If there are any disputes relating to amount payable for any goods or services, and any interest thereon, may be referred by any party, to the Micro and Small Enterprises Facilitation Council, which shall conduct conciliation in the matter.

TS Inter 1st Year Commerce Study Material Chapter 10 Micro, Small and Medium Enterprises (MSMEs)

Short Answer Questions

Question 1.
Define manufacturing enterprises as per MSMEs Act, 2006.
Answer:
Manufacturing enterprises are those business enterprises which are engaged in the manufacturing or production of goods or commodities. Manufacturing enterprises involve in converting the raw materials into finished products.

As per MSMED Act 2006, the manufacturing enterprises are categorised into micro, small and medium enterprises and these are defined in terms of investment made in plant and machinery as shown below.

  • A micro enterprise is an enterprise where investment in plant and machinery does not exceed ₹ 25 lakhs.
  • A small enterprise is an enterprise where the investment in plant and machinery is more than ₹ 25 lakhs but does not exceed ₹ 5 crores.
  • A medium enterprise is an enterprise where the investment in plant and machinery is more than ₹ 5 crores but does not exceed ₹ 10 crores.

Question 2.
Define Service enterprises as per MSMEs Act, 2006.
Answer:
The enterprises which involved in providing or rendering of services are known as service enterprises.

As per MSMED Act 2006, Service enterprises are divided into micro, small and medium enterprises on the base of investment made in equipment. These service enterprises are defined as below:

  • A micro enterprise is an enterprise where the investment in equipment does not exceed ₹ 10 lakhs.
  • A small enterprise is an enterprise where the investment in equipment is more than 110 lakhs but does not exceed ₹ 2 crores.
  • A medium enterprise is an enterprise where the investment in equipment is more than ₹ 2 crores but does not exceed ₹ 5 crores.

Question 3.
Briefly explain the registration process of MSMEs.
Answer:
The Ministry of MSME has been undertaking number of programs to help and assist entrepreneurs and small business. Entrepreneurs who are planning to setup business, may contact National Institute for Micro, Small and Medium Enterprises, or Indian Institute of Entrepreneurship or the Development Commissioner for details about their programs and business plans.

The following are the requirements for registration process of MSMEs under MSMED Act, 2006.

  • Any person intending to establish a micro or small enterprise may do at his discretion.
  • Any person intending to establish a medium enterprise engaged in providing or rendering of services may at his discretion.
  • Any person intending to establish a medium enterprise engaged in the manufacturing or production of goods pertaining to any industry specified in the first schedule to the Industries (Development and Regulation) Act, 1951, shall file the memorandum of medium enterprise with authority specified by the state Government or the Central Government.

Question 4.
Explain the promotional measures initiated for strengthening MSMEs in India.
Answer:
The following are the measures for promotion and development of micro, small and medium enterprises, to be undertaken by the Central Government, State Government and the Reserve Bank of India.

These measures are explained as below:

  • Organizing programs to facilitate development of skills among the employees, management and entrepreneurs, provisioning for technological upgradation, marketing, infrastructure facilities.
  • Credit facilities are provided for timely and smooth flow of credit, minimize the incidence of sickness, and enhance the competitiveness of MSMEs.
  • Preferential procurement of goods and services of MSMEs, by the Government, its aided institutions and public sector enterprises.
  • Government grants to the notified fund or funds which are to be utilized exclusively for the measure of promotion and development of MSMEs.

TS Inter 1st Year Commerce Study Material Chapter 10 Micro, Small and Medium Enterprises (MSMEs)

Very Short Answer Questions

Question 1.
Micro Enterprise.
Answer:
i) For Manufacturing Enterprises:
A micro enterprise is an enterprise where the investment in plant and machinery does not exceed ₹ 25 lakhs,

ii) For Service Enterprises:
A micro enterprise is an enterprise where the investment in equipment does not exceed ₹ 10 lakhs.

Question 2.
Small Enterprises.
Answer:
i) For Manufacturing Enterprises:
A small enterprise is an enterprise where the investment in plant and machinery is more than ₹ 25 lakhs but does not exceed ₹ 5 crores.

ii) For Service Enterprises:
A small enterprise is an enterprise where the investment in equipment is more than ₹ 10 lakhs but does not exceed ₹ 2 crores.

Question 3.
Medium Enterprises.
Answer:
i) For Manufacturing Enterprises:
A medium enterprise is an enterprise where the investment in plant and machinery is more than ₹ 5 crores but does not exceed ₹ 10 crores.

ii) For Service Enterprises:
A medium enterprise is an enterprise where the investment in equipment is more than ₹ 20 crores but does not exceed ₹ 5 crores.

Question 4.
Manufacturing Enterprise.
Answer:
i) The enterprise which is engaged in the manufacturing or production of goods is called a manufacturing enterprise.
ii) There are 3 types of manufacturing enterprises on the base of investment in plant and machinery. They are given below:

  • Micro Enterprise: Investment in plant and machinery does not exceed ₹ 25 lakhs.
  • Small Enterprise: Investment in plant and machinery is more than ₹ 25 lakhs but does not exceed ₹ 5 crores.
  • Medium Enterprise: Investment in plant and machinery is more than ₹ 5 crores but does not exceed ₹ 10 crores.

TS Inter 1st Year Commerce Study Material Chapter 10 Micro, Small and Medium Enterprises (MSMEs)

Question 5.
Service Enterprise.
Answer:
i) The enterprise involved in providing or rendering services is called a service enterprise.
ii) There are 3 types of enterprises based on investment in equipment. They are:

  • Micro Enterprise: Investment in equipment does not exceed ₹ 10 lakhs.
  • Small Enterprise: Investment in equipment is more than ₹ 10 lakhs but does not exceed ₹ 2 crores.
  • Medium Enterprise: Investment in equipment is more than Rs. 2 crores but does not exceed ₹ 5 crores.

Question 6.
Define Enterprise.
Answer:
1) The term “Enterprise” is defined under section 2(e) as “any industrial understanding or business concern or any other establishment, engaged in the manufacture or production of goods, in any manner pertaining to any industry specified in the first schedule to the Industries (Development and Regulation) Act, 1951, or engaged or providing or rendering of any service or services.

2) The term “Enterprise” includes: Proprietorship, Hindu Undivided Family, Co-operative Society, Partnership Undertaking, or any other legal entity.

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 3 స్నేహలతాదేవి లేఖ

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 3rd Lesson స్నేహలతాదేవి లేఖ Textbook Questions and Answers.

TS Inter 1st Year Non-Detailed 3rd Lesson స్నేహలతాదేవి లేఖ

ప్రశ్నలు- సమాధానాలు

ప్రశ్న 1.
స్నేహలతాదేవి ఎదుర్కున్న సమస్యలను చర్చించండి?
జవాబు:
స్నేహలతాదేవి అను పాఠ్యభాగము డా. ముదిగంటి సుజాతారెడ్డిచే రచించబడిన. “విసుర్రాయి” కథా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ కథ నేటి తరం మహిళా సాధికారికతను ప్రతిబింబిస్తుంది. స్త్రీల జీవితంలో పెళ్ళికే కాకుండా సమాంతరంగా విద్య, ఉద్యోగానికి ఆర్థిక స్వాలంబనకు చాలా ప్రాధాన్యత ఉందనే వాస్తవాన్ని వివరిస్తుంది.

యువత చిన్న విషయానికే కుంగిపోయి, అసంతృప్తికి, నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. అలాంటి ప్రతికూల ధోరణులను ఆ కథ నిరసిమైంది. ఆత్మ విశ్వాసంలో దేన్నైనా సాధించవచ్చు అన్న నమ్మకాన్ని ఇస్తుంది. అమ్మా నాన్నలకు స్నేహలత రాసినలేఖ పై విషయాలను రుజువుచేస్తుంది.

స్నేహలత తన పెళ్ళి విషయముపై తన తల్లిదండ్రులు దిగులు పెట్టుకున్నారని తెలుసుకుంది. వారిని ఓదార్చుతూ వర్తమానకాలంలోని యువతులకు ధైర్యాన్నిస్తూ వ్రాసిన లేఖ స్నేహలతాదేవి లేఖ. అమ్మ నాకు పెళ్ళికాలేదని మీరు చింతపెట్టుకున్నారు. మిమ్మల్నిచూసి నాకు మొదట్లో చింతగానే ఉంది.

ఏకాంతంగా ఎన్నో సార్లు ఏడ్చాను కూడా? పెళ్ళిచూపులకు వచ్చిన ప్రతి మగాడు నన్ను కాదనటం వల్ల నాకు న్యూనతా భావం కలిగింది. నాలో నాకే ఎన్నో లోపాలు కన్పించడం మొదలుపెట్టాయి. పెళ్ళిచూపులు మీద పెళ్ళిచూపులు జరిగాయి. పెళ్ళి చూపులనే తతంగం ఆడదానికి జరిగే ఎన్నో అవమానాలలో ఒకటిగా స్నేహలత భావించింది.

నిజంగా పెళ్ళి చూపులకు వచ్చిన వారిలో చాలా మంది నాకు నచ్చలేదు. కాని ఆ మాటలను చెప్పే హక్కునాకు లేదని మీరు, సమాజం నాకు నేర్పారు. అందుకే నోరు మూసుకున్నాను. నేను పెళ్ళి చూపులకు వచ్చిన వారికి వచ్చాకపోవటానికి నా అందం కాదు ప్రమాణం అని నాకు తెలిసింది. వారికి నచ్చంది మీరిచ్చే కట్నకానుకలు నేను చదువకున్నాను.

వచ్చేవాడు ఏమంటాడోనని నన్ను ఉద్యోగ ప్రయత్నం మీరు చేయనీయలేదు. నేను మరీ అంత అందగత్తెను కాకున్నా వికారంగా మాత్రం లేను కదా! ఎంతోమంది పెళ్ళిచూపులకు వచ్చారు కదా? ఒక్కరన్నా నా చదువు సంస్కారం గురించి అడిగారా! కట్న కానుకలను గురించి బేరాలాడటమే సరిపెట్టారు. ఈ సమాజంలో ఆచారాలు కట్టుబాట్లు ఆడదాన్ని బేరమాడే అంగట్లో వస్తువుగా చేశాయి. అమ్ముడు పోయేది వరుడు అవమానాల పాలయ్యేది వధువు ఇదేమి విడ్డూరం. ఇదేమి సంస్కారం.

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 3 స్నేహలతాదేవి లేఖ

వరకట్న వ్యతిరేకంగా పొసెషన్లు, నినాదాలు చేసి రోడ్లమీద తిరిగితే ప్రయోజనం ఉండదు. మానవ మనస్తత్వాలు మారాలి. స్త్రీలలో ఈ పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం రావాలి. స్త్రీలు తమ జీవితాలను తమకు ఇష్టమైన రీతిలో మలచు కోవటానికి ప్రయత్నించాలి. ఒత్తిడితో ధైర్యాన్ని కోల్పోయి ప్రాణత్యాగం చేయవద్దని కోరింది. తనకు ఎదురైన సమస్యలు నేటి సమాజంలోని ప్రతి స్త్రీ ఎదుర్కోంటుందని వారిందరికి ధైర్యం నూరిపోసింది స్నేహలతాదేవి.

ప్రశ్న 2.
స్నేహలతాదేవి ఆత్మ విశ్వాసాన్ని వివరించండి?
జవాబు:
స్నేహలతాదేవి అను పాఠ్యభాగం డా॥ ముదిగంటి సుజాతారెడ్డిచే రచించ బడింది. ఆమె కథల సంపుటి “విసుర్రాయి”లోనికి ఈ కథ. ఈ కథ నేటి తరం మహిళా సాధికారికతను ప్రతిబింబిస్తుంది. స్త్రీల జీవితంలో పెళ్ళికే కాకుండా సమాంతరంగా విద్య, ఉద్యోగానికి, ఆర్థిక స్వావలంబనకు చాలా ప్రాధాన్యం ఉందన్న వాస్తవాన్ని వివరిస్తుంది.

తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎంత బాధ్యతాయుతంగా ఆలోచించాలన్న మానవీయ విలువలను ఆధర్మాలను తెలుపుతుంది. యువత ప్రతి చిన్న విషయానికి అసంతృప్తికి గురి అవుతున్నారని, చిన్న ఓటమికే కృంగిపోయే మనస్తత్వంతో నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నిరసిస్తుంది.

స్నేహలతాదేవికి తనపై తనకు అంచంచల ఆత్మ విశ్వాసం ఉంది. ఈ సమాజంలో జరుగుతున్న సంఘటనలు తనకు నేర్పాయి. తన తనతల్లిదండ్రులకు ఒక్కగా నొక్క కుమార్తె. తల్లిదండ్రులు చక్కగా విద్యాబుద్ధులు నేర్పించారు. వివాహ విషయంలో తన తల్లిదండ్రుల బాధే స్నేహలతను కలిచివేసింది.

స్నేహలతకు వివాహం కావడం లేదని తల్లిదండ్రులు చింతిస్తున్నారు. వారి బాధను చూడలేక వారిని ఓదార్చుతూ తనపై తాను విశ్వాసాన్ని పెంచుకుంది స్నేహలత. పెళ్ళి చూపుల మీద పెళ్ళిచూపులు జరిగాయి. ఇది ఆడదానికి జరిగే అవమానాలలో ఒకటి. నాకేం తక్కువ? చదువుకుంది. సంస్కారం ఉంది.

మరీ అంత అందంగా లేకపోయినా వికారంగా మాత్రం లేను. నన్ను చూడటానికి వచ్చేవారికి వీటితో అస్సలు పనేలేదు. నేనిచ్చే కట్నంపైనే వారి దృష్టి. నేను ఇచ్చే కట్నాన్ని ఆశించి ఎవరూ నన్ను వివాహం చేసుకుంటానని అనటం లేదు. ఎందుకంటే అది వారికి నచ్చలేదు. ఈ దేశంలో స్వయం శక్తిపై విశ్వాసం లేనివాళ్ళు పెరిగిపోతున్నారు. పరాయిధనానికి ఆశకాదు అత్యాశ పడేవారే అధికమవుతున్నారు.

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 3 స్నేహలతాదేవి లేఖ

నా గురించి మీరు ఇల్లు అమ్ముకుని బజారును పడవలసిన పనిలేదు. నాకు చదువుంది. డిగ్రీ వుంది. ఆ డిగ్రీలో ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను. భవిష్యత్తులో నా జీవన పథంలో నేనంటే ఇష్టపడేవాడు. వ్యక్తిగా నన్ను గౌరవించే వాడు డబ్బుకోసం కాక, వరకట్నం కోసం కాక నా సాహచర్యం కోసం నా వ్యక్తిత్వం చూసి నన్ను పెళ్ళాడే వాడు దొరికినపుడే వివాహం చేసుకుంటాను. అందుకే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను.

నా గురించి మీరు భయపడనవసరం లేదు. నన్ను నేను కాపాడుకోగలను. నాకా శక్తిని ఈ సమాజం ఇచ్చింది. ఎక్కడున్నా నేను జాగ్రత్తగా క్షేమంగా ఉంటాను. ఉద్యోగం సాధించగానే మీకు ఉత్తరం రాస్తాను. మీరు కూడా నా దగ్గరికే వచ్చి ఉండవచ్చు. మీరు నా దగ్గర ఉండటానికి ఇష్టపడే వాడు దొరికినప్పుడే పెళ్ళి చేసుకుంటాను. ఈ సమాజంలో స్త్రీ శక్తి మేల్కొవాలి. ఎవరికి తగిన స్థాయిలో వారు ఆర్థిక స్వాలంబనను పొందటానికి కృషిచేసి వరకట్నం వంటి దురాచారాలను ఎదుర్కోవాలని కోరుకుంటున్నాని స్నేహలతాదేవి తనతోపాటు స్త్రీ జాతి కంతటికి ఆత్మ విశ్వాసాన్ని కల్గించింది.

స్నేహలతాదేవి లేఖ Summary in Telugu

రచయిత్రి పరిచయం

కవి పేరు : డా॥ ముదిగంటి సుజాతారెడ్డి

కాలం : మే 25, 1942

పుట్టిన ఊరు : నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం ‘ఆకారం’ గ్రామం

తల్లిదండ్రులు : వెంకటమ్మ, రామిరెడ్డి

చదువులు : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ,పిహెచ్

పిహెచ్ పరిశోధనాంశం : మను, వసు చరిత్రల తులనాత్మక పరిశీలన

రచనలు : తెలుగు సాహిత్య చరిత్ర
తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 3 స్నేహలతాదేవి లేఖ

నవలలు : మలుపు తిరిగిన రధచక్రాలు, సంకెళ్ళు తెగాయి, ఆకాశంలో విభజన రేఖలు లేవు

కథా సంపుటాలు. :

  • విసుర్రాయి, మిగుతున్న పట్నం, వ్యాపార మృగం, మరో మార్క్స్ పుట్టాలె, నిత్యకల్లోలం
  • గోపాలరెడ్డి సంస్కృత పండితుడు. ఆయనను వివాహం చేసుకున్నది. ఆయన స్మృతిలో
  • “ఛత్రప్రియ” అనే జీవిత కథను “ముసురు” పేరుతో ఆత్మకథను రాసుకున్నారు.
  • విదేశీ పర్యటనానుభవంతో ‘అద్భుత చైనా యాత్ర నైలునది నాగరికత’ గ్రంథాలను రచించారు. చాసో అవార్డు, రంగినేని ఎల్లమ్మ సాహితీ పురస్కారం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట ప్రతిభా పురస్కారాలను అందుకున్నారు.

TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 9th Lesson మొగల్ ల యుగం Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 9th Lesson మొగల్ ల యుగం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
షేర్షా పరిపాలనా విధానంపై ఒక వ్యాసం రాయండి.
జవాబు.
మొగల్ పాలనా వ్యవస్థకు రూపకల్పన చేసినవాడు అక్బర్. అక్బర్కు ప్రభుత్వ విధానాల్లో షేరా కొంతవరకు మార్గదర్శి. షేర్షా విధానాలను మెరుగుపరచి, కొత్త విధానాలను ప్రవేశపెట్టి, సమర్థవంతమైన పాలకునిగా అక్బర్ చక్రవర్తి మొగల్ చరిత్రలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు.

కేంద్ర ప్రభుత్వం:మొగల్ పరిపాలనా యంత్రాంగానికి చక్రవర్తి సర్వాధికారి. అధికారాలన్నీ అతడి చేతిలో కేంద్రీకృతమై ఉంటాయి. మొగల్ చక్రవర్తి ప్రాజ్ఞ నిరంకుశ ప్రభువు. “నా కింది ఉద్యోగులు నిర్వహించాల్సిన బాధ్యతలను నేను నిర్వహించనవసరం లేదు. పాలకుడు కింది ఉద్యోగుల తప్పులను దిద్దుకుంటూపోతూ నివారించుకుంటే సరిపోతుంది” అని అక్బర్ చెప్పుకున్నాడు. ప్రభుత్వంలో చక్రవర్తికి (పాదుషాకు) సలహాలిచ్చేందుకు నలుగురు మంత్రులున్నారు. వారు :

  1. వకీల్ లేక వకీల్-ఇ-ముత్లాక్ లేక ప్రధానమంత్రి:ఇతడు చక్రవర్తికి ముఖ్య సలహాదారు. అన్ని శాఖలను పర్యవేక్షిస్తాడు.
  2. దివాన్ లేక వజీర్ లేక ఆర్థికమంత్రి:ఇతడు సామ్రాజ్య ఆర్థిక వనరులను పర్యవేక్షించేవాడు. భూమిశిస్తు ఇతర పన్నుల వసూలు, సామ్రాజ్య ఖర్చులు ఇతని పర్యవేక్షణలో ఉండేవి.
  3. మీర్భక్షి:ఇతడు యుద్ధ మంత్రి. పెద్ద ఉద్యోగులకు జీతాలను కూడా బట్వాడా చేసేవాడు. మున్సబార్ల పేర్లు, వారి హోదాలు, వారి జీతాలు ఇతడు నమోదు చేసుకొనేవాడు. రాజప్రాసాద రక్షణ నిమిత్తం గస్తీ ఉద్యోగులను నియమించేవాడు. రాష్ట్రాలలో వార్తాహరులను, గూఢచారులను నియమించటం కూడా ఇతని విధి.
  4. సదర్-ఉస్-సదర్:మత విషయాలలో చక్రవర్తికి సలహాలివ్వడం, చక్రవర్తి దానధర్మాలను పర్యవేక్షించటం, ముఖ్య న్యాయాధీశునిగా వ్యవహరించటం ఇతడి విధులు.

రాష్ట్ర ప్రభుత్వం:పరిపాలనా సౌలభ్యం కొరకు మొగల్ సామ్రాజ్యం సుబాలుగా విభజింపబడింది. అక్బర్ కాలంలో దాదాపు 15 సుబాలుండేవి. ఒక రకంగా వీటిని రాష్ట్రాలుగా పరిగణించవచ్చు. రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ, కేంద్ర పాలనావ్యవస్థకు ప్రతిరూపం లేక ప్రతీక అని చెప్పవచ్చు. సుబాను పాలించే అధికారి సుబేదార్. సుబాలో శాంతి భద్రతలు కాపాడే బాధ్యతను సుబేదార్ నిర్వహిస్తాడు. దివాన్, భక్షి, సదర్, ఖాజీ అను అధికారులు కూడా రాష్ట్రపాలనా నిర్వహణలో బాధ్యత స్వీకరిస్తారు. వారి విధులు కేంద్ర ప్రభుత్వంలో అదే పేరుగల అధికారులు విధులను పోలి ఉంటాయి.

ప్రధాన నగరాలలో న్యాయ వ్యవహారాలను చూసేందుకు కొత్వాలు అనే ఉద్యోగి ఉండేవాడు. అతడు నగరాలలో శాంతి భద్రతలను కాపాడేవాడు. ప్రభుత్వ ఆజ్ఞలను అమలుపరిచేవాడు. విదేశీయుల కార్యకలాపాలను గమనించేవాడు. సర్కారు పాలన:”సుబాలు” సర్కారులుగా విభజింపబడ్డాయి. సర్కార్లను నేటి జిల్లాలతో పోల్చవచ్చు. సర్కార్లను పాలించడానికి ఈ క్రింది అధికార్లు ఉంటారు.

TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం

ఎ) ఫౌజార్:ఇతడు సర్కారు అధిపతి, సైనికాధికారి, తిరుగుబాట్లను అణచివేసి రెవిన్యూ అధికారులకు సహాయం చేయడం ఇతని ముఖ్య విధులు.
బి) అమల్ గుజార్:ఇతడు రెవిన్యూ శాఖాధిపతి. భూమిశిస్తు వసూలు చేయడం, ఋణాలను మంజూరు చేయడం ఇతని ముఖ్య విధులు.
సి) ఖజానాదార్:ఇతడు కోశాధికారి. వసూలైన భూమిశిస్తును ఖజానాలో భద్రపరచి కేంద్రానికి జాగ్రత్తగా పంపడం ఇతని విధి.
డి) బిలక్సి:ఇతడు భూములకు, భూమిశిస్తులకు సంబంధించిన వివరాలను తయారుచేస్తాడు.

పరగణా పాలన ; సర్కార్లు పరగణాలుగా విభజింపబడ్డాయి. ఈ క్రింది అధికారులు పరగణాల యొక్క నిర్వహించేవారు.
ఎ) షికార్: ఇతడు పరగణా యొక్క ముఖ్య కార్యనిర్వహణాధికారి. ఇతడు కూడా సైనికాధికారియే: పరగణా యొక్క శాంతిభద్రతలను పర్యవేక్షిస్తాడు.
బి) అమీన్: ఇతడు రెవిన్యూ ఉద్యోగి. భూమిశిస్తు విషయాలను నిర్వహిస్తాడు.
సి) కానుంగో: పట్వారీలపై అధికారి. ఇతడు భూములకు సంబంధించిన వివరాలను తయారుచేస్తాడు.
డి) పోద్దార్: ఇతడు పరిగణా యొక్క కోశాధికారి.

గ్రామ పాలన:పరగణాలు గ్రామాలుగా విభజింపబడ్డాయి. గ్రామం పరిపాలనా వ్యవస్థలో తుది అంశము. ముఖద్దమ్, పట్వారీలు గ్రామాధికారులు. ముఖద్దమ్ శాంతిని పర్యవేక్షిస్తాడు. పట్వారీ భూమిశిస్తు వివరాలను తయారు చేస్తాడు. గ్రామాలలో పంచాయితీ విధానం అమలులో ఉండేది. పంచాయితీలు న్యాయనిర్వహణ బాధ్యతలను నిర్వహించేవి.

సైనికపాలన:మొగల్ చక్రవర్తులు సమర్థవంతమైన సైన్యమును పోషించిరి. వీరి సైనిక విధానమును ‘మున్సబ్రీ’ విధానమందురు. ‘మున్సబ్’ అంటే ‘హోదా’ లేదా ‘ఉద్యోగం’ అని అర్థం. ఒక విధముగా ఢిల్లీ సుల్తానుల జాగీర్దార్ విధానం వంటిది.

ఆర్థిక విధానం:మొగలుల ఆర్థిక విధానం సమర్థవంతమైనది. ఖరాజ్, ఖమ్స్, జకాత్, జిజియా అనే నాలుగు రకాల పన్నులు వసూలు చేసిరి.

భూమిశిస్తు విధానం:మొగలుల భూమిశిస్తు విధానానికి పూర్తి రూపాన్ని కల్గించినవారు అక్బర్ మరియు ఆయన రెవిన్యూ మంత్రి రాజాతోడరమల్. మొగలుల భూమిశిస్తు విధానంను ‘బందోబస్త్’ విధానమందురు. న్యాయపాలన:చక్రవర్తితో కూడిన న్యాయమండలి మొగల్ రాజ్యంలో అత్యున్నత న్యాయస్థానం. అతి ముఖ్యమైన వివాదాలను ఈ న్యాయస్థానమే పరిష్కరించేది. చక్రవర్తియే ఉన్నత న్యాయాధీశుడు. ఉద్యోగులలో ప్రధాన ఖాజీ ఉన్నత న్యాయాధికారి. అతడు దిగువ న్యాయస్థానాల యొక్క న్యాయాధిపతులను నియమించేవాడు. ఆ న్యాయస్థానాల నుండి వచ్చే అప్పీళ్లను కూడా ప్రధాన ఖాజీ విచారించేవాడు. చీఫ్ సదర్ మత వివాదాలను పరిష్కరించేవాడు. రాష్ట్రాలలో (సుబాలలో) సదర్ క్రిమినల్ కేసులను, దివాన్ రెవిన్యూ వివాదాలను, ఖాజీ సివిల్ కేసులను పరిష్కరించే వారు. సర్కార్లలో ఫౌజార్లు, ఖాజీలు, పరగణాలలో షికార్లు, అమీన్లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించేవారు. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయితీలు నేర విచారణ చేసేవి.

ముగింపు:మొగలుల పాలనా విధానము ఉదారమైనది, సమర్థవంతమైనది. ప్రజాక్షేమాన్ని కాంక్షించేది. మహమ్మదీయుల పరిపాలనా వ్యవస్థ మొదటిసారిగా మొగలుల కాలంలోనే ఔన్నత్యాన్ని పొందింది.

ప్రశ్న 2.
మొగల్ పరిపాలన ముఖ్య లక్షణాలు చర్చించండి.
జవాబు.
మొగల్ పాలనా వ్యవస్థకు రూపకల్పన చేసినవాడు అక్బర్. అక్బర్కు ప్రభుత్వ విధానాల్లో షేరా కొంతవరకు మార్గదర్శి. షేర్షా విధానాలను మెరుగుపరచి, కొత్త విధానాలను ప్రవేశపెట్టి సమర్థవంతమైన పాలకునిగా అక్బర్ చక్రవర్తి మొగల్ చరిత్రలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు.

కేంద్ర ప్రభుత్వం:మొగల్ పరిపాలనా యంత్రాంగానికి చక్రవర్తి సర్వాధికారి. అధికారాలన్నీ అతడి చేతిలో కేంద్రీకృతమై ఉంటాయి. మొగల్ చక్రవర్తి ప్రాజ్ఞ నిరంకుశ ప్రభువు. నా కింది ఉద్యోగులు నిర్వహించాల్సిన బాధ్యతలను నేను నిర్వహించనవసరం లేదు. పాలకుడు కింది ఉద్యోగుల తప్పులను దిద్దుకుంటూపోతూ తాను చేసే తప్పులను నివారించుకుంటే సరిపోతుంది” అని అక్బర్ చెప్పుకున్నాడు. ప్రభుత్వంలో చక్రవర్తికి (పాదుషాకు) సలహాలిచ్చేందుకు నలుగురు మంత్రులున్నారు. వారు:

  1. వకీల్ లేక వకీల్-ఇ-ముత్లాక్ లేక ప్రధానమంత్రి:ఇతడు చక్రవర్తికి ముఖ్య సలహాదారు. అన్ని శాఖలను పర్యవేక్షిస్తాడు.
  2. దివాన్ లేక వజీర్ లేక ఆర్థికమంత్రి:ఇతడు సామ్రాజ్య ఆర్థిక వనరులను పర్యవేక్షించేవాడు. భూమిశిస్తు ఇతర పన్నుల వసూలు, సామ్రాజ్య ఖర్చులు ఇతని పర్యవేక్షణలో ఉండేవి.
  3. మీర భక్షి:ఇతడు యుద్ధ మంత్రి. పెద్ద ఉద్యోగులకు జీతాలను కూడా బట్వాడా చేసేవాడు. మున్సబార్లా పేర్లు, వారి హోదాలు, వారి జీతాలు ఇతడు నమోదు చేసుకొనేవాడు. రాజప్రాసాద రక్షణ నిమిత్తం గస్తీ ఉద్యోగులను నియమించేవాడు. రాష్ట్రాలలో వార్తాహరులను, గూఢచారులను నియమించటం కూడా ఇతని
    విధి.
  4. సదర్-ఉన్-సదర్:మత విషయాలలో చక్రవర్తికి సలహాలివ్వడం చక్రవర్తి దానధర్మాలను పర్యవేక్షించటం, ముఖ్య న్యాయాధీశునిగా వ్యవహరించటం ఇతడి విధులు.

రాష్ట్ర ప్రభుత్వం:పరిపాలనా సౌలభ్యం కొరకు మొగల్ సామ్రాజ్యం సుబాలుగా విభజింపబడింది. అక్బర్ కాలంలో దాదాపు 15 సుబాలుండేవి. ఒక రకంగా వీటిని రాష్ట్రాలుగా పరిగణించవచ్చు. రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ, కేంద్ర పాలనావ్యవస్థకు ప్రతిరూపం లేక ప్రతీక అని చెప్పవచ్చు. సుబాను పాలించే అధికారి సుబేదార్. సుబాలో శాంతి భద్రతలు కాపాడే బాధ్యతను సుబేదార్ నిర్వహిస్తాడు. దివాన్, భక్షి, సదర్, ఖాజీ అను అధికారులు కూడా రాష్ట్రపాలనా నిర్వహణలో బాధ్యత స్వీకరిస్తారు. వారి విధులు కేంద్ర ప్రభుత్వంలో అదే పేరుగల అధికారులు విధులను పోలి ఉంటాయి.

ప్రధాన నగరాలలో న్యాయ వ్యవహారాలను చూసేందుకు కొత్వాలు అనే ఉద్యోగి ఉండేవాడు. అతడు నగరాలలో శాంతి భద్రతలను కాపాడేవాడు. ప్రభుత్వ ఆజ్ఞలను అమలు పరిచేవాడు. విదేశీయుల కార్యకలాపాలను గమనించేవాడు. సర్కారు పాలన:“సుబాలు” సర్కారులుగా విభజింపబడ్డాయి. సర్కార్లను నేటి జిల్లాలతో పోల్చవచ్చు. సర్కార్లను పాలించడానికి ఈ క్రింది అధికార్లు ఉంటారు.

ఎ) ఫౌజార్: ఇతడు సర్కారు అధిపతి, సైనికాధికారి, తిరుగుబాట్లను అణచివేసి రెవిన్యూ అధికారులకు సహాయం చేయడం ఇతని ముఖ్య విధులు.
బి) అమల్ గుజార్: ఇతడు రెవిన్యూ శాఖాధిపతి. భూమిశిస్తు వసూలు చేయడం, ఋణాలను మంజూరు చేయడం ఇతని ముఖ్య విధులు.
సి) ఖజానాదార్: ఇతడు కోశాధికారి. వసూలైన భూమిశిస్తును ఖజానాలో భద్రపరచి కేంద్రానికి జాగ్రత్తగా పంపడం ఇతని విధి.
డి) బిలక్సీ: ఇతడు భూములకు, భూమిశిస్తులకు సంబంధించిన వివరాలను తయారుచేస్తాడు.

TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం

పరగణా పాలన: సర్కార్లు పరగణాలుగా విభజింపబడ్డాయి. ఈ క్రింది అధికారులు పరగణాల యొక్క పరిపాలనను నిర్వహించేవారు.
ఎ) షికార్:ఇతడు పరగణా యొక్క ముఖ్య కార్యనిర్వహణాధికారి. ఇతడు కూడా సైనికాధికారియే. పరగణా యొక్క శాంతిభద్రతలను పర్యవేక్షిస్తాడు.
బి) అమీన్:ఇతడు రెవిన్యూ ఉద్యోగి. భూమిశిస్తు విషయాలను నిర్వహిస్తాడు.
సి) కానుంగో:పట్వారీల-పై అధికారి. ఇతడు భూములకు సంబంధించిన వివరాలను తయారుచేస్తాడు.
డి) పోద్దార్:ఇతడు పరిగణా యొక్క కోశాధికారి.

గ్రామ పాలన:పరగణాలు గ్రామాలుగా విభజింపబడ్డాయి. గ్రామం పరిపాలనా వ్యవస్థలో తుది అంశము. ముఖద్దమ్, పట్వారీలు గ్రామాధికారులు. ముఖద్దమ్ శాంతిని పర్యవేక్షిస్తాడు. పట్వారీ భూమిశిస్తు వివరాలను తయారు చేస్తాడు. గ్రామాలలో పంచాయితీ విధానం అమలులో ఉండేది. పంచాయితీలు న్యాయనిర్వహణ బాధ్యతలను నిర్వహించేవి.

సైనిక పాలన:మొగల్ చక్రవర్తులు సమర్థవంతమైన సైన్యమును పోషించిరి. వీరి సైనిక విధానమును ‘మున్సబారీ’ విధానమందురు. ‘మున్సబ్’ అంటే ‘హోదా’ లేదా ‘ఉద్యోగం’ అని అర్థం. ఒక విధముగా ఢిల్లీ సుల్తానుల జాగీర్దార్ విధానం వంటిది.

ఆర్థిక విధానం:మొగలుల ఆర్థిక విధానం సమర్థవంతమైనది. ఖరాజ్, ఖమ్స్, జకాత్, జిజియా అనే నాలుగు రకాల పన్నులు వసూలు చేసిరి.

భూమిశిస్తు విధానం:మొగలుల భూమిశిస్తు విధానానికి పూర్తి రూపాన్ని కల్గించినవారు అక్బర్ మరియు ఆయన రెవిన్యూ మంత్రి రాజాతోడర్మల్. మొగలుల భూమిశిస్తు విధానంను ‘బందోబస్త్’ విధానమందురు.

న్యాయపాలన:చక్రవర్తితో కూడిన న్యాయమండలి మొగల్ రాజ్యంలో అత్యున్నత న్యాయస్థానం. అతి ముఖ్యమైన వివాదాలను ఈ న్యాయస్థానమే పరిష్కరించేది. చక్రవర్తియే ఉన్నత న్యాయాధీశుడు. ఉద్యోగులలో ప్రధాన ఖాజీ ఉన్నత న్యాయాధికారి. అతడు దిగువ న్యాయస్థానాల యొక్క న్యాయాధిపతులను నియమించేవాడు. ఆ న్యాయస్థానాల నుండి వచ్చే అప్పీళ్లను కూడా ప్రధాన ఖాజీ విచారించేవాడు. చీఫ్ సదర్ మత వివాదాలను పరిష్కరించేవాడు. రాష్ట్రాలలో (సుబాలలో) సదర్ క్రిమినల్ కేసులను, దివాన్ రెవిన్యూ వివాదాలను, ఖాజీ సివిల్ కేసులను పరిష్కరించేవారు. సర్కార్లలో ఫౌజ్దార్లు, ఖాజీలు, పరగణాలలో షికార్లు, అమీన్లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించేవారు. గ్రామస్థాయిలో గ్రామ పంచాయితీలు నేర విచారణ చేసేవి.

ముగింపు:మొగలుల పాలనా విధానము ఉదారమైనది, సమర్థవంతమైనది. ప్రజాక్షేమాన్ని కాంక్షించేది. మహమ్మదీయుల పరిపాలనా వ్యవస్థ మొదటిసారిగా మొగలుల కాలంలోనే ఔన్నత్యాన్ని పొందింది.

ప్రశ్న 3.
మొగల్ సామ్రాజ్య పతనానికి ఔరంగజేబు ఎంతవరకు బాధ్యుడు ?
జవాబు.
ఔరంగజేబు (క్రీ.శ. 1658 – 1707):సమర్థులైన మొగల్ చక్రవర్తులలో ఔరంగజేబు ఒకడు. “అలంగీర్” (ప్రపంచ విజేత) అనే బిరుదు ధరించి సింహాసనానికి వచ్చాడు. ఇతడి మొదటి పది సంవత్సరాల పాలనలో అనేక విజయాలు సాధించాడు. చిన్న చిన్న తిరుగుబాట్లను అణచివేశాడు. కాని పాలన చివరి రోజుల్లో అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. జాట్లు, సత్నామీలు, సిఖ్ు అతనికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేశారు. ఇతడి సంకుచిత మత దురభిమానం మూలంగానే ఈ తిరుగుబాట్లు జరిగాయి.

దక్కన్ విధానం:మొగలుల దక్కన్ విధానం అక్బర్తో ప్రారంభమైంది. ఖాందేశ్, బెరార్లను ఆక్రమించాడు. జహాంగీర్ అహ్మద్ నగర్ మంత్రి మాలిక్ అంబర్కు వ్యతిరేకంగా యుద్ధం చేశాడు. షాజహాన్ కాలంలో దక్కన్ గవర్నర్గా ఉన్న ఔరంగజేబు దక్కన్ రాజ్యాల పట్ల దుడుకైన విధానాన్ని అనుసరించాడు. కాని జౌరంగజేబు చక్రవర్తైన మొదటి అయిదు సంవత్సరాలు తన దృష్టిని పూర్తిగా పశ్చిమోత్తర సరిహద్దుపై కేంద్రీకరించాడు.

ఇదే సమయంలో మరాఠా నాయకుడు శివాజీ ఉత్తర, దక్షిణ కొంకణ్ణను జయించి స్వతంత్ర మరాఠా రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. మరాఠాల విజృంభణను అరికట్టడానికి ఔరంగజేబు బీజాపూర్, గోల్కొండ రాజ్యాలపై దండయాత్ర చేశాడు. సికిందర్షాను ఓడించి బీజాపూర్ను ఆక్రమించాడు. కుతుబ్షాహి సుల్తానును 1687లో ఓడించి గోల్కొండను ఆక్రమించాడు. దక్కన్ రాజ్యాలను ఆక్రమించడం ఔరంగజేబు చేసిన రాజకీయ తప్పిదం. దీనివల్ల మొగలులకు, మరాఠాలకు మధ్య ఉన్న ఆటంకం తొలగిపోయింది. మహారాష్ట్రులు ప్రత్యక్షంగా తమ బలాన్ని మొగలులపై కేంద్రీకరించడానికి మార్గం ఏర్పడింది. ఇతడి దక్కన్ విధానం మొగల్ సామ్రాజ్యానికి అపార నష్టాన్ని కలిగించింది. జాదునాధ్ సర్కార్ “దక్కన్ పుండు (ulcer) ఔరంగజేబును నాశనం చేసింది” అన్నాడు.

మత విధానం:ఔరంగజేబుకు సనాతన సున్నీ మతంలో విశ్వాసం కలదు. మహసీబ్ అనే అధికారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి, ప్రజలు నైతిక పత్రాలను పాటించేటట్లు కృషి చేశాడు. మద్యపానాన్ని నిషేధించాడు. భంగ్, మత్తు పదార్థాలను నిషేధించాడు. ఆస్థానంలో సంగీతాన్ని నిషేధించాడు. “తులాదానం” (చక్రవర్తిని వెండి, బంగారంతో తూకం వేయడం ఝరోకా దర్శనం” (చక్రవర్తి ప్రజాదర్శనం) వంటి ఆచారాలను నిలిపేశాడు. దీపావళి, దసరా, నౌరోజ్ పండుగలను జరుపరాదన్నాడు. జ్యోతిష్యులను ఆస్థానం నుంచి బహిష్కరించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం

ఔరంగజేబు మొదట కొత్త దేవాలయాల నిర్మాణాన్ని, పాత దేవాలయాల మరమ్మత్తును నిషేధించాడు. తరువాత సంవత్సరంలో హిందూ దేవాలయాలను కూల్చివేయాలని ఆదేశించాడు. మధుర, బెనారస్ లోని ‘దేవాలయాలు కూల్చివేయబడ్డాయి. ఔరంగజేబు 1679లో జిజియా పన్నును, తీర్థయాత్రికుల పన్నును తిరిగి విధించాడు. మహ్మదీయులలోని ఇతర శాఖల వారిపై కూడా మత వ్యతిరేకతను ప్రదర్శించాడు. మొహర్రం పండుగను నిషేధించాడు. షియా మతస్తులనే కారణంపై ఔరంగజేబు దక్కన్ రాజ్యాలపై దండయాత్ర చేశాడు. సిఖ్ తొమ్మిదవ మత గురువు గురు తేజ్బహదూర్ను చంపించాడు. దీనితో సిబ్లు సైన్యంగా ఏర్పడి మొగలాయిలతో నిరంతరం పోరాడారు.

ఔరంగజేబు మత విధానం వల్ల రాజపుత్రులు, మహారాష్ట్రులు, సిబ్లు మొగల్ సామ్రాజ్యానికి శతృవులుగా మారారు. మధుర జాట్లు, మేవార్ సత్నామీలు ఔరంగజేబు మత విధానం మూలంగా తిరుగుబాటు చేశారు. అందుకే మొసలి సామ్రాజ్య పతనానికి ఔరంగజేబు అనుసరించిన మత విధానం కూడా ఒక కారణంగా పేర్కొంటారు. ఔరంగజేబు వ్యక్తిత్వం, శీలం:ఔరంగజేబు వ్యక్తిగత జీవితం చాలా ఆదర్శప్రాయమైంది. ఇతడు క్రమశిక్షణ, కష్టపడి పని చేసే స్వభావం కలవాడు. ఆహార పానీయాలు, వస్త్రధారణ విషయంలో చాలా నిరాడంబరంగా జీవించాడు. విలాసాలకు దూరంగా ఉండేవాడు. తన వ్యక్తిగత ఖర్చుల కోసం ఖురాన్కు నకళ్ళురాసి, వాటిని అమ్మించేవాడు. మద్యపానం సేవించేవాడుకాదు. అరబ్బీ, పార్శీ భాషల్లో మంచి ప్రావీణ్యత కలదు. గ్రంథపఠనం చేసేవాడు. దైవభీతి కలిగిన మహ్మదీయుడిగా ఔరంగజేబు ప్రతిరోజు అయిదు సార్లు నమాజ్ చేసేవాడు. రంజాన్ ఉపవాసాలకు తు.చ. తప్పకుండా పాటించేవాడు.

ఔరంగజేబు రాజకీయ విషయాల్లో కొన్ని తీవ్రమైన తప్పిదాలు చేశాడు. మరాఠాల ఉద్యమ స్వభావాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల వారు ఔరంగజేబుకు విరోధులైనారు. మరాఠాల సమస్యలను పరిష్కరించలేకపోయాడు. దక్కన్ సుల్తానుల పట్ల అతడి విధానం కూడా పెద్ద నష్టాన్ని కలిగించాయి.

ఔరంగజేబు మత విధానం కూడా ఒక అనాలోచితమైన చర్య. తన సున్నీ మతసూత్రాలను మహ్మదీయేతరులపైన బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించాడు. మహ్మదీయులు సైతం అతన్ని సమర్థించలేదు. పైగా వారు మొగల్ సామ్రాజ్యానికి వ్యతిరేకులైనారు.

ప్రశ్న 4.
మొగల్ యుగం నాటి సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులపై వ్యాసం రాయండి.
జవాబు.
మొగల్ల కాలంనాటి సాంఘిక పరిస్థితులు:మొగల్ యుగం నాటి సమాజంలో హిందువులు, ఆఫ్ఘన్లు, ఇరానియన్లు, మంగోళులు, టర్క్లు, సిఖిు, క్రిస్టియన్లు మొదలైన వర్గాలవారు జీవించేవారు. పూర్వం కంటే మొగలుల నాటి సామాజిక వ్యవస్థ చాలా సరళంగా ఉంది. సమాజంలో మూడు ప్రధాన వర్గాలుండేవి. అవి రాజకుటుంబం, ప్రభువులు, మధ్యతరగతి వర్గం, సామాజిక వ్యవస్థలో చివరి వర్గం సామాన్యులు. జనాభాలో అధిక సంఖ్యాకులు వీరే. సామాన్యులు వ్యవసాయం, పరిశ్రమలు, ధనవంతుల ఇండ్లలో పని చేసేవారు. హిందువులు, మహ్మదీయులిద్దరికి జ్యోతిష్యం, శకునాలలో విశ్వాసం కలదు. బాల్యవివాహాలు, సతీసహగమనం, వరకట్నం, బహు భార్యత్వం మొదలైనవి ఆనాటి సామాజిక దురాచారాలు. నౌరోజ్, రంజాన్, షబ్బేబరాత్, దసరా, హోళి, దివాళి మొదలైనవి ఆనాటి ముఖ్యమైన పండుగలు. హిందూ-ముస్లిం పండుగలతోపాటు పాదుషా జన్మదినాన్ని కూడా జరుపుకొనేవారు. ప్రభువులు, రాజ కుటుంబీకుల సరదా కోసం ప్రత్యేక దుకాణ మేళాలను నిర్వహించేవారు. వీటిని నుమా-బజార్లు, ఖుషి బజార్లు అని
పిలిచేవారు.

మొగల్ల నాటి ఆర్థిక వ్యవస్థ:మొగలుల కాలంలో దేశం ఆర్థికంగా చాలా పరిపుష్టంగా ఉండేది. వ్యవసాయం, వాణిజ్యం, చేతివృత్తులు ఉన్నత స్థితిలో ఉండేవి. వ్యవసాయం, వాణిజ్యాభివృద్ధి కోసం మొగలులు అనేక చర్యలు తీసుకొన్నారు. ఆహారధాన్యాల పంటలను, వాణిజ్య పంటలను ప్రోత్సహించారు. బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశు చెరకు పంటకు, బెంగాల్, గుజరాత్, దక్కన్లు పత్తిసాగుకు పేరుగాంచాయి. ఇండిగో, పప్పుధాన్యాలు, నల్లమందు మొదలైన వాటిని కూడా కొన్ని ప్రాంతాల్లో పండించేవారు. జౌళి, ఇనుము – ఉక్కు, తివాచీలు, గాజు, సుగంధ పరిమళాలు, కలంకారీ మొదలైన పరిశ్రమలు బెంగాల్, గుజరాత్, కాశ్మీర్, ఢాకా, మచిలీపట్నంలో విలసిల్లాయి. అంతర్గత వ్యాపారాన్ని స్థానిక వ్యాపారులే నిర్వహించేవారు. భూమార్గ వ్యాపారానికి ఎద్దులు, గాడిదలు, ఒంటెలు, ఎద్దుల బండ్లను ఉపయోగించేవారు. మసాలా దినుసులు, ప్రత్తి, వస్త్రాలు, మిరియాలు, వజ్రాలు మొదలైనవి ఆనాటి ముఖ్యమైన ఎగుమతులు. విదేశీ వ్యాపారం గోవా, హుగ్లీ, కలకత్తా, మచిలీపట్నం ద్వారా జరిగేది. గాజు సామగ్రి, చక్కెర, అశ్వాలు, బానిసలను పర్షియా మధ్య ఆసియా నుంచి దిగుమతి చేసుకొనేవారు.

మొగలుల నాటి సాంస్కృతికాభివృద్ధి:మొగల్ యుగంలో భారతదేశం సాంస్కృతికంగా అద్భుతమైన ప్రగతిని సాధించింది. కళలు, వాస్తు నిర్మాణం, చిత్రలేఖనం, సంగీతం, సాహిత్యం మొదలైన అన్ని రంగాలలో ప్రస్ఫుటమైంది. మొగలులు భారతదేశంలో టర్కీ-పర్షియన్ సంప్రదాయాలను ప్రవేశపెట్టగా, ఇందులో భారతీయ సంప్రదాయం కూడా మేళమించబడింది.

ప్రశ్న 5.
మొగలుల సాంస్కృతిక సేవను వివరించండి.
జవాబు.
మొగలుల నాటి సాంస్కృతికాభివృద్ధి:మొగల్ యుగంలో భారతదేశం సాంస్కృతికంగా అద్భుతమైన ప్రగతిని సాధించింది. కళలు, వాస్తు నిర్మాణం, చిత్రలేఖనం, సంగీతం, సాహిత్యం మొదలైన అన్ని రంగాలలో ప్రస్ఫుటమైంది. మొగలుల భారతదేశంలో టర్కీ-పర్షియన్ సంప్రదాయాలను ప్రవేశపెట్టగా, ఇందులో భారతీయ సంప్రదాయం కూడా మేళమించబడింది.

వాస్తుకళ:మొగలుల వాస్తు నిర్మాణాలలో విశాలమైన కోటలు, రాజభవనాలు, ప్రజలందరు ఉపయోగించుకొనే కట్టడాలు, మసీదులు, సమాధులు మొదలైనవెన్నో కలవు. ఎప్పుడూ నీరు అందుబాటులో ఉండే విధంగా ఉద్యానవనాలను ఏర్పాటు చేశారు. కాశ్మీర్ లోని నిషాత్బాగ్, లాహోర్ లోని షాలిమార్, పంజాబ్లో ని పింజోర్ ఉద్యానవనం మొదలైన మొగలుల ఉద్యానవనాలు నేటికి కూడా సజీవంగా ఉన్నాయి. షేర్షా బీహార్లోని ససారాం వద్ద తన కోసం నిర్మించుకొన్న సమాధి, ఢిల్లీలోని పురానా ఖిలాలోని మసీదు మధ్యయుగ వాస్తు కళారంగంలో అద్భుతాలుగా పరిగణించ బడ్డాయి.

అక్బర్ కాలం నుంచి పెద్ద ఎత్తున భవనాల నిర్మాణం ప్రారంభమైంది. అక్బర్ చాలా కోటలను నిర్మించాడు. అందులో ముఖ్యమైంది ఆగ్రా కోట. ఇది ఎర్రటి ఇసుక రాయితో నిర్మించబడింది. అక్బర్ లాహోర్, అలహాబాద్లో ఇతర కోటలను నిర్మించాడు. .ఢిల్లీలో షాజహాన్ నిర్మించిన ఎర్రకోట కోటల నిర్మాణ రీతిలో అత్యంత విశిష్టమైంది. ఇందులోని రంగమహల్, దివాన్-ఇ-ఆమ్, దివాన్-ఇ-ఖాస్లు కూడా ఇతని నిర్మాణాలే.

అక్బర్ కూడా ఫతేపూర్ సిక్రీ వద్ద రాజభవనం – కోటల సముదాయం నిర్మించాడు. ఇది ఆగ్రాకు 36 కి.మీ. దూరంలో కలదు. గుజరాత్, బెంగాలీ నిర్మాణ శైలి అందులో ప్రతిబింబిస్తుంది. గుజరాత్ నిర్మాణ శైలిని రాజపుత్ర రాణుల కోసం నిర్మించిన భవనాలలో వినియోగించాడు. కాని అన్నింటికంటే ముఖ్యమైన నిర్మాణం మాత్రం అక్కడి జమా మసీదు, ఫతేపూర్ సిక్రీకి ద్వారమైన బులంద్ దర్వాజా. దీని ఎత్తు 176 అడుగులు. అక్బర్ గుజరాత్ విజయానికి చిహ్నంగా దీనిని నిర్మించాడు. ఫతేపూర్ సిక్రీలోని ఇతర ముఖ్యమైన భవనాలలో జోధాభాయి రాజభవనం, అయిదు అంతస్థులతో ఉన్న పంచమహల్ కలవు.

అక్బర్ కాలంలో ఢిల్లీలో హుమాయూన్ సమాధి నిర్మించబడింది. దీని భారీ గుమ్మటం పాలరాతితో నిర్మించబడింది. అందుకే దీనిని తాజ్మహల్కు పూర్వపు రూపంగా భావిస్తారు. ఆగ్రా సమీపంలో సికింద్రా వద్ద అక్బర్ సమాధిని జహంగీర్ పూర్తి చేశాడు. భవన నిర్మాణ కళలో తాజ్మహల్ ఒక అద్భుతంగా నిలిచిపోయింది. మొగలులు అభివృద్ధి పరచిన అన్ని వాస్తు కళాశైలుల సమ్మేళనమే తాజ్మహల్. తాజ్మహల్ అందానికి కారణం దాని విశాలమైన పాలరాతి గోపురం, నాలుగు సన్నటి మినార్లు. అందమైన తోట మధ్యలో నిర్మితం కావడంతో ఆ కట్టడానికి ఎనలేని అందం తెచ్చిపెట్టింది.

షాజహాన్ పాలనలో మసీదుల నిర్మాణం కూడా ఉన్నత దశకు చేరుకొంది. ఆగ్రా కోటలో పాలరాతితో మోతి మసీదు నిర్మించబడింది. ఢిల్లీలో జామా మసీదు ఎర్రటి ఇసుక రాయితో నిర్మించబడింది.

చిత్రలేఖనం, సంగీతం: చిత్రకళారంగానికి మొగలులు చెప్పుకోదగిన కృషి చేశారు. మొగలుల చిత్రకళకు పునాదులు వేసినవాడు హుమాయూన్. అక్బర్ అనేక సాహిత్య, మత గ్రంథాలకు చిత్రీకరణలు వేయించాడు. అక్బర్ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన చిత్రకారులను ఆహ్వానించాడు.

జహాంగీర్ కాలంలో మొగల్ చిత్రలేఖనం ఉన్నత శిఖరాలకు చేరుకొంది. అబ్దుల్సమద్, బిషన్దాస్, మధు, అనంత్, మనోహర్, గోవర్థన్, ఉస్తాద్ మన్సూర్ లాంటి ఎంతోమంది చిత్రకారులను జహంగీర్ నియమించుకొన్నాడు. వేట, యుద్ధం, ఆస్థాన దృశ్యాలు, చిత్రలేఖనంతో పాటు వ్యక్తిగత చిత్రాల లేఖణన ప్రక్రియ (Portrait painting) జంతువుల చిత్రలేఖనం అభివృద్ధి చెందాయి. చిత్రాలు, దస్తూరి (Calligraphy) లతో కూడిన అనేక ఆల్బమ్లు మొగలుల కాలంలో రూపొందించబడ్డాయి. తరువాత కాలంనాటి చిత్రకళపై యూరప్ చిత్రలేఖనం ప్రభావం కన్పిస్తుంది. మొగలుల కాలంలో సంగీతం కూడా అభివృద్ధి చెందింది. అక్బర్ ఆస్థానంలో గ్వాలియర్కు చెందిన తాన్సేన్ అనే గొప్ప గాయకుడుండేవాడు. తాన్సేన్ గోరా, సనమ్ మొదలైన రాగాలకు స్వరాలెన్నింటినో కూర్పు చేశాడు. జహంగీర్, షాజహాన్లకు కూడా సంగీతంలో ప్రవేశం ఉండేది.

TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అక్బర్ రాజపుత్ర విధానాన్ని వివరించండి.
జవాబు.
రాజపుత్రులతో సంబంధాలు:అక్బర్ అనుసరించిన రాజపుత్ర విధానం ప్రసిద్ధమైంది. ఇతడు అంబర్రాజు రాజా భారామల్ కుమార్తెను వివాహమాడాడు. అక్బర్ అనేక రాజపుత్ర రాజ్యాలతో వివాహ సంబంధాలను ఏర్పాటు చేసుకొన్నాడు. ఇది మొగల్ చరిత్రలోనే ఒక ముఖ్యమైన మలుపు అని చెప్పవచ్చు. రాజపుత్రులు మొగలాయిలకు సేనాధిపతులుగా, మంత్రులుగా సేవలందించారు. రాజా భగవాన్ దాస్, రాజామాన్ సింగ్, రాజాతోడరమల్లను అక్బర్ సేనాధిపతులుగా నియమించుకొన్నాడు. జైసల్మీర్, బికనేర్, రణతంభోర్ మొదలైన రాజపుత్ర రాజ్యాలు అక్బర్కు లొంగిపోయాయి. కాని మేవార్ను పాలిస్తున్న రాణా ఉదయ సింహుడు, అతని కుమారుడు రాణా ప్రతాప సింహుడు అక్బర్ను ఎదిరించారు. 1576లో జరిగిన హాల్దీఘాట్ యుద్ధంలో రాణాప్రతాపసింహుడిని అక్బర్ సైన్యాధిపతి రాజామాన్ సింగ్ ఓడించాడు. మేవార్ ఓటమి తరువాత అనేక రాజపుత్ర రాజ్యాలు అక్బర్ సార్వభౌమత్వాన్ని అంగీకరించాయి.

అక్బర్ రాజపుత్ర విధానం అతడి విశాలమైన పరమత సహనంతో ముడిపడి ఉంది. అతడు తీర్థయాత్రల పన్నును, జిజియా పన్నును రద్దుచేశాడు. అక్బర్ రాజపుత్ర విధానం మొగలాయిలకు, రాజపుత్రులకు పరస్పరం మేలు చేసింది. రాజపుత్రులు తమ శక్తి సామార్థ్యాలను దేశానికి వినియోగపరచే అవకాశం లభించింది. దీని మూలంగా రాజస్థాన్లో శాంతి చేకూరింది. రాజపుత్రులు మొగలుల సేవలో చేరి ఉన్నతోద్యోగాలు పొందారు.

ప్రశ్న 2.
నూర్జహాన్పై లఘు సమాధానం రాయండి.
జవాబు.
జహాంగీర్ 1611లో నూర్జహాన్ (ప్రపంచ వెలుగు) ను వివాహమాడాడు. ఈమె అసలు పేరు మెహర్ ఉన్నీసా. ఈమె తండ్రి ఇతిమాదుద్దేలా (ఫియాస్ బేగ్)ను ముఖ్య దివాన్ గా నియమించుకొన్నాడు. జహాంగీర్ నూర్జహాన్ వివాహం తరువాత ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ప్రయోజనం పొందారు. నూర్జహాన్ జ్యేష్ఠ సోదరుడు ఆసఫ్గన్ ఖాన్-ఎ-సమన్ (అంతఃపుర వ్యవహారాలు) గా నియమింపబడ్డాడు. ఆసఖాన్ కూతురు అర్జమందా బానూ బేగం (ముంతాజ్)ను జహాంగీర్ మూడవ కుమారుడు కుర్రం (షాజహాన్) వివాహమాడాడు. నూర్జహాన్ వీరందరితో ఒక వర్గాన్ని ఏర్పాటు చేసిందని కొందరు ఆధునిక చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. నూర్జహాన్ వ్యతిరేకులు మరొక వర్గాన్ని ఏర్పాటు చేశారు. మొగలుల ఆస్థానంలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. జహాంగీర్ పూర్తిగా నూర్జహాన్ ప్రభావానికి లోనయ్యాడని భావించిన షాజహాన్ 1622లో తన తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. కాని ఈ వాదనను ఇతర చరిత్రకారులు అంగీకరించలేదు. ఎందుకంటే తన ఆరోగ్యం క్షీణించేవరకు అన్ని ముఖ్యమైన రాజకీయ నిర్ణయాలను తానే స్వయంగా తీసుకొన్నట్లు తన “స్వీయ చరిత్ర” లో జహంగీర్ పేర్కొన్నాడు.

నూర్జహాన్ షహ్రియార్ (జహాంగీర్ చిన్న కుమారుడు)ను చక్రవర్తిగా ప్రకటిస్తుందని భావించాడు. 1627లో జహాంగీర్ మరణించిన తరువాత షాజహాన్ సర్దారులు, సైన్యం మద్దతుతో తన వ్యతిరేకులందరినీ ఓడించి ఆగ్రా చేరుకొన్నాడు. నూర్జహాన్ అధికారాలు కోల్పోయి రాజకీయాల నుంచి నిష్క్రమించింది. షాజహాన్ నూర్జహాన్కు పింఛను ఏర్పాటు చేశాడు. జహాంగీర్ మరణించిన 18 సంవత్సరాల తరువాత నూర్జహాన్ లాహోర్లో మరణించింది.

ప్రశ్న 3.
మొగల్ సామ్రాజ్య పతనానికి గల కారణాలను రాయండి.
జవాబు.
బాబర్ 1526లో మొగల్ అధికారాన్ని స్థాపించగా, అక్బర్ కాలం నాటికి అత్యున్నత స్థాయికి చేరుకొంది. ఔరంగజేబు విశాలమైన సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. కాని జౌరంగజేబు మరణం తరువాత మొగల్ సామ్రాజ్యం త్వరితగతిన పతనమైంది. మొగల్ సామ్రాజ్య పతనానికి అనేక కారణాలున్నాయి.

(i) బలహీనమైన వారసులు:ఔరంగజేబు తరువాత వచ్చిన వారసులెవ్వరూ రాజ్యానికి సుస్థిరత కల్పించలేకపోయారు. వారిలో చాలామంది అసమర్థులు. మరికొందరు మంత్రుల చేతుల్లో కీలుబొమ్మలైనారు. 1707 నుంచి 1719 వరకు జరిగిన వారసత్వ యుద్ధాలు ఢిల్లీ నగరాన్ని రక్తసిక్తం చేశాయి. దీనివల్ల మొగల్ సామ్రాజ్యం బలహీనపడింది.

TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం

(ii) ప్రభువుల పాత్ర:ప్రభువుల మధ్య పర్షియన్, తురానీ, హిందుస్తానీ అనే విభేదాలుండేవి. ప్రభువుల మధ్య అంతఃకలహాలు మొగల్ సామ్రాజ్య పతనానికి దారితీశాయి. ప్రభువులు విశేషాధికారాలు పొందారు. వీరిలో చాలా మంది స్వార్థపరులై రాజకీయ కుట్రలు చేసి స్వాతంత్య్రం ప్రకటించుకొన్నారు.

(iii) విదేశీ దండయాత్రలు:మధ్య ఆసియా దండయాత్రలు మొగల్ సామ్రాజ్యానికి పెద్ద బెడదగా మారాయి. 1738-39 లో సాదిర్షా దండయాత్ర చేసి ఢిల్లీ నగరాన్ని దోచుకొన్నాడు. అహ్మద్ అబ్దాలీ (1748-1767) భారతదేశంపై ఏడుసార్లు దండయాత్ర చేసి మొగల్ సంపదను దోచుకొన్నాడు.

(iv) ఔరంగజేబు మత విధానం మొగల్ సామ్రాజ్య పతనానికి ప్రధాన కారణం – సిఖిు, మహారాష్ట్రులు విజృంభణ మొగల్ అధికారాన్ని ఆటంకపరచాయి.

(v) షాజహాన్ భవన నిర్మాణాల కోసం చాలా ఖర్చు చేశాడు. ఇది ఆర్థిక దివాలాకు దారితీసింది.

(vi) అధిక పన్నుల భారం, తప్పుడు ఆర్థిక విధానాలు, వ్యవసాయం, పరిశ్రమల్లో వెనకబాటుతనం, సైనిక బలహీనత, ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం మొదలైనవి మొగల్ సామ్రాజ్య పతనానికి దారి తీసింది.

ప్రశ్న 4.
మొగల్ వాస్తు, కళలపై సమాధానం రాయండి.
జవాబు.
మొగల్ పాలకులు యుద్ధ విజేతలే కాక కళా, సాంస్కృతిక రంగాల పోషకులుగా కూడా ప్రసిద్ధి చెందారు. ఔరంగజేబు మినహా మిగతావారందరూ పండితులు, చిత్రకారులు, శిల్పులను పోషించారు. అంతేకాక కొందరు రాజులు, కవులు, చిత్రకారులు. బాబర్, హుమాయూన్, జహంగీర్లు స్వయంగా రచయితలే కాక పండిత పోషకులు. అక్బర్ నిరక్షరాస్యుడైనప్పటికీ కళల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాడు.

బాబర్ కేవలం సమాధులు, చెరువులను నిర్మించాడు. అక్బర్ నిర్మాణాలలో పర్షియన్, హిందూ పద్ధతులు కనిపిస్తాయి. జామియా మసీద్, బీర్బల్ భవనం, ఆగ్రా కోట, జహంగీర్ భవనం, దివాన్-ఇ-ఆమ్, దివాన్-ఇ-ఖాస్, బులంద్ దర్వాజా మొదలైనవి అక్బర్ కాలంనాటి నిర్మాణాలు. జహంగీర్ శిల్పకళ కంటే చిత్రకళపై ప్రత్యేక ఆసక్తిని కనబరచాడు. అబ్దుల్ సమద్, దశావంత్, బసవన్, హసన్ మొగలుల కాలంనాటి ప్రఖ్యాత చిత్రకారులు. షాజహాన్ కాలంలో శిల్పకళ ఉన్నతస్థాయికి చేరి స్వర్ణయుగంగా పేరొందింది. షాజహానాబాద్, దివాన్-ఇ-ఆమ్, దివాన్-ఇ-ఖాస్, ఎర్రకోట, తాజ్మహల్, ముసల్మాన్ బురుజు, మోతీమసీదు షాజహాన్ కాలంనాటి నిర్మాణాలు. వీటివలన షాజహాన్ ‘ఇంజనీర్ రాజు’గా పిలవబడ్డాడు. ఔరంగజేబు శిల్పకళ, చిత్రకళను నిషేధించాడు.

ప్రశ్న 5.
మొగలుల కాలంలో సాహిత్యాభివృద్ధిని చర్చించండి.
జవాబు.
జహాంగీర్ ఆత్మకథ ‘తుజుక్-ఇ-జహాంగీరి’ రచనా శైలిలో ప్రముఖమైంది. ఘియాస్ బేగ్, నఖీబ్ ఖాన్, నయామతుల్లా లాంటి అనేక మంది పండితులను జహాంగీర్ ఆదరించాడు. అబ్దుల్ హామీద్ లాహోరి, ఇనాయత్ ఖాన్ వంటి రచయితలు, చరిత్రకారులను షాజహాన్ ఆదరించాడు. అబ్దుల్హామీద్ లాహోరి ‘పాదుషానామా’ను ఇనాయత్ ఖాన్ “షాజహాన్ నామా” ను రచించారు. షాజహాన్ కుమారుడు దారాషికో భగవద్గీత, ఉపనిషత్తులను పర్షియా భాషలోకి అనువదించాడు. ఔరంగజేబు కాలంలో కూడా చాలా చారిత్రక గ్రంథాలు రాయబడ్డాయి. పార్శీ భాషలోనున్న ప్రముఖ పదకోశాలన్నీ మొగలుల కాలంలో సంకలనం చేయబడ్డాయి.

మొగల్ యుగంలో బెంగాల్, ఒడియా, హిందీ, రాజస్థాని, గుజరాతి మొదలైన ప్రాంతీయ భాషలు అభివృద్ధి చెందాయి. భర్తి పూర్వక గ్రంథాలు ముఖ్యంగా రామాయణ, మహాభారతం లాంటి గ్రంథాలు ప్రాంతీయ భాషల్లోకి అనువదించబడ్డాయి. అక్బర్ కాలం నుంచి హిందీ కవులు, పండితులు ఆదరణ పొందారు. వీరిలో తులసీదాసు చాలా గొప్పవాడు. ఇతడు రామాయణాన్ని హిందీ భాషలో ‘రామచరితమానస్’ పేరుతో రాశాడు.

ప్రశ్న 6.
మీకు ఇచ్చిన పటంలో అక్బర్, షేర్షా సామ్రాజ్యాలను సూచించి కింది ప్రదేశాలను గుర్తించండి.
జవాబు.
ఎ) ఢిల్లీ
బి) ఆగ్రా
సి) మేవార్
డి) గుజరాత్
ఇ) బెంగాల

ఎ) పానిపట్
బి) కనూజ్
సి) చిత్తోర్
డి) ఉజ్జయిని
ఇ) అమర్కోట

ఎ) చూనార్
బి) ససారాం
సి) గౌర్
డి) చందేరి
ఇ) ఆగ్రా
జవాబు.
TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం 1
TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం 2

TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బాబర్ నామా ప్రాధాన్యత.
జవాబు.
మధ్యయుగ భారతదేశ చరిత్రలో గణనీయమైన వ్యక్తులలో బాబర్ ఒకడు. భారతదేశంలో మొగల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఘనుడు బాబరు. క్రీ.శ. 1526లో మొదటి పానిపట్టు యుద్ధంలో ఢిల్లీ సుల్తాన్ అగు ఇబ్రహీం లోడిని వధించి ఢిల్లీ, ఆగ్రాలు ఆక్రమించి మొగల్ సామ్రాజ్యస్థాపన చేసాడు.

బాబర్ టర్కీ భాషలో గొప్ప పండితుడు. టర్కీ భాషలో బాబర్ రాసుకున్న స్వీయచరిత్ర తుజ్-కె-ఇ-బాబరీ (తన ఆత్మకథ). మొగల్ యుగమున రాయబడిన తొలి చారిత్రక గ్రంథము. ఈ గ్రంథం బాబర్ తురుష్క భాషా ప్రావీణ్యాన్ని, నాటి సమకాలీన పరిస్థితులను, హుమాయూన్ తొలి జీవితాన్ని తెలుసుకోవడానికి దోహదపడుతుంది. మధ్యయుగ ఆత్మకథల్లో దీనికి గణనీయమైన ప్రాధాన్యం ఉంది.

ప్రశ్న 2.
మొగల్ చరిత్రలో నూర్జహాన్ స్థానం.
జవాబు.
మొగల్ చక్రవర్తి జహంగీర్ నూర్జహాన్ను వివాహం చేసుకోవడమనేది జహంగీర్ కాలంలో మరొక ప్రధాన ఘట్టం. నూర్జహాన్ అసలు పేరు మెహ్రున్నీసా. ఈమెను సలీం (జహంగీర్) ప్రేమించాడని, వీరి ప్రేమని ఇష్టపడని అక్బర్ ఈమెను షేర్ ఆఫ్ఘనికిచ్చి వివాహం చేసాడని, సలీం రాజైనాక షేర్ ఆఫ్గన్ను వధించి ఆమెను వివాహం చేసుకున్నాడని కొందరు చరిత్రకారుల కథనం. క్రీ.శ.1611లో వివాహానంతరం ప్రధాన పాత్రధారి అయి అధికారాన్నంతా హస్తగతం చేసుకుని సింహాసనం వెనకుండి పాలన చేసింది. నాణాలపై తన పేరు ముద్రింపజేసుకుంది. తన తల్లిదండ్రులను, బంధువులను దర్బారు ఉన్నత పదవుల్లో నియమించింది. ఇది ఖుర్రం తిరుగుబాటుకు, వారసత్వ యుద్ధానికి కారణమైంది.

ప్రశ్న 3.
తాజ్మహల్ కీర్తిని చర్చించండి.
జవాబు.
షాజహాన్ గొప్ప భవన నిర్మాత. షాజహాన్ ఎర్రకోట జామామసీద్, దివాన్-ఇ-ఆమ్, దివాన్ ఖాస్ కట్టించాడు.
షాజహాన్ నిర్మాణాలన్నింటిలోను తలమానికమైనది తాజ్మహల్. ఆగ్రాలో యమునానది ఒడ్డున తన పట్టమనిషి ముంతాజ్భగం సంస్మరణార్థం నిర్మించాడు. దీనిని ప్రపంచ అద్భుత కట్టడాలలో ఒకటిగా భావిస్తారు. దీని నిర్మాణానికి 22 సంవత్సరాలు పట్టింది. ఆ రోజుల్లోనే నాలుగున్నర మిలియన్ల పౌన్లు ఖర్చయింది. ఉస్తాద్ ఈసా దీని శిల్పి. అయితే తాజ్మహల్ను షాజహాన్ కట్టించలేదని, బాబర్ కాలం నాటికే అక్కడ ఉందని ఇది రాజపుత్రుల నిర్మాణమని ఇటీవల కొందరు చారిత్రక పరిశోధకులు ప్రకటించారు. తాజ్మహల్ శివాలయమని ప్రొ.పి.యన్.వోక్ కథనం. కాలగమనంలో నిజం నిగ్గుతేలుతుందని ఆశిద్దాం. ఏది ఏమైనా తాజ్మహల్ కట్టడం ఓ అద్భుతం.

ప్రశ్న 4.
రెండవ పానిపట్ యుద్ధం ప్రాధాన్యత.
జవాబు.
అక్బర్ (క్రీ.శ. 1556–1605):భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో అక్బర్ ఒకరు. ఇతని తండ్రి హుమాయూన్ మరణించిన తరువాత రాజ్యానికి వచ్చాడు. ఆఫ్ఘనుల సేనాధిపతి హేము ఢిల్లీని ఆక్రమించి ‘విక్రమాదిత్య’ అనే బిరుదు ధరించాడు. 1556లో జరిగిన రెండవ పానిపట్ యుద్ధంలో మొదట హేముకే విజయావకాశాలు దగ్గరయ్యాయి. కాని కంటికి బలమైన గాయం తగలడం వల్ల అతడు స్పృహ కోల్పోయాడు. నాయకత్వం కోల్పోయిన ఆఫ్ఘన్ సైన్యం చెల్లాచెదురైంది. మొగలాయిలు అఫ్ఘనులపై శాశ్వతంగా విజయం సాధించారు. భారతదేశంలో మొగల్ సామ్రాజ్యం సుస్థిరమైంది.

TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం

ప్రశ్న 5.
ఇబాదత్ ఖానా గురించి రాయండి.
జవాబు.
తన కొత్త రాజధాని ఫతేపూర్ సిక్రిలో 1575లో ఇబాదత్ ఖానా (పూజామందిరం) అనే భవనాన్ని నిర్మించాడు. హిందూ, జైన, బౌద్ధ, పారశీక, క్రైస్తవ, ఇస్లాం మొదలైన అన్ని మతాల పండితులను ఆహ్వానించి మత చర్చలు జరిపాడు.

ప్రశ్న 6.
దీన్-ఇ-ఇలాహి ముఖ్య లక్షణాలు.
జవాబు.
అక్బర్ విభిన్న మతగురువులతో ఆయా మత సిద్ధాంతాల గురించి తరచూ చర్చలు జరిపేవాడు. వాటి ఫలితంగా అతనికి కలిగిన అవగాహనతో క్రీ.శ. 1581లో దీన్-ఇ-ఇలాహి అనే నూతన మతాన్ని స్థాపించాడు. ఈ మతం వారు చక్రవర్తి కోసం ధన, మాన, ప్రాణాలను అర్పించాలి, మాంసాహారాన్ని మానివేయాలి, ఒకరికొకరు ఎదురైనపుడు అల్లాహా అక్బర్ అని సంభోదించుకోవాలి. అయితే ఈ మతాన్ని స్వీకరించమని అక్బర్ ఎవరినీ బలవంతపెట్టలేదు. బీర్బల్, అబుల్ఫజర్ వంటి కొందరే చేరారు. అబుల్ఫజల్ దీన్-ఇ-ఇలాహిన గురించి పేర్కొంటూ ఇది అందరి దీవెనలను అందుకోవడానికి ఉద్దేశింపబడిన నూతన విశ్వాసమార్గమన్నాడు. ఇది అక్బర్తోనే అంతరించిపోయింది.

ప్రశ్న 7.
ఫతేపూర్ సిక్రీ.
జవాబు.
అక్బర్ కూడా ఫతేపూర్ సిక్రీ వద్ద రాజభవనం కోటల సముదాయం నిర్మించాడు. ఇది ఆగ్రాకు 36 కి.మీ. దూరంలో కలదు. గుజరాత్, బెంగాలీ నిర్మాణ శైలి అందులో ప్రతిబింబిస్తుంది. గుజరాత్ నిర్మాణ శైలిని రాజపుత్ర రాణుల కోసం నిర్మించిన భవనాలలో వినియోగించాడు. కాని అన్నింటికంటే ముఖ్యమైన నిర్మాణం మాత్రం అక్కడి జమా మసీదు, ఫతేపూర్ సిక్రీకి ద్వారమైన బులంద్ దర్వాజా. దీని ఎత్తు 176 అడుగులు. అక్బర్ గుజరాత్ విజయానికి చిహ్నంగా దీనిని నిర్మించాడు. ఫతేపూర్ సిక్రీలోని ఇతర ముఖ్యమైన భవనాలలో జోధాభాయి రాజభవనం, అయిదు అంతస్థులతో ఉన్న పంచమహల్ కలవు.

ప్రశ్న 8.
షాజహాన్ కాలంనాటి నిర్మాణాల గురించి రాయండి.
జవాబు.
షాజహాన్ తాజ్మహల్ నిర్మాణంలో ‘పీత్రదురా’ పద్ధతిని భారీ ఎత్తున ఉపయోగించాడు. భవన నిర్మాణ కళలో తాజ్మహల్ ఒక అద్భుతంగా నిలిచిపోయింది. మొగలులు అభివృద్ధిపరచిన అన్ని వాస్తు కళాశైలుల సమ్మేళనమే తాజ్మహల్. తాజ్మహల్ అందానికి కారణం దాని విశాలమైన పాలరాతి గోపురం, నాలుగు సన్నటి మినార్లు. అందమైన తోట మధ్యలో నిర్మితం కావడంతో ఆ కట్టడానికి ఎనలేని అందం తెచ్చిపెట్టింది.

TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం

షాజహాన్ పాలనలో మసీదుల నిర్మాణం కూడా ఉన్నత దశకు చేరుకొంది. ఆగ్రా కోటలో పాలరాతితో మోతి మసీదు నిర్మించబడింది. ఢిల్లీలో జామా మసీదు ఎర్రటి ఇసుక రాయితో నిర్మించబడింది.

మొగల్ వాస్తుకళ 18, 19వ శతాబ్దం తొలి దశకాల వరకు నిరాఘాటంగా కొనసాగింది. మొగల్ నిర్మాణ శైలి ప్రాంతీయ, స్థానిక రాజ్యాల కట్టడాలపై సైతం ప్రభావం చూపింది. అమృత్సర్లోని సిఖి స్వర్ణదేవాలయం కూడా మొగల్ వాస్తు సంప్రదాయ శైలిలో నిర్మితమైంది.

TS Inter 1st Year History Study Material Chapter 15 జాతీయ ఉద్యమం – మలిదశ

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 15th Lesson జాతీయ ఉద్యమం – మలిదశ Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 15th Lesson జాతీయ ఉద్యమం – మలిదశ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
1920 – 22లో జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని వివరించండి.
జవాబు.
గాంధీ నాయకత్వంలో జాతీయ కాంగ్రెస్ నిర్వహించిన ఉద్యమాల్లో మొదటిది సహాయ నిరాకరణోద్యమం. ఖిలాఫత్ ఉద్యమ సందర్భంగా వ్యక్తమైన హిందూ, ముస్లిం సంఘీభావం గాంధీని సహాయ నిరాకరణోద్యమానికి పురికొల్పింది. 1920 సెప్టెంబరులో కలకత్తాలో లాలాలజపతిరాయ్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమ తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. తీర్మానం ఆమోదించడమైంది. 1920 డిసెంబర్లో విజయరాఘవాచారి అధ్యక్షతన నాగపూర్లో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశంలో దాన్ని ధృవీకరించడమైంది. రెండు సమావేశాల్లోనూ బెంగాల్ నాయకుడు చిత్తరంజన్దాస్ నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. దాస్ సూచనలను కూడా తీర్మానంలో చేర్చడం ద్వారా గాంధీ ఆయనను సమ్మతింపచేశాడు.

TS Inter 1st Year History Study Material Chapter 15 జాతీయ ఉద్యమం – మలిదశ

ఉద్యమ కార్యక్రమం: ఈ ఉద్యమానికి మూడు అంశాల కార్యక్రమం కలదు. అవి: బహిష్కరణ, నిర్మాణాత్మక కార్యక్రమాలు, శాసనోల్లంఘనం.

బహిష్కరణ:

  1. ప్రభుత్వం ఇచ్చిన బిరుదులు, పదవులను త్యజించడం.
  2. ప్రభుత్వం ఏర్పాటు చేసే సన్మానాలు, తదితర కార్యక్రమాలను బహిష్కరించడం.
  3. విద్యార్థులు ప్రభుత్వ విద్యాలయాలను బహిష్కరించడం.
  4. ప్రభుత్వోద్యోగాలకు రాజీనామా చేయడం.
  5. ప్రభుత్వ న్యాయస్థానాలను బహిష్కరించడం.
  6. విదేశీ వస్త్రాలను, వస్తువులను బహిష్కరించడం.
  7. శాసనసభలకు జరిగే ఎన్నికలను బహిష్కరించడం.
  8. 1921లో ఇంగ్లాండ్ దేశపు యువరాజు పర్యటన బహిష్కరించడం మొదలైనవి బహిష్కరణోద్యమంలో ముఖ్యమైనవి.

నిర్మాణాత్మక కార్యక్రమాలు:

  1. తిలక్ స్మారక నిధికి విరాళాలు వసూలు చేయడం.
  2. రాట్నాలపై నూలు వడికి, ఖద్దరు వస్త్రాలు తయారుచేయడం.
  3. అస్పృశ్యతను నిర్మూలించడం.
  4. మద్యపాన నిషేధానికి అనుకూలంగా ఉద్యమం నడపడం.
  5. జాతీయ విద్యాలయాలు నెలకొల్పడం.
  6. హిందూ, ముస్లిం సమైక్యతను సాధించడం అనేవి నిర్మాణాత్మక కార్యక్రమాలు.

శాసనోల్లంఘనం: పన్నులు చెల్లించటం, నిరాకరించటం ద్వారా కాంగ్రెస్ శాసనోల్లంఘనాన్ని చేపట్టాలని నిర్ణయించింది.

ఉద్యమ గమనం: 1920లో ప్రారంభించిన ఈ ఉద్యమంలో ప్రజలు తమ విభేదాలను మరిచి చురుకుగా పాల్గొన్నారు. బ్రిటిష్ విద్యాసంస్థలను బహిష్కరించి జాతీయ విద్యాసంస్థలను నెలకొల్పారు. నెహ్రూ, చిత్తరంజన్ దాస్, ప్రకాశం పంతులు మొదలైన నాయకులు న్యాయస్థానాలను బహిష్కరించి న్యాయవాద వృత్తిని త్యజించారు. సుభాష్ చంద్రబోస్ మొదలైనవారు తమ ప్రభుత్వ పదవులకు రాజీనామా చేశారు. ప్రజలు విదేశీ వస్తువులను బహిష్కరించి ఖద్దరు వాడకాన్ని ప్రోత్సహించారు. హిందువుల ఐక్యతను పెంపొందించటానికి అస్పృశ్యతా నివారణను చేపట్టారు.

ఈ ఉద్యమం ఆంధ్రాలో అద్భుత విజయాన్ని సాధించింది. చీరాల-పేరాల సత్యాగ్రహం, పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం, పల్నాడు పుల్లరి సత్యాగ్రహాలు జరిగాయి. పంజాబ్లో అకాలీలు మహంతులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వహించారు. భారతదేశ సందర్శనానికి వచ్చిన వేల్స్ యువరాజు బహిష్కరించబడ్డాడు. ఈ ఉద్యమాన్ని అణచడానికి ప్రభుత్వం దమనకాండను సాగించింది. అయినప్పటికి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇంతలోనే ఉత్తరప్రదేశ్లోని చౌరీచౌరా అనేచోట హింస చెలరేగి అది అనేకమంది పోలీసులు సజీవదహనానికి దారితీసింది. హింసను సహించలేని గాంధీజీ ప్రజలు ఇంకా అహింసా పద్ధతులకు అలవాటుపడలేదని భావించి ఉద్యమాన్ని నిలుపు చేశాడు.

ఫలితాలు: సహాయ నిరాకరణోద్యమం అనేక గొప్ప ఫలితాలనిచ్చింది.

  1. భారత ప్రజలలోను, కాంగ్రెస్ నాయకులలోను నిరాశ ఏర్పడింది. దీని ఫలితంగా కాంగ్రెస్లోలో చీలిక వచ్చింది.
  2. ఉద్యమ కాలంలో హిందూ – మహమ్మదీయుల ఐక్యత సాధించబడింది.
  3. ఈ ఉద్యమ ప్రభావం వల్ల జాతీయభావం దేశం నలుమూలలా విస్తరించింది.
  4. ప్రజలలో ప్రభుత్వమంటే భయంపోయి వారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది.
  5. కాంగ్రెస్లో వామపక్ష ధోరణులు ప్రారంభమైనాయి.
  6. ప్రభుత్వం దమననీతిని ఎదుర్కొనేందుకు భారతీయ యువత విప్లవోద్యమానికి దిగింది.
  7. ఈ ఉద్యమ విరమణ అనంతరం కాంగ్రెస్-లీగ్ మిత్రత్వం రద్దయింది. ఫలితంగా హిందువులు, ముస్లింల మధ్య మత కల్లోలాలు చెలరేగాయి.

ప్రశ్న 2.
1935 భారత ప్రభుత్వ చట్టంలోని లక్షణాలను వివరించండి.
జవాబు.
ఈ చట్టంలోని ముఖ్య అంశాలు:

  1. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించడం.
  2. కేంద్రంలో భారతీయులకు పరిమిత అధికారాలను కల్పించడం.
  3. సమాఖ్య ఏర్పాటు.
  4. ఫెడరల్ కోర్టు ఏర్పాటు.

కేంద్ర ప్రభుత్వం: 1919 చట్టం ప్రకారం రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తూ ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది.

కేంద్ర శాసనసభ: ఇందులో ఎన్నుకోబడిన సభ్యులు ఉండేవారు. ఓటర్ల సంఖ్య 10 శాతం పెంచబడింది. శాసన సభలో రాష్ట్రం శాసనసభల నుంచి 260 మంది సభ్యులు, సమాఖ్య శాసనసభలో 375 మంది ఉండేవారు. అయితే స్థానిక పాలకులు ఇందులో చేరేందుకు ఆసక్తి చూపకపోవడంతో సమాఖ్య శాసనసభ అమలులోకి రాలేదు. ఈ చట్టం భారతదేశం నుంచి బర్మాను వేరు చేసింది.

TS Inter 1st Year History Study Material Chapter 15 జాతీయ ఉద్యమం – మలిదశ

ప్రాంతీయ ప్రభుత్వం: ఈ చట్టం ప్రాంతీయ ప్రభుత్వాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని నిషేధించి ప్రాంతీయ ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తిని కల్గించింది. శాసన సభలోని అత్యధిక మెజారిటీ సాధించిన పార్టీ నుంచి గవర్నర్ మంత్రులను నియమిస్తాడు. ఈ మంత్రులు బదిలీ చేయబడిన అంశాలకు బాధ్యత వహిస్తారు. వీరు శాసన సభకు మాత్రమే బాధ్యత వహిస్తారు. గవర్నర్లు మంత్రుల సలహాలకై బద్ధులై ఉంటారు. కానీ ఆచరణలో శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తిరస్కరించేవాడు. స్థానిక ప్రభుత్వంలో 1935 చట్టం అమలు చేయడానికి రెండు సంవత్సరాలు పట్టింది.

ప్రశ్న 3.
క్రిప్స్ రాయబారాన్ని వివరించండి.
జవాబు.
1942లో జపాన్, బర్మాలోని రంగూన్ను ఆక్రమించినపుడు భయపడిన బ్రిటీష్ ప్రభుత్వం కాబినెట్ సభ్యుడు స్టాఫర్డ్ క్రిప్సన్న చర్చల నిమిత్తం భారతదేశానికి పంపింది. యుద్ధంలో బ్రిటీష్వారి పరిస్థితి ఓడిపోయే పరిస్థితిలో ఉంది. భారతదేశం అవసరం తప్పనిసరి అయింది. అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్డ్ ఇంగ్లాండ్ ప్రధాని విన్సెంట్ చర్చిల్పై భారతదేశాన్ని యుద్ధంలోకి చేర్చుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. ఫలితంగా 1947లో క్రిప్స్ రాయబారం భారతదేశానికి వచ్చి కొన్ని ప్రతిపాదనలను సూచించింది. అవి:

  1. యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశానికి అధిక దేశ ప్రతిపత్తినియ్యాలి.
  2. నూతన రాజ్యాంగం ఏర్పాటు చేయడానికి ఎన్నికైన సభ్యులతో రాజ్యాంగ రచన కమిటీని వేయాలి.
  3. కేంద్రంలో సమాఖ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. రాష్ట్రాలు అందులో చేరుతాయా లేదా అనేది వాటి నిర్ణయానికి వదిలివేయాలి.

కాంగ్రెస్ ఈ ప్రతిపాదనలను తిరస్కరించింది. గాంధీ దీన్ని దివాలా తీసిన బ్యాంకుపై రాబోయే తేదీ వేసిన చెక్కుగా వల్లించాడు. దానిలో పాకిస్థాన్ ప్రస్థావన లేనందున ముస్లింలీగ్ కూడా ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. ఫలితంగా క్రిప్స్ రాయబారం తన ఉద్దేశాన్ని నెరవేర్చడంలో విఫలమయింది.

ప్రశ్న 4.
1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహాన్ని వివరించండి.
జవాబు.
భారత స్వాతంత్ర పోరాటంలో ఉప్పు సత్యాగ్రహంతో ప్రారంభమైన శాసనోల్లంఘన ఉద్యమం ఒక ప్రధాన ఘట్టం. ఈ ఉద్యమం ద్వారా లక్షలాది ప్రజలు స్వతంత్ర పోరాటంలో భాగమయ్యారు. విదేశీ పాలనకు వ్యతిరేకంగా గాంధీ నాయకత్వంలో శాసనోల్లంఘన ఉద్యమం ఒక ప్రజా ఉద్యమంగా ఉపఖండమంతా వ్యాపించింది.

1929 డిసెంబర్లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన లాహోర్ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్యమే అంతిమ లక్ష్యంగా ప్రకటించారు. రౌండ్ టేబుల్ సమావేశాలను బహిష్కరించి శాసనోల్లంఘన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు.

గాంధీజీ నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ 1930, మార్చి 12న చారిత్రాత్మకమైన శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించింది. కాంగ్రెస్ శాసనసభ్యులందరూ తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామాలు సమర్పించాలని ఆదేశించింది. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకుల ఆవేశాలను చల్లార్చేందుకు గాంధీజీ ప్రయత్నించాడు. ఈ సందర్భంలో గాంధీజీ చివరి ప్రయత్నం చేస్తూ రాజ ప్రతినిధి ఇర్విన్ను సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నించాలని హెచ్చరించాడు. రాజ ప్రతినిధి ఇర్విన్ ఆ హెచ్చరికను పెడచెవిన పెట్టడంతో గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించేందుకు నిర్ణయించాడు.

శాసనోల్లంఘన ఉద్యమం మూడు దశలుగా జరిగింది. అవి:

  1. మొదటి దశ (1930 మార్చి 12 – 1932 జనవరి 3 వరకు)
  2. రెండో దశ (1932 జనవరి 4 – 1933 జులై 11 వరకు)
  3. మూడో దశ (1933 జులై 12 – 1934 మే వరకు)

మొదటి దశ: దీనినే ఉప్పు సత్యాగ్రహ దశగా వర్ణించవచ్చు. ఈ ఉద్యమంను గాంధీజీ 1930, మార్చి 12వ తేదీన సబర్మతీ ఆశ్రమం నుంచి 78 మంది అనుచరులతో ప్రారంభించాడు. అతడు 200 మైళ్ళ దూరంలో అరేబియా సముద్రతీరం వద్ద గల దండి గ్రామాన్ని కాలిబాటన చేరుకొని ఉప్పును తయారుచేసేందుకు ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించాడు. దీంతో దేశవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు సామూహిక ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా గాంధీజీ ప్రజలకు విజ్ఞప్తి చేసిన కార్యక్రమాలు:

  1. మద్యపాన దుకాణాలు, విదేశీ వస్త్ర విక్రయశాలల ఎదుట పికెటింగ్.
  2. రాట్నాల ద్వారా ఖద్దరు వడకటం.
  3. హిందూ-ముస్లింల మధ్య సంబంధాల పటిష్టత.
  4. అస్పృశ్యతా నివారణ.

ఉప్పు సత్యాగ్రహ పర్యవసానం:

  • బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీని నిర్బంధంలోనికి తీసుకొని ఎర్రవాడ కారాగారంలో ఉంచింది. దీంతో కోపోద్రిక్తులైన ప్రజలు దేశమంతటా హర్తాళ్ పాటించారు.
  • అనేకమంది ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేశారు.
  • 1930-32 మధ్యకాలంలో లండన్లో బ్రిటిష్ ప్రభుత్వం మూడు రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పరచింది.
  • రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీజీ పాల్గొని అల్పసంఖ్యాకుల ప్రాతినిధ్యం కంటే రాజ్యాంగ నిర్మాణమే ప్రధాన అంశమని వాదించాడు.
    కాని ఆయన వాదనలు ఆమోదయోగ్యం కాకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి.

రెండో దశ:

  1. ఈ దశలో గాంధీజీని, ఇతర నాయకులను 1932, జనవరి 14న నిర్బంధంలో ఉంచడం జరిగింది. కాని ప్రజలు పికెటింగ్ను చేపట్టడం జరిగింది.
  2. బ్రిటీష్ ప్రభుత్వం విధించిన నిషేధాజ్ఞలు ధిక్కరించి సమావేశాలు నిర్వహించడం, కరపత్రాల ముద్రణ వంటి చర్యలు అమలుచేయడం జరిగింది.
  3. బ్రిటీష్ ప్రభుత్వం అన్ని రకాల ఊరేగింపులను నిషేధించింది.
  4. ముస్లిం నాయకులు మినహా, జాతీయ నాయకులందరూ బ్రిటీష్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ 1932, ఆగస్టు 10న ప్రకటించిన “కమ్యూనల్ అవార్డు”ను వ్యతిరేకించారు.
  5. కమ్యూనల్ అవార్డును వ్యతిరేకిస్తూ ఎర్రవాడ కారాగారంలో గాంధీజీ 1932, సెప్టెంబర్ 20న ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించారు.
  6. బ్రిటీష్ ప్రభుత్వం, గాంధీజీ సంప్రదింపుల ఫలితంగా బ్రిటీష్ ప్రభుత్వం గాంధీజీ డిమాండ్లలో కొన్నింటికి ఆమోదం
    తెలిపింది.
  7. బ్రిటీష్ ప్రభుత్వం తమకు విధేయులైన నాయకులతో లండన్లో 1932, నవంబర్ 17 డిసెంబర్ 24 మధ్య మూడో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో మహిళలకు ఓటుహక్కు వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

మూడో దశ:-

  1. 1933 జులైలో గాంధీజీ, మరికొంతమంది నాయకులు వ్యక్తిగత శాసనోల్లంఘన ఉద్యమానికి ఉపక్రమించారు. వారిని బ్రిటీష్ ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది.
  2. కారాగారంలో గాంధీజీ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయనను బ్రిటీష్ ప్రభుత్వం విడుదల చేసింది.
  3. 1934 మే నెలలో పాట్నాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఉపసంహరించుకొంటున్నట్లు ప్రకటించింది.

ప్రశ్న 5.
భారత స్వాతంత్రోద్యమంలో సుభాష్ చంద్రబోస్ పాత్రను వివరించండి.
జవాబు.
భారత జాతీయోద్యమ చరిత్రలో ప్రముఖ స్థానాన్ని పొందిన దేశభక్తుడు సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ ఐ.సి.ఎస్ పరీక్ష పాసై సివిల్ సర్వెంట్గా తన జీవితాన్ని ప్రారంభించాడు. అయితే సహాయ నిరాకరణోద్యమ ప్రభావానికిలోనై తన సివిల్ సర్వీసు ఉద్యోగానికి రాజీనామా చేసి జాతీయోద్యమంలో పాల్గొన్నాడు.

కాంగ్రెస్ పాత్ర: సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ రాజకీయాల్లో పాల్గొన్నాడు. 1938లో హరిపూర్లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడయ్యాడు. 1939లో త్రిపుర కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ అభ్యర్థియైన భోగరాజు పట్టాభి సీతారామయ్యను ఓడించి పార్టీ అధ్యక్షుడిగా గెలుపొందాడు. అయితే కాంగ్రెస్ అనుసరిస్తున్న శాంతియుత విధానాల యెడల బోస్కు విశ్వాసం లేదు. అందువల్ల గాంధీజీతో బోస్కు తీవ్రమైన భేదాభిప్రాయాలు -కలిగాయి. అందువల్ల కాంగ్రెస్ నుంచి వైదొలగి ‘ఫార్వర్డ్ బ్లాక్’ అనే కొత్త పార్టీని స్థాపించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 15 జాతీయ ఉద్యమం – మలిదశ

ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపన: బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి వెళ్లగొట్టాలంటే రెండవ ప్రపంచ యుద్ధం సరైన అవకాశమని బోస్ భావించాడు. అయితే యుద్ధకాలంలో బోస్ ను ప్రభుత్వం నిర్బంధించింది. బోస్ 1941లో నిర్భంధం నుంచి తప్పించుకొని మొదట రష్యాకు, తరువాత జర్మనీకి, జపాన్కు వెళ్ళాడు. యుద్ధసమయంలో ఆ దేశాల సహాయంతో ఇంగ్లీషువారితో పోరాడి, దేశానికి స్వాతంత్య్రం సాధించవచ్చని బోస్ తలచాడు. యుద్ధంలో జపాన్కు చిక్కిన భారతీయ యుద్ధఖైదీలందరినీ కూడగట్టుకొని 1943లో సింగపూర్లో ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ లేక ‘ఇండియన్ నేషనల్ ఆర్మీ’ని స్థాపించాడు. ఐ.ఎన్.ఏ. స్థాపనలో బోస్కు రాస్ బిహారీ బోస్, మోహన్సింగ్లు సహకరించారు. ఐ.ఎన్.ఏలో చేరిన సేనలు బోసు “నేతాజీ” అని గౌరవంగా పిలిచేవారు. “జైహింద్” అనే నినాదాన్ని చేపట్టి బోస్ తన అనుచరులందరితో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి “ఛలో ఢిల్లీ” అంటూ భారతదేశంలో ఇంఫాల్ సమీపంలోని మోయిరాంగ్ వరకు వచ్చాడు. ఆయనకు తోడుగా వీరవనిత కెప్టెన్ లక్ష్మి మహిళలతో ఏర్పడిన ఝాన్సీరాణి దళనేత అయింది. ఆయన నాయకత్వంలోని ఐ.ఎన్.ఏ. సైన్యాలు దేశ స్వాతంత్ర్యానికి ప్రాణాలొడ్డి పోరాడాయి. కానీ దురదృష్టవశాత్తు 1945 సెప్టెంబర్లో జపాన్ ఓడిపోవటంతో బోస్ ప్రయత్నాలు విఫలమైనాయి. తన ప్రయత్నాలు కార్యరూపం ధరించకుండానే బోస్ 1945లో ఒక విమాన ప్రమాదంలో మరణించాడు.

ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యుల విచారణ: యుద్ధానంతరం ప్రభుత్వం ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ సేనలను ఇండియాపై దాడిచేయడానికి ప్రయత్నించినందున దేశద్రోహులుగా ప్రకటించి ఎర్రకోటలో విచారణ జరిపించింది. సైనిక నాయకులైన మేజర్ జనరల్ షానవాజ్ ఖాన్ (ముస్లిం), కల్నల్ జి.ఎస్. ధిల్లాన్ (సిక్కు), మేజర్ ప్రేమ్ సెహగల్ (హిందూ) లపై విచారణ జరిపించింది. వారి తరఫున జవహర్లాల్ నెహ్రూ, తేజబహదూర్ సప్రూ, భూలాబాయ్ దేశాయ్ు వాదించారు. అయినప్పటికీ ప్రత్యేక న్యాయస్థానం వారికి శిక్షలు విధించింది. కానీ ఆ శిక్షలకు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవటంతో ప్రజాభిప్రాయాన్ని మన్నించి, ప్రభుత్వం వారిని విడుదల చేసింది. దీనితో ప్రజలకు, సైనికులకు ప్రభుత్వం పట్ల భయభక్తులు పోయాయి. హిందూ, సిక్కు, ముస్లింల సేనలను విచారించటం వలన కాంగ్రెస్, లీగ్లు సమైక్యంగా పోరాడాయి.

ఘనత: సుభాష్ చంద్రబోస్ విజయాన్ని సాధించలేకపోయినా, ఆయన ధైర్యసాహసాలు దేశంలో చాలామందికి స్ఫూర్తినిచ్చాయి. ఆయన అచంచల దేశభక్తి, క్రమశిక్షణ, కార్యదీక్ష తరతరాల భారతీయులకు ఆదర్శప్రాయం.

ప్రశ్న 6.
జాతీయోద్యమంలో ముస్లింలీగ్ పాత్రను విశ్లేషించండి.
జవాబు.
హిందూ ముస్లింల మధ్య ఐక్యతను నాశనం చేయడానికి బ్రిటీష్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూనే ఉంది. 1905లో జరిగిన బెంగాల్ విభజన ఒక ఉదాహరణ. అయితే హిందూ, ముస్లింల ఐక్యత ఎప్పుడూ కనిపిస్తూనే ఉండేది. ముఖ్యంగా 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో ఇది బ్రిటీష్ వారిలో ఉద్రిక్తతను, ఒత్తిడిని కలుగజేసింది. దాంతో వీరి మధ్య ఐకమత్యాన్ని, సామరస్యాన్ని తొలగించడం కోసం ప్రభుత్వం ‘విభజించు పాలించు’ అనే విధానాన్ని అమలు చేసింది. విచారకరమైన విషయం ఏమిటంటే ఈ విధానంలో వారు సఫలీకృతులయ్యారు. విద్యావేత్త, సంఘసంస్కర్త సర్సయ్యద్ అహ్మద్ ఖాన్ స్వయంగా హిందూ, ముస్లింల ఐక్యతను కోరినవాడు. వారి ఐక్యతకు కృషి చేశాడు. బ్రిటీష్వారి ప్రభావంతో ముఖ్యంగా అలిఘర్ ఆంగ్లో ముస్లిం పాఠశాల ప్రిన్సిపల్ బెక్ ప్రభావానికి లోనయ్యాడు. ఆయన కాంగ్రెస్తో చేరవద్దని ముస్లింలకు విజ్ఞప్తి చేశాడు.

1906లో డైకానవాబు సలీముల్లాఖాన్, ఆగాఖాన్, మొహిసిన్ ఉలములు బ్రిటీష్వారి సహకారంతో ముస్లింలీగ్ను స్థాపించారు. ఇది ముస్లింలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం, వారికి ప్రత్యేకమత నియోజక వర్గాల కోసం, ముస్లింలకు ప్రత్యేక రక్షణ కోసం విజ్ఞప్తి చేసింది. వైస్రాయ్ మింటో ముస్లింలీగ్ను సమర్థించాడు. ఫలితంగా 1909 చట్టం ద్వారా 1909లో ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా పాకిస్తాన్ అనే ఆలోచనకు భావనకు విత్తనం వేసినట్లు అయింది. బ్రిటీష్వారు విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని అవలంబించినంత కాంగ్రెస్ హిందూ, ముస్లింల ఐక్యతకు ఎంతో కృషి చేసింది. ఫలితంగా 1916లో లక్నో ఒప్పందం జరిగింది. గాంధీ హిందూ ముస్లింల ఐక్యత కోసం ఖిలాఫత్ ఉద్యమాన్ని నడిపారు.

కానీ 1935 భారత ప్రభుత్వ చట్టం జారీ చేయబడ్డప్పుడు జరిగిన ఎన్నికల్లో ముస్లింలీగ్ను వెనుకకు నెట్టి కాంగ్రెస్ ఎన్నో చోట్ల విజయం సాధించింది. దాంతో, జిన్న కాంగ్రెస్ ముస్లింలు భాగస్వాములుగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ప్రతిపాదించాడు. కానీ కాంగ్రెస్ జిన్న ప్రతిపాదనలకు ఒప్పుకోలేదు. ఇది ఇద్దరి మధ్య దూరాన్ని పెంచింది. అంతేగాక ముస్లింలలో తాము వేరు అన్న భావాలకి పెంపొందించింది. ఫలితంగా ఇద్దరిలో మతతత్వ ద్వేషభావనలు అభివృద్ధి చెందాయి.

ప్రశ్న 7.
కాబినెట్ మిషన్ ప్రతిపాదనలను వివరించండి.
జవాబు.
రెండవ ప్రపంచ యుద్ధానంతరం బ్రిటన్ గొప్పదనం బహిర్గతమయింది. దాని సంపద హరించింది. విజయం సాధించినప్పటికీ బలహీనంగా మారింది. దాంతో భారతదేశంలో ప్రభుత్వాన్ని వారికే అప్పగించాలని నిర్ణయించింది. దానికోసం భారతదేశానికి ఒక కమిటీని పంపింది. ఈ కమిటీలో పెథిక్ లారెన్స్, స్టాఫర్డ్ క్రిప్స్, ఎ.వి. అలెగ్జాండర్లు సభ్యులు. ఈ కమిటీ భారతదేశంలో ఉన్న నాయకులతో వివిధ పార్టీలతో వివరంగా చర్యలు జరిపి ఈ కింది విష లను ప్రకటించింది.

  1. స్థానిక సంస్థానాలతో కలిపి భారతదేశాన్నంతటిని సమాఖ్యగా ఏర్పాటు చేయడం.
  2. సంస్థానాలకు స్వయం ప్రతిపత్తి నీయడం.
  3. సంస్థానాలను వివిధ వర్గాలుగా చేయడం.
  4. భారతీయులకు ఒక మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం.
  5. ప్రాంతీయ శాసన సభలకు ఎన్నికైన సభ్యులతో, సంస్థానాలతో కలిపి రాజ్యాంగ ఏర్పాటు కోసం ఒక రాజ్యాంగ సభను ఏర్పాటుచేయడం.

కాంగ్రెస్, ముస్లింలీగ్ రెండు ఈ ప్రతిపాదనలను అంగీకరించాయి. 1946లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత ప్రభుత్వం ఏర్పడింది. బ్రిటీష్ ప్రభుత్వం రక్షణ రంగంతో సహా అన్ని అధికారాలను నెహ్రూ ప్రభుత్వ హస్తగతం చేసింది. ముస్లింలీగ్ కేంద్ర కేబినెట్లో ముస్లింలీగ్చే ఎంపిక చేయబడిన ముస్లింలు మాత్రమే ఉండాలని డిమాండ్ చేసింది. దానికి నిరసనగా వారు అక్టోబరు వరకు మంత్రివర్గంలో చేరలేదు. లీగ్ రాజ్యాంగ సభను బహిష్కరించింది.

ప్రశ్న 8.
1942 క్విట్ ఇండియా ఉద్యమాన్ని వివరించండి.
జవాబు.
క్రిప్స్ రాయబారం విఫలం కాడంతో కాంగ్రెస్ మరొక ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించడానికి నిర్ణయించింది. 1942 ఆగస్టు 8న అఖిలభారత కాంగ్రెస్ కమిటీ బొంబాయిలో సమావేశమయింది. ఈ సమావేశం క్విట్ ఇండియా తీర్మానాన్ని ప్రతిపాదించింది. అది బ్రిటీష్ వారిని సత్వరమే భారతదేశాన్ని వదిలి వెళ్ళాలని డిమాండ్ చేసింది. ఇది గాంధీ ఆధ్వర్యంలో అహింసాయుత పద్ధతులలో ప్రారంభించాలని ప్రతిపాదించబడింది. ఈ ఉద్యమంలో గాంధీ ‘డూ ఆర్ డై’ ‘సాధించండి లేదా చావండి’ అనే నినాదాన్ని ఇచ్చాడు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ తీర్మానాన్ని చేసిన వెంటనే బ్రిటీష్ ప్రభుత్వం గాంధీని అరెస్ట్ చేసి పూనలోని ఆగాఖాన్ భవనంలో ఉంచింది. గాంధీతో పాటు నెహ్రూ, పటేల్, అబ్దుల్ కలాం, ఆజాద్, డా॥ పట్టాభి సీతారామయ్య, టంగుటూరి ప్రకాశం, సంజీవరెడ్డి మొదలైన నాయకులందరిని చెరసాలలో వేసింది.

క్విట్ ఇండియా ఉద్యమంలో ఫార్వర్డ్ బ్లాక్, సోషలిస్టు పార్టీ విప్లవకారులు పాల్గొన్నారు. ముఖ్యమైన నాయకులు లేకపోవటం వల్ల ఉద్యమ పగ్గాలను ప్రజలే తీసుకున్నారు. వారు ప్రభుత్వాన్ని లెక్కచేయలేదు. కొందరు అరెస్ట్ కాని యువనాయకులైన జయప్రకాష్ నారాయణ్, రామ్మోహన్ లోహియా, అరుణా అసఫలీ మొదలైనవారు ఉద్యమాన్ని కొనసాగించారు. హర్తాళ్ళు, నిరసన ప్రదర్శనలు, నిరసన సమావేశాలు దేశమంతటా కొనసాగాయి. ప్రజలు అధిక సంఖ్యలో ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ బొంబాయి నుండి రహస్య రేడియో ప్రసారాలను కూడా చేసింది. ఉత్తర ప్రదేశ్లోని బాలియాలోను, బెంగాల్లోని మిడ్నపూర్ జిల్లాలోను మహారాష్ట్రలోని సతారాలోనూ ప్రజా ప్రభుత్వాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఉద్యమంలో దేశమంతటా హింస వ్యాప్తి చెందింది. ప్రజలు ఆందోళనలు చెయ్యడమే గాక ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. రైల్వే స్టేషన్లను, పోస్టాఫీసులను, పోలీస్ స్టేషన్లను కాల్చివేశారు.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఖిలాఫత్ ఉద్యమం గురించి రాయండి.
జవాబు.
అక్టోబర్ 17, 1919 రోజును ఖిలాఫత్ దినంగా పాటించబడింది. భారతదేశమంతటా హర్తాళ్ పాటించబడింది. గాంధీజి కూడా ఈ ఉద్యమానికి తన మద్దతు తెలిపాడు. హిందూ ముస్లింల ఐక్యతకు ఇది గొప్ప అవకాశం అని భావించాడు. అంతేగాక వారి లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముస్లింలను ప్రోత్సహించాడు. ఈ విషయంలో గాంధీ సఫలీకృతుడు గావడమే గాక గొప్ప నాయకునిగా ప్రశంసించబడ్డాడు.

TS Inter 1st Year History Study Material Chapter 15 జాతీయ ఉద్యమం – మలిదశ

ప్రశ్న 2.
స్వరాజ్ పార్టీ పనిని అంచనా వేయండి.
జవాబు.
1922లో గయలో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశంలో చిత్తరంజన్ దాస్ కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీని స్థాపించాడు.ఇది కాంగ్రెస్ యొక్క శాఖ. దానికి ఆయన అధ్యక్షుడు, మోతీలాల్ నెహ్రూ కార్యదర్శి. నవంబర్ 1923లో . జరిగిన ఎన్నికలలో స్వరాజ్యపార్టీకి 101 స్థానాలకు 42 నియోజకవర్గ స్థానాలను దక్కించుకుంది. కేంద్ర శాసన సభలో ప్రవేశించి బ్రిటీష్ వారి ప్రతిపాదనలను వ్యతిరేకించాలనుకున్నారు. 1925లో విఠలాభాయి పటేల్ స్వరాజ్ పార్టీ తరుఫున కేంద్ర శాసనసభలో స్పీకర్గా ఎన్నుకోబడ్డాడు. 1925లో చిత్తరంజన్ దాస్ మరణించడంతో ఈ పార్టీ కూడా పతనమైపోయింది.

ప్రశ్న 3.
రౌండ్ టేబుల్ సమావేశంలోని అంశాలను అంచనా వేయండి.
జవాబు.
బ్రిటీష్ ప్రభుత్వం రాజ్యాంగ సంస్కరణలను అమలు చేయాలని నిర్ణయించింది. దాంతో బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్సేమాక్డోనాల్డ్, భారత ప్రతినిధులు లండన్కు ఆహ్వానించాడు. మొదటి రౌండ్ టేబుల్ సమావేశాలు నవంబర్ 1930 నుండి జనవరి 1931 వరకు జరిగాయి. దీనికి స్థానిక పరిపాలకులు, రాజకీయ పార్టీలు హాజరయ్యాయి. కానీ కాంగ్రెస్ హాజరు కాలేదు. కాంగ్రెస్ హాజరుకానందున సమావేశం విఫలమయింది. దాంతో రెండవ రౌండ్ టేబుల్ సమావేశం సెప్టెంబర్ 1931లో మొదలై, డిసెంబర్ చివరి వరకు జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ తరఫున గాంధీ అతనితోపాటు సరోజినినాయుడు హాజరయ్యారు. ఈ సమావేశంలో గాంధీ కేంద్ర, రాష్ట్రాల్లో ఇంగ్లాండు సమానమైన బాధ్యతాయుతమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాడు. ఈ సమావేశం కేవలం కేంద్రంలో సమాఖ్య ఏర్పాటు, భారతదేశంలో మైనారిటీల హక్కులను గురించి చర్చించింది. కానీ బాధ్యతాయుత ప్రభుత్వమనే అంశంపై ని ‘యం తీసుకోవడంలో విఫలమయింది.

1932 లో జరిగిన మూడవ రౌండ్డేబుల్ సమావేశాన్ని కాంగ్రెస్ బహిష్కరించింది. తరువాత 1933లో బ్రిటీష్ గ సంస్కరణల ప్రతిపాదనలతో శ్వేతపత్రం విడుదల చేసింది.

ప్రశ్న 4.
1947 భారత స్వతంత్ర చట్టంలోని నిబంధనలను వివరించండి.
జవాబు.
4 జులై 1947న బ్రిటీష్ పార్లమెంట్ లోని కామన్స్ సభలో భారత స్వాతంత్ర్య చట్టం ప్రవేశపెట్టబడింది. జులై 15న కామన్స్ సభలో బిల్లు ఆమోదించబడింది. మరుసటి రోజున ప్రభువుల సభ (లార్డ్స్ సభ) లో ఆమోదించబడింది. జులై 10 నాడు రాజు ఆమోదం పొందింది. ఈ చట్టం భారతదేశాన్ని విభజించి రెండు కొత్త అధినివేశ ప్రాంతాలను సూచించింది. అదే ఇండియా, పాకిస్తాన్. ప్రతి అధినివేశ ప్రాంతంలో రాజు చేత నియమింపబడిన గవర్నర్ జనరల్ కూడా ఉంటాడు. ఒకవేళ వారికిష్టమైతే రెండు అధినివేశ ప్రాంతాలకు ఒకే గవర్నర్ జనరల్ కూడా ఉండవచ్చు.

రెండు ప్రాంతాల్లో శాసనాలు చేయడం కోసం శాసనసభలు ఏర్పాటు చేయబడతాయి. భారతదేశంలో బ్రిటీష్ పార్లమెంట్ అధికార పరిధి 15, ఆగస్ట్ 1947 నుంచి నిలుపుచేయబడుతుంది. ఈ చట్టానికి అనుగుణంగా ఆగస్ట్ 14న పాకిస్తాన్ ఏర్పడింది. దానికి జిన్న గవర్నర్ జనరల్ అయ్యాడు. భారతదేశానికి ఆగస్టు 15న స్వాతంత్ర్యం ఇయ్యబడింది. మౌంట్ బాటిన్ గవర్నర్ జనరల్, నెహ్రూ ప్రధానిగా స్వతంత్ర భారతదేశంలో ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రశ్న 5.
స్వతంత్రోద్యమ కాలంలోని విప్లవకారులు కార్యకలాపాలను వివరించండి.
జవాబు.
కాంగ్రెస్ నిష్క్రియాత్మక విధానాలు నచ్చని కొందరు యువకులు విప్లవవాదులుగా మారారు. వారి లక్ష్యం భయోత్పాతాన్ని సృష్టించి తొందరగా బ్రిటీష్ వారి నుంచి స్వాతంత్ర్యాన్ని పొందడం. వీరు చాలా నిర్భయస్థులు. దేశం కోసం ప్రాణ త్యాగానికైనా స్థిరపడినవారు. అటువంటి వారిలో ఆంధ్రలో అల్లూరి సీతారామరాజు బ్రిటీష్వారి నియంతృత్వం నుండి గిరిజనులను దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేశాడు. 1922 నుండి 1924 వరకు ఏజెన్సీ ప్రాంతంలో బ్రిటీష్ వారి పరిపాలన దాదాపుగా అంతమయిందని చెప్పవచ్చు. ఈ పరిస్థితిని అధిగమించడానికి బ్రిటీష్ ప్రభుత్వం రూథర్ ఫర్డ్ అనే ప్రత్యేక అధికారిని నియమించింది. బెంగాల్లో సూర్యాసేన్ అతని అనుచరుడు సాహు క్రియాశీల పాత్ర వహించారు. సాహు బ్రిటీష్ అధికారి డేని చంపాడు. ఉత్తరప్రదేశ్కి చెందిన రాంప్రసాద్ బిస్మిల్ తన సహచరులతో కలిసి అలంపూర్కు వెళ్తున్న రైలును కాకోరి దగ్గర ఆపి గార్డు దగ్గర నుండి నగదు పెట్టెలను దోచాడు. ఇదే కాకోరి కుట్రకేసుగా ప్రసిద్ధి. ప్రభుత్వం రాంప్రసాద్ బిస్మిల్ను అతని అనుచరుడు అశ్వకుల్లాఖాన్ ను ఉరితీసింది. 1930 – 32లో హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీ తరఫున సూర్యాసేన్ చిటగాంగ్, ఇతర ప్రాంతాలలో దాడులను రచించాడు. అతన్ని ప్రభుత్వం ఉరితీసింది. ఉత్తరప్రదేశ్లో చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్లు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ను స్థాపించారు. తదనంతరం భగత్సింగ్ పోలీసు అధికారి సాండర్స్ను చంపాడు. బతుకేశ్వర్ దత్తో కలిసి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలోకి ఏప్రిల్ 8, 1929న బాంబులు, కరపత్రాలు విసిరారు. ప్రభుత్వం భగత్సింగ్, రాజగురు, సుఖదేవ్లను 23 మార్చి 1931న ఉరితీసింది.

ప్రశ్న 6.
వేవెల్ ప్రణాళికను వివరించండి.
జవాబు.
1943లో లిన్లిత్అ అనంతరం వేవెల్ వైస్రాయ్ అయ్యాడు. అతని పరిస్థితి చాలా క్లిష్టతరంగా మారింది. బెంగాల్ ఒకవైపు కరువుకోరలు మరియు మతపరమైన ప్రశ్నలు ఉదయించడంతో ప్రభుత్వ ప్రతిష్ఠంభన ఏర్పడింది. 1944లో వేవెల్ గాంధీని విడుదల చేశాడు. భారతదేశంలోని ఐక్యతలో ఒత్తిడిని ప్రతిష్ఠంభనను పరిష్కరించడానికి ప్రయత్నం చేశారు. అనంతరం గాంధీ జిన్నతో కలిసి ఒక పరిష్కారాన్ని కనుగొనాలని అనుకున్నాడు. కాం దీని పరిష్కారానికి 1945లో వేవెల్ లండన్ వెళ్ళాడు. రాజకీయ ప్రతిష్ఠంభనను తొలగించి భాగ లక్ష్యాన్ని సాధించడానికి తోడ్పడే ప్రణాళికతో తిరిగి వచ్చాడు.

ద్విపరిపాలనా నూతన రాజ్యాంగం ఏర్పడి భారతీయుల ఆమోదం పొందే లోపల ఒక తాత్కాలిక ఏర్పాటును ప్రణాళిక ప్రతిపాదించింది. వివిధ రాజకీయ సంస్థల ప్రతినిధులతో వైస్రాయ్ ఒక కార్య నిర్వాహక సమితిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో అధ్యక్షుడుగా వైస్రాయ్, యుద్ధ వ్యవహారాలను చూస్తున్న ముఖ్య సైన్యాధిపతి ఇద్దరు మాత్రమే ఆంగ్లేయులు ఉంటారు. మిగిలిన వారు వివిధ పార్టీల నుంచి ఎన్నుకోబడిన వాళ్ళుంటారు. వారిలో హిందూ, ముస్లింలు సమాన సంఖ్యలో ఉంటారు. కార్యనిర్వాహక సంస్థలకు ఎన్నుకోబడిన సభ్యులకు వేవెల్ ఒక సమావేశాన్ని సిమ్లాలో ఏర్పాటు చేశాడు. అయితే ఈ ఎంపికను జిన్నా అంగీకరించలేదు. దాంతో సిమ్లా సమావేశం విఫలమయ్యింది.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
చంపారన్ సత్యాగ్రహం.
జవాబు.
చంపారన్ బీహార్ రాష్ట్రంలో వెనుకబడ్డ జిల్లా. ఇక్కడి రైతులు బ్రిటీష్ వారి బలవంతంతో ‘నీలిమందు (ఇండిగో) పండించేవారు. ఈ రైతులు ఆంగ్లేయుల ఆధీనంలో ఉండేవారు. నీలిమందును ఆంగ్లేయులు పండించిన ధరకే అమ్మాలి. ఆంగ్లేయులు రైతులను ఎంతగానో పీడించేవారు.

దక్షిణాఫ్రికాలో గాంధీ నిర్వహించిన ఉద్యమాలను గురించి విన్న చంపారన్ రైతులు తమకు సహాయం చేయాల్సిందిగా గాంధీని ఆహ్వానించారు. అక్కడ గాంధీజీ సత్యాగ్రహం ఆరంభించాడు. వేలాది రైతులు జత కలవడంతో, చివరకు ప్రభుత్వం చంపారన్ వ్యవసాయ బిల్లును ఆమోదించింది. ఇది గాంధీకి, సత్యాగ్రహానికి లభించిన విజయం.

ప్రశ్న 2.
రౌలట్ చట్టం.
జవాబు.
1917లో బ్రిటీష్ ప్రభుత్వం భారతదేశంలో జరుగుతున్న విప్లవాత్మక నేరాలపై దర్యాప్తు చేయడానికి న్యాయాధికారి సిడ్నిరౌలత్ నాయకత్వంలో ఒక కమిటీని వేసింది. ఈ కమిటీ వీటన్నింటిని అణచివేయమని సిఫార్సు చేసింది. ఫలితంగా 1919లో రౌలత్ చట్టం అమలు చేయబడింది. ఈ చట్టం ప్రకారం ఎవరినైనా వారంటు లేకుండా అరెస్ట్ చేసే అధికారం, వారి ఇంటిని సోదా చేసి ఆస్తులను జప్తు చేసే అధికారాన్ని ప్రభుత్వానికి ఇచ్చింది. దీనికి వ్యతిరేకంగా భారత సాక్ష్యాల చట్టం ఆధారంగా కోర్టులో అప్పీల్ చేయడం గానీ, సాక్ష్యాలను విచారించడం మొదలైన నిబంధనలేవీ లేవు. విచారణ లేకుండా రెండేళ్ళ కంటే ఎక్కువ సమయం నిర్బంధించవచ్చు అనే నిబంధన భారత పౌరుల ప్రాథమిక హక్కులను హరించివేసింది. ఇది భారతీయులలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఈ పరిస్థితులు గాంధీ మొదటి అఖిల భారత ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. ప్రముఖ నాయకులు స్వామి శ్రద్ధానంద కూడా పాల్గొన్నారు. దేశమంతటా నిరసన ఉద్యమాలు జరిగాయి. గందరగోళాన్ని అల్లర్లను సృష్టిస్తున్నాడన్న నెపంపైన గాంధీ అరెస్ట్ చేయబడ్డాడు.

ప్రశ్న 3.
రౌండ్ టేబుల్ సమావేశాలు.
జవాబు.
1930- 32 సంవత్సరాల మధ్యకాలంలో సైమన్ కమీషన్ నివేదిక ఆధారంగా భారతదేశంలో జరపవలసిన రాజ్యాంగ సంస్కరణలను చర్చించడానికి ఆంగ్ల ప్రభుత్వం భారతదేశంలో వివిధ పార్టీలు, సంస్థానాల ప్రతినిధులతో మూడు సమావేశాలను లండన్లో ఏర్పాటు చేశారు. వీటిని రౌండ్ టేబుల్ సమావేశాలు అంటారు.

మొదటి సమావేశం: 1930లో శాసనోల్లంఘన జరిగే సమయంలో ఏర్పాటైన ఈ సమావేశాన్ని భారత జాతీయ కాంగ్రెస్ బహిష్కరించింది. 1931లో జరిగిన గాంధీ – ఇర్విన్ ఒప్పందం ఫలితంగా రాజకీయ ఖైదీలను బ్రిటీష్ వారు విడుదల చేశారు.

రెండో రౌండ్ టేబుల్ సమావేశం: రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీజీ పాల్గొన్నారు. ఈ సమావేశం ఎలాంటి సత్ఫలితాలివ్వలేదు. తిరిగి వచ్చిన గాంధీ మరల శాసనోల్లంఘన చేపట్టారు.

మూడో రౌండ్ టేబుల్ సమావేశం: ఈ సమావేశానికి పెద్దగా ప్రాధాన్యం లేదు. కాంగ్రెస్ వారు, బ్రిటీష్ లేబర్ పార్టీ కూడా దీనిని బహిష్కరించింది.
ఈ సమావేశాల ఫలితంగా 1935 భారత ప్రభుత్వ చట్టం ఏర్పడింది.

TS Inter 1st Year History Study Material Chapter 15 జాతీయ ఉద్యమం – మలిదశ

ప్రశ్న 4.
సైమన్ కమీషన్,
జవాబు.
భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణల గురించి సిఫారసు చేయాల్సిందిగా బ్రిటీష్ ప్రభుత్వం 1927లో జాన్ సైమన్ అధ్యక్షుడిగా సైమన్ కమీషన్ ను నియమించింది. ఈ సంఘంలో అందరూ ఆంగ్లేయులే ఉండటం, అందులో భారతీయులెవరికీ ఇందులో స్థానం కల్పించకపోవడం భారతీయులకు ఆగ్రహం తెప్పించింది. దాంతో దేశవ్యాప్తంగా కమీషన్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, హర్తాళ్లు జరిగాయి. సైమన్ కమీషన్ను ప్రజలు బహిష్కరించారు. ‘సైమన్ గో బ్యాక్’ నినాదాలు దేశమంతటా మార్మోగాయి. అయినప్పటికీ దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి నివేదిక రూపొందించింది.

ప్రశ్న 5.
మౌంట్ బాటెన్ ప్రణాళిక.
జవాబు.
1947లో వేవెల్ స్థానంలో మౌంట్బాటెన్ వైస్రాయ్ గా నియమింపబడ్డాడు. అట్లే ప్రభుత్వం అతనికి అధికార బదిలీ కార్యక్రమాన్ని పూర్తి చేయమని అనుజ్ఞనిచ్చింది. మౌంట్బాటెన్ కాంగ్రెస్, ముస్లిం లీగుతో చర్చించాడు. వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ఎంతో కష్టపడ్డాడు. అయినా చివరికి దేశ విభజన అనివార్యమయింది. ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతంలో పాకిస్థాన్ ను ఏర్పాటు చెయ్యాలని అతను ప్రతిపాదించాడు. వీటిలో సింధ్, బలూచిస్థాన్ వాయువ్య ప్రావిన్సులు పంజాబ్లోని కొన్ని ప్రాంతాలు, తూర్పు బెంగాల్లున్నాయి. పరిస్థితి దిగజారుతుండటంతో తప్పనిసరై కాంగ్రెస్ కూడా ఈ ప్రతిపాదనను ఒప్పుకోవలసి వచ్చింది. విభజనకు అనుగుణంగా మౌంట్బాటెన్. నిర్ణయాలు తీసుకున్నాడు.

TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu

Telangana TSBIE TS Inter 1st Year English Study Material 14th Lesson Sanghala Panthulu Textbook Questions and Answers.

TS Inter 1st Year English Study Material 14th Lesson Sanghala Panthulu

Paragraph Answer Questions (Section – A, Q.No. 5, Marks : 4)

Question 1.
Is the title, SANGHALA PANTHULU apt to the story ? Explain.
Answer:
Suravaram Pratapa Reddy’s thought provoking Telugu story, SANGHALA PANTHULU is a social and historical narration. It was rendered into English by Elanaaga (Dr. N. Surendra). The story pictures the struggles and sufferings of innocent and ignorant villagers. Ramasagaram village is just a representative of any village in Nizam’s rule. Timidity and lack of unity and awareness among the masses helped a handful of people to exploit the poor. A well-informed and good-intentioned gentleman (Panthulu) came to their rescue. He explained to the villagers about their rights. He helped them pick up courage and form into associations (SANGHALU). That ultimately solved their problems. Hence, the title perfectly suits the story.

సురవరం ప్రతాపరెడ్డి ఆలోచనాత్మక తెలుగు కథ “సంఘాల పంతులు” ఒక సాంఘిక మరియు చారిత్రక కథనము. అది ఎలనాగ (డా॥ ఎన్. సురేంద్ర) గారి చేత ఆంగ్లంలోకి అనువదించబడింది. ఈ కథ అమాయక, అజ్ఞాన గ్రామీణుల బాధలను, పోరాటాలను చిత్రిస్తుంది. రామసాగరం అనే గ్రామం నిజాల పాలనలోని ఏ గ్రామానికైనా ఒక ప్రతీక. ప్రజల అధైర్యము, అనైక్యత, అవగాహనా రాహిత్యము ఆ బీదలను దోచుకోవడానికి కొద్దిమంది దోపిడీదారులకు ఉపయోగపడింది. ఒక మంచి పరిజ్ఞానము, సదుద్దేశము కల పెద్ద మనిషి (పంతులు) వారి రక్షణకై వచ్చాడు. ఆ గ్రామీణులకు వారి హక్కుల గురించి చక్కగా వివరించారు. వారికి ధైర్యము కూడగట్టుకునేలాగా, సంఘాలుగా ఏర్పడేలా సహాయపడ్డారు ఆయన. అది చివరిగా వారికి సమస్యలను పరిష్కరించింది. అందువలన ఆ పేరు కథకు సంపూర్ణంగా సమంజసము. సరిగ్గా సరిపోతుంది.

TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu

Question 2.
“With all these atrocities, we cannot live”, cries a woman of Ramasagaram. Explain the atrocities the villagers were subjected to.
Answer:
“Sanghala Panthulu”, an insightful Telugu story by Suravaram Pratapa Reddy, portrays the plight of the innocent poor. English rendering of the story by Elanaaga (Dr. N. Surendra) captures its spirit well. The story lists the atrocities Ramasagaram villagers were subjected to by the police. They (atrocities) were innumerable and unjust.

They (villagers) were forced to supply to the police fowls, eggs, groceries, todday and nuts and fruits. The police demanded drudgery. The poor had to clean their toilets, press their legs, get for them firewood, etc. The wages the poor got for their services or supplies were beatings and scoldings. They were branded on the cheeks. An old, tired and hungry woman was beaten to death. The list is Pendless.

“సంఘాల పంతులు” అనే నిశిత దృష్టితో రాయబడిన సురవరం ప్రతాపరెడ్డి గారి తెలుగు కథ అమాయక బీదల దీనగాథను చిత్రిస్తుంది. ఎలనాగ (డా॥ ఎన్. సురేంద్ర) గారి ఆంగ్లానువాదము కథ స్ఫూర్తిని చక్కగా పట్టుకోగలిగింది. పోలీసుల చేతిలో రామసాగరం గ్రామీణులు అనుభవించిన దురాగతాల జాబితాను అందిస్తుంది ఆ కథ. ఆ అరాచకాలు అసంఖ్యాకము, అన్యాయము.

ఆ గ్రామీణుల చేత బలవంతంగా పోలీసులు కోళ్ళను, గుడ్లను, సరుకులను, కల్లును, గింజలను, పండ్లను తెప్పించుకొనేవారు. పోలీసులు వారి నుండి గాడిద చాకిరీని “చేయించుకునేవారు. బీదవారి చేత మరుగుదొడ్లను శుభ్రం చేయించుకోవడము, కాళ్ళు వత్తించుకోవడం, కట్టెలు తెప్పించుకోవడం లాంటివి చేయించుకొనేవారు. వారి సేవలకు, సరఫరాలకు ఆ బీదలు పొందే ప్రతిఫలం తిట్లు, తన్నులు మాత్రమే. బుగ్గల మీద కాల్చిన ఇనుప కడ్డీలతో వాతలు పెట్టేవారు. ఒక వృద్ధ, అలిసిపోయి ఆకలితో ఉన్న స్త్రీని ఊపిరిపోయేదాకా కొట్టారు. ఈ జాబితాకు ముగింపు లేదు.

TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu

Question 3.
They realized that the lack of unity had been the cause for their plight. What followed this realisation? How did it help the people of Ramasagaram? * (Imp) (Model Paper)
Answer:
“Sanghala Panthulu”, a social story by Suravaram Pratapa Reddy, presents us valuable life lessons. Its English translation by Elanaaga (Dr. N. Surendra) impresses the readers. The story describes the problems the villagers faced. Then it analyses the reasons. And finally it offers a practicable solution.

So, the crisis was resolved. The police were the exploiters. Ramasagaram villagers were the victims. The causes were the lack of unity among them, their timidity, ignorance, etc. With the help of Sanghala Panthulu, the villagers understood the problem. They stood united. They formed themselves into associations. They proved their strength and courage. Their problems ended. Joy pervaded the village. Celebrations started.

సురవరం ప్రతాపరెడ్డి గారి సాంఘిక కథ ‘సంఘాల పంతులు’ మనకు విలువైన జీవన పాఠాలను అందిస్తుంది. ఎలనాగ (డా|| ఎన్.సురేంద్ర గారి ఇంగ్లీషు అనువాదం పాఠకులను ఆకట్టుకుంటుంది. కథ, ఆ గ్రామస్థులు ఎదుర్కొన్న సమస్యను వర్ణిస్తుంది. తరువాత అది అందుకు కారణాలను విశ్లేషిస్తుంది. అంతిమంగా, ఒక ఆచరణాత్మక పరిష్కార మార్గాన్ని అందిస్తుంది.

తద్వారా, ఆ క్లిష్ట సమస్య పరిష్కరించబడుతుంది. దోపిడీదారులు పోలీసులు. బాధితులు రామసాగరం గ్రామ ప్రజలు. కారణాలు వారి మధ్య ఐక్యతా లోపం, పిరికితనం, అమాయకత్వం మొదలైనవి. సంఘాల పంతులు సహాయంతో వారు సమస్యను అర్థం చేసుకున్నారు. వారు కలిసికట్టుగా నిలబడ్డారు. తమ సంఘాలను ఏర్పరచుకున్నారు. తమ ధైర్యాన్ని, బలాన్ని నిరూపించుకున్నారు. వారి కష్టాలు గట్టెక్కాయి. గ్రామంలో ఆనందం వెల్లివిరిసింది. ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu

Question 4.
Describe the result of the declaration by the “Mohathemeem”.
Answer:
Suravaram’s social story, “Sanghala Panthulu”, presents the pathetic plight of Ramasagaram villagers. Elanaaga translated this moving Telugu story into English. The police went on exploiting the innocent villagers ruthlessly. Sandhala Panthulu came to the rescue of the poor. The police were angry with Panthulu.

When they tried to arrest Panthulu, a good number of youth revolted against the police. The police complained against them. The Mohathemeem came to enquire into the incident. He found the police were guilty. He declared the dismissal, suspension and scaling down of different police personnel. The villagers felt happy. Their joy knew no bounds. Feasts followed. Justice prevailed.

సురవరం వారి సాంఘిక కథ, ‘సంఘాల పంతులు’ రామసాగరం గ్రామ ప్రజల దీనగాథను సమర్పిస్తుంది. ఎలనాగ (డా॥ ఎన్. సురేంద్ర ఈ కదిలించే తెలుగు కథను ఆంగ్లంలోకి అనువదించారు. పోలీసులు అమాయక పల్లె ప్రజల నిర్దయగా దోపిడీ చేస్తూ అణచసాగారు. ఆ బీదలను కాపాడేందుకు సంఘాల పంతులు వస్తారు. పోలీసులకు సంఘాల పంతులుపై అంతులేని కోపం. అతనిని నిర్బంధించ ప్రయత్నించినప్పుడు, పెద్ద సంఖ్యలో యువకులు పోలీసులపై తిరుగుబాటు చేస్తారు.

పోలీసులు వారిపై ఫిర్యాదు చేస్తారు. మొహతిమీమ్ విచారణ నిమిత్తం వస్తారు. పోలీసులదే తప్పు అని వారు నిర్ధారించుకుంటారు. వివిధ స్థాయిలలోని పోలీసు సిబ్బందిని ఉద్యోగంలోంచి తొలగించడం, విధి నిర్వహణ నుండి కొంత కాలం పక్కకు పెట్టడం, క్రింది స్థాయికి పంపడం లాంటి చర్యలను ప్రకటించారు ఆ మొహతిమీమ్. గ్రామస్థులు చాలా సంతోషించారు. వారి ఆనందానికి అవధులు లేకపోయాయి. విందు వినోదాలు కొనసాగాయి. న్యాయం గెలిచి నిలబడింది.

TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu

Sanghala Panthulu Summary in English

TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu 1
Suravaram Pratapa Reddy is multifaceted personality. His writings mainly reflect local history and local people’s sufferings. The story Sanghala Panthulu crafted by Suravaram Pratapa Reddy is a caustic comment on contemporary complex problems. It is translated into English by Elanaaga (Dr. N. Surendra). Like other works of Suravaram, this story also reflects local history and local masses struggles and suffering. Gripping narration moves readers into those periods and places. It offers interesting insights into the then social, economic, political and cultural conditions.

The story takes place in a tiny river side village known as Ramasagaram, ruled by the Nizams. The village Ramasagaram is just a symbol. The time of the story is pre-1940. Most of the villagers are either illiterate or not well-informed. Atrocities witnessed in that village are common all over the Nizam’s state.

It is because people are timid and unorganized. Lack of unity among people, their ignorance about their rights comes in handy to the exploiters. The police are exploiting them to the core. In fact, the village needs no police station. Their only duty is to demand. drudgery, fowls and required grocery without any payment.

They have madigas for drudgery and komatis for supplying commodities. Thus, things are moving happily. But the farmers are perturbed. They observe the lives of people on the other side of the river Krishna ruled by the British. They find that the people are happy there.

TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu

Sanghala Panthulu Summary in Telugu

“సంఘాల పంతులు” ఒక అరుదైన బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డి గారి తెలుగు కథ. వారు గొప్ప సంఘసేవకులు, పరిశోధకులు, పత్రికా సంపాదకులు, రచయిత, బహు భాషాకోవిదులు. 1940 కు ముందున్న దారుణ సాంఘిక, ఆర్థిక పరిస్థితులను, అణగారిన వర్గాల ఆవేదనను అద్దంలో చూపినంత స్పష్టంగా చిత్రించారు.

ఈ కథలో. కదిలించే ఈ తెలుగు కథను ఆంగ్లంలోకి అనువదించినవారు ఎలనాగ (ఎలనాగ గారి అసలు పేరు డా.ఎన్. సురేంద్ర). కథా స్థలం కృష్ణా నదీతీర పల్లె రామసాగరం. కథాకాలం 1940 కి ముందు. ప్రభువులు నిజాములు. దోపిడీదారులు పోలీసు సిబ్బంది. బాధితులు గ్రామస్థులు అందరూ. కారణం గ్రామీణుల అజ్ఞానం, అనైక్యత, నిరక్షరాస్యత.

పరిష్కారం : అవగాహన, ఐకమత్యం. సాధించినవారు : సంఘాల పంతులు. ఫలితం : సమస్య అంతం వాతావరణం సంతోషభరితం. ఇదీ సంక్షిప్త చిత్రణ. అత్యంత ఆసక్తికరంగా సాగే కదిలించి వేసే, కట్టిపడవేసే కథనంతో రచయిత నాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చిత్రిస్తారు. అస్సలు అవసరం లేని ఊరిలో ఏర్పాటు చేయబడిన పోలీసు స్టేషన్లోని సిబ్బంది అందరూ.

ఊరి ప్రజలందరినీ పీల్చి పిప్పిచేసి పీడించడమే కార్యక్రమంగా పెట్టుకొన్నారు. పొయ్యిలో కట్టెల నుండి, తినడానికి కోళ్ళు, తాగడానికి కల్లు – సర్వస్వం ఊరి ప్రజలు ఉచితంగా వారి అందరికీ సమకూర్చాలి. గాడిద చాకిరీ చేయాలి. ఫలితం తిట్లు, తన్నులు, ఒంటి మీద వాతలు. చెప్పనలవి కాని బాధలు. నదికి ఆవలి వైపు పల్లెలో ఆంగ్లేయుల పాలన. ఈ రకమైన బాధలు లేవు. అక్కడికి వలస పోదామనుకున్న వారికీ ఆ అవకాశం లేదు.

జీవితం దుర్భరంగా ఉన్న స్థితిలో సంఘాల పంతులు ఆ ఊరికి వస్తారు. జనులను ఐక్యపరిచి, అవగాహన కల్పించి, వారి హక్కులను వివరించి, పోలీసులకు ఏదీ ఉచితంగా ఇవ్వవలసిన పనిలేదని చెబుతారు. అందరూ పాటిస్తారు. గత సాగిబాటు నడవని పోలీసులు అసలు కారణం సంఘాల పంతులు అని, అతనిని నిర్బంధిస్తారు. అంతే పల్లెయువకులు లాఠీలతో దాడిచేసి పోలీసులను చితకబాది పంతులును విడిపించుక వెళతారు.

పోలీసులు పై అధికారులకు తప్పుడు ఫిర్యాదు చేస్తారు. విచారణాధికారి గ్రామ ప్రజల ద్వారా వాస్తవాలు గ్రహించి, పోలీసులకు తగిన శిక్ష విధిస్తారు. గ్రామంలో పండుగ వాతావరణం. దానిని ప్రసాదించిన సంఘాల పంతులను అందరూ ‘దేవుడు’ అని పిలుచుకుంటారు.

TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu

Sanghala Panthulu Summary in Hindi

“संघाला पंतुलु’ विश्लित एवं बहुमुखी प्रज्ञाशाली सुरवरं प्रतापरेड्डी जी की तेलुगु कहानी हैं । वे सामाजिक सुधारक, शोधकर्ता, संपादक, लेखक और बहुभाषी कोविद थे । सन् 1940 के पूर्व प्रचलित दारुण सामाजिक, आर्थिक स्थितियों और दलित वर्गों की व्यथाओं का दर्पण है, यह कहानी ।

इस प्रभावपूर्ण कहानी का अनुवाद पुलनागा ( असली नाम डॉ. एन. सुरेंद्र) ने किया । क्या स्थल कृष्णा नही के तीर स्थित रामसागरम नामक देहात है । 1940 के पूर्व देहाती लोगों के अज्ञान, अनेकता, निरक्षरता आदि हो बादशाह, निजाम, लुटेरे, पुलीस कारक हैं । बाधित लोग : ग्रामीण, हल : समझदारी और एकता । कार्यसिद्धि करनेवाले : संघाला पंतुलु । परिणाम : समस्या का अंत | ग्रामीण वातावरण : संतोष भरित । यही है संक्षिप्त चित्र । गाँव में स्थापित पुलिस स्टेशन अनावश्यक है । पुलिसस्टेशन के सभी स्टाफ़ सभी गाँववालों को पीड़ित करते हैं ।

उन्हें जलाऊ लकड़ी, खाने के लिए मुर्गी-मुर्गे, पीने के लिए दारु आदि सर्वस्व ग्रामीणों द्वारा देना पडता है । संघाला पंतुल उस गाँव आते हैं । वे लोगों को समेकता कर, उन्हें उनके अधिकारों की जानकारी देकर कहते हैं कि पुलिस को मुफत से किसी चीज देने की जरुरत नहीं है । सभी पालन करते हैं। मुफ्त की सुविधाएँ बंद होने के कारण संघाला पंतुलु है, यह सझक कर उसे बंदी बनाती हैं । पुलीस । तुरंत ग्रामीण युवक पुलिसवालों को घेरा डालकर, अँधाधुंध मारपीट करके पंतुलु छुड़कर ले जाते हैं। पूछताछ – अधिकारी वास्तविकता जानकर पुलिसों को सजा देते हैं । गाँव पर्व का वतावरण है। इसके कारक व्यक्ति संघाल पंतुलु को भगवान के नाम से पुकारते हैं ।

Meanings and Explanations

frontier (n) /frantıə(r)/ (ఫ్రన్ టీఅ(ర్)) (disyllabic) = border: సరిహద్దు, सीमांत

the rest (noun phrase) = the others; remaining: మిగిలినవి, रहना

sundry (adj)/sandri/ (సన్ డ్రి) (disyllabic) = several: చాలా various; వివిధ, विभिन्न

jawan, jamedar, Ameen: terms denoting police personnel : పొలిసు సిబ్బందిని, వారి హోదాను సూచించే పదములు, जमींदार

drudgery (n) /dradzəri/ (డ్రజరి) (trisyllabic) hard and boring work : కఠోర శ్రమ; వెట్టిచాకిరి

commodities (n-pl) /kamodati:z/ (కమొడటీజ్) = useful goods : సరుకులు, దైనందిన వాడుక వస్తువులు

splinters (n-pl) /splıntə(r)z/ (కమొడటీజ్ ) (disyllabic) = pieces of wood used as firewood; పోయిల్లా కట్టెలు, किरच, छिपटी

TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu

perturbed (adj) /pǝ(r)t3:(r)bd/ (ప(ర్)ట(ర్)బ్ డ్) (disyllabic) = troubled; angered: ఇబ్బందులకు ; కోపమునకు గురిచేయబడిన, व्याकुल करना

seethe (v) /si:ð/ (సీడ్ ) (monosyllabic) = boil (with anger) : (కోపంతో) మరిగిపోవు, उबलना

hew (v) /hju:/ (హ్యూ) (monosyllabic) = cut : ముక్కలు చేయు, నరుకు, कुल्हाड़ी से काटना

Rela; Cassia = = names of plants and trees in forests : అడవి చెట్ల పేర్లు, जंगल का पेड़

fume (v) /fju:m/ (ఫ్యూమ్) (monosyllabic) = express great anger : తీవ్ర కోపము వెలిబుచ్చు, गड़बड़ कर देना

corpse (n) /ko:(r)ps/ (కో(ర్)ప్ స్) (monosyllabic) = a dead body : శవము , सव

summon (v) /sɅmən/ (సమన్) (disyllabic) = call : పిలుచు, बुलाव

badam, akhrot, pista = names of nuts: పప్పులు, గింజలు పేర్లు दाल

treacherous (adj) /tretsǝrǝs/ (ట్రెచరస్ ) (trisyllabic) = deceitful: మోసపూరిత, विस्वसघाती

quiet (adj) /kwalǝt/ (క్వ్తెఅట్ ) (disyllabic) = calm : ప్రశాంతంగా, शांति, स्थिरता

persuade (v) /pɔ(r)sweid/ (ప(ర్)స్వేఇడ్ ) (disyllabic) = make someone agee to : ఒప్పించు, నచ్చచెప్పు, पुसलना

station (v) /steisǝn/ (స్టెఇషన్) (disyllabic) = to place to do a duty : ఏదైనా పని చేయు నిమ్మిత్తం ఒకరిని ఒక చోట ఉంచు, स्टेशन

fowls, cocks = birds; chickens: పక్షులు; కోళ్ళు, मुर्गा

storeyed (adj) /stɔ:rid/ (స్టోరిడ్) (disyllabic) = with floors : అంతస్తులు కల

Note: story = కథ; storey = floor = అంతస్తు

sport (v)/spɔ:(r)t/ (స్పో(ర్)ట్) (monosyllabic) = display : ప్రదర్శించు; ధరించి చూపు, मन बहलाना

do away with (idiom) = put an end to : ముగింపు పలుకు ; పరిష్కరించు

TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu

abound (v) /ǝbaund/ (అబౌండ్ ) (disyllabic) = fill to full : నిండుగా నింపు

timid (adj) /tımıd/ (టీమిడ్) (disyllabic) = lacking in courage: ధైర్యము లేని cowardly : పిరికి, डरपोक

instill (v) /instil/ (ఇన్ స్టిల్) (disyllabic) = to cause a quality to become part of someone’s nature : ఒక లక్షణమును ఒక వ్యక్తి స్వభావములో భాగము చేయు

plight (n) /plait/ (ప్లైట్) (monosyllabic) = a difficult situation : కష్టము, दुर्दशा

consensus (n) /kǝnsensǝs/ (కన్ సెస్ సస్ ) = agreement among many : ఏకాభిప్రాయము , अनुकूलता

emerge (v) /imз:(r)dz/(ఇమ(ర్)జ్) (disyllabic) = come into view : కనిపించు; ప్రవేశించు, प्रकट होना

alert (v) /ǝl3:(r)t/ (అల(ర్)ట్) (disyllabic) = warn : హెచ్చరించు, चेतावनी देना

fetch (v) /fets/ (ఫెచ్) (monosyllabic) = get; obtain: పొందు; వేలకు బదులుగా దేనికైనా గ్రహించు

are (అరె), khabardar (కబడ్డార్) = కోపాన్ని, హెచ్చరికలను వ్యక్తీకరించే పదాలు

snarl (v)/sna:(r)// (స్నా(ర్)ల్) (monosyllabic) = say very angrily : చాలా కోపంగా అరచు, गुरहिट

prostrate (v) /prostreit/ (ప్రోస్ట్రేఇట్) (disyllabic) = lying flat with face down as a token of respect : సాష్టా౦గపడుदंडवत पड़ा हुआ

brand (v) /brænd/ (బ్య్రా౦డ్ ) (monosyllabic) = a burn flesh with hot iron : వాతపెట్టు; కాల్చిన ఇనుముతో , व्यापारिक चिन्ह

flank (n) /flænk/(ష్ణ్యానిక్) (monosyllabic) = the body part between the last rib and the hip: తొంటి భాగము

atrocities (n-pl)/ǝtrasətiz/(ఆట్రోసటీజ్ ) (polysyllabic-4 syllables) = very cruel acts: అరాచకములు క్రూర చర్యలు

peepul (n) = name of a tree: రావిచెట్టు

insist (v) /Insist/ (ఇన్ సిస్ ట్) (disyllabic) = demand : గట్టిగా కోరు

pompously (adv) /pompǝsli/ (పోమ్ పస్ లి) (trisyllabic) = in an affectedly grand way : ఆడంబరముగ; పైకి తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో, గొప్పగా

patrol (v) /pǝtrǝul/ (పత్రఉల్) (disyllabic) = go round as a guard : రక్షకుడి వలె పహారా తిరుగు

pertaining to (phrase) = connected to: సంబంధించిన

TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu

enraged (v-pt)/inreidzd/ (ఇన్ రెఇజ్ డ్) (disyllabic) = became very angry : బాగా కోపగించుకొనెను

tipsy (adj) /tipsi/ (టిప్సి) (disyllabic) = drunk : త్రాగిన మైకంలో ఉన్న

hail from (phrase) = come from ; belong to (a place) (ఏ ప్రాంతానికి చెందిన; నుండి వచ్చిన

deprive (v) /diprarv/ (డిప్రైవ్) (disyllabic) prevent someone from having something : వచ్చేది రాకుండా చేయు

shriek (v) /fri:k/ (ప్రీక్) (monosyllabic) = cry : అరచు; ఏడ్చు

beseech (v) /brsi:tf/ (బిసీచ్) (disyllabic) = request : విన్నవించు; beg

to no avail (phrase) = to no use : ఉపయోగం లేకుండా; ఫలితం లేకుండా

thrash (v) /9ræf/ (త్ర్యాష్) (monosyllabic) beat mercilessly : నిర్దయగా కొట్టు

rotund (adj) /routAnd/ (రఉటన్) (disyllabic) = having a fat round body : కొవ్వుపట్టి బలిసిన శరీరం కల

divulge (v) /darvAld3/ (డైవల్) (disyllabic) = reveal : తెలియచెప్పు; బహిర్గతము చేయు

instigate (v) /instagert/ (ఇన్టగెట్) (trisyllabic) = to incite : రెచ్చగొట్టు, भड़काना

TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu

looming large (idiom) = seeming hard to avoid something dangerous : ఏదో ప్రమాదము ఆప వీలుకాకుండా జరుగబోతున్నట్లున్నది.

scale down (phrase) = reduce : తగ్గించు, काम करना

delight (n) /dilart (డిలైట్) (disyllabic) joy; pleasure : ఆనందము, खुश

feasts (n-pl) /fi:sts/ (ఫీస్) (monosyllabic) = large, ceremonial meals : భారీ విందు భోజనములు; daavat, दावत देना

Maths 1B Important Questions Chapter Wise with Solutions Pdf 2022 TS | TS Inter 1st Year Maths 1B Important Questions

TS Inter 1st Year Maths 1B Important Questions with Solutions Pdf 2022 | Maths 1B Important Questions 2022 TS

TS Inter First Year Maths 1B Important Questions | Maths 1B Important Questions Pdf 2022 TS

  1. Maths 1B Locus Important Questions
  2. Maths 1B Transformation of Axes Important Questions
  3. Maths 1B Straight Lines Important Questions
  4. Maths 1B Pair of Straight Lines Important Questions
  5. Maths 1B Three-Dimensional Coordinates Important Questions
  6. Maths 1B Direction Cosines and Direction Ratios Important Questions
  7. Maths 1B The Plane Important Questions
  8. Maths 1B Limits and Continuity Important Questions
  9. Maths 1B Differentiation Important Questions
  10. Maths 1B Applications of Derivatives Important Questions

TS Inter 1st Year Maths 1B Blue Print Weightage

TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature

Telangana TSBIE TS Inter 1st Year English Study Material 4th Lesson The Nobel Nature Textbook Questions and Answers.

TS Inter 1st Year English Study Material 4th Lesson The Nobel Nature

Annotations (Section A, Q.No. 2, Marks: 4)

Question 1.
It is not growing like a tree.
In bulk, doth make Man better be;
Answer:
Introduction:
These are the opening lines of the impressive poem, ‘The Noble Nature’ written by Ben Jonson. He is regarded as the second most popular of English dramatists, after Shakespeare.

Context & Explanation:
The poet employs examples from flora to drive home his point. He straight away introduces the main idea how to become a better man. But, mere bulk doesn’t make one great. Smartness, even in small measure, impresses and impacts everyone. Neither long life nor large size can help one attain nobility. Quality counts more than quantity. Motherwords, matter matters, not the magnitude!. To explain this, the poet compares man to both an Oak tree and a Lily.

Critical Comment:
The poem seeks to explain what makes Man noble in his life.

కవి పరిచయం :
ఈ వాక్యాలు బెన్ జాన్సన్ గారు రచించిన మనస్సుకి ఆకర్షవంతమైన పద్యం The Noble Nature’ లోని ప్రారంభ వాక్యాలు. షేక్స్పియర్ తర్వాత, రెండవ ప్రసిద్ధిగాంచిన ఆంగ్ల నాటకకర్తగా గుర్తింపు
పొందాడు.

సందర్భం :
మనిషి జీవితంలో గొప్పగా ఎలా అవుతాడో వివరించటానికి ప్రయత్నిస్తున్నాడు.

వివరణ :
తన అభిప్రాయాన్ని చెప్పటానికి పుష్పాలను ఉదాహరణగా వినియోగిస్తున్నాడు. ఉన్నతమైన వ్యక్తిగా ఎలా గుర్తింపు పొందుతాడో మనిషి వివరిస్తున్నాడు. అయితే కేవలం పెద్ద పరిమాణం ఒకరిని గొప్పవారుగా చేయదు. చక్కటి చురుకుదనం, చిన్నపాటిగా అయినా, అందర్నీ ఆకర్షిస్తుంది. సుదీర్ఘ జీవితం కానీ పెద్ద ఎదుగుదల కానీ, ఒక వ్యక్తి గొప్పగా ఎదగటానికి సహాయపడుతుంది. పరిమాణం కాదు మనిషికి గుణం ముఖ్యం. ఇంకా చెప్పాలంటే విషయం ముఖ్యం. పరిమాణం కాదు. ఈ విషయం వివరించటానికి, కవి మనిషిని సింధూర మ్రానుతో మరియు కలువపువ్వుతో పోల్చుతాడు.

TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature

Question 2.
A lily of a day
Is fairer far in May.
Answer:
Introduction :
These beautiful lines are taken from the poem, ‘The Noble Nature’ written by Ben Jonson. He is regarded as the second most popular of English dramatists, after Shakespeare. As a poet, he proved his expertise with his lyrics.

Context & Explanation :
Leading a meaningful life makes it noble, Jonson asserts. He employs analogies from nature. The lily flowers in May, flourishes for a day and shines for a short while, Yet, it pleases many. Beauty-even in little measures fills hearts with thrills. It’s life is meaningful. Similarly, a person’s life is meaningful only if he does some acts of benefaction.

Critical Comment:
The poet highlighs the qualities that a man must possess to be considered as noble. To explain this, he compares man to both an oak tree and a lily.

కవి పరిచయం :
ఈ అందమైన వాక్యాలు బెన్ జాన్సన్ గారు రచించిన మనస్సుకి ఆకర్షవంతమైన పద్యం The Noble Nature’ అను పద్యం నుండి గ్రహించబడినవి. షేక్స్పియర్ తరువాత మరొక గొప్ప ఆంగ్ల నాటక కర్తగా పేరుగాంచాడు. కవిగా తన పద్యాల ద్వారా తన గొప్పతనాన్ని చాటుకున్నాడు.

సందర్భం :
గొప్ప వ్యక్తిగా చెప్పుకోవటాన్ని మనిషికి ఉండవలసిన లక్షణాలు గురించి వివరిస్తున్నాడు. ఈ విషయాన్ని విశదీకరించటానికి మనిషిని సింధూర మ్రానుతో మరియు చిన్న కలువపుష్పంతో పోల్చుతున్నాడు. వివరణ : అర్థవంతమైన జీవితాన్ని కొనసాగించడమే గొప్పతనం అని స్థిరంగా చెప్తున్నాడు.

ప్రకృతిలోని సాదృశ్యాలను ఉపయోగిస్తున్నాడు. కలువ పుష్పం ‘మే’ నెలలో పూస్తుంది. ఒక రోజే ఉంటుంది. క్షణకాలం వికసిస్తుంది. అయినప్పటికీ, చాలామందిని ఆనందింపజేస్తుంది. అందం క్షణికమైనదైనా, తాత్కాలికమైనదైనా మనస్సులను రంజింపజేస్తుంది. అలా దాని జీవితం అర్థవంతమైంది. అదేవిధంగా, మనిషి జీవితం కూడా సార్థకమౌతుంది, మనిషి కొంత మంచి చేసినప్పటికీ తన జీవితంలో. కావున ఎంతకాలం బ్రతికామన్నదికాదు. ఎలా బ్రతికామన్నది ముఖ్యం.

TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature

Question 3.
It was the plant and flower of light.
Answer:
Introduction:
This line is taken from the poem, The Noble Nature penned by Ben Jonson. He is regarded as one of the major dramatists and poets of the Seventeenth Century.

Context & Explanation:
The poem says leading a meaningful life even for a short while is worthier than leading a long life with neither charm nor value. The core meaning of the poem centres round this single idea. The lily plant has a short life. It blooms in May and is very beautiful. Although the flower has the life span of a day and falls and dies by nightfall, it spreads beauty and delight in that short period. The poet feels, that a meaningful life like a lily flower though short is what makes a man noble. Even though a man’s life is short, it can be a perfect life.

Critical Comment:
The poet advises one to lead a meaningful life-of light-like that of a lily.

కవి పరిచయం :
ఈ వాక్యం బెన్ జాన్సన్ వ్రాసిన ‘The Noble Nature’ అను కావ్యం నుండి గ్రహించబడింది. 17వ శతాబ్దంలో ఒక ప్రధాన నాటకకర్తగా మరియు కవిగా పేరుగాంచాడు.

సందర్భం :
కలువ పుష్పంలాంటి కాంతివంతమైన, సార్థకమైన జీవితాన్ని గడపమని ప్రతిఒక్కరికి కవి సలహా ఇస్తున్నాడు.

వివరణ :
ఎలాంటి విలువ, గుర్తింపులేని సుదీర్ఘ జీవితంకంటే సార్ధకమైన జీవితం కొంతకాలం గడిపినా అది విలువైందని కవి చెప్తున్నాడు. ఈ ఆలోచనతోనే పద్యం అంతా నిండియుంది. కలువ పుష్పం చాలా తక్కువ కాలం జీవిస్తుంది. ‘మే’ నెలలో వికసిస్తుంది. ఇది చాలా అందమైంది. ఇది ఒక్కరోజులోనే వాడిపోయినా, క్షణంలోనే అందాన్ని మరియు కాంతిని వెదజల్లుతుంది. అలాంటి సార్థకమైన జీవితం క్షణికమైనా, మనిషికి గొప్పవాడుగా గుర్తింపు తెస్తుంది అంటాడు. అలా కలువ పువ్వులాంటి జీవితం క్షణికమైనా, అది పరిపూర్ణ జీవిత.

TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature

Question 4.
And in short measures life may perfect be.
Answer:
Introduction:
This is the concluding line of the beautiful lyric, The Noble Nature written by Ben Jonson. He is very well known for his comedy of humours like Every Man in His Humour.

Context & Explanation:
The poet talks about what makes a man noble. He compares man to a sturdy oak and to a delicate lily in order to do this. He says that a person doesn’t become great or honourable by having long life or huge body. His greatest is analysed by his deeds. And to make man better or life perfect, the poet advises one to dead a meaningful life of light-like that of a lily. Thus, the focus of the poem is clearly on making man better. A person’s life is meaningful only if he does some acts of benefaction. Otherwise life is meaningless.

Critical Comment:
Leading a meaningful life makes it noble, Jonson asserts. He employs analogies from nature.

కవి పరిచయం :
ఇది బెన్ జాన్సన్ వ్రాసిన అందమైన గేయం The Noble Nature’ లోని ముగింపు వాక్యం. ఇతని Every Man in His Humour అను comedy of humours లో ప్రసిద్ధిగాంచాడు.

సందర్భం :
సార్థకమైన జీవితం వ్యక్తిని గొప్పవాడిని చేస్తుంది అంటున్నాడు. ప్రకృతిలోని సాదృశ్యాలను ఉపయోగించి తన భావాన్ని చెప్తున్నాడు. ఏది మనిషిని గొప్ప పరిపూర్ణున్ని చేస్తుందో కవి చెప్తున్నాడు. దృఢమైన పెద్ద సింధూర వృక్షంతోను మరియు మృదువైన కలువ పుష్పంతో మనిషిని పోల్చుతున్నాడు. సుదీర్ఘకాలం జీవించడం లేదా భారీ శరీర ఆకారం కలిగి ఉండడం వల్ల మనిషి గొప్పవాడు లేదా గౌరవనీయుడు కాలేడు అంటున్నాడు.

అతని కార్యాల వలన అతని గొప్పతనం విశ్లేషించబడుతుంది. ఒక మనిషి గొప్పవాడు లేదా గొప్ప పరిపూర్ణ జీవితం కొరకు కలువ పుష్పం లాంటి సార్థకమైన అందమైన జీవితంను కొనసాగించాలని కవి సలహా ఇస్తున్నాడు. అలా మనిషిని గొప్ప గౌరవవంతుడిని చేయటం మీదనే కావ్యం దృష్టంతా ఉంది. ఎంతోకొంత ఉపకారం చేస్తేనే మనిషి జీవితం సార్థకమౌతుంది. లేదంటే మనిషి జీవితానికి అర్థంలేదు.

TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature

వివరణ :
అర్థవంతమైన జీవితమే ఆదర్శవంతమైందని నేచర్ ద్వారా జాన్సన్ వివరిస్తున్నాడు.

Paragraph Questions & Answers (Section – A, Q.No. 4, Marks: 4)

Question 1.
Discuss the aptness of the title “The Noble Nature” to the poem. *(Imp, Model Paper)
Answer:
The Noble Nature is one of the most popular lyrics of Ben Jonson. He is regarded as one of the major dramatists and poets of the Seventeenth Century. In this poem, he seeks to explain what makes man’s life noble. The core meaning of the poem centres around this single idea. In just ten lines of the poem, the poet says twice. Man better be; and life perfect be.
TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature 2
And to make Man better or life perfect, he advises one to lead a meaningful life of light-like that of a lily. Thus, the focus of the poem is clearly on making Man better. To explain this point, examples of the oak and the lily are used. Hence, the title, The Noble Nature, suits the poem well. The poem says leading meaningful life even for a short while is worthier than leading a long life with neither charm nor value.

బెన్ జాన్సన్ గారి ప్రసిద్ధిచెందిన గేయాలలో ‘The Noble Nature’ గేయం ఒకటి. ఇతడు 17వ శతాబ్దంలో ప్రసిద్ధిగాంచిన నాటకకర్త మరియు కవి. ప్రస్తుత పద్యంలో, మనిషి జీవితం గొప్పదిగా చేసేది ఏమిటో వివరించటానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ ఒక్క విషయం చుట్టూనే ప్రధాన అర్థం కేంద్రీకృతమైంది. పది లైన్లులో కవి రెండు సార్లు ‘Man better be; and life perfect be’ అని చెప్తున్నాడు. మనిషి గొప్పవాడు లేదా పరిపూర్ణ జీవితం కావాలంటే వ్యక్తి కలువ పుష్పం లాంటి వెలుగుతో, అందరితో సార్థకమైన జీవితాన్ని కొనసాగించాలని కవి సలహా ఇస్తున్నాడు.

అలా, మనిషిని గౌరవనీయుడిని చేయటంపైన ఈ పద్యం దృష్టి ఉంది. ఈ విషయాన్ని వివరించటానికి, పెద్ద సింధూర వృక్షం మరియు సుకుమారమైన కలువ పుష్పాలు ఉదాహరణకు ఉపయోగించాడు. కావున ‘The Nobel Nature’ అను పేరు ఈ పద్యానికి సరిగ్గా సరిపోతుంది. క్షణకాలమైనా, సార్థకమైన జీవితం గడపటం అనేది ఎలాంటి విలువ మరియు గుర్తింపు లేని సుదీర్ఘ జీవితం కంటే విలువైంది అని కవి చెప్తున్నాడు.

TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature

Question 2.
Bulk does not make man better be. How does the Oak support this stand ?
Answer:
Ben Jonson’s poem, The Noble Nature is one of his most popular lyrics. This short poem discusses a noble thought in simple style. That profound message is expressed clearly with the help of example and images from nature. It highlights the point that equality counts more than quantity.

Growing physically like a bulky tree or living long like a sturdy Oak does not make a man noble being. The huge, strong a and aged Oak will soon become a lifelesss, ‘dry’ and withered piece of log. So too will be the fate of a man who is only blessed with long life and physical and material well being. Therefore, mere bulk doesn’t make Man better be. Matter matters, not the magnitude.

బెన్ జాన్సన్ ప్రసిద్ధిగాంచిన గేయాలలో ‘The Noble Nature’ కూడా ఒకటి ఈ చిన్న పద్యం గొప్ప ఆలోచనను చక్కటి శైలిలో వివరిస్తుంది. చక్కటి గూఢమైన సందేశాన్ని ప్రకృతిలోని చెట్లను, పుష్పములను ఉదాహరణలుగా చూపించి తెలియజేస్తుంది. పరిమాణం కాదు మనిషికి గుణం గొప్పదని తెలియజేస్తుంది. సింధూర వృక్షంలాగా పెద్ద మానులాగా పెరిగి 300 సం||లు నివసించితే మనిషి గొప్ప వ్యక్తి కాడు.

బలమైన, ఎత్తైన మరియు తరాల సింధూర మ్రాను ఎండిపోతుంది ఎలాంటి గుర్తింపు లేకుండా. అలానే, మనిషి కూడా కనుమరుగౌతాడు కేవలం సంపద, శరీర సౌష్టవం, సుదీర్ఘ జీవితం కలిగి ఉంటే. ఎలా బ్రతికామన్నది ముఖ్యం ఎంతకాలం కాదు. కావున, పరిమాణం మనిషిని గుణవంతుణ్ణి చేయదు. అతని వ్యక్తిత్వం అతన్ని గొప్పవాడ్ని చేస్తుంది.

Question 3.
Explain with example of the Lily that size matters not but beauty counts a lot.
Answer:
Ben Jonson, in the poem, The Noble Nature talks about what makes a man noble. He compares man to a sturdy Oak and to a delicate Lily in order to explain this point. The Lily plant has a short life. It blooms in May and is very beautiful.

Although, the flower has the span of a day and dies by nightfall it spreads beauty and delight in that short period the poet feels that a meaningful life like the Lily flower, though short, is what makes a man noble and even though a man’s life is short it can be perfect life. People will continue to talk good about him even after he is gone. This is what actually makes a man noble, thus, beauty counts a lot.
TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature 3
ఒక వ్యక్తిని ఏ విషయం గొప్పవాడిగా కీర్తింపజేస్తుంది ఈ పద్యంలో చెప్తున్నాడు. ఈ విషయాన్ని వివరించడానికి మనిషిని సింధూర మ్రానుతో మరియు సుకుమార కలువ పుష్పంతో పోల్చుతున్నాడు. కలువ జీవితం క్షణికమైంది. ఇది ‘మే’ నెలలో వికసించుతుంది. ఇది చాలా అందమైంది. ఒక్కరోజు మాత్రమే వికసించి అస్తమించినప్పటికీ, ఇది అందాన్ని మరియు ఆనందాన్ని అందిస్తుంది.

TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature

క్షణకాలమైనప్పటికీ కలువ పువ్వు లాంటి సార్థకమైన జీవితం వ్యక్తిని గొప్పవాడిని చేస్తుంది. మనిషి జీవితం కొంతకాలమైన అలాంటి సార్థకమైన జీవితం అతడిని పరిపూర్ణుడిని చేస్తుంది. అతని మరణానంతరం సహితం జనం అతని మంచి గుణాన్ని గురించి చెప్పుకుంటారు. ఈలాంటి మంచి పనుల వలన, వ్యక్తిత్వం వలన మనిషి గొప్పవాడౌతాడు. కావున అందమైన పనులు చిన్నవైనా చాలా గొప్పవి.

The Nobel Nature Summary in English

TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature 1

Ben Jonson is regarded as one of the major dramatists and poets of the Seventeenth Century. His poem The Noble Nature, one of his most popular lyrics. This poem is about the importance of noble nature in one’s life. The core meaning of the poem centres around this single idea. He compares man to a sturdy oak and to a delicate lily in order to explain this point.

Growing physically like a bulky tree or living long like a sturdy oak does not make a man noble being. The huge, strong and aged oak will soon become a lifeless, ‘dry’ and withered piece of log. So too will be the fate of a man who is only blessed with physical and material assets and long life. He will not remain for long in the minds of people around him.

However, the lily plant has a short life. It blooms in May and is very beautiful and perfect. It gives us light and happiness. It’s life is meaningful. Although it has the span of a day and withers by the night, it is appreciated for its beauty and delight in that short period.

Similarly if man does good during the short period he lives people will continue to talk good about him even after he is gone. This is what actually makes a man noble. The poet feels that a meaningful life like the lily flower, though short, is what makes a man noble. If means that a person’s life is meaningful only if he does some acts of benefaction. Otherwise his life is meaningless.

The Nobel Nature Summary in Telugu

17వ శతాబ్దపు నాటక కర్తలు మరియు కథలలో ఒక ప్రముఖుడిగా బెన్ జాన్సన్ పేరుగాంచాడు. ఇతని “The Noble Nature” అను గేయం ఇతని ప్రముఖ కావ్యాల్లో ఒకటి. వ్యక్తి జీవితంలోని గొప్పతనం యొక్క ప్రాముఖ్యాన్ని గురించి ఈ పద్యం తెలుపుతుంది. ఈ పద్యం యొక్క ప్రధాన అర్థం ఈ ఒక్క విషయంలో కేంద్రీకృతమైంది. ఈ విషయాన్ని ‘వివరించటానికి మనిషిని పెద్ద సింధూర వృక్షంతోను మరియు నాజూకైన కలువ పువ్వుతోను కవి పోల్చుతున్నాడు.

సింధూర మ్రాను లాగ ఎత్తుగా పెరగటం లేదా సుదీర్ఘకాలం జీవించటం వలన మనిషి గొప్ప గౌరవంతుడు కాడు. పెద్ద పరిమాణం, బలం మరియు ఎక్కువకాలం జీవించిన సింధూరమ్రాను చివరికి ఎండిపోయి, శుష్కించి పోతుంది. ఒక నరికివేసిన మొద్దులాగా అవుతుంది. అలాగే భౌతిక రూపం, సంపద, మరియు సుదీర్ఘ జీవనం కలిగి మనిషి పాత్ర కూడా అంతే. తన చుట్టూ ఉన్న జనం అతన్ని గుర్తుంచుకోరు.

TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature

ఏదిఏమైనప్పటికీ, కలువపువ్వు క్షణకాలం బ్రతుకుతుంది. ఇది మే నెలలో వికసిస్తుంది. ఇది చాలా అందమైంది. మనకు కాంతిని మరియు ఆనందాన్నిస్తుంది. అలా దీని జీవితం సార్ధకమైంది. ఒక్క రోజు ఆయుష్షు కలిగినప్పటికీ దీని అందం మరియు ఆనందింపజేయటం వలన ఇది మెచ్చుకోబడుతుంది.

అదే విధంగా, మనిషి కూడా తన జీవితంలో మంచి పనులు చేస్తే, జనం అతని మంచి గురించి అతని మరణానంతరం సహితం మాట్లాడుకుంటారు. ఈ లక్షణమే మనిషిని గొప్పవాణ్ణిచేస్తుంది. కలువ పువ్వులాంటి సార్థకమైన జీవితం క్షణకాలమైనా సరే మనిషిని గొప్ప గౌరవనీయుణ్ణి చేస్తుంది. మనిషి జీవితం సార్థకమయ్యేది అతను ఏదైనా మంచి పనులు చేస్తేనే. లేదంటే మనిషి జీవితానికి అర్థంలేదు.

The Nobel Nature Summary in Hindi

सोलवीं सदी के विख्यात् नाटककार एंव कवि थे, बेन जानसन । प्रस्तुत पाठथांश ‘महोन्नत उदार स्वभाव’ ‘The Noble Nature’ लयेबरध गीत है, जिसमें अल्प शष्टों में अनल्प अर्थ निहित है । इसमें केवल 10 पंक्तियों में 72 शब्द रात्र हैं । लेकिन इसमें जो संदेश है । वह विश्वमानव की पुरोगति को दूसरी तरफ़ मोड़कर नए स्वर्ण लोक में ले जा सकाता है। सार्थकता, अच्छाई और खुशी को बढ़ानेवाला जीवन चाहे जितना अल्प, कालिक है, वह महोन्नत – उदात्त जीवन ही है । इसके लिए प्रथत्न करना चाहिए । नाम में महानता नहीं होती, काम में होती है । नाटककार बक बक नहीं कर रहे हैं, अपनी इस राम कहानी को संक्षेप में ‘बाँधना – मासा- ‘लाना’ कहकर समाप्त कर रहे हैं । वे पाठकों को वृक्ष – जगत् में ले जाकर अपना संदेश दे रहे हैं ।

जन सज्जन होने का मतलब पेड़ की तरह बढ़ना या मोटा होना नही है, बलूत (ओक) वृक्ष की तरह बढ़ता हुआ आसमान को छूना, तीन सौ साल जीना, सूखकर मुरझाना, मृतकाष्ठ (लॉग) झोना नही है ।

अच्छा जीवन माने लिली फूल की तरह मई में फूलकर चमकर, रात को मुरझाकर झड़ना है । फिरभी सभी जन लिली पौधे को फूल को प्रकाश और आनंद का प्रतीक मानते हैं। छोटे – छोटे परिमाणों में सौंदर्य देखते हैं । लघु विषयों में भी परिपक्व परिपूर्ष जीवन को और जीव को देखते हैं | सार्थकठा से रहना ही आदर्श है। अपरिमितता मे रहना आदर्श नही होता। आनंद देना ही महोन्नत उदार स्वभाव है ।

Meanings and Explanations

bulk (n) / balk / (బల్క) (monosyllabic) : size, quantity (usually large), mass, పరిమాణం, అధికభాగం , आकार
doth (v) / dp0 / (డోత్) (monosyllabic) : old form of ‘does’, ముగించుట , आदि की मादा
long (లాగ్) : measuring a great distance from end to end, పొడవైన , लंभा
oak (n) / Juk / (అఉక్) (monosyllabic) : a large tree with hard wood, పెద్ద సింధుర మ్రాను, शाहबलूत
log (n) / log / (లోగ్) (monosyllabic) : the trunk of a dead tree, మొద్దు నరికిన దుంగ , लड्डा

TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature

dry : not wet or moist, ఎండిన, తడిలేని , सूखना
bald (adj) / bo:ld / (బోల్డ్) (monosyllabic) : the trunk of a dead tree : without leaves, flowers etc : ఆకులు, పూలు లేని మోడు, पुष्य
sere (adj) / sla(r) / (సిఅ(ర్)) (monosyllabic) : without moisture, dry : ఎండిపోయిన, सूखना
proportions / pro’po:fnz / (ప్రపో(ర్)షన్) (trisyllabic) : quantities; measures : భాగాలు, పరిమాణాలు, परिमाण
measures (n) / mey (r) / (మెజ(ర్)) (disyllabic): sizes ; కొలతలు, పరిమాణాలు, नापना
short : not tall ; not long : పొట్టి, చిన్నది, छोटा
perfect : complete, faultless : పరిపూర్ణమైన, లోపంలేని, पूर्ण करना

Maths 1A Important Questions Chapter Wise with Solutions Pdf 2022 TS | TS Inter 1st Year Maths 1A Important Questions

TS Inter 1st Year Maths 1A Important Questions with Solutions Pdf 2022 | Maths 1A Important Questions 2022 TS

TS Inter First Year Maths 1A Important Questions | Maths 1A Important Questions Pdf 2022 TS

  1. Maths 1A Functions Important Questions
  2. Maths 1A Mathematical Induction Important Questions
  3. Maths 1A Matrices Important Questions
  4. Maths 1A Addition of Vectors Important Questions
  5. Maths 1A Products of Vectors Important Questions
  6. Maths 1A Trigonometric Ratios up to Transformations Important Questions
  7. Maths 1A Trigonometric Equations Important Questions
  8. Maths 1A Inverse Trigonometric Functions Important Questions
  9. Maths 1A Hyperbolic Functions Important Questions
  10. Maths 1A Properties of Triangles Important Questions

TS Inter 1st Year Maths 1B Blue Print Weightage

TS Inter 1st Year History Study Material Chapter 5 గుప్తుల యుగం

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 5th Lesson గుప్తుల యుగం Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 5th Lesson గుప్తుల యుగం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సముద్రగుప్తుని సైనిక విజయాలను తెలపండి.
జవాబు.
గుప్త చక్రవర్తులలో సముద్రగుప్తుడు అగ్రగణ్యుడు. సముద్రగుప్తుని విజయాలను, వ్యక్తిత్వాన్ని అతడు జారీచేసిన శాసనాల ఆధారంగా తెలుసుకోవచ్చు. సముద్రగుప్తుడు మొదటి చంద్రగుప్తుడు, కుమారదేవీలకు జన్మించాడు. సైనిక విజయాలు: సముద్రగుప్తుడు గొప్ప విజేత. విదేశీదాస్యం నుంచి భారతదేశానికి విముక్తిని కలిగించి భారతదేశమంతటిని ఒకే పాలన క్రిందకు తీసుకురావాలని ఇతడు ఆశించాడు. ఇతని ఆస్థాన పండితుడు, సేనాపతి అయిన హరిసేనుడు అలహాబాద్లో అశోక స్తంభం మీద వ్రాయించిన “అలహాబాద్ ప్రశస్థి” .ద్వారా ఇతని సైనిక విజయాలను తెలుసుకోవచ్చు. దీని ప్రకారం సముద్రగుప్తుని విజయాలను మూడు భాగాలుగా విభజించవచ్చు.
అవి:

  1. మొదటి ఆర్యావర్త విజయాలు
  2. దక్షిణభారత విజయాలు
  3. రెండో ఆర్యావర్త విజయాలు.

1) మొదటి ఆర్యావర్త విజయాలు: సింహాసనాన్ని అధిష్టించిన వెంటనే సముద్రగుప్తుడు తన అధికారాన్ని ధిక్కరించిన ఉత్తర భారతంలోని రాజులను జయించి పాటలీపుత్రంలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఈ యుద్ధాల్లో సముద్రగుప్తుడు ఓడించిన రాజులు: అహిచ్ఛత్రాన్ని పాలిస్తున్న అచ్యుతుడు, గ్వాలియర్ సమీపంలో పద్మావతీపురాన్ని పాలిస్తున్న నాగసేనుడు, మధురాపురాధీశుడైన గణపతి నాగుడు, ఇంకా చంద్రవర్మ, రుద్రదేవ వంటి మొత్తం ‘ మంది రాజులను అణచి సముద్రగుప్తుడు తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇతని పరాక్రమాన్ని గుర్తించి సP రాజ్యాలైన సమతట, కామరూప, నేపాల్, దావక, కర్రిపుర మొదలైన రాజ్యపాలకులు సముద్రగుప్తుడితో మైత్రి చేసుకున్నారు. మాళవ, యౌధేయ, అభీర వంటి గణరాజ్యాలు ఇతని ఆధిపత్యాన్ని అంగీకరించాయి. ఈ విజయాల ఫలితంగా ఇతని సామ్రాజ్యం హిమాలయాల నుంచి ‘భిల్సా’ వరకు, పంజాబ్ నుంచి బెంగాల్ వరకు విస్తరించింది.

TS Inter 1st Year History Study Material Chapter 5 గుప్తుల యుగం

2) దక్షిణ భారత విజయాలు: మొదటి ఆర్యావర్త యుద్ధాల తరువాత సముద్రగుప్తుడు దక్షిణభారతంపై దండెత్తాడు. ఈ దండయాత్రలో సముద్రగుప్తుడు 12 మంది రాజ్యపాలకులను ఓడించి వారి రాజ్యాలను తిరిగి వారికే అప్పగించాడు. ఆ పాలకులు: 1) కోసల పాలకుడైన మహేంద్రరాజు 2) మహాకాంతార పాలకుడైన వ్యాఘ్రరాజు 3) ఏరండపల్లి దమనుడు 4) పిష్టపుర రాజు మహేంద్రుడు 5) కొత్తూరును పాలించే స్వామిదత్తుడు 6) దేవరాష్ట్ర పాలకుడైన కుబేరుడు 7) వేంగి పాలకుడైన హస్తివర్మ 8) పాలక్క రాజైన ఉగ్రసేనుడు 9) కేరళ రాజ్యాన్ని పాలించే మంత్రరాజు 10) కుశస్థలపురం పాలకుడు ధనంజయుడు 11) అవముక్త పాలకుడు నీలరాజు 12) కంచిని పాలించిన విష్ణుగోపుడు.
సముద్రగుప్తుని ఈ దండయాత్ర మార్గాన్ని గురించి చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

3) రెండో ఆర్యావర్త విజయాలు: సముద్రగుప్తుడు దక్షిణ భారత విజయాల్లో మునిగివున్న సమయంలో ఉత్తరభారతంలోని రాజులు వాకాటక రాజు రుద్రసేనుని నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. సముద్రగుప్తుడు వారిని “కౌశాంబి” యుద్ధంలో ఓడించి, అశ్వమేధయాగాన్ని చేసి సామ్రాట్టుగా ప్రకటించుకున్నాడు. ఈ విజయాలను గుర్తించి మధ్యభారతంలోని అనేక అటవీ రాజ్యాల అధిపతులు ఇతని ఆధిపత్యాన్ని అంగీకరించారు.

ఇట్టి విజయ పరంపరల వలన చరిత్రకారులు సముద్రగుప్తుని ఇండియన్ నెపోలియన్ అని కీర్తించారు.
ఇతర దేశాలతో సంబంధాలు: విజేతగా సముద్రగుప్తుడి కీర్తి, ప్రతిష్టలు విదేశాలకు కూడా వ్యాపించాయి. అనేకమంది విదేశీరాజులు ఇతనితో దౌత్య సంబంధాలనేర్పరుచుకొన్నారు. సింహళరాజైన మేఘవర్ణుడు క్రీ.శ. 851లో ఇతని ఆస్థానానికి రాయబారులను, కానుకలను పంపడమే కాకుండా తన దేశం నుంచి భారతదేశం వచ్చే బౌద్ధ యాత్రికుల కోసం బుద్ధగయ సమీపంలో ఒక విహారాన్ని నిర్మింపజేశాడు.

ప్రశ్న 2.
గుప్తుల పరిపాలనా ముఖ్యాంశాలను వెలికితీయండి.
జవాబు.
భారతదేశ చరిత్రలో గుప్తుల యుగం స్వర్ణయుగంగా భావించబడింది. గుప్తుల పాలనలో ప్రధానాంశాలు.

కేంద్రపాలన:
చక్రవర్తి: కేంద్రపాలనలో చక్రవర్తి అత్యున్నత అధికారి. రాజును దైవాంశ సంభూతుడిగా భావించేవారు. ‘అలహాబాద్ ప్రశస్తి’ సముద్రగుప్తుడిని దేవుడిగా వర్ణించింది. చక్రవర్తికి అపరిమిత అధికారాలున్నాయి. గవర్నర్లు, ఇతర పౌర అధికారులను అతనే నియమిస్తాడు. వారందరూ చక్రవర్తికి జవాబుదారీగా ఉండేవారు.

మంత్రులు: పాలనా వ్యవహారాలలో మంత్రుల కూటమి చక్రవర్తికి సహాయపడుతుంది. వీరిని ‘మంత్రులు’ లేదా ‘సచివులు’ అంటారు. మంత్రులు వారికి కేటాయించిన శాఖల బాధ్యతలు నిర్వర్తించేవారు.

ఇతర అధికారులు: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పరగణాలకు, జిల్లాలకు ప్రత్యేక దూతల ద్వారా తెలిపే అధికారి సర్వాధ్యక్షుడు. సైన్యంపై అధికారాలను కలిగిన మంత్రి ‘మహాసేనాపతి’. మహాదండనాయకుడు, ప్రధాన న్యాయమూర్తి, విదేశీ వ్యవహారాలు, ‘మహాసంధి విగ్రహకుడు’ నిర్వహిస్తాడు. భాండాగారాధికృత అనే అధికారి ప్రభుత్వ ఖజానాధికారి. వీరేగాక ప్రతీహారులు, రాజసన్యాసులు, కుమారామాత్యుడు, ఇలా అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించేవారు. రాష్ట్రపాలన: పరిపాలనా సౌలభ్యం కోసం గుప్తులు తమ విశాలమైన రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించారు. రాష్ట్ర విభాగాలను ‘దేశ’ లేదా ‘భుక్తి’ అంటారు. ‘భుక్తి’ పాలకుడిని ఉపరికుడు అంటారు. యువరాజుకాని, రాజకుటుంబీకులు కాని ఉపరికులుగా నియమింపబడతారు. రాష్ట్రాలను మరల జిల్లాలుగా విభజించారు. వాటిని ‘? చూలు’ అంటారు. ‘విషయ’ పాలనాధికారిని ‘విషయపతి’ అంటారు. డా॥ ఎ.యస్. ఆల్టేకర్ చెప్పినట్లు ప్రభ వికేంద్రీకరించబడింది. చాలావరకు జిల్లా పాలనకు విధులు బదిలీ చేయబడ్డాయి.

పాలనాపరంగా ప్రాంతీయ పాలన: గుప్తుల కాలంలో ప్రాంతీయ పాలన రెండు రకాలుగా అభివృద్ధి చెందింది. 1. మునిసిపల్ లేదా నగర పాలన 2. గ్రామీణ పాలన. నేటి ప్రధాన నగరాలైన పాటలీపుత్ర, తక్షశిల, మండసార్, ఉజ్జయినిలలో నగర పాలన ఉండేది. నగరపాలనను విషయపతి నిర్వహిస్తాడు. ఆరోగ్యం, పరిశుభ్రత, ప్రాథమిక విద్య మొదలైనవి ‘పరిషత్’ కున్న ప్రధాన విధులు.

గ్రామం పరిపాలనలో అతి చిన్న విభాగం. గ్రామ పాలనను నిర్వహించడానికి ‘గ్రామికుడు’లేదా గ్రామాధ్యక్షుడు నియమించబడ్డాడు. గ్రామ రక్షణ, శాంతిభద్రతలు ఇతడి ప్రధాన విధులు. గ్రామాధ్యక్షుడికి సహాయంగా ‘పంచ మండలం’ అనే సభ ఉంటుంది. గ్రామ పెద్దలతో ఈ సంఘం ఏర్పడుతుంది.

న్యాయపాలన: చక్రవర్తి అత్యున్నత న్యాయాధికారి. గ్రామస్థాయి నుంచి ఉన్నత న్యాయస్థానాల వరకు ఉండేవి. ` ప్రధాన న్యాయమూర్తిని మహాదండనాయకుడు అంటారు. ఫాహియాన్ రచనలలో న్యాయవ్యవస్థ వివరాలు ఉన్నాయి. నాడు చట్టాలు సరళంగా ఉండేవి. శిక్షలు కూడా సాధారణంగా ఉండేవి.

సైనికపాలన: గుప్త పాలకులకు బలమైన సైన్యం ఉండేది. గజబలం, అశ్వికబలం, కాల్బలం ఉండేవి. రథాలు కూడా ఉండేవి. ఎడారి ప్రాంతాల్లో ఒంటెలు కూడా వాడారు. సైన్యంలో ప్రధాన అధికారి ‘మహాసేనాధిపతి’, ‘రణభాండాగారాధికరణ’ సైనికులకు అవసరమయ్యే ఏర్పాట్లు చేసేవారు. అలహాబాద్ స్తంభ శాసనంలో వారు వాడిన ఆయుధాల వివరాలు తెలియజేయబడ్డాయి.

ప్రశ్న 3.
గుప్తులు సాహిత్యం, మతాభివృద్ధికి చేసిన సేవను వివరించండి.
జవాబు.
ప్రాచీన భారతదేశ చరిత్రలో గుప్తుల కాలాన్ని స్వర్ణయుగమంటారు. ఈ కాలాన్ని గ్రీస్ చరిత్రలోని పెరిక్లిస్ యుగంతోను, రోమన్ చరిత్రలోని అగస్టస్ యుగంతోను పోలుస్తారు. ఈ యుగంలో భారతదేశం అన్ని రంగాల్లోను అభివృద్ధిని సాధించింది.

రాజకీయ ఐక్యత: గుప్తపాలకులు ఉత్తర భారతదేశాన్ని అనైక్యత నుండి కాపాడి, దేశ సమైక్యతను సాధించారు. మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, చంద్రగుప్త విక్రమాదిత్యుడు మొదలగు పాలకులు తమ దిగ్విజయ యాత్రల ద్వారా దేశ రాజకీయ ఏకీకరణను సాధించారు.

విజ్ఞులైన చక్రవర్తులు: గుప్త చక్రవర్తులు సమర్థులు, పండితులు, శూరులు. వీరిలో సముద్రగుప్తుడు అగ్రగణ్యుడు. ఇతడు అజేయుడైన వీరుడే కాక మంచి కవి కూడా. గుప్త చక్రవర్తులందరూ మత సహనమును పాటించారు. వీరి వ్యక్తిగత ప్రతిభాసంపత్తి గుప్తయుగము స్వర్ణయుగము కావటానికి దోహదపడింది.

ఆర్థికాభివృద్ధి: గుప్తుల సమర్థవంతమైన పాలన వలన రాజ్యంలో సుఖశాంతులు ఏర్పడి ఆర్థికాభివృద్ధి జరిగింది. ప్రజలు సంపన్నులై, సంతోషంగా జీవించేవారని ఫాహియాన్ పేర్కొన్నాడు. శిక్షలు స్వల్పంగా ఉండేవి. బాటసారులకు దొంగల భయం లేకుండా ఉండేది. స్వదేశీ, విదేశీ వాణిజ్యం పురోగమించుటచే దేశసంపద పెరిగింది. పరిశ్రమలు వర్ధిల్లాయి. వ్యవసాయమునకు మంచి ప్రోత్సాహం లభించింది.

మతసామరస్యము:
ఎ) గుప్త చక్రవర్తులు హిందువులవటంతో అశ్వమేథము మొదలగు వైదిక కర్మలను ఆచరించారు. త్రిమూర్తులకు ప్రాధాన్యతనిచ్చారు. గుప్తుల ఇష్టదైవం విష్ణువు కనుక విష్ణుపురాణం, విష్ణుస్మృతి, భాగవతం మున్నగు గ్రంథములు ఆదరింపబడ్డాయి. శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి మున్నగు దేవతలను కూడా వీరు పూజించారు. ఈ కాలంలో సగుణోపాసనకు ప్రాముఖ్యం పెరిగింది.

బి) తాము వైదిక మతమును అవలంబించినప్పటికి గుప్త చక్రవర్తులు జైన, బౌద్ధమతముల యెడల అపారమైన సహనాన్ని పాటించారు. ప్రసిద్ధ బౌద్ధపండితుడైన వసుబంధుని సముద్రగుప్తుడు ఆదరించాడు. సింహళ ప్రభువు మేఘవర్ణుడు భారతదేశములో బౌద్ధవిహారము నిర్మించుటకు ఇతడు అనుమతించాడు. కుమారగుప్తుడు నలందా బౌద్ధ విశ్వవిద్యాలయమును స్థాపించాడు. నాటి బౌద్ధ, జైన ప్రతిమలు అసంఖ్యాకముగా లభించుటయే గుప్తుల మత సహనమునకు తార్కాణం. కాలక్రమేణా బౌద్ధమతం క్షీణించింది. మహాయాన బౌద్ధమతము హిందూమత శాఖవలె తోచుటయే ఇందుకు కారణం. జైనమతం మాత్రమే కొన్ని ప్రాంతాలలో కొనసాగింది. గుప్తులు ఉన్నత ఉద్యోగాలలో మత ప్రమేయం లేకుండా బౌద్ధులను, జైనులను నియమించారు.

సారస్వతాభివృద్ధి: గుప్తుల కాలంలో సంస్కృత భాష పూర్తి వికాసాన్ని పొందింది. సముద్రగుప్తుడు స్వయంగా కవి. “కవిరాజు” అను బిరుదాంకితుడు. సముద్రగుప్తుని సేనాని హరిసేనుడు అలహాదాబ్ ప్రశస్థి శాసనాన్ని వ్రాశాడు. రెండో చంద్రగుప్తుని ఆస్థానంలో ‘నవరత్నాలు’ అనే కవులుండేవారు. వారు

  1. కాళిదాసు
  2. అమరసింహుడు
  3. శంకు
  4. ధన్వంతరి
  5. క్షపణికుడు
  6. బేతాళభట్టు
  7. ఘటకర్షకుడు
  8. వరరుచి
  9. వరాహమిహిరుడు.

కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతల’మనే కావ్యం అనేక ప్రపంచ భాషల్లోకి అనువదించబడింది. ‘మృచ్ఛకటికం’ నాటకాన్ని రచించిన శూద్రకుడు ఈ కాలంవాడే. నాడు వసుబంధు, దిజ్ఞాగుడు, బుద్ధపాలితుడు, భావవివేకుడు వంటి. బౌద్ధ రచయితలు నిరుపమానమైన రచనలు చేశారు. ఈ రచనల ద్వారా ఆనాటి రాజాస్థాన జీవితం, ప్రభువర్గాల జీవన విధానం గురించి తెలుస్తుంది.

విజ్ఞాన శాస్త్రాభివృద్ధి: విజ్ఞానశాస్త్రంలో కూడా గుప్తుల కాలం అద్భుతమైన ప్రగతిని సాధించింది. ఆర్యభట్టు ‘సూర్యసిద్ధాంత’మనే గ్రంథాన్ని, వరాహ మిహిరుడు ‘బృహత్సంహిత’ అనే గ్రంథాన్ని రచించారు. బ్రహ్మ గుప్తుడు గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టి తన పుస్తకం ద్వారా దానిని లోకానికి వెల్లడి చేశాడు. వైద్యశాస్త్రాభివృద్ధికి విశేషంగా కృషిచేసిన శుశ్రుతుడు, వాగ్భటుడు, ధన్వంతరి మొదలైనవారు గుప్తుల కాలంవారే.

కళాభివృద్ధి: గుప్తుల కాలంలో కళలు కూడా పరాకాష్టనందుకొన్నాయి. ఈ కాలంలో జరిగిన నిర్మాణాలన్నీ మతం వలన ప్రేరేపితమైనవే. ఉదాహరణకు దేవఘర్లోని దశావతార దేవాలయం, తిగావా, భూమారా ఆలయాలు, సాంచి, సారనాథ్ లోని బౌద్ధాలయాలు ఈ కాలంలో వాస్తుకళ సాధించిన ప్రగతికి నిదర్శనాలు. గుప్తుల కాలంలో శిల్పకళ కూడా పరిపక్వతను పొందింది. అజంతా గుహల్లోని కొన్ని కుడ్యచిత్రాలు ఈ కాలానికి చెందినవే. లోహాలతో విగ్రహాలను, ఉక్కుతో స్తంభాలను పోతపోయడంలోను, రకరకాల అందమైన నాణాల తయారీలో కూడా గుప్తయుగం తన ప్రత్యేకతను నిలబెట్టుకొంది.

ముగింపు: గుప్తుల యుగం భారతదేశ చరిత్రలో ఒక విశిష్టయుగం. ఈ విశిష్టత ప్రధానంగా సాహిత్యం, విజ్ఞానశాస్త్రాలు కళారంగాలలో కనిపిస్తుంది.

TS Inter 1st Year History Study Material Chapter 5 గుప్తుల యుగం

ప్రశ్న 4.
హర్షవర్ధనుని అంచనా వేయండి.
జవాబు.
గుప్త సామ్రాజ్య పతనానంతరం ఉత్తర భారతదేశం అనేక చిన్న స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయింది. పాటిలో ఒకటి స్థానేశ్వర రాజ్యం. స్థానేశ్వరాన్ని పాలించిన పుష్యభూతి వంశస్థులలో హర్షుడు ప్రముఖుడు. ఇతను క్రీ.శ. 606 – 647 వరకు రాజ్యపాలన చేస్తాడు. తన దండయాత్రలతో ఉత్తర భారత రాజకీయ ఏకీకరణ సాధించాడు.

చారిత్రక ఆధారాలు: బాణుడి హర్షచరిత్ర, హుయాన్ త్సాంగ్ రచించిన సీ- యు- కి హర్షుని శాసనాలు ముఖ్య ఆధారాలు. హర్షుడు రచించిన నాటకాల ద్వారా నాటి సాంఘిక పరిస్థితిని అంచనా వేయవచ్చు.

తొలి విజయాలు: తండ్రీ, సోదరుల మరణానంతరం క్రీ.శ. 606లో హర్షుడు తన పదహారవ ఏట రాజ్య సింహాసనాన్ని రాజపుత్ర’ అనే బిరుదుతో అధిష్టించాడు. సింహాసనానికి వచ్చిన వెంటనే హర్షుడు కామరూప దేశాధిపతి భాస్కరవర్మతో మైత్రిని పొంది, తరువాత మాళవ, గౌడాధీశులను శిక్షించాడు. ఆత్మహత్య చేసుకోబోతున్న సోదరి రాజ్యశ్రీని కాపాడుకున్నాడు. కనోజ్ మంత్రివర్గ విన్నపం మేరకు స్థానేశ్వర, కనోజ్ రాజ్యాలను కలిపి ‘కనోజ్ రాజధానిగా పాలించాడు. “శీలాదిత్య” అనే బిరుదు ధరించాడు. క్రీ.శ. 606 నుండి 647 వరకు పరిపాలించాడు.

జైత్రయాత్రలు: హర్షుడు విశాల సైన్యాన్ని సమకూర్చుకుని ఆరు సంవత్సరాల పాటు చేసిన దిగ్విజయ యాత్రలలో మాళవరాజ్యం, వల్లభి, వంగ, మగధ, గంజామ్ ప్రాంతాలను జయించాడు.

ఓటమి: హర్షుని జీవితంలో చూసిన ఏకైక ఓటమి రెండవ పులకేశి చేతిలో ఓటమి ఉత్తరాపథాన్ని జయించిన హర్షవర్ధనుడు దక్షిణాపథాన్ని జయించాలనుకున్నాడు. కానీ పశ్చిమ చాళుక్యరాజైన రెండవ పులకేశి, హర్షుని నర్మదానదీ తీరంలో ఓడించి వెనుకకు మళ్ళించాడు. నర్మద రెండు రాజ్యాలకు సరిహద్దు అయిందని రెండవ పులకేశి ఐహోల్ శాసనం వలన తెలుస్తుంది. ఈ విధంగా హర్షవర్ధనుడు ఆర్యవర్తానికి చక్రవర్తిగా ఉన్నాడనీ ‘సకలోత్తరపధేశ్వరుని’గా ఐహోల్ శాసనం పేర్కొనటం వలన తెలుస్తుంది.
పాలన: హర్షుడు సమర్థుడైన పాలకుడు. ప్రజా సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపాడు. హర్షుడు విరామమెరుగక రాజ్యభారాన్ని నిర్వహించేవాడని హుయాన్ త్సాంగ్ వ్రాశాడు. పండిన పంటలో 6వ వంతును మాత్రమే పన్నుగా వసూలు చేసాడు. హర్షుని శిక్షాస్మృతి కఠినంగా ఉండేది. నేరాలు అధికంగా ఉండేవని తెలుస్తుంది.

మహామోక్ష పరిషత్: దానధర్మాలలో అశోకునికి సాటిరాగల చక్రవర్తి. ప్రయాగలో మహామోక్ష పరిషత్ ఐదేండ్లకొకసారి జరిపి తన ఖజానాలోని సర్వాన్ని దానం చేసేవాడని, తాను ఆరవ మహామోక్ష పరిషత్కు హాజరయ్యానని హుయాన్త్సాంగ్ రాసుకున్నాడు. ఇందు మొదటిరోజు బుద్ధుని, రెండవరోజు సూర్యుని, మూడవరోజు శివుని పూజించి ఐదు లక్షల జనులకు దానధర్మాలు చేసాడు.

సారస్వత పోషణ: హర్షుడు నలంద విశ్వవిద్యాలయానికి 100 గ్రామాలను దానం చేసాడు. స్వయంగా కవి. రత్నావళి, నాగానందం, ప్రియదర్శిక అనే నాటకాలు రచించాడు. బాణుడు, భర్తృహరి, మయూమడు, మతంగ దివాకరుడు ఇతని ఆస్థాన కవులు, ఉత్తర భారతదేశాన్ని పాలించిన ఆఖరు చక్రవర్తి హర్షుడు. ఇతడు బ: ముఖ ప్రజ్ఞాశాలి.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
చంద్రగుప్తు విక్రమాదిత్యుని విజయాలపై ఒక లఘు వ్యాసం రాయండి.
జవాబు.
విక్రమాదిత్యునిగా పేరుగాంచిన రెండవ చంద్రగుప్తుడు దాదాపు 35 సంవత్సరాలు పరిపాలించాడు. శకులపై ఇతడు సాధించిన విజయం, ధృవాదేవి గౌరవాన్ని కాపాడటం అనేవి ఇతనికి వీరోచిత, ప్రసిద్ధఖ్యాతిని అందించాయి. విశాఖదత్తుడు రాసిన “దేవీచంద్రగుప్తుం” అనే నాటకంపై విషయాన్ని వివరించింది. ఇతడు శకులను ఓడించి పశ్చిమ భారతదేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇతడు నాగవంశ కుటుంబానికి చెందిన కుబేరనాగను వివాహం చేసుకోగా ప్రభావతి గుప్తు అనే కూతురు పుట్టింది. ఈమెను వాకాటక రెండవ రుద్రసేనునికిచ్చి వివాహం చేయగా ఆ రాజ్యం కూడా గుప్త సామ్రాజ్యంలో అంతర్భాగమైంది. రెండవ చంద్రగుప్తుని పాలన కళా వైభవానికి, సాహిత్య పోషణకు ప్రసిద్ది చెందింది. చాలా ప్రసిద్ధి చెందిన కవి, నాటక రచయిత కాళిదాసు ఇతని ఆస్థానంలోనివాడే. ఈ కాలంలోనే ఫాహియాన్ అనే చైనా యాత్రికుడు భారతదేశాన్ని సందర్శించాడు.

ప్రశ్న 2.
గుప్త సామ్రాజ్యం పతనానికి గల కారణాలను పరీక్షించండి.
జవాబు.
పురుగుప్తుని కుమారుడైన బుధగుప్తుడు క్రీ.శ. 477లో సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడు క్రీ.శ. 500 సంవత్సరంలో చనిపోయి ఉండవచ్చు. జయనాధుడు, మహారాజ లక్ష్మణుడు తదితర సామంతరాజులు చక్రవర్తి సార్వభౌమాధికారాన్ని అంగీకరించలేదు. దక్షిణ ప్రాంతంలోని గుప్త సామ్రాజ్యాన్ని నరేంద్రసేనుని నాయకత్వంలోని వాకాటకులు ఆక్రమించారు. ఆ కాలంలో హూణుల దాడులు కూడా గుప్తు సామ్రాజ్య పతనానికి ఒక కారణం. ఈ కారణాలన్నింటివల్ల అతి పెద్దదైన గుప్త సామ్రాజ్యం చిన్న చిన్న ముక్కలుగా, స్వతంత్ర ఉపరాజ్యాలుగా చీలిపోయింది. బుధగుప్తుని మరణానంతరం ‘ గుప్తవంశం పతనమైనందున అతని తరువాత వచ్చినటువంటి రాజుల పేర్లు నిర్దిష్టంగా తెలియరాలేదు. ఆ తరువాత తోరమానుని నాయకత్వంలో హూణులు పంజాబు, పశ్చిమ భారతదేశంలోని పెద్ద భూభాగాన్ని ఎరాన్ వరకు జయించారు. గుప్త పాలకులలో చివరివారు నరసింహగుప్తుడు, కుమారగుప్తుడు, విష్ణుగుప్తుడు. అయితే, ఆనాడు రాజ్యంలో వీరి అధికారం నామమాత్రంగానే ఉండేది.

ప్రశ్న 3.
గుప్తుల కాలంనాటి శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధిని విశ్లేషించండి.
జవాబు.
గుప్తుల కాలంలో భారతీయులు గణిత, ఖగోళ శాస్త్రాలలో అద్భుత ప్రగతిని సాధించారు. ప్రపంచం ఆశ్చర్యపోయే ఆవిష్కరణలు వచ్చాయి. ఈ యుగానికి చెందిన వారే ‘సున్నా’, ‘దశాంశ’ పద్ధతులకు రూపకల్పన చేశారు. ఆర్యభట్టు, వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు నాటి ప్రసిద్ధ ఖగోళ శాస్త్రజ్ఞులు, గణితశాస్త్ర పండితులు.

ఆర్యభట్టు: క్రీ.శ. 5 – 6 శతాబ్దాల మధ్య కాలంలో ఆర్యభట్టు ‘సూర్య సిద్ధాంతం’ సూర్య, చంద్ర గ్రహణాలు వివరిస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని మొదట కనుగొన్న మేధావి అతడే. “ఆర్యభట్టీయం” అనే గ్రంథాన్ని రచించాడు. అందులో గణితశాస్త్ర అంశాలున్నాయి.

వరాహమిహిరుడు: ఇతడు బృహత్సంహిత గ్రంథం రాశాడు. అది ఖగోళశాస్త్ర గ్రంథం. భౌతిక భూగోళశాస్త్రం, వృక్షశాస్త్రం, సహజ చరిత్ర అండలో కలదు. పంచ సిద్ధాంతక బృహతాతక మొదలైన గ్రంథాలు రచించాడు. బ్రహ్మగుప్తుడు: క్రీ.శ. 6,7 శతాబ్దాలలోనే న్యూటన్ చెప్పిన అంశాలను చాలా ముందు కాలంలోనే తెలిపిన గొప్ప ఖగోళ శాస్త్రజ్ఞుడు. ప్రకృతి సూత్రం ప్రకారం అన్ని వస్తువులు భూమిపైన పడాల్సిందే. బ్రహ్మస్ఫుట, సిద్ధాంత, ఖండఖండ్యక `అనే గ్రంథాలు రాశాడు.

ఇతర విజ్ఞాన శాస్త్రాలు: వరాహమిహిరుడు, పాదరసం, ఇనుము ఉపయోగించటం, వైద్యం కోసం లోహసంబంధ తయారీలు రసాయనశాస్త్ర వృద్ధిని సూచిస్తున్నాయి. ‘నవనీతకం’ అనే వైద్య గ్రంథంలో మందుల వివరాలు, వాటి తయారీ వివరించబడింది. పశువైద్యశాస్త్రానికి చెందిన ‘హస్తాయుర్వేద’ గ్రంథాన్ని రచించింది ‘పాలకాప్య’. చరకుడు, సుశ్రుతుడు ఈ కాలానికి చెందిన ప్రసిద్ధ వైద్యులు. ధన్వంతరి కూడా ఈ కాలానికి చెందినవాడే.

ప్రశ్న 4.
గుప్తులు కళలు, శిల్పకళా వైభవానికి చేసిన సేవకై ఒక వివరణ ఇవ్వండి.
జవాబు.
నిర్మాణాలు: భారతీయ నిర్మాణాలలో గుప్తుల కాలానికి ప్రత్యేక స్థానం ఉంది. నగర, ద్రావిడ పద్ధతుల్లో గుప్తుల కళ భారతీయ నిర్మాణ చరిత్ర వైభవానికి ప్రతీకగా నిలిచింది.
గుప్తుల కళ: గుప్తుల కాలం శిల్ప కళారంగం స్వర్ణయుగంగా ప్రసిద్ధిచెందింది. భవనాలు, దేవాలయాలు, స్తంభాలు, స్తూపాలు అనేకం నిర్మించారు. వీరు నిర్మించిన అద్భుతమైన దేవాలయాల్లో హూణులు, ముస్లిం దాడుల తరువాత మిగిలినవి:

  1. ఝాన్సీ జిల్లాలోని దేవఘడ్ వద్దగల దశావతార దేవాలయం.
  2. మధ్యప్రదేశ్లోని భూమారా వద్దగల శివాలయం.

పెర్సీ బ్రౌన్ అభిప్రాయంలో భిట్టర్గావ్ దేవాలయ శిల్ప నిర్మాణం సుదీర్ఘ సంప్రదాయానికి ప్రతీకగా ఉంది. ఇంకా కొన్ని స్తూపాలు, గుహలు, విహారాలు కూడా నిర్మించబడ్డాయి. సారనాథ్ స్తూపం, అజంతా, ఉదయగిరి గుహలు ఆనాటి గొప్ప నిర్మాణాలు. అందమైన బుద్ధుని విగ్రహాలు రాతితో, లోహంతో, బంకమట్టితో చేయడంతోపాటు వివిధ పౌరాణిక బొమ్మలు రాతిపై అందంగా చెక్కారు.

శిల్ప నిర్మాణం:
a. రాతి శిల్పం: సారనాథ్ బుద్ధ విగ్రహం, ఉదయగిరి వద్దగల గుహ ప్రవేశ ద్వారం వద్దగల వరాహ ప్రతిమ చక్కటి ఉదాహరణలు. గ్వాలియర్ వద్ద ఒక నృత్యకారిణితో మహిళా సంగీత విద్వాంసుల చిత్రాలు అద్భుతమైనవి.
b. లోహ నిర్మాణం: 18 అడుగుల ఎత్తైన బుద్ధుని రాగి విగ్రహం, క్రీ.శ. 6వ శతాబ్దంలో బీహారులో నలంద వద్ద నిర్మించారు. సుల్తాన్ గంజ్లోని బుద్ధ విగ్రహం 72 అడుగుల ఎత్తు ఉంది. ఢిల్లీలో మెహరోలి వద్ద ఉన్న ఇనుప స్తంభం గుప్తుల సాంకేతిక పరిజ్ఞానానికి మచ్చుతునక.
కనిష్కుడు గొప్ప భవన నిర్మాత. కనిష్కపురం, పురుషపురం అనే రెండు నగరాలను నిర్మించాడు.

ప్రశ్న 5.
హర్షవర్థనుని పరిపాలనా విధానం గురించి రాయండి.
జవాబు.
పరిపాలన సౌలభ్యం కోసం సామ్రాజ్యాన్ని భుక్తులుగాను, భుక్తులను విషయాలుగాను, విషయాలను గ్రామాలుగాను విభజించారు. పాలనా విధానంలోను, విద్యా, సాంస్కృతిక రంగాల్లోను హర్షుడు గుప్తయుగం సంప్రదాయాలనే అనుసరించాడు. రాజుకు సలహాలిచ్చి సహాయం చేయడానికి మంత్రిపరిషత్ ఉండేది. ప్రభుత్వ విధానంలో మంత్రి పరిషత్కు గౌరవప్రదమైన స్థానం ఉంది. వారసత్వాన్ని నిర్ణయించడానికి కూడా మంత్రిపరిషత్తుకు అధికారం ఉంది. హర్షచరిత్ర నుంచి, శాసనాల నుంచి అనేకమంది ఉద్యోగుల పేర్లు తెలుస్తున్నాయి. వారిలో మహాసంధి – విగ్రహాధికృత (యుద్ధ వ్యవహారాలు), రాజస్థానీయ (విదేశీ వ్యవహారాలు), మహాబలాధికృత (సేనాపతి), ఆయుక్తక, భోగక (పన్నుల వసూలు), భాండాగారాధికృత (కోశాధికారి) మొదలైనవారు ముఖ్యులు. వీరికి జీతాలకు బదులు భూములను ఇచ్చేవారు. సైనికోద్యోగులకు మాత్రం జీతాలిచ్చేవారు.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
హరిసేనుని సేవ గురించి రాయండి.
జవాబు.
గుప్తుల చరిత్ర తెలుసుకోవడానికి ప్రధాన ఆధారాలలో ఒకటైన అలహాబాద్ స్తంభ శాసనం సముద్రగుప్తుని సర్వ సైన్యాధికారియైన హరిసేనుడు రచించాడు. ఇది సముద్రగుప్తుని సైనిక దండయాత్రలని, అతని విజయాలని, ఉత్తర, దక్షిణ భారతదేశ రాజకీయ భౌగోళికతను తెలుపుతుంది. ఇంత ప్రాధాన్యత కలిగిన ఈ శాసనం సంస్కృత భాషలో రచింపబడింది. హరిసేనుడు కవిగా కూడా గుర్తింపు పొందాడు.

TS Inter 1st Year History Study Material Chapter 5 గుప్తుల యుగం

ప్రశ్న 2.
రామగుప్తునిపై ఒక లఘుటీక రాయండి.
జవాబు.
విశాఖదత్తుని దేవీచంద్రగుప్తుం అనే గ్రంథం సముద్రగుప్తుని మరణానంతర సంఘటనల్లో భాగంగా, శకరాజు దాడులకు భయపడిన రామగుప్తుడు తన పట్టపురాణియైన ధృవాదేవిని అప్పగించాలని భావించడంతో, సహించలేని సోదరుడు రెండవ చంద్రగుప్తుడు శకులను పారద్రోలి, అసమర్థుడైన రామగుప్తుని సంహరించి, రాణిని కాపాడుతాడు.

ప్రశ్న 3.
విజ్ఞాన శాస్త్రాభివృద్ధికి ఆర్యభట్టు చేసిన సేవను పరీక్షించండి.
జవాబు.
విజ్ఞాన శాస్త్రాలు కూడా గుప్తుల కాలంలో ఎంతగానో అభివృద్ధి చెందాయి. ప్రసిద్ధిగాంచిన భారత ఖగోళ శాస్త్రవేత్తలైన ఆర్యభట్టు తన “ఆర్యభట్టీయం” అనే గ్రంథంలో గ్రీకులతో మనకు గల సంబంధాల వల్ల ఖగోళశాస్త్ర రంగంలో మనం సాధించిన అభివృద్ధిని గురించి వివరించాడు. ఇతడు ఖగోళ శాస్త్రాన్ని ఉన్నత స్థాయిలోనికి తీసుకొని వచ్చినవాడుగా గణతికెక్కాడు. ఇతడు గ్రహణాలను శాస్త్రీయ పద్ధతిలో వివరించాడు. భూమి తన అక్షంపై తిరగడం వల్ల భూమి నీడ చంద్రునిపై పడుతూందని, తత్ఫలితంగా గ్రహణం ఏర్పడుతుందని ఆర్యభట్టు అభిప్రాయపడ్డాడు. ఇతని సిద్ధాంతాలు శాస్త్రీయంగా ఉండి, మతాన్ని, సంప్రదాయాలను కలిపి ఆచరించే వారిని వ్యతిరేకించాయి. ఇంకా, ఇతడు గణితంలో దశాంశస్థాన విలువల పద్ధతిని కూడా ఆనాడే ఉపయోగించాడు.

ప్రశ్న 4.
ఫాహియాన్ గురించి రాయండి.
జవాబు.
చైనా యాత్రికుడైన ఫాహియాన్ చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో, క్రీ.శ. 405 సంవత్సరంలో భారతదేశానికి వచ్చాడు. ఇతడు బౌద్ధ సన్యాసి, బుద్ధుని జన్మభూమి అయిన భారతదేశాన్ని సందర్శించాలనే ఉత్సాహం కలిగినవాడు. రెండవ చంద్రగుప్తుని పాలనా కాలంనాటి రాజకీయ, సామాజిక, మత, ఆర్థిక పరిస్థితులను తన ‘ఫో-కు-వోకి’ అనే గ్రంథంలో వివరించాడు. గుప్తుల కాలంనాటి చరిత్రకు ఇది ప్రధాన ఆధార గ్రంథం.

ప్రశ్న 5.
అలహాబాద్ స్థంభ శాసన ముఖ్యాంశాలను తెల్పండి.
జవాబు.
అలహాబాద్ ప్రశస్థిని సముద్రగుప్తుని సేనాని హరిసేనుడు సంస్కృతభాషలో వ్రాయించాడు. ఇది ఒక శాసనం రూపంలో ఉంది. దీనిలో సముద్రగుప్తుని దిగ్విజయాలు వివరించబడ్డాయి. దీనిని కావ్యశైలిలో రచించారు. ఇది అలహాబాద్ లోని అశోక స్తంభంపై వ్రాయబడి ఉంది.

ప్రశ్న 6.
హూణుల దండ్రయాతను వర్ణించండి.
జవాబు.
హూణులు చైనా పరిసర ప్రాంతాలకు చెందిన అనాగరిక మోటుజాతి ప్రజలు. వీరిలో నల్లహూణులు, తెల్లహూణులు అను రెండు శాఖలవారున్నారు. తెల్లహూణులు భారతదేశముపై దాడిచేసి గుప్తుల సామ్రాజ్యంలో శాంతిభద్రతలకు అంతరాయం కలిగించారు. వీరిలో తోరమాణుడు, మిహిరకులుడు ముఖ్యులు. వీరి దండయాత్రల వలన గుప్త సామ్రాజ్యం బలహీనపడింది. గణతంత్ర రాజ్యాలు అంతరించాయి. బౌద్ధమతం నాశనమైంది. కాలక్రమంలో హూణులు క్షత్రియులుగా గుర్తింపు పొందారు.

ప్రశ్న 7.
హర్షుని మహామోక్ష పరిషత్ను వర్ణించండి.
జవాబు.
హర్షుడు ప్రయాగ వద్ద ప్రతి 5 సంవత్సరములకొకసారి సర్వస్వదాన కార్యక్రమాన్ని నిర్వహించేవాడు. దీనినే మహామోక్ష పరిషత్ అంటారు. ఇటువంటి పరిషత్లను హర్షుడు ఆరింటిని జరిపాడు. క్రీ.శ. 643లో జరిగిన 6వ పరిషత్కు -హుయాన్ త్సాంగ్ హాజరయ్యాడు. ఈ పరిషత్తులో హర్షుడు తన సర్వస్వాన్ని బ్రాహ్మణులకు, అనాథలకు పంచి, కట్టుగుడ్డలతో రాజధానికి తిరిగి వచ్చేవాడు.

TS Inter 1st Year History Study Material Chapter 5 గుప్తుల యుగం

ప్రశ్న 8.
హుయానా త్సాంగ్ రచనలపై ఒక వివరణ ఇవ్వండి.
జవాబు.
హర్షుని కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ (క్రీ.శ. 630 – 644). ఇతడు దేశంలోని అనేక ప్రాంతాల్లో, బౌద్ధమత పవిత్ర స్థలాల్లో నలందా విశ్వ విద్యాలయంలో గడిపి అనేక బౌద్ధ గ్రంథాలను అధ్యయనం చేశాడు. హర్షునికి సన్నిహితుడైనాడు. హర్షుడు కనోజ్, ప్రయాగలో జరిపిన మోక్ష పరిషత్లలో పాల్గొన్నాడు. భారతదేశంలో అనేక బౌద్ధ గ్రంథాలను, బుద్ధుని ధాతువులను సేకరించాడు. తన పర్యటన అనుభవాలను సి-యు-కి అను గ్రంథంగా రచించాడు. ఈ గ్రంథం హర్షుని రాజ్యంలోని రాజకీయ, సాంఘిక, మత పరిస్థితులను వివరిస్తుంది.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 1st Poem The Dinner Party Textbook Questions and Answers.

TS Inter 1st Year Telugu Study Material 1st Poem విద్యాలక్ష్యం

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
ద్రోణార్జునుల గురుశిష్య సంబంధాన్ని చర్చించండి?
జవాబు:
భరద్వాజ మహర్షి పుత్రుడైన ద్రోణాచార్యుడు గొప్ప అస్త్ర విద్యా నిపుణుడు. కౌరవులకు, పాండవులకు విలువద్య నేర్పడానికి భీష్ముడు ద్రోణాచార్యుడిని రాజగురువు గా నియమించాడు. దివ్యాస్త్రాలతో సహా అన్నిరకాల అస్త్ర, శస్త్ర యుద్ధ విద్యలలో ఆరితేరినవాడు ద్రోణుడు. అర్జునుడు అతని ప్రియ విద్యార్ధి. ద్రోణుడికి అర్జునుని కన్నా ప్రియమైనవారు ఎవరన్నా ఉంటే అది అతని కుమారుడు అశ్వత్థామ మాత్రమే.

మహాభారత ఇతిహాసంలో ఉత్తమ గురువుగా ద్రోణాచార్యుడు, మరియు ఉత్తమ విద్యార్ధిగా అర్జునుడు గురుశిష్య బంధానికి తార్కాణంగా నిలిచి పోయారు. రాజకుమారులందరికీ గురువుగా ఉన్న ద్రోణుడు అర్జునుడు ఒక అసాధారణ విద్యార్ధి అని గమనించాడు. విద్యార్ధులందరికీ పెట్టిన తొలి పరీక్షలోనే అర్జునుడిలోని అపారమైన సంకల్పం మరియు ఏకాగ్రతను గమనించాడు ద్రోణుడు. ఒక రోజు గొప్ప యోధుడవుతాడని గ్రహించాడు. ద్రోణాచార్యుడు పెట్టిన అన్ని పరీక్షలలోను అర్జునుడు అందరినీ మించిపోయాడు.

అర్జునుడు అపారమైన “గురుభక్తితో ద్రోణుడిని సేవించాడు. భీష్మునిచే ఆచార్యునిగా నియమింపబడగానే రాకుమారులందరినీ చూసి నా దగ్గర అస్త్ర విద్యలు నేర్చి నా కోరికమీలో ఎవ్వడు తీర్చగలడు? అని అడుగగా కౌరవులందరూ పెడమొగం పెట్టగా, అర్జునుడు నేను తీరుస్తానని ముందుకు వచ్చాడు. అలా ముందుకు వచ్చిన అర్జునుని అపారప్రేమతో కౌగలించుకున్నాడు. అలాగే ద్రోణుని సరస్సులో మొసలి పట్టుకున్న సమయంలో అర్జునుడే ద్రోణుని మొసలి నుంచి విడిపించి తన ప్రతిభను చాటుకున్నాడు.

చీకటిలో బాణాలు వేయడం అభ్యసిస్తున్నా అర్జునుని చూసి, అస్త్రవిద్యలోని అతని పట్టుదలకి శ్రద్ధకు సంతోషించి నీకంటే విలువిద్యలో అధికులు లేనట్లుగా నేర్పిస్తానన్నాడు ద్రోణుడు అన్నట్లుగానే సకల విద్యాయుద్ధకౌశలాన్ని, అస్త్ర, శస్త్రాలను, దివ్యాస్త్రాలను యుద్ధవ్యూహాలను సంపూర్ణంగా బోధించి ఒకనాటి పరశురాముడు కూడా విలువిద్యలో ఇంతటి వాడు కాడు అనేట్లుగా, అర్జునుని తీర్చిదిద్దాడు.

అర్జునునికన్నా విద్యపట్ల శ్రద్ధ, ఆసక్తి, గురుభక్తి, వినయ కారణంగా ద్రోణుడి ప్రియ శిష్యుడయ్యాడు. బ్రహ్మాస్త్రాన్ని అర్జునునికి ఇచ్చి సాధారణ యోధులకి వ్యతిరేకంగా వాడవద్దని, చెప్పాడు. విలువిద్య కళను నేర్చుకోవటంతో ఉన్న అంకిత భావం అచంచల ఏకాగ్రత కారణంగా గురువు హృదయంలో స్థానం సంపాదించాడు. ద్రోణుడు కూడా తనకున్న విద్యాజ్ఞానాన్నంతటినీ శిష్యులకు ధారపోసాడు. గురుద్రోణాచార్య, శిష్యుడు అర్జునుడు పంచుకున్న బంధం భారత ఇతిహాసంలో ప్రత్యేకంగా నిలిచి పోయింది.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

ప్రశ్న 2.
‘విద్యాలక్ష్యం’ పాఠ్యభాగ సారాంశాన్ని వివరించండి?
జవాబు:
ద్రోణుడు అగ్నివేశుడనే మహాముని వద్ద ధనుర్విద్యా పాఠంగతుడయ్యాడు. అనేక దివ్యాస్త్రాలు పొందాడు. తండ్రి ఆజ్ఞతో కృపాచార్యుని చెల్లెలైన కృపిని వివాహమాడాడు. అశ్వత్థామ అనే కుమారుడిని పొందాడు. ద్రోణుడు పరశురాముని వద్దకు వెళ్ళి వినయంతో తన్న తాను పరిచయం చేసుకుని ధనాన్ని ఆశించి మీ వద్దకు వచ్చాను అని అనగా పరశురాముడు తన వద్దనున్న ధనాన్నంతటినీ వేదజ్ఞానంగల బ్రాహ్మణులకు ఇచ్చివేసానని, తన దగ్గర శరీరం, శస్త్రాస్త్రాలు మాత్రమే ఉన్నాయి అన్నాడు. అప్పుడు ద్రోణుడు ధనాలలో మిక్కిలి శ్రేష్ఠమైనవి శస్త్రాస్త్రములు కాబట్టి వాటిని ప్రసాదించ మనగా పరశురాముడు అనేక దివ్యాస్త్రాలను బోధించాడు.

ఆ విధంగా పరశురాముని వద్ద నుండి యుద్ధవిద్యలు అభ్యసించి ధనాన్ని కోరి తన చిన్ననాటి మిత్రుడయిన ద్రుపదుని వద్దకు వెళ్ళగా ద్రుపదుడు ధన, అధికార గర్వంతో పేదవాడైన ద్రోణుని తీవ్రంగా అవమానపరచాడు. అవమాన భారంతో, కలత చెందిన మనసు కలవాడై, తన భార్య, కుమారుడు, అగ్రిహోత్రం, శిష్యసమేతంగా హస్తినాపురానికి బయలుదేరాడు. ఆ పట్టణం బయట కౌరవ, పాండవులు చెండాట ఆడుతుండగా వాళ్ళాడుతున్న బంగారు బంతి బావిలో పడింది.

ఆకాశంలోని నక్షత్రంలా మెరుస్తున్న ఆ బంతిని బయటకు తీయలేక రాకురులం అలా చూస్తూ ఉన్నారు. ఇంతలో అటువచ్చిన ద్రోణుడు ఆ బంతిని తన బాణము లతో తాడులాగా చేసి బంతిని బయటకు లాగి ఇచ్చాడు. అది చూసిన రాజకుమారు లందరూ ఆశ్చర్యపడి ద్రోణుడిని తీసుకుని వెళ్ళి భీష్మునికి జరిగినదంతా చెప్పారు. భీష్ముడు ద్రోణుడి వివరములడుగగా ద్రోణుడు తన వివరాలన్నీ తెలిపి ద్రుపదుని వలన కలిగిన అవమానం, కుమారుని ఆకలి బాధలు అన్నీ తెలిపాడు.

అది విన్న భీష్ముడు వెదకబోయిన తీగ కాళ్ళకు చుట్టుకున్నట్లు సంతోషించి ద్రోణుని గౌరవించి, ధనదానాలిచ్చి సంతోషపరచాడు. అంతేకాక తన మనమళ్ళ నందరినీ ద్రోణునికి చూపించి, వీరికి గురుత్వం వహించి వీరులుగా తీర్చిదిద్దుమని కోరాడు ద్రోణుడు వారందరినీ శిష్యులుగా స్వీకరించాడు.

అర్జునుడు శస్త్రాస్త్ర విద్యలలో అధికుడై వినయంతో ఎప్పుడూ గురుపూజ చేస్తూ ద్రోణుణ్ణి సంతోషపరచాడు. అస్త్రవిద్యలో అర్జునునికి గల పట్టుదలకి సంతోషించి అతనికంటే విలువిద్యలే అధికులు లేరు అన్నట్లుగా విద్య నేర్పిస్తానని వాగ్దానం చేసాడు. ద్రోణుడు కూడా అర్జునునికి అన్ని రకాల యుద్ధవ్యూహాలు, అస్త్ర, శస్త్రాలు సర్వము బోధించాడు. ఒకనాటి పరశురాముడు కూడా ఇంటివాడు కాదు అన్నట్లుగా అర్జునునికి విద్య నేర్పించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

ద్రోణుని వలన శస్త్రాస్త్ర విద్యాబోధనను పొందటంలో రాజకుమారులు అంతా సమానమే అయినా అర్జునుడు విశేషంగా సాధన చేసి సర్వశ్రేష్ఠుడయ్యాడు. రాజకుమారుల నైపుణ్యం తెలుసుకోవటం కోసం చెట్టు చివరన పక్షిబొమ్మను ఉంచి విద్యార్ధుల ఏకాగ్రతను ద్రోణుడు పరీక్షించగా అందరూ విఫలమవ్వగా అర్జునుడు తన ఏకాగ్రతతో లక్ష్యాన్ని భేదించాడు.

తరువాత మరొకసారి ద్రోణుడు సరస్సులో స్నానం చేస్తుండగా ఒక మొసలి వచ్చి ద్రోణుని కాలును పట్టుకోగా తాను సమర్థుడై ఉండి కూడా శిష్యుల నైపుణ్యం పరీక్షించదలచి రాకుమారులను కాపాడమని కోరాడు. వారంతా విడిపించలేక దిక్కుతోచని స్థితిలో ఉండగా మహాపరాక్రమంతో ఐదు బాణాలతో ఆ మొసలిని సంహరించి గురువును కాపాడుకున్నాడు. అర్జునుడు. సంతోషించిన ద్రోణుడు అర్జునునికి అనేక దివ్యాస్త్రాలు ప్రసాదించాడు అని వైశంపాయనుడు జనమేజయునికి చెప్పాడు.

II. సంగ్రహరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
నన్నయభట్టు గురించి తెలపండి?
జవాబు:
నన్నయ 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థానకవి. ఉభయభాషా కావ్యరచనా శోభితుడు. ఆదికవి, శబ్ధశాసనుడు అనే బిరుదులు కలిగినవాడు. రాజరాజు కోరికపై వ్యాస భారతాన్ని తెలుగులోకి అనువదించాడు. రెండున్నర పర్వముల వరకే నన్నయ్య భారతరచన సాగింది. ఆంధ్రశబ్ధ చింతామణి, ఇంద్రవిజయం, లక్షణసార వంటి ఇతర గ్రంథాలు రచించాడు.

ప్రశ్న 2.
ద్రుపదుడి చేతిలో ద్రోణుడు ఏ విధంగా భంగపడ్డాడు?
జవాబు:
ఆ విధంగా పరశురాముని వద్ద నుండి దివ్యాస్త్రాలను మంత్ర, ప్రయోగ రహస్యాలతో సహాపొంది, విలువిద్యను అభ్యసించి, ధనాన్ని కోరి తన చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదుని వద్దకు వెళ్ళి, నేను నీ బాల్యమిత్రుడిని, నీతో కలిసి చదువుకున్న వాడిని, తెలుసుకదా అని స్నేహపూర్వకంగా మాట్లాడగా, ద్రుపదుడా మాటలను సహించలేక కోపంతో ఇలా అన్నాడు.

ధనవంతునితో పేదవానికి, తత్వజ్ఞానికి మూర్ఖునితో, శాంతమూర్తికి క్రూరునితో, యుద్ధరంగంలో వీరునికి, పిరికితనంతో పారిపోయే, పిరికివాడికి కవచం కలిగిన వీరునికి, కవచం లేని వానితో, సజ్జనునికి దుర్మార్గునితో స్నేహం ఏ విధంగా కలుగుతుంది. కలగదు అని తనని తాను ప్రశంసించుకుంటూ, అకారణంగా ద్రుపదుని నిందించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

ప్రశ్న 3.
ఎవరెవరి మధ్య సఖ్యత కుదరదని ద్రుపదుడు చెప్పాడు?
జవాబు:
ధనవంతునితో పేదవానికి, తత్వజ్ఞానికి మూర్ఖునితో, శాంతమూర్తికి క్రూరునితో, యుద్ధరంగంలో వీరునికి, పిరికితనంతో పారిపోయే, పిరికివాడికి కవచం కలిగిన వీరునికి, కవచం లేని వానితో, సజ్జనునికి దుర్మార్గునితో స్నేహం ఏ విధంగా కలుగుతుంది. కలగదు అని తనని తాను ప్రశంసించుకుంటూ, అకారణంగా ద్రుపదుని నిందించాడు. సమానమైన స్వభావం, విద్య కలవాళ్ళకు, సమానమైన సంపద కలవాళ్ళకు, సమానమైన మంచి నడవికలవాళ్ళకు స్నేహం, వివాహం ఏర్పడతాయి. కాని సమానులు కానివాళ్ళకు అవి ఏర్పడతాయా? (ఏర్పడవని భావం)

ప్రశ్న 4.
కల్పిత పక్షిని ఛేదించే సమయంలో కురుకుమారుల ప్రతిభను తెలుండి?
జవాబు:
ఆ కురుకుమారుల విలువిద్యా నైపుణ్యాన్ని తెలిసికొనగోరి ఒకనాడు ద్రోణుడు భాసమనే పక్షిని రూపొందించి, ఒక చెట్టు కొమ్మ చివరన కట్టి దానిని అందరికీ చూపి నేను చెప్పినప్పుడు, మీమీ ధనువులు ఎక్కుపెట్టి, ఆ పక్షితలను తెగ కొట్టండి. నేను ఒక్కొక్కరినే ఆజ్ఞాపిస్తాను అని, ముందుగా ధర్మరాజును పిలిచి ఈ చెట్టు కొమ్మ కొసన ఉండే పక్షిని చక్కగా చూచి, నేను చెప్పినప్పుడు బాణంతో కొట్టుము అనగా అతడు సర్ అని గురువు మాట ప్రకారం సిద్ధంగా ఉండగా, ద్రోణుడు ఇట్లా అన్నాడు.

ఓ ధర్మరాజా! చెట్టుకొమ్మ చివర ఉన్న పక్షితలను స్పష్టంగా చూచావా అని అడుగగా, చక్కగా చూచానని అతడు చెప్పగా, మరల ద్రోణుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. జనులచేత పొగడబడే ఓ ధర్మరాజా! ఆ మానును, నన్ను, నీ తమ్ముళ్ళను చూశావా? అని ద్రోణుడు అడుగగానే పుణ్యాత్మ! చెట్టు మీదనున్న ఆ పక్షితో పాటు అన్నిటినీ చూచానని ధర్మరాజు అన్నాడు.

అనగా విని ద్రోణుడు ధర్మరాజును మందలించి నీ దృష్టి చెదిరింది, నీవుదానిని కొట్టలేవు. పక్కకు తప్పుకొమ్ము అన్నాడు. అదే విధంగా దుర్యోధనుడు మొదలైన కౌరవులను, భీమునకుల, సహదేవులను వివిధ దేశాల నుండి వచ్చిన రాకుమారులను వరుసగా అడుగగా వాళ్ళంతా ధర్మరాజు ఇచ్చిన సమాధానమే ఇచ్చారు. ద్రోణుడు అందరినీ మందలించి తరువాత అర్జునుని పిలిచి వాళ్ళను అడిగినట్లే అడుగగా అతడిట్లా అన్నాడు. పక్షితలను చక్కగా చూచాను. ఇంకేదీ నాకు కనిపించడం లేదు అని అర్జునుని అనగా ద్రోణుడు గురిచూసి కొట్టుము అని సూక్ష్మదృష్టిగల అర్జునుని ఆజ్ఞాపించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

గురువు చెప్పిన తర్వాత అర్జునుడు బాణాన్ని వదిలాడు. ఆ పక్షితల తత్క్షణమే తెగి చెట్టుకొమ్మ నుండి నేలమీద పడింది.

III. ఏక పద/వాక్య సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
నన్నయ్యకు భారత రచనలో ఎవరు సహాయపడ్డారు.
జవాబు:
నారాయణభట్టు

ప్రశ్న 2.
నన్నయ ఎవరి ఆస్థానకవి?
జవాబు:
రాజరాజ నరేంద్రుడు

ప్రశ్న 3.
ద్రోణుడి మిత్రుడి పేరేమిటి?
జవాబు:
ద్రుపదుడు

ప్రశ్న 4.
అశ్వత్థామ ఎవరి కుమారుడు?
జవాబు:
ద్రోణుడు-

ప్రశ్న 5.
ద్రోణాచార్యుడికి ఎవరెవరు అస్త్రశస్త్రాలు ప్రసాదించారు?
జవాబు:
అగ్నివేశుడు, పరశురాముడు

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

ప్రశ్న 6.
‘పక్షికున్ను’ లక్ష్యంగా ఎవరు బాణం వేశారు.
జవాబు:
అర్జునుడు

ప్రశ్న 7.
పరశురాముడు తన ధనాన్ని ఎవరికి ఇచ్చాడు?
జవాబు:
విప్రులకు దానం చేసాడు.

ప్రశ్న 8.
ద్రోణుడిని ధనుర్విద్యాచార్యుడిగా ఎవరు నియమించారు?
జవాబు:
భీష్ముడు

IV. సందర్భసహిత వ్యాఖ్యలు

ప్రశ్న 1.
సఖ్యము దానొడఁ గూడ నేర్చునే !
జవాబు:
కవి పరిచయం :
ఈ వాక్యం నన్నయభట్టుచే రచింపబడిన శ్రీమదాంధ్ర మహాభారతం ఆదిపర్వం, పంచమాస్వాశం నుండి గ్రహించబడిన విద్యాలక్ష్యం అనే పాఠం నుంచి గ్రహించబడింది.

సందర్భం :
స్నేహపూర్వకంగా తనతో మాట్లాడిన ద్రోణుడిని అవమానిస్తూ ద్రుపదుడు పలికి సందర్భంలోనిది.

భావం :
ధనవంతునితో పేదవానికి, తత్వజ్ఞానికి మూర్ఖునితో, శాంతమూర్తికి క్రూరునితో, యుద్ధరంగంలో వీరునికి, పిరికితనంతో పారిపోయే, పిరికివాడికి కవచం కలిగిన వీరునికి, కవచం లేని వానితో, సజ్జనునికి దుర్మార్గునితో స్నేహం ఏ విధంగా కలుగుతుంది. కలగదు అని తనని తాను ప్రశంసించుకుంటూ, అకారణంగా ద్రుపదుని నిందించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

ప్రశ్న 2.
అత్యుత్తమ ధనములు శస్త్రాస్త్రములు.
జవాబు:
కవి పరిచయం :
ఈ వాక్యం నన్నయభట్టు చే రచింపబడిన శ్రీమదాంధ్ర మహా భారతం ఆదిపర్వం, పంచమాస్వాశం నుండి గ్రహించబడిన విద్యాలక్ష్యం అనే పాఠం నుంచి గ్రహించబడింది.

భావం :
జనులచేత ప్రశంసించబడే ఓ పరశురామా! ధనాలలో మిక్కిలి శ్రేష్ఠమైనవి. శస్త్రాస్త్రములు. కాబట్టి సంతోషంతో వాటిని తీసుకుని కృతార్థుడనవుతాను. శస్త్రాస్త్ర సమూహాన్ని నాకు ఇవ్వవలసింది అని ద్రోణుడన్నాడు.

ప్రశ్న 3.
నారాజ్యభోగంబులు నీవు ననుభవింపనర్హుండ
జవాబు:
కవి పరిచయం :
ఈ వాక్యం నన్నయభట్టు చే రచింపబడిన శ్రీమదాంధ్ర మహా భారతం ఆదిపర్వం, పంచమాస్వాశం నుండి గ్రహించబడిన విద్యాలక్ష్యం అనే పాఠం నుంచి గ్రహించబడింది.

సందర్భం :
ఎక్కడ నుంచి వస్తున్నారు అని భీష్ముడు అడిగినప్పుడు ద్రోణుడు తన వఋత్తాంతాన్ని తెలియచేసిన సందర్భంలోనిది

భావం :
నా పేరు ద్రోణుడు, భరద్వాజుని కుమారుడను. అగ్నివేశ్యుడనే గొప్ప మునిశ్రేష్ఠుని దగ్గర బ్రహ్మచర్య దశలో వేదాద్యయనం చేసి, ధనుర్వేదం నేర్చుకుంటున్న కాలంలో, పాంచాలరాజైన పృషతుని కుమారుడు ద్రుపదుడనేవాడు నాకు ప్రియమిత్రుడై అన్ని విద్యలూ గురువు దగ్గర నేర్చి, నేను పాంచాల దేశానికి రాజైనప్పుడు నీవు నా దగ్గరికి రావాలి సుమా! నా రాజ్యభోగాలు నీవు కూడా అనుభవించడానికి అర్హుడవని నన్ను ప్రార్థించి వెళ్ళాడు. పృషతుని తర్వాత ద్రుపదుడు ఆ దేశానికి రాజయ్యాడు నేను తండ్రి ఆజ్ఞచేత కృషిని వివాహమాడి, తేజశ్శాలి అయిన బాలుడు అశ్వత్థామను కొడుకుగా పొంది, ధనం లేమి చేత సంసారాన్ని భరించలేని వాడై ఉండి కూడా,

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

ప్రశ్న 4.
దారిద్య్రంబున కంటెఁగష్టంబొందెద్దియులేదు.
జవాబు:
కవి పరిచయం :
ఈ వాక్యం నన్నయభట్టు చే రచింపబడిన శ్రీమదాంధ్ర మహా భారతం ఆదిపర్వం, పంచమాస్వాశం నుండి గ్రహించబడిన విద్యాలక్ష్యం అనే పాఠం నుంచి గ్రహించబడింది.

సందర్భం :
తనకుమారుని ఆకలి బాధను ద్రోణుడు భీష్మునికి చెప్పిన సందర్భంలోనిది.

భావం :
ధనవంతుల బిడ్డలు ప్రతిదినం సంతోషంతో పాలు తాగుతుండగా నా కుమారుడు వీడు బాల్యంలో నాకు కూడా పాలు పోయడని ఏడ్చాడు. దానిని చూచి దారిద్య్రం కంటే కష్టం మరొకటి లేదని భావించి ఈ దారిద్ర్యాన్ని నా బాల్యమిత్రుడైన పాంచాలరాజు ద్రుపదుని దగ్గరకు పోయి తొలగించుకుంటాను. అతడు తన దేశానికి రాజు కావటానికి వెళ్తూ నన్ను ఆహ్వానించి వెళ్ళాడు.

V. సంధులు

1. వేదాధ్యయనంబు = వేద + అధ్యయనంబు = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం:

2. నిఖిలోర్వి = నిఖిల + ఉర్వి = గుణసంధి
సూత్రం:

3. విద్యోపదేశం = విద్య + ఉపదేశ = గుణసంధి
సూత్రం:

4. నాటనేసి = నాటన్ + ఏసి = ద్రుతప్రకృతిక సంధి
సూత్రం: ఇకాదులకు దక్క ద్రుత ప్రకృతికంబులకు సంధిలేదు

5. పాలికిఁబోవ = పాలికిన్ + పోవన్ = సరళాదేశ సంధి
సూత్రం : ద్రుతము మీది పరుషములకు సరళములాదేశమును ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషం విభాషనగు

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

6. తెగనేసిన = తెగన్ = ఏసిన = ద్రుఁత ప్రకృతిక సంధి
సూత్రం : ఇకాదులకు దక్క ద్రుత ప్రకృతిందికంబులకు సంధిలేదు

7. అవ్విహగము = ఆ+ విహగము = త్రిక సంధి
సూత్రం:

8. మహోగ్ర = మహా+ఉగ్ర = గుణసంధి

9. శాఖాగ్ర = శాఖ + అగ్ర = సవర్ణదీర్ఘసంధి

VI. సమాసాలు

1. అస్త్రశస్త్రాలు – అస్త్రములు మరియు శస్త్రములు = ద్వంద్వసమాసం
2. దివ్యబాణం – దివ్యమైన బాణం – విశేషణపూర్వపదకర్మధారయం
3. గుణసంపద – గుణములనెడి సంపద – రూపక సమాసం
4. విపులతేజుడు – విపులమైన తేజం కలవాడు – బహువ్రీహిసమాసం
5. గురువచనం – గురువు యొక్క వచనం – షష్ఠీ తత్పురుష సమాసం
6. తపోవృత్తి – తపస్సు అనెడి వృత్తి – రూపక సమాసం
7. పుత్రలాభం – – పుత్రుని వలన లాభం – పంచమీ తత్పురుష సమాసం
8. ధనుర్విద్యాకౌశలం – ధనుర్విద్యయందుకౌశలం-సప్తమీ తత్పురుష సమాసం
9. ధనపతి – ధనమునకు మతి – షష్ఠీతత్పురుష సమాసం
10. ఇష్టసఖుడు – ఇష్టమైన సఖుడు – విశేషణ పూర్వపద కర్మధాయసమాసం

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

ప్రతిపదార్థ, తాత్పర్యములు.

1వ పద్యం :

ద్రోణుండును, నగ్నివేశ్యుంటను మహామునివలన్న
నాగ్నేయాస్త్రంచారిగానే కనిప్యబాంబులు వల్లా, భరదాంతో వియోగంబునం
బుత్రలాభారంబు కృష్ణుని చెలియలిం గృమమేదాని వివాహంభయి
దావియందశ తాఘయను కొడుతుంటదని.

అర్ధాలు :
పారగుండు + ఐ = విలువిద్య అంతాన్ని ముట్టినవాడై (విద్యను సంపూర్ణంగా నేర్చుకొనుట)
తద + ప్రసాదంబున = అగ్నివేశ్యుని దయచేత
ఆగ్నేయ + అస్త్రంబు = ఆగ్నేయాస్త్రము (దివ్యాస్త్రములలో ఒకటి)
ఆదిగా = మొదటగా
దివ్యబాణంబులు = దేవతా సంబంధమైన అస్త్రములు
పడసి = పొందు
భరద్వాజనియోగంబునన్ = భరధ్వాజుని ఆజ్ఞచే
పుత్రలాభార్థంబు = కుమారుని పొందుటకు
కృపుని చెలియలి = కృపాచార్యుని చెల్లెలైన
కృపి అనుదానిన్ = కృపి అనుపేరుగల స్త్రీతో
వివాహంబు + అయి = పెండ్లికాగా
దానియందు = ఆమెయందు
అశ్వత్థామ = అశ్వత్థామ
అనుకొడుకును = అనబడే కుమారుడిని
పడసి = పొందెను

భావము :
ద్రోణుడు అగ్నివేశ్యుడనే మహాముని వద్ద ధనుర్విద్యాపారంగతుడై, అతని అనుగ్రహం చేత ఆగ్నేయాస్త్రం మొదటగా, అనేక దివ్యాస్త్రాలు పొంది, భరద్వాజుని ఆజ్ఞచేత పుత్రులను పొందటానికి కృపుని చెల్లెలైన ‘కృపి’ని వివాహమాడాడు. ఆమె వలన అశ్వత్థామ అనే కొడుకును కన్నాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

2వ పద్యం :

అరిగి మహేంద్రాచలనం సద్వినయముపస్
బీరమ తపోవృత్తి నున్న భారవు లోకా
త్తరు భూరి కర్మ నిర్మల
చరకుని ద్రోణుండు గాంచి

ప్రతిపదార్థం :
అరిగి = వెళ్ళి
మహేంద్ర + అచలమున్ = మహేంద్ర పర్వతం వద్ద
పరమ = గొప్ప
తపోవృత్తి = తపస్సు అనే పనిలో
ఉన్న = నిమగ్నుడైన
భూరి = గొప్ప
కర్మ = పనులలే
నిర్మల చరితుడు = పరిశుద్ధుడైన చరిత్రగల
భార్గవు = భృగువంశపువాడైన పరశురాముడిని
ద్రోణుండు = ద్రోణుడు
కాంచి = చూచి
సత్ + వినయంబున = మంచి వినయంతో

భావం :
మహేంద్ర పర్వతం వద్దకు వెళ్ళి ఘోర తపస్సు చేస్తున్నవాడు, లోకంలో శ్రేష్ఠుడూ, గొప్పపనులు చేయడంతో పరిశుద్ధుడైన నడవడిక గలవాడు భృగువంశ పరశురాముని ద్రోణుని చూచి మంచి వినయంతో

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

3వ పద్యం :

వ. ‘ఏను భారద్వాజుండ, ద్రోణుండనువాఁడ సర్ధార్థి నై నీ కడకు వచ్చితి ననినఁ బరశు
రాముం డిట్లనియె.

ప్రతిపదార్థం :
ఏను = నేను
భరధ్వాజుండు = భరద్వాజుని కుమారుడును
ద్రోణుండు + అనువాడన్ = ్రోణుడు అనేవాడిని
అర్థ + అర్థిని + ఐ = ధనాన్ని కోరినవాడై
నీ కడకు = నీ దగ్గరకు
వచ్చితి = వచ్చాను.
అనినం = అనగా
పరశురాముడు = పరశురాముడు
ఇట్లనియె = ఈ విధంగా బదులు పలికాడు

భావం:
నేను భరధ్వాజుని కుమారుడనైన ద్రోణుడిని. ధనాన్ని ఆశించి మీ దగ్గరకు వచ్చాను అని అనగా పరశురాముడు ఈ విధంగా బదులు పలికాడు.

4వ పద్యం :

చ. కల ధన మెల్ల ముందఱ జగన్నుత! విప్రుల కిచ్చి, వారిమే
ఖలనిఖిలోర్వి యంతయును గశ్యపుఁ డన్ముని కిచ్చితిన్, శరం
బులును శరీరశస్త్రములుఁ బొల్పుగ నున్నవి; వీనిలోన నీ
వలసిన వస్తువుల్ గొను ధ్రువంబుగ నిచ్చెద నీకు నావుడున్.

ప్రతిపదార్థం :
జగత్ + నుత = లోకంచే కీర్తించబడేవాడా !
కలధనము + ఎల్లన్ = ఉన్న ధనాన్నంతటినీ
ముందర = ముందుగానే
విప్రులకిచ్చి = వేదజ్ఞానం గల బ్రహ్మణులకిచ్చి
వార్థి = సముద్రం అనే
మేఖల = ఒడ్డాణం గల
విభాల + ఉర్వి = సమస్త భూమండలాన్ని
కశ్యపుడు = కశ్యపుడు
అన్ + మునికిన్ = అనే మునికి
ఇచ్చితిన్ = ఇచ్చాను.
శరంబులు = బాణాలు
శరీరం = శరీరం
శస్త్రములు = దివ్యాస్త్రములు
పొట్టిగన్ =ఒప్పగా (చాలా)
ఉన్నని = ఉన్నా
వినిలోన = వీటిలో
నీవలసిన = నీకు కావలసిన
వస్తువుల్ = శస్త్రాస్త్రములు
కొను = తీసుకో
నీకున్ = నీకు
ధ్రువంబుగ = తప్పకుండా
ఇచ్చెదన్ = ఇస్తాను
నావుడును = అని పరశురాముడు అనగా

భావం :
లోకం చేత పొగడ్తలందుకున్న ఓ ద్రోణా! నీకు ఉన్నా ధనం అంతా ముందే వేదజ్ఞానం గల బ్రాహ్మణులకు ఇచ్చివేసాను. సముద్రం ఒడ్డాణంగా చుట్టిన భూమినందటినీ కశ్యపమహర్షికి ఇచ్చివేశాను. ఇక శస్త్రాస్త్రాలు, శరీరం మిగిలి ఉన్నాయి. వీటిలో నీకు కావలసింది తీసుకోవలసింది, నీకు తప్పక ఇస్తాను అని పరశురాముడు అనగా,

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

5వ పద్యం :

ధనములలో సత్యుత్తమ
ధనములు శస్త్రాస్త్రములు, ముదంబున వీనిం
గౌని కృతకృత్యుఁడ నగుదును
జవనుత! నా కొసఁగు మప్రశస్త్రచయంబుల్,

ప్రతిపదార్థం :
జననుత = జనుల చేత స్తుతింపబడేవాడా! ఓ పరశురామా!
ధనములలో = సంపదలలో
అత్యుత్తమ = మిక్కిలి శ్రేష్ఠమైన
ధనము = ధనాలు
శస్త్ర + అస్త్రములు = శస్త్రాలు, ఆయుధాలు
ముదంబున = సంతోషంతో
వీనిన్ = వీటిని
కొని = తీసుకొని
కృతకృత్యుఁడను = వచ్చినపని పూర్తిచేసుకున్నవాడిని
అగుదును = అవుతాను
నాకున్ = నాకు
అస్త్ర, శస్త్రచయంబుల్ = అస్త్ర, శాస్త్ర సమూహాల
ఒసగుము = ఇవ్వవలసింది

తాత్పర్యం :
జనులచేత ప్రశంసించబడే ఓ పరశురామా! ధనాలలో మిక్కిలి శ్రేష్ఠమైనవి శస్త్రాస్త్రములు. కాబట్టి సంతోషంతో వాటిని తీసుకుని కృతార్థుడనవుతాను. శస్త్రాస్త్ర సమూహాన్ని నాకు ఇవ్వవలసింది అని ద్రోణుడన్నాడు.

6వ పద్యం :

అని పరశురాముచేత దివ్యాస్త్రంబులు ప్రయోగ రహస్య మంత్రంబులతోడంబడపి,
ధనుర్విద్యాయునభ్యసించి, ధనార్ధియయి తనబాలసఖుండైన ద్రుపదు పాలికింజని ‘యేసు
ద్రోణుంద, నీ బాలసబుండి, సహాధ్యాయుంద నన్నెఱుంగుదే యని ప్రణయపూర్వకంబుగా
బలికిన విని యప్పలుకులు విన సహింపక ద్రుపడుండలిగి యిట్లనియె.

ప్రతిపదార్థం :
అని = ఆ విధంగా
పరశురాముచేత = పరశురాముని వలన
దివ్య + అస్త్రంబులు = దేవతా సంబంధ అస్త్రాలు
ప్రయోగ = ప్రయోగించడం
రహస్య = దాని యొక్క రహస్యం (మర్మం)
మంత్రంబులతోడన్ = దివ్యమంత్రాలతో సహా
ధనుర్విద్యయు = విలువిద్యనుకూడా
అభ్యసించి = నేర్చుకుని
ధనార్థియయి = ధనాన్ని కోరినవాడై
తన = తన
బాలసుడైన = బాల్యస్నేహితుడైన
ద్రుపదు = ద్రుపదుము
పాలకిన్ + చని = దగ్గరకు వెళ్ళి
యోను = నేను
ద్రోణుండు = ద్రోణుడవు
నీ బాలసఖుండు = నీ బాల్య స్నేహితుడుని
సహ + అధ్యాయుడన్ = నీతో కలిసి చదివిన వాడిని
నన్ను + ఎఱుంగదే = నన్ను గుర్తుపట్టావు కదా!
అని = అని పలికి
ప్రణయపూర్వకంగా = స్నేహభావం ఉట్టి పడగా
పలికినన్ = మాట్లాడగా
ఆ పలుకులు = ఆ మాటలు
వినసహింపక = వినటానికి ఇష్టపడక
ద్రుపదుడు = ద్రుపద మహారాజు
అలిగి = కోపంతో
ఇట్లనియె = ఇలా అన్నాడు.

భావం :
ఆ విధంగా పరశురాముని వద్ద నుండి దివ్యాస్త్రాలను మంత్ర, ప్రయోగ రహస్యాలతో సహాపొంది, విలువిద్యను అభ్యసించి, ధనాన్ని కోరి తన చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదుని వద్దకు వెళ్ళి, నేను నీ బాల్యమిత్రుడిని, నీతో కలిసి చదువుకున్న వాడిని, తెలుసుకదా అని స్నేహపూర్వకంగా మాట్లాడగా, ద్రుపదుడా మాటలను సహించలేక కోపంతో ఇలా అన్నాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

7వ పద్యం :

చ. ధనపతితో దరిద్రునకుఁ, దత్త్వవిదుండగు వానితోడ మూ
ర్జునకుఁ బ్రశాంతుతోడఁ గడుఁ గ్రూరునకున్, రణశూరుతోడ భీ
రునకు, వరూథితోడ నవరూఢికి, సజ్జనుతోడఁ గష్టదు
ర్ధనునకు నెవ్విధంబునను సఖ్యము దా నొడఁ గూడ నేర్చునే

ప్రతిపదార్థం :
ధనపతితో = ధనానికి ప్రభువైనవానితో (ధనవంతునితో)
దరిద్రునకు = పేదవానికి
తత్త్వవిదుండు = తత్వపడతడు
అగువనితోడ = అయినవాడితో
మూర్ఖునకుఁ = తెలివితక్కువ వాడికి
ప్రశాంతుతోడున్ = మిక్కిలి శాంతం కలిగినవానితో
కడున్ + క్రూరునకున్ = మిక్కిలి క్రూరుడైనవానికి
రణశూరుతోడన్ = యుద్ధంతో పరాక్రమవంతుడైన వానితో
భీరునకు = పిరికివానికి
వరూధితోడన్ = కవచం కలిగినవానితో
అవరూధికిన్ = కవచం లేనివానికి
సజ్జనుతోడన్ = సన్మార్గునితో
కష్టదుర్జవునకు = పాపి అయిన దుర్మార్గునితో
సఖ్యము = స్నేహం
ఏ + విధంబునన్ = ఏ విధంబుగా
ఒడగూడన్ + నేర్చున్ = కలుగుతుంది ? (కలుగదు అని భావం)

విశేషం :
నన్నయ నానారుచిరార్థ సూక్తినిధికి ఈ పద్యం ఒక తార్కాణం

భావం :
ధనవంతునితో పేదవానికి, తత్వజ్ఞానికి మూర్ఖునితో, శాంతమూర్తికి క్రూరునితో, యుద్ధరంగంలో వీరునికి, పిరికితనంతో పారిపోయే, పిరికివాడికి కవచం కలిగిన వీరునికి, కవచం లేని వానితో, సజ్జనునికి దుర్మార్గునితో స్నేహం ఏ విధంగా కలుగుతుంది. కలగదు అని తనని తాను ప్రశంసించుకుంటూ, అకారణంగా ద్రుపదుని నిందించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

8వ పద్యం :

సమశీలశ్రుతయుతులకు
సమధనవంతులకు సమసుచారిత్రులకుం
దమలో సఖ్యమును వివా
హము నగుఁ గా, కగునె రెండు నసమానులకున్?

అర్ధాలు :
సమ = సమానమైన
శీలం = స్వభావం
శ్రుత = విద్య
యుతులకు = కూడినవారికి
సమధనవంతులకు = సమానమైన ధనవంతులకు
సమచారిత్రులకున్ =సమానమైన మంచి నడవడిక కలిగిన వారికి
తమలో = వారికి వారిలో
సఖ్యము = స్నేహము
వివాహము = వివాహ బంధం
అగ్రిన కాక = ఏర్పడతాయిగాని
రెండు = స్నేహం, వివాహం అనే రెండు
అసమానులకున్ = సమానులు లేని వాళ్ళకి
అగునె = ఔతాయా? (లేవు అని భావం)

భావం :
సమానమైన స్వభావం, విద్య కలవాళ్ళకు, సమానమైన సంపద కలవాళ్ళకు, సమానమైన మంచి నడవికలవాళ్ళకు స్నేహం, వివాహం ఏర్పడతాయి. కాని సమానులు కానివాళ్ళకు అవి ఏర్పడతాయా? (ఏర్పడవని భావం)

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

9వ పద్యం :

‘ మణి యట్లుంగాక రాజులకుఁ గార్యవశంబునంజేసి మిత్రామిత్ర సంబంధంబులు
సంభవించుం గావున మా యట్టి రాజులకు మీ యట్టి పేద పాబువారలతోఁ గార్య
కారణం బైన సఖ్యం బెన్నందును గానేర’ దని ద్రుపదుండైశ్వర్యగర్వంబున మెచ్చక పలికిన
విని, ద్రోణుం ధవమానజనిత మన్యుమూర్ణమాన మానసుండయి యెద్దియుం జేయునది
నేరక పుత్రకళత్రాగ్నిహోత్ర శిష్యగణంబులతో హస్తిపురంబునకు వచ్చే నంత నప్పుర
బహిరంగణంబున దృతరాష్ట్ర పాండునందనులందఱుఁ గందుక క్రీడాపరులయి వేడుకతో
శ్రీ నాడుచున్నంత కాంచనకందుకం బొక్కనూతం బడిన

ప్రతిపదార్థం :
మఱి = ఇంకా
అట్లు కాక = ఆ విధంగా కాకుండా
రాజులకు = రాజులకు
కార్యవశంబునంజేసి = అవసరం చేత
మిత్ర + అమిత్ర = స్నేహం, వైరం
సంబంధంబులు = సంబంధాలు
సంభవించు = కలుగుతాయి
కావున = కాబట్టి
మీయట్టి = మీవంట
పేదపావిఱురలతో = పేదబ్రాహ్మణులతో
కార్యకారణంబు + ఐన = ప్రయోజనకరమైన (ఉపయోగకరమైన)
సఖ్యంబు = మైత్రి
ఎన్నండును = ఎన్నటికీ
కానేరదు = కలుగదు
అని = ఆ విధంగా
ద్రుపదుడు = ద్రుపద మహారాజు
ఐశ్వర్యగర్వంబునన్ = సంపద వలన కలిగిన పొగరులో
మెచ్చక = నిర్లక్ష్యంగా
పలికినవిని = మాట్లాడగా విని
ద్రోణుండు = ద్రోణుడు
అవమానజనిత = అవమానం వలన పుట్టిన
మన్యుఘార్ణమాన = కోపంతో తిరుగుడు బడుతున్న
మానసండయి = మనసు కలవాడై
ఎద్దియున్ = ఏమి
చేయునది నేరక = చేయాలో తెలియక
పుత్ర = కుమారుడు
కళత్ర = భార్య
అగ్నిహోత్ర = నిత్యాగ్నిహోత్రంతో
శిష్యగణంబులతో = శిష్యసమూహంతో
హస్తిపురంబునకున్ = హస్తినాపురానికి
వచ్చె = వచ్చెను
అంతన్ = అప్పుడు
ఆ + పుర = ఆ నగరం
బహిరంగణంబున్ = వెలుపల
ధృతరాష్ట్ర, పాండునందనులు = కౌరవులు, పాండవులు
అందఱన్ = అంతా
కందుక క్రీడాపరులు+అయి = చెండాట ఆడటంలో ఆసక్తి కలవారై
వేడుకతోనే = సంతోషంతో
ఆడుచు+ఉన్నంత = ఆడుతుండగా
కందుకంబు = ఆ బంగారు బంతి
నూతన్ = పడగా

భావం :
అంతేకాదు, రాజులకు అవసరాన్ని బట్టి మిత్రత్వ శత్రుత్వాలు ఏర్పడతాయి. అందుచేత మా వంటి రాజులకు, మీ వంటి పేద బ్రాహ్మణులతో ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి స్నేహం ఎప్పుడూ ఏర్పడదు అని ద్రుపదరాజు ఐశ్వర్యగర్వంతో తిరస్కరించి మాట్లాడగా ద్రోణుడు అవమానం వలన కలిగిన కోపంతో కలత చెందిన మనసుకలవాడై ఏమీ చేయటానికి తోచక, భార్యా, కొడుకు, అగ్నిహోత్రంతో, శిష్య సమూహాలతో హస్తినాపురానికి వచ్చాడు. అప్పుడు ఆ పట్టణం బయట ధృతరాష్ట్రుని కుమారులు పాండురాజు కుమారులు చెండాట ఆడుతుండగా విళ్ళాడుతున్న బంగారు బంతి బావిలో పడింది. అప్పుడు

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

10వ పద్యం :

నీరిలోనఁ దోఁచు తారక ప్రతిబింబ
మొక్కొ యనఁగ వెలుఁగుచున్నదాని
రాచకొడుకులెల్లఁ జూచుచునుండిరి
దానిఁ బుచ్చుకొను విధంబు లేక.

ప్రతిపదార్థం :
నీరిలోన = నీటిలో
తోఁచు= కనిపిస్తున్న
తారక = నక్షత్రం
ప్రతిబింబము+ఒక్కొ = ప్రతిబింబమా?
అనఁగ = అనేట్లుగా
వెలుగుచున్నా = ప్రకాశిస్తున్నా
దానిన్ = ఆ బంతిని
రాచకొడుకులెల్లఁ = రాకుమారులంతా
పుచ్చుకొను = తీసే
విధంబు = విధానం
లేక = తెలియక
చూచుమనుండిరి = చూస్తూ ఉన్నారు.

భావం :
నీటిలో ప్రతిసలిస్తున్న నక్షత్రమా అన్నట్లుగా వెలుగుతున్నా ఆ బంగారు బంతిని తీసుకునే మార్గం లేక రాకుమారులంతా ఊరకే చూస్తున్నారు.

విశేషం :
ఉత్ప్రేక్షాలంకారము

11వ పద్యం :

అట్టి యవసరంబున

ప్రతిపదార్థం :
అట్టయవసరంబున = ఆ సమయంలో

“దీని బాణపరంపరం జేసి పుచ్చి యిచ్చెదం జూడుఁ డీ విద్య యొరు లెవ్వరు నేర’ రని
ద్రోణుం డొక్కబాణంబభిమంత్రించి దృష్టి ముష్టి సౌష్ఠవంబు లొప్ప నక్కందుకంబు
నాటనేసి దాని పుంఖంబు మఱియొక బాణంబున నేసి తత్పుంఖంబొండొకబాణంబున
నేసి వరుసన బాణరజ్జువు గావించి దానిందిగిచికొని యిచ్చిన జూచి రాజకుమారులెల్ల
విస్మయంబంది ద్రోణుందోడ్కొనిచని భీష్మునకంతయు నెఱింగించిన నాతండును.

ప్రతిపదార్ధం :
దీనిన్ = ఈ బంతిని
బాణ = బాణముల
పరంపరం + చేసి = వరసతో
పుచ్చి = తీసుకొని
ఇచ్చెదన్ = మీకు ఇస్తాను.
చూడుఁడు = చూస్తూ ఉండండి
ఈ విద్య = ఈ విలువిద్యను
ఒరులు + ఎవ్వరున్ = ఇతరులెవ్వరూ
నేరరు = నేర్వలేదు
అని = ఆ విధంగా
ద్రోణుండు = ద్రోణుడు
ఒక్క బాణంబు = ఒక్క బాణాన్ని
అభిమాత్రించి = మంత్రంతో పిలిచి
దృష్టి = చూపు
ముష్టి = పిడికిలి
సౌష్టవంబులు = చక్కదనాలు
ఒప్పన్ = ఒప్పునట్లుగా
ఆ + కందకంబు = ఆ బంతిని
నాసిన్ + ఏట = గుచ్చుకునేట్లుగా కొట్టి
దాని = ఆ బాణం యొక్క
ప్రంఖలంబు = క్రింది చివర
మరియొక బాణంబున్ = ఇంకొక బాణంతో
ఏసి = కొట్టి
తద్ + పుంఖంబు = దాని యొక్క చివరి అంచును
బండు + ఒక = యేరొక
బాణంబునన్ = బాణ చేత
ఏసి = కొట్టి
వరుసన = వరుసగా
బాణ రజ్జువు = బాణాలు తాడును
కావించి = వచ్చునట్లుచేసి
దానిన్ = ఆ బంతిని
ఇచ్చినన్ = ఈయగా
చూచి = చూసిన
రాజకుమారులు + ఎల్లన్ = రాజకుమారులందరూ
విస్మయంబు+అంతి = ఆశ్చర్యపడి
ద్రోణుని = ద్రోణుణ్ణి
తోడ్కొని = తీసుకొని
చని = వెళ్ళి
భీష్మునకున్ = భీష్మునకు
అంతయున్ = విషయమంతా
ఎఱించినన్ = తెలుపగా
అతండున్ = అతను కూడా

భావం :
ఈ బంతిని బాణపరంపరతో తీసి ఇస్తాను చూడండి. ఈ విద్య ఇతరులెవ్వరికీ రాదు అని ద్రోణుడు ఒక బాణాన్ని అభిమంత్రించి చూపును పిడికిలిని చక్కగా నిలిపి, ఆ బంతిని నాటుకునే విధంగా ఆ బాణాన్ని కొట్టి ఆ బాణం చివరకి మరో బాణాన్ని దాని చివరకు ఇంకో బాణాన్ని కొట్టి, వరుసగా బాణాల తాడు చేసి బంతిని లాగి వారికి ఇచ్చాడు. అది చూసి రాకుమారులందరూ ఆశ్చర్యపడి ద్రోణుడుని తీసుకుని వెళ్ళి, భీష్మునికి జరిగినదంతా తెలిపారు. ఆయనకూడా,

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

12వ పద్యం :

ఈ. ఎండుంది వచ్చి అందుల
కేందుండఁగ నీకు నిష్ట మేఱిఁగింపుము న
‘ద్వందిత యనియదగిన నా
నందుఁడు ద్రోణజుండు భీష్మునకు నిట్లనియెన్

ప్రతిపదార్థం :
ఎందు + ఉండి = ఎక్కడ నుండి
ఇందులకున్ = ఇక్కడికి
వచ్చితివి = వచ్చాను?
నీకున్ = నీకు
ఎందు+ఉండఁగన్ = ఎక్కడ ఉండటానికి
ఇష్టమ = అభిలాష
ఎఱిఁగింపుము = తెలియజేయుము
సద్ + వందిత = సజ్జనులచే కీర్తింపబడేవాడా
అని = ఆ విధంగా
అదిగినన్ = అడుగగా
స + ఆనందుడు = ఆనందంతో
ఇట్ల + అని = ఇలా అన్నాడు.

భావం :
సజ్జనులచే కీర్తిపండే ఓ ద్రోణాచార్య నీవు ఎక్కడ నుండి ఇక్కడకు వచ్చావు? ఎక్కడ ఉండటం నీకిష్టం ? చెప్పుము అని అడుగగానే ద్రోణుడు సంతోషించి భీష్మునితో ఈ విధంగా అన్నాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

13వ పద్యం :

వ. ఏను ద్రోణుండనువాఁడ, భరద్వాజపుత్రుండ సగ్నివేశ్యుందను మహామునివరుగొద్ద
బ్రహ్మచర్యాశ్రమంబున వేదాద్యయనంబు సేసి ధనుర్వేదంబభ్యసించుచున్న రెండు
పాంచాలపతియైన పృషతుపుత్రుండు ద్రుపదుందనువాఁడు నా క్లిష్టనుండయి
యెల్లవిద్యలు గలచి యెము పొందాల విషయంబునకు రాజయనన్యాకు

యొద్దకు వచ్చునది; నా రాజ్యభోగంబులు నీవు ననుభవింప నర్హుండవని నన్నుఁ
బ్రార్థించి చని, సృషతు పరోక్షంబునఁ దద్దేశంబునకు రాజయియున్న, నేను గురుని
యుక్తుండనై గౌతమిం బాణి గ్రహణంబు సేసి యిక్కుమారు నశ్వత్థామ నధిక
తేజస్వినాత్మజులబడసి, ధనంబు లేమిం గుటుంబ భరణంబునంద సమర్థుందనయి.
యుండియు

ప్రతిపదార్థం :
ఏను = నేను
ద్రోణుండు + అనువాఁడన్ = ద్రోణుడు అనువాడిని
భరద్వాజ పుత్రుండన్ = భరద్వాజుని కుమారుడను
అగ్నివేశ్యుండు = అగ్నివేశ్యుడనే
మహామునినరున్ + ఒద్ద = గొప్ప మునిశ్రేష్ఠుని వద్ద
బ్రహ్మచర్య + ఆశ్రమంబున్ = బ్రహ్మచర్చాశ్రమంలో (విద్యార్థిగా)
వేద + అధ్యయనంబు = వేదాలు చదవటం
చేసి = చేసాను
ధనుర్వేదంబు = విలువిద్యను
అభ్యసించుచున్ = నేర్చుకుంటూ
ఉన్ననాడు = ఉన్నప్పుడు
పాంబాపతి + ఐన = పాంచాల రాజైన
పృషమ పుత్రుండు = పృషతుడనే వాని కుమారుడు
ద్రుపదుండు + అనువాడు = ద్రుపదుడనేవాడు
నాకు = నాకు
ఇష్టసఖండ + ఐ = ప్రియ స్నేహితుడై
ఎల్ల విద్యలు = అన్ని విద్యలు
కఱచి = నేర్చుకుని
ఏను = నేను
పాంచాల విషయమునకు = పాంచాల రాజ్యమునకు
రాజు + అయినాఁడు = రాజైనప్పుడు
నా ఒద్దకున్ = నా దగ్గరికి
వచ్చునది = రమ్ము
నారాజ్యభోగంబులు = నా యొక్క రాజ్య భోగాలు
నీవున్ = నీవుకూడా
అనుభవింపన్ = అనుభవించడానికి
అర్హుండవు = తగినవాడివి
చని = వెళ్ళి
పృషతు పరోక్షంబునన్ = పృషతుని తర్వాత
తద్ + దేశంబునకున్ = ఆ దేశానికి
రాజు + అయి ఉన్నాన్ = ప్రభువై ఉండగా
నేను = నేను
గురు నియుక్తుండను + ఐ = తండ్రి ఆజ్ఞచే
గౌతమిన్ = కృపిని
పాణిగ్రహణంబు + చేసి = వివాహమాడి
ఈ + కుమారున్ = అశ్వత్థామను
అధిక తేజస్విని = మిక్కిలి తేజశ్శాలిని
అత్మజక్ =కుమారునిగా
పడసి = పొంది
ధనంబులేమిన్ = ధనం లేకపోవడంతో
కుటుంబభరణంబు+అందు = కుటుంబ భారాన్ని మోయడంతో
అసమర్థుండనయి = అసమర్ధడనయ్యాను
ఉండియు = అలా ఉండి కూడా

భావం :
నా పేరు ద్రోణుడు, భరద్వాజుని కుమారుడను. అగ్నివేశ్యుడనే గొప్ప మునిశ్రేష్ఠుని దగ్గర బ్రహ్మచర్య దశలో వేదాద్యయనం చేసి, ధనుర్వేదం నేర్చుకుంటున్న కాలంలో, పాంచాలరాజైన పృషతుని కుమారుడు ద్రుపదుడనేవాడు నాకు ప్రియమిత్రుడై అన్ని విద్యలూ గురువు దగ్గర నేర్చి, నేను పాంచాల దేశానికి రాజైనప్పుడు నీవు నా దగ్గరికి రావాలి సుమా!

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

14వ పద్యం :

నా రాజ్యభోగాలు నీవు కూడా అనుభవించడానికి అర్హుడవని నన్ను ప్రార్థించి వెళ్ళాడు. పృషతుని తర్వాత ద్రుపదుడు ఆ దేశానికి రాజయ్యాడు నేను తండ్రి ఆజ్ఞచేత కృషిని వివాహమాడి, తేజశ్శాలి అయిన బాలుడు అశ్వత్థామను కొడుకుగా పొంది, ధనం లేమి చేత సంసారాన్ని భరించలేని వాడై ఉండి కూడా,

పురుషావిశేశావివేక
పరిచయులగు ధరణీపతులు పాలికిం
ఖరులందు దుష్ప్రతిగ్రహ
భర మదలో రోసి ధర్మపధమున నున్నన్

ప్రతిపదార్థం :
పురుష = పురుషుని యొక్క
వివేక యాలు+అగు = గొప్పతనాన్ని గుర్తించిన ఆలోచనబందు పరిచయం లేని
ధరణిపతుల పాలికిన్ = రాజుల దగ్గరికి
పోవన్ = వెళ్ళటం
పరులందు = ఇతరుల దగ్గర
దుష్ప్రతిగ్రహభారము = చెడుదానాలను తీసుకునే కష్టాన్ని
ఎదలో = మనసులో
రోసి = అసహ్యించుకుని
ధర్మపథమునన్ = ధర్మమార్గంలో
ఉన్నన్ = ఉండగా

భావం :
“వ్యక్తుల యోగ్యత గుర్తించలేని రాజులు దగ్గరికి వెళ్ళటానికి, ఇతరుల నుండి చెడుదానాలు తీసుకొనడానికి ఇష్టపడక, ధర్మమార్గంలో జీవితం గడుపుతుండగా,

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

15వ పద్యం :

క. ధనపతుల బాలురు ముదం
బున నిత్యముఁ బాలు ద్రావంబ యిన సస్మ
తనయుందు వీఁదు బాల్యం
బుననేర్పెను బాలు నాకుఁ బోయుండనుచున్,

ప్రతిపదార్థం :
ధనపతులు = ధనవంతుల
బాలరు = పిల్లలు
వలుదంబునన్ = సంతోషంతో
నిత్యమున్ = ప్రతిదినం
పాలుత్రావన్పోయినన్ = పాలుత్రాగుచుండగా
అస్మద్ + తనయుండు = నా కుమారుడు
వీఁదు = ఈ బాలుడు
బాల్యంబునన్ = బాల్యంలో
నాకున్ = నాకూ
పాలు = పాలు
పోయుండని = తాగటానికి ఇవ్వమని
అనుచున్ = అంటూ
ఏడెన్ = రోధించాడు

భావం :
ధనవంతుల బిడ్డలు ప్రతిదినం సంతోషంతో పాలు తాగుతుండగా నా కుమారుడు వీడు బాల్యంలో నాకు కూడా పాలు పోయడని ఏడ్చాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

16వ పద్యం :

ధు ; దానించి దారిద్య్ర లయిన కంటెఁ గష్టం బొందెద్దియు లేదు. దీని నా బాలసుఖంచ
ధ ; పొందాలు పాలికిం బోయి పాలికొండ్రు నాతందు తన దేశంబున కలిసికుండు గా
బోవుచుండి సన్ను రాం బనిచిపోయే!”

ప్రతిపదార్థం :
దానిన్ + చూచి = ఆ సన్నివేశాన్ని చూచి
దారిద్ర్యంబునకంటెన్ =దరిద్రం కంటే
కష్టంబు = కష్టము
ఒండు+ ఎద్దియున్ = మరొకటి ఏదీలేదు.
దీనిన్ = ఈ పేదరికాన్ని
నాబాలసఖుండు = నా చిన్ననాటి స్నేహితుడు
అగు = అయినట్టి
పాంచాల పాలకిన్ = పాంచాలదేశపురాజైన ద్రుపదుని దగ్గరికి
పోయి = వెళ్ళి
పాచికొందున్ = పొగొట్టుకుంటాను
అతండు = ఆ ద్రుపదుడు
తన దేశంబునకు = తన రాజ్యమునకు
అభిషిక్తుండు+కాన్ = రాజు కావడానికి
పోవుచుండి = పోతూ ఉండి
నన్నున్ = నన్ను
రాన్+పనిచి = రమ్మని చెప్పి
పోయేన్ = వెళ్ళిపోయాడు

భావం :
దానిని చూచి దారిద్ర్యం కంటే కష్టం మరొకటి లేదని భావించి ఈ దారిద్ర్యాన్ని నా బాల్యమిత్రుడైన పాంచాలరాజు ద్రుపదుని దగ్గరకు పోయి తొలగించుకుంటాను. అతడు తన దేశానికి రాజు కావటానికి వెళ్తూ నన్ను ఆహ్వానించి వెళ్ళాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

17వ పద్యం :

మ. కో. వేఁడు టెంతయుఁ గష్టమైనను వేఱులేని సుహృజ్జనున్
వేఁడికో లుచితంబ కావున వేడ్కతోఁ జని సోమకున్
వేఁడినన్ ధనమోపఁడేనియు వీని మాత్రకు నాలుగేన్
పాఁడి కుట్టుల నీఁదే వీనికిఁ బాలు ద్రావుచునుండఁగన్.

ప్రతిపదార్థం :
ఎంతయున్ = మిక్కిలి
కష్టము + ఐనన్ = కష్టమైన పని అయినప్పటికి
వేఱులేని = బేధంలేని
సుహృత్+జనున్ = మిత్రుడిని
వేడికోలు = వేడుకోవటం
ఉచితంబు + అ = సరైనదే
కావునన్ = కావున
వేడ్కతోన్ = సంతోషంతో
చని = వెళ్ళి
సోమకున్ = ద్రుపదుడిని
వేఁడినన్ = ప్రార్దింపగా
ధనము+ఓపడు+ఏనియున్ =ధనం ఇవ్వకపోయినప్పటికీ
వీని మాత్రమే = వీడికి (అశ్వత్థామ) సరిపోయేంతగా
నాలుగు + ఏన్ = నాలుగైనా
పాఁడి కుఱ్ఱులన్ = పాడి ఆవులను
వీనికిన్ = ఈ అశ్వత్థామకు
పాలు త్రావుచున్ = పాలు తాగడానికి
ఉండగన్ = ఉండటానికి
ఈడే = ఇవ్వడా !

భావం :
యాచించటం ఎంతో కష్టమైన పని అయినప్పటికీ భేదం లేని మిత్రుడిని యాచించటం ఉచితమే. అందుచేత సంతోషంగా వెళ్ళి ద్రుపదుడిని అడిగినట్లయితే ధనం ఇవ్వలేకపోయినా, అశ్వత్థామ పాలు తాగడానికి సరిపోయేటట్లుగా నాలుగుపాడి ఆవులనైనా ఇవ్వడా?

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

18వ పద్యం :

వ. అని నిశ్చయించి ధ్రుపడునొద్దకుంబోయి నన్నెఱింగించిన, నాతండు ధన రాజ్యమదంబున
నన్నును దన్నును నెఱుంగక ‘యేసు రాజను నీవు పేద పాలుండవు; నాకును
నీకును నెక్కడి సఖ్యం బని పలికిన వానిచేత నవమానితుండనయి వచ్చితి’ నని
ద్రోణుండు దనవృత్తాంతంబంతయుఁ జెప్పిన.

ప్రతిపదార్థం :
అని = ఆ ప్రకారం
నిశ్చయించి = నిర్ణయించుకుని
ద్రుపదు + ఒద్దుకున్ = ద్రుపదుని దగ్గరికి
పోయి = వెళ్ళి
నన్నున్ + ఎఁరింగించినన్ = నన్ను నేను పరిచయం చేసుకొనగా
అతండు = ఆ ద్రుపదుడు
తన రాజ్య మదంబునన్ = తన రాజ్యం వలన కలిగిన పొగరుతో
నన్నువు = నన్ను
తన్నును = తనను
ఎఱుంగక = తెలియక
ఏను = నేను
రాజును = రాజువు
నీవు = నీవు
వేదపాండవు = పేదబ్రాహ్మణుడు
నాకున్నీకున్ = నాకు, నీకూ
ఎక్కడి = ఎక్కడ
సఖ్యంబు = స్నేహం
అని పలికినన్ = అనగా
వాని చెతన్ = ఆ ద్రుపదునితో
అవమానితుండున+ అయి = అవమానింపబడిన వాడినై
వచ్చితిని = వచ్చావు
తోన + వృత్తాంతము + అంతయు = తన వృత్తాంతం అంతా చెప్పగా

తాత్పర్యం :
అని నిర్ణయించుకొని ద్రుపదుని దగ్గరకు వెళ్ళి నన్ను నేను పరిచయం చేసికొనగా, అతడు రాజ్యమదం చేత నన్ను తననూ ఎరుగకుండా నేను రాజును, నీవు బీద బ్రాహ్మణుడివి, నాకూ నీకూ స్నేహం ఎక్కడిది? అని పలికాడు. ఆ విధంగా అతని చేత అవమానం పొంది వచ్చానని ద్రోణుడు తన వృత్తాంతం అంతా తెలిపాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

19వ పద్యం :

సిని రోయా తింగ గాళం
……………………………
……………………………
……………… దనిపెస్

ప్రతిపదార్థం :
విని = ద్రోణుడి వృత్తాంతాన్ని విన్న భీష్ముడు
రోయు తీఁగ = వెదుకుతున్న తీగ
తాన్ = తానే
కాళ్ళన్ పెనఁగన్ = కాళ్ళకు చుట్టుకొన్నాడు
అనుచున్ = అంటూ
పొంగి = సంతోషించి
ఘనభుజున్ = గొప్పభుజాలు కలిగినవాడు అయిన
ద్రోణున్ = ద్రోణుణ్ణి
అభీష్టపూజ = ఇష్టమైన గౌరవాలు
ధనదాన విద్యాములన్ = ధన దానాలిచ్చుట ద్వార
ముదంబున = సంతోషంతో
తనిపెన్ = తృప్తి పరచాడు.

భావం :
అది విన్న భీష్ముడు వెదకబోయిన తీగ కాళ్ళకు చుట్టుకున్నట్లు సంతోషించి, ద్రోణునికి ఇష్టమైన పూజలు చేసి, ధనదానాలిచ్చి ద్రోణుని సంతృప్తి పరచాడు.

20వ పద్యం :

మనుమలనెల్లఁ జూపి మతిమంతుఁడు శాంతనవుండు ‘వీరింజే’
కొని గురువృత్తిమైఁ గఱపు ఘోరకరాసిన విద్యలెల్లఁ బెం
పున జమదగ్నిసూనుఁడును బోలందు నిన్నని విందు విల్లునే
ర్పున నయనైపుణంబునను భూరిపరాక్రమ గర్వసంపదన్

ప్రతిపదార్థం
ముతిమంతుడు = గొప్ప బుద్ధిగలవాడు
శాంతనవుండు = భీష్ముడు
మనుములను = మనుమలను
ఎల్ల + చూపి = అందరినీ చూపించి
వీరిని = వీరందరినీ
చేకొని = గ్రహించి
ఘోర + శర + ఆసన = భయంకర ధనుర్విద్య
విద్యలు + ఎల్లన్ = అన్నింటినీ
పెంపున = అతిశయంగా (బాగా
గురువృత్తిమైన్ = గురుత్వం చేత
కఱపు = నేర్పుము
నిన్నున్ = నీకు
విల్లునేర్చునన్ = విలువిద్యలో
నయనైపుణ్యంబునన్ = నీతి నేర్పులో
భూరి పరాక్రమ = గొప్పబలంకలిగిన
గర్వసంపదన్ = గర్వయనే కలిమిలో
జమదగ్నిసూనఁడును = జమదగ్ని కుమారుడైన పరశురాముడుకూడా
పోలడు = సరిపోలడు
అని విందున్ = అని విన్నాను

భావం :
మతిమంతుడైన భీష్ముడు తన మనమళ్ళనందరినీ ద్రోణునికి చూపించి, వీరికి గురుత్వం వహించి గొప్పగా విలువిద్యలన్నింటినీ నేర్పుము. విలువిద్యలో నీతిలో, పరాక్రమం లో పరశురాముడు కూడా నిన్ను పోలడని విన్నాను.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

21వ పద్యం :

అని కుమారుల నెల్లంజూపి ద్రోణునకు శిష్యులంగా సమర్పించిన

ప్రతిపదార్థం :
అని = ఆ విధంగా పలికి
కుమారులను + ఎల్లన్ = కుమారులందరినీ చూసి
ద్రోణునకు = ద్రోణునికి
శిష్యులన్ +కాన్ = శిష్యులయ్యేట్లుగా
సమర్పించినన్ = అప్పగించగా

భావం :
ఆ విధంగా పలికి కుమారులందరినీ చూపి, వాళ్ళను ద్రోణునికి శిష్యులుగా సమర్పించాడు.

22వ పద్యం :

క. నరుఁడస్త్ర శస్త్ర విద్యా
పరిణతి నధికుఁడయి వినయవరుఁడయి శశ్వ
ద్గురుపూజాయత్నంబునం
బరఁగుచు సంప్రీతుఁ జేసె భారద్వాజున్.

ప్రతిపదార్థం :
నరుడు = అర్జునుడు
అణ, శస్త్ర, విద్యాపరితిన్ = అస్త్రశస్త్ర విద్యాదులలో పక్వతలో
అధికుడు + అయి = గొప్పవాడై
వినయపరుడు + అయి = అణుకువ ప్రధానంగా కలవాడై
శశ్వత్ + గురుపుజాయాత్మంబునన్ = నిరంతరం గురువును పూజించే ప్రయత్నంతో
పరఁగుచున్ = ప్రవర్తిస్తూ
భారద్వాజున్ = భరద్వాజుని కుమారుడైన ద్రోణుణ్ణి
సంప్రీతు = సంతోషించిన వాడిగా
చేసెన్ = చేసెన్

భావం :
అర్జునుడు శస్త్రాస్త్ర విద్యానైపుణ్యంలో అధికుడై వినయంతో ఎప్పుడూ గురుపూజ చేస్తూ ద్రోణుణ్ణి సంతోషపరిచాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

23వ పద్యం :

సీ. ఆతని యస్త్రవిద్యాభియోగమునకుఁ
బ్రియశిష్యవృత్తికిఁ బెద్ద మెచ్చి
‘యన్న! ధనుర్ధరు లన్యులు నీకంటె
నధికులు గాకుండునట్లు గాఁగఁ
గఱపుడు విలువిద్య ఘనముగా’ నని పల్కి
ద్వంద్వ సంకీర్ణ యుద్ధముల తెఱఁగు
రథ మహీ వాజి వారణములపై నుండి
దృఢచిత్ర సౌష్ఠవస్థితుల నేయ

తే. బహువిధ వ్యూహ లేదనోపాయములను
“సంప్రయోగ రహస్యాతిశయము గాఁగం
గలప నర్జునుఁ దొంటి భార్గవుఁడు వింట
నిష్టం చేయని పొగడంగ నెల్ల జనులు.

అర్థాలు :
అతని = ఆ అర్జునుని
అస్త్రవిద్య + అభియోగమునకున్ = అస్త్ర విద్యలందలి ఆసక్తికి
ప్రియ శిష్యవృత్తికిన్ = ప్రియమైన శిష్యుడి నడవడికకి
పెద్ద మెచ్చి = మిక్కిలి సంతోషించి
అన్న = అన్న అని ప్రేమపుర్వకంగా పిలిచి
అన్యులు = ఇతరులైన
ధనుర్థరులు = విలువిద్యను చేపట్టినవాళ్ళు
నీకంటెన్ = నీకన్నా
అధికులు = గొప్పవారు
కాకుండునట్లు = అవ్వకుండా
ఘనముగాన్ = గొప్పగా
విలువిద్యకఱపుదున్ = ధనుర్విద్యనేర్పుతాను
అని = అని పలికి
ద్వంద్వ = ఇద్దరి మధ్య యుద్ధం
సంకీర్ణ యుద్ధము = అనేకులతో చేయుయుద్ధం
తెఱగు = పద్ధతులు
రథ = రథం మీద
మహి = నేలమీద
వాజి = గుర్రం మీద
వారణముల పైన్ = ఏనుగుమీద ఉండే
ధృఢ, చిత్ర = గట్టిగా, చిత్రంగా
సౌస్టివ = చక్కగా ఉన్న
స్థితులన్ = స్థితులలో
ఏయన్ = బాణములు వేయుట
బహువిధ = అనేకమైన
వ్యూహ = వ్యూహములను
భేదన + ఉపాయములను = అనేక విధాలైన వ్యూహాలను భేధించే ఉపాయాలను
సంప్రయోగ = ప్రయోగవిధాన
రహస్య + అతిశయము = రహస్య అతిశయంతో
కాఁగన్ = కూడినట్లుగా
తొంటి = ఒకనాటి
భార్గవుడు = పరశురాముడు
మిటన్ = విలువిద్యలో
అని = అని
పొగడంగ = ఇటువంటివాడా
కఱపెన్ = నేర్పాడ

భావం :
అస్త్రవిద్యలో అర్జునునికి గల పట్టుదలకు, అతని గురుభక్తికి ద్రోణుడు ఎంతో సంతోషించాడు. అన్నా! నీకంటే వేరెవ్వరూ అధికులు కానట్లుగా విలువిద్య నేర్పిస్తానన్నాడు. ద్వంద్వయుద్ధ, సంకులయుద్ధ పద్ధతులను, రథం మీద నేలమీద, గుర్రాల మీద, ఏనుగులమీద ఉండి దృఢం చిత్రం, సౌష్ఠవం అయిన స్థితులలో బాణాలు వేయటాన్ని, బహువిధాలైన వ్యూహాలను ఛేదించే ఉపాయాలను, బాణ ప్రయోగ రహస్యాలను ఇది వరకటి ఆ పరశురాముడు కూడా విలువిద్యలో ఇంతటివాడుకాడని ప్రజలు అర్జునుని పొగిడేటట్లుగా అతనికి నేర్పాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

24వ పద్యం :

మ.కో. భూపనందము లివ్విధంబున భూరి శస్త్రమహాస్త్రవి
ద్యోపదేశపరిగ్రహస్థితి నున్న సందఱయందు వి
ద్యోపదేశము దుల్యమైనను నుత్తమోత్తముఁ డయ్యె వి
పరిశ్రమకౌశలంబున దండితారి నరుండిలన్.

అర్థాలు :
భూపనందనులు = రాకుమారులు
ఈ + విధంబునన్ = ఈ విధంగా
భూరి = గొప్ప
శస్త్ర = శస్త్రాలు
మహా+అస్త్ర = మహాస్త్రాలు
విద్య + ఉపదేశ = విద్యయొక్క బోధన
పరిగ్రహస్థితి = గ్రహించటం అనే స్థితిలో
ఉన్నాన్ = ఉండగా
అందున్ = అందరిలో
విద్య + ఉపదేశము = విద్యాబోధన
తుల్యము = సమానం
అయినను = అయినప్పటికినీ
దండిత + అ = శిక్షించబడిన శత్రువులు కలవాడు
నరుండు = అర్జునుడు
విద్యాపరిశ్రమ = విద్యాభ్యాసపు నేర్పు చేత
ఇలన్ = భూమిలో
ఉత్తమ + ఉత్తములు = శ్రేష్ఠులలో శ్రేష్ఠుడు అయ్యెను

భావము :
రాజకుమారులు ద్రోణుని వలన గొప్ప వస్త్రాస్త్ర విద్యాబోధనను పొందటంలో అంతా సమానమే అయినా, అర్జునుడు విశేషంగా సాధన చేసి సర్వశ్రేష్ఠుడయ్యాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

25వ పద్యం :

వ. అక్కుమారులు ధనుర్విద్యాకౌశలంబెఱుంగ వేఁడి యొక్కనాఁడు ద్రోణుండు
కృత్రిమంబయిన భాసంబను పక్షి నొక్క వృక్షశాఖాగ్రంబున లక్ష్యంబుగా రచియించి,
దాని నందఱకుఁ జూపి ‘మీమీ ధనువులు బాణంబులు సంధించి నా పంచిన
యప్పుడ యిప్పక్షి తలఁ దెగ నేయుం; డే నొకళ్ళి ? కళ్ళన పంచెద’ నని ముందఱ
ధర్మనందనుఁ బిలిచి ‘యీ వృక్షశాఖాగ్రంబున నున్న పక్షి నిమ్ముగా నీక్షించి
మద్వచనానంతరంబున శరమోక్షణంబు సేయు’ మనిన నతండును వల్లె యని
గురువచనంబు సేసియున్న నయ్యుధిష్ఠిరునకు ద్రోణుండిట్లనియె.

ప్రతిపదార్థం :
ఆ+ కుమారులు = ఆ కురు కుమారుల యొక్క
ధనుర్విద్యా కౌశలంబు = విలువద్యలో నేర్పు
ఎఱుంగన్ = తెలిసికొనాలని
వేఁడి = కోరి
ఒక్కనాడు = ఒక్కరోజు
ద్రోణుండు = ద్రోణాచార్యుడు
కృత్రివుంబు+అయిన = కల్పించబడిన
భాసంబు = గద్ద
అనుపక్షిన్ = అనే పక్షిని
ఒక్క. = ఒక
వృక్షశాఖ = చెట్టుకొమ్మ
అగ్రంబున = చివరన
లక్ష్యంబుగాన్ = గురిగా
రచియించి = కూర్చి
దానివి = దాన్ని
అందఱకున్ = అందరికీ చూపి
సంధించి = ఎక్కుపెట్టి
నాపంచిన అప్పుడు+అ = నేను ఆజ్ఞాపించిన సమయంలో
ఈ పక్షి తలన్ = ఈ పక్షి తలను
తెగెన్ = తెగేటట్టుగా
ఏయుండు = కొట్టండి
ఏన్ = నేను .
ఒకళ్లు + ఒకళ్ళన = ఒక్కొక్కరిని
పంచెదన్ = ఆజ్ఞాపిస్తాను
అని = ఆ ప్రకారంగా
ముందఱ = మొదటి
ధర్మనందనుని పిలిచి = ధర్మరాజును పిలిచి
యీవృక్షశాఖా గ్రంబున = ఈ చెట్టుకొమ్మకొనలో
ఉన్న = ఉండిన
పక్షిని = పక్షిని
ఇమ్ముగాన్ = తగిన విధంగా
ఈక్షించి = చూచి
మద్ + వచన = నామాట
అనంతర = తర్వాత
శరమోక్షణంబు = బాణాన్ని వదులుము
అనినన్ = అనగా
అతండును = ఆ ధర్మరాజును
వల్లె అని = సరే అని
గురువచనంబు = గురువుగారి వనిను
చేసి = సిద్ధము గావించి
ఉన్నాన్ = ఉండగా
ఆ+యుధిష్ఠిరునకున్ = ఆ ధర్మరాజుతో
ద్రోణుండు = ద్రోణాచార్యుడు
ఇట్లు + అనియన్ = ఇట్లున్నాడు.

భావం :
ఆ కురుకుమారులు విలువిద్యా నైపుణ్యాన్ని తెలిసికొనగోరి ఒకనాడు ద్రోణుడు భాసమనే పక్షిని రూపొందించి, ఒక చెట్టు కొమ్మ చివరన కట్టి దానిని అందరికీ చూపి నేను చెప్పినప్పుడు, మీమీ ధనువులు ఎక్కుపెట్టి, ఆ పక్షితలను తెగకొట్టండి. నేను ఒక్కొక్కరినే ఆజ్ఞాపిస్తాను అని, ముందుగా ధర్మరాజును పిలిచి ఈ చెట్టు కొమ్మ కొసన ఉండే పక్షిని చక్కగా చూచి, నేను చెప్పినప్పుడు బాణంతో కొట్టుము అనగా అతడు సర్ అని గురువు మాట ప్రకారం సిద్ధంగా ఉండగా, ద్రోణుడు ఇట్లా అన్నాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

26వ పద్యం :

శే. వృక్షశాఖాగ్రమున నున్న పక్షిశిరము
బెల్లముగఁ జూచితే మహీవల్లభుండ!”
యనిన నిమ్ముగఁ జూచితి ననిన, వెండి
యును గురుఁడు ధర్మజున కిట్టు అనియెఁ బ్రీతి.

ప్రతిపదార్థం :
మహీవల్లభుండు = ఓ రాజా
వృక్షశాఖాగ్రమునన్ = చెట్టుకొమ్మ చివరన
పక్షి శిరము = పక్షి తల
తెల్లముగన్ = స్పష్టంగా
చూచితే = చూచావా
అనినన్ = అనగా
ఇమ్ముగాన్ = చక్కగా
వెండియును = మఱియును
గురుఁడు = ద్రోణుడు
ప్రీతిన్ = ప్రీతిలో
ఇట్టలు = ఇలా
అనియున్ = అన్నాడు.

తాత్పర్యం
ఓ ధర్మరాజా! చెట్టుకొమ్మ చివర ఉన్న పక్షితలను స్పష్టంగా చూచావా అని అడుగగా, చక్కగా చూచానని అతడు చెప్పగా, మరల ద్రోణుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు.

27వ పద్యం :

క. ‘జననుత! యా మ్రానిని న
న్నును మణి- నీ భ్రాతృవరులనుం జూచితే నీ?”
వనవుడుఁ జూచితి నన్నిటి
ననఘా! వృక్షమున సున్న యవ్విహగముతోన్.

ప్రతిపదార్థం :
జననుత = జనులచేత పొగడబడేవాడా ఓ ధర్మరాజా!
ఆ మ్రునిని = ఆ చెట్టును
పద్యభాగం 141-420
నన్నున్ = నన్ను
ముఱి = ఇంకా
నీ భ్రాతృనమున్ = నీ తమ్ములను
చూచితె = చూసావా
అనవుడు = అని అనగా
అనఘా = పాపంలేని వాడా! ఓ ద్రోణాచార్య !
వృక్షముననున్న = చెట్టుపైనున్నా
ఆ+విహంగములోన్ = ఆపక్షితో సహ
అన్నిటి = అన్నిటినీ
చూచితి = చూసాను

భావం :
జనులచేత పొగడబడే ఓ ధర్మరాజా! ఆ మానును, నన్ను, నీ తమ్ముళ్ళను చూశావా? అని ద్రోణుడు అడుగగానే పుణాత్మ! చెట్టు మీదనున్న ఆ పక్షితో పాటు అన్నిటినీ చూచానని ధర్మరాజు అన్నాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

28వ పద్యం :

వ. అనిన విని ద్రోణుండు ధర్మజుం బదరి ‘నీ దృష్టి చెదరె; నీవు దీని నేయనోపవు
పాయు’ మని యివ్విధంబున దుర్యోధనాదులైన ధార్తరాష్ట్రులను భీమసేన నకుల
సహదేవులను నానాదేశాగతులైన రాజపుత్రులను గ్రమంబున నడిగిన వారలు
ధర్మనం దను చెప్పినట్ల చెప్పిన, నందఱనిందించి, పురందరనందనుంబిలిచి
వారినడిగిన యట్ల యడిగిన నాచార్యునకు నర్జునుండిట్లనియె.

ప్రతిపదార్థం :
అనినన్ = అనగా
విని = విని
పదరి = మందలించి
నీ దృష్టి = నీ చూపు
చెదరెన్ = చెదరింది
దీనిన్ = ఈ పక్షిని
ఏయన్ ఓపవు = కొట్టలేవు
పాయుము = తప్పుకో
ఈ + విధంబునన్ = ఈ రీతిగా
దుర్యోధనాదులు = దుర్యోధనుడు మొదలైనవారు
దార్తరాష్ట్రులను = ధృతరాష్ట్ర పుత్రులను
నానాదేశగతులైన = వివిధ దేశాల నుండి వచ్చిన రాకుమారులను
క్రమంబంనన్ = వరుసగా
అడిగినన్ = అడుగగా
వారలు = వాళ్ళు
ధర్మనందను చెప్పినట్లే = ధర్మరాజు చెప్పినట్లే
చెప్పినన్ = చెప్పగా
అందఱన్ = అందరినీ
నిందించి = మందలించి
పురందర నందనున్ = దేవేంద్రుని కుమారుడైన అర్జునుని
పిలిచి = చెంతకు పిలిచి
వారిన్ = వాళ్ళను
అడిగిన అట్లు = అడిగిన విధంగానే
అడిగినన్ = అడుగగా
ఆచార్యనకున్ = ద్రోణునకు
అర్జునుడు = అర్జునుడు
ఇట్లు + అనియె = ఇలా అన్నాడు.

భావం :
అనగా విని ద్రోణుడు ధర్మరాజును మందలించి నీ దృష్టి చెదిరింది, నీవుదానిని కొట్టలేవు. పక్కకు తప్పుకొమ్ము అన్నాడు. అదే విధంగా దుర్యోధనుడు మొదలైన కౌరవులను, భీమునకుల, సహదేవులను వివిధ దేశాల నుండి వచ్చిన రాకుమారులను వరుసగా అడుగగా వాళ్ళంతా ధర్మరాజు ఇచ్చిన సమాధానమే ఇచ్చారు. ద్రోణుడు అందరినీ మందలించి తరువాత అర్జునుని పిలిచి వాళ్ళను అడిగినట్లే అడుగగా అతడిట్లా అన్నాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

29వ పద్యం :

క. “పక్షిశిరంబు దిరంబుగ
నిక్షించితి; నొండు గాన నెద్దియు” ననినస్
లక్షించి యేయు మని సూ
కేక్షలు ద్రోణుండు పనిచె నింద్రతనూజున్.

ప్రతిపదార్థం :
పక్షిశిరంబు = పక్షివలన
తిరంబుగన్ = చక్కగా
ఈక్షించితిన్ = చూచాను
ఒండు = ఇతరం
ఎద్దియున్ = ఏదీ కూడా
కానన్ = చూడటం లేదు
అనినన్ = అని తెల్పగా
లక్షించి = గురి పెట్టి
ఏయుము = కొట్టుము
అని = ఆ ప్రకారం
ద్రోణుండు = ద్రోణుడు
సూక్ష్మ + ఈక్షణున్ = సునిశిత దృష్టిగల
ఇంద్రతనూజున్ = అర్జునుని
పనిచెన్ = ఆజ్ఞాపించెను

భావం :
పక్షితలను చక్కగా చూచాను. ఇంకేదీ నాకు కనిపించడం లేదు అని అర్జుడు అనగా ద్రోణుడు గురిచూసి కొట్టుము అని సూక్ష్మదృష్టిగల అర్జునుని ఆజ్ఞాపించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

30వ పద్యం :

క. గురువచనానంతరమున
నరుఁ డప్పుడు శరవిమోక్షణము సేయుఁడుఁ జె
చ్చెరం బక్షిశిరము దెగి త
రుహశాఖనుండి ధారుణిఁ బడియెన్.

ప్రతిపదార్థం :
గురువచన + అనందరములన్. = గురువు మాట తర్వాత
నరుఁడు = అర్జునుడు
శరమోక్షణము = బాణాన్ని విడవటం
చేయుఁడున్ = చేయగా
చెరన్ + చెరన్ = తత్క్షణమే
పక్షి శిరము = పక్షితల
తద్ + ధరుణీరూహశాఖ నుండి = ఆ చెట్టుకొమ్మ నుండి
ధారుణిన్ = భూమిమీద
పడియెన్ = పడింది

భావం :
గురువు చెప్పిన తర్వాత అర్జునుడు బాణాన్ని వదిలాడు. ఆ పక్షితల తత్క్షణమే తెగి చెట్టుకొమ్మ నుండి నేలమీద పడింది.

31వ పద్యం :

ప. ఇట్లశ్రమంబునఁ గృత్రిమ పక్షితలఁ దెగనేసిన యర్జును నచలిత దృష్టికి
లక్ష్యవేధిత్వంబునకు మెచ్చి ద్రోణుందాతనికి ధనుర్వేద రహస్యంబు లుపదేశించె;
నంత.

ప్రతిపదార్థం :
ఆశ్రమంబునన్ = సులువుగా
కృత్రిమ పక్షితలన్ = కల్పింపబడిన పక్షియొక్క తలను
తెగన్ ఏసిన = తెగునట్లు కొట్టిన
అర్జున = అర్జునుని యొక్క
అచలిత దృష్టికి = చెదిరిపోయిన దృష్టికి
లక్ష్యవేధిత్వంబునకున్ = గురిని కొట్టగలిగినందుకు
మెచ్చి = పొగిడి
ద్రోణుండు = ద్రోణాచార్యుడు
అతనికి = అర్జునునికి
ధనుర్వేద రహస్యంబులు = విలువిద్యలోని రహస్యాలు
ఉపదేశించెన్ = ఉపదేశించాడు.
అంతన్ = తర్వాత

భావం :
ఈ విధంగా సులువుగా ఆ కల్పిత పక్షి తలను తెగగొట్టిన అర్జునుని నిశ్చిలదృష్టికీ, గురిని కొట్టే సామర్ధ్యానికీ ద్రోణుడు మెచ్చి, అతనికి విలువిద్యా రహస్యాలు ఉపదేశించాడు. తరువాత

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

32వ పద్యం :

క. మానుగ రాజకుమారులు
తో నొక్కట నొక్కనాఁడు ద్రోణుఁడు గంగా
స్నానార్థం మరిగి యందు మ
హా నియమస్థుఁడయి నీళ్ళనాడుచునున్నన్.

ప్రతిపదార్థం :
మానుగన్ = ఒప్పుగ
రాజకుమారులతోన్ = కురు రాకుమారులన
ఒక్కటన్ = ఒక్కటిగా
గంగాస్నాన+అర్థము = గంగానదిలో స్నానం చేయుటకు
అరిగి = వెళ్ళి
అందున్ = ఆ నదిలో
మహానియస్థుఁడు+అయి = గొప్ప నియమంగలిగినవాడై
నీళ్ళన్ ఆడుచున్ = నీళ్ళలో స్నానం చేస్తూ
ఉన్నాన్ = ఉండగా

భావం :
ఒకనాడు రాకుమారులందరితో కలిసి ద్రోణుడు గంగాస్నానం చేయటానికై వెళ్లి, ఎంతోనిష్ఠతో నీటిలో స్నానం చేస్తుండగా

33వ పద్యం :

క. వెఱచఱవ నీరిలో నా
క్కె నొక మొసలి చూడ్కికి నగోచర మై
పఱతెంచి కుంభసంభవు
చిఱుతొడ వడిఁ బట్టిఁ కొనియె శిష్యులు బెదరన్.

ప్రతిపదార్థం :
వెఱచఱవ = భయపడేటట్లుగా
నీరిలోన = నీరిలో
ఒక్కెఱగాన్ = భయంకరంగా
చూడ్కికిన్ = చూడటానికి
అగోచరము +ఐ = కనిపించనిదై
పఱతెంచి = వచ్చి
కుంభసంభవుడు = ద్రోణుడు
చిఱుతొడ = ద్రోణుని పిక్కను
శిష్యులుబెదరన్ = శిష్యులంతా బెదురునట్లు
వడిన్ = వేగంగా
పట్టుకొనియొక = పట్టుకొన్నది

భావం :
చూసేవారు భయపడేటట్లుగా నీటిలో భయంకరంగా ఒక మొసలి కంటికి కనపడకుండా వచ్చి శిష్యులంతా బెదిరేటట్లుగా ద్రోణుని పిక్కను వెంటనే పట్టుకుంది.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

34వ పద్యం :

క. దాని విడిపింప ద్రోణుఁడు
దానపుడు సమర్థుఁడయ్యుఁ దడయక పనిచెన్
“దీని విడిపింపు” డని నృప
సూనులు శరసజ్యచాపశోభితకరులన్.

ప్రతిపదార్థం :
దానిన్ = ఆ మొసలిని
విడిపింపన్ = విడిపించటానికి
ద్రోణుకడు = ద్రోణాచార్యుడు
తాన్ = తాను
అపుడు = ఆ సమయంలో
సమర్థుఁడయ్యున్ = సమర్ధుడై ఉండికూడా
తడయక = ఆలస్యం చేయకుండా
దీనిన్ = ఈ మొసలిని
శర = బాణములు
సజ్య = అథ్లె త్రాళ్లుచే
చాప = కూడిన ధనస్సులలో
శోభితకరుల = ప్రకాశిస్తున్నా చేతులు కలవారిని
నృపసూనులన్ = రాజకుమారులను
పనిచెన్ = ఆజ్ఞాపించాడు.

భావం :
ఆ మొసలిని విడిపించటానికి ద్రోణుడపుడు తాను సమర్థుడై కూడా ఆలస్యం లేకుండా దీన్ని విడిపించండని ధనుర్భాణా చేత ధరించి ఉన్న రాకుమారులను ఆజ్ఞాపించాడు

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

35వ పద్యం :

తా. దానిష్ నేరక యందటున్ వివశులై తా రున్న, నన్నిరిలోం
గానంగాని శరీరముంగల మహోగ్ర గ్రాహమున్ గోత్ర బి.
సహనం నేను ధరంబులన్ విపుల రిజుండేసి శక్తిన్ మహా
సేన ప్రభ్యుఁడు ద్రోణుణంఘ విడిపించిన విక్రమం చొప్పఁగన్.

ప్రతిపదార్థం :
దానిన్ = ఆ మొసలిని విడిపించటం
నేరక = చేతకాక
అందయిన్ = అందరూ
వివశులు + ఐ = మైమరచిన వాళ్ళయి
తారు = తాము
ఉన్నాన్ = ఉండగా
ఆ + వీరిలోన్ = ఆ నీటిలో
కానన్ + కాని = చూడటానికి సాధ్యపడని
శరీరమున్ + కల = దేహం ఉండే
మహా + ఉగ్ర+గ్రాహమున్ = మిక్కిలి భయంకరమైన మొసలిని
విపులతేజుండు = ఎంతో పరాక్రమం కలవాడు.
శక్తి = బలంలో
మహాసేన ప్రఖ్యుడు = కుమారస్వామితో సమానుడు
గోత్రభిత్+సూనుండు = కొండలను చీల్చిన ఇంద్రుని కుమారుడు
ఏను = ఐదు
విక్రమంబు = పరాక్రమం
ఒప్పఁగన్ = ప్రకాశించేటట్లు
ద్రోణు జంఘన్ = ద్రోణాచార్యుని యొక్క పిక్కను విడిపించెను

భావం :
ఆ రాజకుమారులంతా మొసలిని విడిపించటం చేతకాక దిక్కు తెలియని స్థితిలో ఉండగా, మహాపరాక్రమశాలి శక్తిలో కుమారస్వామి, వంటివాడు పర్వతాలు రెక్కలు నరికిన దేవేంద్రుని పుత్రుడు అయిన అర్జునుడు, నీటిలో కనిపించకుండా ఉన్న ఆ భయంకరమైన మొసలిని అయిదు బాణాలతో కొట్టి ద్రోణాచార్యుని విడిపించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

36వ పద్యం :

…………………………………..
జూచి, ద్రోణుందర్లును ధనుః కౌశలంబునకుఁ దనయందని స్వేగ మారడు గుచ్చి,
దీనిచే ద్రుపమందు బంధుసహితంబు పడతుందగునని తన దిములు
సంతోషించి, దానికి అనేక దివ్యబాణంబు లిచ్చేను) ఎరుకు కొంద కనాంటి పరాక్రమ
గుణకంపదలు వైశంపాయనుందు జనను జయనమం జెప్ప

ప్రతిపదార్థం :
అ + మహా + ఉగ్ర = ఆ గొప్ప భయంకరమైన
గ్రాహంబు = మొసలి
పార్థ బాణ పంచక = అర్జునుని ఐదు బాణాలతో
విభిన్న దేహంబయి = చీల్చబడిన శరీరం కలదై
పంచత్వంబున = మరణాన్ని
పొందినన్ = పొందగా
చూచి = కనుగొని
ధనుస్+కౌశలంబునకున్ = విలువిద్యా నైపుణ్యానికి
తనయందు = తనపై గల
అతిస్నేహంబునకున్ = మిక్కిలి ప్రీతికి
మెచ్చి = పొగిడి
వీనిచే = వీనివల్ల
బంధుసహితంబు = బంధువులతో సహా
పరాజితుండు = ఓడగొట్టబడినవాడు
అగున్ = కాగలడు
మనంబున = మనసులో
వానికిన్ = అర్జునునకు
దివ్యబాణంబులు = దేవతాసంబంధమైన బాణాలు
ఇచ్చేన్ = ఇచ్చాడు.
కొండుకనాటి = అర్జునుని యొక్క చిన్ననాటి
పరాక్రమ గుణసంపదలు = పరాక్రమ గుణాల యొక్క గొప్పలు
వైశంపాయనకలు = వైశంపాయన మహర్షి
జనమేజయునకు = అర్జునుని మనమడికి చెప్పెను

భావం :
అతి భయంకరమైన మొసలి అర్జునుని అయిదు బాణాల చేత శరీరం చలీ మరణించింది. అది చూసి ద్రోణుడు అర్జునుని విలువిద్యా నైపుణ్యానికి, తనపట్ల గల ప్రేమకు మెచ్చి అతనిచేత ద్రుపదుడు బంధువులతో సహా ఓడిపోగలడని సంతోషించి అనేక దివ్యబాణాలు అతనికిచ్చాడు, అని అర్జునుని చిన్ననాటి పరాక్రమ గుణ విశేషాలు వైశంపాయనుడు జనమేజయునికి చెప్పాడు.

విద్యాలక్ష్యం Summary in Telugu

కవి పరిచయం

నన్నయ 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన రాజరాజనరేంద్రుని ఆస్థానకవి. ఉభయభాషా కావ్యరచనాభి శోభితుడు, లోకజ్ఞుడు, ఉచితజ్ఞుడు, రసజ్ఞుడు అయిన నన్నయ సాగించిన భారతానువాదం అనన్య సామాన్యం. వేదవ్యాస విరచితమై పంచమ వేదంగా చెప్పుకొనే సంస్కృత మహాభారతాన్ని రాజరాజు కోరిక మేరకు తెలుగులోకి అను వాదం చేసాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

నన్నయ ‘శ్రీవాణీ గిరిజాశ్చిరాయ’ అంటూ సంస్కృత శ్లోకంతో మహా భారతాన్ని మొదలుపెట్టి ఆనాటి ప్రాచీన విద్వాంసుల మెప్పు పొందాడు. బహుభాషా విజ్ఞుడు, ఉద్దండపండితుడు అయిన నన్నయ మహాభారతంలో ఆది, సభా, అరణ్యపర్వంలోని నాల్గవ ఆశ్వాసంలోని 142వ పద్యం వరకు రచించాడు. వాటితోపాటు ఆంధ్ర శబ్దచింతామణి, చాముండికా విలాసం, ఇంద్ర విజయం, లక్షణసారం అనే గ్రంథాలు రచించాడు.

మిత్రుడైన నారాయణభట్టు సహాయంతో నన్నయ భారతానువాదానికి ఉపక్రమించాడు. మహాభారతాన్ని చంపూ పద్ధతిలో అనువదించిన నన్నయ భారత రచన ఒక స్వతంత్ర రచనలాగా సాగింది. నన్నయ తదనంతర కవులెందరికో మార్గదర్శకుడై “ఆదికవి” అనిపించుకున్నాడు.

రచనా విధానం

నన్నయ కథా నిర్వహణలో, భాషలో, శైలిలో, దృక్పథంలో మూలంలోకన్నా స్వతంత్రంగా వ్యవహరించాడు. మార్గ పద్ధతిలో సాగిన నన్నయ రచనలో అక్షర రమ్యత, నానారుచిరార్థ సూక్తి నిధిత్వము, ప్రసన్న కథా కలితార్థయుక్తి అనే లక్షణాలు కనిపిస్తాయి. నన్నయ వచనం కూడా పద్యంలా సొగసుతో ప్రౌఢ సమాసాలతో రసభరితంగా సాగింది.

నన్నయభట్టు తెలుగులో భాషాసంస్కరణల్ని ప్రవేశపెట్టి ‘శబ్దశాసనుడు’గా పేరు గాంచాడు. వ్యాసభారతంలోని ధర్మాన్ని నన్నయ కావ్యశైలిలోకి మార్చి తెలుగు సాహిత్యంలో కావ్య రచనకు మార్గం సుగమం చేశాడు. ఆధ్యాత్మిక ధర్మప్రబోధం, లోకజ్ఞత, రాజనీతి, లౌకిక నీతులు, శాస్త్ర వైదుష్యం నన్నయ రచనలో గాఢంగా కనిపిస్తాయి.

ప్రస్తుత పాఠ్యభాగం ‘విద్యాలక్ష్యం’ నన్నయ భట్టు విరచితమైన ‘శ్రీమదాంధ్ర మహాభారతం’ లోని ఆదిపర్వం, పంచమ ఆశ్వాసం నుంచి గ్రహించబడింది.

పాఠ్యాంశ సందర్భం

భరద్వాజ మహర్షి పుత్రుడైన ద్రోణాచార్యుడు గొప్ప అస్త్రవిద్యా నిపుణుడు. కౌరవ పాండవులకు విలువిద్యను నేర్పడానికి భీష్ముడు ద్రోణాచార్యుడిని నియమించాడు. కురు పాండవులు ద్రోణాచార్యుని వద్ద గురుకులంలో విద్యను అభ్యసిస్తున్నారు. ద్రోణాచార్యుడు తన అస్త్రవిద్యా నైపుణ్యాలను వేటినీ దాచుకోకుండా తన శిష్యులకు నేర్పించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

అందులో తన ప్రియశిష్యుడైన అర్జునుడికి అనేక ధనుర్విద్యా రహస్యాలను బోధించాడు. గురుకులంలో శిక్షితులందరినీ పరీక్షించడానికి, వాళ్ళ నైపుణ్యం తెలుసుకొనేందుకు ఒక పరీక్షను ఏర్పాటు చేసాడు. గురువు పెట్టే పరీక్షలను అర్థం చేసుకుని లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విద్యార్థికి ఉండవలసిన లక్షణాలను తెలుపుతుంది ఈ పాఠ్యాంశం.

TS Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

Telangana TSBIE TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ Textbook Questions and Answers.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
చరానుపాతాల సూత్రాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించండి.
జవాబు.
చరానుపాత సూత్రం స్వల్పకాలానికి చెందినది. ఈ సూత్రాన్ని రికార్డో, మాల్టస్, మార్షల్ వంటి సంప్రదాయ ఆర్థికవేత్తలు విశేష ప్రాముఖ్యమిచ్చారు. సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఈ సూత్రాన్ని వ్యవసాయ రంగానికే పరిమితం చేశారు. స్టిగ్లర్ అనే ఆర్థికవేత్త ఒక ఉత్పాదకాన్ని సమాన పరిమాణంలో పెంచుతూ మిగతా కారకాలను స్థిరంగా ఉంచితే ఒక స్థాయి తరువాత ఉపాంత ఉత్పాదకత క్షీణిస్తుంది.

ఈ సిద్ధాంతం కొన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి, ఒక ఉత్పత్తి సాధనం పరిమాణంలో మార్పులు చేస్తూ ఉన్నప్పుడు ఏ అనుపాతంలో మారుతుందో తెలియజేయును.

చరానుపాత సూత్రం ప్రకారం మొత్తం ఉత్పత్తి, సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తులు ప్రారంభంలో పెరిగి ఆ తరువాత అవి వివిధ ఉత్పత్తి స్థాయిల వద్ద గరిష్ట స్థాయికి చేరతాయి. మొదటగా ఉపాంత ఉత్పత్తి తరువాత సగటు ఉత్పత్తి, ఆ తరువాత మొత్తం ఉత్పత్తి క్షీణిస్తాయి.

ప్రమేయాలు :

  1. ఈ సూత్రం స్వల్పకాలానికి వర్తిస్తుంది.
  2. సాంకేతిక విజ్ఞానంలో మార్పు ఉండదు.
  3. ఉత్పత్తి కారకాల సమ్మేళనం మార్చడం సాధ్యమవుతుంది.
  4. శ్రమ మాత్రమే చర ఉత్పత్తి కారకం, మిగతా ఉత్పత్తి కారకాలన్నీ స్థిరం.
  5. ఉత్పత్తిని భౌతిక యూనిట్ల రూపంలో కొలవవచ్చు.
  6. శ్రమ సజాతీయంగా ఉంటుంది.

క్షీణ ప్రతిఫల సూత్రాన్ని ఈ క్రింది ఉదాహరణ ద్వారా వివరించవచ్చు. భూమిని స్థిరంగా ఉంచి మరొక సాధనం (శ్రమ)ను పెంచుకుంటూ పోతే, ఉత్పత్తిలో వచ్చే మార్పును మూడు దశలుగా వర్గీకరించవచ్చు. ఈ మూడు దశలలో మొత్తం ఉత్పత్తి, ఉపాంత, సగటు ఉత్పత్తుల మార్పులను పరిశీలించవచ్చు. దీనిని ఈ క్రింది పట్టిక ద్వారా వివరించవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 1

పై పట్టికలో మొత్తం ఉత్పత్తి ప్రారంభంలో పెరుగు తున్న రేటులో, తరువాత తగ్గుతున్న రేటులో పెరుగుతుంది. 7వ శ్రామికుని ఉపయోగించినప్పుడు మొత్తం ఉత్పత్తి గరిష్టమై తరువాత క్షీణిస్తుంది. సగటు ఉత్పత్తి 3వ శ్రామికుడు వరకు పెరిగి 4వ శ్రామికుని దగ్గర గరిష్ట స్థాయికి చేరి తరువాత క్షీణిస్తుంది.

7వ శ్రామికుని దగ్గర మొత్తం ఉత్పత్తి గరిష్టమైనప్పుడు ఉపాంత ఉత్పత్తి శూన్య మైంది. 8వ శ్రామికుని వద్ద మొత్తం ఉత్పత్తి క్షీణించగా ఉపాంత ఉత్పత్తి ఋణాత్మకమైంది. దీనిని ఈ ప్రక్క రేఖా పటం ద్వారా వివరించవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 2

రేఖాపటంలో TP రేఖ A బిందువు వరకు వేగంగా పెరుగుతూ C బిందువు వద్ద గరిష్టమై తరువాత క్షీణిస్తుంది. ‘E’ బిందువు వద్ద AP, MP రేఖలు ఖండించుకోవడం జరిగింది. మొత్తం ఉత్పత్తి C వద్ద గరిష్టంకాగా AP క్షీణించగా, MP శూన్యమైనది. TP క్షీణించగా, MP ఋణాత్మకమైంది. చరానుపాత సూత్రంలోని ఉత్పత్తి దశలను మూడు దశలుగా విభజించవచ్చు.

  1. పెరుగుతున్న ప్రతిఫలాలు
  2. క్షీణ ప్రతిఫలాలు
  3. రుణాత్మక ప్రతిఫలాలు

1. పెరుగుతున్న ప్రతిఫలాలు :
ఈ దశలో మొత్తం ఉత్పత్తి ఉపాంత ఉత్పత్తి కంటే అధికంగాను, ఉపాంత ఉత్పత్తి సగటు కంటే ఎక్కువగాను ఉండును.

2. క్షీణ ప్రతిఫలాలు :
ఈ దశలో మొత్తం ఉత్పత్తి తగ్గుతున్న రేటులో పెరుగుతుంది. సగటు, ఉపాంత ఉత్పత్తులు క్షీణిస్తాయి.

3. రుణాత్మక ప్రతిఫలాలు :
ఈ దశలో మొత్తం, సగటు ఉత్పత్తులు క్షీణించగా ఉపాంత ఉత్పత్తి ఋణాత్మకం అవుతుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 2.
తరహాననుసరించిన ప్రతిఫలాల సూత్రాన్ని వివరించండి.
జవాబు.
దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి సాధనాలను ఒక అనుపాతంలో మార్చినప్పుడు ఉత్పత్తి ఏ అనుపాతంలో మార్పు చెందుతుందో తెలియజేసే దానిని తరహాననుసరించి ప్రతిఫలాలు అంటారు. మొత్తం ఉత్పత్తి కారకాలను మారిస్తే ఉత్పత్తిలో మూడు దశలు కనిపిస్తాయి.

  1. తరహాననుసరించి పెరుగుతున్న ప్రతిఫలాలు,
  2. తరహాననుసరించి స్థిర ప్రతిఫలాలు,
  3. తరహాననుసరించి క్షీణ ప్రతిఫలాలు.

ప్రమేయాలు :

  1. ఉత్పత్తి కారకాలన్నీ చరం.
  2. సాంకేతిక పరిజ్ఞానం స్థిరం.
  3. ఉత్పత్తిని భౌతికరూపంలో కొలవవచ్చు.
  4. సంపూర్ణ పోటీ ఉంటుంది.
  5. శ్రామికులకు లభించే పనిముట్లు, సాధనాలు ఇవ్వబడ్డాయి.

పై ప్రమేయాలకు లోబడి అన్ని ఉత్పత్తి కారకాలను ఒకే నిష్పత్తిలో పెంచినప్పుడు ఉత్పత్తి తరహా విస్తరిస్తుంది.
దీనిని ఈ క్రింది పట్టిక ద్వారా వివరించవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 3

పట్టికలో 1, 2వ శ్రామికులను వాడినప్పుడు మొత్తం ప్రతిఫలాలు రెండు రెట్లకంటే ఎక్కువగా ఉన్నాయి. ఇది పెరుగుతున్న ప్రతిఫలాలను తెలుపును. అంటే ఉత్పత్తిలో పెరుగుదల కన్నా ఉత్పాదకతలో పెరుగుదల ఎక్కువ. 3, 4 శ్రామికులను వినియోగిస్తే ఉపాంత ఉత్పత్తి 11 యూనిట్లుగా ఉంది.

దీనిని స్థిర ప్రతిఫలాల దశ అంటారు. అంటే ఉత్పత్తిలో పెరుగుదల, ఉత్పాదకత పెరుగుదల రెండు సమానం. ఇక 5, 6 శ్రామికులను వాడినప్పుడు మొత్తం ప్రతిఫలాలు తగ్గగా ఉపాంత ప్రతిఫలాలు క్షీణించాయి. దీనిని క్షీణ ప్రతిఫలాల దశ అంటారు. అనగా ఉత్పత్తిలో పెరుగుదల రేటు ఉత్పాదకత పెరుగుదల రేటు కన్నా తక్కువ.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 4

పై రేఖాపటంలో AD రేఖ తరహాననుసరించిన ప్రతిఫలాలు A నుండి B వరకు పెరుగుతున్న ప్రతిఫలాలు, B నుంచి C కి స్థిర ప్రతిఫలాలు, C నుంచి D కి క్షీణ ప్రతిఫలాలు ఉన్నాయి.

ఉత్పత్తిదారుడు వివిధ ప్రతిఫలాలు పొందడానికి కారణాలు :

  1. శ్రమ విభజన, ప్రత్యేకీకరణ వల్ల పెరుగుతున్న ప్రతిఫలాలు ఏర్పడతాయి..
  2. సంస్థ విస్తరించడం వల్ల ఉత్పత్తి కారకాల అసమర్థత; అజమాయిషీ లోపం వల్ల క్షీణ ప్రతిఫలాలు ఏర్పడతాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 3.
అంతర్గత ఆదాలను, బహిర్గత ఆదాలను విశదీకరించండి.
జవాబు.
పరిశ్రమ విస్తరణ వల్ల పరిశ్రమలో ఉత్పత్తి పరిమాణం పెరిగి ఈ ఆదాలు సంస్థలకు లభిస్తాయి. పరిశ్రమలో ఉత్పత్తి తరహా పెరిగినప్పుడు ఏర్పడే ఆదాలను బహిర్గత ఆదాలంటారు.

అంతర్గత ఆదాలు :
1. సాంకేతిక ఆదాలు :
మూలధన పరికరాలు ఇవ్వబడినవిగా భావిస్తే స్వల్ప కాలంలో సాంకేతిక ఆదాలను పొందవచ్చు. సంస్థ ఎక్కువ సామర్థ్యం కలిగిన మంచి, పెద్ద యంత్రాలను, అధునాతన ఉత్పత్తి పద్ధతులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల ఉత్పత్తి బాగా పెరుగుతుంది.

2. మార్కెటింగ్ ఆదాలు :
పెద్ద సంస్థలు అధిక మొత్తంలో ముడిపదార్థాలు కొనడం వల్ల తమకు అనుకూల షరతుల ప్రకారం నాణ్యతగల ముడిసరుకులను సమయానికి పొందడం, తక్కువ రవాణా ఖర్చులు లాంటి ప్రయోజనాలు ఏర్పడతాయి.

3. నిర్వహణ ఆదాలు :
పెద్ద సంస్థలు ప్రత్యేక నైపుణ్యం కలిగిన వ్యక్తులను నియమించుకుంటున్నందువల్ల విధి సంబంధిత ప్రత్యేకీకరణ పెరిగి సంస్థలో ఉత్పాదక సామర్థ్యం పెరిగి, ఉత్పత్తి పెరిగి సగటు యాజమాన్యపు వ్యయం తగ్గుతుంది.

4. విత్తపరమైన ఆదాలు :
పెద్ద సంస్థకు ఉన్న మంచి పేరు, అధిక ఆస్తులవల్ల రుణాలను, సులభంగా తక్కువ వడ్డీ రేటుకు సకాలంలో పొందుతుంది. సంస్థ మూలధనాన్ని మార్కెట్లో షేర్లు, డిబెంచర్లు అమ్మడం వల్ల కూడా సేకరిస్తుంది.

5. నష్టాన్ని భరించే ఆదాలు:
పెద్ద సంస్థలు చిన్న సంస్థల కంటే సులభంగా నష్టాన్ని విస్తరించుకోగలవు. ఒకరకం వస్తూత్పత్తిలో వచ్చిన నష్టాన్ని ఇతర రకాల వస్తూత్పత్తిలో వచ్చే లాభాలతో భర్తీ చేసుకోవచ్చు. మార్కెట్లను విస్తరించుకోవడం వల్ల ఒక మార్కెట్లో ఉన్న తక్కువ డిమాండ్ను ఇతర మార్కెట్లో ఉన్న అధిక డిమాండ్తో భర్తీ చేసుకోవచ్చు.

6. పరిశోధన ఆదాలు :
చిన్న సంస్థ కంటే పెద్ద సంస్థకు అధిక వనరులుంటాయి. అందువల్ల స్వంతంగా పరిశోధన ప్రయోగశాలను కలిగి శిక్షణ పొందిన పరిశోధకులను నియమించుకుంటుంది. వారు కనుగొనే కొత్త విషయాలు సంస్థ ఆస్తి. సంస్థ వీటిని ఉపయోగించుకొని వ్యయాన్ని తగ్గించుకొని ఉత్పత్తిని పెంచుకుంటుంది.

7. సంక్షేమ ఆదాలు :
సంస్థలు శ్రామికులకు సంక్షేమ సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. పెద్ద సంస్థలు పనిచేయడానికి మంచి పరిస్థితులను, సంస్థ లోపల, బయట కల్పిస్తాయి. సంక్షేమ సౌకర్యాలకయ్యే వ్యయం ఎక్కువగా ఉన్నా దానివల్ల శ్రామికుల సామర్థ్యం పెరిగి, మొత్తం ఉత్పత్తి పెరగడానికి, ఉత్పత్తి వ్యయం తగ్గడానికి అవకాశం ఉంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

బహిర్గత ఆదాలు :
పరిశ్రమను ఒక ప్రాంతంలో స్థాపించినప్పుడు నవకల్పనలను ప్రవేశపెట్టడం వల్ల, ప్రత్యేకీకరణను ప్రవేశపెట్టడం వల్ల ఏర్పడే ఆదాలే బహిర్గత ఆదాలు. వీటిని పరిశ్రమలోని సంస్థలన్నీ అనుభవిస్తాయి..

1. కేంద్రీకరణ ఆదాలు :
ఒక పరిశ్రమ ఒక ప్రాంతంలో కేంద్రీకరణ జరిగితే కొన్ని సౌకర్యాలు ఏర్పడతాయి. వీటిని సంస్థలన్నీ అనుభవిస్తాయి.

నైపుణ్యం కలిగిన శ్రామికులు లభించటం, రవాణా, సమాచార సౌకర్యాలు ఏర్పరచడం, మెరుగుపరచటం, బ్యాంకులు, విత్త సంస్థలు, బీమా సంస్థలు తమ శాఖలను ఏర్పాటు చేసి సకాలంలో ఋణాలను తక్కువ వడ్డీ రేటుకు అందించడం, బీమా సౌకర్యాన్ని ఏర్పరచడం, సంస్థలకు విద్యుచ్ఛక్తిని సరిపడే పరిమాణంలో తక్కువ రేట్లకు సరఫరా చేయడం, ఇతర అవస్థాపనా సౌకర్యాలు ఏర్పరచడం, అనుషంగిక పరిశ్రమలు ఏర్పడి, కేంద్రీకృతమై పరిశ్రమకు కావలసిన వస్తువులను సరఫరా చేస్తాయి.

2. సమాచార ఆదాలు :
ఒక సంస్థ కంటే పరిశ్రమలో ఎక్కువ వనరులు ఉన్నందువల్ల పరిశోధనా ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తుంది. పరిశ్రమకు చెందిన సమాచార కేంద్రం తమ ప్రచురణ ద్వారా ముడి సరుకుల లభ్యత, ఆధునిక యంత్రాలు, ఎగుమతి అవకాశాలు మొదలైన ఇతర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సంస్థలకు అందిస్తుంది.

3. ప్రత్యేకీకరణ ఆదాలు :
పరిశ్రమ పరిమాణం పెరిగితే సంస్థలు వివిధ ప్రక్రియలలో ప్రత్యేకీకరణను సాధిస్తాయి. ఫలితంగా పరిశ్రమ మొత్తానికి లాభం చేకూరుతుంది. ఉత్పత్తి పెరిగి, ఉత్పత్తి వ్యయాలు తగ్గుతాయి.

4. సంక్షేమ ఆదాలు :
సంస్థ కంటే పరిశ్రమే శ్రామికులకు, సంక్షేమ సౌకర్యాలు కల్పించడంలో ముందు ఉంటుంది. ఫలితంగా శ్రామికుల సామర్థ్యం పెరిగి, పరిశ్రమలో ఉత్పత్తి పరిమాణాన్ని, నాణ్యతను పెంచవచ్చు. వీటివల్ల సంస్థ ఉత్పాదక సామర్థ్యం పెరిగి సగటు ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది.

ప్రశ్న 4.
సంస్థలోని స్వల్ప కాలిక వ్యయాలను తగిన పటాల సహాయంతో సోదాహరణంగా వివరించండి.
జవాబు.
ఒక ఉత్పత్తిదారుడు ఉత్పత్తికి సంబంధించిన నిర్ణయాలు రెండు కాలాల ఆధారంగా చేస్తాడు.
అవి : 1. స్వల్పకాలం
2. దీర్ఘకాలం.

స్వల్పకాలంలో కొన్ని ఉత్పత్తి కారకాలు అనగా శ్రామికులు,ముడి పదార్థాలను మార్చవచ్చు. అందువల్ల ఉత్పత్తిదారునికి స్వల్పకాలంలో స్థిర వ్యయాలు, చర వ్యయాలు ఉంటాయి.
1. స్థిర వ్యయాలు :
ఉత్పత్తిదారుడు భవనాలు, యంత్రాలు, శాశ్వత కార్మికుల జీతాలు, బీమా మొదలైన వాటిపై చేసే వ్యయాలను స్థిర వ్యయాలు అంటారు. వస్తూత్పత్తిని పెంచినా, తగ్గించినా ఈ వ్యయాలు మారవు. వీటిని అనుబంధ వ్యయాలని, వ్యవస్థాపరమైన వ్యయాలని అంటారు.

2. చర వ్యయాలు :
శ్రామికులు, ముడి పదార్థాలు మొదలైన వాటిపై చేసే వ్యయాలను చర వ్యయాలు అంటారు. ఈ వ్యయాలు ఉత్పత్తితో పాటు మారతాయి. దీనిలో ముడి పదార్థాలకు చెల్లించే ధర, శ్రామికుల వేతనాలు, రవాణా మొదలైన చెల్లింపులు ఉంటాయి. వీటిని ప్రత్యక్ష వ్యయాలని లేదా ప్రధాన వ్యయాలని అంటారు.

మొత్తం వ్యయం :
స్వల్పకాలంలో స్థిర మరియు చర వ్యయాలను కలుపగా మొత్తం వ్యయం వస్తుంది. మొత్తం వ్యయం = స్థిర వ్యయం + చర వ్యయం
TC = FC + VC
వాటిని ఈ క్రింది పట్టిక ద్వారా చూపవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 5

పై పట్టికలో ఉత్పత్తిని క్రమంగా పెంచుతూ పోయినపుడు స్థిర వ్యయాలు మారకుండా ఉన్నాయి. చర వ్యయాలు | ఉత్పత్తితో పాటు మారుతున్నాయి. స్థిర, చర వ్యయాలను కలుపగా మొత్తం వ్యయం వస్తుంది. దీనిని క్రింది రేఖాపటం ద్వారా వివరించవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 6

ప్రక్క రేఖాపటంలో ‘X’ అక్షంపై ఉత్పత్తి యూనిట్లని, Y’ అక్షంపై వ్యయాన్ని తీసుకోవడం జరిగింది. వివిధ వ్యయ రేఖల ఆకారం ఉత్పత్తికీ, వివిధ వ్యయాలకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేయును. స్థిర వ్యయరేఖ (TFC). ‘X’ అక్షానికి సమాంతరంగా ఉంది.

స్వల్పకాలంలో ఉత్పత్తి పెరగటం వల్ల స్థిర వ్యయంలో ఎలాంటి మార్పు ఉండదు. చర వ్యయరేఖ మూలబిందువు దగ్గర మొదలవుతుంది. దీనికి కారణం ఉత్పత్తి శూన్యమయితే చర వ్యయం కూడా శూన్య మౌతుంది. ఉత్పత్తి పెరిగేకొద్ది చర వ్యయం కూడా పెరుగుతుంది.

సగటు వ్యయం :
మొత్తం వ్యయాన్ని మొత్తం ఉత్పత్తితో భాగిస్తే వచ్చేది సగటు వ్యయం. AC TC/Q ఉపాంత వ్యయం : ఉత్పత్తి ప్రక్రియలో అదనంగా ఒక యూనిట్ని పెంచినప్పుడు ఆ అదనపు యూనిట్ వల్ల మొత్తం వ్యయంలో వచ్చే మార్పు.
MC = ∆TC/∆Q

ఈ క్రింది రేఖాపటం ద్వారా MC మరియు AC సంబంధాన్ని తెలియజేయవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 7

పై రేఖాపటంలో ‘X’ అక్షంపైన ఉత్పత్తిని, Y అక్షంపైన వ్యయాన్ని చూపినాము. SAC స్వల్పకాలిక వ్యయరేఖ, యూనిట్లు SMC స్వల్పకాలిక ఉపాంత వ్యయరేఖ. ఉత్పత్తి పెరుగుతుంటే మొదట సగటు వ్యయం తగ్గుతుంది. సగటు వ్యయం తగ్గు తున్నంత వరకు ఉపాంత వ్యయం, సగటు వ్యయంకన్నా తక్కువగా ఉంటుంది.

ఉత్పత్తిని కొనసాగిస్తే సగటు వ్యయం కనిష్ట స్థాయికి వస్తుంది. ఉపాంత వ్యయం, సగటు వ్యయంతో సమానమౌతుంది. SAC మరియు SMC ఖండించుకున్న ‘A’ బిందువు వద్ద ఉత్పత్తి వ్యయం కనిష్టంగా ఉంటుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 5.
రాబడి విశ్లేషణపై ఒక వ్యాసాన్ని రాయండి.
జవాబు.
రాబడి అంటే ఒక సంస్థ వివిధ ధరలకు వస్తువును అమ్మగా పొందిన ఆదాయం. అమ్మకం చేసిన వస్తువు పరిమాణాన్ని దాని ధరతో హెచ్చించడం ద్వారా మొత్తం రాబడిని లెక్కించవచ్చు. అంటే TR = P.Q. రాబడికి సంబంధించి మూడు భావనలున్నాయి. అవి :

  • మొత్తం రాబడి
  • సగటు రాబడి
  • ఉపాంత రాబడి.

(i) మొత్తం రాబడి (Total Revenue – TR) :
సంస్థ మార్కెట్లో ఉన్న ధరకు అమ్మిన వస్తు రాశి వల్ల పొందే ఆదాయాన్ని మొత్తం రాబడి అంటారు.
మొత్తం రాబడి = వస్తువు ధర × ఉత్పత్తి (అమ్మిన వస్తువుల పరిమాణం).
Total Revenue (TR) = Price (P) × Quantity sold (Q)
TR = P.Q.
వినియోగదారులు వస్తువుపై చేసిన మొత్తం వ్యయం సంస్థకు మొత్తం రాబడి అవుతుంది.

(ii) సగటు రాబడి (Average Revenue – AR) :
సగటున ఒక యూనిట్ వస్తువుకు లభించే రాబడిని. సగటు రాబడి అంటారు. అమ్మిన వస్తువు యూనిట్లతో రాబడిని భాగిస్తే సగటు రాబడి తెలుస్తుంది. అసలు ధరే సగటు రాబడి.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 8

అంటే సగటు రాబడి ధరకు సమానంగా ఉంటుంది. ‘డిమాండ్ లేదా ధర రేఖను సగటు రాబడి రేఖ అంటారు.

(iii) ఉపాంత రాబడి (Marginal Revenue – MR) :
మరొక యూనిట్ వస్తువును అదనంగా అమ్మడం వల్ల మొత్తం రాబడిలో వచ్చే పెరుగుదలను అంటే అదనపు రాబడిని ఉపాంత రాబడి అంటారు.
MRn = TRn – TRn-1 లేదా MR = \(\frac{\mathrm{dTR}}{\mathrm{dQ}}\), d అనేది మార్పు.

సంపూర్ణ పోటీలో AR, MR రేఖలు (AR and MR Curves under Perfect Competition) :
సంపూర్ణ పోటీ మార్కెట్లో కొనుగోలుదార్ల సంఖ్య, అమ్మకందార్ల సంఖ్య చాలా అధికం. ఏ ఒక్కరూ వస్తువు ధరను నిర్ణయించలేరు. సజాతీయ వస్తువులుంటాయి. వస్తువు ధర దాని సప్లయ్, డిమాండ్లను బట్టి నిర్ణయించబడుతుంది.

పరిశ్రమలో ఒకే ధర ఉంటుంది. సంస్థలన్నీ ఈ ధరను అంగీకరించి ఎంత పరిమాణంలోనైనా వస్తువులను అమ్ముకోవచ్చు. కాబట్టి సంస్థ ఉత్పత్తికుండే డిమాండ్ రేఖ సంపూర్ణ వ్యాకోచాన్ని కలిగి ఉంటుంది. సంస్థ ఉత్పత్తికున్న డిమాండ్ రేఖే దాని సగటు రాబడి రేఖ. ఈ సగటు రాబడి రేఖ OX – అక్షానికి సమాంతరంగా ఉంటుంది.

సంపూర్ణ పోటీలో ధర స్థిరం. అందువల్ల సగటు రాబడి (AR) ఉపాంత రాబడి (MR) కి సమానంగా ఉండటమే కాకుండా వస్తువు ధర కూడా సమానంగా ఉంటాయి. అంటే P = AR = MR. ఉపాంత రాబడి రేఖ కూడా OX అక్షానికి సమాంతరంగా ఉండటమే కాకుండా సగటు రాబడి రేఖతో కలిసిపోతుంది. అందువల్ల AR రేఖ MR రేఖగా ఉంటుంది. పట్టిక, పటంల ద్వారా AR, MRల మధ్య ఉన్న సంబంధం తెలుపుతుంది.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 9

సంపూర్ణ పోటీ మార్కెట్ అయినందువల్ల వస్తువు ధర స్థిరంగా ఉంటుంది. ₹ 10 ధర ఉన్నప్పుడు సంస్థ ఎంత పరిమాణాన్ని అయినా అమ్ముకోవచ్చు. మొత్తం రాబడి స్థిరమైన రేటులో పెరుగుతుంది. ధర మారనందువల్ల సగటు రాబడి, ఉపాంత రాబడులు కూడా 3 10గా ఉన్నాయి.

అంటే P = AR = MR. ధర, సగటు రాబడి, ఉపాంత రాబడులు సమానంగా ఉండటంతోపాటుగా స్థిరంగా ఉన్నాయి. ఈ కారణంగా P, AR, MR రేఖ పటంలో చూపిన విధంగా OX అక్షానికి సమాంతరంగా ఉంటుంది.

ఏకస్వామ్యంలో AR, MR రేఖలు (AR and MR Curves under Monopoly): ఏకస్వామ్యంలో ఒకే అమ్మకందారు డుంటాడు. సమీప ప్రత్యామ్నాయాలు ఉండవు. జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం చాలా అల్పంగా ఉంటుంది. ధరను లేదా వస్తురాశిని ఏదో ఒక్కదానిని ఏకస్వామ్యదారుడు నిర్ణయిస్తే మరొకటి మార్కెట్లో ఉండే డిమాండ్ను బట్టి నిర్ణయించబడుతుంది. అంతేగాని రెండింటిని ఒకేసారి నిర్ణయించలేడు.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 10

ఏకస్వామ్యదారుడు అమ్మకాలను పెంచుకోవడానికి ధరను తగ్గిస్తాడు. ధరే సగటు రాబడి కాబట్టి, సగటు రాబడి కూడా క్రమేణ క్షీణిస్తుంది. అందువల్ల డిమాండ్ రేఖ అంటే సగటు రాబడి రేఖ ఎడమ నుంచి కుడి వైపుకు కిందికి వాలుతుంది. ఉపాంత రాబడి కూడా తగ్గుతుంది.

సగటు రాబడి కంటే ఉపాంత రాబడి తక్కువగా ఉంటుంది. అందువల్ల సగటు రాబడి రేఖకు ఉపాంత రాబడి రేఖ కింద ఉంటుంది. సగటు రాబడిలోని తగ్గుదల రేటుకంటే ఉపాంత రాబడిలోని తగ్గుదల రేటు ఎక్కువగా ఉంటుంది.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 11

పట్టికలో ధర లేదా సగటు రాబడి ప్రతిసారి గౌ 1 చొప్పున తగ్గుతుంటే ఉపాంత రాబడి ప్రతిసారి 32 చొప్పున తగ్గుతుంది. ధర, సగటు రాబడులు సమానంగా ఉన్నాయి. ఇవి ఉపాంత రాబడి కంటే ఎక్కువగా ఉన్నాయి. అంటే P = AR > MR.

ధర తగ్గినప్పుడు అమ్మకాలు పెరిగి మొత్తం రాబడి పెరుగుతున్నట్లుగా పట్టికలో చూడవచ్చు. సగటు రాబడి, ఉపాంత రాబడి రేఖలను పటంలో పరిశీలించవచ్చు. OX – అక్షంపైన వస్తువు పరిమాణాన్ని, OY అక్షంపైన రాబడులను కొలుస్తున్నాం.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 12

పటంలో AR – సగటు రాబడి రేఖ, MR – ఉపాంత రాబడి రేఖ రెండూ సరళ రేఖలుగా ఉండి ఎడమ నుంచి కుడికి కిందకు వాలుతున్నాయి. AR రేఖకు MR రేఖ కింద ఉంటుంది. ఏకస్వామ్య పోటీలో AR, MR రేఖలు మిగతా మార్కెట్లలో కంటే అధిక వ్యాకోచంగా ఉంటాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భూమి, శ్రమ అనే ఉత్పత్తి కారకాల ప్రధాన లక్షణాలను విశదీకరించండి.
జవాబు.
భూమి : భూమి అంటే కేవలం నేల లేదా ఉపరితలం మాత్రమే కాకుండా అడవులు, నీరు, వాతావరణం, ఖనిజాలు, ఇంధనం, మొదలైన ప్రకృతి వనరులన్నీ భూమిలో భాగమే.

భూమి లక్షణాలు : ఒక ఉత్పత్తి కారకంగా భూమికి ఉండే లక్షణాలు కింద పేర్కొన్న విధంగా ఉంటాయి :

  1. భూమి ప్రకృతి వల్ల లభించిన ఉచిత కానుక.
  2. భూమి సప్లయ్ పరిమితం. ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుంటే భూమి సప్లయ్ స్థిరం. అంటే భూమి సప్లయ్ సంపూర్ణ అవ్యాకోచంగా ఉంటుంది.
  3. భూమికి గమనశీలత లేదు. భూమిని ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించలేం.
  4. భూమిని ఇతర కారకాలతో కలిపి ఉపయోగిస్తూ పోతే క్షీణ ప్రతిఫలాలు ఏర్పడతాయి.
  5. భూమి సారంలో తేడాలుంటాయి.
  6. భూమి తనంతట తానుగా దేనినీ ఉత్పత్తి చేయదు. మానవ ప్రయత్నం తోడైతేనే ఉత్పత్తి జరుగుతుంది.

శ్రమ (Labour – L) :
అర్థశాస్త్రంలో శ్రమ అంటే ఆదాయాన్ని సంపాందించడానికి వస్తుసేవల ఉత్పత్తిలో అందించే భౌతిక, మానసిక కారకం. శ్రమ చురుకైన ఉత్పత్తి కారకం. శ్రమతో కలిసినప్పుడే భూమి, మూలధనం ఉపయోగంలోకి వస్తాయి.

శ్రమ లక్షణాలు : శ్రమకు కింది లక్షణాలుంటాయి.

  1. శ్రమను శ్రామికుడి నుంచి విడదీయలేం. శ్రామికుడు శ్రమనే అమ్ముతాడు తప్ప తానుగా అమ్ముడుపోడు.
  2. శ్రమ నశ్వరం (perishable), అంటే శ్రామికుడు ఒక రోజు పనిచేయకపోతే ఆ రోజు శ్రమ వృథా అయినట్లు. శ్రమను నిల్వచేయలేం. శ్రమకు రిజర్వు ధర (reserve price) లేదు.
  3. శ్రమకు ప్రారంభంలో బేరమాడే శక్తి తక్కువగా ఉంటుంది.
  4. శ్రామికుల సామర్థ్యం వేరు వేరుగా ఉంటుంది. శ్రమను (a) నైపుణ్యంలేని శ్రమ, (b) పాక్షిక నైపుణ్యం ఉన్న శ్రమ, (c) నైపుణ్యం ఉన్న శ్రమ అని విభజిస్తారు.
  5. శ్రమ సప్లయ్ రేఖ ప్రారంభంలో ఎడమ నుంచి కుడికి పైకి వాలి అత్యధిక వేతనాల వద్ద వెనుకకు వాలుతుంది (backward bending).

ప్రశ్న 2.
శ్రమ విభజన వల్ల ఉండే లాభాలు, నష్టాలు ఏమిటి ?
జవాబు.
శ్రమ విభజన (Division of Labour) :
ఆధునిక పారిశ్రామిక వ్యవస్థలో శ్రమ విభజన ముఖ్యమైంది. ఒక వస్తూత్పత్తి ప్రక్రియను వివిధ భాగాలుగా విభజించి వీటిని శ్రామికులకు కేటాయించడాన్నే శ్రమ విభజన అంటారు. ఏ శ్రామికుడు ఒక వస్తువును పూర్తిగా తయారు చేయడు. ప్రతి శ్రామికుడు వస్తువులోని ఒక భాగాన్ని మాత్రమే తయారు చేస్తాడు.

ఈ శ్రమ విభజనను ఆడమ్స్మత్ గుర్తించి వివరించాడు. అధిక సామర్థ్యపు స్థాయి మరియు ప్రత్యేక నైపుణ్యం వల్ల శ్రమ విభజన తలసరి శ్రామిక ఉత్పత్తిలో పెరుగుదలకు దారి తీస్తుంది.

శ్రమ విభజన వల్ల లాభాలు :

  1. ఒక పనిని నిర్విరామంగా శ్రామికుడు చేస్తున్నందువల్ల అతని నైపుణ్యం, సామర్థ్యం పెరిగి ఉత్పత్తి పెరుగుతుంది.
  2. నవకల్పనలకు, ఆవిష్కరణలకు (discovery) దోహదపడుతుంది.
  3. కాలం ఆదా అవుతుంది.
  4. యాంత్రికీకరణకు అవకాశం ఏర్పడుతుంది.
  5. వివిధ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
  6. శ్రామికుల నైపుణ్యం ఆధారంగా తగిన పని లభిస్తుంది.
  7. పెద్ద తరహాలో ఉత్పత్తికి వీలు కలుగుతుంది.

శ్రమ విభజన వల్ల నష్టాలు :

  1. ఒకే రకం పని వల్ల శ్రామికులు ఆసక్తిని కోల్పోతారు.
  2. మానవాభివృద్ధికి నిరోధకం.
  3. నైపుణ్యాన్ని కోల్పోతాడు.
  4. నిరుద్యోగత ఏర్పడవచ్చు.
  5. శ్రామికుల గమనశీలతకు అవరోధం ఏర్పడుతుంది.
  6. TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 3.
క్షీణ ప్రతిఫలాలను వివరించండి.
జవాబు.
పెరుగుతున్న ప్రతిఫలాల దశ అనంతరం క్షీణ ప్రతిఫలాల దశ ఏర్పడుతుంది. దీనినే క్షీణ ప్రతిఫలాల సూత్రమని అంటాం. క్షీణ ప్రతిఫలాల దశ సగటు ఉత్పత్తి గరిష్ఠమైనప్పుడు ప్రారంభమై ఉపాంత ఉత్పత్తి శూన్యం. మొత్తం ఉత్పత్తి గరిష్ఠమయ్యేంత వరకు ఉంటుంది. పట్టిక ప్రకారం శ్రామికుల సంఖ్య 4 నుంచి 7 వరకున్నప్పుడు క్షీణ ప్రతిఫలాల దశ ఏర్పడుతుంది.

OX – అక్షంపై Q నుంచి Q1 వరకు ఉన్న దశే క్షీణ ప్రతిఫలాల దశ. ఈ దశలో మొత్తం ఉత్పత్తి తగ్గుతున్న రేటులో పెరుగుతుంది. సగటు, ఉపాంత ఉత్పత్తులు క్షీణిస్తుంటాయి. ఈ దశలో సగటు ఉత్పత్తి కంటే మొత్తం ఉత్పత్తి అధికంగాను, ఉపాంత ఉత్పత్తికంటే సగటు ఉత్పత్తి అధికంగాను ఉంటాయి. TP > AP > MP. క్షీణ ప్రతిఫలాల దశలోనే ఉత్పత్తి లాభదాయకంగా ఉంటుంది.

ప్రశ్న 4.
తరహాననుసరించి ప్రతిఫలాల భావనను వివరించండి.
జవాబు.
తరహాననుసరించి ప్రతిఫలాల సూత్రం దీర్ఘకాలిక ఉత్పత్తి ఫలానికి సంబంధించింది. ఉత్పత్తి తరహాలో వచ్చే మార్పు వల్ల మొత్తం ఉత్పత్తిలో వచ్చే మార్పును ఇది తెలుపుతుంది. దీర్ఘకాలంలోని (చర) ఉత్పత్తి కారకాలన్నిటినీ ఒకే అనుపాతంలో పెంచినప్పుడు ఉత్పత్తి కారకాల తరహాలో వచ్చే అనుపాతపు మార్పును ఈ ప్రతిఫలాల సూత్రం వివరిస్తుంది. ఉత్పత్తి కారకాల అనుపాతపు మార్పు వల్ల ఉత్పత్తిలో వచ్చే మార్పు మూడు రకాలుగా ఉండే అవకాశం ఉంది. అవి :

  • పెరుగుతున్న ప్రతిఫలాలు
  • స్థిర ప్రతిఫలాలు
  • తగ్గుతున్న ప్రతిఫలాలు.

ప్రమేయాలు : ఈ సూత్రం కింది ప్రమేయాలపై ఆధారపడి ఉంది :

  1. ఉత్పత్తి కారకాలన్నీ చరం అయితే ఉద్యమిత్వం మాత్రం స్థిరం.
  2. సాంకేతిక ప్రగతి స్థిరం.
  3. మార్కెట్లో సంపూర్ణ పోటీ ఉంటుంది.
  4. ఉత్పత్తిని భౌతిక రూపంలో కొలుస్తాం.
  5. శ్రామికునికి లభించే పనిముట్లు, సాధనాలు ఇవ్వడమైంది.

తరహాననుసరించి ప్రతిఫలాల సూత్రం :
పై ప్రమేయాలకు లోబడి అన్ని ఉత్పత్తి కారకాలను ఒకే నిష్పత్తిలో పెంచినప్పుడు ఉత్పత్తి తరహా విస్తరిస్తుంది. పైన వివరించిన విధంగా ఉత్పత్తిపై ఉండే ప్రభావాన్ని మూడు దశలుగా చూడవచ్చు. మొదటి దశ పెరుగుతున్న ప్రతిఫలాలు లేదా క్షీణ వ్యయాలు.

ఈ దశలో ఉత్పాదకాల పెరుగుదల రేటు కంటే ఉత్పత్తిలోని’ పెరుగుదల రేటు ఎక్కువ. రెండవ దశ స్థిర ప్రతిఫలాలు లేదా స్థిర వ్యయాలు. ఈ దశలో ఉత్పత్తిలోని పెరుగుదల రేటు, ఉత్పత్తి కారకాలలోని పెరుగుదల రేటు సమానంగా ఉంటాయి. మూడవ దశ క్షీణ ప్రతిఫలాలు లేదా పెరుగుతున్న వ్యయాలు. ఈ దశలో ఉత్పత్తి కారకాలలోని పెరుగుదల రేటు కంటే ఉత్పత్తిలోని పెరుగుదల రేటు తక్కువగా ఉంటుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 5.
మూలధనంను గురించి ఒక వ్యాఖ్యను వ్రాయండి.
జవాబు.
సాధారణంగా మూలధనం అంటే ద్రవ్యం అనే భావిస్తాం. యంత్ర పరికరాలు, ముడి పదార్థాలు, భవనాలు మొదలైన వాటి పై వెచ్చించే ద్రవ్యాన్ని మూలధనం అంటారు. ప్రస్తుత సంపదలోని కొంత భాగాన్ని భవిష్యత్తులో సంపదను సృష్టించుకోవడానికి ఉపయోగిస్తే అదే మూలధనం.

మూలధనాన్ని (నిల్వ భావన) ఉపయోగించి ఆదాయాన్ని (ప్రవాహం భావన) పొందుతారు. మూలధనాన్ని మానవ నిర్మిత ఉత్పత్తి కారకమని కూడా అంటారు. మూలధనం సప్లయ్లో మార్పులుంటాయి. దీనికి గమనశీలత ఉంటుంది.

మూలధన వర్గీకరణ :
మూలధనాన్ని ఈ కింద పేర్కొన్న రకాలుగా విభజించవచ్చు.

(i) నిజ మూలధనం – మానవ మూలధనం :
భవనాలు, యంత్రాలు, ఫ్యాక్టరీలు మొదలైన భౌతికమైన వాటిని నిజ లేదా వాస్తవిక మూలధనం. (real capital) అంటారు. మానవుల నైపుణ్యం, వారి సామర్థ్యం మొదలైన వాటిని మానవ మూలధనంగా (human capital) పిలుస్తారు.

(ii) వైయక్తిక, సామాజిక మూలధనం :
వైయక్తిక మూలధనం ఒక వ్యక్తికి లేదా సంస్థకు చెందింది. సామాజిక మూలధనం మొత్తం సమాజానికి చెందుతుంది. ఉదా : రోడ్లు, వంతెనలు మొదలైనవి.

(iii) స్థిర మూలధనం, చర మూలధనం :
మన్నిక కలిగి ఉత్పత్తిలో ఎక్కువ కాలం ఉపయోగపడే యంత్రాలు, భవనాలలాంటివి స్థిర మూలధనం (fixed capital). ఉత్పత్తి ప్రక్రియకు సంబంధించిన శ్రామికుల రోజువారీ వేతనాలు, ముడి పదార్థాలు, విద్యుచ్ఛక్తి చార్జీలు చర మూలధనం (variable capital).

(iv) స్పర్శనీయ మూలధనం, అస్పర్శనీయ మూలధనం (Tangible Capital and Intangible Capital) :
భౌతిక రూపంలో ఉండే మూలధనం స్పర్శనీయం. గుడ్విల్, పేటెంట్ రైట్స్ లాంటి వాటిని అస్పర్శనీయ మూలధనంగా పరిగణిస్తారు.

మూలధన ప్రాధాన్యత :
మూలధన ప్రాధాన్యత గురించి క్లుప్తంగా తెలుసుకొందాం.

  1. మూలధనం లేకుండా ఉత్పత్తి జరగదు. ఆర్థికాభివృద్ధిలో దీని పాత్ర ముఖ్యం.
  2. మూలధనం శ్రామికులకు అవసరమైన యంత్రాలు, పనిముట్లు, అందించి వారి సామర్థ్యాన్ని, ఉత్పాదక శక్తిని పెంచడానికి దోహదపడుతుంది. ఇది మొత్తం ఉత్పత్తిని పెంచుతుంది.
  3. మూలధన సంచయనం వల్ల సాంకేతిక ప్రగతి ఏర్పడుతుంది.
  4. ఉద్యోగ అవకాశాలను పెంచడానికి దోహదపడుతుంది.

ప్రశ్న 6.
అంతర్గత ఆదాలు అంటే ఏమిటి ?
జవాబు.
పరిశ్రమ విస్తరణ వల్ల పరిశ్రమలో ఉత్పత్తి పరిమాణం పెరిగి ఈ ఆదాలు సంస్థలకు లభిస్తాయి. పరిశ్రమలో ఉత్పత్తి తరహా పెరిగినప్పుడు ఏర్పడే ఆదాలను బహిర్గత ఆదాలంటారు.

1. సాంకేతిక ఆదాలు :
మూలధన పరికరాలు ఇవ్వబడినవిగా భావిస్తే స్వల్ప కాలంలో సాంకేతిక ఆదాలను పొందవచ్చు. సంస్థ ఎక్కువ సామర్థ్యం కలిగిన మంచి, పెద్ద యంత్రాలను, అధునాతన ఉత్పత్తి పద్ధతులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల ఉత్పత్తి బాగా పెరుగుతుంది.

2. మార్కెటింగ్ ఆదాలు :
పెద్ద సంస్థలు అధిక మొత్తంలో ముడిపదార్థాలు కొనడం వల్ల తమకు అనుకూల షరతుల ప్రకారం నాణ్యతగల ముడిసరుకులను సమయానికి పొందడం, తక్కువ రవాణా ఖర్చులు లాంటి ప్రయోజనాలు ఏర్పడతాయి.

3. నిర్వహణ ఆదాలు :
పెద్ద సంస్థలు ప్రత్యేక నైపుణ్యం కలిగిన వ్యక్తులను నియమించుకుంటున్నందువల్ల విధి సంబంధిత ప్రత్యేకీకరణ పెరిగి సంస్థలో ఉత్పాదక సామర్థ్యం పెరిగి, ఉత్పత్తి పెరిగి సగటు యాజమాన్యపు వ్యయం తగ్గుతుంది.

4. విత్తపరమైన ఆదాలు :
పెద్ద సంస్థకు ఉన్న మంచి పేరు, అధిక ఆస్తులవల్ల రుణాలను, సులభంగా తక్కువ వడ్డీ రేటుకు సకాలంలో పొందుతుంది. సంస్థ మూలధనాన్ని మార్కెట్లో షేర్లు, డిబెంచర్లు అమ్మడం వల్ల కూడా సేకరిస్తుంది.

5. నష్టాన్ని భరించే ఆదాలు :
పెద్ద సంస్థలు చిన్న సంస్థల కంటే సులభంగా నష్టాన్ని విస్తరించుకోగలవు. ‘ఒకరకం’ వస్తూత్పత్తిలో వచ్చిన నష్టాన్ని ఇతర రకాల వస్తూత్పత్తిలో వచ్చే లాభాలతో భర్తీ చేసుకోవచ్చు. మార్కెట్లను విస్తరించుకోవడం వల్ల ఒక మార్కెట్లో ఉన్న తక్కువ డిమాండ్ను ఇతర మార్కెట్లో ఉన్న అధిక డిమాండ్తో భర్తీ చేసుకోవచ్చు.

6. పరిశోధన ఆదాలు :
చిన్న సంస్థ కంటే పెద్ద సంస్థకు అధిక వనరులుంటాయి. అందువల్ల స్వంతంగా పరిశోధన ప్రయోగశాలను కలిగి శిక్షణ పొందిన పరిశోధకులను నియమించుకుంటుంది. వారు కనుగొనే కొత్త విషయాలు సంస్థ ఆస్తి. సంస్థ వీటిని ఉపయోగించుకొని వ్యయాన్ని తగ్గించుకొని ఉత్పత్తిని పెంచుకుంటుంది.

7. సంక్షేమ ఆదాలు :
సంస్థలు శ్రామికులకు సంక్షేమ సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. పెద్ద సంస్థలు పనిచేయడానికి మంచి పరిస్థితులను, సంస్థ లోపల, బయట కల్పిస్తాయి. సంక్షేమ సౌకర్యాలకయ్యే వ్యయం ఎక్కువగా ఉన్నా దానివల్ల శ్రామికుల సామర్థ్యం పెరిగి, మొత్తం ఉత్పత్తి పెరగడానికి, ఉత్పత్తి వ్యయం తగ్గడానికి అవకాశం ఉంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 7.
సప్లయ్ అంటే ఏమిటి ? సప్లయ్ నిర్ణాయకాలను వివరించండి.
జవాబు.
మార్కెట్లో అమ్మకందారుడు ఒక నిర్ణీత సమయంలో, ఒక నిర్ణీత ధరకు ఎంత పరిమాణం వస్తువులను అమ్మడానికి సిద్ధపడతాడో దానిని వస్తువు సప్లయ్ గా నిర్వచించవచ్చు. మొత్తం వస్తూత్పత్తిని స్టాక్ గాను, అమ్మడానికి ఇష్టపడే మొత్తాన్ని సప్లయను చూడాలి.

నిశితంగా పరిశీలిస్తే సప్లయ్క, నిలువ (stock) కు తేడా ఉంటుంది. ఉత్పత్తి చేయబడిన మొత్తాన్ని మార్కెట్కు తరలించడాన్ని నిలువ తెలుపగా వివిధ ధరల వద్ద అమ్మకందారుడు అమ్మజూపే వస్తువు పరిమాణాన్ని సప్లయ్ తెలుపుతుంది.

సప్లయ్ని నిర్ణయించే అంశాలు (Determinants of Supply) :
ఒక వస్తువు సప్లయికి దాని సప్లయ్ నిర్ణయకాలకు మధ్యగల భౌతిక సంబంధాన్ని సప్లయ్ ఫలం తెలుపుతుంది. అయితే సప్లయ్ని నిర్ణయించే అంశాలను ఇప్పుడు తెలుసుకొందాం.

(i) వస్తు ధర :
ఉత్పత్తిదారుడు వస్తువు సప్లయ్న నిర్ణయించడంలో ఆ వస్తువు ధరే ప్రధాన పాత్రను పోషిస్తుంది. వస్తువు ధర వల్ల సంస్థ లాభం నిర్ణయమవుతుంది. వస్తువు ధర పెరిగితే వస్తువుల పరిమాణాన్ని ఎక్కువగా సప్లయ్ చేస్తాడు. వస్తువు ధర తగ్గితే వస్తువు సప్లయ్ తగ్గుతుంది.

(ii) ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలు :
ప్రత్యామ్నాయ వస్తువుల ధరలు ఎక్కువగా ఉంటే వాటిని ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తిదారుడు ప్రయత్నం చేయవచ్చు. లేదా అధిక ధర ఉన్న ప్రత్యామ్నాయ వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది. అందువల్ల ఉత్పత్తిదారుడు తాను ఉత్పత్తి చేస్తున్న వస్తువు సప్లయ్ పెంచవచ్చు.

అలాగే పూరక వస్తువుల ధరలు, వాటికి ఉండే డిమాండ్ ఆధారంగా కూడా ఉత్పత్తిదారుడు తాను చేసే వస్తువు సప్లయ్న నిర్ణయించుకుంటాడు.

(iii) ఉత్పత్తి కారకాల ధరలు :
ఉత్పత్తి కారకాల ధరలు ఎక్కువగా ఉంటే ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. అదే కారకాల ధరలు తక్కువగా ఉంటే ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. అందువల్ల కారకాల ధరలు ఎక్కువగా ఉంటే వస్తువు సప్లయ్ తక్కువగాను, కారకాల ధరలు తక్కువగా ఉంటే వస్తువు సప్లయ్ ఎక్కువగాను ఉంటుంది.

(iv) సాంకేతిక పరిజ్ఞానపు స్థాయి:
సాంకేతిక పరిజ్ఞానం పెరుగుదల వల్ల ఉత్పత్తి పద్ధతుల్లో మార్పులు వస్తే, వస్తువు సప్లయ్లో మార్పులుంటాయి. నవ్యకల్పనలు (discoveries), నవకల్పనల (innovations) వల్ల కారకాలను పొదుపు చేయడంతో పాటుగా వ్యయాన్ని, సమయాన్ని తగ్గించుకోవచ్చు. అందుకే సాంకేతిక పరిజ్ఞానంలోని మార్పులవల్ల వస్తువు సప్లయ్ పెరుగుతుంది.

(v) ప్రభుత్వ విధానాలు :
ప్రభుత్వం అధిక పన్నులను వస్తువులపై విధిస్తే వస్తు సప్లయ్ తక్కువగా ఉంటుంది. తక్కువగా పన్నులు విధిస్తే వస్తువు సప్లయ్ ఎక్కువగా ఉంటుంది. వస్తూత్పత్తి రాయితీలను ఇస్తే వస్తువుల సప్లయ్ ఎక్కువగా ఉంటుంది.

(vi) ఇతర అంశాలు :
సంస్థ లక్ష్యం రవాణా, కమ్యూనికేషన్, సహజ వనరుల లభ్యత మొదలైనటువంటి అంశాలు కూడా వస్తువు సప్లయ్ ప్రభావితం చేస్తాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 8.
సప్లయ్ లోని మార్పులను గురించి చర్చించండి.
జవాబు.
మార్కెట్లో అమ్మకందారుడు ఒక నిర్ణీత సమయంలో, ఒక నిర్ణీత ధరకు ఎంత పరిమాణం వస్తువులను అమ్మడానికి సిద్ధపడతాడో దానిని వస్తువు సప్లయ్ గా నిర్వచించవచ్చు. మొత్తం వస్తూత్పత్తిని స్టాక్ గాను, అమ్మడానికి ఇష్టపడే మొత్తాన్ని సప్లయ్గాను చూడాలి.

నిశితంగా పరిశీలిస్తే సప్లయ్క, నిలువ Stock కు తేడా ఉంటుంది. ఉత్పత్తి చేయబడిన మొత్తాన్ని మార్కెట్కు తరలించడాన్ని నిలువ తెలుపగా వివిధ ధరల వద్ద అమ్మకందారుడు అమ్మజూపే వస్తువు పరిమాణాన్ని సప్లయ్ తెలుపుతుంది.

సప్లయ్ పెరుగుదల, తగ్గుదల :
వస్తువు ధర కాకుండా, ఇతర చలాంకాలలో మార్పు వస్తే సప్లయ్లో వచ్చే మార్పులను పెరుగుదల లేదా తగ్గుదల అంటారు. అంటే సప్లయ్ రేఖ పూర్తిగా బదిలీ అవుతుంది. దీనిని పటంలో చూడవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 13

OX – అక్షంపై వస్తువు సప్లయ్ పరిమాణం, OY – అక్షంపై వస్తువు ధరను కొలుస్తున్నాం. ప్రారంభంలో ‘SS’ సప్లయ్ రేఖ ఉంటే OP ధరకు 0Q వస్తు పరిమాణాన్ని అమ్మకందారుడు సప్లయ్ చేస్తాడు. ఇతర పరిస్థితులలో (వస్తువు ధర మినహా) మార్పు వచ్చి ఈ సప్లయ్ పెరిగితే సప్లయ్ రేఖ కిందకు లేదా కుడికి S1S1 గా బగిలీ అవుతుంది. అప్పుడు పూర్వపు OP ధరకే అధిక సప్లయ్ని అంటే OQ ని సప్లయ్ చేయడం లేదా పూర్వపు సప్లయ్ OQ1 ని తక్కువ ధరకు OP, కి అమ్మకం చేయడం జరుగుతుంది.

ఇతర పరిస్థితులు మారి సప్లయ్ తగ్గితే సప్లయ్ రేఖ పైకి లేదా ఎడమ వైపుకు S2S2 గా బదిలీ అవుతుంది. అప్పుడు పూర్వపు ధర OP దగ్గర OQ2 సప్లయ్ చేయడం లేదా, పూర్వపు సప్లయ్ OQ2 ని OP2 ధరకు అమ్మకం చేయడం జరుగుతుంది. అంటే సప్లయ్ పెరిగితే పూర్వపు ధరకు అధిక సప్లయ్ లేదా పూర్వపు సప్లయ్ను తక్కువ ధరకు చేస్తారు. అదే సప్లయ్ తగ్గితే పూర్వపు తక్కువ సప్లయ్ లేదా పూర్వపు సప్లయ్ను అధిక ధరకు చేస్తారు.

ప్రశ్న 9.
వ్యయాల రకాలను చర్చించండి.
జవాబు.
ఉత్పత్తి పరిమాణం, ఉత్పత్తి తరహా, ఉత్పత్తి కారకాల ధరలు మొదలైనటువంటి ఆర్థిక చలాంకాలలో వచ్చే మార్పువల్ల ఉత్పత్తి వ్యయంలో మార్పులు చోటు చేసుకొంటాయి. ఈ విధంగా ఉత్పత్తి వ్యయాలు ద్రవ్యపరమైన అంశాలను తెలుపగా, ఉత్పత్తి ఫలం భౌతిక పరమైన అంశాలను తెలుపుతుంది.

ఒక సంస్థలో వస్తువు సప్లయ్ వ్యయాలపై ఆధారపడుతుంది. ఒక వస్తువుకున్న డిమాండ్, దాని సప్లయ్లు కలిపి దాని ధరను నిర్ణయిస్తాయి. ధరల ప్రక్రియను, సప్లయ్ వెనక ఉన్న శక్తులను తెలుసుకోవడానికి వ్యయాల స్వభావాన్ని తెలుసుకోవాలి. వస్తూత్పత్తికయ్యే ఖర్చే ఉత్పత్తి వ్యయం.

వ్యయాలలోని రకాలు :
1. ద్రవ్య వ్యయాలు (Money Costs) :
ఉత్పత్తిదారుడు వివిధ ఉత్పాదకాలకు చెల్లించే ద్రవ్య రూపంలోని ప్రతిఫలాలైన భవనాలకున్న అద్దె, వేతనాలు, మూలధనానికి చెల్లించే వడ్డీ, ముడి సరుకులు, యంత్రాలు పరికరాలపై అయ్యే వ్యయాలు, యంత్రాలు, భవనాలు, ఇతర మూలధన వస్తువులపై జరిగే తరుగుదల వ్యయం, విద్యుచ్ఛక్తి, ప్రకటనలు, రవాణా, బీమా ప్రీమియం, పన్నుల కోసం చేసే చెల్లింపులు మొదలైన వాటిని ద్రవ్య వ్యయాలు అంటారు. అంటే వస్తూత్పత్తి కోసం ఒక సంస్థ చేసే ద్రవ్య ఖర్చులను ద్రవ్య వ్యయాలు అంటారు.

ఈ ద్రవ్య వ్యయాలను ప్రకటిత వ్యయాలు (explicit costs), అప్రకటిత వ్యయాలు (implicit costs) అని విభజిస్తారు. వివిధ ఉత్పత్తి కారకాలకు ఉత్పత్తి దారుడు’ చెల్లించే ద్రవ్య వ్యయాలను ప్రకటిత వ్యయాలంటారు. ఉత్పత్తి ప్రక్రియలో ఉత్పత్తి దారుడు తన సొంత వనరులను లేదా సేవలను ఉపయోగిస్తే వాటి విలువను అప్రకటిత వ్యయాలు అంటారు.

2. వాస్తవ వ్యయాలు (Real Costs) :
ఆల్ ఫ్రెడ్ మార్షల్ ప్రకారం వస్తువును తయారుచేయడానికి ఉత్పత్తి కారకాల యజమానులు చేసిన త్యాగాలను ఉత్పత్తికయ్యే వాస్తవిక వ్యయాలంటారు. భూస్వామి భూమి ఇచ్చినప్పుడు తాను కోల్పోయిన పంటే అతని త్యాగం.

శ్రామికుడు పని చేసే శ్రమలో ఇమిడి ఉన్న శారీరక శ్రమ, బాధ, అతడు కోల్పోయే విశ్రాంతి అతని త్యాగం. పెట్టుబడిదారులు తాము పొదుపు చేసి పెట్టుబడి పెట్టాలంటే వినియోగాన్ని కోల్పోతారు. అది వారి త్యాగం.

వ్యవస్థాపకులు వ్యాపారాన్ని నిర్వహించేటప్పుడు అనిశ్చితను, నష్ట భయాన్ని భరించడం, విశ్రాంతిని కోల్పోవడం జరుగుతుంది. అది వారి త్యాగం. వీటినన్నిటిని వాస్తవిక వ్యయాలంటారు. ద్రవ్య వ్యయాలు, వాస్తవిక వ్యయాలు ఒకదానితో ఒకటి సమానం కావు.

3. అవకాశ వ్యయాలు (Opportunity Costs) :
ప్రత్యామ్నాయ ప్రయోజనాలు కలిగి, కొరతగా ఉన్న వనరులను ఒకే సమయంలో అనేక రకాల వస్తూత్పత్తికి ఉపయోగించలేరు. ఒక రకం వస్తూత్పత్తికి సాధనాలను వినియోగించాలంటే వాటిని ఇతర ఉపయోగాల నుంచి ఉపసంహరించవలసి ఉంటుంది. ఒక వస్తూత్పత్తికి బదులుగా మరొక వస్తూత్పత్తిని చేయడానికి కారకాన్ని వాడితే కోల్పోయిన ప్రత్యామ్నాయ ఉత్పత్తి విలువే అవకాశ వ్యయం.

Y వస్తువులకు బదులుగా X వస్తువును తయారు చేయడానికి వనరులను వాడితే ఒక యూనిట్ X వస్తూత్పత్తికి త్యాగం చేయాల్సిన Y వస్తూత్పత్తి పరిమాణమే ప్రత్యామ్నాయ లేదా అవకాశ వ్యయం. ఒక ఉత్పత్తి కారకం అవకాశ వ్యయం ప్రస్తుత ఉపయోగంలో కాకుండా దాని తరువాత అత్యుత్తమ ఉపయోగంలో వాడితే ఆర్జించగలిగే మొత్తానికి సమానం. భూమిని గోధుమ పంట పండించడానికి విడితే అదే భూమిలో పండించగలిగి ఉండే వేరొక పంట విలువే అవకాశ వ్యయం.

4. స్థిర వ్యయాలు (Supplementary Costs) :
ఉత్పత్తిలోని మార్పులతోపాటు మారకుండా స్థిరంగా ఉండే వ్యయాలను మొత్తం. స్థిర వ్యయాలంటారు. స్థిర కారకాలకు చెల్లించే భాటకం, వడ్డీ, తరుగుదల వ్యయం, శాశ్వత సిబ్బందికి చెల్లించే వేతనాలు మొదలైన రూపంలో ఉంటాయి. సంస్థ ఉత్పత్తిని ఆపినా స్థిర వ్యయాలను భరించవలసి ఉంటుంది. మార్షల్ స్థిర వ్యయాలను అనుబంధ వ్యయాలని (supplementary costs) లేదా వ్యవస్థాపరమైన వ్యయాలని (overhead costs) అన్నాడు.

5. చర వ్యయాలు (Direct Costs) :
అధిక మొత్తంలో ఉత్పత్తికి ఎక్కువ మొత్తంలో చర ఉత్పత్తి కారకాలైన శ్రమ, ముడి సరుకులు, విద్యుచ్ఛక్తి, ఇంధనం మొదలైనవి కావాలి. అందువల్ల ఈ ఉత్పత్తి వ్యయాలను చర వ్యయాలు అంటారు. ఉ పెంచినప్పుడు ఇవి పెరుగుతాయి. అలాగే ఉత్పత్తిని తగ్గించినప్పుడు చర వ్యయాలు కూడా క్షీణిస్తాయి.

ఉత్పత్తి ఏ వాతే చర వ్యయాలు కూడా ఉండవు. చర వ్యయాలనే ప్రత్యక్ష వ్యయాలు (direct costs) అంటారు. వీటిని మార్షల్ ప్రధాన వ్యయాలు (prime costs) అన్నాడు.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 10.
మొత్తం వ్యయం, మొత్తం చర వ్యయం, మొత్తం స్థిర వ్యయాల సంబంధాన్ని వివరించండి.
జవాబు.
ఉత్పత్తి పరిమాణం, ఉత్పత్తి తరహా, ఉత్పత్తి కారకాల ధరలు మొదలైనటువంటి ఆర్థిక చలాంకాలలో వచ్చే మార్పువల్ల ఉత్పత్తి వ్యయంలో మార్పులు చోటు చేసుకొంటాయి. ఈ విధంగా ఉత్పత్తి వ్యయాలు ద్రవ్యపరమైన అంశాలను తెలుపగా, ఉత్పత్తి ఫలం భౌతిక పరమైన అంశాలను తెలుపుతుంది. ఒక సంస్థలో వస్తువు సప్లయ్ వ్యయాలపై ఆధారపడుతుంది. ఒక వస్తువుకున్న డిమాండ్, దాని సప్లయ్లు కలిపి దాని ధరను నిర్ణయిస్తాయి.

ధరల ప్రక్రియను, సప్లయ్ వెనుక ఉన్న శక్తులను తెలుసుకోవడానికి వ్యయాల స్వభావాన్ని తెలుసుకోవాలి. వస్తూత్పత్తికయ్యే ఖర్చే ఉత్పత్తి వ్యయం.
స్వల్ప కాలంలో ఒక సంస్థ చేసే వ్యయాలు రెండు రకాలుగా ఉంటాయి. వీటిని స్థిర వ్యయాలు, చర వ్యయాలుగా వర్గీకరించవచ్చు.

స్థిర వ్యయాలు, చర వ్యయాలు :
అధిక మొత్తంలో ఉత్పత్తికి ఎక్కువ మొత్తంలో చర ఉత్పత్తి కారకాలైన శ్రమ, ముడి సరుకులు, విద్యుచ్ఛక్తి, ఇంధనం మొదలైనవి కావాలి. అందువల్ల ఈ ఉత్పత్తి వ్యయాలను చర వ్యయాలు అంటారు. ఉత్పత్తి పెంచినప్పుడు ఇవి పెరుగుతాయి.

అలాగే ఉత్పత్తిని తగ్గించినప్పుడు చర వ్యయాలు కూడా క్షీణిస్తాయి. ఉత్పత్తి ఏమీ ఉండకపోతే చర వ్యయాలు కూడా ఉండవు. చర వ్యయాలనే ప్రత్యక్ష వ్యయాలు (direct costs) అంటారు. వీటిని మార్షల్ ప్రధాన వ్యయాలు (prime costs) అన్నాడు.

ఉత్పత్తిలోని మార్పులతోపాటు మారకుండా స్థిరంగా ఉండే వ్యయాలను మొత్తం స్థిర వ్యయాలంటారు. స్థిర కారకాలకు చెల్లించే భాటకం, వడ్డీ, తరుగుదల వ్యయం, శాశ్వత సిబ్బందికి చెల్లించే వేతనాలు మొదలైన రూపంలో ఉంటాయి. సంస్థ ఉత్పత్తిని ఆపినా స్థిర వ్యయాలను భరించవలసి ఉంటుంది. మార్షల్ స్థిర వ్యయాలను అనుబంధ వ్యయాలని (supplementary costs) లేదా వ్యవస్థాపరమైన వ్యయాలని (overhead costs) అన్నాడు.

మొత్తం ఉత్పత్తి (TP)మొత్తం స్థిర వ్యయం (TFC)మొత్తం చర వ్యయం (TVC)మొత్తం వ్యయం (TC)
03000300
1300300600
2300400700
3300450750
4300500800
5300600900
63007201020
73008901090
830011001400
930013501650
1030020002300

పైన తెలిపిన విధంగా, స్వల్ప కాలంలో ఉత్పత్తిదారుడు చర ఉత్పత్తి కారకాలను మార్చడం ద్వారా మాత్రమే వస్పూత్పత్తిని పెంచగలడు. స్థిర కారకాలైనటువంటి భవనాలు, మూలధనం, శాశ్వత ఉద్యోగులు వంటి వాటిని మార్చుటకు వీలుకాదు.

అందువల్ల స్వల్ప కాలంలో స్థిర, చర వ్యయాలు ఉంటాయి. ఇవి మొత్తం వ్యయం (TC), మొత్తం చర వ్యయం (TVC), మొత్తం స్థిర వ్యయం (TFC), మొత్తం చర, స్థిర వ్యయాలకు మొత్తం వ్యయం సమానం కాబట్టి (TC = TFC + TVC).

పట్టికలో మొత్తం స్థిర వ్యయం, మొత్తం చర వ్యయం, మొత్తం వ్యయాల మధ్య ఉన్న సంబంధాన్ని వివరించడం జరిగింది. ఉత్పత్తి పరిమాణం శూన్యమైనా, పెరిగినా, తగ్గినా, ఎంత ఉన్నా మొత్తం స్థిర వ్యయం ? 300 లుగా ఉంది. ఉత్పత్తి శూన్యమైతే మొత్తం చర వ్యయం శూన్యం.

ఉత్పత్తి పెరుగుతుంటే చర వ్యయం ప్రారంభంలో తరహాననుసరించిన ఆదాల వల్ల తగ్గుతున్న రేటులో పెరుగుతుంది. ఆ తరువాత నష్టదాయకాల కారణంగా మొత్తం చర వ్యయం స్థిర రేటులో పెరిగి చివరగా అది పెరుగుతున్న రేటులో పెరుగుతుంది.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 14

పై పటంలో మొత్తం స్థిర వ్యయం, మొత్తం చర వ్యయం, మొత్తం వ్యయాలకు ఉన్న సంబంధం వివరించబడింది. TFC క్షితిజ రేఖ (horizontal) మొత్తం స్థిర వ్యయాన్ని, TVC రేఖ మొత్తం చర వ్యయాన్ని, TC రేఖ మొత్తం వ్యయాన్ని చూపిస్తున్నాయి. ఉత్పత్తి ఎంత ఉన్నా మొత్తం స్థిర వ్యయం మారదు. అందువల్ల TFC రేఖ OX – అక్షానికి సమాంతరంగా ఉంది. TVC రేఖ మూల బిందువు ‘0’ దగ్గర ప్రారంభమౌతుంది. ఎందుకంటే ఉత్పత్తి శూన్యమైతే TVC కూడా శూన్యం. తరువాత ఉత్పత్తి పెరుగుతుంటే TVC కూడా పెరుగుతుంది.

స్థిర కారకాలతో పోల్చినప్పుడు తక్కువ పరిమాణంలో చర ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకొన్నంత కాలం మొత్తం చర వ్యయం తగ్గుతున్న రేటులో పెరుగుతుంది. కారణం తరహా ఆదాలు ఉండటమే. ఒక స్థాయి దాటిన తరువాత స్థిర కారకాలతో పోల్చినప్పుడు చర కారకాలను అధికంగా వాడటం జరుగుతుంది.

అప్పుడు TVC నష్టదాయకాల కారణంగా పెరుగుతున్న రేటులో పెరుగుతుంది. ఉత్పత్తి పెరుగుతుంటే మొత్తం వ్యయం నిర్విరామంగా పెరుగుతుంది. మొత్తం వ్యయ రేఖ OY – అక్షంపై మూల బిందువుకు పైన TFC రేఖ ప్రారంభమైన బిందువు దగ్గర ప్రారంభమై ఎడమ నుంచి కుడికి పైకి పోతుంది.

ఉత్పత్తి శూన్యమైనా TFC ఉంటుంది. ఈ కారణంగా TFC = TC అవుతుంది. అందువల్ల TC రేఖ TFC రేఖ ప్రారంభమైన బిందువు దగ్గరే ప్రారంభమౌతుంది. TFC రేఖ క్షితిజ సరళ రేఖ. అందుకే TC రేఖ TVC రేఖలాగానే ఉండి TVC రేఖకు పైన సమాంతరంగా ఉంటుంది. TC రేఖకు TFC రేఖకు మధ్య ఉన్న తేడానే TVC కాబట్టి TVC = TC – TFC.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 11.
సగటు వ్యయం, ఉపాంత వ్యయ సంబంధాన్ని తెలపండి.
జవాబు.
వస్తువు ఉత్పత్తికై ప్రక్రియలో చేసే వ్యయాన్ని ఉత్పత్తి వ్యయం అంటారు. ఉత్పత్తి మొత్తం మీద జరిగే వ్యయం మొత్తం వ్యయము. ఉత్పత్తి పెరిగితే మొత్తం వ్యయం పెరుగుతుంది. ఉత్పత్తి తగ్గితే మొత్తం వ్యయం తగ్గుతుంది.
సగటు వ్యయము :
మొత్తం వ్యయాన్ని మొత్తం వస్తురాశితో భాగిస్తే సగటు వ్యయం వస్తుంది. ఇది వస్తువు ఒక యూనిట్కి అయ్యే వ్యయాన్ని తెలియజేస్తుంది.
సగటు వ్యయము = మొత్తం వ్యయం / వస్తురాశి

ఉపాంత వ్యయము :
మొత్తం వ్యయము (TC) నుండి ఉపాంత వ్యయం (MC) లభిస్తుంది. మొత్తం వ్యయంలో తేడాను, వస్తు పరిమాణంలో వచ్చే తేడాతో భాగిస్తే ఉపాంత వ్యయం వస్తుంది.
ఉపాంత వ్యయం = మొత్తం వ్యయంలో మార్పు / వస్తు పరిమాణంలో మార్పు

ఈ క్రింది రేఖాపటం ద్వారా సగటు, ఉపాంత వ్యయాల సంబంధాన్ని పరిశీలించవచ్చు.
రేఖాపటములో X – అక్షముపై ఉత్పత్తి యూనిట్లని, Y- అక్షముపై వ్యయాన్ని చూపాము. AC సగటు వ్యయరేఖ, MC ఉపాంత వ్యయరేఖ.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 15

SAC స్వల్పకాలిక వ్యయరేఖ, SMC స్వల్పకాలిక ఉపాంత రేఖ. ఉత్పత్తి పెరుగుతుంటే మొదట సగటు వ్యయం తగ్గుతుంది. సగటు వ్యయం తగ్గుతున్నంత వరకు ఉపాంత వ్యయం, సగటు వ్యయం కన్నా తక్కువగా ఉంటుంది.

ఉత్పత్తిని కొనసాగిస్తే సగటు వ్యయం కనిష్ట స్థాయికి వస్తుంది. ఉపాంత వ్యయం, సగటు వ్యయంతో సమానమౌతుంది. SAC మరియు SMC ఖండించుకున్న ‘A’ బిందువు వద్ద ఉత్పత్తి వ్యయం కనిష్టంగా ఉంటుంది.

  1. సగటు వ్యయం తగ్గుతూ ఉంటే ఉపాంత వ్యయం, సగటు వ్యయం కంటే ఎక్కువ తగ్గుతుంది. అందువల్ల సగటు వ్యయరేఖకు క్రిందివైపు ఉపాంత వ్యయరేఖ ఉంది.
  2. సగటు వ్యయం కనిష్టంగా ఉన్నప్పుడు ఉపాంత వ్యయం సగటు వ్యయానికి సమానమైంది. కనుక సగటు వ్యయరేఖ కనిష్ట బిందువు వద్ద ఉపాంత వ్యయరేఖ క్రింద నుండి ‘N’ బిందువు వద్ద ఖండించింది.
  3. సగటు వ్యయం పెరుగుతూ ఉంటే ఉపాంత వ్యయం, సగటు వ్యయం కంటే ఎక్కువగా పెరుగుతోంది. అందువల్ల ఉపాంత వ్యయరేఖ సగటు వ్యయరేఖకు పైన ఉంది. ఈ విషయాలను పట్టిక, పటములో పరిశీలించవచ్చును. చరానుపాత సూత్రాల ప్రభావం, తరహాననుసరించి ప్రతిఫలాల ప్రభావము వలననే వ్యయరేఖలు ‘U’ ఆకారంలో ఉన్నాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 12.
సంపూర్ణ పోటీ, ఏకస్వామ్యంలలో సగటు, ఉపాంత రాబడుల స్వభావాన్ని పటాల సహాయంతో వివరించండి.
జవాబు.
పరిపూర్ణ పోటీ మార్కెట్లో అనేకమంది అమ్మకందార్లు, కొనుగోలుదార్లు ఉంటారు. ఈ మార్కెట్లో వస్తువులు సజాతీయాలు. రవాణా ఛార్జీలు, అమ్మకపు వ్యయాలు ఉండవు. కాబట్టి మార్కెట్ అంతటా ఒకే ధర ఉంటుంది. ఈ మార్కెట్లో రాబడుల యొక్క స్వభావాన్ని ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 16

పై పట్టికలో ఉత్పత్తి పరిమాణం ఎంత ఉన్నా ఒకే ధరకు కౌ 10 అమ్మటం జరిగింది. ఉత్పత్తి ధరతో గుణించగా మొత్తం రాబడి వస్తుంది. మొత్తం రాబడి ఒకే మొత్తంలో పెరుగుతూ ఉంది. పట్టికలో సగటు, ఉపాంత రాబడి ఒకే సంఖ్యను కలిగి ఉన్నాయి. ఈ మార్కెట్లో వస్తువు ధర, సగటు, ఉపాంత రాబడులు ఒకటిగానే ఉన్నాయి. దీనిని ఈ క్రింది రేఖాపటాల ద్వారా చెప్పవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 17

పటంలో (A), (B) లో X- అక్షంపైన వస్తు పరిమాణాన్ని, Y- అక్షంపైన ధరను, రాబడులను కొలుస్తున్నాం. పటం (A) లో DD -డిమాండ్ రేఖ, SS – సప్లయ్ రేఖ రెండు E దగ్గర ఖండించి కున్నప్పుడు పరిశ్రమలో సమలతౌల్యం ఏర్పడి OP ధర నిర్ణయించడింది. ఈ OP ధరకే సంస్థ వస్తువులను అమ్ముతుంది. అందుకే పటం (B) లో OP ధర | ఉన్నప్పుడు AR రేఖ MR రేఖ కలిసిపోయి X – అక్షానికి సమాంతరంగా రేఖ ఉంది.

ఏకస్వామ్యంలో AR, MR రేఖలు (AR and MR Curves under Monopoly) :
ఏకస్వామ్యంలో ఒకే అమ్మకందారుడుంటాడు. సమీప ప్రత్యామ్నాయాలు ఉండవు. జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం చాలా అల్పంగా ఉంటుంది. ధరను లేదా వస్తురాశిని ఏదో ఒక్కదానిని ఏకస్వామ్యదారుడు నిర్ణయిస్తే మరొకటి మార్కెట్లో ఉండే డిమాండ్ను బట్టి నిర్ణయించబడుతుంది. అంతేగాని రెండింటిని ఒకేసారి నిర్ణయించలేడు.

ఏకస్వామ్యదారుడు అమ్మకాలను పెంచుకోవడానికి ధరను తగ్గిస్తాడు. ధరే సగటు రాబడి కాబట్టి, సగటు రాబడి కూడా క్రమేణ క్షీణిస్తుంది. అందువల్ల డిమాండ్ రేఖ అంటే సగటు రాబడి రేఖ ఎడమ నుంచి కుడి వైపుకు కిందికి వాలుతుంది. ఉపాంత రాబడి కూడా తగ్గుతుంది. సగటు రాబడి కంటే ఉపాంత రాబడి తక్కువగా ఉంటుంది. అందువల్ల సగటు రాబడి రేఖకు ఉపాంత రాబడి రేఖ కింద ఉంటుంది. సగటు రాబడిలో తగ్గుదల రేటుకంటే ఉపాంత రాబడిలోని తగ్గుదల రేటు ఎక్కువగా ఉంటుంది.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 18

పట్టికలో ధర లేదా సగటు రాబడి ప్రతిసారి ₹ 1 చొప్పున తగ్గుతుంటే ఉపాంత రాబడి ప్రతిసారి ₹ 2 చొప్పున తగ్గుతుంది. ధర, సగటు రాబడులు సమానంగా ఉన్నాయి. ఇవి ఉపాంత రాబడి కంటే ఎక్కువగా ఉన్నాయి. అంటే P = AR > MR. ధర తగ్గినప్పుడు అమ్మకాలు పెరిగి మొత్తం రాబడి పెరుగుతున్నట్లుగా పట్టికలో చూడవచ్చు. సగటు రాబడి, ఉపాంత రాబడి రేఖలను పటంలో పరిశీలించవచ్చు.

OX – అక్షంపైన వస్తువు పరిమాణాన్ని, OY అక్షంపైన రాబడులను P కొలుస్తున్నాం.

పటంలో AR – సగటు రాబడి రేఖ, MR – ఉపాంత రాబడి రేఖ రెండూ సరళ రేఖలుగా ఉండి ఎడమ నుంచి కుడికి కిందకు వాలుతున్నాయి. AR రేఖకు MR రేఖ కింద ఉంటుంది. ఏకస్వామ్య పోటీలో AR, MR రేఖలు మిగతా మార్కెట్లలో కంటే అధిక వ్యాకోచంగా ఉంటాయి.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 19

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భూమి లక్షణాలను వివరించండి.
జవాబు.
అర్థశాస్త్రంలో భూమి అనగా భూమి ఉపరితలంతో పాటు అడవులు, నీరు, వాతావరణం, ఖనిజాలు, ఇంధనం మొదలగునవి. భూమికి క్రింది లక్షణాలు ఉన్నాయి :

  1. భూమి ప్రకృతి ప్రసాదితం.
  2. భూమి సప్లయ్ పూర్తి అవ్యాకోచం.
  3. భూమికి సప్లయ్ ధర లేదు.
  4. భూమికి గమనశీలత లేదు.
  5. భూమి సారాలలో తేడాలు ఉంటాయి.

ప్రశ్న 2.
శ్రమ విభజన అంటే ఏమిటి ?
జవాబు.
ఒక వస్తువు ఉత్పత్తి ప్రక్రియ వివిధ భాగాలుగా విభజించి వీటిని వివిధ నైపుణ్యం గల శ్రామికులకు కేటాయించడాన్ని శ్రమ విభజన అని అంటారు. ఏ శ్రామికుడు ఒక వస్తువును పూర్తిగా తయారుచేయడు. ప్రతి శ్రామికుడు వస్తువులోని ఒక భాగాన్ని మాత్రమే తయారు చేస్తాడు. ఈ భావనను ఆడమ్ స్మిత్ వివరించినాడు. అధిక సామర్థ్యం, ప్రత్యేక నైపుణ్యం వలన శ్రమ విభజన ఉత్పత్తిలో పెరుగుదలకు దారి తీస్తుంది.

ప్రశ్న 3.
ఉత్పత్తి ఫలం నిర్వచించండి.
జవాబు.
ఉత్పాదకాలకు, ఉత్పత్తికి మధ్య ఉండే భౌతిక సంబంధాన్ని తెలుపుతుంది. ఉత్పత్తి కారకాల రేటుకు, ఉత్పత్తి రేటుకు మధ్య ఉండే సంబంధాన్ని ఉత్పత్తి ఫలంగా స్టిగ్లర్ వర్ణించాడు. దీనిని ఈ క్రింది సమీకరణం ద్వారా తెలియజేయవచ్చు :
Q = f (N, L, C, O, T)
ఇక్కడ Q = ఉత్పత్తి; N, L, C, O, T వరుసగా భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, సాంకేతిక ప్రగతి.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 4.
సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తి భావనలను వివరించండి.
జవాబు.
ఉపాంత ఉత్పత్తి (Marginal Product – MP) : చర సాధనాన్ని L అదనంగా ఉపయోగించినందువల్ల మొత్తం ఉత్పత్తిలో వచ్చిన అదనపు పెరుగుదలను ఉపాంత ఉత్పత్తి అంటారు. అంటే
MPn = TPn – TPn-1 లేదా MP = \(\frac{\mathrm{dTP}}{\mathrm{dL}}\)
ఇక్కడ, MPn = nవ కారక ఉపాంత ఉత్పత్తి
TPn = ప్రస్తుత మొత్తం ఉత్పత్తి
TPn – 1 = పూర్వపు మొత్తం ఉత్పత్తి
dTP = మొత్తం ఉత్పత్తిలో మార్పు
dL = చర కారకం ఉపయోగంలో మార్పు
సగటు ఉత్పత్తి (Average Product – AP) :
మొత్తం ఉత్పత్తిని చర ఉత్పత్తి కారకాల సంఖ్యచే భాగించగా ‘సగటు ఉత్పత్తి’ లభిస్తుంది. అంటే
AP = \(\frac{\mathrm{TP}}{\mathrm{L}}\)
= మొత్తం ఉత్పత్తి / శ్రామికుల సంఖ్య

ప్రశ్న 5.
ఉత్పత్తి కారకాలు వర్గీకరణను వివరించండి.
జవాబు.
ఆధునిక ఆర్థిక వ్యవస్థలో వస్తూత్పత్తి ప్రక్రియ చాలా క్లిష్టతరంగా మారింది. ఒక వస్తువు అనేక దశలు దాటి అంతిమ రూపంలో వినియోగదారునికి చేరుతుంది. వస్తుసేవల ఉత్పత్తికి ఉత్పత్తి కారకాలు కావాలి. ఈ ఉత్పత్తి కారకాలు సహజ కారకాలు కావచ్చు లేదా మానవ నిర్మిత కారకాలైనా కావచ్చు.

ఉత్పత్తి కారకాలు నాలుగు రకాలు అవి : భూమి (land), శ్రమ (labour), మూలధనం (capital), వ్యవస్థాపన (organization). ఒక దేశంలో జరిగే మొత్తం ఉత్పత్తి అనేది ఉత్పత్తి కారకాల పరిమాణం, వాటి నాణ్యతపై ఆధారపడుతుంది.

ప్రశ్న 6.
సాంకేతిక ఆదాలు వివరించండి.
జవాబు.
శ్రమ విభజన వలన ఉత్పత్తి పెరిగినపుడు ఉత్పత్తికి అయ్యే సగటు శ్రమ వ్యయం తగ్గుతుంది. సామర్థ్యం పెరుగుతుంది. పెద్ద సంస్థ ఎక్కువ సామర్థ్యం గల మంచి, పెద్ద యంత్రాలను, అధునాతన ఉత్పత్తి పద్ధతులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వలన ఉత్పత్తి బాగా పెరుగుతుంది.

సాంకేతిక ఆదాలను, కెర్న్ క్రాస్ మేలు రకం పద్ధతులు, విస్తారం, అనుసంధాన ప్రక్రియ, ఉప ఉత్పత్తులు, ప్రత్యేకీకరణ అని విభజించారు.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 7.
మూలధన ప్రాధాన్యత ఏమిటి ?
జవాబు.
మూలధన ప్రాధాన్యత గురించి క్లుప్తంగా తెలుసుకొందాం :

  1. మూలధనం లేకుండా ఉత్పత్తి జరగదు. ఆర్థికాభివృద్ధిలో దీని పాత్ర ముఖ్యం.
  2. మూలధనం శ్రామికులకు అవసరమైన యంత్రాలు, పనిముట్లు అందించి వారి సామర్థ్యాన్ని, ఉత్పాదక శక్తిని పెంచడానికి దోహదపడుతుంది. ఇది మొత్తం ఉత్పత్తిని పెంచుతుంది.
  3. మూలధన సంచయనం వల్ల సాంకేతిక ప్రగతి ఏర్పడుతుంది.
  4.  ఉద్యోగ అవకాశాలను పెంచడానికి దోహదపడుతుంది.

ప్రశ్న 8.
బహిర్గత ఆదాలు వివరించండి.
జవాబు.
ఒక పరిశ్రమలోని సంస్థల సంఖ్య లేదా ఆ పరిశ్రమ పరిమాణం పెరిగినపుడు వచ్చే ఆదాలను బహిర్గత ఆదాలు అంటారు. పరిశ్రమను ఒక ప్రాంతంలో స్థాపించినపుడు నవ కల్పనలు ప్రవేశపెట్టడం వలన, ప్రత్యేకీకరణను ప్రవేశ పెట్టడం వలన ఏర్పడే ఆదాలను బహిర్గత ఆదాలు అంటారు. అవి :

  1. (a) కేంద్రీకరణ ఆదాలు
  2. సమాచార ఆదాలు
  3. ప్రత్యేకీకరణ ఆదాలు
  4. శ్రేయస్సు సంబంధించి ఆదాలు

ప్రశ్న 9.
మూలధన సంచయనం అంటే ఏమిటి ?
జవాబు.
మూలధన సంచయనం (Capital Formation) : దేశంలో వాస్తవిక మూలధనం పెరిగితే, అంటే వస్తువులను ఇంకా ఉత్పత్తి చేయడానికి వాడే మూలధన వస్తువులైన యంత్రాలు, యంత్ర పరికరాలు, రవాణా పనిముట్లు, శక్తి వనరులు వంటివి పెరిగితే మూలధన సంచయనం జరిగినట్లు. మూలధన సంచయనం జరగాలంటే పొదుపు చేయాలి. ఈ పొదుపును పెట్టుబడిగా మార్చాలి.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 10.
సప్లయ్ ఫలంను నిర్వచించండి.
జవాబు.
ఒక వస్తువు ధరకు, సప్లయ్కు, సప్లయ్న నిర్ణయించే అంశాలకు మధ్య గల సంబంధాన్ని సప్లయ్ ఫలం తెలియచేస్తుంది. దీనిని క్రింది విధంగా వివరించవచ్చు: ..
Sx = f (Px, Py, Pf, T, Gp, Gf)
Sx = X వస్తువు సప్లయ్
f = ప్రమేయ సంబంధం
Px = X వస్తువు ధర
Py = ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలు
T = సాంకేతిక స్థాయి
Gf = సంస్థ లక్ష్యాలు
Gp = ప్రభుత్వ విధానాలు

ప్రశ్న 11.
సప్లయ్ సూత్రం నిర్వచించండి.
జవాబు.
ఇది వస్తువు ధరకు, వస్తు సప్లయ్కి గల సంబంధాన్ని తెలియజేయును. ఇతర అంశాలు మారకుండా ఉంటే వస్తు ధర పెరిగితే వస్తు సప్లయ్ పెరుగును. ధర తగ్గితే వస్తు సప్లయ్ తగ్గుతుందని సప్లయ్ సూత్రం తెలియజేయును. అనగా సప్లయ్కి, ధరకు మధ్య అనులోమ సంబంధం ఉంటుంది.

ప్రశ్న 12.
సప్లయ్ పట్టిక, సప్లయ్ రేఖలను వివరించండి.
జవాబు.
ఒక మార్కెట్లో అమ్మకందారుడు, ఒక నిర్ణీత సమయంలో, ఒక నిర్ణీత ధరకు ఎంత పరిమాణం వస్తువులను అమ్మడానికి సిద్ధంగా ఉంటాడో దానిని ఆ వస్తువు సప్లయ్ అంటారు. దీనిని ఒక పట్టిక రూపంలో చెబితే అది సప్లయ్ పట్టిక అవుతుంది. సప్లయ్ పట్టిక ఆధారంగా సప్లయ్ రేఖను గీయవచ్చు.

పట్టిక ప్రకారం ధర పెరిగితే సప్లయ్ పెరుగుతుంది. ధర తగ్గితే సప్లయ్ తగ్గుతుంది. సప్లయ్ రేఖ పటం ప్రకారం, ఎడమ నుండి కుడికి పైకి వాలుతూ, ధనాత్మక సంబంధాన్ని చూపుతుంది.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 20

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 13.
ద్రవ్య వ్యయాలు అంటే ఏమిటి ?
జవాబు.
ఉత్పత్తిదారుడు వివిధ ఉత్పాదకాలకు చెల్లించే ద్రవ్య రూపంలోని ప్రతిఫలాలైన భవనాలకున్న అద్దె, వేతనాలు, మూలధనానికి చెల్లించే వడ్డీ, ముడి సరుకులు, యంత్రాలు, పరికరాలపై అయ్యే వ్యయాలు, యంత్రాలు, భవనాలు, ఇతర మూలధన వస్తువులపై జరిగే తరుగుదల వ్యయం, విద్యుచ్ఛక్తి, ప్రకటనలు, రవాణా, బీమా ప్రీమియం, పన్నుల కోసం చేసే చెల్లింపులు మొదలైన వాటిని ద్రవ్య వ్యయాలు అంటారు.

అంటే వస్తూత్పత్తి కోసం ఒక సంస్థ చేసే ద్రవ్య ఖర్చులను ద్రవ్య వ్యయాలను ప్రకటిత వ్యయాలు (explicit costs), అప్రకటిత వ్యయాలు (implicit costs) అని విభజిస్తారు. వివిధ ఉత్పత్తి కారకాలకు ఉత్పత్తి దారుడు చెల్లించే ద్రవ్య వ్యయాలను ప్రకటిత వ్యయాలంటారు. ఉత్పత్తి ప్రక్రియలో ఉత్పత్తి దారుడు తన సొంత వనరులను లేదా సేవలను ఉపయోగిస్తే వాటి విలువను అప్రకటిత వ్యయాలు అంటారు.

ప్రశ్న 14.
అవకాశ వ్యయం అంటే ఏమిటి ?
జవాబు.
ఒక ఉత్పాదకాన్ని ఒక ప్రయోజనానికి బదులుగా మరొక ప్రయోజనానికి వాడితే కోల్పోయిన ఉత్పత్తిని అవకాశవ్యయం అంటారు.

ప్రశ్న 15.
మొత్తం స్థిర వ్యయరేఖను విశదీకరించండి.
జవాబు.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 21

ఉత్పత్తితో పాటు మారకుండా స్థిరంగా ఉండే వ్యయాలను మొత్తం స్థిర వ్యయాలు అంటారు. సంస్థ ఉత్పత్తిని ఆపినా స్థిర వ్యయాలు భరించవలసి ఉంటుంది. మొత్తం స్థిర వ్యయరేఖ X – అక్షానికి సమాంతరంగా ఉంటుంది. ఉత్పత్తి ఎంత ఉన్నా స్థిర వ్యయం మారదు. పటంలో వ్యయాన్ని Y- అక్షంపైనా, ఉత్పత్తిని X – అక్షంపైనా చూపినాము.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 16.
సగటు ఉపాంత వ్యయాల మధ్య సంబంధంను వివరించండి.
జవాబు.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 22

సగటు ఉపాంత వ్యయ రేఖలు రెండూ ‘U’ ఆకారంలో ఉంటాయి. ఉత్పత్తి స్థాయి పెరుగుతున్నపుడు ప్రారంభంలో సగటు వ్యయం, ఉపాంత వ్యయం రెండూ తగ్గుతూ ఉంటాయి. సగటు వ్యయరేఖ కనిష్ట బిందువు వద్ద ఉపాంత వ్యయరేఖ ఖండిస్తుంది. ఉత్పత్తిలో పెరుగుదల ఒక దశ దాటిన తరువాత సగటు, ఉపాంత వ్యయాలు రెండూ కూడా పెరుగుతాయి. దీనిని ఇచ్చిన రేఖా పటంలో చూపవచ్చు.

ప్రశ్న 17.
సంపూర్ణ పోటీలో AR, MR రేఖల స్వభావాన్ని వివరించండి.
జవాబు.
ఒక సంస్థ వివిధ ధరల వద్ద వస్తువులను అమ్మగా పొందిన ఆదాయంను రాబడి అంటారు. అనగా TR = Price × Quantity sold. సంపూర్ణ పోటిలో అమ్మకందార్లు, కొనుగోలుదారులు అధిక సంఖ్యలో ఉంటారు. వస్తువులు సజాతీయంగా ఉంటాయి. పరిశ్రమలో ఒకే ధర ఉంటుంది.

ఈ ధర వద్ద సంస్థలన్ని ఎంత పరిమాణ్ణానైనా అమ్ముతాయి. సంస్థ డిమాండు రేఖయే, ధర రేఖ లేదా సగటు రాబడి రేఖ. లేదా ఉపాంత రాబడి రేఖ. ఈ రేఖ (P = AR = MR) X – అక్షానికి సమాంతరంగా ఉంటుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 18.
ఏకస్వామ్యంలో AR, MR రేఖల స్వభావాన్ని వివరించండి.
జవాబు.
ఏకస్వామ్యంలో ఒకే ఒక అమ్మకందారుడు ఉంటాడు. సమీప ప్రత్యామ్నాయాలు ఉండవు. ఏకస్వామ్యదారుడు అమ్మకాలను పెంచుకోవటానికి ధరను తగ్గిస్తాడు. ‘ధరే సగటు రాబడి, కాబట్టి సగటు రాబడి రేఖ క్రమేణా క్షీణిస్తుంది.

అందువలన ధర రేఖ లేదా డిమాండు రేఖ లేదా సగటు రాబడి (AR) రేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. ఉపాంత రాబడి (MR) కూడా తగ్గుతుంది. AR కంటే MR తక్కువగా ఉంటుంది. అందువలన సగటు రాబడి రేఖకు దిగువన ఉపాంత రాబడి రేఖ ఉంటుంది. AR లోని తగ్గుదల కంటే MR లోని తగ్గుదల ఎక్కువ.