TS Inter 1st Year Telugu Grammar లేఖారచన

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material Grammar లేఖారచన Questions and Answers.

TS Inter 1st Year Telugu Grammar లేఖారచన

మన మనసులోని భావాలను, ఆలోచనలను, సమాచారాన్ని ఇతరులకు తెలుపడానికి ఉత్తమసాధనం ఉత్తరం. ఒకప్పుడు ఉత్తరం అనే దానిని నేడు మనం లేఖ అంటున్నాం. సాధారణంగా అన్ని సందర్భాలలో వ్యక్తులతో, సంస్థలతో ప్రత్యక్షంగా చర్చించలేని విషయాలను లేఖల ద్వారా చేరవేస్తాం. లేఖలను ఒకప్పుడు వక్షుల ద్వారా, జంతువుల ద్వారా చేరవేసే వాళ్ళు.

స్మార్ట్ ఫోన్స్ లేని రోజులలో ఉత్తరాల కోసం ఎదురు చూసేవారు. దీనిలో ఒక ఆనందం, ఉద్వేగం దాగి ఉండేది. కానీ, సాంకేతిక పరిజ్ఞానం పెరిగి, నేడు ఎస్.ఎం.ఎస్., ఈ – మెయిల్, సామాజిక మాధ్యమాల స్థాయికి చేరింది. అయితే మనుషుల మధ్య అనుబంధాలను ఆనాటి లేఖలు ఏర్పరచినట్లుగా, నేటి సామాజిక మాధ్యమాలు ఏర్పరచలేకపోయాయనవచ్చు.

ఉత్తరాలు సంఘజీవితంలో ఒక భాగం. వ్యక్తిగత విషయాలకు సంబంధించిన లేఖలే కాదు, వ్యాపార సంబంధ, ఉద్యోగసంబంధ లేఖలు రాయడం కూడా ముఖ్యమైన అంశమే. భవిష్యత్తులో వివిధ రంగాలలో స్థిరపడే విద్యార్థులకు వ్యక్తిగతంగానూ, విద్యా, ఉద్యోగ, వ్యాపార పరంగానూ లేఖారచన చేయడం అవసరమే. అందుకే, మనం లేఖారచన ప్రాధాన్యతను గుర్తించి, చక్కని శైలిలో, స్పష్టంగా లేఖలు రాయడం నేర్చుకోవాలి.

చక్కని ఉత్తరాలు రాయాలి అంటే లేఖా రచనలోని మెలకువలను మనం తెలుసుకోవాలి.

లేఖారచనలో పాటించే సాధారణ మెలకువలు
ముందుగా లేఖలో పై భాగాన కుడివైపు మనం ఎక్కడి నుండి రాస్తున్నామో ఊరి పేరు, తేదీలను పొందుపరచాలి. ఊరిపేరు తరువాత కామా (,) ఉంచి, తేది తరువాత విరామ చిహ్నం (.) ఉంచాలి.

ఉత్తరాలలో రెండవ ప్రధానవిషయం సంబోధన, ఉత్తరాలు రాసేటప్పుడు ఎవరికి రాస్తున్నామో దానిని బట్టి సంబోధన ఉంటుంది. మనకంటే పెద్దవారి విషయంలో మాన్యశ్రీ, పూజ్యులైన, గౌరవనీయులైన అని సంబోధిస్తారు. వ్యాపార లేఖల్లో మహాశయా! ఆర్యా! అయ్యా! అమ్మా! అని సంబోధిస్తారు. స్నేహితులకు ప్రియమైన అని సంబోధిస్తారు.

TS Inter 1st Year Telugu Grammar లేఖారచన

ఉత్తరాలలో మూడవ అంశం ప్రధాన విషయం మనం చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా, అంశాలవారిగా విభజించి రాయాలి. ముఖ్యంగా వ్యాపార లేఖలలో ఇది మరింత అవసరం. ఉద్యోగ సంబంధ లేఖలలో మన అర్హలు, అనుభవం, ఉద్యోగం పట్ల అవగాహన ఇలా విభజించి రాస్తే బాగుంటుంది. ప్రధానవిషయ వివరణ తరువాత ముగింపువాక్యాలు రాయాలి. స్నేహితులకు, బంధువులకు “ప్రత్యుత్తరం రాయగలరు” అని అధికారులు, ఉద్యోగ సంబంధ ఉత్తరాలలో కృతజ్ఞతలు వంటి వాక్యాలు రాయాలి.

లేఖ చివరన సంతకానికి ముందు లేఖను బట్టి భవదీయుడు, విశ్వసనీయుడు, విధేయుడు వంటివి ఉపయోగించాలి.

ఉత్తరం ముగిసిన తరువాత ఎడమ వైపు చివరన “పూర్తి చిరునామా” రాయాలి. కొన్ని లేఖలలో పై భాగంలోనే పూర్తి చిరునామా రాస్తారు.

లేఖల్లో భేదాలు

  • సాధారణంగా లేఖల్లో వ్యక్తిగత లేఖలు, వ్యవహార లేఖలు, సాంఘిక లేఖలు, వ్యాపార లేఖలు అని విభజించవచ్చు. కానీ, నియమిత భేదాలు ఇవి మాత్రమే ఉంటాయని చెప్పడానికి వీలు లేదు.
  • మన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు రాసే లేఖలను వ్యక్తిగత లేఖలు అంటారు.
  • ప్రభుత్వపరంగా జరిగే కార్యకలాపాలన్నీ వ్యవహార లేఖలుగా గుర్తించవచ్చు. దీంట్లో స్పష్టత, సంక్షిప్తత, సరళత, యథార్థత వంటివి ప్రముఖ అంశాలుగా కనిపిస్తాయి. వీటిలో అధికారిక లేఖలు, అర్థ అధికారిక లేఖలు, మెమోరాండం, నోటిఫికేషన్, సర్యులర్ వంటివి వివిధ వైవిధ్యాలతో కూడా ఉంటాయి.
  • వార్తా పత్రికల్లో ప్రచురితమయ్యే సంపాదకీయ లేఖలు, వినతి పత్రాలు, ఆహ్వాన లేఖలు మొ||నవి సాంఘిక లేఖల క్రిందికి వస్తాయి.
  • ఒక సంస్థ వ్యాపార అభివృద్ధికి రాసే లేఖలు వ్యాపార లేఖలు. వీటిలో సుబోధకత, సంగ్రహత, స్పష్టత, సందర్భ శుద్ధి, యథార్థత, సంక్షిప్తత అనేవి ప్రధాన లక్షణాలు.

1. తల్లిదండ్రులకు లేఖ

వరంగల్,
10-02-2020.

పూజ్యులైన అమ్మానాన్నలకు నమస్కారములు.

నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను. మీరు కూడా క్షేమమే అని తలుస్తున్నాను . నేను బాగా చదువుతున్నాను. ఇక్కడ మాకు ఉపన్యాసకులు చక్కగా బోధిస్తున్నారు. పాఠ్యాంశాలు పూర్తి అయినవి.

ఇటీవల మా కళాశాల నుండి హైదరాబాదుకు విజ్ఞాన విహారయాత్రకు వెళ్లి వచ్చాం. నగరంలోగల సాలార్జంగ్ మ్యూజియంనందున్న పురాతన వస్తువులు, నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో నేను ఇంతవరకు చూడని ఎన్నో జంతువులను చూశాను. బిర్లా మందిర్ అద్భుతమైన పాలరాతి కట్టడం, బిర్లా ప్లానిటోరియం మరియు సైన్స్ మ్యూజియం, రామోజీ ఫిల్మ్ సిటీ, గోలకొండ కోట వంటివి నన్ను ఎంతగానో ఆకర్షించాయి.

TS Inter 1st Year Telugu Grammar లేఖారచన

ఈ విజ్ఞాన, విహారయాత్రకు వెళ్ళడం వలన ఎన్నో చారిత్రక విషయాలు తెలుసుకోవ డంతో పాటు, ఎంతో విజ్ఞానం పొందడం జరిగింది. ఈ విజ్ఞాన, విహారయాత్ర నా భవిష్యత్ విద్యకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పూర్తి విషయాలు ఇంటికి వచ్చిన తరువాత వివరిస్తాను. తాతయ్యకు, నానమ్మకు నా నమస్కారాలు తెలియజేయండి.

ఇట్లు
మీ కుమారుడు
xxxxx

చిరునామా
జి. రాజేశ్వర్
ఇంటి నెంబర్ 1-3-178,
ఎ.యన్. రెడ్డి కాలని, నిర్మల్,
పిన్ నం . 504106

2. కళాశాల ప్రధానాచార్యుల వారికి లేఖ

కరీంనగర్,.
15-06-2020.

గౌరవనీయులైన ప్రధానాచార్యులు గారికి,
ప్రభుత్వ జూనియర్ కళాశాల,
కరీంనగర్. నమస్కారాలు.

విషయము: టి.సి. (బదిలీ పత్రము) ఇప్పించుటకు విజ్ఞప్తి.

నేను మీ కళాశాలలో యం.పి.సి. గ్రూపు ద్వారా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసాను. ఈ సంవత్సరం మార్చి నెలలో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాను. ప్రస్తుతం నేను పై తరగతులు చదువుటకై డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి ‘దోస్త్’ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసాను. ‘దోస్త్’ వెబ్ సైట్ వారు విడుదల చేసిన మొదటి జాబితాయందు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి అనుమతి లభించినది. ప్రవేశం పొందుటకు గాను నాకు బదిలీ పత్రము అవసరం ఉంది.

కావున, నాకు బదిలీ పత్రము ఇప్పించగలరని విజ్ఞప్తి.
కృతజ్ఞతలతో,

TS Inter 1st Year Telugu Grammar లేఖారచన

ఇట్లు
మీ విద్యార్థి
XXXX

3. స్నేహితులకు లేఖ

మెదక్
09-08-2020.

ప్రియమైన సౌమ్యకి,

నేను క్షేమంగా ఉన్నాను. నీవు ఎలా ఉన్నావు? నేను బాగా చదువుతున్నాను. నీవు ఎలా చదువుతున్నావో ఉత్తరం ద్వారా తెలియజేయగలవు.

ఇటీవల మా కళాశాలలో ఎన్.ఎస్.ఎస్ (N.S.S) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రమాదాలు జరిగినపుడు గాని, శస్త్రచికిత్సలు చేసినపుడు గాని మనిషి ప్రాణాన్ని కాపాడడానికి కొన్నిసార్లు రక్తం అవసరం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రక్తదానం చేసి సాటివారి ప్రాణాలు కాపాడాలని తెలియజేసారు. ఈ మాటలు విన్న వింటనే నేను రక్తదానం చేశాను. నీవు కూడా రక్తదానం చేస్తావని భావిస్తున్నాను.

మన స్నేహితులు సమత, సంధ్య, ప్రవళిక ఎలా ఉన్నారు ? వారిని అడిగానని చెప్పు. మీ అమ్మానాన్నలకు నా నమస్కారాలు తెలియజేయగలవు. వచ్చే దసరా సెలవులలో మనం కలుసుకుందాం. నీ ఉత్తరం కోసం ఎదురుచూస్తూ ఉంటాను.

TS Inter 1st Year Telugu Grammar లేఖారచన

ఇట్లు
నీ ప్రియమైన స్నేహితురాలు
XXXXX

చిరునామా ఎ. సౌమ్య
ఇంటి నంబర్ 21-12/68,
సుచిత్ర, సికింద్రాబాద్,
పిన్. నం. – 500067.

4. అధికారికి లేఖ

దిలావర్పూర్,
10.08.2020.

స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు,
పోలీస్ స్టేషన్,
దిలావర్పూర్.

విషయము : నా సైకిల్ దొంగిలింపబడిన విషయం గురించి.

ఆర్య !
నమస్కారములు.

నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల, దిలావర్ పూర్ నందు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాను. నేను నిన్న కళాశాలకు అట్లాస్ కంపెనీకి చెందిన ఎరుపు రంగు సైకిల్ పై వెళ్ళి, కళాశాల ముందర తాళం వేసి పెట్టి, తరగతులకు హాజరు అయ్యాను. సాయంత్రం వచ్చి చూసేసరికి నా సైకిల్ కనిపించలేదు. దొంగిలించబడినదని నిర్ధారణ అయింది.

దయచేసి నా సైకిల్ గురించి విచారణ చేసి తిరిగి నాకు అప్పగించవలసినదిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.

కృతజ్ఞతలతో,

TS Inter 1st Year Telugu Grammar లేఖారచన

ఇట్లు
మీ విశ్వసనీయుడు
పి. ఆదిత్య
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం
ప్రభుత్వ జూనియర్ కళాశాల
దిలావర్పూర్

5. ఉద్యోగానికి లేఖ

నల్లగొండ,
26.07.2020.

శ్రీయుత గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి,
నల్లగొండ.
నమస్కారములు.

విషయము: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం కొరకు దరఖాస్తు

నిర్దేశము: నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రకటన, తేది: 20.07.2020.

ఆర్యా,

ఈ నెల తేది 20.07.2020 నాటి నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన ఉద్యోగ ప్రకటనను చూసాను. మీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగ ఖాళీలను తాత్కాలిక ప్రాతిపదికపై నింపుతున్నట్లు, అర్హులైన వారు దరఖాస్తు చేసుకొమ్మని ప్రకటించారు. తమ ప్రకటన ప్రకారం ఆ ఉద్యోగానికి కావలసిన విద్యార్హతలు అన్నీ నాకు ఉన్నాయి. అలాగే, కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. కావున, ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నాను.

ఈ ఉద్యోగమును క్రమశిక్షణతో, పూర్తి సామర్థ్యంతో పనిచేస్తానని మనవి చేసుకుంటున్నాను. కావున, నాకు ఉద్యోగ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

కృతజ్ఞతలతో,

TS Inter 1st Year Telugu Grammar లేఖారచన

ఇట్లు
మీ భవదీయుడు
XXXX

దరఖాస్తుతో జత చేసిన పత్రాలు:

  1. ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రం
  2. జనన ధ్రువీకరణ పత్రం
  3. స్థానిక ధ్రువీకరణ పత్రం
  4. ఉద్యోగానుభవ ధ్రువీకరణ పత్రం

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 4th Poem అచలం Textbook Questions and Answers.

TS Inter 1st Year Telugu Study Material 4th Poem అచలం

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
దున్న ఇద్దాసు జీవితం- తాత్వికతను సమగ్రంగా వివరించడి?
జవాబు:
“అచలం” అను పాఠ్యభాగం ‘దున్న ఇద్దాసు’ చే రచించబడినది. ఇది దున్న విశ్వనాథం సంపాదకత్వంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్వాలు” గ్రంథం లోనిది.

దున్న ఇద్దాసు తెలంగాణలో ప్రసిద్ధ తత్వకవి. ఈయన 1811 1919 సం||ల మధ్య కాలంలో జీవించాడు. నల్గొండ జిల్లా ‘చింతపల్లి గ్రామానికి చెందినవాడు. తల్లిదండ్రులు రామయ్య, ఎల్లమ్మలు. ఇతని అసలు పేరు ఈదయ్య. తాత్వికునిగా మారాక ‘ఇద్దాసు’గా ప్రసిద్ధివహించాడు. డా. బిరుదురాజు రామరాజు’ ఇద్దాసు’ను మాదిగ మహాయోగిగా కీర్తించాడు.

ఇద్దాను బాల్యంలో మోతుబరి రైతు వద్ద పశువుల కాపరిగా జీవితాన్ని ప్రారంభించాడు. భావిదగ్గర ‘మోట’ కొడుతూ గీతాలను అశువుగా పాడుకునేవాడు. ఈతని మధుర గీతాలను విన్న వరసిద్ధి జంగమ దేవర’ పూదోట బసవయ్య’ ఈతనికి ‘పంచాక్షరీ’ మంత్రాన్ని ఉపదేశించాడు. మెడలో లింగధారణ చేశాడు. ఇద్దాసు అడవులలో సంచారం చేస్తూ “రాజయోగాన్ని” ఏకాంతంగా సాధన చేశాడు. అష్టసిద్ధులను పొందాడు. పూర్వతాత్త్విక కవులైన శివరామ దీక్షితులు, పోతులూరి వీరబ్రహ్మం, ఈశ్వరాంబల ప్రభావం ఇతనిపై ఉంది.

ఇద్దాసు వేమనలా తత్త్వవేత్తగా, అచలుడిగా, వీరశైవ తత్త్వజ్ఞానిలా కన్పిస్తాడు. పటేల, పట్వారీలతోపాటు ప్రజలు ఈతని శిష్యులయ్యారు. సంచారం చేస్తూ నల్గొండ నుండి మహబూబ్ నగర్ జిల్లా వరకు ఆధ్యాత్మిక పర్యటనలు చేశాడు. అచ్చంపేట తాలూకాలోని అయ్యవారిపల్లె, పోలేపల్లి, ఆవులోనిపల్లి, కాంసానిపల్లి, కల్వకుర్తి తాలూకాలోని గుడిగానిపల్లి దేవరకొండ తాలూకాలోని జీడికట్ల వంటి గ్రామాలలో ఈశ్వరమ్మ పీఠాలను నెలకొల్పాడు. వీరశైవ భక్తితో ఈయన 30కిపైగా తత్వాలను మేలుకొలుపులను, మంగళహారతులను రచించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

ప్రశ్న 2.
‘అచలం’ పాఠ్యభాగ సారాంశాన్ని వివరించండి?
జవాబు:
‘అచలం’ అను పాఠ్యభాగం ‘దున్న ఇద్దాసు’ చే రచించబడినది. ఈ పాఠ్యభాగం దున్న విశ్వనాథం సంపాదకత్వంలో వెలువడిన శ్రీ దున్న ఇద్దాసుగారి తత్వాలు” నుండి గ్రహించబడింది. తెలంగాణ పద సంకీర్తన కవులలో ‘ఇద్దాసు’ కలికితురాయి.

ఇద్దాసు తత్వాలు ఆత్మపరంగ, తత్వపరంగ తెలంగాణ నుండి పుట్టిన మాణిక్యాలు. వేదాంత శాస్త్రజ్ఞాన సారాంశాన్ని సామాన్య ప్రజలకు ఈయన అందించాడు. వేదాంత తత్వాక అంశాలను పరిచయం చేయటం ఈ తత్వాల ఉద్దేశ్యం.

ఈ దేహం శాశ్వతం కాదు. కనుక ఈ దేహంపై మోహం విడచిపెట్టాలి. మంచి గురువును ఆశ్రయించి జీవన రాహిత్యాన్ని పొందటానికి ప్రయత్నించాలి. అపుడే మోక్షాన్ని పొందగలుగుతాము. భార్యాబిడ్డలు, ధనధాన్యాల పట్ల మోహాన్ని వదలిపెట్టాలి. ఏదో ఒకనాటికి కీలు వదలిన బొమ్మలా ఈ దేహం రాలిపోక తప్పదు.

ఓ నామః అని అక్షరాలు రాస్తున్నాం నేర్చుకుంటున్నాం కాని, మన జీవిత ఆనవాళ్ళను తెలుసుకోలేకపోతున్నాం. దాని అంతు తెలియక అల్లరిపాలు అవతున్నాం. మంచి చెడులను తెలుసుకొని మసలు కోవాలని ఇద్దాసు పలుకుతున్నారు.

ఈ లోకంలో గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, దీనిని మనం గమనించాలి. మన దేహంలో షట్ చక్రాలుంటాయి. సహస్రారం శిరసుపై ఉంటుంది. అదే చివరి చక్రం. దానిని తెరుచుకోగలిగి శక్తిని పొందితే, ఆ రహస్యం అంతుచిక్కితే అది మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అజ్ఞాచక్రంమును పొందండి, తరించండి.

ఈ లోకం అంతా శూన్యం. ఎక్కడ చూసినా ఎక్కడ వెతికినా ఏమీ కన్పించదు. మనం గమనించాలి. మన దేహంలో షటం చక్రాలుంటాయి. సహస్రారం శిరస్సుపై ఉంటుంది. అదే చివరి చక్రం. దానిని తెరుచుకోగలిగే శక్తిని పొందితే, ఆ రహస్యం అంత చిక్కితే అది మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఆజ్ఞాచక్రంమును పొందండి తరించండి.

ఈ దాసు చెప్పిన మాటలు సత్యములు. అందరూ అనుసరింపదగినవి. వీరశైవ మత గురువైన బసవని యొక్క భావాలను అర్థం చేసుకుని ప్రవర్తించండి. అపుడే జీవన సాఫల్యం జరుగుతుంది.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

II. సంగ్రహ రూప ప్రశ్నలు – సమాధానాలు.

ప్రశ్న 1.
మనుషులు ఎందుకు భ్రమల్లో మునుగుతున్నారు?
జవాబు:
‘అచలం’ అనుపాఠ్యభాగముదున్న ‘ఇద్దాసు’ చేరచించబడింది. ప్రస్తుత పాఠ్య భాగం దున్న విశ్వనాథం సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్వాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.

ఈయన రాసిన తత్వాలు, ఆత్మపరంగా, తత్త్వపరంగా తెలంగాణ మట్టి నుండి పుట్టిన మాణిక్యాలు. ఈ దేహము మనదికాదు, మోహాన్ని విడచి ప్రయత్నం చేసి గురువును చేరుకోవాలన్నాడు. ఆలు, బిడ్డలు ధనము నాది అనుభ్రమల్లో మానవులు బతుకుతున్నారు. భార్యా బిడ్డలు ధన, ధాన్యాలు ఏవీ శాశ్వతంకావు. ఆ భ్రమల్లో బ్రతుకుతూ సత్యాన్ని తెలుసుకునే లోపే జీవితం పూర్తయిపోతున్నది. కీలు విడచిన బొమ్మలాగా నేలలో కలిసిపోతున్నారు. కావున ఆ భ్రమలు వీడి నిజాన్ని తెలుసుకుని ప్రవర్తించాలి అని ఇద్దాసు వివరించాడు.

ప్రశ్న 2.
ఆగం కాకుండా జీవించాలంటే ఏమీ చేయాలి?
జవాబు:
‘అచలం’ అను పాఠ్యభాగము ‘దున్న ఇద్దాసు’ చేరచించబడినది. దున్న విశ్వనాథం సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్వాలు” గ్రంథం నుండి గ్రహించబడింది.

‘ఓనామః శ్రీవాయుః’ అన్న అక్షరాలు రాస్తున్నాం. నేర్చుకుంటున్నాం, మన జీవిత ఆనవాళ్ళను మాత్రం తెలుసుకోలేకపోతున్నాం. మన జీవితం యొక్క ఆనవాళ్ళను తెలుసుకోలేకపోవటం వలననే అల్లరిపాలు అవుతున్నాం. మంచి చెడులను, పూర్వాపరాలను, మన జీవిత ఆనవాళ్ళను తెలుసుకోలేక పోవటం వలననే మనం ఆగమవుతున్నామని ఇద్దాసు ‘అచలం’ అను తత్వాల ద్వారా మనకు తెలియచేశాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

ప్రశ్న 3.
గురువు తత్వం వివరించండి?
జవాబు:
‘అచలం’ అను పాఠ్యభాగం ‘దున్న ఇద్దాసు’ చే రచించబడింది. ‘దున్న విశ్వనాథం’ సంపాదనకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్వాలు” అను గ్రంథం నుండి ఈ పాఠ్యభాగం గ్రహించబడింది.

ఈ లోకంలో గురువే బ్రహ్మం గురువే విష్ణువు. ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. మన దేహంలో షట్ చక్రాలుంటాయి. సహస్రారం శిరస్సుపై ఉంటుంది. మూలాధారం, స్వాధిష్టానం అనాహతం, మణిపూరకం, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారాలు, వీటిలో చివరిది సహస్రారం, అది విచ్చుకునే శక్తిని ప్రసాదించేవాడు గురువు. అపుడే మోక్షప్రాప్తి కలుగుతుంది. కనుక ఆ రహస్యాన్ని తెలుసుకుని మంచి గురువుని ఆశ్రయించి ఆయన ద్వారా మోక్షాన్ని పొందమని ఇద్దాసు వివరిస్తున్నాడు.

ప్రశ్న 4.
దేహ తత్త్వాన్ని గురించి ఇద్దాసు ఏమి చెప్తున్నాడు?
జవాబు:
‘అచలం’ అను పాఠ్యభాగం ‘దున్న ఇద్దాసు’చే రచించబడింది. ‘దున్న విశ్వనాథం’ సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్త్వాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.

ఏడ చూసినా ఏమీ లేదు. అంతామిథ్య. ఎక్కడ వెదకినా ఏమీ కన్పించదు. అంతాశూన్యం. అజ్ఞానంలో ఉన్నంత కాలం చీకటే కన్పిస్తుంది. అజ్ఞానాన్ని వదలి గురుని నమ్మి ఆయనను అనుసరిస్తే ఫలితం ఉంటుంది. మానవులు జీడికంటి వంటి నేత్రాలను తెరచుకోవాలి. ఆ జ్ఞాన నేత్రాలు, ఆ అగ్నినేత్రాలు మన దేహం తత్వాన్ని తెలియచేస్తాయి. అపుడు గురుని ద్వారా ముక్తి మూలాలను తెలుసుకోగలమని దున్న ఇద్దాసు వివరించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

III. ఏక పద/వాక్య సమాధాన ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
దున్న ఇద్దాసు తల్లిదండ్రుల పేర్లు తెలపండి?.
జవాబు:
దున్న రామయ్య – ఎల్లమ్మలు

ప్రశ్న 2.
ఇద్దాసుకు పంచాక్షరిని ఎవరు ప్రబోధించారు?
జవాబు:
వరసిద్ధి జంగమ దేవర పూదోట బసవయ్య ప్రబోధించాడు.

ప్రశ్న 3.
తెలంగాణలో గొప్ప ‘అచల’ గురువు.
జవాబు:
దున్న ఇద్దాసు

ప్రశ్న 4.
ఇద్దాసు ఎవరి సమాధిని దర్శించాడు?
జవాబు:
కందిమల్లయ్యపల్లెలో ఉన్న ఈశ్వరాంబ సమాధిని దర్శించాడు.

ప్రశ్న 5.
దున్న ఇద్దాసు ఏఏ కోణాల్లో కన్పిస్తాడు?
జవాబు:
తత్త్వవేత్తగా, అచలునిగా, వీరశైవతత్త్వజ్ఞానిగా పలుకోణాల్లో కన్పిస్తాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

ప్రశ్న 6.
‘మాదిగ మహాయోగి’ అని ఇద్దాసును ఎవరు పేర్కొన్నారు?
జవాబు:
డా. బిరుదురాజు రామరాజుగారు

ప్రశ్న 7.
సాహసంతో గురుని చేరాక లభించేది ఏది?
జవాబు:
సోహము లభిస్తుంది.

ప్రశ్న 8.
కనురెప్పపాటులో పోయేది ఏమిటి?
జవాబు:
ప్రాణం, శరీరతత్త్వం.

IV. సందర్భ సహిత వ్యాఖ్యలు

ప్రశ్న 1.
సోహమే తన సొమ్మయా!
జవాబు:
పరిచయం :-
ఈ వాక్యము ‘దున్న ఇద్దాసు’చే రచించబడినది. దున్న విశ్వనాథం సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి” తత్వాలు అనుగ్రంథం నుండి గ్రహించబడింది.

సందర్భము :-
ఈ దేహం మనదికాదు మోహాన్ని విడువమని చెప్పిన సందర్భంలోనిది.

భావము :-
ఈ దేహం మనదికాదు. దానిమీద మోహాన్ని వదలిపెట్టండి. ప్రయత్నించి గురుసేవ చేసుకుంటే ఆత్మ పరమాత్మను చేరాక తప్పుతుందా! అని ఇందలి భావం.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

ప్రశ్న 2.
ఆనవాలు అంతు తెలియక ఆగమై పోతారయా!
జవాబు:
పరిచయము :-
ఈ వాక్యం ‘దున్న ఇద్దాసు’చే రచించబడినది. దున్న విశ్వనాథం సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్త్వాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.

సందర్భము :-
మానవులు జీవం యొక్క మూల తత్త్వాన్ని తెలుసుకోలేక పోతున్నారని తెలియచేసిన సందర్భంలోనిది.

భావము :-
ఓ నమః శివాయః అని రాస్తున్నాము గాని మన జీవిత అసలు ఆనవాళ్ళను తెలుసుకోలేకపోతున్నాము. అలా తెలిసికోలేక పోవటం వలన ఆగమైపోతున్నామని ఇందలి భావం.

ప్రశ్న 3.
మూల మెరిగిన గురునిచేత ముక్తి దొరకును మనకయా!
జవాబు:
పరిచయం :-
ఈ వాక్యము ‘దున్న ఇద్దాసు’ చే రచించబడినది. దున్న విశ్వనాథం “సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసు తత్వాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.

సందర్భము :-
మానవులు మంచి గురువును ఆశ్రయిస్తే ముక్తి దొరకుతుందని వివరించిన సందర్భంలోనిది.

భావము :-
ఎక్కడ వెదికినా ఏమీ కన్పించదు శూన్యం తప్ప. జ్ఞాననేత్రాన్ని తెరచి, దాని మూలాన్ని గ్రహించిన గురువును ఆశ్రయించిన మానవులకు మోక్షం లభిస్తుందని ఇద్దాసు చెప్పాడని ఇందలి భావం.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

ప్రశ్న 4.
కీలువదలిన బొమ్మవలెను నేలబడి పోతున్నది.
జవాబు:
పరిచయం :-
ఈ వాక్యము దున్న ఇద్దాసుచే రచించబడినది. దున్న విశ్వనాథం సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్త్వాలు అను గ్రంథం నుండి గ్రహించబడినది.

భావము :-
భార్యా, బిడ్డలు, ధనధాన్యాలు నావి నావారున భ్రమలో మానవులు ఉంటున్నారు. ఆ భ్రమ సత్యంకాదు. ఆ భ్రమలో ఉండగనే కీలువదలిన బొమ్మలాగా రాలిపోతున్నామని ఇందలి భావం.

V. సంధులు

1. మూలమెరిగిన
మూలము+ఎరిగిన = ఉ. కార సంధి. ఉత్వసంధి
సూత్రము :- ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధియగు

2. రాసేరుగాని
రాసేరు + కాని = గసడదవాదేశ సంధి
సూత్రము :- ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళముగానగు. ప్రథమావిభక్తి ప్రత్యయములనగా డు ము వు లు పరుషము లనగా క, చ, ట, త, ప, లు
డు ము వు ల కు, క చ ట త ప లు వస్తే అవి గ స డ ద వ లు గా మారతాయని భావం.

3. భ్రమజెందేరయా
భ్రమజెందేరు + అయా = ఉత్వసంధి / ఉ. కారసంధి
సూత్రము :- ఉత్తునకు అచ్చుపరం బగునపుడు సంధియగు

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

4. ఆగమైపోతారయా
ఆగము+అయిపోతారు+అయా = ఉత్వసంధి/ఉకారసంధి
సూత్రము :- ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు

5. పోతుందయా
పోతుంది + అయ = ఇత్వసంధి
సూత్రము :- ఏమ్యాదుల యిత్తునకు సంధివైకల్పికముగానను ఏమ్యాదులు అనగా ఏమి, మది,కి, షష్ఠి, అది, అవి, ఇది, ఇవి ఏది ఏవి మొదలగునవి.

6. నా దని
నాది + అని = ఇత్వసంధి
సూత్రము : ఏమ్యాదుల యిత్తునకు సంధిపై కల్పికముగానను.
ఏమ్యాదులు అనగా ఏమి, మరి, కి, షష్ఠి, అది, అవి, ఇది, ఇవి, ఏది, ఏవి మొదలగునవి.

7. ఎల్లి యెల్లక
ఎల్లి + ఎల్లక = యడాగమసంధి
సూత్రము :- సంధిలేని చోట స్వరంబుకంటెన్ పరంబైన స్వరంబునకుయట్, ఆగమముగానగు.

8. నేల బ్రడి
నేలన్+పడి = ద్రత సంధి (సరళాదేశ సంధి)
సూత్రము :- ద్రుత ప్రవృతికము మీద పరుషములకు సరళములగు. ద్రుతసంధి/సరళాదేశ సంధి

9. ఏడజ్రూచిన
ఏడన్ + చూచిన = ద్రత సంధి / సరళాదేశ సంధి
సూత్రము :- ద్రుత ప్రకృతికముల మీది పరుషములకు సరళములగు.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

10. సొమ్మయా
సొమ్ము + అయా = ఉత్వసంధి
సూత్రము :- ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు.

VI. సమాసాలు

1. ఆలు పిల్లలు = ఆలియును పిల్లలును – ద్వంద్వసమాసం
2. గురునిపాదము = గురునియొక్క పాదము – షష్ఠితత్పురుష సమాసం
3. బసవగురుడు = బసవ అనుపేరుగల గురుడు – సంభావనాపూర్వపద కర్మధారయము
4. కనురెప్ప = కనుయొక్కరెప్ప – షష్ఠీతత్పురుష సమాసం

అర్థతాత్పర్యములు

1వ పద్యం :

పల్లవి: దేహమైతే మనదిగాడు.
మోహములు విడువందయా
సాహసం బున గురుని జేరితే.
‘సోహమే తన సొమ్ముయా ||

అర్థాలు :
దేహము = శరీరము
మోహము = ప్రేమ, ఆకాంక్ష
సాహసంబున = ప్రయత్నపూర్వకంగా
గురుడు = శివ గురువు బసవన
సోహము = ఆత్మపరమాత్మ అన్న భావన
సొమ్మయా = సంపద

తాత్పర్యము :
ఈ దేహము శాశ్వతం కాదు. కనుక ఈ దేహంపై మోహాన్ని విడచిపెట్టాలి. మంచి శివ గురువును ఆశ్రయించి జీవన రాహిత్యాన్ని పొందాలి. అపుడేమోక్షం లభిస్తుంది. ఆత్మపరమాత్మలో లీనమౌతుంది అని ఇద్దాసు బోధించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

2వ పద్యం :

ఆలు పిల్లలు ధనము నాదని
“ఏల భ్రమ జెందేరయా
కీలు వదలిన బొమ్మవలెను
నేలబడిపోతున్నది.

అర్థాలు :
ఆలు = భార్య
పిల్లలు = సంతానం
ధనము = డబ్బు
భ్రమ = మాయ
కీలు = మూలము

తాత్పర్యము :
భార్యాబిడ్డలు ధన ధాన్యముల పట్ల మోహాన్ని వదలిపెట్టాలి. ఏదో ఒకనాటికి కీలు వదలిన బొమ్మలాగా ఈ దేహం పడిపోక తప్పదు. కనురెప్పపాటున ఇదంతా జరిగిపోతుందని ఇందలి భావం.

3వ పద్యం :

ఏప్పటికిని ముప్పులేదని
మెకృగసు మురిసేరయా!
చెప్పకు కనురెప్పపాటున
చెదరిపోతున్నాదయా!

అర్థాలు :
ఎప్పటికిని = ఏనాటికి
ముప్పు = ప్రమాదము
మొప్పుగా = గొప్పగా
మురిసేరయా = ఆనందిస్తారు
చెప్పకు = చెప్పకుండానే
కనురెప్పపాటున = కనురెప్పతెరచిమూసేలోపే
చెదరిపోతున్నది = చెల్లాచెదురవుతుంది.

తాత్పర్యము :
సంతోషంగా ఉన్నంతకాలం ఏ బాధలు బందీలు లేనంతకాలం మనకేం ప్రమాదం లేదని భావిస్తున్నాం. ఒకసారిగా కనురెప్పపాటున ఈ దేహాన్ని వదలివేయవలసి వస్తుందని ఇందలి భావం.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

4వ పద్యం :

ఓనమాలు రాసేరుగాని
ఆనవాలు రాయండయా!
ఆనవాలు అంతుతెలియక
ఆగమైపోతారయా!

అర్థాలు :
ఓనమాలు = ఓనామః శివాయః సిద్ధం నమః
రాసేరుగాని =రాస్తున్నారని
ఆనవాలు = జీవిత ఆనవాళ్ళన
తెలియక = తెలుసుకోలేక
ఆగమైపోతారయా = స్థిరత్వం లేకుండా పోతున్నారు.

తాత్పర్యం :
ఓనామః శివాయః సిద్ధం నమః అని వ్రాస్తున్నాము గాని మన జీవిత ఆనవాళ్ళను తెలుసుకోలేకపోతున్నాం. తీరా తెలుసుకునేసరికి అల్లరిపాలౌతున్నాం. మంచి చెడులను తెలుసుకొని మసలుకోవాలని ఇందలి భావం.

5వ పద్యం :

గురుడె బ్రహ్మం గురుడే విష్ణువు
గుర్తు తెలుసుకోండయా!
మేడమీద గురుని పాదము
కీలు తెలుసుకోండయా!

అర్థాలు :
గురుడె = గురువు
బ్రహ్మ = బ్రహ్మము
గురుడె = గురువు
విష్ణువు = విష్ణువు
మేడమీద గురుని పాదము = సహస్రార చక్రమునందున్న
కీలు = రహస్యము (పరబ్రహ్మ రహస్యము)
తెలుసుకోండయా = తెలుసుకొనుటకు ప్రయత్నించండి.

తాత్పర్యం :
ఈ లోకంలో గురువే బ్రహ్మం. గురవే విష్ణువు. మన దేహంలో షట్ చక్రాలు న్నాయి. మూలాధారం, స్వాధిస్థానం, అనాహతం, మణిపూరకం, విశుద్ధ, అజ్ఞా, సహస్రారం. వీటిలో చివరిది సహస్రారం. దానిని విచ్చుకునేలా చేయగలిగితే ఆ రహస్యాన్ని చేధించగలిగితే మోక్షాన్ని పొందగలం. దానిని తెలుసుకొని తరించండని ఇందలి భావం.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

6వ పద్యం :

ఏడజూచిన ఏమిలేదు.
జీడి కంటికి పొందయా
మూల మెరిగిన గురుని చేత
ముక్తి దొరకును మనకయా!

అర్థాలు :
చిన = ఎక్కడ వెతికినా
ఏమీలేదు = ఏమీ కన్పించదు
జీడికన్ను= అగ్నినేత్రం, జ్ఞాననేత్రం, ఆజ్ఞాచక్రం
మూలమెరిగిన = మూలాన్ని అంటే అధ్యాత్మిక మూలాన్ని
ఎరిగిన = తెలుసుకున్నా
ముక్తి = మోక్షము
దొరకును = లభిస్తుంది.

తాత్పర్యం :
ఎక్కడ వెతికినా ఏమీ కన్పించదు. అగ్ని నేత్రం, అజ్ఞాచక్రం, మూలాన్ని అంటే ఆథ్యాత్మిక మూలన్ని తెలుసుకున్న వానికి మోక్షము లభిస్తుంది.

7వ పద్యం :

వాసిగను ఇద్దాను చెప్పిన
మాట నిజమిది కనరయా!
భాసురంబుగా బసవగురుని
భావము మీరు గనరయా!

అర్థాలు:
వాసిగను = నాణ్యమైన
ఇ + దాసు = ఈ దాసుడు
చెప్పిన = పలికిన
మాట = పలుకు
నిజమిది = సత్యము
కనరయా = తెలుసుకోండయా
భాసురంబుగా = విశేషముగా
బసవగురుని = బసవగురుని యొక్క
భావము = ఆలోచనను
కనరయా = ఆచరించండి.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

తాత్పర్యం :
ఇద్దాసు చెప్పిన మాటలు నిత్యసత్యాలు. తప్పకుండా అనుసరింపతగినవి. వీరశైవ మతాచార్యుడైన బసవని ఆలోచనలను ఆచరించండి. తరించండి అని ఇందలి భావం.

అచలం Summary in Telugu

కవి పరిచయం

కవిపేరు : దున్న ఇద్దాసు అసలు పేరు ఈదయ్య
కాలం : 1811-1919 మధ్యకాలం
పుట్టిన ఊరు : నల్గొండజిల్లా చింతపల్లి గ్రామం
తల్లిదండ్రుల : దున్నరామయ్య, ఎల్లమ్మలు
రచనలు : తత్వాలు, మేలుకొలుపులు, మంగళహారతులు మాత్రమే కొన్ని లభిస్తున్నాయి. మొత్తం రచనలు 30 వరకు ఉన్నాయి.

దున్న ఇద్దాసు గొప్ప తత్త్వకవి, ప్రముఖ వాగ్గేయకారుడు ఈయన నల్గొంజిల్లా చింతపల్లి గ్రామంలో క్రీ॥శ 1811-1919 మధ్య కాలంలో జీవించారు. తల్లిదండ్రులు దున్న రామయ్య, ఎల్లమ్మలు. ఇతని అసలు పేరు ఈదయ్య. తత్వకారుడయ్యాక ఇద్దాసు అయ్యాడు. ప్రముఖ పరిశోధనకుడు డా. బిరుదు రాజు రామరాజు ఇద్దాసును “మాదిగ మహాయోగి” గా అభివర్ణించాడు.

ఇద్దాసు చింతపల్లి గ్రామంలో మోతుబరి ఇంటి పశువుల కాపరి. రోజూ బావి దగ్గర “మోటకొడుతూ” ఆనువుగా గీతాలను ఆలపించేవాడు. ఆ గీతాలను విన్న వరసిద్ధ జంగమదేవర “పూదోట బసవయ్య” ఇద్దాసు పంచాక్షరీ మంత్రోపదేశం చేశారు. లింగధారణ చేయించి శైవునిగా మార్చాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

అడవులలో సందరిస్తూ “రాజయోగాన్ని” ఏకాంతంలో సాధన చేశాడు. దానితో ఆయన అష్టసిద్ధులను పొందాడు. పూర్వతాత్విక కవులైన శివరామదీక్షితులు, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, ఈశ్వరాంబల ప్రభావం ఇద్దాసుపై ఉంది. ఈయన ఈశ్వరాంబ సంప్రదాయాన్ని అనుసరించాడు. ఆమె సమాధి సందర్శనకు ఇద్దాసు కందిమల్లయ్యపల్లెను దర్శించాడు.

ఇద్దాసు వేమనలా తత్త్వవేత్తగా, అచలుడిగా వీరశైవ తత్త్వ జ్ఞానిగా కన్పిస్తాడు. పఠేల్, పట్వారీలు ఇద్దాసుకు శిష్యులయ్యారు. సంచార యోగిగా నల్గొండ నుండి మహబూబ్ నగర్ వరకు తిరుగుతూ అధ్యాత్మికతను ప్రచారంచేశాడు. అచ్చంపేట తాలూకాలోని అయ్యవారిపల్లి, పోలేపల్లి, ఆవులోని బాయి మొదలగు చోట్ల ఈశ్వరమ్మ పీఠాలను స్థాపించాడు.

ఇద్దాసు 30కి పైగా తత్వాలను మేలుకొలుపులను, మంగళహారతులను రచించాడు. ప్రస్తుత పాఠ్యభాగం దున్న విశ్వనాథం సంపాదకత్వంలో వచ్చిన “శ్రీ దున్న ఇద్దాసు తత్త్వాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.

పాఠ్యాంశ సందర్భం.

దున్నఇద్దాసు తత్త్వాలు ఆత్మపరంగా, తత్త్వపరంగా తెలంగాణ మట్టి నుండి పుట్టిన మాణిక్యాలు. వేదాంతశాస్త్రాల జ్ఞానాన్ని సామాన్య ప్రజలలోకి తీసుకువెళ్ళి ఆథ్యాత్మిక సుగంధాలను ఇద్దాసు లోకంలో వెదజల్లాడు. తెలంగాణ పద సంకీర్తనా కవులలో కలికి తురాయి ఇద్దాసు. వేదాంత తాత్వికాంశాలను విద్యార్థులకు పరిచయం చేయటం ఈ పాఠ్యభాగ ఉద్దేశం.

పాఠ్యభాగ సారాంశం

అచలం అను పాఠ్యభాగం ‘దున్న ఇద్దాసు’చే రచించినబడినది. ఈ పాఠ్యభాగం దున్న విశ్వనాథం సంపాదకత్వంలో వెలువడిన శ్రీ దున్న ఇద్దాసు గారి తత్వాలు నుండి గ్రహించబడింది. తెలంగాణ పద సంకీర్తన కవులలో “ఇద్దాసు” కలికి తురాయి.

ఇద్దరు తలు ఆత్మపరంగ, తత్వపరంగ, తెలంగాణ నుండి పుట్టిన మాణిక్యాలు. వేదాంత శాస్త్రజ్ఞాన సారాంశాన్ని సామాన్య ప్రజలకు ఈయన అందించాడు. వేదాంత తాత్విక అంశాలను పరిచయం చేయడం ఈ తత్వాల ఉద్దేశ్యం.

ఈ దేహం శాశ్వతం కాదు. కనుక ఈ దేహంపై మోహం విడచిపెట్టాలి. మంచి గురువును ఆశ్రయించి జీవనరాహిత్యాన్ని పొందటానికి ప్రయత్నించాలి. అపుడే మోక్షాన్ని పొందగలుగుతాము. భార్యాబిడ్డలు, ధన ధాన్యాల పట్ల మోహాన్ని వదలిపెట్టాలి. ఏదో ఒకనాటికి కీలు వదలిన బొమ్మలా ఈ దేహం రాలిపోకతప్పదు”.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

ఓ నామః అని అక్షరాలు రాస్తున్నాం నేర్చుకుంటున్నాం కాని, మన జీవిత ఆనవాళ్ళనుతెలుసుకోలేకపోతున్నాం. దాని అంతం తెలియక అల్లరి పాలు అవుతున్నాం. మంచి చెడులను తెలుసుకుని మసలుకోవాలని ఇద్దాసు పలుకుతున్నారు.

ఈ లోకంలో గురువే బ్రహ్మ, గురువే విష్ణువు. దీనిని మనం గమనించాలి. మన దేహంలో షట్ చక్రాలుంటాయి. సహస్రారం శిరస్సుపై ఉంటుంది. అదే చివరి చక్రం. దానిని తెరుచుకోగలిగే శక్తిని పొందితే, ఆ రహస్యం అంతం చిక్కితే అది మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఆజ్ఞాచక్రంమును పొందండి తరించండి.

ఈ లోకం అంతా శూన్యం. ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ఎక్కడ వెతికినా ఏమీ కన్పించదు. మనం జీడికంటి వంటి జ్ఞాన నేత్రాన్ని తెరచి చూసుకోవాలి. అపుడే ముక్తిమూలాలు అర్థమౌతాయి.
ఈ దాసు చెప్పిన మాటలు సత్యములు. అందరూ అనుసరింపదగినవి. వీరశైవ మత మత గురువైన బసవని యొక్క భావాలను అర్థం చేసుకుని ప్రవర్తించండి. అపుడే జీవన సాఫల్యం జరుగుతుంది.

TS Inter 1st Year Commerce Study Material Chapter 12 Emerging Trends in Business

Telangana TSBIE TS Inter 1st Year Commerce Study Material 12th Lesson Emerging Trends in Business Textbook Questions and Answers.

TS Inter 1st Year Commerce Study Material Chapter 12 Emerging Trends in Business

Long Answer Questions

Question 1.
Define e-business and explain the nature and scope of e-business.
Answer:
E-business means “Electronic business”. The term “E-business”, was first used by IBM in 1997, it defined E-business as, “The transformation of key business processes through the use of internet technologies”.

“e-business” is defined as the application of information and communication technologies (ICT) that support all the activities and realms of business. E-business focuses on the use of ICT to enable the external activities and relationships of the business with customers. The term “E-business” refers to the integration of business tools, based on ICT to improve the function of the company.

Scope of E-Business:
The scope of E-commerce is to transact online. Transaction online can be either on products or services.

E-business can be divided into the following areas. They are:
a) Within the organization
b) Business – to – Business (B2B) dealings
c) Business – to – Customer (B2C) transactions
d) Customer – to – Customer (C2C)
e) Customer – to – Business (C2B) and
f) Business – to – Government (B2G).

a) E-business within the organization.

b) B2B refers to exchange of products and services by one business enterprise to another business enterprise.
Ex: India mart, Trade India, Ali baba etc.

c) B2C business refers to an exchange of products and services from a business to a customer.
Ex: Amazon.com, Netflix.com, Sulekha.com etc.

d) C2C here customers offer their products online to be bought by other customers.
Ex: OLX, Quicker etc.

e) C2B is a business model in which consumers (individuals) offer products and services to companies and the companies pay them.
Ex: Online Advertising sites like Google Ad sense, affiliation platforms like commission junction and affiliation programs like Amazon.

f) B2G refers to Business-to-Government, e – commerce is generally defined as commerce between companies and the Government or public sector enterprises. It refers to the use of the Internet for public procurement, Licensing procedures, and other government-related operations.
Ex: Business pay taxes, file reports, or sell goods and services to Government.

Scope of E-Business:
The scope of e-business in discussed in terms of the following broad elements, viz:
1) e-commerce: Transacting or facilitating business through internet is called e-commerce. E-commerce is short form of “Electronic Commerce”, i.e, selling and buying products or services online. Any form of business transaction conducted electronically by. using internet is called e-commerce.

2) e-auctioning: In e-auctioning individuals who want to participate in the auction visit the website with a click and go through the details of goods offered or kept in auction in concerned web pages and participate in auction without sacrificing their personal time.

3) e-banking: Electronic banking is one of the most successful online business. E-banking allows customers to access their accounts and execute orders through use of website. Online banking allows the customers to get their money from an Automated Teller Machine (ATM). Then they can view their accounts, transfer funds, deposit amount and can pay bills.

4) m-banking: Another emerging trend in e-banking operations m-banking known as mobile banking. Customer can perform all most all e-commerce operations by using their Mobile phones. All most all e-commerce portals developed their apps to enable the customers to buy their products / services by using these apps.

5) e-marketing: Electronic marketing provides a Worldwide platform for buying and selling of goods without having any geographical barriers. The internet allows companies to react to individual customer demands immediately without any loss of time.

6) e-trading: E-trading is also known as “online trading” or “e-broking”. It is used for buying and selling stocks in stock exchanges.
Ex: Money conrol.com

Question 2.
Explain the benefits of e-business.
Answer:
E-business has many advantages which can be broadly classified into the following categories.
A. Benefits to consumer:
1) Convenient shopping: e-business enables customers to shop or do any transactions 24 hrs a day, round the year from almost any location as per their convenience.

TS Inter 1st Year Commerce Study Material Chapter 12 Emerging Trends in Business

2) Wider choices: e-business enables the customers to have more choices or more alternative products and services online.

3) Price Advantage: e-business provides customers with less expensive products and services by allowing them to shop in many places and conduct quick comparisions. E-business facilities competition which results in substantial price advantages.

4) Exchange of information: E-business allows the customers to interact with other customers and exchange business ideas, opinions and experiences about the products / services which are available at different online portals.

B) Benefits to Business Organization:
1) Reach beyond boundaries: E-business enables the organizations to extend the organizations to extend their market place to national and international markets and there by increase their sales / revenues with limited time span.

2) Cost Savings: Reduces the cost of creating, processing, distributing,, storing and retrieving information. Further, it allows reduced inventories and overheads cost.

3) Competitive Advantage: E-business enables the customer to compare the chosen products / services with all available competitor products / services. This helps in reduced processing time allows for customization of products and services for achieving competitive advantages.

4) Shortens Recovery of capital Invested: E-business reduces the time between the outlay of capital and the receipt of products and services.

C) Benefits to Society:
1) Environmental Benefits: Since customers can buy their required products/services online with a click of button either from their place of work or home, without moving to the shops physically. This results in reduced traffic congestion, air and sound pollution.

2) Public Welfare: E-business allows some merchandise to be sold at lower prices benefiting the poor people.

3) Availability Products: Due to e-business, abundant. Varieties of products / services are available to the customers according to their choices and preferences. Similarly, customers can have access to their desired products / services which are available at any comer of the world.

Question 3.
Explain the opportunities of business enterprises in 21st century.
Answer:
The following are the opportunities of business enterprises in 21st century.
1) LPG: The economic reforms initiated in the form of liberalization, privatization and Globalization (LPG) have brought structural changes which ultimately created favourable environment for business enterprises in India.

2) Increasing size and diversification: The 21 century business enterprises are large sized and highly diversified organizations. Due to large size and increased output, companies are able to reduce their costs and their by increase in profits.

3) Increasing per capital Income: India has emerged as the third largest economy globally with a high growth rate with its improved per capita Income. As India’s per capital income is increasing, the business opportunities are also increasing in India.

4) Market Economies: The India economy being one of the largest economics in the world with a population of more than 1.2 billion is flourishing and attracting industrial, trade and service sectors all around the world.

5) E-commerce – A gate way to global markets: Business enterprises across the globe are discovering the benefits of electronic commerce. Improved cash flow, customer retention, and service satisfaction are few of the benefits gained from e-commerce.

6) Technological advance merits: 21st century business enterprises are able to use ultramodern technology with the advancement of technology organizations are able to offer services, which are relevant, cost effective and compatible with society’s needs.

7) Expansion of financial services: In 21st century the financial services like Banking, insurance, debt and equity financing, micro finance sectors helping the people to save money and to get liberal credit for their future needs. It resulted in widering of business expansion opportunities.

8) Growing mergers, acquisitions and foreign collaborations: Mergers and acquisitions is a strategy of modem business enterprises for improving innovation / profitability, market share and stock prices.

9) Scope for International business: In 21st century, many organizations are globalizing business in terms of manufacturing, service delivery, capital sourcing or talent acquisition as a defensive strategy. These are discovering a new business opportunities in more than one country.

10) Government support and encouragement: Governments both at state and central level are encouraging new innovative business opportunities by introducing new pro-grams like startup, stand up and make in India.

Question 4.
Explain the challenges of business enterprises in 21st century.
Answer:
The following are the challenges of business enterprises in 21st century.
1) Threat for technology: Rapid change in technology has been a great threat for the business enterprises in terms of cost and time. Business organizations have to adopt themselves in tune with the changing technology and modernize their plant and equipment and processes, unless and otherwise they will become outdated in the market place.

TS Inter 1st Year Commerce Study Material Chapter 12 Emerging Trends in Business

2) Growing consumer awareness: Consumers are awareness about the products and services. Business need to respond the consumer demand to gain customers, otherwise, they lose their market share.

3) Challenges of Globalization: As MNCs are dominating the world markets, it is the question of survival to the local business. This gives rise to increased global competition and increased prices of goods and services.

4) Depleting Natural Resources: Most of the manufacturing enterprises depend upon certain natural resources. Such as minerals, metals, forests, fish etc. which are depleted and they are in danger of vanishing from the planet. This will have a direct impact on the growth of future business enterprises.

5) Economic Recession: International economic and political order has been changing throughout the globe. Economic recession took place in united states and europe is slowly spreading over to other countries also.

6) Environmental challenges: Environmental considerations are one of the biggest challenges of business organisations facing Economic, social, political, legal, technological environments have been changing rapidly. It affecting business enterprises in 21st century.

7) Corruption and Bureaucratic Hurdles: Corruption is a very big hurdle for doing business particularly in India. Corruption is a barrier to the effective development of any sector and poses business risks.

8) Foreign exchange Risk: Foreign exchange risk is another factor causing instability in the running of organizations. Exchange rates, amount of exports and imports and political factors are also affect the Business.

9) Security Issues: Security threats to business can happen in various forms like information security, internet security, physical security, wireless Access to the company network, risk management, insider threat, privary laws etc.

10) Human Resource challenges: One of the biggest challenges of 21st century business is Human Resource – finding the right staff, training and retaining them are concerns of the HR function.

In 21st century, managers must understand the cultures around the world and operate at global level.

Short Answer Questions

Question 1.
Explain the scope of e – business.
Answer:
The scope of e-business is discussed in terms of the following broad elements, viz:
1) e-commerce: Transacting or facilitating business through internet is called e-commerce. e-commerce is short form of “Electronic Commerce”, i.e., selling and buying products and/or services online. Any form of business transaction conducted electronically by using internet is called e-commerce.

2) e-auctioning: In e-auctioning individuals who want to participate in the auction visit the website with a click and go through the details of goods offered or kept in auction in concerned web pages and participate in auction without sacrifing their personal life.

3) e-banking: Electronic banking is one of the most successful online businesses e-banking allows customers to access their accounts and execute orders through use of website. Online banking allows the customers to get their money from an Automated Teller Machine (ATM). They can view their accounts, transfer funds, deposit amount and can pay bills.

4) m-banking: Another emerging trend in e-banking operations is m-banking known as mobile banking. Customer can perform all most all e-commerce operations by using their mobile phones. All most all e-commerce portals developed their apps to enable the customers to buy their products / services by using these apps.

5) e-marketing: Electronic marketing provides a world wide platform for buying and selling of goods without having any geographical barriers. The internet allows companies to react to individual customer demands immediately without any loss of time.

6) e-trading: e-trading is also known as “online trading” or “e-broking”. It is used for buying and selling stocks in stock exchanges.
Ex: Money conrol.com

Question 2.
What are the benefits of e-business to business organisations?
Answer:
The benefits of e-business to business organisation.
1) Reach beyond boundaries: e-business enables the organizations to extend their market place to national and international markets and thereby increase their sales/revenues with limited time span.

TS Inter 1st Year Commerce Study Material Chapter 12 Emerging Trends in Business

2) Cost savings: Reduces the cost of creating, processing, distributing, storing and retrieving information. Further, it allows reduced inventories and overheads cost.

3) Competitive Advantage: E-business enables the customer to compare the chosen products/services with all available competitor products/ services. This helps in reduced processing time allows for customization of products and services for achieving competitive advantages.

4) Shortens Recovery of capital Invested: E-business reduces the time between the outlay of capital and the receipt of products and services.

Question 3.
What are the benefits of e-business to customers?
Answer:
The benefits of e-business to customers are:
1) Convenient shopping: e-business enables customers to shop or do any transactions 24 hrs a day, round the year from almost any location as per their convenience.

2) Wider choices: E-business enables the customers to have more choices or more alter-native products and services online.

3) Price Advantage: E-business provides customers with less expensive products and services by allowing them to shop in many places and Conduct Quick Comparisions. E-business facilitated Competition which results in substantial price advantages.

4) Exchange of Information: E-business allows the customers to interact with other customers and exchange business ideas, opinions and experiences about the products/ services which are available at different online portals.

Question 4.
What are the benefits of e-business to Society?
Answer:
The benefits of e-business to society
1) Environmental Benefits: Since customers can buy their required products/services online with a click of button either from their place of work or home, without moving to the shops physically. This results in reduced traffic congestion, air and sound pollution.

2) Public welfare: e-business allows some merchandise to be sold at lower prices benefiting the poor people.

3) Availability products: Due to e-business, abundant varieties of products/services are available to the customers according to their desired products/services which are available at any comer of the world.

TS Inter 1st Year Commerce Study Material Chapter 12 Emerging Trends in Business

Very Short Answer Questions

Question 1.
e-Business.
Answer:
1) The term “E-business” refers to the integration of business tools based on ICT to improve the following of the company.

2) E-business means Electronic Business. The term e-business was first used by IBM in 1997, it defined E-business as, “the transformation of key business processes through the use to internet technologies”.

Question 2.
e-Ban king.
Answer:
1) Performing all banking operations by using internet is known as “E-banking”. It is also called “Online Banking”.

2) Online banking allows the customers to get their money from an Automated Teller Machine (ATM). They can view their accounts, transfer funds, deposit amount and can pay bills.

Question 3.
e-Commerce.
Answer:
1) Transacting or facilitating business through internet is called E-Commerce.

2) E-commerce revolve around buying and selling online. But the E-Commerce universe contains other types of activities as well. Any form of Business transaction conducted electronically is E-commerce.

Question 4.
e-Auctioning.
Answer:
1) The internet enables people to participate in the auction without sacrificing their personal time.

2) In E-Auctioning the people, who want to participate in the auction, visit the website with a click and go through the details of goods offered or kept in the auction concerning web pages and participate in the auction. Ex: Bank auctioneers tenders.

TS Inter 1st Year Commerce Study Material Chapter 12 Emerging Trends in Business

Question 5.
e-Trading.
Answer:
1) E-trading is also known as “Online trading” or E-broking.
2) It is used for buying and selling stocks in stock exchanges.
For example Money conrol.com.

Question 6.
e-Marketing.
Answer:
1) Performing all marketing functions like buying selling, advertisement, etc., by electronic media is called “E-marketing”.

2) The Internet allows companies to react to individual customers’ demands immediately without any loss of time. It does not matter where the customer is located. It can be done by e-mail etc.

Question 7.
Foreign exchange risk.
Answer:
1) Foreign exchange risk is also known as “Exchange rate risk” or “Currency risk”.

2) It is a financial risk that exists when a financial transaction is denominated in a currency other than that of the base currency of the company.

3) This risk arises due to variations in the exchange rates in the foreign exchange market.

TS Inter 1st Year History Study Material Chapter 10 మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 10th Lesson మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 10th Lesson మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మరాఠాల విజృంభణకు దారితీసిన పరిస్థితులను వివరించండి.
జవాబు.
మరాఠా ప్రజల శీలమును, వారి చరిత్ర గతిని నిర్ణయించడంలో ఆ ప్రాంతపు భౌగోళిక అంశాలు గొప్ప ప్రభావాన్ని చూపాయి. మహారాష్ట్ర ప్రాంతానికి రెండువైపుల నుంచి సహ్యాద్రి, వింధ్య, సాత్పూరా పర్వత శ్రేణులు రక్షణ కవచంలా ఉండగా, నర్మదా, తపతి నదులు మహారాష్ట్ర ప్రాంతాన్ని రక్షిస్తూ రక్షణకు ఉపకరించే పర్వత కోటల నిర్మాణానికి కారణమయ్యాయి. ఫలితంగా ఈ ప్రాంతంలో అత్యంత, వ్యూహాత్మక, సహజ రక్షణలకు అనువై, శత్రు దుర్భేద్యమైన కోటలు నిర్మించబడి, శత్రువులు వశపరచుకోవడానికి అంతగా సాధ్యపడలేదు. అత్యల్ప వర్షపాతం పైగా సారవంతం కాని భూములు వల్ల మరాఠాలు ధృడ శరీరులై కష్టపడితే తప్ప కడుపు నిండని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా మహారాష్ట్రులలో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా తట్టుకొనే లక్షణాలు స్వతహాగా ఏర్పడ్డాయి.

పైన పేర్కొన్న భౌగోళిక అంశాల ప్రభావంతోపాటుగా, మహారాష్ట్ర భక్తి ఉద్యమకారులైన తుకారాం, రామదాస్, వామన పండితుల బోధనలు మరాఠాలను చైతన్యపరిచాయి. ఫలితంగా, భగవంతుని ముందు అందరూ సమానులేనన్న భావన ప్రజల్లో బాగా పాతుకుపోయింది. వారు విభేదాలు మరిచిపోయి, ఏక జాతిగా రూపొందేందుకు దోహదపడ్డాయి. ఈ భావనను మహారాష్ట్ర సాహిత్యం మరింత పెంపొందించింది. సమర్థరామదాసు రచించిన ‘దశబోధ’ గ్రంథం శివాజీని మాత్రమే ఉత్తేజపరచకుండా, యావత్ మహారాష్ట్ర జాతిలో తమ ఆత్మ గౌరవం కాపాడుకోవడానికి స్వతంత్ర మరాఠా రాజ్యస్థాపన ఆవశ్యకతను తెలియజేసింది.

TS Inter 1st Year History Study Material Chapter 10 మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

అంతేకాకుండా బీజాపూర్, అహ్మద్ నగర్, గోల్కొండ రాజ్యాల్లో మరాఠా నాయకులు వివిధ హోదాల్లో పనిచేసి సైనిక, పాలనానుభవాన్ని గడించారు. మరాఠా సర్దారులు అందించిన సేవలకు గాను దక్కన్ సుల్తానులు వారిని నాయక్, రావ్ లాంటి బిరుదులతో సత్కరించారు. చందర్రావ్ మోరే, యశ్వంత్ రావ్, నాయక్ నింబాల్కర్, లోక్ జాదవ్వ్, షాజీ భోంస్లే లాంటి మరాఠా సర్దారులు దక్కన్ రాజ్యాల్లో మంచి కీర్తిప్రతిష్టలు సంపాదించుకొన్నారు. ఈ విధంగా పైన పేర్కొన్న కారణాలన్నీ శివాజీ నాయకత్వంలో మహారాష్ట్ర జాతి రాజ్య నిర్మాణానికి దోహదపడ్డాయి.

ప్రశ్న 2.
శివాజి సాధించిన విజయాలు, ఘనతలు చర్చించండి.
జవాబు.
మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన శివాజీ 1627లో షాజీ భోంస్లే, జిజియాబాయి దంపతులకు పూనాకు సుమారు యాభైమైళ్ల దూరంలోని ‘శివనేర్’ దుర్గంలో జన్మించాడు. షాజీభోంస్లే మేవార్ను పాలించిన సిసోడియా వంశానికి `చెందినవాడు. తల్లి జిజియాబాయి దేవగిరిని పాలించిన యాదవ వంశానికి చెందిన ఉన్నత కుటుంబీకురాలు. 1636లో షాజీ భోంస్లే శివనేర్ దుర్గాన్ని కోల్పోవడంతో, దాదాజీ కొండదేవ్ రక్షణలో శివాజీ తన తల్లితో కలసి పూనాకు మకాం మార్చడం జరిగింది. శివాజీ పూనాలో అతని తల్లి పర్యవేక్షణలో పెరిగాడు. ఆమె తన బోధనల ద్వారా, ఆచరణ ద్వారా హిందూ మత పరిరక్షణపై శివాజీకి అపరిమితమైన ఉత్సాహాన్ని కలిగించింది. సమర్థుడు, ప్రజ్ఞాశాలి అయిన దాదాజీ కొండదేవ్ శిక్షణలో శివాజీ ఆరితేరిన యోధుడుగా, దక్షుడైన పరిపాలకుడుగా తీర్చిదిద్దబడ్డాడు. తన సంరక్షకుడైన దాదాజీ కొండదేవ్ 1647లో మరణించడంతో, శివాజీ పూనా జాగీరు బాధ్యతలను స్వతంత్రంగా నిర్వహించడం మొదలుపెట్టాడు. ఇదే క్రమంలో తనకు నమ్మకమైన మావళీ తెగ నాయకులతో సంబంధాలను బలోపేతం చేసుకొన్నాడు. మావళీలే తర్వాత కాలంలో శివాజీ సైన్యంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

శివాజీ తన పంతొమ్మిదో ఏట నుంచి తన సైనిక జీవితాన్ని ప్రారంభించాడు. మొదటగా 1646లో తోరణ దుర్గాన్ని ఆక్రమించాడు. తదనంతరం వరుసగా చాకనా, కొండన, రాయఘడ్, పురంధర్ మొదలైన దుర్గాలను వశపరచుకొన్నాడు. రాయగడ్ వద్ద నూతన దుర్గాన్ని నిర్మించి, దాన్ని తన కార్యకలాపాలకు కేంద్రంగా చేసుకొన్నాడు. శివాజీ కళ్యాణ్ దుర్గాన్ని ముట్టడించినప్పుడు బీజాపూర్ సుల్తాన్ అప్రమత్తమయ్యాడు. శివాజీని లొంగదీసుకోవాలని అతని తండ్రి షాజీ భోంస్లేను బందీగా పట్టుకొన్నాడు. చివరకు శివాజీ బెంగుళూరు, కొండన దుర్గాలను బీజాపూర్ సుల్తాన్కు ఇచ్చి తన తండ్రిని విడిపించుకొన్నాడు. తర్వాత శివాజీ ఆరు సంవత్సరాలపాటు (1649-1655) తన దండయాత్రలు మానివేసి, తాను గెలిచిన ప్రాంతాలను సాధన సంపత్తిని సుస్థిర పరచుకొనే ప్రయత్నం చేశాడు.

శివాజీ బీజాపూర్ ప్రాంతంపై 1656 నుంచి మళ్లీ తన దండయాత్రలను ప్రారంభించాడు. 1656లో మొదటగా చంద్రరావ్ మోర్ను ఓడించి జావళీ దుర్గాన్ని వశపరుచుకొన్నాడు. నాటి నుంచి జావళి దుర్గం, శివాజీ సైనిక చర్యలకు కీలక స్థావరమైంది. తర్వాత ఉత్తర కొంకణ తీరాన్ని, కళ్యాణ్ దుర్గాన్ని జయించాడు. పోర్చుగీసు వారి స్థావరమైన డామన్ ఓడ రేవును దోచుకున్నాడు. శివాజీ దాడులతో అప్రమత్తమైన బీజాపూర్ సుల్తాన్ క్రీ. శ. 1659లో శివాజీని పట్టుకొని రావలిసిందిగా తన సేనాని అఫ్టలానన్ను పంపించాడు.

ఎలాగైనా రెచ్చగొట్టి శివాజీని పర్వత ప్రాంతం (ప్రతాపర్) నుంచి మైదానాల వైపుకు తీసుకురావాలనేదే అల్ఫాన్ వ్యూహం. ఎందుకంటే పర్వత ప్రాంతాలలో శివాజీ గెరిల్లా యుద్ధ తంత్రంలో ఆరితేరినవాడు, అతన్ని లొంగదీసుకోవడం చాలా కష్టం. శివాజీని మైదాన ప్రాంతానికి రప్పించడంలో విఫలమైన అఫ్ఘలాఖాన్ చివరకు కృష్ణాజీ భాస్కర్ అనే రాయబారిని శివాజీతో సంప్రదింపులకై పంపాడు. అలాన్తో జరుపబోయే సమావేశంలో శివాజీ ప్రాణాలకు హాని జరుగవచ్చనే సంకేతాలను రాయబారి వెల్లడించాడు. అలాఖాన్ కుట్రను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధమైన శివాజీ రక్షణ కవచాన్ని ధరించి, తగిన ఆయుధాలను సమకూర్చుకొని సమావేశ మందిరానికి చేరుకొన్నారు. వారిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకోవడంతో పోరు ప్రారంభమయింది. ఆత్మరక్షణకై శివాజీ బాగ్ నఖ్ (పులిగోళ్లు) అనే మారణాయుధంతో అఫ్ఘలాన్ను హతమార్చాడు. తదనంతరం శత్రుసైనిక శిబిరంపై దాడి జరిపి పూర్తిగా ఓడించాడు. భారీస్థాయిలో ధనాన్ని కొల్లగొట్టాడు. ఈ ఘనవిజయంతో శివాజీ ఖ్యాతి మరింత ఇనుమడించి, మరాఠా ప్రజానీకంలో గొప్ప పరాక్రమవంతుడిగా, పురాణ పురుషుడిగా పేరు సంపాదించుకొన్నాడు.

మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ తన మేనమామ షాయిస్తఖాన్ను 1659లో దక్కన్ ప్రాంతానికి గవర్నర్గా నియమించాడు. శివాజీని ఎలాగైనా అణచాలని ఔరంగజేబ్ షాయిస్తఖాన న్ను ఆజ్ఞాపించాడు. దీంతో షాయిస్తఖాన్ తన దండయాత్రను ప్రారంభించి చకాన్, ఉత్తర కొంకణ తీరాన్ని (1661) ఆక్రమించాడు. శివాజీ 1663 ఏప్రిల్ నెలలో పూనే చేరుకొని షాయిస్తఖాన్పై మెరుపుదాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిచాడు. తన సైనిక అవసరాల కోసం శివాజీ 1664లో అతి సంపన్నమైన సూరత్ రేవు పట్టణాన్ని కొల్లగొట్టాడు.

TS Inter 1st Year History Study Material Chapter 10 మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

నానాటికీ పెరుగుతున్న శివాజీ ప్రాబల్యాన్ని, షాయిస్తఖాన్ సంఘటనతో భీతి చెందిన ఔరంగజేబ్ పరిస్థితులను అదుపులో తెచ్చేందుకు ప్రయత్నించాడు. జైసింగ్ పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే వ్యూహాత్మకంగా వ్యవహరించి. శివాజీపై ఒత్తిడి పెంచాడు. జైసింగ్ పురంధర్ వద్ద శివాజీని ఓడించి, పురంధర్ సింధి (1665)కి ఒప్పించాడు. ఈ సంధి షరతుల ప్రకారం శివాజీ తన ఆధీనంలో ఉన్న 35 కోటల్లో ఇరవై మూడు కోటలను మొగులుల వశం చేశాడు. మొగల్ చక్రవర్తి ఆస్థానాన్ని సందర్శించాలనే సంధి షరతును కూడా శివాజీ అంగీకరించాడు.

పురంధర్ సంధిని అనుసరించి శివాజీ 1666లో ఆగ్రాకు వెళ్లి మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ను కలిశాడు. అయితే అక్కడ శివాజీ అమర్యాదకు లోనయ్యాడు. దీంతో శివాజీ ఆగ్రహించడంతో, ఔరంగజేబ్ అతన్ని నిర్బంధించాడు. 1670లో సూరత్ పట్టణంపై రెండోసారి దాడి జరిపి అరవై లక్షల రూపాయల ధనాన్ని దోచుకున్నాడు.
శివాజీ పట్టాభిషేకం 1674 జూన్ 16న రాజ్గఢ్ మిక్కిలి వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ పట్టాభిషేకాన్ని వారణాసికి చెందిన వేద పండితుడైన (విశ్వేశ్వర్) గాగ భట్టు నిర్వహించాడు. మేవార్ రాజపుత్రుల సంప్రదాయం ప్రకారం దీన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ‘శివాజీ ఛత్రపతి’, “హైందవ ధర్మోద్ధారక” అనే బిరుదులు ధరించాడు.

ప్రశ్న 3.
శివాజీ పరిపాలన గురించి రాయండి.
జవాబు.
పరిపాలన: శివాజీ కృషితో స్వతంత్ర మహారాష్ట్ర రాజ్యం ఏర్పడింది. శివాజీ గొప్ప వీరుడు. సైనిక నాయకుడే కాకుండా గొప్ప పాలకుడిగా కూడా పేరు పొందాడు.
శివాజీ పాలన సమానత్వం, న్యాయం, సహనంలపై ఆధారపడి కొనసాగింది. శివాజీ తన రాజ్యానికి ‘స్వరాజ్యం’ అని పేరు పెట్టాడు. తన రాజ్యం పరిసర ప్రాంతాల నుంచి చౌత్, సర్దేశ్ముఖి వంటి పన్నులను వసూలు చేశాడు.

శివాజీ కేంద్రీకృత పాలనావ్యవస్థను ఏర్పాటు చేశాడు. చక్రవర్తి అయిన శివాజీ సర్వాధికారి. అధికారులను నియమించే, తొలగించే అధికారం శివాజీకి ఉండేది. శివాజీ తనకు పరిపాలనలో సహకరించేందుకు ఎనిమిది మంది సభ్యులు గల అష్టప్రధానులు అనే మంత్రిమండలిని ఏర్పాటుచేశాడు. మంత్రులకు వివిధ శాఖలను కేటాయించాడు.

అష్ట ప్రధానులు:
a) పీష్వా: ప్రధానమంత్రి – సాధారణ పాలనా వ్యవహారాలను చూసేవాడు.
b) అమాత్య: ఆర్థిక మంత్రి – ఆదాయ వ్యయాలు, బడ్జెట్ చూసేవాడు.
c) మంత్రి: ఆంతరంగిక వ్యవహారాల మంత్రి.
d) సచివ: సమాచారశాఖా మంత్రి.
e) సుమంత్: విదేశీ వ్యవహారాల మంత్రి.
f) పండితరావు: దానధర్మాలు, ధర్మాదాయం.
g) సేవాపతి: సర్వసైన్యాధ్యక్షుడు.
h) న్యాయాధీశుడు: అత్యున్నత న్యాయాధికారి.

కేవలం సామర్థ్యాన్ని బట్టి మాత్రమే మంత్రిమండలిలో స్థానం లభించేది. వంశపారంపర్య హక్కు ఉండేది కాదు. మంత్రులు, పాలనా వ్యవహారాలతో పాటు అవసరమైనప్పుడు సైనిక విధులను కూడా నిర్వహించేవారు.

పరిపాలనా విభాగాలు: పరిపాలనా సౌలభ్యం కోసం శివాజీ తన స్వరాజ్యంను నాలుగు రాష్ట్రాలుగా విభజించి దాని పాలనకు వైశ్రాయ్ లేదా గవర్నర్ను నియమించాడు. రాష్ట్రాలను తిరిగి జిల్లాలుగా విభజించాడు. జిల్లాను తిరిగి గ్రామాలుగా విభజించాడు. గ్రామ పాలనకు పంచాయితి, పటేల్, కులకర్ణి అనే అధికారులు నిర్వహించేవారు.
వీటికి తోడు మొగల్ రాజ్యంలోని కొన్ని ప్రాంతాలు పరోక్షంగా శివాజీ ఆధీనంలో ఉండేవి. వారి నుంచి చౌత్ అనే పేరున పన్నులు వసూలు చేశాడు.

భూమిశిస్తు విధానం: శివాజీ జాగిర్దారీ విధానాన్ని రద్దుచేశాడు. మత సంస్థల భూములను శివాజీ స్వాధీనం చేసుకొని వాటికి నగదు చెల్లించాడు. భూమిని సర్వే చేయించి రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. పన్నులను ధన రూపంలోగాని, ధాన్య రూపంలోగాని చెల్లించే అవకాశాన్ని కల్పించాడు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు రుణాలను ఇచ్చి, వాటిని సులభ వాయిదాల్లో తిరిగి చెల్లించే ఏర్పాటు చేశాడు.

భూమి శిస్తుతోపాటు వాణిజ్య పన్నులు, నాణాల నుంచి ఆదాయం, చౌత్, సర్దేశముఖి మొదలైన వాటి ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభించేది. చౌత్ అనే 1/4 వ వంతు పన్ను యుద్ధాల నుంచి రక్షించినందున తన రాజ్య పరిసరాల్లోని వారి నుంచి వసూలు చేసేవాడు. 1/10 వ వంతు వసూలు చేసే సర్దేశముఖి రాజు పట్ల గౌరవంతో చెల్లించే పన్ను.

సైనిక పాలన: శివాజీ బలమంతా అతని సైన్యంపై ఆధారపడి ఉంది. శివాజీ ప్రతిభావంతమైన, అంకితభావం గల సైన్యాన్ని ఏర్పాటు చేసుకొన్నాడు. ముస్లిం పాలకులను మహారాష్ట్రకు దూరంగా ఉంచి హిందూ ధర్మాన్ని రక్షించడం ప్రధాన లక్ష్యంగాగల శివాజీ అందుకు అనువైన సైన్యాన్ని ఏర్పాటు చేసుకొన్నాడు. శివాజీ సైన్యంలో 45 వేల అశ్విక దళం, 60 వేల కాల్బలం, లక్షమందితో పదాతి దళం ఉండేది. వీటికి తోడు ఏనుగులు, ఒంటెలు, ఫిరంగి దళం కూడా ఉండేది. జాగీరులకు బదులు మొదటిసారిగా ధనరూపంలో వేతనాలను చెల్లించేవారు. శివాజీ కోటల రక్షణకు ప్రత్యేక చర్యలను తీసుకొన్నాడు. సమర్థులైన వారికి బిరుదులు ఇవ్వడం, ప్రతిభావంతులకు అదనపు సౌకర్యాలను కల్పించడం వంటివి శివాజీ చేశాడు. యుద్ధరంగానికి స్త్రీలను తీసుకువెళ్ళడాన్ని నిషేధించాడు. దీన్ని ఉల్లంఘించిన వారికి మరణ శిక్ష విధించేవాడు. యుద్ధంలో స్వాధీనం చేసుకొన్న సొమ్మంతా చక్రవర్తికి అప్పగించాల్సి ఉండేది.

న్యాయపాలన: న్యాయ వ్యవస్థలో శివాజీ సంప్రదాయ పద్ధతులను పాటించాడు. సమన్యాయాన్ని అనుసరించాడు. ధనవంతుడు, పేదవాడు అనే తేడాలు కానీ, మత తేడాలు కానీ చూపించేవాడు కాదు. గ్రామస్థాయిలో గ్రామ పంచాయితీలు న్యాయపాలన చేసేవి. కేంద్ర స్థాయిలో న్యాయపాలన కోసం ‘న్యాయాధీశ్’ నియమించబడ్డాడు. కేసులు విచారించడంలోనూ, తీర్పులను ఇవ్వడంలోనూ ప్రాచీన హిందూ చట్టాలను పరిగణనలోకి తీసుకొనేవారు.

దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్న మొగలులతో వీరోచితంగా పోరాడి శివాజీ విజయం సాధించాడు. గతంలో అనైక్యంగా చిన్నచిన్న భాగాలుగా ఉన్న హిందూమత శక్తులను ఉన్నతమైన ఆశయాలతో ఏకంచేశాడు.

వీటన్నింటికి తోడు శివాజీ గొప్ప రాజకీయవేత్త, చురుకైన నాయకుడు. జె.ఎన్. సర్కార్ అనే చరిత్రకారుడు అన్నట్లు “శివాజీ మహారాష్ట్రులకు వెలుగు …. మొగలుల పాలిట సింహస్వప్నం తన వారసులకు స్ఫూర్తిప్రదాతగా నిలిచాడు. శివాజీ గొప్పతనం అతని వ్యక్తిత్వంలోను ఆచరణలోనూ బయల్పడుతుంది”.

TS Inter 1st Year History Study Material Chapter 10 మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

ప్రశ్న 4.
మూడోపానిపట్టు యుద్ధం కారణాలు, గమనం, ఫలితాలను వివరించండి.
జవాబు.
ఆధునిక భారతదేశ చరిత్ర గతిని మలుపు తిప్పిన యుద్ధాల్లో మూడో పానిపట్ యుద్ధం ఒకటి. మూడో పీష్వా తమ్ముడైన రఘునాథ రావు (రఘోబా), అహ్మద్ షా అబ్దాలీ రాజ్యంలో భాగంగా ఉన్న పంజాబ్ను ఆక్రమించి, అతని రాజ్య ప్రతినిధిని తరిమివేశాడు. దీంతో అహ్మర్షి అబ్దాలీ మహారాష్ట్రులపై పెద్ద సైన్యంతో దండెత్తాడు. చారిత్రాత్మకమైన పానిపట్ యుద్ధభూమిలో 14 జనవరి, 1761వ తేదిన ఇరు సైన్యాల మధ్య తీవ్ర యుద్ధం జరిగింది.

యుద్ద విశేషాలు: మహారాష్ట్ర సైన్యాధ్యక్షుడుగా సదాశివరావు (బావో సాహెబ్), మూడో పీష్వా కుమారుడైన విశ్వాసరావు ఉపసైన్యాధ్యక్షుడుగా వ్యవహరించారు. బావో సమర్థుడైన వ్యక్తి, కానీ అతని అహంకారం, గర్వం కారణంగా తన సేనా నాయకుల మాటలను వినక పెడచెవిన పెట్టాడు. ముఖ్యంగా జాట్ల నాయకుడైన సూరజ్మల్ ప్రత్యక్ష యుద్ధం (బహిరంగ యుద్ధం) వద్దని, గెరిల్లా యుద్ధమే తమకు లభిస్తుందని చెప్పినా వినలేదు. తన మాటలు లెక్క చేయనందుకు సూరజ్మల్ తన సైన్యంతో వెనుదిరిగాడు. మరోవైపు అహ్మద్ అబ్దాలీ రోహిల్లాలు, అవధ్ నవాబ్ సహకారాన్ని సకాలంలో పొందగలిగాడు.

అబ్దాలీ తెలివిగా మరాఠా సైనిక శిబిరాన్ని చుట్టుముట్టి వారికి ఆహారపదార్థాలు అందకుండా వ్యూహం పన్నాడు. దక్కన్ నుంచి రాకపోకలను పూర్తిగా స్తంభింపచేశాడు. రెండునెలల పాటు మరాఠా సైన్యాలు తీవ్ర బాధలకు గురి అయ్యాయి. ప్రత్యక్ష యుద్ధంలో అంతగా ప్రావీణ్యం లేని మరాఠా సైన్యం చిత్తుగా ఓడిపోయింది. విశ్వాసరావు, సదాశివరావు వంటి వీరులు సైతం మరణించారు. దాదాపు రెండు లక్షలకు పైగా మరాఠా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వేలమందికి పైగా క్షతగాత్రులయ్యారు.

ఫలితాలు:

  1. మూడో పానిపట్ యుద్ధంలో ఓటమి కొంతవరకు మహారాష్ట్రుల అధికారాన్ని, ప్రాభవాన్ని అంతమొందించింది. అఖిల భారత హిందూ సామ్రాజ్య స్థాపన అనే ఆశయం నెరవేరలేదు.
  2. మహారాష్ట్రులు, ముస్లింలు బలహీనమైనందున, ఆంగ్లేయులకు తమ అధికారాన్ని విస్తరించుకొనే అవకాశం కలిగింది. పరోక్షంగా బ్రిటిష్ వారు ఈ యుద్ధం వల్ల లాభపడినట్లయింది.
  3. ఈ యుద్ధంవల్ల శిక్కులు పంజాబ్లో తమ ఆధిక్యతను స్థాపించుకొనేందుకు మార్గం సులభమైంది. శిక్కులు పఠానులను తరిమివేయడంతో వారు స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయారు.

మహారాష్ట్రుల ఓటమికి కారణాలు: మహారాష్ట్రులు ఓటమికి ప్రధాన కారణాలు ఇవి:

  1. అహ్మద్ షా అబ్దాలీ ఆరితేరిన సైన్యాధ్యక్షుడు. ఇతని సైన్యం ఆయుధాలలో, క్రమశిక్షణలో మహారాష్ట్రుల కంటే ఉత్తమమైంది.
  2. భావో గర్విష్టి. అతడు ఇతరుల సలహాలను లక్ష్యపెట్టలేదు. మహారాష్ట్రులు జాట్ల సలహాలు విననందున వారి అభిమానాన్ని, సహాయాన్ని కోల్పోయారు. మరోవైపు అహ్మద్ షా అబ్దాలీ రోహిల్లాలు, అవధ్ నవాబ్ సహకారాన్ని సకాలంలో పొందగలిగాడు.
  3. మహారాష్ట్రులు వారికి పట్టున్న గెరిల్లా యుద్ధాన్ని ఎంచుకోకుండా, అంతగా అభ్యాసనం లేని బహిరంగ యుద్ధం చేయడం.
  4. అబ్దాలి మహారాష్ట్రుల సైన్యానికి ఆహార పదార్థాలు అందకుండా చేయడంతో, వారు పస్తులు ఉండాల్సి వచ్చింది.

ప్రశ్న 5.
పీష్వాల గురించి సంక్షిప్త వ్యాసం రాయండి.
జవాబు.
శివాజీ తన పట్టాభిషేక సమయంలో ఎనిమిది మంది సభ్యులు గల మంత్రి మండలి (అష్టప్రధానులు) బాధ్యతలు, విధుల గురించి స్పష్టంగా వివరించడం జరిగింది. ఛత్రపతి తర్వాత పీష్వా చాలా ప్రధానమైన వ్యక్తి. పరిపాలనలో ఇతనిదే అగ్రస్థానం. శివాజీ కాలంలో మోరోపంత్ త్రయంబక్ మొదటి పీష్వాగా నియమించబడ్డాడు. శివాజీ వారసులు కూడా పరిపాలనలో పీష్వాలపైనే చాలా ఎక్కువగా ఆధారపడ్డారు. తారాబాయితో జరిగిన అంతర్యుద్ధంలో సాహూ విజయం సాధించి ఛత్రపతిగా సింహాసనం అధిష్టించడంలో నాటి పీష్వా బాలాజీ విశ్వనాథ్ కీలక పాత్ర పోషించాడు. ఇతని కాలం నుంచే పీష్వాలు మరాఠా సర్దారులందరిలోకి అగ్రగణ్యులయ్యారు. అష్టప్రధానులందరిపైనే కాకుండా ఛత్రపతి కంటే కూడా పీష్వా అధికుడనే భావనను బలపరిచే విధంగా పీష్వా పదవిని బాలాజీ విశ్వనాథ్ తీర్చిదిద్దాడు. మొత్తం మీద మరాఠా చరిత్రలో 1713 నుంచి 1818 వరకు ఏడుగురు పీష్వాలు పాలించారు. బాలాజీ విశ్వనాథ్ (1713 – 20): బాలాజీ విశ్వనాథ్ కొంకణ్ తీరంలోని చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. ఇతను మరాఠా సర్దారుల దగ్గర గుమస్తాగా జీవితాన్ని ప్రారంభించాడు. ‘తదనంతరం కాలంలో పూనా, దౌలతాబాద్లకు సర్ సుబేదార్ గా పనిచేసాడు. ఈ కాలంలో బాలాజీ విశ్వనాథ్ మొగల్ చక్రవర్తితో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉండడం వల్ల సాహూకి దగ్గరయ్యాడు. సాహూని ఛత్రపతి చేసే విషయమై మరాఠా సర్దారులతో దౌత్యం నెరపడంలోనూ, వారిని లొంగదీసుకోవడంలో బాలాజీ విశ్వనాథ్ విజయం సాధించాడు. అతని సేవలకు గుర్తింపుగా సాహూ అతన్ని 16 నవంబర్, 1713లో పీష్వాగా నియమించాడు. తన అత్యుత్తమ ప్రతిభా పాటవాలచే బాలాజీ విశ్వనాథ్ మరాఠా సామ్రాజ్యానికి పీష్వానే వాస్తవాధినేతగా మార్చాడు. పూనాను రాజకీయ కేంద్రంగా మార్చి, పీష్వా పదవిని వంశపారంపర్యం చేశాడు. అందుకనే బాలాజీ విశ్వనాథన్ను పీష్వా వంశ స్థాపకుడని అంటారు. మొగల్ రాజ్యంలోని అంతర్గత విభేదాలను ఆసరాగా తీసుకొని మరాఠాల ప్రాబల్యాన్ని పెంచడంలో బాలాజీ విశ్వనాథ్ విజయం సాధించాడు. కొంకణ తీరంలోని నావికాదళాధ్యక్షుడు కన్హోజీ అంగ్రేతో 1714లో చేసుకొన్న ‘లోనావాలా సంధి’ ఇతని తొలి దౌత్యవిజయం. దీని ద్వారా కన్హోజీ సాహూని ఛత్రపతిగా అంగీకరించాడు. మొదటి బాజీరావ్ (1720 40): బాలాజీ విశ్వనాథ్ తరువాత అతని 20 సంవత్సరాల కుమారుడు మొదటి బాజీగాన్ కీ ష్వాగా బాధ్యతలు చేపట్టాడు. అతడు విజ్ఞుడైన రాజనీతిజ్ఞుడు, మిక్కిలి వివేకం కలవాడు. చక్కని యోధుడు. యుద్ధ తంత్రంలో ప్రతిభాశాలి. తన తండ్రి వద్ద నుంచి రాజతంత్రాన్ని, దౌత్యాన్ని అనుభవపూర్వకంగా నేర్చుకొన్నాడు. గెంల్లా యుద్ధ తంత్రంలో శివాజీ తరువాత అంతగా ఆరితేరినవాడుగా ప్రసిద్ధి చెందాడు. ధైర్యసాహసాలు, రాజతంత్రం దృష్ట్యా అతడు పీష్వాలలో కడు సమర్థుడిగా పరిగణింపబడ్డాడు.

అఖిల భారత హిందూ సామ్రాజ్యం (హింద్పద్ పద్ షాహీ) స్థాపన అనేది బాజీరావు మహోన్నత ఆశయం. మొగల్ సామ్రాజ్య పతనాన్ని దృష్టిలో పెట్టుకొని, “చెట్టు కాండాన్ని ఛేదిస్తే కొమ్మలు వాటంతట అవే పడిపోతాయని”, అప్పుడు మరాఠా కీర్తి పతాకం సింధూ నుంచి కృష్ణా వరకు ఎగురవేయవచ్చని భావించాడు. బాజీరావు నిజాం సైన్యాలను మర్చి 6, 1728లో పాల్టేడ్ వద్ద ఓడించి అతన్ని మునిషివగావ్ సంధికి ఒప్పించాడు. దీని ప్రకారం సాహూకి వ్యతిరేకంగా రెండో శంభాజీకి నిజాం ఎటువంటి సహాయం అందించరాదనీ, దక్కన్లో పన్నులు వసూలు చేసుకొనేందుకు అధికారాన్ని ఇచ్చాడు.

మొగల్ రాజ్య అలహాబాద్ గవర్నర్ అయిన మహ్మదాఖాన్ భంగాష్ 1727లో బుందేల్ఖండ్ పై దాడి జరిపాడు. అక్కడి రాజుని, అతని కుటుంబ సభ్యులని బందీలుగా పట్టుకొన్నాడు. రాజా అభ్యర్థన మేరకు 1729లో బాజీరావు మరాఠా సైన్యాలను బుందేల్ఫండ్కు పంపి మహ్మదఖాన్ను ఓడించి రాజాను తిరిగి సింహాసనంపై నిలిపాడు. దీంతో ఈ ప్రాంతంలో మరాఠాల ప్రాబల్యం అనూహ్యంగా పెరిగిపోయింది. బాజీరావుకు బుందేలులతోనే కాకుండా అంబర్ రాజులతో కూడా స్నేహ బంధాలు బలపడ్డాయి.

బాజీరావును కట్టడి చేసేందుకు మొగల్ చక్రవర్తి నిజాంను ప్రోత్సహించాడు. దీంతో నిజాంను మరాఠా సైన్యాలు రెండోసారి భోపాల్ యుద్ధంలో (1737) ఓడించి దురైసరై సంధికి ఒప్పించాయి. దీని ప్రకారం నిజాం యుద్ధ పరిహారం కింద యాభై లక్షలు చెల్లించడమే కాకుండా నర్మద, చంబల్ ప్రాంతాల మధ్య ఉన్న ప్రాంతంపై మరాఠాల సార్వభౌమత్వాన్ని అంగీకరించాడు.

బాజీరావ్ సిద్దీలకు (జింజీ) వ్యతిరేకంగా దండయాత్ర చేపట్టి వారిని ప్రధాన భూభాగం నుంచి వెళ్లిపోయేలా చేశాడు. పోర్చుగీసు వారిని 1739లో ఓడించి సాల్సెట్టి, బేసిన్ ప్రాంతాలను ఆక్రమించాడు. దీంతో మరాఠాల ప్రతిష్ట మరింత పెరిగింది.

బాలాజీ బాజీరావ్ (1740-61): మొదటి బాజీరావు మరణం తర్వాత అతని పద్దెనిమిది సంవత్సరాల కుమారుడు బాలాజీ బాజీరావు (నానాసాహెబ్) పీష్వాగా బాధ్యతలు చేపట్టాడు. ఇతను తండ్రి అంతటి సమర్థుడు కాడు. ఇతను ఎల్లపుడూ తన బంధువైన సదాశివరావ్ బావో సలహాలపైనే ఆధారపడేవాడు. బాలాజీ బాజీరావు పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే తన తండ్రి ఆశయాన్ని పూర్తి చేయదలిచాడు. బాలాజీ బాజీరావు నాయకత్వంలోని మరాఠా సర్దారులు అనేక కొత్త ప్రాంతాలను జయించారు. రఘోజీ భోంస్లే మధ్య భారతాన్ని జయించి, బెంగాల్పై దండయాత్రలు జరిపాడు. దీంతో బెంగాల్ నవాబ్ అలీవర్ధనాఖాన్ ఒరిస్సాను దత్తం చేసి బెంగాల్ బీహార్ తో కూడిన రాష్ట్రానికి చౌత్, సర్దేశముఖి పన్నులను చెల్లించడానికి ఒప్పుకొన్నాడు.

మహారాష్ట్రులు 1757లో అహ్మద్ అబ్దాలీ ప్రతినిధి నుంచి ఢిల్లీ ప్రాంతాన్ని జయించారు. 1758లో పీష్వా తమ్ముడైన రఘునాథరావు (రఘోబా) పంజాబు వశం చేసుకొని, అక్కడి నుంచి అహ్మద్ అబ్దాలీ రాజప్రతినిధిని తరిమివేశాడు. ఈ విధంగా మూడో పీష్వా హయాంలో మరాఠాల అధికారం, భారతదేశం ఒక కొన నుంచి మరో కొన వరకు విస్తరించింది. తమ ఆధీనంలో లేని ప్రాంతాల నుంచి కూడా మరాఠాలు చౌత్, సర్దేశముఖి పన్నులను వసూలు చేశారు. ఇలాంటి సమయంలో అహ్మదా అబ్దాలీ మరాఠాలను మూడో పానిపట్ యుద్ధంలో ఓడించాడు. ఈ ఓటమి మహారాష్ట్ర అధికారానికి, ప్రాభవానికి తీవ్ర విఘాతమైంది. ఈ పరాజయంతో కృంగిపోయిన పీష్వా కొద్ది కాలానికే 1761లో మరణించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 10 మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

ప్రశ్న 6.
రంజిత్సింగ్ ఘనతను చర్చించండి.
జవాబు.
రంజిత్ సింగ్ (1792-1839): సిక్కు సామ్రాజ్య స్థాపకుడైన రంజిత్ సింగ్కు ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇతను 13 నవంబరు, 1780లో మహాన్సింగ్, రాజ్కార్ దంపతులకు గుజ్రన్వాలాలో (ప్రస్తుతం ఆధునిక పాకిస్తాన్లో ) జన్మించాడు. మహాన్ సింగ్ ‘సుకరెకియా మిజిల్కు’ అధిపతి. పంజాబ్కు పశ్చిమంగా ఉన్న ప్రాంతం ఇతని ఆధీనంలోనే ఉండేది. ఇతని రాజధాని గుజ్రన్ వాలా. చిన్నతనంలో మశూచి సోకడంతో ఇతను ఎడమ కన్నును కోల్పోయాడు. పది సంవత్సరాల చిన్న వయస్సులోనే ఇతను తండ్రితో కలిసి యుద్ధాల్లో పాల్గొన్నాడు. అతని తండ్రి 1792లో మరణించడంతో మిజిల్ నాయకత్వ బాధ్యతలు 12 సంవత్సరాల రంజిత్ సింగ్కు దక్కాయి. 1797 వరకు అతను తల్లి సంరక్షణలో పాలనాబాధ్యతలు నిర్వహించినా, తరువాత స్వతంత్రంగా వ్యవహరించాడు. నాటి రాజకీయ అస్థిర పరిస్థితుల్ని రంజిత్ సింగ్ తనకు అనుకూలంగా మలుచుకొని రాజకీయంగా ఎదీగాడు.

రంజిత్ సింగ్ తనకు అందించిన సేవలకు ప్రతిఫలంగా, తన ప్రతినిధిగా లాహోర్ను పాలించమని జమాన్షా 1789లో ప్రకటించాడు. రంజిత్ సింగ్ 12, ఏప్రిల్ 1801 నాడు పంజాబ్ మహారాజాగా ప్రకటించుకొన్నాడు. 1802లో ఇతను తన రాజధానిని గుజ్రన్వాలా నుంచి లాహోరు మార్చాడు. 1799 నుంచి 1805 మధ్యకాలంలో రంజిత్ సింగ్ లాహోర్, అమృత్సర్ ప్రాంతాలను బంగీ మిజిల్ సర్దారుల నుంచి కైవసం చేసుకొన్నాడు. తదనంతర కాలంలో లూధియానా (1806), కాంగ్రా (1809), అటక్ (1813), ముల్తాన్ (1818), కాశ్మీర్ (1819), పెషావర్ (1823)లను ఆక్రమించాడు. ఫలితంగా రంజిత్సింగ్ సట్లెజ్, జీలం నదుల మధ్య ప్రాంతంలో తన అధికారాన్ని నెలకొల్పాడు. భారతదేశంలో ఫ్రెంచ్ వారి ప్రాబల్యాన్ని నిరోధించేందుకు బ్రిటిష్ వారు 1809లో రంజిత్ సింగ్తో అమృత్సర్ సంధిని చేసుకొన్నారు. ఈ సంధి ప్రకారం సట్లెజ్ నదికి ఉత్తరాన ఉన్న భూభాగంపై రంజిత్ సింగ్ సార్వభౌమత్వాన్ని బ్రిటిష్వారు గుర్తించారు. అహ్మద్ షా అబ్దాలీ మనుమడైన షాషుజా అతని సోదరుడి వల్ల పదవీచ్యుతుడైనప్పుడు, రంజిత్ సింగ్ సహకారంతో అతను సింహాసనాన్ని తిరిగి సంపాదించుకోగలిగాడు. దీనికి ప్రతిఫలంగా రంజిత్ సింగ్కు కోహినూర్ వజ్రాన్ని తిరిగి అప్పగించాడు.

రంజిత్ సింగ్ ఖాల్సా (సైన్యం)ను ఆధునీకరించాడు. అధునాతన ఆయుధాలను సైన్యంలో ప్రవేశపెట్టాడు. ఐరోపావాసుల చేత, ముఖ్యంగా నెపోలియన్ దగ్గర పనిచేసిన సైనికాధికారులచే తన సైన్యానికి శిక్షణ ఇప్పించాడు. ఫలితంగా రంజిత్ సింగ్ సైన్యం భారతదేశంలోనే మొట్టమొదటి సుశిక్షుతులైన సైన్యంగా తీర్చిదిద్దబడింది. ఆయుధ కర్మాగారాలను ఫిరంగుల తయారీ కేంద్రాలను, మందుగుండు సామాగ్రి తయారీ కర్మాగారాలను రంజిత్ సింగ్ ఏర్పాటు చేశాడు.

రంజిత్ సింగ్ సామ్రాజ్యం లౌకికమైంది. పాలనలో మతపరమైన వివక్ష ఎక్కడా చూపలేదు. అమృత్సర్లోని శిక్కుల పవిత్ర దేవాలయాన్ని అతనే బంగారు పూతతో, చలువరాళ్లతో సుందరీకరించాడు. అప్పటి నుంచి అది స్వర్ణదేవాలయంగా ప్రసిద్ధి చెందింది. అలాగే వారణాశిలోని కాశీ విశ్వనాథుని దేవాలయ గోపురానికి బంగారు తాపడం కోసమని 820 కిలోల బంగారాన్ని రంజిత్ సింగ్ 1839లో బహుకరించాడు. రంజిత్ సింగ్ ఏనాడూ కూడా సిక్కుమత విశ్వాసాలను పాలనలో చొప్పించలేదు. శాంతి భద్రతలను అదుపులో ఉంచి, కఠిన శిక్షలను రద్దు చేశాడు.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అష్ట ప్రధానులు.
జవాబు.
శివాజీ కేంద్రీకృత పాలనావ్యవస్థను ఏర్పాటు చేశాడు. శివాజీ తనకు పరిపాలనలో సహకరించేందుకు ఎనిమిది మంది సభ్యులు గల అష్టప్రధానులు అనే మంత్రిమండలిని ఏర్పాటు చేశాడు. మంత్రులకు వివిధ శాఖలు కేటాయించాడు.

  1. పీష్వా: ప్రధానమంత్రి – సాధారణ పాలనా వ్యవహారాలను చూసేవాడు.
  2. అమాత్య: ఆర్థిక మంత్రి – ఆదాయ వ్యయాలు, బడ్జెట్ చూసేవాడు.
  3. మంత్రి: ఆంతరంగిక వ్యవహారాల మంత్రి.
  4. సచివ: సమాచారశాఖా మంత్రి.
  5. సుమంత్: విదేశీ వ్యవహారాల మంత్రి.
  6. పండితరావు: దానధర్మాలు, ధర్మాదాయం.
  7. సేవాపతి: సర్వసైన్యాధ్యక్షుడు.
  8. న్యాయాధీశుడు: అత్యున్నత న్యాయాధికారి.

ప్రశ్న 2.
బాలాజీ విశ్వనాథ్
జవాబు.
మహారాష్ట్రలో పీష్వాల రాజ్యానికి పునాదులు వేసిన బాలాజీ విశ్వనాథన్ను మహారాష్ట్ర సామ్రాజ్య రెండవ స్థాపకుడిగా పిలుస్తారు. శివాజీ మరణానంతరం మహారాష్ట్ర రాజ్యం అంతర్యుద్ధంలో మునిగి పతనావస్థకు చేరుకుంది. ఆ కల్లోల సమయంలో శివాజీ వదిలి వెళ్ళిన బాధ్యతలను, ఆశయాలను నెరవేర్చి, మహారాష్ట్ర సంస్కృతిని కాపాడిన ఘనత పీష్వాలది.

ఆ పీష్వాల వంశ మూలపురుషుడు బాలాజీ విశ్వనాథ్. ఛత్రపతి సాహూచే వంశపారంపర్య పీష్వాగా నియమింపబడ్డాడు. మరాఠా నౌకాదళాధిపతి కన్హోజీతో ఒప్పందం కుదుర్చుకుని పోర్చుగీస్, ఆంగ్లేయులను ఓడించాడు. సయ్యద్ సోదరులతో ఒప్పందం కుదర్చుకొని ఒకప్పటి శివాజీ భూములన్నీ స్వాధీనం చేసుకున్నాడు. మహారాష్ట్రులు కూటమిని ఏర్పాటు చేసి మరాఠాలలో ఐక్యత సాధించాడు. సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన యోధుడు బాలాజీ విశ్వనాథ్.

ప్రశ్న 3.
మొదటి బాజీరావు
జవాబు.
బాలాజీ విశ్వనాథ్ తరువాత అతని 20 సంవత్సరాల కుమారుడు మొదటి బాజీరావ్ పీష్వాగా బాధ్యతలు చేపట్టాడు. అతడు విజ్ఞుడైన రాజనీతిజ్ఞుడు, మిక్కిలి వివేకం కలవాడు. చక్కని యోధుడు. యుద్ధ తంత్రం ‘ప్రతిభాశాలి. తన శివాజీ తండ్రి వద్ద నుంచి రాజతంత్రాన్ని, దౌత్యాన్ని అనుభవపూర్వకంగా నేర్చుకొన్నాడు. గెరిల్లా యుద్ధ తంత్రంలో తరువాత అంతగా ఆరితేరినవాడుగా ప్రసిద్ధి చెందాడు. ధైర్యసాహసాలు, రాజతంత్రం పీష్వాలలో కడు సమర్థుడిగా పరిగణింపబడ్డాడు.

అఖిల భారత హిందూ సామ్రాజ్యం (హింద్పద్ పదాహీ) స్థాపన అనేది బాజీరావు మహోన్నత ఆశయం. మొగల్ సామ్రాజ్య పతనాన్ని దృష్టిలో పెట్టుకొని, “చెట్టు కాండాన్ని ఛేదిస్తే కొమ్మలు వాటంతట అవే పడిపోతాయని”, అప్పుడు మరాఠా కీర్తి పతాకం సింధూ నుంచి కృష్ణా వరకు ఎగురవేయవచ్చని భావించాడు. బాజీరావు నిజాం సైన్యాలను మర్చి 6, 1728లో పాల్టేడ్ వద్ద ఓడించి అతన్ని మునిషిగావ్ సంధికి ఒప్పించాడు. దీని ప్రకారం సాహూకి వ్యతిరేకంగా రెండో శంభాజీకి నిజాం ఎటువంటి సహాయం అందించరాదనీ, దక్కన్లో పన్నులు వసూలు చేసుకొనేందుకు అధికారాన్ని ఇచ్చాడు.

మొగల్ రాజ్య అలహాబాద్ గవర్నర్ అయిన మహ్మద్భన్ భంగాష్ 1727లో బుందేల్ ఖండ్ పై దాడి జరిపాడు. అక్కడి రాజుని, అతని కుటుంబ సభ్యులని బందీలుగా పట్టుకొన్నాడు. రాజా అభ్యర్థన మేరకు 1729లో బాజీరావు మరాఠా సైన్యాలను బుందేలఖండ్కు పంపి మహ్మదఖాన్ ను ఓడించి రాజాను తిరిగి సింహాసనంపై నిలిపాడు. దీంతో ఈ ప్రాంతంలో మరాఠాల ప్రాబల్యం అనూహ్యంగా పెరిగిపోయింది. బాజీరావుకు బుందేలులతోనే కాకుండా అంబర్ రాజులతో కూడా స్నేహ బంధాలు బలపడ్డాయి.

TS Inter 1st Year History Study Material Chapter 10 మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

బాజీరావును కట్టడి చేసేందుకు మొగల్ చక్రవర్తి నిజాంను ప్రోత్సహించాడు. దీంతో నిజాంను మరాఠా సైన్యాలు రెండోసారి భోపాల్ యుద్ధంలో (1737) ఓడించి దురైసరై సంధికి ఒప్పించాయి. దీని ప్రకారం నిజాం యుద్ధ పరిహారం కింద యాభై లక్షలు చెల్లించడమే కాకుండా నర్మద, చంబల్ ప్రాంతాల మధ్య ఉన్న ప్రాంతంపై మరాఠాల సార్వభౌమత్వాన్ని అంగీకరించాడు.

బాజీరావ్ సిద్దీలకు (జింజీ) వ్యతిరేకంగా దండయాత్ర చేపట్టి వారిని ప్రధాన భూభాగం నుంచి వెళ్లిపోయేలా చేశాడు. పోర్చుగీసు వారిని 1739లో ఓడించి సాల్సెట్టి, బేసిన్ ప్రాంతాలను ఆక్రమించాడు. దీంతో మరాఠాల ప్రతిష్ట మరింత పెరిగింది.

ప్రశ్న 4.
మూడోపానిపట్టు యుద్ధం
జవాబు.
ఆధునిక భారతదేశ చరిత్ర గతిని మలుపు తిప్పిన యుద్ధాల్లో మూడో పానిపట్ యుద్ధం ఒకటి. మూడో పీష్వా తమ్ముడైన రఘునాథ రావు (రఘోబా), అహ్మద్ షా అబ్దాలీ రాజ్యంలో భాగంగా ఉన్న పంజాబ్ను ఆక్రమించి, అతని రాజ్య ప్రతినిధిని తరిమివేశాడు. దీంతో అహ్మర్షి అబ్దాలీ మహారాష్ట్రులపై పెద్ద సైన్యంతో దండెత్తాడు. చారిత్రాత్మకమైన పానిపట్ యుద్దభూమిలో 14 జనవరి, 1761వ తేదిన ఇరు సైన్యాల మధ్య తీవ్ర యుద్ధం జరిగింది. యుద్ధ విశేషాలు: మహారాష్ట్ర సైన్యాధ్యక్షుడుగా సదాశివరావు (బావో సాహెబ్), మూడో పీష్వా కుమారుడైన విశ్వాసరావు ఉపసైన్యాధ్యక్షుడుగా వ్యవహరించారు. బావో సమర్థుడైన వ్యక్తి, కానీ అతని అహంకారం, గర్వం కారణంగా తన సేనా నాయకుల మాటలను వినక పెడచెవిన పెట్టాడు. ముఖ్యంగా జాట్ల నాయకుడైన సూరజ్మల్ ప్రత్యక్ష యుద్ధం (బహిరంగ యుద్ధం) వద్దని, గెరిల్లా యుద్ధమే తమకు లభిస్తుందని చెప్పినా వినలేదు. తన మాటలు లెక్క చేయనందుకు సూరజ్మల్ తన సైన్యంతో వెనుదిరిగాడు. మరోవైపు అహ్మద్ అబ్దాలీ రోహిల్లాలు, అవధ్ నవాబ్ల సహకారాన్ని సకాలంలో పొందగలిగాడు.

అబ్దాలీ తెలివిగా మరాఠా సైనిక శిబిరాన్ని చుట్టుముట్టి వారికి ఆహారపదార్థాలు అందకుండా వ్యూహం పన్నాడు. దక్కన్ నుంచి రాకపోకలను పూర్తిగా స్తంభింపచేశాడు. రెండునెలల పాటు మరాఠా సైన్యాలు తీవ్ర బాధలకు గురి అయ్యాయి. ప్రత్యక్ష యుద్ధంలో అంతగా ప్రావీణ్యం లేని మరాఠా సైన్యం చిత్తుగా ఓడిపోయింది. విశ్వాసరావు, సదాశివరావు వంటి వీరులు సైతం మరణించారు. దాదాపు రెండు లక్షలకు పైగా మరాఠా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వేలమందికి పైగా క్షతగాత్రులయ్యారు.

ప్రశ్న 5.
రంజిత్ సింగ్
జవాబు.
రంజిత్ సింగ్ (1792-1839): సిక్కు సామ్రాజ్య స్థాపకుడైన రంజిత్ సింగ్కు ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇతను 13 నవంబరు, 1780లో మహాన్సింగ్, రాజ్ ్కర్ దంపతులకు గుజ్రన్వాలాలో (ప్రస్తుతం ఆధునిక పాకిస్తాన్లో) జన్మించాడు. మహాన్సింగ్ ‘సుకరెకియా మిజిల్కు’ అధిపతి. పంజాబు పశ్చిమంగా ఉన్న ప్రాంతం ఇతని ఆధీనంలోనే ఉండేది. ఇతని రాజధాని గుజ్రన్ వాలా. చిన్నతనంలో మశూచి సోకడంతో ఇతను ఎడమ కన్నును కోల్పోయాడు. పది సంవత్సరాల చిన్న వయస్సులోనే ఇతను తండ్రితో కలిసి యుద్ధాల్లో పాల్గొన్నాడు. అతని తండ్రి 1792లో మరణించడంతో మిజిల్ నాయకత్వ బాధ్యతలు 12 సంవత్సరాల రంజిత్ సింగ్కు దక్కాయి. 1797 వరకు అతను తల్లి సంరక్షణలో పాలనాబాధ్యతలు నిర్వహించినా, తరువాత స్వతంత్రంగా వ్యవహరించాడు. నాటి రాజకీయ అస్థిర పరిస్థితుల్ని రంజిత్ సింగ్ తనకు అనుకూలంగా మలుచుకొని రాజకీయంగా ఎదిగాడు.

రంజిత్ సింగ్ ఖాల్సా (సైన్యం)ను ఆధునీకరించాడు. అధునాతన ఆయుధాలను సైన్యంలో ప్రవేశపెట్టాడు. ఐరోపావాసుల చేత, ముఖ్యంగా నెపోలియన్ దగ్గర పనిచేసిన సైనికాధికారులచే తన సైన్యానికి శిక్షణ ఇప్పించాడు. ఫలితంగా రంజిత్ సింగ్ సైన్యం భారతదేశంలోనే మొట్టమొదటి సుశిక్షుతులైన సైన్యంగా తీర్చిదిద్దబడింది. ఆయుధ కర్మాగారాలను ఫిరంగుల తయారీ కేంద్రాలను, మందుగుండు సామాగ్రి తయారీ కర్మాగారాలను రంజిత్ సింగ్ ఏర్పాటు చేశాడు.

రంజిత్ సింగ్ 27, జూన్ 1839లో మరణించాడు. అతని వారసుడిగా కరక్సింగ్ పదవీబాధ్యతలు చేపట్టాడు. అతని మరణం తర్వాత పంజాబ్ రాజ్యంలో రాజకీయ అస్థిర పరిస్థితులు, అంతర్యుద్ధం ఏర్పడింది. దీన్ని అదనుగా తీసుకొని బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ఆంగ్లో – సిక్కు యుద్ధాలకు తెరలేపింది. రెండో ఆంగ్లో – సిక్కు యుద్ధం తరువాత బ్రిటిష్ వారు దులీపింగ్ నుంచి పంజాబ్ను ఆక్రమించారు.

TS Inter 1st Year History Study Material Chapter 10 మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
దాదాజి కొండదేవ్
జవాబు.
క్రీ.శ. 1636లో ఫాజీభోంస్లే శివనేర్ దుర్గాన్ని కోల్పోవడంతో దాదాజీ కొండదేవ్ రక్షణలో శివాజీ తన తల్లితో కలిసి మకాం మార్చాడు. దాదాజీ కొండదేవ్ పర్యవేక్షణలో శివాజీ ఆరితేరిన యోధుడిగా, దక్షుడైన పరిపాలకుడిగా తీర్చిదిద్ద బడ్డాడు. శివాజీ సంరక్షకుడైన దాదాజీ కొండదేవ్ 1647లో మరణించడంతో, శివాజీ పూనా జాగీరు బాధ్యతలను స్వతంత్రంగా నిర్వహించాడు.

ప్రశ్న 2.
సమర్థ రామదాసు
జవాబు.
మహారాష్ట్ర భక్తి ఉద్యమకారుడైన సమర్థరామదాస్ క్రీ.శ. 1608 సంవత్సరంలో జన్మించారు. అణగారిపోయిన హిందూ జాతిని జాగృతం చేయడంలో ప్రత్యేకమయిన వ్యూహాత్మక ప్రణాళిక అమలు చేసాడు. శివాజీకి మత గురువు. ఛత్రపతి శివాజీ హైందవ స్వరాజ్యాన్ని ఏర్పరచడంలో వీరిది గురుతుల్య పాత్ర. సమర్థ రామదాసు రచించిన ‘దశబోధ’ గ్రంథం ‘శివాజీని ఉత్తేజపరిచింది. యావత్ మహారాష్ట్ర జాతిలో తమ ఆత్మగౌరవం కాపాడుకోవడానికి స్వతంత్ర మరాఠా రాజ్యస్థాపన ఆవశ్యకతను తెలియజేసింది.

ప్రశ్న 3.
తోరణదుర్గం
జవాబు.
తోరణ దుర్గం పూనె నగరానికి సమీపంలో ఉంది. ఈ దుర్గాన్ని ‘ప్రచండ గఢ్’ అని కూడా అంటారు. ఈ కోట చరిత్ర ప్రసిద్ధికెక్కింది. ఛత్రపతి శివాజీ తన పందొమ్మిదో ఏట అనగా క్రీ.శ. 1646లో ఈ తోరణ దుర్గాన్ని ఆక్రమించాడు. శివాజీ యొక్క విజయపదానికి, స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి తొలి అడుగుగా తోరణ దుర్గ విజయం ప్రసిద్ధికెక్కింది.

ప్రశ్న 4.
అన్జలాఖాన్
జవాబు.
శివాజీ దాడులతో అప్రమత్తమైన బీజాపూర్ సుల్తాన్ క్రీ.శ. 1659లో శివాజీని పట్టుకొని రావలిసిందిగా తన సేనాని అఫ్ఘలానన్ను పంపించాడు. శివాజీని మైదాన ప్రాంతానికి రప్పించడంలో విఫలమైన అల్ఫాన్ చివరకు కృష్ణాజీ భాస్కర్ అనే రాయబారిని శివాజీతో సంప్రదింపులకై పంపాడు. అఫ్టలాఖాన్ తో జరుపబోయే సమావేశంలో శివాజీ ప్రాణాలకు హాని జరుగవచ్చనే సంకేతాలను రాయబారి వెల్లడించాడు అఫ్ఘల్ఫాన్ కుట్రను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధమైన శివాజీ రక్షణ కవచాన్ని ధరించి, తగిన ఆయుధాల ను సమకూర్చుకొని సమావేశ మందిరానికి చేరుకొన్నారు. వారిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకోవడంతో పోరు ప్రారంమయింది. ఆత్మరక్షణకై శివాజీ బాగ్నఖ్ (పులిగోళ్లు) అనే మారణాయుధంతో అల్ఫాన్ ను హతమార్చాడు.

ప్రశ్న 5.
పురందర్ సంధి
జవాబు.
క్రీ.శ. 1665 సం॥లో మొగల్ సేనాని రాజా జైసింగ్కు, మరాఠా నాయకుడు అయిన శివాజీకి మధ్య పురంధర్ వద్ద కుదిరిన సంధిని పురంధర్ సంధి అని అంటారు. ఈ సంధి ప్రకారం:

  1. శివాజీ తన స్వాధీనంలోని సాలీనా నాలుగు లక్షల రూపాయల ఆదాయాన్ని ఇచ్చే ఇరవై మూడు కోటలను మొగలులు స్వాధీనం చేసుకున్నారు.
  2. బీజాపూర్ మొగలులు చేసే యుద్ధాలలో సహాయం చేసేందుకు శివాజీ అంగీకరించాడు.
  3. తన కుమారుడు శంభూజీని ఐదువేల మంది అశ్వికులతో మొగల్ ఆస్థానానికి పంపేందుకు శివాజీ అంగీకరించాడు.
  4. 13 సంవత్సరాల కాలంలో నలభై లక్షల పన్నులను చెల్లించేందుకు శివాజీ అంగీకరించాడు.
  5. ఐదు లక్షల పన్నులను ఇచ్చే బీజాపూర్ రాజ్యంలోని ప్రాంతాలపై శివాజీ అధికారాన్ని మొగలులు గుర్తించారు.

ఈ సంధి వల్ల మొగలులు ప్రయోజనం పొందారు. వారి ప్రాభవం వృద్ధి చెందింది. దీనితో శివాజీ అవమానానికి గురి అయినాడు. పురంధర్ సంధి ప్రకారం రాజా జైసింగ్ ప్రోద్బలంతో ఆగ్రాలోని మొగల్ దర్బారును శివాజీ దర్శించింది.

ప్రశ్న 6.
అష్ట ప్రధానులు
జవాబు.
శివాజీ కేంద్రీకృత పాలనావ్యవస్థను ఏర్పాటు చేశాడు. శివాజీ తనకు పరిపాలనలో సహకరించేందుకు ఎనిమిది మంట సభ్యులు గల అష్టప్రధానులు అనే మంత్రిమండలిని ఏర్పాటు చేశాడు. మంత్రులకు వివిధ శాఖలు కేటాయించాడు.

  • పీష్వా: ప్రధానమంత్రి – సాధారణ పాలనా వ్యవహారాలను చూసేవాడు.
  • అమాత్య: ఆర్థిక మంత్రి – ఆదాయ వ్యయాలు, బడ్జెట్ చూసేవాడు.
  • మంత్రి: ఆంతరంగిక వ్యవహారాల మంత్రి.
  • సచివ: సమాచారశాఖా మంత్రి.
  • సుమంత్: విదేశీ వ్యవహారాల మంత్రి.
  • పండితరావు: దానధర్మాలు, ధర్మాదాయం.
  • సేవాపతి: సర్వసైన్యాధ్యక్షుడు.
  • న్యాయాధీశుడు: అత్యున్నత న్యాయాధికారి.

ప్రశ్న 7.
మూడో పానిపట్టు యుద్ధం
జవాబు.
మూడవ పానిపట్టు యుద్ధం అహ్మదా అబ్దాలీ సామ్రాజ్య కాంక్ష ఫలితం. 1761 జనవరి 14న చారిత్రాత్మక పానిపట్టు వద్ద మహారాష్ట్ర, అబ్దాలీ సైనికులు తలపడ్డారు. ఈ యుద్ధంలో ఆఫ్గన్లు విజయం సాధించారు. సదాశివరావు, విశ్వాసరావు అంతటి వీరులు సైతం నేలకొరిగారు. వేలాది సైనికులు చనిపోయారు. ఈ యుద్ధం వలన నష్టపోని మహారాష్ట్ర కుటుంబం లేదు. ఈ పరాజయ వార్త విన్న పీ+3 బాలాజీ బాజీరావు కృంగి మరణించాడు.
రోహిల్లాలు, అయోధ్య నవాబు ంటి స్వదేశీయులు అబ్దాలీకి సహాయపడటం, మహరాష్ట్రులకు ఎటువంటి సహాయం అందకపోవడం మరాఠాల పరాజయానికి కారణాలయ్యాయి. దీనితో పీష్వా అధికారం క్షీణించి మహారాష్ట్ర సమాఖ్య విచ్ఛిన్నమైంది. మొగల్ సామ్రాజ్యం ఇంకా నిర్వీర్యమైపోయింది.

TS Inter 1st Year History Study Material Chapter 10 మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

ప్రశ్న 8.
అమృత్సర్ సంధి
జవాబు.
భారతదేశంలో ఫ్రెంచ్ వారి ప్రాబల్యాన్ని నిరోధించేందుకు బ్రిటిష్ వారు 1809లో రంజిత్ సింగ్తో అమృత్సర్ సంధిని చేసుకొన్నారు. ఈ సంధి ప్రకారం సట్లెజ్ నదికి ఉత్తరాన ఉన్న భూభాగంపై రంజిత్ సింగ్ సార్వభౌమత్వాన్ని బ్రిటిష్వారు గుర్తించారు.

TS Inter 1st Year Commerce Study Material Chapter 9 Source of Business Finance

Telangana TSBIE TS Inter 1st Year Commerce Study Material 9th Lesson Source of Business Finance Textbook Questions and Answers.

TS Inter 1st Year Commerce Study Material Chapter 9 Source of Business Finance

Long Answer Questions

Question 1.
Explain various sources of business finance available to Indian businessmen.
(Or)
Discuss the main sources of finance available to companies for meeting long-term as well as short-term financial requirements.
(Or)
Write a comparative evaluation of the various methods that are opened to meet the financial requirements of a business firm.
Answer:
A businessman can raise funds from various sources. On the basis of the period, they are classified into three:

  • Long-term sources
  • Medium-term sources
  • Short-term sources.

1) Long-term sources: These sources include i)Issue of equity and preference shares ii) the Issue of debentures iii) Retained earnings.

i) Shares: A company is able to get large amount of capital primarily by the issue of shares. A company generally issues various types of shares, preference, equity, and deferred shares. The object of issuing different kinds of shares is to appeal investors with different temperaments. Preference shares carry preferential rights regarding payment of dividends and repayment of capital at the time of winding up of the company. Equity shares do not carry such rights. Issue of shares is the most important method of raising long-term finance because the raising from the shareholders remain in the company till the time of winding up.

ii) Debentures: A company may not wish to possess more share capital. Instead it may invite persons to lend their money. Money so lent must be acknowledged. The document which the lender receives is called debenture. So, debenture is an acknowledge of debt by a company. It is usually issued under a common seal, secured by fixed or floating charge on the assets of the company. A company in order to secure long term finance for initial needs and more of ten for developments, to supplement its capital may issue debentures. Money raised through debentures remain in the company for long period,

iii) Retained earnings: The ploughing back of earning is an important source of financing the business. Instead of distributing the entire profits, some portion of the profits are retained in the business as reserve. The undistributed earnings are used to finance long term needs.

2) Medium term finance: These sources include

  • Public deposit
  • Loans from banks
  • Lease financing

i) Public deposits: Industries receive deposits from the public. These deposits are called as public deposits. The period of public deposits used to be short (i.e., For three years) so public deposits have been a very important source for working capital requirements.

ii) Loans from banks: Commercial banks occupy a vital position as they provide funds for different purposes and for different periods. They extend loans in the form of cash credits, overdrafts, purchase/discounting bills and term loans. The borrower is required to provide some security or to create a charge on the assets of the firm before a loan is sanctioned.

iii) Lease financing: A lease is a contractual agreement whereby the lesser or owner grants lesser the right to use the asset in return for a periodic payment known as lease rent. At the end of the lease period, the asset goes back to lessor. Lease finance is an important means for modernisation and diversification in the firm. Such financing is resorted to in acquiring assets like computers and electronic equipment.

3) Short-term sources: These sources include

  • Bank credit
  • Trade credit
  • Installment credit
  • Advances
  • C.P.

i) Bank credit: Commercial banks extend the short-term financial assistance to business in the form of loans, cash credits, overdraft and discount of bills. Bank loans are provided for a specific short period. Such advance is credited to loan account and the borrower has to pay interest on the entire amount of loan sanctioned. Bank grants the cash credit upto a specific limit. The firm can withdraw any amount within the limit. Interest is charged on the actual amount withdrawn. In overdraft, the customer can overdraw his current account. This arrangement is for a short period only. Commercial banks finance the business houses by discounting the bills of exchange or promissory notes.

ii) Trade credit: Just as firm grants credit to customers, so it often gets credit from suppliers. It is known as trade credit. It does not make available of funds in cash but it facilitate the purchase of goods without immediate payment.

iii) Installment credit: Business firm gets credit from equipment suppliers. The supplier may allow the purchase of equipment with payments extended over a period of 12 months or more. Some portion of the cost price is paid on delivery and the balance is paid in a number of installments. The supplier charges interest on unpaid balance.

iv) Customers advance: Many times, the manufacturer of goods insist on advance by the customers, incases of big orders. The customers advance represent a part of the price of the product that has been ordered which will be delivered at a later date.

v) C.P or Commercial Paper: Commercial paper is an unsecured promissory note issued by a firm to raise funds for shorter period, varying from 90 days to 365 days. It is issued by one firm to another firm. The amount raised by CP is generally large. As the debt is totally unsecured, firms having good credit rating can issue commercial paper.

Question 2.
What do you mean by Specialized Financial Institutions? Why are these needed?
Answer:
Specialised financial institutions are the institutions which have been setup to serve the increasing financial needs of commerce and trade in the areas of venture capital, credit rating and leasing etc.

1) IFCI Venture Capital Funds Ltd.: Formerly known as Risk Capital and Technology Finance Corporation Ltd. is a subsidiary of Industrial Finance Corporation of India Ltd. It was promoted with the objective of broadening entrepreneurial base in the country by facilitating funding to ventures involving innovative product /process/ technology.

TS Inter 1st Year Commerce Study Material Chapter 9 Source of Business Finance

2) ICICI Venture Funds Ltd: Formerly known as Technology Development and Information Company of India Ltd. was established in 1988 as a joint venture with the Unit Trust of India. Subsequently, it became a fully owned subsidiary of ICICI. It is a Technology Venture Finance Company set upto sanction project finance for new technology ventures. The industrial units assisted by it are in the fields of computer, chemicals/polymers, drugs, diagnostics and vaccines, biotechnology, environmental engineering etc.

3) Tourism Finance Corporation of India Ltd.: TFCI is a specialised financial institution setup by Government of India for promotion and growth of tourist industry in the country. Apart from conventional tourism projects, it provides financial assistance for non-conventional tourism projects like amusement parks, ropeways, car rental services, ferries for inland water transport etc.

Question 3.
Critically examine the advantages and disadvantages of raising funds by issuing shares of different types.
Answer:
Issue of shares: The capital of the company is divided into number of equal parts known as shares. A company can issue different types of shares to get funds from the investors to suit their requirement. Some investors prefer regular income though it may be low, others may prefer higher returns and they will be prepared to take risk. Under the companies act, 1956, a company can issue only two types of shares. 1) Preference shares 2) Equity shares.

1) Preference shares: As the name suggests, these shares have certain preferences as compared to equity shares. There is a preference for payment of dividend and also repayment of capital at the time of liquidation. When the company has distributable profits, the dividend is first paid to preference shares. In the event of liquidation of the company, after the payment of outside creditors, preference share capital is returned. Because of these preferences they are called preference shares. These shares are further divided into cumulative, noncumulative, participating, redeemable, irredeemable, convertable and non-convertable preference shares.

Advantages:

  • Rate of return is guaranteed to those investors who prefer safety and want to earn income certainly.
  • These shares are helpful in raising long term capital of the company.
  • Redeemable preference shares have the added advantage of repayment of capital whenever there is surplus in the company.
  • As fixed rate of dividend is payable, this enable the company to adopt trading on equity.
  • There is no need to mortgage assets for the issue of shares.

Disadvantages:

  • Fixed rate of dividend is paid on these share. This is a permanent burdent to the company.
  • These shares does not carry any voting right and cannot participate in the management of the company.
  • Compared to other types of securities such as debentures, usually cost of raising capital is high.

2) Equity shares: They are also known as ordinary shares. Equity shareholders are the real owners of the company as these shares carry voting rights. Equity shareholders are paid dividend after paying to the preference shares. The rate of dividend depends on the profits of the company. There may be a higher rate of dividend or they may not get anything. These shareholders take more risk as compared to preference shareholders. Equity capital is returned after meeting all other claims including preference shares.

Advantages:

  • Equity shares do not create any obligation to pay fixed rate of dividend.
  • They can be issued with creating any charge over the assets of the company.
  • It is a permanent source of capital and the company need not repay it except under liquidation.
  • Equity shareholders are the real owners of the company.
  • In case of profits, these shareholders can get higher dividends and appreciation in the value of shares.

Disadvantages:

  • If only equity shares are issued the company cannot take the advantage of trading on equity.
  • There is danger of over capitalisation in case of excess issue of these shares.
  • These shareholders can put obsticles in management.
  • In case of higher profits, increase in the value of shares may lead to speculation in the market.

TS Inter 1st Year Commerce Study Material Chapter 9 Source of Business Finance

Short Answer Questions

Question 1.
What are the sources of Short-Term finance?
Answer:
The following are the sources of short-term finance:
1) Bank credit: Commercial banks extend the short term financial assistance to business in the form of loans, cash credits, overdrafts and discount of bills. Bank loans are provided for a specific short period. Such advance is credited to loan account and the borrower has to pay interest on the entire amount of loan sanctioned. Bank grants cash credits upto a specific limit. The firm can withdraw any amount within that limit. Interest is charged on the actual amount withdrawn. In overdraft, the customer can overdraw his current account. The arrangement is for short period only. Commercial banks finance the business houses by discounting the bills of exchange and promissory notes.

2) Trade credit: Just as firm grants credit to customers, so it often gets credit from suppliers. It is known as trade credit. It does not make available of funds in cash but it facilitates the purchase of goods without immediate payment of cash.

3) Installment credit: Business firms get credit from equipment suppliers. The suppliers may allow the purchase of equipment with payments extended over a period of 12 months or more. Some portion of the cost price is paid on delivery and the balance is paid in number of installments. The supplier charges interest on the unpaid balance.

4) Customers advance: Many times, the manufacturer of goods insist on advance by customers in case of big order. The customers advance represent a part of the price of the product which will be delivered at a later date.

5) Commercial paper: Commercial paper is an unsecured promissory note issued by a firm to raise funds for shorter period, varying from 90 days to 365 days. It is issued by one firm to another firm. The amount raised by C.P is large. As the debt is totally unsecured, firms having good credit rating can issue commercial paper.

Question 2.
What are the sources of Long-term finance?
Answer:
The sources of long-term finance are

  • Issue of shares
  • Issue of debentures
  • Retained earnings.

i) Issue of shares: A company is able to get large amount of capital primarily by the issue of shares. A company may issue different types of shares like preference shares, equity shares and deferred shares. The object of issuing different types of shares to appeal investors with different temperment. Preference shares carry preferential right with regarding to payment of dividend and repayment of capital. The equity shares do not carry such rights. It is important method of raising long term finance because the share capital remain in the company till winding up.

ii) Issue of debentures: If a company do not wish to possess more share capital may invite persons to lend their money. Debentures is an acknowledge of debt by company, issued under common seal, secured by fixed or floating charge on the assets of the company. A company in order to secure long-term finance for development purposes and to suppliment its capital may issue debentures. Money raised through debentures remain in the company for a longer period.

iii) Retained earnings: The ploughing back of earnings is an important sources of financing the business. Instead of distributing entire profits, some portion of the profits are retained in the business as reserve. This is called as “Retained Earnings”. The undistributed earnings are used to finance long term needs.

TS Inter 1st Year Commerce Study Material Chapter 9 Source of Business Finance

Question 3.
What are the sources of medium term finance?
Answer:
1) Public Deposits: The deposits that one raised by organisations directly from public are known as ‘public deposits’. Any person who is interested in depositing money in any organisation, can do by filling up a prescribed form. The organisation in return issues a deposit receipt as acknowledgement of debt. Company generally invite public deposits for a period upto 3 years. The acceptance of public deposits is regulated by RBI.

2) Loans from Commercial Bank: Commercial Banks provides funds for different purposes as well as for different time periods. Bank extend loans to firm of all sizes and in many ways like cash credit, overdraft, term loans, discounting of bills etc., the rate of interest charged by banks depend on various facts. The borrower is required to provide some security or create a charge on the assets of the firm before a loan is sanctioned by a commercial bank.

3) Lease Financing: A lease is a contractual agreement where by one party i.e., the owner of an asset grants the other party right to use the asset in return for a periodic payment. The owner of the assets is called the ‘lessor’ while the party that uses the assets is known as the “lesser”. The lesser pays a fixed periodic amount called lease rental to the lessor for the use of the asset. At the end of the lease period, the asset goes back to the lessor. While making the leasing decision, the cost of leasing an asset must be compared with the cost of owning the same.

Question 4.
Discuss the need for specialized financial institutions.
Answer:
Specialised financial institutions are the institutions which have been setup to serve the increasing financial needs of commerce and trade in the areas of venture capital, credit rating and leasing etc.

1) DFCI Venture Capital Funds Ltd.: Formerly known as Risk Capital and Technology Finance Corporation Ltd. is a subsidiary of Industrial Finance Corporation of India Ltd. It was promoted with the objective of broadening entrepreneurial base in the country by facilitating funding to ventures involving innovative product /process/ technology.

2) ICICI Venture Funds Ltd: Formerly known as Technonology Development and Information Company of India Ltd. was established in 1988 as a joint venture with the Unit Trust of India. Subsequently, it became a fully owned subsidiary of ICICI. It is a Technology Venture Finance Company set upto sanction project finance for new technology ventures. The industrial units assisted by it are in the fields of computer, chemicals/polymers, drugs, diagnostics and vaccines, biotechnology, environmental engineering etc.

3) Tourism Finance Corporation of India Ltd.: TFCI is a specialised financial institution setup by Government of India for promotion and growth of tourist industry in the country. Apart from conventional tourism projects, it provides financial assistance for non-conventional tourism projects like amusement parks, ropeways, car rental services, ferries for inland water transport etc.

Question 5.
Explain the advantages and disadvantages of equity source of finance.
Answer:
Equity shares: Equity shares are the most important source of raising long term capital by a company. Equity shares also known as “ordinary shares” represent the ownership of a company. The capital raised by issue of such shares are known as “Owners Fund”. Equity share holders do not get a fixed dividend but are paid on the basis of earning by the company. They are reffered as “residual owners”. They liability, is limited to the extent of capital contributed by them in the company. These share holders have a right to participate in the management of a company.

Merits: The important merits or raising funds through issuing equity shares are given below.

  • Equity shares do not create any obligation to pay a fixed rate of dividend.
  • Equity shares can be issued without creating any charge over the assets of the company.
  • It is a permanent source of capital and the company need not repay it except under liquidation.
  • Equity shareholders are the real owners of the company who have the voting rights.
  • In case of profits, equity share holders are the real gainers by way of increased dividends and appreciation in the value of shares.

Limitations: The major limitations of raising funds through issue of equity shares are as follows.

  • Investors who want steady income may not prefer equity shares as equity shares get fluctuating returns.
  • The cost of equity shares is generally more as compared to the cost of raising funds through other sources.
  • Issue of additional equity shares dilutes the voting power and earning of existing equity shareholders.
  • More legal formalities and procedural delays involved while raising funds through issue of equity shares.

Question 6.
Differentiate between the Equity shares and Preference shares.
Answer:
The following are the differences between equity shares and preference shares.

Basis of DifferenceEquity sharesPreference shares
1. Choice of IssueIssue of these shares are compulsory.Issue of these shares are optional. i.e., not compulsory.
2. Payment of dividendDividends are paid after paymet of dividends to preference shares.Dividends are paid before payment of dividends to equity shares.
3. Rate of dividendRate of dividend is not fixed and recommended by board of directors.Rate of dividend is prefixed and precommunicated.
4. Return of capitalIncase of windingup capital is refunded after the payment of preference shares.Incase of windingup capital is refunded before the payment to equity shares.
5. Voting rightsEquity shareholders are the real owners of the company who have the voting rights.These shares do not have any voting rights.
6. RiskIt is highly risk as compared to preference shares.It is less risky as compared to equity shares.
7. SpeculationScope for speculation.No scope for speculation.
8. Bonus sharesBonus shares are offered to equity shareholders.Bonus shares are not offered to preference shareholders.

TS Inter 1st Year Commerce Study Material Chapter 9 Source of Business Finance

Question 7.
Differentiate between Shares and a Debenture.
Answer:
The following are the differences between shares and Debentures.

SharesDebentures
1. A share is a part of owned capital.1. A debenture is an acknowledge of debt.
2. Shareholders are paid dividend on the shares held by them.2. Debenture holders are paid interest on debentures.
3. The rate of dividend depends upon the amount of divisible profits and policy of the company.3. A fixed rate of interest is paid on debentures irrespective of profit or loss.
4. Dividend on shares is a charge against profit and loss appropriation account.4. Interest on debentures is a charge against profit and loss account.
5. Shareholders have voting rights. They have control over the management of the company.5. Debenture holders are only creditors of the company. They cannot participate in management.
6. Shares are not redeemable (except redeemable preference shares) during the life time of the company.6. The debentures are redeemed after a certain period.
7. At the time of liquidation of the company, share capital is payable after meeting all outside liabilities.7. Debentures are payable in priority over share capital.

Question 8.
What is preference shares and explain the types of preference shares?
Answer:
Types of preference shares:

  • Cumulative preference shares: Under cumulative preference shares the dividend accumulated if it is unpaid during a year.
  • Non-cumulative preference shares: Under non-cumulative preference shares, the dividend does not accumulate.
  • Participating preference shares: Participating preference shares are those preference shares which have a right to participate in the company’s surplus after paying dividend to equity share holders and preference share holders.
  • Non-participating preference shares: The holders of such shares do not enjoy right of participating in the profit of the company.
  • Convertible preference shares: These shares can be converted into equity shares with in a specific period of time.
  • Non-convertible preference shares: Non-convertible preference shares cannot be coverted into equity shares.

Question 9.
What is Retained earnings and explain merits and limitations of Retained earnings.
Answer:
Retained earnings:
A company generally does not distribute all its earnings amongst the share holders as dividends. A portion of the net earnings may be retained in the business for use in the future. This is known as “retained earnings”. It is a source of internal financing or self financing or “ploughing back of profits”. The profit available for ploughing back of points in an organisation depends on many factors like net profits, dividend policy and age of the organization.

Merits: The merits of retained earning as a source of finance are as follows:

  • Retained earnings is a permanent source of funds available to an organisation.
  • It does not involve any explicit cost in the form of interest dividend or floation cost.
  • As the funds are generated internally, there is a greater degree of operational freedom and flexibility.
  • It enhances the capacity of the business firm to absorb unexpected losses.
  • It may lead to increase in the market price of the equity shares of a company.

Limitations:

  • Excessive ploughing back may cause dissatisfication amongst the share holders as they would get lower dividends.
  • It is an uncertain source of funds as the profits of business are fluctuating.
  • The opportunity cost associated with these funds is not recognized by many firms. This may lead to sub-optimal use.

TS Inter 1st Year Commerce Study Material Chapter 9 Source of Business Finance

Question 10.
What is Debentures and write the different types of Debentures.
Answer:
Debentures: ‘Debentures’ are an important instrument for raising term debit capital A company can raise funds through issue of debentures. The debenture issued by a pany is an acknowledgement that the company has borrowed a certain amount of r Which it promises to repay on a future date. Debentures holders are therefore termed as creditors of the company.

Debenture holders are paid a fixed state amount of interest at specified intervals say six months or one year.

Types of Debentures: Debentures may be of a various types. Some important types of debentures are as follows.

1) Mortage Debenture: They are also known as ‘Secured debentures’. The payment of interest and principal is secured by some charge on any part of the whole of the company.

2) Simple Debentures: These debentures have no charge on the assets of the company. They are also known as naked or unsecured debentures. They are not secured by any change or security on any asset of the company.

3) Redeemable Debentures: Those debentures which are issued for a particular fixed time period and after expiry of that period the principal amount is returned.
For example: 5 years, 10 years, 15 years maturity period, after that the amount of debenture is paid back to their holders.

4) Irredeemable Debentures: They are to be paid back at the time of winding up of the company. They are not refundable. Perpetual in nature. A company can, however, redeem such debentures whenever at deems fit.

5) Registered Debentures: The names of the holders are recorded in the books of the company. If such debentures are transferred, the name of the transferee is entered in the register and the name of the original holders is cancelled.

6) Bearer Debentures: The debentures which are not recorded in the register of debenture holders are known as bearer debentures. These debentures are transferable by more delivery.

7) Convertible Debentures: They carry the option of getting a part or the full value of their investments converted into equity shares on a fixed date.

8) Non-Convertible Debentures: They do not enjoy any such right to get themselves converted into equity shares.

Question 11.
Explain various international sources of finance?
Answer:
Liberalisation and Globalisation processes initiated in India in 1991 have opened the gates for the foreigners to invest in India and vice versa. Since then certain international sources are available for financing purposes.

1) American Depository Receipts (ADRS): American depository receipts is issued by any U.S Bank. The first ADR was introduced by J.P. Morgan in 1927 for the British retailers. It is basically a negotiable instrument which represents a specified number of share(s) in a foreign stock that is traded on U.S. exchange. The majority of ADRS range in price from $10 to $100 per share.

The holder of American depository receipt does not carry voting rights. The dividend on ADR is paid in terms of U.S. Dollars.

2) Global Depository Receipt (GDRs): GDR is a bank certificate issued in more than one country for shares in a foreign company. There are more than 900 GDRs listed on exchanges world wide. A holder of GDR does not carry any voting rights. A holder of GDR can convert it into the number of shares that it represented. On conversion of GDR into equity shares, no remitance is to be made by the company.

3) Indian Depository Receipts (IDRs): An IDR is an instrument in the form of Depository Receipt created by the Indian depository in India against the underlaying equity shares of the issuing company. IDRs are listed on stock exchanges in India and are freely transferable. IDRs can be issued with prior approval from securities exchange. Board of India (SEBI). Application can be made for the same 90 days before the issue opening date. An IDR is denominated in Indian Rupees.

According to the guidelines of SEBI, only those companies listed in their home market for at least three years and which have been profitable for three of the preced-ing five years can issue IDRS.

4) Foreign Currency Convertible Bonds (FCCBs): FCCBs have assumed a great importance for various multinational companies. A foreign currency convertiable bond is a type of convertiable bond in which the money is raised by issuing company in the form of a foreign currency. FCCBs are issued in currencies different from the issuing company’s domestic currency. FCCBs are redeemable at maturity if not converted into equity.

TS Inter 1st Year Commerce Study Material Chapter 9 Source of Business Finance

Very Short Answer Questions

Question 1.
Business finance
Answer:
1) The requirement of funds by business firms to accomplish its various activities is called business finance.

2) Business finance is viewed as the activity which is concerned with the acquisition and conservation of capital funds in meeting the financial needs and overall objectives of the business enterprise.

Question 2.
Bank loan
Answer:
1) Bank loan is a direct advance made in lumpsum against some security. A specified amount is sanctioned by the bankers to the customer.

2) The loan amount is paid in cash or credited to customers account. The customer has to pay interest on the amount from the date of sanctioning the loan.

Question 3.
Debentures
Answer:
1) A debenture is an acknowledgement of debt by a company. It is usually issued under common seal, secured by a fixed or floating charge on the assets of the company.

2) The debentures can be classified in different types on the basis of terms and conditions of issue. A company may issue debentures in secure long-term finance for initial needs and for expansions and developments.

Question 4.
Trade Credit
Answer:
1) Trade credit is the credit extended by one trader to another for the purchase of goods and services.

2) Trade credit facilitates the purchase of supplies without immediate payment. Such credit appears in the records of the buyer of the goods as ‘sundry creditors’ or ‘account payable’. Trade credit is commonly used by business organisations as a source of short term financing.

Question 5.
Equity share
Answer:
1) These shares are also known as ordinary shares. Equity sharesholders are the real owners of the company, as these shares carry voting rights.

2) Equity shareholders are paid dividend after paying the preference shares. The rate of dividend depends upon the profits of the company.

Question 6.
Preference share.
Answer:
1) Preference shares have certain preferences as compared to equity shareholders.There is a preference for payment of dividend and also repayment of capital at the time of liquidation when the company has distributable profits, the dividend is first paid to preference shares. In the event of liquidation, after the payment of outside creditors, preference share capital is returned. Because of these preferences they are called as preference shares.

2) These shares do not carry any voting rights. Hence they cannot participate in the management.

Question 7.
Retained earnings.
Answer:
1) Ploughing back of profits or retained earnings refers to the process of reinvestment of the earnings year of after. In this technique all the profits are not distributed to shareholders. A part of the profits is retained in the business as a reserve.

2) These reserves are used to finance long-term and short-term needs of the company. It is also known as self financing or internal financing.

Question 8.
Deferred Shares.
Answer:
1) The rights of deferred shareholders with regard to payment of dividend and repayment of capital are deferred or postponed. These shareholders get their only when all the other shareholders are paid.

2) These shares are generally of small denomination. The management of the company remained in their hands by virtue of their voting rights. These shares were earlier issue to promoters or founders for services rendered to the company. Under the present act, a public company cannot issue deferred shares.

Question 9.
State Financial Corporation.
Answer:
1) The State Financial Corporation was established by the government of India in 1951 with a view to provide financial assistance to small and medium scale industries which are beyond the scope of industrial finance corporation of India.

2) Its share capital is subscribed by respective state governments, Reserve Bank of India, Life Insurance Corporation of India and commercial banks.

TS Inter 1st Year Commerce Study Material Chapter 9 Source of Business Finance

Question 10.
Commercial Banks.
Answer:
1) Commercial banks occupy a vital position as they provide funds for different purposes as well as for different periods. Banks extends loans to firms of all sizes and in many ways like cash credits, overdrafts, purchase / discounting of bills and issue of letter of credit.

2) The loan is repaid in lumpsum or installments. The borrower is required to provide some security or create a charge on the assets of the firm before the loan is sanctioned.

Question 11.
Financial Institutions.
Answer:
1) Another important source of raising finance is from the financial institutions like Industrial Finance Corporation of India, Industrial Development Bank of India, Industrial Credit and Investment Corporation of India.

2) Such institutions provide long-term and medium terms on easy installments to big industrial houses. Such institutions help in pomoting new companies and expansion and development of existing companies.

Question 12.
Industrial Development Bank of India.
Answer:
Industrial Development Bank of India was established in July 1964 by a special Act or Parliament. The IDBI’s whole paid up capital is held by the central government. The main objectives are:

  • To set up an apex institution to co-ordinate the activities of other financial institutions.
  • To promote participation of private capital.
  • To promote private ownership of industrial activities.

Question 13.
Industrial Finance Corporation of India.
Answer:
1) IFCI was the first development finance institution setup in 1948 under IFCI act inorder to pioneer long-term institutional credit to large and medium industries.

2) It is to provide financial assistance to industry by way of rupee and foreign currency loans, underwriting, subscribing the issue of shares, stocks, bonds and debentures of industries.

3) It has also diversified its activities in the field of merchant banking, syndication of loans, formulation of rehabilitation programmes, amalgamation and mergers etc.

Question 14.
Small Industrial Development Bank of India.
Answer:
1) SIDBI was setup by the government of India in April 1990 as a wholly owned subsidiary of IDBI. It is the principal financial institution for promotion, financing and development of small scale industries in the economy.

2) It aims to empower micro, small and medium enterprises sector with a view to contributing to the process of economic growth, employment generation and balanced regional development.

Question 15.
Global Depository Receipt.
Answer:
1) GDR is a bank certificate issued in more than one country for shares in a foreign company. There are more than 900 GDRs listed on exchange worldwide.

2) GDRs are mainly listed in the Frankfurt Stock Exchange, Luxembourg Stock Exchange and London Stock Exchange, Global depository receipts facilitate trade of shares several international banks issue GDRs such as Citigroup, J.P. Morgan, Bank of New York etc. A holder of GDR can convert into number of shares that it represents.

TS Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

Telangana TSBIE TS Inter 1st Year Economics Study Material 9th Lesson ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం Textbook Questions and Answers.

TS Inter 1st Year Economics Study Material 9th Lesson ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ద్రవ్య పరిణామక్రమాన్ని చర్చించండి. ద్రవ్య రకాలను వివరించండి.
జవాబు.
ద్రవ్యం అంటే ఏమిటి అనే శ్న సామాన్యంగా కనిపించినప్పటికీ, జవాబు క్లిష్టమైంది. మానవుల కార్యకలా పాలన్నింటికీ ద్రవ్యం కేంద్ర బిందువు. సమాజంలో ప్రజలు పలు రకాలైన లావాదేవీల కోసం ద్రవ్యాన్ని ఉపయోగిస్తారు. ప్రభుత్వం కూడా దైనందిన వ్యవహారాల కొరకు ద్రవ్యాన్ని ఉపయోగిస్తుంది. నేడు ద్రవ్యం యొక్క పాత్ర లేని సమాజాన్ని మనం ఊహించలేం.

అందుకే, వాకర్ (Walker) పేర్కొన్నట్లు “money is what money does” అంటే ద్రవ్యం ఏ పనులను నిర్వహిస్తుందో ఆయా పనుల ఆధారంగా ద్రవ్య స్వభావాన్ని నిర్వచించవచ్చు. మొత్తం మీద మానవుని నవ్య కల్పన (ఆవిష్కరణ, discovery) అన్నింటిలో ‘ద్రవ్యం’ అత్యద్భుతమైందని చెప్పవచ్చు.

ద్రవ్య పరిణామక్రమం :
‘ద్రవ్యం అనే పదం ‘మానెటా’ అనే పదం నుంచి వచ్చింది. రోమన్ దేవత ‘మానెటా” ఆలయంలో నాణేలు ముద్రించేవారు. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం వాడుకలోకి రాకముందు ‘వస్తు మార్పిడి విధానం’ అమలులో ఉండేది. ఈ విధానంలో వ్యక్తులు వస్తువులకు బదులుగా వస్తువులను వినిమయంగా పొందేవారు.

వస్తు మార్పిడి పద్ధతిలోని ఇబ్బందులను తొలగించడానికే ద్రవ్యం కనుగొనబడింది. ప్రాథమిక దశలో ద్రవ్యం స్థానంలో జంతువులను ఉపయోగించారు.

కాలక్రమంలో బంగారం, వెండి, రాగి, నికెల్ వంటివి లోహ ద్రవ్యంగా చలామణిలోకి వచ్చాయి. మూడవ దశలో నాణేలు ద్రవ్యంగా ఉపయోగించబడగా, ఆ తదుపరి కరెన్సీ నోట్లు ద్రవ్యంగా చలామణిలోకి వచ్చాయి. ప్రస్తుతం, కరెన్సీ నోట్లతో బాటు, వాణిజ్య బాంకులు సృష్టించే డ్రాఫ్ట్లు, చెక్కులు, డెబిట్ కార్డులు కూడా ద్రవ్యంగా చలామణి కావడం మనం చూస్తున్నాం. ఈ విధంగా ద్రవ్య పరిణామక్రమం ఆర్థిక వ్యవస్థలో పలు దశలలో చోటు చేసుకొన్నదని చెప్పవచ్చు.

ద్రవ్యం నిర్వచనాలు :
వస్తు మార్పిడి విధానంలోని ఇబ్బందులను తొలగించడానికి ద్రవ్యాన్ని చలామణిలోకి తీసుకురావడం జరిగింది. అర్థశాస్త్రవేత్తలు ద్రవ్యాన్ని అనేక విధాలుగా నిర్వచించడం జరిగింది.

  1. రాబర్ట్సన్ అభిప్రాయంలో ద్రవ్యం “వస్తు క్రయ విక్రయ చెల్లింపులలో, ఇతర వ్యవహారాల పరిష్కారాలలో అధికంగా జనామోదం పొందింది.”
  2. ‘దేనికైతే సర్వజనాంగీకారం కలిగి ఉన్నదో అదే ద్రవ్యం’ అని సెలిగ్మన్ పేర్కొన్నాడు.
  3. సాధారణంగా ‘వినిమయ సాధనం’గా అందరూ అంగీకరించేది. అంతేకాకుండా విలువల కొలమానంగా, విలువ నిధిగా ఉపయోగపడేది’ ద్రవ్యం అని డా॥ క్రౌథర్ నిర్వచించాడు.
  4. ‘ద్రవ్యం ఏ పనులను నిర్వహిస్తుందో దానినే ద్రవ్యం’ అని వాకర్ పేర్కొన్నాడు.

ద్రవ్యాన్ని సాధారణంగా ఒక ‘యూనిట్’ రూపంలో వ్యక్తపరచడం జరుగుతుంది. కేంద్ర బాంకు జారీ చేసే కరెన్సీ పేపర్ నోట్లు, చిల్లర నాణేల రూపంలో ఉంటుంది. ఉదా॥ భారతదేశంలో రూపాయి, అమెరికాలో డాలర్, యు.కె. లో పౌండ్ స్టెర్లింగ్, జపాన్లో యెన్, యూరోపియన్ దేశాలలో యూరో.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 2.
ద్రవ్యాన్ని నిర్వచించండి. ద్రవ్యం విధులను వివరించండి.
జవాబు.
వస్తు మార్పిడి విధానంలోని ఇబ్బందులను తొలగించడానికి ద్రవ్యాన్ని చలామణిలోకి తీసుకురావడం జరిగింది. అర్థశాస్త్రవేత్తలు ద్రవ్యాన్ని అనేక విధాలుగా నిర్వచించడం జరిగింది.

  1. రాబర్ట్సన్ అభిప్రాయంలో ద్రవ్యం “వస్తు క్రయ విక్రయ చెల్లింపులలో, ఇతర వ్యవహారాల పరిష్కారాలలో అధికంగా జనామోదం పొందింది.”
  2. ‘దేనికైతే సర్వజనాంగీకారం కలిగి ఉన్నదో అదే ద్రవ్యం’ అని సెలిగ్మన్ పేర్కొన్నాడు.
  3. సాధారణంగా ‘వినిమయ సాధనం’గా అందరూ అంగీకరించేది, అంతేకాకుండా విలువల కొలమానంగా, విలువ నిధిగా ఉపయోగపడేది’ ద్రవ్యం అని డా॥ క్రౌథర్ నిర్వచించాడు.
  4. ‘ద్రవ్యం ఏ పనులను నిర్వహిస్తుందో దానినే ద్రవ్యం’ అని వాకర్ పేర్కొన్నాడు.

ద్రవ్యాన్ని సాధారణంగా ఒక ‘యూనిట్’ రూపంలో వ్యక్తపరచడం జరుగుతుంది. కేంద్ర బాంకు జారీ చేసే కరెన్సీ పేపర్ నోట్లు, చిల్లర నాణేల రూపంలో ఉంటుంది. ఉదా॥ భారతదేశంలో రూపాయి, అమెరికాలో డాలర్, యు.కె. లో పౌండ్ స్టెర్లింగ్, జపాన్లో యెన్, యూరోపియన్ దేశాలలో యూరో.

ద్రవ్యం విధులు :
ద్రవ్యం నిర్వహించే విధులు చాలా ఉన్నాయి. వీటికి ప్రాథమిక విధులు, ద్వితీయ శ్రేణి విధులు, అనుషంగిక విధులు అని పలు రకాలుగా వర్గీకరిస్తారు.

ప్రాథమిక విధులు :
1. వినిమయ మాధ్యమం :
ద్రవ్యం వినిమయ మాధ్యమంగా వ్యవహరిస్తుంది. ఏ వస్తువైనా ముందుగా ద్రవ్యంతో మార్పిడి చేసుకొని, ఆ తరువాత ఆ ద్రవ్యంలో మరి ఏ ఇతర వస్తువునైనా కొనుగోలు చేయవచ్చు. ఆ విధంగా ద్రవ్యం అనే వినిమయ మాధ్యమం ద్వారా ప్రజలు వస్తు సేవలను వినిమయం చేసుకోవచ్చు.

2. విలువల కొలమానం :
వస్తు సేవల విలువ కొలమానంగా ద్రవ్యం వ్యవహరిస్తుంది. వ్యాపార వ్యవహారాలను సులువైనవిగా, సులభతరమైనవిగా మార్చింది. ప్రతి వస్తువు విలువను ద్రవ్య యూనిట్లో వ్యక్తపరచడం జరుగుతుంది. దీనిని ధర అంటారు. ద్రవ్యం యూనిట్ విలువ స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే అది సంతృప్తికరమైన కొలమానంగా పనిచేస్తుంది.

ద్వితీయ శ్రేణి విధులు :

1. విలువ నిధి :
వస్తు సేవల విలువను ద్రవ్య రూపంలో నిల్వ చేయవచ్చు. కీన్స్ అభిప్రాయంలో, ద్రవ్యం నిర్వహించే విధులలో ఈ విధి అతి ముఖ్యమైనది. ద్రవ్యం వల్ల మాత్రమే, ప్రస్తుత ఆదాయంతో భవిష్యత్తులో వినియోగం సాధ్యపడుతుంది. అందువల్ల ద్రవ్యం భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాల మధ్య వారధిగా పనిచేస్తుంది.

2. వాయిదాల చెల్లింపుల ప్రామాణికం :
ద్రవ్యం వాయిదా చెల్లింపుల ప్రమాణాలుగా వ్యవహరిస్తుంది. ఈ విధిని నిర్వర్తించడం వల్ల వ్యక్తులు వస్తువులను కొనుగోలు చేయడం, బ్యాంకులు, ఇతర ద్రవ్య సంస్థల నుంచి ఋణాలు పొందడం, షేర్లు, బాండ్లు అమ్మకాలు, కొనుగోలు మొ||నవి సులభతరమయ్యాయి.

3. విలువల బదిలీ :
ఏ సమయంలోనైనా, ఏ ప్రదేశంలోనైనా ద్రవ్యాన్ని ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి బదిలీ చేయడం సాధ్యం అవుతుంది. ద్రవ్యం వల్ల విలువను బదిలీ చేయడం తేలికవుతుంది.

అనుషంగిక విధులు :

1. జాతీయాదాయ మదింపు, పంపిణీ :
ఒక సం॥ కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేయబడిన వస్తు సేవల విలువలను అంచనా వేయవచ్చు. వివిధ ఉత్పత్తి కారకాలను ద్రవ్య రూపంలో చెల్లింపులు చేయడం ద్వారా జాతీయాదా యమును వాటి మధ్య పంపిణీ చేయవచ్చు.

2. ఉపాంత ప్రయోజనాలు/ఉత్పాదకతలు సమానీకరణ :
వినియోగదారులు తాము కొనుగోలు చేసే వివిధ వస్తువుల నుంచి పొందే ఉపాంత ప్రయోజనాలను ద్రవ్యం ఆధారంగా సమానం చేయడం ద్వారా ప్రయోజనాలను గరిష్ఠం చేసుకోగలుగుతాడు.

అదే విధంగా ఉత్పత్తిదారు వివిధ ఉత్పత్తి కారకాల ఉపాంత ఉత్పాదకతలను ద్రవ్యం సహాయంతో సమానం చేయడం ద్వారా లాభాలను గరిష్ఠం చేసుకోగలుగుతాడు.

3. పరపతి వ్యవస్థకు మూలం :
అన్ని ఆర్థిక లావాదేవీలకు ద్రవ్యం ప్రాతిపదిక. ద్రవ్య రిజర్వు లేనిదే పరపతి సృష్టి జరగదు. పరపతి కార్యకలాపాలన్నింటికి ద్రవ్యం పూచీకత్తుగా వ్యవహరిస్తుంది.

4. ద్రవ్యత్వం :
ద్రవ్యానికి అత్యధిక ద్రవ్యత్వం ఉంటుంది. ద్రవ్యత్వపరంగా ఆస్తులన్నింటిలోకి ఉత్తమమైనది. ద్రవ్యం నూరుశాతం ద్రవ్యత్వం కలిగి ఉంటుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 3.
వాణిజ్య బాంకుల విధులను విశదీకరించండి.
జవాబు.
వాణిజ్య బ్యాంకులు దేశ బాంకింగ్ రంగంలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాయి. వాణిజ్య బ్యాంకులు ప్రజల నుంచి, సంస్థల నుంచి డిపాజిట్లను స్వీకరించి, ఆ సొమ్మును వ్యాపారస్తులకు, ఉత్పత్తిదారులకు ఋణాలను ఇస్తూ, అటు ఋణ గ్రహీతలకు, ఋణదాతలకు మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరిస్తుంది.

సేయర్స్ అభిప్రాయంలో “బాంకులు వ్యక్తుల నుంచి డిపాజిట్లను స్వీకరించి, అవసరమైన వాళ్ళకు ఋణాలు మంజూరు చేసే సంస్థలు”.

క్రౌథర్ అభిప్రాయంలో “ఇతరుల ఋణాలు తీసుకొని, తన వద్దగల ద్రవ్యాన్ని ఇతరులకు ఇవ్వడం ద్వారా ద్రవ్యాన్ని సృష్టించడమే బ్యాంకుల వ్యాపారం”.

వాణిజ్య బ్యాంకుల విధులు :
ఇవి దేశ ఆర్థికాభివృద్ధిలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకున్నాయి. వాణిజ్య బ్యాంకుల విధులు ముఖ్యంగా

  1. ప్రాథమిక విధులు.
  2. అనుషంగిక విధులు.
  3. సాధారణోపయోగ సేవలు.

1. ప్రాథమిక విధులు :
ఎ) డిపాజిట్లను స్వీకరించడం:
ప్రజల వద్ద నుంచి పొదుపులను డిపాజిట్లగా స్వీకరించడం బ్యాంకుల ప్రాథమిక నంగా వాణిజ్య బ్యాంకులు స్వీకరించే డిపాజిట్లు రెండు రకాలు, అవి : డిమాండ్ డిపాజిట్లు, కాలపరిమితి

  1. డిమాండ్ డిపాజిట్ల కింద సేవింగ్స్ డిపాజిట్లను, కరెంట్ డిపాజిట్లను సేకరిస్తుంది.
  2. కాలపరిమితి డిపాజిట్ల కింద ఫిక్స్డ్ డిపాజిట్లను, రికరింగ్ డిపాజిట్లను సేకరిస్తుంది.

బి) ఋణాలను మంజూరు చేయడం :

  1. లాభాలను ఆర్జించటం వాణిజ్య బాంకుల ముఖ్యోద్దేశం. బాంకులు వ్యాపారస్తుల ద్రవ్య అవసరాల కోసం ఇచ్చే రుణాలను ‘నగదు పరపతి’ అంటారు. ఋణాన్ని తీసుకొన్న ఖాతాదారు, ఆ ద్రవ్యాన్ని ‘చెక్కు’ ద్వారా తీసుకుంటాడు. ఈ ఋణాలపై బాంకులు వడ్డీ వసూలు చేస్తాయి.
  2. నమ్మకమైన ఖాతాదారులకు బాంకులు “ఓవర్ డ్రాఫ్ట్” పద్ధతి ద్వారా ఋణాలిస్తాయి. ఖాతాదారుని కరెంట్ ఖాతాలో నిలువ ఉన్న మొత్తం కంటే, అధిక మొత్తాన్ని వాడుకొనే వసతిని ‘ఓవర్ డ్రాఫ్ట్’ అంటారు. వాడుకున్న సొమ్ముపై ఖాతాదారుని నుంచి వడ్డీని వసూలు చేస్తాయి.
  3. కేంద్ర బాంకు ఉత్తర్వుల మేరకు, స్టాక్ ఎక్స్ఛేంజ్ బ్రోకర్లకు వాణిజ్య బాంకులు అతి స్వల్పకాలిక ఋణాలు ఇస్తుంది. వీటిని ‘కాలనీ లేదా కాల్ లోన్స్’ అంటారు. వీటి కాల పరిమితి 15 రోజులకు మించదు.
  4. ఖాతాదారుల వద్ద ఉన్న బిల్లులపై కాలపరిమితికి ముందుగానే వడ్డీ మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని చెల్లించే అవకాశం కల్పిస్తుంది. ఈ పద్ధతిని “బిల్లుల డిస్కౌంటింగ్” అంటారు.

సి) పరపతిని సృష్టించడం :
బాంకులు స్వీకరించే డిపాజిట్లే అవి ఇచ్చే ఋణాలకు ఆధారం. పరపతి సృష్టి అంటే బాంకు డిపాజిట్ల కంటే ఎన్నో రెట్లు రుణాలు పెంచడం. పరపతి ఇచ్చేటప్పుడు డిపాజిట్లు సృష్టించబడతాయి.

డి) క్రెడిట్ కార్డులు :
ఆధునిక బాంకులు ఖాతాదారులకు ‘క్రెడిట్ కార్డులు’ మంజూరు చేయడం ద్వారా క ఋణాలను మంజూరు చేస్తున్నాయి. క్రెడిట్ కార్డు ఉన్న ఖాతాదారు వస్తు సేవలను కార్డ్పై కొనుగోలు చేసి, బాంకుకు అసలుతోపాటు వడ్డీ చెల్లించడం జరుగుతుంది.

2. అనుషంగిక విధులు :
బాంకులు నిర్వహించే ప్రాథమిక విధుల ఫలితంగా ‘ప్రాతినిథ్య విధులు’ ఏర్పడతాయి.

  1. బాంకులు ఖాతాదారుల ప్రతినిధులుగా వారి తరపున బీమా ప్రీమియమ్లు, కరెంట్ బిల్లులు మొదలైన వాటిని ఖాతాదారుల ఆదేశానుసారం నిర్ణీత సమయాల్లో చెల్లించుట.
  2. బాంకులు ఖాతాదారులు ‘ఏజెంట్గా’ కంపెనీల షేర్లను, రుణ పత్రాలను కొనిపెడతాయి.
  3. ఖాతాదారుల తరపున డ్రాఫ్టు ద్వారా, ద్వారా, తంతి తపాలా ద్వారా సొమ్ము బదిలీ చేస్తుంది.

3. సాధారణోపయోగ సేవలు :

  1. విదేశీ వ్యాపార క్రమంలో అత్యవసరమైన ‘పరపతి పత్రాలను’ జారీ చేస్తాయి.
  2. విదేశీ వర్తకం చేసేవారికి ‘విదేశీ ద్రవ్యం’లో విత్త సహాయం చేస్తుంది.
  3. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించటానికి ‘విద్యా రుణ’ సౌకర్యాన్ని కల్పిస్తుంది.
  4. బాంకింగ్ సేవలలో మరో విప్లవాత్మక సౌకర్యం ATM పద్ధతి ఖాతాదారులు తమకు సొమ్ము కావలసినప్పుడు బాంకుకు వెళ్ళకుండా, తమకు దగ్గరలో ఉన్న ATM నుంచి నగదు తీసుకొనే సౌకర్యం కల్పించింది.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 4.
భారతీయ రిజర్వు బ్యాంకు విధులు ఏమిటి ?
జవాబు.
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మన దేశానికి కేంద్ర బ్యాంకు. దేశంలోని ద్రవ్య, కోశ విధానాలను రూపొందించడం లోను, అమలు పరచడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది. ఇది దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థ అభివృద్ధికి నాయకత్వం వహిస్తూ దేశ అవసరాలకు తగినట్లుగా బ్యాంకింగ్ కార్యకలాపాలను క్రమబద్ధీకరిస్తుంది.

రాయల్ కమీషన్ ఆఫ్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్ సూచన మేరకు 1935 ఏప్రిల్లో కౌ 5 కోట్ల వాటా మూలధనంతో రిజర్వు బ్యాంకు నెలకొల్పబడినది. మొదట ఇది ప్రైవేటు వాటాదారు యాజమాన్యం క్రింద ఏర్పడింది. దీనిని 1949లో భారత ప్రభుత్వం జాతీయం చేసింది. 1934 భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం ప్రకారం అన్ని ముఖ్యమైన కేంద్ర బ్యాంకు విధులను ఇది నిర్వహిస్తుంది.

దీని ప్రధాన కార్యాలయం ముంబాయిలో ఉంది. ఢిల్లీ, కోలకత్తా, చెన్నై, ముంబాయి మొదలైన నగరాలలో ప్రాంతీయ కార్యాలయాలు పనిచేస్తాయి. 20 మంది డైరెక్టర్లతో కూడిన కేంద్ర డైరెక్టర్ల బోర్డు నియంత్రణ క్రింద ఇది పనిచేస్తుంది.

ఇందులో ఒక గవర్నరు, నలుగురికి మించకుండా డిప్యూటీ గవర్నర్లు, రిజర్వు బ్యాంకు నాలుగు స్థానిక డైరెక్టర్ల బోర్డుల నుంచి ఒక్కొక్కరు కేంద్ర ప్రభుత్వంచే నియమించబడే పదిమంది డైరెక్టర్లు, ఒక ప్రభుత్వ అధికారి, మొత్తం 20 మంది ఉంటారు. వీరందరినీ కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది.

భారతీయ రిజర్వు బ్యాంకు విధులు :

1. కరెన్సీ నోట్ల జారీ :
మనదేశంలోని కరెన్సీ నోట్ల జారీపై గుత్తాధిపత్య అధికారం రిజర్వు బ్యాంకు కలిగి ఉంది. రిజర్వు బ్యాంకు 2,000, 500, 200, 100, 50, 20, 10 ల కరెన్సీ నోట్లను జారీ చేస్తుంది. ఈ నోట్లపై భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ సంతకం ముద్రించబడతాయి.

2. ప్రభుత్వ బ్యాంకరు :
రిజర్వు బ్యాంకు కేంద్ర ప్రభుత్వానికీ, రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకరుగా, ప్రతినిధిగా, ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వ బ్యాంకరుగా వివిధ ప్రభుత్వ విభాగాల అకౌంట్లను నిర్వహిస్తుంది.

ప్రభుత్వం తరుపున ద్రవ్యాన్ని స్వీకరిస్తుంది, చెల్లింపులు చేస్తుంది. ప్రభుత్వాలకు తాత్కాలిక ఋణాలు అందిస్తుంది. అన్ని ఆర్థిక వ్యవహారాలలో ప్రభుత్వాలకు సలహాదారుగా కూడా పనిచేస్తుంది.

3. బ్యాంకుల బ్యాంకరు :
దేశంలోని బ్యాంకులకు రిజర్వు బ్యాంకు బ్యాంకరుగా పనిచేస్తుంది. కొన్ని రకాల బిల్లులను రీడిస్కౌంట్ చేసుకునే సదుపాయం వాణిజ్య బ్యాంకులకు కలుగజేస్తుంది. వివిధ బ్యాంకుల మధ్య బ్యాంకింగ్ లావాదేవీలను పరిష్కరించడానికి క్లియరింగ్ హౌస్గా పనిచేస్తుంది. అలాగే బ్యాంకుల కార్యకలాపాలు తీర్చిదిద్ది వాటికి ” నాయకత్వం వహిస్తుంది.

4. అంతిమ ఋణదాత :
మార్కెట్లోని అన్నిరకాల పరపతి సౌకర్యాలు ఉపయోగించుకున్న తర్వాత ఇంకా ద్రవ్యత్వ ఇబ్బందులున్నప్పుడు రిజర్వు బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు, డిస్కౌంటు గృహాలకు, ఇతర పరపతి సంస్థలకు కొన్ని షరతులకు లోబడి వాటి వినిమయ బిల్లులను రీడిస్కౌంట్ చేయడం ద్వారా పరపతి అందిస్తూ అంతిమ ఋణదాతగా పనిచేస్తుంది.

5. క్లియరింగ్ హౌస్ల నిర్వహణ :
వ్యాపార అవసరాల నిమిత్తం బ్యాంకు ఖాతాదార్లు చెక్కుల ద్వారా చెల్లింపులు చేస్తుంటాయి. వేరువేరు ఖాతాదార్లు వేరువేరు బ్యాంకులలో తమ ఖాతాలు కలిగి ఉండటం వల్ల వివిధ బ్యాంకుల మీద ఈ చెక్కులు జారీ అవుతూ ఉంటాయి.

వివిధ బ్యాంకుల మధ్య ఖాతాదార్ల చెక్కులకు సంబంధించిన సొమ్ము వారి వారి ఖాతాలలో జమచేయడానికి రిజర్వు బ్యాంకు తమవద్ద ఉన్న వివిధ బ్యాంకుల ఖాతాలను సర్దుబాటు చేస్తూ వసూళ్ళ చెల్లింపులు సులభతరం చేయడానికి వివిధ నగరాలలో క్లియరింగ్ హౌస్లు నిర్వహిస్తుంది.

6. విదేశీ మారక ద్రవ్యం పరిరక్షణ :
రిజర్వు బ్యాంకు విదేశీ మారక ద్రవ్యంను పరిరక్షిస్తుంది. విదేశీ మారక ద్రవ్యం మారకం రేటులను స్థిరంగా ఉంచవలసిన బాధ్యత రిజర్వు బ్యాంకుది. విదేశీ మారక నిల్వలను నిర్వహిస్తూ వాటి వినియోగాన్ని నియంత్రణ చేస్తుంది.

7. పరపతి నియంత్రణ :
ఆర్థిక వ్యవస్థలోని పరపతి పరిమాణాన్ని తగిన ద్రవ్య విధానం ద్వారా కేంద్ర బ్యాంకు నియంత్రిస్తుంది. ద్రవ్యోల్బణం సమయంలో పరపతి తగ్గిస్తుంది. ఆర్థిక వ్యవస్థ తిరోగమన పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో పరపతి సప్లయి పెంచుతుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 5.
ద్రవ్యోల్బణాన్ని నిర్వచించండి. ద్రవ్యోల్బణ రకాలను, ప్రభావాలను వివరించండి.
జవాబు.
స్థూలంగా ద్రవ్యోల్బణం అంటే సాధారణ ధరల స్థాయిలో నిర్విరామంగాను, స్థిరంగాను పెరుగుదల ఏర్పడే పరిస్థితి. క్రౌథర్ ప్రకారం, ‘ద్రవ్యోల్బణ స్థితిలో ద్రవ్య విలువ తగ్గి, ధరలు పెరుగుతాయి’.
ఆచార్య కెమ్మెరక్ అభిప్రాయంలో ‘ఒక ఆర్థిక వ్యవస్థలో వ్యాపార వ్యవహారాలు తక్కువగాను, ద్రవ్యం ఎక్కువగాను ఉన్న పరిస్థితియే ద్రవ్యోల్బణం’.

‘సాధారణ స్థాయిలో లేదా సగటు స్థాయిలో ధరలు స్థిరంగా, నిరాఘాటంగా పెరిగే పరిస్థితిని ద్రవ్యోల్బణం’ అని ఆక్లె గార్డనర్ తెలిపాడు. ‘ఆర్థిక కార్యకలాపాల అనుపాతం కంటే ద్రవ్య ఆదాయం విస్తరించినప్పుడు ద్రవ్యోల్బణం ఏర్పడుతుందని పిగూ అభిప్రాయపడ్డాడు.

‘తక్కువ వస్తురాశిని హెచ్చు ద్రవ్యరాశికి తరమడమే ద్రవ్యోల్బణం’ అని డాల్టన్ అన్నాడు.
సామ్యూల్సన్ ప్రకారం సాధారణ ధరల స్థాయిలో పెరుగుదలను ద్రవ్యోల్బణం సూచిస్తుంది.

ద్రవ్యోల్బణంలో రకాలు :
ద్రవ్యోల్బణపు గమనం లేదా రేటు మరియు ద్రవ్యోల్బణ కారణాల ఆధారంగా ద్రవ్యోల్బణం వివిధ రకాలుగా ఉంటుంది.

ద్రవ్యోల్బణ రేటు ప్రకారం :
ద్రవ్యోల్బణ రేటు అంటే సాధారణ ధరల స్థాయిలో పెరుగుదల గమనం ఆధారంగా ద్రవ్యోల్బణం 4 రకాలని చెప్పవచ్చు.

i) ‘పాకే ద్రవ్యోల్బణం’లో (Creeping Inflation) ధరలు నెమ్మదిగా పెరగడాన్ని గమనించవచ్చు. ఇలాంటి పరిస్థితులలో ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చెందడానికి ప్రేరణ కలుగుతుంది. సాధారణ ధరల స్థాయిలో సంవత్సరానికి సుమారు 0 (శూన్యం) నుంచి 2 శాతం వరకు (0 నుంచి) పెరుగుదల ఉంటుంది.

ii) ‘నడిచే ద్రవ్యోల్బణం’ (Walking Inflation) కాలంలో సాధారణ ధరల స్థాయిలో పెరుగుదల సంవత్సరానికి సుమారు 2% నుంచి 4% వరకు (A నుంచి B) ఉంటుంది. ఈ దశలో కూడా ఆర్థిక వ్యవస్థ పురోగతి బాటలో పయనిస్తుంది.

iii) ‘పరుగెత్తే ద్రవ్యోల్బణ’ (Running Inflation) దశలో ధరల పెరుగుదల రేటు సంవత్సరానికి సుమారు 4% నుంచి 10% వరకు (B నుంచి C) ఉంటుంది. ఈ దశలో ప్రభుత్వం సరైన నియంత్రణ చర్యలు చేపట్టకపోతే పర్యవసానాలను ఎదుర్కోవలసి వస్తుంది.

iv) ‘దుమికే’ (Galloping) లేదా ‘అతి తీవ్ర ద్రవ్యోల్బణ’ (Hyper Inflation) పరిస్థితిలో ధరల పెరుగుదల రేటు సంవత్సరానికి పది శాతానికి మించి (C నుంచి D) ఉంటుంది. కీన్స్ (Keynes) అభిప్రాయంలో ఈ స్థితి ‘ద్రవ్యోల్బణం’ పరిస్థితి. ఇలాంటి పరిస్థితి మొదటి, రెండవ ప్రపంచ యుద్ధ కాలాల్లో ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులను అదుపులోకి తీసుకొనిరావాలంటే, ప్రభుత్వం సరైన ద్రవ్య, కోశ విధానాలను ఉపయోగించవలసి ఉంటుంది. ఈ స్థితిలో ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుంది.

2. ద్రవ్యోల్బణ కారణాల ప్రకారం :
ద్రవ్యోల్బణం ఏర్పడడానికి గల కారణాలను అనుసరించి ద్రవ్యోల్బణాన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి :

i) డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం :
వస్తు సేవల డిమాండ్లో పెరుగుదల ద్రవ్యోల్బణ పరిస్థితులకు దారి తీయవచ్చు. దీనినే ‘డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం’ (Demand Pull Inflation) అంటారు.

ii) వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం :
వస్తుసేవల ఉత్పత్తికి అయ్యే వ్యయం పెరగడంవల్ల ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడి దానిని ‘వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం’ (Cost – Push Inflation) అంటారు. దీనినే “సప్లయి ప్రేరిత” ద్రవ్యోల్బణం” అని కూడా అంటారు. ఉత్పత్తి వ్యయంలో భాగంగా ఉన్న శ్రామికుల వేతనాలు పెరగటం, అంటే యాజమాన్యంపై శ్రామిక సంఘాల ఒత్తిడివల్ల ఉత్పత్తి వ్యయం పెరిగితే, అలాంటి పరిస్థితిని ‘వేతన ప్రేరిత’ (wage push) ద్రవ్యోల్బణం అంటారు.

ఉత్పత్తిదారులు తమ లాభాల శాతం పెంచుకోవటంవల్ల ‘లాభాల ప్రేరిత’ (profit push) ‘వేతనాల పెరుగుదల’ కారణాలుగా ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగి వస్తుసేవల ధరలు పెరుగుతున్నట్లయితే ‘వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణా’నికి దారి తీస్తుంది.

ద్రవ్యోల్బణం ప్రభావాలు : నిరంతరంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థపై అనేక చెడు ప్రభావాలను కలిగిస్తుంది.

A) ఉత్పత్తి ద్రవ్యోల్బణ ప్రభావం :

  1. పరిమిత ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు లాభాలు పెరగటంవల్ల దీర్ఘ కాలంలో ఉత్పత్తి దెబ్బ తింటుంది.
  2. అతి తీవ్ర (మోతాదు మించిన) ద్రవ్యోల్బణం (10%కు మించి ధరల పెరుగుదల) ఉత్పత్తిపై చెడు ఫలితాల నిస్తుంది.
  3. ద్రవ్యోల్బణం పొదుపును నిరుత్సాహపరచి, మూలధన సంచయనాన్ని దెబ్బతీస్తుంది. దానివల్ల ఉత్పత్తి తగ్గిపోతుంది.

B) పంపిణీపై ద్రవ్యోల్బణ ప్రభావం :

  1. ద్రవ్యోల్బణం వల్ల సమాజంలో ఎక్కువగా ‘మధ్య తరగతి’, స్థిర ఆదాయ’ వర్గాలవారు వేదనకు గురవుతారు.
  2. కార్మిక వర్గం లేదా వేతన వర్గం అధికంగా దెబ్బతింటారు.
  3. ద్రవ్యోల్బణ కాలంలో ‘ద్రవ్యం విలువ క్షీణిస్తుంది.’ ఫలితంగా ఋణగ్రహీతల కంటే ఋణదాతలు తీవ్రంగా నష్టపోతారు.
  4. ద్రవ్యోల్బణ ప్రభావం వినియోగదారుల స్థితి క్షీణించేలా, ఉత్పత్తిదారుల పరిస్థితులు మెరుగుపరచేలా చేస్తుంది.

C) సాంఘిక న్యాయం వంటి అంశాలపై ద్రవ్యోల్బణ ప్రభావం :
ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థలో ఒక వర్గం మాత్రమే లబ్ధి పొందేటట్లుగా చేయడంవల్ల ధనికులు మరింత ధనికులు కావడం, పేదవారు మరింత పేదరికం అనుభవించాల్సి వచ్చి మొత్తంమీద ‘సాంఘిక న్యాయం’ దెబ్బతింటుంది.

D) రాజకీయ వ్యవస్థ ద్రవ్యోల్బణ ప్రభావం :

  1. ద్రవ్యోల్బణం ఆర్థిక అసమానతలను ఎక్కువ చేయడంవల్ల అసాంఘిక కార్యకలాపాలు పెరిగి, అభివృద్ధి వ్యయం మళ్ళింపు జరుగుతుంది.
  2. అధిక ధరలు, ఉద్యమాలు, పోరాటాలకు దారితీసి, కొన్ని సందర్భాలలో ప్రభుత్వాల సుస్థిరతను దెబ్బతీస్తాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 6.
ద్రవ్యోల్బణ కారణాలు ఏవి ? ద్రవ్యోల్బణ నియంత్రణ నివారణకు చర్యలను సూచించండి.
జవాబు.
సాధారణ ధరల స్థాయిలో స్థిరమైన, గ్రహించదగిన పెరుగుదల పరిస్థితిని ద్రవ్యోల్బణం అంటారు. ఇది అనేక విధాలుగా ప్రజల ఆర్థిక జీవితాన్ని, సంక్షేమాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఉత్పత్తి విలువ, పంపిణీ విలువ ప్రభావితం కలిగి ఉంటుంది.

ద్రవ్యోల్బణానికి కారణాలు :
ద్రవ్యోల్బణం అధిక డిమాండు వల్లగాని, అల్ప సప్లయ్ వల్లగాని, ఉత్పత్తి వ్యయం పెరుగుదల వల్లగాని ఏర్పడుతుంది. ఈ పరిస్థితులకు దారితీసే పలు అంశాలు.

a) వస్తువుల సమిష్టి డిమాండ్ పెరుగుదల :

  1. అధిక జనాభా పెరుగుదల రేటు.
  2. ఆర్థికాభివృద్ధి వల్ల తలసరి ఆదాయాలు పెరగడం.
  3. ఉద్యోగిత కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వం అధికంగా ఖర్చుచేయడం.
  4. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లయ్ పెరగడం.
  5. ప్రత్యక్ష పన్నురేట్లు తగ్గించటం.
  6. లోటు బడ్జెట్ విధానాన్ని అనుసరించడం.

b) అల్ప సప్లయ్ కారణాలు :

  1. వ్యవసాయ రంగంలో ఋతుపవనాలు విఫలం కావడం, వరదలు, పంటలకు తెగులు రావడం, కల్తీ విత్తనాల వాడకం మొదలైనవి.
  2. సంస్థాగత పరపతి తగినంత లభించనందువల్ల పెట్టుబడి కొరత ఏర్పడటం.
  3. ఉత్పాదకాలు, ముడిపదార్థాల సప్లయి లేకపోవడం లేదా కొరతగా ఉండటం.
  4. విద్యుత్ కొరత, కార్మికుల అశాంతి మొదలైన కారణాల వల్ల స్థాపిత శక్తి పూర్తిగా వినియోగించుకోలేక పోవటం.
  5. కొన్ని పరిశ్రమల దీర్ఘ ఫలనకాలం.
  6. దేశంలో వినియోగానికి సప్లయ్ తగ్గించి ఎగుమతులు చేయడం.

c) ఉత్పత్తి వ్యయం పెరుగుదలకు కారణాలు :

  1. ఉత్పత్తి కారకాల ధరలు పెరగడం.
  2. పన్నుల రేట్లు పెరగడం.
  3. ఆధునిక పద్ధతులు ఉపయోగించకుండా పాత పద్ధతులలో ఉత్పత్తి చేయడం.
  4. అధిక ధరలకు యంత్రాలను, పనిముట్లను దిగుమతి చేయడం.

ద్రవ్యోల్బణం నివారణ చర్యలు :
దీర్ఘకాలంలో సాధారణ ధరల స్థాయిలో నిరంతరమైన పెరుగుదలను ద్రవ్యోల్బణం అని అంటారు. పరిమిత ద్రవ్యోల్బణం ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుంది. అతి ద్రవ్యోల్బణం ఆర్థికాభివృద్ధిని నిరోధిస్తుంది. ద్రవ్యోల్బణాన్ని నివారించ డానికి ప్రభుత్వం అనేక చర్యలను చేపడుతుంది. అవి :

1. ద్రవ్యపరమైన చర్యలు :
ద్రవ్యపరమైన చర్యలు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లయ్న క్రమబద్ధం చేస్తాయి. బ్యాంకులు పరపతిని క్రమబద్ధం చేయటం ద్వారా ద్రవ్య సప్లయ్న నియంత్రణ చేయటం జరుగుతుంది. కేంద్ర బ్యాంకు పరిమాణాత్మక, గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాల ద్వారా ద్రవ్యం సప్లయ్న నియంత్రణ చేయవచ్చు.

2. కోశ విధానాలు :
ద్రవ్యోల్బణ కాలంలో ప్రభుత్వం మిగులు బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి పన్ను రేట్లను పెంచటం, కొత్తగా పన్నులను విధించడం మొదలగువాటిని కోశపరమైన చర్యలు అంటారు.

3. ద్రవ్యేతర అంశాలు :

a) ఉత్పత్తిని పెంచటం :
వస్తూత్పత్తిని పెంచటం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అరికట్టవచ్చు. ఉత్పత్తిని పెంచటానికి ఈ క్రింది చర్యలు చేపట్టాలి.

  • ఉత్పాదక వనరులను సక్రమంగా కేటాయించడం.
  • దేశీయంగా ఉన్న వస్తుకొరతను దిగుమతుల ద్వారా ద్రవ్యోల్బణాన్ని అరికట్టవచ్చు.

b) వేతనాలు :
వేతనాల పెరుగుదలకు, వస్తు ధరల పెరుగుదలకు దగ్గర సంబంధం ఉంది. సక్రమమైన వేతన విధానాలను అమలు చేయాలి.

c) రేషనింగ్ :
ద్రవ్యోల్బణాన్ని నివారించే ప్రత్యక్ష చర్య వస్తువు ధరలను అమలు చేయటం, అదుపులో ఉంచటం. చట్టబద్ధంగా ప్రతి వస్తువుకు గరిష్ఠ ధరను నియంత్రించి ఆ ధర కంటే ఎక్కువ ధరకు అమ్మకుండా చర్యలు తీసుకోవాలి.

d) బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టుట అక్రమ వస్తు నిల్వలను అదుపు చేయుట ద్వారా వస్తువుల ధరలను అదుపు చేయవచ్చు. ప్రభుత్వ నియమ, నిబంధనలకు వ్యతిరేకంగా నిల్వచేసే వ్యాపారస్తులను కఠినంగా శిక్షించాలి.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
వస్తు మార్పిడి విధానం అంటే ఏమిటి ? అందులో గల ఇబ్బందులేమిటి ?
జవాబు.
ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం వాడుకలోకి రాకముందు “వస్తు మార్పిడి విధానం” అమలులో ఉండేది. అప్పుడు జనాభా పరిమితంగా ఉండి, వ్యక్తుల కోరికలు సాధారణ స్థాయిలో ఉండేవి.

ఈ విధానంలో వ్యక్తులు వస్తువులకు బదులుగా వస్తువులను వినిమయంగా పొందటాన్ని వస్తు మార్పిడి విధానం అంటారు. ఇలాంటి మార్పిడికి ప్రధాన కారణం మానవుల ‘అవసరాలు’.

ఆర్థిక కార్యకలాపాలు పరిమితంగా ఉండి, వ్యక్తుల కోరికలు సాధారణంగా ఉన్నంత వరకు ఈ విధానం కొనసాగుతుంది. జనాభా పెరిగి, కోరికలలో మార్పులు సంభవించి, వర్తక వాణిజ్య వ్యవహారాలు పెరగడంతో ఈ విధానం అనేక ఇబ్బందులను ఎదుర్కొనవలసి వచ్చింది.

వస్తు మార్పిడి విధానంలోని సమస్యలు :

1. కోర్కెల సమన్వయము లోపించుట :
వస్తు మార్పిడి విధానం సాఫీగా జరగాలంటే ఇరుపక్షాల వారి కోరికలలో సమన్వయం కుదరాలి.
ఉదా : వరి పండించే వ్యక్తికి వస్త్రం అవసరం, వస్త్రం నేసే వ్యక్తికి వరి అవసరం ఏక కాలంలో కలగాలి. అలాగైతేనే వినిమయం లేదా మార్పిడికి అవకాశం ఏర్పడుతుంది. ఇరువురి కోరికలలో సమన్వయం కుదరకపోతే మార్పిడి అసాధ్యమవుతుంది.

2. సంపద నిల్వ చేయడంలో ఇబ్బంది :
మార్పిడికి ఉపయోగించే అన్ని వస్తువులను ‘నిల్వ’ ఉంచే అవకాశం ఉండదు. కారణం కొన్ని రకాల వస్తువులను ‘నిల్వ’ ఉంచడం వల్ల అవి పాడైపోయే అవకాశం ఉంది. కాలం గడిచే కొద్ది ఇలాంటి వస్తువుల విలువ క్షీణించడం, కొన్నిసార్లు నశించడం జరగవచ్చు.
ఉదా : పశువులు, కూరగాయలు, ఆహార ధాన్యాలు మొదలైనవి.

3. వస్తువుల అవిభాజ్యత :
కొన్ని వస్తువులను విభజించడం వల్ల వాటి విలువ క్షీణించవచ్చు లేదా పూర్తిగా నశించవచ్చు. ఉదా : పశువులు, పనిముట్లు, యంత్రాలు. ఇలాంటి వాటి విషయంలో విభజించటానికి వీలుండదు. అందువల్ల మార్పిడి సాధ్యం కాదు.

4. విలువను నిర్ణయించే కొలమానం లేకపోవుట :
వస్తు మార్పిడి విధానంలో వస్తువుల విలువలను ఇతర వస్తువుల విలువలో చెప్పవలసి వస్తుంది. అంటే వస్తువుల విలువలను ఖచ్చితంగా కొలిచే కొలమానం/సాధనం లేకపోవడం వల్ల ఈ విధానాన్ని అమలుచేయడం ఎంతో కష్టమౌతుంది.

5. వాయిదా చెల్లింపులలో ఇబ్బంది :
ఆర్థిక వ్యవస్థలో ఋణాలు ఇవ్వడం, పుచ్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే వస్తు వినిమయంలో ఈ రకమైన చెల్లింపులు కష్టసాధ్యం.

6. సేవల మార్పిడి :
సేవల మార్పిడికి అవకాశం లేదు. విలువలను కొలిచే సాధనం లేకపోవడం వల్ల “సేవల” విలువలను వస్తు రూపంలో చెప్పడానికి వీలుండదు. ఉదా : డాక్టర్లు, టీచర్లు, లాయర్ల సేవలు.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 2.
ద్రవ్యం నిర్వచనాలను వివరించండి.
జవాబు.
ద్రవ్యమునకు పూర్వం వస్తు మార్పిడి విధానం అమలులో ఉండేది. వ్యక్తి తాను ఉత్పత్తి చేసిన వస్తువులను ఇతర వస్తువులతో మార్పిడి చేసుకొను విధానాన్నే వస్తు మార్పిడి విధానమంటారు. ఈ విధానంలో కొన్ని ఇబ్బందులు ఉండటం వల్ల దీనికి బదులు ద్రవ్యాన్ని ప్రవేశపెట్టడమైంది.

నిర్వచనాలు : వివిధ ఆర్థిక శాస్త్రవేత్తలు ద్రవ్యానికి సంబంధించి వివిధ నిర్వచనాలను ఇచ్చారు.
క్రౌథర్ అను ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం, “వినిమయ సాధనంగా అందరూ అంగీకరించేది, విలువల కొలమానంగా ఉపయోగించబడేదే ద్రవ్యం”.

రాబర్ట్సస్ ప్రకారం, “వస్తు క్రయ విక్రయ చెల్లింపులలో, ఇతర వ్యవహారాల పరిష్కారాలలో అధికంగా జనామోదం పొందింది ద్రవ్యంగా చెప్పవచ్చును.

సెలిగ్మన్ ‘ఏ వస్తువుకు అయితే సర్వజనాంగీకారం ఉంటుందో దానినే ద్రవ్యం’గా నిర్వచించాడు. కొంతమంది అభిప్రాయం ప్రకారం చట్టం దేనిని ద్రవ్యమంటుందో అదే ద్రవ్యం అంటారు.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 3.
ద్రవ్య సంబంధిత భావనలను చర్చించండి.
జవాబు.
వస్తు మార్పిడి విధానంలోని ఇబ్బందులను తొలగించడానికి ద్రవ్యాన్ని చలామణిలోకి తీసుకురావడం జరిగింది. అర్థశాస్త్రవేత్తలు ద్రవ్యాన్ని అనేక విధాలుగా నిర్వచించడం జరిగింది.

  1. రాబర్ట్సన్ అభిప్రాయంలో ద్రవ్యం “వస్తు క్రయ విక్రయ చెల్లింపులలో, ఇతర వ్యవహారాల పరిష్కారాలలో అధికంగా జానామోదం పొందింది.”
  2. ‘దేనికైతే సర్వజనాంగీకారం కలిగి ఉన్నదో అదే ద్రవ్యం’ అని సెలిగ్మన్ పేర్కొన్నాడు.
  3. సాధారణంగా ‘వినిమయ సాధనం’గా అందరూ అంగీకరించేది, అంతేకాకుండా విలువల కొలమానంగా, విలువ నిధిగా ఉపయోగపడేది’ ద్రవ్యం అని డా॥ క్రౌథర్ నిర్వచించాడు.

ద్రవ్య అనుబంధ భావనలు (Money Related Concepts) :
ద్రవ్యానికి అనుబంధంగా కరెన్సీ, ద్రవ్యత్వం, సమీప ద్రవ్యం అను భావనల గురించి తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే వీటికి వేరువేరు అర్థాలున్నాయి. ఈ భావనలు ద్రవ్యానికి సంబంధించినవి. అందుకే భావనపరమైన అస్పష్టత లేకుండా ఉండడానికి వాటి గురించి ముచ్చటించుకొందాం.

i) కరెన్సీ (Currency) :
కేంద్ర ప్రభుత్వం, కేంద్ర బ్యాంకులచే ముద్రించబడి ఆర్థిక వ్యవస్థలో చలామణిలోకి వచ్చిన నాణేలు, పేపరు నోట్లను ‘కరెన్సీ’ అంటారు. ద్రవ్యంలో కరెన్సీ ఒక భాగం మాత్రమే. కరెన్సీతోపాటు డిమాండ్, టైమ్ డిపాజిట్లు మొదలైనవి కూడా ద్రవ్యం కిందకు వస్తాయి.

ii) ద్రవ్యత్వం (Liquidity) :
ద్రవ్యానికి ద్రవ్యత్వం ఉంది. ద్రవ్యత్వం అంటే వెంటనే ‘కొనుగోలు చేసే శక్తి’ (ready purchasing power). ఒక వస్తువును విలువ తగ్గకుండా సులభంగా తక్కువ కాలవ్యవధిలో ద్రవ్యంగా మార్చగల గుణాన్ని ‘ద్రవ్యత్వం’ అంటారు. అందువల్లనే ద్రవ్యత్వాన్ని ‘పరిపూర్ణ ద్రవ్యం’ గల ఆస్తి అంటారు.

iii) సమీప ద్రవ్యం (Near Money) :
ద్రవ్యంగా గుర్తింపబడనటువంటి అతి తక్కువ కాలంలో సులభంగా మార్చుకొనే వీలుండే అత్యధిక ద్రవ్యత్వం గల ఆస్తులను సమీప ద్రవ్యం అని అంటారు. అంటే వీటి ద్రవ్యం ద్రవ్యత్వానికి చాలా దగ్గరలో ఉంటుంది. ఇలా ద్రవ్యత్వంలో ద్రవ్యానికి దగ్గరలో ఉన్న వాటిని సమీప ద్రవ్యం లేదా కృత్రిమ ద్రవ్యం (quasi money) అంటారు.

సమీప ద్రవ్యానికి ఉదాహరణలుగా కింది వాటిని చెప్పవచ్చు. (ఎ) వాణిజ్య బాంకులలోని పొదుపు డిపాజిట్లు, డిమాండ్ డిపాజిట్లు; (బి) పోస్టాఫీస్ పొదుపు డిపాజిట్లు, పోస్టాఫీస్ బాండ్లు, (సి) ఉమ్మడి వ్యాపార సంస్థల స్టాకులు, షేర్లు; (డి) UTI యూనిట్లు; (ఇ) పొదుపు బాండ్లు, పత్రాలు; (ఎఫ్) ట్రెజరీ బిల్లులు, (జి) వినిమయ బిల్లులు, ప్రభుత్వ సెక్యూరిటీలు, ప్రభుత్వం హామీ ఇచ్చిన సెక్యూరిటీలు.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 4.
ద్రవ్యం రకాల మధ్య తారతమ్యాలను తెలపండి.
జవాబు.
క్రౌథర్ అను ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం “వినిమయ సాధనంగా అందరూ అంగీకరించేది, విలువ కొలమానంగా ఉపయోగపడేదే ద్రవ్యం”.

ద్రవ్య రకాలు :

1. వస్తురూప ద్రవ్యం/ ప్రాతినిద్య ద్రవ్యం :
ద్రవ్యం ప్రవేశపెట్టిన తొలిదశలో కొన్ని వస్తువులు ద్రవ్యంగా పరిగణించబడేవి. జంతువులు, బంగారం, వెండి మొదలగు వాటిని ద్రవ్యంగా ఉపయోగించారు. ఈ విధమైన ద్రవ్యాన్ని వస్తు రూప ద్రవ్యం లేదా పుల్ బాడీడ్ ద్రవ్యం అంటారు.

నాణేలు, కరెన్సీ నోట్లు ఈ రకానికి చెందుతాయి. ఇది ద్రవ్యానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. కాబట్టి వీటిని ప్రాతినిధ్య ద్రవ్యం అంటారు. వీటి ముఖ విలువ కంటే అంతర్గత విలువ తక్కువగా ఉంటుంది.

2. చట్టబద్ధ ద్రవ్యం, ఐచ్ఛిక ద్రవ్యం :
చట్టబద్ధ ద్రవ్యం అనగా ప్రభుత్వంచే చట్టరీత్యా గుర్తింపు పొందిన ద్రవ్యాన్ని చట్టబద్ధ ద్రవ్యం అని అంటారు. ఈ ద్రవ్యానికి చట్టబద్ధత ఉన్నందువల్ల ప్రతి ఒక్కరూ వస్తుసేవల కొనుగోలుకు, అమ్మకానికి దీనిని వినిమయ మాధ్యమంగా తప్పనిసరిగా అంగీకరించాలి.

ద్రవ్యానికి ప్రత్యామ్నాయంగా వాడే ఏ పరపతి సాధనాన్ని అయినా ఐచ్ఛిక ద్రవ్యంగా పరిగణించవచ్చు.
ఉదా : బిల్లులు, ప్రామిసరి నోట్లు, బాండ్లు, ట్రెజరీ బిల్లులు మొదలగు ద్రవ్యాన్ని అంగీకరించమని ఏ ఒక్కరిని బలవంతం చేయడానికి వీలుకాదు.

3. లోహ ద్రవ్యం, కాగితపు ద్రవ్యం:
అన్ని రకాల నాణేలు లోహ ద్రవ్యం క్రిందికి వస్తాయి. నాణేల తయారీకి వెండి, నికెల్, స్టీల్ మొదలగు లోహాలను ఉపయోగిస్తారు. కాగితంపై ముద్రించిన ద్రవ్యాన్ని కాగితపు ద్రవ్యం అని అంటారు. అన్ని కరెన్సీ నోట్లు కాగితం ద్రవ్యం క్రిందకు వస్తాయి.

4. ప్రామాణిక ద్రవ్యం, టోకెన్ ద్రవ్యం :
ప్రామాణిక ద్రవ్యం ముఖ విలువ, అంతర్గత విలువ ఒకటిగానే ఉంటాయి. ప్రభుత్వం కరెన్సీని ముద్రించడానికి ఏదైనా ఒక లోహాన్ని ప్రమాణంగా తీసుకుంటుంది. ద్రవ్యం అంతర్గత విలువ కంటే ముఖ విలువ ఎక్కువగా ఉంటే దీనిని టోకెన్ ద్రవ్యం అంటారు. ఇది పరివర్తనాత్మకం కాదు. దీనిని ప్రజలు అన్ని రకాల వ్యవహారాలలో వినిమయ మాధ్యమంగా మాత్రమే అంగీకరిస్తారు.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 5.
ద్రవ్యం ప్రాథమిక, ద్వితీయ విధులను వివరించండి.
జవాబు.
ద్రవ్యం నిర్వచనాల ఆధారంగా అది నిర్వహించే విధులను క్రింది విధంగా వర్గీకరించవచ్చు.

1. ప్రాథమిక విధులు (Primary Functions)

i) వినిమయ మాధ్యమం (Medium of Exchange) :
ద్రవ్యం నిర్వహించే విధులలో ముఖ్యమైంది వినిమయ మాధ్యమం. ద్రవ్యం వినిమయ మాధ్యమంగా పని చేయడంవల్ల, అమ్మకాలు, కొనుగోళ్ళు సులభతరమయ్యాయి.

ప్రతి వస్తువు విలువను ద్రవ్యం రూపంలో చెప్పడంవల్ల ‘ధర’ ఏర్పడి, వ్యక్తులు ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ వస్తువునైనా కొనుగోలు చేసే వీలు కలుగుతుంది. ద్రవ్యం వినిమయ మాధ్యమంగా పనిచేయడంవల్ల ద్రవ్యంతో నడిపే వ్యవహారాల సంఖ్య పెరిగింది.

ii) విలువ కొలమానం (Measure of Value) :
ద్రవ్యం వస్తు సేవల విలువ కొలమానంగా పనిచేస్తుంది. బరువును గ్రాముల్లో, దూరాన్ని మీటర్లలో కొలచినట్లే వస్తుసేవల విలువలను ద్రవ్య రూపంలో కొలవవచ్చు.

వస్తుసేవల విలువలు ద్రవ్య రూపంలో (ధరలు) తెలియడంతో వినియోగదారులు, ఉత్పత్తిదారులు తమకు ఎక్కువ సంతృప్తికరంగా ఉండే విధానంలో కావలసిన వస్తుసేవలను కొనడానికి వీలు పడుతుంది. ద్రవ్యం యూనిట్ విలువ స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే అది సంతృప్తికరమైన కొలమానంగా పనిచేస్తుంది.

2. ద్వితీయ శ్రేణి విధులు (Secondary Functions)

iii) విలువ నిధి (Store of Value) :
కీన్స్ అభిప్రాయంలో, ద్రవ్యం నిర్వహించే విధులలో ఈ విధి అతి ముఖ్యమైంది, అత్యంత ప్రాముఖ్యమైంది. ద్రవ్యంవల్ల మాత్రమే, ప్రస్తుత ఆదాయంతో భవిష్యత్తులో వినియోగం. సాధ్యపడుతుంది. అందువల్ల ద్రవ్యం భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాల మధ్య వారధిలాగా పనిచేస్తుంది.

కొన్ని వస్తువులు నశ్వర Perishable రూపంలో ఉంటాయి. కాబట్టి వీటిని ద్రవ్య రూపంలోకి మార్చుకుంటే విలువలో తేడా రాదు. అంతేగాక మన్నిక గల వస్తువులకు కూడా ఒక నిర్ణీత కాలంలో వాటి విలువ క్షీణిస్తుంది. కాని వాటిని ద్రవ్య రూపంలోకి మార్చుకొంటే ఆ ఇబ్బంది ఉండదు.

iv) వాయిదాల చెల్లింపుల ప్రామాణికం (Standard of Deferred Payments) :
ఆధునిక ఆర్థిక వ్యవస్థలో వ్యవహారాలన్నీ ‘అరువు’ పద్ధతి లేదా వాయిదాల చెల్లింపుల పద్ధతిలోనే జరుగుతాయి. ద్రవ్యం ఈ విధిని నిర్వర్తించడంవల్ల వ్యక్తులు వస్తువులను కొనుగోలు చేయడం, బాంకులు, ఇతర ద్రవ్య సంస్థల నుంచి ఋణాలు పొందడం, షేర్లు, బాండ్లు, డిబెంచర్ల కొనుగోలు, అమ్మకాలు మొదలైనవి సులభతరమయ్యాయి.

v) విలువల బదిలీ (Transfer of Money) :
ద్రవ్యం ఉన్న వ్యక్తి దానిని ఏ సమయంలోనైనా, ఏ ప్రదేశంలోనైనా, ఎవరికైనా బదిలీ చేయవచ్చు. ద్రవ్యంవల్ల విలువను బదిలీ చేయడం తేలికవుతుంది.
ఉదా : హైదరాబాదులో ఆస్తిని అమ్మి కొత్త ఆస్తులను నిజామాబాద్ లో కొనుగోలు చేయవచ్చు.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 6.
ద్రవ్యం అనుషంగిక, నిశ్చల, చలన విధులను తెలపండి.
జవాబు.
ద్రవ్యం అనుషంగిక, నిశ్చల, చలన విధులను క్రింది విధంగా వివరించవచ్చు.

1. అనుషంగిక విధులు :

a) జాతీయాదాయ మదింపు, పంపిణీ :
ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేసిన వస్తుసేవల విలువలను అంచనా వేయవచ్చు. జాతీయాదాయాన్ని వివిధ ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలైన, భాటకం, వేతనం, వడ్డీ, లాభాలు చెల్లింపులు ద్రవ్యం ద్వారా సాధ్యపడుతుంది.

b) ఉపాంత ప్రయోజనాలు / ఉత్పాదకతలు సమానీకరణ :
వినియోగదారులు తాము కొనుగోలు చేసే వివిధ వస్తువుల నుంచి పొందే ఉపాంత ప్రయోజనాలను ద్రవ్యం (ధర) ఆధారంగా సమానం చేయడం ద్వారా ప్రయోజనాలను గరిష్ఠం చేసుకోగలుగుతాడు.

అదే విధంగా ఉత్పత్తిదారు వివిధ ఉత్పత్తి కారకాల ఉపాంత ఉత్పాదకతలను ద్రవ్యం సహాయంతో సమానం చేయడం ద్వారా లాభాలను గరిష్ఠం చేసుకోగలుగుతాడు.

c) పరపతి వ్యవస్థకు మూలం :
అన్ని ఆర్థిక లావాదేవీలకు ద్రవ్యం ప్రాతిపదిక. ద్రవ్య రిజర్వు లేనిదే పరపతి సృష్టి జరగదు. పరపతి కార్యకలాపాలన్నింటికీ ద్రవ్యం పూచీకత్తుగా వ్యవహరిస్తుంది.

d) ద్రవ్యత్వం ఆపాదించడం :
ద్రవ్యానికి అత్యధిక ద్రవ్యత్వం ఉంటుంది. ద్రవ్యత్వం అంటే ‘వెంటనే కొనుగోలు చేసే శక్తి’ ద్రవ్యం ద్వారా భూమి, యంత్రాలు, పనిముట్లు, భవనాలు లాంటి ఆస్తులకు ద్రవ్యత్వం చేకూరుతుంది.

2. ద్రవ్యం యొక్క నిశ్చల, చలన విధులు :

a) నిశ్చల విధులు :
పాల్ ఎక్జిగ్ అభిప్రాయంలో ద్రవ్యం పై విధులే కాకుండా, నిశ్చల, గతిశీల విధులను నిర్వర్తిస్తుంది. ద్రవ్యం ప్రాథమిక, ద్వితీయ శ్రేణి విధులను నిర్వర్తిస్తున్నప్పుడు ‘నిశ్చల విధులు’గా భావించారు. ఆర్థిక వ్యవస్థ ప్రగతిపై ఈ విధుల ప్రభావం ఉండదు.

b) చలన విధులు :
ఆర్థిక వ్యవస్థలో ధరల స్థాయి, ఉత్పత్తి, వినియోగం, పంపిణీ మొదలైనవి ద్రవ్యంతో ప్రభావితమవుతాయి. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే ఈ విధులను ‘గతిశీలక’ విధులుగా భావించారు.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 7.
వాణిజ్య బ్యాంకులు సేకరించే వివిధ రకాల డిపాజిట్లను వివరించండి.
జవాబు.
సంస్థాగత పరపతిని సమకూర్చే విషయంలో వాణిజ్య బ్యాంకుల ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది. దేశ ఆర్థిక కార్యకలాపాలలో వాణిజ్య బ్యాంకుల పాత్ర గణనీయమైంది.

వాణిజ్య బ్యాంకులు ప్రజల వద్ద నుండి పొదుపు మొత్తాలను సమీకరించి వాటిని ఉత్పాదక కార్యకలాపాల కోసం పెట్టుబడిగా ఉపయోగించవచ్చు. పొదుపు, పెట్టుబడులను సమన్వయ పరచడానికి వాణిజ్య బ్యాంకులు తోడ్పడతాయి. వాణిజ్య బ్యాంకులు ద్రవ్యాన్ని సృష్టిస్తాయి.

ఈ బ్యాంకులు ముఖ్యంగా ప్రజల దగ్గర నుండి డిపాజిట్లను సేకరించి ఋణాలు మంజూరు చేస్తాయి. డిపాజిట్ల మీద ఇచ్చే వడ్డీ కంటే ఋణాల మీద వసూలు చేసే వడ్డీ ఎక్కువగా ఉంటుంది. వాణిజ్య బ్యాంకులు కొన్ని ప్రయోజనాలకు మాత్రమే పరపతిని సమకూర్చడం ద్వారా ఆర్థిక కార్యకలాపాల స్వభావ, స్వరూపాలను నిర్ణయించగలవు.

వాణిజ్య బ్యాంకుల విధులు : వాణిజ్య బ్యాంకులు నిర్వహించే విధులను ముఖ్యంగా రెండు విధాలుగా విభజించవచ్చు. అవి : ప్రాథమిక విధులు, అనుషంగిక విధులు.

1) ప్రాథమిక విధులు :
వాణిజ్య బ్యాంకుల యొక్క ప్రాథమిక విధులు ప్రజల దగ్గర నుండి డిపాజిట్లను సేకరించడం, ఖాతాదారులకు ఋణాలను మంజూరు చేయుట.

డిపాజిట్లను స్వీకరించుట :
వాణిజ్య బ్యాంకులు ప్రజల నుండి డిపాజిట్లను స్వీకరిస్తాయి. ఖాతాదారులు బ్యాంకులో సొమ్మును డిపాజిట్ చేసినప్పుడు ఆ మొత్తం వారి ఖాతాలో జమ అవుతుంది.

ఇటువంటి డిపాజిట్లను ప్రాథమిక డిపాజిట్లు లేదా సాధారణ డిపాజిట్లు అని అంటారు. వాణిజ్య బ్యాంకులు స్వీకరించే డిపాజిట్లు అనేక రకాలుగా ఉంటాయి.

a) కరెంట్ డిపాజిట్లు :
కరెంట్ డిపాజిట్లలోని సొమ్మును ఖాతాదారుడు అడిగిన వెంటనే బ్యాంకు చెల్లిస్తుంది. ఖాతాదారుడు తన సొమ్మును తీసుకునేటప్పుడు ముందుగా బ్యాంకుకు తెలియపరచవలసిన అవసరం లేదు. కాని ఈ డిపాజిట్లకు బ్యాంకు వడ్డీ చెల్లించదు. సాధారణంగా వ్యాపారస్తులు తమ వ్యాపార వ్యవహారాల చెల్లింపు కోసం కరెంటు డిపాజిట్లను చేయుదురు.

b) ఫిక్స్డ్ డిపాజిట్లు :
ఈ డిపాజిట్లు ఒక నిర్ణీత కాలానికి సంబంధించినవై ఉంటాయి. ఈ డిపాజిట్లు నిర్ణయించిన కాల వ్యవధి లోపల చెల్లించబడవు. వీటినే గడువు డిపాజిట్లు లేదా కాల పరిమితి డిపాజిట్లు అని కూడా అందురు. వీటిపై బ్యాంకులు ఎక్కువ వడ్డీని చెల్లిస్తాయి.

c) సేవింగ్ డిపాజిట్లు :
ప్రజలు తమ వద్దనున్న చిన్నచిన్న పొదుపు మొత్తాలను బ్యాంకులలో సేవింగ్ డిపాజిట్లుగా దాచుకుంటారు. ఈ డిపాజిట్లను అవసరమయినప్పుడు తీసుకోవచ్చు. కానీ వీటిపై కొన్ని షరతులు ఉంటాయి. కొంత గరిష్ఠ మొత్తానికి మించి తీసుకోకూడదు. వీటిపై బ్యాంకులు స్వల్ప వడ్డీని చెల్లిస్తాయి.

d) రికరింగ్ డిపాజిట్లు :
కాల పరిమితి డిపాజిట్లలో ఒక రకం రికరింగ్ డిపాజిట్లు ఒకేసారి పెద్ద మొత్తంలో పొదుపు చేయలేని వారికి ఈ డిపాజిట్లు సౌకర్యంగా ఉంటాయి. ప్రతి నెల 10 గాని అంతకన్నా కొన్ని రెట్లు అదనంగాగాని ఒక సంవత్సరం లేదా కొన్ని సంవత్సరాల వ్యవధికి ఈ ఖాతాలో జమ చేయవచ్చు. పై డిపాజిట్లేగాక రికరింగ్ డిపాజిట్లు, సీజనల్ డిపాజిట్లు, చిల్డ్రన్ బెనిఫిట్ డిపాజిట్లు మొదలైనవి కూడా ఉంటాయి.

2. అనుషంగిక విధులు :
బాంకులు నిర్వహించే ప్రాథమిక విధుల ఫలితంగా ‘ప్రాతినిథ్య విధులు’ ఏర్పడతాయి.

  1. బాంకులు ఖాతాదారుల ప్రతినిధులుగా వారి తరపున బీమా ప్రీమియమ్లు, కరెంట్ బిల్లులు మొదలైన వాటిని ఖాతాదారుల ఆదేశానుసారం నిర్ణీత సమయాల్లో చెల్లించుట.
  2. బాంకులు ఖాతాదారులు ‘ఏజెంట్’ కంపెనీల షేర్లను, రుణ పత్రాలను కొనిపెడతాయి.
  3. ఖాతాదారుల తరపున డ్రాఫ్టు ద్వారా, చెట్ల ద్వారా, తంతి తపాలా ద్వారా సొమ్ము బదిలీ చేస్తుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 8.
వాణిజ్య బాంకులు సమకూర్చే వివిధ రకాల ఋణాలు, అడ్వాన్స్ల గురించి వివరించండి.
జవాబు.
భారత బాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949, సెక్షన్-5 బాంకింగ్ వ్యాపారాన్ని క్రింది విధంగా నిర్వచించింది. కోరిన వెంటనే కాని, ఇంకో సమయంలో కాని చెక్కు, డ్రాఫ్ట్, ఆర్డర్ల ద్వారా కాని, ఇంకో విధంగా కాని, తిరిగి చెల్లించే షరతుల మీద డిపాజిట్లను స్వీకరించి, ఆ సొమ్మును ఋణాలు ఇవ్వడానికిగాని, పెట్టుబడి కోసం కాని ఉపయోగించడం బాంకు వ్యాపారం.

ఋణాలను, అడ్వాన్స్లను మంజూరు చేయడం:
వ్యాపారస్తులు, పారిశ్రామిక వేత్తలు, రైతులు, వివిధ వృత్తి కళాకారులు మొదలైన వారికి వాణిజ్య బాంకులు ఋణాలను అడ్వాన్సులను ఇస్తాయి. కేంద్ర బాంకు నిబంధనలకు లోబడి, వాణిజ్య బాంకులు వాటి ఖాతాదారుల నుండి సేకరించిన డిపాజిట్లలో కొంత భాగం ఉంచుకొని మిగితాది ఋణాలుగా ఇస్తాయి.

ఎ) డిమాండ్ ఋణాలు (Demand / Call Loans) :
ఈ రకమైన ఋణాలను బాంకులు అడిగిన వెంటనే ఋణ గ్రహీత డబ్బు చెల్లిస్తాడు. దీనికి ఒక ప్రత్యేక కాలపరిమితి ఉండదు. ఋణాన్ని మంజూరు చేసి అప్పు పొందిన ఖాతాదారు పేరున అది జమ చేయబడుతుంది. ఏ విధమగు సెక్యూరిటీ లేకుండానే ఈ ఋణాన్ని బాంకులు మంజూరు చేస్తాయి. వీటిని పిలుపు ఋణాలు (call loans) అని కూడా అంటారు.

బి) స్వల్ప కాలిక ఋణాలు (Short Term Loans) :
వ్యాపారస్తులకు, రైతులకు చర మూలధనం రూపంలో ఈ ఋణం చెల్లింపబడుతుంది. ఇతర వ్యక్తులు కూడా దీనిని వ్యక్తిగత రుణాల రూపంలో పొందవచ్చు. తగిన సెక్యూరిటీ | ఆధారంతో ఈ ఋణం మంజూరు చేయబడుతుంది.

సి) ద్రవ్య పరపతి (Cash Credit) :
ఖాతాదారుని ఆర్థిక పరిపుష్టిని అనుసరించి బాంకులు తమ ఖాతాదారులకు ఈ రకమైన ఋణాలనిస్తాయి. ఇందులో గల మొత్తాన్ని ఋణ గ్రహీత విడతల వారీగా తీసుకోవచ్చు. ఈ రకమైన ఋణాల మంజూరీకి సెక్యూరిటీ తప్పనిసరి.

డి) ఓవర్ డ్రాఫ్ట్ (Overdraft) :
కరెంట్ అకౌంట్ ఖాతాదారునికి ఈ సౌకర్యం కల్పించబడుతుంది. ఖాతాదారుని ఖాతాలో ఉన్న జమను దృష్టిలో ఉంచుకొని ఒక పరిమితికి లోబడి ఈ సౌకర్యం కల్పించబడుతుంది. ఖాతాదారులు తమ స్వల్ప కాల అవసరాల దృష్ట్యా ఈ సౌకర్యాన్ని వాడుకొంటారు.

ఇ) వినిమయ బిల్లుల డిస్కౌంట్ (Discounting of Bills of Exchange) :
వర్తక లావాదేవీలు అరువు రూపంలో జరిగినప్పుడు కొనుగోలుదారుడు, అమ్మకందారునికి ఒక నిర్ణీత కాలానికి చెల్లింపు చేసే విధంగా అరువు బిల్లు రాసి ఇవ్వవచ్చు.

కాబట్టి వ్యాపారస్తులు భవిష్యత్తులో తాము పొందబోయే ఈ వినిమయ బిల్లులు డిస్కౌంట్ చేసుకొని ఋణం ఇవ్వవలసిందిగా వాణిజ్య బాంకులను అభ్యర్థించవచ్చు. వాణిజ్య బాంకులు ఈ బిల్లుల పూచీకత్తుగా ఋణాలు మంజూరు చేయడాన్నే వినిమయ బిల్లుల డిస్కౌంట్ అంటారు.

ఎఫ్) క్రెడిట్ కార్డులు (Credit Cards) :
ఇటీవల కాలంలో బాంకులు ఈ రకమైన ఋణ సౌకర్యాన్ని కూడా తమ ఖాతాదారులకు కల్పిస్తున్నాయి. ఒక పరిమితి వరకు వివిధ కంపెనీలలో దుకాణాలలో వస్తువులను కొనుగోలు చేయడానికి ఖాతాదారులు క్రెడిట్ కార్డులను ఉపయోగించుకోవచ్చు. ఇందుకు సంబంధించిన డబ్బును కంపెనీలు సంబంధిత బాంకుల నుంచి తిరిగి రాబట్టుకుంటాయి.

నిబంధనలకు లోబడి ఖాతాదారుడు బాంకుకు అసలును మాత్రమే కాని లేదా అసలుతోబాటు వడ్డీని కాని తిరిగి చెల్లించాలి. ప్రతీ క్రెడిట్ కార్డుకు ఒక పరపతి పరిమితి ఉంటుంది. వీటి ప్రాముఖ్యం ఈ మధ్య కాలంలో పెరిగింది.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 9.
వాణిజ్య బ్యాంకుల ఏజెన్సీ, సాధారణ ఉపయోగ సేవలపై వ్యాఖ్యానించండి.
జవాబు.
ఆచార్య క్రౌథర్ ప్రకారం “తమ ఆదాయం నుండి పొదుపు చేసే వర్గాల నుండి ద్రవ్యాన్ని సేకరించి, ఆ ద్రవ్యాన్ని అవసరమైన వారికి అప్పుగా ఇచ్చే సంస్థ” బాంకు.

డా॥ హెర్బర్డ్ ఎల్. హర్ట్ బాంకర్ అనే పదాన్ని ఈ విధంగా నిర్వచించాడు: ‘సాధారణ వ్యాపార క్రమంలో, వ్యక్తులు జమకట్టే సొమ్మును వారి పేర కరెంట్ ఖాతాలో జమకడుతూ, ఆయా వ్యక్తుల మీద జారీ చేసిన చెక్కులను ఆదరిస్తూ చెల్లించే వారినే బాంకర్’ అంటారు.

అనుషంగిక విధులు :
వాణిజ్య బాంకులు కొన్ని అనుషంగిక విధులను నిర్వహిస్తాయి. కొన్ని సందర్భాలలో ఖాతాదారులకు ఏజెంట్లుగా పనిచేస్తాయి. ప్రధాన అనుషంగిక (ప్రాతినిధ్య) విధులను కింది విధంగా తెలపవచ్చు.

  1. బాంకులు ఖాతాదారులు ప్రతినిధులుగా వారి తరపున బీమా ప్రీమియమ్లు, కరెంట్ బిల్లులు మొదలైన వాటిని ఖాతాదారుల ఆదేశానుసారం నిర్ణీత సమయాల్లో చెల్లించుట, ఆ మొత్తాలను ఖాతాదారు ఖాతాలో ఖర్చుగా రాస్తాయి.
  2. బాంకులు ఖాతాదారుల ‘ఏజెంట్’ కంపెనీల షేర్లను, ఋణ పత్రాలను కొనిపెడతాయి మరియు అమ్మి పెడతాయి.
  3. బాండ్లమీద, షేర్లపై రావలసిన వడ్డీని, డివిడెండ్లను వసూలు చేసిపెడతాయి.
  4. ఖాతాదారుల తరపున డ్రాఫ్టు ద్వారా, చెక్ల ద్వారా, తంతి తపాలా ద్వారా సొమ్ము బదిలీ చేస్తాయి.
  5. ఖాతాదారులకు ట్రస్టీలుగా వారి నిధులను సేఫ్ కస్టడీలో పెడతాయి.

పై సేవలన్నింటికి ఖాతాదారుల నుంచి నామమాత్రపు రుసుమును వసూలు చేస్తాయి.

సాధారణ ఉపయోగ సేవలు :

  1. ఖాతాదారులు తమ విలువైన వస్తువులను, పత్రాలను దాచుకోవడానికి ‘లాకర్’ సదుపాయాన్ని కల్పిస్తాయి.
  2. ఇతర ప్రాంతాలలో ఉండే వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు మొదలైన వారి సమాచారాన్ని సేకరించి, ఖాతాదారులకు అందిస్తాయి.
  3. ఇంటర్నెట్ సౌకర్యం ద్వారా ద్రవ్యాన్ని ఒక బాంకు నుంచి మరొక బాంకుకు బదిలీ చేస్తాయి.
  4. విదేశీ వ్యాపార క్రమంలో అత్యవసరమైన ‘పరపతి పత్రాలను’ జారీ చేస్తాయి.
  5. ద్రవ్యాన్ని నగదు రూపంలో కాకుండా సులభంగా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తీసుకొని వెళ్ళడానికి వీలైన పద్ధతిలో బాంకులు ‘ప్రయాణీకుల చెక్కులను జారీ చేస్తాయి.
  6. విదేశీ వర్తకం చేసేవారికి ‘విదేశీ ద్రవ్యం’లో విత్త సహాయం చేస్తాయి.
  7. ఖాతాదారులకు ఇతర ప్రాంతాలలోని వారితో వర్తక సంబంధాలను ఏర్పాటు చేయటానికి బంకులు ‘రిఫరీలు’గా వ్యవహరిస్తాయి.
  8. వినియోగదారులు మన్నిక గల వినియోగ వస్తువులు కొనుగోలు చేయటానికి, గృహాలు నిర్మించుకోవటానికి ఋణ సౌకర్యాలను కల్పిస్తాయి.
  9. విద్యార్థులు ‘ఉన్నత విద్య’ను అభ్యసించటానికి ‘విద్యా ఋణ’ సౌకర్యాన్ని కల్పిస్తాయి.
  10. బాంకింగ్ సేవలలో మరో విప్లవాత్మక సౌకర్యం (మార్పు) ATM పద్ధతి. ఖాతాదారులు తమకు సొమ్ము కావలసినప్పుడు బాంకుకు వెళ్ళకుండా, తమకు దగ్గరలో ఉన్న ATM (Automatic Teller Machine) నుంచి నగదు తీసుకొనే సౌకర్యం కల్పించబడింది. ఖాతాదారులు సొమ్మును ఒక పరిమితికి లోబడి తీసుకోవచ్చు. ఈ విధానంవల్ల ఖాతాదారులు అన్ని దినాల్లోనూ, ఏ సమయంలోనైనా (24 × 7) తమ నగదును పొందవచ్చు. అంతేకాకుండా క్రెడిట్ కార్డ్ ద్వారా ఏ దేశంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా, ఏ సమయంలోనైనా ATM ద్వారా నగదు తీసుకోవచ్చు.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 10.
కేంద్రబ్యాంకు విధులలో ఏవైనా మూడు ప్రధాన సాధారణ విధులను పేర్కొనండి.
జవాబు.
‘కేంద్ర బాంకు’ అనేది 20వ శతాబ్దపు భావనగా పేర్కొనవచ్చు. ప్రతి దేశపు బాంకింగ్ వ్యవస్థలో ‘అత్యున్నత స్థానం (apex) గా ఉండే బాంక్ కేంద్ర బాంకు, భారతదేశంలో ఉన్న కేంద్ర బాంకును “రిజర్వు బాంక్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. మన దేశంలో 1934 రిజర్వు బాంకు చట్టం ఫలితంగా 1935 ఏప్రిల్ 1వ తేదీన ‘భారతీయ రిజర్వు బాంకు’ ఏర్పడింది.

మొట్టమొదట రిజర్వు బాంకు వాటాదారులు బాంకుగా, 5 కోట్ల రూపాయల మూలధనంతో స్థాపించబడింది. 1949 జనవరి 1వ తేదీన RBI జాతీయం చేయబడింది.

రిజర్వు బాంకు విధులు : భారతీయ రిజర్వు బాంకు కింది విధులను నిర్వహిస్తుంది. అవి :

I. సాధారణ విధులు (General Functions):

1. కరెన్సీ నోట్ల జారీ (Note Issue) :
కరెన్సీ నోట్లు జారీ చేయటం రిజర్వు బాంకు గుత్తాధిపత్యపు అధికారం. అందువల్లే ఈ బాంకుకు ‘జారీ బాంకు’ అని పేరు వచ్చింది. 10, 20, 50, 100, 200, 500, 2,000 రూపాయల కరెన్సీ నోట్లను రిజర్వు బాంకు జారీ చేస్తుంది. ప్రత్యేక ‘జారీ డిపార్టుమెంటు’ ద్వారా నోట్లను జారీ చేయడం జరుగుతుంది.

2. ప్రభుత్వ బాంకరు (Banker to the Government) :
రిజర్వు బ్యాంకు కేంద్ర ప్రభుత్వానికి బాంకరుగా, ప్రతినిధిగా, సలహాదారుగా వ్యవహరిస్తుంది. రిజర్వు బాంకు ప్రభుత్వానికి బాంకింగ్ సౌకర్యాలను కల్పిస్తుంది.

ప్రభుత్వ స్వర్ణ నిధులకు పరిరక్షకుడిగా పనిచేస్తుంది. ద్రవ్య విధానాన్ని రూపొందించడం, ప్రభుత్వానికి సలహా ఇవ్వడమే కాకుండా, అమలు పరచే బాధ్యతను రిజర్వు బాంకు స్వీకరిస్తుంది.

3. బాంకులకు బాంకు (Bankers’ Bank) :
1934 బాంకింగ్ చట్టం ప్రకారం, భారతీయ రిజర్వు బాంకు, వాణిజ్య బాంకులకు నాయకత్వం వహించి వాటి కార్యకలాపాలను నియంత్రణ చేస్తుంది. వాణిజ్య బాంకులు తమ లావాదేవీలను ఎప్పటికప్పుడు రిజర్వు బాంకుకు పంపవలసి ఉంటుంది.

వాణిజ్య బాంకులు అవి సేకరించే డిపాజిట్లలో కొంత భాగం వాటి వద్ద ఉంచుకోవాలి. దీనినే నగదు నిల్వల నిష్పత్తి (CRR) అంటారు. వాణిజ్య బాంకులకు కష్టకాలంలో రిజర్వు బాంకు ఋణ సహాయం కల్పిస్తుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 11.
ద్రవ్యోల్బణాన్ని నిర్వచించి, దానిలోని రకాలను వివరించండి.
జవాబు.
వస్తువుల సప్లయ్కి, డిమాండుకు మధ్య ఏర్పడే అసమతౌల్యం వల్ల వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్న యెడల దానిని ద్రవ్యోల్బణమనవచ్చు. ధరల పెరుగుదల నిర్విరామంగా, గణనీయమైనదిగా ఉన్నప్పుడు మాత్రమే ద్రవ్యోల్బణం ఏర్పడిందని చెప్పాలి. ద్రవ్యోల్బణ భావాన్ని వివిధ రకాలుగా పరిశీలించవచ్చు.

డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం :
సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లయ్ కన్నా ఎక్కువగా ఉన్నందువల్ల ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అని అంటారు. ద్రవ్యరాశి పెరుగుదల పొదుపు కన్నా పెట్టుబడి అధికంగా ఉండటం వల్ల సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లయ్ కన్నా అధికంగా ఉండవచ్చు.

ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగితా స్థాయికి చేరుకున్న తరువాత సమిష్టి డిమాండ్ పెరిగినట్లయినా ఉత్పత్తి పెరగక కేవలం ధరలు మాత్రమే పెరుగుతాయి. డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని నివారించడానికి సమిష్టి డిమాండును తగ్గించాలి.

వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం :
ఉత్పత్తి వ్యయం పెరుగుదల వల్ల ధరల స్థాయి పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడినా దానిని వ్యయప్రేరిత ద్రవ్యోల్బణం అని అంటారు. కార్మిక సంఘాలు బలోపేతమైన వేతనాలను పెంచుకొన్నప్పుడు లేదా ఇతర ఉత్పత్తి వ్యయాలు పెరిగినప్పుడు ఈ వ్యయ ప్రభావిత ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.

వాస్తవిక ద్రవ్యోల్బణం :
వస్తువుల ధరలు పెరిగి శ్రామికుల జీవన ప్రమాణ స్థాయి తగ్గినప్పుడు వాస్తవిక ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. వస్తువుల ధరల పెరుగుదల రేటులో శ్రామికుల వేతనాలు పెరగకపోయిన వాస్తవిక వేతనాలు తగ్గిపోతాయి. దీనివల్ల ఎక్కువ ప్రమాణంలో వస్తురాశిని కొనుగోలు చేయరాదు.

పాకుతున్న ద్రవ్యోల్బణం :
ఈ ద్రవ్యోల్బణం స్వల్ప మోతాదులో ఉంటుంది. ఇందు ధరలు పెరుగుదల స్వల్పంగా ఉండును. ఈ రకమైన ద్రవ్యోల్బణంలో ధరల స్థాయిలో పెరుగుదల సంవత్సరానికి 3 శాతం లోపే ఉంటుంది. కొంతమంది ఆర్థికవేత్తల ప్రకారం ఈ రకమైన ద్రవ్యోల్బణం ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది.

నడుస్తున్న ద్రవ్యోల్బణం :
ధరల స్థాయిలో పెరుగుదల కొంచెం ఎక్కువగా ఉండి ఇది మోతాదులో ఉంటే దీనిని నడుస్తున్న ద్రవ్యోల్బణమని అంటారు. ధరల పెరుగుదల రేటు సంవత్సరానికి 3 నుంచి 4 శాతం వరకు ఈ రకమైన ద్రవ్యోల్బణంలో జరుగును.

పరుగెడుతున్న ద్రవ్యోల్బణం :
ఈ రకం ద్రవ్యోల్బణంలో ధరల పెరుగుదల విపరీతంగా ఉంటుంది. సుమారుగా ఇందు ధరల పెరుగుదల 10 శాతం వరకు ఉండవచ్చు. ఈ ద్రవ్యోల్బణం వల్ల ఆర్థిక వ్యవస్థలో అనేక చెడు ఫలితాలు ఏర్పడతాయి.

ఉదృతమైన లేదా అతి ద్రవ్యోల్బణం :
ధరల పెరుగుదల విపరీతంగా, అతివేగంగా, నిరాటంకంగా జరుగుతున్న దానిని అతి ద్రవ్యోల్బణం అని అంటారు. దీనినే ఉదృతమైన ద్రవ్యోల్బణం అని కూడా అంటారు.

అణచిన ద్రవ్యోల్బణం :
ద్రవ్యోల్బణాన్ని రేషనింగ్, ప్రభుత్వ కంట్రోళ్ళు, ఇతర నియంత్రణ సాధనాల ద్వారా అదుపు చేయబడిన ధరలు తగ్గి ద్రవ్యోల్బణం అదుపు చేయబడుతుంది. దీనినే అణచిన ద్రవ్యోల్బణం అంటారు.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 12.
ద్రవ్యోల్బణానికి గల కారణాలను గుర్తించండి.
జవాబు.
నేడు ప్రపంచంలోని అన్ని దేశాలు ద్రవ్యోల్బణానికి గురవుతున్నాయి. ద్రవ్యోల్బణం సామాన్య ప్రజా జీవనాన్ని సంక్షోభానికి గురిచేయడమే కాకుండా, ఆర్థిక వ్యవస్థలో మొత్తం ఉత్పత్తి, పంపిణీలపై చెడు ప్రభావాలను కలుగచేస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాల మనుగడకూ ఒక సవాలుగా ద్రవ్యోల్బణం నిలుస్తున్నది.

1. వస్తు సేవల సమిష్టి డిమాండ్ పెరుగుదలకు కారణాలు :

  1. జనాభా పెరుగుదల.
  2. ప్రభుత్వ ప్రణాళికా, ప్రణాళికేతర వ్యయాల పెరుగుదల.
  3. ఆర్థికాభివృద్ధి ఫలితంగా ప్రజల తలసరి ఆదాయం పెరిగి, కొనుగోలు శక్తి పెరుగుదల.
  4. దీర్ఘఫలనకాలమున్న పరిశ్రమలపై ప్రభుత్వ పెట్టుబడిలో పెరుగుదల.
  5. ఎగుమతులలో పెరుగుదల.
  6. పన్నులలో తగ్గుదల, ముఖ్యంగా ప్రత్యక్ష పన్నుల రేట్ల తగ్గింపు.
  7.  ప్రభుత్వం అంతర్గత రుణాలు తిరిగి చెల్లింపులవల్ల వ్యక్తుల కొనుగోలు శక్తిలో పెరుగుదల.
  8. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లయి పెరుగుదల.
  9. ద్రవ్య విధానంలో మార్పులు, అంటే బాంకుల ద్వారా వినియోగదారులకు మన్నికగల వస్తువుల కొనుగోలుకు చౌకగా రుణాల లభ్యత.
  10. ప్రభుత్వం పేదరిక నిర్మూలనకై, ఉద్యోగితా / ఉపాధి కల్పనకై సంక్షేమ పథకాలను అమలుపరచడానికి అధిక వ్యయం చేయడం.

2. వస్తు సేవల ఉత్పత్తి వ్యయంలో పెరుగుదలకు కారణాలు :

  1. ఉత్పత్తి కారకాల ధరలు అంటే, భాటకాలు, వేతనాలు, వడ్డీలు, లాభాల రేట్లలో పెరుగుదల.
  2. మూలధన వస్తువుల రేట్లలో పెరుగుదల.
  3. ముడి సరుకుల ధరలలో పెరుగుదల.
  4. పరోక్ష పన్నుల రేట్లలో పెరుగుదల.
  5. మూలధన పరికరాలు ఎక్కువ అరుగుదలకు గురైనట్లయితే “తరుగుదల వ్యయంలో పెరుగుదల.’
  6. విదేశాల నుంచి యంత్ర పరికరాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవడంవల్ల.
  7. ) వనరులను గరిష్ఠంగా ఉపయోగించుకోకపోవడం.
  8. స్వదేశీ కరెన్సీ విలువ క్షీణించడం.
  9. వస్తూత్పత్తిపై సరైన యాజమాన్య పర్యవేక్షణ లోపించడం, వనరుల దుబారా, వృధా వ్యయాలలో పెరుగుదల.
  10. నల్లధనము పెరుగుదల.

3. సమిష్టి డిమాండ్ పెరుగుదలకు కారణాలు :

  1. అకాల ఋతుపవనాలు, వరదలు, మేలైన విత్తనాలను ఉపయోగించుకోకపోవడం మొదలైన కారణాలవల్ల వ్యవసాయోత్పత్తులలో తగ్గుదల.
  2. పెట్టుబడులు సకాలంలో పెట్టకపోవడం.
  3. ఉత్పత్తి కారకాల కొరత.
  4. ముడి సరుకుల కొరత.
  5. ఉత్పాదక వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోవడం.
  6. పెట్టుబడులు అధికంగా దీర్ఘఫలనకాల పరిశ్రమలలో పెట్టడం.
  7. దేశీయ ఉత్పత్తులను ఎగుమతులకు మళ్ళించడం.
  8. నల్ల బజారు కార్యకలాపాలవల్ల దేశంలో వస్తువులకు ‘కృత్రిమ కొరత’ ను సృష్టించడం.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 13.
ద్రవ్యోల్బణ ప్రభావాలను వివరించండి.
జవాబు.
సాధారణ పరిభాషలో ద్రవ్యోల్బణమనగా ధరల పెరుగుదల. కేవలం ఒక్కసారి ధరలు పెరిగినంత మాత్రాన దానిని ద్రవ్యోల్బణం అని అనకూడదు. నిర్విరామంగా ధరలు పెరుగుతుంటే దానినే ద్రవ్యోల్బణం అంటారు. భారతదేశంలో ద్రవ్యోల్బణ సమస్య ఉంది.

ద్రవ్యోల్బణ నిర్వచనం : వివిధ ఆర్థిక శాస్త్రవేత్తలు ద్రవ్యోల్బణం గూర్చి వివిధ నిర్వచనాలు ఇచ్చారు.

  1. హాట్రే అను ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం, “కరెన్సీ నోట్లను అధికంగా జారీ చేయటాన్నే ద్రవ్యోల్బణమందురు”.
  2. డాల్టన్ అభిప్రాయం ప్రకారం, “ద్రవ్యోల్బణమనగా అధిక ద్రవ్యం తక్కువ వస్తువులను వెంటాడటం”.
  3. కిమ్మరర్ అను ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం, “వ్యాపార అవసరాలకు మించి కరెన్సీ ఉండటాన్నే ద్రవ్యోల్బణ మందురు”.
  4. క్రౌథర్ అను ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం, “ద్రవ్య విలువ పడిపోవడం అనగా ధరలు పెరగటాన్ని ద్రవ్యోల్బణమని చెప్పవచ్చు”.

వస్తువుల సప్లై, డిమాండ్లలో అసమతౌల్యం ఏర్పడటం వలన ధరల స్థాయిలో నిర్విరామంగా పెరుగుదల ఏర్పడును. అటువంటి ధరల పెరుగుదలనే ద్రవ్యోల్బణంగా చెప్పవచ్చు. ప్రతి ధర పెరుగుదలను ద్రవ్యోల్బణంగా చెప్పకూడదు. ధరల పెరుగుదల గణనీయమైందిగా, నిర్విరామంగా కొనసాగినప్పుడే ద్రవ్యోల్బణం ఏర్పడిందని చెప్పాలి.

ద్రవ్యోల్బణ ప్రభావం లేదా ఫలితాలు : ధరల పెరుగుదల ముఖ్యంగా ఉత్పత్తి, పంపిణీలపై ఎటువంటి ప్రభావం కలిగించునో పరిశీలిద్దాం.

ఉత్పత్తిపై ప్రభావం :
ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు ధరలు పెరుగుటచే ఉత్పత్తిదారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ధరలు పెరుగుట వల్ల లాభాలు పెరుగుతాయి. దీనివల్ల పెట్టుబడి పెరిగి ఉత్పత్తి పెరుగును. దీనివల్ల ఉద్యోగిత, ఆదాయాలు పెరిగి ఉత్పత్తి మరింతగా పెరుగుతుంది.

ఇది సంపూర్ణ ఉద్యోగితకు దారితీస్తుంది. ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగితను చేరుకున్న తరువాత ధరలు పెరుగుదల ఉత్పత్తిని పెంచదు. ధరలు పెరుగుదల ఒక మోతాదు ఉన్నా ఇది ఉత్పత్తి పెరుగుదలకు దారితీస్తుంది.

ధరల పెరుగుదల విపరీతంగా ఉన్నా, అనగా అతి ద్రవ్యోల్బణం ఉన్నా వ్యాపార రంగం ఏర్పడి ఉత్పత్తి మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

అతి ద్రవ్యోల్బణం వల్ల ఆర్థిక స్థిరమ ర పరిస్థితులు తిని ఆర్థిక వ్యవస్థలో సమస్యలేర్పడతాయి. దీనివల్ల రాజకీయ, ఆర్థిక అస్థిరత్వం ఏర్పడి ఉత్పత్తి, ఉద్యోగితాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆర్థిక వ్యవస్థలో వస్తువుల కొరత, నల్ల బజారు కార్యకలాపాలు ఏర్పడి సామాన్య ప్రజలకు వస్తువులు అందుబాటులో ఉండక వారి జీవన ప్రమాణ స్థాయిని దెబ్బతీయును.

పంపిణీపై ప్రభావం : సమాజంలోని ప్రజలను మూడు విధాలుగా విభజించవచ్చు. అవి :

a) నిశ్చిత ఆదాయం పొందేవారు
b) వ్యాపారస్తులు
c) ఋణాలు ఇచ్చేవారు, పుచ్చుకొనేవారు, ద్రవ్యోల్బణ ప్రభావం ఈ వర్గాలవారిపై ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవచ్చు.

a) నిశ్చిత ఆదాయం పొందేవారు, శ్రామిక వర్గంవారు :
ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు ధరలు పెరుగుతాయేమో గాని నిశ్చితమైన ఆదాయం పొందేవారి ఆదాయం పెరగదు. కనుక ఈ వర్గం వారు ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు నష్టపోతారు.

ద్రవ్యోల్బణ సమయంలో వస్తు సేవలు, వస్తు సేవల ధరలు పెరిగినంతగా వారి వేతనాలు పెరగకపోవడం వల్ల శ్రామిక వర్గంవారు నష్టపోతారు. శ్రామిక సంఘాలు బలమైనవిగా ఉన్నా ధరలు పెరుగుదలకు అనుగుణంగా వేతనాలను పొందవచ్చు. అట్లా కాని పక్షంలో శ్రామిక వర్గం నష్టపోతుంది.

b) వ్యాపారస్తులు :
ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు ధరలు పెరుగుతాయి, కనుక వ్యాపారస్తుల లాభాలు పెరుగుతాయి. వ్యాపారానికి అయ్యే వ్యయం మాత్రం ఒప్పందం ప్రకారం నిలకడగా ఉంటుంది. అందువల్ల ధరలు పెరిగితే వ్యాపారస్తులు లాభాన్ని పొందుతారు.

c) ఋణాలు ఇచ్చేవారు పుచ్చుకొనేవారు :
ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు ఋణాలు ఇచ్చేవారు అనగా ఋణదాతలు నష్టపోతారు. ఈ సమయంలో ఋణాలు తీసుకొనేవారు లాభాన్ని పొందుతారు.

ద్రవ్యోల్బణం వల్ల ఉద్యోగితా స్థాయి పెరుగుతుంది. ధరలు పెరుగుదల వల్ల ఉత్పత్తి పెరిగి, ఉద్యోగితా స్థాయి పెరుగుతుంది. ద్రవ్యోల్బణం వల్ల ధరలు పెరిగి, ఎగుమతులు తగ్గి విదేశీ వ్యాపారంలో లోటు ఏర్పడుతుంది. ద్రవ్యోల్బణ పరిస్థితులు ధనవంతులను ధనవంతులుగా, పేదవారిని నిరుపేదలుగాను తయారుచేసి అసమానతలను పెంచుతుంది. అందువల్ల ద్రవ్యోల్బణాన్ని అరికట్టాలి.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 14.
ద్రవ్య సప్లయిలోని అంతర్భాగాలు ఏవి ?
జవాబు.
ఆర్థిక వ్యవస్థలో చలామణిలో ఉన్న అన్ని రకాల ద్రవ్యం, ద్రవ్య సరఫరాలో అంతర్భాగం. ద్రవ్య సరఫరాలో ఉండే అంతర్భాగాలు వివిధ దేశాల్లో వివిధ రకాలుగా ఉండవచ్చు. అయితే ప్రధానంగా ద్రవ్య సరఫరాలో కింద తెలిపినవి ఉంటాయి.

1. కేంద్ర బాంకు జారీ చేసిన కరెన్సీ :
ఒక దేశపు కేంద్ర బాంకు ఆ దేశ కరెన్సీని జారీ చేస్తుంది. కరెన్సీలో కాగితపు ద్రవ్యం, నాణేలు ఉంటాయి. భారతదేశంలోని కేంద్ర బాంకు అయిన రిజర్వ్ బాంకు ఆఫ్ ఇండియా 2,000, 500, 200, 100, 50, 20, 10 రూపాయల నోట్లను ముద్రిస్తుంది. ఒక రూపాయి నోటును (ఆచరణలో ఇది చెలామణిలో లేదు), చిల్లర నాణేలను భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేస్తుంది.

2. వాణిజ్య బాంకులచే సృష్టించబడిన డిమాండ్ డిపాజిట్లు:
ద్రవ్య సరఫరాలో బాంకు డిపాజిట్లు ముఖ్యమైన అంతర్భాగం. వాణిజ్య బాంకులు ప్రజల నుంచి సేకరించిన ప్రాథమిక డిపాజిట్ల ద్వారా పరపతిని సృష్టిస్తాయి. ఉత్పన్న డిపాజిట్లు లేదా గౌణ డిపాజిట్ల రూపంలో పరపతి సృష్టించబడుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ద్రవ్యపు వాటా దాదాపు 80 శాతం ఉన్నది.

ద్రవ్య సమిష్టి అంశాలు :
భారతదేశంలో రిజర్వ్ బాంక్ ఆఫ్ ఇండియా మూడు కొలమానాలను ద్రవ్య సరఫరా కొలమానాలుగా నిర్వచించింది. అవి :

M0 = చలామణిలో ఉన్న కరెన్సీ + RBI వద్ద గల బాంకర్ల డిపాజిట్లు + RBI వద్ద గల ఇతర డిపాజిట్లు.
M1 = ప్రజల వద్ద ఉన్న కరెన్సీ + డిమాండ్ డిపాజిట్లు + RBI వద్ద గల ఇతర డిపాజిట్లు.
M2 = M1 + బాంకుల వద్ద ఉన్న కాలపరిమితి గల పొదుపు డిపాజిట్లు + బాంకులు జారీ చేసిన డిపాజిట్ సర్టిఫికేట్లు + ఒక సంవత్సర కాలంలో చెల్లింపదగిన టర్మ్ డిపాజిట్లు. (CDలు మినహాయించబడినవి.)
M3 = M2 + ఒక సంవత్సరం తరవాత చెల్లింపు చేసే టర్మ్ డిపాజిట్లు + బాంకుల టర్మ్ అప్పులు.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

అదనపు ప్రశ్నలు:

ప్రశ్న 1.
కేంద్ర బ్యాంకు విధులు ఏవి ?
జవాబు.
దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థకు కేంద్ర బ్యాంకు అత్యున్నతమైనది. బ్యాంకింగ్ వ్యవస్థలో బ్యాంకుల ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది, నియంత్రిస్తుంది, క్రమబద్దీకరిస్తుంది.
కేంద్ర బ్యాంకు విధులు :

1. కరెన్సీ నోట్ల జారీ :
ఒక దేశంలో కరెన్సీ నోట్ల జారీలో కేంద్ర బ్యాంకు గుత్తాధిపత్యం కలిగి ఉంటుంది. దీనివల్ల నోట్ల జారీలో ఏకత్వం ఏర్పడుతుంది. కరెన్సీపై విశ్వసనీయత కలుగుతుంది. ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా ద్రవ్య సప్లయ్ నియంత్రించడానికి వీలుంటుంది.

2. ప్రభుత్వ బ్యాంకరు :
కేంద్ర బ్యాంకు ప్రభుత్వ బ్యాంకరుగా, ఏజెంట్, సలహాదారుగా వ్యవహరిస్తుంది. ఇది ప్రభుత్వ ద్రవ్య నిధులకు సంబంధించిన లెక్కలు తయారుచేస్తుంది. ప్రభుత్వం తరుపున ద్రవ్యం స్వీకరిస్తూ, ప్రభుత్వం తరుపున ఋణాలు ఇస్తూ ప్రభుత్వ ఋణాన్ని స్వీకరిస్తుంది. ప్రభుత్వానికి ఋణాలను ఇస్తూ, అన్ని ఆర్థిక వ్యవహారాలలో ప్రభుత్వానికి సలహాలను అందిస్తుంది.

3. బ్యాంకుల బ్యాంకరు:
కేంద్ర బ్యాంకు ప్రభుత్వానికే కాకుండా బ్యాంకులకు కూడా బ్యాంకరుగా పనిచేస్తుంది. ప్రతి బ్యాంకు చట్ట ప్రకారం తను స్వీకరించిన డిపాజిట్లు మొత్తంలో కొంత శాతం నగదు నిల్వలుగా ఉంచాలి.

ఆ నిల్వల నిష్పత్తిని కేంద్ర బ్యాంకు నిర్ణయిస్తుంది. వినిమయబిల్లుల రీడిస్కౌంట్ ద్వారా షెడ్యూల్డు బ్యాంకులకు విత్త సహాయం అందజేస్తుంది. ఇది వాణిజ్య బ్యాంకుల మధ్య ఏర్పడిన లావాదేవీలను పరిష్కరించడానికి క్లియరింగ్ హౌస్ పనిచేస్తుంది.

4. అంతిమ ఋణదాత :
మార్కెట్లోని అన్నిరకాల పరపతి సౌకర్యాలు ఉపయోగించుకున్న తరువాత ఇంకా ద్రవ్యత్వ ఇబ్బందులున్నప్పుడు బ్యాంకులకు, డిస్కౌంట్ గృహాలకు, ఇతర పరపతి సంస్థలకు కేంద్ర బ్యాంకు అనేక రకాలుగా విత్త సహాయం అందిస్తూ అంతిమ ఋణదాతలుగా పనిచేస్తుంది.

5. పరపతి నియంత్రణ :
ఆర్థిక వ్యవస్థలోని పరపతి పరిమాణాన్ని తగిన ద్రవ్య విధానం ద్వారా కేంద్ర బ్యాంకు నియంత్రిస్తుంది. ద్రవ్యోల్బణం సమయంలో పరపతి తగ్గిస్తుంది. ఆర్థిక వ్యవస్థ తిరోగమన పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో పరపతి సప్లయ్ పెంచుతుంది.

6. పర్యవేక్షణ:
దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థను పర్యవేక్షిస్తుంది. నూతన బ్యాంకుల ఏర్పాటు, బ్యాంకుల విస్తరణకు కేంద్ర బ్యాంకు అనుమతి అవసరం.

దేశంలో ద్రవ్య సుస్థిరతను సాధించుట కేంద్ర బ్యాంకు ప్రధాన ధ్యేయం. దేశంలో ఆర్థికాభివృద్ధిని పెంపొందించే విధానాలను కేంద్ర బ్యాంకు చేపడుతుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 2.
కేంద్ర బ్యాంకు / రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి వ్రాయుము.
జవాబు.
భారతదేశపు కేంద్ర బ్యాంకు భారతీయ రిజర్వు బ్యాంకు. ఇది 1935 సం॥ ఏప్రిల్లో 5 కోట్ల వాటా మూలధనంతో నెలకొల్పబడినది. మొదట భారతీయ రిజర్వు బ్యాంక్ ప్రైవేటు వాటాదారుల యాజమాన్యం క్రింద ఏర్పడినది. 1949 లో భారత ప్రభుత్వం దీనిని జాతీయం చేసింది.

1934 భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం ప్రకారం అన్ని ముఖ్యమైన కేంద్ర బ్యాంక్ విధులను నిర్వర్తిస్తుంది. దీని ప్రధాన కార్యాలయం ముంబాయిలో ఉంది. భారతీయ రిజర్వు బ్యాంకు కార్యనిర్వహణ అధికారి గవర్నర్. గవర్నర్కు సహాయంగా నలుగురు డిప్యూటీ గవర్నర్లు పనిచేస్తారు.

ఆర్థికాభివృద్ధికి కావలసిన ద్రవ్య వనరులను సమకూర్చుట. మరొకవైపు నుండి అభివృద్ధి వ్యయం వలన ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడకుండా చూడటం, ఆర్థికాభివృద్ధికవసరమైన ద్రవ్య సంస్థలను నెలకొల్పటం, దీర్ఘకాలిక ఋణాలు అందేలా చూడటం చాలా అవసరం.

ఇవన్ని కేంద్ర బ్యాంకు యొక్క బాధ్యతలుగా చెప్పవచ్చును. ద్రవ్య వ్యవస్థకు, అభివృద్ధికి కావలసిన ద్రవ్య వనరులను సప్లైని పెంచటం ద్వారా సమకూర్చాలి. మరొకవైపు ద్రవ్య సప్లై పెరగటం వలన ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడకుండా చూడటం దీని ప్రధాన విధి.

భారతీయ రిజర్వు బ్యాంకు విధులు :

1. కరెన్సీ నోట్ల జారీ :
మనదేశంలోని కరెన్సీ నోట్ల జారీపై గుత్తాధిపత్య అధికారం రిజర్వు బ్యాంకు కలిగి ఉంది. రిజర్వు బ్యాంకు 2,000, 500, 200, 100, 50, 20, 10 రూపాయల కరెన్సీ నోట్లను జారీ చేస్తుంది. ఈ నోట్లపై భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ సంతకం ముద్రించబడతాయి.

2. ప్రభుత్వ బ్యాంకరు :
రిజర్వు బ్యాంకు కేంద్ర ప్రభుత్వానికీ, రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకరుగా, ప్రతినిధిగా, ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వ బ్యాంకరుగా వివిధ ప్రభుత్వ విభాగాల అకౌంట్లను నిర్వహిస్తుంది. ప్రభుత్వం తరుపున ద్రవ్యాన్ని స్వీకరిస్తుంది, చెల్లింపులు చేస్తుంది.

ప్రభుత్వాలకు తాత్కాలిక ఋణాలు అందిస్తుంది. అన్ని ఆర్థిక వ్యవహారాలలో ప్రభుత్వాలకు సలహాదారుగా కూడా పనిచేస్తుంది.

3. బ్యాంకుల బ్యాంకరు:
దేశంలోని బ్యాంకులకు రిజర్వు బ్యాంకు బ్యాంకరుగా పనిచేస్తుంది. కొన్ని రకాల బిల్లులను రీడిస్కౌంట్ చేసుకునే సదుపాయం వాణిజ్య బ్యాంకులకు కలుగజేస్తుంది.

వివిధ బ్యాంకుల మధ్య బ్యాంకింగ్ లావాదేవీలను పరిష్కరించడానికి క్లియరింగ్ హౌస్ గా పనిచేస్తుంది. అలాగే బ్యాంకుల కార్యకలాపాలు తీర్చిదిద్ది వాటికి నాయకత్వం వహిస్తుంది.

4. అంతిమ ఋణదాత :
మార్కెట్లోని అన్నిరకాల పరపతి సౌకర్యాలు ఉపయోగించుకున్న తర్వాత ఇంకా ద్రవ్యత్వ ఇబ్బందులున్నప్పుడు రిజర్వు బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు, డిస్కౌంటు గృహాలకు, ఇతర పరపతి సంస్థలకు కొన్ని షరతులకు లోబడి వాటి వినిమయ బిల్లులను రీడిస్కౌంట్ చేయడం ద్వారా పరపతి అందిస్తూ అంతిమ ఋణదాతగా పనిచేస్తుంది.

5. క్లియరింగ్ హౌస్ల నిర్వహణ :
వ్యాపార అవసరాల నిమిత్తం బ్యాంకు ఖాతాదార్లు చెక్కుల ద్వారా చెల్లింపులు చేస్తుంటాయి. వేరువేరు ఖాతాదార్లు వేరువేరు బ్యాంకులలో తమ ఖాతాలు కలిగి ఉండటంవల్ల వివిధ బ్యాంకుల మీద ఈ చెక్కులు జారీ అవుతూ ఉంటాయి.

వివిధ బ్యాంకుల మధ్య ఖాతాదార్ల చెక్కులకు సంబంధించిన సొమ్ము వారి వారి ఖాతాలలో జమచేయడానికి రిజర్వు బ్యాంకు తమవద్ద ఉన్న వివిధ బ్యాంకుల ఖాతాలను సర్దుబాటు చేస్తూ వసూళ్ళ చెల్లింపులు సులభతరం చేయడానికి వివిధ నగరాలలో క్లియరింగ్ హౌస్లు నిర్వహిస్తుంది.

3. ఉత్పత్తి, పంపిణీపై ద్రవ్యోల్బణ ప్రభావం వ్రాయుము.
జవాబు.
ద్రవ్యోల్బణ ప్రభావం అన్ని వర్గాల ప్రజల మీద ఒకే విధంగా ఉండదు. ద్రవ్యోల్బణం కొన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని వర్గాల ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.

1. స్థిర ఆదాయ వర్గాల వారి మీద :
స్థిర ఆదాయ వర్గాలకు చెందిన వారి ఆదాయం, ధరల పెరుగుదలతోపాటు పెరగదు. కాబట్టి ద్రవ్యోల్బణం వల్ల వారు ఇబ్బందిపాలవుతారు. ఫించనుదార్లు, బ్యాంకులలో కాలపరిమితి డిపాజిట్ల ద్వారా వచ్చే ఆదాయం మీద ఆధారపడి జీవించేవారు.

2. శ్రామిక వర్గం :
అసంఘటిత రంగాలలో పనిచేస్తూ వేతనధార జీవనం సాగించే శ్రామికులు సాధారణంగా తక్కువ ఆదాయం కలిగి ఉంటారు. సాధారణంగా ధరలు పెరిగినందువల్ల వీరి వేతనాలలో పెరుగుదల ఉండదు.

3. ఋణదాతలు, ఋణగ్రహీతలు :
ద్రవ్యోల్బణం వల్ల ద్రవ్యం విలువ క్షీణిస్తుంది. కాబట్టి ఋణం ఇచ్చినప్పటికంటే, తిరిగి చెల్లించినప్పటికి ద్రవ్యోల్బణం వల్ల ద్రవ్యం విలువ తగ్గుతుంది. కాబట్టి ఋణదాతలు నష్టపోతారు, ఋణగ్రహీతలు లాభపడతారు.

4. వినియోగదారులు ఉద్యమదారులు :
ద్రవ్యోల్బణం వల్ల వినియోగదారులు నష్టపోతారు. కాని ఉద్యమదారులకు లాభాలు పెరుగుతాయి.
ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థలో ఆదాయ అసమానతలను పెంచుతుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 4.
డిమాండ్ ప్రేరిత మరియు వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణంలను చర్చించుము.
జవాబు.
వస్తువు సప్లైకి, డిమాండ్కు మధ్య ఏర్పడే అసమతౌల్యం వల్ల వస్తువుల ధరలు నిర్విరామంగా పెరుగుతూ ఉన్న యెడల దానిని ద్రవ్యోల్బణమనవచ్చు. ధరల పెరుగుదల నిర్విరామంగా, గణనీయమైనదిగా ఉన్నప్పుడు మాత్రమే ద్రవ్యోల్బణం ఏర్పడిందని చెప్పాలి. ద్రవ్యోల్బణ భావాన్ని వివిధ రకాలుగా పరిశీలించవచ్చు.

డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం :
సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై కన్నా ఎక్కువగా ఉన్నందువల్ల ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అని అంటారు. ద్రవ్యరాశి పెరుగుదల, పొదుపుకన్నా పెట్టుబడి అధికంగా ఉండటం వల్ల సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై కన్నా అధికంగా ఉండవచ్చు.

ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగితా స్థాయికి చేరుకున్నతరువాత సమిష్టి డిమాండ్ పెరిగినట్లయినా ఉత్పత్తి పెరగక కేవలం ధరలు మాత్రమే పెరుగుతాయి. డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని నివారించడానికి సమిష్టి డిమాండ్ను తగ్గించాలి.

వ్యయ ప్రభావిత ద్రవ్యోల్బణం :
ఉత్పత్తి వ్యయం పెరుగుదల వల్ల ధరల స్థాయి పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడినా దానిని వ్యయ ప్రేరిత లేదా వ్యయ ప్రభావిత ద్రవ్యోల్బణం అని అంటారు. కార్మిక సంఘాలు బలోపేతమై వేతనాలను పెంచుకొన్నప్పుడు లేదా ఇతర ఉత్పత్తి వ్యయాలు పెరిగినప్పుడు ఈ వ్యయ ప్రభావిత ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుట ద్వారా వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని నివారించవచ్చు.

ప్రశ్న 5.
అంతర్జాల బాంకింగ్ అనగానేమి ? దాని ప్రయోజనాలను వివరించుము.
జవాబు.
అంతర్జాలం ద్వారా కూడా బాంకు వ్యాపార వ్యవహారాల నిమిత్తం నగదును పొందే అవకాశం కల్పిస్తుంది. దీనినే ‘అంతర్జాల బాంకింగ్’ అంటారు.
అంతర్జాల బాంకింగ్ ప్రయోజనాలు :

  1. వారంలోని 7 రోజులు, రోజులోని 24 గంటలు బాంకింగ్ సేవలు లభిస్తాయి.
  2. అంతర్జాల సౌకర్యం ఉండే కంప్యూటర్ ఉంటే చాలు, ఎక్కడి నుంచి అయినా ఖాతాపై వ్యవహారాలు నడపవచ్చు.
  3. విద్యుచ్ఛక్తి బిల్లులు, బీమా ప్రీమియంలు కట్టే సౌకర్యం లభిస్తుంది.
  4. భద్రతతో కూడిన ఆర్థిక లావాదేవీల నిర్వహణకు సౌకర్యం ఏర్పడుతుంది.
  5. ఖాతాదారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉండి, చాలావరకు కాగితాల వృథాను అరికడుతుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 6.
రిజర్వు బాంకును నిర్వచించుము. రిజర్వు బ్యాంకుల లక్ష్యాలు ఏవి ?
జవాబు.
‘కేంద్ర బాంకు’ అనేది 20వ శతాబ్దపు భావనగా పేర్కొనవచ్చు. ప్రతి దేశపు బాంకింగ్ వ్యవస్థలో అత్యున్నత స్థానం (apex) గా ఉండే బాంక్ కేంద్ర బాంకు, భారతదేశంలో ఉన్న కేంద్ర బాంకును “రిజర్వు బాంక్ ఆఫ్ ఇండియా”గా పిలుస్తారు.

మన దేశంలో 1934 రిజర్వు బాంకు చట్టం ఫలితంగా 1935 ఏప్రిల్ 1వ తేదీన ‘భారతీయ రిజర్వు బాంకు’ ఏర్పడింది. మొట్టమొదట రిజర్వు బాంకు వాటాదారుల బాంకుగా, 5 కోట్ల రూపాయల మూలధనంతో స్థాపించబడింది. 1949 జనవరి 1వ తేదీన RBI జాతీయం చేయబడింది.

రిజర్వు బాంకు లక్ష్యాలు :
కింది లక్ష్యాలను సాధించడానికి భారతీయ రిజర్వు బాంకు పనిచేస్తుంది.

  1. కరెన్సీని క్రమబద్ధం చేయడం.
  2. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య స్థిరత్వాన్ని, సుస్థిరతను సాధించడం.
  3. పటిష్టమైన ద్రవ్య విధానాన్ని అమలుపరుస్తూ, పరపతి నియంత్రణ చేయడం.
  4. దేశంలోని వాణిజ్య బాంకులకు మార్గదర్శిగా వ్యవహరించడం.
  5. దేశవ్యాప్తంగా ఒకే రీతిలో పరపతి విధానాన్ని అమలుచేయడం.

ప్రశ్న 7.
రిజర్వు బాంకుల యొక్క పర్యవేక్షణ విధులు మరియు అభివృద్ధిపరమైన విధులను పేర్కొనుము.
జవాబు.
‘కేంద్ర బాంకు’ అనేది 20వ శతాబ్దపు భావనగా పేర్కొనవచ్చు. ప్రతి దేశపు బాంకింగ్ వ్యవస్థలో ‘అత్యున్నత స్థానం’ (apex) గా ఉండే బాంక్ కేంద్ర బాంకు, భారతదేశంలో ఉన్న కేంద్ర బాంకును “రిజర్వు బాంక్ ఆఫ్ “ఇండియా”గా పిలుస్తారు.

మన దేశంలో 1934 రిజర్వు బాంకు చట్టం ఫలితంగా 1935 ఏప్రిల్ 1వ తేదీన ‘భారతీయ రిజర్వు బాంకు’ ఏర్పడింది. మొట్టమొదట రిజర్వు బాంకు వాటాదారుల బాంకుగా, 5 కోట్ల రూపాయల మూలధనంతో స్థాపించబడింది. 1949 జనవరి 1వ తేదీన RBI జాతీయం చేయబడింది.

పర్వవేక్షణ విధులు (Supervisory Functions) :
దేశంలోని అత్యున్నత బాంక్ కావడంవల్ల దేశంలోని అన్ని రకాల బాంకింగ్ కార్యకలాపాలపై పర్యవేక్షణ, నియంత్రణాధికారాలు రిజర్వు బాంకుకు ఉన్నాయి.

అభివృద్ధిపరమైన విధులు (Developmental Functions) :
పైన పేర్కొన్న సాంప్రదాయ విధులతోపాటు, రిజర్వు బాంకు అభివృద్ధి విధులను కూడా నిర్వహిస్తుంది. అవి :

  1. బాంకింగ్ వ్యవస్థను అభివృద్ధిపరచటం.
  2. వ్యవసాయ పరపతిని ప్రోత్సహించడం – 1982 లో NABARD స్థాపించడం ద్వారా.
  3. పారిశ్రామికాభివృద్ధికి పరపతిని అందించడం – IDBI, IFCI, SIDBI తదితర అభివృద్ధి బాంకుల ద్వారా.
  4. సమాచార సేకరణ, ప్రచురణ, శిక్షణా కళాశాలలను ఏర్పాటు చేయడం.
    భారతదేశ రిజర్వు బాంకు పటిష్ఠమైన ద్రవ్య విధానాన్ని రూపొందించి, అమలుపరచి ప్రపంచ దేశాలలో ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 8.
ద్రవ్యోల్బణాన్ని నిర్వచించి, ద్రవ్యోల్బణాన్ని నివారించే చర్యలు వ్రాయుము.
జవాబు.
సాధారణ పరిభాషలో ద్రవ్యోల్బణమనగా ధరల పెరుగుదల కేవలం ఒకేసారి ధరలు పెరిగినంత మాత్రాన దానిని ద్రవ్యోల్బణం అనకూడదు. నిర్విరామంగా ధరలు పెరుగుతున్నా దీనినే ద్రవ్యోల్బణం అంటారు. భారతదేశంలో ద్రవ్యోల్బణ సమస్య ఉంది.

ద్రవ్యోల్బణ నిర్వచనాలు : వివిధ ఆర్థిక శాస్త్రవేత్తలు ద్రవ్యోల్బణం గూర్చి నిర్వచనాలను ఇచ్చారు.

  1. హాట్రే అను ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం, “కరెన్సీ నోట్లను అధికంగా జారీ చేయటాన్నే ద్రవ్యోల్బణమందురు”.
  2. డాల్టన్ అభిప్రాయం ప్రకారం, “ద్రవ్యోల్బణమనగా అధిక ద్రవ్యం తక్కువ వస్తువులను వెంటాడటం”.
  3. కిమ్మరర్ అను ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం, “వ్యాపార అవసరాలకు మించి కరెన్సీ ఉంటే దాన్ని ద్రవ్యోల్బణం అందురు”.
  4. ఏసి. పిగూ ప్రకారం, “వాస్తవిక ఆదాయం కన్నా ద్రవ్య ఆదాయం ఎక్కువగా ఉండటాన్నే ద్రవ్యోల్బణమందురు”.
  5. కేదర్ అను ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం, “ద్రవ్య విలువ పడిపోవడం అనగా ధరలు పెరగడాన్ని ద్రవ్యోల్బణమని చెప్పవచ్చు”. వస్తువుల సప్లై, డిమాండ్లలో అసమతౌల్యం ఏర్పడడం వల్ల ధరల స్థాయి నిర్విరామంగా పెరుగుదల ఏర్పడినా అటువంటి ధరల పెరుగుదలనే ద్రవ్యోల్బణంగా చెప్పవచ్చు. ప్రతి ధర పెరుగుదలను ద్రవ్యోల్బణంగా చెప్పకూడదు. ధరల పెరుగుదల గణనీయమైందిగా నిర్విరామంగా కొనసాగినప్పుడే ద్రవ్యోల్బణం ఏర్పడిందని చెప్పాలి”.

ద్రవ్యోల్బణం – నివారణ చర్యలు :

1. ద్రవ్యపరమైన చర్యలు :
ద్రవ్యపరమైన చర్యలు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లైని క్రమబద్ధం. చేస్తాయి. బ్యాంకులు పరపతిని క్రమబద్ధం చేయటం ద్వారా ద్రవ్య సప్లైయిని నియంత్రణ చేయటం జరుగుతుంది. కేంద్ర బ్యాంకు పరిమాణాత్మక, గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాల ద్వారా ద్రవ్యం సప్లైయిని నియంత్రణ చేయవచ్చు.

2. కోశ విధానాలు :
ద్రవ్యోల్బణ కాలంలో ప్రభుత్వం మిగులు బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి పన్ను రేట్లను పెంచటం, కొత్తగా పన్నులను విధించడం మొదలగువాటిని కోశపరమైన చర్యలు అంటారు.

3). ద్రవ్యేతర అంశాలు :

a) ఉత్పత్తిని పెంచటం :
వస్తుత్పత్తిని పెంచటం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అరికట్టవచ్చు. ఉత్పత్తిని పెంచటానికి ఈ క్రింది చర్యలు చేపట్టాలి.

  • ఉత్పాదక వనరులను సక్రమంగా కేటాయించడం.
  • దేశీయంగా ఉన్న వస్తూ కొరతను దిగుమతుల ద్వారా ద్రవ్యోల్బణాన్ని అరికట్టవచ్చు.

b) వేతనాలు :
వేతనాల పెరుగుదలకు, వస్తు ధరల పెరుగుదలకు దగ్గర సంబంధం ఉంది. సక్రమమైన వేతన విధానాలను అమలు చేయాలి.

c) రేషనింగ్ :
ద్రవ్యోల్బణాన్ని నివారించే ప్రత్యక్ష చర్య వస్తువు ధరలను అమలు చేయటం, అదుపులో ఉంచటం. చట్టబద్ధంగా ప్రతి వస్తువుకు గరిష్ఠ ధరను నియంత్రించి ఆ ధర కంటే ఎక్కువ ధరకు అమ్మకుండా చర్యలు తీసుకోవాలి.

d) బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టుట:
అక్రమ వస్తు నిల్వలను అదుపు చేయుట ద్వారా వస్తువుల ధరలను అదుపు చేయవచ్చు. ప్రభుత్వ నియమ, నిబంధనలకు వ్యతిరేకంగా నిల్వచేసే వ్యాపారస్తులను కఠినంగా శిక్షించాలి.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 9.
వాణిజ్య బ్యాంకు – కేంద్ర బ్యాంకు మధ్యగల తేడాలు వ్రాయుము.
జవాబు.
వాణిజ్య బ్యాంకు :
ఇతరులకు ఇవ్వడానికి ద్రవ్యం కలిగిన వారి నుంచి లేదా తమ ఆదాయాల నుంచి పొదుపు చేసే వారి నుంచి బ్యాంకు ద్రవ్యం వసూలు చేసి దానిని అవసరమైన వారికి ఋణంగా ఇస్తుంది.

కేంద్ర బ్యాంకు :
దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థకు కేంద్ర బ్యాంకు శిఖరం. ఇది బ్యాంకింగ్ వ్యవస్థలో బ్యాంకుల ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ, నియంత్రిస్తూ, క్రమబద్ధీకరిస్తుంది.

వాణిజ్య బ్యాంకుకేంద్ర బ్యాంకు
1. వాణిజ్య బ్యాంకుల ప్రాథమిక విధి డిపాజిట్ల సేకరణ, ఋణాల మంజూరు.1. కేంద్ర బ్యాంకు ప్రాథమిక విధి కరెన్సీ నోట్ల జారీ.
2. వాణిజ్య బ్యాంకులు ఖాతాదారులకు ఏజెంట్గా, సలహా ఏజెంటుగా, సలహాదారుగా వ్యవహరిస్తాయి.2. కేంద్ర బ్యాంకులు ప్రభుత్వానికి, వాణిజ్య బ్యాంకులకు దారుగా వ్యవహరిస్తాయి.
3. ప్రజల నుంచి స్వీకరించిన డిపాజిట్ల నుంచి పరపతిని సృష్టిస్తాయి.3. ఆర్థిక వ్యవస్థలోని పరపతిని ద్రవ్య విధానాల ద్వారా నియంత్రిస్తుంది.
4. వాణిజ్య బ్యాంకులు కొనుగోలుదారుడు అమ్మకం దారునికి ఇచ్చిన వినిమయ బిల్లులు డిస్కౌంట్ చేసుకుంటాయి.4. వాణిజ్య బ్యాంకుల డిస్కౌంట్ హౌస్ల, ఇతర పరపతి నియంత్రిస్తుంది.
5. ఎగుమతిదారులకు, దిగుమతిదారులకు వ్యాపార నిమిత్తం విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూరుస్తాయి.5. ఇది విదేశీ మారక ద్రవ్యం విలువను, వాటి వినిమయాన్ని సంస్థల వినిమయ బిల్లులను రీడిస్కౌంట్ చేసుకుంటాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
వస్తు మార్పిడి పద్ధతి అంటే ఏమిటి ?
జవాబు.
ఈ పద్ధతిలో వ్యక్తులు వస్తువులకు బదులుగా వస్తువులను మారకం చేసుకునేవారు. ఈ విధానంలో ఏ ఒక వ్యక్తి తనకు కావలసిన అన్ని వస్తువులను ఉత్పత్తి చేసుకునేవాడు కాదు. అందువలన తాను ఉత్పత్తి చేసిన వస్తువులను ఇతరులకు ఇచ్చి తనకు కావలసిన లేదా అవసరం అయిన వస్తువులతో మార్పిడి చేసుకునేవాడు.

ప్రశ్న 2.
ద్రవ్యం విధులెట్టివి ?
జవాబు.
ద్రవ్యం అనేక ముఖ్య విధులను నిర్వర్తిస్తుంది. ద్రవ్యం నిర్వహించే విధులను ఈ విధంగా వర్గీకరించవచ్చు.

  1. ప్రాథమిక విధులు
  2. ద్వితీయ విధులు
  3. అనుషంగిక విధులు
  4. నిశ్చల చలనాత్మక విధులు.

ప్రశ్న 3.
కాగితపు ద్రవ్యం అంటే ఏమిటి ?
జవాబు.
ఒక దేశపు కేంద్ర బాంకు ఆ దేశ కరెన్సీని జారీ చేస్తుంది. కరెన్సీలో కాగితపు ద్రవ్యం, నాణేలు ఉంటాయి. భారతదేశంలోని కేంద్ర బాంకు అయిన రిజర్వ్ బాంకు ఆఫ్ ఇండియా 2,000, 500, 200, 100, 50, 20, 10 రూపాయల నోట్లను ముద్రిస్తుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 4.
ద్రవ్యం విలువ నిక్షేపంను నీవేవిధంగా అవగాహన చేసుకొంటావు?
జవాబు.
ద్రవ్యం అనే పదం రోమన్ దేవత పేరు జునోమొనెటా (Juno Moneta) నుంచి ఏర్పడినది. ద్రవ్యం వాడుకలోకి రాకముందు ‘వస్తు మార్పిడి విధానం’ అమలులో ఉండేది. ఈ విధానంలో ఒక వస్తువుకు బదులుగా మరొక వస్తువును మార్పిడి చేసుకొనేవారు. వస్తు మార్పిడి పద్ధతిలోని ఇబ్బందులను తొలగించడానికే ద్రవ్యం కనుగొనబడింది.

ప్రాథమిక దశలో ద్రవ్యం స్థానంలో జంతువులను ఉపయోగించేవారు. క్రమక్రమంగా బంగారం, వెండి, కంచు, నికెల్ వంటి లోహాలు ద్రవ్యంగా చలామణిలోకి వచ్చాయి. మూడవ దశలో నాణేలు ద్రవ్యంగా ఉపయోగింపబడగా, ఆ తదుపరి కరెన్సీ నోట్లు ద్రవ్యంగా చలామణిలోకి వచ్చాయి.

ప్రశ్న 5.
చిల్లర ద్రవ్యం అంటే ఏమిటి ?
జవాబు.
చిల్లర ద్రవ్యం (Token Money) :
ప్రామాణిక ద్రవ్యపు ముఖ విలువ దాని అంతర్గత విలువకు సమానంగా ఉంటుంది. చిల్లర ద్రవ్యం ముఖ విలువ దాని అంతర్గత విలువ కంటే అధికంగా ఉంటుంది. ఉదా॥ 1, 2, 5 రూపాయల నాణెములు మున్నగునవి.

ప్రశ్న 6.
భారతీయ రిజర్వు బాంకు ద్రవ్య సమిష్టి అంశాలు అంటే ఏవిటి ?
జవాబు.
M0 = చలామణిలో ఉన్న కరెన్సీ + RBI వద్ద గల బాంకర్ల డిపాజిట్లు + RBI వద్ద గల ఇతర డిపాజిట్లు.
M1 = ప్రజల వద్ద ఉన్న కరెన్సీ + డిమాండ్ డిపాజిట్లు + RBI వద్ద గల ఇతర డిపాజిట్లు.
M2 = M1 + బాంకుల వద్ద ఉన్న కాలపరిమితి గల పొదుపు డిపాజిట్లు + బాంకులు జారీ చేసిన డిపాజిట్ సర్టిఫికేట్లు + ఒక సంవత్సర కాలంలో చెల్లింపదగిన టర్మ్ డిపాజిట్లు. (CDలు మినహాయించబడినవి.)
M3 = M2 + ఒక సంవత్సరం తరవాత చెల్లింపు చేసే టర్మ్ డిపాజిట్లు + బాంకుల టర్మ్ అప్పులు.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 7.
పొదుపు డిపాజిట్లు మరియు కాలపరిమితి డిపాజిట్లను విభేదించండి.
జవాబు.
పొదుపు డిపాజిట్లు :
ఇవి ఖాతాదారుల పొదుపు ఖాతా రూపంలో ఉంటాయి. చిన్న మొత్తం పొదుపులను వాణిజ్య బాంకులలో దాచుకోవడం ప్రజలు భద్రతగా భావిస్తారు. ఈ రకపు పొదుపులు చిన్న వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, వివిధ రకాల వృత్తులు చేపట్టే వారికి, మధ్య తరగతి ఆదాయ వర్గాలకు అనువుగా ఉంటాయి.

ఇలాంటి డిపాజిట్లపై వాణిజ్య బాంకులు సాధారణంగా 4 శాతం వడ్డీ చెల్లిస్తాయి. ఈ ఖాతాలో ఉన్న డబ్బును ఖాతాదారు ఎప్పుడైనా తిరిగి తీసుకోవచ్చు.

కాలపరిమితి డిపాజిట్లు (Term Deposits) :
ఒక నిర్ణీత కాలానికి డబ్బుని డిపాజిట్ చేయడం జరుగుతుంది. అందువల్ల వీటిని కాలపరిమితి లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు అంటారు. కాలపరిమితి తరవాతనే ఖాతాదారుకు ఈ మొత్తం చెల్లించబడుతుంది. ఖాతాదారు కాలపరిమితికి ముందుకూడా ఈ డిపాజిట్ సెక్యూరిటీ ఆధారంగా ఋణం పొందవచ్చు.

ఈ డిపాజిట్లకు పొదుపు డిపాజిట్ల కంటే అధిక వడ్డీ ఉంటుంది. వీటిపై వాణిజ్య బాంకులు 6 నుంచి 8.5 శాతం వరకు వడ్డీని డిపాజిట్ కాలపరిమితి ఆధారంగా చెల్లిస్తాయి.

ప్రశ్న 8.
పరపతి సృష్టిని వివరించండి.
జవాబు.
బాంకులు స్వీకరించే డిపాజిట్లే అవి ఇచ్చే రుణాలకు ఆధారం. డిపాజిట్లు స్వీకరించని బాంకులు రుణాలను మంజూరు చేయలేవు. పరపతి సృష్టి అంటే బాంకు డిపాజిట్లకంటే ఎన్నో రెట్లు రుణాలు ఇవ్వడం పరపతి ఇచ్చేటప్పుడు డిపాజిట్లు సృష్టించబడతాయి.

అంటే డిపాజిట్లు (ప్రాథమిక డిపాజిట్లు) పరపతికి దారితీయడమే కాకుండా, పరపతి కూడా వ్యుత్పన్న డిపాజిట్లకు, ద్వితీయ డిపాజిట్లకు దారి తీస్తుంది.

ప్రశ్న 9.
ఆధునిక ఆర్థిక వ్యవస్థలో క్రెడిట్ కార్డుల ఉపయోగాలేవి ?
జవాబు.
క్రెడిట్ కార్డులు (Credit Cards) :
ఇటీవల కాలంలో బాంకులు నూతన పద్ధతిలో అంటే క్రెడిట్ కార్డును ఇవ్వడం ద్వారా ఋణ సౌకర్యాన్ని తమ ఖాతాదారులకు కల్పిస్తున్నాయి. ఒక పరిమితి వరకు నిర్ణీత కంపెనీలలో, దుకాణాలలో వస్తువులను కొనుగోలు చేయడానికి క్రెడిట్ కార్డుదారులు క్రెడిట్ కార్డులను ఉపయోగించుకోవచ్చు.

బిల్లు మొత్తాన్ని కంపెనీలు కార్డుజారీ చేసిన బాంకుల నుంచి రాబట్టుకుంటాయి. నిబంధనలకు లోబడి ఖాతాదారుడు బాంకుకు అసలును కాని లేదా అసలుతోబాటు వడ్డీని కలుపుకొని తరువాత కాలంలో చెల్లిస్తాడు.

ప్రతీ క్రెడిట్ కార్డుకు ఒక పరపతి పరిమితి ఉంటుంది. బాంకు పరిమితికి లోబడి కార్డు ద్వారా నగదును కూడా పొందవచ్చు. వీటి ప్రాముఖ్యం ఈ మధ్య కాలంలో పెరిగింది. జనాభాలో కొన్ని వర్గాల వారికి కిసాన్కార్డుల వంటి ప్రత్యేక కార్డులను బాంకులు సమకూరుస్తున్నాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 10.
నెట్ బాంకింగ్ అంటే ఏమిటి (Net Banking) ? దీని ప్రయోజనాలను వివరించండి.
జవాబు.
గడచిన కొన్ని దశాబ్దాలలో ఏర్పడిన గొప్ప అంతర్జాల విప్లవం ఫలితంగా ఆవిర్భవించినది నెట్ బాంకింగ్. దీనినే అంతర్జాల బాంకింగ్ లేదా ఆన్లైన్ బాంకింగ్ అంటారు. ఇది అంతర్జాలం ఆధారంగా బాంకింగ్ వ్యవహారాలు నిర్వర్తించే ప్రక్రియ. బాంక్ స్టేట్మెంట్లు, బాంక్ ఖాతా స్థాయి (status) ని ఆన్లైన్లో పరిశీలించడం అంతర్జాల బాంకింగ్ నిర్వచనంలో చేర్చబడింది.

ప్రశ్న 11.
కేంద్ర బాంకు ప్రధాన ఉద్దేశ్యాలను గురించి వ్రాయండి.
జవాబు.
భారతదేశంలోని కేంద్ర బాంకులుగా రిజర్వు బాంకు ఆఫ్ ఇండియా క్రింది లక్ష్యాలు లేదా ఆశయాల కోసం ప్రయత్నిస్తుంది.
రిజర్వు బ్యాంకు ఆశయాలు :

  1. కరెన్సీ నోట్ల జారీని క్రమబద్దం చేయటం.
  2. దేశంలో ద్రవ్య స్థిరత్వాన్ని సాధించటం.
  3. వాణిజ్య బ్యాంకులకు మార్గదర్శకత్వం వహించటం.
  4. దేశంలో పరపతి వ్యవస్థను నియంత్రించటం.
  5. దేశవ్యాప్తంగా ఒకే పరపతి విధానాన్ని రూపొందించి అమలు చేయడం.

ప్రశ్న 12.
క్లియరింగ్ హౌస్ అంటే ఏమిటి ?
జవాబు.
బాంకుల నిత్య వ్యవహారాలలో పనులను సులభతరం చేసే నిమిత్తం కొన్ని ముఖ్య కేంద్రాలలో రిజర్వు బాంకు ‘క్లియరింగ్ హౌస్’ లను నిర్వహిస్తోంది. ప్రస్తుతం ముంబాయి, బెంగళూరు, కలకత్తా, హైదరాబాద్, చెన్నై, కాన్పూరు, నాగపూర్, న్యూ ఢిల్లీ, పాట్నా మొదలైన ముఖ్య కేంద్రాలలో క్లియరింగ్ హౌస్లను నెలకొల్పింది.

క్లియరింగ్ హౌస్ల ద్వారా జరిగిన వ్యవహారాల వల్ల ఏయే వాణిజ్య బాంకులు ఎక్కువ ఋణాలను ఇస్తున్నాయో రిజర్వు బ్యాంకుకు తెలుస్తుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 13.
ద్రవ్యోల్బణం రకాలను వివరించండి.
జవాబు.

  1. 1) ద్రవ్యోల్బణ రేటు ప్రకారం
  2. పాకే ద్రవ్యోల్బణం
  3. నడిచే ద్రవ్యోల్బణం
  4. దుమికే ద్రవ్యోల్బణం.

ప్రశ్న 14.
ద్రవ్యోల్బణం వల్ల ఎవరు ప్రభావితం అవుతారు ?
జవాబు.
ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఆర్థిక కార్యకలాపాలైన, ఉత్పత్తి, పంపిణి, సాంఘిక, రాజకీయ సంబంధాలపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.

ప్రశ్న 15.
ఓవర్ డ్రాఫ్ట్ ఉపయోగాలెట్టివి ?
జవాబు.
ఓవర్ డ్రాఫ్ట్ (Overdraft) :
కరెంట్ అకౌంట్ ఖాతాదారునికి ఈ సౌకర్యం కల్పించబడుతుంది. ఖాతాదారుని ఖాతాలో ఉన్న జమను మించి ఒక పరిమితికి లోబడి సెక్యూరిటీతో గాని సెక్యూరిటీ లేకుండాగాని ఖాతాదారుడు ద్రవ్యాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఖాతాదారులు తమ స్వల్పకాల అవసరాల దృష్ట్యా తాత్కాలికంగా రెగ్యులర్ నిధుల కొరత ఉన్నప్పుడు ఈ సౌకర్యాన్ని వాడుకొంటారు.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 16.
బాంకర్లకు బాంకుగా ఏ బాంకు పిలువబడుతుంది ? ఎందుకు ?
జవాబు.
రిజర్వుబాంకు బాంకర్గా ప్రభుత్వానికి మాత్రమే కాక బాంకులకు కూడా పనిచేస్తుంది. 1934 బాంకింగ్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం అన్నీ షెడ్యూల్డ్ బాంకులు అవి సేకరించే మొత్తం డిపాజిట్లలో కొంత భాగంను నగదు నిల్వలుగా RBI దగ్గర ఉంచాలి. ఈ నిష్పత్తిని నగదు నిల్వ నిష్పత్తి అంటారు.

వాణిజ్య బాంకులకు కష్టకాలంలో రిజర్వు బాంకు విత్త సహాయాన్ని అందిస్తుంది. ఈ సహాయం రుణ సహాయం లేదా వినిమయ బిల్లుల రీడిస్కౌంట్ రూపంలో ఉంటుంది. వివిధ వాణిజ్య బాంకుల మధ్య ఖాతాల పరిష్కారానికి రిజర్వుబాంకు క్లియరింగ్ హౌస్ గా వ్యవహరిస్తుంది.

ప్రశ్న 17.
ద్రవ్యం చలనాత్మక విధులెట్టివి ?
జవాబు.
చలన విధులు :
ఉత్పత్తి, వినియోగం, పంపిణీ, సాధారణ ధరల స్థాయిలను ప్రభావితం చేసే ద్రవ్య విధులను చలన విధులుగా పేర్కొనవచ్చు. ఇవి మొత్తం ఆర్థిక వ్యవస్థను చలనాత్మకంగా రూపొందిస్తాయి.

ప్రశ్న 18.
కరెన్సీ అంటే ఏమిటి ?
జవాబు.
ఆర్థిక వ్యవస్థలో చలామణిలో ఉన్న ద్రవ్య రూపాన్ని కరెన్సీ అంటారు. నాణేలు, కాగితపు నోట్లు ఉంటాయి.

ప్రశ్న 19.
క్యాష్ క్రెడిట్స్ అంటే ఏమిటి ?
జవాబు.
ఖాతాదారులు తమ ఖాతా నుంచి రుణ మొత్తాన్ని అవసరమైనప్పుడే విడతల వారీగా తీసుకోవడానికి వీలుగా వాణిజ్య బాంకులు కల్పించే రుణ సౌకర్యం.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 20.
వినిమయ బిల్లుల డిస్కౌంటింగ్ అంటే ఏమిటి ?
జవాబు.
వినిమయ బిల్లుల డిస్కౌంట్ (Discounting of Bills of Exchange) :
వర్తక లావాదేవీలు అరువు రూపంలో జరిగినప్పుడు కొనుగోలుదారుడు, అమ్మకందారునికి ఒక నిర్ణీత కాలానికి చెల్లింపు చేసే విధంగా అరువు బిల్లు రాసి ఇవ్వవచ్చు.

కాబట్టి వ్యాపారస్తులు భవిష్యత్తులో తాము పొందబోయే ఈ వినిమయ బిల్లులు డిస్కౌంట్ చేసుకొని రుణం ఇవ్వవలసిందిగా వాణిజ్య బాంకులను అభ్యర్థించవచ్చు. వాణిజ్య బాంకులు ఈ బిల్లుల పూచీకత్తుగా రుణాలు మంజూరు చేయడాన్నే వినిమయ బిల్లుల డిస్కౌంట్ అంటారు.

TS Inter 1st Year Commerce Study Material Chapter 10 Micro, Small and Medium Enterprises (MSMEs)

Telangana TSBIE TS Inter 1st Year Commerce Study Material 10th Lesson Micro, Small and Medium Enterprises (MSMEs) Textbook Questions and Answers.

TS Inter 1st Year Commerce Study Material Chapter 10 Micro, Small and Medium Enterprises (MSMEs)

Long Answer Questions

Question 1.
Define MSMEs and explain their significance in the Indian economy.
Answer:
Definition:
MSMEs means Micro, Small, and Medium Enterprises. The Small and Medium Enterprise Development Bill, of 2005 was enacted in June 2006 as the “Micro, Small and Medium Enterprises Development Act, 2006”. As per the MSMED Act, 2006, Micro, Small, and Medium Enterprises (MSMEs) are classified into two classes. They are:

  • Manufacturing Enterprises
  • Service Enterprises.

1) Manufacturing Enterprises: Manufacturing enterprises are those enterprises that are engaged in the manufacturing or production of goods. These enterprises are involved in converting raw material into finished products by using plants and machinery.

As per MSMEDs Act 2006, manufacturing enterprises are classified into micro, small and medium enterprises, and those are defined on the base of investment made in plant and machinery.

  • A micro enterprise is an enterprise where investment in plant and machinery does not exceed. ₹ 25 lakhs.
  • A small enterprise is an enterprise where the investment in plant and machinery is more than ₹ 25 lakhs but does not exceed ₹ 5 crores.
  • A medium enterprise is an enterprise where investment in plant and machinery is more than ₹ 5 crores but does not exceed ₹ 10 crores.

2) Service Enterprises: The enterprises involved in providing or rendering of services are known as Service enterprises. As per MSMEDs act 2006, Service enterprises are divided into micro, small and medium enterprises and there are defined as below.

  • A micro enterprise is an enterprise where the investment in equipment does not ex¬ceed ₹ 10 Lakhs.
  • A small enterprise is an enterprise where the investment in equipment is more than ₹ 10 lakhs but does not exceeds ₹ 2 crores.
  • A medium enterprise is an enterprise where the investment in equipment is more than ₹ 2 crores but does not exceed ₹ 5 crores.

Significance of MSMEs:
Micro, Small and Medium Enterprises are integral part of the economy world wide it is accepted that Micro, Small and Medium Enterprises (MSMEs) are engine of economic growth and for promoting economic development.

In India, the MSMEs play an important role in the overall industrial economy of the country. They are widely dispersed across the country and produce a diverse range of products and services to meet the needs of local market and also global market. The significance of MSMEs is given below.

  • MSME contributes 45% of India’s produced output.
  • MSME contributes approximately 40% of India’s exports.
  • MSMEs are contributing 8% of the country’s GDP.
  • MSMEs gives employment to 73 million people in more than 31 million units spread across the nation [40% of the employment opportunity in India is provided by MSME Sector].
  • 90% of MSMEs in India are unregistered (out of which nearly 80% are sole proprietor Firms].
  • MSMEs provide opportunities to the small entrepreneurs by providing various channels of Investment opportunity according to their class of investment.
  • MSMEs provide a good market for foreign companies to start venture capital business in India.
  • MSMEs manufactures more than 6,000 products arraying from hi-tech to traditional industries.

Question 2.
Explain the problems faced by Indian MSME sector in detail.
Answer:
The Indian MSMEs are facing different types of problems.

Various problems faced by Indian MSMEs are given below:
1) Lack of Credit from Banks: The MSMEs are facing the problems of non availability of credit from banks. The banks are not providing the adequate amount of loan to the MSMEs. The promotors of the MSMEs have to produce different types of documents to prove their worthiness. The loan providing process of the banks is very time consuming.

TS Inter 1st Year Commerce Study Material Chapter 10 Micro, Small and Medium Enterprises (MSMEs)

2) Competition from Multinational Companies: Due to globalization, the MSMEs are facing the tough competition from the multinational companies who are providing quality goods at cheapest prices. Therefore, it is very difficult for MSMEs to compete with the multinational companies.

3) Poor Infrastructure: MSMEs are developing so rapidly but their infrastructure is very poor. With poor infrastructure, their production capacity is very low while production cost is very high.

4) Non Availability of Raw Material and Other Inputs: For establishment of MSMEs required raw material, skilled work labour and other inputs which are not available in the market. Due to unavailability of these essentials, it is very difficult to produce the products at affordable prices.

5) Lack of Advanced Technology: The owners of MSMEs are not aware of advanced technologies of production. Their methodology of production is outdated.

6) Lack of Distribution of Marketing Channels: The MSMEs are not adopting the innovative channels of distribution. Their advertisement and sales promotion strategies are comparatively weaker than the multinational companies. Thus, they get low profits.

7) Lack of Training and Skill Development Program: The proprietors of MSMEs are not aware of the innovative methods of production. Lack of proper training and skill enhancement programs in respect of MSMEs are very low. The skill development pro-grams organised by the state and central governments are not reaching properly to all the units across the country.

Question 3.
Discuss the privileges offered to MSMEs in India.
Answer:
MSMEs are enjoying specific privileges and advantages when compared to other enter-prises. The MSMED Act, provides the following privileges on micro, small and medium enterprises.

1) Exclusive Manufacturing of Certain Products by MSMEs: The major benefit for MSMEs is the reservation policy, which reserves certain items, for exclusive manufacture by these enterprises. The Government has put in place policies and has reserved three hundred fifty (350) items for purchase from MSMEs, under the Government Stores Purchase Programme.

2) Space Allocation: To encourage the MSMEs, the Special Economic Zones (SEZs) are required to allocate 10% space for the small-scale units.

3) Timely Payment for Goods and Services: Under MSMED Act, protections are offered in relation to timely payment for goods and services by buyers to MSMEs. It lays an obligation upon the buyers of any goods or services of MSMEs to make payment on specified date as per the agreement.

4) Strong Support and Encouragement from the Government: The Government has been encouraging and supporting this sector by offering packages of schemes and incentives through its specialized institutions in the form of assistance in obtaining finance, help in marketing, technical guidance, training and technology upgradation etc.

5) Interest for Delayed Payment by the Buyer: When a buyer fails to make payment as required by the seller, he shall be liable to pay interest on the outstanding amount, for the period of delay from the date immediately following the agreed date. The interest shall be payable at a rate three times the bank rate and compounded at monthly rates.

6) Reference of Disputes: If there are any disputes relating to amount payable for any goods or services, and any interest thereon, may be referred by any party, to the Micro and Small Enterprises Facilitation Council, which shall conduct conciliation in the matter.

TS Inter 1st Year Commerce Study Material Chapter 10 Micro, Small and Medium Enterprises (MSMEs)

Short Answer Questions

Question 1.
Define manufacturing enterprises as per MSMEs Act, 2006.
Answer:
Manufacturing enterprises are those business enterprises which are engaged in the manufacturing or production of goods or commodities. Manufacturing enterprises involve in converting the raw materials into finished products.

As per MSMED Act 2006, the manufacturing enterprises are categorised into micro, small and medium enterprises and these are defined in terms of investment made in plant and machinery as shown below.

  • A micro enterprise is an enterprise where investment in plant and machinery does not exceed ₹ 25 lakhs.
  • A small enterprise is an enterprise where the investment in plant and machinery is more than ₹ 25 lakhs but does not exceed ₹ 5 crores.
  • A medium enterprise is an enterprise where the investment in plant and machinery is more than ₹ 5 crores but does not exceed ₹ 10 crores.

Question 2.
Define Service enterprises as per MSMEs Act, 2006.
Answer:
The enterprises which involved in providing or rendering of services are known as service enterprises.

As per MSMED Act 2006, Service enterprises are divided into micro, small and medium enterprises on the base of investment made in equipment. These service enterprises are defined as below:

  • A micro enterprise is an enterprise where the investment in equipment does not exceed ₹ 10 lakhs.
  • A small enterprise is an enterprise where the investment in equipment is more than 110 lakhs but does not exceed ₹ 2 crores.
  • A medium enterprise is an enterprise where the investment in equipment is more than ₹ 2 crores but does not exceed ₹ 5 crores.

Question 3.
Briefly explain the registration process of MSMEs.
Answer:
The Ministry of MSME has been undertaking number of programs to help and assist entrepreneurs and small business. Entrepreneurs who are planning to setup business, may contact National Institute for Micro, Small and Medium Enterprises, or Indian Institute of Entrepreneurship or the Development Commissioner for details about their programs and business plans.

The following are the requirements for registration process of MSMEs under MSMED Act, 2006.

  • Any person intending to establish a micro or small enterprise may do at his discretion.
  • Any person intending to establish a medium enterprise engaged in providing or rendering of services may at his discretion.
  • Any person intending to establish a medium enterprise engaged in the manufacturing or production of goods pertaining to any industry specified in the first schedule to the Industries (Development and Regulation) Act, 1951, shall file the memorandum of medium enterprise with authority specified by the state Government or the Central Government.

Question 4.
Explain the promotional measures initiated for strengthening MSMEs in India.
Answer:
The following are the measures for promotion and development of micro, small and medium enterprises, to be undertaken by the Central Government, State Government and the Reserve Bank of India.

These measures are explained as below:

  • Organizing programs to facilitate development of skills among the employees, management and entrepreneurs, provisioning for technological upgradation, marketing, infrastructure facilities.
  • Credit facilities are provided for timely and smooth flow of credit, minimize the incidence of sickness, and enhance the competitiveness of MSMEs.
  • Preferential procurement of goods and services of MSMEs, by the Government, its aided institutions and public sector enterprises.
  • Government grants to the notified fund or funds which are to be utilized exclusively for the measure of promotion and development of MSMEs.

TS Inter 1st Year Commerce Study Material Chapter 10 Micro, Small and Medium Enterprises (MSMEs)

Very Short Answer Questions

Question 1.
Micro Enterprise.
Answer:
i) For Manufacturing Enterprises:
A micro enterprise is an enterprise where the investment in plant and machinery does not exceed ₹ 25 lakhs,

ii) For Service Enterprises:
A micro enterprise is an enterprise where the investment in equipment does not exceed ₹ 10 lakhs.

Question 2.
Small Enterprises.
Answer:
i) For Manufacturing Enterprises:
A small enterprise is an enterprise where the investment in plant and machinery is more than ₹ 25 lakhs but does not exceed ₹ 5 crores.

ii) For Service Enterprises:
A small enterprise is an enterprise where the investment in equipment is more than ₹ 10 lakhs but does not exceed ₹ 2 crores.

Question 3.
Medium Enterprises.
Answer:
i) For Manufacturing Enterprises:
A medium enterprise is an enterprise where the investment in plant and machinery is more than ₹ 5 crores but does not exceed ₹ 10 crores.

ii) For Service Enterprises:
A medium enterprise is an enterprise where the investment in equipment is more than ₹ 20 crores but does not exceed ₹ 5 crores.

Question 4.
Manufacturing Enterprise.
Answer:
i) The enterprise which is engaged in the manufacturing or production of goods is called a manufacturing enterprise.
ii) There are 3 types of manufacturing enterprises on the base of investment in plant and machinery. They are given below:

  • Micro Enterprise: Investment in plant and machinery does not exceed ₹ 25 lakhs.
  • Small Enterprise: Investment in plant and machinery is more than ₹ 25 lakhs but does not exceed ₹ 5 crores.
  • Medium Enterprise: Investment in plant and machinery is more than ₹ 5 crores but does not exceed ₹ 10 crores.

TS Inter 1st Year Commerce Study Material Chapter 10 Micro, Small and Medium Enterprises (MSMEs)

Question 5.
Service Enterprise.
Answer:
i) The enterprise involved in providing or rendering services is called a service enterprise.
ii) There are 3 types of enterprises based on investment in equipment. They are:

  • Micro Enterprise: Investment in equipment does not exceed ₹ 10 lakhs.
  • Small Enterprise: Investment in equipment is more than ₹ 10 lakhs but does not exceed ₹ 2 crores.
  • Medium Enterprise: Investment in equipment is more than Rs. 2 crores but does not exceed ₹ 5 crores.

Question 6.
Define Enterprise.
Answer:
1) The term “Enterprise” is defined under section 2(e) as “any industrial understanding or business concern or any other establishment, engaged in the manufacture or production of goods, in any manner pertaining to any industry specified in the first schedule to the Industries (Development and Regulation) Act, 1951, or engaged or providing or rendering of any service or services.

2) The term “Enterprise” includes: Proprietorship, Hindu Undivided Family, Co-operative Society, Partnership Undertaking, or any other legal entity.

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 3 స్నేహలతాదేవి లేఖ

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 3rd Lesson స్నేహలతాదేవి లేఖ Textbook Questions and Answers.

TS Inter 1st Year Non-Detailed 3rd Lesson స్నేహలతాదేవి లేఖ

ప్రశ్నలు- సమాధానాలు

ప్రశ్న 1.
స్నేహలతాదేవి ఎదుర్కున్న సమస్యలను చర్చించండి?
జవాబు:
స్నేహలతాదేవి అను పాఠ్యభాగము డా. ముదిగంటి సుజాతారెడ్డిచే రచించబడిన. “విసుర్రాయి” కథా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ కథ నేటి తరం మహిళా సాధికారికతను ప్రతిబింబిస్తుంది. స్త్రీల జీవితంలో పెళ్ళికే కాకుండా సమాంతరంగా విద్య, ఉద్యోగానికి ఆర్థిక స్వాలంబనకు చాలా ప్రాధాన్యత ఉందనే వాస్తవాన్ని వివరిస్తుంది.

యువత చిన్న విషయానికే కుంగిపోయి, అసంతృప్తికి, నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. అలాంటి ప్రతికూల ధోరణులను ఆ కథ నిరసిమైంది. ఆత్మ విశ్వాసంలో దేన్నైనా సాధించవచ్చు అన్న నమ్మకాన్ని ఇస్తుంది. అమ్మా నాన్నలకు స్నేహలత రాసినలేఖ పై విషయాలను రుజువుచేస్తుంది.

స్నేహలత తన పెళ్ళి విషయముపై తన తల్లిదండ్రులు దిగులు పెట్టుకున్నారని తెలుసుకుంది. వారిని ఓదార్చుతూ వర్తమానకాలంలోని యువతులకు ధైర్యాన్నిస్తూ వ్రాసిన లేఖ స్నేహలతాదేవి లేఖ. అమ్మ నాకు పెళ్ళికాలేదని మీరు చింతపెట్టుకున్నారు. మిమ్మల్నిచూసి నాకు మొదట్లో చింతగానే ఉంది.

ఏకాంతంగా ఎన్నో సార్లు ఏడ్చాను కూడా? పెళ్ళిచూపులకు వచ్చిన ప్రతి మగాడు నన్ను కాదనటం వల్ల నాకు న్యూనతా భావం కలిగింది. నాలో నాకే ఎన్నో లోపాలు కన్పించడం మొదలుపెట్టాయి. పెళ్ళిచూపులు మీద పెళ్ళిచూపులు జరిగాయి. పెళ్ళి చూపులనే తతంగం ఆడదానికి జరిగే ఎన్నో అవమానాలలో ఒకటిగా స్నేహలత భావించింది.

నిజంగా పెళ్ళి చూపులకు వచ్చిన వారిలో చాలా మంది నాకు నచ్చలేదు. కాని ఆ మాటలను చెప్పే హక్కునాకు లేదని మీరు, సమాజం నాకు నేర్పారు. అందుకే నోరు మూసుకున్నాను. నేను పెళ్ళి చూపులకు వచ్చిన వారికి వచ్చాకపోవటానికి నా అందం కాదు ప్రమాణం అని నాకు తెలిసింది. వారికి నచ్చంది మీరిచ్చే కట్నకానుకలు నేను చదువకున్నాను.

వచ్చేవాడు ఏమంటాడోనని నన్ను ఉద్యోగ ప్రయత్నం మీరు చేయనీయలేదు. నేను మరీ అంత అందగత్తెను కాకున్నా వికారంగా మాత్రం లేను కదా! ఎంతోమంది పెళ్ళిచూపులకు వచ్చారు కదా? ఒక్కరన్నా నా చదువు సంస్కారం గురించి అడిగారా! కట్న కానుకలను గురించి బేరాలాడటమే సరిపెట్టారు. ఈ సమాజంలో ఆచారాలు కట్టుబాట్లు ఆడదాన్ని బేరమాడే అంగట్లో వస్తువుగా చేశాయి. అమ్ముడు పోయేది వరుడు అవమానాల పాలయ్యేది వధువు ఇదేమి విడ్డూరం. ఇదేమి సంస్కారం.

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 3 స్నేహలతాదేవి లేఖ

వరకట్న వ్యతిరేకంగా పొసెషన్లు, నినాదాలు చేసి రోడ్లమీద తిరిగితే ప్రయోజనం ఉండదు. మానవ మనస్తత్వాలు మారాలి. స్త్రీలలో ఈ పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం రావాలి. స్త్రీలు తమ జీవితాలను తమకు ఇష్టమైన రీతిలో మలచు కోవటానికి ప్రయత్నించాలి. ఒత్తిడితో ధైర్యాన్ని కోల్పోయి ప్రాణత్యాగం చేయవద్దని కోరింది. తనకు ఎదురైన సమస్యలు నేటి సమాజంలోని ప్రతి స్త్రీ ఎదుర్కోంటుందని వారిందరికి ధైర్యం నూరిపోసింది స్నేహలతాదేవి.

ప్రశ్న 2.
స్నేహలతాదేవి ఆత్మ విశ్వాసాన్ని వివరించండి?
జవాబు:
స్నేహలతాదేవి అను పాఠ్యభాగం డా॥ ముదిగంటి సుజాతారెడ్డిచే రచించ బడింది. ఆమె కథల సంపుటి “విసుర్రాయి”లోనికి ఈ కథ. ఈ కథ నేటి తరం మహిళా సాధికారికతను ప్రతిబింబిస్తుంది. స్త్రీల జీవితంలో పెళ్ళికే కాకుండా సమాంతరంగా విద్య, ఉద్యోగానికి, ఆర్థిక స్వావలంబనకు చాలా ప్రాధాన్యం ఉందన్న వాస్తవాన్ని వివరిస్తుంది.

తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎంత బాధ్యతాయుతంగా ఆలోచించాలన్న మానవీయ విలువలను ఆధర్మాలను తెలుపుతుంది. యువత ప్రతి చిన్న విషయానికి అసంతృప్తికి గురి అవుతున్నారని, చిన్న ఓటమికే కృంగిపోయే మనస్తత్వంతో నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నిరసిస్తుంది.

స్నేహలతాదేవికి తనపై తనకు అంచంచల ఆత్మ విశ్వాసం ఉంది. ఈ సమాజంలో జరుగుతున్న సంఘటనలు తనకు నేర్పాయి. తన తనతల్లిదండ్రులకు ఒక్కగా నొక్క కుమార్తె. తల్లిదండ్రులు చక్కగా విద్యాబుద్ధులు నేర్పించారు. వివాహ విషయంలో తన తల్లిదండ్రుల బాధే స్నేహలతను కలిచివేసింది.

స్నేహలతకు వివాహం కావడం లేదని తల్లిదండ్రులు చింతిస్తున్నారు. వారి బాధను చూడలేక వారిని ఓదార్చుతూ తనపై తాను విశ్వాసాన్ని పెంచుకుంది స్నేహలత. పెళ్ళి చూపుల మీద పెళ్ళిచూపులు జరిగాయి. ఇది ఆడదానికి జరిగే అవమానాలలో ఒకటి. నాకేం తక్కువ? చదువుకుంది. సంస్కారం ఉంది.

మరీ అంత అందంగా లేకపోయినా వికారంగా మాత్రం లేను. నన్ను చూడటానికి వచ్చేవారికి వీటితో అస్సలు పనేలేదు. నేనిచ్చే కట్నంపైనే వారి దృష్టి. నేను ఇచ్చే కట్నాన్ని ఆశించి ఎవరూ నన్ను వివాహం చేసుకుంటానని అనటం లేదు. ఎందుకంటే అది వారికి నచ్చలేదు. ఈ దేశంలో స్వయం శక్తిపై విశ్వాసం లేనివాళ్ళు పెరిగిపోతున్నారు. పరాయిధనానికి ఆశకాదు అత్యాశ పడేవారే అధికమవుతున్నారు.

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 3 స్నేహలతాదేవి లేఖ

నా గురించి మీరు ఇల్లు అమ్ముకుని బజారును పడవలసిన పనిలేదు. నాకు చదువుంది. డిగ్రీ వుంది. ఆ డిగ్రీలో ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను. భవిష్యత్తులో నా జీవన పథంలో నేనంటే ఇష్టపడేవాడు. వ్యక్తిగా నన్ను గౌరవించే వాడు డబ్బుకోసం కాక, వరకట్నం కోసం కాక నా సాహచర్యం కోసం నా వ్యక్తిత్వం చూసి నన్ను పెళ్ళాడే వాడు దొరికినపుడే వివాహం చేసుకుంటాను. అందుకే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను.

నా గురించి మీరు భయపడనవసరం లేదు. నన్ను నేను కాపాడుకోగలను. నాకా శక్తిని ఈ సమాజం ఇచ్చింది. ఎక్కడున్నా నేను జాగ్రత్తగా క్షేమంగా ఉంటాను. ఉద్యోగం సాధించగానే మీకు ఉత్తరం రాస్తాను. మీరు కూడా నా దగ్గరికే వచ్చి ఉండవచ్చు. మీరు నా దగ్గర ఉండటానికి ఇష్టపడే వాడు దొరికినప్పుడే పెళ్ళి చేసుకుంటాను. ఈ సమాజంలో స్త్రీ శక్తి మేల్కొవాలి. ఎవరికి తగిన స్థాయిలో వారు ఆర్థిక స్వాలంబనను పొందటానికి కృషిచేసి వరకట్నం వంటి దురాచారాలను ఎదుర్కోవాలని కోరుకుంటున్నాని స్నేహలతాదేవి తనతోపాటు స్త్రీ జాతి కంతటికి ఆత్మ విశ్వాసాన్ని కల్గించింది.

స్నేహలతాదేవి లేఖ Summary in Telugu

రచయిత్రి పరిచయం

కవి పేరు : డా॥ ముదిగంటి సుజాతారెడ్డి

కాలం : మే 25, 1942

పుట్టిన ఊరు : నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం ‘ఆకారం’ గ్రామం

తల్లిదండ్రులు : వెంకటమ్మ, రామిరెడ్డి

చదువులు : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ,పిహెచ్

పిహెచ్ పరిశోధనాంశం : మను, వసు చరిత్రల తులనాత్మక పరిశీలన

రచనలు : తెలుగు సాహిత్య చరిత్ర
తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 3 స్నేహలతాదేవి లేఖ

నవలలు : మలుపు తిరిగిన రధచక్రాలు, సంకెళ్ళు తెగాయి, ఆకాశంలో విభజన రేఖలు లేవు

కథా సంపుటాలు. :

  • విసుర్రాయి, మిగుతున్న పట్నం, వ్యాపార మృగం, మరో మార్క్స్ పుట్టాలె, నిత్యకల్లోలం
  • గోపాలరెడ్డి సంస్కృత పండితుడు. ఆయనను వివాహం చేసుకున్నది. ఆయన స్మృతిలో
  • “ఛత్రప్రియ” అనే జీవిత కథను “ముసురు” పేరుతో ఆత్మకథను రాసుకున్నారు.
  • విదేశీ పర్యటనానుభవంతో ‘అద్భుత చైనా యాత్ర నైలునది నాగరికత’ గ్రంథాలను రచించారు. చాసో అవార్డు, రంగినేని ఎల్లమ్మ సాహితీ పురస్కారం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట ప్రతిభా పురస్కారాలను అందుకున్నారు.

TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 9th Lesson మొగల్ ల యుగం Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 9th Lesson మొగల్ ల యుగం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
షేర్షా పరిపాలనా విధానంపై ఒక వ్యాసం రాయండి.
జవాబు.
మొగల్ పాలనా వ్యవస్థకు రూపకల్పన చేసినవాడు అక్బర్. అక్బర్కు ప్రభుత్వ విధానాల్లో షేరా కొంతవరకు మార్గదర్శి. షేర్షా విధానాలను మెరుగుపరచి, కొత్త విధానాలను ప్రవేశపెట్టి, సమర్థవంతమైన పాలకునిగా అక్బర్ చక్రవర్తి మొగల్ చరిత్రలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు.

కేంద్ర ప్రభుత్వం:మొగల్ పరిపాలనా యంత్రాంగానికి చక్రవర్తి సర్వాధికారి. అధికారాలన్నీ అతడి చేతిలో కేంద్రీకృతమై ఉంటాయి. మొగల్ చక్రవర్తి ప్రాజ్ఞ నిరంకుశ ప్రభువు. “నా కింది ఉద్యోగులు నిర్వహించాల్సిన బాధ్యతలను నేను నిర్వహించనవసరం లేదు. పాలకుడు కింది ఉద్యోగుల తప్పులను దిద్దుకుంటూపోతూ నివారించుకుంటే సరిపోతుంది” అని అక్బర్ చెప్పుకున్నాడు. ప్రభుత్వంలో చక్రవర్తికి (పాదుషాకు) సలహాలిచ్చేందుకు నలుగురు మంత్రులున్నారు. వారు :

  1. వకీల్ లేక వకీల్-ఇ-ముత్లాక్ లేక ప్రధానమంత్రి:ఇతడు చక్రవర్తికి ముఖ్య సలహాదారు. అన్ని శాఖలను పర్యవేక్షిస్తాడు.
  2. దివాన్ లేక వజీర్ లేక ఆర్థికమంత్రి:ఇతడు సామ్రాజ్య ఆర్థిక వనరులను పర్యవేక్షించేవాడు. భూమిశిస్తు ఇతర పన్నుల వసూలు, సామ్రాజ్య ఖర్చులు ఇతని పర్యవేక్షణలో ఉండేవి.
  3. మీర్భక్షి:ఇతడు యుద్ధ మంత్రి. పెద్ద ఉద్యోగులకు జీతాలను కూడా బట్వాడా చేసేవాడు. మున్సబార్ల పేర్లు, వారి హోదాలు, వారి జీతాలు ఇతడు నమోదు చేసుకొనేవాడు. రాజప్రాసాద రక్షణ నిమిత్తం గస్తీ ఉద్యోగులను నియమించేవాడు. రాష్ట్రాలలో వార్తాహరులను, గూఢచారులను నియమించటం కూడా ఇతని విధి.
  4. సదర్-ఉస్-సదర్:మత విషయాలలో చక్రవర్తికి సలహాలివ్వడం, చక్రవర్తి దానధర్మాలను పర్యవేక్షించటం, ముఖ్య న్యాయాధీశునిగా వ్యవహరించటం ఇతడి విధులు.

రాష్ట్ర ప్రభుత్వం:పరిపాలనా సౌలభ్యం కొరకు మొగల్ సామ్రాజ్యం సుబాలుగా విభజింపబడింది. అక్బర్ కాలంలో దాదాపు 15 సుబాలుండేవి. ఒక రకంగా వీటిని రాష్ట్రాలుగా పరిగణించవచ్చు. రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ, కేంద్ర పాలనావ్యవస్థకు ప్రతిరూపం లేక ప్రతీక అని చెప్పవచ్చు. సుబాను పాలించే అధికారి సుబేదార్. సుబాలో శాంతి భద్రతలు కాపాడే బాధ్యతను సుబేదార్ నిర్వహిస్తాడు. దివాన్, భక్షి, సదర్, ఖాజీ అను అధికారులు కూడా రాష్ట్రపాలనా నిర్వహణలో బాధ్యత స్వీకరిస్తారు. వారి విధులు కేంద్ర ప్రభుత్వంలో అదే పేరుగల అధికారులు విధులను పోలి ఉంటాయి.

ప్రధాన నగరాలలో న్యాయ వ్యవహారాలను చూసేందుకు కొత్వాలు అనే ఉద్యోగి ఉండేవాడు. అతడు నగరాలలో శాంతి భద్రతలను కాపాడేవాడు. ప్రభుత్వ ఆజ్ఞలను అమలుపరిచేవాడు. విదేశీయుల కార్యకలాపాలను గమనించేవాడు. సర్కారు పాలన:”సుబాలు” సర్కారులుగా విభజింపబడ్డాయి. సర్కార్లను నేటి జిల్లాలతో పోల్చవచ్చు. సర్కార్లను పాలించడానికి ఈ క్రింది అధికార్లు ఉంటారు.

TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం

ఎ) ఫౌజార్:ఇతడు సర్కారు అధిపతి, సైనికాధికారి, తిరుగుబాట్లను అణచివేసి రెవిన్యూ అధికారులకు సహాయం చేయడం ఇతని ముఖ్య విధులు.
బి) అమల్ గుజార్:ఇతడు రెవిన్యూ శాఖాధిపతి. భూమిశిస్తు వసూలు చేయడం, ఋణాలను మంజూరు చేయడం ఇతని ముఖ్య విధులు.
సి) ఖజానాదార్:ఇతడు కోశాధికారి. వసూలైన భూమిశిస్తును ఖజానాలో భద్రపరచి కేంద్రానికి జాగ్రత్తగా పంపడం ఇతని విధి.
డి) బిలక్సి:ఇతడు భూములకు, భూమిశిస్తులకు సంబంధించిన వివరాలను తయారుచేస్తాడు.

పరగణా పాలన ; సర్కార్లు పరగణాలుగా విభజింపబడ్డాయి. ఈ క్రింది అధికారులు పరగణాల యొక్క నిర్వహించేవారు.
ఎ) షికార్: ఇతడు పరగణా యొక్క ముఖ్య కార్యనిర్వహణాధికారి. ఇతడు కూడా సైనికాధికారియే: పరగణా యొక్క శాంతిభద్రతలను పర్యవేక్షిస్తాడు.
బి) అమీన్: ఇతడు రెవిన్యూ ఉద్యోగి. భూమిశిస్తు విషయాలను నిర్వహిస్తాడు.
సి) కానుంగో: పట్వారీలపై అధికారి. ఇతడు భూములకు సంబంధించిన వివరాలను తయారుచేస్తాడు.
డి) పోద్దార్: ఇతడు పరిగణా యొక్క కోశాధికారి.

గ్రామ పాలన:పరగణాలు గ్రామాలుగా విభజింపబడ్డాయి. గ్రామం పరిపాలనా వ్యవస్థలో తుది అంశము. ముఖద్దమ్, పట్వారీలు గ్రామాధికారులు. ముఖద్దమ్ శాంతిని పర్యవేక్షిస్తాడు. పట్వారీ భూమిశిస్తు వివరాలను తయారు చేస్తాడు. గ్రామాలలో పంచాయితీ విధానం అమలులో ఉండేది. పంచాయితీలు న్యాయనిర్వహణ బాధ్యతలను నిర్వహించేవి.

సైనికపాలన:మొగల్ చక్రవర్తులు సమర్థవంతమైన సైన్యమును పోషించిరి. వీరి సైనిక విధానమును ‘మున్సబ్రీ’ విధానమందురు. ‘మున్సబ్’ అంటే ‘హోదా’ లేదా ‘ఉద్యోగం’ అని అర్థం. ఒక విధముగా ఢిల్లీ సుల్తానుల జాగీర్దార్ విధానం వంటిది.

ఆర్థిక విధానం:మొగలుల ఆర్థిక విధానం సమర్థవంతమైనది. ఖరాజ్, ఖమ్స్, జకాత్, జిజియా అనే నాలుగు రకాల పన్నులు వసూలు చేసిరి.

భూమిశిస్తు విధానం:మొగలుల భూమిశిస్తు విధానానికి పూర్తి రూపాన్ని కల్గించినవారు అక్బర్ మరియు ఆయన రెవిన్యూ మంత్రి రాజాతోడరమల్. మొగలుల భూమిశిస్తు విధానంను ‘బందోబస్త్’ విధానమందురు. న్యాయపాలన:చక్రవర్తితో కూడిన న్యాయమండలి మొగల్ రాజ్యంలో అత్యున్నత న్యాయస్థానం. అతి ముఖ్యమైన వివాదాలను ఈ న్యాయస్థానమే పరిష్కరించేది. చక్రవర్తియే ఉన్నత న్యాయాధీశుడు. ఉద్యోగులలో ప్రధాన ఖాజీ ఉన్నత న్యాయాధికారి. అతడు దిగువ న్యాయస్థానాల యొక్క న్యాయాధిపతులను నియమించేవాడు. ఆ న్యాయస్థానాల నుండి వచ్చే అప్పీళ్లను కూడా ప్రధాన ఖాజీ విచారించేవాడు. చీఫ్ సదర్ మత వివాదాలను పరిష్కరించేవాడు. రాష్ట్రాలలో (సుబాలలో) సదర్ క్రిమినల్ కేసులను, దివాన్ రెవిన్యూ వివాదాలను, ఖాజీ సివిల్ కేసులను పరిష్కరించే వారు. సర్కార్లలో ఫౌజార్లు, ఖాజీలు, పరగణాలలో షికార్లు, అమీన్లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించేవారు. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయితీలు నేర విచారణ చేసేవి.

ముగింపు:మొగలుల పాలనా విధానము ఉదారమైనది, సమర్థవంతమైనది. ప్రజాక్షేమాన్ని కాంక్షించేది. మహమ్మదీయుల పరిపాలనా వ్యవస్థ మొదటిసారిగా మొగలుల కాలంలోనే ఔన్నత్యాన్ని పొందింది.

ప్రశ్న 2.
మొగల్ పరిపాలన ముఖ్య లక్షణాలు చర్చించండి.
జవాబు.
మొగల్ పాలనా వ్యవస్థకు రూపకల్పన చేసినవాడు అక్బర్. అక్బర్కు ప్రభుత్వ విధానాల్లో షేరా కొంతవరకు మార్గదర్శి. షేర్షా విధానాలను మెరుగుపరచి, కొత్త విధానాలను ప్రవేశపెట్టి సమర్థవంతమైన పాలకునిగా అక్బర్ చక్రవర్తి మొగల్ చరిత్రలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు.

కేంద్ర ప్రభుత్వం:మొగల్ పరిపాలనా యంత్రాంగానికి చక్రవర్తి సర్వాధికారి. అధికారాలన్నీ అతడి చేతిలో కేంద్రీకృతమై ఉంటాయి. మొగల్ చక్రవర్తి ప్రాజ్ఞ నిరంకుశ ప్రభువు. నా కింది ఉద్యోగులు నిర్వహించాల్సిన బాధ్యతలను నేను నిర్వహించనవసరం లేదు. పాలకుడు కింది ఉద్యోగుల తప్పులను దిద్దుకుంటూపోతూ తాను చేసే తప్పులను నివారించుకుంటే సరిపోతుంది” అని అక్బర్ చెప్పుకున్నాడు. ప్రభుత్వంలో చక్రవర్తికి (పాదుషాకు) సలహాలిచ్చేందుకు నలుగురు మంత్రులున్నారు. వారు:

  1. వకీల్ లేక వకీల్-ఇ-ముత్లాక్ లేక ప్రధానమంత్రి:ఇతడు చక్రవర్తికి ముఖ్య సలహాదారు. అన్ని శాఖలను పర్యవేక్షిస్తాడు.
  2. దివాన్ లేక వజీర్ లేక ఆర్థికమంత్రి:ఇతడు సామ్రాజ్య ఆర్థిక వనరులను పర్యవేక్షించేవాడు. భూమిశిస్తు ఇతర పన్నుల వసూలు, సామ్రాజ్య ఖర్చులు ఇతని పర్యవేక్షణలో ఉండేవి.
  3. మీర భక్షి:ఇతడు యుద్ధ మంత్రి. పెద్ద ఉద్యోగులకు జీతాలను కూడా బట్వాడా చేసేవాడు. మున్సబార్లా పేర్లు, వారి హోదాలు, వారి జీతాలు ఇతడు నమోదు చేసుకొనేవాడు. రాజప్రాసాద రక్షణ నిమిత్తం గస్తీ ఉద్యోగులను నియమించేవాడు. రాష్ట్రాలలో వార్తాహరులను, గూఢచారులను నియమించటం కూడా ఇతని
    విధి.
  4. సదర్-ఉన్-సదర్:మత విషయాలలో చక్రవర్తికి సలహాలివ్వడం చక్రవర్తి దానధర్మాలను పర్యవేక్షించటం, ముఖ్య న్యాయాధీశునిగా వ్యవహరించటం ఇతడి విధులు.

రాష్ట్ర ప్రభుత్వం:పరిపాలనా సౌలభ్యం కొరకు మొగల్ సామ్రాజ్యం సుబాలుగా విభజింపబడింది. అక్బర్ కాలంలో దాదాపు 15 సుబాలుండేవి. ఒక రకంగా వీటిని రాష్ట్రాలుగా పరిగణించవచ్చు. రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ, కేంద్ర పాలనావ్యవస్థకు ప్రతిరూపం లేక ప్రతీక అని చెప్పవచ్చు. సుబాను పాలించే అధికారి సుబేదార్. సుబాలో శాంతి భద్రతలు కాపాడే బాధ్యతను సుబేదార్ నిర్వహిస్తాడు. దివాన్, భక్షి, సదర్, ఖాజీ అను అధికారులు కూడా రాష్ట్రపాలనా నిర్వహణలో బాధ్యత స్వీకరిస్తారు. వారి విధులు కేంద్ర ప్రభుత్వంలో అదే పేరుగల అధికారులు విధులను పోలి ఉంటాయి.

ప్రధాన నగరాలలో న్యాయ వ్యవహారాలను చూసేందుకు కొత్వాలు అనే ఉద్యోగి ఉండేవాడు. అతడు నగరాలలో శాంతి భద్రతలను కాపాడేవాడు. ప్రభుత్వ ఆజ్ఞలను అమలు పరిచేవాడు. విదేశీయుల కార్యకలాపాలను గమనించేవాడు. సర్కారు పాలన:“సుబాలు” సర్కారులుగా విభజింపబడ్డాయి. సర్కార్లను నేటి జిల్లాలతో పోల్చవచ్చు. సర్కార్లను పాలించడానికి ఈ క్రింది అధికార్లు ఉంటారు.

ఎ) ఫౌజార్: ఇతడు సర్కారు అధిపతి, సైనికాధికారి, తిరుగుబాట్లను అణచివేసి రెవిన్యూ అధికారులకు సహాయం చేయడం ఇతని ముఖ్య విధులు.
బి) అమల్ గుజార్: ఇతడు రెవిన్యూ శాఖాధిపతి. భూమిశిస్తు వసూలు చేయడం, ఋణాలను మంజూరు చేయడం ఇతని ముఖ్య విధులు.
సి) ఖజానాదార్: ఇతడు కోశాధికారి. వసూలైన భూమిశిస్తును ఖజానాలో భద్రపరచి కేంద్రానికి జాగ్రత్తగా పంపడం ఇతని విధి.
డి) బిలక్సీ: ఇతడు భూములకు, భూమిశిస్తులకు సంబంధించిన వివరాలను తయారుచేస్తాడు.

TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం

పరగణా పాలన: సర్కార్లు పరగణాలుగా విభజింపబడ్డాయి. ఈ క్రింది అధికారులు పరగణాల యొక్క పరిపాలనను నిర్వహించేవారు.
ఎ) షికార్:ఇతడు పరగణా యొక్క ముఖ్య కార్యనిర్వహణాధికారి. ఇతడు కూడా సైనికాధికారియే. పరగణా యొక్క శాంతిభద్రతలను పర్యవేక్షిస్తాడు.
బి) అమీన్:ఇతడు రెవిన్యూ ఉద్యోగి. భూమిశిస్తు విషయాలను నిర్వహిస్తాడు.
సి) కానుంగో:పట్వారీల-పై అధికారి. ఇతడు భూములకు సంబంధించిన వివరాలను తయారుచేస్తాడు.
డి) పోద్దార్:ఇతడు పరిగణా యొక్క కోశాధికారి.

గ్రామ పాలన:పరగణాలు గ్రామాలుగా విభజింపబడ్డాయి. గ్రామం పరిపాలనా వ్యవస్థలో తుది అంశము. ముఖద్దమ్, పట్వారీలు గ్రామాధికారులు. ముఖద్దమ్ శాంతిని పర్యవేక్షిస్తాడు. పట్వారీ భూమిశిస్తు వివరాలను తయారు చేస్తాడు. గ్రామాలలో పంచాయితీ విధానం అమలులో ఉండేది. పంచాయితీలు న్యాయనిర్వహణ బాధ్యతలను నిర్వహించేవి.

సైనిక పాలన:మొగల్ చక్రవర్తులు సమర్థవంతమైన సైన్యమును పోషించిరి. వీరి సైనిక విధానమును ‘మున్సబారీ’ విధానమందురు. ‘మున్సబ్’ అంటే ‘హోదా’ లేదా ‘ఉద్యోగం’ అని అర్థం. ఒక విధముగా ఢిల్లీ సుల్తానుల జాగీర్దార్ విధానం వంటిది.

ఆర్థిక విధానం:మొగలుల ఆర్థిక విధానం సమర్థవంతమైనది. ఖరాజ్, ఖమ్స్, జకాత్, జిజియా అనే నాలుగు రకాల పన్నులు వసూలు చేసిరి.

భూమిశిస్తు విధానం:మొగలుల భూమిశిస్తు విధానానికి పూర్తి రూపాన్ని కల్గించినవారు అక్బర్ మరియు ఆయన రెవిన్యూ మంత్రి రాజాతోడర్మల్. మొగలుల భూమిశిస్తు విధానంను ‘బందోబస్త్’ విధానమందురు.

న్యాయపాలన:చక్రవర్తితో కూడిన న్యాయమండలి మొగల్ రాజ్యంలో అత్యున్నత న్యాయస్థానం. అతి ముఖ్యమైన వివాదాలను ఈ న్యాయస్థానమే పరిష్కరించేది. చక్రవర్తియే ఉన్నత న్యాయాధీశుడు. ఉద్యోగులలో ప్రధాన ఖాజీ ఉన్నత న్యాయాధికారి. అతడు దిగువ న్యాయస్థానాల యొక్క న్యాయాధిపతులను నియమించేవాడు. ఆ న్యాయస్థానాల నుండి వచ్చే అప్పీళ్లను కూడా ప్రధాన ఖాజీ విచారించేవాడు. చీఫ్ సదర్ మత వివాదాలను పరిష్కరించేవాడు. రాష్ట్రాలలో (సుబాలలో) సదర్ క్రిమినల్ కేసులను, దివాన్ రెవిన్యూ వివాదాలను, ఖాజీ సివిల్ కేసులను పరిష్కరించేవారు. సర్కార్లలో ఫౌజ్దార్లు, ఖాజీలు, పరగణాలలో షికార్లు, అమీన్లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించేవారు. గ్రామస్థాయిలో గ్రామ పంచాయితీలు నేర విచారణ చేసేవి.

ముగింపు:మొగలుల పాలనా విధానము ఉదారమైనది, సమర్థవంతమైనది. ప్రజాక్షేమాన్ని కాంక్షించేది. మహమ్మదీయుల పరిపాలనా వ్యవస్థ మొదటిసారిగా మొగలుల కాలంలోనే ఔన్నత్యాన్ని పొందింది.

ప్రశ్న 3.
మొగల్ సామ్రాజ్య పతనానికి ఔరంగజేబు ఎంతవరకు బాధ్యుడు ?
జవాబు.
ఔరంగజేబు (క్రీ.శ. 1658 – 1707):సమర్థులైన మొగల్ చక్రవర్తులలో ఔరంగజేబు ఒకడు. “అలంగీర్” (ప్రపంచ విజేత) అనే బిరుదు ధరించి సింహాసనానికి వచ్చాడు. ఇతడి మొదటి పది సంవత్సరాల పాలనలో అనేక విజయాలు సాధించాడు. చిన్న చిన్న తిరుగుబాట్లను అణచివేశాడు. కాని పాలన చివరి రోజుల్లో అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. జాట్లు, సత్నామీలు, సిఖ్ు అతనికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేశారు. ఇతడి సంకుచిత మత దురభిమానం మూలంగానే ఈ తిరుగుబాట్లు జరిగాయి.

దక్కన్ విధానం:మొగలుల దక్కన్ విధానం అక్బర్తో ప్రారంభమైంది. ఖాందేశ్, బెరార్లను ఆక్రమించాడు. జహాంగీర్ అహ్మద్ నగర్ మంత్రి మాలిక్ అంబర్కు వ్యతిరేకంగా యుద్ధం చేశాడు. షాజహాన్ కాలంలో దక్కన్ గవర్నర్గా ఉన్న ఔరంగజేబు దక్కన్ రాజ్యాల పట్ల దుడుకైన విధానాన్ని అనుసరించాడు. కాని జౌరంగజేబు చక్రవర్తైన మొదటి అయిదు సంవత్సరాలు తన దృష్టిని పూర్తిగా పశ్చిమోత్తర సరిహద్దుపై కేంద్రీకరించాడు.

ఇదే సమయంలో మరాఠా నాయకుడు శివాజీ ఉత్తర, దక్షిణ కొంకణ్ణను జయించి స్వతంత్ర మరాఠా రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. మరాఠాల విజృంభణను అరికట్టడానికి ఔరంగజేబు బీజాపూర్, గోల్కొండ రాజ్యాలపై దండయాత్ర చేశాడు. సికిందర్షాను ఓడించి బీజాపూర్ను ఆక్రమించాడు. కుతుబ్షాహి సుల్తానును 1687లో ఓడించి గోల్కొండను ఆక్రమించాడు. దక్కన్ రాజ్యాలను ఆక్రమించడం ఔరంగజేబు చేసిన రాజకీయ తప్పిదం. దీనివల్ల మొగలులకు, మరాఠాలకు మధ్య ఉన్న ఆటంకం తొలగిపోయింది. మహారాష్ట్రులు ప్రత్యక్షంగా తమ బలాన్ని మొగలులపై కేంద్రీకరించడానికి మార్గం ఏర్పడింది. ఇతడి దక్కన్ విధానం మొగల్ సామ్రాజ్యానికి అపార నష్టాన్ని కలిగించింది. జాదునాధ్ సర్కార్ “దక్కన్ పుండు (ulcer) ఔరంగజేబును నాశనం చేసింది” అన్నాడు.

మత విధానం:ఔరంగజేబుకు సనాతన సున్నీ మతంలో విశ్వాసం కలదు. మహసీబ్ అనే అధికారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి, ప్రజలు నైతిక పత్రాలను పాటించేటట్లు కృషి చేశాడు. మద్యపానాన్ని నిషేధించాడు. భంగ్, మత్తు పదార్థాలను నిషేధించాడు. ఆస్థానంలో సంగీతాన్ని నిషేధించాడు. “తులాదానం” (చక్రవర్తిని వెండి, బంగారంతో తూకం వేయడం ఝరోకా దర్శనం” (చక్రవర్తి ప్రజాదర్శనం) వంటి ఆచారాలను నిలిపేశాడు. దీపావళి, దసరా, నౌరోజ్ పండుగలను జరుపరాదన్నాడు. జ్యోతిష్యులను ఆస్థానం నుంచి బహిష్కరించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం

ఔరంగజేబు మొదట కొత్త దేవాలయాల నిర్మాణాన్ని, పాత దేవాలయాల మరమ్మత్తును నిషేధించాడు. తరువాత సంవత్సరంలో హిందూ దేవాలయాలను కూల్చివేయాలని ఆదేశించాడు. మధుర, బెనారస్ లోని ‘దేవాలయాలు కూల్చివేయబడ్డాయి. ఔరంగజేబు 1679లో జిజియా పన్నును, తీర్థయాత్రికుల పన్నును తిరిగి విధించాడు. మహ్మదీయులలోని ఇతర శాఖల వారిపై కూడా మత వ్యతిరేకతను ప్రదర్శించాడు. మొహర్రం పండుగను నిషేధించాడు. షియా మతస్తులనే కారణంపై ఔరంగజేబు దక్కన్ రాజ్యాలపై దండయాత్ర చేశాడు. సిఖ్ తొమ్మిదవ మత గురువు గురు తేజ్బహదూర్ను చంపించాడు. దీనితో సిబ్లు సైన్యంగా ఏర్పడి మొగలాయిలతో నిరంతరం పోరాడారు.

ఔరంగజేబు మత విధానం వల్ల రాజపుత్రులు, మహారాష్ట్రులు, సిబ్లు మొగల్ సామ్రాజ్యానికి శతృవులుగా మారారు. మధుర జాట్లు, మేవార్ సత్నామీలు ఔరంగజేబు మత విధానం మూలంగా తిరుగుబాటు చేశారు. అందుకే మొసలి సామ్రాజ్య పతనానికి ఔరంగజేబు అనుసరించిన మత విధానం కూడా ఒక కారణంగా పేర్కొంటారు. ఔరంగజేబు వ్యక్తిత్వం, శీలం:ఔరంగజేబు వ్యక్తిగత జీవితం చాలా ఆదర్శప్రాయమైంది. ఇతడు క్రమశిక్షణ, కష్టపడి పని చేసే స్వభావం కలవాడు. ఆహార పానీయాలు, వస్త్రధారణ విషయంలో చాలా నిరాడంబరంగా జీవించాడు. విలాసాలకు దూరంగా ఉండేవాడు. తన వ్యక్తిగత ఖర్చుల కోసం ఖురాన్కు నకళ్ళురాసి, వాటిని అమ్మించేవాడు. మద్యపానం సేవించేవాడుకాదు. అరబ్బీ, పార్శీ భాషల్లో మంచి ప్రావీణ్యత కలదు. గ్రంథపఠనం చేసేవాడు. దైవభీతి కలిగిన మహ్మదీయుడిగా ఔరంగజేబు ప్రతిరోజు అయిదు సార్లు నమాజ్ చేసేవాడు. రంజాన్ ఉపవాసాలకు తు.చ. తప్పకుండా పాటించేవాడు.

ఔరంగజేబు రాజకీయ విషయాల్లో కొన్ని తీవ్రమైన తప్పిదాలు చేశాడు. మరాఠాల ఉద్యమ స్వభావాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల వారు ఔరంగజేబుకు విరోధులైనారు. మరాఠాల సమస్యలను పరిష్కరించలేకపోయాడు. దక్కన్ సుల్తానుల పట్ల అతడి విధానం కూడా పెద్ద నష్టాన్ని కలిగించాయి.

ఔరంగజేబు మత విధానం కూడా ఒక అనాలోచితమైన చర్య. తన సున్నీ మతసూత్రాలను మహ్మదీయేతరులపైన బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించాడు. మహ్మదీయులు సైతం అతన్ని సమర్థించలేదు. పైగా వారు మొగల్ సామ్రాజ్యానికి వ్యతిరేకులైనారు.

ప్రశ్న 4.
మొగల్ యుగం నాటి సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులపై వ్యాసం రాయండి.
జవాబు.
మొగల్ల కాలంనాటి సాంఘిక పరిస్థితులు:మొగల్ యుగం నాటి సమాజంలో హిందువులు, ఆఫ్ఘన్లు, ఇరానియన్లు, మంగోళులు, టర్క్లు, సిఖిు, క్రిస్టియన్లు మొదలైన వర్గాలవారు జీవించేవారు. పూర్వం కంటే మొగలుల నాటి సామాజిక వ్యవస్థ చాలా సరళంగా ఉంది. సమాజంలో మూడు ప్రధాన వర్గాలుండేవి. అవి రాజకుటుంబం, ప్రభువులు, మధ్యతరగతి వర్గం, సామాజిక వ్యవస్థలో చివరి వర్గం సామాన్యులు. జనాభాలో అధిక సంఖ్యాకులు వీరే. సామాన్యులు వ్యవసాయం, పరిశ్రమలు, ధనవంతుల ఇండ్లలో పని చేసేవారు. హిందువులు, మహ్మదీయులిద్దరికి జ్యోతిష్యం, శకునాలలో విశ్వాసం కలదు. బాల్యవివాహాలు, సతీసహగమనం, వరకట్నం, బహు భార్యత్వం మొదలైనవి ఆనాటి సామాజిక దురాచారాలు. నౌరోజ్, రంజాన్, షబ్బేబరాత్, దసరా, హోళి, దివాళి మొదలైనవి ఆనాటి ముఖ్యమైన పండుగలు. హిందూ-ముస్లిం పండుగలతోపాటు పాదుషా జన్మదినాన్ని కూడా జరుపుకొనేవారు. ప్రభువులు, రాజ కుటుంబీకుల సరదా కోసం ప్రత్యేక దుకాణ మేళాలను నిర్వహించేవారు. వీటిని నుమా-బజార్లు, ఖుషి బజార్లు అని
పిలిచేవారు.

మొగల్ల నాటి ఆర్థిక వ్యవస్థ:మొగలుల కాలంలో దేశం ఆర్థికంగా చాలా పరిపుష్టంగా ఉండేది. వ్యవసాయం, వాణిజ్యం, చేతివృత్తులు ఉన్నత స్థితిలో ఉండేవి. వ్యవసాయం, వాణిజ్యాభివృద్ధి కోసం మొగలులు అనేక చర్యలు తీసుకొన్నారు. ఆహారధాన్యాల పంటలను, వాణిజ్య పంటలను ప్రోత్సహించారు. బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశు చెరకు పంటకు, బెంగాల్, గుజరాత్, దక్కన్లు పత్తిసాగుకు పేరుగాంచాయి. ఇండిగో, పప్పుధాన్యాలు, నల్లమందు మొదలైన వాటిని కూడా కొన్ని ప్రాంతాల్లో పండించేవారు. జౌళి, ఇనుము – ఉక్కు, తివాచీలు, గాజు, సుగంధ పరిమళాలు, కలంకారీ మొదలైన పరిశ్రమలు బెంగాల్, గుజరాత్, కాశ్మీర్, ఢాకా, మచిలీపట్నంలో విలసిల్లాయి. అంతర్గత వ్యాపారాన్ని స్థానిక వ్యాపారులే నిర్వహించేవారు. భూమార్గ వ్యాపారానికి ఎద్దులు, గాడిదలు, ఒంటెలు, ఎద్దుల బండ్లను ఉపయోగించేవారు. మసాలా దినుసులు, ప్రత్తి, వస్త్రాలు, మిరియాలు, వజ్రాలు మొదలైనవి ఆనాటి ముఖ్యమైన ఎగుమతులు. విదేశీ వ్యాపారం గోవా, హుగ్లీ, కలకత్తా, మచిలీపట్నం ద్వారా జరిగేది. గాజు సామగ్రి, చక్కెర, అశ్వాలు, బానిసలను పర్షియా మధ్య ఆసియా నుంచి దిగుమతి చేసుకొనేవారు.

మొగలుల నాటి సాంస్కృతికాభివృద్ధి:మొగల్ యుగంలో భారతదేశం సాంస్కృతికంగా అద్భుతమైన ప్రగతిని సాధించింది. కళలు, వాస్తు నిర్మాణం, చిత్రలేఖనం, సంగీతం, సాహిత్యం మొదలైన అన్ని రంగాలలో ప్రస్ఫుటమైంది. మొగలులు భారతదేశంలో టర్కీ-పర్షియన్ సంప్రదాయాలను ప్రవేశపెట్టగా, ఇందులో భారతీయ సంప్రదాయం కూడా మేళమించబడింది.

ప్రశ్న 5.
మొగలుల సాంస్కృతిక సేవను వివరించండి.
జవాబు.
మొగలుల నాటి సాంస్కృతికాభివృద్ధి:మొగల్ యుగంలో భారతదేశం సాంస్కృతికంగా అద్భుతమైన ప్రగతిని సాధించింది. కళలు, వాస్తు నిర్మాణం, చిత్రలేఖనం, సంగీతం, సాహిత్యం మొదలైన అన్ని రంగాలలో ప్రస్ఫుటమైంది. మొగలుల భారతదేశంలో టర్కీ-పర్షియన్ సంప్రదాయాలను ప్రవేశపెట్టగా, ఇందులో భారతీయ సంప్రదాయం కూడా మేళమించబడింది.

వాస్తుకళ:మొగలుల వాస్తు నిర్మాణాలలో విశాలమైన కోటలు, రాజభవనాలు, ప్రజలందరు ఉపయోగించుకొనే కట్టడాలు, మసీదులు, సమాధులు మొదలైనవెన్నో కలవు. ఎప్పుడూ నీరు అందుబాటులో ఉండే విధంగా ఉద్యానవనాలను ఏర్పాటు చేశారు. కాశ్మీర్ లోని నిషాత్బాగ్, లాహోర్ లోని షాలిమార్, పంజాబ్లో ని పింజోర్ ఉద్యానవనం మొదలైన మొగలుల ఉద్యానవనాలు నేటికి కూడా సజీవంగా ఉన్నాయి. షేర్షా బీహార్లోని ససారాం వద్ద తన కోసం నిర్మించుకొన్న సమాధి, ఢిల్లీలోని పురానా ఖిలాలోని మసీదు మధ్యయుగ వాస్తు కళారంగంలో అద్భుతాలుగా పరిగణించ బడ్డాయి.

అక్బర్ కాలం నుంచి పెద్ద ఎత్తున భవనాల నిర్మాణం ప్రారంభమైంది. అక్బర్ చాలా కోటలను నిర్మించాడు. అందులో ముఖ్యమైంది ఆగ్రా కోట. ఇది ఎర్రటి ఇసుక రాయితో నిర్మించబడింది. అక్బర్ లాహోర్, అలహాబాద్లో ఇతర కోటలను నిర్మించాడు. .ఢిల్లీలో షాజహాన్ నిర్మించిన ఎర్రకోట కోటల నిర్మాణ రీతిలో అత్యంత విశిష్టమైంది. ఇందులోని రంగమహల్, దివాన్-ఇ-ఆమ్, దివాన్-ఇ-ఖాస్లు కూడా ఇతని నిర్మాణాలే.

అక్బర్ కూడా ఫతేపూర్ సిక్రీ వద్ద రాజభవనం – కోటల సముదాయం నిర్మించాడు. ఇది ఆగ్రాకు 36 కి.మీ. దూరంలో కలదు. గుజరాత్, బెంగాలీ నిర్మాణ శైలి అందులో ప్రతిబింబిస్తుంది. గుజరాత్ నిర్మాణ శైలిని రాజపుత్ర రాణుల కోసం నిర్మించిన భవనాలలో వినియోగించాడు. కాని అన్నింటికంటే ముఖ్యమైన నిర్మాణం మాత్రం అక్కడి జమా మసీదు, ఫతేపూర్ సిక్రీకి ద్వారమైన బులంద్ దర్వాజా. దీని ఎత్తు 176 అడుగులు. అక్బర్ గుజరాత్ విజయానికి చిహ్నంగా దీనిని నిర్మించాడు. ఫతేపూర్ సిక్రీలోని ఇతర ముఖ్యమైన భవనాలలో జోధాభాయి రాజభవనం, అయిదు అంతస్థులతో ఉన్న పంచమహల్ కలవు.

అక్బర్ కాలంలో ఢిల్లీలో హుమాయూన్ సమాధి నిర్మించబడింది. దీని భారీ గుమ్మటం పాలరాతితో నిర్మించబడింది. అందుకే దీనిని తాజ్మహల్కు పూర్వపు రూపంగా భావిస్తారు. ఆగ్రా సమీపంలో సికింద్రా వద్ద అక్బర్ సమాధిని జహంగీర్ పూర్తి చేశాడు. భవన నిర్మాణ కళలో తాజ్మహల్ ఒక అద్భుతంగా నిలిచిపోయింది. మొగలులు అభివృద్ధి పరచిన అన్ని వాస్తు కళాశైలుల సమ్మేళనమే తాజ్మహల్. తాజ్మహల్ అందానికి కారణం దాని విశాలమైన పాలరాతి గోపురం, నాలుగు సన్నటి మినార్లు. అందమైన తోట మధ్యలో నిర్మితం కావడంతో ఆ కట్టడానికి ఎనలేని అందం తెచ్చిపెట్టింది.

షాజహాన్ పాలనలో మసీదుల నిర్మాణం కూడా ఉన్నత దశకు చేరుకొంది. ఆగ్రా కోటలో పాలరాతితో మోతి మసీదు నిర్మించబడింది. ఢిల్లీలో జామా మసీదు ఎర్రటి ఇసుక రాయితో నిర్మించబడింది.

చిత్రలేఖనం, సంగీతం: చిత్రకళారంగానికి మొగలులు చెప్పుకోదగిన కృషి చేశారు. మొగలుల చిత్రకళకు పునాదులు వేసినవాడు హుమాయూన్. అక్బర్ అనేక సాహిత్య, మత గ్రంథాలకు చిత్రీకరణలు వేయించాడు. అక్బర్ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన చిత్రకారులను ఆహ్వానించాడు.

జహాంగీర్ కాలంలో మొగల్ చిత్రలేఖనం ఉన్నత శిఖరాలకు చేరుకొంది. అబ్దుల్సమద్, బిషన్దాస్, మధు, అనంత్, మనోహర్, గోవర్థన్, ఉస్తాద్ మన్సూర్ లాంటి ఎంతోమంది చిత్రకారులను జహంగీర్ నియమించుకొన్నాడు. వేట, యుద్ధం, ఆస్థాన దృశ్యాలు, చిత్రలేఖనంతో పాటు వ్యక్తిగత చిత్రాల లేఖణన ప్రక్రియ (Portrait painting) జంతువుల చిత్రలేఖనం అభివృద్ధి చెందాయి. చిత్రాలు, దస్తూరి (Calligraphy) లతో కూడిన అనేక ఆల్బమ్లు మొగలుల కాలంలో రూపొందించబడ్డాయి. తరువాత కాలంనాటి చిత్రకళపై యూరప్ చిత్రలేఖనం ప్రభావం కన్పిస్తుంది. మొగలుల కాలంలో సంగీతం కూడా అభివృద్ధి చెందింది. అక్బర్ ఆస్థానంలో గ్వాలియర్కు చెందిన తాన్సేన్ అనే గొప్ప గాయకుడుండేవాడు. తాన్సేన్ గోరా, సనమ్ మొదలైన రాగాలకు స్వరాలెన్నింటినో కూర్పు చేశాడు. జహంగీర్, షాజహాన్లకు కూడా సంగీతంలో ప్రవేశం ఉండేది.

TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అక్బర్ రాజపుత్ర విధానాన్ని వివరించండి.
జవాబు.
రాజపుత్రులతో సంబంధాలు:అక్బర్ అనుసరించిన రాజపుత్ర విధానం ప్రసిద్ధమైంది. ఇతడు అంబర్రాజు రాజా భారామల్ కుమార్తెను వివాహమాడాడు. అక్బర్ అనేక రాజపుత్ర రాజ్యాలతో వివాహ సంబంధాలను ఏర్పాటు చేసుకొన్నాడు. ఇది మొగల్ చరిత్రలోనే ఒక ముఖ్యమైన మలుపు అని చెప్పవచ్చు. రాజపుత్రులు మొగలాయిలకు సేనాధిపతులుగా, మంత్రులుగా సేవలందించారు. రాజా భగవాన్ దాస్, రాజామాన్ సింగ్, రాజాతోడరమల్లను అక్బర్ సేనాధిపతులుగా నియమించుకొన్నాడు. జైసల్మీర్, బికనేర్, రణతంభోర్ మొదలైన రాజపుత్ర రాజ్యాలు అక్బర్కు లొంగిపోయాయి. కాని మేవార్ను పాలిస్తున్న రాణా ఉదయ సింహుడు, అతని కుమారుడు రాణా ప్రతాప సింహుడు అక్బర్ను ఎదిరించారు. 1576లో జరిగిన హాల్దీఘాట్ యుద్ధంలో రాణాప్రతాపసింహుడిని అక్బర్ సైన్యాధిపతి రాజామాన్ సింగ్ ఓడించాడు. మేవార్ ఓటమి తరువాత అనేక రాజపుత్ర రాజ్యాలు అక్బర్ సార్వభౌమత్వాన్ని అంగీకరించాయి.

అక్బర్ రాజపుత్ర విధానం అతడి విశాలమైన పరమత సహనంతో ముడిపడి ఉంది. అతడు తీర్థయాత్రల పన్నును, జిజియా పన్నును రద్దుచేశాడు. అక్బర్ రాజపుత్ర విధానం మొగలాయిలకు, రాజపుత్రులకు పరస్పరం మేలు చేసింది. రాజపుత్రులు తమ శక్తి సామార్థ్యాలను దేశానికి వినియోగపరచే అవకాశం లభించింది. దీని మూలంగా రాజస్థాన్లో శాంతి చేకూరింది. రాజపుత్రులు మొగలుల సేవలో చేరి ఉన్నతోద్యోగాలు పొందారు.

ప్రశ్న 2.
నూర్జహాన్పై లఘు సమాధానం రాయండి.
జవాబు.
జహాంగీర్ 1611లో నూర్జహాన్ (ప్రపంచ వెలుగు) ను వివాహమాడాడు. ఈమె అసలు పేరు మెహర్ ఉన్నీసా. ఈమె తండ్రి ఇతిమాదుద్దేలా (ఫియాస్ బేగ్)ను ముఖ్య దివాన్ గా నియమించుకొన్నాడు. జహాంగీర్ నూర్జహాన్ వివాహం తరువాత ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ప్రయోజనం పొందారు. నూర్జహాన్ జ్యేష్ఠ సోదరుడు ఆసఫ్గన్ ఖాన్-ఎ-సమన్ (అంతఃపుర వ్యవహారాలు) గా నియమింపబడ్డాడు. ఆసఖాన్ కూతురు అర్జమందా బానూ బేగం (ముంతాజ్)ను జహాంగీర్ మూడవ కుమారుడు కుర్రం (షాజహాన్) వివాహమాడాడు. నూర్జహాన్ వీరందరితో ఒక వర్గాన్ని ఏర్పాటు చేసిందని కొందరు ఆధునిక చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. నూర్జహాన్ వ్యతిరేకులు మరొక వర్గాన్ని ఏర్పాటు చేశారు. మొగలుల ఆస్థానంలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. జహాంగీర్ పూర్తిగా నూర్జహాన్ ప్రభావానికి లోనయ్యాడని భావించిన షాజహాన్ 1622లో తన తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. కాని ఈ వాదనను ఇతర చరిత్రకారులు అంగీకరించలేదు. ఎందుకంటే తన ఆరోగ్యం క్షీణించేవరకు అన్ని ముఖ్యమైన రాజకీయ నిర్ణయాలను తానే స్వయంగా తీసుకొన్నట్లు తన “స్వీయ చరిత్ర” లో జహంగీర్ పేర్కొన్నాడు.

నూర్జహాన్ షహ్రియార్ (జహాంగీర్ చిన్న కుమారుడు)ను చక్రవర్తిగా ప్రకటిస్తుందని భావించాడు. 1627లో జహాంగీర్ మరణించిన తరువాత షాజహాన్ సర్దారులు, సైన్యం మద్దతుతో తన వ్యతిరేకులందరినీ ఓడించి ఆగ్రా చేరుకొన్నాడు. నూర్జహాన్ అధికారాలు కోల్పోయి రాజకీయాల నుంచి నిష్క్రమించింది. షాజహాన్ నూర్జహాన్కు పింఛను ఏర్పాటు చేశాడు. జహాంగీర్ మరణించిన 18 సంవత్సరాల తరువాత నూర్జహాన్ లాహోర్లో మరణించింది.

ప్రశ్న 3.
మొగల్ సామ్రాజ్య పతనానికి గల కారణాలను రాయండి.
జవాబు.
బాబర్ 1526లో మొగల్ అధికారాన్ని స్థాపించగా, అక్బర్ కాలం నాటికి అత్యున్నత స్థాయికి చేరుకొంది. ఔరంగజేబు విశాలమైన సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. కాని జౌరంగజేబు మరణం తరువాత మొగల్ సామ్రాజ్యం త్వరితగతిన పతనమైంది. మొగల్ సామ్రాజ్య పతనానికి అనేక కారణాలున్నాయి.

(i) బలహీనమైన వారసులు:ఔరంగజేబు తరువాత వచ్చిన వారసులెవ్వరూ రాజ్యానికి సుస్థిరత కల్పించలేకపోయారు. వారిలో చాలామంది అసమర్థులు. మరికొందరు మంత్రుల చేతుల్లో కీలుబొమ్మలైనారు. 1707 నుంచి 1719 వరకు జరిగిన వారసత్వ యుద్ధాలు ఢిల్లీ నగరాన్ని రక్తసిక్తం చేశాయి. దీనివల్ల మొగల్ సామ్రాజ్యం బలహీనపడింది.

TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం

(ii) ప్రభువుల పాత్ర:ప్రభువుల మధ్య పర్షియన్, తురానీ, హిందుస్తానీ అనే విభేదాలుండేవి. ప్రభువుల మధ్య అంతఃకలహాలు మొగల్ సామ్రాజ్య పతనానికి దారితీశాయి. ప్రభువులు విశేషాధికారాలు పొందారు. వీరిలో చాలా మంది స్వార్థపరులై రాజకీయ కుట్రలు చేసి స్వాతంత్య్రం ప్రకటించుకొన్నారు.

(iii) విదేశీ దండయాత్రలు:మధ్య ఆసియా దండయాత్రలు మొగల్ సామ్రాజ్యానికి పెద్ద బెడదగా మారాయి. 1738-39 లో సాదిర్షా దండయాత్ర చేసి ఢిల్లీ నగరాన్ని దోచుకొన్నాడు. అహ్మద్ అబ్దాలీ (1748-1767) భారతదేశంపై ఏడుసార్లు దండయాత్ర చేసి మొగల్ సంపదను దోచుకొన్నాడు.

(iv) ఔరంగజేబు మత విధానం మొగల్ సామ్రాజ్య పతనానికి ప్రధాన కారణం – సిఖిు, మహారాష్ట్రులు విజృంభణ మొగల్ అధికారాన్ని ఆటంకపరచాయి.

(v) షాజహాన్ భవన నిర్మాణాల కోసం చాలా ఖర్చు చేశాడు. ఇది ఆర్థిక దివాలాకు దారితీసింది.

(vi) అధిక పన్నుల భారం, తప్పుడు ఆర్థిక విధానాలు, వ్యవసాయం, పరిశ్రమల్లో వెనకబాటుతనం, సైనిక బలహీనత, ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం మొదలైనవి మొగల్ సామ్రాజ్య పతనానికి దారి తీసింది.

ప్రశ్న 4.
మొగల్ వాస్తు, కళలపై సమాధానం రాయండి.
జవాబు.
మొగల్ పాలకులు యుద్ధ విజేతలే కాక కళా, సాంస్కృతిక రంగాల పోషకులుగా కూడా ప్రసిద్ధి చెందారు. ఔరంగజేబు మినహా మిగతావారందరూ పండితులు, చిత్రకారులు, శిల్పులను పోషించారు. అంతేకాక కొందరు రాజులు, కవులు, చిత్రకారులు. బాబర్, హుమాయూన్, జహంగీర్లు స్వయంగా రచయితలే కాక పండిత పోషకులు. అక్బర్ నిరక్షరాస్యుడైనప్పటికీ కళల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాడు.

బాబర్ కేవలం సమాధులు, చెరువులను నిర్మించాడు. అక్బర్ నిర్మాణాలలో పర్షియన్, హిందూ పద్ధతులు కనిపిస్తాయి. జామియా మసీద్, బీర్బల్ భవనం, ఆగ్రా కోట, జహంగీర్ భవనం, దివాన్-ఇ-ఆమ్, దివాన్-ఇ-ఖాస్, బులంద్ దర్వాజా మొదలైనవి అక్బర్ కాలంనాటి నిర్మాణాలు. జహంగీర్ శిల్పకళ కంటే చిత్రకళపై ప్రత్యేక ఆసక్తిని కనబరచాడు. అబ్దుల్ సమద్, దశావంత్, బసవన్, హసన్ మొగలుల కాలంనాటి ప్రఖ్యాత చిత్రకారులు. షాజహాన్ కాలంలో శిల్పకళ ఉన్నతస్థాయికి చేరి స్వర్ణయుగంగా పేరొందింది. షాజహానాబాద్, దివాన్-ఇ-ఆమ్, దివాన్-ఇ-ఖాస్, ఎర్రకోట, తాజ్మహల్, ముసల్మాన్ బురుజు, మోతీమసీదు షాజహాన్ కాలంనాటి నిర్మాణాలు. వీటివలన షాజహాన్ ‘ఇంజనీర్ రాజు’గా పిలవబడ్డాడు. ఔరంగజేబు శిల్పకళ, చిత్రకళను నిషేధించాడు.

ప్రశ్న 5.
మొగలుల కాలంలో సాహిత్యాభివృద్ధిని చర్చించండి.
జవాబు.
జహాంగీర్ ఆత్మకథ ‘తుజుక్-ఇ-జహాంగీరి’ రచనా శైలిలో ప్రముఖమైంది. ఘియాస్ బేగ్, నఖీబ్ ఖాన్, నయామతుల్లా లాంటి అనేక మంది పండితులను జహాంగీర్ ఆదరించాడు. అబ్దుల్ హామీద్ లాహోరి, ఇనాయత్ ఖాన్ వంటి రచయితలు, చరిత్రకారులను షాజహాన్ ఆదరించాడు. అబ్దుల్హామీద్ లాహోరి ‘పాదుషానామా’ను ఇనాయత్ ఖాన్ “షాజహాన్ నామా” ను రచించారు. షాజహాన్ కుమారుడు దారాషికో భగవద్గీత, ఉపనిషత్తులను పర్షియా భాషలోకి అనువదించాడు. ఔరంగజేబు కాలంలో కూడా చాలా చారిత్రక గ్రంథాలు రాయబడ్డాయి. పార్శీ భాషలోనున్న ప్రముఖ పదకోశాలన్నీ మొగలుల కాలంలో సంకలనం చేయబడ్డాయి.

మొగల్ యుగంలో బెంగాల్, ఒడియా, హిందీ, రాజస్థాని, గుజరాతి మొదలైన ప్రాంతీయ భాషలు అభివృద్ధి చెందాయి. భర్తి పూర్వక గ్రంథాలు ముఖ్యంగా రామాయణ, మహాభారతం లాంటి గ్రంథాలు ప్రాంతీయ భాషల్లోకి అనువదించబడ్డాయి. అక్బర్ కాలం నుంచి హిందీ కవులు, పండితులు ఆదరణ పొందారు. వీరిలో తులసీదాసు చాలా గొప్పవాడు. ఇతడు రామాయణాన్ని హిందీ భాషలో ‘రామచరితమానస్’ పేరుతో రాశాడు.

ప్రశ్న 6.
మీకు ఇచ్చిన పటంలో అక్బర్, షేర్షా సామ్రాజ్యాలను సూచించి కింది ప్రదేశాలను గుర్తించండి.
జవాబు.
ఎ) ఢిల్లీ
బి) ఆగ్రా
సి) మేవార్
డి) గుజరాత్
ఇ) బెంగాల

ఎ) పానిపట్
బి) కనూజ్
సి) చిత్తోర్
డి) ఉజ్జయిని
ఇ) అమర్కోట

ఎ) చూనార్
బి) ససారాం
సి) గౌర్
డి) చందేరి
ఇ) ఆగ్రా
జవాబు.
TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం 1
TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం 2

TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బాబర్ నామా ప్రాధాన్యత.
జవాబు.
మధ్యయుగ భారతదేశ చరిత్రలో గణనీయమైన వ్యక్తులలో బాబర్ ఒకడు. భారతదేశంలో మొగల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఘనుడు బాబరు. క్రీ.శ. 1526లో మొదటి పానిపట్టు యుద్ధంలో ఢిల్లీ సుల్తాన్ అగు ఇబ్రహీం లోడిని వధించి ఢిల్లీ, ఆగ్రాలు ఆక్రమించి మొగల్ సామ్రాజ్యస్థాపన చేసాడు.

బాబర్ టర్కీ భాషలో గొప్ప పండితుడు. టర్కీ భాషలో బాబర్ రాసుకున్న స్వీయచరిత్ర తుజ్-కె-ఇ-బాబరీ (తన ఆత్మకథ). మొగల్ యుగమున రాయబడిన తొలి చారిత్రక గ్రంథము. ఈ గ్రంథం బాబర్ తురుష్క భాషా ప్రావీణ్యాన్ని, నాటి సమకాలీన పరిస్థితులను, హుమాయూన్ తొలి జీవితాన్ని తెలుసుకోవడానికి దోహదపడుతుంది. మధ్యయుగ ఆత్మకథల్లో దీనికి గణనీయమైన ప్రాధాన్యం ఉంది.

ప్రశ్న 2.
మొగల్ చరిత్రలో నూర్జహాన్ స్థానం.
జవాబు.
మొగల్ చక్రవర్తి జహంగీర్ నూర్జహాన్ను వివాహం చేసుకోవడమనేది జహంగీర్ కాలంలో మరొక ప్రధాన ఘట్టం. నూర్జహాన్ అసలు పేరు మెహ్రున్నీసా. ఈమెను సలీం (జహంగీర్) ప్రేమించాడని, వీరి ప్రేమని ఇష్టపడని అక్బర్ ఈమెను షేర్ ఆఫ్ఘనికిచ్చి వివాహం చేసాడని, సలీం రాజైనాక షేర్ ఆఫ్గన్ను వధించి ఆమెను వివాహం చేసుకున్నాడని కొందరు చరిత్రకారుల కథనం. క్రీ.శ.1611లో వివాహానంతరం ప్రధాన పాత్రధారి అయి అధికారాన్నంతా హస్తగతం చేసుకుని సింహాసనం వెనకుండి పాలన చేసింది. నాణాలపై తన పేరు ముద్రింపజేసుకుంది. తన తల్లిదండ్రులను, బంధువులను దర్బారు ఉన్నత పదవుల్లో నియమించింది. ఇది ఖుర్రం తిరుగుబాటుకు, వారసత్వ యుద్ధానికి కారణమైంది.

ప్రశ్న 3.
తాజ్మహల్ కీర్తిని చర్చించండి.
జవాబు.
షాజహాన్ గొప్ప భవన నిర్మాత. షాజహాన్ ఎర్రకోట జామామసీద్, దివాన్-ఇ-ఆమ్, దివాన్ ఖాస్ కట్టించాడు.
షాజహాన్ నిర్మాణాలన్నింటిలోను తలమానికమైనది తాజ్మహల్. ఆగ్రాలో యమునానది ఒడ్డున తన పట్టమనిషి ముంతాజ్భగం సంస్మరణార్థం నిర్మించాడు. దీనిని ప్రపంచ అద్భుత కట్టడాలలో ఒకటిగా భావిస్తారు. దీని నిర్మాణానికి 22 సంవత్సరాలు పట్టింది. ఆ రోజుల్లోనే నాలుగున్నర మిలియన్ల పౌన్లు ఖర్చయింది. ఉస్తాద్ ఈసా దీని శిల్పి. అయితే తాజ్మహల్ను షాజహాన్ కట్టించలేదని, బాబర్ కాలం నాటికే అక్కడ ఉందని ఇది రాజపుత్రుల నిర్మాణమని ఇటీవల కొందరు చారిత్రక పరిశోధకులు ప్రకటించారు. తాజ్మహల్ శివాలయమని ప్రొ.పి.యన్.వోక్ కథనం. కాలగమనంలో నిజం నిగ్గుతేలుతుందని ఆశిద్దాం. ఏది ఏమైనా తాజ్మహల్ కట్టడం ఓ అద్భుతం.

ప్రశ్న 4.
రెండవ పానిపట్ యుద్ధం ప్రాధాన్యత.
జవాబు.
అక్బర్ (క్రీ.శ. 1556–1605):భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో అక్బర్ ఒకరు. ఇతని తండ్రి హుమాయూన్ మరణించిన తరువాత రాజ్యానికి వచ్చాడు. ఆఫ్ఘనుల సేనాధిపతి హేము ఢిల్లీని ఆక్రమించి ‘విక్రమాదిత్య’ అనే బిరుదు ధరించాడు. 1556లో జరిగిన రెండవ పానిపట్ యుద్ధంలో మొదట హేముకే విజయావకాశాలు దగ్గరయ్యాయి. కాని కంటికి బలమైన గాయం తగలడం వల్ల అతడు స్పృహ కోల్పోయాడు. నాయకత్వం కోల్పోయిన ఆఫ్ఘన్ సైన్యం చెల్లాచెదురైంది. మొగలాయిలు అఫ్ఘనులపై శాశ్వతంగా విజయం సాధించారు. భారతదేశంలో మొగల్ సామ్రాజ్యం సుస్థిరమైంది.

TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం

ప్రశ్న 5.
ఇబాదత్ ఖానా గురించి రాయండి.
జవాబు.
తన కొత్త రాజధాని ఫతేపూర్ సిక్రిలో 1575లో ఇబాదత్ ఖానా (పూజామందిరం) అనే భవనాన్ని నిర్మించాడు. హిందూ, జైన, బౌద్ధ, పారశీక, క్రైస్తవ, ఇస్లాం మొదలైన అన్ని మతాల పండితులను ఆహ్వానించి మత చర్చలు జరిపాడు.

ప్రశ్న 6.
దీన్-ఇ-ఇలాహి ముఖ్య లక్షణాలు.
జవాబు.
అక్బర్ విభిన్న మతగురువులతో ఆయా మత సిద్ధాంతాల గురించి తరచూ చర్చలు జరిపేవాడు. వాటి ఫలితంగా అతనికి కలిగిన అవగాహనతో క్రీ.శ. 1581లో దీన్-ఇ-ఇలాహి అనే నూతన మతాన్ని స్థాపించాడు. ఈ మతం వారు చక్రవర్తి కోసం ధన, మాన, ప్రాణాలను అర్పించాలి, మాంసాహారాన్ని మానివేయాలి, ఒకరికొకరు ఎదురైనపుడు అల్లాహా అక్బర్ అని సంభోదించుకోవాలి. అయితే ఈ మతాన్ని స్వీకరించమని అక్బర్ ఎవరినీ బలవంతపెట్టలేదు. బీర్బల్, అబుల్ఫజర్ వంటి కొందరే చేరారు. అబుల్ఫజల్ దీన్-ఇ-ఇలాహిన గురించి పేర్కొంటూ ఇది అందరి దీవెనలను అందుకోవడానికి ఉద్దేశింపబడిన నూతన విశ్వాసమార్గమన్నాడు. ఇది అక్బర్తోనే అంతరించిపోయింది.

ప్రశ్న 7.
ఫతేపూర్ సిక్రీ.
జవాబు.
అక్బర్ కూడా ఫతేపూర్ సిక్రీ వద్ద రాజభవనం కోటల సముదాయం నిర్మించాడు. ఇది ఆగ్రాకు 36 కి.మీ. దూరంలో కలదు. గుజరాత్, బెంగాలీ నిర్మాణ శైలి అందులో ప్రతిబింబిస్తుంది. గుజరాత్ నిర్మాణ శైలిని రాజపుత్ర రాణుల కోసం నిర్మించిన భవనాలలో వినియోగించాడు. కాని అన్నింటికంటే ముఖ్యమైన నిర్మాణం మాత్రం అక్కడి జమా మసీదు, ఫతేపూర్ సిక్రీకి ద్వారమైన బులంద్ దర్వాజా. దీని ఎత్తు 176 అడుగులు. అక్బర్ గుజరాత్ విజయానికి చిహ్నంగా దీనిని నిర్మించాడు. ఫతేపూర్ సిక్రీలోని ఇతర ముఖ్యమైన భవనాలలో జోధాభాయి రాజభవనం, అయిదు అంతస్థులతో ఉన్న పంచమహల్ కలవు.

ప్రశ్న 8.
షాజహాన్ కాలంనాటి నిర్మాణాల గురించి రాయండి.
జవాబు.
షాజహాన్ తాజ్మహల్ నిర్మాణంలో ‘పీత్రదురా’ పద్ధతిని భారీ ఎత్తున ఉపయోగించాడు. భవన నిర్మాణ కళలో తాజ్మహల్ ఒక అద్భుతంగా నిలిచిపోయింది. మొగలులు అభివృద్ధిపరచిన అన్ని వాస్తు కళాశైలుల సమ్మేళనమే తాజ్మహల్. తాజ్మహల్ అందానికి కారణం దాని విశాలమైన పాలరాతి గోపురం, నాలుగు సన్నటి మినార్లు. అందమైన తోట మధ్యలో నిర్మితం కావడంతో ఆ కట్టడానికి ఎనలేని అందం తెచ్చిపెట్టింది.

TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం

షాజహాన్ పాలనలో మసీదుల నిర్మాణం కూడా ఉన్నత దశకు చేరుకొంది. ఆగ్రా కోటలో పాలరాతితో మోతి మసీదు నిర్మించబడింది. ఢిల్లీలో జామా మసీదు ఎర్రటి ఇసుక రాయితో నిర్మించబడింది.

మొగల్ వాస్తుకళ 18, 19వ శతాబ్దం తొలి దశకాల వరకు నిరాఘాటంగా కొనసాగింది. మొగల్ నిర్మాణ శైలి ప్రాంతీయ, స్థానిక రాజ్యాల కట్టడాలపై సైతం ప్రభావం చూపింది. అమృత్సర్లోని సిఖి స్వర్ణదేవాలయం కూడా మొగల్ వాస్తు సంప్రదాయ శైలిలో నిర్మితమైంది.

TS Inter 1st Year History Study Material Chapter 15 జాతీయ ఉద్యమం – మలిదశ

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 15th Lesson జాతీయ ఉద్యమం – మలిదశ Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 15th Lesson జాతీయ ఉద్యమం – మలిదశ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
1920 – 22లో జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని వివరించండి.
జవాబు.
గాంధీ నాయకత్వంలో జాతీయ కాంగ్రెస్ నిర్వహించిన ఉద్యమాల్లో మొదటిది సహాయ నిరాకరణోద్యమం. ఖిలాఫత్ ఉద్యమ సందర్భంగా వ్యక్తమైన హిందూ, ముస్లిం సంఘీభావం గాంధీని సహాయ నిరాకరణోద్యమానికి పురికొల్పింది. 1920 సెప్టెంబరులో కలకత్తాలో లాలాలజపతిరాయ్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమ తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. తీర్మానం ఆమోదించడమైంది. 1920 డిసెంబర్లో విజయరాఘవాచారి అధ్యక్షతన నాగపూర్లో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశంలో దాన్ని ధృవీకరించడమైంది. రెండు సమావేశాల్లోనూ బెంగాల్ నాయకుడు చిత్తరంజన్దాస్ నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. దాస్ సూచనలను కూడా తీర్మానంలో చేర్చడం ద్వారా గాంధీ ఆయనను సమ్మతింపచేశాడు.

TS Inter 1st Year History Study Material Chapter 15 జాతీయ ఉద్యమం – మలిదశ

ఉద్యమ కార్యక్రమం: ఈ ఉద్యమానికి మూడు అంశాల కార్యక్రమం కలదు. అవి: బహిష్కరణ, నిర్మాణాత్మక కార్యక్రమాలు, శాసనోల్లంఘనం.

బహిష్కరణ:

  1. ప్రభుత్వం ఇచ్చిన బిరుదులు, పదవులను త్యజించడం.
  2. ప్రభుత్వం ఏర్పాటు చేసే సన్మానాలు, తదితర కార్యక్రమాలను బహిష్కరించడం.
  3. విద్యార్థులు ప్రభుత్వ విద్యాలయాలను బహిష్కరించడం.
  4. ప్రభుత్వోద్యోగాలకు రాజీనామా చేయడం.
  5. ప్రభుత్వ న్యాయస్థానాలను బహిష్కరించడం.
  6. విదేశీ వస్త్రాలను, వస్తువులను బహిష్కరించడం.
  7. శాసనసభలకు జరిగే ఎన్నికలను బహిష్కరించడం.
  8. 1921లో ఇంగ్లాండ్ దేశపు యువరాజు పర్యటన బహిష్కరించడం మొదలైనవి బహిష్కరణోద్యమంలో ముఖ్యమైనవి.

నిర్మాణాత్మక కార్యక్రమాలు:

  1. తిలక్ స్మారక నిధికి విరాళాలు వసూలు చేయడం.
  2. రాట్నాలపై నూలు వడికి, ఖద్దరు వస్త్రాలు తయారుచేయడం.
  3. అస్పృశ్యతను నిర్మూలించడం.
  4. మద్యపాన నిషేధానికి అనుకూలంగా ఉద్యమం నడపడం.
  5. జాతీయ విద్యాలయాలు నెలకొల్పడం.
  6. హిందూ, ముస్లిం సమైక్యతను సాధించడం అనేవి నిర్మాణాత్మక కార్యక్రమాలు.

శాసనోల్లంఘనం: పన్నులు చెల్లించటం, నిరాకరించటం ద్వారా కాంగ్రెస్ శాసనోల్లంఘనాన్ని చేపట్టాలని నిర్ణయించింది.

ఉద్యమ గమనం: 1920లో ప్రారంభించిన ఈ ఉద్యమంలో ప్రజలు తమ విభేదాలను మరిచి చురుకుగా పాల్గొన్నారు. బ్రిటిష్ విద్యాసంస్థలను బహిష్కరించి జాతీయ విద్యాసంస్థలను నెలకొల్పారు. నెహ్రూ, చిత్తరంజన్ దాస్, ప్రకాశం పంతులు మొదలైన నాయకులు న్యాయస్థానాలను బహిష్కరించి న్యాయవాద వృత్తిని త్యజించారు. సుభాష్ చంద్రబోస్ మొదలైనవారు తమ ప్రభుత్వ పదవులకు రాజీనామా చేశారు. ప్రజలు విదేశీ వస్తువులను బహిష్కరించి ఖద్దరు వాడకాన్ని ప్రోత్సహించారు. హిందువుల ఐక్యతను పెంపొందించటానికి అస్పృశ్యతా నివారణను చేపట్టారు.

ఈ ఉద్యమం ఆంధ్రాలో అద్భుత విజయాన్ని సాధించింది. చీరాల-పేరాల సత్యాగ్రహం, పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం, పల్నాడు పుల్లరి సత్యాగ్రహాలు జరిగాయి. పంజాబ్లో అకాలీలు మహంతులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వహించారు. భారతదేశ సందర్శనానికి వచ్చిన వేల్స్ యువరాజు బహిష్కరించబడ్డాడు. ఈ ఉద్యమాన్ని అణచడానికి ప్రభుత్వం దమనకాండను సాగించింది. అయినప్పటికి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇంతలోనే ఉత్తరప్రదేశ్లోని చౌరీచౌరా అనేచోట హింస చెలరేగి అది అనేకమంది పోలీసులు సజీవదహనానికి దారితీసింది. హింసను సహించలేని గాంధీజీ ప్రజలు ఇంకా అహింసా పద్ధతులకు అలవాటుపడలేదని భావించి ఉద్యమాన్ని నిలుపు చేశాడు.

ఫలితాలు: సహాయ నిరాకరణోద్యమం అనేక గొప్ప ఫలితాలనిచ్చింది.

  1. భారత ప్రజలలోను, కాంగ్రెస్ నాయకులలోను నిరాశ ఏర్పడింది. దీని ఫలితంగా కాంగ్రెస్లోలో చీలిక వచ్చింది.
  2. ఉద్యమ కాలంలో హిందూ – మహమ్మదీయుల ఐక్యత సాధించబడింది.
  3. ఈ ఉద్యమ ప్రభావం వల్ల జాతీయభావం దేశం నలుమూలలా విస్తరించింది.
  4. ప్రజలలో ప్రభుత్వమంటే భయంపోయి వారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది.
  5. కాంగ్రెస్లో వామపక్ష ధోరణులు ప్రారంభమైనాయి.
  6. ప్రభుత్వం దమననీతిని ఎదుర్కొనేందుకు భారతీయ యువత విప్లవోద్యమానికి దిగింది.
  7. ఈ ఉద్యమ విరమణ అనంతరం కాంగ్రెస్-లీగ్ మిత్రత్వం రద్దయింది. ఫలితంగా హిందువులు, ముస్లింల మధ్య మత కల్లోలాలు చెలరేగాయి.

ప్రశ్న 2.
1935 భారత ప్రభుత్వ చట్టంలోని లక్షణాలను వివరించండి.
జవాబు.
ఈ చట్టంలోని ముఖ్య అంశాలు:

  1. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించడం.
  2. కేంద్రంలో భారతీయులకు పరిమిత అధికారాలను కల్పించడం.
  3. సమాఖ్య ఏర్పాటు.
  4. ఫెడరల్ కోర్టు ఏర్పాటు.

కేంద్ర ప్రభుత్వం: 1919 చట్టం ప్రకారం రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తూ ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది.

కేంద్ర శాసనసభ: ఇందులో ఎన్నుకోబడిన సభ్యులు ఉండేవారు. ఓటర్ల సంఖ్య 10 శాతం పెంచబడింది. శాసన సభలో రాష్ట్రం శాసనసభల నుంచి 260 మంది సభ్యులు, సమాఖ్య శాసనసభలో 375 మంది ఉండేవారు. అయితే స్థానిక పాలకులు ఇందులో చేరేందుకు ఆసక్తి చూపకపోవడంతో సమాఖ్య శాసనసభ అమలులోకి రాలేదు. ఈ చట్టం భారతదేశం నుంచి బర్మాను వేరు చేసింది.

TS Inter 1st Year History Study Material Chapter 15 జాతీయ ఉద్యమం – మలిదశ

ప్రాంతీయ ప్రభుత్వం: ఈ చట్టం ప్రాంతీయ ప్రభుత్వాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని నిషేధించి ప్రాంతీయ ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తిని కల్గించింది. శాసన సభలోని అత్యధిక మెజారిటీ సాధించిన పార్టీ నుంచి గవర్నర్ మంత్రులను నియమిస్తాడు. ఈ మంత్రులు బదిలీ చేయబడిన అంశాలకు బాధ్యత వహిస్తారు. వీరు శాసన సభకు మాత్రమే బాధ్యత వహిస్తారు. గవర్నర్లు మంత్రుల సలహాలకై బద్ధులై ఉంటారు. కానీ ఆచరణలో శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తిరస్కరించేవాడు. స్థానిక ప్రభుత్వంలో 1935 చట్టం అమలు చేయడానికి రెండు సంవత్సరాలు పట్టింది.

ప్రశ్న 3.
క్రిప్స్ రాయబారాన్ని వివరించండి.
జవాబు.
1942లో జపాన్, బర్మాలోని రంగూన్ను ఆక్రమించినపుడు భయపడిన బ్రిటీష్ ప్రభుత్వం కాబినెట్ సభ్యుడు స్టాఫర్డ్ క్రిప్సన్న చర్చల నిమిత్తం భారతదేశానికి పంపింది. యుద్ధంలో బ్రిటీష్వారి పరిస్థితి ఓడిపోయే పరిస్థితిలో ఉంది. భారతదేశం అవసరం తప్పనిసరి అయింది. అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్డ్ ఇంగ్లాండ్ ప్రధాని విన్సెంట్ చర్చిల్పై భారతదేశాన్ని యుద్ధంలోకి చేర్చుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. ఫలితంగా 1947లో క్రిప్స్ రాయబారం భారతదేశానికి వచ్చి కొన్ని ప్రతిపాదనలను సూచించింది. అవి:

  1. యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశానికి అధిక దేశ ప్రతిపత్తినియ్యాలి.
  2. నూతన రాజ్యాంగం ఏర్పాటు చేయడానికి ఎన్నికైన సభ్యులతో రాజ్యాంగ రచన కమిటీని వేయాలి.
  3. కేంద్రంలో సమాఖ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. రాష్ట్రాలు అందులో చేరుతాయా లేదా అనేది వాటి నిర్ణయానికి వదిలివేయాలి.

కాంగ్రెస్ ఈ ప్రతిపాదనలను తిరస్కరించింది. గాంధీ దీన్ని దివాలా తీసిన బ్యాంకుపై రాబోయే తేదీ వేసిన చెక్కుగా వల్లించాడు. దానిలో పాకిస్థాన్ ప్రస్థావన లేనందున ముస్లింలీగ్ కూడా ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. ఫలితంగా క్రిప్స్ రాయబారం తన ఉద్దేశాన్ని నెరవేర్చడంలో విఫలమయింది.

ప్రశ్న 4.
1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహాన్ని వివరించండి.
జవాబు.
భారత స్వాతంత్ర పోరాటంలో ఉప్పు సత్యాగ్రహంతో ప్రారంభమైన శాసనోల్లంఘన ఉద్యమం ఒక ప్రధాన ఘట్టం. ఈ ఉద్యమం ద్వారా లక్షలాది ప్రజలు స్వతంత్ర పోరాటంలో భాగమయ్యారు. విదేశీ పాలనకు వ్యతిరేకంగా గాంధీ నాయకత్వంలో శాసనోల్లంఘన ఉద్యమం ఒక ప్రజా ఉద్యమంగా ఉపఖండమంతా వ్యాపించింది.

1929 డిసెంబర్లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన లాహోర్ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్యమే అంతిమ లక్ష్యంగా ప్రకటించారు. రౌండ్ టేబుల్ సమావేశాలను బహిష్కరించి శాసనోల్లంఘన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు.

గాంధీజీ నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ 1930, మార్చి 12న చారిత్రాత్మకమైన శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించింది. కాంగ్రెస్ శాసనసభ్యులందరూ తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామాలు సమర్పించాలని ఆదేశించింది. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకుల ఆవేశాలను చల్లార్చేందుకు గాంధీజీ ప్రయత్నించాడు. ఈ సందర్భంలో గాంధీజీ చివరి ప్రయత్నం చేస్తూ రాజ ప్రతినిధి ఇర్విన్ను సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నించాలని హెచ్చరించాడు. రాజ ప్రతినిధి ఇర్విన్ ఆ హెచ్చరికను పెడచెవిన పెట్టడంతో గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించేందుకు నిర్ణయించాడు.

శాసనోల్లంఘన ఉద్యమం మూడు దశలుగా జరిగింది. అవి:

  1. మొదటి దశ (1930 మార్చి 12 – 1932 జనవరి 3 వరకు)
  2. రెండో దశ (1932 జనవరి 4 – 1933 జులై 11 వరకు)
  3. మూడో దశ (1933 జులై 12 – 1934 మే వరకు)

మొదటి దశ: దీనినే ఉప్పు సత్యాగ్రహ దశగా వర్ణించవచ్చు. ఈ ఉద్యమంను గాంధీజీ 1930, మార్చి 12వ తేదీన సబర్మతీ ఆశ్రమం నుంచి 78 మంది అనుచరులతో ప్రారంభించాడు. అతడు 200 మైళ్ళ దూరంలో అరేబియా సముద్రతీరం వద్ద గల దండి గ్రామాన్ని కాలిబాటన చేరుకొని ఉప్పును తయారుచేసేందుకు ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించాడు. దీంతో దేశవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు సామూహిక ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా గాంధీజీ ప్రజలకు విజ్ఞప్తి చేసిన కార్యక్రమాలు:

  1. మద్యపాన దుకాణాలు, విదేశీ వస్త్ర విక్రయశాలల ఎదుట పికెటింగ్.
  2. రాట్నాల ద్వారా ఖద్దరు వడకటం.
  3. హిందూ-ముస్లింల మధ్య సంబంధాల పటిష్టత.
  4. అస్పృశ్యతా నివారణ.

ఉప్పు సత్యాగ్రహ పర్యవసానం:

  • బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీని నిర్బంధంలోనికి తీసుకొని ఎర్రవాడ కారాగారంలో ఉంచింది. దీంతో కోపోద్రిక్తులైన ప్రజలు దేశమంతటా హర్తాళ్ పాటించారు.
  • అనేకమంది ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేశారు.
  • 1930-32 మధ్యకాలంలో లండన్లో బ్రిటిష్ ప్రభుత్వం మూడు రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పరచింది.
  • రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీజీ పాల్గొని అల్పసంఖ్యాకుల ప్రాతినిధ్యం కంటే రాజ్యాంగ నిర్మాణమే ప్రధాన అంశమని వాదించాడు.
    కాని ఆయన వాదనలు ఆమోదయోగ్యం కాకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి.

రెండో దశ:

  1. ఈ దశలో గాంధీజీని, ఇతర నాయకులను 1932, జనవరి 14న నిర్బంధంలో ఉంచడం జరిగింది. కాని ప్రజలు పికెటింగ్ను చేపట్టడం జరిగింది.
  2. బ్రిటీష్ ప్రభుత్వం విధించిన నిషేధాజ్ఞలు ధిక్కరించి సమావేశాలు నిర్వహించడం, కరపత్రాల ముద్రణ వంటి చర్యలు అమలుచేయడం జరిగింది.
  3. బ్రిటీష్ ప్రభుత్వం అన్ని రకాల ఊరేగింపులను నిషేధించింది.
  4. ముస్లిం నాయకులు మినహా, జాతీయ నాయకులందరూ బ్రిటీష్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ 1932, ఆగస్టు 10న ప్రకటించిన “కమ్యూనల్ అవార్డు”ను వ్యతిరేకించారు.
  5. కమ్యూనల్ అవార్డును వ్యతిరేకిస్తూ ఎర్రవాడ కారాగారంలో గాంధీజీ 1932, సెప్టెంబర్ 20న ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించారు.
  6. బ్రిటీష్ ప్రభుత్వం, గాంధీజీ సంప్రదింపుల ఫలితంగా బ్రిటీష్ ప్రభుత్వం గాంధీజీ డిమాండ్లలో కొన్నింటికి ఆమోదం
    తెలిపింది.
  7. బ్రిటీష్ ప్రభుత్వం తమకు విధేయులైన నాయకులతో లండన్లో 1932, నవంబర్ 17 డిసెంబర్ 24 మధ్య మూడో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో మహిళలకు ఓటుహక్కు వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

మూడో దశ:-

  1. 1933 జులైలో గాంధీజీ, మరికొంతమంది నాయకులు వ్యక్తిగత శాసనోల్లంఘన ఉద్యమానికి ఉపక్రమించారు. వారిని బ్రిటీష్ ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది.
  2. కారాగారంలో గాంధీజీ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయనను బ్రిటీష్ ప్రభుత్వం విడుదల చేసింది.
  3. 1934 మే నెలలో పాట్నాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఉపసంహరించుకొంటున్నట్లు ప్రకటించింది.

ప్రశ్న 5.
భారత స్వాతంత్రోద్యమంలో సుభాష్ చంద్రబోస్ పాత్రను వివరించండి.
జవాబు.
భారత జాతీయోద్యమ చరిత్రలో ప్రముఖ స్థానాన్ని పొందిన దేశభక్తుడు సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ ఐ.సి.ఎస్ పరీక్ష పాసై సివిల్ సర్వెంట్గా తన జీవితాన్ని ప్రారంభించాడు. అయితే సహాయ నిరాకరణోద్యమ ప్రభావానికిలోనై తన సివిల్ సర్వీసు ఉద్యోగానికి రాజీనామా చేసి జాతీయోద్యమంలో పాల్గొన్నాడు.

కాంగ్రెస్ పాత్ర: సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ రాజకీయాల్లో పాల్గొన్నాడు. 1938లో హరిపూర్లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడయ్యాడు. 1939లో త్రిపుర కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ అభ్యర్థియైన భోగరాజు పట్టాభి సీతారామయ్యను ఓడించి పార్టీ అధ్యక్షుడిగా గెలుపొందాడు. అయితే కాంగ్రెస్ అనుసరిస్తున్న శాంతియుత విధానాల యెడల బోస్కు విశ్వాసం లేదు. అందువల్ల గాంధీజీతో బోస్కు తీవ్రమైన భేదాభిప్రాయాలు -కలిగాయి. అందువల్ల కాంగ్రెస్ నుంచి వైదొలగి ‘ఫార్వర్డ్ బ్లాక్’ అనే కొత్త పార్టీని స్థాపించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 15 జాతీయ ఉద్యమం – మలిదశ

ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపన: బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి వెళ్లగొట్టాలంటే రెండవ ప్రపంచ యుద్ధం సరైన అవకాశమని బోస్ భావించాడు. అయితే యుద్ధకాలంలో బోస్ ను ప్రభుత్వం నిర్బంధించింది. బోస్ 1941లో నిర్భంధం నుంచి తప్పించుకొని మొదట రష్యాకు, తరువాత జర్మనీకి, జపాన్కు వెళ్ళాడు. యుద్ధసమయంలో ఆ దేశాల సహాయంతో ఇంగ్లీషువారితో పోరాడి, దేశానికి స్వాతంత్య్రం సాధించవచ్చని బోస్ తలచాడు. యుద్ధంలో జపాన్కు చిక్కిన భారతీయ యుద్ధఖైదీలందరినీ కూడగట్టుకొని 1943లో సింగపూర్లో ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ లేక ‘ఇండియన్ నేషనల్ ఆర్మీ’ని స్థాపించాడు. ఐ.ఎన్.ఏ. స్థాపనలో బోస్కు రాస్ బిహారీ బోస్, మోహన్సింగ్లు సహకరించారు. ఐ.ఎన్.ఏలో చేరిన సేనలు బోసు “నేతాజీ” అని గౌరవంగా పిలిచేవారు. “జైహింద్” అనే నినాదాన్ని చేపట్టి బోస్ తన అనుచరులందరితో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి “ఛలో ఢిల్లీ” అంటూ భారతదేశంలో ఇంఫాల్ సమీపంలోని మోయిరాంగ్ వరకు వచ్చాడు. ఆయనకు తోడుగా వీరవనిత కెప్టెన్ లక్ష్మి మహిళలతో ఏర్పడిన ఝాన్సీరాణి దళనేత అయింది. ఆయన నాయకత్వంలోని ఐ.ఎన్.ఏ. సైన్యాలు దేశ స్వాతంత్ర్యానికి ప్రాణాలొడ్డి పోరాడాయి. కానీ దురదృష్టవశాత్తు 1945 సెప్టెంబర్లో జపాన్ ఓడిపోవటంతో బోస్ ప్రయత్నాలు విఫలమైనాయి. తన ప్రయత్నాలు కార్యరూపం ధరించకుండానే బోస్ 1945లో ఒక విమాన ప్రమాదంలో మరణించాడు.

ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యుల విచారణ: యుద్ధానంతరం ప్రభుత్వం ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ సేనలను ఇండియాపై దాడిచేయడానికి ప్రయత్నించినందున దేశద్రోహులుగా ప్రకటించి ఎర్రకోటలో విచారణ జరిపించింది. సైనిక నాయకులైన మేజర్ జనరల్ షానవాజ్ ఖాన్ (ముస్లిం), కల్నల్ జి.ఎస్. ధిల్లాన్ (సిక్కు), మేజర్ ప్రేమ్ సెహగల్ (హిందూ) లపై విచారణ జరిపించింది. వారి తరఫున జవహర్లాల్ నెహ్రూ, తేజబహదూర్ సప్రూ, భూలాబాయ్ దేశాయ్ు వాదించారు. అయినప్పటికీ ప్రత్యేక న్యాయస్థానం వారికి శిక్షలు విధించింది. కానీ ఆ శిక్షలకు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవటంతో ప్రజాభిప్రాయాన్ని మన్నించి, ప్రభుత్వం వారిని విడుదల చేసింది. దీనితో ప్రజలకు, సైనికులకు ప్రభుత్వం పట్ల భయభక్తులు పోయాయి. హిందూ, సిక్కు, ముస్లింల సేనలను విచారించటం వలన కాంగ్రెస్, లీగ్లు సమైక్యంగా పోరాడాయి.

ఘనత: సుభాష్ చంద్రబోస్ విజయాన్ని సాధించలేకపోయినా, ఆయన ధైర్యసాహసాలు దేశంలో చాలామందికి స్ఫూర్తినిచ్చాయి. ఆయన అచంచల దేశభక్తి, క్రమశిక్షణ, కార్యదీక్ష తరతరాల భారతీయులకు ఆదర్శప్రాయం.

ప్రశ్న 6.
జాతీయోద్యమంలో ముస్లింలీగ్ పాత్రను విశ్లేషించండి.
జవాబు.
హిందూ ముస్లింల మధ్య ఐక్యతను నాశనం చేయడానికి బ్రిటీష్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూనే ఉంది. 1905లో జరిగిన బెంగాల్ విభజన ఒక ఉదాహరణ. అయితే హిందూ, ముస్లింల ఐక్యత ఎప్పుడూ కనిపిస్తూనే ఉండేది. ముఖ్యంగా 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో ఇది బ్రిటీష్ వారిలో ఉద్రిక్తతను, ఒత్తిడిని కలుగజేసింది. దాంతో వీరి మధ్య ఐకమత్యాన్ని, సామరస్యాన్ని తొలగించడం కోసం ప్రభుత్వం ‘విభజించు పాలించు’ అనే విధానాన్ని అమలు చేసింది. విచారకరమైన విషయం ఏమిటంటే ఈ విధానంలో వారు సఫలీకృతులయ్యారు. విద్యావేత్త, సంఘసంస్కర్త సర్సయ్యద్ అహ్మద్ ఖాన్ స్వయంగా హిందూ, ముస్లింల ఐక్యతను కోరినవాడు. వారి ఐక్యతకు కృషి చేశాడు. బ్రిటీష్వారి ప్రభావంతో ముఖ్యంగా అలిఘర్ ఆంగ్లో ముస్లిం పాఠశాల ప్రిన్సిపల్ బెక్ ప్రభావానికి లోనయ్యాడు. ఆయన కాంగ్రెస్తో చేరవద్దని ముస్లింలకు విజ్ఞప్తి చేశాడు.

1906లో డైకానవాబు సలీముల్లాఖాన్, ఆగాఖాన్, మొహిసిన్ ఉలములు బ్రిటీష్వారి సహకారంతో ముస్లింలీగ్ను స్థాపించారు. ఇది ముస్లింలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం, వారికి ప్రత్యేకమత నియోజక వర్గాల కోసం, ముస్లింలకు ప్రత్యేక రక్షణ కోసం విజ్ఞప్తి చేసింది. వైస్రాయ్ మింటో ముస్లింలీగ్ను సమర్థించాడు. ఫలితంగా 1909 చట్టం ద్వారా 1909లో ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా పాకిస్తాన్ అనే ఆలోచనకు భావనకు విత్తనం వేసినట్లు అయింది. బ్రిటీష్వారు విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని అవలంబించినంత కాంగ్రెస్ హిందూ, ముస్లింల ఐక్యతకు ఎంతో కృషి చేసింది. ఫలితంగా 1916లో లక్నో ఒప్పందం జరిగింది. గాంధీ హిందూ ముస్లింల ఐక్యత కోసం ఖిలాఫత్ ఉద్యమాన్ని నడిపారు.

కానీ 1935 భారత ప్రభుత్వ చట్టం జారీ చేయబడ్డప్పుడు జరిగిన ఎన్నికల్లో ముస్లింలీగ్ను వెనుకకు నెట్టి కాంగ్రెస్ ఎన్నో చోట్ల విజయం సాధించింది. దాంతో, జిన్న కాంగ్రెస్ ముస్లింలు భాగస్వాములుగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ప్రతిపాదించాడు. కానీ కాంగ్రెస్ జిన్న ప్రతిపాదనలకు ఒప్పుకోలేదు. ఇది ఇద్దరి మధ్య దూరాన్ని పెంచింది. అంతేగాక ముస్లింలలో తాము వేరు అన్న భావాలకి పెంపొందించింది. ఫలితంగా ఇద్దరిలో మతతత్వ ద్వేషభావనలు అభివృద్ధి చెందాయి.

ప్రశ్న 7.
కాబినెట్ మిషన్ ప్రతిపాదనలను వివరించండి.
జవాబు.
రెండవ ప్రపంచ యుద్ధానంతరం బ్రిటన్ గొప్పదనం బహిర్గతమయింది. దాని సంపద హరించింది. విజయం సాధించినప్పటికీ బలహీనంగా మారింది. దాంతో భారతదేశంలో ప్రభుత్వాన్ని వారికే అప్పగించాలని నిర్ణయించింది. దానికోసం భారతదేశానికి ఒక కమిటీని పంపింది. ఈ కమిటీలో పెథిక్ లారెన్స్, స్టాఫర్డ్ క్రిప్స్, ఎ.వి. అలెగ్జాండర్లు సభ్యులు. ఈ కమిటీ భారతదేశంలో ఉన్న నాయకులతో వివిధ పార్టీలతో వివరంగా చర్యలు జరిపి ఈ కింది విష లను ప్రకటించింది.

  1. స్థానిక సంస్థానాలతో కలిపి భారతదేశాన్నంతటిని సమాఖ్యగా ఏర్పాటు చేయడం.
  2. సంస్థానాలకు స్వయం ప్రతిపత్తి నీయడం.
  3. సంస్థానాలను వివిధ వర్గాలుగా చేయడం.
  4. భారతీయులకు ఒక మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం.
  5. ప్రాంతీయ శాసన సభలకు ఎన్నికైన సభ్యులతో, సంస్థానాలతో కలిపి రాజ్యాంగ ఏర్పాటు కోసం ఒక రాజ్యాంగ సభను ఏర్పాటుచేయడం.

కాంగ్రెస్, ముస్లింలీగ్ రెండు ఈ ప్రతిపాదనలను అంగీకరించాయి. 1946లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత ప్రభుత్వం ఏర్పడింది. బ్రిటీష్ ప్రభుత్వం రక్షణ రంగంతో సహా అన్ని అధికారాలను నెహ్రూ ప్రభుత్వ హస్తగతం చేసింది. ముస్లింలీగ్ కేంద్ర కేబినెట్లో ముస్లింలీగ్చే ఎంపిక చేయబడిన ముస్లింలు మాత్రమే ఉండాలని డిమాండ్ చేసింది. దానికి నిరసనగా వారు అక్టోబరు వరకు మంత్రివర్గంలో చేరలేదు. లీగ్ రాజ్యాంగ సభను బహిష్కరించింది.

ప్రశ్న 8.
1942 క్విట్ ఇండియా ఉద్యమాన్ని వివరించండి.
జవాబు.
క్రిప్స్ రాయబారం విఫలం కాడంతో కాంగ్రెస్ మరొక ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించడానికి నిర్ణయించింది. 1942 ఆగస్టు 8న అఖిలభారత కాంగ్రెస్ కమిటీ బొంబాయిలో సమావేశమయింది. ఈ సమావేశం క్విట్ ఇండియా తీర్మానాన్ని ప్రతిపాదించింది. అది బ్రిటీష్ వారిని సత్వరమే భారతదేశాన్ని వదిలి వెళ్ళాలని డిమాండ్ చేసింది. ఇది గాంధీ ఆధ్వర్యంలో అహింసాయుత పద్ధతులలో ప్రారంభించాలని ప్రతిపాదించబడింది. ఈ ఉద్యమంలో గాంధీ ‘డూ ఆర్ డై’ ‘సాధించండి లేదా చావండి’ అనే నినాదాన్ని ఇచ్చాడు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ తీర్మానాన్ని చేసిన వెంటనే బ్రిటీష్ ప్రభుత్వం గాంధీని అరెస్ట్ చేసి పూనలోని ఆగాఖాన్ భవనంలో ఉంచింది. గాంధీతో పాటు నెహ్రూ, పటేల్, అబ్దుల్ కలాం, ఆజాద్, డా॥ పట్టాభి సీతారామయ్య, టంగుటూరి ప్రకాశం, సంజీవరెడ్డి మొదలైన నాయకులందరిని చెరసాలలో వేసింది.

క్విట్ ఇండియా ఉద్యమంలో ఫార్వర్డ్ బ్లాక్, సోషలిస్టు పార్టీ విప్లవకారులు పాల్గొన్నారు. ముఖ్యమైన నాయకులు లేకపోవటం వల్ల ఉద్యమ పగ్గాలను ప్రజలే తీసుకున్నారు. వారు ప్రభుత్వాన్ని లెక్కచేయలేదు. కొందరు అరెస్ట్ కాని యువనాయకులైన జయప్రకాష్ నారాయణ్, రామ్మోహన్ లోహియా, అరుణా అసఫలీ మొదలైనవారు ఉద్యమాన్ని కొనసాగించారు. హర్తాళ్ళు, నిరసన ప్రదర్శనలు, నిరసన సమావేశాలు దేశమంతటా కొనసాగాయి. ప్రజలు అధిక సంఖ్యలో ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ బొంబాయి నుండి రహస్య రేడియో ప్రసారాలను కూడా చేసింది. ఉత్తర ప్రదేశ్లోని బాలియాలోను, బెంగాల్లోని మిడ్నపూర్ జిల్లాలోను మహారాష్ట్రలోని సతారాలోనూ ప్రజా ప్రభుత్వాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఉద్యమంలో దేశమంతటా హింస వ్యాప్తి చెందింది. ప్రజలు ఆందోళనలు చెయ్యడమే గాక ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. రైల్వే స్టేషన్లను, పోస్టాఫీసులను, పోలీస్ స్టేషన్లను కాల్చివేశారు.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఖిలాఫత్ ఉద్యమం గురించి రాయండి.
జవాబు.
అక్టోబర్ 17, 1919 రోజును ఖిలాఫత్ దినంగా పాటించబడింది. భారతదేశమంతటా హర్తాళ్ పాటించబడింది. గాంధీజి కూడా ఈ ఉద్యమానికి తన మద్దతు తెలిపాడు. హిందూ ముస్లింల ఐక్యతకు ఇది గొప్ప అవకాశం అని భావించాడు. అంతేగాక వారి లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముస్లింలను ప్రోత్సహించాడు. ఈ విషయంలో గాంధీ సఫలీకృతుడు గావడమే గాక గొప్ప నాయకునిగా ప్రశంసించబడ్డాడు.

TS Inter 1st Year History Study Material Chapter 15 జాతీయ ఉద్యమం – మలిదశ

ప్రశ్న 2.
స్వరాజ్ పార్టీ పనిని అంచనా వేయండి.
జవాబు.
1922లో గయలో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశంలో చిత్తరంజన్ దాస్ కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీని స్థాపించాడు.ఇది కాంగ్రెస్ యొక్క శాఖ. దానికి ఆయన అధ్యక్షుడు, మోతీలాల్ నెహ్రూ కార్యదర్శి. నవంబర్ 1923లో . జరిగిన ఎన్నికలలో స్వరాజ్యపార్టీకి 101 స్థానాలకు 42 నియోజకవర్గ స్థానాలను దక్కించుకుంది. కేంద్ర శాసన సభలో ప్రవేశించి బ్రిటీష్ వారి ప్రతిపాదనలను వ్యతిరేకించాలనుకున్నారు. 1925లో విఠలాభాయి పటేల్ స్వరాజ్ పార్టీ తరుఫున కేంద్ర శాసనసభలో స్పీకర్గా ఎన్నుకోబడ్డాడు. 1925లో చిత్తరంజన్ దాస్ మరణించడంతో ఈ పార్టీ కూడా పతనమైపోయింది.

ప్రశ్న 3.
రౌండ్ టేబుల్ సమావేశంలోని అంశాలను అంచనా వేయండి.
జవాబు.
బ్రిటీష్ ప్రభుత్వం రాజ్యాంగ సంస్కరణలను అమలు చేయాలని నిర్ణయించింది. దాంతో బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్సేమాక్డోనాల్డ్, భారత ప్రతినిధులు లండన్కు ఆహ్వానించాడు. మొదటి రౌండ్ టేబుల్ సమావేశాలు నవంబర్ 1930 నుండి జనవరి 1931 వరకు జరిగాయి. దీనికి స్థానిక పరిపాలకులు, రాజకీయ పార్టీలు హాజరయ్యాయి. కానీ కాంగ్రెస్ హాజరు కాలేదు. కాంగ్రెస్ హాజరుకానందున సమావేశం విఫలమయింది. దాంతో రెండవ రౌండ్ టేబుల్ సమావేశం సెప్టెంబర్ 1931లో మొదలై, డిసెంబర్ చివరి వరకు జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ తరఫున గాంధీ అతనితోపాటు సరోజినినాయుడు హాజరయ్యారు. ఈ సమావేశంలో గాంధీ కేంద్ర, రాష్ట్రాల్లో ఇంగ్లాండు సమానమైన బాధ్యతాయుతమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాడు. ఈ సమావేశం కేవలం కేంద్రంలో సమాఖ్య ఏర్పాటు, భారతదేశంలో మైనారిటీల హక్కులను గురించి చర్చించింది. కానీ బాధ్యతాయుత ప్రభుత్వమనే అంశంపై ని ‘యం తీసుకోవడంలో విఫలమయింది.

1932 లో జరిగిన మూడవ రౌండ్డేబుల్ సమావేశాన్ని కాంగ్రెస్ బహిష్కరించింది. తరువాత 1933లో బ్రిటీష్ గ సంస్కరణల ప్రతిపాదనలతో శ్వేతపత్రం విడుదల చేసింది.

ప్రశ్న 4.
1947 భారత స్వతంత్ర చట్టంలోని నిబంధనలను వివరించండి.
జవాబు.
4 జులై 1947న బ్రిటీష్ పార్లమెంట్ లోని కామన్స్ సభలో భారత స్వాతంత్ర్య చట్టం ప్రవేశపెట్టబడింది. జులై 15న కామన్స్ సభలో బిల్లు ఆమోదించబడింది. మరుసటి రోజున ప్రభువుల సభ (లార్డ్స్ సభ) లో ఆమోదించబడింది. జులై 10 నాడు రాజు ఆమోదం పొందింది. ఈ చట్టం భారతదేశాన్ని విభజించి రెండు కొత్త అధినివేశ ప్రాంతాలను సూచించింది. అదే ఇండియా, పాకిస్తాన్. ప్రతి అధినివేశ ప్రాంతంలో రాజు చేత నియమింపబడిన గవర్నర్ జనరల్ కూడా ఉంటాడు. ఒకవేళ వారికిష్టమైతే రెండు అధినివేశ ప్రాంతాలకు ఒకే గవర్నర్ జనరల్ కూడా ఉండవచ్చు.

రెండు ప్రాంతాల్లో శాసనాలు చేయడం కోసం శాసనసభలు ఏర్పాటు చేయబడతాయి. భారతదేశంలో బ్రిటీష్ పార్లమెంట్ అధికార పరిధి 15, ఆగస్ట్ 1947 నుంచి నిలుపుచేయబడుతుంది. ఈ చట్టానికి అనుగుణంగా ఆగస్ట్ 14న పాకిస్తాన్ ఏర్పడింది. దానికి జిన్న గవర్నర్ జనరల్ అయ్యాడు. భారతదేశానికి ఆగస్టు 15న స్వాతంత్ర్యం ఇయ్యబడింది. మౌంట్ బాటిన్ గవర్నర్ జనరల్, నెహ్రూ ప్రధానిగా స్వతంత్ర భారతదేశంలో ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రశ్న 5.
స్వతంత్రోద్యమ కాలంలోని విప్లవకారులు కార్యకలాపాలను వివరించండి.
జవాబు.
కాంగ్రెస్ నిష్క్రియాత్మక విధానాలు నచ్చని కొందరు యువకులు విప్లవవాదులుగా మారారు. వారి లక్ష్యం భయోత్పాతాన్ని సృష్టించి తొందరగా బ్రిటీష్ వారి నుంచి స్వాతంత్ర్యాన్ని పొందడం. వీరు చాలా నిర్భయస్థులు. దేశం కోసం ప్రాణ త్యాగానికైనా స్థిరపడినవారు. అటువంటి వారిలో ఆంధ్రలో అల్లూరి సీతారామరాజు బ్రిటీష్వారి నియంతృత్వం నుండి గిరిజనులను దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేశాడు. 1922 నుండి 1924 వరకు ఏజెన్సీ ప్రాంతంలో బ్రిటీష్ వారి పరిపాలన దాదాపుగా అంతమయిందని చెప్పవచ్చు. ఈ పరిస్థితిని అధిగమించడానికి బ్రిటీష్ ప్రభుత్వం రూథర్ ఫర్డ్ అనే ప్రత్యేక అధికారిని నియమించింది. బెంగాల్లో సూర్యాసేన్ అతని అనుచరుడు సాహు క్రియాశీల పాత్ర వహించారు. సాహు బ్రిటీష్ అధికారి డేని చంపాడు. ఉత్తరప్రదేశ్కి చెందిన రాంప్రసాద్ బిస్మిల్ తన సహచరులతో కలిసి అలంపూర్కు వెళ్తున్న రైలును కాకోరి దగ్గర ఆపి గార్డు దగ్గర నుండి నగదు పెట్టెలను దోచాడు. ఇదే కాకోరి కుట్రకేసుగా ప్రసిద్ధి. ప్రభుత్వం రాంప్రసాద్ బిస్మిల్ను అతని అనుచరుడు అశ్వకుల్లాఖాన్ ను ఉరితీసింది. 1930 – 32లో హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీ తరఫున సూర్యాసేన్ చిటగాంగ్, ఇతర ప్రాంతాలలో దాడులను రచించాడు. అతన్ని ప్రభుత్వం ఉరితీసింది. ఉత్తరప్రదేశ్లో చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్లు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ను స్థాపించారు. తదనంతరం భగత్సింగ్ పోలీసు అధికారి సాండర్స్ను చంపాడు. బతుకేశ్వర్ దత్తో కలిసి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలోకి ఏప్రిల్ 8, 1929న బాంబులు, కరపత్రాలు విసిరారు. ప్రభుత్వం భగత్సింగ్, రాజగురు, సుఖదేవ్లను 23 మార్చి 1931న ఉరితీసింది.

ప్రశ్న 6.
వేవెల్ ప్రణాళికను వివరించండి.
జవాబు.
1943లో లిన్లిత్అ అనంతరం వేవెల్ వైస్రాయ్ అయ్యాడు. అతని పరిస్థితి చాలా క్లిష్టతరంగా మారింది. బెంగాల్ ఒకవైపు కరువుకోరలు మరియు మతపరమైన ప్రశ్నలు ఉదయించడంతో ప్రభుత్వ ప్రతిష్ఠంభన ఏర్పడింది. 1944లో వేవెల్ గాంధీని విడుదల చేశాడు. భారతదేశంలోని ఐక్యతలో ఒత్తిడిని ప్రతిష్ఠంభనను పరిష్కరించడానికి ప్రయత్నం చేశారు. అనంతరం గాంధీ జిన్నతో కలిసి ఒక పరిష్కారాన్ని కనుగొనాలని అనుకున్నాడు. కాం దీని పరిష్కారానికి 1945లో వేవెల్ లండన్ వెళ్ళాడు. రాజకీయ ప్రతిష్ఠంభనను తొలగించి భాగ లక్ష్యాన్ని సాధించడానికి తోడ్పడే ప్రణాళికతో తిరిగి వచ్చాడు.

ద్విపరిపాలనా నూతన రాజ్యాంగం ఏర్పడి భారతీయుల ఆమోదం పొందే లోపల ఒక తాత్కాలిక ఏర్పాటును ప్రణాళిక ప్రతిపాదించింది. వివిధ రాజకీయ సంస్థల ప్రతినిధులతో వైస్రాయ్ ఒక కార్య నిర్వాహక సమితిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో అధ్యక్షుడుగా వైస్రాయ్, యుద్ధ వ్యవహారాలను చూస్తున్న ముఖ్య సైన్యాధిపతి ఇద్దరు మాత్రమే ఆంగ్లేయులు ఉంటారు. మిగిలిన వారు వివిధ పార్టీల నుంచి ఎన్నుకోబడిన వాళ్ళుంటారు. వారిలో హిందూ, ముస్లింలు సమాన సంఖ్యలో ఉంటారు. కార్యనిర్వాహక సంస్థలకు ఎన్నుకోబడిన సభ్యులకు వేవెల్ ఒక సమావేశాన్ని సిమ్లాలో ఏర్పాటు చేశాడు. అయితే ఈ ఎంపికను జిన్నా అంగీకరించలేదు. దాంతో సిమ్లా సమావేశం విఫలమయ్యింది.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
చంపారన్ సత్యాగ్రహం.
జవాబు.
చంపారన్ బీహార్ రాష్ట్రంలో వెనుకబడ్డ జిల్లా. ఇక్కడి రైతులు బ్రిటీష్ వారి బలవంతంతో ‘నీలిమందు (ఇండిగో) పండించేవారు. ఈ రైతులు ఆంగ్లేయుల ఆధీనంలో ఉండేవారు. నీలిమందును ఆంగ్లేయులు పండించిన ధరకే అమ్మాలి. ఆంగ్లేయులు రైతులను ఎంతగానో పీడించేవారు.

దక్షిణాఫ్రికాలో గాంధీ నిర్వహించిన ఉద్యమాలను గురించి విన్న చంపారన్ రైతులు తమకు సహాయం చేయాల్సిందిగా గాంధీని ఆహ్వానించారు. అక్కడ గాంధీజీ సత్యాగ్రహం ఆరంభించాడు. వేలాది రైతులు జత కలవడంతో, చివరకు ప్రభుత్వం చంపారన్ వ్యవసాయ బిల్లును ఆమోదించింది. ఇది గాంధీకి, సత్యాగ్రహానికి లభించిన విజయం.

ప్రశ్న 2.
రౌలట్ చట్టం.
జవాబు.
1917లో బ్రిటీష్ ప్రభుత్వం భారతదేశంలో జరుగుతున్న విప్లవాత్మక నేరాలపై దర్యాప్తు చేయడానికి న్యాయాధికారి సిడ్నిరౌలత్ నాయకత్వంలో ఒక కమిటీని వేసింది. ఈ కమిటీ వీటన్నింటిని అణచివేయమని సిఫార్సు చేసింది. ఫలితంగా 1919లో రౌలత్ చట్టం అమలు చేయబడింది. ఈ చట్టం ప్రకారం ఎవరినైనా వారంటు లేకుండా అరెస్ట్ చేసే అధికారం, వారి ఇంటిని సోదా చేసి ఆస్తులను జప్తు చేసే అధికారాన్ని ప్రభుత్వానికి ఇచ్చింది. దీనికి వ్యతిరేకంగా భారత సాక్ష్యాల చట్టం ఆధారంగా కోర్టులో అప్పీల్ చేయడం గానీ, సాక్ష్యాలను విచారించడం మొదలైన నిబంధనలేవీ లేవు. విచారణ లేకుండా రెండేళ్ళ కంటే ఎక్కువ సమయం నిర్బంధించవచ్చు అనే నిబంధన భారత పౌరుల ప్రాథమిక హక్కులను హరించివేసింది. ఇది భారతీయులలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఈ పరిస్థితులు గాంధీ మొదటి అఖిల భారత ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. ప్రముఖ నాయకులు స్వామి శ్రద్ధానంద కూడా పాల్గొన్నారు. దేశమంతటా నిరసన ఉద్యమాలు జరిగాయి. గందరగోళాన్ని అల్లర్లను సృష్టిస్తున్నాడన్న నెపంపైన గాంధీ అరెస్ట్ చేయబడ్డాడు.

ప్రశ్న 3.
రౌండ్ టేబుల్ సమావేశాలు.
జవాబు.
1930- 32 సంవత్సరాల మధ్యకాలంలో సైమన్ కమీషన్ నివేదిక ఆధారంగా భారతదేశంలో జరపవలసిన రాజ్యాంగ సంస్కరణలను చర్చించడానికి ఆంగ్ల ప్రభుత్వం భారతదేశంలో వివిధ పార్టీలు, సంస్థానాల ప్రతినిధులతో మూడు సమావేశాలను లండన్లో ఏర్పాటు చేశారు. వీటిని రౌండ్ టేబుల్ సమావేశాలు అంటారు.

మొదటి సమావేశం: 1930లో శాసనోల్లంఘన జరిగే సమయంలో ఏర్పాటైన ఈ సమావేశాన్ని భారత జాతీయ కాంగ్రెస్ బహిష్కరించింది. 1931లో జరిగిన గాంధీ – ఇర్విన్ ఒప్పందం ఫలితంగా రాజకీయ ఖైదీలను బ్రిటీష్ వారు విడుదల చేశారు.

రెండో రౌండ్ టేబుల్ సమావేశం: రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీజీ పాల్గొన్నారు. ఈ సమావేశం ఎలాంటి సత్ఫలితాలివ్వలేదు. తిరిగి వచ్చిన గాంధీ మరల శాసనోల్లంఘన చేపట్టారు.

మూడో రౌండ్ టేబుల్ సమావేశం: ఈ సమావేశానికి పెద్దగా ప్రాధాన్యం లేదు. కాంగ్రెస్ వారు, బ్రిటీష్ లేబర్ పార్టీ కూడా దీనిని బహిష్కరించింది.
ఈ సమావేశాల ఫలితంగా 1935 భారత ప్రభుత్వ చట్టం ఏర్పడింది.

TS Inter 1st Year History Study Material Chapter 15 జాతీయ ఉద్యమం – మలిదశ

ప్రశ్న 4.
సైమన్ కమీషన్,
జవాబు.
భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణల గురించి సిఫారసు చేయాల్సిందిగా బ్రిటీష్ ప్రభుత్వం 1927లో జాన్ సైమన్ అధ్యక్షుడిగా సైమన్ కమీషన్ ను నియమించింది. ఈ సంఘంలో అందరూ ఆంగ్లేయులే ఉండటం, అందులో భారతీయులెవరికీ ఇందులో స్థానం కల్పించకపోవడం భారతీయులకు ఆగ్రహం తెప్పించింది. దాంతో దేశవ్యాప్తంగా కమీషన్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, హర్తాళ్లు జరిగాయి. సైమన్ కమీషన్ను ప్రజలు బహిష్కరించారు. ‘సైమన్ గో బ్యాక్’ నినాదాలు దేశమంతటా మార్మోగాయి. అయినప్పటికీ దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి నివేదిక రూపొందించింది.

ప్రశ్న 5.
మౌంట్ బాటెన్ ప్రణాళిక.
జవాబు.
1947లో వేవెల్ స్థానంలో మౌంట్బాటెన్ వైస్రాయ్ గా నియమింపబడ్డాడు. అట్లే ప్రభుత్వం అతనికి అధికార బదిలీ కార్యక్రమాన్ని పూర్తి చేయమని అనుజ్ఞనిచ్చింది. మౌంట్బాటెన్ కాంగ్రెస్, ముస్లిం లీగుతో చర్చించాడు. వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ఎంతో కష్టపడ్డాడు. అయినా చివరికి దేశ విభజన అనివార్యమయింది. ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతంలో పాకిస్థాన్ ను ఏర్పాటు చెయ్యాలని అతను ప్రతిపాదించాడు. వీటిలో సింధ్, బలూచిస్థాన్ వాయువ్య ప్రావిన్సులు పంజాబ్లోని కొన్ని ప్రాంతాలు, తూర్పు బెంగాల్లున్నాయి. పరిస్థితి దిగజారుతుండటంతో తప్పనిసరై కాంగ్రెస్ కూడా ఈ ప్రతిపాదనను ఒప్పుకోవలసి వచ్చింది. విభజనకు అనుగుణంగా మౌంట్బాటెన్. నిర్ణయాలు తీసుకున్నాడు.

TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu

Telangana TSBIE TS Inter 1st Year English Study Material 14th Lesson Sanghala Panthulu Textbook Questions and Answers.

TS Inter 1st Year English Study Material 14th Lesson Sanghala Panthulu

Paragraph Answer Questions (Section – A, Q.No. 5, Marks : 4)

Question 1.
Is the title, SANGHALA PANTHULU apt to the story ? Explain.
Answer:
Suravaram Pratapa Reddy’s thought provoking Telugu story, SANGHALA PANTHULU is a social and historical narration. It was rendered into English by Elanaaga (Dr. N. Surendra). The story pictures the struggles and sufferings of innocent and ignorant villagers. Ramasagaram village is just a representative of any village in Nizam’s rule. Timidity and lack of unity and awareness among the masses helped a handful of people to exploit the poor. A well-informed and good-intentioned gentleman (Panthulu) came to their rescue. He explained to the villagers about their rights. He helped them pick up courage and form into associations (SANGHALU). That ultimately solved their problems. Hence, the title perfectly suits the story.

సురవరం ప్రతాపరెడ్డి ఆలోచనాత్మక తెలుగు కథ “సంఘాల పంతులు” ఒక సాంఘిక మరియు చారిత్రక కథనము. అది ఎలనాగ (డా॥ ఎన్. సురేంద్ర) గారి చేత ఆంగ్లంలోకి అనువదించబడింది. ఈ కథ అమాయక, అజ్ఞాన గ్రామీణుల బాధలను, పోరాటాలను చిత్రిస్తుంది. రామసాగరం అనే గ్రామం నిజాల పాలనలోని ఏ గ్రామానికైనా ఒక ప్రతీక. ప్రజల అధైర్యము, అనైక్యత, అవగాహనా రాహిత్యము ఆ బీదలను దోచుకోవడానికి కొద్దిమంది దోపిడీదారులకు ఉపయోగపడింది. ఒక మంచి పరిజ్ఞానము, సదుద్దేశము కల పెద్ద మనిషి (పంతులు) వారి రక్షణకై వచ్చాడు. ఆ గ్రామీణులకు వారి హక్కుల గురించి చక్కగా వివరించారు. వారికి ధైర్యము కూడగట్టుకునేలాగా, సంఘాలుగా ఏర్పడేలా సహాయపడ్డారు ఆయన. అది చివరిగా వారికి సమస్యలను పరిష్కరించింది. అందువలన ఆ పేరు కథకు సంపూర్ణంగా సమంజసము. సరిగ్గా సరిపోతుంది.

TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu

Question 2.
“With all these atrocities, we cannot live”, cries a woman of Ramasagaram. Explain the atrocities the villagers were subjected to.
Answer:
“Sanghala Panthulu”, an insightful Telugu story by Suravaram Pratapa Reddy, portrays the plight of the innocent poor. English rendering of the story by Elanaaga (Dr. N. Surendra) captures its spirit well. The story lists the atrocities Ramasagaram villagers were subjected to by the police. They (atrocities) were innumerable and unjust.

They (villagers) were forced to supply to the police fowls, eggs, groceries, todday and nuts and fruits. The police demanded drudgery. The poor had to clean their toilets, press their legs, get for them firewood, etc. The wages the poor got for their services or supplies were beatings and scoldings. They were branded on the cheeks. An old, tired and hungry woman was beaten to death. The list is Pendless.

“సంఘాల పంతులు” అనే నిశిత దృష్టితో రాయబడిన సురవరం ప్రతాపరెడ్డి గారి తెలుగు కథ అమాయక బీదల దీనగాథను చిత్రిస్తుంది. ఎలనాగ (డా॥ ఎన్. సురేంద్ర) గారి ఆంగ్లానువాదము కథ స్ఫూర్తిని చక్కగా పట్టుకోగలిగింది. పోలీసుల చేతిలో రామసాగరం గ్రామీణులు అనుభవించిన దురాగతాల జాబితాను అందిస్తుంది ఆ కథ. ఆ అరాచకాలు అసంఖ్యాకము, అన్యాయము.

ఆ గ్రామీణుల చేత బలవంతంగా పోలీసులు కోళ్ళను, గుడ్లను, సరుకులను, కల్లును, గింజలను, పండ్లను తెప్పించుకొనేవారు. పోలీసులు వారి నుండి గాడిద చాకిరీని “చేయించుకునేవారు. బీదవారి చేత మరుగుదొడ్లను శుభ్రం చేయించుకోవడము, కాళ్ళు వత్తించుకోవడం, కట్టెలు తెప్పించుకోవడం లాంటివి చేయించుకొనేవారు. వారి సేవలకు, సరఫరాలకు ఆ బీదలు పొందే ప్రతిఫలం తిట్లు, తన్నులు మాత్రమే. బుగ్గల మీద కాల్చిన ఇనుప కడ్డీలతో వాతలు పెట్టేవారు. ఒక వృద్ధ, అలిసిపోయి ఆకలితో ఉన్న స్త్రీని ఊపిరిపోయేదాకా కొట్టారు. ఈ జాబితాకు ముగింపు లేదు.

TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu

Question 3.
They realized that the lack of unity had been the cause for their plight. What followed this realisation? How did it help the people of Ramasagaram? * (Imp) (Model Paper)
Answer:
“Sanghala Panthulu”, a social story by Suravaram Pratapa Reddy, presents us valuable life lessons. Its English translation by Elanaaga (Dr. N. Surendra) impresses the readers. The story describes the problems the villagers faced. Then it analyses the reasons. And finally it offers a practicable solution.

So, the crisis was resolved. The police were the exploiters. Ramasagaram villagers were the victims. The causes were the lack of unity among them, their timidity, ignorance, etc. With the help of Sanghala Panthulu, the villagers understood the problem. They stood united. They formed themselves into associations. They proved their strength and courage. Their problems ended. Joy pervaded the village. Celebrations started.

సురవరం ప్రతాపరెడ్డి గారి సాంఘిక కథ ‘సంఘాల పంతులు’ మనకు విలువైన జీవన పాఠాలను అందిస్తుంది. ఎలనాగ (డా|| ఎన్.సురేంద్ర గారి ఇంగ్లీషు అనువాదం పాఠకులను ఆకట్టుకుంటుంది. కథ, ఆ గ్రామస్థులు ఎదుర్కొన్న సమస్యను వర్ణిస్తుంది. తరువాత అది అందుకు కారణాలను విశ్లేషిస్తుంది. అంతిమంగా, ఒక ఆచరణాత్మక పరిష్కార మార్గాన్ని అందిస్తుంది.

తద్వారా, ఆ క్లిష్ట సమస్య పరిష్కరించబడుతుంది. దోపిడీదారులు పోలీసులు. బాధితులు రామసాగరం గ్రామ ప్రజలు. కారణాలు వారి మధ్య ఐక్యతా లోపం, పిరికితనం, అమాయకత్వం మొదలైనవి. సంఘాల పంతులు సహాయంతో వారు సమస్యను అర్థం చేసుకున్నారు. వారు కలిసికట్టుగా నిలబడ్డారు. తమ సంఘాలను ఏర్పరచుకున్నారు. తమ ధైర్యాన్ని, బలాన్ని నిరూపించుకున్నారు. వారి కష్టాలు గట్టెక్కాయి. గ్రామంలో ఆనందం వెల్లివిరిసింది. ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu

Question 4.
Describe the result of the declaration by the “Mohathemeem”.
Answer:
Suravaram’s social story, “Sanghala Panthulu”, presents the pathetic plight of Ramasagaram villagers. Elanaaga translated this moving Telugu story into English. The police went on exploiting the innocent villagers ruthlessly. Sandhala Panthulu came to the rescue of the poor. The police were angry with Panthulu.

When they tried to arrest Panthulu, a good number of youth revolted against the police. The police complained against them. The Mohathemeem came to enquire into the incident. He found the police were guilty. He declared the dismissal, suspension and scaling down of different police personnel. The villagers felt happy. Their joy knew no bounds. Feasts followed. Justice prevailed.

సురవరం వారి సాంఘిక కథ, ‘సంఘాల పంతులు’ రామసాగరం గ్రామ ప్రజల దీనగాథను సమర్పిస్తుంది. ఎలనాగ (డా॥ ఎన్. సురేంద్ర ఈ కదిలించే తెలుగు కథను ఆంగ్లంలోకి అనువదించారు. పోలీసులు అమాయక పల్లె ప్రజల నిర్దయగా దోపిడీ చేస్తూ అణచసాగారు. ఆ బీదలను కాపాడేందుకు సంఘాల పంతులు వస్తారు. పోలీసులకు సంఘాల పంతులుపై అంతులేని కోపం. అతనిని నిర్బంధించ ప్రయత్నించినప్పుడు, పెద్ద సంఖ్యలో యువకులు పోలీసులపై తిరుగుబాటు చేస్తారు.

పోలీసులు వారిపై ఫిర్యాదు చేస్తారు. మొహతిమీమ్ విచారణ నిమిత్తం వస్తారు. పోలీసులదే తప్పు అని వారు నిర్ధారించుకుంటారు. వివిధ స్థాయిలలోని పోలీసు సిబ్బందిని ఉద్యోగంలోంచి తొలగించడం, విధి నిర్వహణ నుండి కొంత కాలం పక్కకు పెట్టడం, క్రింది స్థాయికి పంపడం లాంటి చర్యలను ప్రకటించారు ఆ మొహతిమీమ్. గ్రామస్థులు చాలా సంతోషించారు. వారి ఆనందానికి అవధులు లేకపోయాయి. విందు వినోదాలు కొనసాగాయి. న్యాయం గెలిచి నిలబడింది.

TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu

Sanghala Panthulu Summary in English

TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu 1
Suravaram Pratapa Reddy is multifaceted personality. His writings mainly reflect local history and local people’s sufferings. The story Sanghala Panthulu crafted by Suravaram Pratapa Reddy is a caustic comment on contemporary complex problems. It is translated into English by Elanaaga (Dr. N. Surendra). Like other works of Suravaram, this story also reflects local history and local masses struggles and suffering. Gripping narration moves readers into those periods and places. It offers interesting insights into the then social, economic, political and cultural conditions.

The story takes place in a tiny river side village known as Ramasagaram, ruled by the Nizams. The village Ramasagaram is just a symbol. The time of the story is pre-1940. Most of the villagers are either illiterate or not well-informed. Atrocities witnessed in that village are common all over the Nizam’s state.

It is because people are timid and unorganized. Lack of unity among people, their ignorance about their rights comes in handy to the exploiters. The police are exploiting them to the core. In fact, the village needs no police station. Their only duty is to demand. drudgery, fowls and required grocery without any payment.

They have madigas for drudgery and komatis for supplying commodities. Thus, things are moving happily. But the farmers are perturbed. They observe the lives of people on the other side of the river Krishna ruled by the British. They find that the people are happy there.

TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu

Sanghala Panthulu Summary in Telugu

“సంఘాల పంతులు” ఒక అరుదైన బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డి గారి తెలుగు కథ. వారు గొప్ప సంఘసేవకులు, పరిశోధకులు, పత్రికా సంపాదకులు, రచయిత, బహు భాషాకోవిదులు. 1940 కు ముందున్న దారుణ సాంఘిక, ఆర్థిక పరిస్థితులను, అణగారిన వర్గాల ఆవేదనను అద్దంలో చూపినంత స్పష్టంగా చిత్రించారు.

ఈ కథలో. కదిలించే ఈ తెలుగు కథను ఆంగ్లంలోకి అనువదించినవారు ఎలనాగ (ఎలనాగ గారి అసలు పేరు డా.ఎన్. సురేంద్ర). కథా స్థలం కృష్ణా నదీతీర పల్లె రామసాగరం. కథాకాలం 1940 కి ముందు. ప్రభువులు నిజాములు. దోపిడీదారులు పోలీసు సిబ్బంది. బాధితులు గ్రామస్థులు అందరూ. కారణం గ్రామీణుల అజ్ఞానం, అనైక్యత, నిరక్షరాస్యత.

పరిష్కారం : అవగాహన, ఐకమత్యం. సాధించినవారు : సంఘాల పంతులు. ఫలితం : సమస్య అంతం వాతావరణం సంతోషభరితం. ఇదీ సంక్షిప్త చిత్రణ. అత్యంత ఆసక్తికరంగా సాగే కదిలించి వేసే, కట్టిపడవేసే కథనంతో రచయిత నాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చిత్రిస్తారు. అస్సలు అవసరం లేని ఊరిలో ఏర్పాటు చేయబడిన పోలీసు స్టేషన్లోని సిబ్బంది అందరూ.

ఊరి ప్రజలందరినీ పీల్చి పిప్పిచేసి పీడించడమే కార్యక్రమంగా పెట్టుకొన్నారు. పొయ్యిలో కట్టెల నుండి, తినడానికి కోళ్ళు, తాగడానికి కల్లు – సర్వస్వం ఊరి ప్రజలు ఉచితంగా వారి అందరికీ సమకూర్చాలి. గాడిద చాకిరీ చేయాలి. ఫలితం తిట్లు, తన్నులు, ఒంటి మీద వాతలు. చెప్పనలవి కాని బాధలు. నదికి ఆవలి వైపు పల్లెలో ఆంగ్లేయుల పాలన. ఈ రకమైన బాధలు లేవు. అక్కడికి వలస పోదామనుకున్న వారికీ ఆ అవకాశం లేదు.

జీవితం దుర్భరంగా ఉన్న స్థితిలో సంఘాల పంతులు ఆ ఊరికి వస్తారు. జనులను ఐక్యపరిచి, అవగాహన కల్పించి, వారి హక్కులను వివరించి, పోలీసులకు ఏదీ ఉచితంగా ఇవ్వవలసిన పనిలేదని చెబుతారు. అందరూ పాటిస్తారు. గత సాగిబాటు నడవని పోలీసులు అసలు కారణం సంఘాల పంతులు అని, అతనిని నిర్బంధిస్తారు. అంతే పల్లెయువకులు లాఠీలతో దాడిచేసి పోలీసులను చితకబాది పంతులును విడిపించుక వెళతారు.

పోలీసులు పై అధికారులకు తప్పుడు ఫిర్యాదు చేస్తారు. విచారణాధికారి గ్రామ ప్రజల ద్వారా వాస్తవాలు గ్రహించి, పోలీసులకు తగిన శిక్ష విధిస్తారు. గ్రామంలో పండుగ వాతావరణం. దానిని ప్రసాదించిన సంఘాల పంతులను అందరూ ‘దేవుడు’ అని పిలుచుకుంటారు.

TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu

Sanghala Panthulu Summary in Hindi

“संघाला पंतुलु’ विश्लित एवं बहुमुखी प्रज्ञाशाली सुरवरं प्रतापरेड्डी जी की तेलुगु कहानी हैं । वे सामाजिक सुधारक, शोधकर्ता, संपादक, लेखक और बहुभाषी कोविद थे । सन् 1940 के पूर्व प्रचलित दारुण सामाजिक, आर्थिक स्थितियों और दलित वर्गों की व्यथाओं का दर्पण है, यह कहानी ।

इस प्रभावपूर्ण कहानी का अनुवाद पुलनागा ( असली नाम डॉ. एन. सुरेंद्र) ने किया । क्या स्थल कृष्णा नही के तीर स्थित रामसागरम नामक देहात है । 1940 के पूर्व देहाती लोगों के अज्ञान, अनेकता, निरक्षरता आदि हो बादशाह, निजाम, लुटेरे, पुलीस कारक हैं । बाधित लोग : ग्रामीण, हल : समझदारी और एकता । कार्यसिद्धि करनेवाले : संघाला पंतुलु । परिणाम : समस्या का अंत | ग्रामीण वातावरण : संतोष भरित । यही है संक्षिप्त चित्र । गाँव में स्थापित पुलिस स्टेशन अनावश्यक है । पुलिसस्टेशन के सभी स्टाफ़ सभी गाँववालों को पीड़ित करते हैं ।

उन्हें जलाऊ लकड़ी, खाने के लिए मुर्गी-मुर्गे, पीने के लिए दारु आदि सर्वस्व ग्रामीणों द्वारा देना पडता है । संघाला पंतुल उस गाँव आते हैं । वे लोगों को समेकता कर, उन्हें उनके अधिकारों की जानकारी देकर कहते हैं कि पुलिस को मुफत से किसी चीज देने की जरुरत नहीं है । सभी पालन करते हैं। मुफ्त की सुविधाएँ बंद होने के कारण संघाला पंतुलु है, यह सझक कर उसे बंदी बनाती हैं । पुलीस । तुरंत ग्रामीण युवक पुलिसवालों को घेरा डालकर, अँधाधुंध मारपीट करके पंतुलु छुड़कर ले जाते हैं। पूछताछ – अधिकारी वास्तविकता जानकर पुलिसों को सजा देते हैं । गाँव पर्व का वतावरण है। इसके कारक व्यक्ति संघाल पंतुलु को भगवान के नाम से पुकारते हैं ।

Meanings and Explanations

frontier (n) /frantıə(r)/ (ఫ్రన్ టీఅ(ర్)) (disyllabic) = border: సరిహద్దు, सीमांत

the rest (noun phrase) = the others; remaining: మిగిలినవి, रहना

sundry (adj)/sandri/ (సన్ డ్రి) (disyllabic) = several: చాలా various; వివిధ, विभिन्न

jawan, jamedar, Ameen: terms denoting police personnel : పొలిసు సిబ్బందిని, వారి హోదాను సూచించే పదములు, जमींदार

drudgery (n) /dradzəri/ (డ్రజరి) (trisyllabic) hard and boring work : కఠోర శ్రమ; వెట్టిచాకిరి

commodities (n-pl) /kamodati:z/ (కమొడటీజ్) = useful goods : సరుకులు, దైనందిన వాడుక వస్తువులు

splinters (n-pl) /splıntə(r)z/ (కమొడటీజ్ ) (disyllabic) = pieces of wood used as firewood; పోయిల్లా కట్టెలు, किरच, छिपटी

TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu

perturbed (adj) /pǝ(r)t3:(r)bd/ (ప(ర్)ట(ర్)బ్ డ్) (disyllabic) = troubled; angered: ఇబ్బందులకు ; కోపమునకు గురిచేయబడిన, व्याकुल करना

seethe (v) /si:ð/ (సీడ్ ) (monosyllabic) = boil (with anger) : (కోపంతో) మరిగిపోవు, उबलना

hew (v) /hju:/ (హ్యూ) (monosyllabic) = cut : ముక్కలు చేయు, నరుకు, कुल्हाड़ी से काटना

Rela; Cassia = = names of plants and trees in forests : అడవి చెట్ల పేర్లు, जंगल का पेड़

fume (v) /fju:m/ (ఫ్యూమ్) (monosyllabic) = express great anger : తీవ్ర కోపము వెలిబుచ్చు, गड़बड़ कर देना

corpse (n) /ko:(r)ps/ (కో(ర్)ప్ స్) (monosyllabic) = a dead body : శవము , सव

summon (v) /sɅmən/ (సమన్) (disyllabic) = call : పిలుచు, बुलाव

badam, akhrot, pista = names of nuts: పప్పులు, గింజలు పేర్లు दाल

treacherous (adj) /tretsǝrǝs/ (ట్రెచరస్ ) (trisyllabic) = deceitful: మోసపూరిత, विस्वसघाती

quiet (adj) /kwalǝt/ (క్వ్తెఅట్ ) (disyllabic) = calm : ప్రశాంతంగా, शांति, स्थिरता

persuade (v) /pɔ(r)sweid/ (ప(ర్)స్వేఇడ్ ) (disyllabic) = make someone agee to : ఒప్పించు, నచ్చచెప్పు, पुसलना

station (v) /steisǝn/ (స్టెఇషన్) (disyllabic) = to place to do a duty : ఏదైనా పని చేయు నిమ్మిత్తం ఒకరిని ఒక చోట ఉంచు, स्टेशन

fowls, cocks = birds; chickens: పక్షులు; కోళ్ళు, मुर्गा

storeyed (adj) /stɔ:rid/ (స్టోరిడ్) (disyllabic) = with floors : అంతస్తులు కల

Note: story = కథ; storey = floor = అంతస్తు

sport (v)/spɔ:(r)t/ (స్పో(ర్)ట్) (monosyllabic) = display : ప్రదర్శించు; ధరించి చూపు, मन बहलाना

do away with (idiom) = put an end to : ముగింపు పలుకు ; పరిష్కరించు

TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu

abound (v) /ǝbaund/ (అబౌండ్ ) (disyllabic) = fill to full : నిండుగా నింపు

timid (adj) /tımıd/ (టీమిడ్) (disyllabic) = lacking in courage: ధైర్యము లేని cowardly : పిరికి, डरपोक

instill (v) /instil/ (ఇన్ స్టిల్) (disyllabic) = to cause a quality to become part of someone’s nature : ఒక లక్షణమును ఒక వ్యక్తి స్వభావములో భాగము చేయు

plight (n) /plait/ (ప్లైట్) (monosyllabic) = a difficult situation : కష్టము, दुर्दशा

consensus (n) /kǝnsensǝs/ (కన్ సెస్ సస్ ) = agreement among many : ఏకాభిప్రాయము , अनुकूलता

emerge (v) /imз:(r)dz/(ఇమ(ర్)జ్) (disyllabic) = come into view : కనిపించు; ప్రవేశించు, प्रकट होना

alert (v) /ǝl3:(r)t/ (అల(ర్)ట్) (disyllabic) = warn : హెచ్చరించు, चेतावनी देना

fetch (v) /fets/ (ఫెచ్) (monosyllabic) = get; obtain: పొందు; వేలకు బదులుగా దేనికైనా గ్రహించు

are (అరె), khabardar (కబడ్డార్) = కోపాన్ని, హెచ్చరికలను వ్యక్తీకరించే పదాలు

snarl (v)/sna:(r)// (స్నా(ర్)ల్) (monosyllabic) = say very angrily : చాలా కోపంగా అరచు, गुरहिट

prostrate (v) /prostreit/ (ప్రోస్ట్రేఇట్) (disyllabic) = lying flat with face down as a token of respect : సాష్టా౦గపడుदंडवत पड़ा हुआ

brand (v) /brænd/ (బ్య్రా౦డ్ ) (monosyllabic) = a burn flesh with hot iron : వాతపెట్టు; కాల్చిన ఇనుముతో , व्यापारिक चिन्ह

flank (n) /flænk/(ష్ణ్యానిక్) (monosyllabic) = the body part between the last rib and the hip: తొంటి భాగము

atrocities (n-pl)/ǝtrasətiz/(ఆట్రోసటీజ్ ) (polysyllabic-4 syllables) = very cruel acts: అరాచకములు క్రూర చర్యలు

peepul (n) = name of a tree: రావిచెట్టు

insist (v) /Insist/ (ఇన్ సిస్ ట్) (disyllabic) = demand : గట్టిగా కోరు

pompously (adv) /pompǝsli/ (పోమ్ పస్ లి) (trisyllabic) = in an affectedly grand way : ఆడంబరముగ; పైకి తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో, గొప్పగా

patrol (v) /pǝtrǝul/ (పత్రఉల్) (disyllabic) = go round as a guard : రక్షకుడి వలె పహారా తిరుగు

pertaining to (phrase) = connected to: సంబంధించిన

TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu

enraged (v-pt)/inreidzd/ (ఇన్ రెఇజ్ డ్) (disyllabic) = became very angry : బాగా కోపగించుకొనెను

tipsy (adj) /tipsi/ (టిప్సి) (disyllabic) = drunk : త్రాగిన మైకంలో ఉన్న

hail from (phrase) = come from ; belong to (a place) (ఏ ప్రాంతానికి చెందిన; నుండి వచ్చిన

deprive (v) /diprarv/ (డిప్రైవ్) (disyllabic) prevent someone from having something : వచ్చేది రాకుండా చేయు

shriek (v) /fri:k/ (ప్రీక్) (monosyllabic) = cry : అరచు; ఏడ్చు

beseech (v) /brsi:tf/ (బిసీచ్) (disyllabic) = request : విన్నవించు; beg

to no avail (phrase) = to no use : ఉపయోగం లేకుండా; ఫలితం లేకుండా

thrash (v) /9ræf/ (త్ర్యాష్) (monosyllabic) beat mercilessly : నిర్దయగా కొట్టు

rotund (adj) /routAnd/ (రఉటన్) (disyllabic) = having a fat round body : కొవ్వుపట్టి బలిసిన శరీరం కల

divulge (v) /darvAld3/ (డైవల్) (disyllabic) = reveal : తెలియచెప్పు; బహిర్గతము చేయు

instigate (v) /instagert/ (ఇన్టగెట్) (trisyllabic) = to incite : రెచ్చగొట్టు, भड़काना

TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu

looming large (idiom) = seeming hard to avoid something dangerous : ఏదో ప్రమాదము ఆప వీలుకాకుండా జరుగబోతున్నట్లున్నది.

scale down (phrase) = reduce : తగ్గించు, काम करना

delight (n) /dilart (డిలైట్) (disyllabic) joy; pleasure : ఆనందము, खुश

feasts (n-pl) /fi:sts/ (ఫీస్) (monosyllabic) = large, ceremonial meals : భారీ విందు భోజనములు; daavat, दावत देना