TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చిన్నప్పుడే

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 8th Lesson చిన్నప్పుడే Textbook Questions and Answers.

మంజీర TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana

బొమ్మను చూడండి ఆలోచించి చెప్పండి

TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చిన్నప్పుడే 1

1. పై బొమ్మలోని సన్నివేశం ఎక్కడ జరుగుతుండవచ్చు?
జవాబు.
పై చిత్రంలోని సన్నివేశం గ్రామంలో ఒక చెట్టుకింద రచ్చబండ దగ్గర జరుగుతోంది.

2. మీ గ్రామంలో ఇట్లాంటి దృశ్యం ఎప్పుడైనా చూశారా? ఎప్పుడు?
జవాబు.
మా గ్రామానికి మధ్యలో రావిచెట్టు ఉంది. ఆ చెట్టు చుట్టూ సిమెంటుతో దిమ్మ కట్టబడి ఉంది. దానిని అందరూ పెద్ద బజారు సెంటరు (కూడలి) అంటారు. సాయంకాలానికి రైతులందరూ అక్కడికి చేరి వ్యవసాయపు పనుల గురించి, గ్రామ సమస్యల గురించి మాట్లాడుకుంటారు. ఆ దృశ్యాన్ని నేను చాలా సార్లు చూశాను.

3. మాట్లాడుతున్న నాయకుడు ఏం చెప్పుతున్నాడని మీరు అనుకుంటున్నారు ?
జవాబు.
మాట్లాడుతున్న నాయకుడు గ్రామ ప్రజలకు జరుగుతున్న మోసాలను, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాన్ని చెబుతూ ఉండి ఉంటాడు. గ్రామీయులు పంటల విషయం, పశువుల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రభుత్వం వారికి ఏర్పాటు చేస్తున్న ఆర్థిక సౌకర్యాల గురించి చెబుతూ ఉండవచ్చు. తమ చుట్టూ ఉన్న సమాజంలో ఏమి జరుగుతోందో చెప్పి, గ్రామీయులు కూడా సమాజం మార్పునకు ఎలా కృషిచేయాలో చెబుతూ ఉండవచ్చు.

TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చిన్నప్పుడే

4. స్వాతంత్ర్యోద్యమ కాలంలో ఇట్లాంటి దృశ్యాలు ఊరిలో కనిపించేవని మీకు తెలుసా ?
జవాబు.
భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలలో చైతన్యం కలిగించడానికి గ్రామాలలో సభలు నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు లాంటి నాయకులు ఉద్యమాలు నడిపి గ్రామప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు. ‘స్వాతంత్ర్యం నా జన్మహక్కు” అనే నినాదంతో బాలగంగాధర తిలక్ ప్రజలలో పౌరుషాన్ని నింపాడు. ఇవన్నీ మేము పెద్దవాళ్ళు చెప్పగా విన్నాము. మరికొన్ని విషయాలు పుస్తకాలు చదివి తెలుసుకున్నాము.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No. 82)

ప్రశ్న 1.
ఈ “వరికోతల రోజులు. అయినా పొలాల్లో ఎవరూ లేరు” ఈ వాక్యాన్నిబట్టి మీకేమి అర్థమయింది ?
జవాబు.
వ్యవసాయం చేసి పంటలు పండించే గ్రామీణులకు నాట్లు వేయడం, కోత కోయడం, కుప్ప నూర్చడం అనే మూడు
పనులూ చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా పంట పండాక దానిని తగిన సమయంలో కోయడానికి ఊళ్ళో జనం అంతా పొలాల్లోనే ఉంటారు. అటువంటి వరికోతల రోజులలో కూడా ప్రజలు పొలాలు విడిచి నాయకుల కోసం వెళ్ళారంటే వారికి ఆ నాయకుల మీద ఉన్న అభిమానం, గౌరవం తెలుస్తున్నాయి.

ప్రశ్న 2.
ఈ ఊళ్ళోకి ఎదుర్కొని తీసుకొని పోవడమంటే ఏమిటి ?
జవాబు.
ఊళ్ళోకి ఎవరైనా గౌరవనీయులు వస్తే వారికి ఎదురువెళ్ళి వాయిద్యాలతోనో, పూలదండలతోనో స్వాగతం పలికి ఊరిలోకి తీసుకురావడం మర్యాద. దీనినే ఊళ్ళోకి ఎదుర్కొని తీసుకొని పోవడం అంటారు.

ప్రశ్న 3.
“పిల్లలు నాయకుణ్ణి అమితోత్సాహంతో చుట్టివేశారు” కదా! వాళ్ళు అట్లా ప్రవర్తించడానికి కారణాలు ఏమై ఉంటాయి ?
జవాబు.
తమ గ్రామంలోని పెత్తందారుడు ప్రతిరోజూ ప్రతివస్తువునూ తమ దగ్గరి నుంచి అన్యాయంగా అపహరిస్తాడు. కానీ నాయకుడు మాత్రం దుర్మార్గుడైన ఆ పెత్తందారును ఎదిరించాడు. గ్రామంలో పెత్తందారులు నిందలు లేకుండా చేశాడు. నేరాలు మోపడం, లంచాలు గుంజడం లేకుండా చేశాడు. నాయకుని కృషివల్లనే గ్రామంలో అందరూ గౌరవంగా, ఆకలి బాధలు లేకుండా బతుకుతున్నారు. పైగా నాయకుడు పిల్లలందరినీ చేరదీసి వారి బాగోగులను తెలుసుకుంటాడు. వారిని ప్రేమతో పలకరిస్తాడు. అందువల్లనే పిల్లలు నాయకుణ్ణి అమితోత్సాహంతో చుట్టివేశారు.

TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చిన్నప్పుడే

ప్రశ్న 4.
ఈ పిల్లలు చెప్పిన విషయాలను బట్టి ఆనాటి గ్రామాల పరిస్థితిని ఎట్లా అర్థం చేసుకున్నారు?
జవాబు.
నాయకులు వచ్చింది తమను బతికించడానికి అని పిల్లలు చెప్పడం ద్వారా ఆ నాటి గ్రామాలలో పెత్తందారీల దుర్మార్గాలు తెలిశాయి. ఏదో సాకుతో బర్రెను బందెల దొడ్లో పెట్టించడం, కోడెదూడ చేలో పడిందని పదిరూపాయలు వసూలు చేయడం, దున్నపోతు బుస్సు మన్నదని, మోతాడు లేదని ముప్పయి రూపాయలు గుంజడం, సర్కారీ రకం కట్టలేదని నాయనకు బండలెత్తడం వంటి దౌర్జన్యాల ద్వారా ఆ నాటి గ్రామ ప్రజలు ఎన్ని అవస్థలు పడ్డారో తెలుస్తుంది. అంతేగాక చేలో కట్టెపుల్లలు ఏరుకుంటే ఆడ కూలీలను కొట్టడం. అడ్డువచ్చిన భర్తల్ని విరగబాదడం మొదలైన విషయాల ద్వారా ఆ నాటి గ్రామప్రజల దయనీయ దుర్భరస్థితి తెలుస్తున్నది.

ప్రశ్న 5.
“మనం మన సంతానానికి ఆస్తిగా ఇచ్చేవి అప్పులు, రోగాలు, కష్టాలేగా” అని నాయకుడు అనడంలోని ఉద్దేశమేమి?
జవాబు.
రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలలో దయనీయ పరిస్థితిని ఉద్దేశించి నాయకుడు ఈ మాట అన్నాడు. ఏరోజు కారోజున వచ్చే కూలీ డబ్బులతో పేదలు పొట్ట పోషించుకుంటారు. పని లేకపోతే పస్తు పడుంటారు. లేకపోతే అప్పులు చేస్తారు. చేసిన అప్పుతీర్చలేక నానా అవస్థలూ పడతారు. రోగాలు వచ్చి పడతాయి. ఈ అప్పులు, రోగాలు, కష్టాలు తరతరాలుగా కొనసాగుతూనే ఉంటాయి. అందువల్లనే నాయకుడు అట్లా అన్నాడు.

ఇవి చేయండి.

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. ‘చిన్నప్పుడే’ కథ చదివారు కదా! దీని ఆధారంగా స్వాతంత్ర్యానికి ముందు గ్రామాల్లో పరిస్థితి ఎట్లా ఉండేదో ఊహించండి, మాట్లాడండి.
జవాబు.
స్వాతంత్ర్యం రాకముందు గ్రామాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ ఉండేది కాదు. గౌరవ మర్యాదలు ఉండేవికాదు. పెత్తందార్లు, అగ్రకులాల వాళ్ళు పేదవారిని, బలహీన వర్గాల వారిని దోపిడీ చేసేవారు. స్త్రీలను నీచంగా చూడడం, అనరాని మాటలు అనడం చేసేవారు. పేద ప్రజలు గ్రామాలలో తినడానికి తిండిలేక ఇబ్బందులు పడేవారు.

స్త్రీలు కూలికి పోయి చేలో కట్టెలు ఏరుకుంటే ఎందుకు ఏరుకున్నారని సిగపట్టుకొని కొట్టేవారు. సర్కారుకు పన్నులు కట్టలేదని నెత్తిమీద బండరాళ్ళు ఎత్తి మోయించేవారు. పిల్లలు బడికెళుతుంటే వాళ్ళను బెదిరించేవారు. పశువులు చేలో పడి గడ్డి తిన్నాయని వాటిని బందెల దొడ్లో పెట్టించేవారు. లేకపోతే డబ్బులు వసూలు చేసేవారు. స్వాతంత్ర్యం రాకముందు మన గ్రామాలలో పరిస్థితి పైవిధంగా ఉండేదని ఈ పాఠం చదివిన తరువాత అనిపించింది.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

1. పాఠం ఆధారంగా కింది మాటలు ఎవరు ఎవరితోటి ఏ సందర్భంలో అన్నారో చర్చించండి.

(అ) వీండ్లందరెవరో ఎరికేనా?
జవాబు.
తమ గ్రామానికి వెంకట్రావు, ఇతర నాయకులు వస్తున్నారని తెలిసిన గ్రామంలోని పిల్లలు వారు ఉన్నచోటికి వెళ్ళారు. నాయకులు పిల్లల్ని ప్రేమగా పలకరించారు. పిల్లలు వారికి తాము కోసుకున్న ఉసిరికాయలు పంచారు. అప్పుడు వెంకట్రావు నాయకుల్ని చూపించి. వీండ్లందరెవరో ఎరికేనా ? అని పిల్లల్ని ప్రశ్నించాడు.

(ఆ) నేను సంగిశెట్టి కొడుకును.
జవాబు.
ఒక నాయకుడు ఒక పిల్లవాణ్ణి “మీరెవరబ్బాయి!” అని ప్రశ్నించాడు. అపుడు ఆ అబ్బాయి “నేను సంగిశెట్టి కొడుకును” అని బదులిచ్చాడు.

TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చిన్నప్పుడే

(ఇ) మన సంతానమంతా హాయిగా బతుకుతారు.
జవాబు.
మనం ఈరోజు స్వార్ధరహితంగా ధైర్యంగా పట్టుదలతో పనిచేస్తే మన సంతానం అంతా హాయిగా బతుకుతారని ఒక నాయకుడు మరొక నాయకునితో అన్నాడు.

2. కింది పేరా చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

నిజాం రాష్ట్రంలో సాంస్కృతికంగా, భాషాపరంగా అణచివేయబడిన తెలంగాణ ప్రజల్లో వారి మాతృభాష, సంస్కృతి పట్ల గాఢాభిమానం కలిగించటంలో ఆనాడు తెలుగు గ్రంథాలయాలు, పఠనాలయాలు, తెలుగు పత్రికలు ఎంతో దోహదం చేశాయి. తెలంగాణలో తెలుగు ప్రజలకు తెలుగు భాషపై, సంస్కృతిపై ఆసక్తి కలిగించటం ద్వారా వారి జాతీయ, సాంస్కృతిక వికాసానికి కృషి చేసిన మహనీయుల్లో మాడపాటి హనుమంతురావు, సురవరం ప్రతాపరెడ్డి, అహల్యాబాయి, రాజాబహద్దూర్ వెంకట్రామారెడ్డి, రావి నారాయణరెడ్డి ముఖ్యులు. జాతిని చైతన్యపరిచే లక్ష్యంతోనే మాడపాటి హనుమంతరావు ఆంధ్రోద్యమాన్ని తెలంగాణలో అంటే అప్పటి నిజాం రాష్ట్రంలో ప్రారంభించాడు.

ప్రశ్నలు :
అ. అణచివేతకు గురైన వారెవరు ?
జవాబు.
నిజాం రాష్ట్రంలో అణచివేతకు గురైన వారు తెలంగాణ ప్రజలు.

ఆ. వాళ్ళు ఏఏ విషయాల్లో అణచివేతకు గురి అయ్యారు ?
జవాబు.
వాళ్ళు సాంస్కృతికంగా, భాషాపరంగా అణచివేతకు గురి అయ్యారు.

ఇ. తెలంగాణాలో ఆంధ్రోద్యమం ఎందుకు విస్తరించింది ?
జవాబు.
తెలంగాణాలో తెలుగు ప్రజలకు తెలుగు భాషపై, సంస్కృతిపై ఆసక్తి కలిగించడానికి ఆంధ్రోద్యమం విస్తరించింది.

TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చిన్నప్పుడే

ఈ. తెలంగాణ ప్రజల్లో భాషాసంస్కృతులపట్ల అభిమానాన్ని పెంచిన సంస్థలేవి ?
జవాబు.
తెలుగు గ్రంథాలయాలు, పఠనాలయాలు, తెలుగు పత్రికలు తెలంగాణ ప్రజల్లో భాషా సంస్కృతుల పట్ల అభిమానాన్ని పెంచిన సంస్థలు.

ఉ. తెలంగాణలో జాతీయ, సాంస్కృతిక వికాసానికి కృషి చేసిన కొందరు మహనీయులు ఎవరు ?
జవాబు.
మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, అహల్యాబాయి, రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి, రావి నారాయణ రెడ్డి మొదలైన వారు తెలంగాణాలో జాతీయ, సాంస్కృతిక వికాసానికి కృషిచేసిన మహనీయులు.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. వెంకట్రావు స్వభావాన్ని తెల్పండి.
జవాబు.
వెంకట్రావు ఆంధ్రమహాసభ కార్యకర్త. తెలంగాణలో ప్రజలు పడుతున్న కష్టాలను చూడలేక వారిలో చైతన్యం తీసుకొనిరావడానికి కృషిచేసిన మహానుభావుడు. ఆయనకు ప్రజలు హృదయపూర్వకంగా దండం పెట్టేవారు. ప్రజల ధన, మాన, ప్రాణ రక్షకునిగా పనిచేశాడు. పెత్తందార్లు చేసే అగడాలను ఎదుర్కొని వారు చిన్న, పెద్దలను గౌరవించే విధంగా మార్పు తెచ్చాడు.

వెంకట్రావు కృషి ఫలితంగా పెత్తందార్లు స్త్రీలను దుర్భాషలాడడం, నీచంగా ప్రవర్తించడం లాంటివి పోయాయి. ప్రజలంతా విరామం లేకుండా కూలి పనిచేసినా కడుపు నిండా తిండిలేకపోవడం చూసి వెంకట్రావు పెత్తందార్లపై తిరగబడి పేదలు కడుపునిండా అన్నం తినేటట్లుగా చేసిన మహనీయుడు. మనిషిని మనిషిగా చూడాలనే తత్త్వం కలవాడు వెంకట్రావు. అందుకే అటువంటి మంచి స్వభావం గల వెంకట్రావును గ్రామపెద్దలు, పిన్నలు కూడా గౌరవిస్తూ దేవుడిలా చూసుకునేవారు.

ఆ. వెంకట్రావు వంటి యువకుల వల్ల కలిగే ప్రయోజనాలేవి?
జవాబు.
వెంకట్రావు వంటి యువకుల వల్ల ప్రజలలో చైతన్యం కలుగుతుంది. ‘దండం – నమస్కరించడం’ అనే పదానికి సరైన అర్థం లభిస్తుంది. ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణ కలుగుతుంది. ప్రజలపై పెత్తందార్లు వేసే నిందలు తగ్గుతాయి. లంచాలు తీసుకొనే వారి సంఖ్య తగ్గిపోతుంది. సమాజంలో ధనం ఆధారంగా ఎక్కువ, తక్కువ అనే భావనపోయి, మనుషుల్ని మనుషుల్లా చూడడం జరుగుతుంది.

పేద ప్రజలకు కడుపునిండా తిండి దొరుకుతుంది. పెత్తందార్లు ప్రజలను హింసించకుండా గౌరవ భావంతో చూస్తారు. నాయకులు పిల్లలు, పెద్దల కష్ట నష్టాలను తెలుసుకొని పరిష్కార మార్గాలు ఆలోచిస్తారు. పేద ప్రజలకు మేలు చేస్తారు. వెంకట్రావు వంటి యువకులవల్ల సమాజానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చిన్నప్పుడే

ఇ. వెంకట్రావుతో నేటి యువతను పరిశీలించి, పోల్చండి.
జవాబు.
మన దేశ స్వాతంత్ర్య పోరాటం జరుగుతున్న కాలం నాటి వ్యక్తి వెంకట్రావు. వెంకట్రావులో దేశభక్తి, సమాజాన్ని పట్టిపీడిస్తున్న దురాచారాలను రూపుమాపాలనే కోరిక అధికంగా కనిపిస్తున్నాయి. తనకు దేశం ఏమిచ్చింది అని చూడక, తాను దేశానికి ఏమి చేయాలి అని ఆలోచించిన వ్యక్తి వెంకట్రావు. నేటి యువకుల్లో అలా ఆలోచించే వారు తక్కువ మందే ఉన్నారు.

ఎక్కువ మందికి తాము, తమ కుటుంబం బాగుంటే చాలనే స్వార్ధం పెరిగిపోయింది. సోమరితనం పెరిగిపోయింది. సమాజంలోని అవినీతిని దౌర్జన్యాలను, దురాచారాలను వెంకట్రావులా ఎదిరించాలనే ధోరణి, తన తోటి వారికి సాయపడాలనే సేవాభావం నేటి యువతలో తగ్గాయి. పెడధోరణులు, క్రమశిక్షణ లేకపోవడం నేటి యువతలో కనబడుతున్నాయి.

ఈ. “మనం ఈ రోజు స్వార్థ రహితంగా, ధైర్యంగా, పట్టుదలతో పనిచేస్తే, మన సంతానం అంతా హాయిగా బతుకుతారు.” అని ఒక నాయకుడు ఎందుకు అని ఉంటాడు ?
జవాబు.
ఆంధ్రమహాసభ కార్యకర్త వెంకట్రావు నాయకులతో కలిసి రంగాపురానికి వెళ్లాడు. అక్కడ కొంతమంది పిల్లలు తమ ఊరి పటేలు, దొర, ఇతర పెత్తందార్లు తమను, తమ తల్లిదండ్రులను ఎంతగా బాధపెడుతోందీ నాయకులకు చెప్పారు. హాయిగా, సంతోషంగా ఎదగాల్సిన బాలలు అంత చిన్న వయసులోనే తమ కుటుంబాలకు జరుగుతున్న అన్యాయాలు తెలుసుకోవాల్సిన గతి పట్టిందంటే, సమాజ పరిస్థితి ఎంతో అధ్వాన్నంగా ఉందని నాయకులకు అర్థమైంది.

వారి పసిమనస్సులు కష్టాల కారణంగా గాయపడితే, సమాజానికి ప్రమాదం. అలాంటి కష్టాలేవి తెలియకుండా పిల్లలు ఎదగాలంటే, స్వార్థరహితంగా, ధైర్యంగా, పట్టుదలతో పెత్తందార్ల ఆగడాలను ఆపే నాయకులు రావాలి. వారు సమాజాన్ని చైతన్యవంతం చేయాలి. నాయకులు చేసే కృషి వల్లే సమాజంలో జరిగే అన్యాయాలు తగ్గి, పిల్లలు ఎటువంటి బాధలు, కష్టాలు లేకుండా ఎదుగుతారని నాయకుడన్నాడు.

ఉ. గ్రామంలోని పెత్తందార్ల, దొరల దౌష్ట్యాలను వివరించండి.
జవాబు.
గ్రామంలోని పెత్తందార్లకూ, దొరలకూ దయాదాక్షిణ్యాలు లేవు. అన్యాయంగా బర్రెను బందులదొడ్లో పెట్టించారు. కోడెదూడ చేలో పడ్డదని ఊరి పటేలు పదిరూపాయలు వసూలు చేశాడు. దున్నపోతు బుస్సుమన్నదనీ, దానికి మోతాడు లేదనీ మాలిపటేలు ముప్పయి రూపాయలు తీసుకున్నాడు. వెంకట్రామ పంతులు పెట్టిన బడిలోకిపోతే దెబ్బలు కొడతానని దొర గుమస్తా బెదిరించాడు. కూలికి పోయి వస్తూ చేలో కట్టెపుల్లలు ఏరుకున్నందుకు స్త్రీ అని కూడా చూడకుండా ఒక తల్లిని సిగపట్టుకొని కొట్టాడు దొర శేగిదారు. అడ్డువెళ్ళిన ఆమె భర్త చెయ్యి విరగగొట్టాడు కూడా. ఈ విధంగా గ్రామంలోని పెత్తందార్ల, దొరల దౌర్జన్యాలకు అడ్డు అదుపూ లేకుండా పోయింది.

TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చిన్నప్పుడే

ఊ. గ్రామస్తుల కష్టాలను పిల్లలు నాయకులకు ఎలా వివరించారు?
జవాబు.
వెంకట్రావు, ఇతర నాయకులూ వచ్చి పిల్లలను కుశల ప్రశ్నలతో ప్రేమగా పలకరించారు. ఒక పిల్లవాడు వాళ్ళమ్మ పొయ్యిలో కట్టెలు లేకపోతే ఆ రాత్రి బువ్వెట్లా వండిందో వివరించాడు. అయ్య అన్నం వండుతుంటే గిర్దావరు బరులకు పోవాలని అతణ్ణి పట్టుకుపోయాడు. పొయ్యిమీది అన్నం చెడిపోయింది. అయినా దాంట్లోనే మీరం, ఉప్పుపోసుకుని నీళ్ళుపోసుకొని తిన్నానన్నాడు ఆ పిల్లవాడు.

ఒకసారి వాళ్ళమ్మ పసుల జంగల్లో నుంచి పేడ తెచ్చిందని పోలీసు పటేలు ఇనుపతట్ట గుంజుకున్నాడనీ, ఆ తట్ట ఇప్పటిదాక ఇవ్వలేదని ఒక పిల్లవాడు చెప్పుకున్నాడు. పాపం! చిన్నప్పుడే కుటుంబ ఇబ్బందులన్నీ ఈ పిల్లలు తెలుసుకోవాల్సిన గతి బట్టిందంటే పరిస్థితులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో కదా! అని నాయకులు బాధపడ్డారు.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ. ‘చిన్నప్పుడే’ కథ ద్వారా ఆనాటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలుసుకున్నారు కదా! నాటి పరిస్థితులు నేటి సమాజంలో కూడా ఉన్నాయా ? కారణాలు ఏమిటి ?
జవాబు.
‘చిన్నప్పుడే’ కథా కాలంలో పటేళ్ళ దొరల దౌర్జన్యాలు ఎక్కువగా ఉండేవి. ఆనాటి పరిస్థితులు ఈనాడు లేవు. 1947 సం||లో మనకు స్వాతంత్ర్యం వచ్చాక, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మన దేశానికి రూపొందించిన రాజ్యాంగం ప్రజలంతా సమానమేనని, కుల, మత, వర్గ విచక్షణ పనికిరాదని తేల్చి చెప్పింది. చట్టం ముందు అంతా సమనామేనని తేల్చింది. కొన్ని వర్గాల వారికి ప్రత్యేక రక్షణలు కల్పించింది. స్త్రీలకు ఆర్తిక స్వాతంత్ర్యం కల్పించింది. దీంతో సమాజంలో చైతన్యం తెచ్చింది.

పటేలు, దొర పెత్తనాలు తగ్గుముఖం పట్టాయి. నేడు ప్రతి గ్రామంలో విద్యాలయం స్థాపించడం వల్ల, విద్యా విధానంలో మార్పులు రావడం వల్ల మారుమూల గ్రామాల్లో ఉన్న పిల్లలు కూడా విద్యావంతులై తమ హక్కులను గుర్తించడం మొదలుపెట్టారు. ప్రభుత్వాలు కఠిన చట్టాలు చేసి పెత్తందారీతనాన్ని అణచివేశాయి. అయితే ఇంకా మార్పు రావలసి ఉంది. ఢిల్లీ అత్యాచార సంఘటనలు అప్పుడప్పుడు వెలుగుచూస్తున్నా పెత్తందార్ల దౌర్జన్యాలు, దోపిడీల వల్ల సమాజంలో ఇంకా ఆనాటి పరిస్థితులు అక్కడక్కడ ఉన్నాయనిపిస్తున్నా, చాలా వరకు పరిస్థితులు మారాయన్నది నిజం.

IV. సృజనాత్మకత/ప్రశంస

1. కింది అంశాల గురించి సృజనాత్మకంగా రాయండి.

అ. ఈ పాఠం ఆధారంగా చేసుకొని, మీ అనుభవాలతో ఒక చిన్న కథ రాయండి.
జవాబు.
రామాపురం మారుమూల చిన్న పల్లెటూరు. అన్ని వర్గాల వాళ్ళు కలిసి మొత్తం 350 కుటుంబాలున్నాయి. ఆ ఊళ్ళో జానయ్య అనే ఒక మోతుబరి రైతు ఉన్నాడు. అదే ఊళ్ళో రామయ్య అనే 100 ఎకరాలున్న రైతు ఉన్నాడు. రామయ్య దగ్గర వ్యవసాయం పనులు చేయడానికి, ఇంకా ఇతర పనులు చేయడానికి మొత్తం పదిమంది పనివాళ్ళున్నారు. రామయ్య పనివాళ్లను బాగా చూసుకుంటాడు. జానయ్యకు తల పొగరు ఎక్కువ.

పనిచేసే వాళ్ళను చాలా హీనంగా చూస్తాడు. అందుకే ఆయన ఇంట్లో పనివాళ్ళు ఎక్కువ కాలం పనిచేయరు. గ్రామంలో ఉన్న ప్రజలకు ఏ అవసరమొచ్చినా రామయ్య ముందుంటాడు. అందుకే అంతా రామయ్యను గౌరవిస్తారు. ఆయన గ్రామానికి గత 30 సంవత్సరాల నుండి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడమే దానికి నిదర్శనం. ఈ మధ్యనే రామయ్య తన పొలంలో 40 ఎకరాల పొలాన్ని కొంత రైతులకు, కొంత ఇండ్ల స్థలాలకు ఇచ్చాడు.

ప్రతి గ్రామంలో ఇటువంటి వారుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. గ్రామాభివృద్దే దేశాభివృద్ధి కదా! అదే విధంగా 5 ఎకరాల స్థలంలో పాఠశాల నిర్మాణం చేయించాడు. ఒకప్పుడు ఆ గ్రామ విద్యార్థులు దాదాపు 5 కి.మీ. నడచి వెళ్ళి చదువుకోవలసిన పరిస్థితి ఉండేది. గ్రామంలో మంచినీటి సౌకర్యాన్ని కలిగించాడు. పంచాయితీ భవనాన్ని కట్టించాడు. రోడ్ల నిర్మాణం చేయించాడు. రామయ్యను చూసి ఇప్పుడు జానయ్య కూడా మారాడు.

(లేదా)

ఆ. వెంకట్రావు వలె గ్రామం బాగుకోసం పాటుపడుతున్న వాళ్ళు నేడు కూడా ఉంటారు. అటువంటి వారి సేవలను ప్రశంసిస్తూ ఒక అభినందన పత్రం రాయండి.
జవాబు.

ఆర్మూర్,
తేది : XX.XX.XXXX

పేద కుటుంబంలో, మురికివాడలో జన్మించిన ‘స్వామి’ బాల్యంలో ఎంతో దుర్భరమైన జీవితాన్ని అనుభవించాడు. ఎంతో కష్టపడి చదువుకున్నాడు. చిన్న వయస్సులోనే ఉద్యోగం సంపాదించడం అతని ప్రతిభకు నిదర్శనం. స్వామి మా గ్రామ ప్రజలకు తలలో నాలుకలా ఉంటాడు. మా గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా తనే ముందుంటాడు. యువకులను, విద్యావంతులను కలిసి ‘గాంధీ యువసేన’ అనే సంఘం ఏర్పాటు చేశాడు.

వారంతా ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం, సెప్టెంబరు 5 ఉపాధ్యాయ దినోత్సవం, నవంబరు 14 బాలల దినోత్సవం వంటి వాటిల్లో బాల బాలికలకు వివిధ రకాల పోటీలు ముఖ్యంగా వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన బాల బాలికలకు బహుమతులు అందిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ మా గ్రామ పాఠశాలలో నిర్వహిస్తారు. బాల బాలికలను చైతన్యవంతులను చేయడమే అతని ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఇవే కాకుండా పోలియో చుక్కలు వేసేటప్పుడు పసిపిల్లల తల్లులను చైతన్యపరుస్తాడు.

వివిధ రకాలైన సేవా కార్యక్రమాలలో భాగంగా పంచాయతీ వారితో మాట్లాడి గ్రామంలో చెత్త కుండీలను ఏర్పాటు చేయించాడు. మొక్కల అవసరం, వినియోగం గురించి అందరికీ చెప్పి ఇండ్లలో, రహదారులపై, పొలాల గట్లపై విరివిగా మొక్కలను నాటించేటట్లు చేశాడు. మన దేశ సమైక్యత, సమగ్రతలను గురించి, అవినీతి, లంచగొండితనం గురించి వివరిస్తూ ప్రజలలోనూ, విద్యార్థులలోనూ అవగాహన కలిగిస్తాడు. స్వామిలాంటి వారు ప్రతి గ్రామంలో ఉంటే దేశం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగుతుందని నా
భావన.

స్వామికి నా అభినందనలు

ఇట్ల
రవికుమార్,
ఆర్మూర్.

(ఇ) పాఠం ఆధారంగా వెంకట్రావు, నాయకులు, బాలుర మధ్య జరిగిన సన్నివేశాన్ని సంభాషణల రూపంలో రాయండి.
జవాబు.

సంభాషణ

ఆంధ్రమహాసభ కార్యకర్త వెంకట్రావు నాయకులతో కలసి రంగాపురానికి బయలుదేరాడు.
వెంకట్రావు : (నాయకులతో) మనం నేరుగా ఊళ్ళోకి వెళ్ళకూడదు. మనం అలా వెళితే గ్రామ ప్రజలకు నిరుత్సాహం కలుగుతుంది. వాళ్ళు మంగళవాయిద్యాలతో మనకు స్వాగతం పలికి తీసుకువెళతారు.
గ్రామ యువకుడు : (బాటసారితో) ఆంధ్రనాయకులు వచ్చారని గ్రామంలో తెలియజెయ్యి.
బాలకులు : మన గ్రామానికి నాయకులు వచ్చారట మనందరం ఉసిరికాయలు ఏరుకొని అక్కడకు వెళదాం పదండి.
నాయకులు : రండి ! పిల్లలూ ! రండి.
నాయకుడు 1 : నీ పేరేంటి?
ఒక బాలుడు : లింగయ్య
రెండో బాలుడు : మేము ముందు లింగా అని పిలిచేవాళ్ళం. బడిలో అందరం లింగయ్య ! అని పిలుస్తున్నాం.
నాయకుడు 2 : మీరు ఎవరు ?
లింగయ్య : మేము బట్టలుతుకుతాం.
నాయకుడు 3 : నాకు ఒక ఉసిరికాయ ఇస్తావా ?
లింగయ్య : ఇదిగో. తీసుకోండి.
బాలలందరూ (పిల్లలందరూ) : ఇవిగోండయ్యా ! ఇవన్నీ మీకే !
వెంకట్రావు : వీళ్ళంతా ఎవరో మీకు తెలుసా ?
పిల్లలు (బాలురు) : వీళ్ళంతా మమ్మల్ని బతికించడానికి వచ్చినవాళ్ళు.
నాయకుడు : మీకేం మీరు బాగానే ఉన్నారు కదా !
బాలుడు – 1 : ఏం బాగు బాబూ ! మా బర్రెను బందెలదొడ్లో పెట్టించాడు.
బాలుడు – 2 : మా అన్న కోడెదూడ చేలో పడిందని పటేలు పది రూపాయలు వసూలు చేశాడు.
బాలుడు – 3 : మా దున్నపోతు బుస్సుమన్నదని మాలి పటేలు ముప్పయి రూపాయలు తీసుకున్నాడు.
బాలుడు – 4 : సర్కారు పన్ను కట్టలేదని మా నాయనకు బండలెత్తారు.
బాలుడు – 5 : వెంకట్రావు పంతులు పెట్టిన బడికిపోతే దెబ్బలు కొడతానని మా దొర గుమాస్తా బెదిరించాడు.
బాలుడు – 6 : మా అమ్మ కూలి పనికిపోయి కట్టెపుల్లలు ఏరుకుందని సిగపట్టుకొని కొట్టాడు. మా అయ్య అడ్డంపోతే చేతికర్ర ఇరిగేదాకా కొట్టాడు దొరగారి శేగిదారు.
నాయకుడు : నువ్వు ఎవరబ్బాయివి ?
బాలుడు : నేను సంగిశెట్టి కొడుకును.
నాయకుడు : మీకేమయినా కష్టాలున్నాయా ?
బాలుడు : ఏమో ? నాకేం ఎరుక ? మా నాయనకెరుక. (నాయకులందరూ ఒకరితో ఒకరు)
పాపం ! ఈ చిన్నపిల్లలు ఇప్పటినుంచే కష్టాలు పడాల్సి వచ్చింది. మనందరం స్వార్థం లేకుండా ఉంటే భావితరం పిల్లలు హాయిగా బతుకుతారు.

V. పదజాల వినియోగం

1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు తెలుసుకొని రాయండి.

(అ) వెంకట్రావుకు పెట్టే దండంలో పెత్తందార్లకు పెట్టే దండంలో తేడా కనిపించింది.
దండం = నమస్కారం, వందనం
తిరిగి రాయుట : వెంకట్రావుకు పెట్టే నమస్కారంలో, పెత్తందార్లకు పెట్టే నమస్కారంలో తేడా ఉంది. వెంకట్రావుకు పెట్టే వందనంలో, పెత్తందార్లకు పెట్టే వందనంలో తేడా ఉంది.

(ఆ) ఆ నాయకుడు పిల్లలకు అవ్యాజ బంధువైపోయాడు.
జవాబు.
అవ్యాజ = కపటం లేనిది
తిరిగి రాయుట : పసిపిల్లలు కల్లాకపటంలేని వారు. ఆ నాయకుడు పిల్లలకు కపటం లేని బంధువైపోయాడు.

(ఇ) సర్కారీ రకం కట్టలేదని ఆ పిల్లవాని తండ్రికి బండలెత్తారు.
జవాబు.
రకం = పైకం, ధనం
తిరిగి రాయుట : సర్కారీ పైకం కట్టలేదని పిల్లవాని తండడ్రికి బండలెత్తారు. సర్కారీ ధనం కట్టలేదని పిల్లవాని తండ్రికి బండలెత్రారు.

TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చిన్నప్పుడే

(ఈ) ఆ బువ్వలోనే మిరం, ఉప్పుపోసుకొని పిల్లవాడు తిన్నాడు.
జవాబు.
మిరం : పంరపపాడి
తిరిగి రాయుట : ఆ బువ్వలోనే మిరపపొడి, ఉప్పం పోసుకొని పిల్లవాడు తిన్నాడు.

(ఉ) కష్టాల సంగతి నాయనకు ఎరుక.
ఎరుక = జ్ఞానం, తెలుసు
తిరిగి రాయుట = కష్టాల సంగతి నాయనకు తెలుసు.

2. కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు అదే అర్థం వచ్చే మరి రెండు పదాలను రాయండి.

ఉదా :
ఊళ్ళోని యువకుడు వెంకట్రావుకు దండం పెట్టాడు.
దండం = నమస్కారం, అంజలి

(అ) పిల్లల పట్ల ఆయనకు గల ప్రేమకు విలువ కట్టలేం.
జవాబు.
విలువ = ధర, వెల, మూల్యం

  1. వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి.
  2. ఆ పుస్తకం వెల కట్టలేనంత గొప్పది.
  3. ఆ వస్తువు మూల్యం ఎంత ?

(ఆ) పిల్లలు తమ కష్టాలను కుప్పలుగా కురిపించారు.
జవాబు.
కుప్పలు = రాసులు, పోగులు, గుంపులు

  1. రైతులు ధాన్యాన్ని రాసులుగా పోశారు.
  2. మొక్కజొన్న కండెలు పోగులుగా ఉన్నాయి.
  3. నాయకుని ఉపన్యాసం వినడానికి జనం గుంపులుగా చేరారు.

(ఇ) కుటుంబ పరిస్థితులు చాలా అధ్వాన్నంగా ఉన్నాయి.
జవాబు.
అధ్వాన్నం = అమార్గం, తప్పుదారి

  1. ఆ గ్రామానికి వెళ్ళే దారి అమార్గంగా ఉంది.
  2. విద్యార్థులు తప్పుదారిలో నడవకూడదు.

(ఈ) పిల్లలందరూ గభాలున అతని వద్దకు చేరుకున్నారు.
జవాబు.
గభాలున = శీఘ్రంగా, తొందరగా, త్వరగా

  1. ప్రమాదం జరిగిన చోటుకు శీఘ్రంగా అందరూ చేరారు.
  2. బడి గంట వినపడి పిల్లలు తొందరగా పరుగెత్తారు.

TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చిన్నప్పుడే

(ఉ) నీ చేతులకు వెండి కడియాలున్నాయి.
జవాబు.
వెండి = రజతము, శ్వేతము

  1. మా చెల్లి కాలి పట్టీలు రజతముతో చేసినవి.
  2. శ్వేతము స్వచ్ఛతకు మారు పేరు.

3. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు పాఠం ఆధారంగా ప్రకృతి పదాలు రాయండి.

(అ) నాయకులు ఒకరి మొగం ఒకరు చూసుకున్నారు.
మొగం (వి) – ముఖం (ప్ర)
జవాబు.
ముఖం

(ఆ) అతడు పట్టలేని సంతసంతో పిల్లలను దగ్గరికి తీసుకున్నాడు.
సంతసం (వి) – సంతోషం (ప్ర)
జవాబు.
సంతోషం

(ఇ) మనం ధైర్యంగా కష్టపడి పనిచేస్తే మన పిల్లలు సుకంగా ఉంటారు.
జవాబు.
సుకం (వి) – సుఖం (ప్ర)

(ఈ) గారవం పొందాలంటే మంచి పనులు చేయాలి.
గారవం (వి) – గౌరవం (ప్ర)
జవాబు.
గౌరవం

VI. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది పట్టికలోని ఖాళీలను పూరించండి.

సమాసపదం విగ్రహవాక్యం సమాసం పేరు
రాజ్యకాంక్ష
విజయం వల్ల గర్వం
అష్టదిక్కులు
బలరాముడును, కృష్ణుడును
ప్రజల భాష
క్రమము కానిది

జవాబు.

సమాసపదం విగ్రహవాక్యం సమాసం పేరు
రాజ్యకాంక్ష రాజ్యము నందు కాంక్ష సప్తమీ తత్పురుష సమాసం
విజయగర్వం విజయం వల్ల గర్వం పంచమీ తత్పురుష సమాసం
అష్టదిక్కులు ఎనిమిది అయిన దిక్కులు ద్విగు సమాసం
బలరామకృష్ణులు బలరాముడును, కృష్ణుడును ద్వంద్వ సమాసం
ప్రజల భాష ప్రజల యొక్క భాష షష్ఠీ తత్పురుష సమాసం
అక్రమము క్రమము కానిది నఞ తత్పురుష సమాసం


2. కింది వాటిని చదువండి.

ఔరౌర! ఎంత గొప్పపని చేశావు.
ఆహాహా! ఎంతో ఆనందం కలిగించావు.

పై వాక్యాలలో గీత గీసిన పదాలను విడదీసి రాస్తే
ఔరౌర = ఔర + ఔర
ఆహాహా = ఆహా + ఆహా – అవుతున్నాయి కదా!

ఇక్కడ ఒకే పదం రెండు సార్లు వచ్చింది. అట్లా వచ్చినప్పుడు రెండోసారి వచ్చిన పదాన్ని ‘ఆమ్రేడితం’ అంటారు. పై పదాలను గమనిస్తే
ఔర = ఔర్ + అ
ఆహా = ఆహ్ + అ

ఆ పదాల చివర అచ్చులు కనబడుతున్నాయి. వాటికి ఆమ్రేడితం వచ్చి చేరితే ఏమవుతుందో చూద్దాం.
ఔర + ఔర = ఔరౌర
ఔ (ర్ + అ) = ఔర అని ఉండగా అకారం లోపించి ఔర్ + ఔర అని ఉంటుంది. ఆమ్రేడిత పదంలోని ‘ఔ’ వచ్చి చేరి “ఔరౌర” అని అయింది.

అట్లాగే ఆహా + ఆహా = ఆ (హ్ + ఆ) + ఆహా = ఆహాహా
దీనివల్ల అచ్చుకు ఆమ్రేడితం పరమైతే సంధి జరుగుతుంది. ఇది ‘ఆమ్రేడిత సంధి’
సూత్రం : “అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరుచుగానగు.”

కింది పదాలను కలిపి రాయండి.

(అ) అప్పుడు + అప్పుడు = అప్పుడప్పుడు
(ఆ) ఏమి + ఏమి = ఏమేమి
(ఇ) ఊరు + ఊరు = ఊరూరు
(ఈ) ఇంట + ఇంట = ఇంటింట
(ఉ) ఓరి + ఓరి = ఓరోరి

ఈ కింది పదాలను చదవండి.

(అ) పగలు + పగలు = పట్టపగలు
(ఆ) చివర + చివర = చిట్టచివర
పై పదాలు కలిపినప్పుడు ఏం జరిగిందో చెప్పండి.
పగలు + పగలు = పట్టపగలు అవుతోంది. అంటే మొదటి పదంలోని పగలులో ‘ప’ తర్వాత ఉన్న ‘గలు’ పోయి దానికి బదులుగా ‘ట్ట’ వచ్చింది. అప్పుడు పట్టపగలు అయింది. అట్లనే చిట్టచివరి పదం కూడా.

మరికొన్ని ఉదాహరణలు చూద్దాం.
(అ) నడుమ + నడుమ = నట్టనడుమ
(ఆ) కొన + కొన = కొట్టకొన
(ఇ) కడ + కడ = కట్టకడ

ద్విరుక్తటకారమనగా ‘ట్ట’ (ద్విత్వము)
ఆమ్రేడితం పరంగా ఉంటే నడుమ, కొన, కడ మొదలైన శబ్దాలలో మొదటి అచ్చు మీద అన్ని అక్షరాలు పోయి వాటి సంస్థానంలో ‘ట్ట’ వస్తుందని చూశాం కదా!
సూత్రం : ఆమ్రేడితం పరమైతే కడాదుల తొలి అచ్చు మీది అన్ని అక్షరాలకు ద్విరుక్తటకారం వస్తుంది.

3. కింది పదాలను కలిపి రాయండి. ఏం జరిగిందో చెప్పండి.

(అ) బయలు + బయలు = బట్టబయలు
బయలు + బయలు – అని ఉన్నప్పుడు మొదటి పదమైన బయలులోని ‘బ’ తప్ప తక్కిన ‘యలు’ లోపించాయి. ఆ లోపించిన ‘యలు’ స్థానంలో ద్విరుక్తటకారం అంటే ‘ట్ట’ వచ్చింది. అపుడు బట్టబయలు అనే రూపం ఏర్పడింది.

(ఆ) అంత + అంత = అంతంత
అంత + అంత – అని ఉన్నప్పుడు అందులో మొదటీపదంలో చివరి ‘అ’ (త్ + అ) ఉన్నది. తరువాతి పదంలో మొదటి ‘అ’ ఉన్నది. అంటే ‘అ + అ’ అని ఉండగా మొదటి పదంలోని చివరి ‘అ’ లోపించి రెండవ పదంలో మొదట่ ఉన్స ‘అ’ మిగిలి ‘అంతంత’ అనే రూపం ఏర్సడింది.

(ఇ) తుద + తుద = తుట్టతుద
తుద + తుద – అని ఉండగా అందులోని మొదటి తుదలో మొదటి అక్షరము మా(్రం మిగిలింది. దాని మీద ఉన్న ‘ద’ లోపించింది. లోపించిన ‘ద’ స్థానంలో ద్విరుక్తటకారం ‘ట్ట’ వచ్చింది. అపుడు తుట్టతుద అనే రూపం ఏర్హడింది.

TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చిన్నప్పుడే

(ఈ) ఎన్ని + ఎన్ని = ఎన్నెన్ని
జవాబు.
ఎన్ని + ఎన్ని – అని ఉండగా అందులోని మొదటి పదం చివర ఉన్న ‘ఇ’ (న్.న్ + ఇ), తరువాతి పదం మొదట ఉన్న ‘ఎ’ల స్థానంలో అంటే ‘ఇ + ఎ’లలో ‘ఇ’ లోపించి ‘ఎ’ మాత్రం మిగిలింది. అప్పుడు ‘ఎన్నెన్ని’ అనే రూపం ఏర్పడింది.

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని

మీ తాత / అమ్మమ్మ / నాయనమ్మలను అడిగి ఒక కథ చెప్పించుకుని వాళ్లు చెప్పినట్లుగానే రాసి నివేదికను తరగతి గదిలో ప్రదర్శించండి.
జవాబు.
(అ) ప్రాథమిక సమాచారం :
(1) ప్రాజెక్టు పని పేరు : పెద్దలు చెప్పిన కథ వాళ్ళు చెప్పిన రీతిలో రాయడం.
(2) సమాచారాన్ని సేకరించిన విధానం : తాత/నానమ్మ/అమ్మమ్మ చెప్పగా విని

(ఆ) నివేదిక : రామయ్య శెట్టి 3 వరాల కథ
మా 8వ పాఠం ‘చిన్నప్పు’’లో తాత/నానమ్మ/అమ్మమ్మలచే కథ చెప్పించుకుని చెప్పిన రీతిలోనే రాయాలని ప్రాజెక్టుపని ఉన్నదని, ఒక కథ చెప్పమని మా నానమ్మను అడగగా తన వంటపని ముగిశాక, భోంచేశాక తను నన్ను దగ్గర కూర్చుండబెట్టుకుని ఈ కథ నాకు చెప్పొంది. పూర్వం రంగాపురంలో రామయ్యశెట్టీ అనే పరమ పిసిరి ఉండేవాడు. అతడు మిక్కిలి దురాశ గలవాడు. ఒకరోజు భగవంతుడు భిక్షకుని రూపంలో ‘అయ్యా భిక్షాందేహి’ అని అతని దుకాణం ముందుకు వచ్చి అడగ్గా…. కసురుకొని పంపివేశాడు.

భిక్షకుని రూపంలో ఆ దేవుడు రామయ్య పక్కింటి వాడైన పేరిశాస్త్రి ఇంటికి వెళ్ళగా, వారు ఆ భిక్షకుణ్ణి సాదరంగా ఆహ్వానించి భోజనం పెట్టారు. భిక్షకుడు వారిని ఆశ్రీదించి బయటకు వెళ్ళగానే పేరయ్య పాత ఇంటి స్థానంలో పెద్ద భవనము, పరిచారకులు, ఇంటినిండా ధన, ధాన్య రాశులు (ప్రత్యక్షమయ్యాయి. ఇది చూసిన రామయ్యశెట్టి ఆ వచ్చినవాడు మామూలు వ్యక్తి కాదని గ్రహించి, పరుగు పరుగున వెళ్ళి అతని

కాళ్ళపైపడి అనుగ్రహించమనగా, ‘నీవు మొదట కోరిన 3 కోరికలు నిజమౌతాయి వెళ్ళు’ అని భగవంతుడు అతన్ని పంపివేశాడు. 3 కోరకకలు ఏం కోరుకోవాలని, ఇంటి వెనుక రాయిఫై కూర్చుని రామయ్యశెట్టి తీక్షణంగా ఆలోచిస్తుండగా నెత్తిపై కాకి రెట్ట వేసింది. ఛీ కాకి చచ్చిపోను అన్నాడు రామయ్యశెట్టి. మొదటి వరం (్రకారం కాకి చచ్చిపోయింది.

మిట్టమధ్యాహ్నం అయ్యింది, భర్త ఇంకా లోనికి రావడం లేదని భార్య ‘మండీ లోపలికి రారా’ అంటే, నేను రాను అన్నాడు రామయ్యశెట్టి. అలా రెండవ వరం న్ష్ప్యయోజనం అయ్యింది. రాయికే అతడు అతుక్కుపోయాడు. ఎండ తీ|్రత పెరుగుతోంది. రాయి వేడెక్క్ కాలడం వల్ల దాసిపై కూర్చోలేక తను రాయి నుండి విడివడాలని 3వ వరం కోరుకుని ఇంట్లోకి వచ్చాడు. ఇలా అతని 3 వరాలు నిష్ఫలమయ్యాయి.

(ఇ) కుగింళ్ర / అభల్రాయుం :
దురాశ దుఃఖానికి చేటు, అత్రాశ పనికిరాదు. జనులు మితిమీరిన సంపాదన మోజులో పడి, చన్న చిన్న ఆనందాలకు, ఆత్మీయుల స్నేహపూర్వక పలకరింపులకు దూరం కారాదు. కేవలం సంపాదనే కాకుండా ఆనందంగా జీవించడం కూడా ఎంతో ముఖ్లం. అత్యాశకు పోయి రామయ్య తన 3 వరాలలో ఏ ఒక్క వరాన్నీ ఉపయోగించు కోలేకపోయాడు.

TS 8th Class Telugu 8th Lesson Important Questions చిన్నప్పుడే

పర్యాయపదాలు

  • రైతు = వ్యవసాయదారుడు, కృషీవలుడు, కర్షకుడు
  • ముఖము = వదనము, ఆననము, మోము
  • తల = శిరస్సు, మస్తకము, మూర్ధము
  • ధనము = డబ్బు, ద్రవ్యము, ఐిత్తము
  • కృషి = యత్నము, పూనిక, ఉద్యోగము
  • స్త్రీ = యువతి, ఉవిద, లలన, మగువ
  • మంతి = ముచ్చట, ప్రసంగం ప్రస్థావన
  • కడుపు = ఉదరము, కుక్షి, పొట్ట
  • చెవి = కర్ణము, శ్రవణము, వీను
  • నేల = భూమి, ఇల, ధరణి, వసుధ

నానార్థాలు

  • వయస్సు – ఈడు, పక్షి, ఆరోగ్యం
  • పొలం – వరిమడి, అడవి, విధం
  • గంట – అరవై నిమిషాల కాలం, చిఱుగంట, గడ్డిదుబ్బు
  • బడి – పాఠశాల, ఐిధం, అనుసరణం
  • దండం – నమస్కారం, కఱ్ఱ, సమూహం

వ్యతిరేకార్థక వాక్యాలు

  • బాలురంతా పరిగెత్తారు × బాలురంతా పరుగెత్తలేదు
  • నాయకులు పిల్లలతో అరగంట గడిపారు × నాయకులు పిల్లలతో అరగంట గడపలేదు
  • బాలుడు జవాబు చెప్పాడు × బాలుడు జవాబు చెప్పలేదు
  • అందరి ముఖాలు వికసించాయి × అందరి ముఖాలు వికసించలేదు.
  • పిల్లలు మెల్లగా నాయకుల ప్రక్కన కూర్చున్నారు × పిల్లలు మెల్లగా నాయకుల ప్రక్కన కూర్చోలేదు

సంధులు

1. సవర్ణదీర్ఘసంధి :
జీవితాంతం = జీవిత + అంతం
గాఢాభిమానం = గాఢ + అభిమాసం
అధ్వాన్నము = అధ్వ + అన్నము
స్వార్రము = స్వ + అర్రము
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.

2. గుణసంధి :
అమితోత్సాహం = అమిత + ఉత్సాహం
సూత్రం : అకారానికి ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమంగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమవుతాయి.

TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చిన్నప్పుడే

3. ఉత్వసంధి :
బట్టలుతుకుతాం = బట్టలు + ఉతుకుతాం
మేమెందుకొ = మేము + ఎందుకొ
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.

4. అత్వసంధి :
బువ్వంత = బువ్వ + అంత
లింగయ్య = లింగ + అయ్య
చిన్నప్పుడు = చిన్న + అప్పుడు
సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.

5. ఇత్వసంధి :
ఏమైంది = ఏమి + ఐంది
ఇవన్ని = ఇవి + అన్ని
ఎవరబ్బాయి = ఎవరి + అబ్బాయి
ఏమయింది = ఏమి + అయింది
సూత్రం : ఏమి మొదలైన పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.

ఇత్వసంధి : (ఆ)
పట్టిందంటే = పట్టింది + అంటే
అన్నదట = అన్నది + అట
సూత్రం : క్రియాపదాల్లో ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.

6. గసడదవాదేశ సంధి:
హాయిగా = హాయి + కా
విలువగట్టు = విలువ + కట్టు
సూత్రం : ప్రథమమీది పరుషాలకు గసడదవలు బహుళంగా వస్తాయి.

సమాసములు

  • గాఢాభిమాన = గాఢమైన అభిమానం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
  • దివ్యభవనాలు = దివ్యమైన భవనాలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
  • పెద్దకొడుకు = పెద్దయైన కొడుకు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
  • వాద్యాల చప్పుడు = దివ్యభవనాలు పెద్దకొడుకు వాద్యాల చప్పుడు – షష్ఠీ తత్పురుష సమాసం
  • పరహితము = పరులకు హితము – షష్ఠీ తత్పురుష సమాసం
  • మన సంతానము = మన యొక్క సంతానము – షష్ఠీ తత్పురుష సమాసం
  • ఒకరైతు = మన సంతానము ఒకరైతు – ద్విగు సమాసం
  • పండ్రెండు గంటలు = పండ్రెండైండు గంటలు – ద్విగు సమాసం
  • పదినిమిషాలు = పది అయిన నిమిషాలు – ద్విగు సమాసం
  • (పతి వస్తువు = వస్తువు వస్తువు – అవ్యయీభావ సమాసం
  • చేతి కర్ర = చేతి యందలి కర్ర – సప్తమీ తత్పురుష సమాసం
  • విశ్వమానవులు = విశ్వము నందలి మానవులు – సప్తమీ తత్పురుష సమాసం
  • గౌరవమర్యాదలు = గౌరవమును, మర్యాదయు – ద్వంద్వ సమాసం
  • స్కార్రరహీతము = స్వార్ధము చేత రహితము – తృతీయా తత్పురుష సమాసం
  • ఆగమనవార్త = ఆగమనమును గుఱించి వార్త – ద్వితీయా తత్పురుష సమాసం

పాఠం ఉద్దేశం

అప్పటి నిజాం రాష్ట్రంలో తెలుగు భాషా సంస్కృతులు ఉపేక్షకు గురికావడాన్ని నిరసిస్తూ నిజాం రాష్ట్రంలో ఆంధ్రోద్యమం విస్తరించింది. ఆ సందర్భంగా సభలద్వారా, పత్రికలద్వారా, రచనల ద్వారా ప్రజా చైతన్యాన్ని ఎట్లా సాధించారో తెల్పడం ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ప్రశ్న 1.
కథానిక ప్రక్రియను గురించి రాయండి.
జవాబు.
ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందినది. ఇది జీవితపు ముఖ్య సన్నివేశాల్ని క్లుప్తంగా తెలియజేస్తుంది; సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది; ఈ వచన ప్రక్రియనే “కథానిక” అంటారు. కథనం, సంభాషణలు, శిల్పం కథానికలోని ప్రధానాంశాలు. సంక్షిప్తతా లక్షణమే కథానిక ప్రత్యేకత. 1945లో మీజాన్ పత్రికలో ప్రచురితమైన ఆళ్వారుస్వామి కథానికనే ప్రస్తుత పాఠ్యాంశం.

రచయిత పరిచయం

పాఠం పేరు : “చిన్నప్పుడే”
రచయిత : వట్టికోట ఆళ్వారుస్వామి
పాఠ్యభాగం దేని నుండి గ్రహింపబడింది : 1945 లో “మీజాన్” పత్రికలో ప్రచురితమైన కథానిక ఇది
రచయిత జననం : 1915 నవంబరు 1న, నల్గొండ జిల్లాలోని “చెరువుమాదారం”లో జన్మించారు.
ప్రతిభ : ఆళ్వారుస్వామి సుప్రసిద్ధ నవలా రచయిత. గొప్ప సాహితీవేత్త. తొలితరం కథా రచయిత.
జైలుజీవితం : నిజాంపాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలు పాలయ్యారు.
ఆంధ్రమహాసభాధ్యక్షులు : ఆంధ్రమహాసభ నల్గొండ జిల్లా శాఖకు ఈయన అధ్యక్షులుగా పనిచేశారు.
గ్రంథమాల స్థాపకులు : దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి 35 పుస్తకాలు ముద్రించారు. “తెలంగాణ” పత్రికను నడిపించారు.
నవలా రచయిత : ఈయన రచించిన ‘ప్రజలమనిషి’, ‘గంగు’ నవలలు బాగా ప్రజాదరణ పొందాయి. వీరు అనేక కథలూ రాశారు.
నైజాం వ్యతిరేకోద్యమం : ఆళ్వారుస్వామి గారు హైదరాబాదు సంస్థాన ప్రజలలో స్ఫూర్తినీ, సాంస్కృతిక చైతన్యాన్నీ రగిలించారు.
మరణం : వీరు తన 46వ ఏటనే, అనగా 5-2-1961న కన్నుమూశారు.

ప్రవేశిక:

రజాకార్ల అఘాయిత్యాలకు, పెత్తందార్ల పీడనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజానీకం తిరగబడ్డది. అట్లా తిరగబడటానికి ప్రేరణనిచ్చినవారు ఉద్యమ కార్యకర్తలు, నాయకులు. ఆనాటి మానవ సమాజానికి స్వతంత్రత, వ్యక్తిత్వం, గౌరవం, మర్యాద, విశ్వమానవ సౌభ్రాతృత్వం, సహనశక్తి, పరహితం వంటి ఉత్తమ గుణాలనందించేటందుకు వాళ్ళు ఏవిధమైన ప్రయత్నం చేశారు ? ఆనాటి సాంఘిక పరిస్థితులెట్లా ఉండేవి ? ఇవన్నీ కళ్ళకు కట్టినట్లు వివరించే కథనం కోసం.. ఈ పాఠం చదువుదాం

కఠినపదాలకు అర్థాలు:

  • పెత్తందార్లు = పెత్తనం చేసేవారు, అధికార్లు, నాయకులు
  • దుర్భాషలు = చెడ్డ మాట่లు
  • ఆగమనం = రాక
  • మాటామంతీ = మాటలు, ముచ్చట్లు, ప్రసంగం
  • పరిహాసం = ఎగతాళి
  • మాలిపటేలు = (గామాల్లో ఒక అధికారి
  • శేగిదారు = పెద్ద నౌకరు
  • గిర్దావరు = రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఆదాయ అధికారి
  • మిరం = కారం
  • ఎరుక = తెలియుట, జ్ఞానం, తెలివి
  • తట్ట = గంప
  • సౌభ్రాతృత్వం = మంచి సోదర భావం
  • అధ్వాన్నం = హీనము, తప్పదారి, అపమార్గం
  • నేరుగా = సూటిగా, తిన్నగా
  • గ్రామీయులు = గ్రామంలో ఉండేవారు
  • సన్నాహాలు = ఏర్పాట్లు
  • నింద = అపవాదు
  • బర్రె = గేదె
  • బండలు = రాళ్ళు
  • జ్ఞాపకం = గుర్తు
  • నాయన = తండ్రి
  • స్వతంత్ర = స్టేచ్ఛ)
  • భ్రాతృత్వం = సోదర భావం
  • చిరము = చాలాకాలం
  • పరిచితం = తెలసినది
  • మోతాడు = గొడ్ల ముక్కుకు వేసే తాడు
  • పసులు = పశువులు
  • జంగల్లో = అడవుల్లో
  • అవ్యాజం = కహటంలేనది
  • దీక్ష = గట్టి పట్టుదల, నియమ

నేనివి చేయగలనా?

TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చిన్నప్పుడే 2

Leave a Comment