TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana అమరులు

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 9th Lesson అమరులు Textbook Questions and Answers.

అమరులు TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana

బొమ్మను చూడండి ఆలోచించి చెప్పండి

TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana అమరులు 1

1. బొమ్మలో ఏం జరుగుతున్నది?
జవాబు.
బొమ్మలో అమరవీరుల స్తూపం ఉన్నది. దాని ముందు ప్రజలు నిలబడి అమరవీరులకు వందన సమర్పణ చేస్తున్నారు.

2. స్థూపాలను ఎందుకు కట్టిస్తారు ?
జవాబు.
గొప్పవారికి గుర్తుగా, వారు చేసిన పనులకు గుర్తుగా స్థూపాలను కట్టిస్తారు.

TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana అమరులు

3. స్తూపం వద్ద ఎందుకు నివాళులు అర్పిస్తారు ?
జవాబు.
జాతి కోసం ప్రాణాలర్పించిన అమరులను గుర్తు చేసుకుంటూ, తాము కూడా వారి బాటలో నడుస్తామని ఆశిస్తూ వారిని గౌరవించటానికి స్తూపం వద్ద నివాళులు అర్పిస్తారు.

4. అమరవీరులకు ఎట్లా నివాళులు అర్పించాలో మీకు తెలుసా ?
జవాబు.
నిటారుగా నిలబడి తల నిటారుగా ఉంచి కుడిచేయి కుడి కణత మీద ఉంచి గౌరవ పూర్వకంగా నివాళులు అర్పించాలి. కొంతమంది కవితల ద్వారా గాని, పాటల ద్వారా గాని, ఇతర కళల ద్వారాగాని నివాళులు అర్పిస్తారు..

ఆలోచించండి – చెప్పండి

1. “మాకై అసువులు బాసిన” అనటంలో మాకు అంటే ఏవరు ?
జవాబు.
మాకై అసువులు బాసిన అంటే ‘మా కోసం ప్రాణాలర్పించిన’ అని అర్థం . మాకు అంటే తెలంగాణ ప్రజలు.

2. “జోహార్లు అంటే ఏమిటి ? ఎవరికి జోహార్లు సమర్పిస్తాం ?” ఎందుకు సమర్పించాలి ?
జవాబు.
జోహార్లు అంటే నమస్కారాలు. ప్రజల సమస్యల కోసం పోరాడి మరణించిన వారికి, ప్రజాసేవలో మరణించిన వారిని, అమర జవానులకు జోహార్లు సమర్పిస్తాం. మనకోసం మన బాగు కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు గనుక వారిపట్ల కృతజ్ఞతా సూచకంగా జోహార్లు సమర్పించాలి. (నేటి కాలంలో జోహార్లు అంటే చనిపోయిన వారికి ఇచ్చే శ్రద్ధాంజలి అని పొరబడుతున్నారు. జోహార్లు బ్రతికున్న వారికీ చెబుతారు. జోహారు శిఖిపింఛమౌళి… అని ప్రసిద్ధ గేయం కూడా ఉంది).

3. “కడుపు పంటల – కడుపు మంటల” – దీనిని గురించి మీకేమి అర్థమయింది ?
జవాబు.
కడుపు పంటలు అంటే ప్రేమతో కడుపార కన్న సంతానం. కడుపు మంటలు మనసుకు కలిగిన గాయాలు, కడుపార కన్న సంతానాన్ని కోల్పోవడం. ఒక తల్లి కన్న బిడ్డను బ్రతికించడానికి మరొక తల్లి కన్నబిడ్డ బలియై పోయాడు అని ఈ వాక్యానికి అర్థం.

4. ఈ “పాపాత్ముల పరిపాలన” అని అనడంలో కవి ఉద్దేశం ఏమై ఉంటుంది ?
జవాబు.
పాపాత్ములు అంటే పాపం చేసినవారు. దుర్మార్గాలు చేసేవారంతా పాపాత్ములే. అటువంటి దుష్టులు దేశాన్ని పాలిస్తుంటే ప్రజల బాధలు వర్ణించరానివి. అందుకే పాపాత్ముల పరిపాలన అంతం చేస్తాం అన్నాడు కవి.

5. “మీ యడుగుజాడల్లో మాయడుగుల నుంచేస్తాం!” దీనిని మీరెట్లా అర్థం చేసుకున్నారు ?
జవాబు.
మంచివారు తన తరువాతి వారికి ఆదర్శమయ్యేలా ఎలా ఎలా నడుచుకున్నారో అలాగే మేము నడుచుకుంటాం అని అర్థం. మీ అడుగు జాడల్లో మా అడుగు వేసి నడుస్తాం అంటే మిమ్మల్ని మేం అనుసరిస్తాం అని అర్థం.

TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana అమరులు

6. ఈ ‘అమృతవర్షం కురిపించడం అంటే ఏమిటి ?
జవాబు.
అమృతం అంటే చావులేనిది. చనిపోయిన వారు మనకిక కనిపించరు. అమృతం తాగటం వల్ల అసలు చావే ఉండదు. దేశం కోస ప్రాణత్యాగం చేసిన వారు కనిపించకుండా పోయినా వారి ఆత్మల మీద అమృతం చల్లితే మన దగ్గరే ఉన్నట్లు ఉంటుందని భావం.

ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. తెలంగాణ రాష్ట్రసాధన కోసం జరిగిన ఉద్యమం గురించి మాట్లాడండి.
జవాబు.
తెలంగాణా రాష్ట్రం కోసం ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పటి నుండి అంటే 60 ఏళ్ళుగా ఉద్యమాలు సాగుతూనే ఉన్నాయి. 1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణా ఉద్యమం యావత్తు ప్రపంచాన్ని ఆకర్షించింది. కానీ అది చల్లారిపోయింది. ఆ తర్వాత గత 15 ఏళ్ళగా జరిగిన ఉద్యమం 2009లో పల్లెపల్లెలకూ పాకి తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయ్యేలా చేసింది.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

1. కింది వాక్యాలు చదువండి. అవి పాఠంలో ఎక్కడున్నాయో గుర్తించి, వాటి సందర్భం రాయండి.
(అ) సకలజనుల సమూహములు.
జవాబు.
పరిచయం : ఈ వాక్యం ఆచార్య రుక్నుద్దీన్ రాసిన అమరులు పాఠంలోనిది.
సందర్భం : తెలంగాణా విమోచన కోసం పాటుపడి ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పిస్తున్న ప్రజలు పలికిన మాటలు ఇవి.
అర్థం : మాన్యులు, ధన్యులు, శివ స్వరూపులైన అమర వీరులారా! మీకు ప్రజలంతా మంచి మనసుతో నివాళులు అర్పిస్తున్నాము.

(ఆ) క్రాంతి విడదు శాంత పడదు.
జవాబు.
పరిచయం : ఈ వాక్యం ఆచార్య రుక్నుద్దీన్ రాసిన అమరులు పాఠంలోనిది.
సందర్భం : ప్రత్యేక తెలంగాణా కోసం ఉద్యమించిన వీరుల రక్తం ఏరులై ప్రవహించింది. ఈ దుర్మార్గుల పాలన అంతమయ్యే వరకు ఈ ప్రవాహం ఆగదు అని ప్రజలు అమరుల ముందు ప్రతిజ్ఞ చేశారు.
అర్థం : ఈ రక్త ప్రవాహం ఆగదు. శాంతించదు.

(ఇ) రుధిరసిక్త యమపాశం.
జవాబు.
పరిచయం : ఈ వాక్యం ఆచార్య రుక్నుద్దీన్ రాసిన అమరులు పాఠంలోనిది.
సందర్భం : అమర వీరులు నుదుట ధరించిన రక్తతిలకం ప్రజలకు దీక్షా కంకణం వంటిది. అధికారుల మదాన్ని
అణచివేస్తుంది. అని ప్రజలు అమరులకు జోహారులర్పిస్తూ పలికారు.
అర్థం : వీరులు ధరించిన రక్తతిలకం అధికారుల పాలిట నెత్తుటితో తడిసిన యమపాశమౌతుంది.

TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana అమరులు

(ఈ) అమృతవర్షం కురిపిస్తాం.
జవాబు.
పరిచయం : ఈ వాక్యం అమరులు పాఠంలోనిది రాసిన కవి ఆచార్య రుక్నుద్దీన్.
సందర్భం : ప్రజలు అమర వీరుల బాటలో నడుస్తామని, వారివలనే మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించియైనా
ప్రత్యేక తెలంగాణా సాధిస్తామని, వారి ఆత్మలకు శాంతి కలిగిస్తామని ప్రతిజ్ఞ చేసిన సందర్భం.
అర్థం : వీరుల ఆత్మలు శాంతించేలా అమృతం వానగా కురిపిస్తాము.

(ఉ) రక్తితోడ ఇచ్చేస్తాం.
జవాబు.
పరిచయం : ఈ వాక్యం అమరులు పాఠంలోనిది. కవి ఆచార్య రుక్నుద్దీన్.
సందర్భం : అమర వీరులకు జోహార్లు చేస్తూ ప్రజలు పలికిన మాటలివి. అమరు వీరుల త్యాగాలతో ప్రజలందరికీ ప్రోత్సాహం లభించింది. వారిలో స్ఫూర్తి నింపింది. అని చెప్పిన సందర్భంలోనిదీ వాక్యం.
అర్థం : మాతృభూమి రక్షణ కోసం మీరిచ్చిన స్ఫూర్తితో రక్తం ధారపోయమన్నా సంతోషంగా ధార పోస్తాం.

(ఊ) బాహాటంగా సాధిస్తాం.
జవాబు.
పరిచయం : ఈ వాక్యం అమరులు పాఠంలోనిది. రచించిన కవి ఆచార్య రుక్నుద్దీన్.
సందర్భం : తెలంగాణా విమోచన కోసం ప్రాణత్యాగం చేసిన వీరులకు జోహారులర్పిస్తూ ప్రజలు ప్రతిజ్ఞ చేస్తూ
పలికిన మాటలివి.
అర్థం : : లోకమంతా తెలిసేలా ప్రత్యేక తెలంగాణా సాధిస్తాం.

2. కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 2009 నాటికి మహోద్యమమయింది. ఈ మలిదశ ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు, కవులు, కళాకారులు, నాయకులు, పిల్లల నుండి పెద్దల వరకు సకల జనులు పాల్గొన్నారు. ఉద్యమం శాంతియుతంగా నడవాలని ఉద్యమ నాయకత్వం కోరింది. తెలంగాణకై ప్రజలందరు ఆత్మవిశ్వాసంతో పోరాడాలని, అధైర్యంతో బలిదానాలు చేయవద్దని చెప్పింది.

ఆ ఉద్యమాల ఫలితంగా 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అమరవీరుల ఆశయం సిద్ధించింది. ప్రభుత్వం అధికారికంగా వేడుకలు నిర్వహించింది. తెలంగాణలోని ఆబాలగోపాలం ఘనంగా సంబురాలు జరుపుకున్నది. సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి అందరం కృషి చేయాలి. అదే మనం అమరవీరులకు ఇచ్చే ఘనమైన నివాళి.

ప్రశ్నలు :
అ. తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగింది ?
జవాబు.
తెలంగాణ ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగింది.

ఆ. ఉద్యమంలో ఎవరెవరు పాల్గొన్నారు ?
జవాబు.
ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు, కవులు, కళాకారులు, నాయకులు అందరూ పాల్గొన్నారు.

ఇ. ఉద్యమం పట్ల నాయకత్వానికి ఉన్న ఆలోచన ఏమిటి ?
జవాబు.
ఉద్యమం శాంతియుతంగా నడవాలని, ఆత్మహత్యలు వంటి ప్రాణాలు పోగొట్టుకునే పనులు చేయకుండా ఆత్మవిశ్వాసంతో ఉద్యమం నడపాలని నాయకత్వం కోరింది.

TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana అమరులు

ఈ. ఆబాలగోపాలం అంటే అర్థమేమిటి ?
జవాబు.
పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ అని అర్థం.

ఉ. అమరవీరులకు మనమిచ్చే నివాళి ఏమిటి ?
జవాబు.
తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దటమే మనం అమర వీరులకిచ్చే నివాళి.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. అమరవీరులను కవి “తెలంగాణ గర్భమ్మున గలిగిన శ్రీ రుద్రులారా!” అని ఎందుకు సంబోధించారు ?
జవాబు.
అమరవీరులను కవి ‘తెలంగాణ గర్భమ్మున గలిగిన శ్రీ రుద్రులారా!’ అని సంబోధించాడు. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో వీరశైవం వ్యాప్తిలో ఉండేది. శివ భక్తులను సాక్షాత్తు శివ స్వరూపులుగా భావిస్తారు. అందుకే అక్కడి ప్రజలనందరినీ కవి రుద్రులుగానే భావించి శ్రీరుద్రులారా అని సంబోధించాడు. ఓరుగల్లును పాలించిన కాకతీయులందరి పేర్లలోనూ ‘రుద్ర’ అనే పేరు చేరుతుంది. రుద్రదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు. రుద్రుడు అంటే కోపం, పరాక్రమానికి గుర్తు కనుక కవి అమర వీరులను శ్రీరుద్రులారా అని సంబోధించాడు.

ఆ. అమరవీరుల పట్ల మనమెట్లాంటి గౌరవాన్ని చూపాలి ?
జవాబు.
మాతృభూమి కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులకు మన మందరం కలిసి నివాళులర్పించాలి. వారి త్యాగాలను ఆదర్శంగా తీసుకొని మనం వారి బాటలోనే నడవాలి. మనదేశాన్ని గౌరవించాలి. మన తోడివారిని కాపాడటానికి ఎటువంటి త్యాగనికైనా సిద్ధపడాలి. అమరవీరుల ఆత్మలకు శాంతి కలిగించాలి. మనకు సిద్ధించిన స్వేచ్ఛను దుర్వినియోగం చెయ్యకూడదు. మన రాజ్యం అభివృద్ధి కోసం మనమందరం కలిసి కృషి చెయ్యాలి. సుఖశాంతులతో ఐకమత్యంతో జీవించాలి. ఇదే మన అమర వీరులు కోరినది. అప్పుడే వారి ఆత్మ శాంతిస్తుంది.

ఇ. అధికారాంధుల ప్రవర్తన ఎట్లా ఉంటుంది ?
జవాబు.
అధికారాంధులు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. అధికారమదంతో వారి కళ్ళు మూసుకుపోయి ఇతరులను తమ బానిసలుగా చూస్తారు. వారి స్వేచ్ఛను హరిస్తారు. వారి ప్రవర్తన, ఆహార విహారాలు, జీవితం తమ ఆధీనంలో ఉంచుకుంటారు. వారి చేత వెట్టి చాకిరీ చేయిస్తారు. ఇక చదువు సంధ్యల గురించి చెప్పవలసిన పనిలేదు. అటువంటి వారి అధికారాన్ని సహించకూడదు. ఆత్మవిశ్వాసంతో వారిని ఎదుర్కొని తమ హక్కులను కాపాడుకోవలసిన బాధ్యత ప్రజలదే.

ఈ. కవి ప్రతిజ్ఞలోని విషయాన్ని మీరెట్లా అర్థం చేసుకున్నారు ?
జవాబు.
కవి ‘ప్రత్యేక’ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీరతామని బాహాటంగా ప్రతిజ్ఞ చేస్తున్నారు తెలంగాణా వీరులు’ అని రాశాడు. సుమారు పన్నెండు సంవత్సరాల నించి ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం సాగుతూనే ఉన్నది. ఎప్పటికప్పుడు అధికారులు మంత్రులు ఏవేవో కారణాలు చెబుతూ వారి ఉద్యమాన్ని నీరుకారుస్తున్నారు. తమకు న్యాయం జరగాలంటే తెలంగాణ ప్రజలంతా సుఖసంతోషాలతో సమృద్ధంగా జీవించాలంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పడాల్సిందే. అప్పుడే ఏ అభివృద్ధియైనా సాధ్యమౌతుంది. కాబట్టి తెలంగాణా సాధించే తీరతామని ప్రతిజ్ఞ చేస్తున్నాడు.

ఉ. కవి అమరులు అనే కవితలో అమరవీరులను ఎలా సంబోధించాడు ? ఎందుకు ?
జవాబు.
కవి ఈ కవితలో అమరవీరులను ‘మాన్యులార; ధన్యులార, ప్రబలులార, శ్రీరుద్రులార, ఘనులార’ అని సంబోధించాడు. ఇది చాలా గౌరవించదగిన ఆశయం. అందుకే ‘మాన్యులార’ అని సంబోధించాడు. అమరవీరులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం దీక్ష వహించారు. ఇది చాలా గౌరవించదగిన ఆశయం. అందుకే ‘మాన్యులారా’ అని సంబోధించాడు.

వీరులు వారి ప్రయత్నంలో వీరమరణం పొంది తల్లి భూమి రుణం తీర్చుకున్నారు. అందుకే ‘ధన్యులార’ అనే సంబోధన పరాక్రమంలో సాక్షాత్తు రుద్రులే కనుక ‘శ్రీరుద్రులార’ అని సంబోధించాడు. పోరాటంలో తమ బల పరాక్రమాలు చూపించారు గనుక ‘ప్రబలులార’ అని సంబోధించాడు. ఇంతటి ఘనకార్యానికి పూనుకున్నారు కాబట్టి ‘ఘనులార’ అని సంబోధించాడు.

ఊ. ఈ కవితలో కవి ‘రక్తం’ అనే పదం ఎన్ని చోట్ల ఎలా ఉపయోగించాడు ?
జవాబు.

  1. ప్రత్యేక తెలంగాణ కోసం అమర వీరులు చిందించిన రక్తం పాపాత్ముల పరిపాలన అంతమయే వరకు శాంతించదు. ప్రవహిస్తూనే ఉంటుంది.
  2. అమరువీరుల ఒక్కొక్క రక్తపు చుక్క అధికంగా విషాన్ని కక్కుతుంది. శత్రువులను అంతం చేస్తుంది.
  3. అమరవీరులు దిద్దిన రక్త తిలకం ప్రజలకు దీక్షా కంకణం వంటిది.
  4. వారి రక్తం అధికార మదంతో విర్రవీగే వారి పాలిట రక్తంతో తడిసిన యమపాశం వంటిది.
  5. ప్రజలు తమ రక్తం తర్పణ చేసియైనా తెలంగాణ విముక్తికోసం పోరాడుతారు.

TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana అమరులు

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.
అ. కవి నాడు చేసిన ప్రతిజ్ఞ నేడు సాకారమైంది కదా! దీనికి పాటుబడిన వారిని గురించి వివరించండి.
జవాబు.
కవి ఆచార్య రుక్నుద్దీన్ పన్నెండేళ్ళ క్రితం రాసిన కవిత ఇది. ప్రత్యేక తెలంగాణ కోసం అమరవీరులు ముమ్మరంగా పోరాటం జరిపారు. లెక్కలేనంత మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలంతా వారి త్యాగాలను మరచి పోకుండా వారి బాటలోనే నడుస్తామని ప్రత్యేక తెలంగాణ సాధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆ ప్రతిజ్ఞ నిలబెట్టుకోడానికి నాటి నుండి నేటి వరకు ఉద్యమం ఆపలేదు. ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నారు. చివరికి ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది.

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటులో ప్రొఫెసర్ శ్రీ జయశంకర్, ఆమరణ నిరాహారదీక్ష చేసిన. శ్రీ.కె.సి.ఆర్. ఐ.కా.స. నాయకుడు శ్రీ కోదండరాం వంటి మేధావులు, రాజకీయ నాయకులతో పాటు వేలాది మంది సామాన్యజనం కూడా భాగస్తులే. ఉద్యమంలో భాగంగా ఆత్మాహుతి చేసుకున్న విద్యార్థుల పాత్ర తక్కువేమీ కాదు. సుమారు 60 రోజలు విధులు బహిష్కరించి సకల జనుల సమ్మెలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులు, దుకాణాలు మూసివేసి నిరసన వ్యక్తం చేసిన వ్యాపారస్తులు ఇలా అందరూ తమ వంతు కృషివల్లే తెలంగాణా రాష్ట్రం సాకారమైంది.

ఆ. అమరులు కవితా సారాంశాన్ని రాయండి.
జవాబు.
‘అమరులు’ అనే కవితను ఆచార్య కె. రుక్నుద్దీన్ రచించారు. ఈ కవితలో అమరవీరులకు ప్రజాసమూహం నివాళులర్పించిన విధాన్ని కవి వివరించాడు.
తెలంగాణ ప్రజలకోసం, మాతృభూమి విముక్తి కోసం ప్రాణత్యాగం చేసిన ధన్యజీవులారా! మీకు జోహార్లు. వీరులారా! మీ జీవితం తెలంగాణ భూమిపుత్రుల సేవలలోనే తరించింది. ఈ సమాజమంతా మీకు జోహార్లు అర్పిస్తుంది. ఇక్కడి ప్రజల సుఖసంతోషాల కోసం మీరు, మీ కుటుంబసభ్యులు ఎన్నో బాధలను అనుభవించారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం పారిన రక్తం పాపాత్ముల పరిపాలన అంతమయ్యేవరకు విశ్రమించదు.

శాంతించదు. మీ ఒక్కొక్క రక్తపుచుక్క తెలంగాణ వ్యతిరేకులపై విషం చిమ్ముతుంది. మీ ఆవేశం ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని ప్రతి నిమిషం ప్రబోధిస్తుంది. మీరు ధరించిన రక్తతిలకం మాకు స్ఫూర్తినందిస్తుంది. అది అధికార మదంతో బలిసిన వారికి యమపాశమవుతుంది. మీ అడుగులలో అడుగేస్తూ మా నెత్తురు ధారపోస్తాం. రక్తతర్పణలను చేస్తాం. నింగి, నేలలో విస్తరించిన సమస్త ప్రాణులారా! మా ప్రతిజ్ఞ వినండి. బాహాటంగానే తెలంగాణను సాధిస్తాం. అమరుల ఆత్మలు శాంతించే విధంగా అమృతవర్షం కురిపిస్తాం.

IV. సృజనాత్మకత/ప్రశంస

1. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి త్యాగాన్ని గురించి ఒక కవిత/గేయం రాయండి.

అమరవీరులకు భక్త్యంజలి
మరణించిన మహావీరులు
నిజంగా మరణించరు
అమరులైన ఆ వీరులు
ఆ చంద్ర తారార్కంగా
అందరి హృదయాల్లోనూ
అత్యున్నతమైన ప్రేమ
పీఠాలను అధివసించి ఉంటారు
ఆదిత్యుని అంశువుల వలె
అనంతమైన ప్రకాశాన్ని వెదజల్లుతుంటారు
నిరంతరం మనకు నిండు వెలుగు బాటల్ని
చూపుతుంటారు నిత్యం మనకు
అభ్యుదయ పథం నిర్దేశిస్తుంటారు.

V. పదజాల వినియోగం

1. కింది పదాలకు పర్యాయపదాలు (అదే అర్థం వచ్చే పదాలను) రాయండి.

(అ) సమూహం  =
జవాబు.
గుంపు, సముదాయం

(ఆ) అసువులు  =
జవాబు.
ప్రాణములు, ఉసురు

ఇ) స్వేచ్ఛ =
జవాబు.
విడుదల, స్వాతంత్ర్యం

ఈ) సఖులు =
జవాబు.
స్నేహితులు, మిత్రులు, సోపతిగాళ్ళు

2. కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు గల నానార్థాలు (వేరు వేరు అర్థాలు) రాయండి.

(అ). ఈ వర్షంలో కురిసిన పెద్ద వర్షం ఇది.
జవాబు.
సంవత్సరం – వాన

(ఆ) అమృతంతో పాయసం చేశారు. అమృతంతో చేతులు కడిగారు.
జవాబు.
పాలు – నీరు

3. కింది వృత్తంలో గల ప్రకృతి, వికృతి పదాలను గుర్తించి రాయండి.

ప్రకృతి – వికృతి
ప్రతిజ్ఞ – ప్రతిన
ఆకాశం – ఆకసం
భాగ్యం – బాగ్గెం
శ్రీ – సిరి

VI. భాషను గురించి తెలుసుకుందాం

సంధులు

1. కింది పదాలను విడదీసి, సంధిపేరు రాయండి.

(అ) ఉద్రేకాస్త్రం = ఉద్రేక + అస్త్రం = సవర్ణదీర్ఘసంధి
(ఆ) మొట్టమొదలు = మొదలు + మొదలు = ఆమ్రేడిత సంధి
(ఇ) లావైన = లావు + ఐన = ఉత్వసంధి
(ఈ) అనంతాకాశం = అనంత + ఆకాశం =సవర్ణదీర్ఘ సంధి
(ఉ) ఒక్కొక్క = ఒక్క + ఒక్క = ఆమ్రేడిత సంధి

2. కింది వాక్యాలను చదువండి. తేడా చెప్పండి

ఆమె ముఖం అందంగా ఉన్నది.
ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది.

పై వాక్యాల్లోని తేడాను చూస్తే ‘ఆమె ముఖం అందంగా ఉన్నది’ అనే దానికి బదులు ‘ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది’ అనే వాక్యం బాగా ఆకట్టుకుంటుంది. కదా! ఇట్లా ఆకట్టుకునేటట్లు చెప్పడానికి చంద్రబింబం అనే పోలికను తీసుకున్నాం. ఇట్లా చక్కని పోలికతో చెప్పడాన్నే ‘ఉపమాలంకారం’ అంటాం. పై వాక్యాన్నిబట్టి చూస్తే ఉపమాలంకారంలో నాలుగు అంశాలను గమనించవచ్చు. అవి :

1. ఉపమేయం – దేనిని లేక ఎవరిని పోలుస్తున్నామో తెలిపేది. (ఆమె ముఖం – ఉపమేయం)
2. ఉపమానం – దేనితో లేక ఎవరితో పోలుస్తున్నామో తెలిపేది. (చంద్రబింబం – ఉపమానం)
3. సమానధర్మం – ఉపమేయ, ఉపమానాల్లో ఉండే ఒకేవిధమైన ధర్మం. (అందంగా ఉండడం – సమానధర్మం)
4. ఉపమావాచకం – పోలికను తెలిపే పదం. (వలె – ఉపమావాచకం)
“ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ఉపమాలంకారం.”

TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana అమరులు

3. కింది ఉదాహరణలు చదువండి. దేనిని దేనితో పోల్చారో, వాటిలోని సమానధర్మం ఏమిటో చెప్పండి.
(అ) ఏకలవ్యుడు అర్జునుడి వలె గురితప్పని విలుకాడు.
జవాబు.
ఉపమాన ఉపమేయాలకు చక్కనిపోలిక చెప్పటమే ఉపమాలంకారం. ఈ వాక్యంలో ఏకలవ్యుడిని అర్జునునితో పోల్చారు. (ఏకలవ్యుడు – ఉపమేయం, అర్జునుడు – ఉపమానం) గురి తప్పకుండా బాణాలు వేయడం సమానధర్మం. పోలికను తెలిపే పదం ‘వలె’ ఉపమావాచకం.

(ఆ) తోటలో పిల్లలు సీతాకోక చిలుకల్లాగా అటూ ఇటూ తిరుగుతున్నారు.
జవాబు.
ఈ వాక్యంలో పిల్లలను సీతాకోకచిలుకలతో పోల్చారు. కనుక ఉపమాలంకారం. పిల్లలు – ఉపమేయం. సీతాకోక చిలుకలు – ఉపమానం. అటూ ఇటూ తిరగడం – సమానధర్మం. ‘లాగా’ అనే పోలికను తెలిపే పదం ఉపమావాచకం.

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని

1. తెలంగాణ ఉద్యమం సందర్భంగా వచ్చిన పాటలను లేదా ఉద్యమకాలంలో జరిగిన ఒక కార్యక్రమం గురించి వివరాలు సేకరించి నివేదిక రాయండి. తరగతిలో ప్రదర్శించండి.
జవాబు.
(అ) ప్రాథమిక సమాచారం :

  1. ప్రాజెక్టు పని పేరు
  2. సమాచారాన్ని సేకరించిన విధానం

(ఆ) నివేదిక :
1. నాగేటి సాళ్ళల్లొ నా తెలంగాణ

పల్లవి : నాగేటి సాళ్ళల్లొ నా తెలంగాణా నా తెలంగాణా
నవ్వేటి బతుకులా నా తెలంగాణా నా తెలంగాణా || 2 ||

చరణం 1 : పారేటి నీళ్ళల్ల పానాదులల్లా
పూసేటి పువ్వుల్ల ……………… పునాసాలల్లా || 2 ||
కొంగు జాపిన నేల …………….. నా తెలంగాణా నా తెలంగాణా
పాలు తాపిన తల్లి …………….. నా తెలంగాణా నా తెలంగాణా || నాగేటి ||

చరణం 2 :
తంగేడి పువ్వుల్ల ……………… తంబాల మంతా
తీరాక్క రంగుల్ల ………………. తీరిచ్చినావూ
తీరొ రంగుల్ల ………………… తీరిచ్చి నావూ
బంగారు చీరలు బాజారులన్నీ || 2 ||
బతుకమ్మ పండుగ నా తెలంగాణా ………….. నా తెలంగాణా
బంతిపూల తోట నా తెలంగాణా …………… నా తెలంగాణా || నాగేటి ||

చరణం 3 : వరద గూడు గడితె వానొచ్చునంటా
బురద పొలం దున్న బురి సున్న రంతా || 2 ||
శివుని గుళ్ళో నీరు ……………… సీమలకు సెక్కరి
వాన కొరకు జడకొప్పులేసీ
వాగుల్లా వంకల్ల నా తెలంగాణా ……………….. నా తెలంగాణా || నాగేటి ||

చరణం 4 :
కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు
పాల పిట్టల జూసి పడుచు చప్పట్లు || 2 ||
పాల పిట్టల జూసి పడుచు చప్పట్లు
జొన్న కర్రల జండ జోరున్న దేమీ || 2 ||
అళై భళై తీసె నా తెలంగాణా ………………. నా తెలంగాణా
తిండి పంచిన ఆర్తి నా తెలంగాణా …………….. నా తెలంగాణా || నాగేటి ||

2. ఉస్మానియా క్యాంపస్ లో

ఉస్మానియా క్యాంపస్ లో …………….. ఉదయించిన కిరణమా ……………. వీర తెలంగాణమా
వీర తెలంగాణమా …………….. నాలుగు కోట్ల ప్రాణమా
కాకతీయ ప్రాంగణంలో …………. కురిసిన ఓ వర్షమా వీర తెలంగాణమా
వీర తెలంగాణమా ………….. నాలుగు కోట్ల ప్రాణమా || వీర ||
భలె …………… భలె ……………… భలె ……………… || ఉస్మానియా ||

నల్లగొండ నడిబొడ్డున నాటిన ఓ ఖడ్గమా వీర తెలంగాణమా
వీర తెలంగాణమా ……………. నాల్గు కోట్ల ప్రాణమా
మహబూబ్నగర్ మట్టిలోన
మొలచిన మందారమా ………………. వీర తెలంగాణమా
వీర తెలంగాణమా ……………… నాల్గు కోట్ల ప్రాణమా
భలె …………… భలె ……………… భలె ……………… || ఉస్మానియా ||

హైదరాబాద్ బడిలోన చేసిన బలిదానమా వీర తెలంగాణమా
వీర తెలంగాణమా ……………. నాల్గు కోట్ల ప్రాణమా
రంగారెడ్డి ఫ్యాక్టరీలో మోగిన నగారమా వీర తెలంగాణమా
భలె …………… భలె ……………… భలె ……………… || ఉస్మానియా ||

మెదక్ సీమ గాలిలోన త్యాగాలా గంధమా వీర తెలంగాణమా
వీర తెలంగాణమా ……………. నాల్గు కోట్ల ప్రాణమా
నిజామాబాద్ నుదుటి మీద దిద్దిన ఓ కుంకుమ ……………. వీర తెలంగాణమా
వీర తెలంగాణమా నాల్గు కోట్ల ప్రాణమా …………..
భలె …………… భలె ……………… భలె ……………… || ఉస్మానియా ||

కరీంనగర్ రైతుకూలీ చిందించిన రక్తమా వీర తెలంగాణమా
వీర తెలంగాణమా ………………… నాల్గు కోట్ల ప్రాణమా
అరెరె రరెరె ఆదిలాబాద్ అడవుల్లో రాజుకున్న రౌద్రమా …………… వీర తెలంగాణమా
వీర తెలంగాణమా …………………. నాల్గు కోట్ల ప్రాణమా
భలె …………… భలె ……………… భలె ……………… || ఉస్మానియా ||

వరంగల్లు గడ్డమీద చేసిన నినాదమా …………………. వీర తెలంగాణమా
వీర తెలంగాణమా …………… నాల్గు కోట్ల ప్రాణమా
ఖమ్మం, మొట్టు పెల్లలోన ఉప్పొంగిన కెరటమా వీర తెలంగాణమా
వీర తెలంగాణమా …………… నాల్గు కోట్ల ప్రాణమా
భలె …………… భలె ……………… భలె ……………… || ఉస్మానియా ||

TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana అమరులు

(ఇ) ముగింపు :
మాట కన్నా పాట సామాన్యులకు తొందరగా చేరుతుంది. వారిని ఉత్తేజితుల్ని చేస్తుంది. తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎంతో మంది కవులు రాసిన పాటలు ప్రజలలో చైతన్యం నింపడానికి ఎంతగానో తోడ్పడ్డాయి.
TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana అమరులు 3

తెలంగాణ ఉద్యమ కాలంలో జరిగిన ఒక కార్యక్రమం:

(ఆ) నివేదిక :

సకల జనుల సమ్మె

తెలంగాణ ఉద్యమ కాలంలో జరిగిన వివిధ రకాల కార్యక్రమాలలో నేను ప్రత్యక్షంగా చూచిన సకలజనుల సమ్మె గూర్చి పొందు పరుస్తున్నాను.
సిరిసిల్ల R.D.O ఆఫీస్ ఎదురుగా టెంట్ వేసిన తెలంగాణ ఉద్యోగుల జాయింట్ ఆక్షన్ కమిటి 42 రోజుల పాటు వివిధ రూపాలలో తెలంగాణ ఇవ్వాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ రకరకాల కార్యక్రమాలు నిర్వహించింది. డివిజన్లోని అన్ని మండలాల్లోని ఉద్యోగులు స్వచ్ఛందంగా 42 రోజులు తమ విధులను బహిష్కరించి ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. రోజుకు కొంతమంది నిరాహార దీక్షలో కూర్చోవడం … జానపద గీతాలు పాడే గాయకులను తీసుకువచ్చి ఉద్యమ గీతాలు పాడించడం, వంటా వార్పు, రోడ్ల దిగ్బంధనం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఉద్యోగులు చేస్తున్న ఈ ఉద్యమానికి అటు రాజకీయ నాయకులు, ఇటు ప్రజల నుండి భారీ మద్దతు లభించింది. రోజుకో కుల సంఘాలు ర్యాలీగా వచ్చి వీరి ఉద్యమానికి మద్దతు తెలియజేశాయి. రోజురోజుకు తీవ్రమౌతున్న ఈ ఉద్యమాన్ని అణచడానికి అప్పటి ప్రభుత్వం ఎన్నో బెదిరింపులకు పాల్పడింది. తాత్కాలిక ఉద్యోగులతో పని చేయిస్తామని… ఉద్యోగాలు పోతాయని ఎన్ని రకాలుగా భయపెట్టినా ఉద్యోగులు లొంగలేదు.

చివరకు ………. విద్యార్థులు నష్టపోతారని, ప్రజలకు బాగా ఇబ్బంది అవుతుందని …….. ఉద్యోగ సంఘాలు సమ్మె విరమించాయి. ఉద్యమం జరుగుతున్నన్ని రోజులు వక్తలచే తెలంగాణ ఆవశ్యకత గూర్చి ఉపన్యాసాలు ఇప్పించడం, కళాకారులచే పాటలు పాడించడం, వంటా వార్పు లాంటి కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలు … కొన్ని రాజకీయ పార్టీల విజ్ఞప్తితో సమ్మె విరమించి విధుల్లో చేరారు.

(ఇ) ముగింపు :
ఒక నెల జీతం 4 రోజులు లేటైతేనే తల్లడిల్లే ఉద్యోగులు 42 రోజులు “సకల జనుల సమ్మె” లో పాల్గొనడం చాలా గొప్ప విషయం. ఈ 42 రోజుల సమ్మె కాలంలో ఇంటి అద్దె, పాల బిల్లు, పేపరు బిల్లు, కరంటు బిల్లు చెల్లించలేని పరిస్థితి వచ్చింది. అయినా ఉద్యోగులు ధైర్యంగా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రజలు కూడా వీరికి బాగా సహకరించారు.

TS 8th Class Telugu 9th Lesson Important Questions అమరులు

పర్యాయపదాలు

  • జనని = మాత, అమ్మ, తల్లి, అంబ
  • తనువు = శరీరం, దేహం, మేను
  • ఆకాశం = గగనం, విహాสసం, ఖం
  • అస్త్రం = శరం, బాణం, తూపు
  • అధికారం = పదవి, ఏలుబడి
  • భూమి = ధర, ధాత్తి, ధరణి
  • గర్ఖము = కడుపు, పొట్ట
  • రక్తము = రుధిరము, నెత్తురు

నానార్థాలు

  • తనువు = శరీరం, అల్పమైనది
  • వర్షం = వాన, సంవత్సరం,
  • అమృతం = పాలు, నీరు, నేయి, సుధ
  • పాసిన = వదలిన, పాడైపోయిన

ప్రకృతిలు – వికృతిలు

  • భూమి – బూమి
  • విషము – విసము

TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana అమరులు

సంధులు

మాకై = మాకు + ఐ = ఉత్వసంధి
తనువొడ్డిన = తనువు + ఒడ్డిన = ఉత్వసంధి
రక్తతర్పణమ్మయినా = రక్త తర్పణమ్ము + అయిన = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైతే సంధి అవుతుంది.

అధికారాంధులు = అధికార + అందులు = సవర్ణదీర్ఘ సంధి
ఉద్బోధార్థ = ఉద్బోధ + అర్థం = సవర్ణదీర్ఘ సంధి
పాపాత్ములు = పాప + ఆత్ములు = సవర్ణదీర్ఘసంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.

స్వేచ్ఛ = స్వ + ఇచ్ఛ = గుణసంధి
సూత్రం : అకారానికి ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమంగా ఏ, ఓ, అర్ లు ఏకాదేశమవుతాయి.

సమాసములు

  • తెలంగాణ గర్భము = తెలంగాణ యొక్క గర్భము = షష్ఠీ తత్పురుష సమాసం
  • జనుల సమూహములు = జనుల యొక్క సమూహములు = షష్ఠీ తత్పురుష సమాసం
  • రక్తపు చుక్క = రక్తము యొక్క చుక్క = షష్ఠీ తత్పురుష సమాసం
  • రక్తపు తిలకం = రక్తము యొక్క తిలకం = షష్ఠీ తత్పురుష సమాసం
  • అధికారాంధులు = అధికారముతో అంధులు = తృతీయాతత్పురుష సమాసం
  • రుధిర సిక్తం = రుధిరముతో సిక్తం = తృతీయాతత్పురుష సమాసం

గేయాలు – ప్రతిపదార్థాలు – భావాలు:

మాకై అసువులు బాసిన
మాన్యులార ! ధన్యులార !
మాతృభూమి స్వేచ్ఛ కొరకు
బలియయ్యిన ప్రబలులార !
తెలంగాణ గర్భమ్మున
గలిగిన శ్రీ రుద్రులార
జనని, సఖుల, సేవలకై
తను వొడ్డిన ఘనులారా !
ప్రాణాలను వదిలారు.
సౌహార్దతతోడ నిచ్చు
బలైనారు. తెలంగాణ
జోహారులు, జోహారులు
సకలజనుల సమూహములు
సమర్పించు జోహారులు

అర్థాలు :
మాకై = మాకోసం
అసువులు = ప్రాణాలను
పాసిన = వదిలిన
మాన్యులార = గౌరవనీయులారా !
ధన్యులార = ధన్లులారా!
మాతృభూమి = జన్మభూమి యొక్క
స్వేచ్ఛ కొరకు = స్కాతంత్రం క్రోసం
బలి + అయ్యిన = (ప్రాణాలు కోల్పోయిన
ప్రబలులార = బలవంతులారా !
తెలంగాణ గర్భమ్మున = తెలంగాణ తల్లి కడుపులో నుండి
కలిగిన = జన్మించిన
శ్రీ రుద్రులారా = శివ స్వరూపులారా !
జనని = తల్లి యొక్క
సఖుల = మిత్రుల యొక్క
సేవలకు + ఐ = సేవకోసం
తనువు + ఒడ్డిన = శరీరం త్యాగం చేసిన
ఘనులారా = మహనీయులారా !
సౌహార్దత తోడన్ = మంచి మనసుతో
ఇచ్చు = మేమిచ్చు
జోహారులు = నివాళులు
సకల జనుల సమూహములు = పజలందరూ కలసి
సమర్పించు = మీకు అందించు
జోహారులు = నివాళులు (అందుకోండి)

భావం : ఓ మాన్యులారా! ధన్యులారా!మహనీయులారా! రుద్రరూపులారా! ఈ తెలంగాణ తల్లి కడుపున పుట్టి మాతృభూమికి స్వేచ్ఛ కలిగించటానికి మీరు మీ ప్రాణాలనే త్యాగంచేశారు. అటువంటి ఘనులైన మీకు మా ప్రజలందరం కలిసి జోహారు చేస్తున్నాము. అందుకోండి.

2. ఏ తల్లి కడుపు పంటల కొరకో
నీ తల్లి కడుపు మంటల మాడెను
ఏ సతి సౌభాగ్ముల్ముల కొరకో
నీ సతి కుంకుమ గోల్పోయెను
ప్రత్యేక తెలంగాణ కొరక్న
ప్రవహించిన నీ రక్తం
పాపాత్ముల పరిపాలన
పటాపంచలా పర్యంతం
(కరాంతి విడదు – శాంత పడదు

అర్థాలు :
ఏ తల్లి = ఎవరో తల్లి
కడుపు పంటల కొరకు + ఓ = కన్న బిడ్డల కోసమో
మీ తల్లి కడుపు = మీ అమ్మసంతానం (మీరు)
మంటల మాడను = మంట గలిసి పోయింది
ఏ సతి = ఎవరో భార్లల యొక్క
సౌభాగ్మ్ముల కౌరకు + ఓ = పసుపు కుంకుమల కోసం
నీ సతి = నీ భార్య
కుంకుమ + కోల్పోయెను = తన నుదుటి కుంకుమ పోగొట్టుకుంది
ప్రతి + ఏక= ప్రత్యేక = ప్రత్యేకమైన
తెలగగాణా కొరు + ఐ = తెలంగాణ రాష్టం కోసం
ప్రవహించిన = కాలువలు గట్టిన
నీ రక్తం = నీ నెత్తురు
పాప + ఆత్ముల = దుర్మార్గుల యొక్క
పరిపాలన = ఏలుబడి
పటాపంచలు + ఔ = నాశనమయ్యే
పర్యంతం = సమయం వచ్చే వరకు
(కాంతి విడదు = విప్లవం ఆగదు
శాంత పడదు = శాంతింపదు

భావం : ఎవరో తల్లి కన్న సంతానాన్ని కాపాడటానికి, ఎవరో పతివ్రతల సౌభాగ్రం కాపాడటానికి నీ ప్రాణాలను ధార పోశావు. తెలంగాణ గడ్డపై దుర్మార్గల పాలన అంతమయ్యే వరకు ప్రత్యేక తెలంగాణ ఏర్పడేవరకు కాల్వలు గట్టిన అమరవీరుల రక్తం ప్రవాహం ఆగదు. శాంతించదు.

3. మీ వొక్కొక్క రక్తపు చుక్కే
లారైన విషమ్ముల గ్రక్కే
ఈ వీరుల ఉద్రేకాస్త్రం
ఈ వీరుల ఉద్బోధార్థం
నీ పెట్టిన రక్తపు తిలకం
నా పాలిటి దీక్షా బంధం
అధికారాంధుల పాలిటి
రుధిరసిక్త యమపాశం

అర్థాలు :
మీ = అమరవీరులైన మీ యొక్క
ఒక్క ఒక్క = ప్రతి ఒక్క
రక్తము + చుక్క + ఏ = నెత్తురు బొట్టూ
ఈ వీరుల = ఈ ఉద్యమ వీరుల యొక్క
లావు + ఐన = అధికమైన
విషములన్ + క్రక్కే = విషాన్ని (పసరించే
ఉద్రేక + అస్త్రం = ఆవేశం అనే ఆయుధం
ఈ వీరుల = పోరాటం సాగిస్తున్న వీరులను
ఉద్బోధ + అర్థం = ప్రోత్సహించటానికే
నీవు + పెట్టిన = నీవు దిద్దిన
రక్తము + తిలకం = వీర తిలకం
దీక్షా బంధం అధికార + అంధుల = దీక్షపూని కట్టిన కంకణం
పాలిటి = అధికార మదంతో కళ్ళు మూసుకుపోయిన వారికి
రుధిరసిక్త = రక్తంతో తడిసిన
యమపాశం యముని పాశం వంటిది

భావం : అమర వీరులైన మీ యొక్క ప్రతి నెత్తురు చుక్కా ఉద్యమ వీరుల చేతిలో విషాన్ని చిమ్మే ఆవేశమనే ఆయుధం ఔతుంది. వీరులను ఉత్సాహపరుస్తుంది. మీరు ధరించిన రక్తతిలకం నాచేతికి కట్టుకున్న దీక్షా కంకణం. అధికారమదంతో కళ్ళుమూసుకుపోయిన పాలకులకు నెత్తురుతో తడిసిన యమపాశం వంటిది.

4. రక్త తర్పణమ్మయినా
రక్తితోడ యిచ్చేస్తాం
మీ యడుగుల జాడల్లో
మాయడుగుల నుంచేస్తాం

అనంతాకాశం
సువిశాల భూవలయం
మధ్నున్న ఓ సమస్త ఫ్రాణులారా !
మా ఘతిన వినుడు

పత్యేక తెలంగాణా
బాహటటంగా సాధిస్తాం !
మృతవీరుల ఆత్మలలో
అమృత వర్షం కురిపిస్తాం.

అర్థాలు :
రక్త తర్పణమ్ము + అయినా = నెత్తురు ధార పోయుమన్నా
యిచ్చేస్తాం = త్యాగం చేస్తాం
మీ + అడుగు జాడల్లో = మీ కాలి గుర్తుల్లో
మా + అడుగులన్ = మా పాదాలను
ఉంచేస్తాం = కలిపేస్తాం
అనంత + ఆకాశం = విశాలమైన ఆకాశానికి
సువిశాల = మిక్కిలి వసస్తారమైన
భూవలయం = భూగోళానికీ
మధ్యన + ఉన్న = మధ్లలో ఉన్న
ఓ సమస్త ప్రాణులారా = సమస్తమైన జీవులారా!
మా ప్రతిన = మా ప్రతిజ్ఞను
వినుడు = వినండ
ప్రతి + ఏక = ప్రత్యేకమైన
తెలంగాణా = తెలంగాణా రాజ్యాన్ని
సాధిస్తాం = సంపాదిస్తాం
మృతవీరుల = చనిపోయిన వీరుల యొక్క
ఆత్మలలో = ఆత్మలపైన
అమృతవర్షం = అమృతాన్ని వర్షంలాగా
కురిపిస్తాం = కురిసేట్లు చేస్తాం

భావం : సంతోషంతో మా నెత్తురు ధారపోస్తాం. మీ కాలి జాడలను అనుసరించి వేంు నడుస్తాం. ఆకాశానికి భూమికి మధ్య నివసించే ప్రాణులందరూ మా ప్రతిజ్ఞ వినండి. ప్రత్యేక తెలంగాణ రాజ్యాన్ని మేము సాధించి తీరుతాం. అమర వీరుల ఆత్మల మీద అమృత వర్షం కురిపిస్తాం.

నేపథ్యం / ఉద్దేశీ

ప్రశ్న. 1.
అమరులు పాఠ్యభాగ నేపథ్యం వివరించండి.
జవాబు.
ప్రత్యేక తెలంగాణను కాంక్షిస్తూ 1969లో పెద్ద ఎత్తున తెలంగాణ (ప్రజలు ఉద్యమం చేశారు. నాటి పోరాటంలో 360 కి పైగా విద్యార్థులు, యువకులు (్రాణత్యాగం చేశారు. ఆ అమరవీరులకు ప్రజలు, కవులు, కళాకారులు తమదైన రీతిలో నివాళులు అర్పించారు. ఆచార్య రుక్నుద్దీన్ అమరవీరులకు తన కవితల ద్వారా నివాళులు అర్బించాడు. తెలంగాణ ఉద్యమంలో నాటి నుండి నేటివరకు అమరులైన వీరి త్యాగాలను స్మరించుకోవడమే ఈ పాఠం ఉద్దేశం. (1969 సంఘటనకు సంబంధించి అప్పుడు రాసిన కవిత కాబట్టి పాఠంలో “[ప్రత్యేక తెలంగాణా బాహాటంగా సాధిస్తాం” అని ఉన్నది. దాన్ని గమనించండి.)

TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana అమరులు

ప్రశ్న 2.
అమరులు పాఠ్యభాగ వివరాలు తెల్పండి.
జవాబు.
ఈ పాఠం గేయ (ప్రక్రియకు చెందినది. ఇది ఆచార్య క. రుక్నుద్దీన్ రాసిన ‘విప్లవ ఢంకా’ అనే కవితా సంకలనంలోనిది.

కవి పరిచయం:

కవి పేరు : ఆచార్య కె. రుక్నుద్దీన్
పాఠ్యభాగం పేరు : అమరులు
కాలం : 2/5/1947 – 26/5/2013
జన్మస్థలం : నాగర్ కర్నూలు జిల్లా రాచూరు గ్రామం.
వృత్తి : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు.
పరిశోధనాత్మక గ్రంథం : జానపద సాహిత్యంలో అలంకార విధానం.
పాఠ్యభాగ గ్రంథం : విప్లవఢంకా
ఇతర రచనలు : ప్రయాణం, సూక్తిసుధ, శెలిమె, కిన్నెరమెట్లు, మోదుగపూలు, విశ్వదర్శనం
సత్కారాలు : వివిధ సాహిత్య సంస్థల నుండి పురస్కారాలు.
విశేషాంశాలు : బహుముఖ ప్రజ్ఞాశాలిగా, సామాజిక స్పృహ కలిగిన సాహిత్యవాదిగా, పాలమూరు ఆణిముత్యంగా కీర్తి పొందారు.

ప్రవేశిక:

ప్రశ 1.
అమరులు పాఠ్యభాగ ప్రవేశికను వివరించండి.
జవాబు.
వలస పాలనలోని వివక్షపై, తమ ప్రాంత విముక్తి కోసం, స్వపరిపాలన కోసం, సహజవనరుల సంరక్షణ కోసం, తమదైన భాష, సంస్కృతలులను కాపాడుకోవటం కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమాలు చేశారు. 1969 ఉద్యమంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయక ఆశయసిద్ధి కొరకు పోరాడి అమరులైన వీరులకు కవి ఎట్లా నివాళులు అర్పించాడో తెలుసుకుందాం.

కఠినపదాలకు అర్థాలు:

అసువులు – ప్రాణాలు
మాన్యులు – గౌరవనీయులు
పాసిన – పాయుట, వదిలిపెట్టుట
రుద్రుడు – శివుడు
సౌహార్దత – మంచి మనసు
జోహారులు – నివాళులు
పరిపాలన – ఏలుబడి
క్రాంతి – విప్లవం
సతి – భార్య
పతి – భర్త
లావు – బలము, ఎక్కువ, అధికం
ఉద్బోధ – సందేశం
అంధులు – గ్రుడ్డివారు, కళ్ళు లేనివారు
రుధిరం – రక్తం
సిక్త – తడిసిన
యమపాశం – యముని చేతిలోని దండం
ప్రతిజ్ఞ – ప్రతిన
భూవలయం – భూమండలం

నేనివి చేయగలనా?

TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana అమరులు 2

Leave a Comment