TS 9th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson నేను… సావిత్రిబాయిని

Telangana SCERT 9th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం 6th Lesson నేను… సావిత్రిబాయిని Questions and Answers.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson నేను… సావిత్రిబాయిని

“జ్యోతి ! సావిత్రికెందుకు చదువు నేర్పుతున్నావు ?”
“ఎందుకు నేర్పకూడదు ?”
అసలు మన కులంవాళ్ళమే చదువుకోకూడదు. అయినా నిన్ను చదివించాను. ఇప్పుడు నువ్వు నీ భార్యకు చదువు చెబుతున్నావు – “ఆమె కూడా మనిషే కదా ! కాదంటే చెప్పు”
“నిజమే కావచ్చు కానీ ఆడదానికి చదువు పనికిరాదు. చదువుకున్న ఆడది చెడిపోతది. బుద్ధి లేనిదవుతది”-
“నాన్నా! సావిత్రి చదువుకుని ఆ మాటలన్నీ అబద్ధాలని నిరూపిస్తుంది”
TS 9th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson నేను… సావిత్రిబాయిని 1

PAPER – I : వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన) (మార్కులు: 6)

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
సావిత్రీబాయి కాలంలో స్త్రీల పరిస్థితులు ఎలా ఉండేవి ?
జవాబు:
సావిత్రీబాయి కాలంలో ఆడవాళ్ళు గడప దాటకూడదు. ఆడదంటే వంటింటికీ, వంటింట్లో పొయ్యికీ కట్టుబడి ఉండాలి. ఆడపిల్ల నియమాలను ఎంతమాత్రం దాటరాదు.

ఆ రోజుల్లో పొయ్యిలో కర్రలూ, పొయ్యి ఊదే గొట్టం ఆడపిల్ల చేతిలో ఎప్పుడూ ఉండాల్సిందే. ఆడపిల్ల ఆ గొట్టంతో పొయ్యిని ఊదుతూ ఉండాల్సిందే. ఆడపిల్ల భర్తనూ, అత్తమామల్ని సేవించుకోవాలి. ఇప్పుడు రెండవతరగతి చదివే వయస్సులోనే ఆనాడు ఆడపిల్లలు అత్తవారింట్లో ఉండేవారు. అత్తవారి ఇల్లే ఆడపిల్ల అసలు ఇల్లని ఆ రోజుల్లో ఆడపిల్లలకు తల్లిదండ్రులు నొక్కి చెప్పేవారు.

ఆ రోజుల్లో ఆడపిల్లలకు చదువు పనికిరాదు. చదువుకున్న ఆడది చెడిపోతుందని, బుద్ధిలేనిది అవుతుందని అప్పటివారు నమ్మేవారు. ఆనాడు సావిత్రి ఆడపిల్లలకు చదువుచెప్పడానికి బడికి పోతూంటే, జనం కిటికీల వెనుక నిలబడి తిట్టేవారు. శాపనార్థాలు పెట్టేవారు. నీచమైన మాటలు అనేవారు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson నేను… సావిత్రిబాయిని

ప్రశ్న 2.
సేబీ అంటే ఎవరు ? ఆయన వ్యక్తిత్వాన్ని గురించి వివరించండి.
జవాబు:
సేబీ అంటే సావిత్రీబాయి భర్త “జ్యోతీరావ్ ఫూలే”. సేబీ, పూనాలో ఉండే ఫూలే కుటుంబంలో పుట్టాడు. సేబీకి ఎప్పుడూ బడి, పుస్తకాలు, చదువు అంటే ఇష్టం. సావిత్రీబాయి, జ్యోతీరావ్ ఫూలేని సేబీ అనే పిలిచేది.

మనిషి మంచివాడయితే, అతడు మనదేశం వాడయినా, విదేశీయుడయినా సరే, ఆయన జీవితం, వ్యక్తిత్వం విలువలూ అన్నీ తెలుసుకోవాలి అనేవాడు సేబీ. శివాజీ, వాషింగ్టన్ వంటి వారి జీవిత చరిత్రలు అన్నీ ఆయన చదివాడు. థామస్పెన్ రాసిన “మానవహక్కులు” పుస్తకం చదివి మనిషికి ఉన్న హక్కులూ, బాధ్యతలూ చక్కగా తెలిసికొన్నాడు.

మన కులవ్యవస్థ, మన సమాజాన్ని నాశనం చేస్తోందని సేరీ చెప్పేవాడు. ఒకప్పుడు మంచిగా ఉన్న మన మతం మూర్ఖపు ఆచారాల్లో చిక్కుకుందనీ, వాటిని రూపుమాపాలనీ అనేవాడు. సేబీ, కబీర్, తుకారాం వంటి భక్తుల సాహిత్యాన్నీ, మత సంస్కర్తల రచనల్నీ చదివాడు. ఆ కాలంలోని శూద్ర, అతిశూద్రకులాల గొడవలు, విద్య వల్లే పోతాయనీ, విద్యే మన ధ్యేయం కావాలనీ సేబీ చెప్పేవాడు. సేబీ, విద్య అనే తపన వహించిన మహావృక్షం వంటివాడు.

ఆడమనిషి చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుందని, భార్య సావిత్రికి చదువుచెప్పి, ఆమెను మొదటి పంతులమ్మగా చేశాడు. తక్కువ కులాల ఆడపిల్లల కోసం సొంత ధనంతో బడిపెట్టాడు.

మానవులందరూ పుట్టుకతో సమానులనీ, వాళ్ళు ఒకరినొకరు సమానులుగా చూసుకోవాలనీ సేర్ చెప్పేవాడు. ఆడపిల్లలకు చదువు చెపుతున్నందుకు కోపంతో కొందరు సేరీని చంపబోయారు. బీదవాళ్ళకు సాయం చెయ్యడమే తన జీవితాశయం అనీ, వాళ్ళ చేతుల్లో చావటానికి కూడా తాను సిద్ధం అని చెప్పి, హంతకుల మనస్సును సేబీ మార్చాడు.

శిశు హత్యలకు వ్యతిరేకంగా మొదటి ఆశ్రమం స్థాపించాడు. “దేవుడు ఒక్కడే. మనందరం ఆయన పిల్లలం. మనిషిని ‘ గొప్పవాడిగా చేసేది అతని గుణమే కాని, కులంకాదు. అనే సిద్ధాంతాలతో “సత్యశోధక సమాజాన్ని” స్థాపించాడు. సేర్జే అంటే జ్యోతీరావ్ ఫూలే. ఈయన స్త్రీ విద్యకూ, కులరహిత సమాజానికీ కృషిచేసిన మహనీయుడు.

ప్రశ్న 3.
జ్యోతీరావ్ ఫూలేని చంపడానికి వచ్చిన వాళ్ళు పరివర్తన చెందిన సంఘటనను తెలపండి.
జవాబు:
జ్యోతీరావ్ ఫూలే తక్కువ కులాల ఆడపిల్లల చదువులకై బడిపెట్టాడు. ఇది గిట్టని సంఘంలో కొందరు పెద్దమనుషులు పూలేని చంపమని దోండిరామ్, కుంబార్ అనే హంతకులను నియమించారు.

ఒకరోజు రాత్రి భోజనాలయ్యాక ఫూలే నిద్రపోడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో ఫూలే పెరటి గుమ్మం తీసుకొని ఇద్దరు హంతకులు గొడ్డళ్ళతో నీశ్శబ్దంగా లోపలకు వచ్చారు. వాళ్ళ ముఖాలు భయంకరంగా ఉన్నాయి. వాళ్ళు పూలే భార్య సావిత్రికీ, ఫూలేకీ ముందు నిలబడి, పూలేని చంపడానికి గొడ్డళ్ళు పైకెత్తారు. వెంటనే ఫూలే భార్య “అన్నల్లారా ! ఆగండి. దయచేసి వెళ్ళిపొండి” అని బ్రతిమాలింది. ఎందుకు వచ్చారని పూలే వాళ్ళను అడిగాడు.

ఫూలే బడులు నడపడం ఇష్టంలేని కొందరు పెద్దలు, ఆయనను చంపడానికి తమకు కాంట్రాక్టు ఇచ్చారని, వాళ్ళు ఫూలేకు చెప్పారు. అప్పుడు ఫూలే వాళ్ళతో – “నా చావు మీకు లాభం అయితే, నన్ను చంపండి. బీదవాళ్ళకు సాయం చెయ్యడమే, నా జీవితాశయం – బీదవారి చేతిలో చావడంలో తప్పులేదు. నన్ను చంపండి” అని మెడవంచి శాంతంగా చావుకు సిద్ధమయ్యాడు. వెంటనే దోండిరామ్, కుంబార్లు గొడ్డళ్ళు కిందపడేశారు. ఫూలే కాళ్ళమీద పడ్డారు. “మేము మిమ్మల్ని చంపం. మీరు మా తండ్రి వంటివారు. ఇప్పుడే వెళ్ళి మమ్మల్ని ఇక్కడకు పంపిన వాళ్ళను చంపుతాం” అన్నారు ఫూలే వాళ్ళను ఆపాడు. వారి ఆలోచన మారేదాకా వారితో మాట్లాడాడు.

వాళ్ళిద్దరూ ఫూలే రాత్రిబడిలో చేరారు. దోండే ఫూలేకు బాడీగార్డుగా తయారయ్యాడు. కుంబార్ “వేదాచార్” అనే పుస్తకం రాసి, పూలే పనికి సాయం చేశాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson నేను… సావిత్రిబాయిని

ప్రశ్న 4.
సావిత్రిబాయి ఫూలే పాత్రను ఏకపాత్రాభినయం చేయండి.
జవాబు:
“సావిత్రిబాయి ఫూలే” ఏకపాత్రాభినయం :
నేను సావిత్రిని.

ఈ రోజు మీతో మాట్లాడదామని మీ ముందుకు వచ్చా. మీరు, మేం మా కాలంలో ఎక్కడున్నామో అక్కడే నిలిచిపోయారా ? అని నాకు అనిపిస్తోంది. నేను మహారాష్ట్రలో సతారా జిల్లా, ఖండాలా తాలూకాలో నైగావ్ గ్రామంలో పాటిల్ గారి మొదటి సంతానంగా పుట్టా. చిన్నప్పుడు బాగా అల్లరి చేసేదాన్ని. చెట్లు ఎక్కి సీమ చింతకాయలు కోసుకు తినేదాన్ని.

నాకు ఏడవ సంవత్సరంలో పూనాలోని పూలే కుటుంబీకుడు జ్యోతిరావ్తో పెండ్లి జరిగింది. మా మామగారు మంచివారు. నా భర్తను నేను సేఠ్ జీ అని పిలిచేదాన్ని. సేఠ్ జీకి చదువు అంటే ఇష్టం. నాకు ఆయన అన్నీ చదివి చెప్పేవారు. సే సాగర్ వెళ్ళారు. ఆడది చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుందని అక్కడ ఒక తెల్లజాతి మనిషి సేబీకి చెప్పింది.

సేఠ్ జీ నాకు చదువు చెప్పడం ప్రారంభించారు. మా మామగారు చదువుకుంటే ఆడది చెడిపోతుందని సేబీకి సలహా చెప్పారు. అయినా సేఠ్ జీ ఆ మాట వినలేదు. నా భర్త తక్కువ కులాల ఆడపిల్లల చదువులకు రెండు బడులు పెట్టారు. ఇంతలో ఆ స్కూలు నడిపే బడిపంతులు మానివేశాడు. దానితో ఫూలే బలవంతంపై, నేనే ఆ పిల్లలకు పంతులమ్మనయి, స్త్రీలకు చదువు చెప్పాను. ఆ పని చేయడం ఇష్టం లేని జనం నన్ను తిట్టేవారు. కిటికీలు మూసి నేను వారికి పాఠాలు చెప్పాను.

ఒక రోజున నేనూ, సేఠ్ నిద్రపోవడానికి సిద్ధంగా ఉండగా ఇద్దరు హంతకులు సేబీని చంపడానికి మా ఇంటికి వచ్చారు. సేబీ తన్ను చంపండని తలవంచారు. హంతకుల మనస్సులు మారిపోయాయి. మేం ఓ పిల్లవాణ్ణి పెంచుకున్నాం. మా సొంతబిడ్డలాగే వాడిని చూసుకున్నాం. ‘నేనే మొదటి పంతులమ్మను. శిశు హత్యలకు వ్యతిరేకంగా మేము ఒక ఆశ్రమం స్థాపించాము.

సత్యశోధక సమాజాన్ని స్థాపించాము. మేం సాధించిన విజయాలను, మా తర్వాత వచ్చిన ప్రజలు ముందుకు తీసుకెళ్ళాలి. పక్షవాతంతో సేఠ్ మరణించారు. 1897లో పూనాలో ప్లేగువ్యాధి వచ్చింది. ప్లేగువ్యాధితో బాధపడే పసిపిల్లలను నేను చేరదీశాను. నేను కూడా ప్లేగువ్యాధితోనే కన్నుమూశాను. మా ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళండి. సెలవు.

PAPER – II : పరిచిత గద్యాలు (మార్కులు : 5)

1. కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

నేను …….. సావిత్రిబాయిని

1897లో పునాలో ప్లేగువ్యాధి ప్రబలింది. పట్టణం ఎడారి అయిపోయింది. జనమంతా దగ్గర్లో ఉన్న అడవుల్లోకి పారిపోయారు. ఇట్లాంటి సమయాల్లో తక్కువ కులాల వాళ్ళకు సహాయపడాలని ఎవరనుకుంటారు ? నేను, నా కొడుకు యశ్వంత్, సమాజం సభ్యులు వ్యాధిగ్రస్తులకు సాయంగా వెళ్ళాం. ఒక గుడిసెలో రెండేళ్ళ పసివాడు బాధతో లుంగలు చుట్టుకుపోతూ కనిపించాడు. ఆ పిల్లవాడిని యెత్తుకొని డాక్టర్ దగ్గరకు పరుగెత్తాను. ప్లేగు అంటువ్యాధైనా ప్రాణం కోసం పెనుగులాడుతున్న ఆ పసిగుడ్డును ఎత్తుకోకుండా ఎట్లా ఉండగలను ? నా గుండెలకు అదుముకున్నాను. ఆ పసిబిడ్డ చావవలసి ఉంటే మరొక మనిషి ప్రేమ ఇచ్చే వెచ్చదనంతో చనిపోనివ్వు. ఆ బిడ్డ చనిపోయాడు. నాకు కూడా ప్లేగువ్యాధి సోకింది.. నా ప్రయాణం పరిసమాప్తమయ్యింది. నేను పనిలో ఉండగా మృత్యువు వరించటం నా అదృష్టం.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
‘నా ప్రయాణం పరిసమాప్తమయ్యింది’ అంటే అర్థం ఏమిటి ?
జవాబు:
నా ప్రయాణం పరిసమాప్తమయ్యింది అంటే, తన జీవితకాలం ముగిసిందని తాను చచ్చిపోతున్నానని అర్థం.

ప్రశ్న 2.
సావిత్రిబాయి కుమారుడు పేరు ఏమిటి ?
జవాబు:
సావిత్రీబాయి కుమారుడి పేరు “యశ్వంత్”.

ప్రశ్న 3.
పూనాలో ప్లేగువ్యాధి ఎప్పుడు వ్యాపించింది? పట్టణం ఎడారి అయ్యింది అంటే ఏమిటి ?
జవాబు:
పూనాలో ప్లేగువ్యాధి 1897 లో వ్యాపించింది. పట్టణం ఎడారి అయ్యిందంటే ఎడారిలోలాగే మనుష్యులు లేకుండా నగరం నిర్జనంగా ఉందన్నమాట.

ప్రశ్న 4.
గుడిసెలో పిల్లవాడిని చూసి సావిత్రీబాయి ఏమి చేసింది ?
జవాబు:
గుడిసెలో పిల్లవాడిని చూసి సావిత్రీబాయి ఆ పిల్లవాడిని ఎత్తుకొని, డాక్టర్ దగ్గరకు పరుగెత్తింది.

ప్రశ్న 5.
ప్లేగువ్యాధిగ్రస్తులకు, ఎవరు సాయంగా వెళ్ళారు ?
జవాబు:
ప్లేగువ్యాధిగ్రస్తులకు సావిత్రీబాయీ, ఆమె కుమారుడు యశ్వంత్, సమాజం సభ్యులూ సాయంగా వెళ్ళారు.

2. కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

“నేను… సావిత్రిబాయిని’

ఒక రోజు నేను ఇల్లు సర్దుతున్నా. పుస్తకాల గుట్టమీద వున్న దుమ్ము దులుపుతున్నా. ఇల్లు శుభ్రంగా ఉండాలి గదా. అదుగో అప్పుడే ఆయనొచ్చాడు. “నా పుస్తకాలనేం చేస్తున్నావు!” అన్నాడు. “దుమ్ము దులిపి శుభ్రం చేయొద్దా?” అన్నా. “పేజీలు పోగొడతావ్ జాగ్రత్త?’ అంటే ‘ఎక్కడికి పోవు, అన్నీ ఉంటాయి అన్నా. ఇదేంటో మరి?’ ‘ఏ పేజీ అది పేజీనో ఏమిటో నాకేం తెలుస్తుంది ? ఏమయిందని మీరిప్పుడీ రగడ చేస్తున్నారు?’ అన్నా ! అవన్నీ జీవిత చరిత్రలు. ఇదిగో చూడు. ఇది శివాజీ గురించి రాసింది. ఆయన ఫోటో ఇది. ఇక్కడ వాషింగ్టన్ గురించి రాసింది. ఇది ఆయన ఫోటో. అని సేరీ అన్నాడు.

“ఎవరూ ? శివాజీ నాకూ తెలుసు. మనవాడే కదా! కానీ ఈయనెవరూ? పరాయిదేశం మనిషివలె ఉన్నాడు. మనదేశం అయితేనేం కాకపోతేనేం. మనిషి మంచి పనులు చేస్తే మనం అతని జీవితం, వ్యక్తిత్వం, విలువలు అన్నీ తెలుసుకోవాలి.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
పై పేరాలో విషయం మనకు చెపుతున్నది ఎవరు ?
జవాబు:
పై పేరాలో మనకు విషయం చెపుతున్నది ‘సావిత్రీ బాయి’.

ప్రశ్న 2.
మనిషి మంచి పనులు చేస్తే, ఏం చేయాలి ?
జవాబు:
మనిషి మంచి పనులు చేస్తే ఆ మనిషి జీవితం, వ్యక్తిత్వం, విలువలు అన్నీ తెలుసుకోవాలి.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson నేను… సావిత్రిబాయిని

ప్రశ్న 3.
పై పేరాలో పేర్కొన్న జీవిత చరిత్రలు, ఫోటోలు ఎవరికి సంబంధించినవి ?
జవాబు:
పై పేరాలో పేర్కొన్న జీవిత చరిత్రలు, ఫోటోలు

  1. శివాజీకి,
  2. వాషింగ్టన్కి సంబంధించినవి.

ప్రశ్న 4.
సావిత్రీబాయి ఏమి చేస్తోంది ?
జవాబు:
సావిత్రీబాయి, సేఠ్ పుస్తకాలపై పడ్డ దుమ్మును దులిపి శుభ్రం చేస్తోంది.

ప్రశ్న 5.
సేఠ్ ఎందుకు రగడ చేశాడు ?
జవాబు:
సేబీ తన పుస్తకాల్లో పేజీలు పోతాయనే భయంతో భార్య సావిత్రీబాయితో రగడ చేశాడు.

Leave a Comment