TS 9th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson ఆచార్య కొత్తపల్లి జయశంకర్

Telangana SCERT 9th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం 4th Lesson ఆచార్య కొత్తపల్లి జయశంకర్ Questions and Answers.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson ఆచార్య కొత్తపల్లి జయశంకర్

TS 9th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 1

తెలంగాణ చెరువు తీరు
మన జయశంకరు సారూ
అలుగు దుంకి పారూ
పదునైన మాట జోరు
పాలు పోసుకున్న పజ్జోన్న కంకులల్ల
పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్ల
మీ ఆశయాల వ్రాలూ
కనిపించే ఆనవాలూ ….
కన్నులలో ఆవేశం కదలాడిన రుద్రుడు
ఆధిపత్య శక్తులపై అతడు వీరభద్రుడు
ఆలోచనల అవసరాన్ని తెలిపిన నిబద్ధుడు
తెలంగాణ కనుగొన్న అతడు మరో

PAPER – I : వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన) (మార్కులు: 6)

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
జయశంకర్ బాల్యం, విద్యాభ్యాసం గురించి రాయండి.
జవాబు:
తెలంగాణను శ్వాసించిన మహోపాధ్యాయుడు, జయశంకర్, వరంగల్లు జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో లక్ష్మీకాంతరావు, మహాలక్ష్మీ దంపతులకు 1934 ఆగస్టు 6న జన్మించాడు. ఆ రోజుల్లో ఉర్దూ మీడియం పాఠశాలలు మాత్రమే ఉండేవి. జయశంకర్ ఆ రోజుల్లో హన్మకొండలోని మర్కజీ పాఠశాలలో ప్రాథమిక విద్య నేర్చాడు. హన్మకొండ న్యూ హైస్కూలులో మాధ్యమిక వరకు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్.ఎస్. సీ వరకు చదువుకున్నాడు.

జయశంకర్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ. పూర్తి చేశాడు. బెనారస్ విశ్వవిద్యాలయం, ఆలీగఢ్ విశ్వవిద్యాలయాల నుండి పి.జి. పూర్తి చేశాడు. ఆ రోజుల్లో వరంగల్లో డిగ్రీ కళాశాల లేదు. డిగ్రీ చదవాలంటే, హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చేది. లెక్చరర్ గారి ప్రోద్బలంతో కాలేజీ కావాలని విద్యార్థులు ఉద్యమం చేశారు. అందులో జయశంకర్ ముందువరుసలో నిలిచాడు.

ఊరేగింపులో జయశంకర్ నినాదాలిస్తున్నాడు. “వరంగల్కు డిగ్రీ కాలేజి కావాలి” అని నినాదాలు ఇవ్వడానికి బదులు, యూనివర్సిటీ కావాలి అని జయశంకర్ నినాదం ఇచ్చాడు. అందరూ నవ్వుకున్నారు. అప్పుడు జయశంకర్ను బాగా ఇష్టపడే ఒక లెక్చరరు, “ఏయ్ పిచ్చిపిల్లాడా ! ఏమయ్యింది” అని జయశంకరుని మందలించాడు. చిత్రంగా ఈ సంఘటన జరిగిన పదేళ్ళకు డిగ్రీ కాలేజి, 30 ఏళ్ళకు యూనివర్సిటీ వరంగల్లులో ప్రారంభమయ్యాయి. అంతేకాదు. పిచ్చిపిల్లాడనిపించుకున్న ఆ జయశంకర్, వరంగల్లు యూనివర్సిటీ వైసాఛాన్సలరు అయ్యాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson ఆచార్య కొత్తపల్లి జయశంకర్

ప్రశ్న 2.
జయశంకర్ ఉద్యోగ జీవితం గురించి తెలపండి.
జవాబు:
జయశంకర్ 1960లో ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టాడు. దానితో జయశంకర్ ఉద్యోగ జీవితం మొదలయ్యింది. తరువాత హన్మకొండలో ఉపాధ్యాయుడిగా నియమింపబడ్డాడు. అక్కడి నుండి లెక్చరర్గా ఆదిలాబాద్కు వెళ్ళాడు. 1975-79 వరకు సి.కె. యం. కళాశాల ప్రిన్సిపాలుగా, బోర్డు మెంబరుగా జయశంకర్ సేవలందించాడు.

1982 – 91 వరకు, సీఫెల్ రిజిష్ట్రారుగా పనిచేశాడు. ఈయన 1991 94 వరకు కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు. ఇవియే కాకుండా, వివిధ ప్రభుత్వ హోదాల్లో, సంఘాల పదవుల్లో పనిచేసి, తనదైన ముద్ర వేశాడు.

జయశంకర్ ఎన్నో పదవుల్లో పనిచేశాడు. తనకు వైస్ ఛాన్సలర్గా చేసిన పనిలో తృప్తి కంటే, సి.కె. ఎం. కళాశాల ప్రిన్సిపాలుగా పనిచేయడం, ఎక్కువ తృప్తినిచ్చిందని జయశంకర్ సార్ చెప్పేవాడు. ఈ విధంగా హన్మకొండలో టీచర్ గా మొదలైన జయశంకర్ ఉద్యోగ జీవితం, అదే ఊళ్ళో వైస్ ఛాన్సలర్గా పదవీ విరమణతో ముగిసింది.

ప్రశ్న 3.
తెలంగాణ ఉద్యమంలోని మూడు దశల్లో జయశంకర్ నిర్వహించిన పాత్రను గురించి రాయండి.
జవాబు:
తెలంగాణ ఉద్యమంలో మూడు ప్రధాన దశలు ఉన్నాయి. మొదటిది భావజాల వ్యాప్తి. రెండవది ఆందోళనా కార్యక్రమం. మూడవది రాజకీయ ప్రక్రియ. ఈ మూడు దశల్లోనూ జయశంకర్ పాత్ర మరచిపోలేనిది. అందుకే, జయశంకర్ తెలంగాణ సిద్ధాంతకర్త.

ఇందులో మొదటిది తెలంగాణ భావజాల వ్యాప్తి :
తెలంగాణ భావజాలం ఎంతగా ప్రజల్లోకి వెళ్ళిందో జయశంకర్ ఒకరోజు ఇలా చెప్పాడు. “ఎందుకమ్మా తెలంగాణ” అని అడిగితే, తెలంగాణ వస్తే మా పొలాలకు నీళ్ళొస్తాయి. మా పిల్లలకు ఉద్యోగాలొస్తాయి అని చదువు రాని ఆడవాళ్ళు చెప్పారు” – ఈ విధంగా తెలంగాణ భావజాలం వ్యాపించింది.

రెండవది ఆందోళన కార్యక్రమం. తెలంగాణలో జరిగిన ఆందోళనలు, ఉద్యమాన్ని రెండింతలు చేశాయి. ఈ ఉద్యమాల వెనుక జయశంకర్ వంటి మేథావులు, ఉద్యమ కార్యకర్తల సూచనలు, సలహాలు ఉన్నాయి. జయశంకర్ ఆందోళనకారులకు కావలసిన పూర్తి వివరాలు, విశ్లేషణలతో ముందుంచేవాడు.

మూడవ దశ రాజకీయ ప్రక్రియ. జయశంకర్ రాజకీయ ప్రక్రియలో పాల్గొనకపోయినా, తెలంగాణ రాజకీయ నాయకులందరికీ, తన సహకారం అందించాడు. చెన్నారెడ్డి నుండి చంద్రశేఖరరావు వరకు ప్రతి రాజకీయ పార్టీకి జయశంకర్ తన మేథోశ్రమను ధారపోశాడు. జయశంకర్ ఊహించినట్టే, చివరకు రాజకీయ ప్రక్రియతోనే తెలంగాణ వచ్చింది.

ప్రశ్న 4.
జయశంకర్ సమయపాలన, నిబద్ధతల గురించి తెలిపే సంఘటనలను తెలపండి.
జవాబు:
జయశంకర్ నీతి,నిజాయితి, నిరాడంబరత, నిబద్ధత సమయపాలన వంటి లక్షణాలు ఉన్న మహా మనీషి. ఈయన సమయపాలన, నిబద్ధతలను గురించి తెలిపే ఒక సంఘటనను పరిశీలిద్దాం. జయశంకర్ సీఫెల్ రిజిష్ట్రారుగా ఉన్న సమయంలో సాయంత్రం 5.30 నుండి రాత్రి 10.30 వరకు తన పరిశోధక విద్యార్థికి సమయం కేటాయించేవారు. తన భోజన సమయంలో విద్యార్థిని కూర్చోబెట్టుకొని, మెటీరియల్ చూసేవారు. ఒకసారి జయశంకర్ సార్ స్నేహితుడొకడు 5 గంటల వరకూ ఆయనతో గడపి, తృప్తిలేక ఇంకా మాట్లాడడానికి ప్రయత్నించాడు.

జయశంకర్ నిర్మొహమాటంగా తన పి.హెచ్.డి విద్యార్థి వచ్చే సమయమయ్యిందనీ మిత్రునితో మరొకసారి కలుద్దామని చెప్పి, మిత్రుని బయటకు పంపించారు. పై పరిశోధక విద్యార్థే తరువాతి కాలంలో ఖమ్మం కళాశాల ప్రిన్సిపాల్ అయ్యాడు. అప్పుడు జయశంకర్ కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా ఉండేవారు. పై ప్రిన్సిపాలు వైస్ ఛాన్స్లర్గా ఉన్న జయశంకర్ సార్తో ఒకసారి సమయం తెలియకుండా మాట్లాడుతున్నాడు. అప్పుడు జయశంకర్ “నీకు రైలు టైం అవుతుంది. స్టేషన్కు వెళ్ళడం ఆలస్యం అవుతుంది నీవు వెళ్ళు” అని చెప్పి పంపించివేశారట. దీనిని బట్టి జయశంకర్ సమయానికి విలువ ఇస్తారని అర్థమవుతోంది.

ప్రశ్న 5.
జయశంకర్ సార్ వ్యక్తిత్వాన్ని గురించి రాయండి.
జవాబు:
జయశంకర్ తెలంగాణకు చిరునామా. తెలంగాణకు మార్గదర్శి. జయశంకర్ జీవితాంతం ఉద్యమాల్లో తిరిగాడు. పెళ్ళి చేసుకోలేదు. ఉద్యోగం ద్వారా వచ్చిన జీతాన్ని ఉద్యమాల కోసం ఖర్చు పెట్టాడు. తన ఉమ్మడి కుటుంబానికి జయశంకర్ చేదోడువాదోడుగా ఉండేవాడు. ఉమ్మడి కుటుంబంలో వారందరూ పెరిగి పెద్దవారు అయ్యారు. జయశంకర్ ఒంటరిగా మిగిలాడు. జయశంకర్ తనకు సాయంగా ఉండడానికి తల్లిదండ్రులు లేని అనాథ పిల్లవాడిని చేరదీశాడు. అతడిని చదివించి పెళ్ళి చేశాడు. వారికో పిల్ల పుట్టింది. వారితో కలసి జయశంకర్ చివరి దశలో గడిపాడు. తనకు తల్లిదండ్రులిచ్చిన పాత ఇల్లు అమ్మి వరంగల్లులో ఒక ఫ్లాట్ తీసుకున్నాడు, అదే జయశంకర్ ఆస్తి.

ఉదాత్తమైన వ్యక్తిత్వం, మృదుభాషణం, ఉద్యమస్ఫూర్తి, స్థితప్రజ్ఞత – అనేవి కలిస్తే జయశంకర్. తెలంగాణ వారందరిచే ఈయన జయశంకర్ సార్ అని ప్రేమగా పిలిపించుకున్నాడు. జయశంకర్ ఉద్యమ పితామహులుగా, తెలంగాణ జాతిపితగా పేరు పొందాడు. ఈయనకు కార్యకర్తకు కావాల్సిన కార్యదక్షత ఉన్నది. కె.సి. ఆర్. వంటి నాయకులకు ఆత్మ విశ్వాసాన్ని
ఈయన అందించారు.

జయశంకర్ సార్ శనివారం భోజనం చేసేవారు కాదు. ఈయన జీవితంలో రెండు విషయాల్లో రాజీ పడలేదు.

1) శనివారం పస్తుండటం.

2) తెలంగాణ అంశం మాట్లాడకుండా ఉండలేకపోవడం. తెలంగాణ రాకముందే, జయశంకర్ అస్తమించాడు.
జయశంకర్ జీవితాంతం, ఒకే మార్గంలో నడిచాడు. ఒకే మాటపై నిలబడ్డాడు. అందరినీ తన మార్గంలో నడిపించాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson ఆచార్య కొత్తపల్లి జయశంకర్

PAPER – II : పరిచిత గద్యాలు (మార్కులు : 5)

1. కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

1996లో నాటి ప్రధాని 15 ఆగస్టు ఎర్రకోట నుండి చేసిన ఉపన్యాసం తెలంగాణా వాదులందరిని తట్టిలేపింది. తెలంగాణ సాధనకు ఎలాంటి వ్యూహాలు రచించాలో జయశంకర్కు తెలుసు. మొత్తం తెలంగాణ ఉద్యమానికి మూడు దశలున్నాయి. మొదటిది భావజాల వ్యాప్తి. అది జరిగింది. రెండోది ఆందోళనా కార్యక్రమం. అది కొనసాగుతున్నది. ఇక మిగిలింది రాజకీయ ప్రక్రియ. అది జరగాల్సి ఉంది. దానిని పూర్తి చేయడమే ఉద్యమ కర్తవ్యం కావాలి. దానికి రాజకీయ చిత్తశుద్ధి అవసరం. ‘ఇప్పుడున్న రాజకీయ నాయకత్వం ఆ పని పూర్తిచేస్తుందని నేను నమ్ముతున్నాను’ అని అన్నాడు. ఈ మూడు దశల్లో కూడా జయశంకర్ పాత్ర మరువలేనిది. అందుకే అతడు తెలంగాణ సిద్ధాంతకర్త. మొదటిది తెలంగాణ భావజాల వ్యాప్తి. అది ఎంతగా ప్రజల్లోకి చొచ్చుకపోయిందో జయశంకర్ ఒక రోజు ఇట్లా చెప్పిండు. “ఎందుకమ్మా తెలంగాణ అంటే ? ‘ఏం సార్ తెలంగాణ వస్తె మా పొలాలకు నీళ్ళొస్తయ్, మా పోరగానికి కొలువొస్తది” అనే భావన వారికి కలిగిందని” చదువురాని ఆడవాళ్ళు చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకొన్నాడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
తెలంగాణ ఉద్యమంలో రెండవదశ ఏది ?
జవాబు:
తెలంగాణ ఉద్యమంలో రెండవ దశ “ఆందోళన కార్యక్రమం”.

ప్రశ్న 2.
తెలంగాణ వస్తే ఏమవుతుందని చదువురాని ఆడవాళ్ళు చెప్పారు ?
జవాబు:
తెలంగాణ వస్తే వారి పొలాలకు నీళ్ళు వస్తాయని, వారి పిల్లలకు ఉద్యోగాలొస్తాయని ఆడవాళ్ళన్నారు.

ప్రశ్న 3.
తెలంగాణ వాదులను తట్టిలేపింది ఏది ?
జవాబు:
1996లో ఆగస్టు 15, నాటి ప్రధాని ఎర్రకోట నుండి చేసిన ఉపన్యాసం తెలంగాణ వాదులను తట్టిలేపింది.

ప్రశ్న 4.
జయశంకర్ తెలంగాణ సిద్ధాంతకర్త ఎలా అయ్యాడు ?
జవాబు:
తెలంగాణ ఉద్యమం మూడు దశల్లోనూ జయశంకర్కు గల పాత్ర మరువలేనిది. అందుకే జయశంకర్ తెలంగాణ సిద్ధాంతకర్త అయ్యాడు.

ప్రశ్న 5.
తెలంగాణ ఉద్యమంలో ప్రధానమైన మూడు దశలు తెల్పండి.
జవాబు:

  1. భావజాల వ్యాప్తి
  2. ఆందోళన కార్యక్రమం
  3. రాజకీయ ప్రక్రియ అనేవి తెలంగాణ ఉద్యమంలో మూడు దశలు.

2. ఈ కింది పేరా చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

జీవితాంతం పదవుల్లో ఉద్యమాల్లో తిరిగిన జయశంకర్ పెండ్లి చేసుకోలేదు. ఉద్యోగరీత్యా సంపాదించినదంతా ఉద్యమాల కోసం ఖర్చు బెట్టాడు. ఉమ్మడి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్నాడు. జీవిత కాలం ఎక్కువగా ఇట్లాగే ఖర్చు అయింది. ఉమ్మడి కుటుంబంలోని వాళ్ళందరు పెరిగి, ఎవరి సంసారాలు వాళ్ళకు అయినంక జయశంకర్ ఒంటరిగా మిగిలాడు. జయశంకర్ తనకు సహాయంగా ఉండటానికి తల్లిదండ్రులు లేని అనాథ పిల్లవాడిని చేరదీశాడు. అతడిని చదివించాడు. అనాథ పిల్లతో పెండ్లి చేశాడు. వారికో పాప పుట్టింది. వాళ్ళతో కలిసి జీవితం చివరిదశలో గడిపాడు. తల్లిదండ్రులు ఇచ్చిన పాత ఇల్లు అమ్మి, వరంగల్లో ఫ్లాట్ తీసుకున్నాడు. అదే అతని ఆస్తి. పెన్షన్తో కాలం
గడిపాడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
జయశంకర్ తన సంపాదనను ఎలా ఖర్చు చేశాడు ?
జవాబు:
జయశంకర్ తన సంపాదనను అంతా ఉద్యమాల కోసం ఖర్చు చేశాడు.

ప్రశ్న 2.
జయశంకర్ పెండ్లి ఎందుకు చేసికోలేదు ?
జవాబు:
జయశంకర్ జీవితాంతం పదవుల్లో, ఉద్యమాల్లో తిరిగినందున పెండ్లి చేసుకోలేదు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson ఆచార్య కొత్తపల్లి జయశంకర్

ప్రశ్న 3.
జయశంకర్ చివరి దశలో ఎవరితో గడిపాడు ?
జవాబు:
జయశంకర్ చివరి దశలో తాను చేరదీసిన అనాథ పిల్లవాడితో, అతని భార్యాపిల్లలతో గడిపాడు.

ప్రశ్న 4.
జయశంకర్ ఆస్తి ఏమిటో చెప్పండి.
జవాబు:
జయశంకర్ తనకు తల్లిదండ్రులు ఇచ్చిన పాత ఇల్లును అమ్మి, వరంగల్లులో ఒక ఫ్లాట్ తీసుకున్నాడు. అదే ఆయన ఆస్థి.

ప్రశ్న 5.
జయశంకర్ ఒంటరివాడు ఎందుకు అయ్యాడు ?
జవాబు:
‘ జయశంకర్ ఉమ్మడి కుటుంబ సభ్యులు అందరూ పెరిగి, ఎవరి సంసారాలు వారు చేసుకుంటున్నారు. అందువల్ల జయశంకర్ ఒంటరివాడయ్యాడు.

Leave a Comment