TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం

Telangana SCERT 9th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం 1st Lesson కుంరం భీం Questions and Answers.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం

‘జల్, జంగల్, జమీన్ (నీరు అడవి భూమి)
మనది…… అనే నినాదంతో గోండులను, కోయలను,
చెంచులను సంఘటితపరచి పోరుబాటలో నడిపించిన
విప్లవ వీరకిశోరం కుంరం భీం. ‘మా గూడెంలో
మా రాజ్యం’ అనే నినాదంతో గిరిజనులందరిని
ఏకంచేసి ప్రభుత్వంపై సమరం సాగించిన
పోరాటయోధుడు కుంరం భీం.
TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం 1

PAPER – I : వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన) (మార్కులు: 6)

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
బాల్యంలో కుంరం భీం, మనసుపై చెరగని ముద్రవేసిన సంఘటనను గూర్చి తెలపండి.
జవాబు:
కుంరం భీం ఒకసారి తన మిత్రులు జంగు, కొంతల్, మాదు, పైకులతో అడవికి వెళ్ళాడు. వారితో మేకపిల్లలు ఉన్నాయి. పైకు నారేపచెట్టు ఎక్కి, సన్న సన్న కొమ్మల్ని నరికి మేకలకు వేస్తున్నాడు. ఇంతలో జంగ్లాత్ జవాన్లు, ఒక సుంకరి వచ్చి చెట్టు కొమ్మలు నరుకుతున్న పైకును పట్టుకున్నారు. వారి వెంట అమీనాబ్ వచ్చి, పిల్లలందరినీ బంగ్లా దగ్గరికి తీసుకురమ్మని చెప్పాడు.

భీం తండ్రి, కుంరం చిన్ను, ఆ గూడెం పెద్ద. అమీనాబ్ పిల్లలు చెట్లు నరికినందుకు చిన్నును మందలించాడు. కొమ్మ నరికిన పిల్లవాడి వేళ్ళు నరకడమే తగిన శిక్ష అంటూ, ఎంత మంది బతిమాలినా వినకుండా భీం స్నేహితుడు పైకు వేళ్ళు నరికించాడు. పైకు అరుపులతో అడవి మారు మ్రోగింది. పైకు స్పృహతప్పి పడిపోయాడు.

ఈ సంఘటన భీంను పట్టి కుదిపింది. ఆవేశంలో వదినె దగ్గరకు వెళ్ళి “ఈ గాలి, నీరు, ఆకాశం మనవైనప్పుడు, ఈ భూమి, అడవి మనవి ఎందుకు కావు ? అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నను “మీ నాయినను అడుగు” అని వదినె భీంకు చెప్పింది.

పన్నుల రూపంలో తమ కష్టాన్ని అంతా గుంజుకుంటే ఆకలితో చచ్చిపోవాల్సిందేనా ? అని, ఆలోచిస్తూ, భీం ఆ రోజు ఆకలితో పడుకున్నాడు. ఈ సంఘటన భీం మనస్సుపై చెరగని ముద్రవేసింది. గిరిజనుల కష్టాన్ని ఇతరులు అన్యాయంగా తీసుకుపోతున్నారని భీం తెలుసుకున్నాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం

ప్రశ్న 2.
కుంఠం భీంపై, విటోబా ప్రభావం ఎటువంటిది ?
జవాబు:
సుర్దాపూర్ గొడవలో కుంరం భీం చేతిలో సిద్ధిక్ చచ్చిపోయాడు. భీం తన మిత్రుడు కొండల్తో కలిసి, ‘భారీలొద్ది’లో ఉన్న పెద్ద ముఖాసీని కలిసి, సర్కారుపై తాను తిరుగబడతాననీ, తనకు మద్దత్తు ఇమ్మనీ అడిగాడు. ముఖాసీ హింసా పద్ధతులు వద్దని సలహా చెప్పాడు.

దానితో భీం రైలెక్కి ఎలాగో చాందా పట్నానికి చేరాడు. రైల్వేస్టేషన్ బయట కూర్చున్న భీంకు, తన సామానులు మోయలేక బాధపడుతున్న ఒక ప్రయాణికుడు కనిపించాడు. ఆయనే విటోబా. భీం విటోబా సరకులను ఇంటికి చేర్చాడు. విటోబా ప్రింటింగ్ ప్రెస్సు యజమాని. నిజాం సర్కారుకూ, తెల్లదొరలకూ వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళతో విటోబాకు దగ్గర సంబంధాలున్నాయి. విటోబా రహస్యంగా ఒక పత్రికను నడిపేవాడు. రహస్య పార్టీ, రహస్య పత్రికల గురించి తెలుసుకున్న భీంకు, విటోబాపై మంచి అభిప్రాయం ఏర్పడింది. భీం, విటోబా దగ్గర ఒక సంవత్సరం ఉన్నాడు. అక్కడే

భీం తెలుగు, ఇంగ్లీషు, హిందీ చదవడం, రాయడం నేర్చుకున్నాడు. భీంకు విటోబా రాజకీయాల్నీ, సమాజ పరిణామాల్ని తెలియజేశాడు. సంఘంలో మార్పురావాలంటే త్యాగం చేయాలన్నాడు. ఒక రోజు రాత్రి పోలీసులు వచ్చి భీంను కొట్టి, విటోబాను అరెస్టు చేశారు. భీం తిరిగి రైల్వేస్టేషన్కు చేరాడు. అక్కడే భీంకు, మంచిర్యాల నుండి వచ్చిన ఒక తెలుగువాడితో పరిచయం అయ్యింది. వారిద్దరూ కలసి, ‘చాయ్పత్తా’ అని పిలువబడే అస్సాంకు వెళ్ళారు.

ప్రశ్న 3.
కుంరం భీంకు, అస్సాం తేయాకు తోటల్లో కలిగిన అనుభవాలను చెప్పండి.
జవాబు:
కుంరం భీం, అస్సాంలో తేయాకు తోటల్లో అడుగుపెట్టాడు. అక్కడ అనేక అనుభవాలతో ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు. ఎక్కడైనా కష్టజీవులకు బాధలు తప్పవనీ, కష్టపడే వానికి కడుపు నిండటం లేదనీ, భీం తెలుసుకున్నాడు. రోజు కూలీ పద్ధతిన, భీం తేయాకు తోటల్లో కష్టపడి పనిచేశాడు. అక్కడ చెమట తుడుచుకోడానికి లేచిన కార్మికులను, మేస్త్రీలు కొరడాలతో కొట్టేవారు. వారి సంపాదన వారి మందులకే సరిపోయేది కాదు. తోటల యజమానులకు కొంచెం కూడా దయాగుణం ఉండేది కాదు.

ఇవన్నీ చూస్తున్న భీంకు అసంతృప్తి రాజుకుంది. కుంరం భీం అస్సాంలో నాల్గు సంవత్సరాలున్నాడు. అక్కడే భీంకు మన్యం నుండి వచ్చిన ఒక తెలుగు వ్యక్తితో పరిచయం అయ్యింది. అతడి ద్వారా భీం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును గూర్చి తెలుసుకున్నాడు. మన్య ప్రాంత ప్రజల్ని సీతారామరాజు సమీకరించిన విధానాన్నీ, రామరాజు జరిపిన పోరాట రీతుల్ని, భీం అర్థం చేసుకున్నాడు. యువకులకు యుద్ధరీతులను రామరాజు ఎలా నేర్పాడో తెలుసుకున్నాడు.

అడవిపై తమకు తప్ప ఇతరులు ఎవరికీ అధికారం లేదని గిరిజనులతో చెప్పించిన రామరాజు యొక్క గొప్పతనాన్ని భీం అర్థం చేసుకున్నాడు. యుద్ధ సమయంలో సమాచారాన్ని చేరవేసే పద్ధతిని భీం గ్రహించాడు. యుద్ధ మెళుకువలను భీం గ్రహించాడు. క్రమంగా భీం ఎక్కుపెట్టిన బాణంలా తయారయ్యాడు.

ఈ సమయంలో తేయాకు తోటల్లో అన్యాయంగా ఇద్దరు కార్మికుల్ని కొడుతున్న మేస్త్రీతో, భీం తగవుపెట్టుకున్నాడు. మేస్త్రీలు కొరడా. భీం పైకి ఎత్తారు. భీం వారిని చితక కొట్టాడు. తోటల యజమాని పోలీసులతో చెప్పి భీంను జైల్లో వేయించాడు. ‘భీం’ జైలు నుండి తప్పించుకొని స్వగ్రామం వెళ్ళాడు.

ప్రశ్న 4.
కుంరం భీం, సర్కార్ (నిజాం) సైన్యంతో యుద్ధం చేసి అమరుడైన విధము తెలపండి.
(లేదా)
కుంరం భీం నాయకత్వంలో గోండు రాజ్య స్థాపనానికి గోండులు చేసిన యుద్ధ పరిణామాల్ని తెలుపండి.
జవాబు:
కుంరం భీం పినతండ్రి “కుర్దు” నాయకత్వంలో, బాబేఝరి ప్రాంతంలో గిరిజనులూ, గోండులూ అడవిని కొట్టి, వ్యవసాయం చేశారు. అది తెలిసి జంగ్లాత్ వాళ్ళు దాడిచేసి గిరిజన గూడేలను ధ్వంసం చేశారు. కుంరం భీం, బాబేఝరి వైపు వచ్చి “టొయికన్” గూడెంలో దిగాడు. భీం భార్య పైకూబాయి వకీలును పెట్టుకోమని భీంకి సలహా చెప్పింది. భీం వకీలును కలిశాడు. వకీలు నిజాంకు అసలు విషయం చెప్పమనీ, నిజాం అతడి ఇష్టం వచ్చినట్లు చేస్తాడనీ చెప్పాడు.

‘భీం’ పన్నెండు గూడేల ప్రజలను పట్నాపూర్ రమ్మని పిలిచాడు. గిరిజనులను భూములను దున్నండని, పంటలు పండించండని నిజాం మనుష్యులను తరిమికొడదామనీ చెప్పాడు. గిరిజనులు కూడా తాము ఆకలితో చావడం కన్న, పోరాటం చేసి చద్దాం అన్నారు. గోండులు భీం నాయకత్వాన్ని సమర్థించారు.

గోండులు అడవిని నరికి, పంటలు పండించారు. జంగ్లాత్ వాళ్ళు ‘బాబేఝరి’పై విరుచుకుపడ్డారు. ఒక జాగీర్దార్ తుపాకీపేల్చాడు. భీంకు అది భుజంపై తగిలింది. తాశీల్దార్ గోండులను అరెస్టు చెయ్యమని డి.ఎస్.పి. కి చెప్పాడు. కుంరం భీం, నిజాంను కలవాలని ప్రయత్నించాడు. కాని అతడికి నిజాం దర్శనం కాలేదు.

భీం, జోడెన్ ఘాట్ వెళ్ళి, గిరిజనుల్ని కలిసి, పరిస్థితుల్ని వారికి చెప్పాడు. “భూమి లేక చచ్చే కంటే, పోరాడి చద్దాం”. అన్నారు గిరిజనులు. గోండు రాజ్యస్థాపన లక్ష్యంగా, జోడెన్ ఘాట్ కేంద్రంగా, భీం నాయకత్వంలో నిజాంపై పోరాటానికి, గోండులు సిద్దమయ్యారు.

నిజాం సర్కారు ఆజ్ఞలను గోండులు వినలేదు. భీం నాయకత్వాన్ని ఇష్టపడ్డ ఇతర గ్రామాలవారు కూడా; గోండు రాజ్యస్థాపనకు భీంకు మద్దతిచ్చారు. తుపాకులు తయారయ్యాయి. గోండులు కుంరం భీంకు జై అన్నారు. నైజాం సైన్యాన్ని భీం బలగం, తరిమి కొట్టింది.

నైజాం సర్కారు సబ్కలెక్టర్, భీంను కలిసి, భీం కూ, అతని బంధువులకూ భూమి పట్టాలిస్తామన్నాడు. పోరు ఆపమని కోరాడు. చివరకు పన్నెండు గ్రామాల వారికీ పట్టాలిస్తానన్నా, భీం అంగీకరించలేదు. వేరుగా గోండు రాజ్యం కావాలన్నాడు. యుద్ధం ఏడు నెలలు సాగింది. నిజాం సైన్యం 10 రోజులు యుద్ధం చేసినా, కొండ ఎక్కలేకపోయింది. ఇంతలో కర్దూపటేల్ భీంను మోసం చేశాడు. సర్కారు సేనతో కలిసి, కొండ మీదికి దారి చూపాడు. నైజాం సైన్యం దొంగతనంగా వచ్చి, గోండు వీరుల్ని చంపింది. కుంరం భీంను కాల్చి చంపింది. ఈ విధంగా కుంరం భీం అమరుడయ్యాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం

ప్రశ్న 5.
గోండు నాయకుడు కుంరం భీంను గూర్చి రాయండి.
జవాబు:
ఆదిలాబాదు జిల్లా అడవుల్లోని యుద్ధ వీరులు గోండులు. వారిలో కుంరం భీం ప్రసిద్ధుడు. గూడెం పెద్ద చిన్ను కుమారుడు భీం. భీంకు సోము, బొజ్జు అనే అన్నలు ఉన్నారు. భీం చిన్నప్పుడు సంకెనపెల్లి గూడెంలో పెరిగాడు. భీం చిన్ననాటి నుండి సాహసుడు. నాయకలక్షణాలు కలవాడు. ఇతడి ఆలోచనలకు బలాన్ని ఇచ్చింది ఇతని వదినె కుకూబాయి.
ఒకసారి భీం మిత్రులతో అడవికి వెళ్ళాడు. చెట్టు కొమ్మలను నరికి మేకలకు వేశాడని, అమీనాబ్ ఇతని స్నేహితుడు పైకు వేళ్ళను నరికించాడు. ఆ సంఘటన భీం మనసుపై చెరగని ముద్రవేసింది. అక్కడి గాలి, ఆకాశం, నీరు తమదైనపుడు అక్కడ అడవి, భూమి తమవి ఎందుకు కావనీ, భీం వదినెను అడిగాడు.

భీం కుటుంబంతో సుర్దాపూర్ వెళ్ళి, అక్కడ అడవులు కొట్టి వ్యవసాయం చేశాడు. అక్కడ భూమి తనదన్న సిద్ధికు భీం కొట్టి చంపాడు. జంగ్లాతోళ్ళతో పోరు మంచిది కాదని, పెద్ద ముఖాసీ భీంకు సలహా చెప్పాడు. భీంకు చాందాలో విటోబాతో పరిచయం అయ్యింది. అక్కడ భీం తెలుగు, హిందీ, ఇంగ్లీషు చదవడం రాయడం నేర్చుకున్నాడు. విటోబా, నిజాంకు వ్యతిరేకంగా పత్రిక నడిపేవాడు. భీంకు రాజకీయాలను విటోబాయే తెలిపాడు.

భీం, అస్సాం తేయాకు తోటల్లో కూలీగా పనిచేశాడు. అక్కడే అల్లూరి సీతారామరాజు గిరిజనుల పక్షాన చేస్తున్న పోరాటం గురించి, యుద్ధరీతుల గురించి భీం తెలుసుకున్నాడు. తర్వాత “కాకన్ ఘాట్”లో అతడు అన్నలను కలిశాడు. దేవడం పెద్ద లచ్చుపటేల్, భీంకు సోంబాయితో పెళ్ళి చేయించాడు. పైకూబాయి కూడా భీం పట్ల ఆకర్షణతో అతణ్ణి పెళ్ళాడింది.

“బాబేఝరి” వద్ద భీం కుటుంబీకులు అడవిని కొట్టి వ్యవసాయం చేశారు. జంగ్లాత్ వాళ్ళు మన్నెంగూడేలను భస్మం చేశారు. భీం జనగామలో వకీలును కలిశాడు. భీం పన్నెండు గూడేల గిరిజనులను, పట్నాపూర్ పిలిచాడు. అక్కడ గిరిజనులు నైజాంతో పోరాటం చేసి చద్దామని నిశ్చయించారు. బాబేఝురి ప్రాంతంలో గిరిజనులు సర్కారు ఆజ్ఞలను లెక్కచేయలేదు. విషయం నైజాంకు చెప్పడానికి భీం ప్రయత్నించాడు. ఏడు నెలలు గిరిజనులకూ, నైజాం సైన్యానికి పోరాటం జరిగింది. ఒక గ్రామం పెద్ద కుట్రతో, నైజాం సైన్యం దొంగతనంగా వచ్చి గోండు వీరుల్నీ, భీంనూ కాల్చి చంపింది.

PAPER – II : పరిచిత గద్యాలు (మార్కులు : 5)

అ) కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

కుంరం భీం బాల్యం నుండి తెలివైనవాడు, సాహసవంతుడు, నాయకత్వ లక్షణాలున్నవాడు. భీం చిన్నప్పటి నుంచి ప్రతి విషయానికి స్పందించేవాడు. ఆలోచించేవాడు. దేన్నీ ఊరికే వదిలిపెట్టేవాడు కాదు. ఈ లక్షణాలే తరువాత అతడిని గిరిజన వీరుడిని చేశాయి. అతని ఆలోచనలకు పురుడు పోసింది, అతని భావాలకు బలాన్ని ఇచ్చింది అతని వదినె కుకూబాయి. భీం చిన్నప్పుడు సంకెనపెల్లి గూడెంలో పెరిగాడు. అక్కడి చెట్టూ, చేమా, బోళ్ళు, బండలు, కొండలు, వాగులు ఒకటేమిటి సమస్త ప్రకృతి అతడిని తీర్చిదిద్దింది. ఆ రోజుల్లోనే ఒక రోజు భీం తన మిత్రులైన జంగు, కొంతల్, మాదు, పైకులతో కలిసి అడవికి వచ్చాడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
కుంరం భీం భావాలకు బలాన్ని ఇచ్చిన వారెవరు ?
జవాబు:
కుంరం భీం భావాలకు బలాన్ని ఇచ్చింది అతని వదినె ‘కుకూబాయి’.

ప్రశ్న 2.
కుంరం భీంను తీర్చిదిద్దినవారు ఎవరు ?
జవాబు:
కుంరం భీంను సంకెనపెల్లి గూడెంలోని చెట్లూ, చేమా, కొండలూ వంటి సమస్త ప్రకృతి తీర్చిదిద్దాయి.

ప్రశ్న 3.
కుంరం భీం మిత్రుల పేర్లు ఏమిటి ?
జవాబు:
కుంరం భీం మిత్రులు

  1. జంగు,
  2. కొంతల్,
  3. మాదు,
  4. పైకు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం

ప్రశ్న 4.
కుంరం భీం వ్యక్తిత్వం ఎటువంటిది ?
జవాబు:
కుంరం భీం, బాల్యం నుండి తెలివిగలవాడు. నాయకత్వ లక్షణాలు గలవాడు. సాహసవంతుడు.

ప్రశ్న 5.
కుంరం భీం ఆలోచనలకు పురుడు పోసిన వదినె పేరు ఏమిటి ?
జవాబు:
కుంరం భీం ఆలోచనలకు పురుడు పోసిన వదినె పేరు “కుకూబాయి”.

ఆ) కింది పేరాను చదవండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

దేవడం పెద్ద లచ్చుపటేల్. అతని దగ్గర భీం జీతానికి కుదిరాడు: అతని పంట పొలాల్లో మార్పు తెచ్చాడు. పత్తి, మిరప వంటి వ్యాపార పంటలను వేశాడు. మొత్తానికి భీం తెలివిపరుడని, వ్యవహారదక్షుడని అందరితో అనిపించుకున్నాడు. లచ్చుపటేల్ భూముల వ్యవహారాలను ముందు నుంచి చూసే అంబటిరావుకు, “సోంబాయి” అనే కూతురు ఉంది. ఆమెను భీంకిచ్చి పెండ్లి చేస్తే బాగుంటుందని లచ్చుపటేల్ నిశ్చయించాడు.

ఆ విధంగా కుంరం భీం, సోంబాయిల పెండ్లి దేవడంలో లచ్చుపటేల్ ఆధ్వర్యంలో జరిగింది. ఆ రోజుల్లో కుంరం భీం వార్తల్లో వ్యక్తి అయినాడు. అతని పట్ల ఆకర్షణ పెంచుకున్న పైకూబాయి, అనే యువతి కోరి అతన్ని పెండ్లాడింది. భీం కాకన్ట్లో కాపురం పెట్టాడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
కుంరం భీం పెండ్లి ఎక్కడ, ఎవరి ఆధ్వర్యంలో జరిగింది ?
జవాబు:
కుంరం భీం పెండ్లి దేవడంలో లచ్చుపటేల్ ఆధ్వర్యంలో జరిగింది.

ప్రశ్న 2.
కుంరం భీం ఎవరి దగ్గర పనిచేశాడు? ఆయన ఎవరు ?
జవాబు:
కుంరం భీం, లచ్చుపటేల్ దగ్గర జీతానికి కుదిరాడు. లచ్చుపటేల్ “దేవడం” గ్రామపెద్ద.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం

ప్రశ్న 3.
పెండ్లి అయిన తర్వాత భీం, ఎక్కడ మకాం పెట్టాడు ?
జవాబు:
పెండ్లి అయిన తర్వాత భీం “కాకనాట్”లో కాపురం పెట్టాడు.

ప్రశ్న 4.
భీం తెలివిపరుడని, వ్యవహారదక్షుడని ఎందుకు పేరు తెచ్చుకున్నాడు ?
జవాబు:
భీం, లచ్చుపటేల్ దగ్గర జీతానికి కుదిరి, ఆయన పంట పొలాల్లో పత్తి, మిరపలాంటి వ్యాపార పంటలు వేశాడు. `ఆ విధంగా తెలివిపరుడని భీం పేరు తెచ్చుకున్నాడు.

ప్రశ్న 5.
అంబటి రావు ఎవరు ?
జవాబు:
అంబటి రావు, లచ్చుపటేల్ భూముల వ్యవహారాలను చూసేవాడు. అంబటిరావు కూతురు సోం బాయిని భీం పెండ్లాడాడు.

Leave a Comment