TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం

Telangana SCERT 9th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం 1st Lesson కుంరం భీం Questions and Answers.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం

‘జల్, జంగల్, జమీన్ (నీరు అడవి భూమి)
మనది…… అనే నినాదంతో గోండులను, కోయలను,
చెంచులను సంఘటితపరచి పోరుబాటలో నడిపించిన
విప్లవ వీరకిశోరం కుంరం భీం. ‘మా గూడెంలో
మా రాజ్యం’ అనే నినాదంతో గిరిజనులందరిని
ఏకంచేసి ప్రభుత్వంపై సమరం సాగించిన
పోరాటయోధుడు కుంరం భీం.
TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం 1

PAPER – I : వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన) (మార్కులు: 6)

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
బాల్యంలో కుంరం భీం, మనసుపై చెరగని ముద్రవేసిన సంఘటనను గూర్చి తెలపండి.
జవాబు:
కుంరం భీం ఒకసారి తన మిత్రులు జంగు, కొంతల్, మాదు, పైకులతో అడవికి వెళ్ళాడు. వారితో మేకపిల్లలు ఉన్నాయి. పైకు నారేపచెట్టు ఎక్కి, సన్న సన్న కొమ్మల్ని నరికి మేకలకు వేస్తున్నాడు. ఇంతలో జంగ్లాత్ జవాన్లు, ఒక సుంకరి వచ్చి చెట్టు కొమ్మలు నరుకుతున్న పైకును పట్టుకున్నారు. వారి వెంట అమీనాబ్ వచ్చి, పిల్లలందరినీ బంగ్లా దగ్గరికి తీసుకురమ్మని చెప్పాడు.

భీం తండ్రి, కుంరం చిన్ను, ఆ గూడెం పెద్ద. అమీనాబ్ పిల్లలు చెట్లు నరికినందుకు చిన్నును మందలించాడు. కొమ్మ నరికిన పిల్లవాడి వేళ్ళు నరకడమే తగిన శిక్ష అంటూ, ఎంత మంది బతిమాలినా వినకుండా భీం స్నేహితుడు పైకు వేళ్ళు నరికించాడు. పైకు అరుపులతో అడవి మారు మ్రోగింది. పైకు స్పృహతప్పి పడిపోయాడు.

ఈ సంఘటన భీంను పట్టి కుదిపింది. ఆవేశంలో వదినె దగ్గరకు వెళ్ళి “ఈ గాలి, నీరు, ఆకాశం మనవైనప్పుడు, ఈ భూమి, అడవి మనవి ఎందుకు కావు ? అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నను “మీ నాయినను అడుగు” అని వదినె భీంకు చెప్పింది.

పన్నుల రూపంలో తమ కష్టాన్ని అంతా గుంజుకుంటే ఆకలితో చచ్చిపోవాల్సిందేనా ? అని, ఆలోచిస్తూ, భీం ఆ రోజు ఆకలితో పడుకున్నాడు. ఈ సంఘటన భీం మనస్సుపై చెరగని ముద్రవేసింది. గిరిజనుల కష్టాన్ని ఇతరులు అన్యాయంగా తీసుకుపోతున్నారని భీం తెలుసుకున్నాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం

ప్రశ్న 2.
కుంఠం భీంపై, విటోబా ప్రభావం ఎటువంటిది ?
జవాబు:
సుర్దాపూర్ గొడవలో కుంరం భీం చేతిలో సిద్ధిక్ చచ్చిపోయాడు. భీం తన మిత్రుడు కొండల్తో కలిసి, ‘భారీలొద్ది’లో ఉన్న పెద్ద ముఖాసీని కలిసి, సర్కారుపై తాను తిరుగబడతాననీ, తనకు మద్దత్తు ఇమ్మనీ అడిగాడు. ముఖాసీ హింసా పద్ధతులు వద్దని సలహా చెప్పాడు.

దానితో భీం రైలెక్కి ఎలాగో చాందా పట్నానికి చేరాడు. రైల్వేస్టేషన్ బయట కూర్చున్న భీంకు, తన సామానులు మోయలేక బాధపడుతున్న ఒక ప్రయాణికుడు కనిపించాడు. ఆయనే విటోబా. భీం విటోబా సరకులను ఇంటికి చేర్చాడు. విటోబా ప్రింటింగ్ ప్రెస్సు యజమాని. నిజాం సర్కారుకూ, తెల్లదొరలకూ వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళతో విటోబాకు దగ్గర సంబంధాలున్నాయి. విటోబా రహస్యంగా ఒక పత్రికను నడిపేవాడు. రహస్య పార్టీ, రహస్య పత్రికల గురించి తెలుసుకున్న భీంకు, విటోబాపై మంచి అభిప్రాయం ఏర్పడింది. భీం, విటోబా దగ్గర ఒక సంవత్సరం ఉన్నాడు. అక్కడే

భీం తెలుగు, ఇంగ్లీషు, హిందీ చదవడం, రాయడం నేర్చుకున్నాడు. భీంకు విటోబా రాజకీయాల్నీ, సమాజ పరిణామాల్ని తెలియజేశాడు. సంఘంలో మార్పురావాలంటే త్యాగం చేయాలన్నాడు. ఒక రోజు రాత్రి పోలీసులు వచ్చి భీంను కొట్టి, విటోబాను అరెస్టు చేశారు. భీం తిరిగి రైల్వేస్టేషన్కు చేరాడు. అక్కడే భీంకు, మంచిర్యాల నుండి వచ్చిన ఒక తెలుగువాడితో పరిచయం అయ్యింది. వారిద్దరూ కలసి, ‘చాయ్పత్తా’ అని పిలువబడే అస్సాంకు వెళ్ళారు.

ప్రశ్న 3.
కుంరం భీంకు, అస్సాం తేయాకు తోటల్లో కలిగిన అనుభవాలను చెప్పండి.
జవాబు:
కుంరం భీం, అస్సాంలో తేయాకు తోటల్లో అడుగుపెట్టాడు. అక్కడ అనేక అనుభవాలతో ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు. ఎక్కడైనా కష్టజీవులకు బాధలు తప్పవనీ, కష్టపడే వానికి కడుపు నిండటం లేదనీ, భీం తెలుసుకున్నాడు. రోజు కూలీ పద్ధతిన, భీం తేయాకు తోటల్లో కష్టపడి పనిచేశాడు. అక్కడ చెమట తుడుచుకోడానికి లేచిన కార్మికులను, మేస్త్రీలు కొరడాలతో కొట్టేవారు. వారి సంపాదన వారి మందులకే సరిపోయేది కాదు. తోటల యజమానులకు కొంచెం కూడా దయాగుణం ఉండేది కాదు.

ఇవన్నీ చూస్తున్న భీంకు అసంతృప్తి రాజుకుంది. కుంరం భీం అస్సాంలో నాల్గు సంవత్సరాలున్నాడు. అక్కడే భీంకు మన్యం నుండి వచ్చిన ఒక తెలుగు వ్యక్తితో పరిచయం అయ్యింది. అతడి ద్వారా భీం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును గూర్చి తెలుసుకున్నాడు. మన్య ప్రాంత ప్రజల్ని సీతారామరాజు సమీకరించిన విధానాన్నీ, రామరాజు జరిపిన పోరాట రీతుల్ని, భీం అర్థం చేసుకున్నాడు. యువకులకు యుద్ధరీతులను రామరాజు ఎలా నేర్పాడో తెలుసుకున్నాడు.

అడవిపై తమకు తప్ప ఇతరులు ఎవరికీ అధికారం లేదని గిరిజనులతో చెప్పించిన రామరాజు యొక్క గొప్పతనాన్ని భీం అర్థం చేసుకున్నాడు. యుద్ధ సమయంలో సమాచారాన్ని చేరవేసే పద్ధతిని భీం గ్రహించాడు. యుద్ధ మెళుకువలను భీం గ్రహించాడు. క్రమంగా భీం ఎక్కుపెట్టిన బాణంలా తయారయ్యాడు.

ఈ సమయంలో తేయాకు తోటల్లో అన్యాయంగా ఇద్దరు కార్మికుల్ని కొడుతున్న మేస్త్రీతో, భీం తగవుపెట్టుకున్నాడు. మేస్త్రీలు కొరడా. భీం పైకి ఎత్తారు. భీం వారిని చితక కొట్టాడు. తోటల యజమాని పోలీసులతో చెప్పి భీంను జైల్లో వేయించాడు. ‘భీం’ జైలు నుండి తప్పించుకొని స్వగ్రామం వెళ్ళాడు.

ప్రశ్న 4.
కుంరం భీం, సర్కార్ (నిజాం) సైన్యంతో యుద్ధం చేసి అమరుడైన విధము తెలపండి.
(లేదా)
కుంరం భీం నాయకత్వంలో గోండు రాజ్య స్థాపనానికి గోండులు చేసిన యుద్ధ పరిణామాల్ని తెలుపండి.
జవాబు:
కుంరం భీం పినతండ్రి “కుర్దు” నాయకత్వంలో, బాబేఝరి ప్రాంతంలో గిరిజనులూ, గోండులూ అడవిని కొట్టి, వ్యవసాయం చేశారు. అది తెలిసి జంగ్లాత్ వాళ్ళు దాడిచేసి గిరిజన గూడేలను ధ్వంసం చేశారు. కుంరం భీం, బాబేఝరి వైపు వచ్చి “టొయికన్” గూడెంలో దిగాడు. భీం భార్య పైకూబాయి వకీలును పెట్టుకోమని భీంకి సలహా చెప్పింది. భీం వకీలును కలిశాడు. వకీలు నిజాంకు అసలు విషయం చెప్పమనీ, నిజాం అతడి ఇష్టం వచ్చినట్లు చేస్తాడనీ చెప్పాడు.

‘భీం’ పన్నెండు గూడేల ప్రజలను పట్నాపూర్ రమ్మని పిలిచాడు. గిరిజనులను భూములను దున్నండని, పంటలు పండించండని నిజాం మనుష్యులను తరిమికొడదామనీ చెప్పాడు. గిరిజనులు కూడా తాము ఆకలితో చావడం కన్న, పోరాటం చేసి చద్దాం అన్నారు. గోండులు భీం నాయకత్వాన్ని సమర్థించారు.

గోండులు అడవిని నరికి, పంటలు పండించారు. జంగ్లాత్ వాళ్ళు ‘బాబేఝరి’పై విరుచుకుపడ్డారు. ఒక జాగీర్దార్ తుపాకీపేల్చాడు. భీంకు అది భుజంపై తగిలింది. తాశీల్దార్ గోండులను అరెస్టు చెయ్యమని డి.ఎస్.పి. కి చెప్పాడు. కుంరం భీం, నిజాంను కలవాలని ప్రయత్నించాడు. కాని అతడికి నిజాం దర్శనం కాలేదు.

భీం, జోడెన్ ఘాట్ వెళ్ళి, గిరిజనుల్ని కలిసి, పరిస్థితుల్ని వారికి చెప్పాడు. “భూమి లేక చచ్చే కంటే, పోరాడి చద్దాం”. అన్నారు గిరిజనులు. గోండు రాజ్యస్థాపన లక్ష్యంగా, జోడెన్ ఘాట్ కేంద్రంగా, భీం నాయకత్వంలో నిజాంపై పోరాటానికి, గోండులు సిద్దమయ్యారు.

నిజాం సర్కారు ఆజ్ఞలను గోండులు వినలేదు. భీం నాయకత్వాన్ని ఇష్టపడ్డ ఇతర గ్రామాలవారు కూడా; గోండు రాజ్యస్థాపనకు భీంకు మద్దతిచ్చారు. తుపాకులు తయారయ్యాయి. గోండులు కుంరం భీంకు జై అన్నారు. నైజాం సైన్యాన్ని భీం బలగం, తరిమి కొట్టింది.

నైజాం సర్కారు సబ్కలెక్టర్, భీంను కలిసి, భీం కూ, అతని బంధువులకూ భూమి పట్టాలిస్తామన్నాడు. పోరు ఆపమని కోరాడు. చివరకు పన్నెండు గ్రామాల వారికీ పట్టాలిస్తానన్నా, భీం అంగీకరించలేదు. వేరుగా గోండు రాజ్యం కావాలన్నాడు. యుద్ధం ఏడు నెలలు సాగింది. నిజాం సైన్యం 10 రోజులు యుద్ధం చేసినా, కొండ ఎక్కలేకపోయింది. ఇంతలో కర్దూపటేల్ భీంను మోసం చేశాడు. సర్కారు సేనతో కలిసి, కొండ మీదికి దారి చూపాడు. నైజాం సైన్యం దొంగతనంగా వచ్చి, గోండు వీరుల్ని చంపింది. కుంరం భీంను కాల్చి చంపింది. ఈ విధంగా కుంరం భీం అమరుడయ్యాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం

ప్రశ్న 5.
గోండు నాయకుడు కుంరం భీంను గూర్చి రాయండి.
జవాబు:
ఆదిలాబాదు జిల్లా అడవుల్లోని యుద్ధ వీరులు గోండులు. వారిలో కుంరం భీం ప్రసిద్ధుడు. గూడెం పెద్ద చిన్ను కుమారుడు భీం. భీంకు సోము, బొజ్జు అనే అన్నలు ఉన్నారు. భీం చిన్నప్పుడు సంకెనపెల్లి గూడెంలో పెరిగాడు. భీం చిన్ననాటి నుండి సాహసుడు. నాయకలక్షణాలు కలవాడు. ఇతడి ఆలోచనలకు బలాన్ని ఇచ్చింది ఇతని వదినె కుకూబాయి.
ఒకసారి భీం మిత్రులతో అడవికి వెళ్ళాడు. చెట్టు కొమ్మలను నరికి మేకలకు వేశాడని, అమీనాబ్ ఇతని స్నేహితుడు పైకు వేళ్ళను నరికించాడు. ఆ సంఘటన భీం మనసుపై చెరగని ముద్రవేసింది. అక్కడి గాలి, ఆకాశం, నీరు తమదైనపుడు అక్కడ అడవి, భూమి తమవి ఎందుకు కావనీ, భీం వదినెను అడిగాడు.

భీం కుటుంబంతో సుర్దాపూర్ వెళ్ళి, అక్కడ అడవులు కొట్టి వ్యవసాయం చేశాడు. అక్కడ భూమి తనదన్న సిద్ధికు భీం కొట్టి చంపాడు. జంగ్లాతోళ్ళతో పోరు మంచిది కాదని, పెద్ద ముఖాసీ భీంకు సలహా చెప్పాడు. భీంకు చాందాలో విటోబాతో పరిచయం అయ్యింది. అక్కడ భీం తెలుగు, హిందీ, ఇంగ్లీషు చదవడం రాయడం నేర్చుకున్నాడు. విటోబా, నిజాంకు వ్యతిరేకంగా పత్రిక నడిపేవాడు. భీంకు రాజకీయాలను విటోబాయే తెలిపాడు.

భీం, అస్సాం తేయాకు తోటల్లో కూలీగా పనిచేశాడు. అక్కడే అల్లూరి సీతారామరాజు గిరిజనుల పక్షాన చేస్తున్న పోరాటం గురించి, యుద్ధరీతుల గురించి భీం తెలుసుకున్నాడు. తర్వాత “కాకన్ ఘాట్”లో అతడు అన్నలను కలిశాడు. దేవడం పెద్ద లచ్చుపటేల్, భీంకు సోంబాయితో పెళ్ళి చేయించాడు. పైకూబాయి కూడా భీం పట్ల ఆకర్షణతో అతణ్ణి పెళ్ళాడింది.

“బాబేఝరి” వద్ద భీం కుటుంబీకులు అడవిని కొట్టి వ్యవసాయం చేశారు. జంగ్లాత్ వాళ్ళు మన్నెంగూడేలను భస్మం చేశారు. భీం జనగామలో వకీలును కలిశాడు. భీం పన్నెండు గూడేల గిరిజనులను, పట్నాపూర్ పిలిచాడు. అక్కడ గిరిజనులు నైజాంతో పోరాటం చేసి చద్దామని నిశ్చయించారు. బాబేఝురి ప్రాంతంలో గిరిజనులు సర్కారు ఆజ్ఞలను లెక్కచేయలేదు. విషయం నైజాంకు చెప్పడానికి భీం ప్రయత్నించాడు. ఏడు నెలలు గిరిజనులకూ, నైజాం సైన్యానికి పోరాటం జరిగింది. ఒక గ్రామం పెద్ద కుట్రతో, నైజాం సైన్యం దొంగతనంగా వచ్చి గోండు వీరుల్నీ, భీంనూ కాల్చి చంపింది.

PAPER – II : పరిచిత గద్యాలు (మార్కులు : 5)

అ) కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

కుంరం భీం బాల్యం నుండి తెలివైనవాడు, సాహసవంతుడు, నాయకత్వ లక్షణాలున్నవాడు. భీం చిన్నప్పటి నుంచి ప్రతి విషయానికి స్పందించేవాడు. ఆలోచించేవాడు. దేన్నీ ఊరికే వదిలిపెట్టేవాడు కాదు. ఈ లక్షణాలే తరువాత అతడిని గిరిజన వీరుడిని చేశాయి. అతని ఆలోచనలకు పురుడు పోసింది, అతని భావాలకు బలాన్ని ఇచ్చింది అతని వదినె కుకూబాయి. భీం చిన్నప్పుడు సంకెనపెల్లి గూడెంలో పెరిగాడు. అక్కడి చెట్టూ, చేమా, బోళ్ళు, బండలు, కొండలు, వాగులు ఒకటేమిటి సమస్త ప్రకృతి అతడిని తీర్చిదిద్దింది. ఆ రోజుల్లోనే ఒక రోజు భీం తన మిత్రులైన జంగు, కొంతల్, మాదు, పైకులతో కలిసి అడవికి వచ్చాడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
కుంరం భీం భావాలకు బలాన్ని ఇచ్చిన వారెవరు ?
జవాబు:
కుంరం భీం భావాలకు బలాన్ని ఇచ్చింది అతని వదినె ‘కుకూబాయి’.

ప్రశ్న 2.
కుంరం భీంను తీర్చిదిద్దినవారు ఎవరు ?
జవాబు:
కుంరం భీంను సంకెనపెల్లి గూడెంలోని చెట్లూ, చేమా, కొండలూ వంటి సమస్త ప్రకృతి తీర్చిదిద్దాయి.

ప్రశ్న 3.
కుంరం భీం మిత్రుల పేర్లు ఏమిటి ?
జవాబు:
కుంరం భీం మిత్రులు

  1. జంగు,
  2. కొంతల్,
  3. మాదు,
  4. పైకు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం

ప్రశ్న 4.
కుంరం భీం వ్యక్తిత్వం ఎటువంటిది ?
జవాబు:
కుంరం భీం, బాల్యం నుండి తెలివిగలవాడు. నాయకత్వ లక్షణాలు గలవాడు. సాహసవంతుడు.

ప్రశ్న 5.
కుంరం భీం ఆలోచనలకు పురుడు పోసిన వదినె పేరు ఏమిటి ?
జవాబు:
కుంరం భీం ఆలోచనలకు పురుడు పోసిన వదినె పేరు “కుకూబాయి”.

ఆ) కింది పేరాను చదవండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

దేవడం పెద్ద లచ్చుపటేల్. అతని దగ్గర భీం జీతానికి కుదిరాడు: అతని పంట పొలాల్లో మార్పు తెచ్చాడు. పత్తి, మిరప వంటి వ్యాపార పంటలను వేశాడు. మొత్తానికి భీం తెలివిపరుడని, వ్యవహారదక్షుడని అందరితో అనిపించుకున్నాడు. లచ్చుపటేల్ భూముల వ్యవహారాలను ముందు నుంచి చూసే అంబటిరావుకు, “సోంబాయి” అనే కూతురు ఉంది. ఆమెను భీంకిచ్చి పెండ్లి చేస్తే బాగుంటుందని లచ్చుపటేల్ నిశ్చయించాడు.

ఆ విధంగా కుంరం భీం, సోంబాయిల పెండ్లి దేవడంలో లచ్చుపటేల్ ఆధ్వర్యంలో జరిగింది. ఆ రోజుల్లో కుంరం భీం వార్తల్లో వ్యక్తి అయినాడు. అతని పట్ల ఆకర్షణ పెంచుకున్న పైకూబాయి, అనే యువతి కోరి అతన్ని పెండ్లాడింది. భీం కాకన్ట్లో కాపురం పెట్టాడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
కుంరం భీం పెండ్లి ఎక్కడ, ఎవరి ఆధ్వర్యంలో జరిగింది ?
జవాబు:
కుంరం భీం పెండ్లి దేవడంలో లచ్చుపటేల్ ఆధ్వర్యంలో జరిగింది.

ప్రశ్న 2.
కుంరం భీం ఎవరి దగ్గర పనిచేశాడు? ఆయన ఎవరు ?
జవాబు:
కుంరం భీం, లచ్చుపటేల్ దగ్గర జీతానికి కుదిరాడు. లచ్చుపటేల్ “దేవడం” గ్రామపెద్ద.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం

ప్రశ్న 3.
పెండ్లి అయిన తర్వాత భీం, ఎక్కడ మకాం పెట్టాడు ?
జవాబు:
పెండ్లి అయిన తర్వాత భీం “కాకనాట్”లో కాపురం పెట్టాడు.

ప్రశ్న 4.
భీం తెలివిపరుడని, వ్యవహారదక్షుడని ఎందుకు పేరు తెచ్చుకున్నాడు ?
జవాబు:
భీం, లచ్చుపటేల్ దగ్గర జీతానికి కుదిరి, ఆయన పంట పొలాల్లో పత్తి, మిరపలాంటి వ్యాపార పంటలు వేశాడు. `ఆ విధంగా తెలివిపరుడని భీం పేరు తెచ్చుకున్నాడు.

ప్రశ్న 5.
అంబటి రావు ఎవరు ?
జవాబు:
అంబటి రావు, లచ్చుపటేల్ భూముల వ్యవహారాలను చూసేవాడు. అంబటిరావు కూతురు సోం బాయిని భీం పెండ్లాడాడు.

TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి

Telangana SCERT 9th Class Telugu Guide Telangana 6th Lesson దీక్షకు సిద్ధంకండి Textbook Questions and Answers.

TS 9th Class Telugu 6th Lesson Questions and Answers Telangana దీక్షకు సిద్ధంకండి

చదువండి – ఆలోచించి చెప్పండి (Textbook Page No. 60)

స్వచ్ఛతలో చరిద్దాం !! స్వచ్ఛతకై శ్రమిద్దాం !

స్వచ్ఛ భారత్కు సన్నద్ధం కండి !

ప్రియమైన విద్యార్థులారా ………….

దేశవ్యాప్తంగా ఇటీవల మనం స్వచ్ఛభారత్ పేరుతో ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టిన విషయం మీకు తెల్సిందే! ప్రజల బాధ్యతారాహిత్యం వల్ల దేశవ్యాప్తంగా పేరుకుపోతున్న అపరిశుభ్రతను అనతికాలంలోనే తొలగించాలన్నది ఒక దీక్షలాగ చేపట్టాం. నిరంతరం కొనసాగవలసిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు కూడా భాగస్వాములే ! మీ మీ పరిసరాల్లో పోగుపడ్డ చెత్తాచెదారాన్ని తొలగించుకుంటూ, వ్యక్తిగత శుభ్రతతో సామాజిక పరిశుభ్రతను గురించి పదిమందికి అవగాహన కల్పిస్తూ స్వచ్ఛభారత్ సాకారమయ్యే దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాం !

రానున్న రోజులలో భారతావని పరిశుభ్ర భారతంగా పరిఢవిల్లాలని కోరుకుందాం.

వైద్య, ఆరోగ్యశాఖ, రాష్ట్రం.
తెలంగాణ రాష్ట్రం

ప్రశ్నలు

ప్రశ్న 1.
ఇటువంటి పత్రాలు ఎక్కడైనా చూశారా ?
జవాబు:
ఇటువంటి పత్రాలను నేను చూశాను. వీటిని “కరపత్రాలు” అంటారు. వీటినే ఇంగ్లీషుభాషలో Pamphlet అంటారు. ఈ రోజుల్లో సమావేశాలకు రమ్మని పిలిచే ఆహ్వానాలకూ, ఆరోగ్యవర్ధకమైన ప్రభుత్వ ప్రచారాలకు, దైవసంబంధ కార్యక్రమాలకు ఈ కరపత్రాలను పంచుతున్నారు.

ప్రశ్న 2.
ఇట్లా పంచిపెట్టే పత్రాలను ఏమంటారు?
జవాబు:
ఇలా సమాచారాన్ని సంక్షిప్తంగా అందించేందుకు వినియోగించే పత్రాలను కరపత్రాలు అంటారు.

TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ప్రశ్న 3.
వీటిని ఎందుకు పంచిపెడుతారు?
జవాబు:
ఒక సమాచారాన్ని లేదా వివాదాస్పద అంశాన్ని ప్రజలందరికీ తెలియపరచడమే, కరపత్రం పంచడంలో గల ప్రధాన ఉద్దేశం. ఒక వ్యక్తిగాని, సంస్థగాని ప్రజలకు అందించాలనుకొనే సమాచారాన్ని వీలైనంత సంక్షిప్తంగా ముద్రిత రూపంలో అందించేందుకు ఈ కరపత్రాలను వినియోగిస్తారు.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
కరపత్రాలను ఎందుకు రూపొందిస్తారు ? మీరు చదివిన కరపత్రం గురించి మాట్లాడండి.
జవాబు:
ఒక వ్యక్తిగాని, సంస్థగాని ప్రజలకు అందించాలనుకొనే సమాచారాన్ని, వీలైనంత సంక్షిప్తంగా ముద్రిత రూపంలో అందించేందుకు కరపత్రాన్ని రూపొందిస్తారు. ఒక సమాచారాన్ని లేదా వివాదాస్పద విషయాన్ని ప్రజలందరికీ తెల్పడమే కరపత్రం యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సామాజిక ప్రయోజనాలు ఉన్న విషయాలను, సామాన్య ప్రజానీకానికి చేరవేయడానికి కరపత్రం, ఒక ముఖ్య సాధనంగా ఉంటుంది.

నేను చదివిన కరపత్రం : స్టేట్బ్యాంకు వారు ఇంటి అప్పులు తక్కువ వడ్డీకి, ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా ఇస్తారన్న కరపత్రాన్ని నేను చదివాను.

  1. ఇంటి అప్పుకు దరఖాస్తు చేసే వ్యక్తి పేర ఇంటిస్థలం ఉండాలి.
  2. ఇల్లు నిర్మాణానికి స్థానిక పంచాయితీ / మునిసిపల్ కార్పొరేషన్ వారి అనుమతి పత్రం ఉండాలి.
  3. నిర్మాణ ఖర్చులో 1/4 వంతు పెట్టుబడిగా పెట్టగలిగిన స్థోమత దరఖాస్తుదారుకు ఉండాలి.
  4. హామీదారు అవసరం లేదు.
  5. అప్పు వడ్డీతో సహా 15 సంవత్సరాలలో తీర్చగలగాలి.
  6. జీతం నుండి రికవరీ చేసి, బ్యాంకుకు కడతామన్న పై అధికారి, హామీపత్రం ఉండాలి.
  7. సంవత్సరానికి 8% వడ్డీకే ఋణం మంజూరు.
  8. ఋణం ముందుగా చెల్లిస్తే, వడ్డీలో కన్సెషన్లు ఇవ్వబడతాయి.

ప్రశ్న 2.
ప్రజా ఉద్యమాలను శాంతియుతంగానే నిర్వహించవలసిన అవసరం ఏమిటి? చర్చించండి.
జవాబు:
ప్రజా ఉద్యమాలను శాంతియుతంగానే నిర్వహించాలి. హింసా పద్ధతులతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రజల నిత్యావసరాల సరఫరాకు ఆటంకాలు కల్పించడం, వగైరా పనులు చేయరాదు.

ప్రజా ఉద్యమాలను శాంతియుతంగా నిర్వహిస్తే కలిగే లాభాలు :

  1. ఉద్యమకారులకు ప్రాణనష్టం, ధననష్టం జరుగదు.
  2. ఉద్యమకారులు ప్రాణభయంతో ఉద్యమం నుండి తప్పుకోరు.
  3. శాంతియుతంగా ఉద్యమాలు నడిపితే, ఉద్యమాన్ని ఎక్కువకాలం కొనసాగించవచ్చు.
  4. ఎక్కువకాలం శాంతియుతంగా ఉద్యమం నిర్వహిస్తే, ప్రభుత్వానికి కూడా ఉద్యమకారులపై సానుభూతి, దయ కలుగుతుంది.
  5. శాంతియుతంగా ఉద్యమం నడిపిన ఉద్యమకారులపై సామాన్య ప్రజలకు అభిమానం, సానుభూతి కలుగుతాయి.
  6. శాంతియుతంగా చేస్తే, ఉద్యమకారులను ప్రభుత్వం కూడా ఏమీ చేయదు.
  7. శాంతియుత ఉద్యమం తప్పక విజయాన్ని సాధిస్తుంది.

TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ప్రశ్న 3.
పాఠం చదువండి. అప్పటి ప్రభుత్వ పాలనను గురించి విమర్శిస్తూ వాడిన కీలక పదాలు వెతికి రాయండి. వాటిని వివరించండి.
TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి 1
జవాబు:
TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి 2

ప్రశ్న 4.
కింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఆంగ్లేయుల రాకకు ముందు మన భారతదేశంలో కరపత్రాలు లేవు. ఆధునిక కాలంలో ప్రతిరోజు మనం కనీసం ఒకకరపత్రమైనా చూస్తున్నాం.

ఒక సమాచారాన్ని లేదా ప్రత్యేక అంశాలను అందరికీ తెల్పడమే కరపత్రం ప్రధాన ఉద్దేశం. కరపత్రంలో సాధారణంగా వాడుకభాష ఉంటుంది. కరపత్రాలు వేసినవాళ్ళు, రాసినవాళ్ళ పేర్లు గాని, ముద్రణాలయం పేరు గాని కరపత్రాల్లో ఉండాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సామాజిక ప్రయోజనాలున్న అంశాలను సామాన్య ప్రజానీకానికి చేరవేయడానికి కరపత్రం ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడుతుంది. కరపత్రం మనిషి భావస్వేచ్ఛకు సంకేతం.

ప్రశ్నలు:

అ) పై పేరాకు శీర్షిక నిర్ణయించండి.
జవాబు:
‘కరపత్రాల ప్రయోజనం’ అనేది, పై పేరాకు శీర్షికగా సరిపడుతుంది.

ఆ) కరపత్రాలు మనదేశంలో ఎప్పటి నుండి ఉన్నాయి ?
జవాబు:
కరపత్రాలు, మనదేశంలో ఆంగ్లేయులు మన దేశానికి వచ్చినప్పటి నుండీ ఉన్నాయి.

ఇ) కరపత్రాలు ఎందుకు ?
జవాబు:
ఒక సమాచారాన్ని లేదా వివాదాస్పద అంశాన్ని అందరికీ తెల్పడానికి, కరపత్రాలు ఉపయోగిస్తారు.

ఈ) కరపత్రాలు ఎట్లా ఉండాలి ?
జవాబు:
కరపత్రాలలో సాధారణంగా వాడుకభాష ఉండాలి. కరపత్రాలు వేసినవాళ్ళు, రాసినవాళ్ళ పేర్లు గాని, ముద్రణాలయం పేరు గాని, కరపత్రాల్లో ఉండాలి.

ఉ) పై గద్యం ప్రకారం ఎక్కువగా వేటికి చెందిన కరపత్రాలు చూస్తున్నాం ?
జవాబు:
ప్రభుత్వ సంక్షేమ పథకాలనూ, సామాజిక ప్రయోజనాలున్న విషయాలనూ, సామాన్య ప్రజలకు చేరవేయడానికి నేడు ఎక్కువగా కరపత్రాలు వాడుతున్నాం.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) 1969 తెలంగాణ ఉద్యమకాలం నాటి పాలన ఎట్లా ఉందని భావిస్తున్నారు ?
జవాబు:
1969లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని, విద్యార్థులూ, ప్రజలూ, ఉద్యోగస్థులూ, రాజకీయ నాయకులూ పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తెలంగాణ నాయకుడు పి.వి. నరసింహారావుగారు ఉండేవారు. 1956లో ఆంధ్ర ప్రాంతమూ తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. తెలంగాణ ప్రాంతానికి ముల్కీ హక్కులు ఉండేవి.. దాని ప్రకారము తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం తెలంగాణ వారికే ఇవ్వాలి.

కాని ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత, తెలంగాణ ప్రాంతంలో సహితమూ, ముల్కీ నియమాలను ఉల్లంఘించి, ఆంధ్ర ప్రాంతం వారికి తెలంగాణలో ఉద్యోగాలు ఇచ్చారు. అదీగాక 1956 నుండి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఆంధ్ర ప్రాంతం వారే ఉండేవారు. వారు ఆంధ్ర ప్రాంతానికి మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకొనేవారు. తెలంగాణ ప్రాంతంలో వచ్చే ప్రభుత్వ రెవెన్యూను సైతం వారు ఆంధ్ర ప్రాంతంలో ఖర్చు చేసేవారు.

అందువల్ల తెలంగాణ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడింది. తెలంగాణ ఉద్యోగులు, ముల్కీ హక్కుల రక్షణకు, నిరవధిక సమ్మెలు ప్రారంభించారు. రాష్ట్ర నాయకులు సమ్మెలను నిర్దాక్షిణ్యంగా అణచివేశారు. విద్యార్థులు 9 నెలలపాటు సమ్మె చేసినా, ప్రభుత్వం పట్టించుకోలేదు. విద్యార్థులకు అప్పుడు ఒక విద్యా సంవత్సరం పూర్తిగా వ్యర్ధమయ్యింది.

TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ఆ) అప్పటి తెలంగాణ పోరాటంలో ప్రజలు కోపోద్రిక్తులు కావడానికి కారణాలు రాయండి.
జవాబు:
ప్రజలు శాంతియుతంగా నెలల తరబడి సమ్మెలు, ధర్నాలు, పికెటింగులు చేసినా, నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉద్యమ నాయకులను బలవంతంగా కారాగారాల్లో ప్రభుత్వము బంధించింది. ఎందరో యువకులు, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోలీసుల తుపాకుల తుటాలకు బలయ్యారు. ఎందరో ఉద్యమ నాయకులు, రక్తతర్పణ చేశారు. ఎందరో యువకులు అంగవికలులు అయ్యారు..

తెలంగాణ ప్రాంతం అంతా, అగ్నిగుండంగా మారింది. అయినా కేంద్రప్రభుత్వము తెలంగాణ ప్రజల కోరికను మన్నించలేదు. కనీసము వారిని శాంతింపచేయడానికి ప్రయత్నాలు కూడా చేయలేదు. ఆ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు కోపోద్రిక్తులయ్యారు.

ఇ) గాంధీజీ సిద్ధాంతాలకు అనుగుణంగా తెలంగాణ సాధించాలనడంలో ఆంతర్యం ఏమిటి ?
జవాబు:
1969వ సంవత్సరము గాంధీ శతజయంతి సంవత్సరము. గాంధీజీ శాంతి, సత్యము, అహింస అనే సిద్ధాంతాలతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య పాలకులను మనదేశం నుండి వెడలగొట్టగలిగారు. గాంధీజీ కార్యసాధనకు సత్యాగ్రహాలను, నిరాహారదీక్షలను నమ్మినవాడు. అటువంటి గాంధీజీ శత జయంతి సంవత్సరంలో, గాంధీజీ నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని, తెలంగాణ ప్రజాసమితి భావించింది. అందుకే విద్యార్థి నాయకుడు నిరాహారదీక్షకు సిద్ధపడ్డాడు.

ఉద్యమం శాంతియుతంగా నడవకపోతే, ప్రభుత్వం బలవంతంగా ఆ ఉద్యమాన్ని శాంతిస్థాపన పేరుతో అణచివేస్తుంది. అశాంతిగా ఉద్యమాన్ని నడిపిస్తే, నాయకులను, ప్రభుత్వం బంధిస్తుంది. ఆ పరిస్థితులు రాకుండా, తెలంగాణ ప్రజాసమితి నాయకత్వం ముందు జాగ్రత్తగా, రాష్ట్ర సాధనోద్యమాన్ని, గాంధీజీ సిద్ధాంతాలకు అనుగుణంగా సాగించాలని నిశ్చయించింది.

ఈ) ప్రజా ఉద్యమాలు హింసాత్మకంగా మారకుండా ఉండడానికి ఉద్యమనాయకత్వం ఏం చేయాలి?
జవాబు:
ప్రజా ఉద్యమాలు హింసాత్మకంగా మారకుండా ఉండాలంటే, ఉద్యమనాయకులు ఈ కింది పద్ధతులను ఆచరణలో పెట్టాలి.

  1. ఉద్యమానికి ప్రధాన నాయకునిగా ఆవేశపరుడు, ఉద్రేకం కలవాడు కాని, అనుభవం కల నాయకుడిని ఎన్నుకోవాలి.
  2. ఉద్యమం శాంతియుతంగా, గాంధీజీ నమ్మిన అహింసా మార్గంలోనే నడిపించాలి.
  3. ఉద్యమనాయకులు ప్రభుత్వ ఆస్తులకు ఏవిధమైన నష్టం కల్గించరాదు.
  4. ఉద్యమనాయకులు తమ అనుచరులకు హితాన్ని ఉపదేశించి, శాంతిమార్గంలో నడిచేలా చేయాలి.
  5. ఉద్యమనాయకులు ప్రభుత్వానికి తమ సమస్యలను ఎప్పటికప్పుడు శాంతియుతంగా తెలపాలి.
  6. ఉద్యమాన్ని హింసా పద్ధతిలోనికి ఎన్నడూ మార్చరాదు.
  7. ఉద్యమం హింసాపద్ధతిలోకి మళ్ళినట్లయితే, వెంటనే ఉద్యమాన్ని తాత్కాలికంగా నాయకుడు ఆపుచేయాం.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) 1969 నాటి తెలంగాణ ఉద్యమం ద్వారా రాష్ట్రం సాధించకపోవడానికి, నేటి ఉద్యమం విజయవంతం కావడానికి కారణాలు విశ్లేషించండి.
జవాబు:
1969 తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ నాయకులు డా॥ మర్రి చెన్నారెడ్డిగారు నాయకత్వం వహించారు. ఆ రోజుల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, ఈ మధ్య సాగిన ఉద్యమం కంటే తీవ్రస్థాయిలోనే జరిగింది. నాటి తెలంగాణ ప్రజాసమితి నాయకత్వాన్ని ప్రజలు కూడా ఎక్కువగానే సమర్థించారు.

అప్పుడు జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి నాయకులను 10 మందిని, ప్రజలు యమ్.పి లుగా నెగ్గించారు. విద్యార్థులు 9 నెలలపాటు పాఠశాలలనూ, కళాశాలలనూ బహిష్కరించారు. వారికి ఒక విద్యాసంవత్సరం మొత్తం నష్టం అయ్యింది. అయినా, ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాలేదు.
దానికి ముఖ్యకారణాలివి.

ఆనాటి తెలంగాణ ఉద్యమంలో అహింసా పద్ధతులు అమలయ్యాయి. హైదరాబాదు నగరంలో నివసిస్తున్న ఆంధ్రప్రాంత స్త్రీలను ఉద్యమకారులు అవమానించారు. అల్లర్లు చేశారు. ఈ విధంగా ఉద్యమంలో అహింసా పద్ధతులు అమలుచేయడం వల్లే, నాడు ఆ నాయకులు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధింపలేకపోయారు.

నేటి ఉద్యమ విజయానికి కారణాలు :

  1. నేటి ఉద్యమం, పట్టువదలని విక్రమార్కుడైన కె.సి.ఆర్ నాయకత్వంలో అహింసా పద్ధతులలో సాగింది.
  2. నిరాహారదీక్షలు, నిరసనలు, సమ్మెలు, సకలజనుల సమ్మె, ఉద్యోగుల సమ్మె వంటి పద్ధతుల ద్వారా కేంద్రప్రభుత్వాన్ని నేటి ఉద్యమ నాయకులు ఒప్పించగలిగారు.
  3. 1969 ఉద్యమానికి నాటి కాంగ్రెస్ పార్టీ, వ్యతిరేకంగా నిలిచింది. నేటి ఉద్యమనాయకులకు, తెలంగాణలోని అన్ని పార్టీలూ కలిసి వచ్చాయి.
  4. ముఖ్యంగా కాంగ్రెస్పార్టీ వారు ముందుండి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిపెట్టారు.
    ఈ విధంగా శాంతియుతంగా సాగడమే, నేటి ఉద్యమ విజయానికి ప్రథమ కారణం.

TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా రాయండి.

ఆ) తెలంగాణ ప్రజల జీవనానికి, గ్రామాల అభివృద్ధికి తోడ్పడేవి “చెరువులు”. ఈ చెరువుల ప్రాధాన్యత వివరిస్తూ, వీటిని కాపాడడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చే కరపత్రం తయారు చేయండి. చదివి వినిపించండి.
జవాబు:

‘తెలంగాణ ప్రజల జీవనానికి చెరువుల ప్రాధాన్యము’

మన తెలంగాణ ప్రాంతంలో నేడు నీటి కొరతను ఎదుర్కొంటున్నాం. మనకు కృష్ణా, గోదావరి జీవనదులు ఉన్నా, వర్షపాతం తగినంత లేకపోడం దానికి ముఖ్యకారణం. ప్రధానంగా మన తెలంగాణలో చెరువులు ముఖ్యనీటి వనరులుగా ఉండి, మనకు త్రాగునీటినీ, సాగునీటినీ అందిస్తూ వచ్చాయి. ఈ మధ్యకాలంలో చెరువులను పూడ్చి ఆ స్థలంలో భవనాలు కట్టడం జరుగుతోంది. ఉన్న చెరువులను లోతుగా త్రవ్వించి, దానితో నీటిని నిల్వ చేయడంలో శ్రద్ధ తగ్గిపోయింది. చెరువులు, నీటి తూడు వగైరా పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. కొన్ని చెరువులు ఎండిపోయాయి. అందువల్లనే నేడు భూగర్భజలాలు అడుగంటిపోయాయి. 1500 అడుగులు లోతు బోర్లు వేసినా, చుక్క నీరు లభించడం లేదు. దీనికి ముఖ్యకారణం, మనం చెరువుల విషయంలో చూపిస్తున్న అశ్రద్ధ.

మన తెలంగాణ ప్రాంతంలో శాతవాహనుల కాలం నుండి చెరువుల నిర్మాణంపై శ్రద్ధ ఉంది. కాకతీయుల కాలంలో చెరువుల నిర్మాణం ఉన్నత దశకు చేరింది. తెలంగాణ పాలకులు, అసఫ్జాహీలు, కుతుబ్షాహీలు, సంస్థానాధీశులు చెరువుల నిర్మాణాన్ని అభివృద్ధి చేశారు.

ఇప్పటి మన తెలంగాణ ప్రభుత్వము చెరువుల ప్రాధాన్యతను గుర్తించింది. ‘మిషన్ కాకతీయ’ అనే పేరుతో పాత చెరువుల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యతనిస్తోంది. మనం కూడా ప్రభుత్వంతో చేయి కలుపుదాం. మనం కూడా ఉద్యమస్ఫూర్తితో ముందుకు కదులుదాం. ప్రతి గ్రామంలో చెరువుల పునర్నిర్మాణంలో పాలు పంచుకుందాం. నీటి కొరతలేని బంగారు తెలంగాణను నిర్మించుకుందాం. కదలిరండి. చెరువులను పునర్నిర్మించండి.

ది. X X X X X

ఇట్లు
తెలంగాణ రాష్ట్ర జలవనరుల శాఖ.

III. భాషాంశాలు

పదజాలం

1. కింది వాక్యాల్లోని గీత గీసిన పదాలకు అర్థాలు రాస్తూ, సొంతవాక్యాల్లో ప్రయోగించండి.

అ) ఆయన అహర్నిశల ఆరాటము తీరని ఆవేదనగానే మిగిలిపోయినది.
జవాబు:
అహర్నిశలు = రాత్రింబగళ్ళు
వాక్యప్రయోగం : మనిషి అహర్నిశలూ విద్యాధనములు సంపాదించాలి.

ఆ) గాంధీ అహింసా మార్గంలో లక్ష్యాన్ని సాధించాడు.
జవాబు:
లక్ష్యం = తలపెట్టిన కార్యం
వాక్యప్రయోగం : ఏదైనా లక్ష్యాన్ని సాధించాలంటే పట్టుదల మెండుగా ఉండాలి.

ఇ) తెలంగాణ జనత ధర్మయుద్ధం సాగిస్తున్నది.
జవాబు:
జనత = జనుల గుంపు
వాక్యప్రయోగం : భారతదేశం జనత కష్టజీవులు. ధర్మవర్తనులు.

2. ఇచ్చిన వివరణలకు సరిపడే జాతీయాలను బ్రాకెట్లో ఇవ్వబడిన వాటి నుండి ఏరి వాటికెదురుగా ఉన్న గళ్లల్లో రాయండి.

TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి 3
(కట్టలు తెంచుకోవడం, ఏ ఎండకాగొడుగు, ఉక్కుపాదం మోపడం, తిలోదకాలు ఇవ్వడం)
జవాబు:
అ) ఆశలు వదులు కొనటం = తిలోదకాలు ఇవ్వడం
ఆ) బలవంతంగా అణచివేయటం = ఉక్కుపాదం మోపడం
ఇ) మితిమీరిపోవటం = కట్టలు తెంచుకోవడం
ఈ) అవకాశవాదం = ఏ ఎండకాగొడుగు

వ్యాకరణాంశాలు

1. కింది వాక్యాల్లో సంధి పదాలను గుర్తించి, ఆ పదాలను విడదీసి సంధి పేర్లు పేర్కొనండి.

అ) కోపోద్రిక్తులైన కార్యకర్తలను హింసకు తెగబడకుండా కట్టడి చేశారు.
__________ + _______ = __________
జవాబు:
కోపాద్రిక్తులు = కోప + ఉద్రిక్తులు = గుణసంధి

ఆ) నమ్మిన సిద్ధాంతం కోసం గొప్పవారు ప్రాణాలర్పించడం చూస్తనే ఉన్నాం.
__________ + _______ = __________
జవాబు:
ప్రాణాలర్పించడం = ప్రాణాలు + అర్పించడం = ఉత్వసంధి

ఇ) సత్యాహింసలు పాటించడం ద్వారా సమాజ శాంతికి బాటలు వేయవచ్చు.
__________ + _______ = __________
జవాబు:
సత్యాహింసలు = సత్య + అహింసలు = సవర్ణదీర్ఘ సంధి

TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి

2. సమాస పదాలకు చెందిన కింది పట్టికను పూరించండి.

TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి 6

‘సమాస పదం – విగ్రహవాక్యం – సమాస నామం

  1. భక్తి ప్రపత్తులు – భక్తియు, ప్రపత్తియు – ద్వంద్వ సమాసం
  2. ధర్మయుద్ధం – ధర్మము కొఱకు యుద్ధం – చతుర్థీ తత్పురుష సమాసం
  3. రక్తపాతం – రక్తం యొక్క పాతం – షష్ఠీ తత్పురుష సమాసం
  4. శాంతి సందేశం – శాంతి యొక్క సందేశం – షష్ఠీ తత్పురుష సమాసం
  5. నాలుగెకరాలు – నాలుగు సంఖ్య గల ఎకరాలు – ద్విగు సమాసం

3. కింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.

అ) వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొన్నారు.
వేలాది యువకులు కారాగారాలకు వెళ్లారు. (సామాన్య వాక్యాలు).
జవాబు:
వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొన్నారు మరియు కారాగారాలకు వెళ్ళారు. (సంయుక్త వాక్యం)

ఆ) గాంధీ విధానాలను ఆచరించాలి.
గాంధీ విధానాల ద్వారా మంచిని సాధించాలి. (సామాన్య వాక్యాలు)
జవాబు:
గాంధీ విధానాలను ఆచరించాలి మరియు మంచిని సాధించాలి (సంయుక్త వాక్యం)

ప్రాజెక్టు పని

మీ ప్రాంతంలో వివిధ రకాల కరపత్రాలు సేకరించి వాటి వివరాలు కింది పట్టిక రూపంలో నమోదు చేయండి. నివేదిక రాయండి.
TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి 4
జవాబు:
TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి 5

కఠిన పదాలకు అర్థాలు

I

62వ పేజీ

సామూహిక ఉపవాస దీక్ష = అందరూ కలసి గుంపుగా ఉపవాసవ్రతం చేపట్టడం
తెలంగాణ రాష్ట్ర ధ్యేయాన్ని = తెలంగాణ రాష్ట్ర సాధన వాంఛను
చాటి చెప్పడానికి = వెల్లడించడానికి
మహాత్ముని = మహాత్మగాంధీజీ యొక్క
ప్రగాఢ విశ్వాసాన్ని = గట్టి నమ్మకాన్ని
ఆదేశాలను = ఆజ్ఞలను
ప్రజా ఉద్యమము = ప్రజల పోరాటం
కొనసాగుతున్నా = సాగుతున్నప్పటికీ (జరుగుతున్నప్పటికీ)
నిరసనపత్రాలకు = వ్యతిరేకతను తెలిపే కాగితాలకు
బడా మనుషులు = పెద్ద మనుష్యులు
భుక్తి మార్గం = తిండికి మార్గం
మలిన హృదయాలను = మురికిపట్టిన మనస్సులను
మరుగుపరుస్తున్నారు = దాస్తున్నారు
జాతిపిత ప్రబోధాలకు = గాంధీజీ బోధనలకు
తిలోదకాలు
(తిల + ఉదకాలు) = నువ్వుల నీళ్ళు
తిలోదకాలిచ్చు = పూర్తిగా ఆశ వదలుకొను,
అహర్నిశలు = పగలు, రాత్రి
ఆరాటము = సంతాపము
ఆవేదన = బాధ
కన్నీటితో తడియడం = ఏడవడం వల్ల కన్నీరు కారడం
ఆంధ్రపాలకులు = ఆంధ్రదేశపు ముఖ్యమంత్రులు
బానిస బంధాలను = = బానిస బంధములను;
తెలంగాణ జనత = తెలంగాణ ప్రజలు;
ప్రాణాలు కోల్పోయినారు = ప్రాణాలు పోగొట్టుకున్నారు
అంగవిహీనులు = అవయవాలు లేనివారు
సత్యాగ్రహ సమరం = సత్యాగ్రహ యుద్ధం

TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి

కారాగారం = జైలు
పికెటింగు = అడ్డుకోడం
ధర్నా = నిరసన కార్యక్రమం
ఉత్కృష్ట లక్ష్యాన్ని= గొప్ప లక్ష్యమును
రాబందుల రాచరికం = రాబందుల పెత్తనం
శాంతియుత విప్లవాన్ని = శాంతితో కూడిన విప్లవాన్ని
ప్రశాంత గంభీర జలధి = ప్రశాంతమైన లోతైన సముద్రము
పరిశీలన = శోధన
ప్రజాభిప్రాయము = ప్రజల అభిప్రాయము
మన్నన = గౌరవము
దారుణ హింసాకాండ = భయంకరమైన హింసా కృత్యం
రక్తపాతం = రక్తం కారడం
కోపోద్రిక్తులను = కోపముతో విజృంభించిన వారిని
కట్టలు తెంచుకొంటున్నది = గట్టులు తెంపుకొంటోంది
సడలిపోయే = జారిపోయే
ఏ ఎండకా గొడుగు = సందర్భానుసారంగా ఆచరించి కాలం గడుపుకోడం

63వ పేజీ

శాసన సభ్యులపైన = శాసనసభలోని సభ్యులపై (MLA లపై)
పేరుకుంటున్నది = అతిశయిస్తోంది
అగ్నిజ్వాలలు = అగ్నిమంటలు
కేరింతలాడుతున్న = ఉత్సాహంతో కేకలు వేస్తున్న
స్వార్థపరులు = తమ ప్రయోజనము మాత్రమే చూసుకొనేవారు
ప్రదర్శించడం = చూపడం
ధ్యేయానికి = కోరిన లక్ష్యమునకు
కలచివేస్తున్న = బాధపెడుతున్న
వాస్తవమే = సత్యమే
గాంధీ శతజయంతి
సంవత్సరం = గాంధీగారి నూరవ పుట్టినరోజు అయిన 1969వ సంవత్సరం
సత్యాహింసలు
(సత్య + అహింసలు) = సత్యము, అహింస
వరప్రభుత్వాన్ని = విదేశ ప్రభుత్వాన్ని
పారద్రోలిన = వెళ్ళగొట్టిన
కాసురాకాసి = డబ్బు రాక్షసి
నిరాహారదీక్ష = ఆహారం తిననని పట్టుపట్టడం
సమ్మతిని = అంగీకారాన్ని
శతజయంతి = నూరవ పుట్టినరోజు
జన్మదినానికి = పుట్టినరోజుకు
చేపట్టడం = చేయవలెనని అనుకోడం
పుష్టిని = బలాన్ని
భక్తి ప్రపత్తులు = భక్తి మరియు శరణాగతి
కానుక = బహుమతి
దిగ్విజయం = జయప్రదం
వెలుగులు విరజిమ్మాలి = కాంతులు నింపాలి
సత్యమేవ, జయతే = సత్యమే జయిస్తుంది

పాఠం నేపథ్యం, ఉద్దేశం

తెలంగాణ ఉద్యమం ఈనాటిది కాదు. ఎంతోమంది అమరుల త్యాగాలకు చిహ్నంగా సాధించుకున్నదే ఈ తెలంగాణ రాష్ట్రం. ఇది ఉద్యమాల ఫలితంగానే సాకారమైంది. నిన్నటి ఉద్యమానికి ముందే 1969లో ‘తెలంగాణ ప్రజాసమితి’ పేరుతోటి ప్రత్యేకరాష్ట్ర సాధన పోరాటం మొదలైంది. ఆనాటి ఉద్యమ తీరుతెన్నులను తెలుపడం, కరపత్రం యొక్క స్వరూప స్వభావాలను పరిచయం చేయడం ఈ పాఠం ఉద్దేశం.

TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం కరపత్రం అనే ప్రక్రియకు చెందినది. ఒక వ్యక్తి గాని, సంస్థ గాని, ప్రజలకు అందించాలనుకొనే సమాచారాన్ని వీలయినంత సంక్షిప్తంగా అచ్చు రూపంలో అందించేందుకు ఉపయోగించే పత్రాన్ని కరపత్రం అంటారు. దీనినే ఆంగ్లభాషలో ‘పాంప్లెట్” (Pamphlet) అంటారు.

“తెలంగాణ హిస్టరీ సొసైటి తరపున 2009లో వెలువడ్డ పుస్తకం, “1969 ఉద్యమం – చారిత్రక పత్రాలు” అనేది. ఈ పుస్తకంలో 1969 నాటి తెలంగాణ ఉద్యమ స్థితి గతులను వెలుగులోకి తెచ్చే కరపత్రాలు ముద్రించబడ్డాయి. ఆ పుస్తకంలో నుండి ఒక కరపత్రం తీసుకోబడింది. ఆ కరపత్రమే, ఈ పాఠం.

ప్రవేశిక

దీర్ఘకాలంగా శాంతియుత ఉద్యమాలు నిర్వహిస్తున్నప్పుడు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించినా అణచివేతకు దిగినా ఉద్యమాలు హింసాయుతంగా మారే అవకాశం ఉన్నది. ముందుగానే అటువంటి పరిణామాన్ని ఊహించిన ఉద్యమనాయకత్వం పాలకులను ఎండగడుతూ గాంధీ సిద్ధాంతాల కనుగుణంగా ఉద్యమించాలని పిలుపునిచ్చింది. ఇందుకనుగుణంగా రూపొందించిన 1969 నాటి కరపత్రంలో వివరాలు ఏమున్నాయో తెలుసుకుందాం.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

Telangana SCERT 9th Class Telugu Guide Telangana 7th Lesson చెలిమి Textbook Questions and Answers.

TS 9th Class Telugu 7th Lesson Questions and Answers Telangana చెలిమి

చదువండి – ఆలోచించి చెప్పండి (Textbook Page No. 68)

పాలకులు, పండితులు, శిష్టులు నిత్యజీవితంలో విరివిగా సంస్కృతం ఉపయోగించడం చేత, తెలుగు కావ్యభాషలో మూడువంతులు సంస్కృత పదాల ఆధిక్యత కనిపిస్తుంది. శ్రీనాథుని కాలం నాటికి సుదీర్ఘ సంస్కృత సమాసాలే, పద్యాలన్నింటిలో నిండిపోయాయి. తెలుగు మాటలు కనిపించకుండాపోయే స్థితి ఏర్పడ్డది. సంస్కృతాన్ని ఉపయోగించి, ఎంత గొప్పగా పద్యరచన చేసినా, కవులు తమ కావ్యాల్లో ఒక్కటైనా అచ్చతెనుగు పద్యాన్ని రాసేవాళ్ళు. ఆ ఒక్క పద్యానికే లోకులు ఆనందంతో పొంగిపోయేవాళ్ళు, ఒక కావ్యాన్ని అంతా, అచ్చంగా తెనుగు పదాలతో రచించిన కవి పొన్నికంటి తెలగన.

ప్రశ్నలు

ప్రశ్న 1.
సంస్కృత పదాలు కావ్యభాషలో ఎక్కువగా ఎందుకు ఉండేవి ?
జవాబు:
పాలకులు, పండితులు, శిష్టులు, నిత్యజీవితంలో విరివిగా సంస్కృతం ఉపయోగించడం చేత, కావ్యభాషలో సంస్కృత పదాలు ఎక్కువగా ఉండేవి.

ప్రశ్న 2.
తెనుగు పద్యాన్ని ప్రజలెందుకు మెచ్చుకునేవాళ్ళు ?
జవాబు:
శ్రీనాథుని కాలం నాటికి కావ్యాలన్నీ, సంస్కృత సమాసాలతో నిండిన పద్యాలతో నిండిపోయాయి. క్రమంగా తెలుగుమాటలు, కనిపించని స్థితి వచ్చింది. దానితో అచ్చతెనుగు పద్యాన్ని చూస్తే ప్రజలు, ఆనందంతో మెచ్చుకొనేవారు.

ప్రశ్న 3.
పద్యాల్లో సుదీర్ఘ సంస్కృత సమాసాలు ఉండటం వలన లాభమా ? నష్టమా ? ఎందుకు?
జవాబు:
పద్యాల్లో సుదీర్ఘ సంస్కృత సమాసాలు ఉండడం వల్ల, సామాన్యులకు పద్యం తేలికగా అర్థం కాదు. సంస్కృత భాషా జ్ఞానం సంపూర్ణంగా లేని తెలుగువారు, ఆ సుదీర్ఘ సంస్కృత సమాసాల పద్యాలను అర్థం చేసుకొని ఆనందించలేరు. కాబట్టి సుదీర్ఘ సంస్కృత సమాసాల వల్ల, సామాన్య పాఠకులకు కష్టం. తెలుగు భాష క్రమంగా మరుగైపోయే ప్రమాదం కూడా ఉంటుంది.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

ప్రశ్న 4.
అచ్చతెనుగు పద్యాలతో కావ్యం రచించిన తెలంగాణ కవి ఎవరని మీరనుకుంటున్నారు ?
జవాబు:
అచ్చతెనుగు పద్యాలతో కావ్యం రచించిన తెలంగాణ కవి పేరు “పొన్నికంటి తెలగన”.

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 70)

ప్రశ్న 1.
వృషపర్వుడు గర్వంతో ఉండడానికి కారణాలు చెప్పండి.
జవాబు:
వృషపర్వుడు రాక్షసులందరికీ రాజు. వృషపర్వుడిని యుద్ధంలో ఎదిరించగల శత్రువులు ఎక్కడా లేరు. ఆ వృషపర్వుడు అనంతమైన ఐశ్వర్యంతో రాక్షస రాజ్యాన్ని పాలిస్తున్నాడు. అందుకే, వృషపర్వుడు గర్వంగా ఉన్నాడు.

ప్రశ్న 2.
అరమరికలు లేని స్నేహం అంటే, ఎట్లా ఉంటుందో చెప్పండి.
జవాబు:
ఇద్దరి స్నేహితుల మధ్య స్నేహంలో భేదాభిప్రాయాలు, పొరపొచ్చాలులేని స్నేహాన్ని అరమరికలు లేని స్నేహం అంటారు. కర్ణుడికి, దుర్యోధనుడికి మధ్య ఉన్న స్నేహం, అరమరికలు లేని స్నేహం. వారు ఎప్పుడూ ఒకరిని ఒకరు సందేహించలేదు. వారు తగవులాడలేదు.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 71)

ప్రశ్న 1.
సురకరువలి (సుడిగాలి) మీరెప్పుడైనా చూశారా? అది వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ?
జవాబు:
నేను సురకరువలిని అనగా సుడిగాలిని చూశాను. అది వస్తే, తేలిక వస్తువులన్నీ చుట్టచుట్టుకొని, గాలిలో గుండ్రంగా తిరుగుతాయి. అట్టముక్కలు వంటివి గాలిలో బొంగరంలా తిరుగుతాయి.

ప్రశ్న 2.
శర్మిష్ఠ గర్వంతో మాట్లాడడానికి గల కారణాలు ఏమై ఉంటాయి?
జవాబు:
శర్మిష్ఠ రాక్షసరాజు వృషపర్వుడి కుమార్తె. ఆ వృషపర్వుడు, ఎక్కడ తమను తప్పుపడతాడో అని భయపడి, రాత్రింబగళ్ళు దేవతలు ఆ వృషపర్వుడికి సేవలు చేస్తూ ఉంటారు. వృషపర్వుడు మంచి భుజబలంతో రాక్షస రాజ్యాన్ని పట్టంకట్టుకున్నాడు. అటువంటి వాడికి కూతురుకాడం వల్ల, శర్మిష్ఠ గర్వంతో మాట్లాడి యుంటుంది.

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 72)

ప్రశ్న 1.
“ఉసులొక్కటియై బొందులు వెసరెండుగనుండు” అంటే అర్థమేమి ? ఈ మాటలు దేవయాని ఎందుకన్నది ?
జవాబు:
శరీరాలు రెండూ వేరుగా నున్నా, ఆ రెండు శరీరాలలో ఉండే ప్రాణం ఒకటే అని దాని అర్థము. అంటే శర్మిష్ఠా దేవయానుల స్నేహం, ప్రాణస్నేహం అన్నమాట. వారిలో ఒకరు లేకపోతే మరొకరు ఉండలేరన్న మాట. వారిద్దరి మైత్రి గొప్పమైత్రి అని చెప్పడానికి, దేవయాని ఆ మాటలు చెప్పింది.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

ఇవి చేయండి

I. అవగాహన- ప్రతిస్పందన

ప్రశ్న 1.
ఒకరివస్తువులు మరొకరు వాడుకుంటే కీడు తలపెట్టడం సరైనదేనా ? చర్చించండి.
జవాబు:
ఒకరి వస్తువులు ఒకరు వాడుకోవడం సరయిన పద్ధతి కాదు. పొరపాటున ఎవరైనా అట్లా వాడుకుంటే, వారికి కీడు తలపెట్టడం సరయిన పద్ధతి కాదు.

సామాన్యంగా హాస్టళ్ళలో, ఇళ్ళల్లో ఒకరి వస్తువులు మరొకరు పొరపాటున కాని, కావాలని కాని, తీసి వాడుతూ ఉంటారు. హాస్టళ్ళలో మిత్రుల సబ్బుబిళ్ళలు, తువ్వాళ్ళు, టూత్పేస్టులు, తినే పదార్థములు పొరపాటున కాని, కావాలని కాని, ఒకరివి మరొకరు వాడుతూ ఉంటారు.

తాము వాడుకొనే సబ్బులు, టూత్పేస్టులు తమవి కనబడకపోయినా, లేక తమ వస్తువులు ఖర్చయిపోయినా, ప్రక్కవారి వస్తువులు, ప్రక్కవారితో చెప్పి కాని, చెప్పకుండా కాని, తీసి వాడుతారు. ఇంటిలో సహితమూ, అన్నదమ్ములు, అక్కాచెల్లెండ్రు ఇలాగే ఒకరి వస్తువులు మరొకరు వాడుతారు. ఒకప్పుడు పొరపాటున ఇతరుల వస్తువులు తమ వస్తువులలాగే ఉండడం ‘వల్ల, వాటిని తమ వస్తువులని భ్రాంతిపడి, వాడవచ్చు.

ఏమయినా ప్రక్కవారు మన వస్తువులను తీశారనే కోపంతో, అహంకారంతో వారికి కీడు తలపెట్టడం సరయినది కాదు.

ప్రశ్న 2.
స్నేహితులంటే ఎట్లా ఉండాలో మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు:
స్నేహితుడన్నా, మిత్రుడన్నా ఒకటే. మిత్రుడు ఎలా ఉండాలో భర్తృహరి నీతి శతకములో ఇలా చెప్పాడు.
శ్లో॥ – పాపా న్నివారయతి, యోజయతే హితాయ,
గుహ్యం నిగూహతి, గుణాన్ ప్రకటీ కరోతి,
ఆపద్గతంచ న జహాతి, దదాతి కాలే,
సన్మిత్ర లక్షణ మిదం, ప్రవదన్తి సన్తః.

దీనికి తాత్పర్యం ఇలా చెప్పవచ్చు. “పాపకార్యాల నుండి మిత్రులను నివారిస్తాడు. హితాన్ని కలుగజేసే మంచిపనులు చేసేటట్లు చేస్తాడు. రహస్యాలను రహస్యంగా ఉంచుతాడు. మంచి గుణాలను ప్రశంసిస్తాడు. ఆపదలలో విడువకుండా ఆదుకుంటాడు.

లేని సమయంలో సకాలంలో ఇస్తాడు. అదే మంచి మిత్రుడి లక్షణం”. కాబట్టి పై విధమైన గుణాలు గలవారిని మంచి స్నేహితులని చెప్పవచ్చు. స్నేహం, త్యాగాన్ని కోరుతుంది. ప్రేమను వర్షిస్తుంది. సంతోషాన్నీ, సంతృప్తినీ కలిగిస్తుంది. అసంతృప్తిని పోగొడుతుంది.

స్నేహము స్వార్థాన్ని పూర్తిగా నశింపజేస్తుంది. స్నేహము సద్బుద్ధిని కలిగిస్తుంది. ఆశలను చిగురింపజేస్తుంది. “స్నేహమేరా శాశ్వతం. స్నేహాని కన్న మిన్న లోకాన లేదు” స్నేహితుడు అన్నవాడు పైన చెప్పినట్లు ఉండాలి.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

ప్రశ్న 3.
పాఠం ఆధారంగా శర్మిష్ఠ, దేవయానిల స్వభావాలు ఎట్లా ఉన్నాయో కింది పట్టికలో రాయండి.
TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి 2
జవాబు:
శర్మిష్ఠ

  1. రాక్షసరాజు కూతురుననే గర్వం, అహంకారం, కలిగియుండడం.
  2. దేవయాని తనకు మంచి మిత్రురాలయినా, ఆమె కట్టిన మైల కోకను ధరించనని పట్టుదల.
  3. తన తండ్రికి దేవతలు సేవలు చేస్తూ ఉంటారనీ, తన తండ్రి రాక్షస రాజ్యాధిపతి అనీ అహంకారం కల్గియుండడం.
  4. స్నేహితురాలు అనునయించి మాట్లాడుతున్నా, నచ్చచెప్పిన ఆమె మాట వినని ధూర్తత్వం.
  5. స్నేహితురాలు దేవయానిని అహంకారంతో నూతిలోకి త్రోసివేసిన దౌష్ట్యం.

దేవయాని

  1. రాక్షస వంశానికి గురువయిన శుక్రాచార్యుని కుమార్తెననే కొద్దిపాటి అహంభావము.
  2. శర్మిష్ఠ వంటి రాజకన్యతో గట్టి స్నేహం. శర్మిష్ఠ, దేవయానుల శరీరాలు వేరు అయినా, ప్రాణం ఒకటే అన్నంతగా రాజకుమార్తె శర్మిష్ఠతో మైత్రి చేయడం.
  3. ఓరిమితో, పొరపాటున బట్టలు తారుమారయినందుకు కోపపడడం తగదని, స్నేహితురాలికి హితబోధ చేయడం.
  4. శర్మిష్ఠ ఎగతాళి మాటలకు చివరకు అసహనంతో, తాను రాక్షస రాజగురువు కుమార్తెనని, స్నేహితురాలికి గుర్తుచేయడం.
  5. శర్మిష్ఠ తొందరపాటుతనానికి బలియై, నూతిలోకి త్రోయబడడం.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

ప్రశ్న 4.
కింది పేరా చదువండి – జవాబులివ్వండి.

2014 జూన్ 8న హిమాచల్ ప్రదేశ్లోని మండిజిల్లాలోని బియాస్ నది అందాలు వీక్షించడంలో లీనమైపోయారు 48 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు. ముగ్గురు అధ్యాపకులతో కలిసి తెలంగాణ రాష్ట్రం నుండి విజ్ఞానయాత్రకు బయలుదేరారు. ఆ విద్యార్థులు, సన్నసన్నగా ప్రవహిస్తున్న బియాస్ నదిలో మధ్య బండరాళ్ళ మీద, మోకాలిలోతుదాకా వెళ్ళి, ఆ నది అందాలను ఆనాటి సాయంత్రం సుమారు ఆరుగంటల ముప్పై నిమిషాలవేళ తమ కెమెరాల్లో బంధిస్తున్నారు.

పైనున్న రిజర్వాయరు గేట్లు ఎత్తిన సంగతి గురించి పరిసరాల్లో ఉన్న హెచ్చరికలను వీళ్ళు గమనించలేదు. నదిలో హఠాత్తుగా నీటిమట్టం పెరగడం గమనించిన కొందరు ప్రమాదాన్ని శంకించి బయట పడటానికి ప్రయత్నం చేసారు. కొంతమంది ప్రాణాలు కాపాడుకోగలిగారు. మరికొందరు ఇతరులను కాపాడటానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో కొందరు విజయం సాధిస్తే ఒకరిద్దరు ప్రాణాలనే పణంగా అర్పించారు. మొత్తంమీద సగం మంది విద్యార్థుల నిండు ప్రాణాలు, అందరూ చూస్తుండగానే ఆ నీటి ఉధృతికి గాల్లో కలిసిపోయాయి. ప్రపంచ మానవాళి హృదయాలను కలచివేసిన సంఘటన ఇది.

ఇటువంటి సంఘటనలు తరచూ మనం వింటున్నాం, చూస్తున్నాం. ఆకతాయితనంతో ఈత రానివాళ్ళను నీళ్ళలోకి తోసివేయడం, ఈత రాకున్నా మిత్రులను చూసి ఉత్సాహంతో నీళ్ళలో దూకి ప్రమాదాలు కొని తెచ్చుకోవడం, నీటిలోతును తప్పుగా అంచనావేసి, ప్రాణాలు పోగొట్టుకోవడం….. తీర్థయాత్రల్లో, పికినిక్ లో, విహారయాత్రల్లో, ఈతకొలనుల్లో, చెరువుల్లో, దిగుడుబావుల్లో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి.

ఆరోగ్యం కోసం, శరీర దారుఢ్యం కోసం జిమ్లకు వెళ్ళడానికి, కరాటే, కుంగ్ఫూ లాంటి రక్షణ విద్యలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లే – ‘ఈతనేర్చుకోవడం’ అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం. ఇది ఆత్మరక్షణకే గాక, నీటి ప్రమాదాల నివారణకూ దోహదపడుతుంది.

ప్రశ్నలు :

అ) సాధారణంగా నీటి ప్రమాదాలు ఎట్లాంటి సందర్భాల్లో జరుగుతాయి ?
జవాబు:

  1. చెరువులు, కాలువలు, నదులలో స్నానానికి వెళ్ళినపుడు, అందులో ఈత కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, నీటి ప్రమాదాలు జరుగుతాయి.
  2. వాగులు, వంకలు దాటి ప్రయాణం చేస్తున్నప్పుడు, అమాంతంగా ఆ వాగుకు వరదవస్తే, ఆ ప్రవాహ వేగంలో కొట్టుకొనిపోయే ప్రమాదం ఉంది.
  3. నదులలో, సముద్రాలలో పడవలపై, లాంచీలపై, ఓడలపై ప్రయాణిస్తున్నప్పుడు, ఆ పడవలకూ, ఓడలకూ ప్రమాదాలు వస్తే, అవి నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు అందులో ప్రయాణిస్తున్న వారికి నీటిప్రమాదం రావచ్చు.
  4. రోడ్లపై ప్రయాణించేటప్పుడు వరదనీటిని సాహసంగా దాటి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించినపుడు దానిలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది.
  5. తీర్థస్నానాలకు వెళ్ళి, కొత్తచోట్ల నదులవంటి వాటిలో స్నానానికి దిగినపుడు, అక్కడ ఉండే లోతు తెలియక, మునిగిపోయే ప్రమాదం ఉంటుంది.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

ఆ) నీళ్ళవద్ద ఆకతాయితనం ప్రదర్శించడం మంచిదేనా ? ఎందుకో తెలుపండి.
జవాబు:
ఆకతాయితనం అంటే తుంటరితనం. అల్లరిచిల్లరిగా తిరగడం అని భావం. నీళ్ళల్లో దిగి స్నానాలు చేసేటప్పుడు అక్కడ లోతు ఎంతగా ఉంటుందో తెలిసికొని జాగ్రత్తగా ప్రక్కన ఉన్న ఏ కఱ్ఱనో, గొలుసునో ఆధారం చేసుకొని స్నానం చేయాలి.

మంచి వేగంగా ప్రవాహం ఉన్న నీటిలో ఒంటరిగా తోడులేకుండా దిగరాదు. స్నానాలు చేయరాదు. స్నానాలు చేసేటప్పుడు ఆకతాయితనంగా ప్రవర్తించి మునగడం, ఈతకొట్టడం, ప్రక్కవారిపై నీళ్ళుచల్లడం, ప్రక్కవారిని బలవంతంగా నీళ్ళలోకి లాగడం, గెంటడం వంటి అల్లరిపనులు చేయరాదు.

ప్రక్కవారికి ఈతరాకపోతే, వారిని నీటిలోకి గెంటితే వారు మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఈత రాకుండా, నీటిలో లోతులోకి దిగితే, ప్రవాహంలో తాము కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. వరదలు వచ్చిన నదులలో, ఈతలు, స్నానాలు చేస్తే ప్రమాదాలు సంభవింపవచ్చు.

ఇ) ఈత నేర్చుకోవడం వల్ల ఏయే ప్రయోజనాలుంటాయి ?
జవాబు:

  1. ఈత మంచి వ్యాయామము. ఈత ఈదేవారి, శరీరము మంచి తేలికగా పటుత్వంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఈతను మించిన వ్యాయామం లేదని ఆరోగ్య శాస్త్రజ్ఞులు చెపుతారు.
  2. ఈత వస్తే నీటి ప్రమాదాలు సంభవించినపుడు తేలికగా తప్పించుకోవచ్చు. ఈత ఈదుకొని గట్టు ఎక్కవచ్చు. ఈత వస్తే ప్రమాదాలు వచ్చినపుడు ప్రక్కవారిని సహితమూ రక్షింపవచ్చు.
  3. ఈత వస్తే కాలువల్లో, ఏరుల్లో, నదుల్లో హాయిగా స్నానం చేయవచ్చు. కాలువలలో ఈది, అవతలి తీరాలకు చేరవచ్చు. ఈత వల్ల మంచి వ్యాయామము సిద్ధిస్తుంది. నీటిప్రమాదాలు వస్తే సురక్షితంగా తాము బయటపడవచ్చు. పక్కవారికి సాయపడవచ్చు.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

ఈ) బియాస్ నది ప్రమాదానికి కారణమేమిటి ?
జవాబు:
విద్యార్థులు నదిలో తక్కువగా నీరు ఉన్నప్పుడు చక్కగా ఉల్లాసంగా విహరించారు. నది అందాలను తమ కెమేరాలలో బంధించారు. అయితే అనుకోకుండా నది యొక్క రిజర్వాయరు గేట్లు ఎత్తడం వల్ల నీరు ఒక్కసారిగా ముందుకు వచ్చింది. ప్రమాదకరమైన హెచ్చరికలను కూడా విద్యార్థులు గమనించలేదు.

కొందరికి ఈత కూడా రాదు. ఈ కారణాలతో నదీ ప్రవాహాన్ని తట్టుకోలేకపోయారు. తమ ప్రాణాలను కోల్పోయారు. కొందరు తమ మిత్రులను కాపాడబోయి వారు కూడా ప్రాణాలను పోగొట్టుకున్నారు. రిజర్వాయరు గేట్లు ఎత్తడం వల్ల, నీరు అధికమొత్తంలో రావడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.

ప్రశ్న 5.
కింది గద్యాన్ని చదువండి.

భీమకవి జన్మస్థలము రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ. కానీ ఆతడెన్నడునూ. ఒక్కచోటనున్నవాడు కాదు. మహేశ్వర వరప్రసాద కవితాఖడ్గమును ధరించి, తన్నెదిరించిన వారినెల్ల ఆ ఖడ్గప్రహారముతో భయపెడుతూ, ఆగ్రహానంతర మనుగ్రహవృష్టిని కురిపిస్తూ నిరంతరం సంచరించే అనంత శక్తిమంతుడా మహాకవి. సుమారు వేయిఏండ్ల కిందటి వాడైనా, అతని కావ్యసంపద లభించకపోయినా, ఆయన పద్యప్రసూనాలు వాడిపోక, ఇప్పటికీ నవ్య సుగంధాలను వెదజల్లుతూనే ఉన్నాయి. బహుభాషాకోవిదుడు, మహోగ్రుడుగా పేరుగన్న భీమన్న శాపం, అనుగ్రహం వేగంగా పనిచేసేవి. ఈయన 11వ శతాబ్దానికి చెందిన కవి అని కొందరి అభిప్రాయం.

కింది వాక్యాల్లోని తప్పొప్పులను గుర్తించండి.
అ) భీమకవి ‘ఖడ్గం ధరించి తిరిగేవాడు.   (✓)
ఆ) వేములవాడ .భీమకవి బహుభాషాకోవిదుడు.   (✓ )
ఇ) భీమకవి 11వ శతాబ్దికి చెందినవాడని కొందరంటారు.   (✗)
ఈ) భీమకవి ఎన్నడూ ఒక్కచోట ఉండలేదు.  (✓ )

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) స్నేహితుల మధ్య వివాదాలు ఎందుకు వస్తాయో వివరించండి.
జవాబు:

  1. సామాన్యంగా ఆటలు ఆడుకొనేటపుడు స్నేహితుల మధ్య వివాదాలు వస్తూ ఉంటాయి.
  2. స్నేహితులకు ఎవరైనా ఏదైనా బహుమతులు ఇచ్చినపుడు, అవి వారికి సమానంగా ఇవ్వలేదనే విషయం దగ్గర తగాదాలు వస్తాయి.
  3. చదువులలో పోటీలు ఏర్పడినపుడు నోట్సులు, పుస్తకాలు దగ్గర తమకున్న బట్టలు వగైరా దగ్గర తగాదాలు వస్తాయి.
  4. తల్లిదండ్రులు కాని, ఇతరులు కాని ఏవైనా బహుమతులు, స్నేహితులలో ఒకరికి ఇచ్చి, రెండవవారికి అవి ఇవ్వనపుడు, తమకు ఎక్కువ తక్కువలు ఉన్నాయనే విషయం దగ్గర వివాదాలు వస్తూ ఉంటాయి.
  5. తమకు ఇంటివద్ద ఆస్తిపాస్తుల విషయంలో ఎక్కువ తక్కువలు ఆరోపించుకోవడం, అందులో ఎక్కువ ఉన్నవారికి గర్వం, అహంకారం వచ్చిందనే కారణంగా, రెండవవాడు తగాదా పెట్టడం వల్ల వివాదాలు వస్తాయి.

ఆ) “కుల, మత, వర్గ, పేద, ధనిక తేడా లేనిది స్నేహం ఒక్కటే” దీనిని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
స్నేహానికి హద్దులు లేవు. పరిమితులు లేవు. బడిలో చదువుకొనేటపుడు, ఆటలు ఆడుకొనేటప్పుడు, ఎందరో మనకు స్నేహితులవుతారు. అందులో వివిధ కులాలవారు, మతాలవారు, వర్గాలవారు, పేదలు, ధనికులు కూడా ఉంటారు. స్నేహానికి మనస్సులు రెండూ కలవడమే ముఖ్యం. ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోడంలోనే స్నేహం ఉంది.

లోకంలో ఎందరో వివిధ మతస్థులయిన, వివిధ కులాలవారయిన స్నేహితులు ఉన్నారు. వారు ఒకరికోసం మరొకరు తమ ప్రాణాలు ఇస్తారు. సుగ్రీవుడు వానరుడు. రామలక్ష్మణులతో స్నేహం చేసి అతడు, సీతను తిరిగి పొందడంలో రామునికి ఎంతో సాయం చేశాడు. అలాగే విభీషణుడు రాక్షసుడు. రాముని ఆశ్రయాన్ని పొందిన విభీషణుడు యుద్ధంలో రామునికెంతో సాయం చేశాడు. దీనినిబట్టి స్నేహానికి, కులమత వర్గ భేదాలు ఉండవని గ్రహించాలి.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

ఇ) అచ్చతెలుగు భాషలో రాయబడిన ఈ పాఠం చదివారు కదా ! దీనిపై మీ అభిప్రాయాన్ని క్లుప్తంగా రాయండి.
జవాబు:
అచ్చతెనుగు పద్యం ఒకటి కావ్యంలో ఉంటేనే, అది ఎంతో గొప్ప విషయం అని కావ్యరసజ్ఞులు మెచ్చుకుంటారు. అలాంటిది నేను ఈ ‘చెలిమి’ పాఠంలో 12 అచ్చతెలుగు పద్యాలు చదువుకున్నాను. అయితే సంస్కృత సమాసాలతో పద్యాలు వినడానికి కమ్మగా, గంభీరంగా, ఇంపుగా ఉంటాయి. ఈ అచ్చతెలుగు పద్యాలు, ముద్దులు మూటలు కడుతూ ఉన్నాయి. శ్రవణ పర్వంగా ఉన్నాయి.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) “ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు” ఎందుకు వివరించండి.
జవాబు:
‘చెలిమి’ పాఠంలో రాక్షసరాజు కూతురు శర్మిష్ఠ, తన స్నేహితురాలైన దేవయానిని, చిన్న తప్పు కోసం అసహనంతో నూతిలోకి త్రోసివేసి, ఇంటికి వెళ్ళిపోయింది. దేవయానిని ఎవరూ ఆదుకోలేదు. శర్మిష్ఠ రాజు కూతురు కాబట్టి, ఆమె వెంట వేయిమంది చెలికత్తెలూ కూడా వెళ్ళిపోయారు.

దేవయాని చెలికత్తె ‘ఘూర్ణిక’ దేవయానిని విడువకుండా ఆమెకు సాయం చేద్దామని చూస్తూ, తాను ఒక్కతే ఏమీ చేయలేక సాయంచేసే వారికోసం ఎదురు చూసింది. ఇంతలో ప్రతిష్ఠానపురము ప్రభువైన యయాతి మహారాజు జాబాలి మహర్షి ఆశ్రమం నుండి తిరిగి వెడుతూ, దాహంతో దేవయాని ఉన్న నూతి దగ్గరకు వచ్చాడు. తన్ను రక్షించుమని దేవయాని చెలికత్తె కోరగా దేవయానిని రక్షించాడు.

దేవయానికి ఘూర్ణిక నిజమైన చెలికత్తె. అందుకే ఘూర్ణిక, దేవయానిని అడవిలో నూతిలో ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళలేదు. దేవయానికి వచ్చిన కష్టాన్ని యయాతి మహారాజుకు చెప్పింది. యయాతి మహారాజుచే దేవయానిని రక్షింపజేసింది. అందుకే ఆపదలో ఆదుకొన్నవారే నిజమైన స్నేహితులు అని చెప్పాలి. ఈ కథలో ఘూర్ణికయే, దేవయానికి నిజమైన స్నేహితురాలు.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

(లేదా)

ఆ) మంచి స్నేహితులను ఎలా సంపాదించుకోవాలి ? ఆ స్నేహం కలకాలం ఉండడానికి ఏం చేయాలి ?
జవాబు:
మంచి స్నేహితులే మనకు నిజమైన సంపదలు. కాబట్టి మనకోసం ప్రాణం ఇచ్చే స్నేహితులను సంపాదించుకోవాలి. స్నేహితులకు అవసరం అయినపుడు, తన ధనాన్నీ, ప్రాణాన్నీ కూడా పంచి ఇవ్వాలి. స్నేహితుల అవసరాలు మనం తెలుసుకొని, వారికి మనం సాయపడాలి. స్నేహితుడు కష్టాల్లో ఉంటే, మన శక్తిని అంతా ధారపోసి వారికి మనం సాయపడాలి.

వారి అవసరం కోసం మనతో స్నేహం చేసేవారు, మంచి స్నేహితులు అనిపించుకోరు. ఎవరైతే మనం ఆపదలో ఉన్నపుడు, లేనిస్థితిలో ఉన్నపుడు ఆదుకొంటారో వారే మంచి స్నేహితులు. మనం తప్పుదారిలో నడిచేటప్పుడు అది మంచిదికాదని, దానివల్ల కలిగే లాభనష్టాలను వివరంగా మనకు తెలియపరచి, మంచిదారి చూపించేవారే మంచి స్నేహితులు.

మంచి స్నేహం త్యాగాన్ని కోరుతుంది. మంచి స్నేహితుల కోసం మనం ఎంతటి త్యాగానికైనా వెనుకడుగు వేయకూడదు. మంచి స్నేహం, కలకాలం నిలవాలంటే మిత్రులు చిన్న చిన్న విషయాలపై తగువులు పెట్టుకోరాదు. ఒకరి మనస్సులను మరొకరు బాగా అర్థం చేసుకోవాలి.

స్నేహితులకు అవసరమైతే తననూ, తన ఆస్తినీ, తన బంధువులనూ వినియోగించి తోడ్పడాలి. ఆ స్నేహం కలకాలం నిలుస్తుంది.

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా రాయండి.

శర్మిష్ఠ తన స్నేహితురాలైన దేవయానిని తిట్టి, బావిలో తోసింది కదా ! తర్వాత తన తప్పు తెలుసుకొని చింతిస్తే, ఎట్లా ఉంటుందో ఊహించి, “ఏక పాత్రాభినయా”నికి అనువుగా మాటలు రాయండి.
జవాబు:
శర్మిష్ట ఏకపాత్రాభినయము
“అయ్యో ! ఎంతపని చేశాను ? దేవయాని నాకు ఎంతో మంచి స్నేహితురాలు కదా ! దాన్ని నూతిలోకి తోశాను. పాపం ఏమయ్యిందో ! చచ్చిపోయిందేమో ! ఎంత పాపానికి ఒడిగట్టాను. నేను మిత్రద్రోహురాలిని. పాపం దేవయాని నాకు ఎంతో నచ్చచెప్పింది. అవును. సుడిగాలి వస్తే దేవయాని ఏం చేస్తుంది ? బట్టలు మారిపోడానికి దేవయాని నిజంగా కారణం కాదు కదా !

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

మరి నేను మాత్రం తప్పు చేయలేదా ? నేను దేవయాని బట్టలు కట్టుకున్నాను కదా ! నేను మాత్రం నా బట్టలు సరిగ్గా గుర్తించగల్గానా ? లేదు కదా ! నేను చేసిన తప్పే, దేవయానీ చేసింది. తప్పు మా ఇద్దరిదీ ఒక్కటే, కాని శిక్ష దేవయాని అనుభవిస్తోంది. ఇది అన్యాయం.

నేను రాజకుమార్తెననే అహంకారంతో ఈ తప్పుచేశా. ఇది నిజం. దేవయాని తండ్రిగారు మా రాక్షస వంశానికి గురువుగా మాకు, ముఖ్యంగా మా నాన్నగారికి, ఎంత ఉపకారం చేస్తున్నారు ? రాక్షసుల క్షేమానికి కారణం దేవయాని తండ్రి శుక్రాచార్యులు గారే !

నేను ఎంత తెలివితక్కువగా వ్యవహరించాను. ఎంత చెడ్డపని చేశాను. వెంటనే దేవయానిని రక్షించమని భటుల్ని పంపిస్తా. దేవయానిని రక్షింపజేసి, ఆమె దగ్గర నా తప్పు అంగీకరిస్తా. క్షమించమని కోరుతా ! (ఎవరక్కడ !)

III. భాషాంశాలు

పదజాలం

1. కింది వాక్యాల్లోని గీత గీసిన పదాలతో సొంతవాక్యాలు రాయండి.

అ) మన ఇరుగు పొరుగు వాళ్ళతో అనగి పెనగి ఉండాలి.
జవాబు:
అనగిపెనగి = మిక్కిలి స్నేహముతో కలిసియుండి
వాక్యప్రయోగం : మా తరగతిలోని బాలబాలికలందరం అనగి పెనగి సరదాగా ఉంటాము.

ఆ) చెలువలు బంగారు ఆభరణాలను చాలా ఇష్టపడతారు.
జవాబు:
చెలువలు = స్త్రీలు
వాక్యప్రయోగం : అట్లతద్దినాడు మా వీధిలో చెలువలు కుందెనగుడి ఆట ఆడారు.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

ఇ) మా పాఠశాలలో తరగతికి వందమంది చొప్పున పది తరగతుల్లో వేవురు విద్యార్థులు చదువుతున్నారు.
జవాబు:
వేవురు = వేయిమంది
వాక్యప్రయోగం : మా గ్రామ జనాభాలో వేవురు పురుషులు, తొమ్మిదివందల మంది స్త్రీలు ఉన్నారు.

ఈ) అమ్మనాన్నలు మనమంచికై కఠినంగా మాట్లాడినా నెగులు పడకూడదు.
జవాబు:
నెగులు = విచారము
వాక్యప్రయోగం : మా ఇంట్లో దొంగలు పడి, బంగారము దొంగిలించారని, మేమంతా నెగులుపడ్డాము.

2. కింది ప్రకృతి – వికృతులను జతపరచండి.

అ) ఆళి ( ) ఎ) సకి
ఆ) గర్వం ( ) బి) అబ్బురం
ఇ) అద్భుతం ( ) సి) ఓలి
ఈ) సఖి ( ) డి) కావరం
జవాబు:
అ) ఆళి ( సి ) ఎ) సకి
ఆ) గర్వం ( డి ) బి) అబ్బురం
ఇ) అద్భుతం ( బి ) సి) ఓలి
ఈ) సఖి ( ఎ ) డి) కావరం

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

ప్రకృతి – వికృతి
అ) ఆళి – ఓలి
ఆ) గర్వము – కావరం
ఇ) అద్భుతము – అబ్బురం
ఈ) సఖి – సకి

వ్యాకరణాంశాలు

1. కింది పదాలు విడదీసి, సంధి పేరు రాయండి.

అ) జగములేలు = …………………………..
జవాబు:
జగములు + ఏలు – ఉత్వసంధి

ఆ) అలరుఁబోఁడి = …………………………….
జవాబు:
అలరు + మేను – పోడ్యాదేశ సంధి

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

ఇ) నీరాట = …………………………
జవాబు:
నీరు + ఆట – ఉత్వసంధి

2. కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.

అ) రక్కసిణేడు = …………………………
జవాబు:
రక్కసులకు తేడు = షష్ఠీ తత్పురుష సమాసం

ఆ) నీరాట = …………………….
జవాబు:
నీటి యందలి ఆట = `సప్తమీ తత్పురుష సమాసం

ఇ) పసిబిడ్డ = ……………………….
జవాబు:
పసిన బిడ్డ = విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

గసడదవాదేశ సంధి:

కింది పదాలను కలిపినప్పుడు, ఏర్పడిన రూపాలను గమనించండి.
అ) వాడు + కొట్టె = వాడుగొట్టె
ఆ) మీరు + చనుడు = మీరుసనుడు
ఇ) నీవు + టక్కరి = నీవుడక్కరి
ఈ) నిజము + తెలిసి = నిజముదెలిసి
ఉ) పాలు + పోక = పాలువొక

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

గమనిక:
పై ఉదాహరణలు గమనించారు కదా! పూర్వపదం చివర ప్రథమా విభక్తి ప్రత్యయాలున్నాయి. పరపదం మొదట, క, చ, ట, త, ప లున్నాయి. ఈ విధంగా ప్రథమా విభక్తి మీది ప్రత్యయాలకు, క, చ, ట, త, ప, లు పరమైతే, వాటి స్థానంలో గ, స, డ, ద, వ లు ఆదేశంగా వస్తాయి. అంటే
1) ‘క’ → ‘గ’ గా మారుతుంది.
2) ‘చ’ → ‘స’ గా మారుతుంది.
2) ‘ట’ → ‘డ’ గా మారుతుంది.
4) ‘త’ → ‘ద’ గా మారుతుంది.
5) ‘ప’ → ‘వ’ గా మారుతుంది.

ప్రథమ మీది పరుషాలకు
గ, స, డ, ద, వ లు బహుళముగానగు

అనగా క, చ, ట, త, ప లకు వరుసగా గ, స, డ, ద, వ, లు ఆదేశంగా వస్తాయి.

3. అభ్యాసం : కింది పదాలను విడదీసి రాయండి. వివరించండి.

అ) రావణుడు గొనిపోయె
ఆ) రాముడు సనుదెంచు
ఇ) వారు దనిసిరి
ఈ) వాడు వోయె
జవాబు:
అ) రావణుడు = గొనిపోయె = రావణుడు +
ఆ) రాముడు సనుదెంచె = రాముడు + చనుదెంచె
ఇ) వారు దనిసిరి = వారు + దనిసిరి
ఈ) వాడు వోయె = వాడు + వోయె

వివరణ :

  1. రావణుడు
  2. రాముడు
  3. వారు
  4. వాడు

– అనే పదాల చివర ప్రథమా విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి. పరపదముల మొదట క, చ, ప లు ఉన్నాయి.
ప్రథమా విభక్తి ప్రత్యయాలకు క, చ, ట, త, ప లు పరమైతే గ, స, డ, ద, వ లు ఆదేశంగా వస్తాయి. కాబట్టి క, చ, ప లు – గ, స, వ లుగా మారాయి.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

కింది పదాలను గమనించండి.

అ) కూరగాయలు – కూర + కాయ
ఆ) కాలుసేతులు – కాలు + చేయి
ఇ) టక్కుడెక్కులు – టక్కు + టెక్కు
ఈ) తల్లిదండ్రులు – తల్లి + తండ్రి
ఉ) ఊరువల్లెలు – ఊరు + పల్లె

పై పదాలు అన్నీ ద్వంద్వ సమాసానికి ఉదాహరణలే.

వివరణ : ద్వంద్వ సమాసంలో ‘కూర + కాయ’ అన్నపుడు ‘క’ స్థానంలో ‘గ’ వచ్చింది. ఈ విధంగా ద్వంద్వ సమాసపదాల్లో క, చ, ట, త, ప, లకు, గ, స, డ, ద, వ లు ఆదేశంగా రావడాన్ని, “గసడదవాదేశం” అంటారు. అనగా ద్వంద్వ సమాసంలో మొదటి పదం మీద ఉన్న క చ ట ప లకు, గ స డ ద వ లు క్రమంగా వస్తాయి. దీన్నే ద్వంద్వ సమాసంలో, ‘గసడదవాదేశ సంధి’ అంటారు.

4. అభ్యాసం : కింది పదాలను కలుపండి. సంధి కార్యం తెలుపండి.

అ) అక్క + చెల్లి = …………………….
జవాబు:
అక్కాసెల్లెండ్రు (ద్వంద్వ సమాసంలో గసడదవాదేశం)

ఆ) అన్న + తమ్ముడు = ……………………….
జవాబు:
అన్నాదమ్ములు (ద్వంద్వ సమాసంలో గసడదవాదేశం)
సూత్రం : ద్వంద్వంబుపై పరుషములకు గ, స, డ, ద, వ లగు.

తేటగీతి

గమనిక : ‘తేటగీతి’ పద్యం సూర్య, ఇంద్ర గణాలతో ఏర్పడుతుంది. ఈ తేటగీతి పద్యలక్షణాలు తెలుసుకోబోయే ముందు సూర్యగణాలు, ఇంద్రగణాలు అంటే ఏవేవో చూద్దాం.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

ఎ) సూర్యగణాలు (2)

  1. న గణం I I I
  2. హ గణం (గలము) – U I

బి) ఇంద్రగణాలు (6)

  1. భ గణం – U I I
  2. ర గణం – U I U
  3. త గణం – U U I
  4. న గము – I I I U
  5. న లము – I I I I
  6. స లము – I I U I

ఇప్పుడు కింది ఉదాహరణమును పరిశీలించండి.
ఉదా :
TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి 3
పై ఉదాహరణ ఆధారంగా, తేటగీతి పద్యలక్షణాలను కింది విధంగా చెప్పవచ్చు.
తేటగీతి పద్య లక్షణాలు :

  • ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి.
  • ప్రతి పాదానికి, వరుసగా ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు ఉంటాయి.
  • నాలుగో గణం మొదటి అక్షరం యతిమైత్రి స్థానం. ప్రాసయతి చెల్లుతుంది.
  • ప్రాస నియమం లేదు.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

ప్రాసయతి :

  1. ప్రాసస్థాన అక్షరానికి, యతిని, పాటించడాన్ని ‘ప్రాసయతి’ అంటారు.
  2. పద్యపాదంలో రెండవ అక్షరానికి, సాధారణ యతిమైత్రి స్థానంలోని తరువాతి అక్షరానికి, యతిని పాటించడం ‘ప్రాసయతి’ అంటారు.

5. పై పద్యానికి సంబంధించి మిగతా పాదాలకు గణవిభజన చేసి లక్షణాలను సరిపోల్చండి.

జవాబు:
2వ పాదం
TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి 4
లక్షణాలు సరిపోల్చడం :
1) పై పాదంలో వరుసగా ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు వచ్చాయి. కాబట్టి ఇది ‘తేటగీతి” పద్యపాదము.
2) మొదటి అక్షరం ‘గూ’ కు ను, నాలుగో గణం మొదటి అక్షరం ‘గో’ కు యతిమైత్రి.
ప్రాజెక్టు పని

స్నేహం గొప్పతనాన్ని తెలిపే కథలను / పాటలను సేకరించి, నివేదిక రాసి ప్రదర్శించండి.
జవాబు:
1) పాట : “స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం”

2) కథ : ‘చిత్రగ్రీవుడు’ పావురాల రాజు. అతగాడు తన పావురాలతో ఆకాశంలో తిరుగుతున్నాడు. గోదావరీ తీరంలో ఒక మర్రిచెట్టు ఉంది. ఒక బోయవాడు వచ్చి ఆ చెట్టు దగ్గరలో నూకలు చల్లి దానిమీద వల వేశాడు. “పక్షులు నూకల కోసం వల మీద వాలతాయి. వాటిని పట్టుకొని అమ్ముకుందాం” అనుకున్నాడు.

చిత్రగ్రీవుడితో ఎగురుతున్న పావురాలు ఆ నూకలను చూశాయి. అవి నేలమీద వాలి, నూకలను తిందామనుకున్నాయి. “ఇది మనుష్యుల సంచారం లేని అడవి. ఈ నూకలు ఇక్కడకు ఎందుకు వస్తాయి ? కాబట్టి ఈ నూకలను ఆశపడకండి” అని చిత్రగ్రీవుడు స్నేహితులకు సలహా చెప్పాడు. ఒక ముసలిపావురం చిత్రగ్రీవుడి మాటలు కాదంది. నూకలు తిందామంది. సరే అని పావురాలు కిందికి దిగాయి. వలలో చిక్కుకున్నాయి.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

పావురాలు అప్పుడు ముసలి పావురాన్ని తిట్టాయి. చిత్రగ్రీవుడు “తిట్టకండి. మనం అంతా కలసి ఎగిరిపోదాం. నాకో స్నేహితుడు ఉన్నాడు మనల్ని రక్షిస్తాడు” అని చెప్పింది. పావురాలు అన్నీ కలసి వల ఎత్తుకొని, చిత్రగ్రీవుడి స్నేహితుడు హిరణ్యకుడు అనే ఎలుక ఉండే కన్నం దగ్గర వాలాయి. హిరణ్యకుణ్ణి చిత్రగ్రీవుడు గొంతెత్తి పిలిచాడు. హిరణ్యకుడు స్నేహితుని మాట విని పావురాల బంధాలన్నీ తన పళ్లతో కొరికివేశాడు. పావురాలు చిత్రగ్రీవుణ్ణి, హిరణ్యకుణ్ణి మెచ్చుకున్నాయి. అందుకే మనందరికీ మంచి స్నేహితులు ఉండాలి.

పద్యాలు – ప్రతిపదార్థాలు – భావాలు

I.

1వ పద్యం

చ. కనుఁగొని నెమ్మది న్నెగులు గ్రమ్మఁగ రక్కసియొజ్జయంచుఁ బే
ర్కొనఁ దగునట్టి శుక్రునకుఁ గూరిమి కూఁతురు దేవయాని నాఁ
దవరిన యిన్నెలంత నొక తప్పునకై వృషపర్వుపట్టి నూ
తమ బడఁద్రోచి పోయెనని దాని తెఱం గది విన్నవించివన్.

ప్రతిపదార్థం :
కనుగొని = చూచి ;
నెమ్మదిన్ = తన మనస్సులో
నెగులు = దుఃఖము
క్రమ్మగన్ = వ్యాపించగా
రక్కసియొజ్జయంచున్;
రక్షసి = రాక్షసులకు
ఒజ్జ = గురువు
అంచున్ = అని
పేర్కొనన్ = చెప్పడానికి
తగునట్టి = తగిన
శుక్రునకున్ = శుక్రుడు అనే వానికి
కూరిమి కూతురు = ప్రియమైన బిడ్డ
దేవయానినాన్ = దేవయాని అనే పేరుతో
తనరిన = ఒప్పిన
ఇన్నెలంతన్ (ఈ + నెలంతన్) = ఈ స్త్రీని (ఈ దేవయానిని)
ఒక తప్పునకై = ఒక్క తప్పుకోసం ;
వృషపర్వుపట్టి = వృషపర్వుడు అనే రాక్షసరాజు కూతురు ; శర్మిష్ఠ
నూతను = నూతిలో
పడఁదోచి (పడన్ + త్రోచి) = పడేటట్లు తోసి
పోయెన్ = వెళ్ళిపోయింది ;
అని = అని
దాని తెఱంగు = ఆమె విషయము (ఆ శర్మిష్ఠ విషయమును)
అది విన్నవించినన్ = ఆ ఘూర్ణిక అనే దేవయాని చెలికత్తె, యమాతి మహారాజుకు తెలుపగా,

భావం :
దేవయాని చెలికత్తె అయిన ఘూర్ణిక అనే ఆమె, యయాతి మహారాజును చూసి, తన మనస్సులో దుఃఖము నిండగా, ఆమె “ఓ మహారాజా! ఈమె దానవగురువు అని చెప్పబడే, శుక్రాచార్యుని కుమార్తె. ఈమె పేరు దేవయాని. ఈమెను ఒక తప్పుకొఱకు వృషపర్వుని కూతురు, ఈ బావిలో త్రోసిపోయింది” అని ఆ దేవయాని విషయమును, యయాతి మహారాజుకు చెప్పింది.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

2వ పద్యం

తే. ‘అతివ, వృషపర్వుఁడన నెవ్వఁ? డతని యనుఁగుఁ
గూఁతుపేరేమి? తనుఁబట్టినూతఁద్రోయు
నంతపని యేమి చేసె నీయలరుఁబోఁడి?’
యనుడు నవ్వాలుగంటి యయాతిఁ జూచి

ప్రతిపదార్థం :
అతివ = ఓ యువతీ ! (ఓ ఘూర్ణికా!)
వృషపర్వుడు = వృషపర్వుడు
అనన్ = అనగా (అంటే)
ఎవ్వడు = ఎవడు ?
అతని = అతని యొక్క (ఆ వృషపర్వుని యొక్క)
అనుగు కూతురు = గారాబమైన బిడ్డ
పేరేమి (పేరు + ఏమి) = పేరు, ఏమిటి ?
తనుఁబట్టి (తనున్ + పట్టి) = తనను పట్టుకొని (ఈ దేవయానిని పట్టుకొని)
నూతన్ = బావిలో
త్రోయు = పడద్రోయవలసిన
అంతపని = అంత తప్పుపని;
ఈ అరుఁబోడి = ఈ పూవువంటి శరీరముగల ఈ సుకుమారి (దేవయాని)
ఏమి చేసె = ఏమి చేసింది ?
అనుడున్ = అని యయాతి ఘూర్ణికతో అనగా ;
అవ్వాలు గంటి (ఆ + వాలుగంటి) = ఆ దీర్ఘములైన కన్నులుగల ఘూర్ణిక
యయాతిన్ = యయాతి మహారాజును ;
చూచి = చూసి

భావం :
ఆ యయాతి మహారాజు ఘూర్ణికను చూసి, “ఓ యువతీ! వృషపర్వుడంటే ఎవరు ? అతని కూతురు పేరేమిటి? ఈ దేవయాని, తనను పట్టుకొని నూతిలో పడద్రోయవలసినంత దోషము ఏమి చేసింది ?” అని అడుగగా, ఆ ఘూర్ణిక ఆ మహారాజుతో.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

3వ పద్యం

క. విను వృషపర్వుఁ డనంగాఁ
దనరున్ రక్కసులతేఁడు తన కనిలోనం
బెనఁగఁదగు మార్తు నెందుం
గని యెఱుఁగక జగము లేలుఁగడ లేని సిరిన్

ప్రతిపదార్థం:
విను = వినుము ; (ఓ మహారాజా! వినుము)
వృషపర్వుడు = వృషపర్వుడు.
అనంగాన్ = అనే
రక్కసులఱేడు = రాక్షసరాజు
తనరున్ = ఒప్పుచుండును (ఉన్నాడు)
తనకున్ = ఆ మహారాజునకు (ఆ మహారాజుతో)
అనిలోనన్ = యుద్ధంలో ;
పెనగందగు (పెనగన్ + తగు) = యుద్ధం చేయగల
మార్తున్ = శత్రువును
ఎందున్ = ఎక్కడనూ
కని = చూచి ;
ఎఱుగక = తెలియక
సిరిన్ = ఐశ్వర్యంతో
జగ = లోకాలు
ఏలున్ = పాలిస్తాడు.

భావం:
ఓ మహారాజా ! చెపుతాను విను. వృషపర్వుడనే పేరుగల ఒక రాక్షసరాజు ఉన్నాడు. ఆయనతో సాటిగా యుద్ధం చేయగల రాజు ఎవ్వరూ లేరు. అతడు అంతులేని ఐశ్వర్యంతో, లోకములను ఏలుతున్నాడు.

విశేషం : వృషపర్వుని సభానిర్మాణము రాక్షసులలో 1) దైత్యులు, 2) దానవులు, 3) అసురులు అని మూడు తెగలు ఉన్నాయని, రాజశేఖరుడు ‘కావ్యమీమాంస’లో చెప్పాడు. 1) హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు, బలి – మొదలగువారు, దైత్యులు. అనగా వీరు దితి కుమారులు. విప్రచిత్తి, శంబరుడు, నముచి మొదలయినవారు దానవులు. అనగా వారు దనువు కుమారులు. బలి, వృత్రాసురుడు, వృషపర్వుడు మొదలయినవారు, అసురులు.

ఇందులో వృషపర్వుడు, కశ్యపప్రజాపతి కుమారుడు. ఇతని తల్లిపేరు దనుజ. “మయబ్రహ్మ”, వృషపర్వుడికి సభాభవనం నిర్మించాడు. ఈ సభాభవనం కోసం తెచ్చిన వాటిలో మిగిలిన సామాగ్రితోనే, మయుడు ధర్మరాజుకు ‘మయసభ’ను కట్టి ఇచ్చాడు. ఆనాటి సభాభవనాల్లో, మయసభకు ఉన్న ఖ్యాతి చాలా గొప్పది.

వృషపర్వుని సభ కట్టగా మిగిలిన సామాగ్రితో కట్టిన మయసభయే అంత అందంగా ఉందంటే, ఇక వృషపర్వుడి సభ ఎంత అందమో ఊహించాల్సిందే.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

4వ పద్యం

తే. అతని కూఁతురు శర్మిష్ఠ యనఁగ నొప్పుఁ
గూర్మి సకియలు వేగురు గొల్వనెపుడు
నా చెలియఁగూడి యీ కొమ్మయాడుకొనుచు
నరమరలు లేని చెలుముల ననఁగి పెనఁగి.

ప్రతిపదార్థం :
అతని కూతురు = ఆ వృషపర్వుడనే రాక్షసరాజు కూతురు,
శర్మిష్ఠయనఁగన్ (శర్మిష్ఠ + అనగన్) = శర్మిష్ఠ అనే పేరు గలది ;
ఒప్పున్ = ఒప్పుతోంది ; (ఉంది)
కూర్మిసకియలు = ప్రియమైన చెలులు ; (ఆమెను)
ఎపుడున్ = ఎప్పుడూ
వేగురు కొల్వన్ = వేయిమంది సేవిస్తుండగా ;
ఒప్పున్ = ఒప్పుతుంది ; (ఆమె ఉంటుంది)
ఆ చెలియన్ = ఆ శర్మిష్ఠను ;
కూడి = కలసి ;
ఈ కొమ్మ = ఈ దేవయాని ;
అరమరలు లేని = పొరపొచ్చెములులేని ;
చెలుములన్ = స్నేహాంతో
అనగి పెనగి = కలసిమెలసి
ఆడుకొనుచున్ = ఆడుకుంటూ

భావం :
ఆ వృషపర్వునికి శర్మిష్ఠ అను పేరు కల కూతురు ఉంది. ఆమెకు వేయిమంది చెలులు. ఎప్పుడూ సేవలు చేస్తూ ఉంటారు. ఆ శర్మిష్ఠతో ఈ దేవయాని పొరపొచ్చెములు లేని స్నేహంతో కలసిమెలసి ఆడుకుంటూ తిరుగుతుంది.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

II.

5వ వచనం.

వచనం : తిరుగుచు నొక్కనాడు నీరాట సల్పునట్టియెడ.

ప్రతిపదార్థం :
తిరుగుచున్ = ఈ విధంగా వారు స్నేహంగా తిరుగుతూ;
ఒక్కనాడు = ఒకరోజున
నీరాట సల్పునట్టియెడన్ (నీరాట + చల్పు + అట్టి + ఎడన్) ;
నీరాట = జలక్రీడ
చల్పు + అట్టి + ఎడన్ = చేసేటటువంటి సమయంలో

భావం :
అలా తిరుగుతూ, ఒకరోజు వారు జలక్రీడ చేస్తున్న సమయంలో

36వ పద్యం

క. సురకరువలి చనుదెంచిన
దరిఁబెట్టినకోక లెల్లఁదడఁబడి పోఁగా
నరిగి యవి దెచ్చి చెలు ల
బ్బుర మగు తమ చీర లెల్లఁ బూనిన, నందున్

ప్రతిపదార్థం:
సురకరువలి = సుడిగాలి
చనుదెంచినన్ = రాగా
దరిన్ = ఒడ్డునందు (గట్టున)
పెట్టిన = తాము పెట్టినటువంటి (తాము పెట్టుకున్న)
కోకలు = కోకలు (చీరలు)
ఎల్లన్ = అన్నీ
తడబడిపోగాన్ = తారుమారు కాగా (చెల్లాచెదరు కాగా):
అరిగి = వెళ్ళి (వారందరూ గట్టుమీదికి వెళ్ళి)
అవి = ఆ తారుమారయిన చీరలు ;
తెచ్చి = తీసుకొనివచ్చి ;
చెలులు = ఆ శర్మిష్ఠ. చెలికత్తెలు
అబ్బురమగు = ఆశ్చర్యకరమైన
తమ చీరలు + ఎల్లన్ = తమ చీరలనన్నింటినీ
పూనినన్ = ధరింపగా
అందున్ = ఆ చీరల లోపల

భావం :
సుడిగాలిరాగా, గట్టుమీద వారు పెట్టుకున్న చీరలన్నీ తారుమారు అయ్యాయి (చెల్లాచెదరయ్యాయి). దానితో ఆ చెలికత్తెలు అపుడు పైకి వెళ్ళి, వారి బట్టలు తెచ్చుకొని ధరించారు.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

7వ పద్యం

క. లలి నీ నెలఁతయుఁ దానును
వలువలు వీడ్వడఁగ దాల్చి, వైళమె చెలువల్
దలఁపింప నెఱిఁగి కినుకం
గులుకుచు రక్కసుల తేని కూఁతురు తెగువన్.

ప్రతిపదార్థం :
లలిన్ = ఒప్పునట్లుగా
ఈ నెలతయున్ = ఈ దేవయానియునూ ;
తానును = ఆ శర్మిష్ఠయునూ
వలువలు = చీరలు
వీడ్వడఁగఁ దాల్చి (వీడ్వడగన్ + తాల్చి) = తారుమారుగా ధరించి; (ఒకరి చీర మరొకరు కట్టుకొని)
వైళమ = ఆ వెంటనే
చెలువల్ = రాజకుమార్తె చెలికత్తెలు
తలపింపన్ = వారికి తమ పొరపాటును తెలియబరచగా
ఎఱిగి = అది తెలిసికొని (ఆ పొరపాటును తెలిసి)
కినుకన్ = కోపంతో
కులుకుచున్ = (తుళ్ళిపడుతూ) (పోట్లాడుతూ)
రక్కసుల లేని కూతురు = రాక్షసరాజు వృషపర్వుని కూతురు ; (శర్మిష్ఠ)
తెగువన్ = సాహసంతో

భావం :
అప్పుడు ఈమెయు, ఆమెయు ఒకరి చీరలు మరొకరు కట్టుకున్నారు. అది చూసి, చెలులు వారికి తెలియబరచారు. అపుడు రాక్షసరాజు కూతురు శర్మిష్ఠ ఆ విషయం తెలిసికొని, కోపంతో త్రుళ్ళిపడుతూ, సాహసంతో ఇలా అంది.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

8వ పద్యం : (కంఠస్థ పద్యం)

* ఉ. ‘నెట్టన రేయినిం బగలు నేరమి వెట్టునటంచు వేలుపు
ల్వెట్టియుఁ గొట్నముల్చలుప వ్రీలని చేబలు వొప్పు పోఁకుడుం
బట్టము గట్టుకొన్న వృషపర్వుని కూఁతుర, నట్టి నేను నీ
కట్టిన మైలఁ గట్టుదునె కావరమేటికి వచ్చెనీ’ కనన్.

ప్రతిపదార్థం:
నెట్టన = మిక్కిలిగా
రేయినిన్ = రాత్రియునూ
పగలున్ = పగలునూ
నేరమీ వెట్టునటంచున్ (నేరమి + పెట్టును + అటంచున్) ;
నేరమి = దోషము
పెట్టు వేలుపుల్ = ఆరోపిస్తాడని ;
వెట్టియున్ = దేవతలు
కొట్నముల్ = ఊడిగములును (సేవలును)
చలుపన్ = చేస్తుండగా
వ్రీలని = భంగపడని
చేబలు వొప్పు (చేబలువు + ఒప్పు) = భుజబలము ఒప్పుతుండగా
సోకుడుంబట్టము (సోకుడు + పట్టము) = రాక్షసరాజ్యానికి పట్టాభిషేకము
కట్టుకున్న = చేసికొన్న
వృషపర్వుని కూతురన్ = వృషపర్వునికి కూతురిని
అట్టినేను = అటువంటి నేను
నీ కట్టిన మైలన్ = నీవు కట్టి విడిచిన మైలకోకను;
కట్టుదు = కట్టుకుంటానా ?
నీకున్ = నీకు
కావరము = గర్వము
ఏటికిన్ = ఎందుకు
వచ్చెన్ = వచ్చింది
అనన్ = అనగా

భావం :
“దేవతలందరూ ఎక్కడ తమను తప్పుపడతారో అని, రాత్రింబగళ్ళు తప్పకుండా వెట్టినీ, ఊడిగాన్నీ చేస్తుండగా, తిరుగులేని భుజబలంతో రాక్షసరాజ్యానికి పట్టాభిషేకం చేసికొన్న వృషపర్వుడి కూతురిని. అటువంటి నేను, నీవు కట్టుకున్న మైల చీరను కట్టుకుంటానా ? నీకు ఇంత పొగరు ఎందుకు వచ్చింది” అని శర్మిష్ఠ దేవయానిని అడిగింది.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

III.

9. వచనం విని యయ్యెలనాఁగకు దేవయాని యిట్లనియె.

ప్రతిపదార్థం :
విని = ఆ శర్మిష్ఠ మాటలు విని
అయ్యెలనాగకున్ = ఆ యువతియైన శర్మిష్ఠకు
దేవయాని = ఈ దేవయాని
ఇట్లనియె (ఇట్లు + అనియె) = ఇలా చెప్పింది.

భావం :
అది విని, శర్మిష్ఠతో దేవయాని ఇలా అన్నది.

10వ పద్యం

క. ‘ఉసు తొక్కటియై బొందులు
వెస రెండుగ నుండి, వల్వవీడ్వడుటకుఁ గాఁ
గస రెద, విధి తగ వగునా ?
పసిబిడ్డవె ? వాయి తెఱచి పల్కెదవు చెలీ !

ప్రతిపదార్థం:
చెలీ = ఓ చెలియా ! శర్మిష్ఠా !
ఉసురు = ప్రాణము (మన ఇద్దరి ప్రాణము)
ఒక్కటియై = ఒకటే అయి
బొందులు = శరీరాలు ;
వెసన్ = క్రమముగా ;
రెండుగన్ + ఉండి = రెండుగా ఉండి ;
వల్వ = చీర
వీడ్వడుటకుగాన్ = తారుమారైనందుకుగాను ;
కసరెదు = (నన్ను) కసరుకొంటున్నావు ; (విసుగుకుంటున్నావు)
ఇది = ఇలా కసరుకోడం
తగునా (తగవు + అగునా) = న్యాయమేనా ?
వాయి = నోరు
తెఱచి = తెరిచి
పల్కెదవు = మాట్లాడుతున్నావు.
పసిబిడ్డవె (పసిబిడ్డవు + ఎ) – నీవు పసిపిల్లవా ? ; (అంత తెలియని దానివా ?)

భావం :
ఓ చెలీ ! మనం ఇద్దరమూ ప్రాణం ఒకటియై, శరీరాలు రెండుగా బ్రతుకుతున్నాము. నీవు చీర తారుమారై నందుకే, ఇంతగా కసరుతున్నావు. ఇది న్యాయమేనా ? నోరుచేసి మాట్లాడుతున్నావు. నీవేమి పసిదానవా ?

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

11వ పద్యం

క. అనవుడు మడుగకఁ మిక్కిలి
కినుకం గేరడము లాడ గేలిగఁ గొనుచు
న్విని విని వేసరి యోర్వక
యెనసిన వగతోడఁ గూడ నీ పడుచనియెన్

ప్రతిపదార్థం :
అనవుడున్ = అని దేవయాని అనగా
ఉడుగక = మానక
మిక్కిలి కినుకన్ = మిగుల కోపంతో
కేరములు = నిష్ఠూరములు
ఆడన్ = పలుకగా (శర్మిష్ఠ మాట్లాడగా)
కేలిగన్ = పరిహాసముగా
కొనుచున్ = తీసుకుంటూ (శర్మిష్ఠ మాటలను)
విని విని = ఆ మాటలు విని విని ;
వేసరి = విసిగి, (దేవయాని విసిగి)
ఓర్వక = ఓర్చుకోలేక
ఎనసిన = పొందిన
వగతోడఁ గూడన్ (వగతోడన్ + కూడన్) = ఆ మాటలకు కలిగిన దుఃఖముతో కూడా
ఈ పడుచు = ఈ దేవయాని ;
అనియెన్ = ఇలా చెప్పింది

భావం :
ఈ దేవయాని అలా అన్నప్పటికీ, శర్మిష్ఠ మానక, కోపంతో అలాగే నిష్ఠూరములు మాట్లాడగా, ఈ దేవయాని వాటిని పరిహాసంగా భావించి విని విని, విసిగిపోయి, చివరకు వాటిని ఓర్చుకోలేక, మనస్సులో కలిగిన దుఃఖముతో ఇలా అంది.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

12వ పద్యం : (కంఠస్థ పద్యం)

మత్తకోకిల.
‘ఓలి రక్కసి వంగడంబున కొజ్జకూరిమి కూఁతుర
వేలవేలుపుఁగన్నియం దగనీపు గట్టినపుట్టముం
దాలుపందగునమ్మ నా’ కని దాని కర్మిలిఁ బల్కఁ దా
నాలకింపక నూతఁద్రోచి గయాళి యై చనియెవ్వడిన్.

ప్రతిపదార్థం :
ఓలి = చెలీ !
రక్కసివంగ డంబునకున్ = రాక్షస వంశానికి
ఒజ్జ = గురువైన (శుక్రునకు)
కూరిమి కూతురన్ = గారాపు బిడ్డను;
నేలవేలుపు కన్నియన్= బ్రాహ్మణ కన్యను
తగన్ = ఒప్పునట్లుగా
నీవు = నీవు
కట్టినపుట్టమున్ = ధరించిన వస్త్రాన్ని
నాకున్ = నాకు ;
తాలుపన్ = ధరించడానికి
తగునమ్మ = తగునా తల్లీ !
అని = అని
దానికిన్ = ఆమెకు (శర్మిష్ఠకు)
అర్మిలిన్ + పల్కన్ = ప్రేమతో బదులు చెప్పగా
తాన్ = ఆమె (శర్మిష్ఠ)
ఆలకింపక = ఆ మాటలు వినక ;
గయాళియై = గయ్యాళిదై
వడిన్ = వేగముగా (దేవయానిని)
నూతన్ + త్రోచి = బావిలోకి తోసి
చనియెన్ = వెళ్ళింది.

భావం :
ఓసీ శర్మిష్ఠా ! నేను మీ రాక్షస వంశానికి తగినట్టి గురువైన శుక్రాచార్యుని గారాబు బిడ్డను. బ్రాహ్మణ కన్యను. కనుక నాకు మాత్రము, నీవు కట్టిన వస్త్రమును కట్టవచ్చునా? అని, ఆమె మాటలకు ప్రేమగా బదులు పలుకగా, శర్మిష్ఠ ఆ మాటలను వినిపించుకోకుండా, గయ్యాళితనముతో ఈమెను బావిలోకి త్రోసి వెళ్ళింది.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

13. వచనం
అని యక్కలికి తెఱం గెఱింగించిన విని
కటకటంబడుచు మగిడి పొగడందగు తేజినెక్కి
మక్కువతో యయాతి తన ప్రోలికిం జనియె.

ప్రతిపదార్థం :
అని = దేవయాని చెలికత్తె అయిన ఘూర్ణిక
అక్కలికి (ఆ + కలికి) = ఆ శర్మిష్ఠ యొక్క
తెఱంగు = విధమును
ఎఱింగించినన్ = తెలుపగా
విని = (యయాతి) ఆ మాటలు విని ;
కటకటం బడుచున్ = బాధపడుతూ
మగిడి = తిరిగి
పొగడంగ (పొగడన్ + తగు) = పొగడదగిన
తేజిన్ = గుఱ్ఱాన్న
ఎక్కి = ఎక్కి
మక్కువతోన్ = ప్రేమతో
యయాతి = యయాతి
తన ప్రోలికిన్ = తన పట్టణానికి
చనియెన్ = వెళ్ళాడు.

భావం :
అని దేవయాని చెలికత్తె అయిన ఘూర్ణిక ఆ సంగతంతా చెప్పగా విని, జాలిపడుతూ, ‘తిరిగి శ్రేష్ఠమైన గుఱ్ఱాన్ని ఎక్కి, యయాతి మహారాజు తన పట్టణానికి వెళ్ళాడు.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

పాఠం నేపథ్యం

ప్రతిష్ఠానపురానికి రాజు యయాతి. అతడు ఒకసారి వేటకు వెళ్ళినపుడు దారితప్పి, జాబాలి అనే ఋషి ఆశ్రమం చేరుకుంటాడు. జాబాలి అతనికి రామాయణ కథ సంక్షిప్తంగా చెప్పి, ఒంటరిగా అడవిలో తిరుగరాదని ఉపదేశించి పంపిస్తాడు. తిరిగి వెళ్తున్న యయాతి దప్పికగొని ఒక నూతి దగ్గరకు పోయాడు. ఆ నూతిలో నున్న ఒక స్త్రీ తనను రక్షించుమని ఏడుస్తుంటే అతడు కాపాడుతాడు. అప్పుడు అక్కడికి చేరిన ఆమె చెలికత్తె రాజుతో వివరించిన సంగతులే ఈ పాఠం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందినది. సంస్కృత పదాలను ఉపయోగించకుండా, కేవలం అచ్చతెలుగు మాటలతో రాసిన కావ్యం ఇది. అచ్చతెనుగు పదాలు, అనగా దేశ్యపదాలు, మఱియు వికృతి పదాలు కలిసిన భాష. యయాతి చరిత్ర, తెలుగులో మొదటి అచ్చతెనుగు కావ్యం.

‘యయాతి చరిత్ర’ అనే ఈ అచ్చతెనుగు కావ్యాన్ని “పొన్నికంటి తెలగన” రచించాడు.
ఈ పాఠం, ‘యయాతి చరిత్ర’ కావ్యంలోని తృతీయాశ్వాసములోనిది.

కవి పరిచయం

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి 1
పాఠం పేరు : ‘చెలిమి’

కవి పేర : ‘పొన్నికంటి తెలగన’

కవి కాలం : 16వ శతాబ్దం

పొన్నికంటి తెలగన ప్రసిద్ధి : పొన్నికంటి తెలగన, అచ్చతెనుగులో నియమబద్ధమైన కావ్య రచనకు పూనుకున్న “అచ్చ తెనుగు ఆదికవిగా” ప్రసిద్ధుడు.

నివాస స్థలము : గోలకొండ పరిసరాలలోని ‘పొట్లచెరువు’ (సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరువు).

తండ్రి : తెలగన తండ్రిపేరు, “భావనామాత్యుడు”.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

మార్గదర్శకుడు : అచ్చతెనుగు కావ్యరచనకు, తెలగనయే నియమాలను ఏర్పరచి, అచ్చతెనుగు కావ్యరచనకు “మార్గదర్శకుడు”గా నిలిచాడు.

యయాతి చరిత్ర : ‘యయాతి చరిత్ర’ కావ్యం, తెలుగు సాహిత్యంలో అచ్చతెనుగు కావ్యాల్లో మొదటిది. మరియు అత్యుత్తమమైనది.

కావ్య విశిష్టత అంకితము : ఈ యయాతి చరిత్రను తెలగన, “అమీన్ ఖాన్” అనే మహ్మదీయ సర్దారుకు, అంకితం చేశాడు.

ప్రవేశిక

సృష్టిలో స్నేహం తీయనిది. మనం తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేనివీ, తోడబుట్టిన వారితో కూడా చెప్పుకోలేనివీ, అయిన` విషయాలను, స్నేహితులకు చెప్పుకుంటాం. మిత్రుడు మన తప్పులను ఎత్తి చూపిస్తాడు. మన మంచిని మెచ్చుకుంటాడు. మనకు అవసరమైతే సాయము చేస్తాడు. ఆపదలు వచ్చినపుడు మనలను విడిచిపెట్టడు. రహస్యాలను దాస్తాడు.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

ఈ విధంగా ఎంతోమంది కలిసిమెలిసి ఉండే స్నేహితులు కూడా, ఒక్కొక్కసారి అనుకోకుండా శత్రువులుగా మారిపోతుంటారు. అలా మిత్రులు ఎందుకు శత్రువులుగా మారతారో తెలిసికోడానికి దానిలోగల మంచిని, చెడునూ విశ్లేషించి చూసుకోడానికి, ఈ పాఠం చదువుదాం.

TS 9th Class Telugu Guide 8th Lesson ఉద్యమ స్ఫూర్తి

Telangana SCERT 9th Class Telugu Guide Telangana 8th Lesson ఉద్యమ స్ఫూర్తి Textbook Questions and Answers.

TS 9th Class Telugu 8th Lesson Questions and Answers Telangana ఉద్యమ స్ఫూర్తి

చదువండి – ఆలోచించి చెప్పండి (Textbook Page No. 81)

గాంధీజీ భారతదేశంలో అన్ని వర్గాలకు ఏకైక మార్గదర్శకుడైనాడు. బ్రిటిష్వాళ్ళు ఈ విషయాన్ని గుర్తించి కలవరపడ్డారు. దేశమంతా వారి ఆధీనంలోనే ఉన్నది. కానీ ప్రజలు మాత్రం మనసులో గాంధీని ఆరాధిస్తున్నారు. భారతీయులు మూఢులు, అజ్ఞానులు అని వలస సామ్రాజ్యవాదులకు ఒక అపోహ. భారతజాతి ప్రజల మేధా సంపత్తిని వారు అనుమానించారు. ప్రపంచాన్ని పాలించటం, అందుకోసం విద్రోహాలకు పూనుకోవటం, చాలా గొప్ప సంగతి అని వారు అనుకున్నారు. కాని గాంధీ అహింసామార్గంలో ముందుకు సాగుతున్నారు.

సబర్మతి ఆశ్రమం నుండి దండియాత్ర ప్రారంభమైంది. ఈ బృందంలో 79 మంది త్యాగధనులైన దేశభక్తులున్నారు. ఉప్పు మీద పన్ను తొలగిస్తే కాని, మళ్ళీ సబర్మతి ఆశ్రమంలో అడుగుపెట్టనని ప్రతిజ్ఞ చేశాడు గాంధీ. దండియాత్ర 24 రోజులు సాగింది. దారి పొడువున నేల ఈనినట్లు గాంధీ అభిమానులు తండోపతండాలై స్వాగతసుమాలను వేదజల్లారు. దేశవ్యాప్తంగా ఈ యాత్ర పెద్ద అలజడి రేపింది. సముద్రతీరాల్లో కార్యకర్తలు కెరటాల్లా లేచారు. గాంధీజీ ఇట్లా ప్రజలందరిని ఏకం చేసి, స్వాతంత్ర్యోద్యమాన్ని వాహినిలా నడిపి, బ్రిటిష్ వారిని ఎదిరించారు.

ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రజలు గాంధీజీని ఎందుకు ఆరాధించారు ?
జవాబు:
గాంధీజీ భారతదేశంలో అన్ని వర్గాలకూ ఏకైక మార్గదర్శకుడు అయ్యాడు. అందువల్లనే, ప్రజలు గాంధీజీని ఆరాధించారు.

ప్రశ్న 2.
నాయకులు గాంధీజీని ఎందుకు అనుసరించారు ?
జవాబు:
గాంధీజీ సబర్మతి ఆశ్రమం నుండి, ఉప్పు సత్యాగ్రహానికి దండియాత్ర ప్రారంభించారు. గాంధీజీ స్వాతంత్ర్యోద్యమాన్ని అహింసామార్గంలో ప్రజలందరినీ ఏకంచేసి, సైన్యంలా నడిపించారు. అందువల్ల నాయకులు, గాంధీజీని అనుసరించారు.

TS 9th Class Telugu Guide 8th Lesson ఉద్యమ స్ఫూర్తి

ప్రశ్న 3.
గాంధీజీ అహింసా మార్గాన్ని ఎందుకు అనుసరించాడు ?
జవాబు:
బ్రిటిష్వారి వద్ద అంతులేని సైన్యం ఉంది. వారివద్ద తుపాకులూ, ఫిరంగులూ ఉన్నాయి. హింసా మార్గంలో బ్రిటిష్ వారిని ఎదిరించడం కష్టం. హింసా పద్ధతిలో వెడితే, ఎందరో దేశభక్తులు, ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. శాంతియుతంగా ఉద్యమాన్ని ఎక్కువకాలము నడుపవచ్చు. బ్రిటిష్ వారిని లొంగదీయవచ్చు. వారి సానుభూతి సంపాదించవచ్చు. అందుకే, గాంధీజీ అహింసా మార్గాన్ని అనుసరించారు.

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 84)

ప్రశ్న 1.
“తమ బ్రతుకు వరకు పరిధుల్ని పరిమితం చేసుకోవటం” అంటే ఏమిటి?
జవాబు:
ఈ రోజుల్లో మనుష్యులు, దేశంలో, రాష్ట్రంలో లేక తమ గ్రామంలో ఏమి జరిగినా, పట్టించుకోడం మానివేశారు. ఏ సంఘటన జరిగినా, అది తమకూ తమ వారికీ సంబంధించినవి కాకపోతే, వాటిని వారు పట్టించుకోడం మానివేశారు. ఆ సంఘటన ప్రభావం, తమపై పడినప్పుడే, మనుష్యులు శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రతి విషయాన్నీ తమచుట్టూ గిరిగీసుకొని, తనకూ తమవారికీ వారు పరిమితమవుతున్నారని అర్థం.

ప్రశ్న 2.
విప్లవసంఘం వారి చర్యలు కొన్ని ఎందుకు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా తోచినాయి ?
జవాబు:
ఆనాడు విప్లవకారులు, చిత్రవిచిత్రమైన బాంబులు తయారు చేసేవారు. అందులో ఇంద్రపాల్ అనే అతడు, మిత్రుల ప్రోద్బలంతో సన్యాసి వేషంలో వెళ్ళి, వైస్రాయి మీద బాంబు పేల్చాడు. ఈ విధమైన వారి చర్యలు, అహింసావాదులయిన దేశభక్తులకు, అద్భుతంగానూ, ఆశ్చర్యకరంగానూ తోచాయి.

TS 9th Class Telugu Guide 8th Lesson ఉద్యమ స్ఫూర్తి

ప్రశ్న 3.
సుఖదేవ్, భగత్సింగులకు ఉరిశిక్ష పడుతుందని తెలిసి దేశంలోని ప్రతి ఒక్కరు ఎందుకు తల్లడిల్లిపోయారు?
జవాబు:
సుఖదేవ్, భగత్సింగ్లు విప్లవ సంఘంలోని సభ్యులు. విప్లవసంఘం వారు కూడా దేశభక్తులే. వారి ఉద్యమం కూడా స్వాతంత్ర్య సిద్ధి కోసమే. కాని అహింసావాదుల విధానాలు, విప్లవసంఘంవారి విధానాలు వేరు వేరుగా ఉండేవి. విధానాలు వేరైనా సుఖదేవ్, భగత్సింగులు, దేశభక్తులైనందువల్ల, వారికి ఉరిశిక్ష పడుతుందని తెలిసి, దేశంలో ప్రతి ఒక్కరు తల్లడిల్లిపోయారు.

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 85)

ప్రశ్న 1.
బొంబాయిలో విదేశీ వస్త్ర బహిష్కరణోద్యమం జరిగిన పరిస్థితులను మీరు ఎట్లా అర్థం చేసుకొన్నారు ?
జవాబు:
ప్రజల్లో ముఖ్యంగా సత్యాగ్రహులు, విదేశ వస్త్రాలను ఎలాగైనా బహిష్కరించాలనే పట్టుదలతో ఉండేవారు. అందుకే వారు విదేశ వస్త్రాలు అమ్ముతానన్న వ్యాపారిని అమ్మవద్దని బ్రతిమాలారు. మరో యువకుడు విదేశ వస్త్రాలను తీసుకువెళ్ళే వ్యాపారి కారుకు అడ్డంగా పడుకొని, తన ప్రాణాలు విడిచాడు. దీనిని బట్టి సత్యాగ్రహులు ఈ ఉద్యమాన్ని ప్రాణప్రదంగా భావించారు.

ప్రభుత్వం అండదండలు ఉన్న కొంతమంది వ్యాపారులు మాత్రం, సత్యాగ్రహుల ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి విదేశ వస్త్రాలు అమ్మేవారు.

ప్రశ్న 2.
బ్రిటిషువారి హృదయాలు కర్కశమైనవని సంగెం లక్ష్మీబాయి ఎందుకన్నది?
జవాబు:

  1. మూర్షాబాద్ జైలులో మణిలాల్సేన్ అనే 17 సంవత్సరాల బాలుడు, 60 రోజులు నిరాహారదీక్ష చేసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
  2. జైలులో రాజకీయ ఖైదీలకు కల్తీ సరకులు ఇచ్చినంత కాలం, తాను తిండి తిననని మణిలాల్సేన్ నిరసన వ్రతం చేశాడు. ఈ విధంగా 60 రోజులు ఆ బాలుడు నిరసన వత్రం చేసినా, ఏ బ్రిటిష్ పాలకుడూ, అతడిని పట్టించుకోలేదు.
  3. అలాగే స్వాతంత్ర్యం కోసం, ఎందరో వీరులు ఆనాడు మరణించారు. అయినా బ్రిటిష్ పాలకుల మనస్సులు కరుగలేదు. అందుకే సంగెం లక్ష్మీబాయి, బ్రిటిష్వారి హృదయాలు కర్కశమైనవని అన్నది.

TS 9th Class Telugu Guide 8th Lesson ఉద్యమ స్ఫూర్తి

ప్రశ్న 3.
సమాజం వ్యాధిగ్రస్తమై పోయిందంటే, అర్థమేమిటి ?
జవాబు:
సమాజం వ్యాధిగ్రస్తమైందంటే, సమాజంలో స్వార్థము, అవినీతి, ఆశ్రిత పక్షపాతము, దేశద్రోహం, దేశభక్తి లేకపోడం, పదవీలాలస, ధన సంపాదనపై కోరిక వంటి దుర్గుణాలు పెరిగాయని అర్థము. ఆ దుర్గుణాలనే రోగాలు, సమాజంలో వ్యాపించాయని అర్థం.

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 86)

ప్రశ్న 1.
ప్రకృతికీ, ప్రాణికీ నడుమ గల అనుబంధం ఏమిటి?
జవాబు:
ప్రకృతికీ, ప్రాణీకీ గొప్ప అనుబంధం ఉంది. మన భారతీయులు పాములనూ, వృక్షాలనూ పూజించేవారు.

నేడు కూడా పూజిస్తున్నారు. పాము, కాలగమ్యాలకు సంకేతము. రావిచెట్టు, సృష్టిస్థితిలయములకు సూచకము. ఆటలాడేటప్పుడు పిల్లలకు బట్టలు తక్కువగా తొడిగితే వారిపై సూర్యకాంతి పడుతుంది. పిల్లలు మట్టి తినకుండా, మట్టిలో ఆడుతుంటే, వారికి నరాల పుష్టి కలుగుతుంది. ఈ విధంగా ప్రాణికీ, ప్రకృతికీ సంబంధం ఉంది.

ప్రశ్న 2.
మన పెద్దల చాకచక్యం ఏమిటి?
జవాబు:
మన పెద్దలు ప్రకృతికీ, ప్రాణికీ గల అనుబంధాన్ని విప్పి చెప్పారు. ఆరోగ్య సూత్రాలనూ, ఆధ్యాత్మిక భావనలనూ, మానవుడి నిత్యజీవితంలో గుప్పించి, వదిలేశారు. మన `పెద్దలు, ఆరోగ్యం కోసం ప్రత్యేకమైన శిక్షణలతో కాలహరణ లేకుండా, ఆరోగ్య సూత్రాలను ఎంతో చాకచక్యంతో వారు మనకు తెలియచెప్పారు.

TS 9th Class Telugu Guide 8th Lesson ఉద్యమ స్ఫూర్తి

ప్రశ్న 3.
“బాధ్యతాయుత ప్రవర్తనకూ, కర్తవ్య పాలనకూ కూడా మనకు స్వతంత్రం లభించింది” దీనిపై మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు:
స్వాతంత్ర్యం మనకు కొన్ని హక్కులను తెచ్చిపెట్టింది. ఆ హక్కులతోపాటు, మనము బాధ్యతతో ప్రవర్తించాలి. అలాగే మన కర్తవ్యాన్ని మనం చక్కగా నెరవేర్చాలి. స్వాతంత్ర్యం అంటే ఇష్టం వచ్చినట్లు తిరగడం,కాదు. మనం హక్కులను పొందినట్లే, మనపై బాధ్యత, కర్తవ్యం కూడా ఉంటాయని నా అభిప్రాయం.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
ఆనాటి కాలంలో కూడా సంగెం లక్ష్మీబాయి వంటివారు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని, సమాజ సేవకు అంకితమైనారు కదా! ఇందుకు దారితీసిన పరిస్థితులేమిటి ? ఇలాంటి ఆదర్శమూర్తుల అవసరం ఉందా? ఎందుకు ? మాట్లాడండి.
జవాబు:
సుమారు రెండు వందల సంవత్సరాలపాటు మనదేశం బ్రిటిష్వారి పాలన కింద బానిస దేశంగా ఉండిపోయింది. ఆ రోజుల్లో గాంధీజీ, నెహ్రూ, తిలక్ వంటి నాయకుల నాయకత్వంలో స్వాతంత్ర్యం కోసం ప్రజలు పోరాటం చేశారు. అప్పుడు సంగెం లక్ష్మీబాయి వంటి స్త్రీలు సహితం గాంధీజీ పిలుపును అందుకుని స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. ‘ వారు సత్యాగ్రహాలు, ధర్నాలు, పికెటింగులు చేశారు. వారు సమాజసేవకు నడుం కట్టారు. ఆ త్యాగమూర్తుల కృషివల్లనే నేడు మనం హాయిగా స్వాతంత్య్ర వాయువులను పీలుస్తున్నాము. నేడు మన దేశాన్ని మనం పాలించుకుంటున్నాము.

నేడు కూడా లక్ష్మీబాయి, దుర్గాబాయమ్మ వంటి త్యాగమూర్తుల సేవలు మన దేశానికి అవసరము. స్వాతంత్ర్యం సిద్ధించాక మనదేశంలోని ప్రజలలో నిర్లిప్తత పెరిగిపోయింది. స్వార్థం పెరిగిపోయింది. సంఘంలో ఎటువంటి పరిణామాలు వచ్చినా, ప్రజలు తమకు ఎందుకని స్పందించడం లేదు. ప్రజలు కర్తవ్యాన్ని మరచి, బాధ్యత లేకుండా ఉంటున్నారు.

ఆ నిర్లిప్తత పోవాలి.. దేశాభ్యున్నతి కోసం, సంఘం కోసం దేశ పౌరులంతా ముందుకు రావాలి. అందుకే లక్ష్మీబాయి వంటి త్యాగమూర్తుల సేవలు నేడు కూడా అవసరము.

TS 9th Class Telugu Guide 8th Lesson ఉద్యమ స్ఫూర్తి

ప్రశ్న 2.
పాఠం చదివి కింది పేరాలకు శీర్షికను పెట్టండి. ఆ పేరాలోని కీలక పదాలు రాయండి.
TS 9th Class Telugu Guide 8th Lesson ఉద్యమ స్ఫూర్తి 2
జవాబు:
TS 9th Class Telugu Guide 8th Lesson ఉద్యమ స్ఫూర్తి 3

ప్రశ్న 3.
మాసుమా బేగం గురించిన కింది పేరా చదువండి. సందర్భాన్ని బట్టి, ఖాళీలను సరైన పదాలతో పూరించండి.

“మాసుమాబేగం హైదరాబాదులో         1            ఆమె ప్రముఖ సంఘ           2             నైజాం రాజ్యంలో గ్రాడ్యుయేట్ అయిన మొదటి ముస్లిం మహిళ. అంజుమన్ – ఎ – ఖవాతీన్ ను స్థాపించి, బీద పిల్లల కోసం హైదరాబాదు నగరంలో ఏడు పాఠశాలలు          3             హైదరాబాదు నుంచి మంత్రి పదవి పొందిన మొదటి మహిళ మాసుమాబేగం. ఈమె చేసే పనుల్లో, సేవా కార్యక్రమాలలో ఆమె భర్త ప్రొఫెసర్ హాసిమాన్ అలీఖాన్ కూడా ఎంతో            4            ఈమె చేసిన సేవలకు గాను, భారత ప్రభుత్వం ఈమెను పద్మశ్రీ బిరుదుతో            5             .
జవాబు:
1) జన్మించింది
2) సేవకురాలు
3) నెలకొల్పింది
4) తోడ్పడ్డాడు
5) సత్కరించింది

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఆలోచించి, ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) స్వాతంత్ర్యం లభించినప్పటికీ, అది సంతోషం కలిగించటం లేదని సంగెం లక్ష్మీబాయి ఎందుకు భావించింది?
జవాబు:
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, సమాజం వ్యాధిగ్రస్తమైపోయింది. అందుకు కారణం, సమాజంలోని వ్యక్తులు. అంతేకాని స్వాతంత్ర్య సిద్ధి కాదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, రాజకీయ నాయకులలో స్వార్ధము, పదవీ లాలస, అక్రమ ధన సంపాదన, అవినీతి, లంచగొండితనం పెరిగిపోయాయి.

ప్రజలలో సాంఘిక నిర్లిప్తత పెరిగిపోయింది. దేశంలో ఎక్కడ ఏ మూల ఏమి జరిగినా, మనకెందుకులే అనే నిర్లిప్తత ప్రజల్లో పెరిగిపోయింది. ప్రజలు తామూ, తమ బ్రతుకూ వరకు పరిధుల్ని పరిమితం చేసుకుంటున్నారు. దేశం కోసం, తోటిప్రజల కోసం సేవచేయడం, త్యాగం చెయ్యడం అనే గుణాలు తగ్గిపోయాయి.

అందువల్లనే స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, అది తనకు సంతోషం కల్గించటం లేదని సంగెం లక్ష్మీబాయి భావించింది.

TS 9th Class Telugu Guide 8th Lesson ఉద్యమ స్ఫూర్తి

ఆ) గాంధీజీ అనుసరించిన అహింసా మార్గం దేశ స్వాతంత్ర్యోద్యమంలో కీలకపాత్ర పోషించిందని ఎట్లా చెప్పగలరు ?
జవాబు:
స్వాతంత్ర్య సాధనకు గాంధీజీ సత్యము, అహింస, సహాయ నిరాకరణము అనే వాటినే అస్త్రాలుగా స్వీకరించి బ్రిటిష్ వారితో పోరాడి స్వాతంత్ర్యం సాధించాడు. గాంధీజీ అనుసరించిన అహింసా మార్గం, స్వాతంత్య్ర సాధనలో ప్రధానపాత్ర పోషించింది.

బ్రిటిష్వారి వద్ద గొప్ప సైన్య సంపద ఉండేది. వారికి తుపాకీలు, విమానాలు, ఫిరంగులు ఉన్నాయి. గాంధీజీ హింసా మార్గాన్ని ఎన్నుకుంటే, బ్రిటిష్ వారు ఆ ఉద్యమాన్ని మిలటరీ సాయంతో అణచివేసి యుండేవారు. గాంధీ హింసా పద్ధతిలో పోరాడితే పెక్కుమంది ఉద్యమకారులు తమ ప్రాణాలు పోగొట్టుకొని యుండేవారు. ఎక్కువ మంది సత్యాగ్రహులు మరణిస్తే, ఉద్యమంలోకి ప్రజలు ఎక్కువగా వచ్చియుండేవారు కారు. ఆ విధంగా స్వాతంత్ర్య పోరాటం నీరసించి యుండేది.

అలాకాక, అహింసా పద్ధతిలో ఉద్యమం సాగడం వల్ల, ఉద్యమంపట్ల ప్రజలకూ, ప్రభుత్వానికీ, పాలకులకూ, సానుభూతి కలిగింది. కనుక అహింసామార్గం స్వాతంత్ర్య సాధనలో కీలకపాత్ర పోషించిందని చెప్పవచ్చు.

ఇ) బ్రిటిష్ వారి చేతుల్లోకి మనదేశ పాలన పోవుటకు గల కారణాలు వివరించండి.
జవాబు:
బ్రిటిష్వారు మొదట మనదేశానికి వర్తకం చేసుకోడానికి వచ్చారు. వర్తకం చేసుకోడానికి స్వదేశరాజుల అనుమతులు సంపాదించారు. స్వదేశరాజుల మధ్య తగవులు పెంచి, వారిలో తాము ఒకరి పక్షాన్ని వహించి, రెండవ వారిని దెబ్బతీసారు. తరువాత తాము సమర్థించిన రాజునూ దెబ్బతీశారు. స్వదేశరాజులకు మిలటరీ సాయం చేస్తామని చెప్పి, వారి నుండి కొన్ని రాజ్య భాగాలు సంపాదించారు.

క్రమంగా స్వదేశరాజులు దత్తత చేసుకోరాదని వారి రాజ్యాన్ని లాక్కున్నారు. అన్యాయంగా, అక్రమంగా స్వదేశరాజుల రాజ్యాల్ని లాక్కున్నారు. అన్యాయంగా, అక్రమంగా స్వదేశరాజుల రాజ్యాల్ని కుట్రలతో స్వాధీన పరచుకున్నారు. ఈ విధంగా వర్తక నెపంతో మనదేశానికి వచ్చి బ్రిటిష్వారు క్రమంగా మనదేశాన్నీ, మనదేశ సంపదనూ, కబళించి వేశారు.

TS 9th Class Telugu Guide 8th Lesson ఉద్యమ స్ఫూర్తి

ఈ) సంగెం లక్ష్మీబాయి రచనా విధానం ఎట్లా ఉన్నది?
జవాబు:
సంగెం లక్ష్మీబాయి తెలుగు పండితురాలు. సుప్రసిద్ధ దేశభక్తురాలు. ఈమె రచనా శైలి సంస్కృతాంధ్రపద సమ్మేళనంతో అనుప్రాసలతో అద్భుతంగా ఉంది. ఆమె రచనలో దేశభక్తి, బ్రిటిష్ వారిపై ద్వేషం అడుగడుగునా తొంగిచూస్తున్నాయి.

ఆనాడు దేశప్రజలు సంతోషంగా ఉరికంబాలెక్కారని ప్రజల దేశభక్తిని ఈమె ప్రశంసించింది. రచనలో మంచి పదబంధాలు ప్రయోగించింది. “ఉడుకు నెత్తురు ప్రవహించేలా”, “వీరావేశంతో జేజేలు కొట్టు” – “బాలుడి మరణం తల్లికీ, స్వదేశీయులకూ రంపపు కోత” – “వంటి మాటలు రాసింది. బ్రిటిష్ వారివి, కర్కశ హృదయాలన్నది. వారు పచ్చి నెత్తురు త్రాగే కిరాతకులన్నది. మన స్వదేశరాజులు దేశాన్ని బ్రిటిష్ వార్కి ధారాదత్తం చేశారని బాధపడింది.

ప్రపంచం. మారినా, మన భారతీయులు ఇంకా అజ్ఞానంలో మ్రగ్గుతున్నారనీ, కరవు కాటకాలు మారెమ్మలా ఊళ్ళమీద పడి ఊడ్చేశాయనీ, మంచి అనుప్రాసలతో ఈమె రచన సాగింది.

మన ప్రాచ్యదేశం అంతా అప్రాచ్యమని, పాశ్చాత్యులు నాగరికత కలవారని భారతీయులను తక్కువ చూపు చూసిన బ్రిటిష్ వారిని, ఈమె పరాన్న భుక్కులని ఎగతాళి చేసింది.

మనకు స్వాతంత్ర్యం, మన హక్కుల సంరక్షణకేకాక, బాధ్యతాయుత ప్రవర్తనకూ, కర్తవ్యపాలనకూ లభించిందని మనకు ఈమె గుర్తు చేసింది. లక్ష్మీబాయి రచనాశైలి ప్రభావవంతమైనది. చురుకైనది. పదబంధాలతో, తెలుగు నుడికారంతో సుందరంగా ఉంది.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) స్వాతంత్ర్య సమరయోధులు కన్నకలలు నిజం కావాలంటే మనకు లభించిన స్వాతంత్య్రాన్ని ఎట్లా సద్వినియో గించుకోవాలో విశ్లేషిస్తూ రాయండి.
జవాబు:
మన భారతదేశ ప్రజలు కేవలం తమ హక్కులను రక్షించుకోడమే కాదు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. భారతదేశ ప్రజలు పాటించవలసిన విధులనూ, కర్తవ్యాన్నీ, నిర్దుష్టంగా నెరవేర్చాలి. భారత ప్రజలలో సమాజంపట్ల నిర్లిప్తత పనికి రాదు.

TS 9th Class Telugu Guide 8th Lesson ఉద్యమ స్ఫూర్తి

మనది ప్రజాస్వామ్య దేశం. మన ప్రజలు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. మంచి శీలవంతమైన ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవాలి. అవినీతిపరులైన లంచగొండులైన వారిని దూరంగా తరిమికొట్టాలి. ప్రతివ్యక్తి సంఘంలో జరిగే చెడ్డను ఎదిరించి పోరాడాలి. లంచగొండితనాన్ని రూపుమాపాలి.

“మన దేశంలో అపారమైన సహజ వనరులు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. శ్రమించి పనిచేయాలి. సోమరితనం కూడదు. దేశాభివృద్ధికి ప్రతివ్యక్తి తన వంతుగా కష్టించి పనిచేయాలి. స్వచ్ఛభారత్ వంటి కార్యక్రమాల్లో మనస్ఫూర్తిగా పాల్గొని, దేశాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి.

వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలి. యువత శ్రద్ధగా చదువుకోవాలి. వృద్ధులను గౌరవించాలి. దేశభక్తి కలిగియుండాలి. దేశసంపదను కొల్లగొట్టే నీచులను తరిమికొట్టాలి.

ప్రతి భారతీయుడు పై విధంగా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ, బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే, స్వాతంత్య్ర సమరయోధుల కలలు ఫలిస్తాయి.

3. కింది అంశం గురించి సృజనాత్మకంగా/ప్రశంసాత్మకంగా రాయండి.

అ) నేటి కాలంలో కూడా సంగెం లక్ష్మీబాయి వంటి వారు ఎందుకు అవసరమో వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
సంగెం లక్ష్మీబాయి వంటి స్వాతంత్ర్య సమరయోధుల అవసరం

సంగెం లక్ష్మీబాయి, దుర్గాబాయి, వరలక్ష్మమ్మ వంటి దేశభక్తురాండ్రు ఆనాడు గాంధీ మహాత్ముని అడుగుజాడలలో నడచి, అహింసా పద్ధతిలో బ్రిటిష్ వారిపై స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు. కారాగారాలలో నిర్బంధింపబడ్డారు. లక్ష్మీబాయి గొప్ప దేశభక్తురాలు. సాంఘిక సేవా పరాయణురాలు.

దుర్గాబాయి ఆంధ్ర మహిళాసభ ద్వారా స్త్రీల అభ్యున్నతికి ఎంతో కృషిచేసింది. వరలక్ష్మమ్మగారు, లక్ష్మీబాయిగారు ఎందరినో కార్యకర్తలను తయారుచేశారు. వినోబాభావే భూదానోద్యమ యాత్రలో లక్ష్మీబాయి పాల్గొంది. బ్రిటిష్ వారిని దేశం నుండి తరిమి వేయడంలో వీరు ప్రముఖపాత్ర వహించారు.

TS 9th Class Telugu Guide 8th Lesson ఉద్యమ స్ఫూర్తి

ఇటువంటి మహిళామణుల ఆవశ్యకత స్వతంత్ర భారతంలో ఎంతగానో ఉంది. స్త్రీల అభ్యున్నతికి, స్త్రీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల సాధనకు, స్త్రీలపై జరిగే అత్యాచారాల నిరోధానికి, పెద్ద ఎత్తున దేశంలో ఉద్యమాలు జరగాలి.

స్వచ్ఛభారత్, బాలకార్మికుల నిరోధం, అవినీతి నిర్మూలనం, స్త్రీ విద్యాభివృద్ధి, స్త్రీలకు పురుషులతో సమానహక్కుల సాధన వంటి రంగాల్లో లక్ష్మీబాయి వంటి త్యాగధనులయిన మహిళామణుల సేవలు ఎంతో అవసరం. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు మహనీయులయిన దేశభక్తురాండ్ర అడుగుజాడల్లో నడిస్తే, మన భారతదేశం సస్యశ్యామలమై, రామరాజ్యమై వర్ధిల్లుతుంది.

III. భాషాంశాలు

పదజాలం

1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

అ) మనం మంచి చేస్తే, మనకూ మంచి జరుగుతుందని స్వానుభవం వల్ల తెలుసుకున్నాను.
జవాబు:
స్వానుభవము = తన అనుభవము
వాక్యప్రయోగం : స్వానుభవమును మించిన గుణపాఠము, వేరే ఉండదని నా నమ్మకము.

ఆ) తమ పిల్లలు ఉన్నతంగా ఎదగాలని తల్లిదండ్రులు పరితపిస్తూ ఉంటారు.
జవాబు:
పరితపిస్తూ = బాధపడుతూ
వాక్యప్రయోగం : జీవితమంతా బాధలతో పరితపిస్తూ బ్రతికే పేదవారిని ప్రభుత్వాలు ఆదుకోవాలి.

TS 9th Class Telugu Guide 8th Lesson ఉద్యమ స్ఫూర్తి

ఇ) బ్రిటిష్ వారు మనదేశ సంపదను కొల్లగొట్టి తీసుకొని పోయారు. ‘
జవాబు:
కొల్లగొట్టి = దోచుకొని
వాక్యప్రయోగం : దొంగలు ప్రజల సొమ్ములను కొల్లగొట్టి తీసుకుపోతారు.

2. కింది వికృతి పదాలకు ప్రకృతులను పాఠంలో వెతికి రాయండి.

ప్రకృతి   –   వికృతి
అ) గారవం  –  గౌరవం
ఆ) కత  –  కథ
ఇ) జీతం  –  జీవితము
ఈ) కఱకు  –  కర్కశము

వ్యాకరణాంశాలు

1. కింది పదాలను పరిశీలించి, అవి ఏ ఏ సంధులో గుర్తించి, పదాలను విడదీసి, సంధి సూత్రం రాయండి.

అ) మనకెందుకు = ………………………..
జవాబు:
మనకున్ + ఎందుకు – ఉకారవికల్ప సంధి
సూత్రము : ప్రథమేతర విభక్తి, శత్రర్థక చువర్ణములందున్న ఉకారానికి సంధి వైకల్పికముగానగు.

ఆ) విషాదాంతము = …………………………..
జవాబు:
విషాద + అంతము – సవర్ణదీర్ఘ సంధి
సూత్రము : అ, ఇ, ఉ, ఋ లకు అవియే అచ్చులు పరమైన సవర్ణదీర్ఘము ఏకాదేశంబగు.

TS 9th Class Telugu Guide 8th Lesson ఉద్యమ స్ఫూర్తి

ఇ) మేమెంత = …………………………..
జవాబు:
మేము + ఎంత – ఉత్వసంధి
సూత్రము : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు.

ఈ) ఎవరికున్నాయి = …………………………………
జవాబు:
ఎవరికిన్ + ఉన్నాయి – ఇత్వసంధి
సూత్రము : ఏమ్యాదుల ఇకారమునకు సంధి వైకల్పికముగానగు.

ఉ) విచిత్రమైన = …………………………………
జవాబు:
విచిత్రము + ఐన – ఉత్వసంధి
సూత్రము : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు.

2. కింది సమాస పదాలను పరిశీలించి, వాటికి విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.

అ) మాతృదేశం = ……………………………..
జవాబు:
తల్లి యొక్క దేశం – షష్ఠీ తత్పురుష సమాసం

ఆ) కర్కశహృదయం = …………………………….
జవాబు:
కర్కశమైన హృదయము – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

TS 9th Class Telugu Guide 8th Lesson ఉద్యమ స్ఫూర్తి

ఇ) సహాయనిరాకరణ = ……………………….
జవాబు:
సహాయమును నిరాకరించడం – ద్వితీయా తత్పురుష సమసం

ఈ) విప్లవసంఘం = ……………………………
జవాబు:
విప్లవకారుల యొక్క సంఘం – షష్ఠీ తత్పురుష సమాసం

ఉ) అశ్వత్థవృక్షం = …………………………..
జవాబు:
‘అశ్వత్థము’ అనే పేరుగల వృక్షము – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం

ఊ) శాస్త్రదృష్టి = ……………………………..
జవాబు:
శాస్త్రము యొక్క దృష్టి – షష్ఠీ తత్పురుష సమాసం

యణాదేశ సంధి

* కింది పదాలను విడదీయండి. విడదీసిన పదాలను కలిపి, కలిగిన మార్పులను గమనించండి.
ఉదా :
TS 9th Class Telugu Guide 8th Lesson ఉద్యమ స్ఫూర్తి 4
TS 9th Class Telugu Guide 8th Lesson ఉద్యమ స్ఫూర్తి 5

గమనిక : పై మూడు రకాల ఉదాహరణల ద్వారా కింది అంశాలను గమనింపవచ్చు. ఇ, ఉ, ఋ లకు అసవర్ణములు కలిస్తే ఇ, ఉ, ఋ లకు ఆదేశంగా య్, వ్, ర్ లు అంటే, య, వ, ర, లు వస్తాయి. య, వ, ర, ల, లను ‘యణులు’ అని పిలుస్తారు. ‘యణులు’ ఆదేశంగా వచ్చే సంధి కాబట్టి ఇలా ఏర్పడిన సంధిని “యణాదేశ సంధి” అంటారు.

TS 9th Class Telugu Guide 8th Lesson ఉద్యమ స్ఫూర్తి

ఇ, ఉ, ఋ లకు, అసవర్ణములైన అచ్చులు పరమైనపుడు, ‘యణులు’ ఆదేశంగా వస్తాయి.

అసవర్ణములు : అసవర్ణములు అంటే సవర్ణములు కాని అచ్చులు.
ఉదా : ‘ఇ’ కి, ఇ, ఈ లు కాకుండా, మిగిలిన (అ, ఆ, ఉ, ఊ, ఋ, ౠ, ఎ, ఏ, ఐ; ఒ, ఓ, ఔ) అచ్చులు అసవర్ణాచ్చులు.

అభ్యాసము : కింద ఇచ్చిన పదాలను విడదీసి, యణాదేశ సంధి అవునో కాదో పరిశీలించండి.

అ) అభ్యుదయం = …………………………
జవాబు:
అభి + ఉదయం = యణాదేశ సంధి
వివరణ : ‘అభి’ అనే పదంలో చివర ‘ఇ’ ఉంది. దానికి ‘ఉ’ అనే అసవర్ణాచ్చు పరమైంది కాన యణాదేశం వచ్చి, అభ్యుదయం అయ్యింది.

ఆ) గుర్వాజ్ఞ = ………………………
జవాబు:
గురు + ఆజ్ఞ = యణాదేశ సంధి
వివరణ : ‘గురు’ అనే పదంలో చివర ‘ఉ’ అనే అచ్చు ఉంది. దానికి ‘ఆ’ అనే అసవర్ణాచ్చు పరమై యణాదేశ సంధిలో ‘వ్’ వచ్చింది.

ఇ) మాత్రంశ = ………………………
జవాబు:
మాతృ + అంశ = యణాదేశ సంధి
వివరణ : ‘మాతృ’ అనే పదంలో చివర ‘ఋ’ ఉంది. దానికి ‘అ’ అనే అసవర్ణాచ్చు పరమయ్యింది. యణాదేశంగా ‘ర్’ వచ్చింది.

TS 9th Class Telugu Guide 8th Lesson ఉద్యమ స్ఫూర్తి

ఈ) మధ్వరి = ………………………………
జవాబు:
మధు + అరి = యణాదేశ సంధి
వివరణ : ‘మధు’ అనే పదంలో చివర ‘ఉ’ ఉంది. దానికి అసవర్ణమైన అచ్చు ‘అ’ పరమై యణాదేశంగా ‘వ్’ వచ్చింది.

ఉ) స్వాగతం = …………………………….
జవాబు:
సు + ఆగతం = యణాదేశ సంధి
వివరణ : ‘సు’ అనే పదంలో, చివర ‘ఉ’ అనే అచ్చు ఉంది. దానికి ‘ఆ’ అనే అసవర్ణాచ్చు పరమైంది. యణాదేశంగా ‘ప్’ వచ్చింది.

ఊ) మీ పాఠ్యపుస్తకంలో యణాదేశ సంధికి సంబంధించిన పది పదాలు వెతికి రాయండి.
జవాబు:
యణాదేశ సంధులు:

  1. ప్రత్యర్థులు = (ప్రతి + అర్థులు) – (నేనెరిగిన బూర్గుల – 2వ పాఠం)
  2. అధ్యయనం = (అధి + అయనం) – (రంగాచార్యతో ముఖాముఖి – 4వ పాఠం)
  3. ప్రత్యేకమైన = (ప్రతి + ఏకమైన) – (రంగాచార్యతో ముఖాముఖి – 4వ పాఠం)
  4. ప్రత్యేక తెలంగాణ = (ప్రతి + ఏక) – (రంగాచార్యతో ముఖాముఖి – 4వ పాఠం)
  5. ప్రత్యేకమైన శిక్షణ = (ప్రతి + ఏకమైన) – (దీక్షకు సిద్ధంకండి – 6వ పాఠం)
  6. అత్యాచారము = (అతి + ఆచారము) – (ఉద్యమ స్ఫూర్తి – 8వ పాఠం)
  7. అభ్యుదయం = (అభి + ఉదయం) – (వాగ్భూషణం – 10వ పాఠం)
  8. అధ్యయనం = (అధి + అయనం) – (వాగ్భూషణం – 10వ పాఠం)
  9. స్మృత్యర్థం = (స్మృతి + అర్థం) – (తీయని పలకరింపు – 12వ పాఠం)

ప్రాజెక్టు పని

స్వాతంత్ర్య పోరాటంలో (లేదా) తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఇద్దరు, ముగ్గురు మహిళల వివరాలు సేకరించి, నివేదిక రాయండి.
జవాబు:
విద్యార్థి కృత్యం

TS 9th Class Telugu Guide 8th Lesson ఉద్యమ స్ఫూర్తి

కఠిన పదములకు – అర్థములు

I.

(83వ పేజి)

అర్థాలు :
నిర్లిప్తత = దేనినీ పట్టించుకోకపోడం
కాఠిన్యము = కఠినత్వము(కర్కశత్వము)
పరిధుల్ని = చుట్టుగోడలను (కంచెలను)
పరిమితంచేసికోవటం = కొలతపెట్టుకోడం ;
గడ్డ = నేల;
విభ్రాంతి = భ్రాంతి లేక భ్రమ
గాథలు = కథలు
సమర సంరంభం = యుద్ధ ఉత్సాహము
జీవితాహుతులకు (జీవిత + ఆహుతులకు) = ప్రాణాలను సమర్పించి నందులకు;
కడలినై = సముద్రమునై
ఘోషించాను = మ్రోతపెట్టాను (అఱచాను)
మాతృదేశ శృంఖలాలను = తల్లిదేశపు సంకెళ్ళను
వీరవాహిని = వీర సైన్యము
అలగా = కెరటంగా
స్వానుభవం (స్వ + అనుభవం) = స్వంత అనుభవం
నిర్లిప్తత = పట్టించుకోకపోడం
నిర్వీర్యత = పౌరుషం లేకపోవడం
సహాయనిరాకరణం = సహాయం చేయడానికి అంగీకరించకపోడం
పోరాటానికి = యుద్ధానికి ;

TS 9th Class Telugu Guide 8th Lesson ఉద్యమ స్ఫూర్తి

ప్రతీకారవాంఛ = ఎదురు దెబ్బతీయాలనే కోరిక ;
అహింసావాదులము = హింస పనికిరాదని చెప్పేవారము
తల్లడిల్లిపోవు = భయపడి కంపించిపోవు
అప్రూవరు (Approver) = ప్రభుత్వం తరఫున సాక్షి
ప్రోద్బలం = పెద్దబలము ; (ప్రేరణ)
శతవిధాల = వంద విధాలుగా (అనేక విధాలుగా)
విఫలులైనారు = ప్రయత్నం ఫలించని వారు అయ్యారు.
నిర్జన ప్రదేశానికి = మనుష్యులు లేని చోటుకు ;
నమోదు అవడం = చేరడం

84వ పేజీ

ఉప్పెనలా = తుపానులా ;

II.

చర్యలు = చేసే పనులు
విషాదాంతం (విషాద + అంతం) = చివరకు దుఃఖాన్ని తెచ్చేవి;
ఘోరమైన = భయంకరమైన
దారుణాలు = క్రూరకృత్యాలు
ప్రతినిత్యం = ప్రతిరోజు
బహిష్కరణోద్యమం (బహిష్కరణ + ఉద్యమం) = వెలివేయాలనే పోరాటం ;
సవాలుచేస్తూ = ఇది ఏమిటని నిలదీసి అడుగుతూ;
సత్యాగ్రహులు = సత్యాగ్రహ ఉద్యమకారులు
విరమించుకోమని = మానుకొమ్మని
ప్రాధేయపడ్డారు = బ్రతిమాలారు
హాస్పిటల్ (Hospital) = వైద్యశాల
స్తంభించిపోయారు = మొద్దుబారిపోయారు (స్తంభంలా బిగిసిపోయారు)
పరితపించిపోవు = మిక్కిలి బాధపడిపోవు
అండదండలు = సహాయములు;

TS 9th Class Telugu Guide 8th Lesson ఉద్యమ స్ఫూర్తి

విచ్చలవిడిగా (విడిగా + విడిగా) = ఇష్టం వచ్చినట్లుగా
దారుణానికి = క్రూరకృత్యానికి
గంధపుష్పాక్షతలు = గంధము, పుష్పములు, అక్షతలు ;
వీరావేశం (వీర + ఆవేశం) = పరాక్రమపు పొంగు
దుర్మరణానికి = అకాలమరణానికి
సానుభూతి = దుఃఖాన్ని వెల్లడించడం.
చెల్లాచెదరు = అటుఇటుపోవు
పికెటింగు (Piqueting) = పోలీసులను రానీకుండా అడ్డుకోడం
శ్రేణి = గుంపు
నిరసనవ్రతం = నిరాహారదీక్ష
అసువులు కోల్పోవు = ప్రాణాలు పోగొట్టుకొను;
పాలకుడు = పాలనాధికారి
గడగడలాడించింది = వణికించింది
కర్కశహృదయాల్ని = కఠినమైన మనసులను
రంపపు కోత = అంపముతో కోసినట్లు నొప్పి కలగడం ;

85వ పేజి

అత్యాచారాలు = అనుచిత ప్రవర్తనలు
ప్రబలిపోవు = ఎక్కువగు
అట్టుడికినట్లు ఉడకడం = ఒక విషయమై పెద్ద గగ్గోలు ఏర్పడం
కిరాతకులు = మ్లేచ్ఛ జాతీయులు
తోచేవారు = కనబడేవారు
అధోగతిపాలగు = కిందికి పతనమగు
నిట్టూర్చడం = నిట్టూర్పులు వదలడం
ధారాదత్తం చేయు = దానంగా ఇవ్వడం (వట్టినే ఇవ్వడం)
కొల్లగొట్టి = దోచుకొని
అనాగరికులు = నాగరికత లేనివారు
పరిగణిస్తూ = లెక్కిస్తూ
అడపాదడపా = అప్పుడప్పుడు

TS 9th Class Telugu Guide 8th Lesson ఉద్యమ స్ఫూర్తి

వసతులు = ఆనుకూల్యములు (సుఖములు)
అజ్ఞానంలో మ్రగ్గు = తెలివితక్కువలో అణిగి యుండు
కాటకములు = కరవులు,
మారెమ = అమ్మవారు ;
ఊడ్చేస్తూ ఉండడం = తుడిచిపెట్టేయడం
ఛాందసాచారాలు (ఛాందస + ఆచారాలు) = లోకజ్ఞానంలేని ఆచారాలు
ప్రవచిస్తూ ఉంటే = చెపుతూ ఉంటే
వ్యాధిగ్రస్తము = రోగంతో ఆక్రమింపబడినది

III.

186 వపేజీ

సుభిక్షం = మంచివర్షం పడి, పంట బాగా పండి ఆహారం, ఆరోగ్యం సమృద్ధిగా ఉండడం
అగ్ని రగులు = అగ్ని ప్రజ్వరిల్లు
గలకపోతే = ప్రజ్వరిల్లకపోతే
హారిబుల్ (Horrible) = భయంకరమైన, దారుణమైన
నిరు పేదలు = మిక్కిలి బీదవారు
పరిహసిస్తూ ఉంటే = వేళాకోళం చేస్తూ ఉంటే
లజ్జాకరంగా = సిగ్గుపుట్టేటట్లుగా
కాలగమ్యాలకు = కాలగమనమునకు (కాలం నడకకు)
సంకేతము = చిహ్నము, గుర్తు
అశ్వత్థ వృక్షం = రావి చెట్టు
ఉష్ణదేశం = వేడిదేశం
నరాలపుష్టి = నరాల బలము
నిపుణులు = నైపుణ్యం గల నేర్పరులు
అనుబంధం = సంబంధం
ఆధ్యాత్మిక భావనలు = పరమాత్మ సంబంధమైన ఆలోచనలు
దైనందిన జీవితం = నిత్యజీవితం
కుప్పించి = గుప్పించి ;
కాలహరణ = కాలం ఖర్చుకాకుండా
ప్రాచ్యము = తూర్పుదేశాల ప్రాంతం
అప్రాచ్యము = పాశ్చాత్యదేశాల ప్రాంతం
ప్రాచ్యులు = తూర్పుదేశస్థులు
పరాన్నభుక్కులు (పర + అన్నభుక్కులు) = ఇతరుల అన్నాన్ని తినేవారు
ఛాందసాచారాలు = లోకజ్ఞానం లేని ఆచారాలు
దిక్కుకానక = దిక్కు కనబడక

TS 9th Class Telugu Guide 8th Lesson ఉద్యమ స్ఫూర్తి

సంతోషాస్పదం (సంతోష + ఆస్పదం) = సంతోషం కల్గించేది
సంరక్షణార్థము = సంరక్షించుకోడం కోసం
బాధ్యతాయుత ప్రవర్తన = బాధ్యతతో కూడిన నడవడి
కర్తవ్యపాలన = చేయవలసిన పనిని చేయడం
స్ఫురణ = స్ఫూర్తి (ప్రేరణ)
కొరవడటమే = లోపించటమే
హేతువు = కారణము
స్వార్ధపరులు = తమ బాగును మాత్రమే కోరుకొనేవారు
సాంఘిక బాధ్యత = సంఘం ఎడల బాధ్యత
శోచనీయంగా = విచారింపవలసినదిగా

పాఠం ఉద్దేశం

నేనొక్కడిని బాగుంటే చాలు ఎవరు ఏమైతే నాకెందుకు ? అనే స్వార్థం సమాజంలో రోజు రోజుకు పెరిగిపోతున్నది. సామాజిక అభివృద్ధిని కోరుకునే సహృదయత చాలా వరకు కరువైంది. త్యాగాల పోరాటాల ఫలితంగా లభించిన స్వాతంత్య్ర లక్ష్యం నెరవేరడం లేదు. సామాజిక బాధ్యతతో నైతికతతో మనమందరం జీవించినప్పుడే స్వాతంత్య్రానికి సార్థకత లభిస్తుందని చెప్పటమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం ‘ఆత్మకథ’ అనే ప్రక్రియకు చెందినది. ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను, ఒక గ్రంథంగా రాస్తే, అది ”ఆత్మకథ’ అవుతుంది. దీనినే స్వీయచరిత్ర అని కూడా పిలుస్తారు. ఇందులో రచయిత అనుభవాలే కాక, సమకాలీన విశేషాలు, ఆనాటి ఆర్థిక, రాజకీయ, సాంఘిక పరిస్థితులు కూడా ప్రతిబింబిస్తాయి. ఇవి చదివిన వారికి, మంచి ప్రేరణను కలిగిస్తాయి. ఆత్మకథలు, ఉత్తమ పురుష కథనంలో సాగుతాయి.

TS 9th Class Telugu Guide 8th Lesson ఉద్యమ స్ఫూర్తి

ప్రస్తుత పాఠ్యభాగం, సంగెం లక్ష్మీబాయి రాసిన “నా జైలు జ్ఞాపకాలు – అనుభవాలు” అనే ఆత్మకథలోనిది.

రచయిత్రి పరిచయం

TS 9th Class Telugu Guide 8th Lesson ఉద్యమ స్ఫూర్తి 1
పాఠం : ‘ఉద్యమ స్ఫూర్తి’

రచయిత్రి : సంగెం లక్ష్మీబాయి

దేని నుండి గ్రహించబడినది : రచయిత్రి రాసిన “నా జైలు జ్ఞాపకాలు – అనుభవాలు” అనే ఆత్మకథ నుండి గ్రహించబడినది.

జన్మస్థలము : ఈమె మేడ్చల్ జిల్లాలోని ‘ఘటకేశ్వరం’ అనే గ్రామంలో జన్మించింది.

జననమరణాలు : జననము 27-07-1911. మరణము 1979 వ సంవత్సరం

ఉద్యోగం : హైదరాబాదు నారాయణగూడ బాలికల ఉన్నత పాఠశాల వార్డెనుగా, తెలుగు పండితురాలిగా ఈమె పనిచేసింది.

పదవులు : ఈమె బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో విద్యాశాఖ ఉపమంత్రిగా పనిచేశారు. ఈమె 1957 నుండి 1971 వరకు 15 సంవత్సరాలు లోక్సభ సభ్యురాలుగా ఉన్నారు.

TS 9th Class Telugu Guide 8th Lesson ఉద్యమ స్ఫూర్తి

పాల్గొన్న ఉద్యమాలు :

  1. గాంధీజీ పిలుపుతో ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని, జైలుకు వెళ్ళిన మొదటి తెలంగాణ మహిళ ఈమె.
  2. 1951లో తెలంగాణలో వినోబాభావే చేసిన భూదానోద్యమ యాత్రలో పాల్గొన్న ప్రథమ మహిళ ఈమె.

ప్రవేశిక

చిన్నతనంలో తల్లిని, వివాహమైన కొంత కాలానికే భర్తను కోల్పోయినా లక్ష్మీబాయి నిరాశ పడలేదు. తండ్రికి ఇష్టం లేకపోయినా ఎన్నో కష్టాలను ఓర్చి చదువుకొన్నది. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనటం, స్త్రీల అభ్యున్నతికి కృషిచేయడం కోసమే తాను జీవించాలని భావించిన మహనీయురాలు సంగెం లక్ష్మీబాయి.

తన జీవిత విశేషాలు, తాను చూసిన స్వాతంత్ర్యోద్యమాన్ని కండ్లకు కట్టినట్లు, మనకు స్ఫూర్తిని కలిగించేటట్లు రాసింది. ఆనాటి స్వాతంత్ర్యోద్యమ సంఘటనలు కొన్ని ఈ పాఠం చదివి తెలుసుకుందాం.

TS 9th Class Telugu Important Questions 11th Lesson వాయసం

These TS 9th Class Telugu Important Questions 11th Lesson వాయసం will help the students to improve their time and approach.

TS 9th Class Telugu 11th Lesson Important Questions వాయసం

PAPER – I : PART – A

I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)

అ) కింది ప్రశ్నకు ఐదు వాక్యాలలో జవాబు రాయండి.

ప్రశ్న 1.
‘స్వర ప్రాణుల పట్ల దయగలిగి ఉండాలి’ ఎందుకు ?
జవాబు:
ప్రకృతిలో భగవంతుడు పుట్టించిన ప్రాణులన్నీ విలువైనవే. వేటి విలువ వాటికి ఉంటుంది. ప్రాణులన్నీ ప్రకృతిలో స్వేచ్ఛగా జీవించాలి. మనం ప్రతి ప్రాణినీ, వాటి ప్రత్యేకతలను అనుసరించి ఆదరించాలి. ప్రాణులన్నిటి యందూ దయ కలిగి ఉండాలి. స్వార్థచింతనతో స్వలాభాన్నే చూసుకోవడం వల్ల తోటి ప్రాణులకు హాని కలుగుతుంది. మనకు సాయం చేసే పశుపక్ష్యాదులను చులకనగా చూడకుండ, వాటిపట్ల ఆదరణ చూపాలి. ప్రాణుల ఆకారాన్ని బట్టి, అరుపును బట్టి కాక వాటిపైన అభిమానాన్ని చూపాలి.

TS 9th Class Telugu Important Questions 11th Lesson వాయసం

ఆ) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
“కాకి నలుపు కలుషితమైనది కాదు’ ఎందుకో వివరించండి. (లేదా) ప్రతి ప్రాణికి తనదైన ప్రత్యేకత ఉంటుంది. ‘వాయసం’ పాఠం ఆధారంగా కాకి ప్రత్యేకతలు తెలుపండి. (లేదా) కాకి విశిష్టతను సొంతమాటల్లో రాయండి.
జవాబు:
కాకి మానవులకు మంచి ఉపకారం చేసే పక్షి. కాకులు జనావాసాల నుండి చెత్తాచెదారాన్నీ, మలిన పదార్థాలనూ దూరంగా తీసుకుపోతాయి. ఆ విధంగా కాకులు మన పరిసరాల పరిశుభ్రతకు తోడ్పడుతున్నాయి.

మనం కాకిని చీదరించుకుంటాం అయినా అది నొచ్చుకోదు. అన్న కొడుకు తన పినతండ్రిని, ‘కాక కాక’ అని ప్రేమతో పిలిచినట్లుగా, కాకి ‘కాక’ అని అరుస్తుంది. అది తెలియక కలుపుగోలుతనం లేని మనం, కాకిని చీదరించుకుంటాము.

నిజానికి పాపాత్ముడి మనస్సులో పేరుకుపోయిన నలుపు కంటె, కాకి నలుపు కలుషితమైనది కాదు. శ్రీకృష్ణుడు నలుపు. ఈశ్వరుని కంఠం నలుపు. చంద్రుడి ముఖంలో మచ్చ నలుపు. మనుష్యుల తలలు నలుపు. అటువంటప్పుడు, కాకి నలుపును అసహ్యించుకోడం అనవసరం. అది తప్పు.

కాకి మన ఇళ్ళమీద వాలి, మన క్షేమ సమాచారాన్ని అడుగుతుంది. మనం చీదరించుకున్నా, కాకి మన ప్రాణ స్నేహితుడిలా : వచ్చిపోవడం మానదు కాకిని మనం చీదరించి కొట్టినా, కాకి ఏ మాత్రం విసుక్కోదు. రాయబారివలె చుట్టాలు మన ఇంటికి వస్తున్నారన్న వార్తను తెస్తున్నట్లుగా గొంతు చింపుకొని తన నోరు నొప్పిపెట్టేటట్లు అరుస్తుంది.

ఎప్పుడో ఏడాదికొకసారి వచ్చి కూసే కోయిలను మనం మెచ్చుకుంటాం. అదే రోజూ వచ్చి మనలను పలుకరించే కాకిని మనం చులకనగా చూస్తాం. కాని కాకి నిజానికి మనకు ప్రాణస్నేహితుడిలాంటిది.

TS 9th Class Telugu Important Questions 11th Lesson వాయసం

ప్రశ్న 2.
‘నలుపంటే ఈసడించుకోవద్దు’ నలుపు లోకమంతటా ఉన్నది. దీనిని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
చెడును నల్లని రంగుతోనూ, మంచిని స్వచ్ఛమైన తెల్లని రంగుతోనూ కవులు పోలుస్తారు. ఇది కేవలం పోలిక మాత్రమే. నిజానికి నలుపు రంగు స్థిరమైనది. శాశ్వితమైనది. మిగిలిన రంగులవలె రంగులు మారే గుణం లేనిది నలుపు. సంఘంలో నలుపురంగు పట్ల చులకన భావం ఉంది. అలా నలుపుపై వ్యతిరేక భావం తగదు:

నల్లనైన వర్ణంతో ఉండే మహావిష్ణువు సకల లోకాల్లో పూజింపబడేవాడై వెలయలేదా ? విషాన్ని తాగి నల్లబడిన కంఠంతో వింతగా కనిపించినా, పరమశివుడు శుభకరుడని కీర్తింపబడలేదా ? అందమైన చంద్రుని ముఖంలో నల్లని మచ్చ ఉన్నా, చంద్రుడు చల్లని వెన్నెలలు కురిపించడం లేదా ? మనుషుల తలలు నలుపు. చీకటిదారులు నలుపు.

ఆకాశం, నీరు, రాత్రి, నీడ నలుపు. మాయలో పడిపోయి పొర్లాడే మాయావి అయిన వ్యక్తి నలుపు. చీకటి మయమైన మనిషి అజ్ఞానం కూడా నలుపు. అలాంటప్పుడు నల్లధనాన్ని అసహ్యించుకోవడం ఎందుకు ? ఇలా ఆలోచించగలిగినప్పుడు వర్ణభేదం ఉండదు. మన జీవితంలో, శరీరంలో ఉన్న నలుపును చూసి కూడా నలుపును ఈసడించుకోవడంలో అర్థం లేదు.

ప్రశ్న 3.
“సృష్టిలో ప్రతిజీవి విలువైనదే” సమర్థిస్తూ రాయండి.
జవాబు:
ప్రకృతిలో భగవంతుడు పుట్టించిన ప్రాణులన్నీ విలువైనవే. వేటి విలువ వాటికి ఉంటుంది. ప్రాణులన్నీ ప్రకృతిలో స్వేచ్ఛగా జీవించాలి. మనం ప్రతి ప్రాణినీ, వాటి ప్రత్యేకతలను అనుసరించి ఆదరించాలి. ప్రాణులందరి యందు దయ కలిగి ఉండాలి. సృష్టిలో ప్రతి జీవికి దానికంటూ కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. కాకి రూపం, స్వరం కనులవిందు, వీనుల విందు కానప్పటికి, అది ఎంగిలి మెతుకులు ఏరుకొనితిని, ఆ ప్రదేశాన్ని శుభ్రం చేస్తుంది.

ఎంత చేసినా పాపం కాకిని ఎవరూ గౌరవంగా చూడరు. విశ్వాసానికి మారుపేరైన కుక్క రేయింబవళ్ళు కుక్క కాపలాకాసి యజమానిని రక్షిస్తుంది. అటువంటి ఆ కుక్కకు ఎంగిలి మెతుకులే దిక్కు గోడల మీద తిరిగే బల్లి దోమలను తిని మనల్ని దోమకాటు నుండి కాపాడుతుంది. దానిపట్ల మనం చూపుతున్న కృతజ్ఞత ఏది ? బల్లి మీద పడితే (పొరపాటున) తలస్నానం చేయాలని, కష్టాలని భావిస్తాము. పొద్దున్నే నిద్రలేపే కోడిని, నిద్రలేచి కూర చేసుకొని తింటున్నాము. ఇలా మేక, గేదె, ఆవు ఇంకా అనేక పక్షులు ప్రధానంగా మనుష్యుల వలనే అంతరించిపోతున్నాయి. కనుక ‘సృష్టిలో ప్రతిజీవి విలువైనదే’ అన్న విషయాన్ని గుర్తెరిగినపుడే జీవరాశుల జీవనానికి సహకరించిన వారౌతాము.

TS 9th Class Telugu Important Questions 11th Lesson వాయసం

ప్రశ్న 4.
వాయసం పాఠం ద్వారా కాకి గొప్పతనాన్ని తెలుసుకున్నావు కదా, అలాగే చీమ. గొప్పతనాన్ని వివరించుము.
జవాబు:
చీమలు సంఘజీవులు. ఎప్పుడూ బారులు బారులుగా వెళుతుంటాయి. ఎక్కడ ఆహారపు పదార్థం ఉన్నట్టు పసిగట్టినా చట్టుక్కున అక్కడికి వెళతాయి. తమ బరువు కన్నా ఎన్నో రెట్లు బరువున్న ఆహార పదార్థాన్ని కష్టపడి చాలా దూరం వెతుకుతూ ఆహారాన్ని మోస్తూ, బారులుగా పుట్టలోకి తెస్తాయి. కొత్త ప్రదేశాలకు వెళ్ళినపుడు ఒక్కొక్కసారి మనమయినా దారి తప్పుతాము గానీ, చీమలు మాత్రం దారి తప్పకుండా మళ్ళీ తమ పుట్టలోకే వచ్చేస్తాయి.

అవి దారిని గుర్తుపెట్టుకోవడానికి ఒక రకమైన జిగురుని దారి వెంట వదులుకుంటూ వెళతాయి. తిరిగి వచ్చేటప్పుడు ఆ జిగురును వాసన చూసుకుంటూ తికమక పడకుండా నేరుగా వస్తాయి. అందుకే అవి వరుసగా వస్తుంటాయి. అవి వెళ్ళేదారిలో ఏదైనా నీటి ప్రవాహం లాంటిది సంభవించినపుడు అవి వందలాదిగా కలిసి ఉండచుట్టుకొని దొర్లుకుంటూ సురక్షితంగా వచ్చేస్తాయి. చీమలు ఎత్తు నుండి పడినా వాటికి దెబ్బ తగలదు. కారణం చీమలలాంటి తేలిక జీవుల విషయానికొస్తే వాటిపై పనిచేసే గురుత్వాకర్షణ బలం, గాలి నిరోధక శక్తి చాలా వరకు సమానంగా ఉండటం వల్ల అవి సమవేగంతో నేలను చేరతాయి. అందువల్ల వాటికి హాని జరుగదు.

భూమి మీద జీవనం సాగించిన తొలిప్రాణి చీమ. సూర్యుని నుండి ఒక అగ్ని శకలం వేరుపడి కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాతకది చల్లబడి భూమిగా ఏర్పడిందని చెబుతారు. భూమిపైన కాసే ఎండకే మనం ఎంతో బాధపడతాం కదా ! భూమిలోపల జీవించే చీమ ఎంతో వేడిని తట్టుకోగల శక్తి గలదని తెలుస్తున్నది. అల్పప్రాణియైన ఎంతో తెలివైనదిగా చీమను గుర్తించాలి మనం.

TS 9th Class Telugu Important Questions 11th Lesson వాయసం

PAPER – I : PART – B

భాషాంశాలు – పదజాలం :

I. సొంతవాక్యాలు:

1. కాకి బలగం : దుర్యోధనుని కాకి బలగం అంతా ఉత్తరుని పెండ్లికి తరలివెళ్ళారు.
2. కాకిపిల్ల కాకికి ముద్దు : కాకిపిల్ల కాకికి ముద్దన్నట్లు రాము గీసిన బొమ్మలు రాముకి నచ్చుతాయి.
3. కాకిగోల : చెట్లు కింద పిల్లల కాకిగోల ఏమిటా ? అని ఆరాతీస్తే కోతి వచ్చిందిట.
4. మసిబూసి మారేడు కాయ : పరీక్షల వేళ ప్రాజెక్టు రికార్డును మసిబూసి మారేడుకాయ చేసినట్లు స్టిక్కర్లతో గోపి ఆకర్షణగా తయారుచేశాడు.
5. గావుకేకలు : పూతన పెట్టిన గావుకేకలకు వ్రేపల్లె జనమంతా ఉలిక్కిపడ్డారు.
6. ప్రాణసఖుడు : శ్రీకృష్ణునికి – అర్జునుడు వలే దుర్యోధనునికి – కర్ణుడు ప్రాణసఖుడేగాని స్వామిభక్తి ఎక్కువ.
7. ఏకరువు పెట్టు : ఎన్నో ఏళ్ళకు ఊరికి వచ్చిన మిత్రుడికి గోపి ఊరి సంగతులన్నీ ఏకరువు పెట్టాడు.
8. కలుపుగోలుతనం : సాధారణ జనంలో ఉన్నంత కలుపుగోలుతనం ధనిక కుటుంబాలలో కూడా కనిపించదు.
9. బంధుజనం : చుట్టాలు – మా బంధుజనం ఎప్పుడూ తీర్థయాత్రలలోనే కాలం గడుపుతున్నారు.

II. అర్థాలు :

ప్రశ్న 1.
“వెన్నుడు” అనే పదానికి అర్థం
A) వెన్ను కలవాడు
B) విష్ణువు
C) శివుడు
D) ఇంద్రుడు
జవాబు:
B) విష్ణువు

TS 9th Class Telugu Important Questions 11th Lesson వాయసం

ప్రశ్న 2.
సొమ్ము, ధనము – అనే అర్థం గల పదము
A) రూపాయి
B) పాడిపంటలు
C) లిబ్బులు
D) మబ్బులు
జవాబు:
C) లిబ్బులు

ప్రశ్న 3.
చెట్టు మీద “బలిపుష్టము” కాకా అని అరిచింది
A) పుష్టి బలం
B) పాప ఫలం
C) రామచిలుక
D) వాయసము
జవాబు:
D) వాయసము

ప్రశ్న 4.
“ప్రేమ” అనే అర్థం గల పదం
A) కులుక
B) పెరిమ
C) తియ్యని
D) కమ్మని
జవాబు:
B) పెరిమ

TS 9th Class Telugu Important Questions 11th Lesson వాయసం

ప్రశ్న 5.
“చుక్కల దొర” అంటే అర్థం
A) సూర్యుడు
B) చంద్రుడు
C) ముగ్గు
D) రాముడు
జవాబు:
B) చంద్రుడు

ప్రశ్న 6.
అమావాస్య నాటి ఇరులు భయపెడతాయి – గీత గీసిన పదానికి అర్థం
A) రాత్రులు
B) చీకట్లు
C) నక్షత్రాలు
D) ఆకాశం
జవాబు:
B) చీకట్లు

ప్రశ్న 7.
పక్క చూపులు చూచు కపట చిత్తులు మెచ్చరు – గీత గీసిన పదానికి అర్థం
A) దయ
B) జాలి
C) మోసం
D) స్వార్థం
జవాబు:
C) మోసం

TS 9th Class Telugu Important Questions 11th Lesson వాయసం

ప్రశ్న 8.
లోకాన దీనుల శోకాల కన్నీటి గాథలేకరువు పెట్టుదువు – గీత గీసిన పదానికి అర్థం
A) బాధ
B) కథ
C) నవల
D) వ్యాసం
జవాబు:
B) కథ

ప్రశ్న 9.
మోసంతో మసిబూసి, మారేడుకాయ జేసేవాడు ఖలుడు – గీత గీసిన పదానికి అర్థం
A) నీచుడు
B) మనిషి
C) రాక్షసుడు
D) మంచివాడు
జవాబు:
A) నీచుడు

ప్రశ్న 10.
లొట్టి మీద కాకిలాగ వాగుతున్నావు – గీత గీసిన పదానికి అర్థం
A) లొట్ట
B) చెట్టు
C) ఒక పిట్ట
D) కల్లుకుండ
జవాబు:
D) కల్లుకుండ

TS 9th Class Telugu Important Questions 11th Lesson వాయసం

III. ప్రకృతి, వికృతులు :

ప్రశ్న 1.
పక్షము – అనే పదానికి వికృతి
A) పక్షి
B) పచ్చము
C) పక్క
D) పాట
జవాబు:
C) పక్క

ప్రశ్న 2.
అంచ – అనే పదానికి ప్రకృతి
A) హంస
B) యంచ
C) రాజపులుగు
D) మంచం
జవాబు:
A) హంస

ప్రశ్న 3.
విష్ణుడు – అనే పదానికి వికృతి
A) కృష్ణుడు
B) వెన్నుడు
C) విషువత్తు
D) వ్యాసుడు
జవాబు:
B) వెన్నుడు

TS 9th Class Telugu Important Questions 11th Lesson వాయసం

ప్రశ్న 4.
సాయంకాలం గీము వదలి వెళ్ళవద్దు – గీత గీసిన పదానికి ప్రకృతి
A) వరండా
B) గృహము
C) భూగృహము
D) గ్రహము
జవాబు:
B) గృహము

ప్రశ్న 5.
” సేమము” అనే పదానికి వికృతి
A) క్షేమము
B) చేమము
C) ధామము
D) సేకరణ
జవాబు:
A) క్షేమము

ప్రశ్న 6.
అందరి దృష్టి అతడి మీదే – గీత గీసిన పదానికి వికృతి
A) దిస్టి
B) ద్రుష్టి
C) దుష్టు
D) శ్రేష్ఠము
జవాబు:
A) దిస్టి

TS 9th Class Telugu Important Questions 11th Lesson వాయసం

ప్రశ్న 7.
చుక్కల దొరలోన ముక్కున నలుపున్న చల్లని వెన్నెల జల్లులిడడె – గీత గీసిన పదానికి వికృతి
A) నక్షత్రం
B) తార
C) శుక్ర
D) బొట్టు
జవాబు:
C) శుక్ర

ప్రశ్న 8.
విసఫు మేతరి గొంతు విడ్డూరమగు నలుపున్నను శివుడంచు బొగడబడడె – గీత గీసిన పదానికి వికృతి
A) వింత
B) ఆశ్చర్యం
C) అబ్బురం
D) విడ్వరం
జవాబు:
D) విడ్వరం

IV. పర్యాయపదాలు :

ప్రశ్న 1.
వాయసము – అనే పదానికి పర్యాయపదాలు కానివి.
A) ధ్వాంక్షము, కాకి, కాకము
B) బలిపుష్టము, మౌకలి
C) ఆత్మఘోషము, కరటము
D) గేహము, జటాయువు
జవాబు:
D) గేహము, జటాయువు

TS 9th Class Telugu Important Questions 11th Lesson వాయసం

ప్రశ్న 2.
“గృహం” అనే పదానికి పర్యాయపదాలు
A) ఇల్లు, కొంప, గేహము
B) భవనము, తిన్నె
C) గది, వంటఇల్లు
D) కోట, పేట
జవాబు:
A) ఇల్లు, కొంప, గేహము

ప్రశ్న 3.
సంతోషంగా ఉండటమే వ్యక్తిబలం – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) హర్షం, ముదము, ప్రమోదం
B) సంతసం, మాత్సర్యం
C) మంద్రము, తంద్రము
D) స్మితము, దరహాసము
జవాబు:
A) హర్షం, ముదము, ప్రమోదం

ప్రశ్న 4.
ముల్లు – అనే పదానికి పర్యాయపదాలు
A) గడియారం, గంట
B) విల్లు, కుశ
C) కంటకము, ములికి
D) సూది, చాలు
జవాబు:
C) కంటకము, ములికి

TS 9th Class Telugu Important Questions 11th Lesson వాయసం

ప్రశ్న 5.
మాంసము – అనే పదానికి పర్యాయపదాలు
A) కరకుట్లు, భక్ష్యము
B) పలలము, ఆమిషము
C) కుక్కురము, మేషము
D) బొబ్బర, మాంసలము
జవాబు:
B) పలలము, ఆమిషము

ప్రశ్న 6.
వాయసముల నలుపు రోయనేల – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) కాకి, కుక్క
B) ధాంక్షము, బలిపుష్టం
C) వాయసం, వాసం
D) కరటం, కటకం
జవాబు:
B) ధాంక్షము, బలిపుష్టం

ప్రశ్న 7.
ఆకాశం, నీరు, రాత్రి, నీడ నలుపు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) గగనం, ఘనం
B) అంబరం, వస్త్రం
C) నింగి, ఆకసం
D) అంతరిక్షం, భక్షం
జవాబు:
C) నింగి, ఆకసం

TS 9th Class Telugu Important Questions 11th Lesson వాయసం

ప్రశ్న 8.
అంధకారమైన అజ్ఞానం నలుపు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) రజని, రాత్రి
B) చీకటి, తిమిరం
C) తమస్సు, తపస్సు
D) ధ్వస్తం, ధ్వంసం
జవాబు:
D) ధ్వస్తం, ధ్వంసం

V. నానార్థాలు :

ప్రశ్న 1.
“కాక” అనే పదానికి నానార్థాలు
A) కాకుండా, కోక
B) చిన్నాన్న, వేడిమి
C) కాకి అరుపు, నలుపు
D) తూర్పు, వెన్నుడు
జవాబు:
B) చిన్నాన్న, వేడిమి

ప్రశ్న 2.
కాకికి ఆహారము బలిగా ఇచ్చిన అన్నం – గీత గీసిన పదానికి నానార్థాలు
A) అంబలి, చెంబలి
B) ఒక రాజు, మేలు
C) ఒక చక్రవర్తి, అర్పణం, యమదండం
D) బలిపీఠం, కంబళి
జవాబు:
C) ఒక చక్రవర్తి, అర్పణం, యమదండం

TS 9th Class Telugu Important Questions 11th Lesson వాయసం

ప్రశ్న 3.
చిరజీవి – అనే పదానికి నానార్థాలు
A) చిరంజీవి, కాకి
B) విష్ణువు, కాకి
C) తక్కువ వయసు, ఒక జీవి
D) మరణం లేనివాడు, మార్కండేయుడు
జవాబు:
B) విష్ణువు, కాకి

ప్రశ్న 4.
ఆత్మఘోషమా ! చిరజీవివై వెలుంగు – గీత గీసిన పదానికి నానార్థాలు
A) బుద్ధి, తెలివి
B) మనస్సు, పరమాత్మ
C) దేహం, కాయం
D) జీవుడు, జీవి
జవాబు:
B) మనస్సు, పరమాత్మ

ప్రశ్న 5.
నోరు నొవ్వంగనే రాయబారమేమొ తెచ్చు వార్తలో చుట్టాలు వచ్చు కబురో – గీత గీసిన పదానికి నానార్థాలు
A) సమాచారం, విషయం
B) నడత, నడక
C) భాషణం, మిరప
D) వృత్తాంతం, నడత
జవాబు:
A) సమాచారం, విషయం

TS 9th Class Telugu Important Questions 11th Lesson వాయసం

VI. వ్యుత్పత్యర్థములు :

ప్రశ్న 1.
తిరుగుచుండునది – అను వ్యుత్పత్తి గల పదం
A) ద్రిమ్మరి
B) జులాయి
C) వాయసం
D) తిరుగలి
జవాబు:
C) వాయసం

ప్రశ్న 2.
కాకా అని తన పేరునే అరిచేది అను వ్యుత్పత్తి గల పదం
A) కోకిల
B) ఆత్మఘోషము
C) చినాన్న
D) వాయి
జవాబు:
B) ఆత్మఘోషము

TS 9th Class Telugu Important Questions 11th Lesson వాయసం

ప్రశ్న 3.
“పాషండుడు” అనే పదానికి సరియైన ఉత్పత్తి
A) పాపములను పోగొట్టువాడు
B) సంసార బంధాలకు అనుగుణంగా శాస్త్రమును వాడుకొనేవాడు
C) పాప కర్మలు చేయువాడు
D) రాయి వంటి మనస్సు కలవాడు
జవాబు:
B) సంసార బంధాలకు అనుగుణంగా శాస్త్రమును వాడుకొనేవాడు

ప్రశ్న 4.
విషమును మింగినవాడు – అనే వ్యుత్పత్తి గల పదము
A) విసపు మేతరి
B) సర్పరాజు
C) శాంతుడు
D) సోక్రటీసు
జవాబు:
A) విసపు మేతరి

ప్రశ్న 5.
మౌకలి – అనే పదానికి సరైన వ్యుత్పత్తి
A) మూకలునికి సంబంధించినది
B) ఎంగిలి తినేది
C) ‘క’ అని పలికేది
D) మాంసం తినేది.
జవాబు:
A) మూకలునికి సంబంధించినది

TS 9th Class Telugu Important Questions 11th Lesson వాయసం

PAPER – II : PART – A

అపరిచిత పద్యాలు

ప్రశ్న 1.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ఆచార్యున కెదిరింపకు
బ్రోచినదొర నింద సేయబోకుము కార్యా
లోచనము లొంటి జేయకు
మాచారము విడువబోకుమయ్య కుమారా !

ప్రశ్నలు – సమాధానాలు
1. ఎవరిని ఎదిరింపరాదు ?
జవాబు:
ఆచార్యుని (గురువును) ఎదిరింపరాదు.

2. ఎవరిని నింద చేయకూడదు ?
జవాబు:
కాపాడిన (రక్షించిన) వారిని నిందచేయకూడదు.

3. వేటిని ఒంటరిగా చేయకూడదు ?
జవాబు:
పనులకై చేయు ఆలోచనలు ఒంటరిగా చేయకూడదు.

4. విడిచిపెట్టకూడనిది ఏది ?
జవాబు:
మంచి నడవడిని విడిచిపెట్టకూడదు.

5. ఇది ఏ శతకంలోని పద్యం ?
జవాబు:
ఇది కుమార శతకంలోని పద్యం.

TS 9th Class Telugu Important Questions 11th Lesson వాయసం

ప్రశ్న 2.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక విషయ మెరుగుచున్
కనికల్ల నిజము దెలియుచు
మనవలె మహితాత్ముడుగను మరువక ఎపుడున్.

ప్రశ్నలు – సమాధానాలు
1. చెప్పినది ఎట్లు వినవలెను ?
జవాబు:
చెప్పినది తొందరపడకుండా విషయమును తెలిసి కొనుచు వినవలెను.

2. విని తెలియవలసిన దేమి ?
జవాబు:
విని అబద్ధమేదో, నిజమేదో తెలియవలెను.

3. ఎట్లు మనవలెను ?
జవాబు:
ఎప్పుడు మహితాత్ముడుగ మనవలెను.

4. దీనికి శీర్షికను సూచించండి.
జవాబు:
దీనికి శీర్షిక ‘మహితాత్ముడు’.

5. కల్ల అంటే అర్థం ఏమిటి ?
జవాబు:
కల్ల అంటే అసత్యం.

TS 9th Class Telugu Important Questions 11th Lesson వాయసం

ప్రశ్న 3.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు వ్రాయుము.

మేడిపండు జూడ మేలిమైయుండును
పొట్టవిచ్చిచూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగుర
విశ్వదాభిరామ ! వినురవేమ !

ప్రశ్నలు – సమాధానాలు
1. పిరికివాడు దేనితో పోల్చబడినాడు ?
జవాబు:
పిరికివాడు మేడిపండుతో పోల్చబడినాడు.

2. మేడిపండు పైకి ఏ విధంగా వుంటుంది ?
జవాబు:
మేడిపండు పైకి చక్కగా ఉంటుంది.

3. మేడిపండు లోపల ఎలా ఉంటుంది ?
జవాబు:
మేడిపండు లోపల పురుగులతో కూడి ఉంటుంది.

4. ఈ పద్యం వల్ల తెలిసిందేమిటి ?
జవాబు:
ఈ పద్యంవల్ల పిరికివాని స్వభావం తెలుస్తోంది.

5. ఇది ఏ శతకంలోని పద్యం ?
జవాబు:
ఇది వేమన శతకంలోని పద్యం.

TS 9th Class Telugu Important Questions 11th Lesson వాయసం

ప్రశ్న 4.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.

ధనము కూడబెట్టి ధర్మంబు సేయక
తాను తినక లెస్స దాచుగాక
తేనెటీగ గూర్చి తెరువరి కీయదా
విశ్వదాభిరామ ! వినురవేమ !

ప్రశ్నలు – సమాధానాలు
1. తేనెటీగ తేనెను ఎవరికి యిస్తున్నది?
జవాబు:
తేనెటీగ తేనెను తెరువరికి (బాటసారికి) ఇస్తున్నది.

2. తాను తినక, కూడబెట్టువారినేమందురు?
జవాబు:
తాను తినక, కూడబెట్టువారిని పిసినారి అంటారు.

3. పై పద్యము నందలి భావమేమి?
జవాబు:
కూడబెట్టిన ధనం సద్వినియోగం చేయకపోతే వృథా అవుతుంది.

4. కూడబెట్టిన ధనము ఎట్లు సద్వినియోగమగును?
జవాబు:
కూడబెట్టిన ధనం దానం చేసినా లేదా తాను అనుభవించినా సద్వినియోగం అవుతుంది.

5. ఇది ఏ శతకంలోని పద్యం ?
జవాబు:
ఇది వేమన శతకంలోని పద్యం.

TS 9th Class Telugu Important Questions 11th Lesson వాయసం

ప్రశ్న 5.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.

అనగ ననగ రాగ మతిశయిల్లుచు నుండు
తినగ తినగ వేము తీయనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ ! వినురవేమ !

ప్రశ్నలు – సమాధానాలు
1. అంటూ ఉంటే అతిశయిల్లేది ఏది ?
జవాబు:
అంటూ ఉంటే రాగం అతిశయిల్లుతుంది.

2. తింటూ ఉంటే తీయనయ్యేది ఏది?
జవాబు:
తింటూ ఉంటే వేపాకు తీయనవుతుంది.

3. సాధనతో సమకూరేవి ఏవి?
జవాబు:
సాధనతో పనులు సమకూరుతాయి.

4. ఈ పద్యానికి మకుటం ఏది?
జవాబు:
‘విశ్వదాభిరామ వినురవేమ’ అనేది ఈ పద్యానికి మకుటం.

5. అతిశయిల్లు అంటే ఏమిటి ?
జవాబు:
అతిశయిల్లు అంటే హెచ్చు.

TS 9th Class Telugu Important Questions 11th Lesson వాయసం

వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
అంతరించిపోతున్న పక్షులు, జంతువులు, అడవులు – వీటిని కాపాడాలని ఐదు నినాదాలు రాయండి.
జవాబు:

  1. వృక్షో రక్షతి రక్షితః.
  2. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు.
  3. రసాయన మందులు వాడకు, పక్షుల జీవితాలతో ఆడకు.
  4. నీ ప్రయోజనాలకై ప్రాణులను బలీయకు.
  5. హింస చేసేది మనమే, భూతదయ అనేది మనమే.
  6. పక్షులను కాపాడు, హింసను విడనాడు.
  7. సేంద్రియ ఎరువులతో ప్రాణుల మనగడకు సహకరించు.
  8. ఆకలికి అన్నము ఉండగా జంతుబలులెందుకు.
  9. చెప్పేది శాఖాహారమూ ! చేసేది మాంసాహారమా ?
  10. చెప్పినవారు చెప్పినట్లే ఉన్నారు. పక్షులు, జంతువులు ఏమైపోతున్నాయో ?

PAPER – II : PART – B

భాషాంశాలు – వ్యాకరణం

కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.

I. సంధులు:

ప్రశ్న 1.
మ్రింగుట + ఏల – సంధి చేయగా
A) మ్రింగుటకేల
B) మ్రింగుట యేల
C) మ్రింగుటేల
D) మ్రింగేలా
జవాబు:
C) మ్రింగుటేల

TS 9th Class Telugu Important Questions 11th Lesson వాయసం

ప్రశ్న 2.
శివుని విసపు మేతరి అని కూడా అంటారు – గీత గీసిన పదాన్ని సంధి విడదీసి రాయండి.
A) విసపు + మేతరి
B) విసము + మేతరి
C) విష + మేతరి
D) విసమే + మేతరి
జవాబు:
B) విసము + మేతరి

ప్రశ్న 3.
లోకము + న – సంధి నామము
A) ఉత్వసంధి
B) ముగాగమ సంధి
C) లు, ల, నల సంధి
D) ప్రాది సంధి
జవాబు:
C) లు, ల, నల సంధి

ప్రశ్న 4.
తొడన్ + కొట్టి – సంధి జరిగిన విధము
A) గసడదవాదేశ సంధి
B) సరళాదేశ సంధి
C) ఇత్వసంధి
D) ద్వంద్వ సంధి
జవాబు:
B) సరళాదేశ సంధి

TS 9th Class Telugu Important Questions 11th Lesson వాయసం

ప్రశ్న 5.
పాయసము + ఒల్లక – సంధి కార్యము
A) ఉత్వసంధి
B) లులనల సంధి
C) ముగాగమ సంధి
D) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
A) ఉత్వసంధి

ప్రశ్న 6.
ఈ కింది వానిలో ఉత్వసంధి కానిది.
A) బోనము + అబ్బు
B) సేమములు + అడుగు
C) నాకు + ఏది
D) పాతకున్ + కొలుచు
జవాబు:
D) పాతకున్ + కొలుచు

ప్రశ్న 7.
నిలువు + నిలువు సంధి కలిపి రాయగా
A) నిట్టనిలువు
B) నిలునిలువు
C) నిలిచినది
D) నిండు నిలువు
జవాబు:
A) నిట్టనిలువు

II. సమాసాలు:

ప్రశ్న 1.
కింది వానిలో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం కానిది.
A) పరుల కొంపలు
B) చారు సంసారము
C) రోత బ్రతుకు
D) తీపి పాయసము
జవాబు:
A) పరుల కొంపలు

TS 9th Class Telugu Important Questions 11th Lesson వాయసం

ప్రశ్న 2.
క్రింది వానిలో షష్ఠీ తత్పురుష సమాసము కానిది.
A) కరటరాజు
B) అన్న కొడుకు
C) నరుల తలలు
D) చల్లని వెన్నెల
జవాబు:
D) చల్లని వెన్నెల

ప్రశ్న 3.
కింది వానిలో రూపక సమాసమునకు ఉదాహరణ
A) దినము దినము
B) ప్రాణం వంటి సఖుడు
C) కపటమైన చిత్తము కలవారు
D) విషము అనెడు అగ్ని
జవాబు:
D) విషము అనెడు అగ్ని

ప్రశ్న 4.
ప్రాణము వంటి సఖుడు – ఏ సమాసము ?
A) రూపక సమాసము
B) ఉపమాన పూర్వపద కర్మధారయము
C) అవ్యయీభావ సమాసము
D) షష్ఠీ తత్పురుష
జవాబు:
B) ఉపమాన పూర్వపద కర్మధారయము

TS 9th Class Telugu Important Questions 11th Lesson వాయసం

ప్రశ్న 5.
దినము + దినము → ప్రతిదినము – ఏ సమాసము ?
A) అవ్యయీభావ సమాసము
B) ప్రాది సమాసము
C) రూపక సమాసము
D) ద్వంద్వ సమాసము
జవాబు:
A) అవ్యయీభావ సమాసము

ప్రశ్న 6.
కపటమైన చిత్తము కలవారు – సమాసము చేయగా
A) కపటుల చిత్తము
B) కపట చిత్తములు
C) కపట చిత్తులు
D) కపటము గలవారు
జవాబు:
C) కపట చిత్తులు

ప్రశ్న 7.
చెట్టు మీద కాకి పిల్లలు గోల చేస్తున్నాయి – గీత గీసిన పదం ఏ సమాసము ?
A) సప్తమీ తత్పురుష
B) తృతీయా తత్పురుష
C) షష్ఠీ తత్పురుష
D) బహువ్రీహి
జవాబు:
C) షష్ఠీ తత్పురుష

TS 9th Class Telugu Important Questions 11th Lesson వాయసం

ప్రశ్న 8.
ఎంగిలి మెతుకులు సమాసమునకు సరియైన విగ్రహవాక్యము
A) ఎంగిలియైన మెతుకులు
B) ఎంగిలి మరియు మెతుకులు
C) ఎంగిలి యొక్క మెతుకులు
D) ఎంగిలి వంటి మెతుకులు
జవాబు:
A) ఎంగిలియైన మెతుకులు

III. అలంకారము :

ప్రశ్న 1.
పాఱఁజూచిన రిపుసేన పాఱఁజూచు – ఈ వాక్యంలో ఉన్న అలంకారం
A) యమకము
B) వృత్త్యనుప్రాస
C) లాటానుప్రాస
D) ఉపమా
జవాబు:
A) యమకము

ప్రశ్న 2.
ఎన్నికలలో, ఎన్నికలలో ! – ఈ వాక్యంలో ఉన్న అలంకారం –
A) వృత్త్యనుప్రాస
B) యమకము
C) ఉపమా
D) లాటానుప్రాస
జవాబు:
B) యమకము

TS 9th Class Telugu Important Questions 11th Lesson వాయసం

ప్రశ్న 3.
నంద నందనా వంద వందనాలు ఈ వాక్యంలో ఉన్న అలంకారం
A) వృత్త్యనుప్రాస
B) లాటానుప్రాస
C) ఛేకానుప్రాస
D) యమకము
జవాబు:
C) ఛేకానుప్రాస

IV. ఛందస్సు :

ప్రశ్న 1.
వేసంగి, భళిరా – అనే పదాలు వరుసగా
A) త, ర
B) ర, స
C) త, స
D) ర, ర
జవాబు:
C) త, స

ప్రశ్న 2.
TS 9th Class Telugu Important Questions 11th Lesson వాయసం 1
పై పద్యపాదంలో గణవిభజన చేసిన గణాలను ఇలా అంటారు.
A) ఇంద్ర గణాలు
B) సూర్య గణాలు
C) వృత్త గణాలు
D) చంద్ర గణాలు
జవాబు:
B) సూర్య గణాలు

TS 9th Class Telugu Important Questions 11th Lesson వాయసం

ప్రశ్న 3.
ఈ కింది వానిలో మ గణం
A) UII.
B) UIU
C) IUU
D) UUU
జవాబు:
D) UUU

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

These TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు will help the students to improve their time and approach.

TS 9th Class Telugu 1st Lesson Important Questions ధర్మార్జునులు

PAPER – I : PART – A

I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)

అ) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘ధర్మార్జునులు’ పాఠం ఆధారంగా రాజుకు ఉండవలసిన ఐదు లక్షణాలు తెల్పండి.’
జవాబు:
“యథా రాజా తథా ప్రజాః” – రాజు ఎట్లా ఉంటే, ప్రజలు. అట్లే ఉంటారు. ధర్మరాజు మహాపురుషుల మార్గంలో నడుస్తూ, ప్రజారంజకమైన విధానాలతో ధర్మపరిపాలన అందించాడు. ప్రస్తుత పాఠం ఆధారంగా రాజుకు ఉండవలసిన

లక్షణాలు – అవి :

  1. ధర్మ ప్రవర్తన కలిగి ఉండాలి.
  2. దానగుణం కల్గి, పూర్తిస్థాయిలో చెయ్యాలి.
  3. ముఖప్రీతి మాటలుకాక మనస్ఫూర్తిగా మాట్లాడాలి.
  4. ప్రజల సంపదను చూసి అసూయపడకూడదు.
  5. రాత్రింబగళ్ళు ధర్మకార్యాలు చేయాలి.
  6. కోపం కొంచెం కూడా ఉండకూడదు.
  7. మంచి చెడులను తాను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
  8. ఆడంబరాలు లేని స్థిరస్వభావం ఉండాలి.

ప్రశ్న 2.
ఒక కుటుంబంలోని అన్నదమ్ములు ఎలా ఉండాలి ?
జవాబు:
అరమరికలు లేని అన్నదమ్ములు ఆణిముత్యాలు. సోదర ప్రేమకు నిలువుటద్దం రామాయణభారతాలు. శ్రీరాముడు సోదరులైన లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుల పట్ల భ్రాతృప్రేమను చాటాడు. అలాగే రాముని పట్ల మిగిలినవారు అంతటి సోదరభావాన్ని ప్రదర్శించారు. అట్లాగే భారతంలోని పాండవులు స్నేహము, భక్తి, సహనం కలిగి, చిన్నా పెద్దా అనే తేడాలు చూసుకుంటూ, ఒకరిమాట ఒకరు పాటిస్తూ అందరూ ఒకే మనస్సుతో పనులు చేస్తూ, అన్యోన్య ప్రేమతో ప్రవర్తించేవారు.

కుటుంబంలోని అన్నదమ్ములు శ్రీరాముని సోదరులను, పాండవులను ఆదర్శంగా తీసుకోవాలి. ఒద్దిక కలవారై ఒకరి మనసు ఒకరు తెలుసుకుని మెలగాలి.

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 3.
చేమకూర వేంకట కవి కవితా శైలిని గూర్చి రాయండి.
జవాబు:
చేమకూర వేంకట కవి భారత కథలో అవసరమైన చక్కని మార్పులు చేసి, “ప్రతిపద్య చమత్కారం”తో స్వతంత్ర కావ్యంగా “విజయ విలాసము” తీర్చిదిద్దాడు. ఈ ప్రబంధం రఘునాథ నాయకునికి అంకితమివ్వబడింది. ఈ కావ్యంలో శబ్దాలంకారాలు సొగసులతో, తెలుగు నుడికారాలతో, అందమైన శైలి, ప్రసన్న గంభీరమైన పద్యం నడక కనబడుతుంది.

విజయ విలాసంలో, చమత్కారం లేని ఒక్క పద్యం కూడా లేదని పేరుపొందాడు. ‘పిల్ల వసుచరిత్ర’ అనే ప్రశంసను పొందిన ఈ కావ్యం, తెలుగులోని పంచమహాకావ్యాలతో సరితూగగలదని విజ్ఞులు తలుస్తారు.

ప్రశ్న 4.
‘అతని నుతింపశక్యమె’ అని అర్జునుడిని గురించి వేంకటకవి అన్నాడు. అర్జునుడి గొప్పతనాన్ని వివరించండి.
జవాబు:
అర్జునుడు అన్నల విషయంలోనూ, తమ్ముళ్ళ విషయంలోనూ సమానంగా ప్రవర్తించే వాడనే పేరు పొందిన ఘనుడు. రాజులందరిలోనూ ఎక్కడా ఎదురులేనివాడని ప్రసిద్ధినీ, గొప్పతనాన్నీ పొందిన పరాక్రమశాలి. అర్జునుడు సాత్త్వికులు ప్రశంసించే, ధర్మప్రవర్తన కలవాడు.

అర్జునుడు అందంలో ఇంద్రుని కుమారుడు జయంతుని అంతటివాడు. దయా స్వభావంలో కృష్ణుడికి ప్రాణమిత్రుడు. యుద్ధ విజయాలలో శివుడితో పోటీపడే వీరుడు. ఈ భూమండలంలో అర్జునుడికి అర్జునుడే సాటియైనవాడు.

అర్జునుడు తేరిపార చూస్తే, శత్రుసైన్యం పారిపోడానికి సిద్ధం అవుతుంది. అర్జునుడు విల్లుఎత్తి పట్టుకోడానికి వంగితే శత్రువులు వీర స్వర్గం దారిపడతారు. అర్జునుడితో సాటి అని చెప్పదగినవాడు, పోల్చదగిన వీరుడు ఈ లోకంలో శ్రీరాముడు తప్ప మరొకరు లేడు.

ఆ) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
ధర్మరాజు పాలనతో, నేటి నాయకుల పాలనను పోల్చి రాయండి.
జవాబు:
ధర్మము తెలిసినవాడు ధర్మరాజు. ధర్మరాజు తాను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం, తాను సహితం ఆచరించేవాడు. శాంతము, దయ, సత్యము అనే సద్గుణాలు కలవాడు. మంచివారిని ఆదరించేవాడు. దానము చేయడంలో ఆసక్తి కలవాడు. ముఖప్రీతి కోసం మాట్లాడేవాడు కాడు. కోపం లేనివాడు. లోకువ చేసేవాడు కాడు.

అసూయ లేనివాడు. మెచ్చుకున్నప్పుడు తృప్తిగా ఇచ్చేవాడు. ఇలా కృతయుగ (సత్యకాలం) లక్షణాలతో విరాజిల్లే ధర్మరాజుతో నేటి నాయకుల పాలనను పోల్చడానికి మనసు రావడం లేదు, పెన్ను కదలడం లేదు.

ఆకలితో అలమటించేవారికి రూపాయి ఖర్చుపెట్టడానికి ఆలోచించే నేటి నాయకులు ఎన్నికలలో డబ్బును ఎన్ని రూపాల్లో పంచవచ్చో అలా పంచేస్తున్నారు. ఓటుకు నోటు ఇచ్చినవాడు తిరిగి మాట మీద నిలబడి మనకు మేలు చేస్తాడని నమ్మడం, ఓటు అమ్ముకోవడం మనం చేస్తున్న దోషాలు. నాణ్యత లేమి ప్రతి పనిలో కనబడుతుంది. ముందుచూపు లేని నాయకుల పాలనలో ప్రజలు ప్రకృతి బీభత్సాలకు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఆవేశం కలిగిన నాయకులు ప్రజలకు అనర్థాలే కలిగిస్తున్నారు.

పెద్దల సభలలో వారి ప్రవర్తన జుగుప్స కల్గిస్తుంది. ముఖప్రీతి మాటలే చెబుతున్నారు. ప్రజలకు ఇచ్చేటప్పుడు పత్రికల ముందు గొప్ప కోసం తప్ప తృప్తిగా ఇచ్చేది లేదు. ప్రభుత్వ పథకాలు అర్హులు అయిన వారికన్నా అనర్హులకే పొడుగు చేతుల పందేరం అవుతోంది. శాంతి, దయ, సత్యం, మత సహనం అనే లక్షణాలు నామమాత్రంగానే ఉన్నాయి.

గాంధీ వంటి మహాత్ముల పేరు చెప్పుకొని బ్రతుకుతున్న నాయకులంతా దేశభక్తిని విడిచి భుక్తి మార్గం వెతుకుతున్నారు. తెల్లరంగు ఛాయలో తమ మలిన హృదయాలను దాచుకుంటున్నారు. త్యాగమూర్తుల ప్రబోధాలకు నీళ్ళొదులుతున్నారు. ఇది కచ్చితంగా కలికాలం. కష్టాల కాలమే.

PART – I : PART – B

భాషాంశాలు – పదజాలం :

1. సొంతవాక్యాలు :

1. సోయగం : చెరువు గట్టున ఉన్న మాయింటి సోయగం చూపులకే కాదు, మనస్సుకు హాయినిస్తుంది.
2. ఏవురు : స్నేహితులు నల్వురు ఏవురు వున్నా, మంచివారై ఉండాలని అమ్మ చెప్పింది.
3. కొంగుపసిడి : మా తాతయ్య మాయింటికే కాదు ఊరికే కొంగుపసిడి అని అంతా అంటారు.
4. సరాగము : మా ఉమ్మడి కుటుంబంలో సరాగము పండుగ రోజుల్లో కనబడుతుంది.
5. ప్రతిజోదు : మా తెలివితేటలకు ప్రతిజోదు మా మావయ్య అడిగే క్విజ్ ప్రశ్నలు.
6. అసూయపడు : ఎదుటివారి సంపదలకు అసూయపడితే నిద్ర రాదు, ఫలితం ఉండదు.
7. సౌజన్యం : ఆపదలు ఎదురైనప్పుడు మనిషిలో సౌజన్యం బయటపడుతుంది.
8. వన్నె, వాసిగాంచు : వన్నె, వాసిగాంచిన మహాపురుషుల గురించి, చిన్నప్పటి నుండి తెలుసుకొంటే మనకు లక్ష్యం ఏర్పడుతుంది.
9. శాంతి : ఎప్పుడూ బాధ లేకుండా ఉండటం ఎల్లప్పుడు మనము శాంతినే కోరుకోవాలి.
10. అసూయపడుట : ఈర్ష్యపడుట – పాండవుల ఐశ్వర్యానికి దుర్యోధనుడు అసూయపడ్డాడు.
11. వెలసిరి : అవతరించటం – విష్ణువు భక్త సంరక్షణార్థమై కలియుగంలో వేంకటేశ్వర స్వామిగా తిరుమలలో వెలసెను.
12. పుణ్యభూమి : గొప్పభూమి – ధర్మ పరిపాలనా తత్పరులు పాలించిన పుణ్యభూమి మనదేశం.

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

II. అర్థాలు:

అ) కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.

ప్రశ్న 1.
శ్రీరాముడు దశరథుని తనూజుడు – గీత గీసిన పదానికి అర్థం
A) తండ్రి
B) కుమారుడు
C) వారసుడు
D) వంశకర్త
జవాబు:
B) కుమారుడు

ప్రశ్న 2.
“క్షితి” అంటే అర్థం
A) చితి
B) ఒక పక్షి
C) భూమి
D) రాజు
జవాబు:

ప్రశ్న 3.
“ఎడాటము” అనే పదానికి సరియైన అర్థం
A) పెంపకము
B) తడబాటు
C) విషయము
D) శ్రద్ధ
జవాబు:
C) విషయము

ప్రశ్న 4.
“ధర్మరాజు” అనే అర్థం వచ్చే పదం
A) అజయుడు
B) ధర్మ తనూజుడు
C) ఉద్ధతుడు
D) కోవిదుడు
జవాబు:
B) ధర్మ తనూజుడు

ప్రశ్న 5.
మనకు కొదవ లేనివి ప్రకృతి వనరులు గీత గీసిన పదానికి అర్థం
A) కొఱత
B) ధనము
C) మర్యాద
D) ఎక్కువ
జవాబు:
A) కొఱత

ప్రశ్న 6.
కలిమి గలనాడె దేవుని పూజింపుము – గీత గీసిన పదానికి అర్థం
A) బలము
B) ధాన్యము
C) భక్తి
D) సంపద
జవాబు:
D) సంపద

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 7.
“జలధి” అనే పదానికి సరియైన అర్థం
A) వారధి
B) వారిధి
C) వారిజాతము
D) పారిజాతము
జవాబు:
B) వారిధి

ప్రశ్న 8.
“భూమి” అనే అర్థం వచ్చే సరియైన పదం
A) మిన్ను
B) చక్రము
C) వసుమతి
D) దానవుడు
జవాబు:
C) వసుమతి

ప్రశ్న 9.
సోదరులు – అనే అర్థం గల పదము
A) అనుజన్ములు
B) కుమార్తెలు
C) తనూజులు
D) తండ్రి, బాబాయి
జవాబు:
A) అనుజన్ములు

ప్రశ్న 10.
సత్త్వగుణం కలవారు – అనే అర్థం వచ్చే సరియైన పదం
A) సరసులు
B) సంపన్నులు
C) ధర్మరాజు
D) సాత్త్వికులు
జవాబు:
D) సాత్త్వికులు

ప్రశ్న 11.
ధర్మరాజు శాంతి, దయలనే ఆభరణాలుగా ధరించాడు – గీత గీసిన పదానికి అర్థం
A) గుణాలు
B) గుడ్డలు
C) నగలు
D) సుగంధాలు
జవాబు:
C) నగలు

ప్రశ్న 12.
పాండురాజు జ్యేష్ఠ కుమారుడు ధర్మరాజు – గీత గీసిన పదానికి అర్థం
A) చివరి
B) మధ్య
C) పెద్ద
D) ఆరంభం
జవాబు:
C) పెద్ద

ప్రశ్న 13.
ధర్మకార్యాలు చేస్తూ పుణ్యం సంపాదించాలనే దృష్టి – గీత గీసిన పదానికి అర్థం
A) చూపు
B) చాప
C) కోరిక
D) దిష్టి
జవాబు:
A) చూపు

ప్రశ్న 14.
మనుష్యులలో వ్యత్యాసం తెలిసినవాడు – గీత గీసిన పదానికి అర్థం
A) ఎక్కువ
B) తేడా
C) తక్కువ
D) సమానం
జవాబు:
B) తేడా

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 15.
యాచకుల దీనత్వం పోగొట్టడానికి ఎల్లప్పుడూ ఉత్సాహం కలిగి ఉంటారు – గీత గీసిన పదానికి అర్థం
A) యాత్రికులు
B) అనాథలు
C) దానం కోరువారు
D) వీధిబాలలు
జవాబు:
C) దానం కోరువారు

ప్రశ్న 16.
లోకంలో అన్నదమ్ముల ఒద్దిక అంటే వారిదే సుమా – గీత
A) అధికారం
B) పెత్తనం
C) అయిష్టం
D) అనుకూలం.
జవాబు:
D) అనుకూలం.

ప్రశ్న 17.
శత్రు సమూహం వీరస్వర్గం దారిపడుతుంది – గీత గీసిన
A) ఇంటిదారి
B) వీరమరణం
C) సుఖం
D) నరకం
జవాబు:
B) వీరమరణం

ప్రశ్న 18.
యథా రాజా తథా ప్రజాః – గీత గీసిన పదానికి అర్థం
A) అట్లు
B) వలన
C) ఎట్లు
D) ఇట్లు
జవాబు:
A) అట్లు

III. పర్యాయపదాలు :

ప్రశ్న 1.
దేవతలు, దివిజులు, సురలు – అనే పర్యాయపదాలు గల పదము
A) దైత్యుతులు
B) అమరులు
C) భాసురులు
D) శ్రమణకులు
జవాబు:
B) అమరులు

ప్రశ్న 2.
ఎప్పుడూ పసిడి ధర ఎక్కువే – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) వెండి, బంగారం
B) నగలు, ప్లాటినం
C) పుత్తడి, పైడి, స్వర్ణము
D) సొమ్ములు, నగలు, ఆభరణాలు
జవాబు:
C) పుత్తడి, పైడి, స్వర్ణము

ప్రశ్న 3.
తనూజుడు పుట్టినప్పుడు కాక కుమారుడు ప్రయోజకుడైతే, ఆ సుతుని చూచి తండ్రి ఆనందపడతాడు. పై వాక్యంలో పర్యాయపదాలు ఉన్న పదం.
A) జనకుడు
B) ఆనందము
C) ప్రయోజనము
D) పుత్రుడు
జవాబు:
D) పుత్రుడు

ప్రశ్న 4.
పురము – అనే పదానికి పర్యాయపదాలు
A) పురము, పురహరుడు
B) పట్టణము, జనపదం
C) ప్రోలు, పట్టణము, నగరం
D) జనపదం, భాగ్యనగరం
జవాబు:
C) ప్రోలు, పట్టణము, నగరం

ప్రశ్న 5.
క్షితి – అనే పదానికి పర్యాయపదం కానిది.
A) భూమి
B) ధరణి
C) వసుమతి
D) పక్షి
జవాబు:
D) పక్షి

ప్రశ్న 6.
నరుడు, మానవుడు – అనే పర్యాయపదాలుగా గల పదం
A) మానిసి
B) ఉత్తముడు
C) దనుజుడు
D) కృష్ణుడు
జవాబు:
A) మానిసి

ప్రశ్న 7.
రాజు అనే పదానికి పర్యాయపదాలు
A) ఏలిక, ప్రభువు
B) ధనికుడు, రాజు
C) చంద్రుడు, రాజు
D) రాజనాలు, ప్రభువు
జవాబు:
A) ఏలిక, ప్రభువు

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 8.
ఇల, మహి, వసుమతి – అనే పర్యాయపదాలు గల పదం
A) క్షితి
B) స్త్రీ
C) ధర్మము
D) అర్జునుడు
జవాబు:
A) క్షితి

ప్రశ్న 9.
మన మాటలో నిజం ఎదుటివాడికి వినబడాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) నిజాయితీ, నైజం
B) ఋతము, సత్య
C) అనృతం, అమృతం
D) సత్తువ, సాపత్తి
జవాబు:
B) ఋతము, సత్య

ప్రశ్న 10.
“శత్రువు” అనే పదానికి పర్యాయపదాలు
A) వైరి, అరి, రిపుడు
B) విరోధం, పగ, విజితులు
C) మిత్రుడు, స్నేహితుడు, దోస్తు
D) వెన్నుజూపు, పాఱజూచు
జవాబు:
A) వైరి, అరి, రిపుడు

ప్రశ్న 11.
నిజం చెప్పడంలోని స్వారస్యాన్ని తెలిసినవాడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) అబద్ధం, అసత్యం
B) సత్యం, ఋతం
C) ఋతం, ఋతం
D) నాసికం, కర్ణం
జవాబు:
B) సత్యం, ఋతం

ప్రశ్న 12.
అతని ముఖము పై చిరునవ్వు ఎప్పుడూ ఉంటుంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) చెవులు, కాళ్ళు
B) ముక్కు చేతులు
C) ఆననం, ఆస్యం
D) నాసికం, కర్ణం
జవాబు:
C) ఆననం, ఆస్యం

ప్రశ్న 13.
సముద్రం ఈ భూమండలాన్ని ఆవరించియున్నది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) సాగరం, రత్నాకరం
B) ఘోష, రొద
C) నదీనదం, వారిధి
D) సంగ్రామం, సంగరం
జవాబు:
A) సాగరం, రత్నాకరం

ప్రశ్న 14.
అయిదు దేవతా వృక్షాలు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) ఋక్షం, చెట్టు
B) మహీరుహం, భూజం
C) భూగృహం, రంధ్రము, కాలము
D) మొక్క ఆకు
జవాబు:
B) మహీరుహం, భూజం

ప్రశ్న 15.
కృష్ణునికి ప్రాణమిత్రుడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) రాముడు, భీముడు
B) విష్ణువు, ధనువు
C) కన్నయ్య, కన్నమ్మ
D) విష్ణువు, కిట్టయ్య
జవాబు:
D) విష్ణువు, కిట్టయ్య

ప్రశ్న 16.
శివునివలె యుద్ధ విజయాలలో పోటీపడే వీరుడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) శంకరుడు, విష్ణువు
B) కృష్ణుడు, రుద్రుడు
C) భవుడు, రుద్రుడు
D) బ్రహ్మ, ఈశ్వరుడు
జవాబు:
C) భవుడు, రుద్రుడు

ప్రశ్న 17.
తేరిపార చూస్తే చాలు శత్రు సైన్యం పారిపోతుంది – గీసిన పదానికి పర్యాయపదాలు
A) దండు, సేన
B) దండ, సాన
C) సైనికులు, రైతులు
D) కార్మికులు, జాలరులు
జవాబు:
A) దండు, సేన

IV. నానార్థాలు:

ప్రశ్న 1.
ఆస్యమును ప్రతి ఉదయము, రాత్రి శుభ్రపరచుకోవాలి – గీత గీసిన పదానికి నానార్థాలు
A) నోరు, నాలుక
B) ముఖము, నోరు
C) చేతులు, ముఖము
D) వాకిలి, ఇల్లు
జవాబు:
B) ముఖము, నోరు

ప్రశ్న 2.
భాషను కాపాడతానని బాస చేస్తున్నాను- గీత గీసిన పదానికి నానార్థాలు
A) భాష, ప్రతిజ్ఞ
B) ఆజ్ఞ, వాణి
C) అధికారి, భాష
D) ఆధారము, అనుమతి
జవాబు:
B) ఆజ్ఞ, వాణి

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 3.
దిశ, ఆశ్రయం (ఆధారం) – అనే నానార్థాలు గల పదం
A) వైపు
B) అరణము
C) దిక్కు
D) పర్ణశాల
జవాబు:
C) దిక్కు

ప్రశ్న 4.
మామిడి పళ్ళు ప్రియము – గీత గీసిన పదానికి నానార్థాలు
A) ఇష్టము, ప్రేమ
B) ప్రియమైనది, అధిక ధర
C) పులుపు, తీపి
D) పండు, కాయ
జవాబు:
B) ప్రియమైనది, అధిక ధర

ప్రశ్న 5.
ఇతడే మా ఏలిక, ఆకాశానికి చంద్రుడు ఇతడు – ఈ వాక్యంలో నానార్థాలు గల పదం
A) నక్షత్రము
B) శివుడు
C) దాత
D) రాజు
జవాబు:
D) రాజు

ప్రశ్న 6.
మరణం లేనివారు, దేవతలు – అను నానార్థాలు గల పదం
A) అమరులు
B) సురపానం
C) పుణ్యాత్ములు
D) పాండవులు
జవాబు:
A) అమరులు

ప్రశ్న 7.
“చౌక” అను పదానికి నానార్థాలు
A) వెల తక్కువ, చులకన
B) నాలుగు దారులు, చదరము
C) చవుక, ఆకాశము
D) చమత్కారము, చదరము
జవాబు:
A) వెల తక్కువ, చులకన

ప్రశ్న 8.
“ధర్మరాజు” అను పదానికి నానార్థాలు
A) ధర్మరాజు, అర్జునుడు
B) ధర్మరాజు, ధార్మికుడు
C) ధర్మరాజు, యముడు
D) ధర్మడు, అధర్ముడు
జవాబు:
C) ధర్మరాజు, యముడు

ప్రశ్న 9.
“మునుపు” అనే పదానికి సరియైన నానార్థాలు
A) నునుపు, పంపుట
B) మునులు, తపస్వినులు
C) ముందు, పూర్వము
D) ఎదురు, తిట్టు
జవాబు:
C) ముందు, పూర్వము

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 10.
సాధుజనుల పట్ల ఆదరణ కల్గి ఉండాలి – గీత గీసిన పదానికి నానార్థాలు
A) సాధువులు, సన్యాసులు
B) మంచివారు, సాధువులు
C) నిదానం, నెమ్మది
D) మంచి, ధర్మం
జవాబు:
B) మంచివారు, సాధువులు

ప్రశ్న 11.
ధర్మరాజు ఆజ్ఞా పరిపాలన వ్రతుడు – గీత గీసిన పదానికి నానార్థాలు
A) ఉత్తరువు, ఉత్తరం
B) దండన, బెత్తం
C) ఉత్తరువు, దండన
D) ఉత్తరం, బెత్తం
జవాబు:
C) ఉత్తరువు, దండన

V. ప్రకృతి, వికృతులు :

ప్రశ్న 1.
ఆజ్ఞను కొందరు ఆనతి అంటారు – గీత గీసిన పదానికి వికృతి
A) అధికారం
B) ఆన
C) గుర్తు
D) ప్రతిన
జవాబు:
B) ఆన

ప్రశ్న 2.
“పురము”నకు సరియైన వికృతి పదము
A) వూరు
B) కాపురము
C) ప్రోలు
D) పూరణ
జవాబు:
C) ప్రోలు

ప్రశ్న 3.
మనస్సుకు భాష వస్తే కవిత్వం వస్తుంది గీత గీసిన పదానికి వికృతి పదం
A) భాస
B) బాస
C) బాష
D) బాసులు
జవాబు:
B) బాస

ప్రశ్న 4.
“దిష్టి” అనే పదానికి సరియైన వికృతి పదం
A) దూరము
B) అదృష్టం
C) దుష్టుడు
D) దృష్టి
జవాబు:
D) దృష్టి

ప్రశ్న 5.
ఈ కింది వానిలో ప్రకృతి – వికృతి సరిగా లేనిది
A) రాజు – తేడు
B) కీర్తి – కీరితి
C) వర్ణము – పర్ణము
D) కన్య – కన్నె
జవాబు:
C) వర్ణము – పర్ణము

ప్రశ్న 6.
“ధర్మము (ప్ర) – ధమ్మము (వి)” వీటిలో వికృతి పదం సరిగా లేదు. సరైన వికృతి
A) ధరమము
B) దమ్మము
C) దమము
D) ధరమ
జవాబు:
B) దమ్మము

ప్రశ్న 7.
“యోధుడు” – ప్రకృతి పదమునకు వికృతి
A) జోదు
B) యోద్ధ
C) యెద
D) ఎదిరి
జవాబు:
A) జోదు

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 8.
అద్దములో మన రూపము చూడవచ్చు – గీత గీసిన పదానికి వికృతి
A) రూప్యము
B) రూపాయి
C) రూపు
D) రూపాలు
జవాబు:
C) రూపు

ప్రశ్న 9.
“కుమారుడు” అనే పదానికి వికృతి పదము
A) కొడుకు
B) కొమరుడు
C) కన్నయ్య
D) కుమారిత
జవాబు:
B) కొమరుడు

ప్రశ్న 10.
ఈ వస్త్రము వర్ణము బాగుంది – గీత గీసిన పదానికి వికృతి
A) పర్ణము
B) వర్ణి
C) తారు
D) వన్నె
జవాబు:
D) వన్నె

ప్రశ్న 11.
యమధర్మరాజు కుమారుడు ధర్మరాజు – గీత గీసిన పదానికి వికృతి
A) పుత్రుడు.
B) సుతుడు
C) బొట్టె
D) కొమరుడు
జవాబు:
D) కొమరుడు

ప్రశ్న 12.
తన కీర్తి కాంతులను ప్రసరింపచేస్తూ ధర్మరాజు పాలించేవాడు – గీత గీసిన పదానికి వికృతి
A) పేరు
B) ప్రతిష్ఠ
C) కీరితి
D) కొరతి
జవాబు:
C) కీరితి

ప్రశ్న 13.
సత్యమును రూపముగా కలవాడు – గీత గీసిన పదానికి వికృతి
A) బలం
B) సత్తు
C) సత్వం
D) నిజం
జవాబు:
B) సత్తు

ప్రశ్న 14.
ధర్మమును అనుసరించువాడు ధర్మరాజు – గీత గీసిన పదానికి వికృతి
A) దమ్మం
B) దరమం
C) ధరమం
D) దమ్ము
జవాబు:
A) దమ్మం

ప్రశ్న 15.
విష్ణువు ఆయుధాలలో శార్జ్గవము ఒకటి – గీత గీసిన పదానికి వికృతి
A) విల్లు
B) కత్తి
C) సింగిణీ
D) సారగవము
జవాబు:
C) సింగిణీ

VI. వ్యుత్పత్త్యర్ధములు :

ప్రశ్న 1.
తన దేహము నుండి పుట్టినవాడు – వ్యుత్పత్త్యర్ధము గల పదము
A) కొడుకు
B) తనూజుడు
C) దేహి
D) దేవత
జవాబు:
B) తనూజుడు

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 2.
ధర్మనందనుడు – అను పదానికి సరియైన వ్యుత్పత్తి
A) ధర్మము మరియు నందనుడు
B) ధర్ముని కొరకు నందనుడు
C) యమధర్మరాజు యొక్క కొడుకు
D) నందనుడైన ధర్ముడు.
జవాబు:
C) యమధర్మరాజు యొక్క కొడుకు

ప్రశ్న 3.
“జలమునకు నిధి” అను వ్యుత్పత్త్యర్ధము గల పదము
A) జలధి
B) జలజము
C) జలజాకరము
D) బావి
జవాబు:
A) జలధి

ప్రశ్న 4.
పాండవులు – అను పదానికి సరియైన వ్యుత్పత్తి
A) ధర్మభీమార్జునులు
B) పాండురాజు యొక్క కుమారులు
C) పాండవులు వేయిమంది
D) కౌరవులు కానివారు.
జవాబు:
B) పాండురాజు యొక్క కుమారులు

ప్రశ్న 5.
“నరులను పాలించువాడు” అను వ్యుత్పత్తి అర్థము గల పదము
A) నరనారాయణుడు’
B) చక్రవర్తి
C) నృపాలుడు
D) రాజు
జవాబు:
C) నృపాలుడు

ప్రశ్న 6.
అమరులు-అను పదానికి సరియైన వ్యుత్పత్త్యర్ధము గల పదము
A) మరులు కొన్నవారు
B) స్వర్గములో ఉండువారు
C) మరణము లేనివారు
D) చెట్లు గల వారు వ్యుత్పత్తి అర్థము గల పదము
జవాబు:
C) మరణము లేనివారు

ప్రశ్న 7.
సంతోష పెట్టువాడు – అను వ్యుత్పత్తి అర్థము గల పదము
A) స్నేహితుడు
B) నందనుడు
C) సోదరుడు
D) భగవంతుడు
జవాబు:
B) నందనుడు

ప్రశ్న 8.
సత్యప్రధానమైన యుగము – అను వ్యుత్పత్తి అర్థము గల పదము
A) కలియుగం
B) ద్వాపరయుగం
C) కృతయుగం
D) త్రేతాయుగం
జవాబు:
C) కృతయుగం

PAPER – II : PART – A

అపరిచిత పద్యాలు

1. క్రింది పద్యాన్ని చదివి, అర్థం చేసుకుని, ఇచ్చిన ఖాళీలను పూరించండి.

తలనుండు విషము ఫణికిని
వెలయంగాఁ దోఁక నుండు వృశ్చికమునకున్
దల తోఁక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ !

ఖాళీలు

1) పాముకు విషం ………… లో ఉంటుంది.
జవాబు:
తల

2) వృశ్చికమనగా ………….
జవాబు:
తేలు

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

3) శరీరమంత విషం ……….. ఉంటుంది.
జవాబు:
ఖలునకు

4) పై పద్య మకుటం ………….
జవాబు:
సుమతీ

5) పై పద్యాన్ని రచించిన కవి ……..
జవాబు:
బద్దెన

2. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు
నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు
సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులు, దేళ్ళు
పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు.

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
నాగులేరు ఏ సీమలో ప్రవహిస్తున్నది?
జవాబు:
నాగులేరు పల్నాటి సీమలో ప్రవహిస్తున్నది.

ప్రశ్న 2.
పల్నాటిసీమ ప్రజల ఆహారం ఏది?
జవాబు:
పల్నాటి సీమ ప్రజల ఆహారం సజ్జ, జొన్నకూళ్ళు.

ప్రశ్న 3.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి ‘పల్నాటి పల్లెటూళ్ళు’ అని పేరు పెట్టవచ్చు.

ప్రశ్న 4.
ఈ పద్యంలోని శబ్దాలంకారమేమిటో రాయండి.
జవాబు:
ఈ పద్యంలోని శబ్దాలంకారం వృత్త్యనుప్రాసం.

ప్రశ్న 5.
ఈ పద్యం వల్ల ఏమి తెలుస్తోంది ?
జవాబు:
ఈ పద్యం వల్ల పల్నాటి సీమ పల్లెటూళ్ళ గురించి తెలుస్తోంది.

3. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

అక్షరంబు వలయు కుక్షి జీవనులకు
నక్షరంబు జిహ్వ కిక్షు రసము
అక్షరంబు తన్ను రక్షించు గావున
నక్షరంబు లోక రక్షితంబు.

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
మానవులకు ఏం కావాలి ?
జవాబు:
మానవులకు అక్షరం (విద్య) కావాలి.

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 2.
అక్షరం జిహ్వకు ఎటువంటిది ?
జవాబు:
అక్షరం జిహ్వకు చెరకురసం వంటిది.

ప్రశ్న 3.
అక్షరము దేనిని రక్షిస్తుంది ?
జవాబు:
అక్షరము తనను (చదువుకున్నవానిని) రక్షిస్తుంది.

ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘అక్షరాలు నేర్చుకో.’

ప్రశ్న 5.
ఈ పద్యంలో దేన్ని గురించి తెలియజేయబడింది?
జవాబు:
ఈ పద్యంలో ‘చదువు’ గురించి తెలియజేయబడింది.

4. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

కందుకము వోలె సుజనుడు
క్రిందంబడి మగుడ మీదికి న్నెగయుఁ జుమీ
మందుడు మృత్పిండమువలె
గ్రిందంబడి యడగియుండుఁ గృపణత్వమునన్.

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
సుజనుడు ఎట్లా ఉంటాడు ?
జవాబు:
సుజనుడు కందుకంలా ఉంటాడు.

ప్రశ్న 2.
మందుడు ఎలా ఉంటాడు ?
జవాబు:
మందుడు మృత్పిండంలా ఉంటాడు.

ప్రశ్న 3.
సుజనుని కవి దేనితో పోల్చాడు ?
జవాబు:
సుజనుని కవి బంతితో పోల్చాడు.

ప్రశ్న 4.
ఈ పద్యంలోని అలంకారమేమి ?
జవాబు:
ఈ పద్యంలో ఉపమాలంకారం ఉంది.

ప్రశ్న 5.
ఈ పద్యానికి శీర్షిక సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘నీతిపద్యం’.

5. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

కలహపడునింట నిలువదు.
కలుముల జవరాలు కానఁ గలకాలం బే
కలహములులేక సమ్మతి
మెలఁగంగా నేర్చెనేని మేలు కుమారీ !

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
కలహపడే ఇంట్లో ఏం నిలువదు ?
జవాబు:
కలహపడే ఇంట్లో లక్ష్మి (సంపద) నిలువదు.

ప్రశ్న 2.
కలకాలం ఎలా మెలగాలి ?
జవాబు:
కలకాలం ఏ విధమైన కలహాలు లేకుండా మెలగాలి.

ప్రశ్న 3.
ఈ పద్యం ఎవరిని సంబోధిస్తూ చెప్పబడింది ?
జవాబు:
ఈ పద్యం కుమారీని సంబోధిస్తూ అంటే ఆడపిల్లలను సంబోధిస్తూ చెప్పబడింది.

ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘కలహం వద్దు’.

ప్రశ్న 5.
ఈ పద్యం ఏ శతకం లోనిది?
జవాబు:
ఈ పద్యం కుమారీ శతకం లోనిది.

PAPER – II : PART – B

భాషాంశాలు – వ్యాకరణం

కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.

1. సంధులు:

ప్రశ్న 1.
భీమార్జునులు – సంధి విడదీస్తే
A) భీముడు + అర్జునుడు
B) భీ + మార్జునులు
C) భీమ + అర్జునుడు
D) భీముని + అర్జునుడు
జవాబు:
C) భీమ + అర్జునుడు

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 2.
“జయ + పెట్టు” – గసడదవాదేశ సంధి చేయగా
A) జయము + వెట్టు
B) జయవెట్టు
C) జయము పెట్టు
D) జోతపెట్టు
జవాబు:
B) జయవెట్టు

ప్రశ్న 3.
పాండవాగ్రేసరుడు – సంధి విడదీయగా
A) పాండ + వాగ్రేసరుడు
B) పాండవాగ్ర + ఇసరుడు
C) పాండవాగ్రే + సరుడు
D) పాండవ + అగ్రేసరుడు
జవాబు:
D) పాండవ + అగ్రేసరుడు

ప్రశ్న 4.
“కన్యకాధిపతి”లో వచ్చు సంధి
A) యణాదేశ సంధి
B) సవర్ణదీర్ఘ సంధి
C) యడాగమ సంధి
D) గుణసంధి
జవాబు:
B) సవర్ణదీర్ఘ సంధి

ప్రశ్న 5.
“అర్ధికి + ఇచ్చు” – ఏ సంధి
A) ఇత్వ సంధి
B) అత్వ సంధి
C) యడాగమ సంధి
D) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
A) ఇత్వ సంధి

ప్రశ్న 6.
వాలి, సుగ్రీవులు అన్నదమ్ములు – గీత గీసిన పదానికి సంధి విడదీసి రాయండి.
A) అన్న + దమ్ములు
B) అన్నయు + తమ్ముడు
C) అన్న + తమ్ములు
D) అన్నా + దమ్ములు
జవాబు:
C) అన్న + తమ్ములు

ప్రశ్న 7.
“పంచ + ఆస్యము” అని విడదీయగా పూర్వ పరస్వరములు
A) చ + ఆ
B) అ + ఆ
C) పంచ + ఆస్యము
D) ఆ మరియు అ
జవాబు:
B) అ + ఆ

ప్రశ్న 8.
“సవర్ణదీర్ఘ సంధి”కి సరియైన ఉదాహరణ
A) అతనికి + ఇచ్చు
B) యడాగమ సంధి
C) పంచ + అమరతరులు
D) వాడు + ఉండెను
జవాబు:
C) పంచ + అమరతరులు

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 9.
ఇచ్చకము + మెచ్చు – సంధి చేయగా వచ్చు సంధి
A) పుంప్వాదేశ సంధి
B) మేన + అత్త
C) ఉత్వ సంధి
D) లులనల సంధి
జవాబు:
A) పుంప్వాదేశ సంధి

ప్రశ్న 10.
య, వ, ర లు ఆదేశము వచ్చు సంధి పేరు
A) యడాగమ సంధి
B) యణాదేశ సంధి
C) గసడదవాదేశ సంధి
D) గుణసంధి
జవాబు:
B) యణాదేశ సంధి

ప్రశ్న 11.
త్రికములు అనగా
A) ఏ, ఓ, అర్
B) ఇ, ఉ, ఋ
C) ఆ, ఈ, ఏ
D) ఏ, ఐ, ఓ, ఔ
జవాబు:
C) ఆ, ఈ, ఏ

ప్రశ్న 12.
ఏ, ఓ, అర్ లను ఏమంటారు ?
A) త్రికములు
B) గుణములు
C) సరళములు
D) వృద్ధులు
జవాబు:
B) గుణములు

II. సమాసములు :

ప్రశ్న 1.
ధర్మార్జునులు – అను దానికి సరియైన విగ్రహవాక్యము
A) ధర్మము మరియు అర్జునుడు
B) ధర్మరాజు మరియు అర్జునుడు
C) ధర్మరాజు తమ్ముడైన అర్జునుడు
D) ధర్మర్జునులు మొదలైనవారు
జవాబు:
B) ధర్మరాజు మరియు అర్జునుడు

ప్రశ్న 2.
“ద్వంద్వ సమాసము”నకు ఉదాహరణ
A) రేపగలు
B) దయాభరణుడు
C) ధర్మనందనుడు
D) దోఃఖర్జులు
జవాబు:
A) రేపగలు

ప్రశ్న 3.
పంచాయుధములు, పంచాస్యములు – ఏ సమాసమునకు ఉదాహరణ ?
A) ద్వంద్వ సమాసము
B) విశేషణ పూర్వపద కర్మధారయము
C) ద్విగు సమాసము
D) రూపక సమాసము
జవాబు:
C) ద్విగు సమాసము

ప్రశ్న 4.
పాండు కుమారులు – అను పదమునకు విగ్రహవాక్యము రాయగా
A) పాండురాజు వలన కుమారులు
B) కుమారులగు పాండవులు
C) పాండవులును, కుమారులును
D) పాండురాజు యొక్క కుమారులు
జవాబు:
D) పాండురాజు యొక్క కుమారులు

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 5.
కృప అనెడు రసము – అనే విగ్రహవాక్యాన్ని సమాసము చేయగా
A) కృపకు రసము
B) కృపతో రసము
C) కృపాభావము
D) కృపారసము
జవాబు:
D) కృపారసము

ప్రశ్న 6.
ధర్మరాజుకు నలుగురు తమ్ముకుర్రలు కలరు – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం
A) కుర్రలైన తమ్ములు
B) తమ్ములైన కుర్రలు
C) తమ్ములును, కుర్రలును
D) తమ్ముల వంటి కుర్రలు
జవాబు:
A) కుర్రలైన తమ్ములు

ప్రశ్న 7.
“విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము”నకు ఉదాహరణ
A) కార్మిక వృద్ధులు
B) పాదపద్మం
C) తొల్లిటిరాజులు
D) పాండునందనులు
జవాబు:
C) తొల్లిటిరాజులు

ప్రశ్న 8.
చతురబ్ధులు – ఇది ఏ సమాసమునకు ఉదాహరణగా గుర్తించవచ్చు.
A) ద్వంద్వ సమాసము
B) ద్విగు సమాసము
C) విశేషణ పూర్వపదం
D) బహువ్రీహి
జవాబు:
B) ద్విగు సమాసము

ప్రశ్న 9.
“విశేషణం ఉత్తరపదం”గా ఉన్న సమాసము
A) విశేషణ పూర్వపద కర్మధారయము
B) ఉపమాన పూర్వపద కర్మధారయము
C) విశేషణ ఉత్తరపద కర్మధారయము
D) ఉపమాన ఉత్తరపద కర్మధారయము
జవాబు:
C) విశేషణ ఉత్తరపద కర్మధారయము

ప్రశ్న 10.
కన్యక (పార్వతి)కు అధిపతి – సమాసము పేరు
A) షష్ఠీ తత్పురుష
B) చతుర్థీ తత్పురుష
C) బహువ్రీహి
D) సంభావనా పూర్వపద కర్మధారయము
జవాబు:
A) షష్ఠీ తత్పురుష

III. ఛందస్సు :

ప్రశ్న 1.
అతని కతండె సాటి చతురబ్ధి పరీత మహీతలమ్మునన్ – ఏ పద్యపాదం ?
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) కందం
D) సీసం
జవాబు:
B) చంపకమాల

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 2.
మ, స, జ, స, త, త, గ – అను గణములు వరుసగా వచ్చు పద్యం.
A) శార్దూలము
B) మత్తేభము
C) చంపకమాల
D) ఉత్పలమాల
జవాబు:
A) శార్దూలము

ప్రశ్న 3.
“నీవేనా” అను పదమును గణ విభజన చేయగా
A) U IU
B) UUU
C) UUI
D) IUI
జవాబు:
B) UUU

ప్రశ్న 4.
IIU – ఇది ఏ గణం ?
A) భ గణం
B) జ గణం
C) స గణం
D) ర గణం
జవాబు:
C) స గణం

ప్రశ్న 5.
సూర్య గణములు
A) న, హ(గల)
B) భ, ర, త
C) గగ, నల
D) లగ, గల
జవాబు:
A) న, హ(గల)

IV. అలంకారములు :

ప్రశ్న 1.
ఒక వస్తువునకు మరొక వస్తువుతో రమణీయమైన పోలిక చెప్తే
A) రూపకం
B) ఉపమా
C) ఉత్ప్రేక్ష
D) యమకం
జవాబు:
B) ఉపమా

ప్రశ్న 2.
తెలుగువీర లేవరా !
దీక్షబూని సాగరా !
అదరవద్దు బెదరవద్దు !
నింగి నీకు హద్దురా !
పై గీతంలో ఉన్న అలంకారం
A) యమకం
B) వృత్త్యనుప్రాస
C) అంత్యానుప్రాస
D) లాటానుప్రాస
జవాబు:
C) అంత్యానుప్రాస

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 3.
ఒకే అక్షరం పలుమార్లు ఆవృత్తి అయితే,
A) అంత్యానుప్రాస.
B) ఛేకానుప్రాస
C) యమకము
D) వృత్త్యనుప్రాస
జవాబు:
D) వృత్త్యనుప్రాస

ప్రశ్న 4.
“భూమి బంతి వలె గోళంగా ఉన్నది.” – ఈ వాక్యంలో గల అలంకారం
A) ఉత్ప్రేక్ష
B) ఉపమా
C) రూపకము
D) వృత్త్యనుప్రాస
జవాబు:
B) ఉపమా

V. వాక్యాలు:

ప్రశ్న 1.
ఈ కింది వాక్యాలలో కర్తరి వాక్యము
A) ఆమె డాక్టరు.
B) ఈ రోజు ఇంటికి వెళ్ళండి.
C) రాము సైకిల్ను తొక్కుతున్నాడు.
D) రాము బజారుకు వెళుతున్నాడు.
జవాబు:
C) రాము సైకిల్ను తొక్కుతున్నాడు.

ప్రశ్న 2.
“రాము తోటపనిని చేస్తున్నాడు.” – ఈ వాక్యమును కర్మణి వాక్యములోనికి మార్చగా
A) తోటపనిని రాము చేస్తున్నాడు.
B) తోటపని రాము చేత చేయబడుచున్నది.
C) చేస్తున్నాడు, రాము తోటపనిని.
D) రాము చేస్తున్న పని, తోటపని.
జవాబు:
B) తోటపని రాము చేత చేయబడుచున్నది.

ప్రశ్న 3.
“వారిచే సినిమా నిర్మించబడినది.” – ఇది ఏ వాక్యం ?
A) కర్మణి వాక్యం
B) కర్తరి వాక్యం
C) సంయుక్త వాక్యం
D) ప్రారంభ వాక్యం
జవాబు:
A) కర్మణి వాక్యం

ప్రశ్న 4.
“ధర్మరాజు తమ్ములను ఆదరించాడు.” ఇది ఏ వాక్యం ?
A) సంయుక్త వాక్యం
B) కర్తరి వాక్యం
C) సంశ్లేష వాక్యం
D) అప్రధాన వాక్యం
జవాబు:
B) కర్తరి వాక్యం

TS 9th Class Telugu Important Questions 12th Lesson తీయని పలకరింపు

These TS 9th Class Telugu Important Questions 12th Lesson తీయని పలకరింపు will help the students to improve their time and approach.

TS 9th Class Telugu 12th Lesson Important Questions తీయని పలకరింపు

PAPER – I : PART – A

I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)

అ) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
నేటి సమాజంలో కొందరు ముసలి తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు అప్పగిస్తున్నారు. ఎందుకు ? కారణాలను వివరించండి.
జవాబు:
మానవుడు సంఘజీవి. పదిమందితో కలిసి జీవించాలనుకుంటాడు. దేశ విదేశాలతో సంబంధాలు నెలకొల్పుకుంటాడు. కాని తన కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా, ఇంటికి పెద్దదిక్కుగా ఉండే వృద్ధులను గౌరవంగా చూస్తున్నాడా ? ఈ ప్రశ్న ఎక్కువమందికి ప్రశ్నార్థకమే.

“యౌవ్వనంలో మనమే కష్టాల్లోకి దూకుతాం. వృద్ధాప్యంలో కష్టాలే మనవైపుకు దూసుకువస్తాయి”. నిన్నటిదాకా ఎవరి సాయంతో అడుగులు వేయడం నేర్చామో, నేడు వారికి ఆసరాగా నడవాలి. మన తప్పులు సరిచేసి మనుషులుగా తీర్చిన వారికి నేడు మాట, చూపు సరిగా లేకపోవడంతో తోడుగా ఉండాలి. చిన్నప్పుడు లేచి నిలబడాలంటే భయపడిన మనకు ధైర్యం చెప్పిన పెద్దలు, ఇవాళ వృద్ధులు అయ్యి, నిలబడలేని స్థితిలో ఉంటే ఊతంగా వెన్నంటి ఉండాలి.

ఏమి చేతగాని స్థితి నుండి అన్నీ చేయగలను అనే స్థితికి కారకులైన పెద్దలు, ప్రస్తుతం ఏమీ చేసుకోలేని స్థితిలో ఉంటే వారికి మనమే తల్లీ, తండ్రీ కావాలి. పైన చెప్పినవన్నీ చేయాలంటే మనకు ముందు మనసుండాలి. చిరకాలం జీవించాలని అందరూ కోరుకుంటారు. ఎందుకో కాని ముసలివాళ్ళం అవ్వాలని మాత్రం ఎవరూ కోరుకోరు. ఎంత విచిత్రం’!. వృద్ధాప్యం గురించి షేక్స్పియర్ ఇలా అంటాడు – “అందరికీ చివరి అంకం. అద్భుతమైన చరిత్రకు చరమాంకం. మరోసారి వచ్చే బాల్యం, పళ్ళు, కళ్ళు, రుచి వంటివేమీ తెలియని స్థితి వృద్ధాప్యం” అని.

నేటి కాలంలో ముసలివారిని పట్టించుకొనే బిడ్డలు తక్కువ. ఆస్తిలో భాగానికి ముందుకొచ్చినవారే వృద్ధులైన తల్లిదండ్రులను సాకటానికి వెనుకంజ వేస్తున్నారు. మనుమలు, మనుమరాండ్రు సైతం చులకనభావంతో చూడడం మిక్కిలి బాధ కలిగించే విషయం. దూరప్రాంతాల్లో ఉండి ఉద్యోగాలు చేసేవారు ఇంటివద్ద ఉండి వృద్ధులను చూసుకొనే మనసు లేక వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారు. వైద్య విషయంలో కూడా సరైన మందు, తిండి పెట్టడానికి తీరికలేని పిల్లలను కన్న ముసలివాళ్ళు వృద్ధాశ్రమాల్లో చేర్చబడటంలో తప్పేముంది. వాళ్ళని కనడం తప్ప.

TS 9th Class Telugu Important Questions 12th Lesson తీయని పలకరింపు

ప్రశ్న 2.
“తీయని పలకరింపు” పాఠం ద్వారా ప్రస్తుతం సమాజంలో వృద్ధులు మన నుండి ఏం కోరుకుంటున్నారో తెల్పండి.
జవాబు:
ఆధునిక జీవితంలో కుటుంబ విలువలు, మానవ సంబంధాలు అడుగంటుతున్నాయి. ముసలివారిని నిర్లక్ష్యంగా చూస్తున్నారు. వృద్ధుల అవసరాలు తీర్చడాన్ని, వారికి ఆత్మీయతను పంచడాన్ని పిల్లలు మరచిపోతున్నారు. వృద్ధులు తాము పెంచిన పిల్లలు తమపట్ల చూపుతున్న నిరాదరణనూ, తమ ఆవేదననూ ఎవరికీ చెప్పుకోలేక బాధపడుతున్నారు. ఆప్యాయంగా పిలిచి మాట్లాడేవారు, నిజంగా మనిషికి కావాలి. ‘తీయటి పలకరింపు’ మనిషికి కావాలి.

తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో ప్రేమతో తమ గుండెలపై పెట్టుకొని పెంచుతారు. కడుపు కట్టుకొని పిల్లలకు తల్లిదండ్రులు కావలసినవి సమకూరుస్తారు. తమ వృద్ధాప్యంలో పిల్లలు తమను ఆదుకుంటారనే ఉద్దేశ్యంతో తమ సర్వస్వాన్ని. బిడ్డల కోసం వినియోగిస్తారు. అటువంటి ప్రేమజీవులను నిర్లక్ష్యం చేయడం, ముసలితనంలో పట్టించుకోకపోవడం వారికి తీవ్ర మనస్తాపాన్ని కల్గిస్తున్నాయి.

చివరి దశలో వారికి తిండి, బట్ట, గూడుతో పాటు బిడ్డల ప్రేమ పూర్వకమైన ఆదరణ, తీయని పలకరింపు కావాలి. కుటుంబ సభ్యులతో కలసిమెలిసి హాయిగా నవ్వుతూ సాగించే జీవనం కావాలి. “గతకాలమే బాగున్నదనిపించడం వృద్ధాప్యపు చిహ్నం”. కానీ ఉన్నంతకాలం వృద్ధులను బాగా చూసుకోవడం బిడ్డల కర్తవ్యం.

ప్రశ్న 3.
వృద్ధాప్యంలో మనుషులకు ఏం కావాలి ? కుటుంబ సభ్యులు వాళ్ళను ఎట్లా చూసుకోవాలి ?
జవాబు:
వృద్ధాప్యంలో మనుష్యులకు ఉండడానికి ఇల్లు, కట్టుకోడానికి బట్ట, తినడానికి తిండి కావాలి. వయస్సులో ఉన్నప్పుడే మనుషులు వృద్ధాప్యానికి కావలసిన ఏర్పాటు చేసికోవాలి. వృద్ధాప్యంలో సామాన్యంగా మంచి ఆరోగ్యం ఉండదు. అందువల్ల మంచి వైద్య సదుపాయం కావాలి.

పైన చెప్పిన వాటన్నింటితో పాటు బిడ్డల ప్రేమ పూర్వకమైన ఆదరణ, తీయని పలకరింపు కావాలి. వేళకు తగిన మితాహారం కావాలి. కుటుంబసభ్యులతో కలిసిమెలసి హాయిగా నవ్వుతూ సాగించే జీవనం కావాలి. ఆధ్యాత్మికమైన జీవనం కావాలి. వారు చదువుకోడానికి దైవ సంబంధమైన సాహిత్యం కావాలి.

భారత, భాగవత, రామాయణ గ్రంథాలు కావాలి. నేటి కాలానికి అవసరమైన టీ.వీ., రేడియో, ఫోను వంటి సౌకర్యాలు వారికి కావాలి. కుటుంబ సభ్యులు, వృద్ధులను ప్రేమగా, ఆప్యాయతతో పలుకరిస్తూ వారి అవసరాలను అడిగి తెలుసుకోవాలి. మధ్యమధ్య వారిని డాక్టర్ల వద్దకు తీసుకువెళ్ళి పరీక్షలు చేయించాలి. వారికి ముఖ్యావసరమయిన మందులను అందివ్వాలి. వృద్ధులను వృద్ధాశ్రమాలలో చేర్చక, తమతోపాటే కలో గంజో వారు త్రాగే ఏర్పాట్లు చేయాలి. వృద్ధులకు ముఖ్యంగా కావలసిన ప్రేమాదరాలను కుటుంబ సభ్యులు వారికి పంచి ఇవ్వాలి.

TS 9th Class Telugu Important Questions 12th Lesson తీయని పలకరింపు

ప్రశ్న 4.
వృద్ధులైన నాయనమ్మ, తాతయ్యల అవసరాలు తీర్చడానికి నీవు ఏయే పనులు చేస్తావో సొంతమాటల్లో రాయుము.
జవాబు:
“నీవు వృద్ధుడిగా ఎదగవు, ఎదగటం మానివేసినప్పుడు వృద్ధుడవు అవుతావు” అన్నాడొక పెద్దాయన. వయసుతో పాటు మానసిక పరిణతి సాధిస్తే వృద్ధాప్యం శాపం కాదు. మనం గమనిస్తే లోకంలో కొందరు పుట్టుకతోనే వృద్ధుల్లా, మరికొందరు వృద్ధాప్యం వచ్చినా యువకుల్లా జీవిస్తారు. దీనినిబట్టి సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నంతకాలం అందరూ యువకులే అన్న సంగతి మరచిపోకూడదు.

వృద్ధులైన తాతయ్య, నాయనమ్మలు కోరుకునేది మన నుండి కాస్త ప్రేమాభిమానాలే. బాల్యంలో మన తల్లిదండ్రులు, తాతమామ్మలు మనకు ఎలా సేవలు చేసారో అవి మరచిపోకూడదు. తాత మామ్మలు ముసలితనం వల్ల వారి పనులు వారు చేసుకోలేరు. కనుక అవి గమనించి సమయానికి తగినట్లు వారికి కావల్సినవి సమకూరుస్తాను. అల్పాహారం, భోజనం, మందులు ఇలా కావల్సినవి అందిస్తాను.

మానసిక ప్రశాంతత కోసం రామాయణ, భారత, గీత వంటి పుస్తకాలు ఇచ్చి వారికి సంతోషం కలిగిస్తాను. వారికి ఏమీ తోచనపుడు అలా బయటకు తీసుకువెళ్ళి, వారి చిన్ననాటి సంగతులను గుర్తుకు వచ్చేట్లు చేస్తాను. బడికి వెళ్ళేముందు, వచ్చిన తర్వాత ఖాళీ సమయాన్ని వారికే కేటాయిస్తాను. చిన్నవయసులో వారు నాకు చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ వారిపట్ల గౌరవభావంతో ఉంటాను. ముసలితనం వారికి శాపంలాగా కాక సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తాను.

PAPER – I : PART – B

భాషాంశాలు – పదజాలం :

I. సొంతవాక్యాలు:.

అ) ఈ కింది పదాలకు సొంతవాక్యాలు రాయండి.

1. ఆత్మీయత : రామునిపట్ల భరతుని ఆత్మీయతకు లక్ష్మణుడు ఆశ్చర్యపడ్డాడు.
2. నిర్లక్ష్యం : అహింస పేరుతో దుర్మార్గుల పట్ల నిర్లక్ష్యం చేస్తే శాంతిభద్రతలు దెబ్బతింటాయి.
3. ఆదరాభిమానాలు : కళల పట్ల ఆదరాభిమానాలు రాజులు చూపించేవారు.
4. భయభక్తులు : విద్యపట్ల భయభక్తులు కలిగి విద్య నభ్యసించాలి నిర్లక్ష్యం వద్దు.
5. న్యాయాన్యాయాలు : దోషం చేసిన వారిపట్ల ఆత్మీయత చూపిస్తే న్యాయాన్యాయాలు సరిగా నిర్ణయించలేరు.
6. కష్టసుఖాలు : తెలంగాణ ఉద్యమంలో K.C.R. కి తాము పొందిన కష్టసుఖాలకంటే ప్రజల ఆదరాభిమానాలు సంతృప్తి నిచ్చాయి.
7. సంప్రదింపులు : ఒక ప్రాజెక్టు కట్టాలంటే వివిధ శాఖలతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి.
8. పీడవదలు : ఆంగ్లేయుల పీడవదలిందను కొంటే, నల్లధనం పీడ భారత్ను పట్టుకుంది.

TS 9th Class Telugu Important Questions 12th Lesson తీయని పలకరింపు

II. ఆరాలు:

ప్రశ్న 1.
“మననం చేసుకొను” అంటే అర్థం
A) గుర్తుకు తెచ్చుకొను
B) స్వంతం చేసుకొను
C) మనసుకు తెచ్చు
D) మరల వచ్చు
జవాబు:
A) గుర్తుకు తెచ్చుకొను

ప్రశ్న 2.
విచారపడు – అనే అర్థం గల పదం
A) ముందుకు వచ్చు
B) వాపోవు
C) వావిరిపోవు
D) వదరుపోవు
జవాబు:
B) వాపోవు

ప్రశ్న 3.
అర్జునుని విషాదము శ్రీకృష్ణుడు పోగొట్టెను – గీత గీసిన పదానికి అర్థం
A) విప్లవము
B) ఆలోచన
C) దుఃఖము
D) విషయము
జవాబు:
C) దుఃఖము

TS 9th Class Telugu Important Questions 12th Lesson తీయని పలకరింపు

ప్రశ్న 4.
“స్వజనము” అంటే అర్థం
A) స్వరాజ్యము
B) తనవారు
C) సొంతప్రజలు
D) మనస్సులో మాట
జవాబు:
B) తనవారు

ప్రశ్న 5.
పెన్నుపారేసి వాళ్ళమ్మకు తెలియకుండా గోప్యంగా ఉంచాడు – గీత గీసిన పదానికి అర్థం
A) గోపికగా
B) తక్కువగా
C) రహస్యంగా
D) చెప్పకుండా
జవాబు:
C) రహస్యంగా

ప్రశ్న 6.
పరిశ్రమలు నెలకొల్పు చోట నీరుండాలి – గీత గీసిన పదానికి అర్థం
A) స్థాపించు
B) ప్రారంభించు
C) ఉన్నచోట
D) నెలవారిగా
జవాబు:
A) స్థాపించు

TS 9th Class Telugu Important Questions 12th Lesson తీయని పలకరింపు

ప్రశ్న 7.
సర్వీసులో ఉండగా చాలా జోరుగా ఉండేది – గీత గీసిన పదానికి అర్థం
A) జోజో
B) హుషారు
C) హాయి
D) నిరుత్సాహం
జవాబు:
B) హుషారు

ప్రశ్న 8.
ఆనాటి ఆదరాభిమానాలు ఇప్పుడు కనబడవని వాపోతారు – గీత గీసిన పదానికి అర్థం
A) సంతోషిస్తారు
B) నవ్వుతారు
C) విచారిస్తారు
D) ఏడుస్తారు
జవాబు:
C) విచారిస్తారు

ప్రశ్న 9.
తన తల్లిదండ్రుల స్మృత్యర్థం ఈ నిలయాన్ని నెలకొల్పారు – గీత గీసిన పదానికి అర్థం
A) జ్ఞాపకంగా
B) కలగా
C) దైవంగా
D) ఇష్టంగా
జవాబు:
A) జ్ఞాపకంగా

TS 9th Class Telugu Important Questions 12th Lesson తీయని పలకరింపు

ప్రశ్న 10.
ఇంక స్వంతిల్లేమిటి ? స్వజనమేమిటి? గీత గీసిన పదానికి అర్థం
A) అందరివారు
B) ఎవరికి వారు
C) పరాయివారు
D) తనవారు
జవాబు:
D) తనవారు

III. ప్రకృతి, వికృతులు:

ప్రశ్న 1.
ఆశ్చర్యము – అనే పదానికి వికృతి
A) అశచర్యము
B) అచ్చెరువు
C) ఆచ్ఛరం
D) ఆసుచర్య
జవాబు:
B) అచ్చెరువు

ప్రశ్న 2.
“సాయం” అనే పదానికి ప్రకృతి
A) సహాయం
B) సాయంకాలం
C) సరియగు
D) శయనం
జవాబు:
A) సహాయం

TS 9th Class Telugu Important Questions 12th Lesson తీయని పలకరింపు

ప్రశ్న 3.
మౌనం” అంటే పండుగ గుర్తుకు వస్తోంది – గీతగీసిన పదానికి ప్రకృతి
A) భోషాణం
B) భోగి
C) భోజనము
D) భోగం
జవాబు:
B) భోగి

ప్రశ్న 4.
కింది వానిలో సరియైన ప్రకృతి-వికృతి కానిది.
A) హంస-అంచ
B) న్యాయం-నెయ్యం
C) సంతోషం సంతసం
D) సన్యాసి – సన్నాసి
జవాబు:
B) న్యాయం-నెయ్యం

ప్రశ్న 5.
బంధం – అనే పదానికి వికృతి
A) బందువు
B) బందుగు
C) బందం
D) బందు
జవాబు:
C) బందం

TS 9th Class Telugu Important Questions 12th Lesson తీయని పలకరింపు

ప్రశ్న 6.
ఈ కింది వానిలో సరియైన ప్రకృతి-వికృతి కానిది
A) ప్రకృతి – పగిది
B) అనాథ – అనది
C) మతి – మది
D) వీధి – ఈది
జవాబు:
D) వీధి- ఈది

ప్రశ్న 7.
మతి స్థిరం లేదు – గీత గీసిన పదానికి ప్రకృతి
A) యతి
B) మది
C) బుద్ధి
D) మనస్సు
జవాబు:
B) మది

ప్రశ్న 8.
వృద్ధులూ, అనాథలూ, పేదవారూ స్థిరవాసం భజన్లాల్ నిలయం – గీత గీసిన పదానికి వికృతి
A) అనాద
B) అనిద
C) అనది
D) అనాది
జవాబు:
C) అనది

TS 9th Class Telugu Important Questions 12th Lesson తీయని పలకరింపు

ప్రశ్న 9.
తన గది తలుపు వీథి వరండాలోకే ఉంది – గీత గీసిన పదానికి వికృతి
A) వీది
B) బజారు
C) వాడ
D) వసారా
జవాబు:
A) వీది

ప్రశ్న 10.
ప్రకృతి వన్నెచిన్నెలు వర్ణించటానికి ఎవరి తరం – గీత గీసిన పదానికి వికృతి
A) ప్రకతి
B) పగద
C) పకిత
D) పగిది
జవాబు:

IV. పర్యాయపదాలు :

ప్రశ్న 1.
పెళ్ళి – అనే పదానికి పర్యాయపదాలు
A) పరిణయము, వివాహము
B) పాణిగ్రహణం, తలంబ్రాలు
C) గాంధర్వము, పాదపీడనం
D) కల్యాణ కంకణం, కరచాలనం
జవాబు:
A) పరిణయము, వివాహము

TS 9th Class Telugu Important Questions 12th Lesson తీయని పలకరింపు

ప్రశ్న 2.
రాముని భార్య సీత – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) అర్ధాంగి, పార్వతి
B) ఆలు, ఇల్లాలు, పత్ని
C) వివాహిత, ఉత్తమురాలు
D) సంస్కృతి, సంస్కారి
జవాబు:
B) ఆలు, ఇల్లాలు, పత్ని

ప్రశ్న 3.
హరిశ్చంద్రుడు సత్యం కోసం రాజ్యం విడిచిపెట్టాడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) సత్యం, సత్యవతి
B) న్యాయం, ధర్మం
C) నిజము, ఋతము, నిక్కం
D) దానము, దయ
జవాబు:
C) నిజము, ఋతము, నిక్కం

ప్రశ్న 4.
తరువు, మహీజం – అనే పర్యాయపదాలుగా గల పదం
A) సూర్యుడు
B) కాండం
C) కొమ్మ
D) వృక్షం.
జవాబు:
D) వృక్షం

TS 9th Class Telugu Important Questions 12th Lesson తీయని పలకరింపు

ప్రశ్న 5.
జలం, సలిలం అనే పర్యాయపదాలుగా గల పదం
A) కప్పం
B) అప్పనం
C) నీరు
D) సూర్యుడు
జవాబు:
C) నీరు

ప్రశ్న 6.
రజని, నిశ, నిశీధి, రేయి – అనే పర్యాయపదాలు గల పదం
A) నీరు
B) రాత్రి
C) నిప్పు
D) సూర్యుడు
జవాబు:
B) రాత్రి

ప్రశ్న 7.
“ఆవాసం” అనే పదానికి పర్యాయపదాలు
A) స్థానం, నెలవు, ఉండుచోటు
B) ఉనికి, మనికి
C) ప్రవాసం, నివాసం
D) ఇల్లు, ప్రాంగణం
జవాబు:
A) స్థానం, నెలవు, ఉండుచోటు

TS 9th Class Telugu Important Questions 12th Lesson తీయని పలకరింపు

ప్రశ్న 8.
నా సంతోషం అంబరం అంటింది గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) ఆకాశం, గగనం, మిన్ను
B) ఖం, మేఘం, ఓఘం
C) విహయసం, స్వర్గం
D) వినువీధి, నడివీధి
జవాబు:
A) ఆకాశం, గగనం, మిన్ను

ప్రశ్న 9.
కాలం – అనే పదానికి సరియైన పర్యాయపదం
A) సాహసం
B) సమయం
C) నిర్ణయం
D) క్రమం
జవాబు:
B) సమయం

ప్రశ్న 10.
బంధువులు, బందుగులు, చుట్టలు – పర్యాయపదాలుగా గల పదం
A) స్వజనం
B) చుట్టాలు
C) మిత్రులు
D) పరివారము.
జవాబు:
B) చుట్టాలు

TS 9th Class Telugu Important Questions 12th Lesson తీయని పలకరింపు

ప్రశ్న 11.
నీ మాటలోనూ నిజం లేకపోలేదు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) ధర్మం, న్యాయం
B) సత్యం, నిక్కం
C) ఋతం, వృత్తం
D) నిప్పు, ఉప్పు
జవాబు:
B) సత్యం, నిక్కం

ప్రశ్న 12.
దేహి అన్నవాళ్ళకు లేదనకుండా శక్తి కొద్దీ చేసాను – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) సత్తువ, బలం
B) సత్తు, బలగం
C) భారం, బలుపు
D) బరువు, బలహీనం
జవాబు:
A) సత్తువ, బలం

V. నానార్థాలు :

ప్రశ్న 1.
ఒక పర్వం పేరు, ప్రయత్నము, కొలువు – అనే నానార్థాలు గల పదం
A) ఉద్యమం
B) ఉద్యోగం
C) యుద్ధము
D) అరణ్యము
జవాబు:
B) ఉద్యోగం

TS 9th Class Telugu Important Questions 12th Lesson తీయని పలకరింపు

ప్రశ్న 2.
మైత్రి, నూనె (తైలం) – అనే నానార్థాలు గల పదం
A) స్నేహం
B) కారణం
C) చైతన్యం
D) సౌజన్యం
జవాబు:
A) స్నేహం

ప్రశ్న 3.
భాగవతంలో హరి భక్తుల కథలు ఉంటాయి – గీత గీసిన పదానికి నానార్థాలు
A) విష్ణువు, సింహం, కోతి
B) శివుడు, బ్రహ్మ
C) గుఱ్ఱము, దొంగ
D) హరిదాసు, హరికథ
జవాబు:
A) విష్ణువు, సింహం, కోతి

ప్రశ్న 4.
ఉద్యోగులు ఎల్లకాలం పదవిలో ఉండలేరు కదా ! – గీత గీసిన పదానికి నానార్థాలు
A) తాడి, కొబ్బరి
B) సమయం, నలుపు
C) చావు, పుట్టుక
D) నాలిక, నలుపు
జవాబు:
B) సమయం, నలుపు

TS 9th Class Telugu Important Questions 12th Lesson తీయని పలకరింపు

ప్రశ్న 5.
సభలకు పెద్ద ఉద్యోగి భార్యగా అధ్యక్షత వహిస్తుంది – గీత గీసిన పదానికి నానార్థాలు
A) ఇల్లు, ఇల్లాలు
B) పరిషత్తు, దుకాణం
C) పరిషత్, ఇల్లు
D) జూదం, మందు
జవాబు:
C) పరిషత్, ఇల్లు

VI. వ్యుత్పత్యర్థములు :

ప్రశ్న 1.
“పున్నామ నరకం నుండి రక్షించువాడు” అనే వ్యుత్పత్తి గల పదం
A) విష్ణువు
B) పుత్రుడు
C) హనుమంతుడు
D) పాము
జవాబు:
B) పుత్రుడు

ప్రశ్న 2.
“జానువుల (మోకాళ్ళ) వరకు పొడవైన చేతులు కలవాడు” అనే వ్యుత్పత్తి గల పదం
A) దీర్ఘదేహుడు
B) ఆజానుబాహుడు
C) స్ఫురద్రూపి
D) అందగాడు
జవాబు:
B) ఆజానుబాహుడు

TS 9th Class Telugu Important Questions 12th Lesson తీయని పలకరింపు

ప్రశ్న 3.
“గంగాధరుడు” – అనే పదానికి వ్యుత్పత్తి
A) గంగ ధరించినది (శివుడు)
B) గంగను శిరస్సుపై ధరించినవాడు (శివుడు)
C) గంగకు ధరుడు (శివుడు)
D) గంగ శిరసు నుండి జారినవాడు (శివుడు)
జవాబు:
B) గంగను శిరస్సుపై ధరించినవాడు (శివుడు)

ప్రశ్న 4.
చెలిమి కలవాడు – అనే వ్యుత్పత్తి గల పదం
A) స్నేహితుడు
B) ఆత్మీయుడు
C) హితుడు
D) సన్నిహితుడు
జవాబు:
A) స్నేహితుడు

ప్రశ్న 5.
జగము దీనియందు లయము పొందును – అనే వ్యుత్పత్తి గల పదం
A) తుపాను
B) వరద
C) ప్రళయం
D) సునామి
జవాబు:
B) వరద

TS 9th Class Telugu Important Questions 12th Lesson తీయని పలకరింపు

PAPER – II : PART – A

అపరిచిత గద్యాలు

ప్రశ్న 1.
కింది పేరా చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రూపొందించండి.

‘బ్రౌనును ఒక వ్యక్తిగా గాక, పెద్ద సాహిత్య సంస్థగా భావించడం అవసరం. యుగసంధిలో నిలిచిన ఈ వ్యక్తి అనేకానేక తాళపత్ర లిఖిత ప్రతులను సేకరించి, అవి ఎక్కడున్నాసరే, ఎంత ధనవ్యయమైనా సరే, లెక్క పెట్టకుండా, తన ఉద్యోగుల ద్వారా సంపాదించాడు. కొందరు పండితులను సమీకరించి, వారికి జీతభత్యాలిచ్చి, శుద్ధప్రతులు వ్రాయించి, కొన్నిటికి అర్థతాత్పర్యాలు సిద్ధం చేయించాడు. ‘విశ్వదాభిరామ వినురవేమ’ పద్యం తెలియని తెలుగువాడు లేడు. అయితే ఈ పద్యాలను మొదట తెలుగువాళ్ళకు పరిచయం చేసినది విదేశీయుడైన బ్రౌను. బ్రౌను పేరు స్మరించగానే, మనకు ముందు స్ఫురించేది బ్రౌను నిఘంటువు. ఈ కృషి 1832లో ఆరంభించబడి, 1853లో పూర్తి అయి ప్రథమ ముద్రణ అయింది. ఈ కృషిలో బ్రౌను ఏనుగుల వీరాస్వామి సహాయం పొందాడు. వీరాస్వామి రచించిన కాశీయాత్ర గురించిన పుస్తకం చారిత్రక దృష్ట్యా విలువైనది.
జవాబు:
ప్రశ్నలు :

  1.  తెలుగు సాహిత్యానికి సంబంధించినంతవరకు బ్రౌనును ఎట్లా పరిగణించడం భావ్యం ?
  2. బ్రౌను సంపాదించిన పుస్తకాలను ఏమంటారు ?
  3. పండితులతో బ్రౌను చేయించిన పనులేమిటి ?
  4. నిఘంటువు ప్రథమ ముద్రణ ఎప్పుడు వచ్చింది ?
  5. కాశీయాత్రను గురించి పుస్తకము రచించినదెవరు ?

TS 9th Class Telugu Important Questions 12th Lesson తీయని పలకరింపు

ప్రశ్న 2.
కింది పేరా చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రూపొందించండి.

విజ్ఞానశాస్త్రం ఎంతో పెరిగింది. దానివల్ల మనుషుల ఆలోచనలో మార్పు వచ్చింది. దాని ఫలితంగా జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులన్నీ సాహిత్య ప్రక్రియల్లో కనపడుతూ ఉంటాయి. సామాన్య మనుషుల జీవితం, వాళ్ళ జీవితంలో సమస్యలు చిత్రించి, పరిష్కారం సూచించడమే సాహిత్య ప్రక్రియలు చెయ్యవలసిన పని అనే భావం ఏర్పడింది. అందువల్ల సాహిత్యం ఇదివరకటిలాగా పండితులకు, జమీందారులకు పరిమితం కాదు.

సాహిత్యం కేవలం చదివి ఆనందించడానికే అన్న అభిప్రాయాలు మారిపోయాయి. సామాన్యులలోకి సాహిత్యం వచ్చేసింది. అందుకు అనువైన ప్రక్రియలే కథానిక, నాటిక, ప్రహసనం, నవల మొదలైనవి. అందుకే వీటిలోని భాష వినగానే అర్థమయ్యేటంతగా సరళంగా ఉండటం ప్రధాన లక్షణమైంది. అంతేకాక రోజువారీ జీవితంలో సామాన్య ప్రజలు మాట్లాడే భాషే ‘వ్యావహారికం’ అనే పేరున ఒక స్పష్టమైన రూపంతో పత్రికల వల్ల బాగా ప్రచారం అయింది.

ముఖ్యంగా నాటకాల్లో, నాటికల్లో కథ అంతా పాత్రల సంభాషణ ద్వారానే జరుగుతుంది కనుక, ఆయా పాత్రలకు ఉచితమైన భాష ఆయా పాత్రల చేత పలికించడం అనేది ముఖ్యమైన లక్షణమైంది. ఉదాహరణకి, ఒక నాటికలో ఏమీ చదువుకోని ఒక పల్లెటూరి మనిషి గ్రాంథికభాషలో సంభాషణ జరిపినట్లు రచయిత రాస్తే ఆ నాటిక లక్ష్యమే దెబ్బతిని హాస్యాస్పదం అవుతుంది.
జవాబు:
ప్రశ్నలు :

  1. దేనివల్ల మనుషుల ఆలోచనలో మార్పు వచ్చింది ?
  2. సాహిత్య ప్రక్రియలు చెయ్యవలసిన పని ఏమిటి ?
  3. భాషకు ప్రధాన లక్షణం ఏమిటి ?
  4. వ్యావహారికం అంటే ఏమిటి ?
  5. నాటకాల్లో, నాటికల్లో వాడే భాషకు ముఖ్యమైన లక్షణమేది ?

TS 9th Class Telugu Important Questions 12th Lesson తీయని పలకరింపు

ప్రశ్న 3.
కింది పేరా చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రూపొందించండి.

భాష నేర్చుకోవడం రెండు రకాలు. భాష కోసం భాష, విషయం కోసం భాష, భాషా స్వరూప స్వభావాలను సమగ్రంగా అధ్యయనం చేయడం మొదటి రకంలోనిది. శాస్త్ర సాంకేతిక విషయాలను, సాహిత్య సాంస్కృతిక విషయాల వంటి వాటినీ అధ్యయనం చెయ్యడం రెండో రకంలోనిది. అలాగే భాష కూడా రెండు రకాలుగా తయారయింది.

ప్రాచీన (కావ్య) భాష, ఆధునిక (ప్రమాణ భాష, సాహిత్యంలో తరతరాల వారసత్వాన్ని అవగాహన చేసుకొని ఆనందించడానికి ప్రాచీన భాష ఉపయోగిస్తుంది. కాని దాన్ని గురించి చెప్పడానికీ, రాయడానికీ ఆధునిక భాషే కావాలి. ఎందువల్లనంటే ఏ కాలంలో జీవించేవాడి ఆలోచనా, అలవాట్లూ ఆ కాలంనాటి భాషలోనే సాగుతుంటాయి కనుక. ప్రాచీన భాష ప్రయోజనం పరిమితం. ఆధునిక భాష ప్రయోజనం అపరిమితం. వివిధ శాస్త్ర విషయాలను వివరించడానికే కాదు, పూర్వ భాషా సాహిత్యాలను వివరించడానికి కూడా ఆధునిక భాషే కావాలి.
జవాబు:
ప్రశ్నలు :

  1. భాషను ఏయే రకాలుగా నేర్చుకొంటాము ?
  2. భాష ఎన్ని రకాలుగా తయారయింది ?
  3. ప్రాచీన భాష ఎందుకు ఉపయోగిస్తుంది ?
  4. ఆధునిక భాష ఉపయోగం ఏమిటి ?
  5. ఏ భాష ప్రయోజనం పరిమితం ?

వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
‘వృద్ధులను నిర్లక్ష్యం చేయరాదు’ దీనిపై మీ అభిప్రాయం తెలుపుతూ మీ మిత్రునికి లేఖ రాయండి. (లేదా) వృద్ధాప్యంలో ఉన్నవారి పట్ల ఆదరణ చూపవలసిన అవసరాన్ని తెలియపరుస్తూ నీ మిత్రునికి ఒక లేఖ రాయండి.
జవాబు:
లేఖ

పాల్వంచ,
X X X X.

ప్రియమిత్రుడు నరసింహమూర్తి,

నేను క్షేమం, నీవు క్షేమమని తలుస్తాను. ఇటీవల పత్రికల్లో ఎక్కువగా ఇంటినుండి వెళ్ళగొట్టబడిన తల్లిదండ్రుల కథనాలు వస్తున్నాయి. ఆ విషయం నీతో పంచుకుందామని ఈ ఉత్తరం రాస్తున్నాను.

‘మాతృదేవోభవ, పితృదేవోభవ’ .” అని అంటారు కదా ! కని, పెంచి, తనంత వారిని చేసిన తల్లిదండ్రుల పట్ల బిడ్డలు ప్రవర్తించాల్సింది ఇలానేనా ? అవసరాలు తీరే దాకా ఆప్యాయతలు, ఆ తర్వాత ? సిగ్గుపడాల్సిన స్థితి, వయసులో ఉన్నప్పుడు తమకోసం కన్నా బిడ్డల కోసమే బ్రతికిన పెద్దలు, వాళ్ళ కొరకు ఆ బిడ్డలు ఏమీ చేయలేరా ? వీళ్ళకు అంత అడ్డమై పోయారా ? వృద్ధాశ్రమాల్లో చేర్చడానికి. వృద్ధాప్యం అంటే మళ్ళీ బాల్యమే. బాల్యంలో మనకు వారు చేసిన సేవలు గుర్తుపెట్టుకుని కృతజ్ఞతతో వారిపట్ల ప్రవర్తించాలన్న కనీస బాధ్యత లేనప్పుడు మనిషికి, రాయికి తేడా ఏముంది. ఉపన్యాసాలు, గొప్పలు చెప్పేవాళ్ళే కాని కూడు పెట్టేవాళ్లు నూటికో కోటికో ఒక్కరు. అల్పాహారం, భోజనం, అవసరమైతే మందుబిళ్ళలు ఇవన్నీ ఆప్యాయంగా అందిస్తే నీ సొమ్మేమైనా పోతుందా ? ఈ మాత్రం ప్రజలు ఆలోచించలేరా ? వీళ్ళకు వృద్ధాప్యం రాదా ? వీళ్ళ పిల్లలు వీరిని కూడా ఆ విధంగానే చూసినపుడు ఆ బాధ తెలుస్తుందేమో. ఈ ఊహ కూడ కలుగదేమో ? ఏది ఏమైనా దైవ స్వరూపులైన అమ్మానాన్నల పట్ల ఎవరూ ఇలా ప్రవర్తించకూడదు. నీవేమంటావు. నా మాటలు నీకు నచ్చాయా. ఉంటాను.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
కె. ఫణిరామ్.

చిరునామా :
యస్. నరసింహమూర్తి,
9వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూల్,
మంచిర్యాల.

TS 9th Class Telugu Important Questions 12th Lesson తీయని పలకరింపు

ప్రశ్న 2.
తల్లిదండ్రులు దైవంతో సమానమనే భావంతో కవిత రాయండి.
జవాబు:
అమృతం పంచే దేవతలు,

కంచిభొట్ల ఫణిరామ్

బిడ్డ ప్రాణ దీపానికి చమురు పోసేది తల్లి.
వేలు పట్టి లోకాన్ని చూపెట్టేది తండ్రి.
తప్పటడుగు వేసినా, తప్పులు చేసినా
చిరునవ్వుతో దిద్దే అమ్మానాన్నలు
అమృతం పంచే దేవతలు.

PAPER – II : PART – B

భాషాంశాలు – వ్యాకరణం

కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.

I. సంధులు:

ప్రశ్న 1.
లక్షలార్జించు – సంధి విడదీసి రాయగా
A) లక్ష + లార్జించు
B) లక్ష + ఆర్జించు
C) లక్షలు + ఆర్జించు
D) లక్షలా + ర్జించు
జవాబు:
C) లక్షలు + ఆర్జించు

ప్రశ్న 2.
ఊళ్ళు + ఏలిన కలిపి రాయగా
A) ఊళ్ళేలిన
B) ఊళ్ళు ఏలిన
C) ఊళ్ళుయేలిన
D) ఊరు వెళ్ళిన
జవాబు:
A) ఊళ్ళేలిన

TS 9th Class Telugu Important Questions 12th Lesson తీయని పలకరింపు

ప్రశ్న 3.
వీలు + ఐతే – జరిగిన సంధికార్యము
A) అత్వసంధి
B) ఇత్వసంధి
C) ఉత్వసంధి
D) గుణసంధి
జవాబు:
D) గుణసంధి

ప్రశ్న 4.
లేదనక + ఉండ – లేదనకుండ – సంధినామం
A) అత్వసంధి
B) ఉత్వసంధి
C) సవర్ణదీర్ఘ సంధి
D) ఇత్వసంధి
జవాబు:
A) అత్వసంధి

ప్రశ్న 5.
అధ్యక్షత = అధి + అక్షత – ఇది ఏ సంధి ?
A) గుణసంధి
B) యణాదేశ సంధి
C) యడాగమ సంధి
D) ఇత్వసంధి
జవాబు:
B) యణాదేశ సంధి

TS 9th Class Telugu Important Questions 12th Lesson తీయని పలకరింపు

ప్రశ్న 6.
ఈ కింది వానిలో సవర్ణదీర్ఘ సంధికి ఉదాహరణ కానిది.
A) ఆదర + అభిమానాలు
B) నమస్ + తే
C) న్యాయ + అన్యాయాలు
D) ధన + ఆకాంక్ష ఉదాహరణ ?
జవాబు:
B) నమస్ + తే

ప్రశ్న 7.
కూర + కాయలు, తల్లి + తండ్రులు – ఇవి ఏ సంధికి
A) సరళాదేశ సంధి
B) యడాగమ సంధి
C) గసడదవాదేశ సంధి
D) నుగాగమ సంధి
జవాబు:
C) గసడదవాదేశ సంధి

II. సమాసాలు:

ప్రశ్న 1.
ఈ కింది వానిలో ద్వంద్వ సమాసమునకు ఉదాహరణ కానిది.
A) ఆదరాభిమానాలు
B) తల్లిదండ్రులు
C) అన్యాయము
D) న్యాయాన్యాయాలు
జవాబు:
C) అన్యాయము

TS 9th Class Telugu Important Questions 12th Lesson తీయని పలకరింపు

ప్రశ్న 2.
ద్విగు సమాసమునకు ఉదాహరణ
A) ఆజానుబాహువు
B) ఆరుగంటలు
C) నిమ్మచెట్టు
D) భయభక్తులు
జవాబు:
B) ఆరుగంటలు

ప్రశ్న 3.
“నిమ్మచెట్టు” – సమాసము పేరు
A) సంభావనా పూర్వపద కర్మధారయము
B) ఉపమాన పూర్వపద కర్మధారయము
C) విశేషణ పూర్వపద కర్మధారయము
D) రూపక సమాసము
జవాబు:
A) సంభావనా పూర్వపద కర్మధారయము

ప్రశ్న 4.
“జానువుల వరకు వ్యాపించిన బాహువులు కలవాడు” – విగ్రహవాక్యమునకు సమాస రూపము
A) జానూబాహూ
B) ఆజానుబాహుడు.
C) జానువులు బాహువులు
D) జానుబాహుబలి
జవాబు:
B) ఆజానుబాహుడు.

TS 9th Class Telugu Important Questions 12th Lesson తీయని పలకరింపు

ప్రశ్న 5.
న్యాయము కానిది – అన్యాయము – సమాసము పేరు
A) కాని సమాసము
B) ప్రథమా తత్పురుష
C) షష్ఠీ తత్పురుష
D) నఞ తత్పురుష
జవాబు:
D) నఞ తత్పురుష

ప్రశ్న 6.
ద్వంద్వ సమాసమునకు ఉదాహరణ
A) అరవై ఏళ్ళు
B) ఒంటరి మనిషి
C) భయభక్తులు
D) జీవిత భాగస్వామి
జవాబు:
C) భయభక్తులు

ప్రశ్న 7.
ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసమునకు ఉదాహరణ
A) నిమ్మచెట్టు
B) ఆజానుబాహుడు
C) పదవీ విరమణ
D) పుత్రరత్నము
జవాబు:
B) ఆజానుబాహుడు

TS 9th Class Telugu Important Questions 12th Lesson తీయని పలకరింపు

ప్రశ్న 8.
‘అధికారం చేత దర్పం’ – విగ్రహవాక్యాన్ని సమాసం’ చేయగా
A) అధిక దర్పం .
B) అధికారిక దర్పం
C) అధికార దర్పం
D) అధికమైన దర్పం
జవాబు:
C) అధికార దర్పం

III. అలంకారాలు :

ప్రశ్న 1.
తల్లివంటి ఇల్లు మనస్సు నొచ్చుకుంటుంది – ఇందులో అలంకారం
A) ఉపమా
B) ఉత్ప్రేక్ష
C) రూపకం
D) అతిశయోక్తి
జవాబు:
A) ఉపమా

TS 9th Class Telugu Important Questions 12th Lesson తీయని పలకరింపు

ప్రశ్న 2.
“గణగణ గంటలు గలగల గజ్జలు మ్రోగినవి” – ఈ వాక్యంలో గల అలంకారం
A) అంత్యానుప్రాస
B) వృత్త్యనుప్రాస
C) యమకము
D) ఉపమా
జవాబు:
B) వృత్త్యనుప్రాస

IV. ఛందస్సు :

ప్రశ్న 1.
చంపకమాలలో వచ్చు గణములు
A) మసజసతతగ
B) నజభజజజర
C) సభరనమయవ
D) నభరసజజగ
జవాబు:
B) నజభజజజర

ప్రశ్న 2.
ఉత్పలమాల పద్యానికి యతి ఎన్నవ అక్షరం ?
A) 14వ
B) 13వ
C) 12వ
D) 10వ
జవాబు:
D) 10వ

TS 9th Class Telugu Important Questions 12th Lesson తీయని పలకరింపు

ప్రశ్న 3.
ప్రతిపాదంలో రెండవ అక్షరం
A) ప్రాస
B) యతి
C) ప్రాసయతి
D) లఘువు
జవాబు:
A) ప్రాస

V. వాక్యాలు :

ప్రశ్న 1.
“రచయిత్రుల చేత ఎన్నో వివరాలు సేకరించబడ్డాయి.” – ఈ వాక్యాన్ని కర్తరి వాక్యంలోకి మార్చి రాయగా
A) రచయిత్రులు ఎన్నో వివరాలు సేకరించబడ్డాయి.
B) ఎన్నో వివరాలు రచయిత్రులు సేకరించారు.
C) వివరాలు అన్ని రచయిత్రులచేత సేకరించారు.
D) వివరము సేకరించబడిన రచయిత్రులు
జవాబు:
B) ఎన్నో వివరాలు రచయిత్రులు సేకరించారు.

ప్రశ్న 2.
గోడల మీద అందమైన చిత్రాలు గీయబడ్డాయి – ఇది ఏ వాక్యం ?
A) సామాన్య వాక్యం
B) కర్మణి వాక్యం
C) కర్తరి వాక్యం
D) ఆశ్చర్యార్థక వాక్యం
జవాబు:
B) కర్మణి వాక్యం

TS 9th Class Telugu Important Questions 12th Lesson తీయని పలకరింపు

ప్రశ్న 3.
దాదాపు నలభై ఇంటర్వ్యూలు చేశాం – ఇది ఏ వాక్యం ?
A) కర్తరి వాక్యం
B) కర్మణి వాక్యం
C) సంక్లిష్ట వాక్యం
D) ప్రశ్నార్థక వాక్యం
జవాబు:
A) కర్తరి వాక్యం

ప్రశ్న 4.
శరత్ ఇంటికి వచ్చి, కాళ్ళు చేతులు కడుక్కొని, అన్నం తిన్నాడు – ఇది ఏ వాక్యం ?
A) సంయుక్త వాక్యం
B) సంశ్లేష వాక్యం
C) కర్మణి వాక్యం
D) సంక్లిష్ట వాక్యం
జవాబు:
D) సంక్లిష్ట వాక్యం

ప్రశ్న 5.
భారతి కూచిపూడి నాట్యం నేర్చుకుంది. భారతి చాలా ప్రదర్శనలు ఇచ్చింది – సంక్లిష్ట వాక్యంలోకి మార్చగా
A) భారతి కూచిపూడి నాట్యం నేర్చుకుంది కాని చాలా ప్రదర్శనలు ఇచ్చింది.
B) భారతి కూచిపూడి నాట్యంతో చాలా ప్రదర్శనలు ఇచ్చేది.
C) భారతి కూచిపూడి నాట్యం నేర్చుకొని చాలా ప్రదర్శనలు ఇచ్చింది.
D) భారతి కూచిపూడి నాట్యం నేర్చుకుంది మరియు ప్రదర్శనలు ఇచ్చింది.
జవాబు:
C) భారతి కూచిపూడి నాట్యం నేర్చుకొని చాలా ప్రదర్శనలు ఇచ్చింది.

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

These TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి will help the students to improve their time and approach.

TS 9th Class Telugu 6th Lesson Important Questions దీక్షకు సిద్ధంకండి

PAPER – 1 : PART – A

I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)

అ) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
తెలంగాణ జనత ఆత్మగౌరవం కాపాడుకొనుటకు ధర్మయుద్ధం సాగిస్తున్నది- దీనిలోని ఆంతర్యం వివరించండి.
జవాబు:
గాంధీ పేరు చెప్పుకొని బ్రతుకుతున్న నాయకులు దేశభక్తి కన్నా తమ భుక్తే లక్ష్యంగా ఉంటూ జాతిపిత ప్రబోధాలకు నీళ్ళు ఒదులుతున్నారు. మతకల్లోలాలతో, హత్యలతో దేశంలోని ప్రతి అంగుళం రక్తంతోనో, కన్నీటితోనో తడుస్తోంది. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ వెనుకబడింది. ఆంధ్ర ప్రభుత్వ ఉక్కుపాదాల కింద తెలంగాణ ప్రజలు నలిగిపోయి, స్వేచ్ఛను కోల్పోతున్నారు. దీని నుండి విముక్తి పొందడానికై తమ బానిస బంధాలను తెంచుకొని ఆత్మగౌరవం కాపాడుకోవడానికి తెలంగాణ జనత ధర్మయుద్ధం సాగిస్తున్నది.

ఆ) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘దీక్షకు సిద్ధంకండి’ పాఠం ఆధారంగా 2014లో తెలంగాణ సిద్ధించుటకు తోడ్పడిన అంశాలు రాయండి.
జవాబు:
తెలంగాణ ఉద్యమం ఈ మధ్య వచ్చింది కాదు. ఎంతోమంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనోద్యమంలో తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ అమరజీవుల త్యాగాలకు గుర్తే ఈ తెలంగాణ రాష్ట్రం. ఈ కొత్త రాష్ట్రం ఉద్యమాల ఫలితంగానే రూపుదిద్దుకొంది. ఈ మధ్య జరిగిన తెలంగాణ ఉద్యమానికి ముందే 1969లో తెలంగాణ ప్రజాసమితి పేరుతో ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటం మొదలయ్యింది. .

దీర్ఘకాలంగా శాంతియుతంగా ఉద్యమాలు చేసినప్పుడు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తాయి. లేదా అణచివేయడానికి ప్రయత్నిస్తాయి. అప్పుడు ఉద్యమాలు హింసాయుతంగా మారే అవకాశం ఉంది. ఉద్యమ నాయకత్వం, ఆ పరిణామాన్ని ముందుగానే ఊహించి, పాలకుల నిర్లక్ష్యాన్ని తప్పుపడుతూ, గాంధీజీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉద్యమం చేపట్టాలని పిలుపు నిచ్చారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో అహింసా పద్ధతులు అమలయ్యాయి. హైదరాబాదులో నివసిస్తున్న ఆంధ్రా స్త్రీలను ఉద్యమకారులు అవమానించారు. అల్లర్లు చేశారు.

2014లో తెలంగాణ సిద్ధించడానికి ప్రధాన కారణం ఆనాటి ఉద్యమ హింసా వాతావరణం లేకపోవడం. నిరాహారదీక్షలు, నిరసనలు, సకలజనుల సమ్మెవంటి పద్ధతులలో ఉద్యమం నడిచింది. నేటి ఉద్యమ నాయకులకు తెలంగాణలోని అన్ని పార్టీలు కలిసివచ్చాయి. ఈ విధంగా శాంతియుతంగా సాగడమే తెలంగాణ సిద్ధించడానికి తోడ్పడింది.

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ప్రశ్న 2.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమం గురించి వివరించండి.
జవాబు:
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మూడు దశలుగా ఉద్యమం జరిగింది. 1952 వరకు, 1969, 1996 లో తెలంగాణ ఉద్యమం సాగింది. తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ ఎందరో మహనీయులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహరహం శ్రమించారు. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ వెనుకబడింది. ఆంధ్ర ప్రభుత్వ ఉక్కుపాదాల కింద తెలంగాణ ప్రజలు నలిగిపోయారు. తమ బానిస బంధాలను తెంచుకొని ఆత్మగౌరవం కాపాడుకోవడానికి తెలంగాణ జనత ధర్మయుద్ధం సాగించింది. ఈ ప్రజా పోరాటంలో వందలాది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేలాది యువకులు అంగవిహీనులయ్యారు. ఖైదు చేయబడ్డారు. గాంధీ కలలుగన్న దేశంలో రాబందుల రాచరికం నడుస్తున్నది.

రాష్ట్రంలో రోజురోజుకు దారుణ హింసాకాండ, రక్తపాతం ప్రజలను కోపోద్రిక్తులను చేస్తున్నది. అహింసా సిద్ధాంతం పట్ల ఆత్మవిశ్వాసం సడలిపోయే ప్రమాదం కనబడుతోంది. నాయకులు ఏ ఎండకాగొడుగు పడుతున్నారు. ముఠా రాజకీయాలు పెరిగిపోతున్నాయి. అప్పటి ఫజల్ అలీ కమిషనన్ను కలిసిన విద్యార్థి నాయకుడు ‘మంచిగ బతకలేకుంటే, బిచ్చమెత్తుకోనైనా అని ఖరాఖండిగా చెప్పి, నిరాహార దీక్షలు ప్రారంభించాడు. సామూహిక ఉపవాసదీక్షలు చేపట్టి, గాంధీ మార్గంలో నడిచి జాతిపితకు అంకితం చేశారు. మన ఆకలి మంటల జ్వాలలో గాంధీ సిద్ధాంతాలు వెలుగులు విరజిమ్మాలని కార్యకర్తలు ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమం నడిచింది.

PAPER – I : PART – B

భాషాంశాలు – పదజాలం :

I. సొంతవాక్యాలు :

1. అహర్నిశలు : రైతులు తమ పంట ఇంటికి వచ్చేదాక అహర్నిశలు కష్టపడతారు.
2. జనత : జనత కోరుకొన్న సాధారణ కోర్కెలకేకాక అసాధారణ ప్రాజెక్టులకు ప్రణాళికలు వేసి దేశాభివృద్ధికి పాటుపడాలి.
3. తిలోదకములిచ్చు : ప్రజానాయకులు ఓటు కోసం ఓటి మాటలకు తిలోదకాలిచ్చి గట్టి మేలు తలపెట్టాలి.
4. జాతిపిత : గాంధీ మన జాతిపితగానే గాక అహింసా మార్గ పోరాటం నేర్పి విశ్వపిత అయినాడు.
5. ఉపమానం : ఆయుధం లేకుండా శత్రువును ఓడించిన వారికి ఒక ఉపమానం గాంధీ తాత.
6. ఉక్కుపాదం ఆశ్రమ విద్యాభ్యాసం కాలంలో బ్రహ్మచారులు కోర్కెలను ఉక్కుపాదంతో అణిచిపెట్టి కోరిన విద్యలు నేర్చుకొనేవారు.
7. కట్టలు తెంచుకోవడం : తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెలువడగానే ప్రజలలో ఆనందం కట్టలు తెంచుకొని ప్రవహించింది.
8. ఏ ఎండకాగొడుగు : ఏ ఎండకాగొడుగు పట్టే మా బాబాయి అంటే ఊరి వాళ్ళకెందుకో అంత ఇష్టం ?
9. ‘ రాబందులు : తుపానుకు కొంపగోడు పోయి ప్రజలు బాధపడుతుంటే రాబందుల్లా దోపిడి దొంగలు ఎగబడ్డారు.

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

II. అర్థాలు :

ఆ) కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.

ప్రశ్న 1.
అమ్మ అహర్నిశలు మన కోసం శ్రమిస్తుంది – గీత గీసిన పదానికి అర్థం
A) కొంతకాలం
B) ఎల్లవేళలా (పగలురాత్రి)
C) చిన్నతనంలో
D) పెరిగేంతవరకు
జవాబు:
B) ఎల్లవేళలా (పగలురాత్రి)

ప్రశ్న 2.
సమ్మక్క-సారక్క జాతరకు జనత మొత్తం కదలివచ్చింది – గీత గీసిన పదానికి అర్థం
A) ఒక రైలు బండి
B) పాలకులు
C) జన సమూహం
D) భక్త బృందం
జవాబు:
C) జన సమూహం

ప్రశ్న 3.
“ఉక్కుపాదం మోపడం” అంటే అర్థం
A) ఇనుముతో చేసిన పాదం పెట్టు
B) బూట్లు ఇనుముతో చేసినవి
C) బలవంతంగా అణిచివేయడం
D) బరువు మీద పెట్టడం
జవాబు:
C) బలవంతంగా అణిచివేయడం

ప్రశ్న 4.
“తిలోదకాలు ఇవ్వడం” అంటే అర్థం
A) ఆశ వదులుకోవడం
B) అమరులైన వారికి నమస్కరించు
C) అన్నం నీళ్ళు ఇవ్వడం
D) ఒక పాదం ముందు పెట్టడం
జవాబు:
A) ఆశ వదులుకోవడం

ప్రశ్న 5.
“పోరాటం” అనే అర్థంలో వాడుతున్న పదం
A) సమ్మె
B) ఉద్యమం
C) బందులు
D) నిరాహారదీక్ష
జవాబు:
B) ఉద్యమం

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ప్రశ్న 6.
“పోరాటం” అనే అర్థంలో వాడుతున్న పదం
A) తృణం
B) నమస్సు
C) నిర్బంధం
D) సమ్మతి
జవాబు:
D) సమ్మతి

ప్రశ్న 7.
“బడా మనుషులు” అంటే అర్థం
A) పొడుగు మనుష్యులు
B) ధనం కలవారు
C) పెద్ద మనుషులు
D) చెడ్డ మనసులు
జవాబు:
C) పెద్ద మనుషులు

ప్రశ్న 8.
“శత జయంతి” అనే పదానికి అర్థం
A) పుట్టి నూరు సంవత్సరాలు
B) వంద పరుగులు
C) ఒక పూవు పేరు
D) వందనము
జవాబు:
A) పుట్టి నూరు సంవత్సరాలు

ప్రశ్న 9.
ప్రతి చిన్న విషయం రుజువు చేయనక్కర లేదు – గీత గీసిన పదానికి అర్థం
A) సత్యవాక్యము
B) సాక్ష్యము చూపించు
C) ప్రయోగము చేయు
D) ఒట్టు వేయు
జవాబు:
B) సాక్ష్యము చూపించు

ప్రశ్న 10.
మన్నన చేయు – అనే పదానికి అర్థం
A) అంగీకరించు
B) తుంచి వేయు
C) గౌరవించు
D) ప్రోగుచేయు
జవాబు:
C) గౌరవించు

ప్రశ్న 11.
ఎంతోమంది అమరుల త్యాగాలకు చిహ్నంగా నిలిచింది ఈ తెలంగాణ – గీత గీసిన పదానికి అర్థం
A) కోరిక
B) చిత్తం
C) గుర్తు
D) జ్ఞానం
జవాబు:
C) గుర్తు

ప్రశ్న 12.
లక్షలాది ప్రజలు సత్యాగ్రహ సమరంలో పోరాడారు – గీత గీసిన పదానికి అర్థం
A) స్వర్గం
B) విజయం
C) సంగరం
D) సమయం
జవాబు:
C) సంగరం

ప్రశ్న 13.
ఉపవాస దీక్షల ద్వారా వారు నమ్మిన సిద్ధాంతానికి పుష్టిని చేకూర్చండి – గీత గీసిన పదానికి అర్థం
A) బలం
B) ధైర్యం
C) నమ్మకం
D) గర్వం
జవాబు:
A) బలం

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

III. ప్రకృతి, వికృతులు:

ప్రశ్న 1.
ఛాయ – అనే పదానికి వికృతి
A) చాయి
B) చాయ
C) చూచు
D) చేయను
జవాబు:
B) చాయ

ప్రశ్న 2.
గౌరవం అంటే మనల్ని చూడగానే ఎదుటివారు పలకరించాలి – గీత గీసిన పదానికి వికృతి
A) గారవము
B) పెద్దరికము
C) గార
D) గౌరు
జవాబు:
A) గారవము

ప్రశ్న 3.
హృదయము – అనే పదానికి వికృతి
A) హృది
B) హృత్
C) ఎద
D) ఉదయం
జవాబు:
C) ఎద

ప్రశ్న 4.
“దమ్మము” వికృతిగా గల పదం
A) దయ
B) ధర్మం
C) దమ్ము
D) ధార్మికం
జవాబు:
B) ధర్మం

ప్రశ్న 5.
ఎంతోమంది అమరుల త్యాగఫలితం నేటి మన స్వేచ్ఛ – గీత గీసిన పదానికి వికృతి
A) యాగం
B) చాగం
C) తాగం
D) తయాగం
జవాబు:
B) చాగం

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ప్రశ్న 6.
దీర్ఘకాలంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నా ఫలితంలేదు – గీత గీసిన పదానికి వికృతి
A) దీగ
B) దీర్గ
C) తీగె
D) వైరు
జవాబు:
C) తీగె

ప్రశ్న 7.
జాతిపిత ప్రబోధాలకు తిలోదకాలిస్తున్నారు – గీత గీసిన పదానికి వికృతి
A) తెలకలు
B) నువ్వులు
C) తిలకం
D) నీళ్ళు
జవాబు:
A) తెలకలు

ప్రశ్న 8.
ఈ ప్రజా పోరాటంలో ఎందరో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు – గీత గీసిన పదానికి వికృతి
A) ఆయువు
B) పానం
C) నమ్మకం
D) గర్వం
జవాబు:
B) పానం

IV. పర్యాయపదాలు :

ప్రశ్న 1.
నమ్మిక, విశ్వాసం – పర్యాయపదాలుగా గల పదము
A) నమ్మకము
B) విసుమానము
C) నిశ్చయము
D) దృఢము
జవాబు:
A) నమ్మకము

ప్రశ్న 2.
“సముద్రము”నకు పర్యాయపదాలు కానివి.
A) జలధి, పయోధి
B) సముద్రము, సాగరము
C) సరస్సు, సరోవరము
D) సంద్రము, వారిధి
జవాబు:
C) సరస్సు, సరోవరము

ప్రశ్న 3.
“యుద్ధం” అనే పదానికి పర్యాయపదాలు
A) యుద్ధం, మేళనం
B) పోరాటం, రణము, సమరం
C) ప్రయాణం, కారణం
D) దొమ్మి, లాఠీ
జవాబు:
B) పోరాటం, రణము, సమరం

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ప్రశ్న 4.
జ్వాల – అనే పదానికి పర్యాయపదాలు
A) మంట, శిఖ
B) నిప్పు, దాహం
C) వెలుగు, కాల్చు
D) పొగ, వేడి
జవాబు:
A) మంట, శిఖ

ప్రశ్న 5.
వంట చేయటానికి ఇప్పుడు అగ్ని కావాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) అనలం, నిప్పు
B) అగ్గి, ఆజ్యం
C) దాహం, తృష్ణ
D) కాల్చు, దహించు
జవాబు:
A) అనలం, నిప్పు

ప్రశ్న 6.
దేశంలోని ప్రతి అంగుళం రక్తంతోనో, కన్నీటితోనో తడిసిపోయింది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) నల్ల, నెల్ల
B) రగతం, తగరం
C) రుధిరం, నెత్తురు
D) నలుపు, ఎఱుపు
జవాబు:
C) రుధిరం, నెత్తురు

ప్రశ్న 7.
ప్రశాంత గంభీర జలధిలోని ప్రళయాల పరిశీలన జరగడం లేదు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) సముద్రం, నది
B) సాగరం, రత్నాకరుడు
C) సంద్రం, జలదం
D) పయోధి, పదిలం
జవాబు:
B) సాగరం, రత్నాకరుడు

ప్రశ్న 8.
జాతిపితకు తెలంగాణ ప్రజలు భక్తి ప్రపత్తులతో సమర్పించే కానుక ఉపవాసదీక్ష – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) తండ్రి, నాన్న
B) పిత, మాత
C) అయ్య, అన్న
D) జనకుడు, జనం
జవాబు:
A) తండ్రి, నాన్న

V. నానారాలు :

ప్రశ్న 1.
ప్రజలు, సంతానము – అను నానార్థములు గల పదం
A) సంతు
B) ప్రజ
C) జనులు
D) పుత్రులు
జవాబు:
B) ప్రజ

ప్రశ్న 2.
“ధర్మము” అను పదమునకు సరియగు నానార్థాలు
A) స్వధర్మము, శ్రేయస్సు
B) రసాయన ధర్మము, భిక్షము
C) న్యాయము, స్వభావము
D) పాడి, ధర
జవాబు:
C) న్యాయము, స్వభావము

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ప్రశ్న 3.
సరుకులు పుష్టిగా తెప్పించాము – గీత గీసిన పదానికి నానార్థాలు
A) అధికం, కొంచెం
B) బలము, సమృద్ధి
C) నిండుగా, నీరసంగా
D) తోడు, వెంట
జవాబు:
B) బలము, సమృద్ధి

ప్రశ్న 4.
అంగము అను పదమునకు నానార్థము
A) శరీరభాగము, అంగదేశము
B) దేశము, విజ్ఞానము
C) సైన్యంలో భాగము, ఒకరోజు
D) శరీర అవయవము, చొక్కా
జవాబు:
A) శరీరభాగము, అంగదేశము

ప్రశ్న 5.
జాతిపిత ప్రభోధాలకు తిలోదకాలిస్తున్నారు – గీత గీసిన పదానికి నానార్థాలు
A) మాట, పాట
B) ఆట, మాట
C) మేలుకోలు, మిక్కిలి తెలివి
D) అనుబోధం, నమ్మకం
జవాబు:
C) మేలుకోలు, మిక్కిలి తెలివి

ప్రశ్న 6.
గాంధీజీ కన్న కలలు ఫలించి తీరుతాయి – గీత గీసిన పదానికి నానార్థాలు
A) నిద్ర, నిదుర
B) స్వప్నం, శిల్పం
C) భాగం, పాలు
D) వడ్డీ, అసలు
జవాబు:
B) స్వప్నం, శిల్పం

ప్రశ్న 7.
భక్తిని వదిలేసి భుక్తి మార్గం వెతుకుతున్నారు – గీత గీసిన పదానికి నానార్థాలు
A) సేవ, స్నేహం
B) భాగం, వంతు
C) మైత్రి, నైయ్యం
D) ఊడిగం, కయ్యం
జవాబు:
A) సేవ, స్నేహం

VI. వ్యుత్పత్యర్థములు :

ప్రశ్న 1.
మరణముతో కూడినది – అను వ్యుత్పత్తి గల పదం
A) సమరం
B) యుద్ధం
C) రణం
D) పోరు
జవాబు:
A) సమరం

ప్రశ్న 2.
అగ్నికి జ్వాల అందం – గీత గీసిన పదానికి సరియైన వ్యుత్పత్తి
A) చాలా మండునది
B) జ్వలించునది (మండునది)
C) జలజల మండునది
D) జారుడు స్వభావం కలది
జవాబు:
B) జ్వలించునది (మండునది)

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ప్రశ్న 3.
“జలము దీనిచే ధరించబడును” – అను వ్యుత్పత్తి గల పదం
A) జలదము
B) జలజము
C) జలధి
D) జలపుష్పం
జవాబు:
C) జలధి

ప్రశ్న 4.
సాగరం – అనే పదానికి సరియైన వ్యుత్పత్తి
A) గరంగరంగా సాగునది
B) సాగని నీరు కలది
C) సగరులచే త్రవ్వబడినది
D) పెద్ద అలలు కలది
జవాబు:
C) సగరులచే త్రవ్వబడినది

ప్రశ్న 5.
సత్యం – అనే పదానికి వ్యుత్పత్త్యర్థాలు
A) చెడ్డవారి మనసులో ఉండేది’
B) దేవతలకు సంబంధించినది
C) సత్పురుషులందు పుట్టునది
D) రాక్షసులకు చెందినది
జవాబు:
C) సత్పురుషులందు పుట్టునది

ప్రశ్న 6.
జ్వలించునది – అనే పదానికి వ్యుత్పత్త్యర్థాలు
A) చలి
B) జ్వాల
C) రవ్వ
D) శిఖ
జవాబు:
B) జ్వాల

PAPER – II : PART – A

అపరిచిత గద్యాలు

ప్రశ్న 1.
కింది గద్యాన్ని చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలను తయారుచేయండి.

“తెలుగు సాహిత్యంలోని పంచకావ్యాల్లో మనుచరిత్రను మొట్టమొదట లెక్కపెడతారు. ఆంధ్రప్రబంధ కవులలో ప్రథమపూజ అల్లసాని పెద్దన గారికే చేస్తారు. ఆదికవులు, కవిబ్రహ్మలు, ప్రబంధ పరమేశ్వరులు, కవి సార్వభౌములు మొదలైన ఆజానుబాహులు ఎందరున్నా, మన సాహితీ రంగంలో ఒక జానెడు ఎత్తుగా కనిపించే జాణ ఆంధ్రకవితా పితామహ బిరుదాంకితులు అల్లసాని పెద్దనగారే. దీనికి కారణం కృష్ణరాయలవారు అందరికన్నా పెద్దనగారికి పెద్దపీట వేయడమే కాదు. ఆయన సహజంగా ఉన్నతుడు. దానికి కారణం ఆయనలో పూర్వకవుల శుభలక్షణాలన్నీ కేంద్రీకృతం అయ్యాయి.
జవాబు:
ప్రశ్నలు

  1. తెలుగు పంచకావ్యాల్లో మొదట లెక్కపెట్టదగిన కావ్యం ఏది ?
  2. ఆంధ్ర ప్రబంధ కవులలో ఎవరిని శ్రేష్ఠునిగా గౌరవిస్తారు ?
  3. ‘ఆంధ్రకవితా పితామహుడు’ అనే బిరుదు పొందిన కవి ఎవరు ?
  4. పెద్దన కవి సహజంగా ఉన్నతుడు కావడానికి కారణం ఏమిటి ?
  5. పెద్దన గారిని ఆదరించిన కవి రాజు ఎవరు ?

ప్రశ్న 2.
కింది వచనాన్ని చదివి, దాని దిగువ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

“సాహితీ సృజనలో అంతర్జాతీయ కీర్తి నందుకొన్న మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్. కవిగా, రచయితగా, తత్త్వవేత్తగా, సంగీతజ్ఞుడిగా, చిత్రకారుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. వీరి పేరు వినగానే చప్పున స్ఫురించేవి ‘జనగణమన ‘గీతం’, ‘గీతాంజలి’. జనగణమన గీతం భారత జాతీయ గీతంగా గుర్తింపబడింది. బంగ్లాదేశ్ జాతీయ గీతం కూడా వీరి లేఖిని నుండి వెలువడినదే. ఇలా రెండు జాతీయ గీతాలనందించిన కవిగా, అపూర్వ చరిత్రను సృష్టించారు. “శాంతి నికేతన్” పేరున ఆదర్శ విద్యాలయాన్ని స్థాపించి, ‘గురుదేవుడు’ గా కీర్తింపబడ్డారు.

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
అంతర్జాతీయ కీర్తినందుకొన్న భారతీయ మహాకవి ఎవరు ?
జవాబు:
అంతర్జాతీయ కీర్తినందుకొన్న భారతీయ మహాకవి “రవీంద్రనాథ్ ఠాగూర్”.

ప్రశ్న 2.
ఏ రెండు దేశాలకు ఠాగూర్ జాతీయ గీతాలను అందించాడు ?
జవాబు:
భారత్, బంగ్లాదేశ్లకు ఠాగూర్ జాతీయ గీతాలను అందించాడు.

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ప్రశ్న 3.
రవీంద్రనాథ్ ఠాగూర్ నెలకొల్పిన విద్యాసంస్థ ఏది ?
జవాబు:
రవీంద్రనాథ్ ఠాగూర్ ‘శాంతినికేతన్’ అనే విద్యాసంస్థను నెలకొల్పాడు.

ప్రశ్న 4.
రవీంద్రుని ప్రసిద్ధ రచనలు రెండింటిని రాయండి.
జవాబు:
రవీంద్రుడు 1) గీతాంజలి 2) జనగణమన గీతం రచించాడు.

ప్రశ్న 5.
రవీంద్రుని బహుముఖ ప్రజ్ఞను వివరించండి.
జవాబు:
రవీంద్రుడు కవి, రచయిత, తత్త్వవేత్త, సంగీతజ్ఞుడు, చిత్రకారుడు.

ప్రశ్న 3.
కింది వచనాన్ని చదివి, కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

“పద్యనాటక రచయితలలో ప్రత్యేకస్థానాన్ని అందుకున్న వారు తిరుపతి వేంకట కవులు. వీరు

1) దివాకర్ల తిరుపతిశాస్త్రి
2) చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి.
వీరు శతావధానులు. తమ అవధానాలతో వీరు ఆంధ్రదేశం అంతా పర్యటించి, సాహిత్య ప్రపంచంలో నూతనోత్తేజాన్ని కలిగించారు. వీరి అవధానాలతో స్ఫూర్తి పొందిన ఎందరో వ్యక్తులు సాహిత్యరంగంలో అడుగిడి కృషి చేశారు. ఆధునికాంధ్ర సాహిత్యంలో వీరికి ఎందరో లబ్ధ ప్రతిష్ఠులైన శిష్యులున్నారు. విశ్వనాథ, వేటూరి, కాటూరి, పింగళి వారలు వీరి శిష్యులే. వీరు రచించిన పాండవోద్యోగ విజయ నాటకాలకు లభించిన ప్రసిద్ధి ఇంతింతనరానిది. పశులకాపరి నుండి పండితుల వరకు అందరి నాల్కలపై వీరి పద్యాలు నాట్యం చేస్తున్నాయి.

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
తిరుపతి వేంకట కవులు ఎవరు ?
జవాబు:
తిరుపతి వేంకట కవులు జంట కవులు. వీరు

  1. దివాకర్ల తిరుపతి శాస్త్రి
  2. చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి.

ప్రశ్న 2.
వీరు సాహిత్య రంగంలో నూతనోత్తేజాన్ని దేని ద్వారా కల్పించారు ?
జవాబు:
వీరు అవధానాల ద్వారా సాహిత్యరంగంలో నూతనోత్తేజాన్ని కలిగించారు.

ప్రశ్న 3.
వీరి శిష్యులలో ఇద్దరిని పేర్కొనండి.
జవాబు:
‘పాండవోద్యోగ విజయాలు’ అనే వీరి నాటకాలు ప్రసిద్ధి పొందాయి.

ప్రశ్న 4.
వీరి ప్రసిద్ధికెక్కిన నాటకాలు ఏవి ?
జవాబు:
వీరి శిష్యులలో

  1. విశ్వనాథ సత్యనారాయణ
  2. వేటూరి ప్రభాకరశాస్త్రి ప్రసిద్ధులు.

ప్రశ్న 5.
అందరి నాల్కలపై నాట్యం చేసే వీరి పద్యాలు ఏ నాటకాలలోనివి ?
జవాబు:
వీరి పాండవోద్యోగ విజయాలు అనే నాటకాలలో పద్యాలు ప్రజల నాల్కలపై నాట్యం ఆడుతున్నాయి.

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ప్రశ్న 4.
కింది పేరా చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రూపొందించండి.

గాంధీ మహాత్ముడు పోరుబందరులో జన్మించాడు. అక్కడ అతని బాల్యంలో చదువు ఏ మాత్రమూ సాగలేదు. అతని తండ్రి పోరుబందరు నుండి రాజకోట వచ్చి కొత్త ఉద్యోగంలో చేరాడు. అక్కడ గాంధీ విద్యార్థి జీవితం ప్రారంభం అయింది. అతడు ముందుగా సబర్బను స్కూలులోను, ఆ తరువాత హైస్కూలులోను చేరి చదువుకున్నాడు. విద్యార్థి దశలో అతను ఎక్కువ బిడియంతో ఉండి ఎవరితోను కలిసిమెలిసి ఉండేవాడు కాదు. ఒకనాడు పరీక్షాధికారి అయిదు మాటలు చెప్పి వాటి వర్ణక్రమాన్ని వ్రాయమన్నాడు. వాటిలో కెటిల్ అనే మాటను గాంధీ తప్పుగా వ్రాశాడు.
జవాబు:

ప్రశ్నలు

  1. గాంధీ ఎక్కడ జన్మించాడు?
  2. అతడు ఏయే స్కూళ్లల్లో చదువుకున్నాడు?
  3. విద్యార్థి. దశలో అతను ఎలా ఉండేవాడు?
  4. అతడు పరీక్షలో దేనిని తప్పుగా వ్రాశాడు?
  5. గాంధీ తండ్రి పోరుబందరు నుండి ఎక్కడకు వచ్చాడు ?

ప్రశ్న 5.
కింది పేరా చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రూపొందించండి.

“కవిత్వం, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పం – ఈ ఐదింటిని లలిత కళలంటారు. ఈ కళల్లో కృష్ణరాయలకు తగినంత చొరవ ఉండేది. ఆయన ఆస్థానంలో కవులు, గాయకులు, నాట్యకారులు, చిత్రకారులు, శిల్పులు ఉండేవారు. వారు తమ తమ కళలను అద్భుతరీతిలో ప్రదర్శించి రాయల మన్ననలందుకొనేవారు. కళలు మానవుని హృదయాన్ని స్పందింపజేసే స్వభావం కలవి. కళలను ఆనందించలేనివాడు రాయిలాగే జడుడని చెప్పవచ్చు.”
జవాబు:

ప్రశ్నలు

  1. లలితకళ లేవి?
  2. కవులు రాయల మన్ననలందుకొనడానికి గల కారణమేమి?
  3. కళలను ఆనందించలేని వాడు రాయిలాగే జడుడు అంటే అర్థం ఏమిటి?
  4. సంగీతం పాడేవారిని గాయకులంటారు. అలాగే చిత్రాలను వేసే వారిని ఏమంటారు?
  5. కళల స్వభావం ఏమిటి ?

వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
“చెరువులు గ్రామాలకు పట్టుకొమ్మలు” అని తెలుపుతూ నీ మిత్రునికి లేఖ రాయుము.
జవాబు:

లేఖ

ముదిగొండ,
X X X X.

ప్రియ మిత్రుడు ప్రవీణ్కు,

నేను బాగా చదువుతున్నాను. నీవూ బాగా చదువుతున్నావనుకుంటున్నాను. ‘చెరువులు గ్రామాలకు పట్టుకొమ్మలు’ అనే విషయం నీకు చెప్పదలచి ఈ లేఖ రాస్తున్నాను.

మన తెలంగాణ ప్రాంతంలో నేడు నీటి కొరతను మనం ఎదుర్కొంటున్నాం. మనకు కృష్ణా, గోదావరి నదులు ఉన్నా తగినంత వర్షపాతం లేకపోవడం దానికి ముఖ్య కారణం. ఈ మధ్యకాలంలో చెరువులు పూడ్చి, ఆ స్థలంలో భవనాలు కట్టడం జరుగుతోంది. చెరువుల పట్ల శ్రద్ధ తగ్గడం వల్ల నీటితూడు వగైరా పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. కొన్ని చెరువులు ఎండిపోయాయి.

శాతవాహనుల కాలం నుండి మన ప్రాంతంలో చెరువుల నిర్మాణంపై శ్రద్ధ ఉంది. మన ప్రభుత్వం చెరువుల ప్రాధాన్యం గుర్తించి “మిషన్ కాకతీయ” పేరుతో పాత చెరువుల అభివృద్ధికి ప్రాధాన్యత నిస్తోంది. చెరువులు కళకళలాడుతుంటేనే ప్రజలు, పశువులు, పక్షులు జీవంతో ఉండేది. వ్యవసాయం, తాగునీరు, నిత్యావసర పనులకు చెరువులపై ఆధారపడే గ్రామాలకు చెరువులు పట్టుకొమ్మలు కదా !

మీ అమ్మానాన్నలకు నా నమస్కారాలు.

ఇట్లు,
నీ మిత్రుడు,
కె. జస్వంత్.

చిరునామా :
డి. ప్రవీణ్,
9వ తరగతి,
పాల్వంచ, ఖమ్మం జిల్లా.

ప్రశ్న 2.
స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో నగరాన్ని / గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకుందామని కరపత్రాన్ని తయారుచేయండి. (లేదా) స్వచ్ఛ తెలంగాణ – సామాజిక బాధ్యత ఈ అంశంపై కరపత్రం తయారుచేయండి.
జవాబు:
సూచన : ప్రశ్నలలో భారత్ / తెలంగాణ అడగడం జరిగింది. పేరు మార్చి రెండిటికి విషయం ఒకటే.

స్వచ్ఛ భారత్ / స్వచ్ఛ తెలంగాణ

ప్రియమైన నా సోదర సోదరీమణులారా !

ఎక్కడ చూసినా, ఎటు చూసినా అపరిశుభ్రం, అశుద్ధం. దోమలు, ఈగల నిలయాలా ? ఇవి జనవాసాలా ? ఆలోచించే శక్తి కోల్పోయారా ? ఆలోచించరా ? ఇప్పటికైనా కళ్ళు తెరవండి, చైతన్యవంతులు కండి. పరిసరాలు శుభ్రంగా లేకపోతే రోగాలు చుట్టుముట్టుతాయి. దోమలు, ఈగల వల్ల భయంకర వ్యాధులు సోకుతాయి. మన నివాసాలు, పశువుల కొట్టాలకన్నా అధ్వానంగా ఉన్నాయి. నీ ఒక్క ఇల్లు బాగుంటే చాలనుకోకు. బయటకు రా. నీతోటి వారి క్షేమాన్ని నీవే కోరకపోతే ఎవరొస్తారు. ఒకరికొకరు మనమే సాయం చేసుకోవాలి. ఈ మురికిలోనే పసిపిల్లలు తిరుగుతున్నారు. వారి భవిష్యత్ కోసమైన పాటుపడదాం. మీ కోసం మేము తోడుంటాం. మరి మీ కోసం మీరేమి చేయరా ? చేయి చేయి కలిపి కష్టాన్ని దూరం చేద్దాం. గ్రామాన్ని తద్వారా దేశాన్ని ప్రగతి పథాన నడుపుదాం. ఈ రోజు నుండే పరిసరాలను శుభ్రంగా ఉంచుదాం. స్వచ్ఛ భారత్ / స్వచ్ఛ తెలంగాణలో భాగస్వాములవుదాం.

ఇట్లు,
స్వచ్ఛ భారత్ / స్వచ్ఛ తెలంగాణ నిర్మాణ యువత.

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ప్రశ్న 3.
తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఒక పెద్ద రాజకీయ నాయకుడు నీ వద్దకు వస్తే ఆయన్ని ఏమేమి ప్రశ్నలడుగుతావో ప్రశ్నావళిని తయారుచేయండి.
జవాబు:
తెలంగాణ ఉద్యమంలో పాల్గొని వచ్చిన రాజకీయ నాయకునితో ఈ ప్రశ్నలు అడుగుతాను.

  1. రాష్ట్రానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ?
  2. మీరు చెప్పినవన్నీ నిస్వార్థంగా చేస్తారా ?
  3. ఎన్నిసార్లు మీరు జైలు కెళ్ళారు ?
  4. ఓటుకు నోటు ఇచ్చారా ?
  5. ఉద్యమంలో పాల్గొనటం కాక ఇంకా మీరు ఏమి చేశారు ?
  6. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పిస్తారా ?
  7. ఖద్దరు ధరించిన మీరు గాంధీ సిద్ధాంతాలు పూర్తిగా పాటిస్తున్నారా ?
  8. మద్యపాన రహిత రాష్ట్రంగా తెలంగాణను చూడగలమా ?
  9. అంటరానితనం నేరమంటూనే పుట్టింది మొదలు చచ్చేవరకు కులం అనే ‘కాలం’ ఎందుకు సర్టిఫికెట్స్లో పెట్టారు?

PAPER – II : PART – B

భాషాంశాలు – వ్యాకరణం

కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.

I. సంధులు:

ప్రశ్న 1.
“ప్రత్యేకం” సంధి విడదీసి రాయగా
A) ప్రత్య + ఏకం
B) ప్రతి + యేకం
C) ప్రతి + ఏకం
D) ప్రతికి + ఏకం
జవాబు:
C) ప్రతి + ఏకం

ప్రశ్న 2.
“సవర్ణదీర్ఘ సంధి”కి ఉదాహరణ
A) ప్రత్యేకం
B) ప్రజాభిప్రాయం
C) ప్రజలంతా
D) నాలుగెకరాలు
జవాబు:
B) ప్రజాభిప్రాయం

ప్రశ్న 3.
చిన్నచిన్న హాస్యాలకు కోపోద్రిక్తులు కాకండి – గీత గీసిన పదం ఏ సంధి ?
A) సవర్ణదీర్ఘ సంధి
B) గుణసంధి
C) ఉత్వ సంధి
D) అత్వ సంధి
జవాబు:
B) గుణసంధి

ప్రశ్న 4.
“స్వ + ఇచ్ఛ” సంధి కలిపి రాయగా
A) స్వచ్ఛ
B) స్వచ్ఛ
C) సర్వేఛ్ఛ
D) స్వేచ్ఛ
జవాబు:
D) స్వేచ్ఛ

ప్రశ్న 5.
“సవర్ణదీర్ఘ సంధి”కి ఉదాహరణ కానిది.
A) ప్రజాభిప్రాయం
B) సత్యాగ్రహం
C) సత్యాహింసలు
D) తిలోదకాలు
జవాబు:
D) తిలోదకాలు

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ప్రశ్న 6.
“ప్రాణాలు + అర్పించు” – సంధికార్యములో వచ్చు సంధి పేరు
A) ఉత్వ సంధి
B) అత్వ సంధి
C) గుణసంధి
D) వృద్ధి సంధి
జవాబు:
A) ఉత్వ సంధి

ప్రశ్న 7.
య, వ, రలు ఆదేశముగా వచ్చు సంధి
A) యడాగమ సంధి
B) గుణసంధి
C) యణాదేశ సంధి
D) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
C) యణాదేశ సంధి

II. సమాసములు :

ప్రశ్న 1.
సత్యమును, అహింసయు, భక్తియు మరియు ప్రపత్తియు – అనే విగ్రహవాక్యాలు ఏ సమాసానికి చెందినవి ?
A) ద్విగు సమాసము
B) ద్వంద్వ సమాసము
C) బహువ్రీహి సమాసము
D) షష్ఠీ తత్పురుష సమాసము
జవాబు:
B) ద్వంద్వ సమాసము

ప్రశ్న 2.
“విద్యార్థి నాయకుడు” – అను సమాస పదంనకు సరియైన విగ్రహవాక్యము
A) విద్యార్థుల యందు నాయకుడు
B) విద్యార్థి నాయకుడుగా కలవాడు
C) విద్యార్థుల వలన నాయకుడు
D) విద్యార్థులకు నాయకుడు
జవాబు:
D) విద్యార్థులకు నాయకుడు

ప్రశ్న 3.
మలినమైన హృదయము – సమాసముగా మార్చగా
A) మలిన హృదయము
B) మలినమగు హృదయము
C) మలినాల హృదయము
D) మలిన హృదయుడు
జవాబు:
A) మలిన హృదయము

ప్రశ్న 4.
“విశేషణ పూర్వపద కర్మధారయము”నకు ఉదాహరణ
A) సత్యాహింసలు
B) సత్యాగ్రహము
C) ఉత్కృష్టమైన లక్ష్యము
D) రాష్ట్ర ధ్యేయము
జవాబు:
C) ఉత్కృష్టమైన లక్ష్యము

ప్రశ్న 5.
“సత్యం కొరకు ఆగ్రహం” – ఈ విగ్రహవాక్యము ఏ సమాసమునకు ఉదాహరణ ?
A) షష్ఠీ తత్పురుష
B) చతుర్థీ తత్పురుష
C) తృతీయా తత్పురుష
D) ద్వంద్వ సమాసము
జవాబు:
B) చతుర్థీ తత్పురుష

ప్రశ్న 6.
“తీవ్ర పరిస్థితుల వలన ధర్మయుద్ధంలో విద్యార్థులు అగ్నిజ్వాలల వలె మండిపడ్డారు.” – ఈ వాక్యములో షష్ఠీ తత్పురుష సమాసమునకు ఉదాహరణ
A) తీవ్ర పరిస్థితులు
B) ధర్మయుద్ధం
C) అగ్నిజ్వాలలు
D) మండిపడు
జవాబు:
C) అగ్నిజ్వాలలు

ప్రశ్న 7.
“ప్రాణాలను అర్పించు” వారు త్యాగవీరులు – ఈ విగ్రహవాక్యంను సమాసంగా మార్చండి.
A) ప్రాణార్పణవీరులు
B) ప్రాణాలర్పించు
C) ప్రాణదాతలు
D) ప్రాణ త్యాగవీరులు
జవాబు:
B) ప్రాణాలర్పించు

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

III. అలంకారములు :

ప్రశ్న 1.
“కిషోర్ లేడిపిల్లలా పరుగులు పెడుతున్నాడు.” – ఈ వాక్యంలో ఉన్న అలంకారం
A) ఉపమాలంకారం
B) ఉత్ప్రేక్షాలంకారం
C) అంత్యానుప్రాస
D) యమకము
జవాబు:
A) ఉపమాలంకారం

ప్రశ్న 2.
……….. గుడిసెకు విసిరి పోతివా
……….. నడుం చుట్టుక పోతివా
………. దిక్కు మొక్కుతు పోతివా – ఈ వాక్యాలలో ఉన్న అలంకారం
A) ఛేకానుప్రాస
B) లాటానుప్రాస
C) వృత్త్యనుప్రాస
D) అంత్యానుప్రాస
జవాబు:
D) అంత్యానుప్రాస

IV. వాక్యాలు

ప్రశ్న 1.
వెంకట్రామయ్య ఆఫీసు పనిమీద మద్రాసు వెళ్ళాడు. వెంకట్రామయ్య ఆఫీసు పనిమీద బెంగళూరు వెళ్ళాడు. పై వాక్యాలను సంయుక్త వాక్యంగా మార్చండి.
A) వెంకట్రామయ్య ఆఫీసు పనిమీద మద్రాసు వెళ్ళి బెంగళూరు వెళ్ళాడు.
B) వెంకట్రామయ్య ఆఫీసు పనిమీద మద్రాసు మరియు బెంగళూరు వెళ్ళాడు.
C) వెంకట్రామయ్య ఆఫీసు పనిమీద మద్రాసు నుండి బెంగళూరు వెళ్ళాడు.
D) వెంకట్రామయ్య వెళ్ళాడు బెంగళూరుకి, మద్రాసుకి.
జవాబు:
B) వెంకట్రామయ్య ఆఫీసు పనిమీద మద్రాసు మరియు బెంగళూరు వెళ్ళాడు.

ప్రశ్న 2.
సీత కాఫీ తాగుతుంది. సీత హార్లిక్స్ తాగుతుంది.
పై వాక్యాలను సంయుక్త వాక్యంగా మార్చండి.
A) సీత కాఫీ మరియు హార్లిక్స్ కూడా తాగుతుంది.
B) సీత కాఫీ తాగి హార్లిక్స్ తాగుతుంది.
C) సీత తాగింది హార్లిక్స్ మరియు కాఫీలు.
D) సీతకు కాఫీ మరియు హార్లిక్స్ కూడా ఇష్టమే.
జవాబు:
A) సీత కాఫీ మరియు హార్లిక్స్ కూడా తాగుతుంది.

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

These TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ will help the students to improve their time and approach.

TS 9th Class Telugu 5th Lesson Important Questions శతక మధురిమ

PAPER – 1 : PART – A

I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)

అ) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘ధనికుని కంటే పేద గొప్ప కదా !’ అన్న కవి అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా ? ఎందుకు ?
జవాబు:
ఉత్పల సత్యనారాయణాచార్య “ధనము, ధనాభిమానము, శ్రియఃపతీ !” అను పద్యంలో ‘ధనికుని కంటే పేద కడు ధన్యుడు” అన్న వారి అభిప్రాయంతో నేను గొంతు కలుపుతున్నాను. ఎందుకంటే ధనం, ధనంపై అభిమానం, ఎల్లప్పుడు ధనం సంపాదించాలనే కోరిక అనే ఈ మూడు దోషాలు ధనికునికి ఉన్నాయి. కాని పేదవానికి ధనం ఉండదు. ధనంపై ఆశ ఉన్నా మంచివారికి దగ్గరగా ఉండటం వల్ల అది కూడా నశిస్తుంది. కనుక ధనికుని కంటే పేద గొప్ప కదా !

ఆ) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
“చేతులకు దానమే అందం, కానీ కంకణాలు కావు” ఎందుకు ? సమర్థిస్తూ రాయుము.
జవాబు:
“దానేన పాణిర్నతు కఙ్కణేన” అన్న భర్తృహరి వాక్యానికి ‘మల్ల భూపాలీయం’ నీతిశతక కర్త ఎలకూచి బాలసరస్వతి తెలుగు సేత ‘చేతులకు దానమే అందం కానీ కంకణాలు కావు’ అన్న వాక్యం.

పరోపకారం చేయడం కోసం దేవుడు మనకు శరీరాన్ని ఇచ్చాడు. అందువల్ల మనశక్తి కొలది ఇతరులకు సాయం చేయాలి. మనచుట్టూ ఉన్న ప్రకృతిని గమనిస్తే ఇతరుల కోసమే నదులు ప్రవహిస్తున్నాయి, పండ్లు ఫలిస్తున్నాయి, గోవులు పాలిస్తున్నాయి. వీటన్నిటి ఉపకారాలు పొందుతూ మనిషి మాత్రం స్వార్థంగా జీవిస్తున్నాడు. తాత్కాలికంగా మంచివాడనిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడేకాని స్వార్థాన్ని పూర్తిగా విడువలేకపోతున్నాడు.

స్వార్థ చింతన కొంతమాని పొరుగువాడికి సాయం చేయాలనే భావన మాత్రం కలుగడం లేదు. తన వైభవమే “చూసుకోవడం తప్ప తోటివారి బాధలు గమనించడం లేదు. అందుకే కవి “చేతులు మనకు భగవంతుడు ఇచ్చింది పరులకు గొప్పగా సాయం చేయమనే కాని కంకణాలు ధరించటానికి కాదంటాడు”.

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

ప్రశ్న 2.
అందరిని ఆదరంగా చూస్తే భూమి మీద కష్టాలు పుట్టవు అని చెప్పిన ‘శతక మధురిమ’ పద్యం అంతరార్థం సోదాహరణంగా వివరించండి.
జవాబు:
“అఖిల జీవుల తనవోలె నాదరింప

ఉద్భవించునే యాపదలుర్వియందు అంటారు నింబగిరి నరసింహ శతక కర్త శ్రీ అందె వేంకట రాజం. సహజంగా ఇళ్ళలో అత్తాకోడళ్ళ విషయంలో కొన్ని బాధలుంటాయి. అత్త కోడలిని కొడుకు భార్యగా కాక పరాయిపిల్ల అనుకోవడం, కోడలు అత్తను రాక్షసిగా భావించడం, కట్నం విషయంలో అత్త కోడల్ని నిందించడం, కోడలి పుట్టింటి వారిని గూర్చి తక్కువ చేసి మాట్లాడటం ఇలా ఎన్నో ఉంటాయి. కోడలిని కూతురి మాదిరిగా చూస్తే ఇంట్లో ఘోరాలు సంభవించవు.

కార్మికులను భాగస్థులను చేస్తే, కర్మాగారాల్లో అల్లర్లు జరుగవు. ప్రపంచంలో ఎన్నో మతాలున్నాయి. అన్ని మతాలు చెప్పేది ఒకటే. ఇతర మతస్థులను మన అన్నదమ్ముల వంటి వారిగా ఆదరిస్తే, మతకలహాలు, కొట్లాటలు లేక ప్రపంచం శాంతిధామం అవుతుంది. కనుక ప్రాణులందరినీ తనవలె ఆదరంగా చూస్తే భూమి మీద కష్టాలు పుట్టవు అని ‘శతక మధురిమ’ పద్యం చక్కగా వివరిస్తోంది.

ప్రశ్న 3.
పాఠశాలలో జరిగే భాషోత్సవాన్ని తిలకించడానికి ప్రముఖ శతక కవులు వచ్చారు. వారిని మీరు ఏమని ఇంటర్వ్యూ చేస్తారు ? అవసరమైన ప్రశ్నావళి రాయండి.
జవాబు:
ప్రశ్నావళి :

  1. శతకంలోని ‘మకుట నియమం’ యొక్క ఉద్దేశం ఏమిటి ?
  2. ఇందలి పద్యాలు దేనికవే వేరుగా అర్థాన్నిస్తాయి కదా ? మరి శతక రచన ఉద్దేశం ఏమిటి ?
  3. “చదువ పద్యమరయ చాలదా నొక్కటి” అని వేమన చెప్పాడు కదా ? ఇన్ని శతక పద్యాలు చదువక్కరలేదా ?
  4. పుత్రోత్సాహం అన్నారే కాని పుత్రికోత్సాహం అని ఎందుకు అనలేదు ?
  5. “తివిరి యిసుమున తైలంబు తీయవచ్చు” అను పద్యంలో లేనివి, రానివి చెప్పబడ్డాయి. దీని ఉద్దేశం ఏమిటి ?
  6. శతకం అంటే నూరు కదా మరి నూట ఎనిమిది పద్యాలు ఉండాలనే నియమాన్ని ఎందుకు పాటించారు ?
  7. శతక పద్యధారణ ఎవరికి అవసరం ?
  8. శతకం కవి ఆత్మీయతకు ప్రతిబింబమా ?

PAPER – 1 : PART – B

భాషాంశాలు – పదజాలం :

1. సొంతవాక్యాలు :

అ) కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

1. జాతుల్చెప్పుట : టి.వి.లో జాతుల్చెప్పు వారిలో ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి ఒకరు.
2. పరద్రవ్యము : పరద్రవ్యము పాము కంటే ప్రమాదము కాబట్టి దానిని కోరవద్దు.
3. నిక్కం : అవగాహన చేసుకొని చదివినదే నిక్కమైన చదువు.
4. ఒజ్జ : అన్ని విద్దెలకు ఒజ్జ ఆ బొజ్జగణపయ్య.
5. తృష్ణ : అర్జునుని గెలవాలన్న తృష్ణతో కర్ణుడు పరశురాముని శిష్యుడయ్యాడు.
6. విభూషణము : నెమలి ఈక అదృష్టం ఏమిటంటే శ్రీకృష్ణుని విభూషణం కావడమే.
7. ఆభరణం : నగ – పరోపకారమే శరీరానికి ఆభరణం వంటిది.
8. ఆదరం : ఆదరణ – అన్ని జీవులను తనవలె ఆదరంగా చూస్తే భూమ్మీద కష్టాలుండవు.
9. ఆశీర్వాదం: దీవెన – గురువు ఆశీర్వాదం పొందిన శిష్యుడే శ్రేష్ఠమైన సాధనాన్ని పొందుతాడు.

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

II. అర్థాలు:

ఆ) కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.

ప్రశ్న 1.
“కృష్ణ” అంటే అర్థం
A) తృణము
B) దప్పిక
C) ఒక తులసి
D) బిందువు
జవాబు:
B) దప్పిక

ప్రశ్న 2.
సజ్జనులు మంచినే కోరుకుంటారు – గీత గీసిన పదానికి అర్థం
A) బుట్ట
B) ఒక ధాన్యము
C) సత్పురుషులు
D) సంఘజీవులు
జవాబు:
C) సత్పురుషులు

ప్రశ్న 3.
“మహి” అంటే అర్థం
A) మహిమ
B) భూమి
C) పాము
D) ఒక స్త్రీ
జవాబు:
B) భూమి

ప్రశ్న 4.
ఆకసమున శీతభానుడు వెన్నెల కురిపిస్తున్నాడు – గీత గీసిన పదానికి అర్థం
A) చందమామ
B) సూర్యుడు
C) వెన్నెల
D) నక్షత్రములు
జవాబు:
A) చందమామ

ప్రశ్న 5.
అబద్ధములు – అనే అర్థం వచ్చే పదం
A) బద్ధము
B) మృషలు
C) సత్యాలు
D) అశుద్ధి
జవాబు:
B) మృషలు

ప్రశ్న 6.
మంత్రులు – అనే అర్థం వచ్చే పదం
A) ప్రధానులు
B) రాజోద్యోగులు
C) మంత్రగాళ్ళు
D) సేనాపతులు
జవాబు:
A) ప్రధానులు

ప్రశ్న 7.
కొండెములాడు వానితో స్నేహం వద్దు – గీత గీసిన పదానికి అర్థం
A) కొండ ఎక్కువాడు
B) కొంచెం చెప్పువాడు
C) చాడీలు చెప్పేవాడు
D) తొండం
జవాబు:
C) చాడీలు చెప్పేవాడు

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

ప్రశ్న 8.
“పరద్రవ్యం” అంటే అర్థం
A) ఇతరులు
B) ఇతరుల సొమ్ము
C) బరువైన ద్రవం
D) పరమాత్ముడు
జవాబు:
B) ఇతరుల సొమ్ము

ప్రశ్న 9.
ఉర్వి అంటే ధరణి అనే అర్థం. ఇటువంటి అర్థం వచ్చే మరొక పదం
A) ఉర్వీశ
B) భూమి
C) ధరణీశ
D) జగదీశ
జవాబు:
B) భూమి

III. పర్యాయపదాలు :

ప్రశ్న 1.
కూతురు – అనే పదానికి పర్యాయపదాలు
A) కుమార్తె, పుత్రిక, దుహిత
B) సుత, జనని
C) ఆత్మజ, మహిత
D) బిడ్డ, ఫలము
జవాబు:
A) కుమార్తె, పుత్రిక, దుహిత

ప్రశ్న 2.
శరీరము – అనే పదానికి పర్యాయపదాలు
A) తనువు, మైపూత
B) మేను, ఒడలు, కాయము
C) దేహము, సందేహము
D) గాత్రము, కళత్రము
జవాబు:
B) మేను, ఒడలు, కాయము

ప్రశ్న 3.
“క్ష్మాపతి”కి మరొక పర్యాయపదం
A) దేశము
B) రాణువ
C) భూపతి
D) శ్రీపతి
జవాబు:
C) భూపతి

ప్రశ్న 4.
గరము మింగిన జోదు, ఈశ్వరుడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) గరళము, వ్యాళము
B) గరళము, విషము, శ్రీ
C) విషము, తీపి
D) చేదు, వేడి
జవాబు:
B) గరళము, విషము, శ్రీ

ప్రశ్న 5.
శ్రీ కాళహస్తీశ్వరా ! – అనే పదంలో గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) సాలీడు, లూత, సాలెపురుగు
B) లక్ష్మి, సాలెపురుగు, శివుడు
C) లాభం, లూత
D) లచ్చి, శివుడు
జవాబు:
A) సాలీడు, లూత, సాలెపురుగు

ప్రశ్న 6.
అన్నిటికంటే ఎత్తైన శైలము హిమగిరి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) అద్రి, పర్వతము, అచలం
B) గట్టు, మెట్ట
C) నగము, శిఖరము
D) కొండ, తరువు
జవాబు:
A) అద్రి, పర్వతము, అచలం

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

ప్రశ్న 7.
పిపాస, ఈప్స, కాంక్ష – అను పర్యాయపదాలు గల పదం
A) దప్పిక
B) దాహము
C) తృష్ణ
D) త్రప
జవాబు:
C) తృష్ణ

ప్రశ్న 8.
నరుడు, మానవుడు, మర్త్యుడు – అనే పర్యాయపదాలు గల పదం
A) మనిషి
B) దానవుడు
C) మరుడు
D) అమరుడు
జవాబు:
A) మనిషి

IV. నానార్థాలు:

ప్రశ్న 1.
శ్రీ – అనే పదానికి నానార్థాలు
A) సాలెపురుగు, లక్ష్మి, సంపద
B) ధనము, ప్రకృతి
C) శోభ, భాష
D) కవిత, కావ్యము
జవాబు:
A) సాలెపురుగు, లక్ష్మి, సంపద

ప్రశ్న 2.
మనిషి ఆశతో జీవిస్తాడు – గీత గీసిన పదానికి నానార్థాలు
A) కోరిక, ప్రేమ
B) పేరాశ, దిక్కు
C) కోరిక, దిక్కు
D) ఆసక్తి, అధికము
జవాబు:
C) కోరిక, దిక్కు

ప్రశ్న 3.
చెవిపోగులు, పాము – అను నానార్థాలు వచ్చే పదము
A) ఆభరణము
B) కుండలి
C) సర్పము
D) నాగము
జవాబు:
B) కుండలి

ప్రశ్న 4.
“దోషము” అను పదమునకు నానార్ధములు – “తప్పు” మరియు ……….
A) రాత్రి, పాపము
B) దోసకాయ, దోషకారి
C) వేషము, రోషము
D) కోపము, పాపము
జవాబు:
A) రాత్రి, పాపము

ప్రశ్న 5.
శ్రియః – అను పదమునకు నానార్ధములలో ఒకటి లక్ష్మీదేవి మరియొకటి
A) ప్రజ్ఞ – ప్రజ
B) ప్రజ్ఞ – ప్రగ్గడ
C) ప్రజ్ఞ – పగ్గె
D) ప్రజ్ఞ – ప్రతిజ్ఞ
జవాబు:
C) ప్రజ్ఞ – పగ్గె

ప్రశ్న 6.
ఇటువంటి గుణము కావాలి – గీత గీసిన పదానికి నానార్థాలు
A) స్వభావము, వింటినారి
B) లక్షణము, వైద్యుడు
C) హెచ్చవేత, మాత్ర
D) దారము, దూది
జవాబు:
A) స్వభావము, వింటినారి

ప్రశ్న 7.
వైభవంలో ఇంద్రుని మించినవాడా ! – గీత గీసిన పదానికి నానార్థాలు
A) ప్రభువు, రాజు
B) శేషుడు, నాగరాజు
C) దేవేంద్రుడు, శ్రేష్ఠుడు
D) ఈశ్వరుడు, శివుడు
జవాబు:
C) దేవేంద్రుడు, శ్రేష్ఠుడు

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

ప్రశ్న 8.
ఓ వేంకట పతీ ! పరబ్రహ్మమూర్తి – గీత గీసిన పదానికి నానార్థాలు
A) చంద్రుడు, వైశ్యుడు
B) నలువ, విష్ణువు
C) శివుడు, క్షత్రియుడు
D) సూర్యుడు, నక్షత్రం
జవాబు:
B) నలువ, విష్ణువు

ప్రశ్న 9.
లక్ష్మీనాథా ! నీవే దిక్కు – గీత గీసిన పదానికి నానార్థాలు
A) శ్రీదేవి, సిరి
B) తామర, మల్లె
C) కలువ, పారిజాతం
D) పసుపు, కుంకుమ
జవాబు:
A) శ్రీదేవి, సిరి

ప్రశ్న 10.
గురువు ఆశీస్సును పొందినపుడే, శిష్యుడు శాంతాన్ని – సాధించగలుగుతాడు – గీత గీసిన పదానికి నానార్థాలు
A) హితం, కీడు
B) ఇచ్ఛ, కోరిక
C) పాముకోర, విషం
D) ఆశీర్వాదం, స్తోత్రం చేయుట
జవాబు:
D) ఆశీర్వాదం, స్తోత్రం చేయుట

V. ప్రకృతి, వికృతులు:

ప్రశ్న 1.
ఈ కింది ప్రకృతి – వికృతులలో సరికాని జోడు ఏది ?
A) దోషము – దొసగు
B) సింహం – సింగ౦
C) కార్యము – కారణము
D) కలహము – కయ్యం
జవాబు:
C) కార్యము – కారణము

ప్రశ్న 2.
“అగ్ని”కి సరియైన వికృతి పదం
A) అగిని
B) అగ్గి
C) నిప్పు
D) మంట
జవాబు:
B) అగ్గి

ప్రశ్న 3.
“పాము విషము కన్నా అవినీతి సర్పము యొక్క విసము ప్రమాదము.’ ఈ వాక్యములో ఉన్న సరియైన ప్రకృతి – వికృతులు
A) పాము – సర్పము
B) అవినీతి – అనీతి
C) ప్రమాదము – ప్రమోదము
D) విషము – విసము
జవాబు:
D) విషము – విసము

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

ప్రశ్న 4.
“సూది” అను పదము వికృతిగా గల పదము
A) సూచన
B) సూచి
C) సూచించు
D) దబ్బనము
జవాబు:
B) సూచి

ప్రశ్న 5.
శ్రియః – అను పదమునకు నానార్ధములలో ఒకటి లక్ష్మీదేవి మరియొకటి
A) ప్రజ్ఞ – ప్రజ
B) ప్రజ్ఞ – ప్రగ్గడ
C) ప్రజ్ఞ – పగ్గె
D) ప్రజ్ఞ – ప్రతిజ్ఞ
జవాబు:
C) ప్రజ్ఞ – పగ్గె

ప్రశ్న 6.
“శ్రీ” అను పదమునకు సరియైన వికృతి
A) సిరి
B) స్త్రీ
C) ఇంతి
D) సిరి
జవాబు:
A) సిరి

ప్రశ్న 7.
యోధులు – అను పదమునకు సరియైన వికృతి
A) యోద్ధలు
B) జోదులు
C) జోగి
D) యాది
జవాబు:
B) జోదులు

ప్రశ్న 8.
కలహం పేరు వింటే నారదుడు గుర్తుకు వచ్చాడా ? గీత గీసిన పదానికి వికృతి
A) కార్యం
B) పేచి
C) కయ్యం
D) తగవు
జవాబు:
C) కయ్యం

ప్రశ్న 9.
భగవంతునికి తన భక్తుడు అంటే ప్రేమ – గీత గీసిన పదానికి వికృతి
A) భక్తి.
B) భజన
C) భాగ్యశాలి
D) బత్తుడు
జవాబు:
D) బత్తుడు

ప్రశ్న 10.
`శిష్యుడు అంటే వివేకానందుడే ఆదర్శం – గీత గీసిన పదానికి వికృతి
A) సిసువుడు
B) సచివుడు
C) శశికరుడు
D) సాధన
జవాబు:
A) సిసువుడు

ప్రశ్న 11.
“నిచ్చలు” అను పదానికి ప్రకృతి
A) నిశ్చయం
B) గోరు
C) నింగి
D) నిరూపణ
జవాబు:
B) గోరు

ప్రశ్న 12.
“ఘోరము” అను పదమునకు వికృతి
A) గరువము
B) గోరు
C) గోరము
D) గోస
జవాబు:
C) గోరము

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

ప్రశ్న 13.
రావే ఈశ్వరా, కావవే వరదా.
A) శివుడు
B) ఈసరుడు
C) శంకరుడు
D) రుద్రుడు
జవాబు:
B) ఈసరుడు

VI. వ్యుత్పత్త్యర్ధములు :

ప్రశ్న 1.
“అచ్యుతుడు” – అను పదమునకు సరియైన వ్యుత్పత్తి
A) చ్యుతము నుండి జారినవాడు
B) నాశనము (చ్యుతి) లేనివాడు
C) అచ్యుతానంత అని పాడువాడు
D) చ్యుతునికి సోదరుడు
జవాబు:
B) నాశనము (చ్యుతి) లేనివాడు

ప్రశ్న 2.
“ప్రకాశమును కలిగించువాడు” – అను వ్యుత్పత్తి కలిగిన పదము
A) భానుహుడు
B) భాస్కరుడు
C) భారతీయుడు
D) చంద్రుడు
జవాబు:
B) భాస్కరుడు

ప్రశ్న 3.
“మనువు సంతతికి చెందినవారు” – అను వ్యుత్పత్తి గల పదము
A) మానవులు
B) భారతీయుడు
C) దానవులు
D) మారినవారు
జవాబు:
A) మానవులు

ప్రశ్న 4.
“సహెూదరులు” – అను పదమునకు సరియైన వ్యుత్పత్తి
A) అపూర్వమైనవారు
B) తోడ (ఒకే గర్భము నుండి) పుట్టినవారు
C) దరిదాపులనున్నవారు
D) ఒక అన్నకు తమ్ముడు
జవాబు:
B) తోడ (ఒకే గర్భము నుండి) పుట్టినవారు

ప్రశ్న 5.
“జలజాతము, అబ్జము” – అను పదములకు సరియైన వ్యుత్పత్తి “నీటి (జలము, అప్పు) నుండి పుట్టినది.” – దీనికి సరియైన పదము
A) అగ్ని
B) పద్మము
C) చేప
D) లక్ష్మి
జవాబు:
B) పద్మము

ప్రశ్న 6.
ఈమెచే సర్వము చూడబడును – అను వ్యుత్పత్తి కలిగిన పదము
A) కన్ను
B) లక్ష్మి
C) సూర్యుడు
D) పార్వతి
జవాబు:
B) లక్ష్మి

ప్రశ్న 7.
విష్ణువు నాశ్రయించునది – అను వ్యుత్పత్తి కలిగిన పదము
A) బ్రహ్మ
B) లక్ష్మి
C) భూదేవి
D) నారదుడు
జవాబు:
B) లక్ష్మి

ప్రశ్న 8.
కంకణం – అను వ్యుత్పత్తి కలిగిన పదము
A) కడియం
B) గాజు
C) మ్రోయునది
D) మెరియునది
జవాబు:
C) మ్రోయునది

PAPER – II : PART – A

అపరిచిత పద్యాలు

1. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

తనిసిరే వేల్పు లుదధి రత్నముల చేత ?
వెఱచిరే ఘోర కాకోల విషము చేత ?
విడిచిరే యత్న మమృతంబు వొడుముదనుక ?
నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు.

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
ఉదధి రత్నముల చేత తృప్తి చెందని వారెవరు ?
జవాబు:
వేల్పులు ఉదధి రత్నములచేత తృప్తి చెందలేరు.

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

ప్రశ్న 2.
నిపుణమతులు ఎటువంటివారు ?
జవాబు:
నిపుణమతులు తాము అనుకున్న కార్యం నెరవేరే – వరకు తమ ప్రయత్నాన్ని వదలరు.

ప్రశ్న 3.
వేల్పులు దేన్ని చూసి భయపడలేదు ?
జవాబు:
వేల్పులు ఘోర కాకోల విషాన్ని చూసి భయపడలేదు.

ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక “నిపుణమతుల లక్షణం”.

ప్రశ్న 5.
ఉదధి అంటే ఏమిటి ?
జవాబు:
ఉదధి అంటే సముద్రం.

2. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

విద్యచే భూషితుండయి వెలయుచున్నఁ
దొడరి వర్ణింపనగుఁ జుమీ దుర్జనుండు
చారు మాణిక్య భూషిత శస్త మస్త
కంబయిన పన్నగము భయంకరము గాదె.

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
చదువుకున్నప్పటికీ విడువదగినవాడు ఎవరు ?
జవాబు:
దుర్జనుడు చదువుకున్నప్పటికీ విడువదగినవాడు.

ప్రశ్న 2.
ఎటువంటి పాము భయంకరమైనది ?
జవాబు:
మణులచేత అలంకరింపబడిన శిరస్సుగల పాము భయంకరమైనది.

ప్రశ్న 3.
ఈ పద్యంలోని దుర్జనుడు దేనితో పోల్చబడ్డాడు ?
జవాబు:
ఈ పద్యంలో దుర్జునుడు పాముతో పోల్చబడ్డాడు.

ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘దుర్జనుడితో స్నేహం పనికిరాదు.’

ప్రశ్న 5.
మస్తకము అంటే ఏమిటి ?
జవాబు:
మస్తకం అంటే తల.

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

3. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు
సుకవి చేతి కలము సుధలు కురియు
ఆత డేల గలుగు యావత్ప్రపంచంబు
నీత డేల గలుగు ఇహము పరము

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
రాజు చేతి కత్తి దేన్ని వర్షిస్తుంది?
జవాబు:
రాజు చేతి కత్తి రక్తాన్ని వర్షిస్తుంది.

ప్రశ్న 2.
సుధలు కురిపించునది ఏది?
జవాబు:
సుకవి చేతి కలము సుధలు కురిపిస్తుంది.

ప్రశ్న 3.
యావత్ప్రపంచాన్ని పరిపాలించగలిగింది ఎవరు?
జవాబు:
రాజు యావత్ప్రపంచాన్ని పరిపాలించగలడు.

ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘రాజు సుకవి’.

ప్రశ్న 5.
ఇహము పరము ఏలగలిగేది ఎవరు ?
జవాబు:
ఇహము పరము ఏలగలిగేది సుకవి.

4. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను
సజ్జనుండు బల్కు చల్లగాను
కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ !

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
అల్పుడు మాట్లాడే తీరు ఎలాంటిది?
జవాబు:
అల్పుడు మాట్లాడే తీరు ఆడంబరంగా ఉంటుంది.

ప్రశ్న 2.
సజ్జనుడు ఎలా మాట్లాడుతాడు?
జవాబు:
సజ్జనుడు చల్లగా మాట్లాడుతాడు.

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

ప్రశ్న 3.
కంచు మ్రోగునట్లు మ్రోగనిదేది?
జవాబు:
కంచు మ్రోగునట్లు మ్రోగనిది బంగారం.

ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘అల్పుడు – సజ్జనుడు’.

ప్రశ్న 5.
ఈ పద్యం ఏ శతకం లోనిది ?
జవాబు:
ఈ పద్యం వేమన శతకం లోనిది.

5. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

కుసుమ గుచ్ఛంబునకుఁబోలె బొసగు శౌర్య
మానవంతున కివి రెండు మహితగతులు
సకలజన మస్తక ప్రదేశములనైన
వనమునందైన జీర్ణభావంబుఁ గనుట

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
శౌర్య మానవంతుడు ఎవరితో పోల్చబడ్డాడు?
జవాబు:
శౌర్య మానవంతుడు పుష్పగుచ్ఛంతో పోల్చబడ్డాడు.

ప్రశ్న 2.
కుసుమ గుచ్ఛం ఎక్కడ అలంకరింపబడుతుంది.?
జవాబు:
కుసుమ గుచ్ఛం సమస్త ప్రజల శిరస్సులందు అలంకరింపబడుతుంది.

ప్రశ్న 3.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘శౌర్య మానవంతుని లక్షణం’.

ప్రశ్న 4.
ఈ పద్యంలోని అలంకారం రాయండి.
జవాబు:
ఈ పద్యంలో ‘ఉపమాలంకారం’ ఉంది.

ప్రశ్న 5.
శౌర్యమానవంతునకు మహితగతులు ఎన్ని ?
జవాబు:
శౌర్యమానవంతునకు రెండు మహిత గతులు.

వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
శతక మధురిమలోని ఏదైనా ఒక పద్యం ఆధారంగా ఒక నీతికథను తయారుచేయండి.
జవాబు:
భక్తులే కాదు మనుషులన్న వారెవ్వరైనా పద్ధతిని, నీతిని తప్పకూడదని సర్వేశ్వర శతకపద్యం చెబుతోంది. నీతి, నిజాయితీలు మనిషి ఉన్నతికి దోహదపడతాయనేదే ఈ కథ.

నిజాయితీ

రామాపురంలో రాజయ్య అనే పేదవాడు ఉన్నాడు. అతడు ప్రతిరోజు అడవికి పోయి కట్టెలు కొట్టుకొని, వాటిని అమ్మి జీవించేవాడు. ఒకరోజు రాజయ్య ఆ అడవిలో నది ఒడ్డునున్న పెద్ద చెట్టెక్కి కట్టెలు కొడుతుండగా చేయి జారి గొడ్డలి నదిలో పడిపోయింది. ఆ నది చాలా లోతు. రెండు, మూడు సార్లు నదిలో దిగి ఎంతో ప్రయత్నించాడు. కాని గొడ్డలి దొరకలేదు. ఎంతో బాధతో భగవంతుణ్ణి మనసులో ప్రార్థించాడు. తన గొడ్డలి ఇప్పించమని వేడుకున్నాడు.

అతని ప్రార్ధనను విని గంగాదేవి ప్రత్యక్షమై, “ఎందుకు బాధపడుతున్నావు” అని అడిగింది. “తల్లీ! నన్ను రక్షించు. నా జీవనాధారమైన గొడ్డలి నదిలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా అది దొరకలేదు” అని బాధపడ్డాడు. ”సరే ఉండు అంటూ దేవత నీటిలో మునిగి బంగారు గొడ్డలితో ప్రత్యక్షమైంది. “ఇదేనా నీ గొడ్డలి ?” అని బంగారు గొడ్డలిని చూపించింది. “నాది కాదు తల్లీ !” అన్నాడు. మళ్ళీ నీళ్ళలో మునిగి దేవత వెండి గొడ్డలితో ప్రత్యక్షమైంది. “ఇదేనా నీ గొడ్డలి?” అని వెండి గొడ్డలిని చూపించింది. కాదని తల అడ్డంగా ఊపాడు. ఈసారి అతని గొడ్డలితోనే ఎదుట నిలిచి “ఇదేనా ?” అన్నది. రాజయ్య సంతోషంతో “అమ్మా ! ఇదే నా గొడ్డలి” అని ఆనందంతో పరవశించాడు.
రాజయ్య నిజాయితీకి మెచ్చి గంగాదేవి మూడు గొడ్డళ్ళు ఇచ్చి మాయమైపోయింది.
నీతి : నిజాయితీయే రాజయ్యను ధనవంతుణ్ణి చేసింది.

PAPER – II : PART – B

భాషాంశాలు – వ్యాకరణం

కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.

I. సంధులు:

ప్రశ్న 1.
“శ్రీకాళహస్తి + ఈశ్వరా”, “పుణ్య + ఆత్ముడు” – అను వాటికి వచ్చు సంధి కార్యము
A) గుణసంధి
B) ఇత్వ సంధి
C) సవర్ణదీర్ఘ సంధి
D) అత్వ సంధి
జవాబు:
C) సవర్ణదీర్ఘ సంధి

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

ప్రశ్న 2.
రాజరాజేశ్వరా – సంధి విడదీసి రాయగా
A) రాజ + రాజేశ్వరా
B) రాజరా + జేశ్వరా
C) రాజరాజ + ఈశ్వరా
D) రాజరాజ + యీశ్వరా
జవాబు:
C) రాజరాజ + ఈశ్వరా

ప్రశ్న 3.
“నెఱి + మేను” – కలిపి రాయగా
A) నెఱిమేను
B) నెమ్మనము
C) నెమ్మేను
D) నిండుమేను
జవాబు:
C) నెమ్మేను

ప్రశ్న 4.
ఈశ్వరుని పదాబ్జములను కొలుతును – గీత గీసిన పదానికి సంధి కార్యము
A) గసడదవాదేశ సంధి
B) సవర్ణదీర్ఘ సంధి
C) అత్వ సంధి
D) గుణసంధి
జవాబు:
B) సవర్ణదీర్ఘ సంధి

ప్రశ్న 5.
“జాతుల్ + చెప్పుట” – సంధి చేసి రాయగా
A) జాతుచెప్పుట
B) జాతికి సెప్పుట
C) జాతులెప్పుట
D) జాతులే సెప్పుట
జవాబు:
D) జాతులే సెప్పుట

ప్రశ్న 6.
“ఏమి + అయినన్” – ఇది ఏ సంధి ?
A) ఇత్వ సంధి
B) అత్వ సంధి
C) గుణసంధి
D) యణాదేశ సంధి
జవాబు:
A) ఇత్వ సంధి

ప్రశ్న 7.
క, చ, ట, త, ప ల స్థానంలో గ, స, డ, ద, వలు వచ్చు సంధి నామము
A) సరళాదేశ సంధి
B) గసడదవాదేశ సంధి
C) ద్రుత సంధి
D) ఆమ్రేడిత సంధి
జవాబు:
B) గసడదవాదేశ సంధి

ప్రశ్న 8.
“వేంకటేశ్వరా” అను పదమును విడదీయగా వచ్చు సంధి
A) సవర్ణదీర్ఘ సంధి
B) గుణసంధి
C) యణాదేశ సంధి
D) యడాగమ సంధి
జవాబు:
B) గుణసంధి

ప్రశ్న 9.
“తలఁదాల్చు” అను పదాన్ని విడదీసి రాయగా
A) తలతోన్ + తాల్చు
B) తల + తాల్చు
C) తలన్ + తాల్చు
D) తలఁ + తాల్చు
జవాబు:
C) తలన్ + తాల్చు

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

II. సమాసములు :

ప్రశ్న 1.
“షష్ఠీ తత్పురుష సమాసాని”కి ఉదాహరణ
A) నీ భక్తుడు
B) చేదమ్మి
C) నెమ్మేన
D) కలహాగ్నులు
జవాబు:
A) నీ భక్తుడు

ప్రశ్న 2.
జలజాతప్రియ శీతభానులు అను దానికి విగ్రహవాక్యం
A) జలజాతము మరియు ప్రియమైన శీతము భానుడును
B) జలజాతప్రియుడును మరియు శీతభానుడును
C) జలజాతప్రియము వంటి శీతభానులు
D) జలజాత ప్రియుని యొక్క శీతభానులు
జవాబు:
B) జలజాతప్రియుడును మరియు శీతభానుడును

ప్రశ్న 3.
“కార్యము నందు దక్షుడు” – అను విగ్రహవాక్యమునకు సమాసరూపం
A) కార్యదక్షుడు
B) కార్యమున దక్షుడు
C) కార్యాధ్యక్షుడు
D) కార్యములందు దక్షుడు
జవాబు:
A) కార్యదక్షుడు

ప్రశ్న 4.
“మూడు దోషాలు” సమాసము పేరు
A) ద్వంద్వ సమాసము
B) ద్విగు సమాసము
C) రూపక సమాసము
D) బహువ్రీహి సమాసము
జవాబు:
B) ద్విగు సమాసము

ప్రశ్న 5.
“ఆశాపాశం”లో చిక్కినవాడు, బయటపడలేడు – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం
A) ఆశ యందు పాశము
B) ఆశ యొక్క పాశం
C) ఆశ అనెడు పాశము
D) ఆశలు మరియు పాశాలు
జవాబు:
C) ఆశ అనెడు పాశము

ప్రశ్న 6.
అబ్జముల వంటి పదములు – విగ్రహవాక్యమునకు సమాసము
A) విశేషణ పూర్వపద కర్మధారయము
B) సంభావనా పూర్వపద కర్మధారయము
C) ఉపమాన ఉత్తరపద కర్మధారయము
D) బహువ్రీహి
జవాబు:
C) ఉపమాన ఉత్తరపద కర్మధారయము

ప్రశ్న 7.
“బహువ్రీహి సమాసము”నకు ఉదాహరణ
A) పుణ్యాత్ముడు
B) పరమేశ్వరుడు
C) కలహాగ్నులు
D) పరద్రవ్యము
జవాబు:
A) పుణ్యాత్ముడు

ప్రశ్న 8.
భీష్మద్రోణులు దుర్యోధనుని కొలువులో ఉన్నారు – గీత గీసిన పదం ఏ సమాసం ?
A) ద్వంద్వ సమాసము
B) ద్విగు సమాసము
C) ప్రాది సమాసము
D) షష్ఠీ తత్పురుష సమాసం
జవాబు:
A) ద్వంద్వ సమాసము

III. ఛందస్సు

ప్రశ్న 1.
“నీయాత్మ” అను పదమును గణవిభజన చేయగా
A) య గణం
B) త గణం
C) జ గణం
D) స గణం
జవాబు:
B) త గణం

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

ప్రశ్న 2.
UUI, UIU – ఈ గణములకు సరియైన పదం
A) శ్రీరామ భూపాల
B) సీతామనోహరా
C) రాజరాజాధిపా
D) తారాశశాంకము
జవాబు:
B) సీతామనోహరా

ప్రశ్న 3.
“శార్దూల పద్యం”లో వచ్చు గణములు
A) న, జ, భ, జ, జ, జ, ర
B) స, భ, ర, న, మ, య, వ
C) మ, స, జ, స, త, త, గ
D) భ, ర, న, భ, భ, ర, వ
జవాబు:
C) మ, స, జ, స, త, త, గ

ప్రశ్న 4.
ధనము, ధనాభిమానము, సదా ధనతృష్ణయు మూడు దోషముల్ – ఈ పద్యపాదంలో 11వ స్థానం యతి వచ్చింది. అయితే ఈ పద్యపాదం
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) మత్తేభం
D) శార్దూలం
జవాబు:
B) చంపకమాల

ప్రశ్న 5.
ఇంద్ర గణములు ఏవి ?
A) న, హ
B) నగ, నల, సల, భ, ర, త
C) య, ర, త, భ, జ, స
D) మ, న, లగ
జవాబు:
B) నగ, నల, సల, భ, ర, త

IV. వాక్యాలు :

ప్రశ్న 1.
రామకృష్ణారావు సత్యాగ్రహం చేశారు. రామకృష్ణారావు జైలుకు వెళ్ళారు. పై వాక్యాలు సంక్లిష్ట వాక్యాలుగా మారిస్తే
A) రామకృష్ణారావు సత్యాగ్రహం చేశారు, జైలుకు వెళ్ళారు.
B) రామకృష్ణారావు సత్యాగ్రహం చేశారు కాబట్టి జైలుకు వెళ్ళారు.
C) రామకృష్ణారావు సత్యాగ్రహం చేసి, జైలుకు వెళ్ళారు.
D) రామకృష్ణారావు సత్యాగ్రహం చేసినా జైలుకు వెళ్ళారు.
జవాబు:
C) రామకృష్ణారావు సత్యాగ్రహం చేసి, జైలుకు వెళ్ళారు.

ప్రశ్న 2.
పాండవులు అరణ్యవాసం చేశారు. పాండవులు అజ్ఞాతవాసం చేశారు. పై వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మారిస్తే
A) పాండవులు అరణ్యవాసం చేసి, అజ్ఞాతవాసం చేశారు.
B) పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేశారు.
C) పాండవులు అరణ్యవాసం చేశారు కాని అజ్ఞాతవాసం కూడా చేశారు.
D) పాండవులు అరణ్యవాసం చేసినా అజ్ఞాతవాసం కూడా చేశారు.
జవాబు:
B) పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేశారు.

ప్రశ్న 3.
సామాన్య వాక్యాలు ఏవి ?
A) చైతన్య వాలీబాల్ ఆడతాడు. నిర్మల్ క్రికెట్ ఆడతాడు.
B) చైతన్య వాలీబాల్ ఆడితే, నిర్మల్ క్రికెట్ ఆడతాడు.
C) చైతన్య వాలీబాల్ ఆడతాడు కాబట్టి, నిర్మల్ క్రికెట్ ఆడతాడు.
D) చైతన్య మరియు నిర్మల్లు, వాలీబాల్ మరియు క్రికెట్ ఆడతారు..
జవాబు:
A) చైతన్య వాలీబాల్ ఆడతాడు. నిర్మల్ క్రికెట్ ఆడతాడు.

ప్రశ్న 4.
“నేను ఈ ఇడ్లీలు చేశాను” అంది హైమ – ఈ వాక్యాన్ని పరోక్ష కథనంలోకి మారిస్తే
A) హైమ అన్నది “నేను ఈ ఇడ్లీలు చేశాను,” అని.
B) తాను ఈ ఇడ్లీలు చేశానని హైమ అన్నది.
C) తాను చేసిన ఇడ్లీలు ఏవి అని హైమ అన్నది.
D) హైమ చేసిన ఇడ్లీలు ఇవి అని ఆమె అన్నది.
జవాబు:
B) తాను ఈ ఇడ్లీలు చేశానని హైమ అన్నది.

TS 9th Class Telugu Guide 10th Lesson వాగ్భూషణం

Telangana SCERT 9th Class Telugu Guide Telangana 10th Lesson వాగ్భూషణం Textbook Questions and Answers.

TS 9th Class Telugu 10th Lesson Questions and Answers Telangana వాగ్భూషణం

చదువండి – ఆలోచించి చెప్పండి   (Textbook Page No. 98)

మాటల కోటలు గట్టి
మహారాజుగా మసలుతాడొకడు
మాట చేటలతో.
మనసు చెరిగి పోతాడొకడు.
మాటలు బాటలు వేస్తాయి.
మాటలు పాటలు రాస్తాయి.
మాటలు లేకపోతే
కవిత లేదు.
గానం లేదు.
నాగరికత లేదు.
నవ్యత లేదు జాగృతి లేదు.
చైతన్యాకృతి లేదు
వెలుగును చూపించేది
విశ్వాన్ని నడిపించేది
వాక్ఛక్తి వాగ్రక్తి
– వేముగంటి నరసింహాచార్యులు

ప్రశ్నలు

ప్రశ్న 1.
ఈ కవితను ఎవరు రాశారు ? ఇది దేని గురించి చెప్పుతుంది ?
జవాబు:
ఈ కవితను వేముగంటి నరసింహాచార్యులు గారు రాశారు. ఇది ‘వాక్ఛక్తి’ ని గురించి చెపుతోంది.

TS 9th Class Telugu Guide 10th Lesson వాగ్భూషణం

ప్రశ్న 2.
మాటల గొప్పతనం ఏమిటి ?
జవాబు:

  1. మాటలు బాటలు వేస్తాయి.
  2. మాటలు పాటలు రాస్తాయి.
  3. మాటలు లేకపోతే కవిత్వం లేదు.
  4. మాటలు లేకపోతే సంగీతం లేదు.
  5. మాటలు లేకపోతే నాగరికత, నవ్యత లేవు.
  6. జాగృతి, చైతన్యం లేవు.

ప్రశ్న 3.
మంచిగా మాట్లాడడం అంటే ఏమిటి?
జవాబు:
మంచిగా మాట్లాడడం అంటే, శ్రోతల మనస్సులకు ఆనందాన్ని కలిగించేలా, మంచి విషయంతో, మంచి కంఠధ్వనితో, ఎక్కువ సేపు కాకుండా, క్లుప్తంగా మాట్లాడడం.

ప్రశ్న 4.
వాక్ఛక్తి, వాగ్రక్తి అంటే ఏమి అర్థమైంది ?
జవాబు:
వాక్ఛక్తి మాటలోని శక్తి. వాగ్రక్తి – మాట యందు ఆసక్తి. ఈ వాక్ఛక్తి, వెలుగును చూపించి, ప్రపంచాన్ని నడిపిస్తుంది. అందువల్ల వాక్కునందు రక్తి అనగా ఆసక్తిని కలిగియుండాలి.

ఆలోచించండి – చెప్పండి  (Textbook Page No. 101)

ప్రశ్న 1.
“సమాజ సమస్యల పరిష్కారానికి మౌనం కంటే భాషణం మంచి సాధనం” – దీనిపై చర్చించండి.
జవాబు:
ఈ రోజు సంఘంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాతావరణ కాలుష్యం, జనాభా సమస్య, బాలకార్మిక వ్యవస్థ, చంటి పిల్లల ఆరోగ్య సమస్య, వివాహాలలో అధిక ఖర్చులు మొదలైనవి.

ఎవరి మట్టుకు వారు ఇటువంటి సమస్యలను గురించి వాటి పరిష్కార మార్గాలను గురించి తమకు తెలిసినా, మాకెందుకులే అని మాట్లాడక ఊరు కుంటున్నారు. తామొక్కరూ ఏమి చేయలేమని నిశ్శబ్దం వహిస్తున్నారు. అట్లా కాకుండా, కర్తవ్యాన్ని గూర్చి, పరిష్కారాలను గూర్చి, ప్రతివ్యక్తి గొంతెత్తి మాట్లాడితే. క్రమంగా ఆ సమస్యకు పరిష్కారం తప్పక దొరుకు తుంది.

TS 9th Class Telugu Guide 10th Lesson వాగ్భూషణం

ప్రశ్న 2.
“మనిషికీ, పశువుకీ ప్రధాన భేదం వాక్కు” అన్నాడు. రచయిత – అటువంటి వాక్ శక్తిని ఎట్లా పెంపొందించు కుంటారు?
జవాబు:
కొంత సాహసించి, కొంత ప్రయత్నించి, తనలోని పఠనశక్తిని వెలికితీసి ప్రయోగించాలి. ప్రతివ్యక్తి నిరంతర ప్రయత్నం వల్ల వక్తృత్వ కళలో నేర్పు సంపాదించగలుగుతాడు.

ప్రశ్న 3.
“వక్తృత్వశక్తి ఆత్మశక్తికి మరో పేరు” ఎట్లాగో చెప్పండి.
జవాబు:
వక్తృత్వం చెప్పగల శక్తి తనకున్నదని, ముందుగా అతడు తన ఆత్మలో గట్టిగా నమ్మకం కలిగి ఉండాలి. తనకు మాట్లాడే శక్తి ఉన్నదని ఆత్మ విశ్వాసం కలిగియుండాలి. తనలో ఆ శక్తి ఉందని గుర్తిస్తే, మానవ జీవితం సఫలం అవుతుంది.

ప్రశ్న 4.
వాక్శక్తిని అర్థం చేసుకుంటే ఏ.ఏ రంగాల్లో రాణించ వచ్చు? చర్చించండి.
జవాబు:
వాక్శక్తిని అర్థం చేసుకుంటే, గణకులు, వ్యాపారులు, వైద్యులు, న్యాయవాదులు, కమిషన్ ఏజంట్లు, హోటల్ వాళ్ళు, సాంఘిక కార్యకర్తలు, రైల్వేపనివారు, ప్రచురణ. కర్తలు, ఇంకా ఎన్నో వృత్తులలో ఉన్నవాళ్ళు రాణింప వచ్చు. వారు తమ భవిష్యత్తును బంగారు బాటపై నడిపించుకోవచ్చు.

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 103)

ప్రశ్న 1.
‘అన్ని కళలకెల్లా ఉత్తమమైనది వక్తృత్వకళ” దీని ప్రయోజనాన్ని సమర్థిస్తూ మాట్లాడండి.
జవాబు:
సహృదయులైన వక్తలు వక్తృత్వాన్ని సాహిత్య ప్రచారానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. శ్రోతల హృదయాలలో ఆర్ద్రతను, రసికతను కలిగిస్తారు. కొన్ని సందర్భాల్లో ఉపన్యాసాల వల్ల ప్రజల హృదయాలలో ఆవేశం పొంగులెత్తుతుంది. అగ్నిపర్వతాలు బద్దలౌతాయి. ఏడ్పు వస్తుంది. వారు కార్యం చేయడానికి సిద్ధమవుతారు. నవరసాలతో నిండిన హృదయాలు కలవారవుతారు.

TS 9th Class Telugu Guide 10th Lesson వాగ్భూషణం

ప్రశ్న 2.
‘మాట్లాడటం సాహసమే’ అని రచయిత ఎందుకు అన్నాడు?
జవాబు:
శ్రోతల ఎదుట మాట్లాడడం, నవ్వులాటగాదు. అది సాహసం. ఎందుకంటే మాట్లాడేటప్పుడు భయం కలుగుతుంది. మనం పెద్దగా చదువుకోలేదనే జంకు కల్గుతుంది. ఒకప్పుడు సభలో వక్త కంటే ఎక్కువగా చదువుకున్నవారు ఉంటారు. వారు వక్త ఉపన్యాసంలో దోషాలు ఉన్నాయని చెప్పవచ్చు.

ఉపన్యాసానికి బాగా సన్నద్ధత కావాలి. ఒకప్పుడు సన్నద్ధం అయినా, నిలబడేటప్పటికి వక్తలు విషయం మరచిపోతూ ఉంటారు. ఒకప్పుడు వారిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. అందువల్లనే రచయిత మాట్లాడడం సాహసమే అని చెప్పాడు.

ప్రశ్న 3.
‘భయాన్ని – అనుమానాన్ని వదులుకున్నవాడు వక్త కాగలడు’ – దీనిపై మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు:
భయంలేనివాడు అజేయుడు. భయాన్ని వదలుకుంటే భాషలో స్పష్టత వస్తుంది. వక్త తాను ఎలా మాట్లాడు తున్నానో అనే చింతను విడిచిపెట్టాలి. సభలో నిలబడి తన మనస్సులో ఉన్న భావాన్ని జడుసుకోకుండా, సిగ్గుపడకుండా ధారాప్రవాహంగా చెప్పాలి.

భయాన్ని, అనుమానాన్ని వడలిపెట్టి మాట్లాడితే నిజంగానే గొప్ప వక్త అవుతాడని నా అభిప్రాయము.

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 104)

ప్రశ్న 1.
“విశ్వమత మహాసభలో వివేకానందస్వామి చేసిన ఉపన్యాసం ఒక ఇతిహాసఘట్టం” దీనిపై మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు:
నిజమే. ఆనాడు విశ్వమత మహాసభలో వివేకానంద స్వామి “భారతీయధర్మం, అన్ని మతాల్నీ గౌరవిస్తుందనీ, అంగీకరిస్తుందనీ, అన్ని మతాలూ సత్యాలేననీ, అన్ని మతాలూ భగవంతుడిని చేరుకోడానికి మార్గాలేననీ చెప్పాడు. తన మతమే నిలవాలని అనుకోనేవారు, బావిలో కప్పలాంటి వారని సత్యాన్ని ప్రకటించాడు. అందువల్ల ఆ ఉపన్యాసం, నిజంగానే ఒక ఇతిహాసిక ఘట్టం.

TS 9th Class Telugu Guide 10th Lesson వాగ్భూషణం

ప్రశ్న 2.
ఉపన్యాసానికి ముందు ప్రణాళిక అవసరం. ఎందుకు?
జవాబు:
ఉపన్యాసం చెప్పేటప్పుడు వక్తలు, అప్పుడప్పుడు చెప్పే విషయాన్ని వదలి, ఇతర విషయాలను గూర్చి. మాట్లాడుతూ ఉంటారు. వక్త యొక్క వాగ్ధార ఎక్కడైనా ఆగిపోవచ్చు. వక్త ఒక్కొక్కసారి చెపుతూ చెపుతూ ఆగిపోతాడు. అతడు మధ్య మధ్య అనుమానాలు వచ్చి, నీళ్ళు నమలవలసి వస్తుంది. అందువల్ల ప్రసంగించ డానికి ముందు ప్రణాళిక అవసరం.

ప్రశ్న 3.
వక్తకు ఎక్కువ పదజాల పరిచయం అవసరం. ఎందుకో చెప్పండి ?
జవాబు:
వక్తకు సమానార్థక పదాలతోనూ, పర్యాయ వాచకాల తోనూ మంచి పరిచయం ఉండాలి. అప్పుడే అతడు యథోచితంగా వాటిని ప్రయోగించగలడు. సభలోని సభ్యుల జ్ఞాన పరిమితికి తగిన పదజాలం వక్త ఉపన్యా సంలో వాడాలి. పెద్దల సభలో, విజ్ఞుల సభలో కఠిన పదాలు, వ్యంగ్యార్థాల పదాలు వాడితే రమణీయంగా ఉంటుంది. చిన్న పిల్లల సభల్లో, సామాన్యుల సభల్లో అందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడాలి. కాబట్టి వక్తకు ఎక్కువ పదజాల పరిచయం అవసరం.

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 106)

ప్రశ్న 1.
వక్తకు జ్ఞాపకశక్తి ఎట్లా ఉపయోగపడుతుంది ?
జవాబు:
వక్తకు జ్ఞాపకశక్తి చాలా అవసరం. ఉపన్యాసానికి ముందే బాగా ప్రణాళిక ప్రకారం సిద్ధమైనా, మాటిమాటికీ కాగితం చూస్తూ మాట్లాడితే ఉపన్యాసం రంజుగా సాగదు. మాట్లాడేటప్పుడు తడబాటు వస్తుంది. చెప్ప దలచుకున్న విషయానికి సంబంధించిన ముఖ్య విషయాలను చీటీపై వ్రాసుకొని, ఏ అంశాన్నీ మరిచి పోకుండా, క్రమబద్ధంగా చెప్పదలచిన విషయాన్ని చెప్పడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మంచి జ్ఞాపకశక్తి ఉంటే విషయాన్ని ధారాప్రవాహంగా, పూర్వకవుల పద్యాలు, శ్లోకాలు ఉదాహరిస్తూ, వాటిని వ్యాఖ్యానిస్తూ, సొగసుగా మాట్లాడగలుగుతాడు.

TS 9th Class Telugu Guide 10th Lesson వాగ్భూషణం

ప్రశ్న 2.
మంచి వక్త కావడానికి ఏం చేయాలి?
జవాబు:

  1. చెప్పదలచుకొన్న విషయానికి సంబంధించిన కొన్ని ముఖ్య వాక్యాలను చీటీపై వ్రాసుకొని, ఏ విషయమూ మరచిపోకుండా క్రమంగా చెప్పదలచిన విషయాన్ని చెప్పాలి.
  2. ముందుగా చిన్న పిల్లల సభల్లో మాట్లాడడం అలవాటు చేసుకోవాలి.
  3. నదీ తీరంలోనో, కొండ మీదో, నిలబడి, ఒంటరిగా ‘కొండనూ, నదినీ, ప్రకృతినీ ఉద్దేశించి మాట్లాడితే సభాకంపనం తగ్గుతుంది.
  4. శ్రోతలను శిలామూర్తులని భావించి ప్రసంగం చేయాలి.
  5. శ్రోతల సంఖ్యను బట్టి తన కంఠధ్వనిని పరిమితం చేసుకోవాలి.
  6. భావానుగుణమైన ధ్వని ప్రసారం వల్ల లాభం ఉంటుంది.
  7. ఉపన్యాస వాక్యాలు చిన్నవిగా ఉండాలి.
  8. వేగంగా మాట్లాడరాదు.
  9. సమయాన్ని ఉల్లంఘించరాదు.
  10. తర్కబద్ధంగా క్లుప్తంగా మాట్లాడాలి.

ప్రశ్న 3.
‘బాగా ఆలోచించేవాడు తక్కువ మాట్లాడుతాడు’ దీని గురించి మీ అభిప్రాయం తెలుపండి.
జవాబు:
బాగా ఆలోచించేవాడు ఏ మాటలు మాట్లాడితే బాగుంటుందో ముందే బాగా ఆలోచించుకొని, అవసరమైన మాటలే తక్కువగా మాట్లాడుతాడు. దీర్ఘమైన అనవసర ప్రసంగాలు చేయడు. బాగా ఆలోచించనివాడు . అవసరమైనవీ, లేనివీ కలిపి, సుదీర్ఘంగా మాట్లాడుతాడు. అందుకే వేమన ‘కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగదు’ అన్నాడు.

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 107)

ప్రశ్న 1.
“అయిదు నిమిషాలు మాట్లాడడానికి ఒక గంట సేపు ఆలోచించవలసి ఉంటుంది. గంటసేపు మాట్లాడడానికి ఆలోచన అనవసరం”. దీనిపై మీ అభిప్రాయాలు చెప్పండి.
జవాబు:
అయిదే నిమిషాలలో ఉపన్యాసం ముగించాలంటే, కేవలం ఆ సభకు అనుగుణమైన, అతి ముఖ్యమైన మాటలే క్లుప్తంగా, తర్కబద్ధంగా రసానుభూతి కల్గించేటట్లు, మాట్లాడాలి. అలా మాట్లాడాలంటే విషయాన్ని ఏ విధంగా మాట్లాడాలో బాగా గంటలసేపు ఆలోచించ వలసివస్తుంది.

గంటసేపు మాట్లాడాలంటే ముఖ్య విషయాన్ని ఆ గంటలో ఎప్పుడైనా మాట్లాడవచ్చు. వక్తకు కావలసిన సమయం అతని చేతిలో ఉంటుంది. కాబట్టి నేను పై మాటలను సమర్థిస్తున్నాను.

TS 9th Class Telugu Guide 10th Lesson వాగ్భూషణం

ప్రశ్న 2.
‘వాక్కు మనిషికి అలంకారం’ దీన్ని సమర్థిస్తూ మాట్లాడండి.
జవాబు:
“వాగ్భూషణం భూషణం” అన్నాడు భర్తృహరి మనిషికి నిజమైన అలంకారము వాక్కే. కేయూరములు, హారములు, విలేపన ద్రవ్యములు, పూలు, మనిషికి నిజమైన అలంకారాలు కాదు. మాట మాత్రమే నిజమైన అలంకారం. చక్కగా మాట్లాడే వ్యక్తిని, అందరూ గౌరవిస్తారు. మంచివాక్కు గలవారి మాటకు మన్నన లభిస్తుంది. మంచివాక్కు ఉంటే ఎదుటివారికి నచ్చచెప్పగలరు. మంచిగా మాట్లాడేవారు, ఇంటర్వ్యూలలో విజయాన్ని సాధిస్తారు.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
‘నోరు మంచిదైతే – ఊరు మంచిదౌతుంది.’ – దీన్ని సమర్థిస్తూ మాట్లాడండి.
జవాబు:
కోయిల తియ్యగా కూస్తుంది. చిలుక చక్కగా మాట్లాడుతుంది. ఆ రెండింటినీ మనం ఆదరిస్తాము. కాకి “కాకా” అంటూ పరుషంగా మాట్లాడుతుంది. ఆ కాకిని మనం తరిమి పారవేస్తాము. దానిని బట్టి నోరు మంచిదైతే, ఊరు మంచిదౌతుందని గ్రహించగలం.

మనం పొరుగూరికి వెళ్ళి, అక్కడి వారితో మంచిగా, గౌరవంగా మాట్లాడితే, ఆ ఊరి ప్రజలు మనల్ని ఆదరిస్తారు. ఆ ఊరులో జనం అంతా మనలను మంచిగా చూస్తారు. అలాగే నిత్యజీవితంలో కూడా, మనం ప్రక్కవారితో మంచిగా, మన్ననగా, కలుపుగోలుగా మాట్లాడితే అక్కడి వారు మనలను మంచిగా చూస్తారు. మన మాటకు విలువ ఇస్తారు. కనుక మనిషి తియ్యగా, చక్కగా మాట్లాడడం నేర్చుకోవాలి.

ప్రశ్న 2.
కింది పదాలు ఈ పాఠంలో ఏ ఏ పేరాల్లో ఎన్నో పంక్తిలో ఉన్నాయో గుర్తించి, వాటి ప్రాధాన్యాన్ని చర్చించండి.
అ) ధారాశుద్ధి ఆ) వక్తృత్వ కళోపాసనం ఇ) ఊనిక ఈ) వచశైలి ఉ) వ్యంగ్యార్థం ఊ) తపస్సు
జవాబు:
అ) ధారాశుద్ధి : ‘ధారాప్రవాహం’ అనే పదం, పాఠంలోని 9వ పేరాలో 6వ పంక్తిలో ఉంది. ఉపన్యాసం చెప్పేటప్పుడు భయం సిగ్గు లేకుండా మాటలు ధారాప్రవాహంగా మాట్లాడాలని రచయిత చెప్పాడు. తడుముకోకుండా నదీ ప్రవాహంలా మాట్లాడాలన్నమాట.

ఆ) వక్తృత్వ కళోపాసనం : ఈ పదం పాఠంలో 28వ పేరాలో మూడవ పంక్తిలో ఉంది. వక్తృత్వం అనేది ‘కళ’ అని, నిద్రాణమై ఉన్న మనశ్శక్తి మేల్కోవాలంటే, వక్తృత్వకళోపాసన ముఖ్యం అనీ రచయిత చెప్పాడు. ఉపన్యాసం చెప్పడాన్ని కళగా గౌరవించి, దానిని ఆదరించాలని కవిగారి అభిప్రాయం.

TS 9th Class Telugu Guide 10th Lesson వాగ్భూషణం

ఇ) ఊనిక : ఈ పదం, పాఠంలో 19 వ పేరాలో 25 వ పంక్తిలో ఉంది. ఉపన్యాసం ‘చెప్పేటప్పుడు వక్త కొన్ని వాక్యాలను ఊనికతో ఒత్తి పలకాలి. కొన్ని వాక్యాలను మందంగా పలకాలి. వక్తృత్వంలో భావానికి తగిన ధ్వని ప్రసారం ఉండాలని రచయిత చెప్పాడు. రసానుగుణంగా పదాలు పలకాలి. రౌద్రరస పదాలను నసుగుతూ గొణుగుతూ పలకరాదు. దయ, శాంతి, కరుణ వంటి మాటలను గంభీరంగా పలకరాదు.

ఈ) వచశ్శైలి : ఈ పదం పాఠంలో 8 వ పేరాలో 2 వ పంక్తిలో ఉంది. ప్రతి వ్యక్తికి తాను మాట్లాడే తీరు ఒకటి ఉంటుంది. అతడికి ఒక ఆలోచనా పద్ధతి ఉంటుంది. వారు మాట్లాడే పద్ధతినే ‘వచశ్శైలి’ అంటారు.

ఉ) వ్యంగ్యార్థం : ఈ పదం పాఠంలో 13 వ పేరాలో 3వ పంక్తిలో ఉంది. ఉపన్యాసంలో కావ్యంలోలాగే వ్యంగ్యార్థం ప్రాధాన్యం వహిస్తుంది. వ్యంగ్యార్థ ప్రతిపాదన లేని భావాలు, వక్తకు గౌరవం తీసుకురావు. కావ్యంలాగే ఉపన్యాసం కూడా, వ్యంగ్యార్థాన్ని ఆశ్రయించినప్పుడు అది ఉత్తమ ఉపన్యాసం అవుతుంది.

ఊ) తపస్సు : ఈ పదం పాఠంలో 22 వ పేరాలో మొదటి పంక్తిలో ఉంది. ఈ తపస్సును ఋషులు, మునులు భగవంతుని అనుగ్రహం పొందడానికి చేస్తారు. అలాగే ఉపన్యాసంలో తాను కోరుకున్న విషయాన్నే చెప్పేశక్తి, కేవలం తపస్సు వల్లనే సాధ్యమవుతుందని రచయిత చెప్పాడు.

ప్రశ్న 3.
కింది అంశాన్ని చదివి, తప్పొప్పులను గుర్తించండి.

మహాత్ములు ఒక విషయాన్ని సంకల్పించుకొని దానిని మాటల ద్వారా చెప్పి, చెప్పిన దానిని చేసి చూపిస్తారు. తలచింది చెప్పడం, చెప్పింది చేయడం అనేది చాలా కష్టమైన విషయం. అది యెంతటి మహాత్ములకో గాని సాధ్యపడదు.
“మనసు, మాట, నడత మనిషికి ఒకటైన
మనిషి కాదు వాడు మహితుడౌను”
మనసులోని ఆలోచన, మాట్లాడేమాట, నడిచే నడత ఈ మూడు ఒకటిగా ఉన్నవాడే మహాత్ముడు. మన మాటలకు మన చేతలకు మూలం మన ఆలోచనలు. కాబట్టి మన ఆలోచనలు సదాలోచనలు కావాలి. మనసులోని యోచన, మాటలోని సూచన, క్రియలోని ఆలోచన ఈ మూడు ఏకం కావాలి.

అ) మాటల ద్వారా చెప్పి, చెప్పిందాన్ని చేసేవారు మహాత్ములు
జవాబు:
ఒప్పు

ఆ) చెప్పింది చేయడం చాలా సులభం.
జవాబు:
తప్పు

TS 9th Class Telugu Guide 10th Lesson వాగ్భూషణం

ఇ) ఆలోచనలు సదాలోచనలు కావాలి.
జవాబు:
ఒప్పు

ఈ) మనసు – మాట – నడత ఒకటైనవాడు మహితుడు కాడు.
జవాబు:
తప్పు

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) “జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే మాటే ప్రధానం” దీనిపై మీ అభిప్రాయం రాయండి.
జవాబు:
చక్కగా పొందికగా ఎదుటి వ్యక్తికి నచ్చే విధంగా మాట్లాడగలవాడికి, అన్నీ విజయాలే సిద్ధిస్తాయి. మంచి ఉపన్యాసకుడు పార్టీ నాయకుడైతే ప్రజలు ఆ పార్టీకి ఓట్ల వర్షం కురిపిస్తారు. మంచిగా నేర్పుగా మాట్లాడగలిగితే, ఉద్యోగాల ఇంటర్వూలలో నెగ్గి మంచి ఉద్యోగాలు సాధింపవచ్చు. రాజకీయ నాయకులు చక్కగా వాగ్దానాలు వరదగా పారించి, ఎన్నికలలో గెలుస్తారు. మన జీవితంలో సైతమూ, ప్రక్కవారితో పొందికగా మాట్లాడి వారి హృదయాలను ఆకట్టుకోవచ్చు.

భార్యాబిడ్డలతో కూడా నేర్పుగా, ఓర్పుగా మాట్లాడి వారి ప్రేమను పొందవచ్చు. ఒకరి వద్ద పనిచేసినపుడు యజమానికి అనువుగా మాట్లాడి, ఆ యజమాని మన్ననలను పొందవచ్చు. చక్కగా మాట్లాడడం, సరసంగా సంభాషించడం, ఇతరుల మనస్సులకు హాయి కలిగేటట్లు మాట్లాడడం అనే వాటి ద్వారా జీవితంలో ఏదైనా సాధింపగలరు.

TS 9th Class Telugu Guide 10th Lesson వాగ్భూషణం

ఆ) శాస్త్రమర్యాదలకు లోబడిన వాక్కు ‘పవిత్రమైనది’, ఇట్లా అనడంలో కవి ఉద్దేశం ఏమిటి ?.
జవాబు:
‘వాక్కు’ అంటే మాట. వాక్కు సరస్వతీ స్వరూపము. మాట్లాడే మాట, నిర్దుష్టంగా వ్యాకరణ శాస్త్ర సమ్మతంగా ఉండాలి. మాట, సభ్యతా సంస్కారాలు కలిగి ఉండాలి. భారతీయులు, వాక్కును సరస్వతీ దేవతా స్వరూపంగా ఆరాధిస్తారు. వాక్కును పరిశుద్ధంగా ప్రయోగించడం, పుణ్యం అని పెద్దలు అన్నారు. కాబట్టి వ్యాకరణ శాస్త్ర మర్యాదకు అనుగుణంగా తప్పులు లేని భాషను మాట్లాడాలి.

వాక్కు మనిషికి అలంకారం వంటిది. భాష మనిషికి ఎన్నడూ కళ తగ్గని అలంకారం. చక్కని భాషలేని వాడికి, మంచి వేషం ఉన్నా వ్యర్థమే. వాగ్ధార, కత్తి అంచు కంటే పదునైనది. భాషను చక్కగా ఉచ్చరించే వాళ్ళను చూసి, ఆయా అక్షరాల ధ్వనులను స్పష్టంగా, నిర్దుష్టంగా వ్యాకరణ శాస్త్ర సమ్మతంగా ఉచ్చరించడం మనం అలవాటు చేసుకోవాలి.

భాష పవిత్రమైనది. కాబట్టి దానిని శాస్త్ర సమ్మతంగానే మాట్లాడాలి. మంచి భాష అలవడడం కోసం, పుస్తకాలలోని ప్రసిద్ధుల ఉపన్యాసాలను అధ్యయనం చెయ్యాలని రచయిత అభిప్రాయము.

ఇ) వక్తృత్వంలో శరీర కదలికల (అంగవిన్యాసం) పాత్ర ఎట్లాంటిది ?
జవాబు:
మహోత్సాహంతో మాట్లాడేటప్పుడు, ఉత్తేజకర భావాలను ప్రకటించేటప్పుడు, పండితుడైన వక్త కండ్లలో, కనుబొమ్మల్లో. చేతుల్లో, ముఖంలో కొన్ని కదలికలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఏ భావాన్ని ప్రకటించడానికి ఏ కదలిక అవసరం అన్న దానికి సరైన సమాధానం దొరకడం కష్టం.

ఈ అంగాంగ సంచలనం అన్నది, ఆ వ్యక్తిని బట్టి ఉంటుంది. వక్త తన భావాలను ప్రకటించేటప్పుడు, అంగాంగ విన్యాసం చెయ్యాలనే నియమం ఏదీలేదు. అవి సహజంగానే జరిగిపోతూ ఉంటాయి. ఏ మాత్రం కదలకుండా పరిమితమైన అంగవిన్యాసం చేస్తూ, స్తంభంలా నిలబడి మాట్లాడేవారు కూడా ఉంటారు.

TS 9th Class Telugu Guide 10th Lesson వాగ్భూషణం

ఈ) ఇరివెంటి కృష్ణమూర్తి రాసిన “వాగ్భూషణం” పాఠం నేటి విద్యార్థులకు ఎట్లా ఉపయోగపడుతుంది ?
జవాబు:
నేటి విద్యార్థులు అన్ని కళల కంటె, ఉదాత్తమైన ఈ వక్తృత్వం పట్ల ఉదాసీనంగా ఉంటున్నారు. విద్యార్థులకు ఈ ఉపన్యాస కళ చాలా ముఖ్యము. వారు ఉద్యోగాలు సంపాదించడానికి, ఇంటర్వ్యూలను ఎదుర్కోడానికి, ఈ ఉపన్యాసశక్తి వారికి ఉపయోగపడుతుంది. సిగ్గు, భయం లేకుండా ఇంటర్వ్యూలలో వచ్చే ప్రశ్నలకు వారు ధైర్యంగా జవాబులు చెప్పగలరు.

ఇరివెంటి కృష్ణమూర్తిగారు ఈ వ్యాసంలో ఉపన్యాస కళను నేర్చుకొనే పద్ధతులను గూర్చి, చెప్పారు. ధైర్యంగా ఎలా మాట్లాడాలో చెప్పారు. ఉపన్యాసం చెప్పడానికి ఎలా సంసిద్ధం కావాలో చెప్పారు. వక్తకు కావలసిన పాండిత్యం గురించి ఈ వ్యాసంలో చెప్పారు. వక్త ఎటువంటి శబ్దార్థాలను ప్రయోగించాలో చెప్పారు. వక్తకు కావలసిన జ్ఞాపకశక్తిని గూర్చి చెప్పారు. ఉపన్యాసం చెప్పే పద్ధతిని ఎలా అలవాటు చేసుకోవాలో దీనిలో చెప్పారు.

ఉపన్యాసం చెప్పేటప్పుడు తమ కంఠధ్వనిని ఎలా నియంత్రించుకోవాలో, రసానుగుణంగా ఎలా మాట్లాడాలో చెప్పారు. ఉపన్యాసంలో క్లుప్తతతో, స్పష్టత అవసరం అని చెప్పారు. వక్తృత్వం అనేది ఒక కళ అనీ, దాన్ని ఆరాధించాలనీ చెప్పారు. మొత్తంపై విద్యార్థులు ఈ వ్యాసం చదివితే, ఉపన్యాసకళపై మక్కువ పెంచుకొని, ఉపన్యాసం మాట్లాడే పద్ధతులు గ్రహించి వారు మహోపన్యాసకులు కాగలరు. గొప్ప రాజకీయ నాయకులు కాగలరు.

2. కింది ప్రశ్నకు పది వాక్యాలలో జవాబు రాయండి.

అ) ‘ఉపన్యాసం – ఒక గొప్పకళ’ దీన్ని వివరిస్తూ రాయండి.
జవాబు:
ఉపన్యాసం ఒక గొప్పకళ. మాట్లాడడం, మనిషికి మాత్రమే లభించిన వరం. మాటలను అందంగా ఒక పద్ధతి ప్రకారం అల్లుకొని మాట్లాడితే, అది ఉపన్యాసం అవుతుంది. వక్తృత్వ కళలో అందరూ నేర్పును సాధింపవచ్చు. మాట్లాడడం నేర్చుకొని, తమ భవిష్యత్తును బంగారు బాటపై నడిపించుకోవచ్చు.

వక్తృత్వం రాణించాలంటే తగిన పాండిత్యం ఉండాలి. చదువు ఎంత వస్తే, అతడి ఉపన్యాసం అంతగా రాణిస్తుంది. అతడి మాటల్లో గాంభీర్యం, సంస్కారం ఉంటుంది. భయాన్నీ, అనుమానాలను వదలి, ధైర్యంగా మాట్లాడుతూ ఉంటే వారు మంచి ఉపన్యాసకులు అవుతారు. భయాన్ని విడిచి, ధారాప్రవాహంగా మాట్లాడాలి. ఉపన్యాసం, శ్రోతలకు రసానందాన్ని పంచిపెడుతుంది.

TS 9th Class Telugu Guide 10th Lesson వాగ్భూషణం

కొన్ని ఉపన్యాసాలు మంచి పేరు పొందుతాయి. ధృతరాష్ట్రుడి సభలో కృష్ణుడి ఉపన్యాసం, విశ్వమతమహాసభలో వివేకానంద స్వామి ఉపన్యాసం పేరుకెక్కాయి. వక్త తాను చెప్పదలచిన విషయంపై తన్మయత్వంతో గంభీరంగా మాట్లాడాలి. వక్తకు పదజాలంతో చక్కని పరిచయం ఉండాలి.

వక్త చెప్పదలచుకున్న విషయానికి సంబంధించిన సామగ్రిని బాగా సేకరించాలి. దానికోసం ఎన్నో పుస్తకాలు చదివి, విషయాలు సేకరించాలి. మొదట పిల్లల వద్ద మాట్లాడాలి. ఒంటరి ప్రదేశాలలో మాట్లాడాలి. అలాచేస్తే సభాకంపం పోతుంది. విషయానికి తగ్గట్టుగా తన కంఠధ్వనిని పరిమితం చేసుకోవాలి.

శ్రోతల ముఖాలను చూస్తూ, మాట్లాడాలి. రసానికి అనుగుణంగా తన కంఠాన్ని సవరించి హెచ్చుతగ్గులు చేస్తూ మాట్లాడాలి. దీర్ఘపన్యాసాలు చేయరాదు. ఉపన్యాస కాలాన్ని అతిక్రమించరాదు. తర్కబద్ధమైన క్లుప్తమైన ఉపన్యాసం చాలా గొప్పది.

ప్రసంగాన్ని ప్రారంభించే ముందు, ముగించే ముందు, ఎంతో పదిలంగా మనోరంజకంగా, మాట్లాడాలి. ఇతరుల మనస్సులకు హాయి కల్గించేటట్లు, చీకటిలో దీపం వెల్గించినట్లు, అజ్ఞానం పారిపోయేటట్లు, మాట్లాడడం, బుద్ధిమంతుడి లక్షణం.

3. కింది అంశం గురించి సృజనాత్మకంగా/ప్రశంసాత్మకంగా రాయండి.

అ) ప్రపంచ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని మీరు మాట్లాడవలసిన అంశమయిన ‘మాటగొప్పదనం’ మీద ప్రసంగ వ్యాసం రాయండి.
జవాబు:
‘మాటగొప్పదనం’

మిత్రులారా! ఈ రోజు ప్రపంచభాషా దినోత్సవం. ఈ సందర్భంగా ‘మాటగొప్పదనం’ గురించి ముచ్చటిస్తాను.. భర్తృహరి వాగ్భూషణం భూషణం అన్నాడు. అంటే మనిషికి వాక్కే అలంకారం. దానిని బట్టి మాటకు ఉన్న శక్తిని మనం గుర్తించవచ్చు. ‘పలుకే బంగారం’ అని పెద్దలంటారు. మాట మనిషికి దేవుడిచ్చిన వరప్రసాదం. మనిషిని మిగతా జీవుల నుండి వేరు చేసి, గొప్పవాడిగా నిలబెట్టినది మాట మాత్రమే.

ఎప్పటికేది ప్రస్తుతమో, అప్పటికి ఆ మాటలాడగలవాడు ధన్యుడు. అతడే గొప్పకార్యసాధకుడవుతాడు. మంచివాక్కు, కల్పవృక్షం వంటిది. మనిషి స్థాయి, అతడి మాట వల్ల తెలుస్తుంది. మాధుర్యం గల మాటలు కార్యసాధకములు. మంచి మాటలు, స్నేహాన్ని పెంచుతాయి. ఆనందాన్ని ఇస్తాయి: బాధలో ఉపశమనాన్ని ఇస్తాయి. మాటలలో కాఠిన్యం పనికిరాదు. కోయిలలా మాట్లాడాలి. కాకిలా మాట్లాడరాదు.

మాటలతో కోటలు కట్టి, మనిషి మహారాజు కాగలడు. దేశప్రధాని కాగలడు. మాటలు పాటలు రాస్తాయి. మాటలు స్నేహానికి బాటలు వేస్తాయి. మాటల వల్లే కవిత్వ సంగీతాలు నిలిచాయి. మాటల వల్లే నవ్యత, నాగరికత, చైతన్యం వెలుగు చూశాయి. విశ్వాన్ని వాక్శక్తి నడిపిస్తుంది. తన బాట బలిమితోనే, మాట నేర్పుతోనే, మోదీ మనకు ప్రధానికాగలిగాడు.

TS 9th Class Telugu Guide 10th Lesson వాగ్భూషణం

భారతీయులు వాక్కును దేవతగా ఆరాధిస్తారు. వాక్కును పరిశుద్ధంగా ప్రయోగించడం పుణ్యం అన్నారు. మాట మనిషికి అలంకారం చక్కని భాషలేనివాడు అందమైన వేషం వేసుకొన్నా వ్యర్థమే. వాగ్ధార కత్తి అంచు కంటే పదునైనది. వాక్కు విశాలమైనది.

ఒక మంచిమాట లోకాన్ని జయిస్తుంది. వివేకానందుని చిన్న ఉపన్యాసం, ప్రపంచాన్ని జయించింది. భారతదేశం పట్ల ప్రపంచానికి గౌరవాదరాలను తెచ్చిపెట్టింది. మాట పదునైన ఆయుధం. దాన్ని సద్వినియోగం చేసుకోవలసిన బాధ్యత, మానవుడిపైనే ఉంది. ఒక తియ్యటి మాటతో, ప్రపంచం అంతా మనకు మిత్రరాజ్యం అవుతుంది. మాటకు కల గొప్పదనం చెప్పడం అసాధ్యం.

III. భాషాంశాలు

పదజాలం

అ) కింది వాక్యాల్లో గీత గీసిన మాటల అర్థాన్ని గ్రహించి పదాలను సొంతవాక్యాలలో ప్రయోగించండి.

ప్రశ్న 1.
భారతక్రికెట్ జట్టు విజయాలు అప్రతిహతంగా సాగుతున్నాయి.
జవాబు:
అప్రతిహతంగా = (అడ్డులేకుండా) (నిరాటంకంగా)
వాక్యప్రయోగం : రోదసీ విజ్ఞాన ప్రయోగాల్లో మనదేశం అప్రతిహతమైన విజయాలు సాధిస్తోంది.

ప్రశ్న 2.
అమేయమైన ప్రతిభావంతుడు అబ్దుల్ కలాం.
జవాబు:
అమేయమైన = లెక్కింపవీలుకాని
వాక్యప్రయోగం : మనకు రాష్ట్రపతిగా పనిచేసిన రాధాకృష్ణ పండితుడు, అమేయమైన బుద్ధిశాలి.

ప్రశ్న 3.
జ్ఞాని ఉదాసీనత దేశానికి నష్టం.
జవాబు:
ఉదాసీనత = ఉపేక్షాభావం
వాక్యప్రయోగం : మేధావుల ఉదాసీనత వల్లనే దేశం నేడు నష్టపోతుంది.

TS 9th Class Telugu Guide 10th Lesson వాగ్భూషణం

ప్రశ్న 4.
ఆచరణ అన్నింటి కన్న గొప్పది.
జవాబు:
ఆచరణ = ఆచరించడం
వాక్యప్రయోగం : ఆచరణ లేని ప్రబోధాలు, చిలుకపలుకులవలె వట్టిదండుగ.

ఆ) కింది పర్యాయపదాలను పదవిజ్ఞానం ఆధారంగా జతపర్చండి.

అ) కృపాణం  –  మది, హృదయం, ఎద
ఆ) వాక్కు  –  చప్పుడు, శబ్దం
ఇ) స్నేహం  –  కత్తి, ఖడ్గము, అసి
ఈ) మనసు  –  మాట, పలుకు, నుడుగు
ఉ) విశ్వాసం  –  చెలిమి, మైత్రి, నెయ్యము
ఊ) ధ్వని  –  నమ్మకం, నమ్మిక
జవాబు:
జతపరచడం  –  పర్యాయపదాలు
అ) కృపాణం  –  కత్తి, ఖడ్గం,అసి
ఆ) వాక్కు  –  మాట, పలుకు, నుడుగు
ఇ) స్నేహం  –  చెలిమి, మైత్రి, నెయ్యము
ఈ) మనసు  –  మది, హృదయం, ఎద
ఉ) విశ్వాసం  –  నమ్మకం, నమ్మిక
ఊ) ధ్వని  –  చప్పుడు, శబ్దం

ఇ) ‘వాగ్మి, ధ్వని’ అనే పదాలకు కింది వాక్యాలలో నానార్థాలున్నాయి. వాటిని గుర్తించండి.

అ) యుక్తియుక్తంగా మాట్లాడే ఉపన్యాసకుడు ఉదాత్త విషయాలే కానీ చిలుక పలుకులు వల్లించడు.
జవాబు:
వాగ్మి (నానార్థాలు) :

  1. యుక్తియుక్తంగా మాట్లాడేవాడు
  2. చిలుక

TS 9th Class Telugu Guide 10th Lesson వాగ్భూషణం

ఆ) ఆయన మాటల్లోని వ్యంగ్యార్థాన్ని గ్రహించి అభినందన పూర్వకంగా బల్లలు చరుస్తూ శబ్దం చేశారు.
జవాబు:
ధ్వని (నానార్థములు) :

  1. వ్యంగ్యార్థము
  2. శబ్దం

ఈ)  కింది పట్టిక నుండి ప్రకృతి – వికృతులు గుర్తించి రాయండి.

TS 9th Class Telugu Guide 10th Lesson వాగ్భూషణం 2
జవాబు:
ప్రకృతి – వికృతి
1) స్నేహం – నెయ్యం
2) హృదయం – ఎడద
3) భాష – బాస
4) ప్రాణం – పానం
5) శక్తి – సత్తి
6) దీపం – దివ్వె
7) శాస్త్రం – చట్టం
8) శబ్దం – సద్దు

TS 9th Class Telugu Guide 10th Lesson వాగ్భూషణం

వ్యాకరణాంశాలు

1. కింది పదాలను విడదీసి, సంధి పేర్లు రాయండి.

అ) కళోపాసనం = ………………………….
జవాబు:
కళా + ఉపాసనం – గుణసంధి

ఆ) అభ్యుదయం = …………………………..
జవాబు:
అభి + ఉదయం – యణాదేశ సంధి

ఇ) తనకెంతో = ……………………….
జవాబు:
తనకున్ + ఎంతో – ఉత్వసంధి(ఉకార వికల్పసంధి)

ఈ) ఉన్నతమైన = …………………………
జవాబు:
ఉన్నతము + ఐన – ఉత్వసంధి

TS 9th Class Telugu Guide 10th Lesson వాగ్భూషణం

ఉ) రసానందం = …………………..,,,,,,,
జవాబు:
రస + ఆనందం – సవర్ణదీర్ఘ సంధి

2. కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేర్లు రాయండి.

అ) శక్తిసామర్థ్యాలు = ……………………
జవాబు:
శక్తియు, సామర్ధ్యమును – ద్వంద్వ సమాసం

ఆ) పఠనశక్తి = ………………………
జవాబు:
పఠనమునందు శక్తి – సప్తమీ తత్పురుష సమాసం

ఇ) అభ్యుదయపథం = ……………………..
జవాబు:
అభ్యుదయమైన పథం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

TS 9th Class Telugu Guide 10th Lesson వాగ్భూషణం

ఈ) ఆత్మశక్తి = ………………………..
జవాబు:
ఆత్మ యొక్క శక్తి – షష్ఠీ తత్పురుష సమాసం

ఉ) అద్భుతశక్తి = ……………………..
జవాబు:
అద్భుతమైన శక్తి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

ప్రాజెక్టు పని

ప్రశ్న 1.
‘వాక్కు’ గొప్పదనాన్ని తెలిపే ఐదు పద్యాలు సేకరించి, భావాలు రాయండి. నివేదికను రాసి ప్రదర్శించండి.
జవాబు:
1) నిండునదులు పారునిలిచి గంభీరమై
వెట్టివాగుపారు వేగఁబొర్లి
అల్పుడాడురీతి నధికుండు నాడునా
విశ్వదాభిరామ ! వినురవేమ !

భావం :
గొప్ప నదులు నిదానంగా, గంభీరంగా ప్రవహిస్తాయి. కాని, చిన్నవాగు గట్లుదాటి పొర్లి ప్రవహిస్తుంది. అలాగే యోగ్యుడు నిదానంగా, గంభీరంగా మాట్లాడుతాడు. నీచుడు బడబడ వాగుతాడు.

2) అల్పుడెపుడు పల్కు నాడంబరము గాను
సజ్జనుండు పల్కు చల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ ! వినురవేమ !

భావం :
తక్కువ బుద్ధిగలవాడు, ఎప్పుడునూ గొప్పలు చెపుతాడు. మంచి బుద్ధిగలవాడు తగినంత మాత్రమే మాట్లాడుతాడు. కంచుమ్రోగేటట్లు బంగారం మ్రోగదు కదా !

TS 9th Class Telugu Guide 10th Lesson వాగ్భూషణం

3) మాటలాడ నేర్చి మనసురంజిలఁజేసి
పరగఁ బ్రియము చెప్పి బడలకున్న
నొకరి చేతి సొమ్ము లూరక వచ్చునా
విశ్వదాభిరామ ! వినురవేమ !

భావం :
ఒకరి సొత్తు ఇంకొకరికి చెందాలంటే, కష్టపడి పనిచేసి, అవతలి వారి మనస్సుకు ఆనందం కలిగేటట్లు మాట్లాడడం నేర్చుకోవాలి.

(లేదా)

ప్రశ్న 2.
ఉపన్యాసం ఇవ్వడం కోసం మీకు నచ్చిన ఒక అంశాన్ని ఎన్నుకొని దానికి సంబంధించిన వివరాలు తెలుసుకొని రాయండి. నివేదిక రాసి ప్రదర్శించండి.
జవాబు:
విద్యార్థి కృత్యం

కఠిన పదాలకు – అర్థాలు

I.

వక్తృత్వం = ధారాళంగా మాట్లాడడం, (ఉపన్యాసం)
అలవడు = అబ్బు; (నేర్చుకోడం సాధ్యమగు)
అంతర్లీనంగా = కలిసిపోయినదిగా ; (లోపల ఉండేదిగా)
ఉద్దీప్తం = ప్రకాశింపబడినది;
వక్త = మాటలాడే ఉపన్యాసకుడు;
నిక్షిప్తము = ఉంచబడినవి
నిద్రాణము = నిద్రించునవి;
ఉత్తేజపరచడం = ప్రేరణ చేయడం; (వెలుగులోకి తేవడం)
మేల్కొల్పడం = లేపడం;
బయల్వెడలి = బయటకు వచ్చి;
ప్రదర్శిస్తాయి = చూపిస్తాయి;
ఆసరా = ఆధారము;
అపోహ = భ్రాంతి
దురూహ = చెడ్డ ఊహ

TS 9th Class Telugu Guide 10th Lesson వాగ్భూషణం

కలవరపెడుతున్న = కలతపెడుతున్న
పరిష్కారం చూపడం = చక్కపెట్టడం (దారిచూపడం)
భాషణం = మాట్లాడడం;
వాక్ శక్తి = మాట యొక్క శక్తి
నిర్వహించే = నెరవేర్చే
అమేయమైనది = లెక్కింపరానిది; (సాటిలేనిది)
పఠనాశక్తి = చదివే శక్తి
పరభాగ్యోప జీవి = ఇతరులభాగ్యంపై ఆధారపడి జీవించేవాడు
దాస్యానికి = బానిసత్వానికి
తలఒగ్గుతాడు = సిద్ధపడతాడు;
బాహిరంగా = బహిరంగంగా
అభ్యుదయపథం = అభ్యుదయ మార్గం
సమంజసమైన = తగినదైన
వరిస్తున్న = లభిస్తున్న
వైయక్తిక ప్రయోజనాలు = వ్యక్తిగతమైన ప్రయోజనాలు;
తోడ్పడుతుంది = సాయపడుతుంది;
వరప్రసాదం = భగవంతుడి అనుగ్రహము
సృష్టికర్త = బ్రహ్మ
సృష్టించుకొన్నాడు = పుట్టించుకొన్నాడు
క్షుప్తంగా = సంక్షిప్తంగా
అర్ధవంతంగా = సార్థకంగా
వినసొంపు = వినడానికి అందము
సాక్షాత్కారం = ప్రత్యక్షం
అనంతం (న + అంతం) = అంతులేనిది
అప్రతిహతం (న + ప్రతిహతం) = అడ్డగించలేనిది (ఎదురులేనిది)

TS 9th Class Telugu Guide 10th Lesson వాగ్భూషణం

ఊపిరి పోస్తుంది = ప్రాణం పోస్తుంది
జాగరితం చేస్తుంది = మేల్కొల్పుతుంది;
ధర్మాభిరతిని (ధర్మ + అభిరతిని) = ధర్మము నందు ఆసక్తిని
ద్వేషానలాన్ని (ద్వేష + అనలాన్నీ) = ద్వేషాగ్నిని;
కల్ప తరువు = కల్ప వృక్షము
జీవిత సాఫల్యం = బ్రతుకు సఫలత్వం
ప్రసంగం = ఉపన్యాసం
ఆత్మవిశ్వాసం = తనయందు తనకు నమ్మకం;
దీనుడై = జాలిగొలుపువాడై
రూపుదిద్దుకుంటుంది = ఆకారం ధరిస్తుంది
గణకులు = లెక్కలు తేల్చేవారు
న్యాయవాదులు (Advocates) = వకీళ్ళు
ప్రచురణకర్తలు (Publishers) = పుస్తకాలు అచ్చువేయించేవారు
నిరంతర ప్రయత్నం = ఎల్లప్పుడూ చేసే ప్రయత్నం
కౌశలాన్ని = నేర్పును

II.

అలవరచుకొనే = అలవాటు చేసుకొనే
విద్వాంసులు = పండితులు;
నిరక్షరాస్యులు = అక్షరాలు నేర్వనివారు;
గ్రామీణులు = గ్రామ ప్రజలు
ఆరితేరినవాళ్ళు = సమర్ధులు;
శ్రోతలను = వినేవారిని;
ఆకట్టుకుంటారు = ఆకర్షిస్తారు;
అంతుండదు (అంతు + ఉండదు) = ముగింపు ఉండదు
ఉదాసీనంగా = ఉపేక్షగా; (పట్టించుకోకుండా ఉండడం)
దిగ్భ్రాంతిని = దిక్కుతోచకపోవడాన్ని
వాస్తవమే = సత్యమే
విద్వత్తు = పాండిత్యం
రాణించదు = శోభించదు

TS 9th Class Telugu Guide 10th Lesson వాగ్భూషణం

సముదాత్త భావప్రసరణ = గొప్ప భావాల వెల్లడి;
దృక్పథాన్ని = దృష్టిని
సంస్కారం = సంస్కృతి (నాగరికత)
ఇతిహాసం = చరిత్ర
సజీవంగా = ప్రాణవంతంగా
ప్రభావోపేతంగా (ప్రభావ + ఉపేతం) = ప్రభావంతో కూడినదిగా
అబ్బిన = అలవాటైన
ఉడిగిపోయి = నశించి
మరుపుతట్టుతుంది = మరుపు వస్తుంది
దోషాలు = తప్పులు
మౌనం = మాట్లాడకుండా ఉండడం
నక్కి = దాగి
వ్యక్తిత్వాన్ని = స్వభావాన్ని
వచ్శశైలి = మాటలశైలి (మాట్లాడేతీరు)
దృక్పథాన్ని = దృష్టి మార్గాన్ని
సరళమైన = తేలికయైన
సందేహం = అనుమానము
నవ్వులాట = నవ్వుతో ఆడుకొనే ఆట (తేలికయైనది)
మనశ్చైతన్య లక్షణం = మనోజ్ఞానానికి చెందిన లక్షణం
అజ్ఞాతం = తెలియబడనిది;
చొరబడుతుంది = ప్రవేశిస్తుంది;
సంకుచిత మనస్తత్వాన్ని = కుదింపబడిన మనస్తత్వాన్ని
ఆత్మవంచన = తనను తాను మోసగించుకోడం
క్షుత్వాన్ని = నీచత్వాన్ని
బిడియపడకుండా = సిగ్గుపడకుండా
జడుసుకోకుండా = భయపడకుండా
ధారాప్రవాహంగా = ప్రవాహంలా ఏకధారగా
చింత = విచారము

TS 9th Class Telugu Guide 10th Lesson వాగ్భూషణం

నిర్భయుడు = భయంలేనివాడు;
అజేయుడు = జయింపశక్యంకానివాడు;
మనః ప్రవృత్తులను = మనస్సు యొక్క నడవడులను;
సహృదయం = మంచి మనస్సు;
ఆర్ద్రతను = మెత్తదనాన్ని
కట్టలు తెంచుకొని పారుతుంది = గట్లు తెంచుకొని ప్రవహిస్తుంది.
ఆవేశం పొంగు లెత్తుతుంది = ఆవేశం ఉరకలు వేస్తుంది
ప్రజ్వలిస్తాయి = బాగా మండుతాయి;
కన్నీటి మున్నీటిలో = కన్నీటి సముద్రంలో
తలమున్కలౌతారు = తలలోతు మునుగుతారు
కార్యోన్ముఖులవుతారు (కార్య + ఉన్ముఖులు + అవుతారు) = పని చేయడానికి సిద్ధం అవుతారు
నవరసభరితాంత రంగులౌతారు = తొమ్మిది రసాలతో నిండిన మనస్సులు కలవారవుతారు

III.

వాగి = యుక్తియుక్తంగా మాట్లాడేవాడు
ఐతిహాసిక ఘట్టం = చారిత్రక సంఘటన
ముమ్మరంగా = ఎక్కువగా
ధీరోదాత్తులు = సర్వసద్గుణులయిన నాయకులు; (ఉత్తమ నాయకులు)
కోవ = తరహా
మహోత్సాహం (మహా + ఉత్సాహం) = గొప్ప ఉత్సాహము
ఉత్తేజకరమైన = గొప్ప ఉత్సాహాన్ని కల్గించే
మనస్వి = బుద్ధిమంతుడు (ప్రశస్తమైన మనస్సు గలవాడు;)
అంగసంచాలనం = అవయవముల కదలిక
వైయక్తికం = వ్యక్తిగతం (ఆయా వ్యక్తులకు సంబంధించినది;)
హృదయోద్భూత భావ ప్రకటనం (హృదయ + ఉద్భూత, భావప్రకటనం) = మనస్సులో పుట్టిన భావాల వెల్లడి;
అంగాంగ విన్యాసం = అవయవముల కదలిక
ప్రసంగించాలి = మాట్లాడాలి.
పునశ్చరణ = తిరిగి చెప్పడం;

TS 9th Class Telugu Guide 10th Lesson వాగ్భూషణం

వివేకం = తెలివి
అభివర్ణించి = బాగా వర్ణించి చెప్పి
మెలకువ = జాగ్రత్త
నిగ్రహించుకుంటూ = అణచుకుంటూ
సంస్కారాన్ని = నాగరికతను (సంస్కృతిని)
వక్తవ్యాంశం (వక్తవ్య + అంశం) = మాట్లాడే విషయం
కేంద్రీకరించండి = దృష్టిపెట్టండి
తన్మయత్వం = దానితో ఐక్యం కావడం
శ్రద్ధాసక్తులు (శ్రద్ధా + ఆసక్తులు) = శ్రద్ధయు, ఆసక్తి;
పదజాలం = పదముల సమూహం
శబ్దార్థములు = శబ్దము యొక్క అర్ధములు, వాచ్యము, లక్ష్యము, వ్యంగ్యము అని మూడు విధములు;

1) వాచ్యము (వాచ్యార్థము) = సంకేతితమైన అర్ధాన్ని స్ఫురింపచేసే . శబ్దవ్యాపారము
‘ఉదా : ‘రత్నగర్భ’ అనగా లోపల రత్నాలు కలది (భూమి)

2) లాక్షణికార్థము వాక్యానికి వాచ్యమైన అర్థము సరిపడకపోవడం వల్ల, దానికి సంబంధించిన విషయంలో ఆరోపించబడే శబ్దవ్యాపారము.
ఉదా : “గంగలో గొల్లపల్లె ఉన్నది” – ఇక్కడ గంగలో గొల్లపల్లె ఉండదు. కాబట్టి గంగా తీరములో గొల్లపల్లె అనే అర్థాన్ని చెపుతుంది. దీనిని లాక్షణికార్ధము అంటారు.

3) వ్యంగ్యార్థము = వాక్యార్థానికి అందాన్ని పుట్టించే మరియొక అర్థాన్ని స్ఫురింపజేసే శబ్దవ్యాపారము.
ఉదా : పూజారీ! పువ్వులు కోసుకోడానికి భయపడకుండా వెళ్ళు. నిన్ను భయపెట్టే జంతువును, సింహం తినివేసింది.
గమనిక : ఇక్కడ వెళ్ళు అని వాచ్యార్థం. కాని అక్కడ సింహం ఉంది వెళ్ళకు అనే వ్యంగ్యార్థము ఈ వాక్యంలో ఉంది.

చమత్కారస్ఫోరకంగా = చమత్కారం వెల్లడి అయ్యేటట్లుగా
మలచి = రూపుదిద్ది (చెక్కి)
పర్యాయవాచకాలు = పర్యాయపదాలు (ఒకే అర్థం కల పదాలు)
యథోచితంగా (యథా + ఉచితంగా) = తగినట్లుగా
నిర్దుష్టమైన = తప్పులులేని
సుపరిష్కృతమైన = చక్కగా పరిష్కరింపబడిన (బాగా తప్పులు లేకుండా దిద్దిన)
బహుధా = అనేక విధాలుగా
ప్రశంసాపాత్రము = పొగడ్తకు తగినది;
అధ్యయన సామాగ్రి = చదువవలసిన విషయాలు;
సంప్రదించి = మాట్లాడి
పరిజ్ఞానాన్ని = నిండు తెలివిని
జీర్ణమవుతుందో = బాగా మనస్సులో కుదురుకుంటుందో

TS 9th Class Telugu Guide 10th Lesson వాగ్భూషణం

నిస్సంకోచంగా = మోమాటం లేకుండా
తడబాటు = ఆలస్యము;
న్యూనతాభావం = తాను తక్కువ వాడననే భావం
అనుక్షణం = ప్రతిక్షణము
ఇతరాంశాలు (ఇతర + అంశాలు) = ఇతర విషయాలు
వాగ్ధార(వాక్ + ధార) = మాటల ప్రవాహం
అధ్యయనం = చదవడం
విజ్ఞాన భాండాగారాన్ని = గ్రంథాలయాన్ని
భద్రపరచుకోండి = జాగ్రత్త చెయ్యండి
సజ్జన సాంగత్యం = సత్పురుషుల స్నేహం
సంప్రదాయాభిజ్ఞులు (సంప్రదాయ + అభిజ్ఞులు) = సంప్రదాయం తెలిసినవారు;
సాఫల్యానికి = నెరవేరడానికి; (ఫలవంతం కావడానికి)
అనువైన = తగిన

IV.

మనశీలత = యోచించే స్వభావం
విలక్షణతను = విశేషమైన తత్త్వాన్ని
దృక్పథం = దృష్టిమార్గం
తడబాటు = అడ్డము;
ఉబికి వస్తుంది = బయటికి వెల్లడి అవుతుంది;
మౌఖికంగా = నోటితో గట్టిగా
వచోవైఖరి = మాట్లాడేతీరు,
వ్యాఖ్యానించడం = వివరించడం
అంశం = విషయం
స్మరణశక్తి = జ్ఞాపకశక్తి
ఏకాంతంగా = ఒంటరిగా
సభాకంపనం = సభలో మాట్లాడేటప్పుడు కలిగే వణకు;
ఆటంకం = అడ్డు
జిజ్ఞాస = తెలిసికోవాలనే కోరిక
శిలామూర్తులు = రాతి స్వరూపాలు
ఊనిక = ఊతము
మందంగా = నెమ్మదిగా
భావానుగుణమైన (భావ + అనుగుణమైన) = భావానికి తగ్గట్టుగా
మృదులంగా = మెత్తగా (నెమ్మదిగా)

TS 9th Class Telugu Guide 10th Lesson వాగ్భూషణం

నిదానంగా = తొందరపడకుండా
అవగాహన = స్పష్టంగా అర్థమవడం;
రౌద్రరస భావాలను = వీరరసభావాలను
గొణుగుతున్నారో = మాటవినీ, వినబడకుండా మాట్లాడుతున్నారో;
క్లేశాన్ని = కష్టాన్ని
సమన్వయం = సరియైన క్రమము;
చీకాకును = చిరాకును;
వడివడిగా = వేగంగా
ఉత్సుకత = ఇష్టసిద్ధికై తహతహ ;
సమయాతిక్రమణం (సమయ + అతిక్రమణం) = కాలాన్ని అతిక్రమించడం
అపోహలు = భ్రాంతులు
దీర్ఘపన్యాసాలు = ఎక్కువసేపు ఉపన్యాసాలు;
నిగ్రహించుకోవడం = అణచుకోవడం;
శ్లథనం = సత్తువలేనిది;
సువ్యవస్థితము = బాగా ఏర్పరుపబడినది
కడవెడు = కుండెడు
ఖరము = గాడిద

V.

అభిలషితార్థాన్ని = కోరిన అర్థాన్ని
నిగ్రహం = అణచుకోవడం;
అనల్పార్థ రచన (అనల్ప + అర్థ రచన) = గొప్ప అర్థాన్ని ఇచ్చే రచన
వివేకంబు = తెలివి
సూక్తి (సు + ఉక్తి) = మంచిమాట
వర్తిస్తుందనుకోవడం = సరిపోతుందనుకోడం
మనీషి = విద్యావంతుడు
Brievity = సంక్షిప్తత
Soul = ఆత్మ
Wit = చమత్కారము, సారస్యము
ఆంగ్లాభాణకం (ఆంగ్ల + ఆభాణకం) = ఇంగ్లీషు లోకోక్తి (సామెత)

TS 9th Class Telugu Guide 10th Lesson వాగ్భూషణం

Brievity is the = సంక్షిప్తతయే, చమత్కార
soul of wit = సంభాషలోని ఆత్మ
యోజించుకోవాలె = ఆలోచించుకోవాలి;
వక్తృత్వ కౌశలాన్ని = మాట్లాడడంలో నేర్పును
బహిర్గతం = బయటకురావడం
అమూల్యమైనది = విలువ కట్టలేనిది
పదిలంగా = భద్రంగా
హృదయంగమంగా = మనోరంజకంగా
హృదయం = మనస్సు (గుండె)
సదభిప్రాయం (సత్ + అభిప్రాయం) = మంచి అభిప్రాయం
ప్రసంగాంతం (ప్రసంగ + అంతం) = సంభాషణ పూర్తి
యత్నం = ప్రయత్నం
స్ఫుటమైన = స్పష్టమైన
వాణిగా = వాక్కు, సరస్వతి
ఉడిగిపోని = తరిగిపోని
కృపాణధార = కత్తి అంచు
వక్తృత్వ కళారాధనం = ఉపన్యాస కళను ఆరాధించడం;
అక్షరాస్యులకు = చదువుకున్నవారికి
నిద్రాణమైన = నిద్రించిన
జాగృతం కావాలి = మేల్కోవాలి
మనోజ్ఞంగా = సౌందర్యంగా
సంభాషించడం = మాట్లాడడం
దివ్వె = దీపము
బర్బరత్వం = తెలివిలేనితనము;

TS 9th Class Telugu Guide 10th Lesson వాగ్భూషణం

పాఠం ఉద్దేశం

‘ఉపన్యసించడం’ గొప్పకళ. మంచి వక్త కావాలంటే ఎట్లాంటి సూచనలు పాటించాలి ? ఉపన్యాసం కోసం ఎట్లా తయారు కావాలి ? ఎట్లా మాట్లాడాలో తెలియజేస్తూ విద్యార్థులను మంచి వక్తలుగా తయారు చేయాలన్నదే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం, ‘వ్యాసము’ అనే ప్రక్రియకు చెందినది. ఈ వ్యాసం, డా॥ ఇరివెంటి కృష్ణమూర్తి రాసిన “వాగ్భూషణం భూషణం” అనే పుస్తకంలోనిది.

రచయిత పరిచయం

TS 9th Class Telugu Guide 10th Lesson వాగ్భూషణం 1
పాఠం పేరు : “వాగ్భూషణం”

రచయిత : డా॥ ఇరివెంటి కృష్ణమూర్తి

దేని నుండి గ్రహింపబడినది : రచయిత వ్రాసిన “వాగ్భూషణం భూషణం” అనే పుస్తకంలో నుండి గ్రహింపబడింది.

జననం : 12-07-1930

మరణం : 26-04-1989

జన్మస్థలము : రచయిత మహబూబ్నగర్ జిల్లాలో జన్మించారు.

పాండిత్యం : రచయితకు సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, హిందీ భాషల్లో గొప్ప ప్రావీణ్యం ఉంది.

చేపట్టిన పదవులు : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యులుగా పనిచేశారు. ‘యువభారతి’ సాహిత్య సాంస్కృతిక సంస్థకు అధ్యక్షులుగా, ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సంస్థల కార్యదర్శిగా, తెలంగాణ రచయితల సంఘ కార్యదర్శిగా పనిచేశారు.

TS 9th Class Telugu Guide 10th Lesson వాగ్భూషణం

రచనలు :

  1. తెలుగు – ఉత్తర భారత సాహిత్యాలు
  2. చాటువులు
  3. వాగ్భూషణం
  4. వేగుచుక్కలు
  5. వెలుగుబాటలు
  6. అడుగు జాడలు
  7. వెలుగు చూపే తెలుగు పద్యాలు
  8. దేశమును ప్రేమించుమన్నా మొదలైనవి ఈయన రచనలు.

సిద్ధాంత గ్రంథము : ‘కవి సమయములు’

ఇతర రచనలు : ఎన్నో కథానికలను, వచన కవితలను, ‘పఠనీయం’ శీర్షికతో 39 ఉత్తమ గ్రంథాల పరిచయాలను రాశారు.

TS 9th Class Telugu Guide 10th Lesson వాగ్భూషణం

రాష్ట్ర విమోచనోద్యమంలో భాగస్వామ్యం : ఈయన మహబూబ్నగర్లోని శ్రీ సీతారామాంజనేయ గ్రంథాలయం ద్వారా, హైదరాబాదు రాష్ట్ర విమోచనోద్యమంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించారు.

ప్రవేశిక

మాట్లాడడం మనిషికి మాత్రమే లభించిన మంచి వరం. మాటలను అందంగా, పొందికగా, ఒక పద్ధతి ప్రకారం, అనుకున్న అంశం మీద అల్లుకుని మాట్లాడితే, అది “ఉపన్యాసం” అవుతుంది. ఉపన్యాసం ఒక కళ. మాట్లాడే నైపుణ్యం, ఉపన్యాస కళను పెంపొందిస్తుంది. ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుంది. మాట్లాడే కళపై ఎట్లా పట్టు సాధించాలనే ప్రశ్నకు సమాధానమే, ఈ వ్యాసం.

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

Telangana SCERT 9th Class Telugu Guide Telangana 5th Lesson శతక మధురిమ Textbook Questions and Answers.

TS 9th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక మధురిమ

చదువండి – ఆలోచించి చెప్పండి (Textbook Page No. 45)

బలవంతుఁడ నాకేమని
పలువురతో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము
చలిచీమల చేతఁజిక్కి చావదె సుమతీ!

ప్రశ్నలు

ప్రశ్న 1.
బలవంతుడననే అహంకారం ఎందుకు ఉండకూడదు ?
జవాబు:
బలవంతుడను అనే అహంకారంతో పదిమందితోనూ తగవు పెంచుకుంటే, ఆ పదిమంది కలసి, ఆ బలవంతుణ్ణి చావగొడతారు. అందువల్ల బలవంతుడననే అహంకారం ఉండరాదు.

ప్రశ్న 2.
చలిచీమల నుంచి మీరేమి తెలుసుకున్నారు ?
జవాబు:
చలిచీమలు సహజంగా బలములేనివి. కాని ఆ చలిచీమలు అన్నీ కలిసి, బలవంతమైన సర్పాన్ని చంపుతాయి. దానిని బట్టి సంఘీభావంతో బలహీనులు కూడా, ఎంతటి ఘనకార్యాన్ని అయినా చేయగలరని చలిచీమల నుండి నేను నేర్చుకున్నాను.

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

ప్రశ్న 3.
పై పద్యం ద్వారా తెలిసే నీతి ఏమిటి?
జవాబు:

  1. బలవంతుడనే గర్వంతో, పెక్కుమందితో విరోధం కూడదు.
  2. బలహీనులు కూడా కలసిమెలసి ఉంటే, ఎంతటి ఘనకార్యాన్ని అయినా చేయగలరు. అనే నీతులు ఈ పద్యం ద్వారా గ్రహించాలి.

ప్రశ్న 4.
ఇట్లాంటి నీతులు ఉండే పద్యాలు సాధారణంగా ఏ ప్రక్రియలో కనబడుతాయి ?
జవాబు:
ఇట్లాంటి నీతులు ఉండే పద్యాలు సాధారణంగా శతక ప్రక్రియలో కనబడతాయి.

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 48)

ప్రశ్న 1.
“భక్తుడు పద్ధతి తప్పడు” అని కవి అన్నాడు కదా! పద్ధతి తప్పడమంటే, మీరేమనుకుంటున్నారు ?
జవాబు:
భక్తుడు పద్ధతి తప్పడు అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, భక్తుడు భగవంతుణ్ణి విశ్వసించి భగవంతుణ్ణి త్రికరణశుద్ధిగా ఆరాధిస్తాడనీ, తాను చేసే దైవ పూజా పద్ధతిని విడిచి, మరోదారి త్రొక్కడనీ ఎల్లవేళలా భక్తుడు భగవంతుడినే నమ్మి కొలుస్తాడనీ దీని భావము.

ప్రశ్న 2.
కీర్తి ఎలా కలుగుతుంది?
జవాబు:
కీర్తి అంటే మంచిపేరు. లోకానికి ఉపకారం జరిగే మంచి పనులు చేస్తే, కీర్తి కలుగుతుంది. మిగిలిన వారికంటె తాను కష్టపడి మంచి విజయాలు సాధిస్తే, అతడికి మంచి కీర్తి కలుగుతుంది. రాజులు వంటివారు మంచిగా ప్రజలను పాలిస్తే, వారికి కీర్తి కలుగుతుంది. కవులూ, పండితులూ వంటివారు మంచి గ్రంథ రచనలు చేస్తే వారికి కీర్తి కలుగుతుంది.

ప్రశ్న 3.
మనిషి చేయకూడని పనులేమిటి?
జవాబు:
ఇతరుల సొమ్మును ఆశించి, జోస్యాలు చెప్పరాదు. అబద్ధాలు చెప్పరాదు. అన్యాయంగా కీర్తిని పొందరాదు. కొండెములు చెప్పరాదు. హింస చేయరాదు. లేనిపోని వ్యాఖ్యానాలు చేయరాదు.

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 49)

ప్రశ్న 1.
“పరోపకారం శరీరానికి ఆభరణం” అని కవి ఏ ఉద్దేశంతో అన్నాడు ?
జవాబు:
పరోపకారం చేయడం కోసమే దేవుడు మనకు శరీరాన్ని ఇచ్చాడు. అందువల్ల మన శక్తి కొద్దీ, మనం ఇతరులకు సాయపడాలి. మన శరీరానికి అందం కోసం, సుగంధద్రవ్యాలు రాసుకుంటూ ఉంటాము. నిజానికి అవి శరీరానికి అందాన్ని ఇవ్వవనీ, పరులకు గొప్పగా ఉపకారం చేయడమే, మనిషికి నిజమైన అలంకారమనీ కవి తన అభిప్రాయం వెలిబుచ్చాడు.

ప్రశ్న 2.
రాజు ఏ విధంగా ప్రవర్తిస్తే, పనులు నెరవేరుతాయి ?
జవాబు:
రాజు తనకు తానుగా తన బుద్ధితో చక్కగా ఆలోచించి కార్య నిర్ణయం చేయాలి. అతనికి స్వయంగా మంచి బుద్ధి పుట్టాలి. అప్పుడే ఆయన పనులు నెరవేరతాయి.

ప్రశ్న 3.
దుర్యోధనుడు ఎట్లాంటివాడు ?
జవాబు:
దుర్యోధనుడికి తనకు తానుగా బుద్ధిలో ఆలోచన పుట్టదు. అతడు తన మిత్రులు సలహా ప్రకారమే నడచుకొనేవాడు. దుష్ట చతుష్టయము” అని పిలువబడే ఆ మిత్రుల సలహా సంప్రదింపుల ప్రకారమే, దుర్యోధనుడు నడచుకొనేవాడు.

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 50)

ప్రశ్న 1.
సజ్జనాప్తి వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి?
జవాబు:
సజ్జనాప్తి వల్ల పేదవాడికి ధనతృష్ణ నశిస్తుంది.

ప్రశ్న 2.
ధనమువల్ల కలిగే దోషాలు ఏవి ?
జవాబు:
ధనము ఉంటే ధనం మీద అభిమానము, ఇంకా ధనం సంపాదించాలనే దురాశ పెరుగుతాయి. ధనము వల్ల మదము, అహంకారము పెరుగుతాయి. ధనతృష్ణ పెరిగితే, ధన సంపాదన కోసం తప్పుడు మార్గాలను మానవుడు అనుసరిస్తాడు. అవినీతికి పాల్పడుతాడు. సజ్జనులకు కష్టాలు కల్గిస్తాడు.

ప్రశ్న 3.
మనుషులు విషంతో నిండి ఉన్నారని అనడంలో కవి ఉద్దేశం ఏమిటి ?
జవాబు:
మనుషులు కామక్రోధలో భమదమోహమాత్సర్యములతో నిండి యున్నారని చెప్పడానికే, కవి మనుషులు విషంతో నిండియున్నారని చెప్పాడు. మనుషులలో స్వార్థం, అవినీతి, దుర్మార్గం, మోసం పెరిగిపోయాయని చెప్పడానికే, కవి మనుషులు విషంతో నిండియున్నారని చెప్పాడు.

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 51)

ప్రశ్న 1.
ఇంట్లో బాధలు కలగడానికి గల కారణాలు ఏమై ఉంటాయి?
జవాబు:
సహజంగా ఇళ్ళల్లో అత్తాకోడళ్ళ విషయంలో కొన్ని బాధలు వస్తూ ఉంటాయి.

  1. వచ్చిన కోడలిని అత్తగారు తన కుమారుని భార్యగా ఆదరించకుండా, వేరింటి పిల్లగా చూడడం మొదటి కారణం.
  2. వచ్చిన కోడలు అత్తగారిని తన తల్లిగా చూడడం మాని, ఏదో రాక్షసిని చూసినట్లు చూడడం రెండో కారణం.
  3. కోడలు కట్న కానుకలను ఎక్కువగా తేలేదని, ఆమెను నిందించడం.
  4. కోడలి పుట్టింటి వారిని గూర్చి అగౌరవంగా మాట్లాడడం.
  5. ఇచ్చిన కట్నం చాలలేదనడం, మనవడే పుట్టాలనడం వంటి కారణాల వల్ల ఇంట్లో బాధలు కలుగుతాయి.

ప్రశ్న 2.
ఇతర మతస్థులతో కూడా ఎందుకు ప్రేమగా ఉండాలి ?
జవాబు:
ప్రపంచంలో ఎన్నో మతాలున్నాయి. అన్ని మతాలూ దైవాన్ని గురించి ఒకే మాట చెపుతున్నాయి. భగవంతుడిని ప్రేమించాలని ఆయనే సర్వానికీ కారణమనీ, అన్ని మతాలూ చెపుతున్నాయి.

అన్ని మతాలు చెప్పేది ఒకటే కనుక, ఇతర మతస్థులతో కూడా మనం ప్రేమగా ఉండాలి. ఇతర మతస్థులను మన అన్నదమ్ముల వంటి వారిగా ఆదరిస్తే, మత కలహాలు, కొట్లాటలు లేక ప్రపంచం శాంతి ధామం అవుతుంది.

ప్రశ్న 3.
‘శాంతి’ అంటే ఏమిటి? ఇది నేడు ఎందుకు కనుమరుగైపోయింది ?
జవాబు:
‘శాంతి’ అంటే కామక్రోధాది షడ్గుణాలు లేకపోవడం. ‘శాంతి’ అంటే ప్రేమ, సహనము, ఆదరము. నేడు కులమత కలహాల వల్ల, ఉన్నదానితో సంతృప్తి లేకపోవడం వల్ల, అవినీతి, లంచగొండితనం, అక్రమ పరిపాలనల వల్ల, అశాంతి పెరిగింది. మనుష్యులలో మానవత్వం నశించి, దానవత్వం ప్రబలింది. అన్ని ప్రాణులనూ తనలాగే చూస్తే, శాంతి వర్ధిల్లుతుంది.

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి.

అ) “సమాజానికి మార్గనిర్దేశనం చేసేవాళ్ళు శతకకవులు” చర్చించండి.
జవాబు:
శతకకవులు తమ శతకాలను తమకు గల ఎంతో అనుభవంతో, తమకు కలిగిన పుస్తక జ్ఞానంతో, దృష్టాంతాలతో, నీతులతో రాస్తారు. కాబట్టి శతకాలలో ముఖ్యంగా నీతి శతకాల్లో శతకకవులు చెప్పిన నీతులు సమాజానికి చక్కని మార్గాన్ని నిర్దేశిస్తాయి.

ఉదాహరణకు మనం చదివిన శతక పద్యాలు చూద్దాం.

  1. అందె వేంకటరాజం గారు, నింబగిరి శతకంలో కోడలిని కూతురుగా చూడాలని, కార్మికులను కర్మశాలల్లో భాగస్థులను చేయాలని, దళితులను సోదరులుగా చూడాలని, ఇతర మతాల వారిని తమ వారిగా ప్రేమించాలని చెప్పి, సమాజానికి మంచి మార్గాన్ని చూపించారు.
  2. అలాగే కాళహస్తీశ్వర శతకంలో పరుల సొమ్మును ఆశించి మనుష్యులు చేసే చెడ్డపనులను గూర్చి చెప్పారు. పరద్రవ్యమును ఆశించి, ఆ చెడ్డపనులు చేయరాదని ధూర్జటి ఆ విధంగా సమాజానికి హితాన్ని బోధించాడు.
  3. మల్ల భూపాలీయంలో చెవికి శాస్త్రజ్ఞానము, చేతికి దానము, శరీరానికి పరోపకారము ముఖ్యాలంకారాలని కవి చెప్పాడు.
  4. రాజుకు సరైన ఆలోచన మనస్సులో పుట్టడం ముఖ్యమని భాస్కర శతక కర్త చెప్పాడు. దీనిని బట్టి శతకకవులు సమాజానికి మార్గనిర్దేశకులు అన్న మాట సత్యము.

ప్రశ్న 2.
పాఠంలోని పద్యాలలో కింది భావాలకు తగిన పద్య పాదాలను గుర్తించండి.

అ) “సూర్యచంద్రులు గతిదప్పినా”
జవాబు:
“జలజాతప్రియ శీతభానులు యథాసంచారముల్ దప్పినన్” అనేది, పై భావాన్ని ఇచ్చే పద్యపాదము.

ఆ) ‘మొదటిదైన ధనం పేదకు ఉండదు’
జవాబు:
‘తొల్తటిది ద్రవ్యము పేదకు లేదు’ – అనేది, పై భావాన్ని ఇచ్చే శతక పద్యపాదము.

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

ఇ) ‘అన్ని జీవులను తనలాగే ఆదరిస్తే’
జవాబు:
‘’అఖిల జీవుల తనవోలె నాదరింప’ – అనేది, పై భావాన్ని ఇచ్చే శతక పద్యపాదము.

ప్రశ్న 3.
కింది పద్యాలను పాద భంగము లేకుండా పూరించండి. వాటి భావం రాయండి.

అ) కులశైలంబులు ………………. సర్వేశ్వరా!
జవాబు:
“కులశైలంబులు పాదు పెల్లగిలి దిక్కులంబునం గూలినన్
జలధుల్ మేరల నాక్రమించి సముదంచద్భంగి నుప్పొంగినన్,
జలజాతప్రియ శీతభానులు యథాసంచారముల్ దప్పినన్!
దలకం డుబ్బఁడు చొప్పుదప్పుఁడు భవద్భక్తుండు సర్వేశ్వరా !

భావం : ఓ సర్వేశ్వరా! కుల పర్వతాలు స్థిరత్వాన్ని తప్పి పెల్లగిలి దిగంతముల వద్ద పడిపోయినా, సముద్రాలు హద్దులను అతిక్రమించి పైకి నెట్టబడి ఉప్పొంగినా, సూర్య చంద్రులు తిరుగవలసిన రీతిగా తిరగడం మానినా నీ భక్తుడు చలించడు. పొంగిపోడు. తన పద్దతిని తప్పడు.

ఆ) ధనము, ధనాభిమానము, ………. శ్రియఃపతీ !
జవాబు:
ధనము, ధనాభిమానము, సదాధనతృష్ణయు మూడు దోషముల్
ధనికున కందు తొల్తటిది ద్రవ్యము పేదకు లేదు కావునన్
ధనికుని కంటె పేదకడు ధన్యుడు, యాతని తృష్ణ సజ్జనా
ప్తిని శమియించు వేంకటపతీ! అఖిలాండపతీ! శ్రియఃపతీ !

భావం : ఓ వేంకటపతీ! బ్రహ్మాండాధిపతీ! లక్ష్మీనాథా! ధనమూ, ధనముపై అభిమానమూ, ఎల్లప్పుడూ ధనం సంపాదించాలనే కోరికా అనే మూడు దోషాలూ ధనవంతుడికి ఉంటాయి. కాని పేదవాడికి అందులో ధనము అనే దోషం ఉండదు. పేదవాడికి ధనాశ ఉన్నా మంచివారికి దగ్గర ఉండడం వల్ల అతడిలో ధనాశ పోతుంది. కాబట్టి పేదవాడు ధనికుని కంటె ధన్యుడు.

ప్రశ్న 4.
కింది పద్యాన్ని చదువండి.

సీ|| కోపంబు చే నరుల్ క్రూరాత్ములగుదురు
కోపంబు మనుషుల కొంప ముంచు
కోపంబు వలననె పాపంబులును హెచ్చు
కోపంబుననె నింద గూడ వచ్చు
కోపంబు తన చావు కొంచెంబు నెరుగదు
కోపంబు మిత్రులన్ కొంచెపరుచు

కోపంబు హెచ్చినన్ శాపంబులున్ వచ్చు
కోపంబు జూడగా కొరివి యగును
తే॥ కోపము నరుని సాంతము కూల్చును భువి
లేదు వెదికిన యిటువంటి చేదు ఫలము
వినుడి మాయప్ప శిద్దప్ప విహితుడప్ప కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప
– ప్రసిద్ధి రామప్పవరకవి (సిద్దప్ప), కరీంనగర్ జిల్లా.

పై పద్యం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.

అ) కవి చేదు ఫలమని దేనిని అన్నాడు ?
ఎ) వేపపండు
బి) కోపం
సి) పాపం
డి) కాకరపండు
జవాబు:
బి) కోపం

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

ఆ) కోపం ఎక్కువైతే వచ్చే ఫలితం ?
ఎ) శాపం
బి) పాపం
సి) నింద
డి) కొరివి
జవాబు:
ఎ) శాపం

ఇ) కోపంచేత మనుషులు ఎట్లా మారుతారు ?
ఎ) పాపాత్ములు
బి) దురాత్ములు
సి) నీచాత్ములు
డి) క్రూరాత్ములు
జవాబు:
డి) క్రూరాత్ములు

ఈ) ‘సొంతం’ అను పదం అర్థమేమిటి?
ఎ) కొంత
బి) మొత్తం
సి) సగం
డి) శూన్యం
జవాబు:
బి) మొత్తం

ఉ) కోపం ఎవరి కొంప ముంచుతుంది ?
ఎ) మనుషుల
బి) మంచివారి
సి) దుర్మార్గుల
డి) నీచుల
జవాబు:
ఎ) మనుషుల

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

ప్రశ్న 1.
కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) ధనతృష్ణ ఎప్పుడు నశిస్తుందో వివరించండి.
జవాబు:
ధనతృష్ణ సజ్జనాప్తిచే నశిస్తుంది. సజ్జనాప్తి అంటే సత్పురుష సహవాసం. శంకరాచార్యులవారు భజగోవింద శ్లోకాలలో, సత్సంగత్వం వల్ల నిస్సంగత్వము, నిస్సంగత్వము వల్ల నిర్మోహత్వము ఏర్పడుతాయని చెప్పారు.

ధనముపై దురాశ అంత తేలికగా నశించదు. మంచివారితో కలియడం వల్ల, వారి మంచి మాటల వల్ల క్రమంగా ధనముపై దురాశ పోతుంది. చనిపోయినపుడు మనం సంపాదించిన ద్రవ్యం, మన వెంటరాదని, మనం చేసుకున్న పుణ్యపాపకర్మల ఫలమే, మన వెంట వస్తుందనీ, సజ్జన సహవాసం వల్ల తెలుస్తుంది. దాని వల్ల ధనతృష్ణ క్రమంగా నశిస్తుంది.

ఆ) మనిషికి నిజమైన అందాన్ని ఇచ్చేవి ఏవి ?
జవాబు:
చెవులకు శాస్త్ర పాండిత్యము అందాన్ని ఇస్తుంది. కుండలాలు చెవులకు అందాన్ని ఇవ్వవు. చేతులకు దానము అందాన్ని ఇస్తుంది. చేతులకు కంకణాలు అందాన్ని ఇవ్వవు. శరీరానికి పరోపకారమే అందాన్ని ఇస్తుంది. శరీరానికి సుగంధలేపనాలు, అందాన్ని ఇవ్వవు. శాస్త్ర పాండిత్యము, దానము, పరోపకారము అనేవి మనిషికి నిజమైన అందాన్నిస్తాయి.

ఇ) ఆపదలు రాకుండా ఉండాలంటే ఎక్కడ ఎట్లా ప్రవర్తించాలి ?
జవాబు:
ఆపదలు రాకుండా ఉండాలంటే, మన ప్రవర్తనలో మార్పులు రావాలి.

  1. కోడలిని కూతురివలె చూడాలి.
  2. కార్మికులను కర్మశాలల్లో భాగస్థులను చేయాలి.
  3. దళితులను తన సోదరుల వలె మన్నించాలి.
  4. పరమతస్థులను తనవారివలె ప్రేమించాలి.
  5. జీవులందరినీ తనవలె చూసుకొని, ప్రేమతో ఆదరించాలి.

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

ఈ) “ధనవంతునికంటే కూడా పేదవాడు గొప్పవాడు.” దీని గురించి మీ అభిప్రాయం తెలుపండి.
జవాబు:
ధనవంతుడిలో సామాన్యంగా ఈ కింది మూడు దోషాలు ఉంటాయి.

  1. ధనము,
  2. ధనాభిమానము,
  3. ధనతృష్ణ.

ఇందులో పేదవాడికి ధనము ఉండదు. కాబట్టి పేదవాడికి ‘ధనము’ అనే దోషం అతడిలో ఉండదు – ధనవంతుడిలో ఉండే ధనతృష్ణ అనే దోషము పేదవాడికి సజ్జన సహవాసం చేత పోతుంది. అందువల్ల పేదవాడిలో ధనము, ధనతృష్ణ అనే రెండు దోషాలు ఉండవు. అందుచేతనే ధనికుని కంటే పేదవాడు గొప్పవాడని చెప్పాలి.

ధనము ఉన్న కొద్దీ, ఇంకా సంపాదించాలనే దురాశ పెరుగుతుంది. ఆ ధనాన్ని ఎలా వృద్ధి చేయాలా ? అనే చింత పట్టుకుంటుంది. ఆ ధనాన్ని ఎలా దాచాలా అనే విచారం కలుగుతుంది. ఆ విచారంతో ధనవంతుడు ఎ.సి గదుల్లో కూడా హాయిగా నిద్రపోలేడు.

పేదవాడికి ధనం పోతుందనే విచారం లేదు. అందువల్ల ధనికుని కంటే పేదవాడు గొప్ప అని నా అభిప్రాయం.

ప్రశ్న 2.
కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) ‘శతక పద్యాలు సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తాయి – విమర్శిస్తాయి’ వివరించండి.
జవాబు:
సామాన్యంగా శతకకవులు తన కాలం నాటి సంఘంలోని మంచి చెడులను గూర్చి తమ పద్యాలలో చెపుతారు. ఆ కవులు నాటి సంఘంలోని దురాచారాల్ని ఎత్తి చూపి విమర్శిస్తారు. నీతి మార్గాన్ని సంఘానికి బోధిస్తారు. మన శతకపద్యాల్లో ధూర్జటి రచించిన కాళహస్తీశ్వర శతక పద్యంలో నాటి సంఘంలోని మనుష్యులు, పరద్రవ్యాన్ని ఆశించి ఎలా బ్రతుకుతున్నారో చెప్పాడు.

పరద్రవ్యాన్ని ఆశించి జోస్యాలు చెప్పడం, అబద్ధాలాడడం, వంకర మార్గంలో కీర్తిని సాధించే ప్రయత్నం చేయడం, చాడీలు చెప్పడం, హింసను ప్రేరేపించడం వంటి పనులు చేస్తున్నారని చెప్పాడు. ఇది ధూర్జటి కాలం నాటి సమాజ ప్రతిబింబం అనడంలో వివాదం అక్కరలేదు.

అలాగే అందె వేంకటరాజంగారు ఇంట్లో అత్తాకోడళ్ళ పోరాటాలు, కర్మశాలలో అలజడులు, దళితుల పట్ల అగ్రవర్ణాల అరాచకాలు, మతహింస వంటి, నేటి సమాజంలోని లోపాలను ఎత్తిచూపి, వాటిని పరిహరించే మార్గాలను కూడా ఉపదేశించారు. ఈ పద్యం నేటి సమాజానికి చక్కని ప్రతిబింబం.

ఈశ్వరుడు విషాన్ని మింగడం గొప్పకాదనీ, నేటి మనుష్యులలోని విషాన్ని పోగొట్టమనీ రాజరాజేశ్వర శతక పద్యంలో కవి చెప్పారు. నేటి మనుష్యులలో అవినీతి, లంచగొండితనం, దురాచారాలు వంటి విషం పెరిగి పోయిందని, కవి ఈనాటి సంఘాన్ని గురించి దీనిలో విమర్శించారు. కాబట్టి శతక పద్యాలు, సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తాయనీ, విమర్శిస్తాయనీ చెప్పడం యథార్థము.

ప్రశ్న 3.
కింది అంశాల గురించి సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా రాయండి.

అ) పాఠంలోని మీకు నచ్చిన పద్య భావాల్ని ఆధారంగా చేసుకొని ఒక కథను రాయండి.
జవాబు:

తీరని రుక్కు కోరిక

‘రుక్కు’ గారి భర్త, రైల్వేలో ఏదో పనిచేసేవాడు. రుక్కుగారి పెద్దకొడుకు కంప్యూటర్ ఇంజనీరు. రుక్కుగారు పెద్దకొడుక్కి మూడేళ్ళ కితం పెళ్ళయింది. ప్రస్తుతం రుక్కుగార్కి ఏడాది దాటిన మనవడు ఉన్నాడు. రుక్కుగారి కోడలు కూడా కంప్యూటర్ బి.టెక్ చదివింది. రుక్కుగార్కి మరో కొడుకు ఉన్నాడు. కాని ఎడ్రస్ లేదు. పెద్ద కొడుకు చేత హైదరాబాద్లో బ్యాంకు లోను పెట్టించి, రుక్కు మూడు బెడ్రూమ్ల ఇల్లు కొనిపించింది. రుక్కుగారి భర్త ఈ మధ్యనే రిటైరయ్యాడు. రుక్కుగార్కి హైదరాబాద్ వెళ్ళి కోడలుపై పెత్తనం చేస్తూ కొడుకు డబ్బును అంతా తానే మేనేజ్ చేయ్యాలని పెద్ద ఆశ. రుక్కుకు ఇంకెక్కడా ఇల్లు లేదు. మొగుడికి ఏదో కొద్దిపాటి పెన్షను రావచ్చు. కోడలును తన గుప్పిట్లో పెట్టి నలిపేస్తూ, మనవడిని తన ఇష్టం వచ్చినట్లు పెంచాలని రుక్కుగారి ఉబలాటం. రుక్కుకు కూతురు లేదు. రుక్కుకు తన మాట ఇంట్లో సాగకపోతే, ఏడుపు వస్తుంది.

‘రుక్కు’ తన ఇంటికి వచ్చినప్పుడల్లా పెంట పెడుతుంది. ఇప్పుడు పర్మనెంటుగా మొగుడిని వెంట పెట్టుకొని హైదరాబాద్ వస్తే ఏం అల్లరిచేస్తుందో అని రుక్కు కోడలుకు గుండె గుబగుబలాడుతోంది. రుక్కు మొగుడు పాపం పెంపుడు కుక్క పిల్లలాంటివాడు. నోట్లో నాలుక లేదు. “అద్దె ఇంట్లో మనమిద్దరం హాయిగా ఉందాం. హైదరాబాద్ వద్దు. అన్నాడు రుక్కుతో ఆమె భర్త. రుక్కుకు చాలా కోపం వచ్చింది. ఏడ్చింది. రుక్కుకు జోస్యాల మీద మంచి నమ్మకం. ఒక మఠంలో సన్యాసి రుక్కు హైదరాబాద్ వెళ్ళడం మంచిది కాదని జోస్యం చెప్పాడు. పాపం రుక్కుకు కోడల్ని ఎలా సతాయించాలో అర్థం కాలేదు. కొడుకు కూడా రుక్కును రావద్దన్నాడు. జోస్యం అల్లాగే ఉంది. రుక్కు కోరిక తీరే మార్గం ఇప్పట్లో లేనట్లే.

(లేదా)

ఆ) పాఠంలోని పద్యభావాల ఆధారంగా విద్యార్థులలో నీతి, విలువల పట్ల అవగాహన పెంచటానికై ఒక కరపత్రాన్ని తయారు చేయండి.
జవాబు:
‘విద్యార్థులు – నీతినియమాలు’

విద్యార్థి సోదరులారా! దైవభక్తి కలిగి ఉండండి. ఐశ్వర్యం శాశ్వతం కాదు. ధనం కోసం అబద్ధాలాడకండి. ర్యాంకుల కోసం తప్పుడుదారులు తొక్కకండి. తోడి పిల్లలపై కొండెములు చెప్పి, హింసను ప్రేరేపించకండి. సిరి శాశ్వతం కాదు. వేషభాషలపై వెర్రితనం మంచిది కాదు. విద్య ప్రధానము. అలంకారాలు ముఖ్యం కాదు. పరోపకారమే విద్యార్థులకు నిజమైన అలంకారం అని తెలుసుకోండి.

మీరు కార్యాన్ని సాధించాలంటే బాగా బుద్ధి పెట్టి ఆలోచన చెయ్యండి. ఇతరుల సలహాలపై ముందుకు సాగకండి. ధనముపై దురాశ పెంచుకోకండి. మన చుట్టూ మనుష్యులలో విషం ఉన్న వాళ్ళున్నారు. వారి విషయంలో జాగ్రత్తపడండి.

మీ దళిత మిత్రులను సోదరులుగా చూడండి. పరమతాల వారిని ప్రేమించండి. జీవులందరినీ మీలాగే చూడండి. గురువుల మాటలను తలదాల్చండి. శాంతి, సత్యము, అహింసలకు ప్రధాన స్థానమియ్యండి. ఇది కరపత్రం కాదు. భగవద్గీత అని నమ్మండి.

ఇట్లు,
విద్యార్థి మిత్రులు.

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

III. భాషాంశాలు

పదజాలం

1. కింది పదాలకు అర్థాలు రాస్తూ, సొంతవాక్యాలు రాయండి.

ఉదా : ఆపద = కష్టం
వాక్యప్రయోగం : ఆపదలు వచ్చినపుడు ఓర్పుతో, ఉపాయంతో వ్యవహరించాలి.

అ) నిక్క = నిజము
వాక్యప్రయోగం : సర్వకాలములయందు భగవంతుని ముందు నిక్కం మాట్లాడాలి.

ఆ) ఒజ్జ = గురువు
వాక్యప్రయోగం : శిష్యులకు ఒజ్జలమాటలు శిరోధార్యములు.

ఇ) తృష్ణ = దప్పి, పేరాస
వాక్యప్రయోగం : ధనతృష్ణ మానవులకు సర్వానర్ధదాయకము.

ఈ) విభూషణం = ఆభరణము
వాక్యప్రయోగం : నేటికాలంలో యువతకు విద్యయే విభూషణం.

2. కింది పదాలకు పర్యాయపదాలు రాసి, వాటితో వాక్యాలు రాయండి.

ఉదా : కూతురు : పుత్రిక, కుమార్తె
వాక్యప్రయోగము : జనకుని పుత్రిక సీతాదేవి, ఈ కుమార్తె వలన జనకుడు పరమానందాన్ని పొందాడు.

అ) తృష్ణ :

  1. దప్పిక
  2. దప్పి
  3. పిపాస

వాక్యప్రయోగము : వేసవి తాపం వల్ల దప్పిక పెరిగింది. పిపాస తీరాలంటే నిమ్మ నీరు త్రాగాలి.

ఆ) సజ్జనుడు :

  1. సత్పురుషుడు
  2. సుజనుడు

వాక్యప్రయోగము : సుజనుడికి లోకమంతా మంచిగానే కన్పిస్తుంది. ఆ సత్పురుషుడు లోకానికి మంచి మార్గాన్ని చూపిస్తాడు.

ఇ) మహి :

  1. భూమి
  2. ధరణి
  3. వసుధ

వాక్యప్రయోగము : భూమిపై పచ్చనిచెట్లు లేవు. ధరణి అంతా నిర్జీవంగా కనిపిస్తోంది.

ఈ) శైలము :

  1. పర్వతము
  2. అద్రి
  3. గిరి

వాక్యప్రయోగము : గిరి పుత్రిక పార్వతి పర్వతమును ఎక్కుతోంది.

3. కింది వాక్యాలను గమనించండి. ఆయా వాక్యాల్లోని ప్రకృతి – వికృతుల్ని గుర్తించండి. వాటి కింద గీత గీయండి.

అ) ప్రతి మనిషికి తెలియకుండా దోషం చేయడం తప్పుకాదేమో కాని తెలిసి దోసం చేయడం తప్పు.
జవాబు:
ప్రతి మనిషికి తెలియకుండా దోషం చేయడం తప్పుకాదేమో కాని తెలిసి దోసం చేయడం తప్పు.

ఆ) సింహం వేట ద్వారా ఆహారాన్ని పొందుతుంది. కానీ ఆకలి వేసినప్పుడే సింగం వేటాడుతుంది.
జవాబు:
సింహం వేట ద్వారా ఆహారాన్ని పొందుతుంది. కానీ ఆకలి వేసినపుడే సింగం వేటాడుతుంది.

ఇ) ఏ కార్యమైనా శ్రమిస్తేనే పూర్తి చేయగలం. కాని కర్ణం నిర్వహించే తీరు తెలియాలి.
జవాబు:
ఏ కార్యమైనా శ్రమిస్తేనే పూర్తి చేయగలం. కాని కర్ణం నిర్వహించే తీరు తెలియాలి.

ఈ) కలహం ఏర్పడినపుడు శాంతం వహిస్తే, కయ్యం నెయ్యంగా మారుతుంది.
జవాబు:
కలహం ఏర్పడినపుడు శాంతం వహిస్తే, కయ్యం నెయ్యంగా మారుతుంది.

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

వ్యాకరణాంశాలు

1. కింది పదాలను విడదీయండి. సంధుల పేర్లు గుర్తించి రాయండి.

అ) కలహాగ్నులు = కలహ + అగ్నులు = సవర్ణదీర్ఘ సంధి
ఆ) వేంకటేశ్వరా = వేంకట + ఈశ్వరా = గుణసంధి
ఇ) కుండలమొప్పు = కుండలము + ఒప్పు = ఉత్వసంధి
ఈ) యోధులనేకులు = యోధులు + అనేకులు = ఉత్వసంధి

2. కింది సమాసపదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేర్లు రాయండి.

అ) కార్యదక్షుడు – కార్యమునందు దక్షుడు – సప్తమీ తత్పురుష సమాసం
ఆ) మూడుదోషాలు – మూడైన దోషాలు – ద్విగు సమాసం
ఇ) కర్మశాల – కర్మము కొఱకు శాల – చతుర్థీ తత్పురుష సమాసం
ఈ) ఆశాపాశం – ఆశ అనె పాశం – రూపక సమాసం

3. కింది పద్యపాదాలు పరిశీలించి, గణవిభజన చేసి, గణాలు గుర్తించి, ఏ పద్యపాదమో రాయండి.

అ) ధనము, ధనాభిమానము, సదా ధనతృష్ణయు మూడు దోషముల్
TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 9
పై పాదంలో న, జ, భ, జ, జ, జ, ర గణాలున్నాయి. కాబట్టి ఇది ‘చంపకమాల’ పద్యపాదం.

ఆ) భూపతికాత్మబుద్ధి మదిఁబుట్టనిచోటఁ బ్రధానులెంత ప్రజ్ఞా…..
TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 10
పై పాదంలో భ, ర, న, భ, భ, ర వ గణాలున్నాయి. కాబట్టి ఇది ‘ఉత్పలమాల’ పద్యపాదం.

సరళాదేశ సంధి

కింది పదాలు చదువండి. పదంలోని చివరి అక్షరం కింద గీతలు గీయండి.
ఉదా : 1) పూచెను
2) చూసెను
3) వచ్చెను
4) తినెను
5) చేసెన్
6) నడిచెన్
7) వెళ్ళెన్
జవాబు:
1) పూచెను
2) చూసెను
3) వచ్చెను
4) తినెను
5) చేసెన్
6) నడిచెన్
7) వెళ్ళెన్ ………..

పై పదాలను గమనిస్తే, ఆ పదాల చివర ను, న్ లు కనిపిస్తాయి. అంటే పదాల చివర ‘న’ కారం ఉన్నది. ఈ ‘న’ కారాన్ని ద్రుతం అంటారు. ద్రుతం (న) చివరగల పదాలను ‘ద్రుత ప్రకృతికాలు’ అంటారు. కావున చూచెను, పూచెను, తినెను, చేసెన్, నడిచెన్ మొదలైన పదాలు ద్రుతప్రకృతికాలే.

అభ్యాసము : మీరు కూడా మరికొన్ని ద్రుతప్రకృతిక పదాలు రాయండి.

  1. చేసెను
  2. వ్రాసెను
  3. వచ్చుచున్
  4. నాకొఱకున్
  5. నాయందున్

కింది వాటిని పరిశీలించండి.

అ) పూచెన్ + కలువలు = పూచెన్ + గలువలు
ఆ) దెసన్ + చూచి = = దెసన్ + జూచి
ఇ) చేసెన్ + టక్కు = చేసెన్ + డక్కు
ఈ) పాటిన్ + తప్ప = పాటిన్ + దప్ప
ఉ) వడిన్ + పట్టి = వడిన్ + బట్టి

పై పదాలను పరిశీలిస్తే

‘న్’ కు ‘క’ పరమైతే ‘క’ – ‘గ’ గా మారుతుంది.
”న్’ కు – ‘చూ’ పరమైతే ‘చూ’ – ‘జూ’ గా మారుతుంది.
‘న్’ కు ‘ట’ పరమైతే ‘ట’ – ‘డ’ గా మారుతుంది.
‘న్’ కు ‘త’ పరమైతే, ‘త’ – ‘ద’ గా మారుతుంది.
‘న్’ కు – ‘ప’ పరమైతే, ‘ప’ – ‘బ’ గా మారుతుంది.
అంటే
క → గ
చ → ‘జ’
ట → ‘డ’
త → ‘ద’
ప → ‘ఐ’ లుగా మారాయి
క, చ, ట, త, ప – లకు వ్యాకరణ పరిభాషలో పరుషాలని పేరు.
గ, జ, డ, ద, బ – లకు వ్యాకరణ పరిభాషలో సరళాలని పేరు.

పై ఉదాహరణలలోని భావాన్ని బట్టి సూత్రీకరిస్తే,

సూత్రము : ద్రుత ప్రకృతికాలకు పరుషాలు లు పరమైతే ఆ పరుషాలు సరళాలుగా మారుతాయి.

ఇప్పుడు కింది ఉదాహరణలను పరిశీలించండి.
పూచెన్ + కలువలు = పూచెన్ + గలువలు

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 11
పై ఉదాహరణ ఆధారంగా సంధి జరిగిన విధానాన్ని సూత్రీకరిస్తే

సూత్రము : ఆదేశ సరళానికి ముందున్న ద్రుతానికి బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయి.

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

4. కింది సంధి పదాలను విడదీసి, ద్రుత ప్రకృతిక సంధి లక్షణాలను పరిశీలించండి.

అ) గురువులఁగాంచి = గురువులన్ + కాంచి – గురువులఁగాంచి; గురువులం గాంచి ; గురువులన్గాంచి
ఆ) ఎక్కువగఁజొప్పడ = ఎక్కువగన్ + చొప్పడ – ఎక్కువగఁజొప్పడ ; ఎక్కువగంజొప్పడ ; ఎక్కువగన్జప్పడ
ఇ) తలఁదాల్చి = తలన్ + తాల్చి – తలదాల్చి ; తలం దాల్చి ; తలన్దాల్చి
ఈ) చెవికింగుండలంబు = చెవికిన్ + కుండలంబు – చెవికిఁగుండలంబు ; చెవికి౦గుండలంబు ; చెవికిన్గు౦డలంబు

శార్దూలం

కింది రెండు పద్యపాదాలను గణవిభజన చేసి పరిశీలిద్దాం!

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 12

గమనిక :

  1. పై పద్యపాదంలో వరుసగా మ, స, జ, స, త, త, గ గణాలు వచ్చాయి.
  2. పద్యానికి నాలుగు పాదాలున్నాయి.
  3. ప్రతి పాదంలో రెండవ అక్షరంగా ‘శ’ ఉన్నది. అంటే ప్రాస నియమం కలిగి ఉంది.
  4. 13వ అక్షరంతో యతి మైత్రి (నా 5) ప్రతి పాదంలో 19 అక్షరాలున్నాయి.

పై లక్షణాలు గల పద్యం “శార్దూలం”.

మత్తేభం

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 13

పై పద్యపాదాన్ని పరిశీలిస్తే

  1. దీనిలో వరుసగా స, భ, ర, న, మ, య, వ గణాలు వచ్చాయి.
  2. పద్యానికి నాలుగు పాదాలున్నాయి. ప్రతిపాదంలో ‘వ’ రెండవ అక్షరంగా ఉండి ప్రాసనియమం కలిగి ఉన్నది.
  3. 14వ అక్షరం యతి మైత్రి (చె – చే) చెల్లుతుంది.
  4. ప్రతిపాదంలో 20 అక్షరాలున్నాయి.
  5. ఈ లక్షణాలు గల పద్యం “మత్తేభం”.

ఈ పాఠ్యాంశంలోని ఐదు, ఏడు పద్యాలకు గణవిభజన చేసి అవి ఏ పద్యపాదాలో తెలుపండి.
TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 14

గమనిక :

  1. పై పాదంలో న, జ, భ, జ, జ, జ, ర గణాలున్నాయి.
  2. కాబట్టి ఇది చంపకమాల పద్యపాదము.
  3. యతి 11వ అక్షరము (ధ-దా) లకు.

7వ పద్యం :

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 15

గమనిక :
1) పై ఏడవ పద్యపాదంలో వరుసగా 6 ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు క్రమంగా వచ్చాయి. కాబట్టి ఇది ‘సీస
పద్యపాదము’
1, 3 గణాద్యక్షరాలకు యతి కూకో
5, 7 గణాద్యక్షరాలకు యతి మం – మం

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

ప్రాజెక్టు పని

మీ పాఠశాలలోని గ్రంథాలయాన్ని సందర్శించి శతకపద్యాల పుస్తకాలను పరిశీలించి, మీకు నచ్చిన ఏవేని ఐదు పద్యాలు సేకరించి, వాటికి భావాలు రాయండి. నివేదిక రాసి, ప్రదర్శించండి.

ప్రశ్న 1.
సిరిలేకైన విభూషితుండె యయి భాసిల్లున్ బుధుండౌదలన్
గురుపాదానతి కేలనీగి చెవులందు న్విన్కి వక్త్రంబునన్
స్థిరసత్యోక్తి భుజంబులన్విజయమున్జిత్తం బునన్సన్మనో
హర సౌజన్యము గల్గిన న్సురభిమల్లా! నీతివాచస్పతీ!

భావం : నీతిలో బృహస్పతి వంటివాడా! సురభిమల్లా! తలకు, గురుపాదాలకు పెట్టే నమస్కారం, చేతులకు త్యాగం, చెవులకు మంచి వినే గుణం ఉండాలి. నోటికి సత్యవాక్కు ఉండాలి. బాహువులకు విజయం, మనసుకు మంచితనం ఉండాలి. అలాంటి పండితుడు సంపదలేకపోయినా ప్రకాశిస్తాడు.

ప్రశ్న 2.
బీదలకన్న వస్త్రములు పేర్మినొసంగుము తుచ్ఛసౌఖ్యసం
పాదనకై యబద్ధముల బల్కకు, వాదములాడబోకు, మ
ర్యాదనతిక్రమింపకు, పరస్పరమైత్రి మెలంగు, మిట్టివౌ
వేదములంచెరుంగుము, వివేకధనంబిదినమ్ముచిత్తమా!

భావం : ఓ మనసా ! బీదవారికి అన్నదానం, వస్త్రదానం చేయాలి. నీచమైన సౌఖ్యాల కోసం అబద్ధాలు చెప్పకు. తగవులు పెట్టుకోకు. మర్యాదను మీరకు. ఒకరితో ఒకరు స్నేహంగా ఉండాలి. ఇటువంటివే జీవన వేదాలని తెలుసుకో. వివేకమనే ధనం ఇదే కదా !

ప్రశ్న 3.
పట్టుగ నీశ్వరుండు తన పాలిట నుండిపుడిచ్చినంతలోఁ
దిట్టక దీనదేహులను తేటగ లాలనజేసి, యన్నమున్
పెట్టు వివేకి మానసముఁ బెంపొనరించుచు నూరకుండినన్
గుట్టుగ లక్ష్మిఁబొందుఁ; దరిగొండనృసింహ! దయాపయోనిధీ!

భావం : దయా సముద్రుడా ! తరిగొండ నరసింహస్వామీ ! ఈశ్వరుడు పట్టుదలతో తన పక్షం వహించి ప్రసాదించిన సంపదలో శక్తిమేరకు పేదవారికి పెట్టాలి. అలాగే పేదలను నిందించకుండా అన్నం పెట్టిన వానికి మనస్సుకు ఆనందం కలుగుతుంది. ప్రయత్నించకపోయినా సంపద చేరుతుంది.

పద్యాలు – ప్రతిపదార్థాలు – భావాలు

I

1వ పద్యం: (కంఠస్థ పద్యం)

మ॥ “కులశైలంబులు పాదు పెల్లగిలి దిక్కులంబునం గూలినన్
జలధుల్ మేరల నాక్రమించి సముదంచదృంగి నుప్పొంగినన్,
జలజాతప్రియ శీతభానులు యథాసంచారముల్ దప్పినన్
దలకం డుబ్బఁడు చొప్పుదప్పుఁడు భవద్భక్తుండు సర్వేశ్వరా!

ప్రతిపదార్థం :

సర్వేశ్వరా = ఓ సర్వేశ్వర స్వామీ !
కులశైలంబులు = కులపర్వతాలు (సప్తకుల పర్వతాలు)
పాదు = ఆశ్రయము (స్థిరత్వము)
పెల్లగిలి = పెల్లగింపబడి (ఉన్మూలితమై)
దిక్కులంబునన్
(దిక్ + కూలంబునన్ = దిక్కుల ఒడ్డున (దగ్గర)
కూలినన్ = కూలిపోయినప్పటికీ
జలధుల్ = సముద్రములు
మేరలన్ = హద్దులను (చెలియలికట్టలను)
ఆక్రమించి = అతిక్రమించి
సముదంచద్భంగిన్
(సముదంచత్ + భంగిన్)
సముదంచత్ = అధికంగా పైకినెట్టబడిన
భంగిన్ = విధముగా
ఉప్పొంగినన్ = మిక్కిలి పొంగినా
జలజాతప్రియ శీతభానులు ;
జలజాతప్రియ = పద్మములకు ప్రియుడైన సూర్యుడును
శీతభానులు = చల్లని కిరణములు గల చంద్రుడునూ
యథాసంచారముల్ = (వారు) సంచరింపవలసిన తీరుగా సంచరించడం (తిరుగవలసిన రీతిగా తిరగడం)
తప్పినన్ = మరచిపోయినా
భవద్భక్తుండు
(భవత్ + భక్తుండు) = నీ భక్తుడు
తలకండు = చలించడు;
ఉబ్బడు = పొంగిపోడు;
చొప్పు = పద్ధతిని
తప్పడు = దాటడు; (విడిచిపెట్టడు)

భావం : ఓ సర్వేశ్వరా ! కుల పర్వతాలు స్థిరత్వాన్ని తప్పి పెల్లగిలి దిగంతముల వద్ద పడిపోయినా, సముద్రాలు హద్దులను అతిక్రమించి, పైకి నెట్టబడి ఉప్పొంగినా, సూర్యచంద్రులు తిరుగవలసిన రీతిగా తిరగడం మానినా, నీ భక్తుడు చలించడు. పొంగిపోడు. తన పద్ధతిని తప్పడు.

విశేషములు :
1) కులపర్వతాలు ఏడు అవి :

  1. మహేంద్రము
  2. మలయము
  3. సహ్యము
  4. శక్తిమంతము
  5. గంధమాదనము
  6. వింధ్యము
  7. పారియాత్రము

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

2వ పద్యం : (కంఠస్థ పద్యం)

శా॥ జాతుల్ సెప్పుట, సేవ చేయుట మృషల్ సంధించు టన్యాయ వి
ఖ్యాతిం బొందుట కొండెకాఁ డవుట హింసారంభకుం డౌట మి
ధ్యాతాత్పర్యము లాడు టన్నియుఁ బరద్రవ్యంబు నాశించి యీ
శ్రీ తా నెన్ని యుగంబు లుండఁ గలదో శ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం :

శ్రీకాళహస్తీశ్వరా = శ్రీకాళహస్తిలో వెలసిన ఈశ్వరా!
జాతుల సెప్పుట
(జాతుల్ + చెప్పుట) = జాతకాలు చెప్పడమూ,
సేవచేయుట = రాజులకు కాని, ఇతరులకు కాని సేవ చేయడము
మృషల్ = అసత్యములు
సంధించుట = కూర్చుటయు; (మాట్లాడడమూ)
అన్యాయవిఖ్యాతిన్;
అన్యాయ = అన్యాయ మార్గములో
విఖ్యాతిన్ = కీర్తిని
పొందుట = పొందడమూ
కొండెకాడు = కొండెములు చెప్పేవాడు (ఒకరిమీద చాడీలు చెప్పేవాడు)
అవుట = అవడమూ, (కావడం)
హింసారంభకుండు
(హింసా + ఆరంభకుండు) = హింసా ప్రయత్నము చేసేవాడు
జౌట = అగుటయూ (కావడమూ)
మిధ్యా తాత్పర్యములు = అసత్యమైన భావములు
ఆడుట = చెప్పడమూ;
అన్నియున్ = ఈ పైన చెప్పిన అన్ని పనులునూ
పరద్రవ్యంబున్ = ఇతరుల ధనాన్ని
ఆశించి = చేజిక్కించుకోవాలనే ఆశ చేతనే కదా!
ఈ శ్రీ = ఇలా సంపాదించిన ధనము
తాను = తాను
ఎన్నియుగంబులు = ఎన్ని యుగాలకాలముపాటు
ఉండగలదో = నిలిచి యుంటుందో! (ఎవ్వరికీ తెలియదు)

భావం : ఓ శ్రీకాళహస్తీశ్వరా! లోకములోని మనుష్యులు, జాతకములు చెప్పడమూ, ఇతరులకు సేవలు చేయడమూ, అసత్యము లాడడమూ, అన్యాయంగా కీర్తిని సంపాదించడమూ, చాడీలు చెప్పడమూ, హింసా ప్రయత్నం చేయడమూ, అనవసర అర్థాలు చెప్పడమూ వంటి పనులు చేస్తూ, తాము ఇతరుల ధనాన్ని ఆశిస్తున్నారు. కాని ఇలా సంపాదించిన ధనం, ‘ఎంతకాలం నిలుస్తుంది ? (ఎంతోకాలం నిలబడదని భావం.)

II

3వ పద్యం : (కంఠస్థ పద్యం)

మ॥ చెవికిం గుండల మొప్పుగాడు శ్రుతమే, చేదమ్మికిన్గంకణం
బు విభూషాఢ్యము గాదు దానమె మహిన్బుణ్యాత్మునెమ్మేనికిన్
బ్రవిలేపంబులు గావు సొమ్ములుపకారప్రౌఢియే నిక్కమౌ
లవితేంద్రాతిగ వైభవా! సురభిమల్లా! నీతివాచస్పతీ!

ప్రతిపదార్థం :

లవితేంద్రాతి వైభవా !
లవిత (లలిత) = సుందరుడైన
ఇంద్ర = ఇంద్రుడి
అతిగ = అతిక్రమించిన (మించిన)
వైభవా = వైభవము గలవాడా!
నీతివాచస్పతీ = నీతి శాస్త్రమునందు దేవతలకు గురువైన బృహస్పతి వంటి వాడా!
సురభి మల్లా = ఓ సురభిమల్ల భూపాలుడా!
చెవికిన్ = చెవులకు
శ్రుతమే (శ్రుతము +ఏ) = శాస్త్రపాండిత్యమే కానీ,
కుండలము = కుండలములు ధరించడం
ఒప్పుగాదు (ఒప్పు + కాదు) = అందము కాదు
చేదమ్మికిన్ = పద్మము వంటి చేతికి;
దానమే
(దానము + ఎ) = దానమే కాని
కంకణంబు = కంకణము
‘విభూషాఢ్యము
(విభూషా + ఆఢ్యము) = గొప్ప అలంకారము
కాదు = కాదు;
మహిన్ = భూమండలములో
పుణ్యాత్ము = పుణ్యాత్ముని యొక్క
నెమ్మేనికిన్
(నెఱి + మేనికిన్) = అందమైన శరీరానికి
ఉపకార ప్రౌఢియే = గొప్ప ఉపకారమే కాని
ప్రవిలేపంబులు = పూత పూసుకొనే సుగంధ ద్రవ్యములు
సొమ్ములు + కావు = ఆభరణములు కావు

భావం : వైభవంలో ఇంద్రుని మించినవాడా! నీతిలో బృహస్పతితో సమానమైన వాడా! ఓ సురభిమల్ల మహారాజా! చెవులకు శాస్త్రపాండిత్యమే అందంకాని, కుండలాలు కాదు. చేతులకు దానమే అందంకాని, కంకణాలు కాదు. శరీరానికి పరోపకారమే ఆభరణం కాని, సుగంధ విలేపనాలు కావు.

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

4వ పద్యం : (కంఠస్థ పద్యం)

ఉ॥ భూపతికాత్మబుద్ధి మదిఁబుట్టని చోటఁబ్రధానులెంత ప్ర
జ్ఞా పరిపూర్ణులైనఁ గొనసాగదు కార్యము కార్యదక్షులై
యోపిన ద్రోణ భీష్మకృప యోధులనేకులుఁ గూడి కౌరవ
క్ష్మాపతి కార్యమేమయినఁ జాలిరెచేయఁగ వారు భాస్కరా!

ప్రతిపదార్థం:

భాస్కరా = ఓ సూర్య భగవానుడా!
భూపతికిన్ = రాజునకు;
ఆత్మబుద్ధి = తన తెలివి
మదిన్ = మనస్సు నందు
పుట్టనిచోన్ = కలుగకున్న పక్షంలో
ప్రధానులు = (ఆ రాజుగారి) మంత్రులు
ఎంత = ఎంతయో
ప్రజ్ఞాపరిపూర్ణులు = గొప్పబుద్దితో నిండినవారు
ఐనన్ = అయినప్పటికీ
కార్యము = పని
కొనసాగదు = నెరవేరదు;
ఎట్లనన్ = ఎలా అంటే
కార్యదక్షులై = పనులయందు నేర్పరులైన
ద్రోణభీష్మకృప యోధులు ;
ద్రోణ = ద్రోణాచార్యులు
భీష్మ = భీష్ముడు
కృప = కృపాచార్యుడు మొదలయిన
యోధులు = వీరులు;
అనేకులు = అనేకమంది
కూడి = కలసి
కౌరవక్ష్మాపతికార్యము = కౌరవులకు రాజయిన దుర్యోధనుని పనిని; (యుద్ధ విజయాన్ని)
ఏమైనన్ = ఏ మాత్రమైనా
చేయగన్ = చేయడానికి
చాలిరె = సరిపోయినారా? (సరిపోలేదు)

భావం : భాస్కరా! రాజుకు సరైన ఆలోచన పుట్టనపుడు, మంత్రులు ఎంత తెలివి కలవారయినా, కార్యాన్ని నెరవేర్చలేరు. కార్యాలోచనలేని దుర్యోధనుడి పనులను, కార్యదక్షులైన ద్రోణ, భీష్మకృపాచార్యాది మహావీరులు, నెరవేర్పలేక పోయారు కదా!

విశేషము : దుర్యోధనుని పక్షంలో మహావీరులయిన భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు వంటి వారున్నా, దుర్యోధనుడికి యుద్ధ విజయాన్ని వారు తెచ్చిపెట్టలేకపోయారు.

III

5వ పద్యం : (కంఠస్థ పద్యం)

చం॥ ధనము, ధనాభిమానము, సదాధనతృష్ణయు మూడు దోషముల్
ధనికున కందు తొల్తటిది ద్రవ్యము పేదకు లేదు కావునన్
ధనికుని కంటె పేదకడు ధన్యుడు, యాతని తృష్ణ సజ్జనా
ప్తిని శమియించు వేంకటపతీ! అఖిలాండపతీ! శ్రియఃపతీ!

ప్రతిపదార్థం :

వేంకటపతి
అఖిలాండపతీ = ఓ వేంకటేశ్వరా!
(అఖిల + అండ, పతీ) = ఓ బ్రహ్మాండనాథా!
శ్రియఃపతీ = లక్ష్మీపతీ!
ధనమున్ = ధనమునూ
ధనాభిమానమున్
(ధన + అభిమానమున్) = ధనమునందు అభిమానమునూ
సదా = ఎల్లప్పుడునూ
తృష్ణయున్ = పేరాశయునూ (అనే); (ధనం సంపాదించాలనే కోరికయును)
మూడు దోషముల్ = మూడు దోషాలూ
ధనికునకున్ = ధనవంతుడికి (ఉంటాయి)
అందున్ = ఆ మూడు దోషాలయందు
తొల్తటిది = మొదటిది (అనగా ధనము)
పేదకున్ = బీదవానికి
లేదు = లేదు
అతని = ఆ పేదవాడి
తృష్ణ = ధనముపై పేరాశ
సజ్జనాప్తిని (సజ్జన + ఆప్తిని) = మంచివారితో కూడడం (సహవాసం) వల్ల
శమించున్ = శమిస్తుంది (నశిస్తుంది)
కావునన్ = కాబట్టి
ధనికుని కంటెన్ = ధనవంతుడి కన్నా
పేద = బీదవాడు
కడున్ = మిక్కిలి
ధన్యుడు = ధన్యాత్ముడు

భావం : ఓ వేంకటపతీ! బ్రహ్మాండాధిపతీ! లక్ష్మీనాథా! ధనమూ, ధనముపై అభిమానమూ, ఎల్లప్పుడూ ధనం సంపాదించాలనే కోరికా, అనే మూడు దోషాలూ ధనవంతుడికి ఉంటాయి. కాని పేదవాడికి అందులో ధనము అనే దోషం ఉండదు. పేదవాడికి ధనాశ ఉన్నా మంచివారికి దగ్గర ఉండడం వల్ల అతడిలో ఆ ధనాశ పోతుంది. కాబట్టి పేదవాడు ధనికుని కంటె ధన్యుడు.

6న పద్యం: (కంఠస్థ పద్యం)

మ॥ గరమున్ మ్రింగి హరించితిన్ సుజన దుఃఖమ్మంచు నీయాత్మలో
మురియంబోకు మనుష్యదుర్విషమునున్మూలింపుమా ముందు యీ
నరులందుండు విషమ్ము సూది విడనైనన్సంధి లేదో ప్రభూ
హర శ్రీవేములవాడ రాజఫణి హారా! రాజరాజేశ్వరా!

ప్రతిపదార్థం :

ఓ ప్రభూ = ఓ ప్రభువా!
హర = ఈశ్వరా
శ్రీవేములవాడ = సంపత్కరమైన వేములవాడ అనే పుణ్యక్షేత్రంలో వెలసిన
రాజఫణి, హారా = పెద్ద సర్పము కంఠహారంగా కలవాడా?
రాజరాజేశ్వరా = ఓ రాజరాజేశ్వర స్వామీ !
గరమున్ = కాలకూట విషాన్ని
మ్రింగి = మ్రింగి (తిని)
సుజన దుఃఖమ్మున్ = సత్పురుషులైన దేవతల దుఃఖాన్ని
హరించితిన్ = పోగొట్టాను
అంచున్ = అని
నీ యాత్మలోన్ (నీ + ఆత్మలోన్) = నీ మనస్సులో
మురియంబోకు = సంతోషపడవద్దు
ఈ నరులందున్ = ఈ మనుష్యులందు
ఉండు = ఉండే
విషమ్ము = విషము
సూదిన్ = సూదిని
ఇడనైనన్ = గ్రుచ్చడానికైనా
సంధిలేదు = సందులేదు
ముందు = ముందుగా
మనుష్యదుర్విషమున్ = మనుష్యులలో ఉన్న చెడ్డ విషాన్ని
ఉన్మూలింపుమా = నశించునట్లు చెయ్యి

భావం : సర్పరాజు వాసుకిని కంఠమున ధరించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామీ ! విషాన్ని మ్రింగి దేవతల దుఃఖాన్ని పోగొట్టానని నీలో నీవు మురిసిపోవద్దు. సూదిమొనకు కూడా చోటు లేనంతగా నిండిపోయిన ఆ మనుష్యులలోని భయంకరమైన విషాన్ని ముందుగా తొలగించు.

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

7వ పద్యం : (కంఠస్థ పద్యం)

సీ||
కూతురు చందాన కోడలిన్ జూచిన
మండునే ఘోరముల్ మందిరమున ?
కార్మిక జనుల భాగస్థులుగాఁ గాంచ
క్రమ్మునే అలజడుల్ కర్మశాల ?
దళితుల నిజ సహోదరులుగా మన్నించ
పుట్టునే ఉత్పాతములు జగాన?
పరమతస్థుల తమ వారిగా ప్రేమించ
రేగునే కలహాగ్నులాగడములు?
తేగీ॥
అఖిల జీవుల తనవోలె నాదరింప
ఉద్భవించునే యాపదలుర్వియందు?
వరశుభవిలాస | శ్రీనింబగిరి నివాస!
భవ్యగుణధామ ! నరసింహ! దివ్యనామ!

ప్రతిపదార్థం :

వరశుభవిలాస;
వర = శ్రేష్ఠమైన
శుభ = శుభాలతో
విలాస = అలరారే వాడా!
భవ్యగుణధామ;
భవ్య = శ్రేష్ఠమైన
గుణ = గుణాలకు
ధామ = నిలయమైనవాడా!
‘శ్రీ నింబగిరి నివాస;
శ్రీ = సంపత్కరమైన
నింబగిరి = నింబగిరియందు
నివాస = నివసించేవాడా?
దివ్యనామ = ఇంపయిన పేరుగలవాఁడా?
నరసింహ = ఓ నరసింహస్వామీ
కోడలిన్ = కోడలిని (కొడుకు భార్యను)
కూతురు చందానన్ = తన కూతురునువలె
చూచినన్ = చూచినట్లయితే
మందిరమునన్ = ఇంట్లో
ఘోరముల్ = భయంకరములైన సంఘటనలు (కోడలిని దహనం చేయడం, కొట్టడం, విషాన్ని త్రాగించడం వంటివి)
మండునే = చెలరేగుతాయా ?
కార్మిక జనులన్ = ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులను
భాగస్థులుగాన్ = (ఆ) ఫ్యాక్టరీ లాభనష్టాల్లో భాగము కలవారిగా
కాంచన్ = చూస్తే
కర్మశాలన్ = ఫ్యాక్టరీలో
అలజడుల్ = ఆందోళనలు (సమ్మెలు వగైరా)
క్రమ్మునే = వ్యాపిస్తాయా? (జరుగుతాయా?)
దళితులన్ = హరిజనులను
నిజసహోదరులుగాన్ = తన తోడబుట్టినవారిగా
మన్నించన్ = గౌరవిస్తే (ఆదరిస్తే)
జగానన్ = ప్రపంచంలో
ఉత్పాతములు = ఉపద్రవములు
పుట్టునే = కలుగుతాయా ?
పరమతస్థులన్ = = ఇతర మతాలవారిని
తమ వారిగా = తమకు కావలసిన వారిగా (తమ మతంలోని వారిగా)
ప్రేమించన్ = ప్రేమగా చూస్తే
కలహాగ్నులు
(కలహా + అగ్నులు) = కయ్యాలు అనే అగ్నిహోత్రములు
ఆగడములు = దౌష్ట్యములు (అన్యాయాలు)
రేగునే = విజృంభిస్తాయా? (పెరుగుతాయా?)
అఖిల జీవులన్ = అన్ని ప్రాణులనూ
తనవోలెన్ = తనవలెనే (ఆత్మవత్ సర్వభూతాని అన్న విధంగా)
ఆదరింపన్ = ప్రేమగా చూస్తే
ఉర్వియందున్ = భూమండలంలో
ఆపదలు = ఆపత్తులు
ఉద్భవించునే = సంభవిస్తాయా ? (సంభవింపవు)

భావం : నింబగిరిలో విలసిల్లే దేవా! శ్రేష్ఠమైన శుభాలతో ఒప్పేవాడా! అత్యుత్తమ గుణాలకు నిలయమైనవాడా! ఓ నరసింహదేవా! కోడలిని కూతురి మాదిరిగా చూస్తే, ఇంట్లో ఘోరాలు సంభవించవు. కార్మికులను భాగస్థులను చేస్తే, కర్మాగారంలో అల్లర్లు జరుగవు. దళితులను తన సొంత అన్నదమ్ముల్లాగా భావిస్తే, ప్రపంచంలో ఉపద్రవాలు పుట్టవు. ఇతర మతస్థులను తనవారిగా ప్రేమతో చూస్తే, కొట్లాటలు, ఆగడాలు పెరగవు. ప్రాణులనందరినీ తనవలె ఆదరంగా చూస్తే, భూమిమీద కష్టాలు పుట్టవు గదా!

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

8వ పద్యం : (కంఠస్థ పద్యం)

శా॥ ఆశాపాశ నిబద్ధుడై చెడక నిత్యంబోర్సుతో దేశికా
దేశంబుందలఁదాల్చి యోగ విధులర్డిన్ సల్పుచున్ భవ్యమౌ
నాశీర్వాదము వొజ్జచేఁ బడసితానందంగనౌ నంచితం
బౌశాంతంబును వచ్యుతార్చిత పదాబ్జా! చంద్రమౌళీశ్వరా!

ప్రతిపదార్థం:

అచ్యుతార్చితపదాబ్జా ;
అచ్యుత = శ్రీమహావిష్ణువు చేత
అర్చిత = పూజింపబడిన
పదాబ్జా (పద + అబ్జా) = పద్మములవంటి పాదములు
చంద్రమౌళీశ్వరా = చంద్రుడు శిరస్సున గల ఓ చంద్రమౌళీశ్వర స్వామీ !
ఆశాపాశ నిబద్ధుడై ;
ఆశాపాశ = ఆశలు అనే త్రాళ్ళచే
నిబద్ధుడై = కట్టబడినవాడై
చెడక = చెడిపోక
నిత్యంబు = ఎల్లప్పుడునూ
ఓర్పుతో = సహనముతో
దేశికాదేశంబున్ ;
దేశిక = గురువుగారి యొక్క
ఆదేశంబున్
తలదాల్చి
(తలన్ + తాల్చి) = శిరసావహించి
యోగవిధులు = యోగాభ్యాస విధులు (యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అనే అష్టాంగయోగ విధులు)
అర్థిన్ = ప్రీతితో
సల్పుచున్ = ఆచరిస్తూ
భవ్యమ్ = అనుకూలమైన
ఆశీర్వాదమున్ = ఆశీస్సును
ఒజ్జచేస్ = గురువుగారిచేత
పడసి = పొంది
(అంచితంబు + ఔ) = ఒప్పియున్న
తాన్ = తాను
అందంగనౌన్ = అందుకోగలడు (సంపాదించగలడు)

భావం : విష్ణువుచే పూజింపబడిన పాదపద్మాలు కలిగిన ఓ చంద్రమౌళీశ్వరా! ఆశ అనే పాశముచే బంధింపబడి, చెడిపోకుండా, ఎల్లప్పుడూ ఓర్పుతో గురువుగారి ఆదేశాలను తలదాల్చి, యోగాభ్యాస విధులను ఆచరిస్తూ, గురువుగారి దివ్యమైన ఆశీస్సును పొందినపుడే, శిష్యుడు శ్రేష్ఠమైన శాంతిని
పొందగలుగుతాడు.

పాఠం ఉద్దేశం

శతక పద్యాలు నైతికవిలువల్ని పెంపొందింపజేస్తాయి. భావి జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. శతక పద్యాల ద్వారా నైతిక విలువలను పెంపొందించడమే ఈ పాఠ్యం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం, శతక ప్రక్రియకు చెందినది. సాధారణంగా శతకపద్యాల్లో ప్రతిపద్యం చివర ‘మకుటం’ ఉంటుంది. శతక పద్యాలు ముక్తకాలు. అంటే ఏ పద్యానికదే స్వతంత్రభావంతో ఉంటుంది. ప్రస్తుత పాఠంలో మల్లభూపాలీయం, సర్వేశ్వర, భాస్కర, శ్రీకాళహస్తీశ్వరశతకం, ఉత్పలమాల, ఏకప్రాసశతపద్యమాలిక, నింబగిరి నరసింహ, చంద్రమౌళీశ్వర శతకాల పద్యాలున్నాయి.

కవుల పరిచయం

1) సర్వేశ్వర శతక కర్త :
TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 1

  1. యథావాక్కుల అన్నమయ్య.
  2. ఈయన కవితా శైలి ధారాళమైనది.
  3. ఈ సర్వేశ్వర శతకానికి శతక సాహిత్యములో గొప్ప పేరున్నది. ఈయన కాలము 13వ శతాబ్దం.

2) శ్రీకాళహస్తీశ్వర శతక కర్త :
TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 2

  1. ధూర్జటి
  2. ఈయన కాలము 16వ శతాబ్దం.
  3. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో “ధూర్జటి” ఒకడు.
  4. రాజుల సేవను ఈయన ధైర్యంగా ధిక్కరించాడు.
  5. ఈయన కవిత్వాన్ని శ్రీకృష్ణదేవరాయలు, “అతులితమాధురీమహిమ” కలదిగా మెచ్చుకున్నాడు.
  6. ఈయన
    1. శ్రీకాళహస్తీశ్వర శతకం,
    2. శ్రీకాళహస్తి మాహాత్మ్యం అనే ప్రబంధాన్ని రాశాడు.

3) “మల్ల భూపాలీయం” నీతిశతక కర్త :
TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 3

  1. ఎలకూచి బాల సరస్వతి. కాలం 17వ శతాబ్దం.
  2. ఈయన నాగర్ కర్నూల్ జిల్లా జటప్రోలు సంస్థానంలో సురభి మాధవరాయల ఆస్థానకవి.
  3. ఈయన తెలుగులో మొదటి త్ర్యర్థి కావ్యం రాఘవ యాదవ పాండవీయంతో పాటు, 12 గ్రంథాలు రచించాడు.
  4. భర్తృహరి సుభాషిత త్రిశతిని, తెలుగులోనికి అనువదించిన వారిలో ఈయన మొదటివాడు.

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

4) భాస్కర శతక కర్త :
TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 4

  1. మారద వెంకయ్య. కాలం 17వ శతాబ్దం.
  2. ఈయన ‘భాస్కరా’ అనే మకుటంతో ఎన్నో నీతులను మనసుకు హత్తుకొనేటట్లు, తన పద్యధారను కొనసాగించాడు.

5) ఉత్పలమాల :
TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 5

  1. ఉత్పల సత్యనారాయణాచార్య
  2. జననం : 4-7-1928. మరణం : 23-10-2007,
  3. ఈయన ఖమ్మం జిల్లాలోని చింతకాని ప్రాంతీయుడు.
  4. రసధ్వని, “ఈ జంటనగరాలు హేమంతశిశిరాలు,” గజేంద్రమోక్షం, భ్రమరగీతం, శ్రీకృష్ణ చంద్రోదయం మొదలైనవి రాశాడు.

6) ఏకప్రాస శతపద్యమాలిక కర్త:
TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 6

  1. గౌరీభట్ల రఘురామ శాస్త్రి
  2. జననం : 22-04-1929, మరణం : 4-2-2004.
  3. సిద్ధిపేట జిల్లాలో “రిమ్మనగూడ” ఈయన జన్మస్థానం.
  4. వ్యాసతాత్పర్య నిర్ణయం, గోమాత కళ్యాణ దాసచరిత్రం, శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శతపద్యమాలిక, శివపద మణిమాల, భావానంద స్వామి చరిత్ర మొదలైనవి రచించారు.

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

7) నింబగిరి నరసింహ శతక కర్త:
TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 7

  1. డా॥ అందె వేంకటరాజం
  2. జననం : 14-10-1933, మరణం : 11-09-2006. జన్మస్థలం : జగిత్యాల జిల్లా కోరుట్ల,
  3. రచనలు : నవోదయం, మణిమంజూష, కళాతపస్విని అనే పద్యకావ్యాలు, “భారతరాణి” నాటికల సంపుటి మొదలైనవి రాశాడు.
  4. బిరుదులు : కవి శిరోమణి, అవధాన యువకేసరి, అవధాన చతురానన మొదలైనవి.

8) చంద్రమౌళీశ్వర శతక కర్త :
TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 8

  1. ఇమ్మడిజెట్టి చంద్రయ్య. నాగర్ కర్నూల్ జిల్లా “తాళ్లపల్లి” జన్మస్థలం.
  2. జననం : 31-03-1934. మరణం : 11-03-2001
  3. రచనలు :
    1. హనుమద్రామ సంగ్రామం, భక్తసిరియాళ, వీరబ్రహ్మేంద్ర విలాసం అనే హరికథలు, రామప్రభు శతకం, మృత్యుంజయ శతకం మొదలైనవి.

ప్రవేశిక

పద్య ప్రక్రియలో శతకం ఒక విభాగం. నీతినీ, జీవిత అనుభవాలనూ, భక్తినీ, వైరాగ్యాన్నీ శతకపద్యాలలో కవులు రాశారు. ఈ శతక పద్యాలు, నైతిక విలువలను పెంపొందిస్తూ, రసానుభూతిని కలిగిస్తాయి. ఇటువంటి కొన్ని శతక పద్యాలను మనం చదువుదాం.