TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

Telangana SCERT 9th Class Telugu Guide Telangana 2nd Lesson నేనెరిగిన బూర్గుల Textbook Questions and Answers.

TS 9th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana నేనెరిగిన బూర్గుల

చదువండి – ఆలోచించి చెప్పండి (Textbook Page No. 14)

సహనమ్ము, సత్యమ్ము, శాంతగంభీరమ్ము,
ఆత్మవిశ్వాసమ్ము, నహరహమ్ము
సాధన, దక్షత, సాధుభాషణమును,
సద్వివేచనమును, సద్గమనము,

దానమ్ము, ధైర్యమ్ము, త్యాగమ్ము, సునిశిత
బుద్ధి, మేల్గాంచుట, పుణ్యగుణము,
కరుణ, క్షమ, పరోపకారబుద్దియనెడి
యాలోచనారీతు లమరియుండు

‘మనుజులెప్పుడును మాన్యులు, మంగళస్వ
రూపులు, మహోన్నతులు, విరాడ్రూపశోభి
తులు, సుకీర్తికాంతవరపతులు, సుమతులు,
జగతిగతి విరచితులు, సజ్జనులువారు.

ప్రశ్న 1.
ఈ పద్యం దేన్ని గురించి చెబుతున్నది ?
జవాబు:
ఈ పద్యం మాన్యులూ, మంగళ స్వరూపులూ, మహోన్నతులూ, కీర్తిమంతులూ అయిన సజ్జనులను గురించి చెబుతున్నది.

ప్రశ్న 2.
ఈ పద్యం ద్వారా గుర్తించిన లక్షణాలేవి ?
జవాబు:
ఈ పద్యం ద్వారా గుర్తించిన లక్షణాలు ఇవి.

  1. సహనం,
  2. సత్యం,
  3. శాంతగంభీరం,
  4. ఆత్మవిశ్వాసం,
  5. రాత్రింబగళ్ళు సాధన,
  6. దక్షత,
  7. సాధుభాషణం,
  8. సద్వివేచనం,
  9. సద్గమనం,
  10. దాన ధైర్యాలు,
  11. త్యాగం,
  12. సునిశిత బుద్ధి,
  13. పుణ్యగుణం,
  14. కరుణ,
  15. క్షమ,
  16. పరోపకారబుద్ధి.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 3.
మంచి లక్షణాలు కలిగిన వారినేమంటారు ?
జవాబు:
మంచి లక్షణాలు కలిగిన వారిని

  1. మాన్యులు,
  2. మంగళ స్వరూపులు,
  3. మహోన్నతులు,
  4. విరాడ్రూపశోభితులు,
  5. సుమతులు,
  6. సజ్జనులు అని అంటారు.

ప్రశ్న 4.
అలాంటివారి గురించి ఎందుకు తెలుసుకోవాలి ? వారితో ఎందుకు సాంగత్యం చేయాలి ?
జవాబు:
అలాంటి వారిని గూర్చి చదివితే, మంచి స్ఫూర్తి కలుగుతుంది. అలాంటి మహాత్ముల గుణాలను ఆదర్శంగా తీసుకొని తాము కూడా ఆ విధంగా సన్మార్గంలో నడవడానికి వీలుపడుతుంది. అటువంటి వారితో సాంగత్యం చేయడం వల్ల, వారి మహోన్నత వ్యక్తిత్వం గూర్చి చక్కగా తెలిసికోడానికి వీలవుతుంది.

అటువంటి వారిని గూర్చి తెలిసికొని, వారు నడచిన అడుగుజాడలలో తాము కూడా నడవడానికి వీలవుతుంది.

ఆలోచించండి – చెప్పండి’ (Textbook Page No. 17)

ప్రశ్న 1.
అంతరాత్మ బోధించడం అంటే ఏమిటి ? మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైందా ? ఎప్పుడు?
జవాబు:
అంతరాత్మ అంటే హృదయం. అంటే మనలో ఉన్న మనస్సు. మనం నోటితో పైకి ఏమి చెపుతున్నా, లోపల మనస్సు మరోరకంగా చెపుతూ ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి అందరికీ జరుగుతుంది.

ఒకసారి నేను మధ్యాహ్నం బడి మానివేసి సినీమాకు వెళ్ళాను. ఇంటికి వచ్చాక నాన్నగారు ఆలస్యంగా ఎందుకు వచ్చావని అడిగారు. ఆటలు ఆడి వచ్చానని అబద్ధం చెప్పాను కాని నేను అబద్ధం చెపుతున్నాననీ, అది తప్పనీ, నా అంతరాత్మ నాకు బోధించింది.

ప్రశ్న 2.
ఇతరులకంటే తాను అధికుడననిపించుకోవాలనే ఉబలాటం, పెనుగులాట, ప్రతినిత్యం ఉంటూనే ఉంటుంది. ఈ వాక్యం ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు:
ప్రతి వ్యక్తి తాను ఇతరుల కంటే గొప్పవాడినని, పదిమంది చేత అనిపించుకోవాలని గట్టిగా అనుకుంటాడు. అందుకోసం లేని గొప్పలు చెప్పుకోడానికి కూడా అతడు సిద్ధపడతాడని గ్రహించాను.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 3.
సత్యదూరమైన విషయం అంటే ఏమిటి ? దీన్ని ఏ ఏ సందర్భాలలో వాడతారు ?
జవాబు:
సత్యదూరమైన విషయం అంటే, నిజం కాని విషయం. అంటే పూర్తిగా అబద్ధము అన్నమాట. ఇతరులు లేని మాటలను ఉన్నట్లు చెపుతున్నపుడు, వారు చెప్పినది. అబద్ధం అని చెప్పడానికి ‘సత్యదూరం’ అనే మాటను వాడతారు.

ఆలోచించండి – చెప్పండి’ (Textbook Page No. 19)

ప్రశ్న 1.
ఎవరైనా గుర్తింపు పొందడానికి శరీరాకృతి కారణం కాదని తెల్సుకొన్నారు కదా! దీన్ని మీరెలా సమర్థిస్తారు?
జవాబు:
“ఒక వ్యక్తి గుర్తించబడటానికి అతని శరీరం యొక్క ఆకారం కారణం కాదు” అని రచయిత చెప్పిన మాట సత్యం.

మన భారతదేశానికి రెండవ ప్రధానమంత్రి అయిన “లాల్ బహదూర్ శాస్త్రిగారు” పొట్టివాడు. ఆయన ఎంతోకాలం కేంద్రమంత్రిగా పనిచేశారు. రైల్వేమంత్రిగా ఆయన ఉన్నప్పుడు పెద్ద రైల్వే ప్రమాదం జరిగింది. వెంటనే ఆయన రిజైన్ చేశారు.

ఆయన ‘జై జవాన్ జై కిసాన్’ అనే నినాదం ఇచ్చి, రైతులనూ, సైనికులనూ ఉత్తేజపరచాడు. ఆయన మరణించే నాటికి ఆయనకు స్వంత ఇల్లు లేదు. అంతటి నిజాయితీ గల శాస్త్రిగారు పొట్టివాడైనా, ఆయన గట్టివాడనిపించుకున్నాడు కదా!

ప్రశ్న 2.
అనన్యమైన వాదనాపటిమ అంటే ఏమిటి ? ఇది ఎవరికి అవసరం ? ఎందుకు ?
జవాబు:
‘వాదనాపటిమ’ అంటే వాదించడంలో గల సమర్థత అని అర్థం. ‘అనన్యము’ అంటే అటువంటి వాదనాశక్తి, మరొక్కరికి ఎవ్వరికీ లేదని అర్థం. ‘అనన్యమైన వాదనాపటిమ’ అంటే, తాను చెప్పినదే సరయినదని, ఎదుటి వారివద్ద గట్టిగా వాదించి చెప్పగల సామర్థ్యం.

ఇటువంటి వాదనాపటిమ ముఖ్యంగా న్యాయ వాదులకు ఉండాలి. న్యాయవాదులు చేపట్టిన కేసులను నెగ్గించుకోవాలంటే, వాదనాపటిమ వారికి ముఖ్యం.

ప్రశ్న 3.
“కొరుకుడు పడకపోవడం” అంటే ఏమిటి ? దీన్ని ఏ ఏ సందర్భాలలో వాడతారు ?
జవాబు:
వస్తువు గట్టిగా ఉండి, పళ్ళతో కొరికి తినడానికి వీలులేక పోవడాన్ని “కొరుకుడు పడకపోవడం” అంటారు. ఈ పదాన్ని రెండు సందర్భాల్లో వాడతారు.

  1. వస్తువు బాగా గట్టిగా ఉండి, పళ్ళతో కొరికి తినడానికి వీలుకానప్పుడు వాడతారు.
  2. తెలిసికోవలసిన విషయం మన బుద్ధికి అంద నప్పుడు, అది ఎంత చెప్పినా అర్థం కానప్పుడు, ఎంత పరిశీలించినా ఆ విషయం స్పష్టం కానప్పుడు, విషయం “కొరుకుడు పడడం లేదు” అని అంటారు.

ఆలోచించండి – చప్పండి (Textbook Page No. 20)

ప్రశ్న 1.
గొప్పవారు తమ జీవితానుభవాలను గ్రంథస్థం ఎందుకు చేయాలి ?
జవాబు:
గొప్పవారి జీవిత చరిత్రలో ఎన్నో ఆదర్శ సంఘటనలు ఉంటాయి. అవి ఇతరులకు మార్గదర్శకంగా ఉంటాయి. వాటిని అందరూ తెలిసికోవాలి.

గొప్పవారు తమ జీవితానుభవాలను వారు పుస్తక రూపంగా రాసిపెడితే, ఆ పుస్తకాలు చదివి, ఇతరులు తమ జీవితాల్ని గొప్పవారు నడిచిన మంచి దారిలో నడుపుకోవచ్చును. కనుక గొప్పవారు తమ జీవితాను భవాల్ని పుస్తకంగా రాయాలి.

ప్రశ్న 2.
మీరు వెచ్చించే సమయం దేనికి ఎక్కువగా ఉంటోంది? మీకుపయోగపడేవాటికా ? లేక ఇతరపనులకా ?
జవాబు:
నేను ఎక్కువగా నా సమయాన్ని చదువుకోసం, ఆటపాటల కోసం వినియోగిస్తాను. నేను ఇతర పనులకు నా సమయాన్ని వినియోగించను.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 3.
రామకృష్ణారావుగారిని పి.వి. గారు ప్రాతఃస్మరణీయులు అని పేర్కొన్నారు కదా! నేటి రాజకీయ నాయకులు కూడా రామకృష్ణారావుగారిలా గొప్పపేరు సంపాదించు కోవాలంటే ఎలా ఉండాలి ? ఏమేం చేయాలి ?
జవాబు:
నేటి రాజకీయ నాయకులు కూడా రామకృష్ణారావు గారివలె పేరు సంపాదించుకోవాలంటే ఈ క్రింది విధంగా పనులు చేయాలి.

  1. ప్రజల అభీష్టానికి పూర్తిగా ప్రాధాన్యం ఇచ్చి మతాతీతంగా విశిష్ట వ్యక్తిత్వం కలిగి ఉండాలి.
  2. ప్రజలకు కష్టసుఖాలలో తాము పాలుపంచుకోవాలి.
  3. శాసనసభ చర్చలలో చక్కగా పాల్గొని, దేశాభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి చక్కని సూచనలు ఇవ్వాలి.
  4. సాహిత్యం బాగా చదివి మంచి పాండిత్యం సంపాదించాలి. మంచి వక్తగా పేరు పొందాలి.
  5. అవినీతికి దూరంగా ఉండాలి.
  6. ప్రజలకు సన్నిహితంగా, సోదర శాసనసభ్యులతో స్నేహంగా, ప్రజల తలలో నాలుకవలె మెలగాలి.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
కింది అంశం గురించి మాట్లాడండి.

ఇతరుల కంటే తాను అధికుడననిపించుకోవాలనే ఉబలాటం, పెనుగులాట ప్రతినిత్యం ఉంటూనే ఉంటుంది. దీని గురించి మీ అభిప్రాయాలను తెలపండి.
జవాబు:
ఇతరుల కంటే తాను గొప్పవాడని అనిపించుకోవాలనే కోరిక, ఉత్సాహము సహజంగా అందరిలోనూ ఉంటుంది. బడిలో పిల్లలకు కూడా పక్కవాడి కంటే తాను ఎక్కువ మార్కులు తెచ్చుకొని, తాను గురువుల వద్ద మంచి పేరు తెచ్చుకోవాలని ఉంటుంది. అలాగే ఆటలలో తానే బాగా ఆడి, పేరు తెచ్చుకోవాలని, అందరూ తన ప్రతిభను మెచ్చుకోవాలని పిల్లలు అనుకుంటారు.

కవులూ, పండితులూ, ఇతర కవి పండితుల కంటే తాము గొప్పవారమని అందరూ గుర్తించాలని వారు తమను గూర్చి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. సంఘంలో మనుషులు తాము పక్కవారి కంటే డబ్బు కలవారమని, గొప్పవారమని అనిపించుకోవాలని ఉబలాటపడుతూ ఉంటారు.

ప్రశ్న 2.
కింది విషయాలు పాఠంలో ఏయే పేరాలలో ఉన్నాయి ? వాటికి సంబంధించిన అంశాలను పట్టికలో రాయండి.
జవాబు:
TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల 2

ప్రశ్న 3.
పాఠం మొత్తాన్ని చదువండి. పాఠంలో ఉన్న జాతీయాలను గుర్తించి రాయండి.
జవాబు:
పాఠంలో జాతీయాలు:

  1. శ్రీరామరక్ష
  2. గీటురాయి
  3. స్వస్తివాచకం
  4. కారాలు మిరియాలు నూరడం
  5. రూపుమాపడం
  6. ముప్పిరిగొను
  7. ఉక్కిరిబిక్కిరైపోవు
  8. వీసం ఎత్తు
  9. ఒడ్డూ పొడుగూ
  10. నిత్య నైమిత్తికం
  11. కంచుగోడలు
  12. కొరుకుడుపడని
  13. జోహారులర్పించు
  14. ప్రాతఃస్మరణీయులు
  15. మార్గదర్శకులు
  16. స్వస్తివాచకం
  17. ఆరునూరుగు
  18. చీల్చిచెండాడు
  19. అతిశయోక్తి
  20. ఒడుదుడుకులు.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 4.
కింది గద్యాన్ని చదువండి.

క్లిష్టపరిస్థితుల్లో రాజ్యాధికారం చేపట్టిన రుద్రమ నిరంతరం యుద్ధాల్లో నిమగ్నమైనా, పరిపాలనా నిర్వహణలో మంచి సమర్థురాలుగా పేరొందింది. స్త్రీలు రాజ్యాధికారం చేపట్టడం అరుదైన ఆ కాలంలో రుద్రమాంబ తన తండ్రి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయక వీరనారిగా చరిత్రలో నిలిచింది.

స్త్రీ అయినప్పటికి పురుషవేషం, పురుషనామం ధరించి సమకాలీన రాజులందరికంటే మిన్నగా రాజ్యాన్ని పరిపాలించి సాహసవంతమైన జీవితాన్ని గడిపింది. గ్రామాలను దానంచేసి ఆదాయంతో విద్యార్థులకు పాఠశాలలు, ఉచిత వసతిగృహాలు నెలకొల్పింది. ఆరోగ్యశాలలు, ప్రసూతి శాలలు ఏర్పాటు చేసింది.

ఒక విద్యాపీఠం స్థాపించి అందులో వేదాలను, సాహిత్యాన్ని, ఆగమవ్యాఖ్యానాలను బోధింపజేసేది. పాఠశాలల్లో ఉపాధ్యాయులను, గ్రామాల్లో కరణాలను నియమించి వారికి వస్తువాహనాలను, ధాన్యాన్ని సమకూర్చేది. మార్కోపోలో అనే విదేశీ యాత్రికుడు ఈమె పరిపాలనా దక్షత, సాహిత్యసేవ, శిల్పకళలు, మహదైశ్వర్యం గురించి ప్రశంసిస్తూ తన’ డైరీలో రాసుకున్నాడు. అదీ రుద్రమదేవి ఘనత.

కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) రుద్రమాంబపై ఆమె తండ్రి ఉంచిన నమ్మకమేమిటి ?
జవాబు:
రుద్రమాంబ స్త్రీ మూర్తి అయినా, ఆమె రాజ్యాధికారం చేపట్టి, చక్కగా పరిపాలించగలదని, రుద్రమాంబపై ఆమె తండ్రి నమ్మకం పెట్టుకున్నాడు.

ఆ) రుద్రమాంబ చేసిన సత్కార్యాలేవి ?
జవాబు:
రుద్రమాంబ గ్రామాలను దానంచేసి, ఆ ఆదాయంతో విద్యార్థులకు పాఠశాలలు, వసతిగృహాలు నెలకొల్పింది. ఆరోగ్యశాలలు, ప్రసూతిశాలలు ఏర్పాటు చేసింది. విద్యాపీఠం నెలకొల్పి, వేదాలను, సాహిత్యాన్ని, ఆగమాలను బోధింపజేసింది. కరణాలనూ, ఉపాధ్యాయులనూ నియమించింది.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ఇ) మార్కోపోలో ఏయే అంశాల్లో రుద్రమదేవిని పొగిడాడు ?
జవాబు:
మార్కోపోలో రుద్రమదేవి యొక్క

  1. పరిపాలనా దక్షత
  2. సాహిత్యసేవ
  3. శిల్పకళలు
  4. మహదైశ్వర్యం అనే విషయాలను గురించి పొగిడాడు.

ఈ) రుద్రమదేవి సమర్థత ఏమిటి ?
జవాబు:
రుద్రమదేవి క్లిష్టపరిస్థితిలో రాజ్యాధికారం చేపట్టి, నిరంతరం యుద్ధాల్లో నిమగ్నమైనా, పరిపాలనా నిర్వహణలో మంచి సమర్థత కలిగి ఉండేది.

ఉ) ఈ గద్యం ద్వారా రుద్రమదేవి వ్యక్తిత్వాన్ని ఒక వాక్యంలో రాయండి.
జవాబు:
రుద్రమదేవి పాలనాదక్షత

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

ప్రశ్న 1.
కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) బూర్గుల – పి.వి. గార్ల సంబంధం గురుశిష్య సంబంధం లాంటిది. దీన్ని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
పి.వి. నరసింహారావుగారు, బూర్గుల రామకృష్ణారావు గారి దగ్గర, అందరికంటే జూనియర్ న్యాయవాదిగా శిక్షణ పొందేవారు. తల్లి, చిన్న పిల్లవానిపై మమకారం ఎక్కువగా చూపించే విధంగానే, బూర్గుల వారు, పి.వి. గారిపై విశేష మమకారం చూపించేవారు. పి.వి. గారు చొరవగా బూర్గుల వారి ఆఫీసుకు వెళ్ళి, జూనియర్లకు లొంగని చిక్కుకేసులను చదివేవారు. అది చూసిన బూర్గులవారి సీనియర్ గుమస్తా, పి.వి. గారిపై కోపపడేవాడు.

అది చూసిన బూర్గులవారు, పి.వి. గార్కి కేసులు చదవడానికి అనుమతి ఇచ్చారు. అంతేగాక, పి.వి. గారితో కేసుల గురించి స్వయంగా తాను చర్చించేవారు. దానితో పి.వి. గారు తన శక్తిసామర్థ్యాలను గుర్తించి, ఆత్మవిశ్వాసాన్ని పొందారు.

ఈ విధంగా పి.వి. గారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన, బూర్గుల వారు, గురువులుగానూ, పి.వి. గారు శిష్యులుగానూ పేరు పడ్డారు. వారిద్దరి మధ్య గల సంబంధం గురుశిష్య సంబంధం వంటిది.

ఆ) ‘సరే – అవన్నీ ఆటల్లో ఉండేవేగా’ అని బూర్గులవారు అనేవారు కదా! ఏ సందర్భంలో ఎందుకనేవారో దానికిగల కారణాలను రాయండి.
జవాబు:
బూర్గుల రామకృష్ణారావుగారి సామాజిక యాత్ర, ఎప్పుడూ సాఫీగా సాగలేదు. ఆయన అనేక రకాల ఒడుదుడుకులను ఎదుర్కోవలసి వచ్చింది. అనేక సందర్భాల్లో ఆపదలు ఆయనను చుట్టుముట్టాయి. అయినా ఆయన చలించేవారు కాడు. మనః స్థైర్యాన్నీ, సమచిత్తతనూ విడిచిపెట్టేవారు కాడు.

ఆయన విజయానికి పొంగిపోలేదు. కష్టం వస్తే క్రుంగిపోలేదు. ఎవరైనా స్నేహితులు ఆయనకు ద్రోహం తలపెట్టినా, ఆయనకు వ్యతిరేకులు ఆయనను దూషించినా “సరే, అవన్నీ ఆటలో ఉండేవేగా” అని సరిపెట్టుకునేవారు.

ఇ) బూర్గుల వారిని ప్రాతఃస్మరణీయులని పి.వి. నరసింహారావుగారు పేర్కొనడాన్ని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
‘బూర్గుల రామకృష్ణారావుగారు ప్రాతఃస్మరణీయులు’ అని పి.వి. నరసింహారావుగారు రాశారు. ప్రాతఃస్మరణీయులంటే నిద్ర నుండి లేవగానే స్మరించుకోవలసిన దైవస్వరూపుడు అని అర్థము.

పి.వి. గారు బూర్గులవారి వద్ద జూనియర్ న్యాయవాదిగా ఉండేవారు. పి.వి. గారు, బూర్గులవారి ఆఫీసులోకి వెళ్ళి, జూనియర్లకు లొంగని చిక్కు కేసుల ఫైళ్ళను తీసి, చదువుతూ ఉండేవారు. పి.వి. చూపించే చొరవ, అక్కడ ఉన్న బూర్గుల వారి సీనియర్ గుమాస్తాకు కోపం తెప్పించింది.

ఒకసారి బూర్గులవారు దానిని గమనించి, పి.వి. గారు తన ఫైళ్ళు చూడడానికి అంగీకరించారు. అంతేగాక పి.వి. గారితో కేసుల గురించి స్వయంగా చర్చించేవారు. పి.వి. గారిలో శక్తి సామర్థ్యాలున్నాయని ఈ విధంగా పి.వి. గారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించారు. ఆ ఆత్మవిశ్వాసం, పి.వి. గారికి శ్రీరామరక్ష అయ్యింది. అందుకే పి.వి. గారు, బూర్గుల వారిని ప్రాతఃస్మరణీయులు అని రాశారు.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 2.
కింది ప్రశ్నలకు పడేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) బూర్గుల వ్యక్తిత్వంలోని మహోన్నత లక్షణాల గురించి సొంతమాటల్లో రాయండి.
జవాబు:
బూర్గుల వ్యక్తిత్వం – మహోన్నత లక్షణాలు: బూర్గులవారు ఎప్పుడూ అన్ని విషయాలూ, ఆఖరుకు తమలోని లోపాలను సహితం ఉన్నవి ఉన్నట్లు చెప్పేవారు. ఆయన పొట్టిగా ఉండేవారు. కాని ఆయనలో బహుముఖమైన ప్రతిభ ఉండేది. అవసరం అయినప్పుడు దానిని మహోన్నతరూపంలో వారు కనబరచేవారు. అవసరం లేనప్పుడు అది ఆయనలో ఇమిడి పోయేది.

న్యాయవాదిగా, బూర్గులవారు విశేషప్రతిభతో, ఎదుటి న్యాయవాదుల వాదనలకు ఎదురొడ్డి నిలిచేవారు. ఆయనలో సునిశిత మేధాసంపత్తి ఉండేది. బూర్గులవారు తమ జూనియర్ న్యాయవాదులను బాగా ప్రోత్సహించి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేవారు. బూర్గులవారు ప్రాతఃస్మరణీయులు.

బూర్గులవారు కౌలుదారీ చట్టాన్ని తయారుచేసి, సామ్యవాద వ్యవస్థకు మార్గదర్శకులు అయ్యారు. బూర్గులవారు, రాజనీతి విశారదులు. బూర్గులవారు ఏ నిర్ణయం తీసుకున్నా, అన్ని విధాలైన జాగ్రత్తలతోనూ, మంచి వ్యవహార దక్షతతోనూ తీసుకొనేవారు. బూర్గులవారు మతాతీత స్థితిని పాటించేవారు. వీరిది విశిష్టమైన వ్యక్తిత్వం. బూర్గులవారు మంచి పార్లమెంటేరియన్. ఈయన బహుభాషావేత్త. ఈయన మంచి ఉపకారశీలి. ఈయన సంతోషానికి పొంగలేదు. కష్టాలకు క్రుంగలేదు.

ఒక్కమాటలో చెప్పాలంటే, బూర్గులవారు “పూర్ణపురుషులు”, బహుముఖ ప్రజ్ఞగలవారు. ప్రధానంగా వీరు సాహితీ జగత్తుకు చెందినవారు.

(లేదా)

ఆ) ఈ పాఠం ఆధారంగా “గొప్పవారి సాంగత్యం వల్ల కలిగే స్పూర్తి గొప్పగా ఉంటుంది” అనే అంశం గురించి, సమర్థిస్తూ రాయండి.
జవాబు:
‘గొప్పవారి సాంగత్యం వల్ల కలిగే స్ఫూర్తి కూడా గొప్పగానే ఉంటుంది’ అన్నమాట నిజం.
బూర్గుల రామకృష్ణారావుగారు మహోన్నత వ్యక్తి. వారిది విశిష్ట వ్యక్తిత్వం. విశాల వ్యక్తిత్వం. ఈయన పూర్ణపురుషుడు. బూర్గులవారి సాంగత్యం, శ్రీ పి.వి. నరసింహారావుగారికి మంచి స్ఫూర్తి నిచ్చింది. బూర్గులవారి వద్ద శ్రీ పి.వి. గారు జూనియర్ లాయర్గా పనిచేసేవారు.

బూర్గులవారు లాయర్ కేసు తీసుకొనేటప్పుడే, ఆ కేసు తాలూకు ఫైలుపై రేఖామాత్రంగా, నోటు వ్రాసి పెట్టుకొనేవారు, ఆ నోటు ఆధారంగానే వారు కోర్టులో ఎదుటి న్యాయవాదుల వాదనలను గట్టిగా అడ్డుకొనేవారు. బూర్గులవారి మేధాసంపత్తినీ, ఆ వాదనాపటిమనూ దగ్గరగా చూసిన పి.వి. గారికి మంచి స్ఫూర్తి కలిగింది.

పి.వి. గారు బూర్గులవారి వద్ద అందరికంటే జూనియర్ లాయరుగా ఉండేవారు. బూర్గులవారు, పి.వి. గారిని ఆదరంగా చూసేవారు. దానితో పి.వి. గారు చొరవగా బూర్గులవారి ఆఫీసులోకి వెళ్ళి, తనకు కావలసిన కేసులను, ముఖ్యంగా జూనియర్లకు కష్టమైన చిక్కు కేసుల ఫైళ్ళను ఏరుకొని చదివేవారు. పి.వి. గారి ఆ చొరవకు అక్కడి సీనియర్ గుమాస్తా కోపపడేవాడు.

కాని బూర్గులవారు పి.వి. గారు తన ఫైళ్ళు చూడ్డానికి అంగీకరించారు. అంతేకాక కేసుల గురించి పి.వి. గారితో బూర్గులవారు సమాన స్థాయిలో చర్చించేవారు. దానితో పి.వి. గారు తనలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయని, ఆత్మవిశ్వాసాన్ని పొందారు.

పి.వి. గారికి ఆ ఆత్మవిశ్వాసం, శాసనసభల్లోనూ, ఇతర స్థలాల్లోనూ శ్రీరామరక్షగా పనిచేసింది. ఈ విధంగా గొప్పవారైన బూర్గులవారి సాంగత్యం, పి.వి. గారికి మంచి స్ఫూర్తి నిచ్చింది.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 3.
సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా రాయండి.

అ) పాఠంలోని పదజాలం, విశిష్ట లక్షణాల ఆధారంగా ఒక కవిత రాయండి.
జవాబు:
“పూర్ణపురుషుడు బూర్గుల రామకృష్ణారావు”
“రామకృష్ణారావు మహాశయా! ఓ పూర్ణపురుషా!
నీవు నా పాలిటి ప్రాతఃస్మరణీయుడవు.
నీ పేరు వింటే, గత స్మృతులతో ఉక్కిరిబిక్కిరౌతాను.
నీ చదువూ, మంత్రి పదవులూ, గవర్నరు గిరీలూ
కమిటీ అధ్యక్షతలూ – నీ వ్యక్తిత్వ ప్రతిబింబాలు కానేకావు.

నీ గురించి నీవు వీసం ఎత్తు ఎక్కువ తక్కువలు చెప్పవు.
నీవు నిజంగా వామనుడైన విరాట్ స్వరూపుడివి,
నీ వ్యక్తిత్వపు మహోన్నత శిఖరం, అనన్య దర్శనీయం
న్యాయవాదిగా నీ ప్రజ్ఞాప్రాభవాలు, శక్తి సామర్థ్యాలూ

సునిశిత మేధా సంపత్తీ – జాజ్వల్యమాన ప్రతిభా
అనన్య వాదనాపటిమా – అద్భుతం, మహాద్భుతం.
నీవు నాలో నింపిన ఆత్మవిశ్వాసం, నా కదే శ్రీరామరక్ష.
నీ విశిష్ట వ్యక్తిత్వానికి ఇవే నా జోహార్లు

నీవు సామ్యవాదవ్యవస్థకు మార్గదర్శకుడవు.
రాజకీయాలలో నీ సమ్యక్ దృష్టి, ప్రశంసనీయం
మత దురభిమాని నిజాం, నీకు బద్ధ శత్రువు, కానీ
కుచ్చుటోపీల మౌల్వీలూ, గడ్డాల ముల్లాలూ నీ వాళ్ళే

మతాతీత స్థితి, నీ విశాల వ్యక్తిత్వం
నీవు బహు భాషావేత్తవు, ఉపకారశీలివి, ఉదారుడవు.
కించిత్తూ చలించవు కష్టసుఖాల రాకలకు
నీ గురించి చెప్పాలంటే అది నా వల్ల ఔతుందా ?
కానేకాదు. నీవు నిజంగా “పూర్ణపురుషుడవు”.

(లేదా)

ఆ) ఈ పాఠం ఓ అభినందన పత్రంగా ఉంది కదూ! దీన్ని ఆధారంగా మీకు నచ్చిన గొప్ప వ్యక్తిని గురించి అభినందన వ్యాసం రాయండి.
జవాబు:
సరస్వతీ మూర్తీ!

మాకు నచ్చిన గొప్ప వ్యక్తి “ఉత్తమోపాధ్యాయుడు” దువ్వూరి సోమయాజులు గార్కి విద్యార్థులు సమర్పించిన సన్మానపత్రం.

ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయునిగా మిమ్ము నిర్ణయించి గౌరవించిన సందర్భంగా మీ శిష్యులమైన మేము మీకూ, ప్రభుత్వానికీ, శతకోటి వందనాలు అర్పిస్తున్నాం. మీరు బహుభాషావేత్తలు. సంస్కృతాంధ్రభాషల్లో మీకు గల శక్తి సామర్థ్యాలు, ప్రజ్ఞాప్రాభవాలు ప్రశంసనీయాలు. మీ వంటి బహుముఖ ప్రజ్ఞాశాలి, మాకు ఉపాధ్యాయుడిగా ఉండడం మాకు గర్వకారణం.

సౌజన్యమూర్తీ!
మీరు మా విద్యార్థులను మీ కన్నబిడ్డవలె ప్రేమగా చూస్తారు. మీరు మతాతీత స్థితిని పాటిస్తారు. మీకు కులమతాల పట్టింపులు లేవు. ధనిక బీద తారతమ్యం లేదు. మీ విశాల వ్యక్తిత్వం, విశిష్ట వ్యక్తిత్వం, సౌజన్యం మరెక్కడా కనబడదు. అందుకే మీరు ఉత్తమోపాధ్యాయులు అయ్యారని మా విశ్వాసం.

మార్గదర్శీ!
మీరు మాలో గల శక్తి సామర్థ్యాలను వెలికితీసి, మెరుగుపెట్టి, మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. అందుకే మాకు ఎన్నో మంచి మార్కులు, బహుమతులు వస్తున్నాయి. మీ సునిశిత మేధాసంపత్తి, జాజ్వల్యమాన ప్రతిభ ఆధారంగా మమ్మల్ని ఉత్తమ విద్యార్థులుగా మీరు తీర్చిదిద్దుతున్నారు. మీరు మా కందించే ప్రోత్సాహమే, మాకు శ్రీరామరక్ష. మీరు మాకు ప్రాతఃస్మరణీయులు.

మీకు పరమేశ్వరుడు ఆయురారోగ్య భాగ్యాలను ఇచ్చి, మా వంటి ఎందరో విద్యార్థినీ, విద్యార్థులను సాహితీ సంపన్నులుగా తయారుచేసేందుకు మీకు తోడ్పడాలని, మేము దైవాన్ని కోరుతున్నాం.

ఇట్లు,
పదజాలం

X X X X X X
హైదరాబాద్.

III. భాషాంశాలు

పదజాలం

1. కింద గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి.

అ) చిన్నప్పటి జ్ఞాపకాలు నాకు ముప్పిరిగొంటున్నాయి.
జవాబు:
ముప్పిరి = చుట్టుముట్టాయి (అతిశయించాయి.)

ఆ) వీసం ఎత్తు అహంకారం లేకుండా ముందుకెళ్ళాలి.
జవాబు:
వీసం ఎత్తు : 1/16 వ వంతు

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ఇ) దశరథుని కడగొట్టు బిడ్డడు శత్రుఘ్నుడు.
జవాబు:
కడగొట్టు = కట్టకడపటి ; చివరి

ఈ) భారతదేశ ప్రాభవాన్ని మనమంతా పెంచాలి.
జవాబు:
ప్రాభవాన్ని = శ్రేష్ఠత్వాన్ని

ఉ) మనదేశ ప్రజలకు వివేకానందుడు ప్రాతః స్మరణీయుడు.
జవాబు:
ప్రాతఃస్మరణీయుడు = నిద్ర నుండి లేవగానే స్మరించుకోవలసిన దైవస్వరూపులు.

ఊ) హితైషి చెప్పిన మాటలను పెడచెవిన పెట్టవద్దు.
జవాబు:
హితైషి = మేలును కోరేవాడు.

2) కింది జాతీయాలను మీ సొంతవాక్యాలలో ప్రయోగించండి.

అ) శ్రీరామరక్ష = పరిరక్షించగలిగినది, సర్వరక్షకం
జవాబు:
వాక్యప్రయోగం : నెహ్రూజీ మొదటి ప్రధానమంత్రి కావడం, మన భారతదేశానికి శ్రీరామరక్ష అయ్యింది.

ఆ) గీటురాయి = కొలబద్ద, ప్రమాణం
జవాబు:
వాక్యప్రయోగం : మంత్రిగారు మెచ్చుకోడం, నా తమ్ముని ప్రతిభకు గీటురాయి అని చెప్పాలి.

ఇ) రూపుమాపడం = శాశ్వతంగా తొలగించడం
జవాబు:
వాక్యప్రయోగం : వీరేశలింగంగారు నాటి సంఘంలోని దురాచారాలను రూపుమాపడానికి కృషిచేశారు.

ఈ) కారాలు మిరియాలు నూరడం = మండిపడడం, మిక్కిలి కోపగించడం
జవాబు:
వాక్యప్రయోగం : నా తమ్ముడు తప్పుచేస్తే, మా నాన్నగారు కారాలు మిరియాలు నూరుతారు.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ఉ) స్వస్తివాచకం = ముగింపు, వదలివేయు
జవాబు:
వాక్యప్రయోగం : విద్యార్థులు చదువుకోసం పూర్తిగా ఆటలకు స్వస్తివాచకం చెప్పకూడదు.

3. కింది వాక్యాలలోని పర్యాయపదాలు గుర్తించండి.

అ) రైతులు ప్రతివర్షం పంటలను పండిస్తూ సాలుకొకసారి వచ్చిన ధనంతో సంవత్సరమంతా నడుపుతారు.
జవాబు:
పర్యాయపదాలు :

  1. వర్షం
  2. సాలు
  3. సంవత్సరం

ఆ) భూమిపై కాలుష్యం పెరుగుట వల్ల, ధరిత్రి మీద ఉండే జనం విలవిలలాడుతూ అవనిపై మేము జీవించలేమని అంటున్నారు.
జవాబు:
పర్యాయపదాలు :

  1. భూమి
  2. ధరిత్రి
  3. అవని.

ఇ) ఒక వ్యక్తి దక్షతతో పనిచేస్తే, ఆ సామర్థ్యం అందరికీ తెలుస్తుంది.
జవాబు:
పర్యాయపదాలు :

  1. దక్షత
  2. సామర్థ్యం

4. కింది ‘వికృతి’ పదాలకు పాఠంలో ఉన్న ‘ప్రకృతి’ పదాలను వెతికి రాయండి.

అ) దవ్వు
జవాబు:
దవ్వు (వికృతి)

  1. దూరము
  2. దవీయము (ప్రకృతి)

ఆ) గారవం
జవాబు:
గారవం (వికృతి) – గౌరవం (ప్రకృతి)

ఇ) పగ్గె / పగ్గియ
జవాబు:
పల్లె / పగ్గియ (వికృతి) – ప్రజ్ఞ (ప్రకృతి)

ఈ) దోసం
జవాబు:
దోసం (వికృతి) – దోషం (ప్రకృతి)

ఉ) రాతిరి
జవాబు:
రాతిరి (వికృతి) – రాత్రి (ప్రకృతి)

ఊ) బాస
జవాబు:
బాస (వికృతి) – భాష (ప్రకృతి)

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

5. ప్రతి వృత్తికి కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయని పాఠం ద్వారా తెలుసుకున్నారు కదా! మీకు తెలిసిన కొన్ని వృత్తులు, వాటికున్న ప్రత్యేక లక్షణాలకు సంబంధించిన పదాలను పట్టిక రూపంలో రాయండి.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల 3
జవాబు:
TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల 4

వ్యాకరణాంశాలు

1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలను విడదీసి సంధులను గుర్తించండి.

అ) హైదరాబాద్ లోని విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఒకటి.
జవాబు:
విమానాశ్రయం : విమాన + ఆశ్రయం = సవర్ణదీర్ఘ సంధి

ఆ) చిన్నప్పటి విషయాలు జ్ఞాపకముండడం చాలా అరుదు.
జవాబు:
జ్ఞాపకముండడం : జ్ఞాపకము + ఉండడం ఉత్వసంధి

ఇ) ప్రతి జీవికి ఒక్కో శరీరాకృతి ఉంటుంది.
జవాబు:
శరీరాకృతి : శరీర + ఆకృతి = సవర్ణదీర్ఘ సంధి

ఈ) అబ్దుల్ కలాం మహోన్నత వ్యక్తిత్వం కలవాడు.
జవాబు:
మహోన్నత : మహా + ఉన్నత = గుణసంధి

ఉ) నా జీవితాన్నంతా దేశసేవకే వినియోగించాలనుకుంటున్నాను.
జవాబు:
జీవితాన్నంతా : జీవితాన్ని + అంతా

ఊ) మాధవి చెప్పినప్పటికీ రమ వినలేదు.
జవాబు:
చెప్పినప్పటికీ : చెప్పిన + అప్పటికీ = అత్వసంధి

ఋ) ఒక్కొక్కప్పుడు ముఖ్యమైన విషయాలు జ్ఞప్తికి రావు.
జవాబు:
ఒక్కొక్క : ఒక + ఒక = ఆమ్రేడిత సంధి

2. కింది సమాస పదాల్లోని తత్పురుష భేదాలను గుర్తించి, విగ్రహవాక్యాలు రాయండి. సమాస నిర్ణయం చేయండి.

ఉదా : – సత్యదూరము – సమాస పదం – షష్ఠీ తత్పురుష సమాసం

సమాసపదం – విగ్రహకవాక్యం – సమాసం పేరు

అ) అమెరికా రాయబారి – అమెరికా యొక్క రాయబారి – షష్ఠీ తత్పురుష సమాసం
ఆ) వాదనాపటిమ – వాదనయందు పటిమ – సప్తమీ తత్పురుష సమాసం
ఇ) అసాధ్యం – సాధ్యము కానిది – నఞ తత్పురుష సమాసం
ఈ) నెలతాల్పు – నెలను ధరించినవాడు – ద్వితీయా తత్పురుష సమాసం
ఉ) గురుదక్షిణ – గురువు కొఱకు దక్షిణ – చతుర్థీ తత్పురుష సమాసం
ఊ) వయోవృద్ధుడు – వయస్సు చేత వృద్ధుడు – తృతీయా తత్పురుష సమాసం
ఋ) దొంగభయము – దొంగవలన భయము – పంచమీ తత్పురుష సమాసం
ౠ) రెండు రాష్ట్రాలు – రెండైన రాష్ట్రాలు – ద్విగు సమాసం
ఎ) శక్తిసామర్ధ్యాలు – శక్తియు, సామర్ధ్యమును – ద్వంద్వ సమాసం
ఏ) అమూల్యసమయం – అమూల్యమైన సమయం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఐ) పూర్ణపురుషులు – పూర్ణులైన పురుషులు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఒ) ప్రాచీనకావ్యాలు – ప్రాచీనములైన కావ్యాలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఓ) పెద్దకుటుంబం – పెద్దదైన కుటుంబం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

3. కింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చండి.

అ) పూనాలోని ఫెర్గూసన్ కాలేజీలో చేరాడు.
పర్షియన్ భాషను చదివాడు.
ఆ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు.
జవాబు:
పూనాలోని ఫెర్గూసన్ కాలేజీలో చేరి, పర్షియన్ భాషను చదివి, ఆ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు. (సంక్లిష్ట వాక్యం)

ఆ) బూర్గుల హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవానికి భూమి హక్కు నిచ్చే కౌలుదారి చట్టాన్ని తయారుచేశాడు.
బూర్గుల సామ్యవాద వ్యవస్థకు పునాది వేశాడు.
బూర్గుల అజరామర కీర్తిని పొందాడు.
జవాబు:
బూర్గుల హైదరాబాదు రాష్ట్రంలో దున్నేవానికి భూమి హక్కునిచ్చే కౌలుదారి చట్టాన్ని తయారుచేసి, సామ్యవాద వ్యవస్థకు పునాదివేసి, అజరామరకీర్తిని పొందాడు. (సంక్లిష్ట వాక్యం)

ప్రాజెక్టు పని

మహోన్నత వ్యక్తిత్వంతో, పరిపాలనాదక్షతతో సేవచేసిన వారి వివరాలు సేకరించండి. నివేదిక రూపొందించండి. తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:
TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల 5

పదాలు – అర్థాలు

I

16వ పేజి

స్వర్గీయులు = స్వర్గాన్ని చేరిన వారు (మరణించిన వారు)
వర్ధంతి = “మరణించిన రోజు”, అనే అర్థంలో ఈ పదం వాడబడుతోంది.
మిత్రులు = స్నేహితులు
స్మృతులు = తలంపులు, జ్ఞాపకాలు
ముప్పిరిగొని = చుట్టుకొని, అతిశయించి
భావోద్రేకంతో
(భావ + ఉద్రేకంతో) = ఉద్రేకంతో కూడిన భావాలతో
ఉక్కిరి బిక్కిరైపోవు = ఊపిరి ఆడకపోవు; (విశ్రాంతి లేకపోవు)
రేఖామాత్రంగా = గీత వలె (కొద్దిగా)
పొందుపరుస్తాను = ఉంచుతాను (రాస్తాను)
పర్షియన్ భాష = పర్షియా భాష
ఐచ్ఛిక విషయం = స్వేచ్ఛా విషయం
పట్టభద్రులయ్యారు = డిగ్రీ పట్టా తీసికొన్నారు (బి.ఏ. పాసయ్యారు)
ట్యూటరు (Tutor) = ఉపన్యాసకునికి తోడుగా పనిచేసే గురువు (Private Teacher)
న్యాయవాద పట్టా = లా డిగ్రీ (Law Degree)
నమోదు అయ్యారు = రిజిష్టరు చేసుకున్నారు
కన్ను మూశారు = మరణించారు.
అవగతం కాదు ‘= అర్థం కాదు

17వ పేజి..

ఘనంగా = గొప్పగా
చిత్రించుకొనే = వర్ణించి చెప్పుకొనే
అంతరాత్మ (అంతః + ఆత్మ) = హృదయం
కృత్రిమ ఘనతను = తెచ్చిపెట్టుకొన్న గొప్పతనాన్ని
ప్రదర్శించి = చూపించి (కనబరచి)
ఉబలాటం = తీవ్రమైన కోరిక
పెనుగులాట = గ్రుద్దులాట
తత్ఫలితంగా = దానికి ఫలితంగా
కించపరుచుకొంటూ = తక్కువ చేసికొంటూ
అమూల్య సమయాన్ని = విలువకట్టలేని గొప్ప కాలాన్ని
వ్యర్థపరచుకుంటూ = వ్యర్థం చేసికొంటూ
అరుదుగా = అపురూపంగా (మిక్కిలి తక్కువగా)
మినహాయింపు = విడిచిపెట్టడం (Exemption)

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

వీసం ఎత్తు = వీసం ఎత్తు బరువు (రూపాయిలో 16వ వంతు బరువు)
మరుగుపరుస్తూ ఉండేది = కప్పిపెడుతూ ఉండేవి
సత్యదూరం = అసత్యం (సత్యం కానిది)
భావన = తలంపు
ఒడ్డూ, పొడుగూ = వెడల్పు, పొడుగు (ఒడ్డు = వెడల్పు)
వామనరూపాన్ని = వామనమూర్తివలె పొట్టి రూపాన్ని
స్నేహపూరితమైన = స్నేహంతో నిండిన
పరిహాసాలను = ఎగతాళులను (వేళాకోళాలను)
భావ నిర్లిప్తతతో = భావము యొక్క తగులపాటు లేకుండా (పట్టించుకోకుండా)
లోగడ = పూర్వం
అసాధారణ పొడగరితనం = సాధారణంగా ఉండని పొడుగుదనం
మరుగుపరచలేదు = కప్పిపెట్టలేదు
విమానాశ్రయం
(విమాన + ఆశ్రయం) = విమానాలు ఆగేచోటు
పుష్పమాలాలంకృతునిగా
(పుష్పమాలా + అలంకృతునిగా) = పూలదండతో అలంకరింపబడిన వానిగా
అతిథి = ముందు తెలియజేయకుండా భోజన సమయానికి వచ్చే వాడు
ఆతిథేయులు = అతిథికి సత్కారం చేసే వారు (గృహస్థులు)
ఇర్వురు = ఇద్దరూ
సరస్పర, సౌజన్య, సౌహార్దాలు = ఒకరికొకరియందు; మంచితనమూ, స్నేహమూ
ఫీటు (Feat) = సాహసకృత్యం
వినోదకర దృశ్యం = వేడుకను ఇచ్చే దృశ్యం
కళానైపుణ్యానికి = కళలో నేర్పరిదనానికి
గీటురాయి = ప్రమాణం
చేకూర్చింది = సిద్ధింపచేసింది

II

17వ పేజి

విరాట్రూపం = ఆదిపురుషుని బ్రహ్మాండ స్వరూపం; (పెద్ద ఆకారం)
శరీరాకృతి (శరీర + ఆకృతి) = శరీరం యొక్క ఆకారము
గహనమైనది
(గహనము + ఐనది) = ఎరుగరానిది
వ్యక్తిత్వం = వ్యక్తి స్వభావం
నిత్య నైమిత్తికంగా (Routine) = వాడుకగా (నియమిత చర్యగా)
వామనమూర్తి వలె = వామనుని వలె (వామనావతారంలో విష్ణువువలె పొట్టిగా)
ముల్లోకాలు
(మూడు + లోకాలు) = స్వర్గ, మర్త్య, పాతాళలోకాలు
ఆక్రమించి = ఆక్రమణం చేసి (వ్యాపించి)
ప్రదర్శించేవారు = వెల్లడించే వారు
ఇమిడిపోతూ = లీనమవుతూ (కలిసిపోతూ)
నిరాడంబరంగా = ఆడంబరం లేకుండా
తెరమరుగున = తెరచాటున (వెనుక)
బహుముఖ ప్రతిభాయుత మూర్తిమత్వం = అనేక విధాలైన తెలివి తేటలతో కూడిన రూపాన్ని కల్గి యుండడం
మహోన్నతరూపం
(మహా + ఉన్నతరూపం) = మిక్కిలి గొప్ప రూపం
వ్యక్తిత్వపు, మహోన్నత శిఖరాలు (వ్యక్తిత్వము + మహోన్నత శిఖరాలు) = స్వభావము యొక్క మిక్కిలి గొప్ప, విశిష్టతలు
అగాధపులోతులలోనే
(అగాధము + లోతులలోనే) = తెలియశక్యంకాని లోతులలో
పరిలక్షితమౌతుంది
(పరిలక్షితము + ఔతుంది) = బాగా సూచింపబడుతుంది. (వెల్లడి అవుతుంది)

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

18వ పేజి

న్యాయవాది (Advocate) = ప్లీడరు
ప్రాక్టీస్ (Practice) = అనుభవం
Roaring Practice = ఎక్కువ ప్రాక్టీసు
ప్రజాహిత జీవితం = ప్రజలకు మేలు కలిగించే జీవితం
ఫైలు పెరుగుట = హోదా పెరగడం (File)
ఉపకరిస్తే = సాయపడితే
తారుమారైంది = తిరగబడింది
క్లయింట్లు (Clients) = లాయర్లకు వ్యాజ్యాలు ఇచ్చేవారు
మిశ్రిత భావం = కలగాపులగమైన భావన
ప్రజ్ఞా ప్రాభవాలు = తెలివియు, గొప్పతనమును
సంపూర్ణ విశ్వాసానికి = పరిపూర్తి అయిన నమ్మకానికి
తోడు = సహాయం
రాజకీయ వ్యగ్రత = రాజకీయాలలోని తొందర తనం
ధ్యానము = మనస్సు యొక్క ఏకాగ్రత
క్షుణ్ణంగా చదివి = బాగా చదివి
చేపట్టేటప్పుడే = తీసుకొనేటప్పుడే (స్వీకరించేటప్పుడే)
ఫైలు (File) = దొంతి (కాగితాలు వరుసగా పెట్టుకొనే అట్ట)
అస్పష్టమైన = స్పష్టంకాని
నోట్సులు (Notes) = వివరణలు
రేఖామాత్రంగా = కొద్దిగా
జాజ్వల్యమానమైన = ప్రకాశించే
వాదనాఘాతములకు = వాదనలనే దెబ్బలకు
దుర్భేద్యమైన = భేదింప శక్యం కానిదైన
నిలపడం = నిలబెట్టడం
నిష్ణాతమైన = నేర్పు కలదైన
సునిశిత మేధాసంపత్తి = మిక్కిలి పదునైన బుద్ధిసంపద
ప్రదర్శిస్తున్నారు = చూపిస్తున్నారు
అనన్యమైన = ఇతరులకులేనట్టి
వాదనాపటిమ = వాదించడంలో సామర్థ్యం
ప్రోత్సాహం (ప్ర+ఉత్సాహం) = మిక్కిలి ఉత్సాహం
ప్రత్యేక తరహా = ప్రత్యేక విధం
జూనియర్ (Junior) = చిన్న
కడగొట్టు బిడ్డ = చివరి బిడ్డ
విశేష, మమకారం = అధికమైన, అభిమానం
చొరవతో = సాహసంతో
నిరాఘాటంగా = అడ్డులేకుండా
ఆఫీసును (Office) = కార్యాలయాన్ని
కాఫీ పానశాల(Coffee Hotel) = కాఫీ త్రాగేశాల
పరిగణించి = లెక్కించి (ఎన్నుకొని)
కొరుకుడుపడని = కొరకడానికి వీలుపడని (అర్థంకాని, కష్టమైన)
ఏరుకొని = ఏరి తీసుకొని (తీసుకొని)
కారాలు మిరియాలు నూరుతూ = కోపగిస్తూ
చేష్ట = నడవడి (కార్యం)
ఆమోదముద్ర = అంగీకారముద్ర
ప్రకరణం = ఒక విషయాన్ని బోధించే గ్రంథ భాగం
ముగియడం = ముగింపు
నిష్కాపట్యంతో = కపటం లేకుండా
సమానస్థాయి = సమానమైన స్థితి
చర్చా సంబంధం = చర్చకు సంబంధం
రూపొందించిన = ఏర్పరచిన
జోహారులు = నమస్కారాలు
అర్పిస్తూనే ఉంటాను = సమర్పిస్తూనే ఉంటాను
పూరించిన = నింపిన
ఆత్మవిశ్వాసమే = తన శక్తి యందు నమ్మకం కల్గియుండడమే
శాసనసభలు = చట్టసభలు
శ్రీరామరక్ష = సర్వరక్షకం
ప్రాతఃస్మరణీయులు = తెల్లవారు జాముననే తలంపవలసిన వారు (దేవుని వంటివారు)
విశిష్ట వ్యక్తిత్వము = మిక్కిలి శ్రేష్ఠమైన వ్యక్తిత్వం
అట్టిది = అటువంటిది
సమ్యక్ దృష్టికోణం = సరియైన చూపు
సంకుచితం = ముడుచుకున్నది
సైద్ధాంతిక అరలు = సిద్ధాంతానికి చెందిన భాగములు.
తావు = స్థానం
జాగీర్దార్ = నవాబుల వలన శౌర్యాదులకై మాన్యాలు పొందినవాడు
జాగీర్దారీ వ్యవస్థ = జాగీర్దారుల ఏర్పాటు
రూపుమాపడానికి = నశింపజేయడానికి (తీసివేయడానికి)
స్నేహకోటి = స్నేహితుల సమూహం
భూస్వాములు భూములు ఎక్కువగా గలవారు (భూకామందులు)
కౌలుదారీ చట్టాన్ని = భూమి యజమాని, సేద్యం చేసే రైతులకు ఇచ్చే హక్కుల చట్టాన్ని
సామ్యవాద వ్యవస్థ = ప్రజలందరికీ సమానమైన అధికారాలూ, భోగభాగ్యాలూ కలగాలని కోరే ఏర్పాటు
మార్గదర్శకులు = మార్గాన్ని చూపించేవారు
ఎంపిక చేసిన = ఎన్నుకొన్న
భూకామందులు = భూస్వాములు
రాజకీయసహచరులు = రాజకీయాల్లో వెంట తిరిగే స్నేహితులు

19వ పేజి

సంస్థానవిచ్ఛిత్తి = సంస్థానాల నాశనం
రాజకీయ ప్రాబల్యానికి = మంచి సమర్థత పొందడానికి
స్వస్తివాచకం పలుకు = ముగించు
మేలు చేకూర్చే = ఉపకారాన్ని చేసే
ఆత్మపరిత్యాగానికి = మనస్సును పూర్తిగా విడిచి వేయడానికి (మనఃపూర్వకం కాని దానికి)
సక్రియ రాజకీయాల నుండి = క్రియాశీలమైన రాజకీయాల నుండి
నిష్క్రమణకు = వెడలిపోడానికి (తప్పుకోడానికి)
అంకితం చేసుకొనే = సంపూర్తిగా సమర్పించుకొనే
రాజనీతి విశారదులు = రాజనీతి పండితులు
బహు అరుదు = మిక్కిలి తక్కువ
‘వ్యవహార దక్షత = వ్యవహార సామర్థ్యం
ఆరునూరైనా = ఏది ఏమయినా
సంక్షిప్త రాజకీయ చరిత్ర = కొద్దిగా చెప్పిన రాజకీయాల చరిత్ర

III

19వ పేజి

సౌజన్యానికి = మంచితనానికి
మారుపేరు = మరోపేరు
ముఖ్యాంశ (ముఖ్య + అంశం) = ముఖ్యవిషయం
గతతరంలోని = పూర్వపుతరంలోని (పూర్వకాలంలోని)
సుగుణాల = మంచిగుణాల
మూర్తిమత్వం = స్వరూపం (personality)
శరాఫత్ = సౌజన్యం (మంచితనం)
మత, దురభిమానం = మతమునందు, పిచ్చి ప్రేమ
పెంపొందిస్తూ = అభివృద్ధిపరుస్తూ
రాజ్యమేలుతున్న = రాజ్యాన్ని పాలిస్తున్న
నాటి నిజాంకు = ఆ రోజుల్లో పాలించే నిజాం రాజుకు
బద్ధవ్యతిరేకి = గట్టి విరోధి
పరమ మిత్రులు = మిక్కిలి స్నేహితులు

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ఆప్తులు = స్నేహితులు
అతినిరాడంబరంగా = మిక్కిలి ఆడంబరం లేకుండా
ఆడంబరం = డంబం
మతాతీతస్థితి (మత + అతీత స్థితి) = మతాన్ని అతిక్రమించిన పరిస్థితిని (మతంతో సంబంధం విడిచిపెట్టడం)
పాటించేవారు = ఆచరించేవారు
డ్రాయింగు రూం
(Drawing Room) = చావడి, (అతిథులు కూర్చుండే గది)
సంస్కృతీ ప్రదర్శనశాల = సంస్కృతిని తెలిపే ఇల్లు
మౌల్వీలు = ముసల్మాను పండితులు
ముల్లాలు = ముస్లిమ్ పండితులు
మహామహోపాధ్యాయులు = గొప్ప వేదశాస్త్ర పండితులు
ఆహ్వానించడానికి = పిలవడానికి
మూడు, విభిన్నతరాల, చివరి, వారధి = మూడు, వేరు వేరు తరాలకు చివరి వంతెన (మూడు తరాల వారినీ కలిపి ఉంచగలవాడు)
తీర్చిదిద్దారు = రూపుదిద్దారు
సునిశిత మేధ = చురుకైన తెలివి (గొప్పతెలివి)
శాసనసభా నాయకులు = చట్టసభలో నాయకులు
పరిమార్జిత భాష = శుద్ధిచేయబడిన భాష (సంస్కరింపబడిన భాష)
మేళవించి = కలిపి
ఉన్నత ప్రమాణాలను = గొప్ప ప్రమాణాలను
స్మరించుకుంటూ = తలచుకుంటూ
ప్రత్యర్థులను = ఎదుటి పక్షం వారిని (వ్యతిరేక పక్షం వారిని)
కన్నీరు బొట్టు = కన్నీటి చుక్క
రవ్వంత (రవ్వ + అంత) = కొద్దిమాత్రం
పార్లమెంటేరియన్ = ప్రజాప్రతినిధి
(Parliamentarian)
(MLA, MP)
అద్వితీయ కళాకౌశలం = సాటిలేని కళలో నేర్పు
బహుభాషావేత్త = అనేక భాషలు తెలిసినవాడు
అభిరుచులు = ఆసక్తులు
ప్రయివేటుగా (Private) = రహస్యంగా
ఆఫీసు ఫైళ్ళు = కార్యాలయపు దస్త్రాలు
సంస్కృత ప్రాచీన కావ్యాలు = సంస్కృత భాషలోని పూర్వపు కవులు వ్రాసిన ‘రఘువంశం’ వంటి గ్రంథాలు’
బహుముఖ ప్రతిభావంతులు = అనేక రంగాలలో తెలివి కలవారు
సాహితీ జగత్తు = సాహిత్యలోకం
సాహిత్య వ్యాసంగం = సాహిత్యంలో పరిశ్రమ

20వ పేజి

ముట్టని = అంటని
క్షేత్రం = రంగం
అతిశయోక్తి = ఎక్కువగా చెప్పడం
(అతిశయ + ఉక్తి)
సాహిత్యక్షేత్రం = సాహిత్యరంగం
దశాబ్దాలు = పదుల సంవత్సరాలు
స్మృతులను = జ్ఞాపకాలను
గ్రంథస్థం = గ్రంథంలో రాయడం
హితైషులు = మేలును కోరేవారు
ఔదార్యం = గొప్పతనం (దాతృత్వం)
దోష౦ = తప్పు
పరిణమించేది = మారేది
అసాధ్యం = సాధ్యం కానిది
చీదరింపు = ‘ఛీ’ యనడం (కాదు పొమ్మనడం)
పరిష్కరించి ఉండేవారు = చక్కపెట్టేవారు
మలచబడ్డారు = చెక్కబడ్డారు (తీర్చిదిద్దబడ్డారు)
ఉపకారశీలి = ఉపకారం చేసే స్వభావం కలవాడు
ఆత్మీయులైన = తనవారైన
పేరుబడ్డారు = పేరు కెక్కారు
సహచరులు = స్నేహితులు, అనుచరులు
ఓర్మి = సహనం
వేచిఉంటూ = ఎదురు చూస్తూ ఉంటూ
పరిపాటి = పద్ధతి (అలవాటు)
సామాజిక యాత్ర = సంఘానికి సంబంధించిన యాత్ర
సాఫీగా = తిన్నగా
ఒడుదుడుకులు = ఎత్తుపల్లాలు (కష్టస్థితులు)
విపత్కర పరిస్థితులు = ఆపద కలిగే పరిస్థితులు
సేనావాహిని = సేనానది
చలించేవారు = తొందరపడేవారు
మనః స్థైర్యాన్ని = మనస్సులో దృఢత్వాన్ని
సమచిత్తత = సమానమైన మనస్సు కల్గి యుండడం
క్రుంగిపోనూలేదు = అణగిపోలేదు (దిగాలు పడలేదు)
పూర్ణపురుషుల = సంపూర్ణమైన వ్యక్తులు (అన్ని శక్తులూ కలవారు)

పాఠం ఉద్దేశం

సమాజంలో కొద్దిమందే ప్రభావశక్తి సంపన్నులు ఉంటారు. వీరి సాంగత్యం పొందినా, వీరి గురించి తెలుసుకున్నా, స్ఫూర్తి కలుగుతుంది. మంచిమార్గంలో నడవడానికి అవకాశం కలుగుతుంది. ఇలా స్ఫూర్తిదాయకులైన వారిలో బూర్గుల రామకృష్ణారావు ఒకరు. ఈయన హైదరాబాదు రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి, రాజనీతిజ్ఞుడిగా బహుభాషావేత్తగా పరిపాలనాదక్షుడిగా పేరెన్నికగన్నాడు. ఈయన మహోన్నత వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేలా పి.వి. నరసింహారావు వ్యాసం రాశాడు, మహోన్నత వ్యక్తిత్వాల నుండి స్ఫూర్తి పొందడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. గొప్పవారి జీవితాన్ని, వారి వ్యక్తిత్వంలోని ఉదాత్తమైన, స్ఫూర్తివంతమైన జీవన కోణాలను విశ్లేషిస్తూ, ప్రశంసిస్తూ రాసిన అభినందన వ్యాసం ఇది.
ఈ పాఠ్యభాగం ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక 1972 సం॥పు డిసంబర్ సంచిక నుండి తీసుకొనబడింది.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

రచయిత పరిచయం

వ్యాస రచయిత : పాములపర్తి వేంకట నరసింహారావు (పి.వి. నరసింహారావు)
పాఠ౦ : “నేనెరిగిన బూర్గుల”

రచయిత జన్మస్థలం : వరంగల్లు రూరల్ జిల్లా ‘నర్సంపేట’ మండలంలోని “లక్నేపల్లి” గ్రామంలో జన్మించారు.

దత్తపుత్రుడు : రచయిత, నరసింహారావుగారు, వరంగల్ దగ్గర ‘భీమదేవరపల్లి’ మండలంలోని ‘వంగర’ గ్రామంలోని రుక్మిణమ్మ, రంగారావులకు దత్తపుత్రుడు.
TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల 1
రచయిత గురువులు : “స్వామి రామానంద తీర్థ వీరికి గురువు. బూర్గుల రామకృష్ణారావుగారు, ఈ రచయితకు గురుతుల్యులు.

రాజకీయ జీవితం : పి.వి. నరసింహారావుగారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థిగా హైద్రాబాద్ విముక్తి పోరాటంలో పాల్గొని, విశ్వవిద్యాలయం నుండి బహిష్కరణకు గురి అయినారు. 1938 లో హైద్రాబాద్ రాష్ట్ర కాంగ్రెస్లో చేరి రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. జీవితాంతం కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారు.

శాసన సభ్యత్వం : కరీంనగర్ జిల్లా “మంథని” నియోజక వర్గం నుండి వరుసగా నాలుగు పర్యాయాలు ఎమ్.ఎల్.ఏ.గా ఎన్నికయ్యారు.

మంత్రి పదవులు : అనేక శాఖలకు రాష్ట్రమంత్రిగా పనిచేసి, 1971 73 లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేంద్రమంత్రిగా చాలాకాలం పనిచేసి, చివరకు 1991 96 కాలంలో భారత ప్రధానిగా పనిచేశారు.

రాజనీతిజ్ఞుడు : ఈయన అపరచాణక్యుడు. తన రాజకీయ చాతుర్యంతో, భారత రాజకీయాల్లో గొప్పగా రాణించిన రాజనీతిజ్ఞుడు.

సాహితీసేవ : ఈయన తెలుగుతో సహా 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగిన బహుభాషావేత్త. తెలుగులో ‘కాకతీయ’ పత్రికను నడిపించాడు. విశ్వనాథ సత్యనారాయణ గారి ‘వేయిపడగలు’ నవలను, ఈయన “సహస్రఫణ్” అనే పేరుతో హిందీలోకి అనువదించాడు. ఈ నవలకు కేంద్రసాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ఈయన “ఆత్మకథ” అని పేరు కెక్కిన “ఇన్ సైడర్” అనేక భాషల్లోకి అనువదించబడింది. “పన్లక్షతొకొనతో” అనే మరాఠి నవలను, ఈయన తెలుగులో “అబలా జీవితం” అనే పేర అనువదించారు.

వ్యక్తిత్వం : నిరాడంబరజీవితం, నిజాయితీ, దేశభక్తి కలిగినవారు. జీవిత పర్యంతం, నిండు కుండలా స్థితప్రజ్ఞునిగా వెలిగారు.

ప్రవేశిక

ప్రతి మానవునిలోనూ సాధారణంగా ఉన్నదానికంటే తనను గురించి ఘనంగా చిత్రించుకొనే స్వభావం ఉంటూ ఉంటుంది. ఇందుకు భిన్నంగా ప్రవర్తించేవారు బహు అరుదుగా ఉంటారు. రకరకాల ఒడిదుడుకులను ఎదుర్కొన్నా విపత్కర పరిస్థితులు సేనావాహినిలా చుట్టుముట్టినా చలించకపోవడం, మనః స్థైర్యాన్ని, సమచిత్తాన్ని విడనాడక పోవడం గొప్పవారికే సాధ్యమౌతుంది.

జయాపజయాలను సమానంగా స్వీకరించడం, మిత్రులు సైతం ద్రోహం తలపెట్టినా ప్రత్యర్థులు దూషించినా “సరే ! ఇవన్నీ ఆటలో భాగమేగా !” అని స్థితప్రజ్ఞతను ప్రదర్శించడం అందరికీ సాధ్యమౌతుందా ? మరి ఇటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఎవరు ? ఈ పాఠం ద్వారా తెలుసుకొండి.

TS 9th Class Telugu Guide 1st Lesson ధర్మార్జునులు

Telangana SCERT 9th Class Telugu Guide Telangana 1st Lesson ధర్మార్జునులు Textbook Questions and Answers.

TS 9th Class Telugu 1st Lesson Questions and Answers Telangana ధర్మార్జునులు

చదువండి – ఆలోచించి చెప్పండి (Textbook Page No. 2)

కుజనుల్ గొందరు రేగి యీ వసుమతిన్ క్రూరస్వభావంబుతో
సుజనాళిన్గడు గుందజేయునెడ రాజుల్ వారి వారింపకే
నిజ దౌర్బల్యము జూపిరేని చెడద నిక్కంబుగా రాజ్యమో
త్రిజగత్కారణ ! భక్తపాలన ! హరా! శ్రీ గుంటు మల్లేశ్వరా
– యర్రం విశ్వనాథం గుప్త

ప్రశ్నలు
ప్రశ్న 1.
సజ్జనుల బాధలను నివారించే వాళ్ళెవ్వరు ?
జవాబు:
సజ్జనుల బాధలను నివారించే వారు రాజులు.

ప్రశ్న 2.
దుర్మార్గులు విజృంభించినప్పుడు రాజులు ఏం చేయాలి ?
జవాబు:
దుర్మార్గులు విజృంభించి క్రూర స్వభావముతో సత్పురుషులను బాధించేటప్పుడు, రాజులు దుర్మార్గులను దండించాలి.

TS 9th Class Telugu Guide 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 3.
ఈ పద్యాన్ని అనుసరించి రాజుల పరిపాలన ఎట్లా ఉండాలని మీరు అనుకుంటున్నారు ?
జవాబు:
చెడ్డవారు క్రూర స్వభావముతో విజృంభించి మంచివారిని బాధిస్తున్నప్పుడు, రాజులు చెడ్డవారిని దండించాలి. అంతేకాని తమ బలహీనతను వెల్లడించరాదు. అలా చేస్తే ఆ రాజుల రాజ్యం చెడిపోతుంది.

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 4)

ప్రశ్న 1.
‘ఆజ్ఞా పరిపాలనా వ్రతం’ అంటే ఏమిటి ? మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు:
తాను వేసిన ఆజ్ఞల ప్రకారమే, తాను కూడా .. నడచుకొనడాన్ని “ఆజ్ఞా పరిపాలనా వ్రతం” అంటారు. సామాన్యంగా ప్రజలను పాలిస్తూ రాజులు కొన్ని నియమాలను పాటించుమని ప్రజలను ఆజ్ఞాపిస్తారు. తాము మాత్రం, ఆ ఆజ్ఞల ప్రకారం నడచుకోరు. అలా కాకుండా ధర్మరాజు తాను వేసిన ఆజ్ఞల ప్రకారమే, తాను కూడా నడచుకొనేవాడు. అందువల్లనే ధర్మరాజు ‘ఆజ్ఞాపరిపాలనా వ్రతుడు’ అయ్యాడు.

ప్రశ్న 2.
‘మొకమిచ్చకపు మెచ్చు !’ అంటే మీరేమనుకుంటున్నారు ?
జవాబు:
ఎదుటి వ్యక్తిని అతని ఎదుట, అతని ముఖప్రీతి కోసం మెచ్చుకోడాన్ని ‘మొకమిచ్చకపు మెచ్చు’ అంటారు. ఆ వ్యక్తిని అతని ముఖం ముందు మెచ్చుకొని, అతడు వెళ్ళిపోయిన తర్వాత అతడిని కొందరు నిందిస్తారు. అది సరయిన పద్ధతి కాదు. మెచ్చుకుంటే ఆ వ్యక్తిని అతని ముందూ, అతడు వెళ్ళిన తర్వాత కూడా మెచ్చుకోవాలి.

TS 9th Class Telugu Guide 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 3.
మంచివారిని ఎందుకు అనుసరించాలి ?
జవాబు:
మంచివారు మంచి గుణాలను కలిగియుంటారు. వారు మంచి ప్రవర్తనను కలిగి ఉంటారు. అటువంటి మంచి వారిని అనుసరిస్తే, వారిలాగే తాను కూడా మంచి పేరు తెచ్చుకోవచ్చు. ధర్మరాజువంటి సజ్జనులను అనుసరిస్తే తాము కూడా ధర్మమూర్తులు కావచ్చు.

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 5)

ప్రశ్న 1.
స్నేహభావం ఎవరెవరితో పెంపొందించుకోవాలి ? జ. స్నేహభావం సత్పురుషులతో పెంపొందించుకోవాలి.
ధర్మరాజు వంటి సత్పురుషులు

  1. ప్రజల సంపదలకు సంతోషిస్తారు. అసూయపడరు.
  2. ప్రజలందరూ తనను సేవించాలని అనుకుంటారు. వీరు ఎవరినీ వెగటుగా చూడరు.
  3. అడిగిన వారికి ఇద్దామని అనుకుంటారు. పూర్వమే అతడికి ఎంతో ఇచ్చామని అనరు.
  4. రాత్రింబగళ్ళు ధర్మార్జన దృష్టితో ఉంటారు. అన్యాయవర్తన ఉండదు.

కాబట్టి ధర్మరాజు వంటి సత్పురుషులతో స్నేహభావం పెంపొందించుకోవాలి.

TS 9th Class Telugu Guide 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 2.
‘కొంగు బంగారం’ అనే మాట ఎప్పుడైనా విన్నారా అయితే దాని గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి.
జవాబు:
‘కొంగు బంగారం’ అనేది తెలుగు జాతీయము. ‘సులభ సాధ్యము’ అని దీనికి అర్థము. పూర్వులు తమకు కావలసిన ధనాన్ని చెంగున ముడివేసుకొనేవారు. ఆ రోజుల్లో మనీ పర్సులు లేవు. వారికి ఏదయినా డబ్బు అవసరం అయితే వెంటనే చెంగున లేక కొంగున ముడి వేసిన ముడి విప్పి, అందులో కావలసిన మొత్తాన్ని వారు సులభంగా వాడుకొనేవారు. వారి డబ్బు ఏ పెట్టెలోనో ఉండి ఉంటే అంత సులభంగా అది వారి అవసరానికి ఉపయోగించదు. ఆ విధంగా ‘కొంగు బంగారం’ అంటే, సులభంగా అయ్యే పని అని అర్థంలో, ఆ జాతీయం వాడుకలోకి వచ్చింది.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
అసూయాపరులంటే ఎవరు ? వారి వల్ల ఎవరికి నష్టమో చెప్పండి.
జవాబు:
అసూయాపరులంటే ఈర్ష్యగుణం కలవారు.’ ఎదుటి వారికి ఉన్నది, తనకు లేదని బాధపడేవారు ‘అసూయా పరులు’. అసూయ వల్ల అసూయాపరులకే నష్టము. అసూయాపరుల వల్ల ఒక్కొక్కప్పుడు ఎదుటివారికి కూడా నష్టం ఉంటుంది.

ప్రశ్న 2.
‘దానగుణం మనిషికి అవసరం’ ఎందుకో మీ అభిప్రాయాలు చెప్పండి.
జవాబు:
‘దానగుణం’ అంటే ఎదుటి వారికి ఇవ్వడం. మన పెద్దలు దశదానాలు, షోడశ మహాదానాలు చేయాలని చెప్పారు. మనం ఒకరికి ఇస్తే దేవుడు తిరిగి మనకు మరింతగా ఇస్తాడు. దానగుణం వల్ల, పేదలు సంతోషిస్తారు. ఈ జన్మలో దానం చేసుకుంటే మరుసటి జన్మలో భగవంతుడు దానం ఇచ్చిన వారికి మరింతగా ఇస్తాడు. దానగుణం లోకంలో ఉంటే పేదవారికి లోటు ఉండదు.

TS 9th Class Telugu Guide 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 3.
యాచకుల దీనత్వాన్ని పోగొట్టడానికి పాండవులు ఉత్సాహం చూపేవారు. ఎందుకో చెప్పండి.
జవాబు:
పాండవులు యాచకుల దీనత్వాన్ని పోగొట్టడానికి ఉత్సాహం చూపేవారు. పాండవుల వద్ద ఎంతో సంపద ఉంది. అదీగాక వారి దేశప్రజలు సకల సంపదలతో తులతూగాలని పాండవులు కోరుకొనేవారు. వారు దానం చేయడంలో గొప్పవారు. అందుకే వారు యాచకుల కోరికలను పూర్తిగా తీర్చి, వారి దీనత్వాన్ని పోగొట్టేవారు. పాండవులు మంచి సౌజన్యం గలవారు. అందుకే వారు యాచకుల దీనత్వాన్ని పోగొట్టడంలో అంటే దానం చేయడం అనే ప్రక్రియలో శూరత్వం చూపేవారు.

ఆలోచించండి – చెప్పండి. (Textbook Page No. 6)

ప్రశ్న 1.
‘ప్రాణసఖుడు’ అని ఎవరినంటారు ? వాళ్ళ లక్షణాలు ఎట్లా ఉంటాయి ?
జవాబు:
‘ప్రాణసఖుడు’ అంటే తన ప్రాణంతో సమానంగా ఎదుటి వారిని చూసుకొనే మిత్రుడు. అవసరమైతే స్నేహితుడి కోసం, తన ప్రాణాలను ఇచ్చే మిత్రుడిని “ప్రాణసఖుడు” అంటారు.
ప్రాణసఖుడి లక్షణాలు :

  1. మిత్రుడిని పాపకార్యముల నుండి మరలిస్తాడు.
  2. స్నేహితునిచే హితమైన కార్యాలు చేయిస్తాడు.
  3. స్నేహితుడి రహస్యాన్ని దాస్తాడు.
  4. మిత్రుడి సద్గుణాలను పోషిస్తాడు.
  5. మిత్రునికి లేని సమయంలో అతడిని విడిచిపెట్టడు.
  6. మిత్రుడికి కావలసినది తాను ఇస్తాడు.

TS 9th Class Telugu Guide 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 2.
‘ధర్మప్రవర్తన కలిగి వుండటం’ అంటే ఏమిటి ?
జవాబు:
వేదధర్మ శాస్త్రాలలో చెప్పిన ధర్మాలకు అనుగుణంగా నడచుకోడాన్ని ధర్మప్రవర్తన కలిగియుండడం అంటారు. అన్నదమ్ముల యందు సమభావన, తోడి రాజులలో మంచి ప్రసిద్ధి, సాత్వికులు కూడా ప్రశంసించే విధంగా నడచుకోడం అన్నది ధర్మప్రవర్తన.

ప్రశ్న 3.
స్నేహభావం పెంపొందించుకోవడం వలన ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో చెప్పండి.
జవాబు:
ఇతరులందరితోనూ స్నేహభావం పెంపొందించుకోడం వల్ల మనకు మిత్రులు పెరుగుతారు. మనకు శత్రువులన్న వారే ఉండరు. అందరూ మనల్ని ప్రేమభావంతో చూస్తారు. అవసరం వచ్చినపుడు ఆ మిత్రులు మనల్ని ఆదుకుంటారు. మనకు ఎక్కువ మంది స్నేహితులు ఉంటే, శత్రువులు మనవైపుకు కన్నెత్తి చూడడానికి సైతం జంకుతారు.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

1. కింది అంశాల గురించి చర్చించండి.

అ) ధర్మరాజు సుగుణాల గురించి విన్నారు కదా ! వీటిని దృష్టిలో పెట్టుకొని నేటి పాలకులకు ఉండవలసిన లక్షణాలను గురించి చర్చించండి.
జవాబు:
నేటి పాలకులకు ఉండవలసిన లక్షణములు :

  1. ప్రభుత్వ శాసనం ప్రకారము, తానూ, తనవారూ నడచుకోవాలి. ప్రజలకు కూడు, గుడ్డ, ఇల్లు సమకూర్చాలి. బీదలపట్ల, హరిజన గిరిజనులపట్ల సానుభూతి ఉండాలి.
  2. శాంతి, దయ అనే సుగుణములు కలిగి ఉండాలి..
  3. సదా సత్యమునే మాట్లాడాలి.
  4. సత్పురుషులైన ప్రజలను ఎల్లవేళలా ఆదరంగా చూడాలి.
  5. విపన్నులకు దానధర్మాలు చేసేవాడై ఉండాలి.
  6. ముందు ఒకమాట, వెనుక ఒకమాట చెప్పకూడదు.
  7. ప్రజలు చేసిన విన్నపాలను, ఆదరంగా ఆలకించి పరిష్కారం చూపించాలి..
  8. మంచిపనులు చేసిన వారిని, మెచ్చుకొని వారిని ఘనంగా సన్మానించాలి.
  9. ప్రజల సంపదపై అసూయకూడదు. ప్రభుత్వ సంపదకు తాను కాపలాదారుగా ఉండాలి.
  10. రాత్రింబగళ్ళు ధర్మమార్గంలో నడవాలి.
  11. ప్రభుత్వ పాలన, పారదర్శకంగా ఉండాలి.
  12. స్వపక్ష, పరపక్ష తారతమ్యం పనికిరాదు.
  13. కోపం, ఈర్ష్య ఉండరాదు.
  14. పండితులను గౌరవించాలి.
  15. అవినీతి, ఆశ్రిత పక్షపాతం ఉండరాదు.
  16. రాత్రింబగళ్ళు ప్రజల కష్టనష్ట నివారణపైనే దృష్టి ఉండాలి.
  17. దేశాన్ని శత్రువుల నుండి కాపాడుకోవాలి.
  18. ప్రజలకు విద్యావైద్య సదుపాయాలు కల్గించాలి.

TS 9th Class Telugu Guide 1st Lesson ధర్మార్జునులు

ఆ) “మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి” ఎందుకో చర్చించండి.
జవాబు:
ఏ పని చేయాలని అనుకున్నా, ఆ పని చేయడంలో వచ్చే మంచి చెడులనూ దానివల్ల కలిగే లాభనష్టాలనూ ముందుగా బాగా ఆలోచించాలి. తరువాతే నిర్ణయం తీసుకోవాలి. తొందరపడి మంచి చెడులను ఆలోచించకుండా నిర్ణయం తీసుకొంటే, తరువాత కష్టనష్టాలు వస్తాయి. అప్పుడు విచారింపవలసి వస్తుంది. బుద్ధిమంతుడైనవాడు, తొందరతో నిర్ణయాలు తీసుకోరాదు. అవసరమైతే తనకు కావలసిన వారికి సమస్యను చెప్పి, వారందరితో బాగా ఆలోచించి, రాబోయే మంచిచెడులను లోతుగా చర్చించి నిర్ణయించాలి.

అలా ఆలోచించి నిర్ణయిస్తే ఆ నిర్ణయం వల్ల ఎటువంటి కష్టనష్టాలు రావు. ఒకవేళ కష్టనష్టాలు వచ్చినా, పశ్చాత్తాప పడవలసిన అవసరం ఉండదు.

ప్రశ్న 2.
పువ్వు గుర్తుగల పద్యాలను భావస్ఫోరకంగా చదువండి.
జవాబు:
ఈ పాఠంలో 1, 4, 7, 9 పద్యాలు పువ్వు గుర్తు గల పద్యాలు. వీటిని చక్కగా మీ గురువుగారి సాయంతో అర్థవంతంగా, భావం తెలిసేలా చదవడం అలవాటు చేసుకొండి.

ప్రశ్న 3.
కింద నాలుగో పద్యానికి ప్రతిపదార్థం ఉన్నది. ఇదే విధంగా 1, 9 సంఖ్యగల పద్యాలకు ప్రతిపదార్థం రాయండి.
కోపము = కోపము
ఒక + ఇంత = కొంచెం కూడా
లేదు = లేద
బుధకోటికిన్ = పండితుల సమూహానికి
కొంగుపసిండి = కొంగున మూటగట్టిన బంగారం (అవసరానికి ఉపయోగ పడుతుంది)
సత్యము = సత్యం (చెప్పడం సంగతంటారా !)
ఆరూపము = దాని స్వరూపమే అతడు
తారతమ్యములు = వ్యత్యాసాలు (మనుష్యులలో)
ఎఱుంగు = తెలియును
స్వతంత్రుడు = స్వేచ్ఛగలవాడు (నిర్ణయాధి కారంలో)
నూతన ప్రియ + ఆటోపము = కొత్త విషయాలపట్ల ఆడంబరం
లేని = లేనటువంటి
నిశ్చలుడు = స్థిర స్వభావం గలవాడు
ఇటుల్ = ఈ విధంగా
కృతలక్షణుండు + ఐ = కృతయుగ (మంచి) లక్షణాలు కలిగి
చెలంగగాన్ = ప్రవర్తిస్తుండగా/ప్రకాశిస్తుండగా
అల ధర్మనందనున్ = ఆ యమధర్మరాజు వరపుత్రు డైన ధర్మరాజును
ద్వాపర లక్షణుండు = (సందిగ్ధమైన) (ద్వాపరయుగ లక్షణాలు కలవాడనీ
అనగ వచ్చునొకో = అనవచ్చునా ? (అనకూడదు)
(అనగవచ్చును + ఒకొ) కృతలక్షణుడనాలి.
జవాబు:
1, 9 పద్యాలు, వాటి ప్రతిపదార్థాలు, భావములు ముందుగానే వేరుగా ఇచ్చాము. వాటిని చదువండి. వాటిని చదివి ప్రతిపదార్థాలు రాయడం నేర్చుకోండి.

TS 9th Class Telugu Guide 1st Lesson ధర్మార్జునులు

4. కింది భావాలు గల పద్యపాదాలు ఏయే పద్యాల్లో ఉన్నాయో గుర్తించండి.

అ) ధర్మరాజే సాటిలేని చక్రవర్తి.
జవాబు:
పై భావం గల పద్యపాదము, రెండవ పద్యంలో ఉంది. “నితడెఁపో సార్వభౌముఁడ ప్రతిముఁ డనఁగఁ బ్రజలఁ బాలించె సకల దిగ్భాసమాన కీర్తి విసరుండు పాండవాగ్రేసరుండు”.

ఆ) గరుడధ్వజుని స్నేహితుడు.
జవాబు:
పై భావం గల పద్యపాదము, తొమ్మిదవ పద్యంలో ఉంది. “బతగ కులాధిపధ్వజుని ప్రాణసఖుండు” – అని.

ఇ) ఎల్లప్పుడు ధర్మాన్ని సంపాదించే దృష్టేగాని న్యాయం తప్పలేదు.
జవాబు:
పై భావం గల పద్యపాదము, మూడవ పద్యములో ఉంది. “రేవగల్ ధర్మమార్జించు దృష్టియె కాని, న్యాయంబు దప్పిన నడకలేదు.”

ఈ) అర్జునుడు సాత్త్వికులతో కూడా ప్రశంసల నందుకునే ధర్మవర్తన గలవాడు.
జవాబు:
పై భావం గల పద్యపాదము, ఎనిమిదవ పద్యంలో ఉంది. “సాత్వికుల్ దన్నుఁనుతింపఁగాఁ దనరు ధార్మికుఁడర్జునుఁ డొప్పునెంతయున్.”

ప్రశ్న 5.
కింది పద్యాన్ని చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
* కుసుమ కోమల భావముల్ కూర్చువేళ
సరసకవులకు కలములన్ నెరసు లేక
జాఱు మకరంద ధారల తీరు రసము
తేలికన జిల్కు మా ముద్దు తెలుగుపలుకు
– శిరశినహళ్ కృష్ణమాచార్య

ప్రశ్నలు
అ) పై పద్యాన్ని రాసిన కవి ఎవరు ?
జవాబు:
పై పద్యాన్ని ‘శిరశినహళ్ కృష్ణమాచార్య’ రచించారు.

ఆ) కవులు ఎటువంటి భావాలను కూర్చగలరు ?
జవాబు:
కవులు కుసుమములవలె కోమలములయిన భావాలను కూర్చగలరు.

TS 9th Class Telugu Guide 1st Lesson ధర్మార్జునులు

ఇ) కలం నుండి తెలుగు పలుకులు ఎట్లా జాలువారుతాయి ?
జవాబు:
కలం నుండి తెలుగు పలుకులు, మకరంద ధారలవలె జాలువారుతాయి.

ఈ) తెలుగు పలుకులను కవి దేనితో పోల్చాడు ?
జవాబు:
తెలుగు పలుకులను, కవి మకరంద ధారలతో పోల్చాడు.

ఉ) ఈ పద్యానికి శీర్షికను నిర్ణయించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక “తెలుగు పలుకు” అన్నది సరిపడుతుంది.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) పాండవుల గుణగణాల గురించి కవి ఏమని వర్ణించాడు ? ఎందుకు ?
జవాబు:
ధర్మరాజు నలుగురు తమ్ములూ, ఓటమిని ఎరుగని వారు. శత్రువులను ఓడించడానికీ, యాచకుల దీనత్వం పోగొట్టడానికీ, ఎల్లప్పుడూ ఉత్సాహం కలిగియుంటారు. వీరు మంచి పరాక్రమం గలవారు.

పాండవులు ఐదుగురూ. కోరిన కోరికలు తీర్చడంలో అయిదు దేవతా వృక్షాలవంటివారని. శత్రువులను జయించడంలో విష్ణుమూర్తి అయిదు ఆయుధాల వంటి వారనీ, పవిత్ర ప్రవర్తనలో ఈశ్వరుడి ఐదు ముఖాల వంటివారనీ, లోకం పొగిడేటట్లు గుణవంతులుగా ఉండేవారు.

పాండవులు స్నేహభావం, భక్తి, ప్రేమ, ఓర్పు కనబడేటట్లు, పెద్ద, చిన్న అనే తేడాలు తెలుసుకొని, ఒకరిమాట మరొకరు దాటకుండా చేసే పనులలో తేడా లేకుండా, ఒకరి మనస్సుననుసరించి మరొకరు నడచుకుంటూ ఉండేవారు. అన్నదమ్ముల సరాగము అంటే పాండవులదే అని లోకము ప్రశంసించే విధంగా వారు ప్రవర్తించేవారు.

TS 9th Class Telugu Guide 1st Lesson ధర్మార్జునులు

ఆ) ఈ పాఠానికి “ధర్మార్జునులు” అనే పేరు తగినవిధంగా ఉన్నదని భావిస్తున్నారా ? ఎందుకు ?
జవాబు:
ఈ పాఠంలో మొత్తం 10 పద్యాలు ఉన్నాయి. అందులో మొదటి నాలుగు పద్యాలలో ధర్మరాజు సుగుణాలనూ, ప్రజలను అతడు పాలించిన విధానమునూ వర్ణించారు. అలాగే చివరి 8, 9, 10 పద్యాలలో అర్జునుని సుగుణాలనూ, అతడి సౌందర్యాన్నీ, దయాగుణాన్నీ, అతడి యుద్ధ విజయాలనూ గూర్చి వర్ణించారు.

ఇందులో ఐదు, ఆరు, ఏడు పద్యాలలో మాత్రము మొత్తం పాండవులు ఐదుగురి గుణగణాలనూ కవి వర్ణించాడు. మొత్తంపై ధర్మరాజు గురించి, అర్జునుడి గురించి ఈ పద్యాలలో విశేషంగా వర్ణింపబడింది. కాబట్టి మొత్తం ఈ పాఠానికి ధర్మరాజు పేరు, అర్జునుడి పేరు కలిసివచ్చేలా, ‘ధర్మార్జునులు’ అని పేరు పెట్టడం తగిన విధంగానే ఉన్నదని భావిస్తున్నాను.

ఇ) ‘పాండవులు ఉదారస్వభావులు’ సమర్థిస్తూ రాయండి.
జవాబు:
ఉదార స్వభావము అన్నదానికి దాతృత్వము, దయ, గొప్పతనము, సరళస్వభావము, గాంభీర్యము, నేర్పరిదనము అని అనేక విశేషార్థాలు ఉన్నాయి. పాండవులు ఐదుగురూ పైన చెప్పిన గుణగణాలు కలవారు.

ధర్మరాజు శాంతి దయలు, ఆభరణంగా కలవాడు. సాధు జనులను ఆదరించేవి డు. దానవిద్య యందు ఆసక్తి కలవాడు. యాచకులకు అడిగిన దానికంటే అధికంగా ఇచ్చేవాడు.

ధర్మరాజు ప్రజల సంపదకు అసూయపడేవాడు కాడు. రాత్రింబగళ్ళు ధర్మాన్ని ఆచరించేవాడు. అన్యాయ ప్రవర్తన అతడి వద్ద లేదు. పండితులకు ధర్మరాజు కొంగు బంగారం వంటివాడు.

పాండవులందరూ యాచకుల దీనత్వాన్ని పోగొట్టే సుగుణం కలవారు. పాండవులు దేవతా వృక్షములయిన కల్పవృక్షాల మాదిరిగా యాచకుల కోర్కెలు తీర్చేవారు. వారంతా పరస్పర ప్రేమతో కలిసిమెలిసి ఉండేవారు.

ఇక అర్జునుడు ధార్మికుడు. అర్జునుడు దయారసంలో శ్రీకృష్ణునికి ప్రాణసఖుడట. ఈ పై గుణాలు పాండవుల యందు ఉండడం చేత, వారిని ఉదార స్వభావులని చెప్పడం సమర్థనీయమే.

TS 9th Class Telugu Guide 1st Lesson ధర్మార్జునులు

ఈ) మంచివారిని ఆదరించి పోషించవలసిన ఆవశ్యకతను గురించి రాయండి.
జవాబు:
మంచివారు అంటే సత్పురుషులు అనగా మంచి గుణాలు కలవారు. ప్రభువులు మంచివారిని ఆదరించి, వారికి ఉద్యోగమిచ్చి వారిని పెంచి పోషించాలి. మంచి వారిని ఆదరించి పోషిస్తే, వారు సహృదయులు కాబట్టి, యజమానుల క్షేమానికీ, వారి అభివృద్ధికీ కృషి చేస్తారు.

యోగ్యుడైన రాజు తన విచక్షణ జ్ఞానంతో ప్రజల మంచి చెడులను ముందుగా గుర్తించాలి. మంచివారిని ప్రోత్సహించాలి. చెడును ఖండించాలి.

మంచివారికి ఆశ్రయం కల్పిస్తే వారు ధర్మమార్గంలో సంసారాన్ని పోషించుకుంటారు. లోకోపకారానికి ప్రయత్నిస్తారు. మంచివారినే మనం ఆదరిస్తే లోకంలో దుర్జనులకు ఆశ్రయం లభించదు. ఆ విధంగా లోకంలో దుష్టత్వం దూరం అవుతుంది. మంచిగా ఉందాం. మంచినే చేద్దాం. మంచివారినే ఆదరిద్దాం అనే భావం లోకంలో వ్యాపిస్తుంది.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) ధర్మరాజు వ్యక్తిత్వాన్ని గురించి మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
ధర్మరాజు వ్యక్తిత్వము : ధర్మరాజు పాండవులలో పెద్దవాడు. ఇంద్రప్రస్థ పట్టణాన్ని పాలించేవాడు. ధర్మరాజు తాను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం, తాను సహితం ఆచరించేవాడు. శాంతము, దయ, సత్యము అనే సద్గుణాలు గలవాడు. మంచివారిని ఆదరించేవాడు. దానము చేయడంలో ఆసక్తి కలవాడు. ఆయన గొప్ప పరాక్రమంతో ప్రజలు మెచ్చుకొనేటట్లు రాజ్యపాలన చేసేవాడు.

ధర్మరాజు ఇతరుల గురించి రహస్యంగా చెడు చెప్పేవాడు కాడు. ముఖప్రీతి కోసం మాట్లాడేవాడు కాడు. ఎవరికీ చనువు ఇచ్చి, వారిని లోకువ చేసేవాడు కాడు. మెచ్చుకున్నప్పుడు తృప్తిగా ఇచ్చేవాడు. మొగమాటానికి ఎవరినీ మెచ్చుకొనేవాడు . కాడు. ప్రజల సంపదలకు సంతోషపడేవాడు కాని, అసూయపడేవాడు కాడు. వెగటుగా ఎవరినీ చూసేవాడు కాడు. అడిగినంత ఇచ్చేవాడు. రాత్రింబగళ్ళు ధర్మార్జన చేసేవాడు. అన్యాయ ప్రవర్తన లేనివాడు.

ధర్మరాజునకు కోపం లేదు. పండితులకు ఆయన కొంగు బంగారం వంటివాడు. సత్యస్వరూపుడు. ఆయన మనుష్యుల తారతమ్యాలు తెలిసిన స్వతంత్రుడు. కొత్త వారిపై మోజులేనివాడు. అతడు కృతయుగ లక్ష్మణుడు.

TS 9th Class Telugu Guide 1st Lesson ధర్మార్జునులు

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా రాయండి.

అ) మీకు తెలిసిన మంచిగుణాలు కలిగిన ఒకరిని గురించి ‘అభినందన వ్యాసం’ రాయండి.
జవాబు:
మా వరంగల్లు నగరంలో ‘కామేశ మహర్షి’ అనే ఒక సత్పురుషుడూ, దైవభక్తుడూ ఉన్నాడు. ఆయన ఇంజనీరింగ్ పట్టభద్రుడు. ఆయన తల్లిగారి జన్మస్థలము “వరంగల్లు”. కామేశ మహర్షికి తల్లిదండ్రులు ‘బెహరా’ అని పేరు పెట్టారు. బెహరా పదవ తరగతిలో ఉండగా, కంచి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్రసరస్వతీ స్వామి ఒకసారి వరంగల్లు కళాశాలకు వచ్చారు. ‘బెహరా’ స్నేహితులతో కలసి, స్వామిని దర్శించారు. కంచి స్వామి, చిన్న కామాక్షీదేవి విగ్రహాన్ని బెహరా గార్కి ఇచ్చారు. అంతే, బెహరా కామాక్షీ భక్తుడుగా మారారు.

మహర్షి నగరంలో కామాక్షీ ప్రేమ మందిరాన్ని స్థాపించి, అమ్మవారిని ఆరాధిస్తున్నారు. దిక్కులేని అనాథపిల్లలను ఆశ్రమంలో చేర్చుకొని, వారందరికీ తండ్రిగా తల్లిగా తానే ఉంటూ, వారిని పెంచి పోషిస్తున్నారు.

కంచి పీఠాధిపతులు ఒకసారి బెహరా గారి ప్రేమమందిరాన్ని దర్శించి, బెహరా గారిని కామేశ మహర్షి అని పిలిచారు. బెహరాగారికి ఎందరో సజ్జనులు చందాలు ఇస్తూ ఉంటారు. కామేశ మహర్షిగారు ఒక ట్రస్టు ఏర్పరచారు. ఆ ధనంతో సుమారు ప్రేమమందిరంలోని నూరు మంది బాలబాలికలకు భోజన వసతి, విద్యా సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రేమమందిరంలోని బాలబాలికలను మహర్షిగారు ఆదరిస్తున్న పద్ధతి చూస్తే సామాన్యులకు ఆశ్చర్యం వేస్తుంది. ఆయన కారణజన్ముడు. కరుణామూర్తి.

మహర్షిగారు అనాథ బాలబాలికలు పెద్దవారయ్యాక, వారికి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. వారికి పురుళ్ళు పోస్తున్నారు. వారి పిల్లలకు బారసాలలు జరిపిస్తారు. పేరంటాలు ఫెట్టిస్తారు. కన్న తల్లిదండ్రులు సైతం ఇంత ప్రేమతో, ఆదరణతో తమ పిల్లలను చూడలేరు.

చందాల రూపంగా వచ్చిన మొత్తంతో మందిరానికి మంచి భవనం కట్టించారు. పిల్లలకు వసతి సౌకర్యాలు, బట్టలు, పుస్తకాలు ఏర్పాటు చేస్తున్నారు.

కామేశ మహర్షి దయాగుణం మూర్తీభవించిన సత్యస్వరూపులు. ప్రేమ, వాత్సల్యం, అనురాగం, ఆర్ద్రత గూడు కట్టుకున్న మహనీయ త్యాగమూర్తి. మహర్షిగారికి పెళ్ళి కాలేదు. పిల్లలు లేరు. అనాథ బాలబాలికలే వారి సంతానము. ఆయన దైవస్వరూపుడు.

TS 9th Class Telugu Guide 1st Lesson ధర్మార్జునులు

ఆ) పాఠం ఆధారంగా చేమకూర వేంకటకవి గురించి ప్రశంసిస్తూ రాయండి.
జవాబు:
చేమకూర వేంకటకవి తంజావూరు రాజ్యాన్ని పాలించిన రఘునాథనాయకుని ఆస్థానకవి. ఈ వేంకటకవి, ‘విజయవిలాసము’ అనే గొప్ప చమత్కార ప్రబంధాన్ని రచించి, రఘునాథరాయలకు అంకితం ఇచ్చాడు.

ఈ విజయవిలాస ప్రబంధము తెలుగులో పంచకావ్యాలని పిలువబడే వాటిలో చివరిది. ఉత్తమమైనది. వేంకటకవిని రఘునాథరాయలు మెచ్చుకొని “ప్రతిపద్యమునందు చమత్కృతి కలుగ చెప్పనేర్తువు”, “క్షితిలో నీ మార్గము ఎవరికింరాదు సుమీ” అని మెచ్చుకున్నాడు. దీనిని బట్టి వేంకటకవి ప్రతి పద్యంలోనూ చమత్కారం ఉండేటట్లు రాస్తాడనీ, వేంకటకవిలా ఇతరులు వ్రాయలేరనీ తెలుస్తుంది.

మన పాఠంలో చమత్కారాలు చూద్దాం. ఈ పద్యాలన్నింటిలో అర్జునుడిని వర్ణిస్తూ చెప్పిన “అతని నుతింపశక్యమె …………… మహీతలమ్మునన్” అనే 9వ పద్యము మేలిరత్నం వంటిది. అర్జునుడు అందంలో జయంతుని తమ్ముడట అంటే సమానం అన్నమాట. దయారసంలో కృష్ణుడికి ప్రాణసఖుడట అంటే కృష్ణునితో సమానం. యుద్ధ విజయంలో ఈశ్వరుడికి ‘ప్రతిజోదు’ అట అంటే సమానమన్న మాట. ఇలా అందంలో జయంతునితో, దయలో కృష్ణుడితో, యుద్ధంలో ఈశ్వరుడితో సమానమని చెప్పి, చివరి పంక్తిలో భూమండలంలో ‘అతనికతండె సాటి’ అని చెప్పాడు.

మొదటలో అర్జునుడిని ముగ్గురితో సమంగా చెప్పి చివరన అర్జునుడికి అర్జునుడే భూమండలంలో సాటి అనడంలో చమత్కారం ఉంది. జయంతుడు, విష్ణుడు, ఈశ్వరుడు అనేవారు భూమండలంలోనివారు కారు. భూమండలంలో అర్జునుడిని మించిన వారులేరని దానిలో చమత్కారం. అదేగాక పురాణాల ప్రకారం జయంతుడు అర్జునుడికి తమ్ముడే, కృష్ణుడు ప్రాణసఖుడే, ఈశ్వరుడు ప్రతిజోదే ఇది మరో చమత్కారం. ఈ పద్యాలు మంచి సమాస గాంభీర్యంతో శబ్దాలంకారాలతో అద్భుతంగా నడుస్తాయి. ‘ఆ పురమేలు, మేలు’ అన్న పద్యం శబ్దాలంకార సుందరము.

‘కోప మొకింత లేదు. బుధకోటికి కొంగు బసిండి’ అన్న పద్యంలో మంచి తెలుగు నుడికారమూ, అందమైన శైలి, ప్రసన్న గంభీరమైన పద్యం నడక కనబడుతుంది.

‘కీర్తి విసరుండు, పాండవాగ్రేసరుండు’, ‘ఏలవలెశాశ్వతము గాగ, నీ ఘనుండె, యేలవలె నన్యులు” అన్నచోట మంచి శబ్దాలంకారాలు ఉన్నాయి.

“పాఱఁ జూచిన బరసేన పాఅఁజూచు
వింటి కొరిగిన రిపురాజి వింటికొరగు” అనే పాదాల్లో అద్భుతమైన యమకాలంకారం ఉంది. మొత్తంపై చేమకూర పాకాన పడిందన్నమాట నిజము. మా పాఠంలో పద్యాలు చేమకూర కవి కవిత్వానికి నిజమైన మచ్చుతునకలు.

III. భాషాంశాలు

పదజాలం

ప్రశ్న 1.
కింది పదాలకు అర్థాలు రాస్తూ సొరతవాక్యాల్లో ప్రయోగించండి.
అ) సోయగం = ……………………..
జవాబు:
చక్కదనము
వాక్యప్రయోగం : బాలకృష్ణుని సోయగం అపూర్వమైనది.

TS 9th Class Telugu Guide 1st Lesson ధర్మార్జునులు

ఆ) ఏవురు = ………………….
జవాబు:
ఐదు మంది
వాక్యప్రయోగం : మా అన్నదమ్ములు ఏవురూ కలసి, పొరుగూరు వెళ్ళాము.

ఇ) వెగటు = …………………….
జవాబు:
వైరస్యము
వాక్యప్రయోగం : ఈ మందు త్రాగడం నాకు వెగటుగా ఉంటుంది.

ఈ) బుధుడు = …………………………
జవాబు:
పండితుడు
వాక్యప్రయోగం : బుధుడు దేశవిదేశాల్లో గౌరవాన్ని పొందుతాడు.

2. కింది పదాలకు వ్యుత్పత్తి అర్థాలు రాయండి.

అ) తనూజుడు : …………………..
జవాబు:
తన దేహము నుండి పుట్టినవాడు (కుమారుడు)

ఆ) నృపాలుడు : ………………………..
జవాబు:
నరులను పాలించువాడు (రాజు)

TS 9th Class Telugu Guide 1st Lesson ధర్మార్జునులు

ఇ) నందనుడు : …………………………..
జవాబు:
సంతోషపెట్టువాడు (కొడుకు)

3. కింది పదాలకు పర్యాయపదాలు రాయండి.

అ) క్షితి = ……………………..
జవాబు:

  1. భూమి
  2. ధరణి
  3. వసుధ

ఆ) కుమారుడు = ……………………..
జవాబు:

  1. తనూజుడు
  2. పుత్రుడు
  3. కొడుకు

ఇ) మొగము = ……………………
జవాబు:

  1. ముఖము
  2. వదనము
  3. ఆననము
  4. వక్త్రము

TS 9th Class Telugu Guide 1st Lesson ధర్మార్జునులు

ఈ) పురము = ………………………
జవాబు:

  1. నగరం
  2. ప్రోలు
  3. పట్టణం

4. కింది వాక్యాలను గమనించండి. ఆయా వాక్యాలలోని ప్రకృతి – వికృతుల్ని గుర్తించి పట్టికగా కూర్చండి.

అ) బుద్ధుని యొక్క దమ్మం ఎందరినో ధర్మమార్గంలో నడిపింది.
జవాబు:
ధర్మము – దమ్మము

ఆ) ఉపాధ్యాయుని గౌరవించాలి. ఒజ్జ చూపిన మార్గంలో నడవాలి.
జవాబు:
ఉపాధ్యాయుడు – ఒజ్జ

ఇ) ప్రకృతి ఆజ్ఞను ధిక్కరించను. ఇదే నా యొక్క ఆన.
జవాబు:
ఆజ్ఞ – ఆన

ఈ) తెలుగు భాషను కాపాడుతానని బాస చేస్తున్నాడు.
జవాబు:
భాష – బాస

5. కింది వాటిలో నానార్థాలు గుర్తించండి, పట్టిక రాయండి.

అ) రాజు = ……………………
అ) తరువు, చెరువు
ఆ) ప్రభువు, ఇంద్రుడు
ఇ) చిలుక, పలక
ఈ) రాముడు, భీముడు
జవాబు:
ఆ) ప్రభువు, ఇంద్రుడు

TS 9th Class Telugu Guide 1st Lesson ధర్మార్జునులు

ఆ) ప్రియం = ……………………..
అ) హెచ్చు, ఇష్టం
ఆ) పేరు, ఊర
ఇ) చౌక, తేలిక
ఈ) బాధ, సంతోషం
జవాబు:
అ) హెచ్చు, ఇష్టం

ఇ) దిక్కు = ………………………
అ) దిశ, ఆశ్రయం
ఆ) కన్ను, ఆకాశం
ఇ) మార్గం, ఆశ్రయం
ఈ) తూర్పు, నేర్పు
జవాబు:
అ) దిశ, ఆశ్రయం

ఈ) చిత్తము = ……………………..
అ) బొమ్మ, కాగితం
ఆ) ఉత్తరం, నది
ఇ) ఇష్టం, కష్టం
ఈ) మనసు, ఇష్టం
జవాబు:
ఈ) మనసు, ఇష్టం

TS 9th Class Telugu Guide 1st Lesson ధర్మార్జునులు

వ్యాకరణాంశాలు

కర్మధారయ సమాసం

కింది సమాసపదాలను, విగ్రహవాక్యాలను పరిశీలించండి.
అ) ఉదగ్రతేజం – ఉదగ్రమైన తేజం
ఆ) తొల్లిటిరాజులు – తొలివారలైన రాజులు
గమనిక : పై సమాసాలను పరిశీలిస్తే, సమాస పదాలలోని పూర్వపదాలు వరుసగా ‘ఉదగ్ర’, తొల్లిటి”, “ప్రియ” అని ఉన్నాయి. ఇవి విశేషణము. అనగా గుణాలను తెలిపేవి.

  • ఉత్తర పదాలు పరిశీలిస్తే, వరుసగా ‘తేజం’, ‘రాజులు’, అని ఉన్నాయి. ఇవి నామవాచకాలు. అనగా విశేష్యాలు.
  • అంటే ఈ సమాసపదాలు విశేషణ విశేష్యాలతో ఏర్పడినవి. ఇట్లాంటి వాటిని కర్మధారయ సమాసాలు అంటారు. ఇందులో
  • విశేషణం పూర్వపదంగా ఉండి, ఉత్తరపదం నామవాచకంగా ఉంటే, అది ‘విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం’ అని గుర్తించాలి.

అభ్యాసము : కింది సమాస పదాలకు విగ్రహవాక్యములు రాసి, పై వివరణ సూత్రంతో సరిచూసుకోండి.
ప్రశ్న 1.
సకలజనములు – …………………………..
జవాబు:
సకలజనములు  – సకలమైన జనములు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

ప్రశ్న 2.
ధార్మికుడర్జునుడు ……………………………
జవాబు:
ధార్మికుడర్జునుడు  – ధార్మికుడైన అర్జునుడు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

TS 9th Class Telugu Guide 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 3.
పరసేన – ………………………………
జవాబు:
పరసేన  – పరమైన సేన – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

కింది సమాసపదాలను, విగ్రహవాక్యాలను పరిశీలించండి.

అ) తమ్ముకుర్రలు – కుర్రలైన తమ్ములు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఆ) కార్మికవృద్ధులు – వృద్ధులైన కార్మికులు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం సమాసాలలో ఉత్తరపదాలుగా ఉన్నాయి. తమ్ములు, వివరణ : విశేషణ పదాలైన ‘కుర్రలు, వృద్ధులు’ అనే పదాలు, పై కార్మికులు, అనే నామవాచకాలు, సమాసంలో పూర్వపదాలుగా ఉన్నాయి.

అంటే ……………… విశేషణము ఉత్తర పదంగా ఉండి, నామవాచకము పూర్వపదంగా ఉంటే, అది ‘విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము’ అని గుర్తించాలి.
అభ్యాసము : కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి ఏ సమాసాలో గుర్తించి రాయండి.
అ) పాదపద్మం – …………………..
జవాబు:
పాదపద్మం – పద్మము వంటి పాదం – ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం

ఆ) చారుసంసారం – ………………………..
జవాబు:
చారుసంసారం – చారువు అయిన సంసారం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

ప్రాజెక్టు పని

ప్రశ్న 1.
ఉత్తమ పాలనను ‘రామరాజ్యం’తో పోలుస్తారు కదా ! శ్రీరాముని పరిపాలన ఏ విధంగా ఉండేదో తెలుసుకొని నివేదిక రాయండి.
జవాబు:

  1. శ్రీరాముడు రాజ్యమును పాలించేటప్పుడు స్త్రీలకు వైధవ్యము ఉండేది కాదు.
  2. ప్రజలకు క్రూరమృగముల బాధ లేదు.
  3. ప్రజలకు రోగ భయము లేదు.
  4. జనాలకు దొంగల భయము లేదు. ప్రజలకు ఎటువంటి కీడు సంభవింపలేదు. పెద్దలు బ్రతికియుండగా వారి పిల్లలు మృతి పొందలేదు.

రామరాజ్యంలో ప్రజలంతా ధర్మనిరతులై ఉండేవారు. వారు సంతోషంతో జీవించేవారు. వారంతా శ్రీరాముడినే ధ్యానిస్తూ, ఒకరితో ఒకరు విరోధములు లేకుండా ఉండేవారు.

TS 9th Class Telugu Guide 1st Lesson ధర్మార్జునులు

రాముని పాలనలో ప్రజలు దీర్ఘాయుర్దాయములతో ఉండేవారు. వారికి ఎక్కువగా సంతానం ఉండేది. వారికి విచారము లేదు. ఆరోగ్య భాగ్యముతో వారు వర్ధిల్లారు. ఆ రామరాజ్యంలో ఎవరినోట విన్నా రాముడి పేరే వినబడేది.

వృక్షములు అన్నీ పుష్పఫల భరితంగా ఉండేవి. సకాలంలో వర్షాలు కురిసేవి. చల్లటిగాలి వచ్చేది. ప్రజలు దురాశాపరులు కారు. ప్రజలు ఎవరిపని వారు చేసుకొనేవారు. ప్రజలు ధర్మవర్తనులు. సత్యమునే పలికేవారు. స్వధర్మాన్నే ఆచరించేవారు.

పద్యాలు – ప్రతిపదార్థాలు – భావాలు

I.

1వ పద్యం : (కంఠస్థ పద్యం)
*ఉ. ఆ పురమేలు ‘మేలు బళి !, యంచుఁ బ్రజల్ జయవెట్టుచుండ నా
జ్ఞా పరిపాలన వ్రతుఁడు, శాంతి దయాభరణుండు, సత్య భా
షా పరతత్త్యకోవిదుఁడు, సాధు జనాదరణుండు, దాన వి
ద్యా పరతంత్ర మానసుఁడు ధర్మతనూజుఁ డుదగ్రతేజుఁడై.

ప్రతిపదార్థం :

ఆజ్ఞా పరిపాలన వ్రతుడు;
ఆజ్ఞా = తాను చేసిన ఆజ్ఞా ప్రకారము
పరిపాలన = తాను కూడా పరిపాలించాలన్న
వ్రతుడు = దీక్షా వ్రతము కలవాడునూ
శాంతి దయాభరణుండు;
శాంతి = శాంతము
దయా = ‘దయ’ అన్న మహాగుణాలు
ఆభరణుండు = భూషణాలుగా కలవాడునూ
సత్యభాషా పరతత్త్వ కోవిదుడు;
సత్యభాషా = నిజాన్ని చెప్పడంలోని
పరతత్త్వ = ఉత్కృష్టమైన స్వరూపాన్ని (స్వారస్యాన్ని)
కోవిదుడు = బాగా తెలుసుకున్నవాడునూ;
సాధుజనాదరణుండు;
సాధుజన = మంచివారలను
ఆదరణుండు = ఆదరించి పోషించేవాడునూ;
దానవిద్యాపరతంత్ర మానసుడు;
దానవిద్యా = దానము చేయడమనే విద్యయందు
పరతంత్ర = ఆసక్తి కల
మానసుడు = మనస్సు కలవాడునూ అయిన
ధర్మతనూజుడు = యమధర్మరాజు కుమారుడైన ధర్మరాజు
ఉదగ్రతేజుడై;
ఉదగ్ర = మిక్కిలి తీక్షణమైన (నిశితమైన)
తేజుడై (తేజుడు + ఐ) = పరాక్రమము గలవాడై;
ప్రజల్ = ప్రజలు
మేలు, బళి, అంచున్ = మేలు, బళి అని అతడిని ప్రశంసిస్తూ
జయవెట్టుచుండన్;
జయ = జయజయ ధ్వనులు
పెట్టుచుండ = పెడుతుండగా; (చేసేలాగున)
ఆ పురము = ఆ ఇంద్రప్రస్థ పట్టణాన్ని
ఏలున్ = పాలిస్తూ ఉండేవాడు

భావం :
యమధర్మరాజు వరపుత్రుడైన ధర్మరాజు, తాను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారము తాను కూడా ప్రవర్తించాలన్న దీక్షావ్రతం గలవాడు. శాంతము, దయ అనే మహాగుణాలనే ఆభరణములుగా ధరించినవాడు. సత్యభాషణములోని రహస్యాన్ని బాగా తెలుసుకున్నవాడు. మంచివారలను ఆదరించి పోషించేవాడు.

దానం చేయడం అనే విద్యయందు ఆసక్తి కల మనస్సు కలవాడు. అతడు మిక్కిలి తీక్షణమైన పరాక్రమం కలవాడై; ప్రజా రంజకుడుగా రాజ్యపాలన చేస్తుండేవాడు. అటువంటి ధర్మరాజు, ప్రజలు ‘మేలు, బళి’ అని జయ జయ ధ్వనులు చేసేటట్లుగా, ఇంద్రప్రస్థ పట్టణాన్ని పాలిస్తున్నాడు.

TS 9th Class Telugu Guide 1st Lesson ధర్మార్జునులు

2వ పద్యం
సీ. అవలఁ బోయిన వెన్కనాడు టెన్నఁడు లేదు,
మొగము ముందఱ నంట మొదలెలేదు,
మనవి చెప్పినఁ జేయకునికి యెన్నఁడు లేదు,
కొదవగా నడుపుట మొదలెలేదు,
చనవిచ్చి చౌక చేసినది యెన్నఁడులేదు,
పదరిహెచ్చించుట మొదలెలేదు,
మెచ్చినచోఁ గొంచె మిచ్చుటెన్నడుఁ లేదు,
మొకమిచ్చకపు మెచ్చు మొదలెలేదు.

తే. మఱియుఁ దొల్లిటి రాజుల మహిమలెన్న
నితడెఁపో సార్వభౌముఁడ ప్రతిముఁ డనఁగఁ
బ్రజలఁ బాలించె సకల దిగ్భ్ర్భాసమాన
కీర్తి విసరుండు పాండవాగ్రేసరుండు.

ప్రతిపదార్థం :
అవలబోయిన వెన్కన్;
అవలన్ + పోయిన వెన్కన్ = బయటకు వెళ్ళిపోయిన తరువాత (అతడిని గురించి)
ఆడుటెన్నడు లేదు; (ఆడుట + ఎన్నడు లేదు) = చెడ్డగా మాట్లాడడం ఎప్పుడూ లేదు
మొగము ముందఱన్ + అంట = ముఖప్రీతి కోసం (నిజం కాని) మంచిమాటలు (ప్రశంసలు) ముఖం ముందే చెప్పడం;
మొదలెలేదు = ముందే లేదు
మనవి చెప్పినన్ = ఏదైన సాయం కోసం మనవి చేసుకుంటే;
చేయకునికి (చేయక + ఉనికి) = ఆ సహాయం చేయకుండా ఉండడం;
ఎన్నడు లేదు = ఎప్పుడూ లేదు
కొదవగా నడుపుట = కొఱతగా (లోపముగా) ఆచరించడం (ఆ సాయం చేసి నప్పుడు అరకొరగా ఏదో చేశాం అనిపించుకోడానికి ఇవ్వడం)
మొదలె లేదు. = ముందే లేదు (సంపూర్ణంగా సాయంచేసే వాడని భావం)
చనవిచ్చి(చనవు + ఇచ్చి) = ప్రేమతో కూడిన స్వేచ్ఛ ఇచ్చి;
చౌక చేసినది = చులకన చేసినది .
ఎన్నడు లేదు = ఎప్పుడూ లేదు. (కొత్తవారు పరిచయం అయినపుడు మొదటలో ఎక్కువగా మర్యాద చేసి, తరువాత వారి వైపు చూడకుండా అనాదరం చూపించడం అన్న గుణం లేదు.)
పదరి హెచ్చించుట = కోపించి, విజృంభించడం
మొదలె లేదు = ముందే లేదు
మెచ్చినచోన్ = మెచ్చుకుంటే
కొంచెమిచ్చుట (కొంచెము + ఇచ్చుట) = కొద్దిగా ఇవ్వడం
ఎన్నడు లేదు = ఎప్పుడూ లేదు
మొకమిచ్చకపు మెచ్చు (మొకమిచ్చకము + మెచ్చు) = ముఖప్రీతి కోసం మెచ్చుకోడం;
మొదలెలేదు = ముందే లేదు
మఱియున్ = మరియూ
తొల్లిటి రాజుల = పూర్వపు రాజుల
మహిమలు = గొప్ప గుణాలను
ఎన్ని = పరిశీలించి (ఇప్పటి ప్రభువులలో లోపించిపోయిన మంచి గుణాలు ధర్మరాజులో ఉండడం గుర్తించి)
ఇత పో ఈ ధర్మరాజే సుమా !
అప్రతిముడు = సాటిలేని వాడైన
సార్వభౌముడు = చక్రవర్తి
అనగన్ = అనడానికి తగినట్లుగా
సకల దిగ్భాసమాన కీర్తి విసరుండు;
సకల దిక్ = అన్ని దిక్కులందు
భాసమాన = ప్రకాశిస్తున్న
కీర్తివిసరుండు = కీర్తి సమూహము గలవాడు; (అతడి కీర్తిని గురించి నాలుగు దిక్కులలో ఉన్న లోకులూ వింటూ ఉంటారని భావము.)
పాండవాగ్రేసరుండు;
(పాండవ + అగ్రేసరుండు) = పాండవులలో పెద్దవాడయిన ధర్మరాజు
ప్రజల = ప్రజలను
పాలించెన్ = పాలించాడు

భావం :
ఇతరుల గురించి వారు వెళ్ళిపోయిన తరువాత, చెడుగా మాట్లాడటం ఎప్పుడూ లేదు. ముఖప్రీతి కోసం, మంచి మాటలు చెప్పడం ముందే లేదు. ఏదైనా సాయం కోసం మనవి చేసుకుంటే, ఆ సాయాన్ని చేయకుండా ఉండటం ఎప్పుడూ లేదు. అరకొరగా సాయం చేయడం ముందే లేదు. పరిచయమైనప్పుడు ఎక్కువ మర్యాదనిచ్చి, తరువాత అమర్యాదగా కోపించడం ముందే లేదు. మెచ్చుకున్నప్పుడు వారికి తక్కువ ఇవ్వడం అనేదే లేదు. ముఖప్రీతి కోసం ఎవరినీ మెచ్చడం అసలే లేదు.

పూర్వ రాజులు గొప్పగుణాలను ఎన్నో పరిశీలించి, ఈ ధర్మరాజే సాటిలేని చక్రవర్తి అనే రీతిగా, అన్ని దిక్కులకూ తన కీర్తికాంతులను ప్రసరింపచేస్తూ, పాండురాజు పెద్ద కుమారుడైన ధర్మరాజు, ప్రజలను పాలించేవాడు.

TS 9th Class Telugu Guide 1st Lesson ధర్మార్జునులు

II.

3వ పద్యం
సీ. ఎంత లెస్సగ నున్న నంత వేడుకే కాని
ప్రజల కల్మికసూయపడుట లేదు.
తనుఁ గొల్వవలెనందఱను ప్రియంబేకాని
మానిసి వెగ టించుకైన లేదు
నిచ్చ వేఁడిన నర్థికిచ్చు చిత్తమె కాని
మునుపింత యిచ్చితి ననుటలేదు;
రేవగల్ ధర్మమార్జించు దృష్టియె కాని
న్యాయంబు దప్పిన నడకలేదు;

తే. కలఁడె యిటువంటి రాజులోకమున నెందు ?
జలధి వలయిత వసుమతీచక్ర మెల్ల
నేలవలె శాశ్వతముగాగ నీ ఘనుండె;
యేలవలె నన్యు ? లన నా నృపాలుఁడలరు.

ప్రతిపదార్థం :
ఎంత = ఎంతగా
లెస్సగన్ = బాగుగా (మేలుగా, సుఖంగా)
ఉన్నన్ = ఉన్నప్పటికినీ;
అంత = అంతగా
వేడుకె కాని = ముచ్చటయే కాని; (సంతోషమే కాని)
ప్రజల కల్మికిన్ = ప్రజల సంపదకు
అసూయపడుట = ఈర్ష్యపడడం అన్నది
లేదు = లేదు
తనున్ = తనను
అందఱు = ప్రజలందరూ
కొల్వవలెన్ = సేవించాలనే
ప్రియంబేకాని = ఇష్టమేకాని; (అందరూ తనతో కలసి ఆ పని, ఈ పని చేసుకుంటూ ఉండాలని కోరేవాడే కాని)
మానిసి, వెగటు = సరిపడని మనిషి;
ఇంచుకైన (ఇంచుక + ఐన) = కొద్దిగానైన
లేదు = లేదు (వాడు వద్దు; వీడు నాకు కిట్టడు, అనే వాడు లేడు)
నిచ్చ = ఎల్లప్పుడూ (అంటే మాటిమాటికీ వచ్చి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని కోరుతూ వచ్చినా)
వేడినన్ = కోరినా
అర్థికిన్ = యాచకునికి
ఇచ్చు = ఇచ్చేటటువంటి
చిత్తమెకాని = మనస్సేకాని
మునుపు = పూర్వము
ఇంత = ఇంతగా
ఇచ్చితిన్ = ఇచ్చాను
అనుటలేదు = అనడంలేదు (నిన్న, మొన్న అంతగా ఇచ్చాను కదా అని యాచకులను సాగనంపే వాడు కాడు)
రేపగల్ (రేయి + పగల్) = రాత్రింబగళ్ళు
ధర్మము + ఆర్జించు = ధర్మకార్యాలు చేస్తూ, పుణ్యం సంపాదించాలనే
దృష్టియెకాని = దృష్టియే కాని;
న్యాయంబు దప్పిన (న్యాయంబు + తప్పిన) = అన్యాయంగా ప్రవర్తించిన
నడకలేదు = వర్తనము లేదు
ఇటువంటి రాజు = ఇన్ని సుగుణాలు కల ధర్మరాజు వంటి రాజు;
లోకమునన్ = లోకంలో
ఎందున్ = ఎక్కడైనా
కలడె (కలడు + ఎ) = ఉన్నాడా ?
జలధి వలయిత వసుమతీ చక్రము;
జలధి వలయిత = సముద్రము చేత, చుట్టబడిన
వసుమతీ చక్రము = భూమండలము
ఎల్లన్ = అతటినీ
ఈ ఘనుండె = ఈ గొప్పవాడైన ధర్మరాజే
శాశ్వతముగాగన్ = శాశ్వతంగా
ఏలవలెన్ = పాలించాలి
అన్యులు = ఇతరులు
ఏల = ఎందుకు
వలెన్ = కావలెను
అనన్ (ప్రజలు) = అనేటట్లుగా
ఆ నృపాలుడు = ఆ ధర్మరాజు
అలరెన్ = శోభిల్లెను (ఉండేవాడు)

భావం:
ప్రజలు ఎంత గొప్పగా ఉంటే, అంతగా సంతోషపడే వాడే కానీ, ప్రజల సంపదలను చూసి అసూయపడేవాడు కాదు. అందరితో కలసిమెలసి ఉండడం ఇష్టమే కాని, ఎవరిపైనా అసూయతో ఉండేవాడు కాదు. తన్ను వేడిన యాచకులకు, దానం చేసేవాడే కాని, పూర్వం ఇంత ఇచ్చానని చెప్పి వారిని సాగనంపేవాడు కాడు.

రాత్రింబగళ్ళు ధర్మకార్యాలు చేస్తూ, పుణ్యం సంపాదించాలనే దృష్టేకాని, అన్యాయంగా ప్రవర్తించేవాడు. కాదు. ఇటువంటి రాజు లోకంలో ఎక్కడైనా ఉన్నాడా ? (లేడు). సముద్రంచే చుట్టుకొనబడిన ఈ భూమండలాన్ని అంతటినీ, ఈ గొప్ప గుణాల ధర్మరాజే, శాశ్వతంగా పాలించాలి. ఇతర రాజులు ఎందుకు ? అని ప్రజలు అనుకొనేటట్లు, ఆ ధర్మరాజు ప్రకాశించాడు.

TS 9th Class Telugu Guide 1st Lesson ధర్మార్జునులు

4వ పద్యం : (కంఠస్థ పద్యం)
*ఉ. కోపమొకింతలేదు; బుధకోటికిఁ గొంగుఁబసిండి; సత్యమా
రూపము; తారతమ్యములెఱుంగు; స్వతంత్రుఁడు; నతవ ప్రియా
టోపములేని నిశ్చలుఁ డిటుల్ కృతలక్షణుఁడై చెలంగఁ గా
ద్వాపర లక్షణుం డనగవచ్చునొకో యల ధర్మనందమన్?)

ప్రతిపదార్థం:
కోపము = కోపము
ఒకింత = కొంచెమైనా
లేదు = లేదు
బుధకోటికిన్ = పండితుల సమూహానికి
కొంగుఁబసిండి (కొంగు + పసిండి) = కొంగున మూటకట్టుకొని ఉన్న బంగారము వంటివాడు; (ఎప్పుడు కావలసివస్తే అప్పుడు ఉపయోగించుకోదగినది)
సత్యమా = సత్యమును చెప్పడం అంటే
రూపము = దాని స్వరూపమే అతడు (అతడు మూర్తీభవించిన సత్యగుణము అన్నమాట)
తారతమ్యములు = మనుష్యులలో ఉన్న హెచ్చు తక్కువలు (వ్యత్యాసములు)
ఎఱుంగన్ = తెలిసికోడంలో
స్వతంత్రుడు = స్వతంత్రంగా నిర్ణయించ -గలవాడు (వారూ, వీరూ చెప్పినట్లు కాకుండా, తానే స్వయంగా మంచిచెడ్డలను ఆలోచించి నిర్ణయము, కార్యమూ చేయడంలో స్వతంత్రుడు.).
నూతన ప్రియాటోపము;
నూతన ప్రియ = కొత్తవారి యందు ప్రేమను చూపించే
ఆటోపము = గర్వము, తొందరపాటు
లేని = ఏమీ లేనటువంటి
నిశ్చలుడు = స్థిర స్వభావము కలవాడు; (అనగా కొత్త వ్యక్తినీ, కొత్త విషయాన్నీ, వింతగానూ, పాతను రోతగానూ చూడకుండా ప్రవర్తించేవాడు.)
ఇట్లు = ఈ విధంగా
కృతలక్షణుడై = ప్రసిద్ధమైన లక్షణములు గలవాడై (కృతయుగంలో ఉండదగిన లక్షణములు కలవాడై అని కూడా అర్థము చెప్పుకోవచ్చు.)
చెలంగగాన్ = ప్రవర్తిస్తుండగా
అల ధర్మనందనున్ = యమధర్మరాజు కుమారుడైన ఆ ధర్మరాజును (ధర్మమును ఆచరించుటయందే సంతోషం పొందేవాడిని)
ద్వాపర లక్షణుండు = సందిగ్ధమైన లక్షణాలు కలవాడు (ద్వాపరయుగంలో ఉండదగ్గ లక్షణాలు కలవాడని కూడా చెప్పవచ్చు)
అనగన్ వచ్చునొకో = అని చెప్పవచ్చునా ? (అనకూడదని భావం)

భావం :
కోపము కొంచెము కూడా లేదు. పండితులకు, కొంగున మూట కట్టిన బంగారం వంటివాడు. సత్య స్వరూపుడు. మనుష్యులలో వ్యత్యాసం తెలిసినవాడు. మంచిచెడ్డలను తాను ఆలోచించి నిర్ణయాలు తీసికోగల స్వతంత్రుడు. కొత్త విషయాల పట్ల ఆడంబరాలు లేని స్థిర స్వభావం గలవాడు. ఈ విధంగా ప్రసిద్ధమైన మంచి లక్షణాలు కలవాడైన ఈ ధర్మరాజును, ద్వాపరలక్షణుడు అంటే ‘సందిగ్ధమైన లక్షణాలు గలవాడని (ద్వాపరయుగ లక్షణాలు కలవాడు) అనవచ్చునా ? (అనకూడదు) – కృతలక్షణుడు అనగా కృతయుగ లక్షణాలు కలవాడనాలి.

TS 9th Class Telugu Guide 1st Lesson ధర్మార్జునులు

III.

5వ పద్యం
క. దుర్జయ విమతాహంకృతి.
మార్జన యాచనకదైన్యమర్దనచణ దో:
ఖర్జులు గలరతనికి భీ
మార్జున నకుల సహదేవులను ననుజన్ముల్.

ప్రతిపదార్థం :
దుర్జయ విమతాహంకృతి మార్జన యాచనకదైన్యమర్దనచణ దోఃఖర్జులు;
దుర్జయ = (వీరిని) జయించ శక్యము కాదని ప్రసిద్ధిపొందిన
విమత = శత్రురాజుల
అహంకృతి = గర్వాన్ని
మార్జన = తుడిచివేయడానికిన్నీ
యాచనక = యాచకుల యొక్క
దైన్య = దీనత్వాన్ని
మర్దన = నిర్మూలించడానికిన్నీ;
చణ = నేర్పు కలిగిన (సమర్థులైన) బాహువుల (భుజముల) దురద
దోఃఖర్జులు = నేర్పు కలిగిన (సమర్థులైన) బాహువుల (భుజముల) దురద (తిమురు) గలవారు (భుజబలం గలవారు)
భీమార్జున నకుల సహదేవులు; = భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు
అను = అనే
అనుజన్ముల్ = తమ్ముళ్ళు
అతనికిన్ = ఆ ధర్మరాజునకు
కలరు = ఉన్నారు

భావం :
ఆ ధర్మరాజుకు, భీమార్జున నకుల సహదేవులు అనే తమ్ముళ్ళు ఉన్నారు. వారు, ఓటమిని ఎరుగని వారిగా పేరు పొందిన శత్రువులను అయినా ఓడించడానికీ, యాచకుల దీనత్వాన్ని పోగొట్టడానికీ, ఎల్లప్పుడూ ఉత్సాహం కలిగి యుండేవారు. వీరు నలుగురు సోదరులూ ప్రసిద్ధమైన భుజబలం కలవారు.

TS 9th Class Telugu Guide 1st Lesson ధర్మార్జునులు

6వ పద్యం
క. పంచామర తరులో ! హరి
పంచాయుధములొ ! గిరీశు పంచాస్యములో
యంచువ్ సకల జనంబులు
నెంచన్ బాండవులు వెలసిరేవురు ఘనులై.

ప్రతిపదార్థం :
పాండవులు = పాండవులు
ఏవురు = ఐదుగురూ
పంచామరతరులో (పంచ + అమర, తరులు + ఓ) = అయిదు దేవతా వృక్షాలో; (దేవతావృక్షాలు :

  1. మందారము
  2. పారిజాతము
  3. సంతానము
  4. కల్పవృక్షము
  5. హరిచందనము)

హరి = విష్ణుమూర్తి యొక్క
పంచాయుధములో (పంచ + ఆయుధములు + ఒ) = అయిదు ఆయుధాలో; (విష్ణుమూర్తి ఆయుధాలు :

  1. పాంచజన్యము (శంఖం)
  2. సుదర్శనం (చక్రం)
  3. కౌమోదకి (గద)
  4. నందకము (ఖడ్గం)
  5. శార్ధము (విల్లు)

గిరీశు = శివుని యొక్క
పంచాస్యములో (పంచ + ఆస్యములు + ఓ) = అయిదు ముఖాలో
(ఈశ్వరుడి ఐదు ముఖాలు :

  1. సద్యోజాతము
  2. వామదేవము
  3. అఘోరము
  4. తత్పురుషము
  5. ఈశానము అనేవి)

అంచున్ = అంటూ
సకల జనంబులు = లోకులందరూ; (శత్రువులు కూడా)
ఎంచన్ = పొగిడేలాగున
ఘనులై = గుణాలచేత గొప్పవారై
వెలసిరి = వర్దిల్లారు.

భావం :
పాండవుల దానబుద్ధిని చూచి దేవతా వృక్షములా అని, వారి యుద్ధ విజయాలు చూచి, విష్ణుమూర్తి ఆయుధాలా అని, వారి పవిత్ర ప్రవర్తన చూసి ఈశ్వరుడి ముఖాలా ? అని ప్రజలందరూ సందేహించేవారు. కోరిన కోర్కెలు ఇవ్వడంలోనూ, శత్రువులను జయించడంలోనూ, పవిత్ర ప్రవర్తనలోనూ పాండవులందరూ గొప్పవారని భావం.

TS 9th Class Telugu Guide 1st Lesson ధర్మార్జునులు

7వ పద్యం.
చ ఒరిమయు, భక్తియున్, నెవరు నోర్పుఁ, గనంబడఁ, బెద్దపిన్నయం
తరువులెఱింగి, మాటజవదాఁటకె, చెయ్యుల వేఱులేక, యొం
డొరుల మనమ్ములో మెలఁగుచుండిరి, “పాండు కుమారులెంత నే
ర్పరు ? లిల నన్నదమ్ముల సరాగము వారలదే సుమీ !” యవన్.

ప్రతిపదార్థం :
ఒరిమయున్ = స్నేహ భావమునూ (పొత్తునూ)
భక్తియున్ = భక్తియునూ
నెనరున్ = ప్రేమయునూ
ఓర్పున్ = సహనమునూ
కవంబడన్ = కనబడే విధంగా
పెద్ద పిన్న అంతరువులు = పెద్ద, చిన్న అనే వ్యత్యాసాలు
ఎఱింగి = తెలుసుకొని
మాట జవదాటక = ఒకరిమాట మరొకరు మీరకుండా
చెయ్వులన్ = చేసే పనులయందు
వేఱులేక = భేదభావం లేకుండా
ఒండొరుల మనంబులోన్ = ఒకరి మనస్సులో ఒకరు; (ఒకరిని అనుసరించి ఒకరు నడుచుకుంటూ)
పాండు కుమారులు = పాండురాజు పుత్రులయిన పాండవులు
ఎంత నేర్పరులు = ఎంత నేర్పరితనం కలవారు
ఇలన్ = లోకంలో
అన్నదమ్ముల సరాగము = అన్నదమ్ముల పరస్పర ప్రేమ
వారలదే సుమీ = వారిదే సుమా
అనన్ = అని ప్రశంసింపబడే విధంగా
గుచుండిరి = ప్రవర్తించేవారు;

భావం :
స్నేహము, భక్తి, సహనము కలిగి, చిన్నా పెద్దా అనే తేడాలు చూసుకుంటూ, ఒకరి మాట ఒకరు పాటిస్తూ అందరూ ఒకే మనస్సుతో పనులు చేస్తూ, అన్యోన్య ప్రేమతో పాండు కుమారులు ప్రవర్తించేవారు. వారిని చూసి ప్రజలు అన్నదమ్ముల ఒద్దిక (పరస్పర ప్రేమ) అంటే, వారిదే అని పొగిడేవారు.

చమత్కార విశేషము :
ఒకరి మనస్సులో మరొకరు మెలగడంలో చమత్కారం ఉంది. ధర్మరాజు మనస్సులో భీముడు ఉండకపోతే, భీముడి మనస్సులో ధర్మరాజు ఉండడానికి వీలులేదు. అయినా పాండవులు ఐదుగురూ, అలా ఉండగలిగారు. కాబట్టే “పాండు కుమారులెంత నేర్పరులు” అని కవి ప్రశంస.

TS 9th Class Telugu Guide 1st Lesson ధర్మార్జునులు

IV.

8వ పద్యం
ఉ. అన్నలపట్లఁ దమ్ముల యెడాటమునన్ సముఁడంచు నెన్నఁగా
వెన్నిక గన్నమేటి, యెదురెక్కడలేక వృపాల కోటిలో
వన్నెయు వాసియున్ గలిగి వర్తిలు పౌరుషశాలి, సాత్వికుల్
దన్నుఁమతింపఁగాఁ దవరు ధార్మికుఁడర్జునుఁ డొప్పు (వెంతయున్

ప్రతిపదార్థం :
అన్నలపట్ల = అన్నల యెడలనూ
తమ్ముల, ఎడాటమునన్ = తమ్ముల విషయముననూ;
సముడు = సమానమైన భావాలు కలవాడు
అంచున్ = అంటూ
ఎన్నగాన్ = ప్రజలు అనుకొనే విధంగా
ఎన్నిక + కన్న, మేటి = పేరు పొందిన ఘనుడు; (అన్నలయందు చూపిన గౌరవ స్నేహ భావాలనే తమ్ముళ్ళయందు కూడా చూపుతూ, ప్రవర్తిస్తాడని భావము.)
నృపాలకోటిలోన్ = రాజుల సమూహములో (కోటి మంది రాజుల్లోనయినా అని చమత్కారం).
ఎదురు = ఎదిరించి నిల్వగలవాడు
ఎక్కడలేక = ఎక్కడనూ లేక
వన్నెయున్ = ప్రసిద్ధినీ
వాసియున్ = గొప్పతనమునూ
కలిగి = కలిగియుండి
వర్తిలు = ప్రవర్తించే
పౌరుషశాలి = పరాక్రమవంతుడు
సాత్త్వికుల్ = సత్త్వ గుణం కలవారు (శాంత స్వభావులు)
తన్నున్ = తనను (అనగా అర్జునుడిని)
సుతింపగాన్ = ప్రశంసించే విధంగా
తనరు = ఉండే
ధార్మికుడు = ధర్మప్రవర్తన గలవాడునూ అయిన
అర్జునుడు = అర్జునుడు
ఎంతయున్ = మిక్కిలి
ఒప్పున్ = చాలా ఘనతతో ఉన్నాడు.

భావం :
అన్నలపట్ల, తమ్ములపట్ల సమబుద్ధితో మెలుగుతూ ఉంటాడని పేరు పొందిన ఘనుడు. రాజులందరిలోనూ ఎదురులేని వాడిగా ప్రసిద్ధినీ, గొప్పతనమునూ కలిగి ప్రవర్తించే పరాక్రమవంతుడు. సాత్వికులు కూడా ప్రశంసించే విధంగా అర్జునుడు ధర్మప్రవర్తన కలిగి యుండేవాడు.

TS 9th Class Telugu Guide 1st Lesson ధర్మార్జునులు

9వ పద్యం : (కంఠస్థ పద్యం)
* చ. అతని నుతింప శక్యమె ? జయంతుని తమ్ముఁడు సోయగమ్మునన్
బతగ కులాధిపధ్వజుని ప్రాణసఖుండు కృపారసమ్మువన్
క్షితిధర కన్యకాధిపతికిన్ బ్రతిజోదు సమిజ్జయమ్ము నం,
దత్తని కతండె సాటి చతురబ్ధి పరీత మహీతలమ్మునన్.

ప్రతిపదార్థం :
అతనిన్ = ఆ అర్జునుని
నుతింపన్ = పొగడడానికి
శక్యమై = ఎవరికైనా శక్యమవుతుందా ? (శక్యము కాదని భావము) (ఎందుచేతనంటే ! అతడు).
సోయగమ్మునన్ = అందుమలో
జయంతుని తమ్ముడు = సౌందర్యానికి ప్రసిద్ధిపొందిన ఇంద్రపుత్రుడు జయంతుని వంటి వాడు.
కృపారసమ్మునన్ = దయారసములో
పతగ కులాధిపధ్వజుని;
పతగ = పక్షుల యొక్క
కుల = జాతికి
అధిప = ప్రభువయిన గరుత్మంతుని యొక్క
ధ్వజుని = జెండాగల (గరుడధ్వజుడైన విష్ణుమూర్తికి (కృష్ణునికి) పోలినవాడు)
ప్రాణసఖుండు = ప్రాణ స్నేహితుడు;
సమిజ్జయమ్మునన్;
సమిత్ = యుద్ధములందలి
జయమ్మునన్ = విజయాలలో
క్షితిధర కన్యకాధిపతికిన్;
క్షితిధర = పర్వతము యొక్క
కన్యకా = కూతురైన పార్వతి యొక్క
అధిపతికిన్ = భర్త అయిన ఈశ్వరుడికి
ప్రతిజోదు = పోటీ (ఎదిరి వీరుడు, అనగా పోలినవాడు)
చతురబ్ధి మహీతలమ్మునన్;
చతురబ్ధి (చతుః + అబ్ధి) = నాలుగు సముద్రములచేత
పరీత = చుట్టుకొనబడిన
మహీతలమ్మునన్ = భూమండలమందు
అతనికిన్ = అతనికి (ఆ అర్జునుడికి)
అతండె = అతడే
సాటి = సమానుడు; (ఇతరులు ఎవ్వరూ సాటికారు)

భావం :
అర్జునుడు అందంలో జయంతుని వంటివాడు. దయా స్వభావములో గరుడధ్వజుడైన విష్ణుమూర్తికి (కృష్ణునకు) ప్రాణమిత్రుడు. పర్వతరాజపుత్రిక పార్వతికి భర్తయైన శివుడికి యుద్ధ విజయాలలో పోటీపడే వీరుడు. నాలుగు సముద్రాలచే ఆవరింపబడిన ఈ భూమండలంలో అతనికి అతనే సాటి. (మరింకెవ్వరూ సాటికాదు). అటువంటి అర్జునుడిని, పొగడటం సాధ్యమా ? (సాధ్యం కాదు).

TS 9th Class Telugu Guide 1st Lesson ధర్మార్జునులు

విశేషము :
1) జయంతుడు ఇంద్రుని కుమారుడు, జయంతుని తమ్ముడు అర్జునుడు, అర్జునుడు అంటే జయంతుని వంటి వాడని భావం. ఇక్కడ తమ్ముడు అనే పదాన్నే ఉపమావాచకంగా కవి ఉపయోగించడం దీనిలో చమత్కారం.

2) ‘ప్రాణసఖుడు’ – ప్రాణాన్ని పోలినవాడని అర్థము. ఇక్కడ సఖుడు అన్న పదము కూడా ఉపమావాచకము. దయారసానికి విష్ణువు ప్రసిద్ధుడు. లోకాలను పోషించేవాడయిన విష్ణువుకు (కృష్ణుడికి), అర్జునుడు ప్రాణసఖుడని ప్రతీతి. ఈ స్నేహము నరనారాయణుల కాలం నుండీ వస్తూంది. ఈ సంబంధాన్ని తెలిపే, “ప్రాణసఖుండ”న్న మాటనే, ఉపమావాచకంగా కవి వాడాడు.

3) ఈశ్వరుడికి ప్రతిజోదు – అంటే పోలినవాడు. ఇక్కడ ‘ప్రతిజోదు’ అనే పదము, ఉపమావాచకము; త్రిపుర సంహారం చేసిన ఈశ్వరుడు పరాక్రమానికీ, యుద్ధ విజయానికీ ప్రసిద్ధుడు. పురాణాలను బట్టి చూస్తే, పంది కోసం శివుడు కిరాత వేషంలో ఉండగా అర్జునుడు కిరాతుడిని ఎదిరించి, పాశుపతాస్త్రం సాధించాడు. ఆ సంబంధాన్ని తెలిపే ‘ప్రతిజోడు’ అన్నమాటను కవి ఇక్కడ ఉపమానంగా వాడడం ఇక్కడ చమత్కారం.

పద్యంలో గల ముఖ్య చమత్కారం : ఉపమానం చెప్పవలసి వచ్చినపుడు, “వాడి తమ్ముడు వీడని, వీడి నేస్తం వాడని, వాడి జోడు వీడని అంటాము. ఈ పద్యంలో జయంతుడిని, విష్ణువుని, ఈశ్వరుడిని పోలినవాడు అనడానికి, క్రమంగా తమ్ముడు, ప్రాణ సఖుడు, ప్రతిజోడు అని వారికి ఉన్న పురాణ సంబంధా లను సూచించే పదాలనే చమత్కారంగా కవి ఉపయో గించాడు.
మొదటి మూడు పాదాలలో ముగ్గురితో పోల్చి, నాలుగో పాదంలో ‘అతని కతండె సాటి’ అని చెప్పడం, కొంచెం అసందర్భంగా కనిపిస్తుంది. దానిని బట్టి “చతురబ్ధి పరీత మహీతలమ్మునన్” అన్నదంతా పేలవంగా కేవలం పాద పూరణంగా కనిపిస్తుంది.

కాని అది సరికాదు. పై చరణాలలో చెప్పిన జయంతుడు స్వర్గంలోనివాడు. విష్ణువు వైకుంఠంలోని వాడు. శివుడు కైలాసంలోని వాడు. ఆ ముగ్గురూ ఈ లోకంలోనివారు కాదు. ఈ లోకంలో సాటిచెప్పదగిన వాడు ఎవడు అని అడిగితే, “ఈ నాలుగు సముద్రాల చేత చుట్టబడిన సర్వప్రపంచంలోనూ సాటి చెప్పతగిన వాడులేడు. అతనికతడే సాటి. అని కవి బదులు చెప్పాడు. అర్జునుడికి సాటి అయినవారు స్వర్గాది లోకాల్లో ఉన్నారేమోకాని, భూలోకంలో అర్జునునికి సాటిలేరని చమత్కారం.

10వ పద్యం
తే. పాఱఁ జూచినఁ బరసేన పాఱఁజూచు
వింటి కొరిగిన రిపురాజి వింటికొరగు,
వేయు నేటికి ? నలపాండవేయు సాటి
వీరుఁడిలలేడు; ప్రతి రఘు వీరుఁడొకఁడు.

ప్రతిపదార్థం:
(అర్జునుడు) పాఱఁజూచినన్ (పాఱన్ + చూచినన్) = తేరిపార జూచినంత మాత్రము చేతనే;
పరసేన = శత్రు సైన్యము
పాఱఁజూచు (పాఱన్ + చూచున్) = పారిపోడానికి ప్రయత్నిస్తుంది.
వింటికిన్ = విల్లు ఎత్తి పట్టుకోడానికి
ఒరిగినన్ = వంగినంత మాత్రం చేతనే
రిపురాజి = శత్రువుల సమూహము
వింటికి = ఆకాశానికి (ఇక్కడ స్వర్గానికి అన్నమాట)
ఒరగున్ = అభిముఖమై వెడుతుంది. (అనగా ఆ శత్రువులు చచ్చి వీర స్వర్గం పొందుతారన్న మాట)
వేయున్, ఏటికిన్ = వెయ్యి మాటలు ఎందుకు ?
అల పాండవేయుసాటి = ఆ అర్జునుడితో పోల్చదగినటువంటి
వీరుడు = పరాక్రమవంతుడు
ఇలన్ = లోకములో
లేడు = లేడు
ప్రతి = అతనికి సాటి అయినవాడు
రఘువీరుడు = రామచంద్రుడు
ఒకడే = ఒక్కడే (ఇంకొకడు లేడని భావము)

భావం :
అర్జునుడు తేరిపారజూస్తే చాలు, శత్రు సైన్యం పారిపోవడానికి సిద్ధమవుతుంది. అతడు విల్లుఎత్తి పట్టుకోడానికి వంగితే చాలు, శత్రు సమూహం వీరస్వర్గం దారిపడుతుంది. ఇంక వేయి మాటలు ఎందుకు ? ఆ అర్జునుడితో సాటి అని చెప్పదగ్గవాడు, పోల్చడానికి రఘురాముడేకాని, ఈ లోకంలో మరొకడు లేడు.

TS 9th Class Telugu Guide 1st Lesson ధర్మార్జునులు

పాఠం ఉద్దేశం / నేపథ్యం

పాండవుల ‘నియమావళిననుసరించి, అర్జునుడు తీర్థయాత్రలు చేస్తాడు. ఈ క్రమంలో సక్రమ రాజ్యపాలనకు కావలసిన అంగబలాన్ని సాధిస్తాడు. రాజ్యవిస్తరణకు అవసరమైన పరాక్రమ ప్రదర్శన చేస్తాడు. ఉలూచి, చిత్రాంగద, సుభద్రలను పెండ్లి చేసుకుంటాడు. ఈ కథను ఆధారంగా చేసుకొని వర్ణనలతో పెంచి, ‘విజయవిలాసం’ అనే ప్రబంధాన్ని చేమకూర వేంకటకవి రచించాడు. కావ్యారంభంలో ఇంద్రప్రస్థపుర వర్ణనలో భాగంగా దానికి రాజైన ధర్మరాజు, అతని సోదరుల గుణగణాల గురించి తెలిపాడు.

కోరిన కోర్కెలు తీర్చడంలోనూ శత్రువులను జయించడంలోనూ పాండవులు పేరు గాంచారు. అన్నదమ్ముల అనుబంధం, ప్రేమ, స్నేహభావం, సహనశీలత వంటి మంచి లక్షణాలను ముఖ్యంగా ధర్మరాజు ఆజ్ఞాపరిపాలనావ్రతాన్ని, అర్జునుని పౌరుష, సత్త్వస్వభావాలనూ ప్రతిమానవుడు అలవరచుకోవలసిన మంచి లక్షణాలను ప్రబోధించడం ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం ‘ప్రబంధ’ ప్రక్రియకు చెందినది. ఇతిహాస, పురాణాలలోని ఓ చిన్న కథను వర్ణనలతో చెప్పడమే ప్రబంధం. ‘ప్రబంధం’ వర్ణన ప్రధానమైనది. దీనిలో పద్దెనిమిది రకాల వర్ణనలు ఉంటాయి.
ఈ పాఠ్యభాగం ‘ప్రతి పద్య చమత్కారచణుడు’ చేమకూర వేంకటకవి రచించిన ‘విజయవిలాసం’ ప్రబంధంలోని ప్రథమాశ్వాసం లోనిది.

కవి పరిచయం

TS 9th Class Telugu Guide 1st Lesson ధర్మార్జునులు 1
పాఠము పేరు : చేమకూర వేంకటకవి

కవి : ‘ధర్మార్జునులు’

కవి తండ్రి : లక్ష్మణామాత్య

కాలము : 17వ శతాబ్దం

ఈయన ఎవరి ఆస్థానకవి : ఈ కవి, తంజావూరు రాజ్యాన్ని పాలించిన, ‘విజయభవన’ అనే కవిపండిత సభను నిర్వహించిన, “అభినవ భోజరాజు” అని బిరుదు పొందిన రఘునాథనాయకుని ఆస్థానకవి.

కవి రచనలు :

  1. సారంగధర చరిత్ర,
  2. విజయవిలాసం

విజయవిలాసం ప్రత్యేకత : తాను రచించిన ‘సారంగధర చరిత్ర’ కావ్యంలో మహారాజుకు అంకితం ఇవ్వదగిన లక్షణాలు లేవని తలచి, సర్వగుణ సంపన్నంగా ‘విజయవిలాసం’ కావ్యాన్ని ఈ కవి రచించాడు.

విజయవిలాసంలో చమత్కారం లేని ఒక్క పద్యం కూడా లేదని పేరు పొందాడు. ‘పిల్లవసు చరిత్ర’ అనే ప్రశంసను పొందిన ఈ కావ్యం, తెలుగులోని పంచమహా కావ్యాలతో సరితూగగలదని విజ్ఞులు తలుస్తున్నారు.

TS 9th Class Telugu Guide 1st Lesson ధర్మార్జునులు

విజయవిలాస కావ్య రచన : ఈ కవి భారత కథలో అవసరమైన చక్కని మార్పులు చేసి, “ప్రతి పద్య చమత్కారం”తో స్వతంత్ర కావ్యంగా విజయవిలాసాన్ని రచించి రఘునాథరాయలకు ఈ విజయవిలాసాన్ని అంకితం చేశాడు.

ప్రవేశిక

ప్రాచీన కాలం నుంచీ రాముడు, హరిశ్చంద్రుడు, శిబిచక్రవర్తి, నలుడు వంటి ధర్మపాలనా తత్పరులు విలసిల్లిన పుణ్యభూమి మనదేశం. వారు పాటించిన ప్రజారంజక విధానాలే, అనంతర కాలానికి ఆదర్శాలయినాయి. మహాభారత కాలంలోను భీష్ముడు, విదురుడు, ధర్మరాజుకు స్ఫూర్తిని ఇచ్చారు. “యథా రాజా తథా ప్రజాః” రాజు ఎట్లా ఉంటే, ప్రజలు అట్లా ఉంటారు. కాబట్టి, ధర్మరాజు మహాపురుషుల మార్గంలో నడుస్తూ, తన సోదరులపట్ల, ప్రజలపట్ల ప్రదర్శించిన ధర్మనిరతి ఎటువంటిదో తెలుసుకొనేందుకు ఈ పాఠం చదువండి.

విద్యార్థులకు సూచనలు

  • పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
  • పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత గీయండి.
  • వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పదవిజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకొండి.

TS 9th Class Telugu Important Questions 2022-2023

TS 9th Class Telugu Important Questions 2022-2023

TS 9th Class Study Material