TS Inter 2nd Year Telugu Grammar సంభాషణ రచనా నైపుణ్యం

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material Grammar సంభాషణ రచనా నైపుణ్యం Questions and Answers.

TS Inter 2nd Year Telugu Grammar సంభాషణ రచనా నైపుణ్యం

ఇద్దరు వ్యక్తుల మధ్య మాటల ద్వారా జరిగే భావప్రసారాన్ని ‘సంభాషణ’ అంటారు. మనం రోజూ ఇంట్లోనూ, బయట ఎంతమందితోనో మాట్లాడుతూ ఉంటాం. ఈ మాటల్లో లెక్కలేనన్ని పదాలు దొర్లుతుంటాయి. ఎదుటి వారితో అర్థవంతంగా, గౌరవంతో కూడిన మాటలు మాట్లాడటం ప్రతి ఒక్కరు అభ్యసించాలి. నైపుణ్యంతో మాట్లాడటం ఒక కళ.

సంభాషణ రచన ద్వారా రచనలో నైపుణ్యాలను సాధించవచ్చు. సంభాషణలో నేర్పును సాధించడానికి కింది అభ్యాసాలు అందుకు ఎంతగానో తోడ్పడుతాయి. సూచించిన పదాలను ఆధారం చేసుకొని సందర్భోచితంగా వ్యక్తుల మధ్య సంభాషణ రాయాల్సి ఉంటుంది. సంభాషణలో వ్యవహారిక భాషలో వాడే ఇతర భాషా పదాలు కూడా వాడవచ్చు. సందర్భోచితంగా వాడే జాతీయాలు, సామెతలు, పదబంధాలు సంభాషణలను ఆసక్తికరంగా మారుస్తాయి.

ప్రశ్న 1.
కాలిదెబ్బలకు వైద్యం కోసం వెళ్ళినపుడు వైద్యునితో సంభాషణ.
(క్రికెట్ ఆడటం – దెబ్బ తగలడం – నొప్పి – ఫస్ఎయిడ్ – మందులు – కాపడం – పథ్యం)
జవాబు:
విద్యార్థి  :  నమస్తే డాక్టర్ !
డాక్టర్  :  నమస్తే సురేశ్ ! ఎలా ఉన్నావు ? కుంటుతున్నావెందుకు ?
విద్యార్థి :  మా కళాశాలలో క్రికెట్ ఆడుతుంటే కాలిబొటన వేలికి దెబ్బ తగిలింది.
డాక్టర్  :  రక్తం ఏమైనా పోయిందా ? ఫస్ట్ ఎయిడ్ ఏమైనా చేశారా !
విద్యార్థి  :  చాలా రక్తం పోయింది. బాగా నొప్పిగా ఉంది డాక్టర్ ! దెబ్బ తగలగానే మా టీచర్ శుభ్రంగా కడిగి పసుపు పెట్టి ఫస్ట్ ఎయిడ్ చేసింది.
డాక్టర్  :  భేష్ పసుపు పెట్టి మీ టీచరు మంచి పని చేసింది. లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చేది.
విద్యార్థి  :  అవును డాక్టర్ ! నా మోకాలు బాగా కమిలి పోయింది. మా అమ్మ కాలికి వేడినీళ్ళతో కాపడం కూడా పెట్టింది.
డాక్టర్  :  మంచి పనిచేసింది సురేశ్ ! దెబ్బను ప్రతిపూటా డెట్టాల్ నీళ్ళతో కడగాలి. నేనిచ్చే మందు పెట్టు, దుమ్ము తగలనీయకు.
విద్యార్థి  :  ఏమైనా పథ్యం చెయ్యాలా డాక్టర్ ?
డాక్టర్  :  అవసరం లేదు. బలమైన ఆహారం తీసుకో !
విద్యార్థి  :  సరే డాక్టర్ ! నమస్కారం.

TS Inter 2nd Year Telugu Grammar సంభాషణ రచనా నైపుణ్యం

ప్రశ్న 2.
ఆదాయ పత్రం జారీ కొరకు విజ్ఞాపన చేయడానికి వెళ్ళినపుడు అధికారితో సంభాషణ. *(M.P.)
(ఆదాయపత్రం – దరఖాస్తు – జతపరుచు – తహశీల్దార్ – ఉపకారవేతనం)
జవాబు:
విద్యార్థి  :  తహశీల్దార్ సర్ నమస్కారం ! నా పేరు శ్రీరాం.
అధికారి  :  నమస్తే చెప్పు బాబూ, ఏ పనిమీద వచ్చావు ?
విద్యార్థి  :  ఆదాయపత్రం కొరకు దరఖాస్తు చేసుకుందామని వచ్చాను సార్ !
అధికారి  :  దరఖాస్తు తెచ్చావా ! వివరాలు అన్నీ ఉన్నాయా ?
విద్యార్థి  :  ఉన్నాయి సర్! సంబంధిత పత్రాలన్నీ జతపరిచాను. ఈ ఆదాయ పత్రం నాకెంతో ఉపయోగపడుతుంది సర్.
అధికారి  :  ఉపకార వేతనం ఏ రకంగా ఉపయోగిస్తావు శ్రీరాం.
విద్యార్థి  :  ఉపకార వేతనంతో పుస్తకాలు, దుస్తులు ఇతర వస్తువులు కొనడానికి తల్లిదండ్రులపై ఆధారపడే ఇబ్బంది ఉండదు సర్.
అధికారి  :  మంచిది ! నేను కూడా ఉపకార వేతనం సాయంతోనే ఎమ్.ఎ. వరకు చదివాను.
విద్యార్థి  :  అలాగా సర్ ! మరి ఆదాయపత్రం ఎప్పుడు ఇస్తారు ?
అధికారి  :  రెండు రోజుల్లో.
విద్యార్థి  :  ధన్యవాదాలు సర్ !

TS Inter 2nd Year Telugu Grammar సంభాషణ రచనా నైపుణ్యం

ప్రశ్న 3.
బోనఫైడ్ సర్టిఫికెట్ కొరకు విజ్ఞప్తి చేయడానికి వెళ్ళినపుడు ప్రిన్సిపాల్తో సంభాషణ.
(ఎన్.సి.సి లో ప్రవేశం – కవాతు – ఆత్మవిశ్వాసం – ధన్యవాదాలు)
జవాబు:
విద్యార్థిని  :  నమస్తే సర్ !
ప్రిన్సిపాల్  :  నమస్తే ! చెప్పమ్మా సుప్రజా ! ఏం కావాలి !
విద్యార్థిని  :  సర్ బోనఫైడ్ సర్టిఫికెట్ కొరకు వచ్చాను సర్.
ప్రిన్సిపాల్  :  దరఖాస్తు తెచ్చావా! సర్టిఫికెట్ దేనికి అమ్మా !
విద్యార్థిని  :  దరఖాస్తు ఇదిగో సర్ ! ఎన్.సి.సి లో చేరాలంటే నేను మన కళాశాల విద్యార్థిని అని సర్టిఫికెట్ కావాలి.
ప్రిన్సిపాల్  :  ఎన్.సి.సిలో చేరాలని ఎందుకనుకుంటున్నావు ?
విద్యార్థిని  :  నాకు కవాతు, రైఫిల్ ఘాటింగ్ అంటే చాలా ఇష్టం.
ప్రిన్సిపాల్  :  అంతేకాదు నీకు ఎన్.సి.సిలో ‘బి’ సర్టిఫికెట్ ఉంటే పై చదువుల్లో సీట్లలో, ఉద్యోగాలలో కూడా ప్రాధాన్యం ఇస్తారు.
విద్యార్థిని  :  అవును సర్ ! మా నాన్నగారు ఎన్.సి.సిలో చేరమన్నారండి.
ప్రిన్సిపాల్  :  మంచిది ఎన్.సి.సి వల్ల నీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. మధ్యాహ్న సమయంలో సర్టిఫికెట్ తీసుకోమ్మా.
విద్యార్థిని  :  అట్లాగే సర్ ! ధన్యవాదాలు.

TS Inter 2nd Year Telugu Grammar సంభాషణ రచనా నైపుణ్యం

ప్రశ్న 4.
పత్రికా విలేకరితో కళాశాల ఉత్సవం గురించి ఫోన్లో వివరించే సంభాషణ.
(కళాశాల వార్షికోత్సవం – కలం, కాగితం ముఖ్య అతిథి ఉపన్యాసం – ఉత్తేజకరం – బహుమతులు – పాటలు – నృత్యాలు.)
జవాబు:
వందన  :  నమస్తే రమణ సర్ ! నా పేరు వందన నేను ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినిని మాట్లాడుతున్నాను.
రమణ  :  నమస్తే వందనా ! నిన్న మీ కళాశాలలో వార్షికోత్సవం జరిగిందట కదా ?
వందన  :  అవును సర్ ! ఆ విషయమే మీకు వివరిద్దామని ఫోన్ చేశాను సర్.
రమణ  :  ఒక నిముషం ఆగమ్మా ! కాగితం, కలం తీసుకుంటాను…. ఇంక చెప్పమ్మా !
వందన  :  నిన్న మా కళాశాల వార్షికోత్సవం వైభవంగా జరిగింది. జూనియర్ కళాశాలల జిల్లా అధికారి ముఖ్య అతిథిగా వచ్చాడు.
రమణ  :  అవునా ! ముఖ్య అతిథి ఏమని ఉపన్యసించాడో చెప్పగలవా ?
వందన  :  మా జిల్లా అధికారి సత్యనారాయణ రెడ్డి ఉపన్యాసం చాలా ఉత్తేజకరంగా సాగింది. జీవితలక్ష్యం కొరకు కృషి, సాధన, ఏకాగ్రత గురించి వివరించాడు.
రమణ  :  బాగుంది వందనా ! ఇంకా వివరాలు చెప్పమ్మా!
వందన  :  వార్షికోత్సవం సందర్భంగా ఆటలపోటీలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
రమణ  :  ఏయే సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినవి ?
వందన  :  ఒక నాటిక, నృత్యాలు, పాటలు, హాస్యసంభాషణలు, ధ్వన్యనుకరణ, అనుకరణ మొదలైన అంశాలతో రెండు గంటలపాటు కార్యక్రమాలు జరిగాయి. అందరికీ బాగా నచ్చాయి. ఫోటోలు ఈమెయిల్ చేస్తాను సర్ ! రేపటి మీ పత్రికలో ఫోటోలు వివరాలు ప్రచురిస్తారా ?
రమణ  :  తప్పకుండానమ్మా ! మంచిదమ్మా !
వందన  :  ధన్యవాదాలు సర్ !

TS Inter 1st Year Telugu Grammar సంధులు

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material Grammar సంధులు Questions and Answers.

TS Inter 1st Year Telugu Grammar సంధులు

సంధి అనే పదానికి కూడిక, కలయిక, చేరిక అనే అర్థాలున్నాయి. వ్యాకరణ శాస్త్ర వ్యవహారాల్లో సంధి అనగా, ఉచ్చారణ సౌకర్యం కొరకు జరిగిన వర్ణసంయోగమని చెప్పవచ్చును.

‘పూర్వపరస్వరంబులకు పరస్వరం బేకాదేశంబగుట సంధి యనంబడు’ అని చిన్నయ సూరి సంధిని నిర్వచించాడు.

సంధిలో రెండు పదాలుంటాయి. మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని పరపదమని అంటారు. పూర్వపదం చివరి అచ్చును పూర్వస్వరమని, పరపదం మొదటి అచ్చును పరస్వరమని అంటారు.

రెండు పదాలు కలిసినపుడు పూర్వపదం చివరి అచ్చునకు పరపదం తొలి అచ్చునకు మారుగా పరస్వరమే నిలుచుట సంధి అనబడుతుంది.

సంధులు రెండు రకాలు.

  1. సంస్కృత సంధులు
  2. తెలుగు సంధులు.

సంస్కృత పదాలకు చేసే సంధి విధానాన్ని సంస్కృత సంధులుగా, తెలుగు పదాలకు సంధి చేసే విధానాన్ని తెలుగు సంధులుగా పేర్కొంటారు

1. సంస్కృత సంధులు:
(ఎ) సవర్ణదీర్ఘ సంధి:
అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాచ్చులు పరమైనపుడు వాటి దీర్ఘాలు ఏకాదేశమగును. సమానంగా ఉచ్చరించబడే వర్ణాలు సవర్ణాలు. అంటే ఒకే ఉచ్చారణ స్థానం నుండి పలుకబడే వర్ణాలను ‘సవర్ణాలు’ అంటారు. అఆ, ఇఈ, ఊ, ఋబూ…. మొదలైనవి సవర్ణాలు

ఉదా:

  • విద్య + అర్థులు = విద్యార్థులు (అ + అ = ఆ)
  • ధరణి + ఈశ = ధరణీశ (ఇ + ఈ = ఈ)
  • గురు + ఉపదేశం = గురూపదేశం (ఉ + ఉ = ఊ)
  • పితౄ + ఋణం = పితౄణం (ఋ + ఋ = బూ)

TS Inter 1st Year Telugu Grammar సంధులు

(బ) గుణసంధి:
అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైనపుడు క్రమంగా ఏ, ఓ, అర్ లు ఏకాదేశమగును. సంస్కృతంలో ఏ, ఓ, అర్ అనువాటికి ‘గుణాలు’ అని పేరు. ఇవి ఆదేశంగా వస్తాయి కాబట్టి ఈ సంధికి ‘గుణసంధి’ అని పేరు.

ఉదా:

  • దేవ + ఇంద్రుడు = దేవేంద్రుడు (అ + ఇ = ఏ)
  • పర + ఉపకారము = పరోపకారము (అ + ఉ = ఓ)
  • దేవ + ఋషి = దేవర్షి (అ + ఋ= అర్)

(సి) వృద్ధి సంధి:
అకారమునకు ఏ, ఐ లు పరమైనపుడు ‘ఐ’కారం; ఓ, ఔలు పరమైనపుడు ‘ఔ’కారం ఏకాదేశమగును.
సంస్కృతంలో ఐ, ఔ లకు ‘వృద్ధులు’ అని పేరు. ఇవి ఏకాదేశంగా వస్తాయి కాబట్టి ఈ సంధికి ‘వృద్ధి సంధి’ అని పేరు.
ఉదా:

  • లోక + ఏక = లోకైక ఆ (అ + ఏ = ఐ)
  • దేశ + ఐక్యత వ దేశైక్యత (అ + ఐ = ఐ)
  • మహా + ఓఘం = మహౌఘం (ఆ + ఓ= ఔ)
  • దివ్య + ఔషధం దివ్యౌషధం (అ + ఔ + ఔ)

TS Inter 1st Year Telugu Grammar సంధులు

(డి) యణాదేశ సంధి:
ఇ, ఉ, ఋ లకు అసవర్ణములైన అచ్చులు పరమగునపుడు క్రమంగా య, వ, ర లు ఏకాదేశమగును.
య, వ, ర లకు సంస్కృతంలో ‘యణు &ణలులు’ అని పేరు. ఇవి ఆదేశంగా వస్తాయి కాబట్టి ఈ సంధికి యణాదేశ సంధి అని పేరు.

ఉదా:

  • ఆది + అక్షరం = ఆద్యక్షరం (ఇ + అ = య)
  • గురు + ఆజ్ఞ = గుర్వాజ్ఞ (ఉ + ఆ = వ)
  • పితృ + ఆర్జితం = పిత్రార్జితం (బు + ఆ = ర)

2. తెలుగు సంధులు :

(ఎ) అత్వసంధి :
అత్తునకు సంధి బహుళముగానగు.
హ్రస్వమైన అకారాన్ని ‘అత్తు’ అంటారు. బహుళమనగా సంధి నాలుగు రూపాల్లో ఉండటం.

  1. నిత్యం
  2. నిషేధం
  3. వైకల్పికం
  4. అన్యవిధం.

ఉదా:

  1. రామ + అయ్య = రామయ్య
  2. అమ్మ + ఇచ్చెను = అమ్మయిచ్చెను
  3. పుట్టిన + ఇల్లు = పుట్టినిల్లు, పుట్టినయిల్లు
  4. ఒక + ఒక = ఒకానొక

TS Inter 1st Year Telugu Grammar సంధులు

(బి) ఇత్వసంధి: (i) ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగానగు.
ఏమి, మణి, కి(షష్ఠి), అది, అవి, ఇది, ఇవి, ఏది, ఏవి మొదలైనవి ఏమ్యాదులు. ఇత్తు అనగా హ్రస్వమైన ఇకారము. వికల్పమనగా సంధి రెండు రూపాల్లో ఉండటం.

  1. సంధి జరిగిన రూపం
  2. సంధి జరగని రూపం.

ఉదా:

  1. ఏమి + అంటివి = ఏమంటివి, ఏమియంటివి
  2. మఱి + ఏమి = మతేమి, మఱియేమి

(ii) క్రియా పదంబులందిత్తునకు సంధి వైకల్పికముగానగు.
క్రియా పదంలోని హ్రస్వ ఇకారానికి అచ్చు పరమైనపుడు సంధి వైకల్పికమని సూత్రార్థం.

ఉదా:

  1. వచ్చిరి + అప్పుడు = వచ్చినప్పుడు, వచ్చిరియప్పుడు
  2. వచ్చితిమి + ఇప్పుడు = వచ్చితిమిప్పుడు, వచ్చితిమియిప్పుడు

(సి) ఉకార సంధి:
ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు.
ఉదా: సోముడు + ఇతడు = సోముడితడు

(డి) యడాగమ సంధి: సంధి లేనిచోట స్వరంబుకంటెఁ బరంబయిన స్వరంబునకు యడాగమంబగు.

ఉదా:

  1. మా + అమ్మ = మా + య్ + అమ్మ = మాయమ్మ
  2. మీ + ఇల్లు = మీ + య్ + ఇల్లు = మీయిల్లు

TS Inter 1st Year Telugu Grammar సంధులు

(ఇ) గసడదవాదేశ సంధి:
ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళముగానగు.

ఉదా:

  1. వాడు + కొట్టె = వాడుగొట్టె, వాడుకొట్టే
  2. అప్పుడు + చనియె = అప్పుడుసనియె, అప్పుడుచనియె
  3. నీవు + టక్కరివి = నీవుడక్కరివి, నీవుటక్కరివి
  4. నీవు తప్ప = నీవుదప్ప, నీవు తప్ప
  5. వారు + పోరు = వారు వారు, వారు పోరు

కళలైన క్రియాపదముల మీద సహితం పరుషములకు గసడదవలు వస్తాయి.

  1. రారు + కదా = రారుగదా, రారుకదా
  2. వత్తురు + పోదురు = వత్తురు వోదురు, వత్తురుపోదురు.

(ఎఫ్) ద్రుత ప్రకృతిక సంధి (సరళాదేశ సంధి):

(i) ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
ద్రుతమనగా ‘న’కారము. ద్రుత ప్రకృతికము అనగా ‘న’కారము చివరన కలది. మొదటి పదం చివర ద్రుతం ఉండి, రెండో పదం మొదట పరుషం ఉంటే, పరుషం స్థానంలో సరళం ఆదేశమవుతుంది.

ఉదా:

  1. పూచెను + కలువలు = పూచెను గలువలు
  2. తోచెను + చుక్కలు = తోచెనుజుక్కలు
  3. చేసెను + టక్కులు = చేసెనుడక్కులు
  4. పాలను + తాగెను = పాలను దాగెను
  5. మొగిడెను + పద్మము = మొగిడెనుబద్మము.

TS Inter 1st Year Telugu Grammar సంధులు

(ii) ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషములు విభాషనగు.
ఆదేశ సరళమనగా మొదటి సూత్రం ప్రకారం పరుషముల స్థానంలో వచ్చిన సరళం. కొన్నిసార్లు ద్రుతముగా మొదటి పదం చివరనున్న ‘ను’ అనుదానికి నిండుసున్న (0), అరసున్న (c) లేదా సంశ్లేషరూపం (ద్రుతం పక్క హల్లుతో కలసిన రూపం) వస్తుంది. సంధి జరిగి ఈ కింది రూపాలు ఏర్పడతాయి.

ఉదా:
పూచెను + కలువలు
= పూచెను గలువలు (మొదటి సూత్రం ప్రకారం)
= పూచెంగలువలు (పూర్ణ బిందువు)
= పూచెంగలువలు (అర్ధ బిందువు)
= పూచెన్గలువలు (సంశ్లేషము)

TS Inter 2nd Year Telugu Grammar సంక్షిప్తీకరణ

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material Grammar సంక్షిప్తీకరణ Questions and Answers.

TS Inter 2nd Year Telugu Grammar సంక్షిప్తీకరణ

ఇటీవల రచనల్లో సంక్షిప్తీకరణకు ప్రాధాన్యత పెరిగిపోయింది. పెద్ద పెద్ద పేరాలలో ఉండే విషయాలను కుదించి మొత్తం విషయాన్ని క్లుప్తంగా చెప్పడం రాతనైపుణ్యాలలో ఒక అంశంగా చెప్పుకుంటున్నాం. మూలంలోని అంశం ప్రతిబింబించేలా తక్కువ పదాల్లో భావాన్ని వ్యక్తీకరించడమే సంక్షిప్తీకరణ. విద్యార్థులలో ఈ నైపుణ్యాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో దీనిని ఒక అంశంగా చేర్చాం.

ప్రశ్న 1.
తెలంగాణా ప్రాంతంలో ఊరూర ఉద్ధండులైన సంస్కృతాంధ్ర పండితులున్నప్పటికిని వారు సభలలో సమావేశమై పరస్పర అవగాహన చేసుకునే అవకాశాలు బొత్తిగా లేకుండెను. రాజభాషయైన ఉర్దూ, ప్రాథమిక దశ నుంచి విశ్వవిద్యాలయ దశవరకు బోధనాభాష కావడంవల్ల తెలుగు భాషాభివృద్ధికి గొప్ప సంకట పరిస్థితి యేర్పడినది. ఆ రోజులలో హైదరాబాదు రాష్ట్రం ఒక ప్రత్యేకమైన ద్వీపకల్పముగా సిద్ధమై అక్కడ నివసించే ప్రజలను ఇతర ప్రపంచము నుండి వేరు చేసినది. అందుచేత గత శతాబ్దమునుంచి భారత స్వాతంత్య్ర ప్రాప్తివరకు అక్షరాస్యులైన ప్రజల సంఖ్య మిక్కిలి తక్కువగా ఉండెను. సంస్కృతాంధ్ర పండితులు కవులు గ్రాసవాసోదైన్యానికి గురియై పల్లెటూళ్ళలో కృశించిరి. కొద్దిమంది ఉర్దూ, ఫారసీ భాషలతో పరిచయం చేసుకొని ప్రభుత్వ ఆశ్రయముతో తమ పనులను నెరవేర్చుకొనిరి. ఈ విధంగా తెలుగు భాషా వికాసానికి తెలంగాణా ప్రాంతంలో గ్రహణము పట్టినది.
జవాబు:
సంక్షిప్తరూపం :
తెలంగాణ ప్రాంతంలో సంస్కృతాంధ్ర పండితులున్నప్పటికి సభలకు అవకాశాలు లేకుండేది. ఉర్దూ రాజభాషగా, బోధనాభాషగా ఉండటం వల్ల తెలుగు భాషాభివృద్ధికి సంకట స్థితి ఏర్పడింది. ఆ రోజులలో హైదరాబాదు రాష్ట్రంలో భారత స్వాతంత్ర్యప్రాప్తి వరకు అక్షరాస్యత తక్కువగా ఉండేది. కొందరు సంస్కృతాంధ్ర పండితులు, కవులు పల్లెటూళ్ళలో కృశించిపోతే, మరికొందరు రాజభాషను నేర్చుకొని తమ పనులు నెరవేర్చుకొన్నారు.

TS Inter 2nd Year Telugu Grammar సంక్షిప్తీకరణ

ప్రశ్న 2.
ఇక నేను తెలుగు సాహిత్య రంగంలో చేసిన పరిశోధన గురించి సంగ్రహంగా మనవి చేస్తాను. హైస్కూలు విద్యార్ధిగా ఉండినప్పటినుంచే భారతి తదితర పత్రికల్లో మానవల్లి, వేటూరి, నిడుదవోలు, ఈయుణ్ణి, మల్లంపల్లి వంటి పరిశోధకుల వ్యాసాలు, వారు సంపాదించిన గ్రంథాల పీఠికలు చదవటంచేత వారివలె ఇంతవరకు సాహిత్యలోకానికి తెలియని క్రొత్త విషయాలు చెప్పవలెననే నిశ్చయంతో పరిశోధన రంగంలో అడుగు పెట్టినాను. జానపద విజ్ఞానంలో విశ్వవిద్యాలయ స్థాయి పరిశోధనలో తెలుగులోనే కాదు దక్షిణభారతదేశ భాషలన్నిటిలో నా తెలుగు జానపదగేయ సాహిత్యము మొదటి సిద్ధాంత గ్రంథమైనది. ఆ రంగంలో అనేక జానపదగేయ సంకలనాలు ప్రకటించినాను. తెలుగులోను ఇంగ్లీషులోను జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పదులకొలది పరిశోధనాత్మకపత్రాలు చదివినాను. ఇంగ్లీషులో ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ.పి., ఫోక్లోర్ ఆఫ్ ఏ.పి., సౌత్ ఇండియన్ ఫోక్ సాంగ్స్, గ్లింప్సెస్ ఇంటూ తెలుగు ఫోక్లోర్ గ్రంథాలు ప్రకటించినాను.
జవాబు:
సంక్షిప్తరూపం :
హైస్కూల్ విద్యార్థిగా ఉన్నప్పటినుండే భారతిలాంటి పత్రికల్లో మానవల్లి, వేటూరి, నిడుదవోలు, మల్లంపల్లి వంటి వాళ్ళ వ్యాసాలు చదివాను. అందువల్ల కొత్త సాహిత్య విషయాలు చెప్పాలని పరిశోధక రంగంలో అడుగుపెట్టాను. దక్షిణ భారతదేశ భాషల్లోనే నా తెలుగు జానపదగేయ సాహిత్యం మొదటి సిద్ధాంత గ్రంథం. తెలుగు, ఆంగ్లంలో జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో ఎన్నో పరిశోధక పత్రాలు చదివాను. ఆంగ్లంలో ‘ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ.పి., ఫోక్ లోర్ ఆఫ్ ఏ.పి., సౌత్ ఇండియన్ ఫోక్ సాంగ్స్, గ్లింప్సెస్ ఇంటూ తెలుగు ఫోక్లోలోర్ గ్రంథాలు ప్రకటించాను.

TS Inter 2nd Year Telugu Grammar సంక్షిప్తీకరణ

ప్రశ్న 3.
ప్రకృతిసిద్ధంగా జరిగే పరిణామక్రమంలో ప్రకృతి చేసుకునే ఎంపిక గురించి చార్లెస్ డార్విన్ వివరిస్తూ మానవజాతి ఆవిర్భావం గురించి విభిన్నంగా ఆలోచించేటట్టు చేశాడు. విద్యుచ్ఛక్తి కనుగొనడం ద్వారా థామస్ ఆల్వా ఎడిసన్ సైన్సుకూ, టెక్నాలజీకి చెందిన ప్రతి రంగాన్ని సమూలంగా మార్చివేశాడు. దక్షిణాఫ్రికాలో జాతి విచక్షణతకు వ్యతిరేకంగా తన అహింసా ధర్మ ఉద్యమాన్ని ప్రారంభించిన మహాత్మాగాంధీ అహింస ద్వారా భారతదేశాన్ని బ్రిటిష్ పాలననుండి విడిపించి స్వాతంత్ర్యాన్ని సంపాదించాడు. 20వ శతాబ్దానికి చెందిన ఈ మూడు ప్రధాన సంఘటనలు సృజనాత్మక ఆలోచనల ఫలితాలు. *(M.P.)
జవాబు:
సంక్షిప్తరూపం :
ప్రకృతిసిద్ధమైన పరిణామక్రమాన్ని చార్లెస్ డార్విన్ మనం విభిన్నంగా ఆలోచించేటట్టు చేశాడు. విద్యుచ్ఛక్తి కనుగొని థామస్ ఆల్వా ఎడిసన్ సైన్స్ & టెక్నాలజీని మొత్తం మార్చేశాడు. అహింసా ఉద్యమాన్ని మహాత్మాగాంధీ ఉపయోగించి బ్రిటీషువారిని భారతదేశం నుండి పంపించేశాడు. ఈ మూడు 20వ శతాబ్దపు సృజనాత్మక ఆలోచనల ఫలితాలు.

TS Inter 2nd Year Telugu Grammar భాషాభాగములు

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material Grammar భాషాభాగములు Questions and Answers.

TS Inter 2nd Year Telugu Grammar భాషాభాగములు

భాషా భాగములు : తెలుగు భాషలోని శబ్దాలన్నీ ప్రధానంగా, ఐదురకాలైన భాషాభాగాలతో కూడి యుంటాయి. భాషలోని భాగాలే భాషాభాగాలు. ఇవి ప్రధానంగా ఐదు రకాలు.

  1. నామవాచకం
  2. సర్వనామం
  3. విశేషణం
  4. క్రియ
  5. అవ్యయం

1. నామవాచకం :
‘నామం’ అంటే పేరు. పేర్లను తెలియజేసే భాషా పదాలు, ‘నామవాచకాలు’. నామవాచకానికి, ‘విశేష్యం’ అని పేరు కూడా ఉంది.
ఉదా :
రాము, రఘ, వరంగల్, నల్లగొండ, కూచిపూడి, భద్రాచలం, వనిత, కవిత మొదలయినవి నామవాచకములు.

వాక్యరూప ఉదాహరణలు :

  1. రాము కళాశాలకు వెళ్ళాడు. – (‘రాము’ అనేది నామవాచకం)
  2. వరంగల్ పెద్ద పట్టణం – (వరంగల్ అనేది నామవాచకం)
  3. వనిత, కవిత అక్కా చెల్లెళ్ళు – (వనిత, కవిత అనే పదాలు నామవాచకాలు)
  4. భద్రాచలం గొప్ప పుణ్యక్షేత్రం – (‘భద్రాచలం’ అనేది నామవాచకం)
  5. కూచిపూడి నాట్యం గొప్పది – (‘కూచిపూడి’ అనేది నామవాచకం)

TS Inter 2nd Year Telugu Grammar భాషాభాగములు

2. సర్వనామం :
నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం.
ఉదా :
వాడు, వీడు, అతడు, ఆమె, ఇతడు, ఈమె, ఎన్ని, ఇన్ని, కొన్ని, మీరు, మనం, మేము, అన్ని, వారు, వీరు, ఎవరు, ఏది మొదలయినవి సర్వనామాలు.

వాక్యరూప ఉదాహరణలు :

  1. ఈ పని ఎవడు చేస్తాడో అతడే గొప్పవాడు. – (‘అతడే’ సర్వనామం)
  2. అతడు శ్రీరాముడు. – (‘అతడు’ సర్వనామం)
  3. వీడు అబద్దాల కోరు. – (‘వీడు’ సర్వనామం)
  4. ఆమె సౌందర్యవతి. – (‘ఆమె’ సర్వనామం)
  5. మనం భారతీయులం. – (‘మనం’ సర్వనామం)

3. విశేషణం :
నామవాచకం, సర్వనామాల గుణాలను తెలియజేసేవి ‘విశేషణాలు’.
ఉదా :
నల్లని, తెల్లని, మనోహరమైన, సరసమైన, పచ్చని, పుల్లని, తియ్యని మొదలయినవి విశేషణాలు.

వాక్యరూప ఉదాహరణలు :

  1. శ్రీజ మంచి తెలివిగల పిల్ల. – (‘మంచి’ విశేషణము)
  2. స్వాతి అందమైన పాప. – (‘అందమైన’ విశేషణము)
  3. కృష్ణుడు నల్లని వాడు. – (‘నల్లని’ విశేషణము)
  4. మాధవి మనోహరమైన స్త్రీ. – (‘మనోహరమైన’ అనేది విశేషణము)
  5. శ్రీనివాసుడు ధనవంతుడు. – (‘ధనవంతుడు’ విశేషణము)

TS Inter 2nd Year Telugu Grammar భాషాభాగములు

4. క్రియ :
చేసే పనిని తెలియజేసే పదాన్ని ‘క్రియ’ అంటారు.
ఉదా :
కొట్టు, తిట్టు, తిను, వెళ్ళు, చూచు, నిద్రించు, మాట్లాడు, నడుచు మొదలయినవి క్రియలు.

వాక్యరూప ఉదాహరణలు :

  1. రాముడు రావణుని సంహరించాడు. – (‘సంహరించాడు’ అనేది క్రియ)
  2. వాల్మీకి రామాయణం రచించాడు. – (‘రచించాడు’ అనేది క్రియ)
  3. రాము గ్రంథాలయానికి వెళ్ళాడు. – (‘వెళ్ళాడు’ అనేది క్రియ)
  4. మాధవరావు నాతో మాట్లాడుతున్నాడు. – (‘మాట్లాడుతున్నాడు’ అనేది క్రియ)
  5. సుప్రజ నిద్రిస్తుంది. – (‘నిద్రిస్తుంది’ అనేది క్రియ)

5. అవ్యయం :
లింగ, విభక్తి, వచనం లేని శబ్దములను ‘అవ్యయాలు’ అంటారు.
ఉదా :
అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు, ఔరా, ఆహా, అయ్యో, ఊరక, మిన్నక, అక్కడ, ఇక్కడ, ఎక్కడ, అచట, ఇచట, ఎచట – మొదలయినవి అవ్యయాలు.

వాక్యరూప ఉదాహరణలు :

  1. ఎక్కడ ఆరోగ్యం వుంటుందో అక్కడ సంపద వుంటుంది. – (ఎక్కడ, అక్కడ అనేవి అవ్యయాలు)
  2. మా అమ్మ అప్పుడు చెప్పిన పనిని ఇప్పుడు చేస్తున్నాను. – (‘అప్పుడు అవ్యయం’)
  3. బంగారు లేడిని చూచి సీత ఆహా ! అనుకుంది. – (‘ఆహా’ అనేది అవ్యయం)

TS Inter 2nd Year Telugu Grammar భాషాభాగములు

గమనిక :
భాషాభాగాలపై ఈ అభ్యాసములోని ప్రశ్నలలో నుండి ఐదు ప్రశ్నలు పరీక్షలలో ఇస్తారు. ఐదు జవాబులకూ, ఐదు మార్కులు. మీకు ఈ అభ్యాసంలో 12 ప్రశ్నలు ఉన్నాయి. వీటి నుండే, మీకు పేపర్లో ప్రశ్నలు వస్తాయి. కాబట్టి, శ్రద్ధగా చదువండి. ఐదుకి ఐదుమార్కులు పొందండి.

అభ్యాసం

ప్రశ్న 1.
అవ్యయానికి ఒక ఉదాహరణ ఇవ్వండి ? *(M.P)
జవాబు:
ఎక్కడ ఆరోగ్యం ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది.
పై వాక్యంలోని ఎక్కడ, అక్కడ అనేవి అవ్యయాలు.

ప్రశ్న 2.
‘ఎప్పుడు’ అన్నది ఏ భాషాభాగం ? *(M.P)
జవాబు:
‘ఎప్పుడు’ అన్నది, ‘అవ్యయము’ అనే భాషాభాగము.

ప్రశ్న 3.
సర్వనామాల గుణాలను తెలియజేసే వాటిని ఏమంటారు ?
జవాబు:
సర్వనామాల గుణాలను తెలియజేసే పదాలను ‘విశేషణం’ అంటారు.

ప్రశ్న 4.
‘శ్రీజ మంచి తెలివిగల పిల్ల’ వాక్యంలోని విశేషణం ఏమిటి ?
జవాబు:
పై వాక్యంలో ‘మంచి’ అనే శబ్దము, ‘విశేషణము’.

TS Inter 2nd Year Telugu Grammar భాషాభాగములు

ప్రశ్న 5.
‘స్వాతి అందమైన అమ్మాయి’ వాక్యంలో అందమైన అన్నది ఏ భాషాభాగం ?
జవాబు:
ఈ వాక్యంలోని ‘అందమైన’ అనే శబ్దము, ‘విశేషణం’ అనే భాషాభాగం అవుతుంది.

ప్రశ్న 6.
‘వీడు అబద్ధాల కోరు’ వాక్యంలోని ‘వీడు’ అన్నది ఏ భాషాభాగం ? *(M.P)
జవాబు:
ఈ వాక్యంలోని ‘వీడు’ అనేది సర్వనామం.

ప్రశ్న 7.
‘రాము గ్రంథాలయానికి వెళ్ళాడు’ వాక్యంలోని క్రియ ఏమిటి ? *(M.P)
జవాబు:
ఈ వాక్యంలోని క్రియ ‘వెళ్ళాడు’ అనే శబ్దము.

ప్రశ్న 8.
‘రాముడు రావణుని సంహరించాడు’ వాక్యంలో ‘సంహరించాడు’ అన్నది ఏ భాషాభాగం ?
జవాబు:
ఈ వాక్యంలో ‘సంహరించాడు’ అనేది ‘క్రియ’.

ప్రశ్న 9.
భాషాభాగములు ఎన్ని రకాలు ?
జవాబు:
భాషాభాగములు ఐదు రకాలు.

ప్రశ్న 10.
నామవాచకానికి గల మరో పేరు ఏమిటి ? *(M.P)
జవాబు:
నామవాచకానికి గల మరో పేరు, ‘విశేష్యము’.

TS Inter 2nd Year Telugu Grammar భాషాభాగములు

ప్రశ్న 11.
‘సర్వనామం’ అనగానేమి ?
జవాబు:
నామవాచకానికి బదులు వాడబడే శబ్దాన్ని ‘సర్వనామం’ అంటారు.

ప్రశ్న 12.
‘అతడు శ్రీరాముడు’ వాక్యంలో ‘అతడు’ అన్నది ఏ భాషాభాగం ?
జవాబు:
‘అతడు’ అనేది, ‘సర్వనామము’.

TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material Grammar ఛందస్సు Questions and Answers.

TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

పద్య లక్షణాలను తెలిపేది ఛందస్సు. లయ ప్రాధాన్యత ఛందస్సులో అంతర్గతంగా వుంటుంది. గణాల కూర్పుతో పద్యపాదాలు ఏర్పడతాయి. ఆ గణాలు గురు లఘువులతో కలిసి ఉంటాయి.

  1. లఘువు : ఒక మాత్ర కాలంలో పలుక బడేది లఘువు. లఘువుని (I) ఈ గుర్తుతో సూచిస్తాం.
  2. గురువు : రెండు మాత్రల కాలంలో పలికేది గురువు. గురువును (U) ఈ గుర్తుతో సూచిస్తాం.
  3. యతి : పద్యానికి సౌందర్యాన్ని చేకూర్చేవి యతి, ప్రాసలు. పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు.
  4. యతి మైత్రి : పద్యంలో నియమిత స్థానంలో ఉండే మైత్రికి, ‘యతిమైత్రి’ అని పేరు.
  5. ప్రాస : పద్య పాదంలో రెండవ అక్షరాన్ని ‘ప్రాస’ అంటారు.
  6. ప్రాస నియమం : నాలుగు పద్య పాదాలలోనూ, ఒకే హల్లును ప్రాస స్థానంలో ప్రయోగిస్తే, దానిని ‘ప్రాసనియమం’ అంటారు.

TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

పద్యాలు ప్రధానం మూడు రకాలు.

  1. వృత్తాలు,
  2. జాతులు,
  3. ఉపజాతులు.

వృత్త పద్యాలు

1. ఉత్పలమాల లక్షణము:

  1. ప్రతి పాదానికి వరుసగా భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలుంటాయి.
  2. ప్రతి పాదానికి ‘20′ అక్షరాలుంటాయి.
  3. ప్రతి పాదంలో, 10 వ అక్షరం యతిమైత్రి కల్గివుంటుంది.
  4. నాలుగు పాదాల్లో ప్రాస నియమం ఉంటుంది.
  5. నాలుగు పాదాలకు లక్షణాలు సమానం..
    ఉదా :
    TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 1
    యతిమైత్రి : 1-10 అక్షరాలైన ‘డ, టా’ లకు యతిమైత్రి చెల్లుతుంది.

2. చంపకమాల లక్షణము :

  1. ప్రతి పాదానికి 21 అక్షరాలుంటాయి.
  2. ప్రతి పాదానికి వరుసగా న, జ, భ, జ, జ, జ, ర అనే గణాలుంటాయి.
  3. ప్రతి పాదానికి 11వ అక్షరం యతిమైత్రి కల్గివుంటుంది.
  4. నాలుగు పాదాలలోనూ ప్రాసనియమం ఉంటుంది.
  5. నాలుగు పాదాలకూ లక్షణాలు సమానం.
    ఉదా :
    TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 2
    యతిమైత్రి : 1-11 అక్షరాలైన ‘అఆ’ లకు యతిమైత్రి చెల్లుతుంది.

గమనిక : (ఎసగన్ + ఆర్యులు) అని విడదీసినపుడున్న ‘ఆ-తో” యతి.

TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

3. శార్దూలం లక్షణము :

  1. ప్రతి పాదానికి 19 అక్షరాలుంటాయి.
  2. ప్రతి పాదానికి వరుసగా మ, స, జ, స, త, త, గ అనే గణాలుంటాయి.
  3. ప్రతి పాదంలో 13వ అక్షరం యతిమైత్రి కల్గి ఉంటుంది.
  4. అన్ని పాదాలలో ‘ప్రాసనియమం’ ఉంటుంది.
  5. నాలుగు పాదాలకు లక్షణాలు సమానము.
    ఉదా :
    TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 3
    యతిమైత్రి : 1-13 అక్షరాలైన ‘శ్రే – రే’ లకు యతిమైత్రి.

4. మత్తేభం లక్షణము :

  1. ప్రతి పాదానికి స, భ, ర, న, మ, య, వ అనే గణాలుంటాయి.
  2. ప్రతి పాదానికి 20 అక్షరాలుంటాయి.
  3. ప్రతి పాదంలో 14వ అక్షరం యతిమైత్రి కల్గి ఉంటుంది.
  4. నాలుగు పాదాలకు ‘ప్రాసనియమం’ ఉంటుంది.
  5. నాలుగు పాదాలకు లక్షణాలు సమానం.
    ఉదా :
    TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 4
    యతిమైత్రి : 1-14 అక్షరాలైన ‘స-త్స’లకు యతిమైత్రి చెల్లుతుంది.

జాతులు

1. కందం లక్షణము

  1. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  2. ఒకటి మూడు పాదాలకు మూడేసి గణాలు, రెండు నాలుగు పాదాలకు అయిదేసి గణాల చొప్పున ఉంటాయి.
    మొదటి రెండు పాదాలను ఒక భాగంగాను, చివరి రెండు పాదాలను ఒక భాగంగాను చెప్తారు.
  3. కంద పద్యంలో, నల, గగ, భ, జ, స అనే చతుర్మాత్రా గణాలు మాత్రమే ఉపయోగించాలి.
  4. బేసి గణాలలో మాత్రం (1, 3, 5, 7), ‘జ’ గణం ఉండకూడదు.
  5. ఆరవ గణం, ‘నల’ లేదా ‘జ’ గణం ఉండాలి.
  6. 2, 4 పాదాల్లో చివరి అక్షరం, విధిగా గురువు అయి ఉండాలి.
  7. రెండు, నాలుగు పాదాల్లో, 1-4 గణాల మొదటి అక్షరానికి, యతిమైత్రి ఉంటుంది.
  8. ప్రాసనియమం ఉండాలి.
    ఉదా :
    TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 5
    యతిమైత్రి : 2వ పాదములోని 1-4 గణాల మొదటి అక్షరాలైన ‘ప-బ’ లకు యతిమైత్రి చెల్లింది.

TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

ఉపజాతులు

ప్రాస యతి ఉండి, ప్రాస నియమం లేకపోవడం, ఉపజాతి పద్యాల ప్రత్యేకత.

1. ఆటవెలది లక్షణము :

  1. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  2. 1, 3 పాదాలలో వరుసగా 3 సూర్యగణాలు, రెండు ఇంద్ర గణాలు; 2-4 పాదాల్లో వరుసగా, ఐదు సూర్య గణాలు ఉంటాయి.
  3. ప్రతి పాదంలోను 1-4 గణాల మొదటి అక్షరాలకు యతిమైత్రి ఉండాలి.
  4. ప్రాసయతిని పాటింపవచ్చును.
  5. ప్రాసనియమం ఉండదు.
    ఉదా :
    TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 6
    యతిమైత్రి : 1-4 గణాల మొదటి అక్షరాలైన ‘క-గా’ లకు, ‘పు-వు’ లకు యతిమైత్రి.

2. తేటగీతి లక్షణము :

  1. తేటగీతి పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి.
  2. ప్రతి పాదానికీ వరుసగా ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, మరల రెండు సూర్యగణాలు ఉంటాయి.
  3. ప్రతిపాదంలోనూ 1-4 గణాల మొదటి అక్షరానికి యతిమైత్రి ఉంటుంది.
  4. ప్రాసయతిని పాటింపవచ్చు.
  5. ప్రాస నియమం ఉండదు.
    ఉదా :
    TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 7
    యతిమైత్రి : 1-4 గణాల మొదటి అక్షరాలైన ‘పా – ఫ’ లకు యతిమైత్రి చెల్లింది.

TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

3. సీసం లక్షణము :

  1. సీస పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి.
  2. ప్రతి పాదానికి వరుసగా ఆరు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు ఉంటాయి.
  3. పఠన సౌలభ్యం కోసం సీసాన్ని 8 అర్ధపాదాలుగా విభజిస్తారు.
  4. ప్రతి అర్ధపాదంలోనూ 1-3, 5-7 గణాల మొదటి అక్షరాలకు, యతిమైత్రి చెల్లుతుంది.
  5. ప్రాస నియమం ఉండదు. కాని ప్రాసయతి ఉంటుంది.
  6. సీస పద్యానికి, అనుబంధంగా ఆటవెలది గాని, తేటగీతి గాని చేర్చాలి.
    ఉదా :
    TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 8
    యతిమైత్రి : 1-3 లో-లో, 5-7 క-గ లకు యతిమైత్రి చెల్లింది. లో-లో, క-గ-యతిమైత్రి చెల్లింది.

గమనిక :
ఈ అభ్యాసములో 22 చిన్న ప్రశ్నలున్నాయి. వీని నుండి మీకు పేపరులో, ఎనిమిది ప్రశ్నలు ఇస్తారు. అందులో మీరు ఆరు ప్రశ్నలకు జవాబులు వ్రాయాలి. వాటికి ఆరుమార్కులు వస్తాయి. కాబట్టి వీటిని, అతిశ్రద్ధగా చదివి, ఆరుమార్కులను మీ స్వంతము చేసికోండి.

అభ్యాసం

ప్రశ్న 1.
‘లఘువు’ అనగానేమి ?
జవాబు:
ఒక మాత్ర కాలములో పలుకబడేది, ‘లఘువు’. లఘువును (I) గుర్తుతో సూచిస్తారు.

ప్రశ్న 2.
‘గురువు’ అనగానేమి ? * (M.P)
జవాబు:
రెండు మాత్రల కాలములో, పలికేది ‘గురువు’. గురువును (U) గుర్తుతో సూచిస్తాము.

TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

ప్రశ్న 3.
‘ఛందస్సు’ అనగానేమి ?
జవాబు:
పద్య లక్షణాలను తెలిపేది ఛందస్సు. లయ ప్రాధాన్యత, ఛందస్సులో అంతర్గతంగా ఉంటుంది.

ప్రశ్న 4.
ప్రాస అనగానేమి ?
జవాబు:
పద్య పాదంలోని రెండవ అక్షరాన్ని ‘ప్రాస’ అంటారు.

ప్రశ్న 5.
యతి అనగానేమి ?
జవాబు:
పద్య పాదంలోని, మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు.

ప్రశ్న 6.
పద్యాలు ప్రధానంగా ఎన్ని రకాలు ? * (M.P.)
జవాబు:
పద్యాలు ప్రధానంగా మూడు రకాలు :

  1. వృత్తాలు
  2. జాతులు
  3. ఉపజాతులు.

ప్రశ్న 7.
‘ఉత్పలమాల’లో వచ్చే గణాలు ఏవి ? * (M.P.)
జవాబు:
ఉత్పలమాలలో ప్రతి పాదములోనూ వరుసగా భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు ఉంటాయి.

ప్రశ్న 8.
‘ఉత్పలమాల’లో ఎన్నవ అక్షరం యతిస్థానం ? * (M.P.)
జవాబు:
ఉత్పలమాలలో 10వ అక్షరం యతిస్థానంగా ఉంటుంది.

TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

ప్రశ్న 9.
‘ఉత్పలమాల’ పద్యంలో ప్రతీ పాదానికి ఎన్ని అక్షరాలు ఉంటాయి ?
జవాబు:
ఉత్పలమాలలో ప్రతి పాదానికీ 20 అక్షరాలు ఉంటాయి.

ప్రశ్న 10.
‘చంపకమాల’లో వచ్చే గణాలు ఏవి ? * (M.P.)
జవాబు:
చంపకమాలలో వచ్చే గణాలు, వరుసగా న, జ, భ, జ, జ, జ, ర అనేవి.

ప్రశ్న 11.
‘చంపకమాల’లో ఎన్నవ అక్షరం యతిస్థానం ?
జవాబు:
చంపకమాలలో 11వ అక్షరం యతిస్థానం.

ప్రశ్న 12.
‘చంపకమాల’ పద్యంలో ప్రతి పాదానికి ఎన్ని అక్షరాలు ఉంటాయి ?
జవాబు:
చంపకమాల పద్యంలో, ప్రతి పాదానికీ 21 అక్షరాలు చొప్పున ఉంటాయి.

ప్రశ్న 13.
‘శార్దూలం’లో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
శార్దూలంలో వచ్చే గణాలు వరుసగా మ, స, జ, స, త, త, గ అనేవి.

ప్రశ్న 14.
‘శార్దూలం’లో ఎన్నవ అక్షరం యతిస్థానం ?
జవాబు:
శార్దూలంలో, 13వ అక్షరం యతిస్థానం.

TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

ప్రశ్న 15.
‘మత్తేభం’లో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
మత్తేభంలో ప్రతి పాదంలోనూ వరుసగా వచ్చే గణాలు, స, భ, ర, న, మ, య, వ అనే గణాలు.

ప్రశ్న 16.
‘మత్తేభం’ ఎన్నవ అక్షరం యతి స్థానం ?
జవాబు:
మత్తేభం, 14వ అక్షరం, యతిస్థానం.

ప్రశ్న 17.
‘కందపద్యం’లో ఆరవగణంలో వచ్చే గణాలు ఏవి ? * (M.P.)
జవాబు:
కందపద్యంలో, ఆరవ గణంగా, ‘నలము’ లేదా ‘జ గణం’ ఉండాలి.

ప్రశ్న 18.
‘ఆటవెలది’ పద్యంలో ప్రతి పాదంలో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
ఆటవెలది పద్యంలో ప్రతి పాదంలోనూ వచ్చే గణాలు, ఒకే రకంగా ఉండవు. ఈ పద్యంలో 1-3 పాదాల్లో మూడు సూర్యగణాలు, రెండు ఇంద్రగణాలూ ఉంటాయి. 2-4 పాదాల్లో ఐదునూ సూర్యగణాలే ఉంటాయి.

ప్రశ్న 19.
‘ఇంద్రగణాలు’ ఎన్ని ? * (M.P.)
జవాబు:
ఇంద్రగణాలు ‘ఆరు’, అవి : నల, నగ, సల, భ, ర, త అనేవి.

ప్రశ్న 20.
‘సూర్యగణాలు’ ఎన్ని ?
జవాబు:
సూర్యగణాలు రెండు. అవి :

  1. హ గణము (గలము)
  2. న గణము అనేవి.

TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

ప్రశ్న 21.
‘తేటగీతి’ పద్యంలో వచ్చే గణాలు ఏవి ? * (M.P.)
జవాబు:
తేటగీతి పద్యంలో, ప్రతి పాదంలోనూ, వరుసగా ఒక సూర్య గణము, రెండు ఇంద్ర గణములు, మరలా రెండు సూర్య గణములూ వస్తాయి.

ప్రశ్న 22.
సీసపద్యానికి అనుబంధంగా ఉండే పద్యాలు ఏవి ?
జవాబు:
సీసపద్యానికి అనుబంధంగా ఆటవెలది గాని, తేటగీతి గాని ఉంటుంది.

TS Inter 2nd Year Telugu Study Material

TS Inter 1st Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 2nd Lesson రాజ్యం, సార్వభౌమాధికారం Textbook Questions and Answers.

TS Inter 1st Year Political Science Study Material 2nd Lesson రాజ్యం, సార్వభౌమాధికారం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
రాజ్యాన్ని నిర్వచించి, దానికి గల మౌలిక లక్షణాలను చర్చించండి.
జవాబు.
పరిచయం :
రాజ్యం అనేది ఒక రాజకీయ సంస్థ. ఇది సార్వభౌమాధికారం గల అతిశక్తివంతమైన సంస్థ. అందువల్ల రాజ్యానికి రాజనీతి శాస్త్ర అధ్యయనంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. రాజ్యం సమాజంలోని అన్ని సాంఘిక, రాజకీయ సంస్థలన్నింటికంటే ఉన్నతమైనది.

అర్థం :
రాజ్యం అనే పదం మొట్టమొదటిసారిగా 16వ శతాబ్దంలో వాడుకలోకి వచ్చింది. ఇటలీ రాజనీతి తత్వవేత్త నికోలో మాకియవెల్లి 1513లో తన గ్రంథమైన “ప్రిన్స్”లో “లా స్టాటో” అనే ఇటలీ పరిభాషను ‘స్టేట్’కు పర్యాయపదంగా వాడాడు. అతని ఉద్దేశంలో స్టేట్ అంటే రాజకీయ శక్తి అని అర్థం.

ఆ తరువాత ఆంగ్లపదం ‘స్టేట్’ విరివిగా వాడుకలోకి వచ్చి విస్తృతంగా చర్చించారు. 18వ శతాబ్దం నాటికి రాజ్యం ఒక మానవ నిర్మిత వ్యవస్థగా బహుళ ఆదరణ పొంది విశ్వజనీన సంస్థగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

నిర్వచనాలు :
రాజ్యం అత్యంత ఆవశ్యకమైన విశ్వజనీన సంస్థ. అందువల్ల రాజనీతిశాస్త్ర అధ్యయనంలో దాని ప్రాధాన్యత మరింత పెరిగింది. అయితే, అనేక మంది రాజనీతి శాస్త్రవేత్తల మధ్య నిర్వచనాలపై ఏకాభిప్రాయం లేదు. ఎందుకంటే గాణ్య స్వభావానికి సంబంధించి భిన్న అభిప్రాయాలుండడం వల్ల దాని నిర్వచనంపై ఏకాభిప్రాయంలేదు. ప్రతి రాజనీతి శాస్త్రవేత్త తనదైన దృక్కోణంలో నిర్వచించడానికి ప్రయత్నించారు.

గార్నర్ :
“ఒక నిర్దిష్ట ప్రదేశంలో స్థిరనివాసులై, స్వతంత్రులుగా, వ్యవస్థాపూర్వక ప్రభుత్వానికి విధేయులుగా ఉండే ప్రజా సముదాయమే రాజ్యం”గా ‘నిర్వచించారు.

బ్లంట్ షిల్లీ :
“నిర్ణీత భూభాగంలో రాజకీయంగా వ్యవస్థాపితమైన ప్రజలే రాజ్యం” అని వర్ణించారు.

ఉడ్రో విల్సన్ :
“నిర్ణీత భూభాగంలో శాసన బద్ధమైన జీవితానికి సంఘటితం కాబడిన ప్రజలే” రాజ్యమని నిర్వచించారు.

హెచ్.జె. లాస్కీ:
“ఒక నియమిత భౌగోళిక ప్రాంతంలో ప్రభుత్వంగా, పాలితులుగా విభజితమై ఇతర సంస్థలన్నింటి మీద ఆధిక్యం కలిగి ఉండే ప్రాదేశిక సంఘమే రాజ్యం” అని నిర్వచించారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

రాజ్యం-మౌలిక లక్షణాలు :
పైన ఉదహరించిన నిర్వచనాలను నిశితంగా పరిశీలించినట్లయితే రాజ్యానికి నాలుగు ప్రధాన లక్షణాలున్నట్లు మనకు బోధపడుతుంది. అవి : 1. ప్రజలు, 2. ప్రదేశం, 3. ప్రభుత్వం, 4. సార్వభౌమాధికారం. ఈ నాలుగు లక్షణాలతోపాటు ఇటీవల కాలంలో రాజ్యానికి అంతర్జాతీయ గుర్తింపు కూడా అవసరమని భావించటం జరిగింది.

1. ప్రజలు :
రాజ్యం ఒక మానవ సంస్థ కాబట్టి ప్రజలులేనిదే రాజ్యంలేదు. ప్రజలు రాజ్యానికి గల మౌలిక లక్షణాలలో మొట్టమొదటిది. ప్రజలులేని రాజ్యం మనుగడను కలిగి ఉండదు. అందువల్ల కొందరు పాలించడానికి మరికొందరు పరిపాలించబడటానికి రాజ్యంలో ఉండాలి.

మానవ సముదాయంలేని ఎడారి ప్రాంతాన్ని మనం రాజ్యంగా భావించలే. రాజ్యంలోని ప్రజలు పలురకాల వర్గాలకు, తెగలకు చెందినవారై భిన్న ఆచార సంప్రదాయాలను అలవాట్లను, అదే విధంగా, అనేక దృక్పథాలను, అభిప్రాయాలను కలిగి ఉంటారు.

రాజ్యంలో ఎంత జనాభా ఉండాలనే దానిపై రాజనీతి శాస్త్రవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. గ్రీకు తత్త్వవేత్త ప్లేటో తన గ్రంథమైన “దిలాస్”లో 5040 మంది జనాభా కలిగి ఉన్న రాజ్యం ఆదర్శ రాజ్యమన్నాడు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యవాది, చిన్న చిన్న గణతంత్ర రాజ్యాలు ఉండాలని భావించిన ఫ్రెంచి తత్త్వవేత్త రూసో, రాజ్యంలో పదివేల జనాభా ఉండవచ్చునన్నాడు.

స్వయం పోషకత్వానికి, సమర్థపాలనకు సరిపడా జనాభా మాత్రమే ఉండాలని అరిస్టాటిల్ పేర్కొన్నాడు. ఏది ఏమైనప్పటికీ, రాజ్యవనరులకు, విస్తీర్ణతకు మించిన జనాభా ఉండకూడదు అనేది అందరి అభిప్రాయం.

2. ప్రదేశం :
ప్రదేశం లేదా భూభాగం అనేది రాజ్యానికి గల రెండవ లక్షణం. ఒక నిర్దిష్ట ప్రదేశంలో ప్రజలు నివసించనట్లయితే దాన్ని రాజ్యంగా పరిగణించలేం: నోమడ్స్, జిప్సీలు వంటి తెగలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి నిరంతరం వలస వెళుతున్నందున వారు ఒక రాజ్యపరిధిలో నివసించినట్లు భావించలేం. ప్రదేశం అనేది రాజ్యానికి సంబంధించిన ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాన్ని సూచిస్తుంది.

ఆ ప్రదేశం ప్రభుత్వ అధీనంలో ఉండి దానిపై సార్వభౌమాధికారంతో కూడిన నియంత్రణాధికారం ఉంటుంది. ప్రదేశం రాజ్యం నుంచి విడదీయలేనటువంటిది. -ప్రదేశం ప్రజల మధ్య సహోదర భావాన్ని సమైక్యతను ఏర్పర్చి రాజ్యానికి తిరుగులేని అధికారాన్ని అందిస్తుంది.

ప్రదేశం ఒక నిర్దిష్ట భూభాగమే కాకుండా దాని పరిధిలో సారవంతమైన నేలను, పర్వతాలను, నదులను, సరస్సులను అనేక ఇతర వనరులను కలిగి ఉంటుంది.

అదే విధంగా, ఆకాశంలో కొంత భాగాన్ని ఆ రాజ్య ప్రాదేశిక వియత్తలంగాను, అట్లాగే ఆ రాజ్యానికి సముద్రతీరం ఉన్నట్లయితే కొంత దూరాన్ని ప్రాదేశిక జలాలుగాను భూభాగంతోపాటు రాజ్యానికి హద్దులుగా నిర్ణయిస్తారు. గతంలో ప్రాదేశిక జలాల దూరం 3 నాటికల్ మైళ్ళుగా ఉండేది నేడు అది 12 నాటికల్ మైళ్ళదూరంగా గుర్తించబడింది.

3. ప్రభుత్వం :
రాజ్యానికి ప్రభుత్వం మూడవ మౌలిక లక్షణం. ప్రభుత్వమనేది ఒక రాజకీయ సంస్థగా ప్రజల కార్యకలాపాలను నియంత్రిస్తూ మార్గనిర్దేశకం చేస్తూ వారి మధ్య ఉత్పన్నమయ్యే అనేక రకాల సమస్యలకు పరిష్కారాలను చూపుతుంది.

రాజ్యం తన విధివిధానాలను, అభిప్రాయాన్ని ప్రభుత్వం ద్వారా అమలుపరుస్తుంది. ప్రభుత్వం ద్వారా రాజ్యం తన ఉనికిని కొనసాగిస్తుంది. గార్నర్ అనే రాజనీతి పండితుడు “ప్రభుత్వం రాజ్యానికి ఒక సాధనంగా ప్రజలందరిని ఉద్దేశించి రూపొందించిన విధానాలను, పథకాలను అమలుపరుస్తూ ప్రజలందరి ప్రయోజనాలను కాపాడే వ్యవస్థ”గా అభివర్ణించాడు.

ప్రభుత్వం, ఒక సాధనంగా రాజ్య అభీష్టాన్ని అమలుపర్చే కార్యంలో నిమగ్నమౌతుంది. అందువల్ల ప్రభుత్వంలేని రాజ్యాన్ని ఊహించలేం. ప్రభుత్వంలేని రాజ్యంలో ప్రజలు అసంఘటితంగా, అశాంతి అభద్రతా భావంతో అరాచకస్థితిలో నివసిస్తారు.

సమష్టి ఆలోచనలుగాని, సమిష్టి నిర్ణయాలు గాని, సమష్టి ప్రయోజనాల సాధనకై ప్రయత్నాలుగాని చేయలేని పరిస్థితిలో శాంతి భద్రతలు లోపించి చట్టాలను అతిక్రమించటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రజాసంక్షేమం దృష్ట్యా నిర్దిష్ట ప్రభుత్వ యంత్రాంగం అత్యంత ఆవశ్యకమైంది.

4. సార్వభౌమాధికారం :
సార్వభౌమాధికారం రాజ్యానికి గల నాలుగవ అతిముఖ్యమైన మౌలిక లక్షణం. ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం ఉన్నా సార్వభౌమాధికారం లేనట్లయితే రాజ్యం ఏర్పడదు. రాజ్యానికి గల ఈ మౌలిక లక్షణమే ఇతర సంస్థలన్నింటికంటే రాజ్యానికి ఉన్నతమైనదిగా గుర్తింపును కలిగిస్తుంది. సార్వభౌమాధికారం ఒక్క రాజ్యానికి మాత్రమే ఉండే లక్షణం.

సార్వభౌమాధికారం రాజ్యానికి గల సర్వాధికారాలకు నిదర్శనం. రాజ్యానికి గల తిరుగులేని అధికారమే సార్వభౌమాధికారం. ఇది ఒక్క రాజ్యానికి మాత్రమే గల అధికారం. ఈ అధికారం వల్లనే సర్వస్వతంత్రత కలిగిన వ్యవస్థగా రాజ్యం గుర్తించబడింది.

సార్వభౌఉకారం, రాజ్యంపై విదేశీపరమైన నియంత్రణలు లేని స్వతంత్ర వ్యవస్థగా, రాజ్యంలోని వ్యక్తులపై సంస్థలపై నళిక ప్రదేశంపై తిరుగులేని అధికారాన్ని చలాయించే శాసనాధికారాన్ని కల్పిస్తుంది. అంతేకాదు.

రాజ్యం అమలుపరచదలుచుకున్న అన్ని రకాల కార్యకలాపాలు యథేచ్ఛగా కొనసాగేటట్లుగాని, ప్రజలు రాజ్యానికి విధేయులుగా ఉండేటట్లుగాని చేయడంలో సార్వభౌమాధికారానికి మించినదేదీలేదు. రాజ్యానికి మాత్రమే ఉన్న ఈ సార్వభౌమాధికారం రాజ్యాన్ని ఇతర సంస్థలన్నింటికంటే ఉన్నతమైన, విశిష్టమైనదిగా నిలబెడుతుంది.

మరోవిధంగా చెప్పాలంటే, సార్వభౌమాధికారం రెండు రకాల రూపాలను కలిగి ఉంటుంది. ఒకటి, రాజ్యపరిధిలోని వ్యక్తులపై, సంస్థలపై చలాయించే శాసనాధికారం అంతర్గత సార్వభౌమత్వం కాగా, విదేశీ విధానంలో రాజ్యం ప్రదర్శించే స్వతంత్రత బాహ్య సార్వభౌమత్వం రెండవది అవుతుంది.

అంతర్జాతీయ గుర్తింపు :
అంతర్జాతీయ గుర్తింపు అనేది ఇటీవల కాలంలో రాజ్య మౌలిక లక్షణాలలో ఒకటిగా గుర్తించబడింది. ఆధునిక కాలంలో అనేక జాతీయ రాజ్యాలు, అంతర్జాతీయ సంస్థలు ఉనికిలోకి వచ్చాయి. అందువల్ల కొంతమంది రాజనీతి పండితులు అంతర్జాతీయ గుర్తింపు అత్యంత ఆవశ్యకమైనదిగా భావించాలన్నారు. ఎందుకంటే

ఏ రాజ్యమైనా ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం, సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటుంది. కాని అది అంతర్జాతీయ స్థాయిలో గుర్తించబడినప్పుడే దానికి గల అధికారాలు చెల్లుబాటు అవుతాయి. ఒక సార్వభౌమాధికార రాజ్యాన్ని మరో సార్వభౌమాధికార రాజ్యం గుర్తించిననాడే దాని మనుగడ కొనసాగుతుంది. అంతర్జాతీయ గుర్తింపు అనేది ప్రపంచ సంస్థయైన ఐక్యరాజ్యసమితి ద్వారా లభిస్తుంది.

ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశంగా గుర్తింపు పొందడం ద్వారా ఆ రాజ్యానికి సంబంధించిన సార్వభౌమాధికారం ఇతర రాజ్యాల చేత ఆమోదం పొందుతుంది. ఈ విధంగానే నూతన రాజ్యాలు ఏర్పడతాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

ప్రశ్న 2.
ఏకత్వ సార్వభౌమాధికారాన్ని వివరించండి.
జవాబు.
జాన్ ఆస్టిన్ ఏకత్వ సార్వభౌమాధికార సిద్ధాంతం : 18వ శతాబ్దంలో ఏకత్వ సార్వభౌమాధికార సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఇంగ్లాండ్ దేశ న్యాయకోవిదుడు జాన్ ఆస్టిన్. ఇతను తన గ్రంథమైన “లెక్చర్స్ ఆన్ జ్యూరిస్ట్రుడెన్స్” (1832)లో ఈ సిద్ధాంత ప్రతిపాదన చేశాడు.

తన కంటే ముందున్న థామస్ హాబ్స్, జెర్మి బెంథామ్ల సిద్ధాంతాలను తన సిద్ధాంతానికి ఆధారంగా తీసుకున్నాడు. ఆస్టిన్ సిద్దాంతాన్ని “నిరపేక్ష లేదా న్యాయబద్ధ సార్వభౌమాధికార సిద్ధాంతమని” కూడా పేర్కొంటారు. ఇతని అభిప్రాయంలో శాసనమనేది సార్వభౌముడు ప్రజలకిచ్చిన ఆజ్ఞగా పేర్కొన్నాడు.

ఆస్టిన్ సార్వభౌమాధికారం – ముఖ్య లక్షణాలు :
1. ఇది నిశ్చయాధికారం :
ప్రతి స్వతంత్ర రాజకీయ సమాజంలో ఒక నిర్ణీత మానవ అధికారి లేదా వ్యక్తుల సముదాయానికి సార్వభౌమాధికారం ఉంటుంది. వ్యక్తికి లేదా వ్యక్తుల సముదాయానికి గల అధికారం నిశ్చయ సార్వభౌమాధికారం.

2. సార్వభౌమాధికారి ప్రజలు అలవాటు ప్రకారం విధేయులై ఉంటారు :
సమాజంలోని ప్రజలందరు తమ అలవాటు ప్రకారం సార్వభౌమాధికారికి విధేయులై ఉంటారు. ప్రజలపై ఎటువంటి ఒత్తిడిగాని, ప్రలోభంగాని ఉండదు. ప్రజలు యథాలాపంగా సార్వభౌముడికి విధేయులై ఉంటారు.

3. సార్వభౌమత్వం అవిభాజ్యం:
సార్వభౌమాధికారం విభజించడానికి లులేనటువంటిది. ఎందుకంటే అది ఒకే దగ్గర కేంద్రీకరించబడి ఉంటుంది. సార్వభౌముడి అధికారానికి ఎటువంటి పరిమితులుండవు. శాసనాలకు మూలాధారం సార్వభౌముడు.

4. సార్వభౌమాధికారం ఆవశ్యకమైంది :
రాజకీయ సమాజానికి సార్వభౌమాధికారం అల్మ ‘అవసరమైంది. సార్వభౌమత్వం లేని సమాజం, రాజకీయంగాని స్వతంత్రతగాని లేని సమాజమౌతుంది.

5. చట్టమే తుది ఆజ్ఞ :
సార్వభౌముని ఆజ్ఞే చట్టం. చట్టాన్ని ఉల్లంఘించిన వారు శిక్షార్హులు అవుతారు. ఎందుకంటే సార్వభౌమాధికారం ‘ నిరపేక్షమైంది, నిర్దిష్టమైంది, స్పష్టమైంది, అపరిమితమైంది కాబట్టి.

6. రాజ్యానికి వ్యతిరేకమైన ఎటువంటి హక్కులు ప్రజలకు ఉండవు :
రాజకీయ సమాజంలోని ప్రజలకు సార్వభౌముడు ప్రసాదించిన హక్కులు మినహా ఏ ఇతర హక్కులు ఉండవు. ప్రజలు రాజ్యాన్ని వ్యతిరేకించే హక్కులను కలిగి ఉండరు.

ఆస్టిన్ సార్వభౌమాధికారం విమర్శ:
ఆస్టిన్ ప్రతిపాదించిన ఏకత్వ సార్వభౌమాధికారాన్ని ఎంతో మంది రాజనీతి పండితులు విమర్శించారు. ముఖ్యంగా ప్రజాస్వామికవాదులు, బహుతావాదులు విమర్శించారు.

వారిలో ప్రముఖంగా ఎ.వి.డైసీ, హెచ్.జె. లాస్కీ, జె.సి. గ్రే, హెన్రీమెయిన్, సివిక్ మొదలైన వారు ముఖ్యులు. కింది అంశాల ఆధారంగా వారు విమర్శించారు.

1. ఇది చారిత్రికమైంది కాదు :
హెన్రీమొయిన్ అభిప్రాయంలో ఆస్టిన్ ఏకత్వ సార్వభౌమాధికారానికి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు.

2. ప్రజాస్వామ్య వ్యతిరేకం:
ఆస్టిన్ సిద్దాంతం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైంది. ఇది ప్రజాస్వామ్య విలువలకు, జీవనానికి పూర్తి విరుద్ధమైనటువంటిది.

3. నిరపేక్ష సార్వభౌమాధికారం హానికరం :
ఆధునిక ప్రజాస్వామ్యదేశాలలో నిరపేక్ష, అపరిమిత సార్వభౌమాధి కారమనేది ఏ రూపంలో ఉన్నా హానికరమైనటువంటిది. ఎందుకంటే, నిరపేక్ష సార్వభౌమాధికారి బాధ్యతారహితంగా పాలించే అవకాశముంది.

4. సార్వభౌమత్వ ఉనికిని గుర్తించడం కష్టం:
ఆస్టిన్ అభిప్రాయంలో సార్వభౌమాధికారం అవిభాజ్యం. ఈ అభిప్రాయాన్ని బహుతావాదులు అంగీకరించలేదు. అమెరికా, భారతదేశం వంటి సమాఖ్య రాజ్యాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాన్ని విభజించడం జరుగుతుంది. కాబట్టి సమాఖ్య రాజ్యాలలో సార్వభౌమాధికారం ఎక్కడుందో గుర్తించడం కష్టమని లాస్కీ వ్యాఖ్యానించాడు.

5. రాజ్యం సర్వోన్నతమైంది కాదు :
ఆస్టిన్ రాజ్యాన్ని సర్వోన్నతమైన సంస్థగా పరిగణించాడు. కానీ వాస్తవంగా సమాజంలో రాజ్యంతో పాటు వివిధ రకాల సంఘాలు కూడా ఎన్నో రకాల సేవలను ప్రజలకు అందిస్తున్నాయని బహుతావాదుల వాదన. వీరి అభిప్రాయంలో వ్యక్తి వికాసానికి రాజ్యమెంత అవసరమో ఇతర సంఘాలు కూడా అంతే అవసరం.

6. ఆచార, సంప్రదాయాల ప్రాధాన్యతను విస్మరించడం :
ఆస్టిన్ సిద్ధాంతం ప్రకారం శాసనాలకు సార్వభౌముడి అధికారం మూలం. అయితే శాసన నిర్మాణంలో ప్రజల ఆచార, సంప్రదాయాలు ప్రాచీనకాలం నుంచి ప్రభావితం చేస్తున్నాయనే విషయాన్ని ఆస్టిన్ విస్మరించాడు.

పైన వివరించిన విమర్శలు ఎన్ని ఉన్నప్పటికీ ఆస్టిన్ ఏకత్వ సార్వభౌమాధికార సిద్ధాంతానికి రాజనీతిశాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

ప్రశ్న 3.
బహుత్వ సార్వభౌమాధికారాన్ని వివరించండి.
జవాబు.
బహుతావాద (బహుత్వవాద) సార్వభౌమాధికార సిద్ధాంతం ఆస్టిన్ ప్రతిపాదించిన ఏకత్వ నిరపేక్ష సార్వభౌమాధికార సిద్ధాంతానికి వ్యతిరేకంగా ప్రచారంలోకి వచ్చింది. ప్రజాస్వామ్యం, సమాఖ్య సిద్దాంత స్ఫూర్తి. వ్యక్తిగత స్వేచ్ఛ, అధికారాల విభజన వంటి అనేక అంశాలు బహుతావాద సార్వభౌమాధికారం బహుళ ప్రాచుర్యం పొందడానికి దోహదపడ్డాయి.

వాన్ గిర్కే (1844 – 1925) : మొట్టమొదటిసారి బహుతావాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆ తరువాత మెట్లాంగ్, బార్కర్, జి.డి.హెచ్. కోల్, హెచ్.జె. లాస్కీ, లిండ్సే, మైకేవర్, ఫాలెట్ వంటి వారు బహుతావాద సార్వభౌమాధికార సిద్ధాంతాన్ని బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు.

వీరందరూ ఏకత్వ సార్వభౌమాధికారం చాలా ప్రమాదకరమైందని ఆధునిక ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలి పెట్టులాంటిదని అభిప్రాయపడ్డారు. బహుతావాదుల అభిప్రాయంలో రాజకీయ సమాజంలోని అనేక సంస్థలలో రాజ్యం ఒకటని అందువల్ల అధికారమంతా ఒక్క రాజ్య అధీనంలోనే ఉండదని వీరు పేర్కొన్నారు.

బహుతావాద సార్వభౌమాధికారం – ప్రధాన అంశాలు :

  1. సమాజంలోని అనేక సంస్థల్లో రాజ్యం ఒకటి. రాజ్యం ఒక్కటే అధికారాన్ని కలిగి ఉండదు. సమాజంలోని వివిధ సంఘాలు కూడా సమాజానికి ఉపయోగకరమైన పనులు చేస్తాయి. అందువల్ల సార్వభౌమాధికారాన్ని రాజ్యానికి వివిధ సంఘాల మధ్య పంచడమే సమంజసమని వీరి అభిప్రాయం.
  2. రాజ్యం సమాజాన్నిగాని మరే ఇతర సంస్థను గాని నిర్మించలేదు. అదే విధంగా సమాజంలోని సాంస్కృతిక, ఆర్థిక, మతపరమైన, రాజకీయపరమైన సంస్థలను కూడా రాజ్యం సృష్టించలేదు. ఈ కారణం చేత రాజ్యం ఈ సంస్థలను రద్దు చేయజాలదు. రాజ్యానికి ఆ అధికారం కూడా లేదు.
  3. సమాజం సమాఖ్య రూపాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి రాజ్యం దాని అధికారాలను అన్ని సంస్థలకు పంపిణీ చేయవలసి ఉంటుంది.
  4. సార్వభౌమాధికారం ఒక్క రాజ్యానికి మాత్రమే చెందింది కాదు. కాబట్టి మిగతా సంస్థలన్నింటి మీద దాని అధికారం ఉండదు.
  5.  సార్వభౌమాధికారం నిరపేక్షంకాదు. అది అపరిమితమైంది, ప్రశ్నించలేనిది కాదు. దానికి కొన్ని అంతర్గత – బాహ్య పరిమితులున్నాయి. అంతర్జాతీయ వేదికలు సార్వభౌమాధికారంపై కొన్ని పరిమితులు విధించవచ్చు.
  6. సార్వభౌమాధికారం ఏకపక్ష స్వభావం కలిగి ఉండదు. సమాజంలో రాజ్యాంగపరమైన, సంప్రదాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకొని సార్వభౌమాధికారం అమలుపర్చవలసి ఉంటుంది. సార్వభౌమాధికారం ఒక్క రాజ్యం చేతిలోనే ఉండదు.
  7. సార్వభౌముడి ఆజ్ఞలే చట్టాలు, శాసనాలు అనుకోవడానికి వీలులేదు. సమాజంలోని అనేక అంశాలను దృష్టిలో ఉంచుకొని దాన్ని అమలుచేయాలి.
  8. ఆస్టిన్ రాజ్యానికి తిరుగులేని అధికారాన్ని కట్టబెట్టాడని బహుతావాదులు విమర్శించారు. దీని పర్యవసానంగా మానవ సమాజంలోని అనేక ఇతర సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

ప్రశ్న 4.
సార్వభౌమాధికారం అంటే ఏమిటి ? దాని ముఖ్య లక్షణాలను పేర్కొనండి.
జవాబు.
ఆధునిక రాజ్యానికి గల అతి ముఖ్యమైన లక్షణం సార్వభౌమాధికారం. నేడు అన్ని ఆధునిక రాజ్యాలు జాతీయ రాజ్యాలే. సార్వభౌమాధికారం వాటి ప్రధాన లక్షణం. సార్వభౌమాధికార లక్షణం వల్లనే రాజ్యం ఇతర సంస్థల సంఘాల కంటే భిన్నమైనదిగా గుర్తించబడింది. సార్వభౌమాధికారం రాజ్యానికి ఉండటం వల్లనే అది అన్ని రకాల అధికారాలను నిర్వహించగలుగుతుంది.

ఆధునిక రచయితల్లో ముఖ్యమైన ఫ్రెంచితత్వవేత్త 16వ శతాబ్దానికి చెందిన జీనో బోడిన్ మొట్ట మొదటి సారి “సార్వభౌమాధికారం” అనే పదాన్ని వాడారు. ఈ భావనను తన గ్రంథమైన “Six Books on the Republic”లో -1576లో పేర్కొన్నాడు.

నిర్వచనాలు : సార్వభౌమాధికారం అనే భావనను అనేక మంది పలు విధాలుగా నిర్వచించారు. కొన్ని నిర్వచనాలను కింది విధంగా తెలుసుకుందాము :
విల్లోభి : “రాజ్యం యొక్క అత్యున్నతా అభీష్టమే సార్వభౌమాధికారం” అన్నాడు.
బ్లాక్న్ : “ఎటువంటి పరిమితులు, నియంత్రణలేని నిరపేక్షమైన, శాసనబద్ధమైన అతి ఉన్నత అధికారమే సార్వభౌమాధికారం”.
జీన్ బోడిన్ : “పౌరులపై పాలితులపై శాసనాతీతమైన అత్యున్నత రాజ్యాధికారమే సార్వభౌమాధికారం”గా నిర్వచించాడు.
హ్యుగో గ్రోషియస్ : “ఎవరు అతిక్రమించలేని, విస్మరించలేని రాజ్యాధికారమే సార్వభౌమాధికారం” అన్నాడు. జెంక్స్ : “సమాజంలోని ప్రతి వ్యక్తి చర్యలను సంపూర్ణంగా నియంత్రించే అధికారమే సార్వభౌమాధికారం.”
ఉడ్రోవిల్సన్ : “శాసనాల తయారీ, అమలు దైనందిన శక్తి వ్యవహారం.”

సార్వభౌమాధికారం లక్షణాలు: సార్వభౌమాధికార లక్షణాలను కింది విధంగా వివరించవచ్చు.

  1. నిరపేక్షత (Absoluteness)
  2. సార్వజనీనత (Universality)
  3. శాశ్వతత్వం (Permanence)
  4. అనన్యసంక్రామకత్వం (Inalienability)
  5. అవిభాజ్యత (Indivisibility)

1. నిరపేక్షత :
రాజ్యానికి గల నిరపేక్షాధికారమే సార్వభౌమాధికారం. రాజ్యపరిధిలో సార్వభౌమాధికారాన్ని మించిన మరే అధికారం ఉండదు. సార్వభౌమాధికారాన్ని శాసించే అధికారం ఏ వ్యక్తికిగాని, సంస్థకుగాని ఉండదు. సార్వభౌమాధికారంపై ఎలాంటి ఆంక్షలను వ్యక్తులుగాని, సముదాయాలుగాని సాధించలేవు. అదేవిధంగా ఒక సార్వభౌ మాధికారం గల రాజ్యం సరిహద్దులలో మరో రాజ్యం జోక్యం చేసుకోవడం తగదు.

అయితే, మెట్లాండ్ వంటి రచయితలు సార్వభౌమాధికార నిరపేక్షతపై కొన్ని పరిమితులున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా, ప్రజాస్వామ్య రాజ్యాలు, ప్రజల ఆచార సంప్రదాయాలలోగాని, వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు వ్యతిరేకంగా తన అధికారాన్ని ఉపయోగించవు. అదే విధంగా, అంతర్జాతీయ న్యాయస్థానం ఏర్పడిన తరువాత అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు లోబడి మాత్రమే రాజ్యాలు ప్రవర్తిస్తున్నాయని చెప్పవచ్చు.

2. సార్వజనీనత :
సార్వభౌమాధికారం దాని స్వభావ రీత్యా సార్వజనీనమైంది. రాజ్య పరిధిలో గల ప్రజలందరి సంస్థలన్నింటికీ, సంఘాలన్నింటికీ సార్వభౌమాధికారం వర్తిస్తుంది. సార్వభౌమాధికారం ఏ వ్యక్తికి గాని, సంస్థకు గాని, సంఘానికి గాని ఎటువంటి మినహాయింపు ఇవ్వదు.

అయితే, విదేశీ రాయబారులు, రాయబార కార్యాలయ సిబ్బందికి మినహాయింపులుంటాయి. కొన్ని ప్రత్యేక సందర్భాలలో వారికి గల ప్రత్యేక అధికారాలను తొలగించవచ్చు. కాబట్టి వారు సైతం ప్రత్యేక సందర్భాలలో సార్వభౌమాధికారానికి లోబడి తమ వ్యవహారశైలిని మార్చుకోవలసి ఉంటుంది.

3. శాశ్వతత్వం :
సార్వభౌమాధికారం రాజ్యానికి గల శాశ్వత అధికారం. రాజ్యం తన మనుగడను కొనసాగించినంత కాలం సార్వభౌమాధికారం కూడా కొనసాగుతూనే ఉంటుంది. ప్రభుత్వం కాలపరిమితిలో మారుతుంది. కాని రాజ్యం మాత్రం మారదు. ఎందుకంటే రాజ్యం శాశ్వతమైంది. ప్రభుత్వం అశాశ్వతమైంది. గార్నర్ అభిప్రాయం ప్రకారం “మరణం లేదా తాత్కాలికంగా గుణములలో సంబంధించిన మార్పులవల్ల గాని, రాజ్యపునఃనిర్మాణం వల్లగాని సార్వభౌమాధికారం మారదు.”

4. అనన్యసంక్రామకత్వం :
రాజ్యానికి గల సార్వభౌమాధికారాన్ని మరొక రాజ్యానికి గాని, సంస్థకుగాని బదిలీ చేయడానికి వీలుపడదు. దాన్ని ఇతరులకు బదిలీ చేసినట్లయితే అది నాశనమౌతుంది. ఒకవేళ రాజ్యం తన భూభాగంలో కొంత భాగాన్ని స్వతహాగా వదులుకుంటే ఆ రాజ్యం సార్వభౌమాధికారాన్ని కోల్పోయినట్లు కాదు. కేవలం ఆ ప్రాంతంపై మాత్రమే తన అధికారం కోల్పోతుంది.

రాజ్యపాలకుణ్ణి ఆ రాజ్యంలోని తిరుగుబాటుదారులు అధికారం నుంచి తొలగించినట్లయితే అది కేవలం ప్రభుత్వంలో మార్పు సంభవించినట్లుగా భావించాలి గాని సార్వభౌమాధికారం మారినట్లు కాదు. సార్వభౌమాధికారం, రాజ్యం సమాంతరంగా కొనసాగుతాయి. ఎందుకంటే శరీరం నుంచి ఆత్మను ఏ విధంగా విడదీయడం సాధ్యం కాదో అదే మాదిరి రాజ్యం నుంచి సార్వభౌమాధికారాన్ని విడదీయలేం.

5. అవిభాజ్యత :
సార్వభౌమాధికారం విడదీయరానిది, దాన్ని విడదీయడం సాధ్యం కాదు. ఒకవేళ దాన్ని విభజించినట్లయితే అది మనుగడను కొనసాగించలేదు. ప్రతి రాజ్యం ఒకే ఒక అభీష్టాన్ని కలిగి ఉంటుంది. సార్వభౌమాధికారాన్ని విడదీయడమనేది సార్వభౌమాధికార సిద్ధాంతానికే వ్యతిరేకం.

బహుతావాదులు సార్వభౌమాధికారం అవిభాజ్యతను వ్యతిరేకించారు. వీరిలో ప్రముఖంగా లోవెల్, బ్రైస్ లాంటి వారు సార్వభౌమాధికార విభజన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.

వీరి ఉద్దేశంలో ఒక రాజ్యంలో రెండు స్థాయిలు గల సార్వభౌమాధికారం ఉంటుంది. దీనికి వీరిచ్చే ఉదాహరణ సమాఖ్య వ్యవస్థలో రాజ్యానికి గల అధికారాలు కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజించబడతాయి. అయితే, వీరి వాదనను వ్యతిరేకించే వారు కేంద్ర – రాష్ట్రాల మధ్య అధికారాల విభజన మాత్రమే జరుగుతుంది గాని సార్వభౌమాధికారం విభజించబడదని అభిప్రాయపడ్డారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఏవైనా నాలుగు రకాల స్వాభౌమాధికారాలను పేర్కొనండి.
జవాబు.
1. నామమాత్రపు సార్వభౌమా కారం :
ఒక వ్యక్తి లేదా సంస్థ రాజ్యం అధికారాలన్నీ పేరుకు మాత్రమే కలిగి ఉండటాన్ని నామమాత్రపు సార్వభౌమాధికారమంటారు. సంప్రదాయానుసారం మాత్రమే సదరు వ్యక్తి లేదా సంస్థ అధికారాలను కలిగి ఉంటారు. వాస్తవానికి ఏ అధికారం ఉండదు.

బ్రిటన్ రాణి, భారత రాష్ట్రపతి నామమాత్రపు సార్వభౌమాధికారానికి చక్కటి ఉదాహరణలు. ఈ రెండు దేశాలలో ఆచరణలో వారి పేరుతో అధికారాన్ని కేబినెట్ చెలాయిస్తుంది.

2. వాస్తవిక సార్వభౌమాధికారం:
సార్వభౌమాధికారాన్ని నామమాత్రపు అధిపతి పేరుతో వేరొక వ్యక్తి లేదా సంస్థ చెలాయించడాన్ని వాస్తవ సార్వభౌమాధికారం అంటారు. వాస్తవ సార్వభౌమాధికారి సహాయ సహకారాలతోనే నామమాత్రపు సార్వభౌమాధికారి ప్రభుత్వ అధికారాలను వినియోగిస్తాడు.

ఉదాహరణకు, పార్లమెంటరీ ప్రభుత్వ విధానం అమల్లో ఉన్న భారతదేశం వంటి రాజ్యాల్లో ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని మంత్రిమండలి సూచనల ప్రకారం నామమాత్రపు సార్వభౌమాధికారి అయిన రాష్ట్రపతి తన అధికారాన్ని వినియోగిస్తారు.

3. న్యాయబద్ధ సార్వభౌమాధికారం:
న్యాయబద్ధ సార్వభౌమాధికారంలో శాసనాలకు, చట్టాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. న్యాయబద్ధ సార్వభౌమాధికారి మాత్రమే అన్ని రకాల ఆజ్ఞలను జారీ చేస్తారు. వీటిని అందరూ తప్పనిసరిగా గౌరవించాలి. దైవిక న్యాయాన్ని లేదా సాధారణ న్యాయాన్ని, ప్రజాభిప్రాయాన్ని చట్ట రూపంలో తీసుకొచ్చే అధికారం కేవలం న్యాయబద్ధ సార్వభౌమాధికారికి మాత్రమే ఉంటుంది. ఇతను జారీ చేసిన కోర్ట్ ఆఫ్ లా కూడా అంగీకరిస్తుంది.

ఈ రకమైన సార్వభౌమాధికారానికి బ్రిటన్ రాజు, రాణి, జపాన్ రాజు, భారతదేశపు రాష్ట్రపతి చక్కటి ఉదాహరణలు. న్యాయబద్ధ సార్వభౌమాధికారం స్పష్టమైంది. వ్యవస్థీకృతమైంది. నిర్బంధమైంది. దాన్ని అతిక్రమించిన వారు శిక్షార్హులు.

4. రాజకీయ సార్వభౌమాధికారం :
ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాల్లో రాజకీయ సార్వభౌమాధికారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. రాజ్యంలోని అందరి చర్యలను రాజకీయ సార్వభౌమాధికారం ప్రభావితం చేస్తుంది. ఎ.వి.డైసీ అనే రాజకీయ పండితుడి దృష్టిలో అందరూ ఆమోదించి ఆచరణలో ఉండే ఒక ఉన్నతాధికారి చర్యయే రాజకీయ సార్వభౌమాధికారం.

అయితే, రాజకీయ సార్వభౌమాధికారం ఎవరెవరికి ఉంటుందో గుర్తించడం సాధ్యం కాదు. సమాజం, సంస్థలు, ప్రజలు, ప్రజాభిప్రాయం వంటి వివిధ రూపాలలో అది నెలకొని ఉంటుంది. ప్రజాభిప్రాయం సాధనాలవల్ల ప్రభావితమై వెల్లడౌతుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

ప్రశ్న 2.
రాజ్యానికి, ప్రభుత్వానికి మధ్యగల వ్యత్యాసాలను వివరించండి.
జవాబు.
రాజ్యానికి – ప్రభుత్వానికి మధ్యగల వ్యత్యాసాలు :

రాజ్యంప్రభుత్వం
1. రాజ్యం చాలా విశాలమైనది. దీనిలో ప్రజలందరూ భాగస్వాములు.1. ప్రభుత్వం చాలా పరిమితమైనది. ఇది కొద్దిమంది పౌరులకు చెందిన సంస్థ.
2. రాజ్యం శాశ్వతమైనది.2. ప్రభుత్వం నిరంతరం మారుతూ ఉంటుంది. ప్రభుత్వం కాలపరిమితికి తగ్గట్టుగా ఏర్పడుతుంది. ఉదాహరణకు భారతదేశంలో ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే మరోసారి బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుంది.
3. రాజ్యానికి సార్వభౌమాధికారం ఉంటుంది.3. ప్రభుత్వానికి సార్వభౌమాధికారం ఉండదు. అయితే, పేరు మీదుగా ప్రభుత్వం సార్వ భౌమాధికారాన్ని చెలాయిస్తుంది.
4. రాజ్యం అమూర్త రూపం4. ప్రభుత్వం నిర్దిష్ట రూపాన్ని కలిగి ఉంటుంది. ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకతను కలిగి ఉండవచ్చు. కాని రాజ్యానికి వ్యతిరేకంగా ఉండలేరు.
5. రాజ్యాలన్నీ విశ్వజనీనమైనవి, స్వభావరీత్యా లక్షణాల రీత్యా పోలికలను కలిగి ఉంటాయి.5. ప్రభుత్వాలు మాత్రం ఆయా రాజ్యాలను బట్టి ఏర్పడతాయి. ఉదాహరణకు, పార్లమెంటరీ, అధ్యక్షతరహా ప్రభుత్వాలు.
6. రాజ్యానికి దాని పౌరులు తప్పనిసరిగా విధేయతను కలిగి ఉండాలి.6. ప్రజాస్వామ్యంలో పౌరులు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కును కలిగి ఉంటారు.
7. రాజ్యం సర్వోన్నతమైనది. అది కొన్ని మౌలిక లక్షణాలను కలిగి ఉంటుంది. అవి ప్రజలు, ప్రభుత్వం, ప్రదేశం, సార్వభౌమాధికారం.7. ప్రభుత్వం రాజ్యానికి గల మౌలిక లక్షణాలలో ఒకటి మాత్రమే. ఈ విధంగా ప్రభుత్వం రాజ్యంలో అంతర్భాగమైనది.
8. రాజ్యానికి గల అధికారాలు వాస్తవమైనవి.8. ప్రభుత్వం చాలా పరిమిత అధికారాలను కలిగి ఉంటుంది. అవి కూడా రాజ్యం ప్రసాదించినవే.
9. రాజ్యం యజమాని వంటిది. అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు.9. ప్రభుత్వ రాజ్యానికి సాధనం వంటిది. ఈ రెండు యజమాని – సేవకుడు సంబంధాలను కలిగి ఉంటాయి. ప్రభుత్వ మనుగడ రాజ్య అభీష్టం మీద ఆధారపడి ఉంటుంది.
10. రాజ్యానికి నిర్దిష్ట భౌగోళిక ప్రదేశం ఉంటుంది. ఇది లేకుండా రాజ్యం మనుగడను కొనసాగించలేదు.10.  భౌగోళిక ప్రదేశం ప్రభుత్వానికి అవసరం లేదు. ఎందుకంటే, ఉదాహరణకు బ్రిటన్ ప్రభుత్వం భారతదేశాన్ని చాలా సంవత్సరాలు పరిపాలించింది.
11. రాజ్యంలో వ్యక్తులకు సభ్యత్వం తప్పనిసరి. ఏ ఒక వ్యక్తి సభ్యత్వం నుంచి తప్పించుకోలేడు.11. ప్రభుత్వంలో వ్యక్తులకు సభ్యత్వం తప్పనిసరికాదు. వ్యక్తి ఇష్టాయిష్టాల మీద సభ్యత్వం ఆధారపడి ఉంటుంది.
12. రాజ్యానికి గల అధికారం నిరపేక్షం, యథార్థం.12. ప్రభుత్వ అధికారాలు పరిమితం, ఆపాదించబడినవి.

 

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

ప్రశ్న 3.
రాజ్యానికి ఇతర సంస్థలకు గల తేడాలు ఏమిటి ?
జవాబు.
రాజ్యానికి – సంస్థలకు / సంఘాలకు మధ్యగల వ్యత్యాసాలు :

రాజ్యంసంస్థలు / సంఘాలు
1. రాజ్యం శాశ్వతమైంది.1. సంస్థలు/సంఘాలు అశాశ్వతమైనవి.
2. రాజ్యానికి సార్వభౌమాధికారం ఉంది.2. సంస్థలు/సంఘాలకు సార్వభౌమాధికారం ఉండదు.
3. రాజ్యానికి నిర్దిష్ట సరిహద్దులు ఉంటాయి. ఏ రాజ్యం విశ్వవ్యాప్తం కాదు లేదా ప్రపంచ వ్యాప్తం కాదు.3. ఇవి నిర్దిష్ట సరిహద్దులను కలిగి ఉండవు. అయితే కొన్ని సంస్థలు అంతర్జాతీయమైవి కూడా ఉంటాయి. ఉదాహరణకు ఐక్యరాజ్యసమితి, రెడ్ క్రాస్ సొసైటీ, ది లైన్స్ క్లబ్ మొదలైనవి.
4. రాజ్యంలో పౌరులకు సభ్యత్వం తప్పనిసరి. ప్రతి పౌరుడు రాజ్యంలో సభ్యుడుగా ఉండాలి.4. సంస్థల/సంఘాలలో సభ్యత్వం అనేది ఐచ్ఛికం. వ్యక్తుల ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది.
5. ఒక వ్యక్తికి ఒక్క సభ్యత్వం మాత్రమే ఉంటుంది.5. వీటిలో ఒక వ్యక్తి ఎన్నింటిలోనైనా సభ్యత్వం పొందవచ్చు.
6. రాజ్యం బహుళ విధులను నిర్వహిస్తుంది.6. సంస్థల విధులు ఒక్కటిగానే ఉండి కేవలం సభ్యులకు మాత్రమే చెందుతాయి.
7. రాజ్యం చట్టాలను, శాసనాలను చేస్తుంది. వాటిని అతిక్రమించినవారికి శిక్ష విధిస్తుంది.7. సంస్థలు/సంఘాలు శాసనాలను, చట్టాలను చేయవు. కాని వాటికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలను ఏర్పర్చుకుంటాయి.
8. ప్రజల మీద రాజ్యం పన్నును విధిస్తుంది.8. సంస్థలు/సంఘాలు ఎటువంటి పన్నులను విధించ లేవు. అయితే స్వచ్ఛందంగా సభ్యత్వ రుసుం చెల్లించుకోవచ్చు.
9. రాజ్యం లక్ష్యాలు విశాలమైనవి.9. సంస్థలు/సంఘాల లక్ష్యాలు ఆశయాలు చాలా పరిమితమైనవి.
10. రాజ్యం తన నిర్ణయాలను ప్రజలపై రుద్దవచ్చు. వాటిని పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవచ్చు.10. సంస్థలు, సంఘాలు తమ నిర్ణయాలను బలవంతంగా ప్రజలపై రుద్దలేవు. పాటించనివారిపై చర్యలు తీసుకోలేవు.
11. సంస్థలన్నింటికంటే రాజ్యం శ్రేష్ఠమైనది.11. సంస్థలన్నీ రాజ్యం పరిధిలో ఉండి రాజ్యం దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి కొనసాగుతూ ఉంటాయి.

 

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

ప్రశ్న 4.
జాన్ ఆస్టిన్ ఏకత్వసార్వభౌమాధికారం అంటే ఏమిటి ?
జవాబు.
18వ శతాబ్దంలో ఏకత్వ సార్వభౌమాధికార సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఇంగ్లాండ్ దేశ న్యాయకోవిదుడు జాన్.ఆస్టిన్. ఇతను తన గ్రంథమైన “లెక్చర్స్ ఆన్ జ్యూరిస్ ప్రుడెన్స్” (1832)లో ఈ సిద్ధాంత ప్రతిపాదన చేశాడు. తన కంటే ముందున్న థామస్ హాబ్స్, జెర్మి బెంథామ్ల సిద్ధాంతాలను తన సిద్ధాంతానికి ఆధారంగా తీసుకున్నాడు.

ఆస్టిన్ సిద్ధాంతాన్ని “నిరపేక్ష లేదా న్యాయబద్ధ సార్వభౌమాధికార సిద్ధాంతమని” కూడా పేర్కొంటారు. ఇతని అభిప్రాయంలో శాసనమనేది సార్వభౌముడు ప్రజలకిచ్చిన ఆజ్ఞగా పేర్కొన్నాడు.

ఆస్టిన్ సార్వభౌమాధికారం – ముఖ్య లక్షణాలు :
1. ఇది నిశ్చయాధికారం :
ప్రతి స్వతంత్ర రాజకీయ సమాజంలో ఒక నిర్ణీత మానవ అధికారి లేదా వ్యక్తుల సముదాయానికి సార్వభౌమాధికారం ఉంటుంది. వ్యక్తికీ లేదా వ్యక్తుల సముదాయానికి గల అధికారం నిశ్చయ సార్వభౌమాధికారం.

2. సార్వభౌమాధికారి ప్రజలు అలవాటు ప్రకారం విధేయులై ఉంటారు :
సమాజంలోని ప్రజలందరు తమ అలవాటు ప్రకారం సార్వభౌమాధికారికి విధేయులై ఉంటారు. ప్రజలపై ఎటువంటి ఒత్తిడిగాని, ప్రలోభంగాని ఉండదు. ప్రజలు యథాలాపంగా సార్వభౌముడికి విధేయులై ఉంటారు.

3. సార్వభౌమత్వం అవిభాజ్యం:
సార్వభౌమాధికారం విభజించడానికి వీలులేనటువంటిది. ఎందుకంటే అది ఒకే దగ్గర కేంద్రీకరించబడి ఉంటుంది. సార్వభౌముడి అధికారానికి ఎటువంటి పరిమితులుండవు. శాసనాలకు మూలాధారం, సార్వభౌముడు.

4. సార్వభౌమాధికారం ఆవశ్యకమైంది :
రాజకీయ సమాజానికి సార్వభౌమాధికారం అత్యంత అవసరమైంది. సార్వభౌమత్వం లేని సమాజం, రాజకీయంగాని స్వతంత్రతగాని లేని సమాజమౌతుంది.

5. చట్టమే తుది ఆజ్ఞ :
సార్వభౌముని ఆజ్ఞే చట్టం. చట్టాన్ని ఉల్లంఘించిన వారు శిక్షార్హులు అవుతారు. ఎందుకంటే సార్వభౌమాధికారం నిరపేక్షమైంది, నిర్దిష్టమైంది, స్పష్టమైంది, అపరిమితమైంది కాబట్టి.

6. రాజ్యానికి వ్యతిరేకమైన ఎటువంటి హక్కులు ప్రజలకు ఉండవు :
రాజకీయ సమాజంలోని ప్రజలకు సార్వభౌముడు ప్రసాదించిన హక్కులు మినహా ఏ ఇతర హక్కులు ఉండవు. ప్రజలు రాజ్యాన్ని వ్యతిరేకించే హక్కులను కలిగి ఉండరు.

ప్రశ్న 5.
బహుతావాద సార్వభౌమాధికారం అంటే ఏమిటి ?
జవాబు.
బహుతావాద (బహుత్వవాద) సార్వభౌమాధికార సిద్ధాంతం ఆస్టిన్ ప్రతిపాదించిన ఏకత్వ నిరపేక్ష సార్వభౌమాధికార సిద్ధాంతానికి వ్యతిరేకంగా ప్రచారంలోకి వచ్చింది. ప్రజాస్వామ్యం, సమాఖ్య సిద్ధాంత స్ఫూర్తి. వ్యక్తిగత స్వేచ్ఛ, అధికారాల విభజన వంటి అనేక అంశాలు బహుతావాద సార్వభౌమాధికారం బహుళ ప్రాచుర్యం పొందడానికి దోహదపడ్డాయి.

వాన్ గిర్కే (1844 – 1925) :
మొట్టమొదటిసారి బహుతావాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆ తరువాత మెట్లాంగ్, బార్కర్, జి.డి. హెచ్. కోల్, హెచ్.జె. లాస్కీ, లిండ్సే, మైకేవర్, ఫాలెట్ వంటి వారు బహుతావాద సార్వభౌమాధికార సిద్ధాంతాన్ని బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు.

వీరందరూ ఏకత్వ సార్వభౌమాధికారం చాలా ప్రమాదకరమైందని ఆధునిక ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలి పెట్టులాంటిదని అభిప్రాయపడ్డారు. బహుత్తావాదుల అభిప్రాయంలో రాజకీయ సమాజంలోని అనేక సంస్థలలో రాజ్యం ఒకటని అందువల్ల అధికారమంతా ఒక్క రాజ్య అధీనంలోనే ఉండదని వీరు పేర్కొన్నారు.

బహుతావాద సార్వభౌమాధికారం – ప్రధాన అంశాలు :

  1. సమాజంలోని అనేక సంస్థల్లో రాజ్యం ఒకటి. రాజ్యం ఒక్కటే అధికారాన్ని కలిగి ఉండదు. సమాజంలోని వివిధ సంఘాలు కూడా సమాజానికి ఉపయోగకరమైన పనులు చేస్తాయి. అందువల్ల సార్వభౌమాధికారాన్ని రాజ్యానికి వివిధ సంఘాల మధ్య పంచడమే సమంజసమని వీరి అభిప్రాయం.
  2. రాజ్యం సమాజాన్ని గాని మరే ఇతర సంస్థను గాని నిర్మించలేదు. అదేవిధంగా సమాజంలోని సాంస్కృతిక, ఆర్థిక, మతపరమైన, రాజకీయపరమైన సంస్థలను కూడా రాజ్యం సృష్టించలేదు. ఈ కారణం చేత రాజ్యం ఈ సంస్థలను చేయజాలదు. రాజ్యానికి ఆ అధికారం కూడా లేదు.
  3. .సమాజం సమాఖ్య రూపాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి రాజ్యం దాని అధికారాలను అన్ని సంస్థలకు పంపిణీ చేయవలసి ఉంటుంది.
  4. సార్వభౌమాధికారం ఒక్క రాజ్యానికి మాత్రమే చెందింది కాదు. కాబట్టి మిగతా సంస్థలన్నింటి మీద దాని అధికారం ఉండదు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

ప్రశ్న 6.
సమాజానికి, రాజ్యానికి గల తేడాలు ఏమిటి ?
జవాబు.
రాజ్యానికి – సమాజానికి మధ్యగల వ్యత్యాసాలు :

రాజ్యంసమాజం
1. రాజ్యం రాజకీయ సంస్థ.1. సమాజం సాంఘిక సంస్థ.
2. రాజ్యానికి నిర్ణీత నిర్దిష్ట భౌగోళిక సరిహద్దులుంటాయి.2. సమాజానికి నిర్దిష్ట భౌగోళిక సరిహద్దులుండవు.
3. రాజ్యం శాసనబద్ధంగా నిర్మితమైన ప్రభుత్వాన్ని కలిగి ఉంటుంది.3. సమాజం శాసనబద్ధంగా నిర్మితమైన సంస్థను కలిగి ఉండదు.
4. రాజ్యానికి అధికారం ఒక అలంకారంగా ఉంటుంది. రాజ్యాధికారాన్ని ధిక్కరించిన వారిని శిక్షించే శాసనం చట్టం చేతిలో ఉంటుంది.4. సమాజం ఎటువంటి అధికారాన్ని కలిగి ఉండదు. సమాజంలోని వ్యక్తుల నిరసనను శిక్షించే భౌతిక అధికారం దీనికి ఉండదు.
5. రాజ్యానికి మాత్రమే సార్వభౌమాధికారం ఉంటుంది. ఆ అధికారాన్ని దానికి గల సాధనాల ద్వారా శాసనాలను చట్టాలను, పథకాలను అమలు పరుస్తూ ఉంటుంది.5. సమాజానికి ఎటువంటి సార్వభౌమాధికారం ఉండదు. కాని ఆచారాలు, సంప్రదాయాలు, నైతిక విలువలు దీనికి అలంకార నియమాలుగా ఉంటాయి. అధికారంతో కూడిన శక్తి మాత్రం దీనికి ఉండదు.
6. రాజ్యం సహజ సంస్థ కాదు. మానవ ప్రయోజనాలకై నిర్మించిన సంస్థ. దీనిలో వ్యక్తులకు సభ్యత్వం తప్పనిసరి.6. సమాజం సహజ స్వచ్ఛందమైన సంస్థ. దీనిలో సభ్యత్వం ఇష్టపూర్వకంగా లభిస్తుంది.
7. రాజ్యం సమాజంలో అతి ముఖ్యమైన సంస్థ. రాజకీయంగా వ్యవస్థీకృతమైన సమాజంలో రాజ్యం అంతర్భాగం.7. సమాజం రాజ్యం కంటే విశాలమైనది. సమాజం అనేక గుంపుల సంఘాలకు నిలయం అయినందున దీనిలోని సంబంధాలు సైతం సంక్లిష్టంగా ఉంటాయి.
8. రాజ్యానికి బలం అది రూపొందించుకొనే శాసనం, చట్టం, రాజ్యాంగం.8. సమాజానికి బలం, అది కలిగి ఉన్న ఆచారం, సంప్రదాయాలు విలువలు, కట్టుబాట్లు మొదలైనవి.
9. రాజ్యం, వ్యక్తుల బహిర్గత కార్యకలాపాలను మాత్రమే పర్యవేక్షిస్తుంది. దాని నిమిత్తం కొన్ని నియమ నిబంధనలను రూపొందిస్తుంది.9. సమాజం వ్యక్తుల అంతర్గత బహిర్గత కార్యకలాపాలను నియంత్రిస్తుంది. సమాజం అన్ని రకాల సాంఘిక రూపాలను పర్యవేక్షిస్తుంది.
10. రాజ్యం ఒక అభివృద్ధి చేసిన సాంఘిక సంస్థ. ఇది సమాజం నుంచి ఆవిర్భవించింది.10. సమాజం మొట్టమొదటిగా ఏర్పడిన సంస్థ, అతి విశాలమైనది. మానవులు స్వభావరీత్యా సంఘ జీవులు.
11. రాజ్యం శాశ్వతమైనది కాకపోవచ్చు. కాలక్రమంలో అది అంతరించిపోవచ్చు లేదా మరో బలవంతమైన రాజ్యం ద్వారా ఆక్రమణకు గురికావచ్చు.11. సమాజం శాశ్వతమైనది. అది ఎల్లవేళలా కొనసాగేది.

 

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం 

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
రాజ్యం అంటే ఏమిటి ?
జవాబు.
‘రాజ్యం’ అనే పదాన్ని అనేకమంది రాజనీతిశాస్త్ర పండితులు అనేక రకాలుగా నిర్వచించారు. వారిలో కొందరు ఇచ్చిన నిర్వచనాలను కింది విధంగా పేర్కొనడమైంది.

  1. అరిస్టాటిల్ : “మానవునికి సుఖప్రదమైన, గౌరవప్రదమైన జీవనాన్ని ప్రసాదించడమే లక్ష్యంగా కలిగిన కుటుంబాలు, గ్రామాల సముదాయమే రాజ్యం”.
  2. బ్లంట్లీ : “ఒక నిర్ణీత ప్రదేశంలో నివసిస్తూ రాజకీయంగా వ్యవస్థీకృతమైన ప్రజల సముదాయమే రాజ్యం”.

ప్రశ్న 2.
ప్రభుత్వం అంటే ఏమిటి ?
జవాబు.
రాజ్యం యొక్క ఆశయాలను, లక్ష్యాలను నెరవేర్చే సాధనమే ప్రభుత్వం. ప్రభుత్వం మూడు అంగాలను కలిగి ఉంటుంది. అవి :

  1. శాసనశాఖ
  2. కార్యనిర్వాహక శాఖ
  3. న్యాయశాఖ.

ప్రశ్న 3.
సమాజం అంటే ఏమిటి ?
జవాబు.
సమాజం ప్రాచీనమైనది. రాజ్యం కంటే ముందు ఏర్పడినది. మానవుడు సంఘజీవి. సమాజంలో మాత్రమే వ్యక్తి సంపూర్ణ వికాసాన్ని, సుఖవంతమైన జీవితాన్ని గడపగలడు. “సమిష్టి జీవనాన్ని గడుపుతున్న మానవ సముదాయమే” సమాజము. సమాజంలో సభ్యత్వం లేని మానవుడిని ఊహించలేము.

వలలాగా అల్లబడిన వివిధ రకాల మానవ సంబంధాలను ‘సమాజం’ అని చెప్పవచ్చు. అయితే రాజ్యంలాగా సార్వభౌమాధికారము, దండనాధికారం ఉండదు. సాంఘిక ఆచార సంప్రదాయాల ఆధారముగా శిక్షలు ఉంటాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

ప్రశ్న 4.
ఏకత్వ సార్వభౌమాధికార సిద్దాంతం.
జవాబు.
18వ శతాబ్దంలో ఏకత్వ సార్వభౌమాధికార సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఇంగ్లాండ్ దేశ న్యాయకోవిదుడు జాన్ ఆస్టిన్. ఇతను తన గ్రంథమైన “లెక్చర్స్ ఆన్ జ్యూరిస్ప్రుడెన్స్”లో ఈ సిద్ధాంత ప్రతిపాదన చేశాడు. ఆస్టిన్ సిద్ధాంతాన్ని నిరపేక్ష లేదా న్యాయబద్ధ సార్వభౌమాధికార సిద్ధాంతమని కూడా పేర్కొంటారు. ఇతని అభిప్రాయంలో శాసనమనేది సార్వభౌముడు ప్రజలకిచ్చిన ఆజ్ఞగా పేర్కొన్నాడు.

ప్రశ్న 5.
బహుత్వ సార్వభౌమాధికార సిద్ధాంతం.
జవాబు.
బహుతావాద సార్వభౌమాధికార సిద్ధాంతం ఆస్టిన్ ప్రతిపాదించిన ఏకత్వ నిరపేక్ష సార్వభౌమాధికార సిద్ధాంతానికి వ్యతిరేకంగా ప్రచారంలోకి వచ్చింది. వాన్ గిర్కే మెట్లా లాండ్, బార్కర్, జి.డి. హెచ్. కోల్, లస్కీ, మెకైవర్, ఫాలెట్ వంటివారు బహుతావాద సార్వభౌమాధికార సిద్ధాంతాన్ని బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. సమాజంలోని అనేక సంస్థల్లో రాజ్యం ఒకటి.

రాజ్యం ఒక్కటే అధికారాన్ని కలిగివుండదు. సమాజంలోని వివిధ సంఘాలు కూడా సమాజానికి ఉపయోగకరమైన పనులు చేస్తాయి. అందువల్ల సార్వభౌమాధికారాన్ని రాజ్యానికి, వివిధ సంఘాల మధ్య పంచడమే సమంజసమని బహుతావాదుల అభిప్రాయం.

ప్రశ్న 6.
అంతర్గత సార్వభౌమాధికారం.
జవాబు.
అంతర్గత సార్వభౌమాధికారం : దేశంలోని ఆంతరంగిక వ్యవహారాలతో ఆ రాజ్యానికున్న అత్యున్నత అధికారాన్ని అంతర్గత సార్వభౌమాధికారంగా చెప్పవచ్చు. ఒక రాజ్య ప్రాదేశిక పరిధిలో నివసిస్తున్న వ్యక్తులు, సంస్థలు, సంఘాలన్నింటికి సంబంధించిన విషయాలలో శాసనాలు రూపొందించి అమలు చేసే అధికారాన్ని అంతర్గత సార్వభౌమాధికారం అంటారు. ప్రజలకు సంబంధించిన అన్ని రకాల స్వేచ్ఛలు హక్కులు రాజ్యానికి గల సార్వభౌమాధికారం ద్వారా మాత్రమే సంక్రమిస్తాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

ప్రశ్న 7.
బహిర్గత సార్వభౌమాధికారం.
జవాబు.
బాహ్య సార్వభౌమాధికారం :
ఒక రాజ్యం తన జాతి ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా అంతర్జాతీయ సమాజంలో ఇతర దేశాలలో చేసుకొనే ఒప్పందాలు, సంప్రదింపులు, దౌత్యనీతి, యుద్ధం వంటి అంశాలలో ఏ ఇతర రాజ్యాల ప్రభావానికి లోబడక సర్వస్వతంత్రంగా వ్యవహరించడాన్ని ఆ రాజ్యానికి ఉన్న బాహ్య సార్వభౌమాధికారంగా చెప్పవచ్చు. మరో విధంగా చెప్పాలంటే ఇటువంటి అధికారం గల రాజ్యంలో విదేశీ వ్యవహారాలలో ఇతర రాజ్యాల జోక్యానికి తావుండదు.

ప్రశ్న 8.
చట్టబద్ధ సార్వభౌమాధికారం.
జవాబు.
‘డి జ్యూర్’ అనేది ఫ్రెంచి పదం. డిజ్యూర్ అంటే చట్టబద్ధమైన అధికారం అని అర్థం. ఒక ప్రాదేశిక రాజ్యంలోని ప్రజలు, సంస్థలన్నింటికీ ఆజ్ఞలను జారీ చేసే చట్టబద్ధమైన అధికారం కలిగి ఉండటాన్ని డిజ్యూర్ సార్వభౌమాధికారమంటారు.

డిజ్యూర్ సార్వభౌమాధికారం రాజ్యాంగం, శాసనాల ద్వారా సంక్రమిస్తుంది. రాజ్యంలోని న్యాయస్థానాలు ఈ సార్వభౌమాధికారాన్ని గుర్తిస్తాయి. బ్రిటన్ రాణి, భారత రాష్ట్రపతి ఇటువంటి సార్వభౌమాధికారానికి ఉదాహరణలు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

ప్రశ్న 9.
యథార్థ సార్వభౌమాధికారం.
జవాబు.
‘డిఫాక్టో’ అనేది ఫ్రెంచిపదం. డిఫాక్టో అంటే ఫ్రెంచి భాషలో యథార్థమైందని అర్థం. రాజ్యంలో సార్వభౌమాధికారాన్ని ‘ఎవరైతే వాస్తవంగా చెలాయిస్తారో వారికి ‘డిఫాక్టో’ సార్వభౌమాధికారం ఉంటుంది. ఈ విధమైన సార్వభౌమాధికారం ఒత్తిడి, నిర్బంధం, బలప్రయోగం వంటి అంశాలపట్ల నియంత్రించబడుతుంది. అటువంటి అధికారాన్ని చట్టం గుర్తించదు. కాని యథార్థానికి వారి యథార్థానికి వారి మాటే చెల్లుతుంది. ఈ విధంగా అధికారంలోకి వచ్చినవారు సైనికాధికారులు కావచ్చు. నియంతలు కావచ్చు లేదా మతాధికారులు కావచ్చు.

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 4 ఇన్సానియత్

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 4th Lesson ఇన్సానియత్ Textbook Questions and Answers.

TS Inter 1st Year Non-Detailed 4th Lesson ఇన్సానియత్

ప్రశ్నలు- సమాధానాలు

ప్రశ్న 1.
ఇన్సానియత్ కథలోని సందేశాన్ని చర్చించండి?
జవాబు:
‘ఇన్సానియత్’ కథ డా. దిలావర్ చే రచించిన “మచ్చుబొమ్మ” కథా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ కథ తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్న ఆత్మీయ మానవ సంబంధాలను చిత్రిస్తుంది. కులమత బేధం లేకుండా ప్రజలందరి మధ్య నెలకొన్న స్నేహాలు, వరుసలు పరస్పర సహకారాలు సహజీవన సంస్కృతిని తెలియచేస్తుంది.

కాలక్రమేణ నగరాల్లోని స్వార్థం, కులాభిమానం, మతోన్మాదం శ్రీ వికృతరూపం దాల్చి గ్రామీణ ప్రాంతంలోకి వ్యాపించ టం ప్రారంభమౌతుంది. ఈ నేపథ్యంలో గ్రామీణ హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్న ఉన్న ఉన్నత మానవీయ సంబంధాలను ఈ కథ తెలియచేస్తుంది. వర్తమాన సమాజంలో లుప్త మౌతున్న ఆదర్శాలను విలువలను తెలుపుతూ కులమత దురభిమానంపై ఆత్మవిమర్శ చేసుకోవాలని ఈ కథ సూచిస్తుంది.

రాంరెడ్డి సుబానీలు పేకాడుతున్నారు. సుబాని చేతిలో రాంరెడ్డి ఓడిపోతున్నాడు, అతడు పేకాటలో ఓడిపోతున్నట్టు లేదు. తన దర్జా దర్పం ఒక్కొక్క మెట్టు దిగ జారిపోతున్నట్టుగా ఉంది. అంతవరకు పేకాటలో రాంరెడ్డిని ఓడించినవాడు లేడని ప్రతీతి పొందాడు. సుబాని ఈనాడు రాంరెడ్డిని బట్టలూడదీసి నడిబజార్లో నిలబెట్టినట్టుంది. తట్టుకోలేక ఎన్నెన్నో అన్నాడు దానికి ఎంకన్న వంతు పాడాడు.

“ఒక్క పేకాటే కాదు మల్ల ఇంకే ఆటైనా గంతే. కిర్కెట్లో పాకిస్తాన్ అగరబాగెలిస్తే పండగచేస్కుంటారు”

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 4 ఇన్సానియత్

“నువ్వెన్ని జెప్పు… వీళ్ళంతా గంతే…. తినేది ఇండియా సొమ్ము… పాడేది పాకిస్తాన్పట” కసిగా అన్నాడు రాంరెడ్డి. సుబానీకి “కండ్లపొంటి నీల్లు గిర్రున తిర్గుతాంటి. సుబాని దిగులుగా ఇంటికి చేరిండు. తల్లి అతని దిగులు గమనించి ఏమయిందని అడిగింది. రాంరెడ్డి అన్న మాటలన్నీ చెప్పిండు సుబాని. ఆ తరువాత సంఘటనలో సుబానీకి యాక్సిడెంట్ అయింది. రాంరెడ్డి కొడుక్కి కిడ్నీఫెయిలయింది. రాంరెడ్డి అడగలేక అడగలేక సుబానీ తల్లిని తన కుమారునికి ప్రాణభిక్ష పెట్టమని కోరాడు.

సుబానీ తల్లి రాంరెడ్డిని “మర్ది కడుపుకోత ఎట్ల అగులు గుబులుగా ఉంటుందో అనుభవిస్తున్న. నా కడుపు కాలినట్లు ఇంకొకల్లకు ఎందుక్కొవాలె. నా కొడుకును మట్టెల గల్పుకుంటున్న, గా మట్టిల్నుంచి ఒక చిన్న మొక్క పానం బోస్కానికి మోక ఉంటే ఎందుకడ్డంబడాలె” అన్నది.

అపుడు రాంరెడ్డి! “సుబానీ! నీ తోని నేనొక్క పేకాటల్నే వోడిపోయిన అనుకున్న. గనినీ సావుసుత నన్ను ఓడిచ్చింది. మనిషికి కావల్సింది. ఇన్సానియత్ గని కులాలు మతాలూ కావని సుత సాటి చెప్పినవ్” అన్నాడు. మానవత ముందు ఏదైనా తలవంచాల్సిందేని ఇన్సానియత్ కథ చెప్తుంది.

ప్రశ్న 2.
పాతిమా గొప్ప మనసును వివరించండి ?
జవాబు:
ఇన్సానియత్ కథ ‘డా. దిలావర్’ చే రచించబడిన “మచ్చుబొమ్మ” కథా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ కథ తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్ని ఆత్మీయ మానవ సంబంధాలను చిత్రించింది. వాటికి ‘ఫాతిమా’ గొప్ప మనసు ఒక, నిధర్శంగా నిలుస్తుంది.

ఫాతిమా సుబానీ తల్లీ, సుబాని, రాంరెడ్డి, కాపోల్ల ఎంకన్నలు పేకాడుకుంటారు. సుబాని చేతిలో వారు ప్రతి ఆట ఓడిపోయారు. రాంరెడ్డి ఇజ్ఞత దెబ్బతింది. సుబానీని నానా మాటలూ అన్నాడు. ఆ దిగులుతో ఇంఇకి వచ్చిన సుబానీని తల్లి ఫాతిమా ఏం జరిగిందని అడిగింది. రాంరెడ్డి అన్నమాటలన్నీ సుబాని తల్లికి చెప్పాడు. రోజులు మారిపోయాయి అనుకుంది ఫాతిమా!

పల్లెకు రజాకార్లోత్తే ఊరోల్ల స్థానానికి తన పానం అడ్డమేసుండు మీ బాపు. ఊరోల్ల మీ బాబును పానానికిపానంగా చూసుకునేటోల్లు. ఇప్పుడు మనిషికి మనిషికి మధ్య ఎడం పెరుగుతుంది. మనమే మనకు పరాయిల్లెక్క కండ్ల బడన్నమ్” గీ దుష్మనీ, కచ్చలు, నరుక్కోటం సంపుకోటం, మత పిచ్చిగాల్లు రామ్ .రహీమ్ల నడ్మ చిచ్చుపెట్టడం· గియన్ని ఎన్నటి జమానలమేం ఎరగంబిడ్డా! ఒకలకు ఆసకొత్తే ఒకల్లు ఆదుకునే టోల్లు.

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 4 ఇన్సానియత్

సుబానీకు యాక్సిడెంటైనా సమయాన తన కొడుకు ఎలానూ బ్రతకడు. ‘రాంరెడ్డి కొడుకన్నా బతికితే అంతేచాలు అని అనున్నది పాతిమా!

“మర్దీ సీమకు సుత అపకారం చెయ్యాలి. నా కొడుకుని చూసి ఓర్వలేక తీస్కపోతన్నడు” అని తన బాధను రాంరెడ్డి వద్ద వెళ్ళపోసుకుంది.

అప్పుడు రాంరెడ్డి ఫాతిమా!” గిసుంటి ఆపతిల తల్లి మనసు ఎంత తండ్లాడ్తదో నాకెర్క లేదు కాదు. జర అటు ఇటు నేను సుత నీవోల్లెనె ఉన్న. ఎంకెట్రెడ్డి సావు బతుకుల్ల ఉన్నాడు. గాని పానాలు గిప్పుడు మీ చేతుల్లవున్నయ్” నా కొడుకు కిడ్నీలు పూరాగా పాడైపోయినయ్. పన్నెండు గంటల్లో ఏరే కిడ్నీలు దొరక్కుంటే నా ఒక్కగానొక్క కొడుకు నాకు దక్కడు. ఫాతిమా! నీకు చేతులెత్తి మొక్కుత! సుబాని కిడ్నీలు…. అని రాంరెడ్డి గొంతుక పూడిపోయి మాట రాలేదు.

ఫాతిమా ఒక్కసారి షాక్ అయింది. సుడిగాలికి ఎండు టాకులా వణికింది.

“మర్షీ! కడుపుకోత ఎట్లు అగులు బుగులుగ ఉంటుందో అనుబగిత్తన్నా! నా కడుపు కాలినట్లు ఇంకొకల్లకు ఎందుకు కావాలె? నా కొడుకును మట్టిలో గల్పుకుంటన్నగా మట్టిల్నుంచి ఒక చిన్న మొక్క పానం బోస్కోనికి మోక వుంటే ఎందుకడ్డబడాలె! నాకొడుకు పానం అసుమంటిదే నీ కొడుకు పానం. నా కొడుకు హయత్సుత బోస్కోని నీ కొడుకు నిండు నూరేండ్లు బత్కొలె! గందుకునన్నే జెయ్యమంటే గజేస్త…. అన్నది ఫాతిమా!

ఫాతిమా మనసు…. మనిషికి కావలసింది. ఇన్సానియత్ గాని కులాల మతాలు కావని” చెప్పకనే చెప్పింది. ఇంతటి గొప్ప మనసు ఫాతిమావంటి తల్లులకు ఎప్పుడూ ఉంటుంది.

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 4 ఇన్సానియత్

ప్రశ్న 3.
ఈ కథ ఆధారంగా హిందూ ముస్లిం మతస్థుల మధ్య నెలకొన్న ఆత్మీయ అనుబంధాలను చర్చించండి?
జవాబు:
‘ఇన్సానియత్’ అను పాఠ్యభాగం డా. దిలావర్ చే రచించబడిన “మచ్చుబొమ్మ” కథా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ కథ గ్రామీణ ప్రాంతాలలోని హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్న ఆత్మీయ మానవ సంబంధాలను తెలియ చేస్తుంది. కులాలు మతాలు అనే భేదం లేకుండా ప్రజలందరి మధ్య నెలకొన్న స్నేహాలు, వరుసలు, పరస్పర సహకారాలు, సహజీవన సంస్కృతిని తెలియపరస్తుంది.

కాలక్రమేణ నగరాల్లోని స్వార్థం, కులాభిమానం, మతోన్మాదం వికృతరూపం దాల్చి గ్రామీణ ప్రాంతాలలోకి వ్యాపించడం ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో గ్రామీణ హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్న ఉన్నతమైన మానవీయ అనుబంధాలను ఈ కథ వివరిస్తుంది. వర్తమాన సమాజంలో లుప్తమవుతున్న ఆదర్శాలను విలువలను తెలుపుతూ కులమత దురభిమానాలపై ఆత్మవిమర్శ చేసుకోమని తెలియచేస్తుంది.

పూర్వం గ్రామాలలోని ప్రజలంతా కుల మత భేదం లేకుండా అందరూ అందర్నీ అత్తా, అక్కడ, బావా, అత్తా,మద్దీ, మామ అని పిలుచుకునేవారు. వారి మధ్య ప్రేమాభిమానాలకు కుల మతాలు అడ్డు వచ్చేవికావు. ఎంతపెద్ద కులంలో పుట్టినా వారిలో కూడా మిగిలిన వారి పట్ల ఆత్మీయానురాగాలు ఉండేవి. ఒకరినొకరు చక్కగా గౌరవించుకునేవారు. దీనికి నిదర్శనం, ఈ కథలోని రాధమ్మత్త, సోందుబాబుల మధ్య జరిగిన సంభాషణలే!

ముస్లిం అయిన సోందుబాబు హిందువైన రాధమ్మను అత్తమ్మా అని పిలవడం ఉదాహరణ..

“ఏం! రాధత్తమ్మా! అంత మంచేనా!” అని సోందుబాబు అంటే

“బానే ఉన్న పోరగా! మీరంతా మంచేనా” అని రాధమ్మ అనటంలో వారి మధ్య ఉన్న ఆప్యాయత అను రాగాలు మనకు అర్థమౌతాయి.

అలాగే పాతిమా రాంరెడ్డిని “మర్దీ! సీమకు సుత అపకారం చెయ్యని నా కొడుకుని చూసి ఓర్వలేక అల్లా తీస్కపోతన్నడు” అనడం ముస్లిం హిందూ కుటుంబాల మధ్య ఉన్న. ఆత్మీయతా, అనుబంధాలకు ఒక నిదర్శనంగా భావించాల్సి ఉంటుంది”.

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 4 ఇన్సానియత్

“మర్షీ! కడుపుకోత ఎట్ల అగులు బుగులుగ ఉంటదో అనుబగిత్తన్నా! నా కొడుకును మట్టిల గల్పుకుంటున్నా. నా కొడుకు పానం వంటిదే నీ కొడుకుపానం” నా కొడుకు హయత్ సుత బోస్కొని నీ కొడుకు నిండు నూరేళ్ళు బత్కాలే” అనటం “మనిషికి కావల్సింది. ఇన్సానియత్ గాని కులము మతము కాదన్న మానవతను, ఆత్మీయ అనుబంధాలను తెలియచెప్తుంది.

ఇన్సానియత్ Summary in Telugu

రచయిత పరిచయం

రచయిత పేరు : డా॥ దిలావర్

పుట్టిన తేదీ : జూన్ 5, 1942

పుట్టిన ఊర : ఖమ్మం జిల్లా, కారేపల్లి మండలం కమలాపురం

తల్లిదండ్రుల : మహబూబీ, మహమ్మద్ నిజాముద్దీన్ –

చదువు : ఎం.ఏ., బి, పిహెచ్.డి.

పరిశోధన : దాశరథి కవితావ్యక్తిత్వం పరిశీలన, – తెలుగు విశ్వవిద్యాలయం నుండి

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 4 ఇన్సానియత్

రచనలు :

  1. వెలుగుపూలు, వెన్నెల కుప్పలు, జీవన తీరాలు, కర్బలా, కవిత సంపుటాలను రాశారు.
  2. ‘ప్రణయాంజలి’ పద్యకావ్యం
  3. ‘రేష్మా ఓ రేష్మా’ పేరుతో వచన కావ్యం
  4. ‘గ్రౌండ్ జీరో’ సామ్రాజ్యవాద వ్యతిరేక దీర్ఘకవిత.
  5. సమిధలు, ముగింపు నవలలు
  6. ‘దూరాల చేరువులో’ వ్యాస సంపుటి
  7. మచ్చుబొమ్మ, చంద్రుడుగీయని చిత్రాలు కథా సంపుటాలు

ప్రస్తుత పాఠ్యభాగం : “మచ్చుబొమ్మ” కథా సంపుటి నుండి గ్రహించబడింది.

TS Inter 1st Year Telugu Grammar సమాసాలు

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material Grammar సమాసాలు Questions and Answers.

TS Inter 1st Year Telugu Grammar సమాసాలు

‘సమర్థంబులగు పదంబులేకపదంబగుట సమాసంబు’ అని చిన్నయసూరి బాల వ్యాకరణంలో సమాస లక్షణాన్ని వివరించాడు.

రెండు లేదా అంతకంటే ఎక్కువపదాలు కలసి ఒకే పదంగా ఏర్పడితే అది సమాసమవుతుంది.

సమాసంలోని మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండవ పదాన్ని ఉత్తరపదం అని అంటారు. ఈ రెండు పదాల మధ్య వివిధ విభక్తి ప్రత్యయాలను అవసరానికి తగినట్లు చేరిస్తే అది విగ్రహవాక్యం అవుతుంది. ఇది సమాసాన్ని వివరించి, విడమర్చి చెబుతుంది.

ఉదా:
‘సూర్య కిరణాలు’ అనే సమాసపదంలో
పూర్వపదం – సూర్య
ఉత్తరపదం కిరణాలు
విగ్రహ వాక్యం – సూర్యుని యొక్క కిరణాలు.

అర్థపరంగా సమాసాన్ని నాలుగు విధాలుగా విభజిస్తారు. అవి

  1. తత్పురుష
  2. బహుజొహి
  3. ద్వంద్వం
  4. అవ్యయీ భావం

1. తత్పురుష సమాసం:
తత్పురుష సమాసం వ్యధికరణమని, సమానాధికరణమని రెండు విధాలు.

(ఎ) వ్యధికరణ తత్పురుష సమాసం:
‘ద్వితీయాదులకు మీది పదంబు తోడ సమాసంబు వ్యధికరణంబునాబడు’ అని బాలవ్యాకరణంలో చెప్పబడింది. వ్యధికరణం అంటే విభక్తుల ఆధారంగా తయారు చేసే సమాసం. పూర్వపదం ద్వితీయాది విభక్తుల్లో ఉండి, ఉత్తర పదం ప్రథమావిభక్తిలో ఉంటుంది. ఇది ద్వితీయా తత్పురుష నుండి సప్తమీ తత్పురుష వరకు.

TS Inter 1st Year Telugu Grammar సమాసాలు

  1. ద్వితీయా తత్పురుషం: పూర్వపదం ద్వితీయా విభక్తిలో ఉండాలి.
    ఉదా: వేషధారి = వేషమును ధరించినవాడు
  2. తృతీయా తత్పురుషం: పూర్వపదం తృతీయా విభక్తిలో ఉండాలి.
    ఉదా: విద్యాధికుడు = విద్యచేత అధికుడు
  3. చతుర్థీ తత్పురుషం: పూర్వపదం చతుర్థి విభక్తిలో ఉండాలి.
    ఉదా: యజ్ఞవేదిక = యజ్ఞం కొరకు వేదిక
  4. పంచమీ తత్పురుషం: పూర్వపదం పంచమీ విభక్తిలో ఉండాలి.
    ఉదా: పాపభీతి = పాపము వలన భీతి
  5. షష్ఠీ తత్పురుషం: పూర్వపదం షష్ఠీ విభక్తిలో ఉండాలి.
    ఉదా: మాటతీరు = మాట యొక్క తీరు
  6. సప్తమీ తత్పురుషం: పూర్వపదం సప్తమీ విభక్తిలో ఉండాలి.
    ఉదా: మనోవేదన మనసు నందలి వేదన
  7. నజ్ తత్పురుష: వ్యతిరేకార్థాన్ని బోధించేది.
    ఉదా: అనంతం = అంతం లేనిది

(బి) సమానాధికరణం:
‘విశేషణంబునకు విశేష్యంబు తోడ సమానంబు సమానాధికరణంబు నాబడు” అని బాలవ్యాకరణంలో చెప్పబడింది. తత్పురుషలోని సమానాధి కరణ సమాసానికే కర్మధారయ సమాసమని పేరు. సమానాధికరణంలో సమాసంలోని రెండు పదాలలో ఒకటి విశేషణం, మరొకటి విశేష్యం (నామవాచకం) అవుతుంది. మరికొన్ని సార్లు ఒకపదం ఉపమానం మరోపదం ఉపమేయం అవుతుంది. ఇలా రెండు పదాలు సమానమైన ఆధారంతో ఉండటం సమానాధికరణం.

(i) విశేషణ పూర్వపద కర్మాధారయం:
ఈ సమాసంలోని రెండు పదాలలో మొదటి పదం విశేషణం. రెండవ పదం విశేష్యంగా ఉంటుంది.
ఉదా:

  • మధురోక్తులు = మధురమైన ఉక్తులు
  • ఎర్రగులాబి = ఎర్రనైన గులాబి
  • దివ్యాత్మ = దివ్యమైన ఆత్మ

పై ఉదాహరణల్లో పూర్వపదం విశేషణం. అందుకే ఈ సమాసానికి విశేషణ పూర్వపద సమాసమని పేరు.

TS Inter 1st Year Telugu Grammar సమాసాలు

(రిరి) విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం:
విశేషణం ఉత్తరపదంలో ఉండి, విశేష్యం (నామవాచకం) పూర్వపదంలో ఉంటే అది విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అవుతుంది.
ఉదా:

  • పురుషోత్తముడు = ఉత్తముడైన పురుషుడు
  • కపోతవృద్ధము = వృద్ధమైన కపోతము
  • పండిత శ్రేష్ఠుడు = శ్రేష్ఠుడైన పండితుడు

ఈ సమాసంలో విశేషణం ఉత్తరపదంగా ఉన్నా, విగ్రహవాక్యంలో మాత్రం విశేషణం ముందు రాయాలి. విశేష్యం తరువాత రాయాలి.

(iii) విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం:
ఈ సమాసంలో పూర్వపదం, ఉత్తర పదం రెండూ విశేషణాలుగా ఉంటాయి.
ఉదా:

  • మృదుమధురం = మృదువైనది, మధురమైనది
  • ధీరోదాత్తుడు = ధీరుడును, ఉదాత్తుడును
  • శీతోష్ణములు = శీతమును, ఉష్ణమును

(iv) ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం:
సమాసంలోని పూర్వపదం ఉపమానంగాను, ఉత్తర పదం ఉపమేయంగాను ఉంటుంది.
ఉదా:

  • తేనెపలుకులు = తేనె వంటి పలుకులు
  • బంగారుమాట = బంగారము వంటి మాట
  • హంసనడక = హంస వంటి నడక

TS Inter 1st Year Telugu Grammar సమాసాలు

(v) ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం:
సమాసంలోని ఉత్తరపదం ఉపమానం, పూర్వపదం ఉపమేయం అవుతుంది.
ఉదా:

  • పాదపద్మాలు = పద్మాల వంటి పాదాలు
  • ముఖారవిందము = అరవిందం వంటి ముఖము
  • ముఖచంద్రుము = చంద్రుని వంటి ముఖము

(vi) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం:
సంభావన అనగా సంజ్ఞ. సంజ్ఞా వాచకం పూర్వపదంగా గల కర్మధారయ సమాసాన్ని సంభావనా పూర్వపద కర్మధారయ సమాసమంటారు.
ఉదా:

  • ద్వారకానగరం = ద్వారక అనే పేరుగల నగరం
  • గంగానది = గంగ అనే పేరుగల నది
  • మామిడి చెట్టు = మామిడి అనే పేరుగల చెట్టు

(vii) అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం:
దీనికే రూపక సమాసం అని పేరు. ఇందులో ఉపమేయం పూర్వపదంగా, ఉపమానం ఉత్తరపదంగా ఉంటుంది. ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పబడుతుంది.
ఉదా:

  • కవితాసుధ = కవిత అనెడి సుధ
  • ఆశాసౌధం = ఆశయనెడి సౌధం
  • కాలచక్రం = కాలమనెడి చక్రం

TS Inter 1st Year Telugu Grammar సమాసాలు

(viii) ద్విగు సమాసం:
సంఖ్యాపూర్వక కర్మధారయం ద్విగువు. సంఖ్యాపూర్వక విశేషణం ముందుగా వున్న సమాసం ద్విగు సమాసం.
ఉదా:

  • ముల్లోకములు = మూడైన లోకములు
  • అష్టదిగ్గజాలు = అష్ట సంఖ్య గల దిగ్గజాలు
  • పంచభూతాలు = పంచ సంఖ్య గల భూతాలు

2. బహువ్రీహి సమాసం:
‘అన్యపదార్థ ప్రధానో బహుబ్లి హిః’. ‘అన్యపదార్థం’ అంటే సమాసంలోని పూర్వపదం, ఉత్తరపదాల అర్థాలు కాకుండా ఈ రెండు పదాలు కలిసి ఇచ్చే మరో అర్థం. దానికి ప్రాధాన్యత ఉంటుంది.
ఉదా:

  • ముక్కంటి = మూడు కన్నులు కలవాడు
  • మధురవాణి = మధురమైన వాక్కు కలది
  • మహాత్ములు = గొప్ప ఆత్మ కలవారు

3. ద్వంద్వ సమాసం:
ఉభయ పదార్థ ప్రాధాన్యం కలది ద్వంద్వ సమాసం. అంటే సమాసం లోని పూర్వపదం, ఉత్తరపదం రెండు పదాల అర్థాలకు సమ ప్రాధాన్యం ఉంటుంది.
ఉదా:

  • సీతారాములు = సీతయును, రాముడును
  • భయభక్తులు = భయమును, భక్తియును
  • తల్లిదండ్రులు = తల్లియును, తండ్రియును

TS Inter 1st Year Telugu Grammar సమాసాలు

4. అవ్యయీభావ సమాసం:
‘అవ్యయం’ అంటే లింగ, వచన, విభక్తుల వల్ల ఎటు వంటి మార్పుకు గురికాని పదం. అటువంటి పదాలు పూర్వపదంలో ఉంటే అది అవ్యయీభావ ‘సమాసం అవుతుంది.
ఉదా:

  • యథాశక్తి = శక్తి ననుసరించి
  • ప్రతి దినము = దినము దినము

TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 5th Lesson తెలంగాణ జాతీయాలు Textbook Questions and Answers.

TS Inter 1st Year Telugu Study Material 5th Lesson తెలంగాణ జాతీయాలు

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
పాఠ్యాంశంలో ఏవేని ఐదు జాతీయాలను సోదాహరణంగా వివరించండి?
జవాబు:
తెలంగాణ జాతీయాలు అను పాఠ్యభాగం వేముల పెరుమాళ్ళు రచించిన “తెలంగాణ జాతీయాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది. ఈ పాఠ్యభాగంలో తెలంగాణ జాతీయాలు వివరించబడ్డాయి.

1. వరిగడ్డిపంట :
ఎండుగడ్డి అంటిందే తడువుగా కాలుతుంది. వాముగా ఉన్నప్పుడు కుమ్ముగా కాలుతుంది. ‘మంచివాళ్ళకు వచ్చే కోపాన్ని వరిగడ్డి మంటతో పోలుస్తారు. వారి కోపం . వరిగడ్డి మంటలాంటిదంటారు. వరిగడ్డిమంటలాంటి కోపం ఆకాసేపు భరించలేనిదిగా ఉ న్నా దానికి ప్రమాదం లేదు. అదే అర్థంలో “వరిగడ్డిమంట” అను జాతీయాన్ని వాడతారు.

2. కుక్కిన పేను : రాకాసిబల్లుల లాంటి మహామహా జంతుజాలం నాశనం అయింది. కాని పేను జాతి మాత్రం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతూనే ఉంది. పేనును కుక్కితే చిటుక్కుమన్న శబ్ధం వస్తుంది. కొన్ని ఈడ్డులాంటి పేలు చిటుక్కుమనవు గోరువత్తిడికి తలకు అంటుకుపోతాయి. చచ్చినట్లుపడి ఉంటాయి. అలా కుక్కితే చచ్చిపోకుండా చచ్చినట్లు పడిఉండే పేలు కుక్కిన పేలు. “ఒక్క మాట అనకుండా వాడు పొద్దంతా అక్కడే కుక్కి పేనువలె పడున్నాడు” అనటానికి ఈ జాతీయాన్ని వాడతారు.

3. గద్ద తన్నుక పోయినట్లు ఏ కాస్త సందు దొరికినా, తల్లి నుండి కొద్ది ఎడబాసినట్లున్నా, ఏ చింతచెట్టు చాటారు కొమ్మనుండి కనిపెడుతుందో గాని గద్ద కోడిపిల్లను ఎత్తుకుపోతుంది. అలాగే ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ తిరుగుతూ ఉన్న వ్యక్తి ప్రమాదంలో చనిపోతాడు. ఇలా హఠాన్మరణం సంభవించినప్పుడు ఆ పరిస్థితిని అంచనా వేసి గద్ద తన్నుకుపోవటంతో పోలుస్తారు. “గంట క్రితం బజార్లకు ఆడుకొనపోయిన పిల్లలాడ్ని గద్ద తన్నుక పోయినట్లు బస్సుకిందపడి చచ్చిపోయే” అని జాతీయ ప్రయోగం.

TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు

4. చుక్కి టెగి పట్టట్లు :
ఆకాశం నుండి అప్పుడప్పుడు అకస్మాత్తుగా ఉల్కలు ఆకాశం నుండి వాతావరణంలోకి రాలిపడుతుంటాయి. ఇది దూరం నుండి చూసిన వారికి ఆకాశం నుండి చుక్కలు రాలిపడినట్లు భ్రాంతి కలుగుతుంది. దీనినే పల్లె భాషలో చుక్క తెగిపడినట్లు అని అంటుంటారు. మనం ఊహించని అతిథిగాని, వ్యక్తిగాని అనుకోని సందర్భంలో అకస్మాత్తుగా వస్తే “చుక్క తెగిపడినట్లు వచ్చావేమిటిరా అని ప్రశ్నిస్తాం. చుక్క తెగిపడటంచాల అరుదుగా జరుగుతుంది. ఎప్పుడు పడుతుందో తెలియదు. అర్థరాత్రి అదరాబాదరా వచ్చిన పాలేరుతో “ఈ సమయంలో వచ్చావు చుక్క తెగిపడినట్లు” అని ఇల్లాలు ప్రశ్నిస్తుంది.

5. రామ చక్కని : చక్కదనం అంటే అందం. రాముని చక్కని అందగాడిగా తెలుగువారు భావిస్తారు. మంచి గుణానికి అందానికి నాణ్యతకు చాలా సందర్భాలలో రామచక్కని బంధం ఉపయోగించబడుతుంది. “రామ చక్కని అద్దం పగుల గొడితివి గదరా” “రంగయ్య రామచక్కని మనిషి”, “రామ చక్కని పిల్ల అది” అని ప్రయోగం మన సమాజంలో ఉన్నదే కదా!

ప్రశ్న 2.
పాఠ్యాంశంలోని జంతువులు పక్షుల ఆధారంగా రూపొందిన ఏ వేని ఐదు జాతీయాలను వివరించండి?
జవాబు:
“తెలంగాణ జాతీయాలు” అను పాఠ్యభాగం వేముల పెరుమాళ్ళుచే రచింంచబడిన ‘తెలంగాణ జాతీయాలు’ అన్న గ్రంథం నుండి గ్రహించబడింది. ఇందులో జంతువుల పక్షులు ఆధారంగా కొన్ని జాతీయాలున్నాయి.

1. కోతికి పుండు పుట్టినట్లు ఒక కోతికి పుండయ్యింది. విచిత్రంగా కన్పించింది. మరొక కోతి వచ్చి ఆపుండును గిల్లి చూసి వెళ్ళిపోయింది. అలాగే మరొక కోతి కూడా అలా చేసింది. ఆకోతి కూడా పుండు బాధ పడలేక గోక్కున్నది. పుండు మరింత నెత్తురుకారి పెద్దదయింది. ఏ కోతికి పుండు పెద్దది కావాలని ఉండదు. అయినా తెలియని తనం వలన ఈ కోతి పుండు మానదు “అత్తా! ఈ పోరగాని కాలుకు దెబ్బ తాకిందని పట్టేసి బడికితోలేస్తే మళ్ళీ దెబ్బతాకించుకున్నాడు. కోతికి పుండు పుట్టించుకున్నట్లున్నది” అన్న కోడలి మాటల్లో ఈ జాతీయం పలుకబడింది.

TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు

2. ఎద్దును చూసి మేతెయ్యాలి : ఏనుగుకు చీమకు ఒకే విధంగా మేత వేస్తే కుదురుతుందా? విచక్షణతో దేనికేంత వేయాలో తెలుసుకోవాలి. ఎద్దుల్లో కొన్ని పెద్ద ఎద్దులుంటాయి. వాటికి తగ్గమేత వాటికి వేయాలి. కొన్ని బొండలుంటాయి. వాటి పుట్టుకే చిన్నది. కడుపు కూడా అంతకు తగ్గట్టుగానే ఉంటుంది. వాటికి మేత ఎక్కువ వేస్తే తొక్కి పాడుచేస్తాయి. ‘దసరా మామూళ్ళని అందరికి పదిరూపాలే ఇస్తిరి. ఎద్దును చూసి మేతెయ్యాలి. మే ఎల్లకాలం పనికచ్చేటోల్లం. మాది మా కుండాల” అని జాతీయం ప్రయోగించబడుతుంది.

3. ఊరుగొడ్డుపోలేదు : ఊరిలో ఎక్కడో ఒకచోట దొరకుండా పోదు అనుట ఒక కుటుంబంలో ఒక వస్తువు దొరకకుండా పోవచ్చు. ఊరిలో దొరకకుండా పోదు. గొడ్డు పోవుట అంటే వంధత్వం, అలభ్యం. ఒక కుటుంబంలో దొరకకపోతే వేరే కుటుంబంలో దొరుకుతుందని భావం” “అయ్యో! నీవు యియ్యకపోతే మాయె. ఊరుగొడ్డుపోయిందా? ఎక్కడో ఒకచోట ఎవరన్నా ఇస్తారు. అందరూ ఒకే తీరు ఉంటారా? అని ఈ జాతీయం ప్రయోగించబడుతుంది

4. కోడి మెదడు : అల్పత్వం మతిమాలిన తనం అని అర్థం. కోడి చిన్న ప్రాణి. దాని మెదడు కూడా చిన్నదే! చెపితే అర్థం చేసుకోకుండా తనకు తెలిసిందే గొప్ప అనుకునే వాడిని కోడిమెడవాడు అంటారు. “వానిది కోడి మెదడు. వానికి తోచదు. ఒకరు చెప్తే వినడు” అంటారు.

5. బుడుబుంగ : నీటిలో తిరిగే పక్షి, బాతు జాతికి చెందింది. నల్లగా ఉంటుంది. ఒక చోట బుడుక్కున మునుగుతుంది. కూత పెట్టు దూరంలో తేలుతుంది. మళ్ళీ మళ్ళీ మునిగినా అలాగే తేలుతుంది. లోపల చేపలను వేటాడుతుంది. ఇప్పుడు ఈ ఇంట్లో, వెంటనే మరో ఇంట్లో ఇలా కాలాగకుండా తిరిగే వాడిని బుడుబుంగ అని అంటారు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు

II. సంగ్రహ రూప ప్రశ్నలు – సమాధానాలు.

ప్రశ్న 1.
‘తాత జాగీరు’ జాతీయంలోని చారిత్రక విశేషాలను తెలపండి?
జవాబు:
కష్టార్జితం కాని సంపద, అనువంశికంగా సంక్రమించిన ఆస్తి, నైజాం ప్రభువులు తమ రాజరికాన్ని కాపాడు కోవటానికి జీతం లేని కొలువులు ఎన్నో ఏర్పాటు చేశారు. పటీలు, మావిపటీలు, పట్వారీ, కొత్వాలి వంటివి అనువంశికంగా సంక్రమించేవి. ఈ పనికి జీతం లేకపోయినా ప్రజలను వీళ్ళు ఎంత దోచుకున్నా తమ సొమ్ము ముట్టచెపితే చాలు.

ఆ విధంగా జమీందారులు, జాగీరుదారులు, ముక్తాదారులు, దేశాయిలు, సర్దేశాయిలుండేవారు. జమీందారుకు కొన్ని గ్రామాల్లో వేలాది ఎకరాల భూములు ఉండేవి. ముక్తాదారులంటే ఆ గ్రామమంతా ఆయనదే! ప్రజల వద్ద ఎంత దోచుకున్నా ప్రభుత్వం పట్టించుకోదు. కప్పం చెల్లిస్తే చాలు. తాత గారి జాగీరును మనమడు అనుభవిస్తున్నట్లు” ఇదేమన్నా నీ తాతగారి జాగీరనుకున్నావా” అన్న జాతీయాలు ప్రయోగించడం జరుగుతుంది.

ప్రశ్న 2.
ఇంటింటికి మంటి పొయ్యి జాతీయంలోని సామాజిక న్యాయాన్ని వివరించండి?
జవాబు:
తెలంగాణ జాతీయాలు అను పాఠ్యభాగం వేముల పెరుమాళ్ళుచే రచించబడిన “తెలంగాణ జాతీయాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.
కట్టెలతో వంటలు చేసేటప్పుడు ఏ ఇంటిలోనైనా మన్నుతో చేసిన పొయ్యి ఉండేది. నాకు ధనమున్నదికదా అని బంగారు పొయ్యి లాడరు కదా! సామాజిక న్యాయం అందరికి ఒక్కటే సమస్యలు లేని ఇల్లుండదు “మాకోడలు కొడుకు మొన్న నలుగురిలో నానామాటలన్నందుకు నల్ల మొఖం అనిపించింది.

బజారుకే రాబుద్ధికావడం లేదు” అంది పొరుగింటావిడ. “ఇంటింటికి మట్టి పొయ్యే ఈ కష్టాలు అందరికీ వచ్చేవే. నీ ఒక్కదానికని ఏముంది. నీ కొడుకు కోడలు ఏదో అంటే నీకెందుకు నల్లమొఖం. ముందటమాకురావా” అని ఓదార్చింది పొరుగింటి ఆవిడ. ఇలాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగించబడుతుంది.

TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు

ప్రశ్న 3.
బట్టకాల్చి మీద వేయడం అంటే ఏమిటి?
జవాబు:
తెలంగాణ జాతీయాలు అను పాఠ్యభాగం వేముల పెరుమాళ్ళుచే రచించబడిన తెలంగాణ జాతీయాలు” అనుగ్రంథం నుండి గ్రహించబడింది.

బట్టకాల్చి మీద వేయటమంటే నిందలు మోపటం అని అర్థం. ఒకరిని అన్యాయంగా వ్యాజ్యంలో ఇరికించడం. పరులను దోషులుగా చిత్రించడం “వాడు దొంగ తనం చేశాడు. నేను నా సొంత బంగామని వాడు చెప్పినందున ఆ సొమ్ము దాచాను. బట్టకాల్చి మీదేసినట్లు ఆ నింద వాడు నా మీద వేసి నన్ను కూడా వానితోపాటు కేసులో ఇరికించాడు అనటంతో ఈ జాతీయం ప్రస్తావించబడుతుంది.

ప్రశ్న 4.
వరిగడ్డిమంట :
జవాబు:
తెలంగాణ జాతీయాలు అను పాఠ్యభాగం వేముల పెరుమాళ్ళుచే రచించబడిన “తెలంగాణ జాతీయాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.

వరిగడ్డి ఎండినదైతే అగ్ని అంటిందే తడవుగా మంటలంటుకుని కాలుతుంది. వాముగా ఉంటే మాత్రం కమ్ముకుని పొగలేచి కుమ్ముగా కాలుతుంది. వంట చెరుకు అంటుకోవటానికి, పొయ్యి రాజుకోవటానికి, చలిమంటలకు బగ్గున లేచే మంటల కోసం వరిగడ్డినే వాడతారు. ఏదైనా వరిగడ్డి బగ్గున మండి బుగ్గయిపోతుంది. మంచివాళ్ళకు వచ్చే కోపం వరిగడ్డి. మంటతో పోలుస్తారు. వారి కోపం వరిగడ్డి మంటాలాంటిది. కొద్దిసేపటిలో మాయపై పోతుంది. అలాంటప్పుడు వరిగడ్డిమంటతో పోలుస్తారు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు

III. ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
వేముల పెరుమాళ్ళు విద్యాభాసం ఎక్కడ జరిగింది ?
జవాబు:
రాయికల్, కోరుట్ల, జగిత్యాలలో జరిగింది.

ప్రశ్న 2.
వేముల పెరుమాళ్ళు రాసిన త్రిశతి పేరేమిటి?
జవాబు:
వేముల పెరుమాళ్ళు వ్రాసిన త్రిశతి పేరు ‘గాంధీమార్గం’

ప్రశ్న 3.
వేముల పెరుమాళ్ళు ప్రసంగాల సంకలనం పేరేమిటి ?
జవాబు:
మానవతా పరిమళాలు

ప్రశ్న 4.
జాతీయాలలో ఏ చరిత్ర కళ్ళకు కట్టినట్లుంటుంది?
జవాబు:
జాతీయాలలో తరతరాల తెలంగాణ సామాజిక చరిత్ర కళ్ళకు కట్టినట్లుంటుంది

ప్రశ్న 5.
జానపదుల నోటి నుండి వెలువడ్డ జాతీయం సామెత ఎలాంటిది?
జవాబు:
గంగలో రాయివంటిది

TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు

ప్రశ్న 6.
“చుక్క తెగిపడ్డట్టు” అనే జాతీయంతో ఒక వాక్యం నిర్మించండి.
జవాబు:
చుక్కమ్మ చుక్క తెగిపడినట్లు చెప్పాపెట్టకుండా మా ఇంటికి వచ్చింది.

ప్రశ్న 7.
“రామచక్కని” అనే జాతీయాన్ని ఉపయోగించి ఒక వాక్యం తయారు చేయండి.
జవాబు:
శ్రీరాముడు రామచక్కనోడు

ప్రశ్న 8.
“లొల్లిలో లొల్లి” జాతీయం ఆధారంగా ఒక వాక్యం రాయండి?
జవాబు:
రాజకీయ పార్టీలు అవినీతిని గురించి ఇప్పుడు లొల్లిలో లొల్లి చేస్తున్నాయి.

తెలంగాణ జాతీయాలు Summary in Telugu

రచయిత పరిచయం

రచయిత : వేముల పెరుమాళ్ళు

పుట్టిన తేదీ : ఆగష్టు 8, 1943

పుట్టిన ఊరు : కరీంనగర్ జిల్లా రాయికల్

తల్లిదండ్రులు : వేముల ఆండాళ్ళమ్మ – రాజయ్యలు

విద్యాభ్యాసం : రాయకల్, కోరుట్ల, జగిత్యాలలో

వృత్తి : గ్రామాభివృద్ధి అధికారి

TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు

రచనలు :

  1. శ్రీరాజ రాజేశ్వర శతకం
  2. ధర్మపురి నృకేసరి శతకం

బాలసాహిత్యంలో

  1. ‘కిట్టు’ బాలనీతి శతకం
  2. ‘నిమ్మ’ పర్యావరణ శతకం
  3. ‘గాంధీమార్గం’ త్రిశతి
  4. ‘లోగుట్టు’ రాజనీతి చతుశ్శతి

ఆకాశవాణి ప్రసంగాలు

  1. మానవతా పరిమళాలు

మరణం : సెప్టెంబరు 17, 2005

కవి పరిచయం

వేముల పెరుమాళ్ళు కరీంనగర్ జిల్లా రాయికల్ గ్రామంలో ఆగష్టు 5, 1943 జన్మించారు. ఈయన తల్లిదండ్రులు వేముల ఆండాళ్ళమ్మ రాజయ్యలు. మాతా మహుడు కైరం భూమదాసు వరకవి గాయకుడు. వీరి విద్యాభ్యాసం రాయకల్ కోరుట్ల జగిత్యాలల్లో జరిగింది. గ్రామాభివృద్ధి అధికారిగా 18 సం॥లు పనిచేశారు. తరువాత రాజకీయ రంగంలో ప్రవేశించి రాయికల్ మండల అధ్యక్షునిగా పనిచేశాడు. సహకార రంగంలో గీత, పారిశ్రామిక కాంట్రాక్ట్ లేబర్, వినియోగ, గృహనిర్మాణ సంఘాలను స్థాపించాడు.

పెరుమాళ్ళు శ్రీరాజరాజేశ్వర, శ్రీధర్మపురి, నృకేసరి శతకాలను ప్రచురించారు. బాల సాహిత్యంలో వీరు బాలనీతి శతకం. ‘కిట్టూ’, పర్యావరణ శతకం ‘నిమ్ము’లు రాశారు. మహాత్ముని మహానీయ సూక్తులను “గాంధీమార్గం” త్రిశతిగా రచించాడు. రాజనీతి చతుశ్శతిగా వీరు “లోగుట్టు” రాశాడు.

1958 నుండి 1968 వరకు సమాజంలో జాతీయ పరిణామాలను పద్యాలుగా రాశాడు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా ఈయన “మానవతా పరిమళాలు” ప్రసంగాలుగా వెలువడ్డాయి. జీర్ణదేవాలయ పునరుద్ధరణ చేశారు. వీరు సెప్టెంబరు 17, 2005న కాలం చేశారు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు

ప్రస్తుత పాఠ్యభాగం “తెలంగాణ జాతీయాలు” గ్రంథం నుండి గ్రహించబడింది.

పాఠ్యభాగ సందర్భం

వేముల పెరుమాళ్ళు తన తల్లి నోటి నుండి వెలువడే జాతీయాలను విని ప్రేరణ పొంది తెలంగాణ వివిధ ప్రాంతాల నుండి వాటిని సేకరించారు. జానపద సాహిత్యం గురించి చెపుతూ “జానపద సాహిత్యం కూరాడుకుండలాంటిది. దానిని మైలపరచ కుండా చేసే బాధ్యత మనందరిది. జానపదుడు ఋషి వంటివాడు. జానపదుల నోట వెలువడిన జాతీయం సామెత గంగలో రాయిలాంటిది. తెలంగాణ భాషయాస అర్థం చేసుకుని చదివితే ఆసక్తికరమైన అంశాలు లభిస్తాయి” అంటారు.

తెలంగాణ జాతీయాలను విద్యార్థులకు తెలియచేసే సందర్భంలో ఈపాఠ్యభాగం ఇవ్వబడింది.

పాఠ్యాభాగ సారాంశం

“వేముల పెరుమాళ్ళు జాతీయాలను వివరిస్తూ “జానపద సాహిత్యం” కూరాడు కుండలాంటిది. దానిని మైల పరచకుండా చూసే బాధ్యత మనందరిది. జానపదుడు ఋషసోంటోడు. జానపదుల నోట వెలువడ్డ జాతీయం, సామెత గంగలో రాయివంటిది.

ఎన్నో వందల సంవత్సరాలు అది ప్రజల నోళ్ళలో నాని రగిడిల్లింది. ఒక్క మాటలో చెప్పాలంటే వీటిలో తరతరాల తెలంగాణా సామాజిక చరిత్ర కళ్ళకు కట్టినట్లుంటుంది. తెలంగాణ భాష, యాస, అర్థం చేసుకుని కొంచెం ఓపికగా చదివేవాళ్ళకు ఇందులో ఎన్నో ఆసక్తి కరమైన అంశాలు లభిస్తాయి.

TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు

జాతీయాలలో వరిగడ్డిమంట, లొల్లిలో లొల్లి, కోటిపండు పుట్టినట్లు, తాతజాగీరు, కుక్కిన పేను, ఏనుగెల్లింది తోకచిక్కింది, వెయ్యికాళ్ళజర్రి, గద్దతన్నుకు పోయినట్లు, పిల్లికి రొయ్యిల మొలతాడు, చుక్కతెగిపడినట్లు, ఎద్దును చూసిమేత వెయ్యాలి, ఊరుగొడ్డుపోలేదు. తూముకాడిపొలం, మొలదారం తెగ, పేర్నాల పెట్టుట మొదలగు ముఖ్యమైన నిత్య వాడుకలో ఉన్న వాటిని వివరించారు.

TS Inter 2nd Year Telugu Grammar అలంకారాలు

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material Grammar అలంకారాలు Questions and Answers.

TS Inter 2nd Year Telugu Grammar అలంకారాలు

ఛందస్సు ‘లయ’ ప్రధానం కాగా, అలంకారం ‘సౌందర్య’ ప్రధానం. వస్తువును అలంకరించేది అలంకారం. చెప్పదలచిన విషయాన్ని అందంగా మలిచేది అలంకారం.
అలంకారాలు రెండు రకాలు :
(అ) శబ్దాలంకారాలు,
(ఆ) అర్థాలంకారాలు

అ) శబ్దాలంకారాలు :
శబ్దాన్ని ఆశ్రయించుకొని ఉండేవి శబ్దాలంకారాలు. శబ్ద చమత్కారంతో పాఠకునికి మనోహరంగా ఇవి భాసిస్తాయి. (కనబడతాయి, తోస్తాయి)

  1. వృత్త్యనుప్రాస
  2. ఛేకానుప్రాస
  3. లాటానుప్రాస
  4. అంత్యానుప్రాస
  5. యమకం

1. వృత్త్యనుప్రాస :
ఒకటిగాని, అంతకంటే ఎక్కువ హల్లులుగాని అనేకసార్లు ఆవృత్తి (మరల మరల రావడం) అయినట్లైతే దానిని వృత్త్యనుప్రాస అంటారు.
ఉదాహరణలు :
1) చిటపట చినుకులు పటపట కురిసెను.
2) జలజల కాలువలు గలగల పారెను.
గమనిక : మొదటి ఉదాహరణలో ‘ట’కారం, మళ్ళీ మళ్ళీ వచ్చింది. రెండవ ఉదాహరణలో ‘ల’కారం, మళ్ళీ మళ్ళీ వచ్చింది.

2. ఛేకానుప్రాస :
రెండు లేక అంతకంటే ఎక్కువ హల్లులు వ్యవధి లేకుండా అర్థ భేదంతో మళ్ళీ వచ్చినట్లయితే అది ‘ఛేకానుప్రాస’ అలంకారము.
ఉదా : పాప సంహరుడు హరుడు.
వివరణ : ఈ పై ఉదాహరణలో, మొదటి ‘హరుడు’ అనగా, హరించేవాడు అని, రెండవ ‘హరుడు’ అనే పదానికి, ‘శివుడు’ అని అర్థం. మొత్తం వాక్యానికి “పాపాలను హరించేవాడు శివుడు” అని అర్థం. ఈ విధంగా ఒకే పదం, అనగా ‘హరుడు’ అనే పదం, అర్థభేదంతో వెంటవెంటనే వచ్చింది. కాబట్టి ఇది ‘ఛేకానుప్రాస’
అలంకారము.

TS Inter 2nd Year Telugu Grammar అలంకారాలు

3. లాటానుప్రాస :
ఒకే అర్థమున్న పదాలు తాత్పర్య భేదంతో వ్యవధి లేకుండా వచ్చినట్లయితే, అది ‘లాటానుప్రాస’ అలంకారం అవుతుంది.
ఉదా : కమలాక్షు నర్చించు కరములు కరములు.
వివరణ : ఈ పై ఉదాహరణలో, ‘కరములు’ అనే మొదటి పదానికి, సామాన్యమైన చేతులు అనీ, రెండవ ‘కరములు’ అనేదానికి శ్రేష్ఠమైన చేతులు అనీ, తాత్పర్య భేదము ఉంది. ‘కరములు’ అనే పదాలు, రెండింటికీ “చేతులు” అనే అర్థం. కాని, రెండవ కరములు అనే పదానికి, శ్రేష్ఠమైన చేతులు అనే తాత్పర్యము, భేదంగా ఉంది. .కాబట్టి ఇది “లాటానుప్రాస అలంకారము.

4. అంత్యానుప్రాస :
ఒకే హల్లుగానీ, ఒకే పదంగానీ పాదం యొక్క అంతంలో గాని, పదం యొక్క అంతంలో గానీ, వాక్యం చివరలో గానీ వచ్చినట్లయితే దాన్ని ‘అంత్యానుప్రాస’ అంటారు.
ఉదాహరణలు :
1) బురద నవ్వింది కమలాలుగా
పువ్వు నవ్వింది భ్రమరాలుగా
పుడమి కదిలింది చరణాలుగా
జడిమ కదిలింది హరిణాలుగా
వివరణ : ఇందులో ‘గా’ అనే హల్లు, నాలుగు పాదాల చివర వచ్చింది. కాబట్టి, ఇది ‘అంత్యానుప్రాస’.

2) భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో
ఈ మానవరూపం కోసం జరిగిన పరిణామాలెన్నో
ఇందులో, పై పాదాల చివరలో ‘న్నో’ అనే పదం, పునరావృతమయింది. (తిరిగి వచ్చింది)

TS Inter 2nd Year Telugu Grammar అలంకారాలు

5. యమకం :
అక్షర సముదాయం అర్థభేదంతో పునరావృతమైనచో దాన్ని ‘యమకాలంకార’ మంటారు.
ఉదాహరణ : లేమా ! దనుజుల గెలవగ
లేమా ! నీవేల కడగి లేచితి విటులన్
లే, మాను ! మాన వేనియు
లే మా విల్లందు కొనుము లీలిన్ గేలన్.
వివరణ : పై పద్యంలో మొదటి ‘లేమా’ అనేది, స్త్రీ సంబోధన వాచకం. రెండవ ‘లేమా’ అనేది, గెలువలేకపోతామా ? అనే అర్థాన్ని ఇచ్చేది. మూడవ చోట, ‘లే’ కు, లెమ్మని, మానుకొమ్మని అర్థం. నాలుగో చోట, లేచి మా విల్లు అందుకొమ్మని ప్రేరేపించటం. అందువల్ల ఇది యమకాలంకారం.

ఆ) అర్థాలంకారాలు :
వివరణ :
అర్థం ప్రధానంగా కలిగి చమత్కారం కలిగించేవి ‘అర్థాలంకారాలు’. పాఠకులకు మనోల్లాసం కలిగించటంలో వీటికి అత్యంత ప్రాధాన్యత ఉంది. సుమారు వంద వరకు అర్థాలంకారాలు ఉన్నప్పటికీ ప్రసిద్ధమైనవి “ఆఱు అలంకారాలు”.
అవి :

  1. ఉపమాలంకారం
  2. ఉత్ప్రేక్షాలంకారం
  3. రూపకాలంకారం
  4. అతిశయోక్తి అలంకారం
  5. అర్ధాంతరన్యాసాలంకారం
  6. స్వభావోక్తి అలంకారం

TS Inter 2nd Year Telugu Grammar అలంకారాలు

1. ఉపమాలంకార లక్షణము :
ఉపమాన ఉపమేయాలకు చక్కని సాదృశ్యాన్ని చెప్పడం “ఉపమాలంకారం”. ఇందులో (1) “ఉపమేయం” (వర్ణించే వస్తువు), (2) “ఉపమానం” (పోల్చు వస్తువు), (3) సమాన ధర్మం, (4) ఉపమావాచకం అనే నాలుగు ప్రధాన భాగాలుగా ఉంటాయి.
ఉదాహరణ : ఓ రాజా ! నీ కీర్తి హంసవలె ఆకాశ గంగలో ఓలలాడుతున్నది.
దీనిలో,

  1. ఉపమేయం : “రాజుకీర్తి”
  2. ఉపమానం : ‘హంస’
  3. సమాన ధర్మం : “ఓలలాడటం”
  4. ఉపమావాచకం : ‘వలె’

2. ఉత్ప్రేక్షాలంకార లక్షణము :
‘ఉత్ప్రేక్ష’ అంటే ఊహించడం అని అర్థం. ధర్మ సామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం ఉత్ప్రేక్షాలంకారం.
ఉదాహరణలు :

  1. ఆ మేడలు ఆకాశాన్ని ముద్దాడుచున్నవా అన్నట్లున్నవి.
  2. గాంధీ మహాత్ముని హత్య వల్ల భారతజాతికి కలిగిన దుఃఖాన్ని చూడలేకపోయాడా అన్నట్లుగా సూర్యుడు అస్తమించాడు.

వివరణ : పై రెండు ఉదాహరణలలోనూ, ఊహ ప్రధానంగా ఉన్నది. మేడలు ఆకాశాన్ని ముద్దాడుతున్నట్లు, దుః ఖం చూడలేకనే సూర్యుడు అస్తమించాడా అన్నట్లు, అనే రెండు చోట్లనూ ఊహలే ఉన్నాయి. అందువల్ల, ఇవి ‘ఉత్ప్రేక్ష’లకు ఉదాహరణలు.

TS Inter 2nd Year Telugu Grammar అలంకారాలు

3. రూపకాలంకార లక్షణము :
ఉపమేయ ఉపమానములకు భేదం ఉన్నా, భేదం లేనట్లు చెప్పడం “రూపకం”. ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించినట్లయితే అది ‘రూపకాలంకారం’.
`ఉదాహరణ : “నా శిరమున పోసికొంటిని నశింపని దుఃఖపుటగ్ని ఖండముల్”
వివరణ : దుఃఖం వేరు, అగ్ని వేరు. ఈ రెండింటికీ భేదం ఉన్నా, ‘దుఃఖపుటగ్ని’ అని, దుఃఖానికీ, అగ్నికీ భేదం లేనట్లు చెప్పడం జరిగింది. అగ్ని ధర్మాన్ని దుఃఖములో ఆరోపించడం జరిగింది. కనుక ఇది ‘రూపకం’.

4. అతిశయోక్తి అలంకార లక్షణము :
గోరంతను కొండంతలుగా వర్ణించడం, ‘అతిశయోక్తి’. ఉన్నదాని కంటె అతిశయం చేసి చెప్పడమే, అతిశయోక్తి అలంకారం.
ఉదాహరణ : ఆ నగరమందలి మేడలు ఆకాశాన్నంటుచున్నవి.
ఇక్కడ మేడలు ఆకాశాన్ని తాకడం ‘అతిశయోక్తి’.

5. అర్ధాంతరన్యాసాలంకార లక్షణము :
సామాన్య వాక్యాన్ని విశేష వాక్యంతోనూ, విశేష వాక్యాన్ని సామాన్య వాక్యంతోనూ, సమర్థించి చెప్పినట్లయితే ‘అర్ధాంతరన్యాసాలంకారము’.
ఉదాహరణ : గాంధీజీ భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించిపెట్టాడు.
మహాత్ములకు సాధ్యము కానిది లోకమున లేదు కదా !
వివరణ : భారతదేశానికి స్వాతంత్య్రం సాధించడం, విశేష విషయము. దాన్ని ‘మహాత్ములకు సాధ్యముకానిది లేదు కదా !’ అనే సామాన్య వాక్యంతో సమర్థించడం వల్ల ఇది ‘అర్ధాంతరన్యాసాలంకారం’.

TS Inter 2nd Year Telugu Grammar అలంకారాలు

6. స్వభావోక్తి లక్షణము :
జాతి, గుణ, క్రియాదులచేత వస్తువు యొక్క స్వరూప స్వభావాలను ఉన్నవి ఉన్నట్లుగా వర్ణించడమే, “స్వభావోక్తి”.
ఉదాహరణ : ‘ఆ లేళ్ళు బెదురు చూపులతో నిక్క పొడుచుకున్న చెవులతో భయభ్రాంత చిత్తములతో అటు ఇటు చూస్తున్నాయి’. – ఇక్కడ లేళ్ళ సహజ ప్రవృత్తి ఉన్నది ఉన్నట్లుగా, కళ్ళకు కట్టినట్లుగా వర్ణించడంవల్ల స్వభావోక్తి అలంకారం.

గమనిక :
ఈ అభ్యాసములో అలంకారాలపై కేవలము 16 ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి. వీటిలో నుండియే, ఎనిమిది ప్రశ్నలు, మీకు పరీక్షల్లో ఇచ్చి, వాటిలో ఆరింటికి, జవాబులు వ్రాయమని అడుగుతారు. వాటికి “ఆఱు మార్కులు” ఇస్తారు. కాబట్టి వీటిని బాగా శ్రద్ధగా చదువండి.

అభ్యాసం

ప్రశ్న 1.
శబ్దాలంకారాలు అనగానేమి ?
జవాబు:
శబ్దాన్ని ఆశ్రయించుకొని ఉండేవి ‘శబ్దాలంకారాలు’.

ప్రశ్న 2.
ఒకే హల్లు అనేకసార్లు ఆవృతి అయితే అది’ ఏ అలంకారం ?
జవాబు:
ఒకే హల్లు, అనేకసార్లు ఆవృతి అయితే, అది ‘వృత్త్యనుప్రాస’ అలంకారం.

TS Inter 2nd Year Telugu Grammar అలంకారాలు

ప్రశ్న 3.
‘పాప సంహరుడు హరుడు’ ఏ అలంకారం ?
జవాబు:
ఇది ‘ఛేకానుప్రాస’ అలంకారము.

ప్రశ్న 4.
‘కమలాక్షు నర్చించు కరములు కరములు’ ఏ అలంకారం ?
జవాబు:
ఇది ‘లాటానుప్రాస’ అలంకారము.

ప్రశ్న 5.
ఒకే పదం ప్రతి పాదం యొక్క అంతంలో వచ్చినట్లయితే దాన్ని ఏ అలంకారం అంటారు ?
జవాబు:
దీనిని ‘అంత్యానుప్రాస’ అలంకారం అంటారు.

ప్రశ్న 6.
‘యమకం’ అనగానేమి ? *(M.P)
జవాబు:
అక్షర సముదాయంతో, అర్థభేదంతో, పునరావృతమైనచో, దాన్ని, ‘యమకాలంకారమంటారు.

ప్రశ్న 7. *(M.P)
‘ఉపమానం’ అనగానేమి ?
జవాబు:
‘ఉపమానం’ అనగా, పోల్చు వస్తువు. (ఉదా : ‘హంస’)

ప్రశ్న 8.
‘ఉపమేయం’ అనగానేమి ? *(M.P)
జవాబు:
ఉపమేయం అనగా, వర్ణించు వస్తువు. (ఉదా : ‘రాజు కీర్తి’).

TS Inter 2nd Year Telugu Grammar అలంకారాలు

ప్రశ్న 9.
‘ఉత్ప్రేక్ష’ అనగా అర్థం ఏమిటి ? *(M.P)
జవాబు:
‘ఉత్ప్రేక్ష’ అనగా, ఊహించడం అని అర్థం.

ప్రశ్న 10.
ఉపమాన, ఉపమేయములకు రెండింటికి భేదం ఉన్నా లేనట్లు చెప్పడం ఏ అలంకారం ?
జవాబు:
రూపకాలంకారము.

ప్రశ్న 11.
‘అతిశయోక్తి’ అనగానేమి ? *(M.P)
జవాబు:
గోరంతను కొండంతలుగా వర్ణించడం, ‘అతిశయోక్తి’.

ప్రశ్న 12.
‘ఆ నగరమందలి మేడలు ఆకాశాన్నంటుచున్నవి’ ఏ అలంకారం ? *(M.P)
జవాబు:
ఇది ‘అతిశయోక్తి’ అలంకారం.

ప్రశ్న 13.
‘స్వభావోక్తి’ అలంకారం అనగానేమి ?
జవాబు:
జాతి, గుణ, క్రియాదుల చేత, వస్తువు యొక్క స్వరూప స్వభావాలను, ఉన్నవి ఉన్నట్లుగా వర్ణించడమే “స్వభావోక్తి”.

ప్రశ్న 14.
సామాన్య వాక్యాన్ని విశేష వాక్యంతోను, విశేష వాక్యాన్ని సామాన్య వాక్యంతోను సమర్థించడం ఏ అలంకారం ?
జవాబు:
అర్థాంతరన్యాసాలంకారం.

TS Inter 2nd Year Telugu Grammar అలంకారాలు

ప్రశ్న 15.
‘దుఃఖపుటగ్ని’ ఇందులోని అలంకారాన్ని గుర్తించండి. *(M.P)
జవాబు:
‘దుఃఖపుటగ్ని’ అనే పదములో ‘రూపకాలంకారము’ ఉంది.

ప్రశ్న 16.
ఉపమావాచకాలు ఏవి ? *(M.P)
జవాబు:
పోలె, వలె, బలె, అట్లు, లాగు మొదలైనవి ఉపమావాచకాలు.

TS Inter 1st Year Telugu Grammar అనువాదం

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material Grammar అనువాదం Questions and Answers.

TS Inter 1st Year Telugu Grammar అనువాదం

ఒక భాష నందలి భావాన్ని మరొక భాషలోకి వ్యక్తీకరించే ప్రక్రియ అనువాదం. దీనినే ఆంగ్లంలో Translation అంటారు. అనువాదం చేయదలచుకున్న భాషను మూల భాష (Source Language) అని, అనువాదం ఏ భాషలోకి చేయదలచుకున్నారో భాషను లక్ష్య భాష (Target Language) అని అంటారు. ఒక భాషలోని చారిత్రక, శాస్త్ర, సాంకేతిక, సాహిత్యాంశాలను అనువాదం చేయటం ద్వారా మూల భాషా ప్రాంతం లోని విషయాలను, సంస్కృతీ విశేషాలను ఇతర భాషీయులు తెలుసుకోవచ్చు. ఇది ప్రాంతాల మధ్య, సంస్కృతుల మధ్య ఐక్యతకు తోడ్పడుతుంది.

భారతీయ భాషలలో ఒక భాషనుంచి మరొక భాషలోకి, విదేశీ భాషలలోకి, విశ్వసాహిత్యం నుంచి భారతీయ భాషలలోకి ఆదాన ప్రదానాలు జరిగాయి. తెలుగు భాషలోకి సంస్కృత, బెంగాలి, హిందీ, ఉర్దూ, తమిళ, మళయాళ, కన్నడ ఇత్యాది భారతీయ భాషల సాహిత్యం, ఆంగ్ల, ఫ్రెంచ్, రష్యన్, చైనీస్ భాషల సాహిత్యం అనువాదం అయింది.

మూలరచనను యథాతథంగా తెలుగులోకి తర్జుమా చేయడం ఒక పద్ధతి అయితే, మూల రచనకు భంగం వాటిల్లకుండా స్వేచ్ఛానుసరణ చేయడం మరొక పద్ధతి.

అనువాద విధానంలో పాటించాల్సిన మెలకువలు
అనువాదంలో సాంస్కృతికపరమైన సమస్యలు ఎదురవుతాయి. భాషాసంబంధమైన సమస్యలు కూడా ఎదురవుతాయి.

భిన్న సంస్కృతులు భిన్న భాషా పదాలను సృష్టించుకున్నప్పుడు, ఆ సాంస్కృతిక అంశాల పారిభాషిక పదాలను అనువాదం చేసే భాషలో ఉండే సామీప్య పద బంధా లను ముందుగా క్రోడీకరించుకోవాలి. ఇంగ్లీషులో ice, snow, dew లాంటి పదాల అనువాదంలో మంచు, చలిమంచు, పొగమంచు పదాలు అనువాదా నికి పనికి వస్తాయో లేదో ఆలోచించాలి.

TS Inter 1st Year Telugu Grammar అనువాదం

ఒక భాషా సమాజంలో ఒక పదం పుట్టుక ఆ భాషా సమాజంలోని సాంస్కృతిక అనుబంధం మీద, దాని పరిసర ప్రభావాల మీద ఆధారపడుతుంది. దానిని అనువాదం చేసేటప్పుడు దాని పరిసరానుబంధానికి విఘాతం జరగకుండా పదాలను ఎంపిక చేసుకోవాలి.

సాధారణంగా ఒక భౌగోళిక ప్రాంతంలో నివసించే ప్రజలంతా ఒకే భాషను మాట్లాడుతారు. అట్లాగే, ఒక భాషా ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు, అంటే -జాతికి, ఒక నిర్దిష్టమైన భౌతిక జీవనం ఉంటుంది. సాంఘిక జీవితం ఉంటుంది. మత విశ్వాసాలు ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే వీటన్నిటి ప్రభావాల వల్ల జాతిభావాలు, భావాల తీరును బట్టి భాషలుంటాయని గమనించాలి.

భౌగోళిక శీతోష్ణ పరిస్థితులను బట్టి పండే పంటల్లో తేడాలుంటాయి. ఆ తేడాలు ఆహారపు అలవాట్లను కూడా మారుస్తాయి. ఇంగ్లీషులో bread, soup, sandwich లాంటి మాటలను గమనించండి. తెలుగు అన్నంలోనూ, కూరల్లోనూ చాలా రకాలున్నాయి. వరి అన్నం వేరు, కొర్రన్నం వేరు, సంగటి వేరు.

ఇంగ్లీషులో Rice అంటే అన్నం కావచ్చు. బియ్యమూ కావచ్చు. అంటే, ఇంగ్లీషువారికి Rice అనే పదంతో వాళ్ళ అవసరాలు తీరుతున్నాయి. కాబట్టి కొత్తపదాల సృష్టి వాళ్ళకు అవసరం లేకుండా పోయింది. అంటే భిన్న భిన్న సంస్కృతులు భిన్న భిన్న పదాలకు ఆలవాలంగా ఉంటాయని గమనించాలి. కాబట్టి అనువాదం చేసేటప్పుడు సాంస్కృతిక ప్రభావం ప్రధానపాత్ర వహిస్తుందన్న సత్యాన్ని గమనించాలి.

అనువాదంలో భాషా సమస్యలు కూడా ప్రధాన అంశమే. మూలభాషా నిర్మాణానికి, లక్ష్య భాషా నిర్మాణానికి మధ్య తేడా ఉండటం వల్ల అనువాదంలో సమస్యలు ఏర్పడతాయి. ఇందులో కొన్ని……… 1. రాసే అలవాట్లు, 2. పదాలు, నుడికారాలు వాటి అర్థ విశేషాలు 3. పదనిర్మాణం 4. వాక్య భేదాలు, ప్రయోగాలు ఇవన్నీ భాషా నిర్మాణ సంబంధమైన సమస్యలుగా గుర్తించాలి.

మూలభాషలోని నుడికారం తెలియకపోతే, తప్పుడు అనువాదం చేసే అవకాశం ఉంది. కాబట్టి అనువాదం చేసేటప్పుడు స్థూలంగా పైన చెప్పిన సమస్యలను గుర్తించి అనువాదం చేస్తే ఆ అనువాదం సరైన విషయ సమగ్రతను కలిగి అనువాదం చేసుకున్న భాషా సమాజానికి కూడా మంచి సమాచారాన్ని అందిస్తుంది.

TS Inter 1st Year Telugu Grammar అనువాదం

అనువాదం అభ్యాసానికి కొన్ని ఆంగ్ల వాక్యాలు

ప్రశ్న 1.
A journey of thousand miles begins with a single step
జవాబు:
వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది.

ప్రశ్న 2.
There is plenty of water in that region.
జవాబు:
ఆ ప్రాంతంలో నీరు పుష్కలంగా ఉంది.

ప్రశ్న 3.
There is no substitute for hard work.
జవాబు:
కృషికి ప్రత్యామ్నాయం లేదు.

ప్రశ్న 4.
Imagination rules the world.
జవాబు:
ఊహాశక్తి ప్రపంచాన్ని శాసిస్తుంది.

ప్రశ్న 5.
Maturity comes with experience not age.
జవాబు:
పరిణతి, వయసుతో కాదు, అనుభవంతో వస్తుంది.

ప్రశ్న 6.
Language is the dress of the thought.
జవాబు:
ఆలోచనకి తొడిగిన ఆహార్యమే భాష.

TS Inter 1st Year Telugu Grammar అనువాదం

ప్రశ్న 7.
A picture is a poem without words.
జవాబు:
పదాలు లేని పద్యమే చిత్రం

ప్రశ్న 8.
The best way to predict the future is to create it.
జవాబు:
భవిష్యత్తును అంచనావేయటానికి ఉత్తమ మార్గం, దానిని సృష్టించటమే.

ప్రశ్న 9.
Learn as if you live forever.
జవాబు:
ఎప్పటికీ జీవిస్తావన్నట్లుగానే నేర్చుకోవాలి.

ప్రశ్న 10.
By failing to prepare you are preparing to fail.
జవాబు:
మీరు సంసిద్ధులు కావటంలో విఫలమవుతున్నారంటే, విఫలమవ్వటానికి సిద్ధపడుతున్నారని అర్థం.

ప్రశ్న 11.
Reading is to the mind what exercise is to the body.
జవాబు:
శరీరానికి వ్యాయామం ఎలాగో మెదడుకి పుస్తక పఠనం అలాంటిది.

ప్రశ్న 12.
Sometimes, later becomes never do it now.
జవాబు:
కొన్నిసార్లు, తరువాత అనుకున్నది ఎప్పటికీ కాదు, అందుకే ఇప్పుడే చెయ్యాలి.

TS Inter 1st Year Telugu Grammar అనువాదం

ప్రశ్న 13.
Don’t stop when you’re tired stop when you are done.
జవాబు:
అలసిపోయినప్పుడు కాదు, పనిపూర్తయినప్పుడే విశ్రమించాలి.

ప్రశ్న 14.
Education is the most powerful weapon which can change the world.
జవాబు:
ప్రపంచాన్ని మార్చగలిగే అత్యంత శక్తివంతమైన సాధనం విద్య మాత్రమే.

ప్రశ్న 15.
What you do is more important than what you say.
జవాబు:
నువ్వు చెప్పే మాటలకంటే నువ్వు చేసే పనులే నీ గురించి మాట్లాడతాయి.

ప్రశ్న 16.
Don’t judge book by its cover.
జవాబు:
ముఖ చిత్రాన్ని చూసి పుస్తకాన్ని అంచనా వెయ్యద్దు.

ప్రశ్న 17.
A poor workman blames his tools.
జవాబు:
పని చేతకానివాడు పనిముట్లని నిందిస్తాడు.

ప్రశ్న 18.
What time is our meeting on Wednesday?
జవాబు:
బుధవారం మన సమావేశం ఎన్ని గంటలకు?

ప్రశ్న 19.
I completed reading the book yesterday.
జవాబు:
నేను పుస్తకం చదవటం నిన్న పూర్తి చేశాను.

TS Inter 1st Year Telugu Grammar అనువాదం

ప్రశ్న 20.
Ours is a joint family.
జవాబు:
మాది ఉమ్మడి కుటుంబం.