TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material 1st Lesson నా ప్రథమ విదేశయాత్ర Textbook Questions and Answers.

TS Inter 2nd Year Telugu Non-Detailed 1st Lesson నా ప్రథమ విదేశయాత్ర

అభ్యాసం

I. ప్రశ్నలకు జవాబులు

ప్రశ్న 1.
ముద్దు రామకృష్ణయ్య గారి సంకల్పం తెలుపండి. (V.Imp) (M.P)
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య 18 అక్టోబరు 1907 నాడు మంథెనలో జన్మించాడు. ఆయన తండ్రి ఆదిలాబాద్ జిల్లా తాండూర్లో సింగల్ టీచర్గా పనిచేసేవారు. ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యాపారం ప్రారంభించి నష్టపోయారు. దాని కారణంగా ఆస్తి కన్నా అప్పు పెరిగింది. అప్పులవాళ్ళు వచ్చి వారి తండ్రివి తిట్టేవారు. ఆ మాటల బాధకు ఇంటి బయటకు వెళ్ళి ఆకాశం వైపు చూస్తూ, చేతులు జోడించి దేవునితో నన్ను కనికరించి చదువు చెప్పించు.

విదేశాలకు వెళ్లి చదువుకునేల ఆశీర్వదించమని, తండ్రి చేసిన అప్పులు తీర్పించి, ఇల్లును అమ్మకుండా, దాని ముందర గుఱ్ఱపు బగ్గీలను, మోటార్లను పెట్టించేలా, తండ్రికి, తల్లికి ఇప్పటికన్న ఎక్కువ పేరు మర్యాదలు తెప్పించమని మొక్కారు. అంటే చిన్నప్పుడే విదేశాల్లో చదువుకోవాలనే సంకల్పం ఉండేదని తెలుస్తుంది.

డబ్బులేనివారు చదువుకోలేరు, వివాహం అయిన వారు చదువుకోలేరు అనే మాటలను తప్పు అని నిరూపించాలని, ఈశ్వరుణ్ణి నమ్మినవాడు తప్పక అనుకున్నది సాధిస్తాడని కూడా రుజువు చేయాలని సంకల్పించు కున్నాడు. హైదరాబాద్ లో బి.ఏ. పాస్ అయ్యాడు. తరువాత L.L.B.

చదువుకొని BAR చేయడానికి ఇంగ్లాండు వెళ్ళాలని సంకల్పం చేసుకున్నాడు. ఇంగ్లండు వెళ్ళడానికి ధనవంతులయిన రెడ్డి స్నేహితులు సహాయం చేస్తారనే నమ్మకం ఉండేది. సర్కారీ ఉద్యోగం చేయటానికి ఇష్టం లేదు. అనేక చిన్న, పెద్ద పనులు చేస్తూ చదువుకున్నాక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉద్యోగం వచ్చింది. తరువాత ఇంకా గట్టిగ ఇంగ్లండు వెళ్లి పరిశోధన చేయాలని సంకల్పించుకున్నాడు.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 2.
ముద్దు రామకృష్ణయ్య గారి ప్రథమ విదేశయాత్ర సన్నాహాలు వివరించండి.
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య మొదటి ప్రయత్నం విఫలం అయ్యాక 1944 లో తన తోటి ఉపాధ్యాయుడు దిగంబరరావు తో మాట్లాడుతూ డబ్బు లేని కారణంగా ఇంగ్లాండు వెళ్లలేదని చెప్పాడు. ఆయన డిప్యూటి కలెక్టర్, పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ మీ మిత్రులే కదా వారు సహకరించరా అని సలహా ఇచ్చాడు. మళ్ళీ విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు ప్రారంభించి థామస్ కుక్ వారికి ఇంగ్లాండ్ వెళ్ళడానికి పడవ ఉందా అని లేఖ రాశాడు. సెప్టెంబర్లో పడవ బయలుదేరుతుందని, బ్రిటీష్ రెసిడెన్సి నుండి పాస్పోర్ట్ తీసుకొమ్మని, సీటు రిజర్వు చేసినట్టు వారు జవాబు పంపారు.

దానికి సంతోషించి హైదరాబాద్ ప్రభుత్వ శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్కు ఇంగ్లాండ్లో ఎం. ఇడి లేదా పి. హెచ్లలో సీట్ ఇప్పించమని, అక్కడ చదువుకోవడానికి ఇక్కడ సెలవు ఇప్పించమని, 6000 అప్పు ఇప్పించమని లేఖ రాశాడు. అతడు యుద్ధ సమయం ముగిసేవరకు పడవలు వెళ్ళవు, అక్కడ సీట్ రావడం కష్టం, అక్కడికి వెళ్ళాలంటే హైదరాబాద్ ప్రభుత్వం అనుమతి ఇవ్వదు.

ఈ మూడు విషయాలు పూర్తి కాకుంటే డబ్బుతో అవసరమే లేదు అని ప్రత్యుత్తరం పంపాడు. హైదరాబాద్ పోలీస్ కమీషనర్ కాదన్నాడు. కో ఆపరేటివ్ బ్యాంకు సెక్రెటరి లోనే లేదన్నాడు. ఇలా అందరూ నిరుత్సాహపరిచారు. అన్నలా భావించే అబ్దుల్ హమీద్ కూడా మొదట పిచ్చి ప్రయత్నం, యుద్ధకాలంలో ఒక నెలలో పాస్పోర్ట్ రావడం అసంభవం అని చెప్పాడు. మీ ఆశీర్వాదం ఉంటే అన్ని అవుతాయని రామకృష్ణయ్య అంటే ఆశీర్వదించి పంపాడు.

లాతూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ మీరు ప్రయత్నం చేయండి నా వంతు సహాయం చేస్తానన్నాడు. ఆ కాలంలో పాస్పోర్ట్ పొందడానికి చాలా తతంగం ఉండేది. పాస్పోర్ట్ కోసం జిల్లా అధికారికి దరఖాస్తు చేస్తే ఆయన హోం శాఖకు పంపితే వారు లోకల్ పోలీసు వారికి పరిశీలన కోసం పంపేవారు. ఇవన్నీ కావడానికి కనీసం ఆరు నెలల కాలం పట్టేది. ఆ తరువాత వారు దానిని బ్రిటీష్ రెసిడెన్సీకి పంపితే వారు పాస్పోర్ట్ మంజూరు చేసేవారు. ఇదంతా జరగడానికి తనకున్న సమయం సరిపోదని తెలిసి కూడా ముద్దు రామకృష్ణయ్య ప్రయత్నాలు ప్రారంభించాడు.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 3.
ముద్దు రామకృష్ణయ్య విదేశయాత్ర కోసం విద్యాశాఖ అనుమతి గురించి రాయండి.
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య విదేశాలకు వెళ్ళాలనుకున్న రోజుల్లో సగం జీతంతో ఇంగ్లాండ్ వెళ్లి చదువుకుంటే వచ్చాక పది సంవత్సరాలు ఉద్యోగం చేస్తానని, అలా చేయకుంటే తీసుకున్న జీతం వాపసు ఇస్తానని బాండ్ రాసి ఇవ్వాలి. అలా ఇవ్వకుంటే మేము ఇస్తామని వంద కంటే ఎక్కువ జీతం ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులు జమానత్ (పూచీ కత్తు) ఇవ్వాలని నిబంధనలు ఉండేవి. అప్పుడు వందపైన జీతం ఉన్న వారు నలుగురు మాత్రమె ఉండేవారు. అందులో ఒకరు జామీను సులభంగానే ఇచ్చారు.

ఇంకో జామీను కోసం చాల ప్రయత్నం చేయాల్సి వచ్చింది. ఐదు రూపాయల బియ్యం ఇప్పించి ఇంకో జామీను తీసుకున్నాడు. రెండు జామీనులు, సెలవు పత్రం, ఎకరారు నామాలతో ప్రధానోపాధ్యాయునికి దరఖాస్తు చేశాడు. ఆయన డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్కు పంపాడు. వారికి ఒక ప్రైవేటు లేఖ రాసి పని త్వరగా అయ్యేలా చూడాలని అభ్యర్థించాడు. వారు అలానే త్వరగా దానిని డి పి ఐ కి పంపారు కాని వారు ఆరు నెలల ముందు అనుమతి కోరలేదు కాబట్టి సెలవు దొరకదని చెప్పారు.

అక్కడి వారిని ఎంత బతిమిలాడినా పని కాలేదు చివరికి సీనియర్ డిప్యుటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ డి.పి.ఐ. హక్కాని ని కలిశారు. ఆయన రామకృష్ణయ్యను చూడగానే మీ హిందువులు నీకు సహకరించడం లేదా అని అడిగారు. ముస్లిం కమ్మంటే కాకపోతివి ఇప్పుడు ఇబ్బందులు పడవడితివి అని అన్నాడు. ఒక బ్రాహ్మణ ఉపాధ్యాయుని దగ్గర భోజనం పెట్టించాడు.

ఆయనకు రామకృష్ణయ్య విషయాన్ని వివరించి సహకరించాలని వేడుకున్నాడు. ప్రభుత్వం సెలవు ఇవ్వకున్నా సొంత ఖర్చులతో ఇంగ్లాండ్ వెళ్తానని రాసివ్వు అంటే అలా రాసిచ్చాడు. ఇతను ఇప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళకపోతే ఇంకెప్పుడూ వెళ్ళలేడు. అలా వెళ్ళకపోతే అతని భవిష్యత్ పాడవుతుంది కావున వెంటనే అనుమతించి రిలీవ్ చేయాలని ప్రధానోపాధ్యాయునికి రాశారు. అలా విద్యాశాఖ అనుమతి లభించింది.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 4.
ముద్దు రామకృష్ణయ్య విదేశయాత్రకు పాస్పోర్టు ఎలా లభించింది ? (V.Imp) (M.P)
జవాబు:
పాస్పోర్ట్ దరఖాస్తుకు పెట్టడానికి ఫోటోలు కావాలి. ఫోటోలు దిగడానికి మంచి డ్రెస్ కూడా లేదు. లాతూర్ పోలీస్ మంచి కాలర్ ఉన్న డ్రెస్తో ఫోటోలు దిగాడు. పాస్పోర్ట్ దరఖాస్తుకు పది రూపాయాల ఫీజు చెల్లించాలి. ఆ డలను స్కూల్ ఫీ నుండి వాడుకొని జీతం వచ్చాక స్కూల్ వారికి ఇచ్చాడు.

ఆ దరఖాస్తును డిప్యూటి కలెక్టర్ ద్వారా ఉస్మానాబాద్ కలెక్టర్కు పంపాడు. తన పరిస్థితి వివరిస్తూ ఒక ప్రయివేటు లెటర్ రాసి ఒక విద్యార్థి ఇచ్చిన కవర్లో పెట్టి పోస్ట్ చేశారు. ఆ కవర్లో అనుకోకుండా ఒక రూపాయి ఉండిపోయింది. అది తెలిసి కలెక్టర్ శిక్షిస్తాడేమో అని రామకృష్ణయ్య భయపడ్డాడు. సిగ్గుతో ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.

హమీద్ పాస్పోర్ట్ రావడం అంతసులభం కాదని చెప్పేవారు. స్కూల్లో సెలవు తీసుకొని పాస్పోర్ట్ పని మీద హైదరాబాదు వెళ్ళాడు. అక్కడ మున్సిపల్ సత్రంలో సామాను పెట్టి కార్యాలయాలన్నీ తిరిగేవాడు. మొదట బ్రిటీష్ రెసిడెన్సికి వెళ్ళాడు. అక్కడికి ఫైల్ రాలేదని తెలిసి పొలిటికల్ డిపార్ట్మెంటుకు వెళ్ళాడు. అక్కడ కూడా లేదని తెలిసి అక్కడి నుండి చీఫ్ సూపరింటెండెంట్ కార్యాలయానికి వెళ్ళాడు.

అక్కడ మీ దరఖాస్తు లేదని చెప్పారు కాని వెతకమని అడిగితే అక్కడే ఉంది. అయ్యా దానిని త్వరగా పూర్తి చేయండి చాల త్వరగా నేను వెళ్ళాల్సి ఉంది అని అడిగితే చాలా పెద్ద పని ఉంది కనీసం సంవత్సరం అయినా పడుతుంది అని చెప్పారు. వారిని బతిమిలాడితే శివలాల్ అనే వారు సి.ఐ.డి. సెక్షన్లో పని చేస్తున్నారు. వారిని కలిస్తే పని త్వరగా కావచ్చు అని సలహా ఇచ్చారు. దేవునికి నమస్కరించి శివకుమార్ లాలు దగ్గరికి వెళ్ళాడు. వారితో కలిసి పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ దగ్గరికి వెళ్లి రామకృష్ణయ్య పరిస్థితిని వివరించి పోలీసు రిపోర్ట్ త్వరగా హోం డిపార్ట్మెంట్కు పంపాలని అభ్యర్థించాడు.

దానికి అంగీకరించి తన క్లార్క్తో బ్రిటీష్ రెసిడెంట్ కార్యాలయానికి సిఫారసు లేఖను పంపాడు. అక్కడికి వెళ్లి అడిగితే ఇంగ్లాండులో ఏదైనా యూనివర్సిటీలో సీటు వచ్చినట్లు కాగితం చూపమన్నారు. దానితో అతనిపై బాంబు పడ్డట్లయింది. మీర్ రజా అలీ సహకారంతో రిప్లయ్ పెయిడ్ ఎక్స్ప్రెస్ టెలిగ్రాం పంపాడు. 48 గంటలు వేచి చూసి తన మిత్రునికి అప్పగించి లాతూరు చేరుకున్నాడు. 72 గంటల తరువాత రిప్లయ్ వచ్చిందని దానిని పాస్పోర్ట్ ఆఫీసులో చూపిస్తే పాస్పోర్ట్ ఇవ్వలేమన్నారని ఉత్తరం వచ్చింది.

చివరి ప్రయత్నంగా హైదరాబాదు వెళ్లి షరతులతో అడ్మిషన్ ఉన్నట్లు వచ్చిన టెలిగ్రాంను, థామస్ కుక్ కంపెనీ వారి లేఖను చూపించి పాస్పోర్ట్ ఇవ్వాలని అభ్యర్థించాడు. రెండు సంవత్సరాలు ఇంగ్లాండులో ఉండడానికి సరిపడా పదివేల రూపాయలను లేదా బ్యాంకు బాలన్స్ను చూపించాలని వారు షరతు విధించారు. మీర్ రజా సహకారంతో ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గారి సర్టిఫికేట్ చూపించి పాస్పోర్ట్ పొందాడు.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 5.
ముద్దు రామకృష్ణయ్యకు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం డబ్బు సమస్య ఎలా తీరింది ?
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య పట్టువదలని విక్రమార్కునిగా ప్రయత్నం చేసి శాఖాపరమైన అనుమతి, యూనివర్సిటిలో అడ్మిషన్, పాస్పోర్ట్ పొందాడు. కాని డబ్బు సమస్య మాత్రం తీరలేదు. తన ఇన్సురెన్స్ పాలసీలు తాకట్టు పెట్టుకొని ఎవరైనా తక్కువ వడ్డీకి అప్పు ఇస్తారేమో అని ప్రయత్నం చేశాడు కాని ఫలించలేదు.

తాలూక్ దార్ హమీద్ ఒక మార్వాడి సేట్ అయిన విష్ణుదాసన్ను పిలిచి తక్కువ వడ్డీతో పదివేల అప్పు ఇప్పించమన్నాడు. అంత కాకుంటే ఐదువేలు అదీ కాకుంటే పన్నెండు వందలు పడవ కిరాయి ఇప్పించమన్నాడు. కాని ఆయన ఐదు వందలు మాత్రమె జమ అయినాయని అంతకంటే కావని చెప్పాడు.

ఆ ఐదు వందలతో నేనేం చేసుకోవాలి అని డబ్బు వాపసు చేస్తే అతను తీసుకోలేదు. రామకృష్ణయ్య లాతూర్ వెళ్లి విష్ణుదాస్ అకౌంట్ లో డబ్బు వేశాడు. దానికి హమీద్ సంతోషించాడు. కాని నా సొమ్ము కాని దాన్ని నా అకౌంటులో ఎందుకు వేశారని విష్ణుదాస్ చిరాకుపడ్డాడు.

నాకు పాస్పోర్ట్ దొరికింది పడవ ఎప్పుడు బయలు దేరుతుంది అని థామస్ కుక్ కంపెనీకి టెలిగ్రాం ఇస్తే సెప్టెంబర్ 22న అని జవాబు వచ్చింది. కాని డబ్బు సమస్య తీరలేదు. ఈ విషయాన్ని హామీద్కు చెప్తే అతను సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లను వెంట తీసుకొని వెళ్లి విష్ణుదాస్ గోదాములను తనిఖీ చేయించాడు. దానిలో బ్లాక్ మార్క్ ధాన్యం, చెక్కర సంచులను గుర్తించి పంచనామా చేయమన్నారు.

దానితో విష్ణుదాస్ భయపడి చందా రూపంలో వచ్చిన ఐదువందలకు తాను ఒక వెయ్యి రూపాయలు కలిపి పదిహేను వందలకు హుండీ రాసిచ్చాడు. అలా మొదటి స్టేజి డబ్బు సమస్య తీరింది. రామకృష్ణయ్య ఇంగ్లాండ్ వెళ్ళడానికి 18 రోజుల పని దినాలు ఉన్నాయి.

రోజుకు నాలుగు రూపాయల చొప్పున 72 రూపాయలు వస్తాయి. వాటిని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో మంథెనకు వెళ్ళాలి అని ఆలోచించాడు. వెంకట రామారావు దగ్గర తాకట్టు పెట్టి 72 రూపాయలు తీసుకొని లాతూరు నుండి మంథెనకు, మంథెన నుండి బొంబాయికి వెళ్ళాడు. అలా సోదరునిలాగా భావించే హామీద్ సహకారంతో ముద్దు రామకృష్ణయ్య డబ్బు సమస్య తీరింది.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 6.
ఇంగ్లండులో ముద్దు రామకృష్ణయ్య విద్యాభ్యాసం ఎలా ప్రారంభమైంది ? (V.Imp) (M.P)
జవాబు:
గ్రేట్ బ్రిటన్ స్కాట్లాండ్ దిగి అక్కడనుండి ఎడింబరో యూనివర్సిటీ ఉన్న నగరానికి రైలులో వెళ్ళారు. ఆంగ్ల ఉపాధ్యాయునిగా పదకొండు సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ ఆంగ్లం మాతృభాషగా ఉన్నవారితో మాట్లాడిన అనుభవం లేదు. రిజిస్ట్రార్ దగ్గరకు వెళ్లి టెలిగ్రాఫ్ను చూపించాడు. ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్తో మాట్లాడుతా అన్నాడు. ఉండడానికి ఒక హోటల్లో రూమ్ బుక్ చేశాడు.

కొన్ని రోజులకు ఆలస్యంగా వచ్చిన కారణంగా అడ్మిషన్ దొరకదు అని చెప్పారు. అక్కడి నుండి లీడ్స్ యూనివర్సిటీలో ప్రయత్నం చేయడానికి లీడ్స్ వెళ్ళాడు. 1939లో చేసిన దరఖాస్తు చేస్తే మీరు రమ్మన్నారు. యుద్ధం కారణంగా ఆలస్యంగా వచ్చాను అని చెప్పాడు. దానికి ఇండియా హౌస్ నుండి దరఖాస్తు చేసుకొమ్మని సలహా ఇచ్చారు. మాది హైదరాబాదు రాజ్యం ఇండియా హౌసుకు సంబంధం ఉండదు అని చెప్తే అడ్మిషన్ అయిన తరువాత వారికి చెప్పొచ్చు అని ఎం.ఇడిలో చేర్చుకున్నారు.

ప్రొఫెసర్ ఫ్రాంక్ ఫీ కట్టడానికి రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్ళమన్నారు. వారు ఇరవై పౌండ్ల ఫీ కట్టమంటే అంతడబ్బు లేదని చెప్పకుండా పది పౌన్లు ఇప్పుడు కట్టి తరువాత పది పౌన్లు చెల్లిస్తానన్నాడు. దానికి వారు అంగీకరించలేదు. వారం రోజులు గడువు ఇచ్చారు. పడవలో పరిచయమైన సురేశ్ చందర్కు లేఖ రాశారు.

చివరి తేది ఉదయం పది పౌన్ల పోస్టల్ ఆర్డర్ను సురేశ్ చందర్ పంపాడు. పోస్ట్ ఆఫీసుకు వెళ్లి పది పౌన్లు తీసుకొని మొత్తం ఇరవై పౌన్లు యూనివర్సిటీ అకౌంట్ సెక్షన్లో ఇచ్చి రసీదు తీసుకున్నాడు. అలా ఇంగ్లాండ్ లీడ్స్ యూనివర్సిటీలో ఎం. ఇడి. లో అడ్మిషన్ దొరకడంతో ఇంగ్లాండులో ముద్దు రామకృష్ణయ్య విద్యాభ్యాసం ప్రారంభమైనది.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 7.
ఇంగ్లండులో ముద్దు రామకృష్ణయ్య విద్యాభ్యాసం ఎలా సాగింది ?
జవాబు:
ఇంగ్లాండ్ లీడ్స్ యూనివర్సిటీలో ఎం.ఇడి.లో ప్రవేశం లభించింది. ప్రొఫెసర్ ఫ్రాంక్ స్మిత్ గైడ్గా ఉన్నారు. ఆయన మాథ్స్, సైకాలజీ, చరిత్రలలో ఏం తీసుకుంటావని అడిగారు. హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ నిజాం స్టేట్ అనే అంశంపై అరవై వేల శబ్దాలతో చరిత్రను రెండు సంవత్సరాలలో రాయాలని నిర్ణయించారు.

ప్రొఫెసర్ ఫ్రాంక్ చాలా ప్రేమగా సలహాలు ఇచ్చేవారు. రాసిన వాటిని ఓపికగా సరిదిద్దే వారు. ముఖ్యంగా ది అనే ఆర్టికల్ వాడటం విషయంలో భారతీయులు పొరపాట్లు చేస్తారని అనేవారు. ఒక గది అద్దెకు తీసుకొని ఉండేవారు. వారికి లభించిన మాంసాహార పదార్థాలు, పంది కొవ్వు ఇంటి ఓనర్కు ఇచ్చి శాఖాహార పదార్థాలు తీసుకునే వారు. పని చేయడానికి ఎంప్లాయ్మెంటు ఎక్స్ఛేంజ్లో పేరు నమోదు చేసుకున్నారు.

రైల్వే పోర్టులో హమాలిగా పని చేసేవారు. దానిలోనుంచి కొంత మొత్తాన్ని ఇంటికి పంపేవారు. డీన్ అనుమతితో లండన్లో కలోనియల్ సెంటర్లో చేరాడు. కలోనియల్ సెంటర్లోనే నైట్ పోర్టర్గా రాత్రి పది నుండి ఉదయం నాలుగు వరకు పని చేసేవాడు. సాయంత్రం ఆరు నుండి పది వరకు హోటల్ వెయిటర్గా పని చేసేవాడు. ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఐదు వరకు లైబ్రరీలో ఐదు నుండి పది వరకు కలోనియల్ సెంటర్లో చదువుకునేవారు. ఉదయం నాలుగు నుండి ఎనిమిది వరకు పడుకునేవారు.

హోటల్లో పని చేసేటప్పుడు హైదరాబాద్ ప్రభుత్వపు అధికారి కలిశారు. వారు ప్రధాని నవాబు చత్తారికి చెప్పి వెయ్యి రూపాయలు పౌండ్లు థామస్ కుక్ ద్వారా పంపించారు. తరువాత బిబిసిలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉద్యోగం లభించింది. ఆ తరువాత వారికి ఆర్ధిక ఇబ్బందులు రాలేదు. బిబిసిలో ఉద్యోగం వచ్చాక ప్రొఫెసర్ ఫ్రాంక్ను కలిసి వారానికి ఒక రోజు వచ్చి పది గంటల క్లాస్ వినడానికి అనుమతి పొందాడు.

మిగతా పనులన్నీ మానేసి బిబిసిలో మాత్రమే పని చేస్తూ శ్రద్ధగా చదువును కొనసాగించాడు. వందల పుస్తకాలు, డాక్యుమెంట్లు చదివి నోట్స్ రాసి ప్రొఫెసర్కు చూపిస్తే ఆయన ప్రేమతో సలహాలు ఇచ్చేవారు. అలా రెండు సంవత్సరాలలో నిజాం రాజ్యంలో విద్య చరిత్ర పేరుతో దక్షిణ భారతదేశ విద్య చరిత్రను రాసి ఎం. ఇడి పూర్తి చేసుకున్నారు.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 8.
ముద్దు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణ అనుభవాలు వివరించండి. * (V.Imp) (M.P)
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య ఎన్నో ప్రయత్నాల తరువాత విద్యా శాఖ అనుమతి, యూనివర్సిటిలో షరతులతో కూడిన అడ్మిషన్, పాస్పోర్ట్, కావలిసిన డబ్బు సమకూరింది. మొత్తానికి బొంబాయి చేరుకొని థామస్ కుక్ పడవలో ప్రవేశించాడు. ఎక్కిన తరువాత కొన్ని రోజులు పడవ బొంబాయి పోర్ట్లోనే ఉంది కాని ప్రయాణికులను బయటికి వెళ్ళనివ్వలేదు. ఆ పడవ మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు.

రామకృష్ణయ్య ఉన్న క్యాబిన్లో ఆరు బెర్తులు ఉండేవి. గాలి రావడానికి కిటికీ బదులు పోర్ట్ హోల్స్ ఉన్నాయి. ఫ్యాన్లు, హాస్పిటల్, టెలిగ్రాఫ్ ఆఫీసు, దుకాణము, పిల్లలకు కిండర్ గార్టెన్ సెక్షన్, అవుట్ డోర్ ఆటలు, గ్రంథాలయం, మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. బ్రిటీషు రేవులో దిగగానే తగినంత డబ్బు లేని వారిని డిపార్ట్ చేస్తారని సహచరుడు చెప్పాడు. పడవలో ఉన్న హైదరాబాద్ నుండి వస్తున్న సురేశ్ చంద్ర ఆస్థాన పరిచయం అయ్యాడు. అతను చాల మంచివాడు.

రామకృష్ణయ్య ఇరవై రెండు పౌన్లతో ఇంగ్లాండ్ బయలుదేరాడు. పడవ బయలుదేరిన తరువాత మొదటిసారి ఏడెన్లో ఆగింది. అక్కడ చారిత్రక స్థలాలు అన్ని చూసి, గుజరాతి వాళ్ళ ఇంట్లో మంచి శాఖాహార భోజనం చేశారు. సయీద్ రేవులో కొద్ది రోజులున్నారు. అక్కడ మ్యూజియం చూశారు. జిబ్రాల్టర్ రేవు దాటిన తరువాత బ్రిటన్ భూమి కనిపిస్తుండగా దేవునికి కృతజ్ఞతాపూర్వక నమస్కారం చేశాడు. కాని డబ్బు లేకపోతే డిపార్ట్ చేస్తారేమో అనే భయం మాత్రం ఉండేది.

ఈ విషయాన్ని సురేశబాబుకు చెప్పి అతని దగ్గరున్న నూటయాభై పౌన్ల డ్రాఫ్ట్ చూపించేలా ఒప్పందం చేసుకున్నాడు. కాని విద్యార్జనకు వచ్చానని చెప్పేసరికి డ్రాఫ్ట్ చూపించాల్సిన అవసరం రాకుండానే ఓడరేవులో పర్మిటెడ్ అని స్టాంప్ పడింది. తోటి భారతీయ ప్రయాణికుల సహకారంతో సామాను దించుకున్నాడు. మొత్తానికి బ్రిటన్లోని స్కాట్లాండ్లో దిగినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

II. సందర్భసహిత వ్యాఖ్యలు

ప్రశ్న 1.
ఆస్తి కన్నా అప్పు మించింది. (Imp)
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
ముద్దు రామకృష్ణయ్య కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించాడు. వారి తండ్రి ప్రభుత్వ ఉద్యోగం వదిలి వ్యాపారం, వ్యవసాయం మొదలుపెట్టారు. చింతకాని చెరువు గుత్తా తీసుకున్నప్పుడు వారికి పెద్ద నష్టం వచ్చింది. దానితో వారికి ఆస్తి కన్నా అప్పు పెరిగిందని రామకృష్ణయ్య చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
సంపాదించిన ఆస్తికన్నా చేసిన అప్పు పెరిగిందని అర్థం.

వ్యాఖ్య :
సింగల్ టీచర్గా పనిచేసిన వారు వారికి అనుభవం లేని రంగంలో పెట్టుబడి పెట్టి అప్పుల పాలైనారని భావం.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 2.
వివాహం విద్యానాశాయ * (V.Imp) (M.P)
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశ యాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
ముద్దు రామకృష్ణయ్య గారి తండ్రి రాజన్న వ్యాపారంలో పెట్టుబడి పెట్టి అప్పులపాలయ్యారు. ఆ అప్పుల వారు ఇంటికి వచ్చి తిట్టి వెళ్ళేవారు. అది చూసిన రామకృష్ణయ్య ఏడుస్తూ తనకు విదేశాలలో చదువు చెప్పించి, తండ్రి చేసిన అప్పులు ఇల్లు అమ్మకుండా తీర్చి, తల్లిదండ్రులకు మరింత మంచి పేరు తెచ్చే విధంగా ఆశీర్వదించమని దేవునికి మొర పెట్టుకునేవాడు. డబ్బులేని వాడు చదువుకోలేడు అని, వివాహం అయినవాడు చదువుకు పనికిరాడని అందరూ భావిస్తారు. అలాంటి భావన తప్పు అని నిరూపించాలని రామకృష్ణయ్య నిశ్చయించుకున్న సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
వివాహం జరిగితే విద్య నేర్వడం కష్టం అని అర్థం.

వ్యాఖ్య :
గట్టి సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు. పాతకాలం నుండి వస్తున్న నమ్మకాలను కూడా మార్చే శక్తి మానవ సంకల్పానికి ఉందని భావం.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 3.
ప్రథమ ప్రయత్నం విఫలమయింది (Imp) (M.P)
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా- ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
ముద్దు రామకృష్ణయ్యకు విదేశాలకు వెళ్లి చదువుకోవాలని కోరిక ఉండేది. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా కోహిర్లో పని చేస్తున్నప్పుడు విదేశీ విద్య స్కాలర్షిప్ కోసం హైదరాబాద్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. మూడవ శ్రేణిలో బి.ఏ. పాస్ అయిన వారికి స్కాలర్షిప్ రాదని చెప్పారు. అప్పు అడిగితే దానికి అంగీకరించలేదు.

సొంతఖర్చులతో విదేశాలకు వెళ్ళే అవకాశం కల్పించాలని దరఖాస్తు చేస్తే కారణం చెప్పకుండా ఫైల్ మూసేశారు. ఇంతలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం అయింది అలా రామకృష్ణయ్య గారి ప్రథమ ప్రయత్నం విఫలమైనదని తెలిపిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
మొదటి ప్రయత్నం విజయవంతం కాలేదు అని అర్థం.

వ్యాఖ్య :
దేవునిపై భారం వేసి చిన్నప్పటి నుండి చదువుకున్నాడు రామకృష్ణయ్య. విదేశాలలో చదువుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు. దానిలో మొదటి ప్రయత్నం ఫలించలేదని భావం.

ప్రశ్న 4.
వారు నాకు జమానతు ఇవ్వటానికి సిద్ధపడలేదు
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
ముద్దు రామకృష్ణయ్య ప్రథమ విదేశీ యాత్ర సన్నాహాల్లో భాగంగా విద్యాశాఖ అనుమతి తీసుకోవలసి వచ్చింది. సగం వేతనం తీసుకుంటూ విదేశాలలో చదువుకొని వచ్చిన తరువాత పది సంవత్సరాలు ప్రభుత్వంలోనే ఉద్యోగం చేయాలి. అలా చేయకుంటే తీసుకున్న వేతనం వాపసు ఇవ్వాలి. దానికి 100 రూపాయల వేతనం కంటే ఎక్కువున్న వారు పూచికత్తు ఇవ్వాలి. అలాంటి వారు కేవలం నలుగురే ఉన్నారు. వారు ఎవరూ జామీను ఇవ్వడానికి సిద్ధంగా లేరని రామకృష్ణయ్య చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
వాళ్ళెవరు జామానతు అంటే పూచీకత్తు ఇవ్వడానికి అంగీకరించలేదు అని అర్థం.

వ్యాఖ్య :
100 రూపాయల కంటే ఎక్కువ వేతనం ఉన్నవారెవరూ పూచీకత్తు ఇవ్వడానికి సిద్ధంగా లేరని భావం.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 5.
ఐదు రూపాయల బియ్యం ఇప్పించితే నేను సంతకం పెట్టుతాను
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
ముద్దు రామకృష్ణయ్య ప్రథమ విదేశీ యాత్ర సన్నాహాలులో భాగంగా విద్యాశాఖ అనుమతి తీసుకోవలసి వచ్చింది. సగం వేతనం తీసుకుంటూ విదేశాలలో చదువుకొని వచ్చిన తరువాత పది సంవత్సరాలు ప్రభుత్వంలోనే ఉద్యోగం చేయాలి. అలా చేయకుంటే తీసుకున్న వేతనం వాపసు ఇవ్వాలి.

దానికి 100 రూపాయల కంటే ఎక్కువ వేతనం ఉన్న వారు పూచికత్తు ఇవ్వాలి. అలాంటి వారు కేవలం నలుగురే ఉన్నారు. వారిలో బషీరుద్ధిన్ అనే వారు సంతకం చేశారు. ఇంకొకరి సంతకం కోసం ప్రయత్నం చేస్తుంటే ఒక ముసలి ముస్లిం టీచర్ రేషన్ అందక బాధపడుతూ రామకృష్ణయ్యను ఐదు రూపాల బియ్యం ఇప్పిస్తే జామీను మీద సంతకం చేస్తానని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం ఇది.

అర్థం :
ఐదు రూపాయల విలువైన బియ్యం ఇప్పిస్తే జామీనుపై సంతకం చేస్తానని అర్థం.

వ్యాఖ్య :
వందకు పైన వేతనం వస్తున్నప్పటికీ రేషన్ కారణంగా తమ పిల్లలకు సరైన తిండి పెట్టలేని స్థితి ప్రపంచ యుద్ధ సమయంలో ఉండేది. రామకృష్ణయ్యకు ఉన్న అవసరాన్ని ఆసరాగా తీసుకొని ముసలి ముస్లిం ఉపాధ్యాయుడు ఐదు రూపాయల బియ్యం అడిగాడని భావం.

ప్రశ్న 6.
ఇప్పుడు వెళ్ళకపోతే అతడి భవిష్యత్తు చెడుతుంది.
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
ముద్దు రామకృష్ణయ్య విదేశీ పర్యటనకోసం విద్యా శాఖ అనుమతి కొరకు ప్రయత్నం చేస్తున్నపుడు జుల్ఫికర్ అలీ హక్కాని ఉన్నతాధికారిగా ఉన్నారు. అప్పటికే సెలవు ఇవ్వడానికి వీలు లేదని ఆఫీస్ నోట్ వచ్చిందని సెలవు ఇవ్వడం వీలుపడదని ఆయన అన్నారు. జీతం లేకుండా సెలవు మంజూరు చేసినా సరే అని రాసివ్వుమన్నారు. అలా రాసిచ్చిన తరువాత రామకృష్ణయ్య ఇప్పుడు పోకపోతే మరెప్పుడు పోలేడు, ఇప్పుడు వెళ్ళకపోతే అతని భవిష్యత్తు చెడుతుందని ఉద్యోగం నుండి వెంటనే రిలీవ్ చేయమని అనుమతించిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
ఇప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళకపోతే రామకృష్ణయ్య భవిష్యత్తు చెడుతుందని అర్థం.

వ్యాఖ్య :
రామకృష్ణయ్యకు సహకరించే పరిస్థితులు ఇప్పుడున్నవి. కావున ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకెప్పుడు పోలేడు. అలా వెళ్ళకపోతే అతని భవిష్యత్తు చెడిపోతుందని భావం.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 7.
సిగ్గుతో నా బాధను ఎవరికీ చెప్పుకోలేదు. (V.Imp) (M.P)
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
ముద్దు రామకృష్ణయ్య పాస్పోర్ట్ కోసం అప్లై చేశారు. దానిని ఉస్మానాబాద్ కలెక్టర్కు ఒక తాలూక్ దార్ సిఫారసుతో పంపారు. దానిని త్వరగా పరిశీలించి అనుమతి ఇవ్వాలని కలెక్టర్కు ఒక ప్రైవేటు ఉత్తరం రాసి ఒక కవర్లో పెట్టి పంపారు. ఆ కవర్లో హాస్టల్ బాలుడు ఒక రూపాయి పెట్టుకొని మరిచిపోయి ఆ కవర్ను రామకృష్ణయ్యకు ఇచ్చాడు. ఒక రూపాయి లంచం పంపినట్టు భావించి కలెక్టర్ ఏమైనా శిక్ష వేస్తాడేమో అని భయపడి, ఆ భయపడుతున్న విషయం కూడా ఎవరికైనా చెపితే పరువు పోతుందేమో అని ఎవరికీ తెలుపలేదని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
బాధ చెబితే పరువు పోతుందేమో అని ఎవరికీ చెప్పలేదని అర్థం.

వ్యాఖ్య :
తెలియక చేసినా పెద్ద పొరపాటు జరిగింది. ఆ పొరపాటుకు శిక్ష పడుతుందేమో అనే భయం, బాధ ఉన్నాయి. కాని ఆ బాధను ఎవరికైనా చెప్పుకుంటే పరువు పోతుందేమో అనే మరో అనుమానం కూడా ఉందని భావం.

ప్రశ్న 8.
ఈ మాటతో నా పైన బాంబు పడినంత బాధ అయినది.
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
ఎన్నో ప్రయత్నాల తరువాత పాస్పోర్ట్ మంజూరు చేయమని నిజాం ప్రభుత్వము సిఫారసు లేఖ ఇచ్చింది. ఆ లేఖ తీసుకొని బ్రిటీషు రెసిడెంట్ ఆఫీసుకు వెళ్తే అక్కడున్న అసిస్టెంట్ సెక్రెటరీ ఏదైనా యూనివర్సిటీలో సీటు వచ్చినట్టు కాగితం చూపిస్తేనే పాస్పోర్ట్ ఇస్తామని చెప్పాడు. ఆ మాటతో తనపై బాంబు పడ్డంత పని అయిందని రామకృష్ణయ్య చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
ఆ మాట బాంబు దెబ్బతో సమానం అని అర్థం.

వ్యాఖ్య :
ఎంతో కష్టపడ్డ తరువాత వచ్చిన అవకాశం చివరి క్షణంలో చేజారి పోతుందని తెలిసి అది బాంబు పడ్డట్టు అనిపించిందని భావం.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 9.
అప్పుడే కోర్టు నుండి సర్టిఫికెట్టు దొరికినది
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
ఎన్నో ప్రయత్నాల తరువాత పాస్పోర్ట్ మంజూరు చేయమని నిజాం ప్రభుత్వము సిఫారసు లేఖ ఇచ్చింది. ఆ లేఖ తీసుకొని బ్రిటీషు రెసిడెంట్ ఆఫీసుకు వెళ్తే అక్కడున్న అసిస్టెంట్ సెక్రెటరీ ఏదైనా యూనివర్సిటీలో సీటు వచ్చినట్టు కాగితం చూపిస్తేనే పాస్పోర్ట్ ఇస్తామని చెప్పాడు.

కొన్ని షరతులతో సీటు ఇస్తామని వచ్చిన టెలిగ్రాఫు చూపించి పాస్పోర్ట్ ఇమ్మన్నాడు. పదివేల రూపాయలు చూపించాలి, లేదా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సర్టిఫికేట్ తెమ్మన్నారు. దానిని మీర్ రజాకు చెప్తే వకీల్ నవరతన్ సహకారంతో సర్టిఫికెట్ ఇప్పించారని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం. –

అర్థం :
ఆ సందర్భంలో కోర్టు నుండి సర్టిఫికెట్ దొరికినదని అర్థం.

వ్యాఖ్య :
ఇంగ్లాండులో రెండు సంవత్సరాలు ఉండడానికి సరిపడా డబ్బు ఉందని సర్టిఫికేట్ దొరికిందని భావం.

ప్రశ్న 10.
పాలముంచినా నీట ముంచినా నీదే భారం
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
అనేక కష్టాల తరువాత విద్యా శాఖనుండి అనుమతి, యూనివర్సిటీలో షరతులతో కూడిన అడ్మిషన్, పాస్పోర్ట్ రావడం ఇలా అనేక పనులు అయినాయి. ఓడ బయలుదేరడానికి వారం రోజుల సమయం మాత్రమే ఉందని థామస్ కుక్ కంపనీ లేఖ పంపింది. కాని అన్నింటికి మించిన డబ్బు సమస్య తీరడం ఎలా అని భగవంతున్ని ప్రార్థించిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
పాలల్లో ముంచినా నీళ్ళల్లో ముంచినా దేవునిదే భారం అని అర్థం.

వ్యాఖ్య :
పాలల్లో ముంచినా అంటే కష్టాలు తీర్చినా, నీళ్ళల్లో ముంచినా అంటే కష్టాల్లోనే ఉంచిన దేవునిదే బాధ్యత అని భావం. అంతా దైవాదీనం అని అంతరార్థం.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 11.
వారి పాదాలపైన నెత్తిపెట్టి వారికి మొక్కితిని
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
రామకృష్ణయ్య తాత సనాతన సంప్రదాయవాది. సముద్ర ప్రయాణం చేస్తే భ్రష్టుడవుతాడని ఆయన “నమ్మకం. తనను చంపి విదేశాలకు వెళ్ళమని అన్నాడు. దానికి మన సంప్రదాయాలు పాటిస్తూ మీరు గీచిన గీత దాటకుండా ఉంటాను. దానికి నువ్వు అనుమతి ఇస్తేనే వెళ్త లేదంటే ఇక్కడే చస్తా అని రామకృష్ణయ్య అన్నాడు. అప్పుడు నా నోరు మూయించావురా అని అనుమతించారు. దానికి కృతజ్ఞతా పూర్వకంగా వారికి పాద నమస్కారం చేశానని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
ఆయన పాదాలపై తలపెట్టి మొక్కాడు అని అర్థం.

వ్యాఖ్య :
పాద నమస్కారం అత్యంత గౌరవ సూచకం అని భావం.

ప్రశ్న 12.
వారి ఉచ్ఛారణ, నిత్య వ్యవహారిక శబ్దాలు తెలియవు చేసిన విద్యావేత్త
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
ముద్దు రామకృష్ణయ్య గ్రేట్ బ్రిటన్ స్కాట్లాండ్లో దిగారు. ఎడింబరో యూనివర్సిటీ రిజిస్ట్రార్ కార్యాలయం వెళ్ళాడు. పదకొండు సంవత్సరాల ఆంగ్ల ఉపాధ్యాయ అనుభవం ఉన్నప్పటికీ అక్కడి వారితో ఎప్పుడూ మాట్లాడని కారణంగా వారి భాష, యాస రామకృష్ణయ్యకు కొత్తగా అనిపించిందని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
ఆంగ్లేయుల ఉచ్ఛారణ వారి వాడుక పదాలు తెలియవు అని అర్థం.

వ్యాఖ్య :
ప్రతీ భాషకు స్వంత యాస ఉంటుంది అలానే పలుకుబళ్ళు ఉంటాయి. వాటిని మాతృభాష అయిన వారి లాగా మాట్లాడటం కష్టం అని భావం.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 13.
నా జాతికి నావలన పాడుమాట రానివ్వను (V.Imp) (M.P)
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
యుద్ధ కాలంలో తిండికి బట్టలకు రేషన్ ఉండేది. ఆ సమయంలో ఇంగ్లాండుకు కొత్తగా వెళ్ళాడు కాబట్టి రామకృష్ణయ్యకు బట్టలు కూపన్లు ఎక్కువ అందినాయి. కాని కొనుక్కోవడానికి డబ్బు లేదు. ఆ సమయంలో ఒక మిత్రుడు ఆ కూపన్లను బ్లాక్ మార్కెట్లో అమ్మితే ఎక్కువ డబ్బు వస్తుందని చెప్పాడు. అలా చేయడం వల్ల భారతీయులు కూపన్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముతారనే చెడ్డపేరు వస్తుందని, అలా దేశానికి చెడ్డపేరు తెచ్చే ఏ పని తాను చేయనని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
నా భారత జాతికి నా ప్రవర్తన వల్ల చెడ్డపేరు రానివ్వను అని అర్థం

వ్యాఖ్య :
బట్టలకోసం దొరికిన కూపన్లను బ్లాక్ మార్కెట్లో అమ్మడం తప్పు అని అలా అమ్మితే దేశ వాసులందరికి చెడ్డ పేరు వస్తుందని, అలాంటి పని తాను చేయడని భావం.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 14.
తన సజెషన్స్ ప్రేమతో ఇచ్చేవారు
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
చదువుకోసం ఇంగ్లాండు వచ్చి లీడ్స్ యూనివర్సిటీలో ఎం.ఎడ్. లో చేరాడు. చదువుతో పాటు వివిధ పార్ట్ టైం ఉద్యోగాలు చేశారు. చివరికి లండన్ బిబిసిలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉద్యోగం చేశాడు. అలా ఉద్యోగం చేస్తూ లీడ్స్కు రోజు వెళ్ళడం సాధ్యం కాదని, వారంలో ఒకరోజు వచ్చి పది గంటలు వింటానని, తన కోసం కొంత శ్రమ తీసుకోవాలని వారి ప్రొఫెసర్ను కోరాడు. దానికి ప్రొఫెసర్ ఫ్రాంక్ అంగీకరించాడని, ప్రేమతో సలహాలు ఇచ్చేవాడని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
ప్రొఫెసర్ ప్రేమగా సలహాలు ఇచ్చారని అర్థం.

వ్యాఖ్య :
కష్టపడి చదివే వారికి అందరూ సహకరిస్తారని, అలానే తన ప్రొఫెసర్ కూడా ప్రేమగా సలహాలు ఇచ్చారని భావం.

నా ప్రథమ విదేశయాత్ర Summary in Telugu

రచయిత పరిచయం

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర 1
ఉపవాచకం పేరు : నా ప్రథమ విదేశయాత్ర

దేనినుండి ఇది గ్రహింపబడింది. : ఈ ఉపవాచకం, శ్రీ ముద్దు రామకృష్ణయ్య ‘నా ప్రథమ విదేశ రచన నుండి గ్రహింపబడింది.

ఉపవాచకం ప్రక్రియ : యాత్రా చరిత్ర

రచయిత : ముద్దు రామకృష్ణయ్య

కాలం : జననం : అక్టోబర్ 18, 1907 – మరణం : అక్టోబరు 21, 1985

తల్లిదండ్రులు : అమ్మాయి, రాజన్న

స్వస్థలం : కరీంనగర్ జిల్లా మంథని

విద్య :

  • 1932లో బి.ఏ. పట్టా పొందాడు.
  • 1944-46 మధ్య ఇంగ్లండు వెళ్ళి లీడ్స్ విశ్వవిద్యాలయంలో విద్యలో మాస్టర్స్ డిగ్రీ (ఎం.ఇడి.) పూర్తి చేసి వచ్చాడు.

ఉద్యోగాలు :

  • 1933 జులై 31న అప్పటి హైదరాబాదు రాష్ట్రం గుల్బర్గా జిల్లాలోని చించోలిలో మాధ్యమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితం ఆరంభించాడు.
  • 1936లో పదోన్నతిపై కోహీరుకు వెళ్ళిన నాటి నుంచి విదేశాలలో ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
  • లండన్లో చదువుకుంటున్న సమయంలోనే బిబిసిలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉద్యోగం చేశారు.
  • 1948లో గుల్బర్గా కళాశాలలో తన ఉద్యోగ ప్రస్థానం కొనసాగించాడు.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

విదేశీ పర్యటనలు :

  • 1951-52 మధ్యకాలంలో మలేషియా, ఫిలిప్పైన్స్, అమెరికా ఖండంలో 24 రాష్ట్రాలు, కెనడా, ఫ్రాన్స్, స్పెయిన్, మొరాకో వంటి దేశాలలో పర్యటించి అక్కడి విద్యావిధానం గురించి అక్కడి విద్యావేత్తలను అడిగి తెలుసుకున్నాడు.
  • 1954-55 సం॥లో ఆస్ట్రేలియా ఖండంలో పర్యటించి అక్కడి విద్యావిధానాన్ని అధ్యయనం చేశాడు. 1958లో ఒక యాత్రికుడిగా రష్యా, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలను సందర్శించి అనేక సంస్థలను పరిశీలించి వచ్చాడు.

సంస్కరణలు : వివిధ దేశాల విద్యావిధానాలను అధ్యయనం చేసిన రామకృష్ణయ్య వాటి స్ఫూర్తితో మన దేశ విద్యారంగంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు.

  • కరీంనగర్, నిజామాబాదు, హైదరాబాదు మొదలైన జిల్లాల్లో ప్రభుత్వ విద్యాశాఖాధికారిగా పనిచేశారు.
  • పాఠశాల విద్య నిర్వహణలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పాడు. ఆ విధానాలు కొన్ని నేటికీ అమలులో ఉన్నాయి.
  • నిరక్షరాస్యతా నిర్మూలన కొరకు “ఈచ్ వన్ టీచ్ వన్” ఉద్యమాన్ని జీవిత పర్యంతం కొనసాగించారు.
  • విధి నిర్వహణలోని ప్రతి అంశాన్నీ, అక్షర రూపంలో భద్రపరచి సంస్కరణలకు బీజం వేశాడు.
  • రామకృష్ణయ్య నిరంతరం తన దినచర్యను రాసుకుంటూ ఆరువేల పుటలకు పైగా అమూల్యమైన అంశాలను లోకానికి అందించారు.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ఉద్దేశం : ముద్దు రామకృష్ణయ్య విదేశాలలో విద్యాభ్యాసం కోసం చేసిన ప్రయత్నాలు, ఎన్ని కష్టాలు ఎదురైనా, పస్తులుండవలసి వచ్చినా తన పట్టుదల వీడక ఆయన సాగించిన కృషి నేటి విద్యార్థులకు స్ఫూర్తి మంత్రం ఁ లాంటి వారి చరిత్ర ద్వారా స్ఫూర్తి పొందుతారని ఉద్దేశంతో ఈ యాత్రా చరిత్రను అందిం. ‘రు.

  • ఈ యాత్రా చరిత్రలో ఆంగ్లం, ఉర్దూ పదాలు ఎక్కువగా వాడారు. నిజాం పాలనా కాలంలోని వ్యవస్థలు, ఆధికారుల పేర్లు కూడా ఇందులో తెలుసుకోవచ్చు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదని ఈ ఉపవాచకం నిరూపిస్తుంది.

TS Inter 2nd Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 9th Lesson తెలంగాణ రాష్ట్ర అవతరణ Textbook Questions and Answers.

TS Inter 2nd Year Political Science Study Material 9th Lesson తెలంగాణ రాష్ట్ర అవతరణ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావటానికి గల కారణాలు ఏవి ?
జవాబు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి దారితీసిన కారణాలు :
1. స్థానికత (Domiclle) నియమాలను మార్చివేయటం ప్రధాన ఉల్లంఘన. తెలంగాణ ప్రాంతంలో స్థానికత రావాలంటే 12 సంవత్సరాల నిరంతరాయ నివాసం ఉండాలనే నియమం ఉంది. పెద్ద మనుషుల ఒప్పందం దానిని ఒప్పుకొన్నది. అమలు విషయానికి వచ్చేసరికి దానిని 4 సంవత్సరాలకు కుదించారు. ఈ ఉల్లంఘనవల్ల 50 వేలమంది ఆంధ్ర ప్రాంతీయులు తెలంగాణ ప్రాంత ఉద్యోగాల్లోకి చేరిపోయారు. తెలంగాణ వారికి ఒక్క దెబ్బతో విద్య, ఉద్యోగాలలో అవకాశాలు పోయాయి.

2. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం మానవ అభివృద్ధిలో ఎంతో వెనుకబడింది. తెలంగాణలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న జనాభా 40.78 శాతం. 1987-88 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం తెలంగాణలో కంటె ఆంధ్ర ప్రాంతంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న జనాభా శాతం చాలా తక్కువ.

అందువల్ల తెలంగాణాలో ఆంధ్ర ప్రాంతంతో పోలిస్తే పేదరికం పెరిగిపోయింది. తెలంగాణ ప్రాంతం ఆంధ్రతో పోలిస్తే నాటికి అధిక ఆదాయం కలిగిన ప్రాంతం. ఆ అధిక ఆదాయాన్ని తెలంగాణ మిగులు అంటారు. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూలో 40 శాతానికి పైగా సమకూరుస్తుంది.

3. జై ఆంధ్ర ఉద్యమం తరువాత 1972 తరువాత ముల్కీ నిబంధనలను, తెలంగాణ ప్రాంతీయ కమిటీకి సంబంధించిన నిబంధనలను సవరించారు. తెలంగాణ ప్రాంతానికి వనరుల పంపిణీలో జరిగే అన్యాయాన్ని ప్రశ్నించే సంస్థాగత నిర్మాణమే లేకుండా చేశారు.

4. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1990 దశకం వరకు తెలంగాణ ప్రజలకు విద్యా సౌకర్యాల దుర్భరంగా ఉండేవి. తెలంగాణలో నిరక్షరాస్యత ఎక్కువ. ఇక్కడ అక్షరాస్యత శాతం చాలా కనిష్టంగా 37 శాతం మాత్రమే ఉండేది. వృత్తి విద్యా కళాశాలపైన ఇంజనీరింగ్, మెడికల్ తదితర విభాగాల కళాశాలలు కొన్నింటిని మాత్రమే స్థాపించారు. తెలంగాణ ప్రాంతంలో విశ్వవిద్యాలయాల సంఖ్య కూడా అతి తక్కువగా ఉండేది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

5. నదీజలాల వినియోగం విషయంలో తెలంగాణకు చాలా అన్యాయం జరిగింది. కృష్ణానదిపై నిర్మించిన నాగర్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు ఆంధ్ర ప్రాంతానికి మేలు చేకూర్చేందుకు మాత్రమే నిర్మించారు. నాగార్జున సాగర్ నిర్మాణం వల్ల నల్లగొండ జిల్లాలో ఎంతో వ్యవసాయ భూమి ముంపుకు గురి కాగా, ఆ జిల్లాకు సాగర్ ద్వారా అందవలసిన న్యాయబద్ధ వాటా దక్కలేదు.

6. గోదావరి పైన ప్రారంభించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు తెలంగాణకు మేలు చేస్తుంది. కానీ దీని పనులు నత్త నడక కాలంలో నడిపించారు. 20 లక్షల ఎకరాలకు నీరు అందించవలసిన ప్రాజెక్టు ఆయకట్టును 50 సంవత్సరాల రెండున్నర లక్షల ఎకరాలకు మాత్రమే అందేట్టు చేశారు. 1966 నాటికి ప్రాజెక్టు పూర్తి కావాలని ఆశించినా అది జరగలేదు.

7. తెలంగాణ ప్రాంతంలోని ప్రాజెక్టులలో నీటి కేటాయింపు హామీ ఉన్న శ్రీశైలం ఎడమగట్టు కాలువ పనులు సైతం సంతృప్తికరంగా ప్రగతి సాధించలేదు.

8. తెలంగాణలో నిజాం ప్రభుత్వ పాలనలో నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టును సరైన నిర్వహణ లేకుండా చేశారు. దాని పూడికమేట వేసి, ప్రాజెక్టు కింద ఆయకట్టు తగ్గిపోసాగింది.

9. మెదక్, నిజామాబాద్ జిల్లాలలోకి పొలాలకు నీరు అందించవలసిన మంజీరా నీళ్ళను, తాగునీటి అవసరాలకోసం హైదరాబాద్కు తరలించారు.

10. రాజోలి బండ డైవర్షన్ కెనాల్ ద్వారా నీరు, తెలంగాణలోని మహబూబ్నగర్లో 50 నుంచి 60 వేల ఎకరాలకు అందవలసి ఉండగా, ఆ జలాలను దౌర్జన్యంగా రాయలసీమకు తరలించారు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

ప్రశ్న 2.
భారత యూనియన్లో తెలంగాణ ఒక నూతన రాష్ట్రంగా ఏర్పడిన తీరును చర్చించండి.
జవాబు.
దశాబ్దాల పోరాటం తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇది 60 సంవత్సరాలుగా వివిధ రూపాలలో నడిచిన ప్రజాపోరాటాల అంతిమ విజయం. 1948 నుంచి 1956 వరకు తెలంగాణకు ప్రత్యేక ఉనికి, గుర్తింపు ఉన్నాయి. తెలంగాణకు ప్రత్యేక చారిత్రక, భౌగోళిక సంస్కృతిక గుర్తింపు, ప్రాతిపదిక ఉన్నాయి.

హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రరాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడం, ఇష్టంలేని, అసమానమైన ఇరుపక్షాలను బలవంతంగా ఒక్కటి చేయడం అనవచ్చు. అందువల్ల అవి విడిపోవడం అనే అనివార్యత, ఆ బలవంతపు కలయికలోనే ఉంది.

తెలంగాణ ప్రాంతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి అవకాశాలకు నోచుకోక, సహజవనరుల విషయంలో తీవ్రదోపిడీకి, ఇతర ప్రాంతాల అభివృద్ధికి తన వనరులను వదులుకోవాల్సిన పరిస్థితులకు గురి అయింది. పెద్ద మనుషుల ఒప్పందం పేరుతో తెలంగాణ ప్రాంతానికి కొన్ని సంరక్షణలు కల్పించినప్పటికీ, వివిధ ప్రభుత్వాల కుయుక్తుల వలన పాలనలో అవి అసంపూర్ణంగా, నిరర్థకంగా మారడం కనిపిస్తుంది.

ఆంధ్ర పాలకుల కుయుక్త నైపుణ్యాల ముందు తెలంగాణ రాజకీయ శిష్టవర్గం సరితూగలేకపోయింది. ప్రభుత్వ ఉద్యోగాలు, నదీజలాల్లో భాగస్వామ్యం, తెలంగాణ ప్రాంత మిగులు నిధుల అక్రమ తరలింపు, ముల్కీ నిబంధనల ఉల్లంఘనలు తదితర విషయాల్లో తెలంగాణకు ఎంతో అన్యాయం జరిగింది. ఈ పరిణామాలన్నీ తెలంగాణ యువతను నిరాశ నిస్పృహలకు గురిచేశాయి.

దీనితో 1969లో ప్రత్యేక తెలంగాణ ఆందోళన ప్రారంభమైంది. ఆ తరువాత కాలంలో, ఈ ప్రత్యేక రాష్ట్రవాదం తీవ్రతరమై, రాజీలేని పోరాటంగా మారి 2001-2014 మధ్యకాలంలో ఒక శక్తివంతమైన ఉద్యమంగా మారింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

భిన్న రాజకీయ భావజాలం గల శక్తులు జాయింట్ యాక్షన్ కమిటీగా రూపొందడం ఈ పోరాటంలో ఒక ప్రత్యేక అంశం. ఇది ఒక విధంగా ప్రజా రాజకీయాలలో (Mass Politics) కొత్త నేర్పు. ఈ JAC లలో రాజకీయ JAC కులసంఘాల JAC, విద్యార్థి JAC, ఉద్యోగుల JAC మొదలైనవి ప్రధానమైనవి. ఈ జాయింట్ యాక్షన్ కమిటీ వివిధ రాజకీయ బృందాలచే కాక వివిధ వృత్తుల సామాజిక శ్రేణులనూ, వివిధ కులసంఘాలనూ పోరాటంలోకి తీసుకువచ్చింది.

ఆ విధంగా ప్రత్యేక రాష్ట్ర మహాయత్వానికి విశాలమైన ప్రజామద్ధతులను కూడగట్టింది. తెలంగాణ రాష్ట్రసమితి పుట్టుక ఒక చారిత్రక సంఘటన, ప్రజా ఉద్యమాన్ని పార్లమెంటరీ రాజకీయాలలోకి ఒదిగించి, సమత్వం, న్యాయం, ఆత్మగౌరవం అన్న ప్రాతిపదికలతో దాన్ని చట్టసభల చర్చలలోకి తీసుకుపోయింది. తెలంగాణ రాష్ట్ర సాధనకు పార్టీ పుట్టుక ఎంతో పనికి వచ్చింది.

ఈ విధంగా దోపిడి, అణచివేత, ఆధిపత్యాల నుండి విముక్తి కోసం సాగించిన తెలంగాణ ఉద్యమం ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కల సాకారమయ్యింది. లోక్సభ, రాజ్యసభలలో రాష్ట్ర పునర్విభజన బిల్లు ఆమోదం పొంది మార్చి 1, 2014న రాష్ట్రపతి ఆమోదం పొందింది. దానితో 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ, భారత యూనియన్లో 29వ రాష్ట్రంగా అవతరించింది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని ప్రధానాంశాలు ఈ విధంగా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రం : తెలంగాణ 10 జిల్లాలు గల 29వ రాష్ట్రం (ప్రస్తుతం దేశంలో 28 రాష్ట్రాలు) తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి.)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం : 13 జిల్లాలు గల రాష్ట్రం.

హైదరాబాద్ ఉమ్మడి రాజధాని : 2014 నుంచి 10 సంవత్సరాలకు మించకుండా హైదరాబాద్ నగరమే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.

ఉమ్మడి గవర్నర్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉంటాడు. (ప్రస్తుతం వేరు, వేరు గవర్నర్లు ఉన్నారు.)

రాజ్యసభ సభ్యులు : తెలంగాణకు 7 మంది, ఆంధ్రప్రదేశ్కు 11 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు.

లోకసభ సభ్యులు : తెలంగాణ రాష్ట్రానికి 17 మంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25 మంది సభ్యులు ఉంటారు.

శాసనసభ సభ్యులు : తెలంగాణకు 119 మంది శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్కు 175 మంది సభ్యులు ఉంటారు.
శాసనమండలి : తెలంగాణ శాసనమండలి సభ్యులు 40, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు 50.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

ప్రశ్న 3.
తెలంగాణ ఉద్యమంలో సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి)ల పాత్రను వివరించండి.
జవాబు.
1. రాజకీయ సంయుక్త కార్యాచరణ కమిటీ (Political JAC) :
రాజకీయ సంయుక్త కార్యాచరణ కమిటీ (Political JAC) ని డిసెంబర్ 24, 2009న ఏర్పరచారు. దీనిలో ప్రధాన రాజకీయ పార్టీలైన తెలంగాణ రాష్ట్ర సమితి (TRS). భారతీయ జనతాపార్టీ (BJP), భారత కమ్యూనిస్టు పార్టీ (CPI), భారత జాతీయ కాంగ్రెస్ (INC), తెలుగుదేశం పార్టీ (TDP), సిపిఐ (ఎం.ఎల్) న్యూడెమొక్రసీ తదితర రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు తదితరులు అంతర్భాగమై ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నిర్వహించాయి.

2. కులసంఘాలు జెఎసి :
సమాజంలోని కొన్ని కులాలు సంఘాలు ఏర్పరచుకోవడం, ఈ సంఘాలన్నీ సంయుక్త కార్యాచరణ కమిటీగా ఏర్పడటం తెలంగాణ ఉద్యమంలో ఒక వినూత్న ధోరణిగా పేర్కొనవచ్చు.

తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొనడానికి సమాజంలో శతాబ్దాల తరబడి అణచివేతకు గురైన కుల సమూహాలు, వివిధ కుల వృత్తుల సమూహాలు, దళిత బహుజనులు, ఇతర వెనుకబడిన కులాలు, అల్ప సంఖ్యాక వర్గాలు ఒకే వేదిక పైకి వచ్చి, సంయుక్త కార్యాచరణ కమిటీ (JAC) గా ఏర్పడ్డాయి. ఈ విధంగా కులసంఘాలు సంఘటితమై పోరాటం చేయడాన్ని కులంపైన ఉండే ఆదిమ విశ్వాసంగా అర్థం చేసుకోరాదు.

3. విద్యార్థుల జెఎసి :
తెలంగాణ ఉద్యమం ప్రారంభించి, తీవ్రతరం చేసి వివిధ కళాశాలల విద్యార్థులు, విశ్వవిద్యాలయ విద్యార్థులు రాష్ట్ర సాధనకు ఎంతో కృషి చేశారు. వివిధ సిద్ధాంత భావజాలాలను నమ్మే విద్యార్థులు తమ మధ్యగల సైద్ధాంతిక విభేదాలను పక్కనబెట్టి తెలంగాణ ఉద్యమం నిర్వహించడానికి ఒక్కటై, పోరాడటానికి ఒక సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి)ని ఏర్పరచారు.

ఈ తరహా జెఎసిలు అనేక విశ్వవిద్యాలయాలు, కళాశాలల స్థాయిలో ఏర్పడ్డాయి. వీటిలో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు జెఎసి (OUJAC), కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థుల జెఎసి (KUJAC), ఉద్యమాన్ని క్రియాశీలంగా నడపడంలో కీలకపాత్ర పోషించాయి.

4. ఉద్యోగుల జెఎసి :
ఉద్యోగులు, కార్మికులు, శ్రామికులు, ఉపాధ్యాయులు తదితరవర్గాలు ఉద్యోగల సంయుక్త కార్యాచరణ కమిటీ (JAC) పేరుతో ఒక వేదికను ఏర్పరచుకొని అనేక నిరసన కార్యక్రమాలు, ఉద్యమాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని చురుకుగా నిర్వహించాయి.

వివిధ స్థాయిలకు చెందిన లక్షలాది మంది ఉద్యోగులు సహాయ నిరాకరణ, పెన్ డౌన్ (Pen Down), ఢిల్లీ ఛలో, మధ్యాహ్న భోజన విరామ నిరసన కార్యక్రమాలతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మితిమీరిన ఆలస్యానికి నిరసనగా ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపట్ల ఉదాసీనతకు వ్యతిరేకంగా ఉద్యోగల జెఎసి రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొన్నది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
పెద్దమనుషుల ఒప్పందంలోని నిబంధనలు తెలపండి.
జవాబు.
పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణలో రీజినల్ కౌన్సిల్ ఏర్పాటు అవుతుంది. ఒప్పందం ప్రకారం తెలంగాణలోని అభివృద్ధి, ప్రణాళికారచన, స్థానికపాలన, ప్రజారోగ్యం, ప్రాథమిక, మాధ్యమిక విద్య, తెలంగాణ ప్రాంత విద్యాలయాల్లో అడ్మిషన్లు, తెలంగాణా ప్రాంత వ్యవసాయ భూముల అమ్మకాలు, లఘు, కుటీర పరిశ్రమలను వీటిని రీజనల్ కౌన్సిల్ నిర్వహిస్తుంది.

ముల్కీ నిబంధనల ప్రకారం తెలంగాణలో 12 సంవత్సరాల శాశ్వత నివాసం ఉంటేనే వారికి తెలంగాణా ప్రాంతపు విద్యాలయాల్లో, ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.

ఇది ఒక ప్రధానమైన తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను రక్షించే చర్య, వీటితోపాటు మరో ప్రధాన రాజకీయ నిర్ణయం ఒప్పందంలో ఉన్నది. దాని ప్రకారం ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికి చెందినవాడైతే ఉపముఖ్యమంత్రి మరో ప్రాంతానికి చెందినవారై ఉండాలి.

అలాగే మంత్రివర్గంలో ఆంధ్ర-తెలంగాణ మంత్రుల నిష్పత్తి 60:40 ఉండాలని ప్రతిపాదించబడింది. అంతేకాకుండా 2 నుంచి 5 వరకు ఉండే ముఖ్యమైన మంత్రిత్వశాఖలు అంటే హోమ్, ఆర్థిక ప్రణాళిక, అభివృద్ధి, వాణిజ్యం, పరిశ్రమలు వంటి శాఖలు తెలంగాణ వారికి ఇవ్వాలి అని ఒప్పందం జరిగింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

ప్రశ్న 2.
1969 నాటి తెలంగాణ ఆందోళన గురించి వివరించండి.
జవాబు.
రకరకాల రూపాలలో పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘనకు గురి కాగా తెలంగాణాలో అసంతృప్తి రాజుకోసాగింది. ముఖ్యంగా స్థానికతకు సంబంధించిన ముల్కీ నియమాలు ఉల్లంఘించడంతో, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో జరిగిన అన్యాయానికి ఒక్కసారిగా వ్యక్తమయిన వ్యతిరేకతే 1909లో జరిగిన ‘జై తెలంగాణ ఉద్యమం’.

ఆనాటికి తెలంగాణ వారికి హక్కుగా లభించవలసిన 25,000 ఉద్యోగాలు తెలంగాణాలోకి వలసవచ్చిన ఆంధ్రావారికి వెళ్ళసాగాయి. ముల్కీ నిబంధనలను పూర్తి సరళంగా మార్చివేసి, 4 సంవత్సరాలు తెలంగాణలో ఉంటే చాలు ఎవరైనా తెలంగాణ వారే అనే వెసులుబాటు ఇవ్వడం వల్ల ఈ దుర్మార్గం జరిగిపోయింది.

ముల్కీ నియమాల ఉల్లంఘనవల్ల కాలేజీల్లో అడ్మిషన్లు కోల్పోవడం తెలంగాణ వారికి సర్వసాధారణమైపోయింది. ఖమ్మంలో ఇటువంటి సంఘటనకు వ్యతిరేకంగా మొదట నిప్పురవ్వ పుట్టింది. మెడికల్ కాలేజీలో అడ్మిషన్ విషయంలో ముల్కీ ఉల్లంఘన జరిగిందనే నిరసన, నిరాహార దీక్షగా పరిణమించింది.

1969లో అది వెనువెంటనే ఉప్మానియా విశ్వవిద్యాలయానికి పాకింది. తరువాత తెలంగాణ అంతటా విస్తరించింది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రతిపక్ష, శాసన సభ్యులూ విద్యార్థులకు మద్ధతుగా “ప్రత్యక్ష చర్యకు” పూరుకుంటామని హెచ్చరించారు.

యువకులు, మేధావులు, టీచర్లు మహిళలూ ఇలా వివిధ జనాల మద్ధతు ఉద్యమానికి తోడయింది. అధికార సభ్యుడయిన కొండాలక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమానికి మద్దతు తెలిపాడు. మదన్మోహన్, మల్లికార్జున్, పులి వీరన్న వంటి విద్యార్థి నాయకులు చురుకుగా ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు తెలంగాణ పరిరక్షణలు ఉల్లంఘనలను ప్రశ్నించి, పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలను హామీ మేరకు అమలుచేయాలని డిమాండ్ చేశారు.

ఈ పోరాటంలో 370 మంది విద్యార్థులు పోలీసు కాల్పుల్లో మృతి చెందారు. 70,000 మంది అరెస్టు అయ్యారు. కాసు బ్రహ్మానందరెడ్డి ఆధ్యర్యంలోని ప్రభుత్వ అణచివేత చర్యల ద్వారా ఉద్యమాన్ని నీరుకార్చింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

ప్రశ్న 3.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని అంశాలను తెలపండి.
జవాబు.
భారత రాజ్యాంగంలోని 3వ అధికరణ ప్రకారం, కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే సంపూర్ణ అధికారం పార్లమెంట్కు ఉంది. తెలంగాణ విషయంలో కేంద్రం ఈ ఆర్టికల్ కింద రాష్ట్ర పునర్విభజన ప్రక్రియ ఆరంభించింది. భారత రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ పునర్విభజన బిల్లును పరిశీలించి ఒక లాంఛనంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పంపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ బిల్లును తిరస్కరించింది. అంతిమంగా రాష్ట్రపతి బిల్లును పార్లమెంటుకు పంపారు.

లోక్సభ, రాజ్యసభలలో బిల్లు ఆమోదం పొంది మార్చి 1, 2014న రాష్ట్రపతి ఆమోదం పొందింది. భారత ప్రభుత్వం 2 జూన్ 2014న చట్టం అమలులోకి వస్తుందని ప్రకటించింది. దానితో 2 జూన్ 2014న తెలంగాణ, భారత యూనియన్లో 29న రాష్ట్రంగా అవతరించింది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని ప్రధానాంశాలు ఈ విధంగా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రం : తెలంగాణ 10 జిల్లాలు గల 29వ రాష్ట్రం (ప్రస్తుత దేశంలో 28 రాష్ట్రాలు, తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం : 13 జిల్లాలు గల రాష్ట్రం.

హైదరాబాద్ ఉమ్మడి రాజధాని : 2014 నుంచి 10 సంవత్సరాలకు మించకుండా హైదరాబాద్ నగరమే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.

ఉమ్మడి గవర్నర్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉంటాడు. (ప్రస్తుతం వేరు, వేరు గవర్నర్లు ఉన్నారు.)

రాజ్యసభ సభ్యులు : తెలంగాణకు 7 మంది, ఆంధ్రప్రదేశ్కు 11 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు.

లోకసభ సభ్యులు : తెలంగాణ రాష్ట్రానికి 17 మంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25 మంది సభ్యులు ఉంటారు.

శాసనసభ సభ్యులు : తెలంగాణకు 119 మంది శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్కు 175 మంది సభ్యులు ఉంటారు.

శాసనమండలి : తెలంగాణా శాసనమండలి సభ్యులు 40, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు 50.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

ప్రశ్న 4.
జూన్ 2, 2014కు గల ప్రాధాన్యతను వివరించండి.
జవాబు.
భారత రాజ్యాంగంలోని 3వ అధికరణ ప్రకారం కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే సంపూర్ణ అధికారం పార్లమెంట్కు ఉంది. తెలంగాణ విషయంలో కేంద్రం ఈ ఆర్టికల్ కింద రాష్ట్ర పనర్విభజన ప్రక్రియ ఆరంభించింది. భారత రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ పునర్విభజన బిల్లును పరిశీలించి ఒక లాంఛనంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పంపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ బిల్లును తిరస్కరించింది. అంతిమంగా రాష్ట్రపతి బిల్లును పార్లమెంటుకు పంపారు.

లోక్సభ, రాజ్యసభలలో బిల్లు ఆమోదం పొంది మార్చి 1, 2014న రాష్ట్రపతి ఆమోదం పొందింది. భారత ప్రభుత్వం 2 జూన్ 2014న చట్టం అమలులోకి వస్తుందని ప్రకటించింది. దానితో 2 జూన్ 2014న తెలంగాణ భారత యూనియన్లో 29 రాష్ట్రంగా అవతరించింది.

ఈ చట్టం రెండు రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులు ఉండాలని, నదీజదాల పంపకపు ట్రిబ్యునల్ ఉండాలని తెలిపింది.

దశాబ్దాల పోరాటం తరువాత తెలంగాణ రాష్ట్రం రూపొందించింది. జూన్ 2, 2014 చరిత్రలోనూ, తెలంగాణ ప్రజల జ్ఞాపకాలలోనూ నిలిచిపోయింది. ఈ మహా ప్రయత్నానికి కీ.శే. ప్రొఫెసర్ జయశంకర్ వంటి మేథావులు, ఎంతో ఊతం అందించారు. 2014 నాటి యు.పి.ఎ. ఛైర్పర్సన్ శ్రీమతి ఇందిరాగాంధీ, బిజెపి నాయకులు తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన మద్ధతు చాలా విలువైనది. వందలాది అమరుల త్యాగాల ద్వారా సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా మారాలని ఆశిద్దాం.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

ప్రశ్న 5.
తెలంగాణ ప్రాంతీయ సమన్వయ సంఘాల గురించి రాయండి.
జవాబు.
ఆంధ్ర, తెలంగాణ నాయకుల మధ్య జరిగిన పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ ప్రాంతీయ సమన్వయ సంఘం ఏర్పాటు ప్రధానమైంది. ప్రాంతీయ కమిటీ సలహాలను ప్రభుత్వం, రాష్ట్ర శాసనసభ అంగీకరించవలసి ఉండేది. తెలంగాణ ప్రాంతీయ సమన్వయ సంఘానికి ఈ కింది అంశాలపై అధికారం ఉంది.

  1. రాష్ట్ర శాసనసభ ఏర్పాటు చేసే అభివృద్ధి, ఆర్థిక ప్రణాళిక మొదలైన అంశాలు.
  2. స్థానిక స్వపరిపాలన ప్రభుత్వ అంశాలు నగరపాలక సంస్థల రాజ్యాంగ అధికారాలు, ట్రస్టుల అభివృద్ధి, జిల్లా బోర్డులు, జిల్లా అధికార సంస్థల అంశాలు.
  3. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, స్థానిక వైద్యశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు.
  4. ప్రాథమిక, సెకండరీ విద్య.
  5. తెలంగాణ ప్రాంతంలోని విద్యా సంస్థలలో ప్రవేశాల క్రమబద్ధీకరణ.
  6. మద్యపాన నిషేధం.
  7. వ్యవసాయ భూముల అమ్మకాలు
  8. హెచ్. కుటీర, చిన్న తరహా పరిశ్రమలు, వ్యవసాయం సహకార సంస్థలు మార్కెట్లు సంతలు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
హైదరాబాదు రాష్ట్రం.
జవాబు.
భారత యూనియన్ జరిపిన పోలీస్ చర్య పర్యవసానంగా స్వపరిపాలన కలిగిన హైదరాబాద్ రాజ్యం 1948లో హైదరాబాద్ రాష్ట్రంగా భారత యూనియన్లో విలీనమైంది. తరనంతరం జనరల్ చౌదరి రాష్ట్రపాలన పగ్గాలు చేపట్టారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటం వల్ల హైదరాబాద్ రాష్ట్ర పరిస్థితులు అల్లకల్లోలంగా ఉండేవి.

ఆ తరుణంలో భారత ప్రభుత్వం ఐ.సి.యస్. అధికారి యం.కె. వెల్లోడిని పాలనా వ్యవహారాలు చూసేందుకు నియమించింది. తదనంతరం జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రశ్న 2.
ముల్కీ నిబంధనలు.
జవాబు.
ఉర్దూ భాషలో ముల్కీ అంటే ఒక జాతి, రాజ్యం. ఆ జాతికి చెందిన ప్రజలందరిని ముల్కీలంటారు. హైదరాబాద్ రాష్ట్రంలో, 15 సంవత్సరాలు శాశ్వత ప్రాతిపదికగా నివసించిన పౌరులను ముల్కీలంటారు. ఆ మేరకు మెజిస్ట్రేట్ సమక్షంలో ఒక లిఖిత పూర్వకమైన అఫిడవిట్ మీద సంతకం చేసి తన పుట్టిన ప్రదేశానికి తిరిగి వెళ్ళనని ప్రకటించిన వారు ముల్కీలుగా పరిగణించబడతారు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

ప్రశ్న 3.
విశాలాంధ్ర.
జవాబు.
మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఆ రాష్ట్రంలోని రాజకీయ ప్రముఖులు హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు వారితో కలిసి ఒక విశాల తెలుగు రాష్ట్రం ఏర్పాటు జరగాలన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఆ ఆలోచనలను వారు విశాలాంధ్ర నినాదంగా మార్చారు.

ఈ ఆలోచనను జాతీయ స్థాయిలోని కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకత్వానికి సూచనప్రాయంగా తెలియజేసింది. అదే సమయంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా పెద్ద ఎత్తున తెలుగు మాట్లాడే వారందరికీ ఒకే తెలుగు రాష్ట్రం ఉంటే మంచిది అన్న వాదనను ‘విశాలాంధ్ర’ అనే పేరిట ప్రచారంలోకి తీసుకొచ్చింది.

ప్రశ్న 4.
1969 తెలంగాణ ఆందోళన.
జవాబు.
రకరకాల రూపాలలో పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘనకు గురికాగా తెంగాణలో అసంతృప్తి రాజుకోసాగింది. ముఖ్యంగా స్థానికతకు సంబంధించిన ముల్కీ నియమాలు ఉల్లంఘించడంతో, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో జరిగిన అన్యాయానికి ఒక్కసారిగా వ్యక్తమయిన వ్యతిరేకతే 1969లో జరిగిన ‘జైతెలంగాణ ఉద్యమం’. ఆనాటికి తెలంగాణ వారికి హక్కుగా లభించవలసిన 25,000 ఉద్యోగాలు తెలంగాణ లోకి వలసవచ్చిన ఆంధ్రావారికి వెళ్ళసాగాయి.

ముల్కీ నిబంధనలను పూర్తి సరళంగా మార్చివేసి, 4 సంవత్సరాలు తెలంగాణలో ఉంటే చాలు ఎవరైనా తెలంగాణ వారే అనే వెసులుబాటు ఇవ్వడం వల్ల ఈ దుర్మార్గం జరిగిపోయిది. 1969లో జరిగిన ‘ఉద్యమంలో 370 మంది విద్యార్థులు పోలీసు కాల్పుల్లో మృతి చెందారు. 70,000 మంది అరెస్టు అయ్యారు. కాసు బ్రహ్మానంద రెడ్డి ఆధ్వర్యలోని ప్రభుత్వం అణచివేత చర్యల ద్వారా ఉద్యమాన్ని నీరు కార్చింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

ప్రశ్న 5.
శ్రీకృష్ణకమిటీ రిపోర్టు 2010.
జవాబు.
శ్రీకృష్ణకమిటీ రిపోర్టులోని ప్రధానాంశాలు :

  1. రాష్ట్రాన్ని విభజించకుండా ఉంచుతూ, తెలంగాణ ప్రాంత సామాజికార్థికాభివృద్ధి కోసం రాజ్యాంగబద్ధమైన తెలంగాణ రీజన్ కౌన్సిలును ఏర్పాటు చేయటం.
  2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచటం.
  3. ఆంధ్రప్రదేశ్ తెలంగాణా, రాయలసీమ, కోస్తాంధ్రాలు కలిసిన రెండు రాష్ట్రాలుగా విభజించటం, హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం.

ప్రశ్న 6.
తెలంగాణ సంరక్షణల ఉల్లంఘనలు.
జవాబు.
ఎన్నో మంచి ఒప్పందాలు, ఎంతో విశ్వాసంతో మొదలైనా చిత్తశుద్ధి లేకపోతే, అమలులోకి రావు అనేది చారిత్రక సత్యం. పెద్ద మనుషుల ఒప్పందంలో పొందుపరచిన తెలంగాణ ప్రాంత సంరక్షణల ఉల్లంగన ఈ సత్యాన్నే లోకానికి తెలిపింది. మరోసారి వీటితో పలు ఉల్లంఘనలు కింది విధంగా జరిగాయి.

స్థానికత (Domicile) నియమాలను మార్చివేయటం ప్రధాన ఉల్లంఘన. తెలంగాణ ప్రాంతంలో స్థానికత రావాలంటే 12 సంవత్సరాల నిరంతరాయ నివాసం ఉండాలనే నియమం ఉండి. పెద్ద పమనుషుల ఒప్పందం దానిని ఒప్పుకొన్నది.

అమలు విషయానికి వచ్చేసరికి దానిని 4 సంవత్సరాలకు కుదించారు. ఈ ఉల్లంఘన వల్ల 50 వేలమంది ఆంధ్ర ప్రాంతీయులు తెలంగాణ ప్రాంత ఉద్యోగాల్లోకి చేరిపోయారు. తెలంగాణ వారికి ఒక్క దెబ్బతో విద్య, ఉద్యోగాలలో అవకాశాలు పోయాయి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

ప్రశ్న 7.
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్.
జవాబు.
ఆంధ్రప్రదేశ్ పనర్విభజన చట్టం 2014 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఈ చట్టం 2014 నుండి 10 సంవత్సరాలకు మించకుండా హైదరాబాద్ నగరమే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని స్పష్టంగా పేర్కొంది.

ప్రశ్న 8.
సకల జనుల సమ్మె.
జవాబు.
తెలంగాణ ఉద్యోగులు, విద్యార్థులు ఒక మహా సమ్మె తలపెట్టారు. 13 సెప్టెంబర్ నుంచి 24 అక్టోబర్ 2011 వరకు నలభై రోజులు తెలంగాణలో సాధారణ జనజీవితం స్తంభించింది. అన్ని వృత్తులవారు ఈ సమ్మెలో పాల్గొన్నారు. రోడ్లపైనే వంటావార్పులు, రైల్ రోకో, రోడ్డు దిగ్బంధాలు ఈ సమ్మె కాలంలో నిత్యకృత్యమైనాయి. ఇది చారిత్రాత్మకమైన ఉద్యమంగా
నిలిచింది.

ప్రశ్న 9.
మిలియన్ మార్ట్.
జవాబు.
17 ఫిబ్రవరి 2011లో మొదలుపెట్టి తెలంగాణ ప్రాంత ఉద్యోగులు 16 రోజులు సహాయనిరాకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడు లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగులు దీనిలో పాల్గొన్నారు.
దీని తరువాత తెలంగాణ జె.ఏ.సి. పదిలక్షల మంది (మిలియన్) జనాలను హైదరాబాద్కు ర్యాలీగా తరలి రమ్మని పిలుపునిచ్చారు.

అదే సంవత్సరం ఈజిప్ట్ లక్షలాది మంది ప్రజలు కైరోను దిగ్బంధించి అధికార మార్పు కోసం చేసిన పోరాటం స్ఫూర్తిగా దానికి మిలియన్ మార్చ్ అని పేరు పెట్టారు. మార్చ్ 10, 2011న హైదరాబాద్లో మిలియన్ మార్చ్ జరిగింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

ప్రశ్న 10.
రాజకీయ జెఎసి.
జవాబు.
రాజకీయ సంయుక్త కార్యాచరణ కమిటీ (Political JAC) : రాజకీయ సంయు కార్యాచరణ కమిటీ (Political JAC) ని డిసెంబర్ 24, 2009 న ఏర్పరచారు. దీనిలో ప్రధాన రాజకీయ పార్టీలైన తెలంగాణ రాష్ట్ర సమితి (TRS), భారతీయ జనతాపార్టీ (BJP), భారత కమ్యూనిస్టు పార్టీ (CPI), భారత జాతీయ కాంగ్రెస్ (INC), తెలుగుదేశం పార్టీ (TDP), సిసిఐ (ఎం.ఎల్), న్యూడెమొక్రసీ తదితర రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు తదితరులు అంతర్భాగమై ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నిర్వహించాయి.

ప్రశ్న 11.
విద్యార్థుల జెఎసి.
జవాబు.
తెలంగాణ ఉద్యమం ప్రారంభించి, తీవ్రతరం చేసి వివిద కళాశాలలు విద్యార్థులు, విశ్వవిద్యాలయ విద్యార్థులు రాష్ట్ర సాధనకు ఎంతో కృషి చేశారు. వివిధ సిద్ధాంత భావజాలాలలను నమ్మే విద్యార్థులు తమ మధ్యగల సైద్ధాంతిక విభేదాలను పక్కన బెట్టి తెలంగాణ ఉద్యమం నిర్వహించడానికి ఒక్కటై, పోరాడడానికి ఒక సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి)ని ఏర్పరచారు.

ఈ తరహా జెఎసిలు అనేక విశ్వవిద్యాలయాలు, కళాశాలలు స్థాయిల్లో ఏర్పడ్డాయి. వీటిలో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు జెఎసి (OUJAC), కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు జెఎసి (KUJAC), ఉద్యమాన్ని క్రియాశీలంగా నడపడంలో కీలకపాత్ర పోషించాయి.

TS Inter 2nd Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం – చారిత్రక నేపథ్యం

Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 1st Lesson భారత రాజ్యాంగం – చారిత్రక నేపథ్యం Textbook Questions and Answers.

TS Inter 2nd Year Political Science Study Material 1st Lesson భారత రాజ్యాంగం – చారిత్రక నేపథ్యం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారత జాతీయోద్యమ ఆవిర్భావానికి కారణాలను వివరించండి.
జవాబు.
ప్రజాబాహుళ్యంలో స్వయంపాలన – స్వేచ్ఛ తదితర సంవర్ధక ఆకాంక్షల ప్రాతిపదికగా భారతదేశంలో జాతీయవాదం వెళ్ళాలనుకుంది. ప్రపంచంలోని ఇతర దేశాల జాతీయోద్యమాల కంటే భారత జాతీయోద్యమం ఎంతో విశిష్టమైనదిగా మేధావులు పేర్కొంటారు.

భారతీయులకు ఒక సుసంపన్న వారసత్వం, సంస్కృతి, గత వైభవం ఉన్నాయి. సగర్వంగా స్వయంపాలన చేపట్టే సామర్థ్యం భారతీయులకు ఉంది. ఈ కారణం వల్ల భారతీయులు స్వయంపాలనకు జాతీయోద్యమాన్ని చేపట్టడంలో ఆశ్చర్యం లేదు.

మానసికంగా గతవైభవ, సుసంపన్న సంస్కృతి వారసత్వ భావనలు ఒకవైపు, బ్రిటీష్ పాలన దోపిడి- నిరంకుశత్వం మరోవైపు భారతీయులు ఒక బలమైన జాతీయోద్యమాన్ని చేపట్టడానికి దారితీసింది.

1. బ్రిటిష్ వలసవాద పాలన :
భారతదేశంలో బ్రిటీషు వారి పాలనకు అనుకూల, ప్రతికూల ప్రభావాలు రెండూ ఉన్నాయి. బ్రిటిషు పాలన భారతదేశంలో ఒక గట్టి పరిపాలన నిర్మాణాన్ని వివిధ శాఖల రూపంలో హేతుబద్ధంగా విభజించి ప్రవేశపెట్టింది. బ్రిటిషువారు పరిపాలన అవసరాల కోసం ఇండియన్ సివిల్ సర్వీస్ (ICS) ప్రారంభించారు.

భారత శిక్షా స్మృతి (Indian Penal Code), నేర విచారణ స్మృతి (Criminal Procedure Code) సంహితలను తయారుచేసి భారతదేశంలో పటిష్టమైన న్యాయవ్యవస్థ ఏర్పాటుకు కృషి చేశారు. పోస్టు – టెలిగ్రాఫ్, సమాచారవ్యవస్థ, రైల్వేలు, జాతీయ రహదారులు, ప్రధాన నీటి పారుదల ప్రాజెక్టులు ఏర్పరచి అభివృద్ధికి అవసరమయ్యే మౌలిక సదుపాయాలు ఏర్పరచారు.

2. సాంఘిక-సాంస్కృతిక పునరుజ్జీవం :
భారతదేశంలో 19వ శతాబ్దంలో వచ్చిన అనేక సాంఘిక-సాంస్కృతిక ఉద్యమాలు ప్రజల్లో సాంఘిక చైతన్యాన్ని, సాంస్కృతిక జాతీయవాద భావనలను ప్రోది చేశాయి.

ఈ ఉద్యమాలన్నింటికీ రాజా రామ్ మోహన్ రాయ్ స్థాపించిన బ్రహ్మసమాజ్ ఉద్యమం అగ్రగామిగా నిలిచి, సాంఘిక దురాచారాలైన సతీసహగమనం, బాల్యవివాహాలు, వితంతువులుగా మార్చడం, విగ్రహారాధన తదితరులకు వ్యతిరేకంగా సంస్కరణలు జరగాలని పిలుపునిచ్చింది.

దీనిని అనుసరించి ఆర్యసమాజం, రామకృష్ణ మిషన్, దివ్యజ్ఞాన సమాజం ప్రార్థన సమాజం, సత్యశోధక సమాజం, అలీఘర్ ఉద్యమం, వహాబీ ఉద్యమం తదితర సాంఘిక ఉద్యమాలు వచ్చాయి. ఈ ఉద్యమాలు ప్రజల్లో జాతీయతవాద భావనను, సాంఘిక – సాంస్కృతిక గుర్తింపును, దేశభక్తిని నింపి పరోక్షంగా ప్రజలు స్వయంపాలన కోరుకోవడానికి ప్రేరణ నిచ్చాయి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

3. మహాతిరుగుబాటు :
1857 వ సంవత్సరంలో భారతీయ సైన్యంలోని వేలాదిమంది సిపాయిలు, పదవీచ్యుతులైన సంస్థానాధీశులు, గ్రామీణ చేతివృత్తులవారు, చిన్నకారు సన్నకారు రైతులు భారతదేశంలో బ్రిటిషు వారి పాలనను అంతమొందించడానికి సమైక్య తిరుగుబాటు చేశారు.

బ్రిటిషు పాలకులు స్వదేశీ సంస్థానాల పాలకుల పట్ల సాధారణ ప్రజానీకంపట్ల చూపే నిరంకుశ పాశవిక విధానాలతో ప్రజలు విసిగి వేసారిపోయారు. ప్రత్యేకంగా లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన ‘రాజ్యాసంక్రమణ సిద్ధాంతం’ (Doctrine of Lapse) స్వదేశీ సంస్థానాధీశుల్లో ఆగ్రహం తెప్పించింది.

4. ఆంగ్లవిద్య :
భారతదేశంలో బ్రిటీషువారు ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు. దీనివల్ల సహేతుక శాస్త్రీయ భావనలు ప్రజాభిప్రాయాలను తీర్చిదిద్దాయి. ఆంగ్లవిద్య భారతీయులకు కీలక రాజకీయ ఆదర్శాలైన స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, ప్రజాస్వామ్యం తదితర విలువలపై అవగాహన కల్పించాయి. ఆంగ్ల విద్యను అభ్యసించిన మధ్యతరగతి వర్గాలు పాశ్చాత్య రాజనీతి తత్త్వవేత్తలైన జెర్మీబెంథాం.

జాన్ సూవర్ట్ మిల్, జాన్లాక్ రూసో, ఆడమస్మిత్, హెర్బర్ట్ స్పెన్సర్ తదితరుల తాత్త్విక భావజాలం నుంచి స్ఫూర్తిని పొందారు. అయితే ఈ ఆదర్శాలను, విలువలను బ్రిటిష్ వారు తమ మాతృదేశమైన ఇంగ్లాండును మాత్రమే గౌరవించి, భారతదేశంలో ఆచరించేవారు కాదు.

ఈ విధమైన ద్వంద్వప్రమాణాలు మధ్య తరగతి వర్గాలను ఆగ్రహానికి గురిచేశాయి. వారు భారత ప్రజానీకాన్ని రాజకీయ ఆదర్శాలు – విలువలపై చైతన్యపరచి, బ్రిటిష్ పాలనను ప్రశ్నించడం మొదలు పెట్టారు. ప్రధానంగా సమన్యాయ పాలన (Rule of Law) జాతీయవాదం, స్వయం ప్రభుత్వం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగత వాదం విద్యావంతులైన వర్గాల్లో ఆశలు రేకెత్తించాయి. దానితో మధ్యతరగతి విద్యావంతులు స్వయంపాలన, స్వాతంత్య్రం లక్ష్యాలుగా జాతీయోద్యమాన్ని ప్రారంభించారు.

5. ఆర్థిక దోపిడి :
బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని ఒక వలస ప్రాంతంగా మార్చి, ఆర్థిక వ్యవస్థను తమ ప్రయోజనాల కోసం దోపిడి చేశారు. బ్రిటిష్వారు భారతదేశంలోని ముడిపదార్థాలను ఇంగ్లాండ్లోని తమ పరిశ్రమలను నిర్వహించుకోవడానికి అతి స్వల్ప ధరలతో తరలించుకు పోయేవారు.

అలాగే ఇంగ్లాండ్లోని తయారైన వస్తువులను భారత మార్కెట్లో నింపివేసేవారు. భారతీయ పారిశ్రామికవేత్తల నుండి, చిన్న తరహా గ్రామీణ చేతివృత్తుల వారినుండి వస్తువులు-సేవల విషయంలో పోటీని నివారించడానికి కఠినతరమైన చర్యలకు పాల్పడేవారు.

ముఖ్యంగా బ్రిటిష్ వారు భారతీయ కుటీర పరిశ్రమలపైన, గ్రామీణ చేతివృత్తుల వారిపైన కఠిన నిబంధనలు విధించేవారు. దీనివల్ల భారతీయ చేతివృత్తులవారు తమతమ వృత్తులను వదిలివేసి, అప్పటికే ఎంతోమందితో పెనుభారంగా ఉన్న వ్యవసాయరంగంలోకి బదిలీ అయ్యారు. మరికొంతమంది గ్రామీణ చేతివృత్తుల వారు మహాసముద్రాలను కూడా లెక్కచేయక, విదేశాలకు కడుపు చేతపట్టుకొని వలసలు పోయారు.

6. కరువు కాటకాలు, పేదరికం :
భారతదేశం 19వ శతాబ్దం చివరిభాగంలో ఎన్నో కరువు కాటక పరిస్థితులను, అంట వ్యాధులను ఎదుర్కొంది. ప్రధానంగా 1873, 1875, 1877, 1895 సంవత్సరాలలో వందలాది మంది ప్రజలు కరువు కాటకాలతో, ఆకలి చావులతో ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనలు భారతీయ, సమాజంలో అశాంతిని, అలజడిని తీసుకువచ్చింది.

7. వార్తాపత్రికలు :
బ్రిటిష్ పాలన కాలంలో ఎన్నో వార్తాపత్రికలు, దినపత్రికలు, నియతకాలిక పత్రికలు భారతీయులలో జాతీయవాద భావాలను ప్రేరేపించాయి. వీటిలో ప్రముఖమైనవి అమృత బజారపత్రిక, కేసరి, పాట్రియాట్, ది హిందూ నవజీవన్, ఆంధ్రపత్రిక మొదలైనవి. ఈ పత్రికలు ప్రజలలో దేశభక్తి, జాతీయవాద భావాలను పెంచి పోషించాయి.

8. పాశవిక పాలన :
భారతదేశంలో బ్రిటిష్ పాలనా యంత్రాంగం భారతీయులకు వ్యతిరేకంగా పాశవికంగా వ్యవహరిస్తూ, నిరంకుశ చట్టాలను ప్రయోగించేది. వీటిలో దేశద్రోహ సమావేశాల చట్టం (Seditious Meetings Act), ఆయుధాల చట్టం (Arms Act), ప్రాంతీయ వార్తాపత్రికల చట్టం, (Vernacular press Act), రౌలత్ చట్టం (Rowlat Act) తదితర చట్టాలను ప్రయోగించి ప్రజల స్వేచ్ఛలను హరించేది. ప్రజల స్వేచ్ఛలను అడ్డుకోవడమేకాక, పత్రికాస్వేచ్ఛపై నిర్హేతుకమైన ఆంక్షలు విధించేది.

9. జాతి విచక్షణ :
బ్రిటిష్ ప్రభుత్వం న్యాయప్రక్రియల్లో, సివిల్ సర్వీసుల ఉద్యోగాల ప్రవేశంలో, హక్కులను అనుమతించడంలో ఎంతో వివక్షపూరిత ధోరణి ప్రదర్శించేది. జాతీయోద్యమ ప్రారంభదశలో భారతీయులు, సివిల్ సర్వీస్ ఉద్యోగాలలో ప్రవేశాలకు సంబంధించి విషయాలలో బ్రిటీషు అభ్యర్థులతో సమానంగా అవకాశాలు ఉండాలని డిమాండ్ చేసేవారు.

అలాగే బ్రిటిష్వారి వివక్షత విధానం. ఇల్బర్ట్ బిల్లు వివాదంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. భారతదేశంలోని యూరోపియన్ సమూహాలు భారతీయ న్యాయ మార్పులు తమ నేరాలను విచారించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ తరహా ధోరణులు భారతీయుల మనోభావాలను దెబ్బతీయడంతో, అది జాతీయోద్యమానికి దారితీసింది.

10. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన (Inceptino of Indian National Congress) :
భారత జాతీయోద్యమ చరిత్రలో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన (1885) ఒక మైలురాయిగా వర్ణించవచ్చు. మాజీ బ్రిటిష్ అధికారులు స్థాపించిన ఆ సంస్థ ప్రారంభంలో బ్రిటిష్ ప్రభుత్వ విధానాలను వెల్లడించడం, నిర్మాణాత్మక విమర్శలను చేయడం వంటి కర్తవ్యాలను నిర్వర్తించింది.

క్రమేణా ఆ సంస్థ భారతీయుల స్వపరిపాలన ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచింది. ప్రజా సమస్యలపై సమిష్టి పోరాటం, భారతీయుల జాతీయలో భావాలను పెంపొందించడం వంటి ఆశయాలతో జాతీయోద్యమానికి చోదక శక్తిగా ఎదిగింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 2.
భారత జాతీయోద్యమంలోని వివిధ దశలను వర్ణించండి.
జవాబు.
ప్రసిద్ధ భారతీయ చరిత్రకారుడు రమేష్ చంద్ర భారత జాతీయోద్యమాన్ని మూడు దశలుగా విభజించాడు. అవి:

  1. మితవాద దశ (1885 – 1905)
  2. అతివాద దశ (1906 -1919)
  3. గాంధీ దశ (1920 – 1947).

1. మితవాద దశ (1885 – 1905) :
భారత జాతీయ కాంగ్రెస్ లోని తొలి నాయకులు “మితవాదులు”గా పేర్కొనబడిరి. 1885 నుండి 1905 వరకు ఉన్న దశను భారత జాతీయోద్యమంలో మితవాద దశ అంటారు.

కాంగ్రెస్లోని మితవాదులు :
భారత జాతీయ కాంగ్రెస్లోని తొలి నాయకులను మితవాదులందురు. 1885 – 1905 -మధ్యకాలంలో మితవాద నాయకుల నాయకత్వంలో కాంగ్రెన్ నడిచెను. వారికి బ్రిటిష్ వారి న్యాయ విధానం నందు పూర్తి విశ్వాసము కలదు. అందువల్లనే మితవాదులు “ప్రార్థన, విజ్ఞప్తి, నిరసన” (Prayer, Petition, Protest) అనే పద్ధతులను అనుసరించి బ్రిటిష్ ప్రభుత్వంతో బేరసారాలాడే దృక్పథాన్ని అవలంభించారు.

కాంగ్రెస్ పార్టీలోని ప్రముఖ మితవాదులు దాదాబాయి నౌరోజీ, ఫిరోజే మెహతా, డి.యి. వాచా, డబ్ల్యు.సి. జెనర్జీ, ఎస్.ఎన్. బెనర్జీ, R.C. దత్తు, L.M. గోష్ మరియు G.K. గోఖలే మొదలగువారు.

మితవాదుల కోర్కెలు :

  1. సైనిక ఖర్చును తగ్గించుట
  2. ఇండియన్ కౌన్సిల్ను రద్దుచేయుట
  3. ఇంగ్లండ్ బాటు భారతదేశంలో కూడా సివిల్ పరీక్షలు నిర్వహించుట
  4. శాసన మండలిని విస్తృతపరచి భారతీయులను ఎక్కువ సంఖ్యలో సభ్యులను చేయుట.

2. అతివాద దశ (1905 – 1920) :
భారత జాతీయోద్యమంలోని రెండవ దశను అతివాద దశగా పేర్కొంటారు. 1906-1919 మధ్యకాలంలో కాంగ్రెస్లో అతివాదులు ప్రధాన పాత్ర పోషించారు. అతివాదులలో ప్రముఖులు బాలగంగాధర్ తిలక్, లాలాలజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్, అరవిందఘోష్ మొదలగువారు. వీరు అతివాద ఉద్యమంలో అగ్రశ్రేణి నాయకులు మితవాదుల సామరస్య వైఖరిని అతివాదులు విమర్శించారు.

అతివాద విధానాలు :

  1. అతివాదులలో ప్రముఖుడైన బాలగంగాధర్ తిలక్ ‘స్వరాజ్యం నా జన్మహక్కు – దాన్ని సాధించి తీరుతాను’ అని ప్రకటించెను. –
  2. అతివాదులకు బ్రిటిష్ వారి దయాదాక్షిణ్యాలపై ఏ మాత్రం విశ్వాసం లేదు. అనుకొన్నది సాధించుటయే అతివాదుల కార్యక్రమం.
  3. స్వరాజ్యం – స్వదేశీ నినాదాలను లేవనెత్తిరి.
  4. జాతీయ విద్యా విధానాన్ని సమర్థించిరి, ప్రాంతీయ భారతీయ భాషల ద్వారా విద్యాబోధన జరగాలి అని తెల్పిరి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

3. గాంధీ దశ (1920 – 1947) :
స్వాత్రంత్రోద్యమ మూడవ దశ గాంధీజీ నాయకత్వంలో నడిచింది. 1920-1947 మధ్యకాలంలో మహాత్మాగాంధీ నాయకత్వంలో జాతీయోద్యమం నడిచింది. అందుచే ఈ కాలమును గాంధీయుగం అందురు. ఈ సమయంలో క్రాంగ్రెస్ శాంతియుత పద్ధతుల ద్వారా పూర్ణస్వరాజ్య సాధన కోసం ఉద్యమించెను. విప్లవ మార్గంలో పోతున్న ప్రజలను శాంతియుత, ప్రజాస్వామిక పద్ధతుల ద్వారా నడిపించిన ఖ్యాతి మహాత్ముడికి దక్కెను.

సత్యాగ్రహం :
గాంధీజీ సత్యాగ్రహం అనే విధానాన్ని ప్రతిపాదించెను. సత్యాగ్రహం అంటే సత్యమైన సహనం. దీనికి అహింసా విధానమే మూలము.

రౌలత్ చట్టం వ్యతిరేకత :
భారత రాజకీయోద్యమాన్ని నడిపించిన తిలక్ మరణించడంతో మహాత్మాగాంధీ జాతీయోద్యమ నాయకుడయ్యెను. నాయకత్వం చేపట్టిన వెంటనే మొట్టమొదట రౌలత్ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా హర్తాళ్లు జరపవలసిందిగా గాంధీజీ పిలుపు ఇచ్చెను.

సహాయ నిరాకరణోద్యమం :
1920 ఆగస్టులో గాంధీజీ తొలిసారిగా సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించెను. ఈ ఉద్యమంలో కొన్ని అంశాలు ఇమిడి ఉన్నాయి. అవి : విదేశీ వస్తువులను బహిష్కరించుట, న్యాయస్థానాలను బహిష్కరించుట, పాఠశాలలు, కళాశాలలను, శాసనసభలను బహిష్కరించుట మొదలగునవి. ఈ అంశాల ప్రాతిపదికపై సత్యం అహింసా పద్ధతుల ద్వారా మాత్రమే పోరాటం సాగించాలని గాంధీజీ పిలుపునిచ్చెను.

శాసనోల్లంఘన ఉద్యమం:
జాతీయోద్యమ చరిత్రలో శాసనోల్లంఘన ఉద్యమం ఒక గొప్ప మలుపు. 1930 మార్చితో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం ద్వారా ఈ ఉద్యమాన్ని ప్రారంభించెను. గుజరాత్ తీరంలోని దండి గ్రామంలో ఉప్పు తయారుచేయడం ద్వారా ఉప్పు చట్టాన్ని గాంధీజీ అతిక్రమించెను. ఈ ఉద్యమంలో భాగంగా విదేశీ వస్తు బహిష్కరణ, ఖద్దరు ధరించుట, మద్యపాన నిషేధం, జెండా ఆవిష్కరణ వంటి కార్యక్రమాలు చేపట్టారు.

గాంధీ – ఇర్విన్ ఒడంబడిక :
మహాత్మాగాంధీ – వైశ్రాయ్ ఇర్విన్ల మధ్య ఒక అవగాహన కుదరడంతో శాసనోల్లంఘన ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు.

క్విట్ ఇండియా ఉద్యమం :
క్రిప్స్ రాయబారం విఫలం కావడంతో కాంగ్రెస్ గాంధీజీ అధ్యక్షతన 1942, ఆగస్టు 8న బొంబాయిలో సమావేశమై క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించెను. చిట్టచివరి స్వాతంత్ర్యోద్యమ ఘట్టం క్విట్ ఇండియా ఉద్యమం. ఈ తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ గాంధీజీ తన ఉపన్యాసాన్ని “విజయమో – వీరస్వర్గమో” (Do or Die) అంటూ ముగించారు. ఈ పిలుపు ప్రజల్లో ఉద్రేకం, ఉత్సాహం నింపి పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగడానికి దారితీసెను.

చివరగా క్యాబినెట్ మిషన్ ప్లాన్, మౌంట్ బాటన్ సూచనల మేర దేశ విభజనకు కాంగ్రెస్ నాయకులు అంగీకరించిరి. భారతదేశం, భారత్-పాకిస్తాన్లుగా విడిపోయెను. 1947, ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్య్రమును పొందెను.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 3.
భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రధాన అంశాలను, విమర్శనాత్మకంగా విశ్లేషించండి.
జవాబు.
1919 చట్టంలోని లోపాలను సరిదిద్దడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని రూపొందించెను. కొన్ని ఇతర కారణాలు కూడా ఈ చట్ట రూపకల్పనకు దోహదం చేశాయి. సైమన్ కమిషన్ నివేదిక పరిణామాలు, స్వరాజ్యవాదుల ఉద్యమాలు, నెహ్రూ నివేదిక, జిన్నా నివేదిక, గాంధీజీ ఆధ్వర్యంలో సాగిన శాసనోల్లంఘన ఉద్యమం మొదలగునవి ఈ చట్టం చేయడానికి దారితీసిన కొన్ని ముఖ్యమైన అంశాలు. ఈ చట్టం చాలా విస్తృతమైనది. ఇందులో 321 అధికరణాలు, 13 షెడ్యూళ్ళు ఉన్నాయి.

ప్రధానాంశాలు :
1. 1935 భారత ప్రభుత్వ చట్టం అతివివరణాత్మకమైన శాసనం.

2. బ్రిటిష్ పాలిత ప్రాంతాలలోనూ, సంస్థానాలలోనూ అఖిల భారత సమాఖ్య అనే ఒక నూతన వ్యవస్థను ఈ చట్టం ఆవిష్కరించెను.

3. పరిపాలనాంశాలను మూడు జాబితాలుగా విభజించెను. అవి :
i) 59 పాలనాంశాలతో కూడిన కేంద్ర జాబితా (Central list)
ii) 54 పాలనాంశాలతో కూడిన ప్రాంతీయ జాబితా (Provincial list)
iii) 36 పాలనాంశాలతో కూడిన ఉమ్మడి జాబితా (Concurrent list)

ఈ మూడు జాబితాలలో పేర్కొనని అవశిష్టాంశాల (Residuary items) పై శాసనాధికారం గవర్నర్ జనరల్ కు ఇచ్చెను.
ఎ) కేంద్ర జాబితాలో ఉన్న అంశాలపై కేంద్ర ప్రభుత్వానికే శాసనాధికారం ఉంటుంది.
ఉదా : విదేశీ వ్యవహారాలు, కరెన్సీ, నాణేలు, సైనిక దళాలు మొదలగు అంశాలు.
బి) ప్రాంతీయ లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాంతీయ జాబితాలో ఉన్న అంశాలపై శాసనాధికారం కలదు.
ఉదా : పోలీస్, విద్య, ప్రాంతీయ పబ్లిక్ సర్వీసులు మొదలైన అంశాలు.
సి) ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ శాసనం చేయవచ్చును.
ఉదా : క్రిమినల్ లా & ప్రొసీజర్, సివిల్ ప్రొసీజర్, వివాహాలు, విడాకుల వంటి అంశాలు

4. కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టిరి. కేంద్ర కార్యనిర్వహణాధికారం గవర్నర్ జనరల్కు ఇచ్చారు. కేంద్ర పాలనాంశాలను రిజర్వుడ్ ట్రాన్స్ఫర్డ్ పాలనాంశాలని విభజించారు. దేశ రక్షణ, మత విషయాలు, విదేశీ వ్యవహారాలు మొదలైన ప్రాముఖ్యం ఉన్న అంశాలు అన్నీ రిజర్వుడ్ పాలనాంశాలు.

వీటిని గవర్నర్ జనరల్ నిర్వహిస్తాడు. మిగిలిన అంశాలు ట్రాన్స్ఫర్డ్ అంశాలు. వీటిని ప్రజాప్రతినిధులైన శాసనసభలోని మంత్రులు నిర్వహిస్తారు. ఆరు రాష్ట్రాల్లో ద్వంద్వ సభా విధానాన్ని అమలు చేయడం జరిగెను.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

5. రాష్ట్రాల్లో స్వయం పాలనా ప్రతిపత్తి ప్రవేశపెట్టడం జరిగెను. అక్కడ బాధ్యతాయుత ప్రభుత్వం కూడా నెలకొల్పారు. గవర్నర్లకు విశేషమైన విచక్షణాధికారాలు ఇచ్చారు.

6. ఫెడరల్ న్యాయస్థానాన్ని ఢిల్లీలో స్థాపించారు. దానికి 1935 చట్టాన్ని కూడా వ్యాఖ్యానించే అధికారం కలదు.

7. 1858 చట్టము సృష్టించిన భారత మండలిని రద్దు చేశారు.

8. 1935 చట్టాన్ని సవరించడానికి బ్రిటిష్ పార్లమెంట్క అధికారం ఇచ్చారు. సంస్థానాలకు ప్రత్యేక హోదా కల్పించారు.

9. గవర్నర్ జనరల్కు విస్తృత అధికారాలు ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో గవర్నర్ జనరల్ సమాఖ్య వ్యవస్థను రద్దు చేయవచ్చు.

10. ఓటు హక్కును ఇతర వర్గాలకు కూడా విస్తరించారు.

విమర్శ :
భారత రాజ్యాంగ చరిత్రలో భారత ప్రభుత్వ చట్టం, 1935 ప్రగతి శీలక చట్టమని రాజ్యాంగ వాదులు భావించారు. ఎందుకంటే ఈ చట్టం ఆధారంగానే స్వతంత్ర భారత రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం జరిగింది. పూర్వ చట్టాలతో పోల్చితే ఈ చట్టం భారతదేశంలో మరింత బాధ్యతాయుత ప్రభుత్వ నిర్మాణానికి, స్పష్టమైన శాసన నిర్మాణ, న్యాయశాఖల అధికారాల పరిధిని విస్తృతం చేసింది.

అయితే ఈ చట్టాన్ని భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, నిశితంగా విమర్శించాయి. భారత వ్యతిరేక చట్టంగా సి.వై.చింతామణి పేర్కొన్నాడు. ఈ చట్టం ప్రాథమికంగా చెడిపోయిన, ఏ మాత్రం ఆమోదయోగ్యం కాని చట్టంగా మహ్మదాలీ జిన్నా విమర్శించాడు.

ఇక జవహర్లాల్ నెహ్రూ ఈ చట్టం గురించి వ్యాఖ్యానిస్తూ సామ్రాజ్యవాద దృక్పథం ఉన్న బ్రిటన్ రాజనీతిజ్ఞతతో భారతదేశం కోసం రూపొందించిన చట్టంగా వర్ణించాడు. రాజేంద్రప్రసాద్ మినూమసానీ, కె.టి.షా వంటి ప్రముఖ నాయకులు ఈ చట్టంలో ఎన్నో అసంగతమైన విషయాలున్నాయని వ్యాఖ్యానించారు.

ఇక బ్రిటన్లో క్లిమెంట్ అట్లీ వంటి ప్రతిపక్ష నాయకులు కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకించారు. ఏమాత్రం ఇష్టంలేని ప్రాంతాలను కలిపి ఉంచే ఉద్దేశంతో రూపొందిన, వింత పోకడలు గల రాజ్యాంగ సమ్మేళనంగా కొందరు ఈ చట్టాన్ని పరిగణించారు. భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో గోచరించే భూస్వామ్య వ్యవస్థను దృఢతరం చేయడానికి బ్రిటిష్ పాలకులు ఆడిన నాటకమే ఈ చట్టమని సుభాష్ చంద్రబోస్ విమర్శించాడు.

ఈ చట్టం సూచించిన అఖిల భారత సమాఖ్య ఆచరణ సాధ్యం కాదని కొందరు వాదించారు. ప్రతిపాదిత సమాఖ్యలో పాల్గొనే వివిధ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల, సంస్థానాధికారుల స్థాయిలలో తేడాలుండటం, రాష్ట్రాలు, సంస్థానాల మధ్య పాలనపరమైన వైవిధ్యాలు ఉండటంతో సమాఖ్య వ్యవస్థ సజావుగా కొనసాగదని వారు భావించారు.

అలాగే గవర్నర్ జనరల్, రాష్ట్ర గవర్నర్లకు మితిమీరిన అధికారాలను ఈ చట్టం కల్పించడంతో భారతీయులు కోరుకున్న స్వయంప్రతిపత్తి ఒక నినాదంగా మిగిలిపోయింది. ఈ చట్టం ద్వారా మైనారిటీలకు కల్పించిన ప్రత్యేక రక్షణలు భారతదేశంలో జాతీయతాభావ వికాసానికి అవరోధంగా నిలిచాయి.

ఈ చట్టం భారత వ్యవహారాల కార్యదర్శిని ఒక రాజులాగా వ్యవహరించే అవకాశాన్ని ఇచ్చింది. ఇక కేంద్ర శాసనసభలోని రాష్ట్రాల మండలి (Council of State) ని ఈ చట్టం ప్రగతి నిరోధక భావాలు, దుష్టజనకూటమి, సాంప్రదాయ భావాలు ఉన్న రాజకీయ నాయకుల నిలయంగా రూపొందించింది. మొత్తంమీద ఈ చట్టం ద్వారా కల్పించిన రక్షణలన్నీ కంటితుడుపు చర్యగా మిగిలిపోయాయని చెప్పవచ్చు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 4.
భారత రాజ్యాంగ ప్రధాన లక్షణాలను వివరించండి.
జవాబు.
భారత రాజ్యాంగ ప్రధాన లక్షణాలు :

1. అతిపెద్ద లిఖిత, వివరణాత్మక రాజ్యాంగం :
భారత రాజ్యాంగం ఒక అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ రూపకల్పన చేసి, చర్చించి మౌలిక చట్టంగా తయారు చేసింది. భారత రాజ్యాంగ రచనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది.

భారత రాజ్యాంగాన్ని 395 నిబంధనలు, 22 భాగాలు. 12 షెడ్యూళ్ళతో ఏర్పరచారు. భారత రాజ్యాంగం అతిపెద్ద పరిమాణంలో రూపొందడానికి ఎన్నో కారణాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తదితర పాలన ఏర్పాట్ల గురించి ఒకే రాజ్యాంగంలో చర్చించారు.

అలాగే సమాజంలోని షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలు, ఇతర వెనుకబడ్డ వర్గాలు మొదలైన వారి ప్రయోజనాల పరిరక్షణకు వివిధ ఏర్పాట్లు రాజ్యంగంలో పొందుపరచారు. ఇదే క్రమంలో ప్రత్యేక రాజ్యాంగబద్ధ సంస్థలైన ఎన్నికల సంఘం, యూనియన్ పబ్లిక్ సర్వీసు కమీషన్, రాష్ట్రపబ్లిక్ సర్వీసు కమీషన్ల ఏర్పాట్లు అధికారాలపై సంగ్రహ వివరణ రాజ్యాంగంలో ఉంది.

ఇదే విధంగా భారత రాజ్యాంగం పౌరులకు గల ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, నిర్దేశక నియమాలు, కేంద్ర – రాష్ట్ర సంబంధాలు, అధికార భాష – వివిధ ప్రాంతీయ భాషల గుర్తింపుకు సంబంధించిన అంశాలను విస్తృతంగా చర్చించింది. వీటన్నింటివల్ల భారత రాజ్యాంగం పరిమాణంలో పెద్దదిగా తయారైంది.

2. సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం:
భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించడంతో భారతదేశం ఒక సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మారింది. భారతదేశం పూర్తి సాధికారతతో స్వేచ్ఛ – స్వాతంత్య్రాలలో దేశీయంగా బాహ్యంగా నిర్ణయాలు తీసుకొనే సార్వభౌమాధికారాన్ని పొందింది.

రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాద లౌకిక అనే పదాలను రాజ్యాంగం 42వ సవరణ ద్వారా 1976 లో పొందుపరచారు. దీనివల్ల రాజ్యం ప్రజలందరికీ సాంఘిక-ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందిస్తూ, అన్ని రకాల దోపిడీలను అంతం చేస్తుంది.

3. విశిష్ట ఆశయాలు లక్ష్యాలు :
భారత రాజ్యాంగం ఎన్నో విశిష్ట ఆశయాలు-లక్ష్యాలను కలిగి ఉంది. భారత రాజ్యాంగం తన పౌరులందరికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అన్ని విషయాల్లో అందిస్తుంది. అలాగే పౌరులందరికీ ఆలోచనా స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ, నమ్మకం, విశ్వాసం, ఆరాధన తదితర విషయాల్లో స్వేచ్ఛలకు హామీ ఇస్తుంది.

ఇదే క్రమంలో భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమాన హోదా, సమాన అవకాశాలు కల్పిస్తుంది. భారత రాజ్యాంగం ప్రజలలో సౌభ్రాతృత్వాన్ని పెంపొందించి, వ్యక్తి గౌరవాన్ని – జాతి సమైక్యత, సమగ్రతలను పరిరక్షించడానికి హామీ ఇస్తుంది.

4. దృఢ – అదృఢల మేలు కలయిక :
భారత రాజ్యాంగాన్ని సవరించడానికి దృఢ అదృఢ పద్ధతులు ఉన్నాయి. కేంద్ర పార్లమెంట్ రాజ్యాంగంలోని కొన్ని భాగాలను సాధారణ మెజారిటీతో సవరించే అధికారాన్ని కలిగి ఉంది. ఉదాహరణకు భారత సమాఖ్యలో నూతన రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల సరిహద్దులు మార్చడం, పౌరసత్వానికి సంబంధించిన నియమ నిబంధనలు మొదలైన వాటిని సాధారణ మెజారిటీతో సవరించవచ్చు.

ఇది అదృఢ పద్ధతి. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, నిర్దేశక నియమాలు తదితర అంశాలను పార్లమెంట్లో మూడింట రెండువంతుల మెజారిటీ (2/3) తో సవరించవవచ్చు. ఇది దృఢ పద్ధతి. రాజ్యాంగంలోని మరికొన్ని అంశాల సవరణకు ఒక ప్రత్యేక మెజారిటీ పద్ధతి ఉంది. దీని ప్రకారం పార్లమెంట్లోని రెండు సభల్లో 2/3 మెజారిటీతోపాటు, కనీసం 50% రాష్ట్రాల శాసన సభలు సవరణకు ఆమోదించాలి. ఇది చాలా సంక్లిష్టమైన దృఢ పద్ధతి.

5. ఏకకేంద్ర – సమాఖ్య లక్షణాలు :
భారత రాజ్యాంగం భారతదేశాన్ని రాష్ట్రాల సమ్మేళనం (Union of States) గా అభివర్ణిస్తుంది. భారతదేశాన్ని ఏకకేంద్ర స్ఫూర్తితో సమాఖ్య వ్యవస్థగా ఏర్పరచింది. అంటే సాధారణ పరిస్థితుల్లో సమాఖ్య విధానాన్ని, అత్యవసర పరిస్థితుల్లో ఏకకేంద్ర నిర్మాణాన్ని పేర్కొంటుంది.

భారత రాజ్యాంగంలో ఏకకేంద్ర లక్షణాలైన ఏక పౌరసత్వం, ఏకీకృత న్యాయవ్యవస్థ, ఒకే ఒక్క ఎన్నికల సంఘం, రాష్ట్రాల పరిపాలనలో అఖిల భారత సర్వీస్ ఉద్యోగుల పాత్ర, కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్లు ఏజెంట్లుగా ఉండడం, రాజ్యాంగ సవరణ ప్రక్రియలో పార్లమెంట్కు గల విశేష అధికారాలు తదితర లక్షణాలు ఉన్నాయి.

ఇదే క్రమంలో భారత రాజ్యాంగంలో సమాఖ్య లక్షణాలైన లిఖిత దృఢ-సర్వోన్నత రాజ్యాంగం రెండు స్థాయిల్లో (కేంద్ర – రాష్ట్ర) ప్రభుత్వాలు, ద్విసభా పద్ధతి, కేంద్రపార్లమెంట్ ఎగువ సభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తదితర లక్షణాలు ఉన్నాయి.
ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు కె.సి. వైర్ భారతదేశాన్ని అర్థసమాఖ్యగా వర్ణించాడు.

6. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం:
భారత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వంలో, వివిధ రాష్ట్రాల స్థాయిలో బ్రిటీష్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది. అయితే బ్రిటీష్ తరహా వారసత్వ రాజరికాన్ని భారతదేశం స్వీకరించలేదు. దీనికి బదులుగా భారత రాజ్యాంగ నిర్మాతలు ఐర్లాండ్ తరహాలో ఎన్నికయ్యే అధ్యక్షుడు ఉండే వ్యవస్థను సూచించారు.

అలాగే బ్రిటీషు రాజకీయ వ్యవస్థ మిగిలిన ఇతర లక్షణాలైన రెండు రకాల కార్యనిర్వాహక నాయకత్వం (రాష్ట్రపతి – ప్రధానమంత్రి), కేంద్రంలో ప్రధానమంత్రి నాయకత్వం, సమిష్టి బాధ్యత నియమం, కేంద్ర కార్యనిర్వాహక వర్గం (మంత్రిమండలి) పై పార్లమెంటు నియంత్రణ, రాష్ట్రపతికి నామమాత్రపు అధికారాలు తదితర లక్షణాలను భారత రాజ్యాంగం స్వీకరించింది. ఇదే తరహా రాజకీయ వ్యవస్థను వివిధ రాష్ట్రాలకు కూడా అన్వయింపజేసింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

7. స్వతంత్ర న్యాయశాఖ:
భారత రాజ్యాంగం భారతీయులకు ఒక స్వతంత్ర, ఏకీకృత న్యాయశాఖను అందించింది. అందువల్ల భారత సుప్రీంకోర్టు వివిధ హైకోర్టులు శాసన నిర్మాణ శాఖకు – కార్యనిర్వాహక వర్గానికి భయం లేదా అనుకూలతలు లేకుండా స్వతంత్రంగా వ్యవహరించే అధికారాన్ని కలిగి ఉన్నాయి.

8. రాజ్య విధానాలపై ఆదేశక సూత్రాలు :
భారత రాజ్యాంగంలోని నాలుగో భాగంలో 36వ నిబంధన నుండి 51వ నిబంధన వరకు రాజ్యవిధానాల రూపకల్పనలో రాజ్యాంగ ఆదేశక సూత్రాలు పొందుపరచారు. భారత రాజ్యాంగ నిర్మాతలు వీటిని ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి స్వీకరించారు.

ఈ ఆదేశక సూత్రాలు భారతదేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగా, గాంధేయవాద దేశంగా, ఉదారవాద రాజ్యంగా రూపొందిస్తాయి. రాజకీయ భావజాలాలతో సంబంధం కాకుండా కేంద్ర ప్రభుత్వంలోని – రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టే అన్ని పార్టీలు ఈ మూల సూత్రాలను తప్పనిసరిగా అమలు చేయాలి.

9. ప్రాథమిక హక్కులు:
భారత రాజ్యాంగ ఉదారవాద ప్రజాస్వామ్య స్వభావం ప్రాథమిక హక్కుల్లో ప్రతిబింబిస్తుంది. ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగంలోని మూడో భాగంలో 12వ నిబంధన నుండి 35వ నిబంధన వరకు పొందుపరచారు. భారత పౌరులు కొన్ని హేతుబద్ధమైన పరిమితులకు లోబడి హక్కులను వినియోగించుకోవచ్చు. ఈ హక్కుల విషయంలో ప్రభుత్వంతో సహా ఎవ్వరి జోక్యాన్ని అనుమతించడం జరగదు. దేశ అత్యున్నత న్యాయవ్యవస్థ పౌరులకు హక్కుల పరిరక్షణలో తోడ్పడుతుంది.

రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఏడురకాల ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో ఉండేవి. ప్రస్తుతం ఇవి ఆరు హక్కులుగా ఉన్నాయి. అవి

  1. సమానత్వపు హక్కు
  2. స్వాతంత్రపు హక్కు
  3. పీడనను, దోపిడిని వ్యతిరేకించే హక్కు
  4. మత స్వేచ్ఛ హక్కు
  5. విద్య – సాంస్కృతిక హక్కులు
  6. రాజ్యాంగ పరిహార హక్కు
    అయితే ఆస్తి హక్కును 44వ రాజ్యాంగ సవరణ ఆధారంగా ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు.

10. ప్రాథమిక విధులు :
భారత రాజ్యాంగ సంస్కరణలపై స్వర్ణసింగ్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు భారత రాజ్యాంగం లోని నాలుగు-ఎ (Part – IV A) భాగంలో 51 ఎ (51 A) నిబంధనలో ప్రాథమిక విధులను పొందుపరచారు. మొదట్లో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ఆధారంగా పది ప్రాథమిక విధులుగా వీటిని ఏర్పరచారు. అయితే ఆ తరువాత భారత రాజ్యాంగ 86వ సవరణ చట్టం (2002) ఆధారంగా మరో ప్రాథమిక విధిని వీటికి జత చేశారు.

11. ఏక పౌరసత్వం :
భారత రాజ్యాంగం భారతదేశంలో జన్మించిన వారందరికీ, లేదా ఒక నిర్దిష్ట కాలంపాటు -భారతదేశంలో నివసిస్తున్న వారికి ఏకపౌరసత్వాన్ని అందిస్తుంది. భారతదేశ సమైక్యత – సమగ్రతను పరిరక్షించడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. భారతదేశంలో విచ్చిన్నకర ధోరణులు తలెత్తకుండా రాజ్యాంగ నిర్మాతలు ఏక పౌరసత్వం ఏర్పాటు చేశారు.

12. సార్వజనీన వయోజన ఓటు హక్కు:
భారత రాజ్యంగం భారతదేశ వయోజన పౌరులందరికీ సార్వజనీన ఓటుహక్కును కల్పించింది. దీని ఫలితంగా భారత పౌరులు కులం, మతం, భాష, ప్రాంతం, లింగ విచక్షణ, వర్ణం, జాతి సంపద తదితర అంశాల ఆధారంగా ఉండే విచక్షణలకు అతీతంగా, కేవలం వయోపరిమితితో మాత్రమే ఓటు హక్కును పొందుతారు.

భారతపౌరులు ఈ హక్కును సక్రమంగా వినియోగించుకోవచ్చు. వయోజన ఓటింగ్ వయస్సు 1950-1987 మధ్య కాలంలో 21 సంవత్సరాలుగా ఉండేది. అయితే ఈ వయోపరిమితిని భారత రాజ్యాంగ 61వ సవరణ ఆధారంగా 1988లో 18 సంవత్సరాలకు తగ్గించారు.

13. ద్విసభా పద్ధతి :
భారత రాజ్యాంగం జాతీయ స్థాయిలో ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టింది. దీనికి అనుగుణంగా భారత పార్లమెంట్లో లోక్సభ (దిగువసభ), రాజ్యసభ (ఎగువసభ) అనే రెండు సభలుంటాయి. లోక్సభ ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నికయ్యే ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.

14. పంచాయతీ రాజ్ – నగరపాలిక చట్టాలు :
దీనిని భారత రాజ్యాంగ విశిష్ట లక్షణంగా పేర్కొనవచ్చు. మహాత్మాగాంధీ ఎన్నో సందర్భాలలో స్థానిక స్వపరిపాలన సంస్థలను ఏర్పాటుచేసి, బలోపేతం చేయవలసిన అవసరాన్ని పేర్కొన్నాడు. ఈ సంస్థల కార్యసాధకతను పెంపొందించడానికి తగిన సదుపాయాలు అవకాశాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని విశ్వసించాడు. స్వాతంత్య్రానంతరం స్థానిక స్వపరిపాలన సంస్థల పటిష్టతకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. వీటన్నింటి ఫలితంగా భారత నగరపాలిక చట్టం 1992లో రూపొందింది.

15. షెడ్యూలు కులాలు, తెగల అభ్యున్నతికి ప్రత్యేక నిబంధనలు :
భారత రాజ్యాంగం భారతదేశంలోని షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల అభ్యున్నతికి కొన్ని నిర్దిష్ట మార్గదర్శకాలను సూచించింది. కేంద్రప్రభుత్వం – వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడ్డ వర్గాల అభ్యున్నతికి పెంపొందించే చర్యలను సమీక్షించడానికి వీలుగా స్వతంత్ర హోదాగల కమీషన్లు ఏర్పాటు చేయాలని సూచించింది. వాటి సిఫార్సులకు అనుగుణంగా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించడానికి అవకాశం కల్పించింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారత జాతీయోద్యమ ఆవిర్భావానికి ఏవేని నాలుగు కారణాలను తెలపండి.
జవాబు.
1. సాంఘిక-సాంస్కృతిక పునరుజ్జీవం :
భారతదేశంలో 19వ శతాబ్దంలో వచ్చిన అనేక సాంఘిక సాంస్కృతిక ఉద్యమాలు ప్రజల్లో సాంఘిక చైతన్యాన్ని, సాంస్కృతిక జాతీయవాద భావనలను ప్రోది చేశాయి. ఈ ఉద్యమాలన్నింటికి రాజా రామ్మోహన్రాయ్ స్థాపించిన బ్రహ్మసమాజ్ ఉద్యమం అగ్రగామిగా నిలిచి, సాంఘిక దురాచారాలైన సతీసహగమనం, బాల్యవివాహాలు, వితంతువులుగా మార్చడం, విగ్రహారాధన తదితరులకు వ్యతిరేకంగా సంస్కరణలు జరగాలని పిలుపునిచ్చింది.

దీనిని అనుసరించి ఆర్యసమాజం, రామకృష్ణ మిషన్, దివ్యజ్ఞాన సమాజం, ప్రార్థన సమాజం, సత్యశోధక సమాజం, అలీఘర్ ఉద్యమం, వహాబీ ఉద్యమం తదితర సాంఘిక ఉద్యమాలు వచ్చాయి. ఈ ఉద్యమాలు ప్రజల్లో జాతీయవాద భావనను, సాంఘిక – సాంస్కృతిక గుర్తింపును, దేశభక్తిని నింపి పరోక్షంగా ప్రజలు స్వయంపాలన కోరుకోవడానికి ప్రేరణ నిచ్చాయి.

2. వార్తాపత్రికలు :
బ్రిటిష్ పాలన కాలంలో ఎన్నో వార్తాపత్రికలు, దినపత్రికలు నియతకాలిక పత్రికలు భారతీయులలో జాతీయవాద భావాలను ప్రేరేపించాయి. వీటిలో ముఖ్యమైనవి అమృతబజార్ పత్రిక, కేసరి, పాట్రియాట్, ది హిందూ, నవజీవన్, ఆంధ్రపత్రిక మొదలైనవి. ఈ పత్రికలు ప్రజలలో దేశభక్తి, జాతీయవాద భావాలను పెంచి పోషించాయి.

జాతీయవాద భావాల వ్యాప్తిలోను, ప్రజల ఆకాంక్షలు, ఆశలు, డిమాండ్లు మొదలైన వాటిని బ్రిటిష్ ప్రభుత్వం ముందు వ్యక్తీకరించడంలోను వార్తాపత్రికలు కీలక పాత్ర పోషించాయి. ప్రఖ్యాత స్వాతంత్ర్యోద్యమ జాతీయ నాయకులు మోతీలాల్ నెహ్రూ, సురేంద్రనాధ్ బెనర్జీ, బాలగంగాధర్ తిలక్, మహాత్మాగాంధీ, డా॥బి.ఆర్. అంబేద్కర్ తదితరులు వార్తాపత్రికలు ద్వారా జాతీయవాద ఆదర్శాలను వ్యాపింపచేయడానికి ఎంతో కృషి చేశారు.

3. జాతి విచక్షణ :
బ్రిటిష్ ప్రభుత్వం న్యాయప్రక్రియల్లో, సివిల్ సర్వీసుల ఉద్యోగాల ప్రవేశంలో హక్కులను, అనుమతించడంలో ఎంతో వివక్షపూరిత ధోరణి ప్రదర్శించేది. జాతీయోద్యమ ప్రారంభదశలో భారతీయులు, సివిల్ సర్వీస్ ఉద్యోగాలలో ప్రవేశాలకు సంబంధించి విషయాలలో బ్రిటిషు అభ్యర్థులతో సమానంగా అవాకాశాలు ఉండాలని డిమాండ్ చేసేవారు.

అలాగే బ్రిటిష్వారి వివక్షత విధానం ఇల్బర్ట్ బిల్లు వివాదంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. భారతదేశంలోని యూరోపియన్ సమూహాలు భారతీయ న్యాయ మార్పులు తమ నేరాలను విచారించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ తరహా ధోరణులు భారతీయుల మనోభావాలను దెబ్బతీయడంతో, అది జాతీయోద్యమానికి దారితీసింది.

4. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన (Inceptin of Indian National Congress) :
భారత జాతీయోద్యమ చరిత్రలో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన (1885) ఒక మైలురాయిగా వర్ణించవచ్చు. మాజీ బ్రిటిష్ అధికారులు స్థాపించిన ఆ సంస్థ ప్రారంభంలో బ్రిటిష్ ప్రభుత్వ విధానాలను వెల్లడించడం, నిర్మాణాత్మక విమర్శలను చేయడం వంటి కర్తవ్యాలను నిర్వర్తించింది.

క్రమేణా ఆ సంస్థ భారతీయుల స్వపరిపాలన ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచింది. ప్రజా సమస్యలపై సమిష్టి పోరాటం, భారతీయులలో జాతీయ భావాలను పెంపొందించడం వంటి ఆశయాలతో జాతీయోద్యమానికి చోదక శక్తిగా ఎదిగింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 2.
భారత జాతీయోద్యమంలో అతివాదుల పాత్ర వివరించండి.
జవాబు.
భారతజాతీయోద్యమంలో రెండో దశయే అతివాదదశ. ఈ దశను కొందరు చరిత్రకారులు తీవ్ర జాతీయతా దశగా వర్ణించారు. హిందూ పునరుజ్జీవనం, బ్రిటిష్ పాలకులపట్ల ద్వేషం లార్డ్ కర్జన్ క్రూరపాలన, బెంగాల్ విభజన, క్షీణించిన ఆర్థిక పరిస్థితులు, సమకాలీన అంతర్జాతీయ సంఘటనలు, విదేశాలలో భారతీయుల కడగండ్లు మొదలైన అంశాలు భారతీయులను ఈ దశలో జాతీయోద్యమం వైపు మొగ్గు చూపేటట్లు ప్రభావితం చేశాయి. అలాగే మితవాదులు అనుసరించిన మెతకవైఖరి కూడా ఈ కాలంలో ఉద్యమకారులలో అసంతృప్తిని పెంపొందించింది.

బాలగంగాధర తిలక్, లాలాలజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్, అరవిందఘోష్ వంటి నాయకులు అతివాదులుగా పరిగణించబడి ఈ దశలో కీలకపాత్ర పోషించారు. బ్రిటిష్ పాలకులు బెంగాల్ను రెండు ముక్కలుగా విభజించడాన్ని అతివాదులు తీవ్రంగా వ్యతిరేకించారు.

బ్రిటిష్ పాలకులు ప్రజాస్వామ్య, స్వేచ్ఛాయుత, ఉదార ప్రియులనే మితవాదుల అభిప్రాయంలో అతివాదులు విభేదించారు. బ్రిటిష్పాలకులు భారతదేశంపట్ల అనుసరించిన అణచివేత, ప్రగతి వ్యతిరేకత, అప్రజాస్వామిక పద్ధతుల వల్లనే భారతీయులు బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు.

బాలగంగాధరతిలక్ ‘స్వరాజ్యం నా జన్మహక్కు- దాన్ని సాధించి తీరుతాను’ అనే నినాదంతో దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. అలాగే మిగిలిన అతివాదులు బ్రిటిష్ పాలకులపట్ల సకారాత్మక (passive) ప్రతిఘటన వైఖరిని అనుసరించారు. మొత్తం మీద అతివాదులు కింద పేర్కొన్న పద్ధతులను భారతీయులు అనుసరించవలసి ఉంటుందని ఉద్భోదించారు.

  1. వస్తువులను, బ్రిటిష్ ప్రభుత్వ గౌరవ బిరుదులను, కార్యాలయాలను బహిష్కరించడం.
  2. స్వదేశీ విద్యను ప్రోత్సహించడం.
  3. శాసన మండలల్లో భారతీయులకు సభ్యత్వం వంటి అంశాల అమలు కోసం కృషిచేయడం.
  4. స్వదేశీ వస్తువులను, పరిశ్రమలను ఆదరించడం.
  5. నకారాత్మక ప్రతిఘటనకు (Passive resistence) పాల్పడటం.

వందేమాతరం, స్వదేశీ వంటి ఉద్యమాలను అతివాదులు నిర్వహించారు. భారతీయులకు స్వయం పాలన, స్వరాజ్యం సాధించాలనే ప్రధాన ఆశయంతో వారు ఆ ఉద్యమాలను చేపట్టారు. తమ ఆశయసాధన కోసం ముస్లింలీగ్ వంటి ఇతర పార్టీలు, సంస్థలతో కలిసి ఉద్యమించారు.

అతివాదుల ఒత్తిడికి లోనైన బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ పునరేకీకరణ (reunification) కు అంగీకరించింది. అలాగే మాంటేగు ఛేమ్స్ఫర్డ్ పథకం ద్వారా ప్రాతినిథ్య సంస్థలలో భారతీయులకు సముచిత ప్రాధాన్యాన్ని ఇవ్వడానికి అంగీకరించారు. భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 3.
భారత జాతీయోద్యమంలోని గాంధీ దశలోని ప్రధాన సంఘటనలు రాయండి.
జవాబు.
1920 నుండి 1947 మధ్య జరిగిన భారత జాతీయోద్యమంలో గాంధీదశ చిట్ట చివరి దశగా, ముగింపు దశగా పేర్కొనవచ్చు. ఈ దశలో మహాత్మాగాంధీ కీలక పాత్ర పోషించి, మితవాద పద్ధతులు – అతివాద పద్ధతులను మేళవించి, జాతీయోద్యమాన్ని నడిపించారు.

గాంధీ దశలోని సంఘటనలు సహాయ నిరాకరణ ఉద్యమము :
భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో సహాయ నిరాకరణోద్యమం ఒక గొప్ప మలుపుగా చరిత్రకారులు భావించారు. ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతునిస్తూ, జలియన్వాలాబాగ్ ఘోర సంఘటనను నిరసిస్తూ గాంధీజీ ఉద్యమాన్ని 1920 ఆగస్టులో ప్రారంభించారు. అవి ఏమిటంటే :

  • సకారాత్మక కార్యక్రమాలు
  • నకారాత్మక కార్యక్రమాలు.

ఆ రెండింటిని కింద పేర్కొనడమైంది.

1. సకారాత్మక కార్యక్రమాలు (Positive or Constructive Programmes) :
సకారాత్మక కార్యక్రమాలలో క్రింది అంశాలు ఇమిడి ఉన్నాయి.
అ) సహాయ నిరాకరణ కార్యక్రమాలను అమలులో ఉంచడానికి కోటి రూపాయల విరాళాల సేకరణ.
ఆ) భారతీయులకు ఉపాధి కల్పించడానికి ఇరవై లక్షల రాట్నాల పంపకం.
ఇ) జాతీయ విద్యా ప్రణాళికల రూపకల్పన, అమలు మొదలగునవి.

2. నకారాత్మక కార్యక్రమాలు (Negative Programmes):
నకారాత్మక కార్యక్రమాలలో కింది అంశాలను ప్రస్తావించడమైంది.
అ) బ్రిటిష్ ప్రభుత్వం ప్రసాదించిన బిరుదులు, గౌరవ పదవులను పరిత్యజించడం.
ఆ) బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహించే అధికారిక సమావేశాలకు గైర్హాజరవడం.
ఇ) బ్రిటిష్ న్యాయస్థానాల బహిష్కరణ మొదలగునవి.

శాసనోల్లంఘనోద్యమం (Civil Disobedience Movement (1930 – 34) :
సహాయ నిరాకరణోద్యమం తరువాత భారత జాతీయోద్యమంలో చెప్పుకోదగిన సంఘటనలలో శాసనోల్లంఘన ఒకటి. ఈ ఉద్యమాన్ని 1930 మార్చి 12న భారత జాతీయ కాంగ్రెస్ గాంధీజీ మార్గదర్శకత్వంలో ప్రారంభించింది.

అంతకుముందు 1929 డిసెంబర్ 29న లాహోర్లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన సమావేశమైన భారత జాతీయ కాంగ్రెస్ భారతీయులకు సంపూర్ణ స్వరాజ్య సాధనయే తన ఆశయంగానూ, అందుకు బ్రిటిష్ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయాలనే అల్టిమేటము జారీచేసింది.

శాసనోల్లంఘన ఉద్యమంలో మూడు ప్రధాన దశలున్నాయి. మొదటి దశలో భారతీయులు ఉప్పుసత్యాగ్రహాన్ని నిర్వహించాలని గాంధీజీ సూచించాడు గాంధీజీ స్వయంగా 78 మంది అనుచరులతో కాలిబాటన సబర్మతీ ఆశ్రమం నుంచి 240 మైళ్ళ దూరంలో అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న ‘దండి’ అనే గ్రామానికి వెళ్ళి ఉప్పును తయారుచేశాడు. గాంధీజీతో సహా దేశవ్యాప్తంగా వేలాదిమంది ప్రజలు ఆయా ప్రాంతాలలో ఉప్పు సత్యాగ్రహాన్ని పాటించడానికి పోటీ పడ్డారు.

క్విట్ ఇండియా ఉద్యమం (Quit India Movement, 1942 August – 1994 May) :
భారత జాతీయోద్యమంలో అంతిమ ఘట్టమే క్విట్ ఇండియా ఉద్యమం. భారతదేశానికి స్వాతంత్య్రం, భారతీయులకు స్వీయ రాజ్యాంగం కావాలని అనేకసార్లు బ్రిటిష్ ప్రభుత్వానికి భారత జాతీయ నాయకులు విజ్ఞప్తి చేసినప్పటికీ వారి ప్రయత్నాలు సఫలం కాలేదు. ప్రతిసారీ బ్రిటిష్ పాలకులు భారతీయుల స్వాతంత్ర్య ఆకాంక్షలను సంపూర్ణంగా నెరవేర్చక, అరకొర పథకాలను మాత్రమే ప్రకటించారు.

వేరొకవైపు రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభంలో బ్రిటిష్ పాలకులు సంబంధిత భారత జాతీయ నాయకులతో చర్చించకుండానే భారతదేశాన్ని మిత్ర రాజ్యంగా ప్రకటించడం జరిగింది. 1942 నాటి క్రిప్స్ ప్రతిపాదనలు భారతీయులకు ఏ మాత్రం సంతృప్తినివ్వలేకపోయాయి.

అంతలో జపాన్ సైన్యం భారతదేశం వైపు దండయాత్రకు పాల్పడుతుందనే పుకార్లు వ్యాపించాయి. బ్రిటిష్ పాలకులు ఆ సమయంలో భారతదేశం వదలి వెళ్ళడం భావ్యమని, తద్వారా జపాన్ సైన్యం దండయాత్రను నివారించవచ్చనే అభిప్రాయాన్ని గాంధీజీ వెల్లడించాడు.

భారతీయులతో కూడిన తాత్కాలిక ప్రభుత్వాన్ని, రాజ్యాంగ పరిషత్తును వెంటనే ఏర్పాటు చేయాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తన నిర్ణయాన్ని కాంగ్రెస్ భారత రాజప్రతినిధితో తెలపడానికి మీరాబెన్ అనే కార్యకర్తను పంపించింది.

అయితే ఆమెతో భారత రాజప్రతినిధి సమావేశమవడానికి అంగీకరించలేదు. దాంతో గాంధీజీ నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమాన్ని 1942 ఆగస్టు 9న ప్రారంభించింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 4.
భారత స్వాతంత్ర్య పోరాటంలో హోమ్హూల్ ఉద్యమాన్ని వర్ణించండి.
జవాబు.
హోమ్హూల్ ఉద్యమం :
భారత జాతీయోద్యమ కాలంలో నిర్వహించబడిన ఉద్యమాలలో హోమ్హూల్ ఉద్యమం ఒకటి. ఈ ఉద్యమానికి లోకమాన్య బాలగంగాధర్ తిలక్, అనిబిసెంట్లు సారధ్యం వహించారు. మాండలే జైలులో ఆరేళ్ళపాటు కారాగార శిక్ష అనుభవించిన లోకమాన్య బాలగంగాధర్ తిలకన్ను 1914 జూన్లో బ్రిటిష్ ప్రభుత్వం వదిలిపెట్టింది.

భారతదేశానికి తిరిగి వచ్చిన తిలక్ భారత జాతీయ కాంగ్రెస్ నాయకులతో సహృద్భావ సంబంధాలు పునరుద్ధరించుకొని నిర్మాణాత్మక కార్యక్రమాల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వాన్ని నొప్పించకుండా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఐర్లాండ్ తరహాలో కొన్ని హోంరూల్ మండలులను నెలకొల్పడానికి కృషి చేశాడు. అందులో భాగంగా మద్రాస్లో దివ్యజ్ఞాన సమాజ

స్థాపకురాలు అనిబిసెంట్ అనే ఐరిష్ నాయకురాలితో సమన్వయం ఏర్పరచుకున్నాడు. 1916లో తిలక్, అనిబిసెంట్లు విడివిడిగా హోంరూల్ లీగ్్న స్థాపించి ప్రజలలో రాజకీయ చైతన్యం, ఆధ్యాత్మిక వికాసం సాధించడానికి కృషిచేశారు.

అనిబిసెంట్ న్యూఇండియా, కామన్వీల్ అనే పత్రికలను స్థాపించి జార్జి అరెండెల్ అనే వ్యక్తిని హోంరూల్ లీగ్ వ్యవస్థాపరమైన కార్యదర్శిగా నియమించింది. ఒక్క బొంబాయి మినహా మహారాష్ట్ర అంతటా, మైసూరు సెంట్రల్ ప్రావిన్సెస్, బీరార్లలోనూ, అనిబిసెంట్ దేశంలోని మిగిలిన ప్రాంతాలతో హోంరూల్ లీగ్ విధివిధానాలను ప్రజలలో వ్యాప్తిచేశారు.

హోంరూల్ లీగ్ కు సంబంధించిన కరపత్రాలను వారు దేశవ్యాప్తంగా విస్తృతంగా పంపిణీ చేశారు. అయితే తిలక్ సత్ప్రవర్తనతో వ్యవహరించలేదనే నెపంతో బ్రిటిష్ ప్రభుత్వం అతడిని 1916 జులైలో నిర్బంధంలో ఉంచింది.

దాంతో తిలక్ అభిమానులు, హోంరూల్ లీగ్ కార్యకర్తలు అసంతృప్తితో రగిలిపోయారు. నిర్బంధం నుంచి తిలకన్ను విడిపించడానికి మహమ్మదాలీ జిన్నా జిల్లాకోర్టు, హైకోర్టులలో తిలక్ తరఫున వాదించాడు. తిలకై తన పోరాటాన్ని ఉధృతం చేశాడు. తిలక్ 6 చోట్ల, అనిబిసెంట్ 20 చోట్ల హోంరూల్ లీగ్ కార్యాలయాలను స్థాపించారు.

హోంరూల్ ఉద్యమంలో భాగంగా గ్రంథాలయాలను స్థాపించడం, విద్యార్థులకు జాతీయ రాజకీయాలపై అవగాహన కల్పించడం, సామాజీక పునర్నిర్మాణ కార్యక్రమాలలో పాల్గొనడం, స్థానిక సంస్థలను బలోపేతం చేయడం వంటి అనేక కార్యక్రమాలను దేశవ్యాప్తంగా వారు ప్రారంభించారు.

భారతీయులకు స్వపరిపాలన (self rule) విషయంలో ఆసక్తిని పెంపొందించాడు. హోంరూల్ లీగ్ ఉద్యమ ఉధృతిని నివారించడానికి బ్రిటిష్ ప్రభుత్వం వారిరువురిని అనేక ప్రాంతాలలో బహిరంగ సభలలో పాల్గొనడాన్ని నిషేధించింది.

1916 డిసెంబర్లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో హోంరూల్ లీగ్ సభ్యులు విరివిగా పాల్గొన్నారు. ఆ సమావేశంలో చివరి రోజున హోంరూల్ల సభ్యులతో తిలక్ సమావేశాలు నిర్వహించాడు.

అయితే హోంరూల్ లీగ్ కు హెచ్చిన ప్రాధాన్యతను నివారించడానికి 1917 జూన్లో అనిబిసెంట్, ఆమె అనుచరుల బృందాన్ని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. మొత్తం మీద స్వపరిపాలన సంస్థలను ఏర్పరచి, వాటిని భారతీయ ప్రతినిధులతో నిర్వహించడానికి అవకాశం ఇవ్వాలనే హోంరూలీగ్ డిమాండ్ బ్రిటిష్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

భారత వ్యవహారాల కార్యదర్శి మాంటెగ్ 1917 ఆగస్టులో చారిత్రాత్మక ప్రకటన ద్వారా భారతీయులకు స్వపరిపాలన, స్వేచ్ఛలను ప్రసాదించడానికి అంగీకరించాడు. మాంటెంగ్ ప్రకటన తరువాత 1917 సెప్టెంబర్ లో అనిబిసెంట్ను బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేయడంతో హోంరూల్ ఉద్యమం సద్దుమనిగింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 5.
సహాయ నిరాకరణ ఉద్యమంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలను తెలపండి.
జవాబు.
ఈ ఉద్యమం భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో గొప్ప సంఘటనగా మిగిలిపోతుంది. మహాత్మాగాంధీ ఈ ఉద్యమాన్ని పంజాబ్ లోని జలియన్ వాలాబాగ్ లో జరిగిన మారణకాండకు నిరసనగా 1920-22 మధ్య కాలంలో నిర్వహించారు. ఉద్యమంలో చేపట్టిన కార్యక్రమాలు :

నకారాత్మక కార్యక్రమాలు: సకారాత్మక కార్యక్రమాలలో క్రింది అంశాలు ఇమిడి ఉన్నాయి.

  1. సహాయ నిరాకరణ కార్యక్రమాలను అమలులో ఉంచడానికి కోటిరూపాయల విరాళాల సేకరణ.
  2. భారతీయులకు ఉపాధి కల్పించడానికి ఇరవై లక్షల రాట్నాల పంపకం.
  3. జాతీయ విద్యా ప్రణాళికల రూపకల్పన, అమలు.
  4. బ్రిటిష్ శాసన మండలుల స్థానంలో కాంగ్రెస్ శాసన సంస్థల ఏర్పాటు.
  5. స్వదేశీ వస్తువుల వినియోగం.

సకారాత్మక కార్యక్రమాలు :
నకారాత్మక కార్యక్రమాలలో క్రింది అంశాలను ప్రస్తావించడమైంది.

  1. బ్రిటిష్ ప్రభుత్వం ప్రసాదించిన బిరుదులు, గౌరవ పదవులను పరిత్యజించడం.
  2. బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహించే అధికారిక సమావేశాలకు గైర్హాజరవడం.
  3. బ్రిటిష్ న్యాయస్థానాల బహిష్కరణ.
  4. శాసన మండలులకు జరిగే ఎన్నికల బహిష్కరణ.
  5. స్థానిక సంస్థల పదవులకు రాజీనామా సమర్పించడం.
  6. విదేశీ వస్తువుల బహిష్కరణ.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 6.
భారత ప్రభుత్వ చట్టం 1919 లోని ప్రధాన అంశాలేవి ?
జవాబు.
1919 భారత ప్రభుత్వ చట్టములోని ప్రధానాంశాలు :

  1. బ్రిటిష్ ఇండియా బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగంగానే కొనసాగుతుంది.
  2. భారత ప్రభుత్వం, దాని ఆదాయాలకు సంబంధించిన అన్ని కార్యకలాపాలపైన, చర్యలపైన పరిశీలన, నియంత్రణాధికారాలు భారత కార్యదర్శికే చెంది ఉంటాయి. ఆయన బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తాడు. రాష్ట్ర పాలనాంశాలపై భారత కార్యదర్శి అధికారాలను తగ్గించింది.
  3. ప్రభుత్వ పాలనాంశాలు రెండుగా విభజింపబడెను. అవి : 1) కేంద్ర పాలనాంశాలు (47), 2) రాష్ట్ర పాలనాంశాలు (51). రాష్ట్ర పాలనాంశాలను మళ్ళీ రెండుగా విభజించారు. అవి : 1) రిజర్వుడు పాలనాంశాలు (28), 2) ట్రాన్స్ఫర్డ్ పాలనాంశాలు (22). అఖిల భారత ప్రాముఖ్యం ఉన్న అంశాలు కేంద్ర పాలనాంశాల జాబితాలోను రాష్ట్ర ప్రాముఖ్యం ఉన్న పాలనాంశాలను రాష్ట్ర పాలనాంశాల జాబితాలోను చేర్చెను.
  4. భారత మండలి నిర్మాణంలో మార్పులు చేసిరి. భారత వ్యవహారాల కార్యదర్శి అధికారాలను కొన్నింటిని తొలగించి వాటిని భారత హైకమీషనర్ క్కు ఇచ్చారు.
  5. భారత ప్రభుత్వ బడ్జెట్ నుండి రాష్ట్ర బడ్జెట్లను వేరుచేశారు. ప్రాంతీయ వనరులకు సంబంధించి ప్రాంతీయ శాసనసభలకు తమ బడ్జెట్లను తామే సమర్పించుకోవడానికి, సొంతంగా పన్నులు విధించుకోవడానికి అధికారాలు కల్పించారు.
  6. కేంద్రంలో ద్విసభా విధానం ప్రవేశపెట్టబడింది. రాజ్యసభ ఎగువసభ కాగా, కేంద్ర శాసనసభ దిగువసభ అయ్యెను. ఎగువసభ పదవీకాలం 5 సంవత్సరాలుగా, దిగువసభ పదవీకాలం 8 సంవత్సరాలుగా నిర్ణయించబడింది.
  7. కేంద్ర శాసనసభ అధికారాలు పెరిగెను. అది బ్రిటిష్ ఇండియా మొత్తానికి, భారతీయ విషయాలకు ప్రభుత్వ ఉద్యోగులకు, బ్రిటిష్ రాజరికానికి సంబంధించిన సైనిక దళాలకు వర్తించేలా శాసనాలు రూపొందించవచ్చును.
  8. రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్ర పాలనాంశాలు రెండు భాగాలుగా విభజించారు. అవి: 1) రిజర్వుడు పాలనాంశాలు, 2) ట్రాన్స్ఫర్డ్ పాలనాంశాలు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 7.
భారత స్వాతంత్య్ర చట్టం – 1947 ముఖ్యాంశాలను వివరించండి.
జవాబు.
భారత వ్యవహారాల నిర్వహణ కోసం బ్రిటిష్ పార్లమెంటు రూపొందించి, అమలు చేసిన చట్టాలలో చిట్టచివరి చట్టమే భారత స్వాతంత్ర్య చట్టము 1947 ప్రధాని అట్లీ ఆధ్వర్యంలోని బ్రిటిష్ ప్రభుత్వం భారత గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ సలహామేరకు 1947, జులై 4వ తేదీన కామన్స్ సభలో భారత స్వాతంత్య్ర చట్ట ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.

తరువాత బ్రిటిష్ పార్లమెంటులోని రెండు సభలు దానిని రెండు వారాల్లోగా ఆమోదించాయి. భారత స్వాతంత్య్ర చట్ట ముసాయిదా తీర్మానంపై బ్రిటిష్ రాణి 1947, జులై 18వ తేదీన సంతకం చేసింది.

ప్రధానాంశాలు :

  1. ఇండియా, పాకిస్తాన్ అనే రెండు స్వతంత్ర రాజ్యాలు ఏర్పడతాయి.
  2. ఇండియా పాకిస్తాన్లకు వేర్వేరుగా రాజ్యాంగ పరిషత్తులు ఏర్పడతాయి.
  3. స్వదేశీ సంస్థానాలపై బ్రిటిష్ సార్వభౌమాధికారం రద్దవుతుంది.
  4. భారత వ్యవహారాల కార్యదర్శి పదవి రద్దవుతుంది.
  5. బ్రిటిష్ రాజు/రాణికి ఇప్పటివరకు ఉన్న “భారత చక్రవర్తి” అనే బిరుదు రద్దవుతుంది.”
  6. ఇండియా పాకిస్తాన్లు రెండింటికీ చెరొక గవర్నర్ జనరల్ నియమితులవుతారు.

ప్రశ్న 8.
భారత్ రాజ్యాంగ మౌలిక లక్షణాలలో ఏవేని మూడింటిని రాయండి.
జవాబు.
1. విశిష్ట ఆశయాలు లక్ష్యాలు :
భారత రాజ్యాంగం ఎన్నో విశిష్ట ఆశయాలు లక్ష్యాలను కలిగి ఉంది. భారత రాజ్యాంగం తన పౌరులందరికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అన్ని విషయాల్లో అందిస్తుంది. అలాగే పౌరులందరికీ, ఆలోచనా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, నమ్మకం, విశ్వాసం, ఆరాధన తదితర విషయాల్లో స్వేచ్ఛలకు హామీ ఇస్తుంది.

ఇదే క్రమంలో భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమాన హోదా, సమాన అవకాశాలు కల్పిస్తుంది. భారత రాజ్యాంగం ప్రజలలో సౌభ్రాతృత్వాన్ని పెంపొందించి వ్యక్తి గౌరవాన్ని జాతి సమైక్యత, సమగ్రతలను పరిరక్షించడానికి హామీ ఇస్తుంది.

2. రాజ్య విధానాలపై ఆదేశిక సూత్రాలు :
భారత రాజ్యాంగంలోని నాలుగో భాగంలో 36వ నిబంధన నుండి 51వ నిబంధన వరకు రాజ్య విధానాల రూపకల్పనలో రాజ్యాంగ ఆదేశక సూత్రాలు పొందుపరుచారు. భారత రాజ్యాంగ నిర్మాతలు వీటిని ఐర్లాండ్, రాజ్యాంగం నుండి స్వీకరించారు.

ఈ ఆదేశక సూత్రాలు భారతదేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగా, గాంధేయవాద దేశంగా, ఉదారవాద రాజ్యంగా రూపొందిస్తాయి. రాజకీయ భావజాలాలతో సంబంధం కాకుండా కేంద్ర ప్రభుత్వంలో-రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టే అన్ని పార్టీలు ఈ మూల సూత్రాలను తప్పనిసరిగా అమలు చేయాలి.

3. ఏక పౌరసత్వం :
భారత రాజ్యాంగం భారతదేశంలో జన్మించిన వారందరికీ, లేదా ఒక నిర్దిష్ట కాలంపాటు భారతదేశంలో నివసిస్తున్నవారికి ఏక పౌరసత్వాన్ని అందిస్తుంది. భారతదేశ సమైక్యత – సమగ్రతను పరిరక్షించడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. భారతదేశంలో విచ్ఛిన్నకర ధోరణులు తలెత్తకుండా రాజ్యాంగ నిర్మాతలు ఏకపౌరసత్వం ఏర్పాటు చేశారు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారత జీతీయోద్యమంలో మితవాదులు.
జవాబు.
మితవాద దశనే సంస్కరణల శకంగా వర్ణించడం జరిగింది. ఈ దశలో ప్రముఖ జాతీయ నాయకులైన గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయ్ నౌరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ వంటి ప్రముఖ నాయకులు కీలకపాత్ర పోషించారు. బ్రిటిష్ పాలకుల ఉదార వైఖరి పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ వారు బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో క్రమానుగత సంస్కరణలను అమలు చేయాలని సూచించారు.

బ్రిటిష్ ప్రజలు నిజమైన ప్రజాస్వామ్య, స్వేచ్ఛావాద ప్రియులనే, భారతీయులలో బ్రిటిష్ పాలకులు రాజకీయ చైతన్యాన్ని విజ్ఞప్తులు, మధ్యవర్తిత్వం వంటి పద్ధతులను అనుసరించడం ద్వారా బ్రిటిష్ పాలకుల దృష్టిని మితవాదులు ఆకర్షించగలిగారు. బ్రిటిష్ పాలన అనేది దైవ సమ్మతం, దైవ నిర్ణయంగా వారు పరిగణించారు.

ప్రశ్న 2.
అతివాదులు అనుసరించిన పద్ధతులు.
జవాబు.

  1. బ్రిటిష్ వస్తువులను, బ్రిటిష్ ప్రభుత్వ గౌరవ బిరుదులను, కార్యాలయాలను బహిష్కరించడం.
  2. స్వదేశీ విద్యను ప్రోత్సహించడం.
  3. శాసనమండలల్లో భారతీయులకు సభ్యత్వం వంటి అంశాల అమలు కోసం కృషి చేయడం.
  4. స్వదేశీ వస్తువులను, పరిశ్రమలను ఆదరించడం.
  5. నకారాత్మక ప్రతిఘటనకు పాల్పడటం.

ప్రశ్న 3.
సైమన్ కమీషన్.
జవాబు.
బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ‘భారత ప్రభుత్వ చట్టం 1919’ అమలు తీరును సమీక్షించి, సంస్కరణలు చేపట్టడానికి వీలుగా చర్యలు సూచించమని ఒక శాసనబద్ధ కమిషన్ ను నియమించింది. ఏడుగురు ఆంగ్లేయులతో కూడిన ఈ కమిషన్కు సర్ఆన్ సైమన్ చైర్మన్ గా వ్యవహరించాడు. భారత జాతీయ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా సైమన్ కమిషన్ కార్యవ్యవహారాలను బహిష్కరించాలని పిలుపునిచ్చి, ‘సైమన్ గో బ్యాక్’ (Simon Go Back) పేరుతో ఒక నినాదాన్నిచ్చింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 4.
శాసనోల్లంఘన ఉద్యమం.
జవాబు.
ఈ ఉద్యమాన్ని 1930 మార్చి 12న భారత జాతీయ కాంగ్రెస్ మార్గదర్శకత్వంలో ప్రారంభించుట జరిగినది. 1930 జనవరి 26వ తేదీన సంపూర్ణ స్వరాజ్యదినంగా పాటించాలని భారతీయులకు కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. శాసనోల్లంఘన ఉద్యమంలో మూడు ప్రధాన దశలున్నాయి. మొదటి దశలో భారతీయులు ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్వహించాలని గాంధీజీ సూచించాడు.

గాంధీజీ స్వయంగా 78 మంది అనుచరులతో కాలిబాటన సబర్మతి ఆశ్రమం నుంచి 240 మైళ్ళ దూరంలో అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న “దండి” అనే గ్రామానికి వెళ్ళి ఉప్పును తయారుచేశాడు. రెండోదశ గాంధీజీ ఎర్రవాడ (పూణె) కారాగారంలో ఉండగా 1932 జనవరి-1933 జులైల మధ్య నిర్వహించడం జరిగింది. శాసనోల్లంఘనలో మూడవదశ 1933 ఆగష్టు, 1934 మే నెల మధ్య కాలంలో నిర్వహించడం జరిగింది. ఆ దశలో భారత కాంగ్రెస్ నాయకులు సామూహిక శాసనోల్లంఘన స్థానాలలో వ్యక్తిగత శాసనోల్లంఘనోద్యమాన్ని కొనసాగించారు.

ప్రశ్న 5.
మింటో – మార్లే సంస్కరణల చట్టం.
జవాబు.
ఈ చట్ట రూపకల్పనలో భారత ప్రతినిధి లార్డ్మింటో భారత వ్యవహారాల కార్యదర్శి లార్డ్ మార్లేలు కీలకపాత్ర పోషించారు. దీనిని మింటోమార్లే సంస్కరణల చట్టంగా వర్ణించడం జరిగింది. భారతదేశంలో శాసనమండలాల నిర్మాణ, నిర్వహణలలో గణనీయమైన మార్పులకు ఈ నాంది పలికింది.

బెంగాల్ విభజనకు నిరసనగా ఉవ్వెత్తున ప్రారంభమైన వందేమాతరం ఉద్యమం, హిందూ-ముస్లింల మధ్య వైషమ్యాలు, లార్డ్ కర్జన్ నియంతృత్వ పోకడలు, పెద్ద దేశమైన రష్యాపై చిన్న దేశమైన జపాన్ విజయం, కాంగ్రెస్ నాయకులలో చీలికలు, ప్రవాస భారతీయుల కడగండ్లు, దుర్భర దారిద్య్రం, విప్లవ భావాలను రేకెత్తించిన కొన్ని రహస్య సంస్థల కార్యకలాపాలు వంటి అనేక అంశాలు ఈ చట్టం రూపకల్పనలో బ్రిటిష్ పాలకులను విశేషంగా ప్రభావితం చేశాయి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 6.
రాజ్యాంగ పరిషత్.
జవాబు.
భారత రాజ్యాంగ పరిషత్తులో 389 సభ్యులున్నారు. బ్రిటిష్ ఇండియాకు చెందిన 296 సభ్యులు ఉన్నారు. మిగిలిన 93 మంది స్వదేశీ సంస్థానాలకు చెందినవారు. భారత రాజ్యాంగ పరిషత్తుకు 1946 జులై – ఆగష్టులలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది.

మొత్తం సభ్యులలో 210 స్థానాలు జనరల్ కేటగిరీకి నిర్దేశించగా, వాటిలో 199 స్థానాలను కాంగ్రెస్ కైవశం చేసుకుంది. రాజ్యాంగ పరిషత్తులో ఆ పార్టీ బలం 208గా ఉంది. కాగా ముస్లింలీగ్ 73 స్థానాలను గెలుచుకుంది.

కాంగ్రెస్ తరఫున గెలిచిన సభ్యులలో మహాత్మాగాంధీ సూచించిన వివిధ రంగాలకు చెందిన 16 మంది మేధావులు ఉండటం విశేషం. మొత్తం మీద కాంగ్రెస్కు సంబంధించిన 30 మంది సభ్యులు రాజ్యాంగ పరిషత్తుకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. జవహర్లాల్ నెహ్రూ, రాజేంద్రప్రసాద్, అంబేద్కర్, శ్యాంప్రసాద్ ముఖర్జీ, దుర్గాబాయ్ దేశ్ ముఖ్, సరోజిని నాయుడు, విజయలక్ష్మి పండిట్, రాజ్కుమారి అమృత్కర్ ముఖ్య సభ్యులు. 1946 డిసెంబర్ 11న రాజేంద్రప్రసాద్ను రాజ్యాంగ పరిషత్తు శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడమైంది.

ప్రశ్న 7.
రాజ్యాంగ ముసాయిదా కమిటి.
జవాబు.
భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీని భారత రాజ్యాంగ పరిషత్తు 1947 ఆగష్టు 29న ఏర్పరచింది. కమిటీలో ఛైర్మన్, ఆరుగురు సభ్యులు ఉన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆ కమిటీ ఛైర్మన్గా వ్యవహరించారు. ఆ కమిటీలో సభ్యులుగా సర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్. గోపాలస్వామి అయ్యంగార్, సయ్యద్ మహమ్మద్ సాధుల్లా, డాక్టర్ కె.ఎమ్. మునీ, బి.ఎల్. మిత్తర్ సభ్యులుగా ఉన్నారు. రాజ్యాంగ ముసాయిదా కమిటి ముఖ్య లేఖకుడిగా ఎస్.ఎన్ ముఖర్జీ నియమితులయ్యారు.

ముసాయిదా కమిటీ అనేక దఫాలు సమావేశమై రాజ్యాంగ ముసాయిదాను రూపొందించి 1947 నవంబర్ 5న రాజ్యాంగ పరిషత్తుకు సమర్పించింది. రాజ్యాంగ ముసాయిదా ప్రతి 1948 ఫిబ్రవరి 21న ముద్రితమైంది. రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగ ముసాయిదాను నవంబరు 26న ఆమోదించింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 8.
భారత రాజ్యాంగ ధృఢ అధృఢ లక్షణాలు.
జవాబు.
రాజ్యాంగంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను అత్యంత కఠినమైన రీతిలో సవరించడానికి వీలుంటే, మరికొన్ని అంశాలను సరళమైన రీతిలో మార్పు చేయవచ్చు. ఇంకొన్ని అంశాలను సగం కఠినమైన, సగం సరళమైన రీతిలో మార్పు చేయవచ్చు.

భారత రాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టుల అధికారాలు, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు వంటి అంశాలను సవరించడానికి రాజ్యాంగ నిర్మాతలు పరుషమైన పద్ధతిని సూచించారు. రాష్ట్రాల పేర్లు, సరిహద్దులు, విస్తీర్ణం, విలీనం లేదా విభజన, రాష్ట్ర శాసనమండళ్ళ ఏర్పాటు లేదా రద్దు వంటి అంశాలను సులభమైన రీతిలో సవరించడానికి వీలుకల్పించారు. ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాలు వంటి అంశాలను మార్పు చేయడానికి పాక్షిక కఠిన, పాక్షిక సరళ పద్ధతికి అవకాశం ఇచ్చారు.

ప్రశ్న 9.
భారత రాజ్యాంగ ప్రవేశిక.
జవాబు.
రాజ్యాంగ నిర్మాతల ఆశయాలు, ఆకాంక్షలు, లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది. జవహర్లాల్నెహ్రూ ప్రవేశికను ఒక నిశ్చయాత్మక తీర్మానం ప్రమాణం హామిగా వర్ణించారు. ప్రవేశిక భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించింది. భారతీయులకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయాలను ప్రసాదిస్తున్నట్లు వెల్లడించింది.

భారతదేశంలోని సర్వసత్తాధికారం అంతిమంగా భారత ప్రజలకే చెందుతుందని సృష్టీకరించింది. ప్రవేశికను సుప్రీంకోర్టు న్యాయమూర్తి యధోల్కర్ రాజ్యాంగ ప్రధాన లక్షణాల సారం అని వర్ణిస్తే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిదయతుల్లా రాజ్యాంగపు ఆత్మగా ప్రస్తుతించారు.

ప్రశ్న 10.
పార్లమెంటరీ ప్రభుత్వం.
జవాబు.
భారత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వంలో, వివిధ రాష్ట్రాల స్థాయిలో బ్రిటిష్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది. అయితే బ్రిటిష్ తరహా వారసత్వ రాజరికాన్ని భారతదేశం స్వీకరించలేదు. దీనికి బదులుగా భారత రాజ్యాంగ నిర్మాతలు ఐర్లాండ్ తరహాలో ఎన్నికయ్యే అధ్యక్షుడు ఉండే వ్యవస్థను సూచించారు.

అలాగే బ్రిటిష్ రాజకీయ వ్యవస్థ మిగిలిన ఇతర లక్షణాలైన రెండు రకాల కార్యనిర్వాహక నాయకత్వం (రాష్ట్రపతి – ప్రధానమంత్రి), కేంద్రంలో ప్రధాన మంత్రినాయకత్వం, సమిష్టి బాధ్యత నియమం, కేంద్ర కార్యనిర్వాహక వర్గం (మంత్రిమండలి) పై పార్లమెంటు నియంత్రణ, రాష్ట్రపతికి నామమాత్రపు అధికారాలు తదితర లక్షణాలను భారత రాజ్యాంగం స్వీకరించింది. ఇదే తరహా రాజకీయ వ్యవస్థను వివిధ రాష్ట్రాలకు కూడా అన్వయింపజేసింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 11.
భారత రాజ్యాంగ ఏకకేంద్ర, సమాఖ్య లక్షణాలు.
జవాబు.
ఏకకేంద్ర రాజ్యలక్షణాలైన ఒకే పౌరసత్వం, ఒకే సమీకృత న్యాయశాఖ, ఒకే ఎన్నికల సంఘం, రాష్ట్రాల పాలనలో అఖిల భారత సర్వీసుల సిబ్బంది పాత్ర, రాష్ట్రాల రాజ్యాంగ అధిపతులుగా గవర్నర్ల నియామకం, రెండు ప్రభుత్వాలు, పార్లమెంటు ఎగువసభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం, రాజ్యాంగ అంశాల సవరణలో పార్లమెంటు చొరవ వంటి అంశాలు సమాఖ్య లక్షణాలైన లిఖిత రాజ్యాంగం, అధికారాల విభజన, న్యాయశాఖ ఔన్నత్యం, ద్విసభా విధానం వంటివి భారత రాజ్యాంగంలో పేర్కొనడమైంది. అయితే మొత్తం మీద భారత రాజ్యాంగంలో ఏకకేంద్ర రాజ్యం కంటే లక్షణాలే భారత రాజ్యాంగంలో అధికంగా ఉన్నాయి.

ప్రశ్న 12.
సార్వజనిక ఓటు హక్కు.
జవాబు.
భారతదేశంలో వయోజన పౌరులందరికి సార్వజనీన ఓటు హక్కును భారత రాజ్యాంగం ప్రసాదించింది. భారత పౌరులందరూ ఒక్క వయో సంబంధమైన పరిమితి మినహా ఇతర అంశాలైన కులం, మతం, భాష, ప్రాంతం, వర్ణం, వర్గం, ఆస్తులతో నిమిత్తం లేకుండా ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి స్వేచ్ఛను కలిగి ఉంటారు.

ఓటు హక్కు ద్వారా ప్రజా సార్వభౌమాధికార భావన ఆచరణలోకి వస్తుందని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. భారతదేశంలో స్వాతంత్య్రానంతరం ఓటు హక్కును పౌరులకు ప్రసాదించడానికి వయోపరిమితి 1950 నుంచి 1987 వరకు 21 ఏళ్ళగానూ, 1998 నుంచి (రాజ్యాంగం 61వ సవరణ చట్టం మేరకు) 18 ఏళ్ళుగానూ నిర్ణయించడమైనది.

TS Inter 2nd Year Political Science Study Material Chapter 8 భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు

Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 8th Lesson భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు Textbook Questions and Answers.

TS Inter 2nd Year Political Science Study Material 8th Lesson భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
అవినీతిని నిర్మూలించి, వివిధ అవినీతి రూపాలను తెలపండి.
జవాబు.
అవినీతి నిర్వచనం : ప్రపంచ బ్యాంకు నిర్వచనంలో “ప్రభుత్వ పదవిని (లేదా కార్యాలయాన్ని) ప్రైవేటు లాభార్జన కోసం వినియోగించడమే అవినీతి”.

అవినీతి రూపాలు :
అవినీతికి అనేక రూపాలున్నాయి. వీటిలో లంచాలు, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, బలవంతపు వసూల, ప్రభుత్వ ధనం దుర్వినియోగం, కుల-మత ప్రీతికర వివక్షత చూపడం వంటివి ఉన్నాయి. 1988లో వచ్చిన అవినీతి నిరోధక చట్టం ప్రకారం లంచగొండితనం, నిధుల దుర్వినియోగం, ధన సంబంధ ప్రయోజనాలు పొందడం, అధికార పదవిని హోదాను స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించడం, ఆదాయానికి మించి ఎన్నోరెట్లు ఆస్తులను కలిగి ఉండడం తదితర చర్యలు అవినీతి చర్యలుగా, చట్టపరంగా శిక్షార్హమైనవిగా పేర్కొంది.

ఇటీవలి సమకాలీన భారతదేశ అవినీతి రూపాలలో “పరస్పర ప్రతిఫల ప్రేరేపిత అవినీతి” ఎన్నోచోట్ల వెలుగులోకి వస్తోంది. దీని ప్రకారం, రాజకీయ నాయకులు, ఉన్నత అధికారులు కార్పొరేటర్లకు, బడా వ్యాపారవేత్తలకు అనుకూలంగా అధికారిక (ప్రభుత్వ) నిర్ణయాలు తీసుకున్నప్పుడు దీనికి బదులుగా (ప్రతిఫలంగా) వారు సంబంధిత నాయకులు-అధికారుల బంధువర్గానికి చెందిన పారిశ్రామిక యూనిట్లలో షేరు విలువలకు మించి కుప్పలు తెప్పలుగా అక్రమ పెట్టుబడులు పెట్టడం, స్వచ్ఛంద సేవా సంస్థలకు భారీస్థాయిలో విరాళాలు ఇవ్వడం జరుగుతోంది.

మరోవిధంగా చెప్పాలంగే, ప్రతిఫలాలను, ప్రయోజనాలను పరస్పరం (నాయకులు–అధికారులు, కార్పొరేట్లు- వాణిజ్యవేత్తలు) ఇచ్చి పుచ్చుకోవడం జరుగుతోంది. ఇటీవటి కాలంలో కేంద్ర నేరపరిశోధక సంస్థ (CBI) ఈ తరహా కేసులను (Quid Pro quo Cases) విచారిస్తూ కుంభకోణం ఆరోపణలను విచారిస్తోంది.

భారతదేశంలో అవినీతి భారతీయ విలువల వ్యవస్థలో ఒక పెద్ద ఉపద్రవంగా, సవాలుగా మారింది. ఇది అంటువ్యాధిలాగా వ్యపిస్తూ పరిపాలన యంత్రాంగాన్నీ, అభివృద్ధి ప్రక్రియలను, ప్రజాస్వామ్యాన్నీ అపహాస్యం చేస్తోంది. అవినీతి ఆర్థిక అభివృద్ధికి, పేదరిక నిర్మూలనకు వ్యతిరేకమైనది. జాతి వ్యతిరేకత లక్షణంగా గల అవినీతిలో రాజకీయ నాయకులు, ఉన్నత అధికారులు, ప్రభుత్వేతర సంస్థలు, నేరగాళ్ళు క్రియాశీల పాత్ర పోషిస్తూ ఉంటారు.

అవినీతి, వస్తువులు-సేవలు కొరతవల్ల, పరిపాలనలో తీవ్ర జాప్యం వల్ల, వ్యవస్థలో పారదర్శకత లోపించడంవల్ల తలెత్తుతుంది. అవినీతి ప్రజలలో అశాంతిని కలుగజేసి, వ్యవస్థపై ప్రజల నమ్మకం కోల్పోయేలా చేస్తుంది. ఫలితంగా తీవ్రవాదం, హింసావాదం, ఉగ్రవాదం ప్రబలే అవకాశం ఉంటుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 8 భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు

ప్రశ్న 2.
సంకీర్ణ రాజకీయాలు అంటే ఏమిటి ? వాటి లక్షణాలను, సంకీర్ణ రాజకీయాలలోని వివిధ దశలను
వివరించండి.
జవాబు.
సంకీర్ణ రాజకీయాలు-భావం :
కొన్ని రాజకీయ పార్టీలు ఉమ్మడిగా ప్రభుత్వ అధికారం పొందడం లేదా ఉమ్మడి ప్రతిపక్షాన్ని ఏర్పరచి రాజకీయ ప్రక్రియను ప్రజాస్వామీకరించం లక్ష్యంగా ఒక వ్యవస్థగా ఏర్పడడాన్ని సంకీర్ణ రాజకీయాలుగా పేర్కొనవచ్చు. ఈ విధంగా ఉమ్మడి కూటమిగా ఏర్పడ్డ రాజకీయ పార్టీలు తమలో తాము అంగీకరించిన ఎజెండా ఆధారంగా కనీస ఉమ్మడి కార్యక్రమం (Common Munimum Programme) ఏర్పరచుకొంటాయి.

లక్షణాలు :
సంకీర్ణ రాజకీయాలు భారతదేశానికి కొత్తేమీకాదు, వాస్తవానికి, నాలుగో సాధారణ ఎన్నికల తరువాత భారతదేశంలో వివిధ రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడి, వివిధ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి అశ్యర్థులను నిలబెట్టాయి. ప్రస్తుతం భారతదేశంలో రెండు ప్రధాన రాజకీయ కూటములు క్రియాశీలంగా పనిచేస్తున్నాయి.

వీటిలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో అకాలీదళ్, లోక్ జనశక్తి పార్టీ తదితర ప్రధాన రాజకీయ పార్టీలు “జాతీయ జాస్వామ్య కూటమి” (NDA) పేరుతో సంకీర్ణంగా ఏర్పడ్డాయి. మరో ప్రధాన సంకీర్ణ కూటమి ఐక్య ప్రగతిశీల కూటమి (UPA) పేరుతో భారత జాతీయ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, డి.ఎం.కె. తదితర పార్టీలు భాగస్వామ్య పక్షాలుగా కొనసాగుతోంది.

వివిధ దశలు :
భారతదేశంలో సంకీర్ణరాజకీయాల పరిణామ క్రమాన్ని వాటి స్వభావం-పనితీరు ఆధారంగా వివిధ దశలుగా అధ్యయనం చేసుకోవచ్చు. మొదటిదశ సంకీర్ణ రాజకీయాలు 1967-1971 మధ్యకాలంలో వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అవతరించి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను సవాలు చేయడంతో ప్రారంభమవుతుంది. భారతీయ జనసంఘ్, లోక్ దళ్, సోషలిస్టు పార్టీ, సంయుక్త విధాయక దళ్ మొదలైనవి ఉత్తర భారత రాష్ట్రాల్లో అవతరించి, సంకీర్ణాలు ఏర్పరచాయి.

సంకీర్ణ రాజకీయాలు రెండోదశ 1977-1980 మధ్య కాలంలో కేరళ, త్రిపుర, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల్లో వామపక్ష సిద్ధాంత భావజాలం ఆధారంగా వామపక్ష కూటిమి ప్రభుత్వాల ఏర్పాటులో ప్రతిబింబిస్తుంది. అలాగే 1977లో వచ్చిన జనతాపార్టీ కూడా సంకీర్ణ రాజకీయాల్లో భాగమని కొద్దిమంది భావిస్తారు. జనతాప్రయోగం కొద్దినెలలు మాత్రమే కేంద్రంలో అధికారంలో ఉంది.

సంకీర్ణ రాజకీయాల్లో మూడో దశ 1989-1991 మధ్యకాలంలో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో, వివిధ రాష్ట్రాల్లో కనిపిస్తుంది. అయితే ఈ దశలోని సంకీర్ణ రాజకీయాలలో సంకీర్ణ భాగస్వామ్య పక్షాల మధ్య సంబంధాల్లో ఒక నూతన ధోరణి కనిపిస్తుంది. సంకీర్ణ పక్షాలు కొన్ని ప్రభుత్వంలో చేరకుడా వెలుపలి నుండి మద్దతు (outside support) అందించి సంకీర్ణ రాజకీయాల్లో పాల్గొనేవి.

సంకీర్ణ రాజకీయాల్లో నాలుగో దశ 1996-1999 మధ్యకాలంలో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో అస్థిరతను, తరచుగా ప్రభుత్వాలు పతనం కావడాన్ని రాజీకీయ యుక్తులు-కుయుక్తులను సూచిస్తుంది. ఈ దశలో సంకీర్ణ భాగస్వామ్య పక్షాలు అనేక సంక్షోభాలను సృష్టిస్తూ తరచుగా ప్రభుత్వం నుంచి దూరంగా ఉండడం, మద్దతు ఉపయోగించుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఎంతో అస్థిరతను ఎదుర్కొంది. ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సంకీర్ణ రాజకీయాల ఫలితంగా పతనం చెందడం జరిగింది.

సంకీర్ణ రాజకీయాల్లో అయిదో దశగా 2004-2020 మధ్యకాలంలో హేతుబద్ధంగా కనీస ఉమ్మడి కార్యక్రమం ప్రాతిపదికగా భాగస్వామ్యపక్షాలు ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం గమనిస్తారు. దీనిలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) ఐక్య ప్రగతిశీల కూటమి (UPA) సంకీర్ణాలు భాగస్వామ్య పక్షాలందరికీ ఆమోదయోగ్యమైన ఎజెండాను “కనీస ఉమ్మడి కార్యక్రమం” (Common Minimum Programme) ప్రాతిపదికగా ఏర్పరచుకొని, ప్రభుత్వాలను పూర్తి పదవీకాలం, విజయవంతంగా నిర్వహించాయి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 8 భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారతదేశంలో సంకీర్ణ రాజకీయాలు, అవతరణకు గల కారణాలను వివరించండి.
జవాబు.
భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడడానికి ఎన్నో కారణాలు దోహదం చేశాయి. ఆధిపత్య పార్టీగా కొనసాగిన కాంగ్రెస్ పార్టీ దేశంలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైనోవడం, మెజారిటీ సాధించే స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఎన్నికల విజయాలు సాధించడం కారణంగా అనేక ఇతర పార్టీలు అవతరించి, అభివృద్ధి చెందాయి.

అలాగే వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని సవాలు చేసే విధంగా ప్రాంతీయ రాజకీయ పార్టీలు అవతరించి, ఇతర జాతీయ పార్టీలతో మైత్రి కూటములు ఏర్పాటు చేసుకోవడం కూడా సంకీర్ణ రాజకీయాలకు దారితీసింది.

సంకీర్ణ రాజకీయాలు వృద్ధి చెందడానికి గల కారణాలను ఈ కింది విధంగా పేర్కొనవచ్చు.

  1. ఏకపార్టీ ఆధిపత్యం నశించడం.
  2. ప్రజల ప్రాంతీయ ఆకాంక్షలు, ప్రయోజనాలు సంతృప్తి పరచడానికి ప్రాంతీయ రాజకీయ పార్టీలు అవతరించడం.
  3. సమాజంలోని వివిధ సమూహాలు తమ హక్కుల పట్ల చైతన్యం పొందడంతో సాంఘిక-రాజకీయ ఉద్యమాలు వ్యాప్తి చెందడం.
  4. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా జాతీయస్థాయిలో, రాష్ట్రాలస్థాయిలో రాజకీయ సంకీర్ణాలు ఏర్పరచవలసిన పరిస్థితులు ఏర్పడటం.

ప్రశ్న 2.
భారతదేశ నేపథ్యంలో వివిధ ఉగ్రవాద రూపాలను తెలియజేయండి.
జవాబు.
1. తెగల-జాతీయవాద ఉగ్రవాదం (Ethno-Nationalist Terrorism) :
ఉగ్రవాద సమూహాలు భారతదేశం నుంచి వేర్పాటును కోరుతూ లేదా భారత సమాఖ్యలో నూతన రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ ఉగ్రవాద చర్యలకు, హింసకు పాల్పడడాన్ని తెగల జాతీయవాద ఉగ్రవాదంగా పేర్కొనవచ్చు.

2. మతమౌఢ్య ఉగ్రవాదం (Religious Terrorism) :
ఈ తరహా ఉగ్రవాదం మత మౌఢ్యవాదం ఆధారంగా జనిస్తుంది. భారతదేశంలో ఎన్నో ఉగ్రవాద చర్యలు, సంఘటనలు, దాడులు ఈ కోవలోకి వస్తాయి. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐ.ఎస్.ఐ (ISI) సహాయంతో ఉగ్రవాద సంస్థలు-సమూహాలు ఎన్నో ప్రాంతాల్లో మతమౌఢ్య ఉగ్రవాదానికి పాల్పడ్డాయి.

2008 నవంబర్ 26న ముంబాయిలో ఉగ్రవాద దాడులు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన దాడులు, ప్రజలకు ఎంతో ప్రాణనష్టాన్ని, ఆస్తినష్టాన్ని కలిగించాయి. దీన్ని కొద్దిమంది జిహాదీ ఉగ్రవాదం పేరుతో కూడా వ్యవహరిస్తారు.

3. సిద్ధాంత (భావజాల) ఆధారిత ఉగ్రవాదం :
దీనినే వామపక్ష తీవ్రవాదమని కూడా వ్యవహరిస్తారు. సమాజ ఆర్థిక దోపిబిని, అణచివేతను, ఆర్థిక అసమానతలను నిర్మూలించడానికి వామపక్ష పోరాటమే మార్గమని నమ్ముతుంది. ప్రఖ్యాత కమ్యూనిస్టు సిద్ధాంతవేత్తలు కారల్ మార్క్స్, మావో, లెనిన్ తదితరుల సిద్ధాంత భావనల ఆధారంగా ఈ తీవ్రవాదం వ్యవహరిస్తుంది. సమాజంలోని విప్లవాత్మక మార్పు లక్ష్యాన్ని హింస, ఉగ్రవాదంతో చేరుకోవచ్చని నమ్ముతుంది.

4. రాజ్యప్రాయోజిక ఉగ్రవాదం (సీమాంతర ఉగ్రవాదం):
పొరుగు రాజ్యాలనుంచి పరోక్ష రూపంలో వ్యక్తమయ్యే ఉగ్రవాదం. సరిహద్దులకు వెలుపల ఇతర రాజ్యాలలో ఉగ్రవాద సంస్థలకు సమూహాలకు తోడ్పాటు అందిస్తూ భయానక వాతావరణాన్ని, అస్థిరతను కలుగజేసే లక్ష్యంతో ఉగ్రవాద చర్యలు ఉంటాయి.

భారతదేశం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్ చేతిలో ఈ తరహా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోంది. భారతదేశంలోని ఉగ్రవాద సమూహాలకు పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐ.ఎస్.ఐ (ISI), ఇతర ఏజెన్సీలు సహాయం అందిస్తున్నట్లు తెలుస్తోంది.

5.మాదక ద్రవ్య (గంధపు చెక్కలు మొదలైన వాటి అక్రమరవాణా) ఉగ్రవాదం :
ఈ తరహా ఉగ్రవాదం నిషేధించిన మాదకద్రవ్యాలు, గంధపు చెక్కల అక్రమరవాణాపై దృష్టి కేంద్రీకరిస్తుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 8 భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు

ప్రశ్న 3.
భారతదేశంలో అమలులో ఉన్న ఉగ్రవాద నిరోధక చట్టాలు ఏవి ?
జవాబు.
ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్టు, జాతీయ భద్రతాచట్టం (MISA), Conservation of Foreign Exchange and Preven- tion of Smuggle Activities Act (COFEPOSA), National Security ACT (NSA), ఉగ్రవాద నిరోధక చట్టం మొదలగునవి.

ప్రశ్న 4.
భారతదేశంలో వివిధ అవినీతి నిరోధక చట్టాలను పేర్కొనండి.
జవాబు.
భారత ప్రభుత్వం అవినీతి నిరోధానికి వివిధ స్థాయిలో అనేక చర్యలు చేపట్టింది. భారతదేశంలో ప్రజా జీవితంలో అవినీతిని అదుపు చేయడానికి అవినీతి నివారక చట్టాన్ని 1988లో రూపొందించింది. ఈ చట్టంలో మరిన్ని సవరణలు చేసి అవినీతి నివారణ చట్టం, 2018 రూపొందించింది.

దీని ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ ఉద్యోగులు తమ అధికారిక విధులను నిర్వహించే క్రమంలో చట్ట వ్యతిరేకంగా ప్రతిఫలాన్ని ఆశించండం లేదా లంచాలు తీసుకోవడాన్ని నిషేధించడం.

ఈ చట్టం లంచాలను ఇచ్చేవారిని, మధ్యవర్తులను కూడా దోషులుగా పరిగణిస్తుంది. అయితే కొద్దిమంది ఉన్నత పదవులలో ఉండే నాయకులు లేదా అధికారులపై అవినీతి కేసులు నమోదు చేయడానికి రాజ్యాంగ వ్యవహర్తల ముందు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.

రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై ఆరోపణల విషయంలో రాష్ట్ర గవర్నర్, కేంద్ర ప్రభుత్వ అధికారుల విషయంలో భారత రాష్ట్రపతి అనుమతి అవసరం అవుతుంది.

ఇదేకాక భారతీయ శిక్షాస్మృతి (Indian Penal code) లోని అనేక నిబంధనలు అవినీతి చర్యలకు పాల్పడే ఉద్యోగులపై శిక్షలు విధించడానికి తోడ్పడతాయి దీనితో పాటు మనీలాండరింగ్ నివారణ చట్టం (2002), సమాచార హక్కు చట్టం (2005) మొదలైనవి కూడా అవినీతి గుర్తించి, కేసులను నమోదు చేయడానికి తోడ్పడతాయి.

ప్రభుత్వోద్యోగులలో అవినీతిని నిరోధించడానికి 1964లో కేంద్ర నిఘా వ్యవహారాల కమిషన& (Central Vigilance Commission-CVC) ని స్థాపించారు. అవినీతికి సంబంధించిన అంశాల్లో పౌరులు చేయవలసిన, చేయకూడని పనులను ఈ కమిషన్ మార్గదర్శకాల రూపంలో రూపొందించింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 8 భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
జాతీయ స్థాయిలో సంకీర్ణ రాజకీయాలు.
జవాబు.
జాతీయ స్థాయిలో ఎన్నోసార్లు సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కేంద్రప్రభుత్వంలో మొదటిసారిగా 1977లో భారతీయ లోక్ దళ్, కాంగ్రెస్ (ఒ), జనసంఘ్, సోషలిస్టు పార్టీ, కొన్ని ఇతర చిన్న పార్టీలు కలిసి జనతా పార్టీగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇది జనతా ప్రయోగంగా ప్రఖ్యాత గాంచింది.

మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఈ ప్రభుతవ &ం ఏర్పడింది. కేంద్రప్రభుత్వంలో 1989లో వి.పి.సింగ్ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. జనమోర్చా, లోక్ దళ్ పార్టీలు నేషనల్ ఫ్రంట్ పేరుతో సంయుక్తంగా, భారతీయ జనతాపార్టీ, వామపక్షాల వెలుపలి మద్దతు అందించడంతో ఈ ప్రభుత్వాన్ని ఏర్పరచాయి.

1996 మే నెలలో హెచ్.డి. దేవగౌడ నాయకత్వంలో యునైటెడ్ ఫ్రంట్ (UF) ప్రభుత్వం ఏర్పడిది. దీనిలో జనతాదళ్, సి.పి.ఐ-సి.పి.ఎం తదితర పార్టీలు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. ఈ సంకీర్ణం తదనంతర కాలంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమిగా (NDA) ఆవిర్భవించింది. ఆ తరువాత 2004 సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటిమి (UPA) డా॥ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా అధికారాన్ని చేపట్టింది.

ప్రశ్న 2.
సంకీర్ణ రాజకీయాల ప్రయోజనాలు, నష్టాలు.
జవాబు.
భారతదేశంలో సంకీర్ణ రాజకీయాలు రాజకీయ సర్దుబాట్లకు, సహాయ సహకారాలకు దారితీశాయి. దీనికి అనుగుణంగా భారత సమాఖ్య స్వభావం మార్పుచెంది, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య అతి తక్కువ స్థాయికి వివాదాలు తగ్గిపోయాయి.

భారతాయ సమాఖ్య ఒక సహకార సమాఖ్యగా రూపాంతరం చెందింది. అలాగే సంకీర్ణ రాజకీయాలు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి దేశంలోని వివిధ స్థాయిల్లో ప్రత్యామ్నాయాన్ని ప్రజాసమస్యలు బాగా వెలుగులోకి రాగలగడతో భారత కాంగ్రెస్ పార్టీకి దేశంలోని వివిధ స్థాయిల్లో ప్రత్యామ్నాయాన్ని ప్రజాసమస్యలు బాగా వెలుగులోకి రాగలగడంతో భారత రాజకీయ వ్యవస్థ తన సామర్థ్యాలను పెంపొందించుకొని ప్రజల డిమాండ్లను పరిష్కరించడానికి సమాయత్తమవుతోంది.’

సంకీర్ణ రాజీకీయాల వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు తమ సంకీర్ణ భాగస్వామ్య పక్షాలతో రాజకీయ బేరసారాలకు దిగుతాయి. కొన్నిసార్లు దీని ఫలితంగా రాజకీయ కుయుక్తులు పెరిగి, రాజకీయ అస్థిరతకు దారితీస్తుంది. చాలా రాజకీయ పార్టీలకు స్వార్థ ప్రయోజనాలతో నిండిన ఎజెండా ఉండడం ఫలితంగా రాజకీయ నీచత్వం, దురాచారాలు, బెదిరింపులు, కుతంత్రాలు రాజ్యమేలుతాయి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 8 భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు

ప్రశ్న 3.
ఉగ్రవాదం లక్షణాలు.
జవాబు.
ఉగ్రవాదంపై జరిగిన అనేక అధ్యయనాలు, ఉగ్రవాద చర్యలలో కనిపించే సారూప్యతలను, ధోరణులను, లక్షణాలుగా తెలిపాయి.

  1. కొద్దిమంది వ్యక్తులు ప్రణాళికాబద్ధంగా, వ్యవస్థీకృతంగా బుద్ధి పూర్వకంగా చేసే హింసాత్మక చర్య ఉగ్రవాదంగా ఉంటుంది.
  2. ఉగ్రవాదం అమాయకపు ప్రజలను లేదా ఒక నిర్దిష్ట వర్గాన్ని పోలీసు అధికారులను, సాయుధ దళాలను లేదా కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని చేసే హింసాత్మక చర్య.
  3. సమాజంలోని సాంఘిక-ఆర్థిక లేదా రాజకీయ వ్యవస్థను సవాలుచేస్తూ, కొద్దిమంది ప్రేరణతో జరిగే హింస ఉగ్రవాదం లేదా తీవ్రవాదం రూపంలో బహిర్గతమవుతుంది.
  4. ఉగ్రవాదం ప్రభుత్వంపైన, రాజకీయ వ్యవస్థపైన జరిపే అనధికార యుద్ధంగా కనబడుతుంది.
  5. బెదిరింపులకు, పాశవికతకు ఉగ్రవాదం సాధనంలాగా ఉంటుంది. కొద్దిమంది తమ డిమాండ్లను హింసాత్మక ఉగ్రవాద చర్యలు ద్వారా వ్యక్తీకరిస్తారు.

ప్రశ్న 4.
అవినీతి రూపాలు.
జవాబు.
అవినీతికి అనేక రూపాలున్నాయి. వీటిలో లంచాలు, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, బలవంతపు వసూలు, ప్రభుత్వ ధనం, దుర్వినియోగం, కుల-మత ప్రీతికర వివక్షచూపడం వంటివి ఉన్నాయి.

1988లో వచ్చిన అవినీతి నిరోధక చట్టం ప్రకారం లంచగొండితనం, నిధుల దుర్వినియోగం, ధన సంబంధ ప్రయోజనాలు పొందడం, అధికార పదవిని, హెూదాను స్వార్థప్రయోజనాలకు ఉపయోగించడం, ఆదాయానికి మించి ఎన్నోరెట్లు ఆస్తులను కలిగిఉండం తదితర చర్యలు అవినీతి చర్యలుగా, చట్టపరంగా శిక్షార్హమైనదిగా పేర్కొంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 8 భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు

ప్రశ్న 5.
ప్రజావేగులు.
జవాబు.
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని వెల్లడించి, బహిర్గతం చేసి అవినీతికి వ్యతిరేకంగా ప్రజలను అప్రమత్తులను చేసే కార్యకర్తలలే (Whistle Blowers). వీరికి అవినీతి అధికారులు, నాయకుల నుంచి ప్రమాదాలు ఎదురవుతాయి. ఇటీవలి కాలంలో జాతీయ రహదారుల అథారిటీ కుంభకోణాన్ని వెలికితీసిన శ్రీ సత్యేంద్ర దూబే హత్య, సమాచార హక్కు కార్యకర్తల షీలా మసూద్ హత్య తదితర సంఘలనలు ప్రజావేగులకు రక్షణ కల్పించవలసిన అవసరాన్ని తెలియజేస్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం “ప్రజా ప్రయోజనాల వెల్లడి తీర్మానం” (Public Interest Disclosure resolution-PIDR) పేరుతో ఈ ప్రజావేగుల జీవితాలకు భద్రత కల్పించడానికి అనేక చర్యలు తీసుకొంటోంది.

TS Inter 1st Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 12th Lesson ప్రభుత్వం – రకాలు Textbook Questions and Answers.

TS Inter 1st Year Political Science Study Material 12th Lesson ప్రభుత్వం – రకాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఏకకేంద్ర ప్రభుత్వం అంటే ఏమిటి ? వాటి లక్షణాలను తెలపండి.`
జవాబు.
‘యూనిటరి’ (Unitary) అనే పదం ‘యూని’ (Uni), ‘టరి’ (Tary) అను రెండు ఆంగ్ల పదాల కలయిక. యూని అనగా ‘ఒక్కటి’, టరీ అనగా ‘పాలన’ అని అర్థం. అందువల్ల యూనిటరీ గవర్నమెంట్ను ‘ఏకకేంద్ర ప్రభుత్వం’గా వ్యవహరిస్తారు. ఏకకేంద్ర ప్రభుత్వంలో పాలనాధికారాలన్నీ సమీకృతంగా ఒకే ఒక ప్రభుత్వం చేతిలో ఉంటాయి. రాజ్యాంగం సర్వాధికారాలన్నీ కేంద్రప్రభుత్వం చేతిలో ఉంచుతుంది.

కేంద్రప్రభుత్వం ఒక్కటే అధికారాలన్నింటిని అనుభవిస్తుంది. అయితే, కేంద్రప్రభుత్వం ప్రత్యేక రాజకీయ ఉపశాఖలను (Political subdivisions) ఏర్పరచి వాటికి కొన్ని అధికారాలను నిర్వహించే అవకాశాన్ని కల్పించవచ్చు. వివిధ రాష్ట్రాల పాలనాధికారాలను ఆయా ప్రాంతీయ మండళ్ళు (Provincial Units) ద్వారా చక్కబెట్టవచ్చు. ఈ ప్రాంతీయ మండళ్ళు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో సహాయక కేంద్రాలుగా పనిచేస్తాయి. ఏకకేంద్ర ప్రభుత్వానికి చక్కటి ఉదాహరణ బ్రిటన్.

ఏకకేంద్ర ప్రభుత్వ నిర్వచనాలు (Definitions of Unitary Government) :
1. ఏ.వి. డైసీ :
“అత్యున్నత శాసనాధికారాన్ని ఒకే ఒక కేంద్రప్రభుత్వం సంపూర్ణంగా నిర్వహించేదే ఏకకేంద్ర ప్రభుత్వం”.

2. హైర్మన్ ఫైనర్ :
“కేంద్ర స్థాయిలో అన్ని రకాల అధికారాలు, ఆధిపత్యం ఇమిడీకృతమై, తన ఇష్టానుసారంగా లేదా దాని అనుబంధశాఖల ద్వారా భౌగోళిక ప్రాంతానికంతటికి న్యాయపరంగా సర్వశక్తి గల అధికారం గల ప్రభుత్వమే ఏకకేంద్ర ప్రభుత్వం”.

3. ప్రొఫెసర్. జె.డబ్ల్యు. గార్నర్ :
“ప్రభుత్వానికి గల సర్వాధికారాలు రాజ్యాంగపరంగా ఒకే ఒక కేంద్ర వ్యవస్థ లేదా వ్యవస్థలకు చెంది ఉండి, వాటి నుంచి స్థానిక ప్రభుత్వాలు తమ అధికారాలను పొందినట్లయితే. అటువంటి ప్రభుత్వమే. ‘ఏకకేంద్ర ప్రభుత్వం’ అంటారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

ఏకకేంద్ర ప్రభుత్వం లక్షణాలు (Features of Unitary Government) :
ఏకకేంద్ర ప్రభుత్వం ఈ క్రింది లక్షణాలను కలిగి ఉంటుంది.

1. ఏకకేంద్ర వ్యవస్థలో ఒకే ప్రభుత్వముంటుంది (Single Government) :
దీనినే కేంద్ర ప్రభుత్వమని వ్యవహరిస్తారు. కేంద్ర ప్రభుత్వం రాజ్య పరిధిలోని అన్ని శాఖలకు సంబంధించిన అధికారాలను నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అత్యున్నతమైన శాసన నిర్మాణ, కార్యనిర్వాహక, న్యాయపరమైన అధికారాలను కలిగి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ అధికారం దేశంలోని ప్రజలందరికీ వర్తిస్తుంది.

2. ప్రాంతీయ ప్రభుత్వాలు (Provincial Government) :
ఏకకేంద్ర ప్రభుత్వ విధానంలో ప్రాంతీయ ప్రభుత్వాల ఏర్పాటు ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. ఒకవేళ ప్రాంతీయ ప్రభుత్వాలు ఉన్నట్లయితే, వాటి అధికారాలు మరియు ఉనికి కేంద్ర ప్రభుత్వం మీదనే ఆధారపడి ఉంటాయి. పాలనా సౌలభ్యం కొరకు వీటిని ఏర్పాటు చేయటం జరుగుతుంది. వీటికి స్వయం నిర్ణయాధికారం ఉండదు. అవి కేంద్ర ప్రభుత్వం నుండి తమకు అవసరమైన అధికారాలను పొందుతాయి.

3. సరళ రాజ్యాంగం (Flexible Constitution) :
ఏకకేంద్ర ప్రభుత్వం సాధారణంగా సరళ రాజ్యాంగాన్ని కలిగి ఉంటుంది. దీనితో పాటు లిఖిత రాజ్యాంగాన్ని కలిగి ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరుధ్యాలు ఏర్పడే అవకాశం ఎంత మాత్రం ఉండదు. ఈ కారణం వల్ల, వివిధ రాజ్యాంగ వ్యవస్థలు శక్తివంతంగా పనిచేస్తాయి.

4. ఏక పౌరసత్వం (Single Citizenship) :
ఏకకేంద్ర ప్రభుత్వం పౌరులందరికీ ఒకే పౌరసత్వాన్ని కల్పిస్తుంది. ఏకకేంద్ర ప్రభుత్వంలో ఏ ప్రాంతంలో జన్మించినా ప్రత్యేక గుర్తింపునిచ్చే పౌరసత్వం కలిగి ఉంటారు. అంతిమంగా ఏకపౌరసత్వం జాతీయ ఏకత, సమైక్యత, సౌభ్రాతృత్వాన్ని ప్రజలలో పెంపొందిస్తుంది.

5. ఏక శాసన సభ (Unicameralism) :
ఏకకేంద్ర ప్రభుత్వం ఒకే శాసన సభను కలిగి ఉంటుంది. ఆ శాసన సభకు అన్ని రకాల శాసనాధికారాలుంటాయి. ప్రాంతీయపరమైన శాసనసభలు ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నట్లయితే అవి కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు తమ విధులను నిర్వహిస్తాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

ప్రశ్న 2.
సమాఖ్య ప్రభుత్వం అంటే ఏమిటి ? వాటి లక్షణాలను పరిశీలించండి.
జవాబు.
‘ఫెడరేషన్’ (Federation) అనే ఆంగ్ల పదం ఫోడస్ (Foedus) అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. ‘ఫోడస్’ అనగా ఒడంబడిక లేదా అంగీకారం అని అర్థం. ఆధునిక రాజకీయ వ్యవస్థలో ‘సమాఖ్య విధానం’ ఒక రాజకీయ ఆలోచనా ప్రక్రియగా మారింది. ఈ విధానం అత్యంత బహుళ ప్రాచుర్యం పొందింది. అమెరికా (1789), స్విట్జర్లాండ్ (1848), ఆస్ట్రేలియా (1901), కెనడా (1931) వంటి దేశాలు సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థకు మంచి ఉదాహరణలు.

నిర్వచనాలు :
1. ఎ.వి. డైసీ : “జాతీయ సమైక్యత, ప్రాంతీయ విభాగాల హక్కులను సమన్వయపరిచే రాజకీయ సాధనమే సమాఖ్య ప్రభుత్వం”.
2. జె.డబ్ల్యు. గార్నర్ : “సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థ అనేది ప్రభుత్వానికి గల మొత్తం అధికారాలను కేంద్రం- రాష్ట్రాల మధ్య జాతీయ రాజ్యాంగం ద్వారా పంపిణీ చేసేది”.

సమాఖ్య ప్రభుత్వ లక్షణాలు (Features of Federal Government) : సమాఖ్య ప్రభుత్వం అనేక లక్షణాలను కలిగి ఉంది. వాటిని ఈ క్రింది విధంగా తెలుసుకోవచ్చు.

1. లిఖిత రాజ్యాంగం (Written Constitution) :
సాధారణంగా సమాఖ్య వ్యవస్థ ఉనికిలో ఉన్న దేశాల్లో లిఖిత రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగం దేశం మొత్తానికి అత్యున్నత శాసనంగా పరిగణించబడుతుంది. ఆ రాజ్యాంగమే అధికారాలను నిర్వచించి, నిర్ణయించి కేంద్రం, రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది. ఆ విధంగా సమాఖ్య వ్యవస్థ అవసరమైన, ఆచరణయోగ్యమైన ప్రభుత్వ విధానంగా ఉంటుంది.

2. ద్వంద్వ పౌరసత్వం (Duel Citizenship):
సమాఖ్య రాజ్య వ్యవస్థలో పౌరులకు ద్వంద్వ (రెండు) పౌరసత్వం ఉంటుంది. (ఒకటి జాతీయస్థాయి, రెండు సంబంధిత రాష్ట్రస్థాయి) అందువల్ల పౌరులు కేంద్రం, రాష్ట్రాల పౌరసత్వాన్ని పొందుతారు. తత్ఫలితంగా, పౌరులు జాతీయ, ప్రాంతీయ ప్రభుత్వాల ఎన్నిక ప్రక్రియలో ప్రాతినిధ్యం వహిస్తారు.

3. అధికార విభజన (Division of Powers) :
సమాఖ్య విధానంలో ప్రభుత్వ అధికారాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజింపబడతాయి. కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రయోజనాలను కాపాడే అంశాలపై నియంత్రణ కలిగి ఉంటుంది. ఉదాహరణకు రక్షణ, విదేశీ వ్యవహారాలు, సుంకాలు, ఎగుమతులు-దిగుమతులు వంటి జాతీయ ప్రాముఖ్యత గల అంశాలను నియంత్రిస్తుంది. అదేవిధంగా, వ్యవసాయం, విద్య, వైద్యం, నీటి పారుదల విషయాలను ప్రాంతీయ ప్రభుత్వాలకు అప్పగించటం జరుగుతుంది.

4. ద్విసభా విధానం (Bicameralism) :
ద్విసభా విధానమనేది సమాఖ్య వ్యవస్థకు మరో ముఖ్య లక్షణం. సమాఖ్య రాజ్యంలో రెండు సభలు ఉంటాయి. ఎగువ సభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షిస్తుంది. ఎగువ సభలో రాష్ట్రాల జనాభాననుసరించి ప్రాతినిధ్యం కల్పించటం జరుగుతుంది. దిగువసభ ప్రజలకు ప్రత్యక్ష ప్రాతినిధ్యం వహిస్తుంది.

5. దృఢ రాజ్యాంగం (Rigid Constitution) :
సాధారణంగా, సమాఖ్య వ్యవస్థలో రాజ్యాంగం దృఢ లక్షణాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల రాజ్యాంగ సవరణ అంత సులభం కాదు. కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి రాజ్యాంగ సవరణ చేయటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. ఈ కారణం వల్ల, అటు కేంద్ర ప్రభుత్వం గానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు గానీ రాజ్యాంగ సూత్రాలను ఏకపక్షంగా సవరించలేవు.

6. స్వతంత్ర న్యాయశాఖ (Independent Judiciary):
సమాఖ్యప్రభుత్వ విధానంలో అతి ముఖ్యమైన లక్షణమేమిటంటే స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయశాఖ. ఎందుకంటే, కేంద్రం, రాష్ట్రాల మధ్యగల వివాదాలను ఒక్క న్యాయశాఖ మాత్రమే తీర్చగలదు. అందువల్ల న్యాయమూర్తులు రాజ్యాంగపరంగా సంక్రమించిన స్వతంత్ర హోదాను సంతృప్తిగా అనుభవిస్తారు.

సాధారణంగా న్యాయమూర్తుల నియామకం ఒకసారి జరిగిన తరువాత వారిని తొలగించడం అంత సులభం కాదు. వారు పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తారు. అంతేకాదు శాసననిర్మాణ, కార్యనిర్వాహక శాఖలు అమలుపరిచే అధికారాలు దుర్వినియోగం జరుగుతున్నట్లు భావించినట్లయితే, ఆ అధికారాలను నియంత్రించేది న్యాయశాఖ మాత్రమే.

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

ప్రశ్న 3.
అధ్యక్ష తరహా అంటే ఏమిటి ? వాటి లక్షణాలను చర్చించండి.
జవాబు.
బాగెహట్ అభిప్రాయం ప్రకారం అధ్యక్ష తరహా ప్రభుత్వంలో శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ రెండు స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. పార్లమెంటు ప్రభుత్వంలో రెండు శాఖలు విలీనమయి పనిచేస్తుంటాయి. అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహక శాఖ శాసన శాఖకు బాధ్యత వహించదు. పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహక శాఖ శాసన శాఖకు బాధ్యత వహిస్తుంది.

అధ్యక్ష తరహా ప్రభుత్వ లక్షణాలు :
ఎ. అధ్యక్షుడు రాజ్యానికి, ప్రభుత్వాధినేత :
అధ్యక్ష తరహా ప్రభుత్వంలో అధ్యక్షుడు ఇటు రాజ్యాధినేతగాను ప్రభుత్వాధినేతగాను కొనసాగుతారు. వాస్తవంగా కార్యనిర్వాహక అధికారాలను చేలాయిస్తాడు. అతడు ప్రభుత్వ నిర్ణయాలను, పథకాలను తన సెక్రటరీల ద్వారా అమలుచేస్తాడు.

బి. కార్యనిర్వాహకశాఖ నుండి శాసనశాఖ వేరుచేయబడి ఉంటుంది :
ఈ తరహా ప్రభుత్వంలో శాసనశాఖ, కార్యనిర్వాహకశాఖ రెండు వేరుగాను, స్వతంత్రంగాను వ్యవహరిస్తూ ఒక శాఖ విషయంలో మరోశాఖ జోక్యం చేసుకోకపోవడం మరో’ లక్షణం.

సి. రాజ్యాధినేత, ప్రభుత్వాధినేత ఎన్నిక :
అధ్యక్ష తరహా కార్యనిర్వాహక వర్గం వారసత్వం ద్వారా గాని నామినేట్ చేయడం ద్వారా గాని ఏర్పడదు. ప్రజల నుంచి నేరుగా ఎన్నిక కావడం మూలంగానే ఏర్పడుతుంది.

డి. అధ్యక్షుడి అభిశంసన :
రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు తప్పుచేసినా, చట్టాలను ఉల్లంఘించినా పదవి ప్రమాణ స్వీకారం చేసిన శాసనశాఖ ద్వారానే అభిశంసించబడి దానిచే తొలగించబడతాడు.

ఇ. నిరోధ సమతౌల్యాలు :
అధ్యక్ష తరహా ప్రభుత్వానికి మరో ముఖ్యలక్షణం నిరోధ సమతౌల్య సూత్రం ఆధారంగా వ్యవహరించటం. ఈ తరహా ప్రభుత్వంలో ప్రభుత్వాంగాలు స్వతంత్రంగా వ్యవహరిస్తూనే పరస్పరం నిరోధ సమతౌల్యతతో వ్యవహరిస్తాయి. శాసనశాఖ అధ్యక్షుడి నిర్ణయాలకు ఆమోదం తెలుపుతుంది. అదేవిధంగా శాసనశాఖ తీసుకునే నిర్ణయాలకు అధ్యక్షుడు ఆమోదం తెలియజేయాల్సి ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం న్యాయశాఖ సమీక్ష చేస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

ప్రశ్న 4.
పార్లమెంటరీ ప్రభుత్వం అంటే ఏమిటి ?
జవాబు.
పరిచయం :
ఏ ప్రభుత్వ వ్యవస్థలో కార్యనిర్వాహక వర్గం శాసనసభ నుండి ఎన్నుకోబడి శాసనసభ యొక్క విశ్వాసాన్ని కలిగి ఉన్నంతకాలం అధికారంలో కొనసాగుతుందో ఆ ప్రభుత్వ వ్యవస్థనే ‘పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థ’ అని అంటారు. ఈ పార్లమెంటరీ ప్రభుత్వానికి పుట్టినిల్లుగా ‘బ్రిటన్ ‘ను పేర్కొనవచ్చు.

నిర్వచనం :
ప్రొఫెసర్ గార్నర్ పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ఈ విధంగా నిర్వచించారు. “పార్లమెంటరీ ప్రభుత్వమంటే నిజమైన కార్యవర్గం, మంత్రిమండలి లేదా మంత్రివర్గం

  1. తక్షణం, చట్టబద్దంగా తన రాజకీయ విధానాలు, చర్యలకు శాసనసభకు
  2. అంతిమంగా నియోజకులకు బాధ్యత వహించే వ్యవస్థతో కూడినది”.

పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణాలు : పార్లమెంటరీ ప్రభుత్వం ఈ క్రింది లక్షణాలను కలిగి ఉంది. అవి :

1. నామమాత్రమైన, వాస్తవ కార్యనిర్వాహక అధిపతులు :
పార్లమెంటరీ ప్రభుత్వంలో రెండు రకాల కార్యనిర్వాహక అధిపతులు ఉంటారు. వీరిలో నామమాత్రపు వాస్తవ కార్యనిర్వాహక అధిపతులు ఉంటారు. నామమాత్రపు కార్యనిర్వాహక అధిపతికి చక్కటి ఉదాహరణ ‘బ్రిటీష్ రాణి’, జపాన్ చక్రవర్తి, భారత రాష్ట్రపతి. వాస్తవానికి ఈ దేశాలలో కార్యనిర్వాహక అధికారాలన్నీ ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి చేతిలో ఉంటాయి.

అందువల్ల ఈ తరహా ప్రభుత్వంలో నామమాత్రపు కార్యనిర్వాహక శాఖ పేరుకు మాత్రమే ఉనికిలో ఉంటుంది. దీనికి భిన్నంగా ఈ విధానంలో ఒక వ్యక్తి గాని, కొద్దిమంది వ్యక్తుల బృందం గానీ నిజమైన కార్యనిర్వాహకవర్గంగా ఉంటుంది. కార్యవర్గం ఆచరణలో అన్ని కార్యనిర్వాహక అధికారాలను చలాయిస్తుంది.

2. సమిష్టి బాధ్యత :
సమిష్టి బాధ్యత అనేది పార్లమెంటరీ ప్రభుత్వ మౌళిక లక్షణం. మంత్రులందరూ శాసననిర్మాణ శాఖలోని దిగువ సభకు సమిష్టిగా బాధ్యత వహిస్తారు. ప్రధానమంత్రి నాయకత్వాన మంత్రులు అందరూ సమిష్టిగా విధాన నిర్ణయాలను తీసుకొంటారు. శాసనశాఖలోని దిగువసభ విశ్వాసాన్ని కోల్పోయినపుడు మంత్రిమండలి తన బాధ్యతల నుంచి విరమించుకొంటుంది.

కేబినెట్ సమావేశంలో ఏ మంత్రి అయినా తన అసమ్మతిని తెలియజేయవచ్చు. కాని అంతిమంగా కేబినేట్ నిర్ణయాన్ని మాత్రం అంగీకరించాల్సిందే. సదరు మంత్రి వ్యక్తిగతంగా, సమిష్టిగా తన శాఖకు సంబంధించి తీసుకొనే అన్ని నిర్ణయాలకు బాధ్యత వహించవలసి ఉంటుంది.

3. రాజకీయ సజాతీయత :
పార్లమెంటరీ ప్రభుత్వపు సర్వశ్రేష్ఠ ముఖ్య లక్షణం రాజకీయ సజాతీయత. పార్లమెంటరీ ప్రభుత్వంలో మంత్రులందరూ సాధారణంగా ఒకే పార్టీకి చెందినవారై ఉంటారు. కొన్ని సందర్భాలలో ఎప్పుడైతే ఒక రాజకీయపార్టీకి మెజారిటీ లేక ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన సంపూర్ణ మెజారిటీ సీట్లు దిగువ సభలో లేనట్లయితే, అటువంటి సందర్భాలలో ఇతర పార్టీల మద్దతును కూడగట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారు.

ఉదా : ఐక్య ప్రగతి కూటమి (UPA – United Progressive Alliance) లేదా జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA – National Democratic Alliance) వంటివి సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పర్చాయి. ఇటువంటి సందర్భాలలో సంకీర్ణ ప్రభుత్వాలు కనీస ఉమ్మడి కార్యక్రమానికి కట్టుబడి పనిచేస్తాయి.

4. శాసననిర్మాణ, కార్యనిర్వాహక శాఖల మధ్య సమన్వయం :
పార్లమెంటరీ ప్రభుత్వం కార్యనిర్వాహక, శాసననిర్మాణ మధ్య సమన్వయాన్ని ఏర్పరుస్తుంది. ఎందుకంటే ఆ రెండు శాఖలకు చెందిన సభ్యులు ఒకేసారి శాసనసభలో సభ్యత్వాన్ని కలిగి ఉంటారు. ప్రథమంగా శాసన సభ్యులందరూ ఏదో ఒక సభలో సభ్యులుగా ఉంటారు.

అటు తరువాత కేబినేట్లో మంత్రిగా కొనసాగుతారు. శాసనసభ ఆమోదించిన సంక్షేమ పథకాలను, విధానాలను అమలుచేస్తుంటారు. అదే విధంగా, అనేక విషయాలకు సంబంధించి వారు శాసన సభ్యులకు సలహాలు ఇస్తుంటారు. ఈ కారణాల రీత్యా రెండు శాఖల మధ్య సమన్వయం ఏర్పడుతుంది.

5. పార్టీ క్రమశిక్షణ :
నిజమైన పార్లమెంటరీ ప్రభుత్వంలో పార్టీ క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈ ప్రభుత్వ విధానంలో ప్రతి రాజకీయపార్టీ తమ సభ్యులందరి మీద తీవ్రమైన క్రమశిక్షణ చర్యలను చేపడుతుంది.

ముఖ్యంగా పార్టీ సిద్ధాంతానికి, సూత్రాలు, నియమ నిబంధనలకు కట్టుబడి నడుచుకోవాలని ఒత్తిడి చేస్తుంది. ఇటువంటి విధానం వల్ల సభ్యులందరూ వినయవిధేయతలతో పార్టీకి, ప్రభుత్వానికి అనుగుణంగా నీతి నిజాయితీలతో, ఆశ్రిత పక్షపాతానికి తావులేకుండా పనిచేసేటట్లు సభ్యులకు శిక్షణ ఇస్తుంటారు. ఈ చర్యల వల్ల రాజకీయ పటిష్టత ఏర్పడి రాజ్యం కొనసాగుతుంది.

6. ప్రధానమంత్రి నాయకత్వం :
పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ‘ప్రధాన మంత్రిత్వ ప్రభుత్వ’మని కూడా వర్ణిస్తారు. ఈ తరహా ప్రభుత్వంలో ప్రధానమంత్రి వాస్తవ కార్యనిర్వాహక అధికారిగా వ్యవహరిస్తాడు. ఇతడు దిగువసభలో మెజారిటీ పార్టీ నాయకుడుగా లేదా సంకీర్ణ మంత్రిమండలి అధిపతిగా చాలామణి అవుతుంటాడు.

ప్రధానమంత్రి కేంద్ర కేబినెట్, కేంద్ర మంత్రిమండలికి మూలవిరాట్గా నిలబడతాడు. మంత్రిమండలి నిర్మాణం, ఉనికి, కొనసాగింపుకు ప్రధానమంత్రి కేంద్ర బిందువుగా ఉంటాడు. కేంద్ర మంత్రిమండలికి అధ్యక్షత వహించటమే కాకుండా, ఎజెండాను కూడా నిర్ణయిస్తాడు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఏకకేంద్ర ప్రభుత్వం గుణదోషాలపై ఒక వ్యాఖ్య రాయండి.
జవాబు.
అర్థము :
ఏకకేంద్ర ప్రభుత్వమంటే ఒకే ఒక్క ప్రభుత్వమని అర్థము. అధికారాలన్నీ ఒకే ప్రభుత్వం కలిగి ఉంటుంది. ఏకకేంద్ర ప్రభుత్వాన్ని ఆంగ్లంలో ‘Unitary Government’ అంటారు. ‘Uni’ అంటే ఒకటి, ‘tary’ అంటే అధికారం అని అర్థం. అంటే ఒకే ఒక్క అధికార కేంద్రమున్న ప్రభుత్వమని అర్థము.

నిర్వచనాలు :
డైసీ : “అత్యున్నత శాసనాధికారాన్ని ఒకే ఒక్క కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తే” దానిని ఏకకేంద్ర ప్రభుత్వం అంటారు.
విల్లోబి : ఏకకేంద్ర ప్రభుత్వ విధానంలో సర్వాధికారాలు కేంద్ర ప్రభుత్వానికే చెంది ఉంటాయి. తరువాత కేంద్ర ప్రభుత్వమే అధికారాలను తన ఇష్టం వచ్చినట్లు ప్రాంతీయ ప్రభుత్వాలను ఇస్తుంది” ఉదా : బ్రిటన్, జపాన్, ఫ్రాన్స్ దేశాలు.

ప్రయోజనాలు (లేదా) సుగుణాలు :

i) శక్తివంతమైన ప్రభుత్వం (Powerful Government) :
ఏకకేంద్ర ప్రభుత్వం శాసన మరియు పాలనాపరమైన అంశాలను ఒకేతాటిపై నడిపిస్తుంది. ఒకే ఒక కేంద్రప్రభుత్వ ఆధీనంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయపరమైన శాఖలుండటం వల్ల ప్రభుత్వ యంత్రాంగం శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ కారణంచేత, ఏకకేంద్ర ప్రభుత్వం సమగ్రమైన సుస్థిర పాలనను అందిస్తుంది.

ii) సమర్థవంతమైన పాలన (Efficient Rule) :
ఏకకేంద్ర పాలనా వ్యవస్థలో ప్రాంతీయ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ సూచనలను, సలహాలను పాటించాల్సి ఉంటుంది. అన్ని రకాల పాలనా పరమైన అంశాలను అత్యంత శక్తివంతంగా, సమర్థవంతంగా నిర్వహిస్తుంది. ఒకే ప్రభుత్వంలో అన్ని అధికారాలుండటం వల్ల యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తుంది.

iii) తక్కువ వ్యయం, తక్కువ సమయం (Less expensive and Time saving:
కేంద్ర వ్యవస్థ ప్రభుత్వ యంత్రాంగంలో ప్రాంతీయ ప్రభుత్వాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. తత్ఫలితంగా, ఏకకేంద్ర ప్రభుత్వ నిర్మాణం, నిర్వహణకు తక్కువ ఆర్థిక వనరులు సరిపోతాయి. అంతేకాదు, సంస్థల నిర్మాణంలో నకిలీ ఏర్పాటు ఉండదు.

అదేవిధంగా కాలయాపన లేకుండా నిర్ణయాలు త్వరితగతిన తీసుకోవడానికి అవకాశమెక్కువ. దీనివల్ల ప్రజాధనం, సమయం ఏకకేంద్ర ప్రభుత్వ వ్యవస్థలో వృధాకావు.

iv) పాలనాపరమైన ఏకత (Administrative uniformity) :
ఏకకేంద్ర ప్రభుత్వ వ్యవస్థలో ప్రత్యక్షపాలన ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తాన్ని తన నియంత్రణలో ఉంచుకొంటుంది. ఈ కారణం వల్ల, ఒకే తరహా శాసనాలు, చట్టాలు, నియమ, నిబంధనలు దేశవ్యాప్తంగా వర్తిస్తాయి. దీని వల్ల శాసనాల రూపకల్పన, పాలనా ప్రక్రియలలో సారూప్యత ఏర్పడుతుంది.

v) సత్వర నిర్ణయాలకు అవకాశం (Quick decisions possible) :
ఏకకేంద్ర ప్రభుత్వ వ్యవస్థలో ఒకే ఒక ప్రభుత్వ యంత్రాంగం ఉండటం వల్ల అది సమయానుకూలంగా సత్వర నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా, ఏకకేంద్ర ప్రభుత్వం ఊహించని, ఆకస్మిక పరిణామాలు ఏర్పడినప్పుడు, అత్యవసర సమయాల్లో సత్వర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

vi) ఒకే పౌరసత్వం (Single Citizenship) :
ఏకకేంద్ర వ్యవస్థలో పౌరులందరికీ ఒకే పౌరసత్వం ఉంటుంది. దీనివల్ల దేశంలోని ప్రజలందరినీ ఎటువంటి వివక్ష ఏ రూపంలోను చూపకుండా అందరినీ సమానమైన పౌరులుగా గుర్తించటం జరుగుతుంది. ఒకే పౌరసత్వం వల్ల అంతిమంగా ప్రజలలో జాతీయ ఐక్యత, సమైక్యత, సమగ్రత, సౌభ్రాతృత్వ భావాలు పెంపొందించుట జరుగుతుంది.

vii) చిన్న దేశాలకు ప్రయోజనకారి (Useful for small countries) :
ఏకకేంద్ర ప్రభుత్వం చిన్న దేశాలకు ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. ఎందుకంటే, తక్కువ జనాభా పరిమితమైన భౌగోళిక ప్రాంతం ఉండటం వల్ల అదేవిధంగా జాతి, భాష, సంస్కృతి, ప్రాంతీయపరంగా సజాతీయతను రూపొందించే అవకాశం ఉంటుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

లోపాలు (లేదా) దోషాలు :

i) నియంతృత్వానికి అవకాశం (Scope for Despotism) :
ఏకకేంద్ర వ్యవస్థలో అన్ని రకాల అధికారాలు ఒకే ఒక కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండటం వల్ల అధికారంలో ఉన్న వ్యక్తులు తమ ఇష్టానుసారంగా నియంతృత్వ ధోరణిలో నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. తత్ఫలితంగా, వ్యక్తుల స్వేచ్ఛకు, హక్కులకు భంగం కలిగే అవకాశం ఉంటుంది. అంతిమంగా, ఈ పరిణామాలు నియంతృత్వ ధోరణులు ప్రబలడానికి అవకాశాలను కల్పిస్తాయి.

ii) కేంద్ర ప్రభుత్వంపై అధిక భారం (More burden on Central Government) :
ఈ తరహా ప్రభుత్వ వ్యవస్థలో కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన జరగదు. కేంద్ర ప్రభుత్వం మాత్రమే అన్ని రకాల విధులను నిర్వహిస్తుంది. తత్ఫలితంగా, కేంద్ర ప్రభుత్వంపై భారం పెరిగి నిర్ణయాలు తీసుకోవటంలో నిర్లక్ష్యం, ఆలస్యం కావటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.

iii) అసమర్థత పెరుగుతుంది (Growth of Inefficiency) :
ఈ తరహా ప్రభుత్వ వ్యవస్థలో ప్రాంతీయ ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తిగానీ, స్వయం నిర్ణయాధికారం గానీ ఉండదు. ప్రాంతీయ ప్రభుత్వాలు అన్నీ కేంద్రం. ప్రభుత్వం మీదనే ఆధారపడవలసి ఉంటుంది. అందువల్ల స్థానిక పాలన వ్యవహారాలలో ప్రజలు రాజకీయంగా చొరవ చూపించటం కుదరదు. ఈ కారణం వల్ల పాలనాపరంగా అసమర్థత పెరగడానికి అవకాశం ఉంది.

iv) పెద్ద రాజ్యాలకు అనువైంది కాదు (Not suitable for large Countries) :
విభిన్న జాతులు, పలు మతాలు, అనేక భాషలు, బహుళ భౌగోళిక పరిస్థితులు, వివిధ సంస్కృతులు నెలకొని ఉన్న దేశాలకు ఏక కేంద్ర ప్రభుత్వ విధానం అనువైంది కాదు. అంతేకాదు, అధిక జనాభా, విస్తారమైన ప్రదేశం గల దేశాలకు ఈ తరహా ప్రభుత్వ వ్యవస్థ ఎంతమాత్రం ఉపయోగపడదు. పెద్ద దేశాల్లో భిన్నత్వంలో ఏకత్వం సాధించటం అంత సులువైన పనికాదు.

v) బాధ్యతారాహిత్యం (Irresponsibility) :
ఏకకేంద్ర వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం దేనికి బాధ్యత వహించదు. అంతేకాదు ప్రాంతీయ ప్రభుత్వాలు ఏ విషయంలోనైనా ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేవు. అందువల్ల, కేంద్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే అవకాశాలు ఉంటాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

ప్రశ్న 2.
పార్లమెంటరీ ప్రభుత్వ గుణదోషాలను పేర్కొనండి.
జవాబు.
శాసన, కార్యనిర్వాహకశాఖల మధ్య సమన్వయం:
శాసన, కార్యనిర్వాహకశాఖల మధ్య సహకారం, సమన్వయం ఉంటాయి. మంత్రిమండలి (కార్యనిర్వాహకశాఖ) శాసనసభలో (పార్లమెంటు) అంతర్భాగమే. ఆ రెండూ మెజారిటీ పార్టీ అధీనంలోనే ఉంటాయి. కాబట్టి శాసనసభ్యుల అభిప్రాయం ప్రకారం మంత్రులు చట్టాలను రూపొందిస్తారు.

అలాగే మంత్రులు ప్రవేశపెట్టే బిల్లుల్ని శాసనసభ్యులు ఆమోదిస్తారు. కాబట్టి ఈ రెండు శాఖలమధ్య వివాదాలకు, సంఘర్షణలకు సాధారణంగా అవకాశం ఉండదు.

ప్రభుత్వ నియంతృత్వానికి అవకాశం తక్కువ :
మంత్రిమండలి ప్రత్యక్షంగా పార్లమెంటుకు, పరోక్షంగా ప్రజలకు బాధ్యత వహిస్తుంది. ప్రశ్నలు, తీర్మానాలు ప్రవేశపెట్టడం ద్వారా పార్లమెంటు మంత్రి వర్గాన్ని అదుపులో ఉంచుతుంది. అవసరమైతే అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించి మంత్రి మండలిని పదవినుంచి తొలగిస్తుంది. అందువల్ల ఈ విధానంలో ప్రభుత్వనియంతృత్వంగా, బాధ్యతారహితంగా పరిపాలించే అవకాశం చాలా తక్కువ.

అధికార వికేంద్రీకరణకు అవకాశం :
పార్లమెంటరీ విధానం అధికార వికేంద్రీకరణను ప్రోత్సహిస్తుంది. ఈ విధానంలో కార్యనిర్వహణాధికారం ఏ ఒక్కరి చేతిలోనూ కేంద్రీకృతం కాదు. మంత్రుల మధ్య అధికారాలు పంపిణీ అవుతాయి.

ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు సులభం:
రాజకీయ విప్లవాలకు అవకాశం ఉండదు. ప్రభుత్వంలో ఎటువంటి మార్పులనైనా సులభంగా ప్రవేశపెట్టవచ్చు. మంత్రివర్గాన్ని అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించిన తరువాత ప్రతిపక్షాలు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉంటాయి. ఒకవేళ ప్రతిపక్షాలు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని స్థాపించడంలో విఫలమైతే, మధ్యంతర ఎన్నికల్ని నిర్వహించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది.

విస్తృత ప్రాతినిధ్యం :
దేశంలోని విభిన్న వర్గాలవారికి, ప్రాంతాలవారికి సముచితమైన ప్రాతినిధ్యం మంత్రివర్గ నిర్మాణంలో ఉంటుంది. ప్రభుత్వ నిర్వహణలో అన్ని వర్గాలవారికి, ప్రాంతాలవారికి, భాషలవారికి ప్రాతినిధ్యం కల్పించడంవల్ల ప్రజలలో జాతీయదృక్పథం, జాతీయ సమైక్యతాభావాలు పెంపొందుతాయి.

రాజకీయ చైతన్యం :
పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజాబాహుళ్యంలో రాజకీయ చైతన్యం పెంపొందుతుంది. ప్రభుత్వం చేపట్టే వివిధ కార్యక్రమాలపై శాసనసభలో జరిగే చర్చలు ప్రభుత్వం పని తీరుపై సామన్య ప్రజల్లో రాజకీయ అవగాహనను పెంచుతాయి. ప్రతిపక్ష పార్టీల విమర్శలను, అధికార పార్టీ లోపాలను ప్రజలు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. ఇలా ప్రజల్లో రాజకీయ పరిజ్ఞానం పెరుగుతుంది.

పార్లమెంటరీ ప్రభుత్వం- లోపాలు:

అధికార పృథక్కరణ సిద్ధాంతానికి వ్యతిరేకం :
ఇది పృథక్కరణ సిద్ధాంతానికి వ్యతిరేకం. మంత్రులు శాసన, కార్య నిర్వాహక శాఖల్లో సభ్యత్వాన్ని కలిగి, ఆ రెండింటిపై అజమాయిషీ చేస్తారు. ఆ రెండు శాఖల మధ్య పూర్తి అవగాహన, సహకారం ఉంటాయి. మంత్రిమండలి పార్లమెంటులో అంతర్భాగంగా పని చేయడంవల్ల అధికార విభజన సిద్ధాంతానికి భంగం కలుగుతుంది.

అస్థిర ప్రభుత్వం :
ప్రభుత్వం పూర్తి పదవీకాలం ఉంటుందన్న నమ్మకం లేదు. ముఖ్యంగా బహుపార్టీ వ్యవస్థ అమలులో ఉన్న దేశాలలో ఈ పరిస్థితి నెలకొని ఉంటుంది. దీనికి కారణం మంత్రి వర్గాలు శాసన సభ్యుల మద్ధతుపై ఆధారపడి ఉండటమే. అంతేగాక అధికార పార్టీలోని విభేదాలు కూడా మంత్రివర్గం కాలపరిమితిని నిర్ణయిస్తాయి. ప్రభుత్వం పార్లమెంటు విశ్వాసమున్నంతవరకే పదవిలో ఉంటుంది. అందువల్ల ప్రభుత్వానికి స్థిరత్వం ఉండదు.

మంత్రి మండలి నియంతృత్వం:
మంత్రిమండలి నియంతృత్వానికి దారితీస్తుంది. పార్లమెంటులో మెజారిటీ ఉన్న మంత్రి మండలి సర్వాధికారాలను చెలాయిస్తుంది. పార్లమెంటరీ ప్రభుత్వం అమల్లో ఉన్న దేశాల్లో మంత్రివర్గ నియంతృత్వం పెరుగుతుందన్న అభిప్రాయాన్ని స్త్రీవార్ట్, రామ్ సేమ్యుర్ మొదలైన ప్రముఖులు వ్యక్తం చేశారు.

మంత్రి మండలి నిర్మాణం కష్టం :
మంత్రి వర్గ నిర్మాణం అంత సులభం కాదు. ప్రధానమంత్రి మంత్రులను ఎంపిక చేసేటప్పుడు అనేక అంశాలను అంటే కుల, మత, భాష, ప్రాంతీయ అంశాలను, పాలనా దక్షత, పార్టీ విధేయతలను దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాలవారిని సంతృప్తిపరచవలసి ఉంటుంది.. తన పార్టీలో అసంతృప్తి వర్గాన్ని కూడా సంతృప్తిపరచాలి. అందువల్ల మంత్రివర్గ నిర్మాణం చాలా క్లిష్టం.

అత్యవసర పరిస్థితులకు తగింది కాదు :
కార్యనిర్వహణాధికారాలు మంత్రుల మధ్య విభజితమై ఉండటంవల్ల ‘ నిర్ణయాలు ఆలస్యంగా జరుగుతాయి. మంత్రుల మధ్య భేదాభిప్రాయాలవల్ల కూడా ఏకగ్రీవంగా నిర్ణయాలు జరగవు. అత్యవసర పరిస్థితుల్లో సంభవించే ప్రమాదాలను అధిగమించే శక్తి సామర్థ్యాలు దీనికి ఉండవు.

పార్టీ ప్రయోజనాలకు ఆధిక్యత :
పార్లమెంటరీ ప్రభుత్వం ప్రధానంగా పార్టీ ప్రభుత్వం. అది అన్న వేళలా పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాధికారాన్ని నిర్వహిస్తుంది. దేశ సమస్యల్ని పార్టీపరంగా ఆలోచించి, వాటి ‘పరిష్కార మార్గాలను రూపొందిస్తుంది. పార్లమెంటులో తన మెజారిటీని నిలుపుకోడానికి ఎప్పుడూ కృషి చేస్తుంది. అవసరమైతే పార్టీ ఫిరాయింపులను కూడా ప్రోత్సహిస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

ప్రశ్న 3.
సమాఖ్య ప్రభుత్వ గుణదోషాలను చర్చించండి.
జవాబు.
సమాఖ్య ప్రభుత్వ ప్రయోజనాలు :

ఎ. భిన్నత్వంలో ఏకత్వం :
సమాఖ్య ప్రభుత్వంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించే అవకాశం ఉంది. భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, విభిన్న భాషలు కలిగి ఉన్న సమాజానికి సమాఖ్య వ్యవస్థ ఎంతో మేలు.

బి. నియంతృత్వానికి వ్యతిరేకం :
సమాఖ్య వ్యవస్థలో నియంతృత్వం ఏర్పడకుండా నిరోధించే అవకాశం ఉంటుంది. కేంద్ర – రాష్ట్రాల మధ్య రాజ్యాంగ పరంగా అధికార విభజన ఉండటంవల్ల నింకుశత్వాన్ని నిరోధించవచ్చు.

సి. కేంద్రంపై భారం తక్కువ :
రాజ్యాంగబద్ధంగా కేంద్రం – రాష్ట్రాల ధ్య అధికారాల విభజన జరగడంవల్ల అవి వాటి వాటి విధులను సమర్థవంతంగా నిర్వహిస్తాయి. అందువల్ల కేంద్రం పై భారం తగ్గుతుంది.

డి. నూతన ప్రయోగాలకు అవకాశం :
సమాఖ్య విధానంలో నూతన విధానాలను, సంక్షేమ పథకాలను ప్రజల సామాజిక ఆర్థిక అభివృద్ధికై నూతన ప్రయోగాలను చేయడానికి అవకాశం ఉంటుంది.

ఇ. పెద్ద రాజ్యాలకు అనువైనది:
పెద్దవైన, విశాలమైన దేశాలకు సమాఖ్య విధానం అనువైనది. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన ఉంటుంది. కాబట్టి సమాఖ్య విధానం అనువైనది.

ఎఫ్. పరిపాలనలో సామర్థ్యం :
సమాఖ్య ప్రభుత్వంలో రాష్ట్రాలకు సంబంధించిన చాలా విషయాలు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందుతాయి. దీనితో కేంద్ర ప్రభుత్వానికి పనిభారం తగ్గి జాతీయ ప్రాముఖ్యం ఉన్న అంశాలపై దృష్టి కేంద్రీకరించి సమర్థవంతమైనపాలన అందించటానికి అవకాశం ఉంటుంది.

సమాఖ్య ప్రభుత్వ లోపాలు :
ఎ. బలహీనమైన కేంద్ర ప్రభుత్వం :
కేంద్రరాష్ట్రాల మధ్య అధికారాల విభజన ఉండటం మూలంగా కేంద్ర ప్రభుత్వం బలహీనపడే అవకాశం ఉంటుంది. ప్రాంతీయ ప్రభుత్వాలు తమ ప్రాంతాల అభివృద్ధి కారణాలతో కేంద్రంపై ఒత్తిడి పెంచుతాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయంలో సవాళ్ళను ఎదుర్కొంటుంది.

బి. ఏకరూపత లోపం :
సమాఖ్య వ్యవస్థలో ప్రాంతీయ అంశాలపై శాసనాలను, చట్టాలను చేసే అధికారం రాష్ట్రాలకే ఉంటుంది. అందువల్ల ఆయా ప్రభుత్వాలు స్థానిక అవసరాలకు అనుగుణంగా శాసనాలు రూపొందించటంవల్ల వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అధికారాల విషయంలోను అదే విధంగా కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వ అధికారాల విషయంలోను ఏకరూపత లోపిస్తుంది.

సి. వైరుధ్యాలు, వివాదాలు :
సమాఖ్య వ్యవస్థలో కేంద్ర – రాష్ట్రాల మధ్య అధికారాల విభజన ఉన్నప్పటికీ ఉమ్మడి జాబితా విషయంలో రెండింటికి శాసనం చేసే అధికారం ఉంటుంది. అయినప్పటికీ తమ తమ బాధ్యతలు విస్మరించటంవల్ల వివాదాలు, వైరుధ్యాలు తలెత్తుతాయి.

డి. ఖర్చుతో కూడిన యంత్రాంగం :
సమాఖ్య విధానంలో రెండు రకాల ప్రభుత్వాలుంటాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వం, రెండవది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రెండు ప్రభుత్వాల పరిపాలన వ్యవస్థ ఏర్పాటు చేయటం ఖర్చుతో కూడుకున్నది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

ప్రశ్న 4.
ఏకకేంద్ర ప్రభుత్వం మరియు సమాఖ్య ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాన్ని తెలపండి.
జవాబు.

ఏకకేంద్ర ప్రభుత్వంసమాఖ్య ప్రభుత్వం
1. లిఖిత లేదా అలిఖిత రాజ్యాంగం.1. లిఖిత రాజ్యాంగం తప్పనిసరి.
2. అదృఢ రాజ్యాంగం.2. దృఢ రాజ్యాంగం.
3. ఏకకేంద్ర ప్రభుత్వ విధానంతో ప్రభుత్వాలు ప్రాంతీయ స్థాయిలో3. రెండు రకాల ప్రభుత్వాలు కేంద్ర స్థాయిలో
4. కేంద్రీకృత అధికారాలు.4. అధికారాల వికేంద్రీకరణ కేంద్రం రాష్ట్రాల మధ్య అధికారాల విభజన.
5. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వ ఉండకపోవచ్చు.5. ప్రజాస్వామ్య ప్రభుత్వం నిర్ణయీకరణలో భాగస్వామ్యం ఉంటుంది.
6. చట్టాలన్నీ సారుప్యత కలిగి ఉంటాయి.6. కేంద్రం చట్టాలు, రాష్ట్రం చట్టాలుంటాయి.
7. స్వతంత్ర న్యాయవ్యవస్థ అవసరం లేదు.7. స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉంటుంది.
8. నిరంకుశం ఏర్పడవచ్చు.8. రాజ్యాంగం ప్రకారం ఏర్పడినవి. కాబట్టి నియం తృత్వానికి తావులేదు.
9. ప్రభుత్వ విధానం సరళం, సాధారణంగా ఉంటుంది.9. ప్రభుత్వ విధానం కఠినతరం, సంక్లిష్టంగా ఉంటుంది.
10. చిన్నరాజ్యాలకు అనువైనది.10. పెద్దరాజ్యాలకు అనువైనది.
11. ద్విసభ విధానం (బ్రిటన్) లేదా ఏకసభ విధానం (చైనా) ఉండవచ్చు.11. ద్విసభా విధానం ఉంటుంది.
12. రాజ్యాంగం అత్యున్నతమైనది (జపాన్), లేదా రాజ్యాంగం మామూలుగా ఉండవచ్చు (బ్రిటన్).12. రాజ్యాంగం ఆధిక్యతను కలిగి ఉంటుంది.
13. రాజకీయ ఏకీకరణకు లేదా రాజకీయ స్థిరత్వానికి అవకాశం ఉంటుంది.13.రాజకీయ ఏకీకరణకు, స్థిరత్వానికి తక్కువ అవకాశం.
14. ప్రాంతీయ ప్రభుత్వ అధికారాలను కేంద్రం మార్చే అవకాశం ఉంది.14. ప్రాంతీయ ప్రభుత్వాల అధికారాలను మార్చే వీలు కేంద్రానికి ఉండదు.

 

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

ప్రశ్న 5.
అధ్యక్ష తరహా ప్రభుత్వంపై ఒక వ్యాఖ్య రాయండి.
జవాబు.
అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహకవర్గం తన చర్యలకు శాసనశాఖకు ఎటువంటి బాధ్యత వహించదు. దీనిని ఏకసభ్య కార్యనిర్వాహక ప్రభుత్వం అని కూడా పిలుస్తారు. దీనిని నిర్ణీత కాల పరిమితి గల ప్రభుత్వమనీ, బాధ్యతారహిత ప్రభుత్వమని కూడా సంభోదిస్తారు.

ఈ ప్రభుత్వ విధానంలో అధ్యక్షుడు ఒక్కడే అన్ని రకాల కార్యనిర్వాహక అధికారాలను అనుభవిస్తాడు. అధ్యక్షుడు ప్రజలచేత ప్రత్యక్షంగా ఎన్నికల గణం ద్వారా ఎన్నికవుతాడు.

అధ్యక్షుడుగాని, ఇతర సభ్యులుగాని వారివారి విధుల నిర్వహణలో ఇతరులెవ్వరికీ బాధ్యత వహించదు. ఈ తరహా ప్రభుత్వం మాంటెస్క్యూ ప్రతిపాదించిన ‘అధికారాల వేర్పాటువాద సిద్ధాంతం ఆధారంగా ఆచరణలోకి వచ్చింది. ఈ తరహా ప్రభుత్వాలు అమెరికా, అర్జెంటీనా, బొలీవియా, చిలీ, జైర్, కాంగో, మెక్సికో, పెరు, పెరుగ్వే, ఉగాండా మొదలగు దేశాలలో కొనసాగుతున్నాయి.

ప్రశ్న 6.
అధ్యక్ష తరహా మరియు పార్లమెంటరీ తరహా ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాలను పరిశీలించండి.
జవాబు.

పార్లమెంటరీ తరహా ప్రభుత్వం

అధ్యక్ష తరహా పార్లమెంటరీ

1. రెండు రకాల కార్యనిర్వాహక వర్గం,

1. వాస్తవాధికారి, 2. నామమాత్రపు అధికారి.

1. వాస్తవాధికారి, నామమాత్రపు అధికారి అనే తేడా ఉండదు. ఒక్కడే వాస్తవాధికారి.
2. రాజ్యాధినేత నామమాత్రం, ప్రభుత్వాధినేత వాస్తవాధికారి.2. రాజ్యాధినేతనే వాస్తవాధికారిగా వ్యవహరిస్తాడు.
3. కార్యనిర్వాహక శాఖకు శాసనశాఖకు సమన్వయం ఉంటుంది.3. కార్యనిర్వాహక వర్గానికి శాసనశాఖకు పరస్పర సహకారం కాని సమన్వయం గాని ఉండదు. రెండూ స్వతంత్రంగా వ్యవహరిస్తాయి.
4. కార్యనిర్వాహక శాఖ పదవీ కాలం అనిశ్చితం.4. కార్యనిర్వాహక వర్గానికి కచ్చితమైన కాలపరిమితి ఉంటుంది.
5. మంత్రిమండలిని పూర్తిగా ప్రధానమంత్రి సలహామేరకు రాజ్యాధిపతి నియమిస్తాడు.5. క్యాబినెట్ను అధ్యక్షుడు నియమిస్తాడు.
6. మంత్రులందరూ శాసనశాఖలో సభ్యులుగా ఉంటారు.6. మంత్రులు లేదా క్యాబినెట్ లేదా సెక్రటరీలు శాసన శాఖలో సభ్యులుగా ఉండరు.
7. మంత్రులందరూ రాజ్యాధిపతికి జవాబుదారిగాను, శాసనసభకు సమిష్టి బాధ్యత వహిస్తారు.7. సెక్రటరీలు శాసనశాఖకు జవాబుదారీగా ఉండరు. కేవలం అధ్యక్షుడికి మాత్రమే జవాబుదారిగా ఉంటారు.
8. పాలనలో అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం ఉంటుంది.8. అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం ఉండదు.
9. కార్యనిర్వాహక శాఖ యొక్క ప్రతిచర్య శాసనశాఖచే పరిశీలించబడుతుంది.9. శాసనశాఖ, కార్యనిర్వాహకశాఖ రెండు స్వతంత్రమైనవి, పరస్పరం నిరోధ సమతౌల్యతతో వ్యవహరిస్తాయి.
10. మారుతున్న పరిస్థితులకనుగుణంగా నిర్ణయాలకు వెసులుబాటు ఉంటుంది.10. షరిస్థితులకనుగుణంగా మారదు. వెసులుబాటు కూడా ఉండదు.

 

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

ప్రశ్న 7.
అధ్యక్ష తరహా ప్రభుత్వ గుణదోషాలను పేర్కొనండి.
జవాబు.
పరిచయం :
అధ్యక్షపాలనను బాధ్యతాయుతముకాని ప్రభుత్వమని కూడా అంటారు. ఈ విధానంలో ఆ దేశాధ్యక్షుడు రాజ్యానికి, ప్రభుత్వానికి కూడా అధినేత. ఆయనకు నిజమైన అధికారాలు ఉంటాయి. ఇది ఏకపాలక వర్గ విధానము. అధ్యక్షుడు నియమించుకునే మంత్రులకు శాసనశాఖతో సంబంధం ఉండదు.

మంత్రులు ఆయనకు విధేయులై పనిచేసే తాబేదారులు, వారికి శాసనసభ సభ్యత్వం ఉండదు. అధ్యక్షుడు ప్రజలచేత లేదా ఎన్నికలగణాల చేత ఎన్నుకోబడతాడు. అధ్యక్షునకు ఒక నిర్ణీత పదవీకాలం ఉంటుంది. ఆయనను తొలగించడం తేలికకాదు. అధ్యక్షపాలనా విధానానికి అమెరికా మంచి ఉదాహరణ (U.S.A.).

నిర్వచనం :
ప్రొఫెసర్ గార్నర్ : “అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహక శాఖ కాలపరిమితి, రాజకీయ విధానాలకు సంబంధించి రాజ్యాంగబద్ధమైన స్వతంత్రతను కలిగి ఉంటుంది”.

ప్రయోజనాలు :
1. నియంతృత్వానికి తక్కువ అవకాశం :
అధ్యక్ష ప్రభుత్వం అధికార వేర్పాటువాద సిద్ధాంత ప్రాతిపదికన ఏర్పడినందున ప్రభుత్వంలోని అన్ని అంగాలు స్వతంత్రమైనవిగా ఉంటాయి. అధికారాలన్నీ వివిధ శాఖల మధ్య, ఆయా అంగాల మధ్య విభజించబడి ఉండటం వలన ఈ ప్రభుత్వంలో నియంతృత్వానికి తావులేదు.

2. సుస్థిర ప్రభుత్వం :
ఈ ప్రభుత్వ విధానంలో ముఖ్య కార్యనిర్వహణాధిపతి (అధ్యక్షుడు) ఒక నిర్దిష్ట కాలపరిమితికి ఎన్నికవుతాడు. అతడి కాలపరిమితి శాసనసభ విశ్వాసం మీద ఆధారపడి ఉండదు. కాబట్టి పూర్తి కాలపరిమితి వరకు అధ్యక్ష హోదాలో అతడు కొనసాగుతాడు. అందువల్ల ఈ విధానంలో ప్రభుత్వం సుస్థిరంగా ఉండగలదని విశ్వసించవచ్చు.

3. చర్యలలో జాప్యం ఉండదు :
అధ్యక్ష ప్రభుత్వ విధానంలో కార్యనిర్వహణాధికారాలన్నీ ఒకే వ్యక్తి చేతిలో ఉండటం వల్ల అతడు సత్వర నిర్ణయాలు తీసుకొనే అవకాశాలుంటాయి. అందువల్ల ప్రజల సమస్యలను తీర్చే సందర్భంలో కార్యదర్శులను (మంత్రులు) సంప్రదించాల్సిన అవసరం లేకుండా త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవచ్చును.

4. పాలనా సామర్థ్యం పెరుగుతుంది :
ఈ ప్రభుత్వ విధానంలో పాలనా సామర్థ్యం పెరుగుతుంది. సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు వారి వారి అనుభవం, సామర్థ్యాలతో పాలనారంగం భాగస్వామ్యం కలిగి ఉండటం వల్ల ఇది సాధ్యమవుతుంది.

5. బాధ్యతాయుతమైన ప్రభుత్వం :
అధ్యక్ష తరహా ప్రభుత్వం సూత్ర ప్రాయంగా బాధ్యతారహిత ప్రభుత్వమైనప్పటికీ వాస్తవానికి ఇది ఎంతో బాధ్యతాయుతంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే, ప్రభుత్వ విధానాలను రూపొందించే సందర్భంలో అధ్యక్షుడు దూరదృష్టితో ప్రజల ఆశయాలను, ఆకాంక్షలను, ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొంటాడు. అధ్యక్షుడు తన అధికారాలను ఉపయోగించే సమయంలో స్వార్థపర వ్యక్తుల పట్ల, స్వప్రయోజనాలను కోరుకునే వ్యాపార వర్గాల పట్ల అప్రమత్తంగా ఉంటాడు.

6. అత్యవసర సమయాలకు తగిన ప్రభుత్వం :
అధ్యక్షతరహా ప్రభుత్వం అత్యవసర పరిస్థితులను, సంఘటనలను పరిష్కరించటంలో ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది. అనూహ్య పరిణామాలు సంభవించినపుడు అధ్యక్షుడు సత్వర నిర్ణయాలు తీసుకొంటాడు. అత్యవసర సమయాలలో శాసనసభ లేదా మంత్రివర్గం ఆమోదానికై ఎదురుచూడకుండా తానే స్వయంగా తగిన నిర్ణయాలు తీసుకొంటాడు. దేశ సంక్షేమం దృష్ట్యా పాలనా చర్యలు వీలైనంత సున్నితంగా ఉండే విధంగా చూస్తాడు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

లోపాలు :

1. శాసన – కార్యనిర్వాహక శాఖల మధ్య వైరుధ్యాలు :
అధ్యక్ష ప్రభుత్వం అధికార వేర్పాటువాద సిద్ధాంతం ఆధారంగా ఏర్పడినప్పటికీ వివిధ ప్రభుత్వ అంగాల మధ్య వైరుధ్యాలు జనిస్తూనే ఉన్నాయి. ఈ విధంగా జరగడానికి ప్రభుత్వం విధుల పరంగా విడివిడిగా ఉండటమే కారణమని చెప్పవచ్చు. పెండింగ్ బిల్లులను అమోదించటంలో, ప్రభుత్వ విధి విధానాలను అమలు పర్చటంలో అధ్యక్షుడికి, శాసనసభ్యులకు మధ్య అవగాహన లోపం ఉండటం కూడా రెండు శాఖల మధ్య వివాదాలకు దారితీస్తుంది.

2. బాధ్యతారహితం :
అధ్యక్ష ప్రభుత్వ ఆచరణలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంది. అధ్యక్షుడు గానీ, శాసనసభ్యులు గానీ, ప్రభుత్వ అంగాలకు పూర్తి బాధ్యత వహించరు. ప్రత్యక్ష ఎన్నికలు, నిర్ణీత కాలపరిమితి, అధికారాల విభజన మొదలైన అంశాలు శాసనాల రూపకల్పనలోను, వాటి అమలులోను బాధ్యతారహితంగా వ్యవహరించే పరిస్థితులను కల్పిస్తాయి.

3. సంపూర్ణ ప్రాతినిధ్యాన్ని కల్పించటంలో విఫలం :
అధ్యక్ష ప్రభుత్వం సమాజంలోని భిన్న సమూహాలకు సరియైన ప్రాతినిధ్యాన్ని కల్పించలేదు. ఎన్నికలకు ముందు ఒక ప్రత్యేక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి అధ్యక్షుడుగా ఎన్నికై పక్షపాతరహితంగా వ్యవహరిస్తాడని నమ్మలేము. అన్ని సందర్భాలలో, సమయాలలో ఖచ్చితంగా ప్రజాసేవకు అంకితమై నీతి నిజాయితీలతో వ్యవహరిస్తాడని చెప్పలేము.

4. ప్రజాభిప్రాయానికి స్థానం లేదు :
ఈ ప్రభుత్వ విధానంలో ప్రజాభిప్రాయానికి చాలా తక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం జరుగుతుంది. ఎన్నికల అనంతరం అధ్యక్షుడితో పాటు శాసనసభ్యులు సైతం అనేక విషయాలకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని ఖాతరు చేయరు. ప్రజామోదం గాని, ప్రజల విశ్వాసం గాని, ప్రజా మద్దతు గాని వారి చర్యలకు అవసరం లేదనే విధంగా ప్రవర్తిస్తారు.

5. శాసనసభకు అప్రధాన హోదా :
అధ్యక్ష ప్రభుత్వ విధానం, శాసనసభకు ద్వితీయ ప్రాధాన్యతనిస్తుంది. కార్యనిర్వాహకశాఖ అధిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ ప్రభుత్వంలో అధ్యక్షుడిని అత్యంత శక్తివంతమైన, మిక్కిలి పలుకుబడి కలిగిన వ్యక్తిగా గుర్తిస్తారు.

దేశానికి సంబంధించి జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలలో అతి ముఖ్యమైన ప్రచారకర్తగా భావిస్తారు. అధ్యక్షుడు శాసనసభ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాల్సిన అవసరం లేనందున సభా సమావేశాలు పేలవంగా అప్రాధ్యానతను సంతరించుకుంటాయి.

6. సంప్రదాయ రాజ్యాంగం :
సాధారణంగా అధ్యక్ష ప్రభుత్వ రాజ్యాంగం సంప్రదాయకమైనదై ఉంటుంది. ఈ ప్రభుత్వంలో స్వభావరీత్యా దృఢ రాజ్యాంగాన్ని సవరించటం అంత సులభం కాదు. మారిన ప్రజావసరాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించడం వీలుపడదు. ఈ కారణంవల్ల అనేకమంది రాజనీతిశాస్త్ర విమర్శకులు ఈ తరహా రాజ్యాంగాన్ని ప్రగతికి, అభివృద్ధికి వ్యతిరేకమైనదానిగా భావిస్తారు.

ప్రశ్న 8.
ఆధునిక ప్రభుత్వ వర్గీకరణపై ఒక వ్యాఖ్య రాయండి.
జవాబు.
ప్రభుత్వం ఉపయోగించే అధికారాలను బట్టి ప్రభుత్వాల వర్గీకరణను, సిసిరో, పొలిబియస్, మాకియవెల్లి, జీన్ బోడిన్, మాంటెస్క్యూ మొదలైన వారు వర్గీకరించారు. ఆధునిక కాలంలోనివారు – బ్లంట్ల, బర్జర్,, మెరియట్, సి.ఎఫ్. స్ట్రాంగ్ స్టీఫెన్ లీకాక్ మొదలయినవారు. వీరిలో స్టీఫెన్ లీకాక్ వర్గీకరణ, నేటి ఆధునిక ఉదారవాద ప్రభుత్వాలకు దగ్గరగా ఉందని చెప్పవచ్చు.

స్టీఫెన్ లీకాన్ ప్రభుత్వాలను ముఖ్యంగా రెండు రకాలుగా వర్గీకరించారు. అవి : నిరంకుశం, ప్రజాస్వామ్యం. అదే విధంగా ప్రజాస్వామ్యం మరో రెండు రకాలు. ఒకటి పరిమిత రాజరికం, రెండు రిపబ్లిక్. అధికారాల విభజనను బట్టి పై రెండు రకాల ప్రభుత్వాలను ఏకకేంద్ర, సమాఖ్య ప్రభుత్వాలుగా విభజించవచ్చు. పై రెండు రకాల ప్రభుత్వాలను వాటి ఉన్నతాధికారి ఎన్నికను బట్టి పార్లమెంటరీ తరహా, అధ్యక్ష తరహా ప్రభుత్వాలుగా విభజించవచ్చు.

ఆధునిక కాలంలోని ప్రభుత్వాలు వాటి అధికారాలను చెలాయించే స్వభావాన్ని బట్టి వివిధ రాజనీతి శాస్త్రజ్ఞులు విస్తృతంగా చర్చించి రెండు రకాలుగా పేర్కొన్నారు. 1. నిరంకుశ ప్రభుత్వం, 2. ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వాలను పరిమిత రాజరిక ప్రభుత్వం, గణతంత్ర ప్రభుత్వాలుగా పేర్కొన్నారు. ఇక వాటి నైసర్గిక అధికారాలను బట్టి ఏకకేంద్ర, సమాఖ్య ప్రభుత్వాలుగాను, అధ్యక్ష తరహా, పార్లమెంటరీ తరహా ప్రభుత్వాలుగా వర్గీకరించడమైంది.

TS Inter 1st Year Political Science Study Material 12th Lesson ప్రభుత్వం – రకాలు 1

నియంతృత్వ ప్రభుత్వం :
ఏ ప్రభుత్వమైతే ఏక వ్యక్తి పాలనలో ఉండి అపరిమితమైన అధికారాన్ని చెలాయిస్తుందో అదే నిరంకుశ ప్రభుత్వం లేదా నియంతృత్వ ప్రభుత్వం. నియంతృత్వ పాలన ప్రజల అభిప్రాయం గాని, వారి సంక్షేమం గాని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా పాలిస్తుంది.

ప్రజాస్వామ్య ప్రభుత్వం :
ప్రజాస్వామ్య ప్రభుత్వం నిర్ణయీకరణలో ప్రజల భాగస్వామ్యం, వారి అభిప్రాయానికి గుర్తింపు, ప్రజల మధ్య సమానత్వం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
అరిస్టాటిల్ ప్రభుత్వాల వర్గీకరణ.
జవాబు.
అరిస్టాటిల్ ప్రభుత్వాలను రెండు అంశాల ప్రాతిపదికగా వర్గీకరించారు. అవి

  1. రాజ్యాధికారంలో ఉన్న వ్యక్తుల సంఖ్యను బట్టి
  2. రాజ్య అంతిమ లక్ష్యాన్ని బట్టి

మరో విధంగా చెప్పాలంటే ప్రభుత్వాలను మంచి ప్రభుత్వాలు, చెడు ప్రభుత్వాలుగా వర్గీకరించటం జరిగింది. రాజరికం, కులీన పాలన, మధ్యతరగతి పాలన అనేవి అరిస్టాటిల్ దృష్టిలో మంచి ప్రభుత్వాలు. నిరంకుశత్వం, అల్పజనపాలన, ప్రజాస్వామ్యం అనేవి చెడు ప్రభుత్వాలు అని అరిస్టాటిల్ పేర్కొన్నాడు.

ప్రశ్న 2.
ఏకకేంద్ర ప్రభుత్వం.
జవాబు.
“ఏ వ్యవస్థలో రాజ్యము యొక్క సర్వాధికారాలను ఒకే కేంద్రీయ అధికార వ్యవస్థ వాడుకగా వినియోగిస్తుందో, ఆ అధికార వ్యవస్థనే ఏకకేంద్ర ప్రభుత్వం” అని ఎ.వి.డైసీ పేర్కొన్నాడు. ఈ విధానంలో, కేంద్ర ప్రభుత్వం ఒక్కటే ఉంటుంది. అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలో కేంద్రీకరించబడి ఉంటాయి. రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం తన అవసరం మేరకు ఏర్పాటు చేసుకొనే వీలుంది.

ప్రశ్న 3.
సమాఖ్య ప్రభుత్వం.
జవాబు.
“జాతీయ సమైక్యత, ప్రాంతీయ విభాగాల హక్కులను సమన్వయపరచే రాజకీయ సాధనమే సమాఖ్య ప్రభుత్వం” అని ఎ.వి.డైసీ పేర్కొన్నాడు. సమాఖ్య ప్రభుత్వానికి ప్రధానంగా మూడు లక్షణాలుంటాయని ఎ.వి.డైసీ పేర్కొన్నాడు. అవి :

  1. కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య స్పష్టమైన, నిర్దిష్టమైన అధికారాల పంపిణీ.
  2. లిఖిత, దృఢ, ఉన్నత రాజ్యాంగం
  3. స్వతంత్ర ప్రతిపత్తి కల్గిన న్యాయవ్యవస్థ.

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

ప్రశ్న 4.
అధ్యక్ష తరహా ప్రభుత్వం.
జవాబు.
అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహకవర్గం తన చర్యలకు శాసననిర్మాణ శాఖకు ఎటువంటి బాధ్యత వహించదు. దీనిని ‘ఏకసభ్య కార్యనిర్వాహక ప్రభుత్వం’ అని, ‘నిర్ణీత కాలపరిమితిగల ప్రభుత్వమని’, ‘బాధ్యతారహిత ప్రభుత్వమని’ సంబోధిస్తారు.

ప్రశ్న 5.
పార్లమెంటరీ తరహా ప్రభుత్వం.
జవాబు.
పార్లమెంటరీ ప్రభుత్వమంటే నిజమైన కార్యనిర్వాహకవర్గం, మంత్రిమండలి లేదా మంత్రివర్గం 1) తక్షణం, చట్టబద్ధంగా తన రాజకీయ విధానాలు, చర్యలకు శాసనసభకు 2) అంతిమంగా నియోజకులకు బాధ్యత వహించే ” వ్యవస్థతో కూడుకొన్నది” అని ప్రొఫెసర్ గార్నర్ నిర్వచించటం జరిగింది.

ప్రశ్న 6.
అలిఖిత రాజ్యాంగం.
జవాబు.
లిఖితరూపంలో లేని రాజ్యాంగాన్ని అలిఖిత రాజ్యాంగం అంటారు. రాజ్యాంగ సూత్రాలన్నీ ఒకే అధికార పత్రంలో రాసి ఉండవు. రాజ్య మౌలిక సూత్రాలు ఆచార సంప్రదాయాల రూపంలోనూ, శాసనసభలు ప్రజావసరాల మేరకు ఎప్పటికప్పుడు రూపొందించే చట్టాల రూపంలోనూ ఉంటాయి. అలిఖిత రాజ్యాంగం ఒక్కసారి కాకుండా కాలక్రమేణా రూపొందడం వలన దీనిని పరిణామాత్మక రాజ్యాంగం అని కూడా అంటారు. బ్రిటీష్ రాజ్యాంగం అలిఖిత రాజ్యాంగానికి చక్కని ఉదాహరణ.

ప్రశ్న 7.
పార్లమెంటరీ కార్యనిర్వాహకవర్గం.
జవాబు.
ఈ విధానంలో కార్యనిర్వాహకవర్గం శాసనసభలో సభ్యత్వాన్ని పొంది ఉండడమే కాక, భారతదేశంలోవలె పార్లమెంటుకు బాధ్యత వహిస్తుంది.

ప్రశ్న 8.
అధికారాల విభజన.
జవాబు.
ఫ్రెంచి రచయిత అయిన మాంటెస్క్యూ తాను రచించిన ‘ద స్పిరిట్ ఆఫ్ లాస్’ అనే గ్రంథంలో అధికార వేర్పాటువాద సిద్ధాంతాన్ని పేర్కొనటం జరిగింది. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రభుత్వము యొక్క సర్వాధికారాలను మూడు ప్రభుత్వాంగాలైన శాసననిర్మాణశాఖ, కార్యనిర్వాహకశాఖ మరియు న్యాయశాఖల మధ్య విభజించాలి.

ప్రతి ప్రభుత్వాంగం తన పరిధిలోని అధికారాలపై తిరుగులేని పెత్తనాన్ని కలిగి ఉంటూ, మరొక అంగానికి చెందిన అధికారాల విషయంలో జోక్యం చేసుకోరాదు అని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది.

ప్రశ్న 9.
నిరోధ సమతౌల్యత.
జవాబు.
అధ్యక్ష తరహా ప్రభుత్వానికి మరో ముఖ్యలక్షణం నిరోధ సమతౌల్య సూత్రం ఆధారంగా వ్యవహరించడం. ఈ తరహా ప్రభుత్వంలో ప్రభుత్వాంగాలు స్వతంత్రంగా వ్యవహరిస్తూనే పరస్పరం నిరోధ సమతౌల్యతతో వ్యవహరిస్తాయి. శాసనశాఖ అధ్యక్షుడి నిర్ణయాలకు ఆమోదం తెలుపుతుంది. అదేవిధంగా శాసనశాఖ తీసుకునే నిర్ణయాలకు అధ్యక్షుడు ఆమోదం తెలియజేయాల్సి ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం న్యాయశాఖ సమీక్ష చేస్తుంది.

ప్రశ్న 10.
సమిష్టి బాధ్యత.
జవాబు.
పార్లమెంటరీ విధానంలో అత్యంత ముఖ్య లక్షణం సమిష్టి బాధ్యత. పార్లమెంట్ విశ్వాసం ఉన్నంత వరకు మంత్రులు ఆయాశాఖలపై పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగిస్తారు. ఆ శాఖల నిర్వహణలో ప్రతిచర్యలపై క్యాబినెట్ ఉమ్మడి బాధ్యత వహిస్తుంది. కాబట్టి ప్రతి మంత్రి తీసుకొనే నిర్ణయాలు యావత్తు క్యాబినెట్కు వర్తిస్తాయి. కాబట్టి అతి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొంటారు.

ప్రశ్న 11.
అవిశ్వాస తీర్మానం.
జవాబు.
మంత్రి మండలి పైన, స్పీకర్ లేక డిప్యూటి స్పీకర్పై పార్లమెంటుకు విశ్వాసం లేదని తెలియజేయటానికి ఈ తీర్మానం ఉపయోగపడుతుంది. అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందితే మంత్రిమండలి లేక స్పీకర్ లేక డిప్యూటి స్పీకర్ రాజీనామా చేయవలసి ఉంటుంది.

ప్రశ్న 12.
ప్రధానమంత్రి.
జవాబు.
పార్లమెంటరీ ప్రభుత్వంలో ప్రధానమంత్రి వాస్తవాధికారిగా కొనసాగుతారు. మంత్రులను ఎంపిక చేసుకోవటం, వారికి శాఖలను కేటాయించటం, మార్పులు చేర్పులు చేయటంతోపాటు ప్రభుత్వాన్ని రద్దు చేయమని కోరే అధికారం ప్రధానమంత్రికి ఉండటం మూలంగా ప్రధానమంత్రి పదవికి ఎంతో విశిష్టత ఉంది.

ప్రశ్న 13.
రాష్ట్రపతి.
జవాబు.
పార్లమెంటరీ ప్రభుత్వ సంప్రదాయాలను అనుసరించి రాజ్యాంగవేత్తలు రాష్ట్రపతి పదవి, అధికారాలు. హోదా లాంఛనప్రాయంగా, నామమాత్ర రాజ్యాధిపతిగా ఉండేటట్లు రూపొందించారు. రాజ్యాంగరీత్యా రాష్ట్రపతికి కార్యనిర్వహణ అధికారాలు అన్నీ ఉంటాయి. కానీ వాస్తవంతో ఆయన తన అధికారాలను ప్రధానమంత్రి అధ్యక్షతన పనిచేసే మంత్రి మండలి సలహా ప్రకారం చెలాయిస్తారు.

TS Inter 2nd Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 6th Lesson స్థానిక ప్రభుత్వాలు Textbook Questions and Answers.

TS Inter 2nd Year Political Science Study Material 6th Lesson స్థానిక ప్రభుత్వాలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారతదేశంలో ప్రాంతీయ ప్రభుత్వాల చారిత్రక నేపథ్యాన్ని వివరించండి.
జవాబు.
చారిత్రక నేపథ్యం:
చక్కని పరిపాలనా వికేంద్రీకరణ, గ్రామ స్వరాజ్యం భారతదేశానికి ఎంతో అవసరమని గాంధీజీ ఏనాడో ఉద్భోదించారు. అనేక మంది జాతీయ నాయకులు ఈ భావనలను బలపరచారు. అయితే స్వాతంత్ర్యానంతరం ఏర్పడిన అనేక సంఘటనల కారణంగా భారత రాజ్యాంగ నిర్మాతలు జాతీయ సమైక్యత, సమగ్రతలకు ఎంతో ప్రాధాన్యం ఇవ్వవలసి వచ్చింది.

ఈ నేపథ్యంలో వారు ప్రాంతీయ ప్రభుత్వాలకు సముచితమైన స్థానాన్ని ఇవ్వలేకపోయారు. అయినప్పటికీ మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్య ఆశయాన్ని భారతరాజ్యాంగంలోని ఆదేశక సూత్రాలలో 40వ ప్రకరణలో వారు పొందుపరచారు. ఈ ప్రకరణ ప్రకారం “రాజ్యం పంచాయితీరాజ్ సంస్థలను నిర్వహించి, అవి స్వయం పాలనా సంస్థలుగా ఏర్పడటానికి తగిన అధికారాలు ఇవ్వాలి.

సామాన్య ప్రజానీకానికి పరిపాలనలో భాగస్వామ్యం, ప్రాతినిధ్యం కల్పించడానికి స్థానిక ప్రభుత్వాలు ఎంతో అవసరం. ఈ సంస్థలు ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులలాంటివి. ఈ సంస్థలను స్వయం పాలన సంస్థలుగా రూపొందించడానికి తగిన చర్యలను తీసుకునే ప్రధాన బాధ్యత రాజ్యానికి ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పంచాయితీరాజ్ సంస్థలను బలోపేతం చేయడానికి వివిధ చర్యలను చేపట్టింది. భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చిన తరువాత 1952లో సమాజాభివృద్ధి పథకం అమలు కోసం తగిన చర్యలు తీసుకుంది.

గ్రామీణ ప్రాంతంలోని వారికి శాస్త్రీయ, సాంకేతిక విజ్ఞానాన్ని అందించడం కోసం ఈ పథకం ద్వారా ప్రభుత్వం కృషి చేసింది. అయితే, ఈ పథకం ఆచరణలో ఆశించిన ఫలితాలను అందించలేకపోయింది. 1953లో కేంద్ర ప్రభుత్వం (National Extension Service Scheme – NESS) జాతీయ విస్తరణ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలను గ్రామీణాభివృద్ధి వ్యవహారాలలో భాగస్వామ్యం చేయడానికి ప్రభుత్వం కృషి చేసింది. అయితే ఈ పథకం కూడా ఆశించిన ఫలితాలను అందించలేదు. దీంతో భారత ప్రభుత్వం 1957లో బల్వంత్ రాయ్ మెహతా ఆధ్వర్యంలో ఒక పరిశీలనా సంఘాన్ని నియమించింది.

సమాజాభివృద్ధి పథకాల వైఫల్యానికి దారితీసిన పరిస్థితుల గురించి విచారణ జరపవలసిందిగా ఈ సంఘాన్ని ప్రభుత్వం కోరింది. బల్వంత్రెయ్మైహతా కమిటీ సుమారు 10 నెలల కాలంలో అనేక విషయాలను పరిశీలించి 1957 నవంబర్లో తుది నివేదికను సమర్పించింది. సమాజాభివృద్ధి వైఫల్యానికి తగిన కారణం, ఆచరణలో ఉన్న లోపాలు అని కమిటీ అభిప్రాయపడింది. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ పేరుతో గ్రామ పంచాయితీలను పునర్వ్యవస్థీకరించాలని కమిటీ సిఫార్సు చేసింది.

ఈ సందర్భంలో బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అనేక సిఫార్సులు చేసింది. వాటిలో ప్రధానమైనవి గ్రామపంచాయితీ, పంచాయితీ సమితి, జిల్లాపరిషత్ వంటి మూడు అంచెల ప్రాతినిధ్య సంస్థలను ప్రవేశపెట్టడం, ప్రాంతీయ ప్రభుత్వాలకు తగినంత నిధులు మంజూరు చేయడం మొదలైన అంశాలకు సంబంధించి బల్వంత్రాయ్ మెహతా కమిటీ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. కమిటీ సూచించిన పంచాయితీరాజ్ వ్యవస్థను అనేక రాష్ట్రాలు ఆమోదించాయి. వీటిలో రాజస్థాన్ మొదటి రాష్ట్రం.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 2.
73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ప్రధాన లక్షణాలను పేర్కొనండి.
జవాబు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఎంతో ప్రముఖమైనది. గ్రామస్థాయిలో, మాధ్యమిక స్థాయిలో, జిల్లాస్థాయిలో ఉన్న మూడంచెల పాలన గల పంచాయితీరాజ్ సంస్థలను ఈ చట్టం వ్యవస్థీకరించింది.

గ్రామీణ ప్రజలలో చక్కని నాయకత్వ లక్షణాలను, వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయాన్ని కలుగజేయడంలో ఈ చట్టం ప్రధానపాత్ర వహిస్తుంది. ఈ చట్టం ప్రధాన లక్షణాలను చట్టంలోని వివిధ ప్రకరణాల ద్వారా సంక్షిప్తంగా తెలుసుకుందాం.

చట్టం ప్రధానాంశాలు :
1. నిర్వచనాలు (243వ ప్రకరణ) :
గ్రామసభ, పంచాయితీ, జిల్లా మొదలైన అనేక పదాలను ఈ చట్టంలో వివిధ సందర్భంలో వాడటం జరిగింది. ఈ పదాల నిర్వచనాలు 243వ ప్రకరణలో ఉన్నాయి.

2. గ్రామసభ (243 – ఎ) :
చట్టం ప్రకారం గ్రామస్థాయిలో ఒక గ్రామ సభ ఉంటుంది. ఇది తన అధికారాలను శాసనసభ నిర్దేశించిన విధంగా చలాయిస్తుంది.

3. పంచాయితీ వ్యవస్థ (243-బి) :
ఈ చట్టం మూడు అంచెల ఏకరూప వ్యవస్థను నిర్దేశించింది. అవి (1) గ్రామస్థాయి (2) (మాధ్యమిక) మండలస్థాయి (3) జిల్లాస్థాయి.

4. పంచాయితీ నిర్మాణం (243-సి) :
పంచాయితీల నిర్మాణం గురించి శాసనసభ తగు నిబంధనలను రూపొందించాలని ఈ చట్టం పేర్కొంది. ప్రాదేశిక నియోజకవర్గాల ప్రాతిపదికపై పంచాయితీలకు ప్రత్యక్ష ఎన్నికలు ఉండాలని ఈ చట్టం పేర్కొంది.

5. సీట్ల రిజర్వేషన్లు (243-డి) :
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల, ప్రజాప్రతినిధులకు పంచాయితీలో వారి జనాభాను బట్టి. సీట్లు రిజర్వేషన్లు ఉండాలని ఈ చట్టం పేర్కొంటుంది. అలాగే 1/3 వంతుకు మించకుండా మహిళలకు రిజర్వేషన్లు కేటాయించాలని చట్టం పేర్కొంటుంది.

6. పంచాయితీల కాల పరిమితి (243-ఇ) :
ఈ చట్టం ప్రకారం పంచాయితీల కాల పరిమితి 5 సం||లు. కాలపరిమితికి ముందే ఒకవేళ అవి రద్దయితే వాటికి ఎన్నికలు నిర్వహించవలసి వస్తుంది.

7. అర్హతలు, అనర్హతలు (243-ఎఫ్) :
ఈ చట్టం పంచాయితీ సంస్థలకు పోటీ చేసే అభ్యర్థుల అర్హతలను, అనర్హతలను నిర్ధిష్టంగా పేర్కొంటుంది.

8. అధికారాలు, విధులు (243-జి):
11వ షెడ్యుల్ ద్వారా 29 అంశాలతో పంచాయితీ కార్యకలాపాలను ఈ చట్టం నిర్ధారించింది.

9. ఆదాయ వనరులు (243-హెచ్) :
పంచాయితీ సంస్థలకు గల వివిధ ఆదాయ వనరుల గురించి ఈ చట్టం పేర్కొనడం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు, పన్నుల ద్వారా ఆదాయం, భవనాల అద్దె మొ॥॥ వాటి ద్వారా ఈ సంస్థలు ఆదాయ వనరులను పొందుతాయి.

10. ఆర్థిక సంఘం (243 – ఐ) :
పంచాయితీల ఆర్థిక స్థితి సమీక్షకై ఒక ఆర్థిక సంఘాన్ని చట్టం ఏర్పరచి, తగిన విధి విధానాలను పేర్కొంటుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 3.
74వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ప్రధాన లక్షణాలను వివరించండి.
జవాబు.
74వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం రాజ్యాంగంలో IXA భాగం చేర్చబడినదని, ఇందులో 243 IP నుంచి 243.2F ప్రకరణలు ఉన్నాయని, ఈ భాగం “మున్సిపాలిటీస్” అనే శీర్షిక ద్వారా వివిధ పట్టణ స్థానిక సంస్థల గురించి వివరిస్తుందని తెలుసుకున్నాం. ఇందులో 243P ప్రకరణలో చట్టంలో ఉపయోగించబడిన అనేక పదాలకు నిర్వచనాలు ఉన్నాయి. ఇతర ప్రకరణలు పట్టణ స్థానిక ప్రభుత్వాల గురించి వివరిస్తాయి. వీటి గురించి తెలుసుకుందాం.

1. మున్సిపాలిటీల వ్యవస్థ (243. Q – ప్రకరణ) :
243Q – ప్రకరణ ప్రకారం, ప్రతి రాష్ట్రంలో ప్రధానంగా మూడు తరహాల మున్సిపాలిటీలు ఉండాలి. అవి :

  1. నగర పంచాయతీ (గ్రామీణ ప్రాంత స్థాయి నుండి పట్టణ ప్రాంతంగా పరివర్తన ప్రాంతంలో).
  2. మున్సిపల్ కౌన్సిల్ (చిన్న పట్టణ ప్రాంతాలలో).
  3. మున్సిపల్ కార్పోరేషన్ (బాగా విస్తరించిన పట్టణ ప్రాంతాలలో).

2. మున్సిపాలిటీల నిర్మాణం (243-R) :
మున్సిపాలిటీల నిర్మాణం గురించి ఈ చట్టం వివరిస్తుంది. దీని ప్రకారం మున్సిపల్ స్థానాలకు ప్రతినిధులు ఎంపిక ప్రత్యక్ష ఎన్నికల ద్వారా జరుగుతుంది. ఇందుకోసం మున్సిపాలిటీలను వార్డులుగా విభజిస్తారు. వార్డులలోని ప్రజలు తాము ప్రతినిధులను ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ఈ చట్టం ప్రకారం కొన్ని ప్రత్యేక అంశాలను సంబంధించి రాష్ట్ర శాసనసభలు శాసనాలు చేయవచ్చు.

ఉదాహరణకు, పురపాలక సంస్థలకు సమావేశాలలో అనుభవజ్ఞులు, నేర్పరితనంగల వ్యక్తులు పాల్గొనడానికి అవసరమైన నియమనిబంధనలను రాష్ట్ర శాసనసభలు చేయవచ్చు. అదేవిధంగా మున్సిపాలిటీ ప్రాంత పరిధిలోని రాష్ట్ర శాసనసభ / పార్లమెంట్ సభ్యులకు ఓటింగ్ హక్కులతో ప్రాతినిధ్యం కలిగించవచ్చు.

3. వార్డు కమిటీలు (243 – S) :
మూడు లక్షలు లేదా అంతకుమించి ఉన్న పురపాలక సంస్థలలో వార్డు కమిటీల ఏర్పాటు విషయంలో శాసనాలను రూపొందించే అధికారాన్ని రాష్ట్ర శాసనసభలు పొందుతాయని 243-S ప్రకరణ పేర్కొంటుంది.

4. సీట్ల రిజర్వేషన్లు (243 – T) :
243 – T ప్రకరణ ప్రకారం మున్సిపల్ ప్రాంతంలోని షెడ్యుల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి సీట్ల రిజర్వేషన్లు ఉండాలి. అంతేకాక 1/3వ వంతు స్థానాలను మహిళలకు కేటాయించాలని కూడా చట్టం నిర్దేశిస్తుంది.

5. మున్సిపాలిటీల పదవీకాలం (243 – U):
ఈ మున్సిపాలిటీల పదవీకాలాన్ని 5 సంగా నిర్ణయించింది. ఒకవేళ ఏ కారణం రీత్యానైనా పదవీకాలం ముగియకముందే మున్సిపాలిటీ రద్దయితే, తిరిగి ఆరుమాసాలలో వాటికి ఎన్నికలు జరిపించాలని కూడా ఈ చట్టం నిర్దేశిస్తుంది.

6. అనర్హతలు (243 – V) :
పురపాలక సంస్థల సభ్యులకు ఎన్నికలలో పోటీ చేయడానికి కావలసిన అర్హతలను, అనర్హతలను నిర్ణయించే అంశాలను ఈ చట్టం నిర్దిష్టంగా పేర్కొంటుంది. దీని ప్రకారం అనర్హతలకు సంబంధించిన వివాదాలను రాష్ట్ర శాసనసభ ఏర్పరచిన ఒక ప్రత్యేక అథారిటీ నిర్ణయిస్తుంది.

7. మున్సిపాలిటీల అధికారాలు, హక్కులు, బాధ్యతలు (243 – W) :
మున్సిపాలిటీలకు అధికారాలు, హక్కులు, బాధ్యతలను రాష్ట్ర శాసనసభలు ప్రత్యేక శాసనాల ద్వారా రూపొందించి, ఈ ప్రభుత్వాలను స్వయంపాలక సంస్థలుగా తీర్చిదిద్దాలని (243 – W) ప్రకరణ పేర్కొంటుంది.

18 అంశాలతో మున్సిపాలిటీలకు గల అధికారాలు, హక్కులు, బాధ్యతలను ఈ చట్టంతో రాజ్యాంగంలో ప్రత్యేకంగా చేర్చబడింది.
ఈ విధంగా 74వ రాజ్యాంగ సవరణ చట్టం పట్టణ, స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగపరమైన గుర్తింపును, సాధికారతను కలిగించి క్షేత్రస్థాయిలో ఉన్న ఈ ప్రభుత్వాలను బలోపేతం చేయడానికి తగిన ప్రధానాంశాలను కలిగి ఉందని చెప్పవచ్చు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 4.
2018 తెలంగాణ పంచాయితీ రాజ్ చట్టంపై సంక్షిప్త సమాధానం రాయండి.
జవాబు.
73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలకు అనుగుణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేవల్లో 1994లో “ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ “చట్టం” పేరుతో చట్టం చేయడమైనది. ఇది మే 30, 1994 నుంచి అమలులోకి వచ్చింది. జూన్ 2, 2014న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాక ఇదే చట్టాన్ని కొంతకాలం కొనసాగించారు. అనంతరం మన్యశ్రీ కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం 2018లో “తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం – 32018” పేరుతో నూతన చట్టాన్ని చేసింది.

ఈ చట్టం రాష్ట్రంలో ఏప్రిల్ 18, 2018 నుంచి అమలులోకి వచ్చింది. నూతన రాష్ట్రం ఆశలు, ఆశయాలు తీర్చుతూ తెలంగాణలో స్థానిక సంస్థలను బలోపేతం చేయడం ఈ చట్టం ప్రధాన లక్ష్యం. ఈ చట్టంలో 8 షెడ్యూల్స్, 9 భాగాలు మరియు 297 సెక్షన్లు ఉన్నాయి.

తెలంగాణ నూతన పంచాయతీరాజ్ చట్టం ముఖ్య లక్షణాలు :

1. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ :
ఈ చట్టం రాష్ట్రంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పరచింది. అవి గ్రామస్థాయిలో గ్రామపంచాయతీ, మండల స్థాయిలో ప్రజాపరిషత్, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్,

2. అరహతలు అనర్హతలు :
దీని ప్రకారం వివిధ పదవులకు కావలసిన అర్హతలను అనర్హతలను స్పష్టంగా పేర్కొంది. అవి :

  1. అతను/ఆమె 21 సంవత్సరాల వయస్సు పూర్తి అయి ఉండాలి.
  2. అతను/ఆమె పోటీ చేసే స్థానిక ప్రభుత్వ భౌగోళిక పరిధిలో ఓటరై ఉండాలి.
  3. అతను/ఆమె ప్రభుత్వం నుంచి ఆదాయం పొందే లాభసాటి పదవిలో ఉండరాదు.
  4. రాష్ట్ర శాసనసభ నిర్ణయించిన మేరకు నిర్ణీత డిపాజిట్లను చెల్లించాలి.
  5. అతను/ఆమె మే, 30, 1995 తరవాత మూడవ సంతానాన్ని పొందితే పోటీకి అనర్హులు.

వివరణ : దీని ప్రకారం ఒక వ్యక్తి మే, 31, 1995 కంటే ముందు ఇద్దరు కంటే ఎక్కువ సంతానాన్ని కలిగి ఉన్నప్పటికీ స్థానిక సంస్థలకు పోటీ చేయడానికి అర్హుడే.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 5.
తెలంగాణ జిల్లా పరిషత్ల నిర్మాణం, అధికారాలు వివరించండి.
జవాబు.
జిల్లా పరిషత్ నిర్మాణం : ప్రతిజిల్లా ప్రజా పరిషత్లో కింది సభ్యులు ఉంటారు.

1. ఎన్నికైన సభ్యులు :
వీరిని జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గ సభ్యులని (ZPTC) అంటారు.

2. పదవీరీత్యా సభ్యులు :
జిల్లా పరిధిలో గల నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడు (MLA), లోక్ సభ సభ్యుడు (MP), అదే విధంగా జిల్లాలో ఓటర్గా నమోదైన రాష్ట్ర విధాన పరిషత్ సభ్యుడు (MLC) రాజ్యసభ సభ్యుడు (MP), జిల్లా ప్రజాపరిషత్లో పదవీరీత్యా సభ్యులుగా (Ex-officio) ఉంటారు.

వీరు జిల్లా పరిషత్ సమావేశాలలో పాల్గొనవచ్చు, చర్చల్లో భాగస్వామ్యం కావచ్చు. అభిప్రాయాలు చెప్పవచ్చు. అదేవిధంగా జిల్లా పరిషత్ యొక్క వివిధ స్థాయి సంఘాల్లో సభ్యులు కావచ్చు. ఈ సమావేశాల్లో పాల్గొని తమ అభిప్రాయాలు చెప్పవచ్చు. కాని వివిధ తీర్మానాలపై ఓటు వేసే హక్కులేదు.

3. కో-ఆప్ట్ సభ్యులు :
జిల్లా ఓటర్గా నమోదై ఉన్న మైనారిటీ వర్గానికి చెందిన ఇద్దరిని జిల్లా పరిషత్ సభ్యులు కో-ఆప్ట్ చేసుకోవచ్చు. వీరికి 21 సంవత్సరాల వయస్సు పూర్తి అయి ఉండాలి.

జిల్లా పరిషత్ అధికారాలు, విధులు :

  1. జిల్లాలోని అన్ని మండల ప్రజాపరిషత్ల బడ్జెట్లను పరిశీలించి ఆమోదిస్తుంది.
  2. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల కింద ఇచ్చే నిధులను జిల్లాలోని అన్ని మండల ప్రజాపరిషత్లకు కేటాయిస్తాడు.
  3. జిల్లాలోని వివిధ మండలాల ప్రణాళికలు క్రోడీకరించి జిల్లా ప్రణాళికను రూపొందించి అమలు చేయడం.
  4. జిల్లాలోని అన్ని మండల ప్రజాపరిషత్లు మరియు గ్రామపంచాయతీల కార్యక్రమాలను పర్యవేక్షించి అవసరమైన సలహాలు, ఆదేశాలివ్వడం.
  5. చట్టం ప్రకారం విధించే పన్నులు లేదా రుసుములను వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవడం, జిల్లా బోర్డ్ అధికారాలను నిర్వహించడం.
  6. గ్రామీణాభివృద్ధికి, ప్రజాసంక్షేమానికై చేపట్టవలసిన వివిధ కార్యక్రమాలు, సేవల రూపకల్పనకై రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సలహా ఇచ్చింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
బల్వంత్రెయ్ మెహతా కమిటీ.
జవాబు.
మనదేశంలో శ్రీ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ సిఫారసులననుసరించి పంచాయితీరాజ్ వ్యవస్థ అమలులోకి వచ్చింది. స్వాతంత్య్రానంతరం భారతదేశంలో ప్రారంభించబడిన సమాజాభివృద్ధి పథకము, జాతీయ విస్తరణ సేవా పధకములు అమలు తీరును సమీక్షించుటకు భారత ప్రభుత్వం 1957లో బల్వంత్ రాయ్ మెహతా ఆధ్వర్యంలో ఒక పరిశీలనా సంఘాన్ని నియమించింది.

ఈ కమిటీ సుమారు 10 నెలల కాలంలో అనేక విషయాలను పరిశీలించి 1957 నవంబరులో తుది నివేదికను సమర్పించింది. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ పేరుతో గ్రామపంచాయితీ, పంచాయితీ సమితి, జిల్లా పరిషత్ వంటి మూడు అంచెల ప్రాతినిధ్య సంస్థలను ప్రవేశపెట్టాలని సూచించింది.

ప్రశ్న 2.
అశోక్ మెహతా కమిటి.
జవాబు.
మోరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా వ్యవస్థలను బలోపేతం చేయడానికి 1978లో 13
ప్రభుత్వం 1977లో అశోక్ మెహతా నాయకత్వంలో పంచాయతీరాజ్. సూచనలతో తన నివేదికను సమర్పించింది. అందులో ముఖ్యమైనవి.

  1. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ స్థానంలో రెండంచెల వ్యవస్థను అమలుచేయాలి. అవి జిల్లాస్థాయిలో జిల్లా పరిషత్, దిగువ స్థాయిలో వివిధ గ్రామాలతో కూడిన మండల పరిషత్.
  2. జిల్లాస్థాయిలో జిల్లాపరిషత్ కార్యనిర్వాహక వ్యవస్థగా పనిచేస్తుంది. జిల్లాస్థాయిలో అన్ని రకాల ప్రణాళికల రూపకల్పన, అమలు కోసం బాధ్యత వహిస్తుంది.

ప్రశ్న 3.
ఎల్.ఎం. సింఘ్వి కమిటి.
జవాబు.
‘ప్రజాస్వామ్యం, అభివృద్ధి’ పేరుతో పంచాయతారాజ్ వ్యవస్థలను పునఃనిర్మాణానికి రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1986లో L.M. సింఘ్వి నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. దీని సూచనలు :

  1. పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగబద్ధత కల్పిస్తూ, పటిష్టంగా అమలుచేయాలి.
  2. పంచాయతీరాజ్ సంస్థలకు స్వేచ్ఛగా, నిర్ణీతకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లను రాజ్యాంగంలో పొందుపరచాలి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 4.
ఎన్నికల సంఘం.
జవాబు.
రాష్ట్రంలో పంచాయితీరాజ్ సంస్థల మరియు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ, ఓటర్ల జాబితా మొదలగు అంశాలను స్వేచ్ఛగా, స్వతంత్రంగా నిర్వహించడానికి రాజ్యాంగ ప్రతిపత్తి గల రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని గవర్నర్ నియమిస్తాడు.

ప్రశ్న 5.
రాష్ట్ర ఆర్థిక సంఘం.
జవాబు.
73 మరియు 74వ రాజ్యాంగ సవరణ చట్టములలో అధికరణలు 243-I మరియు 243-Y వైల ప్రకారం పంచాయతీల ఆర్థికస్థితి సమీక్షపై ఒక ఆర్థిక సంఘం ఏర్పాటవుతుంది. ఈ ఆర్థిక సంఘం మున్సిపాలిటీల ఆర్థిక పరిస్థితిని కూడా సమీక్షించి, తగిన విధి, విధానాల సూచనతో రాష్ట్ర గవర్నర్కు నివేదికను సమర్పిస్తుంది.

ప్రశ్న 6.
జిల్లా ప్రణాళికా కమిటీ:
జవాబు.
ప్రతి రాష్ట్రం 243 (ZD) ప్రకారం, జిల్లా స్థాయిలో జిల్లా ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి. గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు, పట్టణ స్థానిక ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరుల పంపిణి కోసం ప్రణాళికలను రూపొందించడం దీని విధి. తెలంగాణ రాష్ట్రంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవీరీత్యా దీని ఛైర్మన్ గా ఉంటాడు. అదే విధంగా జిల్లా కలెక్టర్ దీనికి కన్వీనర్గా వ్యవహరిస్తాడు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 7.
గ్రామ పంచాయతీ
జవాబు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీరాజ్ సంస్థలో గ్రామపంచాయతీ పునాది నిర్మాణం వంటిది. ఇది గ్రామ స్థాయిలో శాసన నిర్మాణ వ్యవస్థగా, చర్చాసంబంద సంస్థగా ఉంటుంది. గ్రామ పంచాయతీ నెలకు కనీసం ఒకసారి సమావేశం కావాలి.

గ్రామ పంచాయతీ సమావేశానికి సర్పంచ్ అధ్యక్షతవహిలాస్తారు. అతను లేనిచో ఉప సర్పంచ్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. అన్ని రకాల నిర్ణయాలు, తీర్మానాలను గ్రామ పంచాయతీ సభ్యులు, సర్పంచ్ కలిపి మెజారిటీ తీర్మానంతో ఆమోదిస్తారు.

ప్రశ్న 8.
గ్రామ సభ.
జవాబు.
ప్రతి గ్రామపంచాయతీలో గ్రామసభ ఏర్పాటవుతుంది. దానిలో గ్రామానికి చెందిన రిజిష్టర్ ఓటర్లు సభ్యులుగా ఉంటారు. అది సంవత్సరానికి కనీసం మూడుసార్లయినా సమావేశమవుతుంది. గ్రామసభ పంచాయితీకి సంబంధించిన వార్షిక పరిపాలన, ఆడిట్ నివేదికలను పరిశీలించి ఆమోదిస్తుంది.

వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్దిదారుల జాబితాను ఖరారు చేస్తుంది. సమాజ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు శీఘ్రగతిన అమలులో ఉంచడానికి, ప్రజల భౌతిక సేవలను స్వచ్ఛందంగా వినియోగించుకోవడానికి తగిన సూచనలిస్తుంది.

ప్రశ్న 9.
సర్పంచ్.
జవాబు.
గ్రామంలో సర్పంచ్ ప్రథమ పౌరుడు. ఇతను గ్రామ పంచాయతీకి రాజకీయాధిపతిగా ఉంటాడు. సర్పంచ్ గ్రామంలో రిజిష్టర్ ఓటర్లచే ఎన్నికవుతాడు. ఇతను గ్రామపంచాయతీ, గ్రామ సభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. గ్రామ పంచాయతీ, గ్రామ సభ తీర్మానాలను అమలుచేసే బాధ్యతను నిర్వహిస్తాడు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 10.
పంచాయతీ కార్యదర్శి.
జవాబు.
రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడిన పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీలో ముఖ్య ప్రభుత్వోద్యోగి. గ్రామ పంచాయతీ పరిపాలనా వ్యవహారాలలో సర్పంచి సహాయంగా ఉంటూ అతని ఆదేశాలకు అనుగుణంగా తన విధులను నిర్వహిస్తాడు. ఇతను గ్రామ పంచాయతీ, గ్రామసభ సమావేశాలకు హాజరు కావచ్చు.. చర్చల్లో పాల్గొనవచ్చు. సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తాడు. కానీ తీర్మానాలపై ఓటు వేసే అధికారం మాత్రం లేదు.

ప్రశ్న 11.
మండల పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గ సభ్యుడు (MPTC).
జవాబు.
ప్రతి మండల ప్రజాపరిషత్ ను వివిధ ప్రాదేశిక నియోజక వర్గాలుగా విభజిస్తాడు. ఇందలో 3,000 నుంచి 4,000 మంది జనాభా ఉంటారు. ప్రతి ప్రాదేశిక నియోజక వర్గానికి ఒక్కొక్క ప్రతినిధి ఉంటారు. వారిని MPTC అని అంటారు. మండల ప్రజాపరిషత్లోని ఓటర్లచే రహస్య ఓటింగ్ పద్ధతిలో మీరు ఎన్నికౌతారు.

మండల ప్రజాపరిషత్ భౌగోళిక పరిధిలో ఎక్కడైన ఓటర్గా నమోదై ఉన్న వ్యక్తి ఆ మండంలంలోని ఏ ప్రాదేశిక నియోజక వర్గం నుంచి అయిన MPTC పోటీ చేయవచ్చు. మొత్తం MPTC సీట్లలో కొన్ని స్థానాలు చట్టం నిర్దేశించిన విధంగా SC, ST, BC మరియు మహిళలకు రిజర్వ్ చేస్తారు.

ప్రశ్న 12.
మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు (MPP).
జవాబు.
మండల ప్రజాపరిషత్ రాజకీయాధిపతిగా, ప్రథమ పౌరునిగా MPP వ్యవహరిస్తాడు. ప్రతి మండల ప్రజాపరిషత్కు ఒక అధ్యక్షడు, మరొకరు ఉపాధ్యక్షులుగా ఉంటారు. MPTC లు తమలో ఒకరిని MPP గా, మరొకరిని ఉపాధ్యక్షునిగా ఎన్నుకుంటారు. మండల ప్రజాపరిషత్ సమావేశాలను ఏర్పరచి, దానికి అధ్యక్షత వహిస్తాడు.

మండల ప్రజాపరిషత్ రికార్డు మొత్తం ఇతని అధీనంలో ఉంటాయి. మండల ప్రజాపరిషత్ తీర్మానాల అమలులో MPDO పై పాలనాపరమైన నియంత్రణను కలిగి ఉంటాడు. మండలాభివృద్ధి అనేది సమర్థతపై ఆధారపడి ఉంటుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 13.
మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO).
జవాబు.
రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడిన మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) మండల ప్రజాపరిషత్లో ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా వ్యవహరిస్తాడు. మండల ప్రజాపరిషత్ తీర్మానాల అమలు బాధ్యతను కలిగి ఉంటాడు. ప్రభుత్వం ఆదేశించిన ఇతర విధులను కూడా నిర్వర్తించాలి.

మండల పరిధిలోని గ్రామ పంచాయతీలను పర్యవేక్షించే అధికారం ఉంటుంది. మండల ప్రజాపరిషత్ అధ్యక్షుని ఆమోదంతో లేదా ఆదేశానుసారం MPDO నెలకు కనీసం ఒకసారి మండల ప్రజాపరిషత్ సమావేశాలను ఏర్పాటుచేయాలి. MPDO ఈ సమావేశాలకు హాజరు కావచ్చు.

ప్రశ్న 14.
జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు (ZPTC).
జవాబు.
ప్రతి జిల్లా పరిషత్లో అనేక మండలాలు ఉంటాయి. ప్రతి మండలాన్ని ఒక్కో ప్రాదేశిక నియోజక వర్గంగా ఏర్పాటు చేసి, ఒక్కొక్క దానికి ఒక్కో వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తాడు. వీరిని జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గ సభ్యుడు (ZPTC) అని అంటారు.

ఆయా నియోజక వర్గాలలోని ఓటర్లచే రహస్య ఓటింగ్ ప్రక్రియ ద్వారా ZPTC లు ప్రత్యక్షంగా ఎన్నికవుతారు. జిల్లా ప్రజాపరిషత్ ప్రాదేశిక పరిధిలో ఓటర్గా నమోదై ఉన్న ఆ జిల్లా ప్రజా పరిషత్ లో ఎక్కడ నుండైన ZPTC గా పోటీచేయవచ్చు. చట్టం నిర్దేశించిన విధంగా SC, ST, BC మరియు మహిళలకు కొన్ని స్థానాలు రిజర్వ్ చేస్తారు.

ప్రశ్న 15.
ముఖ్య కార్యనిర్వాహక అధికారి (CEO).
జవాబు.
రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడిన ముఖ్య కార్య నిర్వాహక అధికారి (CEO) జిల్లా పరిషత్లో ఉన్నత ప్రభుత్వోద్యోగిగా ఉంటాడు. జిల్లా ప్రజా పరిషత్ తీర్మానాలను అమలుచేయడానికి బాధ్యత వహిస్తాడు. రాష్ట్ర ప్రభుత్వం కాలానుగుణంగా జిల్లా పరిషత్క సంబంధించిన ఇచ్చే ఆదేశాలను కూడా అమలు చేసే బాధ్యతను కలిగి ఉంటాడు.

జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మన్ అనుమతి లేదా ఆదేశంతో జిల్లా ప్రజా పరిషత్ సమావేశాలను CEO నెలకు కనీసం ఒకసారి ఏర్పాటు చేస్తాడు. CEO జిల్లా ప్రజాపరిషత్ సమావేశాలలో, స్థాయి సంఘాల సమావేశాలలో, జిల్లా పరిధిలోని మండల ప్రజాపరిషత్ సమావేశాల్లో పాల్గొనవచ్చు. మాట్లాడవచ్చు. తన అభిప్రాయాన్ని చెప్పవచ్చు. కాని వివిధ తీర్మానాలపై ఓటువేసే హక్కు మాత్రం లేదు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 16.
మేయర్.
జవాబు.
నగర పాలక సంస్థ రాజకీయాధినేతగా, ప్రథమ పౌరునిగా మేయర్ ఉంటాడు. ప్రతి నగర పాలక సంస్థల కార్యక్రమాల నిర్వహణకై ఒక మేయర్, డిప్యూటీ మేయర్ ఉంటారు. నగర పాలక సంస్థ ఎన్నికల అనంతరం కార్పొరేటర్స్ తమలో ఒకరిని మేయర్గా, మరొకరిని డిప్యూటీ మేయర్గా ఎన్నుకుంటారు. వీరి ఎన్నికల్లో పదవీరీత్యా సభ్యులకు కూడా ఓటు హక్కు ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణాల రీత్యా మేయర్ పదవి ఖాళీ అయితే నూతన మేయర్ను ఎన్నుకునేంత వరకు డిప్యూటీ మేయర్ ఆ విధులను నిర్వహిస్తాడు.

ప్రశ్న 17.
తెలంగాణ రాష్ట్రంలోని మునిసిపల్ కార్పొరేషన్ల పేర్లు రాయండి.
జవాబు.

  1. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్
  2. గ్రేటర్, వరంగల్ మునిసిపల్ కార్పోరేషన్
  3. కరీంనగర్
  4. ఖమ్మం
  5. నిజామాబాద్
  6. రామగుండం
  7. బడంగ్ పేట్
  8. బండ్లగూడ
  9. మీర్పేట్
  10. బోడుప్పల్
  11. జవహర్ నగర్
  12. ఫీర్ణాధీగూడ
  13. నిజాంపేట

TS Inter 1st Year Political Science Study Material Chapter 7 పౌరసత్వం

Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 7th Lesson పౌరసత్వం Textbook Questions and Answers.

TS Inter 1st Year Political Science Study Material 7th Lesson పౌరసత్వం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
పౌరసత్వాన్ని నిర్వచించి, పౌరసత్వాన్ని సంపాదించే విధానాలను తెలపండి.
జవాబు.
పరిచయం : పౌరసత్వం అనేది ప్రజాస్వామ్య రాజ్యాలలో నివసించే వ్యక్తుల ప్రత్యేక హక్కు వ్యక్తులు తమ దేశంలో పౌరసత్వాన్ని కలిగి ఉండటాన్ని ప్రతిష్టాత్మకంగానూ, గర్వదాయకంగానూ భావిస్తారు. వాస్తవానికి రాజ్యంలోని పౌరులను వివిధ తరహాల వ్యక్తుల నుంచి విడదీసేందుకు పౌరసత్వం దోహదపడుతుంది. రాజ్యంలో సుఖ సంతోషాలు, సహృద్భావాలతో జీవనం కొనసాగించేందుకు పౌరసత్వం సాధనంగా ఉంటుందని ప్రజలు భావిస్తారు.

ఒక్కమాటలో .చెప్పాలంటే పౌరసత్వం ప్రజలలో దేశభక్తి, త్యాగనిరతి, విశాల దృక్పథం వంటి భావాలను పెంపొందిస్తుంది. పౌరసత్వం అనేది సాంప్రదాయాలు లేదా చట్టాల ద్వారా గుర్తించబడే వ్యక్తుల హోదాను సూచిస్తుంది. పౌరసత్వం గల వ్యక్తులనే పౌరులుగా వ్యవహరిస్తారు. అటువంటి పౌరులు రాజకీయ వ్యవస్థ అయిన రాజ్యం వ్యవహారాలలో పాల్గొంటారు. సాల్మండ్ ప్రకారం పౌరులు రాజ్య సభ్యులుగా ఉంటూ రాజ్యంలో వైయక్తిక, శాశ్వతమైన సంబంధాలను కలిగి ఉంటారు.

వారు అనేక హక్కులు, సౌకర్యాలను అనుభవిస్తారు. అటువంటి వాటిలో ఓటుహక్కు, ఆస్తిహక్కు, నివాసం వంటి హక్కులు ఉన్నాయి. అంతేకాకుండా పన్నులను చెల్లించడం, సైనికపరమైన సేవలను అందించడం వంటి కొన్ని బాధ్యతలు కూడా ప్రతి పౌరుడికి ఉంటాయి.

నిర్వచనాలు :

  1. అరిస్టాటిల్ : “రాజ్య వ్యవహారాలలో ప్రత్యక్షంగా, చురుకైన పాత్ర కలిగిన వ్యక్తియే పౌరుడు”.
  2.  ప్రొఫెసర్ లాస్కీ : “ప్రజాహితానికి వ్యక్తులు అందించే నిర్ణాయక సేవయే పౌరసత్వం”.
  3. టి.హెచ్. మార్షల్ : “రాజకీయ సమాజంలో సంపూర్ణ సభ్యులుగా ఉండేవారికి కల్పించే హోదాయే పౌరసత్వం. అటువంటి హోదాగల వ్యక్తులు హక్కులు, బాధ్యతల విషయంలో సమాన హోదాను కలిగి ఉంటారు”.

పౌరసత్వ ఆర్జన పద్ధతులు (Methods of acquiring Citizenship) :
పౌరసత్వం రెండు పద్ధతుల ద్వారా సంక్రమిస్తుంది. అవి : A) సహజమైనది B) సహజీకృతమైనది. ఆ రెండు పద్దతులను కింద అధ్యయనం చేయడమైంది.

A) సహజ పౌరసత్వం :
అధికారులకు ఏ విధమైన విజ్ఞప్తి చేయకుండా లేదా ప్రత్యేక దరఖాస్తును పంపించకుండా వ్యక్తులకు సంక్రమించే పౌరసత్వాన్ని సహజ పౌరసత్వం అంటారు. సహజ పౌరసత్వంలో మూడు అంశాలు ఇమిడి ఉంటాయి. అవి :

  1. భూమి లేదా జన్మస్థలం (జస్ సోలి),
  2. బంధుత్వం లేదా రక్తసంబంధం (జస్ సాంగ్వినస్),
  3. మిశ్రమ అంశం.

TS Board Inter First Year Political Science Study Material Chapter 7 పౌరసత్వం

పైన పేర్కొన్న వాటిని కింది విధంగా వివరించవచ్చు.

1. జస్ సోలి – భూమి లేదా జన్మస్థలం (Jus soli’ – Land or Place of Birth) :
‘జస్ సోలి’ అంటే భూమి లేదా జన్మస్థలం సూత్రం ఆధారంగా పౌరసత్వ సంక్రమణగా భావించవచ్చు. ఈ పద్ధతి ప్రకారం తల్లిదండ్రులను బట్టి కాకుండా పుట్టిన ప్రదేశం ప్రాతిపదికపై పౌరసత్వం నిర్ణయించడమవుతుంది. జన్మించిన ప్రదేశమే పౌరసత్వాన్ని నిర్ణయించడంలో కీలకపాత్రను పోషిస్తుంది.

అయితే ఆధునిక కాలంలో ఈ రకమైన పద్దతి అంతగా ప్రాచుర్యం పొందలేదు. భూమితో సంబంధం గల మధ్యయుగంలో ఈ రకమైన పౌరసత్వం ఎంతో ప్రసిద్ధిగాంచింది. వర్తమాన కాలంలో ఈ పద్ధతి అర్జంటీనాలో మాత్రమే పాటించబడుతున్నది.

2. జస్ సాంగ్వినీస్ – బంధుత్వం లేదా రక్తసంబంధం (Jus Sanguinis – Kinship or Blood Relation- ship) :
‘జస్ సాంగ్వినీస్’ అనేది బంధుత్వం లేదా రక్తసంబంధం ద్వారా పౌరసత్వం సంక్రమిస్తుందనే అంశాన్ని సూచిస్తుంది. ఈ పద్ధతి ప్రకారం ఒక శిశువు తాను జన్మించిన ప్రదేశంతో సంబంధం లేకుండానే తన తల్లిదండ్రుల పౌరసత్వాన్ని పొందుతుంది.

ఇక్కడ బంధుత్వం లేదా రక్తసంబంధం ఒక్కటే పౌరసత్వ ఆర్జనను నిర్ణయిస్తుంది. ఉదాహరణకు భారతీయ తల్లిదండ్రులకు జన్మించిన శిశువు జన్మస్థలంతో నిమిత్తం లేకుండా భారత పౌరుడిగానే పరిగణించడమవుతుంది.

ఈ రకమైన పౌరసత్వం అనేది ప్రాచీనకాలంలో ఎంతగానో ప్రాచుర్యం పొందింది. ఇప్పటికీ ఈ పద్ధతిని ప్రపంచంలోని అనేక రాజ్యాలు అనుసరిస్తున్నాయి. ఈ రకమైన పౌరసత్వ సంక్రమణం అనేది సహజమైనదిగానూ, హేతుబద్ధమైనదిగానూ భావించబడింది. మొత్తం మీద జర్మనీ, నార్వే, ఇటలీ, స్వీడన్ వంటి అనేక రాజ్యాలలో ఈ రకమైన పౌరసత్వ పద్ధతి అమలులో ఉంది.

3. మిశ్రమ సూత్రం (Mixed Principle) :
ఈ సూత్రాన్ని అనుసరించి రక్తసంబంధంతో పాటు జన్మస్థల సంబంధమైన సూత్రం ప్రకారం పౌరసత్వాన్ని ప్రసాదించడమైంది. అనేక రాజ్యాలు ఈ సూత్రాన్ని అనుసరిస్తున్నాయి. ఉదాహరణకు బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు రక్తసంబంధంతో పాటుగా జన్మస్థల సంబంధమైన అంశం ద్వారా పౌరసత్వాన్ని ప్రసాదిస్తున్నాయి. అయితే ఈ సందర్భంలో పౌరసత్వాన్ని ప్రసాదించడంలో పైన పేర్కొన్న రెండు సూత్రాలను పాటించడంతో ఒకే సమయంలో రెండు దేశాల పౌరసత్వం లభించే అవకాశం ఉంది.

ఉదాహరణకు బ్రిటీష్ తల్లిదండ్రులకు శిశువు అమెరికాలో జన్మిస్తే జన్మస్థల సంబంధమైన పద్ధతి ప్రకారం అమెరికా పౌరసత్వం లభిస్తుంది. అదే శిశువు రక్తసంబంధమైన పద్ధతిని అనుసరించి బ్రిటీష్ పౌరసత్వం పొందుతుంది. అటువంటి సందర్భంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అప్పుడు ఆ శిశువుకు యుక్తవయస్సు వచ్చిన తరువాత తన ఇష్టం వచ్చిన రాజ్య పౌరసత్వాన్ని ఎంపిక చేసుకొనే స్వేచ్ఛ ఉంటుంది.

B. సహజీకృత పౌరసత్వం (Naturalised Citizenship) :
సహజ పౌరసత్వం లేని వ్యక్తి సహజీకృత పద్ధతి ద్వారా రాజ్య పౌరసత్వాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతి ద్వారా విదేశీయులు కొన్ని షరతులకు లోబడి రాజ్య పౌరసత్వాన్ని పొందవచ్చు. అటువంటి షరతులు అన్ని రాజ్యాలలో ఒకే విధంగా ఉండవు. వాటిలో కొన్నింటిని కింద పేర్కొనడమైంది.

1. నివాసం (Residence) :
విదేశీయుడు తాను నివసిస్తున్న రాజ్యంలో పౌరసత్వాన్ని పొందేందుకు నిర్ణీత కాలం పాటు నివసించాలి. అతడు ఆ దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో తప్పనిసరిగా నివసించాల్సి ఉంటుంది. ఆ పరిమితి అన్ని రాజ్యాలలో ఒకే రకంగా లేదు. ఉదాహరణకు ఆ కాలపరిమితి బ్రిటన్, అమెరికాలలో 5 సంవత్సరాలు కాగా, ఫ్రాన్సులో 10 సంవత్సరాలుగా నిర్ణయించడమైంది.

2. ఎంపిక (Choice) :
విదేశీ తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు యుక్తవయస్సు వచ్చిన తరువాత తమ ఇష్టం వచ్చిన రాజ్య పౌరసత్వాన్ని ఎంపిక చేసుకొని పొందవచ్చు.

3. దరఖాస్తు (Application) :
విదేశీయుడు తాను కోరుకున్న రాజ్యంలో పౌరసత్వం పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ రాజ్యానికి చెందిన ప్రభుత్వం విధించే షరతులను సంతృప్తిపరచాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి పౌరసత్వం కోసం చేసుకున్న దరఖాస్తు యోగ్యతను రాజ్యం పరిశీలించి ఆమోదించినట్లయితే అతనికి పౌరసత్వం లభిస్తుంది.

నిర్దిష్ట కాలం పాటు నివాసం, సత్ప్రవర్తన, ఆర్థిక సామర్థ్యం, రాజ్యంలోని ఏదైనా ఒక జాతీయ భాషను అవగాహన చేసుకోవడం వంటి షరతులను ఆయా విదేశీయులు ఆమోదించాల్సి ఉంటుంది. పై వాటితో పాటుగా తాము పౌరసత్వం పొందగోరే రాజ్యానికి విధేయతను కలిగి ఉంటామనే లిఖితపూర్వక ప్రమాణం చేయడం ద్వారా విదేశీయులు పౌరసత్వాన్ని పొందగలుగుతారు.

4) స్థిరాస్తులు (Fixed Assets) :
భూమి, ఇళ్ళు వంటి స్థిరాస్తులను సంపాదించుకోవడం ద్వారా రాజ్య పౌరసత్వాన్ని విదేశీయులు పొందగలుగుతారు.

5) సేవలు (Services) (ప్రభుత్వ లేదా ప్రైవేటు):
ప్రభుత్వం లేదా గుర్తింపు పొందిన ప్రైవేటు సంస్థలలో సేవలను అందించడం ద్వారా విదేశీయుడు పౌరసత్వాన్ని పొందవచ్చు. అధికారిక సంస్థలలో పనిచేసినప్పుడే ఈ నియమం వర్తిస్తుంది. విదేశీ పౌరుడు ప్రతిభావంతమైన సేవలను అందించడం ద్వారా తాను కోరుకున్న దేశం పౌరసత్వాన్ని పొందవచ్చు.

6) వివాహం (Marriage) :
వివాహం వల్ల పౌరసత్వం లభించవచ్చు.. కొన్ని దేశాలలో అన్య దేశీయుని వివాహమాడిన స్త్రీ తన భర్త రాజ్యంలో పౌరసత్వం పొందవచ్చు. మరికొన్ని దేశాలలో పౌరులు విదేశ వనిత లేదా విదేశీ పురుషుడిని గానీ వివాహం చేసుకొంటే, వారి భర్త లేదా భార్యకు చెందిన రాజ్య పౌరసత్వం లభిస్తుంది.

ఉదాహరణకు ఒక బ్రిటీష్ దేశస్థురాలు భారతీయుడిని వివాహమాడితే ఆమెకు భారతదేశ పౌరసత్వమివ్వడం జరుగుతుంది. విదేశస్థుడిని వివాహం చేసుకొన్నప్పటికీ జపాన్ దేశస్థురాలు తన స్వదేశీ పౌరసత్వాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా జపాన్ దేశస్థురాలిని వివాహమాడిన విదేశీయునికి కూడా జపాన్ పౌరసత్వం ఇవ్వబడుతుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 7 పౌరసత్వం

ప్రశ్న 2.
ఉత్తమ పౌరుల లక్షణాలను వివరించండి.
జవాబు.
పౌరుడు : “రాజ్య వ్యవహారాలలో ప్రత్యక్షంగా, చురుకైన పాత్ర కలిగిన వ్యక్తియే పౌరుడు” – అరిస్టాటిల్.

మంచి పౌరుడి లక్షణాలు (Qualities of a Good Citizen) :
అరిస్టాటిల్ ఉద్దేశ్యంలో మంచి పౌరులు మంచి రాజ్యాన్ని నిర్మించగలుగుతారు. వారు ఆదర్శ గుణాలను కలిగి ఉండటమే అందుకు కారణం. ఈ సందర్భంలో లార్డ్ బ్రైస్ మంచి పౌరుడి లక్షణాలలో మూడింటిని పేర్కొన్నాడు. అవి : i) అంతరాత్మ ప్రకారం వ్యవహరించడం. ii) తెలివితేటలను కలిగి ఉండటం iii) ఆత్మ నిగ్రహాన్ని పాటించడం. మొత్తం మీద మంచి పౌరుడు కింది లక్షణాలను కలిగి ఉంటాడని చెప్పవచ్చు.

1. మంచి ప్రవర్తన (Good Character) :
మంచి పౌరుడు మంచి ప్రవర్తనను కలిగి ఉండాలి. అతడు ధైర్యం, న్యాయబుద్ధి, సహాయధోరణి, ఉదార స్వభావం, సానుభూతి, సత్యభాషణ, నిజాయితీ వంటి గుణాలను త్రికరణ శుద్ధిగా కలిగి ఉండాలి.

2. సంపూర్ణ ఆరోగ్యం (Sound Health) :
మంచి పౌరుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని, శక్తిని కలిగి ఉండాలి. ఆరోగ్యవంతులైన పౌరులే ఆరోగ్యకరమైన జాతిని నిర్మిస్తారు. ఎందుకంటే మంచి ఆలోచనలు గల వ్యక్తులే మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. అటువంటి పౌరులు అనేక రంగాలలో రాజ్య ప్రగతికి దోహదపడతారు.

3. తెలివితేటలు, విద్య (Intelligence and Education) :
తెలివితేటలు, విద్య అనేవి పౌరుడికి గల మరొక లక్షణంగా పరిగణించవచ్చు. ప్రతి పౌరుడు తన హక్కులు, బాధ్యతల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి. వివిధ సంఘటనల పరిశీలనలో ఎటువంటి ఆవేశాలకు లోనుకారాదు.

ఈ సందర్భంలో సరైన విద్యను అభ్యసించిన వారు సమాజంలో తగిన పాత్రను పోషించగలుగుతారు. తెలివితేటలు గల పౌరులు రాజ్యం ఎదుర్కొనే సమస్యలను సరైన రీతిలో అవగాహన చేసుకుంటారు.

4. ఆత్మ నిగ్రహం (Self Control) :
ఆత్మ నిగ్రహం అనేది మంచి పౌరుడి లక్షణాలలో ఒకటిగా భావించవచ్చు. మంచి పౌరుడు రాగ ద్వేషాలకు గురయ్యే స్వభావాన్ని కలిగి ఉండరాదు. ప్రజా వ్యవహారాలలో అతడు ఆత్మ నిగ్రహాన్ని ప్రదర్శించాలి. ఆత్మ నిగ్రహం, ఆత్మ విశ్వాసం అనేవి అతడిని క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని గడిపేందుకు దోహదపడతాయి. అట్లాగే మంచి పౌరుడనే వ్యక్తి అమానవీయ కార్యక్రమాలలో పాల్గొనరాదు.

5. ప్రజాస్ఫూర్తి (Public Spirit) :
మంచి పౌరుడు విశాలమైన, ఉదారమైన దృక్పథాలను కలిగి ఉండాలి. ప్రజా వ్యవహారాలలో అతడు క్రియాశీలక పాత్రను పోషించేందుకు సిద్ధంగా ఉండాలి. తన హక్కులు, బాధ్యతల వినియోగంలో తెలివితేటలతో వ్యవహరించాలి. అట్లాగే సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలి. ప్రజా సేవాభావాన్ని కలిగి ఉంటూ సమాజ సమిష్టి సంక్షేమానికి తన సేవలను అందించేందుకు సదా సంసిద్ధుడై ఉండాలి.

6. స్వార్థ పరిత్యాగం (Self-Sacrifice) :
మంచి పౌరుడు స్వార్థాన్ని పరిత్యజించాల్సి ఉంటుంది. అతడు తన స్వార్థ ప్రయోజనాలను సమాజ ప్రయోజనాల కోసం విస్మరించాలి. సేవాతత్పరతతో పాటుగా సమాజం, ప్రభుత్వం, రాజ్యం పట్ల అంకిత భావాలను కలిగి ఉండాలి.

7. నిజాయితీతో ఓటుహక్కు వినియోగం (Honest exercise of franchise) :
ఓటుహక్కును నిజాయితీతో వినియోగించడం అనేది మంచి పౌరుడి మరొక లక్షణంగా పేర్కొనవచ్చు. స్వార్థబుద్ధి, వర్గం, కులం, మతం వంటి అంశాలు ఈ సందర్భంలో మంచి పౌరసత్వానికి ప్రతిబంధకాలుగా ఉంటాయి.

8. బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించడం (Sincere Performance of Obligations) :
మంచి పౌరుడు తన బాధ్యతలను చిత్తశుద్ధితో, విశ్వాసపాత్రుడిగా నిర్వహిస్తాడు. ఈ విషయంలో అతడు సంబంధిత అధికారులకు తగిన సహకారాన్ని అందిస్తాడు. అట్లాగే వివిధ ప్రభుత్వ సంస్థలకు చెల్లించాల్సిన పన్నులను సకాలంలో సరియైన రీతిలో చెల్లిస్తాడు.

9. క్రమానుగత విధేయతలు (Right Ordering of Loyalties) :
మంచి పౌరుడు తన కుటుంబం, వర్గం, కులం, కార్మిక సంఘం, ప్రాంతం, జాతి పట్ల క్రమానుగత విధేయతలను చూపుతాడు. వివిధ సంస్థల పట్ల క్రమానుగత విధేయతలను చూపుతూ, వాటి మధ్య ఘర్షణలు తలెత్తకుండా చూస్తాడు.

విశాల ప్రయోజనాల కోసం స్వప్రయోజనాలను త్యాగం చేస్తాడు. తాను నివసించే కుటుంబం, ప్రాంతాల మధ్య ఘర్షణలు తలెత్తినచో, కుటుంబ ప్రయోజనాలను త్యాగం చేయాల్సి ఉంటుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 7 పౌరసత్వం

ప్రశ్న 3.
వివిధ రకాల పౌరసత్వాలను విశ్లేషించండి.
జవాబు.
పౌరసత్వాన్ని మూడు రకాలుగా పేర్కొనవచ్చు. అవి :

  • ఏక పౌరసత్వం,
  • ద్వంద్వ పౌరసత్వం,
  • విశ్వ పౌరసత్వం.

i) ఏక పౌరసత్వం (Single Citizenship) :
ఏక పౌరసత్వం అంటే రాజ్యంలో పౌరులు ఒకే రకమైన పౌరసత్వాన్ని కలిగి ఉండడంగా పేర్కొనవచ్చు. అట్లాగే ఒకే రకమైన హక్కులు, సౌకర్యాలు, రక్షణలు పౌరులకు ఏక పౌరసత్వ పద్ధతిలో ఉంటాయి. ఈ రకమైన పౌరసత్వం ఆధునిక ప్రపంచంలోని అనేక రాజ్యాలలో వాడుకలో ఉంది. ఉదాహరణకు భారత రాజ్యాంగం భారత పౌరుల జన్మస్థలం, నివాసం వంటి అంశాలతో సంబంధం లేకుండా ఏక పౌరసత్వాన్ని ప్రసాదించింది.

ii) ద్వంద్వ పౌరసత్వం (Double Citizenship) :
పౌరులకు రెండు రాజ్యాలలో పౌరసత్వం ఉండడాన్ని ద్వంద్వ పౌరసత్వంగా వ్యవహరిస్తారు. ఈ రకమైన పౌరసత్వం అనేక అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాలలో వాడుకలో ఉంది. ఉదాహరణకు అమెరికన్ పౌరులకు విదేశాలలో జన్మించిన పిల్లలకు రెండు రాజ్యాల్లోనూ పౌరసత్వం పొందే అవకాశం ఉంది. ఆ రెండింటిలో ఒకటి మాతృదేశ పౌరసత్వం కాగా రెండోది తాము జన్మించిన రాజ్య పౌరసత్వానికి సంబంధించినవై ఉంటాయి.

అయితే ద్వంద్వ పౌరసత్వం గల వ్యక్తులకు ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు ఉండవు. వారు రెండు రాజ్యాల చట్టాలకు విధేయులై ఉంటారు. ద్వంద్వ పౌరసత్వం అనేది యుక్తవయస్సు వచ్చే వరకు పిల్లలకు ఉంటుంది. ఆ తరువాత వారు రెండు రాజ్యాలలోని ఏదో ఒకదానిలో పౌరసత్వాన్ని ఎంపిక చేసుకొంటారు.

iii) విశ్వ పౌరసత్వం (Universal Citizenship) :
అంతర్జాతీయ, జాతీయ రాజకీయాలలో ఇటీవలి కాలంలో ఆవిష్కృతమైన భావనయే విశ్వ పౌరసత్వం. 1980, 1990 దశకాలలో సంభవించిన నాటకీయ పరిణామాలు విశ్వవ్యాప్తంగా శాస్త్ర, సాంకేతిక, కమ్యూనికేషన్లు వంటి రంగాలలో ఏర్పడిన పురోగతి మానవ జీవనాన్ని అద్భుతమైన రీతిలో మార్చివేసింది.

సామాన్యులలో అతి సామాన్యులు సైతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన వివిధ సాధనాలను వినియోగించుకొని సౌకర్యవంతమైన, సౌఖ్యప్రదమైన, ఆర్థిక ప్రయోజనాలను పొందగలిగారు. అట్లాగే సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ వల్ల కలిగే ఫలితాలు వారికి వరప్రదాయినిగా పరిగణించబడినాయి.

అభివృద్ధి చెందిన దేశాలతో పాటుగా తృతీయ ప్రపంచ దేశాలలోని ప్రభుత్వాలు రక్షణ రంగం నుంచి సామాన్య ప్రజల సంక్షేమం దిశగా తమ ప్రాధాన్యతలను నిర్ణయించుకొన్నాయి. వివిధ రంగాలకు చెందిన మేధావులు విదేశాలకు వెళ్ళి, అశేష ప్రయోజనాలను పొందే విషయంలో ఆసక్తిని ప్రదర్శించసాగారు.

ఈ ప్రక్రియలో భాగంగా వారు స్వదేశంతో పాటుగా, తాము పనిచేసే విదేశాలలో సైతం పౌరసత్వాన్ని పొందేందుకు ప్రయత్నించారు. ఇటువంటి సందర్భాలలో కొన్ని రాజ్యాలు ఇతర పౌరులకు తమ రాజ్య పౌరసత్వాన్ని ప్రసాదించే దిశగా అడుగులు వేశాయి. ఈ భావనే విశ్వ పౌరసత్వానికి ప్రాతిపదిక అయింది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 7 పౌరసత్వం

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
దేశీయీకరణ పౌరసత్వాన్ని ఎలా పొందుతారు ?
జవాబు.
సహజీకృత పౌరసత్వం (Naturalised Citizenship) :
సహజ పౌరసత్వం లేని వ్యక్తి సహజీకృత పద్ధతి ద్వారా రాజ్య పౌరసత్వాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతి ద్వారా విదేశీయులు కొన్ని షరతులకు లోబడి రాజ్య పౌరసత్వాన్ని పొందవచ్చు. అటువంటి షరతులు అన్ని రాజ్యాలలో ఒకే విధంగా ఉండవు. వాటిలో కొన్నింటిని కింద పేర్కొవడమైంది.

1. నివాసం (Residence) :
విదేశీయుడు తాను నివసిస్తున్న రాజ్యంలో పౌరసత్వాన్ని పొందేందుకు నిర్ణీత కాలం పాటు నివసించాలి. అతడు ఆ దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో తప్పనిసరిగా నివసించాల్సి ఉంటుంది. ఆ పరిమితి అన్ని రాజ్యాలలో ఒకే రకంగా లేదు. ఉదాహరణకు ఆ కాలపరిమితి బ్రిటన్, అమెరికాలలో 5 సంవత్సరాలు కాగా, ఫ్రాన్స్లో 10 సంవత్సరాలుగా నిర్ణయించడమైంది.

2. ఎంపిక (Choice) :
విదేశీ తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు యుక్తవయస్సు వచ్చిన తరువాత “తమ ఇష్టం వచ్చిన రాజ్య పౌరసత్వాన్ని ఎంపిక చేసుకొని పొందవచ్చు.

3. దరఖాస్తు (Application) :
విదేశీయుడు తాను కోరుకున్న రాజ్యంలో పౌరసత్వం పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ రాజ్యానికి చెందిన ప్రభుత్వం విధించే షరతులను సంతృప్తిపరచాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి పౌరసత్వం కోసం చేసుకున్న దరఖాస్తు యోగ్యతను రాజ్యం పరిశీలించి ఆమోదించినట్లయితే అతనికి పౌరసత్వం లభిస్తుంది.

నిర్దిష్ట కాలం పాటు నివాసం, సత్ప్రవర్తన, ఆర్థిక సామర్థ్యం, రాజ్యంలోని ఏదైనా ఒక జాతీయ భాషను అవగాహన చేసుకోవడం వంటి షరతులను ఆయా విదేశీయులు ఆమోదించాల్సి ఉంటుంది. పై వాటితో పాటుగా తాము పౌరసత్వం పొందగోరే రాజ్యానికి విధేయతను కలిగి ఉంటామనే లిఖితపూర్వక ప్రమాణం చేయడం ద్వారా విదేశీయులు పౌరసత్వాన్ని పొందగలుగుతారు.

4. స్థిరాస్తులు (Fixed Assets) :
భూమి, ఇళ్ళు వంటి స్థిరాస్తులను సంపాదించుకోవడం ద్వారా రాజ్య పౌరసత్వాన్ని విదేశీయులు పొందగలుగుతారు.

5. సేవలు (Services) (ప్రభుత్వ లేదా ప్రైవేటు) :
ప్రభుత్వం లేదా గుర్తింపు పొందిన ప్రైవేటు సంస్థలలో సేవలను అందించడం ద్వారా విదేశీయుడు పౌరసత్వాన్ని పొందవచ్చు. అధికారిక సంస్థలలో పనిచేసినప్పుడే ఈ నియమం వర్తిస్తుంది. విదేశీ పౌరుడు ప్రతిభావంతమైన సేవలను అందించడం ద్వారా తాను కోరుకున్న దేశం పౌరసత్వాన్ని పొందవచ్చు.

6. వివాహం (Marriage) :
వివాహం వల్ల పౌరసత్వం లభించవచ్చు. కొన్ని దేశాలలో అన్య దేశీయుని వివాహమాడిన స్త్రీ తన భర్త రాజ్యంలో పౌరసత్వం పొందవచ్చు. మరికొన్ని దేశాలలో పౌరులు విదేశ వనిత లేదా విదేశీ పురుషుడిని కానీ వివాహం చేసుకొంటే, వారికి భర్త లేదా భార్యకు చెందిన రాజ్య పౌరసత్వం లభిస్తుంది.

ఉదాహరణకు ఒక బ్రిటీష్ దేశస్థురాలు భారతీయుడిని వివాహమాడితే ఆమెకు భారతదేశ పౌరసత్వమివ్వడం జరుగుతుంది. విదేశస్తుడిని వివాహం చేసుకొన్నప్పటికీ జపాన్ దేశస్థురాలు తన స్వదేశీ పౌరసత్వాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా జపాన్ దేశస్తురాలిని వివాహమాడిన విదేశీయునికి కూడా జపాన్ పౌరసత్వం ఇవ్వబడుతుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 7 పౌరసత్వం

ప్రశ్న 2.
పౌరసత్వాన్ని ఎలా కోల్పోతారు ?
జవాబు.
స్వచ్ఛందంగా, తన ప్రమేయం లేకుండా అనే రెండు విధానాల్లో ఒక వ్యక్తి తన పౌరసత్వాన్ని కోల్పోతాడు. పౌరసత్వాన్ని నిలబెట్టుకోవడానికి చేయవలసిన చర్యలు తీసుకోలేనప్పుడు లేదా స్వచ్ఛంద దేశమే పౌరసత్వాన్ని తొలగించినపుడు ఒక వ్యక్తి తన పౌరసత్వాన్ని కోల్పోతాడు. దీనికి విరుద్ధమైనది పౌరుడే తన పౌరసత్వాన్ని త్యజించడం లేదా పరిత్యాగం చేయడం అన్నది పౌరుడే తన పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా కోల్పోవడం అనవచ్చు.

అన్ని సందర్భాల్లో ఈ రెండు విధానాల మధ్య బేధాన్ని (పౌరసత్వం కోల్పోయే విధానాల మధ్య) చూడటం సాధ్యం కాదు. ఉదా : ఇతర దేశాల సైనిక దళాలలో స్వచ్ఛందంగా సేవలు అందించడం లేదా ఇతర దేశాల పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా అంగీకరించడం మొదలైనవి స్వచ్ఛందంగా పౌరసత్వాన్ని కోల్పోవడం లేదా. తన ప్రమేయం లేకుండా కోల్పోవడంగా భావించవచ్చు.

తన ప్రమేయం లేకుండా పౌరసత్వాన్ని కోల్పోవడం అన్నది వెంటనే అమలులోకి వచ్చే అంశంగా భావించాల్సిన అవసరం లేదు. ఏ పరిస్థితుల్లో పౌరుడు పౌరసత్వాన్ని కోల్పోతాడో, ఆ పరిస్థితులు ఏర్పడినప్పటికి సంబంధిత దేశం అధికారులు పౌరసత్వం కోల్పోయినట్లుగా ప్రకటించనంతవరకు అతను ఆ దేశ పౌరుడుగానే భావిస్తారు.

క్రింది పరిస్థితులలో పౌరుడు తన పౌరసత్వాన్ని కోల్పోతాడు.
ఎ. పరిత్యాగం :
స్వంత పౌరసత్వాన్ని పరిత్యాగించి మరోదేశ పౌరసత్వాన్ని అంగీకరించడం ద్వారా ఒక వ్యక్తి తన పౌరసత్వాన్ని పరిత్యాగించవచ్చు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 7 పౌరసత్వం

బి. ఇతర దేశ పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా అంగీకరించడం.

సి. వివాహం :
మహిళ మరో దేశ పౌరున్ని వివాహం చేసుకున్నప్పుడు తన దేశ పౌరసత్వాన్ని కోల్పోతుంది. బ్రిటన్ మహిళలు మరోదేశ పౌరున్ని వివాహం చేసుకున్నప్పటికి బ్రిటన్ పౌరసత్వం కోల్పోకుండా ఉండేలా డిమాండ్ ఉంది. మైనర్ తల్లిదండ్రులు తమ పౌరసత్వాన్ని కోల్పోయినప్పుడు ఇతర దేశాల పౌరులు దత్తత తీసుకున్నప్పుడు, మాతృత్వం లేదా పితృత్వానికి సంబంధించి పిల్లలకు సంబంధించిన న్యాయ సంబంధాలలో మార్పు వచ్చినపుడు.

డి. ఇతర దేశాల సైనిక సేవలు, ఇతర దేశాల బిరుదులను అంగీకరించడం, ఇతర దేశాలకు సైనిక, ఇతర నిషేధిత సేవలందించినపుడు, ఇతర దేశాల బిరుదులను అంగీకరించినప్పుడు తమ పౌరులు పౌరసత్వాన్ని కొన్ని దేశాలు రద్దు చేస్తాయి.

ఇ. దీర్ఘకాలం దేశంలో నివసించక పోవడం :
దీర్ఘకాలం లేదా శాశ్వతంగా ఇతర దేశాలలో నివసించడం వల్ల కూడా కొన్ని దేశాలలో పౌరసత్వం కోల్పోవడం. ఉదా : ఫ్రాన్స్ మరియు జర్మనీకి చెందిన పౌరులు 10 సంవత్సరాలు అంతకంటే అధికంగా తమ దేశంలో నివసించకపోతే తమ పౌరసత్వాన్ని కోల్పోతాడు.

ఎఫ్. దేశద్రోహం లేదా తీవ్రనేరాలు:
రాజద్రోహం, దేశద్రోహం సంఘటనలలో పొల్గొన్నవారు తమ పౌరసత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది. తప్పుడు సమాచారం ఆధారంగా పౌరసత్వాన్ని పొందడం, తప్పుడు పద్ధతుల ద్వారా దేశీయీకరణ పొందడం.
ఉదా : మోసపూరిత వివాహ పద్ధతుల ద్వారా పౌరసత్వాన్ని పొందడం. ఇతర దేశాల పౌరసత్వాన్ని పొందే సమయంలో తమదేశ పౌరసత్వాన్ని వదులుకోకపోవడం.

దేశంలోని నిబంధనలు పాటించకపోవడం
ఉదా : జపాన్ పౌరులకు గల అదనపు పౌరసత్వాన్ని వారికి 22 సంవత్సరాల వయస్సు వచ్చేలోపు వదలుకోకపోతే వారు తమ పౌరసత్వాన్ని కోల్పోతారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 7 పౌరసత్వం

ప్రశ్న 3.
దేశీయీకరణ పౌరసత్వానికి సంబంధించిన మూడు పద్ధతులను తెలపండి.
జవాబు.
1. నివాసం (Residence):
విదేశీయుడు తాను నివసిస్తున్న రాజ్యంలో పౌరసత్వాన్ని పొందేందుకు నిర్ణీత కాలం పాటు నివసించాలి. అతడు ఆ దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో తప్పనిసరిగా నివసించాల్సి ఉంటుంది. ఆ పరిమితి అన్ని రాజ్యాలలో ఒకే రకంగా లేదు. ఉదాహరణకు ఆ కాలపరిమితి బ్రిటన్, అమెరికాలలో 5 సంవత్సరాలు కాగా, ఫ్రాన్స్లో 10 సంవత్సరాలుగా నిర్ణయించడమైంది.

2. ఎంపిక (Choice) :
విదేశీ తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు యుక్తవయస్సు వచ్చిన తరువాత తమకు ఇష్టం వచ్చిన రాజ్య పౌరసత్వాన్ని ఎంపిక చేసుకొని పొందవచ్చు.

3. దరఖాస్తు (Application) :
విదేశీయుడు తాను కోరుకున్న రాజ్యంలో పౌరసత్వం పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ రాజ్యానికి చెందిన ప్రభుత్వం విధించే షరతులను సంతృప్తిపరచాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి పౌరసత్వం కోసం చేసుకున్న దరఖాస్తు యోగ్యతను రాజ్యం పరిశీలించి ఆమోదించినట్లయితే అతనికి పౌరసత్వం లభిస్తుంది.

నిర్దిష్ట కాలం పాటు నివాసం, సత్ప్రవర్తన, ఆర్థిక సామర్థ్యం, రాజ్యంలోని ఏదైనా ఒక జాతీయ భాషను అవగాహన చేసుకోవడం వంటి షరతులను ఆయా విదేశీయులు ఆమోదించాల్సి ఉంటుంది. పై వాటితో పాటుగా తాము పౌరసత్వం పొందగోరే రాజ్యానికి విధేయతను కలిగి ఉంటామనే లిఖితపూర్వక ప్రమాణం చేయడం ద్వారా విదేశీయులు పౌరసత్వాన్ని పొందగలుగుతారు.

ప్రశ్న 4.
ప్రపంచ లేదా విశ్వజనీన పౌరసత్వం.
జవాబు.
విశ్వ పౌరసత్వం (Universal Citizenship) :
అంతర్జాతీయ, జాతీయ రాజకీయాలలో ఇటీవలి కాలంలో ఆవిష్కృతమైన భావనయే విశ్వ పౌరసత్వం. 1980, 1990 దశకాలలో సంభవించిన నాటకీయ పరిణామాలు విశ్వవ్యాప్తంగా శాస్త్ర, సాంకేతిక, కమ్యూనికేషన్లు వంటి రంగాలలో ఏర్పడిన పురోగతి మానవ జీవనాన్ని అద్భుతమైన రీతిలో మార్చివేసింది.

సామాన్యులలో అతి సామాన్యులు సైతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన వివిధ సాధనాలను వినియోగించుకొని సౌకర్యవంతమైన, సౌఖ్యప్రదమైన, ఆర్థిక ప్రయోజనాలను పొందగలిగారు. అట్లాగే సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ వల్ల కలిగే ఫలితాలు వారికి వరప్రదాయినిగా పరిగణించబడినాయి.

అభివృద్ధి చెందిన దేశాలతో పాటుగా తృతీయ ప్రపంచ దేశాలలోని ప్రభుత్వాలు రక్షణ రంగం నుంచి సామాన్య ప్రజల సంక్షేమం దిశగా తమ ప్రాధాన్యతలను నిర్ణయించుకొన్నాయి. వివిధ రంగాలకు చెందిన మేధావులు విదేశాలకు వెళ్ళి, అశేష ప్రయోజనాలను పొందే విషయంలో ఆసక్తిని ప్రదర్శించసాగారు.

ఈ ప్రక్రియలో భాగంగా వారు స్వదేశంతో పాటుగా, తాము పనిచేసే విదేశాలలో సైతం పౌరసత్వాన్ని పొందేందుకు ప్రయత్నించారు. ఇటువంటి సందర్భాలలో కొన్ని రాజ్యాలు ఇతర పౌరులకు తమ రాజ్య పౌరసత్వాన్ని ప్రసాదించే దిశగా అడుగులు వేశాయి. ఈ భావనే విశ్వ పౌరసత్వానికి ప్రాతిపదిక అయింది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 7 పౌరసత్వం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
పౌరసత్వాన్ని నిర్వచించండి.
జవాబు.

  1. అరిస్టాటిల్ : “రాజ్య వ్యవహారాలలో ప్రత్యక్షంగా, చురుకైన పాత్ర కలిగిన వ్యక్తియే పౌరుడు”.
  2. ప్రొఫెసర్ లాస్కీ : “ప్రజాహితానికి వ్యక్తులు అందించే నిర్ణాయక సేవయే పౌరసత్వం”.
  3. టి.హెచ్. మార్షల్ : “రాజకీయ సమాజంలో సంపూర్ణ సభ్యులుగా ఉండేవారికి కల్పించే హోదాయే పౌరసత్వం. అటువంటి హోదాగల వ్యక్తులు హక్కులు, బాధ్యతల విషయంలో సమాన హోదాను కలిగి ఉంటారు”.

ప్రశ్న 2.
(జస్ సాంగ్వినీస్) తల్లిదండ్రుల ఆధారంగా పౌరసత్వం.
జవాబు.
‘జస్ సాంగ్వినీస్’ అంటే ‘బంధుత్వం’ లేదా ‘రక్తసంబంధం’ అని అర్థం. బంధుత్వం లేదా రక్తసంబంధం ద్వారా పౌరసత్వం సంక్రమిస్తుందని జస్ సాంగ్వినీస్ భావం. ఈ పద్దతి ప్రకారం ఒక శిశువు తాను జన్మించిన ప్రదేశంతో సంబంధం లేకుండానే తన తల్లిదండ్రుల పౌరసత్వాన్ని పొందుతుంది.

ప్రశ్న 3.
ప్రదేశ ఆధార ఫౌరసత్వం.
జవాబు.
జస్ సోలి అంటే భూమి లేదా జన్మస్థలం అని అర్థం. భూమి లేదా పుట్టిన ప్రదేశం ప్రాతిపదికగా పౌరసత్వం సంక్రమించే పద్ధతినే జస్ సోలి అని అంటారు. ఈ పద్ధతి ప్రకారం శిశువుకు తన తల్లిదండ్రులను బట్టి కాకుండా, పుట్టిన ప్రదేశం ప్రాతిపదికగా పౌరసత్వం లభిస్తుంది. ప్రస్తుతం ఈ పద్ధతి అర్జంటీనాలో అమలులో ఉన్నది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 7 పౌరసత్వం

ప్రశ్న 4.
పౌరసత్వం కోల్పోయే పరిస్థితులను తెలపండి.
జవాబు.
క్రింది పరిస్థితులలో పౌరుడు తన పౌరసత్వాన్ని కోల్పోతాడు.

  1. పరిత్యాగం
  2. ఇతరదేశ పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా అంగీకరించడం
  3. వివాహం
  4. దీర్ఘకాలం దేశంలో నివసించకపోవడం
  5. దేశద్రోహం లేదా తీవ్రనేరాలు
  6. సైన్యం నుంచి పారిపోవడం
  7. విదేశాలలో ఉద్యోగం
  8. విదేశీ బిరుదుల స్వీకారం.

ప్రశ్న 5.
ద్వంద్వ పౌరసత్వం అంటే ఏమిటి ?
జవాబు.
ద్వంద్వ పౌరసత్వం (Double Citizenship) :
పౌరులకు రెండు రాజ్యాలలో పౌరసత్వం ఉండడాన్ని ద్వంద్వ పౌరసత్వంగా వ్యవహరిస్తారు. ఈ రకమైన పౌరసత్వం అనేక అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాలలో వాడుకలో ఉంది. ఉదాహరణకు అమెరికన్ పౌరులకు విదేశాలలో జన్మించిన పిల్లలకు రెండు రాజ్యాల్లోనూ పౌరసత్వం పొందే అవకాశం ఉంది. ఆ రెండింటిలో ఒకటి మాతృదేశ పౌరసత్వం కాగా రెండోది తాము జన్మించిన రాజ్య పౌరసత్వానికి సంబంధించినవై ఉంటాయి.

అయితే ద్వంద్వ పౌరసత్వం గల వ్యక్తులకు ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు ఉండవు. వారు రెండు రాజ్యాల చట్టాలకు విధేయులై ఉంటారు. ద్వంద్వ పౌరసత్వం అనేది యుక్తవయస్సు వచ్చే వరకు పిల్లలకు ఉంటుంది. ఆ తరువాత వారు రెండు రాజ్యాలలోని ఏదో ఒకదానిలో పౌరసత్వాన్ని ఎంపిక చేసుకొంటారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 7 పౌరసత్వం

ప్రశ్న 6.
ఉత్తమ పౌరుని రెండు లక్షణాలను తెలపండి.
జవాబు.
1. మంచి ప్రవర్తన (Good Character) :
మంచి పౌరుడు మంచి ప్రవర్తనను కలిగి ఉండాలి. అతడు. ధైర్యం, న్యాయ సహాయధోరణి, ఉదార స్వభావం, సానుభూతి, సత్యభాషణ, నిజాయితీ వంటి గుణాలను త్రికరణ శుద్ధిగా కలిగి ఉండాలి.

2. సంపూర్ణ ఆరోగ్యం (Sound Health) :
మంచి పౌరుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని, శక్తిని కలిగి ఉండాలి. ఆరోగ్యవంతులైన పౌరులే ఆరోగ్యకరమైన జాతిని నిర్మిస్తారు. ఎందుకంటే మంచి ఆలోచనలు గల వ్యక్తులే మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. అటువంటి పౌరులు అనేక రంగాలలో రాజ్య ప్రగతికి దోహదపడతారు.

TS Inter 1st Year Political Science Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 1st Lesson రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి Textbook Questions and Answers.

TS Inter 1st Year Political Science Study Material 1st Lesson రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
రాజనీతిశాస్త్రాన్ని నిర్వచించి దాని పరిధిని వివరించండి.
జవాబు.
పరిచయం : సాంఘిక శాస్త్రాలలో రాజనీతి శాస్త్రము ప్రధానమైనది. ప్రాచీన గ్రీకునగర రాజ్యాలైన ఏథెన్స్, స్పార్టా, గ్రీస్, రోమ్లలో క్రీ.పూ. 4వ శాతబ్దంలో ప్రారంభమైంది. ప్రముఖ గ్రీకు రాజనీతి వేత్తలైన సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ రాజనీతిని తత్వశాస్త్రము నుండి వేరు చేసి ప్రత్యేక అధ్యయన శాస్త్రముగా అభివృద్ధిచేసిరి.

అరిస్టాటిల్ రాజనీతి శాస్త్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాడు. అందువలన ఇతను రాజనీతిశాస్త్ర పితామహుడుగా కీర్తింపబడినాడు. అరిస్టాటిల్ తన ప్రఖ్యాత గ్రంథమైన ‘పాలిటిక్స్’ లో రాజ్యము, ప్రభుత్వము గురించి అధ్యయనము చేసే శాస్త్రము రాజనీతి శాస్త్రమని పేర్కొనినాడు.

పదపరిణామము :
రాజకీయాలు (Politics) అనే పదం గ్రీకు పదమైన పోలిస్ (Polis) అనే పదం నుంచి గ్రహించబడింది. పోలిస్ అంటే నగర రాజ్యం (City – State) అని అర్థం. పాలిటి (Polity) అనే పదం గ్రీకు పదమైన పొలిటియా (Poletieia) అనే గ్రీకు పదం నుంచి గ్రహించబడింది. ‘పాలిటి’ అంటే ప్రభుత్వం – లేదా రాజ్యాంగం అని అర్థం.

రాజనీతిశాస్త్రం – నిర్వచనాలు :
జె.డబ్ల్యు. గార్నర్: “రాజనీతిశాస్త్రానికి ఆది అంతాలు రాజ్యమే” అని నిర్వచించారు.
ఆర్.జి. గెటిల్ : “గతకాలపు రాజ్యం యొక్క చారిత్రక వివరణ, వర్తమాన రాజ్యపు విశ్లేషణాత్మక వర్ణన భవిష్యత్లో రాజ్యం ఎలా ఉంటుందనే రాజకీయ చింతన చేసేదే రాజనీతిశాస్త్రం”.
రాబర్ట్ థాల్ : “అధికారాన్ని, శక్తిని, వాటి ప్రభావాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసేదే రాజనీతిశాస్త్రం” నిర్వచించాడు.
డేవిడ్ ఈస్టన్ : “అధికారంతో కూడిన వివిధ చర్యల, పద్ధతుల ద్వారా సమాజానికి మార్గ నిర్దేశం చేసే నియంత్రణా విధానాలను తెలియజేసేదే రాజనీతిశాస్త్రం”గా నిర్వచించినాడు.

రాజనీతిశాస్త్రం-పరిధి :
రాజనీతిశాస్త్రం సైద్ధాంతిక, అనుభవపూర్వక అంశాలకు చెందిన మానవుల రాజకీయ జీవితాన్ని వర్ణించే పరిధిని కలిగి ఉంటుందని చెప్పవచ్చు. రాజకీయ సంస్థల విధుల నిర్వహణకు, రాజకీయ ప్రక్రియలకు సంబంధించి రాజకీయ సమాజాలలో ఏమి జరుగుతుందో ఈ శాస్త్రం వివరిస్తుంది. ఈ కారణంవల్ల రాజనీతిశాస్త్ర పరిధి సమగ్రమైనదిగాను, ఇతర సాంఘికశాస్త్రాలతో అంతర్విభాగీయ సంబంధాలను కలిగి ఉండే శాస్త్రంగాను వివరించబడింది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

రాజనీతిశాస్త్ర పరిధిని అంశాల వారీగా కింది విధంగా చెప్పవచ్చు.

i) వ్యక్తికి సమాజం, రాజ్యం, ప్రభుత్వానికి గల సంబంధం :
రాజనీతిశాస్త్రం ప్రాథమికంగా వ్యక్తికి, సమాజం, రాజ్యం ప్రభుత్వం వంటి వ్యవస్థలకు గల సంబంధాన్ని వివరిస్తుంది. ఈ సందర్భంగా అరిస్టాటిల్ మాటలు ఉటంకించడం సముచితం. ఆయన “మానవుడు సంఘజీవి అదే విధంగా రాజకీయ జీవి కూడా” అని అభివర్ణించాడు.

ii) రాజ్యాన్ని అధ్యయనం చేసే శాస్త్రం :
రాజనీతిశాస్త్రం రాజ్యం పుట్టుక, పరిణామక్రమం, దాని ఆవశ్యకత, పౌరుడికి రాజ్యానికి గల సంబంధాలను గురించి వివరిస్తుంది. అదే విధంగా రాజ్య అవతరణకు సంబంధించిన పలు సిద్ధాంతాలను కూడా తెలియజేస్తుంది. వీటితోపాటు రాజ్య స్వభావం దాని విధుల నిర్వహణను సైతం వివరిస్తుంది.

iii) ప్రభుత్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రం :
రాజనీతిశాస్త్ర పరిధిలో ప్రభుత్వానికి సంబంధించిన అధ్యయనం కూడా ఉంటుంది. ఈ శాస్త్రం రాజ్యానికి ప్రభుత్వానికి గల సంబంధం, రాజ్యం యొక్క ఆశయాలను, లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి ప్రభుత్వం ఏ విధంగా తోడ్పడుతుందో వివరిస్తుంది. అదే విధంగా పలు రకాల ప్రభుత్వ నిర్మాణ రూపాలను వాటి ప్రయోజనాలను, లోపాలను గురించి కూడా వివరిస్తుంది.

iv) సంఘాలను, సంస్థలను అధ్యయనం చేసే శాస్త్రం :
వ్యక్తుల రాజకీయ జీవితాన్ని రాజకీయ సమాజంలోని పలు సంఘాలు, సంస్థలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయో రాజనీతిశాస్త్రం అధ్యయనం చేస్తుంది. రాజ్యానికి, పలు సంఘాలకు, సంస్థలకు గల సంబంధాన్ని వివరిస్తుంది.

ఆయా సంస్థల నిర్మాణం, స్వభావాలు, విధులు, అవి చేపట్టే చర్యలను సైతం రాజనీతిశాస్త్రం తెలియజేస్తుంది. అదే విధంగా రాజకీయ ప్రక్రియలో వివిధ స్వచ్ఛంద సంస్థల పాత్రను కూడా రాజనీతిశాస్త్రం వివరిస్తుంది.

v) హక్కులు, విధుల అధ్యయం :
రాజకీయ సమాజంలోని పౌరుల హక్కులను, విధులను గురించి తెలియజేస్తుంది. ఇటీవలి కాలంలో మానవ హక్కులు, పౌరహక్కులకు సంబంధించిన అనేక అంశాలను రాజనీతిశాస్త్రం సమగ్రంగా విశ్లేషించడం జరుగుతోంది.

vi) జాతీయ – అంతర్జాతీయ పరమైన సమస్యల అధ్యయనం :
రాజనీతిశాస్త్ర పరిధి జాతీయ, అంతర్జాతీయ సమస్యలను వివరించేదిగా ఉంది. జాతీయరాజ్యాలు, భౌగోళిక సమైక్యత, సార్వభౌమాధికారం మొదలైన అంశాలు ఈ శాస్త్ర పరిధిలోకి వస్తాయి. అంతేకాదు ఆయుధీకరణ, నిరాయుధీకరణ, సమతౌల్య ప్రాబల్యం, మిలిటరీ – రక్షణ వ్యవహారాలను సైతం రాజనీతిశాస్త్రం వివరిస్తుంది.

vii) తులనాత్మక రాజకీయాలను అధ్యయనం చేసే శాస్త్రం :
రాజనీతిశాస్త్రం, ప్రపంచంలోని పలు రకాల ప్రభుత్వాలను వాటి నిర్మాణాలను అవి నిర్వహించే విధులను తులనాత్మకంగా వివరిస్తుంది. ప్రపంచంలోని సమకాలీన రాజకీయ వ్యవస్థలను తులనాత్మకంగా విశ్లేషిస్తుంది.

viii) ఆధునిక రాజనీతి విశ్లేషణ అధ్యయనం :
20వ శతాబ్దపు రాజనీతిశాస్త్రం అధికార నిర్మాణం, దాని పంపిణీకి సంబంధించి వివరించే శాస్త్రంగా పరిగణించబడింది. అదే విధంగా ఆధునిక రాజకీయ వ్యవస్థల విశ్లేషణ కోసం ఆయా వ్యవస్థల్లోని రాజకీయ సామాజికీకరణ, రాజకీయ భాగస్వామ్యం, రాజకీయాభివృద్ధి, రాజకీయ సంస్కృతి, రాజకీయ ప్రసరణ వంటి నూతన భావాలను రాజనీతిశాస్త్రం వివరిస్తుంది.

ix) ప్రభుత్వ విధానాల అధ్యయనం :
ఆధునిక రాజనీతిశాస్త్రవేత్తలైన డేవిడ్ ఈస్టర్, గాబ్రియల్, ఎ. ఆల్మండ్ చార్లెస్ మెరియమ్ వంటి వారు ఆధునిక రాజనీతిశాస్త్రం విధానాల అధ్యయనం శాస్త్రంగా రూపాంతరం చెందిందని పేర్కొన్నారు. వారి అభిప్రాయంలో రాజ్యం రూపొందించే సంక్షేమ పథకాలు, చేపట్టే అభివృద్ధి చర్యలను అధ్యయనం చేయడమే. ప్రాథమిక విధిగా రాజనీతిశాస్త్రజ్ఞులు భావించాలన్నారు.

ప్రభుత్వం పథకాలను రూపొందించే సందర్భంగా రాజకీయ పార్టీలు, ప్రభావ వర్గాలు ప్రసార – ప్రచార మాధ్యమాలు ఎటువంటి ప్రభావిత పాత్రలను పోషిస్తున్నాయో రాజనీతిశాస్త్రం వివరిస్తుంది. ఈ నేపథ్యంలో జాతీయాభివృద్ధి కోసం ప్రవేశపెట్టే విధానాలను, ఉదాహరణకు, జాతీయ వ్యవసాయ విధానం పారిశ్రామిక విధానం, పర్యావరణ విధానం, రిజర్వేషన్ విధానం, విద్యావిధానం వంటి జాతీయ ప్రతిష్ఠను నిలబెట్టే విధానాలను కూడా రాజనీతిశాస్త్రం అధ్యయనం చేస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

ప్రశ్న 2.
రాజనీతిశాస్త్ర ప్రాముఖ్యతను గురించి తెలియజేయండి.
జవాబు.
రాజనీతిశాస్త్రం రాజకీయ వ్యవస్థల్లో చోటుచేసుకుంటున్న మార్పులను అధ్యయనం చేయడమేకాకుండా రాజకీయపరమైన సమస్యల పరిష్కారానికి కూడా తగిన సలహాలు, సూచనలు అందిస్తుంది. అంతేకాకుండా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం, బాధ్యతాయుత ప్రభుత్వంగా వ్యవహరించడం, ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యతనివ్వడం వంటి విషయాలను పేర్కొనడం ద్వారా రాజనీతిశాస్త్ర ప్రాముఖ్యత పెరుగుతూ ఉంది.

1. రాజనీతిశాస్త్రం సిద్ధాంతాలను – భావనలను వివరిస్తుంది.
రాజనీతిశాస్త్రం వ్యక్తికి – రాజ్యానికి, సమాజానికి మధ్యగల సంబంధాన్ని వివరిస్తుంది. వ్యక్తుల స్వేచ్ఛా – సమానత్వాల ప్రాముఖ్యతను తెలియజేయడమే కాకుండా అనేక సిద్ధాంతాలను రాజనైతిక భావాలను వివరించడం ద్వారా సమాజాన్ని ప్రగతిశీల సమాజంగా మారుస్తుంది.

2. రాజనీతిశాస్త్రం ప్రభుత్వ రూపాలను, ప్రభుత్వ అంగాలను గురించి వివరిస్తుంది.
రాజనీతి శాస్త్రం ప్రభుత్వ వ్యవస్థలకు సంబంధించిన జ్ఞానాన్ని అందిస్తుంది. ఉదాహరణకు రాజరికం, కులీనపాలన, ప్రజాస్వామ్యం, నియంతృత్వం, ఇతర ప్రభుత్వ రూపాలను గురించి అవగాహనకు ఈ శాస్త్రం కల్పిస్తుంది. అదే విధంగా ఆధునిక ప్రభుత్వాలు కలిగి ఉండే శాసన నిర్మాణ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖల రూపంలో గల అంగాలను, వాటి ప్రాధాన్యతలను, వాటి మధ్యగల సంబంధాలను – భేదాలను తెలియజేయడం ద్వారా శాస్త్ర ప్రాధాన్యత పెరిగింది.

3. రాజనీతిశాస్త్రం హక్కులను – విధులను గురించి వివరిస్తుంది.
రాజకీయ సమాజంలో పౌరులు ఉత్తమ జీవనాన్ని పొందడానికి కావలసిన హక్కులను వారు నిర్వహించాల్సిన విధులను రాజనీతిశాస్త్రం వివరిస్తుంది. అదే విధంగా రాజ్యం పౌరులకు ఎటువంటి హక్కులను కల్పించాలి. ప్రజాభిమతానికి ఏ విధమైన ప్రాధాన్యతలనివ్వాలి అనే విషయం పౌరులకు స్పష్టంగా తెలుస్తుంది.

4. రాజనీతిశాస్త్రం రాజనీతి తత్వవేత్తల భావాలకు సంబంధించిన జ్ఞానాన్ని అందిస్తుంది.
ఆయా కాలాల్లో, పలు సందర్భాల్లో తత్వవేత్తల భావాలు ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయో రాజనీతిశాస్త్రం వివరిస్తుంది. రూసో, వాల్టేరు వంటి వారి తాత్విక భావాలు ఫ్రెంచి విప్లవం సంభవించడానికి ఏ విధంగా దోహదపడ్డాయో ఈ శాస్త్రం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం.

అదే విధంగా కారల్ మార్క్స్ భావాలు రష్యాలో లెనిన్ నాయకత్వంలో విప్లవం సంభవించడానికి మావో నాయకత్వంలో చైనాలో విప్లవం రావడానికి ఏ విధంగా దోహదపడ్డాయో కూడా రాజనీతిశాస్త్రాన్ని అధ్యయనం చేయడంవల్ల మనం తెలుసుకోవచ్చు.

అంతేకాదు మన భారతదేశంలో ‘ప్రజలను శాంతియుతంగా స్వాతంత్ర్యోద్యమంలో భాగస్వాములను చేయడంలో మహాత్మాగాంధీ సిద్ధాంత సూత్రాలు ఏ విధంగా ప్రభావిత పరిచాయో మన గమనంలోనే ఉన్నాయి. ఈ విధంగా రాజనీతిశాస్త్రం రాజనీతి తత్వవేత్తల గురించి సంపూర్ణమైన అవగాహన కల్పిస్తుంది.

5. రాజనీతిశాస్త్రం అంతర్జాతీయ సంబంధాలను తెలియజేస్తుంది.
అంతర్జాతీయంగా సార్వభౌమాధికార రాజ్యాలు ప్రపంచ రాజకీయ వ్యవస్థలో ఎటువంటి భాగస్వామ్యాన్ని కలిగి ఉంటాయో రాజనీతిశాస్త్రం వివరిస్తుంది. ప్రపంచ రాజ్యాల మధ్య పలురకాల సంబంధాలను గురించి ఈ శాస్త్రం తెలియజేస్తుంది. ఆధునిక కాలంలో పారిశ్రామిక విప్లవం సంభవించడంతో ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి దోహదపడిన అంశాలను రాజనీతిశాస్త్రం విశ్లేషిస్తుంది.

శాస్త్ర సాంకేతిక అభివృద్ధి, రోడ్డు రవాణా సౌకర్యాల ఏర్పాటు, ప్రాంతీయ కూటముల ఏర్పాటువల్ల సరిహద్దు రాజ్యాల మధ్య సంబంధాలు మెరుగుపడి అంతర్జాతీయంగా పలు రాజ్యాలు ప్రాధాన్యతను పొందాయి. రాజనీతిశాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఇటువంటి అనేక విషయాలు మనం తెలుసుకోవచ్చు.

6. రాజనీతిశాస్త్రం ప్రపంచ సంస్థలను గురించి వివరిస్తుంది.
రాజనీతిశాస్త్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యత కలిగి ఉన్న సంస్థలకు సంబంధించి అవగాహనను కల్పిస్తుంది. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్న దాని అనుబంధ సంస్థలు, అవి నిర్వహించే కార్యకలాపాలను గురించి అవగాహన రాజనీతిశాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా కలుగుతుంది.

7. రాజనీతిశాస్త్ర అధ్యయన పద్ధతులు.
రాజనీతిశాస్త్రాన్ని అవగాహన చేసుకోవడానికి పలురకాల పద్ధతులున్నాయి. వీటిని ఇతర సాంఘిక శాస్త్రాలలో సైతం పాటించడం జరుగుతుంది. ఈ అధ్యయన పద్ధతులు ముఖ్యంగా చారిత్రక పద్ధతి, పరిశీలనా పద్ధతి, తులనాత్మక పద్ధతి, అనుభవవాద పద్ధతి, తాత్విక పద్ధతి, శాస్త్రీయ పద్ధతి. ఈ పద్ధతులన్నింటిని అవగాహన చేసుకోవడం ద్వారా రాజనీతిశాస్త్ర విశ్లేషణను సంపూర్ణంగా మనం తెలుసుకోవచ్చు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

ప్రశ్న 3.
రాజనీతిశాస్త్రానికి చరిత్ర, అర్థశాస్త్రానికి గల సంబంధాలను తెలపండి.
జవాబు.
రాజనీతిశాస్త్రం – చరిత్ర :
చరిత్ర గతాన్ని వివరిస్తుంది. మానవుడు, సమాజం ఏ విధంగా అభివృద్ధి చెందాయో తెలుసుకోవాలంటే చరిత్ర అధ్యయనం అవసరం. చరిత్ర మానవ అనుభవాల నిధి. మానవగాథ సాంఘికశాస్త్రాలకు ప్రయోగశాలవంటిది. మానవజాతికి సంబంధించిన రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, మత, సాహిత్యరంగాల గురించి చరిత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు.

తొలిమానవుడి నుంచి నేటి వరకూ ఏర్పడ్డ విభిన్న సంస్థల వర్ణనే చరిత్ర. గతకాలంలోని రాజ్యాభివృద్ధిని, నాగరికతను, సంస్కృతిని, మతసిద్ధాంతాలను, ఆర్థిక విషయాలను చరిత్ర నేటి సమాజానికి అందించింది. చారిత్రక సంఘటనలు, ఉద్యమాలు, వాటి కారణాలు, వాటి మధ్యగల అంతర్ సంబంధాలు లిఖితపత్రమే చరిత్ర.

చరిత్ర రాజకీయాల అధ్యయనానికి అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. గతంలో రాజకీయభావాలు, సంస్థలు ఏ విధంగా రూపొందాయో, రాజ్యం ఎట్లా ఆవిర్భవించి అభివృద్ధి చెందిందో తెలుసుకోవడానికీ, సిద్ధాంతీకరించడానికీ చరిత్ర అవసరమైన మౌలిక సమాచారాన్ని సమకూరుస్తుంది. రాజనీతిశాస్త్రానికీ చరిత్రకూ ఉన్న అవినాభావ సంబంధాన్ని ప్రముఖ రాజనీతి శాస్త్రజ్ఞుడు ‘జె.ఆర్.సీలీ’ వివరిస్తూ “రాజనీతిశాస్త్రంలేని చరిత్ర ఫలరహితం, చరిత్రలేని రాజనీతిశాస్త్రం మూలరహితం” అన్నాడు.

రాజకీయ వ్యవస్థలు ప్రాచీనకాలం నుంచి నేటివరకు వివిధ దశలుగా అభివృద్ధి చెందుతున్నాయి. చరిత్ర వివిధ వ్యవస్థల క్రమపరిణామాలను విశదీకరిస్తుంది. రాజనీతిశాస్త్రానికి చరిత్ర పునాది వంటిది. గత రాజకీయ చరిత్రను వర్తమానంతో పోలిస్తే భవిష్యత్తులో పటిష్టవంతమైన ఆదర్శ రాజకీయ వ్యవస్థలు స్థాపించడానికి సాధ్యమవుతుంది. భారత జాతీయ కాంగ్రెస్, ముస్లిమీగ్ ద్విజాతి సిద్ధాంతం, ఫ్రెంచి విప్లవం, రష్యావిప్లవం మొదలైన వాటిని అర్థం చేసుకోవడానికీ, వాటి ప్రభావాన్ని అంచనా వేయడానికీ రాజకీయ పరిజ్ఞానం చాలా అవసరం.

ప్రాచీన యూరప్ చరిత్ర పరిజ్ఞానం ఉన్నప్పుడే ప్లేటో, అరిస్టాటిల్ వంటి తత్త్వవేత్తల భావాలను అధ్యయనం చేయడం సాధ్యమవుతుంది. చారిత్రక సమాచారం ఆధారంగానే మాకియవెల్లి, మాంటెస్క్యూ, లార్డ్ బ్రైస్ వంటి రాజనీతి శాస్త్రజ్ఞులు విభిన్న రాజకీయ సిద్దాంతాలను ప్రతిపాదించారు.

‘రాబ్సన్’ అభిప్రాయపడ్డట్లు ఒక విద్యార్థి తన దేశ రాజ్యాంగాన్ని, విదేశాంగ విధానాన్ని అధ్యయనం చేయాలంటే తన జాతి చారిత్రక క్రమం తెలుసుకోవలసి ఉంటుంది. రాజనీతిశాస్త్ర అభివృద్ధికి చరిత్ర ఎంత అవసరమో రాజనీతిశాస్త్ర పరిజ్ఞానం కూడా చరిత్ర అభివృద్ధికి అంతే అవసరం. చరిత్ర, రాజనీతి శాస్త్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించినప్పుడే నాగరిక సమాజాభివృద్ధికి అవి తోడ్పడతాయి.

చరిత్ర నిర్ధిష్టమైన ఇతివృత్తాలను గురించి చర్చిస్తే, రాజనీతిశాస్త్రం రాజ్యాధికారం, ప్రభుత్వ విధానాలు, రాజ్యాంగాల వర్గీకరణ, వివిధ రాజకీయ పార్టీలు మొదలైనవాటిని గురించి చర్చిస్తుంది. రాజనీతిశాస్త్ర అధ్యయనం, భూత, వర్తమాన పరిణామాలను విశ్లేషించడమే కాకుండా భవిష్యత్తు గురించి ఊహాగానం చేస్తుంది.

రాజనీతిశాస్త్రం – అర్థశాస్త్రం :
అర్థశాస్త్రం సంపద, ఉత్పత్తి పంపిణీ, వస్తు వినిమయం గురించి అధ్యయనం చేస్తుంది. సంపదను ఎట్లా సమకూర్చుకోవాలో అర్థశాస్త్రం చర్చిస్తుంది. సంపద, ఉత్పత్తి, పంపిణీ విషయాలకు సంబంధించిన సామాజిక అధ్యయనమే అర్థశాస్త్రం. సామాజిక వ్యవస్థలు, రాజనీతి సిద్ధాంతాలు మానవజీవితాన్ని క్రమబద్ధం చేయడానికి తోడ్పడుతుంది. మానవుడు ఆదర్శ పౌరుడుగా నియమనిబంధనలతో బతకడానికి స్పష్టమైన రాజకీయ వ్యవస్థ చాలా అవసరం. కాబట్టి అది మానవశ్రేయస్సును అనేక విధాలుగా అభివృద్ధిపర్చడానికి అర్థశాస్త్రం ఉపకరిస్తుంది.

అపరిమితమైన కోరికలను పరిమిత వనరులతో తీర్చుకునే మార్గాలను సమన్వయం చేయడానికి అర్థశాస్త్రం ప్రయత్నిస్తుంది. ఆర్థికావసరాలు తీరని సమాజంలో అశాంతి, అసంతృప్తి ఏర్పడతాయి. ప్రాథమిక అవసరాలైన తిండి, బట్ట, గృహవసతి, విద్య, వైద్యం మొదలైనవి లోపిస్తే మానవజీవితం దుఃఖమయమవుతుంది. కనీసావసరాలు తీరనప్పుడు వ్యక్తి తన మనుగడకోసమే తన శక్తియుక్తులన్నింటిని వినియోగించవలసి వస్తుంది. ‘దారిద్ర్యం విలయతాండవం చేసే సమాజంలో అవినీతి, సంఘవ్యతిరేకశక్తులు భయంకరంగా విజృంభిస్తాయి.

ఆకలితో, అజ్ఞానంతో, అనారోగ్యంతో బాధపడే పౌరుడు తన రాజకీయ లక్ష్యాలను, విలువలను గుర్తించే పరిస్థితిలో ఉండడు. ఆకలి తీర్చుకోవడానికి అతడు అనేక నేరాలకు పాల్పడవచ్చు. సంఘవిద్రోహ చర్యల ద్వారా ప్రగతి సాధించాలనే భావనతో ఉంటాడు. తన హక్కులను, విధులను సరిగ్గా వినియోగించలేడు. బాధ్యతలను నిర్వర్తించలేడు. కనీసావసరాలు తీరని పౌరుడు ఓటుహక్కు విలువను తెలుసుకోలేడు. ఆర్థిక అసమానతలు సామాజిక విప్లవాలకు దారితీస్తాయని ‘అరిస్టాటిల్’ హెచ్చరించాడు.

అర్థశాస్త్రం, రాజనీతిశాస్త్రం వేరైనప్పటికీ ప్రజాసంక్షేమమే ఈ రెండు శాస్త్రాల ప్రధాన లక్ష్యం. ఆధునిక రాజ్యాలు నిర్వర్తించే విధుల్లో ఉత్పత్తి విధానం, వినియోగం మారకద్రవ్య సద్వినియోగం, ధరల పెరుగుదలను అరికట్టడం, జాతిసంపదను పెంచడం, పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడటం ముఖ్యమైనవి. వీటిమీద ఆర్థిక విధానాల ప్రభావం బాగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు రాజకీయ వ్యవస్థల ద్వారానే పరిష్కరించడానికి వీలవుతుంది. ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనడం ద్వారా ప్రభుత్వం ఆర్థిక విధులను నిర్వర్తిస్తుంది.

ఉత్పత్తి – అభివృద్ధి భావనలను వాస్తవికం చేసేందుకు రాజ్యం పన్నులు, మార్కెటింగ్, ఆహారోత్పత్తి, పంపిణీ, ఉపాధి అవకాశాలు, ఎగుమతులు, దిగుమతులు మొదలైన విధులను నిర్వర్తించక తప్పదు. ఆర్థిక ఉత్పత్తి శక్తులే సమాజాలలో మ్కార్సిజం వ్యాప్తికి దోహదం చేశాయి. ఆర్థికపరమైన అంశాలే రెండో ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారణమయ్యాయి. నాజీయిజం, ‘ఫాసం సిద్ధాంతాలకు ఆర్థిక సమస్యలే ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

బ్రిటిష్ ప్రభుత్వం మనదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడంలో జాప్యం చేయడానికి ఆర్థిక కారణాలే ప్రధానమైనవని చాలా మంది భావిస్తారు. ఆధునిక కాలంలో విస్తరిస్తున్న కొత్త కొత్త రాజకీయ సిద్ధాంతాలకూ ఉద్యమాలకూ ఆర్థిక సమస్యలే మూలం. ఆర్థికస్థితిగతులు రాజకీయ నిర్ణయాలను, ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
రాజనీతిశాస్త్రానికి – సమాజశాస్త్రానికి గల సంబంధాలను వివరించండి.
జవాబు.
సమాజశాస్త్రం సాంఘికశాస్త్రాలన్నింటికీ మూలం. సాంఘికవ్యవస్థల పరిణామాలను సమాజశాస్త్రం అధ్యయనం చేస్తుంది. సమాజశాస్త్రం సామాజిక, నైతిక, ఆర్థిక, సాంస్కృతిక వ్యవస్థలన్నింటి గురించి చర్చిస్తుంది. మానవ సంబంధాలు, సాంఘిక పరిస్థితులు, వివిధ వ్యవస్థల ఆవిర్భావం – పరిణామం వికాసం వాటి రూపాలు, చట్టాలు, ఆచార వ్యవహారాలు, జీవనోపాధి, నాగరికత, సంస్కృతి మొదలైన వాటి ప్రభావాల గురించి సమాజశాస్త్రం ప్రస్తావిస్తుంది.

అందువల్ల సమాజశాస్త్ర పరిధి చాలా విస్తృతమైంది. ఇతర సాంఘిక శాస్త్రాలన్నీ దీనిలో నుంచి ప్రత్యేకశాస్త్రాలుగా రూపాంతరం చెందాయి. రాజనీతిశాస్త్రం వీటిలో ఒక భాగం మాత్రమే. ఈ రెండు శాస్త్రాల మధ్య పరస్పర సంబంధం ఉండటమేగాక అవి పరస్పరం ఆధారపడి ఉంటాయి.

రాజనీతిశాస్త్రవేత్తకు సామాజిక శాస్త్రంతో పరిచయం చాలా అవసరం. ఎందుకంటే రాజ్యస్వభావాన్ని అర్థం చేసుకోవాలంటే దాని సామాజిక మూలాలను అధ్యయనం చేయాలి. గ్రీకు తత్త్వవేత్తలు సాంఘిక విధానాన్నే రాజకీయ విధానంగా భావించారు. వారి దృష్టిలో రాజ్యానికీ సంఘానికీ తేడాలేదు.

గ్రీకుల అభిప్రాయంలో రాజ్యం రాజకీయ వ్యవస్థీకాక ఒక ఉన్నతమైన సాంఘిక వ్యవస్థ కూడా. సమాజ జీవనాన్ని క్రమబద్ధం చేయడంలో సమాజంలోని ఆచారాలు కట్టుబాట్లు తోడ్పడతాయి. రాజనీతిశాస్త్రజ్ఞులు వ్యక్తి సమూహ ప్రవర్తనలను నిర్ణయించడంలో సామాజికీకరణ విధానానికి ప్రాధాన్యత ఇస్తారు.

ఇటీవలి కాలంలో రాజకీయ సమాజశాస్త్రం ఒక ప్రత్యేక శాస్త్రంగా రూపొందింది. దీంతో రాజకీయ జీవనం మీద సామాజిక సంస్థల ప్రభావం ఏ మేరకు ఉందో తెలుసుకోవచ్చు. రాజకీయ పార్టీలు, ముఠాలు, ప్రజాభిప్రాయం మొదలైనవి చాలావరకు సామాజిక ప్రభావాలకు లోనవుతున్నాయి.

ఒక దేశంలోని రాజకీయ పరిణామాలను అర్థం చేసుకోవాలంటే, దాని సామాజిక స్థితిగతుల పట్ల అవగాహన ఉండాలి. భారతదేశ రాజకీయాలను చేసుకోవాలంటే కులం, మతం, ప్రాంతం, భాష మొదలైన సామాజిక ప్రక్రియలను తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది.

రాజనీతిశాస్త్రం క్రమబద్ధమైన వ్యక్తుల సముదాయాలకు పరిమితంకాగా సమాజశాస్త్రం క్రమబద్ధం కాని మానవ సముదాయాలను గురించి కూడా వివరిస్తుంది. రాజనీతిశాస్త్రం భూత, వర్తమాన, భవిష్యత్, రాజకీయ వ్యవస్థల గురించి చర్చిస్తే సమాజశాస్త్రం భూత, వర్తమాన కాలాల్లో ఉన్న సంస్థల పుట్టుక, వికాసం గురించి చర్చిస్తుంది.

ప్రశ్న 2.
రాజనీతిశాస్త్రానికి – అర్థశాస్త్రానికి గల సంబంధాలను చర్చించండి.
జవాబు.
అర్థశాస్త్రం సంపద, ఉత్పత్తి, పంపిణీ, వస్తు వినిమయం గురించి అధ్యయనం చేస్తుంది. సంపదను ఎట్లా సమకూర్చుకోవాలో అర్థశాస్త్రం చర్చిస్తుంది. సంపద, ఉత్పత్తి, పంపిణీ విషయాలకు సంబంధించిన సామాజిక అధ్యయనమే అర్థశాస్త్రం.

సామాజిక వ్యవస్థలు, రాజనీతి సిద్ధాంతాలు మానవజీవితాన్ని క్రమబద్ధం చేయడానికి తోడ్పడుతుంది. మానవుడు ఆదర్శపౌరుడుగా నియమనిబంధనలతో బతకడానికి స్పష్టమైన రాజకీయ వ్యవస్థ చాలా అవసరం. కాబట్టి అది మానవశ్రేయస్సును అనేక విధాలుగా అభివృద్ధిపర్చడానికి అర్థశాస్త్రం ఉపకరిస్తుంది.

అపరిమితమైన కోరికలను పరిమిత వనరులతో తీర్చుకునే మార్గాలను సమన్వయం చేయడానికి అర్థశాస్త్రం ప్రయత్నిస్తుంది. ఆర్థికావసరాలు తీరని సమాజంలో అశాంతి, అసంతృప్తి ఏర్పడతాయి.- ప్రాథమిక అవసరాలైన తిండి, బట్ట, గృహవసతి, విద్య, వైద్యం మొదలైనవి లోపిస్తే మానవజీవితం దుఃఖమయమవుతుంది. కనీసావసరాలు తీరనప్పుడు వ్యక్తి తన మనుగడకోసమే తన శక్తియుక్తులన్నింటిని వినియోగించవలసి వస్తుంది. దారిద్య్రం’ విలయతాండవం చేసే సమాజంలో అవినీతి, సంఘవ్యతిరేకశక్తులు భయంకరంగా విజృంభిస్తాయి.

ఆకలితో, అజ్ఞానంతో, అనారోగ్యంతో బాధపడే పౌరుడు తన రాజకీయ లక్ష్యాలను, విలువలను గుర్తించే పరిస్థితిలో ఉండడు. ఆకలి తీర్చుకోవడానికి అతడు అనేక నేరాలకు పాల్పడవచ్చు. సంఘవిద్రోహ చర్యల ద్వారా ప్రగతి సాధించాలనే భావనతో ఉంటాడు.

తన హక్కులను, విధులను సరిగ్గా వినియోగించలేడు. బాధ్యతలను నిర్వర్తించలేడు. కనీసావసరాలు తీరని పౌరుడు ఓటుహక్కు విలువను తెలుసుకోలేడు. ఆర్థిక అసమానతలు సామాజిక విప్లవాలకు దారితీస్తాయని ‘అరిస్టాటిల్’ హెచ్చరించాడు.

అర్థశాస్త్రం, రాజనీతిశాస్త్రం వేరైనప్పటికీ ప్రజాసంక్షేమమే ఈ రెండు శాస్త్రాల ప్రధాన లక్ష్యం. ఆధునిక రాజ్యాలు నిర్వర్తించే విధుల్లో ఉత్పత్తి విధానం, వినియోగం మారకద్రవ్య సద్వినియోగం, ధరల పెరుగుదలను అరికట్టడం, జాతి సంపదను పెంచడం, పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడటం ముఖ్యమైనవి. వీటిమీద ఆర్థిక విధానాల ప్రభావం బాగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు రాజకీయ వ్యవస్థల ద్వారానే పరిష్కరించడానికి వీలవుతుంది.

ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనడం ద్వారా ప్రభుత్వం ఆర్థిక విధులను నిర్వర్తిస్తుంది. ఉత్పత్తి అభివృద్ధి భావనలను వాస్తవికం చేసేందుకు రాజ్యం పన్నులు, మార్కెటింగ్, ఆహారోత్పత్తి, పంపిణీ, ఉపాధి అవకాశాలు, ఎగుమతులు, దిగుమతులు మొదలైన విధులను నిర్వర్తించక తప్పదు.

ఆర్థిక ఉత్పత్తి శక్తులే సమాజాలలో మార్క్సిజం వ్యాప్తికి దోహడం చేశాయి. ఆర్థికపరమైన అంశాలే రెండో ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారణమయ్యాయి. నాజీయిజం, ఫాసిజం సిద్ధాంతాలకు ఆర్థిక సమస్యలే ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

బ్రిటిష్ ప్రభుత్వం మనదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడంలో జాప్యం చేయడానికి ఆర్థిక కారణాలే ప్రధానమైనవని చాలా మంది భావిస్తారు. ఆధునిక కాలంలో విస్తరిస్తున్న కొత్త కొత్త రాజకీయ సిద్ధాంతాలకూ ఉద్యమాలకూ ఆర్థిక సమస్యలే మూలం. ఆర్థికస్థితిగతులు రాజకీయ నిర్ణయాలను, ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

ప్రశ్న 3.
రాజనీతిశాస్త్ర స్వభావం ఏమిటి ?
జవాబు.
రాజకీయాలు (Politics) అనే పదం గ్రీకు పదమైన పోలిస్ (Polis) అనే పదం నుంచి గ్రహించబడింది. ‘పోలిస్’ అంటే నగర – రాజ్యం (City State) అని అర్ధం. ‘పాలిటి (Polity) అనే పదం గ్రీకు పదమైన ‘పొలిటియా’ (Poletieia) అనే గ్రీకు పదం నుంచి గ్రహించబడింది. ‘పాలిటి’ అంటే ‘ప్రభుత్వం – లేదా రాజ్యాంగం’ అని అర్థం.

ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయాలు అంటే రాజ్యం, ప్రభుత్వం, రాజ్యానికి సంబంధించిన సంస్థలకు వివరణగా భావించాలి. ప్రాచీనగ్రీకులు రాజకీయాలను రాజ్యానికి సంబంధించిన సైద్ధాంతిక, పాలనా నిర్వహణకు చెందిన అంశంగా పరిగణించారు.

రాజకీయాలకు – రాజనీతి శాస్త్రానికి సంబంధించిన నిర్వచనాల విషయంలో రాజనీతిశాస్త్రజ్ఞుల మధ్య ఏకాభిప్రాయం లేదు. రాజనీతిశాస్త్రాన్ని సంప్రదాయిక వాదులు, ఆధునిక శాస్త్రవేత్తలు వేరువేరుగా నిర్వచించారు. సంప్రదాయిక రాజనీతిశాస్త్రవేత్తల అభిప్రాయంలో రాజ్యం, ప్రభుత్వం, రాజనీతిశాస్త్ర అధ్యయనానికి కేంద్ర బిందువుగా ఉంటాయి. రాజ్యం లేకుండా ప్రభుత్వం – ప్రభుత్వం లేకుండా రాజ్యం మనుగడకు కొనసాగించలేవని వారు అభిప్రాయపడ్డారు. ఈ కారణం వల్ల రాజ్యం – ప్రభుత్వం రాజనీతిశాస్త్ర అధ్యయనానికి కేంద్ర బిందువులుగా సంప్రదాయ రాజనీతిశాస్త్రవేత్తలు అభివర్ణించారు.

రెండవ ప్రపంచ యుద్ధానంతరం పశ్చిమదేశాలకు చెందిన రాజనీతి శాస్త్రవేత్తలు వివిధ నూతన సిద్ధాంతాలను, అధ్యయన దృక్పథాలను, పద్ధతులను, నమూనాలను రాజనీతిశాస్త్రంలో పొందుపరచి దాన్ని పునఃనిర్వచించి రాజనీతిశాస్త్ర పరిధిని విస్తృత పరిచారు.

1930వ దశకంలో హెరాల్డ్ లాస్వెల్ (Harold Lasswell) అనే రాజనీతి పండితుడు రాజనీతిశాస్త్రాన్ని, ‘రాజకీయ అధికారాన్ని’ (Political Power) అధ్యయనం చేసే శాస్త్రంగాను, అధికారాన్ని ఎవరు, ఎప్పుడు, ఎలా (Who, When and How) చేజిక్కించుకుంటారనే విషయాన్ని ముఖ్య అధ్యయన అంశంగా రాజనీతిశాస్త్రజ్ఞులు ఎంచుకోవాలని నొక్కి వక్కాణించారు. అటు పిమ్మట రెండు దశాబ్దాల తరవాత 1950వ దశకంలో మరికొంతమంది రాజనీతి పండితులు రాజనీతి శాస్త్రాన్ని విధాన నిర్ణయ శాస్త్రంగా పరిగణించాలన్నారు. ఎందుకంటే ?

ఎవరు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నారనే విషయం కంటే ప్రజల సమస్త జీవన రీతులను మెరుగుపర్చటానికి రాజ్యం ఎటువంటి విధానాలను (Policies) రూపొందించి అమలుపరుస్తుందనే అంశం రాజనీతిశాస్త్ర అధ్యయనంగా ఉండాలని వీరు భావించారు. అందువల్ల రాజనీతిశాస్త్రం విధాన నిర్ణయ శాస్త్రంగా స్థిరీకరించబడిన మానవ సమూహాల రాజకీయ చర్యలను, కార్యకలాపాలను విశ్లేషించేదిగా పరిణతి చెందింది.

ఈ క్రమంలో రాజ్యం తీసుకునే విధాన నిర్ణయాల్లో భాగస్వామ్యం కలిగి ఉండే రాజకీయ పార్టీలు, ప్రభావ వర్గాలు, కార్మిక – కర్షక సంఘాలు, ఇతర సంస్థలు, పాలనా యంత్రాంగాలు వాటి పాత్రలను వివరించేదిగా రాజనీతిశాస్త్రం అభివృద్ధి చెందింది.

రాజనీతిశాస్త్రాన్ని విశాల దృక్పథంలో చూసినట్లయితే మనకు రెండు అధ్యయన కోణాలు కనబడతాయి. అవి : ఒకటి సంప్రదాయిక కోణాలు, రెండు ఆధునిక కోణాలు. సంప్రదాయిక కోణంలో రాజనీతిశాస్త్రాన్ని చూసినట్లయితే అది సంప్రదాయాలను, విలువలను, అధ్యయనం చేయడానికి, అదే విధంగా, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం వంటి భావాలను, కొన్ని సంప్రదాయిక సిద్ధాంతాలను వివరించడానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది.

ఆధునిక కోణంలో చూసినట్లయితే, భౌతిక పరిస్థితులకు, వాస్తవిక అంశాలకు, వ్యక్తుల రాజకీయ ప్రవర్తనలకు, రాజ్యం – ప్రభుత్వం రూపొందించే విధానాలకు సమాజంలో సంభవించే సాంఘిక ఉద్యమాలను అధ్యయనం చేయడానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది.

ప్రశ్న 4.
రాజనీతిశాస్త్ర పరిణామ క్రమాన్ని వివరించండి.
జవాబు.
రాజకీయాలను గురించి అధ్యయనం ప్రాచీన గ్రీకు సమాజాలలో ప్రారంభమైంది. సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ వంటి గ్రీకు తాత్వికులు వారి కాలం నాటి సమాజాలలోని రాజకీయాలను గురించి చింతన చేశారు. అయితే, అరిస్టాటిల్ నాటి ప్రభుత్వాలను, రాజకీయ వ్యాసంగాలను హేతుబద్ధంగా తులనాత్మక పద్ధతిలో వివరించినందువల్ల తాను రాజనీతిశాస్త్ర పితామహుడుగా ఆరాధించబడ్డాడు. అరిస్టాటిల్, రాజనీతిశాస్త్రాన్ని “మాస్టరైసైన్స్”గా అభివర్ణించాడు.

అంటే మానవులకు చెందిన సాంఘిక, రాజకీయ సంస్థలను వివరించే శాస్త్రంగా పేర్కొన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయాలను గ్రీకులు ఒక సమగ్రమైన భావనగా చూశారు. కాలక్రమంలో రాజకీయాల పట్ల గ్రీకుల భావన అనేక మార్పులకు చేర్పులకు గురై ప్రాధాన్యతను కోల్పోయింది. ఆధునిక కాలంలో రాజకీయాలు అనే భావన విస్తృతార్థాన్ని సంతరించుకుంది.

వాస్తవానికి, సామాజిక పరిణామక్రమంలో వివిధ దశల వారీగా ఉత్పత్తివిధానంలో చోటు చేసుకున్న మార్పులు (వేటాడే దశ, ఆహార సేకరణ దశ, వ్యవసాయ ఉత్పత్తిదశ, పారిశ్రామిక ఉత్పత్తి దశ) రాజకీయాలను విస్తృత పర్చాయి. వ్యక్తుల చర్యలను సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాలకు చెందినవిగా వివరించబడ్డాయి.

ఈ నేపథ్యంలో రాజనీతిశాస్త్రం వ్యక్తుల రాజకీయ చర్యలకు సంబంధించిన ‘రాజ్యం – ప్రభుత్వం’ లాంటి సంస్థలను వివరించే శాస్త్రంగా వృద్ధి చెందింది. ఈ విధంగా, రాజ్యపరిణామక్రమం, దాని విధులు, ప్రభుత్వం దాని నిర్మాణం – విధులు వంటివి రాజనీతిశాస్త్ర అధ్యయన అంశాలుగా పరిగణించబడ్డాయి.

సామాన్యశాస్త్రాల్లో జీవరాశుల ప్రవర్తనలను అధ్యయనం చేసే తరహాలో సామాజికశాస్త్రాల్లో సైతం వ్యక్తుల ప్రవర్తనలను అధ్యయనం చేయవలసిన ఆవశ్యకతను వివరిస్తూ ప్రవర్తనావాద ఉద్యమం ప్రారంభమైంది. 1920వ దశకంలో గుర్తించబడిన అధ్యయన అంశం రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్రవర్తనావాద ఉద్యమంగా ఒక ఉప్పెనలా సాంఘికశాస్త్రాల అధ్యయనాన్ని అతలాకుతలం చేసింది. 1950వ దశకం నాటికి చార్లెస్ మెరియం, డేవిడ్ ఈస్టన్, గాబ్రియల్ ఆల్మండ్ వంటి రాజనీతిశాస్త్రవేత్తలు ప్రవర్తనావాద ఉద్యమానికి నాయకత్వం వహించారు.

ఈ ఉద్యమం, వ్యక్తుల రాజకీయ ప్రవర్తనల అధ్యయనానికి అధిక ప్రాధాన్యతనిచ్చింది. ఒక రాజకీయ వ్యవస్థలోని పౌరులు ఆ రాజకీయ వ్యవస్థపై ఎటువంటి రాజకీయ పరమైన వైఖరులను కలిగి ఉన్నారో శాస్త్రీయంగా విశ్లేషించాల్సిన ఆవశ్యకతను ప్రవర్తనావాదం నొక్కి చెప్పింది. వ్యవస్థీకృతమైన రాజకీయ సమాజంలో రాజ్యం రూపొందించే విధానాలను, వాటి అమలును, వాటి పట్ల పౌరుల రాజకీయ స్పందనలను వివరించేదిగా రాజనీతిశాస్త్రం పరిణామం చెందింది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
రాజనీతిశాస్త్ర నిర్వచనం.
జవాబు.

  1. జె.డబ్ల్యు. గార్నర్ : “రాజనీతిశాస్త్రనికి ఆది అంతాలు రాజ్యమే”.
  2. పాల్ జానెట్ : “రాజ్య మూలాధారాలను, ప్రభుత్వ సూత్రాలను తెలియజేసే సాంఘికశాస్త్రమే రాజనీతిశాస్త్రం”.
  3. రాబర్ట్ థాల్ : “అధికారాన్ని, శక్తిని, వాటి ప్రభావాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసేదే రాజనీతిశాస్త్రం”.

ప్రశ్న 2.
రాజనీతిశాస్త్ర ప్రాముఖ్యతను నాలుగు మాటల్లో తెలపండి.
జవాబు.
రాజనీతిశాస్త్రం రాజకీయ వ్యవస్థల్లో చోటుచేసుకుంటున్న మార్పులను అధ్యయనం చేయడమే కాకుండా రాజకీయపరమైన సమస్యల పరిష్కారానికి కూడా తగిన సలహాలు, సూచనలు అందిస్తుంది అంతేకాకుండా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం, బాధ్యతాయుత ప్రభుత్వంగా వ్యవహరించడం, ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యతనివ్వడం వంటి విషయాలను పేర్కొంటుంది.

ప్రశ్న 3.
సమాజశాస్త్రం అంటే ఏమిటి ?
జవాబు.
సమాజశాస్త్రం సాంఘికశాస్త్రాలన్నింటికీ మూలం. సాంఘిక వ్యవస్థల పరిణామాలను సమాజశాస్త్రం అధ్యయనం చేస్తుంది. సమాజశాస్త్రం సామాజిక, నైతిక, ఆర్థిక, సాంస్కృతిక వ్యవస్థలన్నింటి గురించి చర్చిస్తుంది.

మానవ సంబంధాలు, సాంఘిక పరిస్థితులు, వివిధ వ్యవస్థల ఆవిర్భావం వాటి రూపాలు, చట్టాలు, ఆచార వ్యవహారాలు, జీవనోపాధి, నాగరికత, సంస్కృతి మొదలైన వాటి ప్రభావాల గురించి సమాజశాస్త్రం ప్రస్తావిస్తుంది. అందువల్ల సమాజశాస్త్రం పరిధి చాలా విస్తృతమైనది. ఇతర సాంఘిక శాస్త్రాలన్నీ దీనిలో నుంచి ప్రత్యేకశాస్త్రాలుగా
రూపాంతరం చెందాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

ప్రశ్న 4.
అర్థశాస్త్రానికి – రాజనీతిశాస్త్రానికి గల భేదం.
జవాబు.

అర్థశాస్త్రం సంపద, ఉత్పత్తి, పంపిణీ, వస్తు వినిమయం గురించి అధ్యయనం చేస్తుంది. సంపదను ఎట్లా సమకూర్చుకోవాలో అర్థశాస్త్రం చర్చిస్తుంది. సంపద, ఉత్పత్తి, పంపిణీ విషయాలకు సంబంధించిన సామాజిక అధ్యయనమే అర్థశాస్త్రం.

సామాజిక వ్యవస్థలు, రాజనీతి సిద్ధాంతాలు మానవజీవితాన్ని క్రమబద్ధం చేయడానికి తోడ్పడుతుంది. మానవుడు ఆదర్శపౌరుడుగా నియమనిబంధనలతో బతకడానికి స్పష్టమైన రాజకీయ వ్యవస్థ చాలా అవసరం. కాబట్టి అది మానవశ్రేయస్సును అనేక విధాలుగా అభివృద్ధిపర్చడానికి అర్థశాస్త్రం ఉపకరిస్తుంది.

అపరిమితమైన కోరికలను పరిమిత వనరులతో తీర్చుకునే మార్గాలను సమన్వయం చేయడానికి అర్థశాస్త్రం ప్రయత్నిస్తుంది. ఆర్థికావసరాలు తీరని సమాజంలో అశాంతి, అసంతృప్తి ఏర్పడతాయి.- ప్రాథమిక అవసరాలైన తిండి, బట్ట, గృహవసతి, విద్య, వైద్యం మొదలైనవి లోపిస్తే మానవజీవితం దుఃఖమయమవుతుంది. కనీసావసరాలు తీరనప్పుడు వ్యక్తి తన మనుగడకోసమే తన శక్తియుక్తులన్నింటిని వినియోగించవలసి వస్తుంది. దారిద్య్రం’ విలయతాండవం చేసే సమాజంలో అవినీతి, సంఘవ్యతిరేకశక్తులు భయంకరంగా విజృంభిస్తాయి.

ఆకలితో, అజ్ఞానంతో, అనారోగ్యంతో బాధపడే పౌరుడు తన రాజకీయ లక్ష్యాలను, విలువలను గుర్తించే పరిస్థితిలో ఉండడు. ఆకలి తీర్చుకోవడానికి అతడు అనేక నేరాలకు పాల్పడవచ్చు. సంఘవిద్రోహ చర్యల ద్వారా ప్రగతి సాధించాలనే భావనతో ఉంటాడు.

తన హక్కులను, విధులను సరిగ్గా వినియోగించలేడు. బాధ్యతలను నిర్వర్తించలేడు. కనీసావసరాలు తీరని పౌరుడు ఓటుహక్కు విలువను తెలుసుకోలేడు. ఆర్థిక అసమానతలు సామాజిక విప్లవాలకు దారితీస్తాయని ‘అరిస్టాటిల్’ హెచ్చరించాడు.

అర్థశాస్త్రం, రాజనీతిశాస్త్రం వేరైనప్పటికీ ప్రజాసంక్షేమమే ఈ రెండు శాస్త్రాల ప్రధాన లక్ష్యం. ఆధునిక రాజ్యాలు నిర్వర్తించే విధుల్లో ఉత్పత్తి విధానం, వినియోగం మారకద్రవ్య సద్వినియోగం, ధరల పెరుగుదలను అరికట్టడం, జాతి సంపదను పెంచడం, పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడటం ముఖ్యమైనవి. వీటిమీద ఆర్థిక విధానాల ప్రభావం బాగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు రాజకీయ వ్యవస్థల ద్వారానే పరిష్కరించడానికి వీలవుతుంది.

ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనడం ద్వారా ప్రభుత్వం ఆర్థిక విధులను నిర్వర్తిస్తుంది. ఉత్పత్తి అభివృద్ధి భావనలను వాస్తవికం చేసేందుకు రాజ్యం పన్నులు, మార్కెటింగ్, ఆహారోత్పత్తి, పంపిణీ, ఉపాధి అవకాశాలు, ఎగుమతులు, దిగుమతులు మొదలైన విధులను నిర్వర్తించక తప్పదు.

ఆర్థిక ఉత్పత్తి శక్తులే సమాజాలలో మార్క్సిజం వ్యాప్తికి దోహడం చేశాయి. ఆర్థికపరమైన అంశాలే రెండో ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారణమయ్యాయి. నాజీయిజం, ఫాసిజం సిద్ధాంతాలకు ఆర్థిక సమస్యలే ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

బ్రిటిష్ ప్రభుత్వం మనదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడంలో జాప్యం చేయడానికి ఆర్థిక కారణాలే ప్రధానమైనవని చాలా మంది భావిస్తారు. ఆధునిక కాలంలో విస్తరిస్తున్న కొత్త కొత్త రాజకీయ సిద్ధాంతాలకూ ఉద్యమాలకూ ఆర్థిక సమస్యలే మూలం. ఆర్థికస్థితిగతులు రాజకీయ నిర్ణయాలను, ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

ప్రశ్న 5.
ప్రవర్తనావాదం.
జవాబు.
సామాన్యశాస్త్రల్లో జీవరాశుల ప్రవర్తనలను అధ్యయనం చేసే తరహాలో సామాజికశాస్త్రాల్లో సైతం వ్యక్తుల ప్రవర్తనలను అధ్యయనం చేయవలసిన ఆవశ్యకతను వివరిస్తూ ప్రవర్తనావాద ఉద్యమం ప్రారంభమైంది. చార్లెస్ మెరియం, డేవిడ్ ఈస్టర్, గాబ్రియల్ ఆల్మండ్ వంటి రాజనీతిశాస్త్రవేత్తలు ప్రవర్తనావాద ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఒక రాజకీయ వ్యవస్థలోని పౌరులు ఆ రాజకీయ వ్యవస్థపై ఎటువంటి రాజకీయపరమైన వైఖరులను కలిగి ఉన్నారో శాస్త్రీయంగా విశ్లేషించాల్సిన ఆవశ్యకతను ప్రవర్తనావాదం నొక్కి చెప్పింది.

ప్రశ్న 6.
ఉత్తర – ప్రవర్తనావాదం.
జవాబు.
రాజనీతిశాస్త్ర అధ్యయన ధృక్పథంలో ప్రవర్తనావాదాన్ని విమర్శిస్తూ ఆవిష్కరించడిన మరో కోణమే ఉత్తర ప్రవర్తనావాదం. ప్రవర్తనావాదం పూర్తి శాస్త్రీయతకు పీటవేయగా, ఉత్తర ప్రవర్తనావాదం విలువలకు – శాస్త్రీయతకు రెండింటికి సమాన ప్రాధాన్యతనిస్తూ రాజకీయ వ్యాసంగాలను విశ్లేషించాలని భావించింది.

ప్రశ్న 7.
మాస్టర్ సైన్స్.
జవాబు.
రాజకీయాలను గురించి అధ్యయనం ప్రాచీన గ్రీకు సమాజాలలో ప్రారంభమైంది. సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ వంటి గ్రీకు తాత్వికులు వారి కాలం నాటి సమాజాలలోని రాజకీయాలను గురించి చింతన చేశారు.

అయితే, అరిస్టాటిల్ నాటి ప్రభుత్వాలను, రాజకీయ వ్యాసంగాలను హేతుబద్ధంగా తులనాత్మక పద్ధతిలో వివరించినందువల్ల తాను రాజనీతి శాస్త్ర పితామహుడుగా ఆరాధించబడ్డాడు. అరిస్టాటిల్, రాజనీతిశాస్త్రాన్ని “మాస్టర్ సైన్స్”గా అభివర్ణించాడు. అంటే మానవులకు చెందిన సాంఘిక, రాజకీయ సంస్థలను వివరించే శాస్త్రంగా పేర్కొన్నాడు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

ప్రశ్న 8.
అరిస్టాటిల్.
జవాబు.
అరిస్టాటిల్ ప్రముఖ గ్రీకు రాజనీతి తత్వవేత్త. ప్లేటో శిష్యుడు. అరిస్టాటిల్ ప్రాచీన గ్రీకు కాలం నాటి ప్రభుత్వాలను, రాజకీయ వ్యాసంగాలను హేతుబద్ధంగా తులనాత్మక పద్ధతిలో వివరించినందువల్ల తాను రాజనీతిశాస్త్ర పితామహుడుగా ఆరాధించబడ్డాడు. అరిస్టాటిల్ రాజనీతిశాస్త్రాన్ని “మాస్టరైసైన్స్”గా అభివర్ణించాడు. అరిస్టాటిల్ తన ప్రఖ్యాత గ్రంధమైన “పాలిటిక్స్”లో రాజ్యము, ప్రభుత్వము గురించి అధ్యయనము చేసే శాస్త్రము రాజనీతిశాస్త్రమని పేర్కొన్నాడు.

TS Inter 1st Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 6th Lesson హక్కులు – విధులు Textbook Questions and Answers.

TS Inter 1st Year Political Science Study Material 6th Lesson హక్కులు – విధులు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
హక్కులను నిర్వచించి పౌర, రాజకీయ హక్కులను వర్ణించండి.
జవాబు.
పరిచయం : రాజనీతిశాస్త్ర అధ్యయనంలో హక్కుల భావనకు చాలా ప్రాముఖ్యత ఉంది. సామాజిక జీవనానికి హక్కులనేవి అత్యంత ఆవశ్యకమైనవి. సామాజిక సంక్షేమ సాధనగా హక్కులు పరిగణించబడినాయి. హక్కులను వినియోగించుకోవటం ద్వారానే రాజ్యంలోని పౌర వ్యక్తిత్వం వికసిస్తుంది.

సమాజంలోనూ, రాజ్యంలోనూ సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి హక్కులు అవసరమవుతాయి. రాజ్యం పౌరులకు ప్రసాధించే హక్కుల ద్వారానే దాని ఔన్నత్యం గుర్తించబడుతుందని హెచ్.జె. లాస్కి పేర్కొన్నాడు. సాధారణంగా ప్రతి రాజ్యం తన పౌరులకు వివిధ రంగాలలో అనేక హక్కులను ప్రసాదిస్తుంది.

హక్కులనేవి రాజ్యం, సమాజం చేత గుర్తించబడే కనీస పరిస్థితులు, అవకాశాలుగా పరిగణించవచ్చు. వాటిని రాజ్యంలోని వివిధ చట్టాలు పరిరక్షిస్తాయి. ఆధునిక రాజ్యాలు తమ రాజ్యాంగం, చట్టాల ద్వారా పౌరుల వికాసానికి అనేక ఏర్పాట్లుగావించాయి. ఇక హక్కులు, బాధ్యతలు అనేవి వ్యక్తుల సంపూర్ణ వికాసానికి అత్యంత ఆవశ్యకమైనవి.

అర్థం :
“హక్కు” అంటే “కలిగి ఉండటము” అని అర్థం. సమాజ సంక్షేమం కోసం, ప్రగతి కోసం వ్యక్తులందరూ పాటించవలసిన బాధ్యతల రూపమే హక్కులు. హక్కులు మానవునకు స్వేచ్ఛను ఇచ్చి, వికాసానికి తోడ్పడతాయి. హక్కుల నిర్వచనాలు : రాజనీతి శాస్త్రవేత్తలు హక్కు అనే పదాన్ని అనేక విధాలుగా నిర్వచించారు. వాటిలో కొన్నింటిని కింద వివరించడమైనది.

  1. ఎర్నెస్ట్ బార్కర్ : “వ్యక్తి మూర్తిమత్వ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన బాహ్యపరమైన పరిస్థితులే ” హక్కులు”.
  2. బొసాంకే : “సమాజం చేత గుర్తించబడి, రాజ్యం చేత అమలులో ఉంచబడే అధికారాలే హక్కులు”.
  3. టి.హెచ్. గ్రీన్ : “ఉమ్మడి శ్రేయస్సుకు దోహదపడే వాటిని కోరేందుకు, గుర్తించేందుకు ఉండే అధికారాలే హక్కులు.” .
  4. హెచ్.జె. లాస్కి : “హక్కులనేవి మానవుల సామాజిక జీవనానికి అవసరమైనవి. అవి లేకుండా ఏ ఒక్కరూ సాధారణంగా, అత్యుత్తమమైన వ్యక్తిగా రూపొందటం సాధ్యం కాదు.”

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

పౌరహక్కులు :
నాగరిక జీవనాన్ని గడపటానికి అవసరమయ్యే హక్కులనే పౌరహక్కులు అంటారు. అన్ని రాజ్యాలు తమ ప్రజలకు ఈ హక్కులను ఇస్తున్నాయి. ఈ హక్కులపై అనేక మినహాయింపులు ఉంటాయి. ముఖ్యమైన పౌర హక్కులు ఏమనగా :

1. జీవించే హక్కు (Right to Life) :
జీవించే హక్కు అనేది పౌరహక్కులలో అత్యంత ముఖ్యమైనదని టి. హెచ్. గ్రీన్ భావించాడు. ఈ హక్కు వ్యక్తుల జీవనానికి భద్రతను కల్పిస్తుంది. ఈ హక్కు లేనట్లయితే వ్యక్తులు తమ జీవనాన్ని గడిపేందుకు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు.

ప్రతి వ్యక్తికీ ఈ హక్కు ఎంతో విలువైనదే కాకుండా, సమాజం, రాజ్యం మొత్తానికి కూడా ఎంత విలువైనదనే ప్రమేయంపై ఈ హక్కు ఆధారపడి ఉంది. అందువల్ల ఈ హక్కు ద్వారా రాజ్యం వ్యక్తుల జీవనానికి ఎంతగానో రక్షణను కల్పిస్తుంది.

అయితే ఈ హక్కును అనుభవించే విషయంలో వ్యక్తులపై రాజ్యం కొన్ని సహేతుకమైన ఆంక్షలను విధించవచ్చు. ఈ సందర్భంలో రాజ్యం ఏ వ్యక్తినైనా జాతి ప్రయోజనం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని ఆజ్ఞాపించవచ్చు. ఈ హక్కులలో ఆత్మరక్షణ హక్కు కూడా ఇమిడి ఉంది.

2. స్వేచ్ఛా హక్కు (Right to Liberty) :
స్వేచ్ఛా హక్కు వ్యక్తులకు అనేక రంగాలలో స్వాతంత్ర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ హక్కు వారి జీవనాన్ని అర్థవంతం చేస్తుంది. వ్యక్తులు అనేక రంగాలలో వారి వ్యక్తిత్వాన్ని వికసింపచేసుకొనేందుకు. వీలు కల్పిస్తుంది. సంచరించే హక్కు, వాక్ స్వాతంత్ర్యపు హక్కు, భావవ్యక్తీకరణ హక్కు, ఆలోచనా హక్కు, నివసించే హక్కు మొదలైనవి ఇందులో ఉన్నాయి.

3. సమానత్వ హక్కు (Right to Equality) :
సమానత్వ హక్కు అంటే చట్టం దృష్టిలో అందరూ సమానులే. అని అర్థంగా చెప్పవచ్చు. వ్యక్తుల మధ్య కులం, వర్ణం, పుట్టుక, మతం, ప్రాంతం, సంపద, విద్యలాంటి పలురకాల విచక్షణలను ఈ హక్కు నిషేధిస్తుంది. అందరినీ ఒకే రకంగా ఆదరిస్తుంది. రాజ్యంలో చట్టాలను ఒకే విధంగా వర్తించుటకు ఈ హక్కు ఉద్దేశించింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో వ్యక్తులందరికీ సమానమైన అవకాశాలను ఈ హక్కు కల్పిస్తుంది.

4. ఆస్తి హక్కు (Right to Property) :
ఈ హక్కు ప్రకారం ప్రతి వ్యక్తి ఆస్తిని సంపాదించేందుకు, అనుభవించేందుకు, దానధర్మాలకు వినియోగించుకొనేందుకు లేదా వారసత్వంగా పొందేందుకు వీలుంటుంది. ప్రతి వ్యక్తి ఉన్నత ప్రమాణాలతో జీవనాన్ని కొనసాగించేందుకు ఈ హక్కు అవసరమవుతుంది. అలాగే వ్యక్తి మూర్తిమత్వ వికాసానికి ఇది ఎంతో కీలకమైనది.

5. కుటుంబ హక్కు (Right to Family) :
కుటుంబం అనేది ఒక ప్రాథమిక, సామాజిక వ్యవస్థ. కుటుంబ హక్కు సమాజంలో వ్యక్తులకు కుటుంబపరమైన సంబంధాలను ఏర్పరచుకొనేందుకు వీలు కల్పిస్తుంది. పర్యవసానంగా ఈ హక్కు ద్వారా వ్యక్తులు తమకు నచ్చినవారిని వివాహం చేసుకొనే స్వేచ్ఛను కలిగి ఉంటారు. అలాగే సంతానాన్ని పొందేందుకు, పిల్లలను పోషించేందుకు వారికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.

అయితే జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ హక్కుపై రాజ్యం కొన్ని నిర్దిష్టమైన ఆంక్షలను విధించవచ్చు. ఉదాహరణకి ఇటీవలి కాలం వరకు చైనా ప్రభుత్వం అక్కడి పౌరుల కుటుంబసభ్యుల సంఖ్యపై కఠిన ఆంక్షలను విధించింది. ఇప్పుడిప్పుడే ఈ రాజ్యం పైన పేర్కొన్న విషయంలో కొన్ని సవరణలు చేస్తున్నది.

6. మత హక్కు (Right to Religion) :
ఈ హక్కు ప్రకారం వ్యక్తులు తమకు ఇష్టమైన మతాన్ని స్వీకరించేందుకు, ప్రచారం చేసేందుకు, ప్రభోదించేందుకు స్వేచ్ఛను కలిగి ఉంటారు. వారు ఈ విషయంలో సంపూర్ణమైన స్వాతంత్ర్యాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా లౌకికరాజ్యాలు తమ పౌరులకు విశేషమైన మత స్వాతంత్ర్యాలను ప్రసాదించాయి.

7. ఒప్పందం హక్కు (Right to Contract) :
ఒప్పందం హక్కు ప్రకారం వ్యక్తులు తమ జీవనం, ఆస్తి, ఉపాధి వంటి విషయాలలో చట్టబద్ధమైన ఏర్పాట్లను చేసుకొనేందుకు లేదా ఒప్పందాలను కుదుర్చుకొనేందుకు స్వాతంత్య్రాన్ని కలిగి ఉంటారు. ఈ విషయంలో ఈ హక్కు ప్రకారం సంబంధిత వ్యక్తులు స్పష్టమైన నియమ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. రాజ్యం వ్యక్తుల శ్రేయస్సును పెంపొందించే ఒప్పందాలను మాత్రమే ఈ సందర్భంలో గుర్తిస్తుంది.

8. విద్యా హక్కు (Right to Education) :
ఆధునిక కాలంలో విద్యా హక్కు అనేది ప్రతి వ్యక్తికి అత్యంత ఆవశ్యకమైనదిగా పరిగణించబడింది. విద్యలేనివారు, అమాయకులు ప్రభుత్వ వ్యవహారాలలో చురుకుగా పాల్గొనలేరు. అలాగే నిరక్షరాస్యులు తమ శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకోలేరు.

అందుచేత విద్య, అక్షరాస్యత అనేవి సమాజంలో వివిధ సామాజిక సమస్యలను అవగాహన చేసుకొనేందుకు, ప్రభుత్వ విధానాలను తెలుసుకొనేందుకు దోహదపడతాయి. ప్రజాస్వామ్య రాజ్యాలలో ఈ హక్కు ప్రతి పౌరుడికి కనీసస్థాయి విద్యను అందించేందుకు హామీ ఇస్తుంది.

9. సంస్థలు, సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు (Right to form Associations and Unions) :
ఈ హక్కు ప్రకారం వ్యక్తులు తమకు ఇష్టమైన సంస్థలు, సంఘాలను నెలకొల్పుకొని, కొన్ని నిర్దిష్ట లక్ష్యాలను నెరవేర్చుకొనేందుకు వీలుంటుంది.

వ్యక్తులు ఈ హక్కును వినియోగించుకోవటం ద్వారా తమ అభీష్టం ప్రకారం వివిధ సంస్థలు, సంఘాలలో సభ్యులుగా చేరేందుకు, కొనసాగేందుకు మరియు సభ్యత్వాలను ఉపసంహరించుకొనేందుకు పూర్తి స్వేచ్ఛను ఉంటారు. అయితే ఒకవేళ వ్యక్తులు జాతి శ్రేయస్సును విస్మరించి సంస్థలను స్థాపించి నిర్వహించినచో, రాజ్యం వారి చర్యలపై కొన్ని ఆంక్షలను విధించవచ్చు.

10. రాజ్యాంగ పరిహారపు హక్కు (Right to Constitutional Remedies) :
వ్యక్తి హక్కుల పరిరక్షణకు ఈ హక్కు అత్యంత ఆవశ్యకమైనది. ఈ హక్కు లేనిచో పౌరహక్కులనేవి అర్థరహితమవుతాయి. ఈ హక్కు ప్రకారం ఇతరుల జోక్యం లేదా దాడి ఫలితంగా నష్టం పొందిన వ్యక్తి తన స్వాతంత్ర్యాన్ని కోల్పోయినచో, తగిన ఉపశమనాన్ని, న్యాయాన్ని న్యాయస్థానాల ద్వారా పొందుతాడు.

ఈ సందర్భంలో ఉన్నత న్యాయస్థానాలు, అనేక ఆజ్ఞలను (writs) జారీ చేస్తాయి. అటువంటి వాటిలో హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, కో వారంటో, సెర్షియోరరి లాంటివి ఉన్నాయి.

రాజకీయ హక్కులు : ప్రజాస్వామ్య దేశాలలో ప్రభుత్వ వ్యవహారాలలో పౌరులు పాల్గొనటానికి అవకాశం కల్పించబడింది. ఈ అవకాశాలనే రాజకీయ హక్కులు అందురు. రాజకీయ హక్కులు ముఖ్యంగా 5 అవి :

1. ఓటు హక్కు (Right to Vote) :
ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలలో పౌరులు అనుభవించే అతి ముఖ్యమైన రాజకీయ హక్కు ఓటు హక్కు. వయోజన పౌరులు ఈ హక్కును వివిధ శాసన నిర్మాణ సంస్థలలో తమ ప్రతినిధులను ఎన్నుకొనేందుకు శక్తివంతమైన ఆయుధంగా వినియోగిస్తారు.

ఈ హక్కు వారిని నిజమైన సార్వభౌములుగా రూపొందిస్తుంది. వయోజన పౌరులందరూ వర్ణం, పుట్టుక, భాష, తెగ, మతం, ప్రాంతం వంటి తారతమ్యాలు లేకుండా ఈ హక్కును కలిగి ఉంటారు. అయితే విదేశీయులు, మైనర్లకు ఈ హక్కు వర్తించదు.

2. ఎన్నికలలో అభ్యర్థిగా పోటీచేసే హక్కు (Right to Contest in Elections) :
రాజ్యంలో పౌరులు వివిధ శాసన నిర్మాణ సంస్థలకు అభ్యర్థులుగా పోటీచేసేందుకు ఈ హక్కు అధికారమిస్తుంది. రాజకీయ సామర్థ్యం ఆసక్తి, శక్తివంతమైన నాయకత్వం వంటి లక్షణాలు గల పౌరులు రాజ్యానికి సంబంధించిన రాజకీయ యంత్రాంగ నిర్వహణలలో చురుకుగా పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. దాంతో ఈ హక్కు పౌరులలో విశేషమైన రాజకీయ పరిజ్ఞానాన్ని, ఆసక్తిని పెంపొందిస్తుంది. ఈ హక్కు ప్రజాస్వామ్య రాజ్యానికి ప్రధాన ప్రాతిపదికగా ఉంటుంది.

3. ప్రభుత్వ పదవులను చేపట్టే హక్కు (Right to Hold Public Offices) :
పౌరులు వివిధ రకాల ప్రభుత్వ పదవులను చేపట్టి, నిర్వహించేందుకు ఈ హక్కు అనేక అవకాశాలను కల్పిస్తుంది ఈ హక్కు ప్రకారం ఏ ఒక్క పౌరుడు ఇతరులతో పోల్చినచో ఎటువంటి ప్రత్యేకమైన సౌకర్యాలను కానీ, మినహాయింపులు కానీ పొందేందుకు వీలులేదు. ప్రభుత్వాధికారాన్ని ఎంతో హుందాగా నిర్వహించేందుకు ఈ హక్కు పౌరులకు సహాయకారిగా ఉంటుంది.

4. విజ్ఞాపన హక్కు (Right to Petition) :
పౌరులు తమ అవసరాలు లేదా సమస్యలను ప్రభుత్వ దృష్టికి విజ్ఞప్తుల ద్వారా తెచ్చేందుకు ఈ హక్కు దోహదపడుతుంది. ఆధునిక రాజ్యంలో ఈ హక్కు ఎంతో ప్రాధాన్యత గల రాజకీయ హక్కుగా పరిగణించబడింది.

ఈ హక్కు ద్వారా పౌరులు ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి, తగిన పరిష్కారాలను పొందుతారు. అలాగే ప్రభుత్వాధికారులు ప్రజా సమస్యలను తెలుసుకొని, వాటిని సకాలంలో పరిష్కరించేటట్లు ఈ హక్కు సహాయపడుతుంది.

5. విమర్శించే హక్కు (Right to Criticism) :
ఈ హక్కు ప్రభుత్వానికి సంబంధించిన అనేక విధానాలు, కార్యక్రమాలను విమర్శించేందుకు పౌరులకు అవకాశం ఇస్తుంది. అలాగే వివిధ స్థాయిలలో నాయకులు, పరిపాలన సిబ్బంది పాల్పడే అవకతవకలను బహిర్గతం చేసేందుకు ఇది తోడ్పడుతుంది.

అంతేకాకుండా కాలానుగుణంగా ప్రభుత్వం అనుసరించే విధానాలపై, పౌరులు సహేతుకమైన, నిర్మాణాత్మకమైన విమర్శలను చేసేందుకు అవకాశమిస్తుంది. ఈ హక్కు అంతిమంగా పరిపాలనాధికారులు, విధాన రూపకర్తలు తమ విద్యుక్త ధర్మాలను ఎంతో అప్రమత్తంగా, జాగ్రత్తగా నిర్వహించేటట్లు చూస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 2.
హక్కుల పరిరక్షణ అంశాలను గుర్తించండి.
జవాబు.
పరిచయం :
రాజనీతిశాస్త్ర అధ్యయనంలో హక్కుల భావనకు చాలా ప్రాముఖ్యత ఉంది. సామాజిక జీవనానికి హక్కులనేవి అత్యంత ఆవశ్యకమైనవి. సామాజిక సంక్షేమ సాధనగా హక్కులు పరిగణించబడినాయి. హక్కులను వినియోగించుకోవటం ద్వారానే రాజ్యంలోని పౌర వ్యక్తిత్వం వికసిస్తుంది.

సమాజంలోనూ, రాజ్యంలోనూ సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి హక్కులు అవసరమవుతాయి. రాజ్యం పౌరులకు ప్రసాదించే హక్కుల ద్వారానే దాని ఔన్నత్యం గుర్తించబడుతుందని హెచ్.జె. లాస్కీ పేర్కొన్నాడు. సాధారణంగా ప్రతి రాజ్యం తన పౌరులకు వివిధ రంగాలలో అనేక హక్కులను ప్రసాదిస్తుంది.

హక్కులనేవి రాజ్యం, సమాజంచేత గుర్తించబడే కనీస పరిస్థితులు, అవకాశాలుగా పరిగణించవచ్చు. వాటిని రాజ్యంలోని వివిధ చట్టాలు పరిరక్షిస్తాయి. ఆధునిక రాజ్యాలు తమ రాజ్యాంగం, చట్టాల ద్వారా పౌరుల వికాసానికి అనేక ఏర్పాట్లుగావించాయి. ఇక హక్కులు, బాధ్యతలు అనేవి వ్యక్తుల సంపూర్ణ వికాసానికి అత్యంత ఆవశ్యకమైనవి.

అర్థం : “హక్కు” అంటే “కలిగి ఉండటము” అని అర్థం. సమాజ సంక్షేమం కోసం, ప్రగతి కోసం వ్యక్తులందరూ పాటించవలసిన బాధ్యతల రూపమే హక్కులు. హక్కులు మానవునకు స్వేచ్ఛను ఇచ్చి, వికాసానికి తోడ్పడతాయి.

హక్కుల నిర్వచనాలు :
రాజనీతి శాస్త్రవేత్తలు హక్కు అనే పదాన్ని అనేక విధాలుగా నిర్వచించారు. వాటిలో కొన్నింటిని కింద వివరించడమైనది.

  1. ఎర్నెస్ట్ బార్కర్ : “వ్యక్తి మూర్తిమత్వ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన బాహ్యపరమైన పరిస్థితులే ” హక్కులు”.
  2. బొసాంకే : “సమాజం చేత గుర్తించబడి, రాజ్యంచేత అమలులో ఉంచబడే అధికారాలే హక్కులు”.
  3. టి.హెచ్. గ్రీన్: “ఉమ్మడి శ్రేయస్సుకు దోహదపడే వాటిని కోరేందుకు, గుర్తించేందుకు ఉండే అధికారాలే హక్కులు.” .
  4. హెచ్.జె. లాస్కి : “హక్కులనేవి మానవుల సామాజిక జీవనానికి అవసరమైనవి. అవి లేకుండా ఏ ఒక్కరూ సాధారణంగా అత్యుత్తమమైన వ్యక్తిగా రూపొందటం సాధ్యం కాదు.”

హక్కుల పరిరక్షణలు (Safeguards of Rights) :
హక్కులను రాజ్యం ప్రతిరక్షించినప్పుడే వ్యక్తులు వాటిని అనుభవించగలుగుతారు. ఈ సందర్భంలో కింది అంశాలు హక్కుల పరిరక్షణకు దోహదపడతాయి.

1. ప్రజాస్వామ్య పాలన (Democratic Rule) :
ప్రజాస్వామ్య పాలన ప్రజల హక్కులను పరిరక్షించుటలో ఎంతగానో కృషిచేస్తుంది. ఒక్క ప్రజాస్వామ్య రాజ్యాలలోనే తమ హక్కులను స్వేచ్ఛగా సంపూర్ణంగా అనుభవిస్తారు. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థ వారి హక్కులకు రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన నియమనిబంధనల ద్వారా రక్షణలు కల్పిస్తుంది.

2. లిఖిత, దృఢ రాజ్యాంగం (Written and Rigid Constitution) :
లిఖిత రాజ్యాంగం ప్రభుత్వ అధికారాలు, కర్తవ్యాలను స్పష్టంగా నిర్వచిస్తుంది. అలాగే ఇది ప్రభుత్వాధికారానికి గల వివిధ పరిమితులను వివరిస్తుంది. అంతేకాకుండా ప్రజల హక్కులకు హామీ ఇస్తుంది. ఈ రాజ్యాంగాన్ని చిన్న కారణాలతో పాలకులు, శాసనసభ్యులు సవరించేందుకు అనుమతించదు.

3. ప్రాథమిక హక్కులను పొందుపరచుట (Incorporation of Fundamental Rights) :
ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరచడం ద్వారా వ్యక్తుల హక్కులను ప్రభుత్వం అతిక్రమించకుండా చూడవచ్చు. ఇటువంటి ఏర్పాటు వ్యక్తుల హక్కులను ఎంతగానో కాపాడుతుంది.

4. అధికారాల వేర్పాటు (Separation of Powers) :
హక్కుల పరిరక్షణకు అధికారాల వేర్పాటు ఎంతో అవసరం. అధికారాలన్నీ ప్రభుత్వంలోని మూడు శాఖల మధ్య ఏర్పాటు చేసినప్పుడే వ్యక్తి స్వేచ్ఛ కాపాడబడుతుంది. అప్పుడు మాత్రమే ఒక శాఖ నియంతృత్వాన్ని వేరొక శాఖ నివారించగలుగుతుంది.

5. అధికారాల వికేంద్రీకరణ (Decentralisation of Powers) :
ప్రభుత్వాధికారాలు వికేంద్రీకృతం అయినప్పుడే వ్యక్తులు హక్కులను అనుభవిస్తారు. అందుకోసం అధికారాలన్నీ జాతీయ, ప్రాంతీయ, స్థానిక స్థాయిలలో వికేంద్రీకరణం కావాలి. అటువంటి ఏర్పాటు ప్రాదేశిక లేదా కర్తవ్యాల ప్రాతిపదికపై జరుగుతుంది.

6. సమన్యాయపాలన (Rule of Law) :
చట్టం ముందు అందరూ సమానులే అనే అర్థాన్ని సమన్యాయపాలన సూచిస్తుంది. అంతేకాకుండా పౌరులందరికీ చట్టాలు సమానంగా వర్తిస్తాయని దీని అర్థం. చట్టం పౌరుల మధ్య ప్రాంతం, కులం, మతం, వర్ణం, తెగ వంటి తారతమ్యాలను చూపదు. అప్పుడు మాత్రమే వ్యక్తులందరూ హక్కులను అనుభవిస్తారు.

7. స్వతంత్ర, నిష్పాక్షిక న్యాయశాఖ (Independent and Impartial Judiciary) :
వ్యక్తుల పరిరక్షణకు తోడ్పడే మరో ముఖ్య అంశమే స్వతంత్ర, నిష్పాక్షిక న్యాయశాఖ. ఉన్నత న్యాయస్థానాలలోని న్యాయమూర్తులు నిష్పక్షపాతంతో, స్వతంత్ర వైఖరితో తీర్పులను అందించాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియలో భాగంగా వారు వ్యక్తుల హక్కులను తక్షణమే పరిరక్షించేందుకై కొన్ని రిట్లను (Writs) మంజూరు చేస్తారు.

8. స్వతంత్ర పత్రికలు (Independent Press) :
వ్యక్తుల హక్కుల పరిరక్షణకు దోహదపడే మరొక అంశమే స్వతంత్ర పత్రికలు. స్వతంత్ర దృక్పథం గల పత్రికలు వార్తలు, అభిప్రాయాలను నిష్పక్షపాతంగా, రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు తెలియజేస్తాయి. ఈ విషయంలో రాజ్యం పత్రికలపై ఎటువంటి ఆంక్షలను విధించేందుకు లేదా పత్రికలను అడ్డుకునేందుకు ప్రయత్నించరాదు. అప్పుడు మాత్రమే వ్యక్తులు తమ హక్కులను సంపూర్ణంగా అనుభవిస్తారు.

9. సాంఘిక, ఆర్థిక సమానత్వాలు (Social and Economic Equalities) :
సాంఘిక, ఆర్థిక సమానత్వాలు అనేవి వ్యక్తులకు హక్కులను అనుభవించేందుకు ఎంతగానో అవసరమవుతాయి. రాజ్యంలో సాంఘిక, ఆర్థిక సమానత్వాలు నెలకొన్నప్పుడే వ్యక్తులు తమ హక్కులను సక్రమంగా, సంవర్థక రీతిలో అనుభవిస్తారు. కులతత్త్వం, మతతత్త్వం, భాషాతత్త్వం వంటి సాంఘిక అనర్థాలు, ఆర్థిక అసమానతలు, దోపిడీని పెంచినప్పుడు సాంఘిక, ఆర్థిక సమానత్వాలను సాధించలేము.

10. నిరంతర అప్రమత్తత (Eternal Vigilance) :
వ్యక్తుల హక్కులను పరిరక్షించటంలో నిరంతర అప్రమత్తత అనేది అత్యంత ముఖ్యమైన అంశంగా చెప్పవచ్చు. వ్యక్తులు ఎప్పటికప్పుడు ప్రభుత్వ విధానాలపట్ల అప్రమత్తతతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రభుత్వం కనక నియంతృత్వ ధోరణులను అనుసరిస్తే, వాటిని ప్రజాస్వామ్య, రాజ్యాంగ పద్ధతుల ద్వారా వ్యతిరేకించాలి.

వారు ఎట్టి పరిస్థితులలోనూ అధికారం కోసం ఆరాటపడే స్వార్థపరులైన నాయకులను ప్రోత్సహించరాదు. అంతేకాకుండా న్యాయసమీక్ష (Judicial Review), పునరాయనం (Recall), దృఢమైన ప్రతిపక్షం లాంటి ఇతర అంశాలు కూడా వ్యక్తుల హక్కులను పరిరక్షించేందుకు దోహదపడతాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 3.
మానవ హక్కులపై ఒక వ్యాసాన్ని రాయండి.
జవాబు.
భావం : మానవుల ప్రాథమిక జీవనానికి అత్యంత ఆవశ్యకమైనవే మానవ హక్కులు. మానవులందరూ ఈ ” హక్కులను కుల, మత, ప్రాంత, వర్ణ, వర్గ తారతమ్యాలు లేకుండా అనుభవిస్తారు. ప్రజాస్వామ్య రాజ్యాలలోని రాజ్యాంగ, సాధారణ చట్టాలు ఇటువంటి హక్కులను గుర్తిస్తాయి. అలాగే ఈ హక్కులను ప్రజలకు అందించేందుకై ప్రజాస్వామ్య రాజ్యాలలోని వివిధ ప్రభుత్వాలు అనేక చర్యలను తీసుకొంటాయి.

మానవ హక్కుల ఆవిర్భావం :
ఒకానొక సమయంలో ప్రాచీన, మధ్యయుగ సమాజాలలో ఎవరో కొన్ని వర్గాలు మాత్రమే మానవ హక్కులను అనుభవించేవారు. దాంతో మెజార్టీ ప్రజలు ఆ హక్కులను నోచుకోలేకపోయారు. వారు హక్కుల సాధనకై అవిశ్రాంతంగా ప్రయత్నించారు.

మానవ హక్కుల సాధనకై ప్రయత్నాలు జరిపిన వారిలో గ్రీకు పాలకులను మొదటిసారిగా పేర్కొనవచ్చు. గ్రీకు పాలకులు మానవ వ్యక్తిత్వ వికాసానికి ఆరోగ్యం, దేహదారుఢ్యం తప్పనిసరిగా ఉండాలని గుర్తించారు. అలాగే జాతి అభివృద్ధిలో మానవ హక్కులు అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తాయనే విషయాన్ని పేర్కొన్నారు. అయితే దురదృష్టం కొద్దీ కొందరు పాలకులు అణచివేత, స్వార్థబుద్ధి కారణంగా ప్రజలలో మతతత్త్వం బాగా వ్యాప్తి చెందింది. ఈ పరిస్థితులలో మానవ హక్కులు కనుమరుగయ్యాయి.

మానవ హక్కుల సాధనలో ఇంగ్లాండులోని మాగ్నా కార్టా (Magna Carta) అనేది మానవ హక్కుల సాధనలో చేసిన మొదటి ప్రయత్నంగా చరిత్రకారులు భావించారు. మాగ్నా కార్టా ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను వీలు కల్పించింది. చరిత్రకారులు దానిని బ్రిటీషు రాజ్యంగపు ‘బైబిల్’గా వర్ణించారు.

మానవ హక్కుల ఆశయాలు :

  1. ప్రజలందరికీ ఎటువంటి వివక్షత లేని స్వాతంత్ర్యాన్ని అందించటం.
  2. పేదరికం నుండి విముక్తి.
  3. వ్యక్తులలో నిబిడీకృతమై ఉన్న సామర్థ్యాలను వినియోగించుకొనే స్వేచ్ఛ.
  4. భయం నుండి విముక్తి.
  5. రక్షణ పొందే స్వేచ్ఛ.
  6. అన్యాయానికి వ్యతిరేకంగా స్వేచ్ఛ.
  7. వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వాతంత్య్రం.
  8. సంస్థలను ఏర్పరచుకొనే స్వేచ్ఛ.
  9. గౌరవప్రదంగా వ్యక్తి తన కార్యకలాపాలు నిర్వర్తించుకొనే స్వేచ్ఛ.
  10. దౌర్జన్యాన్ని నిరోధించి వ్యతిరేకించే స్వేచ్ఛ.

ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 1995 – 2005 దశకాన్ని అంతర్జాతీయ మానవ హక్కుల దశాబ్దిగా ప్రకటించింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా నివసించే ప్రజలందరికీ మానవ హక్కులను ప్రసాదించే ఉద్దేశంతో ఈ కాలంలో అనేక చర్యలను గైకొన్నది.

మానవ హక్కుల వర్గీకరణ :
మానవ హక్కులను స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి (1) పౌర, రాజకీయ హక్కులు (ii) సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక హక్కులు. సమాజంలో పౌరహక్కులు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి. జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు, వ్యక్తుల భద్రత హక్కు, బానిసత్వం లేదా వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందే హక్కు వంటి అనేక హక్కులు పౌరహక్కులలో పేర్కొనడమైంది.

చట్టం నుంచి సమానంగా రక్షణ పొందేహక్కు, బలవంతంగా నిర్భందించడం నుంచి రక్షణ పొందే హక్కు, నిష్పాక్షికంగా విచారణ పొందే హక్కు ఆస్తి హక్కు, వివాహపు హక్కు వంటి ఇతర హక్కులు కూడా పౌరహక్కులలో ఇమిడి ఉన్నాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
హక్కుల లక్షణాలేవి ?
జవాబు.
హక్కులు-నిర్వచనం :
“హక్కులనేవి మానవుల సామాజిక జీవనానికి అవసరమైనవి. అవి లేకుండా ఏ ఒక్కరూ సాధారణంగా అత్యుత్తమమైన వ్యక్తిగా రూపొందటం సాధ్యం కాదు” అని హెచ్.జె. లాస్కి పేర్కొన్నారు.

హక్కుల లక్షణాలు (Features of Rights) : హక్కులు కింద పేర్కొన్న లక్షణాలను కలిగి ఉంటాయి.

1. సమాజంలోనే సాధ్యం (Possible only in Society) :
హక్కులు సమాజంలోనే ఉద్భవిస్తాయి. అవి మానవుల సామాజిక జీవనానికి ప్రతీకగా ఉంటాయి. సమాజం వెలుపల అవి ఉండవు.

2. సామాజిక స్వభావం (Social Nature) :
హక్కులను వ్యక్తుల కోర్కెలుగా భావించవచ్చు. అటువంటి కోర్కెలు సమాజంలోనే నెరవేరుతాయి. రాజ్యం వాటిని గుర్తించి పెంపొందించేందుకు దోహదపడుతుంది. కాబట్టి హక్కులనేవి సామాజిక స్వభావమైనవని చెప్పవచ్చు.

3. ప్రకృతిసిద్ధమైనవి (Natural) :
హక్కులనేవి మానవుల సామాజిక ప్రవృత్తికి నిదర్శనంగా ఉంటాయి. ఈ విషయాన్ని సామాజిక ఒడంబడిక సిద్ధాంతకర్తలు ప్రకటించారు. వారి భావాలను ఆధునిక కాలంలో కొంతమేరకు ఆమోదించడమైనది.

4. రాజ్యంచే అమలై రక్షించబడటం (Enforced and Protected by state) :
హక్కులనేవి రాజ్యంచేత అమలుచేయబడి రక్షించబడతాయి. రాజ్యంలోని వివిధ ఉన్నత న్యాయసంస్థలు వాటికి సంరక్షకులుగా వ్యవహరిస్తాయి. వేరొక రకంగా చెప్పాలంటే ఉన్నత న్యాయస్థానాలు హక్కులను కాపాడతాయి. మరొక విషయం ఏమిటంటే హక్కులను ఒక్క ప్రజాస్వామ్య రాజ్యాలలోని పౌరులు మాత్రమే అనుభవిస్తారు.

5. నిరపేక్షమైనవి కావు (Not Absolute):
హక్కులు నిరపేక్షమైనవి కావు. వాటి వినియోగంపై ‘రాజ్యం, సమాజం కొన్ని ఆంక్షలను విధిస్తుంది. అటువంటి ఆంక్షలు సమాజంలో శాంతి భద్రతల నిర్వహణకు ఉద్దేశించినవి. ‘అంతేకాకుండా హక్కులనేవి సామాజిక శ్రేయస్సు, భద్రతలను పెంపొందించేందుకు దోహదపడతాయని చెప్పవచ్చు.

6. సంబంధిత బాధ్యతలు (Corresponding Responsibilities) :
హక్కులు, బాధ్యతలు ఒకదానికొకటి పరస్పర ఆధారాలుగా ఉంటాయి. ప్రతి హక్కు ఒక బాధ్యతను కలిగి ఉంటుంది. అందుచేత సమాజంలో నివసించే ప్రతి వ్యక్తి తనకు గల హక్కులనే తోటివారు కూడా కలిగి ఉంటారని గ్రహించాలి.

అట్లాగే తోటివారు కూడా వారి హక్కులను వినియోగించుకోవటంలో ప్రతి వ్యక్తికి తగిన సహకారాన్ని అందించాలి. హక్కులు లేని బాధ్యతలు లేదా బాధ్యతలు ‘లేని హక్కులు అనేవి నాగరిక సమాజంలో ఉండవు. హక్కులు, బాధ్యతలు రెండూ వ్యక్తుల ప్రశాంత సామాజిక జీవనానికి ఎంతగానో ఆవశ్యకమైనవి.

7. విశ్వవ్యాప్తమైనవి (Universal) :
హక్కులనేవి విశ్వవ్యాప్తమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి అందరికి వర్తిస్తాయి. వీటిని ప్రజలందరు ఎటువంటి తారతమ్యాలు లేకుండా అనుభవిస్తారు.

8. మార్పులకు అవకాశం (Scope for changes) :
హక్కులనేవి కాలానుగుణంగా ప్రజల అవసరాలను బట్టి మారుతుంటాయి. అట్లాగే దేశ కాలపరిస్థితులలో వచ్చే మార్పులనుబట్టి అభివృద్ధి చెందుతాయి. గతంలో లేని కొన్ని హక్కులు వర్తమాన కాలంలో ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులు వ్యక్తుల హక్కులపై విశేషమైన ప్రభావాన్ని చూపుతాయి.

9. రాజ్యం కంటే ముందుగా ఉండటం (Precede the State) :
చరిత్ర ఫలితాలే హక్కులు. హక్కులు కాలక్రమేణా ఒక క్రమానుగత రీతిలో ఆవిర్భవించాయని విశ్వసించారు. రాజ్యం ఆవిర్భావానికి ముందే హక్కులు ఉన్నాయి. అయితే ఆ తరువాత వాటిని రాజ్యం గుర్తించింది.

10. ఉమ్మడి శ్రేయస్సు (Common Good) :
హక్కులనేవి ఎల్లప్పుడూ ఉమ్మడి శ్రేయస్సును పెంపొందించేందుకై ఏర్పడి వికసించాయి. సమాజం, రాజ్యం చేత గుర్తింపు పొంది, ఉమ్మడి శ్రేయస్సును పెంపొందించే హక్కులను మాత్రమే వ్యక్తులు అనుభవిస్తారు. వ్యక్తులు సుఖ సౌభాగ్యవంతమైన జీవనాన్ని గడిపేందుకు హక్కులు అవసరమవుతాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 2.
రాజకీయ హక్కులను వివరించండి.
జవాబు.
ప్రజాస్వామ్య దేశాలలో ప్రభుత్వ వ్యవహారాలలో పౌరులు పాల్గొనటానికి అవకాశం కల్పించబడింది. ఈ అవకాశాలనే రాజకీయ హక్కులు అందురు. రాజకీయ హక్కులు ముఖ్యంగా 5 అవి :

1. ఓటు హక్కు (Right to Vote) :
ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలలో పౌరులు అనుభవించే అతి ముఖ్యమైన రాజకీయ హక్కు ఓటు హక్కు వయోజన పౌరులు ఈ హక్కును వివిధ శాసన నిర్మాణ సంస్థలలో తమ ప్రతినిధులను ఎన్నుకొనేందుకు శక్తివంతమైన ఆయుధంగా వినియోగిస్తారు.

ఈ హక్కు వారిని నిజమైన సార్వభౌములుగా రూపొందిస్తుంది. వయోజన పౌరులందరూ వర్ణం, పుట్టుక, భాష, తెగ, మతం, ప్రాంతం వంటి తారతమ్యాలు లేకుండా ఈ హక్కును కలిగి ఉంటారు. అయితే విదేశీయులు, మైనర్లకు ఈ హక్కు వర్తించదు.

2. ఎన్నికలలో అభ్యర్థిగా పోటీచేసే హక్కు (Right to Contest in Elections) :
రాజ్యంలో పౌరులు వివిధ శాసన నిర్మాణ సంస్థలకు అభ్యర్థులుగా పోటీచేసేందుకు ఈ హక్కు అధికారమిస్తుంది. రాజకీయ సామర్థ్యం ఆసక్తి, శక్తివంతమైన నాయకత్వం వంటి లక్షణాలు గల పౌరులు రాజ్యానికి సంబంధించిన రాజకీయ యంత్రాంగ నిర్వహణలలో చురుకుగా పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. దాంతో ఈ హక్కు పౌరులలో విశేషమైన రాజకీయ పరిజ్ఞానాన్ని, ఆసక్తిని పెంపొందిస్తుంది. ఈ హక్కు ప్రజాస్వామ్య రాజ్యానికి ప్రధాన ప్రాతిపదికగా ఉంటుంది.

3. ప్రభుత్వ పదవులను చేపట్టే హక్కు (Right to Hold Public Offices) :
పౌరులు వివిధ రకాల ప్రభుత్వ పదవులను చేపట్టి, నిర్వహించేందుకు ఈ హక్కు అనేక అవకాశాలను కల్పిస్తుంది. ఈ హక్కు ప్రకారం ఏ ఒక్క పౌరుడు ఇతరులతో పోల్చినచో ఎటువంటి ప్రత్యేకమైన సౌకర్యాలను కానీ, మినహాయింపులు కానీ పొందేందుకు వీలులేదు. ప్రభుత్వాధికారాన్ని ఎంతో హుందాగా నిర్వహించేందుకు ఈ హక్కు పౌరులకు సహాయకారిగా ఉంటుంది.

4. విజ్ఞాపన హక్కు (Right to Petition) :
పౌరులు తమ అవసరాలు లేదా సమస్యలను ప్రభుత్వ దృష్టికి విజ్ఞప్తుల ద్వారా తెచ్చేందుకు ఈ హక్కు దోహదపడుతుంది. ఆధునిక రాజ్యంలో ఈ హక్కు ఎంతో ప్రాధాన్యత గల రాజకీయ హక్కుగా పరిగణించబడింది.

ఈ హక్కు ద్వారా పౌరులు ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి, తగిన పరిష్కారాలను పొందుతారు. అలాగే ప్రభుత్వాధికారులు ప్రజా సమస్యలను తెలుసుకొని, వాటిని సకాలంలో పరిష్కరించేటట్లు ఈ హక్కు సహాయపడుతుంది.

5. విమర్శించే హక్కు (Right to Criticism) :
ఈ హక్కు ప్రభుత్వానికి సంబంధించిన అనేక విధానాలు, కార్యక్రమాలను విమర్శించేందుకు పౌరులకు అవకాశం ఇస్తుంది. అలాగే వివిధ్య స్థాయిలలో నాయకులు, పరిపాలన సిబ్బంది పాల్పడే అవకతవకలను బహిర్గతం చేసేందుకు ఇది తోడ్పడుతుంది.

అంతేకాకుండా కాలానుగుణంగా ప్రభుత్వం అనుసరించే విధానాలపై పౌరులు సహేతుకమైన, నిర్మాణాత్మకమైన విమర్శలను చేసేందుకు అవకాశమిస్తుంది. ఈ హక్కు అంతిమంగా పరిపాలనాధికారులు, విధాన రూపకర్తలు తమ విద్యుక్త ధర్మాలను ఎంతో అప్రమత్తంగా, జాగ్రత్తగా నిర్వహించేటట్లు చూస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 3.
ముఖ్యమైన కొన్ని పౌర, రాజకీయ హక్కులను వివరించండి.
జవాబు.
1. పౌర హక్కులు :
సామాజిక జీవనాన్ని సంతోషం, హుందాతనంతో గడిపేందుకు వ్యక్తులకు అవసరమైన కనీస పరిస్థితులను కల్పించేందుకు పౌర హక్కులను కల్పించడం జరిగింది. ఈ హక్కులు నాగరిక సమాజానికి అత్యంత ఆవశ్యకమైనవి. పౌరహక్కులు ప్రజాస్వామ్యం కల్పించిన ఒక బహుమతిగా భావించాలి. ఈ హక్కులను పౌరులందరికీ కల్పించడంతోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. పౌరులకు నాగరికమైన సామాజిక జీవనం కొనసాగించడానికి పౌర హక్కులు అవకాశాలను కల్పించాయి.

సమాజంలోని మానవులకు ఈ పౌర హక్కులు కల్పించడంతో మౌలికమైన అవసరాలు తీర్చినట్లవుతుంది. జీవించే హక్కు, స్వాతంత్ర్యపు హక్కు, మతహక్కు, ఆస్తిహక్కు, విద్యాహక్కు, సమానత్వపు హక్కు, కుటుంబ హక్కు వంటివి పౌరహక్కులలో కొన్నింటికి ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.

2. రాజకీయ హక్కులు :
ప్రజాస్వామ్యంలో రాజకీయ హక్కులను మౌలిక అవసరంగా పరిగణించవచ్చు. వాస్తవానికి ఈ హక్కుల సద్వినియోగం తీరుపైనే ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరు, విజయం ఆధారపడి ఉంటుంది. రాజకీయ సమాజం ఏర్పాటులో ఈ హక్కులు కీలకపాత్ర పోషిస్తాయి.

ఎందుకంటే ఈ హక్కులు ప్రభుత్వ వ్యవహారాలలో పౌరులు పాల్గొనేందుకు అనేక అవకాశాలను కల్పిస్తాయి. ఒక్క ప్రజాస్వామ్య రాజ్యంలో మాత్రమే ఈ హక్కులను పౌరులు సంపూర్ణంగా అనుభవిస్తారు. ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీచేసే హక్కు, ప్రభుత్వ పదవులు చేపట్టే హక్కు, విజ్ఞాపన. హక్కు, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మొదలైనవి రాజకీయ హక్కులకు ఉదాహరణలుగా చెప్పవచ్చు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 4.
మానవ హక్కుల వర్గీకరణ, లక్ష్యాలను రాయండి.
జవాబు.
మానవ హక్కుల ఆశయాలు (Objectives of Human Rights): మానవ హక్కుల ఆశయాలను కింది విధంగా పేర్కొనవచ్చు.

  1. ప్రజలందరికీ ఎటువంటి వివక్షత లేని స్వాతంత్ర్యాన్ని అందించటం.
  2. పేదరికం నుండి విముక్తి.
  3. వ్యక్తులలో నిబిడీకృతమై ఉన్న సామర్థ్యాలను వినియోగించుకొనే స్వేచ
  4. భయం నుండి విముక్తి.
  5. రక్షణను పొందే స్వేచ్ఛ.
  6. అన్యాయానికి వ్యతిరేకంగా స్వేచ్ఛ.
  7. వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వాతంత్య్రం.
  8. సంస్థలను ఏర్పరచుకొనే స్వేచ్ఛ.
  9. గౌరవప్రదంగా వ్యక్తి తన కార్యకలాపాలు నిర్వర్తించుకొనే స్వేచ్ఛ.
  10. దౌర్జన్యాన్ని నిరోధించి వ్యతిరేకించే స్వేచ్ఛ.

ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 1995-2005 దశకాన్ని అంతర్జాతీయ మానవ హక్కుల దశాబ్దిగా ప్రకటించింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా నివసించే ప్రజలందరికీ మానవ హక్కులను ప్రసాదించే ఉద్దేశంతో ఈ కాలంలో అనేక చర్యలను గైకొన్నది.

మానవ హక్కుల వర్గీకరణ :
మానవ హక్కులను స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి :

  1. పౌర, రాజకీయ హక్కులు
  2. సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక హక్కులు.

1.A. పౌరహక్కులు : సమాజంలో పౌరహక్కులు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి. పౌరహక్కులకు ఉదాహరణలు.

  1. జీవించే హక్కు
  2. స్వేచ్ఛ హక్కు
  3. వ్యక్తుల భద్రత హక్కు.
  4. వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందే హక్కు
  5. చట్టం నుంచి సమానంగా రక్షణ పొందే హక్కు
  6. బలవంతంగా నిర్భందించడం నుంచి రక్షణ పొందే హక్కు
  7. నిష్పాక్షికంగా విచారణ పొందే హక్కు
  8. ఆస్తి హక్కు
  9. వివాహపు హక్కు
  10.  వాక్ స్వాతంత్య్రపు హక్కు.
  11. భావ ప్రకటన హక్కు
  12. సంస్థలను, సంఘాలను స్థాపించుకునే హక్కు
  13. సభలు, సమావేశాలు నిర్వహించుకునే హక్కు
  14. స్వేచ్ఛగా సంచరించే హక్కు.

1.B. రాజకీయ హక్కులు :

  1. ఓటు హక్కు
  2. ఎన్నికలలో పోటీచేసే హక్కు
  3.  అధికారం పొందే హక్కు
  4. విమర్శించే హక్కు
  5. విజ్ఞాపన హక్కు

2.A. సాంఘిక హక్కులు:

  1.  విద్యా హక్కు
  2. ఆరోగ్య హక్కు
  3. వినోదపు హక్కు మొదలైనవి

2.B. ఆర్థిక హక్కులు :

  1. పని హక్కు
  2. సమానమైన పనికి సమానమైన వేతనం పొందే హక్కు
  3. కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు
  4. సంతృప్తికరమైన జీవనస్థాయిని కలిగి ఉండే హక్కు

2.C. సాంస్కృతిక హక్కులు:

  1. నాగరికత
  2. కళలు
  3. సంస్కృతిని గౌరవించడం వంటి అంశాలు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 5.
వివిధ రకాలైన విధులను చర్చించండి.
జవాబు.
బాధ్యతలు :
సమాజంలో నివశించే వ్యక్తులు ఇతర వ్యక్తుల పట్ల నిర్వర్తించే అంశాలనే బాధ్యతలు అంటారు. బాధ్యతలు అనేవి ‘ఇతరుల పట్ల ఒక వ్యక్తి కలిగి ఉండే కర్తవ్యం, విధి అని అర్థం.

బాధ్యతల రకాలు (Types of Responsibilities) :
బాధ్యతలు స్థూలంగా రెండు రకాలుగా చెప్పవచ్చు. అవి : (i) నైతిక బాధ్యతలు (ii) చట్టబద్ధమైన బాధ్యతలు. ఈ రెండింటిని కింది విధంగా వివరించవచ్చు.

(i) నైతిక బాధ్యతలు (Moral Responsibilities) :
నైతిక బాధ్యతలు అనేవి నైతిక అంశాల ప్రాతిపదికపై వ్యక్తులు నిర్వహించాల్సిన కర్తవ్యాలను సూచిస్తాయి. వీటకి రాజ్యంచేత రూపొందించబడే చట్టాలు మద్దతు ఇవ్వవు, బలపరచవు. ఇవి ప్రజల నైతిక విశ్వాశాలపై ఆధారపడి రూపొందుతాయి.

సమాజంలోని కొన్ని ఆచార సాంప్రదాయాలు వాడుకల ఆధారంగా ఇవి ఏర్పడతాయి. వీటి ఉల్లంఘన ఎటువంటి శిక్షకు దారితీయదు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం, అస్వస్థులకు సహాయపడటంలాంటివి నైతిక బాధ్యతలకు కొన్ని ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.

(ii) చట్టబద్ధమైన బాధ్యతలు (Legal Responsibilities) :
చట్టబద్ధమైన బాధ్యతలనేవి న్యాయస్థానాలు, చట్టాల మద్దతుతో అమలులోకి వస్తాయి. వీటికి శాసనాత్మక ప్రాముఖ్యత ఉంటుంది. ఇవి ఎంతో స్పష్టమైనవి, ఖచ్చితమైనవి. ఇవి నిర్బంధమైన, శిక్షాత్మకమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి.

కాబట్టి వీటిని ఉల్లంఘించినవారు శిక్షకు పాత్రులవుతారు. రాజ్య చట్టాలకు విధేయత చూపటం, పన్నులు చెల్లించటం, శాంతి భద్రతల నిర్వహణలలో అధికారులకు సహాయం అందించటంలాంటివి చట్టబద్దమైన బాధ్యతలలో ముఖ్యమైనవి.

చట్టబద్ధమైన బాధ్యతలు మరలా రెండు రకాలుగా వర్గీకరించబడినాయి. అవి:

  1. సంవర్థక బాధ్యతలు
  2. సంరక్షక బాధ్యతలు.

1. సంవర్థక బాధ్యతలు (Positive Responsibilities) :
సంవర్థక బాధ్యతలనేవి సమాజ ప్రగతి, సంక్షేమాల సాధన, పటిష్టతలకై ఉద్దేశించబడినవి. రాజ్య చట్టాల పట్ల విధేయత, దేశ రక్షణ, పన్నుల చెల్లింపులాంటివి ఈ రకమైన బాధ్యతలకు ఉదాహరణలు చెప్పవచ్చు. ఇటువంటి బాధ్యతలు రాజ్య ఆశయాలను నెరవేర్చడంలో ప్రభుత్వానికి ప్రజలు సహకారాన్ని అందించేందుకు ఉద్దేశించినాయి.

2. సంరక్షక బాధ్యతలు (Negative Responsibilities) :
చట్టం నిషేధించిన కార్యక్రమాలను చేపట్టకుండా వ్యక్తులు దూరంగా ఉండేందుకు పేర్కొన్నవే సంరక్షక బాధ్యతలు. ఈ రకమైన బాధ్యతలు ప్రజలను కొన్ని నిర్ధిష్టమైన కార్యక్రమాలలో పాల్గొనకుండా ఉంచుతాయి. రాజ్యం తరపున ప్రభుత్వం ఈ సందర్భంలో కొన్ని నియమ నిబంధనలను రూపొందించి అమలుచేస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 6.
పౌర, రాజకీయ హక్కుల మధ్య తేడాలను వ్రాయండి.
జవాబు.
1. పౌర హక్కులు :
సామాజిక జీవనాన్ని సంతోషం, హుందాతనంతో గడిపేందుకు వ్యక్తులకు అవసరమైన కనీస పరిస్థితులను కల్పించేందుకు పౌర హక్కులను కల్పించడం జరిగింది. ఈ హక్కులు నాగరిక సమాజానికి అత్యంత ఆవశ్యకమైనవి. పౌరహక్కులు ప్రజాస్వామ్యం కల్పించిన ఒక బహుమతిగా భావించాలి. ఈ హక్కులను పౌరులందరికీ కల్పించడంతోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. పౌరులకు నాగరికమైన సామాజిక జీవనం కొనసాగించడానికి పౌర హక్కులు అవకాశాలను కల్పించాయి.

సమాజంలోని మానవులకు ఈ పౌర హక్కులు కల్పించడంతో మౌలికమైన అవసరాలు తీర్చినట్లవుతుంది. జీవించే హక్కు, స్వాతంత్ర్యపు హక్కు, మతహక్కు, ఆస్తిహక్కు, విద్యాహక్కు, సమానత్వపు హక్కు, కుటుంబ హక్కు వంటివి పౌరహక్కులలో కొన్నింటికి ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.

2. రాజకీయ హక్కులు :
ప్రజాస్వామ్యంలో రాజకీయ హక్కులను మౌలిక అవసరంగా పరిగణించవచ్చు. వాస్తవానికి ఈ హక్కుల సద్వినియోగం తీరుపైనే ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరు, విజయం ఆధారపడి ఉంటుంది. రాజకీయ సమాజం ఏర్పాటులో ఈ హక్కులు కీలకపాత్ర పోషిస్తాయి.

ఎందుకంటే ఈ హక్కులు ప్రభుత్వ వ్యవహారాలలో పౌరులు పాల్గొనేందుకు అనేక అవకాశాలను కల్పిస్తాయి. ఒక్క ప్రజాస్వామ్య రాజ్యంలో మాత్రమే ఈ హక్కులను పౌరులు సంపూర్ణంగా అనుభవిస్తారు. ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీచేసే హక్కు, ప్రభుత్వ పదవులు చేపట్టే హక్కు, విజ్ఞాపన. హక్కు, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మొదలైనవి రాజకీయ హక్కులకు ఉదాహరణలుగా చెప్పవచ్చు.

ప్రశ్న 7.
హక్కులు, విధుల మధ్య సంబంధాన్ని తెల్పండి.
జవాబు.

హక్కులువిధులు
నిర్వచనంరాజ్యం ప్రజలకందించిన అధికారాలు, హక్కులు.ఓ వ్యక్తి అనుభవించే హక్కు ఇతరుల పట్ల అతను నిర్వహించవలసిన విధి అవుతుంది.
చట్టంసాధారణంగా న్యాయస్థానాల ద్వారా హక్కులకు రక్షణ కలిగేలా రాజ్యం చూస్తుంది లేదా సవాలు చేయవచ్చు.పౌర విధులను న్యాయస్థానాల ద్వారా సవాలు చేసే వీలు కాదు.
ఆధారంగావ్యక్తి అనుభవించే అధికారాలు హక్కులు.వ్యక్తిగతంగా విధులు నిర్వర్తించడం, జవాబుదారీతనం ఆధారంగా విధులు ఉంటాయి.

 

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
హక్కులను నిర్వచించండి.
జవాబు.

  1. “వ్యక్తి మూర్తిమత్వ, సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన బాహ్యపరమైన పరిస్థితులే హక్కులు” అని బార్కర్ పేర్కొన్నాడు.
  2. “హక్కులనేవి మానవుల సామాజిక జీవనానికి అవసరమైనవి. అవి లేకుండా… ఏ ఒక్కరూ సాధారణంగా, అత్యుత్తమమైన వ్యక్తిగా రూపొందటం సాధ్యం కాదు” అని హెచ్.జె. లాస్కి పేర్కొన్నాడు.

ప్రశ్న 2.
హక్కులను ‘వర్గీకరించండి.
జవాబు.
హక్కులను విస్తృత ప్రాతిపదికపై మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి :

  1. సహజ హక్కులు
  2. నైతిక హక్కులు
  3. చట్టబద్ధమైన హక్కులు.

చట్టబద్ధమైన హక్కులు మరలా మూడు రకాలుగా వర్గీకరింపబడినాయి. అవి :

  1.  పౌర హక్కులు
  2. రాజకీయ హక్కులు
  3. ఆర్థిక హక్కులు.

ప్రశ్న 3.
పౌర హక్కులేవి ?
జవాబు.
నాగరిక జీవనాన్ని గడపటానికి అవసరమయ్యే హక్కులనే పౌరహక్కులు అంటారు. అన్ని రాజ్యాలు తమ ప్రజలకు ఈ హక్కులను ఇస్తున్నాయి. ఈ హక్కులపై అనేక మినహాయింపులు ఉంటాయి. ముఖ్యమైన పౌరహక్కులు ఏమనగా :

  1. జీవించే హక్కు
  2. స్వేచ్ఛ హక్కు
  3. సమానత్వపు హక్కు
  4. ఆస్తి హక్కు
  5. కుటుంబపు హక్కు
  6. విద్యా హక్కు మొదలైనవి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 4.
సహజ హక్కులు.
జవాబు.
మానవులు జన్మతః అనుభవించే హక్కులే సహజ హక్కులుగా పరిగణించడమైనది. నాగరిక సమాజ ఆవిర్భావానికి ముందే ఈ హక్కులను మానవులు అనుభవించారు. సమాజం, రాజ్యం వీటిని గుర్తించి, గౌరవించాయి. సహజ హక్కులు సిద్ధాంత ప్రతిపాదకుడైన జాన్ లాక్ హక్కులనేవి సమాజం, రాజకీయ వ్యవస్థలు ఏర్పడక ముందే ఉన్నాయన్నాడు.

జీవించే హక్కు, స్వాతంత్ర్యాన్ని అనుభవించే హక్కు, ఆస్తి హక్కు వంటివి ప్రధానమైన సహజ హక్కులకు ఉదాహరణలుగా పేర్కొన్నాడు. మానవులకు గల ఈ హక్కులను రాజ్యం తిరస్కరించరాదన్నాడు.

ప్రశ్న 5.
నైతిక హక్కులు.
జవాబు.
నైతిక హక్కులు సమాజంలోని నైతిక సూత్రాలు ఆధారంగా రూపొందాయి. సమాజంలో నివసించే వ్యక్తులకు నైతికపరమైన అవగాహనను కలిగించేందుకు ఈ రకమైన హక్కులను ఇవ్వటమైనది. సమాజంలోని నైతిక సూత్రాలే ఇటువంటి హక్కులకు ప్రాతిపదికగా ఉన్నాయి.

ప్రజల ఆచారాలు, సాంప్రదాయాలు, వాడుకలు కూడా వీటికి ఆధారంగా ఉంటాయి. ఇవి ప్రజల అంతరాత్మకు సంబంధించినవి. పౌర సమాజంలోని వ్యక్తులు వీటిని అనుభవిస్తారు. వీటికి చట్టపరమైన మద్దతు లేనప్పటికి సమాజం వీటిని బలపరుస్తుంది. అందుచేత వీటి ఉల్లంఘన ఏ రకమైన శిక్షకు దారితీయదు.

ప్రశ్న 6.
రాజకీయ హక్కులేవి ?
జవాబు.
రాజ్యము, ప్రభుత్వము యొక్క కార్యకలాపాలలో పాల్గొనేందుకై ప్రజలకు పూర్తి అవకాశాలను కల్పించే హక్కులనే రాజకీయ హక్కులని అంటారు. ఉదాహరణకు ఓటు హక్కు, ఎన్నికలలో అభ్యర్థిగా పోటీచేసే హక్కు, ప్రభుత్వ పదవులు చేపట్టే హక్కు, విజ్ఞాపన హక్కు, విమర్శించే హక్కు మొదలగునవి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 7.
మానవ హక్కుల లక్ష్యాలను తెల్పండి.
జవాబు.
మానవ హక్కులు కింది ఆశయాలను కలిగి ఉంటాయి.

  1. ప్రజలందరికీ ఎటువంటి వివక్షత లేని స్వాతంత్ర్యాన్ని అందించటం.
  2. పేదరికం నుండి విముక్తి.
  3. వ్యక్తులలో నిబిడీకృతమై ఉన్న సామర్థ్యాలను వినియోగించుకొనే స్వేచ్ఛ.
  4. భయం నుండి విముక్తి.

ప్రశ్న 8.
మానవ హక్కులు ఎన్ని రకాలు, అవి ఏవి ?
జవాబు.
మానవ హక్కులను స్థూలంగా రెండు రకములుగా వర్గీకరించవచ్చు. అవి 1) పౌర, రాజకీయ హక్కులు 2) సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక హక్కులు.

ప్రశ్న 9.
మానవ హక్కుల ప్రాముఖ్యత.
జవాబు.
మానవుల ప్రాథమిక జీవనానికి అత్యంత ఆవశ్యకమైనవే మానవ హక్కులు. మానవులందరూ ఈ హక్కులను కుల, మత, ప్రాంత, వర్గ, వర్ణ తారతమ్యం లేకుండా అనుభవిస్తారు. మానవ హక్కుల సాధనలో ఇంగ్లాండులోని ‘మాగ్నా కార్టా’ అనేది మొదటి ప్రయత్నంగా చెప్పవచ్చు. ఐక్యరాజ్యసమితి కృషి వలన మానవ హక్కులను ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలో ప్రజలు అనుభవిస్తున్నారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 10.
విధులు వర్గీకరణ.
జవాబు.
బాధ్యతలను స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి

  • నైతిక బాధ్యతలు
  • చట్టబద్ధమైన బాధ్యతలు.

చట్టబద్ధమైన బాధ్యతలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి

  • సంవర్థక బాధ్యతలు
  • సంరక్షక బాధ్యతలు.

ప్రశ్న 11.
నైతిక బాధ్యతలు.
జవాబు.
నైతిక బాధ్యతలు నైతిక అంశాల ప్రాతిపదికపై వ్యక్తులు నిర్వహించాల్సిన కర్తవ్యాలను సూచిస్తాయి. వీటికి చట్టపరమైన ఆంక్షలు ఉండవు. ఇవి ప్రజల నైతిక విశ్వాసాలపై ఆధారపడి రూపొందుతాయి. సమాజంలోని ఆచారాలు, సాంప్రదాయాలు, వాడుక పద్ధతుల ఆధారంగా ఇవి ఏర్పడతాయి. వీటికి ఉదాహరణ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం, అస్వస్థులకు సహాయపడటం మొదలైనవి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 12.
కొన్ని ముఖ్య ఆర్థిక హక్కులను పేర్కొనండి.
జవాబు.
ఆర్థిక హక్కులు :
వ్యక్తులు తమ జీవనభృతికి సహేతుకమైన, చట్టబద్ధమైన మార్గాలద్వారా సంపాదించుకొనేందుకు ఈ హక్కులు అవకాశం కల్పిస్తాయి. అట్లాగే ఇవి వ్యక్తుల దైనందిన అవసరాలకు తోడ్పడుతాయి. హక్కులు వ్యక్తులకు ఆర్థిక భద్రత కల్పిస్తాయి. వర్ధమాన శతాబ్దంలోని (21వ శతాబ్దం) ప్రపంచ దేశాలన్నింటిలో ఈ హక్కులకు ప్రాచుర్యం లభించింది.

కనీస వేతనాన్ని పొందే హక్కు, పనిహక్కు, విశ్రాంతిని పొందే హక్కు, పనిచేసే ప్రదేశాలలో కనీస సదుపాయాలను పొందే హక్కు, కార్మిక సంఘాలను ఏర్పరచుకొనే హక్కు, వృద్ధాప్యం మరియు అంగవైకల్యం నుంచి ఉపశమనం పొందే హక్కు మొదలైనవి ఆర్థిక హక్కులకు ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.

TS Inter 1st Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 5th Lesson రాజనీతి భావజాలాలు Textbook Questions and Answers.

TS Inter 1st Year Political Science Study Material 5th Lesson రాజనీతి భావజాలాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
వ్యక్తి శ్రేయోవాదం అంటే ఏమిటి ? వివరించండి.
జవాబు.
అర్థం :
వ్యక్తి శ్రేయోవాదం ప్రకారం రాజ్యం వ్యక్తుల వ్యక్తిగత విషయాలకు సంబంధించి వారి అభీష్టానికే వదిలేయాలంటుంది. ఈ సిద్ధాంతాన్ని జోక్యరహిత సిద్ధాంతం (Laissez Fair theory) అని కూడా అంటారు. Laissez Fair అనేది ఫ్రెంచ్ పదం.

దాని అర్థం ‘ఓంటరిగా వదిలేయ్’ (Leave alone), అంటే సాంఘిక జీవనంలో వ్యక్తే కేంద్ర బిందువు. ఈ సిద్ధాంతాన్ననుసరించి వ్యక్తికి వీలైనంత ఎక్కువ స్వేచ్ఛనివ్వాలి. రాజ్యం వీలైనంత తక్కువ జోక్యం’ కలిగి ఉండాలి. అంటే రాజ్యం వ్యక్తులను సమర్థించాలేగాని నియంత్రించకూడదు.

వ్యక్తి శ్రేయోవాదుల అభిప్రాయంలో “రాజ్యం ఆవశ్యకమైన దయ్యం” లాంటిది. రాజ్యం ఎందుకు అవసరమంటే వ్యక్తులను హింస నుంచి, మోసాల నుంచి కాపాడటానికి అవసరమని వ్యక్తి శ్రేయోవాదుల అభిప్రాయం. ఇది ఎందుకు దయ్యం లాంటిదంటే వ్యక్తుల స్వాతంత్ర్యాన్ని అడ్డుకుంటుంది. కాబట్టి, అందువల్ల వ్యక్తుల వ్యక్తిగత విషయంలో ఎంత తక్కువగా జోక్యం చేసుకుంటే అంతమంచిది.

రాజ్యం కింద తెలిపిన పరిమిత విధులను నిర్వహిస్తుంది.

  1. వ్యక్తులకు రక్షణ కల్పించటం విదేశీ దురాక్రమణల నుంచి కాపాడడం.
  2. ఒక వ్యక్తికి మరో వ్యక్తి నుంచి రక్షణ కల్పించడం.
  3. వ్యక్తుల ఆస్తులకు దోపిడి దొంగల నుంచి, విధ్వంసాల నుంచి రక్షణ కల్పించడం.
  4. తప్పుడు ఒప్పందాల నుంచి ఒప్పంద ఉల్లంఘనల నుంచి వ్యక్తులను కాపాడడం.

సిద్ధాంతం పుట్టుక – అభివృద్ధి:
18వ శతాబ్దం నాటికి యూరప్ లో నిరపేక్ష నియంతృత్వ, రాజరిక ప్రభుత్వాలు ఆచరణలో ఉండేవి. యూరప్కు చెందిన సామాజిక ఒడంబడిక సిద్ధాంతకర్తలు రాజనీతి పండితులైన జాన్లాక్, రూసో వంటి వారు వ్యక్తి స్వేచ్ఛలకు సంబంధించి వివరణలిచ్చారు. ఆ తరువాత 19వ శతాబ్దంలో వ్యక్తి శ్రేయోవాదానికి ఒక సంపూర్ణ రూపం వచ్చింది.

ఈ సిద్ధాంతం ఫ్రాన్స్లో బాగా వేళ్ళూనుకొని అటు పిమ్మట యూరప్ అంతటా విస్తరించింది. దీనిని ఆడమ్ స్మిత్, ఇతర సంప్రదాయ ఆర్థికవేత్తలు అభివృద్ధి చేశారు. అయితే జె.ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్లు దీనిని ఒక విధానంగాను రాజకీయ సిద్ధాంతంగానూ తీర్చిదిద్దారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

వ్యక్తిశ్రేయోవాదాన్ని పలు రకాలుగా వివరించవచ్చు.

నైతిక వాదన :
జె.ఎస్.మిల్ అభిప్రాయం ప్రకారం వ్యక్తుల విషయంలో రాజ్యం జోక్యం వారి అభీష్టాలను, అభివృద్ధిని నిరోధిస్తుంది. వ్యక్తులు స్వతహాగా నిర్వహించే బాధ్యతలను రాజ్యం తన భుజస్కందాల మీద వేసుకోవడం వల్ల వ్యక్తులు తమ బాధ్యతలను మరచిపోవడమే కాకుండా తమకు తామే కాకుండా పోతారు. దాని పర్యవసానంగా వ్యక్తులు నిస్సారంగా, నిస్సత్తువగా తయారౌతారు.

ఆర్థికవాదన :
వ్యక్తి శ్రేయోవాదానికి మద్దతుగా ఆడమస్మిత్ వాదనను లేవనెత్తాడు. ఆయన అభిప్రాయంలో ప్రతి వ్యక్తి తన అభీష్టం మేరకు శక్తివంచన లేకుండా తన అభివృద్ధికై పాటుపడతాడు. ఒకరకంగా ఆడమస్మిత్ వ్యక్తుల స్వప్రయోజనాలను గురించి ప్రజ్ఞావంతమైన వివరణ ఇచ్చాడని చెప్పవచ్చు.

వ్యక్తుల వ్యాపార, వాణిజ్య పరిశ్రమలకు సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలలో రాజ్యం ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోరాదని స్మిత్ గట్టిగా వాదించాడు. వ్యక్తులకు స్వేచ్ఛ ఇవ్వటంవల్ల స్వచ్ఛందంగా తమ స్వంత శక్తి సామర్థ్యాలను వినియోగించి అభివృద్ధి చెందుతారు.

కాబట్టి “జోక్యరహిత” (లేజాఫెయిర్) విధానంలో వ్యక్తుల అవసరంకంటే సమాజ అవసరమే ఎక్కువగా ఉందని వీరి వాదన. ఈ సిద్ధాంతం 18వ శతాబ్దపు చివరిభాగం 19వ శతాబ్దపు మొదటి దశలో ఇంగ్లాండులో పారిశ్రామిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడింది.

జీవైకవాదం :
హార్బర్ట్ స్పెన్సర్ అనే శాస్త్రవేత్త వ్యక్తి శ్రేయోవాదాన్ని సమర్థించే ఉద్దేశంతో జీవైక వాదనను ముందుకు తెచ్చాడు. ఇతని అభిప్రాయంలో ప్రాణికోటిలో ఏదైతే నిదొక్కుకోగలుగుతుందో ఆ జీవి మాత్రమే మనుగడను కొనసాగించగలుగుతుంది. ఆ విధంగా సమాజంలోని వ్యక్తులు స్వేచ్ఛాయుత పోటీలో నిలబడగలిగే వారే తమ మనుగడను కొనసాగించగలరు.

సహజ న్యాయం ప్రకారం మనుగడకు వారు మాత్రమే సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కాగలుగుతారు. రాజ్యం చేయగలిగిందల్లా స్వేచ్ఛాయుత పోటీలో వ్యక్తులకు అనుమతినివ్వటం. పేదలకు, వృద్ధులకు, రోగిష్ఠులకు చేయవలసిన అవసరం రాజ్యానికి ఎంతమాత్రం లేదని వ్యక్తి శ్రేయోవాదుల అభిప్రాయం.

అనుభవిక వాదం :
ఇప్పటివరకు మనం అనుభవంలో చూస్తున్నదేమంటే, ఎక్కడైనా, ఎప్పుడైనా రాజ్యం పరిశ్రమలను పర్యవేక్షించి నియంత్రిస్తుందో అక్కడ ఫలితాలను వెల్లడించడంలో జాప్యం కలుగుతుంది. అదే విధంగా అసమర్ధత, వస్తువులు వ్యర్థంకావటం జరుగుతుంది.

ఎప్పుడైతే రాజ్యం ప్రజాసమూహాల సాంఘిక, ఆర్థిక జీవన విధానాన్ని నియంత్రించటం లేదా పర్యవేక్షించటానికి చేసే ప్రయత్నాలన్నీ ఘోరంగా విఫలమవుతున్నాయి. అంతేకాదు, రాజ్యనిర్వహణ అంటేనే ఉద్యోగుల నిర్లక్ష్యం, అనవసరపు జాప్యం, ప్రతికూల ఆర్థిక విధానం, లంచగొండితనం మొదలైనవి ఉంటాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

ప్రశ్న 2.
ఉదారవాదం అంటే ఏమిటి ? దాని ప్రధాన అంశాలను తెలపండి.
జవాబు.
ఉదారవాదం చాలా విశాలమైన సిద్ధాంతం, వ్యక్తి శ్రేయోవాదం, ఉపయోగితావాదం, సంక్షేమ రాజ్యభావన మొదలైనవి దీనిలో అంతర్భాగమైనవే. వ్యక్తి శ్రేయోవాదాన్ని సాంప్రదాయిక ఉదారవాదంలో భాగంగానే చూస్తారు. వ్యక్తి శ్రేయోవాదం ఉద్దేశంలో వ్యక్తి చాలా హేతుబద్ధమైన జీవి.

తనకు కావల్సినవన్నీ సమకూర్చుకునే సామర్థ్యం ఉన్నవాడు కాబట్టి రాజ్యం కేవలం తనకు రక్షణ కవచంగా ఉంటే చాలు అని భావిస్తాడు. దీన్నే సంప్రదాయ ఉదారవాదం అంటారు. ఉదారవాదం రెండు రకాలు, అవి : సాంప్రదాయిక ఉదారవాదం మొదటిదికాగా ఆధునిక ఉదారవాదం రెండవది.

ఆధునిక ఉదారవాదం 19వ శాతాబ్దపు ఉదారవాదానికి భిన్నమైనది. 20వ శతాబ్దంలో ఉదారవాదం ఎంతో పరిణతి చెందింది. ఎందుకంటే మధ్యతరగతి వర్గ సిద్ధాంతం నుంచి ఒక జన బాహుళ్య సిద్ధాంతంగా మార్పు చెందింది. ముఖ్యంగా టి. హెచ్, గ్రీస్ వివరించిన నైతిక కోణాన్ని తనలో ఇముడ్చుకొని ఆధునిక ఉదారవాదంగా పరిణతి చెందింది.

అదే విధంగా మరికొంత మంది శాస్త్రవేత్తలైన హాబ్ హౌస్, హెచ్.జె. లాస్కీ వంటివారి అభిప్రాయాలతో ప్రభావితమై 20వ శతాబ్దపు అర్ధభాగంలో వ్యక్తుల ప్రయోజనాలను కాపాడేవిధంగా సానుకూల వైఖరిని ఏర్పరచుకొని పాజిటివ్ ఉదారవాదం లేదా ఆధునిక ఉదారవాదంగా గుర్తింపు పొందింది.

అర్థం, నిర్వచనాలు :
ఎంతోమంది అభిప్రాయాలతో అనేక పరిణామాల మధ్య మూడు శతాబ్దాలపాటు పరిణామం చెందిన ఉదారవాదాన్ని నిర్దిష్టంగా నిర్వచించటం చాలా కష్టం. సాంప్రదాయక వైఖరి ప్రకారం ఉదారవాదం వ్యక్తి స్వేచ్ఛలను కాపాడటం, ప్రజాస్వామిక సంస్థల స్థాపన, స్వేచ్ఛా ఆర్థిక విధానం లక్షణాలను కలిగి ఉండేది. ఆధునిక ఉదారవాదం ప్రకారం వ్యక్తి వికాసానికి కావాల్సినంత రక్షణను కల్పిస్తూ సానుకూల వైఖరిని కలిగి ఉంది.

వెబ్స్టర్ నిఘంటువు ప్రకారం వ్యక్తుల హక్కులను, స్వేచ్ఛలను రాజకీయ, ఆర్థిక, ఉద్యోగస్వామ్య ఆధిపత్యాల నుంచి కాపాడే సిద్ధాంతమే ఉదారవాదం. మరో విధంగా చెప్పాలంటే ప్రభుత్వాన్ని ప్రగతిశీలమైన వ్యవస్థగా తీర్చిదిద్దటానికి కావల్సిన సైద్ధాంతిక భూమికయే ఉదారవాద సిద్ధాంతం.

మౌలిక అంశాలు :

  1. వ్యక్తి సహేతుకమైన జీవి, సమాజ శ్రేయస్సుకు కావల్సిన సహాయ సహకారం అందివ్వగలడు. అదేవిధంగా తన అభివృద్ధిని పెంచుకోగలడు. వ్యక్తి పుట్టుకతోనే కొన్ని సహజ హక్కులను కలిగి ఉన్నాడు. వాటిని ఏ అధికార శక్తీ తొలగించలేదు.
  2. వ్యక్తి యొక్క వ్యక్తిగత ప్రయోజనాలకు, సమష్టి ప్రయోజనాలకు మధ్య ఎటువంటి వైరుధ్యం లేదు. నిజానికి, పలుకరాల వ్యక్తి ప్రయోజనాలను సమన్వయం చేయడంవల్లనే సమష్టి ప్రయోజనాలు ఏర్పడతాయి.
  3. పౌర సమాజం, రాజ్యం వ్యక్తుల ద్వారా నిర్మితమైన యాంత్రికమైన సంస్థలు. అవి సమష్టి ప్రయోజనాలను కాపాడతాయి.
  4. ఉదారవాదం ప్రకారం స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, ప్రజాస్వామ్యం వ్యక్తుల సామాజిక జీవనానికి ఎంతో అవసరమైనవి.
  5. ఉదారవాదం, వ్యక్తుల పౌర స్వేచ్ఛలను కాపాడుతుంది. వాటిని పెంపొందించటానికి కావల్సిన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది.
  6. ఉదారవాదం వ్యక్తులు తమ సమ్మతి మేరకు వ్యక్తులతో గాని, సంస్థలతోగాని ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అవకాశం కల్పిస్తుంది.
  7. ఉదారవాదం సమాజంలోని వివిధ సమూహాల సమష్టి ప్రయోజనాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ విధానాలు రూపొందించాలని ఆశిస్తుంది.

ఏది ఏమైనప్పటికీ, ఉదారవాదం మార్కెట్ సమాజాన్ని కోరుకుంటుంది. రాజ్యం వ్యక్తుల ఆస్తులకు, ఒప్పందాలకు, కనీసపు సేవలు అందివ్వటానికి తనవంతు బాధ్యతను నెరవేరుస్తుంది. ఉదారవాదం వ్యక్తి ప్రయోజనాలకు లక్ష్యంగానూ వాటిని కాపాడటానికి కావాల్సిన సాధనంగానూ రాజ్యాన్ని గుర్తిస్తుంది. రాజ్యం యొక్క నిరపేక్ష అధికారాన్ని ఉదారవాదం వ్యతిరేకిస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

ప్రశ్న 3.
సామ్యవాదం అంటే ఏమిటి ? దాని ప్రధాన సూత్రాలను పరిశీలించండి.
జవాబు.
సామ్యవాదం ఫ్రెంచి, పారిశ్రామిక విప్లవ వీరుల తరువాత ప్రచారంలోకి వచ్చింది. ఫ్రెంచి విప్లవం సాంఘిక విప్లవాన్ని లేవదీస్తే, పారిశ్రామిక విప్లవం ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే సమూలంగా మార్చివేసింది. సామ్యవాదాన్ని ప్రచారం చేసిన వారిలో రాబర్ట్ ఓవెన్, సైంట్ సైమన్లు ముఖ్యులు.

రాబర్ట్ ఓవెన్ సామ్యవాదాన్ని కాల్పనిక సామ్యవాదంగా ఇంగ్లండ్లో ప్రచారం చేసాడు. ఈ సామ్యవాదాన్నే మార్క్స్, ఏంజెల్సు అనే తత్త్వవేత్తలు శాస్త్రీయ సామ్యవాదంగా రూపొందించారు.

నిర్వచనం వివరణ :
సామ్యవాదం “సోషియస్” (Socious) అనే పదం నుంచి ఉద్భవించింది. అయితే సామ్యవాదాన్ని నిర్వచించటం చాలా కష్టం. అయినా నిఘంటువు ప్రకారం” ఒక కేంద్ర ప్రజాస్వామ్య ప్రభుత్వం మేలైన పంపిణీ విధానాన్ని, దానికనుగుణంగా ఉత్పత్తి విధానాన్ని ఏర్పరచాలనే ఆశయం గల సిద్ధాంతం సామ్యవాదం”. జార్జి బెర్నాడ్ షా సామ్యవాదమంటే “ఆదాయాలను సమానం చేయటం” అని అన్నాడు.

సామ్యవాదులకు విప్లవం కన్న సంస్కరణల ద్వారా మార్పును తేవటం ఇష్టం. సిద్ధాంతపరమైన సంఘర్షణకన్న నిర్మాణాత్మకమైన కృషిపైన, ఫలితాలపైన వారికి నమ్మకం ఎక్కువ.

ప్రధానసూత్రాలు :
సామ్యవాదపు ప్రధానసూత్రాలను కింది విధంగా చెప్పవచ్చు.

1. సమాజానికి ప్రాముఖ్యత :
సామ్యవాదం వ్యక్తికంటే సమాజానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది. సమాజ ప్రయోజనాలకంటే వ్యక్తి ప్రయోజనాలు తక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ప్రజలందరి అవసరాలకు సంబంధించిన వస్తూత్పత్తికే మిక్కిలి ప్రాధాన్యతనిస్తుంది. సుఖభోగాలకు సంబంధించిన వస్తువుల ఉత్పత్తి అవసరమైనదిగా భావిస్తుంది. లాభాపేక్షగల వస్తూత్పత్తికంటే సహకార సేవలు అందివ్వగలిగే వస్తూత్పత్తి జరగాలని కోరుకుంటుంది.

2. సామాజిక ఐక్యతను కోరుకుంటుంది:
పెట్టుబడిదారీ సమాజంలో శ్రామికులు, కార్మికులు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కోల్పోతారని సామ్యవాదం పేర్కొంది. సామ్యవాద సమాజంలో మాత్రమే ప్రజలందరికీ స్వేచ్ఛాస్వాతంత్ర్యాలతో పాటు సమాన అవకాశాలు కల్పించబడతాయని ఈ సిద్ధాంతం నొక్కి చెబుతుంది.

పెట్టుబడిదారీ సమాజంలో కొంతమంది సంపన్నులు మాత్రమే అన్నిరకాల అవకాశాలను పొందుతారని ఎక్కువమంది అనేక అవకాశాలను కోల్పోతారంటుంది. సామ్యవాద సమాజంలో ప్రజలందరు ఎటువంటి అసమానతలు లేని విధంగా సంపూర్ణప్రయోజనం పొందుతారు.

3. పెట్టుబడిదారీ దారీ వ్యవస్థ నిర్మూలన :
పెట్టుబడిదారీ విధానం సంపూర్ణంగా నిర్మూలించబడాలని సామ్యవాదం కోరుకుంటుంది. పెట్టుబడిదారీవర్గం కార్మికవర్గాన్ని దోపిడీచేస్తూ అధికసంపదను ప్రోగుచేసుకుంటుంది. చట్టం ప్రకారం కార్మిక వర్గానికి చెందాల్సిన సౌకర్యాలనుగాని, ఇతరత్రా ప్రయోజనాలను గాని పెట్టుబడిదారి విధానం కల్పించదు.

దీని పర్యవసానంగా కార్మికవర్గం తీవ్రమైన దుర్భరపరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. వీటన్నింటిరీత్యా పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మూలన కచ్చితంగా జరగాలని సామ్యవాదం అభిప్రాయపడింది.

4. పోటీతత్వాన్ని నిర్మూలించటం:
ఆర్థికరంగంలో ముఖ్యంగా ఉత్పత్తి సంబంధ విషయాలలో పోటీతత్వం సమూలంగా నిర్మూలించబడాలని సామ్యవాద ఆకాంక్ష. పోటీతత్వానికి బదులుగా సహకారం ఉండాలంటుంది. పోటీతత్వం, లంచగొండితనాన్ని, ఏకస్వామ్యాన్ని, అసాంఘిక చర్యలను, విలువలు దిగజారుడుతనాన్ని పెంచిపోషిస్తుందని సామ్యవాదం విమర్శిస్తుంది. అందువల్ల పోటీతత్వం స్థానంలో సహకారం ఎంతో అవసరమని సామ్యవాదం భావిస్తుంది.

5. సమానత్వంపై సంపూర్ణవిశ్వాసం :
సామ్యవాదం సమానత్వ సూత్రాన్ని నమ్ముతుంది. అయితే, సామ్యవాదం సైతం సంపూర్ణ సమానత్వాన్ని సమర్థించదు. వ్యక్తుల ఆలోచనలు, శక్తిసామర్థ్యాలు మరియు నైపుణ్యాల రీత్యా అసమానతలుంటాయని అంగీకరిస్తుంది. అయినంతమాత్రాన ఉద్దేశపూర్వకమైన అసమానతలను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సామ్యవాదం నొక్కి చెబుతుంది.

6. ప్రయివేటు ఆస్తికి వ్యతిరేకం :
సామ్యవాదం ప్రయివేటు ఆస్తి కలిగి ఉండటాన్ని వ్యతిరేకిస్తుంది. భూమిమీద, పరిశ్రమలమీద, ఇతర ఉత్పత్తి సాధనాలమీద ప్రయివేటు యాజమాన్యపు హక్కులను సామ్యవాదం వ్యతిరేకిస్తుంది. పారిశ్రామిక ఉత్పత్తులను ప్రజలందరూ సమానంగా వినియోగించుకోవాలని సామ్యవాదం కోరుకుంటుంది.

7. వస్తూత్పత్తిపై సామూహిక యాజమాన్యం :
సమస్త వస్తూత్పత్తి సామూహిక యాజమాన్య ఆధీనంలో ఉండాలని’ సామ్యవాదం ఆశిస్తుంది. సమాజంలోని సంపదనంతా జాతీయం చేయాలని కోరుకుంటుంది. ప్రయివేటు ఆస్తి సంపాదన అంటే దొంగతనంగా కూడగట్టుకున్నదేనని చెబుతుంది. దీన్ని తొలగించడానికి పరిశ్రమలమీద, మైనింగ్ మీద సమష్టి యాజమాన్యం ఉండాలంటుంది.

8. కేంద్రీకృత ప్రణాళిక వ్యవస్థ ఉండాలి:
కేంద్రీకృత ప్రణాళికా వ్యవస్థ సమగ్ర అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని సామ్యవాద భావన. శీఘ్ర ఆర్థికాభివృద్ధిని సాధించడానికి ప్రణాళికా వ్యవస్థే పట్టుకొమ్మవంటిదని చెబుతుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

ప్రశ్న 4.
గాంధీవాదంపై ఒక వ్యాసం రాయండి.
జవాబు.
మోహన్దాస్ కరంచంద్ గాంధీ గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్ పట్టణంలో 1869 సంవత్సరంలో జన్మించాడు. గాంధీని మొట్టమొదటిసారి రవీంద్రనాథ్ ఠాగూర్ ‘మహాత్మ’ అని సంబోధించాడు. మహాత్ముడు భారతదేశ పితామహుడుగా కూడా విఖ్యాతినొందాడు. ప్రాచీన భరతీయ భావాలైన అహింస సత్యాగ్రహం, సత్యం లాంటివాటిని సాధనాలుగా ఉపయోగించి భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించాడు. తాను ఏదైతే పాటించాడో దాన్నే బోధించాడు.

గాంధీయిజం – ప్రధాన సూత్రాలు :
1. అతిభౌతిక ఆదర్శవాదం:
ఉపనిషత్ భావాలైన ‘దైవికభావన’ సజీవ నిర్జీవ సమస్త ప్రాణికోటిలో నిక్షిప్తమై ఉండే సార్వజనీన ఆత్మ, అన్ని చోట్ల నిరంతరం వెలిగే దైవిక వెలుతురు మొదలైనవి గాంధీ తాత్విక భావాలు. గాంధీ అభౌతిక ఆదర్శవాదం వేదాంత చింతనతో కూడిన నైతికత, ధార్మిక, అభౌతిక జైన, బౌద్ధ, వైష్ణవ సూత్రాలు. వీటన్నింటి సమ్మిళితమే గాంధీయిజం.

2. నైతిక నిరపేక్షత :
గాంధీ నైతిక విలువలకు అధిక ప్రాధాన్యతనిచ్చాడు. గాంధీ నైతిక వేదాంతంలోని ‘రిత’ లో మనం చూడవచ్చు. ‘రిత’ విశ్వజనీనమైది. సర్వాంతర్యామి అయినట్టఁ భగవంతుడికి విధేయులుగా ఉండునట్లు చేస్తుంది.

3. అహింస – సిద్ధాంతం :
అహింస అంటే ‘హింస చేయకుండుటం’. అంటే ఎవరినీ ‘చంపటానికి వీలులేదు’ అనేది విస్తృత అర్థంలో వాడతాం.

గాంధీ ‘అహింసా’ భావాన్ని రాజకీయాలలో తిరుగులేని అస్త్రంగా వాడాడు. సత్యం, భయం లేకుండటం అహింసకు కావల్సిన కారకాలు. గాంధీజీ అహింసను ఒక వ్యక్తి తన ఆత్మకు తాను విధించుకునే స్వకీయ శిక్షవంటిదని పేర్కొన్నాడు. దయ, ప్రేమ, భయంలేకుండుట, అమాయకత్వం, దయార్ద్రత, నిస్వార్థత మొదలైనవి అహింస పాటించటంలో దోహదపడే అంశాలుగా గాంధీ వివరించాడు.

అహింసా విధానాన్ని ఒక్క బ్రిటీష్వారికి మాత్రమే వ్యతిరేకంగా ప్రయోగించిన ఆయుధంకాదు, సమాజంలోని వివిధ రకాల రుగ్మతలను తొలగించటానికి సైతం దీన్ని ఆయుధంగా వాడవచ్చునన్నాడు.

గాంధీజీ అభిప్రాయంలో స్వరాజ్యం లేదా ప్రజాస్వామ్యాన్ని హింస ద్వారా సాధించలేం. ఎందుకంటే హింసతో ఎవరినీ సంపూర్ణంగా ఓడించలేం. వ్యక్తి స్వేచ్ఛ అంటే హింస కాదు. ఒక్క అహింసా విధానంవల్ల మాత్రమే వ్యక్తిస్వేచ్ఛకు వాస్తవ రూపం వస్తుంది.

గాంధీజీ అభిప్రాయంలో హింసకు నాలుగు కారణాలున్నాయి. అవి :

  1. వ్యవస్థీకృతమైన అధికారం లేదా శక్తి
  2. అంతర్గత వైరుధ్యాలు
  3. విదేశీ దురాక్రమణలు
  4. కుటుంబ వ్యవస్థ

గాంధీజీ ప్రకారం సత్యాగ్రహం కేవలం తాత్విక సిద్ధాంతం మాత్రమే కాదు. అది విదేశీపాలనను అంతమొందించి సాంఘిక, ఆర్థిక న్యాయాలు సంపాదించేది. గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు సత్యాగ్రహం అనే భావనను కనిపెట్టాడు.

అతని ఉద్దేశంలో సత్యాగ్రహం అంటే ప్రేమతో కూడిన ఒత్తిడి (Love Force) మరియు ఆత్మ సంబంధమైన ఒత్తిడి (Soul Force). సత్యం ఎన్నడూ హింసను అంగీకరించదు. తప్పు చేసిన వాడిని కూడా ‘హిసా’ పద్ధతిలో శిక్షించకూడదు. ఒకడి దృష్టిలో ”పాపం’ అయినది మరొకరి దృష్టిలో కాకపోవచ్చు.

సత్యాన్ని అన్వేషించటమంటే అహింసావాదాన్ని పాటించడమే అని గాంధీ అభిప్రాయపడ్డాడు. ఒక వ్యక్తికి సంబంధించి అసత్యం అన్యాయం అనే భావనలను తొలగించటానికి తనకు తాను క్షోభను అనుభవించే విధంగా చేయడం ద్వారా మార్పును తీసుకురావాలి. సత్యాగ్రహం అంటే తప్పు చేసినవాడిని క్షోభపెట్టడం కాదు, దాన్ని వ్యతిరేకించేవాడు క్షోభపడి ఎదుటి వాడిలో మార్పు తీసుకురావడం అని గాంధీజీ అభిప్రాయం.

సత్యాగ్రహంపై రాజకీయపరమైన నమ్మకం:
రాజకీయంగా సత్యాగ్రహం మూడు సూత్రాల మీద ఆధారపడింది.

  1. అహింస మీద నిరపేక్షమైన నమ్మకం ఉండాలి.
  2. ఏ ప్రభుత్వం అయినా ప్రజాభీష్టం మేరకు ఏర్పడాలి.
  3. ఏ దేశం కూడా స్వకీయంగా క్షోభను, స్వకీయమైన త్యాగం చేయకుండా అభివృద్ధిని సాధించలేదు.

సత్యాగ్రహం సూత్రాలు:
నిజమైన సత్యాగ్రాహి కింది సూత్రాలను పాటించాల్సి ఉంటుంది.

  1. సత్యం అంటే అబద్ధమాడకుండుట. ఇది దైవికమైనది. చెడు చట్టాలను అహింసా పద్ధతుల ద్వారా ప్రతిఘటించాలి.
  2. అహింస అంటే హింసచేయకుండుట, ప్రేమతో జీవితాంతం బ్రతకటం.
  3. సత్యాగ్రాహి జీవితాంతం బ్రహ్మచర్యం పాటించటం. స్త్రీ గాని, పురుషుడుగాని ఇతరులపట్ల చెడు దృష్టిని కలిగి ఉండకూడదు.
  4. అవసరమైన దాని కంటే ఎక్కువగా భుజించకూడదు.
  5. దొంగతనం చేయరాదు.
  6. ప్రతి వ్యక్తి తన శ్రమ మీదనే ఆధారపడి జీవించాలి.
  7. విదేశీ వస్తువులను కొనుగోలు చేయడంగాని, ధరించడంగాని చేయరాదు.
  8. ప్రతి వ్యక్తి భయంలేని జీవితాన్ని గడపాలి.
  9. అంటరానితనాన్ని పాటించరాదు.
  10. మతపరమైన సహనం ఉండాలి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

సత్యాగ్రహం – వివిధ రూపాలు :

  1. శాసనోల్లంఘనం
  2. అహింస
  3. హర్తా నిరసన
  4. హర్తాల్
  5. హిజరత్

ఈ సూత్రాలను పాటించడం ద్వారా విదేశీ పాలన, పలురకాల అన్యాయాల నుంచి దేశాన్ని, మనల్ని మనం కాపాడుకోగల్గుతాం.

అదే విధంగా, సత్యాగ్రహాన్ని అనేక రూపాలలో ఆచరించవచ్చు. సహాయ – నిరాకరణ అనేది పరోక్షమైన చాలా చిన్నదైన నిరసన. శాసనోల్లంఘనం తీవ్రమైన నిరసన. దీన్ని వ్యక్తిగతంగా గాని, సామూహికంగా గాని తెలియజేయవచ్చు. హర్తాల్, హిజరత్ మరో రకమైన సత్యాగ్రహ నిరసన రూపాలు. సత్యాగ్రహం పద్ధతులు కూడా పలురకాలు. నిరాహారదీక్ష అనేది నిరసన తెలిపే తీవ్రమైన పద్ధతి.

5. మతం రాజకీయాలు :
గాంధీజీ నైతిక భావనలను తరచుగా వ్యక్తపర్చటం చూడవచ్చు. గాంధీజీ అభిప్రాయంలో మతంలేని రాజకీయాలు ప్రభుత్వాన్ని – రాజ్యాన్ని వాటి స్థాయిని తగ్గిస్తాయి. ఎందుకంటే అవి కేవలం భౌతిక అవసరాలు మాత్రమే తీర్చగల్గుతాయి. గాంధీజీ ఉద్దేశంలో అధికారం, నైతికత రెండు సమాంతరంగా రాజకీయాలలో ఉపయోగించబడాలి. అందుకే గాంధీజీ మానవత, మతం, నైతికతను, స్థైర్యాన్ని పెంచినాయన్నాడు.

రాజకీయ కార్యక్రమం కూడా వ్యక్తుల సాంఘిక, నైతిక స్థాయిలను పెంచుతాయన్నాడు. మనిషి జీవితం నుంచి రాజకీయాలను కానీ మతాన్నిగాని విడదీయలేమన్నాడు. గాంధీజీ ఉద్దేశంలో మతమంటే గుడ్డిగా మత విశ్వాసాలను నమ్మటం కాదు, నైతిక విలువలతో మత విశ్వాసాలను సమన్వయం చేసుకోవటంగా పేర్కొన్నాడు. ఏ మతమైనా ఏకపక్ష విధానాన్ని సమర్థించకూడదు. అయితే, గాంధీజీ ఎన్నడూ రాజ్యపరమైన మతాన్ని సమర్థించలేదు. ఆయన ఉద్దేశంలో మతమనేది సమాజంలోని అన్ని రుగ్మతలను తొలగించేదిగా ఉండాలి.

6. లక్షా సాధనాలు :
గాంధీజీ ఉద్దేశంలో సాధనాలు అనేవి ఉదాత్తమైనవి అయి ఉండాలి. అవి అనుకున్న లక్ష్యాలను సాధించేవిగా ఉండాలి. పాశ్చాత్య తత్వవేత్తలు హింసాపూరితమైన సాంఘిక, రాజకీయ విప్లవాలను ప్రతిపాదించారన్నాడు. వాటి ద్వారానే సమాజంలో శాంతి, అభివృద్ధి సాధ్యమౌతాయని వారు పేర్కొన్నారు. అయితే, ఒక్క టాల్ స్టాయ్ మాత్రం హింసను వ్యతిరేకించి “సార్వజనీన ప్రేమ”ను ప్రతిపాదించాడు.

గాంధీజీ, టాల్ స్టాయ్ వీరిరువురు సాంఘిక, రాజకీయ లక్ష్యాలను సాధించటానికి ప్రేమ, కరుణ, దయ వంటి వాటిని ప్రతిపాదించారు. సాధనం అంటే విత్తనం లాంటిది. లక్ష్యం అంటే చెట్టులాంటిది. మంచి విత్తనం నాటితే మంచిదైన చెట్టుపెరిగి మంచి ఫలాన్నిస్తుంది అంటారు గాంధీజీ.

7. ధర్మకర్తృత్వం :
గాంధీజీ, అంతిమ రాజకీయ లక్ష్యం దేశంలో ‘రామరాజ్యం’ ఏర్పాటు చేయటం దాని ద్వారా ప్రజలందరికి సంక్షేమం (సర్వోదయ) కల్పించటం. రామరాజ్యం ఏర్పడిన సమాజంలోని వ్యక్తులు తమ ఆస్తిని పరిశ్రమలను, భూమిని మరియు వ్యాపారాన్ని ధర్మకర్తృత్వంగానే పరిగణిస్తారు. ప్రతి వ్యక్తి తనకు ఎంత కావాలో అంతే ఉంచుకొని మిగిలిన దాన్నంతా ఇతరులకు ఇచ్చివేయాలి. గాంధీజీ ధర్మకర్తృత్వం సిద్ధాంతాన్ని విప్లవ కమ్యూనిస్టు సిద్ధాంతానికి ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించాడు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
వ్యక్తి శ్రేయోవాదాన్ని చర్చించండి.
జవాబు.
అర్థం :
వ్యక్తి శ్రేయోవాదం ప్రకారం రాజ్యం వ్యక్తుల వ్యక్తిగత విషయాలకు సంబంధించి వారి అభీష్టానికే వదిలేయాలంటుంది. ఈ సిద్ధాంతాన్ని జోక్యరహిత సిద్ధాంతం (Laissez Fair Theory) అని కూడా అంటారు. (Laissez Fair) అనేది ఫ్రెంచ్ పదం, దాని అర్థం ‘ఒంటరిగా వదిలేయ్’ (Leave alone), అంటే సాంఘిక జీవనంలో వ్యక్తే కేంద్ర బిందువు. ఈ సిద్ధాంతాన్ననుసరించి వ్యక్తికి వీలైనంత ఎక్కువ స్వేచ్ఛనివ్వాలి. రాజ్యం వీలైనంత తక్కువ జోక్యం కలిగి ఉండాలి. అంటే రాజ్యం వ్యక్తులను సమర్థించాలేగాని నియంత్రించకూడదు.

వ్యక్తి శ్రేయోవాదుల అభిప్రాయంలో “రాజ్యం ఆవశ్యకమైన దయ్యం” లాఁటిది. రాజ్యం ఎందుకు అవసరమంటే వ్యక్తులను హింస నుంచి, మోసాల నుంచి కాపాడటానికి అవసరమని వ్యక్తి శ్రేణి దావాదుల అభిప్రాయం. ఇది ఎందుకు దయ్యం లాంటిదంటే వ్యక్తుల స్వాతంత్ర్యాన్ని అడ్డుకుంటుంది. కాబట్టి, అందువల్ల వ్యక్తుల వ్యక్తిగత విషయంలో ఎంత తక్కువగా జోక్యం చేసుకుంటే అంతమంచిది.

రాజ్యం కింద తెలిపిన పరిమిత విదులను నిర్వహిస్తుంది.

  1. వ్యక్తులకు రక్షణ కల్పించటం విదేశీ దురాక్రమణలనుంచి కాపాడటం.
  2. ఒక వ్యక్తికి మరో వ్యక్తి నుంచి రక్షణ కల్పించడం.
  3. వ్యక్తుల ఆస్తులకు దోపిడి దొంగల నుంచి, విధ్వసాల నుంచి రక్షణ కల్పించడం.
  4. తప్పుడు ఒప్పందాల నుంచి ఒప్పంద ఉల్లంఘనల నుంచి వ్యక్తులను కాపాడడం.

సిద్ధాంతం పుట్టుక – అభివృద్ధి :
18వ శతాబ్దం నాటి యూరప్ లో నిరపేక్ష నియంతృత్వ, రాజరిక ప్రభుత్వాలు ఆచరణలో ఉండేవి. యూరప్కు చెందిన సామాజిక ఒడంబడిక సిద్ధాంతకర్తలు రాజనీతి పండితులైన జాన్లాక్, రూసో వంటి వారు వ్యక్తి స్వేచ్ఛలకు సంబంధించి వివరణలిచ్చారు. ఆ తరువాత 19వ శతాబ్దంలో వ్యక్తి శ్రేయోవాదానికి ఒక సంపూర్ణ రూపం వచ్చింది.

ఆర్థికపరమైన వ్యక్తి శ్రేయోవాదానికి 18వ శతాబ్దంలో ఫిజియోక్రాట్స్ పునాదులు వేశారు. పరిశ్రమలను, వాణిజ్య వ్యాపారాలను పర్యవేక్షిస్తూ వాటికి సంపూర్ణ మద్దతును తెలిపే విధానాలను సమర్థించే మార్కెంటలిజాన్ని ఫిజి.మోక్రాట్స్ వ్యతిరేకించారు. ఈ ఫిజియోక్రాట్సే లేజాఫెయిర్ (జోక్యరహిత) సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.

ఈ సిద్ధాంతం ఫ్రాన్స్లో బాగా వేళ్ళూనుకొని అటు పిమ్మట యూరప్అం తటా విస్తరించింది. దీనిని ఆడమ్స్మిత్, ఇతర సంప్రదాయ ఆర్థికవేత్తలు అభివృద్ధి చేశారు. అయితే జె.ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్లు దీనిని ఒక విధానంగాను రాజకీయ సిద్ధాంతంగానూ తీర్చిదిద్దారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

ప్రశ్న 2.
సామ్యవాదంలోని లోపాలపై ఒక నోట్ రాయండి.
జవాబు.
సామ్యవాదం లోపాలు :
సామ్యవాదం ఎంతో ఉపయోగకరమైన సిద్ధాంతమైనా దాంట్లో కొన్ని లోపాలున్నాయి. వాటిని క్రింది విధంగా చెప్పవచ్చు.

  1. సామ్యవాద సిద్ధాంతం వ్యక్తికిగల సృజనాత్మక శక్తిని అణచివేస్తుంది. ఉత్పత్తి విధానంలో వ్యక్తిపాత్రను తక్కువచేసి చూపుతుంది.
  2. కొన్ని సామ్యవాద సూత్రాలు ఆచరణ సాధ్యంకానివి. ఉదాహరణకు, ఆర్థిక అసమానతలు తొలగించటం, సాంఘిక వివక్షతలు, సమష్టి యాజమాన్యం, ప్రయివేటు ఆస్తి మొదలైనవి.
  3. సామ్యవాదం వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను నిరాకరిస్తుంది. సమాజానికి అధిక ప్రాధాన్యతనిచ్చి వ్యక్తికి తక్కువ ప్రాధాన్యతనిస్తుంది.
  4. ఆర్థిక వ్యవహారాలలో రాజ్యం జోక్యాన్ని సమర్థించడంవల్ల సత్వర ఆర్థికాభివృద్ధి సాధించటం అసాధ్యమౌతుంది.

సామ్యవాదం – ప్రాముఖ్యత:
సామ్యవాదం ఎంతో ప్రాముఖ్యత కలిగిన సిద్ధాంతం. సమకాలీన సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించటానికి ఇది ఏర్పరచుకొన్న లక్ష్యాలు – సాధనాలు ఉదాత్తమైనవి. భౌతిక పరిస్థితులను చక్కదిద్దుకోవటం ద్వారా ప్రజల సంక్షేమాన్ని పెంచుకోవచ్చని సామ్యవాదం భావిస్తుంది. శ్రామికులు, కార్మికుల నిరుద్యోగుల మరియు అన్ని రంగాలలో వెనుకబడిన వర్గాల అభివృద్ధి కేవలం సామ్యవాదం ద్వారానే సాధ్యమౌతుందని ఈ సిద్ధాంతం భావిస్తుంది.

సామ్యవాద సిద్ధాంతం సమసజస్థాపనే ధ్యేయంగా పనిచేస్తుంది. దోపిడీ, అణచివేత, ఆకలి, దారిద్య్రం వంటి వివక్షత రూపుమాపాలంటే సామ్యవాద సిద్ధాంతం ద్వారానే సాధ్యమౌతుందని చెబుతుంది. ప్రయివేటు ఆస్తిని రద్దుచేసి దున్నేవాడిదే భూమి అని నినదించింది.

సామ్యవాద భావాలు భారత రాజకీయాలలో, అమలుచేయబడ్డాయి. రాజ్యాంగ పీఠికలోని అనేక అంశాలలో సామ్యవాదం ఒకటి. ఒకరకంగా చెప్పాలంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్ లాంటిదేశాలు సామ్యవాదం సిద్ధాంతాల ద్వారా ఎంతో స్ఫూర్తిని పొందాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

ప్రశ్న 3.
సత్యాగ్రహ భావనను తెలపండి.
జవాబు.
గాంధీజీ ప్రకారం సత్యాగ్రహం కేవలం తాత్విక సిద్ధాంతం మాత్రమే కాదు, అది విదేశీపాలనను అంతమొందించి సాంఘిక, ఆర్థిక న్యాయాలు సంపాదించేది. గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు సత్యాగ్రహం అనే భావనను కనిపెట్టాడు. అతని ఉద్దేశంలో సత్యాగ్రహం అంటే ప్రేమతో కూడిన ఒత్తిడి (Love Fores) మరియు ఆత్మ సంబంధమైన ఒత్తిడి (Soul Force). సత్యం ఎన్నడూ హింసను అంగీకరించదు. తప్పు చేసిన వాడిని కూడా ‘హింసా’ పద్ధతిలో శిక్షించకూడదు.

ఒకడి దృష్టిలో ‘పాపం’ అయినది మరొకరి దృష్టిలో కాకపోవచ్చు. సత్యాన్ని అన్వేషించటమంటే అహింసా వాదాన్ని పాటించడమే అని గాంధీ అభిప్రాయపడ్డాడు. ఒక వ్యక్తికి సంబంధించి అసత్యం అన్యాయం అనే భావనలను తొలగించటానికి తనకు తాను క్షోభను అనుభవించే విధంగా చేయడం ద్వారా మార్పును తీసుకురావాలి, సత్యాగ్రహం అంటే తప్పు చేసినవాడిని క్షోభపెట్టడం కాదు, దాన్ని వ్యతిరేకించేవాడు క్షోభపడి ఎదుటి వాడిలో మార్పు తీసుకురావడం అని గాంధీజీ అభిప్రాయం.

సత్యాగ్రహంపై రాజకీయపరమైన నమ్మకం :
రాజకీయంగా సత్యాగ్రహం మూడు సూత్రాల మీద ఆధారపడింది.

  1. అహింస మీద నిరపేక్షమైన నమ్మకం ఉండాలి.
  2. ఏ ప్రభుత్వం అయినా ప్రజాభీష్టం మేరకు ఏర్పడాలి.
  3. ఏ దేశం కూడా స్వకీయంగా క్షోభను, స్వకీయమైన త్యాగం చేయకుండా అభివృద్ధిని సాధించలేదు.

సత్యాగ్రహం సూత్రాలు :

  1. సత్యం అంటే అబద్ధమాడకుండుట. ఇది దైవికమైనది. చెడు చట్టాలను అహింసా పద్ధతుల ద్వారా ప్రతిఘటించాలి.
  2. అహింస అంటే హింసచేయకుండుట. ప్రేమతో జీవితాంతం బ్రతకటం.
  3. సత్యాగ్రాహి జీవితాంతం బ్రహ్మచర్యం పాటించటం. స్త్రీ గాని, పురుషుడుగాని, ఇతరులపట్ల చెడు దృష్టిని కలిగి ఉండకూడదు.
  4. అవసరమైన దాని కంటే ఎక్కువగా భుజించకూడదు.
  5. దొంగతనం చేయరాదు.
  6. ప్రతి వ్యక్తి తన శ్రమ మీదనే ఆధారపడి జీవించాలి.
  7. విదేశీ వస్తువులను కొనుగోలు చేయడంగాని, ధరించడంగాని చేయరాదు.
  8. ప్రతి వ్యక్తి భయంలేని జీవితాన్ని గడపాలి.
  9. అంటరానితనాన్ని పాటించరాదు.
  10. మతపరమైన సహనం ఉండాలి.

సత్యాగ్రహం – వివిధ రూపాలు :

  1. శాసనోల్లంఘనం
  2. అహింస
  3. హర్తా నిరసన
  4. హర్తాల్
  5. హిజరత్.

ఈ సూత్రాలను పాటించడం ద్వారా విదేశీ పాలన, పలురకాల అన్యాయాల నుంచి దేశాన్ని మనల్ని మనం కాపాడుకోగల్గుతాం.

అదే విధంగా, సత్యాగ్రహాన్ని అనేక రూపాలలో ఆచరించవచ్చు. సహాయ నిరాకరణ అనేది పరోక్షమైన చాలా చిన్నదైన నిరసన. శాసనోల్లంఘనం తీవ్రమైన నిరసన. దీన్ని వ్యక్తిగతంగా గాని, సామూహికంగా గాని తెలియజేయవచ్చు. హర్తాల్, హిజరత్ మరో రకమైన సత్యాగ్రహ నిరసన రూపాలు. సత్యాగ్రహం పద్ధతులు కూడా పలురకాలు. నిరాహారదీక్ష అనేది నిరసన తెలిపే తీవ్రమైన పద్ధతి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

ప్రశ్న 4.
మతం – రాజకీయాలపై గాంధీజీ భావాలను వివరించండి.
జవాబు.
గాంధీజీ నైతిక భావనలను తరచుగా వ్యక్తపర్చటం చూడవచ్చు. గాంధీజీ అభిప్రాయంలో మతంలేని రాజకీయాలు ప్రభుత్వాన్ని రాజ్యాన్ని వాటి స్థాయిని తగ్గిస్తాయి. ఎందుకంటే అవి కేవలం భౌతిక అవసరాలు మాత్రమే తీర్చగల్గుతాయి. గాంధీజీ ఉద్దేశంలో అధికారం, నైతికత రెండు సమాంతరంగా రాజకీయాలలో ఉపయోగించబడాలి. అందుకే గాంధీజీ మానవత, మతం, నైతికతను, స్థైర్యాన్ని పెంచినాయన్నాడు.

రాజకీయ కార్యక్రమం కూడా వ్యక్తుల సాంఘిక, నైతిక స్థాయిలను పెంచుతాయన్నాడు. మనిషి జీవితం నుంచి రాజకీయాలను కానీ మతాన్నిగాని విడదీయలేమన్నాడు. గాంధీజీ ఉద్దేశంలో మతమంటే గుడ్డిగా, మత విశ్వాసాలను నమ్మటం కాదు, నైతిక విలువలతో మత విశ్వాసాలను సమన్వయం చేసుకోవటంగా పేర్కొన్నాడు. ఏ మతమైనా ఏకపక్ష విధానాన్ని సమర్థించకూడదు. అయితే, గాంధీజీ ఎన్నడూ రాజ్యపరమైన మతాన్ని సమర్థించలేదు. ఆయన ఉద్దేశంలో మతమనేది సమాజంలోని అన్ని రుగ్మతలను తొలగించేదిగా ఉండాలి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
వ్యక్తి శ్రేయోవాదం.
జవాబు.
వ్యక్తి స్వాతంత్ర్యానికి, స్వేచ్ఛకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రచారంలోకి వచ్చిన సిద్ధాంతం వ్యక్తి శ్రేయోవాద సిద్ధాంతం. ఈ సిద్ధాంతం వ్యాప్తికి దోహదం చేసినవారు జాన్ స్టూవర్ట్మిల్, హెర్బర్ట్ స్పెన్సర్. ప్రధమంగా ఈ సిద్ధాంతం లేజాఫేయిర్ (Laissez Fair) సిద్ధాంతంగా పేర్కొనడం జరిగింది. ఫ్రెంచ్ భాషలో లేజాఫేయిర్ అంటే “జోక్యంచేసుకోకు” అని అర్థం. వ్యక్తి శ్రేయోవాద సిద్ధాంత ప్రధాన లక్ష్యం వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు ప్రాధాన్యమిచ్చి, రాజ్యం జోక్యాన్ని అధికారాన్ని పరిమితం చేయటం.

ప్రశ్న 2.
నయా ఉదారవాదం.
జవాబు.
నయా ఉదారవాదాన్ని ఒకరకంగా సమకాలీన సాంప్రదాయ ఉదారవాదంగా చెప్పవచ్చు. జోక్యరహిత (“లేజాఫెయిర్”) వ్యక్తి శ్రేయోవాదంగా కూడా పరిగణించవచ్చు. ఇది సంక్షేమ రాజ్యాన్ని కోరుకుంటుంది. వ్యక్తుల ఆర్థిక కార్యకలాపం మీద ఎటువంటి నియంత్రణలు ఉండకూడదంటుంది.

నయా – ఉదారవాదాన్ని ముఖ్యంగా కింద పేర్కొన్న శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. ఎఫ్.ఎ. ఫెయక్ (1899 – 1922), ఆస్ట్రేలియా తత్వవేత్త మిల్టన్ ఫ్రీడ్మాన్ (1912 – 2006), అమెరికా రాజనీతి తత్త్వవేత్త అయిన రాబర్ట్ నోజిక్ (1938 – 2002) మొదలైనవారు.

ప్రశ్న 3.
లేజాఫేయర్ (జోక్యరహితవాదం).
జవాబు.
వ్యక్తి శ్రేయోవాదం ప్రకారం రాజ్యం వ్యక్తుల వ్యక్తిగత విషయాలకు సంబంధించి వారి అభీష్టానికే వదిలేయా లంటుంది. ఈ సిద్ధాంతాన్ని జోక్యరహిత సిద్ధాంతమని అంటారు.

లేజాఫేయర్ (Laissez Fair) అనేది ఫ్రెంచిపదం. దాని అర్థం “ఒంటరిగా వదిలేయ్” అంటే సాంఘికజీవనంలో వ్యక్తే కేంద్ర బిందువు. ఈ సిద్ధాంతాన్ననుసరించి వ్యక్తికి వీలైనంత ఎక్కువ స్వేచ్ఛనివ్వాలి. రాజ్యం వీలైనంత తక్కువ జోక్యం కలిగివుండాలి. అంటే రాజ్యం వ్యక్తులను సమర్థించాలేగాని నియంత్రించకూడదు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

ప్రశ్న 4.
జె.యస్.మిల్.
జవాబు.
జాన్ స్టువర్ట్ మిల్ 19వ శతాబ్దపు ఆంగ్ల రాజనీతి తత్వవేత్తలలో అగ్రగణ్యుడు. ఇతడు వ్యక్తి శ్రేయోవాది మరియు ప్రజా స్వామ్యవాది. ఇతడు రచించిన “ఆన్ లిబర్టీ” అనే గ్రంథము వ్యక్తి స్వేచ్ఛకు ప్రాధాన్యతనిచ్చింది. వ్యక్తి స్వేచ్ఛకు ఇతడిచ్చినంత ప్రాధాన్యత ఇంతకుముందు ఏ రాజనీతి శాస్త్రవేత్త ఇవ్వలేదు. జె.యస్.మిల్’ వ్యక్తి శారీరక, మానసిక నైతిక వికాసానికి స్వేచ్ఛ చాలా అవసరమని భావించాడు. సమాజ శ్రేయస్సుకోసం వ్యక్తి స్వేచ్ఛ చాలా అవసరమని, అందువలన వ్యక్తి వ్యవహారాలో ప్రభుత్వ జోక్యము పరిమితంగా వుండాలని చెప్పెను.

ప్రశ్న 5.
సామ్యవాదం అర్థం.
జవాబు.
మ్యవాదం వ్యక్తి వాదాన్ని వ్యతిరేకిస్తుంది. ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు సమాజపరంగా నిర్వహించే విధానమే సామ్య దం. ఇది ఒక విప్లవాత్మక సిద్ధాంతం. ఒక రాజకీయ విధానమే గాక, సామ్యవాదం ఒక జీవిత విధానం కూడా. దీనిని అనేక మంది నిర్వచించారు. సి.యి.యమ్. జోడ్ అనే రచయిత సామ్యవాదం ఒక టోపీ వంటిదని, దానిని అందరూ ధరించటం వలన అసలు రూపమే పోయిందని అంటారు.

నిర్వచనాలు :
“ఒక కేంద్ర ప్రజాస్వామ్య ప్రభుత్వం మేలైన పంపిణీ విధానాన్ని, దానికనుగుణంగా ఉత్పత్తి విధానాన్ని ఏర్పరచాలనే ఆశయం గల సిద్ధాంతం సామ్యవాదం”. – ఎన్ సైక్లోపీడియా.
“ఆదాయాలను సమానం చేయడం సామ్యవాదం”. – జార్జ్ బెర్నార్డ్ షా.

ప్రశ్న 6.
పెట్టుబడిదారీ విధానం.
జవాబు.
వ్యక్తివాదం వలన పెట్టుబడిదారీ విధానము పెరిగింది. వ్యక్తులు ఉత్పత్తి సాధనాలను తమ ఆధీనంలో ఉంచుకొని లాభాలను ఆర్జించడము కోసం ఆర్థిక రంగాన్ని నియంత్రణ చేయడము ఇందలి ముఖ్య లక్షణం.

లక్షణాలు :

  1. వ్యక్తుల యాజమాన్యం : ఉత్పత్తి సాధనాలు వ్యక్తి ఆధీనంలో ఉంటాయి. దీని వలన వ్యక్తులు శ్రద్ధతో పనిచేస్తారు.
  2. ఆర్థిక రంగంలో స్వేచ్ఛ: యాజమానులు లాభదాయకమైన వస్తువులను ఉత్పత్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో స్వేచ్ఛ వుంటుంది. లాభ, నష్టాలకు వ్యక్తులే బాధ్యులు.
  3. వినియోగదారునికి స్వేచ్ఛ : వినియోగదారుడు తన ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తాడు.
  4. పోటీ : ఉత్పత్తి వాణిజ్యాలలో తీవ్రమైన పోటీ ఉంటుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

ప్రశ్న 7.
మార్క్సిజం.
జవాబు.
కారల్ మార్క్స్, ఏంజెల్స్ దీనిని ప్రబోధించారు. ఆర్థిక సమానత్వం దీని ప్రధాన లక్ష్యం. ఇది పెట్టుబడిదారీ విధానాన్ని, ఆస్తి హక్కును వ్యతిరేకిస్తుంది. కమ్యూనిజంలో కార్మిక నియంతృత్వం ద్వారా ప్రభుత్వం చేపట్టి, సంపదనంతా జాతీయంచేసి, విప్లవం ద్వారా ఆర్థిక సమానత్వం తేవాలి.

పేదరికం, నిరుద్యోగం కూడా నిర్మూలింపబడాలి. ప్రజలు తమ అవసరాలను బట్టి సంపద వాడుకుంటారు. కమ్యూనిజం లక్ష్యం నెరవేరిన తరువాత రాజ్యం అంతరిస్తుందని కమ్యూనిస్ట్ల వాదన. దీనిని శాస్త్రీయ సామ్యవాదం అని కూడా అంటారు.

ప్రశ్న 8.
అహింసా సిద్ధాంతం.
జవాబు.
అహింస అంటే “హింస చేయకుండటం” అంటే ఎవరినీ “చంపటానికి వీలులేదు” అనేది విస్తృత అర్థంలో వాడతాం. గాంధీ అహింసా భావాన్ని రాజకీయాలలో తిరుగులేని అస్త్రంగా వాడాడు. సత్యం, భయం లేకుండటం అహింసకు కావల్సిన కారకాలు. గాంధీజీ అహింసను ఒక వ్యక్తి తన ఆత్మకు తాను విధించుకునే స్వకీయ శిక్షవంటిదని పేర్కొన్నాడు.

దయ, ప్రేమ, భయం లేకుండుట, అమాయకత్వం, దయార్ద్రత, నిస్వార్థత మొదలైనవి. అహింస పాటించటంలో దోహదపడే అంశాలుగా గాంధీజీ వివరించాడు. అహింసా విధానాన్ని ఒక్క బ్రిటీష్ వారికి మాత్రమే వ్యతిరేకంగా ప్రయోగించిన ఆయుధం కాదు. సమాజంలోని వివిధ రకాల రుగ్మతలను తొలగించటానికి సైతం దీన్ని ఆయుధంగా వాడవచ్చునన్నాడు.

ప్రశ్న 9.
సత్యాగ్రహం.
జవాబు.
గాంధీజీ ప్రకారం సత్యాగ్రహం కేవలం తాత్విక సిద్ధాంతం మాత్రమే కాదు. అది విదేశీ పాలనను అంతమొందించి సాంఘిక, ఆర్థిక న్యాయాలు సంపాదించేది. గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు సత్యాగ్రహం అనే భావనను కనిపెట్టాడు.

అతని ఉద్దేశంలో సత్యాగ్రహం అంటే ప్రేమతో కూడిన ఒత్తిడి మరియు ఆత్మ సంబంధమైన ఒత్తిడి. సత్యాగ్రహం అంటే తప్పుచేసినవాడిని క్షోభపెట్టడం కాదు. దాన్ని వ్యతిరేకించేవాడు క్షోభపడి ఎదుటివాడిలో మార్పు తీసుకురావడం అని గాంధీజీ. అభిప్రాయం.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

ప్రశ్న 10.
ధర్మకర్తృత్వం.
జవాబు.
గాంధీజీ అంతిమ రాజకీయ లక్ష్యం దేశంలో ‘రామరాజ్యం’ ఏర్పాటు చేయటం దాని ద్వారా ప్రజలందరికి సంక్షేమం (సర్వోదయ) కల్పించటం. రామరాజ్యం ఏర్పడిన సమాజంలోని వ్యక్తులు తమ ఆస్తిని పరిశ్రమలను, భూమిని మరియు వ్యాపారాన్ని’ ధర్మకర్తృత్వంగానే పరిగణిస్తారు.

ప్రతి వ్యక్తి తనకు ఎంత కావాలో అంతే ఉంచుకొని మిగిలిన దాన్నంతా ఇతరులకు ఇచ్చివేయాలి. గాంధీజీ ధర్మకర్తృత్వం సిద్ధాంతాన్ని విప్లవ కమ్యూనిస్టు సిద్ధాంతానికి ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించాడు.

ప్రశ్న 11.
సహాయ నిరాకరణ.
జవాబు.
సత్యాగ్రహాన్ని అనేక రూపాలలో ఆచరించవచ్చు. వాటిలో సహాయ నిరాకరణ అనేది పరోక్షమైన చాలా చిన్నదైన నిరసన. దీనిని గాంధీజీ భారతజాతీయోద్యమ చిన్నదైన నిరసన. దీనిని గాంధీజీ భారతజాతీయోద్యమ కాలంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా 1920-22 మధ్యకాలంలో నిర్వహించాడు.

అహింసాయుత సహాయ నిరాకరణోద్యమము ప్రకారం విదేశీ వస్తు బహిష్కరణ, ప్రభుత్వ బిరుదులను పరిత్యజించుట, శాసన సభలను, న్యాయస్థానాలను, విద్యాలయాలను బహిష్కరించుట మొదలగు కార్యకలాపాలను గాంధీజీ నాయకత్వాన విజయవంతంగా చేయడము జరిగింది. అయితే ఈ ఉద్యమము 8, ఫిబ్రవరి 1922న చౌరీ చౌరా సంఘటనతో హింసాయుతమైన మలుపు తీసుకోవడంతో గాంధీజీ కలత చెంది ఉద్యమాన్ని నిలుపుదల చేసినాడు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

ప్రశ్న 12.
శాసనోల్లంఘనం.
జవాబు.
‘సత్యాగ్రహ రూపాలలో శాసనోల్లంఘనం తీవ్రమైన నిరసన. దీన్ని వ్యక్తిగతంగాగాని, సామూహికంగాగాని తెలియజేయవచ్చు. గాంధీజీ 1930వ సంవత్సరంలో శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించెను. గుజరాత్లోని సబర్మతి ఆశ్రమము నుండి “దండి” అనే గుజరాత్ సముద్ర తీరప్రాంత గ్రామానికి తన సహచరులతో పాదయాత్ర నిర్వహించాడు.

సముద్ర తీరంలో ఉప్పు తయారుచేసి, ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా ఆనాటి బ్రిటీష్ ఉప్పు శాసనాన్ని ధిక్కరించెను. ఈ శాసనోల్లంఘన కార్యక్రమములో గాంధీజీతోపాటు 60 వేల మంది ప్రజలు, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొనిరి. అందువలననే దీనిని సామూహిక శాసనోల్లంఘన ఉద్యమంగా అభివర్ణించడం జరిగింది.

TS Inter 1st Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 11th Lesson ప్రభుత్వాంగాలు Textbook Questions and Answers.

TS Inter 1st Year Political Science Study Material 11th Lesson ప్రభుత్వాంగాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ద్విశాసనసభ నిర్మాణాన్ని వివరిస్తూ, శాసనసభ విధులను తెలపండి.
జవాబు.
శాసన శాఖ ఏకశాసనసభ లేదా ద్విశాసనసభా. విధానాన్ని కలిగి వుండవచ్చు. ఏక శాసనసభా విధానంలో ఒకే. సభ వుంటే ద్విశాసనసభా విధానంలో రెండు సభలుంటాయి. వీటిని దిగువ సభ, ఎగువ సభలుగా పేర్కొనవచ్చు.

దిగువ సభ ప్రజల మనోభావాలకు తార్కాణం కాగా, ఎగువ సభ అన్ని రాష్ట్రాల ప్రయోజనాలకు అద్దం పట్టే విధంగా ఉంటుంది. ఉదాహరణకు భారత పార్లమెంటులో రాజ్యసభ ఎగువ సభ కాగా లోక్సభ దిగువ సభగా వుంది.

శాసనసభ విధులు :
ప్రజల అభిమతాన్ననుసరించి చట్టాలు రూపొందించడమే శాసనసభ ప్రధాన విధి. ఆధునిక సభలు చట్ట నిర్మాణంతోపాటు కొన్ని పాలనా విధులను న్యాయ విధులను కూడా నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ రూపాలను బట్టి కూడా శాసనసభ విధులు ఆధారపడి ఉంటాయి. అధ్యక్ష ప్రభుత్వ వ్యవస్థలో శాసనసభ పాత్ర పరిమితంగా ఉంటుంది.

పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థలో శాసనసభ పాత్ర విస్తృతంగా ఉంటుంది. శాసనసభ విధులను కింది శీర్షికల కింద వివరించవచ్చు. శాసన నిర్మాణం, కార్యనిర్వాహక వర్గంపై నియంత్రణ, ఆర్థిక సంబంధ విధులు, రాజ్యాంగ విధులు, ఇతర విధులు.

శాసన నిర్మాణం :
శాసన నిర్మాణం శాసనసభ ప్రాథమిక విధి. ప్రజల అభిమతాలను గుర్తించి వాటికనుగుణంగా శాసనాలు చేయడమే శాసనసభ ముఖ్య కర్తవ్యం. కొత్త చట్టాలను చేయడానికి, కాలదోషం పట్టిన చట్టాలను మార్పు చేయడానికి, రద్దు చేయడానికి శాసనసభకు అధికారం ఉంది. శాసనాలు చేయడమేకాక వివిధ విషయాల మీద, వివరంగా చర్చలు జరపడం, సమాలోచనలు చేయడం కూడా శాసనసభ విధి. ప్రతి బిల్లు శాసనంగా ఆమోదం పొందే ముందు శాసనసభ దానికి సంబంధించిన అన్ని అంశాలను విపులంగా చర్చిస్తుంది.

కార్య నిర్వాహక వర్గంపై నియంత్రణ :
పార్లమెంటరీ ప్రభుత్వ విధానంలో మంత్రి మండలి శాసనసభకు బాధ్యత వహిస్తుంది. దేశంలో తలెత్తే సమస్యల గురించి, వాటి పరిష్కారాలను గురించి వివిధ తీర్మానాల ద్వారా, ప్రశ్నోత్తరాల సమయం ద్వారా మంత్రి వర్గంపై శాసన సభ అజమాయిషీ చేస్తుంది. అవసరమైతే ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగిస్తుంది.

ఆర్థిక సంబంధం విధులు :
ప్రజాస్వామ్య దేశంలో శాసనసభకు ఉండే ఆర్థిక విధులు ముఖ్యమైనవి. శాసనసభ వివిధ పద్దుల కింద ఆదాయ వ్యయాలను బడ్జెట్ రూపంలో ఆమోదిస్తుంది. ప్రభుత్వం ఎంత ఆదాయాన్ని ఏ పద్దుల కింద ఖర్చుపెట్టాలో శాసనసభ నిర్ణయిస్తుంది. శాసనసభ అనుమతి లేకుండా కొత్త పన్నులను విధించరాదు. ఉన్న పన్నులను రద్దు చేయరాదు.

న్యాయ సంబంధ విధులు :
శాసన సభలు ముఖ్యంగా ఎగువ సభలు న్యాయ సంబంధిత విధులను కూడా. నిర్వహిస్తాయి. ఇంగ్లాండులో ప్రభువుల సభ అత్యున్నత న్యాయ స్థానంగా పనిచేస్తుంది. అమెరికా, ఇండియాలో రాష్ట్రపతిపైన సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయ మూర్తులపై వచ్చే అభియోగాలను జాతీయ శాసనసభలు విచారిస్తాయి. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలను శాసనసభ ప్రత్యేక కమిటీల ద్వారా విచారణ జరుపుతుంది. ప్రత్యేక సభాహక్కులు అతిక్రమించినవారిని దండించడానికి కూడా శాసనసభకు అధికారం ఉంది.

రాజ్యాంగ విధులు :
సాధారణ శాసనాలు చేయడమే కాకుండా శాసనసభలకు రాజ్యాంగాన్ని మార్చే అధికారం కూడా ఉంటుంది. దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా మౌలిక శాసనమైన రాజ్యాంగంలో అవసరమైన మార్పులు చేయడానికి చట్టసభలకు అధికారం ఉంది.

ఇతర విధులు :
పై విధులతోపాటు శాసనసభకు మరొకొన్ని విధులు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని ఇవి :

  1. ప్రభుత్వం ప్రకటించే ఆర్డినెన్సులను ఆమోదించడం లేదా తిరస్కరించడం.
  2. సభాధ్యక్షులను ఎన్నుకోవడం.
  3. ప్రభుత్వ వ్యవహారాలను దర్యాప్తు చేయడానికి అవసరమైన కమిటీలను నియమించడం.
  4. సభా కార్యక్రమాలకు సంబంధించిన నియమాలను రూపొందించడం.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

ప్రశ్న 2.
కార్యనిర్వాహక శాఖ అంటే ఏమిటి ? కార్యనిర్వాహకశాఖ విధులను తెల్పండి.
జవాబు.
పరిచయం :
ప్రభుత్వ నిర్మాణంలో కార్యనిర్వాహకశాఖ అతిముఖ్యమైన రెండవ అంగం. రాజ్య విధానాలను అమలుపరచడంలో కార్యనిర్వాహకశాఖ ముఖ్య సాధనంగా ఉపయోగపడుతుంది. కార్యనిర్వాహకశాఖ అంటే రాజ్యాధిపతులు, వారి మంత్రులు, సలహాదారులు, పరిపాలనాశాఖాధిపతులు కలిసికట్టుగా కార్యనిర్వాహక వర్గంగా ఏర్పడతారు.

కార్యనిర్వాహకశాఖ విధులు (Functions of Executive) :
ఆధునిక రాజ్యాలలో కార్యనిర్వాహకశాఖ పలురకాల విధులు నిర్వహిస్తుంది. సైద్ధాంతికంగా, ఈ శాఖ శాసననిర్మాణశాఖ రూపొందించిన చట్టాలను అమలుపరుస్తుంది. అయితే ఆయా ప్రభుత్వ రూపాలను బట్టి ఈ శాఖ నిర్వహించే విధుల్లో మార్పు ఉంటుంది. సాధారణంగా కార్యనిర్వాహకశాఖ ఈ కింది విధులను నిర్వహిస్తుంది.

1. పాలనాపరమైన విధులు (Administrative Functions) :

  • చట్టాలను, న్యాయశాఖ తీర్పులను అమలుపరచడం,
  •  శాంతిభద్రతలను కాపాడటం,
  • విధివిధానాలను రూపొందించడం,
  • సివిల్ సర్వెంట్స్ నియామకం, పదోన్నతి, తొలగింపు (ఉద్యోగంలో నుండి తొలగించడం) మొదలైన విధులు.

2. దౌత్యపరమైన విధులు (Diplomatic Functions) :
కార్యనిర్వాహకశాఖ విదేశీ సంబంధాలను నెరపడము, విదేశాల్లో దౌత్యాధికారులను నియమించడం, దౌత్య వ్యవహారాలను చక్కబెట్టడం, అదే విధంగా, దేశాల మధ్య జరిగే చర్చా సమాలోచనలను, అంతర్జాతీయ ఒప్పందాలను, సదస్సు తీర్మానాలను అమలుపరచడం. అయితే, ఈ చర్యలన్నింటిని శాసన నిర్మాణశాఖ ధృవపరచవలసి ఉంటుంది.

3. సైనికపరమైన విధులు (Military Functions) :
ప్రపంచ దేశాలలోని అనేక రాజ్యాలలో ముఖ్య కార్యనిర్వహణాధిపతి రక్షణశాఖకు అత్యున్నత దేశాధికారిగా ఉంటాడు. ఇతర దేశాలతో యుద్ధాన్ని గాని, లేదా శాంతి సంధినిగాని కార్యనిర్వాహకశాఖ ప్రకటించవచ్చు. అదే విధంగా అత్యవసర సమయాల్లో ఈ శాఖ దేశవ్యాప్తంగా మార్షల్ లా (Martial Law)ను విధించి పౌరుల హక్కులను సైతం రద్దు చేయవచ్చు.

4. ఆర్థికపరమైన విధులు (Financial Functions):
కార్యనిర్వాహకశాఖ కొన్ని ఆర్థికపరమైన విధులను కూడా నిర్వహిస్తుంది. అవి వరుసగా, ఈ శాఖ వార్షిక ఆదాయ వ్యయపట్టికను ఎంతో జాగరూకతతో తయారుచేస్తుంది. వివిధ రకాల రూపాలలో వచ్చే ప్రభుత్వ రాబడులను గుర్తించేందుకు కృషిచేస్తుంది. పన్నుల వసూళ్ళకు కావలసిన యంత్రాంగాన్ని ఏర్పరుస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

5. న్యాయపరమైన విధులు (Judicial Functions) :
అనేక రాజ్యాలలో కార్యనిర్వాహకశాఖ ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల నియామకంతోపాటు వారిని బదిలీ చేయడం వంటి విధులను నిర్వహిస్తుంది. అదే విధంగా దోషులుగా నిర్ధారించబడ్డ వారి శిక్షలను తగ్గించడం లేదా తొలగించడం, రద్దుచేయడం వంటి విధులను సైతం ఈ శాఖ చేపడుతుంది. అయితే ఇలాంటి అధికారాన్ని కొన్ని ప్రత్యేక సమయాలలో మాత్రమే వినియోగిస్తుంది.

6. రాజ్యాంగపరమైన విధులు (Constitutional Functions) :
చాలా దేశాల్లో కార్యనిర్వాహకశాఖ రాజ్యాంగ సవరణలకు సంబంధించి శాసననిర్మాణశాఖకు సలహాదారుగా వ్యవహరిస్తుంది. రాజ్యాంగ సూత్రాలను అమలుపరిచే క్రమంలో సమస్యలు ఉత్పన్నమైనట్లయితే వాటిని అధిగమించి ప్రగతిని సాధించడానికి రాజ్యాంగ సవరణలు అవసరమని భావించినట్లయితే వాటిని చేయవలసిందిగా శాసననిర్మాణ శాఖకు విన్నవిస్తుంది.

అలాంటి చర్యలు చేపట్టవలసిన ఆవశ్యకతను తెలియజేయడానికి ముందస్తు సర్వేలు నిర్వహించి వాటి నివేదికలను పార్లమెంటుకు సమర్పిస్తుంది. ఈ సందర్భంగా, కార్యనిర్వాహకశాఖ శాసనసభ్యుల మద్దతును కూడగట్టి తగిన రాజ్యాంగ సవరణలను చేస్తుంది.

7. ఆర్డినెన్స్ల జారీ (Promulgation of Ordinances) :
అనేక రాజ్యాలలో కార్యనిర్వాహకశాఖ ఆర్డినెన్స్లను జారీ చేస్తుంది. క్లిష్టమైన సమస్యలను అత్యవసరంగా పరిష్కరించడానికి ఈ తరహా బాధ్యతలను అది నిర్వహిస్తుంది. శాసనసభల సమావేశం జరిగేంతవరకు ఈ ఆర్డినెన్స్లు అమలులో ఉంటాయి.

అంతేకాకుండా నియోజిత శాసనం (delegated legislation) అనేది శాసననిర్మాణశాఖ తరపున చట్టాలను రూపొందించేందుకు కార్యనిర్వాహక శాఖకు వీలు కల్పిస్తుంది. శాసన సభ్యులు కొన్ని బిల్లులను సంపూర్ణమైన వివరాలతో తయారు చేసేందుకు కార్యనిర్వాహకశాఖకు అధికారమిచ్చేందుకు తమ సమ్మతిని తెలియజేస్తారు.

8. సంక్షేమ విధులు (Welfare Functions) :
నేడు అనేక రాజ్యాలు సంక్షేమ దృక్పథాన్ని కలిగి ఉన్నాయి. తద్వారా ప్రజాసంక్షేమంలో వాటి కర్తవ్యాలు నానాటికి విశేషంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా, సంక్షేమంలో పూర్తిగా విస్మరించబడ్డ వర్గాలు, నిరాకరించబడ్డ, కనీస సౌకర్యాలకు కూడా నోచుకోని ప్రజలను ఉద్దేశించి శాసనాలను రూపొందించి అమలుపరుస్తుంది. ఫలితంగా ఈ శాఖ అనేక బహుళ విధులను, చర్యలను చేపడుతుంది.

9. పాలనాపరమైన న్యాయనిర్ణయ విధులు (Administrative Adjudication Functions) :
అనేక సందర్భాలలో పరిపాలనకు సంబంధించిన కేసులలో, వివాదాలలో కార్యనిర్వాహక శాఖ పాలనాపరమైన న్యాయనిర్ణేతగా ప్రముఖపాత్రను నిర్వహిస్తుంది. ఇలాంటి చర్యలను చేపట్టడం ద్వారా ఈ శాఖ కొన్ని న్యాయ సంబంధమైన అధికారాలను సైతం కలిగి ఉందని చెప్పవచ్చు.

10. అత్యవసర కార్యక్రమాలు (Emergency Operations):
శాంతి భద్రతలు క్షీణించడం, ప్రకృతివైపరీత్యాలు, విదేశీ చొరబాట్లు లేదా మరే విధమైన అత్యవసర పరిస్థితులు వివిధ సమయాలలో వివిధ ప్రాంతాలలో ఉత్పన్నమైనట్లయితే వాటిని చక్కబెట్టే బాధ్యతను కార్యనిర్వాహకశాఖ చేపడుతుంది.

గతకొన్ని సంవత్సరాల నుంచి అనేక దేశాలలో తీవ్రవాదం ఒక ప్రధాన సమస్యగా పరిణమించింది. ఇలాంటి సమస్యలను కార్యనిర్వాహకశాఖ సందర్భానుసారంగా, సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. మరే ఇతర ప్రభుత్వ అంగం కూడా ఇలాంటి పరిస్థితులను చక్కబెట్టలేదు.

11. ఇతర విధులు (Miscellaneous Functions) :
ప్రభుత్వానికి కార్యనిర్వాహకశాఖ నాయకత్వాన్ని అందిస్తుంది. శాసననిర్మాణ శాఖ, అధికారంలో ఉన్న పార్టీతోపాటుగా మొత్తం జాతికి నాయకత్వం వహిస్తుంది. ఈ శాఖ రాజ్యానికి నాయకత్వాన్ని అందిస్తూ అంతర్జాతీయ సదస్సులు, సంస్థల కార్యకలాపాలలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

ప్రశ్న 3.
న్యాయశాఖను వివరించి దాని విధులను చర్చించండి.
జవాబు.
ప్రభుత్వాంగాలలో న్యాయశాఖ మూడవది, ఇది శాసనాలను వ్యాఖ్యానిస్తుంది. అవి న్యాయసమ్మతంగా ఉన్నదీ, లేనిదీ నిర్ణయిస్తుంది. “పక్షపాతరహితంగా ప్రజలకు న్యాయం చేకూర్చడంపై దేశ శ్రేయస్సు, ప్రభుత్వ సామర్థ్యం ఆధారపడి ఉంటాయని” లార్డ్ బ్రైస్ అభిప్రాయం. న్యాయస్థానాలు న్యాయశాఖలో భాగం.

న్యాయశాఖ ప్రజాస్వామ్యంలో ప్రజల స్వేచ్ఛను రక్షిస్తుంది. ప్రభుత్వం రాజ్యాంగ పరిధిలో పనిచేసేటట్లు చూస్తుంది. ఆధునిక కాలంలో అనేక విధులను నిర్వహిస్తున్నది. ప్రజల హక్కులను కాపాడి, శాసనాలను వ్యాఖ్యానించి, న్యాయం చేయడమే న్యాయస్థానాల ముఖ్య కర్తవ్యం.

విధులు :
1. శాసనాలను వ్యాఖ్యానించడం :
శాసనశాఖ చేసిన శాసనాలకు అర్థవివరణ ఇవ్వడం న్యాయశాఖ ప్రధాన కర్తవ్యం. న్యాయమూర్తులు చట్టాలను వ్యాఖ్యానించి, వివిధ అంశాలపై తమ నిర్ణయాలు తెలుపుతారు. శాసనాల అభివృద్ధికి న్యాయస్థానాలు పరోక్షంగా దోహదం చేస్తాయి.

2. రాజ్యాంగ రక్షణ :
రాజ్యాంగ రక్షణ చేసి, దాని మౌలిక స్వరూపానికి భంగం లేకుండా చూడవలసిన బాధ్యత న్యాయస్థానాలకు ఉంది. శాసనశాఖ చేసే చట్టాలను రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే వాటిని చెల్లవని కొట్టివేసే “న్యాయసమీక్షాధికారం” న్యాయస్థానాలకు ఉంది.

3. హక్కుల రక్షణ :
న్యాయస్థానాలు ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడతాయి. ప్రజాస్వామ్యంలో పౌరుల హక్కులకు భంగం కలిగితే వారు న్యాయస్థానాల ద్వారా వాటిని రక్షించుకుంటారు. వ్యక్తి స్వేచ్ఛను రక్షించడానికి హెబియస్ కార్పస్ వంటి రిట్లు (writs) జారీచేసే అధికారం న్యాయస్థానాలకు ఉంది.

4. సమాఖ్య సమతౌల్యత:
సమాఖ్యలో న్యాయశాఖ అత్యంత కీలక పాత్రను పోషిస్తుంది. న్యాయశాఖ కేంద్రం రాష్ట్రాల మధ్యగాని, పలు రాష్ట్రాల మధ్యగానీ తలెత్తే వివాదాలను పరిష్కరిస్తుంది. కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ పరిమితులను దాటకుండా ఇది చూస్తుంది.

5. సలహారూపక విధులు :
కార్యనిర్వాహక లేదా శాసననిర్మాణశాఖల కోరిక మేరకు న్యాయశాఖ తగిన సలహాలిస్తుంది.
ఉదా : భారత రాష్ట్రపతి రాజ్యాంగపర చట్టాలకు సంబంధించి ఏదైనా సందేహం ఉత్పన్నమైనట్లయితే, భారత సుప్రీంకోర్టు సలహాను తీసుకోవచ్చు. ఇంగ్లాండులో ఇలాంటి సలహా సంప్రదింపులు జరపడం సర్వసాధారణం. చట్టానికి సంబంధించిన ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు బ్రిటీష్ రాణి ప్రివీకౌన్సిల్ న్యాయ కమిటీల సలహాలను తీసుకుంటుంది.

6. అప్పీళ్ళ విచారణ పరిధి :
కింది కోర్టులు ఇచ్చిన తీర్పులపై అత్యున్నత కోర్టు అప్పీళ్లను స్వీకరిస్తుంది. కింది కోర్టులు వెలువరించిన తీర్పులను అన్నివేళల పునఃసమీక్షిస్తుంది. కొన్ని సందర్భాలలో వాటికి వ్యతిరేకంగా కూడా తీర్పులను వెలువరిస్తుంది.

7. రికార్డుల నిర్వహణ :
న్యాయశాఖ తన తీర్పులకు సంబంధించిన రికార్డులతోపాటు ఇతర కేసులకు సంబంధించిన రికార్డులను సైతం భద్రపరుస్తుంది. సదరు రికార్డులు భవిష్యత్తులో న్యాయవాదులకు, న్యాయమూర్తులకు అదే తరహా కేసులు వాదించడానికి లేదా తీర్పులు వెలువరించడానికి ప్రాతిపదికగా ఉపయోగపడతాయి.

8. రాజ్యాధిపతిగా వ్యవహరించడం :
అత్యున్నత న్యాయస్థానాలలోని ప్రధాన న్యాయమూర్తి కొన్ని ప్రత్యేక సందర్భాలలో కొన్ని దేశాలలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఆయా స్థానాలలో లేనప్పుడు రాజ్యాధిపతిగా వ్యవహరిస్తాడు.

9. పరిపాలనా విధులు :
సుప్రీంకోర్టు, హైకోర్టులు కొన్ని పరిపాలనాపరమైన విధులను నిర్వహిస్తాయి. ఉన్నత న్యాయస్థానాలు కింది న్యాయస్థానాల న్యాయమూర్తుల నియామకంలో కార్యనిర్వాహక అధిపతికి సలహా ఇస్తాయి. అదే విధంగా అవి కింది న్యాయస్థానాల పనితీరును పర్యవేక్షిస్తాయి. ఉదా : భారతదేశంలోని హైకోర్టులు తమ పరిధిలోని అధీన న్యాయస్థానాల కార్యక్రమాలను పర్యవేక్షించే కర్తవ్యాన్ని కలిగి ఉంటాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
శాసనసభల ప్రాముఖ్యం తగ్గుదలకు గల కారణాలు వివరించండి.
జవాబు.
ఆధునిక రాజ్యాల్లో సిద్ధాంత రీత్యా సర్వాధికారాలున్న శాసనసభ ప్రాముఖ్యం క్రమేణా తగ్గిపోతుందని రాజనీతి శాస్త్రజ్ఞుల భావన. దీనికి అనేక కారణాలున్నాయి. కార్యనిర్వాహకశాఖ అనేక అధికారాలు సంతరించుకుంది. ఆర్థిక, సామాజిక రంగాల్లో సర్వతోముఖాభివృద్ధిని సాధించడానికి రాజ్యాంగపరంగా, చట్టరీత్యా కార్యనిర్వాహకశాఖ నూతన అధికారాలను సంపాదించుకుంది.

సాంకేతిక, వైజ్ఞానిక అభివృద్ధి ఫలితంగా కొత్త విషయాలు ప్రభుత్వ విధానాల్లో- చోటు చేసుకోవడంలో వాటిని అర్థం చేసుకునే సాధారణ సామర్థ్యం శాసనసభలకు పూర్తిగా లేకపోవడంవల్ల శాసనసభ కార్యనిర్వాహక శాఖపై ఆధారపడే పరిస్థితి ఏర్పడింది.

ఉన్నత రాజకీయ పదవులన్నీ ఎన్నికల ద్వారా భర్తీ కావడం ప్రారంభమైన తరువాత ప్రభుత్వం ప్రత్యక్షంగా ప్రజలను ప్రభావితం చేసే ప్రాముఖ్యాన్ని పొందింది. దీనితో శాసనసభతో సంబంధం లేకుండా ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను ప్రభుత్వం ఏర్పరచుకుంటుంది.

దాని వల్ల శాసనసభ ప్రాముఖ్యం తగ్గడానికి మరోకారణం శాసనసభ ఒక సాధారణ చట్టాన్ని స్థూలంగా ఆమోదించి దానికి సంబంధించిన వివరాలను భర్తీ చేయడానికి కార్య నిర్వాహకశాఖకు ఇచ్చే అధికారమే ‘నియోజిత శాసనం’ ప్రణాళికలు సంక్షేమ పథకాలు అమలు పరిచేందుకు కార్య నిర్వాహకశాఖ నియోజిత శాసనాధికారాన్ని ఉపయోగిస్తుంది.

బలమైన ప్రతిపక్షం లేకపోవడం, పార్లమెంటు సమావేశాల కాలం తగ్గిపోవడం, అధికార పక్షం బాధ్యతారహితంగా ప్రవర్తించడం, సభ్యులు అనుచితంగా ప్రవర్తించడం శాసనసభ ప్రాముఖ్యాన్ని తగ్గిస్తున్నాయని రాజనీతి శాస్త్రజ్ఞులు ఆందోళన చెందుతున్నారు.

ప్రశ్న 2.
కార్యనిర్వాహక శాఖ ప్రాముఖ్యం పెరగడానికి గల కారణాలు చర్చించండి.
జవాబు.
ఆధునిక కాలంలో కార్యనిర్వాహకవర్గం అధికారాల, విధుల పరిధి నానాటికీ విస్తృతమవుతుంది. ఈ స్థితికి కింది కారణాలు ప్రధానమైనవిగా పేర్కొనవచ్చు.

1. సంక్షేమ రాజ్య భావన:
సమాజ సంక్షేమ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. పరిశ్రమలు, ఉత్పత్తి పంపిణీ, సామాజిక భద్రత, కార్మిక సంక్షేమం, విద్య, వైద్య సేవలు మొదలైనవన్నీ కార్యనిర్వాహకశాఖ పరిధి కిందకు వచ్చాయి. ఈ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడానికి కృషి చేయడం వల్ల కార్యనిర్వాహక వర్గం పరిధి పెరుగుతుంది.

2. పారిశ్రామికీకరణ :
పారిశ్రామిక విస్తరణ కూడా కార్యనిర్వాహకవర్గం పాత్రను పెంచింది. మౌలిక పరిశ్రమలను, భారీ పరిశ్రమలను జాతీయం చేయడంలో కార్యనిర్వాహకవర్గం కీలకపాత్ర వహిస్తుంది. జాతీయం చేసిన పరిశ్రమల నిర్వహణ కూడా కార్యనిర్వాహకశాఖ విధుల పరిధిని పెంచింది.

3. నియోజిత శాసన నిర్మాణం :
కార్యనిర్వాహక వర్గం శాసనసభతో పాటు ఒక రకమైన శాసనాలు చేస్తుంది. ఇట్లాంటి శాసనాలను నియోజిత శాసనాలు అంటారు. శాసన సభ ఆమోదించిన శాసనాలను అమలు చేసే సందర్భంగా కార్యనిర్వాహకవర్గం రకరకాల నిబంధనలు, నియమాలు చెయ్యాలి. ఈ విధంగా రూపొందిన శాసనాలను రెండో తరహా శాసనాలు అని కూడా అంటారు. రానురాను ప్రభుత్వ పరిధి బాగా విస్తరిస్తున్నది.

తత్ఫలితంగా ప్రభుత్వం ఎన్నో రంగాల్లో ఎన్నో శాసనాలు చేయవలసి వస్తుంది. అన్ని శాసనాలు చేయడానికి సమయం శాసనసభలకు ఉండదు. అంతేగాక అన్ని శాసనాల తయారీకి కావలసిన నైపుణ్యం శాసనసభకు వుండదు. ఈ కారణం దృష్ట్యా శాసనాధికారాలు కార్యనిర్వాహకశాఖకు వదిలి పెట్టడం తప్పనిసరైంది.

4. రాజకీయ పార్టీల పనితీరు :
రాజకీయ పార్టీల పనితీరు కూడా కార్యనిర్వాహక వర్గ ప్రాధాన్యం పెరుగుదలకు కారణం. రాజకీయ పార్టీల విస్తృత జాతీయ ప్రయోజనాలకోసం గాక సంకుచిత ప్రయోజనాల కోసం చాలాసార్లు పనిచేయడం మనం చూస్తున్నదే.

5. ప్రణాళికారచన :
నేడు ప్రతి రాజ్యం పెద్ద ఎత్తున ప్రణాళికారచనకు పూనుకుంటున్నది. కార్యనిర్వాహక వర్గం దేశ సర్వతోముఖాభివృద్ధికి ప్రణాళికలను అమలు చేయాల్సి ఉంటుంది. జాతీయ స్థాయి నుంచి స్థానిక స్థాయి వరకు ప్రణాళికలను కార్యసాధకంగా అమలు చేయడం కార్యనిర్వాహక శాఖ విధిగా మారింది. దీనితో కార్యనిర్వాహక శాఖకు విస్తృత అధికారాలు చెలాయించే అవకాశం ఏర్పడుతుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

ప్రశ్న 3.
న్యాయసమీక్షాధికారాన్ని చర్చించండి.
జవాబు.
శాసనసభ చేసిన చట్టాలను రాజ్యాంగ బద్ధంగా ఉన్నాయో లేదా అని సమీక్ష చేసే అధికారమే న్యాయసమీక్షాధికారం. రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యలను లేదా నిర్ణయాలను విచారించి అవి రాజ్యాంగ విరుద్ధమైనట్లయితే వాటిని రద్దుచేసే అధికారం పార్లమెంటు, అసెంబ్లీ మండలిలు, పరిషత్లు మొదలయిన శాసనాలను సమీక్ష చేయడం. రాజ్యాంగ వ్యతిరేకమైన అన్ని చట్టాలను న్యాయస్థానాలు కొట్టివేయడం జరుగుతుంది. దీన్ని న్యాయ సమీక్షాధికారం అంటారు.

చట్టాలకు మాత్రమే న్యాయ సమీక్షాధికారం పరిమితం కాదు. కార్యనిర్వాహకశాఖ చేసే కేంద్ర, రాష్ట్ర తుది స్థానిక సంస్థలపై శాసనసభలో చేసిన చట్టాలు మొదలైన అన్నిటికీ ఇది వర్తిస్తుంది. ప్రతి రాజ్యానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. రాజ్యాంగ పరిమితులకు లోనై మౌలిక శాసనం, చట్టాలు ఉంటాయి. రాజ్యాంగం సమర్థించిన ప్రతీ ప్రక్రియ ‘అన్ని చట్టాలు’, తీర్పులు అన్నీ కూడా రాజ్యాంగ పరిధిలోనే ఉంటాయి. న్యాయసమీక్ష అన్ని దేశాలలో కనిపించదు.

న్యాయ సమీక్ష అనే భావన అమెరికాలో ఆవిర్భవించింది. ఇది 1803లో జస్టిస్ మార్షల్ మార్బరీ వర్సెస్ మాడిసన్ వివాదంలో అప్పటి అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శాసనసభ చేసిన చట్టాలు రాజ్యాంగమౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉన్నందువల్ల అవి చెల్లవనే చారిత్రాత్మక తీర్పునిచ్చాడు.

ఈ తీర్పు ప్రకారం శాససభ రూపొందించే చట్టాలు రాజ్యాంగ చట్టానికి అనుగుణంగా ఉన్నాయా లేవాయని పరీక్షించే అధికారం న్యాయస్థానాలకుందని మొట్టమొదటిసారిగా స్పష్టమైంది. రాజ్యాంగపరిధికి లోబడి చేసే చట్టాలు చేసేముందు వివిధ సిద్ధాంతాలను, సూత్రాలను, భావనలన్నిటిని సమీక్షచేసి మాత్రమే చట్టాలు రూపొందించాలి.

న్యాయ సమీక్షా అధికారం క్రింది సిద్ధాంతాలపై ఆధారపడి ఉంది.

  1. శాసన సామర్థ్య సిద్ధాంతం
  2. అధికార పృథక్కరణ సిద్ధాంతం
  3. రాజ్యాంగ చైతన్యతా సిద్ధాంతం
  4. క్రియాశీల సిద్ధాంతం
  5. అనుభవాత్మక నిర్ణయ సిద్ధాంతం
  6. రాజ్యాంగ పురోభావనా సిద్ధాంతం.

రాజ్యాంగ సవరణ చట్టాలు కూడా శాసనసభలు చేసే చట్టాలే కాబట్టి న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తాయి. కాని న్యాయసమీక్ష పరిధిలోకి రాదు అని ఏ రాజ్యాంగ సవరణ చట్టం చెప్పి ఉంటే ఆ సవరణ చట్టం న్యాయసమీక్ష పరిధిలోకి రాదు. దాన్ని నిర్ణయించేది పార్లమెంట్ అయితే రాజ్యాంగం సవరణ చట్టాలపై న్యాయ సమీక్షాధికారం లేకుండా చేసే శక్తి అధికారం పార్లమెంటుకు ఉందా అనేది ఇటీవల తలెత్తిన ప్రశ్న.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

ప్రశ్న 4.
సమన్యాయపాలనపై చిన్న వ్యాసం రాయండి.
జవాబు. బ్రిటీష్ రాజ్యాంగ విశిష్ఠ లక్షణాలలో సమన్యాయపాలన ఒకటి . సమన్యాయ పాలన తొలుత ఇంగ్లండులో ప్రారంభమైంది. తరువాత ఇండియా అమెరికాలతో సహా అనేక రాజ్యాలు ఈ భావనను అనుసరించాయి. ఎ.వి. డైసీ తన ‘లా ఆఫ్ ది కాన్స్టిట్యూషన్స్’ అనే గ్రంథంలో సమన్యాయపాలన భావన గురించి ఖచ్చితమైన వివరణ ఇవ్వడమైనది. డైసీ ప్రకారం సమన్యాయపాలన అంటే చట్టం ముందు అందరూ సమానులేననే విషయాన్ని సూచిస్తుంది.

చట్టం వ్యక్తుల మధ్య ఏ విధమైన విచక్షణను పాటించదు. ప్రధానమంత్రి మొదలుకొని కార్యాలయంలో నాలుగవ తరగతి ఉద్యోగి వరకు చట్టం ముందు అందరూ సమానులే అని ఈ సందర్భంలో ఎ.వి.డైసీ పేర్కొన్నారు. భారత రాజ్యాంగం కూడా సమన్యాయ పాలనను రాజ్యాంగ మౌలిక లక్షణంగా గుర్తించింది. సమన్యాయపాలన రాజ్యాంగ మౌలిక నిర్మాణంగా భారత సుప్రీంకోర్టు పదేపదే ప్రకటించింది.

భారత రాజ్యాంగం మూడో భాగంలోని 14 నుండి 21 వరకు గల ప్రకరణలు సమన్యాయపాలన భావనను పొందుపరిచాయి. సమన్యాయపాలన భావన అనేది చట్టం ముందు అందరూ సమానులే, ఏ ఒక్కరు విచక్షణారహితంగా శిక్షకు గురికాకూడదు అనే సూత్రంపై ఆధారపడి వున్నది.

ప్రశ్న 5.
న్యాయశాఖ క్రియాశీలత అంటే ఏమిటి ?
జవాబు.
ముఖ్యంగా ఇతర ప్రభుత్వశాఖలు అన్యాయాలను సరిచేయడంలో వైఫల్యం చెందినప్పుడు న్యాయశాఖ క్రియాశీలత ప్రకారం, న్యాయమూర్తులు అన్యాయాలను సరిచేయడానికి తమ అధికారాలను ఉపయోగిస్తారు. పౌరహక్కులు, వ్యక్తిగత హక్కుల రక్షణ, రాజకీయ అన్యాయం, ప్రజానైతికతవంటి అంశాలపై సామాజిక విధానాన్ని రూపొందించడంలో న్యాయస్థానాలు చురుకైన పాత్రను పోషిస్తాయి.

శాసన, కార్యానిర్వాహక శాఖలు విధాన నిర్ణయీకరణ చేయటంలో న్యాయశాఖ క్రియాశీలత అనేది వాటికి పోటీగా ఒక రకమైన విధాన నిర్ణయీకరణే. ఈ అంశం న్యాయ సమీక్షకు సంబంధించినది. అంతిమంగా న్యాయశాఖ క్రియాశీలత స్ఫూర్తి సమకాలీన పరిస్థితులకు అనుకూలంగా న్యాయశాఖ నిర్ణయాలను వేలవరించడంగా భావించాలి.

న్యాయశాఖ ప్రతి నిర్ణయం వెనుక, న్యాయశాఖ క్రియాశీలత, స్వీయ నియంత్రణ, నియంత్రణ అనే రెండు అంశాలు న్యాయ శాఖ త్వాన్ని, ప్రేరణను వివరిస్తాయి. న్యాయశాఖ క్రియాశీలత అనేది పూర్తిగా న్యాయశాఖ స్వీయ నియంత్రణకు వ్యతిరేకం. న్యాయశాఖ క్రియాశీలత చట్ట స్ఫూర్తిని, మారుతున్న కాలాన్ని దృష్టిలో పెట్టుకుంటే, అదే న్యాయశాఖ స్వీయ నియంత్రణ అనేది చట్ట వివరణకు, శాసన ఆనవాయితీకి మాత్రమే ప్రాధాన్యతనిస్తుంది.

న్యాయశాఖ. క్రియాశీలత అనేది మారుతున్న సామాజిక పరిస్థితులనుదృష్టిలో పెట్టుకొనే గతిశీలక ప్రక్రియ. న్యాయశాఖ క్రియాశీలత అనే పదాన్ని 1947లో మొట్టమొదటగా అర్ధర్ క్లెసింగర్ జూనియర్ ప్రతిపాదించాడు. ‘బ్లాక్స్ ‘డిక్షనరీ’ ప్రకారం న్యాయశాఖ క్రియాశీలత అనేది న్యాయమూర్తులను సాంప్రదాయక ఆనవాయితీల నుంచి ప్రగతిశీల, నూతన సామాజిక నిర్ణయాలవైపు ప్రేరేపిస్తుంది.

న్యాయశాఖ క్రియాశీలత ప్రభుత్వాంగాల మధ్య సమతౌల్యతను బంగపరుస్తుందనే విమర్శ ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో శాసన నిర్మాణ ప్రక్రియ అనేది న్యాయశాఖ క్రియాశీలత ద్వారా ఒక కొత్త ఒరవడిని సంతరించుకుంది, మారుతున్న సామాజిక సందర్భంలో న్యాయశాఖ శాసనాన్ని వివరించడంలో ఒక ఆరోగ్యకరమైన ఒరవడిని ప్రారంభించింది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ప్రభుత్వాంగాలు ఎన్ని ? అవి ఏవి ?
జవాబు.
ప్రభుత్వ అంగాలు మూడు. అవి

  1. శాసననిర్మాణశాఖ
  2. కార్యనిర్వాహకశాఖ
  3. న్యాయశాఖ.

శాసననిర్మాణ శాఖ శాసనాలను రూపొందిస్తుంది. కార్యనిర్వాహకశాఖ శాసనాలను అమలుచేస్తుంది. న్యాయశాఖ ఈ రెండు శాఖల మధ్య తలెత్తే సమస్యలను పరిష్కరిస్తూ దేశ ప్రజలందరికి నిష్పక్షపాతంగా న్యాయాన్ని ప్రసాదిస్తుంది.

ప్రశ్న 2.
అధికార పృథక్కరణ సిద్ధాంతం అంటే ఏమిటి ?
జవాబు.
ఫ్రెంచి రచయిత అయిన మాంటెస్క్యూ తాను రచించిన ‘ద స్పిరిట్ ఆఫ్ లాస్’ అనే గ్రంథంలో అధికార వేర్పాటువాద సిద్ధాంతాన్ని పేర్కొనటం జరిగింది. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రభుత్వము యొక్క సర్వాధికారాలను మూడు ప్రభుత్వాంగాలైన శాసననిర్మాణశాఖ, కార్యనిర్వాహకశాఖ మరియు న్యాయశాఖల మధ్య విభజించాలి.

ప్రతి ప్రభుత్వాంగం తన పరిధిలోని అధికారాలపై తిరుగులేని పెత్తనాన్ని కలిగి ఉంటూ, మరొక అంగానికి చెందిన అధికారాల విషయంలో జోక్యం చేసుకోరాదు అని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

ప్రశ్న 3.
బహుసభ్య కార్యనిర్వాహకవర్గం అంటే ఏమిటి ?
జవాబు.
దీనిలో అధికారం అనేకమంది చేతుల్లో వుంటుంది. ఉదాహరణకు మంత్రిమండలి. స్విట్జర్లాండ్లోని ఫెడరల్ కౌన్సిల్, పూర్వపు సోవియట్ యూనియన్లోని ప్రిసీడియం మొదలైనవి. ఈ పద్ధతి పార్లమెంటరీ ప్రభుత్వం వున్న దేశాలలోనూ కొన్ని పూర్వపు సమాఖ్య ప్రభుత్వాలలోనూ కొన్ని మార్పులతో కనిపిస్తుంది.

ప్రశ్న 4.
న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తి అంటే ఏమిటి ?
జవాబు.
న్యాయశాఖ సక్రమంగా, స్వతంత్రంగా పనిచేయాలంటే దానికి శాసన శాఖతో కార్యనిర్వాహక శాఖతో సంబంధం ఉండరాదు. ఆ రెండు శాఖల జోక్యం న్యాయశాఖ విధి నిర్వహణలో ఉండకూడదు.

  1. న్యాయశాఖ స్వతంత్రతతో ఉండాలంటే న్యాయమూర్తుల నియామకం రాజకీయాలకు అతీతంగా జరగాలి.
  2. శక్తి సామర్థ్యాలు ప్రతిభావ్యుత్పత్తులు, స్వతంత్ర ఆలోచనాశక్తి ఉన్నవారిని సమర్థులను, అర్హతలున్నవారినీ న్యాయమూర్తులుగా నియమించాలి.
  3. న్యాయమూర్తులు స్వేచ్ఛగా వ్యవహరించాలంటే వారి ఉద్యోగ పరిస్థితులు ఆకర్షణీయంగా ఉండాలి.
  4. పదవిలో ఉన్నప్పుడు, పదవీ విరమణ చేసినప్పుడు వారికి తగిన రక్షణ ఉండాలి.
  5. పదవీ విరమణ తరువాత వేరే పదవుల కోసం ఎదురు చూడకుండా ఉండాలి. పదవీ విరమణ తరువాత ప్రభుత్వోద్యోగాల్లో చేరకూడదనే నియమం ఉండాలి. అప్పుడే వారు ఏ రకమైన ప్రలోభాలకు లోనుకారు.
  6. న్యాయమూర్తుల తీర్పులపై విమర్శ ఉండకూడదు. పై పద్ధతులు, నియమాలు పాటిస్తే న్యాయమూర్తులు ఎట్లాంటి ప్రలోభాలకు ఒత్తిడిలకు, భయాలకు లోనుకాకుండా స్వతంత్రంగా ఉండి న్యాయపాలన బాగా చేయగలరు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

ప్రశ్న 5.
న్యాయ సమీక్ష అంటే ఏమిటి ?
జవాబు.
ప్రజాస్వామ్య దేశాల్లో న్యాయశాఖ రాజ్యాంగానికి సంరక్షణ కర్త. శాసనసభ, కార్యనిర్వాహక వర్గం తమతమ విధుల నిర్వహణలో రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తే ఆ చర్యలను రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటిస్తుంది. రాజ్యాంగ విరుద్ధమైన అంశాలు అమల్లోకి రాకుండా ఆజ్ఞలను జారీ చేస్తుంది. న్యాయస్థానాలకున్న ఈ అధికారాన్ని న్యాయ సమీక్షాధికారం అంటారు.

ప్రశ్న 6.
సెనేట్.
జవాబు.
అమెరికా సంయుక్త రాష్ట్రాల కేంద్ర శాసనశాఖ అయిన కాంగ్రెస్లోని ఎగువసభను సెనేట్. దీనిలో మొత్తం 100 మంది సభ్యులుంటారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలు మొత్తం 50 కాగా ఒక్కో రాష్ట్రం నుంచి ఇద్దరు సభ్యులు ప్రతినిధులుగా ఎన్నుకోబడతారు.

ప్రశ్న 7.
రాష్ట్రాల కౌన్సిల్.
జవాబు.
భారత పార్లమెంటులోని ఎగువ సభను కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లేదా రాజ్యసభ అంటారు. ఇది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. వీరు పరోక్షంగా నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఏక ఓటు బదిలీ. విధానం ద్వారా ఎన్నుకోబడతారు. దీనిలో మొత్తం 250 సభ్యులుండగా వారిలో 238 సభ్యులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నుకోబడతారు.

మిగిలిన 12 సభ్యులను కళలు, సాహిత్యం, సహకారం, సంఘసేవ, శాస్త్ర, సాంకేతిక రంగాలలోని ప్రముఖులను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ప్రతి రెండు సంవత్సరాలకు మొత్తం సభ్యులలో 1/3 వంతు మంది పదవీ విరమణ చేస్తారు, వారి స్థానంలో కొత్తవారు ఎన్నుకోబడతారు. ఒక్కో సభ్యుడు 6 సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతాడు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

ప్రశ్న 8.
హౌస్ ఆఫ్ లార్డ్స్.
జవాబు.
బ్రిటన్ పార్లమెంట్లోని ఎగువసభను హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటారు. దీనిలో 800 మంది సభ్యులున్నారు. వారిని ప్రధానమంత్రి సిఫారసు మేరకు బ్రిటీష్ రాణి నియమిస్తారు.

ప్రశ్న 9.
పార్లమెంటరీ కార్యనిర్వాహకశాఖ.
జవాబు.
ఈ విధానంలో కార్యనిర్వాహక వర్గం శాసనసభలో సభ్యత్వాన్ని పొంది ఉండటమేకాక భారతదేశంలో వలే పార్లమెంటుకు బాధ్యత వహిస్తుంది.

ప్రశ్న 10.
ఏకశాసనసభ అంటే ఏమిటి ?
జవాబు.
శాసనశాఖ ఒకే సభను కలిగి వుంటే దానిని ఏకసభా విధానమని అంటారు. ఈ విధానంలో ఎగువసభ వుండదు. కేవలం ప్రజలచే ఎన్నుకోబడిన దిగువసభ మాత్రమే వుంటుంది. టర్కీ, స్వీడన్, డెన్మార్క్, బల్గేరియా దేశాలను ఏకసభా విధానానికి ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

ప్రశ్న 11.
ద్విశాసనసభ అంటే ఏమిటి ?
జవాబు.
శాసనశాఖ రెండు సభలను కలిగి వుండటాన్ని ద్విశాసనసభా విధానం అంటారు. ఇందులో ఒకటి ఎగువ సభ కాగా రెండోది దిగువ సభ. ఉదా : బ్రిటన్, భారత్, అమెరికా దేశాలను ద్విసభా విధానానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. భారత పార్లమెంటులో రాజ్యసభ ఎగువసభ గాను లోక్సభ దిగువసభ గాను ఉన్నాయి.