TS Inter 2nd Year Political Science Study Material Chapter 11 భారతదేశం – ప్రపంచదేశాలు

Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 11th Lesson భారతదేశం – ప్రపంచదేశాలు Textbook Questions and Answers.

TS Inter 2nd Year Political Science Study Material 11th Lesson భారతదేశం – ప్రపంచదేశాలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారత విదేశాంగ విధానానికి ఉన్న ఏవేని రెండు లక్షణాలను తెలపండి.
జవాబు.
1. వలసవాదం, సామ్రాజ్యవాదాలకు వ్యతిరేకత :
భారత విదేశాంగ విధానం ప్రధానంగా వలసవాదాన్ని సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తుంది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఖండాల్లోని వివిధ దేశాల్లో వలసవాదపాలనలో ఉన్న ప్రజలపట్ల భారతదేశం సానుభూతి ప్రకటించింది.

వలసవాద పాలన ప్రాంతాల్లో ప్రజలపై నిరంకుశ పాశవిక విధానాన్ని భారతదేశం తీవ్రంగా ఖండిస్తుంది. ఈ ప్రాంతాల ప్రజలు స్వాతంత్ర్యాన్ని పొందడానికి రాజకీయ, దౌత్యపర, ఆర్థిక సహాయాలన్నింటినీ భారతదేశం అందించింది. అగ్రరాజ్యాలు రూపొందించిన సామ్రాజ్యవాద వ్యూహాన్ని కూడా విదేశాంగ విధానం వ్యతిరేకిస్తుంది.

2. జాతి విచక్షణకు వ్యతిరేకత :
సుదీర్ఘకాలంగా భారతదేశం వర్ణ, జాతి, సంస్కృతి తదితర అంశాల ఆధారంగా జరిగే అన్ని రకాల విచక్షణలను వ్యతిరేకిస్తోంది. జాతి విచక్షణ సమస్యను అంతర్జాతీయ స్థాయిలో సముచితంగా వివిధ వేదికల్లో, చర్చనీయాంశం చేసింది. దక్షిణాఫ్రికా, కాంగో, రొడీషియా (ఇప్పటి జింబాబ్వే)లలో అనుసరిస్తున్న ప్రభుత్వ జాతి విచక్షణ విధానాన్ని తీవ్రంగా విమర్శించింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 11 భారతదేశం - ప్రపంచదేశాలు

ప్రశ్న 2.
అలీనోద్యమం పాత్రపై ఒక సంక్షిప్త సమాధానం రాయండి.
జవాబు.
అలీనోద్యమం 1955లో బాండుంగ్లో జరిగిన ఆఫ్రో-ఆసియన్ సమావేశం ద్వారా రూపుదిద్దుకుంది. ఇది ఒక విదేశాంగ విధానంగా పశ్చిమ దేశాల కూటమికి, కమ్యూనిస్టు కూటమికి సమానదూరం పాటించే సంవర్థక విధానంగా వృద్ధి చెందింది. అలీనోద్యమ వ్యవస్థాపక నాయకులుగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ, మార్షల్ టిటో, సుకార్నో, నిక్రోమా, అబ్దుల్ నాజర్ తదితర రాజనీతిజ్ఞులు ఉద్యమ వ్యాప్తికి ఎంతో కృషి చేశారు.

అలీనోద్యమ లక్ష్యాలు :
అలీనోద్యమం కొన్ని నిర్దిష్ట లక్ష్యాలతో పనిచేస్తుంది. వాటిలో ప్రధానమైనవి :

  1. ప్రపంచ శాంతి, నిరాయుధీకరణ
  2. వలసప్రాంతాల ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కు
  3. జాతివివక్షకు, వర్ణవివక్షకు వ్యతిరేకంగా ప్రతీవారికి సమానత్వపు హక్కు
  4. ఆర్థిక సమానత్వాన్ని సాధించండం
  5. సాంస్కృతిక ఆధిపత్యం లేదా సాస్కృతిక సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించడం
  6. అంతర్జాతీయ వాదాన్ని సమర్ధించడం.

ప్రశ్న 3.
సార్క్ అనగానేమి ? వివరించండి.
జవాబు.
దక్షిణ ఆసియా ప్రాంతీయ సహకార సంఘం (South Asian Association of Regional Co-operation) లోని ఆంగ్ల ప్రథమాక్షరాల పదబంధంగా సార్క్ (SAARC) అని దీనిని వ్యవహరిస్తారు. ఈ సార్క్ ఏర్పాటులో బంగ్లాదేశ్ అధ్యక్షడు జియాఉర్ రెహమాన్ (Zia-ur Rehaman) ఎంతో ప్రధాన పాత్ర పోషించాడు.

సార్క్న లాంఛనప్రాయంగా డిసెంబర్ 8, 1985న స్థాపించారు. దీనిని బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవులు, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక దేశాలు ఏడు సభ్యదేశాలుగా ఏర్పడ్డాయి. ఆ తరువాత ఏప్రియల్ 3, 2007న ఆఫ్ఘనిస్తాన్ సభ్యదేశం కావడంతో ప్రస్తుతం సార్స్లో మొత్తం ఎనిమిది దేశాలు సభ్య రాజ్యాలుగా ఉన్నాయి.

సార్క్ లక్ష్యాలు :

  1. దక్షిణాసియా ప్రాంతంలో సంక్షేమరంగాన్ని వృద్ధిచేసి జనాభా జీవన పరిస్థితులను గుణాత్మకంగా వృద్ధి చేయడం.
  2. దక్షిణాసియా ప్రాంత దేశాల మధ్య సమష్టి స్వాబలంబనను బలోపేతం చేయడం.
  3. ఆర్థికవృద్ధి, సాంఘిక ప్రగతి, సంస్కృతి అభివృద్ధులను వేగిరపరచడం.
  4. సభ్యదేశాలు తమ సమస్యలపట్ల సానుభూతితో పరస్పర విశ్వాసాన్ని పెంపొందిచుకోవడం.
  5. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో పరస్పర సహాయంతో తోడ్పాటు అందించుకోవడం.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 11 భారతదేశం - ప్రపంచదేశాలు

ప్రశ్న 4.
ఐక్యరాజ్యసమితి సాధారణ సభ అధికారాలు, విధులను వివరించండి.
జవాబు.
సాధారణ సభ అధికారాలు – విధులు :

  1. అంతర్జాతీయ శాంతి భద్రతలు, రక్షణ విషయాలను చర్చించి, సిఫార్సులు చేయడం.
  2. అంతర్జాతీయ సాంఘిక-ఆర్థిక సహకారానికి సంబంధించిన విషయాల్లో మార్గనిర్దేశనం చేస్తే, పర్యవేక్షించడం.
  3. స్వయంపాలన చేసుకోలేని ప్రాంతాల పరిపాలనపై సమాచారాన్ని, నివేదికలను సేకరించడం.
  4. ఐక్యరాజ్యసమితి నిధులపై ప్రత్యేక నియంత్రణ అధికారాన్ని కలిగి, వార్షిక బడ్జెట్ను ఆమోదిస్తుంది.
  5. భద్రతామండలకి 10 మంది తాత్కాలిక సభ్యులను ఎన్నుకుంటుంది. అలాగే ఆర్థిక సాంఘిక మండలికి 5 మంది సభ్యులను, అంతర్జాతీయ న్యాయస్థానానికి 15 మంది న్యాయమూర్తులను, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిని సాధారణ సభ ఎన్నుకుంటుంది.
  6. అంతర్జాతీయ ఒప్పందాలను ఆమోదిస్తుంది.
  7. ఐక్కరాజ్యసమితి ఛార్ట్క అవసరమైన సవరణలు చేసే అధికారం సాధారణ సభకు ఉంటుంది.
  8. ఐక్యరాజ్యసమితిలోకి కొత్తగా రాజ్యాలను సభ్యులుగా చేర్చుకోడానికి, సస్పెండ్ చేయడానికి, సభ్యరాజ్యాలను తొలగించడానికి సాధారణ సభకు అధికారం ఉంటుంది.

ప్రశ్న 5.
భద్రతామండలి నిర్మాణాన్ని తెల్పి, దీనికి గల ఏవైనా రెండు అధికారాలను, విధులను తెలపండి.
జవాబు.
నిర్మాణం :
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యనిర్వాహక విభాగంగా భద్రతామండలిని పేర్కొనవచ్చు. దీనిలో 15 మంది సభ్యులు ఉంటారు. వీటిలో 5 రాజ్యాలను శాశ్వత దేశాలనీ, వీటో అధికారం ఉన్న పెద్ద దేశాలనీ చెప్పవచ్చు. మిగిలిన 10 తాత్కాలిక దేశాలను సాధారణ సభ రెండు సంంత్సరాల పదవీకాలానికి ఎన్నుకుంటుంది.

ఈ పది తాత్కాలిక దేశాలలో అయిదు ఆఫ్రికా-ఆసియా ఖండాలనుంచి, ఒకటి తూర్పు యూరోపు నుంచి, రెండు లాటిన్ అమెరికా ఖండం నుంచి, రెండు పశ్చిమ యూరోపు తదితర ప్రాంతాలనుంచి ప్రాతినిధ్యం వహించేలా ఎన్నికవుతాయి.

ఇవేకాక, ఏదేని వివాదానికి సంబంధించిన ఏదేని ఒక సభ్యరాజ్యన్నికానీ, రాజ్యేతర సభ్యులు కానీ చర్చలలో పాల్గొనమని భద్రతామండలి కోరవచ్చు. భద్రతామండలి అధ్యక్ష పదవి దానిలోని సభ్యరాజ్యాల మధ్య అక్షర క్రమంలో ప్రతి నెలకు ఒకసారి మారుతూ ఉంటుంది. భద్రతామండలికి సహాయం అందించడానికి మూడు స్థాయూ సంఘాలు ఉంటాయి.

అధికారాలు – విధులు :
అంతర్జాతీయ శాంతిభద్రతలు – రక్షణ వ్యవహారాల నిర్వహణలో ఐక్యరాజ్యసమితికి గణనీయమైన అధికారాలు ఉన్నాయి. భద్రతామండలి అధికారాలు – విధులు ఈ దిగువ తెలిపిన విధంగా ఉంటాయి.

  1. భద్రతా మండలి అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది.
  2. అంతర్జాతీయ శాంతి, భద్రతల నిర్వహణకు కార్యాచరణను అమలుచేసి, శాంతికి విఘాతం కలిగించే వాటిపై నివారక చర్యలు చేపడుతుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 11 భారతదేశం - ప్రపంచదేశాలు

ప్రశ్న 6.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అధికారాలు-విధులను సంక్షిప్తంగా రాయండి.
జవాబు.
ప్రధాన కార్యదర్శి అధికారాలు – విధులు :
ఐక్యరాజ్యసమితి ఛార్టర్ నిర్దేశించిన పరిధిలోని అనేక విధులను-బాధ్యతలను ప్రధాన కార్యదర్శి నిర్వహిస్తారు. వీటిలో ప్రధానమైనవి :

  1. అంతర్జాతీయ శాంతిభద్రతలకు విఘాతం కల్పించే అన్ని విషయాలను ప్రధాన కార్యదర్శి సాధారణ సభ భద్రతామండలి ముందు నివేదిస్తాడు.
  2. ఐక్యరాజ్యసమితి వార్షిక బడ్జెట్ను రూపొందిస్తాడు. అలాగే ఐక్యరాజ్యసమితి పనితీరుపై నివేదికను ప్రతి సంవత్సరం తయారుచేస్తాడు.
  3. భద్రతామండలి వినతిపైగాని, ఐక్యరాజ్యసమితి మెజారిటీ సభ్యుల కోరికపైగాని, సాధారణ సభ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేస్తారు.
  4. అంతర్జాతీయ ఒప్పందాలు, ఒడంబడికలకు రిజిష్టర్ చేసే అధికారిలాగా వ్యవహరిస్తారు.
  5. వివిధ సందర్భాలలో ఐక్యరాజ్యసమితి ఏర్పరచిన శాంతి పరిరక్షణ దళాల కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటారు.

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
బిమ్ క్ అనగానేమి ?
జవాబు.
ఈ సంస్థను 1997వ సంవత్సరంలో బంగాళాఖాత (సముద్ర) తీరప్రాంతదేశాలైన దక్షిణాసియా, ఆగ్నేయ ఆసియా దేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. “బంగాళాఖాత తీరప్రాంత దేశాల బహుళరంగ సాంకేతిక ఆర్థిక సహకార సంస్థ” పేరుతో ఏర్పడిన ఈ సంస్థలో భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, బర్మా (మియన్మార్), థాయ్లాండ్ దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. బిమ్క్ అనే ఈ సంస్థ ప్రధాన కేంద్ర కార్యాలయం బంగ్లాదేశ్ ఢాకాలో ఉంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 11 భారతదేశం - ప్రపంచదేశాలు

ప్రశ్న 2.
సార్క్ 18వ శిఖరాగ్ర సమావేశం గురించి రాయండి.
జవాబు.
సార్క్ 18వ శిఖరాగ్ర సమావేశం ఖాట్మండ్లో నవంబరు 27, 2014న జరిగింది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. దక్షిణాసియా దేశాలు అన్ని రంగాల్లో సహకారం అందించుకోవడానికి ముందుండాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు.

ఈ సహకారం ప్రజలు పరస్పరం ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా సమాచార సాంకేతిక అనుసంధానం ద్వారా మరింత తేలికగా జరుగుతుందని పిలుపునిచ్చారు. సార్క్ ద్వారా వాణిజ్యం, పెట్టుబడులు, సహాయం, సహకారాలు ప్రతి రంగంలో సాధ్యమౌతాయని భారతదేశం భావిస్తోంది.

ప్రశ్న 3.
ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ఎన్ని దేశాలు సభ్యత్వం కల్గి ఉన్నాయి ?
జవాబు.
ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో 194 సభ్య రాజ్యాలు ఉన్నాయి.

ప్రశ్న 4.
సార్క్ లోని సభ్యదేశాలు ఏవి ?
జవాబు.
సార్క్ లోని సభ్యదేశాలు

  1. బంగ్లాదేశ్
  2. ఇండియా
  3. మాల్దీవులు
  4. నేపాల్
  5. పాకిస్తాన్
  6. శ్రీలంక
  7. భూటాన్

2007లో ఆఫ్ఘనిస్తాన్ కూడా సభ్యదేశం కావటంతో ప్రస్తుతం సార్క్ ఎనిమిది సభ్యదేశాలున్నాయి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 11 భారతదేశం - ప్రపంచదేశాలు

ప్రశ్న 5.
ఐక్యరాజ్యసమితి ప్రధాన అంగాలు ఏవి ?
జవాబు.

  1. సాధారణ సభ
  2. భద్రతా మండలి
  3. ఆర్థిక-సాంఘిక మండలి
  4. ధర్మకర్తృత్వ సంఘం
  5. అంతర్జాతీయ న్యాయస్థానం
  6. సచివాలయం.

వీటిలో ప్రస్తుతం ధర్మకర్తృత్వమండలి పనిచేయటం లేదు.

ప్రశ్న 6.
ఐక్యరాజ్యసమితి ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎవరు ?
జవాబు.
ఐక్యరాజ్యసమితి ప్రస్తుత ప్రధాన కార్యదర్శి పోర్చుగీసుకు చెందిన ‘ఆంటోనియో గుటిరస్’.

ప్రశ్న 7.
బ్రిక్స్లోని సభ్యదేశాలేవి ?
జవాబు.

  1. బ్రెజిల్ (Brazil)
  2. రష్యా (Russia)
  3. ఇండియా (India)
  4. చైనా (China)
  5. దక్షిణాఫ్రికా (South Africa)

ఈ దేశాల పేర్లలోని మొదటి అక్షరాలతో బ్రిక్స్ (BRICS) అనే పదబంధంతో ఈ సంస్థ ఏర్పడింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 11 భారతదేశం - ప్రపంచదేశాలు

ప్రశ్న 8.
పంచశీల సూత్రాలను వివరించండి.
జవాబు.

  1. రాజ్యాల ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని పరస్పరం గౌరవించుకోవడం.
  2. రాజ్యాలు పరస్పర దురాక్రమణకు పాల్పడకుండా ఉండడం.
  3. ఇతర రాజ్యాల అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం.
  4. రాజ్యాల మధ్య సమానత్వం, పరస్పర ప్రయోజనాత్మక సహకారం.
  5. శాంతియుత సహజీవనం.

TS Inter 2nd Year Political Science Study Material Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్

Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 10th Lesson స్మార్ట్ గవర్నెన్స్ Textbook Questions and Answers.

TS Inter 2nd Year Political Science Study Material 10th Lesson స్మార్ట్ గవర్నెన్స్

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఎలక్ట్రానిక్ పాలన (e-Governance) అంటే ఏమిటి ? దాని సుగుణాలను వివరించండి.
జవాబు.
ఇ-గవర్నెన్స్ అంటే ఆంగ్లంలో ఎలక్ట్రానిక్ గవర్నెన్స్. దీన్ని ఎలక్ట్రానిక్ పాలన అని వ్యవహరిస్తారు. దీన్ని కాగిత రహిత పాలన (Paperless Governance) అని కూడా పేర్కొంటారు. దీన్ని అనుసరించి, సమాచార సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ఆధారంగా ప్రభుత్వం విధులు నిర్వహిస్తుంది. దీని వల్ల సేవలలో సమర్థత కార్యసాధకత పెరుగుతుంది.

దీనిలో భాగంగా అంతర్జాలాన్ని (Internet), ఇతర వెబ్ ఆధారిత సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగిస్తారు. పాలనలో వేగం ఖచ్చితత్వం దీనికి గల అదనపు లక్షణాలు, పౌరులు, సమూహాలు, సంస్థలు ఎలక్ట్రానిక్ పాలన పద్ధతి వల్ల గుణాత్మకమైన, నిరంతరాయమైన సేవలను పొందుతారు.

ఎలక్ట్రానిక్ పాలన పారదర్వకతను, కార్యసాధకతను, జవాబుదారీతనాన్ని పెంపొందిస్తుంది. భరతదేశంలోని ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో దీన్ని అమలుచేస్తున్నారు. 2017 సంవత్సరానికల్లా కాగితపు పాలన సాధన లక్ష్యంతో దీనిని అమలు చేస్తున్నారు.

నిర్వచనం :
భారత మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె అబ్దుల్ కలాం అభిప్రాయంలో భారతదేశపాలన సందర్భంలో ఎలక్ట్రానిక్ పాలన (e-Governance) అంటే, “ఒక పారదర్శక, సత్వర ఎలక్ట్రానిక్ పాలన అవధులు లేని, భద్రమైన విశ్వసనీయ సమాచార ప్రవాహాన్ని, శాఖాంతర అడ్డంకులను అధిగమించాలి. అందుబాటులోకి తెస్తూ పౌరులకు న్యాయబద్ధమైన, పక్షపాతం లేని సేవలను అందిస్తుంది”.

ఇంకా, ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర సాంస్కకృతిక సంస్థ (UNESCO), అభిప్రాయంలో “ఎలక్ట్రానిక్ పాలనలో ప్రభుత్వరంగం సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ, సమాచారాన్ని, సేవల బట్వాడాను పెంపొందించడం. నిర్ణయీకరణ ప్రక్రియలో పౌరుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, ప్రభుత్వం మరింత జవాబుదారీతనంతో, పారదర్శకంగా, సమర్థవంతంగా ఉండేలా చేయడం తదితర లక్ష్యలతో పనిచేస్తుంది.”

పైన పేర్కొన్న నిర్వచనాలు-అర్థవివరణలు పాతకాలపు రాతపని ఆధారిత పాలన ముగించి, పాలనలో ఎలక్ట్రానిక్ పద్ధతిలో సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించవలసిన ఆవశ్యకతను తెలుపుతాయి. పౌరులకు-ప్రభుత్వానికి మధ్య సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానమై కార్యాచరణ సాధనంగా ఉపయోగపడుతుంది. ఫలితంగా పాలనలో పారదర్శకతను చూడవచ్చు. ప్రస్తుతం భారతదేశంలో జాతీయ ఎలక్ట్రానిక్ పాలన ప్రణాళిక (National-Governance Plan-NEGP) అమలులో ఉంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్

ఎలక్ట్రానిక్ పాలన నమూనాలు (Modules of e-Governance) :

ఎ. ప్రభుత్వం నుంచి పౌరులకు (Government to Citizens G to C) :
ఈ నమూనా ఆధారంగా ప్రభుత్వానికి, పౌరులకు మధ్య కార్యాచరణ, సంబంధాన్ని కల్పించి, విస్తృత స్థాయిలో సేవలు అందించడం జరుగుతుంది. ఇది సాధారణ ప్రజానీకానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

బి. ప్రభుత్వం నుంచి వ్యాపార రంగానికి (Government to Business G to B) :
వ్యాపార రంగాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం సదుపాయదారునిలాగా పనిచేస్తుంది. లైసెన్సులను జారీచేసి, రెవెన్యూ వసూలు చేస్తుంది. అంతేకాకుండా, వర్తక వాణిజ్యాలకు, పర్యాటక రంగానికి పెట్టుబడులకు సదుపాయాలు కల్పిస్తుంది.

సి. ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి (Government to Government G to G) :
ప్రభుత్వ సేవలను అందించడంలో సమాచార-సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించడం జరుగుతోంది. స్వేచ్ఛ సమాచార ప్రవాహం సమాంతరంగా, నిలువుగా అందుబాటులో ఉండటం గమనిస్తాం. దీనితో జాతీయ, రాష్ట్ర స్థానిక నిర్వహణ సులువు అవుతుంది.

డి. ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు (Government to Employees G to E) :
ఈ నమూనా కింద ప్రభుత్వం, ఉద్యోగులు సమాచార సాంకేతిక పరిజ్ఞాన సాధనాలతో నిరంతరం స్థిరంగా ఒకరినొకరు సంప్రదించుకొని, కార్యాచరణ జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఉద్యోగులలో విస్తృత కార్యసాధనకు, సంతృప్తికి దారితీస్తుంది.

ఎలక్ట్రానిక్ పాలన-సుగుణాలు : ఎలక్ట్రానిక్ పాలన పద్ధతిలో ఈ దిగువ తెలిపిన ఉపయోగాలు ఉంటాయి.

  1. పౌరునికి సమాచారం అందించి, సంప్రదించే అవకాశం.
  2. పాలన ప్రక్రియను సంస్కరించడం.
  3. సమాచార అందుబాటు
  4. పౌరులకు గుణాత్మక సేవలు పెంపొందించడం
  5. సరళతర నియమాలు
  6. కార్యసాధన
  7. జవాబుదారీతనం
  8. పారదర్శకత
  9. ఎక్కువమంది పౌరులకు గుణాత్మక సేవ

TS Board Inter Second Year Political Science Study Material Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్

ప్రశ్న 2.
ఎలక్ట్రానిక్ పాలనలోని సుగుణాలను, లోపాలను చర్చించండి.
జవాబు.
నిర్వచనం :
భారత మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలాం అభిప్రాయంలో భారతదేశ పరిపాలన సందర్భంలో ఎలక్ట్రానిక్ పాలన (e-Governance) అంటే, “ఒక పారదర్శక, సత్వర ఎలక్ట్రానిక్ పాలన అవధులు లేని, భద్రమైన విశ్వసనీయ సమాచార ప్రవాహాన్ని శాఖాంతర అడ్డంకులను అధిగమించి, అందుబాటులోకి తెస్తూ పౌరులకు న్యాయబద్ధమైన పక్షపాతం లేని సేవలను అందిస్తుంది”.

ఎలక్ట్రానిక్ పాలన-సుగుణాలు :
ఎలక్ట్రానిక్ పాలన పద్ధతిలో ఈ దిగువ తెలిపిన ఉపయోగాలు ఉంటాయి.

  1. పౌరునికి సమాచారం అందించి, సంప్రదించే అవకాశం.
  2. పాలన ప్రక్రియను సంస్కరించడం.
  3. సమాచార అందుబాటు.
  4. పౌరులకు గుణాత్మక సేవలు పెంపొందించడం.
  5. సరళతర నియమాలు.
  6. కార్యసాధకత.
  7. పారదర్శకత.
  8. ఎక్కువమంది పౌరులకు గుణాత్మక సేవ.

ఎలక్ట్రానిక్ పాలన లోపాలు :
ఎలక్ట్రానిక్ పాలనపద్ధతిలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది.

  1. నిర్వహణ, నిర్వర్తన వ్యయాలు అధికం.
  2. సమీకృత సేవలు లేకపోవడం.
  3. మౌలిక సదుపాయాల లేమి
  4. బలహీనమైన న్యాయ ప్రక్రియ, నిస్సారమైన శాసనాలు
  5. న్యాయపర, చట్టపర, పరిపాలనపరమైన, పోలీసు సంస్కరణల అవసరం కలుగుతూ ఉండటం.
  6. పౌరుల అవసరాలను అవగాహన చేసుకోవడం కష్టతరం, భాషాపరమైన అవరోధాలు.
  7. ప్రజావిత్త నిర్వహణ వ్యవస్థ కష్ట సాధ్యం కావడం.
  8. ప్రజా నిర్ణయీకరణలో పౌరసమాజ భాగస్వామ్యాన్ని, పాత్రను నిరోధించడం.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్

ప్రశ్న 3.
సమాచార హక్కు అంటే ఏమిటి ?
జవాబు.
ఆధునిక పాలనలో పౌరుని పాత్రను వివరించడానికి సమాచార హక్కుచట్టం అధ్యయనం ఎంతో మౌలికమైనది. సమాచార హక్కు చట్టం పాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచి, పారదర్శకతను, జవాబుదారీతనాన్ని అందిస్తుంది. 20వ శతాబ్దం రెండో భాగంలో అనేక దేశాలు సమాచార హక్కు చట్టాన్ని రూపొందించాయి.

  1. పాలనలో పౌరులు పాల్గొనగలరా ?
  2. ప్రభుత్వ పథకాల సమాచారాన్ని పౌరులు ఎలా పొందగలరు ?
  3. ప్రభుత్వం న్యాయబద్ధంగా వ్యవహరిస్తోందా ?
  4. ప్రజలకు సమాచానాన్ని బహిర్గతం చేయవచ్చునా ?

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా సమాచార హక్కుచట్టం స్వభావం, ప్రాధాన్యత అధ్యయనం చేయాలి. దానిలో జవాబులు దొరుకుతాయి.

సమాచార హక్కుచట్టం 2005 రాష్ట్రపతి ఆమోదముద్రను 15 జూన్ 2005న పొంది, అక్టోబర్ 2005 నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. ఈ చట్టం జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రం మినహా దేశంలోని అన్ని రాష్ట్రాలు-కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తిస్తుంది. ఆ రాష్ట్రానికి మాత్రం ప్రత్యేక ఏర్పాటు ఉండి.

సమాచార హక్కుచట్టం ప్రకారం దేశంలోని ప్రతీపౌరునికి సంబంధించనదే అయినందున, ప్రభుత్వం ప్రజలతో సమాచారార్ని, పంచుకోవడాన్ని ఈ చట్టం అంగీకరిస్తుంది. ఇది ప్రజాస్వామ్యం మరింత ఆరోగ్యవంతంగా (బలోపేతంగా), లాభదాయకంగా పనిచేయడానికి ఉపకరిస్తుంది. అంతిమంగా సమాచారం ప్రజల్లో వినూత్న అవగాహనకు,య సాధికారతకు దారితీస్తుంది.

ప్రశ్న 4.
సమాచార హక్కులోని నిబంధనలను వివరించండి.
జవాబు.
సమాచార హక్కు ఒక ప్రాథమిక మానవ హక్కు దీనిలో అంతర్గతంగా హక్కులు-బాధ్యతులు కూడా ఉంటాయి. వీటిని ఈ కింది విధంగా వివరించవచ్చు.

  1. ప్రతీ వ్యక్తికి ప్రభుత్వం నుంచి సమాచారాన్ని కోరే హక్కు ఉంటుంది. ప్రైవేటు సంస్థల నుంచి కూడా సమాచారాన్ని కోరవచ్చు.
  2. ప్రజలు కోరిన సమాచారాన్ని అందించే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ప్రత్యేక కారణాల రీత్యా వెల్లడి చేయకూడని సమాచారాన్ని మినహాయించి, మిగిలిన సమాచారాన్ని ప్రభుత్వం తప్పక అందుబాటులో ఉండాలి.
  3. ప్రభుత్వం సమాచారాన్ని అనుకూల కార్యాచరణతో తప్పక వెల్లడి చేయాలి. సమాచారం ప్రజలకు చెందినదని భావించాలి. అంతేకాని దానిని నిర్వహించే ప్రభుత్వ సంస్థదని భావించరాదు.
  4. సమాచారాన్ని కోరుతూ ప్రశ్నించిన 30 రోజుల లోపు ప్రభుత్వం స్పందించాలి.
  5. సమాచార ప్రసరణకు వీలుగా ప్రభుత్వ రికార్డులను కంప్యూటరీకరణ, డిజిటలీకరణ చేయాలి.
  6. సమాచారాన్ని ప్రింట్ కాగితాల రూపంలో, కంప్యూటర్ ఫ్లాపీలు, వీడియో, క్యాసెట్లు లేదా ఏ ఇతర ఎలక్ట్రానిక్ సాధనాల రూపంలోనైనా అందించవచ్చు. ఈ చట్టంలోని 2(ఎఫ్) నిబంధన పైన తెలిపిన వాటిని సమాచారంగా పరిగణిస్తుంది.

ప్రజా సమాచార అధికారుల (PIO’s) నియామకం :
ప్రభుత్వంలోని ప్రతీ కార్యాలయంలో, శాఖలో, సంస్థలో, అథారిటీలో ప్రజాసమాచార అధికారిని (PIO) నియమించాలని ఈ చట్టం నిర్ధేశిస్తుంది. పౌరులు కోరిన సమాచారాన్ని వారికి అందించే బాధ్యత ఈ ప్రజా సమాచార అధికారిపై ఉంటుంది.

అలాగే సమాచార హక్కు అప్పీళ్ళను (వినతులను) స్వీకరించడానికి సహాయక ప్రజా సమాచార అధికారులను (Assistant Public information Officers-APIOs) నియమించాలని ఈ చట్టం సిఫార్సు చేస్తోంది. సమాచారం కోసం ప్రజలు ఆన్లైన్ దరఖాస్తు రూపంలో కూడా వినతిని ఇవ్వవచ్చు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్

ప్రశ్న 5.
స్మార్ట్ గవర్నెన్స్ అంటే ఏమిటి ?
జవాబు.
పరిపాలనలోని దుర్లక్షణాలను తొలగించి, పాలన ప్రజల సాంఘిక-ఆర్థిక అభివృద్ధికి అనుగుణంగా తీర్చిదిద్దే క్రమంలో భారతదేశంలోని అనేక రాష్ట్రాలు స్మార్ట్ గవర్నెన్స్న స్వీకరించాయి. స్వాతంత్య్రానంతరం భారతదేశ పాలనలో, ప్రజల సాంఘిక-ఆర్థిక అభివృద్ధి కేంద్రంగా ఎన్నో సంస్కరణలు వచ్చినప్పటికీ పాలనలో దుర్లక్షణాలైన అవినీతి, అశ్రిత, పక్షపాతం, అధికార దుర్వినియోగం, నిర్ణయీకరణలో జాప్యం, పాలనలో నిర్లక్ష్యం విలయతాండవం చేశాయి.

అయితే ఏ పరిస్థితితో మార్పు తీసుకువచ్చి పాలనను మరింత ప్రజా ప్రయోజనకరంగా మలచేక్రమంలో స్మార్ట్ గవర్నెన్స్ భావన ముందుకు వచ్చింది. ఈ భావనలో SMART అనే పదంలోని ప్రతి ఆంగ్ల అక్షరానికి ఒక్కొక్క నిర్దిష్టమైన అర్థం ఉంది.

దీనిలో S అనగా Simple సరళతరమైన పాలన ప్రక్రియలు
M అనగా Moral, నైతిక విలువలతో కూడిన పాలన
A అనగా Accountable, జవాబుదారీ పాలన
R అనగా Responsive, ప్రజాసమస్యలపై స్పందనాత్మకపాలన
T అనగా Transparent, పారదర్శకత కలిగిన పాలనగా పేర్కొనవచ్చు.

స్మార్ట్ గవర్నెన్స్లో అంతర్గత అంశాలు :

  1. పరిపాలన నిర్వర్తన సామర్థ్యాన్ని వృద్ధి చేయడం.
  2. పాలనలో జవాబుదారీతనం పారదర్శకత పెంచడం.
  3. సంకుచిత, రాజకీయాల నుంచి పాలనను వేరుచేయడం.
  4. ప్రభుత్వ విధానాన్ని విజయవంతంగా అమలుచేయడం
  5. గరిష్ట సామర్ధ్యం సాధించడం
  6. పాలనలో సామాజిక నాయకత్వం కీలకపాత్ర పోషించేలా చేయడం.
  7. ప్రభుత్వ సేవలలో నూతన వరవడి తీసుకురావడం, రాబోయే కాలానికి పాలనను సన్నద్ధం చేయడం.
  8. పాలనలో ఇంటర్నెట్, మొబైల్ తదితర సమాచార సాంకేతిక పరిజ్ఞానం విస్తృత స్థాయిలో ఉపయోగించడం.
  9. ఎలక్ట్రానిక్ పాలన.

భారతదేశంలో పాలన ప్రక్రియను పటిష్టంచేయడానికి ఈ దిగువ తెలిపిన సంస్థలు ఎంతో కృషి చేస్తున్నాయి. స్మార్ట్ గవర్నెన్స్ భావనలోని అనేక అంశాల అమలుకు వివిధ మార్గాలను, పద్ధతులను సూచించడానికి, స్మార్ట్ గవర్నెన్స్ భావనను సంవర్ధకంగా వృద్ధి చేయడానికి ఈ దిగువ తెలిపిన విశిష్ట సంస్థలను స్థాపించడం జరిగింది.

  • ది నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవన్నమెంట్, హైదరాబాద్, ఇండియా
    The National Institute for Smart government (NISG), Hyderabad, India
  • ది సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, హైదరాబాద్, ఇండియా
    The Centre for Good Governance, Hyderabad, India
  • ది సెంటర్ ఫర్ లా అండ్ గవర్నెన్స్, న్యూఢిల్లీ
    The Centere for Law and Governance, New Delhi
  • ది సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెర్స్, న్యూఢిల్లీ
    The Centre for Public Policy and Governance, New Delhi

ప్రశ్న 5.
లోక్పాల్ అధికారాలు-విధులు పేర్కొనండి.
జవాబు.
లోక్పాల్ వ్యవస్థ ఈ కింద పేర్కొన్న పదవులోరి వారిపై వచ్చే అవినీతి ఆరోపణలను విచారణ చేస్తారు.

  1. ప్రధానమంత్రి
  2. కేంద్రమంత్రులు
  3. పార్లమెంట్ ఉభయసభల సభ్యులు
  4. గ్రూప్ ‘A’ మరియు గ్రూప్ ‘B’ ఉద్యోగులు
  5. కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే గ్రూప్ ‘C’ మరియు గ్రూప్ ‘D’ ఉద్యోగులు
  6. ఇతర సంస్థలు, ట్రస్ట్లు సొసైటీలు (10 లక్షలకు మించి విదేశీ విరాళాలను పొందే సంస్థలు)

TS Board Inter Second Year Political Science Study Material Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
జవాబుదారీతనం అంటే ఏమిటి ?
జవాబు.
ప్రభుత్వంలోని ఉద్యోగులు, అధికారులు, ప్రజాసేవకులు తమ నిర్ణయాలు, కార్యాచరణలను ప్రజలకు బాద్యత వహించడాన్ని జవాబుదారీతనంగా చెప్పవచ్చు. ఇక నుంచి వారు తమ కార్యకలాపాల విషయంలో ప్రజా పరిశీలనకు గురి కావలసి ఉంటుంది. విస్తృత అర్థంలో చెప్పాలంగే, పౌర, సేవా సంస్థలు, వినియోగదారుల సంస్థలకు ఉద్యోగులు జవాబుదారీగా ఉండాలి. పాలనలో సమన్యాయం, పారదర్శకత పాటిస్తే జవాబుదారీతనం సిద్ధిస్తుంది.

ప్రశ్న 2.
ఎలక్ట్రానిక్ పాలనలోని ఏవైనా రెండు సుగుణాలు రాయండి.
జవాబు.

  1. పౌరునికి సమాచారం అందించి, సంప్రదించే అవకాశం
  2. పాలన ప్రక్రియ సంస్కరించడం.
  3. సమాచార అందుబాటు
  4. పౌరులకు గుణాత్మక సేవలు పెంపొందించడం
  5. సరళతరం నియమాలు

ప్రశ్న 3.
పాలన సంబంధితుల జాబితా తెలపండి.
జవాబు.

  1. కార్యనిర్వాహక వర్గం
  2. శాసన నిర్మాణ శాఖ
  3. న్యాయశాఖ
  4. ప్రచార ప్రసార మాధ్యమాలు
  5. ప్రైవేటు రంగం
  6. సాంఘిక సేవా సంస్థలు
  7. పౌర సమాజం
  8. రాజకీయ పార్టీలు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్

ప్రశ్న 4.
ఎలక్ట్రానిక్ పాలనలో ప్రభుత్వం నుంచి పౌరుల నమూన అంటే ఏమిటి ?
జవాబు.
ప్రభుత్వానికి, పౌరులకు మధ్య కార్యాచరణ సంబంధాన్ని కల్పించి, విస్తృత స్థాయిలో సేవలు అందించే విధానాన్నే ప్రభుత్వం నుంచి పౌరుల నమూన అంటారు. ఇది సాధారణ ప్రజానీకానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రశ్న 5.
పారదర్శకతను కొన్ని పదాలతో వివరించండి.
జవాబు.
పారదర్శకత, పరిపాలనలో ఈ కింది సూచించిన పద్దతుల ద్వారా కార్యసాధకతను పెంపొందిస్తుంది.

  1. సేవల అందుబాటు వ్యవస్థను క్రమబద్ధీకరించండి.
  2. జవాబుదారీదతనాన్ని పెంపొందించడం.
  3. పాలనలో అవినీతి, అక్రమాల తొలగింపు అనుచిత ఆచరణలు తగ్గించడానికి సాంఘిక తనిఖీ సిఫార్సు చేయడం.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్

ప్రశ్న 6.
సమాచార హక్కుచట్టం ఏ సంవత్సరంలో రూపొంది, అమలయింది.
జవాబు.
సమాచార హక్కుచట్టం 2005 రాష్ట్రపతి ఆమోదముద్రను 15 జూన్ 2005న పొంది, అక్టోబర్ 2005 నుంచి ‘పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 6 సృజనశీలత

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material 6th Lesson సృజనశీలత Textbook Questions and Answers.

TS Inter 2nd Year Telugu Study Material 6th Lesson సృజనశీలత

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
సృజనాత్మకత గురించి రచయిత అభిప్రాయం తెలుపండి.
జ.
సృజనాత్మకత గురించి సృజనశీలత అనే పాఠంలో రచయిత ఎ.పి.జె. అబ్దుల్ కలాం తన అభిప్రాయాలను కింది విధంగా వివరించాడు. సృజనాత్మకత నిష్కల్మషమైన హృదయాల నుండి పుడుతుంది. అది దేశంలో ఎక్కడి నుండైనా, ఏమూల నుండైనా వస్తుంది. జాలరి ఓడ, రైతుల గుడిసె, గొల్ల పల్లె, పశువుల కొట్టం, తరగతి గదులు, లేబరేటరీలు, పారిశ్రామిక వాడలు, పరిశోధనా నిలయాలు ఇలా ఎక్కడనుండైనా ప్రారంభం అవుతుంది. సృజనాత్మకత వివిధ కోణాలు : సృజనాత్మకతకు చాలా కోణాలున్నాయి. అవి నూతన ఆవిష్కరణలు కావచ్చు. కొత్త ప్రయోగాలు కావచ్చు. లేదా ఉన్న వాటినే కొత్తగా తెలుసుకోవడం కూడా కావచ్చు.

ఉన్న భావాలను తిరిగి ప్రయోగించడం ద్వారా, జతపరచడం ద్వారా, మార్చడం ద్వారా కొత్త విషయాలు కనుక్కోగలిగే సామర్థ్యం, ఊహించగలిగే సామర్థ్యాలను సృజనాత్మకత అంటారు. సృజనాత్మకత అనేది ఒక వైఖరి. అది కొత్తదనాన్ని, మార్పునీ అంగీకరించగలిగే భావాలతో, ఊహలతో కూడిన మానసిక స్థితి. మానవ జీవనాన్ని విజయవంతంగా గడపడం, మంచిదైన ప్రతిదాన్నీ అనందిస్తూనే దాన్ని మరింత మంచిగా చేయగలిగే అవకాశాలకోసం వెదకడాన్ని సృజనాత్మకత అంటారు. సృజనాత్మకత అంటే కష్టించి పనిచేయటం. మన భావాల్నీ, మనకు లభ్యమవుతున్న పరిష్కారాల్నీ క్రమంగా మార్చుకుంటూ, మరింత పదును పెట్టుకుంటూ నెమ్మదిగా ముందుకు వెళ్ళడం. దేన్నైనా అందరూ చూస్తున్నట్లే చూసి ఆ చూసిన దాని గురించి మిగిలిన వారికంటే భిన్నంగా ఆలోచించటమే సృజనాత్మకత ముఖ్యలక్షణం.

మానవుడి మేధస్సు అతడికి మాత్రమే లభించిన గొప్ప బహుమానం. మానవ జీవితంలో ఎటువంటి కష్ట నష్టాలైనా రానివ్వండి. ఆలోచించడం అత్యంత విలువైన ఆస్తి అని గుర్తించాలి. ఆలోచించడమే ప్రగతి. ఆలోచించ లేకపోవటం వ్యక్తుల్ని, సంస్థల్ని, దేశాన్ని నాశనం చేస్తుంది. ఆలోచించడం పనులకు దారితీస్తుంది. క్రియా రూపం పొందని ఆలోచనలు నిష్ప్రయోజనం, వ్యర్థం. కార్యరూపం దాల్చిన విజ్ఞానం మాత్రమే సౌభాగ్యాన్ని ఇస్తుంది.

సృజనాత్మకతను పెంపొందించడం : ప్రతి ఒక్కరిలో సృజనాత్మకత ఉంటుందనే విషయంలో సందేహంలేదు. కాని దాన్ని బహిర్గతం చేయాలంటే మాత్రం గట్టి ప్రయత్నం కావాలి. ప్రతి హృదయం సృజనాత్మకమైనది, ప్రతి హృదయంలో కొత్తవి నేర్చుకోవాలనే ఉత్సాహం ఉంటుంది. పిల్లలు చిన్నప్పట్నించి అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పగలిగితే పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది. సృజనాత్మకత మనసుల్లో భావాలను రేఖాచిత్రాలుగా, కథలుగా, కవితలుగా మారుస్తుంది. నేర్చుకోవడం సృజనాత్మకతను కలిగిస్తుంది. సృజనాత్మకత ఆలోచనలను ఇస్తుంది. ఆలోచన జ్ఞానాన్నిస్తుంది. జ్ఞానం మానవులను సమున్నత స్థానానికి చేరుస్తుంది.

ప్రశ్న 2.
ప్రపంచంలో రాబోయే పరిణామాలను రచయిత ఏవిధంగా ఊహిస్తున్నాడు ?
జ.
ది ఏజ్ ఆఫ్ ది స్పిరుట్యువల్ మెషిన్స్ అనే పుస్తకాన్ని రాసిన రే కురువైల్ చెప్పిన దాని ప్రకారం 2009 నాటికి 50,000 ఖరీదు చేయగల కంప్యూటరు ఒక్క సెకండులో కోటి లక్షల లెక్కలు చేయగలదు. 2019 నాటికి సెకండుకు 10 లక్షల కోట్ల లక్షల లెక్కలు చేయగలదు. అంటే అప్పటికి దాదాపుగా మానవ మేధకు సమానమైన సామర్థ్యాన్ని సాధించగలదు. 2029 నాటికి అది ఒక వెయ్యి మానవ మేధస్సులకు సమానమైన సామర్థ్యాన్ని పొందుతుంది.

అంటే భవిష్యత్తులో మానవులు నేడు తాము చేసే పనులు కొన్నింటిని కంప్యూటర్లతో నడిచే రోబోట్స్కి అప్పజెప్పి తమ మెదడుల్ని మరింత ప్రయోజనకరమైన పనులకు అప్పజెప్పే అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్లు తమ భావనా సామర్థ్యంతో ప్రయోగశీల ఆలోచనతో తిరిగి మళ్లీ కంప్యూటర్లను ఓడించగలిగే స్థాయికి చేరుకుంటారు.

ఈ శతాబ్దం చివరికి మానవ ఆలోచనలను, యంత్రాల తెలివితేటలను విలీనం చేసే ధోరణి బలంగా పెరుగుతుంది. అప్పుడు మానవుడు ఒకప్పుడు రూపొందించిన యంత్రాలకూ, మానవ మేధాశక్తికీ మధ్య సరిహద్దులు చెరిగిపోతాయి. అటువంటి పరిస్థితిలో యంత్రాల బారినుండి మానవుడి ప్రత్యేకతను మనం ఏవిధంగా నిలబెట్టుకోగలుగుతామో తెలియదు. నిస్సందేహంగా కంప్యూటర్లు ఒక సవాలుగా మారుతున్నాయి.

ఈ సమస్య కేవలం జీవశాస్త్రవేత్తలదీ, జీవసాంకేతికవేత్తలదీ మాత్రమేకాదు. మొత్తం శాస్త్రవేత్తలు అందరు మనుష్యులు రూపొందించిన కంప్యూటర్లకన్నా మానవ జాతిని ఒక మెట్టు పైనే ఉంచవలసిన గొప్ప బాధ్యత తలకెత్తుకోవలసి ఉంది. అదృష్టవశాత్తూ మానవ మేధ సృజనాత్మకత, ప్రయోగశీల పార్శ్వాలు ఎంత గొప్పవంటే అవి మనిషిని ఎన్నటికి యంత్రం ముందు ఓడిపోనివ్వవు. మానవజాతిలో సహజసిద్ధమైన, అంతర్గతమైన మహాశక్తిని పరిపూర్ణంగా ఆవిష్కరించే దిశగా హ్యూమన్ జీనోమ్ సాఫ్ట్వేర్ను మనమింకా అభివృద్ధి చేయవలసి ఉంది. అని ప్రపంచంలో రాబోయే పరిణామాలను కలాం ఉహించాడు.

II సంగ్రహరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
సృజనాత్మకతకు ఉన్న పార్శ్వాలను వివరించండి. జతపరచడం
జవాబు:
సృజనాత్మకతకు చాలా కోణాలున్నాయి. అవి నూతన ఆవిష్కరణలు కావచ్చు. కొత్త ప్రయోగాలు కావచ్చు. లేదా ఉన్న వాటినే కొత్తగా తెలుసుకోవడం కూడా కావచ్చు. ఉన్న భావాలను తిరిగి ప్రయోగించడం ద్వారా, ద్వారా, మార్చడం ద్వారా కొత్త విషయాలు కనుక్కోగలిగే సామర్థ్యం, ఊహించగలిగే సామర్థ్యాలను సృజనాత్మకత అంటారు. సృజనాత్మకత అనేది ఒక వైఖరి.

అది కొత్తదనాన్ని, మార్పునీ అంగీకరించగలిగే భావాలతో, ఊహలతో కూడిన మానసిక స్థితి. జీవనాన్ని విజయవంతంగా గడపడం, మంచిదైన ప్రతిదాన్నీ అనందిస్తూనే దాన్ని మరింత మంచిగా చేయగలిగే అవకాశాలకోసం వెదకడాన్ని సృజనాత్మకత అంటారు. సృజనాత్మకత అంటే కష్టించి పనిచేయటం. మన భావాల్నీ, మనకు లభ్యమవుతున్న పరిష్కారాల్నీ క్రమంగా మార్చుకుంటూ, మరింత పదును పెట్టుకుంటూ నెమ్మదిగా ముందుకు వెళ్ళడం. దేన్నైనా అందరూ చూస్తున్నట్లే చూసి ఆ చూసిన దాని గురించి మిగిలిన వారికంటే భిన్నంగా ఆలోచించటమే సృజనాత్మకత ముఖ్యలక్షణం.

ప్రశ్న 2.
‘సృజనాత్మకత’ ఎలా పెంపొందుతుంది ? (V. Imp) (M.P.)
జవాబు:
ప్రతి ఒక్కరిలో సృజనాత్మకత ఉంటుందనే విషయంలో సందేహంలేదు. కాని దాన్ని వ్యక్తీకరింపచేయాలంటే మాత్రం గట్టి ప్రయత్నం అవసరం. ప్రతి హృదయం సృజనాత్మకమైనది, ప్రతి హృదయంలో కొత్త విషయాలపట్ల ఆసక్తి, ఉత్సాహం ఉంటాయి. పిల్లలు చిన్నప్పటి నుంచి అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పగలిగితే పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది. సృజనాత్మకత మనసుల్లోని భావాలను చిత్రాలుగా, కథలుగా, కవితలుగా మారుస్తుంది. నేర్చుకోవడం సృజనాత్మకతను కలిగిస్తుంది. సృజనాత్మకత ఆలోచనలను ఇస్తుంది. ఆలోచన జ్ఞానాన్నిస్తుంది. జ్ఞానం మానవులను సమున్నత స్థానానికి చేరుస్తుంది.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 6 సృజనశీలత

ప్రశ్న 3.
బలమైన సంకల్పంతో చేసే కృషి ఎలాంటి ఫలితమిస్తుంది ?
జవాబు:
ఒక చిన్న తుమ్మెద ఆకారానికి ఏరోడైనమిక్ సూత్రాల ఆధారంగా చూస్తే ఆ తుమ్మెద ఎగరడం అసాధ్యమని తెలుస్తుంది. కాని తుమ్మెదలో ఎగరాలనే కోరిక, సంకల్పం ఎంత బలంగా ఉంటాయంటే అది ఎప్పుడూ తన రెక్కలు అల్లాడిస్తూనే ఉంటుంది. అలా పదేపదే తన రెక్కలు కొట్టుకుంటున్నందువల్ల వచ్చే ఉన్నత తరంగదైర్ఘ్య సంవేదనలు ఒక ఆవర్తనాన్ని సృష్టించి దాన్ని ముందుకు తోస్తాయి.

ఆవిధంగా తుమ్మెదకు ఎగరడం సాధ్యమవుతుంది. కాబట్టి బలమైన సంకల్పాలతో చేపట్టే కృషివల్ల సువ్యస్థిత విశ్వాసాలకు (ఎన్నో ఏళ్ల నుండి పాతుకు పోయిన నమ్మకాలకు) నిస్సందేహంగా ఎదురీదగలమని కలాం ప్రబోధించాడు.

ప్రశ్న 4.
ఆర్ద్రకృష్ణ ఊహించిందేమిటి ?
జవాబు:
పదమూడేళ్ల ఆర్రాకృష్ణ తన ఆలోచన అనే ఆకాశంలో స్వేచ్ఛగా విహారించింది. క్రీ.శ. 3000 సంవత్సరంలో ఈ భూమి ఎలా ఉంటుందో ఊహించే ప్రయత్నం చేసింది. అప్పుడు ఈ ప్రపంచ పౌరులు, అంగారక గ్రహానికి వలసపోయి అక్కడొక కొత్త నాగరికతను నిర్మించుకుంటారనీ, అంతలో బృహస్పతి గ్రహంనుండి అంగారకుడి మీదికి రాబోయే ఒక ఏస్టరాయడ్ వల్ల మొత్తం మానవాళి నశించే ప్రమాదమేర్పడుతుందనీ ఆమె ఊహించింది.

అప్పుడు అంగారక గ్రహంమీద ఉండే శాస్త్రవేత్తలు తమ మీద విరుచుకుపడబోతున్న ఏస్టరాయడును అణు శర పరంపర ద్వారా విచ్ఛేదపరుస్తారని ఆమె చెప్పింది. ఆవిధంగా క్రీ.శ. 3000 లలో అంగారక నాగరికత ప్రాకృతిక ఆగ్రహానికి ఎదురునిలిచి జీవించగలుగుతుందనీ ఆమె విశ్వాసం ప్రకటిస్తుంది. ‘ఆర్ద్రకృష్ణ శాస్త్రీయ ఆలోచన ఎంత సుందరంగా కొత్తగా ఉంది అని అబ్దుల్ కలాం గుర్తు చేసుకున్నారు.

III ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశపు ‘మిస్సైల్ మ్యాన్’ అని ఎవరికి పేరు ? (V. Imp) (Model Paper)
జవాబు:
ఎ.పి.జె. అబ్దుల్ కలాంకు.

ప్రశ్న 2.
ఎ.పి.జె. అబ్దుల్ కలాం పూర్తి పేరు ఏమిటి ?
జవాబు:
అవుల్ ఫకీర్ జైనులాద్దీన్ అబ్దుల్ కలాం.

ప్రశ్న 3.
‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ పుస్తక రచయిత ఎవరు ?
జవాబు:
ఎ.పి.జె. అబ్దుల్ కలాం.

ప్రశ్న 4.
‘సృజనాత్మకత’ ఎక్కడి నుండి ప్రభవిస్తుంది ?
జవాబు:
సుందర హృదయాల నుండి.

ప్రశ్న 5.
మానవునికి మాత్రమే లభించిన అద్వితీయ బహుమానం ఏది ?
జవాబు:
మానవుని మేధ.

ప్రశ్న 6.
సృజనాత్మకత దేనికి దారితీస్తుంది ?
జవాబు:
నూతన ఆలోచనలకు.

ప్రశ్న 7.
“అనారోగ్యం గురించి ఆలోచించకు” కవిత రాసిందెవరు ?
జవాబు:
రష్యాకు చెందిన పన్నెండేళ్ళ అన్నా సిన్య కోవ.

ప్రశ్న 8.
“నాకే గనక అధికారముంటే నిఘంటువుల్లోంచి అసాధ్యమనే పదాన్ని తీసేస్తాను” అన్నది. ఎవరు ?
జవాబు:
రాకెట్ రూపశిల్పి వాన్ బ్రౌన్.

కఠిన పదాలకు అర్ధములు

81వ పుట మిస్సైల్

మిస్సైల్ = క్షిపణి
చేదోడు వాదోడు
(జాతీయం) = సహాయకారి
ఆచార్యులు = ప్రొఫెసర్
అత్యన్నత = గొప్ప
అనువాద = భాషాంతరీకరణ

82వ పుట

మేధాశక్తి = తెలివి
సృజనాత్మకత = కొత్తగా ఆలోచించడం
నిలబడదు = నిలువదు
దార్శనిక దృష్టి = దూర దృష్టి
సుందర = అందమైన, కల్మషం లేని
ప్రభవిస్తుంది = పుడుతుంది
తలెత్తగలదు = ప్రారంభం కావచ్చు
జాలరి = చేపలు పట్టేవారు
కొట్టం = పశువుల పాక
లేబరేటరీ = ప్రయోగశాల
పార్శ్వాలు = కోణాలు
ఆవిష్కరణ = కొత్తగా కనుగొనడం
నవీన ప్రయోగాలు = కొత్త ప్రయోగాలు
అనువర్తింపచేయడం = అనుసరించేలా చేయడం, ప్రయోగపూర్వకంగా పరిశీలించడం
సామర్థ్యం = శక్తి
సంభావించ గలిగే = ఊహించ గలిగే
వైఖరి = వక్తిత్వ పద్ధతి
క్రీడించ గలిగే = ఆనందంగా చేయగలిగే
మనః స్థితి = మానసిక స్థితి
దృక్పథం = చూసే తీరు
సారళ్యం = సులభం
మంగళ ప్రదమైన = మంచిని కోరే
వెతుకులాడటం = అన్వేషించడం
లభ్యమవుతున్న = అందుబాటులో ఉన్న, దొరుకుతున్న
పరిష్కారం = సమస్యను అధిగమించడం
క్రమేపి = క్రమంగా
పురోగమనం = ముందుకు వెళ్ళడం
తక్కిన వారు = మిగిలిన వారి
భిన్నంగా = కొత్తగా
అద్వితీయ = గొప్ప, సాటిలేని
బహుమానం = బహుమతి
ఒడిదొడుకులకైనా = ఎత్తుపల్లాలు, కష్టనష్టాలు

TS Inter 2nd Year Telugu Study Material Chapter 6 సృజనశీలత

83వ పుట

తొలచివేస్తుంది
(జాతీయం) = చెడగొడుతుంది
కార్యాలకు = పనులకు
దారితీస్తుంది
(జాతీయం) = ప్రారంభిస్తుంది
=
నిష్ప్రయోజనం = ప్రయోజనం లేకపోవడం
నిరర్థకం = అర్థం లేని
కార్యశీలం = పనిరూపంలోకి రావడం
విజ్ఞానం = శాస్త్రీయ జ్ఞానం
సౌభాగ్య = సంపద
సందేహం = అనుమానం
వ్యక్తీకరింప చేయడం = వ్యక్త పరచడం
ఏకాగ్ర ప్రయత్నం = ఒకే విషయంపై కృషి చేయడం
కుతూహలం = ఉత్సాహం
వికసిస్తుంది = పెరుగుతుంది
నిలయం = నివాసమైనది
చిత్తరువు = రేఖా చిత్రం
అభ్యసనం = నేర్చుకోవడం
సమున్నతపరచడం = అభివృద్ధిని కలిగించడం
అవధి = హద్దు
సంపుటి = పుస్తకం
చిత్ర లేఖనాల సమాహారం = చిత్రాలతో కూడినది
ప్రతిభ = తెలివి
అబ్బుర పరిచింది = ఆశ్చర్యపరిచింది
అవధులకు అతీతం = హద్దులు లేకుండా
విశుద్ధ౦ = పరిశుభ్రం, నిర్మలం
విభజన శీల = విడగొట్టేతత్వం
గోచరించింది = కనిపించింది
ప్రోది = పోషించు, పెంచు
భద్రంగా = సురక్షితంగా
భావ గగనం = ఆలోచనలు అనే ఆకాశం
స్వేచ్ఛా విహారం = స్వేచ్చగా తిరగడం

84వ పుట

పౌరులు = ప్రజలు
వలసపోయి = జీవించడానికి మరొక్కచోటికి పోవడం
వర్థమాన నాగరికత = పెరుగుతున్న నాగరికత
ఏస్టరాయిడ్ = గ్రహశకలం
కనుమరుగయ్యే = అంతరించే
అణుశరపరంపర = అణుశక్తితో నడిచే బాణాలతో
విచ్చేద పరిచే = ముక్కలు చేసే
ప్రాకృతిక = ప్రకృతికి సంబంధించిన
ఆగ్రహం = కోపం
‘మనగలుగుతుంది = జీవిస్తుంది.
విశ్వాసం = నమ్మకం
శాస్త్రీయ చింతన = శాస్త్ర బద్దమైన ఆలోచన
శాసించ కూడదు = అదుపు చేయకూడదు
అధిగమించండి = దాటండి
విజయం సాధించండి = విజయాన్ని పొందండి
భావాలు = ఆలోచనలు
ప్రతిధ్వనించాయి = వినిపించాయి
వ్యాధి = జబ్బు
ఎదుర్కొనే = ఎదిరించే
పరిణామం = మార్పు
ఆవిర్భావం = ప్రారంభం
టెక్నాలజీ = సాంకేతికత
జాతి వివక్ష = = జాతిని బట్టి భేదాన్ని చూపడం
అహింస = హింస లేని
సంఘటనలు = సన్నివేశాలు, జరిగిన అంశాలు
అసాధ్యం = సాధ్యం కానిది

85వ పుట

వైమానిక రంగం = విమానాలకు సంబంధించిన రంగం
అంతరిక్ష = ఆకాశానికి సంబంధించిన
బహుశ = కావచ్చు కాకపోవచ్చు, అంచనా
భూమి + ఆకర్షణ = భూమికి గల ఆకర్షణ శక్తి
సమన్వయ పరచి = ఒక క్రమంలో ఉంచి
ఏకీకృత = = ఒకటే దిశగా
జన + ఆవాసం = మనుషులు ఉండే చోటు
నెలకొల్పే = స్థాపించే
శిలాజ నిక్షేపాలు = భూమి అంతర్భాగంలో దొరికే పెట్రోల్ మొదలైన ఇంధనాలు
అరుదై పోయె = అంతరించి పోయె
తిరిగితిరిగి
ప్రయోగించగల = పునర్వినియోగ శక్తి గల
అంతరిక్ష నౌక = రాకెట్ లాంచర్
సౌరశక్తి = సూర్యుని నుండి వచ్చే శక్తి
ఉపగ్రహాలు = మానవులు ప్రయోగించిన కృత్రిమ గ్రహాలు
సృజనశీల = కొత్తగా కనిపెట్టే స్వభావం గల
ఏరోడైనమిక్ = చలన సిద్ధాంతం
ఇచ్ఛ = కోరిక
సంకల్పం = గట్టి ఆలోచన
సదా = ఎల్లప్పుడు
అల్లాడిస్తూనే = కదిలిస్తూనే
పదేపదే = మళ్ళీ మళ్ళీ
ప్రభవించే = ఉత్పన్నమయ్యే
తరంగదైర్ఘ్యం = తరంగాల వేగం
ఆవర్తనం = వలయం
సువ్యవస్థిత = చక్కగా ఏర్పాటు చేసిన
నిస్సందేహంగా = అనుమానం లేకుండా
ఎదురీదగలవు = ఎదుర్కోగలవు, విజయం సాధించగలవు
తేల్చేశాడు = నిశ్చయించాడు, తీర్మానించాడు.
రెండు దశాబ్దాలు = ఇరవై సంవత్సరాలు
తిరగకుండానే = గడవకముందే
కొట్టిపారేశారు = తప్పు అని నిరూపించారు
మానవ + ఆవిష్కరణ = మానవునిచే కనిపెట్టబడింది
అనూహ్య = ఊహించలేని
రవాణా విప్లవం = రవాణాలో వచ్చిన వేగవంతమైన మార్పు
కుగ్రామం = చిన్నపల్లెటూరు
సులువు = సులభం

86వ పుట

ప్రయోగనౌక = = అంతరిక్షంలోకి తీసుకువెళ్ళే వాహనం
వ్యోమగాములు = అంతరిక్షంలో ప్రయాణించే వారు
ఆరోహణ = దిగడం
నిఘంటువులు = అక్షర క్రమంలో అర్థాలు తెలిపే పుస్తకం
రోబోట్స్ = కృత్రిమ మానవులు.
భావనా సామర్థ్యం = ఆలోచించే శక్తి
ప్రయోగశీల = ప్రయోగించే స్వభావం
వివేచన = మంచి చెడుల ఆలోచన
శతాబ్ద + అంతానికి = వంద సంవత్సరాల కాలం ముగిసే సరికి
విలీనం = కలిసిపోయి
ధోరణి = వైఖరి, మానసిక స్థితి
తలకెత్తుకోవాలి
(జాతీయం) = బాధ్యత తీసుకోవాలి
తలవాల్చనీయవు
(జాతీయం) = ఓడిపోనియ్యవు
అంతః గర్భితమైన = అంతర్గతంగా (లోపల) ఉన్న
పరిపూర్ణంగా = పూర్తిగా
దిశ = మార్గం వైపు
దోహదం = అనుకూలించు, సహకరించు

87వ పుట

అంకురార్పణ
(జాతీయం) = ప్రారంభం
హేతుబద్ధంగా = కారణం తెలుసుకొని
సాహసం = తెగువ
అపజయాలను = ఓటములను
అణగదొక్కుట
(జాతీయం) = పెరగకుండా చేయడం
వ్యవస్థాపరమైన = సౌకర్యాల పరంగా
తక్షణ = వెంటనే
కొల్లగొట్టు (జాతీయం) = ఏకమొత్తంగా లాభంపొందు
సముపార్జన = సంపాదన
జీర్ణం చేసుకొను
(జాతీయం) = జీర్ణించుకొను, ఆలోచనల్లో కలిసిపోవడం
అంతిమం = చివరికి
దుర్భేద్య దుర్గం = ప్రవేశించలేని దృఢమైన కోట

సృజనశీలత Summary in Telugu

TS Inter 2nd Year Telugu Study Material Lesson 6 సృజనశీలత 12

రచయిత పరిచయం

పాఠం పేరు : సృజనశీలత
దేనినుండి గ్రహింపబడినది : అబ్దుల్ కలాం ప్రసంగ వ్యాసాల సంపుటి “ఇన్ డామిటబుల్ స్పిరిట్” (Indomitable Spirit) అనే ఆంగ్ల పుస్తకం.
తెలుగు అనువాదం : వాడ్రేవు చినవీరభద్రుడు – “ఎవరికీ తలవంచకు” అనే పుస్తకం.
రచయిత పేరు : ఎ.పి.జె. అబ్దుల్ కలాం.
పూర్తి పేరు : అవుల్ ఫకీర్ జైనులాబ్దిన్ అబ్దుల్ కలాం.
కాలం : జననం : అక్టోబర్ 15, 1931 – మరణం : జూలై 27, 2015
తల్లిదండ్రులు : ఆషియమ్మ, జైనులబ్దిన్.
స్వస్థలం : తమిళనాడు రామేశ్వరం.
విశేషతలు : పేదరికంలో పేపర్ బాయ్గా చేసి రాష్ట్రపతి స్థాయికి చేరుకున్నారు. భారతదేశపు రక్షణ రంగంలో ‘మిస్సైల్ మ్యాన్’గా పేరుపొందారు.
కలాం శాస్త్రవేత్తగా : అంతరిక్ష రంగంలో విశిష్టసేవలు అందించారు. “డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్” (DRDO) లో చేరి సైన్యం కోసం చిన్న హెలికాఫ్టర్ను తయారు చేయడం ద్వారా తన వృత్తిని ప్రారంభించాడు. భారతీయ అంతరిక్ష పరిశోధనాసంస్థలో, రక్షణరంగ పరిశోధనాసంస్థలో వివిధ పదవులు నిర్వహించాడు. భారత ప్రభుత్వానికి ప్రధాన వైజ్ఞానిక సలహాదారుగా పనిచేశాడు. కొంతకాలంపాటు చెన్నైలో అన్నా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేశాడు.
పురస్కారాలు : భారత ప్రభుత్వం అత్యున్నత పౌరసత్కారాలు పద్మభూషణ్ (1981), పద్మవిభూషణ్ (1991), . భారతరత్న (1997) లతో గౌరవించింది.
రచనలు : ఇండియా 2020 : ఎ విజన్ ఫర్ న్యూ మిలీనియం”, “వింగ్స్ ఆఫ్ ఫైర్”, “ఇగ్నైటెడ్ మైండ్స్”, “ఎన్విజనింగ్ యాన్ ఎంపవర్డ్ నేషన్”, ఇన్ డామిటబుల్ స్పిరిట్ మొదలైనవి.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 6 సృజనశీలత

పాఠ్యభాగ ఉద్దేశం

మానవ మేధాశక్తి, సృజనాత్మకతల ముందు ఏ కంప్యూటరూ నిలవదు. ఈ సమస్త విశ్వం మనతో స్నేహపూర్వకంగా ఉంటుంది. మనలో కలలు కనేవారికి, కష్టించి పనిచేసే వారికి అత్యుత్తమైనదాన్ని ఇస్తుంది. దానికోసం యువత కొత్తగా ఆలోచించాలి. నూతన ఆవిష్కరణలకు సిద్ధం కావాలి అని విద్యార్థులకు తెలియజేయడం, అబ్దుల్ కలాం దార్శనిక దృష్టిని, ఆలోచనలను, ఆదర్శాలను అందివ్వడం ఈ పాఠ్యాంశ ఉద్దేశం.

పాఠ్యభాగ సారాంశం

సుందర హృదయాలే సృజనాత్మకతా నిలయాలు : సృజనాత్మకత నిష్కల్మషమైన హృదయాల నుండి పుడుతుంది. అది దేశంలో ఎక్కడ నుంచైనా, ఏ మూలనుండైనా వస్తుంది. జాలరి ఓడ, రైతుల గుడిసె, గొల్ల పల్లె, పశువుల కొట్టం, తరగతి గదులు, లేబరేటరీలు, పారిశ్రామిక వాడలు, పరిశోధనా నిలయాలు ఇలా ఎక్కడనుండైనా ప్రారంభం కావచ్చు.

సృజనాత్మకత వివిధ పార్శ్వాలు : సృజనాత్మకతకు చాలా కోణాలున్నాయి. అవి నూతన ఆవిష్కరణలు కావచ్చు. కొత్త ప్రయోగాలు కావచ్చు. లేదా ఉన్న వాటినే కొత్తగా తెలుసుకోవడం కూడా కావచ్చు. ఉన్న భావాలను తిరిగి ప్రయోగ పూర్వకంగా పరిశీలించడం ద్వారా, జతపరచడం ద్వారా, మార్చడం ద్వారా కొత్త విషయాలు కనుక్కోగలిగే సామర్థ్యం, ఊహించగలిగే సామర్థ్యాలను సృజనాత్మకత అంటారు. సృజనాత్మకత అనేది ఒక వైఖరి. అది కొత్తదనాన్ని, మార్పునీ అంగీకరించగలిగే భావాలతో, ఊహలతో కూడిన మానసిక స్థితి.

మానవ జీవనాన్ని విజయవంతంగా గడపడం, మంచిదైన ప్రతిదాన్నీ అనందిస్తూనే దాన్ని మరింత మంచిగా చేయగలిగే అవకాశాలకోసం వెదకడాన్ని సృజనాత్మకత అంటారు. సృజనాత్మకత అంటే కష్టించి పనిచేయటం. మన భావాల్నీ, మనకు లభ్యమవుతున్న పరిష్కారాల్నీ క్రమంగా మార్చుకుంటూ, మరింత పదును పెట్టుకుంటూ నెమ్మదిగా ముందుకు వెళ్ళడం. దేన్నైనా అందరూ చూస్తున్నట్లే చూసి ఆ చూసిన దాని గురించి మిగిలిన వారికంటే భిన్నంగా ఆలోచించటమే సృజనాత్మకత ముఖ్యలక్షణం.

మానవుడి మేధస్సు అతడికి మాత్రమే లభించిన గొప్ప బహుమానం. మానవ జీవితం ఎటువంటి ఒడిదుడుకులకైనా లోనుకానివ్వండి, ఆలోచించడం అత్యంత విలువైన ఆస్తి అని గుర్తించాలి. ఆలోచించడమే ప్రగతి. ఆలోచించ లేకపోవటం వ్యక్తుల్ని, సంస్థల్ని, దేశాన్ని నాశనం చేస్తుంది. ఆలోచించడం పనులకు దారితీస్తుంది. క్రియారూపం పొందని ఆలోచన నిష్ప్రయోజనం, వ్యర్థం. కార్యరూపం దాల్చిన విజ్ఞానం సౌభాగ్యాన్ని ఇస్తుంది.

సృజనాత్మకతను పెంపొందించడం : ప్రతి ఒక్కరిలో సృజనాత్మకత ఉంటుందనే విషయంలో సందేహంలేదు. కాని దాన్ని వ్యక్తీకరింపచేయాలంటే మాత్రం గట్టి ప్రయత్నం చేయాలి. ప్రతి హృదయం సృజనాత్మకమైనది, ప్రతి హృదయంలో కుతూహలముంటుంది. పిల్లలు చిన్నప్పట్నించి అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పగలిగితే పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది. సృజనాత్మకత మనసుల్లో భావాలను చిత్రాలుగా, కథలుగా, కవితలుగా మారుస్తుంది.

నేర్చుకోవడం సృజనాత్మకతను కలిగిస్తుంది. సృజనాత్మకత ఆలోచనలను ఇస్తుంది. ఆలోచన జ్ఞానాన్నిస్తుంది. జ్ఞానం మానవులను సమున్నత స్థానానికి చేరుస్తుంది.

సృజనాత్మకతకు అవధుల్లేవు : 1949 నుండి శంకర్స్ అంతర్జాతీయ విద్యార్థుల పోటీ ప్రతి ఏడాదీ జరుగుతుంది. శంకర్స్ పోటీలో 68 దేశాలకు చెందిన పిల్లలు పాల్గొన్నారు. వారు చిత్రించిన చిత్రలేఖనాలతో ఉన్న 55వ సంపుటిని కలాం చూసి ఆశ్చర్యపోయారు. ఆ పిల్లలు తమ చిత్రలేఖనాల్లో, కవితల్లో, కథల్లో, వ్యాసాల్లో చూపించిన ప్రతిభ ఆయన్ని అబ్బురపరచింది. ప్రపంచంలో పెద్దవాళ్లు, వయోజనులు దేశాల గురించి, సరిహద్దుల గురించి, కులాల గురించి, మతాల గురించి, పేదల గురించి, ధనికుల గురించి మాట్లాడుతుండగా పిల్లలు చేసిన కృషి మాత్రం సరిహద్దులకూ, అవధులకూ అతీతంగా ఆయనకు కనిపించింది.

పిల్లల హృదయం అత్యంత పరిశుద్ధంగా, అన్ని విభజనశీల మనస్తత్వాలకూ అతీతంగా కనిపించింది. మానవాళి భవిష్యత్తుకు మనలో ఆశను పెంచేది పిల్లల ప్రపంచం మాత్రమే అని, వాళ్ల చేతుల్లో ఈ భూగోళం భద్రంగా ఉండగలదని వారికి నమ్మకం కలిగింది.

పదమూడేళ్ల అర్ధాకృష్ణ తన ఆలోచన అనే ఆకాశంలో స్వేచ్ఛగా విహరించింది. క్రీ.శ. 3000 సంవత్సరంలో ఈ భూమి ఎలా ఉంటుందో ఊహించే ప్రయత్నం చేసింది. అప్పుడు ఈ ప్రపంచ పౌరులు, అంగారక గ్రహానికి వలసపోయి అక్కడొక కొత్త నాగరికతను నిర్మించుకుంటారనీ, అంతలో బృహస్పతి గ్రహంనుండి అంగారకుడి మీదికి రాబోయే ఒక ఏస్టరాయడ్ వల్ల మొత్తం మానవాళి నశించే ప్రమాదమేర్పడుతుందనీ ఆమె ఊహించింది. అప్పుడు అంగారకగ్రహంమీద ఉండే శాస్త్రవేత్తలు తమమీద విరుచుకుపడబోతున్న ఏస్టరాయడును అణుశరపరంపర ద్వారా విచ్ఛేదపరుస్తారని ఆమె చెప్పింది. ఆవిధంగా క్రీ.శ. 3000 లలో అంగారక నాగరికత ప్రాకృతిక ఆగ్రహానికి ఎదురు నిలిచి జీవించగలుగుతుందనీ ఆమె విశ్వాసం ప్రకటిస్తుంది. అర్ధాకృష్ణ శాస్త్రీయ ఆలోచన ఎంత సుందరంగా కొత్తగా ఉంది అని అబ్దుల్ కలాం గుర్తు చేసుకున్నారు.

రష్యాకు చెందిన పన్నెండేళ్ల అన్నాసిన కోవ రాసిన ‘అనారోగ్యం గురించి ఆలోచించకు’ కవితకూడా వారిని అబ్బురపరచింది. ఏమైనా ముఖ్యమైన పనులు చేపట్టినప్పుడు సమస్యలు తప్పనిసరిగా వస్తూ ఉంటాయి. కాని ఆ సమస్యలు శాసించకూడదని అబ్దుల్ కలాం నమ్ముతారు. దానినే మీరు సమస్యలు అధిగమించండి విజయం సాధించండి అని యువతీయువకులకు చెప్తారు.

ఇటువంటి భావాలే అన్నాసిన్యకోవ కవితలో కూడా ప్రతిధ్వనించాయి. ఆరోగ్యవంతమైన జీవితాల్ని నిలబెట్టుకోవటం కోసం ఎటువంటి వ్యాధినైనా, అనారోగ్యాన్నైనా ఎదుర్కొనే ధైర్యం ఉండాలనే బలమైన సందేశం ఆమె కవితలో కలాంకు కనబడింది.

సృజనాత్మకత జీవనసరళుల్ని మారుస్తుంది : ప్రకృతిసిద్ధంగా జరిగే పరిణామ క్రమంలో ప్రకృతి చేసుకునే ఎంపిక గురించి చార్లెస్ డార్విన్ వివరించాడు. మానవజాతి పుట్టుక గురించి కొత్తగా ఆలోచించేటట్టు చేశాడు. విద్యుచ్ఛక్తి కనుగొనడం ద్వారా థామస్ ఆల్వా ఎడిసన్ సైన్సుకూ, టెక్నాలజీకి చెందిన ప్రతి రంగాన్ని పూర్తిగా మార్చాడు. దక్షిణాఫ్రికాలో జాతి విచక్షణతకు వ్యతిరేకంగా తన అహింసా ధర్మ ఉద్యమాన్ని ప్రారంభించిన మహాత్మాగాంధీ అహింస ద్వారా భారతదేశాన్ని బ్రిటిష్ పాలననుండి విడిపించి స్వాతంత్ర్యాన్ని సంపాదించాడు. 20వ శతాబ్దానికి చెందిన ఈ మూడు ప్రధాన సంఘటనలు సృజనాత్మక ఆలోచనల ఫలితాలు అని కలాం చెప్పాడు.

సృజనాత్మకత అసాధ్యాన్ని సాధ్యం చేస్తుంది : గత 60 ఏళ్లుగా సైన్సులో, టెక్నాలజీలో వస్తున్న మార్పుల ద్వారా రెండు విషయాలు తెలుస్తున్నాయి. మొదటిది ఒకప్పుడు అసాధ్యమనుకున్నది నేడు సాధ్యమవుతుంది. అలాగే సులభసాధ్యమనుకున్నది ఇంకా సాధ్యం కాలేదుకాని, తప్పక సాధ్యమై తీరుతుంది. ముఖ్యంగా వైమానిక రంగం, అంతరిక్ష సాంకేతిక శాస్త్రం, ఎలక్ట్రానిక్స్ వస్తు పరిశోధన, కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఉత్పత్తులు వంటి రంగాలలో ప్రపంచం కొత్త కోణాలవైపు ప్రయాణిస్తుంది. రాబోయే దశాబ్దాలలో బహుశా భూమ్యాకర్షణ శక్తుల్నీ, విద్యుదయస్కాంత శక్తుల్నీ, సాధారణ సాపేక్షతా సిద్ధాంతాన్ని సమన్వయపరిచి కాలాన్నీ, స్థలాన్ని అర్థం చేసుకోగలిగే ఏకీకృత శక్తి క్షేత్ర సిద్ధాంతాన్ని ఆవిష్కరిస్తారు. సౌరకుటుంబంలో ఏదో ఒక గ్రహం మీద, లేదా చంద్రుని మీద మానవజాతి జనావాసాన్ని లేదా ఏదో ఒక పరిశ్రమను నెలకొల్పే అవకాశాన్ని మన చిన్నారులు వాళ్ల జీవితకాలంలోనే చూడవచ్చునని అబ్దుల్ కలాం అనుకున్నారు.

రాబోయే కాలంలో అంటే 50 ఏళ్లనుంచి 100 ఏళ్లలోపే మనకు ప్రస్తుతం లభ్యమవుతున్న ఇంధన వనరులు అంతరించి పోయే పరిస్థితి ఏర్పడవచ్చు. అప్పుడు విద్యుత్ అవసరాలకోసం తిరిగి ఉపయోగించగల అంతరిక్షనౌకల ఆధారంగా సౌరశక్తి ఉపగ్రహాలు ప్రయోగిస్తామేమో. ఇటువంటివన్నీ సృజనశీల ఆలోచనలవల్ల మాత్రమే సాధ్యపడతాయని కలాం అన్నారు.

ఒక చిన్న తుమ్మెద ఆకారానికి ఏరోడైనమిక్ సూత్రాల ఆధారంగా చూస్తే ఆ తుమ్మెద ఎగరడం అసాధ్యమని తెలుస్తుంది. కాని తుమ్మెదలో ఎగిరే ఇచ్ఛ, సంకల్పం ఎంత బలంగా ఉంటాయంటే అది ఎప్పుడూ తన రెక్కలు అల్లాడిస్తూనే ఉంటుంది. అలా పదేపదే తన రెక్కలు కొట్టుకుంటున్నందువల్ల వచ్చే ఉన్నత తరంగదైర్ఘ్య సంవేదనలు ఒక ఆవర్తనాన్ని సృష్టించి దాన్ని ముందుకు తోస్తాయి.

ఆవిధంగా తుమ్మెదకు ఎగరడం సాధ్యమవుతుంది. కాబట్టి బలమైన సంకల్పాలతో చేపట్టే కృషివల్ల సువ్యస్థిత విశ్వాసాలకు నిస్సందేహంగా ఎదురీదగలము అని కలాం ప్రబోధించాడు. సృజనాత్మకశక్తి

తుమ్మెద ఎగరడమేకాదు, అసలు ఒకప్పుడు మానవుడు తను కూడా ఆకాశంలో ఎగరడమనేది అసాధ్యమని నమ్మాడు. 1890లో అప్పటి రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ అధ్యక్షుడుగా ఉన్న ప్రఖ్యాత శాస్త్రవేత్త లార్డ్ కెల్విన్ బరువుగా ఉండేవేవీ కూడా ఆకాశంలో ఎగరడం అసాధ్యమని తేల్చేశాడు. కాని అతడి మాటల్ని రెండు దశాబ్దాలు తిరగకుండానే రైట్ సోదరులు కొట్టి పారేశారు.

వారి సంకల్పంవల్ల, కృషివల్ల మనిషి కూడా ఆకాశంలో ఎగరగలడని నిరూపితమైంది. పట్టినపట్టు విడవకుండా సృజనాత్మకంగా ఆలోచించగలిగితే మనిషి విజయం ఎట్లా సాధిస్తాడో చెప్పే ఒక విజయగాథ ఇది. ఈ ఒక్క మానవావిష్కరణను తీసుకున్నా కూడా అది ఒక అనూహ్య రవాణా విప్లవానికి దారి తీసిందనీ, ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్చివేసిందనీ నేడు మనం సులువుగా గుర్తించవచ్చు.

శాటర్న్-V ప్రయోగనౌకను నిర్మించి దానిద్వారా వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపించి. చంద్రుడిపై మానవ ఆరోహణను సాధ్యంచేసిన ప్రఖ్యాత రాకెట్ రూపశిల్పి వాన్ బ్రౌన్ “నాకే గనక అధికారముంటే నిఘంటువుల్లోంచి అసాధ్యమనే పదాన్ని తీసేస్తాను” అన్నాడు.

రాబోయే పరిణామాలు : ది ఏజ్ ఆఫ్ ది స్పిరిట్యువల్ మెషిన్స్ అనే పుస్తకాన్ని రాసిన రే కురువైల్ చెప్పిన దాని ప్రకారం 2009 నాటికి 50,000 ఖరీదు చేయగల కంప్యూటరు ఒక్క సెకండులో కోటి లక్షల లెక్కలు చేయగలదు. 2019 నాటికి సెకండుకు 10 లక్షల కోట్ల లక్షల లెక్కలు చేయగలదు. అంటే అప్పటికి దాదాపుగా మానవ మేధకు సమానమైన సామర్ధ్యాన్ని సాధించగలదు. 2029 నాటికి అది ఒక వెయ్యి మానవ మేధస్సులకు సమానమైన సామర్థ్యాన్ని పొందుతుంది. అంటే భవిష్యత్తులో మానవులు నేడు తాము చేసే పనులు కొన్నింటిని కంప్యూటర్లతో నడిచే రోబోట్స్కి అప్పజెప్పి తమ మెదడుల్ని మరింత ప్రయోజనకరమైన పనులకు అప్పజెప్పే అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్లు తమ భావనా సామర్థ్యంతో ప్రయోగశీల ఆలోచనతో తిరిగి మళ్లీ కంప్యూటర్లను ఓడించగలిగే స్థాయికి చేరుకుంటారు.

ఈ శతాబ్దం చివరికి మానవ ఆలోచనలను, యంత్రాలు తెలివితేటలను విలీనం చేసే ధోరణి బలంగా పెంపొందుతుంది. అప్పుడు మానవుడు ఒకప్పుడు రూపొందించిన యంత్రాలకూ, మానవ మేధాశక్తికీ మధ్య సరిహద్దులు చెరిగిపోతాయి. అటువంటి పరిస్థితిలో యంత్రాల బారినుండి మానవుడి ప్రత్యేకతను మనం ఏవిధంగా నిలబెట్టుకోగలుగుతాం ? నిస్సందేహంగా కంప్యూటర్లు ఒక సవాలుగా మారుతున్నాయి.

ఈ సమస్య కేవలం జీవశాస్త్రవేత్తలదీ, జీవసాంకేతికవేత్తలదీ మాత్రమేకాదు. మొత్తం శాస్త్రవేత్తలు అందరు మనుష్యులు రూపొందించిన కంప్యూటర్లకన్నా మానవ జాతిని ఒక మెట్టు పైనే ఉంచవలసిన గొప్ప బాధ్యత తలకెత్తుకోవలసి ఉంది. అదృష్టవశాత్తూ మానవ మేధ సృజనాత్మకత, ప్రయోగశీల పార్శ్వాలు ఎంత గొప్పవంటే అవి మనిషిని ఎన్నటికీ యంత్రం ముందు తల వాల్చనివ్వవు. మానవజాతిలో సహజసిద్ధమైన, అంతఃగర్భితమైన మహాశక్తిని పరిపూర్ణంగా ఆవిష్కరించే దిశగా హ్యూమన్ జీనోమ్ సాఫ్ట్వేర్ను మనమింకా అభివృద్ధి చేయవలసి ఉందని కలాం ఉహించాడు.

సృజనాత్మకత నూతన ఆవిష్కరణలకు, సరికొత్త సంపదలకు దారితీస్తుంది. : నిలకడగా ఉండే సమాచారం ఎదుగుదలను ప్రోత్సహించదు. నేటి సరికొత్త డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఒకరితో మరొకరు ఇచ్చిపుచ్చుకునే సమాచారం కొత్త ఆవిష్కరణలకు దారితీసి తద్వారా జాతీయ సంపద పెరుగుదలకు దోహదం చేస్తుంది. కొత్త ఆవిష్కరణలకు అంకురార్పణ చేయడం ద్వారా విజ్ఞానం సంపదగా రూపొందుతుంది. నూతన ఆవిష్కరణ అనేది ఒక పద్ధతి ప్రకారం సువ్యవస్థితంగా, హేతుబద్దంగా చేసే పని. అది విశ్లేషణలు, ప్రయోగాలు, ప్రయోగ పరీక్షలు వంటి వివిధ దశలద్వారా చేపట్టబడే పని.

నూతన ఆవిష్కరణలకు కొత్తగా ఆలోచించే సాహసం, కొత్తవి కనుగొనే సాహసం, అసాధ్యాన్ని ఆవిష్కరించే సాహసం, అపజయాలను అణగదొక్కే సాహసం కావాలి. నూతన ఆవిష్కరణలు సాధారణంగా పరిశోధనాత్మక అభివృద్ధిపై ఆధారపడి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వ్యవస్థాపరమైన మార్పు వంటి ఇతర అంశాలపైన కూడా ఆధారపడి ఉంటాయి.

కాబట్టి దేశంలో సమర్థవంతమైన నూతన ఆవిష్కరణల వ్యవస్థను నెలకొల్పవలసిన తక్షణ అవసరముంది. అటువంటి వ్యవస్థ సాధ్యంకావాలంటే ప్రయోగశీలమైన విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పరిశోధనా సంస్థలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే సంస్థలు ఏవైనా సముదాయాలు పెంపొందవలసి ఉంటుంది.

వాటికీ, వాటి వినియోగదారులకూ, వారిద్దరినీ అనుసంధానపరిచే సంస్థలకూ మధ్య పరస్పర ఆధారిత అనుసంధాన వ్యవస్థలు అభివృద్ధి చెందవలసి ఉంటుంది. ఆ విధంగా నెలకొల్పబోయే పరిశోధనా వ్యవస్థ తన వైజ్ఞానిక సముదాయాల ఆధారంగా విశ్వవ్యాప్త విజ్ఞానాన్ని కొల్లగొట్టుకో గలుగుతుంది. ఆవిధంగా సముపార్జించుకున్న విజ్ఞానాన్ని జీర్ణం చేసుకుని స్థానిక అవసరాలకు తగ్గట్టుగా మలుచుకొని చివరికి కొత్త విజ్ఞానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించుకోగలుగుతుంది.

మానవ వివేచనా ప్రాతిపదిక : సృజనాత్మకత పునాదులపైనే మానవ వివేచన నిలిచి ఉంది. ఎంత వేగవంతమైన కంప్యూటర్లు ఎంత తీవ్రమైన జ్ఞాపకశక్తి కలిగిన కంప్యూటర్లు వృద్ధి చెందినప్పటికీ సృజనాత్మకత ఆ శక్తులన్నిటి పైనా సదా అత్యున్నత స్థానంలో నిలిచే ఉంటుంది. సృజనశీలమైన మానవమేధ కంప్యూటర్లు అందిస్తున్న అపార సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఈ ప్రపంచాన్ని మరింత సుఖంగా జీవించే దిశగా తన ప్రణాళికలను అమలుచేస్తూనే ఉంటుంది.

TS Inter 2nd Year Telugu Grammar సంభాషణ రచనా నైపుణ్యం

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material Grammar సంభాషణ రచనా నైపుణ్యం Questions and Answers.

TS Inter 2nd Year Telugu Grammar సంభాషణ రచనా నైపుణ్యం

ఇద్దరు వ్యక్తుల మధ్య మాటల ద్వారా జరిగే భావప్రసారాన్ని ‘సంభాషణ’ అంటారు. మనం రోజూ ఇంట్లోనూ, బయట ఎంతమందితోనో మాట్లాడుతూ ఉంటాం. ఈ మాటల్లో లెక్కలేనన్ని పదాలు దొర్లుతుంటాయి. ఎదుటి వారితో అర్థవంతంగా, గౌరవంతో కూడిన మాటలు మాట్లాడటం ప్రతి ఒక్కరు అభ్యసించాలి. నైపుణ్యంతో మాట్లాడటం ఒక కళ.

సంభాషణ రచన ద్వారా రచనలో నైపుణ్యాలను సాధించవచ్చు. సంభాషణలో నేర్పును సాధించడానికి కింది అభ్యాసాలు అందుకు ఎంతగానో తోడ్పడుతాయి. సూచించిన పదాలను ఆధారం చేసుకొని సందర్భోచితంగా వ్యక్తుల మధ్య సంభాషణ రాయాల్సి ఉంటుంది. సంభాషణలో వ్యవహారిక భాషలో వాడే ఇతర భాషా పదాలు కూడా వాడవచ్చు. సందర్భోచితంగా వాడే జాతీయాలు, సామెతలు, పదబంధాలు సంభాషణలను ఆసక్తికరంగా మారుస్తాయి.

ప్రశ్న 1.
కాలిదెబ్బలకు వైద్యం కోసం వెళ్ళినపుడు వైద్యునితో సంభాషణ.
(క్రికెట్ ఆడటం – దెబ్బ తగలడం – నొప్పి – ఫస్ఎయిడ్ – మందులు – కాపడం – పథ్యం)
జవాబు:
విద్యార్థి  :  నమస్తే డాక్టర్ !
డాక్టర్  :  నమస్తే సురేశ్ ! ఎలా ఉన్నావు ? కుంటుతున్నావెందుకు ?
విద్యార్థి :  మా కళాశాలలో క్రికెట్ ఆడుతుంటే కాలిబొటన వేలికి దెబ్బ తగిలింది.
డాక్టర్  :  రక్తం ఏమైనా పోయిందా ? ఫస్ట్ ఎయిడ్ ఏమైనా చేశారా !
విద్యార్థి  :  చాలా రక్తం పోయింది. బాగా నొప్పిగా ఉంది డాక్టర్ ! దెబ్బ తగలగానే మా టీచర్ శుభ్రంగా కడిగి పసుపు పెట్టి ఫస్ట్ ఎయిడ్ చేసింది.
డాక్టర్  :  భేష్ పసుపు పెట్టి మీ టీచరు మంచి పని చేసింది. లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చేది.
విద్యార్థి  :  అవును డాక్టర్ ! నా మోకాలు బాగా కమిలి పోయింది. మా అమ్మ కాలికి వేడినీళ్ళతో కాపడం కూడా పెట్టింది.
డాక్టర్  :  మంచి పనిచేసింది సురేశ్ ! దెబ్బను ప్రతిపూటా డెట్టాల్ నీళ్ళతో కడగాలి. నేనిచ్చే మందు పెట్టు, దుమ్ము తగలనీయకు.
విద్యార్థి  :  ఏమైనా పథ్యం చెయ్యాలా డాక్టర్ ?
డాక్టర్  :  అవసరం లేదు. బలమైన ఆహారం తీసుకో !
విద్యార్థి  :  సరే డాక్టర్ ! నమస్కారం.

TS Inter 2nd Year Telugu Grammar సంభాషణ రచనా నైపుణ్యం

ప్రశ్న 2.
ఆదాయ పత్రం జారీ కొరకు విజ్ఞాపన చేయడానికి వెళ్ళినపుడు అధికారితో సంభాషణ. *(M.P.)
(ఆదాయపత్రం – దరఖాస్తు – జతపరుచు – తహశీల్దార్ – ఉపకారవేతనం)
జవాబు:
విద్యార్థి  :  తహశీల్దార్ సర్ నమస్కారం ! నా పేరు శ్రీరాం.
అధికారి  :  నమస్తే చెప్పు బాబూ, ఏ పనిమీద వచ్చావు ?
విద్యార్థి  :  ఆదాయపత్రం కొరకు దరఖాస్తు చేసుకుందామని వచ్చాను సార్ !
అధికారి  :  దరఖాస్తు తెచ్చావా ! వివరాలు అన్నీ ఉన్నాయా ?
విద్యార్థి  :  ఉన్నాయి సర్! సంబంధిత పత్రాలన్నీ జతపరిచాను. ఈ ఆదాయ పత్రం నాకెంతో ఉపయోగపడుతుంది సర్.
అధికారి  :  ఉపకార వేతనం ఏ రకంగా ఉపయోగిస్తావు శ్రీరాం.
విద్యార్థి  :  ఉపకార వేతనంతో పుస్తకాలు, దుస్తులు ఇతర వస్తువులు కొనడానికి తల్లిదండ్రులపై ఆధారపడే ఇబ్బంది ఉండదు సర్.
అధికారి  :  మంచిది ! నేను కూడా ఉపకార వేతనం సాయంతోనే ఎమ్.ఎ. వరకు చదివాను.
విద్యార్థి  :  అలాగా సర్ ! మరి ఆదాయపత్రం ఎప్పుడు ఇస్తారు ?
అధికారి  :  రెండు రోజుల్లో.
విద్యార్థి  :  ధన్యవాదాలు సర్ !

TS Inter 2nd Year Telugu Grammar సంభాషణ రచనా నైపుణ్యం

ప్రశ్న 3.
బోనఫైడ్ సర్టిఫికెట్ కొరకు విజ్ఞప్తి చేయడానికి వెళ్ళినపుడు ప్రిన్సిపాల్తో సంభాషణ.
(ఎన్.సి.సి లో ప్రవేశం – కవాతు – ఆత్మవిశ్వాసం – ధన్యవాదాలు)
జవాబు:
విద్యార్థిని  :  నమస్తే సర్ !
ప్రిన్సిపాల్  :  నమస్తే ! చెప్పమ్మా సుప్రజా ! ఏం కావాలి !
విద్యార్థిని  :  సర్ బోనఫైడ్ సర్టిఫికెట్ కొరకు వచ్చాను సర్.
ప్రిన్సిపాల్  :  దరఖాస్తు తెచ్చావా! సర్టిఫికెట్ దేనికి అమ్మా !
విద్యార్థిని  :  దరఖాస్తు ఇదిగో సర్ ! ఎన్.సి.సి లో చేరాలంటే నేను మన కళాశాల విద్యార్థిని అని సర్టిఫికెట్ కావాలి.
ప్రిన్సిపాల్  :  ఎన్.సి.సిలో చేరాలని ఎందుకనుకుంటున్నావు ?
విద్యార్థిని  :  నాకు కవాతు, రైఫిల్ ఘాటింగ్ అంటే చాలా ఇష్టం.
ప్రిన్సిపాల్  :  అంతేకాదు నీకు ఎన్.సి.సిలో ‘బి’ సర్టిఫికెట్ ఉంటే పై చదువుల్లో సీట్లలో, ఉద్యోగాలలో కూడా ప్రాధాన్యం ఇస్తారు.
విద్యార్థిని  :  అవును సర్ ! మా నాన్నగారు ఎన్.సి.సిలో చేరమన్నారండి.
ప్రిన్సిపాల్  :  మంచిది ఎన్.సి.సి వల్ల నీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. మధ్యాహ్న సమయంలో సర్టిఫికెట్ తీసుకోమ్మా.
విద్యార్థిని  :  అట్లాగే సర్ ! ధన్యవాదాలు.

TS Inter 2nd Year Telugu Grammar సంభాషణ రచనా నైపుణ్యం

ప్రశ్న 4.
పత్రికా విలేకరితో కళాశాల ఉత్సవం గురించి ఫోన్లో వివరించే సంభాషణ.
(కళాశాల వార్షికోత్సవం – కలం, కాగితం ముఖ్య అతిథి ఉపన్యాసం – ఉత్తేజకరం – బహుమతులు – పాటలు – నృత్యాలు.)
జవాబు:
వందన  :  నమస్తే రమణ సర్ ! నా పేరు వందన నేను ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినిని మాట్లాడుతున్నాను.
రమణ  :  నమస్తే వందనా ! నిన్న మీ కళాశాలలో వార్షికోత్సవం జరిగిందట కదా ?
వందన  :  అవును సర్ ! ఆ విషయమే మీకు వివరిద్దామని ఫోన్ చేశాను సర్.
రమణ  :  ఒక నిముషం ఆగమ్మా ! కాగితం, కలం తీసుకుంటాను…. ఇంక చెప్పమ్మా !
వందన  :  నిన్న మా కళాశాల వార్షికోత్సవం వైభవంగా జరిగింది. జూనియర్ కళాశాలల జిల్లా అధికారి ముఖ్య అతిథిగా వచ్చాడు.
రమణ  :  అవునా ! ముఖ్య అతిథి ఏమని ఉపన్యసించాడో చెప్పగలవా ?
వందన  :  మా జిల్లా అధికారి సత్యనారాయణ రెడ్డి ఉపన్యాసం చాలా ఉత్తేజకరంగా సాగింది. జీవితలక్ష్యం కొరకు కృషి, సాధన, ఏకాగ్రత గురించి వివరించాడు.
రమణ  :  బాగుంది వందనా ! ఇంకా వివరాలు చెప్పమ్మా!
వందన  :  వార్షికోత్సవం సందర్భంగా ఆటలపోటీలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
రమణ  :  ఏయే సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినవి ?
వందన  :  ఒక నాటిక, నృత్యాలు, పాటలు, హాస్యసంభాషణలు, ధ్వన్యనుకరణ, అనుకరణ మొదలైన అంశాలతో రెండు గంటలపాటు కార్యక్రమాలు జరిగాయి. అందరికీ బాగా నచ్చాయి. ఫోటోలు ఈమెయిల్ చేస్తాను సర్ ! రేపటి మీ పత్రికలో ఫోటోలు వివరాలు ప్రచురిస్తారా ?
రమణ  :  తప్పకుండానమ్మా ! మంచిదమ్మా !
వందన  :  ధన్యవాదాలు సర్ !

TS Inter 2nd Year Telugu Study Material Chapter 2 తెలంగాణ సాహితీ వికాసం

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material 2nd Lesson తెలంగాణ సాహితీ వికాసం Textbook Questions and Answers.

TS Inter 2nd Year Telugu Study Material 2nd Lesson తెలంగాణ సాహితీ వికాసం

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాషాభివృద్ధి వెనకబడటానికి కారణాలు వివరించండి.
జవాబు:
తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణా ప్రాంతానికి విశిష్ట స్థానం ఉంది. భాస్కరరామాయణము రాసిన భాస్కరుడు, మల్లికార్జున భట్టు, కుమార రుద్రదేవుఁడు, అయ్యలార్యుడు, ఆంధ్ర మహాభాగవతము రాసిన పోతనామాత్యుడు, మార్కండేయ పురాణం రాసిన మారన, మొట్టమొదటి అచ్చతెనుగు కావ్యము యయాతి చరిత్ర రచించిన పొన్నగంటి తెలగన్న, జాను తెనుగులో రచన చేయాలని చెప్పి బసవపురాణాన్ని రాసిన పాల్కురికి సోమనాథుడు మొదలైన వారంతా తెలంగాణా ప్రాంతం వారే. తెలంగాణాలోని ప్రతీ గ్రామంలో తాళపత్ర గ్రంథాలు దొరికాయి.

దూపాటి వేంకటరమణాచార్యులు తెలంగాణా ప్రాంతమంతా తిరిగి ఎన్నో శాసనాలను, నూర్లకొద్ది తాళపత్ర గ్రంథాలను సంపాదించారు. తెలంగాణ శాసనాలలో కొన్నింటిని హైదరాబాదులోని లక్ష్మణరాయ పరిశోధక మండలివారు ప్రచురించారు. మరికొన్ని శాసనాలు పురావస్తు శాఖకు అప్పగించారు. వీటన్నిటిద్వారా తెలంగాణా ప్రాంతంలో తెలుగు దీపాలు ఎన్నడూ ఆరిపోలేదని తెలుస్తుంది. అప్పటి ప్రభుత్వ విధానాల వల్ల దీపాలు దేదీప్యమానముగా ప్రకాశించకపోయినా మిణుకుమిణుకుమని వెలుగుతూనే ఉన్నాయి.

హైదరాబాదు సంస్థానంలో తెలుగు దుస్థితికి కారణాలు : గోలకొండ సుల్తానుల ఉత్తమ సంప్రదాయాన్ని అసఫ్ జాహీ వంశీయులు పాటించలేదు. భాషా సంస్కృతులను అణచి వేశారు. హైదరాబాదు పైన పోలీసు చర్య జరిగే వరకు, నిజాం ప్రభుత్వ విధానాలు ప్రజల భాషలను అణచివేశాయి. బ్రిటిషు పరిపాలనలో భాషలపై ఇటువంటి ప్రయత్నాలు జరుగలేదు. నైజామేతర ప్రాంతాలలో బ్రిటీషువారు గ్రంథాలయాల స్థాపనను నిషేధించలేదు. రాజకీయాలతో సంబంధంలేని సారస్వత కృషి నిరంతరాయంగా జరిగింది. సి.పి. బ్రౌన్ వంటి ఉన్నత అధికారులు ప్రజల భాషల వికాసానికి కృషిచేశారు.

వీరేశలింగం పంతులు మొదలైన వారి సారస్వత కృషికి ప్రభుత్వం ఆటంకాలు కలిగించలేదు. కానీ తెలంగాణా ప్రాంతంలో మాతృభాషల వికాసానికి గొడ్డలి పెట్టువంటి విధానాలను హైదరాబాదు ప్రభుత్వం అమలు చేసింది. ఈ ప్రాంతంలోని 90% ప్రజల భాష తెలుగు అయినప్పటికీ తెలుగు చదువుకొనడానికి అవకాశాలు లేవు. ఒక గ్రంథాలయాన్ని పెట్టుకోవడమే చాలాకష్టమైన పని. కవిసమ్మేళనాలు, సారస్వత సభలను నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి అవసరమయ్యేది. ఆంధ్ర అనే పేరుతో ఏ ఉద్యమం సాగినా దానిని ప్రభుత్వం శత్రుభావముతో చూసేది. ఈ పరిస్థితినే వాగ్బంధన శాసన పైశాచిక తాండవం (నోటిని కట్టివేసే పిశాచాల నర్తనం) అని సురవరం ప్రతాపరెడ్డి అన్నారు.

తెలంగాణా ప్రాంతంలో ఎందరో గొప్పవారైన సంస్కృతాంధ్ర పండితులున్నప్పటికీ వారు సభలలో సమావేశమై పరస్పర అవగాహన చేసుకునే అవకాశాలు లేవు. ప్రజలలో పది శాతం మందికి కూడా రాని ఉర్దూ భాషను రాజభాషగా రుద్దారు. ప్రాథమిక దశ నుంచి విశ్వవిద్యాలయ దశవరకు ఉర్దూయే బోధనాభాష కావడంవల్ల తెలుగు భాషాభివృద్ధికి అవకాశం లేదు. ఆ రోజులలో హైదరాబాదు రాష్ట్రం ఒక ప్రత్యేకమైన ద్వీపకల్పంగా మారి అక్కడ నివసించే ప్రజలను ఇతర ప్రపంచం నుండి వేరు చేసింది. (నిజాం రాజ్యంలో సంస్కృతి సంప్రదాయాలన్నీ ఇతర ప్రాంతాలకంటే భిన్నంగా ఉండేవి.)

అందువల్ల భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేవరకు తెలంగాణలో అక్షరాస్యత చాలా తక్కువ. సంస్కృతాంధ్ర పండితులు, కవులు తిండికి, నివాసానికి కూడా డబ్బుల్లేక పల్లెటూళ్ళలో బాధలు పడ్డారు. కొద్దిమంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉర్దూ, ఫారసీ భాషలను నేర్చుకొని తమ జీవనం సాగించారు. ఈ విధంగా తెలుగు భాషా వికాసానికి తెలంగాణా ప్రాంతంలో గ్రహణము పట్టింది.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 2 తెలంగాణ సాహితీ వికాసం

ప్రశ్న 2.
కొమర్రాజు లక్ష్మణరావు సాహిత్యసేవను తెలియజేయండి.
జవాబు:
తెలంగాణలో తెలుగు భాషా సంస్కృతులపై జరుగుతున్న దాడిని గమనించి ఈప్రాంతంలో సాహిత్య వికాసానికి కృషి చేసినవారిలో ముఖ్యులు కొమర్రాజు వేంకట లక్ష్మణరావు. ఆయన గొప్ప పరిశోధకుడు, తెలుగు భాషా వికాసానికి అపారమైన కృషి చేసిన మేధావి. నిష్కళంక దేశభక్తుడు. ఆ రోజులలో చాలామంది ఆంధ్ర ప్రాంతం వారికి తెలంగాణ గురించి సరైన అవగాహన లేదు. లక్ష్మణరావు మునగాల సంస్థానంలో దివానులుగా పనిచేసేవారు. మునగాల సంస్థానాధీశ్వరులకు తెలంగాణా ప్రాంతంతో సంబంధాలు ఉండేవి. వారిద్దరూ హైదరాబాదుకు వస్తూపోతూ ఉండే వారు.

లక్ష్మణరావు కృషికి మునగాల రాజా తోడ్పాటు అందించారు. ఆ కారణంగా 1900వ సంవత్సరంలో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయము స్థాపితమైంది. తరువాత 1904వ సంవత్సరంలో రాజరాజనరేంద్ర భాషా నిలయం హనుమకొండలో స్థాపితమైనది. ఆ తరువాత వరంగల్లులో శబ్దానుశాసనాంధ్ర భాషా నిలయం స్థాపితమైంది. లక్ష్మణరావు విజ్ఞాన చంద్రిక గ్రంథమండలి కూడా 1900 సంవత్సరంలోనే హైదరాబాదులో స్థాపితమైంది. లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు, మునగాల రాజాగారి తోడ్పాటుతో తెలంగాణలో సాహిత్య వికాసానికి, సాంస్కృతిక చైతన్యానికి గట్టి పునాదులను నిర్మించారు. తరువాత క్రమక్రమంగా తెలంగాణాలో అనేక గ్రంథాలయాల ద్వారా సాహిత్య సభలు జరిగాయి.

కవి పండితులను చైతన్య పరిచి తెలుగు భాషాభ్యుదయానికి కృషి చేశాయి. లక్ష్మణరావు ప్రోత్సాహంతో మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, ఆదిరాజు వీరభద్రరావులు ఈ కృషిలో పాలుపంచుకున్నారు. మొత్తంమీద ఉర్దూ, ఫారసీ భాషల ప్రభావానికి లోనై తన మాతృభాషకు అంత ప్రాధాన్యం ఇవ్వని పరిస్థితి ఆనాటి తెలంగాణలో కనిపించింది. పైన పేర్కొన్న ముగ్గురు మహనీయులు గ్రంథాలయాలు, పత్రికలు, గ్రంథమాలలు స్థాపించి తెలంగాణను మేలుకొల్పారు. వీరి కారణంగా యువకులు సాహిత్య వికాసానికి కంకణబద్ధులైనారు.

తెలంగాణ సాహిత్యరంగంలో నవయుగోదయమైనది. కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయాన్ని స్థాపించిన 1900 సంవత్సరము నుంచి ఈ నవ యుగము ప్రారంభమై 1948 సెప్టెంబరులో జరిగిన పోలీసు చర్య వరకు సాగింది. చరిత్ర పరిశోధన, భాషాపరిశోధన, విజ్ఞాన వాఙ్మయాభివృద్ధి, వచన వాఙ్మయ ప్రగతి అనేవి కొమర్రాజు లక్ష్మణరావుగారి ఆశయాలు. ఈ ఆశయాలకనుగుణంగా వారు తమ అనుయాయులను తీర్చిదిద్దారు. వారిలో ముఖ్యులు ముగ్గురు. వారు మాడపాటి హనుమంతరావు, ఆదిరాజు వీరభద్రరావు, సురవరం ప్రతాపరెడ్డి. వీరు ముగ్గురూ తెలంగాణలో తెలుగు భాషా సంస్కృతుల అభివృద్ధికి తీవ్రమైన కృషి చేశారు.

II సంగ్రహరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణ ప్రాంత విశిష్టత ఎట్టిది ? (Imp) (M.P.)
జవాబు:
తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణా ప్రాంతానికి విశిష్ట స్థానం ఉంది. భారత, రామాయణ, భాగవతాలకు తెలంగాణా ప్రాంతానికి అవినాభావ సంబంధం ఉంది. భాస్కరరామాయణము రాసిన భాస్కరుడు, మల్లికార్జున భట్టు, కుమార రుద్రదేవుఁడు, అయ్యలార్యుడు, ఆంధ్ర మహాభాగవతము రాసిన పోతనామాత్యుడు, మార్కండేయ పురాణం రాసిన మారన, మొట్టమొదటి అచ్చతెనుగు కావ్యము యయాతిచరిత్రను రచించిన పొన్నగంటి తెలగన్న, జాను తెనుగులో రచన చేయాలని చెప్పి బసవపురాణాన్ని రాసిన పాల్కురికి సోమనాథుడు మొదలైన వారంతా తెలంగాణా ప్రాంతం వారే. ప్రాచీన సాహిత్యం తెలంగాణాలో వర్ధిల్లింది.

తెలంగాణా ప్రాంతంలో తెలుగు పాండిత్యం లేదని, తెలుగు సంస్కృతికి చోటులేదని, కొన్ని వర్గాలలో వ్యాపించిన అభిప్రాయం సరైంది కాదు. తెలంగాణాలోని ప్రతీ గ్రామంలో తాళపత్ర గ్రంథాలు దొరికాయి. దూపాటి వేంకటరమణాచార్యులు తెలంగాణా ప్రాంతమంతా తిరిగి ఎన్నో శాసనాలను, నూర్లకొద్ది తాళపత్ర గ్రంథాలను సంపాదించి సాహిత్య పరిషత్తుకు అప్పగించారు. వీటన్నిటిద్వారా తెలంగాణా ప్రాంతంలో తెలుగు దీపాలు ఎన్నడూ ఆరిపోలేదని తెలుస్తుంది. అప్పటి ప్రభుత్వ విధానాల వల్ల దీపాలు దేదీప్యమానముగా ప్రకాశించకపోయినా మిణుకుమిణుకుమని వెలుగుతూనే ఉన్నాయి. హైదరాబాదు నగరంలోని పరిస్థితి ఎట్లున్నా పల్లె ప్రాంతాలలో తెలుగు భాషా, సాహిత్యాలు అంతరించలేదని తెలుస్తుంది.

ప్రశ్న 2.
తెలుగుభాషను ఆదరించడంలో సంస్థానాల కృషిని తెలుపండి.
జవాబు:
నిజాం నిరంకుశ పాలనలో తెలుగు భాషా సంస్కృతులు నిరాదరణకు గురైనాయి. అటువంటి పరిస్థితులలో గద్వాల, వనపర్తి, ఆత్మకూరు మొదలైన సంస్థానాలు తెలుగు భాషా సంస్కృతుల రక్షణకు విశేషమైన కృషిచేశాయి. ఆంధ్ర ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి ఒక విధంగా ఈ సంస్థానాల ఆదరణి వల్ల సాంస్కృతిక సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రతి సంవత్సరం ఆంధ్రప్రాంతం నుంచి కవులు, పండితులు వచ్చి ఈ సంస్థానాలలో సన్మానాలు పొందేవారు. ఇటువంటి వారిలో తిరుపతి వేంకటకవులు కూడా ఉన్నారు.

అవధానాలు తెలంగాణా ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి మధ్య భాషాపరమైన వంతెనలుగా పనిచేశాయి. వీటికితోడు కొన్ని నాటక సంఘాలు ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో కొన్ని పట్టణాల్లో నాటకాలను ప్రదర్శిస్తుండేవి. మైలవరము, సురభి మొదలైన నాటక సంఘాలు వరంగల్లు మొదలైన తెలంగాణా ప్రాంతాలలో నాటకాలను ప్రదర్శించి ఈ రెండు ప్రాంతాల మధ్య సాంస్కృతిక సమైక్యతను బలపరిచాయి.

ప్రశ్న 3.
సురవరం ప్రతాపరెడ్డి సాహిత్యసేవను తెలుపండి.
జవాబు:
సురవరం ప్రతాపరెడ్డి సంపన్న కుటుంబీకులు. బి.ఏ. బి. ఎల్ పట్టభద్రులు. న్యాయవాద వృత్తి చేపట్టడానికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికి, ప్రభుత్వ ఉద్యోగం కూడా చేయకుండా, జీవితాంతం తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన త్యాగమూర్తి సురవరం ప్రతాపరెడ్డి. ఈయన బహుభాషావేత్త, అనేక గ్రంథాలు రాశారు. ఉత్తమశ్రేణి పరిశోధకులు, నిర్భయంగా పత్రికను నడిపిన సంపాదకులు.

ఆయన గోలకొండ పత్రిక ద్వారా తెలంగాణా ప్రజలను అన్ని రంగాలలో మేలుకొల్పినారు. గోలకొండ పత్రికా సంపాదకునిగా వీరు వ్రాసిన సంపాదకీయాలు అనేక విషయాలకు విజ్ఞాన నిక్షేపాలవంటివి. రామాయణ రహస్యాలు, హిందువుల పండుగలు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర మొదలైన గొప్ప పరిశోధనాత్మకమైన గ్రంథాలను రాశారు. ప్రతాపరెడ్డి మంచికవులు, కథకులు, విమర్శకులు, వ్యాసకర్తలు, బహుముఖ ప్రతిభాసంపన్నులు. వారు రాసిన నిరీక్షణము వంటి కథలు కథానికా వాఙ్మయంలో మొదటి శ్రేణికి చెందిన కథలు. తమ రచనల ద్వారా తెలంగాణా సమాజాన్ని చైతన్యవంతం చేశారు. గోలకొండ కవుల సంచిక ద్వారా తెలంగాణలో మరుగున పడిన శతాధిక కవులను వెలుగులోకి తెచ్చారు.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 2 తెలంగాణ సాహితీ వికాసం

ప్రశ్న 4.
తెలంగాణ ప్రాంతంనుండి వెలువడిన పత్రికల గురించి వివరించండి.
జవాబు:
తెలంగాణాలోని మొదటి పత్రిక హితబోధిని 1818వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఒక సంవత్సరం మాత్రమే నడిచింది. తరువాత 1920వ సంవత్సరంలో తెనుగు అనే పత్రిక ఒద్దిరాజు సోదరుల సంపాదకత్వంలో వరంగల్లు జిల్లా ఇనుగుర్తి నుంచి, నీలగిరి అనే పత్రిక షబ్నవీసు నరసింహారావు సంపాదకత్వంలో నల్లగొండ నుండి నడిచాయి. ఈరెండు పత్రికలూ ఐదేండ్లు మాత్రమే నడిచాయి. 1925వ సంవత్సరంలో గోలకొండ పత్రిక అర్ధ వారపత్రికగా ప్రారంభమైంది. తరువాత 1947లో దినపత్రికగా మారి సుమారు ఇరువై సంవత్సరాలు నడిచింది.

సుజాత అనే మాసపత్రిక పి.ఎన్. శర్మ సంపాదకత్వంలో వెలువడింది. ఆంధ్రాభ్యుదయం అనే పత్రిక హన్మకొండ నుంచి, దేశబంధు అనే పత్రిక హైదరాబాదు జిల్లా తూప్రాన్ నుండి, తెలుగు తల్లి, విభూతి, దివ్యవాణి అనే తెలుగు పత్రికలు సికిందరాబాదు నుండి వెలువడినాయి.

తరువాత 1945 లో అడవి బాపిరాజు సంపాదకత్వంలో మీజాన్, బి.ఆర్. చారి సంపాదకత్వంలో తెలంగాణా అనే రెండు దినపత్రికలు వెలువడినాయి. సికింద్రాబాదు నుంచి ఆంధ్ర కేసరి, ఆంధ్రవాణి అనే వార పత్రికలు, తరణి అనే దినపత్రిక వచ్చింది. శోభ అనే సాహిత్య పత్రిక వరంగల్లు నుండి వెలువడింది. ఈ విధంగా తెలంగాణలో నూతన యుగోదయమై అనేకమంది రచయితలు ఆవిర్భవించారు. ఈ పత్రికలన్నీ జాతీయోద్యమ ప్రభావితాలై నవీన వాఙ్మయ నిర్మాణానికి దోహదం చేశాయి.

III ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
దేవులపల్లి రామానుజరావు స్వగ్రామం ఏది ?
జవాబు:
వరంగల్లు జిల్లా దేశాయిపేట.

ప్రశ్న 2.
రామానుజరావు స్థాపించిన సాహిత్య పత్రిక ఏది ?
జవాబు:
శోభ

ప్రశ్న 3.
రామానుజరావు అధ్యక్షుడిగా పనిచేసిన సాహిత్య సంస్థ ఏది ?
జవాబు:
ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి.

ప్రశ్న 4.
రామానుజరావు రాసిన ఖండ కావ్యసంపుటి పేరేమిటి ?
జవాబు:
పచ్చతోరణం.

ప్రశ్న 5.
కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం ఏ సంవత్సరంలో స్థాపించారు ?
జవాబు:
క్రీ. శ. 1900

ప్రశ్న 6.
మున్షీ ప్రేమచంద్ కథలను మొదటిసారి తెలుగులోకి అనువదించింది ఎవరు ?
జవాబు:
మాడపాటి హనుమంతరావు.

ప్రశ్న 7.
తెలంగాణాలోని మొదటి పత్రిక ఏది ?
జవాబు:
హితబోధిని.

ప్రశ్న 8.
‘మీజాన్’ పత్రిక ఎవరి సంపాదకత్వంలో వెలువడింది ?
జవాబు:
అడవి బాపిరాజు.

కఠిన పదాలకు అర్ధములు

జాతీయం అంటే ఒక భాషకు సొంతమైన పదబంధాలు. ఇవి నిఘంటువుల పరంగా ఉన్న అర్థం కాకుండా విశేషమైన అర్థాన్ని ఇస్తాయి. సందర్భాన్ని బట్టి అర్థాన్ని స్వీకరించాలి.)

47వ పుట

బహుముఖ ప్రజ్ఞాశాలి = అనేక అంశాల్లో మేధావి
సహాధ్యాయులు = కలిసి చదువుకున్నవారు
సన్నిహిత = దగ్గరి
వి + ఆసంగం
(వ్యాసంగం) = మిక్కిలి ఆసక్తి
సంపుటి = ఒకే రచయిత రాసిన రచనల సమాహారంగా వచ్చిన పుస్తకం

48వ పుట

ఆవిర్భవించిన = పుట్టిన, ప్రారంభమైన
విస్మృతి = మరుపు
విశిష్టమైన, ప్రశస్తమైన,
గణుతికెక్కిన = గొప్ప
ఏకశిలా నగరం = వరంగల్లు
జాను తెలుగు = అచ్చమైన తెలుగు
వర్ధిల్లినది,
ప్రవర్ధమానమైనది = = పెరిగినది
తాళపత్ర గ్రంథాలు = తాటి ఆకులపై రాసిన పుస్తకాలు
ఏబది = యాబై

49వ పుట

స్వర్గీయ = స్వర్గానికి చేరిన (మరణించిన)
విజ్ఞుల = మేధావులు, తెలిసిన వారు
ఆర్క్యాలజీ శాఖ = పురావస్తు పరిశోధక శాఖ
ప్రకటితమైనవి = ప్రచురింప బడినవి
తెలుగు దీపాలు = తెలుగు అనే దీపాలు
దేదీప్యమానంగా = ప్రకాశవంతంగా
మిణుకుమిణుకుమని = చిన్నగా
ఆదరించినారు = గౌరవించినారు, కాపాడి నారు
అణచివేత = అభివృద్ధి కాకుండా చూడటం
నిరంతరాయంగా = అంతరాయం (అడ్డంకి) లేకుండా
సివిలియన్ అధికారులు = పౌర (ఉన్నత) అధికారులు
వికాసం = అభివృద్ధి
గొడ్డలిపెట్టు(జాతీయం) = అడ్డంకి (మూలం నుండి నశింప చేయడం)
కవి సమ్మేళనాలు = కవులు కలిసే సమావేశాలు
సారస్వత సభలు = సాహిత్య సభలు
కంటగింపు (జాతీయం)= విరోధించు
అస్తిత్వ౦ = ఉనికి
ఉద్యమం = ప్రయత్నం

50వ పుట

తుద = చివర
ప్రామాణిక = శాస్త్రీయ
ప్రచ్ఛన్నంగా = రహస్యంగా (మరోవిధంగా)
వాగ్బంధన = మాటలను బంధించడం
తాండవం = గంభీర నాట్యం
ఉద్దండులైన = గొప్పవారైన
సంస్కృత + ఆంధ్ర = సంస్కృతము లోనూ, తెలుగు లోను
బొత్తిగా = అసలే
సంకటం = కష్టం
ద్వీపకల్పం = మూడువైపులా నీళ్ళుండి, ఒక వైపుమాత్రమే దారి ఉండే ప్రదేశం
స్వాతంత్ర్య ప్రాప్తి = స్వాతంత్రం రావడం
మిక్కిలి = ఎక్కువ
గ్రాస = తిండి
వాసః = బట్టలకు, నివాసానికి
దైన్య౦ = దీన స్థితి (లేకపోవడం)
కృశించిరి = చిక్కిపోయారు, కష్టపడ్డారు
గ్రహణం పట్టింది
(జాతీయం) = ఆటంకం ఏర్పడింది
అవధానం = పద్యాలతో ఆడే ఒక సాహిత్య క్రీడ, ఏకాగ్రత

51వ పుట

సంకల్పించుట = నిశ్చయించుట
నిష్కళంక = మచ్చలేని, కళంకము లేని
కూర్చి = గురించి
దివాను = మంత్రి
ఉభయులు = ఇద్దరు
తోడ్పాటు = సహకారం
అభ్యుదయము = అభివృద్ధి
మేల్కొల్పుట = చైతన్య పరుచుట
మహనీయులు = గొప్పవారు
మార్గదర్శకత్వం = నాయకత్వం
కంకణ బద్దులు
కావడం (జాతీయం) = (కంకణం కట్టుకున్నవారు) సిద్ధం కావడం
నవ యుగ + ఉదయం = కొత్త కాలం ప్రారంభం
వాఙ్మయము = రచనలు
అనుయాయులను = అనుసరించే వారిని (శిష్యులను)

TS Inter 2nd Year Telugu Study Material Chapter 2 తెలంగాణ సాహితీ వికాసం

52వ పుట

గోచరించుట = కనిపించుట
అడుగు జాడలలో
(జాతీయం) = మార్గదర్శకత్వంలో (చూపిన మార్గంలో)
ప్రవీణులు = పాండిత్యం కలిగిన వారు
మహారాష్ట్రము
(భాషాపరంగా) = మరాఠీ భాష
సరళమైన = సులభమైన
పేర్కొనవలసి = చెప్పవలసి
అనువాదం = భాషాంతరీకరణం
మిత వాది = శాంతిని కోరేవాడు (తక్కువ వాదించేవాడు)
వైతాళికుడు = మేల్కొల్పేవాడు, చైతన్య పరిచే వాడు
వ్యాసకర్త = వ్యాసాలు రాసే వ్యక్తి
సంపన్న కుటుంబం = ధనవంతుల కుటుంబం
అవలంబింపక = ఆశ్రయించక, చేయక
స్వీకరింపక = తీసుకోక
అర్పించిన = ఇచ్చిన
త్యాగమూర్తి = ఏది ఆశించకుండా ఇచ్చిన వ్యక్తి
నిర్భయంగా = భయం లేకుండా
విజ్ఞాన నిక్షేపాలు = జ్ఞానాన్ని దాచబడినవి
పరిశోధనాత్మకము = పరిశోధన చేసి చెప్పినది
విమర్శకులు = ఒక రచనలోని మంచి చెడులను చెప్పేవారు
ప్రతిభా సంపన్నులు = ప్రతిభ అనే సంపద కలవారు
నిరీక్షణము = (ఇక్కడ కథ పేరు) వేచి ఉండటం
ప్రథమ శ్రేణి = ఉత్తమ శ్రేణి
హితబోధిని = (ఇక్కడ పత్రిక పేరు) మంచిని బోధించేది

53వ పుట

ఇంచుమించు = దాదాపు
ఒకే పర్యాయం = ఒకటే సారి
జాతీయోద్యమం = స్వాతంత్ర్యోద్యమం
చారిత్రాత్మకమైనది = చరిత్రలో నిలిచిపోయేది
అర్థ వార పత్రిక = వారానికి రెండు సార్లు వచ్చే పత్రిక
ప్రబుద్ధము = చైతన్య వంతము
దేశ + అభ్యుదయానికి = దేశ అభివృద్ధికి
గాఢమైన = ప్రచురించబడినవి
నవీన = కొత్త, నూతన
హర్షించి = సంతోషించి
ప్రశంసాత్మకమైన = పొగడదగిన

54వ పుట

ప్రస్తావించని = చెప్పని
దోహదము = ఉపయోగం
పరంపర + ఆగతము = ఒకరినుండి మరొకరికి
విభిన్న = కొత్త
పుంఖాను పుంఖాలుగా (జాతీయం)
= ఒకదాని తరువాత మరొకటి
(ఎక్కువగా)

తెలంగాణ సాహితీ వికాసం Summary in Telugu

(సాహిత్యోపన్యాసాలు అనే గ్రంథంలోనిది)

రచయిత పరిచయం

TS Inter 2nd Year Telugu Study Material Chapter 2 తెలంగాణ సాహితీ వికాసం 1

పాఠం పేరు : తెలంగాణ సాహితీ వికాసం
గ్రంథం : సాహిత్యోపన్యాసాలు
రచయిత : డా. దేవులపల్లి రామానుజరావు
కాలం : జననం : ఆగస్టు 25, 1917 – మరణం : జూన్ 8, 1993
స్వస్థలం : వరంగల్లు జిల్లా, దేశాయిపేట
తల్లిదండ్రులు : అండాలమ్మ, చలపతిరావు
చదువు : నిజాం కళాశాలలో బి.ఏ., నాగపూర్ విశ్వవిద్యాలయంలో న్యాయ శాస్త్రం
సహాధ్యాయులు : ఉన్నత పాఠశాలలో కాళోజి నారాయణరావు, న్యాయ కళాశాలలో పి. వి. నరసింహారావు
మొదటి రచన : పచ్చ తోరణం (ఖండ కావ్య సంపుటి)

రచనలు :
1) సారస్వత నవనీతం
2) తెలుగుసీమలో సాంస్కృతిక పునరుజ్జీవనం
3) తెలంగాణలో జాతీయోద్యమాలు
4) నా రేడియో ప్రసంగాలు
5) ఉపన్యాసతోరణం
6) వేగుజుక్కలు
7) తెనుగు సాహితి
8) యాభై సంవత్సరాల జ్ఞాపకాలు
9) సాహిత్యోపన్యాసాలు
10) తలపుల దుమారం
11) పంచవర్ష ప్రణాళికలు
12) బంకించంద్ర ఛటర్జీ జీవితం
13) హైదరాబాద్లో స్వాతంత్ర్యోద్యమం
14) మన దేశం – తెలుగు సీమ
15) జవహర్లాల్ నెహ్రూ
16) గౌతమ బుద్ధుడు
17) కావ్యమాల.

సాహిత్య సేవ : వరంగల్లులోని శబ్దానుశాసన గ్రంథాలయానికి కార్యదర్శి, 1946లో శోభ సాహిత్య పత్రిక నిర్వహణ, 15 సంవత్సరాలు గోల్కొండ పత్రికకు సహ సంపాదకులు, ఆంధ్ర సారస్వతపరిషత్తు కార్యదర్శి, ఉపాధ్యక్షుడు, అధ్యక్షుడు, ఆంధ్రపదేశ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షుడు, కేంద్రసాహిత్య అకాడమి కార్యనిర్వాహక సభ్యుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయ సెనెట్ సభ్యుడు, మూడు సార్లు ఆక్టింగ్ వైస్ చాన్సలర్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయానికి, తెలుగు విశ్వవిద్యాలయానికి, డా॥ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు.

డాక్టరేట్ పట్టము : 1960-62 కాలంలో సాహిత్యరంగం నుంచి రాజ్యసభ సభ్యుడు, గురజాడ శతవార్షికోత్సవ సంచిక, రవీంద్రనాధ్ ఠాగూర్ శత వార్షికోత్సవ సంచిక, తెలుగు మహాసభల ప్రత్యేక సంచికలకు సంపాదకత్వం వహించారు. డా॥ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 1990 లో గౌరవ డాక్టరేట్తో సత్కరించింది.

పాఠ్యభాగ సారాంశం

దేవులపల్లి రామానుజరావు రాసిన సాహిత్యోపన్యాసాలు అనే గ్రంథంలో తెలంగాణా సాహితీ వికాసం అనే వ్యాసంలో తెలంగాణా సాహిత్య వైభవాన్ని వివరించారు. ఆ వ్యాసంలోని ముఖ్యాంశాలు.

ప్రాచీన సాహిత్యంలో తెలంగాణా కృషి : తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణా ప్రాంతానికి విశిష్ట స్థానం ఉంది. భారత, రామాయణ, భాగవతాలకు తెలంగాణా ప్రాంతానికి అవినాభావ సంబంధం ఉంది. భాస్కరరామాయణము రాసిన భాస్కరుడు, మల్లికార్జున భట్టు, కుమార రుద్రదేవుఁడు, అయ్యలార్యుడు, ఆంధ్ర మహాభాగవతము రాసిన పోతనామాత్యుడు, మార్కండేయ పురాణం రాసిన మారన, మొట్టమొదటి అచ్చతెనుగు కావ్యము యయాతిచరిత్ర రచించిన పొన్నగంటి తెలగన్న, జాను తెనుగులో రచన చేయాలని చెప్పి బసవపురాణాన్ని రాసిన పాల్కురికి సోమనాథుడు మొదలైన వారంతా తెలంగాణా ప్రాంతం వారే. ప్రాచీన సాహిత్యం కూడా తెలంగాణాలో వర్ధిల్లింది. రాజకీయంగా వేరుపడి పోయినప్పటికిని భాషా దృష్ట్యా తెలంగాణా ప్రాంతం ఆంధ్ర ప్రాంతంతో సన్నిహిత సంబంధాలు కలిగిఉంది.

ఈ సంబంధాలు ఎన్నడూ తెగిపోలేదు. కావున తెలంగాణా ప్రాంతంలో తెలుగు పాండిత్యం లేదని, తెలుగు సంస్కృతికి చోటులేదని, ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు కొన్ని వర్గాలలో వ్యాపించిన అభిప్రాయం సరైంది కాదు. తెలంగాణాలోని ప్రతీ గ్రామాంలో తాళపత్ర గ్రంథాలు దొరికాయి. కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్తు తరపున జయంతి రామయ్య పంతులు ఆదేశంపై దూపాటి వేంకటరమణాచార్యులు తెలంగాణా ప్రాంతమంతా తిరిగారు. ఎన్నో శాసనాలను, నూర్లకొద్ది తాళపత్ర గ్రంథాలను సంపాదించి సాహిత్య పరిషత్తుకు అప్పగించారు.

ఈ తెలంగాణ- శాసనాలలో కొన్నింటిని హైదరాబాదులోని లక్ష్మణరాయ పరిశోధక మండలివారు ప్రచురించారు. మరికొన్ని శాసనాలు పురావస్తు శాఖకు అప్పగించారు. వీటన్నిటిద్వారా తెలంగాణా ప్రాంతంలో తెలుగు దీపాలు ఎన్నడూ ఆరిపోలేదని తెలుస్తుంది. అప్పటి ప్రభుత్వ విధానాల వల్ల దీపాలు దేదీప్యమానముగా ప్రకాశించకపోయినా మిణుకుమిణుకుమని వెలుగుతూనే ఉన్నాయి. హైదరాబాదు నగరంలోని పరిస్థితి ఎట్లున్నా పల్లె ప్రాంతాలలో తెలుగు భాషా, సాహిత్యాలు అంతరించలేదు.

హైదరాబాదు సంస్థానంలో తెలుగు దుస్థితి గోలకొండ సుల్తానుల ఉత్తమ సంప్రదాయాన్ని అసఫ్ జాహీ వంశీయులు పాటించలేదు. భాషా సంస్కృతులను అణచి వేశారు. హైదరాబాదు పైన పోలీసు చర్య జరిగే వరకు, నిజాం ప్రభుత్వ విధానాలు ప్రజల భాషలను అణచివేశాయి. బ్రిటిషు పరిపాలనలో భాషలపై ఇటువంటి ప్రయత్నాలు జరుగలేదు. నిజామేతర ప్రాంతాలలో బ్రిటీషువారు గ్రంథాలయాల స్థాపనను నిషేధించలేదు. రాజకీయాలతో సంబంధంలేని సారస్వత కృషి నిరంతరాయంగా జరిగింది. సి.పి. బ్రౌన్ వంటి ఉన్నత అధికారులు ప్రజల భాషల వికాసానికి కృషిచేశారు. వీరేశలింగం పంతులు మొదలైన వారి సారస్వత కృషికి ప్రభుత్వం ఆటంకాలు కలిగించలేదు. కానీ తెలంగాణా ప్రాంతంలో మాతృభాషల వికాసానికి గొడ్డలి పెట్టువంటి విధానాలను హైదరాబాదు ప్రభుత్వం అమలు చేసింది.

ఈ ప్రాంతంలోని 90% ప్రజల భాష తెలుగు ఐనప్పటికీ తెలుగు చదువుకొనడానికి అవకాశాలు లేవు. ఒక గ్రంథాలయాన్ని పెట్టుకోవడమే చాలాకష్టమైన పని. కవిసమ్మేళనాలు, సారస్వత సభలను నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి అవసరమయ్యేది. ఆంధ్ర అనే పేరుతో ఏ ఉద్యమం సాగినా దానిని ప్రభుత్వం శత్రుభావముతో చూసేది. ఈ పరిస్థితినే వాగ్బంధన శాసన పైశాచిక తాండవం (నోటిని కట్టివేసే పిశాచాల నర్తనం) అని సురవరం ప్రతాపరెడ్డి అన్నారు.

తెలంగాణలో తెలుగు భాషా స్థితి : తెలంగాణా ప్రాంతంలో ఎందరో గొప్పవారైన సంస్కృతాంధ్ర పండితులున్నప్పటికీ వారు సభలలో సమావేశమై పరస్పర అవగాహన చేసుకునే అవకాశాలు లేవు. రాజభాష ఉర్దూ, ప్రాథమిక దశ నుంచి విశ్వవిద్యాలయ దశవరకు బోధనాభాష కావడంవల్ల తెలుగు భాషాభివృద్ధికి అవకాశం లేదు. ఆ రోజులలో హైదరాబాదు రాష్ట్రం ఒక ప్రత్యేకమైన ద్వీపకల్పంగా మారి అక్కడ నివసించే ప్రజలను ఇతర ప్రపంచము నుండి వేరు చేసింది. (నిజాం రాజ్యంలో సంస్కృతి సంప్రదాయాలన్నీ ఇతర ప్రాంతాలకంటే భిన్నంగా ఉండేవి.) అందువల్ల భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేవరకు అక్షరాస్యత చాలా తక్కువ.

సంస్కృతాంధ్ర పండితులు, కవులు తిండికి, నివాసానికి కూడా లేక పల్లెటూళ్ళలో బాధలు పడ్డారు. కొద్దిమంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉర్దూ, ఫారసీ భాషలను నేర్చుకొని తమ జీవనం సాగించారు. ఈ విధంగా తెలుగు భాషా వికాసానికి తెలంగాణా ప్రాంతంలో గ్రహణము పట్టింది.

తెలుగు భాషాభివృద్ధికి సంస్థానాల కృషి అటువంటి పరిస్థితులలో తెలుగు భాషను ఆదరించి, ప్రోత్సహించిన సంస్థానాల కృషిని మరచిపోకూడదు. గద్వాల, వనపర్తి, ఆత్మకూరు సంస్థానాల కృషిని ప్రశంసించాలి. ఆంధ్ర ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి ఒక విధంగా ఈ సంస్థానాల ఆదరణ వల్ల సాంస్కృతిక సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రతి సంవత్సరం ఆంధ్రప్రాంతం నుంచి కవులు, పండితులు వచ్చి ఈ సంస్థానాలలో సన్మానాలు పొందేవారు. ఇటువంటి వారిలో తిరుపతి వేంకటకవులు కూడా ఉన్నారు.

ఈ అవధానాలు తెలంగాణా ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి మధ్య భాషాపరమైన వంతెనలుగా పనిచేశాయి. వీటికితోడు కొన్ని నాటక సంఘాలు ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో కొన్ని పట్టణాల్లో నాటకాలను ప్రదర్శిస్తుండేవి. మైలవరము, సురభి మొదలైన నాటక సంఘాలు వరంగల్లు మొదలైన తెలంగాణా ప్రాంతాలలో నాటకాలను ప్రదర్శించి ఈ రెండు ప్రాంతాల మధ్య సాంస్కృతిక సమైక్యతను బలపరిచాయి.

తెలంగాణలో తెలుగు అభివృద్ధి – కొమర్రాజు లక్ష్మణరావు కృషి : తెలంగాణలోని పరిస్థితులను గమనించి ఈప్రాంతంలో సాహిత్య వికాసానికి కృషి చేసినవారు వారు కొమర్రాజు వేంకట లక్ష్మణరావు. ఆయన గొప్ప పరిశోధకుడు, తెలుగు భాషా వికాసానికి అపారమైన కృషి చేసిన మేధావి. నిష్కళంక దేశభక్తుడు. ఆ రోజులలో చాలామంది ఆంధ్ర ప్రాంతంవారికి తెలంగాణ గురించి సరైన అవగాహన లేదు. లక్ష్మణరావు మునగాల సంస్థానంలో దివానులుగా పనిచేసేవారు. మునగాల సంస్థానాధీశ్వరులకు తెలంగాణా ప్రాంతంతో సంబంధాలు ఉండేవి. వారిద్దరూ హైదరాబాదుకు వస్తూపోతూ ఉండే వారు. లక్ష్మణరావు కృషికి మునగాల రాజా తోడ్పాటు అందింది. ఆ కారణంగా 1900వ సంవత్సరంలో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయము స్థాపితమైంది. తరువాత 1904వ సంవత్సరంలో రాజరాజనరేంద్ర భాషా నిలయం హనుమకొండలో స్థాపితమైనది. ఆ తరువాత వరంగల్లులో శబ్దానుశాసనాంధ్ర భాషా నిలయం స్థాపితమైంది. లక్ష్మణరావు విజ్ఞాన చంద్రిక గ్రంధమండలి కూడా 1900 సంవత్సరంలోనే హైదరాబాదులో స్థాపితమైంది. లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు, మునగాల రాజాగారి తోడ్పాటుతో తెలంగాణలో సాహిత్య వికాసానికి, సాంస్కృతిక చైతన్యానికి గట్టి పునాదులను నిర్మించారు. తరువాత క్రమక్రమంగా తెలంగాణాలో అనేక గ్రంథాలయాల ద్వారా సాహిత్య సభలు జరిగాయి.

కవి పండితులను చైతన్య పరిచి తెలుగు భాషాభ్యుదయానికి కృషి చేశాయి. లక్ష్మణరావు ప్రోత్సాహంతో మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, ఆదిరాజు వీరభద్రరావులు ఈ కృషిలో పాలుపంచుకున్నారు. మొత్తంమీద ఉర్దూ, ఫారసీ భాషల ప్రభావానికి లోనై తన మాతృభాషకు అంత ప్రాధాన్యం ఇవ్వని పరిస్థితి ఆనాటి తెలంగాణలో కనిపించింది. పైన పేర్కొన్న ముగ్గురు మహనీయులు గ్రంథాలయాలు, పత్రికలు, గ్రంథమాలలు స్థాపించి తెలంగాణను మేలుకొల్పారు. వీరి కారణంగా యువకులు సాహిత్య వికాసానికి కంకణబద్ధులైనారు.

తెలంగాణ సాహిత్యరంగంలో నవయుగోదయమైనది. కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయాన్ని స్థాపించిన 1900 సంవత్సరము నుంచి ఈ నవ యుగము ప్రారంభమై 1948 సెప్టెంబరులో జరిగిన పోలీసు చర్య వరకు సాగింది. చరిత్ర పరిశోధన, భాషాపరిశోధన, విజ్ఞాన వాఙ్మయాభివృద్ధి, వచన వాఙ్మయ ప్రగతి అనేవి కొమర్రాజు లక్ష్మణరావుగారి ఆశయాలు. ఈ ఆశయాలకనుగుణంగా వారు తమ అనుయాయులను తీర్చిదిద్దారు.

మాడపాటి హనుమంతరావు, ఆదిరాజు వీరభద్రరావు, సురవరం ప్రతాపరెడ్డిల కృషి : మాడపాటి హనుమంతరావు ఇంగ్లీషు, ఉర్దూ, ఫారసీ, తెలుగు భాషలలో ప్రవీణులు. మరాఠి, హిందీ, సంస్కృత భాషలతో తగినంత పరిచయం కూడా ఉంది. ఉర్దూలో కూడా మంచి రచయిత. ముషీర్ దక్కన్ అనే ఉర్దూ దినపత్రికకు అనేక సంవత్సరాలు సంపాదకీయాలు రాశారు. తెలుగులో సరళమైన వచనరచన చేయగలిగిన మేధావి. “క్షాత్ర కాలపు హింద్వార్యులు” అనే గ్రంథాన్ని మరాఠి నుండి తెలుగులోకి అనువదించారు. తెలుగులో మొదటి కథానికా రచయితలలో హనుమంతరావు ఒకరు. స్వయంగా మంచి కథలను రాయడమేగాక మున్నీ ప్రేమ్ చంద్ కథలను మొదటిసారి అనువదించి తెలుగువారికి పరిచయం చేశారు. భారత రాజకీయాలలో గోపాలకృష్ణ గోఖలేవంటి మితవాది మాడపాటి హనుమంతరావు.

తెలంగాణాలో రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక ఉద్యమాలకు మార్గదర్శకులు. రాజకీయాలతో సంబంధం లేనివారు, గొప్ప పండితులు, బహుగ్రంథ రచయిత, ఉత్తమ వ్యాసకర్త, గ్రంథాలయోద్యమ నిర్వాహకులు ఆదిరాజు వీరభద్రరావు. ఈయన తెలంగాణాలో నవచైతన్యానికి తోడ్పడినారు.

సురవరం ప్రతాపరెడ్డి సంపన్న కుటుంబీకులు. బి.ఏ. బి.ఎల్ పట్టభద్రులు. న్యాయవాద వృత్తి చేపట్టడానికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికి, ప్రభుత్వ ఉద్యోగం కూడా చేయక, జీవితాంతం తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన త్యాగమూర్తి సురవరం. ఈయన బహుభాషావేత్త, అనేక గ్రంథాలు రాశారు. ఉత్తమశ్రేణి పరిశోధకులు, నిర్భయంగా పత్రికను నడిపిన సంపాదకులు. ఆయన గోలకొండ పత్రిక ద్వారా తెలంగాణా ప్రజలను అన్ని రంగాలలో మేలుకొల్పినారు. గోలకొండలో వీరు వ్రాసిన సంపాదకీయాలు అనేక విషయాలకు సంబంధించిన విజ్ఞాన నిక్షేపాలవంటివి.

రామాయణ రహస్యాలు, హిందువుల పండుగలు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర మొదలైన గొప్ప పరిశోధనాత్మకమైన గ్రంథాలను రాశారు. వారు కవులు, కథకులు, విమర్శకులు, వ్యాసకర్తలు, బహుముఖ ప్రతిభాసంపన్నులు. వారు రాసిన నిరీక్షణము వంటి కథలు కథానికా వాఙ్మయంలో మొదటి శ్రేణికి చెందిన కథలు.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 2 తెలంగాణ సాహితీ వికాసం

తెలంగాణా సంస్కృతికాభివృద్ధి – పత్రికల పాత్ర : తెలంగాణను ఆధునిక యుగానికి అనుగుణంగా చైతన్యవంతం చేసిన మరికొన్ని సంస్థలున్నాయి. అందులో రెండు పత్రికలు ముఖ్యమైనవి. తెలంగాణాలోని మొదటి పత్రిక “హితబోధిని” 1818 వ సంవత్సరమున స్థాపితమైంది. ఒక సంవత్సరం మాత్రమే నడిచింది. తరువాత 1920వ సంవత్సరంలో రెండు పత్రికలు దాదాపు ఒకే కాలంలో ప్రారంభమైనాయి. అందులో ఒకటి తెనుగు పత్రిక. ఒద్దిరాజు సోదరుల సంపాదకత్వంలో వరంగల్లు జిల్లా ఇనుగుర్తి నుంచి వెలువడి ఐదేండ్లు నడిచింది. రెండవది నీలగిరి. ఇది నల్లగొండ నుండి షబ్నవీసు నరసింహారావు సంపాదకత్వంలో వచ్చింది.

ఇది కూడా ఐదేండ్లు నడిచింది. ఈ రెండు పత్రికలు సాహిత్య ప్రచారానికి, రచయితలకు, జాతీయోద్యమానికి చేయూతనిచ్చాయి. దీని తరువాత 1925వ సంవత్సరంలో గోలకొండ పత్రిక అర్ధ వారపత్రికగా ప్రారంభమైంది. తరువాత 1947లో దినపత్రికగా మారి సుమారు ఇరువై సంవత్సరాలు నడిచింది. తెలంగాణను చైతన్యవంతం చేయడంలో గోలకొండ పత్రిక చేసిన కృషి చరిత్రాత్మకమైంది. సురవరం ప్రతాపరెడ్డి ఈ పత్రికకు సంపాదకులుగా ఉండి, దేశాభ్యుదయానికి, భాషాభివృద్ధికి అపారమైన కృషిచేశారు. ఈ విధంగా తెలంగాణా రచనా రంగంలో నూతన యుగము ప్రారంభమైంది.

మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి ప్రోత్సాహంతో యువ రచయితల కోసం సుజాత అనే మాసపత్రిక పి.ఎన్. శర్మ సంపాదకత్వంలో వెలువడింది. ఈ పత్రికలో విమర్శనాత్మకమైన వ్యాసాలు, కథలు, కవితలు, విజ్ఞానాత్మకమైన వచన రచనలు వచ్చేవి. బూర్గుల రామకృష్ణారావు ఉర్దూ భాష సారస్వతాలను గురించి, ఉమర్ ఖయాంను గురించి వ్రాసిన వ్యాసాలు యిందులో ప్రకటితమయ్యాయి.

రామకృష్ణారావు స్వయంగా బహుభాషాప్రవీణులు, కవులు, విమర్శకులు. ఆయన ఆ రోజులలో ఎంకి పాటల వంటి నవీన కావ్యాలను హర్షించి ప్రశంసాత్మకమైన వ్యాసాలను రాశారు. ఈ పత్రికలతో పాటు ఆంధ్రాభ్యుదయం అనే పత్రిక హన్మకొండ నుంచి, దేశబంధు అనేపత్రిక హైదరాబాదు జిల్లా తూప్రాన్ నుండి, తెలుగు తల్లి, విభూతి, దివ్యవాణి అనే తెలుగు పత్రికలు సికిందరాబాదు నుండి వెలువడినాయి. తరువాత 1945 లో అడవి బాపిరాజు సంపాదకత్వంలో మీజాన్, బి. ఆర్. చారి సంపాదకత్వంలో తెలంగాణా అనే రెండు దినపత్రికలు వెలువడినాయి.

సికింద్రాబాదు నుంచి, ఆంధ్ర కేసరి, ఆంధ్రవాణి, అనే వార పత్రికలు, తరణి అనే దినపత్రిక వచ్చింది. శోభ అనే సాహిత్య పత్రిక వరంగల్లు నుండి వెలువడి కొంతకాలం నడిచింది. ఈ విధంగా తెలంగాణలో నూతన యుగోదయమై అనేకమంది రచయితలు ఆవిర్భవించారు. ఈ పత్రికలన్నీ జాతీయోద్యమ ప్రభావితాలై నవీన వాఙ్మయ నిర్మాణానికి దోహదం చేశాయి. తెనుగు, నీలగిరి, గోలకొండ, సుజాత మొదలైన పత్రికల ఆవిర్భావంతో యువ రచయితలకు ప్రోత్సాహం లభించింది. దీనితో ఒకే రకమైన సంప్రదాయ సాహిత్యమే కాకుండా విభిన్నమైన సాహిత్యం పుంఖానుపుంఖంగా (ఎక్కువగా) వెలువడింది.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 5 మా భాగోతంలో మేము

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material 5th Lesson మా భాగోతంలో మేము Textbook Questions and Answers.

TS Inter 2nd Year Telugu Study Material 5th Lesson మా భాగోతంలో మేము

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
పాఠ్యాంశం ఆధారంగా చిందు భాగోతం ప్రదర్శన గురించి తెలుపండి.
జవాబు:
చిందు భాగవతం ప్రదర్శించడానికి ముందు నాలుగు గుంజలు, వెనక రెండు గుంజలు పాతి పందిరి వేస్తారు. ఆ పందిరి కిందనే భాగోతం ప్రదర్శిస్తారు. పందిరి లేకుంటే భాగోతం ఆడరు. పందిరిని చాందిని అని కూడా అంటారు. పందిరికి మూడుపక్కల ఎడ్లకు కట్టే పగ్గాల కంటే లావుగా ఉండే జనుముతో చేసిన తాళ్లను కట్టేవారు. భాగోతం చూడడానికి వచ్చిన వారు మీద పడకుండా ఈ తాళ్ళను కట్టేవారు.

దొమ్మరి బిడ్డ గడ (రెండువైపులా కర్రలు పాతి వాటి మధ్యలో తాడు కట్టేవారు. ఆ తాడుపై పెద్ద కర్ర పట్టుకొని నడిచేవారు) ఎక్కి, సాలా పులిగోలిగా అని బియ్యం సల్తది. మాదిగ చిందోల్లు ఎల్లమ్మ యేషం గట్టి చెరువులు మొకం కడిగితేనే మోక్షం, బరుకతు అని భావించే వారు. అట్లాంటిది మారిపోయి నడి ఊర్లో భాగోతం ఆడటం ఎల్లమ్మ తాతల కాలంలోనే ప్రారంభమైంది.

“ఇవ్వాల చిందు భాగోతం ఆడుతుండ్రట, పోవాలరా” అనేవారు. ఇవ్వాల “ఎల్లమ్మ ఆట ఆడుతున్నరు. గావు పట్టేదున్నదట పోవాల” అని ఊరివాల్లు వచ్చేవారు. పాత రోజుల్లో రాత్రులు ఊర్లో భాగోతం ఆడుతున్నపుడు మంగలోలు దివిటీలు పట్టేవారు.

వేషాలు తయారు అయేటపుడు ఎవరూ చూడకుండా జాగ్రత్తపడేవారు. తెరముందు ఆడేటప్పుడు మాత్రమే అందరూ చూడాలి అనుకునేవారు. అందుకోసం మాదిగ ఇండ్లల్లో వేషం ధరించేవారు. అలా కుదరనప్పుడు పందిరికి కొంత దూరంలోనో, అలాకూడా కుదరనప్పుడు చుట్టూ దుప్పటి కట్టుకొని రంగులు వేసుకునే వారు. రంగులు వేసుకున్నాక దుప్పటి కప్పుకొని భాగోతం ప్రదర్శించే పందిరి లోపలికి వచ్చేవారు. కళాకారులు ఎవరి వేషం (మేకప్) వాల్లే వేసుకునే వారు. ఎవరి అద్దం వాల్లదగ్గరే ఉండేది.

మొకంకు రేవిడిని, లేకుంటే పసుపు పచ్చ పౌడరును వేసుకునే వారు. తెల్ల వెంట్రుకలు కావాలంటే మెంచు, లేదా అర్దూలం (జింక్ ఆక్సైడ్) వాడేవారు. ఆ అర్దూలం చెమటకు వెంటనే కరిగిపోయేది. చూసేవారు కంటికి ధారలుపడేటట్టు ఏడుస్తున్నారు అనుకునే వాళ్ళు.

పాత రోజుల్లో ఏడుపు రావాలంటే కంట్లో వేలు పెట్టుకోవడం లేదా నూనె చుక్కలు వేసుకునేవారు. కాని ఎల్లమ్మకు దుఃఖం పాట పాడగానే ఏడుపు వచ్చేది. భాగోతం చూసేవారు కూడా వెక్కివెక్కి ఏడ్చేవారు. వారు ఏడిస్తే చీరకొంగులు తడిసిపోయేవి. అంత కష్టపడి భాగోతాన్ని రసవంతంగా ప్రదర్శించేవారు. సత్యహరిశ్చంద్ర భాగోతం ఆడితే చూసేవారు కూడా ఏడ్చేవారు. అలా ప్రదర్శిస్తున్నప్పుడు ఒక్కోసారి ఆఊరి దొరలు “మేం ఇట్లనే కొంగులు పెట్టుకొని ఏడుద్దుమా? బంజేస్తరా? ఓ గంగారం!, ఓ ఎల్లవ్వా! ఇదేం ఏడుసుడు. ఏం కథ, దేవుడా… జర బందు జేయుండ్రి గదా!” అని చెప్పేవారు. అంత లీనమై ఆ ప్రదర్శనను చూసేలా ఆడేవారు. అంత కష్టపడి ప్రదర్శిస్తేనే ఆ కళకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు భాగోతం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభిస్తే సాయంత్రం ఆరు, యేడు గంటల దాకా ఆడతారు.

ఈ భుజకీర్తులు, కిరీటాలను అంతసేపు అట్లనే ధరించాలి. వేషాల మధ్య తబలకొట్టినా కూడా వాటిని అలానే ధరించేవారు. భాగోతం పూర్తయి ఇంటికి వచ్చి, ఆరతి ఇచ్చిన తరువాతనే వేషాన్ని విప్పేవారు.
ప్రదర్శన ప్రారంభ ముగింపు సన్నివేశాలు: ఏదైనా గ్రామంలో ప్రదర్శన ప్రారంభించే ముందు ఆవూర్లోని విశ్వబ్రాహ్మణుల ఇంటికి వెళ్లి వారి కొలిమికి నమస్కరించేవారు. భాగోతం ఆడటం అయిపోయినంక రాముని

పేరుతో మంగళహారతి ఇస్తారు. పక్కవాయిద్యాల వారు కూడా మంగళారతి పాట పాడేవారు. ప్రధాన వేషం ధరించిన స్త్రీ పాత్ర మంగళహారతి పట్టుకొని ప్రేక్షకుల దగ్గరికి పొతే, వారు ఆ హారతికి నమస్కరించి వారికి తోచినంత డబ్బును హారతి పళ్ళెంలో వేసేవారు. ఆ తరువాత ఆ హారతితోనే కళాకారుల బృందం అంతా ఇంటికి వెళ్తారు. అందరు కలిసి మరొక్కసారి హారతి తీసుకుంటారు.

హారతి ఒకరినొకరిని హృదయాలకు హత్తుకుని ఆడవారితో ఆడవారు, మగవారితో మగవారు దాసున్ని అనే అర్థంలో ‘దాసున్, దాసున్’ అనుకుంటారు. అప్పుడు భాగోతం సామాగ్రినంతా తీసి, ఎవరి సామాను వారు సర్దుకొని వేషాన్ని విప్పేస్తారు. ప్రదర్శనలో భాగంగా అరేయ్ దుర్మార్గా అని, ఓరి సుగ్రీవా అని పాడి, ఎగిరి తంతారు. అలా చేయడం తప్పు కాబట్టి భాగోతం పూర్తికాగానే పెద్దవారి కాళ్లకు నమస్కరిస్తారు. అలా భాగోతంలో అన్నా అనకున్నా, తన్నినా తన్నకున్నా, చిన్నవారు పెద్దలకు నమస్కరిస్తారు.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 5 మా భాగోతంలో మేము

ప్రశ్న 2.
చిందు భాగోతం ప్రదర్శనకు వస్తువుల తయారీని వివరించండి.
జవాబు:
ప్రదర్శనకు వాడే వస్తువుల తయారీ : చిందు భాగవత ప్రదర్శనలో అలంకరణకు చాల ప్రాధాన్యత ఉంది. అలంకరణలో భాగంగా వాడే భుజకీర్తులు, కిరీటాలు మొదలైన ఆభరణాలను కళాకారులే తయారు చేసుకునేవారు. కొంత మంది మగవారికి మాత్రమే వాటిని తయారు చేయడం వచ్చేది. పొనికి కట్టెతో వీటిని తయారు చేస్తారు. దాన్ని బూరుగు కట్టె అనికూడా అంటారు. అగ్గిపుల్లలను కూడా ఈ కర్రతోనే తయారు చేస్తారు. కలిపెల్లిగుట్టకు ఈకర్ర చాలా లభించేది. పూర్వం పెద్దపెద్ద గుట్టలు, అడవులు ఉండేవి.

దొనకంటి, కథారుపల్లె వైపు ఈ కలప లభించేది. అడవులను నరికిన కారణంగా ఇప్పుడు లభించడం లేదు. భుజకీర్తులు, కిరీటాల డిజైన్లు చెక్కుడు, అంతా వారే తయారు చేసుకునేవారు. పురుషుల కిరీటము చేయడానికి పన్నెండు నెలలు, ఆడవారి కిరీటం చేయడానికి పద్దెనిమిది నెలలు పట్టేది.

కష్టపడి చేసిన నగలను జాగ్రత్తగా కాపాడుకొని పది, పన్నెండేండ్లు ఉపయోగించేవారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న అవి పనికి రాకుండా పోయేవి. ఆడవాళ్ళ హారాలు, దండలు తయారు చేయడం చాలా కష్టం. శంఖ చక్రాలు, కిరీటము, భుజకీర్తులు, సూర్య కిరీటము, మకర కుండలాలు, కంఠసారె, పెద్ద పేరు ఇవన్నీ రాజు వేషానికి అవసరమవుతాయి.

జడ, కొప్పుజడ (దాన్ని షాంపూజడ అంటారు) సిగరేకులు, పక్క గొలుసు, చెక్క బవిలీలు, గూబగున్నాలు వేలాడే గున్నాలు స్త్రీ వేషానికి అవసరం. మిగతా జిల్లాల చిందు కళాకారులు ఎన్నో నగల్ని తీసేస్తున్నారు. కానీ నిజామాబాదు జిల్లా కళాకారులు మొదటి నుంచి ఉన్నవాటిని ఇప్పటి దాకా వాడుతున్నారు.

కిరీటాలు, భుజకీర్తులు కట్టుకొని యేషాలు యేసి, ఆది, ఆటయినంక సూసుకుంటే అవన్నీ సెమటకు ఉబ్బేవి. ఆ నగలను ఆరు, యేడు గంటల పాటు ధరించే ఉండాలి. ప్రదర్శన పూర్తయ్యేవరకు నగలను ‘విప్పకపోయేవారు. అందుకోసం వేషాలు వేసుకునేటప్పుడే అవి జారిపోకుండా గట్టిగ లాగి కట్టేవారు.

II సంగ్రహరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
భాగోతం ప్రదర్శనకు వేదికను ఎలా సిద్ధం చేసేవారు ?
జవాబు:
చిందు భాగవతం ప్రదర్శించడానికి ముందు నాలుగు గుంజలు, వెనక రెండు గుంజలు పాతి పందిరి వేస్తారు. ఆ పందిరి కిందనే భాగోతం ప్రదర్శిస్తారు. పందిరి లేకుంటే భాగోతం ఆడరు. పందిరిని చాందిని అని కూడా అంటారు. పందిరికి మూడుపక్కల ఎడ్లకు కట్టే పగ్గాల కంటే లావుగా ఉండే జనుముతో చేసిన తాళ్లను కట్టేవారు. భాగోతం చూడడానికి వచ్చిన వారు మీద పడకుండా ఈ తాళ్ళను కట్టేవారు.

ప్రశ్న 2.
భుజకీర్తులు, కిరీటాల తయారీ ఎలా జరిగేది ? (V.Imp) (Model Paper)
జవాబు:
చిందు భాగవత ప్రదర్శనకు అవసరమైన ఆభరణాలను పొనికి కట్టెతో తయారుచేస్తారు. దాన్ని బూరుగు కట్టె అనికూడా అంటారు. అగ్గిపుల్లలను కూడా ఈ కర్రతోనే తయారు చేస్తారు. భుజకీర్తులు, కిరీటాల డిజైన్లు చెక్కుడు, అంతా వారే తయారుచేసుకునేవారు. పురుషుల కిరీటము చేయడానికి పన్నెండు నెలలు, ఆడవారి కిరీటం చేయడానికి పద్దెనిమిది నెలలు పట్టేది. కష్టపడి చేసిన నగలను జాగ్రత్తగా కాపాడుకొని పది, పన్నెండేండ్లు ఉపయోగించేవారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న అవి పనికి రాకుండా పోయేవి. ఆడవాళ్ళ హారాలు, దండలు తయారు చేయడం చాలా కష్టం.

ప్రశ్న 3.
భాగోతం ఆడిన తరువాత వాటాలు ఎలా పంచుకునేవారు ?
జవాబు:
భాగోతం ఆడిన తరువాత హారతి పళ్ళెంలో వేసిన డబ్బును వాటాలు వేసుకొని పంచుకుంటారు. ప్రదర్శనలో పాల్గొన్న భార్యాభర్తలకు ఒక వాటా, పెళ్లి కాని పిల్లలుంటే, వాళ్లు ఆడితే, ఒక వాటాలో ఐదు భాగాలు చేసి ఆడపిల్లలకు రెండు భాగాలు, మగ పిల్లలయితే మూడు భాగాలు ఇస్తారు. ఇద్దరు భార్యాభర్తలు ఉంటే ఒక పాలు ఇస్తారు కాని ఎల్లమ్మకు భర్తలేడు. అయినా ప్రధాన పాత్రలు ధరిస్తుంది కాబట్టి ఒక వాటా ఇచ్చేవారు. పెండ్లయి ఒక్కడే భాగోతంలో ప్రధాన వేషం వేస్తే కూడా ఒక భాగం ఇస్తారు.

అతనికి భార్యతో విడాకులైనా, ఆమె చనిపోయినా ఆయనకు వాటా ఇస్తారు. మరి పెండ్లయినా చిన్న వేషం ధరిస్తే పాలు ఇవ్వరు. మూడు భాగాలే ఇస్తారు. ఈ పంపకాలు గురించి అప్పుడప్పుడు గొడవలు కూడా అవుతాయి. మళ్ళీ వారిలో వారే పరిష్కరించుకుంటారు.

ప్రశ్న 4.
చిందుల ఎల్లమ్మ ప్రదర్శనలు, పురస్కారాలు తెలుపండి.
జవాబు:
చిందు ఎల్లమ్మ ఇచ్చిన ప్రదర్శనలు : ఎల్లమ్మ నాలుగేళ్ల వయసులోనే బాలకృష్ణుని వేషంతో చిందు యక్షగాన రంగంలో అడుగు పెట్టింది. 1918లో కళారంగంలో ప్రవేశించిన ఎల్లమ్మ గ్రామాల్లో కొన్ని వేల ప్రదర్శనలిచ్చింది. ఎల్లమ్మ తొలి అధికారిక ప్రదర్శన 1979లో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఇచ్చింది. మొదటి రాష్ట్రస్థాయి ప్రదర్శన 1980లో రవీంద్రభారతిలో నాటి ముఖ్యమంత్రి సమక్షంలో ఇచ్చింది. 1984వ సంవత్సరంలో మాస్కో నగరంలో తొలి అంతర్జాతీయ ప్రదర్శన ఇచ్చింది. 1986లో ఢిల్లీలో జరిగిన అప్నా ఉత్సవ్ జాతీయ ప్రదర్శన ఇచ్చింది.

ఎల్లమ్మ పొందిన అవార్డులు : చిందు కళలో తన అభినయానికి 1998-99 లో కళారత్న పురస్కారం, 1999లో హంస పురస్కారం, 2004లో రాజీవ్ ప్రతిభా పురస్కారాలు అందుకుంది. 1982లో రాష్ట్ర సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యత్వం లభించింది. 2004లో అప్పటి ప్రభుత్వం ఆమె గౌరవార్ధం నిజామాబాద్ నుండి బోధన్ వరకు గల రహదారికి ‘ఎల్లమ్మ రహదారి’గా నామకరణం చేసింది.

III ఏకపద/వాక్య సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1. ఎల్లమ్మ ఏ వయసులో రంగస్థల ప్రవేశం చేసింది ?
జవాబు:
నాలుగేళ్ల వయసులో.

ప్రశ్న 2.
ఎల్లమ్మ ప్రదర్శన చూసి ప్రశంసించిన నాట్యాచార్యుడు ఎవరు ?
జవాబు:
నటరాజ రామకృష్ణ.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 5 మా భాగోతంలో మేము

ప్రశ్న 3.
ఎల్లమ్మ తొలి అధికారిక ప్రదర్శన ఏ సంవత్సరంలో ఇచ్చింది ?
జవాబు:
ఎల్లమ్మ తొలి అధికారిక ప్రదర్శన 1979లో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఇచ్చింది.

ప్రశ్న 4.
1999లో ఎల్లమ్మ పొందిన పురస్కారం ఏది ?
జవాబు:
హంస పురస్కారం

ప్రశ్న 5.
ఎక్కడినుండి ఎక్కడి వరకు ఎల్లమ్మ రహదారి అని పిలుస్తారు ?
జవాబు:
నిజామాబాద్ నుండి బోధన్ వరకు ఉన్న రహదారిని.

ప్రశ్న 6.
భుజకీర్తులు, కిరీటాలు ఏ కట్టెతో తయారుచేస్తారు ?
జవాబు:
పొనికి లేదా బూరుగు కట్టె.

ప్రశ్న 7.
న్యాయమున్నచోట ఎవరు ఉంటారు ?
జవాబు:
నారాయణుడు.

ప్రశ్న 8.
అలాయి బలాయి ఎప్పుడు తీసుకుంటారు ? (V.Imp) (Model Paper)
జవాబు:
ప్రదర్శన ముగిసిన తరువాత హారతి తీసుకున్న తరువాత.

కఠిన పదాలకు అర్థములు

71వ పుట

జానపద కళ = జానపదుల అంటే గ్రామీణ ప్రజల కళ
ఔన్నత్యం = గొప్పతనం
ఆసక్తి = కోరిక, ఇష్టం
స్థిరపడ్డారు = స్థిరనివాసం ఏర్పరుచు కున్నారు
ప్రాయం = వయసు
వేషం = పాత్ర ధరించడం
అడుగుపెట్టింది (జాతీయం) = ప్రారంభించింది
అలరించింది. = సంతోషపరిచింది
ఉగ్రరూపం = భయం కలిగించే రూపం
వైవాహిక జీవితం = వివాహ జీవితం
స్వస్తి పలకడం
(జాతీయం) = ముగింపు చెప్పడం
మేటి = గొప్ప, ప్రధాన
పామర స్త్రీ = చదువురాని మహిళ
అభినయం = నటన
విస్మయం = ఆశ్చర్యం
అరుదు = తక్కువ
ప్రశంసించారు = మెచ్చుకున్నారు
సమక్షంలో = ఎదురుగా
విశిష్ట సభ్యత్వం = ప్రత్యేక సభ్యత్వం

72వ పుట

పురస్కారం = గౌరవం, సన్మానం
గౌరవార్థం = గౌరవ సూచకంగా
నామకరణం = పేరుపెట్టడం
గుంజలు = కర్ర స్థంబాలు
ఎనక = వెనక
పందిరేస్తం = పందిరి వేస్తాం
ఆడేది = ప్రదర్శించేది
పక్కల = వైపుల
సోల్లు = లావుగా ఉండే జనుముతో చేసిన తాళ్ళు
దొడ్డుగా = లావుగా
మస్తుకోరుతనం = కావాలని అల్లరి చేయాలనే
నడి ఊల్లె = ఊరి మధ్యలో
గడి + ఎక్కి = వెదురు కర్ర సహాయంతో తాడుపై నడవడం
బరుకతు (ఉర్దూ పదం) = లాభం కంటే మించినది
దొమ్మరి బిడ్డ = దొమ్మరి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి
సల్లా పులిగోలిగా = ఒక రకమైన అరుపు
సల్తది = చల్లుతది
మోక్షం = పుణ్యం, కైవల్యం
అంటుండ్రి = అనేవారు

73వ పుట

గావు పట్టుట = పశువు గొంతు కొరికి బలి ఇవ్వడం
ఊరోళ్ళు = ఊరి జనం
దివిటీలు = కాగడాలు
పడుతుండ్రి = పట్టుకునే వారు
యేషాలు = వేషాలు
సూడద్దు = చూడకూడదు
తెరముందే = వేదికపైనే
సూడాల = చూడాలి
భాగ్యం = సంపద
మాదిగిండ్లల్ల = మాదిగ కులస్థుల ఇండ్లలో యేషాలు
యేసుకుంటుంటిమి = వేషం ధరించే వారం
పందిట్లకు = పందిరి లోపలికి
అస్తం = వస్తాము
రేవిడి = రేగడి మన్ను
మెంచు = తెల్లని పదార్ధం
అర్దూలం = జింక్ ఆక్సైడ్
నూరి = రుద్ది
లావు = చాలా
ఏసుకుంటుంటిమి = వేసుకునే వారం
ఏడుపోస్తది = దుఃఖం వస్తుంది
ఎగ పోస్తరు = వెక్కివెక్కి ఏడుస్తారు
చెంగులు = చీర కొంగులు
కంగారు కంగారుగా = చిందరవందరగా
అయితయు = అవుతాయి
నేరుస్తం = నేర్చుకుంటాము
రంజు కట్టిస్తాం
(జాతీయం) = కొంగులు పట్టుకొని ఏడిపిస్తం
యెడబాసి = విడిపోయి
అమ్మినంక = అమ్మిన తరువాత

TS Inter 2nd Year Telugu Study Material Chapter 5 మా భాగోతంలో మేము

74వ పుట

ప్రాణ + ఈశ = భర్త
నను బాసి పోయెదవ = నన్ను వదిలి వెళ్తావా
ప్రాణంబు = ప్రాణాలను
యెటుల = ఏవిధంగా
భరియింతు = కాపాడుకుంటాను
నయ్యయ్యో = అయ్యో
పశువులనమ్మిన పగిది = పశువులను అమ్మిన విధంగా
శిశువును = కొడుకును
నను = నన్ను
అమ్మించి = అమ్మివేసి
వశము గానట్టి = భరించలేని
ఆపదలు = కష్టాలు
వచ్చే మనకు = మనకు వచ్చాయి
మంది = జనాలు, ప్రేక్షకులు
ఎక్కెక్కి = వెక్కి వెక్కి
ఏడుస్తుండ్రి = ఏడ్చే వారు
దొరలూ = పెత్తందారులు
ఇట్లానే = ఈ విధంగానే
ఏడుద్దుమా = ఏడ్చుకుంటూ ఉండాల్నా
బంజేస్తరా = ముగిస్తారా, ఆపేస్తారా
ఇట్లా పేరు వచ్చింది = ప్రఖ్యాతి లభించింది
అచ్చింది = వచ్చింది
భుజకీర్తులు = – భుజాలపై ఉండే ఆభరణాలు
కిరీటాలు = మకుటాలు
మొగోళల్లే, పొనికి కట్టే, = పురుషులే
బూరుగు కట్టే = ఆభరణాలు తయారు చేయడానికి వాడే ఒకరకం కర్ర
మస్తుగ = ఎక్కువగా
దొరుకుతుండే = లభించేది
ఉంటుండే = ఉండేవి
గట్టు యాడుంది = అడవి ఎక్కడుంది
సెట్టు యాడుంది = చెట్లు ఎక్కడున్నాయి
నాశనం చేసిరి = కనబడకుండా చెడగొట్టారు
ఆడోల్ల నగల కాడికెల్లి = ఆడవారి నగలు కూడా
చేసేతందుకు = చేయడానికి
యాడాది నర్దం = పద్దెనిమిది నెలలు
పడుతది = పడుతుంది
నడుస్తాయి = ఉపయోగించవచ్చు
రేపే ! అంటయి = త్వరగా పాడవుతాయి
హారాలు, పేర్లు = దండలు

75వ పుట

శంఖ చక్రాలు, కిరీటము,
భుజకీర్తులు, సూర్య
కిరీటము, మకర
కుండలాలు, కంఠసారె,
పెద్ద పేరు, జడ, కొప్పుజడ
సిగరేకులు, పక్క గొలుసు,
సెక్క బవిలీలు, గూబగున్నాలు,
వేలాడే గున్నాలు = ఇవన్నీ వేషధారణలో భాగంగా ధరించే ఆభరణాలు
మకర కుండలాలు = మొసలి ఆకారంలో ఉండే చెవులకు పెట్టుకునే నగలు
కంఠసారె = కంఠానికి పెట్టుకునే ఒక ఆభరణం
సిగరేకులు = శిఖలో పెట్టుకునే ఆభరణాలు
సెక్క బవిలీలు = చెక్కతో చేసిన నగలు
గూబగున్నాలు = చెవులకు వేలాడే నగలు
దాక = వరకు
సెమటకు = చెమటకు
అవ్విటిని = వాటిని
ఆపగాలగాల = వేసుకొని మోయాలి
యిప్పేది = విప్పడం
బద్దం గుంజి = గట్టిగా లాగి
పొద్దుగాల = ఉదయం
పొద్దువంగినాక = సూర్యాస్తమయం తరువాత, సాయంత్రం
అట్లనే = అలాగే
నడిమిట్ల = మధ్యలో
ఆరతి ఇచ్చిన మంటేనే = మంగళహారతి ఇచ్చిన తరువాతనే
అవ్విటను = వాటిని, నగలను
ఇసబ్రహ్మ = విశ్వబ్రాహ్మకు
సురూ, షురూ = ప్రారంభం
తిత్తి = కొలిమిలో గాలి ఊదడానికి తోలుతో చేసిన పరికరం
చేతిల కత్తి = చేతిలో ఉండే కత్తి
చేసిచ్చిండ్లు = చేసి ఇచ్చారు
కొంగవలి కత్తి = వంకరగా ఉండే కత్తి
మేళం = కళాకారుల సమూహం
మేటి యేశం = ప్రధాన పాత్ర
ఎంత తోస్తే అంత = ఎంత వేయాలని అనిపిస్తే అంత, తోచినంత
మంగళారతి తీసుకుంటరు = హారతికి నమస్కరిస్తారు
ఇచ్చుడు ఉంటది = ఇవ్వడం ఉంటుంది
అదయినంక = ఆతరువాత
ఇంటిస్తం = ఇంటికి వస్తారు

76వ పుట

అలాయి బలాయి = ఆలింగనం
దాసున్ని = సేవకున్ని
జండర్ సంబంధం లేకుండా = లింగ భేదం పాటించకుండా
ಅಲ್ಲು = వారు
అరేయ్ దుర్మార్గ = ఓరి దుర్మార్గుడా
అంటి = అన్నాను
ఇట్టి = ఇలాంటి
ఘోర కృత్య౦ = ఘోరమైన పని
దండం పెడతాం = నమస్కరిస్తం
మొక్కుతం = నమస్కరిస్తం
సిన్నోల్లు = వయసులో చిన్న వారు
పెద్దోల్లకు = వయసులో పెద్ద వారికి
చెయ్యాల్సిందే = చేయవలసిందే
బారా = పన్నెండు
కెల్లి = నుండి
ఆడంగనే = ప్రదర్శించగానే
సాలు జేయ్యుండ్రి = ఆపేయండి
నిక్కీర్త = ఖచ్చితంగా
పొద్దుపొడవాల = తెల్లారాలి
గొంత = కొద్దిగా కూడా
సూస్తం ఇంకా = ఇంకా చూస్తాము
నోరు కూసోవడం = గొంతు బొంగురుపోవడం
తయారుగుంటరు = సిద్ధంగా ఉంటారు.
పడగొట్టం = వదిలిపెట్టం
ఉల్లాసం = ఉత్సాహం
మందు = మద్యం, సారా
పాడయిరి = చెడిపోతారు
మనసు కరి ఎక్కది = మనస్సు అంగీకరించదు

77వ పుట

లావు అయిపాయే = ఎక్కువై పోతది (చూడరు అని)
నొచ్చె = నొస్తున్నాయి, నొప్పి లేస్తుంది
ఇంటి కాడ = ఇంటి దగ్గర
తెల్లగోలు = వివరంగా
ఆల్ల మొదలార
(తిట్టుపదం) = వాళ్ళ మొదళ్ళు ఆరిపోని అంటే వారు చనిపోని అన్నట్లు
గమ్మతు పడతరు = ఆనందిస్తారు
పైసల్ = డబ్బు
రైకలు = రవికలు
అంగీలు = చొక్కాలు
దోతులు = పంచలు
మస్తు ఇస్తారు = చాలా ఇస్తారు
సౌలత్ = సౌకర్య౦
వాళ్లకు కష్టమే = వాళ్లకు కష్టం వస్తే మాకు కష్టం వచ్చినట్లే
పాలు = వాటా
జింగాలు = ఒక వాటాలో ఐదవవంతు
లగ్గం = పెళ్లి
యేషకాడు = పురుష వేషధారి
యేషకత్తె = స్త్రీ వేషధారి
సమ్మతిస్తే = అంగీకరిస్తే
సహి = సరే

78వ పుట

పంపకాలు = పంచుకోవడం
పోట్లాటలు, తగాదాలు = గొడవలు
మా అండ్ల మేమే = మాలో మేము
పరిష్కరించుకుంటం = సరి చేసుకుంటాం
దబ్బున = ఒకవేళ
చేసుకున్నదే కష్టం = చేసుకున్నంతే సంపాదన
ఆముదాని = ఆదాయం
సూడనిచ్చినావురా ? = చూసే అవకాశం ఇచ్చావారా
ఇయ్యమంట ఆస్తివి = ఇవ్వుమని వచ్చావు
మొకంమీదనే = ముఖం ముందర
కలకల అనిపిస్తది = బాధ అనిపిస్తుంది
సూసేతందుకు = చూడటానికి
ఆడుతున్నమాయే = ప్రదర్శిస్తున్నాం కదా
మానెడు బియ్యం = రెండు అడ్డల బియ్యం (కొలత పదం)
పంచుకుంటిమి = పంచుకున్నాము
లగుంటే = శక్తి ఉంటే
తలా = ఒక్కొక్కరికి
ఇంకొకల్లు = వేరేవాళ్ళు
అటువోరు = ఆ వైపు వెళ్ళరు
మోటు మాట = బూతు, చెడ్డమాట
మా అసుంటోల్లను = మా లాంటి వారిని
ఐదు నూర్లు = ఐదు వందలు
గరుజు = చాలా అవసరం
అసుంటప్పుడు = అలాంటి సమయంలో
తాట = దగ్గర
నారాయణమూర్తి = దేవుడు

మా భాగోతంలో మేము Summary in Telugu

రచయిత్రి పరిచయం

TS Inter 2nd Year Telugu Study Material Chapter 5 మా భాగోతంలో మేము 1

పాఠం పేరు : మా భాగోతంలో మేము
దేని నుండి గ్రహింపబడినది : నేను చిందుల ఎల్లమ్మ మాటల్లోనే ఆమె జీవితాన్ని రికార్డు చేసిన “చిందుల ఎల్లమ్మ”ను .. అనే చిందు భాగవతం ఆత్మకథలో నుండి గ్రహింపబడినది.
రచయిత్రి : చిందు ఎల్లమ్మ
జన్మస్థలం : ఆదిలాబాద్ జిల్లా (ప్రస్తుతం నిర్మల్ జిల్లా) బాసర
నివాస స్థలం : నిజామాబాదు జిల్లా అమ్డాపూర్
కాలం : జననం : ఏప్రిల్ 1, 1914 – మరణం : నవంబర్ 9, 2005
తల్లిదండ్రులు : ఎల్లవ్వ, పిల్లిట్ల నాభిసాబ్.
చదువు : నిరక్షరాస్యురాలు

విశేషతలు : భారతీయ జానపదకళ ఔన్నత్యాన్ని, వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన కళాకారిణి
ధరించిన పాత్రలు : సత్యభామ, మోహిని, సత్యవతి, సావిత్రి, రంభ, లక్ష్మి, రత్నాంగి వంటి స్త్రీ పాత్రలు, ధర్మాంగదుడు, మాంధాత, కుశలుడు, హనుమంతుడు, నరసింహస్వామి వంటి పురుష పాత్రలు. ఎల్లమ్మకు 14 సంవత్సరాల వయస్సులోనే వివాహం జరిగింది. కాని చిందు కళకే అంకితం కావాలనే ధ్యేయంతో వైవాహిక జీవితానికి స్వస్తిపలికి తన జీవితాన్ని కళకు అంకితం చేసింది.

నటరాజ రామకృష్ణచే సన్మానం : క్షణకాలం తేడాలోనే స్త్రీ, పురుష పాత్రలలో మెప్పించగలిగిన మేటి కళాకారిణి ఎల్లమ్మ. ఒక పామర స్త్రీ ఇంత అద్భుతంగా అభినయాన్ని ప్రదర్శించటం నాకు విస్మయాన్ని కలిగించింది. ఇలాంటి కళాకారుల్ని అరుదుగా చూస్తాం. అని ఆమె ప్రదర్శనను చూసిన నాట్యాచార్య నటరాజ రామకృష్ణ ప్రశంసించి విలువైన శాలువాతో సత్కరించారు.

ప్రదర్శనలు : ఎల్లమ్మ నాలుగేళ్ల వయసులోనే బాలకృష్ణుని వేషంతో చిందు యక్షగాన రంగంలో అడుగు పెట్టింది. 1918లో కళారంగంలో ప్రవేశించిన ఎల్లమ్మ గ్రామాల్లో వేల ప్రదర్శనలిచ్చింది. తొలి అధికారిక ప్రదర్శన 1979లో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఇచ్చింది. మొదటి రాష్ట్రస్థాయి ప్రదర్శన 1980లో రవీంద్రభారతిలో నాటి ముఖ్యమంత్రి సమక్షంలో ఇచ్చింది.

రాష్ట్ర సాహిత్య అకాడమి సభ్యత్వం : 1982లో రాష్ట్ర సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యత్వం లభించింది.
జాతీయ ప్రదర్శనలు : 1984వ సంవత్సరంలో మాస్కో నగరంలో తొలి అంతర్జాతీయ ప్రదర్శన ఇచ్చింది. 1986లో ఢిల్లీలో జరిగిన అప్నా ఉత్సవ్లో జాతీయ ప్రదర్శన ఇచ్చింది..
పురస్కారాలు : చిందు కళలో తన అభినయానికి 1998-99 లో కళారత్న పురస్కారం, 1999లో హంస పురస్కారం, 2004లో రాజీవ్ ప్రతిభా పురస్కారాలు అందుకుంది.
ఎల్లమ్మ రహదారి : అప్పటి ప్రభుత్వం ఆమె గౌరవార్ధం నిజామాబాద్ నుండి బోధన్ వరకు గల రహదారికి ‘ఎల్లమ్మ రహదారి’గా నామకరణం చేసింది.

పాఠ్యభాగ సందర్భం

ప్రస్తుత పాఠ్యభాగం చిందు ఎల్లమ్మ మాటల్లోనే ఆమె జీవితాన్ని రికార్డు చేసిన పుస్తకం “నేను చిందుల ఎల్లమ్మను – చిందు భాగవతం ఆత్మకథ” లోనిది. ఈ పుస్తకానికి సంపాదకుడు డా.కె. ముత్యం.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 5 మా భాగోతంలో మేము

పాఠ్యభాగ సారాంశం

(ఈ పాఠ్యాంశం తెలంగాణ మాండలికంలో ఉంది. మరీముఖ్యంగా నిరక్షరాస్యులు యాసలో ఉత్తమ పురుషలో ఉంది. దాని సారాంశాన్ని సరళ ప్రామాణిక భాషలో, ప్రథమపురుషలో అందిస్తున్నాం.)

చిందు భాగోతం ప్రదర్శన : చిందు భాగవతం ప్రదర్శించడానికి ముందు నాలుగు గుంజలు, వెనక రెండు గుంజలు పాతి పందిరి వేస్తారు. ఆ పందిరి కిందనే భాగోతం ప్రదర్శిస్తారు. పందిరి లేకుంటే భాగోతం ఆడరు. పందిరిని చాందిని అని కూడా అంటారు. పందిరికి మూడుపక్కల ఎడ్లకు కట్టే పగ్గాల కంటే లావుగా ఉండే జనుముతో చేసిన తాళ్లను కట్టేవారు. భాగోతం చూడడానికి వచ్చిన వారు మీద పడకుండా ఈ తాళ్ళను కట్టేవారు. దొమ్మరి బిడ్డ గడ (రెండువైపులా కర్రలు పాతి వాటి మధ్యలో తాడు కట్టేవారు. ఆ తాడుపై పెద్ద వెదురు కర్ర పట్టుకొని నడిచేవారు) ఎక్కి సాలా పులిగోలిగా అని బియ్యం సల్తది. మాదిగ చిందోల్లు ఎల్లమ్మ యేషం గట్టి చెరువులు మొకం కడిగితేనే మోక్షం, బరుకతు అని భావించే వారు. అట్లాంటిది మారిపోయి నడి ఊర్లో భాగోతం ఆడటం ఎల్లమ్మ తాతల కాలంలోనే ప్రారంభమైంది.

“ఇవ్వాల చిందు భాగోతం ఆడుతుండ్రట, పోవాలరా” అనేవారు. ఇవ్వాల “ఎల్లమ్మ ఆట ఆడుతున్నరు. గావు పట్టేదున్నదట పోవాల” అని ఊరివాల్లు వచ్చేవారు. పాత రోజుల్లో రాత్రులు ఊర్లో భాగోతం ఆడుతున్నపుడు మంగలోల్లు దివిటీలు పట్టేవారు.

వేషాలు వేసేటప్పుడు ఎవరూ చూడకుండా జాగ్రత్తపడేవారు. తెరముందు ఆడేటప్పుడు మాత్రమే అందరూ చూడాలి అనుకునేవారు. అందుకోసం మాదిగ ఇండ్లల్లో వేషం ధరించేవారు. అలా కుదరనప్పుడు పందిరికి కొంత దూరంలోనో, అలాకూడా కుదరనప్పుడు చుట్టూ దుప్పటి కట్టుకోని రంగులు వేసుకునే వారు. రంగులు వేసుకున్నాక దుప్పటి కప్పుకొని భాగోతం ప్రదర్శించే పందిరి లోపలికి వచ్చేవారు. కళాకారులు ఎవరి వేషం (మేకప్) వాల్లే వేసుకునే వారు. ఎవరి అద్దం వాల్లదగ్గరే ఉండేది. మొకంకు రేవిడిని, లేకుంటే పసుపు పచ్చ పౌడరును వేసుకునే వారు. తెల్ల వెంట్రుకలు కావాలంటే మెంచు, లేదా అర్దూలం (జింక్ ఆక్సైడ్) వాడేవారు. ఆ అర్దూలం చెమటకు వెంటనే కరిగిపోయేది. చూసేవారు కంటికి ధారలుపడేటట్టు ఏడుస్తున్నారు అనుకునే వాళ్ళు. పాత రోజుల్లో ఏడుపు రావాలంటే కంట్లో వేలు పెట్టుకునే వారు లేదా నూనె చుక్కలు వేసుకునేవారు.

కాని ఎల్లమ్మకు దుఃఖం పాట పాడగానే ఏడుపు వచ్చేది. భాగోతం చూసేవారు కూడా వెక్కివెక్కి ఏడ్చేవారు. వారు ఏడిస్తే చీరకొంగులు తడిసిపోయేవి. అంత కష్టపడి భాగోతాన్ని రసవంతంగా ప్రదర్శించేవారు. సత్యహరిశ్చంద్ర భాగోతం ఆడితే చూసేవారు కూడా ఏడ్చేవారు. అలా ప్రదర్శిస్తున్నప్పుడు ఒక్కోసారి ఆఊరి దొరలు “మేం ఇట్లనే కొంగులు పెట్టుకొని ఏడుద్దుమా? బంజేస్తరా? ఓ గంగారం!, ఓ ఎల్లవ్వా! ఇదేం ఏడుసుడు. ఏం కథ, దేవుడా… జర బందు జేయుండ్రి గదా!” అని చెప్పేవారు. అంత లీనమై ఆ ప్రదర్శనను చూసేలా ఆడేవారు. అంత కష్టపడి ప్రదర్శిస్తేనే ఆ కళకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.

ప్రదర్శనకు వాడే వస్తువుల తయారీ : భుజకీర్తులు, కిరీటాలు మొదలైన ఆభరణాలను కళాకారులే తయారు చేసుకునేవారు. కొంత మంది మగవారికి మాత్రమే వాటిని తయారు చేయడం తెలుసు. “పొనికి కట్టెతో వీటిని తయారు చేస్తారు. దాన్ని బూరుగు కట్టె అనికూడా అంటారు. అగ్గిపుల్లలను కూడా ఈ కర్రతోనే తయారు చేస్తారు. కలిపెల్లిగుట్టలో ఈకర్ర చాలా లభించేది. పూర్వం పెద్దపెద్ద గుట్టలు, అడవులు ఉండేవి. దొనకంటి, కథారుపల్లె వైపు ఈ కలప లభించేది. అడవులను నరికిన కారణంగా ఇప్పుడు లభించడం లేదు.

భుజకీర్తులు, కిరీటాల డిజైన్లు చెక్కుడు, అంతా వారే తయారు చేసుకునే వారు. పురుషుల కిరీటము చేయడానికి పన్నెండు నెలలు, ఆడవారి కిరీటం చేయడానికి పద్దెనిమిది నెలలు పట్టేది. కష్టపడి చేసిన నగలను జాగ్రత్తగా కాపాడుకొని పది, పన్నెండేండ్లు ఉపయోగించేవారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న అవి పనికి రాకుండా పోయేవి. ఆడవాల్ల హారాలు, దండలు తయారు చేయడం చాలా కష్టం. శంఖ చక్రాలు, కిరీటము, భుజకీర్తులు, సూర్య కిరీటము, మకర కుండలాలు, కంఠసారె, పెద్ద పేరు ఇవన్నీ రాజు వేషానికి అవసరమవుతాయి.

జడ, కొప్పుజడ (దాన్ని షాంపూజడ అంటారు) సిగరేకులు, పక్క గొలుసు, చెక్క బవిలీలు, గూబగున్నాలు, వేలాడే గున్నాలు స్త్రీ వేషానికి అవసరం. మిగతా జిల్లాల చిందు కళాకారులు ఎన్నో నగల్ని తీసేస్తున్నరు. కానీ నిజామాబాదు జిల్లా కళాకారులు మొదటి నుంచి ఉన్నవాటిని ఇప్పటికీ వాడుతున్నారు.

కిరీటాలు, భుజకీర్తులు కట్టుకొని యేషాలు యేసి, ఆడి, ఆటయినంక చూసుకుంటే అవన్నీ చెమటకు ఉబ్బేవి. నగలను ఆరు, యేడు గంటల పాటు ధరించే ఉండాలి. ప్రదర్శన పూర్తయ్యేవరకు నగలను విప్పకపోయేవారు. అందుకోసం వేషాలు వేసుకునేటప్పుడే అవి జారిపోకుండా గట్టిగ లాగి కట్టేవారు. భాగోతం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభిస్తే సాయంత్రం ఆరు, యేడు గంటల దాకా ఆడతారు. ఈ భుజకీర్తులు, కిరీటాలను అంతసేపు అట్లనే ధరించాలి. వేషాల మధ్య తబలకొట్టినా కూడా వాటిని అలానే ధరించేవారు. భాగోతం పూర్తయి ఇంటికి వచ్చి, ఆరతి ఇచ్చిన తరువాతనే వేషాన్ని విప్పేవారు.

ప్రదర్శన ప్రారంభ, ముగింపు సన్నివేశాలు : ఏదైనా గ్రామంలో ప్రదర్శన ప్రారంభించే ముందు ఆవూర్లోని విశ్వబ్రాహ్మణుల ఇంటికి వెళ్లి కమ్మరి కొలిమికి నమస్కరించే వారు. భాగోతం ఆడటం అయిపోయినంక రాముని పేరుతో మంగళ హారతి ఇస్తారు. పక్కవాయిద్యాల వారు కూడా మంగళారతి పాట పాడేవారు. ప్రధాన వేషం ధరించిన స్త్రీ పాత్ర మంగళహారతి పట్టుకొని ప్రేక్షకుల దగ్గరికి పొతే, వారు ఆ హారతికి నమస్కరించి వారికి తోచినంత డబ్బును హారతి పళ్ళెంలో వేసేవారు. ఆ తరువాత ఆ హారతితోనే కళాకారుల బృందం అంతా ఇంటికి వెళ్తారు. అందరు కలిసి మరొక్కసారి హారతి తీసుకుంటారు.

హారతి తరువాత ఒకరినొక ఆలింగనం చేసుకుంటారు. ఆడవారితో ఆడవారు, మగవారితో మగవారు దాసున్ని అనే అర్థంలో లింగ భేదం లేకుండా ‘దాసున్, దాసున్’ అనుకుంటారు. అప్పుడు భాగోతం సామాగ్రినంతా తీసి, ఎవరి సామాను వారు సర్దుకొని వేషాన్ని విప్పేస్తారు. ప్రదర్శనలో భాగంగా అరేయ్ దుర్మార్గా అని, ఓరి సుగ్రీవా అని పాడి, ఎగిరి తంతారు. అలా చేయడం తప్పు కాబట్టి భాగోతం పూర్తికాగానే పెద్దవారి కాళ్లకు నమస్కరిస్తారు. అలా భాగోతంలో అన్నా అనకున్నా, తన్నినా తన్నకున్నా, చిన్నవారు పెద్దలకు నమస్కరిస్తారు.

ప్రదర్శనల్లో వస్తున్న మార్పులు : మంగళ హారతిలో మంది వేసిన డబ్బులను అందరూ కలిసి పంచుకుంటారు. భాగోతం మధ్యాహ్నం పన్నెండు, ఒకటి నుంచి ఆరు, ఏడు గంటల వరకు ప్రదర్శిస్తారు. ఇపుడు కొంతమంది మూడు గంటలసేపు ఆడగానే ఆపుమంటున్నారు. కాని ఖచ్చితంగా ఆడాలంటే రాత్రి పది గంటలకు ప్రారంభించి, ఉదయం వరకు ప్రదర్శిస్తారు. భాగోతం అయిపోయే వరకు ప్రేక్షకులను కదలనీయనంత ఆకర్షణీయంగా ప్రదర్శిస్తారు. అవకాశముంటే వరుసగా పదిహేను రోజులపాటు భాగోతాలు ఆడుతారు. ఒకవేళ ఎవరి గొంతుకు ఏమైనా ఇబ్బంది కలిగితే ఇతరులు సహకరిస్తారు. సారా ముట్టరు. మందు ముడితే పాడయిపోతారని గట్టి నమ్మకం.

పెద్ద కథని రెండు గంటల్లో ఆడమంటే “అయ్యో చెప్పి ఏమి లాభం? చెప్పక ఏమి లాభం? అనుకుంటారు. అలా తక్కువ సమయంలో పూర్తి చేస్తే వాళ్లకు సంతృప్తి కలగదు. ఈ రోజుల్లో మూడు గంటలు భాగోతం చూడడానికి జనాలకు ఓపిక ఉండటం లేదు. “అయ్యో! నడుములు నొచ్చె, ఇంటికాడ ఏమాయెనో” అంటారు.

ఇతరుల ప్రదర్శనలకంటె చిందు ప్రదర్శనలకు ఎక్కువ మొగ్గు చూపేవారు. కళాకారులకు డబ్బుతోపాటు, చీరలు, రవికలు, అంగీలు, ధోతులు ఇచ్చేవారు. అన్ని గ్రామాలలో చిందు కళాకారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించే వారు. మాదిగ ఇండ్లలో అడుక్కునేవారు కాబట్టి వారిని గౌరవించేవారు.

ఆదాయాన్ని పంచుకునే పద్ధతి : భాగోతం ఆడిన భార్యాభర్తలకు ఒక వాటా, పెళ్లి కాని పిల్లలుంటే, వాళ్లు ఆడితే, ఒక వాటాలో ఐదు భాగాలు చేసి ఆడపిల్లలకు రెండు భాగాలు, మగ పిల్లలకు మూడు భాగాలు ఇస్తారు. ఇద్దరు భార్యాభర్తలకు ఒక పాలు ఇస్తారు కాని ఎల్లమ్మకు భర్తలేడు. అయినా ప్రధాన పాత్రలు ధరిస్తుంది కాబట్టి ఒక వాటా ఇచ్చేవారు. పెండ్లయి ఒక్కడే భాగోతంలో ప్రధాన వేషం వేస్తే కూడా ఒక భాగం ఇస్తారు.

అతనికి భార్యతో విడాకులైనా, ఆమె చచ్చిపోయినా ఆయనకు పాలు ఇస్తారు. మరి పెండ్లయినా చిన్న వేషం ధరిస్తే పాలు ఇవ్వరు. మూడు భాగాలే ఇస్తారు. ఈ పంపకాలు గురించి అప్పుడప్పుడు గొడవలు కూడా అవుతాయి. మళ్ళీ వారిలో వారే పరిష్కరించుకుంటారు.

చిందు వాళ్ళు టిక్కెట్లు పెట్టి భాగోతం ఆడరు. వరంగల్ జిల్లాల ఆడుతున్నరట. టిక్కెటుకు పైసలు ఇస్తేనే భాగోతం చూడనివ్వాలి లేకుంటే లేదు అంటే పైసలు ఉండకపోతే ప్రదర్శన చూడలేకపోతారు. ఒక వేల టిక్కెట్లు పెట్టి ఆడితే ఆ ఆదాయంతోనే బతకాలి. ఊల్లోకి వెళ్లి అడుక్కోవడానికి అవకాశం ఉండదు. అలా అడుక్కుంటే “నువ్వు సూడనిచ్చినావురా? పైసలు తక్కువ వున్నయంటే రానియ్యక పోతివి. మిట్ట మిట్ట సూడంగ ఎల్లగొడితివి. మల్లా అదీ ఇదీ ఇయ్యమంట అస్తివి” అని మొకం మీదనే కసురుకుంటారు. కళాకారులకు తమ ప్రదర్శన ఎక్కువమంది చూడాలనే కోరిక ఉంటుంది. టిక్కెట్టు పెట్టకపోవడానికి మరొక కారణం ఒక గ్రామంలో అడుక్కుంటే బియ్యం, కూరగాయలు, పప్పు, ఉప్పు చింతపండు, బట్టలు ఇలా అనేకరకాల వస్తువులు ఇస్తారు. డబ్బువస్తే దేనికయినా ఖర్చు అవుతాయి కాబట్టి వారు టిక్కెట్టు పెట్టరు.

చిందు కళాకారులు రాజ్యం పంచుకోవడం : చిందు కళాకారులు ప్రారంభంలో యే గ్రామంలోనైనా ప్రదర్శనలు ఇచ్చేవారు. కాని మధ్యలో గ్రామాలు పంచుకొని ఒకరికి వచ్చిన గ్రామంలోకి ఇంకొకరు వెళ్లి ప్రదర్శనలు ఇవ్వరు. ఒక్కో కళాకారుల బృందానికి ఇరవై నుండి ముప్పై గ్రామాలు ఉండేవి. ఇలా గ్రామాలను పంచుకోవడాన్ని రాజ్యం పంచుకునుడు అంటారు. రొట్టె తినని కారణంగా మహారాష్ట్ర వైపు ఎక్కువగా చిందు కళాకారులు లేరు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, గాంధారి, పిట్లం, రెంజల్, నవీపేట, కుందాపురం, నందిపేటల్లో ఉన్నారు. మల్లారం, మాకులూరు, బొంకిన పల్లెల్లో వున్నారు. ఆరమూరు వైపు ఎక్కువగా ఉన్నారు.

అలా ఊల్లు పంచుకున్న కుటుంబాలు భాగోతాలు ఆడాలనుకుంటే కళాకారుల దగ్గరికి వచ్చి, ఆటకు ఐదు వందలు రూపాయలు ఇచ్చి తీసుకుపోతారు. వారి అవసరం కనుక సామాన్లు కూడా నెత్తిమీద పెట్టుకొని తీసుకెళ్తారు. ఎవరికన్నా ఊర్లుండి కళాకారుల బృందం లేకుంటే ముందే మాట్లాడుకుంటారు. వచ్చిన దానిలో సగం సగం తీసుకుంటారు. న్యాయం ఉన్నదగ్గరే నారాయణుడు (దేవుడు) ఉంటాడు అని నమ్మి పంపకాలలో న్యాయం పాటిస్తారు. అని చిందు ఎల్లమ్మ డా. కె.ముత్యం కు చెప్తే ఆమె చెప్పినట్టుగానే ఆయన పుస్తకంలో రాశారు.

TS Inter 2nd Year Telugu Grammar సంక్షిప్తీకరణ

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material Grammar సంక్షిప్తీకరణ Questions and Answers.

TS Inter 2nd Year Telugu Grammar సంక్షిప్తీకరణ

ఇటీవల రచనల్లో సంక్షిప్తీకరణకు ప్రాధాన్యత పెరిగిపోయింది. పెద్ద పెద్ద పేరాలలో ఉండే విషయాలను కుదించి మొత్తం విషయాన్ని క్లుప్తంగా చెప్పడం రాతనైపుణ్యాలలో ఒక అంశంగా చెప్పుకుంటున్నాం. మూలంలోని అంశం ప్రతిబింబించేలా తక్కువ పదాల్లో భావాన్ని వ్యక్తీకరించడమే సంక్షిప్తీకరణ. విద్యార్థులలో ఈ నైపుణ్యాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో దీనిని ఒక అంశంగా చేర్చాం.

ప్రశ్న 1.
తెలంగాణా ప్రాంతంలో ఊరూర ఉద్ధండులైన సంస్కృతాంధ్ర పండితులున్నప్పటికిని వారు సభలలో సమావేశమై పరస్పర అవగాహన చేసుకునే అవకాశాలు బొత్తిగా లేకుండెను. రాజభాషయైన ఉర్దూ, ప్రాథమిక దశ నుంచి విశ్వవిద్యాలయ దశవరకు బోధనాభాష కావడంవల్ల తెలుగు భాషాభివృద్ధికి గొప్ప సంకట పరిస్థితి యేర్పడినది. ఆ రోజులలో హైదరాబాదు రాష్ట్రం ఒక ప్రత్యేకమైన ద్వీపకల్పముగా సిద్ధమై అక్కడ నివసించే ప్రజలను ఇతర ప్రపంచము నుండి వేరు చేసినది. అందుచేత గత శతాబ్దమునుంచి భారత స్వాతంత్య్ర ప్రాప్తివరకు అక్షరాస్యులైన ప్రజల సంఖ్య మిక్కిలి తక్కువగా ఉండెను. సంస్కృతాంధ్ర పండితులు కవులు గ్రాసవాసోదైన్యానికి గురియై పల్లెటూళ్ళలో కృశించిరి. కొద్దిమంది ఉర్దూ, ఫారసీ భాషలతో పరిచయం చేసుకొని ప్రభుత్వ ఆశ్రయముతో తమ పనులను నెరవేర్చుకొనిరి. ఈ విధంగా తెలుగు భాషా వికాసానికి తెలంగాణా ప్రాంతంలో గ్రహణము పట్టినది.
జవాబు:
సంక్షిప్తరూపం :
తెలంగాణ ప్రాంతంలో సంస్కృతాంధ్ర పండితులున్నప్పటికి సభలకు అవకాశాలు లేకుండేది. ఉర్దూ రాజభాషగా, బోధనాభాషగా ఉండటం వల్ల తెలుగు భాషాభివృద్ధికి సంకట స్థితి ఏర్పడింది. ఆ రోజులలో హైదరాబాదు రాష్ట్రంలో భారత స్వాతంత్ర్యప్రాప్తి వరకు అక్షరాస్యత తక్కువగా ఉండేది. కొందరు సంస్కృతాంధ్ర పండితులు, కవులు పల్లెటూళ్ళలో కృశించిపోతే, మరికొందరు రాజభాషను నేర్చుకొని తమ పనులు నెరవేర్చుకొన్నారు.

TS Inter 2nd Year Telugu Grammar సంక్షిప్తీకరణ

ప్రశ్న 2.
ఇక నేను తెలుగు సాహిత్య రంగంలో చేసిన పరిశోధన గురించి సంగ్రహంగా మనవి చేస్తాను. హైస్కూలు విద్యార్ధిగా ఉండినప్పటినుంచే భారతి తదితర పత్రికల్లో మానవల్లి, వేటూరి, నిడుదవోలు, ఈయుణ్ణి, మల్లంపల్లి వంటి పరిశోధకుల వ్యాసాలు, వారు సంపాదించిన గ్రంథాల పీఠికలు చదవటంచేత వారివలె ఇంతవరకు సాహిత్యలోకానికి తెలియని క్రొత్త విషయాలు చెప్పవలెననే నిశ్చయంతో పరిశోధన రంగంలో అడుగు పెట్టినాను. జానపద విజ్ఞానంలో విశ్వవిద్యాలయ స్థాయి పరిశోధనలో తెలుగులోనే కాదు దక్షిణభారతదేశ భాషలన్నిటిలో నా తెలుగు జానపదగేయ సాహిత్యము మొదటి సిద్ధాంత గ్రంథమైనది. ఆ రంగంలో అనేక జానపదగేయ సంకలనాలు ప్రకటించినాను. తెలుగులోను ఇంగ్లీషులోను జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పదులకొలది పరిశోధనాత్మకపత్రాలు చదివినాను. ఇంగ్లీషులో ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ.పి., ఫోక్లోర్ ఆఫ్ ఏ.పి., సౌత్ ఇండియన్ ఫోక్ సాంగ్స్, గ్లింప్సెస్ ఇంటూ తెలుగు ఫోక్లోర్ గ్రంథాలు ప్రకటించినాను.
జవాబు:
సంక్షిప్తరూపం :
హైస్కూల్ విద్యార్థిగా ఉన్నప్పటినుండే భారతిలాంటి పత్రికల్లో మానవల్లి, వేటూరి, నిడుదవోలు, మల్లంపల్లి వంటి వాళ్ళ వ్యాసాలు చదివాను. అందువల్ల కొత్త సాహిత్య విషయాలు చెప్పాలని పరిశోధక రంగంలో అడుగుపెట్టాను. దక్షిణ భారతదేశ భాషల్లోనే నా తెలుగు జానపదగేయ సాహిత్యం మొదటి సిద్ధాంత గ్రంథం. తెలుగు, ఆంగ్లంలో జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో ఎన్నో పరిశోధక పత్రాలు చదివాను. ఆంగ్లంలో ‘ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ.పి., ఫోక్ లోర్ ఆఫ్ ఏ.పి., సౌత్ ఇండియన్ ఫోక్ సాంగ్స్, గ్లింప్సెస్ ఇంటూ తెలుగు ఫోక్లోలోర్ గ్రంథాలు ప్రకటించాను.

TS Inter 2nd Year Telugu Grammar సంక్షిప్తీకరణ

ప్రశ్న 3.
ప్రకృతిసిద్ధంగా జరిగే పరిణామక్రమంలో ప్రకృతి చేసుకునే ఎంపిక గురించి చార్లెస్ డార్విన్ వివరిస్తూ మానవజాతి ఆవిర్భావం గురించి విభిన్నంగా ఆలోచించేటట్టు చేశాడు. విద్యుచ్ఛక్తి కనుగొనడం ద్వారా థామస్ ఆల్వా ఎడిసన్ సైన్సుకూ, టెక్నాలజీకి చెందిన ప్రతి రంగాన్ని సమూలంగా మార్చివేశాడు. దక్షిణాఫ్రికాలో జాతి విచక్షణతకు వ్యతిరేకంగా తన అహింసా ధర్మ ఉద్యమాన్ని ప్రారంభించిన మహాత్మాగాంధీ అహింస ద్వారా భారతదేశాన్ని బ్రిటిష్ పాలననుండి విడిపించి స్వాతంత్ర్యాన్ని సంపాదించాడు. 20వ శతాబ్దానికి చెందిన ఈ మూడు ప్రధాన సంఘటనలు సృజనాత్మక ఆలోచనల ఫలితాలు. *(M.P.)
జవాబు:
సంక్షిప్తరూపం :
ప్రకృతిసిద్ధమైన పరిణామక్రమాన్ని చార్లెస్ డార్విన్ మనం విభిన్నంగా ఆలోచించేటట్టు చేశాడు. విద్యుచ్ఛక్తి కనుగొని థామస్ ఆల్వా ఎడిసన్ సైన్స్ & టెక్నాలజీని మొత్తం మార్చేశాడు. అహింసా ఉద్యమాన్ని మహాత్మాగాంధీ ఉపయోగించి బ్రిటీషువారిని భారతదేశం నుండి పంపించేశాడు. ఈ మూడు 20వ శతాబ్దపు సృజనాత్మక ఆలోచనల ఫలితాలు.

TS Inter 2nd Year Telugu Grammar భాషాభాగములు

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material Grammar భాషాభాగములు Questions and Answers.

TS Inter 2nd Year Telugu Grammar భాషాభాగములు

భాషా భాగములు : తెలుగు భాషలోని శబ్దాలన్నీ ప్రధానంగా, ఐదురకాలైన భాషాభాగాలతో కూడి యుంటాయి. భాషలోని భాగాలే భాషాభాగాలు. ఇవి ప్రధానంగా ఐదు రకాలు.

  1. నామవాచకం
  2. సర్వనామం
  3. విశేషణం
  4. క్రియ
  5. అవ్యయం

1. నామవాచకం :
‘నామం’ అంటే పేరు. పేర్లను తెలియజేసే భాషా పదాలు, ‘నామవాచకాలు’. నామవాచకానికి, ‘విశేష్యం’ అని పేరు కూడా ఉంది.
ఉదా :
రాము, రఘ, వరంగల్, నల్లగొండ, కూచిపూడి, భద్రాచలం, వనిత, కవిత మొదలయినవి నామవాచకములు.

వాక్యరూప ఉదాహరణలు :

  1. రాము కళాశాలకు వెళ్ళాడు. – (‘రాము’ అనేది నామవాచకం)
  2. వరంగల్ పెద్ద పట్టణం – (వరంగల్ అనేది నామవాచకం)
  3. వనిత, కవిత అక్కా చెల్లెళ్ళు – (వనిత, కవిత అనే పదాలు నామవాచకాలు)
  4. భద్రాచలం గొప్ప పుణ్యక్షేత్రం – (‘భద్రాచలం’ అనేది నామవాచకం)
  5. కూచిపూడి నాట్యం గొప్పది – (‘కూచిపూడి’ అనేది నామవాచకం)

TS Inter 2nd Year Telugu Grammar భాషాభాగములు

2. సర్వనామం :
నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం.
ఉదా :
వాడు, వీడు, అతడు, ఆమె, ఇతడు, ఈమె, ఎన్ని, ఇన్ని, కొన్ని, మీరు, మనం, మేము, అన్ని, వారు, వీరు, ఎవరు, ఏది మొదలయినవి సర్వనామాలు.

వాక్యరూప ఉదాహరణలు :

  1. ఈ పని ఎవడు చేస్తాడో అతడే గొప్పవాడు. – (‘అతడే’ సర్వనామం)
  2. అతడు శ్రీరాముడు. – (‘అతడు’ సర్వనామం)
  3. వీడు అబద్దాల కోరు. – (‘వీడు’ సర్వనామం)
  4. ఆమె సౌందర్యవతి. – (‘ఆమె’ సర్వనామం)
  5. మనం భారతీయులం. – (‘మనం’ సర్వనామం)

3. విశేషణం :
నామవాచకం, సర్వనామాల గుణాలను తెలియజేసేవి ‘విశేషణాలు’.
ఉదా :
నల్లని, తెల్లని, మనోహరమైన, సరసమైన, పచ్చని, పుల్లని, తియ్యని మొదలయినవి విశేషణాలు.

వాక్యరూప ఉదాహరణలు :

  1. శ్రీజ మంచి తెలివిగల పిల్ల. – (‘మంచి’ విశేషణము)
  2. స్వాతి అందమైన పాప. – (‘అందమైన’ విశేషణము)
  3. కృష్ణుడు నల్లని వాడు. – (‘నల్లని’ విశేషణము)
  4. మాధవి మనోహరమైన స్త్రీ. – (‘మనోహరమైన’ అనేది విశేషణము)
  5. శ్రీనివాసుడు ధనవంతుడు. – (‘ధనవంతుడు’ విశేషణము)

TS Inter 2nd Year Telugu Grammar భాషాభాగములు

4. క్రియ :
చేసే పనిని తెలియజేసే పదాన్ని ‘క్రియ’ అంటారు.
ఉదా :
కొట్టు, తిట్టు, తిను, వెళ్ళు, చూచు, నిద్రించు, మాట్లాడు, నడుచు మొదలయినవి క్రియలు.

వాక్యరూప ఉదాహరణలు :

  1. రాముడు రావణుని సంహరించాడు. – (‘సంహరించాడు’ అనేది క్రియ)
  2. వాల్మీకి రామాయణం రచించాడు. – (‘రచించాడు’ అనేది క్రియ)
  3. రాము గ్రంథాలయానికి వెళ్ళాడు. – (‘వెళ్ళాడు’ అనేది క్రియ)
  4. మాధవరావు నాతో మాట్లాడుతున్నాడు. – (‘మాట్లాడుతున్నాడు’ అనేది క్రియ)
  5. సుప్రజ నిద్రిస్తుంది. – (‘నిద్రిస్తుంది’ అనేది క్రియ)

5. అవ్యయం :
లింగ, విభక్తి, వచనం లేని శబ్దములను ‘అవ్యయాలు’ అంటారు.
ఉదా :
అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు, ఔరా, ఆహా, అయ్యో, ఊరక, మిన్నక, అక్కడ, ఇక్కడ, ఎక్కడ, అచట, ఇచట, ఎచట – మొదలయినవి అవ్యయాలు.

వాక్యరూప ఉదాహరణలు :

  1. ఎక్కడ ఆరోగ్యం వుంటుందో అక్కడ సంపద వుంటుంది. – (ఎక్కడ, అక్కడ అనేవి అవ్యయాలు)
  2. మా అమ్మ అప్పుడు చెప్పిన పనిని ఇప్పుడు చేస్తున్నాను. – (‘అప్పుడు అవ్యయం’)
  3. బంగారు లేడిని చూచి సీత ఆహా ! అనుకుంది. – (‘ఆహా’ అనేది అవ్యయం)

TS Inter 2nd Year Telugu Grammar భాషాభాగములు

గమనిక :
భాషాభాగాలపై ఈ అభ్యాసములోని ప్రశ్నలలో నుండి ఐదు ప్రశ్నలు పరీక్షలలో ఇస్తారు. ఐదు జవాబులకూ, ఐదు మార్కులు. మీకు ఈ అభ్యాసంలో 12 ప్రశ్నలు ఉన్నాయి. వీటి నుండే, మీకు పేపర్లో ప్రశ్నలు వస్తాయి. కాబట్టి, శ్రద్ధగా చదువండి. ఐదుకి ఐదుమార్కులు పొందండి.

అభ్యాసం

ప్రశ్న 1.
అవ్యయానికి ఒక ఉదాహరణ ఇవ్వండి ? *(M.P)
జవాబు:
ఎక్కడ ఆరోగ్యం ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది.
పై వాక్యంలోని ఎక్కడ, అక్కడ అనేవి అవ్యయాలు.

ప్రశ్న 2.
‘ఎప్పుడు’ అన్నది ఏ భాషాభాగం ? *(M.P)
జవాబు:
‘ఎప్పుడు’ అన్నది, ‘అవ్యయము’ అనే భాషాభాగము.

ప్రశ్న 3.
సర్వనామాల గుణాలను తెలియజేసే వాటిని ఏమంటారు ?
జవాబు:
సర్వనామాల గుణాలను తెలియజేసే పదాలను ‘విశేషణం’ అంటారు.

ప్రశ్న 4.
‘శ్రీజ మంచి తెలివిగల పిల్ల’ వాక్యంలోని విశేషణం ఏమిటి ?
జవాబు:
పై వాక్యంలో ‘మంచి’ అనే శబ్దము, ‘విశేషణము’.

TS Inter 2nd Year Telugu Grammar భాషాభాగములు

ప్రశ్న 5.
‘స్వాతి అందమైన అమ్మాయి’ వాక్యంలో అందమైన అన్నది ఏ భాషాభాగం ?
జవాబు:
ఈ వాక్యంలోని ‘అందమైన’ అనే శబ్దము, ‘విశేషణం’ అనే భాషాభాగం అవుతుంది.

ప్రశ్న 6.
‘వీడు అబద్ధాల కోరు’ వాక్యంలోని ‘వీడు’ అన్నది ఏ భాషాభాగం ? *(M.P)
జవాబు:
ఈ వాక్యంలోని ‘వీడు’ అనేది సర్వనామం.

ప్రశ్న 7.
‘రాము గ్రంథాలయానికి వెళ్ళాడు’ వాక్యంలోని క్రియ ఏమిటి ? *(M.P)
జవాబు:
ఈ వాక్యంలోని క్రియ ‘వెళ్ళాడు’ అనే శబ్దము.

ప్రశ్న 8.
‘రాముడు రావణుని సంహరించాడు’ వాక్యంలో ‘సంహరించాడు’ అన్నది ఏ భాషాభాగం ?
జవాబు:
ఈ వాక్యంలో ‘సంహరించాడు’ అనేది ‘క్రియ’.

ప్రశ్న 9.
భాషాభాగములు ఎన్ని రకాలు ?
జవాబు:
భాషాభాగములు ఐదు రకాలు.

ప్రశ్న 10.
నామవాచకానికి గల మరో పేరు ఏమిటి ? *(M.P)
జవాబు:
నామవాచకానికి గల మరో పేరు, ‘విశేష్యము’.

TS Inter 2nd Year Telugu Grammar భాషాభాగములు

ప్రశ్న 11.
‘సర్వనామం’ అనగానేమి ?
జవాబు:
నామవాచకానికి బదులు వాడబడే శబ్దాన్ని ‘సర్వనామం’ అంటారు.

ప్రశ్న 12.
‘అతడు శ్రీరాముడు’ వాక్యంలో ‘అతడు’ అన్నది ఏ భాషాభాగం ?
జవాబు:
‘అతడు’ అనేది, ‘సర్వనామము’.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 4 గోల్కొండ మధుర స్మృతులు

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material 4th Lesson గోల్కొండ మధుర స్మృతులు Textbook Questions and Answers.

TS Inter 2nd Year Telugu Study Material 4th Lesson గోల్కొండ మధుర స్మృతులు

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
గోల్కొండ కోట ప్రత్యేకతలను వర్ణించండి. (V.Imp) (M.P)
జవాబు:
అంతఃపురంలోని వసతులు: గోల్కొండ కోట కాకతీయ ప్రోలరాజు కన్నా ప్రాచీనమైంది. కాకతీయులనాడు ఈ కోట కొత్త వైభవాన్ని సంతరించుకుంది. రాజ ప్రతినిధులకు స్థావరంగా, యువరాజుకు నివాసంగా, కాకతీయ సైన్యానికి నిలయంగా, అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా రూపొందింది. ఖుతుబుషాహీల కాలంలో ఈ కోటలో అనేక సుందర భవనములు నిర్మించబడ్డాయి. అందులోని ఏర్పాట్లు ఈనాటికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. రాణులు నివసించే అంతఃపురం అన్నిరకాల భద్రతా ఏర్పాట్లతోపాటు సర్వాంగ సుందరంగా ఉంది.

మురికినీరు, వర్షపునీరు బైటికి పోవడానికి చేసిన ఏర్పాట్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అయిదారు అంతస్తుల మేడలు. ప్రతి అంతస్తుకు అవసరమయిన శుభ్రమైన నీరు రావడానికి, మురికి నీరు బైటకు పోవడానికి శాస్త్రీయమైన ఏర్పాట్లు చేశారు. మూడు వందల సంవత్సరాలు గడిచినా అవి ఇంకా నిలిచి ఉన్నాయి. కోటలో నీటి ఏర్పాటుకు వివిధ స్థాయిలలో దాదాపు ఎనిమిది బావులున్నాయి. మొదటి బావి అన్నిటికన్న క్రిందస్థాయిలో ఉంది.

అది అన్నింటికన్న పెద్దది. కోటకు పడమర ఆరుమైళ్ళ దూరంలో మొదటి బావికి సమాన స్థాయిలో “దుర్గమ్మ చెరువు” ఉంది. అది చాలా లోతుగా, విశాలంగా, శుభ్రంగా ఉండి మంచి నీటితో కొండల మధ్య ఉంది. మొదటి బావి నుంచి రెండవ బావికి ఆపై ఒకదానినుంచి వేరొకదానికి నీరు నింపబడేలా ఏర్పాట్లు చేశారు. అలా నింపడానికి ఉపయోగించే పర్ష్యా ఛత్రాలను తిప్పడానికి మానవులును, పశువులును ఉపయోగించేవారు.

ఉద్యానవనాల సౌందర్యం : గోల్కొండ కోటలో, చుట్టుప్రక్కల విశాలంగా, వివిధ రకాల పూలతోటలు ఉన్నాయి. అందులో ఆనాడు పుష్పించిన పూలపేర్లను ఈ రోజు పుస్తకాలలో చదవవలసిందే గాని అవి ఎలా ఉండేవో ఉహించలేము. ఆ పుష్పజాతులు అంతరించిపోయాయి. అంతఃపురంలో పెద్దకోనేరు, బయట “కటోర హవుజు” ఉన్నాయి. ఇందు ప్రతిరోజు నీటిని, రోజా పూవులను నింపేవారు. కటోరా హవుజు రాణీవాసపు స్త్రీలకు జలక్రీడా “స్థలం. దానిని అక్కడ ఉండే స్త్రీలు స్నానాలు జేయడానికి, ఈదులాటకు, నౌకా విహారం చేయడానికి ఉపయోగించేవారు. కటోరా హవుజు ఇప్పటికి ఉంది. కాని అంత శుభ్రంగా లేదు.

గోలకొండ కోటలో విశాలమైన, అందమైన రాజోద్యాన వనాలు, పుర ఉద్యానవనాలు ఉండేవి. అవి ఇంద్రలోకంలోని నందనవనాన్ని గుర్తు చేసే విధంగా ఉండేవి. సాయంకాల సమయములో కవులు, పండితులు ఆ పురోద్యానవనాలలో గుంపులు గుంపులుగా కూర్చుండి సారస్వత చర్చలు, కవితా గోష్ఠులు చేసేవారు. నగీనాబాఘ్ అనే ఉద్యానవనం చారిత్రక ప్రసిద్ది కలిగినది.

కోటలో ఉన్న భవనాలు : కోటలో అంతఃపురాలు, సభాభవనాలు, కార్యాలయాలు, జలాశయాలు, క్రీడామైదానాలు మాత్రమే గాక సైనిక సమూహాలు నివసించే ఇండ్లు, అధికారుల నివాసస్థానాలు, పారిశ్రామికుల ఇండ్లు, పండిత, పామర నాగరికుల ఇండ్లు ఉన్నాయి. వాళ్ళకు మరుగుదొడ్లు, మురుగు నీరుపారే వసతులు, స్నానపు గదులు, వాటికి వేడి, చల్లనీటి ఏర్పాట్లు మొదలైన సామాజిక ఆరోగ్యానికి అవసరమైన ఇతర వసతులు కల్పించబడ్డాయి.

ఆయుధ కర్మాగారాలు, టంకశాలలు, సైనిక శిక్షణ కేంద్రాలు, పాఠశాలలు, వైద్యశాలలు, సత్రాలు, సైనిక సమూహ ప్రణాళికా రచన, పరిశీలన స్థావరాలు ఉండేవి. ఖుతుబుషాహీల టంకశాల, భాండాగారము ఈనాటికీ “ఖజాన బిల్డింగు” అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ పురావస్తుశాఖవారి ఆధీనంలో ఉంది. దానిని ఆనుకొని ఖుతుబుషాహీల ఆయుధాగారము ఉండేది. దానికి ఆనుకొని ఉన్న భవనాలలో సైనిక ప్రజా పరిపాలనాధికారులుండే గృహాలు ఉండేవి. వాటిని దారికి ఇరువైపులా అందమైన వరుసలలో నిర్మించారు.

రాతిఫలకం విశేషత : రాజాంతఃపురపు సింహద్వారంలో నేలపై ఉన్న రాతిఫలకమీద నిలబడి చప్పట్లు కొడితే దాని ప్రతిధ్వని అంతఃపురంలోకి వినిపిస్తుంది. ఇది జహంగీరు చక్రవర్తి న్యాయ ఘటికాయంత్రం కంటే గొప్ప విషయం. కోటలో రాజాంతఃపురాలను దాటిపోతే భాండాగారాలు, తుపాకి మందుగుండు నిలువజేసే గదులు, జైలుగదులు కనిపిస్తాయి. బాలాహిస్సారుకు పోయేదారిలో మస్జిదు, మందిరం ఒకదాని పక్కన మరొకటి ఉంటాయి. ఖుతుబుషాహీల మత సహనానికి సజీవ సాక్ష్యంగా ఈనాటికీ అవి కనిపిస్తాయి. “బాలా హిస్సారు” కు పోయే దారిలో రామదాసు చెఱశాల అని ఒక రాతి గుహను చూపిస్తారు. అందులో ఉన్న చలువరాతిపై శ్రీరాముని ఆకారము రామదాసు చెక్కినదే అని కూడా అంటారు. ఇది రామదాసున్న బందీఖాన యని చెప్పు ఆధారాలు లేవు. కాళ్లు చేతులు సంకెళ్ళతో బంధించబడిన గోపన్న ఉలి సుత్తి లేకుండా శిలపై రాముని చిత్రం చెక్కడం నమ్మదగిన విషయం కాదు.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 4 గోల్కొండ మధుర స్మృతులు

ప్రశ్న 2.
ఖులీఖుతుబ్ షా సమాధుల నిర్మాణ విశేషాలను తెలుపండి.
జవాబు:
గోల్కొండ దుర్గమునకు పడమర సుమారు మైలుదూరంలో ఒక ఎత్తైన సహజసుందరమైన మైదానముంది. ఆ ప్రదేశములో ఖుతుబుషాహీ పాలకుల సమాధులున్నాయి. ఈ ప్రదేశములో ఫలాలతో, పుష్పాలతో నిండిన తోటలుండేవి. కొన్ని ఈనాటికీ ఉన్నాయి. ఈ సమాధుల చుట్టు ఎత్తైన రాతి గోడ ఉంది. ఇందులో ఉన్న సమాధులలో కొన్ని ఖుతుబుషాహి రాజులవికావు. వీటిలో ప్రేమావతి తారామతి, రాజవైద్యుని సమాధులు మాత్రమే గాక రాజాదరణ పొందిన వేరొకరి సమాధికూడా ఉంది. రాజు బంధువులని చెప్పబడేవారి సమాధులు కొన్ని అక్కడక్కడ ఉన్నాయి. మహమ్మదు ఖులీ ఖుతుబుషా సమాధి నిర్మించిన పద్ధతికన్న జమీదు ఖులీ గోరి నిర్మించిన పద్ధతి వేరు. రెండు పర్ష్యా దేశపు నిర్మాణ రీతులనే విశేషంగ అనుకరించి నిర్మించారు.

ఇబ్రహీము ఖులీఖుతుబుషా సమాధి కూడా పెద్దదే. అందలి శిల్పవిజ్ఞానము, నిర్మాణరీతులు క్రొత్తపుంతలు తొక్కినవి. దాని దగ్గరనే మహమ్మదు ఖుతుబుషా సమాధి ఉంది. సమచతురశ్రమగు ఉన్నత వేదికపై అత్యంత సుందరంగ కట్టబడిన బ్రహ్మాండమైన కట్టడమిది. అందులోని శిల్పనిర్మాణ చాతుర్యం హిందూ, ముస్లిం, ఇండో, ఈరానియన్ శిల్ప సాంస్కృతుల కలయికకు చక్కని ఉదాహరణగా నిలుస్తుంది. అందులోని రాతి పుష్పాలు ఇస్లాం మతానికి వ్యతిరేకం అని వాటిని ధ్వంసం చేశారు. అయినా అవి సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తూనే ఉన్నాయి.

మహమ్మదు ఖుతుబ్ షా భాగ్యనగర నిర్మాత. గుల్జారుహౌజు, మక్కా మసీదు, చార్ మినార్ వంటి విఖ్యాత కట్టడాలు ఇతను ప్రారంభించినవే. దక్షిణాపథములో ఉర్దూ భాషకు ఇతన్ని పిత అంటారు. అతని సమాధివద్ద ఈనాటికి ప్రార్థనలు, మత కర్మకాండలు మాత్రమే గాక ఉర్దూ దినం, ఖుతుబుషాహి దినం జరుపుతారు. ఈ సందర్భంగా పండితులతో సారస్వతోపన్యాసములు జరుగుతాయి. ఆ దినాలలో అక్కడ చరిత్ర సంస్కృతులను గురించిన చర్చలు జరుగుతాయి. ఇతని భార్య పేరు హయ్యతు బట్టీ బేగం, ఈమెకు ఈ వంశ చరిత్రలోను గోల్కొండ సంస్కృతిలోను ఒక విశిష్ట స్థానముంది. ఆమె ఖుతుబుషాహీ రాజులలో వరుసగ ఒకనికి కూతురు.

వేరొకనికి భార్య, మరొకనికి తల్లి. ఈమెకు బ్రహ్మాండమైన సమాధి నిర్మించబడింది. దీని నిర్మాణ పద్ధతికూడా విశిష్టమైనది. అబ్దుల్లా ఖుతుబుషా సమాధి చాల పెద్దది. దాని నిర్మాణ పద్ధతికూడా విభిన్నమైనది. దానిని డబుల్ డోల పద్ధతి అంటారు. దీనిలో పైకి కనిపించే గుమ్మటమే గాక దానిలోన కూడా ఎక్కువ నేర్పు గల మరొక గుమ్మటముంది.

ఈ సమాధులు బ్రహ్మాండమైన కట్టడములు. వీటిని చూడడానికి తండోపతండములుగా జనాలు నేటికి చాలా మంది వస్తుంటారు. విదేశీయులు సైతం ఈ సమాధులను చూసి ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని పొందుతారు. చనిపోయిన రాజుల భౌతిక దేహాలను, వారి బంధువుల శవములను ఇక్కడికి తెచ్చి చివరిస్నానము చేయిస్తారు. అంత్య క్రియలు చేయడానికి ఇక్కడ ఒక చిన్న అందమైన కట్టడముంది. ఈ రాజులు షియా సంప్రదాయానికి చెందినవారు. వారు పన్నెండు మంది ఇమాములను పూజిస్తారు. కావున ఈ కట్టడంలో పన్నెండు కోణాలు,

పన్నెండు మెట్లు, పన్నెండు చెంబులు, పన్నెండు ఆకుల ఆకారాలు, ఇలా అన్నీ పన్నెండు ఉంటాయి. ఇది చూడవలసిన చక్కని చిన్న కట్టడం. ఈ సమాధులు అత్యున్నతాలు, అపూర్వాలు, అతిసుందరాలు. ఒకప్పుడివి సర్ఫేఖాస్ (నిజాం నవాబు) ఆస్తి. ఆపై కేంద్రపురావస్తు పర్యవేక్షణలోకి వచ్చాయి. ఇప్పుడవి పురావస్తు శాఖవారి అధీనములో ఉన్నాయి. సుమారు ఎనిమిది లక్షల వ్యయముతో ఈ సమాధులను, పెద్ద ఉద్యానవనములను, క్రీడాసరోవరములను, నౌకా విహారావకాశములను, రమణీయ ఆరామాలను, విశ్రాంతి భవనాలను, పురావస్తు ప్రదర్శనశాలలను, మిరుమిట్లుగొలుపు దీపమాలికలను, జలయంతరాలను, అపురూపమైన పూదోటలను ఏర్పాటు జేసి, దీనిని భారతదేశములోనే ప్రథమ శ్రేణికి చెందిన యాత్రిక కేంద్రముగ రూపొందించే ఆలోచన ఉన్నది. ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి తప్పక దీనిని అభివృద్ధి పరచాలని ఎందరో ఒప్పుకుంటారు.

II సంగ్రహరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
గోల్కొండ కోటలోని నీటి ఏర్పాట్లను తెలుపండి.
జవాబు:
గోలకొండ కోటలో అనేక సుందర భవనములు నిర్మించబడ్డాయి. అందులోని ఏర్పాట్లు ఈనాటికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. రాణులు నివసించే అంతఃపురం అన్నిరకాల భద్రతా ఏర్పాట్లతోపాటు సర్వాంగ సుందరంగా ఉంది. మురికినీరు, వర్షపునీరు బైటికి పోవడానికి చేసిన ఏర్పాట్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అయిదారు అంతస్తుల మేడలు. ప్రతి అంతస్తుకు అవసరమయిన శుభ్రమైన నీరు రావడానికి, మురికి నీరు బైటకు పోవడానికి శాస్త్రీయమైన ఏర్పాట్లు చేశారు. మూడు వందల సంవత్సరాలు గడిచినా అవి ఇంకా నిలిచి ఉన్నాయి. కోటలో నీటి ఏర్పాటుకు వివిధ స్థాయిలలో దాదాపు ఎనిమిది బావులున్నాయి.

మొదటి బావి అన్నిటికన్న క్రిందస్థాయిలో ఉంది. అది అన్నింటికన్న పెద్దది. కోటకు పడమర ఆరుమైళ్ళ దూరంలో మొదటి బావికి సమాన స్థాయిలో “దుర్గమ్మ చెరువు” ఉంది. అది చాల లోతుగా, విశాలంగా, శుభ్రంగా ఉండి మంచి నీటితో కొండల మధ్య ఉంది. మొదటి బావి నుంచి రెండవ బావికి ఆపై ఒకదానినుంచి వేరొకదానికి నీరు నింపబడేలా ఏర్పాట్లు చేశారు. అలా నింపడానికి ఉపయోగించే పర్ష్యా ఛత్రాలను తిప్పడానికి మానవులును, పశువులును ఉపయోగించేవారు.

ప్రశ్న 2.
‘పురానపుల్’ నిర్మించుటకు గల కారణాలు ఏవి ?
జవాబు:
భాగ్యమతి ప్రేమ వలలో చిక్కుకున్న నవయువకుడు, యువరాజు మహమ్మదు ఖులీ కుతుబ్షా పొంగి పొరిలే ముచుకుందా నదిని తన గుర్రంతో దాటి ఆవలి తీరానికి సురక్షితముగ జేరుకున్నాడు. అలా ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదిలోకి వెళ్ళిన తమ కుమారున్ని చూసి అతని తల్లిదండ్రులు మహమ్మదు ఇబ్రహీం ఖుతుబుషా (మల్కిభరాముడు), అతని భార్య తల్లడిల్లిపోయారు. ఇటువంటి ప్రమాడం మళ్ళీ రాకూడదని మూసీనదిపై రాజ దంపతులు పురానపుల్ను నిర్మించారు. అది ఇప్పటికి ప్రజోపయోగకరంగ నిలచి ఉంది. భాగ్యమతి పేరు మీదనే హైద్రాబాదు నిర్మించబడింది.

ప్రశ్న 3.
గోల్కొండ కళాకారుల వైశిష్ట్యాన్ని వివరించండి.
జవాబు:
రాజాంతఃపురపు సింహద్వారంలో నేలపై ఉన్న రాతిఫలకమీద నిలబడి చప్పట్లు కొడితే దాని ప్రతిధ్వని అంతః పురంలోకి వినిపిస్తుంది. ఇది జహంగీరు చక్రవర్తి న్యాయ ఘటికాయంత్రం కంటే గొప్ప విషయం. కోట పడమటి ద్వారాన్ని బంజార దర్వాజ అంటారు. స్థానికముగ లభించే తెల్లటి గ్రానైటురాయితో ఈ కోటను నిర్మించారు. తుపాకి గుండ్లను కూడా బంతులలాగా తిరుగ గొట్టేంత గట్టితనమున్న రాయి అది. ఆ గట్టితనమును కొట్టలేకనే మొఘలులు ఈ కోట గోడలను, సొరంగముల ద్వారా కూల్చే ప్రయత్నం చేశారు. అయినా మూడు సార్లు విఫలులైనారు. తూర్పుభాగంలో ఉన్న బురుజును మాత్రము వారు కూల్చగలిగారు. కాని మరునాటి ఉదయం వరకే దానిని గోల్కొండవారు ఎప్పటిమాదిరి నిలబెట్టారు. అదిచూసి మొఘలులు ఆశ్చర్యపోయారు. ఆ బురుజు నిజమయిన రాతితో నిర్మించబడింది కాదని వారికి తెలియదు. కాగితము పనితనమునకు అది ఒక పరాకాష్ట. గోల్కొండ కళాకారుల వైశిష్ట్యమునకు అదొక గొప్ప ఉదాహరణ.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 4 గోల్కొండ మధుర స్మృతులు

ప్రశ్న 4.
ఖజానా బిల్డింగ్లోని పురావస్తు ప్రదర్శనశాల విశేషాలను తెలుపండి.
జవాబు:
గోలకొండకోట కేంద్రప్రభుత్వ పురావస్తుశాఖవారి యాజమాన్యంలో, షంషీరుకోట్, ఖజాన బిల్డింగులు ఆంధ్రప్రదేశ్ పురావస్తుశాఖ వారి పర్యవేక్షణలో ఉన్నాయి. వారు ఖజాన బిల్డింగును పురావస్తు ప్రదర్శనశాలగా మార్చారు. అందులో వివిధ శతాబ్దముల సంస్కృతులకు చెందిన సుందర శిల్పకళాఖండాలు, అమూల్యములైన శిలాశాసనాలు ప్రదర్శించబడుచున్నాయి. ఆ శిల్పసంపద, ఆనాటి సాంస్కృతీ, సామాజిక వైభవాలకు దర్పణంగా నిలుస్తుంది. ఆ పురావస్తుశాల పర్యవేక్షణకు ఒక అధికారి, కొంత సిబ్బంది నియమితులైనారు. దీని ప్రక్కనే షంషీరుకోట్ ఉంది. దానిలో ఆనాటి వివిధ ఆయుధాలు భద్రపరిచారు. వీటిని సాధారణంగా ప్రదర్శించరు. కాని ప్రదర్శించుట చాల అవసరం.

III ఏకపద/వాక్య సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భూపాలరావుకు తెలిసిన భాషలను పేర్కొనండి.
జవాబు:
తెలుగు, సంస్కృతం, కన్నడ, మరాఠి, హిందీ, ఫ్రెంచి, డచ్.

ప్రశ్న 2.
భూపాలరావు రాయప్రోలు సుబ్రహ్మణ్యంతో కలిసి ఏ గ్రంథాన్ని రచించాడు ?
జవాబు:
దేవాలయ చరిత్ర

ప్రశ్న 3.
‘గోల్కొండ మధురస్మృతులు’ పాఠం ఏ పుస్తకం లోనిది ?
జవాబు:
మహామంత్రి మాదన్న

ప్రశ్న 4.
సింహద్వారం నేలపైనున్న రాతిఫలకము ప్రత్యేకత ఏమిటి ?
జవాబు:
రాజాంతఃపురపు సింహద్వారంలో నేలపై ఉన్న రాతిఫలకమీద నిలబడి చప్పట్లు కొడితే దాని ప్రతిధ్వని అంతఃపురంలోకి వినిపిస్తుంది.

ప్రశ్న 5.
మొహర్రం పదవరోజున ఏ ఉత్సవాలు జరుగుతాయి ?
జవాబు:
బీబీకా ఆలం, ఏనుగు అంబారీ లంగరు ఉత్సవాలు.

ప్రశ్న 6.
‘ఎనుగల చెట్టు’ గొప్పదనం తెలుపండి.
జవాబు:
గోలకొండ కోటలో ఎనుగల చెట్టు అని పిలువబడే ఒక పెద్ద జువ్వి చెట్టు ఉంది. దీని చుట్టుకొలత సుమారు వంద అడుగులు. ఇంత పెద్ద చుట్టుకొలత ఉన్న జువ్విచెట్లు చాల తక్కువ.

ప్రశ్న 7.
‘డబుల్ డోల పద్ధతి’లో ఎవరి సమాధి నిర్మించారు ?
జవాబు:
అబ్దుల్లా కుతుబ్షా

TS Inter 2nd Year Telugu Study Material Chapter 4 గోల్కొండ మధుర స్మృతులు

ప్రశ్న 8.
భాగ్యనగర నిర్మాత ఎవరు ?
జవాబు:
మహమ్మదు ఖుతుబ్ షా

కఠిన పదాలకు అర్ధములు

63వ పుట

రజాకారులు = నిజాం రాజు పాలన కోసం పాకిస్తాన్ నుండి తెచ్చుకున్న ఖాసిం రజ్వి తయారు చేసిన సైన్యం
అరాచకాలు = దుర్మార్గాలు

64వ పుట

దుర్గ౦ = కోట
పురాతనము = ప్రాచీనం
క్రమేపి = క్రమంగా, కాలం గడిచిన కొద్ది
సంతరించుకున్న = పొందిన
దుర్నిరీక్షత = చూడ శక్యం కాని
నాడు = ఆ రోజుల్లో
అబ్దములు = సంవత్సరాలు
దశాంతర = వివిధ దశల్లో
వైభవం = గొప్పతనం
స్థావరం = ఉండే చోట
నివేశనము = నివసించే చోటు, ఇల్లు
వాహిని = సైన్యం
స్కందావారము = సైన్యం ఉండే చోటు
సంభ్రమ + ఆశ్చర్యములు = సంతోషం, అచ్చెరువు
రాణివాసం = రాణులు నివసించే చోటు
సర్వతో భద్రము = అన్ని రకాలుగా సురక్షిత
అంతఃపురం = రాణులు నివసించే చోటు
మనోరంజకము = మనస్సును ఆనందపరిచేది
ముర్కినీరు = మురికి నీరు
ముచ్చట గొలుపు = కోరికను కలిగించు
శుభ్ర + ఉదకము = శుభ్రమైన నీరు
శాస్త్రీయ = శాస్త్రము చెప్పిన విధంగా

65వ పుట

ఎన్మిది = ఎనిమిది
మైలు = ఎనిమిది ఫర్లాంగుల దూరం
అగాధం = లోతైన
విస్తృత = విశాలమైన
నిర్మల = శుభ్రమైన
మధుర = తీయని
జలాశయము = చెరువు
పటిష్ఠము = దృఢమైన
నిరంతరము = ఎల్లప్పుడూ
పర్ష్యా ఛత్రపు = పర్ష్యా దేశంలో వాడే గిరక వంటిది
తోచుట = అనిపించుట
జల సమృద్ధి = కావలిసినంత నీరు
దృవపడింది = ఋజువైంది
విస్తార = విశాల
మెండు = ఎక్కువ
అంతరించు = నశించు, లేకుండా పోవు
కోనేరు = చెరువు
కటోరా హవుజు = గిన్నె ఆకారంలో నిర్మితమైన చెరువు
రోజా పూవులు = గులాబి పూవులు
కేళి కాసారము = ఆడుకునే సరస్సు
నౌకా విహారము = పడవలలో తిరుగుట
పన్నీరు = సువాసననిచ్చే జలం
కన్నీరు = కంటి నీరు (బాధ)
విపులము = విశాలము
సుందర = అందమైన
రాజ + ఉద్యానములు = రాజులు విహరించే పూల తోటలు
పుర + ఉద్యానములు = పుర ప్రజలు విహరించే పూల తోటలు
ఆకర్షణ = మనసును లాగడం
నందన వనం = స్వర్గంలోని పూలతోట (ఇంద్రుని ఉద్యానవనం పేరు)
తలపించెడి = గుర్తు చేసే
సాయం సమయం = సాయంకాల సమయం
గుములుగా = గుంపులుగా
సారస్వత చర్చలు = సాహిత్య చర్చలు
కవితా గోష్ఠులు = కవిత్వ చర్చలు
చారిత్రకము = చరిత్రలో నిలిచినది
ప్రసిద్ధము = పేరు పొందినది
సమృద్ధ = కావలిసినంత
క్రీడ + ఆరామములు = ఆటలాడే స్థలాలు
సైనిక = సైనికుల
నికాయ = సమూహం
వసతి గృహాలు = నివసించే స్థలాలు (ఇళ్ళు)
పారిశ్రామికుల = పరిశ్రమలను స్థాపించిన వారు
గేహము = గృహం, ఇల్లు చదువుకున్నవారు
పండితులు = చదువుకున్నారు
పామరులు = చదువు లేనివారు
నాగరికుల = ప్రజల
టంకశాల = నాణెములు తయారు చేసే స్థలం
సత్రం = ఉచిత భోజన వసతి కల్పించే స్థలం
వ్యూహం = ప్రణాళిక
భాండాగారము = ధనం ఉంచే స్థలం
ఖజానా = భాండాగారం

66వ పుట

స్వాధీనమందు = అధీనంలో, పర్యవేక్షణలో
ఆయుధాగారము = ఆయుధములు ఉంచే స్థలం
యాజమాన్యములో = పాలనలో
నికేతనములు = ఇండ్లు
బారులు తీరి = వరుసగా
సింహ ద్వారము = ప్రధాన మార్గం
రాతి ఫలకం = రాతితో చేసిన ఫలకం
అపూర్వమగు = అంతకుముందు లేని, విశేషమైన
చెరశాల = బందిఖానా, జైలు కనిపిస్తాయి
అగుపడును = కనిపిస్తాయి
మార్గం = దారి
సరసన = పక్కన
మతసహనం = ఇతరమతాలపై ఓర్పు
తార్కాణం = నిదర్శనం
చూపింతురు = చూపిస్తారు
చట్రాతిపై = చలువరాతిపై
ఆధారములు = సాక్ష్యములు
నిగళ బద్ధములై = సంకెళ్ళతో బంధించిన
ఉలి = రాళ్ళను చెక్కే సాధనం
సుత్తి = ఉలిని కొట్టడానికి వాడే ఇనుప సాధనం
రూఢిగా = నిశ్చయముగా
రూపాంతరము = రూపము మార్చుకొని
ప్రేమ వాగురులు = ప్రేమ అనే వలలు
తగుల్కొని = చిక్కుకొని
పరవళ్ళు తొక్కుతూ = వేగంగా ప్రవహిస్తూ
నురుగులు గ్రక్కుతూ = ప్రవాహ వేగానికి నురగలు వస్తుంటే
ముచుకుందు నది = మూసి నది
సీరికిస్థానక = లెక్క చేయక
భీషణ ఘోషలు = భయంకర శబ్దాలు
నలు దిశల = నాలుగు వైపులా
మ్రానుల = చెట్లను
సమూలంగా = వేర్లతోసహా
పెకిలించి = ఊడదీసి
తరంగ డోలికల = “అలల ఉయ్యాలలో
కొనిపోవుచున్న = తీసుకొని పోతున్న
ప్రవేశించు = పోవు
దేవేరి = భార్య, రాణి
తల్లడిల్లిరి = బాధపడ్డారు
పునరావృతము కారాదని = మళ్ళీ రాకూడదని
పూనికతో = సంకల్పంతో
అతిలోక సుందరి = అన్ని లోకాలలో వారికంటే అందమైనది
రూపసంపద = రూపము అనే సంపద (అందం)

67వ పుట

ప్రజా + ఉపయోగ = ప్రజలకు ఉపయోగపడే
అంతేవాసిని = దగ్గర ఉన్నది
ఆసీనయై = కూర్చున్నప్పుడు
మత్తెక్కి = మదమెక్కి
మావటిని = ఏనుగును నడిపేవాడిని
మట్టుబెట్టి = చంపి
రాకుమారుని యుక్తముగా = రాకుమారునితో సహా
సమీప = దగ్గరి
అరణ్య = అడవి
రాజమాత = రాకుమారుని తల్లి, రాణి
తల్లడిల్లు హృదయంతో = బాధతో నిండిన మనస్సుతో
పీరులు = లోహంతో అర్థ చంద్రాకారంగా ఉండేవి
లంగరు ఉత్సవం తీయింతును = లంగరు అనే పేరుతో ఊరేగింపు తీయిస్తాను
మొహర్రం పదియవ రోజున = ఇస్లాం ప్రకారం హిజరీ శకం మొహర్రం నెలలో పదవ రోజు
రూపకల్పన = రూపాన్ని ఉహించడం
హృదయఫలకము మీద = హృదయము అనే ఫలకం మీద (మనస్సులో)
ఏనుగు అంబారిలంగరు = ఏనుగు అంబారీలపై ఊరేగించే ఉత్సవం
ప్రసిద్ధములు = పేరుపొందినవి
అనంతరం = తరువాత
ఉత్సవమును = పండగ
కోటకాల = కోటకు అవతలి వైపు
గవిని ( గైన్ అనే పదం ) = ప్రవేశ ద్వారం
సొరంగముల ద్వారా = భూమి లోపలనుండి తొలచిన ద్వారముల ద్వారా
ముమ్మారు = మూడు సార్లు
విఫలులైరి = విఫలం చెందారు
బురుజు = రాతితో ఎత్తుగా కట్టిన కట్టడం
శిథిలమైన = కూలిపోయిన
వేకువ, = ఉదయం
యథారూపంగా = ఎప్పటిమాదిరి
విభ్రాంతులైరి = ఆశ్చర్యపోయారు
నిస్పృహ = నిరాశ
నిస్తేజులను = మొఖంలో తేజస్సు కోల్పోయిన వారిగా ఉన్నత స్థితి
పరాకాష్ట = ఉన్నత స్థితి
వైశిష్ట్య౦ = విశిష్టత
ఉజ్వల + ఉదాహరణ = తిరుగులేని ఉదాహరణ
వృక్షరాజం = గొప్ప చెట్టు
అశేషజనం = జనులందరూ
కైవారము = చుట్టుకొలత
అరుదు = తక్కువ

TS Inter 2nd Year Telugu Study Material Chapter 4 గోల్కొండ మధుర స్మృతులు

68వ పుట

అమూల్యం = వెలకట్టలేని
ముగ్గులగుచుందురు = మురిసిపోతారు
దర్పణం = అద్దం
ప్రదర్శించరు = చూపించరు
రమారమి = సుమారు
ఫల పుష్ప భరిత = ఫలాలతో, పుష్పాలతో నిండినది
రాతి ప్రాకారం = రాతితో నిర్మించిన ప్రహరి గోడ
మకుటాధిపతులు = కిరీటాన్ని ధరించినవారు, రాజులు
చెదురుగా = అక్కడక్కడ
శిల్ప విన్నాణము = శిల్ప విజ్ఞానం, శిల్పాలు చెక్కడంలో నేర్పు
బ్రహ్మాండము = గొప్ప
శిల్ప ప్రాగల్భ్యం = శిల్పకళలో నేర్పు
ఈరానియన్ = ఇరాన్ దేశ సంప్రదాయం
కూడలి = కలయిక
శిలాపుష్పాలు = శిలపై చెక్కిన పుష్పాలు
వైకృత్తిక = వికారమైన
భిత్తిక = గోడ
సంభ్రమ + ఆశ్చర్యం = సంతోషం, ఆశ్చర్యం
కొలుపును = కలిగిస్తాయి
విఖ్యాత = ప్రఖ్యాత
సారస్వత + ఉపన్యాసాలు = సాహిత్య ప్రసంగాలు

69వ పుట

గుమ్మటం = దీపముంచే ఎత్తైన కట్టడం
తండోపతండాలు = గుంపులు గుంపులుగా
ధీటైన = సమానమైన
అరుదు = తక్కువ
చతురత = నేర్పు
తుది స్నానం = చనిపోయిన తరువాత చివరి స్నానం
చరమ కర్మకాండ = అంత్యక్రియలు
ఇమాం = ఇస్లాం మత పెద్ద
దళములు = ఆకులు
సమాధులు+అతి+ఉన్నతములు = మిక్కిలి ఎత్తైన సమాధులు
అధీనం = స్వాధీనంలో
వ్యయం = ఖర్చు
అపురూపమైన = అపూర్వమైన
నిర్వివాదాంశం = వివాదం లేని విషయం

గోల్కొండ మధుర స్మృతులు Summary in Telugu

TS Inter 2nd Year Telugu Study Material Chapter 4 గోల్కొండ మధుర స్మృతులు 1

రచయిత పరిచయం

పాఠం పేరు : గోల్కొండ మధురస్కృతులు
గ్రంథం : మహామంత్రి మాదన్న
దేనినుండి గ్రహించబడినది : ఇది మహామంత్రి మాదన్న పుస్తకము నుండి గ్రహించబడినది
రచయిత : కొమరగిరి వేంకట భూపాలరావు
తల్లిదండ్రులు : కమలమ్మ, సీతారామయ్య
కాలం : జననం : ఏప్రిల్ 12, 1916; మరణం : జనవరి 8, 2004
స్వస్థలం : హనుమకొండ దగ్గర వెంకటాపురం
తెలిసిన భాషలు : తెలుగు, సంస్కృతం, కన్నడ, మరాఠి, హిందీ, ఫ్రెంచి, డచ్
పరిశోధనాంశం : భాగ్యనగర చరిత్ర
రచనలు : తెలుగులో మహామంత్రి మాదన్న, ఆంగ్లంలో (The Illustrious Prime Minister). ఆచార్య రాయప్రోలు సుబ్రహ్మణ్యంతో కలిసి దేవాలయ చరిత్ర, హైదరాబాద్ నగరంపై సుమారు 20 పుస్తకాలు ఆంగ్లం, తెలుగు భాషల్లో రచించారు.
ఉద్యోగాలు : పురావస్తు శాఖలో కొన్ని రోజులు. తహసీల్దార్ నుండి కలెక్టర్ వరకు వివిధ పదవులు

విశేషతలు :

  • పురావస్తు శాఖలో పని చేసేటప్పుడు శిల్పకళను అధ్యయనం చేశారు.
  • కలెక్టర్గా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలల్లో మౌలిక వసతుల కల్పన చేశారు.
  • ఆయన సేవలకు గుర్తింపుగా భూపాలరావు పేరు మీద భూపాలపల్లి ఏర్పాటైంది.
  • రజాకార్ల అరాచకాల సమయంలో హైద్రాబాద్ విడిచివెళ్ళారు.
  • రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేయటం వల్ల జైలుజీవితం అనుభవించారు.
  • ఉద్యోగ విరమణ తర్వాత తిరిగి తన చారిత్రక పరిశోధన కొనసాగించి మహామంత్రి మాదన్న జీవితంపై “The Illustrious Prime Minister” పేరుతో ఆంగ్లంలో పుస్తకం రచించారు.
  • వరంగల్ సుబేదారీ ప్రాంతంలో మాదన్న విగ్రహస్థాపన చేయించారు.

పాఠ్యభాగ సందర్భం

కొమరగిరి భూపాలరావు విద్యాభ్యాసం కోసం హైదరాబాదుకు రావడంవల్ల, అక్కడ మాడపాటి హనుమంతరావు, ఆదిరాజు వీరభద్రరావుల పరిచయం కారణంగా హైదరాబాదు చరిత్రపట్ల ఆసక్తి పెరిగింది. హైదరాబాదు చరిత్రపై విస్తృత పరిశోధన చేసి ఇరవైకి పైగా తెలుగు, ఇంగ్లీషు పుస్తకాలు రాశారు. ఉద్యోగ విరమణ తరువాత మహామంత్రి మాదన్నపై విస్తృత పరిశోధన చేశారు. ఆయన జీవితంపై తెలుగులో, ఆంగ్లంలో పుస్తకాలు రాశారు. మహామంత్రి మాదన్న పుస్తకంలో గోలకొండ కోట గురించి రాసిన వ్యాసం ప్రస్తుత మన పాఠ్యభాగం. అది గ్రాంథికంలో ఉంది. సరళ ప్రామాణిక భాషలో సారాంశాన్ని ఇస్తున్నాము.

పాఠ్యభాగ సారాంశం

అంతఃపురంలోని వసతులు : గోల్కొండ కోట కాకతీయ ప్రోలరాజు కన్నా ప్రాచీనమైంది. కాకతీయులనాడు ఈ కోట కొత్త వైభవాన్ని సంతరించుకుంది. రాజ ప్రతినిధులకు స్థావరంగా, యువరాజుకు నివాసంగా, కాకతీయ సైన్యానికి నిలయంగా, అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా రూపొందింది. ఖుతుబుషాహీల కాలంలో ఈ కోటలో అనేక సుందర భవనములు నిర్మించబడ్డాయి. అందులోని ఏర్పాట్లు ఈ నాటికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. రాణులు నివసించే అంతఃపురం అన్నిరకాల భద్రతా ఏర్పాట్లతోపాటు సర్వాంగ సుందరంగా ఉంది.

మురికినీరు, వర్షపునీరు బైటికి పోవడానికి చేసిన ఏర్పాట్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అయిదారు అంతస్తుల మేడలు. ప్రతి అంతస్తుకు అవసరమయిన శుభ్రమైన నీరు రావడానికి, మురికి నీరు బైటకు పోవడానికి శాస్త్రీయమైన ఏర్పాట్లు చేశారు. మూడు వందల సంవత్సరాలు i^చినా అవి ఇంకా నిలిచి ఉన్నాయి. కోటలో నీటి ఏర్పాటుకు వివిధ స్థాయిలలో దాదాపు ఎనిమిది బావులున్నాయి.

మొదటి బా ఇన్నిటికన్న క్రిందస్థాయిలో ఉంది. అది అన్నింటికన్న పెద్దది. కోటకు పడమర ఆరుమైళ్ళ దూరంలో మొదటి బావికి సమాన స్థాయిలో “దుర్గమ్మ చెరువు” ఉంది. అది చాలా లోతుగా, విశాలంగా, శుభ్రంగా ఉండి మంచి నీటితో కొండల మధ్య ఉంది. మొదటి బావి నుంచి రెండవ బావికి ఆపై ఒకదానినుంచి వేరొకదానికి నీరు నింపబడేలా ఏర్పాట్లు చేశారు. అలా నింపడానికి ఉపయోగించే పర్యా ఛత్రాలను తిప్పడానికి మానవులును, పశువులును ఉపయోగించే వారు.

ఉద్యానవనాల సౌందర్యం : గోల్కొండ కోటలో, చుట్టుప్రక్కల విశాలంగా, వివిధ రకాల పూలతోటలు ఉన్నాయి. అందులో ఆనాడు పుష్పించిన పూలపేర్లను ఈ రోజు పుస్తకాలలో చదవవలసిందే గాని అవి ఎలా ఉండేవో ఉహించలేము. ఆ పుష్పజాతులు అంతరించిపోయాయి. అంతఃపురంలో పెద్దకోనేరు, బయట “కటోర హవుజు” ఉన్నాయి. ఇందు ప్రతిరోజు నీటిని, రోజా పూవులను నింపేవారు. కటోరా హవుజు రాణీవాసపు స్త్రీలకు జలక్రీడా స్థలం. దానిని అక్కడ ఉండే స్త్రీలు స్నానాలు జేయడానికి, ఈదులాటకు, నౌకా విహారం చేయడానికి ఉపయోగించేవారు. కటోరా హవుజు ఇప్పటికి ఉంది. కాని అంత శుభ్రంగా లేదు.

గోలకొండ కోటలో విశాలమైన, అందమైన రాజోద్యాన వనాలు, పుర ఉద్యానవనాలు ఉండేవి. అవి ఇంద్రలోకంలోని నందనవనాన్ని గుర్తు చేసే విధంగా ఉండేవి. సాయంకాల సమయములో కవులు, పండితులు ఆ పురోద్యానవనాలలో గుంపులు గుంపులుగా కూర్చుండి సారస్వత చర్చలు, కవితా గోష్ఠులు చేసేవారు. నగీనాబాఘ్ అనే ఉద్యానవనం చారిత్రక ప్రసిద్ధి కలిగినది.

కోటలో ఉన్న భవనాలు : కోటలో అంతఃపురాలు, సభాభవనాలు, కార్యాలయాలు, జలాశయాలు, క్రీడామైదానాలు మాత్రమే గాక సైనిక సమూహాలు నివసించే ఇండ్లు, అధికారుల నివాసస్థానాలు, పారిశ్రామికుల ఇండ్లు, పండిత, పామర నాగరికుల ఇండ్లు ఉన్నాయి. వాళ్ళకు మరుగుదొడ్లు, మురుగు నీరుపారే వసతులు, స్నానపు గదులు, వాటికి వేడి, చల్లనీటి ఏర్పాట్లు మొదలైన సామాజిక ఆరోగ్యానికి అవసరమైన ఇతర వసతులు కల్పించబడ్డాయి.

ఆయుధ కర్మాగారాలు, టంకశాలలు, సైనిక శిక్షణ కేంద్రాలు, పాఠశాలలు, వైద్యశాలలు, సత్రాలు, సైనిక సమూహ ప్రణాళికా రచన, పరిశీలన స్థావరాలు ఉండేవి. ఖుతుబుషాహీల టంకశాల, భాండాగారము ఈనాటికీ “ఖజాన బిల్డింగు” అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ పురావస్తుశాఖవారి ఆధీనంలో ఉంది. దానిని అనుకొని ఖుతుబుషాహీల ఆయుధాగారము ఉండేది. దానికి ఆనుకొని ఉన్న భవనాలలో సైనిక ప్రజా పరిపాలనాధికారులుండే గృహాలు ఉండేవి. వాటిని దారికి ఇరువైపులా అందమైన వరుసలలో నిర్మించారు.

రాతిఫలకం విశేషత : రాజాంతఃపురపు సింహద్వారంలో నేలపై ఉన్న రాతిఫలకమీద నిలబడి చప్పట్లు కొడితే దాని ప్రతిధ్వని అంతఃపురంలోకి వినిపిస్తుంది. ఇది జహంగీరు చక్రవర్తి న్యాయ ఘటికాయంత్రం కంటే గొప్ప విషయం. కోటలో రాజాంతఃపురాలను దాటిపోతే భాండాగారాలు, తుపాకి మందుగుండు నిలువజేసే గదులు, జైలుగదులు కనిపిస్తాయి. బాలాహిస్సారుకు పోయేదారిలో మస్జిదు, మందిరం ఒకదాని పక్కన మరొకటి ఉంటాయి. ఖుతుబుషాహీల మత సహనానికి సజీవ సాక్ష్యంగా ఈనాటికీ అవి కనిపిస్తాయి. “బాలా హిస్సారు” కు పోయే దారిలో రామదాసు చెఱశాల అని ఒక రాతి గుహను చూపిస్తారు. అందులో ఉన్న చలువరాతిపై శ్రీరాముని ఆకారము రామదాసు చెక్కినదే అని కూడా అంటారు.

ఇది రామదాసున్న బందీఖాన యని చెప్పు ఆధారాలు లేవు. కాళ్లు చేతులు సంకెళ్ళతో బంధించబడిన గోపన్న ఉలి సుత్తి లేకుండా శిలపై రాముని చిత్రం చెక్కడం నమ్మదగిన విషయం కాదు.

పురానాపూల్ నిర్మాణం : మరికొంత దూరం పోతే “బాలాహిస్సారు” కనిపిస్తుంది. అది తన మొదటి రూపమును . గోల్పోయి ఉంది. భాగ్యమతి ప్రేమ వలలో చిక్కుకున్న నవయువకుడయిన యువరాజు మహమ్మదు ఖులీ ఖుతుబుషా పొంగి పొరిలే ముచుకుందా నదిని తన గుర్రంతో ఆవలి తీరానికి సురక్షితముగ జేరుకున్నాడు. అలా ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదిలోకి వెళ్ళిన తమ కుమారున్ని చూసి అతని తల్లిదండ్రులు మహమ్మదు ఇబ్రహీం ఖుతుబుషా (మల్కిభరాముడు), అతని భార్య తల్లడిల్లిపోయారు. ఇటువంటి ప్రమాదం మళ్ళీ రాకూడదని మూసీనదిపై ఆ రాజ దంపతులు పురానపుల్ను నిర్మించారు. అది ఇప్పటికి ప్రజోపయోగకరంగ నిలచిఉంది. భాగ్యమత్తి పేరు మీదనే హైద్రాబాదు నిర్మించబడింది.

బిబికా ఆలం నిర్వహణకు కారణం : ఆ బాలాహిస్సారులో యున్నప్పుడే మరొకసారి యువరాజు ఎక్కిన ఏనుగుకు మత్తెక్కి మావటీని చంపింది. రాకుమారునితో సహా దగ్గరలో ఉన్న అడవిలోకి పారిపోయింది. అది చూసిన రాజమాత తల్లడిల్లే హృదయంతో తన కొడుకు సురక్షితంగా తిరిగివస్తే పేరులను చేయిస్తానని, లంగరు ఉత్సవం చేస్తానని, ఏనుగుపై నెక్కించి నూరేగిస్తానని మొక్కుకుంది. మొహర్రము పదవరోజు హైద్రాబాదులో ఈనాటికీ కనిపించే బీబీకా ఆలం, లంగరు ఉత్సవముల రూపకల్పన రాణి హృదయ ఫలకం మీద ఈ బాలాహిస్సారులోనే జరిగింది. భారతదేశము మొత్తం మీద ఈ బీబీకా ఆలం, ఈ ఏనుగు అంబారీ లంగరు ప్రసిద్ధమైనవి.

ఖుతుబుషాహీల తర్వాత ఆసఫ్ జాహీలు కూడ ఈ ఉత్సవాన్ని పెద్ద ఎత్తున జరిపించారు. నేటికి పదవ మొహర్రము నాడు లక్షలమంది ఈ వేడుకలలో పాల్గొంటారు.

కోట పటిష్టత : కోటకు అవతలి వైపు తూర్పున తానాషా గురువయిన (రజియొద్దీన్) షా రాజు ఖత్తాల్ సమాధి ఉంది. కోట పడమటి ద్వారాన్ని బంజార దర్వాజ అంటారు. స్థానికముగా లభించే తెల్లటి గ్రానైటురాయితో ఈ కోటను నిర్మించారు. తుపాకి గుండ్లను కూడా బంతులలాగా తిరుగ గొట్టేంత గట్టితనమున్న రాయి అది. ఆ గట్టితనమును కొట్టలేకనే మొఘలులు ఈ కోట గోడలను, సొరంగముల ద్వారా కూల్చేప్రయత్నం చేశారు. అయినా మూడుసార్లు విఫలులైనారు. తూర్పుభాగంలో ఉన్న బురుజును మాత్రము వారు కూల్చగలిగారు.

కాని మరునాటి ఉదయం వరకే దానిని గోల్కొండవారు ఎప్పటిమాదిరి నిలబెట్టారు. అది చూసి మొఘలులు ఆశ్చర్యపోయారు. ఆ బురుజు నిజమయిన రాతితో నిర్మించబడింది కాదని వారికి తెలియదు. కాగితము పనితనమునకు అది ఒక పరాకాష్ట. గోల్కొండ కళాకారుల వైశిష్ట్యమునకు అదొక గొప్ప ఉదాహరణ.

ఏనుగల చెట్టు విశిష్టత : ఈ కోటలో ఎనుగల చెట్టు అని పిలువబడే ఒక పెద్ద వృక్షమున్నది. అది ఖుతుబుషాహీలకు పూర్వముదని దానిని గౌరవించేవారు. దీనిని చూడటానికి అశేషజనం ఈనాటికీ వస్తారు. దీని చుట్టుకొలత సుమారు నూరడుగులు. ఇంత పెద్ద చుట్టుకొలత ఉన్న జువ్విచెట్లు చాలా తక్కువ.

ప్రదర్శనశాలగా కోట : గోలకొండకోట కేంద్రప్రభుత్వ పురావస్తుశాఖవారి యాజమాన్యంలో, షంషీరుకోట్, ఖజాన బిల్డింగులు ఆంధ్రప్రదేశ్ పురావస్తుశాఖ వారి పర్యవేక్షణలో ఉన్నాయి. వారు ఖజాన బిల్డింగును పురావస్తు ప్రదర్శనశాలగా మార్చారు. అందులో వివిధ శతాబ్దముల సంస్కృతులకు చెందిన సుందర శిల్పకళాఖండాలు,

అమూల్యములైన శిలాశాసనాలు ప్రదర్శించబడుచున్నాయి. ఆ శిల్పసంపద, ఆనాటి సాంస్కృతీ, సామాజిక వైభవాలకు దర్పణంగా నిలుస్తుంది. ఆ పురావస్తుశాల పర్యవేక్షణకు ఒక అధికారి, కొంత సిబ్బంది నియమితులైనారు. దీని ప్రక్కనే షంషీరుకోట్ ఉంది. దానిలో ఆనాటి వివిధ ఆయుధాలు భద్రపరిచారు. వీటిని సాధారణంగా ప్రదర్శించరు. కాని ప్రదర్శించుట చాల అవసరం.

సమాధుల విశిష్టత : గోల్కొండ దుర్గమునకు పడమర సుమారు మైలుదూరంలో ఒక ఎత్తైన సహజసుందరమైన మైదానముంది. ఆ ప్రదేశములో ఖుతుబుషాహీ పాలకుల సమాధులున్నాయి. ఈ ప్రదేశములో ఫలాలతో, పుష్పాలతో నిండిన తోటలుండేవి. కొన్ని ఈనాటికీ ఉన్నాయి. ఈ సమాధుల చుట్టు ఎత్తైన రాతి గోడ ఉంది. ఇందులో ఉన్న సమాధులలో కొన్ని ఖుతుబుషాహి రాజులవికావు. వీటిలో ప్రేమావతి తారామతి, రాజవైద్యుని సమాధులు మాత్రమే గాక రాజాదరణ పొందిన వేరొకరి సమాధికూడా ఉంది. రాజు బంధువులని చెప్పబడేవారి సమాధులు కొన్ని అక్కడక్కడ ఉన్నాయి. మహమ్మదు ఖులీ ఖుతుబుషా సమాధి నిర్మించిన పద్ధతికన్న జమీదు ఖులీ గోరి నిర్మించిన పద్ధతి వేరు. రెండు పర్ష్యా దేశపు నిర్మాణ రీతులనే విశేషంగా అనుకరించి నిర్మించారు. ఇబ్రహీము ఖులీఖుతుబుషా సమాధి కూడా పెద్దదే.

అందలి శిల్పవిజ్ఞానము, నిర్మాణరీతులు క్రొత్తపుంతలు తొక్కినవి. దాని దగ్గరనే మహమ్మదు ఖుతుబుషా సమాధి ఉంది. సమచతురశ్రమగు ఉన్నత వేదికపై అత్యంత సుందరంగా కట్టబడిన బ్రహ్మాండమైన కట్టడమిది. అందులోని శిల్పనిర్మాణ చాతుర్యం హిందూ, ముస్లిం, ఇండో, ఈరానియన్ శిల్ప సాంస్కృతుల కలయికకు చక్కని ఉదాహరణగా నిలుస్తుంది. అందులోని రాతి పుష్పాలు ఇస్లాం మతానికి వ్యతిరేకం అని వాటిని ధ్వంసం చేశారు. అయినా అవి సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తూనే ఉన్నాయి.

మహమ్మదు ఖుతుబ్ షా భాగ్యనగర నిర్మాత. గుల్జారుహౌజు, మక్కా మసీదు, చార్మినార్ వంటి విఖ్యాత కట్టడాలు ఇతను ప్రారంభించినవే. దక్షిణాపథములో ఉర్దూ భాషకు ఇతన్ని పిత అంటారు. అతని సమాధి వద్ద ఈనాటికి ప్రార్థనలు, మత కర్మకాండలు మాత్రమే గాక ఉర్దూ దినం, ఖుతుబుషాహి దినం జరుపుతారు.

ఈ సందర్భంగా పండితులతో సారస్వతోపన్యాసములు జరుగుతాయి. ఆ దినాలలో అక్కడ చరిత్ర సంస్కృతులను గురించిన చర్చలు జరుగుతాయి. ఇతని భార్య పేరు హయ్యతు బట్టీ బేగం, ఈమెకు ఈ వంశ చరిత్రలోను, గోల్కొండ సంస్కృతిలోను ఒక విశిష్ట స్థానముంది. ఆమె ఖుతుబుషాహీ రాజులలో వరుసగ ఒకనికి కూతురు. వేరొకనికి భార్య, మరొకనికి తల్లి. ఈమెకు’ బ్రహ్మాండమైన సమాధి నిర్మించబడింది. దీని నిర్మాణ పద్ధతికూడా విశిష్టమైనది. అబ్దుల్లా ఖుతుబుషా సమాధి చాల పెద్దది. దాని నిర్మాణ పద్ధతికూడా విభిన్నమైనది. దానిని డబుల్ డోల పద్ధతి అంటారు. దీనిలో పైకి కనిపించే గుమ్మటమే గాక దానిలోన కూడా ఎక్కువ నేర్పు గల మరొక గుమ్మటముంది.

ఈ సమాధులు బ్రహ్మాండమైన కట్టడములు. వీటిని చూడడానికి తండోపతండములుగా జనాలు నేటికి చాలా మంది వస్తుంటారు. విదేశీయులు సైతం ఈ సమాధులను చూసి ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని పొందుతారు. చనిపోయిన రాజుల భౌతిక దేహాలను, వారి బంధువులు శవములను ఇక్కడికి తెచ్చి చివరిస్నానము చేయిస్తారు. అంత్యక్రియలు చేయడానికి ఇక్కడ ఒక చిన్న అందమైన కట్టడముంది.

ఈ రాజులు షియా సంప్రదాయానికి చెందినవారు. వారు పన్నెండు మంది ఇమాములను పూజిస్తారు. కావున ఈ కట్టడంలో పన్నెండు కోణాలు, పన్నెండు మెట్లు, పన్నెండు చెంబులు, పన్నెండు ఆకుల ఆకారాలు, ఇలా అన్నీ పన్నెండు ఉంటాయి. ఇది చూడవలసిన చక్కని చిన్న కట్టడం. ఈ సమాధులు అత్యున్నతాలు, అపూర్వాలు, అతిసుందరాలు. ఒకప్పుడివి సర్ఫేఖాస్ (నిజాం నవాబు) ఆస్తి. ఆపై కేంద్రపురావస్తు పర్యవేక్షణలోకి వచ్చాయి. ఇప్పుడవి పురావస్తు శాఖవారి అధీనములో ఉన్నాయి.

సుమారు ఎనిమిది లక్షల వ్యయముతో ఈ సమాధులను, పెద్ద ఉద్యానవనములను, క్రీడాసరోవరములను, నౌకా విహారావకాశములను, రమణీయ ఆరామాలను, విశ్రాంతిభవనాలను, పురావస్తు ప్రదర్శనశాలలను, మిరుమిట్లుగొలుపు దీపమాలికలను, జలయంత్రాలను, అపురూపమైన పూదోటలను ఏర్పాటు జేసి, దీనిని భారతదేశములోనే ప్రథమ శ్రేణికి చెందిన యాత్రిక కేంద్రముగా రూపొందించే ఆలోచన ఉన్నది. ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి తప్పక దీనిని అభివృద్ధి పరచాలని ఎందరో ఒప్పుకుంటారు.

TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material Grammar ఛందస్సు Questions and Answers.

TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

పద్య లక్షణాలను తెలిపేది ఛందస్సు. లయ ప్రాధాన్యత ఛందస్సులో అంతర్గతంగా వుంటుంది. గణాల కూర్పుతో పద్యపాదాలు ఏర్పడతాయి. ఆ గణాలు గురు లఘువులతో కలిసి ఉంటాయి.

  1. లఘువు : ఒక మాత్ర కాలంలో పలుక బడేది లఘువు. లఘువుని (I) ఈ గుర్తుతో సూచిస్తాం.
  2. గురువు : రెండు మాత్రల కాలంలో పలికేది గురువు. గురువును (U) ఈ గుర్తుతో సూచిస్తాం.
  3. యతి : పద్యానికి సౌందర్యాన్ని చేకూర్చేవి యతి, ప్రాసలు. పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు.
  4. యతి మైత్రి : పద్యంలో నియమిత స్థానంలో ఉండే మైత్రికి, ‘యతిమైత్రి’ అని పేరు.
  5. ప్రాస : పద్య పాదంలో రెండవ అక్షరాన్ని ‘ప్రాస’ అంటారు.
  6. ప్రాస నియమం : నాలుగు పద్య పాదాలలోనూ, ఒకే హల్లును ప్రాస స్థానంలో ప్రయోగిస్తే, దానిని ‘ప్రాసనియమం’ అంటారు.

TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

పద్యాలు ప్రధానం మూడు రకాలు.

  1. వృత్తాలు,
  2. జాతులు,
  3. ఉపజాతులు.

వృత్త పద్యాలు

1. ఉత్పలమాల లక్షణము:

  1. ప్రతి పాదానికి వరుసగా భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలుంటాయి.
  2. ప్రతి పాదానికి ‘20′ అక్షరాలుంటాయి.
  3. ప్రతి పాదంలో, 10 వ అక్షరం యతిమైత్రి కల్గివుంటుంది.
  4. నాలుగు పాదాల్లో ప్రాస నియమం ఉంటుంది.
  5. నాలుగు పాదాలకు లక్షణాలు సమానం..
    ఉదా :
    TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 1
    యతిమైత్రి : 1-10 అక్షరాలైన ‘డ, టా’ లకు యతిమైత్రి చెల్లుతుంది.

2. చంపకమాల లక్షణము :

  1. ప్రతి పాదానికి 21 అక్షరాలుంటాయి.
  2. ప్రతి పాదానికి వరుసగా న, జ, భ, జ, జ, జ, ర అనే గణాలుంటాయి.
  3. ప్రతి పాదానికి 11వ అక్షరం యతిమైత్రి కల్గివుంటుంది.
  4. నాలుగు పాదాలలోనూ ప్రాసనియమం ఉంటుంది.
  5. నాలుగు పాదాలకూ లక్షణాలు సమానం.
    ఉదా :
    TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 2
    యతిమైత్రి : 1-11 అక్షరాలైన ‘అఆ’ లకు యతిమైత్రి చెల్లుతుంది.

గమనిక : (ఎసగన్ + ఆర్యులు) అని విడదీసినపుడున్న ‘ఆ-తో” యతి.

TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

3. శార్దూలం లక్షణము :

  1. ప్రతి పాదానికి 19 అక్షరాలుంటాయి.
  2. ప్రతి పాదానికి వరుసగా మ, స, జ, స, త, త, గ అనే గణాలుంటాయి.
  3. ప్రతి పాదంలో 13వ అక్షరం యతిమైత్రి కల్గి ఉంటుంది.
  4. అన్ని పాదాలలో ‘ప్రాసనియమం’ ఉంటుంది.
  5. నాలుగు పాదాలకు లక్షణాలు సమానము.
    ఉదా :
    TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 3
    యతిమైత్రి : 1-13 అక్షరాలైన ‘శ్రే – రే’ లకు యతిమైత్రి.

4. మత్తేభం లక్షణము :

  1. ప్రతి పాదానికి స, భ, ర, న, మ, య, వ అనే గణాలుంటాయి.
  2. ప్రతి పాదానికి 20 అక్షరాలుంటాయి.
  3. ప్రతి పాదంలో 14వ అక్షరం యతిమైత్రి కల్గి ఉంటుంది.
  4. నాలుగు పాదాలకు ‘ప్రాసనియమం’ ఉంటుంది.
  5. నాలుగు పాదాలకు లక్షణాలు సమానం.
    ఉదా :
    TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 4
    యతిమైత్రి : 1-14 అక్షరాలైన ‘స-త్స’లకు యతిమైత్రి చెల్లుతుంది.

జాతులు

1. కందం లక్షణము

  1. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  2. ఒకటి మూడు పాదాలకు మూడేసి గణాలు, రెండు నాలుగు పాదాలకు అయిదేసి గణాల చొప్పున ఉంటాయి.
    మొదటి రెండు పాదాలను ఒక భాగంగాను, చివరి రెండు పాదాలను ఒక భాగంగాను చెప్తారు.
  3. కంద పద్యంలో, నల, గగ, భ, జ, స అనే చతుర్మాత్రా గణాలు మాత్రమే ఉపయోగించాలి.
  4. బేసి గణాలలో మాత్రం (1, 3, 5, 7), ‘జ’ గణం ఉండకూడదు.
  5. ఆరవ గణం, ‘నల’ లేదా ‘జ’ గణం ఉండాలి.
  6. 2, 4 పాదాల్లో చివరి అక్షరం, విధిగా గురువు అయి ఉండాలి.
  7. రెండు, నాలుగు పాదాల్లో, 1-4 గణాల మొదటి అక్షరానికి, యతిమైత్రి ఉంటుంది.
  8. ప్రాసనియమం ఉండాలి.
    ఉదా :
    TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 5
    యతిమైత్రి : 2వ పాదములోని 1-4 గణాల మొదటి అక్షరాలైన ‘ప-బ’ లకు యతిమైత్రి చెల్లింది.

TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

ఉపజాతులు

ప్రాస యతి ఉండి, ప్రాస నియమం లేకపోవడం, ఉపజాతి పద్యాల ప్రత్యేకత.

1. ఆటవెలది లక్షణము :

  1. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  2. 1, 3 పాదాలలో వరుసగా 3 సూర్యగణాలు, రెండు ఇంద్ర గణాలు; 2-4 పాదాల్లో వరుసగా, ఐదు సూర్య గణాలు ఉంటాయి.
  3. ప్రతి పాదంలోను 1-4 గణాల మొదటి అక్షరాలకు యతిమైత్రి ఉండాలి.
  4. ప్రాసయతిని పాటింపవచ్చును.
  5. ప్రాసనియమం ఉండదు.
    ఉదా :
    TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 6
    యతిమైత్రి : 1-4 గణాల మొదటి అక్షరాలైన ‘క-గా’ లకు, ‘పు-వు’ లకు యతిమైత్రి.

2. తేటగీతి లక్షణము :

  1. తేటగీతి పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి.
  2. ప్రతి పాదానికీ వరుసగా ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, మరల రెండు సూర్యగణాలు ఉంటాయి.
  3. ప్రతిపాదంలోనూ 1-4 గణాల మొదటి అక్షరానికి యతిమైత్రి ఉంటుంది.
  4. ప్రాసయతిని పాటింపవచ్చు.
  5. ప్రాస నియమం ఉండదు.
    ఉదా :
    TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 7
    యతిమైత్రి : 1-4 గణాల మొదటి అక్షరాలైన ‘పా – ఫ’ లకు యతిమైత్రి చెల్లింది.

TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

3. సీసం లక్షణము :

  1. సీస పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి.
  2. ప్రతి పాదానికి వరుసగా ఆరు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు ఉంటాయి.
  3. పఠన సౌలభ్యం కోసం సీసాన్ని 8 అర్ధపాదాలుగా విభజిస్తారు.
  4. ప్రతి అర్ధపాదంలోనూ 1-3, 5-7 గణాల మొదటి అక్షరాలకు, యతిమైత్రి చెల్లుతుంది.
  5. ప్రాస నియమం ఉండదు. కాని ప్రాసయతి ఉంటుంది.
  6. సీస పద్యానికి, అనుబంధంగా ఆటవెలది గాని, తేటగీతి గాని చేర్చాలి.
    ఉదా :
    TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 8
    యతిమైత్రి : 1-3 లో-లో, 5-7 క-గ లకు యతిమైత్రి చెల్లింది. లో-లో, క-గ-యతిమైత్రి చెల్లింది.

గమనిక :
ఈ అభ్యాసములో 22 చిన్న ప్రశ్నలున్నాయి. వీని నుండి మీకు పేపరులో, ఎనిమిది ప్రశ్నలు ఇస్తారు. అందులో మీరు ఆరు ప్రశ్నలకు జవాబులు వ్రాయాలి. వాటికి ఆరుమార్కులు వస్తాయి. కాబట్టి వీటిని, అతిశ్రద్ధగా చదివి, ఆరుమార్కులను మీ స్వంతము చేసికోండి.

అభ్యాసం

ప్రశ్న 1.
‘లఘువు’ అనగానేమి ?
జవాబు:
ఒక మాత్ర కాలములో పలుకబడేది, ‘లఘువు’. లఘువును (I) గుర్తుతో సూచిస్తారు.

ప్రశ్న 2.
‘గురువు’ అనగానేమి ? * (M.P)
జవాబు:
రెండు మాత్రల కాలములో, పలికేది ‘గురువు’. గురువును (U) గుర్తుతో సూచిస్తాము.

TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

ప్రశ్న 3.
‘ఛందస్సు’ అనగానేమి ?
జవాబు:
పద్య లక్షణాలను తెలిపేది ఛందస్సు. లయ ప్రాధాన్యత, ఛందస్సులో అంతర్గతంగా ఉంటుంది.

ప్రశ్న 4.
ప్రాస అనగానేమి ?
జవాబు:
పద్య పాదంలోని రెండవ అక్షరాన్ని ‘ప్రాస’ అంటారు.

ప్రశ్న 5.
యతి అనగానేమి ?
జవాబు:
పద్య పాదంలోని, మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు.

ప్రశ్న 6.
పద్యాలు ప్రధానంగా ఎన్ని రకాలు ? * (M.P.)
జవాబు:
పద్యాలు ప్రధానంగా మూడు రకాలు :

  1. వృత్తాలు
  2. జాతులు
  3. ఉపజాతులు.

ప్రశ్న 7.
‘ఉత్పలమాల’లో వచ్చే గణాలు ఏవి ? * (M.P.)
జవాబు:
ఉత్పలమాలలో ప్రతి పాదములోనూ వరుసగా భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు ఉంటాయి.

ప్రశ్న 8.
‘ఉత్పలమాల’లో ఎన్నవ అక్షరం యతిస్థానం ? * (M.P.)
జవాబు:
ఉత్పలమాలలో 10వ అక్షరం యతిస్థానంగా ఉంటుంది.

TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

ప్రశ్న 9.
‘ఉత్పలమాల’ పద్యంలో ప్రతీ పాదానికి ఎన్ని అక్షరాలు ఉంటాయి ?
జవాబు:
ఉత్పలమాలలో ప్రతి పాదానికీ 20 అక్షరాలు ఉంటాయి.

ప్రశ్న 10.
‘చంపకమాల’లో వచ్చే గణాలు ఏవి ? * (M.P.)
జవాబు:
చంపకమాలలో వచ్చే గణాలు, వరుసగా న, జ, భ, జ, జ, జ, ర అనేవి.

ప్రశ్న 11.
‘చంపకమాల’లో ఎన్నవ అక్షరం యతిస్థానం ?
జవాబు:
చంపకమాలలో 11వ అక్షరం యతిస్థానం.

ప్రశ్న 12.
‘చంపకమాల’ పద్యంలో ప్రతి పాదానికి ఎన్ని అక్షరాలు ఉంటాయి ?
జవాబు:
చంపకమాల పద్యంలో, ప్రతి పాదానికీ 21 అక్షరాలు చొప్పున ఉంటాయి.

ప్రశ్న 13.
‘శార్దూలం’లో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
శార్దూలంలో వచ్చే గణాలు వరుసగా మ, స, జ, స, త, త, గ అనేవి.

ప్రశ్న 14.
‘శార్దూలం’లో ఎన్నవ అక్షరం యతిస్థానం ?
జవాబు:
శార్దూలంలో, 13వ అక్షరం యతిస్థానం.

TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

ప్రశ్న 15.
‘మత్తేభం’లో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
మత్తేభంలో ప్రతి పాదంలోనూ వరుసగా వచ్చే గణాలు, స, భ, ర, న, మ, య, వ అనే గణాలు.

ప్రశ్న 16.
‘మత్తేభం’ ఎన్నవ అక్షరం యతి స్థానం ?
జవాబు:
మత్తేభం, 14వ అక్షరం, యతిస్థానం.

ప్రశ్న 17.
‘కందపద్యం’లో ఆరవగణంలో వచ్చే గణాలు ఏవి ? * (M.P.)
జవాబు:
కందపద్యంలో, ఆరవ గణంగా, ‘నలము’ లేదా ‘జ గణం’ ఉండాలి.

ప్రశ్న 18.
‘ఆటవెలది’ పద్యంలో ప్రతి పాదంలో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
ఆటవెలది పద్యంలో ప్రతి పాదంలోనూ వచ్చే గణాలు, ఒకే రకంగా ఉండవు. ఈ పద్యంలో 1-3 పాదాల్లో మూడు సూర్యగణాలు, రెండు ఇంద్రగణాలూ ఉంటాయి. 2-4 పాదాల్లో ఐదునూ సూర్యగణాలే ఉంటాయి.

ప్రశ్న 19.
‘ఇంద్రగణాలు’ ఎన్ని ? * (M.P.)
జవాబు:
ఇంద్రగణాలు ‘ఆరు’, అవి : నల, నగ, సల, భ, ర, త అనేవి.

ప్రశ్న 20.
‘సూర్యగణాలు’ ఎన్ని ?
జవాబు:
సూర్యగణాలు రెండు. అవి :

  1. హ గణము (గలము)
  2. న గణము అనేవి.

TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

ప్రశ్న 21.
‘తేటగీతి’ పద్యంలో వచ్చే గణాలు ఏవి ? * (M.P.)
జవాబు:
తేటగీతి పద్యంలో, ప్రతి పాదంలోనూ, వరుసగా ఒక సూర్య గణము, రెండు ఇంద్ర గణములు, మరలా రెండు సూర్య గణములూ వస్తాయి.

ప్రశ్న 22.
సీసపద్యానికి అనుబంధంగా ఉండే పద్యాలు ఏవి ?
జవాబు:
సీసపద్యానికి అనుబంధంగా ఆటవెలది గాని, తేటగీతి గాని ఉంటుంది.

TS Inter 2nd Year Telugu Study Material

TS Inter 2nd Year Telugu Study Material Poem 6 ఆడపిల్లలంటేనే

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material 6th Poem ఆడపిల్లలంటేనే Textbook Questions and Answers.

TS Inter 2nd Year Telugu Study Material 6th Poem ఆడపిల్లలంటేనే

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
‘ఆడపిల్లలంటెనే’ పాఠ్యభాగం ద్వారా కవి అందించిన సందేశం తెలియజేయండి.
జవాబు:
ఆడపిల్లలంటేనే అనే పాఠ్యభాగం ద్వారా నిసార్ మహిళాలోకానికి సందేశాన్ని ఇచ్చాడు. ఆడపిల్లలు అంటేనే లోకానికి చులకన భావం ఏర్పడింది. ఆడవారు లేకుండా ఈ లోకం ఎక్కడుంది అని సమాజాన్ని నిలబెట్టి స్పష్టంగా అడుగుమని సలహా ఇచ్చాడు. పిల్లలు పుట్టాలని పూజలు, వ్రతాలు చేస్తారు. కాని ఆడపిల్ల పుట్టిందని తెలియగానే వెక్కిరిస్తారు. ఆడపిల్ల పడుకుంటే లేపి అంట్లు శుభ్రం చేయిస్తారు. మగపిల్లలను బడికి పంపి చదివిస్తారు. ఆడపిల్లలను పనికి మగపిల్లలను చదువుకు పంపడం అనే భేద భావాలు ఎందుకుండాలి ? ఆడ మగ ఇద్దరూ పరస్పరం సహకరించుకుంటూ ఉండాలి అలా ఉండకుంటే జీవితం సఫలం కాదు అని నిసార్ భావన.

కొత్తగా పెండ్లి కాగానే అత్తగారి ఇంటికి వరకట్నం, కానుకలు తెచ్చే పంటగామారి వారి ఇల్లు నింపాలని అనుకుంటారు. నువ్వు కట్నంగా తెచ్చిన డబ్బుతో, బంగారంతో, వాహనంతో, వంట పాత్రలతో ఇల్లు నింపినా ఇంకా సరిపోలేదని అంటారు. తెచ్చిన కట్నంలో ఏ కొద్దిగా తగ్గినా నీ మొఖం పాడుగాను, నువ్వేం తెచ్చావని అంటారు. నిన్ను వాళ్ళే చంపేసి వంటింట్లో చచ్చిందని వార్తాపత్రికలకు ఇస్తారని నిసార్ హెచ్చరించాడు.

ఉదయం లేచింది మొదలు ఇల్లు ఊడ్చడం, ‘వాకిలి ఊడ్చి కల్లాపి చల్లడం, వంటపాత్రలు కడిగి వంటచేయడం, అందరి బట్టలుతకడం, వడ్డించి తినేవరకు ఆగి శరీరం మొత్తం అలిసి పోయేదాక పని చేసినా పని అయిపోదు. రోజులో ఉండే ఇరవైనాలుగు గంటలూ కష్టపడ్డా ఇంకా ఎదో ఒకపని ఉండనే ఉంటది. కాని కేవలం ఎనిమిది గంటలు బయట పనికి వెళ్లి వచ్చిన భర్త మాత్రం ఆడవారిమీద ఎగిరి ఎగిరి పడతాడు తల్లి అని నిసార్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇంటికి కావలసిన పనులన్ని చేసి, పిల్లలను పోషించి, అత్త మామలను సరిగా పోషించి, భర్త మెప్పును పొంది కూలికి కూడా వెళ్లి పనిచేసి ఆకలితో ఇంటికి వచ్చి పొయ్యి వెలిగిస్తావు. ఏ లెక్కప్రకారం చూసినా ఆడవారు చేసే శ్రమనే అధికం. అయినా మగవారికే కూలి ఎక్కువ ఎందుకిస్తారు అని నిసార్ ప్రశ్నించాడు. పేగులు తెంపుకొని, పిల్లల్ని కనీ, పెంచి వారికి పెళ్ళిళ్ళు చేసి ఆనందపడతారని, చావుబతుకుల్లో, కష్టసుఖాల్లో సంసారాన్ని సాగించి ఒంటిలో ఓపిక ఉన్నతకాలం సంసారపు బరువును మోస్తారని కవి చెప్పాడు. ముసలి దానివి అని దూరంగా ఉంచుతారు. వయసుమీద పడి పెంచుకున్న ఆశలు ఎండిపోయి తొడిమలాగా మిగిలిపోయారని ఆడవారి పట్లజాలి చూపాడు.

స్త్రీలు నడిచే చెట్టులాంటి వారని, త్యాగాలు చేసిన తేనెతుట్టె లాంటి వారని చెట్టు ఆకులను రాల్చినట్టు కష్టాలను మరిచిపోయి, తేనెలను పంచినట్టు ప్రేమలను పంచుతారని అన్నాడు. ఇంకా ఎన్ని రోజులు కష్టాల కొలిమిలో ఉంటారని, ఈ చెడిపోయిన వాళ్ళను వెళ్ళగొట్టడానికి లేచి ముందుకు రావాలని, సహించినంత కాలం కష్టాలను భరించాల్సి ఉంటుందని, ఎదిరిస్తేనే బాధలు దూరమవుతాయని దానికోసం పోరాటం చేయాలని నిసార్ మహిళలకు సందేశం ఇచ్చాడు.

ప్రశ్న 2.
‘ఆడపిల్లలంటెనే’ పాటలో కవి చిత్రించిన స్త్రీల శ్రమతత్త్వాన్ని విశ్లేషించండి.
జవాబు:
ఆడపిల్లలంటేనే లోకానికి చులకన భావం ఏర్పడిందని కవి నిసార్ స్త్రీల శ్రమ తత్వాన్ని తెలపడం ప్రారంభించాడు. ఆడవారు లేకుండా ఈ లోకం ఎక్కడుంది అని సమాజాన్ని నిలబెట్టి స్పష్టంగా అడగమని స్త్రీలకు సూచించాడు. ఆడపిల్ల పడుకుంటే లేపి అంట్లు శుభ్రం చేయిస్తారు. మగపిల్లలను బడికి పంపి చదివిస్తారు. ఆడపిల్లలను పనికి మగపిల్లలను చదువుకు పంపడం అనే భేద భావాలు ఎందుకుండాలి ? ఆడ మగ ఇద్దరూ పరస్పరం సహకరించుకుంటూ ఉండాలి అలా ఉండకుంటే జీవితం సఫలం కాదు అని నిసార్ భావన.

కొత్తగా పెండ్లి కాగానే అత్తగారి ఇంటికి తెచ్చిన కట్నంలో ఏ కొద్దిగా తగ్గినా నీ మొఖం పాడుగాను, నువ్వేం తెచ్చావని అంటారు. నిన్ను వాళ్ళే చంపేసి వంటింట్లో చచ్చిందని వార్తాపత్రికలకు ఇస్తారని నిసార్ హెచ్చరించాడు.

ఉదయం లేచింది మొదలు ఇల్లు ఊడ్చడం, వాకిలి ఊడ్చి కల్లాపి చల్లడం, వంటపాత్రలు కడిగి వంటచేయడం, అందరి బట్టలుతకడం, వడ్డించి తినేవరకు ఆగి నీ శరీరం మొత్తం అలిసి పోయేదాక పని చేసినా పని అయిపోదు. రోజులో ఉండే ఇరవైనాలుగు గంటలూ కష్టపడ్డా ఇంకా ఎదో ఒకపని ఉండనే ఉంటది. కాని కేవలం ఎనిమిది గంటలు బయట పనికి వెళ్లి వచ్చిన నీ భర్త మాత్రం నీ మీద ఎగిరిఎగిరి పడతాడు తల్లి అని నిసార్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇంటికి కావలసిన పనులన్ని చేసి, పిల్లలను పోషించి, అత్త మామలను సరిగా పోషించి, భర్త మెప్పును పొంది కూలికి కూడా వెళ్లి పనిచేసి ఆకలితో ఇంటికి వచ్చి పొయ్యి వెలిగిస్తావు. ఏ లెక్కప్రకారం చూసినా ఆడవారు చేసే శ్రమనే అధికం. అయినా మగవారికే కూలి ఎక్కువ ఎందుకిస్తారు అని నిసార్ ప్రశ్నించాడు.

పేగులు తెంపుకొని, పిల్లల్ని కనీ, పెంచి వారికి పెళ్ళిళ్ళు చేసి ఆనందపడ్డా, చావుబతుకుల్లో, కష్టసుఖాల్లో సంసారాన్ని సాగించినా, ఒంటిలో ఓపిక ఉన్నతకాలం సంసారపు బరువును మోసి ముసలితనం పొందితే దూరంగా ఉంచుతారని చెప్పాడు. వయసుమీద పడి నీవు పెంచుకున్న ఆశలు ఎండి పోయి తొడిమలాగా మిగిలిపోయావని చెప్తూ స్త్రీలు నడిచే చెట్టులాంటి వారని, త్యాగాల తేనెతుట్టె లాంటి వారని అన్నాడు. చెట్టు ఆకులను రాల్చినట్టు కష్టాలను మరిచిపోతారని, తేనెలను పంచినట్టు ప్రేమలను పంచుతారని నిసార్ స్త్రీల శ్రమ తత్వాన్ని విశ్లేషించాడు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 6 ఆడపిల్లలంటేనే

II సంగ్రహరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
నిసార్ కవి పరిచయం రాయండి.
జవాబు:
ఆడపిల్లలంటేనే అనే పాఠాన్ని ‘నిసార్ పాట’ అనే ఉద్యమగీతాల సంపుటిలోనుండి గ్రహించారు. దీని రచయిత నిసార్. ఈయన పూర్తి పేరు మహమ్మద్ నిసార్ అహమద్. నిస్సార్ డిసెంబర్ 16, 1964 న జన్మించాడు. జూలై 8, 2020 న కరోనా కారణంగా చనిపోయాడు. ఈయన స్వస్థలం ఉమ్మడి నల్లగొండ జిల్లా, గుండాల మండలం, సుద్దాల గ్రామం. తల్లిదండ్రులు హాలీమాబీ, మహమ్మద్ అబ్బాస్. సుద్దాలలో ప్రాథమిక విద్యను, సీతారాంపురం ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తిచేశాడు. ఉన్నత చదువులు అభ్యసించాలన్న ఆకాంక్ష ఉన్నప్పటికీ పేదరికం కారణంగా నిసార్ చదువుకు స్వస్తిచెప్పి, ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్కు చేరుకున్నాడు.

దూర విద్య ద్వారా బి.ఏ. డిగ్రీ పట్టా అందుకున్నాడు తొలితరం ప్రజావాగ్గేయకారుల స్ఫూర్తితో 1986 సం॥ నుంచి పాటలు రాయడం ప్రారంభించాడు. “చుట్టుప ఎక్కడ జూచిన పొట్టలల్లో ఆకలిమంటలు/చుట్టుకుపోయిన పేగులన్నీ తట్టిలేపుతున్నాయి” అంటూ తొలిపాట రాసి, అంతులేని ఆకలిబాధలను ఆర్ద్రంగా గానం చేశాడు.

ప్రశ్న 2.
సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్షను తెలియజేయండి.
జవాబు:
పిల్లలు పుట్టాలని పూజలు, వ్రతాలు చేస్తారు. కాని ఆడపిల్ల పుట్టిందని తెలియగానే వెక్కిరిస్తారు. ఆడపిల్ల పడుకుంటే లేపి అంట్లు శుభ్రం చేయిస్తారు. మగపిల్లలను బడికి పంపి చదివిస్తారు. ఆడపిల్లలను పనికి మగపిల్లలను చదువుకు పంపడం అనే భేద భావాలు ఎందుకుండాలి ? ఆడ మగ ఇద్దరూ పరస్పరం సహకరించుకుంటూ ఉండాలి అలా ఉండకుంటే జీవితం సఫలం కాదు అని నిసార్ స్త్రీలపట్ల ఉన్న వివక్షను ఎత్తి చూపాడు.

ప్రశ్న 3.
కుటుంబ ప్రగతిలో స్త్రీ పాత్రను వివరించండి.
జవాబు:
ఉదయం లేచింది మొదలు ఇల్లు ఊడ్చడం, వాకిలి ఊడ్చి కల్లాపి చల్లడం, వంటపాత్రలు కడిగి వంటచేయడం, అందరి బట్టలుతకడం, వడ్డించి తినేవరకు ఆగి నీ శరీరం మొత్తం అలిసి పోయేదాక పని చేసినా పని అయిపోదు. రోజులో ఉండే ఇరవైనాలుగు గంటలూ కష్టపడ్డా ఇంకా ఎదో ఒకపని ఉండనే ఉంటది. కాని కేవలం ఎనిమిది గంటలు బయట పనికి వెళ్లి వచ్చిన నీ భర్త మాత్రం నీ మీద ఎగిరి ఎగిరి పడతాడు తల్లి అని నిసార్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంటికి కావలసిన పనులన్ని చేసి, పిల్లలను పోషించి, అత్త మామలను సరిగా పోషించి, భర్త మెప్పును పొంది కూలికి కూడా వెళ్లి పనిచేసి ఆకలితో ఇంటికి వచ్చి పొయ్యి వెలిగిస్తావు. ఏ లెక్కప్రకారం చూసినా ఆడవారు చేసే శ్రమనే అధికం. ఇలా కుటుంబ ప్రగతిలో స్త్రీపాత్ర కీలకం అని నిసార్ తెలిపాడు.

ప్రశ్న 4.
స్త్రీ త్యాగనిరతిని తెలుపండి.
జవాబు:
పేగులు తెంపుకొని, పిల్లల్ని కనీ, పెంచి వారికి పెళ్ళిళ్ళు చేసి ఆనందపడతారని, చావుబతుకుల్లో, కష్టసుఖాల్లో సంసారాన్ని సాగించి ఒంటిలో ఓపిక ఉన్నతకాలం సంసారపు బరువును మోస్తారని కవి చెప్పాడు. ముసలి దానివి అని దూరంగా ఉంచుతారు. వయసుమీద పడి ఆశలు ఎండిపోయి, పెంచుకున్న ఆశలు ఎండిపోయి తొడిమలాగా మిగిలిపోయారని ఆడవారి పట్ల జాలి చూపాడు. స్త్రీలు నడిచే చెట్టులాంటి వారని, త్యాగాలు చేసిన తేనెతుట్టె లాంటి వారని చెట్టు ఆకులను రాల్చినట్టు కష్టాలను మరిచిపోయి, తేనెలను పంచినట్టు ప్రేమలను పంచుతారని స్త్రీల త్యాగ నిరతిని నిసార్ తెలియచేశాడు.

III. ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
నిసార్ జన్మస్థలం ఏది ?
జవాబు:
నల్లగొండ జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామం

ప్రశ్న 2.
నిసార్ తల్లిదండ్రులెవరు ?
జవాబు:
హాలీమాబీ, మహమ్మద్ అబ్బాస్

TS Inter 2nd Year Telugu Study Material Poem 6 ఆడపిల్లలంటేనే

ప్రశ్న 3.
నిసార్ ఏ సంస్థకు కార్యదర్శిగా ఉన్నాడు ?
జవాబు:
ప్రజా నాట్యమండలికి

ప్రశ్న 4.
కనుమరుగవుతున్న కళారూపాలపై నిసార్ రాసిన పాట ఏది ?
జవాబు:
“చుట్టుపక్కల ఎక్కడ జూచిన పొట్టలల్లో ఆకలిమంటలు/చుట్టుకుపోయిన పేగులన్నీ తట్టిలేపుతున్నాయి” అంటూ తొలిపాట రాసి, అంతులేని ఆకలిబాధలను ఆర్ద్రంగా గానం చేశాడు.

ప్రశ్న 5.
‘ఆడపిల్లలంటేనే’ పాఠ్యభాగం ఏ సంపుటి లోనిది?
జవాబు:
నిసార్ పాట అనే ఉద్యమ గీతాల సంపుటి నుండి

ప్రశ్న 6.
నిసార్ ఏ సంవత్సరం నుంచి పాటలు రాస్తున్నాడు ?
జవాబు:
1986 నుండి

ప్రశ్న 7.
బ్రతుకు పండేది ఎప్పుడు ? (V.Imp.MP)
జవాబు:
ఆడ, మగ ఒకరికి ఒకరు తోడు నీడగా ఉంటే బ్రతుకు పండుతుంది.

ప్రశ్న 8.
ఆకు రాల్చినట్లు కష్టాలు మరిచేది ఎవరు ?
జవాబు:
ఆడవారు, స్త్రీలు

IV సందర్భసహిత వ్యాఖ్యలు

1. కట్నకానుకల పంటవయి నిండాలె (V.Imp)
జవాబు:
కవి పరిచయం : ఉద్యమకవి నిసార్ రాసిన “నిసార్ పాట” అనే ఉద్యమ గీతాల సంపుటి నుండి స్వీకరించిన “ఆడపిల్లలంటెనే” అనే పాఠ్యభాగం నుండి తీసుకున్నది ఈ వాక్యం. నిసార్ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కవి. సందర్భం : కొత్తగా పెండ్లి కాగానే అత్తగారి ఇంటికి వరకట్నం, కానుకలు తెచ్చే పంటలగామారి వారి ఇల్లు నింపాలని అనుకుంటారు. నువ్వు కట్నంగా తెచ్చిన డబ్బుతో, బంగారంతో, వాహనంతో, వంట పాత్రలతో ఇల్లు నింపినా ఇంకా సరిపోలేదని అంటారని కవి చెప్పిన సందర్భం లోనిది ఈ వాక్యం.

అర్థం : కట్నం అనే పంటతో ఇల్లంతా నింపాలని అర్థం.

వ్యాఖ్య : ఆడపిల్లలు ఎంత కట్నం తెచ్చినా ఇంకా కావాలని వేధిస్తారని భావం.

2. వొళ్లెంత వొంచిన పని వొడవదోయమ్మా
జవాబు:
కవి పరిచయం : ఉద్యమకవి నిసార్ రాసిన “నిసార్ పాట” అనే ఉద్యమ గీతాల సంపుటి నుండి స్వీకరించిన “ఆడపిల్లలంటెనే” అనే పాఠ్యభాగం నుండి తీసుకున్నది ఈ వాక్యం. నిసార్ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కవి. సందర్భం : ఉదయం లేచింది మొదలు ఇల్లు ఊడ్చడం, వాకిలి ఊడ్చి కల్లాపి చల్లడం, వంటపాత్రలు కడిగి వంటచేయడం, అందరి బట్టలుతకడం, వడ్డించి తినేవరకు ఆగి నీ శరీరం మొత్తం అలిసి పోయేదాక పని చేసినా పని అయిపోదని నిసార్ చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం : శరీరం మొత్తం అలిసి పోయేదాక పని చేసినా పని పూర్తి కాదని అర్థం.

వ్యాఖ్య : స్త్రీలు ఒళ్ళు హూనం చేసుకునేలా పని చేసినా వారికి తీరిక లభించదు అని భావం.

TS Inter 2nd Year Telugu Study Material Poem 6 ఆడపిల్లలంటేనే

3. ఏ లెక్క జూసినా నువు జేసె కష్టమే ఎక్కువాయే
జవాబు:
కవి పరిచయం : ఉద్యమకవి నిసార్ రాసిన “నిసార్ పాట” అనే ఉద్యమ గీతాల సంపుటి నుండి స్వీకరించిన “ఆడపిల్లలంటెనే” అనే పాఠ్యభాగం నుండి తీసుకున్నది ఈ వాక్యం. నీసార్ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కవి.

సందర్భం : ఇంటికి కావలసిన పనులన్ని చేసి, పిల్లలను పోషించి, అత్త మామలను సరిగా పోషించి, భర్త మెప్పును పొంది కూలికి కూడా వెళ్లి పనిచేసి ఆకలితో ఇంటికి వచ్చి పొయ్యి వెలిగిస్తావు. ఏ లెక్కప్రకారం చూసినా ఆడవారు చేసే శ్రమనే అధికమని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం : ఏ లెక్క ప్రకారం చూసినా స్త్రీలు చేసే పని విలువనే అధికం అని అర్థం.

వ్యాఖ్య : స్త్రీలు చేసే పనివిలువ ఎక్కువ అయినా స్త్రీలకు తక్కువ కూలి ఇస్తారని భావం.

4. కష్టాల కొలిమిలో ఇంకెంత కాలమేడుస్తవమ్మా
జవాబు:
కవి పరిచయం : ఉద్యమకవి నిసార్ రాసిన “నిసార్ పాట” అనే ఉద్యమ గీతాల సంపుటి నుండి స్వీకరించిన “ఆడపిల్లలంటెనే” అనే పాఠ్యభాగం నుండి తీసుకున్నది ఈ వాక్యం. నిసార్ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కవి. సందర్భం : స్త్రీలు నడిచే చెట్టులాంటి వారని, త్యాగాలు చేసిన తేనెతుట్టె లాంటి వారని చెట్టు ఆకులను రాల్చినట్టు కష్టాలను మరిచిపోయి, తేనెలను పంచినట్టు ప్రేమలను పంచుతారని ఇంకా ఎన్ని రోజులు కష్టాల కొలిమిలో ఉంటారని, ఈ చెడిపోయిన వాళ్ళను వెళ్ళగొట్టడానికి లేచి ముందుకు రావాలని, కవి చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం : కష్టాలనే కొలిమిలో ఇంకా ఎన్ని రోజులు కాలం గడుపుతారని అర్థం.

వ్యాఖ్య : స్త్రీలు వారి జీవితాన్ని వారి కుటుంబంకోసం త్యాగం చేస్తారు. ఇంకా ఎన్ని రోజులు ఆ బాధలను భరిస్తారు ఎదిరించాలని భావం.

గేయాలు – గేయ సారాంశములు

1 నుండి 2 పంక్తులు

ఆడపిల్లలంటేనే లోకాన లోకువై పాయె తల్లీ
ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లీ.

అర్ధములు :

తల్లీ = ఓ అమ్మా
ఆడపిల్లలు + అంటేనే = ఆడపిల్లలు అంటేనే
లోకాన = లోకంలో
లోకువై పాయె = చులకన అయింది.
ఆడోళ్ళు లేనిదే = ఆడవారు లేకుండా
లోకము + ఏడుందని = లోకం ఎక్కడుంది (లేదని భావం)
నిలదీసి అడుగు చెల్లీ = నిలబెట్టి స్పష్టంగా అడుగు

సారాంశము : ఓ అమ్మా! ఆడపిల్లలు అంటేనే లోకానికి చులకన భావం ఏర్పడింది. ఆడవారు లేకుండా ఈ లోకం ఎక్కడుంది అని సమాజాన్ని నిలబెట్టి స్పష్టంగా అడుగు చెల్లి అని నిసార్ సలహా ఇస్తున్నాడు.

3 నుండి 8వ పంక్తి వరకు

ఆడపిల్లలు పుడితే మూతులె ముడిచేరు
మగపిల్లలా కొరకు నోములె న్తోచేరు
ఆడపిల్లను లేపి అంట్లుముందేసేరు
మగపిల్లవాడిని బడికి పంపించేరు.
ఆడ మగ తేడా లెందుకు, ఇద్దరు వుండాలిగా
వొకరి కొకరు తోడు నీడగా లేకుంటే బ్రతుకే పండదుగా – ఆడ ”

అర్ధములు :

పిల్లల కొరకు = పిల్లలు పుట్టాలని
నోము నోచేరు = దేవుళ్లకు పూజలు చేస్తారు
ఆడపిల్లలు పుడితే = ఆడపిల్ల పుట్టిందని తెలిస్తే
మూతులె ముడిచేరు = వెక్కిరిస్తారు
ఆడపిల్లను లేపి = ఆడపిల్ల పడుకుంటే నిద్ర లేపి
అంట్లు ముందు+ఏసేరు = అంట్ల పాత్రలు శుభ్రం చేయమని ముందు వేస్తారు
మగపిల్లవాడిని = మగపిల్లలను
బడికి పంపించేరు = పాఠశాలకు పంపిస్తారు
ఆడ మగ తేడాలు + ఎందుకు = ఆడ మగ అనే భేద భావాలు ఎందుకు ఉండాలి
ఒకరి కొకరు తోడు నీడగా = ఒకరికి ఒకరు సహకరించుకుంటూ
ఇద్దరు వుండాలిగా = ఆడ, మగ ఇద్దరు ఉండాలి
లేకుంటే = అలా లేకుంటే
బ్రతుకే పండదుగా = జీవితం సఫలం కాదు

సారాంశము : పిల్లలు పుట్టాలని పూజలు, వ్రతాలు చేస్తారు. కాని ఆడపిల్ల పుట్టిందని తెలియగానే వెక్కిరిస్తారు. ఆడపిల్ల పడుకుంటే లేపి అంట్లు శుభ్రం చేయిస్తారు. మగపిల్లలను బడికి పంపి చదివిస్తారు. ఆడపిల్లలను పనికి మగపిల్లలను చదువుకు పంపడం అనే భేద భావాలు ఎందుకుండాలి ? ఆడ మగ ఇద్దరూ పరస్పరం సహకరించుకుంటూ ఉండాలి అలా ఉండకుంటే జీవితం సఫలం కాదు అని నిసార్ భావన.

TS Inter 2nd Year Telugu Study Material Poem 6 ఆడపిల్లలంటేనే

9 నుండి 12వ పంక్తి వరకు

కొత్తగా పెండ్లితె అత్తవారింటిలో
కట్నకానుకల పంటవయి నిండాలె
డబ్బు బంగారము బండి, బాసండ్లతో
ఇల్లంత నింపినా ఇంతేనా అంటారు. – ” ఆడ

అర్థములు :

కొత్తగా పెండ్లితె = కొత్తగా పెండ్లి కాగానే
అత్తవారింటిలో = అత్తగారి ఇంటికి
కట్న కానుకల = వరకట్నాలు కానుకలు తెచ్చే
పంటవయి నిండాలె = పంటలా మారి వారి ఇల్లు నిండా నింపాలి
డబ్బు = కట్నంగా తెచ్చిన డబ్బుతో
బంగారము = బంగారంతో
బండి = వాహనంతో
బాసండ్లతో = వంట పాత్రలతో
ఇల్లంత నింపినా = ఇల్లు పూర్తిగా నింపినా
ఇంతేనా అంటారు = ఇంకా సరిపోలేదు అంటారు

సారాంశము : కొత్తగా పెండ్లి కాగానే అత్తగారి ఇంటికి వరకట్నం, కానుకలు తెచ్చే పంటలగామారి వారి ఇల్లు నింపాలని అనుకుంటారు. నువ్వు కట్నంగా తెచ్చిన డబ్బుతో, బంగారంతో, వాహనంతో, వంట పాత్రలతో ఇల్లు నింపినా ఇంకా సరిపోలేదని అంటారు.

13 నుండి 15వ పంక్తి వరకు

ఏది తక్కువయిననూ ఓచెల్లి నిన్నేడిపిస్తరమ్మా
నీ మొఖం పాడుగాను నువ్వేమి తెచ్చినావంటరమ్మా
నిను చంపి వంటింట్లో కాలి చచ్చినవంటు పేపర్లకిస్తరమ్మ ఆడ ”

అర్థములు :

చెల్లి = ఓ చెల్లి
ఏది తక్కువయిననూ = నీవు తెచ్చిన కట్నంలో ఏది తక్కువయినా
నిన్ను+ఏడిపిస్తారు+అమ్మా = నిన్ను ఏడిపిస్తారు
నీ మొఖం పాడుగాను = నీ ముఖం పాడు గాను అని తిట్టి
నువ్వేమి తెచ్చినావంటరు + అమ్మా = నువ్వు ఏం తెచ్చావని అంటారమ్మ
నిను చంపి = నిన్ను చంపేసి
వంటింట్లో కాలి = వంట చేస్తుంటే కాలి పోయి
చచ్చినవు + అంటు = చనిపోయిందని అంటూ
పేపర్లకు + ఇస్తరమ్మ = వార్తాపత్రికలకు ఇస్తారు.

సారాంశము : ఓ చెల్లెమ్మా! నీవు తెచ్చిన కట్నంలో ఏ కొద్దిగా తగ్గినా నీ మొఖం పాడుగాను, నువ్వేం తెచ్చావని అంటారు. నిన్ను వాళ్ళే చంపేసి వంటింట్లో చచ్చిందని వార్తాపత్రికలకు ఇస్తారని నిసార్ హెచ్చరించాడు.

16 నుండి 21వ పంక్తి వరకు

ఊడ్చాలె, చల్లాలె, కడుగాలె, వుతకాలె
వండాలె, వడ్డించి తినేదాక వుండాలె
వొళ్లెంత వొంచిన పని వొడవదోయమ్మా
తెల్లారి పొద్దుకె తీరువాట మేదమ్మా
రోజుకిరవయి నాలుగు గంటలు నీకు డ్యూటుంటదమ్మా
ఎనిమిదే గంటలు చేసొచ్చి నీ మొగుడు ఎగిరెగిరిపడతడమ్మ

అర్థములు :

ఊడ్చాలె, చల్లాలె = ఇల్లు వాకిలి ఊడ్చాలి, కల్లాపి చల్లాలి
కడుగాలె, వుతకాలె = వంటపాత్రలు కడగాలి, ఇంటిల్లిపాది బట్టలు ఉతకాలి
వండాలె, = వంట చేయాలి
వడ్డించి = ఇంటి వారికి వడ్డించాలి
తినేదాక వుండాలె = వారంతా తినేదాక వేచిచూడాలి
ఒళ్లెంత ఒంచిన = నీ శరీరాన్ని ఎంత వంచి పని చేసినా
‘పని ఒడవదోయమ్మా = పని పూర్తి కాదు
తెల్లారి పొద్దుకె = తెల్లవారింది మొదలు
తీరువాట మేదమ్మా = నీకు తీరిక దొరకదు
రోజుకిరవయి నాలుగు = ఒక్క రోజులో ఉండే ఇరవై
గంటలు = నాలుగు ‘గంటలూ
నీకు డ్యూటుంటదమ్మా = నీకు ఎదో ఒక పని ఉంటుంది.
ఎనిమిదే గంటలు చేసొచ్చి = కేవలం ఎనిమిది గంటలు పని చేసి ఇంటికి వచ్చే
నీ మొగుడు = నీ భర్త
ఎగిరెగిరిపడతడమ్మ = చాలా గర్విస్తాడు అమ్మ

సారాంశము : ఉదయం లేచింది మొదలు ఇల్లు ఊడ్చడం, వాకిలి ఊడ్చి కల్లాపి చల్లడం, వంటపాత్రలు కడిగి వంటచేయడం, అందరి బట్టలుతకడం, వడ్డించి తినేవరకు ఆగి నీ శరీరం మొత్తం అలిసి పోయేదాక పని చేసినా పని అయిపోదు. రోజులో ఉండే ఇరవైనాలుగు గంటలూ కష్టపడ్డా ఇంకా ఎదో ఒకపని ఉండనే ఉంటది. కాని కేవలం ఎనిమిది గంటలు బయట పనికి వెళ్లి వచ్చిన నీ భర్త మాత్రం నీ మీద ఎగిరి ఎగిరి పడతాడు తల్లి అని నిసార్ ఆవేదన వ్యక్తం చేశాడు.

22 నుండి 27వ పంక్తి వరకు

ఇల్లంత సరిజేసి పిల్లలా సవరించి
అత్తమామల జూసి, మొగని మెప్పుపొంది
కూలి నాలి జేసి పొద్దూక ఇల్లొచ్చి
ఆకలి మంటతో పొయ్యి రాజేసేవు
ఏ లెక్కనా జూసినా నువుజేసే కష్టమే ఎక్కువాయే
కూలి డబ్బుల కాడ మగవాల్ల కన్న నీకెందుకు తక్కువాయే – “ఆడ ”

అర్థములు :

ఇల్లంత సరిజేసి = ఇంటికి కావలసిన పనులు చేసి
పిల్లలా సవరించి = పిల్లలను పోషించి
అత్తమామల జూసి, = అత్తను మామను సరిగా పోషించి
మొగని మెప్పుపొంది = భర్త సంతోషించేలా చేసి
కూలి నాలి జేసి = కూలిపని మొదలయినవి చేసి
పొద్దూక ఇల్లొచ్చి = సాయంత్రం సమయంలో ఇంటికి చేరి
ఆకలి మంటతో = ఆకలి వేస్తుండగా
పొయ్యి రాజేసేవు = వంట చేయడానికి పొయ్యిని వెలిగిస్తావు
ఏ లెక్కనా జూసినా = ఇలా ఏ లెక్క ప్రకారం చూసినా
నువుజేసే కష్టమే = నువ్వు (ఆడవారు) చేసే కష్టమే
ఎక్కువాయే = అధికం
కూలి డబ్బుల కాడ = కూలి చేసినందుకు ఇచ్చే డబ్బుల్లో కూడా
మగవాల్ల కన్న = మగవారితో పోల్చితే
నీకెందుకు = నీకు (ఆడవారికి) ఎందుకు
తక్కువాయే = తక్కువగా ఇస్తారు.

సారాంశము : ఇంటికి కావలసిన పనులన్ని చేసి, పిల్లలను పోషించి, అత్త మామలను సరిగా పోషించి, భర్త మెప్పును పొంది కూలికి వెళ్లి పనిచేసి ఆకలితో ఇంటికి వచ్చి పొయ్యి వెలిగిస్తావు. ఏ లెక్కప్రకారం చూసినా ఆడవారు చేసే శ్రమనే అధికం. అయినా మగవారికే కూలి ఎక్కువ ఎందుకిస్తారు అని నిసార్ ప్రశ్నించాడు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 6 ఆడపిల్లలంటేనే

28 నుండి 33వ పంక్తి వరకు

పేగుతెంచుకొని పిల్లలా కన్నావు
పెంచినవు పెండ్లీలు చేసి మురిసినవు
చావు బతుకులల్ల సంసార మీదినవు
చాతనయి నందక బరువంత మోసినవు
ముసలి దానవంటూ నిన్ను కసిరించు కుంటరమ్మా
వయసు పండి నీ ఆశలెండి వుత్త తొడిమోలె మిగిలేవమ్మా

అర్థములు :

పేగుతెంచూ కొని = పేగులను తెంపుకొని, నొప్పులు భరించి
పిల్లలా కన్నావు = పిల్లల్ని కన్నావు
పెంచినవు = పెంచి పెద్ద చేశావు
పెండ్లీలు చేసి = పెళ్ళిళ్ళు చేసి
మురిసినపు = ఆనందపడ్డావు
చావు బతుకులల్ల = చావులో, బతుకులో (కష్ట సుఖాల్లో)
సంసారము ఈదినవు = సంసారాన్ని సాగించావు
చాతనయి నందక = ఒంటిలో ఓపిక ఉన్నంత కాలం
బరువంత మోసినవు = సంసారం బరువును మోసావు
ముసలిదానివి అయ్యావని = ముసలి దానవంటూ
నిన్ను కసిరించు కుంటారమ్మా = దూరంగా ఉంచుతారు
వయసు పండి = వయసు మీద పడి
నీ ఆశలెండి = నీవు పెట్టుకున్న ఆశలు ఎండిపోయి, ఆశలను చాలించుకుని
వుత్త తొడిమోలె = పండు విడిచిన తొడిమ లాగ
మిగిలేవమ్మా = మిగిలి పోతావు, ఉండిపోతావు.

సారాంశము : పేగులు తెంపుకొని, పిల్లల్ని కనీ, పెంచి వారికి పెళ్ళిళ్ళు చేసి ఆనందపడ్డావు. చావుబతుకుల్లో, కష్టసుఖాల్లో సంసారాన్ని సాగించావు. నీ ఒంటిలో ఓపిక ఉన్నతకాలం సంసారపు బరువును మోసావు. ముసలిదానివి అని ఇప్పుడు దూరంగా ఉంచుతున్నారు. వయసుమీద పడి నీవు పెంచుకున్న ఆశలు ఎండి పోయి తొడిమలాగా మిగిలిపోయావు.

34 నుండి 37వ పంక్తి వరకు

నడిచేటి చెట్టువమ్మా వో తల్లి త్యాగాల తెట్టెవమ్మా
ఆకు రాల్చినట్టు కష్టాలు మరిచేవు ప్రేమలే పంచేవమ్మా
కష్టాల కొలిమిలోనా ఇంకెంత కాలమేడుస్తవమ్మా
ఈ బష్టుగాళ్ళ తరుమ లేచిరా ముందుకు ఆలస్యమెందుకమ్మ – “ఆడ”

అర్థములు :

ఓ తల్లి = ఓ అమ్మా
నడిచేటి చెట్టువమ్మా = నీవు నడుస్తున్న చెట్టువు
త్యాగాల తెట్టెవమ్మా = త్యాగాలు అనే తేనె తెట్టెవు అమ్మ
ఆకు రాల్చినట్టు = ఆకులను రాల్చేసినట్టు
కష్టాలు మరిచేవు = కష్టాలను మరిచిపోతావు
ప్రేమలే పంచేవు + అమ్మా= ప్రేమలను పంచుతావు
కష్టాల కొలిమిలోనా = కష్టాలు అనే కొలిమిలో
ఇంక + ఎంత కాలము = ఇంకా ఎన్ని రోజులు
ఏడుమ్మా = ఏడుస్తూ ఉంటావమ్మ
ఈ బద్దుగాళ్ళ తరుమ = ఈ చెడిపోయిన వాళ్ళను వెళ్ళగొట్టడానికి
లేచిరా ముందుకు = లేచి ముందుకు రా
ఆలస్యము+ఎందుకమ్మ = ఇంకా ఆలస్యం ఎందుకు చేస్తావు

సారాంశము : ఓ అమ్మా! నీవు నడిచే చెట్టులాంటి దానివి. త్యాగాలు చేసిన తేనెతుట్టె లాంటి దానివి. చెట్టు ఆకులను రాల్చినట్టు కష్టాలను మరిచిపోతావు. తేనెలను పంచినట్టు ప్రేమలను పంచుతావు. ఇంకా ఎన్ని రోజులు కష్టాల కొలిమిలో ఉంటావమ్మ. ఈ చెడిపోయిన వాళ్ళను వెళ్ళగొట్టడానికి లేచి ముందుకు రావాలి అని, సహించినంత కాలం కష్టాలను భరించాల్సి ఉంటుందని, ఎదిరిస్తేనే బాధలు దూరమవుతాయని దానికోసం పోరాటం చేయాలని నిసార్ మహిళలకు మార్గదర్శనం చేశాడు.

ఆడపిల్లలంటేనే Summary in Telugu

TS Inter 2nd Year Telugu Study Material Poem 6 ఆడపిల్లలంటేనే 1

కవి పరిచయం

పాఠ్యాంశం పేరు : ఆడపిల్లలంటేనే
కవి పేరు : మహమ్మద్ నిసార్ అహమద్
గ్రంథం : ‘నిసార్ పాట’ అనే ఉద్యమగీతాల సంపుటిలోనిది.
కాలం : డిసెంబర్ 16, 1964 – మరణం: జూలై 8, 2020
స్వస్థలం : ఉమ్మడి నల్లగొండ జిల్లా, గుండాల మండలం, సుద్దాల గ్రామం
తల్లిదండ్రులు : హాలీమాబీ, మహమ్మద్ అబ్బాస్
చదువు : సుద్దాలలో ప్రాథమిక విద్యను, సీతారాంపురం ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తిచేశాడు. ఉన్నత చదువులు అభ్యసించాలన్న ఆకాంక్ష ఉన్నప్పటికీ పేదరికం కారణంగా నిసార్ చదువుకు స్వస్తిచెప్పి, ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్కు చేరుకున్నాడు. దూరవిద్య ద్వారా బి.ఏ. డిగ్రీ పట్టా అందుకున్నాడు.

రచనలు : తొలితరం ప్రజావాగ్గేయకారుల స్ఫూర్తితో 1986 సం|| నుంచి పాటలు రాయడం ప్రారంభించాడు. “చుట్టుపక్కల ఎక్కడ జూచిన పొట్టలల్లో ఆకలిమంటలు/చుట్టుకుపోయిన పేగులన్నీ తట్టిలేపుతున్నాయి” అంటూ తొలిపాట రాసి, అంతులేని ఆకలిబాధలను ఆర్ద్రంగా గానం చేశాడు. అనునిత్యం ప్రజల కష్టనష్టాలకు ప్రతిస్పందిస్తూ పదునైన పాటలల్లి సమాజాన్ని చైతన్యపరిచాడు. తెలంగాణ గ్రామీణ సాంస్కృతిక ఔన్నత్యాన్ని కాపాడుకోవలసిన అవసరముందని నిసార్ తన పాటల్లో ప్రబోధించాడు.

తాపీ మేస్త్రీ, కల్లుగీత కార్మికులు, హమాలీలు, అడ్డా కూలీలు, ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ కార్మికులు, నిరుపేద ముస్లింలు తదితర బడుగుజీవుల బతుకు వెతలను కళ్ళకు కట్టినట్లుగా నిసార్ తన పాటల్లో చిత్రించాడు. లాక్ డౌన్ నేపథ్యంలో చిన్నాభిన్నమైన రోజుకూలీల మూగరోదనలను రాగరంజితంగా వినిపించాడు. ‘నిసార్ పాట’ అనే శీర్షికతో 2008 సం॥లో ప్రచురితమైన ఈ కవి ఉద్యమగీతాలకు సముచితమైన ప్రాచుర్యం లభించింది.

ప్రజానాట్యమండలి కార్యదర్శిగా విశేషమైన సేవలందించిన నిసార్ కరోన బారినపడి మరణించాడు. నిసార్ అంటే ఉర్దూలో ‘త్యాగధనుడు’ అనిఅర్థం. ప్రజాచైతన్యపూరితమైన పాటలతో సమాజానికి తనను తాను అర్పించుకున్న సార్ధక నామధేయుడు నిసార్.

పాఠ్యభాగ సందర్భం

ఆనాటి నుంచి ఈనాటి వరకు మహిళలపై నిరాఘాటంగా అణిచివేత పెరుగుతూనే ఉంది. బాల్యంనుంచి వృద్ధాప్యం వరకూ స్త్రీ అంతులేని వివక్షతను ఎదుర్కొంటూనే ఉంది. ప్రపంచంలో పనిగంటల నియమం లేకుండా ఇంటా బయట పరిశ్రమించే నిత్యశ్రామికులు మహిళలు మాత్రమే. రోజువారీ జీవితంలో మహిళలు ఎదుర్కొంటున్న బహుముఖీన శ్రమభారాన్ని అర్ధంచేసుకొని, వారి కష్టంలో పాలుపంచుకోవాలి. మహిళాభివృద్ధియే దేశాభివృద్ధి అని గుర్తించాలి. స్త్రీ, పురుషుల్లో పరస్పర గౌరవ భావన పెంపొందినప్పుడే మెరుగైన సమాజం ఏర్పడుతుంది. ఈ రకమైన సమానత్వ ఎరుకను విద్యార్థుల్లో కలిగించడమే ఈ పాఠ్యభాగ సారాంశం.

TS Inter 2nd Year Telugu Study Material Poem 6 ఆడపిల్లలంటేనే

పాఠ్యభాగ సారాంశం

ఓ అమ్మా! ఆడపిల్లలు అంటేనే లోకానికి చులకన భావం ఏర్పడింది. ఆడవారు లేకుండా ఈ లోకం ఎక్కడుంది అని సమాజాన్ని నిలబెట్టి స్పష్టంగా అడుగు చెల్లి అని నిసార్ సలహా ఇస్తున్నాడు. పిల్లలు పుట్టాలని పూజలు, వ్రతాలు చేస్తారు. కాని ఆడపిల్ల పుట్టిందని తెలియగానే వెక్కిరిస్తారు. ఆడపిల్ల పడుకుంటే లేపి అంట్లు శుభ్రం చేయిస్తారు. మగపిల్లలను బడికి పంపి చదివిస్తారు. ఆడపిల్లలను పనికి మగపిల్లలను చదువుకు పంపడం అనే భేద భావాలు ఎందుకుండాలి ? ఆడ మగ ఇద్దరూ పరస్పరం సహకరించుకుంటూ ఉండాలి అలా ఉండకుంటే జీవితం సఫలం కాదు అని నిసార్ భావన.

కొత్తగా పెండ్లి కాగానే అత్తగారి ఇంటికి వరకట్నం, కానుకలు తెచ్చే పంటలగా మారి వారి ఇల్లు నింపాలని అనుకుంటారు. నువ్వు కట్నంగా తెచ్చిన డబ్బుతో, బంగారంతో, వాహనంతో, వంట పాత్రలతో ఇల్లు నింపినా ఇంకా సరిపోలేదని అంటారు. ఓ చెల్లెమ్మా! నీవు తెచ్చిన కట్నంలో ఏ కొద్దిగా తగ్గినా నీ మొఖం పాడుగాను, నువ్వేం తెచ్చావని అంటారు. నిన్ను వాళ్ళే చంపేసి వంటింట్లో చచ్చిందని వార్తాపత్రికలకు ఇస్తారని నిసార్ హెచ్చరించాడు.

ఉదయం లేచింది మొదలు ఇల్లు ఊడ్చడం, వాకిలి ఊడ్చి కల్లాపి చల్లడం, వంటపాత్రలు కడిగి వంటచేయడం, అందరి బట్టలుతకడం, వడ్డించి తినేవరకు ఆగి నీ శరీరం మొత్తం అలిసి పోయేదాక పని చేసినా పని అయిపోదు. రోజులో ఉండే ఇరవైనాలుగు గంటలూ కష్టపడ్డా ఇంకా ఎదో ఒకపని ఉండనే ఉంటది. కాని కేవలం ఎనిమిది గంటలు బయట పనికి వెళ్లి వచ్చిన నీ భర్త మాత్రం నీ మీద ఎగిరి ఎగిరి పడతాడు తల్లి అని నిసార్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంటికి కావలసిన పనులన్ని చేసి, పిల్లలను పోషించి, అత్త మామలను సరిగా పోషించి, భర్త మెప్పును పొంది కీ వెళ్లి పనిచేసి ఆకలితో ఇంటికి వచ్చి పొయ్యి వెలిగిస్తావు.

ఏ లెక్కప్రకారం చూసినా ఆడవారు చేసే శ్రమనే అధికం. అయినా మగవారికే కూలి ఎక్కువ ఎందుకిస్తారు అని నిసార్ ప్రశ్నించాడు. పేగులు తెంపుకొని, పిల్లల్ని కనీ, పెంచి వారికి పెళ్ళిళ్ళు చేసి ఆనందపడ్డావు. చావుబతుకుల్లో, కష్టసుఖాల్లో సంసారాన్ని సాగించావు. నీ ఒంటిలో ఓపిక ఉన్నంతకాలం సంసారపు బరువును మోసావు. ముసలి దానివి అని ఇప్పుడు దూరంగా ఉంచుతున్నారు. వయసుమీద పడి నీవు పెంచుకున్న ఆశలు ఎండిపోయి తొడిమలాగా మిగిలిపోయావు.

ఓ అమ్మా! నీవు నడిచే చెట్టులాంటి దానివి. త్యాగాలు చేసిన తేనెతుట్టె లాంటి దానివి. చెట్టు ఆకులను రాల్చినట్టు కష్టాలను మరిచిపోతావు. తేనెలను పంచినట్టు ప్రేమలను పంచుతావు. ఇంకా ఎన్ని రోజులు కష్టాల కొలిమిలో ఉంటావమ్మ. ఈ చెడిపోయిన వాళ్ళను వెళ్ళగొట్టడానికి లేచి ముందుకు రావాలి అని, సహించినంత కాలం కష్టాలను భరించాల్సి ఉంటుందని, ఎదిరిస్తేనే బాధలు దూరమవుతాయని దానికోసం పోరాటం చేయాలని నిసార్ మహిళలకు మార్గదర్శనం చేశాడు.