TS Inter 2nd Year Telugu Study Material Chapter 4 గోల్కొండ మధుర స్మృతులు

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material 4th Lesson గోల్కొండ మధుర స్మృతులు Textbook Questions and Answers.

TS Inter 2nd Year Telugu Study Material 4th Lesson గోల్కొండ మధుర స్మృతులు

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
గోల్కొండ కోట ప్రత్యేకతలను వర్ణించండి. (V.Imp) (M.P)
జవాబు:
అంతఃపురంలోని వసతులు: గోల్కొండ కోట కాకతీయ ప్రోలరాజు కన్నా ప్రాచీనమైంది. కాకతీయులనాడు ఈ కోట కొత్త వైభవాన్ని సంతరించుకుంది. రాజ ప్రతినిధులకు స్థావరంగా, యువరాజుకు నివాసంగా, కాకతీయ సైన్యానికి నిలయంగా, అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా రూపొందింది. ఖుతుబుషాహీల కాలంలో ఈ కోటలో అనేక సుందర భవనములు నిర్మించబడ్డాయి. అందులోని ఏర్పాట్లు ఈనాటికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. రాణులు నివసించే అంతఃపురం అన్నిరకాల భద్రతా ఏర్పాట్లతోపాటు సర్వాంగ సుందరంగా ఉంది.

మురికినీరు, వర్షపునీరు బైటికి పోవడానికి చేసిన ఏర్పాట్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అయిదారు అంతస్తుల మేడలు. ప్రతి అంతస్తుకు అవసరమయిన శుభ్రమైన నీరు రావడానికి, మురికి నీరు బైటకు పోవడానికి శాస్త్రీయమైన ఏర్పాట్లు చేశారు. మూడు వందల సంవత్సరాలు గడిచినా అవి ఇంకా నిలిచి ఉన్నాయి. కోటలో నీటి ఏర్పాటుకు వివిధ స్థాయిలలో దాదాపు ఎనిమిది బావులున్నాయి. మొదటి బావి అన్నిటికన్న క్రిందస్థాయిలో ఉంది.

అది అన్నింటికన్న పెద్దది. కోటకు పడమర ఆరుమైళ్ళ దూరంలో మొదటి బావికి సమాన స్థాయిలో “దుర్గమ్మ చెరువు” ఉంది. అది చాలా లోతుగా, విశాలంగా, శుభ్రంగా ఉండి మంచి నీటితో కొండల మధ్య ఉంది. మొదటి బావి నుంచి రెండవ బావికి ఆపై ఒకదానినుంచి వేరొకదానికి నీరు నింపబడేలా ఏర్పాట్లు చేశారు. అలా నింపడానికి ఉపయోగించే పర్ష్యా ఛత్రాలను తిప్పడానికి మానవులును, పశువులును ఉపయోగించేవారు.

ఉద్యానవనాల సౌందర్యం : గోల్కొండ కోటలో, చుట్టుప్రక్కల విశాలంగా, వివిధ రకాల పూలతోటలు ఉన్నాయి. అందులో ఆనాడు పుష్పించిన పూలపేర్లను ఈ రోజు పుస్తకాలలో చదవవలసిందే గాని అవి ఎలా ఉండేవో ఉహించలేము. ఆ పుష్పజాతులు అంతరించిపోయాయి. అంతఃపురంలో పెద్దకోనేరు, బయట “కటోర హవుజు” ఉన్నాయి. ఇందు ప్రతిరోజు నీటిని, రోజా పూవులను నింపేవారు. కటోరా హవుజు రాణీవాసపు స్త్రీలకు జలక్రీడా “స్థలం. దానిని అక్కడ ఉండే స్త్రీలు స్నానాలు జేయడానికి, ఈదులాటకు, నౌకా విహారం చేయడానికి ఉపయోగించేవారు. కటోరా హవుజు ఇప్పటికి ఉంది. కాని అంత శుభ్రంగా లేదు.

గోలకొండ కోటలో విశాలమైన, అందమైన రాజోద్యాన వనాలు, పుర ఉద్యానవనాలు ఉండేవి. అవి ఇంద్రలోకంలోని నందనవనాన్ని గుర్తు చేసే విధంగా ఉండేవి. సాయంకాల సమయములో కవులు, పండితులు ఆ పురోద్యానవనాలలో గుంపులు గుంపులుగా కూర్చుండి సారస్వత చర్చలు, కవితా గోష్ఠులు చేసేవారు. నగీనాబాఘ్ అనే ఉద్యానవనం చారిత్రక ప్రసిద్ది కలిగినది.

కోటలో ఉన్న భవనాలు : కోటలో అంతఃపురాలు, సభాభవనాలు, కార్యాలయాలు, జలాశయాలు, క్రీడామైదానాలు మాత్రమే గాక సైనిక సమూహాలు నివసించే ఇండ్లు, అధికారుల నివాసస్థానాలు, పారిశ్రామికుల ఇండ్లు, పండిత, పామర నాగరికుల ఇండ్లు ఉన్నాయి. వాళ్ళకు మరుగుదొడ్లు, మురుగు నీరుపారే వసతులు, స్నానపు గదులు, వాటికి వేడి, చల్లనీటి ఏర్పాట్లు మొదలైన సామాజిక ఆరోగ్యానికి అవసరమైన ఇతర వసతులు కల్పించబడ్డాయి.

ఆయుధ కర్మాగారాలు, టంకశాలలు, సైనిక శిక్షణ కేంద్రాలు, పాఠశాలలు, వైద్యశాలలు, సత్రాలు, సైనిక సమూహ ప్రణాళికా రచన, పరిశీలన స్థావరాలు ఉండేవి. ఖుతుబుషాహీల టంకశాల, భాండాగారము ఈనాటికీ “ఖజాన బిల్డింగు” అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ పురావస్తుశాఖవారి ఆధీనంలో ఉంది. దానిని ఆనుకొని ఖుతుబుషాహీల ఆయుధాగారము ఉండేది. దానికి ఆనుకొని ఉన్న భవనాలలో సైనిక ప్రజా పరిపాలనాధికారులుండే గృహాలు ఉండేవి. వాటిని దారికి ఇరువైపులా అందమైన వరుసలలో నిర్మించారు.

రాతిఫలకం విశేషత : రాజాంతఃపురపు సింహద్వారంలో నేలపై ఉన్న రాతిఫలకమీద నిలబడి చప్పట్లు కొడితే దాని ప్రతిధ్వని అంతఃపురంలోకి వినిపిస్తుంది. ఇది జహంగీరు చక్రవర్తి న్యాయ ఘటికాయంత్రం కంటే గొప్ప విషయం. కోటలో రాజాంతఃపురాలను దాటిపోతే భాండాగారాలు, తుపాకి మందుగుండు నిలువజేసే గదులు, జైలుగదులు కనిపిస్తాయి. బాలాహిస్సారుకు పోయేదారిలో మస్జిదు, మందిరం ఒకదాని పక్కన మరొకటి ఉంటాయి. ఖుతుబుషాహీల మత సహనానికి సజీవ సాక్ష్యంగా ఈనాటికీ అవి కనిపిస్తాయి. “బాలా హిస్సారు” కు పోయే దారిలో రామదాసు చెఱశాల అని ఒక రాతి గుహను చూపిస్తారు. అందులో ఉన్న చలువరాతిపై శ్రీరాముని ఆకారము రామదాసు చెక్కినదే అని కూడా అంటారు. ఇది రామదాసున్న బందీఖాన యని చెప్పు ఆధారాలు లేవు. కాళ్లు చేతులు సంకెళ్ళతో బంధించబడిన గోపన్న ఉలి సుత్తి లేకుండా శిలపై రాముని చిత్రం చెక్కడం నమ్మదగిన విషయం కాదు.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 4 గోల్కొండ మధుర స్మృతులు

ప్రశ్న 2.
ఖులీఖుతుబ్ షా సమాధుల నిర్మాణ విశేషాలను తెలుపండి.
జవాబు:
గోల్కొండ దుర్గమునకు పడమర సుమారు మైలుదూరంలో ఒక ఎత్తైన సహజసుందరమైన మైదానముంది. ఆ ప్రదేశములో ఖుతుబుషాహీ పాలకుల సమాధులున్నాయి. ఈ ప్రదేశములో ఫలాలతో, పుష్పాలతో నిండిన తోటలుండేవి. కొన్ని ఈనాటికీ ఉన్నాయి. ఈ సమాధుల చుట్టు ఎత్తైన రాతి గోడ ఉంది. ఇందులో ఉన్న సమాధులలో కొన్ని ఖుతుబుషాహి రాజులవికావు. వీటిలో ప్రేమావతి తారామతి, రాజవైద్యుని సమాధులు మాత్రమే గాక రాజాదరణ పొందిన వేరొకరి సమాధికూడా ఉంది. రాజు బంధువులని చెప్పబడేవారి సమాధులు కొన్ని అక్కడక్కడ ఉన్నాయి. మహమ్మదు ఖులీ ఖుతుబుషా సమాధి నిర్మించిన పద్ధతికన్న జమీదు ఖులీ గోరి నిర్మించిన పద్ధతి వేరు. రెండు పర్ష్యా దేశపు నిర్మాణ రీతులనే విశేషంగ అనుకరించి నిర్మించారు.

ఇబ్రహీము ఖులీఖుతుబుషా సమాధి కూడా పెద్దదే. అందలి శిల్పవిజ్ఞానము, నిర్మాణరీతులు క్రొత్తపుంతలు తొక్కినవి. దాని దగ్గరనే మహమ్మదు ఖుతుబుషా సమాధి ఉంది. సమచతురశ్రమగు ఉన్నత వేదికపై అత్యంత సుందరంగ కట్టబడిన బ్రహ్మాండమైన కట్టడమిది. అందులోని శిల్పనిర్మాణ చాతుర్యం హిందూ, ముస్లిం, ఇండో, ఈరానియన్ శిల్ప సాంస్కృతుల కలయికకు చక్కని ఉదాహరణగా నిలుస్తుంది. అందులోని రాతి పుష్పాలు ఇస్లాం మతానికి వ్యతిరేకం అని వాటిని ధ్వంసం చేశారు. అయినా అవి సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తూనే ఉన్నాయి.

మహమ్మదు ఖుతుబ్ షా భాగ్యనగర నిర్మాత. గుల్జారుహౌజు, మక్కా మసీదు, చార్ మినార్ వంటి విఖ్యాత కట్టడాలు ఇతను ప్రారంభించినవే. దక్షిణాపథములో ఉర్దూ భాషకు ఇతన్ని పిత అంటారు. అతని సమాధివద్ద ఈనాటికి ప్రార్థనలు, మత కర్మకాండలు మాత్రమే గాక ఉర్దూ దినం, ఖుతుబుషాహి దినం జరుపుతారు. ఈ సందర్భంగా పండితులతో సారస్వతోపన్యాసములు జరుగుతాయి. ఆ దినాలలో అక్కడ చరిత్ర సంస్కృతులను గురించిన చర్చలు జరుగుతాయి. ఇతని భార్య పేరు హయ్యతు బట్టీ బేగం, ఈమెకు ఈ వంశ చరిత్రలోను గోల్కొండ సంస్కృతిలోను ఒక విశిష్ట స్థానముంది. ఆమె ఖుతుబుషాహీ రాజులలో వరుసగ ఒకనికి కూతురు.

వేరొకనికి భార్య, మరొకనికి తల్లి. ఈమెకు బ్రహ్మాండమైన సమాధి నిర్మించబడింది. దీని నిర్మాణ పద్ధతికూడా విశిష్టమైనది. అబ్దుల్లా ఖుతుబుషా సమాధి చాల పెద్దది. దాని నిర్మాణ పద్ధతికూడా విభిన్నమైనది. దానిని డబుల్ డోల పద్ధతి అంటారు. దీనిలో పైకి కనిపించే గుమ్మటమే గాక దానిలోన కూడా ఎక్కువ నేర్పు గల మరొక గుమ్మటముంది.

ఈ సమాధులు బ్రహ్మాండమైన కట్టడములు. వీటిని చూడడానికి తండోపతండములుగా జనాలు నేటికి చాలా మంది వస్తుంటారు. విదేశీయులు సైతం ఈ సమాధులను చూసి ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని పొందుతారు. చనిపోయిన రాజుల భౌతిక దేహాలను, వారి బంధువుల శవములను ఇక్కడికి తెచ్చి చివరిస్నానము చేయిస్తారు. అంత్య క్రియలు చేయడానికి ఇక్కడ ఒక చిన్న అందమైన కట్టడముంది. ఈ రాజులు షియా సంప్రదాయానికి చెందినవారు. వారు పన్నెండు మంది ఇమాములను పూజిస్తారు. కావున ఈ కట్టడంలో పన్నెండు కోణాలు,

పన్నెండు మెట్లు, పన్నెండు చెంబులు, పన్నెండు ఆకుల ఆకారాలు, ఇలా అన్నీ పన్నెండు ఉంటాయి. ఇది చూడవలసిన చక్కని చిన్న కట్టడం. ఈ సమాధులు అత్యున్నతాలు, అపూర్వాలు, అతిసుందరాలు. ఒకప్పుడివి సర్ఫేఖాస్ (నిజాం నవాబు) ఆస్తి. ఆపై కేంద్రపురావస్తు పర్యవేక్షణలోకి వచ్చాయి. ఇప్పుడవి పురావస్తు శాఖవారి అధీనములో ఉన్నాయి. సుమారు ఎనిమిది లక్షల వ్యయముతో ఈ సమాధులను, పెద్ద ఉద్యానవనములను, క్రీడాసరోవరములను, నౌకా విహారావకాశములను, రమణీయ ఆరామాలను, విశ్రాంతి భవనాలను, పురావస్తు ప్రదర్శనశాలలను, మిరుమిట్లుగొలుపు దీపమాలికలను, జలయంతరాలను, అపురూపమైన పూదోటలను ఏర్పాటు జేసి, దీనిని భారతదేశములోనే ప్రథమ శ్రేణికి చెందిన యాత్రిక కేంద్రముగ రూపొందించే ఆలోచన ఉన్నది. ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి తప్పక దీనిని అభివృద్ధి పరచాలని ఎందరో ఒప్పుకుంటారు.

II సంగ్రహరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
గోల్కొండ కోటలోని నీటి ఏర్పాట్లను తెలుపండి.
జవాబు:
గోలకొండ కోటలో అనేక సుందర భవనములు నిర్మించబడ్డాయి. అందులోని ఏర్పాట్లు ఈనాటికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. రాణులు నివసించే అంతఃపురం అన్నిరకాల భద్రతా ఏర్పాట్లతోపాటు సర్వాంగ సుందరంగా ఉంది. మురికినీరు, వర్షపునీరు బైటికి పోవడానికి చేసిన ఏర్పాట్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అయిదారు అంతస్తుల మేడలు. ప్రతి అంతస్తుకు అవసరమయిన శుభ్రమైన నీరు రావడానికి, మురికి నీరు బైటకు పోవడానికి శాస్త్రీయమైన ఏర్పాట్లు చేశారు. మూడు వందల సంవత్సరాలు గడిచినా అవి ఇంకా నిలిచి ఉన్నాయి. కోటలో నీటి ఏర్పాటుకు వివిధ స్థాయిలలో దాదాపు ఎనిమిది బావులున్నాయి.

మొదటి బావి అన్నిటికన్న క్రిందస్థాయిలో ఉంది. అది అన్నింటికన్న పెద్దది. కోటకు పడమర ఆరుమైళ్ళ దూరంలో మొదటి బావికి సమాన స్థాయిలో “దుర్గమ్మ చెరువు” ఉంది. అది చాల లోతుగా, విశాలంగా, శుభ్రంగా ఉండి మంచి నీటితో కొండల మధ్య ఉంది. మొదటి బావి నుంచి రెండవ బావికి ఆపై ఒకదానినుంచి వేరొకదానికి నీరు నింపబడేలా ఏర్పాట్లు చేశారు. అలా నింపడానికి ఉపయోగించే పర్ష్యా ఛత్రాలను తిప్పడానికి మానవులును, పశువులును ఉపయోగించేవారు.

ప్రశ్న 2.
‘పురానపుల్’ నిర్మించుటకు గల కారణాలు ఏవి ?
జవాబు:
భాగ్యమతి ప్రేమ వలలో చిక్కుకున్న నవయువకుడు, యువరాజు మహమ్మదు ఖులీ కుతుబ్షా పొంగి పొరిలే ముచుకుందా నదిని తన గుర్రంతో దాటి ఆవలి తీరానికి సురక్షితముగ జేరుకున్నాడు. అలా ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదిలోకి వెళ్ళిన తమ కుమారున్ని చూసి అతని తల్లిదండ్రులు మహమ్మదు ఇబ్రహీం ఖుతుబుషా (మల్కిభరాముడు), అతని భార్య తల్లడిల్లిపోయారు. ఇటువంటి ప్రమాడం మళ్ళీ రాకూడదని మూసీనదిపై రాజ దంపతులు పురానపుల్ను నిర్మించారు. అది ఇప్పటికి ప్రజోపయోగకరంగ నిలచి ఉంది. భాగ్యమతి పేరు మీదనే హైద్రాబాదు నిర్మించబడింది.

ప్రశ్న 3.
గోల్కొండ కళాకారుల వైశిష్ట్యాన్ని వివరించండి.
జవాబు:
రాజాంతఃపురపు సింహద్వారంలో నేలపై ఉన్న రాతిఫలకమీద నిలబడి చప్పట్లు కొడితే దాని ప్రతిధ్వని అంతః పురంలోకి వినిపిస్తుంది. ఇది జహంగీరు చక్రవర్తి న్యాయ ఘటికాయంత్రం కంటే గొప్ప విషయం. కోట పడమటి ద్వారాన్ని బంజార దర్వాజ అంటారు. స్థానికముగ లభించే తెల్లటి గ్రానైటురాయితో ఈ కోటను నిర్మించారు. తుపాకి గుండ్లను కూడా బంతులలాగా తిరుగ గొట్టేంత గట్టితనమున్న రాయి అది. ఆ గట్టితనమును కొట్టలేకనే మొఘలులు ఈ కోట గోడలను, సొరంగముల ద్వారా కూల్చే ప్రయత్నం చేశారు. అయినా మూడు సార్లు విఫలులైనారు. తూర్పుభాగంలో ఉన్న బురుజును మాత్రము వారు కూల్చగలిగారు. కాని మరునాటి ఉదయం వరకే దానిని గోల్కొండవారు ఎప్పటిమాదిరి నిలబెట్టారు. అదిచూసి మొఘలులు ఆశ్చర్యపోయారు. ఆ బురుజు నిజమయిన రాతితో నిర్మించబడింది కాదని వారికి తెలియదు. కాగితము పనితనమునకు అది ఒక పరాకాష్ట. గోల్కొండ కళాకారుల వైశిష్ట్యమునకు అదొక గొప్ప ఉదాహరణ.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 4 గోల్కొండ మధుర స్మృతులు

ప్రశ్న 4.
ఖజానా బిల్డింగ్లోని పురావస్తు ప్రదర్శనశాల విశేషాలను తెలుపండి.
జవాబు:
గోలకొండకోట కేంద్రప్రభుత్వ పురావస్తుశాఖవారి యాజమాన్యంలో, షంషీరుకోట్, ఖజాన బిల్డింగులు ఆంధ్రప్రదేశ్ పురావస్తుశాఖ వారి పర్యవేక్షణలో ఉన్నాయి. వారు ఖజాన బిల్డింగును పురావస్తు ప్రదర్శనశాలగా మార్చారు. అందులో వివిధ శతాబ్దముల సంస్కృతులకు చెందిన సుందర శిల్పకళాఖండాలు, అమూల్యములైన శిలాశాసనాలు ప్రదర్శించబడుచున్నాయి. ఆ శిల్పసంపద, ఆనాటి సాంస్కృతీ, సామాజిక వైభవాలకు దర్పణంగా నిలుస్తుంది. ఆ పురావస్తుశాల పర్యవేక్షణకు ఒక అధికారి, కొంత సిబ్బంది నియమితులైనారు. దీని ప్రక్కనే షంషీరుకోట్ ఉంది. దానిలో ఆనాటి వివిధ ఆయుధాలు భద్రపరిచారు. వీటిని సాధారణంగా ప్రదర్శించరు. కాని ప్రదర్శించుట చాల అవసరం.

III ఏకపద/వాక్య సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భూపాలరావుకు తెలిసిన భాషలను పేర్కొనండి.
జవాబు:
తెలుగు, సంస్కృతం, కన్నడ, మరాఠి, హిందీ, ఫ్రెంచి, డచ్.

ప్రశ్న 2.
భూపాలరావు రాయప్రోలు సుబ్రహ్మణ్యంతో కలిసి ఏ గ్రంథాన్ని రచించాడు ?
జవాబు:
దేవాలయ చరిత్ర

ప్రశ్న 3.
‘గోల్కొండ మధురస్మృతులు’ పాఠం ఏ పుస్తకం లోనిది ?
జవాబు:
మహామంత్రి మాదన్న

ప్రశ్న 4.
సింహద్వారం నేలపైనున్న రాతిఫలకము ప్రత్యేకత ఏమిటి ?
జవాబు:
రాజాంతఃపురపు సింహద్వారంలో నేలపై ఉన్న రాతిఫలకమీద నిలబడి చప్పట్లు కొడితే దాని ప్రతిధ్వని అంతఃపురంలోకి వినిపిస్తుంది.

ప్రశ్న 5.
మొహర్రం పదవరోజున ఏ ఉత్సవాలు జరుగుతాయి ?
జవాబు:
బీబీకా ఆలం, ఏనుగు అంబారీ లంగరు ఉత్సవాలు.

ప్రశ్న 6.
‘ఎనుగల చెట్టు’ గొప్పదనం తెలుపండి.
జవాబు:
గోలకొండ కోటలో ఎనుగల చెట్టు అని పిలువబడే ఒక పెద్ద జువ్వి చెట్టు ఉంది. దీని చుట్టుకొలత సుమారు వంద అడుగులు. ఇంత పెద్ద చుట్టుకొలత ఉన్న జువ్విచెట్లు చాల తక్కువ.

ప్రశ్న 7.
‘డబుల్ డోల పద్ధతి’లో ఎవరి సమాధి నిర్మించారు ?
జవాబు:
అబ్దుల్లా కుతుబ్షా

TS Inter 2nd Year Telugu Study Material Chapter 4 గోల్కొండ మధుర స్మృతులు

ప్రశ్న 8.
భాగ్యనగర నిర్మాత ఎవరు ?
జవాబు:
మహమ్మదు ఖుతుబ్ షా

కఠిన పదాలకు అర్ధములు

63వ పుట

రజాకారులు = నిజాం రాజు పాలన కోసం పాకిస్తాన్ నుండి తెచ్చుకున్న ఖాసిం రజ్వి తయారు చేసిన సైన్యం
అరాచకాలు = దుర్మార్గాలు

64వ పుట

దుర్గ౦ = కోట
పురాతనము = ప్రాచీనం
క్రమేపి = క్రమంగా, కాలం గడిచిన కొద్ది
సంతరించుకున్న = పొందిన
దుర్నిరీక్షత = చూడ శక్యం కాని
నాడు = ఆ రోజుల్లో
అబ్దములు = సంవత్సరాలు
దశాంతర = వివిధ దశల్లో
వైభవం = గొప్పతనం
స్థావరం = ఉండే చోట
నివేశనము = నివసించే చోటు, ఇల్లు
వాహిని = సైన్యం
స్కందావారము = సైన్యం ఉండే చోటు
సంభ్రమ + ఆశ్చర్యములు = సంతోషం, అచ్చెరువు
రాణివాసం = రాణులు నివసించే చోటు
సర్వతో భద్రము = అన్ని రకాలుగా సురక్షిత
అంతఃపురం = రాణులు నివసించే చోటు
మనోరంజకము = మనస్సును ఆనందపరిచేది
ముర్కినీరు = మురికి నీరు
ముచ్చట గొలుపు = కోరికను కలిగించు
శుభ్ర + ఉదకము = శుభ్రమైన నీరు
శాస్త్రీయ = శాస్త్రము చెప్పిన విధంగా

65వ పుట

ఎన్మిది = ఎనిమిది
మైలు = ఎనిమిది ఫర్లాంగుల దూరం
అగాధం = లోతైన
విస్తృత = విశాలమైన
నిర్మల = శుభ్రమైన
మధుర = తీయని
జలాశయము = చెరువు
పటిష్ఠము = దృఢమైన
నిరంతరము = ఎల్లప్పుడూ
పర్ష్యా ఛత్రపు = పర్ష్యా దేశంలో వాడే గిరక వంటిది
తోచుట = అనిపించుట
జల సమృద్ధి = కావలిసినంత నీరు
దృవపడింది = ఋజువైంది
విస్తార = విశాల
మెండు = ఎక్కువ
అంతరించు = నశించు, లేకుండా పోవు
కోనేరు = చెరువు
కటోరా హవుజు = గిన్నె ఆకారంలో నిర్మితమైన చెరువు
రోజా పూవులు = గులాబి పూవులు
కేళి కాసారము = ఆడుకునే సరస్సు
నౌకా విహారము = పడవలలో తిరుగుట
పన్నీరు = సువాసననిచ్చే జలం
కన్నీరు = కంటి నీరు (బాధ)
విపులము = విశాలము
సుందర = అందమైన
రాజ + ఉద్యానములు = రాజులు విహరించే పూల తోటలు
పుర + ఉద్యానములు = పుర ప్రజలు విహరించే పూల తోటలు
ఆకర్షణ = మనసును లాగడం
నందన వనం = స్వర్గంలోని పూలతోట (ఇంద్రుని ఉద్యానవనం పేరు)
తలపించెడి = గుర్తు చేసే
సాయం సమయం = సాయంకాల సమయం
గుములుగా = గుంపులుగా
సారస్వత చర్చలు = సాహిత్య చర్చలు
కవితా గోష్ఠులు = కవిత్వ చర్చలు
చారిత్రకము = చరిత్రలో నిలిచినది
ప్రసిద్ధము = పేరు పొందినది
సమృద్ధ = కావలిసినంత
క్రీడ + ఆరామములు = ఆటలాడే స్థలాలు
సైనిక = సైనికుల
నికాయ = సమూహం
వసతి గృహాలు = నివసించే స్థలాలు (ఇళ్ళు)
పారిశ్రామికుల = పరిశ్రమలను స్థాపించిన వారు
గేహము = గృహం, ఇల్లు చదువుకున్నవారు
పండితులు = చదువుకున్నారు
పామరులు = చదువు లేనివారు
నాగరికుల = ప్రజల
టంకశాల = నాణెములు తయారు చేసే స్థలం
సత్రం = ఉచిత భోజన వసతి కల్పించే స్థలం
వ్యూహం = ప్రణాళిక
భాండాగారము = ధనం ఉంచే స్థలం
ఖజానా = భాండాగారం

66వ పుట

స్వాధీనమందు = అధీనంలో, పర్యవేక్షణలో
ఆయుధాగారము = ఆయుధములు ఉంచే స్థలం
యాజమాన్యములో = పాలనలో
నికేతనములు = ఇండ్లు
బారులు తీరి = వరుసగా
సింహ ద్వారము = ప్రధాన మార్గం
రాతి ఫలకం = రాతితో చేసిన ఫలకం
అపూర్వమగు = అంతకుముందు లేని, విశేషమైన
చెరశాల = బందిఖానా, జైలు కనిపిస్తాయి
అగుపడును = కనిపిస్తాయి
మార్గం = దారి
సరసన = పక్కన
మతసహనం = ఇతరమతాలపై ఓర్పు
తార్కాణం = నిదర్శనం
చూపింతురు = చూపిస్తారు
చట్రాతిపై = చలువరాతిపై
ఆధారములు = సాక్ష్యములు
నిగళ బద్ధములై = సంకెళ్ళతో బంధించిన
ఉలి = రాళ్ళను చెక్కే సాధనం
సుత్తి = ఉలిని కొట్టడానికి వాడే ఇనుప సాధనం
రూఢిగా = నిశ్చయముగా
రూపాంతరము = రూపము మార్చుకొని
ప్రేమ వాగురులు = ప్రేమ అనే వలలు
తగుల్కొని = చిక్కుకొని
పరవళ్ళు తొక్కుతూ = వేగంగా ప్రవహిస్తూ
నురుగులు గ్రక్కుతూ = ప్రవాహ వేగానికి నురగలు వస్తుంటే
ముచుకుందు నది = మూసి నది
సీరికిస్థానక = లెక్క చేయక
భీషణ ఘోషలు = భయంకర శబ్దాలు
నలు దిశల = నాలుగు వైపులా
మ్రానుల = చెట్లను
సమూలంగా = వేర్లతోసహా
పెకిలించి = ఊడదీసి
తరంగ డోలికల = “అలల ఉయ్యాలలో
కొనిపోవుచున్న = తీసుకొని పోతున్న
ప్రవేశించు = పోవు
దేవేరి = భార్య, రాణి
తల్లడిల్లిరి = బాధపడ్డారు
పునరావృతము కారాదని = మళ్ళీ రాకూడదని
పూనికతో = సంకల్పంతో
అతిలోక సుందరి = అన్ని లోకాలలో వారికంటే అందమైనది
రూపసంపద = రూపము అనే సంపద (అందం)

67వ పుట

ప్రజా + ఉపయోగ = ప్రజలకు ఉపయోగపడే
అంతేవాసిని = దగ్గర ఉన్నది
ఆసీనయై = కూర్చున్నప్పుడు
మత్తెక్కి = మదమెక్కి
మావటిని = ఏనుగును నడిపేవాడిని
మట్టుబెట్టి = చంపి
రాకుమారుని యుక్తముగా = రాకుమారునితో సహా
సమీప = దగ్గరి
అరణ్య = అడవి
రాజమాత = రాకుమారుని తల్లి, రాణి
తల్లడిల్లు హృదయంతో = బాధతో నిండిన మనస్సుతో
పీరులు = లోహంతో అర్థ చంద్రాకారంగా ఉండేవి
లంగరు ఉత్సవం తీయింతును = లంగరు అనే పేరుతో ఊరేగింపు తీయిస్తాను
మొహర్రం పదియవ రోజున = ఇస్లాం ప్రకారం హిజరీ శకం మొహర్రం నెలలో పదవ రోజు
రూపకల్పన = రూపాన్ని ఉహించడం
హృదయఫలకము మీద = హృదయము అనే ఫలకం మీద (మనస్సులో)
ఏనుగు అంబారిలంగరు = ఏనుగు అంబారీలపై ఊరేగించే ఉత్సవం
ప్రసిద్ధములు = పేరుపొందినవి
అనంతరం = తరువాత
ఉత్సవమును = పండగ
కోటకాల = కోటకు అవతలి వైపు
గవిని ( గైన్ అనే పదం ) = ప్రవేశ ద్వారం
సొరంగముల ద్వారా = భూమి లోపలనుండి తొలచిన ద్వారముల ద్వారా
ముమ్మారు = మూడు సార్లు
విఫలులైరి = విఫలం చెందారు
బురుజు = రాతితో ఎత్తుగా కట్టిన కట్టడం
శిథిలమైన = కూలిపోయిన
వేకువ, = ఉదయం
యథారూపంగా = ఎప్పటిమాదిరి
విభ్రాంతులైరి = ఆశ్చర్యపోయారు
నిస్పృహ = నిరాశ
నిస్తేజులను = మొఖంలో తేజస్సు కోల్పోయిన వారిగా ఉన్నత స్థితి
పరాకాష్ట = ఉన్నత స్థితి
వైశిష్ట్య౦ = విశిష్టత
ఉజ్వల + ఉదాహరణ = తిరుగులేని ఉదాహరణ
వృక్షరాజం = గొప్ప చెట్టు
అశేషజనం = జనులందరూ
కైవారము = చుట్టుకొలత
అరుదు = తక్కువ

TS Inter 2nd Year Telugu Study Material Chapter 4 గోల్కొండ మధుర స్మృతులు

68వ పుట

అమూల్యం = వెలకట్టలేని
ముగ్గులగుచుందురు = మురిసిపోతారు
దర్పణం = అద్దం
ప్రదర్శించరు = చూపించరు
రమారమి = సుమారు
ఫల పుష్ప భరిత = ఫలాలతో, పుష్పాలతో నిండినది
రాతి ప్రాకారం = రాతితో నిర్మించిన ప్రహరి గోడ
మకుటాధిపతులు = కిరీటాన్ని ధరించినవారు, రాజులు
చెదురుగా = అక్కడక్కడ
శిల్ప విన్నాణము = శిల్ప విజ్ఞానం, శిల్పాలు చెక్కడంలో నేర్పు
బ్రహ్మాండము = గొప్ప
శిల్ప ప్రాగల్భ్యం = శిల్పకళలో నేర్పు
ఈరానియన్ = ఇరాన్ దేశ సంప్రదాయం
కూడలి = కలయిక
శిలాపుష్పాలు = శిలపై చెక్కిన పుష్పాలు
వైకృత్తిక = వికారమైన
భిత్తిక = గోడ
సంభ్రమ + ఆశ్చర్యం = సంతోషం, ఆశ్చర్యం
కొలుపును = కలిగిస్తాయి
విఖ్యాత = ప్రఖ్యాత
సారస్వత + ఉపన్యాసాలు = సాహిత్య ప్రసంగాలు

69వ పుట

గుమ్మటం = దీపముంచే ఎత్తైన కట్టడం
తండోపతండాలు = గుంపులు గుంపులుగా
ధీటైన = సమానమైన
అరుదు = తక్కువ
చతురత = నేర్పు
తుది స్నానం = చనిపోయిన తరువాత చివరి స్నానం
చరమ కర్మకాండ = అంత్యక్రియలు
ఇమాం = ఇస్లాం మత పెద్ద
దళములు = ఆకులు
సమాధులు+అతి+ఉన్నతములు = మిక్కిలి ఎత్తైన సమాధులు
అధీనం = స్వాధీనంలో
వ్యయం = ఖర్చు
అపురూపమైన = అపూర్వమైన
నిర్వివాదాంశం = వివాదం లేని విషయం

గోల్కొండ మధుర స్మృతులు Summary in Telugu

TS Inter 2nd Year Telugu Study Material Chapter 4 గోల్కొండ మధుర స్మృతులు 1

రచయిత పరిచయం

పాఠం పేరు : గోల్కొండ మధురస్కృతులు
గ్రంథం : మహామంత్రి మాదన్న
దేనినుండి గ్రహించబడినది : ఇది మహామంత్రి మాదన్న పుస్తకము నుండి గ్రహించబడినది
రచయిత : కొమరగిరి వేంకట భూపాలరావు
తల్లిదండ్రులు : కమలమ్మ, సీతారామయ్య
కాలం : జననం : ఏప్రిల్ 12, 1916; మరణం : జనవరి 8, 2004
స్వస్థలం : హనుమకొండ దగ్గర వెంకటాపురం
తెలిసిన భాషలు : తెలుగు, సంస్కృతం, కన్నడ, మరాఠి, హిందీ, ఫ్రెంచి, డచ్
పరిశోధనాంశం : భాగ్యనగర చరిత్ర
రచనలు : తెలుగులో మహామంత్రి మాదన్న, ఆంగ్లంలో (The Illustrious Prime Minister). ఆచార్య రాయప్రోలు సుబ్రహ్మణ్యంతో కలిసి దేవాలయ చరిత్ర, హైదరాబాద్ నగరంపై సుమారు 20 పుస్తకాలు ఆంగ్లం, తెలుగు భాషల్లో రచించారు.
ఉద్యోగాలు : పురావస్తు శాఖలో కొన్ని రోజులు. తహసీల్దార్ నుండి కలెక్టర్ వరకు వివిధ పదవులు

విశేషతలు :

  • పురావస్తు శాఖలో పని చేసేటప్పుడు శిల్పకళను అధ్యయనం చేశారు.
  • కలెక్టర్గా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలల్లో మౌలిక వసతుల కల్పన చేశారు.
  • ఆయన సేవలకు గుర్తింపుగా భూపాలరావు పేరు మీద భూపాలపల్లి ఏర్పాటైంది.
  • రజాకార్ల అరాచకాల సమయంలో హైద్రాబాద్ విడిచివెళ్ళారు.
  • రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేయటం వల్ల జైలుజీవితం అనుభవించారు.
  • ఉద్యోగ విరమణ తర్వాత తిరిగి తన చారిత్రక పరిశోధన కొనసాగించి మహామంత్రి మాదన్న జీవితంపై “The Illustrious Prime Minister” పేరుతో ఆంగ్లంలో పుస్తకం రచించారు.
  • వరంగల్ సుబేదారీ ప్రాంతంలో మాదన్న విగ్రహస్థాపన చేయించారు.

పాఠ్యభాగ సందర్భం

కొమరగిరి భూపాలరావు విద్యాభ్యాసం కోసం హైదరాబాదుకు రావడంవల్ల, అక్కడ మాడపాటి హనుమంతరావు, ఆదిరాజు వీరభద్రరావుల పరిచయం కారణంగా హైదరాబాదు చరిత్రపట్ల ఆసక్తి పెరిగింది. హైదరాబాదు చరిత్రపై విస్తృత పరిశోధన చేసి ఇరవైకి పైగా తెలుగు, ఇంగ్లీషు పుస్తకాలు రాశారు. ఉద్యోగ విరమణ తరువాత మహామంత్రి మాదన్నపై విస్తృత పరిశోధన చేశారు. ఆయన జీవితంపై తెలుగులో, ఆంగ్లంలో పుస్తకాలు రాశారు. మహామంత్రి మాదన్న పుస్తకంలో గోలకొండ కోట గురించి రాసిన వ్యాసం ప్రస్తుత మన పాఠ్యభాగం. అది గ్రాంథికంలో ఉంది. సరళ ప్రామాణిక భాషలో సారాంశాన్ని ఇస్తున్నాము.

పాఠ్యభాగ సారాంశం

అంతఃపురంలోని వసతులు : గోల్కొండ కోట కాకతీయ ప్రోలరాజు కన్నా ప్రాచీనమైంది. కాకతీయులనాడు ఈ కోట కొత్త వైభవాన్ని సంతరించుకుంది. రాజ ప్రతినిధులకు స్థావరంగా, యువరాజుకు నివాసంగా, కాకతీయ సైన్యానికి నిలయంగా, అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా రూపొందింది. ఖుతుబుషాహీల కాలంలో ఈ కోటలో అనేక సుందర భవనములు నిర్మించబడ్డాయి. అందులోని ఏర్పాట్లు ఈ నాటికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. రాణులు నివసించే అంతఃపురం అన్నిరకాల భద్రతా ఏర్పాట్లతోపాటు సర్వాంగ సుందరంగా ఉంది.

మురికినీరు, వర్షపునీరు బైటికి పోవడానికి చేసిన ఏర్పాట్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అయిదారు అంతస్తుల మేడలు. ప్రతి అంతస్తుకు అవసరమయిన శుభ్రమైన నీరు రావడానికి, మురికి నీరు బైటకు పోవడానికి శాస్త్రీయమైన ఏర్పాట్లు చేశారు. మూడు వందల సంవత్సరాలు i^చినా అవి ఇంకా నిలిచి ఉన్నాయి. కోటలో నీటి ఏర్పాటుకు వివిధ స్థాయిలలో దాదాపు ఎనిమిది బావులున్నాయి.

మొదటి బా ఇన్నిటికన్న క్రిందస్థాయిలో ఉంది. అది అన్నింటికన్న పెద్దది. కోటకు పడమర ఆరుమైళ్ళ దూరంలో మొదటి బావికి సమాన స్థాయిలో “దుర్గమ్మ చెరువు” ఉంది. అది చాలా లోతుగా, విశాలంగా, శుభ్రంగా ఉండి మంచి నీటితో కొండల మధ్య ఉంది. మొదటి బావి నుంచి రెండవ బావికి ఆపై ఒకదానినుంచి వేరొకదానికి నీరు నింపబడేలా ఏర్పాట్లు చేశారు. అలా నింపడానికి ఉపయోగించే పర్యా ఛత్రాలను తిప్పడానికి మానవులును, పశువులును ఉపయోగించే వారు.

ఉద్యానవనాల సౌందర్యం : గోల్కొండ కోటలో, చుట్టుప్రక్కల విశాలంగా, వివిధ రకాల పూలతోటలు ఉన్నాయి. అందులో ఆనాడు పుష్పించిన పూలపేర్లను ఈ రోజు పుస్తకాలలో చదవవలసిందే గాని అవి ఎలా ఉండేవో ఉహించలేము. ఆ పుష్పజాతులు అంతరించిపోయాయి. అంతఃపురంలో పెద్దకోనేరు, బయట “కటోర హవుజు” ఉన్నాయి. ఇందు ప్రతిరోజు నీటిని, రోజా పూవులను నింపేవారు. కటోరా హవుజు రాణీవాసపు స్త్రీలకు జలక్రీడా స్థలం. దానిని అక్కడ ఉండే స్త్రీలు స్నానాలు జేయడానికి, ఈదులాటకు, నౌకా విహారం చేయడానికి ఉపయోగించేవారు. కటోరా హవుజు ఇప్పటికి ఉంది. కాని అంత శుభ్రంగా లేదు.

గోలకొండ కోటలో విశాలమైన, అందమైన రాజోద్యాన వనాలు, పుర ఉద్యానవనాలు ఉండేవి. అవి ఇంద్రలోకంలోని నందనవనాన్ని గుర్తు చేసే విధంగా ఉండేవి. సాయంకాల సమయములో కవులు, పండితులు ఆ పురోద్యానవనాలలో గుంపులు గుంపులుగా కూర్చుండి సారస్వత చర్చలు, కవితా గోష్ఠులు చేసేవారు. నగీనాబాఘ్ అనే ఉద్యానవనం చారిత్రక ప్రసిద్ధి కలిగినది.

కోటలో ఉన్న భవనాలు : కోటలో అంతఃపురాలు, సభాభవనాలు, కార్యాలయాలు, జలాశయాలు, క్రీడామైదానాలు మాత్రమే గాక సైనిక సమూహాలు నివసించే ఇండ్లు, అధికారుల నివాసస్థానాలు, పారిశ్రామికుల ఇండ్లు, పండిత, పామర నాగరికుల ఇండ్లు ఉన్నాయి. వాళ్ళకు మరుగుదొడ్లు, మురుగు నీరుపారే వసతులు, స్నానపు గదులు, వాటికి వేడి, చల్లనీటి ఏర్పాట్లు మొదలైన సామాజిక ఆరోగ్యానికి అవసరమైన ఇతర వసతులు కల్పించబడ్డాయి.

ఆయుధ కర్మాగారాలు, టంకశాలలు, సైనిక శిక్షణ కేంద్రాలు, పాఠశాలలు, వైద్యశాలలు, సత్రాలు, సైనిక సమూహ ప్రణాళికా రచన, పరిశీలన స్థావరాలు ఉండేవి. ఖుతుబుషాహీల టంకశాల, భాండాగారము ఈనాటికీ “ఖజాన బిల్డింగు” అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ పురావస్తుశాఖవారి ఆధీనంలో ఉంది. దానిని అనుకొని ఖుతుబుషాహీల ఆయుధాగారము ఉండేది. దానికి ఆనుకొని ఉన్న భవనాలలో సైనిక ప్రజా పరిపాలనాధికారులుండే గృహాలు ఉండేవి. వాటిని దారికి ఇరువైపులా అందమైన వరుసలలో నిర్మించారు.

రాతిఫలకం విశేషత : రాజాంతఃపురపు సింహద్వారంలో నేలపై ఉన్న రాతిఫలకమీద నిలబడి చప్పట్లు కొడితే దాని ప్రతిధ్వని అంతఃపురంలోకి వినిపిస్తుంది. ఇది జహంగీరు చక్రవర్తి న్యాయ ఘటికాయంత్రం కంటే గొప్ప విషయం. కోటలో రాజాంతఃపురాలను దాటిపోతే భాండాగారాలు, తుపాకి మందుగుండు నిలువజేసే గదులు, జైలుగదులు కనిపిస్తాయి. బాలాహిస్సారుకు పోయేదారిలో మస్జిదు, మందిరం ఒకదాని పక్కన మరొకటి ఉంటాయి. ఖుతుబుషాహీల మత సహనానికి సజీవ సాక్ష్యంగా ఈనాటికీ అవి కనిపిస్తాయి. “బాలా హిస్సారు” కు పోయే దారిలో రామదాసు చెఱశాల అని ఒక రాతి గుహను చూపిస్తారు. అందులో ఉన్న చలువరాతిపై శ్రీరాముని ఆకారము రామదాసు చెక్కినదే అని కూడా అంటారు.

ఇది రామదాసున్న బందీఖాన యని చెప్పు ఆధారాలు లేవు. కాళ్లు చేతులు సంకెళ్ళతో బంధించబడిన గోపన్న ఉలి సుత్తి లేకుండా శిలపై రాముని చిత్రం చెక్కడం నమ్మదగిన విషయం కాదు.

పురానాపూల్ నిర్మాణం : మరికొంత దూరం పోతే “బాలాహిస్సారు” కనిపిస్తుంది. అది తన మొదటి రూపమును . గోల్పోయి ఉంది. భాగ్యమతి ప్రేమ వలలో చిక్కుకున్న నవయువకుడయిన యువరాజు మహమ్మదు ఖులీ ఖుతుబుషా పొంగి పొరిలే ముచుకుందా నదిని తన గుర్రంతో ఆవలి తీరానికి సురక్షితముగ జేరుకున్నాడు. అలా ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదిలోకి వెళ్ళిన తమ కుమారున్ని చూసి అతని తల్లిదండ్రులు మహమ్మదు ఇబ్రహీం ఖుతుబుషా (మల్కిభరాముడు), అతని భార్య తల్లడిల్లిపోయారు. ఇటువంటి ప్రమాదం మళ్ళీ రాకూడదని మూసీనదిపై ఆ రాజ దంపతులు పురానపుల్ను నిర్మించారు. అది ఇప్పటికి ప్రజోపయోగకరంగ నిలచిఉంది. భాగ్యమత్తి పేరు మీదనే హైద్రాబాదు నిర్మించబడింది.

బిబికా ఆలం నిర్వహణకు కారణం : ఆ బాలాహిస్సారులో యున్నప్పుడే మరొకసారి యువరాజు ఎక్కిన ఏనుగుకు మత్తెక్కి మావటీని చంపింది. రాకుమారునితో సహా దగ్గరలో ఉన్న అడవిలోకి పారిపోయింది. అది చూసిన రాజమాత తల్లడిల్లే హృదయంతో తన కొడుకు సురక్షితంగా తిరిగివస్తే పేరులను చేయిస్తానని, లంగరు ఉత్సవం చేస్తానని, ఏనుగుపై నెక్కించి నూరేగిస్తానని మొక్కుకుంది. మొహర్రము పదవరోజు హైద్రాబాదులో ఈనాటికీ కనిపించే బీబీకా ఆలం, లంగరు ఉత్సవముల రూపకల్పన రాణి హృదయ ఫలకం మీద ఈ బాలాహిస్సారులోనే జరిగింది. భారతదేశము మొత్తం మీద ఈ బీబీకా ఆలం, ఈ ఏనుగు అంబారీ లంగరు ప్రసిద్ధమైనవి.

ఖుతుబుషాహీల తర్వాత ఆసఫ్ జాహీలు కూడ ఈ ఉత్సవాన్ని పెద్ద ఎత్తున జరిపించారు. నేటికి పదవ మొహర్రము నాడు లక్షలమంది ఈ వేడుకలలో పాల్గొంటారు.

కోట పటిష్టత : కోటకు అవతలి వైపు తూర్పున తానాషా గురువయిన (రజియొద్దీన్) షా రాజు ఖత్తాల్ సమాధి ఉంది. కోట పడమటి ద్వారాన్ని బంజార దర్వాజ అంటారు. స్థానికముగా లభించే తెల్లటి గ్రానైటురాయితో ఈ కోటను నిర్మించారు. తుపాకి గుండ్లను కూడా బంతులలాగా తిరుగ గొట్టేంత గట్టితనమున్న రాయి అది. ఆ గట్టితనమును కొట్టలేకనే మొఘలులు ఈ కోట గోడలను, సొరంగముల ద్వారా కూల్చేప్రయత్నం చేశారు. అయినా మూడుసార్లు విఫలులైనారు. తూర్పుభాగంలో ఉన్న బురుజును మాత్రము వారు కూల్చగలిగారు.

కాని మరునాటి ఉదయం వరకే దానిని గోల్కొండవారు ఎప్పటిమాదిరి నిలబెట్టారు. అది చూసి మొఘలులు ఆశ్చర్యపోయారు. ఆ బురుజు నిజమయిన రాతితో నిర్మించబడింది కాదని వారికి తెలియదు. కాగితము పనితనమునకు అది ఒక పరాకాష్ట. గోల్కొండ కళాకారుల వైశిష్ట్యమునకు అదొక గొప్ప ఉదాహరణ.

ఏనుగల చెట్టు విశిష్టత : ఈ కోటలో ఎనుగల చెట్టు అని పిలువబడే ఒక పెద్ద వృక్షమున్నది. అది ఖుతుబుషాహీలకు పూర్వముదని దానిని గౌరవించేవారు. దీనిని చూడటానికి అశేషజనం ఈనాటికీ వస్తారు. దీని చుట్టుకొలత సుమారు నూరడుగులు. ఇంత పెద్ద చుట్టుకొలత ఉన్న జువ్విచెట్లు చాలా తక్కువ.

ప్రదర్శనశాలగా కోట : గోలకొండకోట కేంద్రప్రభుత్వ పురావస్తుశాఖవారి యాజమాన్యంలో, షంషీరుకోట్, ఖజాన బిల్డింగులు ఆంధ్రప్రదేశ్ పురావస్తుశాఖ వారి పర్యవేక్షణలో ఉన్నాయి. వారు ఖజాన బిల్డింగును పురావస్తు ప్రదర్శనశాలగా మార్చారు. అందులో వివిధ శతాబ్దముల సంస్కృతులకు చెందిన సుందర శిల్పకళాఖండాలు,

అమూల్యములైన శిలాశాసనాలు ప్రదర్శించబడుచున్నాయి. ఆ శిల్పసంపద, ఆనాటి సాంస్కృతీ, సామాజిక వైభవాలకు దర్పణంగా నిలుస్తుంది. ఆ పురావస్తుశాల పర్యవేక్షణకు ఒక అధికారి, కొంత సిబ్బంది నియమితులైనారు. దీని ప్రక్కనే షంషీరుకోట్ ఉంది. దానిలో ఆనాటి వివిధ ఆయుధాలు భద్రపరిచారు. వీటిని సాధారణంగా ప్రదర్శించరు. కాని ప్రదర్శించుట చాల అవసరం.

సమాధుల విశిష్టత : గోల్కొండ దుర్గమునకు పడమర సుమారు మైలుదూరంలో ఒక ఎత్తైన సహజసుందరమైన మైదానముంది. ఆ ప్రదేశములో ఖుతుబుషాహీ పాలకుల సమాధులున్నాయి. ఈ ప్రదేశములో ఫలాలతో, పుష్పాలతో నిండిన తోటలుండేవి. కొన్ని ఈనాటికీ ఉన్నాయి. ఈ సమాధుల చుట్టు ఎత్తైన రాతి గోడ ఉంది. ఇందులో ఉన్న సమాధులలో కొన్ని ఖుతుబుషాహి రాజులవికావు. వీటిలో ప్రేమావతి తారామతి, రాజవైద్యుని సమాధులు మాత్రమే గాక రాజాదరణ పొందిన వేరొకరి సమాధికూడా ఉంది. రాజు బంధువులని చెప్పబడేవారి సమాధులు కొన్ని అక్కడక్కడ ఉన్నాయి. మహమ్మదు ఖులీ ఖుతుబుషా సమాధి నిర్మించిన పద్ధతికన్న జమీదు ఖులీ గోరి నిర్మించిన పద్ధతి వేరు. రెండు పర్ష్యా దేశపు నిర్మాణ రీతులనే విశేషంగా అనుకరించి నిర్మించారు. ఇబ్రహీము ఖులీఖుతుబుషా సమాధి కూడా పెద్దదే.

అందలి శిల్పవిజ్ఞానము, నిర్మాణరీతులు క్రొత్తపుంతలు తొక్కినవి. దాని దగ్గరనే మహమ్మదు ఖుతుబుషా సమాధి ఉంది. సమచతురశ్రమగు ఉన్నత వేదికపై అత్యంత సుందరంగా కట్టబడిన బ్రహ్మాండమైన కట్టడమిది. అందులోని శిల్పనిర్మాణ చాతుర్యం హిందూ, ముస్లిం, ఇండో, ఈరానియన్ శిల్ప సాంస్కృతుల కలయికకు చక్కని ఉదాహరణగా నిలుస్తుంది. అందులోని రాతి పుష్పాలు ఇస్లాం మతానికి వ్యతిరేకం అని వాటిని ధ్వంసం చేశారు. అయినా అవి సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తూనే ఉన్నాయి.

మహమ్మదు ఖుతుబ్ షా భాగ్యనగర నిర్మాత. గుల్జారుహౌజు, మక్కా మసీదు, చార్మినార్ వంటి విఖ్యాత కట్టడాలు ఇతను ప్రారంభించినవే. దక్షిణాపథములో ఉర్దూ భాషకు ఇతన్ని పిత అంటారు. అతని సమాధి వద్ద ఈనాటికి ప్రార్థనలు, మత కర్మకాండలు మాత్రమే గాక ఉర్దూ దినం, ఖుతుబుషాహి దినం జరుపుతారు.

ఈ సందర్భంగా పండితులతో సారస్వతోపన్యాసములు జరుగుతాయి. ఆ దినాలలో అక్కడ చరిత్ర సంస్కృతులను గురించిన చర్చలు జరుగుతాయి. ఇతని భార్య పేరు హయ్యతు బట్టీ బేగం, ఈమెకు ఈ వంశ చరిత్రలోను, గోల్కొండ సంస్కృతిలోను ఒక విశిష్ట స్థానముంది. ఆమె ఖుతుబుషాహీ రాజులలో వరుసగ ఒకనికి కూతురు. వేరొకనికి భార్య, మరొకనికి తల్లి. ఈమెకు’ బ్రహ్మాండమైన సమాధి నిర్మించబడింది. దీని నిర్మాణ పద్ధతికూడా విశిష్టమైనది. అబ్దుల్లా ఖుతుబుషా సమాధి చాల పెద్దది. దాని నిర్మాణ పద్ధతికూడా విభిన్నమైనది. దానిని డబుల్ డోల పద్ధతి అంటారు. దీనిలో పైకి కనిపించే గుమ్మటమే గాక దానిలోన కూడా ఎక్కువ నేర్పు గల మరొక గుమ్మటముంది.

ఈ సమాధులు బ్రహ్మాండమైన కట్టడములు. వీటిని చూడడానికి తండోపతండములుగా జనాలు నేటికి చాలా మంది వస్తుంటారు. విదేశీయులు సైతం ఈ సమాధులను చూసి ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని పొందుతారు. చనిపోయిన రాజుల భౌతిక దేహాలను, వారి బంధువులు శవములను ఇక్కడికి తెచ్చి చివరిస్నానము చేయిస్తారు. అంత్యక్రియలు చేయడానికి ఇక్కడ ఒక చిన్న అందమైన కట్టడముంది.

ఈ రాజులు షియా సంప్రదాయానికి చెందినవారు. వారు పన్నెండు మంది ఇమాములను పూజిస్తారు. కావున ఈ కట్టడంలో పన్నెండు కోణాలు, పన్నెండు మెట్లు, పన్నెండు చెంబులు, పన్నెండు ఆకుల ఆకారాలు, ఇలా అన్నీ పన్నెండు ఉంటాయి. ఇది చూడవలసిన చక్కని చిన్న కట్టడం. ఈ సమాధులు అత్యున్నతాలు, అపూర్వాలు, అతిసుందరాలు. ఒకప్పుడివి సర్ఫేఖాస్ (నిజాం నవాబు) ఆస్తి. ఆపై కేంద్రపురావస్తు పర్యవేక్షణలోకి వచ్చాయి. ఇప్పుడవి పురావస్తు శాఖవారి అధీనములో ఉన్నాయి.

సుమారు ఎనిమిది లక్షల వ్యయముతో ఈ సమాధులను, పెద్ద ఉద్యానవనములను, క్రీడాసరోవరములను, నౌకా విహారావకాశములను, రమణీయ ఆరామాలను, విశ్రాంతిభవనాలను, పురావస్తు ప్రదర్శనశాలలను, మిరుమిట్లుగొలుపు దీపమాలికలను, జలయంత్రాలను, అపురూపమైన పూదోటలను ఏర్పాటు జేసి, దీనిని భారతదేశములోనే ప్రథమ శ్రేణికి చెందిన యాత్రిక కేంద్రముగా రూపొందించే ఆలోచన ఉన్నది. ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి తప్పక దీనిని అభివృద్ధి పరచాలని ఎందరో ఒప్పుకుంటారు.

Leave a Comment