TS Inter 2nd Year Political Science Study Material Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్

Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 10th Lesson స్మార్ట్ గవర్నెన్స్ Textbook Questions and Answers.

TS Inter 2nd Year Political Science Study Material 10th Lesson స్మార్ట్ గవర్నెన్స్

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఎలక్ట్రానిక్ పాలన (e-Governance) అంటే ఏమిటి ? దాని సుగుణాలను వివరించండి.
జవాబు.
ఇ-గవర్నెన్స్ అంటే ఆంగ్లంలో ఎలక్ట్రానిక్ గవర్నెన్స్. దీన్ని ఎలక్ట్రానిక్ పాలన అని వ్యవహరిస్తారు. దీన్ని కాగిత రహిత పాలన (Paperless Governance) అని కూడా పేర్కొంటారు. దీన్ని అనుసరించి, సమాచార సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ఆధారంగా ప్రభుత్వం విధులు నిర్వహిస్తుంది. దీని వల్ల సేవలలో సమర్థత కార్యసాధకత పెరుగుతుంది.

దీనిలో భాగంగా అంతర్జాలాన్ని (Internet), ఇతర వెబ్ ఆధారిత సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగిస్తారు. పాలనలో వేగం ఖచ్చితత్వం దీనికి గల అదనపు లక్షణాలు, పౌరులు, సమూహాలు, సంస్థలు ఎలక్ట్రానిక్ పాలన పద్ధతి వల్ల గుణాత్మకమైన, నిరంతరాయమైన సేవలను పొందుతారు.

ఎలక్ట్రానిక్ పాలన పారదర్వకతను, కార్యసాధకతను, జవాబుదారీతనాన్ని పెంపొందిస్తుంది. భరతదేశంలోని ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో దీన్ని అమలుచేస్తున్నారు. 2017 సంవత్సరానికల్లా కాగితపు పాలన సాధన లక్ష్యంతో దీనిని అమలు చేస్తున్నారు.

నిర్వచనం :
భారత మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె అబ్దుల్ కలాం అభిప్రాయంలో భారతదేశపాలన సందర్భంలో ఎలక్ట్రానిక్ పాలన (e-Governance) అంటే, “ఒక పారదర్శక, సత్వర ఎలక్ట్రానిక్ పాలన అవధులు లేని, భద్రమైన విశ్వసనీయ సమాచార ప్రవాహాన్ని, శాఖాంతర అడ్డంకులను అధిగమించాలి. అందుబాటులోకి తెస్తూ పౌరులకు న్యాయబద్ధమైన, పక్షపాతం లేని సేవలను అందిస్తుంది”.

ఇంకా, ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర సాంస్కకృతిక సంస్థ (UNESCO), అభిప్రాయంలో “ఎలక్ట్రానిక్ పాలనలో ప్రభుత్వరంగం సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ, సమాచారాన్ని, సేవల బట్వాడాను పెంపొందించడం. నిర్ణయీకరణ ప్రక్రియలో పౌరుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, ప్రభుత్వం మరింత జవాబుదారీతనంతో, పారదర్శకంగా, సమర్థవంతంగా ఉండేలా చేయడం తదితర లక్ష్యలతో పనిచేస్తుంది.”

పైన పేర్కొన్న నిర్వచనాలు-అర్థవివరణలు పాతకాలపు రాతపని ఆధారిత పాలన ముగించి, పాలనలో ఎలక్ట్రానిక్ పద్ధతిలో సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించవలసిన ఆవశ్యకతను తెలుపుతాయి. పౌరులకు-ప్రభుత్వానికి మధ్య సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానమై కార్యాచరణ సాధనంగా ఉపయోగపడుతుంది. ఫలితంగా పాలనలో పారదర్శకతను చూడవచ్చు. ప్రస్తుతం భారతదేశంలో జాతీయ ఎలక్ట్రానిక్ పాలన ప్రణాళిక (National-Governance Plan-NEGP) అమలులో ఉంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్

ఎలక్ట్రానిక్ పాలన నమూనాలు (Modules of e-Governance) :

ఎ. ప్రభుత్వం నుంచి పౌరులకు (Government to Citizens G to C) :
ఈ నమూనా ఆధారంగా ప్రభుత్వానికి, పౌరులకు మధ్య కార్యాచరణ, సంబంధాన్ని కల్పించి, విస్తృత స్థాయిలో సేవలు అందించడం జరుగుతుంది. ఇది సాధారణ ప్రజానీకానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

బి. ప్రభుత్వం నుంచి వ్యాపార రంగానికి (Government to Business G to B) :
వ్యాపార రంగాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం సదుపాయదారునిలాగా పనిచేస్తుంది. లైసెన్సులను జారీచేసి, రెవెన్యూ వసూలు చేస్తుంది. అంతేకాకుండా, వర్తక వాణిజ్యాలకు, పర్యాటక రంగానికి పెట్టుబడులకు సదుపాయాలు కల్పిస్తుంది.

సి. ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి (Government to Government G to G) :
ప్రభుత్వ సేవలను అందించడంలో సమాచార-సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించడం జరుగుతోంది. స్వేచ్ఛ సమాచార ప్రవాహం సమాంతరంగా, నిలువుగా అందుబాటులో ఉండటం గమనిస్తాం. దీనితో జాతీయ, రాష్ట్ర స్థానిక నిర్వహణ సులువు అవుతుంది.

డి. ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు (Government to Employees G to E) :
ఈ నమూనా కింద ప్రభుత్వం, ఉద్యోగులు సమాచార సాంకేతిక పరిజ్ఞాన సాధనాలతో నిరంతరం స్థిరంగా ఒకరినొకరు సంప్రదించుకొని, కార్యాచరణ జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఉద్యోగులలో విస్తృత కార్యసాధనకు, సంతృప్తికి దారితీస్తుంది.

ఎలక్ట్రానిక్ పాలన-సుగుణాలు : ఎలక్ట్రానిక్ పాలన పద్ధతిలో ఈ దిగువ తెలిపిన ఉపయోగాలు ఉంటాయి.

  1. పౌరునికి సమాచారం అందించి, సంప్రదించే అవకాశం.
  2. పాలన ప్రక్రియను సంస్కరించడం.
  3. సమాచార అందుబాటు
  4. పౌరులకు గుణాత్మక సేవలు పెంపొందించడం
  5. సరళతర నియమాలు
  6. కార్యసాధన
  7. జవాబుదారీతనం
  8. పారదర్శకత
  9. ఎక్కువమంది పౌరులకు గుణాత్మక సేవ

TS Board Inter Second Year Political Science Study Material Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్

ప్రశ్న 2.
ఎలక్ట్రానిక్ పాలనలోని సుగుణాలను, లోపాలను చర్చించండి.
జవాబు.
నిర్వచనం :
భారత మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలాం అభిప్రాయంలో భారతదేశ పరిపాలన సందర్భంలో ఎలక్ట్రానిక్ పాలన (e-Governance) అంటే, “ఒక పారదర్శక, సత్వర ఎలక్ట్రానిక్ పాలన అవధులు లేని, భద్రమైన విశ్వసనీయ సమాచార ప్రవాహాన్ని శాఖాంతర అడ్డంకులను అధిగమించి, అందుబాటులోకి తెస్తూ పౌరులకు న్యాయబద్ధమైన పక్షపాతం లేని సేవలను అందిస్తుంది”.

ఎలక్ట్రానిక్ పాలన-సుగుణాలు :
ఎలక్ట్రానిక్ పాలన పద్ధతిలో ఈ దిగువ తెలిపిన ఉపయోగాలు ఉంటాయి.

  1. పౌరునికి సమాచారం అందించి, సంప్రదించే అవకాశం.
  2. పాలన ప్రక్రియను సంస్కరించడం.
  3. సమాచార అందుబాటు.
  4. పౌరులకు గుణాత్మక సేవలు పెంపొందించడం.
  5. సరళతర నియమాలు.
  6. కార్యసాధకత.
  7. పారదర్శకత.
  8. ఎక్కువమంది పౌరులకు గుణాత్మక సేవ.

ఎలక్ట్రానిక్ పాలన లోపాలు :
ఎలక్ట్రానిక్ పాలనపద్ధతిలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది.

  1. నిర్వహణ, నిర్వర్తన వ్యయాలు అధికం.
  2. సమీకృత సేవలు లేకపోవడం.
  3. మౌలిక సదుపాయాల లేమి
  4. బలహీనమైన న్యాయ ప్రక్రియ, నిస్సారమైన శాసనాలు
  5. న్యాయపర, చట్టపర, పరిపాలనపరమైన, పోలీసు సంస్కరణల అవసరం కలుగుతూ ఉండటం.
  6. పౌరుల అవసరాలను అవగాహన చేసుకోవడం కష్టతరం, భాషాపరమైన అవరోధాలు.
  7. ప్రజావిత్త నిర్వహణ వ్యవస్థ కష్ట సాధ్యం కావడం.
  8. ప్రజా నిర్ణయీకరణలో పౌరసమాజ భాగస్వామ్యాన్ని, పాత్రను నిరోధించడం.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్

ప్రశ్న 3.
సమాచార హక్కు అంటే ఏమిటి ?
జవాబు.
ఆధునిక పాలనలో పౌరుని పాత్రను వివరించడానికి సమాచార హక్కుచట్టం అధ్యయనం ఎంతో మౌలికమైనది. సమాచార హక్కు చట్టం పాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచి, పారదర్శకతను, జవాబుదారీతనాన్ని అందిస్తుంది. 20వ శతాబ్దం రెండో భాగంలో అనేక దేశాలు సమాచార హక్కు చట్టాన్ని రూపొందించాయి.

  1. పాలనలో పౌరులు పాల్గొనగలరా ?
  2. ప్రభుత్వ పథకాల సమాచారాన్ని పౌరులు ఎలా పొందగలరు ?
  3. ప్రభుత్వం న్యాయబద్ధంగా వ్యవహరిస్తోందా ?
  4. ప్రజలకు సమాచానాన్ని బహిర్గతం చేయవచ్చునా ?

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా సమాచార హక్కుచట్టం స్వభావం, ప్రాధాన్యత అధ్యయనం చేయాలి. దానిలో జవాబులు దొరుకుతాయి.

సమాచార హక్కుచట్టం 2005 రాష్ట్రపతి ఆమోదముద్రను 15 జూన్ 2005న పొంది, అక్టోబర్ 2005 నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. ఈ చట్టం జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రం మినహా దేశంలోని అన్ని రాష్ట్రాలు-కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తిస్తుంది. ఆ రాష్ట్రానికి మాత్రం ప్రత్యేక ఏర్పాటు ఉండి.

సమాచార హక్కుచట్టం ప్రకారం దేశంలోని ప్రతీపౌరునికి సంబంధించనదే అయినందున, ప్రభుత్వం ప్రజలతో సమాచారార్ని, పంచుకోవడాన్ని ఈ చట్టం అంగీకరిస్తుంది. ఇది ప్రజాస్వామ్యం మరింత ఆరోగ్యవంతంగా (బలోపేతంగా), లాభదాయకంగా పనిచేయడానికి ఉపకరిస్తుంది. అంతిమంగా సమాచారం ప్రజల్లో వినూత్న అవగాహనకు,య సాధికారతకు దారితీస్తుంది.

ప్రశ్న 4.
సమాచార హక్కులోని నిబంధనలను వివరించండి.
జవాబు.
సమాచార హక్కు ఒక ప్రాథమిక మానవ హక్కు దీనిలో అంతర్గతంగా హక్కులు-బాధ్యతులు కూడా ఉంటాయి. వీటిని ఈ కింది విధంగా వివరించవచ్చు.

  1. ప్రతీ వ్యక్తికి ప్రభుత్వం నుంచి సమాచారాన్ని కోరే హక్కు ఉంటుంది. ప్రైవేటు సంస్థల నుంచి కూడా సమాచారాన్ని కోరవచ్చు.
  2. ప్రజలు కోరిన సమాచారాన్ని అందించే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ప్రత్యేక కారణాల రీత్యా వెల్లడి చేయకూడని సమాచారాన్ని మినహాయించి, మిగిలిన సమాచారాన్ని ప్రభుత్వం తప్పక అందుబాటులో ఉండాలి.
  3. ప్రభుత్వం సమాచారాన్ని అనుకూల కార్యాచరణతో తప్పక వెల్లడి చేయాలి. సమాచారం ప్రజలకు చెందినదని భావించాలి. అంతేకాని దానిని నిర్వహించే ప్రభుత్వ సంస్థదని భావించరాదు.
  4. సమాచారాన్ని కోరుతూ ప్రశ్నించిన 30 రోజుల లోపు ప్రభుత్వం స్పందించాలి.
  5. సమాచార ప్రసరణకు వీలుగా ప్రభుత్వ రికార్డులను కంప్యూటరీకరణ, డిజిటలీకరణ చేయాలి.
  6. సమాచారాన్ని ప్రింట్ కాగితాల రూపంలో, కంప్యూటర్ ఫ్లాపీలు, వీడియో, క్యాసెట్లు లేదా ఏ ఇతర ఎలక్ట్రానిక్ సాధనాల రూపంలోనైనా అందించవచ్చు. ఈ చట్టంలోని 2(ఎఫ్) నిబంధన పైన తెలిపిన వాటిని సమాచారంగా పరిగణిస్తుంది.

ప్రజా సమాచార అధికారుల (PIO’s) నియామకం :
ప్రభుత్వంలోని ప్రతీ కార్యాలయంలో, శాఖలో, సంస్థలో, అథారిటీలో ప్రజాసమాచార అధికారిని (PIO) నియమించాలని ఈ చట్టం నిర్ధేశిస్తుంది. పౌరులు కోరిన సమాచారాన్ని వారికి అందించే బాధ్యత ఈ ప్రజా సమాచార అధికారిపై ఉంటుంది.

అలాగే సమాచార హక్కు అప్పీళ్ళను (వినతులను) స్వీకరించడానికి సహాయక ప్రజా సమాచార అధికారులను (Assistant Public information Officers-APIOs) నియమించాలని ఈ చట్టం సిఫార్సు చేస్తోంది. సమాచారం కోసం ప్రజలు ఆన్లైన్ దరఖాస్తు రూపంలో కూడా వినతిని ఇవ్వవచ్చు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్

ప్రశ్న 5.
స్మార్ట్ గవర్నెన్స్ అంటే ఏమిటి ?
జవాబు.
పరిపాలనలోని దుర్లక్షణాలను తొలగించి, పాలన ప్రజల సాంఘిక-ఆర్థిక అభివృద్ధికి అనుగుణంగా తీర్చిదిద్దే క్రమంలో భారతదేశంలోని అనేక రాష్ట్రాలు స్మార్ట్ గవర్నెన్స్న స్వీకరించాయి. స్వాతంత్య్రానంతరం భారతదేశ పాలనలో, ప్రజల సాంఘిక-ఆర్థిక అభివృద్ధి కేంద్రంగా ఎన్నో సంస్కరణలు వచ్చినప్పటికీ పాలనలో దుర్లక్షణాలైన అవినీతి, అశ్రిత, పక్షపాతం, అధికార దుర్వినియోగం, నిర్ణయీకరణలో జాప్యం, పాలనలో నిర్లక్ష్యం విలయతాండవం చేశాయి.

అయితే ఏ పరిస్థితితో మార్పు తీసుకువచ్చి పాలనను మరింత ప్రజా ప్రయోజనకరంగా మలచేక్రమంలో స్మార్ట్ గవర్నెన్స్ భావన ముందుకు వచ్చింది. ఈ భావనలో SMART అనే పదంలోని ప్రతి ఆంగ్ల అక్షరానికి ఒక్కొక్క నిర్దిష్టమైన అర్థం ఉంది.

దీనిలో S అనగా Simple సరళతరమైన పాలన ప్రక్రియలు
M అనగా Moral, నైతిక విలువలతో కూడిన పాలన
A అనగా Accountable, జవాబుదారీ పాలన
R అనగా Responsive, ప్రజాసమస్యలపై స్పందనాత్మకపాలన
T అనగా Transparent, పారదర్శకత కలిగిన పాలనగా పేర్కొనవచ్చు.

స్మార్ట్ గవర్నెన్స్లో అంతర్గత అంశాలు :

  1. పరిపాలన నిర్వర్తన సామర్థ్యాన్ని వృద్ధి చేయడం.
  2. పాలనలో జవాబుదారీతనం పారదర్శకత పెంచడం.
  3. సంకుచిత, రాజకీయాల నుంచి పాలనను వేరుచేయడం.
  4. ప్రభుత్వ విధానాన్ని విజయవంతంగా అమలుచేయడం
  5. గరిష్ట సామర్ధ్యం సాధించడం
  6. పాలనలో సామాజిక నాయకత్వం కీలకపాత్ర పోషించేలా చేయడం.
  7. ప్రభుత్వ సేవలలో నూతన వరవడి తీసుకురావడం, రాబోయే కాలానికి పాలనను సన్నద్ధం చేయడం.
  8. పాలనలో ఇంటర్నెట్, మొబైల్ తదితర సమాచార సాంకేతిక పరిజ్ఞానం విస్తృత స్థాయిలో ఉపయోగించడం.
  9. ఎలక్ట్రానిక్ పాలన.

భారతదేశంలో పాలన ప్రక్రియను పటిష్టంచేయడానికి ఈ దిగువ తెలిపిన సంస్థలు ఎంతో కృషి చేస్తున్నాయి. స్మార్ట్ గవర్నెన్స్ భావనలోని అనేక అంశాల అమలుకు వివిధ మార్గాలను, పద్ధతులను సూచించడానికి, స్మార్ట్ గవర్నెన్స్ భావనను సంవర్ధకంగా వృద్ధి చేయడానికి ఈ దిగువ తెలిపిన విశిష్ట సంస్థలను స్థాపించడం జరిగింది.

  • ది నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవన్నమెంట్, హైదరాబాద్, ఇండియా
    The National Institute for Smart government (NISG), Hyderabad, India
  • ది సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, హైదరాబాద్, ఇండియా
    The Centre for Good Governance, Hyderabad, India
  • ది సెంటర్ ఫర్ లా అండ్ గవర్నెన్స్, న్యూఢిల్లీ
    The Centere for Law and Governance, New Delhi
  • ది సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెర్స్, న్యూఢిల్లీ
    The Centre for Public Policy and Governance, New Delhi

ప్రశ్న 5.
లోక్పాల్ అధికారాలు-విధులు పేర్కొనండి.
జవాబు.
లోక్పాల్ వ్యవస్థ ఈ కింద పేర్కొన్న పదవులోరి వారిపై వచ్చే అవినీతి ఆరోపణలను విచారణ చేస్తారు.

  1. ప్రధానమంత్రి
  2. కేంద్రమంత్రులు
  3. పార్లమెంట్ ఉభయసభల సభ్యులు
  4. గ్రూప్ ‘A’ మరియు గ్రూప్ ‘B’ ఉద్యోగులు
  5. కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే గ్రూప్ ‘C’ మరియు గ్రూప్ ‘D’ ఉద్యోగులు
  6. ఇతర సంస్థలు, ట్రస్ట్లు సొసైటీలు (10 లక్షలకు మించి విదేశీ విరాళాలను పొందే సంస్థలు)

TS Board Inter Second Year Political Science Study Material Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
జవాబుదారీతనం అంటే ఏమిటి ?
జవాబు.
ప్రభుత్వంలోని ఉద్యోగులు, అధికారులు, ప్రజాసేవకులు తమ నిర్ణయాలు, కార్యాచరణలను ప్రజలకు బాద్యత వహించడాన్ని జవాబుదారీతనంగా చెప్పవచ్చు. ఇక నుంచి వారు తమ కార్యకలాపాల విషయంలో ప్రజా పరిశీలనకు గురి కావలసి ఉంటుంది. విస్తృత అర్థంలో చెప్పాలంగే, పౌర, సేవా సంస్థలు, వినియోగదారుల సంస్థలకు ఉద్యోగులు జవాబుదారీగా ఉండాలి. పాలనలో సమన్యాయం, పారదర్శకత పాటిస్తే జవాబుదారీతనం సిద్ధిస్తుంది.

ప్రశ్న 2.
ఎలక్ట్రానిక్ పాలనలోని ఏవైనా రెండు సుగుణాలు రాయండి.
జవాబు.

  1. పౌరునికి సమాచారం అందించి, సంప్రదించే అవకాశం
  2. పాలన ప్రక్రియ సంస్కరించడం.
  3. సమాచార అందుబాటు
  4. పౌరులకు గుణాత్మక సేవలు పెంపొందించడం
  5. సరళతరం నియమాలు

ప్రశ్న 3.
పాలన సంబంధితుల జాబితా తెలపండి.
జవాబు.

  1. కార్యనిర్వాహక వర్గం
  2. శాసన నిర్మాణ శాఖ
  3. న్యాయశాఖ
  4. ప్రచార ప్రసార మాధ్యమాలు
  5. ప్రైవేటు రంగం
  6. సాంఘిక సేవా సంస్థలు
  7. పౌర సమాజం
  8. రాజకీయ పార్టీలు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్

ప్రశ్న 4.
ఎలక్ట్రానిక్ పాలనలో ప్రభుత్వం నుంచి పౌరుల నమూన అంటే ఏమిటి ?
జవాబు.
ప్రభుత్వానికి, పౌరులకు మధ్య కార్యాచరణ సంబంధాన్ని కల్పించి, విస్తృత స్థాయిలో సేవలు అందించే విధానాన్నే ప్రభుత్వం నుంచి పౌరుల నమూన అంటారు. ఇది సాధారణ ప్రజానీకానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రశ్న 5.
పారదర్శకతను కొన్ని పదాలతో వివరించండి.
జవాబు.
పారదర్శకత, పరిపాలనలో ఈ కింది సూచించిన పద్దతుల ద్వారా కార్యసాధకతను పెంపొందిస్తుంది.

  1. సేవల అందుబాటు వ్యవస్థను క్రమబద్ధీకరించండి.
  2. జవాబుదారీదతనాన్ని పెంపొందించడం.
  3. పాలనలో అవినీతి, అక్రమాల తొలగింపు అనుచిత ఆచరణలు తగ్గించడానికి సాంఘిక తనిఖీ సిఫార్సు చేయడం.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్

ప్రశ్న 6.
సమాచార హక్కుచట్టం ఏ సంవత్సరంలో రూపొంది, అమలయింది.
జవాబు.
సమాచార హక్కుచట్టం 2005 రాష్ట్రపతి ఆమోదముద్రను 15 జూన్ 2005న పొంది, అక్టోబర్ 2005 నుంచి ‘పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది.

Leave a Comment