TS Inter 2nd Year Telugu Study Material Chapter 5 మా భాగోతంలో మేము

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material 5th Lesson మా భాగోతంలో మేము Textbook Questions and Answers.

TS Inter 2nd Year Telugu Study Material 5th Lesson మా భాగోతంలో మేము

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
పాఠ్యాంశం ఆధారంగా చిందు భాగోతం ప్రదర్శన గురించి తెలుపండి.
జవాబు:
చిందు భాగవతం ప్రదర్శించడానికి ముందు నాలుగు గుంజలు, వెనక రెండు గుంజలు పాతి పందిరి వేస్తారు. ఆ పందిరి కిందనే భాగోతం ప్రదర్శిస్తారు. పందిరి లేకుంటే భాగోతం ఆడరు. పందిరిని చాందిని అని కూడా అంటారు. పందిరికి మూడుపక్కల ఎడ్లకు కట్టే పగ్గాల కంటే లావుగా ఉండే జనుముతో చేసిన తాళ్లను కట్టేవారు. భాగోతం చూడడానికి వచ్చిన వారు మీద పడకుండా ఈ తాళ్ళను కట్టేవారు.

దొమ్మరి బిడ్డ గడ (రెండువైపులా కర్రలు పాతి వాటి మధ్యలో తాడు కట్టేవారు. ఆ తాడుపై పెద్ద కర్ర పట్టుకొని నడిచేవారు) ఎక్కి, సాలా పులిగోలిగా అని బియ్యం సల్తది. మాదిగ చిందోల్లు ఎల్లమ్మ యేషం గట్టి చెరువులు మొకం కడిగితేనే మోక్షం, బరుకతు అని భావించే వారు. అట్లాంటిది మారిపోయి నడి ఊర్లో భాగోతం ఆడటం ఎల్లమ్మ తాతల కాలంలోనే ప్రారంభమైంది.

“ఇవ్వాల చిందు భాగోతం ఆడుతుండ్రట, పోవాలరా” అనేవారు. ఇవ్వాల “ఎల్లమ్మ ఆట ఆడుతున్నరు. గావు పట్టేదున్నదట పోవాల” అని ఊరివాల్లు వచ్చేవారు. పాత రోజుల్లో రాత్రులు ఊర్లో భాగోతం ఆడుతున్నపుడు మంగలోలు దివిటీలు పట్టేవారు.

వేషాలు తయారు అయేటపుడు ఎవరూ చూడకుండా జాగ్రత్తపడేవారు. తెరముందు ఆడేటప్పుడు మాత్రమే అందరూ చూడాలి అనుకునేవారు. అందుకోసం మాదిగ ఇండ్లల్లో వేషం ధరించేవారు. అలా కుదరనప్పుడు పందిరికి కొంత దూరంలోనో, అలాకూడా కుదరనప్పుడు చుట్టూ దుప్పటి కట్టుకొని రంగులు వేసుకునే వారు. రంగులు వేసుకున్నాక దుప్పటి కప్పుకొని భాగోతం ప్రదర్శించే పందిరి లోపలికి వచ్చేవారు. కళాకారులు ఎవరి వేషం (మేకప్) వాల్లే వేసుకునే వారు. ఎవరి అద్దం వాల్లదగ్గరే ఉండేది.

మొకంకు రేవిడిని, లేకుంటే పసుపు పచ్చ పౌడరును వేసుకునే వారు. తెల్ల వెంట్రుకలు కావాలంటే మెంచు, లేదా అర్దూలం (జింక్ ఆక్సైడ్) వాడేవారు. ఆ అర్దూలం చెమటకు వెంటనే కరిగిపోయేది. చూసేవారు కంటికి ధారలుపడేటట్టు ఏడుస్తున్నారు అనుకునే వాళ్ళు.

పాత రోజుల్లో ఏడుపు రావాలంటే కంట్లో వేలు పెట్టుకోవడం లేదా నూనె చుక్కలు వేసుకునేవారు. కాని ఎల్లమ్మకు దుఃఖం పాట పాడగానే ఏడుపు వచ్చేది. భాగోతం చూసేవారు కూడా వెక్కివెక్కి ఏడ్చేవారు. వారు ఏడిస్తే చీరకొంగులు తడిసిపోయేవి. అంత కష్టపడి భాగోతాన్ని రసవంతంగా ప్రదర్శించేవారు. సత్యహరిశ్చంద్ర భాగోతం ఆడితే చూసేవారు కూడా ఏడ్చేవారు. అలా ప్రదర్శిస్తున్నప్పుడు ఒక్కోసారి ఆఊరి దొరలు “మేం ఇట్లనే కొంగులు పెట్టుకొని ఏడుద్దుమా? బంజేస్తరా? ఓ గంగారం!, ఓ ఎల్లవ్వా! ఇదేం ఏడుసుడు. ఏం కథ, దేవుడా… జర బందు జేయుండ్రి గదా!” అని చెప్పేవారు. అంత లీనమై ఆ ప్రదర్శనను చూసేలా ఆడేవారు. అంత కష్టపడి ప్రదర్శిస్తేనే ఆ కళకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు భాగోతం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభిస్తే సాయంత్రం ఆరు, యేడు గంటల దాకా ఆడతారు.

ఈ భుజకీర్తులు, కిరీటాలను అంతసేపు అట్లనే ధరించాలి. వేషాల మధ్య తబలకొట్టినా కూడా వాటిని అలానే ధరించేవారు. భాగోతం పూర్తయి ఇంటికి వచ్చి, ఆరతి ఇచ్చిన తరువాతనే వేషాన్ని విప్పేవారు.
ప్రదర్శన ప్రారంభ ముగింపు సన్నివేశాలు: ఏదైనా గ్రామంలో ప్రదర్శన ప్రారంభించే ముందు ఆవూర్లోని విశ్వబ్రాహ్మణుల ఇంటికి వెళ్లి వారి కొలిమికి నమస్కరించేవారు. భాగోతం ఆడటం అయిపోయినంక రాముని

పేరుతో మంగళహారతి ఇస్తారు. పక్కవాయిద్యాల వారు కూడా మంగళారతి పాట పాడేవారు. ప్రధాన వేషం ధరించిన స్త్రీ పాత్ర మంగళహారతి పట్టుకొని ప్రేక్షకుల దగ్గరికి పొతే, వారు ఆ హారతికి నమస్కరించి వారికి తోచినంత డబ్బును హారతి పళ్ళెంలో వేసేవారు. ఆ తరువాత ఆ హారతితోనే కళాకారుల బృందం అంతా ఇంటికి వెళ్తారు. అందరు కలిసి మరొక్కసారి హారతి తీసుకుంటారు.

హారతి ఒకరినొకరిని హృదయాలకు హత్తుకుని ఆడవారితో ఆడవారు, మగవారితో మగవారు దాసున్ని అనే అర్థంలో ‘దాసున్, దాసున్’ అనుకుంటారు. అప్పుడు భాగోతం సామాగ్రినంతా తీసి, ఎవరి సామాను వారు సర్దుకొని వేషాన్ని విప్పేస్తారు. ప్రదర్శనలో భాగంగా అరేయ్ దుర్మార్గా అని, ఓరి సుగ్రీవా అని పాడి, ఎగిరి తంతారు. అలా చేయడం తప్పు కాబట్టి భాగోతం పూర్తికాగానే పెద్దవారి కాళ్లకు నమస్కరిస్తారు. అలా భాగోతంలో అన్నా అనకున్నా, తన్నినా తన్నకున్నా, చిన్నవారు పెద్దలకు నమస్కరిస్తారు.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 5 మా భాగోతంలో మేము

ప్రశ్న 2.
చిందు భాగోతం ప్రదర్శనకు వస్తువుల తయారీని వివరించండి.
జవాబు:
ప్రదర్శనకు వాడే వస్తువుల తయారీ : చిందు భాగవత ప్రదర్శనలో అలంకరణకు చాల ప్రాధాన్యత ఉంది. అలంకరణలో భాగంగా వాడే భుజకీర్తులు, కిరీటాలు మొదలైన ఆభరణాలను కళాకారులే తయారు చేసుకునేవారు. కొంత మంది మగవారికి మాత్రమే వాటిని తయారు చేయడం వచ్చేది. పొనికి కట్టెతో వీటిని తయారు చేస్తారు. దాన్ని బూరుగు కట్టె అనికూడా అంటారు. అగ్గిపుల్లలను కూడా ఈ కర్రతోనే తయారు చేస్తారు. కలిపెల్లిగుట్టకు ఈకర్ర చాలా లభించేది. పూర్వం పెద్దపెద్ద గుట్టలు, అడవులు ఉండేవి.

దొనకంటి, కథారుపల్లె వైపు ఈ కలప లభించేది. అడవులను నరికిన కారణంగా ఇప్పుడు లభించడం లేదు. భుజకీర్తులు, కిరీటాల డిజైన్లు చెక్కుడు, అంతా వారే తయారు చేసుకునేవారు. పురుషుల కిరీటము చేయడానికి పన్నెండు నెలలు, ఆడవారి కిరీటం చేయడానికి పద్దెనిమిది నెలలు పట్టేది.

కష్టపడి చేసిన నగలను జాగ్రత్తగా కాపాడుకొని పది, పన్నెండేండ్లు ఉపయోగించేవారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న అవి పనికి రాకుండా పోయేవి. ఆడవాళ్ళ హారాలు, దండలు తయారు చేయడం చాలా కష్టం. శంఖ చక్రాలు, కిరీటము, భుజకీర్తులు, సూర్య కిరీటము, మకర కుండలాలు, కంఠసారె, పెద్ద పేరు ఇవన్నీ రాజు వేషానికి అవసరమవుతాయి.

జడ, కొప్పుజడ (దాన్ని షాంపూజడ అంటారు) సిగరేకులు, పక్క గొలుసు, చెక్క బవిలీలు, గూబగున్నాలు వేలాడే గున్నాలు స్త్రీ వేషానికి అవసరం. మిగతా జిల్లాల చిందు కళాకారులు ఎన్నో నగల్ని తీసేస్తున్నారు. కానీ నిజామాబాదు జిల్లా కళాకారులు మొదటి నుంచి ఉన్నవాటిని ఇప్పటి దాకా వాడుతున్నారు.

కిరీటాలు, భుజకీర్తులు కట్టుకొని యేషాలు యేసి, ఆది, ఆటయినంక సూసుకుంటే అవన్నీ సెమటకు ఉబ్బేవి. ఆ నగలను ఆరు, యేడు గంటల పాటు ధరించే ఉండాలి. ప్రదర్శన పూర్తయ్యేవరకు నగలను ‘విప్పకపోయేవారు. అందుకోసం వేషాలు వేసుకునేటప్పుడే అవి జారిపోకుండా గట్టిగ లాగి కట్టేవారు.

II సంగ్రహరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
భాగోతం ప్రదర్శనకు వేదికను ఎలా సిద్ధం చేసేవారు ?
జవాబు:
చిందు భాగవతం ప్రదర్శించడానికి ముందు నాలుగు గుంజలు, వెనక రెండు గుంజలు పాతి పందిరి వేస్తారు. ఆ పందిరి కిందనే భాగోతం ప్రదర్శిస్తారు. పందిరి లేకుంటే భాగోతం ఆడరు. పందిరిని చాందిని అని కూడా అంటారు. పందిరికి మూడుపక్కల ఎడ్లకు కట్టే పగ్గాల కంటే లావుగా ఉండే జనుముతో చేసిన తాళ్లను కట్టేవారు. భాగోతం చూడడానికి వచ్చిన వారు మీద పడకుండా ఈ తాళ్ళను కట్టేవారు.

ప్రశ్న 2.
భుజకీర్తులు, కిరీటాల తయారీ ఎలా జరిగేది ? (V.Imp) (Model Paper)
జవాబు:
చిందు భాగవత ప్రదర్శనకు అవసరమైన ఆభరణాలను పొనికి కట్టెతో తయారుచేస్తారు. దాన్ని బూరుగు కట్టె అనికూడా అంటారు. అగ్గిపుల్లలను కూడా ఈ కర్రతోనే తయారు చేస్తారు. భుజకీర్తులు, కిరీటాల డిజైన్లు చెక్కుడు, అంతా వారే తయారుచేసుకునేవారు. పురుషుల కిరీటము చేయడానికి పన్నెండు నెలలు, ఆడవారి కిరీటం చేయడానికి పద్దెనిమిది నెలలు పట్టేది. కష్టపడి చేసిన నగలను జాగ్రత్తగా కాపాడుకొని పది, పన్నెండేండ్లు ఉపయోగించేవారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న అవి పనికి రాకుండా పోయేవి. ఆడవాళ్ళ హారాలు, దండలు తయారు చేయడం చాలా కష్టం.

ప్రశ్న 3.
భాగోతం ఆడిన తరువాత వాటాలు ఎలా పంచుకునేవారు ?
జవాబు:
భాగోతం ఆడిన తరువాత హారతి పళ్ళెంలో వేసిన డబ్బును వాటాలు వేసుకొని పంచుకుంటారు. ప్రదర్శనలో పాల్గొన్న భార్యాభర్తలకు ఒక వాటా, పెళ్లి కాని పిల్లలుంటే, వాళ్లు ఆడితే, ఒక వాటాలో ఐదు భాగాలు చేసి ఆడపిల్లలకు రెండు భాగాలు, మగ పిల్లలయితే మూడు భాగాలు ఇస్తారు. ఇద్దరు భార్యాభర్తలు ఉంటే ఒక పాలు ఇస్తారు కాని ఎల్లమ్మకు భర్తలేడు. అయినా ప్రధాన పాత్రలు ధరిస్తుంది కాబట్టి ఒక వాటా ఇచ్చేవారు. పెండ్లయి ఒక్కడే భాగోతంలో ప్రధాన వేషం వేస్తే కూడా ఒక భాగం ఇస్తారు.

అతనికి భార్యతో విడాకులైనా, ఆమె చనిపోయినా ఆయనకు వాటా ఇస్తారు. మరి పెండ్లయినా చిన్న వేషం ధరిస్తే పాలు ఇవ్వరు. మూడు భాగాలే ఇస్తారు. ఈ పంపకాలు గురించి అప్పుడప్పుడు గొడవలు కూడా అవుతాయి. మళ్ళీ వారిలో వారే పరిష్కరించుకుంటారు.

ప్రశ్న 4.
చిందుల ఎల్లమ్మ ప్రదర్శనలు, పురస్కారాలు తెలుపండి.
జవాబు:
చిందు ఎల్లమ్మ ఇచ్చిన ప్రదర్శనలు : ఎల్లమ్మ నాలుగేళ్ల వయసులోనే బాలకృష్ణుని వేషంతో చిందు యక్షగాన రంగంలో అడుగు పెట్టింది. 1918లో కళారంగంలో ప్రవేశించిన ఎల్లమ్మ గ్రామాల్లో కొన్ని వేల ప్రదర్శనలిచ్చింది. ఎల్లమ్మ తొలి అధికారిక ప్రదర్శన 1979లో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఇచ్చింది. మొదటి రాష్ట్రస్థాయి ప్రదర్శన 1980లో రవీంద్రభారతిలో నాటి ముఖ్యమంత్రి సమక్షంలో ఇచ్చింది. 1984వ సంవత్సరంలో మాస్కో నగరంలో తొలి అంతర్జాతీయ ప్రదర్శన ఇచ్చింది. 1986లో ఢిల్లీలో జరిగిన అప్నా ఉత్సవ్ జాతీయ ప్రదర్శన ఇచ్చింది.

ఎల్లమ్మ పొందిన అవార్డులు : చిందు కళలో తన అభినయానికి 1998-99 లో కళారత్న పురస్కారం, 1999లో హంస పురస్కారం, 2004లో రాజీవ్ ప్రతిభా పురస్కారాలు అందుకుంది. 1982లో రాష్ట్ర సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యత్వం లభించింది. 2004లో అప్పటి ప్రభుత్వం ఆమె గౌరవార్ధం నిజామాబాద్ నుండి బోధన్ వరకు గల రహదారికి ‘ఎల్లమ్మ రహదారి’గా నామకరణం చేసింది.

III ఏకపద/వాక్య సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1. ఎల్లమ్మ ఏ వయసులో రంగస్థల ప్రవేశం చేసింది ?
జవాబు:
నాలుగేళ్ల వయసులో.

ప్రశ్న 2.
ఎల్లమ్మ ప్రదర్శన చూసి ప్రశంసించిన నాట్యాచార్యుడు ఎవరు ?
జవాబు:
నటరాజ రామకృష్ణ.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 5 మా భాగోతంలో మేము

ప్రశ్న 3.
ఎల్లమ్మ తొలి అధికారిక ప్రదర్శన ఏ సంవత్సరంలో ఇచ్చింది ?
జవాబు:
ఎల్లమ్మ తొలి అధికారిక ప్రదర్శన 1979లో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఇచ్చింది.

ప్రశ్న 4.
1999లో ఎల్లమ్మ పొందిన పురస్కారం ఏది ?
జవాబు:
హంస పురస్కారం

ప్రశ్న 5.
ఎక్కడినుండి ఎక్కడి వరకు ఎల్లమ్మ రహదారి అని పిలుస్తారు ?
జవాబు:
నిజామాబాద్ నుండి బోధన్ వరకు ఉన్న రహదారిని.

ప్రశ్న 6.
భుజకీర్తులు, కిరీటాలు ఏ కట్టెతో తయారుచేస్తారు ?
జవాబు:
పొనికి లేదా బూరుగు కట్టె.

ప్రశ్న 7.
న్యాయమున్నచోట ఎవరు ఉంటారు ?
జవాబు:
నారాయణుడు.

ప్రశ్న 8.
అలాయి బలాయి ఎప్పుడు తీసుకుంటారు ? (V.Imp) (Model Paper)
జవాబు:
ప్రదర్శన ముగిసిన తరువాత హారతి తీసుకున్న తరువాత.

కఠిన పదాలకు అర్థములు

71వ పుట

జానపద కళ = జానపదుల అంటే గ్రామీణ ప్రజల కళ
ఔన్నత్యం = గొప్పతనం
ఆసక్తి = కోరిక, ఇష్టం
స్థిరపడ్డారు = స్థిరనివాసం ఏర్పరుచు కున్నారు
ప్రాయం = వయసు
వేషం = పాత్ర ధరించడం
అడుగుపెట్టింది (జాతీయం) = ప్రారంభించింది
అలరించింది. = సంతోషపరిచింది
ఉగ్రరూపం = భయం కలిగించే రూపం
వైవాహిక జీవితం = వివాహ జీవితం
స్వస్తి పలకడం
(జాతీయం) = ముగింపు చెప్పడం
మేటి = గొప్ప, ప్రధాన
పామర స్త్రీ = చదువురాని మహిళ
అభినయం = నటన
విస్మయం = ఆశ్చర్యం
అరుదు = తక్కువ
ప్రశంసించారు = మెచ్చుకున్నారు
సమక్షంలో = ఎదురుగా
విశిష్ట సభ్యత్వం = ప్రత్యేక సభ్యత్వం

72వ పుట

పురస్కారం = గౌరవం, సన్మానం
గౌరవార్థం = గౌరవ సూచకంగా
నామకరణం = పేరుపెట్టడం
గుంజలు = కర్ర స్థంబాలు
ఎనక = వెనక
పందిరేస్తం = పందిరి వేస్తాం
ఆడేది = ప్రదర్శించేది
పక్కల = వైపుల
సోల్లు = లావుగా ఉండే జనుముతో చేసిన తాళ్ళు
దొడ్డుగా = లావుగా
మస్తుకోరుతనం = కావాలని అల్లరి చేయాలనే
నడి ఊల్లె = ఊరి మధ్యలో
గడి + ఎక్కి = వెదురు కర్ర సహాయంతో తాడుపై నడవడం
బరుకతు (ఉర్దూ పదం) = లాభం కంటే మించినది
దొమ్మరి బిడ్డ = దొమ్మరి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి
సల్లా పులిగోలిగా = ఒక రకమైన అరుపు
సల్తది = చల్లుతది
మోక్షం = పుణ్యం, కైవల్యం
అంటుండ్రి = అనేవారు

73వ పుట

గావు పట్టుట = పశువు గొంతు కొరికి బలి ఇవ్వడం
ఊరోళ్ళు = ఊరి జనం
దివిటీలు = కాగడాలు
పడుతుండ్రి = పట్టుకునే వారు
యేషాలు = వేషాలు
సూడద్దు = చూడకూడదు
తెరముందే = వేదికపైనే
సూడాల = చూడాలి
భాగ్యం = సంపద
మాదిగిండ్లల్ల = మాదిగ కులస్థుల ఇండ్లలో యేషాలు
యేసుకుంటుంటిమి = వేషం ధరించే వారం
పందిట్లకు = పందిరి లోపలికి
అస్తం = వస్తాము
రేవిడి = రేగడి మన్ను
మెంచు = తెల్లని పదార్ధం
అర్దూలం = జింక్ ఆక్సైడ్
నూరి = రుద్ది
లావు = చాలా
ఏసుకుంటుంటిమి = వేసుకునే వారం
ఏడుపోస్తది = దుఃఖం వస్తుంది
ఎగ పోస్తరు = వెక్కివెక్కి ఏడుస్తారు
చెంగులు = చీర కొంగులు
కంగారు కంగారుగా = చిందరవందరగా
అయితయు = అవుతాయి
నేరుస్తం = నేర్చుకుంటాము
రంజు కట్టిస్తాం
(జాతీయం) = కొంగులు పట్టుకొని ఏడిపిస్తం
యెడబాసి = విడిపోయి
అమ్మినంక = అమ్మిన తరువాత

TS Inter 2nd Year Telugu Study Material Chapter 5 మా భాగోతంలో మేము

74వ పుట

ప్రాణ + ఈశ = భర్త
నను బాసి పోయెదవ = నన్ను వదిలి వెళ్తావా
ప్రాణంబు = ప్రాణాలను
యెటుల = ఏవిధంగా
భరియింతు = కాపాడుకుంటాను
నయ్యయ్యో = అయ్యో
పశువులనమ్మిన పగిది = పశువులను అమ్మిన విధంగా
శిశువును = కొడుకును
నను = నన్ను
అమ్మించి = అమ్మివేసి
వశము గానట్టి = భరించలేని
ఆపదలు = కష్టాలు
వచ్చే మనకు = మనకు వచ్చాయి
మంది = జనాలు, ప్రేక్షకులు
ఎక్కెక్కి = వెక్కి వెక్కి
ఏడుస్తుండ్రి = ఏడ్చే వారు
దొరలూ = పెత్తందారులు
ఇట్లానే = ఈ విధంగానే
ఏడుద్దుమా = ఏడ్చుకుంటూ ఉండాల్నా
బంజేస్తరా = ముగిస్తారా, ఆపేస్తారా
ఇట్లా పేరు వచ్చింది = ప్రఖ్యాతి లభించింది
అచ్చింది = వచ్చింది
భుజకీర్తులు = – భుజాలపై ఉండే ఆభరణాలు
కిరీటాలు = మకుటాలు
మొగోళల్లే, పొనికి కట్టే, = పురుషులే
బూరుగు కట్టే = ఆభరణాలు తయారు చేయడానికి వాడే ఒకరకం కర్ర
మస్తుగ = ఎక్కువగా
దొరుకుతుండే = లభించేది
ఉంటుండే = ఉండేవి
గట్టు యాడుంది = అడవి ఎక్కడుంది
సెట్టు యాడుంది = చెట్లు ఎక్కడున్నాయి
నాశనం చేసిరి = కనబడకుండా చెడగొట్టారు
ఆడోల్ల నగల కాడికెల్లి = ఆడవారి నగలు కూడా
చేసేతందుకు = చేయడానికి
యాడాది నర్దం = పద్దెనిమిది నెలలు
పడుతది = పడుతుంది
నడుస్తాయి = ఉపయోగించవచ్చు
రేపే ! అంటయి = త్వరగా పాడవుతాయి
హారాలు, పేర్లు = దండలు

75వ పుట

శంఖ చక్రాలు, కిరీటము,
భుజకీర్తులు, సూర్య
కిరీటము, మకర
కుండలాలు, కంఠసారె,
పెద్ద పేరు, జడ, కొప్పుజడ
సిగరేకులు, పక్క గొలుసు,
సెక్క బవిలీలు, గూబగున్నాలు,
వేలాడే గున్నాలు = ఇవన్నీ వేషధారణలో భాగంగా ధరించే ఆభరణాలు
మకర కుండలాలు = మొసలి ఆకారంలో ఉండే చెవులకు పెట్టుకునే నగలు
కంఠసారె = కంఠానికి పెట్టుకునే ఒక ఆభరణం
సిగరేకులు = శిఖలో పెట్టుకునే ఆభరణాలు
సెక్క బవిలీలు = చెక్కతో చేసిన నగలు
గూబగున్నాలు = చెవులకు వేలాడే నగలు
దాక = వరకు
సెమటకు = చెమటకు
అవ్విటిని = వాటిని
ఆపగాలగాల = వేసుకొని మోయాలి
యిప్పేది = విప్పడం
బద్దం గుంజి = గట్టిగా లాగి
పొద్దుగాల = ఉదయం
పొద్దువంగినాక = సూర్యాస్తమయం తరువాత, సాయంత్రం
అట్లనే = అలాగే
నడిమిట్ల = మధ్యలో
ఆరతి ఇచ్చిన మంటేనే = మంగళహారతి ఇచ్చిన తరువాతనే
అవ్విటను = వాటిని, నగలను
ఇసబ్రహ్మ = విశ్వబ్రాహ్మకు
సురూ, షురూ = ప్రారంభం
తిత్తి = కొలిమిలో గాలి ఊదడానికి తోలుతో చేసిన పరికరం
చేతిల కత్తి = చేతిలో ఉండే కత్తి
చేసిచ్చిండ్లు = చేసి ఇచ్చారు
కొంగవలి కత్తి = వంకరగా ఉండే కత్తి
మేళం = కళాకారుల సమూహం
మేటి యేశం = ప్రధాన పాత్ర
ఎంత తోస్తే అంత = ఎంత వేయాలని అనిపిస్తే అంత, తోచినంత
మంగళారతి తీసుకుంటరు = హారతికి నమస్కరిస్తారు
ఇచ్చుడు ఉంటది = ఇవ్వడం ఉంటుంది
అదయినంక = ఆతరువాత
ఇంటిస్తం = ఇంటికి వస్తారు

76వ పుట

అలాయి బలాయి = ఆలింగనం
దాసున్ని = సేవకున్ని
జండర్ సంబంధం లేకుండా = లింగ భేదం పాటించకుండా
ಅಲ್ಲು = వారు
అరేయ్ దుర్మార్గ = ఓరి దుర్మార్గుడా
అంటి = అన్నాను
ఇట్టి = ఇలాంటి
ఘోర కృత్య౦ = ఘోరమైన పని
దండం పెడతాం = నమస్కరిస్తం
మొక్కుతం = నమస్కరిస్తం
సిన్నోల్లు = వయసులో చిన్న వారు
పెద్దోల్లకు = వయసులో పెద్ద వారికి
చెయ్యాల్సిందే = చేయవలసిందే
బారా = పన్నెండు
కెల్లి = నుండి
ఆడంగనే = ప్రదర్శించగానే
సాలు జేయ్యుండ్రి = ఆపేయండి
నిక్కీర్త = ఖచ్చితంగా
పొద్దుపొడవాల = తెల్లారాలి
గొంత = కొద్దిగా కూడా
సూస్తం ఇంకా = ఇంకా చూస్తాము
నోరు కూసోవడం = గొంతు బొంగురుపోవడం
తయారుగుంటరు = సిద్ధంగా ఉంటారు.
పడగొట్టం = వదిలిపెట్టం
ఉల్లాసం = ఉత్సాహం
మందు = మద్యం, సారా
పాడయిరి = చెడిపోతారు
మనసు కరి ఎక్కది = మనస్సు అంగీకరించదు

77వ పుట

లావు అయిపాయే = ఎక్కువై పోతది (చూడరు అని)
నొచ్చె = నొస్తున్నాయి, నొప్పి లేస్తుంది
ఇంటి కాడ = ఇంటి దగ్గర
తెల్లగోలు = వివరంగా
ఆల్ల మొదలార
(తిట్టుపదం) = వాళ్ళ మొదళ్ళు ఆరిపోని అంటే వారు చనిపోని అన్నట్లు
గమ్మతు పడతరు = ఆనందిస్తారు
పైసల్ = డబ్బు
రైకలు = రవికలు
అంగీలు = చొక్కాలు
దోతులు = పంచలు
మస్తు ఇస్తారు = చాలా ఇస్తారు
సౌలత్ = సౌకర్య౦
వాళ్లకు కష్టమే = వాళ్లకు కష్టం వస్తే మాకు కష్టం వచ్చినట్లే
పాలు = వాటా
జింగాలు = ఒక వాటాలో ఐదవవంతు
లగ్గం = పెళ్లి
యేషకాడు = పురుష వేషధారి
యేషకత్తె = స్త్రీ వేషధారి
సమ్మతిస్తే = అంగీకరిస్తే
సహి = సరే

78వ పుట

పంపకాలు = పంచుకోవడం
పోట్లాటలు, తగాదాలు = గొడవలు
మా అండ్ల మేమే = మాలో మేము
పరిష్కరించుకుంటం = సరి చేసుకుంటాం
దబ్బున = ఒకవేళ
చేసుకున్నదే కష్టం = చేసుకున్నంతే సంపాదన
ఆముదాని = ఆదాయం
సూడనిచ్చినావురా ? = చూసే అవకాశం ఇచ్చావారా
ఇయ్యమంట ఆస్తివి = ఇవ్వుమని వచ్చావు
మొకంమీదనే = ముఖం ముందర
కలకల అనిపిస్తది = బాధ అనిపిస్తుంది
సూసేతందుకు = చూడటానికి
ఆడుతున్నమాయే = ప్రదర్శిస్తున్నాం కదా
మానెడు బియ్యం = రెండు అడ్డల బియ్యం (కొలత పదం)
పంచుకుంటిమి = పంచుకున్నాము
లగుంటే = శక్తి ఉంటే
తలా = ఒక్కొక్కరికి
ఇంకొకల్లు = వేరేవాళ్ళు
అటువోరు = ఆ వైపు వెళ్ళరు
మోటు మాట = బూతు, చెడ్డమాట
మా అసుంటోల్లను = మా లాంటి వారిని
ఐదు నూర్లు = ఐదు వందలు
గరుజు = చాలా అవసరం
అసుంటప్పుడు = అలాంటి సమయంలో
తాట = దగ్గర
నారాయణమూర్తి = దేవుడు

మా భాగోతంలో మేము Summary in Telugu

రచయిత్రి పరిచయం

TS Inter 2nd Year Telugu Study Material Chapter 5 మా భాగోతంలో మేము 1

పాఠం పేరు : మా భాగోతంలో మేము
దేని నుండి గ్రహింపబడినది : నేను చిందుల ఎల్లమ్మ మాటల్లోనే ఆమె జీవితాన్ని రికార్డు చేసిన “చిందుల ఎల్లమ్మ”ను .. అనే చిందు భాగవతం ఆత్మకథలో నుండి గ్రహింపబడినది.
రచయిత్రి : చిందు ఎల్లమ్మ
జన్మస్థలం : ఆదిలాబాద్ జిల్లా (ప్రస్తుతం నిర్మల్ జిల్లా) బాసర
నివాస స్థలం : నిజామాబాదు జిల్లా అమ్డాపూర్
కాలం : జననం : ఏప్రిల్ 1, 1914 – మరణం : నవంబర్ 9, 2005
తల్లిదండ్రులు : ఎల్లవ్వ, పిల్లిట్ల నాభిసాబ్.
చదువు : నిరక్షరాస్యురాలు

విశేషతలు : భారతీయ జానపదకళ ఔన్నత్యాన్ని, వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన కళాకారిణి
ధరించిన పాత్రలు : సత్యభామ, మోహిని, సత్యవతి, సావిత్రి, రంభ, లక్ష్మి, రత్నాంగి వంటి స్త్రీ పాత్రలు, ధర్మాంగదుడు, మాంధాత, కుశలుడు, హనుమంతుడు, నరసింహస్వామి వంటి పురుష పాత్రలు. ఎల్లమ్మకు 14 సంవత్సరాల వయస్సులోనే వివాహం జరిగింది. కాని చిందు కళకే అంకితం కావాలనే ధ్యేయంతో వైవాహిక జీవితానికి స్వస్తిపలికి తన జీవితాన్ని కళకు అంకితం చేసింది.

నటరాజ రామకృష్ణచే సన్మానం : క్షణకాలం తేడాలోనే స్త్రీ, పురుష పాత్రలలో మెప్పించగలిగిన మేటి కళాకారిణి ఎల్లమ్మ. ఒక పామర స్త్రీ ఇంత అద్భుతంగా అభినయాన్ని ప్రదర్శించటం నాకు విస్మయాన్ని కలిగించింది. ఇలాంటి కళాకారుల్ని అరుదుగా చూస్తాం. అని ఆమె ప్రదర్శనను చూసిన నాట్యాచార్య నటరాజ రామకృష్ణ ప్రశంసించి విలువైన శాలువాతో సత్కరించారు.

ప్రదర్శనలు : ఎల్లమ్మ నాలుగేళ్ల వయసులోనే బాలకృష్ణుని వేషంతో చిందు యక్షగాన రంగంలో అడుగు పెట్టింది. 1918లో కళారంగంలో ప్రవేశించిన ఎల్లమ్మ గ్రామాల్లో వేల ప్రదర్శనలిచ్చింది. తొలి అధికారిక ప్రదర్శన 1979లో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఇచ్చింది. మొదటి రాష్ట్రస్థాయి ప్రదర్శన 1980లో రవీంద్రభారతిలో నాటి ముఖ్యమంత్రి సమక్షంలో ఇచ్చింది.

రాష్ట్ర సాహిత్య అకాడమి సభ్యత్వం : 1982లో రాష్ట్ర సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యత్వం లభించింది.
జాతీయ ప్రదర్శనలు : 1984వ సంవత్సరంలో మాస్కో నగరంలో తొలి అంతర్జాతీయ ప్రదర్శన ఇచ్చింది. 1986లో ఢిల్లీలో జరిగిన అప్నా ఉత్సవ్లో జాతీయ ప్రదర్శన ఇచ్చింది..
పురస్కారాలు : చిందు కళలో తన అభినయానికి 1998-99 లో కళారత్న పురస్కారం, 1999లో హంస పురస్కారం, 2004లో రాజీవ్ ప్రతిభా పురస్కారాలు అందుకుంది.
ఎల్లమ్మ రహదారి : అప్పటి ప్రభుత్వం ఆమె గౌరవార్ధం నిజామాబాద్ నుండి బోధన్ వరకు గల రహదారికి ‘ఎల్లమ్మ రహదారి’గా నామకరణం చేసింది.

పాఠ్యభాగ సందర్భం

ప్రస్తుత పాఠ్యభాగం చిందు ఎల్లమ్మ మాటల్లోనే ఆమె జీవితాన్ని రికార్డు చేసిన పుస్తకం “నేను చిందుల ఎల్లమ్మను – చిందు భాగవతం ఆత్మకథ” లోనిది. ఈ పుస్తకానికి సంపాదకుడు డా.కె. ముత్యం.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 5 మా భాగోతంలో మేము

పాఠ్యభాగ సారాంశం

(ఈ పాఠ్యాంశం తెలంగాణ మాండలికంలో ఉంది. మరీముఖ్యంగా నిరక్షరాస్యులు యాసలో ఉత్తమ పురుషలో ఉంది. దాని సారాంశాన్ని సరళ ప్రామాణిక భాషలో, ప్రథమపురుషలో అందిస్తున్నాం.)

చిందు భాగోతం ప్రదర్శన : చిందు భాగవతం ప్రదర్శించడానికి ముందు నాలుగు గుంజలు, వెనక రెండు గుంజలు పాతి పందిరి వేస్తారు. ఆ పందిరి కిందనే భాగోతం ప్రదర్శిస్తారు. పందిరి లేకుంటే భాగోతం ఆడరు. పందిరిని చాందిని అని కూడా అంటారు. పందిరికి మూడుపక్కల ఎడ్లకు కట్టే పగ్గాల కంటే లావుగా ఉండే జనుముతో చేసిన తాళ్లను కట్టేవారు. భాగోతం చూడడానికి వచ్చిన వారు మీద పడకుండా ఈ తాళ్ళను కట్టేవారు. దొమ్మరి బిడ్డ గడ (రెండువైపులా కర్రలు పాతి వాటి మధ్యలో తాడు కట్టేవారు. ఆ తాడుపై పెద్ద వెదురు కర్ర పట్టుకొని నడిచేవారు) ఎక్కి సాలా పులిగోలిగా అని బియ్యం సల్తది. మాదిగ చిందోల్లు ఎల్లమ్మ యేషం గట్టి చెరువులు మొకం కడిగితేనే మోక్షం, బరుకతు అని భావించే వారు. అట్లాంటిది మారిపోయి నడి ఊర్లో భాగోతం ఆడటం ఎల్లమ్మ తాతల కాలంలోనే ప్రారంభమైంది.

“ఇవ్వాల చిందు భాగోతం ఆడుతుండ్రట, పోవాలరా” అనేవారు. ఇవ్వాల “ఎల్లమ్మ ఆట ఆడుతున్నరు. గావు పట్టేదున్నదట పోవాల” అని ఊరివాల్లు వచ్చేవారు. పాత రోజుల్లో రాత్రులు ఊర్లో భాగోతం ఆడుతున్నపుడు మంగలోల్లు దివిటీలు పట్టేవారు.

వేషాలు వేసేటప్పుడు ఎవరూ చూడకుండా జాగ్రత్తపడేవారు. తెరముందు ఆడేటప్పుడు మాత్రమే అందరూ చూడాలి అనుకునేవారు. అందుకోసం మాదిగ ఇండ్లల్లో వేషం ధరించేవారు. అలా కుదరనప్పుడు పందిరికి కొంత దూరంలోనో, అలాకూడా కుదరనప్పుడు చుట్టూ దుప్పటి కట్టుకోని రంగులు వేసుకునే వారు. రంగులు వేసుకున్నాక దుప్పటి కప్పుకొని భాగోతం ప్రదర్శించే పందిరి లోపలికి వచ్చేవారు. కళాకారులు ఎవరి వేషం (మేకప్) వాల్లే వేసుకునే వారు. ఎవరి అద్దం వాల్లదగ్గరే ఉండేది. మొకంకు రేవిడిని, లేకుంటే పసుపు పచ్చ పౌడరును వేసుకునే వారు. తెల్ల వెంట్రుకలు కావాలంటే మెంచు, లేదా అర్దూలం (జింక్ ఆక్సైడ్) వాడేవారు. ఆ అర్దూలం చెమటకు వెంటనే కరిగిపోయేది. చూసేవారు కంటికి ధారలుపడేటట్టు ఏడుస్తున్నారు అనుకునే వాళ్ళు. పాత రోజుల్లో ఏడుపు రావాలంటే కంట్లో వేలు పెట్టుకునే వారు లేదా నూనె చుక్కలు వేసుకునేవారు.

కాని ఎల్లమ్మకు దుఃఖం పాట పాడగానే ఏడుపు వచ్చేది. భాగోతం చూసేవారు కూడా వెక్కివెక్కి ఏడ్చేవారు. వారు ఏడిస్తే చీరకొంగులు తడిసిపోయేవి. అంత కష్టపడి భాగోతాన్ని రసవంతంగా ప్రదర్శించేవారు. సత్యహరిశ్చంద్ర భాగోతం ఆడితే చూసేవారు కూడా ఏడ్చేవారు. అలా ప్రదర్శిస్తున్నప్పుడు ఒక్కోసారి ఆఊరి దొరలు “మేం ఇట్లనే కొంగులు పెట్టుకొని ఏడుద్దుమా? బంజేస్తరా? ఓ గంగారం!, ఓ ఎల్లవ్వా! ఇదేం ఏడుసుడు. ఏం కథ, దేవుడా… జర బందు జేయుండ్రి గదా!” అని చెప్పేవారు. అంత లీనమై ఆ ప్రదర్శనను చూసేలా ఆడేవారు. అంత కష్టపడి ప్రదర్శిస్తేనే ఆ కళకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.

ప్రదర్శనకు వాడే వస్తువుల తయారీ : భుజకీర్తులు, కిరీటాలు మొదలైన ఆభరణాలను కళాకారులే తయారు చేసుకునేవారు. కొంత మంది మగవారికి మాత్రమే వాటిని తయారు చేయడం తెలుసు. “పొనికి కట్టెతో వీటిని తయారు చేస్తారు. దాన్ని బూరుగు కట్టె అనికూడా అంటారు. అగ్గిపుల్లలను కూడా ఈ కర్రతోనే తయారు చేస్తారు. కలిపెల్లిగుట్టలో ఈకర్ర చాలా లభించేది. పూర్వం పెద్దపెద్ద గుట్టలు, అడవులు ఉండేవి. దొనకంటి, కథారుపల్లె వైపు ఈ కలప లభించేది. అడవులను నరికిన కారణంగా ఇప్పుడు లభించడం లేదు.

భుజకీర్తులు, కిరీటాల డిజైన్లు చెక్కుడు, అంతా వారే తయారు చేసుకునే వారు. పురుషుల కిరీటము చేయడానికి పన్నెండు నెలలు, ఆడవారి కిరీటం చేయడానికి పద్దెనిమిది నెలలు పట్టేది. కష్టపడి చేసిన నగలను జాగ్రత్తగా కాపాడుకొని పది, పన్నెండేండ్లు ఉపయోగించేవారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న అవి పనికి రాకుండా పోయేవి. ఆడవాల్ల హారాలు, దండలు తయారు చేయడం చాలా కష్టం. శంఖ చక్రాలు, కిరీటము, భుజకీర్తులు, సూర్య కిరీటము, మకర కుండలాలు, కంఠసారె, పెద్ద పేరు ఇవన్నీ రాజు వేషానికి అవసరమవుతాయి.

జడ, కొప్పుజడ (దాన్ని షాంపూజడ అంటారు) సిగరేకులు, పక్క గొలుసు, చెక్క బవిలీలు, గూబగున్నాలు, వేలాడే గున్నాలు స్త్రీ వేషానికి అవసరం. మిగతా జిల్లాల చిందు కళాకారులు ఎన్నో నగల్ని తీసేస్తున్నరు. కానీ నిజామాబాదు జిల్లా కళాకారులు మొదటి నుంచి ఉన్నవాటిని ఇప్పటికీ వాడుతున్నారు.

కిరీటాలు, భుజకీర్తులు కట్టుకొని యేషాలు యేసి, ఆడి, ఆటయినంక చూసుకుంటే అవన్నీ చెమటకు ఉబ్బేవి. నగలను ఆరు, యేడు గంటల పాటు ధరించే ఉండాలి. ప్రదర్శన పూర్తయ్యేవరకు నగలను విప్పకపోయేవారు. అందుకోసం వేషాలు వేసుకునేటప్పుడే అవి జారిపోకుండా గట్టిగ లాగి కట్టేవారు. భాగోతం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభిస్తే సాయంత్రం ఆరు, యేడు గంటల దాకా ఆడతారు. ఈ భుజకీర్తులు, కిరీటాలను అంతసేపు అట్లనే ధరించాలి. వేషాల మధ్య తబలకొట్టినా కూడా వాటిని అలానే ధరించేవారు. భాగోతం పూర్తయి ఇంటికి వచ్చి, ఆరతి ఇచ్చిన తరువాతనే వేషాన్ని విప్పేవారు.

ప్రదర్శన ప్రారంభ, ముగింపు సన్నివేశాలు : ఏదైనా గ్రామంలో ప్రదర్శన ప్రారంభించే ముందు ఆవూర్లోని విశ్వబ్రాహ్మణుల ఇంటికి వెళ్లి కమ్మరి కొలిమికి నమస్కరించే వారు. భాగోతం ఆడటం అయిపోయినంక రాముని పేరుతో మంగళ హారతి ఇస్తారు. పక్కవాయిద్యాల వారు కూడా మంగళారతి పాట పాడేవారు. ప్రధాన వేషం ధరించిన స్త్రీ పాత్ర మంగళహారతి పట్టుకొని ప్రేక్షకుల దగ్గరికి పొతే, వారు ఆ హారతికి నమస్కరించి వారికి తోచినంత డబ్బును హారతి పళ్ళెంలో వేసేవారు. ఆ తరువాత ఆ హారతితోనే కళాకారుల బృందం అంతా ఇంటికి వెళ్తారు. అందరు కలిసి మరొక్కసారి హారతి తీసుకుంటారు.

హారతి తరువాత ఒకరినొక ఆలింగనం చేసుకుంటారు. ఆడవారితో ఆడవారు, మగవారితో మగవారు దాసున్ని అనే అర్థంలో లింగ భేదం లేకుండా ‘దాసున్, దాసున్’ అనుకుంటారు. అప్పుడు భాగోతం సామాగ్రినంతా తీసి, ఎవరి సామాను వారు సర్దుకొని వేషాన్ని విప్పేస్తారు. ప్రదర్శనలో భాగంగా అరేయ్ దుర్మార్గా అని, ఓరి సుగ్రీవా అని పాడి, ఎగిరి తంతారు. అలా చేయడం తప్పు కాబట్టి భాగోతం పూర్తికాగానే పెద్దవారి కాళ్లకు నమస్కరిస్తారు. అలా భాగోతంలో అన్నా అనకున్నా, తన్నినా తన్నకున్నా, చిన్నవారు పెద్దలకు నమస్కరిస్తారు.

ప్రదర్శనల్లో వస్తున్న మార్పులు : మంగళ హారతిలో మంది వేసిన డబ్బులను అందరూ కలిసి పంచుకుంటారు. భాగోతం మధ్యాహ్నం పన్నెండు, ఒకటి నుంచి ఆరు, ఏడు గంటల వరకు ప్రదర్శిస్తారు. ఇపుడు కొంతమంది మూడు గంటలసేపు ఆడగానే ఆపుమంటున్నారు. కాని ఖచ్చితంగా ఆడాలంటే రాత్రి పది గంటలకు ప్రారంభించి, ఉదయం వరకు ప్రదర్శిస్తారు. భాగోతం అయిపోయే వరకు ప్రేక్షకులను కదలనీయనంత ఆకర్షణీయంగా ప్రదర్శిస్తారు. అవకాశముంటే వరుసగా పదిహేను రోజులపాటు భాగోతాలు ఆడుతారు. ఒకవేళ ఎవరి గొంతుకు ఏమైనా ఇబ్బంది కలిగితే ఇతరులు సహకరిస్తారు. సారా ముట్టరు. మందు ముడితే పాడయిపోతారని గట్టి నమ్మకం.

పెద్ద కథని రెండు గంటల్లో ఆడమంటే “అయ్యో చెప్పి ఏమి లాభం? చెప్పక ఏమి లాభం? అనుకుంటారు. అలా తక్కువ సమయంలో పూర్తి చేస్తే వాళ్లకు సంతృప్తి కలగదు. ఈ రోజుల్లో మూడు గంటలు భాగోతం చూడడానికి జనాలకు ఓపిక ఉండటం లేదు. “అయ్యో! నడుములు నొచ్చె, ఇంటికాడ ఏమాయెనో” అంటారు.

ఇతరుల ప్రదర్శనలకంటె చిందు ప్రదర్శనలకు ఎక్కువ మొగ్గు చూపేవారు. కళాకారులకు డబ్బుతోపాటు, చీరలు, రవికలు, అంగీలు, ధోతులు ఇచ్చేవారు. అన్ని గ్రామాలలో చిందు కళాకారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించే వారు. మాదిగ ఇండ్లలో అడుక్కునేవారు కాబట్టి వారిని గౌరవించేవారు.

ఆదాయాన్ని పంచుకునే పద్ధతి : భాగోతం ఆడిన భార్యాభర్తలకు ఒక వాటా, పెళ్లి కాని పిల్లలుంటే, వాళ్లు ఆడితే, ఒక వాటాలో ఐదు భాగాలు చేసి ఆడపిల్లలకు రెండు భాగాలు, మగ పిల్లలకు మూడు భాగాలు ఇస్తారు. ఇద్దరు భార్యాభర్తలకు ఒక పాలు ఇస్తారు కాని ఎల్లమ్మకు భర్తలేడు. అయినా ప్రధాన పాత్రలు ధరిస్తుంది కాబట్టి ఒక వాటా ఇచ్చేవారు. పెండ్లయి ఒక్కడే భాగోతంలో ప్రధాన వేషం వేస్తే కూడా ఒక భాగం ఇస్తారు.

అతనికి భార్యతో విడాకులైనా, ఆమె చచ్చిపోయినా ఆయనకు పాలు ఇస్తారు. మరి పెండ్లయినా చిన్న వేషం ధరిస్తే పాలు ఇవ్వరు. మూడు భాగాలే ఇస్తారు. ఈ పంపకాలు గురించి అప్పుడప్పుడు గొడవలు కూడా అవుతాయి. మళ్ళీ వారిలో వారే పరిష్కరించుకుంటారు.

చిందు వాళ్ళు టిక్కెట్లు పెట్టి భాగోతం ఆడరు. వరంగల్ జిల్లాల ఆడుతున్నరట. టిక్కెటుకు పైసలు ఇస్తేనే భాగోతం చూడనివ్వాలి లేకుంటే లేదు అంటే పైసలు ఉండకపోతే ప్రదర్శన చూడలేకపోతారు. ఒక వేల టిక్కెట్లు పెట్టి ఆడితే ఆ ఆదాయంతోనే బతకాలి. ఊల్లోకి వెళ్లి అడుక్కోవడానికి అవకాశం ఉండదు. అలా అడుక్కుంటే “నువ్వు సూడనిచ్చినావురా? పైసలు తక్కువ వున్నయంటే రానియ్యక పోతివి. మిట్ట మిట్ట సూడంగ ఎల్లగొడితివి. మల్లా అదీ ఇదీ ఇయ్యమంట అస్తివి” అని మొకం మీదనే కసురుకుంటారు. కళాకారులకు తమ ప్రదర్శన ఎక్కువమంది చూడాలనే కోరిక ఉంటుంది. టిక్కెట్టు పెట్టకపోవడానికి మరొక కారణం ఒక గ్రామంలో అడుక్కుంటే బియ్యం, కూరగాయలు, పప్పు, ఉప్పు చింతపండు, బట్టలు ఇలా అనేకరకాల వస్తువులు ఇస్తారు. డబ్బువస్తే దేనికయినా ఖర్చు అవుతాయి కాబట్టి వారు టిక్కెట్టు పెట్టరు.

చిందు కళాకారులు రాజ్యం పంచుకోవడం : చిందు కళాకారులు ప్రారంభంలో యే గ్రామంలోనైనా ప్రదర్శనలు ఇచ్చేవారు. కాని మధ్యలో గ్రామాలు పంచుకొని ఒకరికి వచ్చిన గ్రామంలోకి ఇంకొకరు వెళ్లి ప్రదర్శనలు ఇవ్వరు. ఒక్కో కళాకారుల బృందానికి ఇరవై నుండి ముప్పై గ్రామాలు ఉండేవి. ఇలా గ్రామాలను పంచుకోవడాన్ని రాజ్యం పంచుకునుడు అంటారు. రొట్టె తినని కారణంగా మహారాష్ట్ర వైపు ఎక్కువగా చిందు కళాకారులు లేరు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, గాంధారి, పిట్లం, రెంజల్, నవీపేట, కుందాపురం, నందిపేటల్లో ఉన్నారు. మల్లారం, మాకులూరు, బొంకిన పల్లెల్లో వున్నారు. ఆరమూరు వైపు ఎక్కువగా ఉన్నారు.

అలా ఊల్లు పంచుకున్న కుటుంబాలు భాగోతాలు ఆడాలనుకుంటే కళాకారుల దగ్గరికి వచ్చి, ఆటకు ఐదు వందలు రూపాయలు ఇచ్చి తీసుకుపోతారు. వారి అవసరం కనుక సామాన్లు కూడా నెత్తిమీద పెట్టుకొని తీసుకెళ్తారు. ఎవరికన్నా ఊర్లుండి కళాకారుల బృందం లేకుంటే ముందే మాట్లాడుకుంటారు. వచ్చిన దానిలో సగం సగం తీసుకుంటారు. న్యాయం ఉన్నదగ్గరే నారాయణుడు (దేవుడు) ఉంటాడు అని నమ్మి పంపకాలలో న్యాయం పాటిస్తారు. అని చిందు ఎల్లమ్మ డా. కె.ముత్యం కు చెప్తే ఆమె చెప్పినట్టుగానే ఆయన పుస్తకంలో రాశారు.

Leave a Comment