TS 10th Class Physical Science Important Questions Chapter 1 Reflection of Light at Curved Surfaces

These TS 10th Class Physics Chapter Wise Important Questions Chapter 1 Reflection of Light at Curved Surfaces will help the students to improve their time and approach.

TS 10th Class Physical Science Important Questions Chapter 1 Reflection of Light at Curved Surfaces

1 Mark Questions

Question 1.
Can you find out the rough focal length of a convex mirror?
Answer:
No, because it always forms a virtual image for any position of the object.

Question 2.
What type of mirror ¡s used to obtain real image?
Answer:
Concave mirror is used to obtain real image.

Question 3.
Which mirror has large field of view?
Answer:
Convex mirror.

Question 4.
For what position of an object, a real and diminished image is formed by a concave mirror.
Answer:
The position of an object is beyond centre of curvature.

Question 5.
What is reflection?
Answer:
The light rays falling on a surface are returned Into the original medium, this phenomenon is called reflection.

Question 6.
What Is meant by lateral Inversion?
Answer:
The right appears as left in the image is called lateral inversion.

Question 7.
Which spherical mirror will be bent outward?
Answer:
Convex mirror will be bent outward.

Question 8.
Which mirror is called converging mirror?
Answer:
Concave mirror is called converging mirror.

Question 9.
Which spherical mirror will be bent inward?
Answer:
Concave mirror will be bent inward.

Question 10.
Which mirror is called diverging mirror?
Answer:
Convex mirror is called diverging mirror.

Question 11.
What is the relation between focal length and radius of curvature?
Answer:
Radius of curvature = 2 x focal length
∴ R=2f(or)f = \(\frac{R}{2}\)

Question 12.
Which mirror always give virtual image?
Answer:
Convex mirror always give virtual image.

Question 13.
What is the mirror formula for spherical mirrors?
Answer:
The mirror formula is
f = focal length of mirror, u = object distance, v = image distance

Question 14.
What is vertex?
Answer:
The point at which the central axis touches the mirror is called vertex.

Question 15.
What is focus?
Answer:
The light rays coming from distint object appear to meet at point in case of concave mirror and tends to meet at point when drawn backwanl in case of convex mirror. That point is called focus.

Question 16.
What is centre of curvature?
Answer:
The centre of sphere to which the mirror belongs is called centre of curvature.

Question 17.
What is focal length?
Answer:
The distance between vertex and centre of curvature.

Question 18.
Define magnification.
Answer:
The ratio of size of image to size of object is called magnification.
TS 10th Class Physical Science Important Questions Chapter 1 Reflection of Light at Curved Surfaces 1

Question 19.
How do you get a virtual Image with a concave mirror?
Answer:
When we place the object between vertex and focus then we will get a virtual Imagre.

Question 20.
Why concave and convex mirrors are called spheilcal mirrors?
Answer:
The reflecting surface of convex and concave mirror is considered to form a part of the surface of a sphere so they are called spherical mirrors.

Question 21.
Which mirrors are used in saloons?
Answer:
Plane mirrors are used In saloons.

Question 22.
Which mirrors will act as rare view mirror?
Answer:
Convex mirrors will act as rare view mirror.

Question 23.
Which Image does not form on a screen?
Answer:
Virtual image.

Question 24.
Which mirrors has magnification always same?
Answer:
Plane mirrors has magnification always same.

Question 25.
What Is the magnification of plane mirror?
Answer:
The size of object = size of Image
∴ magnificatIon = 1

Question 26.
Where do you place the vessel In solar cooker?
Answer:
We place the vessel In solar cooker at the focal point.

Question 27.
Write any two uses of concave mirror in our daily life.
Answer:
Uses of concave mirror:

  1. Concave mirrors are used by dentists to see enlarged image of tooth.
  2. Concave mirrors are used In car headlights.

Question 28.
Which objects at your home act as spherical mirrors?
Answer:
Objects at home act as spherical mirrors.

  1. Spoons
  2. Spectacles
  3. Sink
  4. Cooking vessel

Question 29.
Suggest a new use with a spherical mirror?
Answer:
Spherical mirrors are newly adapted in AThis.

Question 30.
What are needed to form a shadow?
Answer:
A source of light, an opaque object and a screen are needed to form a shadow.

Question 31.
Which rays are called paraxial rays?
Answer:
The rays which are very nearer to the principal axis are called paraxial rays.

Question 32.
Which property of concave mirror Is used by dentists?
Answer:
When a bulb is placed at the focus of a concave mirror light from the bulb gets reflected to produce a strong, parallel beam. By using this property, dentists are able to see the Inner parts of the tooth clearly.

Question 33.
What is meant by converging of light rays?
Answer:
If light rays after reflection meet at a point then we say the light rays are converging.

Question 34.
When do you say light rays are diverging?
Answer:
If lights rays appear as if they are coming from a point after reflection then we say light rays are diverging.

Question 35.
If focal length is 20 cm then what Is radius of curvature of mirror?
Answer:
f = 20 cm
r = 2f = 2 x 20 40 cm. So radius of curvature = 40 cm

Question 36.
When does a ray reflect along the same path from a concave mirror?
Answer:
When it passes through centre of curvature.

Question 37.
When a light ray travelling parallel to principal axis falls on concave mirror, then what is the path of reflected ray?
Answer:
The reflected ray passes through focal point.

Question 38.
Where do you place the vessel in solar cooker?
Answer:
We place the vessel in solar cooker at the focal point.

Question 39.
If the magnification Is atways less than 1 then what Is the mirror?
Answer:
The mirror is convex.

Question 40.
The radius of curvature of a spherical mirror Is 20 cm. What is the focal length?
Answer:
Radius of curvature (R) = 20 cm
Focal length (f) = \(\frac{R}{2}=\frac{20}{2} \) = 10cm.

Question 41.
Name a mirror that can give an erect and enlarged image of an object.
Answer:
Concave mirror can give an erect and enlarged image of an object.

Question 42.
The focal length of convex mirror is 16 cm. What is lts radius of curvature?
Answer:
f = 16 cm.
R = 2f = 2 x 16= 32 cm.

Question 43.
A concave mirror produces three times magnified real image of an object placed at 10 cm in front of it. Where Is the image located?
Answer:
30 cm.

Question 44.
Write any two uses of concave mirror in our daily life.
Answer:
Uses of concave mirror:

  1. Concave mirrors are used by dentists to see enlarged image of tooth.
  2. Concave mirrors are used in car headlights.

Question 45.
Write any two uses of convex mirror in our daily life.
Answer:
Uses of convex mirror:

  1. Convex mirrors are used as rear view mirrors in vehicles because convex mirrors increase field of view.
  2. Convex mirrors are used in street light reflectors as they spread light over greater area.

Question 46.
Which objects at your home act as spherical mirrors?
Answer:
Objects at home act as spherical mirrors are.

  1. Spoons
  2. Spectacles
  3. Door-knobs
  4. Cooking vessel

Question 47.
What is your opinion on elevating buildings with mirrors.
Answer:
The mirrors used in elevating buildings are reinforced, tough and laminated glasses. These mirrors provide safety and make the buildings attractive but the reflection caused by mirrors is dangerous to people travelling on roads and also to the birds.

Question 48.
Suggest a new use with a spherical mirror.
Answer:
Spherical mirrors are newly adopted in ATMs.

Question 49.
Can a convex mirror burn a paper? If not? Why?
Answer:
The rays’coming parallel to principal axis after reflection diverge from the mirror. So we cannot burn a paper by using a convex mirror as they do not converge light at a point.

Question 50.
Which mirror has wider field of view?
Answer:
A convex mirror has wider field of view, that’s why they are used as rear view mirrors in vehicles.

Question 51.
Why does our image appear thin or bulged In spherical mirrors?
Answer:
Due to covering or diverging of light rays from the mirror.

Question 52.
Can we focus a sunlight at a point using a mirror instead of magnifying glass?
Answer:
Yes, by using concave mirror we can focus sunlight at a point.

Question 53.
Why is angle of Incidence equal to angle of reflection when a light ray is reflected from a surface.
Answer:
Because light selects the path that takes least time to cover a distance.

Question 54.
Are angle of reflection and angle of incidence also equal for curved surface?
Answer:
Yes, it Is equal for curved surfaces like spherical mirrors..

Question 55.
What is a spherical mirror? Give different types of spherical mirrors.
Answer:
If the reflecting surface of mirror Is considered to form a part of the surface of sphere then it is called spherical mirror. Spherical mirrors are of two types:

  1. Concave mirror
  2. Convex mirror

Question 56.
Why does an image suffer lateral Inversion?
Answer:
The light rays which come from an object get reflected from the plane mirror and reach our eye, our brain feels that the ray (reflected ray) is coming from inside the mirror. That is why the right of object looks like left in the image.

Question 57.
We wish to obtain an erect image of an object using a ‘concave mirror of focal length of 15 cm. What should be range of distance of the object from the mirror ? What is the nature of the image? Is the image larger or smaller than the object?
Answer:

  1. The range of distance of object is between 0 and 15 cm.
  2. The image is virtual and erect.
  3. The Image Is larger than the object.

Question 58.
To reduce glaze of surroundings the windows of sorne department stores, rather than being vertical, slant Inward at the bottom. How does this reduce glaze?
Answer:
Thts slant reflects the sunlight further down towards the ground, than it would have happened If they are vertical.

Question 59.
Predict and write the reason, why the value of the distance of the object (u) is always negative in the mirror equation.
Answer:
Because, the object Is always placed infront of the mirror and the object distance is measured opposite to the incident rays, the sign of object distance is taken as negative.

Question 60.
Which property of concave mirror Is used in making the solar cooker?
Answer:
When the light rays which travels parallel to the principal axis of concave mirror, they will meet at Focus after reflection.

Question 61.
Draw the ray diagram to show the formation of image for the object of height 1 cm. placed at 5cm. distance, in front of a convex mirror having the radius of curvature R = 5cm.
Answer:
TS 10th Class Physical Science Important Questions Chapter 1 Reflection of Light at Curved Surfaces 2

2 Marks Questions

Question 1.
A fish looks up from the water making a perpendicular angle 45°C. Can the fish see the sky on the surface of water? Explain.
Answer:
If the incidence angle is less than the critical angle takes place.
Given incidence angle = θ1 = 45°
nwaterXsinθc = nairXsin90°
Refractive index of water = \(\frac{4}{3}\)
Refractive index of air = 1
\(\frac{4}{3} \times \sin \theta_c=1 \times 1 \)
\(\sin \theta_c=1 \times \frac{3}{4}=\frac{3}{4} \Rightarrow \theta_c=\sin ^{-1}\left(\frac{3}{4}\right)=47.85^{\circ}\)
∴ θc θ1 So fish can see the sky.

Question 2.
The focal length of. huge concave mirror is 120 cm. A man Is standing in front of it at a distance of 40cm. What are the characteristics of his image in that mirror?
Answer:
Object distance = u = – 40 cm
Focal length f = -120 cm (∵ concave mirror)
Image distance v =?
Mirror formula \(\frac{1}{f}=\frac{1}{v}+\frac{1}{u} \Rightarrow \frac{1}{120}=\frac{1}{v}-\frac{1}{40} \)
\(\frac{1}{v}=\frac{1}{40}-\frac{1}{120}=\frac{3-1}{120}=\frac{2}{120}=\frac{1}{60}\)
∴ v = 60 cm
Image distance = 60 cm.
Magnification = m = \(\frac{\text { Image distance }}{\text { Object distance }}=\frac{-60}{-20} \) = 3 cm
Here ‘+‘ represents Image is virtual, erect and magnified.

Question 3.
There Is an object in front of convex mirror at a distance of 5 cm. If Its focal length Is 10 cm then
a) What Is the image distance?
b) What is Its magnification
Answer:
a) In the case of convex mirror.
Object distance = u = – 5 cm
Focal length = f = + 10 cm
TS 10th Class Physical Science Important Questions Chapter 1 Reflection of Light at Curved Surfaces 3
b) Magmfication (m) = \(-\frac{v}{u}=\frac{-3.33}{-5}\) = 0.66

Question 4.
Write any two uses of each of concave and convex mirrors In our daily life.
Answer:
Uses of Convex mirrors:

  1. Convex mirrors are used as rear-view mirrors In cars, scooters, motorcycles, buses and trucks etc.
  2. Convex mirrors are used In telescopes.

Concave mirrors:

  1. Concave mirrors are used as shaving mirrors and used by dentists, eye specialists etc.
  2. Coeica”e mirrors at e use1 as reflectors in the headlights of vehicles such as motorcycles, cars etc.
  3. Large concave mirrors can be used to concentrate sunlight to produce neat ifl a solar heating device.
  4. Concave mirrors are also used in telescopes.

Question 5.
Which objects at your home act as spherical mirrors?
Answer:

  1. TIe outer surfaces of stainless steel utensils,. spoons, plates, etc., act as convex mirrors.
  2. The inner surfaces of the above said articles act as concave mirrors.,
  3. Any bought surface with high polish acts as a convex mirror.

Question 6.
Suggest a new use with a spherical mirror.
Answer:

  1. Concave mirrors are used in long focal-length camera lenses.
  2. In ‘Super sniper to focus arid gritty sound from a great distance onto a microphone pick up.
  3. At one end of some gas LASERS to focus the emerging beam of light.
  4. In the telescopes to focus the very weak radio waves onto the suspended antenna.

Question 7.
Write about different points related to mirrors.
Answer:
The different points related to mirrors are

  1. Vertex (P): The point where the central axis touches the mirror is called vertex.
  2. Focus or focal point (F): The rays coming from a distant object meet at a point on principal axis after reflection. That point is known as focus or focal point.
  3. Centre of curvature (C): It is the centre of the sphere to which The mirror belongs.

Question 8.
Write about various distances related to mirrors.
Answer:
The various distances related to mirrors are

  1. Focal length (f): The distance between vertex and focus is called focal length.
  2. RadIus of curvature (R): The distance between vertex and centre of curvature is called radius of curvature.
  3. Object distance: It is the distance between the object and pole of mirror and is denoted by ‘u.
  4. Image distance: It is the distance between the Image and pole of the mirror and is denoted by ‘y’.

Question 9.
What happens If an object is placed at centre of curvature of a mirror?
Answer:
From the ray diagram, we conclude that the image of the object will be formed at the same distance as the object and it will be inverted and of the same size. The image Is real because it forms on a screen.
TS 10th Class Physical Science Important Questions Chapter 1 Reflection of Light at Curved Surfaces 4

Question 10.
Would you be able to burn a paper using concave mirror?
Answer:
1. Concave mirror focuses the parallel sun rays at focal point of the mirror.
2. So with a small concave mirror we can heat up and bum a paper.
TS 10th Class Physical Science Important Questions Chapter 1 Reflection of Light at Curved Surfaces 5

Question 11.
Cana plane mirror ever form a real image?
Answer:

  1. Real images can only be formed when the reflected rays converge.
  2. For plane mirrors it is not possible.
  3. However if the reflected rays are converged it can form a real image.
  4. Consider a source of light at infinity (say sun) and plane mirror is very small in size, its reflected image will show a circular bright spot (Image of sun) on the screen.

Question 12.
Identify types of mirrors without actually touching it. (move the mirror to and from)
Answer:

  1. Plane mirror: It forms the mage es of same size.
  2. Concave mIrror: Image es curved, bringing the mirror closer, magnifying the image. Moving it away, the Image Is Inverted and reduced.
  3. Convex mirror: Mirror image is always diminished but erect. The viewpoint is wider.

Question 13.
Why there is right-left inversion (lateral Inversion) when we look into mirror?
Answer:

  1. The light rays which come from object get reflected from the plane mirror and reach our eye.
  2. Our brain feels that the ray Is coming from the inside of mirror.
  3. So there Is right-left inversion.

Question 14.
List out the four properties of the Image formed by a convex mirror.
Answer:
Properties of the image formed by a convex mirror:

  1. The image is always virtual and erect.
  2. The image is highly diminished or point sized.
  3. It is always formed between F and R
  4. The object and image are on opposite sides of mirror.

Question 15.
The magnification of the image by the concave mirror is -1. Mention the four characteristics of Image from the above Information.
Answer:
Magnification = -1.
This means the image size is equal to the object size. In this case the object will be at centre of curvature ‘C’ and the image also will be formed at ‘C’.

Characteristics of image :
→ Image is real
→ Image is inverted
→ Size of image Is equal to the size of the object
→ Image will be formed at ‘C’

Question 16.
Why periscopes are in ‘Z’ shape? Why not In other shapes? Make a guess. Try to check whether your guess Is correct or not.
Answer:
Generally, periscopes are used to see the objects which are at a greater height by hiding In ground. The beam of light which is incident on the first mirror must be Incident on second mirror after reflection from the first mirror. The mirrors are arranged at an angle of 45°. It is possible only when It Is in the shape of ‘Z’ and In other shapes it Is impossible to see the object by hiding. So periscopes are in ‘Z’ shape. Eg : Let us assume that periscope is in T shape. It is impossible to see the object by hiding.
TS 10th Class Physical Science Important Questions Chapter 1 Reflection of Light at Curved Surfaces 6

Question 17.
State the laws of reflection of light.
Answer:
1. When light gets reflected from a plane surface, the angle of reflection is equal to the angle of Incidence.i.e.,
∠i = ∠r
2. The Incident ray, the normal at the point of Incidence and the reflected ray lie in the same plane. i.e. AO, ON, OB are in same plane.
TS 10th Class Physical Science Important Questions Chapter 1 Reflection of Light at Curved Surfaces 7

Question 18.
How do you appreciate the role of spherical mirrors In our daily life?
(OR)
Write the usage of spherical mirror In daily life situations.
(OR)
How do you appreciate the importance of spherical mirrors In our daily usage?
Answer:

  1. Spherical mirrors are useful in our daily life in many ways.
  2. Convex mirrors are used as rear-view mirrors In cars, scooters, buses, etc. This helps us to see the traffic behind the vehicle, which avoids accidents while taking turns.
  3. Concave mirrors are used by dentists, ophthalmologists, to see the smaller parts of teeth, eyes and ears.
  4. Concave mirrors are also used in solar heating devices.
  5. Concave mirrors are used as shaving mirrors to see a large image of the chin (or) face.

Question 19.
How do you appreciate the use of reflection of light by a concave mirror In making of TV antenna dishes?
Answer:

  1. I appreciate the working process of TV antenna dishes.
  2. They contain the concave surfaces to receive the signals from the distinct communication satellites.
  3. The concave (parabolic) shape of a dish antenna helps to reflect signals to the focal point of the dish.
  4. A device known as feed horn is mounted at the focal point which gathers the signais and sends them to a processing unit.

Question 20.
Have you ever observed the image of the sky In rainwater pools on earth? Explain the reflection of light In this context.
Answer:

  1. The image of the sky Is formed in the rainwater pool on earth.
  2. Ught rays coming from blue sky travel through nearly the same air layers and all are bent over to the same amount.
  3. Therefore, rays coming from the top of object will arrive lower than those from the bottom.
  4. The image usually is upside down, enhancing the illusion that the Image of the sky is seen in the water which is acting as a mirror.

Question 21.
Discuss the merits and demerits of using mirrors in building elevation.
Answer:
Merits:

  • When sunlight falls on the building, the light rays reflect back and building does not heat up.
  • Mirrors do not get rust and can be cut into different shapes and sizes.

Demerits:

  1. Elevation of buildings with mirrors is not suggestable.
  2. These mirrors reflect sun rays at day time and reflectS lighting from nearby electrical bulbs at night time, which causes confusion and disturbance for the vehicles and people who are running on the nearby roads lead to accidents.
  3. Birds like sparrows, crows will get confusion while flying on roads.
  4. They are also not safe enough to the buildings, as they cause easy access to thieves.

4 Marks Questions

Question 1.
Focal length of a concave mirror Is f. The distance from Its focal point to the object is P. Find the ratio of heights of image.
Answer:
Concave mirror Is a part of spherical mirror.
Magnification of a spherical mirror = m = \(\frac{f}{f-u}\)
Focal length of a mirror = f
The distance from focal point to the object is = p.
i) When the object is placed within the focus, then
u = – (f- P), f = f
Magnificatlon of the mirror = m = \(\frac{\text { Size of image }}{\text { Size of object }}=\frac{-f}{-f+(f-p)}=\frac{f}{p}\) ……………………….. (1)
ii) If the object placed beyond F at a distance P. So = u = – (f + P) = f = – f
Magnification of the mirror = \(\frac{f}{f-u}=\frac{-f}{p} \) ……………………. (2)
\(\frac{(1)}{(2)}=\frac{h_1}{h_2}=\frac{O J \times \frac{f}{p}}{-O J \times \frac{f}{p}}\) = -1

Question 2.
In the following cases calculate the magnification values for a concave mirror. Give reason.
a) When the object is at the focal point of the mirror
b) When the object Is between focal point and the pole.
Answer:
In the case of concave mirror
a) When the object Is at the focal point of the mirror then its magnification value is -1.
Reason: In this case size of the image is large, compare with the object. It is called virtual image.
Image is formed behind the mirror so magnification has negative sign.
TS 10th Class Physical Science Important Questions Chapter 1 Reflection of Light at Curved Surfaces 8
Nature of the image: It ¡s real, inverted, enlarged and forms at infinity.
b) When the object Is between focal point (F) and the pole (P) of the mirror, then its magnification value is + 1.
TS 10th Class Physical Science Important Questions Chapter 1 Reflection of Light at Curved Surfaces 9
Reason: In this case image is formed on the same side of the object and it is also virtual Image so, the sign of the magnification Is positive. Nature of the Image: It is virtual, erect, enlarged and on the same side of the object.

Question 3.
You are given three mirrors of equal size – concave, convex and plane. How will you identify them without touching their surfaces?
Answer:
We look our face In each mirror, in one after the other. First we keep our face quite close to the mirror and then move It slowly away from the mirror.

  1. If the image formed Is of same size as our face but laterally Inverted for all positions, then it Is a plane mirror.
  2. If the Image formed ¡s erect and enlarged Initially but gets inverted as the face is moved away, then it Is a concave mirror.
  3. If the image formed is erect and smaller In size for aft positions then t is a convex mirror.

Question 4.
Explain the formation of virtual image by a concave mirror.
Answer:
1. Let the object is placed at a distance less than the focal lenqth of the mirror.
2. The first ray (R1) will start from tip of the object and run parallel to axis to get reflected so as to pass through the focal point. ‘
3. The ray (R2) which is passing through focal point is not possible to draw.
4. Let us consider a ray that starts from the tip of the object and goes In such a direction that it would go through the centre of curvature if extended backwards.
TS 10th Class Physical Science Important Questions Chapter 1 Reflection of Light at Curved Surfaces 10
5. This ray Is normal to the surface and so will be reflected along the same line In opposite direction and will go through the centre of curvature.
6. If we extend these two rays (R1 and R3) backward till they meet, an enlarged, erect image is formed which cannot be caught on the screen but visible through mirror. This is the virtual image formed by a concave mirror.

Question 5.
Write the rules to trace an Image forward by a convex mirror.
Answer:
Rule 1. : A ray, running parallel to axis. on meeting the convex mirror,will get the reflected so as to appear as it is coming from the focal point.
TS 10th Class Physical Science Important Questions Chapter 1 Reflection of Light at Curved Surfaces 11
Rule 2: A ray going in the direction of focal point, after reflection, will become parallel to main axis.
TS 10th Class Physical Science Important Questions Chapter 1 Reflection of Light at Curved Surfaces 12
Rule 3: A ray going ¡n the direction of the centre of curvature on reflection, will get back In opposite
direction and looks that it is coming from the centre of curvature.
TS 10th Class Physical Science Important Questions Chapter 1 Reflection of Light at Curved Surfaces 13

Question 6.
Sukumar saw his face in car rearview mirror. He observed that his Image is smaller than the original.
a) What type of mirror it is?
b) What is the nature of image?
c) Draw the ray diagram for it.
Answer:
a) The mirror is convex mirror which is also called as Rear view mirror.
b) The nature of image is erect, virtual, smaller than size of object.
c)
TS 10th Class Physical Science Important Questions Chapter 1 Reflection of Light at Curved Surfaces 14

Question 7.
A student conducted an experiment to observe characteristics of images formed by spherical mirrors and recorded his observations as follows. Observe the table and answer the questions.
TS 10th Class Physical Science Important Questions Chapter 1 Reflection of Light at Curved Surfaces 15
i) Above said Information belongs to which sphencal mirror?
ii) In which situation, magnification Is less than 1.
iii) An object of height 8 cm placed at centre of curvature on principal axis, then where do you get the image and what is its height?
iv) “All real images are inverted”. Justify the statement by using above table.
Answer:
i) It is a Concave mirror.
ii) When object Is kept beyond ‘C’ then magnification is less than 1.
iii) Image formed at ‘C’. The height of the image is 8 cm.
iv) According to the table if the image is erected, it is a real image. In all tne other cases very real image Is Virtual Image.

Question 8.
Make a Solar heater / Cooker and explain the process of making.(AS5)
Answer:
Making of solar heater/cooker:

  1. Make a wooden/Iron frame in the shape of TV dish antenna.
  2. Cut the acrylic mirror sheets Into 8 or 12 places in the shape of Isosceles triangle with a height equal to the radius of your dish antenna.
  3. The bases of 8 or 12 triangles together make the circumference of the dish.
  4. Stick the triangle mirrors to the dish.
  5. Face the dish towards the sun. Find the focal point and place a vessel at that point.
  6. It will become heated. Even you can cook rice in that vessel.
  7. In this way we will make a solar heater/cooker.

TS 10th Class Physical Science Important Questions Chapter 1 Reflection of Light at Curved Surfaces 16

Additional Problems

Question 1.
An object 4 cm In size is placed at 25 cm In front of a concave mirror of focal length 15 cm. At what distance from the mirror should a screen be placed in order to obtain a sharp image? Find the nature and size of image.
Solution:
Given that f = -15 cm; u = -25 cm; h0 = 4 cm; v = ?
The mirror formula Is
\( \frac{1}{f}=\frac{1}{u}+\frac{1}{v} \Rightarrow \frac{1}{-15}=\frac{1}{-25}+\frac{1}{v} \Rightarrow \frac{1}{v}=\frac{1}{25}-\frac{1}{15}=\frac{3-5}{75}=\frac{-2}{75}=\)-37.5 cm.
v = -37.5 cm
The screen should be placed 37.5 cm from the pole of mirror and the image is real.
Magnification, m = \(=\frac{h_i}{h_o}=\frac{-v}{u} \Rightarrow \frac{h_i}{4}=-\frac{37.5}{25} \Rightarrow h_i=-\frac{37.5}{25} \times 4 \) = -6cm
So the image is enlarged and inverted.

Question 2.
An object of size 7 cm is placed at 27 cm in front of a concave mirror of focal length 18 cm. At what distance from the mirror should a screen be placed to obtaIn a sharp Image ? FInd size and nature of the Image.
Solution:
Given that h0 = 7cm; u =- 27cm; f= -18cm; v = ?
The mirror formula is \(\frac{1}{f}=\frac{1}{v}+\frac{1}{u} \Rightarrow \frac{1}{-18}=\frac{1}{-27}+\frac{1}{v}\)
\(\frac{1}{v}=-\frac{1}{18}+\frac{1}{27} \Rightarrow \frac{1}{v}=\frac{-3+2}{54}=\frac{-1}{54} \)
So, v = – 54 cm,
So the screen should be placed 54 cm from the mirror and the image is real and inverted.
MagnifIcation, m=\(\frac{h_i}{h_o}=\frac{-v}{u} \Rightarrow \frac{h_i}{7}=-\frac{(-54)}{27} \Rightarrow h_i=-\frac{(-54)}{27} \times 7\) = -14 cm(Hence the image is inverted). As the size of the object Is 7cm the image is enlarged two times.

Question 3.
An object 3 cm high Is placed at a distance of 15 cm from a concave mirror, the radius curvature is 20 cm. Find the nature, position and size of the image. (V = -30 cm, m = -2, h2 = -6 cm)
Answer:
h0 = 3 cm
u = -15 cm
r = -20 cm
f= \(\frac{r}{2}\) =-10cm
Mirror formula is = \(\frac{1}{f}=\frac{1}{u}+\frac{1}{v} \Rightarrow \frac{1}{-10}=\frac{1}{-15}+\frac{1}{v}\)
⇒ \(\frac{1}{v}=\frac{1}{15}-\frac{1}{10}=\frac{2-3}{30}=\frac{-1}{30} \) = -30 cm
So the Image Is real and Inverted and beyond C.
Magnification = \(\frac{-v}{u}=\frac{-(-30)}{-15}\) = -2
Therefore the image is enlarged \(\frac{h_i}{h_o} \) = -2 ⇒ \(\frac{h_i}{3}\) = -2
⇒ hi = -6 cm
∴ Size of the image = 6 cm.

Question 4.
An object is placed at a distance of lo cm. from a convex mirror of focal length 15 cm. Find the position and nature of image.
Answer:
According to the sign convention.
Focal length, f = 15 cm.
Object distance, u = – 10cm (negative sign)
Image distance, v = ?
Formula: \(\frac{1}{f}=\frac{1}{u}+\frac{1}{v}\)
\(\frac{1}{15}=-\frac{1}{10}+\frac{1}{v}\)
⇒ The image Is formed at a distance of 6 cm. at the back of the mirror.
Magnification, m = \(\frac{h_i}{h_0}=-\frac{v}{u}=\frac{-6}{-10}=\frac{3}{5} \) = 0.6
The image is virtual, erect and diminished 0.6 times of the size of object.

Do You Know ?

How does light travel?
Light Is a form of electromagnetic radiation. It travels as waves that do not require any medium for their propagation.
Light is the visible part of these waves having a wavelength of 0.4 to 0.7 tm. The colour of light emitted by a particular substance is characteristic of the atoms present in the substance. Although light travels In straight lines, It can be bent around curves and edges by making use of optical fibres. Optical fibers are bundles of very thin strands of exceptionally clear glass.

Lasers and their use:
Full form of LASER: Light Amplification by Stimulated Emission of Radiation. LASER are used in shops, banks to scan bank notes to see whether they are Fake. This is done by passing the note under an ultraviolet light scanner, Gold Is one of the most valuable of elements has been prized since antiquity for Its beauty and resistance to corrosion.

TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

Telangana SCERT 10th Class Telugu Guide Telangana 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు Textbook Questions and Answers.

TS 10th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

చదువండి – ఆలోచించి చెప్పండి (T.B. P.No. 13)

తెలంగాణ భాషంతా ‘తౌరక్యాంధ్ర’మని ఎవడో అన్నడు. అంత అగ్వకున్నదా తెలంగాణ భాష ? ఇక సహించవద్దు. అందుకనే నేను గిట్లనే మాట్లాడ, గిట్లనే రాస్త అని జిద్దుకు రాయాలె. జిద్దేంది అసలు మన యాసల్నే మన బతుకున్నది. నీ భాషల్నే నీ బతుకున్నది. నీ యాసల్నే నీ సంస్కృతున్నది. ఆ యాసలున్న పలుకుబళ్ళల్లనే తెలంగాణ జీవితం ఉన్నది. కమస్కం నీ భాషల్నన్న నువ్వు రాసే ధైర్నం జేయి.

మనం పోగొట్టుకుంటున్న మన బతుకును బతికించుకోవాలె, దానికి, బాస చాన ముఖ్య మయింది. ఎవని యాసల, ఎవని భాషల వాడు రాయాలె. తెలుస్తదా అన్నది లేనే లేదు. మన కవులను రచయితలను మనం గుర్తించి గౌరవించు కోవాలె. ఇట్లరాస్తే అవతలోనికి తెలుస్తదా అని ముందర్నే మనమనుకునుడు, మనను మనం తక్కువ చేసుకున్నట్లె. ఈ బానిస భావన పోవాలె. నేనెన్నో సార్లు చెప్పిన. భాష రెండు తీర్లు – ఒకటి బడిపలుకుల భాష రెండోది పలుకుబడుల భాష పలుకుబడుల భాషగావాలె.
– కాళోజి నారాయణరావు

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
పై పేరాలోని మాటలు ఎవరన్నారు?
జవాబు:
కాళోజి నారాయణరావు గారు అన్నారు.

TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ప్రశ్న 2.
ఇట్లా ఎందుకు అని ఉంటాడు ?
జవాబు:
తెలంగాణ భాషను ఎవరో ‘తౌరక్యాంధ్ర’మని అన్నారు. దానితో కాళోజీగారికి చాలా కోపం వచ్చింది. ఎవరైనా తమ భాషను, యాసను, పలుకుబడిని చాలా ఇష్టపడతారు. తాము ఉగ్గుపాలతో నేర్చిన భాషను ఎవరైనా హేళన చేసినా, కించపరిచినా, విమర్శించినా సహించలేరు. అందునా కవులకు, రచయితలకు భాషాభిమానం, ఆత్మాభిమానం చాలా ఎక్కువ. అందుకే కాళోజీగారు అలా అని ఉంటారు.

ప్రశ్న 3.
ఎవరి భాషలో వాళ్ళు మాట్లాడడం, రాయడం అంటే ఏమిటి ?
జవాబు:
ఎవరి భాషలో వాళ్లు మాట్లాడడం, రాయడం అంటే తమ మాతృభాషలో వ్యవహరించడం. తల్లి నుండి ఉగ్గుపాలతో నేర్చుకొన్న భాషను మాతృభాష అంటారు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, పరిసరాల వారూ, స్నేహితులు మొదలైన వారు ఉపయోగించే భాష, యాస, పదజాలం, మాండలి కాలు మొదలైనవి ఎవరికైనా ఇష్టంగా ఉంటాయి. అంటే అది వారి వ్యవహారభాష. ఎవరి వ్యవహార భాషలో వారు మాట్లాడడం, రాయడం చేస్తే ఆనందంగా ఉంటుంది. ఉత్సాహంగా ఉంటుంది.

ప్రశ్న 4.
ఎవరి భాష వాళ్ళకు ఎట్లా అనిపిస్తుంది ?
జవాబు:
ఎవరి భాష వాళ్లకు చాలా మధురంగా ఉంటుంది. హాయిగా ఉంటుంది. తియ్యగా ఉంటుంది. పద ప్రయోగంలో సౌఖ్యంగా ఉంటుంది. ఎవరి భాష వాళ్లకు తల్లిలా అనిపిస్తుంది. తమ మాండలిక పదజాలానికి తాము గర్వంగా అనుభూతి చెందుతారు.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 17)

“తాతా ! ఇగపటు నీ పాను, జర్దా డబ్బీ” అని ……… ఉద్యోగ విరమణ చేసినారు.

ప్రశ్న 1.
“ఏ ప్రాంతపు వాళ్ల తెలుగు ఆ ప్రాంతపు వాళ్లకు ఇంకా మంచిగా ఉంటుంది” సమర్థించండి.
జవాబు:
ఎవరి ప్రాంతంలో వారు అయినా, ఆయా ప్రాంతాలలో ఉపయోగించే పదాలు, జాతీయాలు, నుడికారాలు, పలుకుబడులు తాము ఉపయోగించే భాషలో ప్రయోగిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలలోనూ తెలుగు భాషనే మాట్లాడతారు. కాని, రెండు రాష్ట్రాలలోని ప్రతి జిల్లాకు ‘యాస’ మారి పోతుంది. ఉపయోగించే మాండలికాలు మారి పోతాయి. ఇతర ప్రాంతాల మాండలికాలు, కొన్ని పదాలు అర్థం కావు.

అందుచేత అవి కొత్తగా ఉంటాయి. తమ ప్రాంతపు మాండలికాలపైనా, భాషపైనా, యాసపైనా పట్టు ఉంటుంది. అందుచేత ఏ ప్రాంతపు వాళ్ళ తెలుగు ఆ ప్రాంతపు వాళ్ళకు ఇంకా మంచిగా ఉంటుంది.

ప్రశ్న 2.
రచయిత కొందరు పండితులను గురు స్థానీయులని చెప్పాడు. గురువులనగానే వాళ్ళలో ఏయే ప్రత్యేకత లుండాలని మీరు ఆశిస్తున్నారో తెలుపండి.
జవాబు:
‘మాతృదేవోభవ – పితృదేవోభవ – ఆచార్యదేవోభవ’ అని గురువుకు తల్లిదండ్రులతో సమాన స్థానం ఇచ్చారు. గురువును దైవంగా భావించే సంప్రదాయం మనది.

అటువంటి గురువు ఆదర్శవంతంగా ఉండాలి. సమయానికి పాఠశాలకు రావాలి. విద్యార్థులకు అర్థం అయ్యేలా ప్రతి పాఠం చెప్పాలి. అబద్ధం ఆడకూడదు. కోప్పడకూడదు. మంచి మంచి కథలు చెప్పాలి. మా గురువుగారిలా ఉండాలి.

TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ప్రశ్న 3.
‘పసందైన ప్రాంతీయ భాష’ – దీనిని ఎట్లా అర్థం చేసుకున్నారో వివరించండి.
జవాబు:
కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారు సంస్కృతాంధ్ర భాషల్లో మహాపండితులు. వారు కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితులు. అటువంటి శాస్త్రిగారు, తిరుమల రామచంద్రగార్కి తిరుపతి లడ్డు ఇస్తూ, “వారీ రామచంద్రా” అని సంబోధించి ‘ఇగపటు’ అనటం వింతగా అనిపిస్తుంది. అయితే ‘ఇగపటు’ అనగా ‘ఇదిగో తీసుకో” అని అనడం, వారీ రామచంద్రా అని పిలవడం, లక్ష్మణశాస్త్రిగార్కి పసందైన వారి ప్రాంతీయ భాషపై, వారికి గల అభిమానాన్ని తెలియపరుస్తాయి.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 17)

మహబూబ్ నగర్ వాళ్ళ భాష తెలుగుతనం ……….. ప్రభుత్వం జప్తు చేస్తుంది.

ప్రశ్న 1.
“వారి రాతలోను, మాటలోను ప్రాంతీయత కనిపించేది” దీని గురించి చర్చించండి.
జవాబు:
మహబూబ్ నగర్ వాళ్ళ భాష తెలుగుతనం కల్గి ఉంటుంది. సురవరం ప్రతాపరెడ్డిగారిది కూడా మహబూబ్నగర్ జిల్లానే. వారి రాతలోనూ, మాటలోనూ మహబూబ్నగర్ జిల్లా ప్రాంతీయత కన్పించేది. వారి స్వగ్రామం నీళ్ళులేని ఇటిక్యాలపాడు.

ప్రశ్న 2.
‘ఏకలవ్య శిష్యుడ’నే పదంలోని అంతరార్థాన్ని వివరించండి.
జవాబు:
కౌరవ పాండవులకు ద్రోణాచార్యుడు విలువిద్యలు నేర్పాడు. కాని, ఆయనకు పాండవులంటే ఇష్టం. అందులోను తను చెప్పినది చెప్పినట్లు చేర్చుకొనే అర్జునుడు అంటే చాలా ఇష్టం. అర్జునుడిని మహావీరుడిగా తయారుచేయాలని విలువిద్యలు నేర్పుతున్నాడు.

ఇంతలో ‘ఏకలవ్యుడు’ అనే గిరిజన బాలుడు తనకూ విలువిద్యలు నేర్పమన్నాడు. కాని, ద్రోణుడు నేర్పను అన్నాడు. అయినా ఏకలవ్యుడు తన పంతం విడిచి పెట్టలేదు. ద్రోణుని బొమ్మను తయారు చేసుకొన్నాడు. దానిని గురువుగా చేసుకొని విలువిద్యలు తనకు తానే సొంతంగా నేర్చుకొన్నాడు. అర్జునునితో సమానమైన వీరుడయ్యాడు. అందుచేత గురువు దగ్గర ప్రత్యక్షంగా నేర్చుకోకపోయినా, ఆయనపై గురుత్వ భావన ఉంచి నేర్చుకొనే వారిని ఏకలవ్య శిష్యులు అంటారు.

ప్రశ్న 3.
“పలుకుబడి, నుడికారం, జాతీయాలు ఒక భాషకు అలంకారాలవంటివి “ఈ అభిప్రాయాన్ని సమర్థిస్తూ మాట్లాడండి.
జవాబు:
పలుకుబడి : పలుకుబడి అంటే ‘నుడి’, అంటే మాట్లాడబడేది. మాట్లాడబడేది భాష, భాషకు ‘యాస’ ప్రధానం. మాండలికాలు, ఆయా ప్రాంతాలలో ఉపయోగించే స్థానిక పదజాలం పలుకుబడి అనవచ్చు. ఈ పలుకుబడి వలన భాషకు చాలా అందం వస్తుంది. వినసొంపుగా ఉంటుంది. ఇది వినగానే ఆనందం కలుగుతుంది.

నుడికారం : చమత్కారాన్ని నుడికారం అంటారు. ఎవరి భాషలోని చమత్కారాలు వారికే బాగా తెలుస్తాయి. చమత్కారం వలన కూడా భాషకు చాలా అందం వస్తుంది. చమత్కారంగా మాట్లాడే వారంటే ఎవరికైనా ఇష్టమే కదా ! ఇది కొద్దిగా ఆలోచిస్తేనే ఆనందం కలుగుతుంది.

జాతీయం : ఒక భాషను ఉపయోగించే వారందరికీ ఆనందాన్ని కలిగించేవి జాతీయాలు. వాటి పూర్వకథలు తెలియకపోతే ఆనందం కలగదు. అంటే బాగా పరిజ్ఞానం ఉంటేనే ఆనందం కలుగుతుంది. ఉదాహరణకు భగీరథ ప్రయత్నం, శ్రీరామరక్ష . మొదలైనవి.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 18)

ఆడవాళ్ళ నోట అసలైన భాష
మా ఊరిలో పూజలు చేయించే మరాఠీ ……… విశేషమే కదా !

ప్రశ్న 1.
“మొదలు మీకళ్లకు నీళ్లు పెట్టుకోండి” అని మరాఠీ పురోహితుడు అన్నాడు గదా! మీ నిత్యజీవితంలోని ఇట్లాంటి సంఘటనలను వివరించండి.
జవాబు:
భాష చాలా విలువైనది. పద ప్రయోగాలు చాలా జాగ్రత్తగా చెయ్యాలి. నేను అందర్ని ఒక సభలో రండి, రండి అని పిలుస్తున్నాను. (అనగా రమ్మని అర్థం) అది రండలాగా ఒక ముస్లింకు వినబడింది. అతను వెంటనే కోపంతో ఎగిరాడు. “రండ” అంటే ఉర్దూలో తప్పు అర్థం అని తెల్సింది. అతను నా స్నేహితుడే అవ్వటం వల్ల సమస్య సమసిపోయింది.

ప్రశ్న 2.
“ఏ ప్రాంతంలోనైనా అసలైన భాష ఆడవాళ్ళ నోటనే వినగలం” దీన్ని సమర్థిస్తూ చర్చించండి.
జవాబు:
సాధారణంగా పిల్లలంతా ‘అమ్మ’ నుండే మాట్లాడడం నేర్చుకొంటారు. స్త్రీలు ఇంటి వద్ద ఉండి ఎక్కువ మందితో మాట్లాడతారు. మగవారి కంటే స్త్రీలు నుడికారాలు, పలుకుబళ్ళు ఎక్కువ ఉపయోగిస్తారు. ప్రాంతీయమైన మాండలికాలు ఎక్కువ ఉపయోగిస్తారు. అందుకే అసలైన భాషను ఆడవాళ్ళ నోటనే వినగలం.

TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ప్రశ్న 3.
కవిసమ్మేళనం అంటే మీకు తెలుసా ? ఎపుడైనా కవి సమ్మేళన సభలో పాల్గొన్నారా ? మీ అనుభవాన్ని తెలుపండి.
జవాబు:
కవులయొక్క కూడిక, తమ అభిప్రాయాలను, తమ రచనలను చర్చించే వేదిక “కవి సమ్మేళనం”. నాకు తెలుసు. నేను “రవీంద్ర భారతి”లో చూశాను. స్నేహితులందరం కలిసి కవి సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాం. మా తెలుగు పంతులుగారి ఆధ్వర్యంలో దానిని నిర్వహించాము. చాలా బాగుంది.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 20)

“ఇంతకాలం తెలంగాణా సీమోల్లంఘనం చేసి ……… సామాన్య ప్రజలతోనే” అని.

ప్రశ్న 1.
“నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసందు చేస్తున్నారు. కాని నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే” అని రచయిత అనడంలో ఆంతర్య మేమిటి?
జవాబు:
ఒక షేర్లో “ఖాస్ – ఆమ్ అనే రెండు మాటలున్నాయి. ఖాస్ అంటే ప్రత్యేకమయినది. దాని బహువచనం ఖవాస్. అంటే విద్వత్తులోనో, సంపద లోనో, హోదా లోనో ప్రత్యేకమైనవాళ్లు. ఆమ్ అంటే సామాన్యం. ఆవామ్ అంటే బహువచనంలో సామాన్య ప్రజలు. కవి ఏమంటున్నాడంటే “నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసంద్ చేస్తున్నారు -కాని నేను మాట్లాడు తున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే” అని దీని అర్థం.

ప్రశ్న 2.
“పిల్లలు ఇంట్లో మాట్లాడే భాషవేరు. బళ్లో చదివే భాషవేరు.” అనడం నిజమా ? కాదా ? కారణాలు చర్చించండి.
(లేదా)
తెలుగు “పిల్లలు ఇంట్లో మాట్లాడే భాషవేరు. బళ్లో చదివే భాషవేరు.” అనే వాక్యాలు మీరు సమర్థిస్తారా ? ఎందుకు ? (June 2017)
జవాబు:
వ్యావహారిక భాష వ్యాప్తిలోకి వచ్చిన తర్వాతనే ఈ ప్రాంతీయ భాషలు, మాండలిక భాషలు వచ్చాయి. గ్రాంథిక భాష రాసేకాలంలోనూ పిల్లలకు తెలుగు చెప్పే పంతులు కాబట్టి వ్యావహారికం గూర్చి మాట్లాడేవారు. ఉర్దూ, మరాఠీ పిల్లలు తమ ఇంట్లో మాట్లాడే భాషనే బళ్ళో చదువుతుంటే, తెలుగు పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు, బళ్ళో చదివే భాషవేరు. ఇది చాలా ఘోరం. వ్యావహారిక భాషావాదం వచ్చాక ఇది సమసిపోయింది. ఇది వాస్తవం.

ప్రశ్న 3.
ప్రాంతీయ భాషా భేదాలను ఎట్లా సరిచేసుకోవాలి ? మాట్లాడండి.
జవాబు:
మాండలిక భేదాలటుంచి, ప్రాంతీయ భేదాలను సరిచేసుకోలేకపోతున్నాం. సరిచేసుకోవాలంటే తొలగించటమూ కాదు. దిద్దుకోవటం కాదు. అన్ని ప్రాంతాల పలుకుబళ్లను ఇప్పుడు తెలుగనుకుంటున్న భాషలో కలుపుకోవటం. ప్రాంతీయ భాష ప్రజల వ్యవహారంలో ఉన్నది. ఉంటుంది.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
కింది అంశాలను గూర్చి చర్చించండి.

అ) మన తెలుగు భాష గొప్పతనం గురించి మాట్లాడండి. ఐతే ఒక్క ఆంగ్లపదం కానీ, హిందీ, ఉర్దూ ….. ఇలా ఇతర భాషాపదాలు వాడకుండా మాట్లాడాలి. ప్రయత్నం చేయండి. ఎవరు బాగా మాట్లాడుతారో చూద్దాం.
జవాబు:
నేను లంగర్ హౌజ్ పాఠశాలలో చదువుచున్నాను. ఒకసారి మా పాఠశాలలో “ఒక నిమిషం” అనే కార్యక్రమం నిర్వహించారు. మా తరగతిలో అందరూ మాట్లాడటానికి ప్రయత్నించారు. నేను బాగా మాట్లాడానని నాకు బహుమతి ఇచ్చారు. ఆ కార్యక్రమానికి పోలీస్ కమీషనర్గారు వచ్చారు. ఒక్క ఆంగ్ల, ఉర్దూ, హిందీ పదం రాకుండా అచ్చ తెలుగులో మాట్లాడాను. మీరూ
ప్రయత్నించండి.

ప్రశ్న 2.
క్రింది గద్యాన్ని చదువండి. ప్రశ్నలకు సరైన జవాబును గుర్తించండి.

గో మెరే షేర్ హైఁ ఖవాస్ పసంద్
పర్ మెరీ గుప్తగూ అవామ్ సేహై
“ఖాస్ – ఆమ్ అనే రెండు మాటలున్నాయి. ఖాన్ అంటే ప్రత్యేకమైనది. (స్పెషల్) దాని బహువచనం ఖవాస్. అంటే విద్వత్తులోనో, సంపదలోనో, హోదాలోనో ప్రత్యేకమైనవాళ్లు. ఆమ్ అంటే సామాన్యం. ఆవామ్ అంటే బహువచనంలో సామాన్య ప్రజలు (కామన్ పీపుల్), కవి ఏమంటున్నాడంటే, “నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసంద్ చేస్తున్నారు కాని నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే” అని.

ప్రశ్నలు

అ) ‘ఖాస్ అనే ఉర్దూ పదానికి అర్థం
ఎ) కవిత
బి) ప్రత్యేకమైన
సి) సాధారణమైన
డి) సామాన్యం
జవాబు:
బి) ప్రత్యేకమైన

ఆ) సామాన్య ప్రజలను ఉర్దూలో ఏమంటారు ?
ఎ) అవామ్
బి) ఆమ్
సి) ఖాస్
డి) ఖవాస్
జవాబు:
బి) ఆమ్

ఇ) నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసంద్ జేస్తున్నారు. క్రింద గీత గీసిన పదానికి సమానార్థక ఉర్దూపదం.
ఎ) సంబంద్
బి) అవామ్
సి) ఖవాస్
డి) పసంద్
జవాబు:
సి) ఖవాస్

ఈ) పై కవితలో కవి ఎవరి భాషను ఉపయోగించాడు ?
ఎ) గ్రాంథికభాష
బి) ఉర్దూభాష
సి) ప్రజలభాష
డి) ఏవీకాదు
జవాబు:
సి) ప్రజలభాష

TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ప్రశ్న 3.
క్రింది గద్యాన్ని చదవండి. ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
ఉర్దూ మన దేశీయుల ఉమ్మడి భాష. కాని ఏదో ఒక కులానికో, మతానికో చెందిన భాష కాదన్నారు ప్రొఫెసర్ రఫియా సుల్తానా. ఆ తరం వాళ్లందరూ అట్లాగే అనుకున్నారు. ఇప్పటికీ ఉన్న ఆ తరం వాళ్లు అట్లాగే అనుకుంటున్నారు. అందుకే నా ముచ్చట్లలో ఉర్దూతో మాకు గల సంబంధాన్ని యాది చేసుకుంటున్నాను.

మా చదువు ఉర్దూ మీడియంలో జరిగింది. హెడ్మాస్టర్ అన్వరుద్దీన్ సాహెబు. ఉర్దూ చెప్పే మౌల్వీ సాహెబులు ఇద్దరో, ముగ్గురో ఉండేవాళ్లు. అయితే, పై తరగతిలో చదివే మాకు రామనాథరావుసార్ ఉర్దూ చెప్పేవారు. వారు మంథెన బ్రాహ్మణులు. ఎఫ్.ఎ. (ఇంటర్మీడియట్) చదివిన ఆ సారుకు తెలుగు, సంస్కృతం, మరాఠీ, ఇంగ్లీషు భాషల్లో మంచి పాండిత్యం వుండేదనేవాళ్లు.

ఉర్దూలో ఏదో పెద్ద పరీక్ష పాసయినారు. వారు పెద్ద తరగతికి ఉర్దూ చెప్తుంటే ఉర్దూ డిగ్రీలు గల మౌల్వీ – సాహెబులెవరూ అభ్యంతరం లేవదీయలేదు. పైగా తమకు సరిగా అర్ధం కుదరని ఉర్దూ పేర్ల తాత్పర్యం మా ముందరే రామనాథరావుసార్తో చెప్పించుకునేవాళ్లు.

ప్రశ్నలు

అ) రఫియా సుల్తానా తరంవాళ్ళు ఏమని అను కున్నారు ?
జవాబు:
ఉర్దూ మన దేశీయుల ఉమ్మడి భాషని, ఏదో ఒక కులానికో, మతానికో చెందిన భాష కాదన్నారు.

ఆ) రచయిత తన ముచ్చట్లలో ఏ భాషా సంబంధాన్ని యాది చేసుకున్నాడు ?
జవాబు:
ఉర్దూతో గల సంబంధాన్ని యాది చేసు కున్నాడు.

ఇ) రామనాథరావుసార్ ఎక్కడివారు ? ఏ విషయాన్ని బోధించేవారు ?
జవాబు:
రామనాథరావు సార్ మంథెన బ్రాహ్మణులు. ఉర్దూ బోధించేవారు.

ఈ) ఉర్దూ డిగ్రీలున్న మౌల్వీలు రామనాథరావు సార్న ఏ విషయమై సంప్రదించేవాళ్లు ?
జవాబు:
అర్థం కుదరని ఉర్దూ పేర్ల తాత్పర్యంపై సంప్రదించేవాళ్లు.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) మనుమరాలి మాటలు విని తాతయ్య ఎందుకు అబ్బురపడ్డాడు ?
(లేదా)
మనుమరాలి మాటలు తాతయ్యకు ఎందుకు ఆశ్చర్యం కలిగించాయి ?
జవాబు:
మనుమరాలు లావణ్య 4 సంవత్సరాల అమ్మాయి. ఇంకొక మనుమరాలు కావ్య. సెలవుల్లో అమ్మమ్మ గారింటికి వచ్చారు. వాళ్ళు హిందీ మాట్లాడుతారు. తెలుగురాదు. హిందీలోంచి అనువదించుకొని మాట్లాడుతారు. కాని తెలుగు పలుకుబడి, నుడి కారము వాళ్ళకు తెలియదు. 4 సంవత్సరాల లావణ్య “తాతా ఇగపటు నీ పాను, జర్దా డబ్బీ” అని తాత చేతికిచ్చింది. లావణ్య ఇగపటు అనగానే ఆమెకు ఈ ప్రాంతపు తీయని తెలుగు పట్టుపడ్డందుకు తాత అబ్బురపడ్డాడు.

TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ఆ) కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారిని రచయిత గురుస్థానీయులుగ ఎందుకు భావించారో వివరిం
జవాబు:
సంస్కృతాంధ్ర భాషల్లో, కావ్యవ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండపండితులు, సంస్కృతంలో బిల్హణ మహాకవి రాసిన విక్రమాంకదేవ చరిత్ర అనే ప్రౌఢకావ్యాన్ని తెలుగులో ఇంకా ప్రౌఢంగా అనువదించిన గొప్పకవి శ్రీ కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారు. ఆయన రాసిన అనేక కావ్యాలకు మహాపండితుల ప్రశంసా పూర్వకాలయిన అభిప్రాయాలు డా॥ సామల సదాశివగారు చదివారు. వారిదగ్గర (లక్ష్మణశాస్త్రి) శిష్యరికం చేయకపోయినా, ఆయన సన్నిధానంలో కూర్చొని తరుచుగా జాబులు రాసేవారు. అప్పుడు అనేక సాహిత్య విషయాలు తెలుసుకున్నారు. కాబట్టి శాస్త్రిగారిని సదాశివగారు గురుస్థానీయులుగా భావించారు.

ఇ) “అందరు యూనివర్సిటీ ఆచార్యులుండగా ఒక రిటైర్డ్ రెవిన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించడమేమిటి ?” అని రచయిత అనుకోవడంలో ఉద్దేశమేమై ఉంటుంది ?
జవాబు:
వరంగల్లు తెలుగు గురించి చెప్పిన విషయం ఇది. పెద్ద కాళోజీ వర్ధంతి సభ జరుగుతోంది. రచయిత కాళోజీ ఇంట జరిగే వర్ధంతి, జయంతి సభల్లో పాల్గొనేవారు. ఆ సభల్లో చిన్నపాటి కవిసమ్మేళనం, చిన్నపాటి ముషాయిరా ఉండేవి. కొన్ని ప్రసంగాలు జరిగేవి. షాద్ గజల్లు వినిపించేవారు. పెద్ద కాళోజీ ఉర్దూకవి. కలం పేరు ఫాద్. రచయిత వెళ్ళేటప్పటికి సాహితీ మిత్రమండలి కవులు, కవితలు వినిపిస్తున్నారు.

ఆ సాహిత్యసభకు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ అధ్యక్షులై ఉన్నారు. వారు రచయితకు తెలియదు. అక్కడ అందరూ తెలుగు విద్వాంసులుండగా అందరు యూనివర్సిటీ ఆచార్యులుండగా ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించటమేమిటీ అని రచయిత అనుకున్నారు. కాళోజీకి ఆప్తుడనుకున్నారు రచయిత. రెవెన్యూవాళ్ళకు తెలుగుసాహిత్య సభల్లో అధ్యక్షత వహించే అర్హత లేదనుకునేవారు కాని అలా ఉత్తమ కవితలూ, కథలు రాసిన రెవెన్యూ, పోలీస్ శాఖల ఆఫీసర్లను ఈ యాది శీర్షిక కిందే ప్రస్తావించారు.

ఈ) రచయిత రచనా శైలిని ప్రశంసిస్తూ వ్రాయండి.
జవాబు:
రచయిత డా॥సామల సదాశివగారు సంస్కృతం, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, ఫార్సీ, మరాఠీ భాషల్లో పండితులు. అనేక భాషలు రచయితల, కవుల సాహిత్యాన్ని తెలుగులోకి అనువాదం చేశారు.

TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ఉర్దూ సాహిత్య చరిత్ర, అన్జద్ రుబాయీలు, మలయమారుతాలు, యాది, సంగీత శిఖరాలు మొదలైనవి వీరి ఇతర రచనలు. అన్జద్ రుబాయీలు అనువాదానికి ‘ఉత్తమ అనువాద రచనా పురస్కారం, “స్వరలయల” గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు లభించింది. కాకతీయ, తెలుగు విశ్వ విద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి. సదాశివను హిందుస్థానీ – కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా విద్వాంసులు గుర్తించారు. సహృదయ విమర్శకుడైన ఇతని రచనల్లో భాష సహజ సుందరంగా, సరళంగా, ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకుపోయేటట్లు ఉంటుంది.

ప్రశ్న 2.
క్రింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) ఈ పాఠం ద్వారా సామల సదాశివ గురించి మీకేమర్థమయిందో రాయండి.
(లేదా)
ఎవరి భాష వాళ్ళకు వినసొంపు పాఠ్యభాగం ద్వారా కవి ఏమి చెప్పదలచుకున్నారు ?
జవాబు:
ఈ పాఠం ద్వారా సామల సదాశివగారి వ్యక్తిత్వం, పాండిత్యం, వినయం మొదలైన ఎన్నో విషయాలు తెలిశాయి.

1. వ్యక్తిత్వం : సామల సదాశివగారు అల్పసంతోషి, ప్రాంతీయ భాషాభిమానం ఎక్కువ కలవారు. అందుకే తమ మనుమరాలు ‘ఇగపటు’ అనగానే చాలా ఆనందించారు. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని యాది చేసుకొన్నారు. ఎంత గొప్ప పండితుడైనా తమ ప్రాంతీయతను, ప్రాంతీయ భాషను విడిచిపెట్ట కూడదని సామల సదాశివగారి అభిప్రాయంగా తెలిసింది.

2. పాండిత్యం : మరాఠీ పురోహితుని గురించి చెప్పిన సందర్భంలో ‘మాకూ మరాఠీ వచ్చు కదా” అనే రచయిత మాటలను బట్టి, ఆయన మరాఠీలో మంచి పండితుడని తెలిసింది.
“పెద్ద కాళోజీ వర్ధంతి సభలో ఊర్దూలో ప్రసంగించాన”న్నాడు. అందుచేత ఉర్దూలో కూడా గొప్ప పండితుడని తెలిసింది.

“నేనూ ఒకప్పుడు పుస్తకాలూ, వ్యాసాలూ గ్రాంథిక భాషలో రాసినవాడినే” అని రచయిత అన్నాడు. దీనిని బట్టి సదాశివగారు ప్రాచీన తెలుగు సాహిత్యంలో మంచి పండితులని తెలిసింది.

3. వినయం : తను బహు భాషాపండితుడైనా గర్వం లేనివాడు. కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారి వద్ద తను ఎన్నో సాహిత్య విషయాలు తెలుసుకొన్నానని వినయంగా చెప్పారు. లక్ష్మణశాస్త్రిగారికి తను ఏకలవ్య శిష్యుడినని వినయంగా ప్రకటించు కొన్నారు. పండితుల గురించి చెప్పవలసి వచ్చినపుడు గొప్ప గొప్ప మాటలలో చెప్పారు. వీటన్నిటినీ బట్టి సదాశివగారి దగ్గర పాండిత్యంతో బాటు వినయం కూడా ఎక్కువ ఉందని చెప్పవచ్చు. “తెలుగులోను, ఉర్దూలోనూ,ఎందరెందరి దగ్గర ఏమేమి నేర్చుకొన్నానో అదంతా రాయాలంటే ఒక పుస్తకమవుతుంది” అనడంలో ఆయన వినయం తెలిసింది.

ప్రశ్న 3.
క్రింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

అ) మీ ప్రాథమిక విద్యాభ్యాస జీవితంలో మీరు మరిచి పోలేని జ్ఞాపకాలను ఒక వ్యాసంగా వ్రాయండి.
జవాబు:
నా ప్రాథమిక విద్యాభ్యాసం నల్గొండ జిల్లాలోని మునగాల మండలం ఆకుపాముల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. మాకు తెలుగుకు వేమూరి విజయశ్రీగారు వచ్చేవారు. ఆమె చక్కటి వేషధారణ, భాషపై పట్టుకల వ్యక్తి. వారు తెలుగు పద్యాలను ధారాళంగా చెప్పేవారు.

ఒకసారి వేమన సుమతీ శతక పద్యాలకు కంఠస్థ పోటీ నిర్వహించారు. దానిలో నేను ప్రథమ బహుమతిని పొందాను. మునగాల మండల విద్యాశాఖాధిగారు, నల్గొండ జిల్లా కలెక్టర్ గారు ఆ సభలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. బహుమతి పొందిన ప్రథమ ద్వితీయ, తృతీయ పోటీదారులను సత్కరించారు. నాకు తెలుగు నిఘంటువు ఇచ్చారు. ఇది నా ప్రాథమిక విద్యాభ్యాస జీవితంలో మరచిపోలేని సంఘటన.

(లేదా)

ఆ) మీ పరిసరాల్లో జరిగిన ఏదైనా సంఘటనను వాడుక భాషలో సంభాషణగా వ్రాయండి.
జవాబు:
(మేము ఖమ్మం జిల్లా మధిరలో ఉండేవారము. మా ఇంటి ప్రక్కనవారు, మేము బాగా కలిసి ఉండేవారం. భార్యాభర్తలు చిన్న చిన్న పనులు చేసుకొని జీవించేవారు. వాళ్ళకు ముగ్గురు ఆడపిల్లలు. మా నాన్నగారు, అమ్మగారు టీచర్లుగా పనిచేసేవారు. వారు ఎంతో నచ్చచెప్పిన వినకుండా ముగ్గురు పిల్లల్ని కన్నారు.

కిరణ్కు తాగుడు అలవాటు అయింది. ఆసుపత్రిలో చేర్చారు. మా నాన్నగారు రక్తదానం చేసారు. అయినా కిరణ్ గారు బతుకలేదు. వాళ్ళ పిల్లలు అనాథలు అయ్యారు. తాగుడుకు బానిసై ఆ కుటుంబం ఇంటి యజమానిని కోల్పోయింది. ఈ సంఘటన నాకు ఎంతో బాధ కల్గించింది.) (ఇది సంభాషణగా రాస్తాను.)

శ్రావ్య : అన్నయ్య ప్రక్క ఇంటిలో ఏదో జనం గోలగా ఉన్నారు ? ఏమయింది ?
రవి : అవును శ్రావ్య ! చూసివస్తాను ఉండు – (చూసి వస్తాడు).
శ్రావ్య : ఏం జరిగిందన్నయ్యా ?
రవి : : ప్రక్క ఇంటిలో కిరణ్ గారు పడిపోయారు. అందరూ గుమిగూడారు. నేను ఆసుపత్రికి వెళ్ళి వస్తాను ………? సరేనా …….. ?
శ్రావ్య : సరే ! నేను వస్తాను పద ! (ఇద్దరు) కలిసి ఆసుపత్రికి వెళతారు.) (డాక్టర్గారు పరీక్షించి రక్తం అవసరం అన్నారు.)
డాక్టర్ : రవి, శ్రావ్య మీరు వెళ్ళి “రక్తదానం” చేసేవారిని తీసుకురండి. (రవి, శ్రావ్య వెళతారు) (రవి వాళ్ళ నాన్నగారితో చెపుతాడు).
రవి : నాన్న ! కిరణ్ గారికి రక్తం ఎక్కించా లని అన్నారు. నీవు ఇస్తావా నాన్నా!
రాజు : ఓ! అలాగే ! నేను ఇస్తాను. ఇప్పుడే వెళ్ళి రక్తదానం చేసి వస్తాను. (ఆసుపత్రికి వెళతాడు)
డాక్టర్ : పేషెంట్కి రక్తదానం చేయటానికి ఎవరు వచ్చారు ?
రాజు : నేను సార్ ! నేను స్కూల్ మాష్టార్ని. ఇంతకు పూర్వం చాలాసార్లు ఇచ్చాను.
డాక్టర్ : సరే పదండి (రాజు రక్తం ఇస్తాడు).
రాజు : డాక్టర్గారు ఇక నేను వెళ్ళవచ్చా!
డాక్టర్ : ఓ వెళ్ళవచ్చు.
రాజు : పేషెంటు పరిస్థితి (కిరణ్కి) ఎలా ఉంది ?
డాక్టర్ : చాలా దారుణంగా ఉంది. కొద్ది సేపటిలో అతను చనిపోవచ్చు.
రాజు : అయ్యో ! పోవచ్చా ! (అంటూ బాధ పడుతూ ఇంటికి వెళతాడు)
శ్రావ్య, రవి : నాన్నా ! రక్తం ఇచ్చావా ?
రాజు : ఇచ్చానమ్మా ! కానీ కిరణ్ పరిస్థితి బాగోలేదని చెప్పారు ?
(కిరణ్ చనిపోయాడని ఇంటికి తీసుకు వస్తారు. అందరూ ప్రక్క ఇంటికి వెళతారు.
శ్రావ్య : నాన్నగారు ! కిరణ్ ఎందుకు చనిపోయారు ?
రవి : త్రాగుడుకు బానిసలైతే జీవితం ఇలా అవుతుందా ?
రాజు : తాగుడు వల్ల చనిపోయాడు.
రాజు : అవును రవి ! ఫలితం ఇలా దారుణంగా ఉంటుంది. మీ స్నేహితులకు చెప్పండి. “మద్య పానం మనిషికి శత్రువు” అని.
శ్రావ్య, రవి : సరే నాన్నగారు! మా స్నేహితులకు చెబుతాం (ముగింపు).

III. భాషాంశాలు

పదజాలం

ప్రశ్న 1.
క్రింది పదాలను సొంతవాక్యాలలో ప్రయోగించండి.
ఉదా : యాదిచేసుకొను = గుర్తు చేసుకొను

నేను, నా స్నేహితుడు చిన్నప్పటి సంగతులు యాది చేసుకొని బాగా నవ్వుకున్నాం.

అ) పసందు = ఇష్టం
జవాబు:
పసందైన మామిడి పండ్లను మేము ఇష్టపడతాం.

ఆ) రమ్యం = అందమైన
జవాబు:
రమ్యమైన ప్రకృతి, సుందర జలపాతాలకు కేరళ రాష్ట్రం ప్రసిద్ది చెందినది.

ఇ) క్షేత్రం = చోట
జవాబు:
నా తెలంగాణ క్షేత్రం ఉద్యమాలకు ఆలవాలమైంది.

TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ప్రశ్న 2.
నిఘంటువు సాయంతో క్రింది పదాలకు నానార్థాలు వ్రాయండి.

అ) కవి = కవిత్వం చెప్పేవాడు, పండితుడు, శుక్రుడు, జలపక్షి, ఋషి, నీటికాకి
ఆ) క్షేత్రం = చోటు, పుణ్యస్థానం, భూమి, శరీరం

ప్రశ్న 3.
క్రింది పర్యాయపదాలకు పాఠం ఆధారంగా సరియైన పదాన్ని వ్రాయండి.

అ) ఇల్లు, గృహం = ఆలయం
ఆ) పొగడ్త, స్తోత్రం = ప్రశంస

ప్రశ్న 4.
క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు ప్రకృతి – వికృతులను వ్రాయండి.

అ) మీ వ్యాసాల్లో తెలంగాణ ప్రాంతీయ భాష కనిపిస్తూ వున్నది.
జవాబు:
భాష బాస

ఆ) నాది ప్రజా కవిత కద !
జవాబు:
కవిత – కైత

ఇ) మా అమ్మమ్మ రోజూ కత చెప్పుతుంది.
జవాబు:
కత – కథ

ఈ) కూరగాయలు అమ్మే ఇంతి మాటల్లో తెలుగు నుడి కనిపిస్తుంది.
జవాబు:
ఇంతి – స్త్రీ

ప్రశ్న 5.
క్రింది వ్యుత్పత్త్యర్థాలకు తగిన పదాలు వ్రాయండి.

అ) అజ్ఞానమనెడు అంధకారాన్ని తొలగించువాడు: గురువు
ఆ) భాషింపబడునది : భాష

వ్యాకరణాంశాలు

ప్రశ్న 1.
క్రింది వాక్యాలను సామాన్య వాక్యాలుగా మార్చండి.

అ) తిరుమల రామచంద్రగారు సంస్కృత, ఆంధ్ర భాషలలో పండితుడు.
జవాబు:
సామాన్య వాక్యాలు :

  1. తిరుమల రామచంద్రగారు సంస్కృత భాషలో పండితుడు.
  2. తిరుమల రామచంద్ర గారు ఆంధ్రభాషలో పండితుడు.

ఆ) నేనొకప్పుడు పుస్తకాలు, వ్యాసాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని.
జవాబు:
సామాన్య వాక్యాలు :

  1. నేనొకప్పుడు పుస్తకాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని.
  2. నేనొకప్పుడు వ్యాసాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని.

ఇ) ఇంట్లో మాట్లాడే భాష, బడిలో చదివే భాష వేరువేరు.
జవాబు:
సామాన్య వాక్యాలు :

  1. ఇంట్లో మాట్లాడే భాష వేరు.
  2. బడిలో చదివే భాష వేరు.

ప్రశ్న 2.
క్రింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి.

అ) తెలుగువాళ్ళ పలుకుబడి, నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి. వాటిని మనం భద్రపరుచు కోవడం లేదు.
జవాబు:
తెలుగువాళ్ళ పలుకుబడి, నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి. కానీ వాటిని మనం భద్రపరుచుకోవడం లేదు.

ఆ) నల్గొండ జిల్లాలో ఎందరో కవులు ఉన్నారు. నల్గొండ జిల్లాలో కథకులూ ఉన్నారు. నల్గొండ జిల్లాలో పత్రికా విలేకరులు ఉన్నారు.
జవాబు:
నల్గొండ జిల్లాలో ఎందరో కవులు, కథకులూ, పత్రికా విలేకరులు ఉన్నారు.

ఇ) నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు. నమాజు చదివి ఎందరో పోతుంటారు.
జవాబు:
నమాజు (చేయడానికి) చదవడానికి ఎందరో వచ్చిపోతుంటారు.

TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ప్రశ్న 3.
క్రింది వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చండి.

అ) అంబటిపూడి వెంకటరత్నం కావ్యం రాశాడు. అంబటిపూడి వెంకటరత్నం అచ్చు వేయించాడు.
జవాబు:
అంబటిపూడి వెంకటరత్నం కావ్యం రాసి, అచ్చు వేయించాడు.

ఆ) గడియారం రామకృష్ణశర్మ మంచి పాండిత్యం సంపాదించాడు. గడియారం రామకృష్ణశర్మ అనేక సన్మానాలు పొందాడు.
జవాబు:
గడియారం రామకృష్ణశర్మ మంచి పాండిత్యం సంపాదించి, అనేక సన్మానాలు పొందాడు.

ఇ) కప్పగంతుల లక్ష్మణశాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించాడు. కర్ణనుందరి నాటకాన్ని ప్రచురించాడు.
జవాబు:
కప్పగంతుల లక్ష్మణశాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించి, ప్రచురించాడు.

రుగాగమ సంధి 

ఈ క్రింది పదాలను గమనించి విడదీయండి.

అ) పేదరాలు
ఆ) బీదరాలు
ఇ) బాలింతరాలు
పై పదాలను విడదీస్తే ఎట్లా ఉంటాయో గమనిద్దాం.
ఎట్లా మారాయో పరిశీలిద్దాం.
అ) పేద + ఆలు → పేదరాలు
ఆ) బీద + ఆలు → బీదరాలు
ఇ) బాలింత + ఆలు → బాలింతరాలు
పేద + ఆలు → పేద + ర్ + ఆలు → పేదరాలు
బీద + ఆలు → బీద + ర్ + ఆలు → బీదరాలు
బాలింత + ఆలు → బాలింత + ర్ + ఆలు → బాలింతరాలు

  • పై మూడు సందర్భాలలో పర పదం ‘ఆలు’
  • ఒక వర్ణం మిత్రుడివలె అదనంగా చేరడమే ‘ఆగమం’.
  • పేద, బీద, బాలింత పదాలకు ‘ఆలు’ పరమైంది.
  • పేద, బీద, బాలింత మొదలైన శబ్దాలను ‘పేదాదులు’ అంటారు.
  • పేదాదిపదాలకు ‘ఆలు’ అనే పదం కలిసినప్పుడు ‘ర్’ అనే అక్షరం అదనంగా వచ్చింది.
  • ‘ర్’ అనేది అదనంగా రావడాన్ని ‘రుగాగమం’ అంటారు.
  • దీన్నే ఇట్లా కూడా చెప్పవచ్చు.
    పేదాది శబ్దాలకు ‘ఆలు’ శబ్దం పరమైనప్పుడు రుగాగమమవుతుంది.

పైన చెప్పిన మూడు పదాలలో పూర్వపదం విశేషణం, ఉత్తరపదం విశేష్యం (నామవాచకం) ఇలా విశేషణ విశేష్యాలతో కూడిన పదాన్ని కర్మ ధారయమంటారు.

కర్మధారయమందు పేదాది శబ్దాలకు “ఆలు” శబ్దం పరమైతే రుగాగమమౌతుంది.

పై పద్ధతి ప్రకారం క్రింది పదాలను విడదీసి గమనించండి. విశ్లేషించండి.

అ) ముద్దరాలు = ముద్ద + ఆలు = రుగాగమసంధి
ఆ) జవరాలు = జవ్వని + ఆలు = రుగాగమసంధి
ఇ) మనుమరాలు = మనుమ + ఆలు = రుగాగమసంధి
ఈ) కొమరాలు = కొమ + ఆలు = రుగాగమసంధి

పైన చెప్పిన పేదాది పదాలు తెలుగుపదాలు. ఇప్పుడు సంస్కృతానికి సమానమైన (తత్సమ) పదాలకు ఆలు శబ్దం పరమైతే ఏం జరుగుతుందో పరిశీలిద్దాం.

గుణవంత + ఆలు → గుణవంతురాలు
బుద్ధిమంత + ఆలు → బుద్ధిమంతురాలు
శ్రీమంత + ఆలు → శ్రీమంతురాలు

ఈ సందర్భాలలో కూడా ‘ర్’ వస్తుంది. కానీ స్వల్పమైన తేడా వచ్చింది గమనించారా ? అదేమిటో పరిశీలిద్దాం !
గుణవంత + ఆలు → గుణవంత + ఉ + ఆలు
→ గుణవంతు + ఆలు → గుణవంతు + ర్ + ఆలు → గుణవంతురాలు
శ్రీమంత + ఆలు → శ్రీమంత + ఉ + ఆలు → శ్రీమంతు + ఆలు → శ్రీమంతు + ర్ + ఆలు →
అలాగే
శ్రీమంతురాలు
బుద్ధిమంత + ఆలు → బుద్ధిమంత + ఉ + ఆలు → బుద్ధిమంతు + ఆలు → బుద్ధిమంతు + ర్ + ఆలు → బుద్ధిమంతురాలు

పై మూడుచోట్ల తత్సమపదాలకు ‘ఆలు’ కలిస్తే మొదటిపదం చివర ఉన్న అచ్చు ‘అకారానికి బదులు ‘ఉ’ కారము వచ్చి తరువాత రుగాగమమయింది, దీన్ని ఇట్లా చెప్పవచ్చు.

కర్మధారయమందు తత్సమ శబ్దములకు ‘ఆలు’ శబ్దము పరమైనప్పుడు పూర్వపదం చివర ఉన్న ‘అకారానికి’ ఉకారము వచ్చి రుగాగమం అయింది.

TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ప్రాజెక్టు పని

గాంధీజీ “సత్యశోధన”, సామల సదాశివ “యాది”, కాళోజి “నా గొడవ”, దాశరథి రంగాచార్య “జీవనయానం”, గడియారం రామకృష్ణశర్మ “శతపత్రము” మొదలగు వాటిలో వారివారి జ్ఞాపకాలు, అనుభవాలు గ్రంథస్థమై ఉన్నాయి. వీటిలో ఏదైనా ఒక గ్రంథాన్ని సేకరించి అందులోని విషయాలను చదువండి. వాటిలో మీకు నచ్చిన ఒక సంఘటనను పేర్కొంటూ ఎందుకు నచ్చిందో తెలుపుతూ నివేదిక వ్రాయండి.
జవాబు:
కాళోజి నారాయణరావు రచించిన ‘నా గొడవ’ కావ్యం నాకు నచ్చింది. దానిలో కోరిక అను గేయం (ఈప్స) నాకు నచ్చింది. దానిని రాస్తున్నాను.

నివేదిక

నాకున్నది ఒక కోరిక. నేను రాసే కవిత నా మనసులోని భావాల అలజడిని మిత్రుడికి రాసిన ఆత్మీయ ఉత్తరంగా ఉండాలి. పుస్తక ప్రియులను ఆహ్లాదపరిచే కవిత్వంగా, సౌందర్యారాధకులను ఆలోచింపజేసేదిగా, మేధావుల మనసులను కదిలించేదిగా, తార్కికుల్లో సైతం భావోద్వేగాలు పుట్టించేలా, అమాయకులు ప్రమాదాల్లో పడిపోకుండా కాపాడేదిగా ఉండాలనేది నా కోరిక. సాహిత్యవిలువలు, రస సౌందర్యం, కవి సమయాల గురించి తెలియనివారి వెక్కిరింతలు ఆగిపోయే విధంగా భావగాఢతగల కవితగా ఉండాలని, ఆడంబర మనస్తత్వాల్ని సైతం ఆకర్షించేదిగా ఉండాలని, జడత్వం ఆవరించిన స్నేహరాహిత్య హృదయాలకు ప్రాణం పోసే సంజీవనిగా ఉండాలని, కోపంతో నిండిన కనులను శాంతపరచేదిగా, విచ్చలవిడిగా వీధుల్లో తిరుగుతూ అమాయకులను గాయపరిచే ఆంబోతుల్లాంటి మనుష్యుల అకృత్యాలకు కళ్ళెం వేసేలా నా కవిత ఉండాలి.

కవిత్వం గాలిలో తేలివచ్చే సువాసనలాగా, మధురమైన భావాలను మోసుకు రావాలి. పొదుగుల నుండి కారుతున్న పాలధారలా కవిత ఉపయోగకరంగా ఉండాలి. అమ్మ కంటి చూపుల్లోంచి కురిసే మమతానురాగాలు, పంటను సంరక్షించే రైతు చూపుల్లోని జాగ్రదావస్థ కవిత్వంలో నిక్షిప్తమై ఉండాలి.

నిరాశతో కుంగిపోయిన మనసుకు ఆనందాన్ని కలిగించి, జీవితంలోని అభద్రతాభావాన్ని తొలగించి జీవనానికి ఆధారంగా కవిత ఉండాలి. అనవసరపు మృత్యుభయాల్ని తొలగిస్తూ యమునికే మృత్యుభీతి కలిగించే విశ్వాసాన్ని కవిత్వం అందించాలి.

దాహంతో గొంతెండిపోయిన వారికి చెలిమనీరులా, చలికి వణికిపోయేవారికి ఆరిపోని కుంపటి వెచ్చదనంలా నిత్యం అందుబాటులో ఉండి ప్రజల కష్టనష్టాలలో ఆదుకునేలా కవిత్వం ఉండాలి.

పక్షిప్రాణాన్ని కాపాడటం కోసం తన శరీరంలోని మాంసాన్ని కోసి ఇచ్చిన శిబి దాతృత్వాన్ని, ఆడిన మాట నిలబెట్టుకోవడానికి ప్రాణాన్నే ఇచ్చిన బలిచక్రవర్తి త్యాగాన్ని ప్రబోధించేలా కవిత ఉండాలి. దేశ సరిహద్దుల్ని నిరంతరం పరిశీలిస్తూ పహారాకాసే సైనికుడిలా, చావంటే భయం వదలిపెట్టి పోరాడే వీరుడిలా, అమరవీరుడి మెడలో మెరిసే పూలదండలా కవిత ఉండాలి.

పవిత్రమైన వేదం చదివితే కలిగే బహుళ ప్రయోజనాల్లా కవితలోని వేదన పఠితలో గుణాత్మకమయిన మార్పుల్ని కలిగించాలి. జీవనదిలా ప్రవహించే నిర్మల గంగానదిలా మనిషి జీవనం నిత్యచైతన్యంతో ముందుకు కదలాలని, నదిలో కొట్టుకుపోతున్న వాడికి తీరం తగిలినట్లుగా, కష్టాల్లో, బాధల్లో మునిగిపోయిన వారికి ఒక ఓదార్పు, ఉపశమనం కలిగించే తీరంలా కవిత్వపుతీరు ఉండాలి.

పాతాళాన్ని పైకి లాగేదిగా, ఆకాశాన్ని భూమ్మీదికి దించేదిగా అసాధ్యాలను సుసాధ్యాలు చేయగలిగే ఉత్తేజాన్ని కవిత్వం కలిగించాలి. అనేక సహజ వనరులతో, ప్రకృతి సౌందర్యంతో, విభిన్న ప్రాణుల జీవనానికి అనుగుణంగా ఉన్న అమూల్యమైన భూమిని, ఈ పర్యావరణాన్ని కాపాడుకునేలా కవిత్వం స్ఫూర్తి కలిగించాలి. మనిషి మానవీయ విలువలతో మంచి మనిషిగా ఎదిగేలా కవిత్వం నేర్పాలని కవి గాఢంగా కోరుకుంటున్న కోరిక ఈ కవిత.

విశేషాంశాలు

  1. పలుకుబడి : మాటతీరు ఉచ్ఛారణలో ఉండే విలక్షణత. దీన్నే ‘యాస’ అంటారు.
  2. నుడికారం : మాటయందలి చమత్కారం. ఏ భాష నుడికారం ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిలోంచి, భౌగోళిక పరిస్థితుల లోంచి, ఆప్రాంత ప్రజల ఆచార వ్యవహారాలలోంచి ఉద్భవిస్తుంది.
  3. జాతీయం : జాతివాడుకలో రూపుదిద్దుకున్న భాషా విశేషం. జాతీయంలోని పదాల అర్థాన్ని ఉన్నదున్నట్లుగా పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు. ఆ పదాల పొందికతో వచ్చే అర్థం వేరు.
    ఉదా : ‘చేతికి ఎముకలేదు’ అన్న జాతీయంలోని పదాలకు నిఘంటుపరంగా ఎముకలేని చేయంటే కేవలం

కండరాలు మాత్రమే ఉండాలె. కాని ఈ జాతీయానికి ధారాళంగా దానమిచ్చే మనిషి’ అని
అర్థం వస్తుంది. ఈ విధంగా పదాలకున్న వాక్యార్ధం పోయి లక్ష్యార్థం రావడాన్నే ‘జాతీయం’ అంటారు.
కొట్టినపిండి, తలపండిన, వీనుల విందైన, కబంధహస్తాలు, అగస్త్య భ్రాత మొదలైనవి మరికొన్ని జాతీయాలు.

సూక్తి : ఆత్మలను పలికించేదే అసలైన భాష
ఆ విలువ కరువైపోతే అది కంఠశోష
-డా|| సి. నారాయణరెడ్డి

పదాలు – అర్థాలు

I

అబ్బురపడు = ఆశ్చర్యపడు
పలుకుబడి = ఉచ్ఛారణము, మాట చెల్లుబడి
నుడికారము = మాట చమత్కారము, మాట, పలుకుబడి
పట్టుబడుట = నేర్చుకొనుట, అలవాటగుట
స్మరించుట = గుర్తుకు తెచ్చుకొనుట
యాదిచేసుకొనుట = గుర్తుకు తెచ్చుకొనుట
బాల్యమిత్రులు = చిన్నప్పటి (మిత్రులు) స్నేహితులు
ఉద్దండము = పొడవైనది, ఎక్కువైనది, మిక్కిలి
ప్రౌఢ = గంభీరమైనది
సన్నిధానము = సమీపము, ఆశ్రయము

II

పునరుద్ధరించుట = బాగుచేయుట
గురువు = ఉపాధ్యాయుడు, బృహస్పతి
సొంపు = అందం
రమ్యమైన = అందమైన
ప్రాముఖ్య = ప్రముఖమైనవి
టక్సాలా = టంకసాల
ప్రాముఖ్యం = ప్రాధాన్యత

III

పొల్యూట్ = కలుషితమైన
వర్దంతి = చనిపోయిన రోజు
జయంతి = పుట్టినరోజు
సమ్మేళనం = కలయిక, కలుపుట, కలియుట
విద్వాంసుడు = పండితుడు
ఆశ్రయించకుండా = తీసుకొనకుండా
వెల్లడించుట = వ్యక్తం చేయుట
జాబులు = లేఖలు, జవాబులు
అడ్వకేటు = వకీలు, న్యాయవాది

TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

IV

రుచించవు = ఇష్టపడవు, నచ్చవు
ఘోరము = దారుణము
గ్రాంథికం = గ్రంథములలో ఉండే భాష (గ్రాంథికం)
అగ్రగణ్యుడు = మొదటివాడు
వ్యవహారికం = మాటలలో మనంఉచ్చరించేది (వ్యవహారిక మాట)

పాఠం ఉద్దేశం

ఒక భాషలోని నుడికారపుసొంపు, పలుకుబడులు, జాతీయాలవల్ల భాష ఎంతో పరిపూర్ణంగా, సౌందర్య వంతంగా విలసిల్లుతుందో చెబుతూ, ఇతర భాషల్లో గొప్పతనాన్ని కూడా బేరీజువేస్తూ తెలుగు భాష గొప్పతనాన్ని, ప్రాంతీయ భాషలోని మాధుర్యాన్ని తెలియజేయడమే ఈ పాఠం ప్రధానోద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ప్రస్తుత పాఠ్యభాగం డా॥ సామల సదాశివ తన స్వీయ అనుభూతులతో రాసిన ‘యాది’ అనే వ్యాస సంపుటిలోనిది.

కవి పరిచయం

రచయిత : డా॥ సామల సదాశివ

జననం : 11.05.1928

మరణం : 07.08.2012

జన్మస్థలం : కుంరం భీమ్ జిల్లాలో భాగమైన దహెగామ్ మండలం తెనుగుపల్లె

ఇతర రచనలు :

  1. ఉర్దూ సాహిత్య చరిత్ర
  2. అన్జద్ రుబాయీలు
  3. మలయమారుతాలు
  4. యాది.
  5. సంగీత శిఖరాలు

పురస్కారాలు :

  1. 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ అనువాద రచనా పురస్కారం (అన్జద్ రుబాయీలకు)
  2. 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (స్వర్ణలయలు గ్రంథానికి)
  3. కాకతీయ,తెలుగు విశ్వ విద్యాలయాల గౌరవ డాక్టరేట్.

విశేషాంశాలు : ఉత్తమ అనువాదకుడు, విమర్శకుడు.

శైలి : భాష సహజ సుందరం, సరళం

ప్రవేశిక

సంస్కృతాంధ్ర భాషల్లో, కావ్యవ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితుడు; ‘ఆంధ్రబిల్హణ’ బిరుదాంకితుడూ అయిన కప్పగంతుల లక్ష్మణశాస్త్రి “వారీ! రామచంద్రా ! ఇగపటు” అన్నాడు.
గుడిపూజారి “మొదలు మీ కండ్లకు నీళ్ళు పెట్టుకోండి” అని ఆశ్చర్యపరచాడు.
“మసీదు మెట్లమీద కూర్చొని ఫకీర్లు, బిచ్చగాళ్ళు, బిచ్చగత్తెలు మాట్లాడుకునే మాటలు శ్రద్ధగా విని ప్రజల పలుకుబడిని, జాతీయాలను నేర్చుకున్నాను” అన్నాడు. భేషజం లేకుండా ప్రముఖ కవి మీర్ తఖీమీర్.
ఈ అనుభవాలన్నీ ప్రముఖ సాహితీవేత్త సామల సదాశివ ‘యాది’ లోనివి. ఇటువంటి మరెన్నో ఆశ్చర్యకర సంఘటనల గురించి తెలుసుకోవాలంటే ఈ పాఠం చదువవలసిందే!

విద్యార్థులకు సూచనలు

  • పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
  • పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత గీయండి.
  • వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పదవిజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకొండి.

ప్రక్రియ -వ్యాసం

ఈ పాఠం వ్యాసప్రక్రియకు చెందినది. ఏదైనా ఒక అంశాన్ని గురించి సంగ్రహంగా, ఆకట్టుకునేటట్లు వివరించేది వ్యాసం, సూటిగా, స్పష్టంగా, నిర్దిష్టంగా, సులభంగా అర్థమయ్యే విధంగా ఉండటం వ్యాసలక్షణం.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం

Telangana SCERT 10th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం రామాయణం Questions and Answers.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం

ఉపోద్ఘాతం
TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం 1
శ్రీమద్రామాయణం ఒక మహాకావ్యం. ఇది ఆదికావ్యం. వాల్మీకి మహర్షి రామాయణాన్ని రసవత్తరంగా రచించారు. ఈ కావ్యాన్ని కొందరు ధర్మశాస్త్రమని, శరణాగతిశాస్త్రమని కూడా పిలుస్తారు. మానవజీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం. మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ. ఆత్మీయతానుబంధాలు, సోదరుల అభిమానం, సేవక భక్తి, భార్యాభర్తల అనుబంధం, గురుభక్తి, శిష్యానురక్తి, స్నేహఫలం, ధర్మబలం, వినయ, వివేకాలు, జీవకారుణ్య భావన ……..ఇలా జీవితపార్శ్వాలెన్నింటినో రామాయణం పట్టిచూపిస్తుంది. ఈ కావ్యంలో 24 వేల శ్లోకాలు, ఆరు కాండలు ఉన్నాయి. శ్రీరామచంద్రుని గుణగణాలను అద్భుతంగా వాల్మీకి జగతికి అందించారు. ఇందులోని పాత్రలన్నీ ఇప్పటికీ సజీవంగానే మానవ హృదయాల్లో నిలిచి ఉన్నాయి.

ప్రశ్నలు – సమాధానములు

క్రింది పాత్రల స్వభావాన్ని వ్రాయండి.

ప్రశ్న 1.
విశ్వామిత్రుడు
జవాబు:
రామాయణంలో విశ్వామిత్రుని పాత్ర గొప్పది. ఇతడు గొప్ప ఋషి. యాగరక్షణ కోసం దశరథుని సమీపించాడు. రామలక్ష్మణుల సహాయాన్ని అర్థించాడు. యాగరక్షణ పేరుతో విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఎన్నో శస్త్రాస్త్రాలను బోధించాడు. బల, అతిబల అనే మంత్రాలను కూడా ఉప దేశించాడు. సీతారాముల వివాహవిషయంలో ప్రధాన భూమికను పోషించాడు. శ్రీరామునికి అస్త్రవిద్యలను ఉపదేశించడంలో నేర్పరితనాన్ని ప్రదర్శించాడు. గంగావతరణ మొదలైన వృత్తాంతాలను తెలియ జేశాడు.

ప్రశ్న 2.
శ్రీరాముడు
జవాబు:
మానవునిగా జన్మించి మహనీయునిగా ఎదిగి జగతికి ఆదర్శంగా నిలిచిన పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు. శ్రీరాముని వంటి ఉత్తమ గుణ సంపన్నుడు మరొకడు కనిపించడు. ఆయన ఆ కాలానికే కాదు ఏ కాలానికీ లేడు. శ్రీరాముని ధర్మ చరిత్ర సృష్టి ఉన్నంతకాలం ఉంటుంది. మానవ జాతిని తీర్చిదిద్ది, ధార్మికజీవనం ఎంతగొప్పదో, ఎంత పవిత్రమైందో, ఎంత ఆదర్శవంతమైందో తన ప్రవర్తన ద్వారా శ్రీరాముడు నిరూపించాడు. శ్రీరాముడు ధర్మనిష్ఠకు, సత్యసంధతకు, ఏకపత్నీ వ్రతానికి దృష్టాంతంగా నిలిచాడు. దుష్టరావణాది రాక్షసులను సంహరించి లోకకళ్యాణం చేశాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం

ప్రశ్న 3.
సీత
జవాబు:
ప్రపంచమునందలి మహాపతివ్రతలలో సీతామహాదేవి అగ్రగణ్యురాలు. శ్రీమద్రామాయణం లో సీత పాత్ర మహోన్నతమైంది. అసాధారణ పాతివ్రత్యం, త్యాగం, సౌశీల్యం, శాంతం, నిర్భయత్వం, సహనశీలం, ధర్మపరాయణత, వినయం, సంయమనం, సేవాభావం, సదాచారం మొదలైన ఉత్తమగుణాలతో కూడిన మహాసాధ్వి సీతాదేవి. సీతాదేవి పవిత్ర జీవనం, నిరుపమాన పతిభక్తి అపూర్వములు.

ఈమె అన్ని విషయాల్లోను పవిత్రురాలు. ఈమె జీవితంలోని ఘట్టాలన్నీ మన తల్లులకు, అక్కచెల్లెళ్ళకు, కోడళ్ళకు, కుమార్తెలకు చక్కని ప్రబోధాత్మకములు, స్ఫూర్తి దాయకములు. రావణుని తృణప్రాయంగా ఎదిరించి మాట్లాడిన ధీరవనిత. ఈమె సాక్షాత్తు దైవస్వరూపిణి. అయినప్పటికిని సీత తన మానవజీవితము నందు ఆదర్శచరిత్ర కలిగి సామాన్య గృహిణిగా ఆదర్శ జీవనాన్ని గడిపింది.

ప్రశ్న 4.
లక్ష్మణుడు
జవాబు:
వాల్మీకి రామాయణంలో లక్ష్మణుని పాత్ర ఆదర్శవంతమైంది. సోదరప్రేమకు సరియైన . ఉదాహరణ లక్ష్మణుడు. అన్నతోపాటు అరణ్యవాసం చేశాడు. తన జీవితాన్ని రాముని సేవకే అంకితం చేసిన మహనీయమూర్తి. లక్ష్మణుని బ్రహ్మచర్యము నిరుపమానము. అతడు గొప్పధైర్యశాలి. అసమాన పరాక్రమవంతుడు. అంతకు మించి జితేంద్రియుడు, సరళ స్వభావం కలవాడు, సహనం కలవాడు, నిష్కపటం లేనివాడు. తపస్సంపన్నుడు, త్యాగి, సేవాభావం కలవాడు. శ్రీరాముని యందు సాటిలేని ప్రేమగలవాడు. రాముని సేవలో తనను తానే మరచి పోతాడు. నీడవలె లక్ష్మణుడు శ్రీరాముని విడిచి ఉండలేడు. సీతను తల్లిగా భావించి గౌరవించాడు. యుద్ధరంగంలో రామునికి అండగా నిలిచిన మహనీయుడు.

ప్రశ్న 5.
కైక (లేదా) కైకేయి పాత్ర స్వభావాన్ని వివరించండి.
జవాబు:
ఈమె దశరథుని ముగ్గురి భార్యలలో మూడవ భార్య. పుత్రకామేష్టి యాగం తరువాత ఈమెకు భరతుడు జన్మించాడు. మంథర మాయమాటలకు లోనైంది. రాముని అరణ్యవాసానికి కారణమైంది. భరతుని ఆగ్రహానికి లోనైంది. దశరథుని మరణానికి పరోక్షంగా కారణభూతురాలైంది.

ప్రశ్న 6.
భరతుడు
జవాబు:
రామాయణంలో భరతుడు సర్వశ్రేష్ఠుడు. అతని చరిత్ర ఉజ్జ్వలమైంది. ఆదర్శవంతమైనది. భరతుని మనస్సు నిష్కపటమైందిగా నిరూపితమైంది. ఇతడు సాధు శిరోమణి, స్వామిభక్తి పరాయణుడు, ఆదర్శపురుషుడు, స్వార్థం లేనివాడు, భక్తితత్పరుడు, కర్మయోగి, నిరుపమాన నీతిజ్ఞుడు, సంయమనం కలవాడు, సదాచారపరాయణుడు, ప్రేమమూర్తి, వినయశీలి. శ్రీరామునియందు భక్తి విశ్వాసాలు కలవాడు, రాజ్యకాంక్ష లేనివాడు. రామాజ్ఞను శిరసావహించేవాడు. అన్న కోసం తల్లిని కూడా దూషించాడు. భరతుని సేవ అపూర్వమైంది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం

ప్రశ్న 7.
మంథర
జవాబు:
రామాయణంలో మంథర పాత్ర ఎంతో విశిష్టమైనది. శ్రీరామ వనవాసానికి ప్రధాన కారకురాలు. ఈమె కైకేయి సహాయకురాలు. పచ్చని కాపురంలో చిచ్చుపెట్టే స్వభావం కలది. కైకేయిలో దుర్భుద్ధిని పుట్టించింది. మంథర మాటలను విని కైక రాముడిని 14 సంవత్సరాలు వనవాసాన్ని, భరతునికి పట్టాభిషేకాన్ని కోరింది. భరతుని ఆగ్రహానికి లోనైంది. ఈమె ఒక దుష్టపాత్రగా రామాయణంలో నిలిచిపోయింది.

ప్రశ్న 8.
మారీచుడు
జవాబు:
ఇతడు ఒక రాక్షసుడు. తాటకి యొక్క కుమారుడు. అయినా ఇతడు గొప్ప ధర్మాత్ముడు, ప్రభుభక్తి పరాయణుడు. సీతాపహరణం తప్పని రావణునికి చెప్పాడు. రావణుని ఆగ్రహానికి కారకుడైనాడు. గత్యంతరంలేక రావణుని ఆదేశాన్ని అనుసరించి మాయారూపమైన జింకగా మారాడు. రాముని బాణానికి మరణించాడు.

ప్రశ్న 9.
రావణుడు
జవాబు:
శ్రీమద్రామాయణంలో అత్యంత ప్రధానమైన భూమికను పోషించినవాడు, లంకాధిపతియైన రావణుడు. ఒకవిధంగా చెప్పాలంటే రామావ తారమునకు కారణమైనవాడు రావణుడే. అతడు గొప్ప విద్యావంతుడు, తపశ్శాలి, గొప్ప శివభక్తుడు మరియు అస్త్ర శస్త్రవిద్యలన్నీ నేర్చిన మహావీరుడు. అయితే అతడు దురహంకారి. కామక్రోధాలకు లొంగినవాడు. ఇలాంటి దుర్గుణాలే అతని పతనానికి దారితీశాయి. పవిత్రమైన ఆలోచనలు లేనివాడు. పరకాంతా వ్యామోహం కలవాడు. మంచిమాటలను వినని స్వభావం కలవాడు. రాక్షసవంశ నాశనానికి తానే మార్గం చూపాడు.

ప్రశ్న 10.
సుగ్రీవుడు
జవాబు:
ఇతడు ఒక వానరరాజు. ఇతడు గొప్పవీరుడు, ధర్మపరుడు, నిరంకుశుడు, కొంత చాపల్యం కలవాడు. మిత్ర ధర్మానికి కట్టుబడినవాడుగా రామాయణంలో కనిపిస్తాడు. ఇతని ఆజ్ఞకు తిరు గుండదు. తన సోదరుడైన వాలిని సంహరించడానికి శ్రీరామునితో సఖ్యతను కుదుర్చుకున్నాడు. సీతాన్వేషణలో సుగ్రీవుడు తన కర్తవ్యాన్ని పాటించాడు. రావణవధ తరువాత రాముని కోరికపై అయోధ్యకు వెళ్ళాడు.

ప్రశ్న 11.
హనుమంతుడు
జవాబు:
శ్రీమద్రామాయణంలో హనుమంతుని పాత్ర అనుపమానమైనదిగా పేర్కొనవచ్చు. ప్రభుభక్తి పరాయణుడు. గొప్ప వక్త, సాటిలేని బలం కలవాడు, బుద్ధికుశలుడు, వ్యాకరణ పండితుడు, సేవా ధర్మపరాయణుడు, నిరంతరం సత్యమునే పలుకు వాడు, హనుమంతుని స్వామిభక్తి తిరుగులేనిది. దైవభక్తి ఇతనికి ఉగ్గుపాలతో పెట్టిన విద్య. యుద్ధవిద్యలయందు ఆరితేరినవాడు. కోరిన రూపమును ధరించగల సమర్థుడు. హనుమంతుని గుణములు అద్భుతములు, అపారములు. సీతాన్వేషణలోను, లంకాదహనంలోను, రావణునికి సందేశాన్ని ఇవ్వడంలోను ఇతనికి ఇతడే సాటి. లంకా నగరంలో హనుమంతుడు చూపిన సాహసం వీరులందరికి ఆదర్శప్రాయమైనది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం

ప్రశ్న 12.
త్రిజట
జవాబు:
రామాయణంలోని ముఖ్యపాత్రలలో త్రిజట పాత్ర ప్రముఖమైనది. ఈమె విభీషణుని కుమార్తె. రాక్షస వంశంలో జన్మించినా మంచిచెడులను గురించి ఆలోచించి చెప్పగల సమర్థురాలు. రాక్షస స్త్రీలు లంకలోని సీతను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. చివరకు రావణుడు బెదిరించాడు. ఆ సమయంలో సీత దుఃఖించింది. ఈ సందర్భంలో త్రిజట సీతను ఓదార్చింది. పగటిపూట వచ్చిన తన స్వప్న వృత్తాంతాన్ని చెప్పింది. సీతలో బ్రతుకుపై ఆశ కల్గించింది. ఈమె ప్రవర్తన అందరికి ఆదర్శం కావాలి.

ప్రశ్న 13.
ఇంద్రజిత్తు
జవాబు:
ఇతడు రావణుని కుమారుడు. ఇతనికి మేఘ నాథుడు అనే పేరు కూడా ఉంది. ఇంద్రుడిని జయించినందువల్ల ఇంద్రజిత్తు అయ్యాడు. బ్రహ్మ అనుగ్రహంతో బ్రహ్మాస్త్రాన్ని పొందాడు. యుద్ధ సంగ్రామంలో ఆకాశంలోకి వెళ్ళి మేఘాలలో యుద్ధం చేయగల సమర్థుడు. రామరావణ సంగ్రామం లో చురుకైన పాత్రను పోషించాడు. నాగాస్త్రంతో ఒకేసారి రామలక్ష్మణులను బంధించాడు. చివరకు లక్ష్మణుని చేతిలో మరణించాడు.

ప్రశ్న 14.
వాలి
జవాబు:
ఇతడు వానరరాజు, గొప్ప పరాక్రమవంతుడు. పెద్దపెద్ద బండరాళ్ళను కూడా అవలీలగా విసిరి వేయగల సమర్థుడు. దృఢమైన చెట్లను కూడా పీకిపారేయగల శక్తిసమర్థుడు. రావణుడిని సముద్రాల్లో ముంచి ముచ్చెమటలు పట్టించాడు. పరకాంతా వ్యామోహం కలవాడు. అదే ఇతని మరణానికి దారితీసింది. ధర్మాన్ని అభిమానించాడు. వాలి కోరికపై రాముడు అతని కుమారుడైన అంగదుడుని యువరాజుగా నియమించాడు.

ప్రశ్న 15.
విభీషణుడు (లేదా) విభీషణుడి పాత్ర స్వభావాన్ని వివరించండి.
జవాబు:
రామాయణంలో విభీషణుని పాత్ర అపూర్వ మైనది. ఇతడు రావణుని సోదరుడు. సేవాప రాయణుడు, ధర్మతత్పరుడు. ఎవరు తప్పు చేసినా వారిని నిలదీసే స్వభావం గలవాడు. అధర్మ పరాయణుడైన రావణుని ఎదిరించిన మహావీరుడు. శ్రీరాముడిని శరణుజొచ్చాడు. ధర్మంవైపు నిలిచి శాశ్వతమైన కీర్తిని పొందాడు.

ప్రశ్న 16.
దశరథుడు (లేదా) దశరథుని పాత్ర స్వభావం వివరించండి.
జవాబు:
ఇతడు ఇక్ష్వాకు వంశపు మహారాజు. గొప్ప పరాక్రమవంతుడు, సత్యసంధుడు. పుత్రకామేష్టి ద్వారా కుమారులను పొందాడు. శ్రీరామునియందు అమితమైన అనురాగం కలవాడు. పుత్ర వ్యామోహంతో మరణించాడు. కుమారులకు శస్త్రాస్త్ర విద్యలను నేర్పించాడు. పెద్దలయందు వినయం కలవాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం

ప్రశ్న 17.
జనక మహారాజు
జవాబు:
ఈయన మిథిలానగరానికి మహారాజు. సీతా దేవికీ తండ్రి. మిక్కిలి పరాక్రమవంతుడు. తన పూర్వీకుల నుండి సంక్రమించిన శివధనస్సును రక్షిస్తున్నాడు. సీతాదేవికి స్వయంవరాన్ని ప్రకటించి యోగ్యుడైన శ్రీరామచంద్రునికి తన కుమార్తె అయిన సీతను ఇచ్చి వివాహాన్ని జరిపించాడు. అంతేకాదు తన సొంత కుమార్తె అయిన ఊర్మిళను లక్ష్మణుడికి ఇచ్చి వివాహాన్ని జరిపించాడు. తన సోదరుని కుమార్తెలైన మాండవి, శ్రుతకీర్తనలను భరత, శత్రుఘ్నులకు ఇచ్చి వివాహాన్ని జరిపించాడు.

ప్రశ్న 18.
కుంభకర్ణుడు
జవాబు:
ఇతడు రావణుని సోదరుడు. బ్రహ్మవరప్రసాది. ఇతడు ఆరునెలలు మేల్కొని ఉంటాడు. ఆరునెలలు పడుకొని ఉంటాడు. భోజనప్రియుడు, యుద్ధ సమయంలో రావణుని ఆదేశంతో శ్రీరామునితో యుద్ధం చేశాడు. వీరమరణాన్ని పొందాడు.

ప్రశ్న 19.
జటాయువు
జవాబు:
ఇతడు ఒక వానరుడు. అనూరుని రెండవ కుమారుడు. ఇతని తల్లి శ్యేని, తాత కశ్యపుడు. రావణుడు సీతను అపహరించుకొని వెళ్ళే సమయంలో రావణుని ఎదిరించాడు. రావణుని చేతిలో మరణించాడు. రామునికి సీత జాడను తెలియజేశాడు. మిత్ర ధర్మాన్ని పాటించాడు.

ప్రశ్న 20.
భగీరథుడు
జవాబు:
ఇతడు ఒక సూర్యవంశపు రాజు. గొప్ప పరాక్రమవంతుడు. దిలీపుని కుమారుడు. తన ప్రపితామహులకు స్వర్గలోక ప్రాప్తిని కలిగించడం కోసం ఆకాశగంగను తన తపశ్శక్తితో భూలోకానికి దింపిన మహానీయుడు. గంగావతరణ విషయంలో కఠోర పరిశ్రమను చేశాడు.

ప్రశ్న 21.
శబరి
జవాబు:
ఈమె గొప్ప భక్తురాలు. మతంగ మహర్షి ఆశ్రమంలో నివసించే ఒక సన్యాసిని. కబంధుడు సూచించిన మార్గంలో ప్రయాణిస్తూ రామలక్ష్మణులు పంపా సరస్సు ప్రాంతంలో ఉన్న శబరి ఆశ్రమానికి వెళ్ళారు. శబరి తపస్సిద్ధురాలు. జ్ఞానవయో వృద్ధురాలు. శ్రీరామదర్శనంతో ఆమె తనువు పులకించింది. పంపా తీరంలో దొరికే పండ్లను స్వామికి సమర్పించింది. తన జన్మ ధన్యమైనట్లు భావించింది. శ్రీరాముడి అనుమతినిపొంది తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసి అగ్నికాంతితో ఊర్ధ్వలోకాలకు వెళ్ళింది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం

ప్రశ్న 22.
కౌసల్య
జవాబు:
దశరథ మహారాజు భార్య. శ్రీరాముని తల్లి. ఏనాడూ భర్త మాటకు ఎదురుచెప్పని మహాపతివ్రత. శ్రీరాముడు అరణ్యవాసానికి బయల్దేరేటప్పుడు శ్రీరాముని వనవాస ప్రయత్నం విరమింపజేయాలను కుంది. ఫలించలేదు. పుత్ర వ్యామోహంతో వన వాసానికి తానూ వస్తానంది. రాముడు ఒప్పుకోలేదు. శ్రీరాముడికి ధర్మబోధ చేసింది. ధైర్యం చెప్పిన వీరనారి. ధర్మాన్ని విడిచిపెట్టవద్దని చెప్పిన మహారాణి కౌసల్య.

ప్రశ్న 23.
సుమిత్ర
జవాబు:
దశరథ మహారాజుకు రెండవ భార్య. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు ఈమె సంతానం. కౌసల్యా దేవి అడుగు జాడలలో నడిచింది. భర్త మాటకు ఎదురుచెప్పని మహాపతివ్రత, శ్రీరామ, లక్ష్మణ, భరత శత్రుఘ్ను లందర్నీ సమానంగా చూసిన మాతృమూర్తి.

ప్రశ్న 24.
శత్రుఘ్నుడు
జవాబు:
సుమిత్రయందు దశరథునకు జన్మించాడు. లక్ష్మణుని స్వభావం శత్రుఘ్నుని స్వభావం ఒక్కటే. అన్నగార్లపై అమితమైన గౌరవం కలవాడు.

ప్రశ్న 25.
ఋష్యశృంగుడు
జవాబు:
విభాండక మహర్షి కొడుకు. దశరథుని కుమార్తె శాంతను వివాహం చేసుకున్నాడు. పుత్రకామేష్ఠి యాగం దశరథుని చేత చేయించాడు. ఋష్య శృంగుడు సాక్షాత్తు దైవస్వరూపుడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ వర్షాలు బాగా కురుస్తాయి. భూమి సస్యశ్యామలంగా ఉంటుంది.

ప్రశ్న 26.
నారదుడు
జవాబు:
దేవఋషి. రామాయణగాథను వాల్మీకికి ఉపదేశించిన వాడు. బ్రహ్మయొక్క మానసపుత్రుడు. త్రిలోక సంచారి. నిరంతరం నారాయణ నామాన్ని జపిస్తూ ఉంటాడు. లోకకల్యాణం కోసం నిరంతరం ప్రయత్నిస్తాడు. ఋషులకు మార్గదర్శకుడు. రామాయణ కథారచనకు మూలపురుషుడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం

ప్రశ్న 27.
కబంధుడు
జవాబు:
ఒక రాక్షసుడు. ఇతని చేతిలో చిక్కితే ఎవ్వరూ తప్పించుకోలేరు. రావణుడు అపహరించిన సీతాదేవి దొరికే ఉపాయాన్ని శ్రీరామునకు చెప్పాడు.

క్రింది వాటిని వివరించండి.

ప్రశ్న 1.
చెవిటివాని చెవిలో శంఖం ఊదినట్లు :
జవాబు:
మూర్ఖునికి ఉపదేశం చేయడం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదని తెలియజెప్పే అర్థంలో ఈ జాతీయం వాడు తారు.

ప్రశ్న 2.
చెవినిల్లుకట్టుకొనిపోరు:
జవాబు:
చెప్పింది విన్నా, వినక పోయినా అదేపనిగా ఎదుటివానికి చెప్పే సందర్భంలో ఈ జాతీయం వాడుతారు.

ప్రశ్న 3.
గతజలసేతుబంధనం :
జవాబు:
జరిగిపోయిన నష్టం తర్వాత వారధిని నిర్మించడం వల్ల ఉపయోగం లేదని తెలియజెప్పే సందర్భంలో దీన్ని వాడుతారు.

ప్రశ్న 4.
అగస్త్యభ్రాత:
జవాబు:
పేరు తెలియని వ్యక్తిని గూర్చి తెలియజేయు సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు.

ప్రశ్న 5.
సుగ్రీవాజ్ఞ :
జవాబు:
తిరుగులేని ఆదేశం అని తెలియజేయు సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం

ప్రశ్న 6.
శ్రీరామరక్ష :
జవాబు:
రక్షింపగలిగినది, సర్వరక్షమైనది అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు.

ప్రశ్న 7.
కబంధహస్తాలు :
జవాబు:
విడిపించుకోవడానికి వీలుకాని బంధాన్ని గూర్చి తెలియజేయు సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు.

ప్రశ్న 8.
భగీరథ ప్రయత్నం :
జవాబు:
అసాధ్యమైనదానిని సాధించాడు అని తెలియజేయు సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు.

మరికొన్ని జాతీయాలు :

ప్రశ్న 9.
కారాలు మిరియాలు నూరడం :
జవాబు:
ఈ జాతీయాన్ని ‘కోపము చేయు’ ‘పగ సాధించు’ అనే సందర్భంలో ఉపయోగిస్తారు.

ప్రశ్న 10.
ఉచితజ్ఞత :
జవాబు:
‘తగిన విషయాన్ని తెలుసుకొనే తత్త్వము’ అనే సందర్భంలో దీనిని ఉపయోగిస్తారు.

ప్రశ్న 11.
స్థితప్రజ్ఞత :
జవాబు:
దేనికీ చలింపని మనస్సు కలిగి ఉండడం. పొంగుక్రుంగులు లేని మనస్తత్వము అనే సందర్భంలో దీనిని వాడతారు.

ప్రశ్న 12.
పితృవాక్య పరిపాలన :
జవాబు:
తండ్రి మాటను ఎటువంటి స్థితిలోనయినా తప్పకుండా పాటించడం అనే సందర్భంలో దీనిని ఉపయోగిస్తారు. తండ్రి మాట వలె తప్పక పాటింపవలసినదని భావము.

ప్రశ్న 13.
గజ్జెకట్టడం :
జవాబు:
కాలికి గజ్జెలు కట్టుకొని నాట్యం చేయడం అని దీని అర్థము. ఆ పనిని చేయడానికి పూనుకున్నాడు అనే సందర్భంలో దీన్ని ఉపయోగిస్తారు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం

ప్రశ్న 14.
మంత్రాలకు చింతకాయలు రాలడం :
జవాబు:
మంత్రాలు చదవడానికి, చింతకాయలు రాలడానికి సంబంధం ఉండదు. ఇలా బొత్తిగా సంబంధం లేదని చెప్పే సందర్భంలో దీన్ని వాడతారు.

ప్రశ్న 15.
నీరు కారిపోవుట :
జవాబు:
‘దిగాలు పడిపోవు”, లేక “నిరుత్సాహుడగు” అనే సందర్భంలో దీన్ని ఉపయోగిస్తారు.

ప్రశ్న 16.
కలుపు తీయడం :
జవాబు:
చేలలో పనికిరాని మొక్కలను తొలగించడం అనే సందర్భంలో దీనిని ఉపయోగిస్తారు.

ప్రశ్న 17.
పురిట్లో సంధి కొట్టడం :
జవాబు:
“పురుడు వచ్చి బిడ్డ పుట్టగానే సంధిరోగం రావడం’ అనగా పని ప్రారంభించగానే విఘ్నం కలగడం అనే సందర్భంలో దీన్ని ఉపయోగిస్తారు.

ప్రశ్న 18.
బ్రహ్మాస్త్రం :
జవాబు:
బ్రహ్మగారి అస్త్రము వలె, తిరుగులేని అస్త్రము అనే సందర్భంలో దీన్ని ప్రయోగిస్తారు. తప్పకుండా జరిగేది అనే భావములో దీన్ని వాడతారు.

ప్రశ్న 19.
చూసి రమ్మంటే కాల్చిరావడం :
జవాబు:
సీతను చూసి రమ్మంటే ఆంజనేయుడు లంకను కాల్చి వచ్చాడు. అలా ఏదో చిన్న పని చేయమని చెపితే, దాన్ని పాడుచేసి రావడం అనే సందర్భంలో వాడతారు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం

ప్రశ్న 20.
చెప్పుడు మాటలు చేటు :
జవాబు:
మంథర చెప్పిన మాటలు విని కైక రాముడిని అడవులకు పంపింది. చెప్పుడు మాటలు వింటే చెడు వస్తుందనే సందర్భంలో వాడతారు.

సొంతవాక్యాలు

ప్రశ్న 1.
చెవిటివాని ముందు శంఖం ఊదినట్లు :
జవాబు:
విభీషణో పదేశం చెవిటివాని ముందు శంఖం ఊదినట్లు వ్యర్థం అయింది.

ప్రశ్న 2.
చెవినిల్లు కట్టుకొనిపోరు :
జవాబు:
విభీషణుడు సీతాపహరణం తప్పని, చెవినిల్లు కట్టుకొనిపోరుగా రావణునికి చెప్పాడు.

ప్రశ్న 3.
గతజలసేతుబంధనం :
జవాబు:
ప్రభుత్వం చేపట్టే కొన్ని సహాయకచర్యలు గతజల సేతుబంధనంతో సమానంగా ఉంటున్నాయి.

ప్రశ్న 4.
అగస్త్యభ్రాత :
జవాబు:
స్వాతంత్ర్య సమరంలో ఎందరో అగస్త్య భ్రాతలు కాలగర్భంలో కలిసిపోయారు.

ప్రశ్న 5.
సుగ్రీవాజ్ఞ :
జవాబు:
పూర్వకాలంలో రాజుల ఆదేశాలు సుగ్రీవాజ్ఞగా నిలిచేవి.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం

ప్రశ్న 6.
శ్రీరామరక్ష :
జవాబు:
పిల్లలకు తల్లిదండ్రుల దీవెనలే శ్రీరామరక్షగా ఉంటాయి.

ప్రశ్న 7.
కబంధహస్తాలు :
జవాబు:
పేద ప్రజలు వడ్డీ వ్యాపారుల కబంధహస్తాల్లో నలిగిపోతున్నారు.

ప్రశ్న 8.
భగీరథ ప్రయత్నం :
జవాబు:
నదుల అనుసంధాన కార్యక్రమాన్ని ప్రభుత్వం భగీరథ ప్రయత్నంగా సాధించింది.

ప్రశ్న 9.
కనువిప్పు :
జవాబు:
గురువులు చెప్పిన మాటలతో నా అజ్ఞానము పోయి కనువిప్పు కలిగింది.

ప్రశ్న 10.
చివాట్లు పెట్టడం :
జవాబు:
పరీక్షకు మాని సినిమాకు వెళ్ళాడని తమ్ముడిని అమ్మ చివాట్లు పెట్టింది.

ప్రశ్న 11.
వన్నెచిన్నెలు :
జవాబు:
మా ఆవుదూడ వన్నెచిన్నెలు చూస్తే అందరూ మురిసిపోతారు.

ప్రశ్న 12.
రూపుమాపడం :
జవాబు:
మద్యపానం అనే దురలవాటును రూపుమాపడం కోసం ప్రయత్నించాలి.

ప్రశ్న 13.
మిన్నందుకోవడం :
జవాబు:
మన ప్రధాని కీర్తి ప్రతిష్ఠలు, దేశ విదేశాలలో మిన్నందుకొన్నాయి.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం

ప్రశ్న 14.
శ్రద్ధాసక్తులు :
జవాబు:
విజయం సాధించాలంటే పనిపై శ్రద్ధాసక్తులు చూపించాలి.

ప్రశ్న 15.
ప్రేమ-ఆప్యాయతలు :
జవాబు:
గురువులు శిష్యుల యందు ప్రేమ ఆప్యాయతలను చూపించాలి.

ప్రశ్న 16.
కంపించిపోవడం :
జవాబు:
మా వీధిలో బాంబు పేలడంతో మా ఇంటి తలుపులు కంపించిపోయాయి.

ప్రశ్న 17.
గుండెలు బరువెక్కడం :
జవాబు:
నా ప్రియమిత్రుడు కాలధర్మం చెందాడని తెలిసి, నా గుండెలు బరు వెక్కాయి.

ప్రశ్న 18.
ప్రతిధ్వనించడం :
జవాబు:
బాణసంచా చప్పుళ్ళు నగరం అంతా ప్రతిధ్వనించాయి.

ప్రశ్న 19.
కుందాడుట :
జవాబు:
గురువులు శిష్యుల తప్పులను ఎత్తి చూసి కుందాడుట మంచిది కాదు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం

ప్రశ్న 20.
పొద్దస్తమానం :
జవాబు:
రైతులు పొద్దస్తమానం పొలాల్లో పనిచేస్తారు.

ప్రశ్న 21.
అడుగున పడిపోవు :
జవాబు:
ప్రభుత్వం శ్రద్ధతీసుకోకపోవడం వల్ల మా గ్రామాభివృద్ధి అడుగున పడిపోయింది.

ప్రశ్న 22.
కష్టఫలం :
జవాబు:
నేడు రైతులకు తమ కష్టఫలం దక్కటల్లేదు.

ప్రశ్న 23.
కడుపులు మాడ్చుకొను :
జవాబు:
తల్లులు, తమ కడుపులు మాడ్చుకొని తమకు ఉన్నదాన్ని పిల్లలకు పెడతారు.

ప్రశ్న 24.
లాలన :
జవాబు:
తల్లిదండ్రులు తమ పిల్లలను లాలన చేసి పెంచాలి.

ప్రశ్న 25.
సమయ సందర్భాలు :
జవాబు:
విద్యార్థులు సమయ సందర్భాలు గమనించి నడుచుకోవాలి.

ప్రశ్న 26.
హాయిసౌఖ్యాలు :
జవాబు:
పాలకులు ప్రజల హాయి సౌఖ్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం

ప్రశ్న 27.
చమత్కారం :
జవాబు:
మా బావగారు మంచి చమత్కారంగా మాట్లాడతారు.

ప్రశ్న 28.
సాన్నిధ్యం :
జవాబు:
దైవసాన్నిధ్యంలో మా అక్కాబావల పెళ్ళి జరిగింది.

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఉపవాచకం ఆధారంగా ‘శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడు’ అని సమర్థిస్తూ ఆ సన్నివేశాలను వివరించండి.
జవాబు:
శ్రీరాముడు దశరథుడు, కౌసల్యల పుత్రుడు, శ్రీరాముడు ఎప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్న మయ్యేవాడు. పితృవాక్య పరిపాలకుడు. తండ్రి అనుమతితోనే విశ్వామిత్రుని యజ్ఞాన్ని రక్షించడానికి ఆయన వెంట వెళ్ళాడు. పినతల్లి కైక తన తండ్రి నుండి కోరిన వరాలమేరకు తండ్రి మాట పాటించడానికి పదునాలుగేళ్ళు వనవాసం చేశాడు.

భరతుడు ప్రార్థించినా అయోధ్య ప్రజలు విలపించినా తల్లి వారించినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తండ్రి స్వయంగా చెప్పకపోయినా పినతల్లి వినిపించిన మాటలనే తండ్రి ఆజ్ఞగా స్వీకరించాడు. అడవులలో ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. సీతావియోగ దుఃఖాన్ని భరించాడు. రావణాసురుని రాక్షస కులాన్ని సమూలంగా నిర్మూలించాడు. ధర్మాన్ని ప్రతిష్ఠించాడు. రాచరికపు సౌఖ్యాలన్నీ త్యజించి నారబట్టలు ధరించి అన్ని కష్టాలకు సిద్ధపడ్డాడు. తండ్రిమాట పాటించడమే తన ధర్మంగా భావించిన ఆదర్శపురుషుడు శ్రీరాముడు.

ప్రశ్న 2.
హనుమంతుని వాక్చాతుర్యం, పాండిత్యం ఎటువంటిది ?
జవాబు:
హనుమంతుడు సూర్యుని శిష్యుడు. గొప్ప జ్ఞాని. వేదాలను, వ్యాకరణాన్ని క్షుణ్ణంగా చదివాడు. తొందరపాటు లేకుండా, తప్పులు పలకకుండా, సరైన స్వరంతో స్పష్టంగా మాట్లాడుతాడు. ఈయన మాట్లాడే తీరు చూస్తే చంపాలని కత్తి ఎత్తిన శత్రువు కూడా. కరిగిపోతాడు. ఆ మాటతీరు శ్రీరాముని కెంతో నచ్చింది. సుగ్రీవునికి రామునికి మైత్రి కలిపాడు. ‘ఒకరికొకరు సహాయం చేసుకొనేటట్లు ఒప్పందం చేశాడు. వాలిని సంహరించిన తరువాత సుగ్రీవునికి పట్టాభిషేకం చేయాలని రామునికి సూచించాడు.

సీతను తాను తప్పక వెదకగలనన్న నమ్మకం గలవాడు. జాంబవంతుడు మొదలైన వానర వీరుల ప్రోత్సాహంతో నూరు యోజనాల సముద్రం దాటి లంకలో సీతను దర్శించాడు. రాముని విషయాలు తెలిపి సీతను ఓదార్చాడు. తిరిగి వచ్చి సీత విషయాలు వివరించి రామునికి ఊరట కలిగించాడు. రావణుడికి రాముని శక్తిని తెలిపి భయం కలిగించాడు. యుద్ధంలో అందరినీ ఉత్తేజపరుస్తూ శత్రు సంహారం చేశాడు. ఇవన్నీ హనుమంతుని పాండిత్యం వల్ల సాధ్యమైన విషయాలే.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం

ప్రశ్న 3.
రామాయణం ఆధారంగా అన్నదమ్ముల అనుబంధాన్ని విశ్లేషించండి.
జవాబు:
రామాయణంలో దశరథ మహారాజు కుమారులు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. నలుగురూ కలిసి వశిష్ఠుని వద్ద విద్యాభ్యాసం చేశారు. సర్వలక్షణ సంపన్నులైనారు. రాముడు ఎల్లప్పుడూ తల్లిదండ్రుల సేవలో మునిగి ఉండేవాడు. లక్ష్మణుడికి అన్న సేవ కంటే మిన్న ఏదీ లేదు. భరతుడు, శత్రుఘ్నుడు అన్యోన్య ప్రేమాభిమానాలు కలవారు.

భరతుని మేనమామ ఇంటికి శత్రఘ్నుడు కూడా వెనుకనే వెళ్ళాడు. తండ్రి ఆజ్ఞ మేరకు రాముడు వనవాసానికి బయలుదేరితే లక్ష్మణుడు కూడా వెంటే వెళ్ళి పద్నాలుగేళ్ళూ నిద్రాహారాలు మాని సేవించు కున్నాడు. రావణుడి శక్తి ఆయుధానికి లక్ష్మణుడు స్పృహ తప్పిపోయినప్పుడు రాముడు ఎంతో దుః ఖించాడు. లక్ష్మణుడు మరణిస్తే తన విజయానికి అర్థమే లేదన్నాడు రాముడు.

రామునికి చెందవలసిన రాజ్యాన్ని తను పాలించనని భరతుడు తానూ వనవాసానికి బయలు దేరాడు.రాముడు నచ్చజెప్పి తనకు మారుగా రాజ్యంలో లుగు (ప్రథమ భాష) శాంతి భద్రతలు కాపాడుతూ ఉండమన్నాడు. అన్న ఆజ్ఞను తలదాల్చి అతని పాదుకలను అతని బదులుగా రాజ్యానికి తెచ్చి సింహాసనం పైనుంచి పరిపాలన సాగించాడు భరతుడు. రాముడు గడువులోపల తిరిగి రాకపోతే ప్రాణత్యాగం చేస్తానని శపథం చేశాడు. ఇలా ఈ కావ్యంలో అన్నదమ్ముల అనుబంధం చాలా గొప్పది.

ప్రశ్న 4.
రామాయణంలో మీకు నచ్చిన పాత్ర ఏది? ఎందుకో తెల్పండి.
(ఈ ప్రశ్నకు జవాబుగా విద్యార్థులు ఎవరికి వారు తమ సొంత జవాబులు రాయవచ్చు)
జవాబు:
రామాయణంలో నాకు నచ్చిన పాత్ర ఆంజనేయుడు. ఆంజనేయునికి హనుమంతుడు, అంజనీపుత్రుడు, వాయునందనుడు, మారుతి, పవనకుమారుడు అని పేర్లు. హనుమ పుట్టుకతోనే మహాబలశాలి. గొప్ప శూరుడు. పసితనంలోనే పండు అనుకొని సూర్యుణ్ణి మింగేయడానికి ఆకాశానికి ఎగిరినవాడు.

ఆంజనేయుడు స్వామి భక్తి పరాయణుడు. అంటే తన యజమానికి ఎంతో నమ్మకంగా సేవ చేసే వ్యక్తి అని అర్థం. అతను సుగ్రీవునికి నమ్మిన బంటు, తర్వాత శ్రీరామునికి పరమభక్తుడయ్యాడు. తన మాటల నేర్పుతో రామలక్ష్మణులకు సుగ్రీవునితో మైత్రి కుదిర్చాడు. అంతటి వాక్చతురుడు హను మంతుడు. వేదవేదాంగాలలో గొప్ప పండితుడైనా ఎప్పుడూ వినయంగానే ఉంటాడు. సీతను వెతకడానికి సమర్థుడిగా అందరిచేత ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అందుకే రాముడు అతనికి తన ముద్రికను ఇచ్చాడు.

వానరవీరుల ప్రేరణతో మహాసముద్రాన్ని దాటాడు. వెళ్ళిన పని సాధించుకొని వస్తానని ఆత్మవిశ్వాసం చాటాడు. సముద్రంలో మైనాకుడు ఆతిథ్యానికి ఆహ్వానించినా విశ్రాంతి తీసుకోని కార్యదక్షుడు. సింహిక అనే రాక్షసిని చంపిన వీరుడు. సీత జాడ దొరకక ఆత్మహత్యకు ప్రయత్నించి కూడా విచక్షణతో ప్రాణాలు నిలుపుకున్న తెలివిగలవాడు. లంకలో అణువణువూ వెదకి సీతమ్మను గుర్తించిన కార్యశూరుడు.సీతను చూసి రమ్మంటే ఆ పనితోపాటు లంకను కూడా కాల్చి వచ్చిన హనుమంతుడు సమయానుకూలంగా ఎట్లా ప్రవర్తించాలో తెలిసిన మహనీయుడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం

ప్రశ్న 5.
సీత ఆదర్శనారి – వివరించండి.
(లేదా)
సీత పాత్ర స్వభావాన్ని వివరించండి.
జవాబు:
సీత జనక మహారాజు కుమార్తె. సకల సద్గుణవతి. శ్రీరాముని అర్థాంగి. భర్తను సేవిస్తూ నీడలా అనుసరించడమే ధర్మంగా భావించింది. అత్తవారింట ఎంతో అనుకూలవతిగా వ్యవహరించింది.

శ్రీరాముడు తండ్రి ఆజ్ఞమేరకు అడవులకు బయలుదేరినప్పుడు ‘వనవాస కష్టాలు భరించలేవు’ అని ఎంతమంది వారించినా వినకుండా రాముని వెంట అడవులకు వెళ్ళింది. 14 ఏళ్ళ వనవాస కష్టాలన్నీ అనుభవించింది. పతియే ప్రత్యక్షదైవం అని ప్రపంచానికి చాటిన ఆదర్శ మహిళ సీత.

రావణుని చెరలోవున్న పదినెలలూ అశోక వనంలో భర్తనే తలచుకుంటూ గడిపింది. రావణుడు ఎన్ని ఆశలు చూపినా, ఎంత భయ పెట్టినా, ఎన్ని మాయలు పన్నినా వేటికీ లొంగలేదు. ఎంతో ధైర్యంగా భర్త రాకకోసం ఎదురు చూసింది.

హనుమంతుడు సీతను రాముని చెంతకు చేరుస్తానన్నాడు. దానివల్ల తన భర్త పరాక్రమానికి మచ్చవస్తుందని, శ్రీరాముడు రావణుని జయించి తనను తీసుకు వెళ్ళడమే ఉచితమని చెప్పి తిరస్కరించింది. ఈ విధంగా సీత ఆదర్శనారి అని చెప్పవచ్చు.

ప్రశ్న 6.
రామాయణం ఎందుకు చదవాలి ?
(లేదా)
రామాయణం చదవడం వల్ల, వ్యక్తికి గాని, సమాజానికి గాని కలిగే ప్రయోజనాలు ఏమిటి ?
జవాబు:
శ్రీమద్రామాయణం మనకు ఆదికావ్యం. ఈ మహాకావ్యం మానవ జాతిని జాగృతం చేసింది. రామాయణ కథ మానవ హృదయాల నుండి చెరగదు. రామాయణంలో తల్లిదండ్రుల అనురాగం, పుత్రుల అభిమానం, భార్యాభర్తల అనుబంధం, గురుభక్తి, శిష్యానురక్తి, స్నేహభావం, ధర్మబలం, జీవకారుణ్యం వంటి ఎన్నో జీవిత పార్శ్వాలు కనబడతాయి.

రామాయణాన్ని చదవడం అంటే, జీవితాన్ని చదవడమే. అది అందరికీ పఠనీయ గ్రంథం. మానవీయ విలువలతో కూడిన ధర్మాలను ఆచరిస్తే, మనిషి మనీషిగా ఎలా ఎదగగలడో రామాయణం నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా రామాయణం గొప్ప సందేశాన్ని అందించింది. రామాయణంలో వాల్మీకి మారీచునివంటి రాక్షసుని నోటి నుండి “రామో విగ్రహవాన్ ధర్మః – సత్య ధర్మ పరాక్రమః అనే మాటలు పలికించాడు.

శ్రీరాముని వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి మహాకావ్యం ‘నభూతో నభవిష్యతి’ అని నిరూపించబడింది. ఈ కావ్యం భావితరాలకు మార్గదర్శకంగా ఉంది. అందువల్ల రామాయణాన్ని తప్పక చదవాలి. కాబట్టి భారతదేశంలో ఏవిధంగా జీవించాలో రామాయణం మనకు బోధిస్తుందని చెప్పవచ్చు. రామాయణం ‘రామునివలె నడుచుకో రావణునివలె నడువవద్దు’ అనే ధర్మాన్ని భారతీయులకు అందిస్తుంది. అందువల్లనే రామాయణం మానవు లందరికీ ఆదర్శగ్రంథం. పఠనీయ గ్రంథం.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం

ప్రశ్న 7.
రామాయణంలోని అన్నదమ్ముల గురించి రాయండి.
జవాబు:
రామాయణంలో ముగ్గురు అన్నదమ్ముల బాంధవ్యాలు గురించి చెప్పబడింది. వారు :

  1. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు
  2. వాలి సుగ్రీవులు,
  3. రావణ కుంభకర్ణ విభీషణులు.

ఇందులో రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల సోదర బంధం, ప్రశంసనీయం. ఇందులో రామలక్ష్మణుల సోదర ప్రేమ, అమోఘము. లక్ష్మణుడు రామునికి బహిః ప్రాణము. అన్నను విడిచి ఉండలేక లక్ష్మణుడు అన్నతో అడవికి వెళ్ళి ఎన్నో కష్టాలు పడ్డాడు. భరత శత్రుఘ్నులు సహితం ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయేవారు. భరతుడు తనకు వచ్చిన రాజ్యాన్ని కాదని, రాముని పాదుకలకు పట్టం గట్టి, అన్న పేర పాలించాడు. అన్న 14 ఏండ్ల తరువాత అయోధ్యకు రాకపోతే భరతుడు అగ్ని ప్రవేశం చేస్తానన్నాడు.

వాలి సుగ్రీవులు అన్నదమ్ములు. వీరి సోదర బంధం ఆదర్శప్రాయం కాదు. వాలి, సుగ్రీవుని భార్యను అపహరించి, సుగ్రీవుడిని దేశ బహిష్కారం చేయించాడు. ఇక సుగ్రీవుడు రామునితో స్నేహం చేసి వాలిని చంపించాడు.

రావణ కుంభకర్ణ విభీషణులు సోదరులు. విభీషణుడు ధర్మాత్ముడు. దూతను చంపవద్దనీ, రామునితో విరోధం వద్దనీ, అన్న రావణునికి ఇతడు హితవు చెప్పాడు. కుంభకర్ణుడు కూడా సీతను అపహరించేముందు తనతో చెప్పలేదని అన్నను తప్పుపట్టాడు. కాని అన్నకోసం యుద్ధంలో చచ్చాడు. విభీషణుడు రామునితో కలిసి, రావణునిపై యుద్ధం చేసి, అన్నను చంపించి తాను లంకకు రాజు అయ్యాడు. వీరి సోదర బంధం ఆదర్శప్రాయము కాదు.

ప్రశ్న 8.
రామాయణములోని స్నేహాల గురించి రాయండి.
జవాబు:
రామాయణంలో రామసుగ్రీవుల స్నేహం, రామ విభీషణుల స్నేహాలు, సుప్రసిద్ధమైనవి. సుగ్రీవుడు రామునితో స్నేహం చేశాడు. సుగ్రీవుడికీ అతని అన్న వాలికీ విరోధం ఉంది. వాలి, కిష్కింధకు రాజు. సుగ్రీవుడు రామునితో స్నేహం చేసి, రామునిచేత తన అన్న వాలిని చంపించి, తాను కిష్కింధకు రాజు అయ్యాడు. రాముడే సుగ్రీవుడిని కిష్కింధకు రాజును చేశాడు. రావణుని చంపి, సీతను తిరిగి తెచ్చు కోవడానికి సుగ్రీవుడు తన వానర సైన్యంతో రామునికి సాయపడ్డాడు. ఈ విధంగా రామసుగ్రీవుల స్నేహం వల్ల వారిద్దరికీ మేలు జరిగింది.

రామాయణంలో రామవిభీషణుల స్నేహం కూడా ప్రసిద్ధమైనది. విభీషణుడు లంకా నగరాధిపతి, రావణుడికి తమ్ముడు. రావణుడు సీతను అపహరించి తీసుకురావడం, విభీషణుడికి ఇష్టం లేదు. అందుకే విభీషణుడు తన అన్న రావణుని విడిచి, రాముని స్నేహాన్ని ఆశ్రయించాడు. రాముడు విభీషణుని ఆదరించాడు. రామ విభీషణుల స్నేహం గొప్పది.

విభీషణుడు మాట సాయంతో రాముడు రావణుని జయించాడు. విభీషణుని లంకా నగరానికి రాజును చేశాడు. విభీషణుడు సీతను రామునకు అప్పగించాడు. ఈ విధంగా రామవిభీషణులు స్నేహం వల్ల ఒకరికి ఒకరు మేలు చేసుకున్నారు. రామవిభీషణుల స్నేహం వల్ల వారిద్దరికీ మేలు జరిగింది.

ప్రశ్న 9.
రామాయణంలో సీత – కైకల పాత్రల భేదాలను విశ్లేషించండి.
జవాబు:
సీత, శ్రీరామచంద్రునికి ధర్మపత్ని. ఈమె మహా పతివ్రత. మహా సౌందర్యవతి. ఈమె జనక మహారాజు కుమార్తె. రామునితో పాటు సీత కూడా వనవాసానికి వెళ్ళి ఎన్నో బాధలు పడింది. రావణుడు ఈమెను అపహరించి లంకకు తీసుకువెళ్ళాడు. రాముడు సీతాదేవి జాడను తెలిసికోవడానికి హనుమంతుడిని దూతగా పంపాడు. హనుమ సీతను కలిసి, రాముని ఉంగరాన్ని ఆమెకు ఇచ్చాడు. సీత ఇచ్చిన చూడామణిని తెచ్చి రామునకు ఇచ్చాడు. రాముడు సీత కోసం సముద్రానికి వారధిని కట్టి యుద్ధంలో రావణుని సంహరించి సీతను తీసుకు వచ్చాడు. రామాయణంలోని పాత్రలలో రాముని తరువాత సీత పాత్ర ప్రధానమైనది.

కైక దశరథ మహారాజునకు ముద్దుల భార్య. ఈమెకు రాముడంటే మంచి ప్రేమ. మంథర చెప్పిన చెప్పుడు మాటలు విని, కైక తన మనస్సును మార్చుకొని దుష్టురాలయ్యింది. పుత్రప్రేమతో భరతుడిని రాజును చెయ్యమనీ, రాముడిని అడవులకు పంపమనీ ఈమె పట్టుపట్టింది. దశరథుడు బ్రతిమాలి చెప్పినా ఈమె వినలేదు. కైక మొండిది.

కైక పట్టుదల వల్లనే దశరథుడు రాముడిని వనవాసానికి పంపవలసి వచ్చింది. రామునిపై బెంగతో దశరథుడు మరణించాడు. రాముని వనవాసానికి, దశరథుని మరణానికి కైక యొక్క మూర్ఖపు పట్టుదలయే కారణము.

‘సీత’ భర్త రామునికి తోడుగా ఉండి అరణ్యానికి వెళ్ళింది. కైక, భర్త దశరథుని మరణానికి కారణం అయ్యింది. సీత మహాపతివ్రత కాగా, కైక గయ్యాళి భార్య. కైక భర్త మాటను లెక్కచేయలేదు. సీత రాముని కోసం, తన ప్రాణాలను కూడా ఇవ్వగల ఉత్తమ సతి. రామాయణ కావ్యంలో సీత – కైక పాత్రలు రెండూ ప్రధానమైనవే. రామాయణ కథ, ఈ రెండు పాత్రల వల్లనే సాగింది. సీత మహాసాధ్వి. కైక గయ్యాళి గంప.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం

ప్రశ్న 10.
లక్ష్మణుని వ్యక్తిత్వాన్ని సొంతమాటల్లో రాయండి.
జవాబు:
లక్ష్మణుని మహిమ సాటిలేనిది. వాల్మీకి రామాయణము నందు లక్ష్మణుడు పరమాత్ముడగు, విష్ణువు యొక్క అంశయై అవతరించెనని పేర్కొందురు. కొన్ని గ్రంథములలో అతడు శ్రీరాముని వెన్నంటి వచ్చిన మహాత్ముడగు ఆదిశేషుని అవతారమని పేర్కొన బడినది. ఆయన జన్మ శ్రీరాముని చరణము లకు అంకితమైనది.

ఆయనను సేవించుటకే లక్ష్మణు డవతరించెనని ఈయన చరిత్ర వలన స్పష్టమగును. సోదరులందరికిని రఘు రాముని ఎడల సమానమైన ప్రేమకలదు. అయినప్పటికిని దేవాలయముల యందు మాత్రము రామచంద్రుని ప్రక్కన లక్ష్మణస్వామి ప్రతిమయే ప్రతిష్ఠింపబడి ఉండును. శ్రీరాముని నామముతో కూడా లక్ష్మణస్వామి పేరు సైతము స్మరింపబడు చుండును.

భరతశత్రుఘ్నులు మాత్రము శ్రీరామునకు దూరముగా తాతగారి ఇంటిదగ్గర స్వేచ్ఛగా మసలు కొనుచుండిరి. కాని లక్ష్మణుడు తన జీవిత మందెప్పుడును ఎట్టిపరిస్థితులలోను రామునివిడిచి ఉండలేదు. రాఘవుడు తనను పరిత్యజించిన వెంటనే లక్ష్మణుడు పరంధామము నకు వెళ్లిపోయెను. ఆయన బ్రహ్మచర్య వ్రతము నిరుపమానము.

ఆ స్వామి మహాధైర్యశాలి, సాటిలేని వీరుడు, తేజో విరాజితుడు, గొప్ప పరాక్రమ శాలి, జితేంద్రి యుడు, మిగుల చక్కనివాడు, సరళ స్వభావము కలవాడు, సహనము గలవాడు, భయమునెరుగనివాడు, కపటములేనివాడు, తపస్సంపన్నుడు, త్యాగి, సేవాభావముగలవాడు, అతడు సత్యసంధుడు, బుద్ధిమంతుడు, నీతికుశలుడు, శ్రీరామునియందు ఆయనకు గల ప్రేమ సాటిలేనిది. రామచంద్రుని చరణములను ధ్యానించుచు ఆయనను సేవించుట యే తన పరమధర్మమని, కర్తవ్యమని అతడు తలంచెడివాడు.

ఈ ప్రపంచమంతయు రామచంద్రుని గుణము. లను గానము చేయును. శ్రీరాముడు భరతుని గుణములను వర్ణించును. రామభరతు లిరువురు లక్ష్మణుని ఉత్తమగుణములను ప్రశంసించు
చుందురు.

ప్రశ్న 11.
సుగ్రీవాజ్ఞ ఎటువంటిది ? సుగ్రీవుడు వానరులను ఏమని ఆదేశించాడు ?
జవాబు:
సీతాదేవి అన్వేషణకై సుగ్రీవుడు వివిధ ప్రాంతాలలో గల వానర వీరులను రావలసిందిగా చెప్పమని హనుమంతుణ్ణి ఆజ్ఞాపించాడు. పదిరోజుల్లోగా రాకపోతే వాళ్ళకు మరణదండన తప్పదని హెచ్చరించాడు. హనుమంతుడు ఈ వార్తను అన్ని దిక్కులకూ వేగంగా పంపాడు. ఫలితంగా కోట్లమంది వానరయోధులు కిష్కింధకు చేరుకున్నారు. సుగ్రీవుని ఆజ్ఞ అటువంటిది. దానికి తిరుగులేదు. అందుకే ‘సుగ్రీవాజ్ఞ’ అనేది జాతీయంగా స్థిరపడ్డది.

సుగ్రీవుడు శ్రీరామునికి వానరుల రాకను గురించి తెలిపాడు. సీతజాడను తెలుసుకోవడం, రావణుడి నివాసాన్ని పసిగట్టడమే ప్రధాన కర్తవ్యమన్నాడు శ్రీరాముడు. శ్రీరాముని సూచన మేరకు సీతాన్వేషణ కోసం వానర వీరులను నలుదిక్కులకు పంపాడు. తూర్పు దిక్కునకు ‘వినతుని’ నాయకత్వంలో సేనను పంపాడు. దక్షిణ దిక్కుకు అంగదుని నాయకత్వంలో హనుమంతుడు, జాంబవంతుడు మొదలైన ప్రముఖులతో కూడిన సేనను పంపాడు.

మేనమామ అయిన సుషేణుని నాయకత్వంలో పడమరకు, శతబలి నాయకత్వంలో ఉత్తర దిశకు సేనను పంపాడు. ఒక్కొక్క దిక్కుకు ఏయే ప్రదేశాలగుండా వెళ్ళాలో, అక్కడ ఏమేమి ఉంటాయో వివరంగా చెప్పాడు సుగ్రీవుడు. ఆ ప్రదేశాలకు సంబంధించిన అతని జ్ఞానం చూస్తే ముక్కున వేలేసుకుంటాం. నెలరోజుల్లో సమాచారం తెమ్మని సుగ్రీవాజ్ఞ. సీతాన్వేషణను సఫలం చేయగల సమర్థుడు హనుమంతుడేనని సుగ్రీవుడి నమ్మకం. హనుమంతుడూ అంతే విశ్వాసంతో ఉన్నాడు.

శ్రీరాముడి భావన కూడా అదే. అందుకే తన పేరు చెక్కబడిన ఉంగరాన్ని హనుమంతుడికి ఇచ్చాడు శ్రీరాముడు. సీత దీన్ని చూస్తే హనుమను రామ దూతగా నమ్ముతుందన్నాడు. హనుమంతుడు నమస్కరించి రామముద్రికను గ్రహించాడు. శ్రీరాముని పాదాలకు ప్రణమిల్లి ప్రయాణమయ్యాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం

ప్రశ్న 12.
సీతాదేవి గుణశీలాదులను వివరించండి.
జవాబు:
ప్రపంచమునందలి పతివ్రతలలో సీతాదేవి మేలు బంతి. పతిసేవా పరాయణులైన స్త్రీలయందు సాధ్వికి మిగుల ఉన్నతస్థానము కలదు. రామాయణములో వర్ణించబడిన స్త్రీల చరిత్రలన్నింటి యందును ఆమె చరిత్రము సర్వోత్తమమైనది, అన్ని విధముల ఆదర్శప్రాయమైనది, అనుసరణయోగ్య మైనది. హిందూసమాజమునందలి స్త్రీలకందరికిని అన్ని విధములుగా సీతాదేవి జీవితము మార్గ దర్శకము.

సీతాదేవియందు అసాధారణ పాతి వ్రత్యము, త్యాగము, సౌశీల్యము, నిర్భయత్వము, శాంతము, క్షమాగుణము, సౌహార్థము, సహన శీలము, ధర్మపరాయణత, వినయము, సంయ మనము, సేవాభావము, సదాచారము, వ్యవహారము నందలి పటుత్వము, సాహసము, శౌర్యము మొదలగు గుణములన్నియు గూడుకట్టుకొనిఉన్నవి. ప్రపంచము నందలి ఏ ఇతర స్త్రీయందును ఇట్టి మహోన్నత గుణములు దుర్లభములు. సీతాదేవి యొక్క పవిత్ర జీవనము, నిరుపమాన పతిభక్తి అపూర్వములు.

ప్రపంచ చరిత్రలను ఎంతగా గాలించి చూచినను అట్టివి కానరావు. మొదటి నుండియు ఆ మహాసాధ్వి అన్ని విషయములందును పవిత్రురాలు, ఆదర్శ వంతురాలు. ఆమె జీవితము నందలి ఘట్టములు అన్నియును మనతల్లులకు, అక్కచెల్లెళ్ళకు, కోడళ్ళకు, కుమార్తెలకు చక్కని ప్రబోధాత్మకములు, స్ఫూర్తి దాయకములు. నేటి వరకు గల స్త్రీలందరిలో ‘సీతాదేవి మిన్నయైన పతివ్రతాశిరోమణి’ అని చెప్పుటలో అతిశయోక్తి ఎంతమాత్రమును లేదు.

సీతాదేవి తన జీవితమున కఠిన పరీక్షలను ఎదుర్కొనెను. ఆపదలందు కూడ తన ధర్మమును పాటించిన స్త్రీ. సీతాదేవి యొక్క పతిభక్తి, అత్తలయెడ సేవాభావము, ‘అందరిని గౌరవించు స్వభావము,
ప్రేమతో వ్యవహరించుట, ఋషులను, మునులను సేవించుట మొదలగు జీవనవిధానములు ఆమె కీర్తికిరీటమునకు వన్నెలు దిద్దినవి. వీరులు, పరాక్రమవంతులు అయిన కుశలవులకు జన్మనిచ్చిన ఆ జానకీదేవి ఎంతయు ధన్యాత్మురాలు.

సీతాదేవి సాక్షాత్తు దైవస్వరూపిణి. అయినప్పటికిని ఆమె తన మానవజీవితమునందు ఆదర్శచరిత్ర కలిగి సామాన్య గృహిణిగా మసలుకొనెను. ఏ స్త్రీయైనను పట్టుదలతో, దీక్షతో పూనుకొనినచో ఆమె యొక్క పవిత్ర జీవన విధానములను అనుసరించ గలుగును. ఇందు ఆమె చరిత్ర అలౌకికము కాదు, వ్యావహారికమైనది. అట్టివానిని ఆచరించినచో స్త్రీలందరును పరమ ప్రయోజనమును పొందగలరు.

ప్రశ్న 13.
శ్రీరాముని వ్యక్తిత్వం మనకందరికీ ఆదర్శం. దీనిని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
శ్రీరాముడు మంచిగుణాలు కలవాడు. ఆపదల్లో తొణకనివాడు. ధర్మమూర్తి, ఆశ్రితులను ఆదుకొనే వాడు. ఆడిన మాట తప్పనివాడు. వీరుడు, సౌందర్యమూర్తి. తండ్రిమాట జవదాటనివాడు. పెద్దలయెడ గౌరవం, దేవతలు-ఋషులు, మునుల పట్ల భక్తి కలవాడు.

అధర్మాన్ని అనుసరించిన వాలిని, రావణుని, రాక్షసగుణాలను మట్టుపెట్టి ధర్మాన్ని స్థాపించాడు. రావణుని అవినీతిని వ్యతిరేకించి వచ్చిన విభీషణునికి ఆశ్రయమిచ్చి లంకకు రాజును చేశాడు.

శ్రీరాముడు మహర్షులను, పెద్దలను గౌరవించాడు. భరతునిపై కోపాన్ని చూపకుండా తన పాదుకలను ఇచ్చి పంపించాడు. తనను ఆశ్రయించిన సుగ్రీవుడిని, విభీషణుడిని ఆదరించాడు. శ్రీరామునికి తన జన్మభూమిపై గల అనురాగం అపూర్వమైందిగా కనిపిస్తుంది.

శ్రీరామునివలె మనము కూడా తమ్ముళ్ళను ప్రేమగా చూడాలి. ఆశ్రయించిన వారికి అభయం ఇవ్వాలని, శ్రీరాముని పాత్ర ద్వారా తెలుస్తుంది. రాముడు పక్షియైన జటాయువుకు అంత్యసంస్కారం చేశాడు. రాముని తండ్రికి మిత్రుడు. అందువల్ల రాముడు ఆ పక్షిపై దయచూపాడు. రాముడు ధర్మ రక్షణతో యుద్ధం చేశాడు. రాముని వలె మనం ధర్మాన్ని కాపాడాలి. మొత్తం మీద శ్రీరాముని వ్యక్తిత్వం సదా మనకందరికీ ఆదర్శం.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం

ప్రశ్న 14.
రామాయణం ఆధారంగా కుటుంబంలోని వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలో సోదాహరణంగా వివరించండి.
జవాబు:
రామాయణంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నల అన్నదమ్ముల అనుబంధం ఆదర్శవంతం. రావణ, కుంభకర్ణ, విభీషణుల సోదర బంధాన్ని కూడా చక్కగా చెప్పడం జరిగింది. అలాగే సుగ్రీవునకు, వాలికి మధ్య గల అన్నదమ్ముల అనుబంధం కూడా రామాయణంలో ఉంది. వారిద్దరి మధ్య ఏర్పడిన వివాదాల కారణంగా వాలి తన ప్రాణాలను పోగొట్టు కున్నాడు.

ముఖ్యంగా రామలక్ష్మణుల అనుబంధం ఏనాటికీ విడదీయరానిదిగా ఉంటుంది. అరణ్యవాస సమయంలోను, యుద్ధంలోను లక్ష్మణుడు శ్రీరాముడిని అంటి పెట్టుకొని ఉన్నాడు. సదా సేవించాడు. లక్ష్మణుడు అన్న సేవలో తన సౌఖ్యాలను కూడా వదులుకున్నాడు. యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్ఛపోతే శ్రీరాముడు తీవ్రంగా దుఃఖించాడు. అది రామలక్ష్మణుల అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా నిలిచింది.

రామలక్ష్మణుల అన్నదమ్ముల అనుబంధము వల్ల నేను ఎన్నో విషయాలను గ్రహించాను. ఎన్నో కష్టాలు, సుఖాలు వచ్చినా, నష్టాలు వచ్చినా అన్నదమ్ములు కలకాలం కలసి ఉండాలని గ్రహించాను. అన్నదమ్ముల అనుబంధం మాన వీయతకు ప్రతిబింబంగా గ్రహించాను. ఆధునిక కాలంలో డబ్బుకోసం, భూమికోసం తగాదాలు పడుతూ, ఒకరినొకరు చంపుకుంటున్న అన్న దమ్ములకు రామలక్ష్మణుల సోదర ప్రేమ ఆదర్శంగా ఉంటుందని గ్రహించాను. ముఖ్యంగా పాఠశాల స్థాయిలో రామాయణ కథను అందరికి విని పించాలని, దానిద్వారా విద్యార్థుల్లో నైతిక విలువలు పెరుగుతాయని గ్రహించాను.

ప్రశ్న 15.
రామాయణంలోని ఆదర్శపాత్రలు ఏవి ? అవి ఎందుకు ఆదర్శప్రాయంగా నిలిచాయో రాయండి.
జవాబు:
శ్రీమద్రామాయణం మానవజాతికి ఆదర్శ గ్రంథం. అది జాతిని జాగృతం చేసింది. రామాయణంలోని పాత్రలు సహజంగా కనిపిస్తాయి. సకల మానవాళికి ఆదర్శంగా నిలుస్తాయి. రామాయణంలోని ముఖ్య పాత్రలలో కొన్ని :

శ్రీరాముడు : ఇతడు సత్యధర్మ పరాక్రమవంతుడు, ఆదర్శ ప్రభువు. మూర్తీభవించిన ధర్మ స్వరూపుడు. మహావీరుడైన రావణుని చంపాడు. తనను ఆశ్రయించిన విభీషణుని, సుగ్రీవుని ఆదరించాడు. ఏకపత్నీవ్రతునిగా కొనసాగాడు.

సీత : ఈమె గొప్ప పతివ్రత. ఎన్నో కష్టాలు అను భవించింది. నిరంతరం భర్తనే అనుసరించింది. రావణుని తృణ ప్రాయంగా భావించింది. అగ్ని ప్రవేశం చేసి, తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంది.

లక్ష్మణుడు : ఇతడు గొప్ప సేవకుడు. అన్నను కష్టాల్లో అనుసరించాడు. ఆరణ్యాల్లో అండగా నిలిచాడు. అన్నా వదినలను సేవించాడు. తన సుఖసంతోషాలను కూడా ప్రక్కనపెట్టి శ్రీరాముని సేవలో తరించాడు.

హనుమంతుడు : రామాయణంలో ఇతడు గొప్ప భక్త శిఖామణి. మహామంత్రిగా రాణించాడు. సీతాన్వేషణలో హనుమంతుని కృషి అపూర్వమైనది. లంకలో తన పరాక్రమాన్ని చూపాడు. రావణునికి హితోపదేశాన్ని చేశాడు. సంజీవిని తెచ్చి లక్ష్మణుని ప్రాణాలను నిలిపాడు. ఆదర్శ సేవకునిగా, కార్య సాధకునిగా కీర్తి పొందాడు.

భరతుడు : ఇతని సోదర భక్తి నిరుపమానమైంది. రాజ్యాన్ని తిరస్కరించి రాముని సమీపించాడు. తన తల్లి తప్పును క్షమించమని కోరాడు. రాముని పాదుకలను తీసుకొని, వాటికి పట్టాభిషేకం చేసి రామునికి ప్రతినిధిగా రాజ్యాన్ని పాలించిన మహా మనిషి.

ఈ విధంగా రామాయణంలో ఎన్నో పాత్రలు మనకు ఆదర్శంగా నిలుస్తాయి. వారి మార్గంలో ప్రజలంతా పయనించాలి.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం

ప్రశ్న 16.
రామాయణ రచనను ప్రభావితం చేసిన పరిస్థితు లను వివరించండి.
జవాబు:
శ్రీమన్నారాయణుని నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. నారదుడు తపస్వి, వాక్చాతురుల్లో శ్రేష్ఠుడు. వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారినడిగాడు (జిజ్ఞాసే విజ్ఞానానికి మూలం).

‘ఓ మహర్షీ! అన్నీ మంచి గుణాలు కలవాడు, ఎలాంటి ఆపదలు చుట్టు ముట్టినా తొణకనివాడు, ధర్మం తెలిసినవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు, మాటతప్పని వాడు, సకల ప్రాణులకు మేలుచేసేవాడు, వీరుడు, ధీరుడు, అసూయలేనివాడు, అందమున్నవాడు…. ఇలాంటి శుభలక్షణాలు కలవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నాడా ?” అని ప్రశ్నించాడు. నారదుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు.

‘మహామునీ ! ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదురుకోవడం సాధారణంగా జరగదు. కానీ, నీవు తెలిపిన విశిష్ట గుణాలన్నీ మూర్తీభవించినవాడు శ్రీరాముడ’ని తెలిపాడు. రామాయణగాథను సంక్షిప్తంగా వాల్మీకికి వినిపించాడు నారదుడు. అక్కడి నుంచి బ్రహ్మ లోకానికి వెళ్ళిపోయాడు.

వాల్మీకి రామకథను గురించి ఆలోచిస్తూ, శిష్యులతో కలిసి స్నానం చేయడానికి తమసానదీ తీరానికి వెళ్ళాడు. ఆ సమయంలో ఒకవేటగాడు బాణంతో ఒక మగక్రౌంచ పక్షిని కొట్టి చంపాడు. అప్పుడు వాల్మీకి హృదయంలో కరుణరసం పొంగింది. ‘మానిషాద’ అనే శ్లోకం ఆయన నోట వెలువడింది. వాల్మీకి తిరిగి ఆశ్రమానికి వచ్చాడు.

బ్రహ్మ వాల్మీకిని చూడడానికి ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి బ్రహ్మకు ఉపచారాలుచేశాడు. వాల్మీకి హృదయంలో ‘మానిషాద’ అనే శ్లోకం మళ్ళీమళ్ళీ ప్రతిధ్వనించింది. పిమ్మట బ్రహ్మ చిరునవ్వు నవ్వి వాల్మీకితో ‘నీవు పలికింది శ్లోకమే. ఈ ఛందస్సులోనే రామాయణం వ్రాయి. ఈ లోకంలో పర్వతాలు, నదులు ఉన్నంతకాలం రామాయణ గాథను కీర్తిస్తూనే ఉంటారు’ అని చెప్పాడు. ఈ రకంగా బ్రహ్మ ఆదేశానుసారం వాల్మీకి రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు.

ప్రశ్న 17.
రామాయణం ఆధారంగా సమాజంలోని వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలో సోదాహరణంగా వివరించండి.
జవాబు:
శ్రీమద్రామాయణం ఆదర్శవంతమైన గ్రంథం. ఇది జాతిని జాగృతం చేసింది. రామాయణంలోని పాత్రలు సజీవంగా నిలుస్తాయి. మనమంతా అనుసరించ దగిన పాత్ర శ్రీరాముడు. ఆయన నడిచిన మార్గము ధర్మ మార్గము.

శ్రీరాముని లాగా ప్రజలు తమ భార్యలయందు మిక్కిలి అనురాగాన్ని ప్రదర్శించాలి. అన్నదమ్ముల మధ్య పటిష్టమైన అనుబంధం ఉండాలి. సీతా రాములవలె ఆదర్శవంతమైన దాంపత్య జీవితాన్ని కొనసాగించాలి. శ్రీరాముడు తల్లి దండ్రులపై ప్రేమ గలవాడు. శ్రీరాముడు తండ్రిని సత్య ప్రతిజ్ఞునిగా నిలబెట్టడం కోసం 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు. రాజ్యాన్ని తృణప్రాయంగా తిరస్కరించాడు. అట్లే లక్ష్మణుడు తన అన్నను సేవించడం కోసం సుఖ సంతోషాలను విడనాడి అరణ్యానికి వెళ్ళాడు. అన్నావదినలను సేవించాడు.

రామాయణంలో శరణాగతి రక్షణ ప్రధాన మైందిగా పేర్కొనవచ్చు. రాముడు తనను ఆశ్రయించిన సుగ్రీవునికి, విభీషణునికి రాజ్యాన్ని అందించాడు. రాముడు దుష్ట రాక్షసులను సంహరించి లోకానికి ఆదర్శంగా నిలిచాడు.

అట్లే భరతుడు కూడా రామునిపై అచంచలమైన భక్తిని ప్రదర్శించాడు. రాముని పాదుకలను తీసుకొని, వాటికి పట్టాభిషేకం చేసి తన భక్తిని లోకానికి చాటాడు. ఈ రకంగా రామలక్ష్మణ, భరతశత్రుఘ్నుల సోదర సంబంధం అనుసరణీయం. కుటుంబంలోని ఆత్మీయతానురాగాలకు రామాయణ కథ ఆదర్శవంతం. రామాయణంలోని కుటుంబ జీవనం మధురమైంది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం

ప్రశ్న 18.
శ్రీరాముని పితృవాక్య పరిపాలనను వివరించండి.
జవాబు:
శ్రీరాముడు దశరథుడు, కౌసల్యల పుత్రుడు. శ్రీరాముడు ఎప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్న మయ్యేవాడు. పితృవాక్య పరిపాలకుడు. తండ్రి అనుమతితోనే విశ్వామిత్రుని యజ్ఞాన్ని రక్షించడానికి ఆయన వెంట వెళ్ళాడు. పినతల్లి కైక తన తండ్రి నుండి కోరిన వరాలమేరకు తండ్రిమాట పాటించడానికి పదునాలుగేళ్ళు వనవాసం చేశాడు. భరతుడు ప్రార్థించినా, అయోధ్య ప్రజలు విలపించినా, తల్లి వారించినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తండ్రి స్వయంగా చెప్పకపోయినా పినతల్లి వినిపించిన మాటలనే తండ్రి ఆజ్ఞగా స్వీకరించాడు. అడవులలో ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. సీతావియోగ దుఃఖాన్ని భరించాడు. రావణాసురుని రాక్షస కులాన్ని సమూలంగా నిర్మూలించాడు. ధర్మాన్ని ప్రతిష్ఠించాడు. రాచరికపు సౌఖ్యాలన్నీ త్యజించి నార బట్టలు ధరించి అన్ని కష్టాలకు సిద్ధపడ్డాడు. తండ్రిమాట పాటించడమే తన ధర్మంగా భావించిన ఆదర్శ పురుషుడు శ్రీరాముడు.

ప్రశ్న 19.
సీతాదేవి అగ్నిప్రవేశ వృత్తాంతాన్ని రాయండి.
జవాబు:
రావణుని మరణం తర్వాత, విభీషణుడు పల్లకిలో సీతాదేవిని శ్రీరాముని దగ్గరకు చేర్చాడు. కానీ సీతను స్వీకరించడానికి రాముడు నిరాకరించాడు. చాలా కాలం పరపురుషుడైన రావణుని పంచన ఉన్నందు వల్ల సీత ప్రవర్తన గురించి అనుమానం ఉందన్నాడు. తన ఇష్టం వచ్చిన చోటుకు సీత వెళ్ళవచ్చన్నాడు. తన వంశ ప్రతిష్ఠ నిలుపుకోవడానికే రావణుని చెర నుండి సీతను విడిపించానన్నాడు.

శ్రీరాముని మాటలు సీతకు సూదుల్లా గుచ్చు కున్నాయి. స్థాయికి తగినట్లు రాముడు మాట్లాడ లేదన్నది. శ్రీరామునికి తన శీలం గురించి నమ్మకం కలిగించడానికి అగ్నిప్రవేశమొక్కటే మార్గమని భావించింది. లక్ష్మణుడు పేర్చిన చితిలో సీత అగ్నిప్రవేశం చేసింది. అగ్నిదేవుడే స్వయంగా వచ్చి, సీతాదేవిని బయటకు తీసుకొని వచ్చి, ఆమె గొప్పదనాన్ని లోకానికి వెల్లడించాడు. సీతను స్వీకరించాల్సిందిగా శ్రీరాముణ్ణి కోరాడు.

సీత శీలం గొప్పదనాన్ని మూడు లోకాలకు చాటడానికే సీత అగ్నిప్రవేశం చేస్తున్నా ఊరుకున్నానే గానీ, సీత గురించి తనకంతా తెలుసునని రాము డన్నాడు. సీతను దగ్గరకు తీసుకున్నాడు.

ఈ వృత్తాంతంవల్ల సీత వంటి పతివ్రతలను తాకడానికి అగ్నిదేవుడు కూడా భయపడతాడని తెలుస్తోంది. సీత గొప్పదనమూ, సీత మీద రాముని కున్న నమ్మకమూ తెలుస్తున్నాయి.

ప్రశ్న 20.
విశ్వామిత్రుడు అయోధ్యకు రావడం రామాయణంలో ప్రధాన ఘట్టంగా అభివర్ణిస్తూ వ్రాయండి.
జవాబు:
వాల్మీకి రచించిన రామాయణం మనకు ఆదికావ్యం. ఇందులో ఆరు కాండలు ఉంటాయి. రామాయణం మానవ జీవితానికి పరమార్థాన్ని తెలియజేసే కావ్యం. మానవుడు మహానీయుడిగా ఎలా మారాలో తెలియజేసే ఉత్తమ గ్రంథం.

రామాయణంలో బాలకాండలో విశ్వామిత్రుని పాత్ర ప్రముఖమైనది. విశ్వామిత్రుడు అయోధ్యకు రావడం రామాయణ కథలో ప్రధాన మలుపుగా పేర్కొనవచ్చు. రామలక్ష్మణ భరతశత్రుఘ్నుల విద్యాభ్యాసం చక్కగా జరిగింది. ఆ సమయంలో విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చాడు. విశ్వామిత్రుడు తన శక్తియుక్తులను, ఆయుధ సంపత్తిని, రామ లక్ష్మణులకు ధారాదత్తం చేయాలనుకున్నాడు.

యాగరక్షణ ఒక నెపం మాత్రమే. విశ్వా మిత్రునికి రామలక్ష్మణులపై దశరథునికి ఎంత ప్రేముందో తెలుసు. దశరథునికి పుత్రప్రేమ అధికం. రాముడిని పంపించనని చెప్పాడు. చివరకు వశిష్ఠుని మాట విని రామలక్ష్మణులను విశ్వామిత్రుని వెంట పంపించాడు.

యాగరక్షణకు ముందు విశ్వామిత్రుడు ఎన్నో మంత్రాలను ఉపదేశించాడు. శస్త్రాస్త్రసంపత్తిని అందించాడు. సీతారాముల వివాహానికి విశ్వా మిత్రుడు పునాది వేశాడు. విశ్వామిత్రుని రాకతో రామాయణంలో ప్రధానమైన మలుపు తిరిగిందని చెప్పవచ్చు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం

ప్రశ్న 21.
రామాయణ ప్రాశస్త్యమును గురించి రాయండి.
జవాబు:
మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం “రామాయణం”. మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ. “అమ్మానాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యానురక్తి, స్నేహఫలం, ధర్మబలం, వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలన” ఇలా జీవిత పార్శ్వాలనెన్నింటినో పట్టి చూపిస్తుంది రామాయణం.

రామాయణాన్ని చదవడమంటే జీవితాన్ని చదవడమే. రామాయణం పారాయణ గ్రంథం మాత్రమే కాదు, ఆచరణ ప్రధాన గ్రంథం. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనిషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది. చిన్నచిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్నందిస్తుంది. “రామో విగ్రహవాన్ ధర్మః సత్యధర్మ పరాక్రమః” అన్న మహితోక్తిని మారీచుని నోటినుండి మహర్షి పలికించాడు. రామునివంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శకావ్యం ‘నభూతో నభవిష్యతి !’ మనిషి ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది.

ప్రపంచ సాహిత్యంలోనే ఆదికావ్యం రామాయణం. వాల్మీకి మహర్షి దీనిని రచించి ‘ఆదికవి’ గా కీర్తి పొందాడు. ‘రామాయణం, పౌలస్త్యవధ, సీతా యాశ్చరితం మహత్’ అనే మూడు పేర్లు దీనికున్నాయి. ఆరు కాండల (విభాగం)తో, ఇరవై నాలుగు వేల శ్లోకాలతో, సంస్కృతభాషలో సాగిన రచన ఇది. తరువాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి. మనదేశంలోనే కాదు ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది. వారివారి ప్రతిభననుసరించి వాల్మీకి కథకు జోడింపులు చేసిన కవులూ ఉన్నారు.

రామాయణాన్ని అందరూ చదవాలి. దీనివల్ల సనాతన భారతీయ సంస్కృతి తెలుస్తుంది. మానవీయ విలువలు తెలుస్తాయి. మనిషి తన జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు. మహోన్నత ఉత్తమ గుణాలను పొందగలుగుతాడు.

ప్రశ్న 22.
సీతారామకళ్యాణమును రాయండి.
(లేదా)
శివధనుర్భంగ వృత్తాంతమును విశ్లేషించండి.
జవాబు:
విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో “జనక మహారాజు యజ్ఞం చేస్తున్నాడు. అక్కడ ఒక మహాధనస్సు ఉంది. అక్కడకు వెడదాం” అన్నాడు. రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట మిధిలకు బయలుదేరారు. దారిలో మహర్షి రామలక్ష్మణులకు తన వంశాన్ని గూర్చి, గంగ వృత్తాంతాన్ని గూర్చి చెప్పాడు. భగీరథుని వృత్తాంతం చెప్పాడు.

మిధిలా నగరం సమీపంలో, వారు గౌతమ మహర్షి ఆశ్రమం చూశారు. ఆ ఆశ్రమంలో అహల్యాగౌతములు ఉండేవారు. అహల్య తప్పు చేసిందని గౌతముడు అహల్యను వేల సంవత్సరాల పాటు అన్నపానాలు లేకుండా బూడిదలో పడి ఉండమని శపించాడు. రాముని రాకతో ఆమెకు శాపవిముక్తి కలుగుతుందని చెప్పాడు. రాముడు మహర్షి ఆదేశంపై గౌతమాశ్రమంలో కాలుమోపి, అహల్యకు శాపవిముక్తి కల్పించాడు.

మిధిలలో జనక మహారాజు వీరిని ఆదరించాడు. అహల్యా గౌతముల కుమారుడు శతానందుడు, రామునికి కృతజ్ఞతలు చెప్పాడు. జనకుడు రామ లక్ష్మణులను ఆహ్వానించాడు. విశ్వామిత్రుడు జనకునితో “వీరు దశరథ పుత్రులు రామలక్ష్మణులు. నీ ధనస్సును చూద్దామని వచ్చారు. చూపించు శుభం కలుగుతుంది” అని చెప్పాడు. జనకుడు శివధనస్సు చరిత్రను వివరించి తన కూతురు సీత నాగటి చాలులో దొరికిందనీ, ఆ సీతను శివధనుస్సును ఎక్కుపెట్టగల వీరునికి ఇచ్చి పెండ్లి చేస్తానని చెప్పాడు. చాలామంది రాజులు శివధనస్సును ఎక్కుపెట్టలేకపోయారని కూడా చెప్పాడు.

విశ్వామిత్రుడు శివధనస్సును తెప్పించమన్నాడు. ఐదువేలమంది కలసి శివధనస్సు ఉన్న పెట్టెను సభలోకి తెచ్చారు. రాముడు పట్టుకోగానే శివధనస్సు వంగింది. నారి ఎక్కుపెట్టగా ఆ ధనస్సు ధ్వనిచేస్తూ విరిగింది.

జనకుడు సీతారాములకు పెండ్లి చేయడానికి సిద్ధం అయ్యాడు. దశరథునికి కబురుపెట్టారు. అయోధ్య నుండి అందరూ వచ్చారు. జనకుడు తన కుమార్తెలు సీతా, ఊర్మిళలను, రామలక్ష్మణులకు, తన తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలు మాండవిని, శ్రుతకీర్తిని భరతశత్రుఘ్నులకు ఇచ్చి పెండ్లి చేశాడు.

దశరథుడు అయోధ్యకు తిరిగి వెడుతుండగా పరశురాముడు ఎదురువచ్చాడు. రాముడు పరశు రాముని చేతిలోని వైష్ణవి ధనస్సును ఎక్కుపెట్టాడు. పరశురాముడు ఓడిపోయి, మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం

ప్రశ్న 23.
శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి గల కారణమేమి ?
జవాబు:
దశరథుడు శ్రీరామునికి యువరాజుగా పట్టం కట్టాలని ఆలోచించాడు. అందరూ సంతోషించారు. అయోధ్య నగరంలో పండుగ వాతావరణం చోటు చేసుకున్నది. దశరథుని చిన్నభార్య కైకేయికి ఆమె దాసి మంథర దుర్బోధలు చేసింది. “నీ కొడుకు భరతుడు రాజైతే నీవు పట్టపురాణివి ఔతావు. లేకుంటే నీవు కౌసల్యకు నీ కొడుకు రామునికి సేవకుల్లా బతకాల్సిందే” అని చెప్పింది.

కైక మందిరానికి వచ్చిన దశరథుని కైక రెండు వరాలుకోరింది. రాజు సంతోషంతో ఇస్తానని చెప్పాడు. వెంటనే కైక రాముని పదునాలుగేళ్ళు వనవాసం, భరతునికి పట్టాభిషేకం అనే రెండు వరాలు కోరింది. దశరథుడు దుఃఖంతో కుప్పకూలి పోయాడు. కైక రామునికి కబురు పంపింది. దశరథుడు తనకిచ్చిన వరాల గురించి చెప్పింది. తండ్రి ఆజ్ఞను శిరసావహించి రాముడు సీతా లక్ష్మణులతో కలిసి అడవులకు వెళ్ళాడు.

ప్రశ్న 24.
శ్రీరామ సుగ్రీవుల మైత్రి ఎలా ఏర్పడింది ?
(లేదా)
సుగ్రీవుని మిత్రత్వాన్ని సోదాహరణంగా వివరించండి.
జవాబు:
సుగ్రీవుడు సూర్యుని అంశతో జన్మించినవాడు. ఇతని అన్నయగు వాలి ఇంద్రాంశ సంభవుడు. వీరి తండ్రి ఋక్షవిరజుడు. మాయావి అనే రాక్షసునితో యుద్ధములో అన్న వాలి మరణించాడు అనుకొని, మరలివచ్చిన సుగ్రీవునికి మంత్రులు కూడి చేసిన పట్టాభిషేకం వలన కిష్కింధకు రాజు అయ్యాడు.

కొంతకాలము తరువాత తిరిగివచ్చిన వాలి, సుగ్రీవునిపై ఆగ్రహం చెంది కిష్కింధ నుండి వెడల గొట్టి అతని భార్యను, కుమారులను నిర్బంధించెను. భూమండలం అంతా తిరిగి తిరిగి సుగ్రీవుడు వాలి అడుగుపెట్టని ఋష్యమూక పర్వతంపై తన మంత్రులైన హనుమంతుడు మొదలగువారితో కాలం గడుపుచుండెను.

రావణాసురుడు సీతాదేవిని అపహరించుకొని పోయిన పిమ్మట ఆమెను వెదకుచూ రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం వద్దకు చేరిరి. హనుమంతుడు రామలక్ష్మణులను సాదరముగా సుగ్రీవుని కడకు తీసికొనివచ్చెను. రామసుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులైరి. శ్రీరాముడు ఒకేఒక్క బాణముతో వాలిని వధించి సుగ్రీవుని భయమును తొలగించెను.

ప్రశ్న 25.
సీతాన్వేషణ వృత్తాంతం రాయండి.
జవాబు:
మారీచుణ్ణి చంపి, శ్రీరాముడు వెనుక వస్తుండగా లక్ష్మణుడు కనబడ్డాడు. రామలక్ష్మణులు ఆశ్రమానికి వెళ్ళి, సీతను వెదికారు. వనమంతా వెదికారు. సీత జాడ కనబడలేదు.

సీతను వెతుకుతూ వెళుతుంటే దారిలో రామ లక్ష్మణులకు రక్తంలో తడిసిన జటాయువు కనిపించాడు. రావణుడు సీతను అపహరించాడనీ, రావణుడే తనను దెబ్బతీశాడనీ, జటాయువు వారికి
చెప్పి మరణించాడు. రాముడు జటాయువుకు అంత్యక్రియలు చేశాడు.

రామలక్ష్మణులు “క్రౌంచారణ్యం” చేరుకున్నారు. అక్కడ వారికి కబంధుడనే రాక్షసుడు కనబడ్డాడు. ‘కబంధుడు’ రామలక్ష్మణులను చేతులతో పట్టు కున్నాడు. వాడు రామలక్ష్మణుల్ని తినడానికి నోరు తెరచాడు. వారు కబంధుని భుజాలు నరికి పార వేశారు. కబంధుడు కుప్పకూలాడు. శాపంవల్ల తనకు వికృతరూపం వచ్చిందని కబంధుడు వారికి చెప్పాడు.

రామలక్ష్మణులు రావణుని గురించి కబంధుణ్ణి అడిగారు. కబంధుడు తన శరీరాన్ని దహిస్తే తనకు దివ్యజ్ఞానం వస్తుందనీ, అప్పుడు రావణుడి గురించి చెప్పగలననీ చెప్పాడు. రామలక్ష్మణులు కబంధుడి శరీరానికి అగ్నిసంస్కారం చేశారు. కబంధుడు దివ్యదేహంతో వచ్చి, సీతాదేవి దొరికే ఉపాయాన్ని చెప్పాడు. సుగ్రీవుడితో స్నేహం చేయమన్నాడు. కబంధుడు సూచించిన మార్గంలో రామలక్ష్మణులు ప్రయాణించారు.

ఆ దారిలో శబరి ఆశ్రమానికి వెళ్ళారు. శబరి రాముడికి పండ్లు పెట్టింది. శ్రీరాముని అనుమతి పొంది శబరి తన శరీరాన్ని అగ్నికి ఆహుతిచేసి ఊర్ధ్వలోకాలకు వెళ్ళింది. రామలక్ష్మణులు ఈ విధంగా పంపా సరస్సుకు చేరారు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం

ప్రశ్న 26.
సేతువు నిర్మాణం గురించి రాయండి.
జవాబు:
సముద్రాన్ని దాటే ఉపాయమేమిటని సుగ్రీవుణ్ణి ప్రశ్నించాడు శ్రీరాముడు. సముద్రుణ్ణి ప్రార్థించడం వల్ల ఇది సాధ్యపడుతుందన్నాడు విభీషణుడు. శ్రీరాముడు సముద్రతీరంలో దర్భాసనంమీద కూర్చుని సముద్రుణ్ణి ఉపాసించాడు. మూడు రాత్రులు గడిచాయి. సముద్రుడు ఎదుట నిలువ లేదు. శ్రీరాముడి కన్నులు ఎర్రబారాయి. సముద్రుడి అహంకారాన్ని అణగదొక్కాల నుకున్నాడు. నీటి నంతా ఇంకిపోయేటట్టు చేయాలను కున్నాడు.

బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు. ప్రకృతంతా అల్లకల్లోల మౌతున్నది. సముద్రుడు భయపడి పారిపోతున్నాడు. పరుగెత్తే వానిపై బాణం ప్రయోగించరాదని ఆగాడు శ్రీరాముడు. సముద్రుడు దారికి వచ్చాడు. లంకకు వెళ్ళడానికి దారినిస్తానన్నాడు. ఎక్కుపెట్టిన బాణం వృథాకారాదు. ఎక్కడ ప్రయోగించాలో చెప్పమన్నాడు. శ్రీరాముడు. పాపాత్ములు దోపిడి దారులు ఉండే ‘ద్రుమకుల్యం’పైన ప్రయోగించ మన్నాడు సముద్రుడు. అది జరిగిపోయింది.

విశ్వకర్మ కుమారుడైన ‘నలుడు’ శిల్పకళా నిపుణుడు. ఉత్సాహం, శక్తి ఉన్నవాడు. సేతువు (వంతెన) ను నిర్మించడానికి అతడే యోగ్యుడని సముద్రుడు తెలిపాడు. ఆ సేతువును తాను భరిస్తానని మాట ఇచ్చాడు. సేతువు నిర్మాణానికి వానర నాయకులకు ఆజ్ఞ ఇచ్చాడు శ్రీరాముడు. అందరూ మహారణ్యం దారిపట్టారు. పెద్దపెద్ద చెట్లను, బండరాళ్ళను మోసుకువచ్చి సముద్రంలో పడేశారు. వాటి దెబ్బకు సముద్రంలోని నీరు ఆకాశానికి ఎగిసి పడింది. నలుని సూచనల ననుసరించి కొలతల ప్రకారం సేతువు నిర్మాణం జరిగింది. వంద యోజనాల పొడవు, పది యోజనాల వెడల్పు గల సేతువును కట్టడం ఐదు రోజుల్లో పూర్తయింది.

ప్రశ్న 27.
భారతీయ జీవన విధానానికి రామాయణం మార్గదర్శకమని ఎలా చెప్పగలరు ? (March 2015)
జవాబు:
ప్రపంచ సాహిత్యంలోనే ఆదికావ్యం రామాయణం. వాల్మీకి మహర్షి దీనిని రచించి ‘ఆదికవి’గా కీర్తి పొందాడు. ‘రామాయణం’ ‘పౌలస్త్యవధ, సీతాయాశ్చరితం మహత్’ అనే మూడు పేర్లు దీని కున్నాయి. ఆరు కాండల (విభాగం)తో, ఇరవై నాలుగు వేల శ్లోకాలతో, సంస్కృత భాషలో సాగిన రచన ఇది. తరువాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి. మన దేశంలోనే కాదు ప్రపంచంలోని పలుదేశాల్లో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది.

మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం. మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ. ‘అమ్మానాన్నల అనురాగం, పుత్రుల అభిమానం అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం – గురుభక్తి, శిష్యానురక్తి – స్నేహఫలం, ధర్మబలం – వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం – జీవకారుణ్యభావన, ప్రకృతిలాలన’ – ఇలా జీవిత పార్శ్వాలనెన్నింటినో పట్టి చూపిస్తుంది రామాయణం.

రామాయణాన్ని చదవడమంటే జీవితాన్ని చదవడమే. రామాయణం పారాయణ గ్రంథం కాదు, ఆచరణ ప్రధాన గ్రంథం. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనీషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్నందిస్తుంది. “రామో విగ్రహవాన్ ధర్మః సత్యధర్మ పరాక్రమ” అన్న మహితోక్తిని మారీచుని నోటి నుండి మహర్షి పలికించాడు. రామునివంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శకావ్యం ‘నభూతో నభవిష్యతి !’ మనిషి ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం

ప్రశ్న 28.
రామలక్ష్మణులు విశ్వామిత్రుని యజ్ఞ సంరక్షణ చేసిన తీరును తెల్పండి. (March 2015)
జవాబు:
రామలక్ష్మణులు విశ్వామిత్రుని యాగ సంరక్షణకై విశ్వామిత్రుని వెంట బయలుదేరారు. తాటక వధనాంతరం సంతుష్టుడైన విశ్వామిత్ర మహర్షి రామునకు ఎన్నో దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు.

రామలక్ష్మణ సహితుడయి విశ్వామిత్రుడు ‘సిద్ధాశ్రమం’ చేరుకున్నాడు. అదే అతని యజ్ఞభూమి. రామలక్ష్మణులు వినయంగా చేతులు జోడించి గురువుగారిని యజ్ఞదీక్షను స్వీకరించమని ప్రార్థించారు, మన్నించాడు మహర్షి యజ్ఞదీక్షితు డయ్యాడు. మరునాడే యజ్ఞం ప్రారంభమైంది.

ఆరు రోజులపాటు సాగే ఈ యజ్ఞ విషయంలో అత్యంత జాగరూకులై ఉండమని రామలక్ష్మణులకు సూచించారు మునులు. ఐదురోజులైంది. కంటిమీద కునుకులేకుండా యజ్ఞాన్ని కాపాడుతున్నారు రామలక్ష్మణులు. రాక్షసుల రాకకు సూచనగా చివరి రోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా యజ్ఞకుండం నుండి జ్వాలలు ఎగసిపడ్డాయి.

మారీచ, సుబాహులు అనుచరులతో వచ్చారు. యజ్ఞవేదిక పరిసరాలు రక్తవర్షంతో తడిసి ముద్దయ్యాయి. రాముడు ‘శీతేషువు’ అన్న మానవాస్త్రాన్ని మారీచుడి పైకి ప్రయోగించాడు. దాని దెబ్బకు మారీచుడు నూరు యోజనాల దూరం ఎగిరి సముద్రంలో పడి పోయాడు. స్పృహకోల్పోయి గిరగిరా తిరుగుతూ కొట్టుకుపోతున్నాడు. మరు నిముషంలో ‘ఆగ్నేయాస్త్రం’ తో సుబాహుని వక్షస్థలాన్ని ప్రక్కలు చేశాడు. ‘వాయువ్యాస్త్రం’తో మిగతా రాక్షసుల భరతంపట్టాడు. రాక్షసబాధ తొలగింది. యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది. విశ్వామిత్రుడు సంతోషించాడు.

ప్రశ్న 29.
రామాయణం కథ ఆధారంగా రావణుని వ్యక్తిత్వాన్ని గురించి తెలపండి. (June 2015)
జవాబు:
రావణుడు మహా తేజశ్శాలి. హనుమంతుడు మొట్టమొదటిసారి రావణుని చూసి రావణుని తేజస్సుకు ఆశ్చర్యపడ్డాడు. అకంపనుడు, సీతను అపహరించి తెమ్మని, అలా చేస్తే రాముడు సీతావియోగంతో మరణిస్తాడని చెప్పాడు. శూర్పణఖ సీత అందాన్ని వర్ణించి చెప్పి రావణునిలోని స్త్రీ వ్యామోహాన్ని రెచ్చగొట్టింది. మారీచుడు, అకంపనుడు ఎంత చెప్పినా వినకుండా రావణుడు మూర్ఖత్వంతో సీతను అపహరించి తెచ్చాడు.

విభీషణుడు ఎంత హితవు చెప్పినా రావణుడు వినలేదు. రావణుడు పరాక్రమవంతుడు. జటాయువును సంహరించాడు. లక్ష్మణుడిని శక్తి ఆయుధంతో మూర్ఛపోయేలా చేశాడు. రాముడి పరాక్రమం ముందు మాత్రం రావణుడు నిలబడలేక పోయాడు. రావణుడు రామునితో సమంగా యుద్ధం చేశాడు. చివరకు రాముని బ్రహ్మాస్త్రానికి హతుడయ్యాడు.

రావణుడు కపటి. శ్రీరాముని మాయా శిరస్సును, ధనుర్బాణాలను సీతకు చూపించి రాముడు తన చేతిలో మరణించాడని అబద్ధం ఆడాడు. రావణుడు అవివేకి. హనుమంతుడు ఒక్కడే సముద్రాన్ని దాటివచ్చి ఎంతో మంది రాక్షసుల్ని చంపి లంకాదహనం చేసిన రాముని బలాన్ని గూర్చి అంచనా వేయలేకపోయాడు. తన కుమారుడు మహాశక్తివంతుడైన ఇంద్రజిత్తు, తమ్ముడు కుంభకర్ణుడు మరణించినా రావణుడు తెలివి తెచ్చుకోలేదు. మహాపతివ్రత అయిన సీతను బంధించి తెచ్చి తన చావును తానే కోరి తెచ్చు కున్నాడు.

లంకారాజ్యాధిపతి అయిన రావణుడు, స్త్రీ వ్యామోహంతో, అవివేకంతో, తనవారి యొక్క తమ్ముల యొక్క హితవచనాలు వినక రాముని చేతిలో మరణించాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం

ప్రశ్న 30.
రామాయణంలోని స్నేహధర్మాన్ని గురించి సొంతమాటల్లో రాయండి. (March 2016)
జవాబు:
రామాయణంలో స్నేహధర్మాన్ని గురించి తెలిపే వృత్తాంతము, ‘రామ సుగ్రీవుల’ వృత్తాంతము. సుగ్రీవుడి అన్న వాలి. వాలి సుగ్రీవుడి భార్యను అపహరించి సుగ్రీవుణ్ణి రాజ్యం నుండి దూరంగా తరిమివేశాడు. సుగ్రీవుడు ప్రాణభయంతో ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడు.

శ్రీరాముడి భార్యను రావణుడు అపహరించాడు. రామలక్ష్మణులు సీతను వెదకుతున్నారు. కబంధుడు, రాముణ్ణి సుగ్రీవుడితో స్నేహం చెయ్యమని చెప్పాడు. రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం దగ్గరకు వచ్చారు. రామలక్ష్మణులను చూసి మొదట సుగ్రీవుడు భయపడి హనుమంతుడిని సన్యాసి రూపంలో రామలక్ష్మణుల దగ్గరకు పంపాడు.

హనుమంతుడు సుగ్రీవుడి దగ్గరకు రామ లక్ష్మణులను తీసుకువెళ్ళాడు. శ్రీరామ సుగ్రీవులు, అగ్నిసాక్షిగా స్నేహితులయ్యారు. సుగ్రీవుడు తనకు అన్న వాలి నుండి భయం లేకుండా అభయం ఇమ్మని రాముడిని అడిగాడు. వాలిని తాను చంపుతానని రాముడు మాట ఇచ్చాడు. సీతను తాను వెదికిస్తానని, రావణుడితో యుద్ధంలో తాను సాయం చేస్తానని, సుగ్రీవుడు రామునికి మాట ఇచ్చాడు.

రామ సుగ్రీవుల స్నేహం ఫలించింది. రాముడు వాలిని చంపి సుగ్రీవుణ్ణి కిష్కింధ రాజ్యానికి రాజును చేశాడు. సుగ్రీవుడు రామునికి మాట ఇచ్చినట్లు, సీతాదేవిని వెదికించడానికి వానరులను పంపాడు. హనుమంతుడు, సుగ్రీవుడికి మంత్రి, అతడు సీత జాడను తెలుసుకు వచ్చాడు. సుగ్రీవుడు తన వానర సైన్యంతో లంకకు వెళ్లి రావణుడిని చంపడంలో రాముడికి మంచి సాయం చేశాడు.

ఈ విధంగా స్నేహితులు ఒకరి కొకరు, మంచి సాయం చేసుకున్నారు.

ప్రశ్న 31.
శ్రీరాముడి జీవితం ద్వారా మీరేమి గ్రహించారు ? (March 2016)
జవాబు:
రామాయణములో నాయకుడు శ్రీరాముడు. రాముడు నడచిన మార్గమే ‘రామాయణము’ రాముడిలా నడచుకోడమే, మనం రామాయణం నుండి నేర్చుకోవలసిన విషయము. శ్రీరాముడి జీవిత ద్వారా నేను గ్రహించినది.

శ్రీరాముడు మంచి గుణాలరాశి. శ్రీరాముడు మూర్తీభవించిన ధర్మ స్వరూపుడు, రాముడు పితృవాక్య పరిపాలకుడు. రాముడు గొప్ప సోదర ప్రేమ కలవాడు. శ్రీరాముడు మహావీరుడు. మూడు ఘడియల్లో రాముడు దండకారణ్యంలో ఖరదూషణాది రాక్షసులను చంపాడు. తేలికగా రావణ కుంభ కర్ణులను యుద్ధంలో సంహరించాడు.

తండ్రి చెప్పినట్లు పితృవాక్య పరిపాలకుడై, 14 సంవత్సరాలు భార్యతో అరణ్యములకు వెళ్ళాడు. భరతుడు తిరిగి రమ్మని అడిగినా, తండ్రికి ఇచ్చిన మాటకే రాముడు కట్టుబడ్డాడు. రాముడు విభీషణుడికి శరణు ఇచ్చి అతడిని లంకాధిపతిని చేశాడు. సుగ్రీవుడితో స్నేహం చేసి, వాలిని చంపి, సుగ్రీవుడిని కిష్కింధకు రాజును చేశాడు.

రాముడు తన తమ్ముడు లక్ష్మణుడిపై మంచి ప్రేమ చూపించాడు. రాముడు ఏకపత్నీవ్రతుడు. సీతపై గొప్ప అనురాగం కలవాడు. సీత కోసం లంకకు వచ్చి, రావణుడిని చంపి రాముడు సీతను చేపట్టాడు. రాముడు ధర్మప్రభువు. అందుకే రామరాజ్యం కావాలని ప్రజలు నేటికీ కోరుతున్నారు. తనకు సాయం చేసిన హనుమంతుడిని మెచ్చుకొని రాముడు అతడిని ఆలింగనం చేసుకున్నాడు.

పై విషయాలను రాముడి జీవితం ద్వారా నేను గ్రహించాను. శ్రీరాముడివలె సత్య ధర్మములను సర్వదా పాటించాలని గ్రహించాను.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం

ప్రశ్న 32.
రామాయణం ఆధారంగా కైకేయి పాత్ర స్వభావాన్ని వివరించండి. (June 2016)
జవాబు:
‘కైక’ దశరథ మహారాజు గారి మూడవ పట్టపురాణి. ఈమె భరతునికి తల్లి. రాముడంటే ఈమెకు చాలా ప్రేమ.

రాముడికి పట్టాభిషేకం చేస్తారని కైక అరణపుదాసి అయిన మంథరకు తెలిసింది. ఆమె, ఆ విషయం కైకతో చెప్పింది. కైకకు రాముడంటే చాల ఇష్టం. అందుకే ఆ వార్త తెచ్చిన మంథరకు, ఆనందంతో కైక మంచి బహుమతిని ఇచ్చింది. కైక ప్రవర్తనకు మంథర ఆశ్చర్యపోయింది. ఏడ్వవలసిన సమయంలో ఎందుకు సంతోషిస్తున్నావని మంథర కైకను అడిగింది. తనకు రామభరతులు ఇద్దరూ సమానమే అని కైక చెప్పింది.

అప్పుడు మంథర కైకకు దుష్టబోధ చేసింది. “రాముడు రాజు అయితే కౌసల్య రాజమాత అవుతుంది. కైక దాసి అవుతుంది. రాముడికి భరతుడు దాస్యం చేయవలసి వస్తుంది. తరువాత రాముడి సంతానానికే రాజ్యాధికారం వస్తుంది.

భరతుడి సంతానానికి రాజ్యం రాదు. కాబట్టి భరతుడికి రాజ్యాధికారం దక్కేటట్లు, రాముడు అడవులపాలు అయ్యేటట్లు చూడు” అని మంథర కైకకు చెప్పుడు మాటలు చెప్పింది. ఆ చెప్పుడు మాటలు విని, కైక మనస్సు మార్చుకుంది.

దశరథుని ముందు లేనిపోని కోపాన్ని ప్రదర్శించింది. దశరథుడు బ్రతిమాలగా రాముని అడవికి పంపి, భరతునికి పట్టాభిషేకం చేయమని దశరథుని కోరింది, వెంటనే రాముడు జటలు ధరించి 14 ఏళ్ళు అడవికి వెళ్ళాలని కైక మొండి పట్టుపటింది.

దశరథుడు ఈమెను మందలించినా, చివరకు భర్త ఈమె కాళ్ళు పట్టుకున్నా, కైక బండరాతి హృదయం కరుగలేదు. కైకేయి మనస్సు మారలేదు. కైక మూర్ఖురాలు. రాముడిని అడవులకు పంపింది. తద్వారా దశరధుని మరణానికి కారణమైంది. చెప్పుడు మాటలు వినడం ద్వారా కైక ఎందరి జీవితాల్లోనో చీకట్లను నింపింది. అపకీర్తిని పొందింది.

ప్రశ్న 33.
‘అన్నదమ్ముల అనుబంధానికి రామలక్ష్మణులు చిహ్నం’, సమర్థించండి. (June 2016)
జవాబు:
శ్రీమద్రామాయణం మనకు ఆదికావ్యం. వాల్మీకి ఆదికవి. మానవ జీవన మూలాలకు రామాయణం మణిదర్పణం. మానవుడిని పూర్తిగా సంస్కరించగలిగే ఉత్తమ కావ్యం రామాయణం. మానవ హృదయాల నుండి ఎన్నటికి చెరగని కథ రామాయణం అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల అనురాగం, స్నేహలకు, మానవీయగుణాలు ఈ రామాయణం ద్వారా మనకు తెలుస్తాయి. ముఖ్యంగా రామాయణం లోని సోదర ప్రేమ అందరికి ఆదర్శంగా నిలుస్తుంది.

రామాయణంలో రామలక్ష్మణుల మధ్యగల సోదర అనుబంధం జగతికే ఆదర్శంగా నిలుస్తుంది. వారి మధ్య ఉండే సోదర ప్రేమ అనిర్వచనీయ మైందిగా పేర్కొనవచ్చు. రాముడిని విడిచి లక్ష్మణుడు ఎన్నడూ ఉండలేదు. వీరిద్దరి మధ్యగల అన్యోన్యమైన సోదరప్రేమ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుంది. రామునితో కలిసి లక్ష్మణుడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు. సీతారాములకు రక్షణగా నిలిచాడు.

సీతాపహరణ సమయంలో కోపగించిన రాముడిని లక్ష్మణుడు శాంతపరిచాడు. కర్తవ్యో న్ముఖుడిని చేశాడు. అట్లే యుద్ధరంగంలో లక్ష్మణుడు మూర్ఛ పొందినప్పుడు రాముడు ఎంతగానో విలపించాడు. లక్ష్మణుడు లేకుండా తాను జీవింపలేనని చెప్పాడు. ఇది వీరిద్దరి మధ్య నున్న అనురాగం. అన్నదమ్ముల మధ్య ఉండాల్సిన ప్రేమానురాగాలు, మానవీయ సంబంధాలు అందరికి మార్గదర్శకంగా నిలుస్తాయి.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం

ప్రశ్న 34.
వాలి – శ్రీరాముని మధ్య జరిగిన సంవాదం సారాంశం రాయండి. (March 2017)
జవాబు:
రక్తపుమడుగులో పడివున్న వాలి కొంతసేపటికి తేరుకుని రామునితో “ఉత్తముడని పేరు పొందిన నీవు ఇంత అధర్మంగా ఎందుకు ప్రవర్తించావు ? నీకు నీ దేశానికి నేనెప్పుడూ అపకారం చేయతల పెట్టలేదు. అలాంటప్పుడు నన్నెందుకు చంపవలసి వచ్చింది. నిన్ను ఎదిరించి యుద్ధమే చేయలేదు. వేరొకరితో పోరుతున్నప్పుడు ఎందుకు దొంగదెబ్బ తీశావు ? సీతాదేవి కొరకు సుగ్రీవుణ్ణి ఆశ్రయించడం కన్నా తనను కోరివుంటే బాగుండే దన్నాడు. ఒక్కరోజులో సీతాదేవిని తెచ్చి అప్పజెప్పేవాడనని రావణుణ్ణి యుద్ధంలో బంధించి తెచ్చి నీ ముందుంచే వాడినని తెలిపాడు.

శ్రీరాముడి వాలి అభిప్రాయాలను తోసేసి తమ్ముడు భార్యను చెరబట్టడం వంటి అధర్మాలవల్ల మరణ దండన విధించానని, వానరుడివి కనుక చాటుగా ఉండి చంపడంలో తప్పు లేదన్నాడు.

ప్రశ్న 35.
అన్న పట్ల భరతునికి గల భక్తి భావాన్ని గురించి వివరించండి. (March 2017)
జవాబు:
దశరథుడు శ్రీరాముని ఎడబాటును సహింపలేక ప్రాణాలు విడిచాడు. రామలక్ష్మణులు అడవికి వెళ్ళారు. భరత శత్రుఘ్నులు మేనమామ ఇంటిలో ఉన్నారు. వశిష్ఠుడి ఆజ్ఞమేరకు దశరథుని శరీరాన్ని తైలద్రోణిలో జాగ్రత్త చేశారు. దూతలు వెళ్ళి ఎనిమిదవరోజున భరత శత్రుఘ్నులను అయోధ్యకు తీసుకువచ్చారు. భరతుడు తండ్రికి అంత్యక్రియలు పూర్తి చేశాడు.

భరతుడు కైకను తప్పు పట్టాడు. శత్రుఘ్నుడు మంథరను చంపడానికి సిద్ధమయ్యాడు. మంత్రులు భరతుణ్ణి రాజ్యాధికారం స్వీకరించమన్నారు. పెద్దవాడైన రాముడే రాజు కావాలని భరతుడు పట్టుపట్టాడు. తాను వెళ్ళి రాముణ్ణి అయోధ్యకు తీసుకువస్తానని భరతుడు అయోధ్యాపురవాసులతో కలసి అడవికి బయలుదేరాడు.

భరతుడు శృంగిబేరపురం చేరాడు. గుహుడు భరతుడి మనస్సు తెలియక, తికమక పడ్డాడు. విషయం తెలిసి గుహుడు భరతుణ్ణి ఆహ్వానించాడు. భరతుడు గుహుడితో కలిసి, భరద్వాజాశ్రమం చేరి విందు స్వీకరించాడు. తరువాత చిత్రకూటం బయలు దేరాడు. భరతుడు సేనలతో వస్తూ ఉండడం చూసి, లక్ష్మణుడు పొరపాటుపడ్డాడు. భరతుడు రాముని మీదికి యుద్ధానికి వస్తున్నాడని, లక్ష్మణుడు రామునికి చెప్పాడు. భరతుడు అటువంటి వాడుకాడని రాముడు లక్ష్మణునకు చెప్పాడు.

భరత శత్రుఘ్నులు రాముని పాదాలపై పడ్డారు. రాముడు కన్నీళ్ళు పెట్టాడు. రాముడు భరతునికి రాజనీతులు చెప్పాడు. రాముణ్ణి అయోధ్యకు తిరిగి రమ్మని భరతుడు కోరాడు. రాముడు తండ్రి మాటే తనకు శిరోధార్యం అన్నాడు.

చివరకు భరతుని కోరికపై శ్రీరాముడు తన పాదుకలను భరతునికి ఇచ్చాడు. ఆ పాదుకల మీదనే రాజ్యభారం ఉంచి, తాను నారచీరలు ధరించి, నగరం వెలుపల ఉంటాననీ, పదునాల్గవ సంవత్సరం కాగానే, రామదర్శనం కాకపోతే అగ్ని ప్రవేశం చేస్తానని భరతుడు చెప్పాడు. ఈరకంగా భరతుడు శ్రీరామునిపై తనకు గల భక్తి భావాన్ని ప్రకటించాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం

ప్రశ్న 36.
హనుమంతుని శీలాన్ని విశ్లేషించండి.
(లేదా)
హనుమంతుని వ్యక్తిత్వాన్ని గురించి రాయండి. (June 2017)
జవాబు:
హనుమంతుడు పరమాత్ముడగు శ్రీరాముని యొక్క భక్తులలో అగ్రగణ్యుడు. ఆ ప్రభువునకు ఇతడు దాసానుదాసుడు. ఇతడు వాయుదేవుని వరము వలన అంజనీదేవికి జన్మించిన మహానుభావుడు. ఈయన ఉత్తమ నైష్ఠిక బ్రహ్మచారి, మహావీరుడు, సాటిలేని బలముగలవాడు. బుద్ధికుశలుడు. వాక్చతురులలో శిరోమణి. నవవ్యాకరణ పండితుడు.

సేవాధర్మపరాయణుడు. భయము ఎరుగనివాడు. సత్యమునే పలుకువాడు. ఈయన స్వామిభక్తి సాటిలేనిది. పరమాత్మతత్త్వ రహస్యములను, గుణములను, ప్రభావమును క్షుణ్ణముగా నెఱిగిన వాడు, మహావిరక్తుడు, అష్టసిద్ధులు ఈయనకు కరతలామలకములు. మిగులప్రేమ స్వరూపుడు, దైవభక్తి ఈయన ఉగ్గుపాలతో నేర్చిన విద్య. సదాచార సంపన్నుడు. మహాత్ముడు, యుద్ధ విద్యలయందు ఆరితేరినవాడు, కోరిన రూపమును ధరింపగల సమర్థుడు. పరమాత్ముని నామరూప గుణములతో కూడిన లీలలను దర్శించి ఆనందించుటలో నిరతుడు.

ఇప్పటికిని శ్రీరాముని గాథలు, కీర్తనలు కొనసాగే స్థలమునందు హనుమంతుడు తనకు ఇష్టమైన రూపములో మసలుచుండునని పెద్దలు చెప్పుదురు. కాని అజ్ఞానమువలనను శ్రద్ధాదరములు లేనందునను ఆయనను మనము గుర్తించలేక పోతున్నామని కొందరు అంటారు. ఆంజనేయుని గుణములు అద్భుతములు. అపారములు. పరమాత్ముని యొక్క ఆయన పరమభక్తుల యొక్క గుణగణములను ఎంతటివారును వర్ణింపజాలరు.

హనుమంతుడు రామలక్ష్మణులను మొట్ట మొదటిసారిగా పంపా సరోవర తీరమున దర్శించెను. ఆంజనేయుని యొక్క వినయ సౌశీల్యములు, పాండిత్యము, చాతుర్యము, దైవమునెడ దీనభావము, ప్రేమ, శ్రద్ధ మొదలగు గుణములు మిక్కిలి వైశిష్ట్యమును సంతరించు కొన్నాయి. హనుమంతుడు సీతాన్వేషణలో చేసిన ప్రయత్నం నిరుపమానమైంది. లంకలో ప్రదర్శించిన పరాక్రమం అసమానమైంది. రావణుడికి చేసిన ఉపదేశం వల్ల హనుమంతుని శాస్త్రజ్ఞానం వ్యక్తమౌతుంది.

ప్రశ్న 37.
‘ఉత్తమ ధర్మాలను అనుసరిస్తే మనిషి మనీషిగా ఎదుగగలడని’ రామాయణం ఆధారంగా వివరించండి. (June 2017)
జవాబు:
శ్రీమద్రామాయణం మనకు ఆదికావ్యం. ఈ మహాకావ్యం మానవ జాతిని జాగృతం చేసింది. రామాయణ కథ మానవ హృదయాల నుండి చెరగదు. రామాయణంలో తల్లిదండ్రుల అనురాగం, పుత్రుల అభిమానం, భార్యాభర్తల అనుబంధం, గురుభక్తి, శిష్యానురక్తి, స్నేహభావం, ధర్మబలం, జీవకారుణ్యం వంటి ఎన్నో జీవిత పార్శ్వాలు కనబడతాయి.

రామాయణాన్ని చదవడం అంటే, జీవితాన్ని చదవడమే. అది అందరికీ పఠనీయ గ్రంథం. మానవీయ విలువలతో కూడిన ధర్మాలను ఆచరిస్తే, మనిషి మనీషిగా ఎలా ఎదగగలడో రామాయణం నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా రామాయణం గొప్ప సందేశాన్ని అందించింది. రామాయణంలో వాల్మీకి మారీచునివంటి రాక్షసుని నోటి నుండి “రామో విగ్రహవాన్ ధర్మః – సత్య ధర్మ పరాక్రమః” అనే మాటలు పలికించాడు.

శ్రీరాముని వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి మహాకావ్యం ‘నభూతో నభవిష్యతి’ అని నిరూపించబడింది. ఈ కావ్యం భావితరాలకు మార్గ దర్శకంగా ఉంది. అందువల్ల రామాయణాన్ని తప్పక చదవాలి. కాబట్టి భారతదేశంలో ఏవిధంగా జీవించాలో రామాయణం మనకు బోధిస్తుందని చెప్పవచ్చు. రామాయణం ‘రామునివలె నడుచుకో రావణునివలె నడువవద్దు’ అనే ధర్మాన్ని భారతీయు లకు అందిస్తుంది. అందువల్లనే రామాయణం మానవు లందరికీ ఆదర్శగ్రంథం. పఠనీయ గ్రంథం.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం

ప్రశ్న 38.
రామాయణం ఆధారంగా గురుశిష్యుల సంబంధాన్ని వివరించండి. (March 2018)
జవాబు:
పూర్వకాలంలో ‘గురుముఖతః’ విద్య నేర్చుకొనేవారు. గురుసేవలు చేసి, వాళ్ళ అనుగ్రహాన్ని పొంది విద్యలను అభ్యసించేవారు.

రామాయణాన్ని పరిశీలించినట్లయితే రామ లక్ష్మణులు కూడా విశ్వామిత్రునికి సేవలు చేసి ఆయన వద్ద అనేక విద్యలను అభ్యసించినట్లు తెలుస్తోంది. విశ్వామిత్రుడు యాగరక్షణ కోసం బాలకులైన రామలక్ష్మణులను తనతో అడవికి తీసుకొనిపోయి ‘బల’, ‘అతిబల’ వంటి విద్యలను బోధించాడు. వీటి ప్రభావం వల్ల అలసట, ఆకలి దప్పుల వంటివి ఉండవు. దీన్ని బట్టి శిష్యుల బాగోగులను చూడటం తమ బాధ్యతగా గురువులు గ్రహించేవారని తెలుస్తోంది.

రామాయణం ఆధారంగా పరిశీలిస్తే గురు శిష్యుల సంబంధం ఎంతో విశిష్టమైనదిగా తోస్తుంది. శిష్యులు గురువు ఆజ్ఞను పాటించడం తమ కర్తవ్యంగా భావించేవారు. తాటక వధ గావించిన రాముని చూసి సంతోషించి విశ్వామిత్ర మహర్షి రామునికి ఎన్నో దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు. గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేనిది లేదనీ, శిష్యుడు పొందలేనిది లేదనీ రామాయణాన్ని బట్టి గ్రహించ వచ్చు.

శిష్యులు తమ కర్తవ్యాన్ని నెరవేర్చడంలో ఎంతో నిష్ఠతో ఉండాలి. సమర్థులైన శిష్యులను చూసి గురువు ఎంతో సంతోషిస్తాడు. పట్టిన పని ఫలవంతమయ్యే వరకు పట్టుదల ఎలా ఉండాలో గంగావతరణం కథ ద్వారా విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు బోధించాడు. గురువు శిష్యుల పట్ల వాత్సల్యంతోను, శిష్యులు గురువు పట్ల వినయ విధేయతలతోను, మెలగుతుండేవారు.

ప్రశ్న 39.
రామాయణంలో విభీషణుడి పాత్ర గురించి రాయండి. (March 2016)
జవాబు:
విభీషణుడు రావణాసురుని తమ్ముడు. శత్రువుల శక్తి సామర్థ్యాలను తెలుసుకోకుండా వారిని చులకనగా భావించకూడదనే ఆలోచన కలవాడు. రావణుడు సీతను అపహరించడం మహాపాపమని, రావణుని కీర్తి ప్రతిష్ఠలు మంటగలుస్తాయని, సంపదలు నశిస్తాయని భావించినట్టివాడు. అనేక ధర్మసూక్ష్మాలు తెలిసినవాడు విభీషణుడు.

లంకలో ప్రవేశించిన హనుమంతుని చంపమని రావణాసురుడు ఆజ్ఞాపించినపుడు, దూతను చంపడం భావ్యం కాదని, ఇతర పద్ధతుల్లో దూతను దండించవచ్చని రాజనీతిని ప్రదర్శించిన విజ్ఞుడు విభీషణుడు.

విభీషణుడు తన అన్నయగు రావణునితో అనవసరంగా కోపం మంచిది కాదని, అది ధర్మానికి ఆటంకమౌతుందని, సుఖాలను దూరం చేస్తుందని హితవు పలికినవాడు. రావణుని అధర్మ మార్గాన్ని వ్యతిరేకించినవాడు.

విభీషణుడు ధర్మరక్షణ కోసం శ్రీరాముని పక్షంలో చేరినవాడు. రావణ సంహారం తరువాత లంకా నగరానికి రాజుగా పట్టాభిషిక్తుడైనాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం

ప్రశ్న 40.
అహల్యా కబంధుల శాప విముక్తులను గూర్చి సొంతమాటల్లో రాయండి. (June 2018)
జవాబు:
అ) అహల్య : అహల్య గౌతమ మహర్షి భార్య. ఆమె గౌతముని శాపానికి గురియై గౌతముని ఆశ్రమంలోనే వేల సంవత్సరాలపాటు అన్నపానాదులు లేక వాయువునే ఆహారంగా తీసుకుంటూ బూడిదలో కప్పబడి ఉంది. ఎవ్వరికీ కనబడకుండా ఉంది. విశ్వామిత్రుని కోరికమేరకు శ్రీరాముడు గౌతమా శ్రమంలో కాలుమోపి అహల్యకు శాపవిముక్తి కలిగించాడు.

ఆ) కబంధుని శాపం : కబంధుడు క్రౌంచారణ్యంలో ఉన్న ఒక రాక్షసుడు. ఇతడికి తల, మెడ లేవు. ఇతడి కడుపు భాగంలో ముఖం ఉండేది. రొమ్ము భాగంలో ఒకే కన్ను ఉండేది. ఇతనికి యోజనం పొడవు వ్యాపించిన చేతులు ఉండేవి. ఆ చేతులతో పక్షులను, మృగాలను పట్టి తినేవాడు.

కబంధుడు రామలక్ష్మణులను తన చేతులతో పట్టుకొని తినబోయాడు. కబంధుడి చేతులకు చిక్కితే, ఎవరూ తప్పించుకోలేరు. కాని రామలక్ష్మణులు తమ ఖడ్గాలతో కబంధుడి చేతులు నరికారు. అప్పుడు కబంధుడు తనకు శాపం వల్ల రాక్షసరూపం వచ్చిందనీ, తన శరీరాన్ని దహిస్తే తనకు దివ్యజ్ఞానం వస్తుందనీ రామలక్ష్మణులకు చెప్పాడు. రామ లక్ష్మణులు కబంధుడి శరీరాన్ని దహనం చేశారు.

ఈ విధంగా రాముడు కబంధునికి శాపం నుండి విముక్తి కలిగించాడు.

ప్రశ్న 41.
సీత, హనుమంతుడుల మధ్య శింశుపావృక్షం క్రింద జరిగిన సంభాషణా సారాంశాన్ని రాయండి. (June 2018)
జవాబు:
లంకా నగరం చేరిన హనుమంతుడు అశోకవనంలో శింశుపావృక్షం క్రింద కృశించి దీనావస్థలో ఉన్న స్త్రీని చూశాడు. ఆమె ధరించిన ఆభరణాలను చూచి ఆమె సీతే అని ధృవపరచుకున్నాడు.

రాక్షస స్త్రీల బెదిరింపులతో భయపడిపోయి ఉన్న సీతాదేవిని పలకరించడానికి రామకథాగానమే సరైన మార్గమని నిశ్చయించుకొని, సీతాదేవికి వినపడేట్టు రామకథను వర్ణించాడు.

దగ్గరగా వస్తున్న మారుతిని రావణునిగా భావించిన సీత మారుతి రామదూతే అయితే రాముని గురించి చెప్పమంది.

తన వీపు మీద కూర్చుంటే తక్షణమే రాముని సన్నిధికి చేరుస్తానని మారుతి అన్నా, సీత హనుమంతునితో వెళ్ళడానికి నిరాకరించింది. పరపురుషుని తాకనన్నది. శ్రీరాముడు రావణుని సంహరించి తనను తీసుకొని వెళ్ళడమే రాముని స్థాయికి తగిన పని అన్నది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం

తన వెంట రావడం సీతకు అంగీకారం కాకపోతే, శ్రీరాముడు గుర్తించగల ఏదైనా ఆనవాలును తనకు ఇమ్మని అడిగాడు హనుమంతుడు.

సీత, హనుమంతుల సంభాషణను బట్టి సీత గొప్పదనం, హనుమంతుని పరాక్రమం, ఒక పనిని సమర్థంగా చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుస్తున్నాయి.

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

Telangana SCERT 10th Class Telugu Guide Telangana 1st Lesson దానశీలము Textbook Questions and Answers.

TS 10th Class Telugu 1st Lesson Questions and Answers Telangana దానశీలము

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 2)

కర్ణుని పూజామందిరంలో ‘సూర్యుడు’ ప్రత్యక్షమై కర్ణునితో ఇట్లా అంటాడు.
సూర్యుడు : పుత్రా ! కర్ణా ! బ్రాహ్మణ వేషంలో వచ్చి ఇంద్రుడు నీ కవచకుండలాలను దానంగా అడుగుతాడు. వాటిని దానం చేస్తే నీ ప్రాణానికే ముప్పు వస్తుంది. నాయనా జాగ్రత్త!
కర్ణుడు : తండ్రీ! ఇంద్రుడంతటివాడు రూపం మార్చుకొని “దేహి” అని నాదగ్గరకు వస్తే ఎట్లా కాదంటాను. ఈ శరీరం శాశ్వతం కాదు. ఎటువంటి ఆపద వచ్చినా సరే. నేను కాదనను. నాపై మీకున్న వాత్సల్యానికి సంతోషిస్తా. కాని నన్ను వారించకండి.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
సూర్యుడు కర్ణుని దానం చేయకుండా ఆపడానికి గల కారణమేమిటి ?
జవాబు:
కవచకుండలాలుంటే కర్ణుని ప్రాణానికి ముప్పు ఉండదు. అవి దానం చేస్తే ప్రాణాలకు ముప్పు వస్తుంది. అందుకే దానం చేయకుండా ఆపాలనుకొన్నాడు సూర్యుడు. కర్ణుడు ఆయన కొడుకు గదా !

ప్రశ్న 2.
కర్ణుని మాటలను బట్టి మీకేమర్థమైంది ?
జవాబు:
ఎటువంటి ఆపద వచ్చినా, దానం చేస్తానని చెపుతాడు. కర్ణుని దానగుణం యొక్క గొప్పతనం తెలుస్తుంది.

ప్రశ్న 3.
ప్రాణానికి ముప్పని తెలిసినా కర్ణుడు ఎందుకు దానం చేశాడు ?
జవాబు:
శరీరం శాశ్వతం కాదని, ఇంద్రుడంతటివాడు రూపం మార్చుకొని దేహి అంటే కాదనని కర్ణుడు అంటాడు.

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

ప్రశ్న 4.
ఇటువంటి దానవీరులు ఇంకెవరైనా ఉన్నారా ? ఎవరు ?
జవాబు:
ఇటువంటి దానవీరులు చాలామంది ఉన్నారు.

  1. బలి : వామనుడికి మూడడుగుల నేల దానం చేశాడు. తన గురువు శుక్రాచార్యుడు వద్దన్నా వినలేదు. దానివలన తన ప్రాణాలు కోల్పోయినాడు.
  2. శిబి : పావురాన్ని కాపాడడానికి శిబిచక్రవర్తి తన శరీరంలోని మాంసం కోసి డేగకు ఇచ్చినాడు.
  3. దధీచి ఇంద్రుడికి పర్వతాల రెక్కలు తెగకొట్టడానికి వజ్రాయుధం కావలసి వచ్చింది. వజ్రాయుధం తయారీకి దధీచి తన వెన్నెముకను ఇచ్చినాడు.
  4. రంతిదేవుడు : తన రాజ్యం మొత్తం దానధర్మాలకు వినియోగించినాడు. తను తినడానికి మిగిలిన అన్నం కూడా దానం చేసినాడు. తను త్రాగడానికి ఉంచు కొన్న నీటిని కూడా దానం చేసినాడు.
  5. సక్తుప్రస్థుడు : తన సామ్రాజ్యంలోని సంపదను దానధర్మాలకే వినియోగించినాడు. తను, తన కుటుంబీకులు తినబోయిన ఆహారం కూడా దానం చేసినాడు.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 4)

ప్రశ్న 1.
శుక్రుడు బలిచక్రవర్తితో “వలదీ దానము గీనమున్” అని ఎందుకు హెచ్చరించాడో ఊహించండి.
జవాబు:
శుక్రుడు రాక్షసులకు వంశ గురువు. శుక్రుడు ఎప్పుడూ రాక్షసుల క్షేమాన్నే కోరుకుంటాడు. శుక్రుడు తపస్సంపన్నుడు. వచ్చిన పొట్టివాడు విష్ణుమూర్తి అని శుక్రునికి తెలుసు. విష్ణుమూర్తి ఆ మూడడుగులతో తేలికగా పోడని, శుక్రుడికి తెలుసు. అతడు మూడడుగులతో మూడు లోకాలనూ కొలిచే త్రివిక్రముడు అవుతాడనీ, బ్రహ్మాండం అంతా నిండిపోతాడనీ ఆయనకు తెలుసు. ఎవ్వరూ విష్ణుమూర్తిని ఆపలేరని కూడా శుక్రాచార్యుడికి తెలుసు.

అందుకే, శుక్రుడు బలిని దానము చేయవద్దని హెచ్చరించాడు.

ప్రశ్న 2.
“మానధనులు” ఎట్లా ఉంటారని మీరు భావిస్తున్నారు.
జవాబు:
మానధనులు అంటే అభిమానమే ధనముగా గలవారు. వారికి పదవితో గాని, ధనముతో గాని సంబంధం లేదు. వారు ప్రాణం కంటే తమ గౌరవానికే ప్రాధాన్యం ఇస్తారు. ఎవరిచేతా ‘ఇది తప్పు’ అని చెప్పించుకోరు. ఎట్టి పరిస్థితిలోనూ ఇచ్చిన మాట తప్పరు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన మాట నిలబెట్టు కొంటారు. ప్రాణం కంటే తాము ఇచ్చిన మాటకే విలువ ఇస్తారు.

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

ప్రశ్న 3.
“కీర్తిని సంపాదించడమే గొప్పదని” చెప్పిన బలిచక్రవర్తి మాటలను మీరు ఏ విధంగా సమర్థిస్తారు ?
జవాబు:
కీర్తిని సంపాదించమే గొప్పదని బలిచక్రవర్తి చెప్పిన మాట ఉత్తమమైనది. అది అందరికీ శిరోధార్య మైనది.

  1. సిరిసంపదలూ, రాజ్యమూ శాశ్వతమైనవి కావు.
  2. సత్యవంతుడని పేరు పొందిన హరిశ్చంద్ర మహారాజు వంటి వారికి లభించిన కీర్తి, శాశ్వత మైనది.
  3. దేశం కోసం తమ సర్వస్వాన్నీ అర్పించి, త్యాగం చేసిన గాంధీజీ, నెహ్రూజీ, పటేలు, సుభాష్ చంద్రబోస్ వంటి వారి త్యాగాన్నీ, దేశసేవనూ నేటికీ లోకులు కీర్తిస్తున్నారు.
  4. అక్రమ సంపాదనలతో లోకకంటకులైన వారిని లోకం నేటికీ నిందిస్తోంది. కాబట్టి కీర్తి సంపాదన ముఖ్యమన్న బలిచక్రవర్తి మాటను నేను సమర్థిస్తాను.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 5)

ప్రశ్న 1.
“తిరుగన్ నేరదు నాదు జిహ్వ” అన్నాడు కవి. దీనినిబట్టి మీకేం తెలిసింది ?
జవాబు:
ఆడినమాట తప్పకూడదని, వచ్చినవాడు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఎవరైనా సరే. నా నాలుక వెనుతిరుగదు” అని బలిచక్రవర్తి అంటాడు. దీనిని బట్టి ఆడినమాట తప్పకూడదని అర్థమైంది.

ప్రశ్న 2.
“శిబి గొప్ప దాత”. ఎందుకు ?
జవాబు:
శిబి చక్రవర్తి చాలా గొప్పదాత. ఒకసారి ఒక పావురాన్ని కాపాడడానికి తన శరీరంలోని మాంసం కోసి ఇచ్చాడు. ఆ మాయా పావురం ఎంతకూ తూగకపోతే తన శరీరంలోని రెండు తొడలలోని మాంసాన్ని తనే కోసి డేగకు ఇచ్చిన దాన శీలి.

ప్రశ్న 3.
ఎదుటివారు అడిగిన దానిని ఇవ్వడంలో ఎటువంటి తృప్తి ఉంటుంది ? మీ అనుభవాలు చెప్పండి.
జవాబు:
చాలా తృప్తి ఉంటుంది. దానినే త్యాగం అంటారు. నాకు జన్మదినానికి ఒక “పార్కర్ పెన్ను” బహుమతి వచ్చింది. దానిని నా “ప్రాణస్నేహితుడు” అడుగగా ఇచ్చివేసాను. నాకు చాలా తృప్తి కలిగింది.

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

ప్రశ్న 4.
“పొడవు పొడవున గుఱుచై” అని కవి ఎవరిని ఉద్దేశించి, ఎందుకట్లా అని ఉంటాడు ?
జవాబు:
వామనుని (విష్ణుమూర్తి) ఉద్దేశించి అన్నాడు. గొప్పవాడైన విష్ణువు చిన్నవానిగా మారి (వామనుడిగా) అడుగుతున్నాడు. అతడు కోరినదానిని ఇవ్వడం కంటె నావంటివానికి ఇంకేం కావాలని” బలిచక్రవర్తి అంటాడు.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
దానాలన్నీ వేటికవే గొప్పవి. అయితే నేటి కాలంలో రక్తదానం, మరణానంతరం అవయవదానం వంటివి చేస్తున్నారు కదా ! వాటి యొక్క ప్రాధా న్యాన్ని చర్చించండి.
జవాబు:
దానం అంటే మనకున్నది ఇవ్వడం. అది కూడా కావలసిన వారికే ఇవ్వాలి. అడిగిన వారికే ఇవ్వాలి. ధనం దానం చేస్తాం. దానివలన అడిగిన వారికి కొన్ని అవసరాలు తీరతాయి. అన్నదానం చేస్తే గ్రహీతకు ఆకలి తీరుతుంది. విద్యాదానం చేస్తే గ్రహీతకు జ్ఞానం వస్తుంది. అంటే మనం ఏ దానం చేసినా స్వీకరించడానికి గ్రహీత ఉండాలి కదా ! దాత కూడా ఎంత గొప్పవాడైనా ప్రాణం లేకపోతే ఏమీ చేయలేడు.

అందుచేత ప్రాణదానం అన్ని దానాలకంటే ఉత్తమమైనది. ప్రాణం నిలబడాలంటే రోగాలు తగ్గాలి. కొన్ని రకాల రోగాలకు కారణం రక్తం లేకపోవడం. ఆపరేషన్లు జరిగినపుడు రోగికి రక్తం కావాలి. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గాయాల పాలవుతారు. అప్పుడు కూడా రోగి ప్రాణాలు కాపాడ్డానికి రక్తం కావాలి. ఒక్కొక్కసారి కావలసిన గ్రూపు రక్తం దొరకక రోగి ప్రాణాలు కూడా పోతాయి. అందుచేత అన్ని దానాల కంటే రక్తదానం గొప్పది. దానివలన దాతకు కూడా నష్టమేమీ లేదు. మళ్ళీ వెంటనే కొత్త రక్తం పడుతుంది. కనీసం ఆరునెలల కొకసారి రక్తదానం చేయాలి. దానివల్ల రక్తం శుద్ధి అవుతుంది. అత్యవసర పరిస్థితులలో వైద్యుల సలహాలననుసరించి రక్తదానం చేయవచ్చు.

మనకు తెలియకుండానే ఎంతో మందికి ప్రాణదానం చేసిన పుణ్యం వస్తుంది. ఆరోగ్యానికీ మంచిదే. కొంతమంది కొన్ని అవయవాలు పనిచేయక మరణిస్తారు. అటువంటివారిలో ఎక్కువమంది మూత్రపిండాల వ్యాధితో మరణిస్తుంటారు. వారిని ఆదుకోవాలంటే మూత్రపిండం దానం చేయవచ్చు. ప్రతి మనిషికీ రెండు మూత్రపిండాలు ఉంటాయి. వైద్యుల సలహాతో ఒకటి దానం చెయ్యవచ్చు.

బ్రెయిన్డెడ్ అయిన వారి కళ్ళు, కాలేయం, గుండె మొదలైనవి ఆయా అవసరాలున్నవారికి మార్పిడి చేయవచ్చు. దానివలన మరొకరి అవయవాల రూపంలో జీవించవచ్చు. వారికి అవయవదానం చేసిన పుణ్యం కూడా వస్తుంది. అందుకే తన మరణానంతరం తన అవయవాలను దానం చేయవలసినదిగా వీలునామా రాయాలి. దానిని బంధువులు కూడా ఆటంకపరచకూడదు. పోయిన ప్రాణం తిరిగిరాదు. శరీరం కూడా నశించి పోతుంది. అవయవాలు దానం చేస్తే మరొకరి జీవితంలో వెలుగు వస్తుంది.

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

ప్రశ్న 2.
పువ్వు గుర్తుగల పద్యాలను భావస్ఫోరకంగా చదవండి.
జవాబు:
దాతల్లో గొప్పవాడా ! ఓ బలిచక్రవర్తీ ! నీ కులాన్నీ, రాజ్యాన్నీ, పరాక్రమాన్నీ నిలుపుకో. ఈ పొట్టివాడు విష్ణువు. కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాదు. మూడడుగులతో మూడు లోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండి పోతాడు. ఎవరైనా అతడిని ఆపగలరా? నా మాట విను. దానం వద్దు గీనం వద్దు. ఈ బ్రహ్మచారిని (వామనుడిని) పంపించు.

ఆచార్యా ! పూర్వం రాజులు ఉన్నారు. వారికి రాజ్యాలు ఉన్నాయి. వారు ఎంతో అహంకారంతో విర్రవీగారు. కాని వారెవరూ ఈ సంపదలను మూటగట్టుకొని పోలేదు. ప్రపంచంలో వారి పేర్లు కూడా మిగులలేదు. శిబిచక్రవర్తి వంటివారు కీర్తి కోసం సంతోషంగా అడిగినవారి కోరికలు తీర్చలేదా ? వారిని ఈనాటికీ లోకం మరువలేదు కదా !

ఓ పండితోత్తమా ! నాకు నరకం దాపురించినా సరే, బంధనం ప్రాప్తమైనా మంచిదే. ఈ భూమండలం అదృశ్యమైనా, నాకు దుర్మరణం వచ్చినా సరే. నా వంశం అంతా నశించినా సరే. ఏమైనా కానీ, ఏదైనా రానీ ! ఆడిన మాట మాత్రం తప్పను. వచ్చినవాడు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఎవరైనా సరే. నా నాలుక వెనుదిరుగదు. (ఆడినమాట తప్పను) ఎందుకీ వేలకొద్ది మాటలు ?

ప్రశ్న 3.
ఒకటో పద్యానికి ఇక్కడ ప్రతిపదార్థం ఉంది. ఇదే విధంగా నాలుగు, ఆరు సంఖ్యగల పద్యాలకు ప్రతి పదార్థాలు రాయండి.
1వ పద్యం ప్రతిపదార్థము :
వదాన్య + ఉత్తమా ! = దాతల్లో శ్రేష్ఠుడా ! (ఓ బలిచక్రవర్తీ !)
కులమున్ = (రాక్షస) కులమును
రాజ్యమున్ = (రాక్షస) రాజ్యమును
తేజమున్ = తేజస్సును
నిలుపుము నిలబెట్టుము
ఈ = ఈ
కుబ్జుండు = పొట్టివాడు (వామనుడు)
విశ్వంభరుండు = విష్ణుమూర్తి (జగత్తును భరించువాడు హరి)
అలఁతిన్ + పోడు = అంత తేలికగా వదలిపెట్టడు
త్రివిక్రమ = ముల్లోకములను ఆక్రమించెడి
స్ఫురణన్ = స్ఫూర్తి కలవాడు
వాడు = వాడు
ఐ = అయ్యి
నిండున్ = నిండిపోవను
బ్రహ్మాండమున్ = బ్రహ్మాండమును
కలడే = సమర్థుడు ఉన్నాడా
మానన్ = ఆపుటకు
ఒకండు = ఒకడైన
నా = నా యొక్క
పలుకులున్ = మాటలను
ఆకర్ణింపుము = వినుము
కర్ణంబులన్ = చెవులారా
వలదు = వద్దు
ఈ = ఈ
దానమున్ = దానము
గీనమున్ = గీనము
వర్ణిన్ = బ్రహ్మచారిని
పనుపుమా = పంపివేయుము (పంపించవయ్యా !)
జవాబు:
4వ పద్యం ప్రతిపదార్థము :
భార్గవా = ఓ శుక్రాచార్యా ! (భార్గవుడు = భృగువు పుత్రుడు, శుక్రుడు)
రాజులు = ఎంతో మంది రాజులు
కారే = కాలేదా ?
రాజ్యముల్ = రాజ్యములు
కలుగవే = పొందలేదా ఏమి
గర్వ = అహంకారముతో
ఉన్నతిన్ = గొప్పదనాన్ని
పొందరే = పొందలేదా ఏమి
వారు = వాళ్ళందరు
ఏరి = ఎక్కడ ఉన్నారు ?
సిరిని = సంపదలను
మూటగట్టుకొని = కూడగట్టుకొని
పోవన్ + చాలిరే = తీసుకెళ్ళగలిగారా, లేదు
భూమిపైన్ = నేలపైన (ఈ భూలోకంలో)
పేరు + ఐనన్ = కనీసము పేరైనా
కలరే = ఉన్నదా, లేదు
శిబి = శిబిచక్రవర్తి
ప్రముఖులున్ = మొదలగువారు
యశః = కీర్తి
కాములు + ఐ = కోరువారై
కోర్కులు = దానములను
ప్రీతిన్ = సంతోషంతో
ఈరే = ఇవ్వలేదా
ఈ = ఇప్పటి
కాలమున = కాలమునందును
వారలన్ = వారిని
మఱచిరే = మరిచిపోయారా, లేదు (మరిచిపోలేదని అర్థం)

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

6వ పద్యం ప్రతిపదార్థము

ధీవర్య = ఓ విజ్ఞాని ! (ఓ పండితోత్తమా !)
నిర్ణయంబు + ఐన = నరకము దాపురించినా
నిబంధము + ఐన = అనారోగ్యం కలిగినా
ధరణీ = రాజ్యము
నిర్మ = నాశనము
ఐనన్ = అయినా సరే
దుర్మరణంబు + ఐనన్ = అకాల మరణం సంభవించినా
కుల + అంతము + ఐన = వంశం నాశమైనా
నిజమున్ = నిజంగానే పైవన్నీ
రానిమ్ము = వస్తేరానీ
కానిము = జరిగెడిది జరగనిమ్ము
వేయేటికిన్ = వేయిమాటలు దేనికి
వినుమా = వినుము
అభ్యాగతుండు = అతిథిగా వచ్చినవాడు
హరుడు = శివుడు
ఐనన్ = అయినా
హరి = విష్ణువు
నీరజభవుండు + ఐన = బ్రహ్మదేవుడయినా
నాదు = నా యొక్క
జిహ్వ = నాలుక
ఔన్ = ఇస్తానని
తిరుగన్ = వెనుతిరుగుట (మాట తప్పడం)
నేరదు = చేయలేదు

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) “ఈ కుబ్జుండు అలఁతింబోడు” అని శుక్రాచార్యుడు చెప్పడంలో అతని ‘ఉద్దేశమేమై’ ఉంటుంది ? దానితో మీరు ఏకీభవిస్తారా ?
జవాబు:
“వామనుడు (పొట్టివాడు) సామాన్యుడు కాదు. విష్ణువు, విశ్వంభరుడు కొంచెం మాత్రం తీసుకొనిపోయేవాడు కాదు. మూడడుగులతో కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఎవ్వరూ అతడిని ఆపలేరు”. నా మాట వినమని శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి చెప్పాడు. శిష్యుడ్ని రక్షించడం కొరకు అలా చెప్పాడు. ఇదే ఉద్దేశం. ఇంతకంటె వేరులేదు. నేను కూడా దీనిని ఏకీభవిస్తాను.

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

ఆ) హాలికునికి కావలసిన వసతి సౌకర్యాలు ఏవిధంగా ఉంటే అతడు తృప్తి జెందుతాడు ?
జవాబు:
హాలికుడు అంటే వ్యవసాయదారుడు. రైతును దేశానికి వెన్నెముక అంటారు. అంతేగాని సౌకర్యాలేమి కల్పించరు. రైతును ప్రభుత్వాలు పట్టించుకోవాలి.
రైతులకు కావలసిన సౌకర్యాలు :

  1. తగినంత నీటి సదుపాయం కల్పించాలి.
  2. మంచి విత్తనాలను ఉచితంగా సరఫరా చేయాలి.
  3. వడ్డీలేని అప్పులను ఇవ్వాలి.
  4. ఎరువులు, పురుగుమందులు మొదలైనవి సబ్సిడీ ధరలపై ఇవ్వాలి.
  5. భూసార పరీక్షలు చేసి, సూచనలు సలహాలు ఇవ్వాలి.
  6. నిరంతరం విద్యుత్తు సరఫరా చేయాలి.
  7. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై పూర్తి అవగాహన కలిగించాలి.
  8. తను పండించిన దానికి ధరను నిర్ణయించుకొనే స్వేచ్ఛ రైతుకు కల్పించాలి.
  9. దళారీ వ్యవస్థను నిర్మాలించాలి.
  10. పండించిన పంట నిల్వ చేసుకొనేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి.

ఇ) ‘సిరి మూట గట్టుకొని పోవం జాలిరే ?’ అనడంలో బలిచక్రవర్తి ఆంతర్యమేమై ఉంటుంది ?
(లేదా)
“సంపదలు శాశ్వతం కాదు. వారు సంపాదించిన కీర్తి ప్రతిష్టలే శాశ్వతం”. వివరించండి.
(లేదా)
సంపదలు గొప్పవా ? కీర్తిప్రతిష్టలు గొప్పవా ? చర్చించండి.
జవాబు:
పూర్వం రాజులు ఉన్నారు. వారికి రాజ్యాలు ఉన్నాయి. వారు ఎంతో అహంకారంతో విర్రవీగారు. కాని వారెవరూ ఈ సంపదలను మూటగట్టుకొని పోలేదు. ప్రపంచంలో వారి పేర్లు కూడా మిగులలేదు. బలి ఆంతర్యంలో ఈ క్రింది కారణాలు ఉన్నాయి.

  1. సంపదను అనుభవించాలి లేదా దానం చేయాలి.
  2. అనుభవించడం వలన కీర్తి ప్రతిష్టలు రావు.
  3. దానం చేస్తే పేరు ప్రఖ్యాతులు వస్తాయి. పుణ్యం వస్తుంది.
  4. అనుభవించినా, దానం చేసినా తను బ్రతికి ఉండగానే చేయాలి.
  5. ఎప్పటికైనా మరణం తప్పదు. మరణించాక సంపద ఎవరెవరో పట్టుకొని పోతారు.
  6. తన చేతులతో తను దానం చేసుకోవాలని బలి ఉద్దేశం.
  7. వచ్చినవాడు సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు.
  8. శ్రీమహావిష్ణువుకు దానం చేసే అదృష్టం అందరికీ రాదు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎన్ని జన్మలెత్తినా అటువంటి అవకాశం రాదు.
  9. తన సంపద కంటే ప్రాణం కంటే శ్రీమహావిష్ణువుకు దానం చేయడమే విలువైనదని బలి ఉద్దేశం.
  10. శ్రీమహావిష్ణువు (గ్రహీత) ఉన్నంతకాలం మహాదాత అయిన బలి కీర్తి ఉంటుంది. అదే బలిచక్రవర్తి కోరిక.

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

ఈ) “ఆడినమాట తప్పగూడదు” ఎందుకు ?
(లేదా)
“మాట దిరుగలేరు మానధనులు” అనే మాటను సమర్థిస్తూ వ్రాయండి.
(లేదా)
“మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడమే మాన ధనులకు మేలు” అని బలి ఎందుకన్నాడు ?
(లేదా)
“తిరుగన్ నేరదు నాదు జిహ్వ” అని బలిచక్రవర్తి శుక్రా చార్యునితో ఎందుకన్నాడు ? ఆ మాటలో గల సామం జన్యమెట్టిదో వివరించండి.
(లేదా)
“తిరుగన్ నేరదు నాదు జిహ్వ” అన్నాడు కవి. దీనిని బట్టి మీకేం తెలిసింది ?
(లేదా)
“మాట దిరుగలేరు మానధనులు” అన్న మాటను మీరు సమర్థిస్తారా ? ఎందుకు ?
జవాబు:
పూర్వం భూదేవి ఎటువంటి చెడ్డపని చేసినవాడినైనా భరిస్తాను కాని, ఆడినమాట తప్పినవాడిని మాత్రం మోయలేను అని చెప్పిందట. అంతేకాదు, తాను అన్నమాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడం, అభిమానధనులైన వారికి ఉత్తమమార్గం.

ఎన్ని కష్టాలు వచ్చినా, పేదరికం సంభవించినా, ధన ప్రాణాలకు చేటు వచ్చినా, చివరికి మరణమే సంభవించినా అభిమానధనులు మాట తప్పలేరు. ఇచ్చినమాట తప్పటం కన్నా మహాపాపం లేదు.
సత్యవాక్యం వల్ల పుణ్యం వస్తుంది. సత్యం మాట్లాడేవారికి స్వర్గాది పుణ్యలోకాలు సంభవిస్తాయి. కాబట్టి ఆడినమాట తప్పగూడదు.

ప్రశ్న 2.
క్రింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) నేటి సమాజానికి దాతృత్వంగల వ్యక్తుల అవసరమేమిటో వివరించండి.
(లేదా)
దానశీలము కలిగిన వ్యక్తుల వలన సమాజానికి కలిగే ప్రయోజనం ఏమిటి ?
(లేదా)
దాతృత్వమే నేటి సమాజానికి అవసరం. వివరించండి.
జవాబు:

  1. నేటి సమాజంలో ఒకరినొకరు పట్టించుకోవడం తగ్గుతోంది.
  2. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే దానగుణం రావాలి.
  3. దానగుణం వలన ఆపదలో ఉన్నవారికి సహాయం దొరుకుతుంది.
  4. మోసం తగ్గుతుంది. దొంగతనాలు తగ్గుతాయి.
  5. మనిషిలో స్వార్థం తగ్గుతుంది.
  6. సమాజంలో క్రూరత్వం తగ్గుతుంది.
  7. స్నేహం పెరుగుతుంది.
  8. కలిసిమెలసి ఉంటారు. ఒకరి కష్టసుఖాలలో ఒకరు పాలుపంచుకొంటారు.
  9. ప్రపంచమంతా ఒకే కుటుంబం. అందరూ నావాళ్ళే అనే భావాలు పెంపొందుతాయి.
  10. అవిద్య, పేదరికం, రోగాలు, యుద్ధాలు మొదలైనవి అంతమౌతాయి. సంపద, ఆరోగ్యం, శాంతి మొదలగునవి పెరుగుతాయి.
  11. పగ, ప్రతీకారం, ద్వేషం మొదలైనవి పోతాయి.
  12. గౌరవం, ప్రేమ, వాత్సల్యం, అభిమానం, బంధుత్వాలు, స్నేహాలు మొదలైనవి పెరుగుతాయి.

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

(లేదా)

ఆ) పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటలలో రాయండి.
జవాబు:
శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో నీ కులాన్ని, రాజ్యాన్ని నిలబెట్టుకో ఈ పొట్టివాడు విష్ణువు. ఇతడు తేలికగా పోడు. మూడులోకాలనూ మూడడుగులుగా కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండుతాడు. నా మాట విను ఈ దానం గీనం వద్దు అని శుక్రాచార్యుడు మేలుకోరి చెప్పగా క్షణకాలం కళ్ళుమూసుకొని బలిచక్రవర్తి ఇలా అన్నాడు.

‘ఓ మహాత్మా ! నీవు చెప్పింది నిజమే నేను ఈ లోకంలో అర్థమూ, కామమూ, జీవనోపాయము ఏది అడిగినా ఇస్తానని చెప్పాను. ఇప్పుడు ధనంపై దురాశతో తిరిగి పంపించలేను. ఇచ్చినమాట తప్పడం కన్నా పాపం లేదు. పూర్వం భూదేవి “ఎటువంటి చెడ్డపని చేసిన వానినైనా మోస్తాను. కాని ఆడిన మాట తప్పిన వానిని మాత్రం మోయలేను” అని బ్రహ్మతో చెప్పింది కదా ! యుద్ధంలో వెనుదిరగకుండా వీరమరణం పొందటమూ, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడమూ మానధనులైన వారికి మేలైన మార్గాలు.

రైతుకు మంచి పొలమూ, మంచి విత్తనాలు ఒక చోట దొరకడం అరుదు. అదే విధంగా దాతకు తగిన ధనమూ, దానిని తీసుకునే ఉత్తముడు దొరికే అదృష్టం అపురూపం కదా ! ఆచార్యా! పూర్వం రాజులున్నారు, రాజ్యాలున్నాయి. ఎంతో గర్వంతో విర్రవీగారు. కాని వారెవరూ ఈ సంపదను మూటకట్టుకొనిపోలేదు. ప్రపంచంలో వారి పేరు కూడా మిగులలేదు. శిబి చక్రవర్తి వంటివారు కీర్తికోసం సంతోషంగా అడిగినవారి కోర్కెలు తీర్చలేదా ? వారిని ఈనాటికి లోకం మరువలేదుకదా !

ఎడతెగని యజ్ఞాలు చేసివా పుణ్యకార్యాలు కావించినా విష్ణువును చూడటానికి వీలుపడదు. అటువంటి గొప్పవాడు పొట్టివాడై అడుగుతున్నాడు. ఇంతకంటే ఏం కావాలి. నాకు నరకం వచ్చినా, భూమండలం అదృశ్యమైనా, దుర్మరణం వచ్చినా, నా కులానికి చెడు జరిగినా సరే ! నేను ఆడినమాట తప్పను జరగవలసింది జరగనీ ! భయం లేదు. వచ్చిన వాడు శివుడైనా, విష్ణువైనా, బ్రహ్మదేవుడైనా, ఎవరైనా సరే ! ఎందుకు పలుమాటలు ? నా నాలుకకు మారుమాట రాదు.

బాగా బ్రతికినా, పెక్కుకష్టాలకు గురియైనా, పేదరికం వచ్చినా, ప్రాణానికి ధనానికీ చేటువచ్చినా కడకు చావు సంభవించినా సరే మానధనులు మాటతప్పలేరు. బలిచక్రవర్తి ఇల్లాలు వింధ్యావళి. ఆమె ఆ సందర్భంలో భర్తసైగ గమనించి బ్రహ్మచారి కాళ్ళు కడగటానికి బంగారు కలశంతో నీళ్ళు తెచ్చింది. అప్పుడు బలి చక్రవర్తి ఓ బ్రహ్మచారీ ! లేవయ్యా ! ఇటు రావయ్యా ! నీవు అడిగింది ఇస్తాను.

నీ పాదాలు కడుగనివ్వు ఇంకా ఆలస్యం దేనికి ? అనగానే బలి చక్రవర్తి దేవతలను కష్టాల నుండి కాపాడేది, కలకాలం మేలు కల్గించేది, అన్ని ఉపనిషత్తులకూ అలంకారమైనది, భవబంధాలను పోకార్చి మోక్షాన్ని సమకూర్చేది, అయిన కుడిపాదాన్ని కడిగాడు. ఆలాగే ఎడమ పాదాన్ని కడిగాడు. ఆ నీరు తలపై జల్లుకున్నాడు.

బలిచక్రవర్తి చేతులు చాచి వామనుని పూజించాడు. ‘బ్రహ్మణుడవు, విష్ణుస్వరూపుడవూ, వేదాల నియమాలు తెలిసినవాడవు అయిన నీకు మూడడుగుల నేల దానం చేస్తున్నాను” అని పలికి “పరమాత్మునకు ప్రీతి కలుగుగాక” అంటూ వెనువెంటనే ధారపోసినాడు. అది చూచి లోకం ఆశ్చర్యపడింది. ఓ పరీక్షన్మహారాజా ! అన్ని భూతాలకూ విష్ణువు అధిపతి. ఆయనకు బలి చక్రవర్తి దానం చేయగానే అన్ని దిక్కులూ కళకళలాడినాయి. పంచభూతాలు “బళిబళి” అని పొగిడినాయి.

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

ప్రశ్న 3.
క్రింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.
అ) ఆడినమాట తప్పకపోవడం, దానగుణం కలిగి ఉండడం అనే విషయాలపై నినాదాలు, సూక్తులు రాయండి.
జవాబు:
నేటికీ మన సమాజం ఈ విధంగా, మంచిగా ఉందంటే కారణం, ఆడిన మాట తప్పక పోవడం, దానగుణం కల్గిన వంటివారు నేటి సమాజంలో ఉండటం. కాబట్టి ఆడిన మాట తప్పటం కన్నా మరణించటం మేలు. దానగుణం అన్ని గుణాల్లో గొప్పది.
ఆడినమాట తప్పకపోవడం
నినాదాలు :

  1. ఆడి తప్పకండి – పలికి బొంకకండి.
  2. ఇచ్చినమాట నిలబెట్టుకొండి – నీతిగా బ్రతకండి.
  3. మితంగా మాట్లాడండి – అమితంగా విలువివ్వండి.
  4. మాటమీద నిలబడండి – పౌరుషంగా బ్రతకండి.

సూక్తులు :

  1. ఆడి తప్పరాదు. పలికి బొంకరాదు.
  2. మాటకు ప్రాణం సత్యం.
  3. మానధనులు మాట తప్పరు.
  4. ప్రాణం కంటే మాట విలువైనది.

నినాదాలు :
దానగుణం

  1. రక్తదానం చేయండి – ప్రాణాలు కాపాడండి.
  2. అవయవదానం ప్రోత్సహించండి – మరణం తర్వాతా జీవించండి.
  3. విద్యాదానం చేయండి – వివేకం పెంచండి.
  4. అన్నదానం చేయండి – జన్మను ధన్యం చేసు కోండి.

III. భాషాంశాలు

పదజాలం

ప్రశ్న 1.
క్రింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
అ) పలికి లేదనుట = మాట ఇచ్చి తప్పుట
జవాబు:
పలికి లేదనుట కంటె మించిన పాపము లేదు.

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

ఆ) కుఱుచగుట = పొట్టియగుట
జవాబు:
కుఱుచైనంత మాత్రమున మన విలువేమి తగ్గదు.

ఇ) చేతులొగ్గు = చేతులు వంచి
జవాబు:
కర్ణుడు ఇంద్రునకు చేతులొగ్గి దానం చేసాడు.

ప్రశ్న 2.
క్రింది పదాలకు వ్యుత్పత్త్యర్థాలు రాయండి.

అ) నీరజభవుడు = విష్ణువు నాభి కమలము నుండి పుట్టినవాడు (బ్రహ్మ).
ఆ) త్రివిక్రముడు = మూడడుగులచే ముల్లోకములను కొలిచినవాడు (విష్ణువు).

ప్రశ్న 3.
క్రింది వాక్యాలలో గీతలు గీసిన పదానికి సరిపోయే అర్థాన్నిచ్చే మరిన్ని పదాలు రాయండి.

అ) జలములతో నిండిన చెరువులు మిక్కిలి హాయినీ, ఆనందాన్నీ కలిగిస్తాయి.
జవాబు:
జలము – నీరు, వారి, అంబువు, ఉదకం, క్షీరము, జీవనం, సలిలము, తోయం

ఆ) జీవచ్ఛవం కావటంకన్నా యశఃకాయుడు కావడం మిన్న.
జవాబు:
యశః – కీర్తి, యశస్సు, సమజ్ఞ, భగము, శ్లోకము, ప్రతిష్ఠ, ఖ్యాతి, పేరు

ప్రశ్న 4.
క్రిందివాటిలో ప్రకృతి పదాలకు వికృతి పదాలు, వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయండి.

అ) సిరి = శ్రీ
ఆ) విష్ణువు = వెన్నుడు
ఇ) ధర్మము = దమ్మము
ఈ) బ్రహ్మ = బమ్మ

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

ప్రశ్న 5.
క్రింది పదాలకు నానార్థాలు రాయండి.

అ) కులము = వంశం, జాతి, శరీరం, ఇల్లు, సమూహం
ఆ) క్షేత్రము = చోటు, పుణ్యస్థానం, భూమి, శరీరం, మనస్సు ఉపవాసము
ఇ) హరి = విష్ణువు, ఇంద్రుడు, గుఱ్ఱం, దొంగ, సింహం, కోతి, సూర్యుడు, చంద్రుడు, అగ్ని
ఈ) చిత్రము = అద్భుత రసం, ఆశ్చర్యం, చిత్తరువు, పదచమత్కారం.

వ్యాకరణాంశాలు

ప్రశ్న 1.
క్రింది వాక్యాలలో సంధి పదాలను గుర్తించి, వాటిని విడదీసి సంధిపేరు రాయండి.
ఉదా : రమణి నాట్యాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించింది.
అత్యద్భుతం = అతి + అద్భుతం (యణాదేశసంధి)

అ) గర్వోన్నతి వల్ల ఆత్మీయులు దూరం అవుతారు.
జవాబు:
గర్వోన్నతి = గర్వ + ఉన్నతి (గుణసంధి)

ఆ) అభ్యాగతులకు దానం చేయడం మంచిది.
జవాబు:
అభ్యాగతులకు = అభి + ఆగతులకు (యణాదేశ సంధి)

ఇ) రంతిదేవుడు వదాన్యోత్తముడు.
జవాబు:
వదాన్యోత్తముడు = వదాన్య + ఉత్తముడు (గుణసంధి)

ఈ) అణ్వాయుధాలు మానవులకు హాని కలిగిస్తాయి.
జవాబు:
అణ్వాయుధాలు = అణు + ఆయుధాలు (యణాదేశ సంధి) అణ్వాయుధాలు = అణ్వాయుధము + లు (లులనల సంధి)

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

ప్రశ్న 2.
క్రింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసాలు గుర్తించండి.

అ) జీవధనములు – జీవమును, ధనమును (ద్వంద్వ సమాసము)
ఆ) యువతీయువకులు – యువతియును, యువకులును (ద్వంద్వ సమాసము)
ఇ) దశదిక్కులు – దశ సంఖ్యగల దిక్కులు (ద్విగు సమాసము)
ఈ) భూతప్రేతములు – భూతమును, ప్రేతమును (ద్వంద్వ సమాసము)

ప్రశ్న 3.
క్రింది పద్య పాదాలను గణవిభజన చేసి, ఏ పద్యాలకు సంబంధించినవో నిర్ణయించండి. లక్షణాలను రాయండి.

అ) తెలగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము ! రా
జవాబు:
TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము 1
ఇది మత్తేభ పద్యపాదము.
లక్షణములు :

  1. పై పద్యపాదమున స, భ, ర, న, మ, య, వ అను గణములు వరుసగా వచ్చినాయి.
  2. యతి 1 – 14 (తె – ధి)
  3. ప్రాస నియమం కలదు.
  4. 4 పాదములు పద్యమునకు ఉంటాయి.

ఆ) అనయము దోషమే పరులయందు కనుంగొని పల్కునట్టియా
జవాబు:
TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము 2
ఇది చంపకమాల పద్యపాదము.
లక్షణములు :

  1. పై పద్యపాదమున న, జ, భ, జ, జ, జ, ర అను గణములు వరుసగా వచ్చినాయి.
  2. యతి : 1-11 (అ – య)
  3. ప్రాస నియమం కలదు.
  4. 4 పాదములు పద్యమునకు ఉంటాయి.

త్రిక సంధి:
క్రింది పదాలను గమనించండి.
అ) అచ్చోటు → ఆ + చోటు
ఆ) ఇవ్విధము → ఈ + విధము
ఇ) ఎక్కాలము → ఏ + కాలము
పై పదాలలో పూర్వపదాల్లో ఆ, ఈ, ఏ లు ఉన్నాయి. ఇవి సర్వనామాలు.
ఈ త్రికముమీద ఉన్న అసంయుక్త హల్లు ద్విత్వంగా మారుతుంది.
ఆ, ఈ, ఏ లను ‘త్రికం’ అంటారు.
ఆ + చోటు → ఆ + చ్చోటు;
ఆ ఈ + విధము → ఈ + వ్విధము;
ఇ) ఏ + కాలము ఏ + క్కాలము
త్రికం మీది అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళమౌతుంది.

ఇలా ద్విత్వం (ద్విరుక్తం) పైన ఉన్న దీర్ఘాచ్చు హ్రస్వంగా మారుతుంది.

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

బహుళం : ఒక వ్యాకరణ కార్యం నిత్యంగారావడం, రాకపోవడం, వికల్పంగారావడం, అన్యకార్యం రావడం · ఇట్లా నాలుగు విధాలుగా జరిగితే ‘బహుళం’ అంటారు.
అ) ఆ + చ్చోటు → అచ్చోటు
ఆ) ఈ + వ్విధము → ఇవ్విధము
ఇ) ఏ + క్కాలము → ఎక్కాలము
ద్విరుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆచ్ఛికమైన దీర్ఘం హ్రస్వమౌతుంది.
ఆచ్ఛికం : అచ్చ తెలుగు పదం.

ప్రాజెక్టు పని

వివిధ పండుగల సందర్భంగా వివిధ మతాలవారు చేసే దానధర్మాలను తెలుసుకోండి. సమాచారం సేకరించండి. పట్టికను రాయండి. నివేదిక ప్రదర్శించండి.
TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము 3
జవాబు:
TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము 4
TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము 5

విశేషాంశాలు
1. అష్టాదశ పురాణాలు
1) మత్స్య పురాణం
2) మార్కండేయ పురాణం
3) భాగవత పురాణం
4) భవిష్య పురాణం
5) బ్రహ్మ పురాణం
6) బ్రహ్మవైవర్త పురాణం
7) బ్రహ్మాండ పురాణం
8) విష్ణు పురాణం
9) వరాహ పురాణం
10) వామన పురాణం
11) వాయు పురాణం
12) అగ్ని పురాణం
13) నారద పురాణం
15) లింగ పురాణం
17) కూర్మ పురాణం
14) పద్మ పురాణం
16) గరుడ పురాణం
18) స్కాంద పురాణం

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

2. శిబిచక్రవర్తి :

గొప్పదాత దయాగుణంకలవాడు. ఈయన దానగుణాన్ని పరీక్షించుటకు ఇంద్రుడు, అగ్ని డేగ, పావురాల రూపాలతో వస్తారు. పావురాన్ని డేగ నుంచి రక్షించడానికి శిబి తన శరీరభాగాన్ని కోసి ఆహారంగా ఇస్తాడు. తన శరీరాన్ని ఎంత కోసి సమర్పించినా అది పావురం బరువుతో సరితూగదు. అప్పుడు శిబి ఆర్తరక్షణ ధర్మాన్ని పాటించి తననే ఆహారంగా ఆర్పించుకుంటాడు. అంతటి మహాదాత ఆయన శిబిని కీర్తించి ఇంద్రాగ్నులు అతనికి తేజో శరీరాన్ని ప్రసాదించి ఆశీర్వదిస్తారు.

సూక్తి : తన ఆకలిని సహించుకునే తపోధనుడి శక్తికన్నా, ఇతరుల ఆకలి తీర్చే దానశీలి శక్తి మిన్న !

ప్రతిపదార్థ తాత్పర్యాలు

1. మ.
కులమున్ రాజ్యముఁ దేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంభరుం
డలఁతిం బోఁడు త్రివిక్రమస్ఫురణవాఁడై నిండు బ్రహ్మాండముం
గలఁడే మాన్ప నొకండు ? నా పలుకు లాకర్ణింపు కర్ణంబులన్
వలదీ దానము గీనముం ; బనుపుమా వర్ణిన్ నోత్తమా!

కవి పరిచయం :
ఈ పద్యము మహాకవి బమ్మెర పోతనచే రచించబడిన ‘దానశీలము’ అనే పాఠ్యభాగము నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థము
వదాన్య + ఉత్తమా ! = దాతల్లో శ్రేష్ఠుడా ! (ఓ బలిచక్రవర్తీ !)
కులమున్ = (రాక్షస) కులమును
రాజ్యమున్ (రాక్షస) రాజ్యమును
తేజమున్ = తేజస్సును
నిలుపుము = నిలబెట్టుము
ఈ = ఈ
కుబ్జుండు = పొట్టివాడు (వామనుడు)
విశ్వంభరుండు = విష్ణుమూర్తి (జగత్తును భరించువాడు హరి)
అలతిన్ + పోడు = అంత తేలికగా వదలిపెట్టడు
త్రివిక్రమ = ముల్లోకములను ఆక్రమించెడి
స్ఫురణన్ = స్ఫూర్తి కలవాడు
వాడు = వాడు
ఐ = అయ్యి
నిండున్ = నిండిపోవున
బ్రహ్మాండమున్ = బ్రహ్మాండమును
కలడే = సమర్థుడు ఉన్నాడా
మాన్పన్ = ఆపుటకు
ఒకండు = ఒకడైన
నా = నా యొక్క
పలుకులున్ = మాటలను
ఆకర్ణింపుము = వినుము
కర్ణంబులన్ = చెవులారా
వలదు = వద్దు
ఈ = ఈ
దానమున్ = దానము
గీనమున్ = గీనము
వర్ణిన్ = బ్రహ్మచారిని
పనుపుమా = పంపివేయుము (పంపించవయ్యా !)

తాత్పర్యము :
దాతల్లో గొప్పవాడా ! ఓ బలిచక్రవర్తీ ! నీ కులాన్నీ, రాజ్యాన్నీ, పరాక్రమాన్నీ నిలుపుకో. ఈ పొట్టివాడు విష్ణువు. కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాడు. మూడడుగులతో మూడు లోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఎవరైనా అతడిని ఆపగలరా ? నా మాట విను. దానం వద్దు గీనం వద్దు. ఈ బ్రహ్మచారిని (వామనుడిని) పంపించు.

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

వ. అని యిట్లు హితంబు పలుకుచున్న కులాచార్యునకు
క్షణమాత్ర నిమీలిత లోచనుండయి యిట్లనియె.

ప్రతిపదార్థము
అని = అని
ఇట్లు = ఇలా
హితంబు = మేలుకోరి
పలుకుచున్న = చెప్పుతున్న
కుల = వంశ
ఆచార్యునకున్ = గురువునకున్
యశస్వి = కీర్తిగలవాడు (కీర్తిమంతుడైన) (బలి)
క్షణమాత్ర = కొంచెము సేపు
నిమీలిత = అరమూసిన
లోచనుడు = కన్నులు కలవాడు
అయి = అయ్యి
ఈ విధముగ
ఇట్లు = పలికెను

తాత్పర్యము :
అని ఈ విధంగా తన వంశగురువైన శుక్రాచార్యుడు తన మేలుకోరి చెప్పుతుండగా క్షణకాలం కన్నులు మూసుకొని కీర్తిమంతుడైన బలి ఇట్లన్నాడు.

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

2. సీ. నిజమానతిచ్చితి నీవు మహాత్మక !
మహిని గృహస్థధర్మంబు నిదియ
యర్థంబుఁ గామంబు యశమును వృత్తియు
నెయ్యది ప్రార్థింప నిత్తు ననియు
నర్థలోభంబున నర్థిఁ బొమ్మనుటెట్లు?
పలికి లేదనుకంటెఁ బాప మెద్ది
‘యెట్టి దుష్కర్ముని నే భరించెదఁ గాని
సత్యహీనుని మోవఁజాల’ ననుచుఁ

తే. బలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ
సమరమున నుండి తిరుగకఁ జచ్చుకంటెఁ
బలికి బొంకక నిజమునఁ బరఁగు కంటెఁ
మానధనులకు భద్రంబు మఱియుఁ గలదె

కవి పరిచయం :
ఈ పద్యము మహాకవి బమ్మెర పోతనచే రచించబడిన ‘దానశీలము’ అనే పాఠ్యభాగము నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్దము.
నిజమున్ = సత్యమును
ఆనతిచ్చితివి = చెప్పితివి
నీవు = నీవు
మహాత్మక = గొప్ప ఆత్మ కలవాడా !
మహిని = భూమిపైన
గృహస్థ = గృహస్థుల యొక్క
ధర్మంబున్ = ధర్మము
ఇదియ = ఇదే
కామంబు = కామము (వాంఛ)
యశము = కీర్తి
వృత్తియున్ = జీవనాధారం
ఎయ్యదిన్ = ఏదైనా
ప్రార్థింపన్ = కోరితే
ఇత్తును = ఇచ్చెదను
అనియున్ = అని కూడా
అర్థ = సంపదలపై
లోభంబునన్ = లోభముతో
అర్థిన్ = అడిగినవానిని
పొమ్ము = వెళ్ళిపొమ్ము
అనుట = అనుట
ఎట్లు = ఎలా కుదురుతుంది
పలికి = మాట యిచ్చి
లేదు = లేదు
అనుట = అనుట
కంటెన్ = కంటె
పాపము = పాపము
ఎద్ది = ఏముంది ?
తొల్ల = పూర్వము
భూదేవి = భూదేవి
ఎట్టి = ఎలాంటి
దుష్కర్ముని = చెడ్డపని చేసినవానినైన
నేన్ = నేను (భూమాత)
భరించెదన్ = మోయగలను
కాని = కాని
సత్యహీనుడు = ఆడిన మాటతప్పువానిని
మోవజాలన్ = మోయలేను
అనుచున్ = అని
బ్రహ్మ = బ్రహ్మదేవుని
తోడన్ = తోటి
పలుక = అన్నది కదా
సమరమున = యుద్ధము
నుండి = నుండి
తిరుగక = వెనుతిరుగక
చచ్చు = మరణించుట
కంటెన్ = కంటె
పలికి = మాట యిచ్చి
బొంకక = పలికిలేదనకుండ
నిజమునన్ = సత్యమునందు
పరగు = వర్థిల్లెడి
కంటెన్ = కంటె
మానధనులకు = అభిమానమే ధనముగా కలవారికి
భద్రంబు = శుభమైనది
మఱియున్ = మరింకొకటి
కలదె = ఉన్నదా (లేదు అని అర్థం)

తాత్పర్యము :
ఓ మహాత్మా ! నీవు చెప్పింది నిజమే. లోకంలో గృహస్థుల ధర్మం కూడా ఇదే. అర్థం, కామం, కీర్తి, జీవనాధారం వీటిలో ఏది అడిగినా ఇస్తానని చెప్పాను. ఇప్పుడు ధనంపై దురాశతో లేదని చెప్పి తిప్పి పంపించలేను. ఇచ్చిన మాట తప్పుటకున్నా పాపం లేదు. పూర్వం భూదేవి “ఎటువంటి చెడ్డపని చేసినవానినైన భరిస్తాను. కాని ఆడిన మాట తప్పినవానిని మాత్రం మోయలేను” అని బ్రహ్మతో చెప్పింది కదా ! యుద్ధంలో వెనుదిరుగకుండా వీరమరణం పొందడమూ మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడమూ మానధనులైనవాళ్ళకు మేలైన మార్గాలు.

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

3. క॥ ధాత్రిని హలికునకును సు
క్షేత్రము బీజములు నొకటఁ జేకుఱు భంగిం
జిత్రముగ దాత కీవియుఁ
బాత్రము సమకూరునట్టి భాగ్యము గలదే !

కవి పరిచయం :
ఈ పద్యము మహాకవి బమ్మెర పోతనచే రచించబడిన ‘దానశీలము’ అనే పాఠ్యభాగము నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థము
హలికునకును = రైతుకు
ధాత్రిన్ = భూమిపైన
సుక్షేత్రము = మంచి పొలము
బీజములున్ = మంచి విత్తనములును
ఒకటన్ = ఒకేచోట
చేకుఱు = సమకూరిన
భంగిన్ = విధంగా
దాతకు = దానము చేయువానికి
చిత్రముగ = అపురూపముగ
ఈవియున్ = దానమునకు తగినది
పాత్రము = తగిన గ్రహీత
సమకూరున్ = కలిసివచ్చు
అట్టి = అటువంటి
భాగ్యము = అదృష్టము
కలదే = ఉందా, లేదు

తాత్పర్యము :
రైతులకు మంచి నేల, మంచి విత్తనాలు దొరకటం అరుదు. అట్లే దాతకు తగినంత ధనము, దానిని గ్రహించటానికి ఉత్తముడైన వ్యక్తీ దొరికే అదృష్టం అరుదే కదా !

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

II

* 4. శా.
కారే రాజులు ? రాజ్యముల్ గలుగవే ? గర్వోన్నతిం
వారేరీ సిరి మూట గట్టుకొని పోవంజాలిరే ? భూమిపైఁ
బేరైనం గలదే ? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై
యీరే కోర్కులు ? వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా !

ప్రతిపదారము

భార్గవా = ఓ శుక్రాచార్యా ! (భార్గవుడు = భృగువు పుత్రుడు, శుక్రుడు)
రాజులు = ఎంతో మంది రాజులు
కారే = కాలేదా ?
రాజ్యముల్ = రాజ్యములు
కలుగవే = పొందలేదా ఏమి
గర్వ = అహంకారముతో
ఉన్నతిన్ = గొప్పదనాన్ని
పొందరే = పొందలేదా ఏమి
వారు = వాళ్ళందరు
ఏరి = ఎక్కడ ఉన్నారు ?
సిరిని = సంపదలను
మూటగట్టుకొని = కూడగట్టుకొని
పోవన్ + చాలిరే = తీసుకెళ్ళగలిగారా, లేదు
భూమిపైన్ = నేలపైన (ఈ భూలోకంలో)
పేరు + ఐనన్ = కనీసము పేరైనా
కలరే = ఉన్నదా, లేదు
శిబి = శిబిచక్రవర్తి
ప్రముఖులున్ = మొదలగువారు
యశః = కీర్తి
కాములు + ఐ = కోరువారై
కోర్కులు = దానములను
ప్రీతిన్ = సంతోషంతో
ఈరే = ఇవ్వలేదా
ఈ = ఇప్పటి
కాలమున = కాలమునందును
వారలన్ = వారిని
మఱచిరే = మరిచిపోయారా, లేదు (మరిచిపోలేదని అర్థం)

తాత్పర్యము :
ఆచార్యా ! పూర్వం రాజులు ఉన్నారు. వారికి రాజ్యాలు ఉన్నాయి. వారు ఎంతో అహంకారంతో విర్రవీగారు. కాని వారెవరూ ఈ సంపదలను మూటగట్టుకొని పోలేదు. ప్రపంచంలో వారి పేర్లు కూడా మిగులలేదు. శిబిచక్రవర్తి వంటివారు కీర్తి కోసం సంతోషంగా అడిగినవారి కోరికలు తీర్చలేదా ? వారిని ఈనాటికీ లోకం మరువలేదు కదా !

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

5. క. ఉడుగని క్రతువుల వ్రతములఁ
బొడగనఁ జననట్టి పొడవు పొడవునంఁ గుఱుచై
యడిగెడి నఁట ననుబోఁటికి,
నిడరాదె మహానుభావ ! యిష్టార్థంబుల్

కవి పరిచయం :
ఈ పద్యము మహాకవి బమ్మెర పోతనచే రచించబడిన ‘దానశీలము’ అనే పాఠ్యభాగము నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్దము
మహా + అనుభావ ! = ఓ మహానుభావా !
ఉడుగని = ఎడతెగని
క్రతువుల = యాగములతో
వ్రతములన్ = వ్రతములతో
పొడగనన్ = దర్శించుటకు
చననట్టి = వీలు కానట్టి
పొడవు = గొప్పవాడు
పొడవున = ఔన్నత్యముతో, కొలతలో
కుఱచ = తక్కువ, పొట్టి
ఐ = అయ్యి
ఇష్ట = కోరిన
అర్థంబుల్ = సంపదలను
అడిగెన్ + అంట = అడుగుతున్నాడట
నను = నా
పోటికిన్ = వంటివానికి
ఇడన్ = దానమిచ్చుట
రాదె = చేయకూడదా ఏమి

తాత్పర్యము :
మహానుభావా ! ఎడతెగని యజ్ఞాలు, పుణ్యకార్యాలు ఎన్ని చేసినా విష్ణువును చూడడం సాధ్యంకాదు. అటువంటి గొప్పవాడు చిన్నవానిగా మారి అడుగుతున్నాడు. అతడు కోరిన దానిని ఇవ్వడంకంటే నా వంటి వానికి ఇంకేం కావాలి ?

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

* 6. మ.
నిరయంబైన, నిబంధమైన, ధరణీ నిర్మూలనంబైన, దు
ర్మరణం బైనఁ గులాంతమైన నిజమున్ రానిమ్ము. కానిమ్ము పో :
హరుఁడైనన్, హరియైన, నీరజభవుం డభ్యాగతుండైన
దిరుగన్ నేరదు నాదు జిహ్వ; వినుమా ! ధీవర్య! యేటికిన్ ?

కవి పరిచయం :
ఈ పద్యము మహాకవి బమ్మెర పోతనచే రచించబడిన ‘దానశీలము’ అనే పాఠ్యభాగము నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్దము
ధీవర్య = ఓ విజ్ఞాని ! (ఓ పండితోత్తమా !)
నిర్ణయంబు + ఐన = నరకము దాపురించినా
నిబంధము + ఐన = అనారోగ్యం కలిగినా
ధరణీ = రాజ్యము
నిర్మ = నాశనము
ఐనన్ = అయినా సరే
దుర్మరణంబు + ఐనన్ = అకాల మరణం సంభవించినా
కుల + అంతము + ఐన = వంశం నాశమైనా
నిజమున్ = నిజంగానే పైవన్నీ
రానిమ్ము = వస్తేరానీ
కానిము = జరిగెడిది జరగనిమ్ము
వేయేటికిన్ = వేయిమాటలు దేనికి
వినుమా = వినుము
అభ్యాగతుండు = అతిథిగా వచ్చినవాడు
హరుడు = శివుడు
ఐనన్ = అయినా
హరి = విష్ణువు
నీరజభవుండు + ఐన = బ్రహ్మదేవుడయినా
నాదు = నా యొక్క
జిహ్వ = నాలుక
ఔన్ = ఇస్తానని
తిరుగన్ = వెనుతిరుగుట (మాట తప్పడం)
నేరదు = చేయలేదు

తాత్పర్యము :
ఓ పండితోత్తమా ! నాకు నరకం దాపురించినా సరే, బంధనం ప్రాప్తమైనా మంచిదే. ఈ భూమండలం అదృశ్యమైనా, నాకు దుర్మరణం వచ్చినా “సరే. నా వంశం అంతా నశించినా సరే. ఏమైనా కానీ, ఏదైనా రానీ ! ఆడిన మాట మాత్రం తప్పను. వచ్చినవాడు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఎవరైనా సరే. నా నాలుక వెనుదిరుగదు. (ఆడినమాట తప్పను) ఎందుకీ వేలకొద్ది మాటలు ?

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

III

7.
ఆ. బ్రదుకవచ్చుఁ గాక బహుబంధనములైన
వచ్చుఁగాక లేమి వచ్చుఁగాక
జీవధనములైనఁ జెడుఁగాక పడుఁగాక
మాట దిరుగలేరు మానధనులు

కవి పరిచయం :
ఈ పద్యము మహాకవి బమ్మెర పోతనచే రచించబడిన ‘దానశీలము’ అనే పాఠ్యభాగము నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థము
బ్రదుకవచ్చున్ + కాక = (బాగా) బ్రతికే అవకాశం ఉండవచ్చు
బహు = చాలా
బంధనములు + ఐన = చిక్కులైనా
వచ్చున్ + కాక = వచ్చినా కానీ
లేమి = దరిద్రం
వచ్చున్ + కాక = వచ్చినా కానీ
జీవ = ప్రాణాలూ
ధనములు + ఐనన్ = సంపదలు కూడా
చెడున్ + కాక = చెడిపోయినా కానీ
పడున్ + కాక = మరణం వచ్చినా కానీ
మానధనులు = అభిమానమే ధనంగా గలవారైన పౌరుషవంతులు
మాటన్ = ఇచ్చిన మాటను
తిరుగలేరు = తప్పలేరు

తాత్పర్యము :
మానధనులైన వారు బాగా బ్రతికితే బ్రతకవచ్చు. చాలా చిక్కులైనా ఎదుర్కోవలసి రావచ్చును. దరిద్రం వస్తే రావచ్చు. ప్రాణాలు, సంపద కూడా నాశనం కావచ్చు. మరణం కూడా సంభవించవచ్చు. అయినా ఎట్టి పరిస్థితులలోనూ మాట తప్పరు.

వ. అయ్యవసరమున
ప్రతిపదార్థము
ఆ + అవసరమయిన = ఆ సమయంలో

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

8.
ఆ. దనుజలోకనాథు దయిత వింధ్యావళి
రాజవదన మదమరాళ గమన
వటుని కాళ్లు గడుగ వర హేమఘటమున
జలముఁ దెచ్చె భర్త సన్న యెఱిగి.

కవి పరిచయం :
ఈ పద్యము మహాకవి బమ్మెర పోతనచే రచించబడిన ‘దానశీలము’ అనే పాఠ్యభాగము నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థము
రాజవదన = చంద్రముఖి
మదమరాళ = రాయంచలవంటి
గమన = నడకలు కలామె
దనుజలోక నాథు= రాక్షసులందరికి రాజైన బలిచక్రవర్తి
దయిత = భార్య
వింధ్యావళి = వింధ్యావళి
భర్త = మొగుని
సన్న = సంజ్ఞను
ఎఱిగి = అర్థము చేసికొని
వటుని = బ్రహ్మచారి
కాళ్ళు = పాదములు
కడుగ = కడుగుటకు
వర = శ్రేష్ఠమైన
హేమ = బంగారు
ఘటమునన్ = కలశముతో
జలమున్ = నీటిని
తెచ్చెన్ = తీసుకువచ్చెను

తాత్పర్యము :
అని ఈ విధంగా బలిచక్రవర్తి మాట్లాడుతుండగా చంద్రబింబం వంటి ముఖమూ మత్తిల్లిన రాజహంస వంటి నడక కలిగిన అతని ఇల్లాలు వింధ్యావళి భర్త యొక్క సైగను గమనించింది. ఆ బ్రహ్మచారి కాళ్ళు కడిగి దానం చేయటానికై శ్రేష్ఠమైన బంగారు కలశంతో నీళ్ళు తెచ్చింది.

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

వ. అయ్యవసరంబునఁ గపటవటునకు నద్దానవేంద్రుం డిట్లనియె.

ఆ + అవసరంబున = ఆ సమయంలో (అప్పుడు)
కపట వటునకు = మోసగాడైన వామనునితో
ఆ + దానవేంద్రుడు = ఆ బలిచక్రవర్తి
ఇట్లు + అ = ఇట్లా అన్నాడు

తాత్పర్యము :
అప్పుడు వామనునితో బలిచక్రవర్తి ఇట్లా అన్నాడు.

9.
క. రమ్మా ! మాణవకోత్తమ!
లెమ్మా ! నీ వాంఛితంబు లే దన కిత్తుం
దెమ్మా ! యడుగుల నిటు రా
నిమ్మా! కడుగంగవలయు నేఁటికిఁ దడయన్ ?

కవి పరిచయం :
ఈ పద్యము మహాకవి బమ్మెర పోతనచే రచించబడిన ‘దానశీలము’ అనే పాఠ్యభాగము నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్ధము
మాణవక + ఉత్తమా != ఉత్తమమైన బాలకుడా !
లెమ్ము + ఆ = లేచి
రమ్ము + ఆ = ఇటు రా!
అడుగులన్ = పాదములను
ఇటు = ఇటుపక్కకి
రానిమ్ము = రానిమ్ము
కడుగంగవలయున్ = కడగాలి
తెమ్ము + ఆ = తేవయ్య !
తడయున్ = ఆలస్యము చేయుట
ఏటికిన్ = దేనికి ?
నీ = నీ యొక్క
వాంఛితంబున్ = కోరికను
లేదు = లేదు
అనకన్ = అనకుండగా
ఇత్తున్ = ఇచ్చెదను

తాత్పర్యము :
ఓ ఉత్తమ బ్రహ్మచారీ! లేవయ్యా! ఇటు రావయ్యా ! నీవు అడిగింది లేదనుకుండా ఇస్తా, నీ పాదాలు కడుగనివ్వు. ఇంకా ఆలస్యం దేనికి ?

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

10.
క. సురలోక సముద్ధరణము
నిరత శ్రీకరుణ మఖిల నిగమాంతాలం
కరణము భవసంహరణము
హరిచరణము నీటఁ గడిగె నసురోత్తముఁడున్.

కవి పరిచయం :
ఈ పద్యము మహాకవి బమ్మెర పోతనచే రచించబడిన ‘దానశీలము’ అనే పాఠ్యభాగము నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్ధము
సురలోక = దేవతలు అందరును
సముద్దరణమున్ = చక్కగా కాపాడెడిది
నిరత = కలకాలము
శ్రీకరుణ = మేలు కలిగించెడిది
అఖిల = సర్వ
నిగమాంత = వేదాంతములకు
అలంకరణమున్ = అలంకారమైనది
భవ = పునర్జన్మప్రాప్తి
సంహరణమున్ = పోగొట్టునది
హరి = విష్ణుని యొక్క
చరణమున్ = పాదమును
అసుర = రాక్షసులలో
ఉత్తముడున్ = శ్రేష్ఠుడైన బలిచక్రవర్తి
నీట = నీటితో
కడిగెన్ = శుభ్రపరచెను

తాత్పర్యము :
వామనుడైన విష్ణువు కుడి పాదాన్ని బలిచక్రవర్తి కడిగాడు. ఆ పాదం దేవతలను కష్టాల నుండి కాపాడేది. కలకాలమూ మేలు కలిగించేది. అన్ని ఉపనిషత్తులకూ అలంకారమైంది. భవబంధాలను పోగొట్టి మోక్షాన్ని సమకూర్చేది. అదేవిధంగా ఆ చక్రవర్తి వామనుని పాదాన్ని కూడా కడిగాడు.

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

వ. ఇట్లు ధరణీసుర దక్షిణ చరణ ప్రక్షాళనంబు సేసి
వామపాదంబు గడిగి తత్పావన జలంబు
శిరంబునం జల్లుకొని వార్చి దేశ కాలాది పరిగణ నంబుసేసి.

ప్రతిపదార్దము
ఇట్లు = ఈ విధముగ
ధరణీసుర = బ్రాహ్మణుని (ధరణీసురుడు – భూమిపై దేవత-విప్రుడు)
దక్షిణ = కుడి
చరణ = పాదమును
ప్రక్షాళనము = కడుగుట
చేసి = చేసి
వామ = ఎడమ
పాదంబున్ = పాదమును
కడిగి = కడిగి
తత్ = ఆ రెండు పాదాలూ కడిగిన
పావన = పవిత్రమైన
జలంబున్ = నీటిని
శిరంబునన్ = తలపైన
చల్లుకొని = చిలకరించుకొని
దేశ = ప్రదేశము
కాల = కాలము
ఆది = మున్నగువాని
పరిగణనంబు = సంకల్పము
చేసి = చేసి (చెప్పాడు)
వార్చి = పూజించి

తాత్పర్యము :
పవిత్రమైన ఆ జలాలను నెత్తిపై చల్లుకున్నాడు. ఆచమనం చేశాడు. దేశ, కాల పూర్వకమైన ‘సంకల్పాన్ని’ చెప్పాడు

11. శా.
‘విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వే
ద ప్రామాణ్యవిదే త్రిపాదధరణీం దాస్యామి’ యంచుం గ్రియా
క్షిప్రుండై దనుజేశ్వరుండు వడుగుం జేసాఁచి పూజించి ‘బ్ర
హ్మ ప్రీత మ్మని ధారవోసె భువనం బాశ్చర్యముం బొందఁ గన్.

కవి పరిచయం :
ఈ పద్యము మహాకవి బమ్మెర పోతనచే రచించబడిన ‘దానశీలము’ అనే పాఠ్యభాగము నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్ధము
దనుజేశ్వరుండు = రాక్షసరాజు బలిచక్రవర్తి
విప్రాయ = బ్రాహ్మణుని కొరకు
ప్రకట = ప్రసిద్ధమైన
వ్రతాయ = నిష్ఠకల వానికొరకు
విష్ణు = విష్ణుమూర్తి యొక్క
స్వరూపాయ = స్వరూపము ఐనవాడి కొరకు
వేద = వేదములందలి
ప్రామాణ్య = ప్రమాణములను
విదే = తెలిసినవాడవు
భవతే = నాకు
త్రి = మూడు (3)
పాద = అడుగుల
ధరణీం = భూమిని
దాస్యామి = దానము చేయుచుంటిని
అంచున్ = అనుచు
క్రియాక్షిప్రుండై = పనియందు వేగము కలవాడై
చేన్ = చేయి
చాచి = చాచి
వడుగున్ = బ్రహ్మచారిని
పూజించి = పూజచేసి
భువనంబు = జగత్తంతా
ఆశ్చర్యమున్ = ఆశ్చర్యము
పొందగన్ = పడునట్లుగా (పడింది)
బ్రహ్మ = పరబ్రహ్మకి
ప్రీతమ్ము = ప్రీతి కలుగుగాక
అని = అని
ధారవోసి (ధార + పోసి) = ధారపోసెను (దారపోయు దానం చేసెడి క్రియలో నీటిధారను దాతచేతి నుండి గ్రహీత చేతిలో పడునట్లు పోసెడి విధి)

తాత్పర్యము :
బలిచక్రవర్తి చేతులు చాచి వామనుని పూజించాడు. “బ్రాహ్మణుడవూ ప్రసిద్ధమైన వ్రతము కలవాడవూ విష్ణు స్వరూపుడవూ వేదాల ప్రమాణతను తెలిసినవాడవు అయిన నీకు మూడడుగుల నేల దానం చేస్తున్నా’ అని పలికి “పరమాత్మునకు ప్రీతి కలుగుగాక” అంటూ వెనువెంటనే చేతిలో నీటిని ధారవోశాడు. అది చూసి లోకం ఆశ్చర్యపడింది.

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

12.
క. బలి చేసిన దానమునకు
నలినాక్షుఁడు నిఖిలభూత నాయకుఁ డగుటం
గలకల మని దశ దిక్కులు
బళి బళియని పొగడె భూత పంచకమనఘా!

కవి పరిచయం :
ఈ పద్యము మహాకవి బమ్మెర పోతనచే రచించబడిన ‘దానశీలము’ అనే పాఠ్యభాగము నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థము
అనఘా = ఓ పుణ్యుడా ! (పరీక్షిన్మహారాజా !)
బలి = బలి చక్రవర్తి
చేసిన = చేసినట్టి
దానమునకు = దానమునకు
నలినాక్షుఁడు = విష్ణువు
నిఖిల = సమస్తమైన
భూత = జీవులకు
నాయకుడు = ప్రభువు
అగుటన్ = అగుట వలన
దశ = పది
దిక్కులు = దిశలందు (దశ దిక్కులు = 4 దిక్కులు, 4 మూలలు, పైన క్రింద మొత్తం 10 వైపులు)
భూతపంచకము = పంచభూతములును (పంచభూతములు (1) పృథివి (2) అప్ (3) తేజస్సు (4) వాయువు (5) ఆకాశము)
గలకలమని = కలకలలాడి
బళిబళి = ఒహో ఒహో
అని = అని
పొగడె = (విష్ణువును) పొగిడిను

తాత్పర్యము :
ఓ పరీక్షిన్మహారాజా ! అన్ని భూతాలకూ విష్ణువు అధిపతి. ఆయనకు బలిచక్రవర్తి దానమియ్యగానే పది దిక్కులూ, పంచభూతాలూ “బళి బళి” అని పొగిడాయి.

పాఠం నేపథ్యం / ఉద్దేశం

విరోచనుని కుమారుడైన బలి అసుర చక్రవర్తి. ప్రహ్లాదుని మనుమడు. ఇతడు తన శక్తిసామర్థ్యాలతో స్వర్గలోకాన్ని ఆక్రమిస్తాడు. ఇతని పరిపాలనలో కొందరు దేవతలు స్వర్గాన్ని వదిలిపోగా మిగిలినవారు వివక్షకు గురౌతారు. ఈ విషయాన్ని వారు మహావిష్ణువుతో చెప్పుకోగా తాను వామనునిగా జన్మించి దేవతల కష్టాలు తీరుస్తానని అభయమిస్తాడు.

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

ఆ తర్వాత కొంతకాలానికి మహావిష్ణువు వామనా వతారం ఎత్తుతాడు. బలి నర్మదానదీ తీరంలో యాగం చేస్తుండగా వామనుడు వెళ్ళి తనకు మూడడుగుల నేల కావాలని కోరగా తాను ఇస్తానని బలి మాట యిస్తాడు. వామనుని మాటల్లో ఏదో మోసం ఉందని గ్రహిస్తాడు రాక్షస గురువైన శుక్రాచార్యుడు. బలిచక్రవర్తిని దానం ఇవ్వవద్దని అంటాడు.

ఇచ్చిన మాటకు కట్టుబడే తత్త్వాన్ని, దానం గొప్పదనాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

పోతన తెలుగులో భాగవతాన్ని రాశాడు. ప్రస్తుత పాఠ్యభాగం శ్రీమత్ భాగవతం, అష్టమ స్కంధంలోని “వామన చరిత్ర” లోనిది.

కవి పరిచయం

కవి పేరు : బమ్మెర పోతనామాత్యుడు.

గ్రహింపబడిన గ్రంథం: బమ్మెర పోతన రచించిన శ్రీమద్భాగవతంలోని అష్టమ స్కంధంలోని ‘వామన చరిత్ర’ లోనిది.

పోతన తల్లిదండ్రులు : లక్కమాంబ, కేసన

కాలము : 15వ శతాబ్దము.

జన్మస్థలము : బమ్మెర గ్రామము, పూర్వపు వరంగల్ జిల్లా.

ఇతర రచనలు : వీరభద్ర విజయం, భోగినీ దండకం, నారాయణ శతకం, ప్రహ్లాదచరిత్ర, గజేంద్రమోక్షం, రుక్మిణీకల్యాణం.

అంకితం : మానవమాత్రులైన రాజులకు తన గ్రంథాన్ని అంకితం ఇవ్వనన్నాడు. భగవంతుడిచ్చిన కవితాశక్తితో రచించిన భాగవతాన్ని శ్రీరామునికే అంకితం ఇస్తానన్నాడు. శ్రీరామ చంద్రునికే అంకితం ఇచ్చాడు.

అనువాదం : పోతన కొన్ని భాగాలను పెంచి వర్ణించాడు. కొన్నిటిని ఉన్నవి ఉన్నట్లుగా అనువదించాడు.

బిరుదు : పోతనకు ‘సహజ పండితుడు’ అని బిరుదు కలదు. అంటే పుట్టుకతోనే ఆయనకు పాండిత్యం, కవిత్వము అల్లగల శక్తి ఉన్నాయి. పోతన ‘భక్తకవి’.

ప్రత్యేకత : పండిత పామర జనరంజకంగా బమ్మెర పోతన రచన ఉంటుంది. ప్రహ్లాదచరిత్ర, గజేంద్రమోక్షం, రుక్మిణీకల్యాణం, వామన చరిత్ర మొదలైన వాటిలో పద్యాలు నోటికి రాని తెలుగువారు లేరు.

అలంకారాలు : శబ్దాలంకారాలు ఎక్కువగా ప్రయో గించాడు. అర్థాలంకారాలు కూడా సందర్భానుసారంగా ప్రయో గించాడు.

నివాసం : తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్లు జిల్లా నేటి జనగామ జిల్లాలోని బమ్మెర గ్రామ నివాసి.

వృత్తి : వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించాడు. అంతేకాని, రాజా స్థానాలకు వెళ్ళలేదు. సన్మానాలను తిరస్కరించాడు.

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

ప్రవేశిక

ఇచ్చిన మాట తప్పకపోవటం, తాను సంపాదించిన దానిలో శక్తిమేరకు దానం చేయడం, తన యింటికి వచ్చిన అతిథి, అభ్యాగతులను ఆదరించటం అనేవి మానవులకు ఉండవలసిన మహిత గుణాలు.

మన పురాణాలలో, చరిత్రలో ఇటువంటి మహనీయుల కథలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటిని చదివి మనం స్ఫూర్తి పొందవలసిన అవసరం ఉన్నది.

ప్రస్తుత పాఠంలో బలిచక్రవర్తి తాను ఇచ్చినమాటకు కట్టుబడి తన గురువు వారించినా, హెచ్చరిస్తున్నా కాదంటూ ‘వామనుని’ కోరికమేరకు దానం చేస్తాడు.

ఆ అద్భుత సన్నివేశాన్ని పోతన రమణీయ శైలిలో ఆస్వాదిద్దాం.

విద్యార్థులకు సూచనలు

  • పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
  • పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత గీయండి.
  • వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పద విజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసు కొండి.

ప్రక్రియ -ప్రాచీన పద్యం (పురాణం)

ఈ పాఠ్యభాగం పురాణ ప్రక్రియకు చెందినది. పురాణం అంటే పాతదైననూ కొత్తగా భాసించేది. ‘సర్గం, ప్రతిసర్గం, వంశం, మన్వంతరం, వంశానుచరితం’ అనేవి పురాణ లక్షణాలు. పురాణాలు 18. వీటిలో భాగవత పురాణం ఒకటి. పోతన తెలుగులో భాగవతాన్ని రాశాడు.

పాఠ్యభాగ సారాంశము

శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో నీ కులాన్ని, రాజ్యాన్ని నిలబెట్టుకో ఈ పొట్టివాడు విష్ణువు. ఇతడు తేలికగా పోడు. మూడులోకాలనూ మూడడుగులుగా కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండుతాడు. నా మాట విను ఈ దానం గీనం వద్దు అని శుక్రాచార్యుడు మేలుకోరి చెప్పగా క్షణకాలం కళ్ళుమూసుకొని బలిచక్రవర్తి ఇలా అన్నాడు. ‘ఓ మహాత్మా ! నీవు చెప్పింది నిజమే నేను ఈ లోకంలో అర్థమూ, కామమూ జీవనోపాయము – ఏది అడిగినా ఇస్తానని చెప్పాను.

ఇప్పుడు ధనంపై దురాశతో తిరిగి పంపించలేను. ఇచ్చినమాట తప్పడం కన్నా పాపం లేదు. పూర్వం భూదేవి “ఎటువంటి చెడ్డపని చేసిన వానినైనా మోస్తాను. కాని ఆడిన మాట తప్పిన వానిని మాత్రం మోయలేను” అని బ్రహ్మతో చెప్పింది కదా ! యుద్ధంలో వెనుదిరగకుండా వీరమరణం పొందటమూ, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడమూ మానధనులైన వారికి మేలైన మార్గాలు.

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

రైతుకు మంచి పొలమూ, మంచి విత్తనాలు ఒక చోట దొరకడం అరుదు. అదే విధంగా దాతకు తగిన ధనమూ, దానిని తీసుకునే ఉత్తముడు దొరికే అదృష్టం అపురూపం కదా ! ఆచార్యా ! పూర్వం రాజులున్నారు, రాజ్యాలున్నాయి. ఎంతో గర్వంతో విర్రవీగారు. కాని వారెవరూ ఈ సంపదను మూటకట్టు కొనిపోలేదు. ప్రపంచంలో వారి పేరు కూడా మిగులలేదు. శిబి చక్రవర్తి వంటివారు కీర్తికోసం సంతోషంగా అడిగినవారి కోర్కెలు తీర్చలేదా ? వారిని ఈనాటికి లోకం మరువలేదు కదా !

ఎడతెగని యజ్ఞాలు చేసినా పుణ్యకార్యాలు కావించినా విష్ణువును చూడటానికి వీలుపడదు. అటువంటి గొప్పవాడు పొట్టివాడై అడుగుతున్నాడు. ఇంతకంటే ఏం కావాలి. నాకు నరకం వచ్చినా, భూమండలం అదృశ్యమైనా, దుర్మరణం వచ్చినా, నా కులానికి చెడు జరిగినా సరే ! నేను ఆడినమాట తప్పను జరగవలసింది జరగనీ ! భయం లేదు. వచ్చిన వాడు శివుడైనా, విష్ణువైనా, బ్రహ్మదేవుడైనా, ఎవరైనా సరే ! ఎందుకు పలుమాటలు ? నా నాలుకకు మారుమాట రాదు.

బాగా బ్రతికినా, పెక్కు కష్టాలకు గురియైనా, పేదరికం వచ్చినా, ప్రాణానికి ధనానికి చేటువచ్చినా కడకు చావు సంభవించినా సరే మానధనులు మాటతప్పలేరు. బలిచక్రవర్తి ఇల్లాలు వింధ్యావళి. ఆమె ఆ సందర్భంలో భర్తసైగ గమనించి బ్రహ్మచారి కాళ్ళు కడగటానికి బంగారు కలశంతో నీళ్ళు తెచ్చింది. అప్పుడు బలి చక్రవర్తి ఓ బ్రహ్మచారీ ! లేవయ్యా ! ఇటు రావయ్యా ! నీవు అడిగింది. ఇస్తాను. నీ పాదాలు కడుగనివ్వు ఇంకా ఆలస్యం దేనికి ?

అనగానే బలి చక్రవర్తి దేవతలను కష్టాల నుండి కాపాడేది, కలకాలం మేలు కల్గించేది, అన్ని ఉపనిషత్తులకూ అలంకార మైనది, భవబంధాలను పోకార్చి మోక్షాన్ని సమకూర్చేది, అయిన కుడిపాదాన్ని కడిగాడు. ఆలాగే ఎడమ పాదాన్ని కడిగాడు. ఆ నీరు తలపై జల్లుకున్నాడు.

బలిచక్రవర్తి చేతులు చాచి వామనుని పూజించాడు. ‘బ్రహ్మణుడవు విష్ణుస్వరూపుడవూ, వేదాల నియమాలు – తెలిసినవాడవు అయిన నీకు మూడడుగుల నేల దానం చేస్తున్నాను’ అని పలికి “పరమాత్మునకు ప్రీతి కలుగుగాక” అంటూ వెనువెంటనే ధారపోసినాడు. అది చూచి లోకం ఆశ్చర్యపడింది. ఓ పరీక్షన్మహారాజా ! అన్ని భూతాలకూ విష్ణువు అధిపతి. ఆయనకు బలి చక్రవర్తి దానం చేయగానే అన్ని దిక్కులూ కళకళలాడినాయి. పంచభూతాలు “బళిబళి” అని పొగిడినాయి.

TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట

Telangana SCERT 10th Class Telugu Guide Telangana 4th Lesson కొత్తబాట Textbook Questions and Answers.

TS 10th Class Telugu 4th Lesson Questions and Answers Telangana కొత్తబాట

చదవండి – ఆలోచించి చెప్పండి (T.B. P.No. 36)

మార్కెట్కు వెళ్ళే మార్గం పక్కన ఇళ్ళున్నాయి. వాటిలో కొన్ని గట్టి ఇటుకలతో నిర్మింపబడ్డాయి. గోడలకు వెల్లవేసి ఉన్నది. వసారా గోడలపై ఆకర్షణీయమైన పూలు చిత్రించబడి ఉన్నాయి. మరికొన్ని ఇళ్ళు మట్టితో నిర్మింపబడ్డాయి. ఆ ఇళ్ళకు చిరిగిన తాటియాకుల కప్పు ఉన్నది. చిన్న, పెద్ద ఇళ్ళలోను, పేదల, ధనికుల ఇళ్ళలోను, అన్ని ఇళ్ళలోను ప్రవేశద్వారం ప్రక్క కుండీలో తులసి మొక్క ఉన్నది. పసిపిల్లలు, ఊరకుక్కలతో పాటు దుమ్ములో ఆడుతున్నారు. స్త్రీలు బియ్యం కడుగుతూ, ఆ కడిగిన నీటిని సందులో పోస్తున్నారు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
పై పేరాలో దేనిని గురించి ఉన్నది ?
జవాబు:
ఒక ప్రాంతం గురించి ఉన్నది (ఒక పేద బస్తీ గురించి).

ప్రశ్న 2.
ఇటువంటి వాతావరణం ఎక్కడ ఉంటుంది ?
జవాబు:
అపరిశుభ్ర కాలనీలో ఉంటుంది.

TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట

ప్రశ్న 3.
మీరు చూసిన పల్లె గురించి మాట్లాడండి.
జవాబు:
నేను చూసిన పల్లె రామాపురం. పచ్చని పొలాలతో కళకళలాడుతూ ఉంది. స్వచ్ఛమైన పైరు గాలి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఊరి పక్కన గలగల పారే సెలయేరు నా మనస్సును ఆకట్టుకుంది. కల్మషం లేని పల్లె ప్రజల శ్రమ జీవన సౌందర్యం ఆదర్శ నీయం.

ప్రశ్న 4.
పల్లెల్లో నాటితో పోలిస్తే నేడు ఏయే మార్పులు చోటుచేసుకున్నాయి ?
జవాబు:
ఆనాడు పల్లెలు దరిద్రానికి, అనారోగ్యానికి, అవిద్యకు ప్రతిరూపాలుగా ఉండేవి. ఇప్పుడు పల్లెల్లో కూడా సౌభాగ్యం ఉంది. ప్రతి ఇంటికీ విద్యుత్తు, టివి ఉన్నాయి. ఇంచుమించు చాలామందికి మోటారు బైకులున్నాయి. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. బాగా చదువుకొంటున్నారు. కొన్ని విషయాలలో కొంత వెనుకబడి ఉన్నారు.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 39)

నేను రాన్రా తమ్ముడు! ………….. గండ్లవడ్తనె ఉంది.

ప్రశ్న 1.
“సెవ్వు మీద పేను వార్తెనా?” అంటే మీకేమి అర్థమైంది ?
జవాబు:
‘పేను’ తలలో ఉంటుంది. పేను పాకుతుంటే దురద పెడుతుంది. అందుచేత తెలుస్తుంది. అంటే చెవి మీద పేనుపాకితే తెలుస్తుంది. కాని, అక్క చెప్పే మాటలను తమ్ముడు అస్సలు పట్టించుకోవటం లేదు. అందుకే కనీసం చెవి మీద పేను పాకినట్లు కూడా లేదతనికి. ఇంక చెవిలోకి ఆ మాటలు వెళ్ళే అవకాశం లేదు. వాటి గురించి ఆలోచించే ప్రశ్నే లేదు. అందుచేత అక్క చెప్పే మాటలను కనీసం పట్టించుకోవట్లేదని అర్థమయింది.

ప్రశ్న 2.
మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా నడుచుకుంటూ పోతారా ? పోయేటప్పుడు ఏమేం గమనిస్తారో చెప్పండి.
జవాబు:
మేము ఎప్పుడైనా ఎక్కడికైనా దగ్గర్లో ఉన్న చోట్లకు నడుచుకొంటూనే పోతాము. పోయేటప్పుడు గోడలపై రాతలు, సినిమా పోస్టర్లు మొదలైనవి గమనిస్తాం. పక్షులు, జంతువులు, వాహనాలు, ఇళ్ళను చూస్తాం.

TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట

ప్రశ్న 3.
మీ ఊరి పొలిమేరల్లో ప్రకృతి ఎట్లా ఉంటుందో చెప్పండి.
జవాబు:
మా ఊరి పొలిమేర పచ్చని పంటపొలాలు, పచ్చని చేలు పావడకట్టి, పంట కాలువలతో ప్రకృతి రమణీయం, వాగులూ, వంకలతో, పక్షుల కిలకిలారావాలతో చూడముచ్చటగా ఉంటుంది.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 40)

మరి! మా తిక్క సన్నాసి…………. సంబురాన ముందుకు సాగిన

ప్రశ్న 1.
“తన కాళ్ళమీద తను నిలబడటం” అంటే ఏమిటి ? చర్చించండి.
జవాబు:
తన కాళ్ళమీద తను నిలబడటం అంటే ఎవ్వరి మీద ఆధారపడకుండా తిండికి, బట్టకూ లోటు లేకుండా స్వశక్తితో సంపాదించుకోవడం. అంటే తన ప్రతిభకు తగిన ఉపాధిని పొందుతూ జీవనాన్ని సాగించటం.

ప్రశ్న 2.
నాటి నేటి ఆచార వ్యవహారాల్లో తేడాలు ఉన్నాయా ?
జవాబు:
పూర్వం పెండ్లిళ్లు, పండుగలు మొదలైనవి వస్తే అందరూ కలిసి పనులు చేసుకొనేవారు. సాయంత్రం అందరూ కూర్చొని మాట్లాడుకొనేవారు. ఏ వ్యవహారం లోనూ మోసం, దగా ఉండేవి కావు. ఆడంబరాలు లేవు.

ఈనాడు ఆడంబరాలు ఎక్కువ. మోసం చేసే లక్షణాలు పెరిగిపోయాయి. ఎవరింట్లో వాళ్ళు టివిలు చూస్తూ గడుపుతున్నారు. పిలిచినా పెళ్ళిళ్ళకు, పండుగలకు వచ్చేవారు తగ్గిపోయారు. వచ్చినా ఒక పూటకు మించి ఎవ్వరూ ఉండటం లేదు.

ప్రశ్న 3.
మీ ఊర్లో రచ్చబండ / గ్రామ సచివాలయం ఉన్నదా ? అక్కడ ఎవరెవరు ఏయే విషయాల గురించి మాట్లాడతారు ?
జవాబు:
మా ఊర్లో ఒకప్పుడు రచ్చబండ ఉండేదట. ఇప్పుడు గ్రామ సచివాలయం ఉంది. అక్కడ గ్రామ సర్పంచ్, పంచాయితీ వార్డు సభ్యులు గ్రామ అభివృద్ధికి సంబంధించిన అంశాలను చర్చించి ప్రణాళికలు రూపొందిస్తారు.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 41)

బండి సాగిపోతనే ఉండది ……… అడుక్కు తిండ్లు లేవు.

ప్రశ్న 1.
‘కడ్పుల ఇసం నాల్కెన తీపి’ అంటే మీరేం అర్థం చేసుకున్నారు?
జవాబు:
కడ్పుల ఇసం నాల్కలతీపి – అంటే కడుపులో విషం. నాలుక చివర తీపి, కడుపులో అన్నీ చెడు ఆలోచనలు విషపూరితమైన భావాలు ఉన్నా పైకి మాత్రం తియ్యగా మాట్లాడడం. కొంతమందికి లోపల చాలా కోపం ఉంటుంది. ఉదాహరణకు ధృతరాష్ట్రుడికి భీముడంటే చాలా కోపం. భీముడిని ఎప్పుడు చంపేద్దామా అని ఉండేది. భీముడు చచ్చిపోవాలని నిరంతరం కోరుకొనేవాడు. కాని, ఎదురుపడితే మాత్రం “నాయనా ! భీమసేనా ! అన్నం తిన్నావా బాబూ ?” అంటూ ప్రేమగా అమృతం కురిపిస్తూ మాట్లాడేవాడు. అందుచేత ధృతరాష్ట్రుడి వంటి వారికి కడ్పుల ఇసం నాల్కల తీపి ఉంటుంది.

ప్రశ్న 2.
పంచాయితీలు చెప్పడం అంటే ఏమిటి ? పంచా యితీలను ఎట్లా జరుపుతారు ?
జవాబు:
న్యాయం చెప్పడం అని అర్థం. తగవులు తీర్చడం అని అర్థం. ఒకరు, ఇద్దరు పెద్దలు రచ్చబండపై కూర్చొని ఫిర్యాదీదారుడు, ఇతర వ్యక్తులను వేర్వేరుగా పిలిచి మాట్లాడి పరిష్కారం చూపుతారు. దొంగతనాలు మున్న గునవి పరిష్కరింపబడతాయి.
పంచాయితీని గ్రామసచివాలయం లేదా రచ్చ బండ లేదా ఒక పెద్దమనిషి ఇంట్లోనూ నిర్వహిస్తారు. పంచాయితీకి గ్రామపెద్దలంతా వస్తారు.

TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట

ప్రశ్న 3.
“కళదప్పిన ఇల్లు” ఎట్లా ఉంటుంది ?
జవాబు:
కళదప్పిన ఇల్లు అనగా దానికి జీవం లేదు. జీవకళ లేదు. ఆ ఇంట్లో సుఖసంతోషాలు లేవు. నిత్యం కష్టాల మయం అని అర్థం.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 42)

బండి మా ఇంటి దిక్కు మూలమల్పు ……….. నల్గురు నడిసిందె బాట.

ప్రశ్న 1.
రాత్రిబడి అంటే ఏమిటి ? రాత్రి బళ్ళను ఎందుకు నడుపుతారు ?
జవాబు:
పగలంతా పొలం పనులు, ఇతర పనులు చేసుకొని, రాత్రిపూట చదువుకోవాలనుకునే వారికి ప్రభుత్వం కల్పించిన సదుపాయమే రాత్రి బడి. రాత్రి బళ్ళను ప్రతి ఊరిలో నిర్వహిస్తారు. (వ్యవసాయదారులకు) నిరక్షరాస్యులకు విద్యను నేర్పి, వారి వారి వృత్తులలో నైపుణ్యం పొందటానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

ప్రశ్న 2.
“నల్గురు నడిసిందె బాట”లోని అంతరార్థం ఏమిటి ? చర్చించండి.
జవాబు:
“పదుగురు ఆడు మాట పాడియై ధరచెల్లు” అని వేమన ఎప్పుడో చెప్పారు. అట్లే నలుగురు నడిచినదే బాట. ఒక్కడి మార్గాన్ని ఎవరూ అనుసరించరని దీని అర్థం.

ప్రశ్న 3.
మీ పరిసర ప్రాంతాల్లో పిల్లల రూపురేఖలు, వేష ధారణ ఎట్లా ఉంటాయి?
జవాబు:
మా పరిసర ప్రాంతంలో పిల్లలు పరిశుభ్రంగా, దృఢంగా ఉంటారు. ఉన్నంతలో పరిశుభ్రమైన దుస్తులు ధరిస్తారు. తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం, క్రమశిక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
ఈ కథకు ‘కొత్తబాట’ అనే పేరు తగినదని భావిస్తున్నారా ? ఎందుకు ? చర్చించండి. (T.S Mar. ’16)
జవాబు:
పాకాల యశోదారెడ్డి తన గ్రామంలో వచ్చిన మార్పుల గురించి చెప్పిన కథకు ‘కొత్తబాట’ అని పేరు పెట్టారు.

‘కొత్తబాట’ అంటే కొత్తదారి అని అర్థము. యశోదారెడ్డి ఊరిలో ప్రజలు పాత ఆచారాలను వదలి కొత్తదారి పట్టారు. అందువల్ల ఈ కథకు ఆ పేరు సరిపోతుంది. ఆ గ్రామ ప్రజలు పట్టిన కొత్తదారి ఇది.

  1. గ్రామంలో పెద్ద ఇళ్ళ ఆడవాళ్ళు సామాన్యుల కంటికి కనబడకుండా బండ్లకు తెరలు కట్టే ఆచారం, నేడు పోయింది.
  2. రచ్చబండపై గ్రామపెద్దతో కలిసి గ్రామస్థులు అందరూ నేడు కూర్చుంటున్నారు.
  3. గ్రామపెద్ద రంగరాయడి వంటి పెత్తనాన్ని నేడు గ్రామాల్లో ప్రజలు ధిక్కరిస్తున్నారు.
  4. పోలీసు పటేళ్ళ పెత్తనం, ప్రజలు పోలీసులకు లంచా లివ్వడం, పోయింది.
  5. ప్రజలు చీటికిమాటికీ తగవులు, కొట్లాటలు మానారు. పంచాయితీలు, జరిమానాలు నేడు లేవు. ఏ గ్రామానికి ఆ గ్రామంలో తీర్పులు ఇస్తున్నారు.
  6. రాత్రి దొంగతనాలు లేవు. ప్రజలకు శిక్షలు లేవు. ప్రజలు ముష్టి ఎత్తుకోడం మానివేశారు. వారు మంచి వేషాలు వేసుకుంటున్నారు.
  7. పెళ్ళిళ్ళలో కూడా మేనాలు, పల్లకీలు, ప్రజలు నేడు మోయడం లేదు.
  8. పనిమనుషులను తమతోడి వారుగా చూస్తున్నారు.

ఈ విధంగా గ్రామాల్లో ప్రజలు కొత్తబాట పట్టారు. అందువల్ల ఈ కథకు ఈ పేరు బాగా సరిపడింది.

TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట

ప్రశ్న 2.
పాఠం చదువండి. క్రింది పేరాల ఆధారంగా పట్టిక నింపండి.
TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట 1
జవాబు:
TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట 2
TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట 3

ప్రశ్న 3.
క్రింది పేరా చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
జవాబు:
పల్లెసీమకు పట్టుకొమ్మలాగ మారుమూల గిరిజన గ్రామమైన కొండాపూర్ ఆదర్శంగా నిలిచింది. వరంగల్ (రూరల్) కాకతీయ జిల్లా నల్లబెల్లి మండలానికి 18 కిలోమీటర్ల దూరాన ఉన్న కొండాపూర్ చుట్టూ దట్టమైన అడవిమధ్య నిలిచిన అటవీ గ్రామం. ఇక్కడ 1945లో ప్రత్యేక గ్రామపంచాయితీ ఏర్పడింది. 2007 డిసెంబర్ 5న సర్పంచ్ వాసం కన్నయ్య అధ్యక్షతన జరిగిన గ్రామసభలో గ్రామ సమస్యల పరిష్కారానికి, గ్రామాభివృద్ధికి 8 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు లోడిసంస్థ సహకారంతో, గ్రామస్థుల శ్రమదానంతో మేడివాగుపై పక్కారోడ్డు నిర్మించాయి. అధికారుల సహకారంతో మద్యపాన నిషేధం అమలులో ఉన్నది.

వందశాతం అక్షరాస్యత సాధించారు. గ్రామ జనాభాకు సరిపడా మినరల్ ప్లాంట్ ఏర్పాటు చేసు కున్నారు. గ్రామంలో బాలకార్మికులు లేకుండా చేశారు. పిల్లలందరిని బళ్ళలో చేర్చారు. గిరిజనులు సాధించిన ఈ అభివృద్ధిని చూసి అంతర్జాతీయ గూగుల్ ఆర్గ్ సంస్థ ఈ గ్రామాన్ని ఉత్తమగ్రామ పురస్కార్కు ఎంపిక చేసింది.

ప్రశ్నలు

అ) కొండాపూర్ ఎక్కడ ఉన్నది ?
జవాబు:
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలానికి 18 కి.మీ. దూరంలో కొండాపూర్ ఉన్నది.

ఆ) గ్రామపంచాయితీ ఎప్పుడు ఏర్పడింది ?
జవాబు:
1945లో ప్రత్యేక గ్రామపంచాయితీ ఏర్పడింది.

ఇ) గ్రామసర్పంచ్ ఎవరు ?
జవాబు:
గ్రామసర్పంచ్ వాసం కన్నయ్య.

ఈ) పక్కా రోడ్డు ఎవరి సహకారంతో, ఎవరు నిర్మించారు?
జవాబు:
లోడి సంస్థ సహకారంతో, గ్రామస్తుల శ్రమదానంతో. మేడివాగుపై పక్కారోడ్డు నిర్మించారు.

ఉ) గ్రామ ప్రజలు సాధించిన విజయాలేవి ?
జవాబు:
పక్కా రోడ్డు నిర్మాణం, వందశాతం అక్షరాస్యత సాధించటం, గ్రామజనాభాకు సరిపడా మినరల్ ప్లాంటు ఏర్పాటు, గ్రామంలో బాలకార్మికులు లేకుండా చేయటం, పిల్ల లందరిని బళ్ళలో చేర్చటం మొదలగునవి గ్రామ ప్రజలు సాధించిన విజయాలు.

ఊ) ఈ పేరాకు శీర్షిక ఏం పెట్టవచ్చు? ఎందుకు ?
జవాబు:
ఉత్తమ గ్రామం, నల్లబెల్లి (లేదా) ఉత్తమ గ్రామ పురస్కార్కు ఎంపికైన నల్లబెల్లి.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) “ఎంత చెడ్డగని, ఎంత బాగా బతికిన గని ఇంకోణి ఆసరతోటి మంది భుజాలెక్కి నడువకుండ పయినం సాగితే సాలు” అన్న అక్కమాటల్లో ఆంతర్యం ఏమై ఉంటుంది?
జవాబు:
స్వతంత్ర్య ప్రవృత్తి గురించి రచయిత్రి చెప్పిన మాటలివి. రెండుకళ్ళు తెరిచి నిదానంగా ఆలోచించాలి. మర్చిపో కూడదు. బాట మారింది. కాళ్ళకు బురద అంటు కునేది. మనిషికి మనం చూడవలసిందే స్వతంత్రంగా జీవించడం. అంతేగాని ఒకరిమీద ఆధారపడి జీవించ కూడదు.

ఇంకొకరి మీద ఆధారపడటం దారుణం. ఒకళ్ళ భుజాల మీద ఎక్కి ప్రయాణించడం అనే లక్షణం మంచిది కాదని అర్థం.

ఆ) “అక్కడక్కడ నక్కలు అదునుగాస్తున్న జాడలు కన బడ్తున్నవి” అంటే మీకేం అర్థమైంది ?
జవాబు:
నక్కలు మోసానికి ప్రతి రూపాలు. మోసం చేయడానికి అదను కోసం చూస్తుంటాయి. ఎంతసేపైనా నిరీక్షిస్తాయి. వేటాడకుండా ఆహారాన్ని సంపాదించగల దిట్టలు. పొదల్లో నక్కి ఉంటాయి. బలహీనమైన కోడి, మేకపిల్ల వంటి వాటిని చంపి తింటాయి. బలమైన ఏనుగు వంటి వాటిని ఏ సింహమో వేటాడేదాకా చూస్తుంది.

వేటాడి, అది తినగా మిగిలిన మాంసం తినేస్తుంది. గ్రామంలో రంగారాయుడు లాంటి మనుషులు లాగానే జంతులోకంలో నక్కలూ ఉంటాయని అక్క ఆంతర్యం అయి ఉంటుందని మాకు అర్థమైంది.

ఇ) మీ గ్రామంలోని ప్రకృతిని లేదా మీ ఊరి ప్రత్యేకతలను గురించి రాయండి.
జవాబు:
మా ఊరు చాలా బాగుంటుంది. పొలాలు, మామిడి తోటలతో, చక్కని వరిపొలాలతో, గోదావరి (పోలవరం) కాలువతో చూడముచ్చటైన ఊరు మా ఊరు. ఊరి చివర బడి, ఊరి మధ్యలో గుడి, మడులు, పిల్లల అరుపులు, పక్షుల కిలకిలారావాలతో, నీళ్ళతో నిండిన చెరువులు, చక్కని రోడ్లు, మా ఊరికే సొంతం.

అందుకే “పల్లె తల్లిలాంటిది, పట్టణం ప్రియురాలి వంటిదని” దేవులపల్లి కృష్ణశాస్త్రి అంటారు. మా గ్రామం ఆదర్శగ్రామంగా ఎంపిక కాబడింది. మా ఊరి ప్రత్యేకత ఏమిటంటే, మా ఊరు ఎవరు వచ్చినా మా ఊరి అందాలను ఫోటో తీయందే వెళ్లరు. చాలా సినిమాల షూటింగులు మా ఊళ్ళో జరిగాయి. మా ఊళ్ళో గోదావరి అందాలు మా ఊరికే వన్నెతెస్తున్నాయి.

ఈ) చెరువుల ప్రాముఖ్యత ఏమిటి ?
జవాబు:
తెలంగాణ ప్రాంతంలో చెరువుల నిర్మాణం శాత వాహనుల కాలం కంటే ముందునుంచే ఉన్నప్పటికీ కాకతీయుల కాలంలో ఉన్నతదశకు చేరుకుంది. ఆ తర్వాత తెలంగాణను పాలించిన కుతుబ్షాహీలు, అసఫ్జాహీలు, సంస్థానాధీశులు, తెలంగాణలో చెరువుల నిర్మాణాన్ని అభివృద్ధిపరిచి, వ్యవసాయా భివృద్ధికి తోడ్పడ్డారు. తర్వాత కాలంలో ఈ చెరువుల వ్యవస్థ సరైన నిర్మాణానికి నోచుకోక విధ్వంసానికి గురి అయ్యింది. దీనివలన స్వయంపోషక గ్రామాలుగా ఉన్న తెలంగాణ గ్రామాలు కరువుపీడిత గ్రామాలుగా మారాయి.

ఈ పరిణామం కూడా వలసలకు కారణమైంది. లక్షలాది మంది తెలంగాణ ప్రజలు పొట్టచేత పట్టుకొని ఇతర రాష్ట్రాలకు, గల్ఫ్ దేశాలకు వలస పోయారు. తెలంగాణలో చెరువుల పునర్మిర్మాణం ద్వారా వ్యవసాయాభివృద్ధి సాధిస్తే, ప్రజలకు ఉపాధి దొరికి, వలసలు ఆగిపోతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరువులను పునరుద్ధరించ డానికి ‘మిషన్ కాకతీయ’ అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది.

TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట

ప్రశ్న 2.
క్రింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) పాఠం ఆధారంగా పల్లెల్లో వచ్చిన మార్పులను విశ్లేషిస్తూ (T.S June ’16)
జవాబు:
“కొత్తబాట” అనే ఈ పాఠంలో “అక్కా తమ్ముళ్ళిద్దరూ” బస్సు దిగి అక్కడ నుండి ఎద్దులబండిలో వాళ్ళ ఊరి వరకు ప్రయాణం చేస్తారు. పల్లెలో అనేకరకాల మార్పు లను చూస్తారు. అవి ఈ విధంగా ఉన్నాయి.

  1. కొత్తబాట (రోడ్లు) నిర్మించారు.
  2. మోరుగవనం వేశారు. అందమైన ప్రకృతికి మారు పేరది.
  3. రోడ్డుకిరువైపులా చెట్లు నాటారు. పూల తోటలు వేశారు. పొంటిమాన్లు చిగురించాయి.
  4. చెరువును పూడిక తీసి అందంగా చేశారు. దానికి ఆయకట్టు కట్టడం వల్ల అందరికి ఆదరువైంది.
  5. జారుడు బండలు ఏర్పాటు చేశారు.
  6. మెచ్చుకొని తీరవలసినట్లుగా నిర్మాణం జరిగింది ఆ రోడ్డు.
  7. ఇదివరకు కాళ్ళకు బురద అంటుకునేది.
  8. స్వతంత్ర జీవనం సాగించాలి ప్రజలు.
  9. కొట్టాల గడ్డివాములన్నీ కుదురుగా మట్టసంగా ఉన్నాయి.
  10. ఎల్లమ్మ గుడిని బాగుచేయించారు.
  11. ఆ ఊరిని చూసి అక్క ఊపిరి పీల్చుకుంది.
  12. దొంగతనాలు, దోపిడీలు, పంచాయితీ శిక్షలు పోయాయి.
  13. పని మనిషులు కూడా ఇంట్లో మనుషులతో సమానంగా గౌరవం అందుకుంటున్నారు.
  14. మిత్తి పూజ పేరుతో ప్రజల మూఢనమ్మకాల్ని సొమ్ము చేసుకున్న వారిని ప్రజలు ఊరొదిలి పోయేలా తరిమికొట్టారు.

ఈ విధంగా ఈ పాఠంలో అనేక మార్పులను రచయిత్రి తెలిపింది.

ప్రశ్న 3.
క్రింది ప్రశ్నకు సృజనాత్మకంగా సమాధానం రాయండి.

అ) పల్లె సౌందర్యాన్ని వర్ణిస్తూ పది పంక్తుల వచన కవిత రాయండి.
జవాబు:
పల్లె తాకనంటా (వచన కవిత)
– కృష్ణప్రసాద్

కోడికూతతోనే కళ్ళుతెరచి
పల్లె ఒళ్ళు విరుచుకుంది
చల్లగాలుల్లోనే స్నానమాడి
చక్కగా కూర్చుంది
చూడచక్కగా తానుంది

చిట్టి గువ్వలన్నీ గూటిని వీడి గంతులు వేయగా యేటిలో చేపలే గువ్వల సాటిగా ఎగరగా చూడంగా చిన్నారి పాదాలు సందులలోన పరుగులు తీయంగా
ఆ చప్పుడు వింటూ
బంతులు – చేమంతులూ
మల్లెలు – మందారాలు
ముద్దుముద్దుగా విచ్చుకుంటున్నాయా
మొద్దు నిదురవీడి
– కోడి కూతతోనే

పల్లె తనదంటూ వదిలెల్లనంటూ మొండికేసే చంద్రుడే
కాదు నాదంటూ నువ్వెళ్ళి పొమ్మంటూ ఎర్రబారే సూరీడే
తగవు తీర్చలేక మబ్బు చల్లంగచేరి ఝల్లె కురిసింది
నే పల్లెన తాకానంటూ
ఆ సూరీడుకు, చంద్రుడుకు
ఆకాశాన చుక్కలకు
కన్నెగరేసిందీ
– కోడి కూతతోనే

III. భాషాంశాలు

పదజాలం

1. క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలను సొంతవాక్యాల్లో ఉపయోగించండి.

అ) ఉపాధ్యాయుడు చెప్పే పాఠాన్ని చెవివారిచ్చి వినాలి.
అర్థం : శ్రద్ధగావిను
జవాబు:
ప్రహ్లాదుడు చండామార్కులు (గురువు గారు) చెప్పిన పాఠాలను చెవివారిచ్చి వినేవాడు.

ఆ) చిరుతపులులు గవిన్లలో నివసిస్తాయి. అర్థం : గుహలు
జవాబు:
అజంతా, ఎల్లోరా గవిన్లలో చిత్రకళా సంపద దాగి ఉన్నది.

TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట

ఇ) కుటిలవాజితనం పనికిరాదు.
అర్థం : కపట బుద్ధికలవాడు, మోసగాడు
జవాబు:
నక్క కుటిలవాజితనం కలిగి ఉంటుంది.

ఈ) మా ఊరి పొలిమేర లో పంటపొలాలున్నాయి.
అర్థం : ఊరిచివర (ఊరిచివర హద్దు)
జవాబు:
మా ఊరి పొలిమేర ఇప్పుడు చెరిగిపోయి నగరం కలిసి పోయింది.

2. క్రింది వాక్యాల్లో పర్యాయపదాల క్రింద గీత గీయండి.

అ) రోజూ పెయి కడుక్కోవాలి. లేకపోతే మేను వాసన వస్తుంది. దేహం నిండా ఈగలు ముసురుతాయి.
జవాబు:
రోజూ పెయి కడుక్కోవాలి. లేకపోతే మేను వాసన వస్తుంది. దేహం నిండా ఈగలు ముసురుతాయి.

ఆ) మనుషులు నీళ్ళు దొరికె తావుల్ల నివసిస్తారు. సరుకులు అమ్మే చోటులకు దగ్గరుంటారు. అందమైన ప్రదేశాలను ఇష్టపడతారు.
జవాబు:
మనుషులు నీళ్ళు దొరికె తావుల్ల నివసిస్తారు. సరుకులు అమ్మే చోటులకు దగ్గరుంటారు. అందమైన ప్రదేశాలను ఇష్టపడతారు.

3. క్రింది పట్టిక నుండి ప్రకృతి, వికృతులను వేరుచేసి రాయండి.

TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట 4
జవాబు:
1) సముద్రం – సంద్రం
2) ఆధారం – అదెరువు
3) శిఖ – సిగ
4) విద్య – విద్దె
5) ప్రయాణం – పైన

4. క్రింది జాతీయాలను ఏ అర్థంలో వాడుతారో తెలపండి.

TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట 5
జవాబు:
TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట 6

వ్యాకరణాంశాలు

1. క్రింది పదాలను విడదీసి సంధులను గుర్తించండి.

అ) ప్రాణాలు గోల్పోవు = ప్రాణాలు + కోల్పోవు (గసడదవాదేశ సంధి)
ఆ) మూటఁగట్టు = మూటన్ + కట్టు (సరళాదేశ సంధి)
ఇ) ఆసువోయుట = ఆసు + పోయుట (గసడదవాదేశ సంధి)
ఈ) కాలుసేతులు = కాలు + చేతులు (గసడదవాదేశ సంధి)
ఉ) పూచెనుగలువలు = పూచెను + కలువలు (సరళాదేశ సంధి)

వృద్ధి సంధి :

క్రింది పదాలను విడదీయండి.

ఉదా : రసైక = రస + ఏక = (అ + ఏ = ఐ)

అ) ఏకైక = ఏక + ఏక = (అ + ఏ = ఐ)
ఆ) వసుధైక = వసుధ + ఏక = (అ + ఏ = ఐ)
ఉదా : దివ్యైరావతం = దివ్య + ఐరావతం (అ + ఐ = ఐ)

అ) దేశైశ్వర్యం = దేశ + ఐశ్వర్యం = (అ + ఐ = ఐ)
ఆ) అప్లైశ్వర్యాలు = అష్ట + ఐశ్వర్యాలు = (అ + ఐ = ఐ)
ఉదా : ఘనౌషధి = ఘన + ఓషధి = (అ + ఓ = ఔ)

అ) వనౌషధి = వన + ఓషధి (అ + ఓ = ఔ)
ఆ) మహౌషధి = మహా + ఓషధి (అ + ఓ = ఔ)
ఉదా : రసౌచిత్యం = రస + ఔచిత్యం = (అ + ఔ అ)

అ) దివ్యౌషధం = దివ్య + ఔషధం: (అ + ఔ = ఔ)
ఆ) నాటకౌచిత్యం = నాటక + ఔచిత్యం = (అ + ఔ = ఔ)

పైన ఇచ్చిన పదాలను విడదీసినప్పుడు మీరు గమనించిన విషయాలు సరిచూడండి.

అ) ఈ సంధి ఏర్పడేటప్పుడు ప్రతిసారి పూర్వస్వరంగా ‘అ, ఆ’ లలో ఒకటి వచ్చింది.
(ఐ,ఔ లను ‘వృద్ధులు’ అంటారు.)
ఆ) పరస్వరం స్థానంలో వరుసగా ఏ, ఐ, ఓ, ఔ లున్నాయి.
ఇ) ‘అ’ కారానికి ఏ, ఐ లు కలిసినప్పుడు ‘ఐ’ వచ్చింది.
ఈ) ‘అ’ కారానికి ఓ, ఔ లు కలిసినప్పుడు ‘ఔ’ వచ్చింది.
అంటే ….

i) ‘అ’ కారానికి ఏ, ఐ లు పరమైతే ‘ఐ’ వస్తుంది.
ii) ‘అ’ కారానికి ఓ, ఔ లు పరమైతే ‘ఔ’ వస్తుంది.
‘వృద్ధుల’ వల్ల ఏర్పడిన సంధి కనుక ఇది వృద్ధి సంధి.

సూత్రం : అకారానికి (అ, ఆ లకు) ఏ, ఐలు పరమైతే ‘ఐ’ కారం, ఓ, ఔ లు పరమైతే ‘ఔ’ కారం ఏకాదేశంగా వస్తాయి.

TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట

ప్రాజెక్టు పని

అందమైన పల్లెటూరు చిత్రాలను సేకరించండి. పల్లెకు సంబంధించిన కవిత / పాట సేకరించి ప్రదర్శించండి. మీ మిత్రులు రాసినవన్నీ ఒక చోట చేర్చి సంకలనం తయారు చేయండి.
జవాబు:
పల్లెకు సంబంధించిన తెలంగాణ గీతం
(అత్యంత ప్రజాదరణ పొందిన గీతం)

పల్లెపల్లెనా పల్లేరు మొలచె పాలమూరులోన నా తెలంగాలోన
పాతగోడలు పందిరిగుంజలు సిన్నబోయినాయి
ఇండల్ల దుమ్మురేపినాయి ||పాత||

చెట్టుమీద ఆ పిట్టలెగురగా సేదబావిలో ఊటలూరుగా
పచ్చా పచ్చా నూళ్ళు పలుగురాళ్ళు తేలినాయి
అయ్యో పనిపాట లేక ప్రజలు తల్లడిల్లినారో ||పల్లె పల్లెనా||

దండీ గడాలు వెండి గాజులు మొలతాడులు కొనగ పోగులు
ఉన్నాదంతా నమ్మి కనిపెంచి నూరు విడిచి
పొట్టచేతపట్టి బతుకు బయలెల్లినాడో ||పల్లె పల్లె||

విశేషాంశాలు

1. నక్షత్రకుడు : విశ్వామిత్రుని శిష్యుడు. హరిశ్చంద్రుని వద్ద అప్పు వసూలు చేయడానికి విశ్వామిత్రునిచే నియమింపబడ్డాడు. ఈ విషయమై హరిశ్చంద్రుణ్ణి ముప్పుతిప్పలు పెట్టాడు. ఎదుటివారి కష్టాలను పట్టించుకోకుండా పీడించేవాడి విషయంలో ఈ జాతీయాన్ని వాడుతారు. మూలంలోలేని ఈ పాత్రను తెలంగాణ కవి అయిన గౌరన తన హరిశ్చంద్రోపాఖ్యానంలో మొదటిసారి ప్రవేశపెట్టాడు. ఈ పాత్ర తెలుగునాట చాలా ఆదరణ పొందింది.

2. వసతాగిన పిట్ట : ‘వస’ ఒక మొక్క. చిన్న పిల్లలకు మాటలు చక్కగా రావడానికి కొంచెం మోతాదులో దీని రసాన్ని తాగిస్తారు. మోతాదు ఎక్కువైతే మాటలెక్కువైతాయి. ఎక్కువగా మాట్లాడేవారి గురించి ఈ పదబంధాన్నివాడుతారు.

3. వెన్నెల మాసం : శరదృతువు విశేషంగా వెన్నెలను కురిపించే కాలం. ఆశ్వీయుజ, కార్తీక మాసాలు ఈ ఋతువుకు చెందినవి. ప్రత్యేకంగా కార్తీక మాసానికి వెన్నెల మాసంగా పేరుంది.

4. ఆసుపోయు : బట్టలు నేసేవారు వొడికిన దారాన్ని కుదురుకు చుట్టి ఆ తరువాత నేయవలసిన బట్ట పొడుగును అనుసరించి దారాలన్నీ వరుసలుగా అమర్చవలసి ఉంటుంది. అట్లా చేసేటప్పుడు ఆ పని చేసేవాడు ఒక కొన నుండి మరో కొనకు తప్పక తిరగవలసి ఉంటుంది. ఈ పనికి ‘ఆసుపోయడం’ అని పేరు. ఇట్లా విరామం లేకుండా తిరిగిన తోవనే మళ్ళీ మళ్ళీ తిరగడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు.

5. అలుగు : చెరువు నిండిన తరువాత మత్తడి అవుతుంది. ఆ తరువాత ఉబికి బయటికి వచ్చే నీళ్ళు కాలువ అవుతుంది. దీనిని ‘అలుగు’ అంటారు. ఈ క్రమాన్నే చెరువు నిండింది, మత్తడి దూకింది, అలుగు పారుతుంది అని అంటారు. అలుగు చెరువుకట్టకు రక్షణ. ఎక్కువైన నీళ్ళు దీని గుండా బయటికి పోవడంవల్ల చెరువుకట్ట తెగకుండా రక్షింపబడుతుంది.

సూక్తి : పరిస్థితులు మారాలంటే నువ్వు మారాలి. అవి బాగుపడాలంటే, నువ్వు బాగుపడాలి. మారుతున్న ప్రపంచంతో పాటు మనమూ మారాలి.

పదాలు – అర్ధాలు

I

నక్షత్రకుడు = హరిశ్చంద్రుని బాకీ కోసం వెంట పడినవాడు, విశ్వామిత్రుని శిష్యుడు
ఊకున్నాడా ? = ఊరుకొన్నాడా ?
ఈగకాలం = ఆషాఢమాసం
జనిగెపట్టు = మూర్ఖత్వపు పట్టుదల
సోద = గొడవ, వాగుడు
కయ్య = చిన్న కాలువ
పొంటి = దారివెంట
పేను వారైనా = పేను పాకితే
గండ్లు = నీళ్ళు ఎక్కువగా వచ్చుటచేత తెగిన గట్టులు
పట్టు = పంతం
నడుములిర్గె = నడుములు విరుగుతున్నాయి
మెచ్చిందాక = మెచ్చుకొనేదాక
బంక = జిగురు
వార్రెలు = బీటలు, పగుళ్ళు
పూలకాలం = వసంతకాలం
గని = కాని
ఎన్నెల మాసం = వెన్నెల రోజులు
సోకు = అందం
పెయి = శరీరం
సాళ్ళు = వరుసలు
ముత్తైదలోలె = ముత్తైదువుల వలె
కొటారి కొమ్మల్లల్ల = చిట్టచివరి కొమ్మలు
శికె = చివర
పోషాకులు = వేషధారణ
వస = వాక్కును శుద్ధి చేసే ఔషధమూలిక
రొద = చప్పుడు
ఏరు = నది, ప్రవాహం
సెవ్వు = చెవ్వు
బాట = దారి
ఇడిస్తెన = విడిస్తేనా !
మాసం = నెల
సొంపు = అందం
పాలిపేర = గుర్తు, చిహ్నం, జాడ

TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట

II

పదం = పాట
బాడ్తండేంది = పాడుతున్నాడేమిటి
ఇందుట్ల = ఇందులో
పురాగ = పూర్తిగ
గని = కాని
పచ్చరం = బట్ట, వస్త్రం
రొండు = రెండు
దెర్సి = తెరిచి
తావు = చోటు
సంబురం = సంతోషం, సంబరం
యోగం = అదృష్టం
ఒగరో = ఒకరో
వాళ్ళల్ల = వాళ్ళలో
బండారి = కుంకుమ
మత్తడి = రేగడిపొలం
బంగుల = బంగ్లా
ఇగి = ప్రవేశం, అతిశయం
యావి = ఏ
ఆడ = అక్కడ
రచ్చకట్ట = రచ్చబండ
మణుసులు = మనుషులు
ఇంగోటి = ఇంకొకటి
తీర్గ = తీరుగా
వోరగ = చివరగ
గూ సండె = కూర్చొనే
కాన్రాలేదు = కనబడలేదు
పయినం = ప్రయాణం
రాగిచెట్టు = రావిచెట్టు
తొక్కుడువడ్డ = అలవాటు పడ్డ
ఎలుతురు = వెలుతురు
రొంపి = బురద
ఆసరా = తోడు, సహాయం, అండ
యాదికి = గుర్తుకు
మోతెబరి = ఊరి పెద్ద
సూడిగములు = గాజులు, కడియములు
చిత్రము = సిత్రము
సంబురాము = వేడుకలు

III

పొద్దుమాపు పూట = రాత్రిపూట
మళ్ళెపడి = తిరగబడి
పచ్చపూస గన్కనా ? = సత్యవంతుడు కనుకనా ?
పాడు గొట్లాడినట్లు = పాడుపడినట్లు
పంగనామం బెట్టిన్రు = మోసం చేసారు
కుటిలవాజి = మోసగాడు
మిత్తి = మృత్యుదేవత, పీడ
సాగువాటు = ఇల్లు గడవడం
గత్తరిచ్చే = కత్తిరించే
పొలండ్ల = పాలివాళ్ళు, వాటాదార్లు
అయిన = ఆయన
దోసక = తోచక
ఇంగ = ఇంక
వాడ = వీధి
దీస్కొని = తీసుకొని
పసికారు = కుర్రాళ్ళు
లొగులతొండలు = చిత్రవధలు
సాగిపోతనే ఉండది = సాగిపోతూనే ఉంది
నక్కతంతుల సింగోటం = నక్క వ్యవహారంలాంటి ఎత్తులు
దప్తురం = పద్దు పుస్తకం
గట్టుకం = కట్టడం, చెల్లించడం
మిత్తి = మృత్యువు (చావు), వడ్డీ
సుట్టాల = చుట్టాల
ఉద్ది = జత, జట్టు
ఇసం = విషం
జూస్కోని = చూస్కొని

IV

ఇంగ = ఇక
మగ్దూరు = నియమం
నడుత = ప్రవర్తన
తామసం = కోపం
పణమీది = మెడమీది
నడ్సిన = నడిచేను
బంకులు = సందులు
సింపులు = పీలికలు(చింపులు)
బద్ధురం = భద్రంగ
సవారి = పల్లకి, ప్రయాణసాధనం
మెరిచ్చిన మెరియ్యని = మెరిపించి మెరియ్య
ఇంది = అయ్యింది
ఇనిపిచ్చింది = వినిపించింది
పొత్తువిల్లు = ఉమ్మడి ఇల్లు
మెరిమెణ = ఊరేగించు (మెరిచ్చు)
ముంగల = ముందు
సప్పుడు = చప్పుడు
సెంబు = చెంబు
అమాంతం = ఒక్కసారిగా
వొల్లనంటదా ? = ఒప్పుకోనంటుందా
బాయికాడి = బావికాడి
పేకల లేదు = పెగలలేదు

పాఠం ఉద్దేశం

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వేగంగా చోటుచేసుకున్న మార్పులు, క్రమానుసారంగా రాబోయే కొత్త మార్పులు, ఊహించని పరిణామాలు, పర్యవసానాలు, స్థానిక ఆధిపత్యశక్తుల మీద సామాన్యుడి కొత్త విజయాలను సంకేతాత్మకంగా చిత్రిస్తుందీ కథ. ప్రాంతీయ, భాషాపరమైన దృక్పథంలో తెలంగాణ అస్తిత్వచైతన్యానికి నిదర్శనంగా నిలబడి కొత్తబాటలో నడిచిన కథను పరిచయం చేయడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందినది. రెండు తరాలకు సంబంధించిన వివరాలు, తరాలమధ్య కాలాను గుణంగా వచ్చిన మార్పులు మొదలైన విషయాలను డా॥ పి. యశోదారెడ్డి తమ ‘కొత్తబాట’లో తెలియపరిచింది. నేషనల్ బుక్స్ట్ ప్రచురించిన ‘యశోదారెడ్డి ఉత్తమ కథలు’ గ్రంథంలోనిది ఈ పాఠ్యభాగం.

రచయిత్రి పరిచయం

రచయిత్రి : డా॥ పాకాల యశోదారెడ్డి
జననం : 8.8.1929
మరణం : 7.10.2007
జన్మస్థలం : నాగర్ కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి గ్రామం.
పరిశోధనాంశం : “తెలుగులో హరివంశాలు”
నిర్వహించిన పదవులు : తెలుగు ప్రొఫెసర్గా ‘ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేశారు. రాష్ట్ర అధికారభాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన తొలి మహిళ.
రచనలు : ఆంధ్ర సాహిత్య వికాసము, పారి జాతాపహరణ పర్యాలోచనము, ఎర్రాప్రెగడ, కథాచరిత్ర వంటి పరిశోధనా గ్రంథాలను రచించారు. మావూరిముచ్చట్లు, ఎచ్చమ్మకథలు, ధర్మశాల వంటి కథా సంపుటాలను రాశారు.
ఇతర అంశాలు : వీరి రేడియో ధారావాహిక కార్యక్రమం “మహాలక్ష్మి ముచ్చట్లు” ఎంతో ప్రజాదరణ పొందింది.
శైలి : అందమైన తెలంగాణా మాండలికంలో కథలు రాసి తెలంగాణ భాషా సౌందర్యాన్ని, నాటి తెలంగాణ సామాజిక, సాంస్కృతిక జనజీవన వైవిధ్యాన్ని తమ కథల ద్వారా తెలియజేశారు.

TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట

ప్రవేశిక

ఈ ‘కొత్తబాట’ గురించి డా|| పి. యశోదారెడ్డి మాట్లాడుతూ “ఈ కథ తెలంగాణ మాండలికంలో వ్రాయబడింది. అక్కాతమ్ముళ్ళిద్దరూ బస్సుదిగి అక్కడి నుండి ఎద్దుల బండిలో వాళ్ళ ఊరి వరకు ప్రయాణం చేసిన రెండు గంటల్లో రెండు తరాలకు జరిగిన ఘర్షణ, సాధించిన విజయాలు సప్రమాణంగా ప్రదర్శింపబడ్డాయి. ఈ సంభాషణలో ఎన్నో సాంఘిక దురాచారాలు తడమ బడ్డాయి. భాష తెలంగాణ మాండలికాన్ని జీర్ణించుకొని, ఆ జాతీయాన్ని, జీవనరీతిని, నుడికారాన్ని ప్రదర్శిస్తుందని” చెప్పింది. ఆ కొత్తబాటలో మనం నడక మొదలు పెడుదాం.

విద్యార్థులకు సూచనలు

  • పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
  • పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత గీయండి.
  • వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పదవిజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకొండి.

ప్రక్రియ -కథానిక

ప్రాచీన తెలుగు సాహిత్య ప్రక్రియల్లో కథానిక ఒకటి. నేడు కథ, కథానిక అనే పదాలను పర్యాయ పదాలుగా వాడుతున్నాము. ఇది ఒక వచన సాహిత్య ప్రక్రియ. వ్యక్తి జీవితంలోని ఒక ముఖ్య సన్నివేశాన్నిగాని, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. క్లుప్తత దీని ప్రధాన లక్షణం. పాత్రలు, నేపథ్యము కథనము, జీవిత వాస్తవిక చిత్రణ కథానిక ప్రక్రియలోని ముఖ్య బాణీలు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ

Telangana SCERT 10th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం రామాయణం యుద్ధకాండ Questions and Answers.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ

యుద్ధ కాండం

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ 1
శ్రీరాముడు హనుమంతుడిని ప్రశంసించాడు. తన గుండెలకు హత్తుకున్నాడు. రాముడు సూచించిన మార్గంలో వానర సైన్యం సముద్ర తీరాన్ని చేరింది. లంకలో రావణుడు మంత్రులతో లంకను కాపాడుకునే పద్ధతి గూర్చి సమాలోచన గావించాడు. విభీషణుడు హితోక్తులు పలికాడు. సీతాపహరణం పాపకార్యం అన్నాడు. సీతను తిరిగి రామునికి అప్పగించాలన్నాడు. రావణుడు విభీషణునిపై కోపించాడు. నిందించాడు. విభీషణుడు రావణుని వీడి శ్రీరాముడిని శరణు వేడాడు.

రావణుని సంహరించి విభీషణుడికి పట్టాభిషేకం చేస్తానని రాముడు ప్రతిజ్ఞ గావించాడు. సముద్ర జలాలతో లంకారాజుగా విభీషణుని పట్టాభిషిక్తుని చేయమని లక్ష్మణునికి రాముడు ఆజ్ఞ ఇచ్చాడు. లక్ష్మణుడు ఆ విధంగా విభీషణుణ్ణి పట్టాభిషిక్తుని గావించాడు. శ్రీరాముడు సముద్రుని ప్రార్థించాడు. సముద్రుడు అనుగ్రహించలేదు. శ్రీరాముడు ఆగ్రహించాడు. బ్రహ్మాస్త్రాన్ని శ్రీరాముడు స్మరించాడు. సముద్రుడు భయపడ్డాడు. లంకకు దారినివ్వడానికి సముద్రుడు అంగీకరించాడు. నలుడు సముద్రంపై సేతు నిర్మాణానికి పూనుకున్నాడు.

వానరులందరూ నిరంతరాయంగా కృషిచేసి వందయోజనాల పొడవు, పదియోజనాల వెడల్పు గల సేతువును ఐదురోజుల్లో నిర్మించారు. కోలాహలంగా సేతువుపై ప్రయాణించి అవతలి తీరం చేరారు. శుక సారణులనే రాక్షసులు రావణుని వద్ద నుండి వచ్చి వానర సైన్యంలో చేరారు. విభీషణుడు వారిని గుర్తించాడు. సీతను అప్పగించక పోతే రావణునికి చావు తప్పదని చెప్పి రాముడు వారిని పంపివేశాడు. రావణుడు అనేక మాయో పాయాలతో సీతను వంచించడానికి ప్రయత్నం చేశాడు. విభీషణుని భార్యసరమఇదంతా రాక్షసమాయ అని సీతకు చెప్పి ఓదార్చింది. రాముడు సువేల పర్వతం పై నుండి రావణుని చూశాడు. సుగ్రీవుడు కోపంతో వెళ్ళి రావణునితో తలపడి, తిరిగి రివ్వున సువేల పర్వతంపై వాలాడు.

అంగదుడు రాయబారం నడిపాడు. సీతను అప్పగించకపోతే రావణునికి శ్రీరాముని చేతిలో చావు తప్పదన్నాడు. తన పైకి వచ్చిన రాక్షసులను విసిరికొట్టి అంగదుడు ఆకాశమార్గంలో తిరిగి రామునివద్దకు చేరాడు. లంకపై దండయాత్ర ప్రారంభమైంది. ఇరుసైన్యాలూ తీవ్రంగా పోరాడాయి, హనుమంతుడు ఎందరో రాక్షసులను చంపాడు. అంగదుడు ఇంద్రజిత్తును ఓడించాడు. ఇంద్రజిత్తు నాగాస్త్రంతో రామలక్ష్మణులను మూర్ఛితుల్ని గావించాడు. రావణుడు సుగ్రీవుడిని మూర్ఛలో ముంచాడు. హనుమంతుడు రావణుని కొట్టాడు.

రావణుడు హనుమంతుని బలాన్ని మెచ్చుకున్నాడు. రావణుడు వేసిన ‘శక్తి’ అనే ఆయుధం దెబ్బకు లక్ష్మణుడు మూర్ఛిల్లాడు. హనుమంతుడు రాముడిని భుజాలమీద కూర్చోబెట్టుకున్నాడు. రాముడి బాణాల దెబ్బకు రావణుడు అలసిపోయాడు. అవమానంతో రావణుడు అంతఃపురానికి చేరాడు. కుంభకర్ణుడు అన్నను ఓదార్చి యుద్ధానికి వచ్చాడు. రాముడు ఇంద్రాస్త్రంతో కుంభకర్ణుని వధించాడు. ఇంద్రజిత్తు రామలక్ష్మణుల పై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ

రామలక్ష్మణులు పడిపోగా వారు మరణించారను కున్నాడు ఇంద్రజిత్తు. విభీషణుడు వానర సైన్యానికి ధైర్యం చెప్పాడు. హనుమంతుడు జీవించివుంటే అందరం జీవించివున్నట్లే అన్నాడు జాంబవంతుడు. హనుమంతుడు హిమాలయాల్లోని సర్వౌషధి పర్వతాన్ని తెచ్చాడు. ఓషధుల వాసనకు రామ లక్ష్మణుల గాయాలు మానాయి. ఇంద్రజిత్తు మాయలు కొన్ని చేశాడు. అభిచార హోమాన్ని చేశాడు. లక్ష్మణుడు ఇంద్రజిత్తును సంహరించాడు. రావణుడు లక్ష్మణునిపై ‘శక్తి’ని ప్రయోగించాడు. లక్ష్మణుడు నేలపై పడిపోయాడు. శ్రీరాముడు విలపించాడు.

సుషేణుని సలహాతో హనుమంతుడు ఓషధీ పర్వతాన్ని తెచ్చాడు. లక్ష్మణుడు పునర్జీవితుడయ్యాడు. ఇంద్రుడు పంపిన రథంపై ఉండి రాముడు యుద్ధం చేశాడు. అగస్త్యుడు రామునికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు. రామరావణ యుద్ధం ఘోరంగా సాగింది. శ్రీరాముడు బ్రహ్మాస్త్రంతో రావణాసురుని వధించాడు. రాముని అనుమతితో విభీషణుడు అన్నకు దహన సంస్కారాలు గావించాడు. లక్ష్మణుడు విభీషణుని లంకారాజుగా పట్టాభిషేకం గావించాడు. హనుమంతుడు శ్రీరాముని విజయాన్ని సీతకు తెలియజేశాడు.

సీత రాముని వద్దకు వచ్చింది. రాముడు ఆమె తన ఇష్టం వచ్చిన చోటికి పోవచ్చునన్నాడు. సీత అగ్నిప్రవేశం గావించింది. అగ్నిదేవుడు సీతాదేవి పరిశుద్ధతను వెల్లడిస్తూ ఆమె గొప్పతనాన్ని తెలియజేస్తూ శ్రీరామునికి తిరిగి అప్పజెప్పాడు. ముల్లోకాలకు ఆమె గొప్పతనాన్ని తెలియజేయడానికే ఇలా చేశానన్నాడు రాముడు. ఇంద్రుడు చనిపోయిన వానరులను బ్రతికించాడు. పుష్పక విమానంలో అందరూ తిరిగి బయలు దేరారు. నందిగ్రామంలో భరతుడు సీతారామ లక్ష్మణులకు స్వాగతం పలికాడు. సీతారామ లక్ష్మణులు పెద్దలందరికీ నమస్కరించారు. భరతుడు పాదుకలను రాముని పాదాలకు తొడిగాడు. శ్రీరామపట్టాభిషేకం జరిగింది. భరతుని యువ రాజుగా చేశాడు. శ్రీరాముడు ప్రజలను సుఖంగా పాలించాడు. రామరాజ్యం ఆదర్శవంతంగా నేటికీ నిలిచివుంది.

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జాంబవంతుడు విభీషణుని ‘హనుమంతుడు క్షేమమేనా ?” అని అడగడంలోని అంతరార్థం ఏమిటి?
జవాబు:
ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్ర ప్రభావానికి రామలక్ష్మణులతో సహా అందరూ స్పృహ కోల్పోయారు. బ్రహ్మాస్త్ర ప్రభావం విభీషణునిపైనా, హనుమంతునిపైనా, జాంబవంతునిపైనా పడలేదు. తనను వెతుకుతూ వచ్చిన విభీషణుని ‘హను మంతుడు క్షేమమేనా ?’ అని జాంబవంతుడు అడిగాడు.

రామలక్ష్మణుల గురించి కాక, హను మంతుని గురించి అడగడంలోని జాంబవంతుని ఆంతర్యం విభీషణునికి అర్థం కాలేదు. హను మంతుడు బతికి ఉంటే, రామలక్ష్మణులతో సహా వానరసైన్యం మొత్తం క్షేమంగా ఉంటుందని జాంబవంతుడు అన్నాడు. ఈ మాటలను బట్టి ఆంజనేయుని శక్తి సామర్థ్యాలు అర్థమవుతున్నాయి.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ

ప్రశ్న 2.
‘రామ రావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే సాటి’ దీన్ని గురించి వివరించండి.
జవాబు:
రావణుడు కపటోపాయంతో సీతను అపహరించుకు పోయి, లంకలో అశోకవనంలో బంధించాడు. హను మంతుని ద్వారా ఎట్టకేలకు సీత జాడ తెలుసుకొని వానర సైన్యాన్ని తోడుతీసుకొని లంకను ముట్ట డించాడు.

శ్రీరాముడు ముందుగా సీతనప్పగించి ప్రాణాలు దక్కించుకోమని రావణునికి కబురంపాడు. రావణుడు తిరస్కరించాడు. వానరవీరుల చేతిలో రాక్షసవీరులు నిహతులౌతున్నారు. రావణుడు సుగ్రీవునిపై బాణాలేసాడు. లక్ష్మణుడు రావణుని ఎదుర్కొన్నాడు. రావణుని దెబ్బకు హనుమంతుడు, హనుమంతుని దెబ్బకు రావణుడు ఉలికిపడి సర్దుకున్నారు. రావణుడి ‘శక్తి’ ప్రయోగంచే లక్ష్మణుడు మూర్ఛపోయాడు. హనుమంతుడు రావణుని పిడికిళ్ళతో నొప్పించి శ్రీరాముని తన భుజాలపై ఎక్కించుకున్నాడు. శ్రీరాముడు రావణునితో యుద్ధం చేశాడు. రావణుని ధనుస్సు, కిరీటం పడగొట్టి అలసట తీర్చుకొని రమ్మని పంపేశాడు.

కుంభకర్ణుడు విజృంభించగా రాముడు అతణ్ణి అంతం చేశాడు. రావణుడు విభీషణునిపై బల్లెం ఎత్తాడు. లక్ష్మణుడు అడ్డుకున్నాడు. రాముడు రావణునిపై బాణాలు గుప్పించాడు. తట్టుకోలేక రావణుడు పరుగులు తీశాడు. ఇంద్రుడు మాతలితో రథాన్ని పంపాడు. రామరావణులు ఒకరికొకరు తీసిపోకుండా యుద్ధం చేశారు. రావణుని తలలు .ఎన్నిసార్లు నరికినా మళ్ళీ మొలుస్తూ ఉండడంతో బ్రహ్మాస్త్రం ప్రయోగించి రాముడు రావణుని అంతమొందించాడు.

‘ఈ రకంగా రామరావణుల యుద్ధానికి రామరావణుల యుద్ధమే సాటి’ అని చెప్పవచ్చు.

ప్రశ్న 3.
శ్రీరాముడు సముద్రునిపై అస్త్ర ప్రయోగానికి సిద్ధ పడటానికి కారణం ఏమిటి? దాని పర్యవసానమేమిటి?
జవాబు:
లంకకు వెళ్ళాలంటే రాముడు సముద్రం దాటాలి. సముద్రాన్ని దాటే ఉపాయం ఏమిటని సుగ్రీవుడిని రాముడు అడిగాడు. సముద్రుడిని ప్రార్థించమని విభీషణుడు సలహా చెప్పాడు. శ్రీరాముడు సముద్ర తీరంలో దర్భాసనం మీద కూర్చుని సముద్రుడిని ప్రార్థించాడు. మూడు రాత్రులు గడచినా సముద్రుడు ఎదుట కనబడలేదు.

కోపముతో శ్రీరాముడి కళ్ళు ఎరుపు ఎక్కాయి. సముద్రుడి అహంకారాన్ని పోగొట్టాలని, సముద్రంలో నీటిని ఇంకిపోయేటట్లు చేయాలని రాముడు అనుకున్నాడు. అప్పుడు శ్రీరాముడు బ్రహ్మాస్త్రమును స్మరించాడు.

దానితో ప్రకృతి అంతా అల్లకల్లోలమయ్యింది. సముద్రుడు భయపడి పారిపోతున్నాడు. పరుగెత్తే వాడిపై బాణం ప్రయోగించరాదని, శ్రీరాముడు ఆగాడు. సముద్రుడు దారికి వచ్చాడు. లంకకు వెళ్ళడానికి తాను దారి ఇస్తానన్నాడు.

ఎక్కుపెట్టిన బాణం వృథాకారాదని, రాముడు సముద్రుడి మాటపై పాపాత్ములు ఉండే ద్రుమ కుల్యంపై దాన్ని ప్రయోగించాడు. సేతువు నిర్మించ డానికి నలుడు సమర్థుడనీ, సేతువును తాను భరిస్తాననీ, సముద్రుడు రామునికి చెప్పాడు. సేతు నిర్మాణం జరిగింది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ

ప్రశ్న 4.
అంగద రాయబారాన్ని వివరించండి.
జవాబు:
అంగదుడు వాలి కుమారుడు. మహాశక్తిమంతుడు. రావణుడితో యుద్ధానికి దిగేముందు, రాముడు రావణుని దగ్గరకు అంగదుని రాయబారిగా పంపాడు. అంగదుడు రావణుడి దగ్గరకు వెళ్ళి, సీతను రామునికి అప్పగించకపోతే, శ్రీరాముడి చేతిలో రావణుడి మరణం తథ్యమనీ, లంకకు విభీషణుడు రాజు కాగలడనీ, రావణుడిని హెచ్చరించాడు.

దానితో రావణుని సభ అంతా అట్టుడికి పోయింది. నలుగురు రాక్షసులు అంగదుడి మీద విరుచుకుపడ్డారు. అంగదుడు ఆ రాక్షసులను తన చంకలో ఇరికించుకొని, మేడపైకి ఎగిరాడు. అంగదుడు మేడపై నుండి ఆ రాక్షసులను నేలపైకి విసిరాడు.

తరువాత అంగదుడు సింహనాదంచేసి ఆకాశ మార్గంలో శ్రీరాముడిని చేరాడు. ఈ విధంగా శ్రీరాముడు రావణుని భావాన్ని గ్రహించాడు. ఇక రావణుడితో యుద్ధం చేయక తప్పదని రాముడు నిశ్చయించాడు.

ప్రశ్న 5.
రావణుని ‘శక్తి’ ఆయుధ ప్రయోగం వలన కలిగిన పరిణామాలను వివరించండి.
జవాబు:
రావణుడు తనతో యుద్ధం చేస్తున్న లక్ష్మణుడిపై ‘శక్తి’ అనే ఆయుధాన్ని ప్రయోగించాడు. ఆ శక్తి ఆయుధం, లక్ష్మణుడి హృదయంలో గుచ్చుకుంది. దానితో లక్ష్మణుడు స్పృహ తప్పాడు. రావణుడు లక్ష్మణుడిని ఎత్తుకొని వెళ్ళాలని అనేక విధాల ప్రయత్నించాడు. కాని రావణుడు లక్ష్మణుడిని పైకి ఎత్తలేకపోయాడు. అప్పుడు ఆంజనేయుడు రావణుడి మీద దాడి చేశాడు.

హనుమంతుడు రావణుడి వక్షస్థలం మీద తన పిడికిలితో గట్టిగా గుద్దాడు. దానితో రావణుడు కూలిపోయాడు. హనుమంతుడు లక్ష్మణుడిని శ్రీరాముడి వద్దకు చేర్చాడు. శ్రీరాముడు హను మంతుడి భుజాలపై కూర్చుండి, రావణునితో యుద్ధం చేశాడు. రాముడి పరాక్రమం ముందు, రావణుడి ధనుస్సు ముక్కలయ్యింది. రావణుని కిరీటం నేలకూలింది.

శ్రీరాముడు రావణునిపై దయతలచి “రావణా ! నీవు యుద్ధంలో అలసిపోయావు. ‘విశ్రాంతి తీసుకొనిరా” అని చెప్పాడు. రావణుడు యుద్ధం నుండి తిరుగుముఖం పట్టాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ

ప్రశ్న 6.
రామరావణ సంగ్రామాన్ని వివరించండి.
జవాబు:
రాముడు హనుమంతుడి భుజాలపై కూర్చుండి, రావణునితో యుద్ధం చేశాడు. రాముని పరా క్రమంతో రావణుని ధనుస్సు ముక్కలయ్యింది. రావణుడి కిరీటం నేలకూలింది. రాముడు రావణునిపై దయతలచి అప్పటికి విడిచిపెట్టాడు.

తరువాత రామలక్ష్మణులతో రావణుడు భయంకరంగా యుద్ధం చేశాడు. రావణుడు శక్తి అనే ఆయుధాన్ని లక్ష్మణుడిపై వేశాడు. రాముడు శక్తిని వేడుకున్నాడు. శక్తి తన ప్రాణశక్తిని కోల్పోయింది. శక్తి లక్ష్మణుడికి తగిలింది. రాముడు శక్తిని విరిచివేశాడు. రాముడు విజృంభించాడు. దానితో రావణుడు పరుగుపెట్టాడు.

హనుమ తెచ్చిన ఓషధీ ప్రభావంతో లక్ష్మణుడు లేచాడు. ఇంద్రుడు తన సారధి మాతలిని, తన దివ్యరథాన్ని, రాముని కోసం పంపాడు. రాముడు ఇంద్ర రథం ఎక్కి రావణుడితో యుద్ధం చేశాడు.
రామరావణులు సమానంగా పోరాడారు.

రాముడు విజృంభించడంతో, రావణుడి రథసారధి రావణుని రథాన్ని ప్రక్కకు మరలించాడు. రావణుడు తన సారధిని మందలించాడు. తిరిగి రావణ రథం, రాముని ముందు నిలిచింది. అగస్త్య మహర్షి దేవతలతో వచ్చి, రామునికి ఆదిత్యహృదయ మంత్రం ఉపదేశించాడు.

రాముని బాణానికి రావణుడి తలలు నేలపై రాలి తిరిగి మొలుస్తున్నాయి. అప్పుడు మాతలి రావణునిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించమని రామునికి చెప్పాడు. రాముని బ్రహ్మాస్త్రంతో, రావణ సంహారం జరిగింది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ

ప్రశ్న 7.
రామాయణంలో విభీషణుడి పాత్ర గురించి రాయండి. (March 2018)
జవాబు:
విభీషణుడు రావణాసురుని తమ్ముడు. శత్రువుల శక్తి సామర్థ్యాలను తెలుసుకోకుండా వారిని చులకనగా భావించకూడదనే ఆలోచన కలవాడు. రావణుడు సీతను అపహరించడం మహాపాపమని, ఆయన కీర్తి ప్రతిష్ఠలు మంటగలుస్తాయని, సంపదలు నశిస్తాయని భావించినట్టివాడు. అనేక ధర్మసూక్ష్మాలు తెలిసినవాడు విభీషణుడు.

లంకలో ప్రవేశించిన హనుమంతుని చంపమని రావణాసురుడు ఆజ్ఞాపించినపుడు, దూతను చంపడం భావ్యం కాదని, ఇతర పద్ధతుల్లో దూతను దండించవచ్చని రాజనీతిని ప్రదర్శించిన విజ్ఞుడు విభీషణుడు.

విభీషణుడు తన అన్నయగు రావణునితో అనవసరంగా కోపం మంచిది కాదని, అది ధర్మానికి ఆటంకమౌతుందని, సుఖాలను దూరం చేస్తుందని హితవు పలికినవాడు. రావణుని అధర్మ మార్గాన్ని వ్యతిరేకించినవాడు.

విభీషణుడు ధర్మరక్షణ కోసం శ్రీరాముని పక్షంలో చేరినవాడు. రావణ సంహారం తరువాత లంకా నగరానికి రాజుగా పట్టాభిషిక్తుడైనాడు.

ప్రశ్న 8.
రామాయణం కథ ఆధారంగా రావణుని వ్యక్తిత్వాన్ని గురించి తెలపండి. (June 2015)
జవాబు:
రావణుడు మహా తేజశ్శాలి. హనుమంతుడు మొట్టమొదటిసారి రావణుని చూసి రావణుని తేజస్సుకు ఆశ్చర్యపడ్డాడు. అకంపనుడు, సీతను అపహరించి తెమ్మని, అలా చేస్తే రాముడు సీతావియోగంతో మరణిస్తాడని చెప్పాడు. శూర్పణఖ సీత అందాన్ని వర్ణించి చెప్పి రావణునిలోని స్త్రీ వ్యామోహాన్ని రెచ్చగొట్టింది. మారీచుడు, అకంపనుడు ఎంత చెప్పినా వినకుండా రావణుడు మూర్ఖత్వంతో సీతను అపహరించి తెచ్చాడు.

విభీషణుడు ఎంత హితవు చెప్పినా రావణుడు వినలేదు. రావణుడు పరాక్రమవంతుడు. జటాయువును సంహరించాడు. లక్ష్మణుడిని శక్తి ఆయుధంతో మూర్ఛపోయేలా చేశాడు. రాముడి పరాక్రమం ముందు మాత్రం రావణుడు నిలబడలేకపోయాడు. రావణుడు రామునితో సమంగా యుద్ధం చేశాడు. చివరకు రాముని బ్రహ్మాస్త్రానికి హతుడయ్యాడు.

రావణుడు కపటి. శ్రీరాముని మాయా శిరస్సును, ధనుర్బాణాలను సీతకు చూపించి రాముడు తన చేతిలో మరణించాడని అబద్ధం ఆడాడు. రావణుడు అవివేకి. హనుమంతుడు ఒక్కడే సముద్రాన్ని దాటివచ్చి ఎంతో మంది రాక్షసుల్ని చంపి లంకాదహనం చేసిన రాముని బలాన్ని గూర్చి అంచనా వేయలేకపోయాడు. తన కుమారుడు మహాశక్తివంతుడైన ఇంద్రజిత్తు, తమ్ముడు కుంభకర్ణుడు మరణించినా రావణుడు. తెలివి తెచ్చుకోలేదు. మహాపతివ్రత అయిన సీతను బంధించి తెచ్చి తన చావును తానే కోరి తెచ్చుకున్నాడు.

లంకారాజ్యాధిపతి అయిన రావణుడు, స్త్రీ వ్యామోహంతో, అవివేకంతో, తనవారి యొక్క తమ్ముల యొక్క హితవచనాలు వినక రాముని చేతిలో మరణించాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ

ప్రశ్న 9.
శ్రీరాముడు సైన్యంతో లంకానగరాన్ని చేరిన వృత్తాంతాన్ని తెలపండి.
జవాబు:
సీతాదేవిని చూసి వచ్చి కుశల వార్తను అందించిన హనుమను శ్రీరాముడు ఆలింగనం చేసికొన్నాడు. మహోపకారం చేసిన హనుమకు తాను ఇయ్యగల సత్కారం అదే అన్నాడు. రాముడికి దుఃఖం వచ్చింది. సుగ్రీవుడు రాముడిని ఓదార్చాడు. క్రోధం చూపించాలి అని రామునికి సుగ్రీవుడు సలహా ఇచ్చాడు. సముద్రానికి సేతువు కడితేకాని, లంకను జయించలేము “అన్నాడు. హనుమ లంకానగర రక్షణ వ్యవస్థను గూర్చి తెలిపాడు.

విజయ ముహూర్తంలో లంకకు బయలుదేరాలని రాముడు అన్నాడు. నీలుడు సైన్యానికి మార్గం చూపించాలని, రాముడు హనుమంతుని భుజం మీద, లక్ష్మణుడు అంగదుని భుజం మీద కూర్చొని వెళ్ళాలని, సుగ్రీవుడు పల్లకిపై రావాలని, రాముడు నిర్ణయించాడు. అందరూ సముద్రతీరాన్ని చేరుకున్నారు.

విభీషణుడు ధర్మం విడిచిన రావణుని విడిచి పెట్టి, తన నలుగురు అనుచరులతో రామలక్ష్మణులు ఉన్న చోటుకు చేరాడు. విభీషణుడు రాముని శరణు కోరగా, రాముడు అంగీకరించాడు. రాముడు రావణుని చంపి విభీషణుణ్ణి రాజును చేస్తానని ప్రమాణం చేశాడు. ఆ పనిలో రామునికి తాను సహాయం చేస్తానని విభీషణుడన్నాడు.

రాముడు విభీషణుణ్ణి లంకకు పట్టాభిషిక్తుణ్ణి చేయమని లక్ష్మణుడికి చెప్పాడు. లక్ష్మణుడు వెంటనే ఆ పని చేశాడు. సముద్రుణ్ణి ప్రార్థిస్తే సముద్రాన్ని దాటగలవని విభీషణుడు రామునికు సలహా చెప్పాడు. శ్రీరాముడు సముద్రుణ్ణి ఉపాసించాడు. మూడు రోజులు అయినా, సముద్రుడు ప్రసన్నుడు కాలేదు. రాముడు బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు.

సముద్రుడు పరుగుపెట్టాడు. లంకకు వెళ్ళడానికి దారి ఇస్తానని సముద్రుడు చెప్పాడు. రాముడు తాను ఎక్కుపెట్టిన అస్త్రం వ్యర్థం కాకుండా, పాపాత్ములు ఉండే “ద్రుమకుల్యం”పై ప్రయోగించాడు. నలుడు సేతువు నిర్మించడానికి తగినవాడని సముద్రుడు చెప్పాడు. సేతువును భరిస్తానని సముద్రుడు మాట ఇచ్చాడు.

రాముడు సేతువు నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. వానరులు వృక్షాలు తెచ్చి సముద్రంలో పడవేశారు. 100 యోజనాల పొడవు, 10 యోజనాల వెడల్పు గల సేతువు 5 రోజుల్లో కట్టబడింది. రామలక్ష్మణ సుగ్రీవులు ముందు నడుస్తున్నారు. సైన్యం వారి వెంట నడిచింది. వానరులు కొందరు సముద్రంలో దూకి ఈదుతూ వచ్చారు.

ఈ విధంగా శ్రీరాముడు, సుగ్రీవుడు మొదలయిన వానర నాయకులతో లంకా నగరానికి చేరాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ

ప్రశ్న 10.
వానర సైన్యానికీ, రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధం వివరాలను తెలపండి.
జవాబు:
రాముడు సైన్యాన్ని విభాగించి, ఎవరి బాధ్యతలు వారికి అప్పగించాడు. రావణుని మంత్రులైన శుకసారణులు రాముని బలం తెలిసికోడానికి గూఢచారులుగా వచ్చి వానరులలో చేరారు. విభీషణుడు వారిని గుర్తించి, రాముని ముందు పెట్టాడు. రాముడు వారిని క్షమించి, సీతను అప్పగించకపోతే రావణుడి మరణం తప్పదని హెచ్చరించి పంపాడు. శుకసారణులు రావణునికి ఆ విషయం తెలిపారు.

రావణుడు అశోకవనం వెళ్ళి రాముడు తన చేతిలో మరణించాడని సీతకు అబద్ధం చెప్పాడు. విద్యుజ్జిహ్వుడిచే రామునివి అనిపించే మాయా శిరస్సునూ, ధనుర్భాణాలనూ తెప్పించి, సీతకు చూపించాడు. సీతను తన్ను ఆశ్రయించమని కోరాడు. సీత విచారించింది. విభీషణుడి భార్య “సరమ” సీతను ఊరడించి రాముడు క్షేమంగా ఉన్నాడనీ, అదంతా రాక్షసమాయ అనీ సీతకు తెలిపింది.

శ్రీరామ చంద్రాదులు సువేల పర్వతానికి చేరారు. లంకానగర శోభను చూశారు. రావణుడు ఠీవిగా మేడపై ఉన్నాడు. సుగ్రీవుడు రావణునిపై కోపంతో ఎగిరి రావణ భవనంపై వాలాడు. తన నుండి రావణుడు తప్పించుకోలేడని, రావణుడి కిరీటాన్ని తీసి నేలపై కొట్టాడు. రావణుడు రెచ్చిపోయాడు. ఇద్దరికీ బాహాబాహీ యుద్ధం జరిగింది. సుగ్రీవుడు రావణుడిని ముప్పుతిప్పలు పెట్టి, తిరిగి సువేల పర్వతం చేరాడు. శ్రీరాముడు సుగ్రీవుణ్ణి మందలించాడు.

అంగదుడిని రాముడు రావణుడి దగ్గరకు రాయబారిగా పంపాడు. రాముడి చేతిలో రావణుడు మరణిస్తాడని, విభీషణుడు రాజు అవుతాడని రాముని వాక్యంగా, అంగదుడు రావణునికి తెలిపాడు. అంగదుడిని నలుగురు రాక్షసులు చంపబోయారు. అంగదుడు వారిని చంపి వచ్చాడు. రాముడు యుద్ధానికి సిద్ధం అయ్యాడు.

లంకపై దండయాత్ర :
వానరసైన్యం లంకను నాల్గువైపుల నుండి ముట్టడించింది. ఆంజనేయుడి చేతిలో జంబుమాలి, సుషేణుడి చేతిలో విద్యున్మాలి మరణించారు. అంగదుడి చేతిలో ఇంద్రజిత్తు ఓడిపోయాడు. దానితో ఇంద్రజిత్తు కపటయుద్ధానికి దిగాడు. ఇంద్రజిత్తు నాగాస్త్రంతో రామలక్ష్మణులను బంధించాడు. రామలక్ష్మణులు మరణించారని ఇంద్రజిత్తు రావణుడితో చెప్పాడు. రావణుడు ఆజ్ఞాపించగా “త్రిజట మొదలయిన రాక్షస స్త్రీలు సీతను పుష్పక విమానంలో యుద్ధభూమికి తీసుకువచ్చి, నేలపై ఉన్న రామలక్ష్మణులను చూపించారు. సీత ఏడ్చింది. త్రిజట సీతను ఓదార్చింది. రామలక్షణులు బతికి ఉన్నారని ఆమె సీతకు ఆధారాలు చూపింది. సీత మనస్సు కుదుట పడింది.

గరుత్మంతుడి రాకతో నాగాస్త్ర ప్రభావం నుండి రామలక్ష్మణులు విముక్తి పొందారు. హనుమంతుడు అకంపనుణ్ణి, ధూమ్రాక్షుణ్ణి చంపాడు. అంగదుడు వజ్రదంష్ట్రుడిని, నీలుడు ప్రహస్తుడిని చంపాడు. రావణుడి చేతిలో సుగ్రీవుడు మూర్ఛపోయాడు. లక్ష్మణుడు రావణుడిని ఎదిరించాడు. రావణుడు బాణవర్షం కురిపించాడు. హనుమ అడ్డుకున్నాడు. రావణుడి అరచేతి దెబ్బకు హనుమ చలించి, తిరిగి తేరుకొని, రావణుడిని అరచేతితో కొట్టాడు. దశగ్రీవుడు కంపించిపోయి, ‘భళా! వానరా’ అని హనుమశక్తిని మెచ్చుకున్నాడు.

రావణుడు ‘శక్తి’ అనే ఆయుధాన్ని లక్ష్మణుడిపై వేశాడు. లక్ష్మణుడు స్పృహకోల్పోయాడు. రావణుడు లక్ష్మణుడిని ఎత్తుకొని పోవడానికి విఫలయత్నం చేశాడు. ఆంజనేయుడు పిడికిలితో పొడిచి రావణుడిని కూలగొట్టి, లక్ష్మణుడిని రాముని దగ్గరకు చేర్చాడు. శ్రీరాముడు హనుమంతుని భుజాలపై కూర్చుండి రావణునితో యుద్ధం చేశాడు. రావణుని కిరీటం, ధనుస్సు నేలపై పడ్డాయి. రాముడు కరుణించి, అలసిపోయిన రావణుడిని విశ్రాంతి తీసుకొని తిరిగి యుద్ధానికి రమ్మని పంపాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ

ప్రశ్న 11.
రామరావణయుద్ధాన్ని గురించి రాయండి.
జవాబు:
రావణుడు ప్రయోగించిన శక్తి ఆయుధం లక్ష్మణుడి గుండెపై నాటుకుంది. లక్ష్మణుడు స్పృహ తప్పాడు. హనుమంతుడు రావణుడి వక్షస్థలంపై గుద్ది క్రింద పడేటట్లు చేశాడు. రాముడు హనుమ భుజాలపై కూర్చొని, రావణునితో చేసి, యుద్ధ రావణుని ధనుస్సును విరిచాడు. రావణుని కిరీటం నేలపై పడింది. రాముడు రావణునితో “యుద్ధంలో అలసిపోయావు. విశ్రాంతి తీసుకొని రా. నా బలం చూపిస్తా” అన్నాడు.

రాముడు కుంభకర్ణుని చంపాడు. లక్ష్మణుడు ఐంద్రాస్త్రంతో ఇంద్రజిత్తును చంపాడు. రావణుడు శక్తిని ప్రయోగించాడు. రాముడు దాన్ని ప్రార్థించాడు. లక్ష్మణుడు పడిపోయాడు. రాముని విలువిద్య ముందు రావణుడు నిలువ లేక పరుగు తీశాడు. హనుమంతుడు ఓషధీ పర్వతాన్ని తెచ్చి, లక్ష్మణుడిని బ్రతికించాడు.

ఇంద్రుడు రామునకు దివ్యరథాన్ని పంపాడు. రాముడు ఆ రథం ఎక్కి రావణుడితో యుద్ధం చేశాడు. క్రమంగా రాముని ‘ముందు రావణుడు నిలువలేకపోయాడు. రావణుని సారథి రథాన్ని ప్రక్కకు మళ్ళించాడు. రావణుడు సారథిపై కోపించాడు. అగస్త్యమహర్షి రామునికి, ఆదిత్య హృదయం ఉపదేశించాడు. రాముడి బాణాలు తగిలి రావణుని తలలు తెగిపడ్డాయి. కాని తిరిగి మొలుస్తున్నాయి.

రామరావణ యుద్ధానికి సాటి రామ, రావణ యుద్ధమే. మాతలి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించమని రామునికి సూచించాడు. రాముని బ్రహ్మాస్త్రంతో రావణుడు మరణించాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ

ప్రశ్న 12.
రావణుని చంపి శ్రీరాముడు పట్టాభిషిక్తుడై రాజ్యాన్ని పాలించిన విధానాన్ని తెలపండి.
జవాబు:
మాతలి సూచనతో శ్రీరాముడు రావణునిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. రావణ సంహారం జరిగింది. రాముడి ఆదేశం మేరకు విభీషణుడు తన అన్న రావణునికి ఉత్తర క్రియలను నిర్వహించాడు. రాముని ఆజ్ఞప్రకారం, లక్ష్మణుడు విభీషణుడిని లంకారాజుగా పట్టాభిషేకం చేశాడు. హనుమ సీతమ్మకు రావణసంహారం గురించి చెప్పాడు. సీతను బాధించిన స్త్రీలను చంపుతానన్న హనుమను, సీతమ్మ వారించింది.

విభీషణుడు సీతను పల్లకిలో రాముని వద్దకు తీసుకువచ్చాడు. సీత భర్తను చేరుకుంది. రాముడు సీతతో తన వంశ ప్రతిష్ఠను నిలుపుకోడానికి రావణుడి చెర నుండి సీతను విడిపించాననీ, సీత పరుల పంచన ఉన్నందువల్ల తనకు ఆమెపై సందేహం ఉందనీ, ఆమె ఇష్టం వచ్చినచోటుకు వెళ్ళవచ్చుననీ అన్నాడు. శ్రీరాముడి మాటలు సీతకు బాణాల్లా గుచ్చుకున్నాయి. రాముడికి తనపై విశ్వాసం కల్గించడానికి ‘అగ్నిప్రవేశం’ ఒక్కటే దిక్కని ‘సీత భావించింది. లక్ష్మణుడు చితిని సిద్ధం చేశాడు. సీత అగ్నిప్రవేశం చేసింది. అగ్నిదేవుడు సీతను స్వయంగా తీసుకువచ్చి ఆమెను స్వీకరించమని రాముని కోరాడు.

సీత శీలాన్ని ముల్లోకాలకూ చాటడానికే, సీత అగ్ని ప్రవేశం చేస్తున్నప్పటికీ, తాను ఊరుకున్నానని చెప్పి. సీతను రాముడు స్వీకరించాడు. శివుడు రాముని ప్రశంసించాడు. ఇంద్రుడు చనిపోయిన వానరులను బ్రతికించాడు. విభీషణుడు రాముడిని మరికొంతకాలం లంకలో ఉండమన్నాడు. కాని భరతుని కోసం రాముడు పుష్పకవిమానంలో అయోధ్యకు బయలుదేరాడు. రాముడు తాను తిరిగి వస్తున్న విషయాన్ని భరతుడికి హనుమ ద్వారా కబురంపాడు.

పుష్పకవిమానంలో నందిగ్రామం చేరుకున్న సీతారామలక్ష్మణులకు, భరతాదులు స్వాగతం చెప్పారు. సీతారాములు తల్లులకూ, వశిష్ఠుడికి నమస్కరించారు. భరతుణ్ణి రాముడు దగ్గరకు తీసుకొన్నాడు. శ్రీరామ పట్టాభిషేకం మహా వైభవంగా జరిగింది. రాముడు లక్ష్మణుడిని యువరాజుగా ఉండమన్నాడు. లక్ష్మణుడు అంగీకరించలేదు. భరతుణ్ణి యువరాజుగా చేశాడు.

రాముడు ప్రజలను కన్నబిడ్డలవలె చూశాడు. ప్రజలు ధర్మబద్ధంగా నడచుకున్నారు. రాముడు 11 వేల సంవత్సరాలు పాలించాడు. ప్రజలకు ఈతిబాధలు లేవు. అందుకే ‘రామరాజ్యం’ అనేమాట ప్రసిద్ధం అయ్యింది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ

ప్రశ్న 13.
విభీషణుని నీతిని వివరించండి.
జవాబు:
లంకలో రావణుడు మంత్రులతో సమావేశం అయ్యాడు. తామొక్కరే లంకను కాపాడగలమని అందరూ గొప్పలు చెబుతున్నారు. శత్రువును తుదముట్టిస్తామంటున్నారు.

విభీషణుడు మాత్రం శత్రువుల శక్తిసామర్థ్యాలను తక్కువగా అంచనా వేయకూడదన్నాడు. మనరాజే సీతను అపహరించాడు. అది పాపం. కీర్తిప్రతిష్ఠలు పోతాయి. ఆయుష్షు తగ్గుతుందన్నాడు. సంపదలు నశిస్తాయి అన్నాడు. సీతను శ్రీరామునికి అప్పగించడమే మంచిదన్నాడు. శ్రీరాముని వంటి మహావీరునితో విరోధం తగదన్నాడు. అనవసరంగా కోపించకూడదు. అది ధర్మానికి ఆటంకం కల్గిస్తుంది. సుఖాలను దూరం చేస్తుంది అని రావణునికి అనేక విధాల హితబోధ చేశాడు. అనవసరమైన యుద్ధాన్ని నివారించడమే విభీషణుని నీతి.

ప్రశ్న 14.
అంగద రాయబారం గురించి రాయండి.
జవాబు:
అంగదుడిని శ్రీరాముడు రాయబారిగా పంపాడు. రావణుడి దగ్గరకు వెళ్ళాడు అంగదుడు. సీతను అప్పగించకపోతే శ్రీరాముని చేతిలో మరణం తప్పదన్నాడు. లంకకు విభీషణుడు రాజు అవుతాడన్నాడు. దానితో సభ అట్టుడికిపోయింది. నలుగురు రాక్షసులు అంగదునిపై బడ్డారు. అంగదుడు వారిని తన చంకలలో ఇరికించుకొన్నాడు. రాజప్రాసాదం పైకి ఎగిరాడు. అక్కడి నుండి బలంగా నేలపైకి విసిరాడు. సింహనాదం చేసి ఆకాశమార్గంలో శ్రీరాముని చేరాడు.

అంటే, అంగదుడు రాయబారిగా తాను చెప్పదలచుకొన్నది సూటిగా చెప్పాడు. తనపై దాడికి దిగిన వారిని మట్టుబెట్టాడు. తను చెప్పినది చేయగల సమర్థత తమకు ఉందని నిరూపించాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ

ప్రశ్న 15.
శ్రీరాముని యుద్ధనీతిని వివరించండి.
జవాబు:
రావణుడిది తప్పని తెలిసినా రాయబారిని పంపాడు. సీతను ఇచ్చివేస్తే యుద్ధం ఉండదని చెప్పించాడు. తప్పనిసరి పరిస్థితులలో యుద్ధం చేశాడు. రావణుని సకుటుంబంగా చంపాడు. రావణుని మరణంతో అతనిపై వైరం పోయిందన్నాడు. రావణుడు తనకు కూడా గౌరవించదగిన వాడే అన్నాడు. ఎంతవరకు విరోధం పాటించాలో అంతవరకే రామునకు విరోధం ఉంటుంది. అది శ్రీరాముని యుద్ధనీతి.

“నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై”
TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ 2

పరిచిత గద్యాలు

ప్రశ్న 1.
కింది గద్యాన్ని చదివి దాని కింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (March 2019)

రావణుడు విభీషణుని మాటలకు క్రోధావేశాలకు లోనయ్యాడు. తీవ్రస్థాయిలో నిందించాడు. అన్న తండ్రితో సమానమని అతని నిందలను సహించాడు విభీషణుడు. కాని రావణుని అధర్మమార్గాన్ని మాత్రం సమర్థించలేదు. ధర్మం వీడిన రావణుని వీడడానికే విభీషణుడు నిర్ణయించుకున్నాడు. తన నలుగురు అనుచరులతో కలిసి రామలక్ష్మణులున్న చోటికి చేరాడు. శ్రీరాముడిని శరణు కోరాడు. రావణుని విషయాలన్నీ సంక్షిప్తంగా చెప్పాడు. అనుగ్రహించిన శ్రీరాముడు విభీషణునితో నేను రావణుని బంధుమిత్ర సమేతంగా హతమార్చి నిన్ను రాజును చేస్తానని చెప్పాడు. ఆ పనిలో తాను యథాశక్తి సహాయపడగలనని విభీషణుడు మాట ఇచ్చాడు. రాముడు విభీషణుడిని ఆలింగనం చేసుకున్నాడు. లక్ష్మణుడితో వెంటనే సముద్రజలం తెచ్చి లంకారాజుగా విభీషణుడిని పట్టాభిషిక్తుని చేయమన్నాడు. శ్రీరాముని ఆజ్ఞ వెంటనే ఆచరణ రూపం దాల్చింది. అందరూ ఆనందాన్ని ప్రకటించారు.

ప్రశ్నలు – జవాబులు :
1. ఎవరు ధర్మమార్గమును విడిచిపెట్టారు ?
జవాబు:
రావణుడు ధర్మమార్గమును విడిచిపెట్టాడు.

2. రావణుని నిందలను విభీషణుడు ఎందుకు సహించాడు ?
జవాబు:
అన్న తండ్రితో సమానమని అతని నిందలను సహించాడు విభీషణుడు.

3. విభీషణుడు ఎవరితో కలిసి రామలక్ష్మణుల దగ్గరకు వెళ్ళాడు ?
జవాబు:
విభీషణుడు నలుగురి అనుచరులతో కలిసి రామలక్ష్మణుల దగ్గరకు వెళ్ళాడు.

4. ఆచరణ రూపం దాల్చిన శ్రీరాముని ఆజ్ఞ ఏమిటి ?
జవాబు:
లక్ష్మణుడితో వెంటనే సముద్రజలం తెచ్చి లంకా రాజుగా విభీషణుడిని పట్టాభిషిక్తుని చేయమన్నాడు. శ్రీరాముని ఆజ్ఞ వెంటనే ఆచరణ రూపం దాల్చింది.

5. విభీషణునితో శ్రీరాముడు ఏమన్నాడు ?
జవాబు:
నేను రావణుని బంధుమిత్ర సమేతంగా హతమార్చి నిన్ను రాజును చేస్తానని చెప్పాడు. ఆ పనిలో తాను యథాశక్తి సహాయపడగలనని విభీషణుడు మాట ఇచ్చాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ

ప్రశ్న 2.
కింది గద్యాన్ని చదువండి. (March 2018)

పరమశివుడు శ్రీరాముణ్ణి ప్రశంసించాడు. దుష్ట సంహారం చేసిన శ్రీరాముణ్ణి ప్రజానురంజకంగా పరిపాలన చేయమన్నాడు. శ్రీరాముని కోరిక మేరకు ఇంద్రుడు మృతులై పడి ఉన్న వానరులను మళ్ళీ బ్రతికించాడు. విభీషణుడు లంకలో కొంతకాలం ఉండమని శ్రీరాముణ్ణి అభ్యర్థించాడు. భరతుని కొరకు తాను త్వరగా ప్రయాణం కావలసిందేనన్నాడు శ్రీరాముడు. వానరులను వాళ్ళ స్వస్థానాలకు వెళ్ళమని చెప్పి, విభీషణుని వీడ్కోలు అందుకున్నాడు. పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరాడు. దారిలో ఆయా ప్రదేశాలన్నీ సీతకు చూపుతున్నాడు. భరద్వాజాశ్రమాన్ని సందర్శించారు. శ్రీరామాజ్ఞతో హనుమంతుడు శ్రీరాముడు వస్తున్న విషయాన్ని భరతునికి, గుహునికి ముందుగా వెళ్ళి తెలియజేశాడు. వాళ్ళెంతో ఆనందించారు.

క్రింది ప్రశ్నలకు సరైన జవాబు గుర్తించి రాయండి.
1. లంకలో కొంతకాలం ఉండమని శ్రీరాముని అభ్యర్థించినది.
అ) శివుడు
ఆ) విభీషణుడు
ఇ) గుహుడు
జవాబు:
ఆ) విభీషణుడు

2. భరద్వాజ ఆశ్రమాన్ని చూసినవారు.
అ) శ్రీరాముడు
ఆ) సీతారాములు
ఇ) సీత
జవాబు:
ఆ) సీతారాములు

3. వానరులను బతికించినది.
అ) భరద్వాజుడు
ఆ) ఇంద్రుడు.
ఇ) శ్రీరాముడు
జవాబు:
ఆ) ఇంద్రుడు

4. శ్రీరాముడు సంహరించినది.
అ) శిష్టులను
ఆ) ఇష్టులను
ఇ) దుష్టులను
జవాబు:
ఇ) దుష్టులను

5. శ్రీరాముని రాకను ముందుగా భరతునికి తెలియజేసినది.
అ) హనుమంతుడు
ఆ) గుహుడు
ఇ) విభీషణుడు
జవాబు:
అ) హనుమంతుడు

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ

ప్రశ్న 3.
కింది గద్యాన్ని చదివి, ఖాళీలు పూరించండి. (June 2017)

రావణుని బాణశక్తికి సుగ్రీవుడు మూర్చపోయాడు. శ్రీరాముడు విల్లందుకున్నాడు. అన్నను వారించి లక్ష్మణుడు రావణుణ్ణి ఎదిరించడానికి పూనుకున్నాడు. వానరసేన మీద శరవర్ష ధార కురిపిస్తున్నాడు రావణుడు. ఆంజనేయుడు రావణుడి ధాటికి అడ్డుకట్ట వేశాడు. అరచేతితో హనుమంతుని బలంగా చరచాడు రావణుడు. మారుతి చలించిపోయాడు. అయినా క్షణంలో తేరుకున్నాడు. అరచేతితో రావణుణ్ణి ఒక్క దెబ్బ వేశాడు. దశగ్రీవుడు కంపించిపోయాడు. తేరుకుని వానరా ! భళా !, నాకు శత్రువువే అయినా నీ శక్తిని మెచ్చుకుంటున్నానని యుద్ధస్ఫూర్తిని చాటాడు రావణుడు.

ప్రశ్నలు – జవాబులు :
1) రావణుడు ………………… మీద శరవర్ష ధార కురిపిస్తున్నాడు.
జవాబు:
వానరసేన మీద

2) రావణుని దెబ్బకు చలించిపోయినవాడు ……………..
జవాబు:
మారుతి (హనుమంతుడు)

3) రావణుడు …………….. దెబ్బతో చలించిపోయాడు.
జవాబు:
హనుమంతుని ఒక్క అరచేతి

4) మారుతి ………………….. చేత మెచ్చుకోబడ్డాడు.
జవాబు:
రావణుని

5) లక్ష్మణుడు రావణుణ్ణి ఎదిరించడానికి …………………. ను వారించాడు.
జవాబు:
అన్న

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ

ప్రశ్న 4.
కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

సముద్రాన్ని దాటే ఉపాయమేమిటని సుగ్రీవుణ్ణి ప్రశ్నించాడు రాముడు. సముద్రుణ్ణి ప్రార్థించడం వల్ల ఇది సాధ్యపడుతుందన్నాడు విభీషణుడు. శ్రీరాముడు సముద్రతీరంలో దర్భాసనం మీద కూర్చుని సముద్రుణ్ణి ఉపాసించాడు. మూడు రాత్రులు గడిచాయి. సముద్రుడు ఎదుట నిలవడలేదు. శ్రీరాముడి కన్నులు ఎఱ్ఱబారాయి. సముద్రుడి అహంకారాన్ని అణగద్రొక్కాలనుకున్నాడు. నీటినంతా ఇంకి పోయేటట్లు చేయాలనుకున్నాడు. బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు. ప్రకృతంతా అల్లకల్లోలమౌతున్నది. సముద్రుడు భయపడి పారిపోతున్నాడు. పరుగెత్తే వానిపై బాణం ప్రయోగించరాదని ఆగాడు శ్రీరాముడు.

ప్రశ్నలు – జవాబులు :
1. సముద్రం దాటే ఉపాయాన్ని విభీషణుడు ఏమి చెప్పాడు ?
జవాబు:
సముద్రాన్ని ప్రార్థించడం వల్ల సముద్రాన్ని దాటగలమని విభీషణుడు ఉపాయం చెప్పాడు.

2. శ్రీరాముడు సముద్రుణ్ణి ఎలా ఉపాసించాడు ?
జవాబు:
శ్రీరాముడు సముద్రతీరంలో దర్భాసనం మీద కూర్చుని సముద్రుణ్ణి ఉపాసించాడు.

3. శ్రీరాముడు సముద్రుని గర్వం అణగద్రొక్కడానికి స్మరించిన అస్త్రం ఏది ?
జవాబు:
శ్రీరాముడు సముద్రుని గర్వం అణగదొక్కడానికి స్మరించిన అస్త్రము ‘బ్రహ్మాస్త్రము’.

4. శ్రీరాముడు బ్రహ్మాస్త్రాన్ని స్మరిస్తే ఏమయింది ?
జవాబు:
శ్రీరాముడు బ్రహ్మాస్త్రాన్ని స్మరిస్తే ప్రకృతంతా అల్లకల్లోలమయ్యింది. సముద్రుడు భయపడి పారిపోయాడు.

5. పై పేరాకు తగిన శీర్షికను స్మరించండి.
జవాబు:
‘సముద్రుడిపై శ్రీరాముడి బ్రహ్మాస్త్ర ప్రయోగం’ అన్న శీర్షిక, దీనికి సరిపోతుంది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ

ప్రశ్న 5.
కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ఇంద్రుడు పంపగా మాతలి దివ్యరథంతో సహా శ్రీరాముడి దగ్గరికి వచ్చాడు. ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరించి శ్రీరాముడు రథాన్ని అధిరోహించాడు. యుద్ధభూమికి సాగించారథం. మిగతా దినాల కన్నా భిన్నంగా ఉందీనాటి యుద్ధం. కొంతసేపు ఎవరికెవరూ తీసిపోని విధంగా విజృంభించారు. రానురాను రాముడిదే పైచేయి అవుతున్నది. రావణుని సారథి గమనించాడు. రథాన్ని పక్కకు మళ్ళించాడు. అలా చేయడం అవమానంగా భావించిన రావణుడు సారథిపై నిప్పులు చెరిగాడు. రథం మళ్ళీ రాముడి ముందు నిలిచింది. యుద్ధం చూడడానికి అగస్త్యుడు దేవతలతో కూడి అక్కడకు వచ్చాడు. శ్రీరాముడికి ‘ఆదిత్య హృదయం’ ఉపదేశించాడు. శ్రీరాముడి బాణాలతాకిడికి రావణుడి తలలు నేలరాలుతున్నాయి. కాని వెంటనే చిత్రంగా మళ్ళీ మొలుస్తున్నాయి.

ప్రశ్నలు – జవాబులు :
1. మాతలి ఎవరి రథసారథి ?
జవాబు:
ఇంద్రుని రథ సారథి.

2. అగస్త్యుడు ఎవరి విజయాన్ని కోరుకున్నాడు ?
జవాబు:
అగస్త్యుడు శ్రీరాముని విజయాన్ని కోరుకున్నాడు.

3. రావణుడు పొందిన వరం ఏమిటి ?
జవాబు:
తెగిన తలలు మళ్ళీ మొలవాలని వరం పొందాడు.

4. రావణుని సారథి ఎందుకు రథాన్ని పక్కకు మళ్ళించాడు ?
జవాబు:
రాముని బాణాల నుండి రావణుని కాపాడడానికి.

5. రావణుడు నిజమైన వీరుడని ఎలా చెప్పగలవు ?
జవాబు:
యుద్ధరంగంలో పక్కకు వెళ్ళడానికి ఇష్టపడలేదు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ

ప్రశ్న 6.
కింది గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

“రావణుడు సీత విషయంలో మరొక ఎత్తుగడ వేశాడు. అశోకవనం వెళ్ళి రాముడు తన చేతిలో హతుడైనాడని, సీతతో పలికాడు. ఆమె నమ్మలేదు. మాయావియైన విద్యుజ్జిహ్వుణ్ణి పిలిచాడు. అతడు శ్రీరామునిదే అనిపించే మాయా శిరస్సును, ధనుర్బాణాలను తీసుకొని వచ్చి చూపించాడు సీతకు. ఇప్పటికైనా తన్నాశ్రయించమని సీతను కోరాడు రావణుడు. సీత కుమిలిపోయింది. రావణుడు తన భవనానికి వెళ్ళిపోయాడు. విభీషణుని భార్య ‘సరమ’ సీతను ఊరడించింది. ఇదంతా రాక్షసమాయ అని చెప్పింది. శ్రీరాముడు క్షేమమే అని తెలిపింది.

ప్రశ్నలు – జవాబులు :
1. సరమ ఎవరు? ఆమె సీతకు ఏమి చెప్పింది ?
జవాబు:
‘సరమ’ విభీషణుని భార్య. సరమ అది రాక్షసమాయ అని, రాముడు క్షేమమని సీతకు చెప్పింది.

2. రావణుడు సీత విషయంలో వేసిన ఎత్తుగడ ఏమిటి?
జవాబు:
రాముడు తన చేతిలో హతుడైనాడని, రాముని మాయా శిరస్సును, ధనుర్బాణాలను రావణుడు సీతకు చూపించాడు. ఇప్పటికైనా తన్నాశ్రయించమని కోరాడు.

3. శ్రీరాముని మాయ శిరస్సును తెచ్చి సీతకు చూపినవాడు ఎవరు?
జవాబు:
విద్యుజ్జిహ్వుడు అనే రాక్షసుడు సీతకు రాముని మాయా శిరస్సును, ధనుర్బాణాలను చూపాడు.

4. సీత ఎందుకు కుమిలిపోయింది?
జవాబు:
రాముడు నిజంగానే మరణించి ఉంటాడని నమ్మి సీత కుమిలిపోయింది.

5. ఇది ఏ కాండం లోనిది? దీనికి శీర్షికను నిర్ణయించండి.
జవాబు:
ఇది యుద్ధకాండం లోనిది. దీనికి “రావణుని ఎత్తుగడ” అనే శీర్షిక తగియుంటుంది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ

ప్రశ్న 7.
కింది గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

“ఆకాశంలోనే నిలిచి శ్రీరాముణ్ణి శరణుకోరాడు విభీషణుడు, అనుగ్రహించాడు దాశరథి. విభీషణుడు శ్రీరాముని పాదాలపై వాలాడు. రావణుని విషయాలన్నీ సంక్షిప్తంగా చెప్పాడు. శ్రీరాముడు విభీషణునితో నేను రావణుని బంధుమిత్ర సమేతంగా హతమార్చి నిన్ను రాజును చేస్తానని తమ్ముల మీద ఒట్టేసి చెప్పాడు. ఈ పనిలో తాను యథాశక్తి సహాయపడగలనని విభీషణుడు మాట ఇచ్చాడు. రాముడు విభీషణుణ్ణి ఆలింగనం చేసుకొన్నాడు. లక్ష్మణుడితో వెంటనే సముద్రజలం తెచ్చి లంకారాజుగా విభీషణుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేయమన్నాడు. శ్రీరాముడి ఆజ్ఞ వెంటనే ఆచరణ రూపం దాల్చింది. అందరూ ఆనందాన్ని ప్రకటించారు.

ప్రశ్నలు – జవాబులు :
1. దాశరథి ఎవరిని అనుగ్రహించాడు ?
జవాబు:
దాశరథి విభీషణుణ్ణి అనుగ్రహించాడు.

2. రాముడు ఒట్టేసి విభీషణునితో ఏమని చెప్పాడు ?
జవాబు:
రావణుని బంధుమిత్ర సమేతంగా చంపి విభీషణుణ్ణి రాజును చేస్తానని ఒట్టేసి చెప్పాడు.

3. విభీషణుడు రామునకు ఏమని మాట ఇచ్చాడు ?
జవాబు:
రావణుని చంపే పనిలో తాను యథాశక్తిగా సాయం చేస్తానని విభీషణుడు రామునకు మాట ఇచ్చాడు.

4. విభీషణుని లంకారాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేసింది ఎవరు ?
జవాబు:
విభీషణుని లంకారాజుగా పట్టాభిషక్తుణ్ణి చేసింది లక్ష్మణుడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ

5. ఈ పేరాకు శీర్షికను నిర్ణయించండి. ఇది ఏ కాండం లోనిది ?
జవాబు:
‘విభీషణుని శరణాగతి’ అన్నది శీర్షిక. ఇది యుద్ధకాండం లోనిది.

TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds

Telangana SCERT TS 10th Class Physical Science Study Material Pdf 12th Lesson Carbon and its Compounds Textbook Questions and Answers.

TS 10th Class Physical Science 12th Lesson Carbon and its Compounds

Improve Your Learning
I. Reflections on concepts

Question 1.
What are the general molecular formulae of alkanes, alkenes and alkynes?
Answer:
Alkanes – CnH2n+2
Alkenes – CnH2n
Alkynes – CnH2n-2

Question 2.
Name the product other than water formed on burning of ethanal in air.
Answer:
C2H5OH + 3O2 → CO2 + 3H2O + Energy
Carbon dioxide is another product.

Question 3.
Name the simplest ketone and write Its molecular formula.
Answer:
The simplest ketone is Acetone (Propanone) Its molecular formula is CH3COCH3 (or) C3H6O

Question 4.
Name the compound formed by heating ethanol at 443k wIth excess of conc. H2SO4.
Answer:
Ethanol reacts with conc. H2SO4 at about 443K to give ethene, The reaction is as follows
TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds 1
It Is a dehydration reaction. H2SO4 in a dehydrating agent and removes H2O.

Question 5.
Name the product obtained when ethanol is oxidized by either chronic anhydride or alkaline potassium permanganate.
Answer:
Ethyl alcohol (Ethanol) undergoes oxidation to form the product acetaldehyde and finally acetic acid. The reaction Is as follows :
TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds 2

Question 6.
What are homologous series of carbon compounds? Mention any two characteristics of homologous series.
Answer:
Compounds having same functional group are called homologous series. Eq: Alkanes, Alkenes, Alkynes, Halo Alkanes.

Characteristics of homologous series

  1. They have general formula
    Eq: General formula of alkanes CnH2n+2
    General formula of alkynes: CnH2n-2 etc.
  2. Successive compounds in the series possess a difference of (-CH2) unit.
  3. They possess similar chemical properties due to same functional group.
  4. They show a regular gradation In their physical properties.

TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds

Question 7.
Why does carbon form compounds mainly by covalent bonding’?
Answer:

  1. Carbon belongs to 14th group or IV A group in the modem periodic table.
  2. The electronic configuration of carbon is 1s22S22p2. ‘To get octet configuration in its outer shell It has to gain four more electrons to form C4-. Its nucleus has only 6 protons. Therefore it would be difficult for a nucleus with 6 protons to hold 10 electrons. Hence, carbon cannot form C4- ions so easily.
  3. If carbon loses 4 electrons from the outer shell, it has to form C4+’ ions. This require huge amount of energy which is not available normally, Therefore C4+ formation also is remote possibility.
  4. Carbon has to satisfy its tetravalency by sharing electrons with other atoms. It has to form ‘4 covalent bonds either with Its own atoms or atoms of other elements.

Question 8.
Explain how sodium ethoxide is obtained from ethanol. Give chemical equations.
Answer:
Ethanol reacts with sodium to liberate hydrogen and forms sodium ethoxide. The chemical equation is
TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds 3

Question 9.
Explain the cleansing action of soap.
Answer:
1. Soaps and detergents make oil and dirt present on the cloth come out into water, thereby making the cloth clean.
2. Soap has one polar end TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds 4 and one non-polar end (the end with the hydrocarbon chain) as shown here,
3. The polar end Is hydrophilic in nature and this end is attracted towards water.
4. The non-polar end is hydrophobic, in nature and it is attracted towards grease or oil on the cloth, but not attracted towards water.
5. When soap is dissolved in water, its hydrophobic ends attach themselves to dirt and remove It from cloth, as shown sequentially in the figure.
6. The hydrophobic end of the soap molecules move towards the dirt or grease particle.
7. The hydrophobic ends attached to the dirt particle and try to pull it out.
8. The molecule of soap surround the dirt particles at the centre of the cluster and form a spherical structure called micelle.
9. These micelles remain suspended in water-like particles in a colloidal solution.
TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds 5
10. The various miscelles present in water do not come together to form a precipitate as each micelle repels the other because of the ion-ion repulsion.
11. Thus, the dirt particles remain; trapped in micelles and are easily rinsed away with water. Hence, soap micelles remove dirt by dissolving in water.

Question 10.
Distinguish between esterification and saponification reactions of organic compounds.
Answer:

EsterificationSaponification
1) The formation of ester is known as esterification reaction.1) The formation of soap is known as saponification reaction.
2) Alcohol reacts with carboxylic acids to produce esters.2) Higher fatty acids reacts with bases to form soaps.
3) Water is the by-product in esterification reaction.
Eg: Ethyl Acetate (CH3COOC2H5)
3) Glycerol is the by-product in saponification reaction
Eg: Sodium stearate. (C17H35COONa)

 

Question 11.
What happens when a small piece of sodium Is dropped Into ethanol?
Answer:
When a small piece of sodium is dropped into ethanol, it shows brisk effervescence and liberates hydrogen gas and forms sodium ethoxide.
TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds 6

Question 12.
Draw the electronic dot structure of ethane molecule (C2H6)
Answer:
TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds 7

Question 13.
Name the simplest hydrocarbon?
Answer:
Methane (CH4) is the simplest hydrocarbon.

Question 14.
Name the carboxylic acid used as a preservative.
Answer:
Acetic acid – CH3COOH (IUPAC Name Ethanoic Acid)

TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds

Question 15.
A mixture of oxygen and ethyne Is burnt for welding; can you tell why a mixture of ethyne and air Is not used?
Answer:

  1. Air consists many gases like N2, CO2, etc., ¡n addition to oxygen.
  2. Production of flame for welding is a combustion reaction, which is generally oxidation reaction.
  3. If air is used it leaves a soot flame. Hence, air is not mixed with ethyne. Only oxygen is mixed with ethyne and used for welding.

Question 16.
What do we call the self linkIng property of carbon?
Answer:
The self-linking property of carbon is called catenation. If any element forms bonds. between its own atoms to give big molecules, we call that property as catenation property

Question 17.
Give an example for esterification reaction.
Answer:
The reaction between carboxylic acid and an alcohol in the presence of Conc.H2SO4 to form a fruity-odoured substance, ester with the functional
TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds 8
Eg Preparation of ethyl acetate from ethanoic acid and ethanol will be as follows:
TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds 9

Question 18.
Write the chemical equation representing the reaction of preparation of ethanol from ethane.
Answer:

  1. Ethane in the absence of air on heating forms ethanol TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds 10
  2. Ethanol is prepared on large scale from ethene by addition of water vapour to it in the presence of catalysts like P2O5, Tungsten oxide at high pressure a temperature.
    TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds 11

Question 19.
Give the names of functional groups (i) -CHO (ii) -C=O.
Answer:
(i) -CHO aldehyde functional group.
(ii) -C=O Ketone functional group.

Question 20.
Explain the structure of graphite In term of bonding and give one property based on this structure.
Answer:
1. Graphite forms a two-dimensional layer structure with C – C bonds within the layers. There are relatively weak interactions between the layers.
2. In a layer structure, the carbon atoms are in a trigonal planar environment. This is consistent with each carbon atom in sp2 hybridization.
3. Interactions between sp2 orbitals leads to the formation of C – C bonds.
4. Each carbon atom is with one unhybridised ‘p’ orbital.
TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds 12
The arrangement of carbon atoms In graphite layers.
5. The unhybridised ‘p’ orbitals interact to form a ‘π’ system that is delocalised over the whole layer.
6. The interactions (or) London dispersion forces between the layers which are separated by a distance of 3.35 Å are weakened by the presence of water. molecules so that It is easy to cleave graphite.
7. For this reason graphite is used as lubricant and as the ‘lead’ in pencils.

Question 21.
Name the acid present in vinegar.
Answer:

  1. The acid present in vinegar is Ethanoic acid or acetic acid (CH3COOH).
  2. 5-8% solution of acetic acid in water Is called vinegar.

Question 22.
How do you appreciate the role of esters In everyday lite?
Answer:
Role of esters in everyday life:

  1. Many esters have pleasant odours, so they are used In perfumes, air refreshers and flavourings, among other things.
  2. Esters are used to give artificial flavouring for sweets, ice creams and soft drinks. In industries, esters are being used as solvents In the manufacture of, cellulose; varnishes and paints, as solvents in pharmaceutical industries and as softeners or plasticizers in plastic and moulding Industries.

Application Of Concepts

Question 1.
Explain with the help of a chemical equation, how an addition reaction is used In vegetable ghee industry.
Answer:
The reaction in which a reagent adds completely on a substance without the removal of small molecules are called addition reaction. Addition of hydrogen in the presence of nickel catalyst to vegetable oil gives ghee. Vegetable oil is unsaturated compound where as ghee is a saturated compound.
TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds 13

Question 2.
a. What are the various possible structural formulae of a compound having molecular formula C3H6O?
b. Give the IUPAC names of the above possible compounds and write their structures.
c. What is the similarity in these compounds?
Answer:
(a) C3H6O
CH3CH2CHO – Ethanal
CH3COCH3 – Propanone
TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds 14
(c) (i) Both ethanol and propanone contain one carbonyl functional group
TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds 15
(ii) Both compounds have same molecular formula,
(iii) Both compounds have the 2sp3 hybridised carbons and one ‘sp2’ hybridised carbon atom.

Question 3.
Allotropy is a property shown by which class of substances: elements, compounds or mixtures? Explain allotropy with suitable examples.
Answer:
Allotropy can be shown by elements.
Allotropy: The property of an element to exist in two or more physical forms having more or less chemical properties but different physical properties is called ‘allotropy’.

Carbon has many allotropes. They are classified into two types.
1) Amorphous forms
2) Crystalline forms

  1. Amorphous forms: Different amorphous forms of carbon are coal, coke, wood charcoal, animal charcoal, lamp black, etc.
  2. Crystallise forms: Different crystalline forms of carbon are diamond, graphite, buckminsterfullerene, nanotubes etc.

Question 4.
Two carbon compounds A and B have molecular formulae C3H8 and C3H6 respectively. Which one of the two is most likely to undergo addition reactions? Justify your answer.
Answer:
TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds 16
It is a saturated hydrocarbon. It shows substitution reaction.
TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds 17
This is an unsaturated hydrocarbon. Hence it shows addition to become saturated. During the reactions, addition of reagent takes place at the double-bonded carbon atoms.
TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds 18

TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds

Question 5.
1 ml of glacial acetic acid and 1 ml of ethanol are mixed together in a test tube. Few drops of concentrated sulphuric acid is added to the mixture and warmed ¡n a water bath for 5 min. Answer the following:
(a) Name the resultant compound formed.
(b) Represent the above change by a chemical equation?
(c) What name is given to such a reaction?
(d) What are the special characteristics of the compound formed?
Answer:
(a) Ethyl acetate (CH3COOC2H5) an ester.
TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds 19
(c) Esterification reaction
(d) The formed compound when poured into water, we observe a sweet fruit odour.

Question 6.
Give the IUPAC name of the following compounds. If more than one compound is possible name at least two of them.
(i) An aldehyde derived from ethane.
(ii) A ketone derived from butane.
(iii) A chloride derived from propane.
(iv) An alcohol derived from pentane.
Answer:
(i) An aldehyde derived from ethane is “Ethanal” (CH3CHO) (or) TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds 20
(ii) Ketone derived from butane s Butanone (Or) Butane-2- one.
TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds 21
(iii) Chloride derived from propane is
(a) Propyl chloride
CH3 – CH2 – CH2Cl

(b) 2 – Chloro – Propane
TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds 22
(iv) Alcohol derived from pentane
TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds 23

Question 7.
Write the IUPAC name of the next homologous of CH2OHCH2CH3.
Answer:
TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds 24

Question 8.
How do you condemn the use of alcohol as a social practice?
Answer:

  1. Consumption of alcohol ¡n the form of beverages is harmful to health.
  2. It causes severe damage to blood circulation system.
  3. Addiction to alcohol drinking leads to heart diseases and damages the liver.
  4. It also causes ulcers in small intestines due to increased acidity and damages the digestive system.
  5. Alcohol which is consumed in raw form under the names liquor, gudumba is more harmful to health due to adulteration.
  6. Alcohol mixed with pyridine is called denatured spirit. Consumption of denatured spirit causes blindness and death.
  7. Hence use of alcohol is a social evil which harms the society.

Question 9.
An organic compound with molecular formula C2H4O2 produces brisk effervescence on addition of sodium carbonate/bicarbonate.
Answer the following:
(a) Identify the organic compound.
(b) Write the chemical equation for the above reaction.
(C) Name the gas evolved.
(d) How will you test the gas evolved?
(e) List two important uses of the above compound.
Answer:
a) CH3COOH (EtharioiC acid)
b) 2CH3COOH + Na2CO3 → 2CH3COONa + H2 + CO2
CH3COOH + NaHCO3 → CH3COONa + CO2 + H2O
C) Carbon dioxide (CO2)
d) When the evolved gas is passed into lime water, lime water turns milky white. Basing on the observation we conclude that the evolved gas is carbon dioxide.
e) Ethanoic acid Es used in
a) for preservation of pickles
b) for preparation of dyes, drugs
C) for solvent in industry
d) for curing meat, fish.

Multiple choice questions

Question 1.
Which of the following solution of acetic acid in water can be used as preservative? [ ]
(a) 5-10%
(b) 10-15%
(c) 15-20%
(d) 100%
Answer:
(a) 5-10%

Question 2.
The suffix used for naming an aldehyde is [ ]
(a) -0l
(b) -al
(c) -one
(d) -ene
Answer:
(b) -al

Question 3.
Acetic acid, when dissolved in water, it dissociates into ions reversibly because it is a:[ ]
(a) Weak acid
(b) strong acid
(c) weak base
(d) strong base
Answer:
(a) Weak acid

TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds

Question 4.
Which one of the following hydrocarbons can show isomerism? [ ]
(a) C2H4
(b) C2H6
(c) C3H8
(d) C4H10
Answer:
(d) C4H10

Question 5.
Combustion of hydrocarbon is generally accompanied by the evolution of [ ]
(a) Heat
(b) Light
(c) both heat and light
(d) Electric current.
Answer:
(c) both heat and light

Question 6.
2m1 of ethanoic acid was taken in each of the three test tubes A, B and C’ and 2m1. 4ml and 8 ml of water was added to them, respectively. A clear solution is obtained in: [ ]
(a) Test tube A only
(b) Test tubes A & B only.
(c) Test tubes B and C only
(d) All the test tubes.
Answer:
(d) All the test tubes.

Question 7.
If 2 ml of acetic acid was added slowly in drops to 5m1 of water then we will notice [ ]
(a) The acid forms a separate layer on the top of water.
(b) Water forms a separate layer on the top of the acid.
(c) Formation of a clear and homogenous solution.
(d) Formation of a pink and clear solution.
Answer:
(c) Formation of a clear and homogenous solution.

Question 8.
A few drops of ethanoic acid were added to solid sodium carbonate. The possible results of the reactions are: [ ]
(a) A hissing sound was evolved
(b) Brown fumes evolved.
(c) Brisk effervescence occurred.
(d) A pungent-smelling gas evolved.
Answer:
(c) Brisk effervescence occurred.

Question 9.
When acetic acid reacts with ethyl alcohol, we add cone. H2SO4, which acts as and the process is called [ ]
(a) Oxidizing agent, saponification
(b) Dehydrating agent, estenfication
(c) Reducing agent, Esterification
(d) Acid & esterification
Answer:
(b) Dehydrating agent, estenfication

Suggested Experiments

Question 1.
Suggest a test to find the hardness of water and explain the procedure.
Answer:
Hardness of water can be tested with the help of a good quality soap.
Procedure

  1. Take 50ml of water from different sources i.e., tap water, well water, lake water, pond water, river water, etc., in different test tubes and lable them as A, B, C, D etc.
  2. Add 1gm of good-quality soap to each test tube.
  3. Close each test tube with rubber corks.
  4. Shake test tube A for 15 seconds and keep it undisturbed for 30 seconds. Measure the height of the foam formed. Note the height of foam in your notebook.
  5. Repeat the process for each test tube and record your observation in your notebook.
  6. The water which gives less foam is considered as hard water.

Question 2.
Suggest a chemical test to distinguish between ethanol and ethanoic acid and explain the procedure.
Answer:

  1. Take ethanol and ethanoic acid in two different test tubes.
  2. Add nearly 1gm of sodium bicarbonate (NaHCO3) to each test tube.
  3. Lots and lots of bubbles and foam will be observed from the test tube containing ethanoic acid. This is due to release of CO2.
    NaHCO3 + CH3COOH → CH3COONa + H2O + CO2
  4. Ethanol will not react with sodium bicarbonate and thus we won’t observe any change in the test tube containing ethanol. Thus we can seperate ethanol from ethanoic acid.

Question 3.
An organic compound ‘X’ with a molecular formula C2H6O undergoes oxidation with alkaline KMnO4 and forms the compound ‘Y’, that has molecular formula C2H4O2.
(a) Identify “X”and “Y”.
Answer:
X : C2H6O is Ethanol
Y: C2H4O2 is Ethanoic acid
Ethyl alcohol undergoes oxidation to form the product Acetaldehyde and finally Acetic acid.
TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds 25
This CH3COOH is used as preservative for pickles.

(b) Write your observation regarding the product when compound ‘X’is made to react with compound “Y” which ¡s used as a preservative for pickles.
Answer:
When x (ethanol) is reacted with y (ethanoic acid) in the presence of concentrated H2S04 to form fruity odour substance called ester (ethyl acetate)
TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds 26
Here CH3COOH is used as preservative for pickles.

TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds

Suggested Projects

Question 1.
Prepare models of methane, ethane, ethene and ethyne molecules using clay balls and match sticks.
Answer:
TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds 27
in these models Black Ball is Carbon atom White Ball is Hydrogen atom.

Question 2.
Collect information about artificial ripening of fruits by ethylene.
Answer:
Chemistry of ripening:

  1. During ripening, the starch in the fruit breaks down to form sugar. The fruit skin changes its colour.
  2. The ripening of fruit depends on the season. The plant can detect the changes in season. They produce ethylene (C2H4) which spreads across the plant.
  3. When ethylene reaches the fruits, it sends a signal to ail the cells in the fruit to make enzymes which break starch into sugar.
  4. The cells in the skin start making pigments, which give the fruit its colour.

Artificial ripening:

  1. Raw fruits are kept in hay-lined wooden boxes called crates. These crates are stacked on shelves and a wood fire s lit below them. The smoke contains ethylene and acetylene gases, which induce ripening.
  2. Fruits are placed in a room into which ethylene gas or acetylene gas is introduced.
  3. In another method calcium carbide (CaC2) is applied over fruits. It reacts with moisture to form acetylene, which induces ripening.

TS 10th Class Physical Science Carbon and its Compounds Intext Questions

Page 253

Question 1.
Can carbon get helium configuration by losing four electrons from the outer shell?
Answer:
No. if carbon loses four electrons from the outer shell, it has to form C+4 ions. This requires huge amount of energy which is not available normally.

Page 254

Question 2.
How do carbon atoms form bonds in so many ways
Answer:
Electronic configuration of carbon (ground state) is 1S2 2S2 2P2 (or) 1S2 2S2 2Px1 2Py1 2Pz1
TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds 28
Electronic configuration of carbon (excited state):
TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds 29
In excited state of carbon atom one ‘2s’ electron Is promoted to ‘2Pz’ orbital. Each carbon In excited state has four unpaired electrons and forms four covalent bonds as shown below.
TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds 30

Question 3.
Explain the four unpaired electrons in carbon atom through excited state
Answer:
Electronic configuration of carbon (ground state)
TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds 31
Electronic configuration of carbon (excited state)
TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds 32
So, in 2s,2p orbitals there are four unpaired electrons In each of 2s, 2px, 2py, and 2pz orbitals.

Page 255

Question 4.
Where this energy to excited electron comes from?
Answer:
The energy required for excitation is taken up from bond energies, which are liberated energies and four bonds are formed between carbon atoms and other atoms.

Question 5.
In methane (CH4) molecule, all four carbon-hydrogen bonds are identical and bond angle TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds 33 is 109° 28’. How can we explain this?
Answer:
In methane (CH4), in excited state, carbon atom has three unpaired electrons in p-orbitals, and one electron in s-orbital. So all four C-4 bonds are identical.

Question 6.
How these energetically unequal valence electrons form four equivalent covalent bonds in methane molecules?
Answer:

  • The energy difference between the 2s and 2p orbitals is very small.
  • When carbon atom is ready to form bonds it gets a small amount of energy from bond energies and gets excited and is promoted from the ‘2s’ to the empty 2pz to give four unpaired electrons.
  • These four unpaired electrons form four equivalent covalent bonds in methane.

Page 259

Question 7.
What are bond angles of TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds 34 in CH4, C2H4 and CH3 molecules?
Answer:
The bond angles:
In CH4 is 109°28′
In C2 H4 is 120°
In C2H2 Is l80°

Page 261

Question 8.
How do you understand the marking (writings) of a pencil on a paper?
Answer:
When we write with a pencil, the interlayer attractions break down and leave graphite layers on the paper. These pencil marks are easy to remove from paper with an eraser because the layers do not bind strongly to the paper.

TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds

Page 264

Question 9.
AllottIng completely one special branch in chemistry to compounds of only one element. Is It justified when there are so many elements and their compounds but not with any special branches?
Answer:

  1. We know that all molecules that make life possible, namely, carbohydrates, proteins, nucleic acids, lipids, harmones and vitamins contain carbon.
  2. The chemical reactions that take place in living systems are of carbon corn pounds.
  3. Food that we eat, various medicines we use cotton and silk fibres, synthetic fibres, plastics, synthetic rubber are also compounds of carbon.
  4. So, Carbon Is a unique element with the largest number of compounds.
  5. So allotting completely one special branch in chemistry to carbon is justified.

Page 265

Question 10.
What are hydrocarbons?
Answer:
The compounds containing only carbon and hydrogen in their molecules are called ‘Hydrocarbons’.

Question 11.
Do all the organic compounds have equal number of ‘C’ and ‘H’ atoms?
Answer:
No. Different organic compounds have different number of ‘C’ and ‘H’ atoms.

Page 266

Question 12.
Can carbon form bonds with the atoms of other elements?
Answer:
It Is observed that carbon atoms form compounds not only with hydrogen atoms but also with atoms of other elements like oxygen, sulphur, nitrogen, phosphorus, halogens etc. These atoms are called heteroatoms and the compounds are formed with particular functional groups.

Page 269

Question 13.
How about their structures? Are they same?
Answer:
The structures are not the same. They are different.

Question 14.
How many carbon and hydrogen atoms are there In (a) and (b) structures?
Answer:
In structure (a) there are 4 carbon atoms and 10 hydrogen atoms.
In structure (b) also there are 4 carbon atoms and 10 hydrogen atoms.

Question 15.
Write the condensed molecular formulae for (a) and (b). Do they have same molecular formulae?
Answer:
The condensed molecular formula for (a) is C4H10.
The condensed molecular formula for (b) is C4H10.
Both (a) and (b) have the same condensed molecular formula. (Isomers)

Page 280

Question 16.
Why do sometimes cooking vessels get blackened on a gas or kerosene stove?
Answer:
Because of Inlets of air getting closed, the fuel gases do not completely undergo combustion. Hence, it forms a sooty carbon form (black in colour) which gets coated over the vessels.

Page 283

Question 17.
Do you know how the police detect whether suspected drivers have consumed alcohol or not?
Answer:

  1. The police officer asks the suspected driver to blow air into a plastic bag through a mouthpiece of the detecting instrument which contains orange-coloured crystals of potassium dichromate (K2Cr2O7).
  2. As K2Cr2O7 is a good oxidising agent ethanol which is in the driver’s breath changes to ethanoic add. The orange colour changes to green and the police can detect that the driver has consumed alcohol.

Page 284

Question 18.
What are esters?
Answer:

  1. The reaction between carboxylic acid and an alcohol ‘n the presence of conc H2SO4 produces a sweet-smelling substance called ester.
  2. An ester contains the functional group: – C – COOR

Question 19.
What do you notice?
Answer:
We notice that the resulting mixture is a sweet-smelling substance and is known as ethyl acetate, an ester.

Page 285

Question 20.
Do you know what ‘soap’ is?
Answer:
Soap is a sodium or potassium salt of a higher fatty acid like palmitic acid (C15H31COOH), stearic acid (C17H35COOH) Oleic acid (C17H33COOH) etc.
The formula of soap is RCOONa (or) RCOOK
R = C15H31; C17,H35 etc.

Page 286

Question 21.
What isatrue solution?
Answer:
A true solution is that in which the solute particles dispersed In the solvent are less than mm (10-9m) in diameter.

Question 22.
Can you see the oil and water layers separately in both the test tubes.
Answer:
(a) Immediately after: You stop shaking them?
Answer:
No,
(b) Leave the test tubes undisturbed for sometime and observe. Does the oil layer separate out?
Answer:
Yes. After allowing test tubes to settle for some time. the oil layer floats on water layer.
(c) in which test tube does this happen first? Give your observations?
Answer:
The oil layer and water layer separate first in test tube B, with soap water.

Page 287

Question 23.
What is the action of soap particles on the greasy cloth?
Answer:
The soap particles make oil and dirt present on the cloth come out into water, thereby making the cloth clean.

Think And Discuss

Question 1.
Why we are advised not to use animal fats for cooking?
Answer:
Fats are generally solids at room temperature. Animal fats have saturated carbon chains. Hence they require large quantities of heat to break those chains. In this process a lot of fuel is consumed. So, we are advised not to use animal fats for cooking.

Question 2.
Which oil is recommended for cooking? Why?
Answer:
Generally, vegetable oils having long unsaturated carbon chains are recommended for cooking.
Reasons:

  1. They do not require large quantities of heat to break the carbon chains.
  2. So we can save cooking fuel.
  3. Secondly, it does not take long time to cook food which prevents over cooking which is harmful to health.

TS 10th Class Physical Science Carbon and its Compounds Activities

Activity 1

Question 1.
Observe the names of the following compounds. Give reasons in the space provided. (ASS) (4 Marks)
Answer:
COOH > (CH3CO)2O> – COOR > -COX> -CONH2 > -CN > – CHO > C=O > R-OH> -NH
Acid anhydride ester acid halide amide nitrite aldehyde ketones alcohols amines
Divide the given names as per the notations given and identify the parts In the name through the numbers given from (1) to (11) and write them in your notebook.
TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds 35

TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds

Activity 2

Question 1.
Write an activity to show esterification.
Answer:

  1. Take imI of ethanol and imI of glacial acetic acid along with a few drops of concentrated sulphuric acid in a test tube.
  2. Warm it In a water bath or a beaker containing water for at least 5 minutes as shown In fig.
  3. Pour the warm contents into a beaker containing 20-50 ml of water and observe the odour of the resulting mixture.

Observation: The resulting mixture Is a sweet odoured substance. This substance is ester. This reaction is esterification.
TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds 38

Activity 3

Question 1.
How do you test the cleansing action of soap?
Answer:
1. Take about 10 ml of water in two test tubes.
2. Add a drop of cooking oil to both the test tubes and label them as A and B.
3. Add a few drops of soap solution to test tube B.
4. Now shake both the test tubes vigorously for the same period of time.
5. We cannot observe that the oil and water layers separately in both the test tubes immediately after shaking Is stopped.
TS 10th Class Physical Science Solutions Chapter 12 Carbon and its Compounds 39
6. Leave the test tubes undisturbed for some time and observe.
7. We observe the separation of oil layer in test tube B first because it contains the soap solution.
8. This gives an idea of cleansing action of soap.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం సుందరకాండ

Telangana SCERT 10th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం రామాయణం సుందరకాండ Questions and Answers.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం సుందరకాండ

సుందర కాండం

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం సుందరకాండ 1
హనుమంతుడు దేవతలకు నమస్కరించి, శరీరాన్ని పెంచి, పాదాలను దట్టించి ఒక్క ఉదుటున ఆకాశంలోకి ఎగిరాడు. సముద్రం కోరికపై, లోన ఉన్న మైనాక పర్వతం పైకి లేచి తనపై విశ్రాంతి తీసుకోమన్నది. ఆగడానికి సమయం లేదని హనుమంతుడు ముందుకు సాగిపోయాడు. సురస అనే నాగమాత హనుమంతుడిని ఆశీర్వదించింది. అడ్డువచ్చిన సింహికను హనుమంతుడు చీల్చివేశాడు. ఏ మాత్రం అలసట లేకుండా హనుమంతుడు లంకకు చేరాడు.

రాత్రిపూటలో శరీరాన్ని కుదించుకొని లంకలో ప్రవేశించగా లంకిణి అతణ్ణి చూచింది. హనుమంతుడిని బలంగా కొట్టింది. హనుమంతుని దెబ్బకు లంకిణి కూలబడిపోయింది. బ్రహ్మ చెప్పిన ప్రకారం లంకకు కీడుమూడిందని లంకిణి పలికింది. హనుమంతుడు ప్రాకారం పై నుంచి దూకి మొదట ఎడమ పాదం మోపాడు. అక్కడ లంకా వైభవాన్ని దర్శించాడు. అన్ని భవనాలూ వెదికాడు. ఎక్కడా సీతజాడ లేదు. రావణుని అంతఃపురంలో మండోదరిని చూశాడు. మొదట సీత అని భ్రాంతి పడినా, తరువాత కాదని తెలుసుకున్నాడు. నిరుత్సాహపడకుండా వెతికాడు. ఎక్కడా సీత కనిపించకపోయేసరికి ప్రాయోపవేశంతో ప్రాణాలు వీడాలనుకున్నాడు. కానీ బ్రతికివుంటేనే ఎప్పటికైనా దేన్నైనా సాధించవచ్చునని నిశ్చయించుకున్నాడు.

అశోకవనంలో ప్రవేశించాడు. శింశుపావృక్షంపైకి ఎక్కాడు. అక్కడ మలిన వస్త్రాలు ధరించి రాక్షస స్త్రీల కాపలాలో ఉన్న సీతను చూచాడు. తెల్లవారగానే రావణుడు అశోకవనానికి వచ్చాడు. సీతను నయానా భయానా మనసు మార్చే ప్రయత్నం చేశాడు. సీత అతడి ప్రలోభాలకు లొంగలేదు. రావణుడు రెండు నెలలు గడువిచ్చాడు. రాక్షస స్త్రీలు సీతను చంపుతామని బెదిరించారు. విభీషణుని కూతురైన త్రిజట తనకు వచ్చిన కలను గూర్చి చెప్పింది.

హంసల పల్లకిలో రామలక్ష్మణులు కూర్చున్నారని, సముద్రం మధ్య తెల్లని పర్వతంపై సీత కూర్చున్నదని, రావణుడు నేలపై పడివున్నాడని ఆమె తన కలలో కనబడిన దృశ్యాలను చెప్పింది. సీతకు శుభశకునాలు తోచాయి. చెట్టుపై ఉన్న హనుమంతుడు రామకథను వర్ణించాడు. సీత అతడిని చూచి ఆశ్చర్యపడింది. హనుమంతుడు చెట్టు దిగివచ్చి తాను శ్రీరామ దూతను అన్నాడు. సీత ఇది రావణుని మాయ అని అనుమానించింది.

హనుమంతుడు ఆమె కోరికపై రాముని స్వరూపాన్ని వర్ణించి శ్రీరామ ముద్రికను సమర్పించాడు. సీత తనను రాక్షస చెర నుండి తప్పించమని రామునికి చెప్పమన్నది. హనుమంతుడు ఆమెను తన వీపుపై మోసుకెళ్లడానికి సిద్ధపడ్డాడు. పరపురుషుని తాకదు కాబట్టి సీత యిందుకు నిరాకరించింది. హనుమంతుడు ఆనవాలును అడగగా దివ్య చూడామణిని సీత అతడికి ఇచ్చింది. హనుమంతుడు అశోకవనాన్ని నాశనం చేశాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం సుందరకాండ

రావణుడు పంపిన రాక్షసులను కూడా మట్టుపెట్టాడు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో హనుమంతుణ్ణి బంధించాడు. తాను రామదూతనని రావణునికి హనుమంతుడు చెప్పాడు. విభీషణుడు దూతను చంపడం భావ్యం కాదనగా, రావణుడు అతడి. తోకకు నిప్పు అంటించమన్నాడు. హనుమంతుడు లంకను తగలబెట్టి, తన తోకను సముద్రంలో చల్లార్చుకున్నాడు. సీతకు నమస్కరించి, తిరుగు ప్రయాణం ప్రారంభించాడు.

విజయోత్సాహంతో మహేంద్రగిరి శిఖరం చేరాడు. సీతమ్మను కనుగొంటినని ప్రకటించాడు. రావణుని చంపి సీతను తీసుకొని వద్దామని అంగదుడు అనగా, రాముడు ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి మనం ఆ పని చేయగూడదని జాంబవంతుడు పలికాడు. మధువనంలో తేనెతాగి అందరూ ఆనందించారు. హనుమంతుడు శ్రీరామునికి నమస్కరించి ‘కనుగొంటి సీతమ్మను” అన్నాడు. సీత ఇచ్చిన చూడామణిని రామునికి సమర్పించాడు. తన అన్వేషణ వృత్తాంతాన్ని వివరించాడు.

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆత్మహత్య కన్నా బతికుండడమే ఎన్నో విధాల ఉత్తమమని, బాధల్లో నిరుత్సాహపడకూడదని నిరూపించి హనుమంతుడు ఎలా ఆదర్శప్రాయు
జవాబు:
లంకలోని రావణుని అంతఃపురంలోకి వెళ్ళి ఎంత వెదికినా హనుమంతునికి సీత జాడ తెలియలేదు. ఎక్కడా సీత జాడ తెలియకపోయేసరికి సీత మరణించిందేమోనని సందేహించాడు. సీత జాడను కనిపెట్టలేకపోయిన తాను ఏ ముఖం పెట్టుకొని తిరిగి వెళ్ళాలని బాధపడ్డాడు. సీత కనబడలేదని చెపితే శ్రీరాముడు జీవించడు. అతను లేక లక్ష్మణుడుండడు. వీరి మరణవార్త విని భరత శత్రుఘ్నులుండరు. పుత్రుల మరణానికి తట్టుకోలేక కౌసల్య, సుమిత్ర, కైకేయీ తనువులు చాలిస్తారు.

ప్రియ మిత్రుణ్ణి వీడి సుగ్రీవుడు బ్రతకడు. దానితో రుమ, తార, అంగదులు మిగలరు. ఇది చూసి వానరజాతి ఈ లోకాన్ని వీడుతుంది. కాని తర్కించి చూస్తే ఆత్మహత్యకన్నా బతికుండడమే ఎన్నో విధాల ఉత్తమమనిపించింది. చచ్చి సాధించేదేమిటి ? బతికితే సుఖాలను, శుభాలను పొందవచ్చు. బతికి ఉన్న వాళ్ళు ఎన్నడైనా కలుసుకోవచ్చు. అందుకే ప్రాణాలను నిలుపుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ఈ రకంగా సీత జాడ మొదట కనిపెట్టలేక నిరుత్సాహపడినా, ధైర్యం తెచ్చుకున్నాడు. ఆత్మహత్య వల్ల ప్రయోజనం లేదని నిరూపించి, నేటికీ మనకు ఆదర్శప్రాయునిగా నిలిచాడు హనుమంతుడు.

ప్రశ్న 2.
లంకా దహన వృత్తాంతాన్ని తెలపండి.
జవాబు:
హనుమంతుడు లంకలో సీతను దర్శించి రాముని ఉంగరమిచ్చి ఆమె చూడామణిని ఆనవాలుగా గ్రహించాడు. రావణుని బలం ఎంతో తెలుసుకుందా మనుకున్నాడు. అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. రాక్షస స్త్రీలు రావణునికి ఈ విషయం చెప్పారు. రావణుడు పంపిన ఎనభైవేల మంది రాక్షసులను మట్టుపెట్టాడు. జంబుమాలిని, ఏడుగురు మంత్రి కుమారులను, ఐదుగురు సేనాపతులను, అక్షకుమారుని చంపాడు.

చివరికి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో హనుమంతుని బంధించి రావణుని ముందుంచాడు. అక్కడ హనుమంతుడు రాముని పరాక్రమం వెల్లడించాడు. రావణుడు కోపంతో హనుమంతుని తోకకు నిప్పంటించమన్నాడు. హనుమంతుడు మండుతున్న తోకతో లంక అంతా నిప్పు ముట్టించాడు. లంకలో హహాకారాలు చెలరేగినాయి. సముద్రంలో తోకను చల్లార్చుకొని ఆకాశానికెగిరి తిరుగు ప్రయాణమైనాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం సుందరకాండ

ప్రశ్న 3.
హనుమ సముద్రలంఘనం చేసిన విధానం వివరించండి.
జవాబు:
మహాబలవంతుడైన హనుమ, సముద్రం దాటడానికి ముందు దేవతలు అందరికీ నమస్కరించాడు. తన శరీరాన్ని పెంచాడు. పెద్దగా గర్జించాడు. చేతులు నడుముపై పెట్టాడు. అంగదాది వీరులతో తాను రామబాణంలా లంకకు వెడతానన్నాడు.

సముద్రంపై నుండి వెడుతున్న హనుమంతుడికి సాయం చేద్దామని సముద్రుడు అనుకున్నాడు. రామకార్యం మీద వెడుతున్న హనుమకు శ్రమ కలుగకూడదని, సముద్రంలోని మైనాకుణ్ణి సముద్రుడు బయటకు రమ్మన్నాడు. మైనాకుడి శిఖరాలపై హనుమ కొంచెం విశ్రాంతి తీసుకొంటాడని సముద్రుడు అనుకున్నాడు.

మైనాకుడు పైకి లేచాడు. మైనాకుడు తనకు అడ్డు వస్తున్నాడని హనుమ అనుకొని, తన వక్షంతో అతడిని గెంటివేశాడు. మైనాకుడు మానవరూపంతో పర్వత శిఖరంపై నిలబడి, సముద్రుడి కోరికను హనుమకు చెప్పాడు. హనుమ సంతోషించాడు. తనకు సమయం లేదని, చేతితో మైనాకుణ్ణి హనుమ తాకి వెళ్ళాడు.

తరువాత హనుమంతుడిని పరీక్షించడానికి సురస అనే నాగమాత వచ్చి, హనుమ సూక్ష్మబుద్ధిని మెచ్చుకొని, అతడిని ఆశీర్వదించింది. సింహిక అనే రాక్షసి హనుమను మ్రింగాలని చూసింది. కాని హనుమంతుడు గోళ్ళతో సింహికను చీల్చివేశాడు.

ఇలా హనుమ నూరు యోజనాల సముద్రాన్ని దాటి లంకకు చేరాడు.

ప్రశ్న 4.
సీతాదేవిని హనుమంతుడు తొలిసారి సందర్శించి నపుడు అతడు పొందిన ఆనందాన్ని విశ్లేషించండి.
జవాబు:
హనుమంతుడు సీతను వెతుకుతూ, రావణుడి అంతః పురంలోకి వెళ్ళాడు. అక్కడ గొప్ప అందంతో ఉన్న రావణుడి భార్య మండోదరిని చూసి, సీత అని భ్రాంతిపడ్డాడు. తాను సీతను చూశానని హనుమ ఆనందంతో గంతులు వేశాడు. కొద్దిసేపటికే తన ఆలోచన తప్పు అనుకున్నాడు.

తరువాత హనుమ ఆశోకవనం అంతా, సీత కోసం వెతికాడు. శింశుపా వృక్షం ఎక్కాడు. ఆ చెట్టు క్రింద మాసిన బట్టలు కట్టుకొన్న ఒక స్త్రీని హనుమ చూశాడు. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు. ఆమె దీనావస్థలో ఉంది. ఆమె సీతయే అని, హనుమ అనుకున్నాడు.

అతడు ఆమె ధరించిన ఆభరణాలు చూశాడు. రాముడు చెప్పిన వాటితో అవి సరిపోయాయి. దానితో ఆమె సీతయే అని హనుమంతుడు గట్టిగా నిశ్చయించాడు. సీతాదేవిని చూడగానే హనుమంతుడి కళ్ళ నుండి ఆనందబాష్పాలు జారాయి. శ్రీరాముడిని మనస్సులో స్మరించుకొని, హనుమంతుడు నమస్కరించాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం సుందరకాండ

ప్రశ్న 5.
త్రిజటా స్వప్నం గురించి రాయండి.
జవాబు:
‘త్రిజట’ విభీషణుని కూతురు. రావణుడు సీతను అశోకవనంలో ఉంచి, రాక్షస స్త్రీలను ఆమెకు కాపలాగ పెట్టాడు. వారిలో ‘త్రిజట’ కూడా ఉంది. రావణుని భర్తగా అంగీకరించడానికి సీతను ఒప్పించమని రావణుడు రాక్షస స్త్రీలకు చెప్పాడు. రాక్షస స్త్రీలు సీతకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. లేకపోతే చంపుతామని వారు సీతను బెదిరించారు. సీత ఎంతో ఏడ్చింది.

అంతవరకూ నిద్రపోతున్న త్రిజట లేచి తనకు కల వచ్చిందని అక్కడున్న రాక్షస స్త్రీలకు చెప్పింది. కలలో వేయి హంసల పల్లకిపై రామలక్ష్మణులు కనబడ్డారని, సీత తెల్లని పర్వతం మీద కూర్చుందనీ వారికి చెప్పింది. రావణుడు నూనె పూసిన శరీరంతో నేలపై పడి ఉన్నాడని, ఒక నల్లని స్త్రీ రావణుని మెడకు తాడు కట్టి దక్షిణంవైపు ఈడ్చుకువెడుతోందని కూడా చెప్పింది. రావణుడు పందిమీద దక్షిణ దిశగా వెళ్ళడం తాను కలలో చూశానని, లంకానగరం చిన్నాభిన్నం కావడం తాను చూశానని త్రిజట తోటి రాక్షస స్త్రీలకు చెప్పింది.

తనకు కలలో విమానం కనబడింది కాబట్టి సీత కోరిక సిద్ధిస్తుందనీ, రావణుడికి వినాశం, రాముడికి జయం కలుగుతుందనీ త్రిజట చెప్పింది. త్రిజట ఉత్తమురాలు.

ప్రశ్న 6.
లంక దహనానికి అసలు కారకులెవరు ? ఎలా ? విశ్లేషించండి.
జవాబు:
హనుమంతుడు సీత జాడను తెలుసుకున్నాక, రావణుడి శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలను కున్నాడు. అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. రావణుడు పంపిన రాక్షస వీరులను అందరినీ హనుమ చంపాడు. చివరకు ఇంద్రజిత్తు హనుమను బ్రహ్మాస్త్రంతో బంధించి, రావణుడి వద్దకు తీసుకు వెళ్ళాడు.

రావణుడు హనుమంతుడిని చంపమని ఆజ్ఞాపించాడు. దూతను చంపడం భావ్యం కాదని, ఇతర పద్ధతులలో దండింపవచ్చునని విభీషణుడు అన్న రావణునికి చెప్పాడు.

హనుమంతుడి తోకకు నిప్పు అంటించి, లంక అంతా తిప్పమని రాక్షసులకు రావణుడు చెప్పాడు. వారు బట్టలు హనుమంతుడి తోకకు చుట్టారు. దానిని నూనెతో తడిపారు. హనుమ తోకకు నిప్పు అంటించి, వారు లంక అంతా ఊరేగిస్తున్నారు. హనుమంతుడు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు. విభీషణుడి భవనం తప్ప, లంకనంతా కాల్చాడు. ఈ విధంగా రాముడు సీతను చూసి రమ్మని హనుమంతుడిని పంపితే, హనుమ లంకను కాల్చి వచ్చాడు.

దీనినిబట్టి లంకను కాల్చడానికి అసలు కారకుడు రావణుడు అని మనకు తెలుస్తుంది. హనుమంతుడు రాముడి పరాక్రమాన్ని గుర్తుచేసి, సీతను రాముడి వద్దకు పంపమని రావణుడికి చెప్పడానికే వెళ్ళాడు. కాని రావణుడు, తెలివి తక్కువగా హనుమ తోకకు నిప్పు పెట్టించాడు. కాబట్టి లంకా దహనానికి రావణుడే అసలు కారకుడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం సుందరకాండ

ప్రశ్న 7.
సీత, హనుమంతుడుల మధ్య శింశుపా వృక్షం కింద జరిగిన సంభాషణా సారాంశాన్ని రాయండి. (June 2018)
జవాబు:
హనుమంతుడు అశోకవనంలో సీతను చూచాడు. తన మాటల ద్వారా తాను రామదూతనని సీతకు నమ్మకం కలిగించాడు. సీత కోరికపై హనుమ, రాముని రూపగుణాలను వర్ణించి చెప్పాడు. తాను తెచ్చిన రామముద్రికను హనుమ సీతకు ఇచ్చాడు. రామ ముద్రికను చూసి సీత ఆనందభరితురాలయ్యింది. సీత తన దీనావస్థను హనుమంతునికి చెప్పింది. రాముణ్ణి త్వరగా లంకను తీసుకువచ్చి తనను రాక్షసుల చెరనుండి విడిపించమని సీత హనుమంతుని కోరింది.

హనుమంతుడు సీతను తన వీపుమీద కూర్చోమన్నాడు. అలా చేస్తే వెంటనే సీతను రాముని వద్దకు తీసుకొని వెళ్ళగలనన్నాడు. కాని సీతమ్మ అందుకు నిరాకరించింది. సీత తాను పరపురుషుని తాకనని చెప్పింది. అప్పుడు హనుమ సీతను రాముడు గుర్తించే ఆనవాలును ఇమ్మని అడిగాడు. సీత తన చూడామణిని హనుమకు ఇచ్చింది.

సీతను వెంటనే రాముని వద్దకు తీసుకొని వెళ్ళి సీతారాములకు ఆనందం కలిగించాలని హనుమ భావించాడని, రాముని క్షేమవార్తను చెప్పి సీత ప్రాణాలను నిలబెట్టాడని వారి సంభాషణ వల్ల తెలుస్తుంది.

సీతమ్మ తనకు వెంటనే చెర నుండి విముక్తి కలగాలని కోరుకోలేదు. ఆమెకు తన పాతివ్రత్యం ముఖ్యం. రాముడే వచ్చి రావణుని చంపి తనను తీసుకొని వెళ్ళాలని ఆమె చెప్పింది. హనుమంతుడు సీతను దొంగతనంగా తీసుకొని వెళ్ళడం, రామునకు అపకీర్తికరమని సీత అభిప్రాయపడింది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం సుందరకాండ

ప్రశ్న 8.
హనుమంతుని వ్యక్తిత్వాన్ని గురించి రాయండి. (June 2017)
జవాబు:
రామాయణములో రాముని తర్వాత నాకు నచ్చిన పాత్ర ‘ఆంజనేయుడు’. హనుమంతుని వ్యక్తిత్వము, చాలా గొప్పది.

హనుమంతుని వ్యక్తిత్వము :
హనుమంతుడు గొప్ప బలశాలి. ధైర్యసాహసాలు గలవాడు. ఇతడు పసితనంలోనే సూర్యుణ్ణి చూసి పండు అనుకొని ఆకాశానికి ఎగిరిన మహాబలశాలి. హనుమంతుడు, స్వామిభక్తి పరాయణుడు. ఇతడు సుగ్రీవునికి నమ్మిన బంటు మంత్రి. ఇతడు రామసుగ్రీవులకు స్నేహం కలిపిన ప్రజ్ఞాశాలి. ఇతడు శ్రీరామునికి మహాభక్తుడు. వీరాగ్రణి.

మహాబలశాలి :
ఇతడు నూరుయోజనాల సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళి సీత జాడను తెలిసికొని వచ్చాడు. లంకలో ఎందరో రాక్షస వీరులను చంపి సభలో రావణుని హెచ్చరించి, లంకను కాల్చి వచ్చాడు. సీతకు రాముని ఉంగరాన్ని ఇచ్చి, ఆమె ఇచ్చిన చూడామణిని తెచ్చి రామునకు అందించాడు.

హనుమంతుడు, సముద్రంపై వారధిని నిర్మింపజేసి, రాముడిని తన భుజాలపై కూర్చుండపెట్టుకొని, లంకా నగరానికి వానరసేనతో చేరాడు. యుద్ధంలో హనుమంతుడు ఎందరో రాక్షసవీరులను సంహరించాడు. లంకిణిని సంహరించాడు.

సంజీవి పర్వతాన్ని తెచ్చి, లక్ష్మణుని బ్రతికించాడు. హనుమంతుడు తన పరాక్రమంతో, బలంతో శత్రువయిన రావణుని ప్రశంసలను సైతం పొందాడు. రాముడు హనుమంతుని సహాయాన్ని మెచ్చి, ఆలింగనం చేసికొన్నాడు.

హనుమంతుడు మహావీరుడు, మహాభక్తుడు, స్వామికార్య ధురంధరుడు. ఇతడు సీతమ్మ మెప్పును పొందిన రామదూత ఆంజనేయుడు. శ్రీరాముని హృదయాన్ని చూరగొన్న భక్తాగ్రేసరుడు. కాబట్టి రామాయణంలో నాకు నచ్చిన పాత్ర హనుమంతుడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం సుందరకాండ

ప్రశ్న 9.
హనుమంతుడు సీతను ఎలా గుర్తుపట్టాడు ? వివరించండి.
(లేదా)
లంకలో ప్రవేశించిన హనుమంతుడు సీతను గుర్తించిన విధానమును తెలుపండి. (May 2022)
జవాబు:
సీతకోసం రాక్షస భవనాలన్నీ వెతికాడు. రావణుని అంతఃపురం కూడా వెతికాడు. మహాసౌందర్యవతి అయిన మండోదరిని సీత అని భ్రమించాడు. కాని, అంతలోనే ఆమె సీతకాదని నిర్ణయించుకొన్నాడు.

తర్వాత అశోకవనంలోకి వెళ్ళాడు. అణువణువు వెతికాడు. శింశుపావృక్షం ఎక్కాడు. దాని కింద ఒక స్త్రీ మలిన వస్త్రాలతో ఉంది. చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు. ఆమె కృశించి ఉంది. దీనావస్థలో ఉంది. రాముని ఎడబాసిన సీత ఉండవలసిన స్థితిలో ఉంది.

అందుకే ఆమెను సీతగా గుర్తించాడు. ఆమె ధరించిన ఆభరణాలను చూశాడు. రాముడు చెప్పిన వాటితో అవి సరిపోయేయి. ఋష్యమూక పర్వతం వద్ద చూచిన ఆభరణాలు ఆమె శరీరంపై కనిపించలేదు. కచ్చితంగా ఆమెను సీతగా నిర్ధారించుకొన్నాడు. రావణాసురుడు వచ్చి, సీతను భయపెట్టి వెళ్ళాడు. సీతాదేవికి వినబడేలా రామకథాగానం చేశాడు. సీత నాలుగు వైపులా చూసింది. దానితో ఆమెను సీతగా పూర్తిగా నిర్ధారించుకొన్నాడు.

మొదట సీతాదేవి బాహ్య పరిస్థితులను గమనించాడు. తర్వాత ఆమె స్థితిని గుర్తించాడు. ఆమె మనసుకు నచ్చే రామ కథను విన్పించి, ఆమె ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని గమనించాడు. ఆ విధంగా సీతను గుర్తించాడు.

ప్రశ్న 10.
హనుమంతుడు శ్రీరాముని గుణగణాలను సీతాదేవికి నివేదించిన విధం చెప్పండి.
జవాబు:
శ్రీరాముడు పద్మముల వంటి కన్నులు కలవాడు. చక్కని దేహ సౌందర్యము, గుణసంపద కలవాడు. తేజస్సులో రాముడు -సూర్యుడి వంటివాడు. ఓర్పులో భూదేవి వంటివాడు. బుద్ధిలో బృహస్పతి. కీర్తిలో దేవేంద్రుని వంటివాడు.

రాముడు శరణు అన్నవారిని రక్షిస్తాడు. శత్రువులను సంహరిస్తాడు. రాజవిద్యాకుశలుడు. సర్వ విద్యా పండితుడు. వినయము గలవాడు. యజుర్వేదమందు, ధనుర్వేదమందు పండితుడు. విశాలమైన భుజములు, పొడవైన భుజములు, శంఖం వంటి కంఠము, శుభప్రదమైన ముఖము కలవాడు. దుందుభి వంటి కంఠస్వరము కలవాడు. శ్రీరాముడు సకల ఐశ్వర్య సంపన్నుడు.

శ్రీరాముడు సత్యము మాట్లాడుటయందు, ధర్మాచరణము నందు ఆసక్తి కలవాడు. పాత్రులకు దానము చేస్తాడు. అందరితో ప్రియముగా మాట్లాడుతాడు. శ్రీరాముడు మేఘమువలె శ్యామల వర్ణము గలవాడు.

శ్రీరాముడు దశరథుని పెద్ద కుమారుడు. శ్రీరాముడు చంద్రుడివలె చక్కని ముఖము కలవాడు. ధనుర్ధారులలో శ్రేష్ఠుడు. ధర్మ రక్షకుడు. అరివీరభయంకరుడు అని హనుమంతుడు శ్రీరాముని గుణగణాలను సీతకు చెప్పాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం సుందరకాండ

ప్రశ్న 11.
హనుమంతుడు లంకలో ప్రవేశించి సీతను చూసి మాట్లాడిన వృత్తాంతాన్ని తెలపండి.
జవాబు:
హనుమంతుడు దేవతలకు నమస్కరించాడు. తన శరీరాన్ని పెంచాడు. పెద్ద ధ్వని చేస్తూ, చేతులను నడుం మీద ఉంచి, తోకను విదల్చాడు. సీతను చూసి వస్తానని, అంతరిక్షంలోకి ఎగిరాడు. హనుమ సముద్రంపై వెడుతుండగా, సముద్రుడు హనుమకు సాయం చేద్దామని తనలో దాగిన మైనాకుణ్ణి పైకి రమ్మన్నాడు. హనుమ ఆ గిరిశిఖరాలపై విశ్రాంతి తీసికొంటాడని సాగరుడు అనుకున్నాడు. పైకి లేచిన మైనాకుణ్ణి చూసి, తనకు అడ్డంగా ఉన్నాడని, హనుమ తన వక్షఃస్థలంతో నెట్టివేశాడు. మైనాకుడు మనిషి రూపంలో గిరి శిఖరంపై నిలిచి, సముద్రుడి కోరికను హనుమకు తెలిపాడు. హనుమ తనకు మధ్యలో ఆగడం కుదరదని, మైనాకుని చేతితో తాకి ముందుకు సాగాడు.

హనుమను పరీక్షించాలని ‘సురస’ అనే నాగమాత యత్నించి హనుమ సూక్ష్మబుద్ధిని మెచ్చుకుంది. ‘సింహిక’ అనే రాక్షసి హనుమను మింగాలని చూసి, తానే హనుమ చేతిలో మరణించింది. హనుమ లంకను చూశాడు. రాత్రి కాగానే పిల్లి ప్రమాణంలో తన శరీరాన్ని తగ్గించుకొని, లంకలో ప్రవేశించాడు. లంకాధిదేవత (లంకిణి) లంకలోకి వెళ్ళడానికి హనుమంతుడిని అడ్డగించింది. హనుమ లంకను చూసి వస్తానన్నాడు. లంకిణి హనుమను అరచేతితో కొట్టింది. హనుమ లంకిణిని ఒక్క దెబ్బ వేశాడు. లంకిణి కూలిపోయింది. వానరుడు వచ్చి లంకిణిని జయించినపుడు రాక్షసులకు కీడు కల్గుతుందని బ్రహ్మ చెప్పాడని హనుమకు లంకిణి చెప్పింది. హనుమను లంకలోకి వెళ్ళమంది.

హనుమ ప్రాకారం నుండి లంకలోకి దూకాడు. లంకలో ఎడమపాదం పెట్టాడు. హనుమ లంకలో రాక్షస భవనాలన్నీ వెదికాడు. రావణుని భార్య మండోదరిని చూసి సీత అని భ్రమపడ్డాడు. తరువాత ఆమె సీత కాదని నిశ్చయించాడు. చివరకు సీత చనిపోయి ఉంటుందని అనుకున్నాడు. హనుమ తాను కూడా మరణిద్దాం అనుకున్నాడు. చివరకు బతికి ఉంటే శుభాలు పొందవచ్చుననుకున్నాడు.

హనుమ అశోకవనంలోకి వెళ్ళాడు. హనుమ ఆ వనంలో శింశుపావృక్షం ఎక్కాడు. దానికింద మలిన వస్త్రాలు ధరించిన ఒక స్త్రీని చూశాడు. ఆమె సీత అయి ఉంటుందని నిశ్చయించాడు. హనుమ చెట్టుమీదే ఉన్నాడు. తెల్లవారుతోంది. రావణుడు వచ్చి, సీత మనస్సును మార్చబోయాడు. సీత లొంగలేదు. రావణుడు సీతకు రెండు నెలలు గడువు ఇచ్చి, సీతను తన దారికి తెమ్మని రాక్షస స్త్రీలకు చెప్పాడు. రావణుడు వెళ్ళిపోయాక, రాక్షస స్త్రీలు, సీత మనస్సును మార్చడానికి యత్నించారు. సీత రాముడిని విడిచి ఉండలేక చనిపోదామనుకుంది.

విభీషణుడి కూతురు త్రిజట నిద్ర నుండి లేచింది. త్రిజట తనకు కల వచ్చిందనీ ఆ కలలో వేయి హంసల పల్లకిలో రాముడూ, తెల్లని పర్వతంపై సీత కనబడ్డారని, రావణుడు నూనె పూసిన శరీరంతో నేలపై పడి ఉన్నాడని, లంక ఛిన్నాభిన్నం అయ్యిందనీ, రాముడికి జయం కల్గుతుందనీ చెప్పింది.

సీతకు శుభశకునాలు కనబడ్డాయి. హనుమంతుడు రామకథను గానం చేశాడు. సీత చెట్టు మీద హనుమను చూసి ఆశ్చర్యపడింది. హనుమ చెట్టుదిగి, ఆ స్త్రీని “నీ వెవరవు ?’ నీవు సీతవైతే నీకు శుభం అవుతుంది” అన్నాడు. తన పేరు సీత అని, ఆ స్త్రీ చెప్పింది. హనుమ తాను శ్రీరామ దూతనని చెప్పాడు. హనుమను చూసి సీత మొదట రాక్షసుడు అనుకుంది. రామదూతవయితే రాముణ్ణి గురించి చెప్పు అన్నది. హనుమ రాముని రూపాన్ని వర్ణించాడు. రాముడిచ్చిన అంగుళీయకాన్ని సీతకు గుర్తుగా ఇచ్చాడు.

రాముణ్ణి త్వరగా లంకకు తీసుకురమ్మని హనుమకు సీతమ్మ చెప్పింది. వెంటనే సీతను రాముని వద్దకు తీసుకు వెడతాననీ, తన వీపుపై కూర్చోమనీ, హనుమ ఆమెకు చెప్పాడు. అందుకు సీత నిరాకరించింది. తాను పరపురుషుడిని తాకననీ, రాముడు రావణుని చంపి తనను తీసుకువెళ్ళడం ధర్మం అనీ చెప్పింది. హనుమంతుడు రాముడు గుర్తించే ఆనవాలును ఇమ్మని సీతను అడిగాడు. సీత కాకాసురుని కథ చెప్పింది. ఆమె తన దివ్య చూడామణిని హనుమకు ఇచ్చింది. ఈ విధంగా హనుమ లంకలో సీతను కలిసి వెళ్ళాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం సుందరకాండ

ప్రశ్న 12.
హనుమ లంకను కాల్చి వచ్చి, సీత జాడను రామునికి నివేదించిన వృత్తాంతాన్ని వివరించండి. (లేదా) సీతాన్వేషణ వృత్తాంతాన్ని తెలపండి.
జవాబు:
సీతాదేవిని దర్శించడంతో హనుమకు ఒక ముఖ్యకార్యం పూర్తి అయ్యింది. రావణుడి శక్తిసామర్థ్యాలు హనుమ తెలుసుకుందామనుకున్నాడు. అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. అశోక వన ధ్వంసం గురించి రాక్షస స్త్రీలు, రావణునకు చెప్పారు. రావణుడు ఎనభైవేల మంది రాక్షసులను పంపాడు. హనుమ వాళ్ళను చంపాడు. రావణుడు పంపిన జంబుమాలిని, ఏడుగురు మంత్రి పుత్రులను, ఐదుగురు సేనాపతులను, అక్షకుమారుణ్ణి కూడా హనుమ చంపాడు. చివరకు రావణుడు తన కుమారుణ్ణి ఇంద్రజిత్తును పంపాడు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో హనుమను బంధించాడు. అది హనుమపై స్వల్పకాలమే పని చేసింది.

రాక్షసులు హనుమను రావణుని ముందు ప్రవేశపెట్టారు. హనుమ తాను రామదూతనని రావణుడికి చెప్పి, రాముని పరాక్రమాన్ని చాటాడు. దూతను చంపడం తగదని రావణుని తమ్ముడు విభీషణుడు చెప్పడంతో, రావణుడు హనుమంతుని తోకకు నిప్పంటించి లంకలో తిప్పమన్నాడు. రాక్షసులు హనుమ తోకకు బట్టలు చుట్టి, నూనెతో తడిపి, నిప్పు ముట్టించి లంకానగరంలో ఊరేగించారు. హనుమ ఆకాశంలోకి ఎగిరి, విభీషణుని భవనం తప్పించి, మిగిలిన లంకంతా తగులబెట్టాడు.

తరువాత హనుమ లంకను అంటించి తాను తప్పు చేశానని, సీతామాత ఆ మంటలలో కాలిపోయిందేమో అని, సందేహించాడు. తన తోకను కాల్చని అగ్ని, సీతను దహింపదని చివరకు ధైర్యం తెచ్చుకున్నాడు. సీత క్షేమంగా ఉందని చారణుల ద్వారా తెలుసుకొని సంతోషించాడు. హనుమ సీత వద్దకు తిరిగి వెళ్ళి ఆమెకు నమస్కరించి తిరుగు ప్రయాణం అయ్యాడు.

హనుమ ‘అరిష్టం’ అనే పర్వతాన్నుండి ఆకాశంలోకి ఎగిరాడు. మహేంద్రగిరికి చేరుతూ మహానాదం చేశాడు. జాంబవంతుడు ఆ ధ్వనిని విని హనుమ విజయం సాధించి వస్తున్నాడని వానరులకు చెప్పాడు.

హనుమ మహేంద్రగిరి చేరాడు. పెద్దలకు నమస్కరించాడు. ‘చూశాను సీతమ్మను’ అని చెప్పాడు. ప్రయాణ విషయాలు వారికి చెప్పాడు. అంగదుడు లంకకు వెళ్ళి, రావణుని చంపి సీతను తీసుకొనివచ్చి రాముని వద్దకు వెడదాం అన్నాడు. జాంబవంతుడు, అది సరికాదన్నాడు. రామసుగ్రీవులు సీతమ్మను చూసి రమ్మన్నారు. రాముడు రావణుని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. రామునికి ముందు విషయం తెలుపుదాం అన్నాడు.

దారిలో మధువనాన్ని వానరులు ధ్వంసం చేశారు. మధువనాన్ని రక్షిస్తున్న దధిముఖుడు, వానరుల చేతిలో దెబ్బతిని, ఆ విషయం సుగ్రీవుడికి చెప్పాడు. సుగ్రీవుడు అదంతా శుభసూచకంగా భావించాడు. అంగద హనుమదాదులు సుగ్రీవుల దగ్గరకు వెళ్ళారు. హనుమ, రాముడికి నమస్కరించి ‘చూశాను సీతమ్మను’ అని చెప్పి, సీత ఇచ్చిన చూడామణిని రాముడికి గుర్తుగా ఇచ్చి సీతాన్వేషణ వృత్తాంతాన్ని రామునకు వివరించాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం సుందరకాండ

ప్రశ్న 13.
అశోకవనంలో హనుమ – సీతల (సీతా హనుమల) సంభాషణను విశ్లేషిస్తూ, వారి స్వభావాలను రాయండి.
జవాబు:
సీత కోరికపై హనుమంతుడు శ్రీరాముని రూపగుణాలను వివరించాడు. రామ ముద్రికను అతడు సీతకు సమర్పించాడు. రామ ముద్రికను చూసి పతివ్రతయైన సీత పరమానందభరితురాలు అయ్యింది. సీత తన దీనావస్థను హనుమకు వివరించింది. రాముణ్ణి త్వరగా లంకకు తీసుకువచ్చి, తనను రాక్షసుల చెర నుండి విడిపించుమని సీత హనుమంతునికి చెప్పింది.

తన వీపు మీద కూర్చుంటే వెంటనే సీతను రాముని వద్దకు తీసుకొని వెళ్ళగలనని హనుమంతుడు సీతకు చెప్పాడు. కానీ సీత హనుమంతునితో వెళ్ళడానికి నిరాకరించింది. తాను పరపురుషుని తాకనని సీత చెప్పింది. రాముడు గుర్తించే ఆనవాలును ఇమ్మని హనుమ అడిగితే, సీత తన చూడామణిని హనుమకు ఇచ్చింది.

సీతాహనుమల సంభాషణను బట్టి, సీతమ్మను వెంటనే తీసుకొని వెళ్ళి, సీతారాములకు ఆనందం కలిగించాలని హనుమ తలంచాడనీ, అతడు స్వామికార్య ధురంధరుడనీ తెలుస్తోంది.

సీతాహనుమల సంభాషణను బట్టి, సీత తనకు వెంటనే చెర నుండి విముక్తి కలగడం ప్రధానం కాదని భావించింది. పాతివ్రత్యం కాపాడుకోవడం ఆమెకు ముఖ్యమని తెలుస్తోంది. దొంగతనంగా హనుమంతుడు సీతను తీసుకువెడితే అది రాముడికి అపకీర్తి అని భావించింది. రావణుని యుద్ధంలో చంపి తనను రాముడు తీసుకొని వెడితే అది రామునికి కీర్తిని కలిగిస్తుందని సీత అభిప్రాయపడింది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం సుందరకాండ

ప్రశ్న 14.
హనుమంతుడు సముద్రం దాటేటపుడు ఎదురైన ఆటంకాలేవి ? వాటినెలా అధిగమించాడు ?
జవాబు:
హనుమంతుడు సముద్రంపై మహావేగంగా సాగిపోతున్నాడు. అతనికి సముద్రుడు ఆతిథ్యం ఇవ్వాలనుకొన్నాడు. మైనాక పర్వతాన్ని పంపాడు. మైనాక పర్వతం హనుమంతుని దారికి అడ్డంగా నిలబడ్డాడు. హనుమంతుడది ఆటంకంగా భావించాడు. దానిని తన గుండెతో గట్టిగా కొట్టాడు. మైనాకుని ప్రార్థనతో చేతితో తాకి వెళ్ళిపోయేడు.

ఇది హనుమంతునిపై అభిమానంతో కలిగిన ఆటంకం. దానిని మర్యాదపూర్వకమైన మాటలతో, చేతలతో అధిగమించాడు.

‘సురస’ అనే నాగమాత హనుమంతుని పరీక్షించడానికి ఆటంకం కల్పించింది. తన సూక్ష్మబుద్ధిని, సమయస్ఫూర్తిని ఉపయోగించి, ఆ ఆటంకాన్ని కూడా హనుమ అధిగమించాడు. ఆమె మెప్పును పొందాడు.

‘సింహిక’ అనే రాక్షసి హనుమను మింగేయాలనుకొంది. తన గోళ్ళతో ఆమెను చీల్చి చంపాడు హనుమ. తన తెలివితో, బలంతో ‘లంకిణి’ ని కూడా జయించాడు.

ఈ విధంగా హనుమంతుడు తన వినయం, తెలివి, బలాలతో ఎక్కడ ఏది అవసరమో అక్కడ దానిని ఉపయోగించాడు. సముద్రాన్ని అధిగమించాడు.

ప్రశ్న 15.
లంకాదహనానికి కారకులెవరు ? విశ్లేషించండి.
జవాబు:
సీతాదేవి దర్శనంతో హనుమంతుడికి చాలా ఆనందం కల్గింది. అశోకవనం ధ్వంసం చేశాడు.. రాక్షసులు బంధించారు. రావణుడు హనుమను చంపమన్నాడు. అది తగదన్నాడు విభీషణుడు. హనుమంతుని తోకకు నిప్పుపెట్టి లంకంతా తిప్పమని రావణుడు ఆజ్ఞాపించాడు. నూనెలో తడిపిన బట్టలు హనుమంతుని తోకకు చుట్టపెట్టారు రాక్షసులు. ఆ తోకకు నిప్పు పెట్టారు. లంకా నగర వీధులలో తిప్పుతున్నారు. ఒక్కసారిగా హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరాడు. విభీషణుని భవనం తప్ప మొత్తం లంకంతా కాల్చాడు.

రావణుడు ఆజ్ఞాపించాడు. రాక్షసులు ఆచరించారు. అందుకే లంక తగలబడింది. లంక తగలబడడానికి కారణం అజ్ఞానంతో కూడిన రావణుని ఆజ్ఞ. మూర్ఖత్వంగా దానిని అమలుపరిచిన రాక్షసులు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం సుందరకాండ

ప్రశ్న 16.
మధువన ధ్వంసం గురించి చెప్పినపుడు అది శుభసూచకంగా సుగ్రీవుడెందుకు భావించాడు ? విశ్లేషించండి.
జవాబు:
సాధారణంగా కోతులకు ఆనందం కలిగినా, కోపం వచ్చినా వనాలను ధ్వంసం చేస్తాయి. విపరీతంగా అల్లరి చేస్తాయి. లంకలో సీతాదేవి కనిపించిన ఆనందంతో హనుమ అశోకవనం ధ్వంసం చేశాడు. తన తోకకు నిప్పు పెట్టారనే కోపంతో లంకను తగులబెట్టాడు. సీతాదేవి జాడ దొరికిన ఆనందంతో హనుమ వచ్చాడు. మధువనంలోకి వానరులు ప్రవేశించారు. తేనెలు త్రాగారు. మధువనం ధ్వంసం చేశారు. దధిముఖుడు అడ్డు వచ్చాడు. అతను సుగ్రీవుని మేనమామ అని వారికి తెలుసు. అయినా కొట్టారు. అంటే విజయోన్మాదంలో ఉన్నారు. అది గ్రహించాడు కనుకనే సుగ్రీవుడు ఆనందించాడు.

పరిచిత గద్యాలు

ప్రశ్న 1.
కింది పేరాను చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

హనుమంతుడు మహేంద్రగిరి శిఖరం మీద అడుగు పెట్టాడు. వానరులంతా చుట్టూ చేరారు. పెద్దలకు నమస్కరించాడు హనుమంతుడు. “చూశాను సీతమ్మను అని ప్రకటించాడు. అందరూ ఆనందించారు. లంకా ప్రయాణ విశేషాలను వారికి వివరించాడు మారుతి. అంగదుడు “ఓ వీరులారా ! సీతాదేవి జాడ తెలిసిన తరువాత కూడా ఆమె లేకుండా శ్రీరాముని దగ్గరికి వెళ్ళడం సబబుకాదు. లంకకు వెళ్ళి రావణుని చంపి సీతను తీసుకొని శ్రీరాముని వద్దకు వెళుదా”మని అన్నాడు. జాంబవంతుడు అంగదుడి మాటలను ఖండించాడు. శ్రీరామసుగ్రీవులు సీతను చూసి రమ్మన్నారేకాని తీసుకురమ్మనలేదు. పైగా రావణుణ్ణి సంహరిస్తానని శ్రీరాముడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. దానికి భంగం కలగనీయగూడదన్నాడు. అందరం వెళ్ళి జరిగిన విషయాలను నివేదిద్దామన్నాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. మహేంద్రగిరి శిఖరం మీద అడుగుపెట్టిన వారెవరు ?
జవాబు:
మహేంద్రగిరి శిఖరం మీద హనుమంతుడు అడుగుపెట్టాడు.

2. హనుమంతుడు ఏమని ప్రకటించాడు ?
జవాబు:
హనుమంతుడు “చూశాను సీతమ్మ”ను అని ప్రకటించాడు.

3. అంగదుడు ఏమన్నాడు?
జవాబు:
సీతాదేవి జాడ తెలిసిన తరువాత ఆమె లేకుండా శ్రీరాముని వద్దకు వెళ్ళవద్దని, రావణుణ్ణి చంపి సీతను తీసుకొని రాముని వద్దకు వెళదామని అతడు అన్నాడు.

4. జాంబవంతుడు ఎవరి మాటలను ఖండించినాడు ?
జవాబు:
జాంబవంతుడు అంగదుడి మాటలను ఖండించాడు.

5. శ్రీరాముడు ఏమని ప్రతిజ్ఞ చేసినాడు ?
జవాబు:
రావణుణ్ణి సంహరిస్తానని శ్రీరాముడు ప్రతిజ్ఞ చేసినాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం సుందరకాండ

ప్రశ్న 2.
క్రింది పేరాను చదవండి. కింది మాటలకు ఒక వాక్యంలో వివరణ వ్రాయండి.

“వేకువ జామయ్యింది వేదఘోషలు వినబడుతున్నాయి. నిద్రలేచిన రావణుడు అశోకవనం వైపు అడుగులు వేస్తున్నాడు. సుగంధ తైలాలతో తడిసి ఉన్న కాగడాలను ధరించిన స్త్రీలు ముందు నడుస్తున్నారు. రావణుని తేజస్సును చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు హనుమంతుడు. సీత దగ్గరికి వచ్చి రావణుడు నయానా భయానా సీత మనసు మార్చే ప్రయత్నం చేశాడు. కాని ఎలాంటి ప్రలోభాలకు తాను లొంగనని సీత తేల్చి చెప్పింది. శ్రీరాముని నుంచి తప్పించుకోవడం సాధ్యంకాదని హెచ్చరించింది. రావణునిలో ఆవేశం పెల్లుబికింది. రెండు నెలలు గడువు విధించాడు. ఎలాగైనా సీతను తన దారికి తెమ్మని రాక్షస స్త్రీలను ఆదేశించి తన భవనానికి చేరుకున్నాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. వేకువజాము
జవాబు:
అంటే తెల్లవారుజాము అనగా ప్రభాత సమయములో అని భావము.

2. ఆశ్చర్యచకితుడు
జవాబు:
అనగా ఆశ్చర్యముతో కలతపడ్డాడు. అని భావము

3. నయానా భయానా
జవాబు:
‘నయానా’ అంటే అందంగా, నేర్పుగా మాట్లాడడం, భయానా అంటే భయపెట్టి బెదరించడం.

4. ప్రలోభాలు
జవాబు:
అంటే పేరాసలు అని అర్థము అంటే పెద్దగా ఆశలు పెట్టుట అని భావము.

5. తేల్చి చెప్పింది
జవాబు:
అంటే స్పష్టం చేసి చెప్పింది అని భావం.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం సుందరకాండ

ప్రశ్న 3.
కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

లంకను కాల్చాక హనుమంతుడు సముద్రంలో తోకను చల్లార్చుకున్నాడు. తోకతోపాటు ఆయన కోపం కూడా చల్లారింది. తాను తప్పు చేశాననుకున్నాడు. కోపం ఎంతో అనర్థదాయకమనుకున్నాడు. లంకంతా కాలి సీతామాత కూడా కాలిపోయి ఉంటుందని బాధపడ్డాడు. వచ్చిన పనిని చేజేతులా పాడుచేసుకొన్నందుకు తనను తాను నిందించుకున్నాడు. కాని ఎక్కడో చిన్న ఆశ. తన తోకనే కాల్చని అగ్నిదేవుడు పరమ పూజ్యురాలైన సీతను దహిస్తాడా ? అని ధైర్యం తెచ్చుకున్నాడు. ఇంతలో సీత క్షేమంగా ఉందని చారణుల ద్వారా తెలుసుకొని చాలా సంతోషించాడు. సీతమ్మ దగ్గరికి చేరి పాదాభివందనం చేశాడు. ఆమె అనుమతితో తిరుగు ప్రయాణమయ్యాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. హనుమంతుడు లంకను కాల్చడానికి తన శరీరంలో దేనిని ఉపయోగించుకున్నాడు ?
జవాబు:
తోక

2. చారణుల ద్వార తెలుసుకొని చాలా సంతోషించాడు – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది ?
జవాబు:
సంతసించాడు

3. ఎవరికి కోపం వచ్చింది ?
జవాబు:
హనుమంతునకు

4. అగ్నిదేవుడు ఎవరిని బాధపెట్టాడు ?
జవాబు:
పూజ్యులను

5. సీతాదేవి కాలిపోయి ఉంటుందని హనుమంతుడు పూర్తిగా నమ్మాడా ?
జవాబు:
లేదు

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం సుందరకాండ

ప్రశ్న 4.
కింది గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

“సముద్రంపై సాగిపోతున్న హనుమంతుణ్ణి చూసి సాగరుడు సహాయపడదలచాడు. తానింతవాడు కావడానికి ఇక్ష్వాకు ప్రభువైన సగరుడే కారణమని సాగరుని అభిప్రాయం. ఆ ఇక్ష్వాకు తిలకుడైన శ్రీరాముని కార్యం కోసం వెళు తున్న హనుమంతునికి శ్రమ కలగకూడదనుకున్నాడు. సముద్రంలో ఉన్న మైనాకుణ్ణి బయటకు రమ్మన్నాడు. అతడు బంగారు శిఖరాల మీద హనుమంతుడు ఒకింత సేపు విశ్రాంతి తీసుకోగలడని భావించాడు. మైనాకుడు సరేనన్నాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. హనుమంతుడు ఎవరి పని మీద వెళ్తున్నాడు?
జవాబు:
హనుమంతుడు శ్రీరాముని పని మీద వెళుతున్నాడు.

2. సాగరుని అభిప్రాయం ఏమిటి?
జవాబు:
తానింతవాడు కావడానికి ఇక్ష్వాకు ప్రభువైన సగరుడే కారణమని సాగరుని అభిప్రాయం.

3. మైనాకుడు ఎవరు?
జవాబు:
మైనాకుడు హిమవంతుని కుమారుడు. అతడు దేవేంద్రుని భయంతో సముద్రంలో దాగియున్నాడు.

4. పై పేరా ఆధారంగా ఇక్ష్వాకు వంశస్థులైన వారి పేర్లను తెలపండి.
జవాబు:
పై పేరా ప్రకారంగా ఇక్ష్వాకు వంశరాజులు 1) సగరుడు 2) శ్రీరాముడు.

5. పై పేరాకు ఒక శీర్షిక పెట్టండి.
జవాబు:
‘హనుమంతునకు సాగరుని ఆతిథ్యము’ అన్నది ఈ పేరాకు తగిన శీర్షిక.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం సుందరకాండ

ప్రశ్న 5.
కింది గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకునాలు తోచాయి. చెట్టుపైన ఉన్న హనుమంతుడు సీతాదేవిని ఎలా కాపాడుకోవాలో అని మథనపడ్డాడు. రామకథా గానమే సరైన మార్గమని ఎంచుకున్నాడు. సీతాదేవికి వినబడేటట్లు రామకథను వర్ణించాడు. సీతాదేవి అన్నివైపులా చూచింది. చెట్టు మీదున్న హనుమంతుణ్ణి చూసి ఆశ్చర్యానికి లోనైంది. హనుమంతుడు చెట్టు దిగి నమస్కరించాడు. “అమ్మా! నీవెవరు? ఒకవేళ సీతాదేవివే అయితే శుభమగుగాక ! దయతో విషయాలు చెప్పుమని ప్రార్థించాడు. తనను సీత అంటారని తెలిపిందా సాధ్వి – తన వృత్తాంతమంతా వివరించింది. హనుమంతుడు తాను శ్రీరామదూతనని చెప్పుకున్నాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. హనుమంతుడు ఎందుకు మథనపడ్డాడు ?
జవాబు:
ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతను ఎలా కాపాడుకోవాలో తెలియక హనుమంతుడు మథనపడ్డాడు.

2. హనుమంతునికి తోచిన మార్గం ఏమిటి ?
జవాబు:
రామకథా గానమే సరైన మార్గమని హనుమంతునికి తోచింది.

3. హనుమంతుడు సీతమ్మతో ఏమన్నాడు ?
జవాబు:
“అమ్మా! నీవెవరు? సీతాదేవివి అయితే నీకు శుభం కల్గుగాక” !

4. హనుమంతుడు సీతకు తనను ఎలా పరిచయం చేసుకున్నాడు ?
జవాబు:
హనుమంతుడు తాను శ్రీరాముని దూతనని సీతకు పరిచయం చేసుకొన్నాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం సుందరకాండ

5. ఈ కథ రామాయణంలో ఏ కాండం లోనిది ?
జవాబు:
ఈ కథ సుందరకాండం లోనిది. (సీత, హనుమంతుడు మాట్లాడుకున్న కథ సుందరకాండం లోనిది.)

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ

Telangana SCERT 10th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ Questions and Answers.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ

కిష్కింధా కాండం

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ 1
లక్ష్మణుడు అన్నను ఓదార్చాడు. ప్రయత్నిస్తే వదినెగారి జాడ తప్పక తెలుస్తుందని ధైర్యం చెప్పాడు. వారిని వాలి పంపాడేమో అని సుగ్రీవుడు మొదట భయపడ్డాడు. హనుమంతుణ్ణి వెళ్లి వాళ్లెవరో తెలుసుకొని రమ్మని పంపాడు. సన్యాసి రూపంలో ఆంజనేయుడు వెళ్లి తనను పరిచయం గావించు కున్నాడు. హనుమంతుని మాట తీరునుబట్టి అతడు పండితుడని రాముడు గుర్తించాడు. లక్ష్మణుడు తమ వృత్తాంతాన్ని హనుమంతునికి తెలియజేశాడు. హనుమంతుడు సుగ్రీవుని వెంటబెట్టుకు వచ్చాడు.

శ్రీరామసుగ్రీవులు మిత్రులయ్యారు. శ్రీరాముడు సుగ్రీవునికి అభయం ఇచ్చాడు. సుగ్రీవుడు తాము కొండపై ఉన్నపుడు ఒక స్త్రీ ‘రామా లక్ష్మణా’ అరిచిందని, నగలమూట జారవిడిచిందని చెప్పి, ఆ మూటను చూపాడు. లక్ష్మణుడు సీతాదేవి కాలి అందెలను గుర్తించాడు. సుగ్రీవుడు రాముని ఓదార్చాడు. ధైర్యం చెప్పాడు.. అందుకు ప్రతిగా రాముడుతో “సుగ్రీవుని భార్యను అపహరించిన వాలిని ఈరోజే చంపుతాను” అన్నాడు. సుగ్రీవుడు తమ వైరం కారణాన్ని తెలియజేశాడు.

వాలి పెద్దవాడు. కనుక కిష్కింధకు రాజయ్యాడు. మాయావి అనేవాడు వాలిని యుద్ధానికి ఆహ్వానించి, ఒక భూగృహంలో దూరాడు. సుగ్రీవుడు బిలం ద్వారం వద్ద ఉండగా, వాలి లోపలికి వెళ్లాడు. సంవత్సరం తరువాత రక్తం బయటకు ప్రవహించింది. వాలి చనిపోయాడని సుగ్రీవుడు భావించాడు. రాక్షసుడు బయటకు రాకుండా బిల ద్వారానికి రాతిని అడ్డుపెట్టి సుగ్రీవుడు కిష్కింధకు వెళ్లాడు. మంత్రులు సుగ్రీవుణ్ని రాజును చేశారు. వాలి తిరిగి వచ్చి సుగ్రీవుణ్ణి రాజ్యభ్రష్టుడిని గావించి, అతడి భార్య రుమను అపహరించాడు.

సుగ్రీవుడు ఋష్యమూక పర్వతాన్ని ఆశ్రయించాడు. మతంగమహర్షి శాపం వలన వాలి అక్కడకు రాడు. శ్రీరాముడు దుందుభి అస్థిపంజరాన్ని కాలిబొటన వ్రేలితో ఎగరగొట్టాడు. ఒకే బాణంతో ఏడు మద్ది చెట్లను చీల్చాడు. సుగ్రీవుడు రామునితో కిష్కింధకు వెళ్ళి వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. ఇద్దరూ యుద్ధం చేస్తున్నారు. అయితే ఆ ఇద్దరు ఒకే రకంగా ఉండటంతో రాముడు వాలిని గుర్తుపట్టలేక పోయాడు. సుగ్రీవుడు ప్రాణభయంతో పరుగెత్తాడు. రాముడు సుగ్రీవుని గుర్తించడానికి నాగ కేసరపు లతను మెడలో వేయమని లక్ష్మణునికి చెప్పాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ

తార మాటలు వినకుండా వాలి మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. వాళ్ళిద్దరూ యుద్ధం చేసేటప్పుడు రాముడు వాలిపై బాణం వేశాడు. “ఎందుకు దొంగదెబ్బ తీశావు” అన్నాడు వాలి.

వానరుడిని చాటు నుండి చంపడం తప్పుగాదని, తమ్ముడి భార్యను చెరబట్టినందుకు మరణదండన విధించానని రాముడు జవాబిచ్చాడు. వాలి క్షమాపణ కోరాడు. వాలి, తార, అంగదుల బాధ్యతను సుగ్రీవునికి అప్పజెప్పాడు. అంగదునికి హితం చెప్పి మరణించాడు. తాను ప్రసవణగిరి యందు ఉంటానని, వర్షాకాలం తరువాత సీతాన్వేషణ గావించమనీ రాముడు సుగ్రీవునికి చెప్పాడు. సుగ్రీవుడు కిష్కింధకు రాజయ్యాడు.

శరత్కాలం వచ్చినా సుగ్రీవుడు సీతాన్వేషణకు పూనుకోలేదు. లక్ష్మణుడు కోపించాడు. సుగ్రీవుడు తనని మన్నించమని వేడుకున్నాడు. వానర వీరులను అతడు పిలిపించాడు. నలుదిక్కులకు వారిని పంపాడు. హనుమంతునికి రాముడు తన ఉంగరాన్ని గుర్తుగా ఇచ్చాడు. అంగదుని నాయ కత్వంలో హనుమంతుడు దక్షిణదిక్కులో సీతను వెతకడానికి సిద్ధమయ్యాడు.

హనుమంతుడు ఋక్షబిలంలోకి ప్రవేశించాడు. అక్కడ స్వయంప్రభ యోగిని వానరులను అనుగ్రహించింది. అందరూ సముద్ర తీరం చేరారు. అక్కడ జటాయువు అన్న అయిన సంపాతిని కలిశారు. సంపాతి సీత ఉనికిని గూర్చి చెప్పాడు. లంకకు మార్గం తెలిపాడు. వందయోజనాల ఎగరగలవాడు హనుమంతుడొక్కడే. హనుమంతుడిని జాంబవంతుడు ఇతర వానరులు ప్రశంసించి, సముద్ర లంఘనానికి ప్రోత్సహించారు. తన బలానికి భూమి కంపిస్తుందని, మహేంద్ర పర్వతమైతే తనను భరించగలదని చెప్పి హనుమంతుడు మహేంద్రగిరికి చేరాడు.

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు 

ప్రశ్న 1.
ప్రతి వారిలో ఏదో ఒక శక్తి ఉంటుంది. సరైన ప్రేరణ దొరికితే అది వెలికి వస్తుంది. జాంబవంతుడు హనుమంతుని ప్రేరేపించడం వల్ల ఎలా సముద్ర లంఘనానికి సిద్ధపడ్డాడో రాయండి.
జవాబు:
అంగదుని నాయకత్వంలో దక్షిణ దిక్కు వైపుకు బయలుదేరిన హనుమంతుడు మొదలైన వాళ్ళు అణువణువునా గాలిస్తున్నారు. సుగ్రీవుడిచ్చిన గడువు పూర్తయింది. ఏం చేయాలో తోచడం లేదు. తమవాళ్ళు నిరాశ పడకుండా జాగ్రత్తపడ్డాడు అంగదుడు. విరక్తి పొందకుండా ధైర్యోత్సాహాలతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని ప్రేరేపించాడు. అందరూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు కదిలారు. ఒక పెద్ద సముద్రపు ఒడ్డుకు చేరుకున్నారు. ఆ సముద్రాన్ని ‘మహోదధి’ అంటారు. ఉవ్వెత్తున లేచే అలల అలజడి భయాన్ని కలిగిస్తున్నది.

సముద్రతీరంలో వానరులంతా సమావేశ మయ్యారు. ఏం చెయ్యాలో తీవ్రంగా చర్చించు కుంటున్నారు. సీత జాడ కనిపెట్టకుండా సుగ్రీవుని చేర రాదనుకున్నారు.

వానర వీరులు బలపరాక్రమాలను ప్రదర్శించడం ద్వారానే సీతాన్వేషణ సఫలమౌ తుందన్న నిశ్చయానికి వచ్చారు. కాని వంద యోజనాల దూరం ఉన్న లంకకు వెళ్ళి రాగల వారెవ్వరని తర్కించు కుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కార్యహాని కలగకుండా కాపాడగలవాడు హనుమంతు డొక్కడేనని నిగ్గుదేల్చాడు జాంబ వంతుడు. ఆ సమయంలో హనుమంతుడు ఒకచోట ఏకాంతంగా కూర్చుని ఉన్నాడు.

జాంబవంతుడు హనుమంతుడి దగ్గరకు వెళ్ళి అతడి శక్తి యుక్తులెంతటివో తెలుపుతూ ప్రేరే పించాడు. దానికి వానరుల ప్రశంసలు తోడైనాయి. హనుమంతుడు రెట్టించిన ఉత్సాహంతో బలాన్ని పుంజుకున్నాడు. వానరులతో తాను భూమండలాన్ని సముద్రంలో ముంచగలననీ, గ్రహ నక్షత్రాలను అధిగమించగలనని, పర్వతాలను నుగ్గు నుగ్గు చేయగలనని, మహాసముద్రాలను అవలీలగా దాటగలనని ఆత్మశక్తిని ప్రకటించాడు. ఈ విధంగా హనుమంతునిలో శక్తిని జాంబవంతుడు ప్రేరేపించాడు. తద్వారా హనుమంతుడు సముద్రలం ఘనానికి సిద్ధపడేలా చేశాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ

ప్రశ్న 2.
ఒకడు సన్యాసి వేషంలో వచ్చి అపకారం చేశాడు. మరొకడు ఉపకారం చేశాడు. వారెవరు ? వాటి ఫలితాలేమిటి?
జవాబు:
రావణుడు అనే రాక్షసుడు, సన్యాసి వేషంలో వచ్చి పంచవటిలో పర్ణశాలలో ఒంటరిగా ఉన్న సీతను బలవంతంగా అపహరించి లంకకు తీసుకు పోయాడు. ఈ విధంగా సన్యాసి వేషంలో వచ్చిన రావణుడు రామ లక్ష్మణులకు అపకారం చేశాడు.

రామలక్ష్మణులు సుగ్రీవుడితో స్నేహం చేయాలని సుగ్రీవుడు ఉన్న ఋష్యమూక పర్వతం దగ్గరకు వచ్చారు. రామలక్ష్మణులను చూసి వారు తన్ను చంపడానికి అన్న వాలి పంపిన వీరులని సుగ్రీవుడు భయపడ్డాడు. రామలక్ష్మణుల వివరాలు తెలిసికోమని, ఆంజనేయుడు అనే తన మంత్రిని సన్యాసి వేషంలో సుగ్రీవుడు పంపాడు. హనుమంతుడు సన్యాసి రూపంలో వచ్చి, రామ లక్ష్మణులను గూర్చి తెలిసికొని, రామసుగ్రీవులకు మైత్రిని కల్పించాడు. వానర సహాయంతో రాముడు రావణుడిని చంపి, సీతను తీసుకువచ్చాడు.

ఈ విధంగా సన్యాసి రూపంలో వచ్చి ఉపకారం చేసినవాడు హనుమంతుడు. హనుమంతుని సాయం తోనే సీతను అపహరించిన రావణుడిని సంహరించి, రాముడు సీతను తిరిగి తీసుకు వచ్చాడు.

ప్రశ్న 3.
శ్రీరామ సుగ్రీవుల స్నేహం గూర్చి విశ్లేషించండి.
జవాబు:
వాలి సుగ్రీవులు అన్నదమ్ములు. సుగ్రీవుడిని రాజ్యం నుండి తరిమి, సుగ్రీవుని భార్య రుమను వాలి చేపట్టాడు. సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై ఉంటున్నాడు. హనుమంతుడు సుగ్రీవునకు మంత్రి. సుగ్రీవుడితో స్నేహం చేయాలని రామలక్ష్మణులు, ఋష్యమూక పర్వతం దగ్గరకు వచ్చారు. సుగ్రీవుడు ధనుర్ధారులయిన రామలక్ష్మణులను చూసి వారు తన్ను చంపడానికి వాలి పంపించిన వీరులని భయపడ్డాడు. రామలక్ష్మణులను గూర్చి తెలిసికొని రమ్మని తన మంత్రి హనుమంతుడిని సుగ్రీవుడు పంపాడు.

హనుమంతుడు సన్యాసి రూపంలో రామ లక్ష్మణుల వద్దకు వచ్చాడు. రామలక్ష్మణులకు సుగ్రీవుడిని గూర్చి చెప్పి తాను సుగ్రీవుని మంత్రిననీ, పేరు హనుమంతుడనీ చెప్పాడు. హనుమంతుని మాటల్లోని నేర్పును రాముడు మెచ్చుకున్నాడు. లక్ష్మణుడు తమకు సుగ్రీవుని సాయం కావాలన్నాడు. హనుమంతుడు రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొని సుగ్రీవుని దగ్గరకు తీసుకువచ్చాడు. అక్కడ శ్రీరామ సుగ్రీవులు, అగ్నిసాక్షిగా స్నేహితులయ్యారు.

సుగ్రీవుడు రామునితో ప్రాణమిత్రులుగా ఉందామని చెప్పి తనకు వాలి నుండి అభయం కావాలని కోరాడు. వాలిని చంపుతానని రాముడు మాట ఇచ్చాడు. సుగ్రీవుడు సీత విడిచిన నగల మూటను రామునికి చూపించాడు. సుగ్రీవుడు సీతను వెదికించడానికీ, రావణుని చంపడానికీ, రామునికి సాయం చేస్తానన్నాడు. రాముడు తన కాలి బొటనవ్రేలితో దుందుభి శరీరాన్ని 10 యోజనాల దూరం విసరివేశాడు. ఒక బాణంతో ఏడు తాడిచెట్లను పడగొట్టాడు. దానితో సుగ్రీవునికి రాముడి బలంపై నమ్మకం కుదిరింది. రామసుగ్రీవులు ప్రాణమిత్రులు అయ్యారు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ

ప్రశ్న 4.
వాలి సుగ్రీవుల యుద్ధానికి కారణాలను విశ్లేషించండి.
జవాబు:
వాలి సుగ్రీవులు అన్నదమ్ములు. వాలి మహాబలశాలి. వాలి, తండ్రి తర్వాత కిష్కింధకు రాజు అయ్యాడు. మాయావి అనే రాక్షసుడు, వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి సుగ్రీవులు మాయావి వెంటపడ్డారు. మాయావి ఒక గుహలో ప్రవేశించాడు. వాలి, తన తమ్ముడు సుగ్రీవుడిని బిలద్వారం దగ్గర కాపలా ఉండమని, తాను బిలంలోకి వెళ్ళి, మాయావితో సంవత్సరకాలం పోరాడాడు.

ఆ గుహద్వారం నుండి రక్తం బయటకు వచ్చింది. గుహలో వాలి, మాయావి యొక్క అరపులు వినిపించాయి. సుగ్రీవుడు వాలి చనిపోయాడని అనుకొని, మాయావి పైకి రాకుండా గుహద్వారం మూసివేసి, కిష్కింధకు తిరిగి వచ్చాడు.

మంత్రులు వాలి చచ్చిపోయాడనుకొని, సుగ్రీవుడిని కిష్కింధకు రాజును చేశారు. తర్వాత వాలి మాయావిని చంపి, గుహద్వారాన్ని తెరిచి, కిష్కింధకు వచ్చాడు. సుగ్రీవుడు రాజుగా ఉన్నందుకు వాలి కోపించి, సుగ్రీవుడిని రాజ్యభ్రష్టుడిని చేసి, సుగ్రీవుడి భార్య రుమను తాను అపహరించాడు.

సుగ్రీవుడు ప్రాణభయంతో పారిపోయి, భూ మండలం అంతా తిరిగి, ఋష్యమూక పర్వతంపై ఉన్నాడు. మతంగముని శాపం వల్ల వాలి, ఆ పర్వతానికి రాలేడని, సుగ్రీవుడు ఆ పర్వతంపై ఉన్నాడు. ఈ విధంగా అన్నదమ్ములయిన వాలి సుగ్రీవులకు విరోధం వచ్చింది. సుగ్రీవుడు రాముని సహాయంతో వెళ్ళి, వాలితో యుద్ధం చేశాడు.

ప్రశ్న 5.
శ్రీరాముడు వాలిని చంపడం ధర్మమా ? కాదా ? చర్చించండి.
జవాబు:
రామ సుగ్రీవులకు స్నేహం కుదిరింది. సుగ్రీవుడు తనకు తన అన్న వాలి వల్ల భయం ఉందనీ, రాముడి అభయం కావాలనీ రాముడిని అడిగాడు. రాముడు సుగ్రీవుని భార్యను అపహరించిన వాలిని, తప్పక వధిస్తానని సుగ్రీవుడికి మాట ఇచ్చాడు.

వాలిసుగ్రీవుల యుద్ధం భయంకరంగా సాగింది. సుగ్రీవుడి శక్తి తగ్గిపోయింది. అప్పుడు వాలి మీదికి బాణం వేశాడు. ఆ బాణం తగిలి వాలి తెలివి తప్పాడు. తరువాత వాలి తెలివి తెచ్చుకుని రాముడు అధర్మంగా ప్రవర్తించాడని తప్పు పట్టాడు.

రామునికి కాని, రాముని దేశానికి కాని వాలి అపచారం చేయలేదు. అదీగాక వాలి సుగ్రీవుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రాముడు వాలిని దొంగదెబ్బ తీశాడు. అందువల్ల రాముడు వాలిని చంపడం అధర్మమని, వాలి రాముడిని తప్పుపట్టాడు.

వాలి మాటలకు రాముడు జవాబు చెప్పాడు. తమ్ముడి భార్యను చెరబట్టడం వంటి అధర్మాలు చేయడం వల్ల తాను వాలికి మరణదండన విధించానన్నాడు. వాలి, వానరుడు కాబట్టి తాను చెట్టు చాటున ఉండి కొట్టడం, తప్పు కాదన్నాడు. రాముడు మహారాజు కాబట్టి, తప్పు చేసిన వాలిని చంపడం ధర్మమే అవుతుంది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ

ప్రశ్న 6.
‘ఉపకారం జరుగడమే మిత్రుని వల్ల ఫలం’. – రామ సుగ్రీవుల స్నేహం ఆధారంగా దీనిని వివరించండి. (March 2019)
(లేదా)
రామాయణంలోని స్నేహధర్మాన్ని గురించి సొంతమాటల్లో రాయండి. (March 2016)
జవాబు:
రామాయణంలో స్నేహ ధర్మాన్ని గురించి తెలిపే వృత్తాంతము, ‘రామ సుగ్రీవుల’ వృత్తాంతము. సుగ్రీవుడి అన్న వాలి. వాలి సుగ్రీవుడి భార్యను అపహరించి సుగ్రీవుణ్ణి రాజ్యం నుండి దూరంగా తరిమివేశాడు. సుగ్రీవుడు ప్రాణభయంతో ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడు.

శ్రీరాముడి భార్యను రావణుడు అపహరించాడు. రామలక్ష్మణులు సీతను వెదకుతున్నారు. కబంధుడు, రాముణ్ణి సుగ్రీవుడితో స్నేహం చెయ్యమని చెప్పాడు. రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం దగ్గరకు వచ్చారు. రామలక్ష్మణులను చూసి మొదట సుగ్రీవుడు భయపడి హనుమంతుడిని సన్యాసి రూపంలో రామలక్ష్మణుల దగ్గరకు పంపాడు.

హనుమంతుడు సుగ్రీవుడి దగ్గరకు రామలక్ష్మణులను తీసుకువెళ్ళాడు. శ్రీరామ సుగ్రీవులు, అగ్నిసాక్షిగా స్నేహితులయ్యారు. సుగ్రీవుడు తనకు అన్న వాలి నుండి భయం లేకుండా అభయం ఇమ్మని రాముడిని అడిగాడు. వాలిని తాను చంపుతానని రాముడు మాట ఇచ్చాడు. సీతను తాను వెదికిస్తానని, రావణుడితో యుద్ధంలో తాను సాయం చేస్తానని, సుగ్రీవుడు రామునికి మాట ఇచ్చాడు.

రామ సుగ్రీవుల స్నేహం ఫలించింది. రాముడు వాలిని చంపి సుగ్రీవుణ్ణి కిష్కింధ రాజ్యానికి రాజును చేశాడు. సుగ్రీవుడు రామునికి మాట ఇచ్చినట్లు, సీతాదేవిని వెదికించడానికి వానరులను పంపాడు. హనుమంతుడు, సుగ్రీవుడికి మంత్రి. అతడు సీత జాడను తెలుసుకు వచ్చాడు. సుగ్రీవుడు తన వానర సైన్యంతో లంకకు వెళ్ళి రావణుడిని చంపడంలో రాముడికి మంచి సాయం చేశాడు.

ఈ విధంగా స్నేహితులు ఒకరి కొకరు, మంచి సాయం చేసుకున్నారు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ

ప్రశ్న 7.
వాలి-శ్రీరాముని మధ్య జరిగిన సంవాదం సారాంశం రాయండి. (March 2017)
జవాబు:
వాలి-సుగ్రీవుల సంవాదము : వాలి సుగ్రీవులు యుద్ధం చేస్తుండగా, శ్రీరాముడు విషసర్పం వంటి బాణాన్ని వాలి మీదికి వదిలాడు. వాలి నేలమీదికి వాలిపోయాడు దానితో వాలి స్పృహ కోల్పోయాడు. వాలి కొంతసేపటికి తేరుకొని రాముడితో ఇలా అన్నాడు.

వాలి మాటలు : “ఓ రామా” ఉత్తముడివి అని పేరు పొందిన నీవు, ఇంత అధర్మంగా ఎందుకు ప్రవర్తించావు ? నేను నీకు గాని, నీ దేశానికి గాని, ఎప్పుడూ అపకారం చేయ తలపెట్టలేదు. అలాంటప్పుడు నన్ను ఎందుకు చంపవలసి వచ్చింది? నిన్ను ఎదిరించి నీతో నేను యుద్ధం చేయనే లేదు. నేను ఇంకొకరితో యుద్ధం చేస్తుండగా, నీవు నాపై ఎందుకు దొంగదెబ్బ తీశావు ?

సీతాదేవి కోసం నీవు సుగ్రీవుడిని ఆశ్రయించడం కన్న, నన్నే కోరి ఉంటే బాగుండేది. ఒక్క రోజులోనే సీతాదేవిని తెచ్చి, నీకు నేను అప్ప జెప్పేవాడిని. రావణుడిని బంధించి తెచ్చి నీ ముందు ఉంచేవాడిని.” అని వాలి రాముడితో అన్నాను. వాలి మాటలు విని, రాముడు వాలితో ఇలా చెప్పాడు.

రాముని మాటలు : “వాలీ ! నీవు చెప్పినది సరిగా లేదు. నీవు నీ తమ్ముడి భార్యను చెరపట్టడం వంటి అధర్మకార్యాలు చేసినందువల్ల, నేను నీకు మరణదండన విధించాను. నీవు వానరుడిని కనుక నేను చాటుగా ఉండి నిన్ను కొట్టి చంపడం తప్పుకాదు” అని రాముడు వాలికి చెప్పాడు.

ప్రశ్న 8.
వాలి, సుగ్రీవుల విరోధం గురించి రాయండి.
జవాబు:
వాలి, సుగ్రీవులు వానరులు. వీరు అన్నదమ్ములు. అందులో వాలి పెద్దవాడు. గొప్ప బలశాలి. తండ్రి తరువాత వాలి కిష్కింధకు రాజు అయ్యాడు. మాయావి అనే రాక్షసుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి సుగ్రీవులు మాయావి వెంటబడ్డారు. మాయావి గుహలో ప్రవేశించాడు. వాలి సుగ్రీవుడిని గుహద్వారం వద్ద ఉండమని చెప్పి తాను గుహలోకి వెళ్ళి మాయావితో యుద్ధం చేశాడు.

సంవత్సరం తర్వాత గుహలోంచి రక్తం బయటకు వచ్చింది. మాయావి అరుపులు వినిపించాయి. దానితో వాలి చనిపోయాడని భావించి, సుగ్రీవుడు బిలద్వారం మూసి, కిష్కింధకు వచ్చాడు. మంత్రులు సుగ్రీవుని రాజును చేశారు. తరువాత వాలి వచ్చి, సుగ్రీవునిపై కోపించి, సుగ్రీవుడిని తరిమి, అతని భార్య రుమను అపహరించాడు.

సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై ఉండేవాడు. మతంగ మహర్షి శాపం వల్ల వాలి అక్కడకు రాలేడు. హనుమంతుడు రామసుగ్రీవులకు మైత్రిని కూర్చాడు. రాముడు వాలిని చంపి, సుగ్రీవుని కిష్కింధకు రాజును చేస్తానన్నాడు.

రాముడు సహాయంతో సుగ్రీవుడు వాలిపై యుద్ధానికి వెళ్ళాడు. వాలి సుగ్రీవులు ఒకే పోలిక. అందువల్ల రాముడు వాలిపై బాణం వేయలేదు. సుగ్రీవుడు యుద్ధంలో ఓడిపోయాడు.

రాముడు సుగ్రీవుని మెడలో గుర్తుగా నాగకేసరపు లతను వేయించి తిరిగి వాలిపై యుద్ధానికి సుగ్రీవుని పంపాడు. వాలి సుగ్రీవులు యుద్ధం చేస్తుండగా రాముడు వాలిని బాణంతో కొట్టి చంపాడు. వాలి తన మెడలోని సువర్ణమాలను సుగ్రీవునికి ఇచ్చాడు. వాలి తారా అంగదులను సుగ్రీవునకు అప్పగించాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ

ప్రశ్న 9.
రామసుగ్రీవుల మైత్రిని గురించి రాయండి.
జవాబు:
వాలి, సుగ్రీవులు అన్నదమ్ములు. రామలక్ష్మణులు సుగ్రీవునితో మైత్రి చేయాలని సుగ్రీవుడు ఉంటున్న ఋష్యమూక పర్వతం దగ్గరకు వచ్చారు. సుగ్రీవుడు రామలక్ష్మణులను చూసి, వాలి తన్ను చంపడానికి పంపిన వీరులని భయపడ్డాడు. రామలక్ష్మణులను గురించి తెలుసుకోమని తన మంత్రి హనుమంతుని సుగ్రీవుడు పంపాడు.

హనుమ సన్న్యాసి రూపంలో రామలక్ష్మణుల దగ్గరికి వచ్చాడు. హనుమంతుడు సుగ్రీవుని గూర్చి రామలక్ష్మణులకు చెప్పి, తాను సుగ్రీవుని మంత్రిననీ, తన పేరు హనుమంతుడనీ చెప్పాడు. హనుమ మాటల్లోని నేర్పును రాముడు మెచ్చుకున్నాడు. హనుమతో లక్ష్మణుడు తమకు సుగ్రీవుని సాయం కావాలని చెప్పాడు. హనుమ రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొని, సుగ్రీవుని వద్దకు తీసుకువచ్చాడు. శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా స్నేహితులయ్యారు.

సుగ్రీవుడు రామునితో “ప్రాణమిత్రులుగా ఉందాం” అని చెప్పి, తనకు వాలి భయం లేకుండా అభయం కావాలి అన్నాడు. వాలిని చంపుతానని రాముడు మాట ఇచ్చాడు. సుగ్రీవుడు రామునితో “ఒక రాక్షసుడు స్త్రీని బలవంతంగా తీసుకుపోవడం తాను చూశాననీ, ఆమె “రామా! లక్ష్మణా!” అని గట్టిగా అరుస్తుండగా తాను విన్నాననీ చెప్పి ఆమె జారవిడిచిన నగల మూటను తెప్పించి రాముడికి చూపించాడు. రాముడు ఆ నగలను చూసి ఏడ్చాడు. లక్ష్మణుడు నగలలోని కాలి అందెలు తన వదిన సీతమ్మవే అన్నాడు.

సుగ్రీవుడు సీతను వెదికించడానికీ, రావణుని చంపడానికీ, రాముడికి సాయం చేస్తానన్నాడు. రామ సుగ్రీవులు ప్రాణమిత్రులు అయ్యారు. శ్రీరాముడు కాలి బొటన వ్రేలుతో దుందుభి శరీరాన్ని 10 యోజనాల దూరం చిమ్మివేశాడు. ఒక్క బాణంతో ఏడు తాడిచెట్లను కూల్చి రాముడు సుగ్రీవుడికి తన బలంపై నమ్మకం కల్గించాడు.

సుగ్రీవుడు రామలక్ష్మణులతో కలిసి కిష్కింధకు వెళ్ళి వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి సుగ్రీవులు ఒకే పోలికగా ఉన్నారు. అందువల్ల రాముడు వారిని గుర్తించలేక, బాణం వేయలేదు. సుగ్రీవుడు ఓడిపోయాడు.

రాముడు, సుగ్రీవుడి మెడలో “నాగకేసరపులత”ను గుర్తుగా వేయించాడు. సుగ్రీవుడు తిరిగి వాలిని యుద్ధానికి రమ్మని కవ్వించాడు. రాముని సాయంతో సుగ్రీవుడు వచ్చాడనీ, యుద్ధానికి వెళ్ళవద్దనీ, వాలికి అతడి భార్య తార చెప్పింది. వాలి సుగ్రీవులకు భయంకర యుద్ధం జరిగింది. రాముడు విషసర్పం వంటి బాణం వేసి, వాలిని సంహరించాడు. సుగ్రీవుడు కిష్కింధకు రాజయ్యాడు. సుగ్రీవుడు సీతను వెదికించడానికి వానరవీరులను పిలిచాడు. అన్ని దిక్కులకూ వానరులను సీతాన్వేషణ కోసం పంపాడు. దక్షిణ దిశకు అంగదుని నాయకత్వంలో హనుమంతుడు, జాంబవంతుడు
మొదలయిన వానరులను పంపాడు.

దక్షిణ దిశకు వెళ్ళిన వానరులకు ‘సంపాతి’ పక్షి కనబడింది. సంపాతి పక్షి, దివ్యజ్ఞానంతో రావణుని వృత్తాంతాన్ని వానరులకు చెప్పింది. జాంబవంతుడు హనుమంతునికి ఉత్సాహం కలిగించాడు. హనుమ తాను సముద్రాన్ని దాటి వెళ్ళి లంకలోని సీత జాడను తెలుసుకుంటానని మహేంద్రగిరిపైకి చేరాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ

ప్రశ్న 10.
హనుమంతుడు సీతాన్వేషణకై బయలుదేరిన విధమెట్టిది ?
జవాబు:
సుగ్రీవుడు సీతాన్వేషణకై వానరులను అన్ని దిశలకూ పంపాడు. అంగదుని నాయకత్వంలో హనుమ, జాంబవంతుడు మొదలయిన వీరులను దక్షిణ దిక్కుకు పంపాడు. తూర్పు, పడమర, ఉత్తర దిక్కులకు వెళ్ళిన వానరులు, వట్టి చేతులతో తిరిగివచ్చారు.

అంగదుని నాయకత్వంలో దక్షిణ దిశకు బయలుదేరివచ్చిన వానర వీరులు అణువణువూ వెదకుతున్నారు. సుగ్రీవుడు ఇచ్చిన గడువు నెలపూర్తి అయ్యింది. అంగదుడు ఉత్సాహంతో ముందుకు కదలుదాము అన్నాడు. వారు ‘ఋక్షబిలము’ అనే గుహ దగ్గరికి వచ్చారు. వానరులకు ఆకలి, దాహము పట్టుకొంది. అక్కడ ‘స్వయంప్రభ’ అనే యోగిని దయతో, వానరులు ఆకలిదప్పులు తీర్చుకొన్నారు. ఆమె ప్రభావంతో, వారు సముద్రతీరానికి చేరారు. వానరులు సీత జాడ తెలిశాకే సుగ్రీవుని కలుద్దాం అనుకున్నారు.

వానరుల మాటలో ‘జటాయువు’ మాట వచ్చింది. ఈ జటాయువు సోదరుడు ‘సంపాతి’. సంపాతి తన దివ్యదృష్టితో లంకను గురించి వానరులకు చెప్పాడు. లంకకు వెళ్ళాలంటే సముద్రాన్ని దాటాలి. అది ఎవరివల్ల ఔతుందో అని వానరులు చర్చించుకున్నారు. హనుమంతుడు ఒక్కడే సముద్రాన్ని దాటగలడని చివరకు వారు నిశ్చయించారు.

జాంబవంతుడు హనుమంతుడికి, అతని శక్తియుక్తులను గురించి తెలిపాడు. హనుమ బలాన్ని పుంజుకున్నాడు. దానితో హనుమ వానరులతో “నేను వేయి పర్యాయాలు మేరు పర్వతాన్ని చుట్టి రాగలను. సముద్రాలను దాటగలను” అని చెప్పాడు.

హనుమ మాటలకు జాంబవంతుడు ఆనందించాడు. “నీ ధైర్యోత్సాహాలకు తగు విధంగా మాట్లాడావు. నీవు ఋషులు, గురువుల అనుగ్రహంతో సముద్రాన్ని దాటు. నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మన వానరుల ప్రాణాలన్ని నీపై ఆధారపడి యున్నాయి” అని జాంబవంతుడు హనుమకు చెప్పాడు.

హనుమ, తాను ఎగరడానికి ‘మహేంద్రగిరి’ తగినదని, నిశ్చయించి అక్కడకు చేరాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ

ప్రశ్న 11.
వాలి, సుగ్రీవుల యుద్ధాన్ని వర్ణించండి. వాలి వధ న్యాయమా ? కాదా ? వివరించండి.
జవాబు:
సుగ్రీవుడు రామలక్ష్మణులతో కలిసి కిష్కింధకు వెళ్ళాడు. సుగ్రీవుడు భయంకరంగా గర్జిస్తూ అన్న వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి, సుగ్రీవుల మధ్య యుద్ధం భయంకరంగా సాగింది. రాముడు వాలిని చంపుతానని సుగ్రీవుడికి మాట ఇచ్చాడు. వాలి, సుగ్రీవులు ఒకే పోలికలో ఉండడం వల్ల రాముడు వాలిని గుర్తించలేకపోయాడు. సుగ్రీవుడు వాలి పరాక్రమాన్ని తట్టుకోలేక రాముడివైపు చూశాడు. రాముడు కనబడలేదు. సుగ్రీవుడు ప్రాణభయంతో పరుగుదీశాడు.

శ్రీరాముడు సుగ్రీవుడి వద్దకు వచ్చాడు. సుగ్రీవుడు సిగ్గుపడి, రాముడు తనకు సాయం చేయలేదని నిలదీశాడు. రాముడు సుగ్రీవుడికి అసలు విషయం చెప్పి, సుగ్రీవుడి మెడలో “నాగ కేసరపులత”ను లక్ష్మణుడిచే వేయించాడు. తిరిగి సుగ్రీవుడు కిష్కింధకు వెళ్ళి వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి భార్య తార వాలిని యుద్ధానికి వెళ్ళవద్దని హెచ్చరించింది. వాలి సుగ్రీవులు పోరాడారు.

శ్రీరాముడు విషసర్పంతో సమానమైన బాణంతో వాలిని కొట్టాడు. వాలి స్పృహ కోల్పోయి, తరువాత తేరుకొన్నాడు. తన్ను అధర్మంగా చంపాడని వాలి రాముని నిందించాడు.
వాలి వధ న్యాయమా ?

  1. వాలి వానరుడు అనగా జంతువు. జంతువును చెట్టు చాటునుండి రాముడు బాణంతో కొట్టడంలో తప్పులేదు.
  2. వాలి, తన తమ్ముడు సుగ్రీవుని భార్య రుమను చెరబట్టాడు. వాలి అధర్మాలకు ఒడిగట్టడం వల్ల రాజయిన రాముడు వాలికి మరణదండన విధించాడు.

కాన రాముడు వాలిని చంపడంలో తప్పులేదు.

ప్రశ్న 12.
శ్రీరామ సుగ్రీవుల మైత్రి కలిపిందెవరు ? ఎలా కలిపేడో వివరించండి.
జవాబు:
పంపాసరోవర ప్రాంతంలో రామలక్ష్మణులు ఉన్నారు. వారిని సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై నుండి చూశాడు. తన అన్న అయిన వాలి తనను చంపడానికి వారిని పంపాడేమోనని భయపడ్డాడు.

హనుమంతుని చూసి రమ్మన్నాడు. హనుమ సన్యాసి వేషంలో వెళ్ళి వారిని సమీపించాడు. తనను తాను చక్కని మాటలతో పరిచయం చేసుకొన్నాడు. సుగ్రీవుని గుణగణాలను చాలా చక్కగా వివరించాడు. తన మాటల చాకచక్యంతో శ్రీరాముని మనసును గెలిచాడు.

లక్ష్మణుడు సీతాపహరణ వృత్తాంతం చెప్పాడు. సుగ్రీవుని స్నేహం కావాలన్నాడు. రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొన్నాడు. సుగ్రీవుని వద్దకు చేర్చాడు. అగ్నిసాక్షిగా శ్రీరామ సుగ్రీవులు మిత్రులయ్యారు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ

ప్రశ్న 13.
లక్ష్మణుడు కిష్కింధకు ఎందుకు వెళ్ళాడు ? అక్కడ ఏమైంది ?
జవాబు:
వాలిని శ్రీరాముడు సంహరించాడు. కిష్కింధకు సుగ్రీవుని రాజుకమ్మని రాముడు ఆజ్ఞాపించాడు. వానాకాలం వెళ్ళాక సీతాన్వేషణ ప్రారంభించమన్నాడు. శరత్కాలం వచ్చినా సీతాన్వేషణ ప్రారంభించలేదు. అప్పుడు హనుమ గుర్తుచేశాడు. నీలుడిని సైన్యసమీకరణ చేయమని సుగ్రీవుడు ఆజ్ఞాపించాడు. ఇది రామునికి తెలియదు. లక్ష్మణుణ్ణి పిలిచి సుగ్రీవుని వద్దకు వెళ్ళమన్నాడు.

అందుకు లక్ష్మణుడు సుగ్రీవుని వద్దకు వెళ్ళాడు. అక్కడ సుగ్రీవుడు రాజభోగాలనుభవిస్తున్నాడు. అది చూశాడు లక్ష్మణుడు. తన అన్నగారు దీనస్థితిలో ఉంటే, భోగాలనుభవిస్తున్న సుగ్రీవుడిని చూసిన లక్ష్మణునికి చాలా కోపం వచ్చింది. “ఆ కోపానికి సుగ్రీవుడు కూడా చాలా భయపడ్డాడు. మందిర ద్వారం దగ్గరికి వచ్చిన లక్ష్మణుడితో మాట్లాడటానికి తార వెళ్లింది. సీతాన్వేషణకు ప్రయత్నాలు ప్రారంభించేడని ఆమె చెప్పింది. దానితో లక్ష్మణుడు శాంతించాడు. అప్పుడు సుగ్రీవుడు క్షమార్పణ కోరాడు. లక్ష్మణుడు తనతో రమ్మని సుగ్రీవుని రాముని దగ్గరకు తీసుకొని వెళ్ళాడు.

ప్రశ్న 14.
సీతాన్వేషణా వ్యూహాన్ని వివరించండి.
జవాబు:
శ్రీరాముని సూచనలను అనుసరించి వానరులను సుగ్రీవుడు నాలుగు దిక్కులకు పంపాడు. సీతాన్వేషణ పదిరోజులలో పూర్తి చేయాలని సుగ్రీవుడు గడువు విధించాడు.

తూర్పు దిక్కుకు ‘వినతు’ని నాయకత్వంలో వానరులు వెళ్ళారు. దక్షిణ దిక్కుకు ‘అంగదుడు’ నాయకుడు. అందులో హనుమంతుడు, జాంబవంతుడు వంటి ప్రముఖులు ఉన్నారు. ఉత్తరానికి శతబలి, పడమరకు సుషేణుడు నాయకత్వం వహించారు.

ఒక్కొక్క దిక్కుకు వెళ్ళవలసిన మార్గాలు, అక్కడి విశేషాలు వివరంగా సుగ్రీవుడు చెప్పాడు. ఎంతమందిని ఎన్నిదిక్కులకు పంపినా హనుమంతునిపైనే సుగ్రీవునకు నమ్మకం. అతడే సీతాన్వేషణ సమర్థవంతంగా చేయగలడని శ్రీరామునకు కూడా నమ్మకం. అందుకే అత్యంత క్లిష్టమైన దక్షిణ దిక్కుకు హనుమను పంపారు. ఆయా దిక్కులతో పరిచయం గల వారిని, శక్తిసామర్థ్యాలను బట్టి ఆయా దిక్కులకు పంపారు. ఇదే సీతాన్వేషణలో సుగ్రీవుడు అనుసరించిన వ్యూహం.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ

ప్రశ్న 15.
సీతాన్వేషణలో కీలకమైన విషయం ఎవరు చెప్పారు ? ఆ క్రమం వివరించండి.
జవాబు:
అన్ని దిక్కులనుండీ వానరులు నిరాశతో తిరిగి వచ్చారు. సీతాన్వేషణ సఫలం కాలేదని వివరించారు. రావణుడు సీతను దక్షిణం వైపే తీసుకెళ్ళాడు. కనుక అటువైపే ఉండవచ్చని ఆశ. కాని, ఎంత వెతికినా సీతాదేవి జాడ తెలియలేదు. అందరికీ నిరాశ కల్గింది.

ఈ పరిస్థితులలో ‘ఋక్షబిలం’ చేరారు. అక్కడ ‘స్వయంప్రభ’ అనుగ్రహంతో ఆకలిదప్పులు తీర్చుకొన్నారు. ఆమె తపః ప్రభావం వలన పెద్దసముద్రం ఒడ్డుకు చేరారు.

అక్కడ సంపాతిని చూశారు. సంపాతి తన దివ్యదృష్టితో చూసి, సీతాదేవి లంకలో ఉన్నట్లు చెప్పాడు. దానితో సీతాన్వేషణలో కీలకమైన విషయం తెలిసింది. ఈ మంచిపని చేసినందుకు సంపాతికి విరిగిపోయిన రెక్కలు తిరిగి వచ్చాయి.

పరిచిత గద్యాలు

ప్రశ్న 1.
కింది గద్యాన్ని చదువండి. (March 2017)

సుగ్రీవ హనుమదాదులు శ్రీరాముని దగ్గరకు వచ్చారు. హనుమంతుడు శ్రీరామునితో సుగ్రీవుని పట్టాభిషేక విషయం ప్రస్తావించాడు. దీనికోసం కిష్కింధకు రమ్మని ప్రార్థించాడు. తండ్రి ఆజ్ఞ మేరకు పద్నాలుగు సంవత్సరాల వరకు ఏ గ్రామంలో గాని, నగరంలో గాని, తాను అడుగుపెట్టనని చెప్పి పితృవాక్య పరిపాలనను మరోమారు చాటుకున్నాడు శ్రీరాముడు. సుగ్రీవునికి శుభం పలికాడు. తాను ప్రసవణగిరి మీదే ఉంటానన్నాడు. వర్షాకాలం పోయాక సీతాన్వేషణ ప్రయత్నం ప్రారంభించమని సుగ్రీవుణ్ణి ఆదేశించాడు. సరేనన్నాడు సుగ్రీవుడు. కిష్కింధకు రాజుగా సుగ్రీవుడు, యువరాజుగా అంగదుడు పట్టాభిషిక్తులయ్యారు. కాలం గడుస్తూన్నది. శరత్కాలం వచ్చింది. సీతాన్వేషణ కార్యభారాన్ని సుగ్రీవుడికి గుర్తు చేశాడు హనుమంతుడు.

కింది కీలక పదాల అర్థాలను ఒక్క వాక్యంలో వివరించండి.
1. శుభం పలుకడం : ………………….
జవాబు:
శుభము కలగాలని ఆశీర్వదించాడు.

2. ప్రస్తావన : ………………….
జవాబు:
ముచ్చటించుట

3. పితృవాక్య పరిపాలన : ……………………….
జవాబు:
తండ్రి చెప్పిన మాటను పాటించడం.

4. అన్వేషణ : ……………………
జవాబు:
వెదకడం

5. కార్యభారం : ……………………….
జవాబు:
పని యొక్క బరువు

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ

ప్రశ్న 2.
కింది పేరాను చదవండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. (June 2015)

జాంబవంతుడు హనుమంతుణ్ణి చేరాడు. అతని శక్తియుక్తులెంతటివో తెలుపుతూ ప్రేరేపించాడు. దీనికి వానరుల ప్రశంసలు తోడైనాయి. ఇంకేముంది ? హనుమంతుడు రెట్టించిన ఉత్సాహంతో బలాన్ని పుంజుకున్నాడు. అద్భుతమైన తేజస్సుతో వెలుగుతున్నాడు. వానరులతో “నేను మహా సముద్రాలను అవలీలగా దాటగలనని” ఆత్మశక్తిని ప్రకటించాడు. ప్రతివారిలో ఏదో ఒక శక్తి ఉంటుంది. సరైన ప్రేరణ దొరికితే అది వెలికి వస్తుంది. హనుమంతుడి మాటలకు
జాంబవంతుడు ఆనందించాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. జాంబవంతుడు హనుమంతుణ్ణి ఎలా ప్రేరేపించాడు ?
జవాబు:
జాంబవంతుడు హనుమంతుడిని చేరి, హనుమంతుడి శక్తియుక్తులు ఎటువంటివో ఆయనకు తెలుపుతూ, హనుమంతుడిని ప్రేరేపించాడు.

2. ప్రేరణ వలన ఏమి బయటపడుతుంది ?
జవాబు:
ప్రేరణ వలన వ్యక్తిలోని శక్తి వెలికి వస్తుంది.

3. హనుమంతుడు వానరులతో ఏమన్నాడు?
జవాబు:
హనుమంతుడు తాను మహాసముద్రాలను అవలీలగా దాటగలనని వానరులతో అన్నాడు.

4. హనుమంతుడి మాటలు ఏమి తెలియజేస్తున్నాయి ?
జవాబు:
హనుమంతుడి మాటలు, ఆతని ఆత్మశక్తిని, ఉత్సాహంతో కూడిన అతని బలాన్నీ, తేజస్సునూ తెలియజేస్తున్నాయి.

5. పై పేరాకు తగిన శీర్షికను సూచించండి.
జవాబు:
“సముద్ర లంఘనానికి సిద్ధపడ్డ హనుమంతుడు” అనే శీర్షిక సరిపడుతుంది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ

ప్రశ్న 3.
ఈ క్రింది పేరాను చదివి దిగువ నిచ్చిన పదాలకు వివరణ వ్రాయండి.

“సీతాన్వేషణకు బయలుదేరి నెలరోజులు కావస్తున్నది. తూర్పు, పడమర, ఉత్తర దిక్కులకు వెళ్ళినవాళ్ళు, తీవ్రంగా వెదకి రిక్త హస్తాలతో వెనుదిరిగారు. గడువు ముగిసే నాటికి ప్రస్రవణగిరిలో శ్రీరామునితో ఉన్న సుగ్రీవుడి దగ్గరకు చేరుకున్నాడు. సీత జాడ కోసం చేసిన కృషి ఫలించలేదని విన్నవించుకున్నారు. హనుమంతుడు ఈ విషయంలో కృతకృత్యుడు ఔతాడని ధీమా వ్యక్తం చేశారు.

అంగదుని నాయకత్వంలో దక్షిణం వైపుకు బయలుదేరిన హనుమంతుడు మొదలైనవాళ్ళు అణువణువునా గాలిస్తున్నారు. సుగ్రీవుడిచ్చిన గడువు పూర్తయింది. ఏం చేయాలో తోచడం లేదు. తమవాళ్ళు నిరాశపడకుండా జాగ్రత్తపడ్డాడు. అంగదుడు విరక్తి పొందకుండా ధైర్యోత్సాహాలతో ముందుకు సాగితే, విజయం వరిస్తుందని ప్రేరేపించాడు. అందరూ రెట్టించిన ఉత్సాహంతో ముందు కదిలారు.

1. రిక్తహస్తాలతో
జవాబు:
అనగా వట్టి చేతులతో, అంటే వెళ్ళిన పని జరుగకాకుండానే అని భావము.

2. విన్నవించుకున్నారు
జవాబు:
అంటే మనవి చేసుకున్నారు, అనగా చెప్పారు అని భావము.

3. కృతకృత్యుడు
జవాబు:
అంటే కృతార్థుడు – అనగా చేయవలసిన పని పూర్తి చేసినవాడని భావము.

4. ధీమా వ్యక్తం చేశారు
జవాబు:
అంటే ధైర్యాన్ని వెలిబుచ్చారు.

5. అణువణువునా
జవాబు:
ప్రతి చిన్న ప్రదేశమందూ అని

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ

ప్రశ్న 4.
ఈ క్రింది పేరాను చదివి, క్రింద ఇచ్చిన పదాలను ఒక్క వాక్యంలో వివరించండి.

శ్రీరామం “లక్ష్మణుడు కిష్కింధకు పయనమయ్యాడు. సుగ్రీవుడు రాజభోగాలతో ఓలలాడుతున్నాడు. సీతాదేవి ఎడబాటువల్ల నిలువునా నీరవుతున్న అన్నగారు, నిర్లక్ష్యంతో సుగ్రీవుడు – లక్ష్మణుని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బుసలు కొడుతున్నాడు. అతని ముందుకు రావడానికి ఎవరికీ కాళ్ళాడడం లేదు. వానరులూ, మంత్రులే కాదు. సుగ్రీవుడి పరిస్థితి అంతే. మందిర ద్వారం దగ్గరికి వచ్చిన లక్ష్మణుడితో మాట్లాడడానికి తార వెళ్ళింది. స్త్రీల పట్ల కోపం ప్రదర్శించగూడదని శాంతించాడు. లక్ష్మణుడు శ్రీరాముని దయవల్లనే తానీ స్థితిలో ఉన్నానని కృతజ్ఞత ప్రకటించాడు సుగ్రీవుడు. మహాపరాక్రమశాలి శ్రీరామునికి తన సహాయం నిమిత్త మాత్రమేనన్నాడు. తనవైపు నుంచి ఏదైనా తప్పు జరిగితే మన్నించమన్నాడు.

1. ఓలలాడుతున్నాడు.
జవాబు:
అంటే ఓల, ఓల అంటూ నీటిలో ఆడుతున్నాడని అర్థం, మునిగి తేలుతున్నాడని భావం.

2. నిలువునా నీరవుతున్న
జవాబు:
పూర్తిగా నాశనము అవుతున్న అని అర్ధము. పూర్తిగా అధైర్యపడుతున్నాడని భావం.

3. ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
జవాబు:
కోపం లాగా ఎక్కువగా పొంగి ప్రవహించిందని భావం.

4. కాళ్ళాడడం లేదు
జవాబు:
కాళ్ళు కదలడంలేదు. అంటే ముందుకు అడుగుపడలేదని భావము.

5. కృతజ్ఞత ప్రకటించాడు.
జవాబు:
చేసిన మేలును వెల్లడించాడని చేసిన ఉపకారాన్ని గుర్తు చేశాడని భావము.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ

ప్రశ్న 5.
కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

వాలి వధకు ఇక ఏ మాత్రం ఆలస్యం వద్దని శ్రీరాముణ్ణి తొందరపెట్టాడు. అందరూ కిష్కింధకు వెళ్ళారు. సుగ్రీవుడు భయంకరంగా గర్జిస్తూ వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. మహాబలశాలి అయిన వాలి క్షణాలలో అక్కడ వాలాడు. ఇద్దరి యుద్ధం అక్కడ భయానక వాతావరణాన్ని సృష్టించింది. వాలిసుగ్రీవులు ఒకే పోలికతో ఉన్నారు. అందుకే శ్రీరాముడు వాలిని స్పష్టంగా గుర్తించలేకపోయాడు. వాలి విజృంభణకు తట్టుకోలేకపోయాడు సుగ్రీవుడు. శ్రీరాముడి కొరకు చూశాడు. కనిపించలేదు. గుండె గుభేలుమంది. ప్రాణభయంతో ఋష్యమూకానికి పరుగులు తీశాడు సుగ్రీవుడు. అక్కడకు వెళ్ళలేని వాలి సుగ్రీవుడితో ‘బతికావు పో’ అని మరలిపోయాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. వాలి, సుగ్రీవులు ఎవరు ?
జవాబు:
వాలి, సుగ్రీవులు అన్నదమ్ములు.

2. ఇద్దరిలో బలవంతుడు ఎవరు ?
జవాబు:
వాలి

3. శ్రీరాముని శరణువేడినదెవరు ?
జవాబు:
సుగ్రీవుడు

4. యుద్ధంలో ఎవరు ఓడిపోయారు ?
జవాబు:
సుగ్రీవుడు

5. సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం పైకి ఎందుకు వెళ్ళిపోయాడు ?.
జవాబు:
అక్కడకు తన అన్న వాలి రాడని సుగ్రీవునకు తెలుసు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ

ప్రశ్న 6.
కింది గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

శ్రీరాముడి శోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు. సీతాదేవిని తీసుకురావడంలో తన వంతు సాయం చేస్తానన్నాడు. రావణుణ్ణి సపరివారంగా హతమార్చేందుకు తన శక్తియుక్తులనన్నింటినీ వినియోగిస్తానన్నాడు. దుఃఖం అనర్థదాయకం కనుక ఎప్పుడూ దుఃఖించవద్దన్నాడు. ఎల్లప్పుడు దుఃఖించేవారికి సుఖముండదు. ‘తేజస్సు క్షీణిస్తుంది. ప్రాణాలు నిలపడమే కష్టంగా ఉంటుంది. కనుక దుఃఖస్థితి నుండి బయటపడమని ధైర్యవచనాలు చెప్పాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. శ్రీరాముడు ఎందుకు శోకించాడు?
జవాబు:
తన భార్య సీతను రావణుడు అనే రాక్షసుడు అపహరించి తీసుకొని వెళ్ళాడని తెలిసి రాముడు శోకించాడు.

2. సుగ్రీవుడు దేని కొఱకు తన శక్తిని వినియోగిస్తానన్నాడు ?
జవాబు:
సపరివారంగా రావణుణ్ణి హతమార్చేందుకు తన శక్తియుక్తులనన్నింటినీ వినియోగిస్తానన్నాడు.

3. దుఃఖం వలన ఏం కలుగుతుంది?
జవాబు:
దుఃఖం వలన సుఖము ఉండదు. తేజస్సు క్షీణిస్తుంది. దుఃఖించే వారి ప్రాణాలు నిలవడం కూడా కష్టంగా ఉంటుంది.

4. శ్రీరాముడిని ఓదార్చినవారెవరు ?
జవాబు:
శ్రీరాముడిని సుగ్రీవుడు ఓదార్చాడు.

5. ఈ భాగం ఏ కాండంలోనిది?
జవాబు:
ఈ భాగం ‘కిష్కింధాకాండం’ లోనిది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ

ప్రశ్న 7.
కింది గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

“కిష్కింధకు ప్రయాణమయ్యారందరూ. సుగ్రీవుడు వాలిని మళ్ళీ యుద్ధానికి ఆహ్వానించాడు. వాలి అడుగు ముందుకు వేశాడు. కాని అతని భార్య తార అడ్డుపడింది. ఒకసారి ఓడిపోయి దెబ్బలు తిన్న సుగ్రీవుడు మళ్ళీ ఆహ్వానించడం వెనుక ఏదో ఆంతర్యం ఉందని అభిప్రాయపడింది. సుగ్రీవుడికి శ్రీరాముడు అండగా ఉన్నాడన్న విషయాన్ని ప్రస్తావించింది. పెడచెవిన పెట్టాడు వాలి. యుద్ధ దిశగా అడుగులు వేశాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. వాలి క్షేమం కోరేవారెవరు?
జవాబు:
వాలి క్షేమాన్ని అతని భార్య తార కోరుతుంది.

2. వాలి విరోధి ఎవరు?
జవాబు:
వాలి విరోధి అతని తమ్ముడు సుగ్రీవుడు.

3. పై పేరాను బట్టి జరగబోయే యుద్ధంలో ఎవరు ఓడిపోవచ్చును?
జవాబు:
పై పేరాను బట్టి జరుగబోయే యుద్ధంలో వాలి ఓడిపోవచ్చు.

4. వాలి తన భార్య మాటను పాటించాడా ?
జవాబు:
వాలి తన భార్య మాటను పాటించలేదు.

5. పై పేరాకు తగిన శీర్షికను పెట్టండి.
జవాబు:
‘హితోపదేశాన్ని తిరస్కరించడం’ అనేది ఈ పేరాకు తగిన శీర్షిక.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ

ప్రశ్న 8.
కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

శ్రీరాముడి శోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు. సీతాదేవిని తీసుకురావడంలో తాను తగిన ప్రయత్నం చేస్తానన్నాడు. సపరివారంగా రావణుణ్ణి హతమార్చేందుకు తన శక్తియుక్తులన్నింటినీ వినియోగిస్తానన్నాడు. దుఃఖం అనర్థదాయకం కనుక ఎప్పుడూ దుఃఖించవద్దన్నాడు. ఎల్లప్పుడూ దుఃఖించేవారికి సుఖముండదు. తేజస్సు క్షీణిస్తుంది. | ఒక్కొక్కప్పుడు ప్రాణాలు నిలవడమే కష్టంగా ఉంటుంది. కనుక దుఃఖస్థితి నుంచి బయట పడమని ధైర్యవచనాలను చెప్పాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. శ్రీరాముడు ఎందుకు శోకించాడు ?
జవాబు:
సీతాదేవి కోసం

2. సీతాదేవిని ఎవరు తీసుకుపోయారు ?
జవాబు:
రావణాసురుడు

3. దుఃఖాన్ని పోగొట్టేవేవి ?
జవాబు:
ధైర్యవచనాలు

4. శ్రీరాముని స్నేహితుడెవరు ?
జవాబు:
సుగ్రీవుడు

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ

5. దుఃఖం వలన నష్టమేమిటి ?
జవాబు:
సుఖముండదు, తేజస్సు ఉండదు.

TS 10th Class Maths Notes Chapter 14 Statistics

We are offering TS 10th Class Maths Notes Chapter 14 Statistics to learn maths more effectively.

TS 10th Class Maths Notes Chapter 14 Statistics

→ Mean :
The mean for grouped data can be found by :

  • Direct Mean: x̄ = \(\frac{\Sigma \mathrm{f}_{\mathrm{i}} \mathrm{x}_{\mathrm{i}}}{\Sigma \mathrm{f}_{\mathrm{i}}}\)
  • The Assumed Mean Method: x̄ = a + \(\frac{\Sigma \mathrm{f}_{\mathrm{i}} \mathrm{d}_{\mathrm{i}}}{\Sigma \mathrm{f}_{\mathrm{i}}}\)
  • The step-deviation Method: x̄ = a + \(\left[\frac{\Sigma \mathrm{f}_{\mathrm{i}} \mu_{\mathrm{i}}}{\Sigma \mathrm{f}_{\mathrm{i}}}\right]\) × h
    with the assumption that the frequency of a class is centred at its mid-point, called its class mark.

→ Mode:
A mode is that value among the observations which occurs most often, that is the value of observation having the maximum frequency.

→ Median :
Median of un grouped data :
First arrange the data values of the observations in ascending order.
Then, if n is odd,
The median is the \(\left(\frac{\mathrm{n}+1}{2}\right)^{\mathrm{th}}\) observation.
And if n is even, the median is the average of the \(\left(\frac{\mathrm{n}}{2}\right)^{\text {th }}\) and the \(\left(\frac{\mathrm{n}}{2}+1\right)^{\text {th }}\) observation.

→ Measures of central tendency are :
Mean, Median and Mode.

  • The mean is the most frequently used measure of central tendency because it takes into a count of all the observations and lies between the extremes, (i.e.) the largest and the smallest observations of the entire data.
  • In problems, where individual observations are not important and We wish to find out a typical observation the median is more appropriate.
  • ln situations, which require establishing the most frequent value or most popular item, the mode is the best choice.
  • Emperial relationship between the three measures of central tendency.
    Mode = 3 (Median) – 2(Mean).

TS 10th Class Maths Notes Chapter 14 Statistics

→ Cummuiative frequency curve, or an ogive (of the lessthan type)
We mark the upper limits of the class intervals on the horizontal axis (X -axis) and the their corre-sponding cummuiative frequencies on the vertical axis (Y – axis), choosing a convenient scale. The scale may not be the same on both the axes. Now, we plot the points (upper limit, corresponding cummuiative frequency) on a graph paper and join them by a free hand smooth curve. The curve we get is called a cummuiative frequency curve, or an ogive (of the lessthan type).

Flow Chat:
TS 10th Class Maths Notes Chapter 14 Statistics 1

Ronald Aylmer Fisher (1890 – 1962):

  • Sir Ronald Aylmer Fisher (1890 – 1962) was an English statistician, volutionary biologist, geneticist and eugenicist.
  • He was fellow of the Royal Society in 1929. Royal Medal 1938.
  • Statistics is an English word is taken by an Italian word ‘Starusta’ and a Greek word ‘Statistic’.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం అరణ్యకాండ

Telangana SCERT 10th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం రామాయణం అరణ్యకాండ Questions and Answers.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం అరణ్యకాండ

అరణ్య కాండం

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం అరణ్యకాండ 1
దండకారణ్యంలో మునుల ఆశ్రమాలున్నాయి. అది ప్రాణికోటికి సురక్షిత ప్రాంతం. మహర్షులు సీతారామ లక్ష్మణులను ఆదరించారు. మరునాడు మహర్షులకు వీడ్కోలు పలికి సీతారామలక్ష్మణులు దండకారణ్యం మధ్యకు చేరుకున్నారు. అక్కడ విరాధుడనే వికృతాకారం గల రాక్షసుడు వీరిని అడ్డగించి రామలక్ష్మణులను భుజాలపై వేసుకుపో సాగాడు. విరాధుని ఎన్ని దెబ్బలు కొట్టినా చావలేదు.

విరాధుడు తన పూర్వకథను చెప్పి, తనను గోతిలో పూడ్చమన్నాడు. విరాధుని సలహాను అనుసరించి సీతారామలక్ష్మణులు శరభంగ మహర్షిని దర్శనం చేసుకున్నారు. శరభంగ మహర్షి తన తపఃఫలాన్ని శ్రీరామునికి ప్రసాదించాడు. మునులు వచ్చి రాక్షసుల పీడ నుండి తమను రక్షించమని రాముని వేడుకున్నారు. సుతీక్ష మహర్షి తన తపశ్శక్తిని శ్రీరామునికి ఇచ్చాడు. దండకారణ్యంలో అనేక మునుల ఆశ్రమాలను వారు దర్శించారు. అగస్త్యు ని సోదరుని ఆశ్రమాన్ని దర్శించారు. తరువాత అగస్త్యుని దర్శించారు. అగస్త్యుడు ధనుస్సు, అక్షయతూణీరాలు, ఖడ్గం బహూకరించాడు.

అగస్త్యుని సలహామేరకు పంచవటి ప్రాంతంలో నివసించడానికి వారు బయలుదేరారు. దారిలో జటాయువును చూశారు. పంచవటిలో లక్ష్మణుడు పర్ణశాలను నిర్మించాడు. శూర్పణఖ రావణాసురుని చెల్లెలు. ఆమె శ్రీరాముని వద్దకు వచ్చి తనను పెండ్లి చేసుకొమన్నది. శ్రీరాముడు పరిహాసంగా లక్ష్మణుని వద్దకు వెళ్ళమన్నాడు. లక్ష్మణుడు తిరిగి రాముని వద్దకు పంపాడు. శూర్పణఖ సీతాదేవి తనకు అడ్డుగా ఉన్నదని ఆగ్రహించింది. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులను కోశాడు.

ఆమె తన సోదరుడైన ఖరుడు అనే వాడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంది. ఖర దూషణాదులు రామునిపైకి రాగా వారందర్నీ రాముడు సంహరించాడు. అకంపనుడు అనే గూఢచారి రావణునికి ఈ వార్త చెప్పాడు. రాముని చంపడానికి అతడు ఒక ఉపాయం కూడా చెప్పాడు. “సీతను అపహరిస్తే రాముడు మరణిస్తాడు” అని సలహా ఇచ్చాడు. రావణుడు మారీచుని ఆశ్రమానికి వచ్చాడు. మారీచుడు ‘రాముని కవ్వించడం మంచిదికాదు’ అని సలహాయివ్వగా రావణుడు తిరిగి లంకకు వెళ్ళాడు. శూర్పణఖ రావణుని సభలోకి వెళ్ళి ఆవేశంతో మాట్లాడి “సీతకు తగిన భర్తవు నువ్వే” అని రెచ్చగొట్టింది. రావణుడు మారీచుని వద్దకుపోయి బంగారు లేడిగా మారి తనకు సహకరించమని కోరాడు. లేకపోతే తానే అతడిని చంపుతానన్నాడు.

మారీచుడు బంగారుజింకగా మారి రాముని ఆశ్రమం ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా సీతాదేవి ముచ్చటపడి దాన్ని తీసుకు రావాలని రామలక్ష్మణులను కోరింది. ఆమె యిష్టాన్ని తీర్చడానికి శ్రీరాముడు బయలుదేరాడు. చివరకు బాణంతో దాన్ని కొట్టాడు. మారీచుడు రాముని కంఠధ్వనిని అనుకరిస్తూ “సీతా, లక్ష్మణా !” అని అరుస్తూ మరణించాడు. సీత ఆ కేక విని భయపడి లక్ష్మణుని వెంటనే అక్కడకు పొమ్మన్నది. లక్ష్మణుడు అంగీకరించలేదు. సీత లక్ష్మణుని కఠినోక్తులతో నిష్ఠూరాలాడింది. లక్ష్మణుడు బాధపడి, ఆశ్రమంలో సీతను విడిచి వెళ్లాడు. రావణుడు సన్యాసి వేషంలో వచ్చి సీతను భిక్షవేడాడు. తన నిజరూపం చూపి తనను పతిగా స్వీకరించమన్నాడు. సీత అతడిని తృణీకరించింది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం అరణ్యకాండ

సీతను రావణుడు రథంలో లంకకు తీసుకుపోసాగాడు. ఆమె రోదన జటాయువు విన్నాడు. జటాయువు రావణుని ఎదిరించాడు. రావణుడు జటాయువు రెక్కలను, కాళ్ళను నరికాడు. సీత ఆకాశమార్గం నుండి తన కొంగులో మూటగట్టిన ఆభరణాలను విడిచింది. రావణుడు లంకలో తన వైభవాన్ని సీతకు చూపి ఆమె మనసు మార్చాలని ప్రయత్నించాడు. పన్నెండు నెలలు గడువిచ్చాడు. ఆమెను అశోకవనంలో కాపలానడుమ ఉంచాడు. అక్కడ సీతాదేవి అపహరణ వృత్తాంతం తెలిసి రామలక్ష్మణులు అన్నిచోట్లా వెతికారు. వారికి జటాయువు కనిపించి జరిగిన విషయం తెలిపాడు. జటాయువుకి రాముడే దహన సంస్కారాలు గావించాడు. రామలక్ష్మణులు క్రౌంచారణ్యం చేరారు.

అక్కడ కబంధుడు అనే రాక్షసుడు వారిని తన చేతులతో పట్టుకున్నాడు. రామలక్ష్మణులు అతడి భుజాలను నరికి అతడి కోరికమేరకు దేహాన్ని దహనం గావించారు. దివ్య దేహంతో వెలుపలికి వచ్చిన కబంధుడు సీతాదేవి లభించే ఉపాయాన్ని చెప్పాడు. వాలిసుగ్రీవులను గూర్చి చెప్పాడు. కబంధుడు చెప్పిన మార్గంలో రామలక్ష్మణులు పంపా సరస్సు తీరంలోని ఆశ్రమానికి చేరారు. శబరి ఇచ్చిన పండ్లను రాముడు తిన్నాడు. ఆమె జన్మధన్యం చేసుకొన్నది. రామ లక్ష్మణులు ఋష్యమూక పర్వత ప్రాంతంలోని పంపా సరస్సును చూశారు.

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
శూర్పణఖ ఎవరు ? ఆమె అవమానం పొందడానికి కారణమేమిటో తెల్పండి.
జవాబు:
శూర్పణఖ ఒక రాక్షసి. ఈమె రావణునికి చెల్లెలు. శ్రీరాముని అందానికి మురిసిపోయి తనను పెళ్ళి చేసుకోమన్నది. అందుకు అడ్డంగా ఉన్న సీతను, లక్ష్మణుని చంపితింటానన్నది. రాముడు ఆమెను పరిహాసంగా లక్ష్మణుని వద్దకు పంపించాడు. లక్ష్మణుడు తాను అన్నగారి సేవకుణ్ణని, తనను పెళ్ళాడితే ఆమె కూడా తనతోబాటే అన్నకు దాస్యం చేయాల్సి వస్తుందని చెప్పి రాముణ్ణి పెళ్ళాడమని పంపాడు. సీత ఉండటంవల్లే రాముడు తనను నిరాకరించాడనుకొని సీతను చంపడానికి దాడి చేసింది. ప్రమాదాన్ని గుర్తించిన లక్ష్మణుడు అన్న ఆదేశంపై శూర్పణఖ ముక్కు, చెవులు కోసి ఆమెను విరూపిని చేశాడు. అలా తన రాక్షసత్వం వలన శూర్పణఖ రామలక్ష్మణులను కోరి అవమానం పొందింది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం అరణ్యకాండ

ప్రశ్న 2.
సీతాపహరణం జరగడానికి దారితీసిన పరిస్థితు లను విశ్లేషించండి.
జవాబు:
రావణుని చెల్లెలు శూర్పణఖ రాముడి అందానికి మోహపడి తన్ను భార్యగా స్వీకరించమని కోరింది. లక్ష్మణుడు కోపించి, శూర్పణఖ ముక్కు, చెవులు కోశాడు. శూర్పణఖ దండకారణ్యంలో ఉన్న సోదరుడు ఖరుడికి ఆ విషయం చెప్పింది. ఖరుడు పంపిన యోధులనూ, ఖరదూషణులనూ మొత్తం 14వేల మంది రాక్షసులను రాముడు గడియలో చంపాడు.

‘అకంపనుడు’ అనే గూఢచారి రావణునకు ఈ వార్త చేర్చాడు. రాముణ్ణి చంపడం దేవాసురులకు కూడా అసాధ్యం అని, సీతను అపహరిస్తే ఆమె వియోగంతో రాముడు మరణిస్తాడని సూచించాడు. రావణుడు మారీచుడి దగ్గరకు వెళ్ళి, సీతాపహరణకు బంగారు లేడిగా మారి తనకు సాయం చెయ్యమని అడిగాడు. తనకు సాయపడకపోతే మారీచుని చంపుతానన్నాడు రావణుడు.

దానితో మారీచుడు బంగారు లేడిగా మారి రాముని ఆశ్రమ ప్రాంతంలో తిరిగాడు. సీత బంగారు లేడిని చూసి ముచ్చటపడి పట్టి తెమ్మని రాముని కోరింది. రాముడు లక్ష్మణుణ్ణి సీతకు కాపలాగా ఉంచి, బంగారు లేడి కోసం వెళ్ళాడు. రాముడు మాయలేడిపై బాణం వేశాడు. మాయలేడి చస్తూ “హా సీతా ! హా లక్ష్మణా !” అని అరిచింది.

ఆ ధ్వని విని సీత రాముడు ఆపదలో చిక్కు కున్నాడని, రామునికి సాయంగా లక్ష్మణుడిని వెళ్ళమని చెప్పింది. లక్ష్మణుడు మొదట కాదన్నా వెళ్ళక తప్పలేదు. ఇదే అదనుగా రావణుడు సన్యాసి వేషంలో సీత ఉన్న ఆశ్రమానికి వచ్చి, ఆమెను బలవంతంగా లంకా నగరానికి తీసుకుపోయాడు.

ప్రశ్న 3.
రామలక్ష్మణులు సీతను అన్వేషిస్తూ పంపాసరస్సు తీరాన్ని చేరిన వృత్తాంతం రాయండి.
జవాబు:
మారీచుణ్ణి చంపి, శ్రీరాముడు వెనుక వస్తుండగా లక్ష్మణుడు కనబడ్డాడు. రామలక్ష్మణులు ఆశ్రమానికి వెళ్ళి, సీతను వెదికారు. వనమంతా వెదికారు. సీత జాడ కనబడలేదు.

సీతను వెతుకుతూ వెళుతుంటే దారిలో రామ లక్ష్మణులకు రక్తంలో తడిసిన జటాయువు కనిపించాడు. రావణుడు సీతను అపహరించాడనీ, రావణుడే తనను దెబ్బతీశాడనీ, జటాయువు వారికి చెప్పి మరణించాడు. రాముడు జటాయువుకు అంత్యక్రియలు చేశాడు.

రామలక్ష్మణులు “క్రౌంచారణ్యం” చేరుకున్నారు. అక్కడ వారికి కబంధుడనే రాక్షసుడు కనబడ్డాడు. ‘కబంధుడు’ రామలక్ష్మణులను చేతులతో పట్టుకున్నాడు. వాడు రామలక్ష్మణుల్ని తినడానికి నోరు తెరచాడు. వారు కబంధుని భుజాలు నరికి పారవేశారు. కబంధుడు కుప్పకూలాడు. శాపంవల్ల తనకు వికృతరూపం వచ్చిందని కబంధుడు వారికి చెప్పాడు.

రామలక్ష్మణులు రావణుని గురించి కబంధుణ్ణి అడిగారు. కబంధుడు తన శరీరాన్ని దహిస్తే తనకు దివ్యజ్ఞానం వస్తుందనీ, అప్పుడు రావణుడి గురించి చెప్పగలననీ చెప్పాడు. రామలక్ష్మణులు కబంధుడి శరీరానికి అగ్నిసంస్కారం చేశారు. కబంధుడు దివ్యదేహంతో వచ్చి, సీతాదేవి దొరికే ఉపాయాన్ని చెప్పాడు. సుగ్రీవుడితో స్నేహం చేయమన్నాడు. కబంధుడు సూచించిన మార్గంలో రామలక్ష్మణులు ప్రయాణించారు.

ఆ దారిలో శబరి ఆశ్రమానికి వెళ్ళారు. శబరి రాముడికి పండ్లు పెట్టింది. శ్రీరాముని అనుమతి పొంది శబరి తన శరీరాన్ని అగ్నికి ఆహుతిచేసి ఊర్ధ్వలోకాలకు వెళ్ళింది. రామలక్ష్మణులు ఈ విధంగా పంపాసరస్సుకు చేరారు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం అరణ్యకాండ

ప్రశ్న 4.
పంచవటిలో సీతారామలక్ష్మణుల జీవితం ఎలా సాగి వివరించండి.
జవాబు:
అగస్త్య మహర్షి మాటపై, సీతారామలక్ష్మణులు పంచవటికి చేరారు. లక్ష్మణుడు పంచవటిలో పర్ణశాలను నిర్మించాడు. సీత రక్షణ బాధ్యతను రాముడు, జటాయువుకు అప్పగించాడు. పంచ వాటిలో వారి జీవితం సుఖంగా సాగుతోంది. రావణుని చెల్లెలు శూర్పణఖ అక్కడకు వచ్చి, రాముడిని తనను చేపట్టమంది. లక్ష్మణుడు అన్న ఆజ్ఞతో శూర్పణఖ ముక్కు, చెవులు కోశాడు. శూర్పణఖ సోదరుడైన ఖరుడి వద్దకు వెళ్ళి ఈ విషయం చెప్పింది. ఖరుడు 14 వేల మంది రాక్షసులతో రాముడి చేతిలో యుద్ధంలో మరణించాడు.

అకంపనుడు అనే గూఢచారి ఖరుడి మరణవార్త రావణుడికి అందించి రాముని భార్య సీతను అపహరించమని రావణుడికి సలహా చెప్పాడు. శూర్పణఖ వెళ్ళి రావణుడిని రెచ్చగొట్టింది.
రావణుడు మారీచుడిని మాయలేడిగా సీతారాములు ఉన్న పర్ణశాల వద్దకు పంపాడు. సీత ఆ లేడిని తెచ్చి ఇమ్మని రాముడిని కోరింది. రాముడు వెళ్ళి మాయలేడిని చంపాడు. మాయలేడి ‘సీతా ! లక్ష్మణా ! అంటూ అరచి రాముడి చేతిలో మరణించింది.

రాముడు ఆపదలో ఉన్నాడని సీత లక్ష్మణుడిని రాముని వద్దకు పంపింది. అదే సమయంలో సన్యాసి వేషంలో రావణుడు పర్ణశాలలో ఒంటరిగా ఉన్న సీతను బలాత్కారంగా తన రథంలో కూర్చోబెట్టి తీసుకువెడుతున్నాడు. సీత, రామా, రామా’ అని కేకలు వేసింది. జటాయువు రావణుడిని ఎదిరించి, అతడి చేతిలో దెబ్బతింది. రావణుడు సీతను తన లంకా నగరానికి తీసుకువెళ్ళాడు.

రామలక్ష్మణులు ఆశ్రమానికి తిరిగి వచ్చారు. సీత జాడ తెలియక వారు దుఃఖించారు.

ప్రశ్న 5.
మాయలేడి వలన సీతారాములకు కష్టాలు వచ్చాయని ఎలా చెప్పగలవు ?
జవాబు:
రావణుడు పంచవటిలో ఉన్న సీతాదేవిని అపహరిం చాలనుకున్నాడు. రావణుడు మారీచుడిని బెదిరించి, బంగారులేడి రూపంలో అతడిని రాముడి ఆశ్రమ ప్రాంతానికి పంపాడు. సీత ఆ లేడిని చూసి ఇష్ట పడింది. లక్ష్మణుడు అది మాయామృగం అని చెప్పాడు. సీత ఆ లేడిని తెచ్చి ఇమ్మని పట్టుపట్టింది.

సీత ఇష్టాన్ని కాదనలేక, ఆ మాయలేడిని చంపి అయినా తేవడానికి రాముడు వెళ్ళాడు. రాముడు ఎంత ప్రయత్నించినా లేడి అందకుండా పరుగు దీసింది. దానితో రాముడు లేడిపై బాణాన్ని వేశాడు. ఆ లేడి ‘సీతా ! లక్ష్మణా !’ అని అరుస్తూ చచ్చింది.

మాయలేడి కంఠ ధ్వని రాముడిది అని, సీత కంగారుపడి, రాముడికి సాయంగా లక్ష్మణుడిని పంపింది. లక్ష్మణుడు తప్పనిసరి పరిస్థితులలో సీతను విడిచి, రాముడి దగ్గరకు వెళ్ళాడు.

అదే అదనుగా రావణుడు సన్యాసి వేషంలో పర్ణశాలకు వచ్చి సీతను బలవంతంగా తీసుకు పోయాడు. కాబట్టి సీతారాముల కష్టానికి మాయ లేడియే కారణం అని చెప్పగలము.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం అరణ్యకాండ

ప్రశ్న 6.
‘కబంధుడు’ అనే రాక్షసుడు శ్రీరామునకు ఉపకారం చేశాడని ఎలా చెప్పగలవు ?
జవాబు:
కబంధుడు క్రౌంచారణ్యంలో ఉన్న ఒక రాక్షసుడు. ఇతడికి తల, మెడ లేవు. ఇతడి కడుపు భాగంలో ముఖం ఉండేది. రొమ్ము భాగంలో ఒకే కన్ను ఉండేది. ఇతనికి యోజనం పొడవు వ్యాపించిన చేతులు ఉండేవి. ఆ చేతులతో వాడు పక్షులను, మృగాలను పట్టి తినేవాడు.

కబంధుడు రామలక్ష్మణులను తన చేతులతో పట్టుకొని తినబోయాడు. కబంధుడి చేతులకు చిక్కితే, ఎవరూ తప్పించుకోలేరు. కాని రామలక్ష్మణులు తమ ఖడ్గాలతో కబంధుడి చేతులు నరికారు. అప్పుడు కబంధుడు తనకు శాపం వల్ల రాక్షసరూపం వచ్చిందనీ, తన శరీరాన్ని దహిస్తే తనకు దివ్యజ్ఞానం వస్తుందనీ రామలక్ష్మణులకు చెప్పాడు.

రామలక్ష్మణులు కబంధుడి శరీరాన్ని దహనం చేశారు. ఆ జ్వాలల నుండి కబంధుడు దివ్యదేహంతో వచ్చి, సీత దొరికే ఉపాయాన్ని రామలక్ష్మణులకు చెప్పాడు. సుగ్రీవుడితో స్నేహం చెయ్యమని వారికి చెప్పాడు. సుగ్రీవుని స్నేహంతో రాముడు సీతను తిరిగి తెచ్చుకున్నాడు. దీనినిబట్టి కబంధుడు రామలక్ష్మణులకు ఉపకారం చేశాడని చెప్పగలం.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం అరణ్యకాండ

ప్రశ్న 7.
అహల్యా కబంధుల శాప విముక్తులను గూర్చి సొంతమాటల్లో రాయండి.
జవాబు:
మిథిలానగర సమీపానికి చేరుకొన్నారు విశ్వామిత్ర రామలక్ష్మణులు. అక్కడ గౌతముని ఆశ్రమం చూశారు. ఆ ఆశ్రమం అందంగా ఉంది. కాని, జనసంచారం లేదు. గౌతమ మహర్షి భార్య అహల్య అనీ, ఆమె ఒక తప్పు చేసినందుకు ఆమెను గౌతముడు శపించాడనీ విశ్వామిత్ర మహర్షి చెప్పాడు. అప్పటి నుండి అహల్య వాయువే ఆహారంగా తీసుకొని జీవిస్తూ బూడిదలో పడి ఉంది. అహల్య అదృశ్య రూపంలో ఉంది. రాముని రాకతో ఆమెకు నిజరూపం కల్గుతుందని గౌతముడు చెప్పాడని విశ్వామిత్రుడు శ్రీరామునకు’ చెప్పాడు. విశ్వామిత్రుని ఆజ్ఞతో గౌతముని ఆశ్రమంలో శ్రీరాముడు పాదం మోపాడు. ఆ పవిత్ర పాదం పెట్టగానే అహల్య పూర్వ రూపం పొందింది. అహల్యా గౌతములు శ్రీరాముని సత్కరించారు.

రామలక్ష్మణులు “క్రౌంచారణ్యం” చేరుకున్నారు. అక్కడ వారికి ఒక రాక్షసుడు కనబడ్డాడు. వాడికి తల, మెడ లేదు. వాడి ముఖం వాడి కడుపులో ఉంది. రొమ్ముమీద ఒకే కన్ను ఉంది. వాడి చేతులు యోజనం పొడుగున్నాయి. ఆ చేతులతో వాడు పక్షులను, మృగాలను పట్టి తింటాడు. అతడి పేరు ‘కబంధుడు’.

‘కబంధుడు’ రామలక్ష్మణులను చేతులతో పట్టుకున్నాడు. వాడి చేతుల్లో చిక్కితే, ఎవడూ తప్పించుకోలేడు. వాడు రామలక్ష్మణుల్ని తినడానికి నోరు తెరచాడు. వారు కబంధుని భుజాలు నరికిపారవేశారు. కబంధుడు కుప్పకూలాడు. శాపం వల్ల తనకు వికృత రూపం వచ్చిందని కబంధుడు వారికి చెప్పాడు.

రామలక్ష్మణులు రావణుని గురించి కబంధుణ్ణి అడిగారు. కబంధుడు తన శరీరాన్ని దహిస్తే తనకు దివ్యజ్ఞానం వస్తుందనీ, అప్పుడు రావణుడి గురించి చెప్పగలననీ చెప్పాడు. రామలక్ష్మణులు కబంధుడి శరీరానికి అగ్ని సంస్కారం చేశారు. కబంధుడు దివ్యదేహంతో వచ్చి, సీతాదేవి దొరికే ఉపాయాన్ని వారికి చెప్పాడు. సుగ్రీవుడితో స్నేహం చేయమన్నాడు. కబంధుడు స్వర్గానికి వెళ్ళాడు.

ప్రశ్న 8.
అన్న పట్ల భరతునికి గల భక్తి భావాన్ని గురించి వివరించండి. (March 2017)
జవాబు:
శ్రీరాముడు తండ్రి మాటను శిరసావహించి, వనవాసానికి వెళ్ళాడు. దశరథుడు మరణించాడని చెప్పి, రాముని తమ్ముడు భరతుడిని, అయోధ్యా నగరానికి మంత్రులు తీసుకువచ్చారు.

రాముడు తన తల్లి మాటపై వనవాసానికి వెళ్ళాడని తెలిసి, భరతుడు తన తల్లి కైకను తప్పుపట్టాడు. మంత్రులు భరతుణ్ణి రాజువుకమ్మన్నారు. రామునిపై భక్తి కల భరతుడు అందుకు అంగీకరించలేదు. పెద్దవాడైన రాముడే రాజు కావాలన్నాడు రాముడి బదులు, భరతుడు 14 సంవత్సరాలు వనవాసం చేస్తానన్నాడు. శ్రీరాముడిని అయోధ్యకు తిరిగి తీసుకువస్తానని, భరతుడు సైన్యంతో రాముడు ఉన్న అడవులకు వెళ్ళాడు.

అయోధ్యకు వచ్చి రాజువుకమ్మని, భరతుడు శ్రీరాముని ప్రార్థించాడు. అందుకు రాముడు అంగీకరించలేదు. అప్పుడు భరతుడు రామునిపై భక్తితో, రాముని పాదుకలను ఇమ్మని కోరాడు.
భరతుడు అన్న పాదుకుల మీదనే రాజ్యపాలన భారాన్ని ఉంచాడు. భరతుడు రాముని వలె తాను కూడా నారచీరలు కట్టి, జడలు ధరించాడు. వనవాస నియమాలు పాటించి, అయోధ్యా నగరం వెలుపలనే ఉన్నాడు.

14 సంవత్సరాలు పూర్తి కాగానే, రాముని దర్శనం తనకు కాకపోతే భరతుడు అగ్ని ప్రవేశం చేస్తానని రామునితో చెప్పాడు. భరతుడు నందిగ్రామం చేరి, రాముని పాదుకలకు పట్టాభిషేకం చేశాడు. దీనిని బట్టి భరతుడు ఆదర్శ సోదరభావం కలవాడని రాముని పట్ల భక్తిభావం కలవాడని గ్రహించగలము.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం అరణ్యకాండ

ప్రశ్న 9.
సీతారాముల దండకారణ్యవాస వృత్తాంతాన్ని తెలపండి. (సీతారాములు పంచవటిని చేరిన వృత్తాంతం)
జవాబు:
సీతారామలక్ష్మణులు దండకారణ్యంలో ప్రవేశించారు. అక్కడ ఎన్నో మునుల ఆశ్రమాలు ఉన్నాయి. అక్కడ యజ్ఞయాగాలు జరుగుతున్నాయి. మునులు వీరికి స్వాగతం పలికారు.

వీరు దండకవనం మధ్యకు చేరారు. ‘విరాధుడు’ అనే రాక్షసుడు సీతారామలక్ష్మణులపై పడ్డాడు. రామలక్ష్మణులను తన భుజాలపై వేసుకొని వాడు తీసుకుపోతున్నాడు. సీత ఏడ్చింది. రామలక్ష్మణులు విరాధుని భుజాలు నరికివేశారు. విరాధుడు కుప్పకూలాడు. విరాధుణ్ణి గోతిలో పాతిపెడదామని వారు అనుకున్నారు. విరాధుడు తాను తుంబురుడిననీ, శాపంవల్ల తాను రాక్షసుడుగా అయ్యాననీ చెప్పి, వారిని శరభంగమహర్షిని దర్శించమనీ, తనను గోతిలో పూడ్చమనీ రామలక్ష్మణులకు చెప్పాడు.

రామలక్ష్మణులు విరాధుణ్ణి గోతిలో పూడ్చి, శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. శరభంగ మహర్షి రామదర్శనం కోసం వేచి చూస్తున్నాడు. ఆయన తన తపః ఫలాన్ని రాముడికి ధారపోశాడు. సుతీక్ష మహర్షిని దర్శించమని వారికి ఆయన చెప్పాడు. మునులు రాముణ్ణి కలిసి, రాక్షసుల బాధల నుండి తమను రక్షించమని కోరారు. రాముడు సరే అన్నాడు.

సీతారామలక్ష్మణులు సుతీక్ష మహర్షిని దర్శించారు. ఆయన రామదర్శనం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ మహర్షి తన తపస్సును రామునికి ధారపోశాడు. ఈ విధంగా దండకారణ్యంలోని మునుల ఆశ్రమాలను దర్శిస్తూ, సీతారామలక్ష్మణులు పదిసంవత్సరాలు వనవాసం చేశారు. వారు తిరిగి సుతీక్ష మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. ఆయన అగస్త్యుని సోదరునీ, అగస్త్య మహర్షినీ దర్శనం చేసుకోమని రామలక్ష్మణులకు చెప్పాడు.

సీతారామలక్ష్మణులు అగస్త్యభ్రాత (సోదరుడు) ఆశ్రమాన్ని దర్శించారు. తరువాత అగస్త్యుని దర్శించారు. అగస్త్య మహర్షి శిష్యులతో రామునికి స్వాగతం పలికాడు. ఆయన రామునికి దివ్య ధనుస్సు, అక్షయ తూణీరాలు, ఖడ్గమును ఇచ్చాడు. రామునకు జయం కల్గుతుందని ఆశీర్వదించాడు.

రాముడు తాము నివసించడానికి తగిన ప్రదేశాన్ని సూచించమని అగస్త్యుణ్ణి కోరాడు. ఆ మహర్షి గోదావరీ తీరంలో ఉన్న ‘పంచవటి’ లో ఉండమని వారికి సూచించాడు. రామలక్ష్మణులకు మార్గమధ్యంలో ‘జటాయువు’ కనబడింది. దానికి సీత రక్షణ బాధ్యతను వారు అప్పగించారు. పంచవటిలో ఆశ్రమం నిర్మించుకొని వారు అక్కడ నివసించారు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం అరణ్యకాండ

ప్రశ్న 10.
రావణుడు మారీచుని సాయంతో సీతాదేవిని అపహరించిన వృత్తాంతాన్ని రాయండి.
జవాబు:
సీతారాములు పంచవటిలో సుఖంగా జీవిస్తున్నారు. రావణుని చెల్లెలు శూర్పణఖ అక్కడకు వచ్చి రాముడి అందానికి మోహపడి తన్ను భార్యగా స్వీకరించమని రాముణ్ణి కోరింది. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు, చెవులు కోశాడు. శూర్పణఖ దండాకారణ్యంలో ఉన్న సోదరుడు ఖరుడికి ఆ విషయం చెప్పింది. ఖరుడు పంపిన యోధులనూ, ఖరదూషణులనూ మొత్తం 14 వేల మంది రాక్షసులను రాముడు గడియలో చంపాడు.

‘అకంపనుడు’ అనే గూఢచారి దండకలో రాక్షససంహారం జరిగిందని రావణునకు వార్త చేర్చాడు. రావణుడు రాముణ్ణి చంపుతానన్నాడు. రాముణ్ణి చంపడం దేవాసురులకు కూడా అసాధ్యం అని అకంపనుడు చెప్పాడు. సీతను అపహరించమని సూచించాడు. రావణుడు మారీచుని సాయం అడిగాడు. మారీచుడు రాముణ్ణి కవ్వించవద్దని రావణునికి సలహా చెప్పాడు. శూర్పణఖ, తన అన్న రావణుడికి, సీతను అపహరించమని చెప్పింది.

రావణుడు తిరిగి మారీచుడి దగ్గరకు వెళ్ళి, సీతాపహరణకు బంగారు లేడిగా మారి తనకు సాయం చెయ్యమని మారీచుణ్ణి అడిగాడు. మారీచుడు హితం చెప్పినా, రావణుడు వినలేదు. తనకు సాయపడకపోతే మారీచుని చంపుతానన్నాడు రావణుడు.

దానితో మారీచుడు చేసేదిలేక బంగారు లేడిగా మారి, రాముని ఆశ్రమ ప్రాంతంలో తిరిగాడు. సీత బంగారు లేడిని చూసి ముచ్చటపడింది.

ఆ బంగారు లేడిని పట్టి తెమ్మని, సీత రాముని కోరింది. అది మాయలేడి అని లక్ష్మణుడు చెప్పాడు. రాముడు, సీత మాట కాదన లేక లక్ష్మణుణ్ణి సీతకు కాపలాగా ఉంచి, తాను లేడి కోసం వెళ్ళాడు. మాయలేడి రామునికి దొరకలేదు. రాముడు దానిపై బాణం వేశాడు. మాయలేడి చస్తూ “హా సీతా! హా లక్ష్మణా!” అని అరిచింది.

ఆ ధ్వని విని సీత రాముడు ఆపదలో చిక్కుకున్నాడని లక్ష్మణుడిని రామునికి సాయంగా వెళ్ళమని చెప్పింది. లక్ష్మణుడు కాదంటే, అతణ్ణి సీత నిందించింది. చివరకు లక్ష్మణుడు సీతను విడిచి వెళ్ళాడు. ఇదే అదనుగా రావణుడు సన్యాసి వేషంలో సీత ఉన్న ఆశ్రమానికి వచ్చి, తాను రావణుడిని అని చెప్పి సీతను బలవంతంగా తన లంకా నగరానికి తీసుకుపోయాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం అరణ్యకాండ

ప్రశ్న 11.
రామలక్ష్మణులు సీతను అన్వేషిస్తూ పంపా సరస్సు తీరానికి చేరిన వృత్తాంతాన్ని రాయండి.
జవాబు:
మారీచుణ్ణి చంపి, శ్రీరాముడు వెనుకకు ఆశ్రమానికి బయలుదేరాడు. దారిలో లక్ష్మణుడు కనబడ్డాడు. సీతను ఒంటరిగా విడిచి వచ్చావేమిటని రాముడు అడిగాడు. లక్ష్మణుడు జరిగిన విషయం చెప్పాడు. రామలక్ష్మణులు ఆశ్రమానికి వెళ్ళి, సీతను వెదికారు. వనమంతా వెదికారు. సీతజాడ కనబడలేదు. సీత జాడ చెప్పమని. రాముడు ప్రకృతిని ప్రార్థించాడు. శ్రీ శ్రీరాముడు సీతా వియోగాన్ని భరించలేక ఏడ్చాడు. లక్ష్మణుడు రాముడిని ఓదార్చాడు.

రామలక్ష్మణులకు రక్తంతో తడిసిన జటాయువు కనిపించాడు. అతడిని చూసి గద్ద రూపంలో ఉన్న రాక్షసుడనీ, అతడే సీతను తిని ఉంటాడనీ వారు భ్రాంతి పడ్డారు. జటాయువు జరిగినది చెప్పాడు. రావణుడు సీతను అపహరించాడనీ, రావణుడే తనను దెబ్బ తీశాడనీ, జటాయువు వారికి చెప్పాడు. జటాయువు మరణించాడు. రాముడు జటాయువుకు అంత్యక్రియలు చేశాడు.

రామలక్ష్మణులు “క్రౌంచారణ్యం” చేరుకున్నారు. అక్కడ వారికి ఒక రాక్షసుడు కనబడ్డాడు. వాడికి తల, మెడ లేదు. వాడి ముఖం వాడి కడుపులో ఉంది. రొమ్ముమీద ఒకే కన్ను ఉంది. వాడి చేతులు యోజనం పొడుగున్నాయి. ఆ చేతులతో వాడు పక్షులనూ, మృగాలను పట్టి తింటాడు. అతడి పేరు ‘కబంధుడు’.

‘కబంధుడు’ రామలక్ష్మణులను చేతులతో పట్టుకున్నాడు. వాడి చేతుల్లో చిక్కితే, ఎవడూ తప్పించుకోలేడు. వాడు. రామలక్ష్మణుల్ని తినడానికి నోరు తెరచాడు. వారు కబంధుని భుజాలు నరికిపారవేశారు. కబంధుడు కుప్పకూలాడు. శాపం వల్ల తనకు వికృత రూపం వచ్చిందని కబంధుడు వారికి చెప్పాడు.

రామలక్ష్మణులు రావణుని గురించి కబంధుణ్ణి అడిగారు. కబంధుడు తన శరీరాన్ని దహిస్తే తనకు దివ్యజ్ఞానం వస్తుందనీ, అప్పుడు రావణుడి గురించి చెప్పగలననీ చెప్పాడు. రామలక్ష్మణులు కబంధుడి శరీరానికి అగ్ని సంస్కారం చేశారు. కబంధుడు దివ్యదేహంతో వచ్చి, సీతాదేవి దొరికే ఉపాయాన్ని వారికి చెప్పాడు. సుగ్రీవుడితో స్నేహం చేయమన్నాడు. కబంధుడు స్వర్గానికి వెళ్ళాడు.

రామలక్ష్మణులు శబరి ఆశ్రమానికి వెళ్ళారు. శబరి రాముడికి పండ్లు పెట్టింది. తరువాత శబరి తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసి ఊర్ధ్వలోకాలకు వెళ్ళింది. రామలక్ష్మణులు ఈ విధంగా పంపా సరస్సుకు చేరారు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం అరణ్యకాండ

ప్రశ్న 12.
సీతారామలక్ష్మణులు అడవిలోకి ప్రవేశించిన ఎన్ని సంవత్సరాలకు సుతీక్ష మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు ? ఆ సంవత్సరాలలో ఏమైంది ?
జవాబు:
సీతారామలక్ష్మణులు అడవిలోకి ప్రవేశించిన 10 సంవత్సరాలకు సుతీక్ష మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు.

సీతారామలక్ష్మణులు దండకారణ్యంలోకి ప్రవేశించారు. అక్కడి మునులు వారికి స్వాగతం పలికారు. కొద్దికాలం అక్కడ ఉండి, ప్రయాణం కొనసాగించారు. వనం మధ్యకు చేరారు.

అక్కడ విరాధుడు తన వికృత రూపంతో సీతారామలక్ష్మణుల మీద విరుచుకుపడ్డాడు. రామలక్ష్మణులను భుజాలపై .వేసుకుని తీసుకుపోతున్నాడు. రామలక్ష్మణులు వాడిని సంహరించలేక గోతిలో పాతాలనుకొన్నారు. అప్పుడు అతనికి పూర్వ రూపం వచ్చింది. శరభంగ మహర్షిని కలుసుకోమని చెప్పాడు. బ్రహ్మలోకం చేరాడు.

మునులు రాక్షస సంహారం చేయమని కోరారు. రాముడు అభయం ఇచ్చాడు. తర్వాత సుతీక్ష మహర్షి తన తపశ్శక్తినంతా శ్రీరామునికి ధారపోశాడు. మునుల ఆశ్రమాలలో కొద్దికొద్ది కాలం ఉంటూ 10 సంవత్సరాలు గడిపారు.

ప్రశ్న 13.
సీతాపహరణకు ఎవరు అవకాశం కల్పించారో విశ్లేషించండి.
జవాబు:
సీతాదేవిని ఎలాగైనా అపహరించాలని రావణుడు పన్నాగం పన్నాడు. మారీచుని బంగారులేడిగా మారమని అన్నాడు. సీతారాముల దగ్గర తిరగమన్నాడు.

సీత ఆ బంగారులేడి కావాలంది. లక్ష్మణుడు చెప్పాడు అది రాక్షస మాయ అని. అయినా వినలేదు. అదే కావాలంది. రాముడు వెళ్ళి తెస్తానన్నాడు. లక్ష్మణుని, జటాయువును సీతకు కాపలా పెట్టాడు.

కొంతసేపటికి రాముని గొంతుతో అయ్యో సీతా! లక్ష్మణా! అని వినబడింది. సీత కంగారు పడింది. రాముడు ఆపదలో ఉన్నాడు అని లక్ష్మణుని వెళ్ళమంది. అది రాక్షస మాయ అని లక్ష్మణుడు చెప్పాడు. అనేక విధాల ప్రార్థించాడు. కాని, సీత వినలేదు. లక్ష్మణుని నిందించింది. అతని మనసు గాయపడేలా మాట్లాడింది. విధిలేక లక్ష్మణుడు వెళ్ళాడు. ఒంటరిగా ఉన్న సీతను రావణుడు అపహరించాడు.

పై దానిని పరిశీలిస్తే సీతాపహరణానికి సీతాదేవి యొక్క ఆలోచనే కారణమైంది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం అరణ్యకాండ

ప్రశ్న 14.
రామలక్ష్మణులు క్రౌంచారణ్యానికి ఎందుకు చేరారు ? అక్కడేమి జరిగింది ?
జవాబు:
సీతాదేవిని వెతుకుతూ రామలక్ష్మణులు క్రౌంచారణ్యానికి చేరారు. అక్కడ భయంకరమైన కబంధుడనే రాక్షసుని చూశారు. రామలక్ష్మణులను తన చేతులతో పట్టుకున్నాడు. రామలక్ష్మణులు వాడి చేతులు నరికేశారు. కబంధుడు కుప్పకూలాడు.

రామలక్ష్మణుల గురించి తెలుసుకొన్నాడు. తన గురించి చెప్పాడు. తన శరీరాన్ని దహిస్తే రావణుని గురించి చెపుతానన్నాడు. రామలక్ష్మణులు అలాగే చేశారు. అప్పుడు కబంధుడికి దివ్యశరీరం వచ్చింది. సీతాదేవి దొరికే ఉపాయం చెప్పాడు. వాలి సుగ్రీవుల కథ చెప్పాడు. సుగ్రీవుని స్నేహం చేస్తే మంచి జరుగుతుందని చెప్పాడు. సీతాన్వేషణకు బలమైన ఆధారం చూపించాడు.

పరిచిత గద్యాలు

ప్రశ్న 1.
కింది పేరాను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి. (June 2016)

రామలక్ష్మణులు దండకారణ్యం నుంచి క్రౌంచారణ్యానికి చేరుకున్నారు. అక్కడి వనంలో భయంకరుడైన ఒక రాక్షసుణ్ణి చూశారు. అతని తల, మెడ కనబడడం లేదు. కడుపు భాగంలో ముఖముంది. రొమ్ము మీద ఒకే కన్ను ఉంది. యోజనం పొడవు వ్యాపించిన చేతులు. ఆ చేతులతో పక్షులను, మృగాలను పట్టి తింటాడు. అతని పేరు కబంధుడు, తన సమీపంలోకి వచ్చిన రామలక్ష్మణులను అమాంతంగా రెండు చేతులతో పట్టుకున్నాడు. అతని చేతుల్లో చిక్కితే తప్పించుకోవడం ఎవరితరం కాదు. కబంధుడు రామలక్ష్మణులను భక్షించడానికి నోరు తెరచాడు. అన్నదమ్ములిద్దరూ తమ ఖడ్గాలతో అనాయాసంగా వాడి భుజాలను నరికివేశారు. కబంధుడు కుప్పకూలాడు. రామలక్ష్మణుల గురించి తెలుసుకున్నాడు. తన గురించి చెప్పుకున్నాడు. శాపకారణంగా తనకీ వికృతరూపం ప్రాప్తించిందన్నాడు. శ్రీరాముడు కబంధునితో ‘మాకు రావణుని పేరు మాత్రమే తెలిసింది. అతని రూపం, ఉండే చోటు, శక్తి సామర్థ్యాలు తెలియవు. వాటిని చెప్పవలసిందని’ అడిగాడు. సమాధానంగా కబంధుడు ‘శ్రీరామా ! నాకిప్పుడు దివ్యజ్ఞానం లేదు. నా శరీరాన్ని దహిస్తే నా నిజరూపం వస్తుంది. అప్పుడు చెప్పగల’నన్నాడు. కబంధుని శరీరానికి అగ్నిసంస్కారం చేశారు రామలక్ష్మణులు. ఆ జ్వాలల నుంచి దివ్య దేహంతో బయటికి వచ్చాడు కబంధుడు.

ప్రశ్నలు – జవాబులు :
1. రామలక్ష్మణులను పట్టుకున్న రాక్షసుడి ప్రత్యేకత ఏమిటి ?
జవాబు:
రామలక్ష్మణులను పట్టుకున్న కబంధుడు అనే రాక్షసుడికి తల, మెడ కనబడలేదు. అతడి కడుపు భాగంలో ముఖముంది. రొమ్ము మీద ఒకే కన్ను ఉంది. అతనికి యోజనం పొడవు వ్యాపించిన చేతులు ఉన్నాయి. అతడు ఆ చేతులతో పక్షులను, మృగాలను పట్టి తింటాడు.

2. ‘కబంధ హస్తాలు’ అనే జాతీయం ఎలా పుట్టింది ?
జవాబు:
కబంధుడు అనే రాక్షసుడికి, యోజనం పొడవు వ్యాపించిన చేతులు ఉన్నాయి. అతడు ఆ చేతులతో పక్షులను, మృగాలను పట్టి తింటాడు. అతని చేతుల్లో చిక్కితే తప్పించుకోడం ఎవరితరమూ కాదు. తప్పించుకోడానికి వీలు కాని చేతులు అనే అర్థంలో, ఈ విధంగా కబంధ హస్తాలు అనే జాతీయం పుట్టింది.

3. కబంధుడికి దివ్యజ్ఞానం తిరిగి ఎట్లా వస్తుంది ?
జవాబు:
కబంధుని శరీరాన్ని దహిస్తే అతడి నిజరూపమూ, దివ్యజ్ఞానమూ వస్తాయి.

4. కబంధుడు రామలక్ష్మణులను ఎట్లా పట్టుకున్నాడు ?
జవాబు:
కబంధుడు తన సమీపంలోకి వచ్చిన రామలక్ష్మణులను, అమాంతంగా తన రెండు చేతులతోనూ, పట్టుకున్నాడు.

5. రామలక్ష్మణులు కబంధుణ్ణి ఏ సహాయం అడిగారు ?
జవాబు:
రామలక్ష్మణులు, తమకు, రావణుని రూపం గురించి, అతడు ఉండే చోటును గురించి, రావణుని శక్తి సామర్థ్యాలను గురించి చెప్పవలసిందని, కబంధుణ్ణి అడిగారు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం అరణ్యకాండ

ప్రశ్న 2.
కింది పేరాను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి. (March 2016)

అప్పుడప్పుడే నిద్రకుపక్రమిస్తున్న జటాయువుకు సీతాదేవి ఆర్తనాదాలు వినబడ్డాయి. చూసే సరికల్లా సీతను అపహరించుకు పోతున్న రావణుడు కంటపడ్డాడు. జటాయువు రావణుణ్ణి ఎదిరించాడు. ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా సాగింది. చివరకు రావణుడు ఖడ్గంతో జటాయువు రెక్కలను, కాళ్ళను నరికివేశాడు. నేలపై కూలాడు -జటాయువు, రక్తంతో తడిసి ముద్దయిన అతణ్ణి చూసి ఆత్మబంధువును పోగొట్టుకున్నట్లు సీత ఆక్రందించింది.

ప్రశ్నలు – జవాబులు :
1. జటాయువు రావణుణ్ణి ఎందుకు ఎదిరించాడు ?
జవాబు:
రావణుడు సీతాదేవిని అపహరించుకుపోతున్నాడు. అందువల్ల జటాయువు రావణుణ్ణి ఎదిరించాడు.

2. జటాయువుకి సీతాదేవి ఆర్తనాదాలు ఎప్పుడు వినబడినాయి ?
జవాబు:
జటాయువు నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో సీతాదేవి ఆర్తనాదాలు వినబడ్డాయి.

3. సీతాదేవి ఎందుకు ఆక్రందించింది ?
జవాబు:
రావణుడు తనను అపహరించుకుపోతున్నాడు. అందువల్ల సీతాదేవి ఆక్రందించింది.

4. పై పేరాలో పోరు ఎవరెవరి మధ్య జరిగింది ?
జవాబు:
పై పేరాలో రావణుడికి, జటాయువుకు మధ్య పోరు జరిగింది.

5. పై పేరాలోని జాతీయాలు గుర్తించి రాయండి.
జవాబు:
పై పేరాలో

  1. హోరాహోరిగా
  2. తడిసి ముద్దయిన అనేవి రెండు జాతీయాలు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం అరణ్యకాండ

ప్రశ్న 3.
కింది పేరాను చదవండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. (March 2015)

రావణుడు మారీచుని వద్దకు వెళ్ళాడు. సీతాపహరణకు బంగారు లేడిగా మారి సహకరించమన్నాడు. ఆ ఆలోచనను విరమించుకోమని లంకేశునికి పరిపరి విధాల నచ్చజెప్పజూశాడు మారీచుడు. విశ్వామిత్రుని యాగ సంరక్షణ సందర్భంలో రామబాణం రుచి ఏమిటో తాను తెలుసుకున్నానన్నాడు. మారీచుడి మాటలను రావణుడు పెడచెవిన పెట్టాడు. మూర్ఖులకు హితబోధలు చెవికెక్కవు. “నేను చెప్పినట్లు చేయకుంటే నా చేతిలో చావు తప్పదని” రావణుడు హెచ్చరించాడు. ఆశ్రమానికి వెళ్తే శ్రీరాముడు చంపుతాడు. వెళ్ళకుంటే రావణుడు చంపుతాడు. “ముందు నుయ్యి వెనుక గొయ్యి” లా ఉంది మారీచుని స్థితి. చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. “నీ చేతిలో చావడం కన్నా శ్రీరాముని చేతిలో చావడం నయం. నా జన్మ తరిస్తుంది” అని తేల్చి చెప్పాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. రావణుడు మారీచుణ్ణి ఎలా సహకరించమన్నాడు ?
జవాబు:
మారీచుణ్ణి బంగారు లేడిగా మారి, తనకు సహకరించమని మారీచుడికి రావణుడు చెప్పాడు..

2. రామబాణం రుచి చూడటమంటే ఏమిటి ?
జవాబు:
రామబాణం రుచి చూడటమంటే, రాముని బాణం వల్ల తగిలే తీవ్రమైన బాధను అనుభవించడం అని అర్థం.

3. పై పేరాలోంచి ఒక జాతీయాన్ని గుర్తించి రాయండి.
జవాబు:
“ముందు నుయ్యి, వెనుక గొయ్యి” అన్నది, పై పేరాలో గల ఒక జాతీయము.

4. రావణుణ్ణి ఆలోచన విరమించుకోమని మారీచుడు ఎందుకు చెప్పాడు ?
జవాబు:
విశ్వామిత్రుని యాగ సంరక్షణ సందర్భంలో మారీచుడు రామబాణం రుచి ఏమిటో తెలిసికొన్నాడు. అందుకే రాముని జోలికి వెళ్ళడం మంచిది కాదని, రావణునికి మారీచుడు సలహా చెప్పాడు.

5. మారీచుడు శ్రీరాముని చేతిలో చావడానికే సిద్ధపడ్డాడు. ఎందుకు ?
జవాబు:
తాను చెప్పినట్లు చేయకపోతే మారీచుణ్ణి రావణుడు చంపుతానన్నాడు. రావణుని చేతిలో చావడం కన్న, రాముని చేతిలో చస్తే, తన జన్మ తరిస్తుందని, మారీచుడు రాముని చేతిలో చావడానికి సిద్ధపడ్డాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం అరణ్యకాండ

ప్రశ్న 4.
క్రింది పేరాను చదవండి. కింది మాటలకు ఒక వాక్యంలో వివరణ వ్రాయండి.

క్రూరులైన దుష్టులతో పరిహాసం పనికిరాదు. అది ఎంతో ప్రమాదకరం. ఆలస్యం చేయకుండా శూర్పణఖను విరూపిని చేయమన్నాడు శ్రీరాముడు. అన్న ఆజ్ఞే ఆలస్యం – శూర్పణఖ ముక్కు, చెవులు తెగిపడ్డాయి లక్ష్మణుని కత్తి దెబ్బకు. లబోదిబో మని మొత్తుకుంటూ సోదరుడైన ఖరుడి దగ్గరకు వెళ్ళింది శూర్పణఖ. ఖరుడు పద్నాలుగుమంది యోధులను పంపాడు. వాళ్ళంతా శ్రీరాముని చేతిలో మట్టిగరచారు. ఇది చూసిన శూర్పణఖ ఖరుని వద్దకు వెళ్ళి చెప్పింది. ఖర దూషణులు పద్నాలుగు వేలమంది రాక్షసులతో రాముని మీదకు దండెత్తారు. మూడు గడియల్లో వాళ్ళందరినీ యమపురికి పంపించాడు శ్రీరాముడు.

ప్రశ్నలు – జవాబులు :
1. దుష్టులతో పరిహాసం
జవాబు:
చెడు నడవడి కలవారితో ఎగతాళి, అనగా చెడ్డవారితో వేళాకోళం అని భావం.

2. విరూపిని చేయు
జవాబు:
వికృతమైన రూపము కలదానిగా చేయడం, అనగా అందములేని దానిగా చేయడం అని భావం.

3. లబోదిబోమని మొత్తుకుంటూ
జవాబు:
లబోదిబోమని మొత్తుకుంటూ మొర్రో మొర్రో అని నెత్తిపై కొట్టుకుంటూ అని భావము.

4. మట్టిగరచారు
జవాబు:
అనగా నేల కఱచారు. అనగా చనిపోయారు అని భావం.

5. యమపురికి పంపించాడు
జవాబు:
అనగా యముని యొక్క నరకలోకానికి పంపాడు. అంటే చంపాడు అని భావము.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం అరణ్యకాండ

ప్రశ్న 5.
ఈ క్రింది పేరాను చదివి, క్రింద ఇచ్చిన పదాలకు అర్థం ఒక వాక్యంలో వివరించండి.

మారీచుణ్ణి వధించి శ్రీరాముడు వెనుదిరిగాడు – లక్ష్మణుడు ఎదురయ్యేసరికి నిశ్చేష్టుడయ్యాడు. సీతను ఒంటరిగా వదలి ఎందుకు వచ్చావని నిలదీశాడు. జరిగిన విషయాలు పూసగుచ్చినట్లు చెప్పాడు లక్ష్మణుడు. ఇద్దరూ ఆశ్రమానికి చేరుకున్నారు. సీతాదేవి జాడ కనిపించలేదు. వనమంతా వెతికారు. ఆమె జాడ కనిపించలేదు. జాడ చెప్పమని ప్రకృతిని ప్రార్థించాడు శ్రీరాముడు. ఆమె ఎడబాటును తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఆవేదన ఆవేశంగా మారింది. లోకాలను ధ్వంసం చేయడానికి శ్రీరాముడు సిద్ధపడ్డాడు. లక్ష్మణుడు ఓదార్పు వాక్యాలతో అన్నను శాంతపరిచాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. నిశ్చేష్టుడయ్యాడు.
జవాబు:
అంటే శారీరక వ్యాపారము లేనివాడు – అనగా కదలకుండా ఉండి పోయాడు.

2. నిలదీశాడు
జవాబు:
నిర్బంధము చేశాడని అర్థము. గట్టిగా అడిగాడని భావము

3. పూసగుచ్చినట్లు
జవాబు:
వరుసగా అని అర్థము, ఒకదాని తర్వాత మరొకటిగా అని భావము.

4. జాడకనిపించలేదు.
జవాబు:
వార్త తెలియలేదు అని అర్థము ఆనవాలు దొరకలేదని భావము.

5. ప్రకృతిని ప్రార్థించాడు.
జవాబు:
చెట్టు, పుట్ట, గుట్ట, ఏటు, నది వంటి అన్ని వస్తువులను వేడుకున్నాడని భావం.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం అరణ్యకాండ

ప్రశ్న 6.
ఈ క్రింది పేరాను చదివి, దిగువన ఇచ్చిన పదాలను ఒక్క వాక్యంలో వివరించండి.

“సీతారామలక్ష్మణులు వనం మధ్యకు చేరుకున్నారు. ఇంతలో వికృతాకారంలో ఉన్న విరాధుడనే రాక్షసుడు అమాంతంగా సీతారామలక్ష్మణుల పైకి విరుచుకుపడ్డాడు. రామలక్ష్మణులను తన భుజాలపై వేసుకొని తీసుకుపోసాగాడు. సీత గగ్గోలు పెడుతున్నది. రామలక్ష్మణులు విరాధుని రెండు భుజాలను నరికి వేశారు. నేలపై కుప్పకూలాడు విరాధుడు ముష్టిఘాతాలతో మోకాళ్ళతో దాడి చేశారు. రామలక్ష్మణులు ఎంతకూ చావని విరాధుణ్ణి గోతిలో పాతిపెట్టడానికి సంసిద్ధులయ్యారు. వెంటనే విరాధుడు తన పూర్వ కథను వివరించాడు. తుంబురుడనే గంధర్వుడైన తాను కుబేరుని శాపంచే రాక్షసుడిగా మారిన విషయం తెలిపాడు. శ్రీరాముని వల్ల శాపవిముక్తి కలుగుతుందన్న కుబేరుని మాటను జ్ఞాపకం చేసుకున్నాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. అమాంతంగా
జవాబు:
అంటే అకస్మాత్తుగా అని అర్థము. ఉన్నట్లు ఉండి వెంటనే అని భావము.

2. విరుచుకుపడ్డాడు
జవాబు:
విరిగిన వస్తువు పడ్డట్లు మీద పడ్డాడు అని భావము

3. గగ్గోలు పెడుతున్నది.
జవాబు:
పెద్దగా ధ్వని చేస్తూ ఏడుస్తోందని భావము.

4. నేలపై కుప్పకూలాడు
జవాబు:
కుప్పలా నేలపై పడ్డాడు అంటే నేలపై పడి కదలలేకపోయాడని భావము.

5. సంసిద్ధులయ్యారు.
జవాబు:
అంటే బాగా సిద్ధపడ్డారు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం అరణ్యకాండ

ప్రశ్న 7.
కింది గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

పంచవటిలో జీవనం ప్రశాంతంగా గడుస్తున్నది. ఒకనాడు శ్రీరాముడు పురాణ కథా ప్రసంగంలో ఉన్నాడు. అంతలో ‘శూర్పణఖ’ అనే రాక్షసి వచ్చింది. ఈమె రావణాసురుని చెల్లెలు. శ్రీరాముడి సౌందర్యానికి ముగ్ధురాలైంది. తనను చేపట్టమన్నది. తమ మధ్య అడ్డుగా ఉన్న సీతాలక్ష్మణులను చంపి తింటానన్నది. శ్రీరాముడు పరిహాసంగా లక్ష్మణుని వద్దకు వెళ్ళమన్నాడు. లక్ష్మణుడు తాను అన్న దాసుడననీ, తనతో ఉంటే శూర్పణఖ కూడా దాస్యం చేయాల్సివస్తుందనీ, అందుకే శ్రీరాముణ్ణి చేరడమే సబబని సమాధానమిచ్చాడు. శ్రీరాముడివైపు తిరిగింది శూర్పణఖ. సీత ఉండడం వల్లనే తనను నిరాకరిస్తున్నాడని అట్టుడికిపోయింది. సీతాదేవిని అడ్డు తొలగించుకోవాలని ఆమెపై దాడికి దిగింది.

ప్రశ్నలు – జవాబులు :
1. లక్ష్మణుడు శూర్పణఖతో ఏమన్నాడు?
జవాబు:
తాను అన్నకు దాసుడననీ, శూర్పణఖ తనతో ఉంటే శూర్పణఖ కూడా దాస్యం చేయాల్సి వస్తుందనీ లక్ష్మణుడు శూర్పణఖతో అన్నాడు.

2. శ్రీరాముడు శూర్పణఖను ఎందుకు నిరాకరించాడు?
జవాబు:
శ్రీరాముడు పురాణ కథా ప్రసంగంలో ఉన్నాడు. తన భార్య తనతోనే ఉంది కాబట్టి రాముడు శూర్పణఖను నిరాకరించాడు.

3. శూర్పణఖ ఎవరు?
జవాబు:
శూర్పణఖ రావణాసురుని చెల్లెలు. శూర్పణఖ రాక్షసి.

4. సీతారామలక్ష్మణులు ఎక్కడ ఉన్నారు?
జవాబు:
సీతారామలక్ష్మణులు పంచవటిలో, పర్ణశాలలో ఉన్నారు.

5. ఈ పేరాకు శీర్షికను నిర్ణయించండి. .
జవాబు:
‘శ్రీరాముడు శూర్పణఖను నిరాకరించడం’ అనే శీర్షిక తగియుంటుంది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం అరణ్యకాండ

ప్రశ్న 8.
క్రింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.

క్రూరుడైన దుష్టులతో పరిహాసం పనికిరాదు. అది ఎంతో ప్రమాదకరం. ఆలస్యం చేయకుండా శూర్పణఖను విరూపిని చేయమన్నాడు శ్రీరాముడు. అన్న ఆజ్ఞే ఆలస్యం – శూర్పణఖ ముక్కు, చెవులు తెగిపడ్డాయి లక్ష్మణుని కత్తిదెబ్బకు. లబోదిబోమని మొత్తుకొంటూ సోదరుడైన ఖరుడి దగ్గరికి వెళ్ళింది శూర్పణఖ. ఖరుడు. పద్నాలుగుమంది యోధులను పంపాడు. వాళ్ళంతా శ్రీరాముని చేతిలో మట్టిగరచారు. ఇది చూసిన శూర్పణఖ ఖరుని వద్దకు వెళ్ళి చెప్పింది. ఖరదూషణులు పద్నాలుగువేల మంది రాక్షసులతో రాముడి మీదకు దండెత్తారు. మూడు గడియల్లో వాళ్ళందరినీ యమపురికి పంపించాడు శ్రీరాముడు.

ప్రశ్నలు – జవాబులు :
1. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు, చెవులు ఎందుకు కోశాడు ?
జవాబు:
శ్రీరాముని ఆజ్ఞను అనుసరించి

2. ఖర దూషణులు ఎవరు ?
జవాబు:
రాక్షసులు

3. యమపురికి పంపించడం అంటే ఏమిటి ?
జవాబు:
చంపడం

4. పద్నాలుగువేలు ఏ సమాసం ?
జవాబు:
ద్విగు సమాసం

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం అరణ్యకాండ

5. “ఆజ్ఞ” వికృతి పదం రాయండి.
జవాబు:
ఆన