TS Inter 1st Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

Telangana TSBIE TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ Textbook Questions and Answers.

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఆకృత తప్పులు అంటే ఏమిటి ?
జవాబు.

  1. ఒక వ్యవహారాన్ని పూర్తిగా గానీ లేదా పాక్షికంగా గానీ పుస్తకాలలో నమోదు చేయకుండా వదిలివేయటం వల్ల జరిగే తప్పులను ఆకృత తప్పులు అంటారు.
  2. వ్యవహారములను సహాయక చిట్టాలలో వ్రాయకపోవడము వలన లేదా ఆవర్జాలో నమోదు చేయకపోవడం వలన ఇలాంటి దోషాలు ఏర్పడతాయి.
  3. ఉదా : అరువు మీద 300 లకు సరుకు కొనుగోలు చేసి, కొనుగోలు పుస్తకములో నమోదు చేయకపోవడం, గణేశ్ చెల్లించిన నగదు 1,000 నగదు పుస్తకములో వ్రాయలేదు.

ప్రశ్న 2.
ఆకార్యకరణ దోషాలను ఉదాహరణలతో వివరించండి.
జవాబు.

  1. ఇవి వ్రాతపూర్వకమైన దోషాలు.
  2. వ్యవహారాన్ని చిట్టాపద్దులో తప్పుగా రాయటం, ఖాతాల్లో తప్పుగా నమోదుచేయటం. కూడికలలో నిల్వ తేల్చటములో లేదా నిల్వలను ముందుగా తీసుకొని వెళ్ళడంలో జరిగిన తప్పులను ఆకార్యకరణ దోషాలు అంటారు.
  3. ఉదా : కొనుగోలు ఖాతాలో ₹ 1,000 కు బదులు ₹ 100గా నమోదు చేయడము. X చెల్లించిన ₹ 100 y ఖాతాకు క్రెడిట్ చేయడం.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 3.
సిద్ధాంత రీత్యా దోషాన్ని రెండు ఉదాహరణలతో వివరించండి.
జవాబు.

  1. గణకశాస్త్ర సూత్రాలకు విరుద్ధముగా వ్యాపార వ్యవహారాలు వ్రాసినపుడు జరిగే దోషాలను “సిద్ధాంతరీత్యా దోషాలు” అంటారు.
  2. పెట్టుబడికి, రాబడికి మధ్య వ్యత్యాసాన్ని గమనించకుండా లెక్కలు వ్రాసినపుడు సిద్ధాంతపు దోషాలు ఏర్పడతాయి.
  3. ఉదా : ₹ 10,000 కు ఫర్నీచర్ కొని, కొనుగోలు ఖాతాకు డెబిట్ చేయడం, యంత్రాల మరమ్మత్తులకు ₹ 500 చెల్లించి, యంత్రాల ఖాతాకు డెబిట్ చేయడం.

ప్రశ్న 4.
సరిపెట్టె తప్పులు అంటే ఏమిటి ?
జవాబు.

  1. రెండు లేదా అంతకన్నా ఎక్కువ తప్పులు జరిగి ఒక తప్పును మరొక తప్పుతో సర్దుబాటు అయితే దానిని సరిపెట్టే తప్పులు అంటారు.
  2. ఖాతాలలో ఒకవైపున చేసిన తప్పులు, మరొక వైపున చేసిన తప్పులతో సమానమై రద్దు అవుతాయి.
  3. ఉదా : రాముకి చెల్లించిన 500 పుస్తకాలలో 450గా నమోదు చేయటం, అలాగే రమేష్ నుండి వచ్చిన నగదు కౌ 1,000లను కౌ950గా నమోదు చేయటం.

ప్రశ్న 5.
అనామతు ఖాతాను నిర్వచించండి.
జవాబు.

  1. వ్యవహారాలను పుస్తకాలలో నమోదు చేసే ప్రక్రియలో అంకణాలోని డెబిట్, క్రెడిట్ మొత్తాలు కొన్ని సందర్భాలలో సమానంగా ఉండకపోవచ్చును. అంకణాలోని డెబిట్, క్రెడిట్ మొత్తాలలోని తేడాను ఒక ప్రత్యేకమైన ఖాతాకు బదిలీ చేయడం జరుగుతుంది. దీనినే ‘అనామతు ఖాతా’ అంటారు.
  2. అనామతు ఖాతా అనేది ఒక ఊహజనిత ఖాతా, దీనిని అంకణాలోని రెండు వరసలు సమానత్వం పొందటం కోసం తాత్కాలికంగా మాత్రమే తెరువబడుతుంది.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
దోషాలు ఎన్ని రకాలు ? తగిన ఉదాహరణలతో వివరించండి.
జవాబు.
తప్పు ఏదో ఒక రకమైన దోషము. తప్పుల వ్యవహారములను చిట్టాపద్దులలో నమోదు చేసేటప్పుడు గాని, సహాయక చిట్టాలలో నమోదు చేసేటప్పుడుగాని, ఆవర్జా ఖాతాలలో నమోదు చేసేటప్పుడుగాని, ఖాతా నిల్వలను తేల్చేటప్పుడుగాని లేదా నిల్వలను బదిలీ చేసేటప్పుడుగాని ఏర్పడతాయి. ఈ తప్పులు ముగింపు లెక్కలపై ప్రభావాన్ని చూపుతాయి.

గణక శాస్త్రములో తప్పులను కొట్టివేసి వాటి స్థానములో వేరే రాయటానికి వీలులేదు. ఇది ఆచరణయోగ్యము కాదు. అందువలన తప్పు పాక్షికమయితే వదిలిన భాగమునకు సవరణ పద్దు రాయటం ద్వారా లేదా అదనపు పద్దు నమోదు చేయటము ద్వారాగాని సవరించవచ్చును. ఈ విధముగా సవరించడాన్ని తప్పుల సవరణ అంటారు.

దోషాలను రెండు రకాలుగా వర్గీకరించడం జరిగినది. అవి :

  1. సిద్ధాంతపరమైన దోషాలు
  2. రాతపూర్వకమైన దోషాలు

1. సిద్ధాంతపరమైన దోషాలు :
గణక శాస్త్ర సూత్రాలకు విరుద్ధముగా వ్యాపార వ్యవహారములను వ్రాయడం వలన జరిగే దోషాలను సిద్ధాంతపరమైన దోషాలు అంటారు. పెట్టుబడి వ్యయాన్ని రాబడి వ్యయముగా చూపినపుడు, రాబడి ఆదాయాన్ని పెట్టుబడి వ్యయముగా చూపినపుడు ఇలాంటి దోషాలు ఏర్పడతాయి. జీతాలను చెల్లించి వ్యక్తిగత ఖాతాలకు నమోదు చేయడం, ఫర్నీచర్ కొని కొనుగోలు ఖాతాలో వ్రాయడం. ఈ దోషాలు అంకణా ద్వారా వెల్లడి కావు.

2. రాతపూర్వకమైన దోషాలు :
వ్యాపార వ్యవహారాలను తొలిపద్దు పుస్తకములో గాని ఆవర్జాలో నమోదు చేసేటప్పుడు సిబ్బంది చేసే తప్పులను రాతపూర్వకమైన దోషాలు అంటారు. ఇవి మూడు రకాలు :

  • ఆకృత దోషాలు
  • అకార్యాకరణ దోషాలు
  • సరిపెట్టే దోషాలు.

ఎ) ఆకృత దోషాలు :
వ్యవహారములను సహాయక చిట్టాలలో వ్రాయకపోవడం వలన లేదా ఆవర్జాలో నమోదు చేయకపోవడం వలన ఇలాంటి దోషాలు ఏర్పడతాయి. జరిగిన వ్యవహారము పుస్తకాలలో వ్రాయకపోవడం ఆకృత దోషము. ఇది అంకణా సమానతకు భంగము కలిగించదు. ఉదా : అరువు మీద ₹ 300 సరుకు కొనుగోలు చేసి, కొనుగోలు పుస్తకములో వ్రాయకపోవడం.

బి) అకార్యాకరణ దోషాలు :
వ్యాపార వ్యవహారాలను నమోదు చేసేటపుడు కేవలము సిబ్బంది చేసే తప్పులను అకార్యాకరణ దోషాలు అంటారు. తప్పు వరసల వలన, తప్పుగా ముందుకు తీసుకొని రావడం, తప్పుగా నిల్వలు తేల్చడం, ద్వంద దోషాలు, తప్పుగా పద్దులు వేయడం ద్వారా ఇలాంటి దోషాలు ఏర్పడతాయి.

ఇవి అంకణా సమానతకు భంగము కలిగించవచ్చు లేదా కలిగించకపోవచ్చు. ఉదా : కొనుగోలు ఖాతాకు ₹ 1,000 బదులు ₹ 100 నమోదు చేయడము.

సి) సరిపెట్టే దోషాలు :
ఒక తప్పును మరొక తప్పుతో సర్దుబాటు చేయడము వలన సరిపెట్టే దోషాలు ఏర్పడతాయి. ఖాతాలలో ఒకవైపు చేసిన తప్పులు మరొక వైపున చేసే తప్పులతో సమానమై రద్దు అయిపోతాయి.
ఉదా : జీతాల ఖాతాలో 7 500 ఎక్కువగా డెబిట్ చేసి, అమ్మకాల ఖాతాలో కూడా ₹ 500 ఎక్కువ క్రెడిట్ చేయడం. ఈ దోషాల వలన అంకణా సమానతకు భంగము కలగదు.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 2.
అంకణా వల్ల వెల్లడి అయ్యే తప్పులను, వెల్లడి కాని తప్పులను వివరించండి.
జవాబు.
తప్పులు అనేవి వ్యవహారాలను పుస్తకాలలో నమోదు చేసే క్రమంలో కాని, వాటిని ఆవర్జాలో నమోదు చేసే సందర్భంలో కానీ లేదా అంకణా తయారుచేయునప్పుడు గానీ దొర్లే పొరపాట్లు.
తప్పులు (దోషాలు) – రకాలు :
తప్పులు అంకణాపై ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో అనే అంశం ఆధారంగా తప్పులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి :

  • అంకణా వల్ల వెల్లడి కాని తప్పులు
  • అంకణా వల్ల వెల్లడి అయ్యే తప్పులు

I. అంకణా వల్ల వెల్లడి కాని తప్పులు:

  1. సిద్ధాంతపరమైన తప్పులు
  2. ఆకృత (తొలగింపు) తప్పులు
  3. ఆకార్యకరణ దోషాలు
  4. సరిపెట్టే తప్పులు
  5. ఖాతాలో తప్పువైపున నమోదు చేసే దోషాలు

II. అంకణా వల్ల వెల్లడి అయ్యే తప్పులు

  1. ఖాతాలో తప్పువైపున నమోదు చేసే దోషం
  2. తప్పు మొత్తాన్ని చూపటం
  3. కూడికలలో తప్పులు
  4. తప్పుగా ముందుకు తీసుకుపోవడం
  5. వ్యవహారాన్ని పాక్షికంగా వదలివేయటం
  6. ఒకే అంశాన్ని రెండు సార్లు ఒకే ఖాతాలో నమోదు చేయటం.

I. అంకణా వల్ల వెల్లడి కాని తప్పులు :
ఈ రకమైన తప్పులు అంకణా తయారు చేయటం వల్ల వెల్లడి కావు, ఎందుకంటే ఈ తప్పులు అంకణా సమానతపై ఎలాంటి ప్రభావం చూపవు. ఈ తప్పులను విపులంగా క్రింద చర్చించడమైనది.

a) సిద్ధాంతపరమైన తప్పులు :

  1. వ్యాపార వ్యవహారాలు సాధారణంగా ఆమోదింపబడే గణకశాస్త్ర సిద్ధాంతాల ప్రకారం నమోదు చేయబడతాయి. ఏ సిద్ధాంతమైనా అమలు చేయునప్పుడు కానీ లేదా వాటిని పట్టించుకోకుండా వ్యవహారాలను నమోదు చేయటం వల్ల గానీ సంభవించే దోషాలను సిద్ధాంతపరమైన దోషాలు అంటారు.
  2. పెట్టుబడి అంశాలను రాబడి అంశాలుగా భావించడం వల్ల ఈ రకమైన తప్పులు సంభవిస్తాయి.
  3. ఉదాహరణకి యంత్రాల కొనుగోలు అనే వ్యవహారాన్ని, కొనుగోలు ఖాతాలో నమోదు చేయటం.

b) ఆకృత (తొలగింపు) తప్పులు :

  1. ఒక వ్యవహారాన్ని పూర్తిగా గానీ లేదా పాక్షికంగా గానీ (పుస్తకాలలో) నమోదు చేయకుండా వదిలివేయటం వల్ల జరిగే తప్పులను ఆకృత తప్పులు అంటారు.
  2. ఈ రకమైన తప్పులు రెండు రకాలుగా సంభవించవచ్చును. అవి
    1. సంపూర్ణ ఆకృత తప్పులు
    2. పాక్షిక ఆకృత తప్పులు.

1. సంపూర్ణ ఆకృత దోషం (సంపూర్ణ తొలగింపు) :

  • ఒక వ్యవహారాన్ని పుస్తకాలలో నమోదు చేయకుండా పూర్తిగా వదలివేయటాన్ని సంపూర్ణ ఆకృత దోషం అంటారు.
  • ఉదాహరణకు సాకేత్ & కంపెనీ నుండి కొన్న ఫర్నీచరు పుస్తకాలలో పూర్తిగా నమోదు చేయలేదు.
  • ఈ తప్పు అంకణా సమానత్వానికి భంగం వాటిల్లదు.

2. పాక్షిక ఆకృత తప్పులు :

  • వ్యవహారంలోని ఒక అంశాన్ని మాత్రమే నమోదు చేసి ఇంకొక అంశాన్ని వదిలివేసినట్లయితే అలాంటి దోషాలను పాక్షిక ఆకృత దోషాలు అంటారు.
  • ఉదాహరణకి, సుందర్కి అరువుపై అమ్మిన సరుకు అమ్మకాల పుస్తకాలలో నమోదు చేశారు కాని, సుందర్ ఖాతాలో నమోదు చేయటం జరగలేదు.
  • ఇలాంటి దోషాలు అంకణా సమానత్వానికి భంగం కలుగుతాయి. కాబట్టి అంకణా సరితూగదు.

c) అకార్యకరణ దోషాలు :

  • వ్యవహారాన్ని చిట్టా పద్దులో తప్పుగా రాయటం, ఖాతాలలో తప్పుగా నమోదు చేయటం, ఖాతా మొత్తాలను తప్పుగా కూడటం, ఖాతాలను తప్పుగా నిల్వ తేల్చటం, తప్పుగా ముందుకు తీసుకువెళ్లడం వంటి దోషాలను అకార్యకరణ దోషాలు అంటారు.
  • ఉదాహరణకి, ప్రవీణ్ నుంచి ₹ 8,500 సరుకును అరువుపై కొనుగోలు చేసిన వ్యవహారాన్ని పుస్తకాలలో ₹ 5,800గా (తప్పుగా) నమోదు చేయటం.

d) సరిపెట్టే తప్పులు :

  • రెండు లేదా అంతకన్నా ఎక్కువ తప్పులు జరిగి, ఒక తప్పును మరొక తప్పుతో సరిపెట్టినట్లయితే, దానిని సరిపెట్టే తప్పు అంటారు. దీని ద్వారా (అంకణా యొక్క) అంకగణితపు ఖచ్చితత్వానికి భంగం వాటిల్లదు.
  • ఉదాహరణకి, రాముకి చెల్లించిన ₹ 5,000, ₹ 4,500లుగా నమోదు చేయటం, అలానే శ్యాము నుండి వచ్చిన నగదు ₹ 10,000లు, ₹ 9,500లుగా నమోదు చేయటం.

e) ఖాతాలో తప్పువైపున నమోదు చేసే దోషాలు :

  • ఒక ఖాతాలో రాయవలసిన దానిని వేరొక ఖాతాలో రాయటం వల్ల ఈ రకమైన దోషాలు సంభవిస్తాయి.
  • ఉదాహరణకి, మహేష్కి చెల్లించిన మొత్తం ₹ 1,000 సురేష్ ఖాతాకి డెబిట్ చేయటం.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

II. అంకణా వల్ల వెల్లడి అయ్యే తప్పులు :
అంకణా తయారు చేయటం ద్వారా తెలుసుకొనగలిగే తప్పులను అంకణా ద్వారా వెల్లడి అయ్యే తప్పులు అంటారు. ఈ క్రింది దోషాలు అంకణా తయారుచేయటం వల్ల వెల్లడి అవుతాయి.

a) వ్యవహరాన్ని ఖాతాలో, తప్పువైపున నమోదు చేయటం :
ఉదాహరణకి ఇచ్చిన డిస్కౌంట్ను, డిస్కౌంటు ఖాతాలో క్రెడిట్ వైపున నమోదు చేయటం.

b) ఖాతాలో తప్పు మొత్తాన్ని నమోదు చేయటం :
ఉదాహరణకి ₹ 25,000 ల అమ్మకాలు, ₹ 2,500 లుగా అమ్మకాల ఖాతాలో నమోదు చేయటం.

c) కూడికలలో తప్పులు :
సహాయక పుస్తకాలలో కానీ, ఆవర్జాలలో కానీ, వ్యవహారాల మొత్తాన్ని తప్పుగా కూడినప్పుడు అది అంకణా కచ్చితత్వానికి ప్రభావం చూపుతుంది.
ఉదా :
1) అమ్మకాల వాపసుల పుస్తకం ₹ 1,000లు ఎక్కువగా కూడటం.
2) ఫర్నీచరు ఖాతాను ₹ 1,500 లుకు బదులుగా, ₹ 1,750 గా కూడటం.

d) తప్పుగా ముందుకు తీసుకుపోవడం :
ఒక పేజీలోని మొత్తాన్ని తదుపరి పేజీలోకి తీసుకోపోతున్నప్పుడు చేసే దోషాలను తప్పుగా ముందుకు తీసుకుపోయే దోషాలు అంటారు. ఈ రకమైన తప్పు అంకణా సమానత్వానికి భంగం వాటిల్లుతుంది.
ఉదా : కొనుగోలు పుస్తకం మొత్తం ₹ 150 లకు బదులుగా ₹ 1,500 లుగా ముందు పేజీలో చూపటం.

e) పాక్షిక తొలగింపు దోషాలు :
వ్యవహారాలను చిట్టా నుంచి ఆవర్జాలోని ఖాతాలకు బదిలీ చేసే సందర్భంలో చిట్టా పద్దులో రెండు అంశాలలో ఒకే అంశాన్ని ఖాతాలోకి బదిలీ చేయటం వల్ల పాక్షిక తొలగింపు దోషాలు సంభవిస్తాయి. ఉదా : రమేష్ నుండి కొన్న సరుకు ₹ 2,000 కొనుగోలు పుస్తకంలో మాత్రమే నమోదు చేయటమైనది.

f) రెండు సార్లు నమోదుకు సంబంధించిన దోషం :
ఒకే అంశాన్ని రెండు సార్లు చిట్టాలో రాయటం వల్ల ఈ రకమైన దోషాలు సంభవిస్తాయి.
ఉదా : చెల్లించిన జీతాలు ₹ 600లు జీతాల ఖాతాలో రెండు సార్లు నమోదు చేయటం.

ప్రశ్న 3.
అనామతు ఖాతా అంటే ఏమిటి ? దానిని గురించి సూక్ష్మంగా వివరించండి.
జవాబు.

  1. వ్యవహారాలను పుస్తకాలలో నమోదు చేసే ప్రక్రియలో అంకణాలోని డెబిట్, క్రెడిట్ మొత్తాలు కొన్ని సందర్భాలలో సమానంగా ఉండకపోవచ్చును. అంకణాలోని డెబిట్, క్రెడిట్ మొత్తాలలోని తేడాను ఒక ప్రత్యేకమైన ఖాతాకు బదిలీ చేయడం జరుగుతుంది. దీనినే ‘అనామతు ఖాతా’ అంటారు.
  2. అనామతు ఖాతా అనేది ఒక ఊహజనిత ఖాతా, దీనిని అంకణాలోని రెండు వరసలు సమానత్వం పొందటం కోసం తాత్కాలికంగా మాత్రమే తెరువబడుతుంది.
  3. అంకణా ద్వారా వెల్లడి అయిన, వెల్లడి కాని తప్పులను గుర్తించి ఈ అనామతు ఖాతా ద్వారా దోషాలను సవరిస్తారు. అలా దోషాలను గుర్తించి, వాటిని సవరించటం ద్వారా ఈ ‘అనామతు ఖాతా’ ముగుస్తుంది. అంటే అనామతు ఖాతా ఎలాంటి నిల్వ చూపదు.
  4. దోషాలు సవరించే సందర్భంలో ఒకవేళ అంకణా యొక్క డెబిట్ మొత్తాలు, క్రెడిట్ మొత్తాల కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు అనామతు ఖాతాను ఆ తేడా మొత్తంతో క్రెడిట్ చేయాలి. అలాగే ఒకవేళ క్రెడిట్ మొత్తాలు, డెబిట్ మొత్తాల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు అనామతు ఖాతాను ఆ వ్యత్యాసంతో డెబిట్ చేయాలి. అంటే అంకణా ఏవైపు తక్కువ చూపుతుందో ఆ వైపున అనామతు ఖాతా నిల్వ చూపుతుంది.

అనామతు ఖాతా ఉపయోగించి సవరణ పద్దులు రాసేటప్పుడు ఈ క్రింది విషయాలు గుర్తుంచుకోవాలి :

  1. అంకణాను ప్రభావితం చేసే దోషాలను సవరించటానికి అనామతు ఖాతా ఉపయోగించాలి.
  2. a) సవరణ పద్దులో సవరించాల్సిన అంశానికి డెబిట్ చేయ్యాల్సి వస్తే, అనామతు ఖాతాకు క్రెడిట్ చేసి, జంట పద్దు పూర్తి చేస్తాం.
    b) సవరణ పద్దులో సవరించాల్సిన అంశానికి క్రెడిట్ చేయ్యాల్సి వస్తే, అనామతు ఖాతాకు డెబిట్ చేసి, జంట పద్దు విధానాన్ని పూర్తి చేస్తాం.

ప్రశ్న 4.
పాక్షిక ఆకృత తప్పులకు, సంపూర్ణ ఆకృత తప్పులకు మధ్యగల తేడాలను ఉదాహరణలతో వివరించండి.
జవాబు.
పాక్షిక ఆకృత తప్పులు, సంపూర్ణ ఆకృత తప్పులకు మధ్యగల తేడాలు :

తేడాకు ఆధారంపాక్షిక ఆకృత తప్పులుసంపూర్ణ ఆకృత తప్పులు
1. అర్థమువ్యవహారంలో ఒక అంశాన్ని మాత్రమే నమోదు చేసి, ఇంకొక అంశాన్ని వదిలివేసినట్లయితే అలాంటి దోషాలను పాక్షిక ఆకృత తప్పులు అంటారు.ఒక వ్యవహారాన్ని పుస్తకాలలో నమోదు చేయకుండా పూర్తిగా వదిలివేయ్యటాన్ని సంపూర్ణ ఆకృత దోషం అంటారు.
2. ఉదాహరణఉదాహరణకు : రమేష్కి అరువుపై అమ్మిన సరుకు అమ్మకాల పుస్తకాలలో నమోదు చేశారు కాని రమేష్ ఖాతాలో నమోదు చేయలేదు.ఉదాహరణకు : శ్రీను నుండి కొన్న ఫర్నీచర్ పుస్తకాలలో పూర్తిగా నమోదు చేయలేదు.
3. అంకణాపై ప్రభావంపాక్షిక ఆకృత తప్పుల వల్ల అంకణా సమానత్వానికి ప్రభావం భంగం కలుగుతుంది. కాబట్టి అంకణా సరితూగదు.సంపూర్ణ ఆకృత తప్పుల వల్ల అంకణా సమానత్వానికి భంగం వాటిల్లదు. అంకణా సరితూగుతుంది.


TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

Problems:

ప్రశ్న 1.
కింది దోషాలను సవరించండి.
a) ఆదిత్యకు అమ్మిన సరుకు ₹ 2,500 కొనుగోలు పుస్తకంలో రాసుకొన్నారు.
b) సందీప్కి చెల్లించిన జీతం ₹ 800 అతని వ్యక్తిగత ఖాతాకు డెబిట్ చేశారు.
c) శేఖర్ వద్ద అరువుకి కొన్న ఫర్నీచర్ ₹ 1,000 కొనుగోలు పుస్తకంలో రాశారు.
d) భవనాల విస్తృతి కోసం పెట్టిన ఖర్చు ₹ 5,000 తప్పుగా భవనాల మరమ్మత్తుల ఖాతాలో డెబిట్ చేశారు.
e) శైలేష్ వాపసు చేసిన సరుకు ₹ 1,200 కొనుగోలు వాపసుల పుస్తకంలో నమోదు చేసుకొన్నారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 1

ప్రశ్న 2.
కింది తప్పులను సవరించండి.
a) ఫర్నీచర్ కొనుగోలు ₹ 10,000 తప్పుగా కొనుగోలు ఖాతాకు డెబిట్ అయ్యింది.
b) రమణ వద్ద అరువుకి కొన్న యంత్రాలు ₹ 20,000 కొనుగోలు పుస్తకంలో రాయడమైంది.
c) యంత్రం మరమ్మత్తుల ఖర్చు ₹ 1,400 యంత్రాల ఖాతాకు డెబిట్ చేశారు.
d) పాత యంత్రం మరమ్మత్తులకైన ఖర్చు ₹ 2,000 మరమ్మత్తుల ఖాతాకు డెబిట్ చేశారు.
e) యంత్రం అమ్మకాలు ₹ 3,000 అమ్మకాల ఖాతాలో క్రెడిట్ చేశారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 2

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 3.
కింది తప్పులను సవరించడానికి చిట్టా పద్దులు రాయండి.
a) యంత్రం కొనుగోలు ₹ 5,000 కొనుగోలు ఖాతాకు డెబిట్ చేయడమైంది.
b) రుచిరకి చెల్లించిన న్యాయాత్మక ఖర్చులు ₹ 700 ఆమె వ్యక్తిగత ఖాతాకు డెబిట్ చేయడమైంది.
c) ఎస్కార్ట్స్ కంపెనీ వద్ద కొనుగోలు చేసిన యంత్రం ₹ 10,000 ఎస్కార్ట్స్ కంపెనీ ఖాతాకు డెబిట్ చేశారు.
d) టైప్ రైటర్ కొనుగోలు ₹ 6,000 తప్పుగా కొనుగోలు పుస్తకంలో రాశారు.
e) యజమాని తనకోసం కొనుగోలు చేసిన మోటారు సైకిల్ ₹ 20,000 సాధారణ ఖర్చుల ఖాతాలో రాశారు.
f) గ్యాస్ ఇంజన్ కొనుగోలు ₹ 15,000 కొనుగోలు ఖాతాకు డెబిట్ చేశారు.
g) సరితకు చెల్లించిన నగదు ₹ 400 ఆమని ఖాతాకు డెబిట్ చేయడమైంది.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 3

ప్రశ్న 4.
కింది తప్పులకు సవరణ పద్దులు రాయండి.
a) ఫర్నీచర్ తయారీదారుకి చెల్లించాల్సిన వేతనాలు ₹ 670 వేతనాల ఖాతాకు డెబిట్ చేశారు.
b) శ్రీనివాస్కు అరువుపై అమ్మిన సరుకు ₹ 150 శివరామ్ ఖాతాకు డెబిట్ చేశారు.
c) వర్షిణికి చెల్లించిన జీతం ₹ 1,000 అసలు పుస్తకాల్లో నమోదు కాలేదు.
d) హర్షిణి వద్ద అరువుకి కొన్న సరుకు 140 పుస్తకాల్లో ₹ 410 గా నమోదు అయ్యింది.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 4

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 5.
కింది దోషాలకు సవరణ పద్దులు రాయండి.
a) వ్యాపారస్తుడి కొనుగోలు పుస్తకాన్ని ₹ 200 ఎక్కువగా కూడారు.
b) పాత ఫర్నీచర్ అమ్మకం ₹ 100 తప్పుగా అమ్మకాల ఖాతాకు క్రెడిట్ అయ్యింది.
c) చెల్లించిన వడ్డీ ₹ 100 కమీషన్ ఖాతాకు డెబిట్ చేశారు.
d) సోనీ నుంచి వచ్చిన నగదు ₹ 125 ఆమె ఖాతాలో తప్పుగా ₹ 152 క్రెడిట్ అయ్యింది.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 5

ప్రశ్న 6.
కింది తప్పులను సవరించండి.
a) ఫర్నీచర్ కొనుగోలు ₹ 1,200 కొనుగోలు పుస్తకంలో రికార్డు అయ్యింది.
b) యంత్రం మరమ్మత్తులు ₹ 200 యంత్రం ఖాతాకు డెబిట్ చేశారు.
c) రమేష్కి అరువుపై అమ్మిన సరుకు ₹ 200 అమ్మకాల పుస్తకంలో సరిగానే నమోదు అయినప్పటికీ అతడి ఖాతా, డెబిట్ చేశారు.
d) కొనుగోలు పుస్తకాన్ని ₹ 200 ఎక్కువగా కూడారు.
e) మేనేజర్కి చెల్లించిన జీతం ₹ 2,000 అతడి వ్యక్తిగత ఖాతాకు డెబిట్ చేశారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 6

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 7.
కింది తప్పులను సవరించండి.
a) పాత యంత్రం అమ్మకం ₹ 500 అమ్మకాల పుస్తకంలో రాసుకొన్నారు.
b) రాకేష్ చెల్లించిన ₹ 300 రాజేష్ ఖాతాకు క్రెడిట్ చేశారు.
c) షా & కంపెనీ ₹ 250 వారి ఖాతాకు ₹ 520గా డెబిట్ అయ్యింది.
d) రామంజికి వాపసు చేసిన సరుకు ₹ 350 అసలు పుస్తకాల్లో రికార్డు కాలేదు.
e) రమణకి చెల్లించిన జీతం ₹ 1,500 అతడి ఖాతాకు డెబిట్ చేశారు.
f) గుప్త వద్ద కొన్న సరుకు ₹ 700 అమ్మకాల పుస్తకంలో రాసుకొన్నారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 7

ప్రశ్న 8.
కింది దోషాలను సవరించండి.
a) ఫర్నీచర్ మరమ్మత్తులకై చెల్లించిన ₹ 100 ఫర్నీచర్ ఖాతాకు డెబిట్ చేశారు.
b) అమ్మకాల పుస్తకాన్ని ₹ 500 తో ఎక్కువగా కూడారు.
c) ఖర్చులు ₹ 1500 ఆవర్జా ఖాతాలో ₹ 150 గా నమోదు అయ్యింది.
d) Mr. S కి అమ్మిన సరుకు ₹ 200 Mr. V ఖాతాకు డెబిట్ చేశారు.
e) పాత ఫర్నీచర్ అమ్మకం ₹ 500 అమ్మకాల ఖాతాకు క్రెడిట్ చేశారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 8

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 9.
కింది తప్పులకు సవరణ పద్దులు రాయండి.
a) అమ్మకాల పుస్తకాన్ని ₹ 300 ఎక్కువగా కూడారు.
b) మాధవికి అమ్మకాలు ₹ 100 తప్పుగా శరత్ ఖాతాకు డెబిట్ చేశారు.
c) సాధారణ ఖర్చులు ₹ 200 ఆవర్జా ఖాతాలో 300గా నమోదు అయ్యింది.
d) శంకర్ నుంచి వచ్చిన నగదు ₹ 500 సంధ్య ఖాతాకు డెబిట్ చేశారు.
e) సరితకు చెల్లించిన న్యాయాత్మక ఖర్చులు ₹ 200 ఆమె వ్యక్తిగత ఖాతాకు డెబిట్ చేశారు.
f) రమేష్కి చెల్లించిన ₹ 200 అసలు పుస్తకాల్లో రికార్డు కాలేదు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 9

ప్రశ్న 10.
కింది తప్పులను సవరిస్తూ చిట్టాపద్దులు రాయండి.
a) కొనుగోలు పుస్తకాన్ని ₹ 200 తక్కువగా కూడారు.
b) వైష్ణవి వద్ద అరువుకి కొన్న సరుకు ₹ 1,000 తప్పుగా అమ్మకాల పుస్తకంలో రాశారు.
c) చెల్లించిన వేతనాలు ₹ 200 తప్పుగా జీతాల ఖాతాకు డెబిట్ చేశారు.
d) వచ్చిన వడ్డీ ₹ 100 తప్పుగా కమీషన్ ఖాతాకు క్రెడిట్ చేశారు.
e) మేనేజర్ కృష్ణకు చెల్లించిన జీతం ₹ 500 అతని ఖాతాకు డెబిట్ చేశారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 10

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 11.
కింది తప్పులను సవరించండి.
a) కొనుగోలు పుస్తకాన్ని ₹ 2,000 తో తక్కువగా కూడారు.
b) చెల్లించిన అద్దె ₹ 350 ఆ ఖాతాకు 530గా డెబిట్ అయ్యింది.
c) రామా & కంపెనీ నుంచి వచ్చిన డిస్కౌంట్ ₹ 250 అసలు పుస్తకాల్లో రికార్డు కాలేదు.
d) చెల్లించిన వడ్డీ ₹ 89 తప్పుగా ₹ 98 గా క్రెడిట్ అయ్యింది.
e) అమ్మకాల పుస్తకాన్ని ₹ 1,700 తో ఎక్కువగా కూడారు.
f) కొనుగోలు వాపసుల పుస్తకం ₹ 275 తక్కువగా కూడారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 11

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 12.
కింది దోషాలను సవరించండి.
a) అమ్మకాల పుస్తకాన్ని ₹ 1,000 తక్కువగా కూడారు.
b) పాత ఫర్నీచర్ అమ్మకాలు ₹ 4,000 అమ్మకాల ఖాతాకు క్రెడిట్ చేశారు.
c) వడ్డీ నిమిత్తం చెల్లించిన ₹ 250 కమీషన్ ఖాతాకు డెబిట్ చేయడమైంది.
d) సందీప్కి చెల్లించిన ₹ 125 అతని ఖాతాలో ₹ 152 గా నమోదు అయ్యింది.
e) కొనుగోలు పుస్తకంలో ₹ 750 ఎక్కువగా కూడారు.
f) హెడ్ గుమాస్తా శేఖరుకి చెల్లించిన జీతం ₹ 4,500 అతని ఖాతాకు డెబిట్ చేశారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 12

ప్రశ్న 13.
కింది తప్పులను సవరించండి.
a) ఫర్నీచర్ కొనుగోలు ₹ 3,500 కొనుగోలు పుస్తకంలో రాశారు.
b) వచ్చిన వాపసుల పుస్తకాన్ని ₹ 250 తో ఎక్కువగా కూడారు.
c) యంత్రం మరమ్మత్తుల ఖర్చులు ₹ 800 యంత్రాల ఖాతాకు డెబిట్ చేశారు.
d) శ్రీమన్నారాయణకి చేసిన అమ్మకాలు ₹ 750 అమ్మకాల పుస్తకంలో నమోదు అయినప్పటికీ అతడి ఖాతాలో క్రెడిట్ చేశారు.
e) రాధిక వద్ద చేసిన కొనుగోలు ₹ 760 ఆమె ఖాతాలో ₹ 670 గా క్రెడిట్ అయ్యింది.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 13

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 14.
కింది దోషాలను సవరించండి.
a) యజమాని వైద్య ఖర్చులు ₹ 250 వివిధ ఖర్చుల ఖాతాకు డెబిట్ చేశారు.
b) సంధ్య & కంపెనీకి అమ్మిన సరుకు ₹ 2,900 కొనుగోలు పుస్తకంలో నమోదు చేశారు.
c) పాత యంత్రం ₹ 5,000 అమ్మకాల ఖాతాకు క్రెడిట్ చేశారు.
d) కొనుగోలు పుస్తకాన్న ₹ 2,000 తో ఎక్కువగా కూడారు.
e) కిట్టుకి చెల్లించిన జీతం ₹ 4,500 వ్యక్తిగత ఖాతాకు డెబిట్ చేశారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 14

ప్రశ్న 15.
కింద ఇచ్చిన తప్పులను సవరించండి.
a) గోపాల్ నుంచి వచ్చిన నగదు ₹ 1,500 చందు ఖాతాకు క్రెడిట్ చేశారు.
b) కొనుగోలు పుస్తకాన్ని ₹ 1,000 తక్కువగా కూడారు.
c) యంత్రం మరమ్మత్తులు ₹ 800 యంత్రాల ఖాతాకు డెబిట్ చేశారు.
d) చింటుకి అనుమతించిన డిస్కౌంట్ ₹ 200 నగదు పుస్తకంలో సరిగానే నమోదు అయినప్పటికీ వ్యక్తిగత ఖాతాలో అసలు నమోదు కాలేదు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 15

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

Textual Examples:

ప్రశ్న 1.
కింద ఇచ్చిన దోషాలను సవరించండి.
a) పవనికి చెల్లించిన జీతం ₹ 1,200 అతని వ్యక్తిగత ఖాతాకు డెబిట్ చేశారు.
b) ఇంటి యజమాని మురళికి చెల్లించిన అద్దె ₹ 5,000 అతని ఖాతాకు డెబిట్ చేశారు.
c) భవనాల మరమ్మతుల కోసం చెల్లించిన ₹ 2,000 భవనాల ఖాతాకు డెబిట్ చేశారు.
d) యజమాని తన సొంతానికి వాడుకొన్న ₹ 850 ను వర్తక ఖర్చులకు డెబిట్ చేశారు.
e) రమేష్ బ్రదర్స్ వాపసు చేసిన సరుకు ₹ 235 అసలు పుస్తకాల్లో నమోదు కాలేదు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 16

ప్రశ్న 2.
కింది తప్పులను సవరించండి.
a) ఆఫీసు ఫర్నిచర్ కొనుగోలు ₹ 7,200 తప్పుగా ఆఫీసు ఖర్చుల ఖాతాకి డెబిట్ చేశారు.
b) ప్రదీప్ అరువుపై అమ్మిన సరుకు ₹ 1,500 పొరపాటున కొనుగోలు ఖాతాలో రాసారు.
c) వెంకట్ నుంచి వచ్చిన చెక్కు ₹ 1,600 అనాదరణ చెందగా తప్పుగా అమ్మకాల వాపసుల పుస్తకంలో డెబిట్ చేశారు.
d) సుధకి అమ్మిన సరుకు ₹ 4,000 పుస్తకాల్లో రికార్డు కాలేదు.
e) సుధీర్ నుంచి వచ్చిన నగదు ₹ 2,000 తప్పుగా సందీప్ ఖాతాకు క్రెడిట్ చేశారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 17

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 3.
లక్ష్మీనారాయణ్ & సన్స్ పుస్తకాల్లో కింది తప్పులు కనుగొన్నారు. వాటిని సవరించే చిట్టా పద్దులు రాయండి.
a) ఫర్నిచర్ కొనుగోలు ₹ 500 కొనుగోలు ఖాతాలో రాశారు.
b) మరమ్మతుల ఖర్చు ₹ 50 భవనాల ఖాతాకు డెబిట్ చేశారు.
c) చెల్లించిన అద్దె ₹ 1000 భూస్వామి ఖాతాకు డెబిట్ చేశారు.
d) షా & కో నుంచి వచ్చిన నగదు ₹ 100 షా & కంపెనీ నుంచి వచ్చినట్లుగా రాసుకొన్నారు.
e) యజమాని తన సొంతానికి తీసుకున్న నగదు ₹ 1150 ప్రయాణ ఖర్చుల ఖాతాకు డెబిట్ చేశారు.
f) టైప్ రైటర్ కొనుగోలు ₹ 1,500 ఆఫీసు ఖర్చుల ఖాతాలో రాసుకొన్నారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 18

ప్రశ్న 4.
అంకణా తయారుచేసేటప్పుడు కనుగొన్న తప్పులకు సవరణ పద్దులు రాయండి.
a) వచ్చిన కమీషన్ ₹ 200 తప్పుగా వడ్డీ ఖాతాకు క్రెడిట్ చేశారు.
b) కొనుగోలు వాపసుల పుస్తకాన్ని ₹ 500 తక్కువగా కూడారు.
c) ఫర్నిచర్ కొనుగోలు ₹ 600 కొనుగోలు ఖాతాకు డెబిట్ చేయడమైంది.
d) శ్రీ భీమ్రాజ్ నుంచి వచ్చిన నగదు ₹ 300 శ్రీరామ్ రాజ్ ఖాతాకు తప్పుగా క్రెడిట్ చేశారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 19

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 5.
వరుణ్ బ్రదర్స్, వరంగల్ వారి ఖాతా పుస్తకాల నుంచి కింది దోషాలను కనుగొన్నారు. సవరణపద్దులు రాయండి.
a) ఫర్నిచర్ అమ్మకాలు ₹ 1,500 సరుకు అమ్మకాలుగా నమోదు అయ్యింది.
b) రామ్ వద్ద నుంచి వచ్చిన నగదు ₹ 3500 శ్యామ్ ఖాతాకు క్రెడిట్ చేయడమైంది.
c) మోహన్ వద్ద కొనుగోలు చేసిన సరుకు ₹ 1,000 అసలు పుస్తకాల్లో నమోదు కాలేదు.
d) ముఖేష్ వద్ద నుంచి వాపసు వచ్చిన సరుకు ₹ 120 అతని ఖాతాకు డెబిట్ చేశారు.
e) యజమాని ఇంటి అద్దె ₹ 600 అద్దె ఖాతాకు డెబిట్ చేయడమైంది.
f) రఫీకి చెల్లించిన ₹ 215 అతని ఖాతాలో ₹ 125 గా క్రెడిట్ చేయడమైంది.
g) అమ్మకాల పుస్తకంలో ₹ 400 తక్కువగా కూడారు.
h) వసూలు బిల్లుల పుస్తకంలో ₹ 1,500 పుస్తకాల్లో నమోదు కాలేదు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 20

ప్రశ్న 6.
కింద ఇచ్చిన తప్పులను అనామతు ఖాతా సహాయంతో సవరించండి.
a) మోహన్క అరువుకి అమ్మిన సరుకు ₹ 7,000 శ్రీను ఖాతాలో ₹ 5,000 గా నమోదు అయ్యింది.
b) శరత్ వద్ద అరువు కొనుగోళ్ళు ₹ 9,000 కిరణ్ ఖాతాలో ₹ 10,000 గా డెబిట్ చేశారు.
c) శైలజకు వాపసు చేసిన సరుకు ₹ 4,000 పావని ఖాతాలో ₹ 3,000 లుగా క్రెడిట్ చేశారు.
d) రత్నాజీ నుంచి వాపసు వచ్చిన సరుకు ₹ 1,000 సంధ్య ఖాతాలో ₹ 2,000 గా నమోదయ్యింది.
e) నగదు అమ్మకాలు ₹ 2,000 కమీషన్ ఖాతాలో ₹ 200 గా నమోదు అయ్యింది.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 21

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 7.
కింది తప్పులను సవరించండి.
a) లలిత నుంచి వచ్చిన నగదు ₹ 200 ఆమె ఖాతాలో ₹ 180 గా నమోదు చేశారు.
b) అశోకికి అమ్మిన సరుకు ₹ 75 అసలు ఖాతా పుస్తకాల్లో నమోదు కాలేదు.
c) హరి ఖాతాలో క్రెడిట్ వైపు ఎక్కువగా కూడిన మొత్తం ₹ 200.
d) రమేష్ నుంచి వాపసు వచ్చిన సరుకు ₹ 650 అతని ఖాతాలో నమోదు కాలేదు.
e) అమ్మకాల పుస్తకాన్ని ₹ 500 తక్కువగా కూడారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 22

ప్రశ్న 8.
కింద ఇచ్చిన తప్పులను అనామతు ఖాతా సహాయంతో సవరించండి.
a) కొనుగోలు పుస్తకాన్ని ₹ 650 ఎక్కువగా కూడారు.
b) కొనుగోలు వాపసుల పుస్తకాన్ని ₹ 250 తక్కువగా కూడారు.
c) అమల నుంచి వచ్చిన నగదు ₹ 222 ఆమె ఖాతాలో ₹ 2,222 గా నమోదు అయ్యింది.
d) రాజేష్ అమ్మిన సరుకు ₹ 296 అతని ఖాతాలో ₹ 269 గా నమోదు అయ్యింది.
e) శరత్ నుంచి వచ్చిన నగదు ₹ 350 అతని ఖాతాలో డెబిట్ వైపున నమోదు చేశారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 23

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 9.
మహేంద్ర ట్రేడర్స్ పుస్తకాల ద్వారా తయారుచేసిన అంకణా సరితూగలేదు. ఖాతాల్లో ₹ 1,310 తేడా కనపడగా దాన్ని అనామతు ఖాతాకి క్రెడిట్ వైపుకు మళ్ళించారు. కింది దోషాలను కనుగొన్నారు. వాటిని సవరించి, అనామతు ఖాతాను తయారుచేయండి.
a) వినయ్ వద్ద కొనుగోలు చేసిన సరుకు ₹ 800 కొనుగోలు పుస్తకంలో సరిగా నమోదు అయ్యింది కానీ అతని ఖాతాకు తప్పుగా డెబిట్ అయ్యింది.
b) అమ్మకాల పుస్తకాన్ని ₹ 600 ఎక్కువగా కూడారు.
c) ₹ 115 సాధారణ ఖర్చు కింద చెల్లించగా అది ₹ 150 గా నమోదు అయ్యింది.
d) అమర్కి అనుమతించిన డిస్కౌంట్ ₹ 225 నగదు పుస్తకంలో సరిగానే నమోదు అయ్యింది. కానీ అతని వ్యక్తిగత ఖాతాలో నమోదు కాలేదు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 24

ప్రశ్న 10.
ఒక సంస్థ అంకణాలోని వ్యత్యాసాలు ₹ 750 (డెబిట్ వైపు ఎక్కువగా ఉన్నది) అందుకు గాను ఆ మొత్తాన్ని అనామతు ఖాతాలో క్రెడిట్ వైపు ఉంచారు మరియు క్రింది తప్పులను గుర్తించారు. ఆ దోషాలను సవరించి అనామతు ఖాతా తయారుచేయండి.
a) రాజేష్ నుంచి వచ్చిన నగదు ₹ 250 అతని వ్యక్తిగత ఖాతాలో డెబిట్ చేశారు.
b) మహేష్కి అమ్మిన సరుకు ₹ 540 అమ్మకాల పుస్తకంలో ₹ 450గా నమోదు అయ్యింది.
c) వచ్చిన డిస్కౌంట్ ₹ 150 నగదు పుస్తకంలో రాసుకొన్నారు. కానీ డిస్కౌంట్ ఖాతాలో నమోదు కాలేదు.
d) కొనుగోలు వాపసులు ₹ 50 కొనుగోలు ఖాతాకు డెబిట్ చేశారు.
e) యంత్రాల మరమ్మతులు ₹ 370 మరమ్మతుల ఖాతాలో తప్పుగా ₹ 170 గా డెబిట్ అయ్యింది.
f) అమ్మకాల పుస్తకాన్ని ₹ 200 తక్కువగా కూడారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 25

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 11.
కింది దోషాలను సవరించండి.
a) ఆనంద్ నుంచి వచ్చిన నగదు ₹ 188 ని ₹ 180 గా నమోదు చేసుకొన్నారు.
b) వర్ధనికి అమ్మిన సరుకు ₹ 75 రికార్డు చేయడం మర్చిపోయారు.
c) దీక్షిత్ ఖాతాలో క్రెడిట్ వైపు ₹ 20 ఎక్కువగా కూడారు.
d) రాధిక నుంచి వాపసు వచ్చిన ₹ 35 ల సరుకు ఆమె ఖాతాలో నమోదు కాలేదు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 26

ప్రశ్న 12.
a) కొనుగోలు పుస్తకం ₹ 400 ఎక్కువగా కూడటమైనది.
b) కొనుగోలు వాపసుల పుస్తకం ₹ 260 తక్కువగా కూడటం జరిగింది.
c) సుందర్ నుండి వచ్చిన నగదు ₹ 660 అతని ఖాతాలో ₹ 1,660 గా నమోదు అయ్యింది.
d) పరమ్కి అమ్మిన సరుకు ₹ 550 అతని ఖాతాలో ₹ 450గా నమోదు అయ్యింది.
e) కిరణ్ నుంచి వచ్చిన నగదు ₹ 1050 అతని ఖాతాలో డెబిట్ వైపున నమోదు చేశారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 27

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 13.
అకౌంటెంట్ అంకణాని సరిపోల్చలేకపోయాడు. అంకణాలో ఉన్న ₹ 5,180 తేడాను ముగింపు లెక్కలు తయారు చేయటం కొరకు (ప్రస్తుతానికి) అనామతు ఖాతాలో క్రెడిట్ వైపున వేయటం జరిగింది. ఈ క్రింది తప్పులను గుర్తించడం జరిగింది.
a) చెల్లించిన కమీషన్ ₹ 500. రెండు సార్లు అనగా చెల్లించిన డిస్కౌంటు ఖాతాకి మరియు కమీషన్ ఖాతాకి నమోదు చేయుటమైనది.
b) అమ్మకాల పుస్తకం ₹ 1,000 తక్కువ కూడటమైనది.
c) సుధకి అరువుపై అమ్మిన సరుకు ₹ 2,780 అమ్మకాల పుస్తకాలలో సరిగి నమోదు చేసినప్పటికీ, తన వ్యక్తిగత ఖాతాలో ₹ 3,860 గా తప్పుగా డెబిట్ చేయుటమైనది.
d) నటరాజ్ నుండి అరువు కొనుగోలు ₹ 1,500 కొనుగోలు పుస్తకాలలో సరిగా నమోదు చేసినప్పటికీ, అతని వ్యక్తిగత ఖాతాకి తప్పుగా డెబిట్ చేయటమైనది.
e) నగదు పుస్తకంలోని చెల్లింపు వైపున డిస్కౌంట్ వరసలో ₹ 2,400 కు బదులు, ₹ 2,800 గా తప్పుగా చూపటమైనది. అవసరమైన సవరణ పద్దులు రాసి, అనామతు ఖాతాను తయారు చేయండి.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 28

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 14.
శేషు & బ్రదర్స్, వరంగల్ వారి పుస్తకాలలో 2018 సం॥రానికి క్రింద తెలిపిన దోషాలు వారి ఖాతాలను ప్రభావితం చేస్తున్నాయి.
a) పాత ఫర్నీచర్ అమ్మకం ₹ 1,500 సరుకు అమ్మకాలుగా చూపడమైంది.
b) సాయిరాం నుండి వచ్చిన ₹ 5,000 రాంసాయి ఖాతాలో క్రెడిట్ చేయడమైంది.
c) పవన్ కుమార్ నుంచి కొన్న సరుకు ₹ 1,200 పుస్తకాలలో నమోదు కాలేదు.
d) యజమాని సొంత నివాసం అద్దె ₹ 7,500, అద్దె ఖాతాకి డెబిట్ చేయడమైంది.
e) మరమత్తులకు అయిన ఖర్చు ₹ 600 భవనాల ఖాతాకి డెబిట్ చేయటమైంది.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 29

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 15.
కింది తప్పులను సవరించండి.
a) కొనుగోలు పుస్తకం ₹ 2,500 ఎక్కువగా కూడటం జరిగింది.
b) అమ్మకాల పుస్తకం ₹ 4,200 తక్కువగా కూడటం జరిగింది.
c) కొనుగోలు వాపసుల పుస్తకం ₹ 1,450 ఎక్కువగా చూపటం జరిగింది.
d) అమ్మకాల వాపసుల పుస్తకం ₹ 3,500 తక్కువగా చూపటం జరిగింది.
సాధన.
a) కొనుగోలు ఖాతాకి ₹ 2,500 క్రెడిట్ చేయాలి.
b) అమ్మకాల ఖాతాకి ₹ 4,200 క్రెడిట్ చేయాలి.
c) కొనుగోలు వాపసుల పుస్తకాన్ని ₹ 1,450 తో డెబిట్ చేయాలి.
d) అమ్మకాల వాపసుల పుస్తకాన్ని ₹ 3,500 తో డెబిట్ చేయాలి.

TS Inter 1st Year Accountancy Study Material Chapter 7 అంకణా

Telangana TSBIE TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా Textbook Questions and Answers.

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
అంకణా అంటే ఏమిటి ? దానిని ఏ విధంగా తయారుచేస్తారు.
జవాబు.
సంవత్సరాంతాన ముగింపు లెక్కలు తయారుచేయడానికి ముందు ఆవర్జా ఖాతాల నిల్వల అంకగణితపు ఖచ్ఛితాన్ని ఋజువు చేసుకోవడానికి తయారుచేసే పట్టికను అంకణా అంటారు. అంకణా ముగింపు లెక్కలు, ఆవర్జా ఖాతాలను కలిపే ఒక క్లాంటిది.

అంకణ సూరుచేసే ముందు దిగువ విషయాలను గుర్తుంచుకొనవలసి ఉంటుంది.

  1. అంకణాను ఒక నిర్దిష్ట తేదీన తయారు చేస్తారు. కాబట్టి ఆ తేదీని అంకణా హెడ్డింగ్లో చూపాలి.
  2. శీర్షికతో అంకణా నమూనాను గీయవలెను.
  3. అంకణా ఒక నివేదిక అయినందున, దీనిలో To మరియు By అనే పదాలు వాడకూడదు. అంకణాలో క్రమసంఖ్య, ఖాతా పేరు, ఆవర్జా పుట సంఖ్య, డెబిట్ మరియు క్రెడిట్ నిల్వలు ఉంటాయి.
  4. అన్ని ఆస్తుల ఖాతాలు, ఖర్చుల ఖాతాలు, నష్టాలకు సంబంధించిన ఖాతాలు, కొనుగోలు ఖాతా మరియు అమ్మకాల వాపసుల ఖాతా డెబిట్ నిల్వను చూపుతాయి.
  5. అన్ని అప్పుల ఖాతాలు, ఆదాయాలు లాభాలకు సంబంధించిన ఖాతాలు, రిజర్వులు, ఏర్పాట్లు, అమ్మకాలు మరియు కొనుగోలు వాపసుల ఖాతా క్రెడిట్ నిల్వను చూపుతాయి. అంకణాలో డెబిట్ నిల్వను చూపే ఖాతాలను డెబిట్ వైపు, క్రెడిట్ నిల్వను చూపే ఖాతాలను క్రెడిట్ వైపు చూపాలి.
  6. అంకగణిత ఖచ్చితమును రుజువు చేసేందుకు అంకణాలో డెబిట్ నిల్వల మొత్తము క్రెడిట్ నిల్వలతో సరిపోవాలి.

ప్రశ్న 2.
అంకణా యొక్క లాభనష్టాలను రాయండి.
జవాబు.
అంకణా వలన లాభాలు :

  1. అంకణా ద్వారా ఆవర్జాలోని ఖాతాల అంకగణితపు ఖచ్చితాన్ని కనుగొనుటకు సహాయపడుతుంది.
  2. అంకణా ఆధారముగా వర్తకపు, లాభనష్టాల ఖాతా మరియు ఆస్తి – అప్పుల పట్టికను తయారుచేయవచ్చు.
  3. వ్యవహారాల నమోదులో దొర్లిన పొరపాట్లను, తప్పులను గుర్తించడానికి తోడ్పడుతుంది.
  4. అంకణా ద్వారా అన్ని ఖాతాల నిల్వలు ఒకే చోట కనుగొనటానికి సహాయపడుతుంది.

అంకణా వలన నష్టాలు :

  1. ఖాతా పుస్తకాలలో తప్పులు ఉన్నప్పటికి అంకణా డెబిట్, క్రెడిట్ మొత్తాలు సరిపోవచ్చు.
  2. జంటపద్దు విధానాన్ని అవలంబిస్తున్న సంస్థలు మాత్రమే అంకణాను తయారుచేయగలుగుతాయి. ఇది కొంత ఖర్చుతో కూడుకున్నది మరియు ఎక్కువ సమయము కావలెను.
  3. కొన్ని వ్యవహారాలను నమోదు చేయనప్పటికి, అంకణా సమానత్వానికి భంగము కలగదు.
  4. అంకణాను క్రమపద్ధతిలో తయారు చేయనపుడు, దాని మీద ఆధారపడి ముగింపు లెక్కలను తయారుచేసినపుడు, సంస్థ యొక్క నిజమైన ఆర్థిక పరిస్థితి వెల్లడి కాకపోవచ్చును.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 7 అంకణా

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
అంకణాను నిర్వచించండి.
జవాబు.
1. జె.ఆర్.బాట్లిబాయి ప్రకారం :
“వ్యాపార పుస్తకాల అంకగణితపు ఖచ్చితత్వాన్ని పరీక్షించే ఉద్దేశ్యంతో ఆవర్జా నుంచి గ్రహించిన డెబిట్, క్రెడిట్ నిల్వలతో తయారు చేసిన నివేదికనే అంకణా అంటారు”.

2. కార్టర్ ప్రకారం :
“ఆవర్ణాల నుంచి సంగ్రహించిన డెబిట్ – క్రెడిట్ నిల్వలతో తయారు చేసిన జాబితా. నగదు పుస్తకం నుండి సంగ్రహించిన నగదు, బ్యాంకు నిల్వలను కూడా ఇందులో పొందుపర్చడం జరుగుతుంది”.

3. స్పైసర్ & పెగ్లర్ ప్రకారం :
“ఒక నిర్ణీతమైన తేదీన, ఆవర్జాలోని ఖాతాల సహాయంతో పుస్తకంలోని నగదు, బ్యాంకు “ల్వల సహాయంతో తయారు చేసే జాబితాయే అంకణా”.

ప్రశ్న 2.
‘అంకణా నమూనా’ను రాయండి.
జవాబు.
అంకణా నమూనా దిగువ విధముగా ఉంటుంది.

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 1

TS Board Inter First Year Accountancy Study Material Chapter 7 అంకణా

ప్రశ్న 3.
అంకణా ధ్యేయాలను తెలపండి.
జవాబు.
అంకణా తయారీ యొక్క ధ్యేయాలను క్రింది విధంగా పేర్కొనవచ్చు :

  1. వివిధ ఆవర్జా ఖాతాల అంకగణితపు ఖచ్చితత్వాన్ని పరీక్షించడం.
  2. ముగింపు లెక్కల తయారీకి సహాయపడటం.
  3. ఆడిటింగ్ పనిలో ప్రధాన పరికరంగా ఉపయోగపడడం.
  4. ఆవర్జా నిల్వలకు, ముగింపు ఖాతాలకు మధ్య సరిపోల్చడం.
  5. ఆవర్జాఖాతాల తయారీలో సంభవించిన లేదా దొర్లిన తప్పులను గుర్తించడం.

ప్రశ్న 4.
అంకణాను తయారుచేసే పద్ధతులను వివరించండి.
జవాబు.
అంకణాను రెండు పద్ధతులలో తయారుచేస్తారు.

  1. మొత్తాల పద్ధతి
  2. నిల్వల పద్ధతి.

1. మొత్తాల పద్ధతి :

  1. ఆవర్జాలోని ప్రతి ఖాతా డెబిట్, క్రెడిట్ వరుసలు విడివిడిగా కూడి అంకణాను తయారు చేసే పద్ధతిని మొత్తాల పద్ధతి అంటారు.
  2. ఈ పద్ధతి ప్రకారము ఆవర్జా ఖాతాలోని డెబిట్ మొత్తాన్ని, క్రెడిట్ మొత్తాన్ని కూడాలి. అయితే ఈ పద్ధతి ప్రస్తుతము వాడుకలో లేదు.

2. నిల్వల పద్ధతి :
ఇది బాగా వాడుకలో ఉన్న పద్ధతి. ఈ పద్ధతిలో ప్రతి ఆవర్జాలోని ఖాతా నిల్వను తీసుకుంటారు. అంకణాలో డెబిట్ నిల్వను డెబిట్వైపు, క్రెడిట్ నిల్వను క్రెడిట్ వైపు చూపుతారు. ఈ రెండు వరుసల మొత్తాలు సమానముగా ఉంటే, అంకగణిత దోషాలు లేవని చెప్పవచ్చును.

ప్రశ్న 5.
అంకణా యొక్క లక్షణాలను రాయండి.
జవాబు.
అంకణా యొక్క ప్రధాన లక్షణాలను క్రింది విధంగా చెప్పవచ్చు. :

  1. అంకణా ఖాతా కాదు, ఇది ఒక నివేదిక లేదా జాబితా లేదా షెడ్యూల్.
  2. దీనిని ఎప్పుడూ జంటపద్దు విధానం సూత్రాల మీద ఆధారపడి తయారు చేస్తారు.
  3. దీనిని ఒక నిర్దిష్టమైన కాలానికి అంటే ఏదైన నెల చివరన గాని, సంవత్సరాంతాన గాని తయారు చేయడం జరుగుతుంది.
  4. దీనిని ముగింపు లెక్కల తయారీకి ముందు తయారు చేస్తారు. కాబట్టి ఇది ముగింపు లెక్కల తయారీకి ఆధారంగా పనిచేస్తుంది.
  5. అంకణా ఆవర్జా ఖాతాల యొక్క అంకగణితపు ఖచ్చితత్వాన్ని పరీక్షిస్తుంది.
  6. దీన్ని అడ్డువరుసలలో గాని . నిలువు వరుసలలో గాని తయారు చేస్తారు.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 7 అంకణా

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
అనామతు ఖాతా
జవాబు.

  1. అంకణా డెబిట్ నిల్వల మొత్తం, క్రెడిట్ నిల్వల మొత్తానికి సమానంగా లేనప్పుడు, ముగింపు లెక్కలు తయారు చేయవలసి వస్తే, అంకణాను సమానం చేయడానికి డెబిట్ – క్రెడిట్ నిల్వల వ్యత్యాసాన్ని తాత్కాలికంగా ఒక ఖాతాకు బదిలీ చేస్తారు. ఆ ఖాతానే “అనామతు ఖాతా” అంటారు.
  2. అంకణాను సమానం చేయడానికి తాత్కాలికంగా సృష్టించిన ఖాతానే అనామతుఖాతా. అంకణా డెబిట్ నిల్వల మొత్తం తక్కువగా ఉంటే అనామతు ఖాతాకు డెబిట్, క్రెడిట్ నిల్వల మొత్తం తక్కువగా ఉంటే అనామతు ఖాతాకు క్రెడిట్ చేస్తారు.
  3. ముగింపు లెక్కల తయారీ అనంతరం తిరిగి వ్యత్యాసానికి గల కారణాన్ని గుర్తించిన తర్వాత, అనామతు ఖాతా రద్దు అవుతుంది.

ప్రశ్న 2.
మొత్తం నిల్వల పద్ధతి.
జవాబు.

  1. ఆవర్జాలోని ప్రతి డెబిట్ క్రెడిట్ వరుసలు విడివిడిగా కూడి అంకణాను తయారు చేసే పద్ధతిని మొత్తాల నిల్వల పద్ధతి అంటారు.
  2. ఈ పద్ధతి ప్రకారం ఆవర్జా ఖాతాలోని డెబిట్ మొత్తాన్ని క్రెడిట్ మొత్తాన్ని కూడాలి. అవి సమానంగా ఉంటే అంకగణితపు దోషాలు లేవని అర్థం. ప్రస్తుతం ఈ పద్ధతి వాడుకలో లేదు.

ప్రశ్న 3.
నికర నిల్వల పద్ధతి
జవాబు.

  1. ఆవర్జాలోని ఖాతాల నిల్వల సహాయంతో అంకణాను తయారు చేసే పద్ధతిని నికర నిల్వల పద్ధతి అంటారు.
  2. ఈ పద్దతిలో ముందుగా ఆవర్జాలోని అన్ని ఖాతాలను నిల్వ తేల్చాలి. ఈ పద్దతి ప్రస్తుతం ఎక్కువగా వాడుకలో ఉన్నది.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 7 అంకణా

ప్రశ్న 4.
అడ్డువరుసల అంకణా నమూనా
జవాబు.

  1. అంకణా అనేది ఒక నివేదిక. ఇది ఖాతా కాదు. అందువల్ల దీనిని అడ్డు వరుసలలో గాని, నిలువు వరుసలలో గాని తయారు చేయవచ్చు.
  2. అడ్డు వరుసల అంకణా నివేదికలో ఆస్తులు, ఖర్చులు, నష్టాలు, రుణగ్రస్తులు, సొంతవాడకాల ఆవర్జాల నిల్వలను ఎడమవైపు మరియు అప్పులు, ఆదాయాలు, లాభాలు మొదలైనవి కుడివైపు నమోదు చేస్తారు.

ప్రశ్న 5.
‘అంకగణితపు ఖచ్చితత్వం’ అంటే ఏమిటి ?
జవాబు.

  1. వ్యాపార పుస్తకాల అంకగణితపు ఖచ్చితత్వాన్ని పరీక్షించే ఉద్దేశ్యంతో అంకణాను తయారు చేస్తారు.
  2. అంకణాలో డెబిట్ మొత్తం క్రెడిట్ మొత్తంతో సమానంగా ఉంటే అకౌంటింగ్ ప్రక్రియలో తప్పులు లేదా పొరపాట్లు జరగలేదని, అంకగణితపు ఖచ్చితత్వం రుజువైనదని భావించడం జరుగుతుంది.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 7 అంకణా

Problems:

ప్రశ్న 1.
సంజీవరెడ్డి పుస్తకాల నుంచి సేకరించిన క్రింది నిల్వల నుండి 31-12-2016న అంకణాను తయారుచేయండి.

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 2

సాధన.
31 డిసెంబర్, 2016 నాటి సంజీవ రెడ్డి యొక్క అంకణా

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 3

TS Board Inter First Year Accountancy Study Material Chapter 7 అంకణా

ప్రశ్న 2.
క్రింది నిల్వల నుండి 31-03-2018న వీణ పుస్తకాలలో అంకణాను తయారుచేయండి.

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 4

సాధన.
31 మార్చి, 2018 నాటి వీణ యొక్క అంకణా

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 5

గమనిక : అంకణాలోని డెబిట్, క్రెడిట్ వ్యత్యాసాన్ని ‘అనామతి’ ఖాతాకు మళ్ళించాలి.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 7 అంకణా

ప్రశ్న 3.
ఈ కింది అంకణాను ఒక అనుభవం లేని గణకుడు తయారుచేశారు. మీరు తిరిగి సరైన అంకణాను తయారుచేయండి.

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 6

సాధన.
సవరించిన అంకణా:

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 7

ప్రశ్న 4.
కింది నిల్వలు మనోహర్ పుస్తకాల నుండి సేకరించడం జరిగింది. 31-3-2018 నాటికి అంకణాను తయారుచేయండి.

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 12

సాధన.
31-3-2018 నాటి మనోహర్ యొక్క అంకణా:

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 8

TS Board Inter First Year Accountancy Study Material Chapter 7 అంకణా

ప్రశ్న 5.
కింది నిల్వల ద్వారా జె.పి.రెడ్డి అంకణాను 31-12-2016 నాటికి తయారుచేయండి.

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 13

సాధన.
31-12-2016 నాటి జె.పి.రెడ్డి యొక్క అంకణా:

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 9

ప్రశ్న 6.
పుల్లన్న పుస్తకాల నుండి సంగ్రహించిన క్రింది నిల్వల నుండి 31-12-2017న అంకణాను తయారు చేయుము.

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 14

సాధన.
31-12-2017 నాటి పుల్లన్న వారి అంకణా:

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 10

TS Board Inter First Year Accountancy Study Material Chapter 7 అంకణా

ప్రశ్న 7.
ఈ క్రింది నిల్వలు విష్ణుచరణ్ పుస్తకాల నుండి సేకరించబడినవి. వాటిని ఆధారంగా 31-12-2018న అంకణా తయారుచేయండి.

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 15

సాధన.
31-12-2018 నాటి విష్ణుచరణ్ యొక్క అంకణా:

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 11

ప్రశ్న 8.
31-12-2013న నాటి రెనిస్ యొక్క అంకణాను తయారుచేయండి.

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 16

సాధన.
31-12-2013 నాటి రెనిస్ యొక్క అంకణా:

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 17

TS Board Inter First Year Accountancy Study Material Chapter 7 అంకణా

ప్రశ్న 9.
క్రింది నిల్వల నుంచి 31-12-2013న మానస్ యొక్క అంకణాను తయారుచేయండి.

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 18

సాధన.
31-12-2013 నాటి మానస్ యొక్క అంకణా:

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 19

ప్రశ్న 10.
క్రింది నిల్వల నుంచి 31-12-2013న రాము అంకణా తయారుచేయండి.

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 20

సాధన.
31-12-2013 నాటి రాము యొక్క అంకణా:

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 21

TS Board Inter First Year Accountancy Study Material Chapter 7 అంకణా

ప్రశ్న 11.
31-03-2017న క్రింది నిల్వల నుండి ప్రదీప్ కుమార్ యొక్క అంకణాను తయారుచేయుము.

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 22

సాధన.
31-03-2017 నాటి ప్రదీప్ కుమార్ యొక్క అంకణా:

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 23

ప్రశ్న 12.
ఈ క్రింది నిల్వల నుండి 31-12-2015 న సుచిత్ర అంకణా నుంచి తయారుచేయండి.

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 24

సాధన.
31-12-2015 నాటి సుచిత్ర యొక్క అంకణా:

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 25

TS Board Inter First Year Accountancy Study Material Chapter 7 అంకణా

ప్రశ్న 13.
క్రింది నిల్వల నుండి రాధ యొక్క అంకణా తయారు చేయుము.

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 26

సాధన.
రాధ యొక్క అంకణా:

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 27

ప్రశ్న 14.
క్రింది నిల్వల నుండి ఎన్.ఎన్. రావు యొక్క అంకణాను తయారు చేయుము.

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 28

సాధన.
ఎన్.ఎన్.రావు యొక్క అంకణా:

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 29

TS Board Inter First Year Accountancy Study Material Chapter 7 అంకణా

ప్రశ్న 15.
శేషాద్రి యొక్క అంకణాను, 31-12-2016న క్రింది నిల్వల నుంచి అంకణాను తయారుచేయండి.

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 30

సాధన.
31-12-2016 నుంచి శేషాద్రి అంకణా:

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 31

ప్రశ్న 16.
భాగ్యలక్ష్మి యొక్క అంకణాను తయారుచేయండి.

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 32

సాధన.
భాగ్యలక్ష్మి యొక్క అంకణా:

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 33

TS Board Inter First Year Accountancy Study Material Chapter 7 అంకణా

ప్రశ్న 17.
క్రింది నిల్వల నుండి 31-03-2018న కస్తూరి యొక్క అంకణా తయారు చేయుము.

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 34

సాధన.
31-03-2018 నాటి కస్తూరి యొక్క అంకణా:

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 35

ప్రశ్న 18.
క్రింది వివరాల నుండి ‘సుదా’ యొక్క అంకణాను తయారుచేయండి.

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 36

సాధన.
సుధ అంకణా:

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 37

గమనిక : లెక్కలో కొనుగోళ్ళు రెండు సార్లు ఇచ్చారు. అందువల్ల రెండవ కొనుగోళ్ళు 20,000 ను యంత్రాలు ₹ 20,000 గా తీసుకున్నాము.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 7 అంకణా

ప్రశ్న 19.
ఈ క్రింది నిల్వల నుండి అంజిరెడ్డి యొక్క అంకణాను తయారుచేయండి.

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 38

సాధన.
అంజి రెడ్డి యొక్క అంకణా:

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 39

ప్రశ్న 20.
క్రింది నిల్వల నుంచి 31-12-2018న డా॥చిలుముల శ్రీనివాస్ యొక్క అంకణాను తయారుచేయండి.

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 40

సాధన.
31-12-2018 నాటి డా॥ చిలుముల శ్రీనివాస్ యొక్క అంకణా:

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 41

TS Board Inter First Year Accountancy Study Material Chapter 7 అంకణా

Textual Examples:

ప్రశ్న 1.
ఈ క్రింది నిల్వల సహాయంతో 31-12-2018 నాటికి Mr. వినోద్ కుమార్ యొక్క అంకణాను తయారుచేయండి.

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 42

సాధన.
31-12-2018, Mr. వినోద్ కుమార్ యొక్క అంకణా:

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 43

TS Board Inter First Year Accountancy Study Material Chapter 7 అంకణా

ప్రశ్న 2.
శ్రీమతి శోభారాణి పుస్తకాల నుంచి సేకరించిన వివిధ నిల్వల జాబితా నుంచి 31-12-2017 నాటికి అంకణాను తయారుచేయండి.

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 44

సాధన.
31-12-2017న శ్రీమతి శోభారాణి యొక్క అంకణా:

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 45

TS Board Inter First Year Accountancy Study Material Chapter 7 అంకణా

ప్రశ్న 3.
ఈ కింది అంకణాను ఒక అనుభవం లేని గణకుడు తయారుచేసాడు. దీనిని తిరిగి సరైన విధంగా తయారుచేయండి.

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 46

సాధన.
సరిచేయబడిన అంకణా:

TS Inter 1st Year Accountancy Study Material 7th Lesson అంకణా 47

TS Inter 2nd Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 3rd Lesson కేంద్ర ప్రభుత్వం Textbook Questions and Answers.

TS Inter 2nd Year Political Science Study Material 3rd Lesson కేంద్ర ప్రభుత్వం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారత రాష్ట్రపతికి ఉన్న సాధారణ, అత్యవసర అధికారాలను గురించి వర్ణించండి.
జవాబు.
అధికారాలు, విధులు :
సాధారణ అధికారాలు: భారత రాష్ట్రపతికి ఉన్న సాధారణ అధికారాలను 6 రకాలుగా వర్గీకరించవచ్చు.

1. కార్యనిర్వాహణాధికారాలు :
అధికరణ 53 ప్రకారం కేంద్రం కార్యనిర్వహణాధికారాలు రాష్ట్రపతికి చెందుతాయి. ఈ అధికారాలన్నీ రాష్ట్రపతి నేరుగాగానీ, అతడి కింది అధికారుల ద్వారా గానీ నిర్వహిస్తాడు. దేశం కార్యనిర్వహణాధిపతిగా రాష్ట్రపతి రాష్ట్రాల గవర్నర్లను, ప్రధానమంత్రిని, సుప్రీంకోర్ట్, హైకోర్టు న్యాయమూర్తులను వివిధ కమీషన్ల సభ్యులను, ఛైర్మన్లను నియమిస్తాడు.

2. శాసనాధికారాలు :
అధికరణ 79 ప్రకారం కేంద్ర శాసన నిర్మాణ శాఖ, పార్లమెంట్ ఉభయసభలను మరియు రాష్ట్రపతిని కలిగి ఉంటుంది. భారత రాష్ట్రపతి కేంద్ర శాసననిర్మాణ శాఖలో ముఖ్య భాగం. రాష్ట్రపతికి పార్లమెంట్ ఉభయసభలను సమావేశపరచడం లేదా సభలను నిరవధికంగా వాయిదావేయడం, కేంద్ర మంత్రిమండలి సలహాపై అధికారం ఉంది.

ఏదైనా బిల్లు పట్ల ఉభయ సభల మధ్య వివాదం ఏర్పడినట్లయితే ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. లోక్సభ ప్రతీ సాధారణ ఎన్నికల తరవాత, ప్రతీ సంవత్సరం జరిగే పార్లమెంట్ ఉభయ సభల సమావేశంలో సభను ఉద్దేశించి ప్రసంగిస్తాడు. రాష్ట్రపతి లోక్సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను, రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేస్తాడు.

3. ఆర్థికాధికారాలు :
రాష్ట్రపతి ప్రతీ ఆర్థిక సంవత్సరానికి భారత ప్రభుత్వం తన సంవత్సర బడ్జెట్ను పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టేలా చూస్తాడు. రాష్ట్రపతి భారత సంఘటిత నిధిని నిర్వహిస్తాడు. రాష్ట్రపతి ముందస్తు అనుమతి లేకుండా ద్రవ్యాన్ని ఖర్చుచేయడం, ప్రభుత్వం రెవెన్యూను పెంచటం వంటి ప్రతిపాదనలు పార్లమెంటులో ప్రవేశపెట్టరాదు.

ప్రతీ అయిదు సంవత్సరాలకు ఆర్థిక సంఘం అధ్యక్షుణ్ణి, ఇతర సభ్యులను నియమిస్తాడు. ఆర్థిక సంఘం మరియు భారత కంప్టోలర్ ఆడిటర్ జనరల్ తమ తమ నివేదికలు పార్లమెంట్లో ప్రవేశపెడతారు.

4. న్యాయాధికారాలు:
రాష్ట్రపతి సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను, ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడు. రాష్ట్రపతికి కోర్టు విధించిన శిక్షను తగిన కారణమున్న పక్షంలో తాత్కాలికంగా నిలిపివేయడానికి, శిక్షలు అమలు కాకుండా వాయిదావేయడానికీ, ఒక రకమైన శిక్షను వేరొక రకం శిక్షగా మార్చడానికీ, శిక్షని పూర్తిగా రద్దు చేసి క్షమాభిక్ష పెట్టడానికి అధికారం ఉంది. అధికరణ 143 ప్రకారం రాష్ట్రపతి జాతీయ ప్రాధాన్యత గల అంశాలపై న్యాయపరమైన సలహాలు తీసుకోగలడు.

5. సైనిక అధికారాలు :
రాష్ట్రపతి దేశానికి సర్వసైన్యాధ్యక్షుడు. ఇతడికి యుద్ధాన్ని ప్రకటించడం. సంధి ఒడంబడికలు చేయడం లాంటి అధికారాలు కలవు.

6. దౌత్య అధికారాలు :
రాష్ట్రపతి ఇతర దేశాలకు భారత దౌత్య రాయబారులను నియమిస్తాడు మరియు ఇతర దేశాలు భారతదేశానికై నియమించిన రాయబారుల అధికార పత్రాలను స్వీకరిస్తాడు. అన్ని అంతర్జాతీయ ఒప్పందాలు, సంధి ఒడంబడికలు రాష్ట్రపతి పేరుమీదనే జరుగుతాయి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

అత్యవసర అధికారాలు :
భారత రాజ్యాంగం, భారతరాష్ట్రపతికి మూడు రకాలైన అత్యవసర పరిస్థితుల్ని ప్రకటించి, నిర్వహించే అధికారం ఇచ్చింది.

  1. జాతీయ అత్యవసర పరిస్థితి (అధికరణ 352)
  2. రాష్ట్రపతి పాలన (అధికరణ 356)
  3. ఆర్థిక అత్యవసర పరిస్థితి (అధికరణ 360)

1. జాతీయ అత్యవసర పరిస్థితి :
రాష్ట్రపతి దేశానికి గానీ లేదా ఏదైనా భారత భూభాగానికి గానీ యుద్ధం లేదా బాహ్య దాడులు, సైనిక తిరుగుబాటు వల్ల ముప్పు పొంచి ఉందని భావించినట్లైతే, కేంద్ర మంత్రిమండలి లిఖిత సలహా మేరకు జాతీయ అత్యవసర పరిస్థితులను విధించవచ్చు.

ఇలాంటి ప్రకటన ఒక నెల వ్యవధి లోపల పార్లమెంటులో ఓటింగ్లో పాల్గొన్న మొత్తం సభ్యుల్లో 2/3 వంతుకు తగ్గకుండా ఆమోదించవలసి ఉంటుంది. అపుడు ఈ ప్రకటన 6 నెలల పాటు అమలులో ఉంటుంది. పార్లమెంట్ ఆమోదం ద్వారా దీన్ని మరో 6 నెలల పాటు పొడిగించవచ్చు.

2. రాష్ట్రపతి పాలన :
ఒక రాష్ట్రం గవర్నర్చే ఆ రాష్ట్రంలోని ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ముందుకు సాగే పరిస్థితిలో లేదు. ఆ రాష్ట్రంలోని రాజ్యాంగపరమైన వ్యవస్థ విఫలమైంది అన్న నివేదికను అందుకున్న మీదట రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని, (రాష్ట్రపతి పాలన) ప్రకటించవచ్చు. ఈ ప్రకటన ఫలితంగా,

  1. రాష్ట్రపతీ ఆ రాష్ట్రప్రభుత్వం మొత్తం లేదా ఏవైనా విధులను తన అధికారంలోకి తీసుకోవచ్చు.
  2. రాష్ట్రశాసన నిర్మాణశాఖ అధికారాలు పార్లమెంటుచే నిర్వహించబడతాయి.

ఈ అత్యవసర ప్రకటన రెండు నెలలలోపు పార్లమెంటుచే ఆమోదించబడాలి. ఈ ప్రకటన 6 నెలల పాటు అమలులో ఉంటుంది. పార్లమెంట్ ఆమోదం మేరకు దీన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించవచ్చు.

3. ఆర్థిక అత్యవసర పరిస్థితి :
దేశం ఆర్థిక సుస్థిరతకు భంగం వాటిల్లిందని రాష్ట్రపతి భావించినపుడు ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తాడు. ఈ అత్యవసర పరిస్థితి సమయంలో కేంద్రప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాన్ని, ఇతర సదుపాయాలను తగ్గించగలిగే అధికారం కలిగి ఉంటుంది.

అన్ని ద్రవ్యబిల్లులు, ఇతర బిల్లులను రాష్ట్ర శాసన నిర్మాణశాఖ ద్వారా జారీ చేయబడిన తరువాత రాష్ట్రపతి అనుమతి కొరకు పంపించవలసి ఉంటుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించలేదు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 2.
భారత ప్రధానమంత్రి అధికారాలను వర్ణించండి.
జవాబు.
ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం యొక్క నిజమైన కార్యనిర్వాహక అధిపతి. రాజ్యాంగ అధికరణ 74 ప్రకారం ప్రధానమంత్రి ఛైర్మన్ గా గల కేంద్ర మంత్రిమండలి రాష్ట్రపతికి తన విధులను నిర్వహించడంలో సలహాలను, సహకారాన్ని అందిస్తుంది. రాష్ట్రపతి లోక్సభలోని మెజారిటీ పార్టీ లేదా గ్రూపు నాయకుణ్ణి ప్రధానమంత్రిగా నియమిస్తాడు. అందరు మంత్రులు ప్రధానమంత్రి సలహాపై రాష్ట్రపతి ద్వారా నియమించబడతారు.

ప్రధానమంత్రి తన ఇష్టానుసారం బాధ్యతారహితంగా ప్రవర్తించే మంత్రుల్ని తొలగించడం లేదా మంత్రిత్వ శాఖల్ని పునఃపంపిణీ చేయడం, మార్చడం వంటి అధికారాలను కలిగి ఉంటాడు. భారత రాజ్యాంగం ప్రకారం మంత్రులు రాష్ట్రపతి విశ్వాసం కలిగి ఉన్నంత వరకు పదవిలో ఉంటారు. కానీ నిజానికి వారు ప్రధానమంత్రి విశ్వాసం కలిగి ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతారు.

ప్రధానమంత్రి అధికారాలు, విధులు :

1. ప్రధానమంత్రి – కేంద్ర కేబినెట్ నాయకుడు:
కేంద్ర మంత్రిమండలి ప్రధానమంత్రి ఆదేశాలకనుగుణంగా విధులను నిర్వహిస్తుంది. కేంద్ర మంత్రిమండలిలోని ఏ వ్యక్తినైనా తొలగించే లేదా ఏ వ్యక్తినైనా నియమించే అధికారం ప్రధానమంత్రికి ఉంది. ఇతడు మంత్రిమండలిలో మంత్రుల మధ్య శాఖలను మార్చగలడు. కేబినెట్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు.

2. ప్రధానమంత్రి – మెజార్టీ పార్టీ నాయకుడు:
ప్రధానమంత్రి ప్రజలసభ అయిన లోక్సభలోని మెజార్టీ పార్టీ నాయకుడు. ఇతడు తన పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను, పార్టీ మేనిఫెస్టోను నెరవేరుస్తాడు. ఇతను పార్టీకి, ప్రభుత్వానికి మధ్య వారధి.

3. ప్రధానమంత్రి – పార్లమెంట్ నాయకుడు :
రాజ్యాంగం పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని రూపొందించిన దగ్గర నుంచి పార్లమెంట్ దేశప్రజల పరిపాలనలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. పార్లమెంట్లోని ప్రజల సభ అయిన లోక్ సభ మెజార్టీ పార్టీ నాయకుడిగా, ప్రభుత్వం అధినేతగా ప్రధానమంత్రి పార్లమెంట్కు నాయకుడిగా పరిగణించబడతాడు. ఇతడు కేబినెట్ నిర్ణయాలను పార్లమెంట్కు తెలియపరుస్తాడు. కేంద్రప్రభుత్వ దేశ, విదేశీ విధానాలను పార్లమెంట్ సభ్యులకు వివరిస్తాడు.

4. ప్రధానమంత్రి – రాష్ట్రపతి, మంత్రిమండలి మధ్య వారధి:
ప్రధానమంత్రి రాష్ట్రపతి, కేంద్ర మంత్రిమండలికి మధ్య వారధిలా వ్యవహరిస్తాడు. మంత్రిమండలి నిర్ణయాలను రాష్ట్రపతికి తెలియజేయడం ఇతడి విధి. కేంద్రప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన విషయాలన్నింటినీ రాష్ట్రపతికి తెలియజేస్తాడు.

5. ప్రధానమంత్రి – కేంద్రప్రభుత్వ నాయకుడు :
ప్రధానమంత్రి కేంద్రప్రభుత్వ అధినేత. ఇతడు దేశం మరియు దేశప్రజల ఉన్నతికి, అభివృద్ధికి తోడ్పడే ప్రభుత్వ పథకాలను, విధానాలను, కార్యక్రమాలను కేంద్ర మంత్రిమండలితో కలసి రూపొందించి అమలుపరుస్తాడు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా ప్రధానమంత్రి ఇష్టానుసారం పనిచేస్తుంది.

6. ప్రధానమంత్రి దేశానికి నాయకుడు :
ప్రధానమంత్రి దేశం నాయకుడిగా వ్యవహరిస్తాడు. పార్లమెంట్ నాయకుడిగా మరియు ప్రభుత్వ అధినేతగా పార్లమెంట్ లోపల, బయట ఇతడి వ్యాఖ్యలు ప్రకటనలు దేశానికి ముఖ్యమైనవిగా ఉంటాయి. ఇతర దేశాలను సందర్శించినప్పుడు ప్రధానమంత్రి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఇతడి అభిప్రాయాలు మొత్తం దేశపు అభిప్రాయంగా పరిగణించబడతాయి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 3.
కేంద్ర మంత్రిమండలి నిర్మాణం, విధులను వివరించండి.
జవాబు.
అధికరణ 74(1) ప్రకారం ప్రధానమంత్రి ఛైర్మన్ గా గల కేంద్ర మంత్రిమండలి రాష్ట్రపతికి తన విధులను నిర్వహించడంలో సలహాలను, సహకారాన్ని అందిస్తుంది. మంత్రిమండలిలోని మంత్రులందరూ ప్రధానమంత్రి సలహాపైన రాష్ట్రపతి ద్వారా నియమించబడతారు.

1. నిర్మాణం :
కేంద్ర మంత్రిమండలిలో మూడు విధాలైన మంత్రులు ఉంటారు. అంటే కేబినెట్ మంత్రులు, డిప్యూటీ మంత్రులు, స్టేట్ మంత్రులు.
i) కేబినేట్ మంత్రులు :
మొదట రాజ్యాంగంలో కేబినెట్ అనే పదం లేదు. కేబినెట్ అనే పదం రాజ్యాంగంలో 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడింది. సాధారణంగా ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను కలిగి ఉన్న మంత్రులు కేబినెట్ మంత్రులుగా పిలవబడతారు.

విధానాలు రూపొందించడంలో కేబినెట్ మంత్రులు ప్రధానమంత్రికి సహకరిస్తారు. కేబినేట్ ప్రభుత్వ విధాన రూపకల్పనలో ముఖ్యమైన భాగం ప్రధానమంత్రి స్వయంగా నియమించిన వారు క్యాబినేట్ మంత్రులుగా ఉంటారు.

ii) స్టేట్ మంత్రులు :
స్టేట్ మంత్రులు చిన్న మంత్రిత్వ శాఖలను స్వతంత్రంగా నిర్వహిస్తారు.

iii) డిప్యూటీ మంత్రులు :
డిప్యూటీ మంత్రులు ఎలాంటి స్వతంత్ర మంత్రిత్వ శాఖలను కలిగి ఉండరు. వీరు కేబినెట్ మంత్రులకు సహకరిస్తారు. కేబినెట్ మంత్రుల ఆధ్వర్యంలో ఆయా మంత్రిత్వ శాఖల రోజువారీ పనులను నిర్వహిస్తారు.

అధికారాలు, విధులు : మంత్రిమండలిలోని మంత్రులు కింది విధులను కలిగి ఉంటారు.

  1. కేంద్రప్రభుత్వం విధానాలను మంత్రిమండలి రూపొందిస్తుంది. ఎన్నో చర్చోపచర్చల తరవాత వీరు దేశం, దేశీయ విదేశీ విధానాలను అంతిమంగా నిర్ణయిస్తారు.
  2. కేంద్రప్రభుత్వానికి సంబంధించిన అన్ని అంశాల్లో రాష్ట్రపతికి సలహాలను అందిస్తుంది. రాష్ట్రపతి తన విధులను నిర్వహించడానికి మార్గనిర్దేశం చేస్తుంది.
  3. ఇది దేశ, ఆర్థిక రంగంపై పూర్తి నియంత్రణను కలిగి ఉంటుంది. పన్నులు, ఇతర ఖర్చులకు సంబంధించిన తీర్మానాలు నిజానికి కేబినెట్ ద్వారా రూపొందించబడి పార్లమెంట్ ద్వారా ఆమోదించబడతాయి.
  4. దేశ పరిపాలన మంత్రులు వివిధ ప్రభుత్వ విభాగాల రాజకీయ అధినేతలు ప్రభుత్వ యంత్రాంగం అంతా మంత్రుల నియంత్రణలో రోజువారీ పరిపాలన నిర్వహిస్తారు. దీన్ని బట్టి కేబినెట్ మొత్తం దేశాన్ని పరిపాలిస్తుంది అని చెప్పవచ్చు.
  5. చట్టాలను రూపొందించే ప్రక్రియలో కేబినెట్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఏదైనా మంత్రిత్వశాఖకు సంబంధించిన బిల్లు నిర్మాణం మంత్రిమండలి సమావేశంలో క్షుణ్ణంగా చర్చించిన తరవాతనే జరుగుతుంది. ఈ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టబడి, సంబంధించిన మంత్రులతో వివరించబడుతుంది.
  6. పార్లమెంట్లో ప్రవేశపెట్టబడ్డ బిల్లులు రాష్ట్రపతి సంతకం తరవాతే చట్టాలుగా మారతాయి. నిజానికి రాష్ట్రపతి కేబినెట్ చేయమన్న పని మాత్రమే చేస్తాడు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

5. సమిష్టి బాధ్యత :
అధికరణ 75(3) ప్రకారం మంత్రిమండలి ప్రజల సభ అయిన లోక్సభకి సమిష్టి బాధ్యత వహిస్తుంది. ప్రతీ మంత్రి తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన నిర్ణయాలకు బాధ్యుడు అంతేకాకుండా అతడు తన తోటి మంత్రులు నిర్వహించే మంత్రిత్వశాఖలకు సంబంధించిన నిర్ణయాలకు కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది.

ఎందుకంటే అందరు మంత్రులు కేబినెట్ విధి విధానాలను అనుసరించి, క్యాబినెట్ మార్గనిర్దేశనంలో, నియంత్రణలో పనిచేస్తారు. దీన్ని బట్టి ఒక మంత్రి తన తప్పుడు నిర్ణయాలకు బాధ్యత వహిస్తాడు.

అలాగే తన తోటి మంత్రుల తప్పుడు నిర్ణయాలకు బాధ్యత వహిస్తాడు. ఒకవేళ ఏ మంత్రి అయినా వేరొక మంత్రి తప్పుడు నిర్ణయానికి, చర్యకు బాధ్యత వహించడానికి అంగీకరించనట్లయితే అతను మంత్రి పదవికి రాజీనామా చేయవలసి ఉంటుంది లేదా. అతడు ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతిచే తొలగించబడతాడు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 4.
భారత పార్లమెంటు అధికారాలు ఏమిటి ? వివరించండి.
జవాబు.
రాజ్యాంగం 79వ అధికరణం ప్రకారం కేంద్ర శాసన నిర్మాణ శాఖలో (ఎ) రాష్ట్రపతి, (బి) పార్లమెంటులోని ఉభయసభలు అంతర్భాగాలు. లోక్సభ అనేది పార్లమెంటులో దిగువసభకాగా, రాజ్యసభ ఎగువసభ. రాష్ట్రపతికి ఉభయసభల సమావేశాలను ప్రారంభించేందుకు వాయిదా వేసేందుకు అధికారం ఉంటుంది.

పార్లమెంట్ అధికారాలు, విధులు: భారత పార్లమెంట్ భారతదేశ పౌరుల ఆకాంక్షలను, ఆశయాలను ప్రతిబింబించే ప్రధాన శాసన నిర్మాణ అంగం. ఇది భారత ప్రభుత్వానికి కావలసిన చట్టాలను రూపొందించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. భారత పార్లమెంట్ క్రింది అధికారాలను కలిగి ఉంది.

1. శాసన నిర్మాణాధికారం :
పార్లమెంట్ కేంద్ర జాబితాలో, ఉమ్మడి జాబితాలో గల అంశాలపై చట్టాలను రూపొందిస్తుంది. ఏ జాబితాలోని అంశాలపైన అయినా శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంది. ఒక బిల్లు కేవలం రెండు సభలు ఆమోదించిన తరవాత మాత్రమే చట్టంగా మారుతుంది. ఒక బిల్లుపై రెండు సభల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తినపుడు రాష్ట్రపతి ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు.

అప్పుడు ఆ బిల్లు భవితవ్యం సంయుక్త సమావేశంలో మెజారిటీ ఓట్ల ద్వారా నిర్ణయించబడుతుంది. రాష్ట్రపతికి ఒక బిల్లుని పునఃపరిశీలన కోసం పార్లమెంట్కు తిరిగి పంపించగలిగే అధికారం ఉంది. ఎప్పుడైతే పార్లమెంట్ తిరిగి చర్చ జరిపి దాన్ని మళ్ళీ ఆమోదిస్తుందో అప్పడు రాష్ట్రపతి తప్పనిసరిగా సంతకం చేయవలసి ఉంటుంది.

2. కార్వనిర్వాహక అధికారం (కార్యనిర్వాహక శాఖని నియంత్రించే అధికారం) :
కేంద్ర మంత్రిమండలి తన నిర్ణయాలపట్ల తన విధానాలపట్ల నేరుగా లోక్సభకు బాధ్యత వహిస్తుంది. కొత్త తీర్మానాన్ని ఆమోదించడం లేదా ఏదైనా ద్రవ్యబిల్లును ఆమోదించడానికి లోక్సభ నిరాకరించనట్లయితే దాన్ని మంత్రిమండలిపై అవిశ్వాస తీర్మానంగా భావించబడుతుంది. మంత్రిమండలి రాజీనామా చేయవలసి ఉంటుంది.

3. ఆర్థికాధికారాలు :
పార్లమెంట్ దేశం యొక్క జమా ఖర్చులకు బాధ్యత వహిస్తుంది. పార్లమెంటు ఆమోదం లేనిదే పన్నులను విధించడంగానీ, పన్నులు వసూలు చేయడంగానీ, ఏదైనా వ్యయం చేయడంగానీ జరగదు.

4. రాజ్యాంగ సవరణాధికారం:
రాజ్యాంగ అధికరణ 368 నిబంధనల ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్కు ఉంది. రాజ్యాంగంలో చాలా భాగం పార్లమెంట్ ప్రతీ సభలో సభ్యులలో 2/3వ వంతు మెజారిటీ ద్వారా సవరించబడింది. కొన్ని అధికరణాలలోని నిబంధనలను సవరించడానికి రెండు సభల్లో 2/3వ వంతు మెజారిటీతో ఆమోదించబడ్డ తరవాత దేశంలోని రాష్ట్రశాసన సభలలో కనీసం సగం శాసనసభల ఆమోదం అవసరం.

5. ఎన్నికాధికారం :
భారతపార్లమెంట్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులను ఎన్నుకొంటుంది. లోక్సభలోని సభ్యులు తమ నుండి ఇద్దరు సభ్యులను స్పీకర్, డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకుంటారు. రాజ్యసభ సభ్యులు తమ డిప్యూటీ చైర్మన్ని ఎన్నుకుంటారు.

6. న్యాయసంబంధ అధికారాలు :
అవినీతి, అసమర్థత లాంటి అభియోగాల వంటి నిర్దిష్ట కారణాలున్నపుడు మహాభియోగ తీర్మానం ద్వారా రాష్ట్రపతిని ఉపరాష్ట్రపతిని, సుప్రీంకోర్టు, హైకోర్టుల ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తులను తొలగించడానికి భారత పార్లమెంట్కి అధికారం గలదు.

7. చర్చాపూర్వక విధులు :
భారత పౌరులకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించే, యోచించే ముఖ్యమైన చర్చావేదిక పార్లమెంట్. సమకాలీన జాతీయ, అంతర్జాతీయ అంశాలు, దేశ పౌరులను ఇబ్బందుల నుంచి విముక్తి కల్పించడానికి సంబంధించిన అంశాలపై చర్చలు జరుపుతుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 5.
భారత సుప్రీంకోర్టు విధులను తెలియజేయండి.
జవాబు.
సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధిని ప్రాథమిక, అప్పీళ్ళ విచారణ, సలహారూపక అధికార పరిధులుగా విభజించవచ్చు.

i. ప్రాథమిక అధికార పరిధి :
ఈ అధికారం కింది సుప్రీంకోర్టు ఈ కింది వివాదాలను విచారించగలదు.

  1. భారత ప్రభుత్వానికి ఒకటి లేక అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు మధ్య వివాదం.
  2. భారతప్రభుత్వం ఒకటి అంతకంటే ఎకుకవ రాష్ట్రాలు ఒక వైపు, ఒక రాష్ట్రం లేదా ఎక్కువచ రాష్ట్రాలు ఇంకోవైను ఉన్నప్పుడు వాటి మధ్య వివాదం.
  3. రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు మధ్య వివాదాలు తలెత్తినప్పుడు విచారిస్తుంది.

ii. అప్పీళ్ళ విచారణా పరిధి :
ఈ అధికారం కింద సుప్రీంకోర్టు ఈ కింది వివాదాలపై అప్పీళ్ళను విచారిస్తుంది.

ఎ. రాజ్యాంగపరమైన వివాదాలు :
రాజ్యాంగంపై వ్యాఖ్యానాలకు సంబంధించిన వివాదాలపై సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు.

బి. పౌర వివాదాలు :
పౌరవివాదాలపై కూడా హైకోర్టు తీర్పుకు వ్యవతిరేకంగా సుప్రీంకోర్టులో అప్పీలు చేయవచ్చు. ఈ అప్పీలు కోసం హైకోర్టు ఆ వివాదం రాజ్యాంగపరమైన, చట్టానికి సంబంధించిన ప్రశ్నలను కలిగి ఉందని అప్పీలు చేయవచ్చు.

సి. క్రిమినల్ వివాదాలు :
క్రిమినల్ వివాదాల్లో ఏ తీర్పుకు వ్యతిరేకంగానైనా సుప్రీంకోర్టులో అప్పీలు చేయవచ్చు. అంతిమ నిర్ణయం లేదా తుది తీర్పు హైకోర్టుచే ఇవ్వబడుతుంది. సాధారణంగా క్రిమినల్ వివాదాలలో అప్పీలు చేసుకోగలిగే అంతిమ స్థాయి కోర్టు హైకోర్టు. కానీ ఈ క్రిమినల్ అంశాలకు సంబంధించి హైకోర్టు నిర్ణయాలకు వ్యతిరేకంగా అప్పీలును వినే ప్రత్యేక అధికారం పార్లమెటు సుప్రీంకోర్టుకు కల్పించింది.

iii. సలహా అధికార పరిధి :
సుప్రీంకోర్టు కొంత సలహా అధికార పరిధిని కూడా కలిగి ఉంది. ఒక అంశంలో చట్టం, వాస్తవానికి మధ్య ప్రశ్న తలెత్తి ఆ విషయంలో రాజ్యాంగపరమైన వ్యాఖ్యానం అవసరమని రాష్ట్రపతి భావించినట్లయితే సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరవచ్చు. సుప్రీంకోర్టు రాష్ట్రపతి ప్రశ్నకి సమాధానం ఇవ్వవచ్చు. కానీ ఇది ఏ పక్షాలపై నిర్బంధం విధించదు.

iv. ఇతర విధులు :
కోర్ట్ ఆఫ్ రికార్డ్ (Court of Record) :
సుప్రీంకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డ్ కూడా పనిచేస్తుంది. సుప్రీంకోర్టు తీర్పులు నమోదు చేయబడి, భద్రపరచబడతాయి. ఇవి ప్రామాణికమైనవిగా భావించబడి చట్టాలతో సమానంగా గౌరవించబడతాయి. ఈ రాకార్డులు సాక్ష్యాలుగా ప్రాముఖ్యత కలిగి ఉంటాయి.

సూచనలు ఆదేశాలు లేదా రిట్లు :
సుప్రీంకోర్టు పౌరుల యొక్క ప్రాథమిక హక్కులను రక్షించేదిగా, హామీనిచ్చేదిగా విమర్శించడం ఖండించడం, కోర్టును, న్యాయమూర్తులను విమర్శించడం. కోర్టుకి వ్యతిరేకంగా అమర్యాదకరమైన అగౌరవమైన అభిప్రాయాలను వెలిబుచ్చడం, కోర్టు నిర్ణయాలకు కట్టుబడి ఉండకపోవడం అనేవి కోర్టు ధిక్కార నేరంగా పరిగణించబడతాయి.

కోర్టు ధిక్కరణ :
ఏ వ్యక్తినైనా కోర్టు ధిక్కార నేరం కింద శిక్షించే అధికారం సుప్రీంకోర్టుకి ఉంది. కోర్టు తీర్పును విమర్శించడం, ఖండించడం, కోర్టును, న్యాయమూర్తులను విమర్శించడం, కోర్టుకి వ్యతిరేకంగా అమర్యాదకరమైన, అగౌరవకరమైన అభిప్రాయాలను వెలిబుచ్చడం, కోర్టు నిర్ణయాలకు కట్టుబడి ఉండకపోవడం అనేవి కోర్టుధిక్కార నేరంగా పరిగణించబడతాయి.

ఆదేశాలను, తీర్పులను, పునఃపరిశీలించడం :
సుప్రీంకోర్టు తీను ఇంతకు ముందు జారీ చేసిన ఏ ఆదేశాన్నైనా పునఃపరిశీలించే అధికారం కలిగి ఉంది. ఎ. కొత్త పరిష్కార పద్ధతి లేదా సాక్ష్యాలు కనిపించినపుడు, బి. కోర్టు యొక్క రికార్డుల ప్రకారం తీర్పులో తప్పిదం కనిపించినప్పుడు సి. లేదా పునఃపరిశీలనకు తగిన కారణాలు కలిగి ఉన్నపుడు కోర్టు ఈ విధంగా ఆదేశాలను సమీక్షించగలదు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారత రాష్ట్రపతి ప్రత్యేక (అత్యవసర) అధికారాలు ఏమిటి ?
జవాబు.
భారత రాజ్యాంగం, భారత రాష్ట్రపతికి మూడురకాలైన అత్యవసర పరిస్థితుల్ని ప్రకటించి, నిర్వహించే అధికారం ఇచ్చింది. అవి:

  1. జాతీయ అత్యవసర పరిస్థితి (అధికరణ 352)
  2. రాష్ట్రపతి పాలన (అధికరణ 356)
  3. ఆర్థిక అత్యవసర పరిస్థితి (అధికరణ 360)

1. జాతీయ అత్యవసర పరిస్థితి :
రాష్ట్రపతి దేశానికి గానీ లేదా ఏదైనా భారత భూభాగానికి గానీ యుద్ధం లేదా బాహ్యదాడులు, సైనిక తిరుగుబాటు వల్ల ముప్పు పొంచి ఉందని భావించినట్లయితే, కేంద్ర మంత్రిమండలి లిఖిత సలహా మేరకు జాతీయ అత్యవసర పరిస్థితిని విధించవచ్చు.

ఇలాంటి ప్రకటన ఒక నెల వ్యవధి లోపల పార్లమెంటులో ఓటింగులో పాల్గొన్న మొత్తం సభ్యుల్లో 2/3వ వంతుకు తగ్గకుండా ఆమోదించవలసి ఉంటుంది. అప్పుడు ఈ ప్రకటన 6 నెలల పాటు అమలులో ఉంటుంది. పార్లమెంట్ ఆమోదం ద్వారా దీనిని మరో 6 నెలల పాటు పొడిగించవచ్చు.

2. రాష్ట్రపతి పాలన :
ఒక రాష్ట్రం గవర్నర్చే ఆ రాష్ట్రంలోని ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ముందుకు సాగే పరిస్థితిలో లేదు. ఆ రాష్ట్రంలోని రాజ్యాంగపరమైన వ్యవస్థ విఫలమైంది అన్న నివేదికను అందుకున్న మీదట రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని (రాష్ట్రపతి పాలన) ప్రకటించవచ్చు. ఈ ప్రకటన ఫలితంగా

  1. రాష్ట్రపతి ఆ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం లేదా ఏదైనా విధులను తన అధికారంలోకి తీసుకోవచ్చు.
  2. రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ అధికారాలు పార్లమెంటుచే నిర్వహించబడతాయి.

ఈ అత్యవసర ప్రకటన రెండు నెలల లోపు పార్లమెంటుచే ఆమోదించబడాలి. ఈ ప్రకటన 6 నెలల పాటు అమలులో ఉంటుంది. పార్లమెంట్ ఆమోదం మేరకు దీన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించవచ్చు.

3. ఆర్థిక అత్యవసర పరిస్థితి :
దేశ ఆర్థిక సుస్థిరతకు భంగం వాటిల్లిందని రాష్ట్రపతి భావించినపుడు ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తాడు. ఈ అత్యవసర పరిస్థితి సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను, ఇతర సదుపాయాలను తగ్గించగలిగే అధికారం కలిగి ఉంటాడు.

అన్ని ద్రవ్య బిల్లులు, ఇతర బిల్లులను రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ద్వారా. జారీ చేయబడిన తరువాత రాష్ట్రపతి అనుమతి కొరకు పంపించవలసి ఉంటుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటినుంచి ఇప్పటి వరకు ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించలేదు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 2.
రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మాన ప్రక్రియను వివరించండి.
జవాబు.
రాష్ట్రపతి పదవీకాలం ముగియక ముందే రాజీనామా చేయవచ్చు లేదా రాజ్యాంగాన్ని అతిక్రమిస్తే రాజ్యాంగంలోని 56, 61 అధికరణాల ప్రకారం పార్లమెంట్ మహాభియోగ తీర్మానం ద్వారా పదవి నుండి తొలగించవచ్చు. దానికి అనుసరించే పద్ధతి ఈ దిగువ వివరించిన విధంగా ఉంటుంది.

  1. పార్లమెంట్లో ఏదో ఒక సభలో 14 రోజుల వ్యవధితో ఒక నోటీసు జారీచేసి మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. ఆ తీర్మానం మీద ఆ సభలోని సభ్యుల 4వ వంతు సభ్యులు సంతకం చేయాలి.
  2. ఆ తీర్మానాన్ని చర్చించి ఆ సభ 2/3వ వంతు మెజారిటీతో ఆమోదించాలి.
  3. అలా ఆమోదించిన తీర్మానాన్ని రెండవ సభ ఒక కమిటీని ఏర్పరచి, ఆరోపణలపై విచారణ జరుపుతుంది.
  4. ఆరోపణలు రుజువైతే ఆ సభలో మొత్తం సభ్యులలో 2/3వ వంతు సభ్యులు ఆమోదిస్తే రాష్ట్రపతి పదవీచ్యుతుడౌతాడు. ఇంతవరకు మహాభియోగ తీర్మానం ద్వారా ఏ రాష్ట్రపతి తొలగింపబడలేదు.

ప్రశ్న 3.
ఉపరాష్ట్రపతి ఎన్నిక, అధికారాలు – విధులను గురించి రాయండి.
జవాబు.
భారత ఉపరాష్ట్రపతి పదవి భారతదేశంలోని రెండవ అత్యున్నత పదవి. రాజ్యాంగ అధికరణ 60 నుంచి 71 ఉపరాష్ట్రపతి గురించి వివరిస్తాయి. ప్రస్తుతం భారత ఉపరాష్ట్రపతిగా హమీద్ అన్సారీ వరుసగా రెండవసారి ఎన్నికై కొనసాగుతున్నారు.

నిర్మాణం :
1. అర్హతలు:
భారత ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి ఒక వ్యక్తి ఈ కింది అర్హతలను కలిగి ఉండాలి.

  • భారత పౌరుడై ఉండాలి.
  • 35 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.
  • రాజ్యసభ సభ్యుడుగా ఎన్నిక కావడానికి కావలిసిన అర్హత కలిగి ఉండాలి.

2. ఎన్నిక :
భారత ఉపరాష్ట్రపతిని నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఒక ఓటు బదిలీ ద్వారా రహస్య ఓటింగ్ విధానంలో భారత పార్లమెంట్ ఉభయసభలకు ఎన్నుకోబడిన, నామినేట్ చేయబడిన సభ్యులు ఎన్నుకొంటారు.

3. పదవీకాలం :
భారత ఉపరాష్ట్రపతి పదవీకాలం కార్యాలయంలో విధులు చేపట్టిన సమయం నుంచి 5 సంవత్సరాలు. ఇతడు రాష్ట్రపతికి రాజీనామా లేఖను పంపించడం ద్వారా పదవికి రాజీనామా చేయవచ్చు.

4. వేతనం, ఇతర సదుపాయాలు:
భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్ హోదాలో 71,25,000 నెలసరి వేతనం, ఇతర సదుపాయాలను అందుకొంటాడు.

5. తొలగింపు భారత ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానం కేవలం రాజ్యసభలో మొత్తం సభ్యుల్లో 1/4వ వంతు సభ్యుల అనుమతితో ప్రవేశపెట్టాలి. 14 రోజుల ముందస్తు నోటీసు గడువు పూర్తి అయిన తరువాత రాజ్యసభ ఈ తీర్మానంపై చర్చలు జరుపుతుంది.

ఈ తీర్మానం సభలో ఓటింగ్ లో పాల్గొనే సభ్యుల్లో 2/3వ వంతు సభ్యులు ఆమోదించినట్లయితే ఇది లోక్సభకు పంపబడుతుంది. లోక్ సభలో కూడా ఈ తీర్మానం 2/3వ వంతు సభ్యులచే ఆమోదించవలసి ఉంటుంది.

అధికారాలు – విధులు : భారత ఉపరాష్ట్రపతి కేవలం 2 రకాల అధికారాలను, విధులను కలిగి ఉన్నాడు.

1. రాజ్యసభ ఛైర్మన్ :
భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్ గా వ్యవహరిస్తాడు. ఇతడు రాజ్యసభ సమావేశాల్లో – ప్రసంగిస్తాడు. సభ యొక్క వ్యవహారాలను నిర్వహిస్తాడు. ఏదైనా బిల్లు పట్ల ఓట్లు సమానంగా చీలినట్లయితే, నిర్ణాయకపు ఓటును వినియోగిస్తాడు.

2. తాత్కాలిక రాష్ట్రపతి :
రాష్ట్రపతిని తొలగించినా, రాజీనామా చేసినా లేదా మరణించినా గానీ ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు. ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా 6 నెలలు మాత్రమే వ్యవహరించగలడు. ఈ సమయంలో ఇతడు భారత రాష్ట్రపతికి గల వేతనం ఇతర సదుపాయాలను అందుకుంటాడు. రాజ్యసభ ఛైర్మన్ హోదాలో ఎలాంటి వేతనాన్ని, ఇతర సదుపాయాలను అందుకోలేడు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 4.
సమిష్టి బాధ్యత అనగానేమి ? వివరించండి.
జవాబు.
సమిష్టి బాధ్యత :
పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణాలలో ప్రధానమైనదే సమిష్టి బాధ్యత. భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ సూత్రాన్ని బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. రాజ్యాంగం 75(3)వ అధికరణం మంత్రిమండలి సమిష్టిగా లోక్సభకు బాధ్యత వహిస్తుందని ప్రకటించింది. కేంద్ర మంత్రిమండలి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఒక జట్టుగా వ్యవహరిస్తుంది.

కార్యనిర్వాహకశాఖలోని మంత్రులు అధికారంలో ఉండగా తమ చర్యలకు, కార్యకలాపాలకు పార్లమెంటు (శాసన నిర్మాణశాఖ కు సమిష్టిగా బాధ్యత వహించడాన్నే సమిష్టి బాధ్యత అంటారు. ప్రతి మంత్రి తన మంత్రిత్వశాఖలో పరిణామాలకు బద్దుడై పార్లమెంటుకు జవాబుదారీగా ఉంటాడు. అలాగే మంత్రిత్వశాఖలో తన నిర్ణయాలవల్ల కలిగే పరిణామాలకు బద్ధుడై ఉంటాడు.

ఇది ప్రతి మంత్రి నిర్వర్తించవలసిన వ్యక్తిగత బాధ్యత కూడా. ప్రభుత్వ విధానాలపట్ల, అనుకూలంగానో, ప్రతికూలంగానో ఎదురయ్యే పరిణామాల సందర్భంలో తన ప్రమేయంలేదనీ, తనకు తెలియదనీ చెప్పి తప్పుకోవడానికి, నిస్సహాయతను వెల్లడించడానికి ఏ మంత్రికీ వీలులేదు.

సమిష్టి బాధ్యత మంత్రులందరినీ ఒక జట్టుగా ఉంచి ఏక త్రాటిపై నడిపిస్తుంది. సమిష్టి బాధ్యతా సూత్రాన్ని ప్రధానమంత్రి ఆచరణలో ఉంచుతాడు. మంత్రివర్గ సమావేశాలలో ఆమోదించిన నిర్ణయాలను ప్రతి ఒక్క మంత్రి గౌరవించినట్లు, అమలుతో ఉంచేటట్లు ప్రధానమంత్రి చర్యలు తీసుకుంటాడు. మంత్రిమండలిలోని సభ్యుల మధ్య సహకారం, సమన్వయం సర్దుబాటుతనం పెంపొందించడానికి కృషి చేస్తాడు. మంత్రివర్గ సమావేశాలలో ఏ మంత్రి అయినా తన భావాలను స్వేచ్ఛగా వెల్లడించడానికి అనుమతిస్తాడు.

అయితే, ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత దానికి కట్టుబడి ప్రతి మంత్రి మనస్ఫూర్తిగా అనుసరించవలసి ఉంటుంది. లేకపోతే రాజీనామా సమర్పించవలసి ఉంటుంది. అది కూడా చేయనప్పుడు ఆయనను ప్రధానమంత్రి సలహాపై రాష్ట్రపతి మంత్రిమండలి నుంచి బర్తరఫ్ చేయవచ్చు. ఇక మంత్రివర్గ నిర్ణయాలను బట్టి కట్టుబడని మంత్రులను మినహాయించి మిగిలిన వారితో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే హక్కు ప్రధానమంత్రికి ఉంటుంది.

కార్యనిర్వాహకశాఖ సమిష్టి బాధ్యతను శాసన నిర్మాణశాఖ అనేక విధాలుగా ఆచరణలో ఉంచుతుంది. శాసన నిర్మాణశాఖ (పార్లమెంటు) కార్యనిర్వాహకశాఖ (మంత్రిమండలి)పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించి, ఆమోదిస్తుంది. అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందిన తక్షణమే కార్యనిర్వాహకశాఖ (మంత్రిమండలి) అధికారాన్ని కోల్పోతుంది.

అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే సందర్భంలో పార్లమెంటు సభ్యులు కార్యనిర్వాహకశాఖపై మోపిన ఆరోపణలకు సంజాయిషీ కోరగా కార్యనిర్వాహకశాఖ అందుకు కొన్ని సందర్భాలలో అవిశ్వాస తీర్మానం బదులుగా కార్యనిర్వాహకశాఖే శాసన నిర్మాణశాఖ విశ్వాసాన్ని పొందే విధంగా తీర్మానాన్ని ప్రతిపాదించవలసి రావచ్చు.

ఉదాహరణకు 1979లో రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి చరణ్సింగ్ను ప్రధానిగా నియమిస్తూ లోక్సభ విశ్వాసాన్ని పొందవలసిందిగా ఆదేశించారు. కానీ లోక్సభ విశ్వాసాన్ని పొందకుండానే చరణ్ సింగ్ ప్రధాని పదవికి రాజీనామా సమర్పించారు.

ఇటీవల 1999 ఏప్రిల్ 14న వాజ్పేయి ఆధ్వర్యంలోని ఎన్.డి.ఎ. ప్రభుత్వానికి ఎ.ఐ.ఎ.డి.ఎం.కె. మద్దతు ఉపసంహరించుకోగా, ప్రధాని వాజ్పేయి లోక్సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆయన తీర్మానాన్ని సభ తిరస్కరించగా 1999 ఏప్రిల్ 17న ఆయన తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించారు.

మొత్తం మీద సమిష్టి బాధ్యత అనేది మంత్రిమండలికి, లోక్సభకు సంబంధించిన అంశం. సమిష్టి బాధ్యత అనేది శాసన నిర్మాణశాఖ కార్యనిర్వాహకశాఖలు రెండూ విడివిడిగా పార్లమెంటు దిగువసభలో తమ శక్తిసామర్థ్యాలను నిరూపించుకోవడానికి, ప్రజలకు ఎలక్ట్రానిక్ ప్రచార సాధనాల ద్వారా తన అభిప్రాయాలను తెలియజేయడానికి వీలు కల్పిస్తుంది. మంత్రిమండలి సమైక్యంగా బాధ్యతాయుతంగా, సామరస్యం, సదవగాహనలతో వ్యవహరించడానికి సమిష్టి బాధ్యత దోహదపడుతుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 5.
లోక్సభ స్పీకర్ యొక్క విధులను వివరించండి.
జవాబు.
భారతదేశంలో స్పీకర్ కార్యాలయం ఏర్పాటు పద్దతిని బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థ నుండి తీసుకోవడం జరిగింది. రాజ్యాంగ అధికరణ 93 ప్రకారం ప్రతీ సాధారణ ఎన్నికల తరువాత లోక్సభ సభ్యులు తమ నుండి స్పీకర్ను డిప్యూటీ స్పీకర్ను పూర్తి సమయం కోసం ఎన్నుకోవలసి ఉంటుంది.

1. అర్హత :
లోక్సభ స్పీకర్గా ఎన్నికయ్యే వ్యక్తి తప్పనిసరిగా లోక్సభ సభ్యుడై ఉండాలి.

2. ఎన్నిక :
లోక్ సభ సభ్యులు తమలోంచి ఒక సభ్యుణ్ణి స్పీకర్గా ఎన్నుకుంటారు. సాధారణంగా స్పీకర్ పదవికి అధికారంలో ఉన్న పార్టీ సభ్యులే ఎన్నికవడం ఆనవాయితీ.

3. పదవీకాలం :
లోకసభ స్పీకర్ పదవీకాలం సాధారణంగా 5 సంవత్సరాలు. స్పీకర్ సభ రద్దయిన తరువాత కూడా పదవిలో కొనసాగుతాడు. క్రొత్త స్పీకర్ ఎన్నికయ్యే వరకు అతను స్పీకర్ కార్యాలయాన్ని నిర్వహిస్తాడు.

4. వేతనం, ఇతర సదుపాయాలు :
స్పీకర్ ప్రతి నెల 1,25,000 వేతనంగా పొందుతాడు. ఉచిత నివాసగృహం. వైద్యసదుపాయం, కమ్యూనికేషన్ సదుపాయాలు కల్పించబడడం పొందుతారు.

5. తొలగింపు :
స్పీకర్ సభలో హాజరైన, ఓటింగ్ లో పాల్గొన్న సభ్యుల్లోని మెజారిటీ సభ్యులు తొలగింపు తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా తొలగించబడతాడు. దీనికి 14 రోజుల ముందస్తు నోటీసు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. స్పీకరును తొలగించే తీర్మానంపై చర్చ జరుగుతున్నప్పుడు, స్పీకర్ సభకి అధ్యక్షత వహించలేడు. కానీ చర్చలో పాల్గొనగలడు. ఇంతవరకు భారతదేశంలో స్పీకర్ పదవిలో ఉన్న ఎవరినీ తొలగించడం జరగలేదు.

6. స్పీకర్ అధికారాలు, విధులు :
స్పీకర్ తన విధులను సక్రమంగా, హుందాగా సమర్థవంతంగా నిర్వహించడానికి కావలసిన అధికారాలను భారత రాజ్యాంగం స్పీకర్కు కల్పించింది. స్పీకర్ తన విస్తృతమైన అధికారాలను రాజ్యంగం ద్వారా, పార్లమెంటు విధి విధానాల నిర్వహణ చట్టం 1950 నుంచి పొందుతాడు. స్పీకర్ ఈ కింది విధులను నిర్వహిస్తాడు.

  1. స్పీకర్ లోక్సభ సమావేశాల్లో ప్రసంగిస్తాడు.
  2. సభ్యులను ప్రశ్నలు అడగడానికి అనుమతిస్తాడు. సభానియమాలకు అనుగుణంగా ప్రశ్నలు లేని పక్షంలో అనుమతి నిరాకరించడానికి కూడా స్పీకర్కు అధికారం ఉంది.
  3. వాయిదా తీర్మానాలు ఇతని ఆమోదంతోనే ప్రవేశపెట్టబడతాయి. ఇతడి తీర్మానంపై వ్యాఖ్యానించడానికి సమయం పరిమితిని నిర్ణయిస్తాడు.
  4. ఒక బిల్లుని సభలో ప్రవేశపెట్టడానికి ముందు గెజిట్ ఆఫ్ ఇండియాలో ప్రచురించడానికి అనుమతించవచ్చు. దీనికి సభ అనుమతి అవసరం లేదు.
  5. అతడు సెలక్షన్ కమిటీ చైర్మన్ను నియమిస్తాడు. తను స్వంతంగా కొన్ని ముఖ్యమైన కమిటీలకు, బిజినెస్ అడ్వయిజరీ కమిటీ, జనరల్ పర్చేస్ కమిటీ వంటి వాటికి చైర్మన్ గా వ్యవహరిస్తాడు.
  6. ఒక తీర్మానం సభలో ప్రవేశయోగ్యమా కాదా అని నిర్ణయిస్తాడు.
  7. స్పీకర్ అనుమతి లేకుండా ఏ సభ్యుడూ సభనుద్దేశించి ప్రసంగించలేడు. ఏ సభ్యుడు అయినా చర్చకు సంబంధంలేని అంశాలను మాట్లాడడం ద్వారా సభా సమయాన్ని దుర్వినియోగం, నిరుపయోగం కాకుండా చూస్తాడు.
  8. సభను సక్రమంగా నిర్వహిస్తాడు. సభలో గందరగోళం చెలరేగి కార్యక్రమాలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడినపుడు సభను వాయిదా వేసి, ముగిస్తాడు.
  9. ఒక సభ్యుడు స్పీకర్ అధ్యక్షతను అంగీకరించకపోతే, అసభ్యంగా ప్రవర్తిస్తే నిషేధ హెచ్చరిక చేస్తాడు. సభ నుంచి వెళ్ళిపొమ్మని ఆదేశించినప్పుడు ఆ ఆ దేశాన్ని ఆ సభ్యుడు ఖాతరు చేయకపోతే సంబంధిత సెక్యూరిటీ అధికారుల (మార్షల్స్) ద్వారా బయటికి పంపించగలడు.
  10. ఒక తీర్మానానికి అనుకూలంగా, ప్రతికూలంగా, సమానంగా ఓట్లు లభించినప్పుడు నిర్ణాయకపు ఓటును వినియోగిస్తాడు.
  11. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాలలో ప్రసంగిస్తాడు.
  12. ఒక బిల్లుని ద్రవ్య బిల్లా, కాదా అని నిర్ణయిస్తాడు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 6.
సుప్రీంకోర్టు యొక్క న్యాయసమీక్షాధికారం గురించి రాయండి.
జవాబు.
భారత రాజ్యాంగంలో ‘న్యాయసమీక్ష’ అనే పదాన్ని ఎక్కడా ప్రస్తావించకపోయినప్పటికీ, మన రాజ్యాంగ నిర్మాతలు భారతదేశంలోని కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లోని శాసన, కార్యనిర్వాహక సంస్థలు రూపొందించే, అమలుచేసే చట్టాలలోని రాజ్యాంగ ఔచిత్యాన్ని నిర్ణయించే అధికారాన్ని సుప్రీంకోర్టుకు సంక్రమింపచేశారు.

భారతదేశంలో రాజ్యాంగ అంశాలను వ్యాఖ్యానించడానికి, రాజ్యాంగ విలువలను కాపాడటానికి, కేంద్రం, రాష్ట్రాల మధ్య న్యాయవివాదాలు ఏర్పడితే న్యాయపరమైన తీర్పు ఇచ్చే పవిత్ర బాధ్యతను సుప్రీంకోర్టుకు ఇవ్వడం జరిగింది.

అందుకు అనుగుణంగా రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఎలాంటి శాసనాలను శాసన నిర్మాణశాఖ రూపొందించినా, కార్యనిర్వాహక వర్గం అమలు చేసినా అవి చెల్లవనీ, రాజ్యాంగ వ్యతిరేకమనీ సుప్రీంకోర్టు ప్రకటిస్తుంది. సుప్రీంకోర్టు ఈ రకమైన న్యాయసమీక్ష అధికారాన్ని తొలిసారిగా 1950లోనే వినియోగించి ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం (Preventive Detention) లోని కొన్ని అంశాలు రాజ్యాంగ వ్యతిరేకమని తీర్పుచెప్పింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఎన్నికల గణం అంటే ఏమిటి ?
జవాబు.
భారత రాష్ట్రపతి ఎన్నిక : భారత రాష్ట్రపతి ఎన్నికల గణం ద్వారా ఎన్నికవుతాడు. ఆ ఎన్నికల గణంలో (i) పార్లమెంటు, (ii) రాష్ట్రాల విధాన సభలు, (iii) ఢిల్లీ, పాండిచ్చేరీ విధాన సభలలోని ‘ఎన్నికైన సభ్యులు ఓటర్లుగా ఉంటారు. నైష్పత్తిక ప్రాతిపదికన, ఒక ఓటు బదిలీ సూత్రం అనుసరించి, ఎన్నిక జరుగుతుంది. నిర్ణీత కోటా ఓట్లు వచ్చిన అభ్యర్థి రాష్ట్రపతి పదవికి ఎన్నికైనట్లు ప్రకటిస్తారు.

ప్రశ్న 2.
సాధారణ బిల్లుకు, ద్రవ్య బిల్లుకు మధ్యగల తేడాను వివరించండి.
జవాబు.
ఆర్థికేతర, ప్రభుత్వపు పరిపాలన అంశాలకు సంబంధించిన బిల్లులను సాధారణ బిల్లులంటారు. ద్రవ్యబిల్లులు ప్రభుత్వపు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఉంటాయి. సాధారణ బిల్లులు పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి ముందస్తు అసుమతి అవసరం లేదు. ద్రవ్య బిల్లులను పార్లమెంటులో ప్రవేశ పెట్టడానికి రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 3.
కేంద్ర మంత్రిమండలి నిర్మాణం గురించి రాయండి.
జవాబు.
కేంద్ర మంత్రిమండలిలో మూడు రకాల సభ్యులు ఉంటారు. వారు :

  1. కేబినెట్ మంత్రులు
  2. స్టేట్ మంత్రులు
  3. డిప్యూటీ లేదా సహాయమంత్రులు.

1. కేబినెట్ మంత్రులు :
కేంద్ర ప్రభుత్వంలోని రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, హోం, మానవ వనరుల అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రైల్వేలు వంటి ముఖ్యశాఖలకు అధిపతులుగా కేబినెట్ హోదా గల మంత్రులు ఉంటారు. వారు తమ మంత్రిత్వశాఖల నిర్వహణలో, నిర్ణయాలు తీసుకోవడంలో స్వతంత్రులు. కేంద్ర మంత్రిమండలి, కేంద్ర కేబినెట్ సమావేశాలలో నిర్ణయాలు తీసుకోవడంలో వారికి నిర్ణయాత్మకమైన పాత్ర ఉంటుంది.

2. స్టేట్ మంత్రులు :
కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని శాఖలను ఈ రకమైన మంత్రులు స్వతంత్రంగా నిర్వహిస్తూ, విధి నిర్వహణలో ప్రధానమంత్రికి నేరుగా జవాబుదారీగా ఉంటారు. మంత్రిత్వశాఖలోని కొన్ని కీలకమైన విభాగాలకు వారు ఆధ్వర్యం వహిస్తారు. కేబినెట్ మంత్రుల అజమాయిషీ వారిపైన ఉండదు.

3. డిప్యూటీ లేదా సహాయమంత్రులు :
మంత్రిత్వశాఖలకు సంబంధించిన శాసన పరిపాలనా వ్యవహారాలలో కేబినెట్ మంత్రులకు సహాయపడటానికి నియమించబడే మంత్రులను డిప్యూటీ లేదా సహాయమంత్రులని అంటారు. వారిని ప్రధానమంత్రి ఎంపిక చేస్తాడు. బ్రిటన్లో ఈ రకమైన మంత్రులను జూనియర్ మంత్రులనీ, పార్లమెంటరీ కార్యదర్శులని పిలుస్తారు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 4.
రాష్ట్రపతి యొక్క శాసనాధికారాలు.
జవాబు.
శాసనాధికారాలు :

  1. పార్లమెంటు సమావేశపరచడానికి, వాయిదా వేయడానికి, లోక్సభను రద్దు చేయడానికి రాష్ట్రపతికి అధికారాలున్నాయి.
  2. సాధారణ ఎన్నికల తరువాత ఉభయసభల సంయుక్త సమావేశంలో ప్రారంభోపన్యాసం చేస్తాడు.
  3. పార్లమెంట్కు సందేశాలు పంపవచ్చును.
  4. రాష్ట్రపతి సంతకం పొందిన తరువాతనే బిల్లులు చట్టాలవుతాయి. బిల్లులకు ఆమోదం తెలుపకుండా కొంతకాలం నిలపవచ్చు కానీ రెండు సభలు తిరిగి ఆ బిల్లలను ఆమోదించి పంపితే అధ్యక్షుడు తప్పనిసరిగా ఆమోదించాలి.
  5. పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్లను జారీ చేస్తాడు.
  6. ఆర్థిక బిల్లులు ఆయన అనుమతి లేనిదే పార్లమెంటులో ప్రవేశపెట్టరాదు.
  7. ఆర్థిక సంఘం, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వంటి సంస్థలు ఇచ్చిన నివేదికలను పార్లమెంట్కు పంపుతాడు.
  8. పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటుచేస్తాడు.
  9. రాజ్యసభకు 12 మందిని లోక్సభకు ఇద్దరిని నియమిస్తాడు.

ప్రశ్న 5.
జాతీయ అత్యవసర పరిస్థితి.
జవాబు.
జాతీయ అత్యవసర పరిస్థితి (352వ అధికరణం) : విదేశీ దండయాత్రలు, యుద్ధం, సాయుధ తిరుగుబాటు వంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు రాష్ట్రపతి ఈ రకమైన అత్యవసర అధికారాన్ని వినియోగిస్తాడు. ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని కేంద్ర మంత్రిమండలి లిఖితపూర్వక సూచన మేరకు మాత్రమే రాష్ట్రపతి వ్యవహరించవలసి ఉంటుందని 1978లో చేసిన 44వ రాజ్యాంగ సవరణ చట్టం స్పష్టం చేసింది.

జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనకు సంబంధించిన తీర్మానాన్ని నెల రోజుల్లోగా పార్లమెంటు ఉభయ సభల మొత్తం సభ్యత్వ సంఖ్యలో 2/3వ వంతు సభ్యుల మద్దతుతో ఆమోదించవలసి ఉంటుంది. పార్లమెంటు ఆమోదించిన రాష్ట్రపతి ప్రకటన ఆరు నెలల కాలంపాటు అమలులో ఉంటుంది. ఆ తరువాత రాష్ట్రపతి మరొక ప్రకటన ద్వారా అలాంటి అత్యవసర పరిస్థితిని పార్లమెంటు ఆమోదంతో మరో ఆరునెలల కాలంపాటు పొడిగించవచ్చు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 6.
ఒక రాష్ట్రంలో రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి (రాష్ట్రపతి పాలన).
జవాబు.
ఒక రాష్ట్రం గవర్నర్చే ఆ రాష్ట్రంలోని ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ముందుకు సాగే పరిస్థితిలో లేదు. ఆ రాష్ట్రంలోని రాజ్యాంగపరమైన వ్యవస్థ విఫలమైంది అన్న నివేదికను అందుకున్న మీదట రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని (రాష్ట్రపతి పాలన) ప్రకటించవచ్చు. ఈ ప్రకటన ఫలితంగా:

  1. రాష్ట్రపతి ఆ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం లేదా ఏవైనా విధులను తన అధికారంలోకి తీసుకోవచ్చు.
  2. రాష్ట్ర శాసన నిర్మాణశాఖ అధికారాలు పార్లమెంటుచే నిర్వహించబడతాయి.

ఈ అత్యవసర ప్రకటన రెండు నెలలలోపు పార్లమెంటుచే ఆమోదించబడాలి. ఈ ప్రకటన 6 నెలలపాటు అమలులో ఉంటుంది. పార్లమెంటు ఆమోదం మేరకు దీన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించవచ్చు.

ప్రశ్న 7.
లోక్సభ స్పీకర్ అధికారాలు తెలపండి.
జవాబు.
లోక్సభ స్పీకర్ అధికారాలు :

  1. స్పీకర్ లోక్సభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు.
  2. వివిధ బిల్లులపై అధికార, ప్రతిపక్షాల సభ్యులు ప్రసంగించేందుకు తగిన సమయాన్ని కేటాయించి, అవసరమయితే బిల్లులపై ఓటింగ్ నిర్వహించి, ఫలితాలు ప్రకటిస్తాడు.
  3. లోక్సభ ఆమోదించిన బిల్లులను రాజ్యసభకు పంపుతాడు.
  4. లోక్సభ తరపున ముఖ్య ప్రతినిధిగా వ్యవహరిస్తాడు.
  5. సభ్యుల హక్కులను, సభా గౌరవాన్ని, ప్రతిష్టను కాపాడేందుకు చర్యలు తీసుకుంటాడు.

ప్రశ్న 8.
రాజ్యసభ నిర్మాణం.
జవాబు.
రాజ్యసభ నిర్మాణం: రాజ్యసభలో గరిష్టంగా 250 మంది సభ్యులు ఉంటారు. భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ వ్యవహరిస్తాడు. సభ్యులలో ఒకరు డిప్యూటీ ఛైర్మన్ గా ఎన్నికవుతారు. ప్రస్తుతం రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 233 మంది ఎన్నికైనవారు కాగా, 12 మంది నామినేటెడ్ సభ్యులు.

ఎన్నికైన వారిలో 229 మంది 28 రాష్ట్రాలకు, ముగ్గురు సభ్యులు జాతీయ రాజధాని ఢిల్లీకి, ఒకరు కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి ప్రాతినిధ్యం వహిస్తారు. రాష్ట్రపతి 12 మంది సభ్యులను నామినేట్ చేస్తారు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 9.
లోక్సభ నిర్మాణం.
జవాబు. భారత పార్లమెంటులో లోక్సభను దిగువ సభ, ప్రజల సభ అనికూడా అంటారు. దీనిలో అత్యధికంగా 552 సభ్యులు ఉండవచ్చు. ప్రస్తుతం ఈ సభలో 545 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 543 మంది ఎన్నుకోబడే సభ్యులు కాగా రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో-ఇండియన్ ప్రతినిధులను లోక్సభకు నామినేట్ చేస్తారు. అయితే ఈ పద్ధతిని (నామినేట్ చేసే పద్ధతిని) 104వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించటం జరిగింది. స్పీకర్ అధ్యక్షతన లోక్సభ సమావేశాలు నిర్వహించబడతాయి.

TS Inter 1st Year Accountancy Study Material Chapter 4 సహాయక చిట్టాల తయారీ

Telangana TSBIE TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ Textbook Questions and Answers.

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఈ క్రింది వ్యవహారాలను కొనుగోలు చిట్టాలో నమోదు చేయండి.
2019 మార్చి
మార్చి 1 అనిల్ నుంచి కొనుగోలు చేసిన సరుకు – ₹ 2,000
మార్చి 3 రాజు నుంచి కొనుగోలు చేసిన సరుకు – ₹ 4,000
మార్చి 7 శ్రీకాంత్ నుంచి కొనుగోలు చేసిన సరుకు – ₹ 5,000
(వర్తకపు డిస్కౌంట్ 10%)
మార్చి 13 వెంకట్ నుంచి కొనుగోలు చేసిన సరుకు – ₹ 1,600
మార్చి 18 మహేష్ నుంచి కొనుగోలు చేసిన సరుకు – ₹ 1,400
మార్చి 24 కొనుగోళ్ళు – ₹ 3,000
మార్చి 26 అశోక్ నుంచి సరుకు కొనుగోలు – ₹ 2,500
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 1

సూచన :
1) మార్చి 7న వర్తకపు డిస్కౌంట్ = 5,000 × \(\frac{10}{100}\) = 500
2) మార్చి 24 నాటి వ్యవహారం నగదు వ్యవహారం కాబట్టి కొనుగోలు చిట్టాలో రాయకూడదు.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 4 సహాయక చిట్టాల తయారీ

ప్రశ్న 2.
ఈ క్రింది వ్యవహారాల నుంచి కొనుగోలు పుస్తకం తయారు చేయండి.
సాధన.
ఏప్రిల్ 2018
ఏప్రిల్ 1 శేఖర్ నుంచి సరుకు కొనుగోలు – ₹ 4,000
ఏప్రిల్ 4 నగదు కొనుగోళ్ళు – ₹ 2,000
ఏప్రిల్ 8 శ్యాం నుంచి సరుకు కొనుగోళ్ళు – ₹ 8,000
(వర్తకం డిస్కౌంట్ 5%)
ఏప్రిల్ 12 కార్తీక్ నుంచి కొన్న సరుకు – ₹ 2,400
ఏప్రిల్ 18 నరేష్ నుంచి సరుకు కొనుగోళ్ళు – ₹ 3,000
ఏప్రిల్ 25 ఆకాశ్ నుంచి ఫర్నీచర్ కొనుగోళ్ళు – ₹ 6,000
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 2

సూచన :

  1. ఏప్రిల్ 4 నాటి వ్యవహారం నగదు వ్యవహారం కాబట్టి కొనుగోలు చిట్టాలో రాయకూడదు.
  2. ఏప్రిల్ 25 నాటి వ్యవహారం ఆస్తి కొనుగోలు కాబట్టి కొనుగోలు చిట్టాలో రాయకూడదు. 3. కొనుగోలు చిట్టా తయారు చేయండి.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 4 సహాయక చిట్టాల తయారీ

ప్రశ్న 3.
కొనుగోలు చిట్టా తయారు చేయండి.
2018 డిసెంబర్
డిసెంబర్ 1 పల్లవి నుంచి సరుకు కొనుగోలు – ₹ 4,200
డిసెంబర్ 5 తేజ నుంచి సరుకు కొనుగోలు – ₹ 8,000
డిసెంబర్ 10 వేదాగ్ని నుంచి కొన్న సరుకు – ₹ 3,800
డిసెంబర్ 14 సుధా నుంచి సరుకు కొనుగోలు – ₹ 6,000
(వర్తకం డిస్కౌంట్ 7 600)
డిసెంబర్ 18 రమ్య నుంచి సరుకు కొనుగోలు – ₹ 2,000
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 3

ప్రశ్న 4.
క్రింది వ్యవహారాలను కొనుగోలు చిట్టాలో నమోదు
2018 నవంబర్
నవంబర్ 1 ఇన్వాయిస్ నెం.250 ప్రకారం చైతన్య నుంచి కొనుగోలు చేసిన సరుకు
నవంబర్ 12 ఇన్వాయిస్ నెం. 300 ప్రకారం రవి నుంచి కొన్న సరుకు – ₹ 1,000
నవంబర్ 18 ఇన్వాయిస్ నెం. 105 ప్రకారం సతీష్ నుంచి సరుకు కొనుగోలు – ₹ 3,000
నవంబర్ 23 ఇన్వాయిస్ నెం. 410 ప్రకారం నగదు పైన పవన్ నుంచి సరుకు కొనుగోలు – ₹ 2,500
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 4

సూచన :
నవంబర్ 23వ తేదీన వ్యవహారం నగదు కొనుగోలు, అందువల్ల కొనుగోలు చిట్టాలో నమోదు చేయలేదు.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 4 సహాయక చిట్టాల తయారీ

ప్రశ్న 5.
క్రింది వ్యవహారాలను కొనుగోలు చిట్టా మరియు కొనుగోలు వాపస్ల చిట్టాలో నమోదు చేయండి.
ఆగస్ట్ 2018
ఆగస్ట్ 1 కృష్ణ నుండి సరుకు కొనుగోలు – ₹ 6,000
ఆగస్ట్ 4 మల్లేష్ నుంచి కొనుగోలు చేసిన సరుకు – ₹ 3,500
ఆగస్ట్ 8 కృష్ణకు వాపసులు – ₹ 600
ఆగస్ట్ 13 నవీన్ నుంచి సరుకు కొనుగోలు – ₹ 2,000
ఆగస్ట్ 16 మల్లేషకు పంపిన సరుకు వాపసులు – ₹ 400
ఆగస్ట్ 22 రవి నుంచి సరుకు కొనుగోలు – ₹ 4,000
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 5

ప్రశ్న 6.
ఈ క్రింది వ్యవహారాలను సహాయక చిట్టాలలో నమోదు చేయండి.
2018 జూన్
జూన్ 1 అరుణ్ నుంచి సరుకు కొనుగోలు – ₹ 2,500
జూన్ 3 ప్రకాశ్ నుంచి సరుకు కొనుగోలు – ₹ 7,000
జూన్ 5 అరుణ్కు పంపిన వాపస్లు – ₹ 800
జూన్ 14 నాగరాజు నుంచి కొన్న సరుకు – ₹ 10,000
(వర్తకం డిస్కౌంట్ 10%)
జూన్ 19 నిఖిల్ నుంచి నగదుపై కొన్న సరుకు – ₹ 4,000
జూన్ 25 నాగరాజుకు పంపిన వాపస్లు – ₹ 1,200
జూన్ 28 విశాల్ నుంచి కొన్న సరుకు – ₹ 1,500
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 6

సూచన :

  1. జూన్ 14న వర్తకపు డిస్కౌంట్ = 10,000 × \(\frac{10}{100}\) = 1,000
  2. జూన్ 19 తేదీన వ్యవహారం నగదు వ్యవహారం అందువల్ల కొనుగోలు చిట్టాలో నమోదు చేయలేదు.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 4 సహాయక చిట్టాల తయారీ

ప్రశ్న 7.
క్రింది వ్యవహారాలను అమ్మకాల చిట్టాలో నమోదు చేయండి.
2019 ఫిబ్రవరి
ఫిబ్రవరి 1 సంపత్కు అమ్మిన సరుకు – ₹ 2,250
ఫిబ్రవరి 6 మనోహర్కు అమ్మిన సరుకు – ₹ 2,000
ఫిబ్రవరి 10 నగదు అమ్మకాలు – ₹ 1,800
ఫిబ్రవరి 16 మురళికి అమ్మిన సరుకు – ₹ 5,000
(వర్తకం డిస్కౌంట్ 5%)
ఫిబ్రవరి 20 అరువుపై శంకర్కు అమ్మిన సరుకు – ₹ 2,500
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 7

సూచన :

  1. ఫిబ్రవరి 10వ తేదీన నగదు వ్యవహారం జరిగినందున అమ్మకాల చిట్టాలో రాయకూడదు.
  2. ఫిబ్రవరి 16న వర్తకపు డిస్కౌంట్ = 5,000 × \(\frac{5}{100}\) = 250.

ప్రశ్న 8.
ఈ క్రింది వ్యవహారాల నుంచి అమ్మకాల పుస్తకాన్ని తయారుచేయండి.
2018 మే
మే 1 కిరణ్కు అమ్మిన సరుకు – ₹ 10,000
మే 8 కళ్యాణ్ కు అమ్మిన సరుకు – ₹ 6,000
(వర్తకం డిస్కౌంట్ 10%)
మే 12 సంజీవకు నగదుపై అమ్మిన సరుకు – ₹ 3,000
మే 18 జీవన్కు సరుకు అమ్మకాలు – ₹ 4,600
మే 24 సందీప్కు అమ్మిన పాతయంత్రం – ₹ 2,500
మే 26 వాసుకు అమ్మిన సరుకు – ₹ 8,000
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 8

సూచన :

  1. మే 12న వ్యవహారం నగదు వ్యవహారం అందువల్ల అమ్మకాల చిట్టాలో నమోదు చేయరాదు.
  2. మే 24న ఆస్తిని అమ్మారు. అందువల్ల అమ్మకాల చిట్టాలో రాయకూడదు.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 4 సహాయక చిట్టాల తయారీ

ప్రశ్న 9.
అమ్మకాల పుస్తకాన్ని తయారుచేయండి.
2018 జూలై
జూలై 1 ఇన్వాయిస్ నెం. 410 ప్రకారం నిఖిల్కు అమ్మిన సరుకు – ₹ 7,500
జూలై 3 ఇన్వాయిస్ నెం. 101 ప్రకారం అరువుపైన రుత్విక్కు అమ్మిన సరుకు – ₹ 5,500
జూలై 12 ఇన్వాయిస్ నెం. 370 ప్రకారం జయరాంకు అమ్మిన సరుకు – ₹ 4,000
(వర్తకం డిస్కౌంట్ 10%)
జూలై 18 శరత్కు నగదుపై అమ్మిన సరుకు – ₹ 8,000
జూలై 24 ఇన్వాయిస్ నెం. 220 అరుణకు అమ్మిన సరుకు – ₹ 6,400
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 9

సూచన :

  1. జూలై 12న వర్తకపు డిస్కౌంట్ = 4,000 × \(\frac{10}{100}\) = 400
  2. జూలై 18వ తేదీన నగదు వ్యవహారం జరిగినందున అమ్మకాల చిట్టాలో రాయకూడదు.

ప్రశ్న 10.
క్రింది వ్యవహారాలను అమ్మకాల చిట్టా మరియు అమ్మకాల వాపస్ల చిట్టాలో నమోదు చేయండి.
2018 సెప్టెంబర్
సెప్టెంబర్ 1 సత్యంకు అమ్మిన సరుకు – ₹ 2,500
సెప్టెంబర్ 5 అజయ్క అమ్మిన సరుకు – ₹ 7,200
సెప్టెంబర్ 7 వరుణ్కు అమ్మిన సరుకు – ₹ 2,800
సెప్టెంబర్ 10 సత్యంకు వాపస్ చేసిన సరుకు – ₹ 300
సెప్టెంబర్ 14 అఖిల్కు అమ్మిన సరుకు – ₹ 4000
సెప్టెంబర్ 16 వరుణ్ నుంచి వచ్చిన వాపస్లు – ₹ 200
సెప్టెంబర్ 25 కార్తీకకు నగదుపై అమ్మిన సరుకు – ₹ 3,000
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 10

సూచన :
సెప్టెంబర్ 25వ తేదీన నగదు వ్యవహారం జరిగినందున అమ్మకాల చిట్టాలో రాయకూడదు.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 4 సహాయక చిట్టాల తయారీ

ప్రశ్న 11.
క్రింద ఇచ్చిన సమాచారం నుంచి అమ్మకాల చిట్టా మరియు అమ్మకాల వాపస్ చిట్టా తయారుచేయండి.
2017 మే
మే 1 రాహుల్కు సరుకు అమ్మకాలు – ₹ 6,500
మే 3 మనీషు అమ్మిన సరుకు – ₹ 6,000
మే 8 రాహుల్ చేత సరుకు వాపస్లు – ₹ 700
మే 11 రాజ్కుమార్కు అమ్మిన సరుకు – ₹ 12,000
మే 14 భరతకు అమ్మిన సరుకు – ₹ 11,000
మే 17 రాజ్కుమార్ నుంచి సరుకు వాపస్లు – ₹ 2,000
మే 21 ఆనంద్కు అమ్మిన సరుకు – ₹ 9,000
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 11

ప్రశ్న 12.
క్రింది వ్యవహారాలను సరియైన సహాయక చిట్టాలలో నమోదు చేయండి.
2017 అక్టోబర్
అక్టోబర్ 1 అర్చనకు అమ్మిన సరుకు – ₹ 10,000
అక్టోబర్ 4 దివ్య నుంచి కొనుగోలు చేసిన సరుకు – ₹ 6,000
అక్టోబర్ 8 మనస్వి నుంచి కొన్న సరుకు – ₹ 8,000
అక్టోబర్ 10 అర్చన చేత సరుకు వాపస్లు – ₹ 500
అక్టోబర్ 14 శివానికి అమ్మిన సరుకు – ₹ 3,000
అక్టోబర్ 16 దివ్యకు సరుకు వాపస్లు – ₹ 300
అక్టోబర్ 18 మాధురి నుంచి సరుకు కొనుగోలు – ₹ 4,000
అక్టోబర్ 20 శివాని వాపస్ చేసిన సరుకు – ₹ 200
అక్టోబర్ 21 మనస్వికి పంపిన వాపస్లు – ₹ 400
అక్టోబర్ 25 శరణ్యకు అరువుపై అమ్మిన సరుకు – ₹ 7,000
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 12

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 13

TS Board Inter First Year Accountancy Study Material Chapter 4 సహాయక చిట్టాల తయారీ

ప్రశ్న 13.
ఈ క్రింది వ్యవహారాల నుంచి సరియైన సహాయక చిట్టాలను తయారు చేయండి.
2018 అక్టోబర్
అక్టోబర్ 1 అమర్ నుంచి సరుకు కొనుగోలు – ₹ 2000
అక్టోబర్ 4 పవన్ కు అమ్మిన సరుకు – ₹ 3500
అక్టోబర్ 8 అమర్కు పంపిన వాపస్లు – ₹ 200
అక్టోబర్ 12 సృజనకు అమ్మిన సరుకు – ₹ 8000
(వర్తక డిస్కౌంటు 5%)
అక్టోబర్ 15 పవన్ నుంచి వచ్చిన సరుకు వాపస్ – ₹ 100
అక్టోబర్ 17 రాజు నుంచి యంత్రం కొనుగోలు – ₹ 5000
అక్టోబర్ 19 వైభవ్ నుంచి కొనుగోలు చేసిన సరుకు – ₹ 2,500
అక్టోబర్ 21 సృజన్ నుంచి సరుకు వాపస్ – ₹ 150
అక్టోబర్ 24 రమేషు నగదుపై అమ్మిన సరుకు – ₹ 4,000
అక్టోబర్ 26 వినీత్ నుంచి సరుకు కొనుగోలు – ₹ 8500
అక్టోబర్ 28 వంశీకి అరువుపై అమ్మిన సరుకు – ₹ 6500
అక్టోబర్ 29 వైభవ్కు సరుకు వాపస్లు – ₹ 250
అక్టోబర్ 30 వంశీ చేసిన వాపస్లు – ₹ 500
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 14

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 20

సూచన :

  1. అక్టోబర్ 12వ తేదీన వర్తకపు డిస్కౌంట్ 8,000 × \(\frac{5}{100}\) = 400
  2. అక్టోబర్ 17న ఆస్తి కొనుగోలు చేశారు. అందువల్ల కొనుగోలు చిట్టాలో రాయకూడదు.
  3. అక్టోబర్ 24న నగదుపై సరుకును అమ్మారు. అందువల్ల ఈ వ్యవహారాన్ని అమ్మకాల చిట్టాలో చూపరాదు.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 4 సహాయక చిట్టాల తయారీ

ప్రశ్న 14.
కొనుగోలు చిట్టాని తయారు చేసి, వాటిని సంబంధిత ఆవర్జాలో నమోదు చేయండి.
2019 మార్చి
మార్చి 1 ప్రవీణ్ నుంచి కొనుగోలు చేసిన సరుకు – ₹ 7,500
మార్చి 4 జగన్ నుంచి కొన్న సరుకు – ₹ 6,000
మార్చి 8 రాజు నుంచి కొన్న సరుకు – ₹ 4,000
మార్చి 12 రవి నుంచి కొన్న సరుకు – ₹ 5,500
మార్చి 16 అశీష్ నుంచి ఫర్నీచర్ కొనుగోలు – ₹ 2,000
మార్చి 20 శ్రవణ్ నుంచి కొన్న సరుకు – ₹ 7,000
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 16

సూచన :
మార్చి 16వ తేదీన ఆస్తిని కొనుగోలు చేసారు. అందువల్ల కొనుగోలు చిట్టాలో రాయకూడదు.

ఆవర్జా :

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 17

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 18

TS Board Inter First Year Accountancy Study Material Chapter 4 సహాయక చిట్టాల తయారీ

ప్రశ్న 15.
క్రింది వ్యవహారాలతో అమ్మకాల పుస్తకం తయారుచేసి, వాటిని సంబంధిత ఆవర్జాలో నమోదు చేయండి.
2019 ఏప్రిల్
ఏప్రిల్ 1 దామోదర్కు అమ్మిన సరుకు – ₹ 8,000
ఏప్రిల్ 3 మూర్తికి సరుకు అమ్మకాలు – ₹ 6,300
ఏప్రిల్ 8 బాలాజీకి సరుకు అమ్మకాలు – ₹ 5,000
ఏప్రిల్ 12 గంభీర్కు అమ్మిన సరుకు – ₹ 2,000
ఏప్రిల్ 16 అశోక్కు సరుకు అమ్మకాలు – ₹ 7,000
ఏప్రిల్ 18 కిషోర్కు పాత ఫర్నీచర్ అమ్మకం – ₹ 5,000
ఏప్రిల్ 20 రాజ్కు అమ్మిన సరుకు – ₹ 8,000
(వర్తకం డిస్కౌంటు 10%)
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 19

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 20

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 21

TS Board Inter First Year Accountancy Study Material Chapter 4 సహాయక చిట్టాల తయారీ

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
క్రింది వివరాల నుంచి జనవరి 1, 2018 నాటి ప్రారంభ పద్దును రాయండి.
సంస్థ యొక్క ఆస్తుల మొత్తం 31,00,000 మరియు సంస్థ యొక్క అప్పుల మొత్తం 20,000.
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 22

ప్రశ్న 2.
కార్తీక్ పుస్తకాలలో జనవరి 1, 2019 నాటి ప్రారంభ పద్దును రాయండి.
చేతిలో నగదు – ₹ 4,000
ఫర్నీచర్ – ₹ 15,000
బ్యాంకు ఓవర్ డ్రాఫ్టు – ₹ 6,000
వివిధ ఋణగ్రస్తులు – ₹ 21,000
సరుకు – ₹ 10,000
చెల్లింపు బిల్లులు – ₹ 4,000
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 23

TS Board Inter First Year Accountancy Study Material Chapter 4 సహాయక చిట్టాల తయారీ

ప్రశ్న 3.
క్రింది ఆస్తులు మరియు అప్పుల నుంచి మే 1, 2019 నాటి ప్రారంభ పద్దును నమోదు చేయండి.
యంత్రాలు – ₹ 16,000
బ్యాంకు – ₹ 12,000
వసూలు బిల్లులు – ₹ 14,000
వివిధ ఋణదాతలు – ₹ 10,000
ట్రేడ్ మార్కులు – ₹ 8,000
నగదు – ₹ 10,000
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 24

ప్రశ్న 4.
క్రింది వివరాల నుంచి ఏప్రిల్ 1, 2019 నాటి ప్రారంభ పద్దును నమోదు చేయండి.
భవనాలు – ₹ 24,000
పేటెంట్లు – ₹ 18,000
ఫిక్చర్ మరియు ఫిట్టింగులు – ₹ 6,000
చెల్లింపు బిల్లులు – ₹ 4,000
యంత్రాలు – ₹ 10,000
ఋణదాతలు – ₹ 4,000
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 25

TS Board Inter First Year Accountancy Study Material Chapter 4 సహాయక చిట్టాల తయారీ

ప్రశ్న 5.
క్రింది వాటి నుంచి జనవరి 1, 2019 నాటి ప్రారంభ పద్దును రాయండి.
ఋణగ్రస్తులు – ₹ 18,000
ఫర్నీచరు – ₹ 10,000
బ్యాంకు నిల్వ – ₹ 20,000
పవన్ నుంచి అప్పు – ₹ 10,000
చెల్లింపు బిల్లులు – ₹ 5,000
భూమి మరియు భవనాలు – ₹ 12,000
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 26

ప్రశ్న 6.
క్రింది వాటి నుంచి మార్చి 1, 2019 నాటి ప్రారంభ పద్దును రాయండి.
ఋణగ్రస్తులు – ₹ 16,000
ఋణదాతలు – ₹ 12,000
వసూలు బిల్లులు – ₹ 8,500
ఫర్నీచర్ – ₹ 4,500
బ్యాంకు ఓవర్ డ్రాఫ్టు – ₹ 5,000
వ్యాపార ఆవరణలు – ₹ 30,000
సాధన.
మార్చి 1, 2019 నాటి ప్రారంభ పద్దు

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 27

TS Board Inter First Year Accountancy Study Material Chapter 4 సహాయక చిట్టాల తయారీ

ప్రశ్న 7.
క్రింద తెలిపిన బాలాజి యొక్క ఆవర్జా నిల్వల నుంచి ముగింపు పద్దులను రాయండి.

ప్రారంభ సరుకు – ₹ 60,000
కొనుగోళ్ళు – ₹ 15,000
కొనుగోలు రవాణా – ₹ 1,000
వేతనాలు – ₹ 4,000
సాధన.
బాలాజీ పుస్తకాలలో ముగింపు పద్దు

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 28

ప్రశ్న 8.
సుహాన్ పుస్తకాలలో ఆవర్జా నిల్వల నుంచి ముగింపు పద్దులను నమోదు చేయండి.
జీతాలు – ₹ 5,000
ఇచ్చిన డిస్కౌంటు – ₹ 2,000
అద్దె – ₹ 1,000
వచ్చిన డిస్కౌంటు – ₹ 2,000
వచ్చిన వడ్డీ – ₹ 2,000
సాధన.
సుహాన్ పుస్తకాలలో ముగింపు పద్దులు

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 29

TS Board Inter First Year Accountancy Study Material Chapter 4 సహాయక చిట్టాల తయారీ

ప్రశ్న 9.
31, మార్చి 2019 నాటి క్రింది పద్దులను సవరణ చేయండి.
1. మల్లేశ్కు చెల్లించిన వేతనాలు ₹ 10,000, అతని వ్యక్తిగత ఖాతాకు డెబిట్ చేయడం జరిగింది.
2. అమ్మిన ఫర్నీచర్ ₹ 20,000, పొరపాటున అమ్మకాల ఖాతాకు క్రెడిట్ చేయడం జరిగింది.
సాధన.
31 మార్చి 2019 నాటి సవరణ పద్దులు

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 30

ప్రశ్న 10.
31, మార్చి 2019 నాటి క్రింది పద్దులను సవరణ చేయండి.
1. చెల్లించిన కమీషన్ ₹ 4,000 చెల్లించిన వడ్డీ ఖాతాకు డెబిట్ చేయడం జరిగింది.
2. రెడ్డికి చెల్లించిన అద్దె ₹ 5,000 పొరపాటున వేతనాల ఖాతాకు డెబిట్ చేయడం జరిగింది.
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 31

TS Board Inter First Year Accountancy Study Material Chapter 4 సహాయక చిట్టాల తయారీ

ప్రశ్న 11.
క్రింది వాటికి సర్దుబాటు పద్దులను రాయండి.
1. రావలసిన వడ్డీ ₹ 200.
2. ఫర్నీచర్పై తరుగుదల 5%, ఫర్నీచర్ యొక్క విలువు ₹ 8,000.
సాధన.
సర్దుబాటు పద్దులు

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 32

ప్రశ్న 12.
క్రింది వాటికి సర్దుబాటు పద్దులను రాయండి.
1. ఋణగ్రస్తులపై 10% రానిబాకీల నిధిని ఏర్పాటు చేయండి. ఋణగ్రస్తుల విలువ ₹ 10,000.
2. ముగింపు సరుకు ₹ 30,000.
సాధన.
సర్దుబాటు పద్దులు

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 33

TS Board Inter First Year Accountancy Study Material Chapter 4 సహాయక చిట్టాల తయారీ

Textual Examples:

ప్రశ్న 1.
క్రింద ఇచ్చిన వ్యవహారాల నుండి కొనుగోలు చిట్టా తయారు చేయండి.
2019 జనవరి
జనవరి 1 నిత్య నుంచి కొనుగోలు చేసిన సరుకు – ₹ 6,000
జనవరి 5 అనుహ్య నుంచి కొన్న సరుకు (వర్తకపు డిస్కౌంట్ 200) – ₹ 4,000
జనవరి 10 లతిక నుంచి కొన్న సరుకు (వర్తకపు డిస్కౌంట్ 10%) – ₹ 10,000
జనవరి 15 వర్ష అమ్మిన సరుకు – ₹ 5,000
జనవరి 20 శ్రీనిధి నుంచి నగదు కొన్న సరుకు – ₹ 5,000
సాధన.
కొనుగోలు చిట్టా

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 34

సూచన : తేది జనవరి 20, 2019 నాటి వ్యవహారం నగదు వ్యవహారం కాబట్టి కొనుగోలు చిట్టాలో రాయకూడదు.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 4 సహాయక చిట్టాల తయారీ

ప్రశ్న 2.
క్రింద ఇచ్చిన వ్యవహారాల నుంచి కొనుగోలు చిట్టాను మరియు కొనుగోలు ఖాతాను తయారుచేయండి.
2018 డిసెంబర్
డిసెంబర్ 2 మనోజ్ నుంచి కొన్న సరుకు – ₹ 5,000
డిసెంబర్ 6 అరుణ్ నుంచి కొన్న సరుకు – ₹ 10,000
(వర్తకపు డిస్కౌంట్ 10%)
డిసెంబర్ 7 10 పెట్టెల సరుకును, పెట్టె ఒక్కింటికి 600 చొప్పున దేవరాజు నుంచి కొనుగోలు – ₹ 6,000
డిసెంబర్ 10 రాజేందర్ ఫర్నీచర్స్ నుంచి కొన్న ఆఫీసు టేబుల్ – ₹ 10,000
డిసెంబర్ 20 నగదు కొనుగోళ్ళు – ₹ 5,000
సాధన.
కొనుగోలు చిట్టా

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 35

సూచన :
డిసెంబర్ 10 మరియు డిసెంబర్ 20 నాడు జరిగిన వ్యవహారాలు వరసగా ఆస్తి కొనుగోలు మరియు నగదు సరుకు కొనుగోలు కాబట్టి వీటిని కొనుగోలు పుస్తకంలో రాయకూడదు.

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 36

TS Board Inter First Year Accountancy Study Material Chapter 4 సహాయక చిట్టాల తయారీ

ప్రశ్న 3.
కింది వ్యవహారాల నుంచి కొనుగోలు చిట్టాను తయారుచేసి, ఆవర్జా నమోదు చేయండి.
2019 జనవరి
జనవరి 1 నవీన్ నుంచి సరుకు కొనుగోలు – ₹ 25,000
జనవరి 5 ప్రవీణ్ నుంచి సరుకు కొనుగోలు – ₹ 15,000
జనవరి 6 రాజేశ్ నుంచి కొన్న సరుకు – ₹ 15,000
జనవరి 10 శ్రీను అమ్మిన సరుకు – ₹ 5,000
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 37

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 38

TS Board Inter First Year Accountancy Study Material Chapter 4 సహాయక చిట్టాల తయారీ

ప్రశ్న 4.
కింది వివరాల నుంచి బాలాజీరావు పుస్తకాలలో అమ్మకాల చిట్టాను తయారుచేయండి.
సాధన.
2019 ఫిబ్రవరి
ఫిబ్రవరి 1 రజనీకి అమ్మిన సరుకు – ₹ 10,000
ఫిబ్రవరి 5 మహాలక్ష్మీకి అమ్మిన సరుకు – ₹ 20,000
ఫిబ్రవరి 10 బాలలక్ష్మీకి అమ్మకాలు – ₹ 15,000
ఫిబ్రవరి 15 ధనలక్ష్మీకి అరువుపై అమ్మిన సరుకు – ₹ 5,000
ఫిబ్రవరి 20 వరలక్ష్మీకి అమ్మకాలు (వర్తకపు డిస్కౌంట్ 100) – ₹ 5,000
సాధన.
అమ్మకాల చిట్టా

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 39

ప్రశ్న 5.
క్రింద ఇచ్చిన వ్యవహారాల నుంచి అమ్మకాల చిట్టాను తయారుచేసి అమ్మకాల ఖాతాను చూపండి.
2019 జనవరి
జనవరి 1 మూర్తికి అరువుపై అమ్మిన సరుకు – ₹ 6,000
జనవరి 2 నగదు అమ్మకాలు – ₹ 10,000
జనవరి 10 శ్రావణ్ కు అమ్మిన సరుకు – ₹ 3,000
జనవరి 15 కార్తీకు అమ్మిన పాత ఫర్నీచర్ – ₹ 20,000
జనవరి 20 100 కేసులను కేసు ఒక్కింటికి 50/- చొప్పున నవీన్ కు అమ్మిన సరుకు
జనవరి 25 శ్యామ్కు అమ్మిన సరుకు (వర్తకపు డిస్కౌంట్ 10%) – ₹ 5,000
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 40

సూచనలు :
1. తేది జనవరి 5 నాడు జరిగిన నగదు అమ్మకాలు 10,000 లను అమ్మకాల పుస్తకంలో రాయకూడదు. దీనిని నగదు పుస్తకంలో నమోదు చేయాలి.
2. తేది జనవరి 15 నాడు జరిగిన వ్యవహారం కార్తీకు అమ్మిన పాత ఫర్నీచర్ 20,000 ల రాయకూడదు. దీనిని అసలు చిట్టాలో నమోదు చేయాలి.

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 41

TS Board Inter First Year Accountancy Study Material Chapter 4 సహాయక చిట్టాల తయారీ

ప్రశ్న 6.
క్రింద ఇచ్చిన వ్యవహారాల నుంచి ‘సందీప్ సారీ స్టోర్స్’ వారి అమ్మకాల చిట్టా తయారుచేసి, సంబంధిత ఖాతాలలో నమోదు చేయండి.
2019 ఫిబ్రవరి
ఫిబ్రవరి 1 రాజు & కంపెనీ, కామారెడ్డి వారికి అరువుపై అమ్మిన సరుకు, 20 చీరలు, ఒక్కింటికి ₹ 300/- చొప్పున వర్తకపు డిస్కౌంట్ 10%.
ఫిబ్రవరి 11 రాణి & కంపెనీ, నిజామాబాదు వారికి నగదు అమ్మిన సరుకు, 10 చీరలు, చీర ఒక్కింటికి ₹ 3,000లు చొప్పున
ఫిబ్రవరి 16 మధు & కంపెనీ, కరీంనగర్ వారికి అరువుపై అమ్మిన సరుకు, 10 చీరలు, చీర ఒక్కింటికి ₹ 1,500లు చొప్పున వర్తకపు డిస్కౌంట్ 10%.
ఫిబ్రవరి 28 ప్రసాద్ హార్డ్వేర్ వారికి అరువుపై అమ్మిన 2 పాత కంప్యూటర్లు ₹ 5,000 చొప్పున.
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 42

సూచన : ఫిబ్రవరి 11 మరియు 28వ తేదీ నాడు జరిగిన వ్యవహారాలను అమ్మకాల పుస్తకంలో రాయకూడదు. ఎందుకంటే ఫిబ్రవరి 11 తేదీ నాడు జరిగిన వ్యవహారం నగదు అమ్మకాలు మరియు ఫిబ్రవరి 28 నాడు జరిగిన వ్యవహారం ఆస్తికి సంబంధించిన అమ్మకం.

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 43

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 44

TS Board Inter First Year Accountancy Study Material Chapter 4 సహాయక చిట్టాల తయారీ

ప్రశ్న 7.
కింది వ్యవహారాలను ‘కొనుగోలు వాపసుల చిట్టా’ లో రాసి, కొనుగోలు వాపసుల ఖాతాను తయారుచేయండి.
2019 జనవరి
జనవరి 5 రమేష్ హైదరాబాదుకు పంపిన సరుకు వాపసులు – ₹ 2,000
జనవరి 10 సౌజన్య, బెంగుళూరుకు పంపిన సరుకు వాపసు – ₹ 1,000
జనవరి 15 సురేష్, బొంబాయికి పంపిన సరుకు వాపసులు – ₹ 2,000
జనవరి 20 రఘు, వైజాగ్ వారికి పంపిన సరుకు వాపసులు – ₹ 1,000
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 45

ప్రశ్న 8.
కింది వ్యవహారాల నుంచి ‘కొనుగోలు వాపసుల చిట్టా’ ను తయారుచేసి, ఆవర్జా నమోదు చూపండి.
2019 జనవరి
జనవరి 5 ‘సాయి’ కి పంపిన సరుకు వాపసులు – ₹ 2,500
వర్తకపు డిస్కౌంట్ 10%, డెబిట్ నోటు సంఖ్య 25, ఆవర్జా పుట సంఖ్య – 10
జనవరి 10 ‘సంపత్’ కు పంపిన సరుకు వాపసులు – ₹ 3,000
వర్తకపు డిస్కౌంట్ 10%, డెబిట్ నోటు సంఖ్య 26, ఆవర్జా పుట సంఖ్య – 20
జనవరి 25 ‘సుమన్ ‘కు పంపిన సరుకు వాపసులు – ₹ 4,000
వర్తకపు డిస్కౌంట్ 10%, డెబిట్ నోటు సంఖ్య 27, ఆవర్జా పుట సంఖ్య – 30
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 46

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 47

TS Board Inter First Year Accountancy Study Material Chapter 4 సహాయక చిట్టాల తయారీ

ప్రశ్న 9.
కింది వ్యవహారాలను ‘అమ్మకాల వాపసుల చిట్టా’లో వ్రాసి మరియు అమ్మకాల వాపసులు ఖాతాను తయారుచేయండి.
2019 జనవరి
జనవరి1 ‘శ్యామ్’ నుండి వాపసు వచ్చిన సరుకు – ₹ 2,000
జనవరి 5 ‘మూర్తి’ వాపసు చేసిన సరుకు – ₹ 3,000
జనవరి 10 ‘వాసు’ వాపసు చేసిన సరుకు – ₹ 4,000
జనవరి 15 రవి నుండి వాపసు వచ్చిన సరుకు – ₹ 1,000
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 48

ప్రశ్న 10.
కింది వ్యవహారాల నుంచి అమ్మకాల వాపసుల పుస్తకాన్ని తయారు చేసి, ఆవర్జా నమోదు చేయండి.
2019
జనవరి 1 ‘నాగరాజు’ వాపసు చేసిన సరుకు – ₹ 2,475
జనవరి 5 ‘కృష్ణ’ వాపసు చేసిన సరుకు – ₹ 3,120
జనవరి 15 ‘సత్యం’ వాపసు చేసిన సరుకు – ₹ 675
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 49

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 50

TS Board Inter First Year Accountancy Study Material Chapter 4 సహాయక చిట్టాల తయారీ

ప్రశ్న 11.
కింది వ్యవహారాలను సంబంధిత సహాయక పుస్తకాలలో చూపండి.
2019 జనవరి
జనవరి 1 ప్రణయ్, పాలమూరు నుంచి కొన్న సరుకు – ₹ 9,000
జనవరి 2
సంజన, సత్తుపల్లి వారికి అమ్మిన సరుకు – ₹ 1,000
జనవరి 4 వినోద్, వికారాబాద్ వారికి అమ్మిన సరుకు – ₹ 2,000
జనవరి 10 రవి, రాణిగంజ్ నుంచి కొన్న సరుకు – ₹ 1,500
జనవరి 14 మోహన్, మొహిదీపట్నం నుంచి కొన్న సరుకు – ₹ 3,000
జనవరి 19 సంజన నుంచి వచ్చిన సరుకు వాపసు – ₹ 200
జనవరి 21 ప్రణయ్కు వాపసు పంపిన సరుకు – ₹ 200
జనవరి 25 మోహన్ కు సరుకు వాపసులు – ₹ 500
జనవరి 28 నగేష్, నిజామాబాదుకు అమ్మిన సరుకు, వర్తకపు డిస్కౌంట్ 10% – ₹ 5,000
జనవరి 29 వినోద్ నుంచి వచ్చిన సరుకు వాపసులు – ₹ 300
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 51

TS Board Inter First Year Accountancy Study Material Chapter 4 సహాయక చిట్టాల తయారీ

ప్రశ్న 12.
కింది వివరాల నుంచి అమ్మకాల చిట్టాను, అమ్మకాల వాపసుల చిట్టాను తయారు చేయండి.
2019 మార్చి
మార్చి 1 రమేష్కు అమ్మిన సరుకు – ₹ 6,000
మార్చి 3 మహేష్కు అమ్మిన సరుకు – ₹ 6,000
మార్చి 8 మహేష్ నుంచి సరుకు వాపసు – ₹ 700
మార్చి 11 మూర్తికి అమ్మిన సరుకు – ₹ 12,000
మార్చి 14 సంపత్కు అమ్మిన సరుకు – ₹ 11,000
మార్చి 17 రమేష్ నుంచి వచ్చిన సరుకు వాపసు – ₹ 1,300
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 52

ప్రశ్న 13.
కింది వ్యవహారాల నుంచి సంబంధిత సహాయక పుస్తకాలను తయారు చేయండి.
2019 జనవరి
జనవరి 1 అనూహ్య నుంచి కొన్న సరుకు – ₹ 10,000
జనవరి2 నిత్య నుంచి కొన్న సరుకు – ₹ 4,000
జనవరి 5 అనూహ్యకు పంపిన సరుకు వాపసులు – ₹ 300
జనవరి 8 వర్ష నుంచి కొన్న సరుకు – ₹ 2,000
జనవరి 10 నిత్యకు పంపిన సరుకు వాపసులు – ₹ 500
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 53

TS Board Inter First Year Accountancy Study Material Chapter 4 సహాయక చిట్టాల తయారీ

ప్రశ్న 14.
ఏప్రిల్ 1, 2019 ‘మారుతి’ వ్యాపార ప్రారంభానికి తెచ్చిన ఆస్తులు : నగదు ₹ 5,000, సరుకు ₹ 10,000, ఫర్నీచర్ ₹ 10,000 మరియు భవనాలు ₹ 50,000, ప్రారంభ పద్దు రాయండి.
సాధన.
మారుతి పుస్తకాలలో చిట్టా

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 54

ప్రశ్న 15.
తేది 31-12-2018 నాడు సుప్రీత్ వ్యాపార పుస్తకాలలో క్రింద ఆవర్జా నిల్వలు ఉన్నాయి.
చేతిలో నగదు – ₹ 10,000
బ్యాంకులో నగదు – ₹ 14,000
సరుకు నిల్వ – ₹ 16,000
ప్లాంటు – ₹ 10,000
ఋణదాతలు – ₹ 10,000
తేది జనవరి 1, 2019 న సుప్రీత్ వ్యాపార పుస్తకాలలో పై నిల్వలను నమోదు చేయండి..
సాధన.
సుప్రీత్ పుస్తకాలలో అసలు చిట్టా

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 55

TS Board Inter First Year Accountancy Study Material Chapter 4 సహాయక చిట్టాల తయారీ

ప్రశ్న 16.
‘రాజేశ్వర రావు’ ఆస్తి అప్పుల పట్టీ నుండి తేది జనవరి 1, 2019 నాటి ప్రారంభ పద్దు రాయండి. తేది 1.1.2019 నాటి ‘రాజేశ్వరరావు’ ఆస్తి అప్పుల పట్టీ

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 56

సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 57

ప్రశ్న 17.
రాజేందర్ పుస్తకాలలో కింది తెలిపిన నిల్వలతో ముగింపు పద్దు రాయండి.
కొనుగోలు – ₹ 14,000
అమ్మకాలు – ₹ 46,000
కొనుగోలు వాపసులు – ₹ 2,000
అమ్మకాల వాపసులు – ₹ 1,000
ప్రారంభపు సరుకు – ₹ 10,000
వేతనాలు – ₹ 3,000
జీతాలు – ₹ 5,000
వచ్చిన అద్దె – ₹ 4,000
కమీషన్ – ₹ 1,500
ఇచ్చిన డిస్కౌంట్ – ₹ 800
వచ్చిన డిస్కౌంట్ – ₹ 1,200
కొనుగోలు రవాణా – ₹ 1,000
ముగింపు సరుకు – ₹ 12,000
ఆఫీసు ఖర్చులు – ₹ 2,500
సాధన.
రాజేందర్ పుస్తకాలలో అసలు చిట్టా.

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 58

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 59

TS Board Inter First Year Accountancy Study Material Chapter 4 సహాయక చిట్టాల తయారీ

ప్రశ్న 18.
తేది 31.12.2018 నాడు యంత్రాల విలువ 31,00,000. తరుగుదలను 10% యంత్రాలపై ఏర్పాటు చేయడానికి చిట్టాపద్దు రాయండి.
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 60

ప్రశ్న 19.
క్రింది తప్పులను సవరించడానికి చిట్టాపద్దులు రాయండి.
1. కొత్త ఫర్నీచర్ కోసం చెల్లించిన 500 లను, ఆఫీసు ఖర్చుల ఖాతాకు రాసారు.
2. రాజుకు చెల్లించిన జీతం500 లను అతని వ్యక్తిగత ఖాతాకు రాసారు.
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 61

TS Board Inter First Year Accountancy Study Material Chapter 4 సహాయక చిట్టాల తయారీ

ప్రశ్న 20.
1. వ్యాపారంలో సంవత్సరానికి వచ్చిన నికర లాభం ₹ 10,000 లను సాధారణ రిజర్వుకు మళ్ళించడానికి నిర్ణయించడమైనది.
2. యజమాని తన సొంతానికి వాడుకొన్న సరుకు
పై వ్యవహారాలకు చిట్టాపద్దులు రాయండి.
సాధన.
అసలు చిట్టా:

TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ 62

TS Inter 1st Year Economics Study Material Chapter 10 అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు

Telangana TSBIE TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు Textbook Questions and Answers.

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఏక పరిమాణ చిత్రపటాలను తగిన ఉదాహరణలతో వివరించండి.
జవాబు.
బార్ పొడవును మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు, వెడల్పు లెక్కించరు. అందువల్ల వీటిని “ఏకపరిమాణ చిత్రం” అంటారు. ఈ ఏకపరిమాణ చిత్రాలు ముఖ్యంగా నాలుగు రకాలు.

  1. సాధారణ బార్పటాలు
  2. ఉప విభాజిత బార్పటాలు
  3. బహుళ బారటాలు
  4. శాతపు బార్పటాలు

1. సాధారణ బార్పటం :
దీనిని ఒక చలనరాశిలో మార్పు చూపడానికి ఉపయోగిస్తారు.
ఉదా :

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 1

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 2

TS Board Inter First Year Economics Study Material Chapter 10 అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు

2. ఉపవిభాజిత బారటం :
దీనిలో మొత్తం దత్తాంశంలోని భాగాలు బార్ లో చూపించవచ్చు.
ఉదా :

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 3

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 4

3. బహుళబార్ పటం :
అంతర సంబంధమున్న దత్తాంశం ఒకే పటంలో చూపడానికి బహుళబార్ ఉపయోగిస్తారు.
ఉదా :

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 4

4. శాతపు బార్ పటం :
దత్తాంశంలోని మార్పులు సులభంగా గమనించడానికి శాతపు బార్ ఉపయోగిస్తారు. బార్ పొడవు నూరు యూనిట్లుగా విభాగం పొందుతుంది.
ఉదా :

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 6

TS Board Inter First Year Economics Study Material Chapter 10 అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు

ప్రశ్న 2.
ఈ క్రింది దత్తాంశానికి అంక మధ్యమం కనుగొనండి.

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 7

సాధన.
పై దత్తాంశం విలీన శ్రేణులకు చెందింది. దీని మినహాయింపు శ్రేణులలోనికి మార్చి వ్రాయగా అనగా తరగతిలో దిగువ అవధిలో 0.5 తీసివేయాలి, ఎగువ అవధికి 0.5 కలపాలి. అలా చేయటం ద్వారా విలీన శ్రేణులను మినహాయింపు శ్రేణులుగా మార్చవచ్చు. పై దత్తాంశాన్ని అలా మార్చి వ్రాయగా

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 8

\(\overline{\mathrm{X}}=\mathrm{A}+\frac{\sum \mathrm{fd}^{\prime}}{\mathrm{N}} \times \mathrm{i}\)
ఇక్కడ A = ఊహించిన అంకమధ్యమం = 54.5
Σfd’ = – 37.4
N = పౌనఃపున్యాల మొత్తం = 200
i = తరగతి అంతరం = 10
విలువలను పై సూత్రంలో ప్రతిక్షేపించగా
\(\bar{x}=54.5+\left(\frac{-374}{200}\right) \times 10\)
= 54.5 + (- 1.87) × 10
= 54.5 + (- 18.7)
\(\bar{x}\) = 35.8.

TS Board Inter First Year Economics Study Material Chapter 10 అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు

ప్రశ్న 3.
దిగువ పేర్కొన్న దత్తాంశానికి మధ్యగతాన్ని కనుగొనండి.

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 9

సాధన.

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 10

మధ్యగతం = L1 + \(\left(\frac{\frac{\mathrm{N}}{2}-\mathrm{CF}}{\mathrm{f}}\right)\) × i
మధ్యగత స్థానం = \(\frac{N}{2}\) వ అంశం
= \(\frac{100}{2}\) వ అంశం = 50 వ అంశం
L1 = మధ్యగత తరగతి దిగువ అవధి
\(\frac{N}{2}\) = మధ్యగత అంశం = 50
CF = మధ్యగతమైన తరగతికి ముందున్న తరగతి సంచిత పౌనఃపున్యం = 40
f = మధ్యగతమైన తరగతికి సాధారణ పౌనఃపున్యం = 30
i = తరగతి అంతరం = 10
విలువలను పై సూత్రంలో ప్రతిక్షేపించగా = 30 + \(\left(\frac{50-40}{30}\right)\) × 10
= 30 + \(\left(\frac{10}{30}\right)\) × 10
= 30 + (0.33) × 10
= 30 + 3.33 = 33.33
∴ మధ్యగతం = 33.3.

ప్రశ్న 4.
ఈ క్రింది దత్తాంశానికి బహుళకాన్ని కనుగొనండి.

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 11

సాధన.

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 12

TS Board Inter First Year Economics Study Material Chapter 10 అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు

(2)* = ప్రతి రెండు అడ్డు వరుసలలో గల పౌనఃపున్యాల సంకలనం.
(3)* = మొదటి అడ్డు వరుసలో గల పౌనఃపున్యాన్ని వదిలి, ప్రతి రెండు అడ్డు వరుసల పౌనఃపున్యాల సంకలనం.
(4)* = ప్రతి మూడు అడ్డు వరుసలలో గల పౌనఃపున్యాల సంకలనం.
(5)* = మొదటి అడ్డు వరుసలో గల పౌనఃపున్యాన్ని వదలి ప్రతి మూడు అడ్డు వరుసలతో పౌనఃపున్యాల సంకలనం.
(6)* = మొదటి రెండు అడ్డు వరుసలను వదిలి ప్రతి మూడు పౌనఃపున్యాల సంకలనం.

ఈ కింద ఉన్న విశ్లేషణ పట్టికకు వర్గీకృత పట్టిక ఆధారంగా చేయటమైనది.

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 13

విశ్లేషణ పట్టికను పరిశీలించినప్పుడు 6000 అనే అంశం అధిక పర్యాయాలు అంటే 6 పర్యాయాలు వచ్చింది.
కాబట్టి బాహుళకం Z = 6000.

ప్రశ్న 5.
క్రింది దత్తాంశానికి ‘పై’ (Pie) చిత్రము గీయండి.

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 14

సాధన.

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 15

Area changed into Degree వరి = \(\frac{16 \times 360}{63}\) = 90°
గోధుమ = \(\frac{24 \times 360}{63}\) = 137°
రాగి = \(\frac{10 \times 360}{63}\) = 57°
జొన్నలు = \(\frac{8 \times 360}{63}\) = 46°
చిరుధాన్యాలు = \(\frac{5 \times 360}{63}\) = 29°
∴ మొత్తం = 360°.

TS Board Inter First Year Economics Study Material Chapter 10 అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
గణాంక శాస్త్రం అంటే ఏమిటి ? అర్థశాస్త్రంతో దానిక గల సంబంధాన్ని వివరించండి.
జవాబు.
గణాంక శాస్త్రానికి అనేక శాస్త్రాలతో సన్నిహిత సంబంధముంది. 19వ శతాబ్దం నుంచి గణాంక శాస్త్రం, అర్థశాస్త్రం చాలా సాన్నిహిత్యం పెంపొందించుకున్నాయి. అర్థశాస్త్ర విశ్లేషణ అధ్యయనంలో, సిద్ధాంత నిర్మాణంలో సాంప్రదాయ ఆర్థికవేత్తలు నిగమన పద్ధతిని ఉపయోగించేవారు.

అయితే కాలక్రమేణా ఆర్థిక విషయాల పరిశీలనకు, అర్థశాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి గణాంకశాస్త్ర పరిజ్ఞానం అవసరమని J.S.

మిల్, జీవాన్స్, కీన్స్ లాంటి ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. అర్థశాస్త్ర సిద్ధాంతాలను యదార్థ జీవితానికి అన్వయించడానికి, న్యాయబద్ధతను నిర్ణయించడానికి ‘ఆగమన పద్ధతి’ ని ప్రవేశపెట్టడంతో గణాంక, అర్థశాస్త్రాలు సన్నిహితమవడం ప్రారంభమైంది. ‘జీవాన్స్’ సంఖ్యా దత్తాంశాన్ని ఉపయోగించి ‘కాలశ్రేణుల విశ్లేషణ’, సూచీ సంఖ్యల అధ్యయనం చేశారు.

1704లో గ్రెగొరికింగ్ వస్తు సప్లయ్కి, వస్తువు ధరకు ఉన్న సంబంధాన్ని గణాంకాల రూపంలో నిరూపించడానికి ప్రయత్నం చేశాడు. బౌలే, పియర్సన్, W.I. కింగ్, ఫిషర్ మొదలైన గణాంకవేత్తలు తమ సేవలతో గణాంకశాస్త్రాన్ని, అర్థ శాస్త్రానికి మరింత చేరువ చేశారు.

అర్థశాస్త్ర విశ్లేషణ అంతా గణాంక దత్తాంశంపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. పేదరికం, నిరుద్యోగం, ధరల పెరుగుదల మొదలైన ఆర్థిక సమస్యల స్వభావం, స్వరూపం, గణాంక వివరాలు లేకుండా తెలుసుకోవడం సాధ్యం కాదు. ఆర్థిక సమస్యలన్నీ గణాంక పద్ధతుల ద్వారా పరిశీలించడం జరుగుతుంది.

ఆర్థిక విశ్లేషణలో సాంఖ్యక వివరాలు, పద్ధతులు చాలా శక్తివంతమైన పరికరాలు, గణాంక శాస్త్రం అర్థశాస్త్రానికి ముఖ్యంగా ‘మూడు’ విధాలుగా ఉపయోగపడుతుంది.

  1. ఆర్థిక సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకోవడానికి.
  2. ఆర్థిక సిద్ధాంతాలకు సాంఖ్యారూపమేర్పరచటం, ఆర్థిక సిద్ధాంతాల ఉపకల్పనలను (Hypothesis) పరీక్ష చేయడం.
  3. ఆర్థిక సిద్ధాంతాల భవిష్యత్ అంచనాలను పరీక్షించడం.
    ఉదా : కీన్స్ ప్రతిపాదించిన వినియోగ ప్రవృత్తి సిద్ధాంతాన్ని కూజెనట్స్ దత్తాంశాన్ని సేకరించి సంఖ్యారూప మేర్పరిస్తే దాని ఆధారంగా వినియోగ ప్రవృత్తి సిద్ధాంతాన్ని మార్పుచేసి డ్యూసెన్బెర్రీ, ఫ్రీడ్మన్ కొత్త రీతులలో ప్రతిపాదించారు.

TS Board Inter First Year Economics Study Material Chapter 10 అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు

ప్రశ్న 2.
తగిన ఉదాహరణలతో సాధారణ, ఉప విభాజిత చిత్రపటాలను వివరించండి.
జవాబు.
1. సాధారణ (సామాన్య) బార్పటం : దీనిని ఒక చలనరాశిలో మార్పు చూపడానికి ఉపయోగిస్తారు.
ఉదా :

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 16

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 17

2. ఉపవిభాజిత బార్పటం : దీనిలో మొత్తం దత్తాంశంలోని భాగాలు బార్ లో చూపించవచ్చు.
ఉదా :

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 18

TS Board Inter First Year Economics Study Material Chapter 10 అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు

ప్రశ్న 3.
క్రింది దత్తాంశానికి అంక మధ్యమాన్ని కనుగొనండి.

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 19

జవాబు.

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 20

\(\overline{\mathrm{X}}=\mathrm{A}+\frac{\Sigma \mathrm{fd}}{\mathrm{N}}\)
ఇక్కడ \(\overline{\mathrm{X}}\) = అంక మధ్యమం
A = ఊహించిన అంక మధ్యమం = 1200
Σfd = ఊహించిన అంక మధ్యమం నుంచి తీసుకొన్న విచలనాలను (d) వాటి అనురూప పౌనఃపున్యాలతో (f) తో గుణించగా వచ్చిన లబ్దాల సంకలనం = 600
N = పౌనఃపున్యాల మొత్తం = 100
విలువలను పై సూత్రంలో ప్రతిక్షేపించగా
= 1200 + \(\frac{(-600)}{100}\)
= 1200 + (- 6) = 1194
∴ \(\overline{\mathrm{X}}\) = 1194.

ప్రశ్న 4.
క్రింది దత్తాంశానికి మధ్యగతాన్ని కనుగొనండి.

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 21

జవాబు.

xfcf (సంచిత పౌనఃపున్యం)
1055
20813
301225
402045
503075
601691
7010101
807108
908116
N = 116

 

మధ్యగత స్థానం = \(\frac{\mathrm{N}+1}{2}\)వ అంశం
ఇక్కడ N = పౌనఃపున్యాల మొత్తం = 116 = \(\frac{116+1}{2}\)వ అంశం
= \(\frac{117}{2}\) = 58.5
58.5 అంశం సంచిత పౌనఃపున్యం 75 లో ఉంది. అందువల్ల దాని అనురూప ‘x’ విలువ 50 మధ్యగతం అవుతుంది.
మధ్యగతం = 50.

TS Board Inter First Year Economics Study Material Chapter 10 అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు

ప్రశ్న 5.
ఈ క్రింది దత్తాంశానికి బహుళకము లెక్కించండి.

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 22

సాధన.

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 23

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 24

∴ Z = 16.

TS Board Inter First Year Economics Study Material Chapter 10 అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు

ప్రశ్న 6.
అంక మధ్యమం అంటే ఏమిటి ? దాని ప్రయోజనాలు, పరిమితులు తెల్పండి.
జవాబు.
అంక మధ్యమం అంటే అంశాల మొత్తం విలువలను, మొత్తం అంశాల సంఖ్యచే భాగించగా వచ్చేదే అంక మధ్యమం. ప్రయోజనాలు :

  1. అంక మధ్యమాన్ని గణించడం అర్థం చేసుకోవడం చాలా సులభం.
  2. దీని గణనలో ప్రతి అంశం పరిగణింపబడుటవలన ప్రతి అంశంచే ఇది ప్రభావితమౌతుంది.
  3. దీని గణితాత్మక సమీకరణం దృఢంగా ఉండడంచేత ఏ పద్ధతులలో అంక మధ్యమాన్ని గణన చేసినప్పటికి ఒకే రకమైన సమాధానాన్ని పొందగలం.
  4. తదుపరి బీజీయ గణనకు ఇది ఉపకరించును.
  5. వివిధ అంశాలను పోల్చుటలో దీనిని విరివిగా ఉపయోగిస్తారు.

పరిమితులు :

  1. గ్రాఫ్లో దీని విలువను గుర్తించలేం.
  2. ఒక అంశంలో వచ్చిన ఒక చిన్న మార్పు ఫలితాలలో పెద్ద మార్పును తెస్తుంది. ఉదా : 3, 6, 9ల అంక మధ్యమం విలువ 6. కాని దీనికి 82 అనే అంశాన్ని చేర్చినపుడు అంక మధ్యమం 3 + 6 + 9 + 82 / 4 = 100/4 = 25. మొదటి మూడు అంశాల విలువతో పోల్చినపుడు నాల్గవ అంశం చేరికవల్ల విలువలో ఎక్కువ మార్పు ఏర్పడుటను గమనించవచ్చు.
  3. అంకమధ్యమం, శ్రేణులలో గల చిన్న అంశాలకన్న పెద్ద అంశాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంది.
  4. ఇది మధ్యగతం మరియు బాహుళకం వలే తనిఖీ లేదా పరిశీలన ద్వారా గుర్తించబడదు.
  5. ఇది కొన్ని సందర్భాలలో అసంబద్ధమైన ఫలితాలను ఇస్తుంది. ఉదా : ఒక కుటుంబంలో సభ్యుల సగటు ఎంత అన్నపుడు లెక్కించిన అంక మధ్యమం విలువ 4.3 అయితే ఆ విలువ అసంబద్ధంగా ఉంటుంది. ఎందుకంటే కుటుంబ సభ్యుల సంఖ్య భిన్నాలలో ఉండదు.

ప్రశ్న 7.
మధ్యగతం అంటే ఏమిటి ? దాని ప్రయోజనాలు, పరిమితులు తెల్పండి.
జవాబు.
ఒక విభాజనాన్ని ఏ విలువైతే రెండు సమభాగాలుగా విభజిస్తుందో, అంటే ఏ విలువకు అటు, ఇటు విభాగాన్ని పొందిన అంశాల సంఖ్య సమానంగా ఉంటుందో ఆ విలువను ‘మధ్యగతం’ అంటారు. దీనినే ‘స్థాన మాన సగటు’ (Positional averge) అని కూడా అంటారు.

మధ్యగతాన్ని లెక్కించడానికి దిగువ పేర్కొన్న పద్ధతిని ఉపయోగిస్తారు.

  1. 1) ఇచ్చిన దత్తాంశాన్ని ఆరోహణ లేదా ఆవరోహణ క్రమంలో రాసుకోవాలి.
  2. 2) వరుస క్రమంలో మధ్యస్థ విలువ లేదా సంఖ్యే మధ్యగతం, ఇవ్వబడిన అంశాల సంఖ్య N బేసి (odd) లేదా సంఖ్య అయినట్లయితే, \(\left(\frac{\mathrm{n}+1}{2}\right)^{\text {th }}\) వ అంశం మధ్యగతం అవుతుంది.
    ఇలాంటి స్థితిలో మధ్యగతం ఒకే ఒక విలువను కలిగి ఉంటుంది. ఇందుకు భిన్నంగా, అంశాల సంఖ్య సరి (even) సంఖ్య అయితే, వరుస క్రమంలో ఉన్న రెండు సంఖ్యల మధ్యస్థ విలువను మధ్యగతం విలువగా పరిగణిస్తారు. కాబట్టి ఈ పరిస్థితిలో మధ్యగతం లెక్కించడానికి \(\left(\frac{\mathrm{n}}{2}\right)^{\text {th }},\left(\frac{\mathrm{n}}{2}+1\right)^{\mathrm{th}}\)వ అంశాలను పరిగణించాలి.

ప్రయోజనాలు :

  1. మధ్యగతం దృఢంగా నిర్వచింపబడుతుంది.
  2. ఒక శ్రేణిలో గల అంశాలలో ఒక అంశం విలువ ఇతర అంశాల విలువలకు భిన్నంగా అత్యధికంగా ఉన్నప్పటికినీ మధ్యగతం విపరీత అంశాల విలువలచే ప్రభావం కాదు.
  3. మధ్యగతాన్ని రేఖాచిత్రం ద్వారా కూడా గణన చేయడానికి వీలు కలుగుతుంది.
  4. మధ్యగతాన్ని అర్థం చేసుకోవడం, గణించడం చాలా సులభం

పరిమితులు :

  1. మధ్యగతం – స్థానపు సగటు కాబట్టి, దాని గణన శ్రేణిలోని ప్రతి అంశం యొక్క విలువపైన ఆధారపడి ఉండదు. కాబట్టి మధ్యగతం విలువ శ్రేణిలో గల అంశాలకు ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పలేం.
  2. మధ్యగతం తదుపరి బీజగణిత విశ్లేషణకు ఉపయోగపడదు.
  3. అవిచ్ఛిన్న శ్రేణులలో దీనిని అంతర్వేశనం (Interpolated) చేయాల్సి ఉంటుంది.
  4. సరిసంఖ్య గల అంశాలు శ్రేణిలో ఉన్నప్పుడు, రెండు మధ్య విలువల అంక మధ్యమమే మధ్యగతం అవుతుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 10 అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు

ప్రశ్న 8.
బహుళకం అంటే ఏమిటి ? దాని ప్రయోజనాలు, లోపాలేవి ?
జవాబు.
ఒక విభాజనంలో ఒక అంశం విలువ తరచూ ఎక్కువ పర్యాయాలు కనిపించడాన్ని బహుళకం తెలుపుతుంది. శ్రేణులలో ఉన్న అంశాలలో ఏ విలువ అతి తరచుగా వస్తుందో ఆ విలువను, ఇంకా ఏ విలువ చుట్టూ అత్యధికంగా ఇతర విలువల పంపిణీ జరుగుతుందో ఆ విలువను ‘బహుళకంగా’ నిర్వచించవచ్చు.

ప్రయోజనాలు :

  1. బహుళకం శ్రేణులలో అధిక పర్యాయాలు కనిపించే విలువ. మధ్యగతం మాదిరి దీని విలువ విడిగా (isalated) ఉండదు, శ్రేణిలోలేని అంశాల విలువను తెలిపే అంకమధ్యమంలాగా ఉండదు.
  2. విపరీత అంశాల ప్రభావం దీనిపై ఉండదు. అందువల్ల ఇది శ్రేణిలోని అంశాలకు ప్రాతినిధ్యం వహించును.
  3. రేఖా చిత్రం ద్వారా కూడా బహుళకాన్ని లెక్కించవచ్చు.
  4. విస్తృత అవధులు ఉన్న తరగతులలో కూడా బహుళకాన్ని లెక్కించవచ్చు.
  5. దత్తాంశంలోని గుణాత్మక విలువలను వర్గీకరించవలసినపుడు ఈ పద్ధతి ఉపయుక్తంగా ఉంటుంది.
  6. బహుళకాన్ని అర్థం చేసుకోవడం, గణించడం సులభం.
  7. ఇది నిత్య జీవితంలో తరచుగా ఉపయోగించే సగటు. ఉదాహరణకు తరగతి మార్కుల సగటు, ఒక విభాగంలో విద్యార్థుల సంఖ్యను కనుగొనుట మొదలైనవి.

లోపాలు :

  1. ద్విబహుళకం, బహుళ బహుళకం శ్రేణులలో బహుళకాన్ని లెక్కించడం చాలా కష్టం.
  2. కేంద్రీకృత విలువలపై మాత్రమే బహుళకం ఆధారపడుతుంది. బహుళకం విలువ కంటే అధిక విలువలు కలిగిన ఇతర అంశాలు ఉన్నా అవి పరిగణింపబడవు. అవిచ్ఛిన్న శ్రేణులలో కేవలం తరగతి అంతరాల అవధులు మాత్రమే పరిగణింపబడతాయి.
  3. బహుళకం ప్రతిచయన మార్పులకు ఎక్కువగా గురవుతుంది.
  4. బహుళకాన్ని వివిధ పద్ధతులలో లెక్కించినపుడు అంకమధ్యమం వలె ఒకే విలువ రాదు. గణనకు అనేక సూత్రాలు ఉన్నాయి. ఏది ఉపయోగించాలి అని సందేహం తలెత్తుతుంది.
  5. ఇది బీజీయ ప్రస్తావనకు పనికి రాదు. అంకమధ్యమం వలె ఉమ్మడి బహుళక గణన సాధ్యం కాదు.
  6. శ్రేణిలోని అంశాల సంఖ్య అత్యధికంగా ఉన్నప్పుడే బహుళకం ఆ శ్రేణిలోని విలువలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.

ప్రశ్న 9.
ఆదర్శ లేదా మంచి సగటుకు ఉండవలసిన లక్షణాలను తెల్పండి ?
జవాబు.
ఆదర్శ లేదా మంచి సగటుకు ఉండవలసిన లక్షణాలు :

  1. మంచి సగటు నిర్దిష్టంగా నిర్వచింపబడి ఉండాలి అంటే ఎవ్వరు తెలిపినా ఒకే అర్థం కలిగి ఉండాలి.
  2. దత్తాంశంలోని మొత్తం అంశాలకు ప్రాతినిధ్యం వహించాలి.
  3. బీజగణిత విశ్లేషణకు అనువుగా ఉండాలి.
  4. దత్తాంశంలోని ఒకే ఒక అంశం లేదా కొన్ని అంశాలవల్ల ప్రభావితం కాకూడదు. అధిక విలువలు కలిగిన అంశాలు సగటును ప్రభావితం చేస్తే, ఆ సగటు శ్రేణిలో గల అన్ని అంశాలకు ప్రాతినిధ్యం వహించదు.
  5.  మంచి సగటు లెక్కించడానికి సులభంగా ఉండి, సామాన్య మానవునికి కూడా సులభంగా అర్థమయ్యేట్లు ఉండాలి. దాని గణనకు క్లిష్టమైన గణిత ప్రక్రియలు అధిక మొత్తంలో ఉంటే అది సులభంగా అర్థం కాదు. అందువల్ల దాని ఉపయోగిత పరిమితంగా ఉంటుంది.
  6. ప్రతిచయన స్థిరత్వం కలిగి ఉండాలి. అంటే ప్రతిచయన మార్పులకు సగటు ప్రభావితం కాకూడదు. ఒకే జనాభా నుంచి తీసుకున్న వేరు వేరు ప్రతి చయనాల సగటులలో పెద్దగా తేడా లేకుండా పరస్పరం దగ్గరగా ఉండాలి.

TS Board Inter First Year Economics Study Material Chapter 10 అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
అర్థశాస్త్ర అధ్యయనంలో గణాంక శాస్త్ర ప్రాధాన్యతను తెలపండి ?
జవాబు.
ఆర్థిక విశ్లేషణలో గణాంక వివరాలు, గణాంక పద్ధతులు చాలా శక్తివంతమైన పరికరాలు. గణాంకశాస్త్రం, అర్థశాస్త్రానికి ముఖ్యంగా మూడు రకాలుగా ఉపయోగపడుతుంది.

  • ఆర్థిక సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకోవడానికి.
  • సిద్ధాందంతాలకు సంఖ్యా రూపం ఏర్పరచడం.
  • ఆర్థిక సిద్ధాంతాలకు పరికల్పనలను పరీక్ష చేయడం.
  • ఆర్థిక సిద్ధాంతాల భవిష్యత్ అంచనాలు పరీక్షించడం.

ప్రశ్న 2.
చిత్రపటాల ఉపయోగాలు ఏమిటి ?
జవాబు.
గణాంక ఫలితాలను నమ్మకంగా, ఆకర్షణీయంగా సమర్పించడానికి చిత్రపటాలు ఉపయోగపడతాయి. చిత్రపటాలను సక్రమంగా నిర్మించినట్లయితే అవి దత్తాంశ ఫలితాలను స్పష్టంగా చూపిస్తాయి. చిత్రపటాల ఉపయోగాలను క్రింది విధంగా వివరించవచ్చు.

  1. ఆకర్షణీయంగా, ఆసక్తిదాయకంగా ఉంటాయి.
  2. ప్రత్యేక గణితశాస్త్ర పరిజ్ఞానం అవసరం లేదు.
  3. దత్తాంశ సమర్పణ తేలిక.
  4. పోల్చడం తేలిక.
  5. జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి.

ప్రశ్న 3.
“పై” (Pie) చిత్రం అంటే ఏమిటి ?
జవాబు.
‘పై’ చిత్రాన్ని వృత్తాలు అంటారు. దత్తాంశంలోని వివిధ అంశాలను లేదా భాగాలను చూపడానికి మరియు సరిపోల్చడానికి ఉపయోగించే వలయాలను వృత్తాలు అంటారు. ఇది ద్విపరిమాణ చిత్ర పటంలోనిది.

TS Board Inter First Year Economics Study Material Chapter 10 అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు

ప్రశ్న 4.
ఉప విభాజిత పటాల ఉపయోగాలు ఏమిటి ?
జవాబు.
దత్తాంశంలోని వివిధ భాగాలను ఒకే బార్లో చూపించడానికి ఈ విధమైన బార్ పటాలను గీస్తారు. ఈ పటాన్ని ‘అంశాల బార్ పటం’ (component bar diagram) అని కూడా అంటారు. ఈ పటాలు దత్తాంశపు మొత్తం వివరాలను వివిధ భాగాలుగా విభజించి గీయబడతాయి. వివిధ భాగాలను వేరుగా చూపడానికి వివిధ రంగులను ఉపయోగిస్తారు.

ప్రశ్న 5.
క్రింది విలువలకు మధ్యగతం కనుగొనండి 5, 7, 7, 8, 9, 10, 12, 15, 21
సాధన.
ఇచ్చిన దత్తాంశాన్ని ఆరోహణ క్రమంలో వ్రాయగా

క్రమసంఖ్యx
15
27
37
48
59
610
712
815
921

మధ్యగతం = \(\frac{\mathrm{N}+1}{2}\)వ అంశం
ఇక్కడ N = అంశాల సంఖ్య = 9
మధ్యగతం = \(\frac{9+1}{2}\)వ అంశం
= \(\frac{10}{2}\)వ అంశం = 5వ అంశం
5వ అంశానికి అనురూపంగా ఉన్న విలువ = 9
∴ మధ్యగతం = 9

ప్రశ్న 6.
బహుళకం భావన గురించి తెలపండి.
జవాబు.
ఆంగ్లభాషలో బహుళకాన్ని Mode అంటారు. మోడ్ అనే మాట ల-మోడ్ అనే ప్ర గ్రహించబడింది. దీని అర్థం ఫ్యాషన్ బీజక్. బహుళకాన్ని శ్రేణులలో ఉన్న అంశాలలో ఏ విలువ అతి తరచుగా వస్తుందో ఆ విలువ ఇంకా ఏ విలువ చుట్టూ అత్యధికంగా ఇతర విలువల పంపిణీ జరుగుతుందో ఆ విలువలను ‘బహుళకం’ అంటారు.

TS Board Inter First Year Economics Study Material Chapter 10 అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు

ప్రశ్న 7.
హరమధ్యమం యొక్క ఉపయోగాలు తెలపండి.
జవాబు.
కాలం, దూరం, రేట్లు మొదలైన సమస్యలకు పరిష్కారానికి హరమాధ్యమాన్ని ఉపయోగిస్తారు.

ప్రశ్న 8.
గుణమధ్యమం భావన గురించి తెలపండి.
జవాబు.
గుణ మధ్యమం ఒక ప్రత్యేక రకమైన సగటు. శ్రేణిలో రెండు అంశాలు ఇచ్చినట్లయితే రెండు అంశాల లబ్దానికి వర్గమూలం (Square root) మూడు అంశాలు ఇచ్చినట్లయితే మూడు అంశాల లబ్దానికి ఘనమూలం (Cube root) ‘n’ అంశాలు ఇచ్చినట్లయితే Nవ మూలాన్ని (A/ ) లెక్కిస్తాం. “శ్రేణులలోని N అంశాల లబ్దానికి Nవ మూలాన్ని గుణమధ్యమం” అంటారు.
ఉదా : 2, 8ల గుణమధ్యమం రెండు అంశాల లబ్దానికి వర్గమూలం అంటే √2.8 = 4
ఉదా : 2, 3, 6ల గుణమధ్యమం మూడు అంశాల లబ్దానికి ఘనమూలం, అంటే = \(\sqrt[3]{2.3 .6}\)
లేదా (2.3.6)1/3 = 3.3.
G.M. = \(\sqrt[n]{X_1, X_2, X_3 \ldots \ldots X_n}\)
G.M. = గుణ మధ్యమం
n = అంశాల సంఖ్య
X = అంశాల విలువలు.

ప్రశ్న 9.
మధ్యగతం యొక్క ప్రయోజనాలను తెలపండి.
జవాబు.

  1. మధ్యగతం దృఢంగా నిర్వచింపబడుతుంది.
  2. ఒక శ్రేణిలో గల అంశాలలో ఒక అంశం విలువ ఇతర అంశాల విలువలకు భిన్నంగా అత్యధికంగా ఉన్నప్పటికినీ మధ్యగతం విపరీత అంశాల విలువలచే ప్రభావం కాదు.
  3. మధ్యగతాన్ని రేఖాచిత్రం ద్వారా కూడా గణన చేయడానికి వీలు కలుగుతుంది.
  4. మధ్యగతాన్ని అర్థం చేసుకోవడం, గణించడం చాలా సులభం.

TS Board Inter First Year Economics Study Material Chapter 10 అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు

ప్రశ్న 10.
మధ్యగతం యొక్క పరిమితులను తెలపండి.
జవాబు.

  1. మధ్యగతం – స్థానపు సగటు కాబట్టి, దాని గణన శ్రేణిలోని ప్రతి అంశం యొక్క విలువపైన ఆధారపడి ఉండదు. కాబట్టి మధ్యగతం విలువ శ్రేణిలో గల అంశాలకు ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పలేం.
  2. మధ్యగతం తదుపరి బీజగణిత విశ్లేషణకు ఉపయోగపడదు.
  3. అవిచ్ఛిన్న శ్రేణులలో దీనిని అంతర్వేశనం (Interpolated) చేయాల్సి ఉంటుంది.
  4. సరిసంఖ్య గల అంశాలు శ్రేణిలో ఉన్నప్పుడు, రెండు మధ్య విలువల అంక మధ్యమమే మధ్యగతం అవుతుంది.

ప్రశ్న 11.
బహుళకం యొక్క ప్రయోజనాలను తెలపండి.
జవాబు.

  1. బహుళకం శ్రేణులలో అధిక పర్యాయాలు కనిపించే విలువ. మధ్యగతం మాదిరి దీని విలువ విడిగా (isalated) ఉండదు, శ్రేణిలోలేని అంశాల విలువను తెలిపే అంకమధ్యమంలాగా ఉండదు.
  2. విపరీత అంశాల ప్రభావం దీనిపై ఉండదు. అందువల్ల ఇది శ్రేణిలోని అంశాలకు ప్రాతినిధ్యం వహించును.
  3. రేఖా చిత్రం ద్వారా కూడా బహుళకాన్ని లెక్కించవచ్చు.
  4. విస్తృత అవధులు ఉన్న తరగతులలో కూడా బహుళకాన్ని లెక్కించవచ్చు.
  5. దత్తాంశంలోని గుణాత్మక విలువలను వర్గీంచవలసినపుడు ఈ పద్ధతి ఉపయుక్తంగా ఉంటుంది.
  6. బహుళకాన్ని అర్థం చేసుకోవడం, గణించడం సులభం.
  7. ఇది నిత్య జీవితంలో తరచుగా ఉపయోగించే సగటు. ఉదాహరణకు తరగతి మార్కుల సగటు, ఒక విభాగంలో విద్యార్థుల సంఖ్యను కనుగొనుట మొదలైనవి.

ప్రశ్న 12.
బహుళకం యొక్క పరిమితులను తెలపండి.
జవాబు.

  1. ద్విబహుళకం, బహుళ బహుళకం శ్రేణులలో బహుళకాన్ని లెక్కించడం చాలా కష్టం.
  2. కేంద్రీకృత విలువలపై మాత్రమే బహుళకం ఆధారపడుతుంది. బహుళకం విలువ కంటే అధిక విలువలు కలిగిన ఇతర అంశాలు ఉన్నా అవి పరిగణింపబడవు. అవిచ్ఛిన్న శ్రేణులలో కేవలం తరగతి అంతరాల అవధులు మాత్రమే పరిగణింపబడతాయి.
  3. బహుళకం ప్రతిచయన మార్పులకు ఎక్కువగా గురవుతుంది.
  4.  బహుళకాన్ని వివిధ పద్ధతులలో లెక్కించినపుడు అంక మధ్యమం వలె ఒకే విలువ రాదు. గణనకు అనేక సూత్రాలు ఉన్నాయి. ఏది ఉపయోగించాలి అని సందేహం తలెత్తుతుంది.
  5. ఇది బీజీయ ప్రస్తావనకు పనికి రాదు. అంకమధ్యమం వలె ఉమ్మడి బహుళక గణన సాధ్యం కాదు.
  6. శ్రేణిలోని అంశాల సంఖ్య అత్యధికంగా ఉన్నప్పుడే బహుళకం ఆ శ్రేణిలోని విలువలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 10 అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు

ప్రశ్న 13.
ఈ కింది దత్తాంశానికి బహుళకం విలువను కనుగొనండి.

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 25

జవాబు.
ఇచ్చిన దత్తాంశం ప్రకారం ₹ 480 మూడు సార్లు వచ్చింది. కనుక బాహుళకం = 480.

ప్రశ్న 14.
హరమధ్యమం భానవ గురించి తెల్పండి.
జవాబు.
ఇచ్చిన శ్రేణిలోని అంశాల వ్యుత్రమాల (reciprocal) అంక మధ్యమానికి వ్యుత్రమమే ఆ అంశాల హరమధ్యమం. ఇంకొక విధంగా చెప్పాలంటే అంశాల సంఖ్యను, వాటి వ్యుత్రమాల మొత్తంచే భాగించగా వచ్చిన ఫలితమే హరమధ్యమం. దీనిని దిగువ తెలిపిన సమీకరణం ద్వారా కనుగొనవచ్చు.

H.M. = Reci \(\frac{\frac{1}{\mathrm{X}_1}+\frac{1}{\mathrm{X}_2}+\ldots .+\frac{1}{\mathrm{X}_{\mathrm{n}}}}{\mathrm{N}}\) లేదా
= \(\frac{\mathrm{N}}{\frac{1}{\mathrm{X}_1}+\frac{1}{\mathrm{X}_2}+\ldots \ldots+\frac{1}{\mathrm{X}_{\mathrm{n}}}}\) లేదా
= \(\frac{\mathrm{N}}{\sum\left(\frac{1}{\mathrm{X}}\right)}\)

ప్రశ్న 15.
4, 6, 12ల హరమధ్యమం విలువను లెక్కించండి.
జవాబు.
హరమధ్యమం విలువ = 4, 6, 12

NX
14
26
312

∴ హరమధ్యమం (\(\frac{1}{x}\))
\(\frac{1}{4}\) = 0.2500;
\(\frac{1}{6}\) = 0.1667;.
\(\frac{1}{12}\) = 0.8333.

ప్రశ్న 16.
4, 16ల గుణమధ్యమం విలువను లెక్కించండి.
జవాబు.
గుణమధ్యమం విలువ : 4, 16

N

X
1

4

2

16

N = 2
గుణమధ్యమం = \(\sqrt[N]{x_1 \cdot x_2 \cdot x_3}=\left(x_1, x_2 \ldots \ldots x_4\right)^n\)
= \(\sqrt{4 \times 16}=\sqrt{64}\) = 8.

TS Board Inter First Year Economics Study Material Chapter 10 అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు

Textual Examples:

ప్రశ్న 1.
ఒక కళాశాలలో విదేశీ భాషలను చదువుతున్న విద్యార్థుల వివరాలు కింది పట్టికలో ఇవ్వడమైంది. ఈ దత్తాంశం సహాయంతో బహుళ బార్ పటాన్ని గీయండి.
పట్టిక : విదేశీ భాషలను చదువుతున్న విద్యార్థులు

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 26

సాధన.

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 27

ప్రశ్న 2.
క్రింది దత్తాంశానికి ‘పై’ (Pie) చిత్రము గీయండి.

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 28

సాధన.

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 29

మొత్తం విస్తీర్ణం = 16 + 24 + 10 + 8 + 5 = 63
మొత్తం భూవిస్తీర్ణాన్ని డిగ్రీలలోకి మార్చినట్లయితే =
వరి = \(\frac{16 \times 360}{63}\) = 91°
గోధుమ= \(\frac{24 \times 360}{63}\) = 137°
రాగులు = \(\frac{10 \times 360}{63}\) = 57°
జొన్నలు = \(\frac{16 \times 360}{63}\) = 46°
తృణ ధాన్యాలు = \(\frac{5 \times 360}{63}\) = 29°
∴ మొత్తం = 360°.

TS Board Inter First Year Economics Study Material Chapter 10 అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు

ప్రశ్న 3.
దిగువ తెలిపిన దత్తాంశం బడికి వెళ్తున్న, బడి మానేసిన బాల బాలికలకు సంబంధించింది. ఈ దత్తాంశానికి శాతపు బార్ పటాన్ని గీయండి.

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 30

సాధన.

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 31

ప్రశ్న 4.
దిగువ ఇచ్చిన దత్తాంశం ఆరుగురు విద్యార్థులు ఒక పరీక్షలో పొందిన మార్కులకు సంబంధించింది అంక మధ్యమాన్ని గణన చేయండి.
మార్కులు (X): 70, 80, 40, 50, 65, 45
సాధన.

క్రమ సంఖ్యX
170
280
340
450
565
645
N = 6ΣX = 350

\(\overline{\mathrm{X}}=\frac{\Sigma \mathrm{X}}{\mathrm{N}}=\frac{350}{6}\) = 58.3

∴ \(\overline{\mathrm{X}}\) = 58.3.

TS Board Inter First Year Economics Study Material Chapter 10 అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు

ప్రశ్న 5.
కింది దత్తాంశానికి అంక మధ్యమాన్ని గణన చేయండి.

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 32

సాధన.

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 33

గమనిక : పై సమస్య సాధనలో ఊహించిన సగటు (A) 40గా తీసుకోబడింది.
\(\bar{X}=A+\frac{\sum \mathrm{fd}}{N}\)
ఇక్కడ, N = 60, Σfd = 60, A = 40 ఈ విలువలను పై సూత్రంలో ప్రతిక్షేపిస్తే,
\(\overline{\mathrm{X}}\) = 40 + \(\frac{60}{60}\)
= 40 + 1 = 41
∴ \(\overline{\mathrm{X}}\) = 40 + 1 = 41.

ప్రశ్న 6.
క్రింది దత్తాంశానికి అంక మధ్యమాన్ని కనుగొనండి.

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 34

సాధన.

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 35

\(\overline{\mathrm{X}}=\mathrm{A}+\frac{\sum \mathrm{fd}^{\prime}}{\mathrm{N}} \times \mathrm{C}^{\prime}\)

ఇక్కడ, \(\overline{\mathrm{X}}\) = అంక మధ్యమం
A = ఊహించిన అంక మధ్యమం = 155
Σ fd’ = ఊహించిన అంక మధ్యమం నుంచి తీసుకొన్న సోపాన విచలనాలను [di = \(\frac{\mathbf{x}_{\mathbf{i}}-\mathbf{A}}{\mathbf{i}}\)]
వాటి అనురూప పౌనఃపున్యాలతో గుణించగా వచ్చిన లబ్ధాల సంకలనం = – 4
N = పౌనఃపున్యాల = 40
C = తరగతి అంతరం = 10
ఈ విలువలను పై సూత్రంలో ప్రతిక్షేపిస్తే,
= 155 + \(\frac{-4}{40 \overline{\mathrm{X}}}\) × 10
= 155 + \(\frac{-40}{40}\)
= 155 – 1 = 154.
∴ \(\overline{\mathrm{X}}\) = 154.

TS Board Inter First Year Economics Study Material Chapter 10 అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు

ప్రశ్న 7.
కింది దత్తాంశం ఏడుగురు వ్యక్తుల ఆదాయాలకు సంబంధించింది. మధ్యగతాన్ని గణన చేయండి.
ఆదాయాలు (X) : 100 150 80 90 160 200
సాధన.
ఇవ్వబడిన దత్తాంశాన్ని ఆరోహన క్రమంలో రాయగా,

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 36

ఇక్కడ, Med = మధ్యగతం,
N = అంశాల సంఖ్య = 7
M = \(\left(\frac{7+1}{2}\right)^{\text {th }}=\frac{8}{2}\) = 4 వ సంఖ్య
4వ అంశానికి అనురూపంగా ఉన్న విలువ = 140,
కాబట్టి ∴ మధ్యగతం = 140.

ప్రశ్న 8.
కింది దత్తాంశానికి మధ్యగతాన్ని లెక్కించండి.

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 37

సాధన.

xfcf (సంచిత పౌనఃపున్యం)
1055
20813
301225
402045
503075
601691
7010101
807108
908116
N = 116

 

మధ్యగత స్థానం = \(\left(\frac{\mathrm{N}+1}{2}\right)\)వ అంశం
ఇక్కడ, N = పౌనఃపున్యాల మొత్తం = 116
= \(\left(\frac{116+1}{2}\right)\) వ అంశం
= \(\frac{117}{2}\)వ అంశం
= 58.5 వ అంశం
58.5 వ అంశం పౌనఃపున్యం 75లో ఉంది. అందువల్ల దాని అనురూప ‘X’ విలువ 50 మధ్య అవుతుంది.
∴ మధ్యగతం = 50.

TS Board Inter First Year Economics Study Material Chapter 10 అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు

ప్రశ్న 9.
కింది దత్తాంశానికి మధ్యగతాన్ని లెక్కించండి.

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 39

సాధన.
మార్కులు విద్యార్థులు సాధన. పై దత్తాంశం విలీన (inclusive) శ్రేణులకు చెందింది. దీన్ని మినహాయింపు (exclusive) శ్రేణులలోకి మార్చి రాయాలి. ఇందుకోసం తరగతిలో ప్రతి దిగువ అవధిలో నుంచి 0.5 తీసివేయాలి. అలాగే ఎగువ అవధికి 0.5ను కలపాలి. అలా చేయడం ద్వారా విలీన శ్రేణులను మినహాయింపు (exclusive) శ్రేణులుగా మార్చవచ్చు. పై దత్తాంశాన్ని అలా మార్చి రాయగా,

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 40

350 వ అంశం సంచిత పౌనఃపున్యం 502 తో ఉంది. దాని అనురూపమైన తరగతి 39.5 – 49.3 కాబట్టి మధ్యగతం విలువ ఈ మధ్యగత తరగతి 39.5 – 49.5 లో ఉంటుంది.
Med = L1 + \(\left[\frac{\frac{\mathrm{N}}{2}-\mathrm{CF}}{\mathrm{f}}\right]\) × i
ఇక్కడ, Med = Median
L1 = 39.5,
\(\frac{\mathrm{N}}{2}\) = 350
CF = 252
F = 250
i = 10
విలువలను పై సూత్రంలో ప్రతిక్షేపిస్తే,
= 39.5 + \(\frac{350-252}{250}\) × 10
= 39.5 + \(\frac{98}{250}\) × 10
= 39.5 + \(\frac{980}{250}\)
= 39.5+ 3.93 = 43.42
∴ మధ్యగతం = 43.42.

ప్రశ్న 10.
కింది దత్తాంశానికి బాహుళకాన్ని లెక్కించండి.

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 41

సాధన.

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 42

(2)* = ప్రతి రెండు అడ్డు వరుసలలో గల పౌనఃపున్యాల సంకలనం.
(3)* = మొదటి అడ్డు వరుసలో గల పౌనఃపున్యాన్ని వదిలి, ప్రతి రెండు అడ్డు వరుసల పౌనఃపున్యాల సంకలనం.
(4)* = ప్రతి మూడు అడ్డు వరుసలలో గల పౌనఃపున్యాల సంకలనం.
(5)* = మొదటి అడ్డు వరుసలో గల పౌనఃపున్యాన్ని వదిలి ప్రతి మూడు అడ్డు వరుసలతో పౌనఃపున్యాల సంకలనం.
(6)* = మొదటి రెండు అడ్డు వరుసలను వదిలి ప్రతి మూడు అడ్డు వరుసల పౌనఃపున్యాల సంకలనం.

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 43

TS Board Inter First Year Economics Study Material Chapter 10 అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు

వర్గీకృత పట్టిక, విశ్లేషణ పట్టిక ప్రకారం 10-15 తరగతి ఎక్కువ పర్యాయాలు కనిపించింది. కాబట్టి బహుళకపు విలువ 10 – 15 తరగతిలో ఉంటుంది.

TS Inter 1st Year Economics Study Material 10th Lesson అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు 44

వర్గీకృతం మరియు విశ్లేషణ తర్వాత బహుళకం కనుగొనడానికి ఈ కింది ఫార్మలా ఉపయోగించుతాయి.
Z = L1 + \(\frac{\Delta_1}{\Delta_1+\Delta_2}\) × i
ఇక్కడ, Z = బహుళకం = ?
L1 = బహుళ తరగతి దిగువ అవధి = 10
f0 = బహుళక తరగతికి ముందున్న తరగతి పౌనఃపున్యం = 195
f1 = బహుళక తరగతి పౌనఃపున్యం = 241
f2 = బాహుళక తరగతి తరువాత తరగతి పౌనఃపున్యం = 117
i తరగతి అంతరం = 5
1 = f1 – f0
= 241 – 195 = 46
2 = f1 – f2
= 241 – 117 = 124
విలువలను పై సూత్రంలో ప్రతిక్షేపిస్తే,
= 10 + \(\frac{46}{46+124}\) × 5
= 10 + \(\frac{230}{170}\)
= 10 + 1.35
= 11.35
∴ Z = 11.35.

TS Inter 2nd Year Political Science Study Material Chapter 2 ప్రాథమిక హక్కులు – ఆదేశక సూత్రాలు

Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 2nd Lesson ప్రాథమిక హక్కులు – ఆదేశక సూత్రాలు Textbook Questions and Answers.

TS Inter 2nd Year Political Science Study Material 2nd Lesson ప్రాథమిక హక్కులు – ఆదేశక సూత్రాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కులను వివరించండి.
జవాబు.
ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోని 3వ భాగంలో చేర్చారు. ఇవి 12వ అధికరణ నుంచి 35వ అధికరణ వరకు పొందుపరచబడ్డాయి. స్వతంత్ర భారతదేశం కోసం జరిగిన స్వాతంత్రోద్యమమే వీటి ఆమోదం వెనకనున్న తాత్త్విక ప్రేరణ.

భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చడానికి వాటి గుర్తింపు పరిశీలన, సవరణల కొరకు రాజ్యాంగ సభలో జె.బి.కృపలాని అధ్యక్షతన ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ రూపొందించబడింది. అనిబిసెంట్ కామన్వెల్త్ ఇండియా బిల్లు 1925, నెహ్రూ నివేదిక 1928లు ఈ ప్రాథమిక హక్కులకు మార్గదర్శకాలు.

ప్రాథమిక హక్కుల వర్గీకరణ: వీటిని ఈ కింది విధంగా వర్గీకరించారు.

  1. సమానత్వపు హక్కు (అధికరణ 14 నుంచి అధికరణ 18 వరకు)
  2. స్వాతంత్య్రపు హక్కు (అధికరణ 19 నుంచి అధికరణ 22 వరకు)
  3. పీడనాన్ని నిరోధించే హక్కు (అధికరణ 23 మరియు అధికరణ 24)
  4. మతస్వాతంత్ర్యపు హక్కు (అధికరణ 25 నుంచి అధికరణ 28 వరకు)
  5. సాంస్కృతిక విద్యావిషయక హక్కు (అధికరణ 29 మరియు అధికరణ 30)
  6. రాజ్యాంగ పరిహార హక్కు (అధికరణ 32)

1. సమానత్వపు హక్కు (అధికరణ 14 నుంచి అధికరణ 18 వరకు) :
i) 14వ అధికరణ :
చట్టం ముందు వ్యక్తి సమానత్వాన్ని లేదా చట్టాల సమాన రక్షణను ప్రభుత్వం తిరస్కరించరాదని తెలుపుతుంది.

ii) 15వ అధికరణ :
మతం, జాతి, కులం, లింగం, జన్మస్థానం మీద గానీ, వీటిలో ఏ ఒక్కదాని కారణంగా గానీ ప్రభుత్వం ఏ పౌరుడి మీదా వివక్ష చూపరాదని తెలుపుతుంది.

  1. ఏ పౌరుడిపై కూడా పైవాటి లేదా ఏ ఇతర కారణాల వల్ల దుకాణాలు, హోటళ్లు, వినోద స్థలాలు ఉపయోగించుకోవడంలో ఏ విధమైన అనర్హత, నిషేధం, షరతులు విధించరాదు.
  2. పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ ప్రభుత్వ నిధులచే నిర్వహించబడుతున్న బావులు, చెరువులు, స్నానపుశాలలు, వినోద స్థలాలను పౌరులందరూ వినియోగించుకోవచ్చు.

iii) 16వ అధికరణ :
ప్రభుత్వం కింద ఉన్న ఏ కార్యాలయంలోనైనా ఉపాధి లేదా నియామకానికి సంబంధించిన విషయాలలో పౌరులందరికీ సమాన అవకాశాలుండాలని ఆఢలుపుతుంది.
సి) ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే ఏదైనా కార్యాలయం లేదా ఉద్యోగానికి సంబంధించి ఏ పౌరుడైనా మత, జాతి, కుల, లింగ, వంశ, జన్మస్థానం, నివాస స్థలాల కారణంగా గానీ వీటిలో ఏ ఒక్క కారణంగా గానీ అనర్హతకు లేదా వివక్షతకు గురికారాదు.

iv) 17వ అధికరణ :
అస్పృశ్యత నిషేధించబడింది. ఏ రూపంలోనైనా దీని వాడుక నిరోధించబడింది. బలవంతంగా అస్పృశ్యత కారణంగా తలెత్తిన ఏ అనర్హత అయినా చట్టపరంగా నేరం, శిక్షింపదగినది అని తెలుపుతుంది.

v) 18వ అధికరణ :
సైనిక సంబంధమైనవి లేదా విద్యా సంబంధమయినవి తప్ప ఏ ఇతర బిరుదును ప్రభుత్వం ప్రసాదించరాదని తెలుపుతుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 2 ప్రాథమిక హక్కులు - ఆదేశక సూత్రాలు

2. స్వాతంత్య్రపు హక్కు (అధికరణ 19 నుంచి అధికరణ 22 వరకు) :

i) 19వ అధికరణ : పౌరులందరూ ఈ కింది హక్కులను కలిగి ఉంటారని తెలుపుతుంది.

  1. భావ వ్యక్తీకరణ మరియు వాక్కు స్వేచ్ఛ.
  2. ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సభలు, సమావేశాలు జరుపుకొనే స్వేచ్ఛ.
  3. సంఘాలు, సమూహాలు ఏర్పరచుకొనే స్వేచ్ఛ.
  4. భారత భూభాగమంతా సంచరించే స్వేచ్ఛ.
  5. భారత భూభాగంలోని ఏ ప్రాంతంలోనయినా నివసించే స్వేచ్ఛ.
  6. ఏదైనా వృత్తి, ఉపాధి, వ్యాపార, వాణిజ్యాలను నిర్వహించుకొనే స్వేచ్ఛ.

గమనిక : అధికరణ 19 (ఎఫ్), ఆస్తిని సంపాదించుకొనే స్వేచ్ఛ, 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించబడింది.

ii) 20వ అధికరణ :
(ఎ) అమలులో ఉన్న చట్టాన్ని అతిక్రమించడం నేరంగా పరిగణించబడుతున్న సమయంలో ఆ చర్యకు పాల్పడటం మినహా, ఏ ఇతర నేరానికీ ఏ పౌరుడూ నేరారోపణకు గురికారాదు. నేరం జరిగిన సమయంలో అమలులో ఉన్న చట్టం కింద విధించే దానికన్నా అధిక శిక్షకు గురికారాదు అని తెలుపుతుంది.

ఎ) ఏ వ్యక్తీ ఒకే నేరానికి ఒకసారి కంటే ఎక్కువ నేరారోపణకు, శిక్షకు గురికారాదు.
బి) నేరారోపణ చేయబడిన ఏ పౌరుడినీ తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యం చెప్పుకోవడానికి ఒత్తిడి చేయరాదు.

iii) 21వ అధికరణ :
జీవించే హక్కు గురించి తెలుపుతుంది. చట్టం ద్వారా రూపొందించబడిన ప్రక్రియ ద్వారా మినహా, ఏ వ్యక్తి ప్రాణానికి లేదా వ్యక్తిగత స్వేచ్ఛకు హాని కలిగించరాదు. దీనినే ప్రాణరక్షణ హక్కు అని అంటారు.

iv) అధికరణ 21-ఎ కు లోబడి 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ చట్టం ద్వారా నిర్ణయించిన పద్ధతిలో నిర్బంధ, ఉచిత విద్యను ప్రభుత్వాలన్నీ అందించాలి. (86వ సవరణ చట్టం 2002 ద్వారా చేర్చబడింది).

v) 22వ అధికరణ :
అరెస్టు చేసిన వ్యక్తిని కారణం తెలుపకుండా నిర్బంధించరాదు అని తెలుపుతుంది. అరెస్టు చేసి నిర్బంధించబడిన ప్రతీ వ్యక్తిని అరెస్టు చేసిన తరువాత ఇరవైనాలుగు గంటల లోపల దగ్గరలోని న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలి.

3. పీడనాన్ని నిరోధించే హక్కు (అధికరణ 23 మరియు అధికరణ 24) :

  1. 23వ అధికరణ అక్రమ మానవ వ్యాపారం, వెట్టిచాకిరి, మరే ఇతర రూపాలలో బలవంతంగా పని చేయించడం నిరోధించబడింది అని తెలుపుతుంది.
  2. 24వ అధికరణ 14 సంవత్సరాల లోపు వయస్సు పిల్లలను కర్మాగారాలు, గనులు తదితర ప్రమాదకరమయిన వృతులలో పని చేయించరాదు.

4. మతస్వాతంత్య్రపు హక్కు (అధికరణ 25 నుంచి అధికరణ 28 వరకు) :

  1. 25వ అధికరణ ప్రజాసంక్షేమం, నైతిక విలువలు, ఆరోగ్యం ఇతర నిబంధనలకు లోబడి, ఏ వ్యక్తి అయినా తనకు ఇష్టమైన మతాన్ని స్వీకరించడం, ఆచరించడం, ప్రచారం చేయడం, వ్యాప్తి చేసుకోవడానికీ పౌరులందరికీ సమానమయిన హక్కు కల్పించబడింది.
  2. ప్రభుత్వాలు, మతానికి సంబంధించిన ఆర్థిక, రాజకీయ లేదా మరే ఇతర సంక్షేమ చర్యలను నియంత్రించే లేదా నిరోధించే చట్టాలను రూపొందించవచ్చు.
  3. 26వ అధికరణకు లోబడి ప్రజాసంక్షేమం, నైతిక విలువలు, ఆరోగ్యం వంటి విషయాలకు సంబంధించి మత సంబంధమయిన ఏ సంస్థ లేదా శాఖ అయినా ఈ క్రింది హక్కులను కలిగి ఉంటాయి.
    ఎ) మత సంబంధమయిన మరియు ధార్మిక సంస్థలను స్థాపించడం, నిర్వహించడం.
    బి) మత సంబంధమయిన వ్యవహారాలను స్వంతంగా నిర్వహించుకోవడం.
    సి) స్థిరాస్తి మరియు చరాస్తులను సమకూర్చుకోవడం.
    డి) చట్టానికి లోబడి అటువంటి ఆస్తులను నిర్వహించుకొనడం.
  4. 27వ అధికరణ మతం లేదా మత సంబంధమయిన సంస్థల అభివృద్ధి, నిర్వహణ ఖర్చుల కొరకు ఏ విధమయిన పన్నులు విధించరాదు.
  5. 28వ అధికరణ, పూర్తిగా గానీ, పాక్షికంగా గాని ప్రభుత్వ నిధులతో నిర్వహించబడుతున్న ఏ విద్యాసంస్థలోనైనా మతపరమయిన బోధనలు, పద్ధతులను పాటించరాదు.

5. సాంస్కృతిక మరియు విద్యావిషయక హక్కు :

  1. 29వ అధికరణ, ప్రతీ పౌరుడికీ, తన స్వంత భాష, లిపి లేదా సంస్కృతులను కలిగి ఉండడానికి మరియు సంరక్షించుకొనే హక్కు ఉంది. ప్రభుత్వం లేదా ప్రభుత్వేతర నిధుల సహాయంతో నిర్వహించబడుతున్న ఏ విద్యా సంస్థలలోకి ఏ పౌరుడినీ మతం, జాతి, కుల, భాషల లేదా వీటిలో ఏ ఒక్కదాని కారణంగానైనా తన ప్రవేశాన్ని నిరాకరించరాదు.
  2. 30 అధికరణ, మత లేదా భాషాపరంగా అల్పసంఖ్యాకులు ఇష్టమయిన విద్యాసంస్థలను స్థాపించుకొని నిర్వహించుకొనే హక్కు కలిగి ఉన్నాయని తెలుపుతుంది.
    31వ అధికరణ ఆస్తి హక్కు 44వ సవరణ చట్టం ద్వారా 1978లో ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించబడింది.

6. రాజ్యాంగ పరిహార హక్కు (అధికరణ 32) :
అధికరణ 32 ప్రకారం, ప్రతీ పౌరుడూ రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల అమలుకు తగిన ప్రక్రియల ద్వారా సుప్రీం కోర్టును ఆశ్రయించే హక్కు ప్రసాదించబడింది. రాజ్యాంగం ద్వారా ప్రసాదించబడిన ప్రాథమిక హక్కుల అమలు కొరకై సుప్రీంకోర్టు, హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, కో వారంలొ మరియు సర్షియర రిట్లతో తగిన రిట్ను జారీ చేసే అధికారం కలిగి ఉంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 2 ప్రాథమిక హక్కులు - ఆదేశక సూత్రాలు

ప్రశ్న 2.
ఆదేశక సూత్రాలను వివరించండి.
జవాబు.
ఆదేశక సూత్రాలు ఐర్లాండు రాజ్యాంగం నుంచి గ్రహించబడ్డాయి. ఇవి భారత రాజ్యాంగంలో 4వ భాగంలో అధికరణ 36 నుంచి అధికరణ 51 వరకు పొందుపరచబడ్డాయి. ఆదేశక సూత్రాల అమలులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవు. ఆదేశక సూత్రాలు భారతదేశ పౌరులకు సామాజిక – ఆర్థిక న్యాయం అందించడంలో తోడ్పడతాయి. వీటి ముఖ్య ఉద్దేశం శ్రేయోరాజ్య స్థాపన.
ఆదేశక సూత్రాలను వివరించండి.

ఆదేశక సూత్రాలు మూడు రకాలుగా విభజించబడ్డాయి.

  1. సామ్యవాద సూత్రాలు
  2. గాంధేయవాద సూత్రాలు
  3. ఉదారవాద సూత్రాలు

1. సామ్యవాద సూత్రాలు :
ఇవి భారతదేశంలో సామాజిక సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడానికి ఆదేశక సూత్రాలలో చేర్చబడ్డాయి. 38వ అధికరణ, 39వ అధికరణ, 41వ అధికరణ, 42వ అధికరణ, 43వ అధికరణ, 46వ అధికరణ, 47వ అధికరణలు ఆదేశ సూత్రాల యొక్క సామ్యవాద భావాలను వివరిస్తాయి.

  1. 38వ అధికరణ, ప్రజలందరికీ న్యాయం (సామాజిక, ఆర్థిక, రాజకీయ) చేకూరే పద్ధతిలో ఒక సామాజిక క్రమాన్ని నెలకొల్పడం ద్వారా ప్రజాసంక్షేమాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలని తెలుపుతుంది.
  2. 39వ అధికరణ, ప్రభుత్వం కింది వాటి కొరకు చర్యలు తీసుకోవాలని తెలుపుతుంది.
    i) ప్రజలందరికీ తగినంత జీవనభృతిని కల్పించుట.
    ii) ప్రజలందరి ఉపయోగం కొరకు దేశంలోని వనరుల సమాన పంపిణీ.
    iii) జాతీయ సంపదను వికేంద్రీకరించుట.
    iv) స్త్రీ, పురుషులకు సమాన వేతనాలు.
    v) కార్మికుల, పురుషుల, మహిళల సంపదను, శక్తిని సంరక్షించడం.
    vi) బాల్యం, యవ్వనాన్ని దోపిడీ నుంచి రక్షించడం.
  3. 41వ అధికరణ, నిరుద్యోగిత, వృద్ధాప్యం, అనారోగ్యం, అశక్తత వంటి పరిస్థితులలో సహాయం, పనిహక్కు విద్యాహక్కులను ప్రసాదించాలని ప్రభుత్వాన్ని కోరుతుంది.
  4. 42వ అధికరణ, కార్మికులు పనిచేసేందుకు తగిన మానవీయ పరిస్థితులను కల్పించడం, స్త్రీలకు ప్రసూతి సౌకర్యాలను కల్పించడం.
  5. 43వ అధికరణ కార్మికులందరికీ కనీస జీవన వేతనం, మెరుగైన పని నిబంధనలు, సామాజిక, సాంస్కృతిక అవకాశాలను కల్పించాలని ప్రభుత్వాన్ని సూచిస్తుంది.
  6. 46వ అధికరణ, ప్రభుత్వం షెడ్యూల్డు తెగల, షెడ్యూల్డు కులాల, అల్ప సంఖ్యాకులకు విద్యా, ఆర్థిక సదుపాయాలను అందించాలని ప్రభుత్వానికి సూచిస్తుంది. సామాజిక అన్యాయం, అన్ని రకాల దోపిడీల నుంచి ప్రభుత్వం వారిని రక్షించాలి.
  7. 47వ అధికరణ, కనీస పోషకాహార స్థాయి, జీవన ప్రమాణాన్ని పెంచి ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని కోరుతుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 2 ప్రాథమిక హక్కులు - ఆదేశక సూత్రాలు

2. గాంధేయవాద సూత్రాలు:
గాంధేయవాద సూత్రాలు భారతదేశంలో ఆదర్శ పరిపాలనను అందిస్తాయి. ఈ సూత్రాలు అధికరణ 40, అధికరణ 43, అధికరణ 46, అధికరణ 47, అధికరణ 48ఎ, అధికరణ 49 లలో ప్రతిఫలిస్తాయి.

  1. 40వ అధికరణ, ప్రభుత్వం, గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేసి, అధికారాలను కల్పించి, వాటిని స్వపరిపాలనా సంస్థలుగా పనిచేసే అవకాశాన్ని కల్పించాలని సూచిస్తుంది.
  2. 43వ అధికరణ, గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగతంగా గాని సామూహిక రంగంలో గాని కుటీర పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని ప్రభుత్వాన్ని నిర్దేశిస్తుంది.
  3. 46వ అధికరణ, బలహీన వర్గాల వారికి ప్రత్యేక శ్రద్ధతో విద్య, ఆర్థిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని నిర్దేశిస్తుంది.
  4. 47వ అధికరణ, మద్యం, మత్తుపదార్థాలను నిషేధించడానికి కృషి చేయాలని ప్రభుత్వానికి సూచిస్తుంది.
  5. 48వ అధికరణ, నూతన, సాంకేతిక పద్ధతులలో పశుపోషణ, వ్యవసాయాలను నిర్వహించాలని ప్రభుత్వానికి ఇది సూచిస్తుంది. ఇది గోవులను, ఇతర పాడి పశువులను వధించడాన్ని నిషేధించవలసిందిగా ఆదేశిస్తుంది.
  6. అధికరణ 48ఎ, పర్యావరణ పరిరక్షణ, అడవులను, వన్యప్రాణుల్ని సంరక్షించాలని ప్రభుత్వానికి సూచిస్తుంది.
  7. 49వ అధికరణ కళాత్మక నైపుణ్యం, చారిత్రక ప్రాముఖ్యం కలిగిన స్థలాలను, కట్టడాలను పరిరక్షించాలని సూచిస్తుంది.

3. ఉదారవాద సూత్రాలు :
ఈ సూత్రాలు స్వతంత్ర న్యాయ వ్యవస్థ మరియు అంతర్జాతీయ శాంతి మొదలగు వాటి సాకారానికి సంబంధించినవి. అవి అధికరణ 44, అధికరణ 45, అధికరణ 50, అధికరణ 51 లలో పొందుపరచబడ్డాయి.

  1. 44వ అధికరణ, దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని ప్రభుత్వానికి సూచిస్తుంది.
  2. 45వ అధికరణ, బాల్యంలో పిల్లల సంరక్షణ మరియు పిల్లలందరికీ ఆరు సంవత్సరాల వరకు పూర్వప్రాథమిక విద్యను ప్రభుత్వం అందించాలని సూచిస్తుంది.
  3. 50వ అధికరణ, కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరుచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతుంది.
  4. 51వ అధికరణ ప్రభుత్వాన్ని కింది వాటిని నిర్వహించాలని సూచిస్తుంది.
    i) అంతర్జాతీయ శాంతి భద్రతలను ప్రోత్సహించడం.
    ii) దేశాల మధ్య సత్సంబంధాలను నెలకొల్పడం.
    iii) అంతర్జాతీయ చట్టాలను, ఒప్పందాలను గౌరవించి ఆచరించడం.
    iv) అంతర్జాతీయ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడాన్ని ప్రోత్సహించడం.

అదనపు సూత్రాలు :
రాజ్యాంగ చట్టాలు – 42వ సవరణ 1976, 44వ సవరణ 1978, ఈ ఆదేశ సూత్రాలకు మరికొన్ని సూత్రాలను చేర్చాయి. 42వ సవరణ 1976 చట్టం అధికరణ 39ఎ, అధికరణ 43ఎ, అధికరణ 48ఎ లను చేర్చింది. 44వ సవరణ 1978 చట్టం అధికరణ 38 లో 2వ నిబంధనను చేర్చింది. అవి ఈ క్రింది విషయాలను కలిగి ఉన్నాయి.

  1. ఆదాయంలో అసమానతలను తగ్గించడం.
  2. సమన్యాయం మరియు పేదలకు ఉచిత్ర చట్టపరమయిన సహాయం (అధికరణ 39ఎ).
  3. పరిశ్రమల నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించడం (అధికరణ 43ఎ).
  4. పర్యావరణం, అడవులు, జంతువుల సంరక్షణ (అధికరణ 48ఎ).

TS Board Inter Second Year Political Science Study Material Chapter 2 ప్రాథమిక హక్కులు - ఆదేశక సూత్రాలు

ప్రశ్న 3.
ప్రాథమిక హక్కులకు, ఆదేశక సూత్రాలకు మధ్య భేదాలను తెలపండి.
జవాబు.
ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాల మధ్య భేదాలు :

ప్రాథమిక హక్కులు

ఆదేశక సూత్రాలు

1. ప్రాథమిక హక్కులు ప్రతికూల స్వభావాన్ని కలిగి ఉంటాయి. వ్యక్తికి హానికరమైన ప్రభుత్వ కార్యకలాపాలను నిరోధిస్తాయి.1. ఇవి స్వభావరీత్యా అనుకూలమైనవి. ఇవి ప్రభుత్వపు సామాజిక, ఆర్థిక కార్యకలాపాలను విస్తరిస్తాయి.
2. ఇవి న్యాయస్థానం ద్వారా పొందగలిగినవి. న్యాయస్థానాలు 32వ అధికరణకు లోబడి, ప్రాథమిక హక్కుల సంరక్షణ కొరకు రిట్లను జారీ చేస్తాయి.2. ఇవి న్యాయస్థానం ద్వారా పొందలేనివి. న్యాయ స్థానం వీటిని అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయలేవు.
3. 13వ అధికరణ ప్రకారం, ప్రాథమిక విధులను ఉల్లంఘించే చట్టాలు చెల్లవు.3. ఆదేశక సూత్రాలను ఉల్లంఘించే చట్టాలు చెల్లుబాటు కావు అని న్యాయస్థానాలు నిర్దేశించలేవు.
4. ప్రాథమిక హక్కులు పౌరుల వ్యక్తిగత జీవితం, స్వేచ్ఛల సంరక్షణకు సంబంధించినవి.4. ఆదేశక సూత్రాలు దేశం యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ, సంక్షేమాల అభివృద్ధి కొరకు ఉద్దేశించబడినవి.
5. ప్రాథమిక హక్కులకు, ఆదేశక సూత్రాలకు మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాలను అధిగమిస్తాయి.5. ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులను ఆదేశక సూత్రాలు అధిగమించలేవు.
6. ఇవి రాజ్యాంగంలోని 3వ భాగంలో చేర్చబడ్డాయి. వీటిని అమలు చేయడానికి ప్రత్యేక చట్టాలను చేయాల్సిన అవసరం లేదు.6. ఇవి భవిష్యత్ ప్రభుత్వాలకు మార్గ నిర్దేశకాలు మాత్రమే. కావున వీటిని అమలు చేయడానికి ప్రత్యేక చట్టం అవసరం.
7. ఇవి రాజ్యానికి మరియు భవిష్యత్ ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చిన ఆదేశాలు.7. ఇవి భవిష్యత్ ప్రభుత్వాలకు సలహాలు, సూచనలు. ఇవి రాజ్యాంగకర్తల ఆదర్శాలు.
8. ప్రభుత్వం లేదా అధికారంలో ఎవరున్నా ప్రాథమిక హక్కులు అమలుపరచబడతాయి.8. వీటిపై కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకతలు ఎదురుకావచ్చు. కాబట్టి ప్రభుత్వం తన వెసులుబాటు, వనరుల లభ్యతను బట్టి అమలుపరుస్తుంది.
9. ప్రాథమిక హక్కులు ప్రభుత్వం యొక్క రాజకీయ ప్రజాస్వామ్య స్వభావాన్ని సూచిస్తాయి.9. ఆదేశక సూత్రాలు రాజ్య ఆదర్శాలను మరియు ప్రభుత్వపు లక్ష్యాలను, గమ్యాలను వివరిస్తాయి.
10. ప్రతీ పౌరునికీ, దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో స్వేచ్ఛగా పాల్గొనే అవకాశాన్ని ఇవి కలిగిస్తాయి.10. సామాజిక అభివృద్ధి సంక్షేమం కొరకు, వెసులుబాటు మరియు వనరులను బట్టి ప్రభుత్వం నిర్వహించే చర్యలను ఇవి సూచిస్తాయి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 2 ప్రాథమిక హక్కులు - ఆదేశక సూత్రాలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
సమానత్వ హక్కు.
జవాబు.
రాజ్యాంగం 14వ అధికరణం భారతదేశంలో నివసించే వ్యక్తులందరికీ చట్టం ముందు సమానత్వాన్ని, చట్టం ద్వారా సమానమైన రక్షణ, సదుపాయాలను కల్పించింది. చట్టం ముందు సమానత్వం అంటే వ్యక్తులందరికీ ఒకే విధమైన చట్టాలు, ఒకే రకమైన న్యాయస్థానాలు, ఒకే విధమైన కార్యపద్ధతులు అని అర్థం.

సంపద, హోదా లేదా పరిస్థితిని బట్టి వ్యక్తుల మధ్య విచక్షణ చూపించకూడదు. పౌరుల మధ్య మతం, కులం, లింగ, జన్మస్థల సంబంధమైన వివక్షతలను రాజ్యం పాటించరాదని 15వ అధికరణం స్పష్టం చేసింది.

16వ అధికరణం ప్రకారం రాజ్యానికి సంబంధించిన ఏ ఉద్యోగం లేదా నియామకానికైనా పౌరులందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. 17వ అధికరణం అస్పృశ్యత లేదా అంటరానితనం పాటించడాన్ని నేరంగా పేర్కొంది. 18వ అధికరణం ప్రకారం పౌరులకు సైనిక లేదా విద్యా విషయక బిరుదులు ఇతర బిరుదులను రాజ్యం ప్రసాదించకూడదు. భారత రాష్ట్రపతి అనుమతి లేకుండా విదేశీ రాజ్యాలు ప్రకటించే బిరుదులను పౌరులు స్వీకరించకూడదు.

ప్రశ్న 2.
స్వాతంత్య్ర హక్కు.
జవాబు. స్వాతంత్య్రపు హక్కు (19 – 22 అధికరణాలు) : ఈ హక్కు పౌరులకు 6 ప్రాథమిక స్వేచ్ఛలను కల్పిస్తున్నది. అవి :

  1. వాక్ స్వాతంత్ర్యం
  2. సభలు, సమావేశాలు జరుపుకునే స్వాతంత్ర్యం
  3. సంఘ నిర్మాణ స్వాతంత్ర్యం
  4. సంచార స్వాతంత్ర్యం
  5. నివాస స్వాతంత్ర్యం
  6. వృత్తి స్వాతంత్ర్యం.
    ఈ స్వేచ్ఛలు ఏవీ నిరపేక్షమైనవి కావు. వీటికి ప్రభుత్వం ఆంక్షలు విధించవచ్చు.

ఏ పౌరుడు నేరం చేయనిదే శిక్షింపబడరాదు. నిందితుడు తనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వమని బలవంతం చేయరాదు. నేరం ఋజువు కానిదే ఎవరినీ 24 గంటలకు మించి నిర్బంధంలో ఉంచరాదు. 24 గంటలలో మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచాలి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 2 ప్రాథమిక హక్కులు - ఆదేశక సూత్రాలు

ప్రశ్న 3.
మతస్వాతంత్ర్య హక్కు.
జవాబు.
మత స్వాతంత్ర్య హక్కు భారత రాజకీయ వ్యవస్థ లౌకిక స్వభావానికి ప్రతీక. 25వ అధికరణం ప్రకారం ప్రతి వ్యక్తికీ ప్రజాభద్రత, నైతికత, ఆరోగ్యాలకు లోబడి తన అంతరాత్మకు అనుగుణమైన మతాన్ని అవలంభించడానికి, ప్రచారం చేసుకోవడానికి హక్కు ఉంది. మత ప్రభావానికి సంబంధించిన ఏ కార్యక్రమాలనైనా క్రమబద్ధం చేసే చట్టాన్ని రాజ్యం రూపొందించవచ్చు.

26వ అధికరణం ప్రకారం ఏ మతానికి చెందినవారైనా

  1. మతపరమైన ధార్మిక సంస్థలను ఏర్పాటు చేసుకోవడానికి
  2. స్వీయ మత వ్యవహారాలను నిర్వహించుకోవడానికి
  3. స్థిర, చరాస్తులపై యాజమాన్య హక్కు పొందటానికి, వాటిని కొనుగోలు చేయడానికి చట్ట ప్రకారం ఆస్తిపాస్తులను నిర్వహించుకోవచ్చు.

27వ అధికరణం మతం ఆధారంగా రాజ్యం ఏ వ్యక్తిపై, ఏ విధమైన పన్ను విధించడానికి, వసూలు చేయడానికి వీలులేదని పేర్కొంది. 28వ అధికరణం ప్రకారం రాజ్యం నుంచి సంపూర్ణంగానో, పాక్షికంగానో ఆర్థిక సహాయాన్ని పొందే విద్యా సంస్థలలో మతపరమైన బోధనలు నిషేధించడం జరిగింది.

ప్రశ్న 4.
గాంధేయవాద సూత్రాలు.
జవాబు.

  1. 40వ అధికరణం ప్రకారం రాజ్యం పంచాయితీరాజ్ సంస్థలను నిర్వహించి, అవి స్వయంపాలన సంస్థలుగా ఏర్పడటానికి తగిన అధికారాలు ఇవ్వాలి.
  2. 43వ అధికరణం ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో వ్యక్తిగత లేదా సహకార ప్రాతిపదికపై కుటీర పరిశ్రమల స్థాపనకు రాజ్యం తోడ్పడాలి.
  3. 46వ అధికరణం ప్రకారం బలహీన వర్గాల ప్రజల విద్యా, సామాజిక ప్రగతికి రాజ్యం ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
  4. 47వ అధికరణం ప్రకారం మత్తు పానీయాలు, మాదకద్రవ్యాల నిషేధానికి చర్యలు తీసుకోవాలి.
  5. 48వ అధికరణం ప్రకారం వ్యవసాయం, పశుపోషణలను ఆధునిక, శాస్త్రీయ పద్ధతులలో నిర్వహించడానికి గోవులు, దూడలు, ఇతర పాడి పశువులు, లాగుడుబండ్లకు కట్టే పశువుల వధను నిషేధించడానికి రాజ్యం చర్యలు తీసుకోవాలి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 2 ప్రాథమిక హక్కులు - ఆదేశక సూత్రాలు

ప్రశ్న 5.
సామ్యవాద సూత్రాలు.
జవాబు.
సామ్యవాద సూత్రాలు :

  1. ప్రజలందరికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని చేకూర్చుట.
  2. స్త్రీ, పురుష వివక్షత చూపక అందరికీ సమాన హక్కులు ఇచ్చుట. అస్పృశ్యతను నేరంగా పరిగణించటం.
  3. పౌరులందరికీ జీవనోపాధి కల్పించడం.
  4. దేశ సంపద సమిష్టి శ్రేయస్సు కోసం పంపిణీ చేయటం.
  5. కార్మికుల ఆరోగ్య పరిరక్షణ.
  6. బాలబాలికలు, యువతీయువకులు దోపిడీకి గురికాకుండా ఉండేటట్లు చేయడం, పని హక్కు కల్పించే చర్యలు తీసుకోవడం.
  7. ప్రజలకు పోషకాహారాన్ని అందించి వారి ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవడం.
  8. మాతాశిశు సంక్షేమం మొదలగునవి. ఈ అంశాల అమలుకు కొన్ని చర్యలు తీసుకొనబడ్డాయి.
    ఉదా : అంటరానితనం నిర్మూలించే చట్టం చేయడం, జాతీయ ప్రణాళికా సంఘం ద్వారా ప్రణాళికలు అమలు చేసి ఆర్థిక ప్రగతికి చర్యలు తీసుకోవడం, కార్మిక చట్టాలు చేయడం మొదలగునవి.

ప్రశ్న 6.
ఏవైనా నాలుగు ప్రాథమిక విధులు.
జవాబు.
నాలుగు ప్రాథమిక విధులు :

  1. భారత రాజ్యాంగం పట్ల, అది సూచించిన ఆదర్శాలు, సంస్థల పట్ల, జాతీయపతాకం, జాతీయగీతం పట్ల విధేయతను చూపటం.
  2. స్వాతంత్ర్యం కోసం జరిగిన జాతీయోద్యమ ఉదాత్త ఆశయాలను పోషించుకుంటూ అనుసరించటం.
  3. భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమైక్యత, సమగ్రతలను సమర్థించి సంరక్షించుకోవటం.
  4. దేశాన్ని రక్షించుకోవడం, అవసరమయినపుడు జాతీయ సేవలో పాల్గొనడం.
  5. మత, భాషా, ప్రాంతీయ, వర్గ సంబంధమైన వైవిధ్యాలను అధిగమించి భారత ప్రజలందరిలో సమైక్యతను, ఉమ్మడి సౌభ్రాతృత్వ భావాలను పెంపొందించుకోవడం, మహిళల గౌరవానికి విరుద్ధమైన పద్ధతులను పరిత్యజించడం.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 2 ప్రాథమిక హక్కులు - ఆదేశక సూత్రాలు

ప్రశ్న 7.
ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాల మధ్య ఏవైనా రెండు తేడాలు.
జవాబు.
ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాల మధ్య రెండు వ్యత్యాసాలు :

ప్రాథమిక హక్కులుఆదేశక సూత్రాలు
1. ప్రాథమిక హక్కులు చట్టబద్ధమైనవి.1. ఆదేశక సూత్రాలు సామాజికమైనవి.
2. ప్రాథమిక హక్కులకు రాజ్యాంగం హామీ ఇస్తుంది.2. ఆదేశక సూత్రాల అమలు కోసం రాజ్యాంగం ఎలాంటి హామీ ఇవ్వలేదు.
3. ప్రాథమిక హక్కులు సంరక్షక స్వభావాన్ని కలిగి ఉంటాయి.3. ఆదేశక సూత్రాలు సంవర్థకమైనవి.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material 1st Lesson నా ప్రథమ విదేశయాత్ర Textbook Questions and Answers.

TS Inter 2nd Year Telugu Non-Detailed 1st Lesson నా ప్రథమ విదేశయాత్ర

అభ్యాసం

I. ప్రశ్నలకు జవాబులు

ప్రశ్న 1.
ముద్దు రామకృష్ణయ్య గారి సంకల్పం తెలుపండి. (V.Imp) (M.P)
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య 18 అక్టోబరు 1907 నాడు మంథెనలో జన్మించాడు. ఆయన తండ్రి ఆదిలాబాద్ జిల్లా తాండూర్లో సింగల్ టీచర్గా పనిచేసేవారు. ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యాపారం ప్రారంభించి నష్టపోయారు. దాని కారణంగా ఆస్తి కన్నా అప్పు పెరిగింది. అప్పులవాళ్ళు వచ్చి వారి తండ్రివి తిట్టేవారు. ఆ మాటల బాధకు ఇంటి బయటకు వెళ్ళి ఆకాశం వైపు చూస్తూ, చేతులు జోడించి దేవునితో నన్ను కనికరించి చదువు చెప్పించు.

విదేశాలకు వెళ్లి చదువుకునేల ఆశీర్వదించమని, తండ్రి చేసిన అప్పులు తీర్పించి, ఇల్లును అమ్మకుండా, దాని ముందర గుఱ్ఱపు బగ్గీలను, మోటార్లను పెట్టించేలా, తండ్రికి, తల్లికి ఇప్పటికన్న ఎక్కువ పేరు మర్యాదలు తెప్పించమని మొక్కారు. అంటే చిన్నప్పుడే విదేశాల్లో చదువుకోవాలనే సంకల్పం ఉండేదని తెలుస్తుంది.

డబ్బులేనివారు చదువుకోలేరు, వివాహం అయిన వారు చదువుకోలేరు అనే మాటలను తప్పు అని నిరూపించాలని, ఈశ్వరుణ్ణి నమ్మినవాడు తప్పక అనుకున్నది సాధిస్తాడని కూడా రుజువు చేయాలని సంకల్పించు కున్నాడు. హైదరాబాద్ లో బి.ఏ. పాస్ అయ్యాడు. తరువాత L.L.B.

చదువుకొని BAR చేయడానికి ఇంగ్లాండు వెళ్ళాలని సంకల్పం చేసుకున్నాడు. ఇంగ్లండు వెళ్ళడానికి ధనవంతులయిన రెడ్డి స్నేహితులు సహాయం చేస్తారనే నమ్మకం ఉండేది. సర్కారీ ఉద్యోగం చేయటానికి ఇష్టం లేదు. అనేక చిన్న, పెద్ద పనులు చేస్తూ చదువుకున్నాక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉద్యోగం వచ్చింది. తరువాత ఇంకా గట్టిగ ఇంగ్లండు వెళ్లి పరిశోధన చేయాలని సంకల్పించుకున్నాడు.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 2.
ముద్దు రామకృష్ణయ్య గారి ప్రథమ విదేశయాత్ర సన్నాహాలు వివరించండి.
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య మొదటి ప్రయత్నం విఫలం అయ్యాక 1944 లో తన తోటి ఉపాధ్యాయుడు దిగంబరరావు తో మాట్లాడుతూ డబ్బు లేని కారణంగా ఇంగ్లాండు వెళ్లలేదని చెప్పాడు. ఆయన డిప్యూటి కలెక్టర్, పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ మీ మిత్రులే కదా వారు సహకరించరా అని సలహా ఇచ్చాడు. మళ్ళీ విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు ప్రారంభించి థామస్ కుక్ వారికి ఇంగ్లాండ్ వెళ్ళడానికి పడవ ఉందా అని లేఖ రాశాడు. సెప్టెంబర్లో పడవ బయలుదేరుతుందని, బ్రిటీష్ రెసిడెన్సి నుండి పాస్పోర్ట్ తీసుకొమ్మని, సీటు రిజర్వు చేసినట్టు వారు జవాబు పంపారు.

దానికి సంతోషించి హైదరాబాద్ ప్రభుత్వ శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్కు ఇంగ్లాండ్లో ఎం. ఇడి లేదా పి. హెచ్లలో సీట్ ఇప్పించమని, అక్కడ చదువుకోవడానికి ఇక్కడ సెలవు ఇప్పించమని, 6000 అప్పు ఇప్పించమని లేఖ రాశాడు. అతడు యుద్ధ సమయం ముగిసేవరకు పడవలు వెళ్ళవు, అక్కడ సీట్ రావడం కష్టం, అక్కడికి వెళ్ళాలంటే హైదరాబాద్ ప్రభుత్వం అనుమతి ఇవ్వదు.

ఈ మూడు విషయాలు పూర్తి కాకుంటే డబ్బుతో అవసరమే లేదు అని ప్రత్యుత్తరం పంపాడు. హైదరాబాద్ పోలీస్ కమీషనర్ కాదన్నాడు. కో ఆపరేటివ్ బ్యాంకు సెక్రెటరి లోనే లేదన్నాడు. ఇలా అందరూ నిరుత్సాహపరిచారు. అన్నలా భావించే అబ్దుల్ హమీద్ కూడా మొదట పిచ్చి ప్రయత్నం, యుద్ధకాలంలో ఒక నెలలో పాస్పోర్ట్ రావడం అసంభవం అని చెప్పాడు. మీ ఆశీర్వాదం ఉంటే అన్ని అవుతాయని రామకృష్ణయ్య అంటే ఆశీర్వదించి పంపాడు.

లాతూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ మీరు ప్రయత్నం చేయండి నా వంతు సహాయం చేస్తానన్నాడు. ఆ కాలంలో పాస్పోర్ట్ పొందడానికి చాలా తతంగం ఉండేది. పాస్పోర్ట్ కోసం జిల్లా అధికారికి దరఖాస్తు చేస్తే ఆయన హోం శాఖకు పంపితే వారు లోకల్ పోలీసు వారికి పరిశీలన కోసం పంపేవారు. ఇవన్నీ కావడానికి కనీసం ఆరు నెలల కాలం పట్టేది. ఆ తరువాత వారు దానిని బ్రిటీష్ రెసిడెన్సీకి పంపితే వారు పాస్పోర్ట్ మంజూరు చేసేవారు. ఇదంతా జరగడానికి తనకున్న సమయం సరిపోదని తెలిసి కూడా ముద్దు రామకృష్ణయ్య ప్రయత్నాలు ప్రారంభించాడు.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 3.
ముద్దు రామకృష్ణయ్య విదేశయాత్ర కోసం విద్యాశాఖ అనుమతి గురించి రాయండి.
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య విదేశాలకు వెళ్ళాలనుకున్న రోజుల్లో సగం జీతంతో ఇంగ్లాండ్ వెళ్లి చదువుకుంటే వచ్చాక పది సంవత్సరాలు ఉద్యోగం చేస్తానని, అలా చేయకుంటే తీసుకున్న జీతం వాపసు ఇస్తానని బాండ్ రాసి ఇవ్వాలి. అలా ఇవ్వకుంటే మేము ఇస్తామని వంద కంటే ఎక్కువ జీతం ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులు జమానత్ (పూచీ కత్తు) ఇవ్వాలని నిబంధనలు ఉండేవి. అప్పుడు వందపైన జీతం ఉన్న వారు నలుగురు మాత్రమె ఉండేవారు. అందులో ఒకరు జామీను సులభంగానే ఇచ్చారు.

ఇంకో జామీను కోసం చాల ప్రయత్నం చేయాల్సి వచ్చింది. ఐదు రూపాయల బియ్యం ఇప్పించి ఇంకో జామీను తీసుకున్నాడు. రెండు జామీనులు, సెలవు పత్రం, ఎకరారు నామాలతో ప్రధానోపాధ్యాయునికి దరఖాస్తు చేశాడు. ఆయన డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్కు పంపాడు. వారికి ఒక ప్రైవేటు లేఖ రాసి పని త్వరగా అయ్యేలా చూడాలని అభ్యర్థించాడు. వారు అలానే త్వరగా దానిని డి పి ఐ కి పంపారు కాని వారు ఆరు నెలల ముందు అనుమతి కోరలేదు కాబట్టి సెలవు దొరకదని చెప్పారు.

అక్కడి వారిని ఎంత బతిమిలాడినా పని కాలేదు చివరికి సీనియర్ డిప్యుటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ డి.పి.ఐ. హక్కాని ని కలిశారు. ఆయన రామకృష్ణయ్యను చూడగానే మీ హిందువులు నీకు సహకరించడం లేదా అని అడిగారు. ముస్లిం కమ్మంటే కాకపోతివి ఇప్పుడు ఇబ్బందులు పడవడితివి అని అన్నాడు. ఒక బ్రాహ్మణ ఉపాధ్యాయుని దగ్గర భోజనం పెట్టించాడు.

ఆయనకు రామకృష్ణయ్య విషయాన్ని వివరించి సహకరించాలని వేడుకున్నాడు. ప్రభుత్వం సెలవు ఇవ్వకున్నా సొంత ఖర్చులతో ఇంగ్లాండ్ వెళ్తానని రాసివ్వు అంటే అలా రాసిచ్చాడు. ఇతను ఇప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళకపోతే ఇంకెప్పుడూ వెళ్ళలేడు. అలా వెళ్ళకపోతే అతని భవిష్యత్ పాడవుతుంది కావున వెంటనే అనుమతించి రిలీవ్ చేయాలని ప్రధానోపాధ్యాయునికి రాశారు. అలా విద్యాశాఖ అనుమతి లభించింది.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 4.
ముద్దు రామకృష్ణయ్య విదేశయాత్రకు పాస్పోర్టు ఎలా లభించింది ? (V.Imp) (M.P)
జవాబు:
పాస్పోర్ట్ దరఖాస్తుకు పెట్టడానికి ఫోటోలు కావాలి. ఫోటోలు దిగడానికి మంచి డ్రెస్ కూడా లేదు. లాతూర్ పోలీస్ మంచి కాలర్ ఉన్న డ్రెస్తో ఫోటోలు దిగాడు. పాస్పోర్ట్ దరఖాస్తుకు పది రూపాయాల ఫీజు చెల్లించాలి. ఆ డలను స్కూల్ ఫీ నుండి వాడుకొని జీతం వచ్చాక స్కూల్ వారికి ఇచ్చాడు.

ఆ దరఖాస్తును డిప్యూటి కలెక్టర్ ద్వారా ఉస్మానాబాద్ కలెక్టర్కు పంపాడు. తన పరిస్థితి వివరిస్తూ ఒక ప్రయివేటు లెటర్ రాసి ఒక విద్యార్థి ఇచ్చిన కవర్లో పెట్టి పోస్ట్ చేశారు. ఆ కవర్లో అనుకోకుండా ఒక రూపాయి ఉండిపోయింది. అది తెలిసి కలెక్టర్ శిక్షిస్తాడేమో అని రామకృష్ణయ్య భయపడ్డాడు. సిగ్గుతో ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.

హమీద్ పాస్పోర్ట్ రావడం అంతసులభం కాదని చెప్పేవారు. స్కూల్లో సెలవు తీసుకొని పాస్పోర్ట్ పని మీద హైదరాబాదు వెళ్ళాడు. అక్కడ మున్సిపల్ సత్రంలో సామాను పెట్టి కార్యాలయాలన్నీ తిరిగేవాడు. మొదట బ్రిటీష్ రెసిడెన్సికి వెళ్ళాడు. అక్కడికి ఫైల్ రాలేదని తెలిసి పొలిటికల్ డిపార్ట్మెంటుకు వెళ్ళాడు. అక్కడ కూడా లేదని తెలిసి అక్కడి నుండి చీఫ్ సూపరింటెండెంట్ కార్యాలయానికి వెళ్ళాడు.

అక్కడ మీ దరఖాస్తు లేదని చెప్పారు కాని వెతకమని అడిగితే అక్కడే ఉంది. అయ్యా దానిని త్వరగా పూర్తి చేయండి చాల త్వరగా నేను వెళ్ళాల్సి ఉంది అని అడిగితే చాలా పెద్ద పని ఉంది కనీసం సంవత్సరం అయినా పడుతుంది అని చెప్పారు. వారిని బతిమిలాడితే శివలాల్ అనే వారు సి.ఐ.డి. సెక్షన్లో పని చేస్తున్నారు. వారిని కలిస్తే పని త్వరగా కావచ్చు అని సలహా ఇచ్చారు. దేవునికి నమస్కరించి శివకుమార్ లాలు దగ్గరికి వెళ్ళాడు. వారితో కలిసి పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ దగ్గరికి వెళ్లి రామకృష్ణయ్య పరిస్థితిని వివరించి పోలీసు రిపోర్ట్ త్వరగా హోం డిపార్ట్మెంట్కు పంపాలని అభ్యర్థించాడు.

దానికి అంగీకరించి తన క్లార్క్తో బ్రిటీష్ రెసిడెంట్ కార్యాలయానికి సిఫారసు లేఖను పంపాడు. అక్కడికి వెళ్లి అడిగితే ఇంగ్లాండులో ఏదైనా యూనివర్సిటీలో సీటు వచ్చినట్లు కాగితం చూపమన్నారు. దానితో అతనిపై బాంబు పడ్డట్లయింది. మీర్ రజా అలీ సహకారంతో రిప్లయ్ పెయిడ్ ఎక్స్ప్రెస్ టెలిగ్రాం పంపాడు. 48 గంటలు వేచి చూసి తన మిత్రునికి అప్పగించి లాతూరు చేరుకున్నాడు. 72 గంటల తరువాత రిప్లయ్ వచ్చిందని దానిని పాస్పోర్ట్ ఆఫీసులో చూపిస్తే పాస్పోర్ట్ ఇవ్వలేమన్నారని ఉత్తరం వచ్చింది.

చివరి ప్రయత్నంగా హైదరాబాదు వెళ్లి షరతులతో అడ్మిషన్ ఉన్నట్లు వచ్చిన టెలిగ్రాంను, థామస్ కుక్ కంపెనీ వారి లేఖను చూపించి పాస్పోర్ట్ ఇవ్వాలని అభ్యర్థించాడు. రెండు సంవత్సరాలు ఇంగ్లాండులో ఉండడానికి సరిపడా పదివేల రూపాయలను లేదా బ్యాంకు బాలన్స్ను చూపించాలని వారు షరతు విధించారు. మీర్ రజా సహకారంతో ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గారి సర్టిఫికేట్ చూపించి పాస్పోర్ట్ పొందాడు.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 5.
ముద్దు రామకృష్ణయ్యకు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం డబ్బు సమస్య ఎలా తీరింది ?
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య పట్టువదలని విక్రమార్కునిగా ప్రయత్నం చేసి శాఖాపరమైన అనుమతి, యూనివర్సిటిలో అడ్మిషన్, పాస్పోర్ట్ పొందాడు. కాని డబ్బు సమస్య మాత్రం తీరలేదు. తన ఇన్సురెన్స్ పాలసీలు తాకట్టు పెట్టుకొని ఎవరైనా తక్కువ వడ్డీకి అప్పు ఇస్తారేమో అని ప్రయత్నం చేశాడు కాని ఫలించలేదు.

తాలూక్ దార్ హమీద్ ఒక మార్వాడి సేట్ అయిన విష్ణుదాసన్ను పిలిచి తక్కువ వడ్డీతో పదివేల అప్పు ఇప్పించమన్నాడు. అంత కాకుంటే ఐదువేలు అదీ కాకుంటే పన్నెండు వందలు పడవ కిరాయి ఇప్పించమన్నాడు. కాని ఆయన ఐదు వందలు మాత్రమె జమ అయినాయని అంతకంటే కావని చెప్పాడు.

ఆ ఐదు వందలతో నేనేం చేసుకోవాలి అని డబ్బు వాపసు చేస్తే అతను తీసుకోలేదు. రామకృష్ణయ్య లాతూర్ వెళ్లి విష్ణుదాస్ అకౌంట్ లో డబ్బు వేశాడు. దానికి హమీద్ సంతోషించాడు. కాని నా సొమ్ము కాని దాన్ని నా అకౌంటులో ఎందుకు వేశారని విష్ణుదాస్ చిరాకుపడ్డాడు.

నాకు పాస్పోర్ట్ దొరికింది పడవ ఎప్పుడు బయలు దేరుతుంది అని థామస్ కుక్ కంపెనీకి టెలిగ్రాం ఇస్తే సెప్టెంబర్ 22న అని జవాబు వచ్చింది. కాని డబ్బు సమస్య తీరలేదు. ఈ విషయాన్ని హామీద్కు చెప్తే అతను సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లను వెంట తీసుకొని వెళ్లి విష్ణుదాస్ గోదాములను తనిఖీ చేయించాడు. దానిలో బ్లాక్ మార్క్ ధాన్యం, చెక్కర సంచులను గుర్తించి పంచనామా చేయమన్నారు.

దానితో విష్ణుదాస్ భయపడి చందా రూపంలో వచ్చిన ఐదువందలకు తాను ఒక వెయ్యి రూపాయలు కలిపి పదిహేను వందలకు హుండీ రాసిచ్చాడు. అలా మొదటి స్టేజి డబ్బు సమస్య తీరింది. రామకృష్ణయ్య ఇంగ్లాండ్ వెళ్ళడానికి 18 రోజుల పని దినాలు ఉన్నాయి.

రోజుకు నాలుగు రూపాయల చొప్పున 72 రూపాయలు వస్తాయి. వాటిని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో మంథెనకు వెళ్ళాలి అని ఆలోచించాడు. వెంకట రామారావు దగ్గర తాకట్టు పెట్టి 72 రూపాయలు తీసుకొని లాతూరు నుండి మంథెనకు, మంథెన నుండి బొంబాయికి వెళ్ళాడు. అలా సోదరునిలాగా భావించే హామీద్ సహకారంతో ముద్దు రామకృష్ణయ్య డబ్బు సమస్య తీరింది.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 6.
ఇంగ్లండులో ముద్దు రామకృష్ణయ్య విద్యాభ్యాసం ఎలా ప్రారంభమైంది ? (V.Imp) (M.P)
జవాబు:
గ్రేట్ బ్రిటన్ స్కాట్లాండ్ దిగి అక్కడనుండి ఎడింబరో యూనివర్సిటీ ఉన్న నగరానికి రైలులో వెళ్ళారు. ఆంగ్ల ఉపాధ్యాయునిగా పదకొండు సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ ఆంగ్లం మాతృభాషగా ఉన్నవారితో మాట్లాడిన అనుభవం లేదు. రిజిస్ట్రార్ దగ్గరకు వెళ్లి టెలిగ్రాఫ్ను చూపించాడు. ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్తో మాట్లాడుతా అన్నాడు. ఉండడానికి ఒక హోటల్లో రూమ్ బుక్ చేశాడు.

కొన్ని రోజులకు ఆలస్యంగా వచ్చిన కారణంగా అడ్మిషన్ దొరకదు అని చెప్పారు. అక్కడి నుండి లీడ్స్ యూనివర్సిటీలో ప్రయత్నం చేయడానికి లీడ్స్ వెళ్ళాడు. 1939లో చేసిన దరఖాస్తు చేస్తే మీరు రమ్మన్నారు. యుద్ధం కారణంగా ఆలస్యంగా వచ్చాను అని చెప్పాడు. దానికి ఇండియా హౌస్ నుండి దరఖాస్తు చేసుకొమ్మని సలహా ఇచ్చారు. మాది హైదరాబాదు రాజ్యం ఇండియా హౌసుకు సంబంధం ఉండదు అని చెప్తే అడ్మిషన్ అయిన తరువాత వారికి చెప్పొచ్చు అని ఎం.ఇడిలో చేర్చుకున్నారు.

ప్రొఫెసర్ ఫ్రాంక్ ఫీ కట్టడానికి రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్ళమన్నారు. వారు ఇరవై పౌండ్ల ఫీ కట్టమంటే అంతడబ్బు లేదని చెప్పకుండా పది పౌన్లు ఇప్పుడు కట్టి తరువాత పది పౌన్లు చెల్లిస్తానన్నాడు. దానికి వారు అంగీకరించలేదు. వారం రోజులు గడువు ఇచ్చారు. పడవలో పరిచయమైన సురేశ్ చందర్కు లేఖ రాశారు.

చివరి తేది ఉదయం పది పౌన్ల పోస్టల్ ఆర్డర్ను సురేశ్ చందర్ పంపాడు. పోస్ట్ ఆఫీసుకు వెళ్లి పది పౌన్లు తీసుకొని మొత్తం ఇరవై పౌన్లు యూనివర్సిటీ అకౌంట్ సెక్షన్లో ఇచ్చి రసీదు తీసుకున్నాడు. అలా ఇంగ్లాండ్ లీడ్స్ యూనివర్సిటీలో ఎం. ఇడి. లో అడ్మిషన్ దొరకడంతో ఇంగ్లాండులో ముద్దు రామకృష్ణయ్య విద్యాభ్యాసం ప్రారంభమైనది.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 7.
ఇంగ్లండులో ముద్దు రామకృష్ణయ్య విద్యాభ్యాసం ఎలా సాగింది ?
జవాబు:
ఇంగ్లాండ్ లీడ్స్ యూనివర్సిటీలో ఎం.ఇడి.లో ప్రవేశం లభించింది. ప్రొఫెసర్ ఫ్రాంక్ స్మిత్ గైడ్గా ఉన్నారు. ఆయన మాథ్స్, సైకాలజీ, చరిత్రలలో ఏం తీసుకుంటావని అడిగారు. హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ నిజాం స్టేట్ అనే అంశంపై అరవై వేల శబ్దాలతో చరిత్రను రెండు సంవత్సరాలలో రాయాలని నిర్ణయించారు.

ప్రొఫెసర్ ఫ్రాంక్ చాలా ప్రేమగా సలహాలు ఇచ్చేవారు. రాసిన వాటిని ఓపికగా సరిదిద్దే వారు. ముఖ్యంగా ది అనే ఆర్టికల్ వాడటం విషయంలో భారతీయులు పొరపాట్లు చేస్తారని అనేవారు. ఒక గది అద్దెకు తీసుకొని ఉండేవారు. వారికి లభించిన మాంసాహార పదార్థాలు, పంది కొవ్వు ఇంటి ఓనర్కు ఇచ్చి శాఖాహార పదార్థాలు తీసుకునే వారు. పని చేయడానికి ఎంప్లాయ్మెంటు ఎక్స్ఛేంజ్లో పేరు నమోదు చేసుకున్నారు.

రైల్వే పోర్టులో హమాలిగా పని చేసేవారు. దానిలోనుంచి కొంత మొత్తాన్ని ఇంటికి పంపేవారు. డీన్ అనుమతితో లండన్లో కలోనియల్ సెంటర్లో చేరాడు. కలోనియల్ సెంటర్లోనే నైట్ పోర్టర్గా రాత్రి పది నుండి ఉదయం నాలుగు వరకు పని చేసేవాడు. సాయంత్రం ఆరు నుండి పది వరకు హోటల్ వెయిటర్గా పని చేసేవాడు. ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఐదు వరకు లైబ్రరీలో ఐదు నుండి పది వరకు కలోనియల్ సెంటర్లో చదువుకునేవారు. ఉదయం నాలుగు నుండి ఎనిమిది వరకు పడుకునేవారు.

హోటల్లో పని చేసేటప్పుడు హైదరాబాద్ ప్రభుత్వపు అధికారి కలిశారు. వారు ప్రధాని నవాబు చత్తారికి చెప్పి వెయ్యి రూపాయలు పౌండ్లు థామస్ కుక్ ద్వారా పంపించారు. తరువాత బిబిసిలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉద్యోగం లభించింది. ఆ తరువాత వారికి ఆర్ధిక ఇబ్బందులు రాలేదు. బిబిసిలో ఉద్యోగం వచ్చాక ప్రొఫెసర్ ఫ్రాంక్ను కలిసి వారానికి ఒక రోజు వచ్చి పది గంటల క్లాస్ వినడానికి అనుమతి పొందాడు.

మిగతా పనులన్నీ మానేసి బిబిసిలో మాత్రమే పని చేస్తూ శ్రద్ధగా చదువును కొనసాగించాడు. వందల పుస్తకాలు, డాక్యుమెంట్లు చదివి నోట్స్ రాసి ప్రొఫెసర్కు చూపిస్తే ఆయన ప్రేమతో సలహాలు ఇచ్చేవారు. అలా రెండు సంవత్సరాలలో నిజాం రాజ్యంలో విద్య చరిత్ర పేరుతో దక్షిణ భారతదేశ విద్య చరిత్రను రాసి ఎం. ఇడి పూర్తి చేసుకున్నారు.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 8.
ముద్దు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణ అనుభవాలు వివరించండి. * (V.Imp) (M.P)
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య ఎన్నో ప్రయత్నాల తరువాత విద్యా శాఖ అనుమతి, యూనివర్సిటిలో షరతులతో కూడిన అడ్మిషన్, పాస్పోర్ట్, కావలిసిన డబ్బు సమకూరింది. మొత్తానికి బొంబాయి చేరుకొని థామస్ కుక్ పడవలో ప్రవేశించాడు. ఎక్కిన తరువాత కొన్ని రోజులు పడవ బొంబాయి పోర్ట్లోనే ఉంది కాని ప్రయాణికులను బయటికి వెళ్ళనివ్వలేదు. ఆ పడవ మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు.

రామకృష్ణయ్య ఉన్న క్యాబిన్లో ఆరు బెర్తులు ఉండేవి. గాలి రావడానికి కిటికీ బదులు పోర్ట్ హోల్స్ ఉన్నాయి. ఫ్యాన్లు, హాస్పిటల్, టెలిగ్రాఫ్ ఆఫీసు, దుకాణము, పిల్లలకు కిండర్ గార్టెన్ సెక్షన్, అవుట్ డోర్ ఆటలు, గ్రంథాలయం, మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. బ్రిటీషు రేవులో దిగగానే తగినంత డబ్బు లేని వారిని డిపార్ట్ చేస్తారని సహచరుడు చెప్పాడు. పడవలో ఉన్న హైదరాబాద్ నుండి వస్తున్న సురేశ్ చంద్ర ఆస్థాన పరిచయం అయ్యాడు. అతను చాల మంచివాడు.

రామకృష్ణయ్య ఇరవై రెండు పౌన్లతో ఇంగ్లాండ్ బయలుదేరాడు. పడవ బయలుదేరిన తరువాత మొదటిసారి ఏడెన్లో ఆగింది. అక్కడ చారిత్రక స్థలాలు అన్ని చూసి, గుజరాతి వాళ్ళ ఇంట్లో మంచి శాఖాహార భోజనం చేశారు. సయీద్ రేవులో కొద్ది రోజులున్నారు. అక్కడ మ్యూజియం చూశారు. జిబ్రాల్టర్ రేవు దాటిన తరువాత బ్రిటన్ భూమి కనిపిస్తుండగా దేవునికి కృతజ్ఞతాపూర్వక నమస్కారం చేశాడు. కాని డబ్బు లేకపోతే డిపార్ట్ చేస్తారేమో అనే భయం మాత్రం ఉండేది.

ఈ విషయాన్ని సురేశబాబుకు చెప్పి అతని దగ్గరున్న నూటయాభై పౌన్ల డ్రాఫ్ట్ చూపించేలా ఒప్పందం చేసుకున్నాడు. కాని విద్యార్జనకు వచ్చానని చెప్పేసరికి డ్రాఫ్ట్ చూపించాల్సిన అవసరం రాకుండానే ఓడరేవులో పర్మిటెడ్ అని స్టాంప్ పడింది. తోటి భారతీయ ప్రయాణికుల సహకారంతో సామాను దించుకున్నాడు. మొత్తానికి బ్రిటన్లోని స్కాట్లాండ్లో దిగినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

II. సందర్భసహిత వ్యాఖ్యలు

ప్రశ్న 1.
ఆస్తి కన్నా అప్పు మించింది. (Imp)
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
ముద్దు రామకృష్ణయ్య కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించాడు. వారి తండ్రి ప్రభుత్వ ఉద్యోగం వదిలి వ్యాపారం, వ్యవసాయం మొదలుపెట్టారు. చింతకాని చెరువు గుత్తా తీసుకున్నప్పుడు వారికి పెద్ద నష్టం వచ్చింది. దానితో వారికి ఆస్తి కన్నా అప్పు పెరిగిందని రామకృష్ణయ్య చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
సంపాదించిన ఆస్తికన్నా చేసిన అప్పు పెరిగిందని అర్థం.

వ్యాఖ్య :
సింగల్ టీచర్గా పనిచేసిన వారు వారికి అనుభవం లేని రంగంలో పెట్టుబడి పెట్టి అప్పుల పాలైనారని భావం.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 2.
వివాహం విద్యానాశాయ * (V.Imp) (M.P)
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశ యాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
ముద్దు రామకృష్ణయ్య గారి తండ్రి రాజన్న వ్యాపారంలో పెట్టుబడి పెట్టి అప్పులపాలయ్యారు. ఆ అప్పుల వారు ఇంటికి వచ్చి తిట్టి వెళ్ళేవారు. అది చూసిన రామకృష్ణయ్య ఏడుస్తూ తనకు విదేశాలలో చదువు చెప్పించి, తండ్రి చేసిన అప్పులు ఇల్లు అమ్మకుండా తీర్చి, తల్లిదండ్రులకు మరింత మంచి పేరు తెచ్చే విధంగా ఆశీర్వదించమని దేవునికి మొర పెట్టుకునేవాడు. డబ్బులేని వాడు చదువుకోలేడు అని, వివాహం అయినవాడు చదువుకు పనికిరాడని అందరూ భావిస్తారు. అలాంటి భావన తప్పు అని నిరూపించాలని రామకృష్ణయ్య నిశ్చయించుకున్న సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
వివాహం జరిగితే విద్య నేర్వడం కష్టం అని అర్థం.

వ్యాఖ్య :
గట్టి సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు. పాతకాలం నుండి వస్తున్న నమ్మకాలను కూడా మార్చే శక్తి మానవ సంకల్పానికి ఉందని భావం.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 3.
ప్రథమ ప్రయత్నం విఫలమయింది (Imp) (M.P)
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా- ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
ముద్దు రామకృష్ణయ్యకు విదేశాలకు వెళ్లి చదువుకోవాలని కోరిక ఉండేది. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా కోహిర్లో పని చేస్తున్నప్పుడు విదేశీ విద్య స్కాలర్షిప్ కోసం హైదరాబాద్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. మూడవ శ్రేణిలో బి.ఏ. పాస్ అయిన వారికి స్కాలర్షిప్ రాదని చెప్పారు. అప్పు అడిగితే దానికి అంగీకరించలేదు.

సొంతఖర్చులతో విదేశాలకు వెళ్ళే అవకాశం కల్పించాలని దరఖాస్తు చేస్తే కారణం చెప్పకుండా ఫైల్ మూసేశారు. ఇంతలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం అయింది అలా రామకృష్ణయ్య గారి ప్రథమ ప్రయత్నం విఫలమైనదని తెలిపిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
మొదటి ప్రయత్నం విజయవంతం కాలేదు అని అర్థం.

వ్యాఖ్య :
దేవునిపై భారం వేసి చిన్నప్పటి నుండి చదువుకున్నాడు రామకృష్ణయ్య. విదేశాలలో చదువుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు. దానిలో మొదటి ప్రయత్నం ఫలించలేదని భావం.

ప్రశ్న 4.
వారు నాకు జమానతు ఇవ్వటానికి సిద్ధపడలేదు
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
ముద్దు రామకృష్ణయ్య ప్రథమ విదేశీ యాత్ర సన్నాహాల్లో భాగంగా విద్యాశాఖ అనుమతి తీసుకోవలసి వచ్చింది. సగం వేతనం తీసుకుంటూ విదేశాలలో చదువుకొని వచ్చిన తరువాత పది సంవత్సరాలు ప్రభుత్వంలోనే ఉద్యోగం చేయాలి. అలా చేయకుంటే తీసుకున్న వేతనం వాపసు ఇవ్వాలి. దానికి 100 రూపాయల వేతనం కంటే ఎక్కువున్న వారు పూచికత్తు ఇవ్వాలి. అలాంటి వారు కేవలం నలుగురే ఉన్నారు. వారు ఎవరూ జామీను ఇవ్వడానికి సిద్ధంగా లేరని రామకృష్ణయ్య చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
వాళ్ళెవరు జామానతు అంటే పూచీకత్తు ఇవ్వడానికి అంగీకరించలేదు అని అర్థం.

వ్యాఖ్య :
100 రూపాయల కంటే ఎక్కువ వేతనం ఉన్నవారెవరూ పూచీకత్తు ఇవ్వడానికి సిద్ధంగా లేరని భావం.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 5.
ఐదు రూపాయల బియ్యం ఇప్పించితే నేను సంతకం పెట్టుతాను
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
ముద్దు రామకృష్ణయ్య ప్రథమ విదేశీ యాత్ర సన్నాహాలులో భాగంగా విద్యాశాఖ అనుమతి తీసుకోవలసి వచ్చింది. సగం వేతనం తీసుకుంటూ విదేశాలలో చదువుకొని వచ్చిన తరువాత పది సంవత్సరాలు ప్రభుత్వంలోనే ఉద్యోగం చేయాలి. అలా చేయకుంటే తీసుకున్న వేతనం వాపసు ఇవ్వాలి.

దానికి 100 రూపాయల కంటే ఎక్కువ వేతనం ఉన్న వారు పూచికత్తు ఇవ్వాలి. అలాంటి వారు కేవలం నలుగురే ఉన్నారు. వారిలో బషీరుద్ధిన్ అనే వారు సంతకం చేశారు. ఇంకొకరి సంతకం కోసం ప్రయత్నం చేస్తుంటే ఒక ముసలి ముస్లిం టీచర్ రేషన్ అందక బాధపడుతూ రామకృష్ణయ్యను ఐదు రూపాల బియ్యం ఇప్పిస్తే జామీను మీద సంతకం చేస్తానని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం ఇది.

అర్థం :
ఐదు రూపాయల విలువైన బియ్యం ఇప్పిస్తే జామీనుపై సంతకం చేస్తానని అర్థం.

వ్యాఖ్య :
వందకు పైన వేతనం వస్తున్నప్పటికీ రేషన్ కారణంగా తమ పిల్లలకు సరైన తిండి పెట్టలేని స్థితి ప్రపంచ యుద్ధ సమయంలో ఉండేది. రామకృష్ణయ్యకు ఉన్న అవసరాన్ని ఆసరాగా తీసుకొని ముసలి ముస్లిం ఉపాధ్యాయుడు ఐదు రూపాయల బియ్యం అడిగాడని భావం.

ప్రశ్న 6.
ఇప్పుడు వెళ్ళకపోతే అతడి భవిష్యత్తు చెడుతుంది.
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
ముద్దు రామకృష్ణయ్య విదేశీ పర్యటనకోసం విద్యా శాఖ అనుమతి కొరకు ప్రయత్నం చేస్తున్నపుడు జుల్ఫికర్ అలీ హక్కాని ఉన్నతాధికారిగా ఉన్నారు. అప్పటికే సెలవు ఇవ్వడానికి వీలు లేదని ఆఫీస్ నోట్ వచ్చిందని సెలవు ఇవ్వడం వీలుపడదని ఆయన అన్నారు. జీతం లేకుండా సెలవు మంజూరు చేసినా సరే అని రాసివ్వుమన్నారు. అలా రాసిచ్చిన తరువాత రామకృష్ణయ్య ఇప్పుడు పోకపోతే మరెప్పుడు పోలేడు, ఇప్పుడు వెళ్ళకపోతే అతని భవిష్యత్తు చెడుతుందని ఉద్యోగం నుండి వెంటనే రిలీవ్ చేయమని అనుమతించిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
ఇప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళకపోతే రామకృష్ణయ్య భవిష్యత్తు చెడుతుందని అర్థం.

వ్యాఖ్య :
రామకృష్ణయ్యకు సహకరించే పరిస్థితులు ఇప్పుడున్నవి. కావున ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకెప్పుడు పోలేడు. అలా వెళ్ళకపోతే అతని భవిష్యత్తు చెడిపోతుందని భావం.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 7.
సిగ్గుతో నా బాధను ఎవరికీ చెప్పుకోలేదు. (V.Imp) (M.P)
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
ముద్దు రామకృష్ణయ్య పాస్పోర్ట్ కోసం అప్లై చేశారు. దానిని ఉస్మానాబాద్ కలెక్టర్కు ఒక తాలూక్ దార్ సిఫారసుతో పంపారు. దానిని త్వరగా పరిశీలించి అనుమతి ఇవ్వాలని కలెక్టర్కు ఒక ప్రైవేటు ఉత్తరం రాసి ఒక కవర్లో పెట్టి పంపారు. ఆ కవర్లో హాస్టల్ బాలుడు ఒక రూపాయి పెట్టుకొని మరిచిపోయి ఆ కవర్ను రామకృష్ణయ్యకు ఇచ్చాడు. ఒక రూపాయి లంచం పంపినట్టు భావించి కలెక్టర్ ఏమైనా శిక్ష వేస్తాడేమో అని భయపడి, ఆ భయపడుతున్న విషయం కూడా ఎవరికైనా చెపితే పరువు పోతుందేమో అని ఎవరికీ తెలుపలేదని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
బాధ చెబితే పరువు పోతుందేమో అని ఎవరికీ చెప్పలేదని అర్థం.

వ్యాఖ్య :
తెలియక చేసినా పెద్ద పొరపాటు జరిగింది. ఆ పొరపాటుకు శిక్ష పడుతుందేమో అనే భయం, బాధ ఉన్నాయి. కాని ఆ బాధను ఎవరికైనా చెప్పుకుంటే పరువు పోతుందేమో అనే మరో అనుమానం కూడా ఉందని భావం.

ప్రశ్న 8.
ఈ మాటతో నా పైన బాంబు పడినంత బాధ అయినది.
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
ఎన్నో ప్రయత్నాల తరువాత పాస్పోర్ట్ మంజూరు చేయమని నిజాం ప్రభుత్వము సిఫారసు లేఖ ఇచ్చింది. ఆ లేఖ తీసుకొని బ్రిటీషు రెసిడెంట్ ఆఫీసుకు వెళ్తే అక్కడున్న అసిస్టెంట్ సెక్రెటరీ ఏదైనా యూనివర్సిటీలో సీటు వచ్చినట్టు కాగితం చూపిస్తేనే పాస్పోర్ట్ ఇస్తామని చెప్పాడు. ఆ మాటతో తనపై బాంబు పడ్డంత పని అయిందని రామకృష్ణయ్య చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
ఆ మాట బాంబు దెబ్బతో సమానం అని అర్థం.

వ్యాఖ్య :
ఎంతో కష్టపడ్డ తరువాత వచ్చిన అవకాశం చివరి క్షణంలో చేజారి పోతుందని తెలిసి అది బాంబు పడ్డట్టు అనిపించిందని భావం.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 9.
అప్పుడే కోర్టు నుండి సర్టిఫికెట్టు దొరికినది
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
ఎన్నో ప్రయత్నాల తరువాత పాస్పోర్ట్ మంజూరు చేయమని నిజాం ప్రభుత్వము సిఫారసు లేఖ ఇచ్చింది. ఆ లేఖ తీసుకొని బ్రిటీషు రెసిడెంట్ ఆఫీసుకు వెళ్తే అక్కడున్న అసిస్టెంట్ సెక్రెటరీ ఏదైనా యూనివర్సిటీలో సీటు వచ్చినట్టు కాగితం చూపిస్తేనే పాస్పోర్ట్ ఇస్తామని చెప్పాడు.

కొన్ని షరతులతో సీటు ఇస్తామని వచ్చిన టెలిగ్రాఫు చూపించి పాస్పోర్ట్ ఇమ్మన్నాడు. పదివేల రూపాయలు చూపించాలి, లేదా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సర్టిఫికేట్ తెమ్మన్నారు. దానిని మీర్ రజాకు చెప్తే వకీల్ నవరతన్ సహకారంతో సర్టిఫికెట్ ఇప్పించారని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం. –

అర్థం :
ఆ సందర్భంలో కోర్టు నుండి సర్టిఫికెట్ దొరికినదని అర్థం.

వ్యాఖ్య :
ఇంగ్లాండులో రెండు సంవత్సరాలు ఉండడానికి సరిపడా డబ్బు ఉందని సర్టిఫికేట్ దొరికిందని భావం.

ప్రశ్న 10.
పాలముంచినా నీట ముంచినా నీదే భారం
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
అనేక కష్టాల తరువాత విద్యా శాఖనుండి అనుమతి, యూనివర్సిటీలో షరతులతో కూడిన అడ్మిషన్, పాస్పోర్ట్ రావడం ఇలా అనేక పనులు అయినాయి. ఓడ బయలుదేరడానికి వారం రోజుల సమయం మాత్రమే ఉందని థామస్ కుక్ కంపనీ లేఖ పంపింది. కాని అన్నింటికి మించిన డబ్బు సమస్య తీరడం ఎలా అని భగవంతున్ని ప్రార్థించిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
పాలల్లో ముంచినా నీళ్ళల్లో ముంచినా దేవునిదే భారం అని అర్థం.

వ్యాఖ్య :
పాలల్లో ముంచినా అంటే కష్టాలు తీర్చినా, నీళ్ళల్లో ముంచినా అంటే కష్టాల్లోనే ఉంచిన దేవునిదే బాధ్యత అని భావం. అంతా దైవాదీనం అని అంతరార్థం.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 11.
వారి పాదాలపైన నెత్తిపెట్టి వారికి మొక్కితిని
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
రామకృష్ణయ్య తాత సనాతన సంప్రదాయవాది. సముద్ర ప్రయాణం చేస్తే భ్రష్టుడవుతాడని ఆయన “నమ్మకం. తనను చంపి విదేశాలకు వెళ్ళమని అన్నాడు. దానికి మన సంప్రదాయాలు పాటిస్తూ మీరు గీచిన గీత దాటకుండా ఉంటాను. దానికి నువ్వు అనుమతి ఇస్తేనే వెళ్త లేదంటే ఇక్కడే చస్తా అని రామకృష్ణయ్య అన్నాడు. అప్పుడు నా నోరు మూయించావురా అని అనుమతించారు. దానికి కృతజ్ఞతా పూర్వకంగా వారికి పాద నమస్కారం చేశానని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
ఆయన పాదాలపై తలపెట్టి మొక్కాడు అని అర్థం.

వ్యాఖ్య :
పాద నమస్కారం అత్యంత గౌరవ సూచకం అని భావం.

ప్రశ్న 12.
వారి ఉచ్ఛారణ, నిత్య వ్యవహారిక శబ్దాలు తెలియవు చేసిన విద్యావేత్త
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
ముద్దు రామకృష్ణయ్య గ్రేట్ బ్రిటన్ స్కాట్లాండ్లో దిగారు. ఎడింబరో యూనివర్సిటీ రిజిస్ట్రార్ కార్యాలయం వెళ్ళాడు. పదకొండు సంవత్సరాల ఆంగ్ల ఉపాధ్యాయ అనుభవం ఉన్నప్పటికీ అక్కడి వారితో ఎప్పుడూ మాట్లాడని కారణంగా వారి భాష, యాస రామకృష్ణయ్యకు కొత్తగా అనిపించిందని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
ఆంగ్లేయుల ఉచ్ఛారణ వారి వాడుక పదాలు తెలియవు అని అర్థం.

వ్యాఖ్య :
ప్రతీ భాషకు స్వంత యాస ఉంటుంది అలానే పలుకుబళ్ళు ఉంటాయి. వాటిని మాతృభాష అయిన వారి లాగా మాట్లాడటం కష్టం అని భావం.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 13.
నా జాతికి నావలన పాడుమాట రానివ్వను (V.Imp) (M.P)
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
యుద్ధ కాలంలో తిండికి బట్టలకు రేషన్ ఉండేది. ఆ సమయంలో ఇంగ్లాండుకు కొత్తగా వెళ్ళాడు కాబట్టి రామకృష్ణయ్యకు బట్టలు కూపన్లు ఎక్కువ అందినాయి. కాని కొనుక్కోవడానికి డబ్బు లేదు. ఆ సమయంలో ఒక మిత్రుడు ఆ కూపన్లను బ్లాక్ మార్కెట్లో అమ్మితే ఎక్కువ డబ్బు వస్తుందని చెప్పాడు. అలా చేయడం వల్ల భారతీయులు కూపన్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముతారనే చెడ్డపేరు వస్తుందని, అలా దేశానికి చెడ్డపేరు తెచ్చే ఏ పని తాను చేయనని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
నా భారత జాతికి నా ప్రవర్తన వల్ల చెడ్డపేరు రానివ్వను అని అర్థం

వ్యాఖ్య :
బట్టలకోసం దొరికిన కూపన్లను బ్లాక్ మార్కెట్లో అమ్మడం తప్పు అని అలా అమ్మితే దేశ వాసులందరికి చెడ్డ పేరు వస్తుందని, అలాంటి పని తాను చేయడని భావం.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 14.
తన సజెషన్స్ ప్రేమతో ఇచ్చేవారు
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
చదువుకోసం ఇంగ్లాండు వచ్చి లీడ్స్ యూనివర్సిటీలో ఎం.ఎడ్. లో చేరాడు. చదువుతో పాటు వివిధ పార్ట్ టైం ఉద్యోగాలు చేశారు. చివరికి లండన్ బిబిసిలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉద్యోగం చేశాడు. అలా ఉద్యోగం చేస్తూ లీడ్స్కు రోజు వెళ్ళడం సాధ్యం కాదని, వారంలో ఒకరోజు వచ్చి పది గంటలు వింటానని, తన కోసం కొంత శ్రమ తీసుకోవాలని వారి ప్రొఫెసర్ను కోరాడు. దానికి ప్రొఫెసర్ ఫ్రాంక్ అంగీకరించాడని, ప్రేమతో సలహాలు ఇచ్చేవాడని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
ప్రొఫెసర్ ప్రేమగా సలహాలు ఇచ్చారని అర్థం.

వ్యాఖ్య :
కష్టపడి చదివే వారికి అందరూ సహకరిస్తారని, అలానే తన ప్రొఫెసర్ కూడా ప్రేమగా సలహాలు ఇచ్చారని భావం.

నా ప్రథమ విదేశయాత్ర Summary in Telugu

రచయిత పరిచయం

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర 1
ఉపవాచకం పేరు : నా ప్రథమ విదేశయాత్ర

దేనినుండి ఇది గ్రహింపబడింది. : ఈ ఉపవాచకం, శ్రీ ముద్దు రామకృష్ణయ్య ‘నా ప్రథమ విదేశ రచన నుండి గ్రహింపబడింది.

ఉపవాచకం ప్రక్రియ : యాత్రా చరిత్ర

రచయిత : ముద్దు రామకృష్ణయ్య

కాలం : జననం : అక్టోబర్ 18, 1907 – మరణం : అక్టోబరు 21, 1985

తల్లిదండ్రులు : అమ్మాయి, రాజన్న

స్వస్థలం : కరీంనగర్ జిల్లా మంథని

విద్య :

  • 1932లో బి.ఏ. పట్టా పొందాడు.
  • 1944-46 మధ్య ఇంగ్లండు వెళ్ళి లీడ్స్ విశ్వవిద్యాలయంలో విద్యలో మాస్టర్స్ డిగ్రీ (ఎం.ఇడి.) పూర్తి చేసి వచ్చాడు.

ఉద్యోగాలు :

  • 1933 జులై 31న అప్పటి హైదరాబాదు రాష్ట్రం గుల్బర్గా జిల్లాలోని చించోలిలో మాధ్యమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితం ఆరంభించాడు.
  • 1936లో పదోన్నతిపై కోహీరుకు వెళ్ళిన నాటి నుంచి విదేశాలలో ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
  • లండన్లో చదువుకుంటున్న సమయంలోనే బిబిసిలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉద్యోగం చేశారు.
  • 1948లో గుల్బర్గా కళాశాలలో తన ఉద్యోగ ప్రస్థానం కొనసాగించాడు.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

విదేశీ పర్యటనలు :

  • 1951-52 మధ్యకాలంలో మలేషియా, ఫిలిప్పైన్స్, అమెరికా ఖండంలో 24 రాష్ట్రాలు, కెనడా, ఫ్రాన్స్, స్పెయిన్, మొరాకో వంటి దేశాలలో పర్యటించి అక్కడి విద్యావిధానం గురించి అక్కడి విద్యావేత్తలను అడిగి తెలుసుకున్నాడు.
  • 1954-55 సం॥లో ఆస్ట్రేలియా ఖండంలో పర్యటించి అక్కడి విద్యావిధానాన్ని అధ్యయనం చేశాడు. 1958లో ఒక యాత్రికుడిగా రష్యా, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలను సందర్శించి అనేక సంస్థలను పరిశీలించి వచ్చాడు.

సంస్కరణలు : వివిధ దేశాల విద్యావిధానాలను అధ్యయనం చేసిన రామకృష్ణయ్య వాటి స్ఫూర్తితో మన దేశ విద్యారంగంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు.

  • కరీంనగర్, నిజామాబాదు, హైదరాబాదు మొదలైన జిల్లాల్లో ప్రభుత్వ విద్యాశాఖాధికారిగా పనిచేశారు.
  • పాఠశాల విద్య నిర్వహణలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పాడు. ఆ విధానాలు కొన్ని నేటికీ అమలులో ఉన్నాయి.
  • నిరక్షరాస్యతా నిర్మూలన కొరకు “ఈచ్ వన్ టీచ్ వన్” ఉద్యమాన్ని జీవిత పర్యంతం కొనసాగించారు.
  • విధి నిర్వహణలోని ప్రతి అంశాన్నీ, అక్షర రూపంలో భద్రపరచి సంస్కరణలకు బీజం వేశాడు.
  • రామకృష్ణయ్య నిరంతరం తన దినచర్యను రాసుకుంటూ ఆరువేల పుటలకు పైగా అమూల్యమైన అంశాలను లోకానికి అందించారు.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ఉద్దేశం : ముద్దు రామకృష్ణయ్య విదేశాలలో విద్యాభ్యాసం కోసం చేసిన ప్రయత్నాలు, ఎన్ని కష్టాలు ఎదురైనా, పస్తులుండవలసి వచ్చినా తన పట్టుదల వీడక ఆయన సాగించిన కృషి నేటి విద్యార్థులకు స్ఫూర్తి మంత్రం ఁ లాంటి వారి చరిత్ర ద్వారా స్ఫూర్తి పొందుతారని ఉద్దేశంతో ఈ యాత్రా చరిత్రను అందిం. ‘రు.

  • ఈ యాత్రా చరిత్రలో ఆంగ్లం, ఉర్దూ పదాలు ఎక్కువగా వాడారు. నిజాం పాలనా కాలంలోని వ్యవస్థలు, ఆధికారుల పేర్లు కూడా ఇందులో తెలుసుకోవచ్చు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదని ఈ ఉపవాచకం నిరూపిస్తుంది.

TS Inter 2nd Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 9th Lesson తెలంగాణ రాష్ట్ర అవతరణ Textbook Questions and Answers.

TS Inter 2nd Year Political Science Study Material 9th Lesson తెలంగాణ రాష్ట్ర అవతరణ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావటానికి గల కారణాలు ఏవి ?
జవాబు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి దారితీసిన కారణాలు :
1. స్థానికత (Domiclle) నియమాలను మార్చివేయటం ప్రధాన ఉల్లంఘన. తెలంగాణ ప్రాంతంలో స్థానికత రావాలంటే 12 సంవత్సరాల నిరంతరాయ నివాసం ఉండాలనే నియమం ఉంది. పెద్ద మనుషుల ఒప్పందం దానిని ఒప్పుకొన్నది. అమలు విషయానికి వచ్చేసరికి దానిని 4 సంవత్సరాలకు కుదించారు. ఈ ఉల్లంఘనవల్ల 50 వేలమంది ఆంధ్ర ప్రాంతీయులు తెలంగాణ ప్రాంత ఉద్యోగాల్లోకి చేరిపోయారు. తెలంగాణ వారికి ఒక్క దెబ్బతో విద్య, ఉద్యోగాలలో అవకాశాలు పోయాయి.

2. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం మానవ అభివృద్ధిలో ఎంతో వెనుకబడింది. తెలంగాణలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న జనాభా 40.78 శాతం. 1987-88 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం తెలంగాణలో కంటె ఆంధ్ర ప్రాంతంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న జనాభా శాతం చాలా తక్కువ.

అందువల్ల తెలంగాణాలో ఆంధ్ర ప్రాంతంతో పోలిస్తే పేదరికం పెరిగిపోయింది. తెలంగాణ ప్రాంతం ఆంధ్రతో పోలిస్తే నాటికి అధిక ఆదాయం కలిగిన ప్రాంతం. ఆ అధిక ఆదాయాన్ని తెలంగాణ మిగులు అంటారు. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూలో 40 శాతానికి పైగా సమకూరుస్తుంది.

3. జై ఆంధ్ర ఉద్యమం తరువాత 1972 తరువాత ముల్కీ నిబంధనలను, తెలంగాణ ప్రాంతీయ కమిటీకి సంబంధించిన నిబంధనలను సవరించారు. తెలంగాణ ప్రాంతానికి వనరుల పంపిణీలో జరిగే అన్యాయాన్ని ప్రశ్నించే సంస్థాగత నిర్మాణమే లేకుండా చేశారు.

4. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1990 దశకం వరకు తెలంగాణ ప్రజలకు విద్యా సౌకర్యాల దుర్భరంగా ఉండేవి. తెలంగాణలో నిరక్షరాస్యత ఎక్కువ. ఇక్కడ అక్షరాస్యత శాతం చాలా కనిష్టంగా 37 శాతం మాత్రమే ఉండేది. వృత్తి విద్యా కళాశాలపైన ఇంజనీరింగ్, మెడికల్ తదితర విభాగాల కళాశాలలు కొన్నింటిని మాత్రమే స్థాపించారు. తెలంగాణ ప్రాంతంలో విశ్వవిద్యాలయాల సంఖ్య కూడా అతి తక్కువగా ఉండేది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

5. నదీజలాల వినియోగం విషయంలో తెలంగాణకు చాలా అన్యాయం జరిగింది. కృష్ణానదిపై నిర్మించిన నాగర్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు ఆంధ్ర ప్రాంతానికి మేలు చేకూర్చేందుకు మాత్రమే నిర్మించారు. నాగార్జున సాగర్ నిర్మాణం వల్ల నల్లగొండ జిల్లాలో ఎంతో వ్యవసాయ భూమి ముంపుకు గురి కాగా, ఆ జిల్లాకు సాగర్ ద్వారా అందవలసిన న్యాయబద్ధ వాటా దక్కలేదు.

6. గోదావరి పైన ప్రారంభించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు తెలంగాణకు మేలు చేస్తుంది. కానీ దీని పనులు నత్త నడక కాలంలో నడిపించారు. 20 లక్షల ఎకరాలకు నీరు అందించవలసిన ప్రాజెక్టు ఆయకట్టును 50 సంవత్సరాల రెండున్నర లక్షల ఎకరాలకు మాత్రమే అందేట్టు చేశారు. 1966 నాటికి ప్రాజెక్టు పూర్తి కావాలని ఆశించినా అది జరగలేదు.

7. తెలంగాణ ప్రాంతంలోని ప్రాజెక్టులలో నీటి కేటాయింపు హామీ ఉన్న శ్రీశైలం ఎడమగట్టు కాలువ పనులు సైతం సంతృప్తికరంగా ప్రగతి సాధించలేదు.

8. తెలంగాణలో నిజాం ప్రభుత్వ పాలనలో నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టును సరైన నిర్వహణ లేకుండా చేశారు. దాని పూడికమేట వేసి, ప్రాజెక్టు కింద ఆయకట్టు తగ్గిపోసాగింది.

9. మెదక్, నిజామాబాద్ జిల్లాలలోకి పొలాలకు నీరు అందించవలసిన మంజీరా నీళ్ళను, తాగునీటి అవసరాలకోసం హైదరాబాద్కు తరలించారు.

10. రాజోలి బండ డైవర్షన్ కెనాల్ ద్వారా నీరు, తెలంగాణలోని మహబూబ్నగర్లో 50 నుంచి 60 వేల ఎకరాలకు అందవలసి ఉండగా, ఆ జలాలను దౌర్జన్యంగా రాయలసీమకు తరలించారు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

ప్రశ్న 2.
భారత యూనియన్లో తెలంగాణ ఒక నూతన రాష్ట్రంగా ఏర్పడిన తీరును చర్చించండి.
జవాబు.
దశాబ్దాల పోరాటం తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇది 60 సంవత్సరాలుగా వివిధ రూపాలలో నడిచిన ప్రజాపోరాటాల అంతిమ విజయం. 1948 నుంచి 1956 వరకు తెలంగాణకు ప్రత్యేక ఉనికి, గుర్తింపు ఉన్నాయి. తెలంగాణకు ప్రత్యేక చారిత్రక, భౌగోళిక సంస్కృతిక గుర్తింపు, ప్రాతిపదిక ఉన్నాయి.

హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రరాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడం, ఇష్టంలేని, అసమానమైన ఇరుపక్షాలను బలవంతంగా ఒక్కటి చేయడం అనవచ్చు. అందువల్ల అవి విడిపోవడం అనే అనివార్యత, ఆ బలవంతపు కలయికలోనే ఉంది.

తెలంగాణ ప్రాంతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి అవకాశాలకు నోచుకోక, సహజవనరుల విషయంలో తీవ్రదోపిడీకి, ఇతర ప్రాంతాల అభివృద్ధికి తన వనరులను వదులుకోవాల్సిన పరిస్థితులకు గురి అయింది. పెద్ద మనుషుల ఒప్పందం పేరుతో తెలంగాణ ప్రాంతానికి కొన్ని సంరక్షణలు కల్పించినప్పటికీ, వివిధ ప్రభుత్వాల కుయుక్తుల వలన పాలనలో అవి అసంపూర్ణంగా, నిరర్థకంగా మారడం కనిపిస్తుంది.

ఆంధ్ర పాలకుల కుయుక్త నైపుణ్యాల ముందు తెలంగాణ రాజకీయ శిష్టవర్గం సరితూగలేకపోయింది. ప్రభుత్వ ఉద్యోగాలు, నదీజలాల్లో భాగస్వామ్యం, తెలంగాణ ప్రాంత మిగులు నిధుల అక్రమ తరలింపు, ముల్కీ నిబంధనల ఉల్లంఘనలు తదితర విషయాల్లో తెలంగాణకు ఎంతో అన్యాయం జరిగింది. ఈ పరిణామాలన్నీ తెలంగాణ యువతను నిరాశ నిస్పృహలకు గురిచేశాయి.

దీనితో 1969లో ప్రత్యేక తెలంగాణ ఆందోళన ప్రారంభమైంది. ఆ తరువాత కాలంలో, ఈ ప్రత్యేక రాష్ట్రవాదం తీవ్రతరమై, రాజీలేని పోరాటంగా మారి 2001-2014 మధ్యకాలంలో ఒక శక్తివంతమైన ఉద్యమంగా మారింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

భిన్న రాజకీయ భావజాలం గల శక్తులు జాయింట్ యాక్షన్ కమిటీగా రూపొందడం ఈ పోరాటంలో ఒక ప్రత్యేక అంశం. ఇది ఒక విధంగా ప్రజా రాజకీయాలలో (Mass Politics) కొత్త నేర్పు. ఈ JAC లలో రాజకీయ JAC కులసంఘాల JAC, విద్యార్థి JAC, ఉద్యోగుల JAC మొదలైనవి ప్రధానమైనవి. ఈ జాయింట్ యాక్షన్ కమిటీ వివిధ రాజకీయ బృందాలచే కాక వివిధ వృత్తుల సామాజిక శ్రేణులనూ, వివిధ కులసంఘాలనూ పోరాటంలోకి తీసుకువచ్చింది.

ఆ విధంగా ప్రత్యేక రాష్ట్ర మహాయత్వానికి విశాలమైన ప్రజామద్ధతులను కూడగట్టింది. తెలంగాణ రాష్ట్రసమితి పుట్టుక ఒక చారిత్రక సంఘటన, ప్రజా ఉద్యమాన్ని పార్లమెంటరీ రాజకీయాలలోకి ఒదిగించి, సమత్వం, న్యాయం, ఆత్మగౌరవం అన్న ప్రాతిపదికలతో దాన్ని చట్టసభల చర్చలలోకి తీసుకుపోయింది. తెలంగాణ రాష్ట్ర సాధనకు పార్టీ పుట్టుక ఎంతో పనికి వచ్చింది.

ఈ విధంగా దోపిడి, అణచివేత, ఆధిపత్యాల నుండి విముక్తి కోసం సాగించిన తెలంగాణ ఉద్యమం ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కల సాకారమయ్యింది. లోక్సభ, రాజ్యసభలలో రాష్ట్ర పునర్విభజన బిల్లు ఆమోదం పొంది మార్చి 1, 2014న రాష్ట్రపతి ఆమోదం పొందింది. దానితో 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ, భారత యూనియన్లో 29వ రాష్ట్రంగా అవతరించింది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని ప్రధానాంశాలు ఈ విధంగా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రం : తెలంగాణ 10 జిల్లాలు గల 29వ రాష్ట్రం (ప్రస్తుతం దేశంలో 28 రాష్ట్రాలు) తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి.)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం : 13 జిల్లాలు గల రాష్ట్రం.

హైదరాబాద్ ఉమ్మడి రాజధాని : 2014 నుంచి 10 సంవత్సరాలకు మించకుండా హైదరాబాద్ నగరమే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.

ఉమ్మడి గవర్నర్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉంటాడు. (ప్రస్తుతం వేరు, వేరు గవర్నర్లు ఉన్నారు.)

రాజ్యసభ సభ్యులు : తెలంగాణకు 7 మంది, ఆంధ్రప్రదేశ్కు 11 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు.

లోకసభ సభ్యులు : తెలంగాణ రాష్ట్రానికి 17 మంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25 మంది సభ్యులు ఉంటారు.

శాసనసభ సభ్యులు : తెలంగాణకు 119 మంది శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్కు 175 మంది సభ్యులు ఉంటారు.
శాసనమండలి : తెలంగాణ శాసనమండలి సభ్యులు 40, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు 50.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

ప్రశ్న 3.
తెలంగాణ ఉద్యమంలో సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి)ల పాత్రను వివరించండి.
జవాబు.
1. రాజకీయ సంయుక్త కార్యాచరణ కమిటీ (Political JAC) :
రాజకీయ సంయుక్త కార్యాచరణ కమిటీ (Political JAC) ని డిసెంబర్ 24, 2009న ఏర్పరచారు. దీనిలో ప్రధాన రాజకీయ పార్టీలైన తెలంగాణ రాష్ట్ర సమితి (TRS). భారతీయ జనతాపార్టీ (BJP), భారత కమ్యూనిస్టు పార్టీ (CPI), భారత జాతీయ కాంగ్రెస్ (INC), తెలుగుదేశం పార్టీ (TDP), సిపిఐ (ఎం.ఎల్) న్యూడెమొక్రసీ తదితర రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు తదితరులు అంతర్భాగమై ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నిర్వహించాయి.

2. కులసంఘాలు జెఎసి :
సమాజంలోని కొన్ని కులాలు సంఘాలు ఏర్పరచుకోవడం, ఈ సంఘాలన్నీ సంయుక్త కార్యాచరణ కమిటీగా ఏర్పడటం తెలంగాణ ఉద్యమంలో ఒక వినూత్న ధోరణిగా పేర్కొనవచ్చు.

తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొనడానికి సమాజంలో శతాబ్దాల తరబడి అణచివేతకు గురైన కుల సమూహాలు, వివిధ కుల వృత్తుల సమూహాలు, దళిత బహుజనులు, ఇతర వెనుకబడిన కులాలు, అల్ప సంఖ్యాక వర్గాలు ఒకే వేదిక పైకి వచ్చి, సంయుక్త కార్యాచరణ కమిటీ (JAC) గా ఏర్పడ్డాయి. ఈ విధంగా కులసంఘాలు సంఘటితమై పోరాటం చేయడాన్ని కులంపైన ఉండే ఆదిమ విశ్వాసంగా అర్థం చేసుకోరాదు.

3. విద్యార్థుల జెఎసి :
తెలంగాణ ఉద్యమం ప్రారంభించి, తీవ్రతరం చేసి వివిధ కళాశాలల విద్యార్థులు, విశ్వవిద్యాలయ విద్యార్థులు రాష్ట్ర సాధనకు ఎంతో కృషి చేశారు. వివిధ సిద్ధాంత భావజాలాలను నమ్మే విద్యార్థులు తమ మధ్యగల సైద్ధాంతిక విభేదాలను పక్కనబెట్టి తెలంగాణ ఉద్యమం నిర్వహించడానికి ఒక్కటై, పోరాడటానికి ఒక సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి)ని ఏర్పరచారు.

ఈ తరహా జెఎసిలు అనేక విశ్వవిద్యాలయాలు, కళాశాలల స్థాయిలో ఏర్పడ్డాయి. వీటిలో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు జెఎసి (OUJAC), కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థుల జెఎసి (KUJAC), ఉద్యమాన్ని క్రియాశీలంగా నడపడంలో కీలకపాత్ర పోషించాయి.

4. ఉద్యోగుల జెఎసి :
ఉద్యోగులు, కార్మికులు, శ్రామికులు, ఉపాధ్యాయులు తదితరవర్గాలు ఉద్యోగల సంయుక్త కార్యాచరణ కమిటీ (JAC) పేరుతో ఒక వేదికను ఏర్పరచుకొని అనేక నిరసన కార్యక్రమాలు, ఉద్యమాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని చురుకుగా నిర్వహించాయి.

వివిధ స్థాయిలకు చెందిన లక్షలాది మంది ఉద్యోగులు సహాయ నిరాకరణ, పెన్ డౌన్ (Pen Down), ఢిల్లీ ఛలో, మధ్యాహ్న భోజన విరామ నిరసన కార్యక్రమాలతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మితిమీరిన ఆలస్యానికి నిరసనగా ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపట్ల ఉదాసీనతకు వ్యతిరేకంగా ఉద్యోగల జెఎసి రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొన్నది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
పెద్దమనుషుల ఒప్పందంలోని నిబంధనలు తెలపండి.
జవాబు.
పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణలో రీజినల్ కౌన్సిల్ ఏర్పాటు అవుతుంది. ఒప్పందం ప్రకారం తెలంగాణలోని అభివృద్ధి, ప్రణాళికారచన, స్థానికపాలన, ప్రజారోగ్యం, ప్రాథమిక, మాధ్యమిక విద్య, తెలంగాణ ప్రాంత విద్యాలయాల్లో అడ్మిషన్లు, తెలంగాణా ప్రాంత వ్యవసాయ భూముల అమ్మకాలు, లఘు, కుటీర పరిశ్రమలను వీటిని రీజనల్ కౌన్సిల్ నిర్వహిస్తుంది.

ముల్కీ నిబంధనల ప్రకారం తెలంగాణలో 12 సంవత్సరాల శాశ్వత నివాసం ఉంటేనే వారికి తెలంగాణా ప్రాంతపు విద్యాలయాల్లో, ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.

ఇది ఒక ప్రధానమైన తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను రక్షించే చర్య, వీటితోపాటు మరో ప్రధాన రాజకీయ నిర్ణయం ఒప్పందంలో ఉన్నది. దాని ప్రకారం ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికి చెందినవాడైతే ఉపముఖ్యమంత్రి మరో ప్రాంతానికి చెందినవారై ఉండాలి.

అలాగే మంత్రివర్గంలో ఆంధ్ర-తెలంగాణ మంత్రుల నిష్పత్తి 60:40 ఉండాలని ప్రతిపాదించబడింది. అంతేకాకుండా 2 నుంచి 5 వరకు ఉండే ముఖ్యమైన మంత్రిత్వశాఖలు అంటే హోమ్, ఆర్థిక ప్రణాళిక, అభివృద్ధి, వాణిజ్యం, పరిశ్రమలు వంటి శాఖలు తెలంగాణ వారికి ఇవ్వాలి అని ఒప్పందం జరిగింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

ప్రశ్న 2.
1969 నాటి తెలంగాణ ఆందోళన గురించి వివరించండి.
జవాబు.
రకరకాల రూపాలలో పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘనకు గురి కాగా తెలంగాణాలో అసంతృప్తి రాజుకోసాగింది. ముఖ్యంగా స్థానికతకు సంబంధించిన ముల్కీ నియమాలు ఉల్లంఘించడంతో, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో జరిగిన అన్యాయానికి ఒక్కసారిగా వ్యక్తమయిన వ్యతిరేకతే 1909లో జరిగిన ‘జై తెలంగాణ ఉద్యమం’.

ఆనాటికి తెలంగాణ వారికి హక్కుగా లభించవలసిన 25,000 ఉద్యోగాలు తెలంగాణాలోకి వలసవచ్చిన ఆంధ్రావారికి వెళ్ళసాగాయి. ముల్కీ నిబంధనలను పూర్తి సరళంగా మార్చివేసి, 4 సంవత్సరాలు తెలంగాణలో ఉంటే చాలు ఎవరైనా తెలంగాణ వారే అనే వెసులుబాటు ఇవ్వడం వల్ల ఈ దుర్మార్గం జరిగిపోయింది.

ముల్కీ నియమాల ఉల్లంఘనవల్ల కాలేజీల్లో అడ్మిషన్లు కోల్పోవడం తెలంగాణ వారికి సర్వసాధారణమైపోయింది. ఖమ్మంలో ఇటువంటి సంఘటనకు వ్యతిరేకంగా మొదట నిప్పురవ్వ పుట్టింది. మెడికల్ కాలేజీలో అడ్మిషన్ విషయంలో ముల్కీ ఉల్లంఘన జరిగిందనే నిరసన, నిరాహార దీక్షగా పరిణమించింది.

1969లో అది వెనువెంటనే ఉప్మానియా విశ్వవిద్యాలయానికి పాకింది. తరువాత తెలంగాణ అంతటా విస్తరించింది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రతిపక్ష, శాసన సభ్యులూ విద్యార్థులకు మద్ధతుగా “ప్రత్యక్ష చర్యకు” పూరుకుంటామని హెచ్చరించారు.

యువకులు, మేధావులు, టీచర్లు మహిళలూ ఇలా వివిధ జనాల మద్ధతు ఉద్యమానికి తోడయింది. అధికార సభ్యుడయిన కొండాలక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమానికి మద్దతు తెలిపాడు. మదన్మోహన్, మల్లికార్జున్, పులి వీరన్న వంటి విద్యార్థి నాయకులు చురుకుగా ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు తెలంగాణ పరిరక్షణలు ఉల్లంఘనలను ప్రశ్నించి, పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలను హామీ మేరకు అమలుచేయాలని డిమాండ్ చేశారు.

ఈ పోరాటంలో 370 మంది విద్యార్థులు పోలీసు కాల్పుల్లో మృతి చెందారు. 70,000 మంది అరెస్టు అయ్యారు. కాసు బ్రహ్మానందరెడ్డి ఆధ్యర్యంలోని ప్రభుత్వ అణచివేత చర్యల ద్వారా ఉద్యమాన్ని నీరుకార్చింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

ప్రశ్న 3.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని అంశాలను తెలపండి.
జవాబు.
భారత రాజ్యాంగంలోని 3వ అధికరణ ప్రకారం, కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే సంపూర్ణ అధికారం పార్లమెంట్కు ఉంది. తెలంగాణ విషయంలో కేంద్రం ఈ ఆర్టికల్ కింద రాష్ట్ర పునర్విభజన ప్రక్రియ ఆరంభించింది. భారత రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ పునర్విభజన బిల్లును పరిశీలించి ఒక లాంఛనంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పంపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ బిల్లును తిరస్కరించింది. అంతిమంగా రాష్ట్రపతి బిల్లును పార్లమెంటుకు పంపారు.

లోక్సభ, రాజ్యసభలలో బిల్లు ఆమోదం పొంది మార్చి 1, 2014న రాష్ట్రపతి ఆమోదం పొందింది. భారత ప్రభుత్వం 2 జూన్ 2014న చట్టం అమలులోకి వస్తుందని ప్రకటించింది. దానితో 2 జూన్ 2014న తెలంగాణ, భారత యూనియన్లో 29న రాష్ట్రంగా అవతరించింది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని ప్రధానాంశాలు ఈ విధంగా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రం : తెలంగాణ 10 జిల్లాలు గల 29వ రాష్ట్రం (ప్రస్తుత దేశంలో 28 రాష్ట్రాలు, తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం : 13 జిల్లాలు గల రాష్ట్రం.

హైదరాబాద్ ఉమ్మడి రాజధాని : 2014 నుంచి 10 సంవత్సరాలకు మించకుండా హైదరాబాద్ నగరమే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.

ఉమ్మడి గవర్నర్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉంటాడు. (ప్రస్తుతం వేరు, వేరు గవర్నర్లు ఉన్నారు.)

రాజ్యసభ సభ్యులు : తెలంగాణకు 7 మంది, ఆంధ్రప్రదేశ్కు 11 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు.

లోకసభ సభ్యులు : తెలంగాణ రాష్ట్రానికి 17 మంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25 మంది సభ్యులు ఉంటారు.

శాసనసభ సభ్యులు : తెలంగాణకు 119 మంది శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్కు 175 మంది సభ్యులు ఉంటారు.

శాసనమండలి : తెలంగాణా శాసనమండలి సభ్యులు 40, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు 50.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

ప్రశ్న 4.
జూన్ 2, 2014కు గల ప్రాధాన్యతను వివరించండి.
జవాబు.
భారత రాజ్యాంగంలోని 3వ అధికరణ ప్రకారం కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే సంపూర్ణ అధికారం పార్లమెంట్కు ఉంది. తెలంగాణ విషయంలో కేంద్రం ఈ ఆర్టికల్ కింద రాష్ట్ర పనర్విభజన ప్రక్రియ ఆరంభించింది. భారత రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ పునర్విభజన బిల్లును పరిశీలించి ఒక లాంఛనంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పంపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ బిల్లును తిరస్కరించింది. అంతిమంగా రాష్ట్రపతి బిల్లును పార్లమెంటుకు పంపారు.

లోక్సభ, రాజ్యసభలలో బిల్లు ఆమోదం పొంది మార్చి 1, 2014న రాష్ట్రపతి ఆమోదం పొందింది. భారత ప్రభుత్వం 2 జూన్ 2014న చట్టం అమలులోకి వస్తుందని ప్రకటించింది. దానితో 2 జూన్ 2014న తెలంగాణ భారత యూనియన్లో 29 రాష్ట్రంగా అవతరించింది.

ఈ చట్టం రెండు రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులు ఉండాలని, నదీజదాల పంపకపు ట్రిబ్యునల్ ఉండాలని తెలిపింది.

దశాబ్దాల పోరాటం తరువాత తెలంగాణ రాష్ట్రం రూపొందించింది. జూన్ 2, 2014 చరిత్రలోనూ, తెలంగాణ ప్రజల జ్ఞాపకాలలోనూ నిలిచిపోయింది. ఈ మహా ప్రయత్నానికి కీ.శే. ప్రొఫెసర్ జయశంకర్ వంటి మేథావులు, ఎంతో ఊతం అందించారు. 2014 నాటి యు.పి.ఎ. ఛైర్పర్సన్ శ్రీమతి ఇందిరాగాంధీ, బిజెపి నాయకులు తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన మద్ధతు చాలా విలువైనది. వందలాది అమరుల త్యాగాల ద్వారా సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా మారాలని ఆశిద్దాం.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

ప్రశ్న 5.
తెలంగాణ ప్రాంతీయ సమన్వయ సంఘాల గురించి రాయండి.
జవాబు.
ఆంధ్ర, తెలంగాణ నాయకుల మధ్య జరిగిన పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ ప్రాంతీయ సమన్వయ సంఘం ఏర్పాటు ప్రధానమైంది. ప్రాంతీయ కమిటీ సలహాలను ప్రభుత్వం, రాష్ట్ర శాసనసభ అంగీకరించవలసి ఉండేది. తెలంగాణ ప్రాంతీయ సమన్వయ సంఘానికి ఈ కింది అంశాలపై అధికారం ఉంది.

  1. రాష్ట్ర శాసనసభ ఏర్పాటు చేసే అభివృద్ధి, ఆర్థిక ప్రణాళిక మొదలైన అంశాలు.
  2. స్థానిక స్వపరిపాలన ప్రభుత్వ అంశాలు నగరపాలక సంస్థల రాజ్యాంగ అధికారాలు, ట్రస్టుల అభివృద్ధి, జిల్లా బోర్డులు, జిల్లా అధికార సంస్థల అంశాలు.
  3. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, స్థానిక వైద్యశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు.
  4. ప్రాథమిక, సెకండరీ విద్య.
  5. తెలంగాణ ప్రాంతంలోని విద్యా సంస్థలలో ప్రవేశాల క్రమబద్ధీకరణ.
  6. మద్యపాన నిషేధం.
  7. వ్యవసాయ భూముల అమ్మకాలు
  8. హెచ్. కుటీర, చిన్న తరహా పరిశ్రమలు, వ్యవసాయం సహకార సంస్థలు మార్కెట్లు సంతలు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
హైదరాబాదు రాష్ట్రం.
జవాబు.
భారత యూనియన్ జరిపిన పోలీస్ చర్య పర్యవసానంగా స్వపరిపాలన కలిగిన హైదరాబాద్ రాజ్యం 1948లో హైదరాబాద్ రాష్ట్రంగా భారత యూనియన్లో విలీనమైంది. తరనంతరం జనరల్ చౌదరి రాష్ట్రపాలన పగ్గాలు చేపట్టారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటం వల్ల హైదరాబాద్ రాష్ట్ర పరిస్థితులు అల్లకల్లోలంగా ఉండేవి.

ఆ తరుణంలో భారత ప్రభుత్వం ఐ.సి.యస్. అధికారి యం.కె. వెల్లోడిని పాలనా వ్యవహారాలు చూసేందుకు నియమించింది. తదనంతరం జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రశ్న 2.
ముల్కీ నిబంధనలు.
జవాబు.
ఉర్దూ భాషలో ముల్కీ అంటే ఒక జాతి, రాజ్యం. ఆ జాతికి చెందిన ప్రజలందరిని ముల్కీలంటారు. హైదరాబాద్ రాష్ట్రంలో, 15 సంవత్సరాలు శాశ్వత ప్రాతిపదికగా నివసించిన పౌరులను ముల్కీలంటారు. ఆ మేరకు మెజిస్ట్రేట్ సమక్షంలో ఒక లిఖిత పూర్వకమైన అఫిడవిట్ మీద సంతకం చేసి తన పుట్టిన ప్రదేశానికి తిరిగి వెళ్ళనని ప్రకటించిన వారు ముల్కీలుగా పరిగణించబడతారు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

ప్రశ్న 3.
విశాలాంధ్ర.
జవాబు.
మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఆ రాష్ట్రంలోని రాజకీయ ప్రముఖులు హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు వారితో కలిసి ఒక విశాల తెలుగు రాష్ట్రం ఏర్పాటు జరగాలన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఆ ఆలోచనలను వారు విశాలాంధ్ర నినాదంగా మార్చారు.

ఈ ఆలోచనను జాతీయ స్థాయిలోని కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకత్వానికి సూచనప్రాయంగా తెలియజేసింది. అదే సమయంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా పెద్ద ఎత్తున తెలుగు మాట్లాడే వారందరికీ ఒకే తెలుగు రాష్ట్రం ఉంటే మంచిది అన్న వాదనను ‘విశాలాంధ్ర’ అనే పేరిట ప్రచారంలోకి తీసుకొచ్చింది.

ప్రశ్న 4.
1969 తెలంగాణ ఆందోళన.
జవాబు.
రకరకాల రూపాలలో పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘనకు గురికాగా తెంగాణలో అసంతృప్తి రాజుకోసాగింది. ముఖ్యంగా స్థానికతకు సంబంధించిన ముల్కీ నియమాలు ఉల్లంఘించడంతో, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో జరిగిన అన్యాయానికి ఒక్కసారిగా వ్యక్తమయిన వ్యతిరేకతే 1969లో జరిగిన ‘జైతెలంగాణ ఉద్యమం’. ఆనాటికి తెలంగాణ వారికి హక్కుగా లభించవలసిన 25,000 ఉద్యోగాలు తెలంగాణ లోకి వలసవచ్చిన ఆంధ్రావారికి వెళ్ళసాగాయి.

ముల్కీ నిబంధనలను పూర్తి సరళంగా మార్చివేసి, 4 సంవత్సరాలు తెలంగాణలో ఉంటే చాలు ఎవరైనా తెలంగాణ వారే అనే వెసులుబాటు ఇవ్వడం వల్ల ఈ దుర్మార్గం జరిగిపోయిది. 1969లో జరిగిన ‘ఉద్యమంలో 370 మంది విద్యార్థులు పోలీసు కాల్పుల్లో మృతి చెందారు. 70,000 మంది అరెస్టు అయ్యారు. కాసు బ్రహ్మానంద రెడ్డి ఆధ్వర్యలోని ప్రభుత్వం అణచివేత చర్యల ద్వారా ఉద్యమాన్ని నీరు కార్చింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

ప్రశ్న 5.
శ్రీకృష్ణకమిటీ రిపోర్టు 2010.
జవాబు.
శ్రీకృష్ణకమిటీ రిపోర్టులోని ప్రధానాంశాలు :

  1. రాష్ట్రాన్ని విభజించకుండా ఉంచుతూ, తెలంగాణ ప్రాంత సామాజికార్థికాభివృద్ధి కోసం రాజ్యాంగబద్ధమైన తెలంగాణ రీజన్ కౌన్సిలును ఏర్పాటు చేయటం.
  2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచటం.
  3. ఆంధ్రప్రదేశ్ తెలంగాణా, రాయలసీమ, కోస్తాంధ్రాలు కలిసిన రెండు రాష్ట్రాలుగా విభజించటం, హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం.

ప్రశ్న 6.
తెలంగాణ సంరక్షణల ఉల్లంఘనలు.
జవాబు.
ఎన్నో మంచి ఒప్పందాలు, ఎంతో విశ్వాసంతో మొదలైనా చిత్తశుద్ధి లేకపోతే, అమలులోకి రావు అనేది చారిత్రక సత్యం. పెద్ద మనుషుల ఒప్పందంలో పొందుపరచిన తెలంగాణ ప్రాంత సంరక్షణల ఉల్లంగన ఈ సత్యాన్నే లోకానికి తెలిపింది. మరోసారి వీటితో పలు ఉల్లంఘనలు కింది విధంగా జరిగాయి.

స్థానికత (Domicile) నియమాలను మార్చివేయటం ప్రధాన ఉల్లంఘన. తెలంగాణ ప్రాంతంలో స్థానికత రావాలంటే 12 సంవత్సరాల నిరంతరాయ నివాసం ఉండాలనే నియమం ఉండి. పెద్ద పమనుషుల ఒప్పందం దానిని ఒప్పుకొన్నది.

అమలు విషయానికి వచ్చేసరికి దానిని 4 సంవత్సరాలకు కుదించారు. ఈ ఉల్లంఘన వల్ల 50 వేలమంది ఆంధ్ర ప్రాంతీయులు తెలంగాణ ప్రాంత ఉద్యోగాల్లోకి చేరిపోయారు. తెలంగాణ వారికి ఒక్క దెబ్బతో విద్య, ఉద్యోగాలలో అవకాశాలు పోయాయి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

ప్రశ్న 7.
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్.
జవాబు.
ఆంధ్రప్రదేశ్ పనర్విభజన చట్టం 2014 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఈ చట్టం 2014 నుండి 10 సంవత్సరాలకు మించకుండా హైదరాబాద్ నగరమే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని స్పష్టంగా పేర్కొంది.

ప్రశ్న 8.
సకల జనుల సమ్మె.
జవాబు.
తెలంగాణ ఉద్యోగులు, విద్యార్థులు ఒక మహా సమ్మె తలపెట్టారు. 13 సెప్టెంబర్ నుంచి 24 అక్టోబర్ 2011 వరకు నలభై రోజులు తెలంగాణలో సాధారణ జనజీవితం స్తంభించింది. అన్ని వృత్తులవారు ఈ సమ్మెలో పాల్గొన్నారు. రోడ్లపైనే వంటావార్పులు, రైల్ రోకో, రోడ్డు దిగ్బంధాలు ఈ సమ్మె కాలంలో నిత్యకృత్యమైనాయి. ఇది చారిత్రాత్మకమైన ఉద్యమంగా
నిలిచింది.

ప్రశ్న 9.
మిలియన్ మార్ట్.
జవాబు.
17 ఫిబ్రవరి 2011లో మొదలుపెట్టి తెలంగాణ ప్రాంత ఉద్యోగులు 16 రోజులు సహాయనిరాకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడు లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగులు దీనిలో పాల్గొన్నారు.
దీని తరువాత తెలంగాణ జె.ఏ.సి. పదిలక్షల మంది (మిలియన్) జనాలను హైదరాబాద్కు ర్యాలీగా తరలి రమ్మని పిలుపునిచ్చారు.

అదే సంవత్సరం ఈజిప్ట్ లక్షలాది మంది ప్రజలు కైరోను దిగ్బంధించి అధికార మార్పు కోసం చేసిన పోరాటం స్ఫూర్తిగా దానికి మిలియన్ మార్చ్ అని పేరు పెట్టారు. మార్చ్ 10, 2011న హైదరాబాద్లో మిలియన్ మార్చ్ జరిగింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

ప్రశ్న 10.
రాజకీయ జెఎసి.
జవాబు.
రాజకీయ సంయుక్త కార్యాచరణ కమిటీ (Political JAC) : రాజకీయ సంయు కార్యాచరణ కమిటీ (Political JAC) ని డిసెంబర్ 24, 2009 న ఏర్పరచారు. దీనిలో ప్రధాన రాజకీయ పార్టీలైన తెలంగాణ రాష్ట్ర సమితి (TRS), భారతీయ జనతాపార్టీ (BJP), భారత కమ్యూనిస్టు పార్టీ (CPI), భారత జాతీయ కాంగ్రెస్ (INC), తెలుగుదేశం పార్టీ (TDP), సిసిఐ (ఎం.ఎల్), న్యూడెమొక్రసీ తదితర రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు తదితరులు అంతర్భాగమై ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నిర్వహించాయి.

ప్రశ్న 11.
విద్యార్థుల జెఎసి.
జవాబు.
తెలంగాణ ఉద్యమం ప్రారంభించి, తీవ్రతరం చేసి వివిద కళాశాలలు విద్యార్థులు, విశ్వవిద్యాలయ విద్యార్థులు రాష్ట్ర సాధనకు ఎంతో కృషి చేశారు. వివిధ సిద్ధాంత భావజాలాలలను నమ్మే విద్యార్థులు తమ మధ్యగల సైద్ధాంతిక విభేదాలను పక్కన బెట్టి తెలంగాణ ఉద్యమం నిర్వహించడానికి ఒక్కటై, పోరాడడానికి ఒక సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి)ని ఏర్పరచారు.

ఈ తరహా జెఎసిలు అనేక విశ్వవిద్యాలయాలు, కళాశాలలు స్థాయిల్లో ఏర్పడ్డాయి. వీటిలో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు జెఎసి (OUJAC), కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు జెఎసి (KUJAC), ఉద్యమాన్ని క్రియాశీలంగా నడపడంలో కీలకపాత్ర పోషించాయి.

TS Inter 2nd Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం – చారిత్రక నేపథ్యం

Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 1st Lesson భారత రాజ్యాంగం – చారిత్రక నేపథ్యం Textbook Questions and Answers.

TS Inter 2nd Year Political Science Study Material 1st Lesson భారత రాజ్యాంగం – చారిత్రక నేపథ్యం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారత జాతీయోద్యమ ఆవిర్భావానికి కారణాలను వివరించండి.
జవాబు.
ప్రజాబాహుళ్యంలో స్వయంపాలన – స్వేచ్ఛ తదితర సంవర్ధక ఆకాంక్షల ప్రాతిపదికగా భారతదేశంలో జాతీయవాదం వెళ్ళాలనుకుంది. ప్రపంచంలోని ఇతర దేశాల జాతీయోద్యమాల కంటే భారత జాతీయోద్యమం ఎంతో విశిష్టమైనదిగా మేధావులు పేర్కొంటారు.

భారతీయులకు ఒక సుసంపన్న వారసత్వం, సంస్కృతి, గత వైభవం ఉన్నాయి. సగర్వంగా స్వయంపాలన చేపట్టే సామర్థ్యం భారతీయులకు ఉంది. ఈ కారణం వల్ల భారతీయులు స్వయంపాలనకు జాతీయోద్యమాన్ని చేపట్టడంలో ఆశ్చర్యం లేదు.

మానసికంగా గతవైభవ, సుసంపన్న సంస్కృతి వారసత్వ భావనలు ఒకవైపు, బ్రిటీష్ పాలన దోపిడి- నిరంకుశత్వం మరోవైపు భారతీయులు ఒక బలమైన జాతీయోద్యమాన్ని చేపట్టడానికి దారితీసింది.

1. బ్రిటిష్ వలసవాద పాలన :
భారతదేశంలో బ్రిటీషు వారి పాలనకు అనుకూల, ప్రతికూల ప్రభావాలు రెండూ ఉన్నాయి. బ్రిటిషు పాలన భారతదేశంలో ఒక గట్టి పరిపాలన నిర్మాణాన్ని వివిధ శాఖల రూపంలో హేతుబద్ధంగా విభజించి ప్రవేశపెట్టింది. బ్రిటిషువారు పరిపాలన అవసరాల కోసం ఇండియన్ సివిల్ సర్వీస్ (ICS) ప్రారంభించారు.

భారత శిక్షా స్మృతి (Indian Penal Code), నేర విచారణ స్మృతి (Criminal Procedure Code) సంహితలను తయారుచేసి భారతదేశంలో పటిష్టమైన న్యాయవ్యవస్థ ఏర్పాటుకు కృషి చేశారు. పోస్టు – టెలిగ్రాఫ్, సమాచారవ్యవస్థ, రైల్వేలు, జాతీయ రహదారులు, ప్రధాన నీటి పారుదల ప్రాజెక్టులు ఏర్పరచి అభివృద్ధికి అవసరమయ్యే మౌలిక సదుపాయాలు ఏర్పరచారు.

2. సాంఘిక-సాంస్కృతిక పునరుజ్జీవం :
భారతదేశంలో 19వ శతాబ్దంలో వచ్చిన అనేక సాంఘిక-సాంస్కృతిక ఉద్యమాలు ప్రజల్లో సాంఘిక చైతన్యాన్ని, సాంస్కృతిక జాతీయవాద భావనలను ప్రోది చేశాయి.

ఈ ఉద్యమాలన్నింటికీ రాజా రామ్ మోహన్ రాయ్ స్థాపించిన బ్రహ్మసమాజ్ ఉద్యమం అగ్రగామిగా నిలిచి, సాంఘిక దురాచారాలైన సతీసహగమనం, బాల్యవివాహాలు, వితంతువులుగా మార్చడం, విగ్రహారాధన తదితరులకు వ్యతిరేకంగా సంస్కరణలు జరగాలని పిలుపునిచ్చింది.

దీనిని అనుసరించి ఆర్యసమాజం, రామకృష్ణ మిషన్, దివ్యజ్ఞాన సమాజం ప్రార్థన సమాజం, సత్యశోధక సమాజం, అలీఘర్ ఉద్యమం, వహాబీ ఉద్యమం తదితర సాంఘిక ఉద్యమాలు వచ్చాయి. ఈ ఉద్యమాలు ప్రజల్లో జాతీయతవాద భావనను, సాంఘిక – సాంస్కృతిక గుర్తింపును, దేశభక్తిని నింపి పరోక్షంగా ప్రజలు స్వయంపాలన కోరుకోవడానికి ప్రేరణ నిచ్చాయి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

3. మహాతిరుగుబాటు :
1857 వ సంవత్సరంలో భారతీయ సైన్యంలోని వేలాదిమంది సిపాయిలు, పదవీచ్యుతులైన సంస్థానాధీశులు, గ్రామీణ చేతివృత్తులవారు, చిన్నకారు సన్నకారు రైతులు భారతదేశంలో బ్రిటిషు వారి పాలనను అంతమొందించడానికి సమైక్య తిరుగుబాటు చేశారు.

బ్రిటిషు పాలకులు స్వదేశీ సంస్థానాల పాలకుల పట్ల సాధారణ ప్రజానీకంపట్ల చూపే నిరంకుశ పాశవిక విధానాలతో ప్రజలు విసిగి వేసారిపోయారు. ప్రత్యేకంగా లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన ‘రాజ్యాసంక్రమణ సిద్ధాంతం’ (Doctrine of Lapse) స్వదేశీ సంస్థానాధీశుల్లో ఆగ్రహం తెప్పించింది.

4. ఆంగ్లవిద్య :
భారతదేశంలో బ్రిటీషువారు ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు. దీనివల్ల సహేతుక శాస్త్రీయ భావనలు ప్రజాభిప్రాయాలను తీర్చిదిద్దాయి. ఆంగ్లవిద్య భారతీయులకు కీలక రాజకీయ ఆదర్శాలైన స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, ప్రజాస్వామ్యం తదితర విలువలపై అవగాహన కల్పించాయి. ఆంగ్ల విద్యను అభ్యసించిన మధ్యతరగతి వర్గాలు పాశ్చాత్య రాజనీతి తత్త్వవేత్తలైన జెర్మీబెంథాం.

జాన్ సూవర్ట్ మిల్, జాన్లాక్ రూసో, ఆడమస్మిత్, హెర్బర్ట్ స్పెన్సర్ తదితరుల తాత్త్విక భావజాలం నుంచి స్ఫూర్తిని పొందారు. అయితే ఈ ఆదర్శాలను, విలువలను బ్రిటిష్ వారు తమ మాతృదేశమైన ఇంగ్లాండును మాత్రమే గౌరవించి, భారతదేశంలో ఆచరించేవారు కాదు.

ఈ విధమైన ద్వంద్వప్రమాణాలు మధ్య తరగతి వర్గాలను ఆగ్రహానికి గురిచేశాయి. వారు భారత ప్రజానీకాన్ని రాజకీయ ఆదర్శాలు – విలువలపై చైతన్యపరచి, బ్రిటిష్ పాలనను ప్రశ్నించడం మొదలు పెట్టారు. ప్రధానంగా సమన్యాయ పాలన (Rule of Law) జాతీయవాదం, స్వయం ప్రభుత్వం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగత వాదం విద్యావంతులైన వర్గాల్లో ఆశలు రేకెత్తించాయి. దానితో మధ్యతరగతి విద్యావంతులు స్వయంపాలన, స్వాతంత్య్రం లక్ష్యాలుగా జాతీయోద్యమాన్ని ప్రారంభించారు.

5. ఆర్థిక దోపిడి :
బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని ఒక వలస ప్రాంతంగా మార్చి, ఆర్థిక వ్యవస్థను తమ ప్రయోజనాల కోసం దోపిడి చేశారు. బ్రిటిష్వారు భారతదేశంలోని ముడిపదార్థాలను ఇంగ్లాండ్లోని తమ పరిశ్రమలను నిర్వహించుకోవడానికి అతి స్వల్ప ధరలతో తరలించుకు పోయేవారు.

అలాగే ఇంగ్లాండ్లోని తయారైన వస్తువులను భారత మార్కెట్లో నింపివేసేవారు. భారతీయ పారిశ్రామికవేత్తల నుండి, చిన్న తరహా గ్రామీణ చేతివృత్తుల వారినుండి వస్తువులు-సేవల విషయంలో పోటీని నివారించడానికి కఠినతరమైన చర్యలకు పాల్పడేవారు.

ముఖ్యంగా బ్రిటిష్ వారు భారతీయ కుటీర పరిశ్రమలపైన, గ్రామీణ చేతివృత్తుల వారిపైన కఠిన నిబంధనలు విధించేవారు. దీనివల్ల భారతీయ చేతివృత్తులవారు తమతమ వృత్తులను వదిలివేసి, అప్పటికే ఎంతోమందితో పెనుభారంగా ఉన్న వ్యవసాయరంగంలోకి బదిలీ అయ్యారు. మరికొంతమంది గ్రామీణ చేతివృత్తుల వారు మహాసముద్రాలను కూడా లెక్కచేయక, విదేశాలకు కడుపు చేతపట్టుకొని వలసలు పోయారు.

6. కరువు కాటకాలు, పేదరికం :
భారతదేశం 19వ శతాబ్దం చివరిభాగంలో ఎన్నో కరువు కాటక పరిస్థితులను, అంట వ్యాధులను ఎదుర్కొంది. ప్రధానంగా 1873, 1875, 1877, 1895 సంవత్సరాలలో వందలాది మంది ప్రజలు కరువు కాటకాలతో, ఆకలి చావులతో ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనలు భారతీయ, సమాజంలో అశాంతిని, అలజడిని తీసుకువచ్చింది.

7. వార్తాపత్రికలు :
బ్రిటిష్ పాలన కాలంలో ఎన్నో వార్తాపత్రికలు, దినపత్రికలు, నియతకాలిక పత్రికలు భారతీయులలో జాతీయవాద భావాలను ప్రేరేపించాయి. వీటిలో ప్రముఖమైనవి అమృత బజారపత్రిక, కేసరి, పాట్రియాట్, ది హిందూ నవజీవన్, ఆంధ్రపత్రిక మొదలైనవి. ఈ పత్రికలు ప్రజలలో దేశభక్తి, జాతీయవాద భావాలను పెంచి పోషించాయి.

8. పాశవిక పాలన :
భారతదేశంలో బ్రిటిష్ పాలనా యంత్రాంగం భారతీయులకు వ్యతిరేకంగా పాశవికంగా వ్యవహరిస్తూ, నిరంకుశ చట్టాలను ప్రయోగించేది. వీటిలో దేశద్రోహ సమావేశాల చట్టం (Seditious Meetings Act), ఆయుధాల చట్టం (Arms Act), ప్రాంతీయ వార్తాపత్రికల చట్టం, (Vernacular press Act), రౌలత్ చట్టం (Rowlat Act) తదితర చట్టాలను ప్రయోగించి ప్రజల స్వేచ్ఛలను హరించేది. ప్రజల స్వేచ్ఛలను అడ్డుకోవడమేకాక, పత్రికాస్వేచ్ఛపై నిర్హేతుకమైన ఆంక్షలు విధించేది.

9. జాతి విచక్షణ :
బ్రిటిష్ ప్రభుత్వం న్యాయప్రక్రియల్లో, సివిల్ సర్వీసుల ఉద్యోగాల ప్రవేశంలో, హక్కులను అనుమతించడంలో ఎంతో వివక్షపూరిత ధోరణి ప్రదర్శించేది. జాతీయోద్యమ ప్రారంభదశలో భారతీయులు, సివిల్ సర్వీస్ ఉద్యోగాలలో ప్రవేశాలకు సంబంధించి విషయాలలో బ్రిటీషు అభ్యర్థులతో సమానంగా అవకాశాలు ఉండాలని డిమాండ్ చేసేవారు.

అలాగే బ్రిటిష్వారి వివక్షత విధానం. ఇల్బర్ట్ బిల్లు వివాదంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. భారతదేశంలోని యూరోపియన్ సమూహాలు భారతీయ న్యాయ మార్పులు తమ నేరాలను విచారించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ తరహా ధోరణులు భారతీయుల మనోభావాలను దెబ్బతీయడంతో, అది జాతీయోద్యమానికి దారితీసింది.

10. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన (Inceptino of Indian National Congress) :
భారత జాతీయోద్యమ చరిత్రలో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన (1885) ఒక మైలురాయిగా వర్ణించవచ్చు. మాజీ బ్రిటిష్ అధికారులు స్థాపించిన ఆ సంస్థ ప్రారంభంలో బ్రిటిష్ ప్రభుత్వ విధానాలను వెల్లడించడం, నిర్మాణాత్మక విమర్శలను చేయడం వంటి కర్తవ్యాలను నిర్వర్తించింది.

క్రమేణా ఆ సంస్థ భారతీయుల స్వపరిపాలన ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచింది. ప్రజా సమస్యలపై సమిష్టి పోరాటం, భారతీయుల జాతీయలో భావాలను పెంపొందించడం వంటి ఆశయాలతో జాతీయోద్యమానికి చోదక శక్తిగా ఎదిగింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 2.
భారత జాతీయోద్యమంలోని వివిధ దశలను వర్ణించండి.
జవాబు.
ప్రసిద్ధ భారతీయ చరిత్రకారుడు రమేష్ చంద్ర భారత జాతీయోద్యమాన్ని మూడు దశలుగా విభజించాడు. అవి:

  1. మితవాద దశ (1885 – 1905)
  2. అతివాద దశ (1906 -1919)
  3. గాంధీ దశ (1920 – 1947).

1. మితవాద దశ (1885 – 1905) :
భారత జాతీయ కాంగ్రెస్ లోని తొలి నాయకులు “మితవాదులు”గా పేర్కొనబడిరి. 1885 నుండి 1905 వరకు ఉన్న దశను భారత జాతీయోద్యమంలో మితవాద దశ అంటారు.

కాంగ్రెస్లోని మితవాదులు :
భారత జాతీయ కాంగ్రెస్లోని తొలి నాయకులను మితవాదులందురు. 1885 – 1905 -మధ్యకాలంలో మితవాద నాయకుల నాయకత్వంలో కాంగ్రెన్ నడిచెను. వారికి బ్రిటిష్ వారి న్యాయ విధానం నందు పూర్తి విశ్వాసము కలదు. అందువల్లనే మితవాదులు “ప్రార్థన, విజ్ఞప్తి, నిరసన” (Prayer, Petition, Protest) అనే పద్ధతులను అనుసరించి బ్రిటిష్ ప్రభుత్వంతో బేరసారాలాడే దృక్పథాన్ని అవలంభించారు.

కాంగ్రెస్ పార్టీలోని ప్రముఖ మితవాదులు దాదాబాయి నౌరోజీ, ఫిరోజే మెహతా, డి.యి. వాచా, డబ్ల్యు.సి. జెనర్జీ, ఎస్.ఎన్. బెనర్జీ, R.C. దత్తు, L.M. గోష్ మరియు G.K. గోఖలే మొదలగువారు.

మితవాదుల కోర్కెలు :

  1. సైనిక ఖర్చును తగ్గించుట
  2. ఇండియన్ కౌన్సిల్ను రద్దుచేయుట
  3. ఇంగ్లండ్ బాటు భారతదేశంలో కూడా సివిల్ పరీక్షలు నిర్వహించుట
  4. శాసన మండలిని విస్తృతపరచి భారతీయులను ఎక్కువ సంఖ్యలో సభ్యులను చేయుట.

2. అతివాద దశ (1905 – 1920) :
భారత జాతీయోద్యమంలోని రెండవ దశను అతివాద దశగా పేర్కొంటారు. 1906-1919 మధ్యకాలంలో కాంగ్రెస్లో అతివాదులు ప్రధాన పాత్ర పోషించారు. అతివాదులలో ప్రముఖులు బాలగంగాధర్ తిలక్, లాలాలజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్, అరవిందఘోష్ మొదలగువారు. వీరు అతివాద ఉద్యమంలో అగ్రశ్రేణి నాయకులు మితవాదుల సామరస్య వైఖరిని అతివాదులు విమర్శించారు.

అతివాద విధానాలు :

  1. అతివాదులలో ప్రముఖుడైన బాలగంగాధర్ తిలక్ ‘స్వరాజ్యం నా జన్మహక్కు – దాన్ని సాధించి తీరుతాను’ అని ప్రకటించెను. –
  2. అతివాదులకు బ్రిటిష్ వారి దయాదాక్షిణ్యాలపై ఏ మాత్రం విశ్వాసం లేదు. అనుకొన్నది సాధించుటయే అతివాదుల కార్యక్రమం.
  3. స్వరాజ్యం – స్వదేశీ నినాదాలను లేవనెత్తిరి.
  4. జాతీయ విద్యా విధానాన్ని సమర్థించిరి, ప్రాంతీయ భారతీయ భాషల ద్వారా విద్యాబోధన జరగాలి అని తెల్పిరి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

3. గాంధీ దశ (1920 – 1947) :
స్వాత్రంత్రోద్యమ మూడవ దశ గాంధీజీ నాయకత్వంలో నడిచింది. 1920-1947 మధ్యకాలంలో మహాత్మాగాంధీ నాయకత్వంలో జాతీయోద్యమం నడిచింది. అందుచే ఈ కాలమును గాంధీయుగం అందురు. ఈ సమయంలో క్రాంగ్రెస్ శాంతియుత పద్ధతుల ద్వారా పూర్ణస్వరాజ్య సాధన కోసం ఉద్యమించెను. విప్లవ మార్గంలో పోతున్న ప్రజలను శాంతియుత, ప్రజాస్వామిక పద్ధతుల ద్వారా నడిపించిన ఖ్యాతి మహాత్ముడికి దక్కెను.

సత్యాగ్రహం :
గాంధీజీ సత్యాగ్రహం అనే విధానాన్ని ప్రతిపాదించెను. సత్యాగ్రహం అంటే సత్యమైన సహనం. దీనికి అహింసా విధానమే మూలము.

రౌలత్ చట్టం వ్యతిరేకత :
భారత రాజకీయోద్యమాన్ని నడిపించిన తిలక్ మరణించడంతో మహాత్మాగాంధీ జాతీయోద్యమ నాయకుడయ్యెను. నాయకత్వం చేపట్టిన వెంటనే మొట్టమొదట రౌలత్ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా హర్తాళ్లు జరపవలసిందిగా గాంధీజీ పిలుపు ఇచ్చెను.

సహాయ నిరాకరణోద్యమం :
1920 ఆగస్టులో గాంధీజీ తొలిసారిగా సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించెను. ఈ ఉద్యమంలో కొన్ని అంశాలు ఇమిడి ఉన్నాయి. అవి : విదేశీ వస్తువులను బహిష్కరించుట, న్యాయస్థానాలను బహిష్కరించుట, పాఠశాలలు, కళాశాలలను, శాసనసభలను బహిష్కరించుట మొదలగునవి. ఈ అంశాల ప్రాతిపదికపై సత్యం అహింసా పద్ధతుల ద్వారా మాత్రమే పోరాటం సాగించాలని గాంధీజీ పిలుపునిచ్చెను.

శాసనోల్లంఘన ఉద్యమం:
జాతీయోద్యమ చరిత్రలో శాసనోల్లంఘన ఉద్యమం ఒక గొప్ప మలుపు. 1930 మార్చితో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం ద్వారా ఈ ఉద్యమాన్ని ప్రారంభించెను. గుజరాత్ తీరంలోని దండి గ్రామంలో ఉప్పు తయారుచేయడం ద్వారా ఉప్పు చట్టాన్ని గాంధీజీ అతిక్రమించెను. ఈ ఉద్యమంలో భాగంగా విదేశీ వస్తు బహిష్కరణ, ఖద్దరు ధరించుట, మద్యపాన నిషేధం, జెండా ఆవిష్కరణ వంటి కార్యక్రమాలు చేపట్టారు.

గాంధీ – ఇర్విన్ ఒడంబడిక :
మహాత్మాగాంధీ – వైశ్రాయ్ ఇర్విన్ల మధ్య ఒక అవగాహన కుదరడంతో శాసనోల్లంఘన ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు.

క్విట్ ఇండియా ఉద్యమం :
క్రిప్స్ రాయబారం విఫలం కావడంతో కాంగ్రెస్ గాంధీజీ అధ్యక్షతన 1942, ఆగస్టు 8న బొంబాయిలో సమావేశమై క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించెను. చిట్టచివరి స్వాతంత్ర్యోద్యమ ఘట్టం క్విట్ ఇండియా ఉద్యమం. ఈ తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ గాంధీజీ తన ఉపన్యాసాన్ని “విజయమో – వీరస్వర్గమో” (Do or Die) అంటూ ముగించారు. ఈ పిలుపు ప్రజల్లో ఉద్రేకం, ఉత్సాహం నింపి పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగడానికి దారితీసెను.

చివరగా క్యాబినెట్ మిషన్ ప్లాన్, మౌంట్ బాటన్ సూచనల మేర దేశ విభజనకు కాంగ్రెస్ నాయకులు అంగీకరించిరి. భారతదేశం, భారత్-పాకిస్తాన్లుగా విడిపోయెను. 1947, ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్య్రమును పొందెను.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 3.
భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రధాన అంశాలను, విమర్శనాత్మకంగా విశ్లేషించండి.
జవాబు.
1919 చట్టంలోని లోపాలను సరిదిద్దడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని రూపొందించెను. కొన్ని ఇతర కారణాలు కూడా ఈ చట్ట రూపకల్పనకు దోహదం చేశాయి. సైమన్ కమిషన్ నివేదిక పరిణామాలు, స్వరాజ్యవాదుల ఉద్యమాలు, నెహ్రూ నివేదిక, జిన్నా నివేదిక, గాంధీజీ ఆధ్వర్యంలో సాగిన శాసనోల్లంఘన ఉద్యమం మొదలగునవి ఈ చట్టం చేయడానికి దారితీసిన కొన్ని ముఖ్యమైన అంశాలు. ఈ చట్టం చాలా విస్తృతమైనది. ఇందులో 321 అధికరణాలు, 13 షెడ్యూళ్ళు ఉన్నాయి.

ప్రధానాంశాలు :
1. 1935 భారత ప్రభుత్వ చట్టం అతివివరణాత్మకమైన శాసనం.

2. బ్రిటిష్ పాలిత ప్రాంతాలలోనూ, సంస్థానాలలోనూ అఖిల భారత సమాఖ్య అనే ఒక నూతన వ్యవస్థను ఈ చట్టం ఆవిష్కరించెను.

3. పరిపాలనాంశాలను మూడు జాబితాలుగా విభజించెను. అవి :
i) 59 పాలనాంశాలతో కూడిన కేంద్ర జాబితా (Central list)
ii) 54 పాలనాంశాలతో కూడిన ప్రాంతీయ జాబితా (Provincial list)
iii) 36 పాలనాంశాలతో కూడిన ఉమ్మడి జాబితా (Concurrent list)

ఈ మూడు జాబితాలలో పేర్కొనని అవశిష్టాంశాల (Residuary items) పై శాసనాధికారం గవర్నర్ జనరల్ కు ఇచ్చెను.
ఎ) కేంద్ర జాబితాలో ఉన్న అంశాలపై కేంద్ర ప్రభుత్వానికే శాసనాధికారం ఉంటుంది.
ఉదా : విదేశీ వ్యవహారాలు, కరెన్సీ, నాణేలు, సైనిక దళాలు మొదలగు అంశాలు.
బి) ప్రాంతీయ లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాంతీయ జాబితాలో ఉన్న అంశాలపై శాసనాధికారం కలదు.
ఉదా : పోలీస్, విద్య, ప్రాంతీయ పబ్లిక్ సర్వీసులు మొదలైన అంశాలు.
సి) ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ శాసనం చేయవచ్చును.
ఉదా : క్రిమినల్ లా & ప్రొసీజర్, సివిల్ ప్రొసీజర్, వివాహాలు, విడాకుల వంటి అంశాలు

4. కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టిరి. కేంద్ర కార్యనిర్వహణాధికారం గవర్నర్ జనరల్కు ఇచ్చారు. కేంద్ర పాలనాంశాలను రిజర్వుడ్ ట్రాన్స్ఫర్డ్ పాలనాంశాలని విభజించారు. దేశ రక్షణ, మత విషయాలు, విదేశీ వ్యవహారాలు మొదలైన ప్రాముఖ్యం ఉన్న అంశాలు అన్నీ రిజర్వుడ్ పాలనాంశాలు.

వీటిని గవర్నర్ జనరల్ నిర్వహిస్తాడు. మిగిలిన అంశాలు ట్రాన్స్ఫర్డ్ అంశాలు. వీటిని ప్రజాప్రతినిధులైన శాసనసభలోని మంత్రులు నిర్వహిస్తారు. ఆరు రాష్ట్రాల్లో ద్వంద్వ సభా విధానాన్ని అమలు చేయడం జరిగెను.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

5. రాష్ట్రాల్లో స్వయం పాలనా ప్రతిపత్తి ప్రవేశపెట్టడం జరిగెను. అక్కడ బాధ్యతాయుత ప్రభుత్వం కూడా నెలకొల్పారు. గవర్నర్లకు విశేషమైన విచక్షణాధికారాలు ఇచ్చారు.

6. ఫెడరల్ న్యాయస్థానాన్ని ఢిల్లీలో స్థాపించారు. దానికి 1935 చట్టాన్ని కూడా వ్యాఖ్యానించే అధికారం కలదు.

7. 1858 చట్టము సృష్టించిన భారత మండలిని రద్దు చేశారు.

8. 1935 చట్టాన్ని సవరించడానికి బ్రిటిష్ పార్లమెంట్క అధికారం ఇచ్చారు. సంస్థానాలకు ప్రత్యేక హోదా కల్పించారు.

9. గవర్నర్ జనరల్కు విస్తృత అధికారాలు ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో గవర్నర్ జనరల్ సమాఖ్య వ్యవస్థను రద్దు చేయవచ్చు.

10. ఓటు హక్కును ఇతర వర్గాలకు కూడా విస్తరించారు.

విమర్శ :
భారత రాజ్యాంగ చరిత్రలో భారత ప్రభుత్వ చట్టం, 1935 ప్రగతి శీలక చట్టమని రాజ్యాంగ వాదులు భావించారు. ఎందుకంటే ఈ చట్టం ఆధారంగానే స్వతంత్ర భారత రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం జరిగింది. పూర్వ చట్టాలతో పోల్చితే ఈ చట్టం భారతదేశంలో మరింత బాధ్యతాయుత ప్రభుత్వ నిర్మాణానికి, స్పష్టమైన శాసన నిర్మాణ, న్యాయశాఖల అధికారాల పరిధిని విస్తృతం చేసింది.

అయితే ఈ చట్టాన్ని భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, నిశితంగా విమర్శించాయి. భారత వ్యతిరేక చట్టంగా సి.వై.చింతామణి పేర్కొన్నాడు. ఈ చట్టం ప్రాథమికంగా చెడిపోయిన, ఏ మాత్రం ఆమోదయోగ్యం కాని చట్టంగా మహ్మదాలీ జిన్నా విమర్శించాడు.

ఇక జవహర్లాల్ నెహ్రూ ఈ చట్టం గురించి వ్యాఖ్యానిస్తూ సామ్రాజ్యవాద దృక్పథం ఉన్న బ్రిటన్ రాజనీతిజ్ఞతతో భారతదేశం కోసం రూపొందించిన చట్టంగా వర్ణించాడు. రాజేంద్రప్రసాద్ మినూమసానీ, కె.టి.షా వంటి ప్రముఖ నాయకులు ఈ చట్టంలో ఎన్నో అసంగతమైన విషయాలున్నాయని వ్యాఖ్యానించారు.

ఇక బ్రిటన్లో క్లిమెంట్ అట్లీ వంటి ప్రతిపక్ష నాయకులు కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకించారు. ఏమాత్రం ఇష్టంలేని ప్రాంతాలను కలిపి ఉంచే ఉద్దేశంతో రూపొందిన, వింత పోకడలు గల రాజ్యాంగ సమ్మేళనంగా కొందరు ఈ చట్టాన్ని పరిగణించారు. భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో గోచరించే భూస్వామ్య వ్యవస్థను దృఢతరం చేయడానికి బ్రిటిష్ పాలకులు ఆడిన నాటకమే ఈ చట్టమని సుభాష్ చంద్రబోస్ విమర్శించాడు.

ఈ చట్టం సూచించిన అఖిల భారత సమాఖ్య ఆచరణ సాధ్యం కాదని కొందరు వాదించారు. ప్రతిపాదిత సమాఖ్యలో పాల్గొనే వివిధ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల, సంస్థానాధికారుల స్థాయిలలో తేడాలుండటం, రాష్ట్రాలు, సంస్థానాల మధ్య పాలనపరమైన వైవిధ్యాలు ఉండటంతో సమాఖ్య వ్యవస్థ సజావుగా కొనసాగదని వారు భావించారు.

అలాగే గవర్నర్ జనరల్, రాష్ట్ర గవర్నర్లకు మితిమీరిన అధికారాలను ఈ చట్టం కల్పించడంతో భారతీయులు కోరుకున్న స్వయంప్రతిపత్తి ఒక నినాదంగా మిగిలిపోయింది. ఈ చట్టం ద్వారా మైనారిటీలకు కల్పించిన ప్రత్యేక రక్షణలు భారతదేశంలో జాతీయతాభావ వికాసానికి అవరోధంగా నిలిచాయి.

ఈ చట్టం భారత వ్యవహారాల కార్యదర్శిని ఒక రాజులాగా వ్యవహరించే అవకాశాన్ని ఇచ్చింది. ఇక కేంద్ర శాసనసభలోని రాష్ట్రాల మండలి (Council of State) ని ఈ చట్టం ప్రగతి నిరోధక భావాలు, దుష్టజనకూటమి, సాంప్రదాయ భావాలు ఉన్న రాజకీయ నాయకుల నిలయంగా రూపొందించింది. మొత్తంమీద ఈ చట్టం ద్వారా కల్పించిన రక్షణలన్నీ కంటితుడుపు చర్యగా మిగిలిపోయాయని చెప్పవచ్చు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 4.
భారత రాజ్యాంగ ప్రధాన లక్షణాలను వివరించండి.
జవాబు.
భారత రాజ్యాంగ ప్రధాన లక్షణాలు :

1. అతిపెద్ద లిఖిత, వివరణాత్మక రాజ్యాంగం :
భారత రాజ్యాంగం ఒక అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ రూపకల్పన చేసి, చర్చించి మౌలిక చట్టంగా తయారు చేసింది. భారత రాజ్యాంగ రచనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది.

భారత రాజ్యాంగాన్ని 395 నిబంధనలు, 22 భాగాలు. 12 షెడ్యూళ్ళతో ఏర్పరచారు. భారత రాజ్యాంగం అతిపెద్ద పరిమాణంలో రూపొందడానికి ఎన్నో కారణాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తదితర పాలన ఏర్పాట్ల గురించి ఒకే రాజ్యాంగంలో చర్చించారు.

అలాగే సమాజంలోని షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలు, ఇతర వెనుకబడ్డ వర్గాలు మొదలైన వారి ప్రయోజనాల పరిరక్షణకు వివిధ ఏర్పాట్లు రాజ్యంగంలో పొందుపరచారు. ఇదే క్రమంలో ప్రత్యేక రాజ్యాంగబద్ధ సంస్థలైన ఎన్నికల సంఘం, యూనియన్ పబ్లిక్ సర్వీసు కమీషన్, రాష్ట్రపబ్లిక్ సర్వీసు కమీషన్ల ఏర్పాట్లు అధికారాలపై సంగ్రహ వివరణ రాజ్యాంగంలో ఉంది.

ఇదే విధంగా భారత రాజ్యాంగం పౌరులకు గల ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, నిర్దేశక నియమాలు, కేంద్ర – రాష్ట్ర సంబంధాలు, అధికార భాష – వివిధ ప్రాంతీయ భాషల గుర్తింపుకు సంబంధించిన అంశాలను విస్తృతంగా చర్చించింది. వీటన్నింటివల్ల భారత రాజ్యాంగం పరిమాణంలో పెద్దదిగా తయారైంది.

2. సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం:
భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించడంతో భారతదేశం ఒక సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మారింది. భారతదేశం పూర్తి సాధికారతతో స్వేచ్ఛ – స్వాతంత్య్రాలలో దేశీయంగా బాహ్యంగా నిర్ణయాలు తీసుకొనే సార్వభౌమాధికారాన్ని పొందింది.

రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాద లౌకిక అనే పదాలను రాజ్యాంగం 42వ సవరణ ద్వారా 1976 లో పొందుపరచారు. దీనివల్ల రాజ్యం ప్రజలందరికీ సాంఘిక-ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందిస్తూ, అన్ని రకాల దోపిడీలను అంతం చేస్తుంది.

3. విశిష్ట ఆశయాలు లక్ష్యాలు :
భారత రాజ్యాంగం ఎన్నో విశిష్ట ఆశయాలు-లక్ష్యాలను కలిగి ఉంది. భారత రాజ్యాంగం తన పౌరులందరికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అన్ని విషయాల్లో అందిస్తుంది. అలాగే పౌరులందరికీ ఆలోచనా స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ, నమ్మకం, విశ్వాసం, ఆరాధన తదితర విషయాల్లో స్వేచ్ఛలకు హామీ ఇస్తుంది.

ఇదే క్రమంలో భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమాన హోదా, సమాన అవకాశాలు కల్పిస్తుంది. భారత రాజ్యాంగం ప్రజలలో సౌభ్రాతృత్వాన్ని పెంపొందించి, వ్యక్తి గౌరవాన్ని – జాతి సమైక్యత, సమగ్రతలను పరిరక్షించడానికి హామీ ఇస్తుంది.

4. దృఢ – అదృఢల మేలు కలయిక :
భారత రాజ్యాంగాన్ని సవరించడానికి దృఢ అదృఢ పద్ధతులు ఉన్నాయి. కేంద్ర పార్లమెంట్ రాజ్యాంగంలోని కొన్ని భాగాలను సాధారణ మెజారిటీతో సవరించే అధికారాన్ని కలిగి ఉంది. ఉదాహరణకు భారత సమాఖ్యలో నూతన రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల సరిహద్దులు మార్చడం, పౌరసత్వానికి సంబంధించిన నియమ నిబంధనలు మొదలైన వాటిని సాధారణ మెజారిటీతో సవరించవచ్చు.

ఇది అదృఢ పద్ధతి. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, నిర్దేశక నియమాలు తదితర అంశాలను పార్లమెంట్లో మూడింట రెండువంతుల మెజారిటీ (2/3) తో సవరించవవచ్చు. ఇది దృఢ పద్ధతి. రాజ్యాంగంలోని మరికొన్ని అంశాల సవరణకు ఒక ప్రత్యేక మెజారిటీ పద్ధతి ఉంది. దీని ప్రకారం పార్లమెంట్లోని రెండు సభల్లో 2/3 మెజారిటీతోపాటు, కనీసం 50% రాష్ట్రాల శాసన సభలు సవరణకు ఆమోదించాలి. ఇది చాలా సంక్లిష్టమైన దృఢ పద్ధతి.

5. ఏకకేంద్ర – సమాఖ్య లక్షణాలు :
భారత రాజ్యాంగం భారతదేశాన్ని రాష్ట్రాల సమ్మేళనం (Union of States) గా అభివర్ణిస్తుంది. భారతదేశాన్ని ఏకకేంద్ర స్ఫూర్తితో సమాఖ్య వ్యవస్థగా ఏర్పరచింది. అంటే సాధారణ పరిస్థితుల్లో సమాఖ్య విధానాన్ని, అత్యవసర పరిస్థితుల్లో ఏకకేంద్ర నిర్మాణాన్ని పేర్కొంటుంది.

భారత రాజ్యాంగంలో ఏకకేంద్ర లక్షణాలైన ఏక పౌరసత్వం, ఏకీకృత న్యాయవ్యవస్థ, ఒకే ఒక్క ఎన్నికల సంఘం, రాష్ట్రాల పరిపాలనలో అఖిల భారత సర్వీస్ ఉద్యోగుల పాత్ర, కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్లు ఏజెంట్లుగా ఉండడం, రాజ్యాంగ సవరణ ప్రక్రియలో పార్లమెంట్కు గల విశేష అధికారాలు తదితర లక్షణాలు ఉన్నాయి.

ఇదే క్రమంలో భారత రాజ్యాంగంలో సమాఖ్య లక్షణాలైన లిఖిత దృఢ-సర్వోన్నత రాజ్యాంగం రెండు స్థాయిల్లో (కేంద్ర – రాష్ట్ర) ప్రభుత్వాలు, ద్విసభా పద్ధతి, కేంద్రపార్లమెంట్ ఎగువ సభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తదితర లక్షణాలు ఉన్నాయి.
ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు కె.సి. వైర్ భారతదేశాన్ని అర్థసమాఖ్యగా వర్ణించాడు.

6. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం:
భారత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వంలో, వివిధ రాష్ట్రాల స్థాయిలో బ్రిటీష్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది. అయితే బ్రిటీష్ తరహా వారసత్వ రాజరికాన్ని భారతదేశం స్వీకరించలేదు. దీనికి బదులుగా భారత రాజ్యాంగ నిర్మాతలు ఐర్లాండ్ తరహాలో ఎన్నికయ్యే అధ్యక్షుడు ఉండే వ్యవస్థను సూచించారు.

అలాగే బ్రిటీషు రాజకీయ వ్యవస్థ మిగిలిన ఇతర లక్షణాలైన రెండు రకాల కార్యనిర్వాహక నాయకత్వం (రాష్ట్రపతి – ప్రధానమంత్రి), కేంద్రంలో ప్రధానమంత్రి నాయకత్వం, సమిష్టి బాధ్యత నియమం, కేంద్ర కార్యనిర్వాహక వర్గం (మంత్రిమండలి) పై పార్లమెంటు నియంత్రణ, రాష్ట్రపతికి నామమాత్రపు అధికారాలు తదితర లక్షణాలను భారత రాజ్యాంగం స్వీకరించింది. ఇదే తరహా రాజకీయ వ్యవస్థను వివిధ రాష్ట్రాలకు కూడా అన్వయింపజేసింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

7. స్వతంత్ర న్యాయశాఖ:
భారత రాజ్యాంగం భారతీయులకు ఒక స్వతంత్ర, ఏకీకృత న్యాయశాఖను అందించింది. అందువల్ల భారత సుప్రీంకోర్టు వివిధ హైకోర్టులు శాసన నిర్మాణ శాఖకు – కార్యనిర్వాహక వర్గానికి భయం లేదా అనుకూలతలు లేకుండా స్వతంత్రంగా వ్యవహరించే అధికారాన్ని కలిగి ఉన్నాయి.

8. రాజ్య విధానాలపై ఆదేశక సూత్రాలు :
భారత రాజ్యాంగంలోని నాలుగో భాగంలో 36వ నిబంధన నుండి 51వ నిబంధన వరకు రాజ్యవిధానాల రూపకల్పనలో రాజ్యాంగ ఆదేశక సూత్రాలు పొందుపరచారు. భారత రాజ్యాంగ నిర్మాతలు వీటిని ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి స్వీకరించారు.

ఈ ఆదేశక సూత్రాలు భారతదేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగా, గాంధేయవాద దేశంగా, ఉదారవాద రాజ్యంగా రూపొందిస్తాయి. రాజకీయ భావజాలాలతో సంబంధం కాకుండా కేంద్ర ప్రభుత్వంలోని – రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టే అన్ని పార్టీలు ఈ మూల సూత్రాలను తప్పనిసరిగా అమలు చేయాలి.

9. ప్రాథమిక హక్కులు:
భారత రాజ్యాంగ ఉదారవాద ప్రజాస్వామ్య స్వభావం ప్రాథమిక హక్కుల్లో ప్రతిబింబిస్తుంది. ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగంలోని మూడో భాగంలో 12వ నిబంధన నుండి 35వ నిబంధన వరకు పొందుపరచారు. భారత పౌరులు కొన్ని హేతుబద్ధమైన పరిమితులకు లోబడి హక్కులను వినియోగించుకోవచ్చు. ఈ హక్కుల విషయంలో ప్రభుత్వంతో సహా ఎవ్వరి జోక్యాన్ని అనుమతించడం జరగదు. దేశ అత్యున్నత న్యాయవ్యవస్థ పౌరులకు హక్కుల పరిరక్షణలో తోడ్పడుతుంది.

రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఏడురకాల ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో ఉండేవి. ప్రస్తుతం ఇవి ఆరు హక్కులుగా ఉన్నాయి. అవి

  1. సమానత్వపు హక్కు
  2. స్వాతంత్రపు హక్కు
  3. పీడనను, దోపిడిని వ్యతిరేకించే హక్కు
  4. మత స్వేచ్ఛ హక్కు
  5. విద్య – సాంస్కృతిక హక్కులు
  6. రాజ్యాంగ పరిహార హక్కు
    అయితే ఆస్తి హక్కును 44వ రాజ్యాంగ సవరణ ఆధారంగా ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు.

10. ప్రాథమిక విధులు :
భారత రాజ్యాంగ సంస్కరణలపై స్వర్ణసింగ్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు భారత రాజ్యాంగం లోని నాలుగు-ఎ (Part – IV A) భాగంలో 51 ఎ (51 A) నిబంధనలో ప్రాథమిక విధులను పొందుపరచారు. మొదట్లో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ఆధారంగా పది ప్రాథమిక విధులుగా వీటిని ఏర్పరచారు. అయితే ఆ తరువాత భారత రాజ్యాంగ 86వ సవరణ చట్టం (2002) ఆధారంగా మరో ప్రాథమిక విధిని వీటికి జత చేశారు.

11. ఏక పౌరసత్వం :
భారత రాజ్యాంగం భారతదేశంలో జన్మించిన వారందరికీ, లేదా ఒక నిర్దిష్ట కాలంపాటు -భారతదేశంలో నివసిస్తున్న వారికి ఏకపౌరసత్వాన్ని అందిస్తుంది. భారతదేశ సమైక్యత – సమగ్రతను పరిరక్షించడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. భారతదేశంలో విచ్చిన్నకర ధోరణులు తలెత్తకుండా రాజ్యాంగ నిర్మాతలు ఏక పౌరసత్వం ఏర్పాటు చేశారు.

12. సార్వజనీన వయోజన ఓటు హక్కు:
భారత రాజ్యంగం భారతదేశ వయోజన పౌరులందరికీ సార్వజనీన ఓటుహక్కును కల్పించింది. దీని ఫలితంగా భారత పౌరులు కులం, మతం, భాష, ప్రాంతం, లింగ విచక్షణ, వర్ణం, జాతి సంపద తదితర అంశాల ఆధారంగా ఉండే విచక్షణలకు అతీతంగా, కేవలం వయోపరిమితితో మాత్రమే ఓటు హక్కును పొందుతారు.

భారతపౌరులు ఈ హక్కును సక్రమంగా వినియోగించుకోవచ్చు. వయోజన ఓటింగ్ వయస్సు 1950-1987 మధ్య కాలంలో 21 సంవత్సరాలుగా ఉండేది. అయితే ఈ వయోపరిమితిని భారత రాజ్యాంగ 61వ సవరణ ఆధారంగా 1988లో 18 సంవత్సరాలకు తగ్గించారు.

13. ద్విసభా పద్ధతి :
భారత రాజ్యాంగం జాతీయ స్థాయిలో ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టింది. దీనికి అనుగుణంగా భారత పార్లమెంట్లో లోక్సభ (దిగువసభ), రాజ్యసభ (ఎగువసభ) అనే రెండు సభలుంటాయి. లోక్సభ ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నికయ్యే ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.

14. పంచాయతీ రాజ్ – నగరపాలిక చట్టాలు :
దీనిని భారత రాజ్యాంగ విశిష్ట లక్షణంగా పేర్కొనవచ్చు. మహాత్మాగాంధీ ఎన్నో సందర్భాలలో స్థానిక స్వపరిపాలన సంస్థలను ఏర్పాటుచేసి, బలోపేతం చేయవలసిన అవసరాన్ని పేర్కొన్నాడు. ఈ సంస్థల కార్యసాధకతను పెంపొందించడానికి తగిన సదుపాయాలు అవకాశాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని విశ్వసించాడు. స్వాతంత్య్రానంతరం స్థానిక స్వపరిపాలన సంస్థల పటిష్టతకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. వీటన్నింటి ఫలితంగా భారత నగరపాలిక చట్టం 1992లో రూపొందింది.

15. షెడ్యూలు కులాలు, తెగల అభ్యున్నతికి ప్రత్యేక నిబంధనలు :
భారత రాజ్యాంగం భారతదేశంలోని షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల అభ్యున్నతికి కొన్ని నిర్దిష్ట మార్గదర్శకాలను సూచించింది. కేంద్రప్రభుత్వం – వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడ్డ వర్గాల అభ్యున్నతికి పెంపొందించే చర్యలను సమీక్షించడానికి వీలుగా స్వతంత్ర హోదాగల కమీషన్లు ఏర్పాటు చేయాలని సూచించింది. వాటి సిఫార్సులకు అనుగుణంగా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించడానికి అవకాశం కల్పించింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారత జాతీయోద్యమ ఆవిర్భావానికి ఏవేని నాలుగు కారణాలను తెలపండి.
జవాబు.
1. సాంఘిక-సాంస్కృతిక పునరుజ్జీవం :
భారతదేశంలో 19వ శతాబ్దంలో వచ్చిన అనేక సాంఘిక సాంస్కృతిక ఉద్యమాలు ప్రజల్లో సాంఘిక చైతన్యాన్ని, సాంస్కృతిక జాతీయవాద భావనలను ప్రోది చేశాయి. ఈ ఉద్యమాలన్నింటికి రాజా రామ్మోహన్రాయ్ స్థాపించిన బ్రహ్మసమాజ్ ఉద్యమం అగ్రగామిగా నిలిచి, సాంఘిక దురాచారాలైన సతీసహగమనం, బాల్యవివాహాలు, వితంతువులుగా మార్చడం, విగ్రహారాధన తదితరులకు వ్యతిరేకంగా సంస్కరణలు జరగాలని పిలుపునిచ్చింది.

దీనిని అనుసరించి ఆర్యసమాజం, రామకృష్ణ మిషన్, దివ్యజ్ఞాన సమాజం, ప్రార్థన సమాజం, సత్యశోధక సమాజం, అలీఘర్ ఉద్యమం, వహాబీ ఉద్యమం తదితర సాంఘిక ఉద్యమాలు వచ్చాయి. ఈ ఉద్యమాలు ప్రజల్లో జాతీయవాద భావనను, సాంఘిక – సాంస్కృతిక గుర్తింపును, దేశభక్తిని నింపి పరోక్షంగా ప్రజలు స్వయంపాలన కోరుకోవడానికి ప్రేరణ నిచ్చాయి.

2. వార్తాపత్రికలు :
బ్రిటిష్ పాలన కాలంలో ఎన్నో వార్తాపత్రికలు, దినపత్రికలు నియతకాలిక పత్రికలు భారతీయులలో జాతీయవాద భావాలను ప్రేరేపించాయి. వీటిలో ముఖ్యమైనవి అమృతబజార్ పత్రిక, కేసరి, పాట్రియాట్, ది హిందూ, నవజీవన్, ఆంధ్రపత్రిక మొదలైనవి. ఈ పత్రికలు ప్రజలలో దేశభక్తి, జాతీయవాద భావాలను పెంచి పోషించాయి.

జాతీయవాద భావాల వ్యాప్తిలోను, ప్రజల ఆకాంక్షలు, ఆశలు, డిమాండ్లు మొదలైన వాటిని బ్రిటిష్ ప్రభుత్వం ముందు వ్యక్తీకరించడంలోను వార్తాపత్రికలు కీలక పాత్ర పోషించాయి. ప్రఖ్యాత స్వాతంత్ర్యోద్యమ జాతీయ నాయకులు మోతీలాల్ నెహ్రూ, సురేంద్రనాధ్ బెనర్జీ, బాలగంగాధర్ తిలక్, మహాత్మాగాంధీ, డా॥బి.ఆర్. అంబేద్కర్ తదితరులు వార్తాపత్రికలు ద్వారా జాతీయవాద ఆదర్శాలను వ్యాపింపచేయడానికి ఎంతో కృషి చేశారు.

3. జాతి విచక్షణ :
బ్రిటిష్ ప్రభుత్వం న్యాయప్రక్రియల్లో, సివిల్ సర్వీసుల ఉద్యోగాల ప్రవేశంలో హక్కులను, అనుమతించడంలో ఎంతో వివక్షపూరిత ధోరణి ప్రదర్శించేది. జాతీయోద్యమ ప్రారంభదశలో భారతీయులు, సివిల్ సర్వీస్ ఉద్యోగాలలో ప్రవేశాలకు సంబంధించి విషయాలలో బ్రిటిషు అభ్యర్థులతో సమానంగా అవాకాశాలు ఉండాలని డిమాండ్ చేసేవారు.

అలాగే బ్రిటిష్వారి వివక్షత విధానం ఇల్బర్ట్ బిల్లు వివాదంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. భారతదేశంలోని యూరోపియన్ సమూహాలు భారతీయ న్యాయ మార్పులు తమ నేరాలను విచారించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ తరహా ధోరణులు భారతీయుల మనోభావాలను దెబ్బతీయడంతో, అది జాతీయోద్యమానికి దారితీసింది.

4. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన (Inceptin of Indian National Congress) :
భారత జాతీయోద్యమ చరిత్రలో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన (1885) ఒక మైలురాయిగా వర్ణించవచ్చు. మాజీ బ్రిటిష్ అధికారులు స్థాపించిన ఆ సంస్థ ప్రారంభంలో బ్రిటిష్ ప్రభుత్వ విధానాలను వెల్లడించడం, నిర్మాణాత్మక విమర్శలను చేయడం వంటి కర్తవ్యాలను నిర్వర్తించింది.

క్రమేణా ఆ సంస్థ భారతీయుల స్వపరిపాలన ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచింది. ప్రజా సమస్యలపై సమిష్టి పోరాటం, భారతీయులలో జాతీయ భావాలను పెంపొందించడం వంటి ఆశయాలతో జాతీయోద్యమానికి చోదక శక్తిగా ఎదిగింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 2.
భారత జాతీయోద్యమంలో అతివాదుల పాత్ర వివరించండి.
జవాబు.
భారతజాతీయోద్యమంలో రెండో దశయే అతివాదదశ. ఈ దశను కొందరు చరిత్రకారులు తీవ్ర జాతీయతా దశగా వర్ణించారు. హిందూ పునరుజ్జీవనం, బ్రిటిష్ పాలకులపట్ల ద్వేషం లార్డ్ కర్జన్ క్రూరపాలన, బెంగాల్ విభజన, క్షీణించిన ఆర్థిక పరిస్థితులు, సమకాలీన అంతర్జాతీయ సంఘటనలు, విదేశాలలో భారతీయుల కడగండ్లు మొదలైన అంశాలు భారతీయులను ఈ దశలో జాతీయోద్యమం వైపు మొగ్గు చూపేటట్లు ప్రభావితం చేశాయి. అలాగే మితవాదులు అనుసరించిన మెతకవైఖరి కూడా ఈ కాలంలో ఉద్యమకారులలో అసంతృప్తిని పెంపొందించింది.

బాలగంగాధర తిలక్, లాలాలజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్, అరవిందఘోష్ వంటి నాయకులు అతివాదులుగా పరిగణించబడి ఈ దశలో కీలకపాత్ర పోషించారు. బ్రిటిష్ పాలకులు బెంగాల్ను రెండు ముక్కలుగా విభజించడాన్ని అతివాదులు తీవ్రంగా వ్యతిరేకించారు.

బ్రిటిష్ పాలకులు ప్రజాస్వామ్య, స్వేచ్ఛాయుత, ఉదార ప్రియులనే మితవాదుల అభిప్రాయంలో అతివాదులు విభేదించారు. బ్రిటిష్పాలకులు భారతదేశంపట్ల అనుసరించిన అణచివేత, ప్రగతి వ్యతిరేకత, అప్రజాస్వామిక పద్ధతుల వల్లనే భారతీయులు బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు.

బాలగంగాధరతిలక్ ‘స్వరాజ్యం నా జన్మహక్కు- దాన్ని సాధించి తీరుతాను’ అనే నినాదంతో దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. అలాగే మిగిలిన అతివాదులు బ్రిటిష్ పాలకులపట్ల సకారాత్మక (passive) ప్రతిఘటన వైఖరిని అనుసరించారు. మొత్తం మీద అతివాదులు కింద పేర్కొన్న పద్ధతులను భారతీయులు అనుసరించవలసి ఉంటుందని ఉద్భోదించారు.

  1. వస్తువులను, బ్రిటిష్ ప్రభుత్వ గౌరవ బిరుదులను, కార్యాలయాలను బహిష్కరించడం.
  2. స్వదేశీ విద్యను ప్రోత్సహించడం.
  3. శాసన మండలల్లో భారతీయులకు సభ్యత్వం వంటి అంశాల అమలు కోసం కృషిచేయడం.
  4. స్వదేశీ వస్తువులను, పరిశ్రమలను ఆదరించడం.
  5. నకారాత్మక ప్రతిఘటనకు (Passive resistence) పాల్పడటం.

వందేమాతరం, స్వదేశీ వంటి ఉద్యమాలను అతివాదులు నిర్వహించారు. భారతీయులకు స్వయం పాలన, స్వరాజ్యం సాధించాలనే ప్రధాన ఆశయంతో వారు ఆ ఉద్యమాలను చేపట్టారు. తమ ఆశయసాధన కోసం ముస్లింలీగ్ వంటి ఇతర పార్టీలు, సంస్థలతో కలిసి ఉద్యమించారు.

అతివాదుల ఒత్తిడికి లోనైన బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ పునరేకీకరణ (reunification) కు అంగీకరించింది. అలాగే మాంటేగు ఛేమ్స్ఫర్డ్ పథకం ద్వారా ప్రాతినిథ్య సంస్థలలో భారతీయులకు సముచిత ప్రాధాన్యాన్ని ఇవ్వడానికి అంగీకరించారు. భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 3.
భారత జాతీయోద్యమంలోని గాంధీ దశలోని ప్రధాన సంఘటనలు రాయండి.
జవాబు.
1920 నుండి 1947 మధ్య జరిగిన భారత జాతీయోద్యమంలో గాంధీదశ చిట్ట చివరి దశగా, ముగింపు దశగా పేర్కొనవచ్చు. ఈ దశలో మహాత్మాగాంధీ కీలక పాత్ర పోషించి, మితవాద పద్ధతులు – అతివాద పద్ధతులను మేళవించి, జాతీయోద్యమాన్ని నడిపించారు.

గాంధీ దశలోని సంఘటనలు సహాయ నిరాకరణ ఉద్యమము :
భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో సహాయ నిరాకరణోద్యమం ఒక గొప్ప మలుపుగా చరిత్రకారులు భావించారు. ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతునిస్తూ, జలియన్వాలాబాగ్ ఘోర సంఘటనను నిరసిస్తూ గాంధీజీ ఉద్యమాన్ని 1920 ఆగస్టులో ప్రారంభించారు. అవి ఏమిటంటే :

  • సకారాత్మక కార్యక్రమాలు
  • నకారాత్మక కార్యక్రమాలు.

ఆ రెండింటిని కింద పేర్కొనడమైంది.

1. సకారాత్మక కార్యక్రమాలు (Positive or Constructive Programmes) :
సకారాత్మక కార్యక్రమాలలో క్రింది అంశాలు ఇమిడి ఉన్నాయి.
అ) సహాయ నిరాకరణ కార్యక్రమాలను అమలులో ఉంచడానికి కోటి రూపాయల విరాళాల సేకరణ.
ఆ) భారతీయులకు ఉపాధి కల్పించడానికి ఇరవై లక్షల రాట్నాల పంపకం.
ఇ) జాతీయ విద్యా ప్రణాళికల రూపకల్పన, అమలు మొదలగునవి.

2. నకారాత్మక కార్యక్రమాలు (Negative Programmes):
నకారాత్మక కార్యక్రమాలలో కింది అంశాలను ప్రస్తావించడమైంది.
అ) బ్రిటిష్ ప్రభుత్వం ప్రసాదించిన బిరుదులు, గౌరవ పదవులను పరిత్యజించడం.
ఆ) బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహించే అధికారిక సమావేశాలకు గైర్హాజరవడం.
ఇ) బ్రిటిష్ న్యాయస్థానాల బహిష్కరణ మొదలగునవి.

శాసనోల్లంఘనోద్యమం (Civil Disobedience Movement (1930 – 34) :
సహాయ నిరాకరణోద్యమం తరువాత భారత జాతీయోద్యమంలో చెప్పుకోదగిన సంఘటనలలో శాసనోల్లంఘన ఒకటి. ఈ ఉద్యమాన్ని 1930 మార్చి 12న భారత జాతీయ కాంగ్రెస్ గాంధీజీ మార్గదర్శకత్వంలో ప్రారంభించింది.

అంతకుముందు 1929 డిసెంబర్ 29న లాహోర్లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన సమావేశమైన భారత జాతీయ కాంగ్రెస్ భారతీయులకు సంపూర్ణ స్వరాజ్య సాధనయే తన ఆశయంగానూ, అందుకు బ్రిటిష్ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయాలనే అల్టిమేటము జారీచేసింది.

శాసనోల్లంఘన ఉద్యమంలో మూడు ప్రధాన దశలున్నాయి. మొదటి దశలో భారతీయులు ఉప్పుసత్యాగ్రహాన్ని నిర్వహించాలని గాంధీజీ సూచించాడు గాంధీజీ స్వయంగా 78 మంది అనుచరులతో కాలిబాటన సబర్మతీ ఆశ్రమం నుంచి 240 మైళ్ళ దూరంలో అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న ‘దండి’ అనే గ్రామానికి వెళ్ళి ఉప్పును తయారుచేశాడు. గాంధీజీతో సహా దేశవ్యాప్తంగా వేలాదిమంది ప్రజలు ఆయా ప్రాంతాలలో ఉప్పు సత్యాగ్రహాన్ని పాటించడానికి పోటీ పడ్డారు.

క్విట్ ఇండియా ఉద్యమం (Quit India Movement, 1942 August – 1994 May) :
భారత జాతీయోద్యమంలో అంతిమ ఘట్టమే క్విట్ ఇండియా ఉద్యమం. భారతదేశానికి స్వాతంత్య్రం, భారతీయులకు స్వీయ రాజ్యాంగం కావాలని అనేకసార్లు బ్రిటిష్ ప్రభుత్వానికి భారత జాతీయ నాయకులు విజ్ఞప్తి చేసినప్పటికీ వారి ప్రయత్నాలు సఫలం కాలేదు. ప్రతిసారీ బ్రిటిష్ పాలకులు భారతీయుల స్వాతంత్ర్య ఆకాంక్షలను సంపూర్ణంగా నెరవేర్చక, అరకొర పథకాలను మాత్రమే ప్రకటించారు.

వేరొకవైపు రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభంలో బ్రిటిష్ పాలకులు సంబంధిత భారత జాతీయ నాయకులతో చర్చించకుండానే భారతదేశాన్ని మిత్ర రాజ్యంగా ప్రకటించడం జరిగింది. 1942 నాటి క్రిప్స్ ప్రతిపాదనలు భారతీయులకు ఏ మాత్రం సంతృప్తినివ్వలేకపోయాయి.

అంతలో జపాన్ సైన్యం భారతదేశం వైపు దండయాత్రకు పాల్పడుతుందనే పుకార్లు వ్యాపించాయి. బ్రిటిష్ పాలకులు ఆ సమయంలో భారతదేశం వదలి వెళ్ళడం భావ్యమని, తద్వారా జపాన్ సైన్యం దండయాత్రను నివారించవచ్చనే అభిప్రాయాన్ని గాంధీజీ వెల్లడించాడు.

భారతీయులతో కూడిన తాత్కాలిక ప్రభుత్వాన్ని, రాజ్యాంగ పరిషత్తును వెంటనే ఏర్పాటు చేయాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తన నిర్ణయాన్ని కాంగ్రెస్ భారత రాజప్రతినిధితో తెలపడానికి మీరాబెన్ అనే కార్యకర్తను పంపించింది.

అయితే ఆమెతో భారత రాజప్రతినిధి సమావేశమవడానికి అంగీకరించలేదు. దాంతో గాంధీజీ నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమాన్ని 1942 ఆగస్టు 9న ప్రారంభించింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 4.
భారత స్వాతంత్ర్య పోరాటంలో హోమ్హూల్ ఉద్యమాన్ని వర్ణించండి.
జవాబు.
హోమ్హూల్ ఉద్యమం :
భారత జాతీయోద్యమ కాలంలో నిర్వహించబడిన ఉద్యమాలలో హోమ్హూల్ ఉద్యమం ఒకటి. ఈ ఉద్యమానికి లోకమాన్య బాలగంగాధర్ తిలక్, అనిబిసెంట్లు సారధ్యం వహించారు. మాండలే జైలులో ఆరేళ్ళపాటు కారాగార శిక్ష అనుభవించిన లోకమాన్య బాలగంగాధర్ తిలకన్ను 1914 జూన్లో బ్రిటిష్ ప్రభుత్వం వదిలిపెట్టింది.

భారతదేశానికి తిరిగి వచ్చిన తిలక్ భారత జాతీయ కాంగ్రెస్ నాయకులతో సహృద్భావ సంబంధాలు పునరుద్ధరించుకొని నిర్మాణాత్మక కార్యక్రమాల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వాన్ని నొప్పించకుండా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఐర్లాండ్ తరహాలో కొన్ని హోంరూల్ మండలులను నెలకొల్పడానికి కృషి చేశాడు. అందులో భాగంగా మద్రాస్లో దివ్యజ్ఞాన సమాజ

స్థాపకురాలు అనిబిసెంట్ అనే ఐరిష్ నాయకురాలితో సమన్వయం ఏర్పరచుకున్నాడు. 1916లో తిలక్, అనిబిసెంట్లు విడివిడిగా హోంరూల్ లీగ్్న స్థాపించి ప్రజలలో రాజకీయ చైతన్యం, ఆధ్యాత్మిక వికాసం సాధించడానికి కృషిచేశారు.

అనిబిసెంట్ న్యూఇండియా, కామన్వీల్ అనే పత్రికలను స్థాపించి జార్జి అరెండెల్ అనే వ్యక్తిని హోంరూల్ లీగ్ వ్యవస్థాపరమైన కార్యదర్శిగా నియమించింది. ఒక్క బొంబాయి మినహా మహారాష్ట్ర అంతటా, మైసూరు సెంట్రల్ ప్రావిన్సెస్, బీరార్లలోనూ, అనిబిసెంట్ దేశంలోని మిగిలిన ప్రాంతాలతో హోంరూల్ లీగ్ విధివిధానాలను ప్రజలలో వ్యాప్తిచేశారు.

హోంరూల్ లీగ్ కు సంబంధించిన కరపత్రాలను వారు దేశవ్యాప్తంగా విస్తృతంగా పంపిణీ చేశారు. అయితే తిలక్ సత్ప్రవర్తనతో వ్యవహరించలేదనే నెపంతో బ్రిటిష్ ప్రభుత్వం అతడిని 1916 జులైలో నిర్బంధంలో ఉంచింది.

దాంతో తిలక్ అభిమానులు, హోంరూల్ లీగ్ కార్యకర్తలు అసంతృప్తితో రగిలిపోయారు. నిర్బంధం నుంచి తిలకన్ను విడిపించడానికి మహమ్మదాలీ జిన్నా జిల్లాకోర్టు, హైకోర్టులలో తిలక్ తరఫున వాదించాడు. తిలకై తన పోరాటాన్ని ఉధృతం చేశాడు. తిలక్ 6 చోట్ల, అనిబిసెంట్ 20 చోట్ల హోంరూల్ లీగ్ కార్యాలయాలను స్థాపించారు.

హోంరూల్ ఉద్యమంలో భాగంగా గ్రంథాలయాలను స్థాపించడం, విద్యార్థులకు జాతీయ రాజకీయాలపై అవగాహన కల్పించడం, సామాజీక పునర్నిర్మాణ కార్యక్రమాలలో పాల్గొనడం, స్థానిక సంస్థలను బలోపేతం చేయడం వంటి అనేక కార్యక్రమాలను దేశవ్యాప్తంగా వారు ప్రారంభించారు.

భారతీయులకు స్వపరిపాలన (self rule) విషయంలో ఆసక్తిని పెంపొందించాడు. హోంరూల్ లీగ్ ఉద్యమ ఉధృతిని నివారించడానికి బ్రిటిష్ ప్రభుత్వం వారిరువురిని అనేక ప్రాంతాలలో బహిరంగ సభలలో పాల్గొనడాన్ని నిషేధించింది.

1916 డిసెంబర్లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో హోంరూల్ లీగ్ సభ్యులు విరివిగా పాల్గొన్నారు. ఆ సమావేశంలో చివరి రోజున హోంరూల్ల సభ్యులతో తిలక్ సమావేశాలు నిర్వహించాడు.

అయితే హోంరూల్ లీగ్ కు హెచ్చిన ప్రాధాన్యతను నివారించడానికి 1917 జూన్లో అనిబిసెంట్, ఆమె అనుచరుల బృందాన్ని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. మొత్తం మీద స్వపరిపాలన సంస్థలను ఏర్పరచి, వాటిని భారతీయ ప్రతినిధులతో నిర్వహించడానికి అవకాశం ఇవ్వాలనే హోంరూలీగ్ డిమాండ్ బ్రిటిష్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

భారత వ్యవహారాల కార్యదర్శి మాంటెగ్ 1917 ఆగస్టులో చారిత్రాత్మక ప్రకటన ద్వారా భారతీయులకు స్వపరిపాలన, స్వేచ్ఛలను ప్రసాదించడానికి అంగీకరించాడు. మాంటెంగ్ ప్రకటన తరువాత 1917 సెప్టెంబర్ లో అనిబిసెంట్ను బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేయడంతో హోంరూల్ ఉద్యమం సద్దుమనిగింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 5.
సహాయ నిరాకరణ ఉద్యమంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలను తెలపండి.
జవాబు.
ఈ ఉద్యమం భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో గొప్ప సంఘటనగా మిగిలిపోతుంది. మహాత్మాగాంధీ ఈ ఉద్యమాన్ని పంజాబ్ లోని జలియన్ వాలాబాగ్ లో జరిగిన మారణకాండకు నిరసనగా 1920-22 మధ్య కాలంలో నిర్వహించారు. ఉద్యమంలో చేపట్టిన కార్యక్రమాలు :

నకారాత్మక కార్యక్రమాలు: సకారాత్మక కార్యక్రమాలలో క్రింది అంశాలు ఇమిడి ఉన్నాయి.

  1. సహాయ నిరాకరణ కార్యక్రమాలను అమలులో ఉంచడానికి కోటిరూపాయల విరాళాల సేకరణ.
  2. భారతీయులకు ఉపాధి కల్పించడానికి ఇరవై లక్షల రాట్నాల పంపకం.
  3. జాతీయ విద్యా ప్రణాళికల రూపకల్పన, అమలు.
  4. బ్రిటిష్ శాసన మండలుల స్థానంలో కాంగ్రెస్ శాసన సంస్థల ఏర్పాటు.
  5. స్వదేశీ వస్తువుల వినియోగం.

సకారాత్మక కార్యక్రమాలు :
నకారాత్మక కార్యక్రమాలలో క్రింది అంశాలను ప్రస్తావించడమైంది.

  1. బ్రిటిష్ ప్రభుత్వం ప్రసాదించిన బిరుదులు, గౌరవ పదవులను పరిత్యజించడం.
  2. బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహించే అధికారిక సమావేశాలకు గైర్హాజరవడం.
  3. బ్రిటిష్ న్యాయస్థానాల బహిష్కరణ.
  4. శాసన మండలులకు జరిగే ఎన్నికల బహిష్కరణ.
  5. స్థానిక సంస్థల పదవులకు రాజీనామా సమర్పించడం.
  6. విదేశీ వస్తువుల బహిష్కరణ.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 6.
భారత ప్రభుత్వ చట్టం 1919 లోని ప్రధాన అంశాలేవి ?
జవాబు.
1919 భారత ప్రభుత్వ చట్టములోని ప్రధానాంశాలు :

  1. బ్రిటిష్ ఇండియా బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగంగానే కొనసాగుతుంది.
  2. భారత ప్రభుత్వం, దాని ఆదాయాలకు సంబంధించిన అన్ని కార్యకలాపాలపైన, చర్యలపైన పరిశీలన, నియంత్రణాధికారాలు భారత కార్యదర్శికే చెంది ఉంటాయి. ఆయన బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తాడు. రాష్ట్ర పాలనాంశాలపై భారత కార్యదర్శి అధికారాలను తగ్గించింది.
  3. ప్రభుత్వ పాలనాంశాలు రెండుగా విభజింపబడెను. అవి : 1) కేంద్ర పాలనాంశాలు (47), 2) రాష్ట్ర పాలనాంశాలు (51). రాష్ట్ర పాలనాంశాలను మళ్ళీ రెండుగా విభజించారు. అవి : 1) రిజర్వుడు పాలనాంశాలు (28), 2) ట్రాన్స్ఫర్డ్ పాలనాంశాలు (22). అఖిల భారత ప్రాముఖ్యం ఉన్న అంశాలు కేంద్ర పాలనాంశాల జాబితాలోను రాష్ట్ర ప్రాముఖ్యం ఉన్న పాలనాంశాలను రాష్ట్ర పాలనాంశాల జాబితాలోను చేర్చెను.
  4. భారత మండలి నిర్మాణంలో మార్పులు చేసిరి. భారత వ్యవహారాల కార్యదర్శి అధికారాలను కొన్నింటిని తొలగించి వాటిని భారత హైకమీషనర్ క్కు ఇచ్చారు.
  5. భారత ప్రభుత్వ బడ్జెట్ నుండి రాష్ట్ర బడ్జెట్లను వేరుచేశారు. ప్రాంతీయ వనరులకు సంబంధించి ప్రాంతీయ శాసనసభలకు తమ బడ్జెట్లను తామే సమర్పించుకోవడానికి, సొంతంగా పన్నులు విధించుకోవడానికి అధికారాలు కల్పించారు.
  6. కేంద్రంలో ద్విసభా విధానం ప్రవేశపెట్టబడింది. రాజ్యసభ ఎగువసభ కాగా, కేంద్ర శాసనసభ దిగువసభ అయ్యెను. ఎగువసభ పదవీకాలం 5 సంవత్సరాలుగా, దిగువసభ పదవీకాలం 8 సంవత్సరాలుగా నిర్ణయించబడింది.
  7. కేంద్ర శాసనసభ అధికారాలు పెరిగెను. అది బ్రిటిష్ ఇండియా మొత్తానికి, భారతీయ విషయాలకు ప్రభుత్వ ఉద్యోగులకు, బ్రిటిష్ రాజరికానికి సంబంధించిన సైనిక దళాలకు వర్తించేలా శాసనాలు రూపొందించవచ్చును.
  8. రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్ర పాలనాంశాలు రెండు భాగాలుగా విభజించారు. అవి: 1) రిజర్వుడు పాలనాంశాలు, 2) ట్రాన్స్ఫర్డ్ పాలనాంశాలు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 7.
భారత స్వాతంత్య్ర చట్టం – 1947 ముఖ్యాంశాలను వివరించండి.
జవాబు.
భారత వ్యవహారాల నిర్వహణ కోసం బ్రిటిష్ పార్లమెంటు రూపొందించి, అమలు చేసిన చట్టాలలో చిట్టచివరి చట్టమే భారత స్వాతంత్ర్య చట్టము 1947 ప్రధాని అట్లీ ఆధ్వర్యంలోని బ్రిటిష్ ప్రభుత్వం భారత గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ సలహామేరకు 1947, జులై 4వ తేదీన కామన్స్ సభలో భారత స్వాతంత్య్ర చట్ట ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.

తరువాత బ్రిటిష్ పార్లమెంటులోని రెండు సభలు దానిని రెండు వారాల్లోగా ఆమోదించాయి. భారత స్వాతంత్య్ర చట్ట ముసాయిదా తీర్మానంపై బ్రిటిష్ రాణి 1947, జులై 18వ తేదీన సంతకం చేసింది.

ప్రధానాంశాలు :

  1. ఇండియా, పాకిస్తాన్ అనే రెండు స్వతంత్ర రాజ్యాలు ఏర్పడతాయి.
  2. ఇండియా పాకిస్తాన్లకు వేర్వేరుగా రాజ్యాంగ పరిషత్తులు ఏర్పడతాయి.
  3. స్వదేశీ సంస్థానాలపై బ్రిటిష్ సార్వభౌమాధికారం రద్దవుతుంది.
  4. భారత వ్యవహారాల కార్యదర్శి పదవి రద్దవుతుంది.
  5. బ్రిటిష్ రాజు/రాణికి ఇప్పటివరకు ఉన్న “భారత చక్రవర్తి” అనే బిరుదు రద్దవుతుంది.”
  6. ఇండియా పాకిస్తాన్లు రెండింటికీ చెరొక గవర్నర్ జనరల్ నియమితులవుతారు.

ప్రశ్న 8.
భారత్ రాజ్యాంగ మౌలిక లక్షణాలలో ఏవేని మూడింటిని రాయండి.
జవాబు.
1. విశిష్ట ఆశయాలు లక్ష్యాలు :
భారత రాజ్యాంగం ఎన్నో విశిష్ట ఆశయాలు లక్ష్యాలను కలిగి ఉంది. భారత రాజ్యాంగం తన పౌరులందరికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అన్ని విషయాల్లో అందిస్తుంది. అలాగే పౌరులందరికీ, ఆలోచనా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, నమ్మకం, విశ్వాసం, ఆరాధన తదితర విషయాల్లో స్వేచ్ఛలకు హామీ ఇస్తుంది.

ఇదే క్రమంలో భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమాన హోదా, సమాన అవకాశాలు కల్పిస్తుంది. భారత రాజ్యాంగం ప్రజలలో సౌభ్రాతృత్వాన్ని పెంపొందించి వ్యక్తి గౌరవాన్ని జాతి సమైక్యత, సమగ్రతలను పరిరక్షించడానికి హామీ ఇస్తుంది.

2. రాజ్య విధానాలపై ఆదేశిక సూత్రాలు :
భారత రాజ్యాంగంలోని నాలుగో భాగంలో 36వ నిబంధన నుండి 51వ నిబంధన వరకు రాజ్య విధానాల రూపకల్పనలో రాజ్యాంగ ఆదేశక సూత్రాలు పొందుపరుచారు. భారత రాజ్యాంగ నిర్మాతలు వీటిని ఐర్లాండ్, రాజ్యాంగం నుండి స్వీకరించారు.

ఈ ఆదేశక సూత్రాలు భారతదేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగా, గాంధేయవాద దేశంగా, ఉదారవాద రాజ్యంగా రూపొందిస్తాయి. రాజకీయ భావజాలాలతో సంబంధం కాకుండా కేంద్ర ప్రభుత్వంలో-రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టే అన్ని పార్టీలు ఈ మూల సూత్రాలను తప్పనిసరిగా అమలు చేయాలి.

3. ఏక పౌరసత్వం :
భారత రాజ్యాంగం భారతదేశంలో జన్మించిన వారందరికీ, లేదా ఒక నిర్దిష్ట కాలంపాటు భారతదేశంలో నివసిస్తున్నవారికి ఏక పౌరసత్వాన్ని అందిస్తుంది. భారతదేశ సమైక్యత – సమగ్రతను పరిరక్షించడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. భారతదేశంలో విచ్ఛిన్నకర ధోరణులు తలెత్తకుండా రాజ్యాంగ నిర్మాతలు ఏకపౌరసత్వం ఏర్పాటు చేశారు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారత జీతీయోద్యమంలో మితవాదులు.
జవాబు.
మితవాద దశనే సంస్కరణల శకంగా వర్ణించడం జరిగింది. ఈ దశలో ప్రముఖ జాతీయ నాయకులైన గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయ్ నౌరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ వంటి ప్రముఖ నాయకులు కీలకపాత్ర పోషించారు. బ్రిటిష్ పాలకుల ఉదార వైఖరి పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ వారు బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో క్రమానుగత సంస్కరణలను అమలు చేయాలని సూచించారు.

బ్రిటిష్ ప్రజలు నిజమైన ప్రజాస్వామ్య, స్వేచ్ఛావాద ప్రియులనే, భారతీయులలో బ్రిటిష్ పాలకులు రాజకీయ చైతన్యాన్ని విజ్ఞప్తులు, మధ్యవర్తిత్వం వంటి పద్ధతులను అనుసరించడం ద్వారా బ్రిటిష్ పాలకుల దృష్టిని మితవాదులు ఆకర్షించగలిగారు. బ్రిటిష్ పాలన అనేది దైవ సమ్మతం, దైవ నిర్ణయంగా వారు పరిగణించారు.

ప్రశ్న 2.
అతివాదులు అనుసరించిన పద్ధతులు.
జవాబు.

  1. బ్రిటిష్ వస్తువులను, బ్రిటిష్ ప్రభుత్వ గౌరవ బిరుదులను, కార్యాలయాలను బహిష్కరించడం.
  2. స్వదేశీ విద్యను ప్రోత్సహించడం.
  3. శాసనమండలల్లో భారతీయులకు సభ్యత్వం వంటి అంశాల అమలు కోసం కృషి చేయడం.
  4. స్వదేశీ వస్తువులను, పరిశ్రమలను ఆదరించడం.
  5. నకారాత్మక ప్రతిఘటనకు పాల్పడటం.

ప్రశ్న 3.
సైమన్ కమీషన్.
జవాబు.
బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ‘భారత ప్రభుత్వ చట్టం 1919’ అమలు తీరును సమీక్షించి, సంస్కరణలు చేపట్టడానికి వీలుగా చర్యలు సూచించమని ఒక శాసనబద్ధ కమిషన్ ను నియమించింది. ఏడుగురు ఆంగ్లేయులతో కూడిన ఈ కమిషన్కు సర్ఆన్ సైమన్ చైర్మన్ గా వ్యవహరించాడు. భారత జాతీయ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా సైమన్ కమిషన్ కార్యవ్యవహారాలను బహిష్కరించాలని పిలుపునిచ్చి, ‘సైమన్ గో బ్యాక్’ (Simon Go Back) పేరుతో ఒక నినాదాన్నిచ్చింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 4.
శాసనోల్లంఘన ఉద్యమం.
జవాబు.
ఈ ఉద్యమాన్ని 1930 మార్చి 12న భారత జాతీయ కాంగ్రెస్ మార్గదర్శకత్వంలో ప్రారంభించుట జరిగినది. 1930 జనవరి 26వ తేదీన సంపూర్ణ స్వరాజ్యదినంగా పాటించాలని భారతీయులకు కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. శాసనోల్లంఘన ఉద్యమంలో మూడు ప్రధాన దశలున్నాయి. మొదటి దశలో భారతీయులు ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్వహించాలని గాంధీజీ సూచించాడు.

గాంధీజీ స్వయంగా 78 మంది అనుచరులతో కాలిబాటన సబర్మతి ఆశ్రమం నుంచి 240 మైళ్ళ దూరంలో అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న “దండి” అనే గ్రామానికి వెళ్ళి ఉప్పును తయారుచేశాడు. రెండోదశ గాంధీజీ ఎర్రవాడ (పూణె) కారాగారంలో ఉండగా 1932 జనవరి-1933 జులైల మధ్య నిర్వహించడం జరిగింది. శాసనోల్లంఘనలో మూడవదశ 1933 ఆగష్టు, 1934 మే నెల మధ్య కాలంలో నిర్వహించడం జరిగింది. ఆ దశలో భారత కాంగ్రెస్ నాయకులు సామూహిక శాసనోల్లంఘన స్థానాలలో వ్యక్తిగత శాసనోల్లంఘనోద్యమాన్ని కొనసాగించారు.

ప్రశ్న 5.
మింటో – మార్లే సంస్కరణల చట్టం.
జవాబు.
ఈ చట్ట రూపకల్పనలో భారత ప్రతినిధి లార్డ్మింటో భారత వ్యవహారాల కార్యదర్శి లార్డ్ మార్లేలు కీలకపాత్ర పోషించారు. దీనిని మింటోమార్లే సంస్కరణల చట్టంగా వర్ణించడం జరిగింది. భారతదేశంలో శాసనమండలాల నిర్మాణ, నిర్వహణలలో గణనీయమైన మార్పులకు ఈ నాంది పలికింది.

బెంగాల్ విభజనకు నిరసనగా ఉవ్వెత్తున ప్రారంభమైన వందేమాతరం ఉద్యమం, హిందూ-ముస్లింల మధ్య వైషమ్యాలు, లార్డ్ కర్జన్ నియంతృత్వ పోకడలు, పెద్ద దేశమైన రష్యాపై చిన్న దేశమైన జపాన్ విజయం, కాంగ్రెస్ నాయకులలో చీలికలు, ప్రవాస భారతీయుల కడగండ్లు, దుర్భర దారిద్య్రం, విప్లవ భావాలను రేకెత్తించిన కొన్ని రహస్య సంస్థల కార్యకలాపాలు వంటి అనేక అంశాలు ఈ చట్టం రూపకల్పనలో బ్రిటిష్ పాలకులను విశేషంగా ప్రభావితం చేశాయి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 6.
రాజ్యాంగ పరిషత్.
జవాబు.
భారత రాజ్యాంగ పరిషత్తులో 389 సభ్యులున్నారు. బ్రిటిష్ ఇండియాకు చెందిన 296 సభ్యులు ఉన్నారు. మిగిలిన 93 మంది స్వదేశీ సంస్థానాలకు చెందినవారు. భారత రాజ్యాంగ పరిషత్తుకు 1946 జులై – ఆగష్టులలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది.

మొత్తం సభ్యులలో 210 స్థానాలు జనరల్ కేటగిరీకి నిర్దేశించగా, వాటిలో 199 స్థానాలను కాంగ్రెస్ కైవశం చేసుకుంది. రాజ్యాంగ పరిషత్తులో ఆ పార్టీ బలం 208గా ఉంది. కాగా ముస్లింలీగ్ 73 స్థానాలను గెలుచుకుంది.

కాంగ్రెస్ తరఫున గెలిచిన సభ్యులలో మహాత్మాగాంధీ సూచించిన వివిధ రంగాలకు చెందిన 16 మంది మేధావులు ఉండటం విశేషం. మొత్తం మీద కాంగ్రెస్కు సంబంధించిన 30 మంది సభ్యులు రాజ్యాంగ పరిషత్తుకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. జవహర్లాల్ నెహ్రూ, రాజేంద్రప్రసాద్, అంబేద్కర్, శ్యాంప్రసాద్ ముఖర్జీ, దుర్గాబాయ్ దేశ్ ముఖ్, సరోజిని నాయుడు, విజయలక్ష్మి పండిట్, రాజ్కుమారి అమృత్కర్ ముఖ్య సభ్యులు. 1946 డిసెంబర్ 11న రాజేంద్రప్రసాద్ను రాజ్యాంగ పరిషత్తు శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడమైంది.

ప్రశ్న 7.
రాజ్యాంగ ముసాయిదా కమిటి.
జవాబు.
భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీని భారత రాజ్యాంగ పరిషత్తు 1947 ఆగష్టు 29న ఏర్పరచింది. కమిటీలో ఛైర్మన్, ఆరుగురు సభ్యులు ఉన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆ కమిటీ ఛైర్మన్గా వ్యవహరించారు. ఆ కమిటీలో సభ్యులుగా సర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్. గోపాలస్వామి అయ్యంగార్, సయ్యద్ మహమ్మద్ సాధుల్లా, డాక్టర్ కె.ఎమ్. మునీ, బి.ఎల్. మిత్తర్ సభ్యులుగా ఉన్నారు. రాజ్యాంగ ముసాయిదా కమిటి ముఖ్య లేఖకుడిగా ఎస్.ఎన్ ముఖర్జీ నియమితులయ్యారు.

ముసాయిదా కమిటీ అనేక దఫాలు సమావేశమై రాజ్యాంగ ముసాయిదాను రూపొందించి 1947 నవంబర్ 5న రాజ్యాంగ పరిషత్తుకు సమర్పించింది. రాజ్యాంగ ముసాయిదా ప్రతి 1948 ఫిబ్రవరి 21న ముద్రితమైంది. రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగ ముసాయిదాను నవంబరు 26న ఆమోదించింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 8.
భారత రాజ్యాంగ ధృఢ అధృఢ లక్షణాలు.
జవాబు.
రాజ్యాంగంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను అత్యంత కఠినమైన రీతిలో సవరించడానికి వీలుంటే, మరికొన్ని అంశాలను సరళమైన రీతిలో మార్పు చేయవచ్చు. ఇంకొన్ని అంశాలను సగం కఠినమైన, సగం సరళమైన రీతిలో మార్పు చేయవచ్చు.

భారత రాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టుల అధికారాలు, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు వంటి అంశాలను సవరించడానికి రాజ్యాంగ నిర్మాతలు పరుషమైన పద్ధతిని సూచించారు. రాష్ట్రాల పేర్లు, సరిహద్దులు, విస్తీర్ణం, విలీనం లేదా విభజన, రాష్ట్ర శాసనమండళ్ళ ఏర్పాటు లేదా రద్దు వంటి అంశాలను సులభమైన రీతిలో సవరించడానికి వీలుకల్పించారు. ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాలు వంటి అంశాలను మార్పు చేయడానికి పాక్షిక కఠిన, పాక్షిక సరళ పద్ధతికి అవకాశం ఇచ్చారు.

ప్రశ్న 9.
భారత రాజ్యాంగ ప్రవేశిక.
జవాబు.
రాజ్యాంగ నిర్మాతల ఆశయాలు, ఆకాంక్షలు, లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది. జవహర్లాల్నెహ్రూ ప్రవేశికను ఒక నిశ్చయాత్మక తీర్మానం ప్రమాణం హామిగా వర్ణించారు. ప్రవేశిక భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించింది. భారతీయులకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయాలను ప్రసాదిస్తున్నట్లు వెల్లడించింది.

భారతదేశంలోని సర్వసత్తాధికారం అంతిమంగా భారత ప్రజలకే చెందుతుందని సృష్టీకరించింది. ప్రవేశికను సుప్రీంకోర్టు న్యాయమూర్తి యధోల్కర్ రాజ్యాంగ ప్రధాన లక్షణాల సారం అని వర్ణిస్తే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిదయతుల్లా రాజ్యాంగపు ఆత్మగా ప్రస్తుతించారు.

ప్రశ్న 10.
పార్లమెంటరీ ప్రభుత్వం.
జవాబు.
భారత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వంలో, వివిధ రాష్ట్రాల స్థాయిలో బ్రిటిష్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది. అయితే బ్రిటిష్ తరహా వారసత్వ రాజరికాన్ని భారతదేశం స్వీకరించలేదు. దీనికి బదులుగా భారత రాజ్యాంగ నిర్మాతలు ఐర్లాండ్ తరహాలో ఎన్నికయ్యే అధ్యక్షుడు ఉండే వ్యవస్థను సూచించారు.

అలాగే బ్రిటిష్ రాజకీయ వ్యవస్థ మిగిలిన ఇతర లక్షణాలైన రెండు రకాల కార్యనిర్వాహక నాయకత్వం (రాష్ట్రపతి – ప్రధానమంత్రి), కేంద్రంలో ప్రధాన మంత్రినాయకత్వం, సమిష్టి బాధ్యత నియమం, కేంద్ర కార్యనిర్వాహక వర్గం (మంత్రిమండలి) పై పార్లమెంటు నియంత్రణ, రాష్ట్రపతికి నామమాత్రపు అధికారాలు తదితర లక్షణాలను భారత రాజ్యాంగం స్వీకరించింది. ఇదే తరహా రాజకీయ వ్యవస్థను వివిధ రాష్ట్రాలకు కూడా అన్వయింపజేసింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 11.
భారత రాజ్యాంగ ఏకకేంద్ర, సమాఖ్య లక్షణాలు.
జవాబు.
ఏకకేంద్ర రాజ్యలక్షణాలైన ఒకే పౌరసత్వం, ఒకే సమీకృత న్యాయశాఖ, ఒకే ఎన్నికల సంఘం, రాష్ట్రాల పాలనలో అఖిల భారత సర్వీసుల సిబ్బంది పాత్ర, రాష్ట్రాల రాజ్యాంగ అధిపతులుగా గవర్నర్ల నియామకం, రెండు ప్రభుత్వాలు, పార్లమెంటు ఎగువసభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం, రాజ్యాంగ అంశాల సవరణలో పార్లమెంటు చొరవ వంటి అంశాలు సమాఖ్య లక్షణాలైన లిఖిత రాజ్యాంగం, అధికారాల విభజన, న్యాయశాఖ ఔన్నత్యం, ద్విసభా విధానం వంటివి భారత రాజ్యాంగంలో పేర్కొనడమైంది. అయితే మొత్తం మీద భారత రాజ్యాంగంలో ఏకకేంద్ర రాజ్యం కంటే లక్షణాలే భారత రాజ్యాంగంలో అధికంగా ఉన్నాయి.

ప్రశ్న 12.
సార్వజనిక ఓటు హక్కు.
జవాబు.
భారతదేశంలో వయోజన పౌరులందరికి సార్వజనీన ఓటు హక్కును భారత రాజ్యాంగం ప్రసాదించింది. భారత పౌరులందరూ ఒక్క వయో సంబంధమైన పరిమితి మినహా ఇతర అంశాలైన కులం, మతం, భాష, ప్రాంతం, వర్ణం, వర్గం, ఆస్తులతో నిమిత్తం లేకుండా ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి స్వేచ్ఛను కలిగి ఉంటారు.

ఓటు హక్కు ద్వారా ప్రజా సార్వభౌమాధికార భావన ఆచరణలోకి వస్తుందని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. భారతదేశంలో స్వాతంత్య్రానంతరం ఓటు హక్కును పౌరులకు ప్రసాదించడానికి వయోపరిమితి 1950 నుంచి 1987 వరకు 21 ఏళ్ళగానూ, 1998 నుంచి (రాజ్యాంగం 61వ సవరణ చట్టం మేరకు) 18 ఏళ్ళుగానూ నిర్ణయించడమైనది.

TS Inter 2nd Year Political Science Study Material Chapter 8 భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు

Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 8th Lesson భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు Textbook Questions and Answers.

TS Inter 2nd Year Political Science Study Material 8th Lesson భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
అవినీతిని నిర్మూలించి, వివిధ అవినీతి రూపాలను తెలపండి.
జవాబు.
అవినీతి నిర్వచనం : ప్రపంచ బ్యాంకు నిర్వచనంలో “ప్రభుత్వ పదవిని (లేదా కార్యాలయాన్ని) ప్రైవేటు లాభార్జన కోసం వినియోగించడమే అవినీతి”.

అవినీతి రూపాలు :
అవినీతికి అనేక రూపాలున్నాయి. వీటిలో లంచాలు, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, బలవంతపు వసూల, ప్రభుత్వ ధనం దుర్వినియోగం, కుల-మత ప్రీతికర వివక్షత చూపడం వంటివి ఉన్నాయి. 1988లో వచ్చిన అవినీతి నిరోధక చట్టం ప్రకారం లంచగొండితనం, నిధుల దుర్వినియోగం, ధన సంబంధ ప్రయోజనాలు పొందడం, అధికార పదవిని హోదాను స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించడం, ఆదాయానికి మించి ఎన్నోరెట్లు ఆస్తులను కలిగి ఉండడం తదితర చర్యలు అవినీతి చర్యలుగా, చట్టపరంగా శిక్షార్హమైనవిగా పేర్కొంది.

ఇటీవలి సమకాలీన భారతదేశ అవినీతి రూపాలలో “పరస్పర ప్రతిఫల ప్రేరేపిత అవినీతి” ఎన్నోచోట్ల వెలుగులోకి వస్తోంది. దీని ప్రకారం, రాజకీయ నాయకులు, ఉన్నత అధికారులు కార్పొరేటర్లకు, బడా వ్యాపారవేత్తలకు అనుకూలంగా అధికారిక (ప్రభుత్వ) నిర్ణయాలు తీసుకున్నప్పుడు దీనికి బదులుగా (ప్రతిఫలంగా) వారు సంబంధిత నాయకులు-అధికారుల బంధువర్గానికి చెందిన పారిశ్రామిక యూనిట్లలో షేరు విలువలకు మించి కుప్పలు తెప్పలుగా అక్రమ పెట్టుబడులు పెట్టడం, స్వచ్ఛంద సేవా సంస్థలకు భారీస్థాయిలో విరాళాలు ఇవ్వడం జరుగుతోంది.

మరోవిధంగా చెప్పాలంగే, ప్రతిఫలాలను, ప్రయోజనాలను పరస్పరం (నాయకులు–అధికారులు, కార్పొరేట్లు- వాణిజ్యవేత్తలు) ఇచ్చి పుచ్చుకోవడం జరుగుతోంది. ఇటీవటి కాలంలో కేంద్ర నేరపరిశోధక సంస్థ (CBI) ఈ తరహా కేసులను (Quid Pro quo Cases) విచారిస్తూ కుంభకోణం ఆరోపణలను విచారిస్తోంది.

భారతదేశంలో అవినీతి భారతీయ విలువల వ్యవస్థలో ఒక పెద్ద ఉపద్రవంగా, సవాలుగా మారింది. ఇది అంటువ్యాధిలాగా వ్యపిస్తూ పరిపాలన యంత్రాంగాన్నీ, అభివృద్ధి ప్రక్రియలను, ప్రజాస్వామ్యాన్నీ అపహాస్యం చేస్తోంది. అవినీతి ఆర్థిక అభివృద్ధికి, పేదరిక నిర్మూలనకు వ్యతిరేకమైనది. జాతి వ్యతిరేకత లక్షణంగా గల అవినీతిలో రాజకీయ నాయకులు, ఉన్నత అధికారులు, ప్రభుత్వేతర సంస్థలు, నేరగాళ్ళు క్రియాశీల పాత్ర పోషిస్తూ ఉంటారు.

అవినీతి, వస్తువులు-సేవలు కొరతవల్ల, పరిపాలనలో తీవ్ర జాప్యం వల్ల, వ్యవస్థలో పారదర్శకత లోపించడంవల్ల తలెత్తుతుంది. అవినీతి ప్రజలలో అశాంతిని కలుగజేసి, వ్యవస్థపై ప్రజల నమ్మకం కోల్పోయేలా చేస్తుంది. ఫలితంగా తీవ్రవాదం, హింసావాదం, ఉగ్రవాదం ప్రబలే అవకాశం ఉంటుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 8 భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు

ప్రశ్న 2.
సంకీర్ణ రాజకీయాలు అంటే ఏమిటి ? వాటి లక్షణాలను, సంకీర్ణ రాజకీయాలలోని వివిధ దశలను
వివరించండి.
జవాబు.
సంకీర్ణ రాజకీయాలు-భావం :
కొన్ని రాజకీయ పార్టీలు ఉమ్మడిగా ప్రభుత్వ అధికారం పొందడం లేదా ఉమ్మడి ప్రతిపక్షాన్ని ఏర్పరచి రాజకీయ ప్రక్రియను ప్రజాస్వామీకరించం లక్ష్యంగా ఒక వ్యవస్థగా ఏర్పడడాన్ని సంకీర్ణ రాజకీయాలుగా పేర్కొనవచ్చు. ఈ విధంగా ఉమ్మడి కూటమిగా ఏర్పడ్డ రాజకీయ పార్టీలు తమలో తాము అంగీకరించిన ఎజెండా ఆధారంగా కనీస ఉమ్మడి కార్యక్రమం (Common Munimum Programme) ఏర్పరచుకొంటాయి.

లక్షణాలు :
సంకీర్ణ రాజకీయాలు భారతదేశానికి కొత్తేమీకాదు, వాస్తవానికి, నాలుగో సాధారణ ఎన్నికల తరువాత భారతదేశంలో వివిధ రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడి, వివిధ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి అశ్యర్థులను నిలబెట్టాయి. ప్రస్తుతం భారతదేశంలో రెండు ప్రధాన రాజకీయ కూటములు క్రియాశీలంగా పనిచేస్తున్నాయి.

వీటిలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో అకాలీదళ్, లోక్ జనశక్తి పార్టీ తదితర ప్రధాన రాజకీయ పార్టీలు “జాతీయ జాస్వామ్య కూటమి” (NDA) పేరుతో సంకీర్ణంగా ఏర్పడ్డాయి. మరో ప్రధాన సంకీర్ణ కూటమి ఐక్య ప్రగతిశీల కూటమి (UPA) పేరుతో భారత జాతీయ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, డి.ఎం.కె. తదితర పార్టీలు భాగస్వామ్య పక్షాలుగా కొనసాగుతోంది.

వివిధ దశలు :
భారతదేశంలో సంకీర్ణరాజకీయాల పరిణామ క్రమాన్ని వాటి స్వభావం-పనితీరు ఆధారంగా వివిధ దశలుగా అధ్యయనం చేసుకోవచ్చు. మొదటిదశ సంకీర్ణ రాజకీయాలు 1967-1971 మధ్యకాలంలో వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అవతరించి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను సవాలు చేయడంతో ప్రారంభమవుతుంది. భారతీయ జనసంఘ్, లోక్ దళ్, సోషలిస్టు పార్టీ, సంయుక్త విధాయక దళ్ మొదలైనవి ఉత్తర భారత రాష్ట్రాల్లో అవతరించి, సంకీర్ణాలు ఏర్పరచాయి.

సంకీర్ణ రాజకీయాలు రెండోదశ 1977-1980 మధ్య కాలంలో కేరళ, త్రిపుర, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల్లో వామపక్ష సిద్ధాంత భావజాలం ఆధారంగా వామపక్ష కూటిమి ప్రభుత్వాల ఏర్పాటులో ప్రతిబింబిస్తుంది. అలాగే 1977లో వచ్చిన జనతాపార్టీ కూడా సంకీర్ణ రాజకీయాల్లో భాగమని కొద్దిమంది భావిస్తారు. జనతాప్రయోగం కొద్దినెలలు మాత్రమే కేంద్రంలో అధికారంలో ఉంది.

సంకీర్ణ రాజకీయాల్లో మూడో దశ 1989-1991 మధ్యకాలంలో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో, వివిధ రాష్ట్రాల్లో కనిపిస్తుంది. అయితే ఈ దశలోని సంకీర్ణ రాజకీయాలలో సంకీర్ణ భాగస్వామ్య పక్షాల మధ్య సంబంధాల్లో ఒక నూతన ధోరణి కనిపిస్తుంది. సంకీర్ణ పక్షాలు కొన్ని ప్రభుత్వంలో చేరకుడా వెలుపలి నుండి మద్దతు (outside support) అందించి సంకీర్ణ రాజకీయాల్లో పాల్గొనేవి.

సంకీర్ణ రాజకీయాల్లో నాలుగో దశ 1996-1999 మధ్యకాలంలో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో అస్థిరతను, తరచుగా ప్రభుత్వాలు పతనం కావడాన్ని రాజీకీయ యుక్తులు-కుయుక్తులను సూచిస్తుంది. ఈ దశలో సంకీర్ణ భాగస్వామ్య పక్షాలు అనేక సంక్షోభాలను సృష్టిస్తూ తరచుగా ప్రభుత్వం నుంచి దూరంగా ఉండడం, మద్దతు ఉపయోగించుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఎంతో అస్థిరతను ఎదుర్కొంది. ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సంకీర్ణ రాజకీయాల ఫలితంగా పతనం చెందడం జరిగింది.

సంకీర్ణ రాజకీయాల్లో అయిదో దశగా 2004-2020 మధ్యకాలంలో హేతుబద్ధంగా కనీస ఉమ్మడి కార్యక్రమం ప్రాతిపదికగా భాగస్వామ్యపక్షాలు ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం గమనిస్తారు. దీనిలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) ఐక్య ప్రగతిశీల కూటమి (UPA) సంకీర్ణాలు భాగస్వామ్య పక్షాలందరికీ ఆమోదయోగ్యమైన ఎజెండాను “కనీస ఉమ్మడి కార్యక్రమం” (Common Minimum Programme) ప్రాతిపదికగా ఏర్పరచుకొని, ప్రభుత్వాలను పూర్తి పదవీకాలం, విజయవంతంగా నిర్వహించాయి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 8 భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారతదేశంలో సంకీర్ణ రాజకీయాలు, అవతరణకు గల కారణాలను వివరించండి.
జవాబు.
భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడడానికి ఎన్నో కారణాలు దోహదం చేశాయి. ఆధిపత్య పార్టీగా కొనసాగిన కాంగ్రెస్ పార్టీ దేశంలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైనోవడం, మెజారిటీ సాధించే స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఎన్నికల విజయాలు సాధించడం కారణంగా అనేక ఇతర పార్టీలు అవతరించి, అభివృద్ధి చెందాయి.

అలాగే వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని సవాలు చేసే విధంగా ప్రాంతీయ రాజకీయ పార్టీలు అవతరించి, ఇతర జాతీయ పార్టీలతో మైత్రి కూటములు ఏర్పాటు చేసుకోవడం కూడా సంకీర్ణ రాజకీయాలకు దారితీసింది.

సంకీర్ణ రాజకీయాలు వృద్ధి చెందడానికి గల కారణాలను ఈ కింది విధంగా పేర్కొనవచ్చు.

  1. ఏకపార్టీ ఆధిపత్యం నశించడం.
  2. ప్రజల ప్రాంతీయ ఆకాంక్షలు, ప్రయోజనాలు సంతృప్తి పరచడానికి ప్రాంతీయ రాజకీయ పార్టీలు అవతరించడం.
  3. సమాజంలోని వివిధ సమూహాలు తమ హక్కుల పట్ల చైతన్యం పొందడంతో సాంఘిక-రాజకీయ ఉద్యమాలు వ్యాప్తి చెందడం.
  4. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా జాతీయస్థాయిలో, రాష్ట్రాలస్థాయిలో రాజకీయ సంకీర్ణాలు ఏర్పరచవలసిన పరిస్థితులు ఏర్పడటం.

ప్రశ్న 2.
భారతదేశ నేపథ్యంలో వివిధ ఉగ్రవాద రూపాలను తెలియజేయండి.
జవాబు.
1. తెగల-జాతీయవాద ఉగ్రవాదం (Ethno-Nationalist Terrorism) :
ఉగ్రవాద సమూహాలు భారతదేశం నుంచి వేర్పాటును కోరుతూ లేదా భారత సమాఖ్యలో నూతన రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ ఉగ్రవాద చర్యలకు, హింసకు పాల్పడడాన్ని తెగల జాతీయవాద ఉగ్రవాదంగా పేర్కొనవచ్చు.

2. మతమౌఢ్య ఉగ్రవాదం (Religious Terrorism) :
ఈ తరహా ఉగ్రవాదం మత మౌఢ్యవాదం ఆధారంగా జనిస్తుంది. భారతదేశంలో ఎన్నో ఉగ్రవాద చర్యలు, సంఘటనలు, దాడులు ఈ కోవలోకి వస్తాయి. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐ.ఎస్.ఐ (ISI) సహాయంతో ఉగ్రవాద సంస్థలు-సమూహాలు ఎన్నో ప్రాంతాల్లో మతమౌఢ్య ఉగ్రవాదానికి పాల్పడ్డాయి.

2008 నవంబర్ 26న ముంబాయిలో ఉగ్రవాద దాడులు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన దాడులు, ప్రజలకు ఎంతో ప్రాణనష్టాన్ని, ఆస్తినష్టాన్ని కలిగించాయి. దీన్ని కొద్దిమంది జిహాదీ ఉగ్రవాదం పేరుతో కూడా వ్యవహరిస్తారు.

3. సిద్ధాంత (భావజాల) ఆధారిత ఉగ్రవాదం :
దీనినే వామపక్ష తీవ్రవాదమని కూడా వ్యవహరిస్తారు. సమాజ ఆర్థిక దోపిబిని, అణచివేతను, ఆర్థిక అసమానతలను నిర్మూలించడానికి వామపక్ష పోరాటమే మార్గమని నమ్ముతుంది. ప్రఖ్యాత కమ్యూనిస్టు సిద్ధాంతవేత్తలు కారల్ మార్క్స్, మావో, లెనిన్ తదితరుల సిద్ధాంత భావనల ఆధారంగా ఈ తీవ్రవాదం వ్యవహరిస్తుంది. సమాజంలోని విప్లవాత్మక మార్పు లక్ష్యాన్ని హింస, ఉగ్రవాదంతో చేరుకోవచ్చని నమ్ముతుంది.

4. రాజ్యప్రాయోజిక ఉగ్రవాదం (సీమాంతర ఉగ్రవాదం):
పొరుగు రాజ్యాలనుంచి పరోక్ష రూపంలో వ్యక్తమయ్యే ఉగ్రవాదం. సరిహద్దులకు వెలుపల ఇతర రాజ్యాలలో ఉగ్రవాద సంస్థలకు సమూహాలకు తోడ్పాటు అందిస్తూ భయానక వాతావరణాన్ని, అస్థిరతను కలుగజేసే లక్ష్యంతో ఉగ్రవాద చర్యలు ఉంటాయి.

భారతదేశం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్ చేతిలో ఈ తరహా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోంది. భారతదేశంలోని ఉగ్రవాద సమూహాలకు పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐ.ఎస్.ఐ (ISI), ఇతర ఏజెన్సీలు సహాయం అందిస్తున్నట్లు తెలుస్తోంది.

5.మాదక ద్రవ్య (గంధపు చెక్కలు మొదలైన వాటి అక్రమరవాణా) ఉగ్రవాదం :
ఈ తరహా ఉగ్రవాదం నిషేధించిన మాదకద్రవ్యాలు, గంధపు చెక్కల అక్రమరవాణాపై దృష్టి కేంద్రీకరిస్తుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 8 భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు

ప్రశ్న 3.
భారతదేశంలో అమలులో ఉన్న ఉగ్రవాద నిరోధక చట్టాలు ఏవి ?
జవాబు.
ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్టు, జాతీయ భద్రతాచట్టం (MISA), Conservation of Foreign Exchange and Preven- tion of Smuggle Activities Act (COFEPOSA), National Security ACT (NSA), ఉగ్రవాద నిరోధక చట్టం మొదలగునవి.

ప్రశ్న 4.
భారతదేశంలో వివిధ అవినీతి నిరోధక చట్టాలను పేర్కొనండి.
జవాబు.
భారత ప్రభుత్వం అవినీతి నిరోధానికి వివిధ స్థాయిలో అనేక చర్యలు చేపట్టింది. భారతదేశంలో ప్రజా జీవితంలో అవినీతిని అదుపు చేయడానికి అవినీతి నివారక చట్టాన్ని 1988లో రూపొందించింది. ఈ చట్టంలో మరిన్ని సవరణలు చేసి అవినీతి నివారణ చట్టం, 2018 రూపొందించింది.

దీని ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ ఉద్యోగులు తమ అధికారిక విధులను నిర్వహించే క్రమంలో చట్ట వ్యతిరేకంగా ప్రతిఫలాన్ని ఆశించండం లేదా లంచాలు తీసుకోవడాన్ని నిషేధించడం.

ఈ చట్టం లంచాలను ఇచ్చేవారిని, మధ్యవర్తులను కూడా దోషులుగా పరిగణిస్తుంది. అయితే కొద్దిమంది ఉన్నత పదవులలో ఉండే నాయకులు లేదా అధికారులపై అవినీతి కేసులు నమోదు చేయడానికి రాజ్యాంగ వ్యవహర్తల ముందు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.

రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై ఆరోపణల విషయంలో రాష్ట్ర గవర్నర్, కేంద్ర ప్రభుత్వ అధికారుల విషయంలో భారత రాష్ట్రపతి అనుమతి అవసరం అవుతుంది.

ఇదేకాక భారతీయ శిక్షాస్మృతి (Indian Penal code) లోని అనేక నిబంధనలు అవినీతి చర్యలకు పాల్పడే ఉద్యోగులపై శిక్షలు విధించడానికి తోడ్పడతాయి దీనితో పాటు మనీలాండరింగ్ నివారణ చట్టం (2002), సమాచార హక్కు చట్టం (2005) మొదలైనవి కూడా అవినీతి గుర్తించి, కేసులను నమోదు చేయడానికి తోడ్పడతాయి.

ప్రభుత్వోద్యోగులలో అవినీతిని నిరోధించడానికి 1964లో కేంద్ర నిఘా వ్యవహారాల కమిషన& (Central Vigilance Commission-CVC) ని స్థాపించారు. అవినీతికి సంబంధించిన అంశాల్లో పౌరులు చేయవలసిన, చేయకూడని పనులను ఈ కమిషన్ మార్గదర్శకాల రూపంలో రూపొందించింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 8 భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
జాతీయ స్థాయిలో సంకీర్ణ రాజకీయాలు.
జవాబు.
జాతీయ స్థాయిలో ఎన్నోసార్లు సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కేంద్రప్రభుత్వంలో మొదటిసారిగా 1977లో భారతీయ లోక్ దళ్, కాంగ్రెస్ (ఒ), జనసంఘ్, సోషలిస్టు పార్టీ, కొన్ని ఇతర చిన్న పార్టీలు కలిసి జనతా పార్టీగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇది జనతా ప్రయోగంగా ప్రఖ్యాత గాంచింది.

మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఈ ప్రభుతవ &ం ఏర్పడింది. కేంద్రప్రభుత్వంలో 1989లో వి.పి.సింగ్ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. జనమోర్చా, లోక్ దళ్ పార్టీలు నేషనల్ ఫ్రంట్ పేరుతో సంయుక్తంగా, భారతీయ జనతాపార్టీ, వామపక్షాల వెలుపలి మద్దతు అందించడంతో ఈ ప్రభుత్వాన్ని ఏర్పరచాయి.

1996 మే నెలలో హెచ్.డి. దేవగౌడ నాయకత్వంలో యునైటెడ్ ఫ్రంట్ (UF) ప్రభుత్వం ఏర్పడిది. దీనిలో జనతాదళ్, సి.పి.ఐ-సి.పి.ఎం తదితర పార్టీలు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. ఈ సంకీర్ణం తదనంతర కాలంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమిగా (NDA) ఆవిర్భవించింది. ఆ తరువాత 2004 సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటిమి (UPA) డా॥ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా అధికారాన్ని చేపట్టింది.

ప్రశ్న 2.
సంకీర్ణ రాజకీయాల ప్రయోజనాలు, నష్టాలు.
జవాబు.
భారతదేశంలో సంకీర్ణ రాజకీయాలు రాజకీయ సర్దుబాట్లకు, సహాయ సహకారాలకు దారితీశాయి. దీనికి అనుగుణంగా భారత సమాఖ్య స్వభావం మార్పుచెంది, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య అతి తక్కువ స్థాయికి వివాదాలు తగ్గిపోయాయి.

భారతాయ సమాఖ్య ఒక సహకార సమాఖ్యగా రూపాంతరం చెందింది. అలాగే సంకీర్ణ రాజకీయాలు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి దేశంలోని వివిధ స్థాయిల్లో ప్రత్యామ్నాయాన్ని ప్రజాసమస్యలు బాగా వెలుగులోకి రాగలగడతో భారత కాంగ్రెస్ పార్టీకి దేశంలోని వివిధ స్థాయిల్లో ప్రత్యామ్నాయాన్ని ప్రజాసమస్యలు బాగా వెలుగులోకి రాగలగడంతో భారత రాజకీయ వ్యవస్థ తన సామర్థ్యాలను పెంపొందించుకొని ప్రజల డిమాండ్లను పరిష్కరించడానికి సమాయత్తమవుతోంది.’

సంకీర్ణ రాజీకీయాల వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు తమ సంకీర్ణ భాగస్వామ్య పక్షాలతో రాజకీయ బేరసారాలకు దిగుతాయి. కొన్నిసార్లు దీని ఫలితంగా రాజకీయ కుయుక్తులు పెరిగి, రాజకీయ అస్థిరతకు దారితీస్తుంది. చాలా రాజకీయ పార్టీలకు స్వార్థ ప్రయోజనాలతో నిండిన ఎజెండా ఉండడం ఫలితంగా రాజకీయ నీచత్వం, దురాచారాలు, బెదిరింపులు, కుతంత్రాలు రాజ్యమేలుతాయి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 8 భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు

ప్రశ్న 3.
ఉగ్రవాదం లక్షణాలు.
జవాబు.
ఉగ్రవాదంపై జరిగిన అనేక అధ్యయనాలు, ఉగ్రవాద చర్యలలో కనిపించే సారూప్యతలను, ధోరణులను, లక్షణాలుగా తెలిపాయి.

  1. కొద్దిమంది వ్యక్తులు ప్రణాళికాబద్ధంగా, వ్యవస్థీకృతంగా బుద్ధి పూర్వకంగా చేసే హింసాత్మక చర్య ఉగ్రవాదంగా ఉంటుంది.
  2. ఉగ్రవాదం అమాయకపు ప్రజలను లేదా ఒక నిర్దిష్ట వర్గాన్ని పోలీసు అధికారులను, సాయుధ దళాలను లేదా కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని చేసే హింసాత్మక చర్య.
  3. సమాజంలోని సాంఘిక-ఆర్థిక లేదా రాజకీయ వ్యవస్థను సవాలుచేస్తూ, కొద్దిమంది ప్రేరణతో జరిగే హింస ఉగ్రవాదం లేదా తీవ్రవాదం రూపంలో బహిర్గతమవుతుంది.
  4. ఉగ్రవాదం ప్రభుత్వంపైన, రాజకీయ వ్యవస్థపైన జరిపే అనధికార యుద్ధంగా కనబడుతుంది.
  5. బెదిరింపులకు, పాశవికతకు ఉగ్రవాదం సాధనంలాగా ఉంటుంది. కొద్దిమంది తమ డిమాండ్లను హింసాత్మక ఉగ్రవాద చర్యలు ద్వారా వ్యక్తీకరిస్తారు.

ప్రశ్న 4.
అవినీతి రూపాలు.
జవాబు.
అవినీతికి అనేక రూపాలున్నాయి. వీటిలో లంచాలు, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, బలవంతపు వసూలు, ప్రభుత్వ ధనం, దుర్వినియోగం, కుల-మత ప్రీతికర వివక్షచూపడం వంటివి ఉన్నాయి.

1988లో వచ్చిన అవినీతి నిరోధక చట్టం ప్రకారం లంచగొండితనం, నిధుల దుర్వినియోగం, ధన సంబంధ ప్రయోజనాలు పొందడం, అధికార పదవిని, హెూదాను స్వార్థప్రయోజనాలకు ఉపయోగించడం, ఆదాయానికి మించి ఎన్నోరెట్లు ఆస్తులను కలిగిఉండం తదితర చర్యలు అవినీతి చర్యలుగా, చట్టపరంగా శిక్షార్హమైనదిగా పేర్కొంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 8 భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు

ప్రశ్న 5.
ప్రజావేగులు.
జవాబు.
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని వెల్లడించి, బహిర్గతం చేసి అవినీతికి వ్యతిరేకంగా ప్రజలను అప్రమత్తులను చేసే కార్యకర్తలలే (Whistle Blowers). వీరికి అవినీతి అధికారులు, నాయకుల నుంచి ప్రమాదాలు ఎదురవుతాయి. ఇటీవలి కాలంలో జాతీయ రహదారుల అథారిటీ కుంభకోణాన్ని వెలికితీసిన శ్రీ సత్యేంద్ర దూబే హత్య, సమాచార హక్కు కార్యకర్తల షీలా మసూద్ హత్య తదితర సంఘలనలు ప్రజావేగులకు రక్షణ కల్పించవలసిన అవసరాన్ని తెలియజేస్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం “ప్రజా ప్రయోజనాల వెల్లడి తీర్మానం” (Public Interest Disclosure resolution-PIDR) పేరుతో ఈ ప్రజావేగుల జీవితాలకు భద్రత కల్పించడానికి అనేక చర్యలు తీసుకొంటోంది.

TS Inter 1st Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 12th Lesson ప్రభుత్వం – రకాలు Textbook Questions and Answers.

TS Inter 1st Year Political Science Study Material 12th Lesson ప్రభుత్వం – రకాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఏకకేంద్ర ప్రభుత్వం అంటే ఏమిటి ? వాటి లక్షణాలను తెలపండి.`
జవాబు.
‘యూనిటరి’ (Unitary) అనే పదం ‘యూని’ (Uni), ‘టరి’ (Tary) అను రెండు ఆంగ్ల పదాల కలయిక. యూని అనగా ‘ఒక్కటి’, టరీ అనగా ‘పాలన’ అని అర్థం. అందువల్ల యూనిటరీ గవర్నమెంట్ను ‘ఏకకేంద్ర ప్రభుత్వం’గా వ్యవహరిస్తారు. ఏకకేంద్ర ప్రభుత్వంలో పాలనాధికారాలన్నీ సమీకృతంగా ఒకే ఒక ప్రభుత్వం చేతిలో ఉంటాయి. రాజ్యాంగం సర్వాధికారాలన్నీ కేంద్రప్రభుత్వం చేతిలో ఉంచుతుంది.

కేంద్రప్రభుత్వం ఒక్కటే అధికారాలన్నింటిని అనుభవిస్తుంది. అయితే, కేంద్రప్రభుత్వం ప్రత్యేక రాజకీయ ఉపశాఖలను (Political subdivisions) ఏర్పరచి వాటికి కొన్ని అధికారాలను నిర్వహించే అవకాశాన్ని కల్పించవచ్చు. వివిధ రాష్ట్రాల పాలనాధికారాలను ఆయా ప్రాంతీయ మండళ్ళు (Provincial Units) ద్వారా చక్కబెట్టవచ్చు. ఈ ప్రాంతీయ మండళ్ళు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో సహాయక కేంద్రాలుగా పనిచేస్తాయి. ఏకకేంద్ర ప్రభుత్వానికి చక్కటి ఉదాహరణ బ్రిటన్.

ఏకకేంద్ర ప్రభుత్వ నిర్వచనాలు (Definitions of Unitary Government) :
1. ఏ.వి. డైసీ :
“అత్యున్నత శాసనాధికారాన్ని ఒకే ఒక కేంద్రప్రభుత్వం సంపూర్ణంగా నిర్వహించేదే ఏకకేంద్ర ప్రభుత్వం”.

2. హైర్మన్ ఫైనర్ :
“కేంద్ర స్థాయిలో అన్ని రకాల అధికారాలు, ఆధిపత్యం ఇమిడీకృతమై, తన ఇష్టానుసారంగా లేదా దాని అనుబంధశాఖల ద్వారా భౌగోళిక ప్రాంతానికంతటికి న్యాయపరంగా సర్వశక్తి గల అధికారం గల ప్రభుత్వమే ఏకకేంద్ర ప్రభుత్వం”.

3. ప్రొఫెసర్. జె.డబ్ల్యు. గార్నర్ :
“ప్రభుత్వానికి గల సర్వాధికారాలు రాజ్యాంగపరంగా ఒకే ఒక కేంద్ర వ్యవస్థ లేదా వ్యవస్థలకు చెంది ఉండి, వాటి నుంచి స్థానిక ప్రభుత్వాలు తమ అధికారాలను పొందినట్లయితే. అటువంటి ప్రభుత్వమే. ‘ఏకకేంద్ర ప్రభుత్వం’ అంటారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

ఏకకేంద్ర ప్రభుత్వం లక్షణాలు (Features of Unitary Government) :
ఏకకేంద్ర ప్రభుత్వం ఈ క్రింది లక్షణాలను కలిగి ఉంటుంది.

1. ఏకకేంద్ర వ్యవస్థలో ఒకే ప్రభుత్వముంటుంది (Single Government) :
దీనినే కేంద్ర ప్రభుత్వమని వ్యవహరిస్తారు. కేంద్ర ప్రభుత్వం రాజ్య పరిధిలోని అన్ని శాఖలకు సంబంధించిన అధికారాలను నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అత్యున్నతమైన శాసన నిర్మాణ, కార్యనిర్వాహక, న్యాయపరమైన అధికారాలను కలిగి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ అధికారం దేశంలోని ప్రజలందరికీ వర్తిస్తుంది.

2. ప్రాంతీయ ప్రభుత్వాలు (Provincial Government) :
ఏకకేంద్ర ప్రభుత్వ విధానంలో ప్రాంతీయ ప్రభుత్వాల ఏర్పాటు ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. ఒకవేళ ప్రాంతీయ ప్రభుత్వాలు ఉన్నట్లయితే, వాటి అధికారాలు మరియు ఉనికి కేంద్ర ప్రభుత్వం మీదనే ఆధారపడి ఉంటాయి. పాలనా సౌలభ్యం కొరకు వీటిని ఏర్పాటు చేయటం జరుగుతుంది. వీటికి స్వయం నిర్ణయాధికారం ఉండదు. అవి కేంద్ర ప్రభుత్వం నుండి తమకు అవసరమైన అధికారాలను పొందుతాయి.

3. సరళ రాజ్యాంగం (Flexible Constitution) :
ఏకకేంద్ర ప్రభుత్వం సాధారణంగా సరళ రాజ్యాంగాన్ని కలిగి ఉంటుంది. దీనితో పాటు లిఖిత రాజ్యాంగాన్ని కలిగి ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరుధ్యాలు ఏర్పడే అవకాశం ఎంత మాత్రం ఉండదు. ఈ కారణం వల్ల, వివిధ రాజ్యాంగ వ్యవస్థలు శక్తివంతంగా పనిచేస్తాయి.

4. ఏక పౌరసత్వం (Single Citizenship) :
ఏకకేంద్ర ప్రభుత్వం పౌరులందరికీ ఒకే పౌరసత్వాన్ని కల్పిస్తుంది. ఏకకేంద్ర ప్రభుత్వంలో ఏ ప్రాంతంలో జన్మించినా ప్రత్యేక గుర్తింపునిచ్చే పౌరసత్వం కలిగి ఉంటారు. అంతిమంగా ఏకపౌరసత్వం జాతీయ ఏకత, సమైక్యత, సౌభ్రాతృత్వాన్ని ప్రజలలో పెంపొందిస్తుంది.

5. ఏక శాసన సభ (Unicameralism) :
ఏకకేంద్ర ప్రభుత్వం ఒకే శాసన సభను కలిగి ఉంటుంది. ఆ శాసన సభకు అన్ని రకాల శాసనాధికారాలుంటాయి. ప్రాంతీయపరమైన శాసనసభలు ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నట్లయితే అవి కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు తమ విధులను నిర్వహిస్తాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

ప్రశ్న 2.
సమాఖ్య ప్రభుత్వం అంటే ఏమిటి ? వాటి లక్షణాలను పరిశీలించండి.
జవాబు.
‘ఫెడరేషన్’ (Federation) అనే ఆంగ్ల పదం ఫోడస్ (Foedus) అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. ‘ఫోడస్’ అనగా ఒడంబడిక లేదా అంగీకారం అని అర్థం. ఆధునిక రాజకీయ వ్యవస్థలో ‘సమాఖ్య విధానం’ ఒక రాజకీయ ఆలోచనా ప్రక్రియగా మారింది. ఈ విధానం అత్యంత బహుళ ప్రాచుర్యం పొందింది. అమెరికా (1789), స్విట్జర్లాండ్ (1848), ఆస్ట్రేలియా (1901), కెనడా (1931) వంటి దేశాలు సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థకు మంచి ఉదాహరణలు.

నిర్వచనాలు :
1. ఎ.వి. డైసీ : “జాతీయ సమైక్యత, ప్రాంతీయ విభాగాల హక్కులను సమన్వయపరిచే రాజకీయ సాధనమే సమాఖ్య ప్రభుత్వం”.
2. జె.డబ్ల్యు. గార్నర్ : “సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థ అనేది ప్రభుత్వానికి గల మొత్తం అధికారాలను కేంద్రం- రాష్ట్రాల మధ్య జాతీయ రాజ్యాంగం ద్వారా పంపిణీ చేసేది”.

సమాఖ్య ప్రభుత్వ లక్షణాలు (Features of Federal Government) : సమాఖ్య ప్రభుత్వం అనేక లక్షణాలను కలిగి ఉంది. వాటిని ఈ క్రింది విధంగా తెలుసుకోవచ్చు.

1. లిఖిత రాజ్యాంగం (Written Constitution) :
సాధారణంగా సమాఖ్య వ్యవస్థ ఉనికిలో ఉన్న దేశాల్లో లిఖిత రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగం దేశం మొత్తానికి అత్యున్నత శాసనంగా పరిగణించబడుతుంది. ఆ రాజ్యాంగమే అధికారాలను నిర్వచించి, నిర్ణయించి కేంద్రం, రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది. ఆ విధంగా సమాఖ్య వ్యవస్థ అవసరమైన, ఆచరణయోగ్యమైన ప్రభుత్వ విధానంగా ఉంటుంది.

2. ద్వంద్వ పౌరసత్వం (Duel Citizenship):
సమాఖ్య రాజ్య వ్యవస్థలో పౌరులకు ద్వంద్వ (రెండు) పౌరసత్వం ఉంటుంది. (ఒకటి జాతీయస్థాయి, రెండు సంబంధిత రాష్ట్రస్థాయి) అందువల్ల పౌరులు కేంద్రం, రాష్ట్రాల పౌరసత్వాన్ని పొందుతారు. తత్ఫలితంగా, పౌరులు జాతీయ, ప్రాంతీయ ప్రభుత్వాల ఎన్నిక ప్రక్రియలో ప్రాతినిధ్యం వహిస్తారు.

3. అధికార విభజన (Division of Powers) :
సమాఖ్య విధానంలో ప్రభుత్వ అధికారాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజింపబడతాయి. కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రయోజనాలను కాపాడే అంశాలపై నియంత్రణ కలిగి ఉంటుంది. ఉదాహరణకు రక్షణ, విదేశీ వ్యవహారాలు, సుంకాలు, ఎగుమతులు-దిగుమతులు వంటి జాతీయ ప్రాముఖ్యత గల అంశాలను నియంత్రిస్తుంది. అదేవిధంగా, వ్యవసాయం, విద్య, వైద్యం, నీటి పారుదల విషయాలను ప్రాంతీయ ప్రభుత్వాలకు అప్పగించటం జరుగుతుంది.

4. ద్విసభా విధానం (Bicameralism) :
ద్విసభా విధానమనేది సమాఖ్య వ్యవస్థకు మరో ముఖ్య లక్షణం. సమాఖ్య రాజ్యంలో రెండు సభలు ఉంటాయి. ఎగువ సభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షిస్తుంది. ఎగువ సభలో రాష్ట్రాల జనాభాననుసరించి ప్రాతినిధ్యం కల్పించటం జరుగుతుంది. దిగువసభ ప్రజలకు ప్రత్యక్ష ప్రాతినిధ్యం వహిస్తుంది.

5. దృఢ రాజ్యాంగం (Rigid Constitution) :
సాధారణంగా, సమాఖ్య వ్యవస్థలో రాజ్యాంగం దృఢ లక్షణాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల రాజ్యాంగ సవరణ అంత సులభం కాదు. కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి రాజ్యాంగ సవరణ చేయటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. ఈ కారణం వల్ల, అటు కేంద్ర ప్రభుత్వం గానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు గానీ రాజ్యాంగ సూత్రాలను ఏకపక్షంగా సవరించలేవు.

6. స్వతంత్ర న్యాయశాఖ (Independent Judiciary):
సమాఖ్యప్రభుత్వ విధానంలో అతి ముఖ్యమైన లక్షణమేమిటంటే స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయశాఖ. ఎందుకంటే, కేంద్రం, రాష్ట్రాల మధ్యగల వివాదాలను ఒక్క న్యాయశాఖ మాత్రమే తీర్చగలదు. అందువల్ల న్యాయమూర్తులు రాజ్యాంగపరంగా సంక్రమించిన స్వతంత్ర హోదాను సంతృప్తిగా అనుభవిస్తారు.

సాధారణంగా న్యాయమూర్తుల నియామకం ఒకసారి జరిగిన తరువాత వారిని తొలగించడం అంత సులభం కాదు. వారు పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తారు. అంతేకాదు శాసననిర్మాణ, కార్యనిర్వాహక శాఖలు అమలుపరిచే అధికారాలు దుర్వినియోగం జరుగుతున్నట్లు భావించినట్లయితే, ఆ అధికారాలను నియంత్రించేది న్యాయశాఖ మాత్రమే.

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

ప్రశ్న 3.
అధ్యక్ష తరహా అంటే ఏమిటి ? వాటి లక్షణాలను చర్చించండి.
జవాబు.
బాగెహట్ అభిప్రాయం ప్రకారం అధ్యక్ష తరహా ప్రభుత్వంలో శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ రెండు స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. పార్లమెంటు ప్రభుత్వంలో రెండు శాఖలు విలీనమయి పనిచేస్తుంటాయి. అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహక శాఖ శాసన శాఖకు బాధ్యత వహించదు. పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహక శాఖ శాసన శాఖకు బాధ్యత వహిస్తుంది.

అధ్యక్ష తరహా ప్రభుత్వ లక్షణాలు :
ఎ. అధ్యక్షుడు రాజ్యానికి, ప్రభుత్వాధినేత :
అధ్యక్ష తరహా ప్రభుత్వంలో అధ్యక్షుడు ఇటు రాజ్యాధినేతగాను ప్రభుత్వాధినేతగాను కొనసాగుతారు. వాస్తవంగా కార్యనిర్వాహక అధికారాలను చేలాయిస్తాడు. అతడు ప్రభుత్వ నిర్ణయాలను, పథకాలను తన సెక్రటరీల ద్వారా అమలుచేస్తాడు.

బి. కార్యనిర్వాహకశాఖ నుండి శాసనశాఖ వేరుచేయబడి ఉంటుంది :
ఈ తరహా ప్రభుత్వంలో శాసనశాఖ, కార్యనిర్వాహకశాఖ రెండు వేరుగాను, స్వతంత్రంగాను వ్యవహరిస్తూ ఒక శాఖ విషయంలో మరోశాఖ జోక్యం చేసుకోకపోవడం మరో’ లక్షణం.

సి. రాజ్యాధినేత, ప్రభుత్వాధినేత ఎన్నిక :
అధ్యక్ష తరహా కార్యనిర్వాహక వర్గం వారసత్వం ద్వారా గాని నామినేట్ చేయడం ద్వారా గాని ఏర్పడదు. ప్రజల నుంచి నేరుగా ఎన్నిక కావడం మూలంగానే ఏర్పడుతుంది.

డి. అధ్యక్షుడి అభిశంసన :
రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు తప్పుచేసినా, చట్టాలను ఉల్లంఘించినా పదవి ప్రమాణ స్వీకారం చేసిన శాసనశాఖ ద్వారానే అభిశంసించబడి దానిచే తొలగించబడతాడు.

ఇ. నిరోధ సమతౌల్యాలు :
అధ్యక్ష తరహా ప్రభుత్వానికి మరో ముఖ్యలక్షణం నిరోధ సమతౌల్య సూత్రం ఆధారంగా వ్యవహరించటం. ఈ తరహా ప్రభుత్వంలో ప్రభుత్వాంగాలు స్వతంత్రంగా వ్యవహరిస్తూనే పరస్పరం నిరోధ సమతౌల్యతతో వ్యవహరిస్తాయి. శాసనశాఖ అధ్యక్షుడి నిర్ణయాలకు ఆమోదం తెలుపుతుంది. అదేవిధంగా శాసనశాఖ తీసుకునే నిర్ణయాలకు అధ్యక్షుడు ఆమోదం తెలియజేయాల్సి ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం న్యాయశాఖ సమీక్ష చేస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

ప్రశ్న 4.
పార్లమెంటరీ ప్రభుత్వం అంటే ఏమిటి ?
జవాబు.
పరిచయం :
ఏ ప్రభుత్వ వ్యవస్థలో కార్యనిర్వాహక వర్గం శాసనసభ నుండి ఎన్నుకోబడి శాసనసభ యొక్క విశ్వాసాన్ని కలిగి ఉన్నంతకాలం అధికారంలో కొనసాగుతుందో ఆ ప్రభుత్వ వ్యవస్థనే ‘పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థ’ అని అంటారు. ఈ పార్లమెంటరీ ప్రభుత్వానికి పుట్టినిల్లుగా ‘బ్రిటన్ ‘ను పేర్కొనవచ్చు.

నిర్వచనం :
ప్రొఫెసర్ గార్నర్ పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ఈ విధంగా నిర్వచించారు. “పార్లమెంటరీ ప్రభుత్వమంటే నిజమైన కార్యవర్గం, మంత్రిమండలి లేదా మంత్రివర్గం

  1. తక్షణం, చట్టబద్దంగా తన రాజకీయ విధానాలు, చర్యలకు శాసనసభకు
  2. అంతిమంగా నియోజకులకు బాధ్యత వహించే వ్యవస్థతో కూడినది”.

పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణాలు : పార్లమెంటరీ ప్రభుత్వం ఈ క్రింది లక్షణాలను కలిగి ఉంది. అవి :

1. నామమాత్రమైన, వాస్తవ కార్యనిర్వాహక అధిపతులు :
పార్లమెంటరీ ప్రభుత్వంలో రెండు రకాల కార్యనిర్వాహక అధిపతులు ఉంటారు. వీరిలో నామమాత్రపు వాస్తవ కార్యనిర్వాహక అధిపతులు ఉంటారు. నామమాత్రపు కార్యనిర్వాహక అధిపతికి చక్కటి ఉదాహరణ ‘బ్రిటీష్ రాణి’, జపాన్ చక్రవర్తి, భారత రాష్ట్రపతి. వాస్తవానికి ఈ దేశాలలో కార్యనిర్వాహక అధికారాలన్నీ ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి చేతిలో ఉంటాయి.

అందువల్ల ఈ తరహా ప్రభుత్వంలో నామమాత్రపు కార్యనిర్వాహక శాఖ పేరుకు మాత్రమే ఉనికిలో ఉంటుంది. దీనికి భిన్నంగా ఈ విధానంలో ఒక వ్యక్తి గాని, కొద్దిమంది వ్యక్తుల బృందం గానీ నిజమైన కార్యనిర్వాహకవర్గంగా ఉంటుంది. కార్యవర్గం ఆచరణలో అన్ని కార్యనిర్వాహక అధికారాలను చలాయిస్తుంది.

2. సమిష్టి బాధ్యత :
సమిష్టి బాధ్యత అనేది పార్లమెంటరీ ప్రభుత్వ మౌళిక లక్షణం. మంత్రులందరూ శాసననిర్మాణ శాఖలోని దిగువ సభకు సమిష్టిగా బాధ్యత వహిస్తారు. ప్రధానమంత్రి నాయకత్వాన మంత్రులు అందరూ సమిష్టిగా విధాన నిర్ణయాలను తీసుకొంటారు. శాసనశాఖలోని దిగువసభ విశ్వాసాన్ని కోల్పోయినపుడు మంత్రిమండలి తన బాధ్యతల నుంచి విరమించుకొంటుంది.

కేబినెట్ సమావేశంలో ఏ మంత్రి అయినా తన అసమ్మతిని తెలియజేయవచ్చు. కాని అంతిమంగా కేబినేట్ నిర్ణయాన్ని మాత్రం అంగీకరించాల్సిందే. సదరు మంత్రి వ్యక్తిగతంగా, సమిష్టిగా తన శాఖకు సంబంధించి తీసుకొనే అన్ని నిర్ణయాలకు బాధ్యత వహించవలసి ఉంటుంది.

3. రాజకీయ సజాతీయత :
పార్లమెంటరీ ప్రభుత్వపు సర్వశ్రేష్ఠ ముఖ్య లక్షణం రాజకీయ సజాతీయత. పార్లమెంటరీ ప్రభుత్వంలో మంత్రులందరూ సాధారణంగా ఒకే పార్టీకి చెందినవారై ఉంటారు. కొన్ని సందర్భాలలో ఎప్పుడైతే ఒక రాజకీయపార్టీకి మెజారిటీ లేక ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన సంపూర్ణ మెజారిటీ సీట్లు దిగువ సభలో లేనట్లయితే, అటువంటి సందర్భాలలో ఇతర పార్టీల మద్దతును కూడగట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారు.

ఉదా : ఐక్య ప్రగతి కూటమి (UPA – United Progressive Alliance) లేదా జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA – National Democratic Alliance) వంటివి సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పర్చాయి. ఇటువంటి సందర్భాలలో సంకీర్ణ ప్రభుత్వాలు కనీస ఉమ్మడి కార్యక్రమానికి కట్టుబడి పనిచేస్తాయి.

4. శాసననిర్మాణ, కార్యనిర్వాహక శాఖల మధ్య సమన్వయం :
పార్లమెంటరీ ప్రభుత్వం కార్యనిర్వాహక, శాసననిర్మాణ మధ్య సమన్వయాన్ని ఏర్పరుస్తుంది. ఎందుకంటే ఆ రెండు శాఖలకు చెందిన సభ్యులు ఒకేసారి శాసనసభలో సభ్యత్వాన్ని కలిగి ఉంటారు. ప్రథమంగా శాసన సభ్యులందరూ ఏదో ఒక సభలో సభ్యులుగా ఉంటారు.

అటు తరువాత కేబినేట్లో మంత్రిగా కొనసాగుతారు. శాసనసభ ఆమోదించిన సంక్షేమ పథకాలను, విధానాలను అమలుచేస్తుంటారు. అదే విధంగా, అనేక విషయాలకు సంబంధించి వారు శాసన సభ్యులకు సలహాలు ఇస్తుంటారు. ఈ కారణాల రీత్యా రెండు శాఖల మధ్య సమన్వయం ఏర్పడుతుంది.

5. పార్టీ క్రమశిక్షణ :
నిజమైన పార్లమెంటరీ ప్రభుత్వంలో పార్టీ క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈ ప్రభుత్వ విధానంలో ప్రతి రాజకీయపార్టీ తమ సభ్యులందరి మీద తీవ్రమైన క్రమశిక్షణ చర్యలను చేపడుతుంది.

ముఖ్యంగా పార్టీ సిద్ధాంతానికి, సూత్రాలు, నియమ నిబంధనలకు కట్టుబడి నడుచుకోవాలని ఒత్తిడి చేస్తుంది. ఇటువంటి విధానం వల్ల సభ్యులందరూ వినయవిధేయతలతో పార్టీకి, ప్రభుత్వానికి అనుగుణంగా నీతి నిజాయితీలతో, ఆశ్రిత పక్షపాతానికి తావులేకుండా పనిచేసేటట్లు సభ్యులకు శిక్షణ ఇస్తుంటారు. ఈ చర్యల వల్ల రాజకీయ పటిష్టత ఏర్పడి రాజ్యం కొనసాగుతుంది.

6. ప్రధానమంత్రి నాయకత్వం :
పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ‘ప్రధాన మంత్రిత్వ ప్రభుత్వ’మని కూడా వర్ణిస్తారు. ఈ తరహా ప్రభుత్వంలో ప్రధానమంత్రి వాస్తవ కార్యనిర్వాహక అధికారిగా వ్యవహరిస్తాడు. ఇతడు దిగువసభలో మెజారిటీ పార్టీ నాయకుడుగా లేదా సంకీర్ణ మంత్రిమండలి అధిపతిగా చాలామణి అవుతుంటాడు.

ప్రధానమంత్రి కేంద్ర కేబినెట్, కేంద్ర మంత్రిమండలికి మూలవిరాట్గా నిలబడతాడు. మంత్రిమండలి నిర్మాణం, ఉనికి, కొనసాగింపుకు ప్రధానమంత్రి కేంద్ర బిందువుగా ఉంటాడు. కేంద్ర మంత్రిమండలికి అధ్యక్షత వహించటమే కాకుండా, ఎజెండాను కూడా నిర్ణయిస్తాడు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఏకకేంద్ర ప్రభుత్వం గుణదోషాలపై ఒక వ్యాఖ్య రాయండి.
జవాబు.
అర్థము :
ఏకకేంద్ర ప్రభుత్వమంటే ఒకే ఒక్క ప్రభుత్వమని అర్థము. అధికారాలన్నీ ఒకే ప్రభుత్వం కలిగి ఉంటుంది. ఏకకేంద్ర ప్రభుత్వాన్ని ఆంగ్లంలో ‘Unitary Government’ అంటారు. ‘Uni’ అంటే ఒకటి, ‘tary’ అంటే అధికారం అని అర్థం. అంటే ఒకే ఒక్క అధికార కేంద్రమున్న ప్రభుత్వమని అర్థము.

నిర్వచనాలు :
డైసీ : “అత్యున్నత శాసనాధికారాన్ని ఒకే ఒక్క కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తే” దానిని ఏకకేంద్ర ప్రభుత్వం అంటారు.
విల్లోబి : ఏకకేంద్ర ప్రభుత్వ విధానంలో సర్వాధికారాలు కేంద్ర ప్రభుత్వానికే చెంది ఉంటాయి. తరువాత కేంద్ర ప్రభుత్వమే అధికారాలను తన ఇష్టం వచ్చినట్లు ప్రాంతీయ ప్రభుత్వాలను ఇస్తుంది” ఉదా : బ్రిటన్, జపాన్, ఫ్రాన్స్ దేశాలు.

ప్రయోజనాలు (లేదా) సుగుణాలు :

i) శక్తివంతమైన ప్రభుత్వం (Powerful Government) :
ఏకకేంద్ర ప్రభుత్వం శాసన మరియు పాలనాపరమైన అంశాలను ఒకేతాటిపై నడిపిస్తుంది. ఒకే ఒక కేంద్రప్రభుత్వ ఆధీనంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయపరమైన శాఖలుండటం వల్ల ప్రభుత్వ యంత్రాంగం శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ కారణంచేత, ఏకకేంద్ర ప్రభుత్వం సమగ్రమైన సుస్థిర పాలనను అందిస్తుంది.

ii) సమర్థవంతమైన పాలన (Efficient Rule) :
ఏకకేంద్ర పాలనా వ్యవస్థలో ప్రాంతీయ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ సూచనలను, సలహాలను పాటించాల్సి ఉంటుంది. అన్ని రకాల పాలనా పరమైన అంశాలను అత్యంత శక్తివంతంగా, సమర్థవంతంగా నిర్వహిస్తుంది. ఒకే ప్రభుత్వంలో అన్ని అధికారాలుండటం వల్ల యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తుంది.

iii) తక్కువ వ్యయం, తక్కువ సమయం (Less expensive and Time saving:
కేంద్ర వ్యవస్థ ప్రభుత్వ యంత్రాంగంలో ప్రాంతీయ ప్రభుత్వాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. తత్ఫలితంగా, ఏకకేంద్ర ప్రభుత్వ నిర్మాణం, నిర్వహణకు తక్కువ ఆర్థిక వనరులు సరిపోతాయి. అంతేకాదు, సంస్థల నిర్మాణంలో నకిలీ ఏర్పాటు ఉండదు.

అదేవిధంగా కాలయాపన లేకుండా నిర్ణయాలు త్వరితగతిన తీసుకోవడానికి అవకాశమెక్కువ. దీనివల్ల ప్రజాధనం, సమయం ఏకకేంద్ర ప్రభుత్వ వ్యవస్థలో వృధాకావు.

iv) పాలనాపరమైన ఏకత (Administrative uniformity) :
ఏకకేంద్ర ప్రభుత్వ వ్యవస్థలో ప్రత్యక్షపాలన ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తాన్ని తన నియంత్రణలో ఉంచుకొంటుంది. ఈ కారణం వల్ల, ఒకే తరహా శాసనాలు, చట్టాలు, నియమ, నిబంధనలు దేశవ్యాప్తంగా వర్తిస్తాయి. దీని వల్ల శాసనాల రూపకల్పన, పాలనా ప్రక్రియలలో సారూప్యత ఏర్పడుతుంది.

v) సత్వర నిర్ణయాలకు అవకాశం (Quick decisions possible) :
ఏకకేంద్ర ప్రభుత్వ వ్యవస్థలో ఒకే ఒక ప్రభుత్వ యంత్రాంగం ఉండటం వల్ల అది సమయానుకూలంగా సత్వర నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా, ఏకకేంద్ర ప్రభుత్వం ఊహించని, ఆకస్మిక పరిణామాలు ఏర్పడినప్పుడు, అత్యవసర సమయాల్లో సత్వర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

vi) ఒకే పౌరసత్వం (Single Citizenship) :
ఏకకేంద్ర వ్యవస్థలో పౌరులందరికీ ఒకే పౌరసత్వం ఉంటుంది. దీనివల్ల దేశంలోని ప్రజలందరినీ ఎటువంటి వివక్ష ఏ రూపంలోను చూపకుండా అందరినీ సమానమైన పౌరులుగా గుర్తించటం జరుగుతుంది. ఒకే పౌరసత్వం వల్ల అంతిమంగా ప్రజలలో జాతీయ ఐక్యత, సమైక్యత, సమగ్రత, సౌభ్రాతృత్వ భావాలు పెంపొందించుట జరుగుతుంది.

vii) చిన్న దేశాలకు ప్రయోజనకారి (Useful for small countries) :
ఏకకేంద్ర ప్రభుత్వం చిన్న దేశాలకు ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. ఎందుకంటే, తక్కువ జనాభా పరిమితమైన భౌగోళిక ప్రాంతం ఉండటం వల్ల అదేవిధంగా జాతి, భాష, సంస్కృతి, ప్రాంతీయపరంగా సజాతీయతను రూపొందించే అవకాశం ఉంటుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

లోపాలు (లేదా) దోషాలు :

i) నియంతృత్వానికి అవకాశం (Scope for Despotism) :
ఏకకేంద్ర వ్యవస్థలో అన్ని రకాల అధికారాలు ఒకే ఒక కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండటం వల్ల అధికారంలో ఉన్న వ్యక్తులు తమ ఇష్టానుసారంగా నియంతృత్వ ధోరణిలో నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. తత్ఫలితంగా, వ్యక్తుల స్వేచ్ఛకు, హక్కులకు భంగం కలిగే అవకాశం ఉంటుంది. అంతిమంగా, ఈ పరిణామాలు నియంతృత్వ ధోరణులు ప్రబలడానికి అవకాశాలను కల్పిస్తాయి.

ii) కేంద్ర ప్రభుత్వంపై అధిక భారం (More burden on Central Government) :
ఈ తరహా ప్రభుత్వ వ్యవస్థలో కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన జరగదు. కేంద్ర ప్రభుత్వం మాత్రమే అన్ని రకాల విధులను నిర్వహిస్తుంది. తత్ఫలితంగా, కేంద్ర ప్రభుత్వంపై భారం పెరిగి నిర్ణయాలు తీసుకోవటంలో నిర్లక్ష్యం, ఆలస్యం కావటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.

iii) అసమర్థత పెరుగుతుంది (Growth of Inefficiency) :
ఈ తరహా ప్రభుత్వ వ్యవస్థలో ప్రాంతీయ ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తిగానీ, స్వయం నిర్ణయాధికారం గానీ ఉండదు. ప్రాంతీయ ప్రభుత్వాలు అన్నీ కేంద్రం. ప్రభుత్వం మీదనే ఆధారపడవలసి ఉంటుంది. అందువల్ల స్థానిక పాలన వ్యవహారాలలో ప్రజలు రాజకీయంగా చొరవ చూపించటం కుదరదు. ఈ కారణం వల్ల పాలనాపరంగా అసమర్థత పెరగడానికి అవకాశం ఉంది.

iv) పెద్ద రాజ్యాలకు అనువైంది కాదు (Not suitable for large Countries) :
విభిన్న జాతులు, పలు మతాలు, అనేక భాషలు, బహుళ భౌగోళిక పరిస్థితులు, వివిధ సంస్కృతులు నెలకొని ఉన్న దేశాలకు ఏక కేంద్ర ప్రభుత్వ విధానం అనువైంది కాదు. అంతేకాదు, అధిక జనాభా, విస్తారమైన ప్రదేశం గల దేశాలకు ఈ తరహా ప్రభుత్వ వ్యవస్థ ఎంతమాత్రం ఉపయోగపడదు. పెద్ద దేశాల్లో భిన్నత్వంలో ఏకత్వం సాధించటం అంత సులువైన పనికాదు.

v) బాధ్యతారాహిత్యం (Irresponsibility) :
ఏకకేంద్ర వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం దేనికి బాధ్యత వహించదు. అంతేకాదు ప్రాంతీయ ప్రభుత్వాలు ఏ విషయంలోనైనా ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేవు. అందువల్ల, కేంద్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే అవకాశాలు ఉంటాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

ప్రశ్న 2.
పార్లమెంటరీ ప్రభుత్వ గుణదోషాలను పేర్కొనండి.
జవాబు.
శాసన, కార్యనిర్వాహకశాఖల మధ్య సమన్వయం:
శాసన, కార్యనిర్వాహకశాఖల మధ్య సహకారం, సమన్వయం ఉంటాయి. మంత్రిమండలి (కార్యనిర్వాహకశాఖ) శాసనసభలో (పార్లమెంటు) అంతర్భాగమే. ఆ రెండూ మెజారిటీ పార్టీ అధీనంలోనే ఉంటాయి. కాబట్టి శాసనసభ్యుల అభిప్రాయం ప్రకారం మంత్రులు చట్టాలను రూపొందిస్తారు.

అలాగే మంత్రులు ప్రవేశపెట్టే బిల్లుల్ని శాసనసభ్యులు ఆమోదిస్తారు. కాబట్టి ఈ రెండు శాఖలమధ్య వివాదాలకు, సంఘర్షణలకు సాధారణంగా అవకాశం ఉండదు.

ప్రభుత్వ నియంతృత్వానికి అవకాశం తక్కువ :
మంత్రిమండలి ప్రత్యక్షంగా పార్లమెంటుకు, పరోక్షంగా ప్రజలకు బాధ్యత వహిస్తుంది. ప్రశ్నలు, తీర్మానాలు ప్రవేశపెట్టడం ద్వారా పార్లమెంటు మంత్రి వర్గాన్ని అదుపులో ఉంచుతుంది. అవసరమైతే అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించి మంత్రి మండలిని పదవినుంచి తొలగిస్తుంది. అందువల్ల ఈ విధానంలో ప్రభుత్వనియంతృత్వంగా, బాధ్యతారహితంగా పరిపాలించే అవకాశం చాలా తక్కువ.

అధికార వికేంద్రీకరణకు అవకాశం :
పార్లమెంటరీ విధానం అధికార వికేంద్రీకరణను ప్రోత్సహిస్తుంది. ఈ విధానంలో కార్యనిర్వహణాధికారం ఏ ఒక్కరి చేతిలోనూ కేంద్రీకృతం కాదు. మంత్రుల మధ్య అధికారాలు పంపిణీ అవుతాయి.

ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు సులభం:
రాజకీయ విప్లవాలకు అవకాశం ఉండదు. ప్రభుత్వంలో ఎటువంటి మార్పులనైనా సులభంగా ప్రవేశపెట్టవచ్చు. మంత్రివర్గాన్ని అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించిన తరువాత ప్రతిపక్షాలు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉంటాయి. ఒకవేళ ప్రతిపక్షాలు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని స్థాపించడంలో విఫలమైతే, మధ్యంతర ఎన్నికల్ని నిర్వహించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది.

విస్తృత ప్రాతినిధ్యం :
దేశంలోని విభిన్న వర్గాలవారికి, ప్రాంతాలవారికి సముచితమైన ప్రాతినిధ్యం మంత్రివర్గ నిర్మాణంలో ఉంటుంది. ప్రభుత్వ నిర్వహణలో అన్ని వర్గాలవారికి, ప్రాంతాలవారికి, భాషలవారికి ప్రాతినిధ్యం కల్పించడంవల్ల ప్రజలలో జాతీయదృక్పథం, జాతీయ సమైక్యతాభావాలు పెంపొందుతాయి.

రాజకీయ చైతన్యం :
పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజాబాహుళ్యంలో రాజకీయ చైతన్యం పెంపొందుతుంది. ప్రభుత్వం చేపట్టే వివిధ కార్యక్రమాలపై శాసనసభలో జరిగే చర్చలు ప్రభుత్వం పని తీరుపై సామన్య ప్రజల్లో రాజకీయ అవగాహనను పెంచుతాయి. ప్రతిపక్ష పార్టీల విమర్శలను, అధికార పార్టీ లోపాలను ప్రజలు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. ఇలా ప్రజల్లో రాజకీయ పరిజ్ఞానం పెరుగుతుంది.

పార్లమెంటరీ ప్రభుత్వం- లోపాలు:

అధికార పృథక్కరణ సిద్ధాంతానికి వ్యతిరేకం :
ఇది పృథక్కరణ సిద్ధాంతానికి వ్యతిరేకం. మంత్రులు శాసన, కార్య నిర్వాహక శాఖల్లో సభ్యత్వాన్ని కలిగి, ఆ రెండింటిపై అజమాయిషీ చేస్తారు. ఆ రెండు శాఖల మధ్య పూర్తి అవగాహన, సహకారం ఉంటాయి. మంత్రిమండలి పార్లమెంటులో అంతర్భాగంగా పని చేయడంవల్ల అధికార విభజన సిద్ధాంతానికి భంగం కలుగుతుంది.

అస్థిర ప్రభుత్వం :
ప్రభుత్వం పూర్తి పదవీకాలం ఉంటుందన్న నమ్మకం లేదు. ముఖ్యంగా బహుపార్టీ వ్యవస్థ అమలులో ఉన్న దేశాలలో ఈ పరిస్థితి నెలకొని ఉంటుంది. దీనికి కారణం మంత్రి వర్గాలు శాసన సభ్యుల మద్ధతుపై ఆధారపడి ఉండటమే. అంతేగాక అధికార పార్టీలోని విభేదాలు కూడా మంత్రివర్గం కాలపరిమితిని నిర్ణయిస్తాయి. ప్రభుత్వం పార్లమెంటు విశ్వాసమున్నంతవరకే పదవిలో ఉంటుంది. అందువల్ల ప్రభుత్వానికి స్థిరత్వం ఉండదు.

మంత్రి మండలి నియంతృత్వం:
మంత్రిమండలి నియంతృత్వానికి దారితీస్తుంది. పార్లమెంటులో మెజారిటీ ఉన్న మంత్రి మండలి సర్వాధికారాలను చెలాయిస్తుంది. పార్లమెంటరీ ప్రభుత్వం అమల్లో ఉన్న దేశాల్లో మంత్రివర్గ నియంతృత్వం పెరుగుతుందన్న అభిప్రాయాన్ని స్త్రీవార్ట్, రామ్ సేమ్యుర్ మొదలైన ప్రముఖులు వ్యక్తం చేశారు.

మంత్రి మండలి నిర్మాణం కష్టం :
మంత్రి వర్గ నిర్మాణం అంత సులభం కాదు. ప్రధానమంత్రి మంత్రులను ఎంపిక చేసేటప్పుడు అనేక అంశాలను అంటే కుల, మత, భాష, ప్రాంతీయ అంశాలను, పాలనా దక్షత, పార్టీ విధేయతలను దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాలవారిని సంతృప్తిపరచవలసి ఉంటుంది.. తన పార్టీలో అసంతృప్తి వర్గాన్ని కూడా సంతృప్తిపరచాలి. అందువల్ల మంత్రివర్గ నిర్మాణం చాలా క్లిష్టం.

అత్యవసర పరిస్థితులకు తగింది కాదు :
కార్యనిర్వహణాధికారాలు మంత్రుల మధ్య విభజితమై ఉండటంవల్ల ‘ నిర్ణయాలు ఆలస్యంగా జరుగుతాయి. మంత్రుల మధ్య భేదాభిప్రాయాలవల్ల కూడా ఏకగ్రీవంగా నిర్ణయాలు జరగవు. అత్యవసర పరిస్థితుల్లో సంభవించే ప్రమాదాలను అధిగమించే శక్తి సామర్థ్యాలు దీనికి ఉండవు.

పార్టీ ప్రయోజనాలకు ఆధిక్యత :
పార్లమెంటరీ ప్రభుత్వం ప్రధానంగా పార్టీ ప్రభుత్వం. అది అన్న వేళలా పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాధికారాన్ని నిర్వహిస్తుంది. దేశ సమస్యల్ని పార్టీపరంగా ఆలోచించి, వాటి ‘పరిష్కార మార్గాలను రూపొందిస్తుంది. పార్లమెంటులో తన మెజారిటీని నిలుపుకోడానికి ఎప్పుడూ కృషి చేస్తుంది. అవసరమైతే పార్టీ ఫిరాయింపులను కూడా ప్రోత్సహిస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

ప్రశ్న 3.
సమాఖ్య ప్రభుత్వ గుణదోషాలను చర్చించండి.
జవాబు.
సమాఖ్య ప్రభుత్వ ప్రయోజనాలు :

ఎ. భిన్నత్వంలో ఏకత్వం :
సమాఖ్య ప్రభుత్వంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించే అవకాశం ఉంది. భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, విభిన్న భాషలు కలిగి ఉన్న సమాజానికి సమాఖ్య వ్యవస్థ ఎంతో మేలు.

బి. నియంతృత్వానికి వ్యతిరేకం :
సమాఖ్య వ్యవస్థలో నియంతృత్వం ఏర్పడకుండా నిరోధించే అవకాశం ఉంటుంది. కేంద్ర – రాష్ట్రాల మధ్య రాజ్యాంగ పరంగా అధికార విభజన ఉండటంవల్ల నింకుశత్వాన్ని నిరోధించవచ్చు.

సి. కేంద్రంపై భారం తక్కువ :
రాజ్యాంగబద్ధంగా కేంద్రం – రాష్ట్రాల ధ్య అధికారాల విభజన జరగడంవల్ల అవి వాటి వాటి విధులను సమర్థవంతంగా నిర్వహిస్తాయి. అందువల్ల కేంద్రం పై భారం తగ్గుతుంది.

డి. నూతన ప్రయోగాలకు అవకాశం :
సమాఖ్య విధానంలో నూతన విధానాలను, సంక్షేమ పథకాలను ప్రజల సామాజిక ఆర్థిక అభివృద్ధికై నూతన ప్రయోగాలను చేయడానికి అవకాశం ఉంటుంది.

ఇ. పెద్ద రాజ్యాలకు అనువైనది:
పెద్దవైన, విశాలమైన దేశాలకు సమాఖ్య విధానం అనువైనది. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన ఉంటుంది. కాబట్టి సమాఖ్య విధానం అనువైనది.

ఎఫ్. పరిపాలనలో సామర్థ్యం :
సమాఖ్య ప్రభుత్వంలో రాష్ట్రాలకు సంబంధించిన చాలా విషయాలు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందుతాయి. దీనితో కేంద్ర ప్రభుత్వానికి పనిభారం తగ్గి జాతీయ ప్రాముఖ్యం ఉన్న అంశాలపై దృష్టి కేంద్రీకరించి సమర్థవంతమైనపాలన అందించటానికి అవకాశం ఉంటుంది.

సమాఖ్య ప్రభుత్వ లోపాలు :
ఎ. బలహీనమైన కేంద్ర ప్రభుత్వం :
కేంద్రరాష్ట్రాల మధ్య అధికారాల విభజన ఉండటం మూలంగా కేంద్ర ప్రభుత్వం బలహీనపడే అవకాశం ఉంటుంది. ప్రాంతీయ ప్రభుత్వాలు తమ ప్రాంతాల అభివృద్ధి కారణాలతో కేంద్రంపై ఒత్తిడి పెంచుతాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయంలో సవాళ్ళను ఎదుర్కొంటుంది.

బి. ఏకరూపత లోపం :
సమాఖ్య వ్యవస్థలో ప్రాంతీయ అంశాలపై శాసనాలను, చట్టాలను చేసే అధికారం రాష్ట్రాలకే ఉంటుంది. అందువల్ల ఆయా ప్రభుత్వాలు స్థానిక అవసరాలకు అనుగుణంగా శాసనాలు రూపొందించటంవల్ల వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అధికారాల విషయంలోను అదే విధంగా కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వ అధికారాల విషయంలోను ఏకరూపత లోపిస్తుంది.

సి. వైరుధ్యాలు, వివాదాలు :
సమాఖ్య వ్యవస్థలో కేంద్ర – రాష్ట్రాల మధ్య అధికారాల విభజన ఉన్నప్పటికీ ఉమ్మడి జాబితా విషయంలో రెండింటికి శాసనం చేసే అధికారం ఉంటుంది. అయినప్పటికీ తమ తమ బాధ్యతలు విస్మరించటంవల్ల వివాదాలు, వైరుధ్యాలు తలెత్తుతాయి.

డి. ఖర్చుతో కూడిన యంత్రాంగం :
సమాఖ్య విధానంలో రెండు రకాల ప్రభుత్వాలుంటాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వం, రెండవది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రెండు ప్రభుత్వాల పరిపాలన వ్యవస్థ ఏర్పాటు చేయటం ఖర్చుతో కూడుకున్నది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

ప్రశ్న 4.
ఏకకేంద్ర ప్రభుత్వం మరియు సమాఖ్య ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాన్ని తెలపండి.
జవాబు.

ఏకకేంద్ర ప్రభుత్వంసమాఖ్య ప్రభుత్వం
1. లిఖిత లేదా అలిఖిత రాజ్యాంగం.1. లిఖిత రాజ్యాంగం తప్పనిసరి.
2. అదృఢ రాజ్యాంగం.2. దృఢ రాజ్యాంగం.
3. ఏకకేంద్ర ప్రభుత్వ విధానంతో ప్రభుత్వాలు ప్రాంతీయ స్థాయిలో3. రెండు రకాల ప్రభుత్వాలు కేంద్ర స్థాయిలో
4. కేంద్రీకృత అధికారాలు.4. అధికారాల వికేంద్రీకరణ కేంద్రం రాష్ట్రాల మధ్య అధికారాల విభజన.
5. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వ ఉండకపోవచ్చు.5. ప్రజాస్వామ్య ప్రభుత్వం నిర్ణయీకరణలో భాగస్వామ్యం ఉంటుంది.
6. చట్టాలన్నీ సారుప్యత కలిగి ఉంటాయి.6. కేంద్రం చట్టాలు, రాష్ట్రం చట్టాలుంటాయి.
7. స్వతంత్ర న్యాయవ్యవస్థ అవసరం లేదు.7. స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉంటుంది.
8. నిరంకుశం ఏర్పడవచ్చు.8. రాజ్యాంగం ప్రకారం ఏర్పడినవి. కాబట్టి నియం తృత్వానికి తావులేదు.
9. ప్రభుత్వ విధానం సరళం, సాధారణంగా ఉంటుంది.9. ప్రభుత్వ విధానం కఠినతరం, సంక్లిష్టంగా ఉంటుంది.
10. చిన్నరాజ్యాలకు అనువైనది.10. పెద్దరాజ్యాలకు అనువైనది.
11. ద్విసభ విధానం (బ్రిటన్) లేదా ఏకసభ విధానం (చైనా) ఉండవచ్చు.11. ద్విసభా విధానం ఉంటుంది.
12. రాజ్యాంగం అత్యున్నతమైనది (జపాన్), లేదా రాజ్యాంగం మామూలుగా ఉండవచ్చు (బ్రిటన్).12. రాజ్యాంగం ఆధిక్యతను కలిగి ఉంటుంది.
13. రాజకీయ ఏకీకరణకు లేదా రాజకీయ స్థిరత్వానికి అవకాశం ఉంటుంది.13.రాజకీయ ఏకీకరణకు, స్థిరత్వానికి తక్కువ అవకాశం.
14. ప్రాంతీయ ప్రభుత్వ అధికారాలను కేంద్రం మార్చే అవకాశం ఉంది.14. ప్రాంతీయ ప్రభుత్వాల అధికారాలను మార్చే వీలు కేంద్రానికి ఉండదు.

 

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

ప్రశ్న 5.
అధ్యక్ష తరహా ప్రభుత్వంపై ఒక వ్యాఖ్య రాయండి.
జవాబు.
అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహకవర్గం తన చర్యలకు శాసనశాఖకు ఎటువంటి బాధ్యత వహించదు. దీనిని ఏకసభ్య కార్యనిర్వాహక ప్రభుత్వం అని కూడా పిలుస్తారు. దీనిని నిర్ణీత కాల పరిమితి గల ప్రభుత్వమనీ, బాధ్యతారహిత ప్రభుత్వమని కూడా సంభోదిస్తారు.

ఈ ప్రభుత్వ విధానంలో అధ్యక్షుడు ఒక్కడే అన్ని రకాల కార్యనిర్వాహక అధికారాలను అనుభవిస్తాడు. అధ్యక్షుడు ప్రజలచేత ప్రత్యక్షంగా ఎన్నికల గణం ద్వారా ఎన్నికవుతాడు.

అధ్యక్షుడుగాని, ఇతర సభ్యులుగాని వారివారి విధుల నిర్వహణలో ఇతరులెవ్వరికీ బాధ్యత వహించదు. ఈ తరహా ప్రభుత్వం మాంటెస్క్యూ ప్రతిపాదించిన ‘అధికారాల వేర్పాటువాద సిద్ధాంతం ఆధారంగా ఆచరణలోకి వచ్చింది. ఈ తరహా ప్రభుత్వాలు అమెరికా, అర్జెంటీనా, బొలీవియా, చిలీ, జైర్, కాంగో, మెక్సికో, పెరు, పెరుగ్వే, ఉగాండా మొదలగు దేశాలలో కొనసాగుతున్నాయి.

ప్రశ్న 6.
అధ్యక్ష తరహా మరియు పార్లమెంటరీ తరహా ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాలను పరిశీలించండి.
జవాబు.

పార్లమెంటరీ తరహా ప్రభుత్వం

అధ్యక్ష తరహా పార్లమెంటరీ

1. రెండు రకాల కార్యనిర్వాహక వర్గం,

1. వాస్తవాధికారి, 2. నామమాత్రపు అధికారి.

1. వాస్తవాధికారి, నామమాత్రపు అధికారి అనే తేడా ఉండదు. ఒక్కడే వాస్తవాధికారి.
2. రాజ్యాధినేత నామమాత్రం, ప్రభుత్వాధినేత వాస్తవాధికారి.2. రాజ్యాధినేతనే వాస్తవాధికారిగా వ్యవహరిస్తాడు.
3. కార్యనిర్వాహక శాఖకు శాసనశాఖకు సమన్వయం ఉంటుంది.3. కార్యనిర్వాహక వర్గానికి శాసనశాఖకు పరస్పర సహకారం కాని సమన్వయం గాని ఉండదు. రెండూ స్వతంత్రంగా వ్యవహరిస్తాయి.
4. కార్యనిర్వాహక శాఖ పదవీ కాలం అనిశ్చితం.4. కార్యనిర్వాహక వర్గానికి కచ్చితమైన కాలపరిమితి ఉంటుంది.
5. మంత్రిమండలిని పూర్తిగా ప్రధానమంత్రి సలహామేరకు రాజ్యాధిపతి నియమిస్తాడు.5. క్యాబినెట్ను అధ్యక్షుడు నియమిస్తాడు.
6. మంత్రులందరూ శాసనశాఖలో సభ్యులుగా ఉంటారు.6. మంత్రులు లేదా క్యాబినెట్ లేదా సెక్రటరీలు శాసన శాఖలో సభ్యులుగా ఉండరు.
7. మంత్రులందరూ రాజ్యాధిపతికి జవాబుదారిగాను, శాసనసభకు సమిష్టి బాధ్యత వహిస్తారు.7. సెక్రటరీలు శాసనశాఖకు జవాబుదారీగా ఉండరు. కేవలం అధ్యక్షుడికి మాత్రమే జవాబుదారిగా ఉంటారు.
8. పాలనలో అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం ఉంటుంది.8. అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం ఉండదు.
9. కార్యనిర్వాహక శాఖ యొక్క ప్రతిచర్య శాసనశాఖచే పరిశీలించబడుతుంది.9. శాసనశాఖ, కార్యనిర్వాహకశాఖ రెండు స్వతంత్రమైనవి, పరస్పరం నిరోధ సమతౌల్యతతో వ్యవహరిస్తాయి.
10. మారుతున్న పరిస్థితులకనుగుణంగా నిర్ణయాలకు వెసులుబాటు ఉంటుంది.10. షరిస్థితులకనుగుణంగా మారదు. వెసులుబాటు కూడా ఉండదు.

 

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

ప్రశ్న 7.
అధ్యక్ష తరహా ప్రభుత్వ గుణదోషాలను పేర్కొనండి.
జవాబు.
పరిచయం :
అధ్యక్షపాలనను బాధ్యతాయుతముకాని ప్రభుత్వమని కూడా అంటారు. ఈ విధానంలో ఆ దేశాధ్యక్షుడు రాజ్యానికి, ప్రభుత్వానికి కూడా అధినేత. ఆయనకు నిజమైన అధికారాలు ఉంటాయి. ఇది ఏకపాలక వర్గ విధానము. అధ్యక్షుడు నియమించుకునే మంత్రులకు శాసనశాఖతో సంబంధం ఉండదు.

మంత్రులు ఆయనకు విధేయులై పనిచేసే తాబేదారులు, వారికి శాసనసభ సభ్యత్వం ఉండదు. అధ్యక్షుడు ప్రజలచేత లేదా ఎన్నికలగణాల చేత ఎన్నుకోబడతాడు. అధ్యక్షునకు ఒక నిర్ణీత పదవీకాలం ఉంటుంది. ఆయనను తొలగించడం తేలికకాదు. అధ్యక్షపాలనా విధానానికి అమెరికా మంచి ఉదాహరణ (U.S.A.).

నిర్వచనం :
ప్రొఫెసర్ గార్నర్ : “అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహక శాఖ కాలపరిమితి, రాజకీయ విధానాలకు సంబంధించి రాజ్యాంగబద్ధమైన స్వతంత్రతను కలిగి ఉంటుంది”.

ప్రయోజనాలు :
1. నియంతృత్వానికి తక్కువ అవకాశం :
అధ్యక్ష ప్రభుత్వం అధికార వేర్పాటువాద సిద్ధాంత ప్రాతిపదికన ఏర్పడినందున ప్రభుత్వంలోని అన్ని అంగాలు స్వతంత్రమైనవిగా ఉంటాయి. అధికారాలన్నీ వివిధ శాఖల మధ్య, ఆయా అంగాల మధ్య విభజించబడి ఉండటం వలన ఈ ప్రభుత్వంలో నియంతృత్వానికి తావులేదు.

2. సుస్థిర ప్రభుత్వం :
ఈ ప్రభుత్వ విధానంలో ముఖ్య కార్యనిర్వహణాధిపతి (అధ్యక్షుడు) ఒక నిర్దిష్ట కాలపరిమితికి ఎన్నికవుతాడు. అతడి కాలపరిమితి శాసనసభ విశ్వాసం మీద ఆధారపడి ఉండదు. కాబట్టి పూర్తి కాలపరిమితి వరకు అధ్యక్ష హోదాలో అతడు కొనసాగుతాడు. అందువల్ల ఈ విధానంలో ప్రభుత్వం సుస్థిరంగా ఉండగలదని విశ్వసించవచ్చు.

3. చర్యలలో జాప్యం ఉండదు :
అధ్యక్ష ప్రభుత్వ విధానంలో కార్యనిర్వహణాధికారాలన్నీ ఒకే వ్యక్తి చేతిలో ఉండటం వల్ల అతడు సత్వర నిర్ణయాలు తీసుకొనే అవకాశాలుంటాయి. అందువల్ల ప్రజల సమస్యలను తీర్చే సందర్భంలో కార్యదర్శులను (మంత్రులు) సంప్రదించాల్సిన అవసరం లేకుండా త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవచ్చును.

4. పాలనా సామర్థ్యం పెరుగుతుంది :
ఈ ప్రభుత్వ విధానంలో పాలనా సామర్థ్యం పెరుగుతుంది. సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు వారి వారి అనుభవం, సామర్థ్యాలతో పాలనారంగం భాగస్వామ్యం కలిగి ఉండటం వల్ల ఇది సాధ్యమవుతుంది.

5. బాధ్యతాయుతమైన ప్రభుత్వం :
అధ్యక్ష తరహా ప్రభుత్వం సూత్ర ప్రాయంగా బాధ్యతారహిత ప్రభుత్వమైనప్పటికీ వాస్తవానికి ఇది ఎంతో బాధ్యతాయుతంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే, ప్రభుత్వ విధానాలను రూపొందించే సందర్భంలో అధ్యక్షుడు దూరదృష్టితో ప్రజల ఆశయాలను, ఆకాంక్షలను, ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొంటాడు. అధ్యక్షుడు తన అధికారాలను ఉపయోగించే సమయంలో స్వార్థపర వ్యక్తుల పట్ల, స్వప్రయోజనాలను కోరుకునే వ్యాపార వర్గాల పట్ల అప్రమత్తంగా ఉంటాడు.

6. అత్యవసర సమయాలకు తగిన ప్రభుత్వం :
అధ్యక్షతరహా ప్రభుత్వం అత్యవసర పరిస్థితులను, సంఘటనలను పరిష్కరించటంలో ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది. అనూహ్య పరిణామాలు సంభవించినపుడు అధ్యక్షుడు సత్వర నిర్ణయాలు తీసుకొంటాడు. అత్యవసర సమయాలలో శాసనసభ లేదా మంత్రివర్గం ఆమోదానికై ఎదురుచూడకుండా తానే స్వయంగా తగిన నిర్ణయాలు తీసుకొంటాడు. దేశ సంక్షేమం దృష్ట్యా పాలనా చర్యలు వీలైనంత సున్నితంగా ఉండే విధంగా చూస్తాడు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

లోపాలు :

1. శాసన – కార్యనిర్వాహక శాఖల మధ్య వైరుధ్యాలు :
అధ్యక్ష ప్రభుత్వం అధికార వేర్పాటువాద సిద్ధాంతం ఆధారంగా ఏర్పడినప్పటికీ వివిధ ప్రభుత్వ అంగాల మధ్య వైరుధ్యాలు జనిస్తూనే ఉన్నాయి. ఈ విధంగా జరగడానికి ప్రభుత్వం విధుల పరంగా విడివిడిగా ఉండటమే కారణమని చెప్పవచ్చు. పెండింగ్ బిల్లులను అమోదించటంలో, ప్రభుత్వ విధి విధానాలను అమలు పర్చటంలో అధ్యక్షుడికి, శాసనసభ్యులకు మధ్య అవగాహన లోపం ఉండటం కూడా రెండు శాఖల మధ్య వివాదాలకు దారితీస్తుంది.

2. బాధ్యతారహితం :
అధ్యక్ష ప్రభుత్వ ఆచరణలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంది. అధ్యక్షుడు గానీ, శాసనసభ్యులు గానీ, ప్రభుత్వ అంగాలకు పూర్తి బాధ్యత వహించరు. ప్రత్యక్ష ఎన్నికలు, నిర్ణీత కాలపరిమితి, అధికారాల విభజన మొదలైన అంశాలు శాసనాల రూపకల్పనలోను, వాటి అమలులోను బాధ్యతారహితంగా వ్యవహరించే పరిస్థితులను కల్పిస్తాయి.

3. సంపూర్ణ ప్రాతినిధ్యాన్ని కల్పించటంలో విఫలం :
అధ్యక్ష ప్రభుత్వం సమాజంలోని భిన్న సమూహాలకు సరియైన ప్రాతినిధ్యాన్ని కల్పించలేదు. ఎన్నికలకు ముందు ఒక ప్రత్యేక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి అధ్యక్షుడుగా ఎన్నికై పక్షపాతరహితంగా వ్యవహరిస్తాడని నమ్మలేము. అన్ని సందర్భాలలో, సమయాలలో ఖచ్చితంగా ప్రజాసేవకు అంకితమై నీతి నిజాయితీలతో వ్యవహరిస్తాడని చెప్పలేము.

4. ప్రజాభిప్రాయానికి స్థానం లేదు :
ఈ ప్రభుత్వ విధానంలో ప్రజాభిప్రాయానికి చాలా తక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం జరుగుతుంది. ఎన్నికల అనంతరం అధ్యక్షుడితో పాటు శాసనసభ్యులు సైతం అనేక విషయాలకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని ఖాతరు చేయరు. ప్రజామోదం గాని, ప్రజల విశ్వాసం గాని, ప్రజా మద్దతు గాని వారి చర్యలకు అవసరం లేదనే విధంగా ప్రవర్తిస్తారు.

5. శాసనసభకు అప్రధాన హోదా :
అధ్యక్ష ప్రభుత్వ విధానం, శాసనసభకు ద్వితీయ ప్రాధాన్యతనిస్తుంది. కార్యనిర్వాహకశాఖ అధిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ ప్రభుత్వంలో అధ్యక్షుడిని అత్యంత శక్తివంతమైన, మిక్కిలి పలుకుబడి కలిగిన వ్యక్తిగా గుర్తిస్తారు.

దేశానికి సంబంధించి జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలలో అతి ముఖ్యమైన ప్రచారకర్తగా భావిస్తారు. అధ్యక్షుడు శాసనసభ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాల్సిన అవసరం లేనందున సభా సమావేశాలు పేలవంగా అప్రాధ్యానతను సంతరించుకుంటాయి.

6. సంప్రదాయ రాజ్యాంగం :
సాధారణంగా అధ్యక్ష ప్రభుత్వ రాజ్యాంగం సంప్రదాయకమైనదై ఉంటుంది. ఈ ప్రభుత్వంలో స్వభావరీత్యా దృఢ రాజ్యాంగాన్ని సవరించటం అంత సులభం కాదు. మారిన ప్రజావసరాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించడం వీలుపడదు. ఈ కారణంవల్ల అనేకమంది రాజనీతిశాస్త్ర విమర్శకులు ఈ తరహా రాజ్యాంగాన్ని ప్రగతికి, అభివృద్ధికి వ్యతిరేకమైనదానిగా భావిస్తారు.

ప్రశ్న 8.
ఆధునిక ప్రభుత్వ వర్గీకరణపై ఒక వ్యాఖ్య రాయండి.
జవాబు.
ప్రభుత్వం ఉపయోగించే అధికారాలను బట్టి ప్రభుత్వాల వర్గీకరణను, సిసిరో, పొలిబియస్, మాకియవెల్లి, జీన్ బోడిన్, మాంటెస్క్యూ మొదలైన వారు వర్గీకరించారు. ఆధునిక కాలంలోనివారు – బ్లంట్ల, బర్జర్,, మెరియట్, సి.ఎఫ్. స్ట్రాంగ్ స్టీఫెన్ లీకాక్ మొదలయినవారు. వీరిలో స్టీఫెన్ లీకాక్ వర్గీకరణ, నేటి ఆధునిక ఉదారవాద ప్రభుత్వాలకు దగ్గరగా ఉందని చెప్పవచ్చు.

స్టీఫెన్ లీకాన్ ప్రభుత్వాలను ముఖ్యంగా రెండు రకాలుగా వర్గీకరించారు. అవి : నిరంకుశం, ప్రజాస్వామ్యం. అదే విధంగా ప్రజాస్వామ్యం మరో రెండు రకాలు. ఒకటి పరిమిత రాజరికం, రెండు రిపబ్లిక్. అధికారాల విభజనను బట్టి పై రెండు రకాల ప్రభుత్వాలను ఏకకేంద్ర, సమాఖ్య ప్రభుత్వాలుగా విభజించవచ్చు. పై రెండు రకాల ప్రభుత్వాలను వాటి ఉన్నతాధికారి ఎన్నికను బట్టి పార్లమెంటరీ తరహా, అధ్యక్ష తరహా ప్రభుత్వాలుగా విభజించవచ్చు.

ఆధునిక కాలంలోని ప్రభుత్వాలు వాటి అధికారాలను చెలాయించే స్వభావాన్ని బట్టి వివిధ రాజనీతి శాస్త్రజ్ఞులు విస్తృతంగా చర్చించి రెండు రకాలుగా పేర్కొన్నారు. 1. నిరంకుశ ప్రభుత్వం, 2. ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వాలను పరిమిత రాజరిక ప్రభుత్వం, గణతంత్ర ప్రభుత్వాలుగా పేర్కొన్నారు. ఇక వాటి నైసర్గిక అధికారాలను బట్టి ఏకకేంద్ర, సమాఖ్య ప్రభుత్వాలుగాను, అధ్యక్ష తరహా, పార్లమెంటరీ తరహా ప్రభుత్వాలుగా వర్గీకరించడమైంది.

TS Inter 1st Year Political Science Study Material 12th Lesson ప్రభుత్వం – రకాలు 1

నియంతృత్వ ప్రభుత్వం :
ఏ ప్రభుత్వమైతే ఏక వ్యక్తి పాలనలో ఉండి అపరిమితమైన అధికారాన్ని చెలాయిస్తుందో అదే నిరంకుశ ప్రభుత్వం లేదా నియంతృత్వ ప్రభుత్వం. నియంతృత్వ పాలన ప్రజల అభిప్రాయం గాని, వారి సంక్షేమం గాని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా పాలిస్తుంది.

ప్రజాస్వామ్య ప్రభుత్వం :
ప్రజాస్వామ్య ప్రభుత్వం నిర్ణయీకరణలో ప్రజల భాగస్వామ్యం, వారి అభిప్రాయానికి గుర్తింపు, ప్రజల మధ్య సమానత్వం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
అరిస్టాటిల్ ప్రభుత్వాల వర్గీకరణ.
జవాబు.
అరిస్టాటిల్ ప్రభుత్వాలను రెండు అంశాల ప్రాతిపదికగా వర్గీకరించారు. అవి

  1. రాజ్యాధికారంలో ఉన్న వ్యక్తుల సంఖ్యను బట్టి
  2. రాజ్య అంతిమ లక్ష్యాన్ని బట్టి

మరో విధంగా చెప్పాలంటే ప్రభుత్వాలను మంచి ప్రభుత్వాలు, చెడు ప్రభుత్వాలుగా వర్గీకరించటం జరిగింది. రాజరికం, కులీన పాలన, మధ్యతరగతి పాలన అనేవి అరిస్టాటిల్ దృష్టిలో మంచి ప్రభుత్వాలు. నిరంకుశత్వం, అల్పజనపాలన, ప్రజాస్వామ్యం అనేవి చెడు ప్రభుత్వాలు అని అరిస్టాటిల్ పేర్కొన్నాడు.

ప్రశ్న 2.
ఏకకేంద్ర ప్రభుత్వం.
జవాబు.
“ఏ వ్యవస్థలో రాజ్యము యొక్క సర్వాధికారాలను ఒకే కేంద్రీయ అధికార వ్యవస్థ వాడుకగా వినియోగిస్తుందో, ఆ అధికార వ్యవస్థనే ఏకకేంద్ర ప్రభుత్వం” అని ఎ.వి.డైసీ పేర్కొన్నాడు. ఈ విధానంలో, కేంద్ర ప్రభుత్వం ఒక్కటే ఉంటుంది. అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలో కేంద్రీకరించబడి ఉంటాయి. రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం తన అవసరం మేరకు ఏర్పాటు చేసుకొనే వీలుంది.

ప్రశ్న 3.
సమాఖ్య ప్రభుత్వం.
జవాబు.
“జాతీయ సమైక్యత, ప్రాంతీయ విభాగాల హక్కులను సమన్వయపరచే రాజకీయ సాధనమే సమాఖ్య ప్రభుత్వం” అని ఎ.వి.డైసీ పేర్కొన్నాడు. సమాఖ్య ప్రభుత్వానికి ప్రధానంగా మూడు లక్షణాలుంటాయని ఎ.వి.డైసీ పేర్కొన్నాడు. అవి :

  1. కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య స్పష్టమైన, నిర్దిష్టమైన అధికారాల పంపిణీ.
  2. లిఖిత, దృఢ, ఉన్నత రాజ్యాంగం
  3. స్వతంత్ర ప్రతిపత్తి కల్గిన న్యాయవ్యవస్థ.

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

ప్రశ్న 4.
అధ్యక్ష తరహా ప్రభుత్వం.
జవాబు.
అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహకవర్గం తన చర్యలకు శాసననిర్మాణ శాఖకు ఎటువంటి బాధ్యత వహించదు. దీనిని ‘ఏకసభ్య కార్యనిర్వాహక ప్రభుత్వం’ అని, ‘నిర్ణీత కాలపరిమితిగల ప్రభుత్వమని’, ‘బాధ్యతారహిత ప్రభుత్వమని’ సంబోధిస్తారు.

ప్రశ్న 5.
పార్లమెంటరీ తరహా ప్రభుత్వం.
జవాబు.
పార్లమెంటరీ ప్రభుత్వమంటే నిజమైన కార్యనిర్వాహకవర్గం, మంత్రిమండలి లేదా మంత్రివర్గం 1) తక్షణం, చట్టబద్ధంగా తన రాజకీయ విధానాలు, చర్యలకు శాసనసభకు 2) అంతిమంగా నియోజకులకు బాధ్యత వహించే ” వ్యవస్థతో కూడుకొన్నది” అని ప్రొఫెసర్ గార్నర్ నిర్వచించటం జరిగింది.

ప్రశ్న 6.
అలిఖిత రాజ్యాంగం.
జవాబు.
లిఖితరూపంలో లేని రాజ్యాంగాన్ని అలిఖిత రాజ్యాంగం అంటారు. రాజ్యాంగ సూత్రాలన్నీ ఒకే అధికార పత్రంలో రాసి ఉండవు. రాజ్య మౌలిక సూత్రాలు ఆచార సంప్రదాయాల రూపంలోనూ, శాసనసభలు ప్రజావసరాల మేరకు ఎప్పటికప్పుడు రూపొందించే చట్టాల రూపంలోనూ ఉంటాయి. అలిఖిత రాజ్యాంగం ఒక్కసారి కాకుండా కాలక్రమేణా రూపొందడం వలన దీనిని పరిణామాత్మక రాజ్యాంగం అని కూడా అంటారు. బ్రిటీష్ రాజ్యాంగం అలిఖిత రాజ్యాంగానికి చక్కని ఉదాహరణ.

ప్రశ్న 7.
పార్లమెంటరీ కార్యనిర్వాహకవర్గం.
జవాబు.
ఈ విధానంలో కార్యనిర్వాహకవర్గం శాసనసభలో సభ్యత్వాన్ని పొంది ఉండడమే కాక, భారతదేశంలోవలె పార్లమెంటుకు బాధ్యత వహిస్తుంది.

ప్రశ్న 8.
అధికారాల విభజన.
జవాబు.
ఫ్రెంచి రచయిత అయిన మాంటెస్క్యూ తాను రచించిన ‘ద స్పిరిట్ ఆఫ్ లాస్’ అనే గ్రంథంలో అధికార వేర్పాటువాద సిద్ధాంతాన్ని పేర్కొనటం జరిగింది. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రభుత్వము యొక్క సర్వాధికారాలను మూడు ప్రభుత్వాంగాలైన శాసననిర్మాణశాఖ, కార్యనిర్వాహకశాఖ మరియు న్యాయశాఖల మధ్య విభజించాలి.

ప్రతి ప్రభుత్వాంగం తన పరిధిలోని అధికారాలపై తిరుగులేని పెత్తనాన్ని కలిగి ఉంటూ, మరొక అంగానికి చెందిన అధికారాల విషయంలో జోక్యం చేసుకోరాదు అని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది.

ప్రశ్న 9.
నిరోధ సమతౌల్యత.
జవాబు.
అధ్యక్ష తరహా ప్రభుత్వానికి మరో ముఖ్యలక్షణం నిరోధ సమతౌల్య సూత్రం ఆధారంగా వ్యవహరించడం. ఈ తరహా ప్రభుత్వంలో ప్రభుత్వాంగాలు స్వతంత్రంగా వ్యవహరిస్తూనే పరస్పరం నిరోధ సమతౌల్యతతో వ్యవహరిస్తాయి. శాసనశాఖ అధ్యక్షుడి నిర్ణయాలకు ఆమోదం తెలుపుతుంది. అదేవిధంగా శాసనశాఖ తీసుకునే నిర్ణయాలకు అధ్యక్షుడు ఆమోదం తెలియజేయాల్సి ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం న్యాయశాఖ సమీక్ష చేస్తుంది.

ప్రశ్న 10.
సమిష్టి బాధ్యత.
జవాబు.
పార్లమెంటరీ విధానంలో అత్యంత ముఖ్య లక్షణం సమిష్టి బాధ్యత. పార్లమెంట్ విశ్వాసం ఉన్నంత వరకు మంత్రులు ఆయాశాఖలపై పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగిస్తారు. ఆ శాఖల నిర్వహణలో ప్రతిచర్యలపై క్యాబినెట్ ఉమ్మడి బాధ్యత వహిస్తుంది. కాబట్టి ప్రతి మంత్రి తీసుకొనే నిర్ణయాలు యావత్తు క్యాబినెట్కు వర్తిస్తాయి. కాబట్టి అతి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొంటారు.

ప్రశ్న 11.
అవిశ్వాస తీర్మానం.
జవాబు.
మంత్రి మండలి పైన, స్పీకర్ లేక డిప్యూటి స్పీకర్పై పార్లమెంటుకు విశ్వాసం లేదని తెలియజేయటానికి ఈ తీర్మానం ఉపయోగపడుతుంది. అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందితే మంత్రిమండలి లేక స్పీకర్ లేక డిప్యూటి స్పీకర్ రాజీనామా చేయవలసి ఉంటుంది.

ప్రశ్న 12.
ప్రధానమంత్రి.
జవాబు.
పార్లమెంటరీ ప్రభుత్వంలో ప్రధానమంత్రి వాస్తవాధికారిగా కొనసాగుతారు. మంత్రులను ఎంపిక చేసుకోవటం, వారికి శాఖలను కేటాయించటం, మార్పులు చేర్పులు చేయటంతోపాటు ప్రభుత్వాన్ని రద్దు చేయమని కోరే అధికారం ప్రధానమంత్రికి ఉండటం మూలంగా ప్రధానమంత్రి పదవికి ఎంతో విశిష్టత ఉంది.

ప్రశ్న 13.
రాష్ట్రపతి.
జవాబు.
పార్లమెంటరీ ప్రభుత్వ సంప్రదాయాలను అనుసరించి రాజ్యాంగవేత్తలు రాష్ట్రపతి పదవి, అధికారాలు. హోదా లాంఛనప్రాయంగా, నామమాత్ర రాజ్యాధిపతిగా ఉండేటట్లు రూపొందించారు. రాజ్యాంగరీత్యా రాష్ట్రపతికి కార్యనిర్వహణ అధికారాలు అన్నీ ఉంటాయి. కానీ వాస్తవంతో ఆయన తన అధికారాలను ప్రధానమంత్రి అధ్యక్షతన పనిచేసే మంత్రి మండలి సలహా ప్రకారం చెలాయిస్తారు.