TS Inter 2nd Year Political Science Study Material Chapter 8 భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు

Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 8th Lesson భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు Textbook Questions and Answers.

TS Inter 2nd Year Political Science Study Material 8th Lesson భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
అవినీతిని నిర్మూలించి, వివిధ అవినీతి రూపాలను తెలపండి.
జవాబు.
అవినీతి నిర్వచనం : ప్రపంచ బ్యాంకు నిర్వచనంలో “ప్రభుత్వ పదవిని (లేదా కార్యాలయాన్ని) ప్రైవేటు లాభార్జన కోసం వినియోగించడమే అవినీతి”.

అవినీతి రూపాలు :
అవినీతికి అనేక రూపాలున్నాయి. వీటిలో లంచాలు, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, బలవంతపు వసూల, ప్రభుత్వ ధనం దుర్వినియోగం, కుల-మత ప్రీతికర వివక్షత చూపడం వంటివి ఉన్నాయి. 1988లో వచ్చిన అవినీతి నిరోధక చట్టం ప్రకారం లంచగొండితనం, నిధుల దుర్వినియోగం, ధన సంబంధ ప్రయోజనాలు పొందడం, అధికార పదవిని హోదాను స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించడం, ఆదాయానికి మించి ఎన్నోరెట్లు ఆస్తులను కలిగి ఉండడం తదితర చర్యలు అవినీతి చర్యలుగా, చట్టపరంగా శిక్షార్హమైనవిగా పేర్కొంది.

ఇటీవలి సమకాలీన భారతదేశ అవినీతి రూపాలలో “పరస్పర ప్రతిఫల ప్రేరేపిత అవినీతి” ఎన్నోచోట్ల వెలుగులోకి వస్తోంది. దీని ప్రకారం, రాజకీయ నాయకులు, ఉన్నత అధికారులు కార్పొరేటర్లకు, బడా వ్యాపారవేత్తలకు అనుకూలంగా అధికారిక (ప్రభుత్వ) నిర్ణయాలు తీసుకున్నప్పుడు దీనికి బదులుగా (ప్రతిఫలంగా) వారు సంబంధిత నాయకులు-అధికారుల బంధువర్గానికి చెందిన పారిశ్రామిక యూనిట్లలో షేరు విలువలకు మించి కుప్పలు తెప్పలుగా అక్రమ పెట్టుబడులు పెట్టడం, స్వచ్ఛంద సేవా సంస్థలకు భారీస్థాయిలో విరాళాలు ఇవ్వడం జరుగుతోంది.

మరోవిధంగా చెప్పాలంగే, ప్రతిఫలాలను, ప్రయోజనాలను పరస్పరం (నాయకులు–అధికారులు, కార్పొరేట్లు- వాణిజ్యవేత్తలు) ఇచ్చి పుచ్చుకోవడం జరుగుతోంది. ఇటీవటి కాలంలో కేంద్ర నేరపరిశోధక సంస్థ (CBI) ఈ తరహా కేసులను (Quid Pro quo Cases) విచారిస్తూ కుంభకోణం ఆరోపణలను విచారిస్తోంది.

భారతదేశంలో అవినీతి భారతీయ విలువల వ్యవస్థలో ఒక పెద్ద ఉపద్రవంగా, సవాలుగా మారింది. ఇది అంటువ్యాధిలాగా వ్యపిస్తూ పరిపాలన యంత్రాంగాన్నీ, అభివృద్ధి ప్రక్రియలను, ప్రజాస్వామ్యాన్నీ అపహాస్యం చేస్తోంది. అవినీతి ఆర్థిక అభివృద్ధికి, పేదరిక నిర్మూలనకు వ్యతిరేకమైనది. జాతి వ్యతిరేకత లక్షణంగా గల అవినీతిలో రాజకీయ నాయకులు, ఉన్నత అధికారులు, ప్రభుత్వేతర సంస్థలు, నేరగాళ్ళు క్రియాశీల పాత్ర పోషిస్తూ ఉంటారు.

అవినీతి, వస్తువులు-సేవలు కొరతవల్ల, పరిపాలనలో తీవ్ర జాప్యం వల్ల, వ్యవస్థలో పారదర్శకత లోపించడంవల్ల తలెత్తుతుంది. అవినీతి ప్రజలలో అశాంతిని కలుగజేసి, వ్యవస్థపై ప్రజల నమ్మకం కోల్పోయేలా చేస్తుంది. ఫలితంగా తీవ్రవాదం, హింసావాదం, ఉగ్రవాదం ప్రబలే అవకాశం ఉంటుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 8 భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు

ప్రశ్న 2.
సంకీర్ణ రాజకీయాలు అంటే ఏమిటి ? వాటి లక్షణాలను, సంకీర్ణ రాజకీయాలలోని వివిధ దశలను
వివరించండి.
జవాబు.
సంకీర్ణ రాజకీయాలు-భావం :
కొన్ని రాజకీయ పార్టీలు ఉమ్మడిగా ప్రభుత్వ అధికారం పొందడం లేదా ఉమ్మడి ప్రతిపక్షాన్ని ఏర్పరచి రాజకీయ ప్రక్రియను ప్రజాస్వామీకరించం లక్ష్యంగా ఒక వ్యవస్థగా ఏర్పడడాన్ని సంకీర్ణ రాజకీయాలుగా పేర్కొనవచ్చు. ఈ విధంగా ఉమ్మడి కూటమిగా ఏర్పడ్డ రాజకీయ పార్టీలు తమలో తాము అంగీకరించిన ఎజెండా ఆధారంగా కనీస ఉమ్మడి కార్యక్రమం (Common Munimum Programme) ఏర్పరచుకొంటాయి.

లక్షణాలు :
సంకీర్ణ రాజకీయాలు భారతదేశానికి కొత్తేమీకాదు, వాస్తవానికి, నాలుగో సాధారణ ఎన్నికల తరువాత భారతదేశంలో వివిధ రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడి, వివిధ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి అశ్యర్థులను నిలబెట్టాయి. ప్రస్తుతం భారతదేశంలో రెండు ప్రధాన రాజకీయ కూటములు క్రియాశీలంగా పనిచేస్తున్నాయి.

వీటిలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో అకాలీదళ్, లోక్ జనశక్తి పార్టీ తదితర ప్రధాన రాజకీయ పార్టీలు “జాతీయ జాస్వామ్య కూటమి” (NDA) పేరుతో సంకీర్ణంగా ఏర్పడ్డాయి. మరో ప్రధాన సంకీర్ణ కూటమి ఐక్య ప్రగతిశీల కూటమి (UPA) పేరుతో భారత జాతీయ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, డి.ఎం.కె. తదితర పార్టీలు భాగస్వామ్య పక్షాలుగా కొనసాగుతోంది.

వివిధ దశలు :
భారతదేశంలో సంకీర్ణరాజకీయాల పరిణామ క్రమాన్ని వాటి స్వభావం-పనితీరు ఆధారంగా వివిధ దశలుగా అధ్యయనం చేసుకోవచ్చు. మొదటిదశ సంకీర్ణ రాజకీయాలు 1967-1971 మధ్యకాలంలో వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అవతరించి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను సవాలు చేయడంతో ప్రారంభమవుతుంది. భారతీయ జనసంఘ్, లోక్ దళ్, సోషలిస్టు పార్టీ, సంయుక్త విధాయక దళ్ మొదలైనవి ఉత్తర భారత రాష్ట్రాల్లో అవతరించి, సంకీర్ణాలు ఏర్పరచాయి.

సంకీర్ణ రాజకీయాలు రెండోదశ 1977-1980 మధ్య కాలంలో కేరళ, త్రిపుర, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల్లో వామపక్ష సిద్ధాంత భావజాలం ఆధారంగా వామపక్ష కూటిమి ప్రభుత్వాల ఏర్పాటులో ప్రతిబింబిస్తుంది. అలాగే 1977లో వచ్చిన జనతాపార్టీ కూడా సంకీర్ణ రాజకీయాల్లో భాగమని కొద్దిమంది భావిస్తారు. జనతాప్రయోగం కొద్దినెలలు మాత్రమే కేంద్రంలో అధికారంలో ఉంది.

సంకీర్ణ రాజకీయాల్లో మూడో దశ 1989-1991 మధ్యకాలంలో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో, వివిధ రాష్ట్రాల్లో కనిపిస్తుంది. అయితే ఈ దశలోని సంకీర్ణ రాజకీయాలలో సంకీర్ణ భాగస్వామ్య పక్షాల మధ్య సంబంధాల్లో ఒక నూతన ధోరణి కనిపిస్తుంది. సంకీర్ణ పక్షాలు కొన్ని ప్రభుత్వంలో చేరకుడా వెలుపలి నుండి మద్దతు (outside support) అందించి సంకీర్ణ రాజకీయాల్లో పాల్గొనేవి.

సంకీర్ణ రాజకీయాల్లో నాలుగో దశ 1996-1999 మధ్యకాలంలో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో అస్థిరతను, తరచుగా ప్రభుత్వాలు పతనం కావడాన్ని రాజీకీయ యుక్తులు-కుయుక్తులను సూచిస్తుంది. ఈ దశలో సంకీర్ణ భాగస్వామ్య పక్షాలు అనేక సంక్షోభాలను సృష్టిస్తూ తరచుగా ప్రభుత్వం నుంచి దూరంగా ఉండడం, మద్దతు ఉపయోగించుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఎంతో అస్థిరతను ఎదుర్కొంది. ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సంకీర్ణ రాజకీయాల ఫలితంగా పతనం చెందడం జరిగింది.

సంకీర్ణ రాజకీయాల్లో అయిదో దశగా 2004-2020 మధ్యకాలంలో హేతుబద్ధంగా కనీస ఉమ్మడి కార్యక్రమం ప్రాతిపదికగా భాగస్వామ్యపక్షాలు ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం గమనిస్తారు. దీనిలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) ఐక్య ప్రగతిశీల కూటమి (UPA) సంకీర్ణాలు భాగస్వామ్య పక్షాలందరికీ ఆమోదయోగ్యమైన ఎజెండాను “కనీస ఉమ్మడి కార్యక్రమం” (Common Minimum Programme) ప్రాతిపదికగా ఏర్పరచుకొని, ప్రభుత్వాలను పూర్తి పదవీకాలం, విజయవంతంగా నిర్వహించాయి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 8 భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారతదేశంలో సంకీర్ణ రాజకీయాలు, అవతరణకు గల కారణాలను వివరించండి.
జవాబు.
భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడడానికి ఎన్నో కారణాలు దోహదం చేశాయి. ఆధిపత్య పార్టీగా కొనసాగిన కాంగ్రెస్ పార్టీ దేశంలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైనోవడం, మెజారిటీ సాధించే స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఎన్నికల విజయాలు సాధించడం కారణంగా అనేక ఇతర పార్టీలు అవతరించి, అభివృద్ధి చెందాయి.

అలాగే వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని సవాలు చేసే విధంగా ప్రాంతీయ రాజకీయ పార్టీలు అవతరించి, ఇతర జాతీయ పార్టీలతో మైత్రి కూటములు ఏర్పాటు చేసుకోవడం కూడా సంకీర్ణ రాజకీయాలకు దారితీసింది.

సంకీర్ణ రాజకీయాలు వృద్ధి చెందడానికి గల కారణాలను ఈ కింది విధంగా పేర్కొనవచ్చు.

  1. ఏకపార్టీ ఆధిపత్యం నశించడం.
  2. ప్రజల ప్రాంతీయ ఆకాంక్షలు, ప్రయోజనాలు సంతృప్తి పరచడానికి ప్రాంతీయ రాజకీయ పార్టీలు అవతరించడం.
  3. సమాజంలోని వివిధ సమూహాలు తమ హక్కుల పట్ల చైతన్యం పొందడంతో సాంఘిక-రాజకీయ ఉద్యమాలు వ్యాప్తి చెందడం.
  4. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా జాతీయస్థాయిలో, రాష్ట్రాలస్థాయిలో రాజకీయ సంకీర్ణాలు ఏర్పరచవలసిన పరిస్థితులు ఏర్పడటం.

ప్రశ్న 2.
భారతదేశ నేపథ్యంలో వివిధ ఉగ్రవాద రూపాలను తెలియజేయండి.
జవాబు.
1. తెగల-జాతీయవాద ఉగ్రవాదం (Ethno-Nationalist Terrorism) :
ఉగ్రవాద సమూహాలు భారతదేశం నుంచి వేర్పాటును కోరుతూ లేదా భారత సమాఖ్యలో నూతన రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ ఉగ్రవాద చర్యలకు, హింసకు పాల్పడడాన్ని తెగల జాతీయవాద ఉగ్రవాదంగా పేర్కొనవచ్చు.

2. మతమౌఢ్య ఉగ్రవాదం (Religious Terrorism) :
ఈ తరహా ఉగ్రవాదం మత మౌఢ్యవాదం ఆధారంగా జనిస్తుంది. భారతదేశంలో ఎన్నో ఉగ్రవాద చర్యలు, సంఘటనలు, దాడులు ఈ కోవలోకి వస్తాయి. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐ.ఎస్.ఐ (ISI) సహాయంతో ఉగ్రవాద సంస్థలు-సమూహాలు ఎన్నో ప్రాంతాల్లో మతమౌఢ్య ఉగ్రవాదానికి పాల్పడ్డాయి.

2008 నవంబర్ 26న ముంబాయిలో ఉగ్రవాద దాడులు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన దాడులు, ప్రజలకు ఎంతో ప్రాణనష్టాన్ని, ఆస్తినష్టాన్ని కలిగించాయి. దీన్ని కొద్దిమంది జిహాదీ ఉగ్రవాదం పేరుతో కూడా వ్యవహరిస్తారు.

3. సిద్ధాంత (భావజాల) ఆధారిత ఉగ్రవాదం :
దీనినే వామపక్ష తీవ్రవాదమని కూడా వ్యవహరిస్తారు. సమాజ ఆర్థిక దోపిబిని, అణచివేతను, ఆర్థిక అసమానతలను నిర్మూలించడానికి వామపక్ష పోరాటమే మార్గమని నమ్ముతుంది. ప్రఖ్యాత కమ్యూనిస్టు సిద్ధాంతవేత్తలు కారల్ మార్క్స్, మావో, లెనిన్ తదితరుల సిద్ధాంత భావనల ఆధారంగా ఈ తీవ్రవాదం వ్యవహరిస్తుంది. సమాజంలోని విప్లవాత్మక మార్పు లక్ష్యాన్ని హింస, ఉగ్రవాదంతో చేరుకోవచ్చని నమ్ముతుంది.

4. రాజ్యప్రాయోజిక ఉగ్రవాదం (సీమాంతర ఉగ్రవాదం):
పొరుగు రాజ్యాలనుంచి పరోక్ష రూపంలో వ్యక్తమయ్యే ఉగ్రవాదం. సరిహద్దులకు వెలుపల ఇతర రాజ్యాలలో ఉగ్రవాద సంస్థలకు సమూహాలకు తోడ్పాటు అందిస్తూ భయానక వాతావరణాన్ని, అస్థిరతను కలుగజేసే లక్ష్యంతో ఉగ్రవాద చర్యలు ఉంటాయి.

భారతదేశం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్ చేతిలో ఈ తరహా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోంది. భారతదేశంలోని ఉగ్రవాద సమూహాలకు పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐ.ఎస్.ఐ (ISI), ఇతర ఏజెన్సీలు సహాయం అందిస్తున్నట్లు తెలుస్తోంది.

5.మాదక ద్రవ్య (గంధపు చెక్కలు మొదలైన వాటి అక్రమరవాణా) ఉగ్రవాదం :
ఈ తరహా ఉగ్రవాదం నిషేధించిన మాదకద్రవ్యాలు, గంధపు చెక్కల అక్రమరవాణాపై దృష్టి కేంద్రీకరిస్తుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 8 భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు

ప్రశ్న 3.
భారతదేశంలో అమలులో ఉన్న ఉగ్రవాద నిరోధక చట్టాలు ఏవి ?
జవాబు.
ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్టు, జాతీయ భద్రతాచట్టం (MISA), Conservation of Foreign Exchange and Preven- tion of Smuggle Activities Act (COFEPOSA), National Security ACT (NSA), ఉగ్రవాద నిరోధక చట్టం మొదలగునవి.

ప్రశ్న 4.
భారతదేశంలో వివిధ అవినీతి నిరోధక చట్టాలను పేర్కొనండి.
జవాబు.
భారత ప్రభుత్వం అవినీతి నిరోధానికి వివిధ స్థాయిలో అనేక చర్యలు చేపట్టింది. భారతదేశంలో ప్రజా జీవితంలో అవినీతిని అదుపు చేయడానికి అవినీతి నివారక చట్టాన్ని 1988లో రూపొందించింది. ఈ చట్టంలో మరిన్ని సవరణలు చేసి అవినీతి నివారణ చట్టం, 2018 రూపొందించింది.

దీని ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ ఉద్యోగులు తమ అధికారిక విధులను నిర్వహించే క్రమంలో చట్ట వ్యతిరేకంగా ప్రతిఫలాన్ని ఆశించండం లేదా లంచాలు తీసుకోవడాన్ని నిషేధించడం.

ఈ చట్టం లంచాలను ఇచ్చేవారిని, మధ్యవర్తులను కూడా దోషులుగా పరిగణిస్తుంది. అయితే కొద్దిమంది ఉన్నత పదవులలో ఉండే నాయకులు లేదా అధికారులపై అవినీతి కేసులు నమోదు చేయడానికి రాజ్యాంగ వ్యవహర్తల ముందు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.

రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై ఆరోపణల విషయంలో రాష్ట్ర గవర్నర్, కేంద్ర ప్రభుత్వ అధికారుల విషయంలో భారత రాష్ట్రపతి అనుమతి అవసరం అవుతుంది.

ఇదేకాక భారతీయ శిక్షాస్మృతి (Indian Penal code) లోని అనేక నిబంధనలు అవినీతి చర్యలకు పాల్పడే ఉద్యోగులపై శిక్షలు విధించడానికి తోడ్పడతాయి దీనితో పాటు మనీలాండరింగ్ నివారణ చట్టం (2002), సమాచార హక్కు చట్టం (2005) మొదలైనవి కూడా అవినీతి గుర్తించి, కేసులను నమోదు చేయడానికి తోడ్పడతాయి.

ప్రభుత్వోద్యోగులలో అవినీతిని నిరోధించడానికి 1964లో కేంద్ర నిఘా వ్యవహారాల కమిషన& (Central Vigilance Commission-CVC) ని స్థాపించారు. అవినీతికి సంబంధించిన అంశాల్లో పౌరులు చేయవలసిన, చేయకూడని పనులను ఈ కమిషన్ మార్గదర్శకాల రూపంలో రూపొందించింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 8 భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
జాతీయ స్థాయిలో సంకీర్ణ రాజకీయాలు.
జవాబు.
జాతీయ స్థాయిలో ఎన్నోసార్లు సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కేంద్రప్రభుత్వంలో మొదటిసారిగా 1977లో భారతీయ లోక్ దళ్, కాంగ్రెస్ (ఒ), జనసంఘ్, సోషలిస్టు పార్టీ, కొన్ని ఇతర చిన్న పార్టీలు కలిసి జనతా పార్టీగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇది జనతా ప్రయోగంగా ప్రఖ్యాత గాంచింది.

మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఈ ప్రభుతవ &ం ఏర్పడింది. కేంద్రప్రభుత్వంలో 1989లో వి.పి.సింగ్ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. జనమోర్చా, లోక్ దళ్ పార్టీలు నేషనల్ ఫ్రంట్ పేరుతో సంయుక్తంగా, భారతీయ జనతాపార్టీ, వామపక్షాల వెలుపలి మద్దతు అందించడంతో ఈ ప్రభుత్వాన్ని ఏర్పరచాయి.

1996 మే నెలలో హెచ్.డి. దేవగౌడ నాయకత్వంలో యునైటెడ్ ఫ్రంట్ (UF) ప్రభుత్వం ఏర్పడిది. దీనిలో జనతాదళ్, సి.పి.ఐ-సి.పి.ఎం తదితర పార్టీలు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. ఈ సంకీర్ణం తదనంతర కాలంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమిగా (NDA) ఆవిర్భవించింది. ఆ తరువాత 2004 సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటిమి (UPA) డా॥ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా అధికారాన్ని చేపట్టింది.

ప్రశ్న 2.
సంకీర్ణ రాజకీయాల ప్రయోజనాలు, నష్టాలు.
జవాబు.
భారతదేశంలో సంకీర్ణ రాజకీయాలు రాజకీయ సర్దుబాట్లకు, సహాయ సహకారాలకు దారితీశాయి. దీనికి అనుగుణంగా భారత సమాఖ్య స్వభావం మార్పుచెంది, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య అతి తక్కువ స్థాయికి వివాదాలు తగ్గిపోయాయి.

భారతాయ సమాఖ్య ఒక సహకార సమాఖ్యగా రూపాంతరం చెందింది. అలాగే సంకీర్ణ రాజకీయాలు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి దేశంలోని వివిధ స్థాయిల్లో ప్రత్యామ్నాయాన్ని ప్రజాసమస్యలు బాగా వెలుగులోకి రాగలగడతో భారత కాంగ్రెస్ పార్టీకి దేశంలోని వివిధ స్థాయిల్లో ప్రత్యామ్నాయాన్ని ప్రజాసమస్యలు బాగా వెలుగులోకి రాగలగడంతో భారత రాజకీయ వ్యవస్థ తన సామర్థ్యాలను పెంపొందించుకొని ప్రజల డిమాండ్లను పరిష్కరించడానికి సమాయత్తమవుతోంది.’

సంకీర్ణ రాజీకీయాల వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు తమ సంకీర్ణ భాగస్వామ్య పక్షాలతో రాజకీయ బేరసారాలకు దిగుతాయి. కొన్నిసార్లు దీని ఫలితంగా రాజకీయ కుయుక్తులు పెరిగి, రాజకీయ అస్థిరతకు దారితీస్తుంది. చాలా రాజకీయ పార్టీలకు స్వార్థ ప్రయోజనాలతో నిండిన ఎజెండా ఉండడం ఫలితంగా రాజకీయ నీచత్వం, దురాచారాలు, బెదిరింపులు, కుతంత్రాలు రాజ్యమేలుతాయి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 8 భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు

ప్రశ్న 3.
ఉగ్రవాదం లక్షణాలు.
జవాబు.
ఉగ్రవాదంపై జరిగిన అనేక అధ్యయనాలు, ఉగ్రవాద చర్యలలో కనిపించే సారూప్యతలను, ధోరణులను, లక్షణాలుగా తెలిపాయి.

  1. కొద్దిమంది వ్యక్తులు ప్రణాళికాబద్ధంగా, వ్యవస్థీకృతంగా బుద్ధి పూర్వకంగా చేసే హింసాత్మక చర్య ఉగ్రవాదంగా ఉంటుంది.
  2. ఉగ్రవాదం అమాయకపు ప్రజలను లేదా ఒక నిర్దిష్ట వర్గాన్ని పోలీసు అధికారులను, సాయుధ దళాలను లేదా కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని చేసే హింసాత్మక చర్య.
  3. సమాజంలోని సాంఘిక-ఆర్థిక లేదా రాజకీయ వ్యవస్థను సవాలుచేస్తూ, కొద్దిమంది ప్రేరణతో జరిగే హింస ఉగ్రవాదం లేదా తీవ్రవాదం రూపంలో బహిర్గతమవుతుంది.
  4. ఉగ్రవాదం ప్రభుత్వంపైన, రాజకీయ వ్యవస్థపైన జరిపే అనధికార యుద్ధంగా కనబడుతుంది.
  5. బెదిరింపులకు, పాశవికతకు ఉగ్రవాదం సాధనంలాగా ఉంటుంది. కొద్దిమంది తమ డిమాండ్లను హింసాత్మక ఉగ్రవాద చర్యలు ద్వారా వ్యక్తీకరిస్తారు.

ప్రశ్న 4.
అవినీతి రూపాలు.
జవాబు.
అవినీతికి అనేక రూపాలున్నాయి. వీటిలో లంచాలు, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, బలవంతపు వసూలు, ప్రభుత్వ ధనం, దుర్వినియోగం, కుల-మత ప్రీతికర వివక్షచూపడం వంటివి ఉన్నాయి.

1988లో వచ్చిన అవినీతి నిరోధక చట్టం ప్రకారం లంచగొండితనం, నిధుల దుర్వినియోగం, ధన సంబంధ ప్రయోజనాలు పొందడం, అధికార పదవిని, హెూదాను స్వార్థప్రయోజనాలకు ఉపయోగించడం, ఆదాయానికి మించి ఎన్నోరెట్లు ఆస్తులను కలిగిఉండం తదితర చర్యలు అవినీతి చర్యలుగా, చట్టపరంగా శిక్షార్హమైనదిగా పేర్కొంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 8 భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు

ప్రశ్న 5.
ప్రజావేగులు.
జవాబు.
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని వెల్లడించి, బహిర్గతం చేసి అవినీతికి వ్యతిరేకంగా ప్రజలను అప్రమత్తులను చేసే కార్యకర్తలలే (Whistle Blowers). వీరికి అవినీతి అధికారులు, నాయకుల నుంచి ప్రమాదాలు ఎదురవుతాయి. ఇటీవలి కాలంలో జాతీయ రహదారుల అథారిటీ కుంభకోణాన్ని వెలికితీసిన శ్రీ సత్యేంద్ర దూబే హత్య, సమాచార హక్కు కార్యకర్తల షీలా మసూద్ హత్య తదితర సంఘలనలు ప్రజావేగులకు రక్షణ కల్పించవలసిన అవసరాన్ని తెలియజేస్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం “ప్రజా ప్రయోజనాల వెల్లడి తీర్మానం” (Public Interest Disclosure resolution-PIDR) పేరుతో ఈ ప్రజావేగుల జీవితాలకు భద్రత కల్పించడానికి అనేక చర్యలు తీసుకొంటోంది.

Leave a Comment