TS Inter 2nd Year Economics Notes Chapter 9 Environmental Economics

Here students can locate TS Inter 2nd Year Economics Notes Chapter 9 Environmental Economics to prepare for their exam.

TS Inter 2nd Year Economics Notes Chapter 9 Environmental Economics

→ Environment is the surroundings encompassing the physical and organic factors.

TS Inter 2nd Year Economics Notes Chapter 9 Environmental Economics

→ A balance is to be stack between environment and economic development as otherwise environment gets degraded.

→ Ecosystems operate within the environment. Some ecosystems likes forests, gross buds, deserts etc.

→ Pollution has become a challenge in the process of industrialization and growing urbanization. Pollution is different types, they are pollution, water pollution, soil pollution, sound pollution etc.

→ Population, overproduction and pollution are recognized as the recent factors for environmental degradation.

→ Sustainable development means development without the destruction of the environment. If the objective is the protection of the environment increase in the standard of living of all sections of society.

TS Inter 2nd Year Economics Notes Chapter 9 పర్యావరణ అర్థశాస్త్రం

→ మన చుట్టూ ఆవరించి ఉన్న అన్ని అంశాలను పర్యావరణంగా చెప్పవచ్చు. దీనిలో సజీవ, నిర్జీవ అంశాలు ఉంటాయి.

→ పర్యావరణంలో రకాలు :

  1. భౌతిక పర్యావరణం
  2. జీవ పర్యావరణం
  3. సామాజిక పర్యావరణం.

→ ఒక భౌగోళిక ప్రాంతంలో సహజ భౌతిక పర్యావరణాల కలయిక, వాటి మధ్యగల పరస్పర సంబంధమే ఆవరణ వ్యవస్థ.

→ కాలుష్యం ప్రధానంగా వాయు కాలుష్యం, జల కాలుష్యం, ధ్వని కాలుష్యం మొదలైన రూపాల్లో ఉంటుంది.

→ పర్యావరణ విచ్ఛేదనకు కారణాలు : భూసార క్షీణత, కాలుష్యం చెత్తా చెదారాల సమూహం, వన నిర్మూలన, సహజ కారణాలు, పారిశ్రామికీకరణ, అధికోత్పత్తి.

→ సహజ వనరుల వర్గీకరణ :

  1. పునరుద్ధరించగల వనరులు
  2. పునరుద్ధరించలేని వనరులు.

TS Inter 2nd Year Economics Notes Chapter 9 Environmental Economics

→ పర్యావరణ విధ్వంసం లేకుండా జరిగే ఆర్థికాభివృద్ధిని సుస్థిర అభివృద్ధి అంటారు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు

Telangana TSBIE TS Inter 2nd Year Commerce Study Material 1st Lesson విత్త మార్కెట్లు Textbook Questions and Answers.

TS Inter 2nd Year Commerce Study Material 1st Lesson విత్త మార్కెట్లు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ద్రవ్య మార్కెట్ అంటే ఏమిటి ? దాని విధులను వివరించండి.
జవాబు.
స్వల్పకాలిక పరపతి సాధనాలతో వర్తకం జరిపే మార్కెట్ను ద్రవ్యమార్కెట్ అంటారు.
ద్రవ్యంతో దగ్గరి సంబంధం గల అనేక రకాల ద్రవ్యాలతో వ్యవహరించే వివిధ సంస్థల సముదాయాన్ని ద్రవ్య మార్కెట్ అంటారు.

నిర్వచనం: “ద్రవ్య మార్కెట్ ముఖ్యంగా స్వల్పకాలిక స్వభావం గల ద్రవ్యపరమైన ఆస్తులతో జరిపే వ్యవహారాలకు కేంద్రమై ఉంటుంది. ఇది రుణగ్రస్తులకు స్వల్పకాలిక ద్రవ్య అవసరాలను తీరుస్తూ, రుణాలను అందించే వారికి ద్రవ్యత్వాన్ని లేదా నగదును సమకూరుస్తుంది”. – రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ద్రవ్య మార్కెట్కు వ్యవహారాలు జరపడానికి నిర్ణీత ప్రదేశమేమీ లేదు. అందులో పాల్గొనేవారు ఫోన్, ఇంటర్నెట్ ద్వారా వ్యవహారాలను జరుపుతారు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు

ద్రవ్య మార్కెట్ విధులు:
(ఎ) ప్రధాన విధులు:

  1. స్వల్పకాలిక నిధుల సప్లయ్కు సమానమైన డిమాండ్ను కల్పిస్తూ రెండింటి మధ్య సమతౌల్య సాధనకు తగిన యంత్రాంగంగా వ్యవహరిస్తుంది.
  2. కేంద్ర బ్యాంకు తన జోక్యం ద్వారా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యత్వం మరియు సాధారణ స్థాయి వడ్డీ రేట్లను ప్రభావితం చేయడానికి ప్రవాస సమాచారాన్ని అందచేస్తుంది.
  3. స్వల్పకాలిక నిధులను సమకూర్చేవారు, వాటిని వినియోగించేవారు, తమ రుణాల, పెట్టుబడుల అవసరాలను ఒక సమర్థవంతమైన మార్కెట్లో స్పష్టమైన ధరతో తీర్చుకోవడానికి సరైన మార్గం చూపుతుంది.

(బి) ఇతర విధులు:
పై ప్రధాన విధులతో పాటు క్రింద చెప్పబడిన విధులను కూడా ద్రవ్య మార్కెట్ నిర్వర్తిస్తుంది.

  1. నిర్వహణా మూలధన అవసరాలను తీర్చడానికి, ఇది వ్యాపారానికి స్వల్పకాలిక రుణ సౌకర్యాన్ని కల్పిస్తుంది.
  2. పొదుపరులకు స్వల్పకాలిక పరపతి సాధనాలను జారీ చేయడం ద్వారా ప్రభుత్వానికి నిధులను సమకూరుస్తుంది.
  3. పరపతి సాధనాలతో వ్యవహరిస్తుంది.
  4. వర్తక వాణిజ్యాలు మేలైన మార్గంలో అభివృద్ధి చెందడానికి వీలుగా బిల్లులను జారీ చేస్తుంది.
  5. బిల్లులు/హుండీలను జారీ చేయడం ద్వారా వర్తక వాణిజ్యాలు మెరుగైన పద్ధతిలో అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది.
  6. ప్రజలు తమ పొదుపు మొత్తాలను పరపతి సాధనాలలో పెట్టుబడి పెట్టడం వల్ల వచ్చే వడ్డీ/డిస్కౌంట్ల వల్ల పొదుపు అలవాటు ప్రజలలో మరింత పెంపొందింప చేయడం సాధ్యపడుతుంది.
  7. “ఎలువైన, ఖచ్చితమైన సమాచారాన్ని అందించడం ద్వారా పార్టీలు తమ సమయాన్ని, శ్రమను, నగదును ఆదా చేసుకోవడంలో సహాయపడుతుంది.

ప్రశ్న 2.
మూలధన మార్కెట్ విధులను వివరించండి.
జవాబు.
మూలధన మార్కెట్:

  1. సెక్యూరిటీలను అమ్మడం ద్వారా వ్యాపార సంస్థలకు దీర్ఘకాలిక నిధులను సమకూర్చే మార్కెట్ను మూలధన మార్కెట్ అంటారు.
  2. మూలధన మార్కెట్లో ప్రైవేట్ రంగ ఉత్పత్తి సంస్థలు, ప్రభుత్వం, ప్రత్యేక విత్త సంస్థలు, మదుపరులు పాల్గొంటారు.

మూలధన మార్కెట్ను ప్రాథమిక మార్కెట్ మరియు ద్వితీయ మార్కెట్ వర్గీకరించవచ్చు.

మూలధన మార్కెట్ విధులు:
1. వనరుల మళ్ళింపు: మూలధన మార్కెట్ వనరులను మిగులుగా ఉన్న ప్రదేశాల నుంచి నిధుల లోటు ఉన్న ఉత్పాదక రంగాలకు మళ్ళించి దేశ ఉత్పాదకతను, ఆర్థికాభివృద్ధిని పెంపొందిస్తుంది.

2. పొదుపును ప్రోత్సహించడం: ప్రజలు పెట్టిన పెట్టుబడికి తగిన రాబడి, వడ్డీ, డివిడెండ్, బోనస్ రూపంలో రావడం వల్ల, ప్రజలలో పొదుపు అలవాటుకు ప్రోత్సాహం కలుగచేస్తుంది.

3. పెట్టుబడికి ప్రోత్సాహం: అధిక పెట్టుబడులను విత్త సంస్థల ద్వారా సేకరించడం వల్ల వడ్డీరేట్లు తగ్గి పెట్టుబడులు పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది.

4. ధరలలో స్థిరత్వం: సెక్యూరిటీల (వాటాల) ధరలు నిలకడగా ఉండేటట్లు గాను, ధరలలో హెచ్చు తగ్గులను కనీస స్థాయికి తగ్గించడం చేస్తుంది.

5. అనుత్పాదక కార్యకలాపాల తగ్గింపు: స్పెక్యులేషన్ను అనుత్పాదక కార్యకలాపాలను తగ్గించడానికి వీలు కల్పిస్తుంది.

6. ఆర్ధికాభివృద్ధిని పెంపొందించడం: మూలధన మార్కెట్ దేశ ఆర్థికాభివృద్ధిని పెంపొందింపచేస్తుంది. పబ్లిక్ మరియు ప్రైవేట్ రంగ పరిశ్రమలను, వర్తకాన్ని విస్తరింపచేయడానికి మిగులు నిధులను తగిన విధంగా కేటాయించడం వల్ల దేశ ఆర్థిక పురోగతి ముందంజ వేస్తుంది.

ప్రశ్న 3.
ద్రవ్య మార్కెటు, మూలధన మార్కెట్కు మధ్యగల వ్యత్యాసాలను పేర్కొనండి.
జవాబు.
ద్రవ్య మార్కెట్: స్వల్పకాలిక పరపతి సాధనాలతో వర్తకం జరిపే మార్కెట్ను ద్రవ్య మార్కెట్ అంటారు. మూలధన మార్కెట్: సెక్యూరిటీల అమ్మడం ద్వారా వ్యాపార సంస్థలకు దీర్ఘకాలిక నిధులను సమకూర్చే మార్కెట్ను మూలధన మార్కెట్ అంటారు.

ద్రవ్య మార్కెట్, మూలధన మార్కెట్ల మధ్య వ్యత్యాసం:
TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు 1
TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు 2

TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు

ప్రశ్న 4.
వివిధ ద్రవ్య మార్కెట్ పత్రాలను వివరించండి.
జవాబు.
1) ద్రవ్యమార్కెట్ పత్రాలు:
1) ట్రెజరీ బిల్లు:
a) ట్రెజరీ బిల్లు లేదా శూన్య కూపన్ బాండు కేంద్ర ప్రభుత్వం తరపున స్వల్పకాలిక నిధుల అవసరాలను తీర్చడానికి రిజర్వ్ బ్యాంక్ చేత డిస్కౌంట్ కోసం జారీ చేసిన ఒక ప్రామిసరీ నోటు.

b) ట్రెజరీ బిల్లులు వాటి ముఖ విలువ కంటే తక్కువ ధరకు జారీ చేయబడి ముఖ విలువతో తిరిగి చెల్లించబడుతాయి. కొనుగోలు ధరకు, గడువు తేదీన చెల్లించిన మొత్తానికి మధ్యగల వ్యత్యాసమే డిస్కౌంట్గా పిలుస్తారు.

c) ఇది సురక్షిత ద్రవ్య మార్కెట్ సాధనాలలో ఒకటి. కాని దీనిపై రాబడి అంత ఆకర్షణీయంగా ఉండదు. అయినప్పటికీ, ఇవి శూన్య నష్టభయమున్న, నిశ్చిత ఆదాయం కలిగిన సాధనాలు. ట్రెజరీ బిల్లు యొక్క కొనుగోలు ధర వేలం పద్ధతిలో నిర్ణయించబడుతుంది.

d) ప్రస్తుతం భారత ప్రభుత్వం 91 రోజుల, 182 రోజుల, 364 రోజుల మూడు రకాలైన ట్రెజరీ బిల్లులను వేలం ద్వారా జారీ చేస్తున్నదీ.

2) వాణిజ్య పత్రం:
a) వాణిజ్య పత్రం, ఆర్థిక పరిపుష్టి కలిగిన కంపెనీలచే జారీ చేయబడి, కొంత డిస్కౌంట్ తో బదలాయింపు చేయదగిన ఒక స్వల్పకాలిక హామీ లేని ప్రామిసరీ నోటు.

b) వాణిజ్య పత్రం ఒక రోజు నుంచి 270 రోజుల కాల పరిమితిని కలిగి ఉంటుంది.

c) వసూలు ఖాతాలు, ఇన్వెంటరీ నిర్వహణ కోసం అవసరమయ్యే నిధుల నిమిత్తం, స్వల్పకాలిక రుణాలను చెల్లించడానికి వాణిజ్య పత్రాలను జారీ చేస్తారు.

d) వాణిజ్య పత్రాల మీది రాబడి ట్రెజరీ బిల్లులపై వచ్చే రాబడి కంటే అధికంగా ఉంటుంది. కాని ఇవి తక్కువ హామీ కలిగినవి.

3) పిలుపు ద్రవ్యం:
a) పిలుపు ద్రవ్యం నగదు, రిజర్వు ఆవశ్యకత కోసం పిలుపు రేటు అనే వడ్డీతో సహా ఒక రోజు నుంచి 14 రోజుల నోటీసుపై గాని మరియు 14 రోజులు మించిన కాల వ్యవధితో తిరిగి చెల్లించబడే, స్వల్పకాలిక నిధుల కోసం బ్యాంకులు జరిపే పరస్పర వ్యవహారం.

b) రిజర్వు బ్యాంకు నగదు రిజర్వ్ నిష్పత్తి మొత్తంలో మార్పులు చేసినప్పుడు నిర్దేశించబడిన నిల్వల కంటే తక్కువ నగదు నిల్వలు కలిగిన బ్యాంకులు మిగులు నిధులు కలిగి ఉన్న బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుంటాయి. ఈ సేవలకు గాను, రుణదాత బ్యాంకుకు చెల్లించే వడ్డీని పిలుపు రేటు అని పిలుస్తారు.

c) పిలుపు రేటు రోజు రోజుకు, గంట గంటకు కూడా మారుతూ ఉంటుంది.

4) సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్:
a) సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్, దాని గ్రహీత వడ్డీతో పాటుగా ముఖ విలువ మొత్తాన్ని పొందేందుకు అధికారాన్నిస్తూ వాణిజ్య బ్యాంకులచే జారీ చేయబడ్డ బదిలీ చేయదగిన స్వల్పకాలిక హామీ లేని ప్రామిసరీ నోటు.

b) సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ వ్యక్తులకు, కార్బొరేషన్లకు, కంపెనీలకు, ప్రవాస భారతీయులకు జారీ చేయబడుతుంది.

c) ఈ సర్టిఫికెట్లు 3 నెలల నుంచి 5 సంవత్సరాల కాల పరిమితితో అందుబాటులో ఉంటాయి.

d) సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్లు నష్టభయం ఎక్కువగా కలిగి ఉండడం చేత వీటి మీద రాబడి ట్రెజరీ బిల్లులపై రాబడి కంటే అధికంగా ఉంటుంది.

5) వాణిజ్య బిల్లులు:
a) వాణిజ్య బిల్లు కొనుగోలుదారుడు బాకీ ఉన్న అరువు అమ్మకాల మొత్తాన్ని ఒక భవిష్యత్తు తేదీ నాడు చెల్లించడం కోసం కొనుగోలుదారుని (బిల్లు స్వీకర్త) ఆమోదానికై అమ్మకందారుని (బిల్లుకర్త)చే రాయబడ్డ అన్యాక్రాంత యోగ్యతా పత్రం. (negotiable bill)

b) బిల్లు స్వీకర్త స్వీకృతిని తెలియజేయగానే వాణిజ్య బిల్లు ఒక చట్టబద్ధమైన పత్రంగా మారి బిల్లు కర్తకు నగదు అవసరమైనప్పుడు బ్యాంకులో డిస్కౌంట్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.

c) బ్యాంకు బిల్లుపై సొమ్మును చెల్లించేటప్పుడు కొంత డిస్కౌంట్ మొత్తాన్ని మినహాయించుకుంటుంది. గడువు తేదీనాడు బిల్లు మొత్తాన్ని బ్యాంకు బిల్లు స్వీకర్త వద్ద వసూలు చేసుకుంటుంది.

ప్రశ్న 5.
ఉత్పన్నాలు అంటే ఏమిటి ? వివిధ ఉత్పన్నాల ఉత్పత్తులను వివరించండి.
జవాబు.
ఉత్పన్నాలు:
1) ఉత్పన్నాలు అనగా ఆర్థిక ఒప్పందాలు. వీటి విలువ వీటిని పోలిన ఇతర ఆస్తుల విలువపై ఆధారపడి ఉంటుంది.
2) ఉత్పన్నాలను సరిపోల్చడానికి ఉపయోగించే ఇతర ఆస్తులు స్టాక్స్, బాండ్లు, కరెన్సీలు, వస్తువులు మరియు మార్కెట్ సూచికలు.
ఉత్పన్నాల ఉత్పత్తులు:
ఉత్పన్న ఉత్పత్తులను 4 రకాలుగా వర్గీకరించవచ్చు.
ఎ) ఫార్వార్డ్స్
బి) ఫ్యూచర్స్,
సి) ఆప్షన్స్,
డి) స్వాప్స్
TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు 3

ఎ) ఫార్వార్డ్స్:

  1. ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అనేది రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం
  2. ముందుగా అంగీకరించిన ధర వద్ద భవిష్యత్తులో ఒక నిర్దిష్ట తేదీలో సెక్యూరిటీల పరిష్కారం జరుగుతుంది.

బి) ఫ్యూచర్స్:

  1. ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అనేది భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయంలో ఒక నిర్దిష్ట ధర వద్ద ఒక ఆస్తిని కొనుగోలు చేయడానికి లేదా విక్రయించడానికి రెండు పార్టీల మధ్య చేసుకున్న ఒప్పందం.
  2. ఫ్యూచర్స్ కాంట్రాక్టులు ప్రత్యేకమైన ఫార్వర్డ్ కాంట్రాక్టులు. వీటిలో ప్రామాణికమైన మారకపు వర్తక ఒప్పందాలు ఇమిడి ఉంటాయి.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు

సి) ఆప్షన్స్:

  1. ఆప్షన్స్ రెండు రకాలు – కాల్స్ మరియు పుట్స్
  2. కాల్స్ కొనుగోలుదారునికి కొనుగోలు చేయడానికి హక్కును ఇస్తాయి. కాని ఇచ్చిన భవిష్యత్ తేదీన లేదా అంతకు ముందు నిర్ధారించిన ధర వద్ద నిర్దిష్ట ఆస్తి యొక్క నిర్దిష్ట పరిమాణాన్ని కొనుగోలు చేయవలసిన బాధ్యత మాత్రం ఏర్పడదు.
  3. పుట్స్ కొనుగోలుదారునికి ఆస్తి కొనుగోలు హక్కును ఇస్తాయి. కాని ఇచ్చిన తేదీలో లేదా నిర్ధారిత ధర వద్ద నిర్దిష్టమైన ఆస్తిని, నిర్దిష్ట పరిమాణాన్ని విక్రయించే బాధ్యత ఏర్పడదు.

డి) స్వాప్స్:

  1. ముందుగా నిర్ణయించిన సూత్రం ప్రకారం భవిష్యత్తులో నగదు ప్రవాహాన్ని మార్పిడి చేయడానికి రెండు పార్టీల మధ్య కుదిరిన ప్రైవేట్ ఒప్పందాలు స్వాప్లు.
  2. వాటిని ఫార్వర్డ్ కాంట్రాక్టులు ఫోర్ట్ఫోలియోగ పరిగణించవచ్చు.

ప్రశ్న 6.
వివిధ రుణ మార్కెట్ పత్రాల గురించి సవివరంగా తెలియచేయండి.
జవాబు.
రుణ మార్కెట్: రుణ పత్రాలతో వ్యాపారం జరిగే మార్కెట్ను రుణ మార్కెట్ అంటారు. రుణ పత్రాలలో తనఖా, ప్రామిసరీ నోట్స్, బాండ్లు మరియు డిపాజిట్ సర్టిఫికెట్లు ఉన్నాయి.
రుణ మార్కెట్ పత్రాలు: ఈ క్రింది రుణ పత్రాలను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు, మునిసిపల్ కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థలు మరియు వాణిజ్య సంస్థలు జారీ చేస్తాయి. ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు మరియు పబ్లిక్ లిమిటెడ్ సంస్థలు రుణ మార్కెట్లో జారీ చేసే ముఖ్యమైన పత్రాలు.
1) డిబెంచర్లు:

  1. ఇవి ఒక రకమైన రుణ పత్రాలు. ఇవి నిర్దిష్ట కాలానికి నిర్ణీత వడ్డీ రేటును అందిస్తుంది.
  2. కంపెనీలు లేదా ప్రభుత్వాలు నిధులను సమకూర్చుకోవడానికి డిబెంచర్లను ఉపయోగిస్తాయి. డిబెంచర్లు కేవలం కంపెనీలు తీసుకున్న రుణాలు మాత్రమే. అవి సంస్థలో యాజమాన్యపు హక్కును కల్గించవు.

2) బాండ్లు:

  1. మూలధనాన్ని పెంచడానికి కార్పొరేషన్లు మరియు ప్రభుత్వాలు జారీ చేసే స్థిర ఆదాయ సెక్యూరిటీలు బాండ్లు.
  2. బాండ్ జారీ చేసేవారు బాండ్ హోల్డర్ నుంచి మూలధనాన్ని తీసుకుంటారు మరియు వారికి నిర్ణీత కాలానికి స్థిర వడ్డీ రేటుతో స్థిర చెల్లింపులు చేస్తారు.

3) ప్రభుత్వ సెక్యూరిటీలు:

  1. ప్రభుత్వ సెక్యూరిటీలు లేదా G-Secs భారత ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ జారీ చేస్తుంది.
  2. సెక్యూరిటీలు స్థిర వడ్డీ రేటును అందిస్తాయి. ఇక్కడ వడ్డీ వార్షిక కాలంలో రెండు సార్లు చెల్లించబడుతుంది.

3) ట్రెజరీ బిల్లులు:

  1. ట్రెజరీ బిల్లులు లేదా టి-బిల్లులు, వీటిని రిజర్వు బ్యాంకు జారీ చేస్తుంది.
  2. ఇవి 91 రోజులు, 182 రోజులు మరియు 364 రోజుల కాలానికి జారీ చేస్తారు.

4) సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్లు:

  1. ఒక నిర్దిష్ట కాలానికి బ్యాంకు వద్ద ఉన్న నిధుల డిపాజిటర్లకు సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్లు (CDలు) బ్యాంక్ జారీ చేస్తుంది.
  2. CDలు సాంప్రదాయ టర్మ్ డిపాజిట్ల మాదిరిగానే ఉంటాయి, వీటిని స్వల్పకాలిక ద్రవ్య మార్కెట్లో మార్చుకోవచ్చు మరియు వర్తకం చేయవచ్చు.

5) వాణిజ్య పత్రాలు:

  1. వాణిజ్య పత్రాలను CP అని కూడా పిలుస్తారు. ఇవి నిధుల సేకరణ కోసం కంపెనీలు జారీ చేసే స్వల్పకాలిక రుణ పత్రాలు.
  2. ఇది ప్రామిసరీ నోట్ రూపంలో జారీ చేయబడిన రిస్క్ ను కలిగి ఉన్న ద్రవ్య మార్కెట్ పత్రం. దీనిని 1990లో భారతదేశంలో మొదటిసారి ప్రవేశపెట్టడం జరిగింది.

ప్రశ్న 7.
ఈక్విటీ మార్కెట్ పత్రాలను వివరించండి.
జవాబు.
ఈక్విటీ మార్కెట్: లిస్టెడ్ కంపెనీల షేర్లలో వర్తకం చేయడానికి కొనుగోలుదారులు మరియు విక్రేతలు కలిసే మార్కెటు ఈక్విటీ మార్కెట్ అంటారు. దీనినే స్టాక్ మార్కెట్ లేదా షేర్ మార్కెట్ అని కూడా పిలుస్తారు.

ఈక్విటీ మార్కెట్ పత్రాలు:
1) సాధారణ వాటాలు:
1) సాధారణ స్టాక్ వాటాలు యాజమాన్య మూలధనాన్ని సూచిస్తాయి మరియు సాధారణ వాటాలను కలిగి ఉన్న వారికి సంస్థ యొక్క లాభాల నుంచి డివిడెండ్ చెల్లించబడుతుంది.

2) సాధారణ వాటాదారులకు సంస్థ యొక్క ఆదాయం మరియు ఆస్తుల అవశేష విలువపై అధికారం ఉంటుంది. ఆధిక్యపు వాటాదారులు మరియు బాండ్ హెరాల్డర్కు చెల్లించిన తర్వాత మాత్రమే వారు సంస్థ యొక్క లాభాలలో వాటాను పొందటానికి అర్హులు.

2) ఆధిక్యపు వాటాలు:
1) ఆధిక్యపు వాటాలు మిశ్రమ జాతి భద్రత లక్షణాలను కలిగి ఉంటాయి. ఎందుకంటే అవి సాధారణ ఈక్విటీ వాటాలు మరియు డిబెంచర్ల యొక్క కొన్ని లక్షణాలను మిళితం చేస్తాయి.

2) అవి డివిడెండ్ల స్థిరమైన రేటును కలిగి ఉండటం, ఈక్విటీ వాటాదారుల కంటే ముందుగా కంపెనీ ఆదాయంపై మరియు ఆస్తులపై హక్కును కలిగి ఉంటారు. కంపెనీ యొక్క మిగిలిన ఆదాయంలో వీరికి ఏ హక్కులేదు మరియు వాటాదారులకు ఓటు హక్కును ఇవ్వనందున అవి డిబెంచర్ల వంటివి.

3) ప్రైవేట్ ఈక్విటీ:
1) ప్రైవేట్ ప్లేస్మెంట్ల ద్వారా చేసే ఈక్విటీ పెట్టుబడులను ప్రైవేట్ ఈక్విటీ అంటారు. ప్రైవేట్ ఈక్విటీని ప్రైవేట్ ఋణ బాధ్యతగల సంస్థలు మరియు భాగస్వామ్యాలు సేకరిస్తాయి.

2) సాధారణంగా, ప్రారంభ మరియు చిన్న/మధ్య తరహా కంపెనీలు, సంస్థాగత పెట్టుబడిదారులు మరియు సంపన్న వ్యక్తుల నుండి ఈ మార్గం ద్వారా మూలధనాన్ని సేకరిస్తాయి.

4) మ్యూచువల్ ఫండ్స్:
1) మ్యూచువల్ ఫండ్స్ అనేవి పెట్టుబడిదారులకు లాభం సంపాదించడానికి అనేకమంది పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరించి కంపెనీ స్టాక్స్, బాండ్స్, ప్రభుత్వ పత్రాలు మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టే సాధనం.

2) వచ్చిన లాభాన్ని పెట్టుబడిదారులకు డివిడెండ్లుగా చెల్లించవచ్చు లేదా మూలధన పెరుగుదల కోసం ఫండ్ ద్వారా తిరిగి పెట్టు బడి పెట్టవచ్చు.

5) ఉత్పన్నాలు:
1) ఇవి ఆర్థిక ఒప్పందాలు. వీటి విలువ వీటిని పోలిన ఇతర ఆస్తుల విలువపై ఆధారపడి ఉంటుంది.

2) సాధారణంగా సరిపోల్చడానికి ఇతర ఆస్తులు ఏవనగా స్టాక్స్, బాండ్లు, కరెన్సీలు, వస్తువులు మరియు మార్కెట్ సూచికలు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఆస్తుల విలువ మారుతూ ఉంటుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు

ప్రశ్న 8.
మ్యూచువల్ ఫండ్ను నిర్వచించి, దాని ధ్యేయాలు ఏమిటో వివరించండి.
జవాబు.
1) మ్యూచువల్ ఫండ్స్ అనేవి పెట్టుబడిదారులకు లాభం సంపాదించడానికి అనేక మంది పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరించి కంపెనీ స్టాక్స్, బాండ్స్, ప్రభుత్వ పత్రాలు మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టే సాధనం.

2) వీటిలో వచ్చిన లాభాన్ని పెట్టుబడిదారులకు డివిడెండ్లుగా చెల్లించవచ్చు లేదా మూలధన పెరుగుదల కోసం ఫండ్ ద్వారా తిరిగి పెట్టుబడి పెట్టవచ్చు.

మ్యూచువల్ ఫండ్ ధ్యేయాలు:
1) లక్ష్య ఆధారిత పెట్టుబడి: మ్యూచువల్ ఫండ్స్ యొక్క ప్రథమ పెట్టుబడి లక్ష్యం ఇది. ఇది వివిధ పెట్టుబడిదారుల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల మ్యూచువల్ ఫండ్లను అందిస్తుంది. ఫండ్ మేనేజర్ పెట్టుబడిదారునికి ఏర్పడే రిస్క్ మరియు రుణ బాధ్యతలు మొదలైన వాటిని చూసిన తరువాతనే పెట్టుబడిదారులకు అనువైన సెక్యూరిటీల మిశ్రమాన్ని ఎంపిక చేస్తారు.

2) పెట్టుబడి వృద్ధి: అనేక మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడి ఉద్దేశాలలో పెట్టుబడి వృద్ధి ఒకటి. అధిక రాబడి కోసం చూస్తున్న పెట్టుబడిదారులు కొంత అదనపు రిస్క్ తీసుకొని పెట్టుబడిని చేస్తారు. ఈ ఉద్దేశం ప్రకారం వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థలలో డబ్బును పెట్టుబడి పెడతాయి.

3) పన్ను ఆదా: మ్యూచువల్ ఫండ్ యొక్క ముఖ్యమైన పెట్టుబడి ఉద్దేశాలలో పన్ను ఆదా కూడా ఒకటి. ఎక్కువగా సంపన్న క్లయింట్లు, సంస్థాగత పెట్టుబడిదారులు మరియు కార్పొరేట్ పన్ను భారాన్ని తగ్గించే ఉద్దేశాన్ని కలిగి ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులకు వివిధ రకాల ఫండ్లు అందుబాటులో ఉండి పన్నులు తగ్గిస్తాయి.

ప్రశ్న 9.
వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్ ఏమిటో సవివరంగా తెలియజేయండి.”
జవాబు.
మ్యూచువల్ ఫండ్ పథకాలను దాని నిర్మాణం మరియు పెట్టుబడి లక్ష్యం ఆధారంగా వర్గీకరించవచ్చు.
TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు 4
స్వరూపం ఆధారంగా:
ద్రవ్య మార్కెట్ ఫండ్
ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్
ఓపెన్ ఎండెడ్ ఫండ్స్:

  1. ఓపెన్ – ఎండెడ్ ఫండ్ అంటే నిరంతర ప్రాతిపదికన చందా చేయడానికి మరియు తిరిగి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. అంటే ఏడాది పొడవునా లభ్యమౌతుంది.
  2. ఈ ఫండ్కు స్థిర మెచ్యూరిటీ వ్యవధి లేదు.
  3. పెట్టుబడిదారులు నికర ఆస్తి విలువ (NAV) సంబంధిత ధరలతో సౌకర్యవంతంగా యూనిట్లను కొనుగోలు చేయవచ్చు మరియు అమ్మవచ్చు. ఓపెన్ – ఎండ్ పథకాల యొక్క ముఖ్య లక్షణం ద్రవ్యత్వాన్ని కల్పించడం.

క్లోజ్ – ఎండెడ్ ఫండ్స్:
1) క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్ నిర్ణీత మెచ్యూరిటీ వ్యవధిని కలిగి ఉంటాయి. ఇవి సాధారణంగా 3-15 సంవత్సరాల కాల వ్యవధిలో ఉంటాయి. ఈ నిధులు నిర్దిష్ట కాలంలో మాత్రమే చందా కోసం తెరవబడతాయి.

2) ప్రారంభ పబ్లిక్ ఇష్యూ సమయంలో పెట్టుబడిదారులు ఈ పథకంలో పెట్టుబడులు పెట్టవచ్చు మరియు ఆ తరువాత వారు జాబితా చేయబడిన స్టాక్ ఎక్స్ఛేంజ్లలో ఈ పథకం యొక్క యూనిట్లను కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు.

3) పెట్టుబడిదారులకు నిష్క్రమణ మార్గాన్ని అందించడానికి, కొన్ని క్లోజ్-ఎండెడ్ ఫండ్ NAV సంబంధిత ధరలకు మ్యూచువల్ ఫండ్ పునర్ కొనుగోలు విధానం ద్వారా యూనిట్లను తిరిగి విక్రయించే అవకాశాన్ని ఇస్తాయి.

ఇంటర్వెల్ ఫండ్స్:

  1. ఇంటర్వెల్ ఫండ్స్ ఓపెన్ – ఎండెడ్ మరియు క్లోజ్-ఎండెడ్ స్కీమ్ల లక్షణాలను మిళితం చేస్తాయి.
  2. NAV సంబంధిత ధరల వద్ద ముందుగా నిర్ణయించిన వ్యవధిలో అవి అమ్మకం లేదా విముక్తి కోసం తెరవబడతాయి. పెట్టుబడి లక్ష్యం ఆధారంగా:

వృద్ధి ఫండ్స్:

  1. పెట్టుబడుల విలువ పెరుగుదలను మూలధనం విలువ పెరుగుదల ద్వారా ఉద్దేశించిన నిధులు ఈ రకానికి వస్తాయి.
  2. ఇలాంటి నిధులు వృద్ధి ఆధారిత సెక్యూరిటీలలో పెట్టుబడిగా పెడతాయి. అంటే, దీర్ఘకాలంలో పెరుగుదల గల కంపెనీల వాటాలలో పెట్టుబడిని చేస్తారు.
  3. గ్రోత్ ఫండ్స్ను నెస్ట్ ఎగ్స్ లేదా లాంగ్ హాల్ ఇన్వెస్టిమెంట్స్ అని కూడా అంటారు.

ఆదాయ ఫండ్స్:

  1. పెట్టుబడిదారులకు క్రమమైన మరియు స్థిరమైన ఆదాయాన్ని అందించడం ఆదాయ ఫండ్స్ యొక్క ఉద్దేశం.
  2. ఇలాంటి పథకాలు సాధారణంగా బాండ్లు, కార్పొరేట్ డిబెంచర్లు మరియు ప్రభుత్వ సెక్యూరిటీల వంటి స్థిర ఆదాయ సెక్యూరిటీల ద్వారా లభ్యమౌతాయి.
  3. మూలధన స్థిరత్వం, సాధారణ ఆదాయానికి ఈ ఫండ్స్ అనువైనవి.

సమతుల్య ఫండ్స్:

  1. సమతుల్య ఫండ్స్ ఉద్దేశం వృద్ధి మరియు సాధారణ ఆదాయం రెండింటినీ అందించడం.
  2. ఇలాంటి పథకాలు క్రమానుగతంగా వారి సంపాదనలో కొంత భాగాన్ని పంపిణీ చేస్తాయి మరియు ఈక్విటీలు మరియు స్థిర ఆదాయ సెక్యూరిటీలలో వారి ప్రతిపాదన పత్రాలలో సూచించిన నిష్పత్తిలో పెట్టుబడి పెడతాయి. మెజారిటీ నిధులు ఈ కోవలోకి వస్తాయి.

ద్రవ్య మార్కెట్ ఫండ్స్:

  1. ద్రవ్య మార్కెట్ ఫండ్ల ఉద్దేశం తేలికైన ద్రవ్యత, మూలధన సంరక్షణ మరియు మితమైన ఆదాయాన్ని అందించడం.
  2. ఈ పథకాలు సాధారణంగా ట్రెజరీ బిల్లులు, డిపాజిట్ సర్టిఫికెట్లు, కమర్షియల్ పత్రాలు మరియు ఇంటర్ బ్యాంక్ కాల్ మనీ వంటి సురక్షితమైన స్వల్పకాలిక సాధనాలలో పెట్టుబడి పెడతాయి.
  3. మార్కెట్లో ఉన్న వడ్డీ రేట్లను బట్టి ఈ పథకాలపై రాబడి మారవచ్చు. ఈ నిధులు కార్పొరేట్ మరియు వ్యక్తిగత పెట్టుబడిదారులకు వారి మిగులు నిధులను స్వల్ప కాలానికి మళ్ళించటానికి అనువైనవి.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు

III. ఇతర రకాలు:
1) పన్ను పొదుపు ఫండ్స్ పెట్టుబడిదారులను ప్రోత్సహించటానికి నిర్దేశిత మార్గాల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వం పన్ను ప్రోత్సాహకాలను అందిస్తున్నది. ఈ పథకాలు భారతీయ ఆదాయపు పన్ను చట్టాల యొక్క నిర్దిష్ట నిబంధనల ప్రకారం పెట్టుబడిదారులకు పన్ను రాయితీలను అందిస్తాయి.

2) పరిశ్రమ నిర్దిష్ట ఫండ్స్:

  • పరిశ్రమ నిర్దిష్ట పథకాలు ప్రతిపాదనలో పేర్కొన్న పరిశ్రమలలో మాత్రమే పెట్టుబడి పెడతాయి.
  • ఈ నిధుల పెట్టుబడి ఇన్ఫోటెక్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) ఫార్మాస్యూటికల్స్ మొదలైన నిర్దిష్ట పరిశ్రమలకు పరిమితం.

ఇండెక్స్ ఫండ్స్: BSE లేదా NSEల నిర్దిష్ట సూచిక యొక్క పనితీరును ప్రతిబింబించడానికి ఇండెక్స్ ఫండ్స్ ప్రయత్నిస్తాయి.

ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్:

  1. ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ పెట్టుబడిదారులకు క్లోజ్డ్ ఎండెడ్ మరియు ఓపెన్ – ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ యొక్క మిశ్రమ ప్రయోజనాలను అందిస్తాయి.
  2. ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ స్టాక్ మార్కెట్ సూచికలను అనుసరిస్తాయి మరియు సూచీతో ముడిపడి ఉన్న ధరల వద్ద ఒకే స్టాక్ స్టాక్ ఎక్స్ఛేంజిలలో వర్తకం చేయబడతాయి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
దేశీయ బ్యాంకర్లకు, వడ్డీ వ్యాపారస్తులకు మధ్యగల తేడాలను రాయండి.
జవాబు.
దేశీయ బ్యాంకర్లు

  1. దేశీయ బ్యాంకర్లు వర్తక వాణిజ్య అవసరాలకు రుణాలిస్తారు.
  2. వీరు వసూలు చేసే వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది.
  3. దేశీయ బ్యాంకర్లు ఇచ్చే రుణాలకు హామీ తప్పనిసరి.
  4. వీరు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు అందిస్తారు.

వడ్డీ వ్యాపారస్తులు

  1. వడ్డీ వ్యాపారస్తులు వినియోగ అవసరాలకు రుణాలిస్తారు.
  2. వడ్డీ వ్యాపారస్తులు వసూలు చేసే వడ్డీరేటు అధికంగా ఉంటుంది.
  3. వడ్డీ వ్యాపారస్తులు ఇచ్చే రుణాలకు హామీ అవసరం లేదు.
  4. వీరు ఎక్కువ స్వల్పకాలిక రుణాలకు ప్రాధాన్యత ఇస్తారు.

ప్రశ్న 2.
వ్యవస్థీకృత ద్రవ్య మార్కెట్ నిర్వహించే పాత్ర ఏమిటి ?
జవాబు.
సంఘటిత ద్రవ్య మార్కెట్లో పని చేస్తున్నా లేదా కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు R.B.I ద్వారాగాని, ఇతర నియంత్రణ సంస్థలైన ‘నాబార్డ్ (NABARD) ద్వారాగాని క్రమబద్దీకరించబడతాయి. అందువల్ల వాణిజ్య బ్యాంకులు, భారతీయ మరియు విదేశీ, పబ్లిక్ ప్రైవేట్ రంగానికి చెందినవి వ్యవస్థీకృత ద్రవ్యమార్కెట్లో కేంద్ర ప్రభుత్వం, వ్యాపార సంస్థలతోపాటు పాల్గొంటాయి.

వ్యవస్థీకృత ద్రవ్య మార్కెట్ పాత్ర:

  1. వాణిజ్య బ్యాంకులు నగదు రిజర్వు నిష్పత్తి కొనసాగించడంలో సహాయపడుతుంది.
  2. సంస్థలు నిర్వహణ మూలధన అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది.
  3. నిధుల లోటును పూరించడానికి ప్రభుత్వానికి సహకరిస్తుంది.

ద్రవ్యమార్కెట్ పరపతి సాధనాలు ట్రెజరీ బిల్లులు, వాణిజ్య పత్రాలు, పిలుపు ద్రవ్యం, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్, వాణిజ్య బిల్లులు మొదలైన సాధనాలతో వాణిజ్య బ్యాంకులు, సంస్థలు, ప్రభుత్వం నిధులను సమకూర్చుకుంటాయి.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు

ప్రశ్న 3.
ప్రాథమిక మార్కెట్కు, ద్వితీయ మార్కెట్కు మధ్యగల తేడాలను రాయండి.
జవాబు.
ప్రాథమిక మార్కెట్

  1. కొత్తగా జారీచేయబడిన వాటాల కొనుగోళ్ళు జరుపుతుంది.
  2. పెట్టుబడిన అభివృద్ధి చేయడంలో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది.
  3. సెక్యూరిటీల కొనుగోలు వ్యవహారాలు మాత్రమే జరుగుతాయి.
  4. కంపెనీ నిర్వాహకులు సెక్యూరిటీ ధరలను నిర్ణయిస్తారు.
  5. సెక్యూరిటీ వ్యవహారాలు జరపడానికి నిర్ణీత ప్రదేశం లేదు.
  6. దీని ద్వారా కంపెనీ తన సెక్యూరిటీలను నేరుగా గాని, మధ్యవర్తుల ద్వారాగాని పెట్టుబడి దారులకు అమ్మగలదు.

ద్వితీయ మార్కెట్

  1. ఒకసారి కొనుగోలు చేయబడిన వాటాలను మరల మార్కెట్ చేయడం జరుపుతుంది.
  2. పెట్టుబడిని అభివృద్ధి చేయడంలో పరోక్షంగా సంబంధం కలిగి ఉంటుంది.
  3. సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకాలు రెండు జరుగుతాయి.
  4. సెక్యూరిటీల ధర వాటి యొక్క సప్లయ్, డిమాండ్లను బట్టి నిర్ణయించబడతాయి.
  5. నిర్ణీత ప్రదేశాలలో సెక్యూరిటీలకు సంబంధించిన వ్యవహారాలు జరుగుతాయి.
  6. సెక్యూరిటీదారులు తమ సెక్యూరిటీలను వినిమయం చేయడంలో తోడ్పడుతుంది.

ప్రశ్న 4.
ట్రెజరీ బిల్లు అంటే ఏమిటి ?
జవాబు.
1) ట్రెజరీ బిల్లు లేదా శూన్య కూపన్ బాండు కేంద్రప్రభుత్వం తరుపున స్వల్పకాలిక నిధుల అవసరాలను తీర్చడానికి రిజర్వ్ బ్యాంక్ (RBI) చేత డిస్కౌంట్ కోసం జారీ చేసిన ఒక ప్రామిసరీ నోటు.

2) ట్రెజరీ బిల్లులు వాటి ముఖ విలువ కంటే తక్కువ ధరకు జారీచేయబడి ముఖ విలువతో తిరిగి చెల్లించబడతాయి. కొనుగోలు ధరకు, గడువు తేదీని చెల్లించిన మొత్తానికి మధ్యగల వ్యత్యాసమే డిస్కౌంట్గా పిలువబడు ఆర్జించిన వడ్డీ.

3) ఇది సురక్షిత ద్రవ్య మార్కెట్ సాధనాలలో ఒకటి. కాని దీనిపై రాబడి అంత ఆకర్షణీయంగా ఉండదు. అయినప్పటికీ,
ఇవి శూన్య నష్ట భయమున్న, నిశ్చిత ఆదాయం కలిగిన సాధనాలు. ట్రెజరీ బిల్లు యొక్క కొనుగోలు ధర వేలం పద్దతిలో నిర్ణయించబడుతుంది.

4) ప్రస్తుతం భారత ప్రభుత్వం 91 రోజుల, 182 రోజుల, 364 రోజుల మూడు రకాలైన ట్రెజరీ బిల్లులను వేలం ద్వారా జారీ చేస్తున్నది.

ప్రశ్న 5.
ఇ-ఐపిఒలు (e – IPO).
జవాబు.
1) కంపెనీ సెక్యూరిటీలను ఆన్లైన్ వర్తకం వ్యవస్థ గల స్టాక్ ఎక్స్ఛేంజ్తో ఒప్పందం చేసుకోవడం ద్వారా జారీ చేస్తుంది. దీనినే (e – IPO – Initial Public Offer) ‘ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్’ అంటారు.

2) దీనికోసం, దరఖాస్తులను అంగీకరించి ఆర్డర్లను కంపెనీకి ఇవ్వడానికి సెబి (SEBI) రిజిష్టర్ బ్రోకర్లను
నియమించవలసి ఉంటుంది.

3) వాటాలను జారీ చేస్తున్న కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్తో ఎలక్ట్రానిక్ కనెక్టివిటీ కోసం ఒక రిజిష్ట్రారును నియమించవలసి ఉంటుంది.

4) వాటాలను జారీ చేసే కంపెనీ తన సెక్యూరిటీలను “సెక్యూరిటీలను జాబితాలో చేర్చిన స్టాక్ ఎక్స్ఛేంజ్లో” కాకుండా ఏదైనా ఇతర స్టాక్ ఎక్స్ఛేంజ్లోని జాబితాలో చేర్చవలసి ఉంటుంది. సెక్యూరిటీల జారీ నిర్వహించే మధ్యవర్తులను ఒక లీడ్ మేనేజర్ సమన్వయించడం జరుగుతుంది.

ప్రశ్న 6.
ఏ విధంగా ఆర్థిక మార్కెట్లు వర్గీకరించారు ?
జవాబు.
ద్రవ్య పరమైన ఆస్తులను సృష్టించడానికి, వినిమయం చేయడానికి కావలసిన విత్త వ్యవహారాలు జరిపే మార్కెట్లను విత్త మార్కెట్లు అంటారు. వీటినే ఆర్థిక మార్కెట్లు అని కూడా పిలుస్తారు.
విత్త మార్కెట్లను విత్త యొక్క కాలపరిమితి ఆధారంగా రెండు రకాలుగా వర్గీకరించారు. అవి:
1) ద్రవ్య మార్కెట్లు,
2) మూలధన మార్కెట్లు
TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు 5
A) స్వల్ప కాల పరపతి సాధనాలలో వర్తకం జరిపే మార్కెట్ను ద్రవ్య మార్కెట్ అంటారు. దీనిని మరల సంఘటిత మార్కెట్ మరియు అసంఘటిత మార్కెట్గా వర్గీకరించారు.

B) వ్యాపార దీర్ఘకాలిక అవసరాలను తీర్చడంకోసం వాటాల కొనుగోలు అమ్మకాలను సంబంధించిన వ్యవహారాలు జరిగే మార్కెట్లు మూలధన మార్కెట్ అంటారు. మూలధన మార్కెట్ను ప్రాథమిక మరియు ద్వితీయ మార్కెట్లుగా విభజించవచ్చు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు

ప్రశ్న 7.
సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్లు అంటే ఏమిటి ?
జవాబు.

  1. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ దాని గ్రహీత వడ్డీతో పాటుగా ముఖ విలువ మొత్తాన్ని పొందేందుకు అధికారాన్నిస్తూ వాణిజ్య బ్యాంకులచే జారీ చేయబడ్డ బదిలీ చేయదగిన స్వల్పకాలిక హామీ లేని ప్రామిసరీ నోటు.
  2. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ వ్యక్తులకు, కార్పొరేషన్లకు, కంపెనీలకు, ప్రవాస భారతీయులకు జారీ చేయబడుతుంది.
  3. ఈ సర్టిఫికేట్లు 3 నెలల నుంచి 5 సంవత్సరాల కాల పరిమితితో అందుబాటులో ఉంటాయి.
  4. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్లు నష్టభయం ఎక్కువగా కలిగి ఉండటం చేత వీటి మీద రాబడి ట్రెజరీ బిల్లులపై రాబడి కంటే అధికంగా ఉంటుంది.

ప్రశ్న 8.
వాణిజ్య పత్రం గురించి తెలపండి.
జవాబు.

  1. వాణిజ్య పత్రం ఆర్థిక పరిపుష్టి కలిగిన కంపెనీలచే జారీ చేయబడి, కొంత డిస్కౌంట్తో బదలాయింపు చేయదగిన ఒక స్వల్పకాలిక హామీ లేని ప్రామిసరీ నోటు.
  2. వాణిజ్య పత్రం ఒక రోజు నుంచి 270 రోజుల కాల పరిమితిని కలిగి ఉంటుంది.
  3. వసూలు ఖాతాలు, ఇన్వెంటరీ నిర్వహణ కోసం అవసరం అయ్యే నిధుల నిమిత్తం, స్వల్పకాలిక రుణాలను చెల్లించడానికి వాణిజ్య పత్రాలను జారీ చేస్తారు.
  4. వాణిజ్య పత్రాల మీద రాబడి ట్రెజరీ బిల్లులపై వచ్చే రాబడి కంటే అధికంగా ఉంటుంది. కాని ఇవి తక్కువ హామీ కలిగినవి.

ప్రశ్న 9.
పిలుపు ద్రవ్యం అంటే ఏమిటి ?
జవాబు.
1) పిలుపు ద్రవ్యం నగదు, రిజర్వు ఆవశ్యకత కోసం పిలుపు రేటు అనే వడ్డీతో సహా ఒక రోజు నుంచి 14 రోజుల నోటీసుపై గాని మరియు 14 రోజులు మించిన కాల వ్యవధితో తిరిగి చెల్లించబడే, స్వల్పకాలిక నిధుల కోసం బ్యాంకులు జరిపే పరస్పర వ్యవహారం.

2) రిజర్వ్ బ్యాంకు ఈ నగదు రిజర్వ్ నిష్పత్తి మొత్తంలో మార్పులు చేసినప్పుడు నిర్దేశించబడిన నిల్వల కంటే తక్కువ నగదు నిల్వలు కలిగిన బ్యాంకులు మిగులు నిధులు కలిగి ఉన్న బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుంటాయి. ఈ సేవలకు గాను, రుణదాత బ్యాంకుకు చెల్లించే వడ్డీని పిలుపు రేటు అని పిలుస్తారు.

3) పిలుపు రేటు రోజు రోజుకు, గంట గంటకు కూడా మారుతూ ఉంటుంది.

ప్రశ్న 10.
బాండ్ మార్కెట్ గురించి తెలియజేయండి.
జవాబు.
1) బాండ్ మార్కెట్ను తరచుగా డెట్ మార్కెట్, ‘స్థిర – ఆదాయ’ మార్కెట్ లేదా ‘క్రెడిట్-మార్కెట్’ అని పిలుస్తారు.

2) ప్రభుత్వ సంస్థలు లేదా బహిరంగంగా వర్తకం చేసే సంస్థల ద్వారా మార్కెట్లోకి తీసుకువచ్చే రుణ సెక్యూరిటీలను పెట్టుబడిదారులు కొనుగోలు చేసే మార్కెట్ స్థలంనే బాండ్ మార్కెట్ అంటారు.

3) ప్రభుత్వాలు సాధారణంగా అప్పులు చెల్లించడానికి లేదా మౌలిక సదుపాయాల మెరుగుదలకు నిధులు సమకూర్చడానికి బాండ్లను జారీ చేస్తాయి.

4) పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు వ్యాపార విస్తరణ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు లేదా కొనసాగుతున్న కార్యకలాపాలను నిర్వహించడానికి బాండ్లను జారీ చేస్తాయి.

5) సాధారణ బాండ్ మార్కెట్ను కార్పొరేట్ బాండ్లు, ప్రభుత్వ బాండ్లు, మునిసిపల్ బాండ్లు, తనఖా పౌండ్లు మరియు అభివృద్ధి చెందుతున్న మార్కెట్ బాండ్లుగా విభజించవచ్చు.

ప్రశ్న 11.
రుణ మార్కెట్ అంటే ఏమిటి ?
జవాబు.

  1. రుణ మార్కెట్ అంటే రుణ పత్రాలతో వ్యాపారం జరిగే ఏదైనా మార్కెట్ స్థలము.
  2. రుణ పత్రాలలో తనఖా, ప్రామిసరీ నోట్స్, బాండ్లు మరియు డిపాజిట్ సర్టిఫికెట్లు ఉన్నాయి.
  3. ఇది వివిధ రకాల స్థిర ఆదాయ ఆర్థిక పత్రాలను జారీ చేస్తుంది మరియు ఆ తరువాత వాణిజ్యాన్ని సులభతరం చేస్తుంది.
  4. రుణ మార్కెట్ ప్రభుత్వ రంగ మరియు ప్రైవేట్ రంగ ప్రాజెక్టులకు ఎక్కువ నిధులను సమకూర్చే మార్గాలను అందిస్తుంది మరియు సంస్థాగత ఫైనాన్సింగ్పై ఒత్తిడిని తగ్గిస్తుంది.
  5. స్థిర రేట్ల రుణ పత్రాలతో అనుసంధానించబడినప్పుడు, మార్కెట్ను స్థిర ఆదాయ మార్కెట్ అని పిలుస్తారు.

ప్రశ్న 12.
ఈక్విటీ మార్కెట్ అంటే ఏమిటి ?
జవాబు.

  1. ఈక్విటీ మార్కెట్ను “స్టాక్ మార్కెట్” లేదా “షేర్ మార్కెట్” అని కూడా పిలుస్తారు.
  2. ఇది కంపెనీ వాటాలతో వర్తకం చేయడానికి ఒక వేదిక. ఇది లిస్టెడ్ కంపెనీల షేర్లలో వర్తకం చేయడానికి కొనుగోలుదారులు మరియు విక్రేతలు కలిసే ప్రదేశం.
  3. లిస్టెడ్ కంపెనీలు తమ ఈక్విటీలో కొంత భాగాన్ని పబ్లిక్ పెట్టుబడిదారులకు అందిస్తాయి. వీటిని స్టాక్ ఎక్స్ఛేంజ్ జాబితాలో చేర్చబడి ఉండాలి. ‘
  4. స్టాక్ ఎక్స్ఛేంజ్లు సాధారణ ఈక్విటీ షేర్లతో పాటు కార్పొరేట్ బాండ్లు మరియు కన్వర్టిబుల్ బాండ్లవంటి ఇతర సెక్యూరిటీలను జాబితాలో చేర్చుతాయి.
  5. స్టాక్ ఎక్స్ఛేంజ్ యొక్క ఉద్దేశం కొనుగోలుదారులు మరియు అమ్మకం దారుల మధ్య సెక్యూరిటీల మార్పిడిని సులభతరం చేయడం, తద్వారా మార్కెట్ స్థలం వలె పనిచేస్తుంది.
  6. రెండు ప్రధాన భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్లు BSE (బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్) మరియు NSE (నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్) లిస్టెడ్ సెక్యూరిటీలపై రియల్ టైమ్ ట్రేడింగ్ సమాచారాన్ని అందిస్తాయి, ధరల ఆవిష్కరణకు దోహదపడతాయి.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు

ప్రశ్న 13.
ఫారెక్స్ మార్కెట్ అంటే ఏమిటి ?
జవాబు.
1) విదేశీ మారక మార్కెట్ లేదా ‘ఫారెక్స్ మార్కెట్’ అనేది అంతర్జాతీయ నెట్వర్క్ను ఏర్పరిచే వ్యవస్థ. ఇది కొనుగోలుదారులు, అమ్మకందారులకు వివిధ దేశాల కరెన్సీ వాణిజ్యం లేదా మార్పిడిని నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది.

2) ఫారెక్స్ వ్యాపారి యొక్క లక్ష్యం ధరలలో ఈ హెచ్చుతగ్గుల నుండి లాభాలను ఆర్జించడం మరియు భవిష్యత్తులో విదేశీ మారక రేట్లు ఏ విధంగా కదలవచ్చో ఊహించడం.

3) ఫారెక్స్ మార్కెట్ బ్యాంకులు, వాణిజ్య సంస్థలు, సెంట్రల్ బ్యాంకు, పెట్టుబడి నిర్వహణ సంస్థలు, హెడ్జ్ ఫండ్స్ మరియు రిటైల్ ఫారెక్స్ బ్రోకర్లు మరియు పెట్టుబడిదారులతో రూపొందించబడింది.

4) ఫారెక్స్ మార్కెట్ అనేది సంస్థల నెట్ వర్క్ రోజుకు 24 గంటలు, వారానికి ఐదు రోజులు వర్తకం చేయడానికి అనుమతిస్తుంది.

5) ఫారెక్స్ మార్కెట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక మార్కెట్. విదేశీ లావాదేవీలు సాధారణంగా జతగా కోట్ చేయబడతాయి. ఎందుకంటే ఒక కరెన్సీని కొనుగోలు చేసినప్పుడు మరొకటి అమ్ముతారు. మొదటి కరెన్సీ ‘బేస్ కరెన్సీ అని, రెండవ కరెన్సీని ‘కోట్ కరెన్సీ’ అంటారు.

ప్రశ్న 14.
క్లోజ్-ఎండెడ్ ఫండ్స్ అంటే ఏమిటి ?
జవాబు.
1) క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్ నిర్ణీత మెచ్యూరిటీ వ్యవధిని కలిగి ఉంటాయి. ఇవి సాధారణంగా 3-15 సంవత్సరాల కాల వ్యవధిలో ఉంటాయి. ఈ నిధులు నిర్దిష్ట కాలంలో మాత్రమే చందా కోసం తెరవబడతాయి.

2) ప్రారంభ పబ్లిక్ ఇష్యూ సమయంలో పెట్టుబడిదారులు ఈ పథకంలో పెట్టుబడులు పెట్టవచ్చు మరియు ఆ తరువాత వారు జాబితా చేయబడిన స్టాక్ ఎక్స్ఛేంజ్లలో ఈ పథకం యొక్క యూనిట్లను కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు.

3) పెట్టుబడిదారులకు నిష్క్రమణ మార్గాన్ని అందించడానికి, కొన్ని క్లోజ్-ఎండెడ్ ఫండ్ NAV సంబంధిత ధరలకు మ్యూచువల్ ఫండ్ పునర్ కొనుగోలు విధానం ద్వారా యూనిట్లను తిరిగి విక్రయించే అవకాశాన్ని ఇస్తాయి.

ప్రశ్న 15.
కన్వర్టబుల్ బాండ్ అంటే ఏమిటి ?
జవాబు.

  1. కన్వర్టిబుల్ బాండ్ అనేది ఒక సాధారణ కార్పొరేట్ బాండ్. ఇది సాధారణ స్టాక్ లోకి నిర్ణీత సంఖ్యలో వాటాలుగా మార్చగల అదనపు లక్షణాన్ని కలిగి ఉంటుంది.
  2. కన్వర్టిబుల్ బాండ్స్ రుణ పత్రాలు. ఎందుకంటే అవి వడ్డీని చెల్లిస్తాయి మరియు స్థిర విమోచన తేదీని కలిగి
    ఉంటాయి.
  3. మార్పిడి నిష్పత్తి జారీ చేసే సమయంలో నిర్ణయించబడుతుంది మరియు సాధారణంగా హెూల్డర్ ఎప్పుడైనా వాటిని వాటాలలోకి మార్చుకోవచ్చు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
విత్త మార్కెట్.
జవాబు.

  1. ద్రవ్యపరమైన ఆస్తులను సృష్టించడానికి, వినిమయం చేయడానికి కావలసిన విత్త వ్యవహారాలు జరిపే మార్కెట్లను విత్త మార్కెట్లు అంటారు.
  2. ఇవి వ్యాపార స్వల్పకాలిక, దీర్ఘకాలిక విత్త అవసరాలను తీర్చడం కోసం పరపతి సాధనాలను, సెక్యూరిటీలను జారీ చేయడంలో ప్రముఖపాత్ర నిర్వహిస్తున్నాయి.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు

ప్రశ్న 2.
ద్రవ్య మార్కెట్.
జవాబు.

  1. స్వల్పకాలిక పరపతి సాధనాలతో వర్తకం జరిగే మార్కెట్ను ద్రవ్య మార్కెట్ అంటారు.
  2. ద్రవ్య మార్కెట్ అంటే అధిక ద్రవ్యత్వం కలిగిన, హామీ లేని, తక్కువ నష్టభయం కలిగిన స్వల్పకాలిక పరపతి సాధనాలతో పార్టీల మధ్య వర్తకం జరిగే పరపతి మార్కెట్.

ప్రశ్న 3.
మూలధన మార్కెట్.
జవాబు.

  1. సెక్యూరిటీలను అమ్మడం ద్వారా వ్యాపార సంస్థలకు దీర్ఘకాలిక నిధులను సమకూర్చే మార్కేట్ను మూలధన మార్కెట్ అంటారు.
  2. మూలధన మార్కెట్ (ప్రైవేట్ రంగ ఉత్పత్తి సంస్థలు, ప్రభుత్వం, ప్రత్యేక విత్త సంస్థలు, మదుపరులు పాల్గొంటారు.

ప్రశ్న 4.
సంఘటిత ద్రవ్య మార్కెట్.
జవాబు.
1) సంఘటిత ద్రవ్య మార్కెట్లో పనిచేస్తున్న లేదా కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ద్వారా గాని, ఇతర నియంత్రణ సంస్థయైన నాబార్డ్ ద్వారా గాని క్రమబద్దీకరించబడతాయి.

2) వాణిజ్య బ్యాంకులు భారతీయ మరియు విదేశీ, పబ్లిక్ మరియు ప్రైవేట్ రంగానికి చెందినవి సంఘటిత రంగంగా (లేదా వ్యవస్థీకృత రంగంగా) పరిగణించబడుతున్నాయి.. ఈ సంస్థలన్నీ కేంద్ర ప్రభుత్వం, వ్యాపార సంస్థలు మరియు వ్యక్తులతో పాటుగా డిమాండు చేయడంలో పాల్గొంటాయి.

3) ద్రవ్య మార్కెట్ పరపతి సాధనాలైన ట్రెజరీ బిల్లులు, వాణిజ్య పత్రాలు, పిలుపు ద్రవ్యం, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్, వాణిజ్య బిల్లులతో వ్యవహరిస్తాయి.

ప్రశ్న 5.
అసంఘటిత ద్రవ్య మార్కెట్.
జవాబు.

  1. ద్రవ్య మార్కెట్లోని ఈ విభాగంపై ఎలాంటి ప్రత్యేక అధికార యంత్రాంగం యొక్క క్రమబద్ధీకరణ లేదు
  2. దేశ గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకింగ్ వ్యవస్థ విస్తరించి అభివృద్ధి చెందినప్పటికీ అసంఘటిత ద్రవ్య మార్కెట్ ఇంకా కొనసాగుతున్నది. ఇందులో దేశీయ బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు ఉన్నారు.
  3. దేశీయ బ్యాంకర్లు వర్తక వాణిజ్య అవసరాలకు రుణాలనిస్తే, వడ్డీ వ్యాపారస్తులు వినియోగ అవసరాలకు రుణాలనిస్తున్నారు.

ప్రశ్న 6.
ప్రాథమిక మార్కెట్.
జవాబు.
ప్రాథమిక మార్కెట్ను కొత్త సెక్యూరిటీల మార్కెట్ అని కూడా అంటారు. ఈ మార్కెట్లో సెక్యూరిటీలను జారీ చేసే కంపెనీ కొత్తదైనా, పాతదైనా కావచ్చు.

ప్రశ్న 7.
ద్వితీయ మార్కెట్.
జవాబు.
ద్వితీయ మార్కెట్ను స్టాక్ ఎక్స్ఛేంజ్ అనికూడా వ్యవహరిస్తారు. స్టాక్ ఎక్స్ఛేంజ్ సెక్యూరిటీలు కొనుగోలు మరియు అమ్మకాలు రెండు జరుగుతాయి.

ప్రశ్న 8.
విత్త మార్కెట్ ధర.
జవాబు.

  1. విత్త సాధనాలు లేదా విత్త సెక్యూరిటీలను మార్కెట్లో వర్తనం చేయడానికి నిర్ణయించిన విలువను విత్త మార్కెట్ ధర అంటారు.
  2. విత్త మార్కెట్ ధర అంటే విత్త సాధనాలకు, మార్కెట్లో లభించిన విలువ.
  3. ప్రాథమిక మార్కెట్లో సెక్యూరిటీల ధరను కంపెనీ నిర్వాహకులు నిర్ణయిస్తారు మరియు ద్వితీయ మార్కెట్లో సెక్యూరిటీల ధర వాటి యొక్క సప్లయ్, డిమాండ్లను బట్టి నిర్ణయించబడుతుంది.

ప్రశ్న 9.
వ్యాపార విత్తం.
జవాబు.

  1. ఒక వ్యాపార సంస్థ తన కార్యకలాపాలు సాగించడానికి అవసరమైన ద్రవ్యసేకరణ, వినియోగం, నియంత్రణకు సంబంధించిన ప్రక్రియను వ్యాపార విత్తం అంటారు.
  2. ప్రతి వ్యాపార సంస్థకు వ్యాపారం ప్రారంభించడానికి, ‘ఆస్తుల కొనుగోలుకు, రోజువారి కార్యకలాపాలకు వ్యాపార – విత్తం ఎంతో ఆవశ్యకం.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు

ప్రశ్న 10.
ద్రవ్య మార్కెట్ పత్రాలు.
జవాబు.

  1. ట్రెజరీ బిల్లు
  2. వాణిజ్య పత్రం,
  3. పిలుపు ద్రవ్యం
  4. వాణిజ్య బిల్లులు,
  5. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్.

ప్రశ్న 11.
సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్.
జవాబు.

  1. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ దాని గ్రహీత వడ్డీతో పాటుగా ముఖ విలువ మొత్తాన్ని పొందేందుకు అధికారాన్నిస్తూ వాణిజ్య బ్యాంకులచే జారీ చేయబడ్డ బదిలీ చేయదగిన స్వల్పకాలిక హామీ లేని ప్రామిసరీ నోటు.
  2. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ వ్యక్తులకు, కార్పొరేషన్లకు, కంపెనీలకు, ప్రవాస భారతీయులకు జారీ చేయబడుతుంది.
  3. ఈ సర్టిఫికేట్లు 3 నెలల నుంచి 5 సంవత్సరాల కాల పరిమితితో అందుబాటులో ఉంటాయి.

ప్రశ్న 12.
వాణిజ్య బిల్లు.
జవాబు.
1) వాణిజ్య బిల్లు కొనుగోలు దారుడు బాకీ ఉన్న అరువు అమ్మకాల మొత్తాన్ని ఒక భవిష్యత్తు తేదీ నాడు చెల్లించడం కోసం కొనుగోలుదారుని (బిల్లు స్వీకర్త) ఆమోదానికై అమ్మకందారుని (బిల్లుకర్త) చే రాయబడ్డ అన్యాక్రాంత యోగ్యతా పత్రం.

2) బిల్లు స్వీకర్త స్వీకృతిని తెలియజేయగానే వాణిజ్య బిల్లు ఒక చట్టబద్దమైన పత్రంగా మారి బిల్లు కర్తకు నగదు అవసరమైనప్పుడు బ్యాంకులో డిస్కౌంట్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.

ప్రశ్న 13.
ట్రెజరీ బిల్లుపై డిస్కౌంట్.
జవాబు.

  1. కేంద్ర ప్రభుత్వం తరపున స్వల్పకాలిక నిధుల అవసరాల కోసం రిజర్వు బ్యాంకు చేత డిస్కౌంట్ కోసం జారీ చేసిన ప్రామిసరీ నోటును ట్రెజరీ బిల్లు అంటారు.
  2. ట్రెజరీ బిల్లులు వాటి ముఖ విలువ కంటే తక్కువ ధరకు జారీ చేయబడి ముఖ విలువతో తిరిగి చెల్లించబడతాయి. . కొనుగోలుధరకు, గడువు తేదీన చెల్లించే మొత్తానికి మధ్య గల వ్యత్యాసాన్ని “ట్రెజరీ బిల్లుపై డిస్కౌంట్” అంటారు.

ప్రశ్న 14.
పిలుపు రేటు.
జవాబు.
1) వాణిజ్య బ్యాంకులు నగదు రిజర్వు నిష్పత్తిగా పిలువబడే కొంత కనీస నగడు నిల్వలను రిజర్వు బ్యాంకు వద్ద పెంచాల్సి ఉంటుంది.

“రిజర్వు బ్యాంక్ నగదు రిజర్వు నిష్పత్తిలో మార్పులు చేసినప్పుడు నిర్దేశించబడిన నిల్వల కంటే తక్కువ నగదు నిల్వ కలిగిన బ్యాంకులు మిగులు నిధులు కలిగిన బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుంటాయి. ఈ సేవకు గాను రుణదాత బ్యాంకుకు చెల్లించే వడ్డీనే “పిలుపు రేటు” అని అంటారు.

ప్రశ్న 15. ఉత్పన్నాలు.
జవాబు.

  1. ఇవి ఆర్థిక ఒప్పందాలు. వీటి విలువ వీటిని పోలిన ఇతర ఆస్తుల విలువపై ఆధారపడి ఉంటుంది.
  2. సాధారణంగా సరిపోల్చడానికి ఇతర ఆస్తులు ఏవనగా స్టాక్స్, బాండ్లు, కరెన్సీలు, వస్తువులు మరియు మార్కెట్ సూచికలు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఆస్తుల విలువ మారుతూ ఉంటుంది.

ప్రశ్న 16.
ఫార్వార్డ్స్.
జవాబు.

  1. ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అనేది రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం.
  2. ముందుగా అంగీకరించిన ధర వద్ద భవిష్యత్తులో ఒక నిర్దిష్ట తేదీలో సెక్యూరిటీల పరిష్కారం జరుగుతుంది.

ప్రశ్న 17.
ఫ్యూచర్స్.
జవాబు.

  1. ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అనేది భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయంలో ఒక నిర్దిష్ట ధర వద్ద ఒక ఆస్తిని కొనుగోలు చేయడానికి లేదా విక్రయించడానికి రెండు పార్టీల మధ్య చేసుకున్న ఒప్పందం.
  2. ఫ్యూచర్స్ కాంట్రాక్టులు ప్రత్యేకమైన ఫార్వర్డ్ కాంట్రాక్టులు. వీటిలో ప్రామాణికమైన మారకపు వర్తక ఒప్పందాలు ఇమిడి ఉంటాయి.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు

ప్రశ్న 18.
ఆప్షన్స్ (Options).
జవాబు.

  1. ఆప్షన్స్ రెండు రకాలు – కాల్స్ మరియు పుట్స్.
  2. కాల్స్ కొనుగోలుదారునికి కొనుగోలు చేయడానికి హక్కును ఇస్తాయి. కాని ఇచ్చిన భవిష్యత్ తేదీన లేదా అంతకు ముందు నిర్ధారించిన ధర వద్ద నిర్దిష్ట ఆస్తి యొక్క నిర్దిష్ట పరిమాణాన్ని కొనుగోలు చేయవలసిన బాధ్యత మాత్రం ఏర్పడదు.
  3. పుట్స్ కొనుగోలుదారునికి ఆస్తి కొనుగోలు హక్కును ఇస్తాయి. కాని ఇచ్చిన తేదీలో లేదా నిర్ధారిత ధర వద్ద నిర్దిష్టమైన ఆస్తిని, నిర్దిష్ట పరిమాణాన్ని విక్రయించే బాధ్యత ఏర్పడదు.

ప్రశ్న 19.
స్వాప్స్ (Swaps).
జవాబు.

  1. ముందుగా నిర్ణయించిన సూత్రం ప్రకారం భవిష్యత్తులో నగదు ప్రవాహాన్ని మార్పిడి చేయడానికి రెండు పార్టీల మధ్య కుదిరిన ప్రైవేట్ ఒప్పందాలు స్వాప్లు.
  2. వాటిని ఫార్వర్డ్ కాంట్రాక్టుల ఫోర్ట్ఫోలియోగ పరిగణించవచ్చు.

ప్రశ్న 20.
నిర్మాణాత్మక ఉత్పత్తులు.
జవాబు.

  1. నిర్మాణాత్మక ఉత్పత్తి అనేది సాంప్రదాయ విత్త పత్రాలు మరియు ఉత్పన్నాల కలయికను ఉపయోగించి వ్యక్తీకరించిన పెట్టుబడి పరిష్కారం.
  2. ఈ కలయిక పెట్టుబడిదారులు రిస్క్ స్థాయిని వారికి ఆమోదయోగ్యమైన స్థాయికి సర్దుబాటు చేయడానికి అనుమతిస్తుంది. అదే సమయంలో అంతర్లీన కదలికల నుంచి ప్రయోజనం పొందుతుంది.
    (ఉదా: స్టాక్, మార్పిడి రేటు మొదలైనవి).
  3. ఈ ఉత్పత్తులు సాధారణంగా దీర్ఘకాలిక స్వభావం కలిగి ఉంటాయి. గరిష్ట రాబడిని పొందడానికి కనీసం 1 సంవత్సరం లాక్-ఇన్ కాలం మరియు 2-3 సంవత్సరాల పెట్టుబడి కాలం అవసరం.

ప్రశ్న 21.
మ్యూచువల్ ఫండ్.
జవాబు.

  1. మ్యూచువల్ ఫండ్స్ అనేవి పెట్టుబడిదారులకు లాభం సంపాదించడానికి అనేకమంది పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరించి కంపెనీ స్టాక్స్, బాండ్స్, ప్రభుత్వ పత్రాలు మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టే సాధనం.
  2. వచ్చిన లాభాన్ని పెట్టుబడిదారులకు డివిడెండ్లుగా చెల్లించవచ్చు లేదా మూలధన పెరుగుదల కోసం ఫండ్ ద్వారా తిరిగి పెట్టుబడి పెట్టవచ్చు.

ప్రశ్న 22.
ఓపెన్ ఎండెడ్ ఫండ్.
జవాబు.

  1. ఓపెన్-ఎండెడ్ ఫండ్ అంటే నిరంతర ప్రాతిపదికన చందా చేయడానికి మరియు తిరిగి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. అంటే ఏడాది పొడవునా లభ్యమౌతుంది.
  2. ఈ ఫండ్కు స్థిర మెచ్యూరిటీ వ్యవధి లేదు.
  3. పెట్టుబడిదారులు నికర ఆస్తి విలువ (NAV) సంబంధిత ధరలతో సౌకర్యవంతంగా యూనిట్లను కొనుగోలు చేయవచ్చు మరియు అమ్మవచ్చు. ఓపెన్-ఎండ్ పథకాల యొక్క ముఖ్య లక్షణం ప్రభుత్వాన్ని కల్పించడం.

ప్రశ్న 23.
గ్రోత్ ఫండ్.
జవాబు.

  1. పెట్టుబడుల విలువ పెరుగుదలను మూలధనం విలువ పెరుగుదల ద్వారా ఉద్దేశించిన నిధులు ఈ రకానికి వస్తాయి.
  2. ఇలాంటి నిధులు వృద్ధి ఆధారిత సెక్యూరిటీలలో పెట్టుబడిగా పెడతాయి. అంటే, దీర్ఘకాలంలో పెరుగుదల గల కంపెనీల వాటాలలో పెట్టుబడిని చేస్తారు.
  3. గ్రోత్ ఫండ్స్న నెస్ట్ ఎగ్స్ లేదా లాంగ్ హాల్ ఇన్వెస్ట్మెంట్స్ అని కూడా అంటారు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు

ప్రశ్న 24.
పరిశ్రమ నిర్దిష్ట ఫండ్.
జవాబు.

  1. పరిశ్రమ నిర్దిష్ట పథకాలు ప్రతిపాదనలో పేర్కొన్న పరిశ్రమలలో మాత్రమే పెట్టుబడి పెడతాయి.
  2. ఈ నిధుల పెట్టుబడి ఇన్ఫోటెక్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) ఫార్మాస్యూటికల్స్ మొదలైన నిర్దిష్ట పరిశ్రమలకు పరిమితం.

TS Inter 2nd Year Economics Notes Chapter 8 Foreign Sector

Here students can locate TS Inter 2nd Year Economics Notes Chapter 8 Foreign Sector to prepare for their exam.

TS Inter 2nd Year Economics Notes Chapter 8 Foreign Sector

→ Liberalisation: It refers to the relaxation of previous government restrictions usually in areas of social and economic policies. Thus, when the government liberalized trade it means it has removed the tariff, subsidies and other under employment restrictions on the flow of goods and services between the countries.

TS Inter 2nd Year Economics Notes Chapter 8 Foreign Sector

→ Globalisation: It is the process of integrating various economies of the world without creating any hindrances in the free flow of goods and services or human capital.

→ Privatisation: It is the general process of involving the private sector in the ownership or operation of a state-owned enterprise.

→ The govt, of India implemented economic reforms since 1991 to stabilize the economy from the severe economic crisis 1990. Foreign investment restrictions were relaxed. F.D.I allowed upto .74 state even -100 in some cases in Indian enterprises.

→ The reduction in trade and non-trade barriers due to the liberalization policy improved international trade of our country.

→ The balance of payments accounts statement of a nation denotes the true position of a country. It also indicates the visible and invisible trade balance of a country. India experienced a negative balance in its balanced of trade.

→ Role of international trade – comparative cost advantage market expansion – Agricultural development, competition, trach policy, foreign capital.

→ The GATT came into force on January 1, 1948. This paved way for the setting up of .T.O.

→ The T.O. came into force on 1, 1995 and India became a founder member of the T.O. by signing the .T.O. agreement on December 30, 1994.

TS Inter 2nd Year Economics Notes Chapter 8 Foreign Sector

TS Inter 2nd Year Economics Notes Chapter 8 విదేశీ రంగం

→ 1990 దశకంలో ఏర్పడిన తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడటానికి భారతదేశం 1991లో ఆర్థిక స్థిరీకరణ సాధన కోసం ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టింది.

→ అంతర్జాతీయ వ్యాపారంలో గతంలో అమలులో ఉన్న ప్రభుత్వ నియంత్రణలను తొలగించడాన్ని సరళీకరణ అంటారు.

→ ప్రభుత్వ రంగంలోని ఉత్పాదక కార్యకలాపాలను ప్రైవేటు రంగానికి బదిలీ చేసే ప్రక్రియనే ప్రైవేటీకరణ అంటారు.

→ ప్రపంచీకరణ అంటే వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనుసంధానం చేయడం.

→ విదేశీ సంస్థలో యాజమాన్యపు భాగస్వామ్యం కోసం లేదా యాజమాన్య నియంత్రణ ఉద్దేశంలో దీర్ఘకాలిక రూపంలో అంతర్జాతీయ మూలధన బదలాయింపునే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అంటారు.

→ అంతర్జాతీయ చెల్లింపులు, రాబడుల వివరాల పట్టికయే, విదేశీ వర్తక చెల్లింపుల శేషం. ఇది జంట పద్దు అకౌంటింగ్ రూపంలో ఉంటుంది. దీనిలో రెండు ఖాతాలు ఉంటాయి.
ఎ) కరెంటు ఖాతా బి) మూలధన ఖాతా.

→ 1948లో సుంకాల, వర్తకంపై సాధారణ ఒప్పందం (GATT) అమలులోకి వచ్చింది.

→ 1994 సం||లో (GATT) W. T. O లో విలీనం కావడం వల్ల 1995 సం॥లో ప్రపంచ వర్తక సంస్థ ఆవర్భవించింది.

TS Inter 2nd Year Economics Notes Chapter 8 Foreign Sector

→ ప్రపంచ వర్తక సంస్థ ఒప్పందాలు – వ్యవసాయంపై ఒప్పందం – జౌళి వస్త్ర వ్యాపార ఒప్పందం – వర్తక సంబంధిత పెట్టుబడిపై ఒప్పందం – TRIPS, TRMS etc.

TS Inter 2nd Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 3rd Lesson కేంద్ర ప్రభుత్వం Textbook Questions and Answers.

TS Inter 2nd Year Political Science Study Material 3rd Lesson కేంద్ర ప్రభుత్వం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారత రాష్ట్రపతికి ఉన్న సాధారణ, అత్యవసర అధికారాలను గురించి వర్ణించండి.
జవాబు.
అధికారాలు, విధులు :
సాధారణ అధికారాలు: భారత రాష్ట్రపతికి ఉన్న సాధారణ అధికారాలను 6 రకాలుగా వర్గీకరించవచ్చు.

1. కార్యనిర్వాహణాధికారాలు :
అధికరణ 53 ప్రకారం కేంద్రం కార్యనిర్వహణాధికారాలు రాష్ట్రపతికి చెందుతాయి. ఈ అధికారాలన్నీ రాష్ట్రపతి నేరుగాగానీ, అతడి కింది అధికారుల ద్వారా గానీ నిర్వహిస్తాడు. దేశం కార్యనిర్వహణాధిపతిగా రాష్ట్రపతి రాష్ట్రాల గవర్నర్లను, ప్రధానమంత్రిని, సుప్రీంకోర్ట్, హైకోర్టు న్యాయమూర్తులను వివిధ కమీషన్ల సభ్యులను, ఛైర్మన్లను నియమిస్తాడు.

2. శాసనాధికారాలు :
అధికరణ 79 ప్రకారం కేంద్ర శాసన నిర్మాణ శాఖ, పార్లమెంట్ ఉభయసభలను మరియు రాష్ట్రపతిని కలిగి ఉంటుంది. భారత రాష్ట్రపతి కేంద్ర శాసననిర్మాణ శాఖలో ముఖ్య భాగం. రాష్ట్రపతికి పార్లమెంట్ ఉభయసభలను సమావేశపరచడం లేదా సభలను నిరవధికంగా వాయిదావేయడం, కేంద్ర మంత్రిమండలి సలహాపై అధికారం ఉంది.

ఏదైనా బిల్లు పట్ల ఉభయ సభల మధ్య వివాదం ఏర్పడినట్లయితే ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. లోక్సభ ప్రతీ సాధారణ ఎన్నికల తరవాత, ప్రతీ సంవత్సరం జరిగే పార్లమెంట్ ఉభయ సభల సమావేశంలో సభను ఉద్దేశించి ప్రసంగిస్తాడు. రాష్ట్రపతి లోక్సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను, రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేస్తాడు.

3. ఆర్థికాధికారాలు :
రాష్ట్రపతి ప్రతీ ఆర్థిక సంవత్సరానికి భారత ప్రభుత్వం తన సంవత్సర బడ్జెట్ను పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టేలా చూస్తాడు. రాష్ట్రపతి భారత సంఘటిత నిధిని నిర్వహిస్తాడు. రాష్ట్రపతి ముందస్తు అనుమతి లేకుండా ద్రవ్యాన్ని ఖర్చుచేయడం, ప్రభుత్వం రెవెన్యూను పెంచటం వంటి ప్రతిపాదనలు పార్లమెంటులో ప్రవేశపెట్టరాదు.

ప్రతీ అయిదు సంవత్సరాలకు ఆర్థిక సంఘం అధ్యక్షుణ్ణి, ఇతర సభ్యులను నియమిస్తాడు. ఆర్థిక సంఘం మరియు భారత కంప్టోలర్ ఆడిటర్ జనరల్ తమ తమ నివేదికలు పార్లమెంట్లో ప్రవేశపెడతారు.

4. న్యాయాధికారాలు:
రాష్ట్రపతి సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను, ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడు. రాష్ట్రపతికి కోర్టు విధించిన శిక్షను తగిన కారణమున్న పక్షంలో తాత్కాలికంగా నిలిపివేయడానికి, శిక్షలు అమలు కాకుండా వాయిదావేయడానికీ, ఒక రకమైన శిక్షను వేరొక రకం శిక్షగా మార్చడానికీ, శిక్షని పూర్తిగా రద్దు చేసి క్షమాభిక్ష పెట్టడానికి అధికారం ఉంది. అధికరణ 143 ప్రకారం రాష్ట్రపతి జాతీయ ప్రాధాన్యత గల అంశాలపై న్యాయపరమైన సలహాలు తీసుకోగలడు.

5. సైనిక అధికారాలు :
రాష్ట్రపతి దేశానికి సర్వసైన్యాధ్యక్షుడు. ఇతడికి యుద్ధాన్ని ప్రకటించడం. సంధి ఒడంబడికలు చేయడం లాంటి అధికారాలు కలవు.

6. దౌత్య అధికారాలు :
రాష్ట్రపతి ఇతర దేశాలకు భారత దౌత్య రాయబారులను నియమిస్తాడు మరియు ఇతర దేశాలు భారతదేశానికై నియమించిన రాయబారుల అధికార పత్రాలను స్వీకరిస్తాడు. అన్ని అంతర్జాతీయ ఒప్పందాలు, సంధి ఒడంబడికలు రాష్ట్రపతి పేరుమీదనే జరుగుతాయి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

అత్యవసర అధికారాలు :
భారత రాజ్యాంగం, భారతరాష్ట్రపతికి మూడు రకాలైన అత్యవసర పరిస్థితుల్ని ప్రకటించి, నిర్వహించే అధికారం ఇచ్చింది.

  1. జాతీయ అత్యవసర పరిస్థితి (అధికరణ 352)
  2. రాష్ట్రపతి పాలన (అధికరణ 356)
  3. ఆర్థిక అత్యవసర పరిస్థితి (అధికరణ 360)

1. జాతీయ అత్యవసర పరిస్థితి :
రాష్ట్రపతి దేశానికి గానీ లేదా ఏదైనా భారత భూభాగానికి గానీ యుద్ధం లేదా బాహ్య దాడులు, సైనిక తిరుగుబాటు వల్ల ముప్పు పొంచి ఉందని భావించినట్లైతే, కేంద్ర మంత్రిమండలి లిఖిత సలహా మేరకు జాతీయ అత్యవసర పరిస్థితులను విధించవచ్చు.

ఇలాంటి ప్రకటన ఒక నెల వ్యవధి లోపల పార్లమెంటులో ఓటింగ్లో పాల్గొన్న మొత్తం సభ్యుల్లో 2/3 వంతుకు తగ్గకుండా ఆమోదించవలసి ఉంటుంది. అపుడు ఈ ప్రకటన 6 నెలల పాటు అమలులో ఉంటుంది. పార్లమెంట్ ఆమోదం ద్వారా దీన్ని మరో 6 నెలల పాటు పొడిగించవచ్చు.

2. రాష్ట్రపతి పాలన :
ఒక రాష్ట్రం గవర్నర్చే ఆ రాష్ట్రంలోని ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ముందుకు సాగే పరిస్థితిలో లేదు. ఆ రాష్ట్రంలోని రాజ్యాంగపరమైన వ్యవస్థ విఫలమైంది అన్న నివేదికను అందుకున్న మీదట రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని, (రాష్ట్రపతి పాలన) ప్రకటించవచ్చు. ఈ ప్రకటన ఫలితంగా,

  1. రాష్ట్రపతీ ఆ రాష్ట్రప్రభుత్వం మొత్తం లేదా ఏవైనా విధులను తన అధికారంలోకి తీసుకోవచ్చు.
  2. రాష్ట్రశాసన నిర్మాణశాఖ అధికారాలు పార్లమెంటుచే నిర్వహించబడతాయి.

ఈ అత్యవసర ప్రకటన రెండు నెలలలోపు పార్లమెంటుచే ఆమోదించబడాలి. ఈ ప్రకటన 6 నెలల పాటు అమలులో ఉంటుంది. పార్లమెంట్ ఆమోదం మేరకు దీన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించవచ్చు.

3. ఆర్థిక అత్యవసర పరిస్థితి :
దేశం ఆర్థిక సుస్థిరతకు భంగం వాటిల్లిందని రాష్ట్రపతి భావించినపుడు ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తాడు. ఈ అత్యవసర పరిస్థితి సమయంలో కేంద్రప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాన్ని, ఇతర సదుపాయాలను తగ్గించగలిగే అధికారం కలిగి ఉంటుంది.

అన్ని ద్రవ్యబిల్లులు, ఇతర బిల్లులను రాష్ట్ర శాసన నిర్మాణశాఖ ద్వారా జారీ చేయబడిన తరువాత రాష్ట్రపతి అనుమతి కొరకు పంపించవలసి ఉంటుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించలేదు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 2.
భారత ప్రధానమంత్రి అధికారాలను వర్ణించండి.
జవాబు.
ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం యొక్క నిజమైన కార్యనిర్వాహక అధిపతి. రాజ్యాంగ అధికరణ 74 ప్రకారం ప్రధానమంత్రి ఛైర్మన్ గా గల కేంద్ర మంత్రిమండలి రాష్ట్రపతికి తన విధులను నిర్వహించడంలో సలహాలను, సహకారాన్ని అందిస్తుంది. రాష్ట్రపతి లోక్సభలోని మెజారిటీ పార్టీ లేదా గ్రూపు నాయకుణ్ణి ప్రధానమంత్రిగా నియమిస్తాడు. అందరు మంత్రులు ప్రధానమంత్రి సలహాపై రాష్ట్రపతి ద్వారా నియమించబడతారు.

ప్రధానమంత్రి తన ఇష్టానుసారం బాధ్యతారహితంగా ప్రవర్తించే మంత్రుల్ని తొలగించడం లేదా మంత్రిత్వ శాఖల్ని పునఃపంపిణీ చేయడం, మార్చడం వంటి అధికారాలను కలిగి ఉంటాడు. భారత రాజ్యాంగం ప్రకారం మంత్రులు రాష్ట్రపతి విశ్వాసం కలిగి ఉన్నంత వరకు పదవిలో ఉంటారు. కానీ నిజానికి వారు ప్రధానమంత్రి విశ్వాసం కలిగి ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతారు.

ప్రధానమంత్రి అధికారాలు, విధులు :

1. ప్రధానమంత్రి – కేంద్ర కేబినెట్ నాయకుడు:
కేంద్ర మంత్రిమండలి ప్రధానమంత్రి ఆదేశాలకనుగుణంగా విధులను నిర్వహిస్తుంది. కేంద్ర మంత్రిమండలిలోని ఏ వ్యక్తినైనా తొలగించే లేదా ఏ వ్యక్తినైనా నియమించే అధికారం ప్రధానమంత్రికి ఉంది. ఇతడు మంత్రిమండలిలో మంత్రుల మధ్య శాఖలను మార్చగలడు. కేబినెట్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు.

2. ప్రధానమంత్రి – మెజార్టీ పార్టీ నాయకుడు:
ప్రధానమంత్రి ప్రజలసభ అయిన లోక్సభలోని మెజార్టీ పార్టీ నాయకుడు. ఇతడు తన పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను, పార్టీ మేనిఫెస్టోను నెరవేరుస్తాడు. ఇతను పార్టీకి, ప్రభుత్వానికి మధ్య వారధి.

3. ప్రధానమంత్రి – పార్లమెంట్ నాయకుడు :
రాజ్యాంగం పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని రూపొందించిన దగ్గర నుంచి పార్లమెంట్ దేశప్రజల పరిపాలనలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. పార్లమెంట్లోని ప్రజల సభ అయిన లోక్ సభ మెజార్టీ పార్టీ నాయకుడిగా, ప్రభుత్వం అధినేతగా ప్రధానమంత్రి పార్లమెంట్కు నాయకుడిగా పరిగణించబడతాడు. ఇతడు కేబినెట్ నిర్ణయాలను పార్లమెంట్కు తెలియపరుస్తాడు. కేంద్రప్రభుత్వ దేశ, విదేశీ విధానాలను పార్లమెంట్ సభ్యులకు వివరిస్తాడు.

4. ప్రధానమంత్రి – రాష్ట్రపతి, మంత్రిమండలి మధ్య వారధి:
ప్రధానమంత్రి రాష్ట్రపతి, కేంద్ర మంత్రిమండలికి మధ్య వారధిలా వ్యవహరిస్తాడు. మంత్రిమండలి నిర్ణయాలను రాష్ట్రపతికి తెలియజేయడం ఇతడి విధి. కేంద్రప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన విషయాలన్నింటినీ రాష్ట్రపతికి తెలియజేస్తాడు.

5. ప్రధానమంత్రి – కేంద్రప్రభుత్వ నాయకుడు :
ప్రధానమంత్రి కేంద్రప్రభుత్వ అధినేత. ఇతడు దేశం మరియు దేశప్రజల ఉన్నతికి, అభివృద్ధికి తోడ్పడే ప్రభుత్వ పథకాలను, విధానాలను, కార్యక్రమాలను కేంద్ర మంత్రిమండలితో కలసి రూపొందించి అమలుపరుస్తాడు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా ప్రధానమంత్రి ఇష్టానుసారం పనిచేస్తుంది.

6. ప్రధానమంత్రి దేశానికి నాయకుడు :
ప్రధానమంత్రి దేశం నాయకుడిగా వ్యవహరిస్తాడు. పార్లమెంట్ నాయకుడిగా మరియు ప్రభుత్వ అధినేతగా పార్లమెంట్ లోపల, బయట ఇతడి వ్యాఖ్యలు ప్రకటనలు దేశానికి ముఖ్యమైనవిగా ఉంటాయి. ఇతర దేశాలను సందర్శించినప్పుడు ప్రధానమంత్రి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఇతడి అభిప్రాయాలు మొత్తం దేశపు అభిప్రాయంగా పరిగణించబడతాయి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 3.
కేంద్ర మంత్రిమండలి నిర్మాణం, విధులను వివరించండి.
జవాబు.
అధికరణ 74(1) ప్రకారం ప్రధానమంత్రి ఛైర్మన్ గా గల కేంద్ర మంత్రిమండలి రాష్ట్రపతికి తన విధులను నిర్వహించడంలో సలహాలను, సహకారాన్ని అందిస్తుంది. మంత్రిమండలిలోని మంత్రులందరూ ప్రధానమంత్రి సలహాపైన రాష్ట్రపతి ద్వారా నియమించబడతారు.

1. నిర్మాణం :
కేంద్ర మంత్రిమండలిలో మూడు విధాలైన మంత్రులు ఉంటారు. అంటే కేబినెట్ మంత్రులు, డిప్యూటీ మంత్రులు, స్టేట్ మంత్రులు.
i) కేబినేట్ మంత్రులు :
మొదట రాజ్యాంగంలో కేబినెట్ అనే పదం లేదు. కేబినెట్ అనే పదం రాజ్యాంగంలో 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడింది. సాధారణంగా ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను కలిగి ఉన్న మంత్రులు కేబినెట్ మంత్రులుగా పిలవబడతారు.

విధానాలు రూపొందించడంలో కేబినెట్ మంత్రులు ప్రధానమంత్రికి సహకరిస్తారు. కేబినేట్ ప్రభుత్వ విధాన రూపకల్పనలో ముఖ్యమైన భాగం ప్రధానమంత్రి స్వయంగా నియమించిన వారు క్యాబినేట్ మంత్రులుగా ఉంటారు.

ii) స్టేట్ మంత్రులు :
స్టేట్ మంత్రులు చిన్న మంత్రిత్వ శాఖలను స్వతంత్రంగా నిర్వహిస్తారు.

iii) డిప్యూటీ మంత్రులు :
డిప్యూటీ మంత్రులు ఎలాంటి స్వతంత్ర మంత్రిత్వ శాఖలను కలిగి ఉండరు. వీరు కేబినెట్ మంత్రులకు సహకరిస్తారు. కేబినెట్ మంత్రుల ఆధ్వర్యంలో ఆయా మంత్రిత్వ శాఖల రోజువారీ పనులను నిర్వహిస్తారు.

అధికారాలు, విధులు : మంత్రిమండలిలోని మంత్రులు కింది విధులను కలిగి ఉంటారు.

  1. కేంద్రప్రభుత్వం విధానాలను మంత్రిమండలి రూపొందిస్తుంది. ఎన్నో చర్చోపచర్చల తరవాత వీరు దేశం, దేశీయ విదేశీ విధానాలను అంతిమంగా నిర్ణయిస్తారు.
  2. కేంద్రప్రభుత్వానికి సంబంధించిన అన్ని అంశాల్లో రాష్ట్రపతికి సలహాలను అందిస్తుంది. రాష్ట్రపతి తన విధులను నిర్వహించడానికి మార్గనిర్దేశం చేస్తుంది.
  3. ఇది దేశ, ఆర్థిక రంగంపై పూర్తి నియంత్రణను కలిగి ఉంటుంది. పన్నులు, ఇతర ఖర్చులకు సంబంధించిన తీర్మానాలు నిజానికి కేబినెట్ ద్వారా రూపొందించబడి పార్లమెంట్ ద్వారా ఆమోదించబడతాయి.
  4. దేశ పరిపాలన మంత్రులు వివిధ ప్రభుత్వ విభాగాల రాజకీయ అధినేతలు ప్రభుత్వ యంత్రాంగం అంతా మంత్రుల నియంత్రణలో రోజువారీ పరిపాలన నిర్వహిస్తారు. దీన్ని బట్టి కేబినెట్ మొత్తం దేశాన్ని పరిపాలిస్తుంది అని చెప్పవచ్చు.
  5. చట్టాలను రూపొందించే ప్రక్రియలో కేబినెట్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఏదైనా మంత్రిత్వశాఖకు సంబంధించిన బిల్లు నిర్మాణం మంత్రిమండలి సమావేశంలో క్షుణ్ణంగా చర్చించిన తరవాతనే జరుగుతుంది. ఈ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టబడి, సంబంధించిన మంత్రులతో వివరించబడుతుంది.
  6. పార్లమెంట్లో ప్రవేశపెట్టబడ్డ బిల్లులు రాష్ట్రపతి సంతకం తరవాతే చట్టాలుగా మారతాయి. నిజానికి రాష్ట్రపతి కేబినెట్ చేయమన్న పని మాత్రమే చేస్తాడు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

5. సమిష్టి బాధ్యత :
అధికరణ 75(3) ప్రకారం మంత్రిమండలి ప్రజల సభ అయిన లోక్సభకి సమిష్టి బాధ్యత వహిస్తుంది. ప్రతీ మంత్రి తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన నిర్ణయాలకు బాధ్యుడు అంతేకాకుండా అతడు తన తోటి మంత్రులు నిర్వహించే మంత్రిత్వశాఖలకు సంబంధించిన నిర్ణయాలకు కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది.

ఎందుకంటే అందరు మంత్రులు కేబినెట్ విధి విధానాలను అనుసరించి, క్యాబినెట్ మార్గనిర్దేశనంలో, నియంత్రణలో పనిచేస్తారు. దీన్ని బట్టి ఒక మంత్రి తన తప్పుడు నిర్ణయాలకు బాధ్యత వహిస్తాడు.

అలాగే తన తోటి మంత్రుల తప్పుడు నిర్ణయాలకు బాధ్యత వహిస్తాడు. ఒకవేళ ఏ మంత్రి అయినా వేరొక మంత్రి తప్పుడు నిర్ణయానికి, చర్యకు బాధ్యత వహించడానికి అంగీకరించనట్లయితే అతను మంత్రి పదవికి రాజీనామా చేయవలసి ఉంటుంది లేదా. అతడు ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతిచే తొలగించబడతాడు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 4.
భారత పార్లమెంటు అధికారాలు ఏమిటి ? వివరించండి.
జవాబు.
రాజ్యాంగం 79వ అధికరణం ప్రకారం కేంద్ర శాసన నిర్మాణ శాఖలో (ఎ) రాష్ట్రపతి, (బి) పార్లమెంటులోని ఉభయసభలు అంతర్భాగాలు. లోక్సభ అనేది పార్లమెంటులో దిగువసభకాగా, రాజ్యసభ ఎగువసభ. రాష్ట్రపతికి ఉభయసభల సమావేశాలను ప్రారంభించేందుకు వాయిదా వేసేందుకు అధికారం ఉంటుంది.

పార్లమెంట్ అధికారాలు, విధులు: భారత పార్లమెంట్ భారతదేశ పౌరుల ఆకాంక్షలను, ఆశయాలను ప్రతిబింబించే ప్రధాన శాసన నిర్మాణ అంగం. ఇది భారత ప్రభుత్వానికి కావలసిన చట్టాలను రూపొందించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. భారత పార్లమెంట్ క్రింది అధికారాలను కలిగి ఉంది.

1. శాసన నిర్మాణాధికారం :
పార్లమెంట్ కేంద్ర జాబితాలో, ఉమ్మడి జాబితాలో గల అంశాలపై చట్టాలను రూపొందిస్తుంది. ఏ జాబితాలోని అంశాలపైన అయినా శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంది. ఒక బిల్లు కేవలం రెండు సభలు ఆమోదించిన తరవాత మాత్రమే చట్టంగా మారుతుంది. ఒక బిల్లుపై రెండు సభల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తినపుడు రాష్ట్రపతి ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు.

అప్పుడు ఆ బిల్లు భవితవ్యం సంయుక్త సమావేశంలో మెజారిటీ ఓట్ల ద్వారా నిర్ణయించబడుతుంది. రాష్ట్రపతికి ఒక బిల్లుని పునఃపరిశీలన కోసం పార్లమెంట్కు తిరిగి పంపించగలిగే అధికారం ఉంది. ఎప్పుడైతే పార్లమెంట్ తిరిగి చర్చ జరిపి దాన్ని మళ్ళీ ఆమోదిస్తుందో అప్పడు రాష్ట్రపతి తప్పనిసరిగా సంతకం చేయవలసి ఉంటుంది.

2. కార్వనిర్వాహక అధికారం (కార్యనిర్వాహక శాఖని నియంత్రించే అధికారం) :
కేంద్ర మంత్రిమండలి తన నిర్ణయాలపట్ల తన విధానాలపట్ల నేరుగా లోక్సభకు బాధ్యత వహిస్తుంది. కొత్త తీర్మానాన్ని ఆమోదించడం లేదా ఏదైనా ద్రవ్యబిల్లును ఆమోదించడానికి లోక్సభ నిరాకరించనట్లయితే దాన్ని మంత్రిమండలిపై అవిశ్వాస తీర్మానంగా భావించబడుతుంది. మంత్రిమండలి రాజీనామా చేయవలసి ఉంటుంది.

3. ఆర్థికాధికారాలు :
పార్లమెంట్ దేశం యొక్క జమా ఖర్చులకు బాధ్యత వహిస్తుంది. పార్లమెంటు ఆమోదం లేనిదే పన్నులను విధించడంగానీ, పన్నులు వసూలు చేయడంగానీ, ఏదైనా వ్యయం చేయడంగానీ జరగదు.

4. రాజ్యాంగ సవరణాధికారం:
రాజ్యాంగ అధికరణ 368 నిబంధనల ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్కు ఉంది. రాజ్యాంగంలో చాలా భాగం పార్లమెంట్ ప్రతీ సభలో సభ్యులలో 2/3వ వంతు మెజారిటీ ద్వారా సవరించబడింది. కొన్ని అధికరణాలలోని నిబంధనలను సవరించడానికి రెండు సభల్లో 2/3వ వంతు మెజారిటీతో ఆమోదించబడ్డ తరవాత దేశంలోని రాష్ట్రశాసన సభలలో కనీసం సగం శాసనసభల ఆమోదం అవసరం.

5. ఎన్నికాధికారం :
భారతపార్లమెంట్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులను ఎన్నుకొంటుంది. లోక్సభలోని సభ్యులు తమ నుండి ఇద్దరు సభ్యులను స్పీకర్, డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకుంటారు. రాజ్యసభ సభ్యులు తమ డిప్యూటీ చైర్మన్ని ఎన్నుకుంటారు.

6. న్యాయసంబంధ అధికారాలు :
అవినీతి, అసమర్థత లాంటి అభియోగాల వంటి నిర్దిష్ట కారణాలున్నపుడు మహాభియోగ తీర్మానం ద్వారా రాష్ట్రపతిని ఉపరాష్ట్రపతిని, సుప్రీంకోర్టు, హైకోర్టుల ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తులను తొలగించడానికి భారత పార్లమెంట్కి అధికారం గలదు.

7. చర్చాపూర్వక విధులు :
భారత పౌరులకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించే, యోచించే ముఖ్యమైన చర్చావేదిక పార్లమెంట్. సమకాలీన జాతీయ, అంతర్జాతీయ అంశాలు, దేశ పౌరులను ఇబ్బందుల నుంచి విముక్తి కల్పించడానికి సంబంధించిన అంశాలపై చర్చలు జరుపుతుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 5.
భారత సుప్రీంకోర్టు విధులను తెలియజేయండి.
జవాబు.
సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధిని ప్రాథమిక, అప్పీళ్ళ విచారణ, సలహారూపక అధికార పరిధులుగా విభజించవచ్చు.

i. ప్రాథమిక అధికార పరిధి :
ఈ అధికారం కింది సుప్రీంకోర్టు ఈ కింది వివాదాలను విచారించగలదు.

  1. భారత ప్రభుత్వానికి ఒకటి లేక అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు మధ్య వివాదం.
  2. భారతప్రభుత్వం ఒకటి అంతకంటే ఎకుకవ రాష్ట్రాలు ఒక వైపు, ఒక రాష్ట్రం లేదా ఎక్కువచ రాష్ట్రాలు ఇంకోవైను ఉన్నప్పుడు వాటి మధ్య వివాదం.
  3. రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు మధ్య వివాదాలు తలెత్తినప్పుడు విచారిస్తుంది.

ii. అప్పీళ్ళ విచారణా పరిధి :
ఈ అధికారం కింద సుప్రీంకోర్టు ఈ కింది వివాదాలపై అప్పీళ్ళను విచారిస్తుంది.

ఎ. రాజ్యాంగపరమైన వివాదాలు :
రాజ్యాంగంపై వ్యాఖ్యానాలకు సంబంధించిన వివాదాలపై సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు.

బి. పౌర వివాదాలు :
పౌరవివాదాలపై కూడా హైకోర్టు తీర్పుకు వ్యవతిరేకంగా సుప్రీంకోర్టులో అప్పీలు చేయవచ్చు. ఈ అప్పీలు కోసం హైకోర్టు ఆ వివాదం రాజ్యాంగపరమైన, చట్టానికి సంబంధించిన ప్రశ్నలను కలిగి ఉందని అప్పీలు చేయవచ్చు.

సి. క్రిమినల్ వివాదాలు :
క్రిమినల్ వివాదాల్లో ఏ తీర్పుకు వ్యతిరేకంగానైనా సుప్రీంకోర్టులో అప్పీలు చేయవచ్చు. అంతిమ నిర్ణయం లేదా తుది తీర్పు హైకోర్టుచే ఇవ్వబడుతుంది. సాధారణంగా క్రిమినల్ వివాదాలలో అప్పీలు చేసుకోగలిగే అంతిమ స్థాయి కోర్టు హైకోర్టు. కానీ ఈ క్రిమినల్ అంశాలకు సంబంధించి హైకోర్టు నిర్ణయాలకు వ్యతిరేకంగా అప్పీలును వినే ప్రత్యేక అధికారం పార్లమెటు సుప్రీంకోర్టుకు కల్పించింది.

iii. సలహా అధికార పరిధి :
సుప్రీంకోర్టు కొంత సలహా అధికార పరిధిని కూడా కలిగి ఉంది. ఒక అంశంలో చట్టం, వాస్తవానికి మధ్య ప్రశ్న తలెత్తి ఆ విషయంలో రాజ్యాంగపరమైన వ్యాఖ్యానం అవసరమని రాష్ట్రపతి భావించినట్లయితే సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరవచ్చు. సుప్రీంకోర్టు రాష్ట్రపతి ప్రశ్నకి సమాధానం ఇవ్వవచ్చు. కానీ ఇది ఏ పక్షాలపై నిర్బంధం విధించదు.

iv. ఇతర విధులు :
కోర్ట్ ఆఫ్ రికార్డ్ (Court of Record) :
సుప్రీంకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డ్ కూడా పనిచేస్తుంది. సుప్రీంకోర్టు తీర్పులు నమోదు చేయబడి, భద్రపరచబడతాయి. ఇవి ప్రామాణికమైనవిగా భావించబడి చట్టాలతో సమానంగా గౌరవించబడతాయి. ఈ రాకార్డులు సాక్ష్యాలుగా ప్రాముఖ్యత కలిగి ఉంటాయి.

సూచనలు ఆదేశాలు లేదా రిట్లు :
సుప్రీంకోర్టు పౌరుల యొక్క ప్రాథమిక హక్కులను రక్షించేదిగా, హామీనిచ్చేదిగా విమర్శించడం ఖండించడం, కోర్టును, న్యాయమూర్తులను విమర్శించడం. కోర్టుకి వ్యతిరేకంగా అమర్యాదకరమైన అగౌరవమైన అభిప్రాయాలను వెలిబుచ్చడం, కోర్టు నిర్ణయాలకు కట్టుబడి ఉండకపోవడం అనేవి కోర్టు ధిక్కార నేరంగా పరిగణించబడతాయి.

కోర్టు ధిక్కరణ :
ఏ వ్యక్తినైనా కోర్టు ధిక్కార నేరం కింద శిక్షించే అధికారం సుప్రీంకోర్టుకి ఉంది. కోర్టు తీర్పును విమర్శించడం, ఖండించడం, కోర్టును, న్యాయమూర్తులను విమర్శించడం, కోర్టుకి వ్యతిరేకంగా అమర్యాదకరమైన, అగౌరవకరమైన అభిప్రాయాలను వెలిబుచ్చడం, కోర్టు నిర్ణయాలకు కట్టుబడి ఉండకపోవడం అనేవి కోర్టుధిక్కార నేరంగా పరిగణించబడతాయి.

ఆదేశాలను, తీర్పులను, పునఃపరిశీలించడం :
సుప్రీంకోర్టు తీను ఇంతకు ముందు జారీ చేసిన ఏ ఆదేశాన్నైనా పునఃపరిశీలించే అధికారం కలిగి ఉంది. ఎ. కొత్త పరిష్కార పద్ధతి లేదా సాక్ష్యాలు కనిపించినపుడు, బి. కోర్టు యొక్క రికార్డుల ప్రకారం తీర్పులో తప్పిదం కనిపించినప్పుడు సి. లేదా పునఃపరిశీలనకు తగిన కారణాలు కలిగి ఉన్నపుడు కోర్టు ఈ విధంగా ఆదేశాలను సమీక్షించగలదు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారత రాష్ట్రపతి ప్రత్యేక (అత్యవసర) అధికారాలు ఏమిటి ?
జవాబు.
భారత రాజ్యాంగం, భారత రాష్ట్రపతికి మూడురకాలైన అత్యవసర పరిస్థితుల్ని ప్రకటించి, నిర్వహించే అధికారం ఇచ్చింది. అవి:

  1. జాతీయ అత్యవసర పరిస్థితి (అధికరణ 352)
  2. రాష్ట్రపతి పాలన (అధికరణ 356)
  3. ఆర్థిక అత్యవసర పరిస్థితి (అధికరణ 360)

1. జాతీయ అత్యవసర పరిస్థితి :
రాష్ట్రపతి దేశానికి గానీ లేదా ఏదైనా భారత భూభాగానికి గానీ యుద్ధం లేదా బాహ్యదాడులు, సైనిక తిరుగుబాటు వల్ల ముప్పు పొంచి ఉందని భావించినట్లయితే, కేంద్ర మంత్రిమండలి లిఖిత సలహా మేరకు జాతీయ అత్యవసర పరిస్థితిని విధించవచ్చు.

ఇలాంటి ప్రకటన ఒక నెల వ్యవధి లోపల పార్లమెంటులో ఓటింగులో పాల్గొన్న మొత్తం సభ్యుల్లో 2/3వ వంతుకు తగ్గకుండా ఆమోదించవలసి ఉంటుంది. అప్పుడు ఈ ప్రకటన 6 నెలల పాటు అమలులో ఉంటుంది. పార్లమెంట్ ఆమోదం ద్వారా దీనిని మరో 6 నెలల పాటు పొడిగించవచ్చు.

2. రాష్ట్రపతి పాలన :
ఒక రాష్ట్రం గవర్నర్చే ఆ రాష్ట్రంలోని ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ముందుకు సాగే పరిస్థితిలో లేదు. ఆ రాష్ట్రంలోని రాజ్యాంగపరమైన వ్యవస్థ విఫలమైంది అన్న నివేదికను అందుకున్న మీదట రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని (రాష్ట్రపతి పాలన) ప్రకటించవచ్చు. ఈ ప్రకటన ఫలితంగా

  1. రాష్ట్రపతి ఆ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం లేదా ఏదైనా విధులను తన అధికారంలోకి తీసుకోవచ్చు.
  2. రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ అధికారాలు పార్లమెంటుచే నిర్వహించబడతాయి.

ఈ అత్యవసర ప్రకటన రెండు నెలల లోపు పార్లమెంటుచే ఆమోదించబడాలి. ఈ ప్రకటన 6 నెలల పాటు అమలులో ఉంటుంది. పార్లమెంట్ ఆమోదం మేరకు దీన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించవచ్చు.

3. ఆర్థిక అత్యవసర పరిస్థితి :
దేశ ఆర్థిక సుస్థిరతకు భంగం వాటిల్లిందని రాష్ట్రపతి భావించినపుడు ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తాడు. ఈ అత్యవసర పరిస్థితి సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను, ఇతర సదుపాయాలను తగ్గించగలిగే అధికారం కలిగి ఉంటాడు.

అన్ని ద్రవ్య బిల్లులు, ఇతర బిల్లులను రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ద్వారా. జారీ చేయబడిన తరువాత రాష్ట్రపతి అనుమతి కొరకు పంపించవలసి ఉంటుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటినుంచి ఇప్పటి వరకు ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించలేదు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 2.
రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మాన ప్రక్రియను వివరించండి.
జవాబు.
రాష్ట్రపతి పదవీకాలం ముగియక ముందే రాజీనామా చేయవచ్చు లేదా రాజ్యాంగాన్ని అతిక్రమిస్తే రాజ్యాంగంలోని 56, 61 అధికరణాల ప్రకారం పార్లమెంట్ మహాభియోగ తీర్మానం ద్వారా పదవి నుండి తొలగించవచ్చు. దానికి అనుసరించే పద్ధతి ఈ దిగువ వివరించిన విధంగా ఉంటుంది.

  1. పార్లమెంట్లో ఏదో ఒక సభలో 14 రోజుల వ్యవధితో ఒక నోటీసు జారీచేసి మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. ఆ తీర్మానం మీద ఆ సభలోని సభ్యుల 4వ వంతు సభ్యులు సంతకం చేయాలి.
  2. ఆ తీర్మానాన్ని చర్చించి ఆ సభ 2/3వ వంతు మెజారిటీతో ఆమోదించాలి.
  3. అలా ఆమోదించిన తీర్మానాన్ని రెండవ సభ ఒక కమిటీని ఏర్పరచి, ఆరోపణలపై విచారణ జరుపుతుంది.
  4. ఆరోపణలు రుజువైతే ఆ సభలో మొత్తం సభ్యులలో 2/3వ వంతు సభ్యులు ఆమోదిస్తే రాష్ట్రపతి పదవీచ్యుతుడౌతాడు. ఇంతవరకు మహాభియోగ తీర్మానం ద్వారా ఏ రాష్ట్రపతి తొలగింపబడలేదు.

ప్రశ్న 3.
ఉపరాష్ట్రపతి ఎన్నిక, అధికారాలు – విధులను గురించి రాయండి.
జవాబు.
భారత ఉపరాష్ట్రపతి పదవి భారతదేశంలోని రెండవ అత్యున్నత పదవి. రాజ్యాంగ అధికరణ 60 నుంచి 71 ఉపరాష్ట్రపతి గురించి వివరిస్తాయి. ప్రస్తుతం భారత ఉపరాష్ట్రపతిగా హమీద్ అన్సారీ వరుసగా రెండవసారి ఎన్నికై కొనసాగుతున్నారు.

నిర్మాణం :
1. అర్హతలు:
భారత ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి ఒక వ్యక్తి ఈ కింది అర్హతలను కలిగి ఉండాలి.

  • భారత పౌరుడై ఉండాలి.
  • 35 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.
  • రాజ్యసభ సభ్యుడుగా ఎన్నిక కావడానికి కావలిసిన అర్హత కలిగి ఉండాలి.

2. ఎన్నిక :
భారత ఉపరాష్ట్రపతిని నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఒక ఓటు బదిలీ ద్వారా రహస్య ఓటింగ్ విధానంలో భారత పార్లమెంట్ ఉభయసభలకు ఎన్నుకోబడిన, నామినేట్ చేయబడిన సభ్యులు ఎన్నుకొంటారు.

3. పదవీకాలం :
భారత ఉపరాష్ట్రపతి పదవీకాలం కార్యాలయంలో విధులు చేపట్టిన సమయం నుంచి 5 సంవత్సరాలు. ఇతడు రాష్ట్రపతికి రాజీనామా లేఖను పంపించడం ద్వారా పదవికి రాజీనామా చేయవచ్చు.

4. వేతనం, ఇతర సదుపాయాలు:
భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్ హోదాలో 71,25,000 నెలసరి వేతనం, ఇతర సదుపాయాలను అందుకొంటాడు.

5. తొలగింపు భారత ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానం కేవలం రాజ్యసభలో మొత్తం సభ్యుల్లో 1/4వ వంతు సభ్యుల అనుమతితో ప్రవేశపెట్టాలి. 14 రోజుల ముందస్తు నోటీసు గడువు పూర్తి అయిన తరువాత రాజ్యసభ ఈ తీర్మానంపై చర్చలు జరుపుతుంది.

ఈ తీర్మానం సభలో ఓటింగ్ లో పాల్గొనే సభ్యుల్లో 2/3వ వంతు సభ్యులు ఆమోదించినట్లయితే ఇది లోక్సభకు పంపబడుతుంది. లోక్ సభలో కూడా ఈ తీర్మానం 2/3వ వంతు సభ్యులచే ఆమోదించవలసి ఉంటుంది.

అధికారాలు – విధులు : భారత ఉపరాష్ట్రపతి కేవలం 2 రకాల అధికారాలను, విధులను కలిగి ఉన్నాడు.

1. రాజ్యసభ ఛైర్మన్ :
భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్ గా వ్యవహరిస్తాడు. ఇతడు రాజ్యసభ సమావేశాల్లో – ప్రసంగిస్తాడు. సభ యొక్క వ్యవహారాలను నిర్వహిస్తాడు. ఏదైనా బిల్లు పట్ల ఓట్లు సమానంగా చీలినట్లయితే, నిర్ణాయకపు ఓటును వినియోగిస్తాడు.

2. తాత్కాలిక రాష్ట్రపతి :
రాష్ట్రపతిని తొలగించినా, రాజీనామా చేసినా లేదా మరణించినా గానీ ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు. ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా 6 నెలలు మాత్రమే వ్యవహరించగలడు. ఈ సమయంలో ఇతడు భారత రాష్ట్రపతికి గల వేతనం ఇతర సదుపాయాలను అందుకుంటాడు. రాజ్యసభ ఛైర్మన్ హోదాలో ఎలాంటి వేతనాన్ని, ఇతర సదుపాయాలను అందుకోలేడు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 4.
సమిష్టి బాధ్యత అనగానేమి ? వివరించండి.
జవాబు.
సమిష్టి బాధ్యత :
పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణాలలో ప్రధానమైనదే సమిష్టి బాధ్యత. భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ సూత్రాన్ని బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. రాజ్యాంగం 75(3)వ అధికరణం మంత్రిమండలి సమిష్టిగా లోక్సభకు బాధ్యత వహిస్తుందని ప్రకటించింది. కేంద్ర మంత్రిమండలి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఒక జట్టుగా వ్యవహరిస్తుంది.

కార్యనిర్వాహకశాఖలోని మంత్రులు అధికారంలో ఉండగా తమ చర్యలకు, కార్యకలాపాలకు పార్లమెంటు (శాసన నిర్మాణశాఖ కు సమిష్టిగా బాధ్యత వహించడాన్నే సమిష్టి బాధ్యత అంటారు. ప్రతి మంత్రి తన మంత్రిత్వశాఖలో పరిణామాలకు బద్దుడై పార్లమెంటుకు జవాబుదారీగా ఉంటాడు. అలాగే మంత్రిత్వశాఖలో తన నిర్ణయాలవల్ల కలిగే పరిణామాలకు బద్ధుడై ఉంటాడు.

ఇది ప్రతి మంత్రి నిర్వర్తించవలసిన వ్యక్తిగత బాధ్యత కూడా. ప్రభుత్వ విధానాలపట్ల, అనుకూలంగానో, ప్రతికూలంగానో ఎదురయ్యే పరిణామాల సందర్భంలో తన ప్రమేయంలేదనీ, తనకు తెలియదనీ చెప్పి తప్పుకోవడానికి, నిస్సహాయతను వెల్లడించడానికి ఏ మంత్రికీ వీలులేదు.

సమిష్టి బాధ్యత మంత్రులందరినీ ఒక జట్టుగా ఉంచి ఏక త్రాటిపై నడిపిస్తుంది. సమిష్టి బాధ్యతా సూత్రాన్ని ప్రధానమంత్రి ఆచరణలో ఉంచుతాడు. మంత్రివర్గ సమావేశాలలో ఆమోదించిన నిర్ణయాలను ప్రతి ఒక్క మంత్రి గౌరవించినట్లు, అమలుతో ఉంచేటట్లు ప్రధానమంత్రి చర్యలు తీసుకుంటాడు. మంత్రిమండలిలోని సభ్యుల మధ్య సహకారం, సమన్వయం సర్దుబాటుతనం పెంపొందించడానికి కృషి చేస్తాడు. మంత్రివర్గ సమావేశాలలో ఏ మంత్రి అయినా తన భావాలను స్వేచ్ఛగా వెల్లడించడానికి అనుమతిస్తాడు.

అయితే, ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత దానికి కట్టుబడి ప్రతి మంత్రి మనస్ఫూర్తిగా అనుసరించవలసి ఉంటుంది. లేకపోతే రాజీనామా సమర్పించవలసి ఉంటుంది. అది కూడా చేయనప్పుడు ఆయనను ప్రధానమంత్రి సలహాపై రాష్ట్రపతి మంత్రిమండలి నుంచి బర్తరఫ్ చేయవచ్చు. ఇక మంత్రివర్గ నిర్ణయాలను బట్టి కట్టుబడని మంత్రులను మినహాయించి మిగిలిన వారితో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే హక్కు ప్రధానమంత్రికి ఉంటుంది.

కార్యనిర్వాహకశాఖ సమిష్టి బాధ్యతను శాసన నిర్మాణశాఖ అనేక విధాలుగా ఆచరణలో ఉంచుతుంది. శాసన నిర్మాణశాఖ (పార్లమెంటు) కార్యనిర్వాహకశాఖ (మంత్రిమండలి)పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించి, ఆమోదిస్తుంది. అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందిన తక్షణమే కార్యనిర్వాహకశాఖ (మంత్రిమండలి) అధికారాన్ని కోల్పోతుంది.

అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే సందర్భంలో పార్లమెంటు సభ్యులు కార్యనిర్వాహకశాఖపై మోపిన ఆరోపణలకు సంజాయిషీ కోరగా కార్యనిర్వాహకశాఖ అందుకు కొన్ని సందర్భాలలో అవిశ్వాస తీర్మానం బదులుగా కార్యనిర్వాహకశాఖే శాసన నిర్మాణశాఖ విశ్వాసాన్ని పొందే విధంగా తీర్మానాన్ని ప్రతిపాదించవలసి రావచ్చు.

ఉదాహరణకు 1979లో రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి చరణ్సింగ్ను ప్రధానిగా నియమిస్తూ లోక్సభ విశ్వాసాన్ని పొందవలసిందిగా ఆదేశించారు. కానీ లోక్సభ విశ్వాసాన్ని పొందకుండానే చరణ్ సింగ్ ప్రధాని పదవికి రాజీనామా సమర్పించారు.

ఇటీవల 1999 ఏప్రిల్ 14న వాజ్పేయి ఆధ్వర్యంలోని ఎన్.డి.ఎ. ప్రభుత్వానికి ఎ.ఐ.ఎ.డి.ఎం.కె. మద్దతు ఉపసంహరించుకోగా, ప్రధాని వాజ్పేయి లోక్సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆయన తీర్మానాన్ని సభ తిరస్కరించగా 1999 ఏప్రిల్ 17న ఆయన తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించారు.

మొత్తం మీద సమిష్టి బాధ్యత అనేది మంత్రిమండలికి, లోక్సభకు సంబంధించిన అంశం. సమిష్టి బాధ్యత అనేది శాసన నిర్మాణశాఖ కార్యనిర్వాహకశాఖలు రెండూ విడివిడిగా పార్లమెంటు దిగువసభలో తమ శక్తిసామర్థ్యాలను నిరూపించుకోవడానికి, ప్రజలకు ఎలక్ట్రానిక్ ప్రచార సాధనాల ద్వారా తన అభిప్రాయాలను తెలియజేయడానికి వీలు కల్పిస్తుంది. మంత్రిమండలి సమైక్యంగా బాధ్యతాయుతంగా, సామరస్యం, సదవగాహనలతో వ్యవహరించడానికి సమిష్టి బాధ్యత దోహదపడుతుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 5.
లోక్సభ స్పీకర్ యొక్క విధులను వివరించండి.
జవాబు.
భారతదేశంలో స్పీకర్ కార్యాలయం ఏర్పాటు పద్దతిని బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థ నుండి తీసుకోవడం జరిగింది. రాజ్యాంగ అధికరణ 93 ప్రకారం ప్రతీ సాధారణ ఎన్నికల తరువాత లోక్సభ సభ్యులు తమ నుండి స్పీకర్ను డిప్యూటీ స్పీకర్ను పూర్తి సమయం కోసం ఎన్నుకోవలసి ఉంటుంది.

1. అర్హత :
లోక్సభ స్పీకర్గా ఎన్నికయ్యే వ్యక్తి తప్పనిసరిగా లోక్సభ సభ్యుడై ఉండాలి.

2. ఎన్నిక :
లోక్ సభ సభ్యులు తమలోంచి ఒక సభ్యుణ్ణి స్పీకర్గా ఎన్నుకుంటారు. సాధారణంగా స్పీకర్ పదవికి అధికారంలో ఉన్న పార్టీ సభ్యులే ఎన్నికవడం ఆనవాయితీ.

3. పదవీకాలం :
లోకసభ స్పీకర్ పదవీకాలం సాధారణంగా 5 సంవత్సరాలు. స్పీకర్ సభ రద్దయిన తరువాత కూడా పదవిలో కొనసాగుతాడు. క్రొత్త స్పీకర్ ఎన్నికయ్యే వరకు అతను స్పీకర్ కార్యాలయాన్ని నిర్వహిస్తాడు.

4. వేతనం, ఇతర సదుపాయాలు :
స్పీకర్ ప్రతి నెల 1,25,000 వేతనంగా పొందుతాడు. ఉచిత నివాసగృహం. వైద్యసదుపాయం, కమ్యూనికేషన్ సదుపాయాలు కల్పించబడడం పొందుతారు.

5. తొలగింపు :
స్పీకర్ సభలో హాజరైన, ఓటింగ్ లో పాల్గొన్న సభ్యుల్లోని మెజారిటీ సభ్యులు తొలగింపు తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా తొలగించబడతాడు. దీనికి 14 రోజుల ముందస్తు నోటీసు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. స్పీకరును తొలగించే తీర్మానంపై చర్చ జరుగుతున్నప్పుడు, స్పీకర్ సభకి అధ్యక్షత వహించలేడు. కానీ చర్చలో పాల్గొనగలడు. ఇంతవరకు భారతదేశంలో స్పీకర్ పదవిలో ఉన్న ఎవరినీ తొలగించడం జరగలేదు.

6. స్పీకర్ అధికారాలు, విధులు :
స్పీకర్ తన విధులను సక్రమంగా, హుందాగా సమర్థవంతంగా నిర్వహించడానికి కావలసిన అధికారాలను భారత రాజ్యాంగం స్పీకర్కు కల్పించింది. స్పీకర్ తన విస్తృతమైన అధికారాలను రాజ్యంగం ద్వారా, పార్లమెంటు విధి విధానాల నిర్వహణ చట్టం 1950 నుంచి పొందుతాడు. స్పీకర్ ఈ కింది విధులను నిర్వహిస్తాడు.

  1. స్పీకర్ లోక్సభ సమావేశాల్లో ప్రసంగిస్తాడు.
  2. సభ్యులను ప్రశ్నలు అడగడానికి అనుమతిస్తాడు. సభానియమాలకు అనుగుణంగా ప్రశ్నలు లేని పక్షంలో అనుమతి నిరాకరించడానికి కూడా స్పీకర్కు అధికారం ఉంది.
  3. వాయిదా తీర్మానాలు ఇతని ఆమోదంతోనే ప్రవేశపెట్టబడతాయి. ఇతడి తీర్మానంపై వ్యాఖ్యానించడానికి సమయం పరిమితిని నిర్ణయిస్తాడు.
  4. ఒక బిల్లుని సభలో ప్రవేశపెట్టడానికి ముందు గెజిట్ ఆఫ్ ఇండియాలో ప్రచురించడానికి అనుమతించవచ్చు. దీనికి సభ అనుమతి అవసరం లేదు.
  5. అతడు సెలక్షన్ కమిటీ చైర్మన్ను నియమిస్తాడు. తను స్వంతంగా కొన్ని ముఖ్యమైన కమిటీలకు, బిజినెస్ అడ్వయిజరీ కమిటీ, జనరల్ పర్చేస్ కమిటీ వంటి వాటికి చైర్మన్ గా వ్యవహరిస్తాడు.
  6. ఒక తీర్మానం సభలో ప్రవేశయోగ్యమా కాదా అని నిర్ణయిస్తాడు.
  7. స్పీకర్ అనుమతి లేకుండా ఏ సభ్యుడూ సభనుద్దేశించి ప్రసంగించలేడు. ఏ సభ్యుడు అయినా చర్చకు సంబంధంలేని అంశాలను మాట్లాడడం ద్వారా సభా సమయాన్ని దుర్వినియోగం, నిరుపయోగం కాకుండా చూస్తాడు.
  8. సభను సక్రమంగా నిర్వహిస్తాడు. సభలో గందరగోళం చెలరేగి కార్యక్రమాలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడినపుడు సభను వాయిదా వేసి, ముగిస్తాడు.
  9. ఒక సభ్యుడు స్పీకర్ అధ్యక్షతను అంగీకరించకపోతే, అసభ్యంగా ప్రవర్తిస్తే నిషేధ హెచ్చరిక చేస్తాడు. సభ నుంచి వెళ్ళిపొమ్మని ఆదేశించినప్పుడు ఆ ఆ దేశాన్ని ఆ సభ్యుడు ఖాతరు చేయకపోతే సంబంధిత సెక్యూరిటీ అధికారుల (మార్షల్స్) ద్వారా బయటికి పంపించగలడు.
  10. ఒక తీర్మానానికి అనుకూలంగా, ప్రతికూలంగా, సమానంగా ఓట్లు లభించినప్పుడు నిర్ణాయకపు ఓటును వినియోగిస్తాడు.
  11. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాలలో ప్రసంగిస్తాడు.
  12. ఒక బిల్లుని ద్రవ్య బిల్లా, కాదా అని నిర్ణయిస్తాడు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 6.
సుప్రీంకోర్టు యొక్క న్యాయసమీక్షాధికారం గురించి రాయండి.
జవాబు.
భారత రాజ్యాంగంలో ‘న్యాయసమీక్ష’ అనే పదాన్ని ఎక్కడా ప్రస్తావించకపోయినప్పటికీ, మన రాజ్యాంగ నిర్మాతలు భారతదేశంలోని కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లోని శాసన, కార్యనిర్వాహక సంస్థలు రూపొందించే, అమలుచేసే చట్టాలలోని రాజ్యాంగ ఔచిత్యాన్ని నిర్ణయించే అధికారాన్ని సుప్రీంకోర్టుకు సంక్రమింపచేశారు.

భారతదేశంలో రాజ్యాంగ అంశాలను వ్యాఖ్యానించడానికి, రాజ్యాంగ విలువలను కాపాడటానికి, కేంద్రం, రాష్ట్రాల మధ్య న్యాయవివాదాలు ఏర్పడితే న్యాయపరమైన తీర్పు ఇచ్చే పవిత్ర బాధ్యతను సుప్రీంకోర్టుకు ఇవ్వడం జరిగింది.

అందుకు అనుగుణంగా రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఎలాంటి శాసనాలను శాసన నిర్మాణశాఖ రూపొందించినా, కార్యనిర్వాహక వర్గం అమలు చేసినా అవి చెల్లవనీ, రాజ్యాంగ వ్యతిరేకమనీ సుప్రీంకోర్టు ప్రకటిస్తుంది. సుప్రీంకోర్టు ఈ రకమైన న్యాయసమీక్ష అధికారాన్ని తొలిసారిగా 1950లోనే వినియోగించి ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం (Preventive Detention) లోని కొన్ని అంశాలు రాజ్యాంగ వ్యతిరేకమని తీర్పుచెప్పింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఎన్నికల గణం అంటే ఏమిటి ?
జవాబు.
భారత రాష్ట్రపతి ఎన్నిక : భారత రాష్ట్రపతి ఎన్నికల గణం ద్వారా ఎన్నికవుతాడు. ఆ ఎన్నికల గణంలో (i) పార్లమెంటు, (ii) రాష్ట్రాల విధాన సభలు, (iii) ఢిల్లీ, పాండిచ్చేరీ విధాన సభలలోని ‘ఎన్నికైన సభ్యులు ఓటర్లుగా ఉంటారు. నైష్పత్తిక ప్రాతిపదికన, ఒక ఓటు బదిలీ సూత్రం అనుసరించి, ఎన్నిక జరుగుతుంది. నిర్ణీత కోటా ఓట్లు వచ్చిన అభ్యర్థి రాష్ట్రపతి పదవికి ఎన్నికైనట్లు ప్రకటిస్తారు.

ప్రశ్న 2.
సాధారణ బిల్లుకు, ద్రవ్య బిల్లుకు మధ్యగల తేడాను వివరించండి.
జవాబు.
ఆర్థికేతర, ప్రభుత్వపు పరిపాలన అంశాలకు సంబంధించిన బిల్లులను సాధారణ బిల్లులంటారు. ద్రవ్యబిల్లులు ప్రభుత్వపు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఉంటాయి. సాధారణ బిల్లులు పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి ముందస్తు అసుమతి అవసరం లేదు. ద్రవ్య బిల్లులను పార్లమెంటులో ప్రవేశ పెట్టడానికి రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 3.
కేంద్ర మంత్రిమండలి నిర్మాణం గురించి రాయండి.
జవాబు.
కేంద్ర మంత్రిమండలిలో మూడు రకాల సభ్యులు ఉంటారు. వారు :

  1. కేబినెట్ మంత్రులు
  2. స్టేట్ మంత్రులు
  3. డిప్యూటీ లేదా సహాయమంత్రులు.

1. కేబినెట్ మంత్రులు :
కేంద్ర ప్రభుత్వంలోని రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, హోం, మానవ వనరుల అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రైల్వేలు వంటి ముఖ్యశాఖలకు అధిపతులుగా కేబినెట్ హోదా గల మంత్రులు ఉంటారు. వారు తమ మంత్రిత్వశాఖల నిర్వహణలో, నిర్ణయాలు తీసుకోవడంలో స్వతంత్రులు. కేంద్ర మంత్రిమండలి, కేంద్ర కేబినెట్ సమావేశాలలో నిర్ణయాలు తీసుకోవడంలో వారికి నిర్ణయాత్మకమైన పాత్ర ఉంటుంది.

2. స్టేట్ మంత్రులు :
కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని శాఖలను ఈ రకమైన మంత్రులు స్వతంత్రంగా నిర్వహిస్తూ, విధి నిర్వహణలో ప్రధానమంత్రికి నేరుగా జవాబుదారీగా ఉంటారు. మంత్రిత్వశాఖలోని కొన్ని కీలకమైన విభాగాలకు వారు ఆధ్వర్యం వహిస్తారు. కేబినెట్ మంత్రుల అజమాయిషీ వారిపైన ఉండదు.

3. డిప్యూటీ లేదా సహాయమంత్రులు :
మంత్రిత్వశాఖలకు సంబంధించిన శాసన పరిపాలనా వ్యవహారాలలో కేబినెట్ మంత్రులకు సహాయపడటానికి నియమించబడే మంత్రులను డిప్యూటీ లేదా సహాయమంత్రులని అంటారు. వారిని ప్రధానమంత్రి ఎంపిక చేస్తాడు. బ్రిటన్లో ఈ రకమైన మంత్రులను జూనియర్ మంత్రులనీ, పార్లమెంటరీ కార్యదర్శులని పిలుస్తారు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 4.
రాష్ట్రపతి యొక్క శాసనాధికారాలు.
జవాబు.
శాసనాధికారాలు :

  1. పార్లమెంటు సమావేశపరచడానికి, వాయిదా వేయడానికి, లోక్సభను రద్దు చేయడానికి రాష్ట్రపతికి అధికారాలున్నాయి.
  2. సాధారణ ఎన్నికల తరువాత ఉభయసభల సంయుక్త సమావేశంలో ప్రారంభోపన్యాసం చేస్తాడు.
  3. పార్లమెంట్కు సందేశాలు పంపవచ్చును.
  4. రాష్ట్రపతి సంతకం పొందిన తరువాతనే బిల్లులు చట్టాలవుతాయి. బిల్లులకు ఆమోదం తెలుపకుండా కొంతకాలం నిలపవచ్చు కానీ రెండు సభలు తిరిగి ఆ బిల్లలను ఆమోదించి పంపితే అధ్యక్షుడు తప్పనిసరిగా ఆమోదించాలి.
  5. పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్లను జారీ చేస్తాడు.
  6. ఆర్థిక బిల్లులు ఆయన అనుమతి లేనిదే పార్లమెంటులో ప్రవేశపెట్టరాదు.
  7. ఆర్థిక సంఘం, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వంటి సంస్థలు ఇచ్చిన నివేదికలను పార్లమెంట్కు పంపుతాడు.
  8. పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటుచేస్తాడు.
  9. రాజ్యసభకు 12 మందిని లోక్సభకు ఇద్దరిని నియమిస్తాడు.

ప్రశ్న 5.
జాతీయ అత్యవసర పరిస్థితి.
జవాబు.
జాతీయ అత్యవసర పరిస్థితి (352వ అధికరణం) : విదేశీ దండయాత్రలు, యుద్ధం, సాయుధ తిరుగుబాటు వంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు రాష్ట్రపతి ఈ రకమైన అత్యవసర అధికారాన్ని వినియోగిస్తాడు. ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని కేంద్ర మంత్రిమండలి లిఖితపూర్వక సూచన మేరకు మాత్రమే రాష్ట్రపతి వ్యవహరించవలసి ఉంటుందని 1978లో చేసిన 44వ రాజ్యాంగ సవరణ చట్టం స్పష్టం చేసింది.

జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనకు సంబంధించిన తీర్మానాన్ని నెల రోజుల్లోగా పార్లమెంటు ఉభయ సభల మొత్తం సభ్యత్వ సంఖ్యలో 2/3వ వంతు సభ్యుల మద్దతుతో ఆమోదించవలసి ఉంటుంది. పార్లమెంటు ఆమోదించిన రాష్ట్రపతి ప్రకటన ఆరు నెలల కాలంపాటు అమలులో ఉంటుంది. ఆ తరువాత రాష్ట్రపతి మరొక ప్రకటన ద్వారా అలాంటి అత్యవసర పరిస్థితిని పార్లమెంటు ఆమోదంతో మరో ఆరునెలల కాలంపాటు పొడిగించవచ్చు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 6.
ఒక రాష్ట్రంలో రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి (రాష్ట్రపతి పాలన).
జవాబు.
ఒక రాష్ట్రం గవర్నర్చే ఆ రాష్ట్రంలోని ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ముందుకు సాగే పరిస్థితిలో లేదు. ఆ రాష్ట్రంలోని రాజ్యాంగపరమైన వ్యవస్థ విఫలమైంది అన్న నివేదికను అందుకున్న మీదట రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని (రాష్ట్రపతి పాలన) ప్రకటించవచ్చు. ఈ ప్రకటన ఫలితంగా:

  1. రాష్ట్రపతి ఆ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం లేదా ఏవైనా విధులను తన అధికారంలోకి తీసుకోవచ్చు.
  2. రాష్ట్ర శాసన నిర్మాణశాఖ అధికారాలు పార్లమెంటుచే నిర్వహించబడతాయి.

ఈ అత్యవసర ప్రకటన రెండు నెలలలోపు పార్లమెంటుచే ఆమోదించబడాలి. ఈ ప్రకటన 6 నెలలపాటు అమలులో ఉంటుంది. పార్లమెంటు ఆమోదం మేరకు దీన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించవచ్చు.

ప్రశ్న 7.
లోక్సభ స్పీకర్ అధికారాలు తెలపండి.
జవాబు.
లోక్సభ స్పీకర్ అధికారాలు :

  1. స్పీకర్ లోక్సభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు.
  2. వివిధ బిల్లులపై అధికార, ప్రతిపక్షాల సభ్యులు ప్రసంగించేందుకు తగిన సమయాన్ని కేటాయించి, అవసరమయితే బిల్లులపై ఓటింగ్ నిర్వహించి, ఫలితాలు ప్రకటిస్తాడు.
  3. లోక్సభ ఆమోదించిన బిల్లులను రాజ్యసభకు పంపుతాడు.
  4. లోక్సభ తరపున ముఖ్య ప్రతినిధిగా వ్యవహరిస్తాడు.
  5. సభ్యుల హక్కులను, సభా గౌరవాన్ని, ప్రతిష్టను కాపాడేందుకు చర్యలు తీసుకుంటాడు.

ప్రశ్న 8.
రాజ్యసభ నిర్మాణం.
జవాబు.
రాజ్యసభ నిర్మాణం: రాజ్యసభలో గరిష్టంగా 250 మంది సభ్యులు ఉంటారు. భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ వ్యవహరిస్తాడు. సభ్యులలో ఒకరు డిప్యూటీ ఛైర్మన్ గా ఎన్నికవుతారు. ప్రస్తుతం రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 233 మంది ఎన్నికైనవారు కాగా, 12 మంది నామినేటెడ్ సభ్యులు.

ఎన్నికైన వారిలో 229 మంది 28 రాష్ట్రాలకు, ముగ్గురు సభ్యులు జాతీయ రాజధాని ఢిల్లీకి, ఒకరు కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి ప్రాతినిధ్యం వహిస్తారు. రాష్ట్రపతి 12 మంది సభ్యులను నామినేట్ చేస్తారు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 9.
లోక్సభ నిర్మాణం.
జవాబు. భారత పార్లమెంటులో లోక్సభను దిగువ సభ, ప్రజల సభ అనికూడా అంటారు. దీనిలో అత్యధికంగా 552 సభ్యులు ఉండవచ్చు. ప్రస్తుతం ఈ సభలో 545 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 543 మంది ఎన్నుకోబడే సభ్యులు కాగా రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో-ఇండియన్ ప్రతినిధులను లోక్సభకు నామినేట్ చేస్తారు. అయితే ఈ పద్ధతిని (నామినేట్ చేసే పద్ధతిని) 104వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించటం జరిగింది. స్పీకర్ అధ్యక్షతన లోక్సభ సమావేశాలు నిర్వహించబడతాయి.

TS Inter 2nd Year Political Science Study Material Chapter 2 ప్రాథమిక హక్కులు – ఆదేశక సూత్రాలు

Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 2nd Lesson ప్రాథమిక హక్కులు – ఆదేశక సూత్రాలు Textbook Questions and Answers.

TS Inter 2nd Year Political Science Study Material 2nd Lesson ప్రాథమిక హక్కులు – ఆదేశక సూత్రాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కులను వివరించండి.
జవాబు.
ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోని 3వ భాగంలో చేర్చారు. ఇవి 12వ అధికరణ నుంచి 35వ అధికరణ వరకు పొందుపరచబడ్డాయి. స్వతంత్ర భారతదేశం కోసం జరిగిన స్వాతంత్రోద్యమమే వీటి ఆమోదం వెనకనున్న తాత్త్విక ప్రేరణ.

భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చడానికి వాటి గుర్తింపు పరిశీలన, సవరణల కొరకు రాజ్యాంగ సభలో జె.బి.కృపలాని అధ్యక్షతన ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ రూపొందించబడింది. అనిబిసెంట్ కామన్వెల్త్ ఇండియా బిల్లు 1925, నెహ్రూ నివేదిక 1928లు ఈ ప్రాథమిక హక్కులకు మార్గదర్శకాలు.

ప్రాథమిక హక్కుల వర్గీకరణ: వీటిని ఈ కింది విధంగా వర్గీకరించారు.

  1. సమానత్వపు హక్కు (అధికరణ 14 నుంచి అధికరణ 18 వరకు)
  2. స్వాతంత్య్రపు హక్కు (అధికరణ 19 నుంచి అధికరణ 22 వరకు)
  3. పీడనాన్ని నిరోధించే హక్కు (అధికరణ 23 మరియు అధికరణ 24)
  4. మతస్వాతంత్ర్యపు హక్కు (అధికరణ 25 నుంచి అధికరణ 28 వరకు)
  5. సాంస్కృతిక విద్యావిషయక హక్కు (అధికరణ 29 మరియు అధికరణ 30)
  6. రాజ్యాంగ పరిహార హక్కు (అధికరణ 32)

1. సమానత్వపు హక్కు (అధికరణ 14 నుంచి అధికరణ 18 వరకు) :
i) 14వ అధికరణ :
చట్టం ముందు వ్యక్తి సమానత్వాన్ని లేదా చట్టాల సమాన రక్షణను ప్రభుత్వం తిరస్కరించరాదని తెలుపుతుంది.

ii) 15వ అధికరణ :
మతం, జాతి, కులం, లింగం, జన్మస్థానం మీద గానీ, వీటిలో ఏ ఒక్కదాని కారణంగా గానీ ప్రభుత్వం ఏ పౌరుడి మీదా వివక్ష చూపరాదని తెలుపుతుంది.

  1. ఏ పౌరుడిపై కూడా పైవాటి లేదా ఏ ఇతర కారణాల వల్ల దుకాణాలు, హోటళ్లు, వినోద స్థలాలు ఉపయోగించుకోవడంలో ఏ విధమైన అనర్హత, నిషేధం, షరతులు విధించరాదు.
  2. పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ ప్రభుత్వ నిధులచే నిర్వహించబడుతున్న బావులు, చెరువులు, స్నానపుశాలలు, వినోద స్థలాలను పౌరులందరూ వినియోగించుకోవచ్చు.

iii) 16వ అధికరణ :
ప్రభుత్వం కింద ఉన్న ఏ కార్యాలయంలోనైనా ఉపాధి లేదా నియామకానికి సంబంధించిన విషయాలలో పౌరులందరికీ సమాన అవకాశాలుండాలని ఆఢలుపుతుంది.
సి) ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే ఏదైనా కార్యాలయం లేదా ఉద్యోగానికి సంబంధించి ఏ పౌరుడైనా మత, జాతి, కుల, లింగ, వంశ, జన్మస్థానం, నివాస స్థలాల కారణంగా గానీ వీటిలో ఏ ఒక్క కారణంగా గానీ అనర్హతకు లేదా వివక్షతకు గురికారాదు.

iv) 17వ అధికరణ :
అస్పృశ్యత నిషేధించబడింది. ఏ రూపంలోనైనా దీని వాడుక నిరోధించబడింది. బలవంతంగా అస్పృశ్యత కారణంగా తలెత్తిన ఏ అనర్హత అయినా చట్టపరంగా నేరం, శిక్షింపదగినది అని తెలుపుతుంది.

v) 18వ అధికరణ :
సైనిక సంబంధమైనవి లేదా విద్యా సంబంధమయినవి తప్ప ఏ ఇతర బిరుదును ప్రభుత్వం ప్రసాదించరాదని తెలుపుతుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 2 ప్రాథమిక హక్కులు - ఆదేశక సూత్రాలు

2. స్వాతంత్య్రపు హక్కు (అధికరణ 19 నుంచి అధికరణ 22 వరకు) :

i) 19వ అధికరణ : పౌరులందరూ ఈ కింది హక్కులను కలిగి ఉంటారని తెలుపుతుంది.

  1. భావ వ్యక్తీకరణ మరియు వాక్కు స్వేచ్ఛ.
  2. ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సభలు, సమావేశాలు జరుపుకొనే స్వేచ్ఛ.
  3. సంఘాలు, సమూహాలు ఏర్పరచుకొనే స్వేచ్ఛ.
  4. భారత భూభాగమంతా సంచరించే స్వేచ్ఛ.
  5. భారత భూభాగంలోని ఏ ప్రాంతంలోనయినా నివసించే స్వేచ్ఛ.
  6. ఏదైనా వృత్తి, ఉపాధి, వ్యాపార, వాణిజ్యాలను నిర్వహించుకొనే స్వేచ్ఛ.

గమనిక : అధికరణ 19 (ఎఫ్), ఆస్తిని సంపాదించుకొనే స్వేచ్ఛ, 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించబడింది.

ii) 20వ అధికరణ :
(ఎ) అమలులో ఉన్న చట్టాన్ని అతిక్రమించడం నేరంగా పరిగణించబడుతున్న సమయంలో ఆ చర్యకు పాల్పడటం మినహా, ఏ ఇతర నేరానికీ ఏ పౌరుడూ నేరారోపణకు గురికారాదు. నేరం జరిగిన సమయంలో అమలులో ఉన్న చట్టం కింద విధించే దానికన్నా అధిక శిక్షకు గురికారాదు అని తెలుపుతుంది.

ఎ) ఏ వ్యక్తీ ఒకే నేరానికి ఒకసారి కంటే ఎక్కువ నేరారోపణకు, శిక్షకు గురికారాదు.
బి) నేరారోపణ చేయబడిన ఏ పౌరుడినీ తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యం చెప్పుకోవడానికి ఒత్తిడి చేయరాదు.

iii) 21వ అధికరణ :
జీవించే హక్కు గురించి తెలుపుతుంది. చట్టం ద్వారా రూపొందించబడిన ప్రక్రియ ద్వారా మినహా, ఏ వ్యక్తి ప్రాణానికి లేదా వ్యక్తిగత స్వేచ్ఛకు హాని కలిగించరాదు. దీనినే ప్రాణరక్షణ హక్కు అని అంటారు.

iv) అధికరణ 21-ఎ కు లోబడి 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ చట్టం ద్వారా నిర్ణయించిన పద్ధతిలో నిర్బంధ, ఉచిత విద్యను ప్రభుత్వాలన్నీ అందించాలి. (86వ సవరణ చట్టం 2002 ద్వారా చేర్చబడింది).

v) 22వ అధికరణ :
అరెస్టు చేసిన వ్యక్తిని కారణం తెలుపకుండా నిర్బంధించరాదు అని తెలుపుతుంది. అరెస్టు చేసి నిర్బంధించబడిన ప్రతీ వ్యక్తిని అరెస్టు చేసిన తరువాత ఇరవైనాలుగు గంటల లోపల దగ్గరలోని న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలి.

3. పీడనాన్ని నిరోధించే హక్కు (అధికరణ 23 మరియు అధికరణ 24) :

  1. 23వ అధికరణ అక్రమ మానవ వ్యాపారం, వెట్టిచాకిరి, మరే ఇతర రూపాలలో బలవంతంగా పని చేయించడం నిరోధించబడింది అని తెలుపుతుంది.
  2. 24వ అధికరణ 14 సంవత్సరాల లోపు వయస్సు పిల్లలను కర్మాగారాలు, గనులు తదితర ప్రమాదకరమయిన వృతులలో పని చేయించరాదు.

4. మతస్వాతంత్య్రపు హక్కు (అధికరణ 25 నుంచి అధికరణ 28 వరకు) :

  1. 25వ అధికరణ ప్రజాసంక్షేమం, నైతిక విలువలు, ఆరోగ్యం ఇతర నిబంధనలకు లోబడి, ఏ వ్యక్తి అయినా తనకు ఇష్టమైన మతాన్ని స్వీకరించడం, ఆచరించడం, ప్రచారం చేయడం, వ్యాప్తి చేసుకోవడానికీ పౌరులందరికీ సమానమయిన హక్కు కల్పించబడింది.
  2. ప్రభుత్వాలు, మతానికి సంబంధించిన ఆర్థిక, రాజకీయ లేదా మరే ఇతర సంక్షేమ చర్యలను నియంత్రించే లేదా నిరోధించే చట్టాలను రూపొందించవచ్చు.
  3. 26వ అధికరణకు లోబడి ప్రజాసంక్షేమం, నైతిక విలువలు, ఆరోగ్యం వంటి విషయాలకు సంబంధించి మత సంబంధమయిన ఏ సంస్థ లేదా శాఖ అయినా ఈ క్రింది హక్కులను కలిగి ఉంటాయి.
    ఎ) మత సంబంధమయిన మరియు ధార్మిక సంస్థలను స్థాపించడం, నిర్వహించడం.
    బి) మత సంబంధమయిన వ్యవహారాలను స్వంతంగా నిర్వహించుకోవడం.
    సి) స్థిరాస్తి మరియు చరాస్తులను సమకూర్చుకోవడం.
    డి) చట్టానికి లోబడి అటువంటి ఆస్తులను నిర్వహించుకొనడం.
  4. 27వ అధికరణ మతం లేదా మత సంబంధమయిన సంస్థల అభివృద్ధి, నిర్వహణ ఖర్చుల కొరకు ఏ విధమయిన పన్నులు విధించరాదు.
  5. 28వ అధికరణ, పూర్తిగా గానీ, పాక్షికంగా గాని ప్రభుత్వ నిధులతో నిర్వహించబడుతున్న ఏ విద్యాసంస్థలోనైనా మతపరమయిన బోధనలు, పద్ధతులను పాటించరాదు.

5. సాంస్కృతిక మరియు విద్యావిషయక హక్కు :

  1. 29వ అధికరణ, ప్రతీ పౌరుడికీ, తన స్వంత భాష, లిపి లేదా సంస్కృతులను కలిగి ఉండడానికి మరియు సంరక్షించుకొనే హక్కు ఉంది. ప్రభుత్వం లేదా ప్రభుత్వేతర నిధుల సహాయంతో నిర్వహించబడుతున్న ఏ విద్యా సంస్థలలోకి ఏ పౌరుడినీ మతం, జాతి, కుల, భాషల లేదా వీటిలో ఏ ఒక్కదాని కారణంగానైనా తన ప్రవేశాన్ని నిరాకరించరాదు.
  2. 30 అధికరణ, మత లేదా భాషాపరంగా అల్పసంఖ్యాకులు ఇష్టమయిన విద్యాసంస్థలను స్థాపించుకొని నిర్వహించుకొనే హక్కు కలిగి ఉన్నాయని తెలుపుతుంది.
    31వ అధికరణ ఆస్తి హక్కు 44వ సవరణ చట్టం ద్వారా 1978లో ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించబడింది.

6. రాజ్యాంగ పరిహార హక్కు (అధికరణ 32) :
అధికరణ 32 ప్రకారం, ప్రతీ పౌరుడూ రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల అమలుకు తగిన ప్రక్రియల ద్వారా సుప్రీం కోర్టును ఆశ్రయించే హక్కు ప్రసాదించబడింది. రాజ్యాంగం ద్వారా ప్రసాదించబడిన ప్రాథమిక హక్కుల అమలు కొరకై సుప్రీంకోర్టు, హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, కో వారంలొ మరియు సర్షియర రిట్లతో తగిన రిట్ను జారీ చేసే అధికారం కలిగి ఉంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 2 ప్రాథమిక హక్కులు - ఆదేశక సూత్రాలు

ప్రశ్న 2.
ఆదేశక సూత్రాలను వివరించండి.
జవాబు.
ఆదేశక సూత్రాలు ఐర్లాండు రాజ్యాంగం నుంచి గ్రహించబడ్డాయి. ఇవి భారత రాజ్యాంగంలో 4వ భాగంలో అధికరణ 36 నుంచి అధికరణ 51 వరకు పొందుపరచబడ్డాయి. ఆదేశక సూత్రాల అమలులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవు. ఆదేశక సూత్రాలు భారతదేశ పౌరులకు సామాజిక – ఆర్థిక న్యాయం అందించడంలో తోడ్పడతాయి. వీటి ముఖ్య ఉద్దేశం శ్రేయోరాజ్య స్థాపన.
ఆదేశక సూత్రాలను వివరించండి.

ఆదేశక సూత్రాలు మూడు రకాలుగా విభజించబడ్డాయి.

  1. సామ్యవాద సూత్రాలు
  2. గాంధేయవాద సూత్రాలు
  3. ఉదారవాద సూత్రాలు

1. సామ్యవాద సూత్రాలు :
ఇవి భారతదేశంలో సామాజిక సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడానికి ఆదేశక సూత్రాలలో చేర్చబడ్డాయి. 38వ అధికరణ, 39వ అధికరణ, 41వ అధికరణ, 42వ అధికరణ, 43వ అధికరణ, 46వ అధికరణ, 47వ అధికరణలు ఆదేశ సూత్రాల యొక్క సామ్యవాద భావాలను వివరిస్తాయి.

  1. 38వ అధికరణ, ప్రజలందరికీ న్యాయం (సామాజిక, ఆర్థిక, రాజకీయ) చేకూరే పద్ధతిలో ఒక సామాజిక క్రమాన్ని నెలకొల్పడం ద్వారా ప్రజాసంక్షేమాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలని తెలుపుతుంది.
  2. 39వ అధికరణ, ప్రభుత్వం కింది వాటి కొరకు చర్యలు తీసుకోవాలని తెలుపుతుంది.
    i) ప్రజలందరికీ తగినంత జీవనభృతిని కల్పించుట.
    ii) ప్రజలందరి ఉపయోగం కొరకు దేశంలోని వనరుల సమాన పంపిణీ.
    iii) జాతీయ సంపదను వికేంద్రీకరించుట.
    iv) స్త్రీ, పురుషులకు సమాన వేతనాలు.
    v) కార్మికుల, పురుషుల, మహిళల సంపదను, శక్తిని సంరక్షించడం.
    vi) బాల్యం, యవ్వనాన్ని దోపిడీ నుంచి రక్షించడం.
  3. 41వ అధికరణ, నిరుద్యోగిత, వృద్ధాప్యం, అనారోగ్యం, అశక్తత వంటి పరిస్థితులలో సహాయం, పనిహక్కు విద్యాహక్కులను ప్రసాదించాలని ప్రభుత్వాన్ని కోరుతుంది.
  4. 42వ అధికరణ, కార్మికులు పనిచేసేందుకు తగిన మానవీయ పరిస్థితులను కల్పించడం, స్త్రీలకు ప్రసూతి సౌకర్యాలను కల్పించడం.
  5. 43వ అధికరణ కార్మికులందరికీ కనీస జీవన వేతనం, మెరుగైన పని నిబంధనలు, సామాజిక, సాంస్కృతిక అవకాశాలను కల్పించాలని ప్రభుత్వాన్ని సూచిస్తుంది.
  6. 46వ అధికరణ, ప్రభుత్వం షెడ్యూల్డు తెగల, షెడ్యూల్డు కులాల, అల్ప సంఖ్యాకులకు విద్యా, ఆర్థిక సదుపాయాలను అందించాలని ప్రభుత్వానికి సూచిస్తుంది. సామాజిక అన్యాయం, అన్ని రకాల దోపిడీల నుంచి ప్రభుత్వం వారిని రక్షించాలి.
  7. 47వ అధికరణ, కనీస పోషకాహార స్థాయి, జీవన ప్రమాణాన్ని పెంచి ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని కోరుతుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 2 ప్రాథమిక హక్కులు - ఆదేశక సూత్రాలు

2. గాంధేయవాద సూత్రాలు:
గాంధేయవాద సూత్రాలు భారతదేశంలో ఆదర్శ పరిపాలనను అందిస్తాయి. ఈ సూత్రాలు అధికరణ 40, అధికరణ 43, అధికరణ 46, అధికరణ 47, అధికరణ 48ఎ, అధికరణ 49 లలో ప్రతిఫలిస్తాయి.

  1. 40వ అధికరణ, ప్రభుత్వం, గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేసి, అధికారాలను కల్పించి, వాటిని స్వపరిపాలనా సంస్థలుగా పనిచేసే అవకాశాన్ని కల్పించాలని సూచిస్తుంది.
  2. 43వ అధికరణ, గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగతంగా గాని సామూహిక రంగంలో గాని కుటీర పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని ప్రభుత్వాన్ని నిర్దేశిస్తుంది.
  3. 46వ అధికరణ, బలహీన వర్గాల వారికి ప్రత్యేక శ్రద్ధతో విద్య, ఆర్థిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని నిర్దేశిస్తుంది.
  4. 47వ అధికరణ, మద్యం, మత్తుపదార్థాలను నిషేధించడానికి కృషి చేయాలని ప్రభుత్వానికి సూచిస్తుంది.
  5. 48వ అధికరణ, నూతన, సాంకేతిక పద్ధతులలో పశుపోషణ, వ్యవసాయాలను నిర్వహించాలని ప్రభుత్వానికి ఇది సూచిస్తుంది. ఇది గోవులను, ఇతర పాడి పశువులను వధించడాన్ని నిషేధించవలసిందిగా ఆదేశిస్తుంది.
  6. అధికరణ 48ఎ, పర్యావరణ పరిరక్షణ, అడవులను, వన్యప్రాణుల్ని సంరక్షించాలని ప్రభుత్వానికి సూచిస్తుంది.
  7. 49వ అధికరణ కళాత్మక నైపుణ్యం, చారిత్రక ప్రాముఖ్యం కలిగిన స్థలాలను, కట్టడాలను పరిరక్షించాలని సూచిస్తుంది.

3. ఉదారవాద సూత్రాలు :
ఈ సూత్రాలు స్వతంత్ర న్యాయ వ్యవస్థ మరియు అంతర్జాతీయ శాంతి మొదలగు వాటి సాకారానికి సంబంధించినవి. అవి అధికరణ 44, అధికరణ 45, అధికరణ 50, అధికరణ 51 లలో పొందుపరచబడ్డాయి.

  1. 44వ అధికరణ, దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని ప్రభుత్వానికి సూచిస్తుంది.
  2. 45వ అధికరణ, బాల్యంలో పిల్లల సంరక్షణ మరియు పిల్లలందరికీ ఆరు సంవత్సరాల వరకు పూర్వప్రాథమిక విద్యను ప్రభుత్వం అందించాలని సూచిస్తుంది.
  3. 50వ అధికరణ, కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరుచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతుంది.
  4. 51వ అధికరణ ప్రభుత్వాన్ని కింది వాటిని నిర్వహించాలని సూచిస్తుంది.
    i) అంతర్జాతీయ శాంతి భద్రతలను ప్రోత్సహించడం.
    ii) దేశాల మధ్య సత్సంబంధాలను నెలకొల్పడం.
    iii) అంతర్జాతీయ చట్టాలను, ఒప్పందాలను గౌరవించి ఆచరించడం.
    iv) అంతర్జాతీయ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడాన్ని ప్రోత్సహించడం.

అదనపు సూత్రాలు :
రాజ్యాంగ చట్టాలు – 42వ సవరణ 1976, 44వ సవరణ 1978, ఈ ఆదేశ సూత్రాలకు మరికొన్ని సూత్రాలను చేర్చాయి. 42వ సవరణ 1976 చట్టం అధికరణ 39ఎ, అధికరణ 43ఎ, అధికరణ 48ఎ లను చేర్చింది. 44వ సవరణ 1978 చట్టం అధికరణ 38 లో 2వ నిబంధనను చేర్చింది. అవి ఈ క్రింది విషయాలను కలిగి ఉన్నాయి.

  1. ఆదాయంలో అసమానతలను తగ్గించడం.
  2. సమన్యాయం మరియు పేదలకు ఉచిత్ర చట్టపరమయిన సహాయం (అధికరణ 39ఎ).
  3. పరిశ్రమల నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించడం (అధికరణ 43ఎ).
  4. పర్యావరణం, అడవులు, జంతువుల సంరక్షణ (అధికరణ 48ఎ).

TS Board Inter Second Year Political Science Study Material Chapter 2 ప్రాథమిక హక్కులు - ఆదేశక సూత్రాలు

ప్రశ్న 3.
ప్రాథమిక హక్కులకు, ఆదేశక సూత్రాలకు మధ్య భేదాలను తెలపండి.
జవాబు.
ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాల మధ్య భేదాలు :

ప్రాథమిక హక్కులు

ఆదేశక సూత్రాలు

1. ప్రాథమిక హక్కులు ప్రతికూల స్వభావాన్ని కలిగి ఉంటాయి. వ్యక్తికి హానికరమైన ప్రభుత్వ కార్యకలాపాలను నిరోధిస్తాయి.1. ఇవి స్వభావరీత్యా అనుకూలమైనవి. ఇవి ప్రభుత్వపు సామాజిక, ఆర్థిక కార్యకలాపాలను విస్తరిస్తాయి.
2. ఇవి న్యాయస్థానం ద్వారా పొందగలిగినవి. న్యాయస్థానాలు 32వ అధికరణకు లోబడి, ప్రాథమిక హక్కుల సంరక్షణ కొరకు రిట్లను జారీ చేస్తాయి.2. ఇవి న్యాయస్థానం ద్వారా పొందలేనివి. న్యాయ స్థానం వీటిని అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయలేవు.
3. 13వ అధికరణ ప్రకారం, ప్రాథమిక విధులను ఉల్లంఘించే చట్టాలు చెల్లవు.3. ఆదేశక సూత్రాలను ఉల్లంఘించే చట్టాలు చెల్లుబాటు కావు అని న్యాయస్థానాలు నిర్దేశించలేవు.
4. ప్రాథమిక హక్కులు పౌరుల వ్యక్తిగత జీవితం, స్వేచ్ఛల సంరక్షణకు సంబంధించినవి.4. ఆదేశక సూత్రాలు దేశం యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ, సంక్షేమాల అభివృద్ధి కొరకు ఉద్దేశించబడినవి.
5. ప్రాథమిక హక్కులకు, ఆదేశక సూత్రాలకు మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాలను అధిగమిస్తాయి.5. ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులను ఆదేశక సూత్రాలు అధిగమించలేవు.
6. ఇవి రాజ్యాంగంలోని 3వ భాగంలో చేర్చబడ్డాయి. వీటిని అమలు చేయడానికి ప్రత్యేక చట్టాలను చేయాల్సిన అవసరం లేదు.6. ఇవి భవిష్యత్ ప్రభుత్వాలకు మార్గ నిర్దేశకాలు మాత్రమే. కావున వీటిని అమలు చేయడానికి ప్రత్యేక చట్టం అవసరం.
7. ఇవి రాజ్యానికి మరియు భవిష్యత్ ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చిన ఆదేశాలు.7. ఇవి భవిష్యత్ ప్రభుత్వాలకు సలహాలు, సూచనలు. ఇవి రాజ్యాంగకర్తల ఆదర్శాలు.
8. ప్రభుత్వం లేదా అధికారంలో ఎవరున్నా ప్రాథమిక హక్కులు అమలుపరచబడతాయి.8. వీటిపై కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకతలు ఎదురుకావచ్చు. కాబట్టి ప్రభుత్వం తన వెసులుబాటు, వనరుల లభ్యతను బట్టి అమలుపరుస్తుంది.
9. ప్రాథమిక హక్కులు ప్రభుత్వం యొక్క రాజకీయ ప్రజాస్వామ్య స్వభావాన్ని సూచిస్తాయి.9. ఆదేశక సూత్రాలు రాజ్య ఆదర్శాలను మరియు ప్రభుత్వపు లక్ష్యాలను, గమ్యాలను వివరిస్తాయి.
10. ప్రతీ పౌరునికీ, దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో స్వేచ్ఛగా పాల్గొనే అవకాశాన్ని ఇవి కలిగిస్తాయి.10. సామాజిక అభివృద్ధి సంక్షేమం కొరకు, వెసులుబాటు మరియు వనరులను బట్టి ప్రభుత్వం నిర్వహించే చర్యలను ఇవి సూచిస్తాయి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 2 ప్రాథమిక హక్కులు - ఆదేశక సూత్రాలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
సమానత్వ హక్కు.
జవాబు.
రాజ్యాంగం 14వ అధికరణం భారతదేశంలో నివసించే వ్యక్తులందరికీ చట్టం ముందు సమానత్వాన్ని, చట్టం ద్వారా సమానమైన రక్షణ, సదుపాయాలను కల్పించింది. చట్టం ముందు సమానత్వం అంటే వ్యక్తులందరికీ ఒకే విధమైన చట్టాలు, ఒకే రకమైన న్యాయస్థానాలు, ఒకే విధమైన కార్యపద్ధతులు అని అర్థం.

సంపద, హోదా లేదా పరిస్థితిని బట్టి వ్యక్తుల మధ్య విచక్షణ చూపించకూడదు. పౌరుల మధ్య మతం, కులం, లింగ, జన్మస్థల సంబంధమైన వివక్షతలను రాజ్యం పాటించరాదని 15వ అధికరణం స్పష్టం చేసింది.

16వ అధికరణం ప్రకారం రాజ్యానికి సంబంధించిన ఏ ఉద్యోగం లేదా నియామకానికైనా పౌరులందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. 17వ అధికరణం అస్పృశ్యత లేదా అంటరానితనం పాటించడాన్ని నేరంగా పేర్కొంది. 18వ అధికరణం ప్రకారం పౌరులకు సైనిక లేదా విద్యా విషయక బిరుదులు ఇతర బిరుదులను రాజ్యం ప్రసాదించకూడదు. భారత రాష్ట్రపతి అనుమతి లేకుండా విదేశీ రాజ్యాలు ప్రకటించే బిరుదులను పౌరులు స్వీకరించకూడదు.

ప్రశ్న 2.
స్వాతంత్య్ర హక్కు.
జవాబు. స్వాతంత్య్రపు హక్కు (19 – 22 అధికరణాలు) : ఈ హక్కు పౌరులకు 6 ప్రాథమిక స్వేచ్ఛలను కల్పిస్తున్నది. అవి :

  1. వాక్ స్వాతంత్ర్యం
  2. సభలు, సమావేశాలు జరుపుకునే స్వాతంత్ర్యం
  3. సంఘ నిర్మాణ స్వాతంత్ర్యం
  4. సంచార స్వాతంత్ర్యం
  5. నివాస స్వాతంత్ర్యం
  6. వృత్తి స్వాతంత్ర్యం.
    ఈ స్వేచ్ఛలు ఏవీ నిరపేక్షమైనవి కావు. వీటికి ప్రభుత్వం ఆంక్షలు విధించవచ్చు.

ఏ పౌరుడు నేరం చేయనిదే శిక్షింపబడరాదు. నిందితుడు తనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వమని బలవంతం చేయరాదు. నేరం ఋజువు కానిదే ఎవరినీ 24 గంటలకు మించి నిర్బంధంలో ఉంచరాదు. 24 గంటలలో మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచాలి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 2 ప్రాథమిక హక్కులు - ఆదేశక సూత్రాలు

ప్రశ్న 3.
మతస్వాతంత్ర్య హక్కు.
జవాబు.
మత స్వాతంత్ర్య హక్కు భారత రాజకీయ వ్యవస్థ లౌకిక స్వభావానికి ప్రతీక. 25వ అధికరణం ప్రకారం ప్రతి వ్యక్తికీ ప్రజాభద్రత, నైతికత, ఆరోగ్యాలకు లోబడి తన అంతరాత్మకు అనుగుణమైన మతాన్ని అవలంభించడానికి, ప్రచారం చేసుకోవడానికి హక్కు ఉంది. మత ప్రభావానికి సంబంధించిన ఏ కార్యక్రమాలనైనా క్రమబద్ధం చేసే చట్టాన్ని రాజ్యం రూపొందించవచ్చు.

26వ అధికరణం ప్రకారం ఏ మతానికి చెందినవారైనా

  1. మతపరమైన ధార్మిక సంస్థలను ఏర్పాటు చేసుకోవడానికి
  2. స్వీయ మత వ్యవహారాలను నిర్వహించుకోవడానికి
  3. స్థిర, చరాస్తులపై యాజమాన్య హక్కు పొందటానికి, వాటిని కొనుగోలు చేయడానికి చట్ట ప్రకారం ఆస్తిపాస్తులను నిర్వహించుకోవచ్చు.

27వ అధికరణం మతం ఆధారంగా రాజ్యం ఏ వ్యక్తిపై, ఏ విధమైన పన్ను విధించడానికి, వసూలు చేయడానికి వీలులేదని పేర్కొంది. 28వ అధికరణం ప్రకారం రాజ్యం నుంచి సంపూర్ణంగానో, పాక్షికంగానో ఆర్థిక సహాయాన్ని పొందే విద్యా సంస్థలలో మతపరమైన బోధనలు నిషేధించడం జరిగింది.

ప్రశ్న 4.
గాంధేయవాద సూత్రాలు.
జవాబు.

  1. 40వ అధికరణం ప్రకారం రాజ్యం పంచాయితీరాజ్ సంస్థలను నిర్వహించి, అవి స్వయంపాలన సంస్థలుగా ఏర్పడటానికి తగిన అధికారాలు ఇవ్వాలి.
  2. 43వ అధికరణం ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో వ్యక్తిగత లేదా సహకార ప్రాతిపదికపై కుటీర పరిశ్రమల స్థాపనకు రాజ్యం తోడ్పడాలి.
  3. 46వ అధికరణం ప్రకారం బలహీన వర్గాల ప్రజల విద్యా, సామాజిక ప్రగతికి రాజ్యం ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
  4. 47వ అధికరణం ప్రకారం మత్తు పానీయాలు, మాదకద్రవ్యాల నిషేధానికి చర్యలు తీసుకోవాలి.
  5. 48వ అధికరణం ప్రకారం వ్యవసాయం, పశుపోషణలను ఆధునిక, శాస్త్రీయ పద్ధతులలో నిర్వహించడానికి గోవులు, దూడలు, ఇతర పాడి పశువులు, లాగుడుబండ్లకు కట్టే పశువుల వధను నిషేధించడానికి రాజ్యం చర్యలు తీసుకోవాలి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 2 ప్రాథమిక హక్కులు - ఆదేశక సూత్రాలు

ప్రశ్న 5.
సామ్యవాద సూత్రాలు.
జవాబు.
సామ్యవాద సూత్రాలు :

  1. ప్రజలందరికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని చేకూర్చుట.
  2. స్త్రీ, పురుష వివక్షత చూపక అందరికీ సమాన హక్కులు ఇచ్చుట. అస్పృశ్యతను నేరంగా పరిగణించటం.
  3. పౌరులందరికీ జీవనోపాధి కల్పించడం.
  4. దేశ సంపద సమిష్టి శ్రేయస్సు కోసం పంపిణీ చేయటం.
  5. కార్మికుల ఆరోగ్య పరిరక్షణ.
  6. బాలబాలికలు, యువతీయువకులు దోపిడీకి గురికాకుండా ఉండేటట్లు చేయడం, పని హక్కు కల్పించే చర్యలు తీసుకోవడం.
  7. ప్రజలకు పోషకాహారాన్ని అందించి వారి ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవడం.
  8. మాతాశిశు సంక్షేమం మొదలగునవి. ఈ అంశాల అమలుకు కొన్ని చర్యలు తీసుకొనబడ్డాయి.
    ఉదా : అంటరానితనం నిర్మూలించే చట్టం చేయడం, జాతీయ ప్రణాళికా సంఘం ద్వారా ప్రణాళికలు అమలు చేసి ఆర్థిక ప్రగతికి చర్యలు తీసుకోవడం, కార్మిక చట్టాలు చేయడం మొదలగునవి.

ప్రశ్న 6.
ఏవైనా నాలుగు ప్రాథమిక విధులు.
జవాబు.
నాలుగు ప్రాథమిక విధులు :

  1. భారత రాజ్యాంగం పట్ల, అది సూచించిన ఆదర్శాలు, సంస్థల పట్ల, జాతీయపతాకం, జాతీయగీతం పట్ల విధేయతను చూపటం.
  2. స్వాతంత్ర్యం కోసం జరిగిన జాతీయోద్యమ ఉదాత్త ఆశయాలను పోషించుకుంటూ అనుసరించటం.
  3. భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమైక్యత, సమగ్రతలను సమర్థించి సంరక్షించుకోవటం.
  4. దేశాన్ని రక్షించుకోవడం, అవసరమయినపుడు జాతీయ సేవలో పాల్గొనడం.
  5. మత, భాషా, ప్రాంతీయ, వర్గ సంబంధమైన వైవిధ్యాలను అధిగమించి భారత ప్రజలందరిలో సమైక్యతను, ఉమ్మడి సౌభ్రాతృత్వ భావాలను పెంపొందించుకోవడం, మహిళల గౌరవానికి విరుద్ధమైన పద్ధతులను పరిత్యజించడం.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 2 ప్రాథమిక హక్కులు - ఆదేశక సూత్రాలు

ప్రశ్న 7.
ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాల మధ్య ఏవైనా రెండు తేడాలు.
జవాబు.
ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాల మధ్య రెండు వ్యత్యాసాలు :

ప్రాథమిక హక్కులుఆదేశక సూత్రాలు
1. ప్రాథమిక హక్కులు చట్టబద్ధమైనవి.1. ఆదేశక సూత్రాలు సామాజికమైనవి.
2. ప్రాథమిక హక్కులకు రాజ్యాంగం హామీ ఇస్తుంది.2. ఆదేశక సూత్రాల అమలు కోసం రాజ్యాంగం ఎలాంటి హామీ ఇవ్వలేదు.
3. ప్రాథమిక హక్కులు సంరక్షక స్వభావాన్ని కలిగి ఉంటాయి.3. ఆదేశక సూత్రాలు సంవర్థకమైనవి.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material 1st Lesson నా ప్రథమ విదేశయాత్ర Textbook Questions and Answers.

TS Inter 2nd Year Telugu Non-Detailed 1st Lesson నా ప్రథమ విదేశయాత్ర

అభ్యాసం

I. ప్రశ్నలకు జవాబులు

ప్రశ్న 1.
ముద్దు రామకృష్ణయ్య గారి సంకల్పం తెలుపండి. (V.Imp) (M.P)
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య 18 అక్టోబరు 1907 నాడు మంథెనలో జన్మించాడు. ఆయన తండ్రి ఆదిలాబాద్ జిల్లా తాండూర్లో సింగల్ టీచర్గా పనిచేసేవారు. ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యాపారం ప్రారంభించి నష్టపోయారు. దాని కారణంగా ఆస్తి కన్నా అప్పు పెరిగింది. అప్పులవాళ్ళు వచ్చి వారి తండ్రివి తిట్టేవారు. ఆ మాటల బాధకు ఇంటి బయటకు వెళ్ళి ఆకాశం వైపు చూస్తూ, చేతులు జోడించి దేవునితో నన్ను కనికరించి చదువు చెప్పించు.

విదేశాలకు వెళ్లి చదువుకునేల ఆశీర్వదించమని, తండ్రి చేసిన అప్పులు తీర్పించి, ఇల్లును అమ్మకుండా, దాని ముందర గుఱ్ఱపు బగ్గీలను, మోటార్లను పెట్టించేలా, తండ్రికి, తల్లికి ఇప్పటికన్న ఎక్కువ పేరు మర్యాదలు తెప్పించమని మొక్కారు. అంటే చిన్నప్పుడే విదేశాల్లో చదువుకోవాలనే సంకల్పం ఉండేదని తెలుస్తుంది.

డబ్బులేనివారు చదువుకోలేరు, వివాహం అయిన వారు చదువుకోలేరు అనే మాటలను తప్పు అని నిరూపించాలని, ఈశ్వరుణ్ణి నమ్మినవాడు తప్పక అనుకున్నది సాధిస్తాడని కూడా రుజువు చేయాలని సంకల్పించు కున్నాడు. హైదరాబాద్ లో బి.ఏ. పాస్ అయ్యాడు. తరువాత L.L.B.

చదువుకొని BAR చేయడానికి ఇంగ్లాండు వెళ్ళాలని సంకల్పం చేసుకున్నాడు. ఇంగ్లండు వెళ్ళడానికి ధనవంతులయిన రెడ్డి స్నేహితులు సహాయం చేస్తారనే నమ్మకం ఉండేది. సర్కారీ ఉద్యోగం చేయటానికి ఇష్టం లేదు. అనేక చిన్న, పెద్ద పనులు చేస్తూ చదువుకున్నాక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉద్యోగం వచ్చింది. తరువాత ఇంకా గట్టిగ ఇంగ్లండు వెళ్లి పరిశోధన చేయాలని సంకల్పించుకున్నాడు.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 2.
ముద్దు రామకృష్ణయ్య గారి ప్రథమ విదేశయాత్ర సన్నాహాలు వివరించండి.
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య మొదటి ప్రయత్నం విఫలం అయ్యాక 1944 లో తన తోటి ఉపాధ్యాయుడు దిగంబరరావు తో మాట్లాడుతూ డబ్బు లేని కారణంగా ఇంగ్లాండు వెళ్లలేదని చెప్పాడు. ఆయన డిప్యూటి కలెక్టర్, పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ మీ మిత్రులే కదా వారు సహకరించరా అని సలహా ఇచ్చాడు. మళ్ళీ విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు ప్రారంభించి థామస్ కుక్ వారికి ఇంగ్లాండ్ వెళ్ళడానికి పడవ ఉందా అని లేఖ రాశాడు. సెప్టెంబర్లో పడవ బయలుదేరుతుందని, బ్రిటీష్ రెసిడెన్సి నుండి పాస్పోర్ట్ తీసుకొమ్మని, సీటు రిజర్వు చేసినట్టు వారు జవాబు పంపారు.

దానికి సంతోషించి హైదరాబాద్ ప్రభుత్వ శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్కు ఇంగ్లాండ్లో ఎం. ఇడి లేదా పి. హెచ్లలో సీట్ ఇప్పించమని, అక్కడ చదువుకోవడానికి ఇక్కడ సెలవు ఇప్పించమని, 6000 అప్పు ఇప్పించమని లేఖ రాశాడు. అతడు యుద్ధ సమయం ముగిసేవరకు పడవలు వెళ్ళవు, అక్కడ సీట్ రావడం కష్టం, అక్కడికి వెళ్ళాలంటే హైదరాబాద్ ప్రభుత్వం అనుమతి ఇవ్వదు.

ఈ మూడు విషయాలు పూర్తి కాకుంటే డబ్బుతో అవసరమే లేదు అని ప్రత్యుత్తరం పంపాడు. హైదరాబాద్ పోలీస్ కమీషనర్ కాదన్నాడు. కో ఆపరేటివ్ బ్యాంకు సెక్రెటరి లోనే లేదన్నాడు. ఇలా అందరూ నిరుత్సాహపరిచారు. అన్నలా భావించే అబ్దుల్ హమీద్ కూడా మొదట పిచ్చి ప్రయత్నం, యుద్ధకాలంలో ఒక నెలలో పాస్పోర్ట్ రావడం అసంభవం అని చెప్పాడు. మీ ఆశీర్వాదం ఉంటే అన్ని అవుతాయని రామకృష్ణయ్య అంటే ఆశీర్వదించి పంపాడు.

లాతూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ మీరు ప్రయత్నం చేయండి నా వంతు సహాయం చేస్తానన్నాడు. ఆ కాలంలో పాస్పోర్ట్ పొందడానికి చాలా తతంగం ఉండేది. పాస్పోర్ట్ కోసం జిల్లా అధికారికి దరఖాస్తు చేస్తే ఆయన హోం శాఖకు పంపితే వారు లోకల్ పోలీసు వారికి పరిశీలన కోసం పంపేవారు. ఇవన్నీ కావడానికి కనీసం ఆరు నెలల కాలం పట్టేది. ఆ తరువాత వారు దానిని బ్రిటీష్ రెసిడెన్సీకి పంపితే వారు పాస్పోర్ట్ మంజూరు చేసేవారు. ఇదంతా జరగడానికి తనకున్న సమయం సరిపోదని తెలిసి కూడా ముద్దు రామకృష్ణయ్య ప్రయత్నాలు ప్రారంభించాడు.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 3.
ముద్దు రామకృష్ణయ్య విదేశయాత్ర కోసం విద్యాశాఖ అనుమతి గురించి రాయండి.
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య విదేశాలకు వెళ్ళాలనుకున్న రోజుల్లో సగం జీతంతో ఇంగ్లాండ్ వెళ్లి చదువుకుంటే వచ్చాక పది సంవత్సరాలు ఉద్యోగం చేస్తానని, అలా చేయకుంటే తీసుకున్న జీతం వాపసు ఇస్తానని బాండ్ రాసి ఇవ్వాలి. అలా ఇవ్వకుంటే మేము ఇస్తామని వంద కంటే ఎక్కువ జీతం ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులు జమానత్ (పూచీ కత్తు) ఇవ్వాలని నిబంధనలు ఉండేవి. అప్పుడు వందపైన జీతం ఉన్న వారు నలుగురు మాత్రమె ఉండేవారు. అందులో ఒకరు జామీను సులభంగానే ఇచ్చారు.

ఇంకో జామీను కోసం చాల ప్రయత్నం చేయాల్సి వచ్చింది. ఐదు రూపాయల బియ్యం ఇప్పించి ఇంకో జామీను తీసుకున్నాడు. రెండు జామీనులు, సెలవు పత్రం, ఎకరారు నామాలతో ప్రధానోపాధ్యాయునికి దరఖాస్తు చేశాడు. ఆయన డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్కు పంపాడు. వారికి ఒక ప్రైవేటు లేఖ రాసి పని త్వరగా అయ్యేలా చూడాలని అభ్యర్థించాడు. వారు అలానే త్వరగా దానిని డి పి ఐ కి పంపారు కాని వారు ఆరు నెలల ముందు అనుమతి కోరలేదు కాబట్టి సెలవు దొరకదని చెప్పారు.

అక్కడి వారిని ఎంత బతిమిలాడినా పని కాలేదు చివరికి సీనియర్ డిప్యుటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ డి.పి.ఐ. హక్కాని ని కలిశారు. ఆయన రామకృష్ణయ్యను చూడగానే మీ హిందువులు నీకు సహకరించడం లేదా అని అడిగారు. ముస్లిం కమ్మంటే కాకపోతివి ఇప్పుడు ఇబ్బందులు పడవడితివి అని అన్నాడు. ఒక బ్రాహ్మణ ఉపాధ్యాయుని దగ్గర భోజనం పెట్టించాడు.

ఆయనకు రామకృష్ణయ్య విషయాన్ని వివరించి సహకరించాలని వేడుకున్నాడు. ప్రభుత్వం సెలవు ఇవ్వకున్నా సొంత ఖర్చులతో ఇంగ్లాండ్ వెళ్తానని రాసివ్వు అంటే అలా రాసిచ్చాడు. ఇతను ఇప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళకపోతే ఇంకెప్పుడూ వెళ్ళలేడు. అలా వెళ్ళకపోతే అతని భవిష్యత్ పాడవుతుంది కావున వెంటనే అనుమతించి రిలీవ్ చేయాలని ప్రధానోపాధ్యాయునికి రాశారు. అలా విద్యాశాఖ అనుమతి లభించింది.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 4.
ముద్దు రామకృష్ణయ్య విదేశయాత్రకు పాస్పోర్టు ఎలా లభించింది ? (V.Imp) (M.P)
జవాబు:
పాస్పోర్ట్ దరఖాస్తుకు పెట్టడానికి ఫోటోలు కావాలి. ఫోటోలు దిగడానికి మంచి డ్రెస్ కూడా లేదు. లాతూర్ పోలీస్ మంచి కాలర్ ఉన్న డ్రెస్తో ఫోటోలు దిగాడు. పాస్పోర్ట్ దరఖాస్తుకు పది రూపాయాల ఫీజు చెల్లించాలి. ఆ డలను స్కూల్ ఫీ నుండి వాడుకొని జీతం వచ్చాక స్కూల్ వారికి ఇచ్చాడు.

ఆ దరఖాస్తును డిప్యూటి కలెక్టర్ ద్వారా ఉస్మానాబాద్ కలెక్టర్కు పంపాడు. తన పరిస్థితి వివరిస్తూ ఒక ప్రయివేటు లెటర్ రాసి ఒక విద్యార్థి ఇచ్చిన కవర్లో పెట్టి పోస్ట్ చేశారు. ఆ కవర్లో అనుకోకుండా ఒక రూపాయి ఉండిపోయింది. అది తెలిసి కలెక్టర్ శిక్షిస్తాడేమో అని రామకృష్ణయ్య భయపడ్డాడు. సిగ్గుతో ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.

హమీద్ పాస్పోర్ట్ రావడం అంతసులభం కాదని చెప్పేవారు. స్కూల్లో సెలవు తీసుకొని పాస్పోర్ట్ పని మీద హైదరాబాదు వెళ్ళాడు. అక్కడ మున్సిపల్ సత్రంలో సామాను పెట్టి కార్యాలయాలన్నీ తిరిగేవాడు. మొదట బ్రిటీష్ రెసిడెన్సికి వెళ్ళాడు. అక్కడికి ఫైల్ రాలేదని తెలిసి పొలిటికల్ డిపార్ట్మెంటుకు వెళ్ళాడు. అక్కడ కూడా లేదని తెలిసి అక్కడి నుండి చీఫ్ సూపరింటెండెంట్ కార్యాలయానికి వెళ్ళాడు.

అక్కడ మీ దరఖాస్తు లేదని చెప్పారు కాని వెతకమని అడిగితే అక్కడే ఉంది. అయ్యా దానిని త్వరగా పూర్తి చేయండి చాల త్వరగా నేను వెళ్ళాల్సి ఉంది అని అడిగితే చాలా పెద్ద పని ఉంది కనీసం సంవత్సరం అయినా పడుతుంది అని చెప్పారు. వారిని బతిమిలాడితే శివలాల్ అనే వారు సి.ఐ.డి. సెక్షన్లో పని చేస్తున్నారు. వారిని కలిస్తే పని త్వరగా కావచ్చు అని సలహా ఇచ్చారు. దేవునికి నమస్కరించి శివకుమార్ లాలు దగ్గరికి వెళ్ళాడు. వారితో కలిసి పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ దగ్గరికి వెళ్లి రామకృష్ణయ్య పరిస్థితిని వివరించి పోలీసు రిపోర్ట్ త్వరగా హోం డిపార్ట్మెంట్కు పంపాలని అభ్యర్థించాడు.

దానికి అంగీకరించి తన క్లార్క్తో బ్రిటీష్ రెసిడెంట్ కార్యాలయానికి సిఫారసు లేఖను పంపాడు. అక్కడికి వెళ్లి అడిగితే ఇంగ్లాండులో ఏదైనా యూనివర్సిటీలో సీటు వచ్చినట్లు కాగితం చూపమన్నారు. దానితో అతనిపై బాంబు పడ్డట్లయింది. మీర్ రజా అలీ సహకారంతో రిప్లయ్ పెయిడ్ ఎక్స్ప్రెస్ టెలిగ్రాం పంపాడు. 48 గంటలు వేచి చూసి తన మిత్రునికి అప్పగించి లాతూరు చేరుకున్నాడు. 72 గంటల తరువాత రిప్లయ్ వచ్చిందని దానిని పాస్పోర్ట్ ఆఫీసులో చూపిస్తే పాస్పోర్ట్ ఇవ్వలేమన్నారని ఉత్తరం వచ్చింది.

చివరి ప్రయత్నంగా హైదరాబాదు వెళ్లి షరతులతో అడ్మిషన్ ఉన్నట్లు వచ్చిన టెలిగ్రాంను, థామస్ కుక్ కంపెనీ వారి లేఖను చూపించి పాస్పోర్ట్ ఇవ్వాలని అభ్యర్థించాడు. రెండు సంవత్సరాలు ఇంగ్లాండులో ఉండడానికి సరిపడా పదివేల రూపాయలను లేదా బ్యాంకు బాలన్స్ను చూపించాలని వారు షరతు విధించారు. మీర్ రజా సహకారంతో ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గారి సర్టిఫికేట్ చూపించి పాస్పోర్ట్ పొందాడు.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 5.
ముద్దు రామకృష్ణయ్యకు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం డబ్బు సమస్య ఎలా తీరింది ?
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య పట్టువదలని విక్రమార్కునిగా ప్రయత్నం చేసి శాఖాపరమైన అనుమతి, యూనివర్సిటిలో అడ్మిషన్, పాస్పోర్ట్ పొందాడు. కాని డబ్బు సమస్య మాత్రం తీరలేదు. తన ఇన్సురెన్స్ పాలసీలు తాకట్టు పెట్టుకొని ఎవరైనా తక్కువ వడ్డీకి అప్పు ఇస్తారేమో అని ప్రయత్నం చేశాడు కాని ఫలించలేదు.

తాలూక్ దార్ హమీద్ ఒక మార్వాడి సేట్ అయిన విష్ణుదాసన్ను పిలిచి తక్కువ వడ్డీతో పదివేల అప్పు ఇప్పించమన్నాడు. అంత కాకుంటే ఐదువేలు అదీ కాకుంటే పన్నెండు వందలు పడవ కిరాయి ఇప్పించమన్నాడు. కాని ఆయన ఐదు వందలు మాత్రమె జమ అయినాయని అంతకంటే కావని చెప్పాడు.

ఆ ఐదు వందలతో నేనేం చేసుకోవాలి అని డబ్బు వాపసు చేస్తే అతను తీసుకోలేదు. రామకృష్ణయ్య లాతూర్ వెళ్లి విష్ణుదాస్ అకౌంట్ లో డబ్బు వేశాడు. దానికి హమీద్ సంతోషించాడు. కాని నా సొమ్ము కాని దాన్ని నా అకౌంటులో ఎందుకు వేశారని విష్ణుదాస్ చిరాకుపడ్డాడు.

నాకు పాస్పోర్ట్ దొరికింది పడవ ఎప్పుడు బయలు దేరుతుంది అని థామస్ కుక్ కంపెనీకి టెలిగ్రాం ఇస్తే సెప్టెంబర్ 22న అని జవాబు వచ్చింది. కాని డబ్బు సమస్య తీరలేదు. ఈ విషయాన్ని హామీద్కు చెప్తే అతను సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లను వెంట తీసుకొని వెళ్లి విష్ణుదాస్ గోదాములను తనిఖీ చేయించాడు. దానిలో బ్లాక్ మార్క్ ధాన్యం, చెక్కర సంచులను గుర్తించి పంచనామా చేయమన్నారు.

దానితో విష్ణుదాస్ భయపడి చందా రూపంలో వచ్చిన ఐదువందలకు తాను ఒక వెయ్యి రూపాయలు కలిపి పదిహేను వందలకు హుండీ రాసిచ్చాడు. అలా మొదటి స్టేజి డబ్బు సమస్య తీరింది. రామకృష్ణయ్య ఇంగ్లాండ్ వెళ్ళడానికి 18 రోజుల పని దినాలు ఉన్నాయి.

రోజుకు నాలుగు రూపాయల చొప్పున 72 రూపాయలు వస్తాయి. వాటిని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో మంథెనకు వెళ్ళాలి అని ఆలోచించాడు. వెంకట రామారావు దగ్గర తాకట్టు పెట్టి 72 రూపాయలు తీసుకొని లాతూరు నుండి మంథెనకు, మంథెన నుండి బొంబాయికి వెళ్ళాడు. అలా సోదరునిలాగా భావించే హామీద్ సహకారంతో ముద్దు రామకృష్ణయ్య డబ్బు సమస్య తీరింది.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 6.
ఇంగ్లండులో ముద్దు రామకృష్ణయ్య విద్యాభ్యాసం ఎలా ప్రారంభమైంది ? (V.Imp) (M.P)
జవాబు:
గ్రేట్ బ్రిటన్ స్కాట్లాండ్ దిగి అక్కడనుండి ఎడింబరో యూనివర్సిటీ ఉన్న నగరానికి రైలులో వెళ్ళారు. ఆంగ్ల ఉపాధ్యాయునిగా పదకొండు సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ ఆంగ్లం మాతృభాషగా ఉన్నవారితో మాట్లాడిన అనుభవం లేదు. రిజిస్ట్రార్ దగ్గరకు వెళ్లి టెలిగ్రాఫ్ను చూపించాడు. ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్తో మాట్లాడుతా అన్నాడు. ఉండడానికి ఒక హోటల్లో రూమ్ బుక్ చేశాడు.

కొన్ని రోజులకు ఆలస్యంగా వచ్చిన కారణంగా అడ్మిషన్ దొరకదు అని చెప్పారు. అక్కడి నుండి లీడ్స్ యూనివర్సిటీలో ప్రయత్నం చేయడానికి లీడ్స్ వెళ్ళాడు. 1939లో చేసిన దరఖాస్తు చేస్తే మీరు రమ్మన్నారు. యుద్ధం కారణంగా ఆలస్యంగా వచ్చాను అని చెప్పాడు. దానికి ఇండియా హౌస్ నుండి దరఖాస్తు చేసుకొమ్మని సలహా ఇచ్చారు. మాది హైదరాబాదు రాజ్యం ఇండియా హౌసుకు సంబంధం ఉండదు అని చెప్తే అడ్మిషన్ అయిన తరువాత వారికి చెప్పొచ్చు అని ఎం.ఇడిలో చేర్చుకున్నారు.

ప్రొఫెసర్ ఫ్రాంక్ ఫీ కట్టడానికి రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్ళమన్నారు. వారు ఇరవై పౌండ్ల ఫీ కట్టమంటే అంతడబ్బు లేదని చెప్పకుండా పది పౌన్లు ఇప్పుడు కట్టి తరువాత పది పౌన్లు చెల్లిస్తానన్నాడు. దానికి వారు అంగీకరించలేదు. వారం రోజులు గడువు ఇచ్చారు. పడవలో పరిచయమైన సురేశ్ చందర్కు లేఖ రాశారు.

చివరి తేది ఉదయం పది పౌన్ల పోస్టల్ ఆర్డర్ను సురేశ్ చందర్ పంపాడు. పోస్ట్ ఆఫీసుకు వెళ్లి పది పౌన్లు తీసుకొని మొత్తం ఇరవై పౌన్లు యూనివర్సిటీ అకౌంట్ సెక్షన్లో ఇచ్చి రసీదు తీసుకున్నాడు. అలా ఇంగ్లాండ్ లీడ్స్ యూనివర్సిటీలో ఎం. ఇడి. లో అడ్మిషన్ దొరకడంతో ఇంగ్లాండులో ముద్దు రామకృష్ణయ్య విద్యాభ్యాసం ప్రారంభమైనది.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 7.
ఇంగ్లండులో ముద్దు రామకృష్ణయ్య విద్యాభ్యాసం ఎలా సాగింది ?
జవాబు:
ఇంగ్లాండ్ లీడ్స్ యూనివర్సిటీలో ఎం.ఇడి.లో ప్రవేశం లభించింది. ప్రొఫెసర్ ఫ్రాంక్ స్మిత్ గైడ్గా ఉన్నారు. ఆయన మాథ్స్, సైకాలజీ, చరిత్రలలో ఏం తీసుకుంటావని అడిగారు. హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ నిజాం స్టేట్ అనే అంశంపై అరవై వేల శబ్దాలతో చరిత్రను రెండు సంవత్సరాలలో రాయాలని నిర్ణయించారు.

ప్రొఫెసర్ ఫ్రాంక్ చాలా ప్రేమగా సలహాలు ఇచ్చేవారు. రాసిన వాటిని ఓపికగా సరిదిద్దే వారు. ముఖ్యంగా ది అనే ఆర్టికల్ వాడటం విషయంలో భారతీయులు పొరపాట్లు చేస్తారని అనేవారు. ఒక గది అద్దెకు తీసుకొని ఉండేవారు. వారికి లభించిన మాంసాహార పదార్థాలు, పంది కొవ్వు ఇంటి ఓనర్కు ఇచ్చి శాఖాహార పదార్థాలు తీసుకునే వారు. పని చేయడానికి ఎంప్లాయ్మెంటు ఎక్స్ఛేంజ్లో పేరు నమోదు చేసుకున్నారు.

రైల్వే పోర్టులో హమాలిగా పని చేసేవారు. దానిలోనుంచి కొంత మొత్తాన్ని ఇంటికి పంపేవారు. డీన్ అనుమతితో లండన్లో కలోనియల్ సెంటర్లో చేరాడు. కలోనియల్ సెంటర్లోనే నైట్ పోర్టర్గా రాత్రి పది నుండి ఉదయం నాలుగు వరకు పని చేసేవాడు. సాయంత్రం ఆరు నుండి పది వరకు హోటల్ వెయిటర్గా పని చేసేవాడు. ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఐదు వరకు లైబ్రరీలో ఐదు నుండి పది వరకు కలోనియల్ సెంటర్లో చదువుకునేవారు. ఉదయం నాలుగు నుండి ఎనిమిది వరకు పడుకునేవారు.

హోటల్లో పని చేసేటప్పుడు హైదరాబాద్ ప్రభుత్వపు అధికారి కలిశారు. వారు ప్రధాని నవాబు చత్తారికి చెప్పి వెయ్యి రూపాయలు పౌండ్లు థామస్ కుక్ ద్వారా పంపించారు. తరువాత బిబిసిలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉద్యోగం లభించింది. ఆ తరువాత వారికి ఆర్ధిక ఇబ్బందులు రాలేదు. బిబిసిలో ఉద్యోగం వచ్చాక ప్రొఫెసర్ ఫ్రాంక్ను కలిసి వారానికి ఒక రోజు వచ్చి పది గంటల క్లాస్ వినడానికి అనుమతి పొందాడు.

మిగతా పనులన్నీ మానేసి బిబిసిలో మాత్రమే పని చేస్తూ శ్రద్ధగా చదువును కొనసాగించాడు. వందల పుస్తకాలు, డాక్యుమెంట్లు చదివి నోట్స్ రాసి ప్రొఫెసర్కు చూపిస్తే ఆయన ప్రేమతో సలహాలు ఇచ్చేవారు. అలా రెండు సంవత్సరాలలో నిజాం రాజ్యంలో విద్య చరిత్ర పేరుతో దక్షిణ భారతదేశ విద్య చరిత్రను రాసి ఎం. ఇడి పూర్తి చేసుకున్నారు.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 8.
ముద్దు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణ అనుభవాలు వివరించండి. * (V.Imp) (M.P)
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య ఎన్నో ప్రయత్నాల తరువాత విద్యా శాఖ అనుమతి, యూనివర్సిటిలో షరతులతో కూడిన అడ్మిషన్, పాస్పోర్ట్, కావలిసిన డబ్బు సమకూరింది. మొత్తానికి బొంబాయి చేరుకొని థామస్ కుక్ పడవలో ప్రవేశించాడు. ఎక్కిన తరువాత కొన్ని రోజులు పడవ బొంబాయి పోర్ట్లోనే ఉంది కాని ప్రయాణికులను బయటికి వెళ్ళనివ్వలేదు. ఆ పడవ మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు.

రామకృష్ణయ్య ఉన్న క్యాబిన్లో ఆరు బెర్తులు ఉండేవి. గాలి రావడానికి కిటికీ బదులు పోర్ట్ హోల్స్ ఉన్నాయి. ఫ్యాన్లు, హాస్పిటల్, టెలిగ్రాఫ్ ఆఫీసు, దుకాణము, పిల్లలకు కిండర్ గార్టెన్ సెక్షన్, అవుట్ డోర్ ఆటలు, గ్రంథాలయం, మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. బ్రిటీషు రేవులో దిగగానే తగినంత డబ్బు లేని వారిని డిపార్ట్ చేస్తారని సహచరుడు చెప్పాడు. పడవలో ఉన్న హైదరాబాద్ నుండి వస్తున్న సురేశ్ చంద్ర ఆస్థాన పరిచయం అయ్యాడు. అతను చాల మంచివాడు.

రామకృష్ణయ్య ఇరవై రెండు పౌన్లతో ఇంగ్లాండ్ బయలుదేరాడు. పడవ బయలుదేరిన తరువాత మొదటిసారి ఏడెన్లో ఆగింది. అక్కడ చారిత్రక స్థలాలు అన్ని చూసి, గుజరాతి వాళ్ళ ఇంట్లో మంచి శాఖాహార భోజనం చేశారు. సయీద్ రేవులో కొద్ది రోజులున్నారు. అక్కడ మ్యూజియం చూశారు. జిబ్రాల్టర్ రేవు దాటిన తరువాత బ్రిటన్ భూమి కనిపిస్తుండగా దేవునికి కృతజ్ఞతాపూర్వక నమస్కారం చేశాడు. కాని డబ్బు లేకపోతే డిపార్ట్ చేస్తారేమో అనే భయం మాత్రం ఉండేది.

ఈ విషయాన్ని సురేశబాబుకు చెప్పి అతని దగ్గరున్న నూటయాభై పౌన్ల డ్రాఫ్ట్ చూపించేలా ఒప్పందం చేసుకున్నాడు. కాని విద్యార్జనకు వచ్చానని చెప్పేసరికి డ్రాఫ్ట్ చూపించాల్సిన అవసరం రాకుండానే ఓడరేవులో పర్మిటెడ్ అని స్టాంప్ పడింది. తోటి భారతీయ ప్రయాణికుల సహకారంతో సామాను దించుకున్నాడు. మొత్తానికి బ్రిటన్లోని స్కాట్లాండ్లో దిగినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

II. సందర్భసహిత వ్యాఖ్యలు

ప్రశ్న 1.
ఆస్తి కన్నా అప్పు మించింది. (Imp)
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
ముద్దు రామకృష్ణయ్య కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించాడు. వారి తండ్రి ప్రభుత్వ ఉద్యోగం వదిలి వ్యాపారం, వ్యవసాయం మొదలుపెట్టారు. చింతకాని చెరువు గుత్తా తీసుకున్నప్పుడు వారికి పెద్ద నష్టం వచ్చింది. దానితో వారికి ఆస్తి కన్నా అప్పు పెరిగిందని రామకృష్ణయ్య చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
సంపాదించిన ఆస్తికన్నా చేసిన అప్పు పెరిగిందని అర్థం.

వ్యాఖ్య :
సింగల్ టీచర్గా పనిచేసిన వారు వారికి అనుభవం లేని రంగంలో పెట్టుబడి పెట్టి అప్పుల పాలైనారని భావం.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 2.
వివాహం విద్యానాశాయ * (V.Imp) (M.P)
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశ యాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
ముద్దు రామకృష్ణయ్య గారి తండ్రి రాజన్న వ్యాపారంలో పెట్టుబడి పెట్టి అప్పులపాలయ్యారు. ఆ అప్పుల వారు ఇంటికి వచ్చి తిట్టి వెళ్ళేవారు. అది చూసిన రామకృష్ణయ్య ఏడుస్తూ తనకు విదేశాలలో చదువు చెప్పించి, తండ్రి చేసిన అప్పులు ఇల్లు అమ్మకుండా తీర్చి, తల్లిదండ్రులకు మరింత మంచి పేరు తెచ్చే విధంగా ఆశీర్వదించమని దేవునికి మొర పెట్టుకునేవాడు. డబ్బులేని వాడు చదువుకోలేడు అని, వివాహం అయినవాడు చదువుకు పనికిరాడని అందరూ భావిస్తారు. అలాంటి భావన తప్పు అని నిరూపించాలని రామకృష్ణయ్య నిశ్చయించుకున్న సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
వివాహం జరిగితే విద్య నేర్వడం కష్టం అని అర్థం.

వ్యాఖ్య :
గట్టి సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు. పాతకాలం నుండి వస్తున్న నమ్మకాలను కూడా మార్చే శక్తి మానవ సంకల్పానికి ఉందని భావం.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 3.
ప్రథమ ప్రయత్నం విఫలమయింది (Imp) (M.P)
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా- ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
ముద్దు రామకృష్ణయ్యకు విదేశాలకు వెళ్లి చదువుకోవాలని కోరిక ఉండేది. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా కోహిర్లో పని చేస్తున్నప్పుడు విదేశీ విద్య స్కాలర్షిప్ కోసం హైదరాబాద్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. మూడవ శ్రేణిలో బి.ఏ. పాస్ అయిన వారికి స్కాలర్షిప్ రాదని చెప్పారు. అప్పు అడిగితే దానికి అంగీకరించలేదు.

సొంతఖర్చులతో విదేశాలకు వెళ్ళే అవకాశం కల్పించాలని దరఖాస్తు చేస్తే కారణం చెప్పకుండా ఫైల్ మూసేశారు. ఇంతలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం అయింది అలా రామకృష్ణయ్య గారి ప్రథమ ప్రయత్నం విఫలమైనదని తెలిపిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
మొదటి ప్రయత్నం విజయవంతం కాలేదు అని అర్థం.

వ్యాఖ్య :
దేవునిపై భారం వేసి చిన్నప్పటి నుండి చదువుకున్నాడు రామకృష్ణయ్య. విదేశాలలో చదువుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు. దానిలో మొదటి ప్రయత్నం ఫలించలేదని భావం.

ప్రశ్న 4.
వారు నాకు జమానతు ఇవ్వటానికి సిద్ధపడలేదు
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
ముద్దు రామకృష్ణయ్య ప్రథమ విదేశీ యాత్ర సన్నాహాల్లో భాగంగా విద్యాశాఖ అనుమతి తీసుకోవలసి వచ్చింది. సగం వేతనం తీసుకుంటూ విదేశాలలో చదువుకొని వచ్చిన తరువాత పది సంవత్సరాలు ప్రభుత్వంలోనే ఉద్యోగం చేయాలి. అలా చేయకుంటే తీసుకున్న వేతనం వాపసు ఇవ్వాలి. దానికి 100 రూపాయల వేతనం కంటే ఎక్కువున్న వారు పూచికత్తు ఇవ్వాలి. అలాంటి వారు కేవలం నలుగురే ఉన్నారు. వారు ఎవరూ జామీను ఇవ్వడానికి సిద్ధంగా లేరని రామకృష్ణయ్య చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
వాళ్ళెవరు జామానతు అంటే పూచీకత్తు ఇవ్వడానికి అంగీకరించలేదు అని అర్థం.

వ్యాఖ్య :
100 రూపాయల కంటే ఎక్కువ వేతనం ఉన్నవారెవరూ పూచీకత్తు ఇవ్వడానికి సిద్ధంగా లేరని భావం.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 5.
ఐదు రూపాయల బియ్యం ఇప్పించితే నేను సంతకం పెట్టుతాను
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
ముద్దు రామకృష్ణయ్య ప్రథమ విదేశీ యాత్ర సన్నాహాలులో భాగంగా విద్యాశాఖ అనుమతి తీసుకోవలసి వచ్చింది. సగం వేతనం తీసుకుంటూ విదేశాలలో చదువుకొని వచ్చిన తరువాత పది సంవత్సరాలు ప్రభుత్వంలోనే ఉద్యోగం చేయాలి. అలా చేయకుంటే తీసుకున్న వేతనం వాపసు ఇవ్వాలి.

దానికి 100 రూపాయల కంటే ఎక్కువ వేతనం ఉన్న వారు పూచికత్తు ఇవ్వాలి. అలాంటి వారు కేవలం నలుగురే ఉన్నారు. వారిలో బషీరుద్ధిన్ అనే వారు సంతకం చేశారు. ఇంకొకరి సంతకం కోసం ప్రయత్నం చేస్తుంటే ఒక ముసలి ముస్లిం టీచర్ రేషన్ అందక బాధపడుతూ రామకృష్ణయ్యను ఐదు రూపాల బియ్యం ఇప్పిస్తే జామీను మీద సంతకం చేస్తానని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం ఇది.

అర్థం :
ఐదు రూపాయల విలువైన బియ్యం ఇప్పిస్తే జామీనుపై సంతకం చేస్తానని అర్థం.

వ్యాఖ్య :
వందకు పైన వేతనం వస్తున్నప్పటికీ రేషన్ కారణంగా తమ పిల్లలకు సరైన తిండి పెట్టలేని స్థితి ప్రపంచ యుద్ధ సమయంలో ఉండేది. రామకృష్ణయ్యకు ఉన్న అవసరాన్ని ఆసరాగా తీసుకొని ముసలి ముస్లిం ఉపాధ్యాయుడు ఐదు రూపాయల బియ్యం అడిగాడని భావం.

ప్రశ్న 6.
ఇప్పుడు వెళ్ళకపోతే అతడి భవిష్యత్తు చెడుతుంది.
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
ముద్దు రామకృష్ణయ్య విదేశీ పర్యటనకోసం విద్యా శాఖ అనుమతి కొరకు ప్రయత్నం చేస్తున్నపుడు జుల్ఫికర్ అలీ హక్కాని ఉన్నతాధికారిగా ఉన్నారు. అప్పటికే సెలవు ఇవ్వడానికి వీలు లేదని ఆఫీస్ నోట్ వచ్చిందని సెలవు ఇవ్వడం వీలుపడదని ఆయన అన్నారు. జీతం లేకుండా సెలవు మంజూరు చేసినా సరే అని రాసివ్వుమన్నారు. అలా రాసిచ్చిన తరువాత రామకృష్ణయ్య ఇప్పుడు పోకపోతే మరెప్పుడు పోలేడు, ఇప్పుడు వెళ్ళకపోతే అతని భవిష్యత్తు చెడుతుందని ఉద్యోగం నుండి వెంటనే రిలీవ్ చేయమని అనుమతించిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
ఇప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళకపోతే రామకృష్ణయ్య భవిష్యత్తు చెడుతుందని అర్థం.

వ్యాఖ్య :
రామకృష్ణయ్యకు సహకరించే పరిస్థితులు ఇప్పుడున్నవి. కావున ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకెప్పుడు పోలేడు. అలా వెళ్ళకపోతే అతని భవిష్యత్తు చెడిపోతుందని భావం.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 7.
సిగ్గుతో నా బాధను ఎవరికీ చెప్పుకోలేదు. (V.Imp) (M.P)
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
ముద్దు రామకృష్ణయ్య పాస్పోర్ట్ కోసం అప్లై చేశారు. దానిని ఉస్మానాబాద్ కలెక్టర్కు ఒక తాలూక్ దార్ సిఫారసుతో పంపారు. దానిని త్వరగా పరిశీలించి అనుమతి ఇవ్వాలని కలెక్టర్కు ఒక ప్రైవేటు ఉత్తరం రాసి ఒక కవర్లో పెట్టి పంపారు. ఆ కవర్లో హాస్టల్ బాలుడు ఒక రూపాయి పెట్టుకొని మరిచిపోయి ఆ కవర్ను రామకృష్ణయ్యకు ఇచ్చాడు. ఒక రూపాయి లంచం పంపినట్టు భావించి కలెక్టర్ ఏమైనా శిక్ష వేస్తాడేమో అని భయపడి, ఆ భయపడుతున్న విషయం కూడా ఎవరికైనా చెపితే పరువు పోతుందేమో అని ఎవరికీ తెలుపలేదని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
బాధ చెబితే పరువు పోతుందేమో అని ఎవరికీ చెప్పలేదని అర్థం.

వ్యాఖ్య :
తెలియక చేసినా పెద్ద పొరపాటు జరిగింది. ఆ పొరపాటుకు శిక్ష పడుతుందేమో అనే భయం, బాధ ఉన్నాయి. కాని ఆ బాధను ఎవరికైనా చెప్పుకుంటే పరువు పోతుందేమో అనే మరో అనుమానం కూడా ఉందని భావం.

ప్రశ్న 8.
ఈ మాటతో నా పైన బాంబు పడినంత బాధ అయినది.
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
ఎన్నో ప్రయత్నాల తరువాత పాస్పోర్ట్ మంజూరు చేయమని నిజాం ప్రభుత్వము సిఫారసు లేఖ ఇచ్చింది. ఆ లేఖ తీసుకొని బ్రిటీషు రెసిడెంట్ ఆఫీసుకు వెళ్తే అక్కడున్న అసిస్టెంట్ సెక్రెటరీ ఏదైనా యూనివర్సిటీలో సీటు వచ్చినట్టు కాగితం చూపిస్తేనే పాస్పోర్ట్ ఇస్తామని చెప్పాడు. ఆ మాటతో తనపై బాంబు పడ్డంత పని అయిందని రామకృష్ణయ్య చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
ఆ మాట బాంబు దెబ్బతో సమానం అని అర్థం.

వ్యాఖ్య :
ఎంతో కష్టపడ్డ తరువాత వచ్చిన అవకాశం చివరి క్షణంలో చేజారి పోతుందని తెలిసి అది బాంబు పడ్డట్టు అనిపించిందని భావం.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 9.
అప్పుడే కోర్టు నుండి సర్టిఫికెట్టు దొరికినది
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
ఎన్నో ప్రయత్నాల తరువాత పాస్పోర్ట్ మంజూరు చేయమని నిజాం ప్రభుత్వము సిఫారసు లేఖ ఇచ్చింది. ఆ లేఖ తీసుకొని బ్రిటీషు రెసిడెంట్ ఆఫీసుకు వెళ్తే అక్కడున్న అసిస్టెంట్ సెక్రెటరీ ఏదైనా యూనివర్సిటీలో సీటు వచ్చినట్టు కాగితం చూపిస్తేనే పాస్పోర్ట్ ఇస్తామని చెప్పాడు.

కొన్ని షరతులతో సీటు ఇస్తామని వచ్చిన టెలిగ్రాఫు చూపించి పాస్పోర్ట్ ఇమ్మన్నాడు. పదివేల రూపాయలు చూపించాలి, లేదా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సర్టిఫికేట్ తెమ్మన్నారు. దానిని మీర్ రజాకు చెప్తే వకీల్ నవరతన్ సహకారంతో సర్టిఫికెట్ ఇప్పించారని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం. –

అర్థం :
ఆ సందర్భంలో కోర్టు నుండి సర్టిఫికెట్ దొరికినదని అర్థం.

వ్యాఖ్య :
ఇంగ్లాండులో రెండు సంవత్సరాలు ఉండడానికి సరిపడా డబ్బు ఉందని సర్టిఫికేట్ దొరికిందని భావం.

ప్రశ్న 10.
పాలముంచినా నీట ముంచినా నీదే భారం
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
అనేక కష్టాల తరువాత విద్యా శాఖనుండి అనుమతి, యూనివర్సిటీలో షరతులతో కూడిన అడ్మిషన్, పాస్పోర్ట్ రావడం ఇలా అనేక పనులు అయినాయి. ఓడ బయలుదేరడానికి వారం రోజుల సమయం మాత్రమే ఉందని థామస్ కుక్ కంపనీ లేఖ పంపింది. కాని అన్నింటికి మించిన డబ్బు సమస్య తీరడం ఎలా అని భగవంతున్ని ప్రార్థించిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
పాలల్లో ముంచినా నీళ్ళల్లో ముంచినా దేవునిదే భారం అని అర్థం.

వ్యాఖ్య :
పాలల్లో ముంచినా అంటే కష్టాలు తీర్చినా, నీళ్ళల్లో ముంచినా అంటే కష్టాల్లోనే ఉంచిన దేవునిదే బాధ్యత అని భావం. అంతా దైవాదీనం అని అంతరార్థం.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 11.
వారి పాదాలపైన నెత్తిపెట్టి వారికి మొక్కితిని
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
రామకృష్ణయ్య తాత సనాతన సంప్రదాయవాది. సముద్ర ప్రయాణం చేస్తే భ్రష్టుడవుతాడని ఆయన “నమ్మకం. తనను చంపి విదేశాలకు వెళ్ళమని అన్నాడు. దానికి మన సంప్రదాయాలు పాటిస్తూ మీరు గీచిన గీత దాటకుండా ఉంటాను. దానికి నువ్వు అనుమతి ఇస్తేనే వెళ్త లేదంటే ఇక్కడే చస్తా అని రామకృష్ణయ్య అన్నాడు. అప్పుడు నా నోరు మూయించావురా అని అనుమతించారు. దానికి కృతజ్ఞతా పూర్వకంగా వారికి పాద నమస్కారం చేశానని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
ఆయన పాదాలపై తలపెట్టి మొక్కాడు అని అర్థం.

వ్యాఖ్య :
పాద నమస్కారం అత్యంత గౌరవ సూచకం అని భావం.

ప్రశ్న 12.
వారి ఉచ్ఛారణ, నిత్య వ్యవహారిక శబ్దాలు తెలియవు చేసిన విద్యావేత్త
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
ముద్దు రామకృష్ణయ్య గ్రేట్ బ్రిటన్ స్కాట్లాండ్లో దిగారు. ఎడింబరో యూనివర్సిటీ రిజిస్ట్రార్ కార్యాలయం వెళ్ళాడు. పదకొండు సంవత్సరాల ఆంగ్ల ఉపాధ్యాయ అనుభవం ఉన్నప్పటికీ అక్కడి వారితో ఎప్పుడూ మాట్లాడని కారణంగా వారి భాష, యాస రామకృష్ణయ్యకు కొత్తగా అనిపించిందని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
ఆంగ్లేయుల ఉచ్ఛారణ వారి వాడుక పదాలు తెలియవు అని అర్థం.

వ్యాఖ్య :
ప్రతీ భాషకు స్వంత యాస ఉంటుంది అలానే పలుకుబళ్ళు ఉంటాయి. వాటిని మాతృభాష అయిన వారి లాగా మాట్లాడటం కష్టం అని భావం.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 13.
నా జాతికి నావలన పాడుమాట రానివ్వను (V.Imp) (M.P)
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
యుద్ధ కాలంలో తిండికి బట్టలకు రేషన్ ఉండేది. ఆ సమయంలో ఇంగ్లాండుకు కొత్తగా వెళ్ళాడు కాబట్టి రామకృష్ణయ్యకు బట్టలు కూపన్లు ఎక్కువ అందినాయి. కాని కొనుక్కోవడానికి డబ్బు లేదు. ఆ సమయంలో ఒక మిత్రుడు ఆ కూపన్లను బ్లాక్ మార్కెట్లో అమ్మితే ఎక్కువ డబ్బు వస్తుందని చెప్పాడు. అలా చేయడం వల్ల భారతీయులు కూపన్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముతారనే చెడ్డపేరు వస్తుందని, అలా దేశానికి చెడ్డపేరు తెచ్చే ఏ పని తాను చేయనని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
నా భారత జాతికి నా ప్రవర్తన వల్ల చెడ్డపేరు రానివ్వను అని అర్థం

వ్యాఖ్య :
బట్టలకోసం దొరికిన కూపన్లను బ్లాక్ మార్కెట్లో అమ్మడం తప్పు అని అలా అమ్మితే దేశ వాసులందరికి చెడ్డ పేరు వస్తుందని, అలాంటి పని తాను చేయడని భావం.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 14.
తన సజెషన్స్ ప్రేమతో ఇచ్చేవారు
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
చదువుకోసం ఇంగ్లాండు వచ్చి లీడ్స్ యూనివర్సిటీలో ఎం.ఎడ్. లో చేరాడు. చదువుతో పాటు వివిధ పార్ట్ టైం ఉద్యోగాలు చేశారు. చివరికి లండన్ బిబిసిలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉద్యోగం చేశాడు. అలా ఉద్యోగం చేస్తూ లీడ్స్కు రోజు వెళ్ళడం సాధ్యం కాదని, వారంలో ఒకరోజు వచ్చి పది గంటలు వింటానని, తన కోసం కొంత శ్రమ తీసుకోవాలని వారి ప్రొఫెసర్ను కోరాడు. దానికి ప్రొఫెసర్ ఫ్రాంక్ అంగీకరించాడని, ప్రేమతో సలహాలు ఇచ్చేవాడని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
ప్రొఫెసర్ ప్రేమగా సలహాలు ఇచ్చారని అర్థం.

వ్యాఖ్య :
కష్టపడి చదివే వారికి అందరూ సహకరిస్తారని, అలానే తన ప్రొఫెసర్ కూడా ప్రేమగా సలహాలు ఇచ్చారని భావం.

నా ప్రథమ విదేశయాత్ర Summary in Telugu

రచయిత పరిచయం

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర 1
ఉపవాచకం పేరు : నా ప్రథమ విదేశయాత్ర

దేనినుండి ఇది గ్రహింపబడింది. : ఈ ఉపవాచకం, శ్రీ ముద్దు రామకృష్ణయ్య ‘నా ప్రథమ విదేశ రచన నుండి గ్రహింపబడింది.

ఉపవాచకం ప్రక్రియ : యాత్రా చరిత్ర

రచయిత : ముద్దు రామకృష్ణయ్య

కాలం : జననం : అక్టోబర్ 18, 1907 – మరణం : అక్టోబరు 21, 1985

తల్లిదండ్రులు : అమ్మాయి, రాజన్న

స్వస్థలం : కరీంనగర్ జిల్లా మంథని

విద్య :

  • 1932లో బి.ఏ. పట్టా పొందాడు.
  • 1944-46 మధ్య ఇంగ్లండు వెళ్ళి లీడ్స్ విశ్వవిద్యాలయంలో విద్యలో మాస్టర్స్ డిగ్రీ (ఎం.ఇడి.) పూర్తి చేసి వచ్చాడు.

ఉద్యోగాలు :

  • 1933 జులై 31న అప్పటి హైదరాబాదు రాష్ట్రం గుల్బర్గా జిల్లాలోని చించోలిలో మాధ్యమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితం ఆరంభించాడు.
  • 1936లో పదోన్నతిపై కోహీరుకు వెళ్ళిన నాటి నుంచి విదేశాలలో ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
  • లండన్లో చదువుకుంటున్న సమయంలోనే బిబిసిలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉద్యోగం చేశారు.
  • 1948లో గుల్బర్గా కళాశాలలో తన ఉద్యోగ ప్రస్థానం కొనసాగించాడు.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

విదేశీ పర్యటనలు :

  • 1951-52 మధ్యకాలంలో మలేషియా, ఫిలిప్పైన్స్, అమెరికా ఖండంలో 24 రాష్ట్రాలు, కెనడా, ఫ్రాన్స్, స్పెయిన్, మొరాకో వంటి దేశాలలో పర్యటించి అక్కడి విద్యావిధానం గురించి అక్కడి విద్యావేత్తలను అడిగి తెలుసుకున్నాడు.
  • 1954-55 సం॥లో ఆస్ట్రేలియా ఖండంలో పర్యటించి అక్కడి విద్యావిధానాన్ని అధ్యయనం చేశాడు. 1958లో ఒక యాత్రికుడిగా రష్యా, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలను సందర్శించి అనేక సంస్థలను పరిశీలించి వచ్చాడు.

సంస్కరణలు : వివిధ దేశాల విద్యావిధానాలను అధ్యయనం చేసిన రామకృష్ణయ్య వాటి స్ఫూర్తితో మన దేశ విద్యారంగంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు.

  • కరీంనగర్, నిజామాబాదు, హైదరాబాదు మొదలైన జిల్లాల్లో ప్రభుత్వ విద్యాశాఖాధికారిగా పనిచేశారు.
  • పాఠశాల విద్య నిర్వహణలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పాడు. ఆ విధానాలు కొన్ని నేటికీ అమలులో ఉన్నాయి.
  • నిరక్షరాస్యతా నిర్మూలన కొరకు “ఈచ్ వన్ టీచ్ వన్” ఉద్యమాన్ని జీవిత పర్యంతం కొనసాగించారు.
  • విధి నిర్వహణలోని ప్రతి అంశాన్నీ, అక్షర రూపంలో భద్రపరచి సంస్కరణలకు బీజం వేశాడు.
  • రామకృష్ణయ్య నిరంతరం తన దినచర్యను రాసుకుంటూ ఆరువేల పుటలకు పైగా అమూల్యమైన అంశాలను లోకానికి అందించారు.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ఉద్దేశం : ముద్దు రామకృష్ణయ్య విదేశాలలో విద్యాభ్యాసం కోసం చేసిన ప్రయత్నాలు, ఎన్ని కష్టాలు ఎదురైనా, పస్తులుండవలసి వచ్చినా తన పట్టుదల వీడక ఆయన సాగించిన కృషి నేటి విద్యార్థులకు స్ఫూర్తి మంత్రం ఁ లాంటి వారి చరిత్ర ద్వారా స్ఫూర్తి పొందుతారని ఉద్దేశంతో ఈ యాత్రా చరిత్రను అందిం. ‘రు.

  • ఈ యాత్రా చరిత్రలో ఆంగ్లం, ఉర్దూ పదాలు ఎక్కువగా వాడారు. నిజాం పాలనా కాలంలోని వ్యవస్థలు, ఆధికారుల పేర్లు కూడా ఇందులో తెలుసుకోవచ్చు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదని ఈ ఉపవాచకం నిరూపిస్తుంది.

TS Inter 2nd Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 9th Lesson తెలంగాణ రాష్ట్ర అవతరణ Textbook Questions and Answers.

TS Inter 2nd Year Political Science Study Material 9th Lesson తెలంగాణ రాష్ట్ర అవతరణ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావటానికి గల కారణాలు ఏవి ?
జవాబు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి దారితీసిన కారణాలు :
1. స్థానికత (Domiclle) నియమాలను మార్చివేయటం ప్రధాన ఉల్లంఘన. తెలంగాణ ప్రాంతంలో స్థానికత రావాలంటే 12 సంవత్సరాల నిరంతరాయ నివాసం ఉండాలనే నియమం ఉంది. పెద్ద మనుషుల ఒప్పందం దానిని ఒప్పుకొన్నది. అమలు విషయానికి వచ్చేసరికి దానిని 4 సంవత్సరాలకు కుదించారు. ఈ ఉల్లంఘనవల్ల 50 వేలమంది ఆంధ్ర ప్రాంతీయులు తెలంగాణ ప్రాంత ఉద్యోగాల్లోకి చేరిపోయారు. తెలంగాణ వారికి ఒక్క దెబ్బతో విద్య, ఉద్యోగాలలో అవకాశాలు పోయాయి.

2. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం మానవ అభివృద్ధిలో ఎంతో వెనుకబడింది. తెలంగాణలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న జనాభా 40.78 శాతం. 1987-88 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం తెలంగాణలో కంటె ఆంధ్ర ప్రాంతంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న జనాభా శాతం చాలా తక్కువ.

అందువల్ల తెలంగాణాలో ఆంధ్ర ప్రాంతంతో పోలిస్తే పేదరికం పెరిగిపోయింది. తెలంగాణ ప్రాంతం ఆంధ్రతో పోలిస్తే నాటికి అధిక ఆదాయం కలిగిన ప్రాంతం. ఆ అధిక ఆదాయాన్ని తెలంగాణ మిగులు అంటారు. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూలో 40 శాతానికి పైగా సమకూరుస్తుంది.

3. జై ఆంధ్ర ఉద్యమం తరువాత 1972 తరువాత ముల్కీ నిబంధనలను, తెలంగాణ ప్రాంతీయ కమిటీకి సంబంధించిన నిబంధనలను సవరించారు. తెలంగాణ ప్రాంతానికి వనరుల పంపిణీలో జరిగే అన్యాయాన్ని ప్రశ్నించే సంస్థాగత నిర్మాణమే లేకుండా చేశారు.

4. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1990 దశకం వరకు తెలంగాణ ప్రజలకు విద్యా సౌకర్యాల దుర్భరంగా ఉండేవి. తెలంగాణలో నిరక్షరాస్యత ఎక్కువ. ఇక్కడ అక్షరాస్యత శాతం చాలా కనిష్టంగా 37 శాతం మాత్రమే ఉండేది. వృత్తి విద్యా కళాశాలపైన ఇంజనీరింగ్, మెడికల్ తదితర విభాగాల కళాశాలలు కొన్నింటిని మాత్రమే స్థాపించారు. తెలంగాణ ప్రాంతంలో విశ్వవిద్యాలయాల సంఖ్య కూడా అతి తక్కువగా ఉండేది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

5. నదీజలాల వినియోగం విషయంలో తెలంగాణకు చాలా అన్యాయం జరిగింది. కృష్ణానదిపై నిర్మించిన నాగర్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు ఆంధ్ర ప్రాంతానికి మేలు చేకూర్చేందుకు మాత్రమే నిర్మించారు. నాగార్జున సాగర్ నిర్మాణం వల్ల నల్లగొండ జిల్లాలో ఎంతో వ్యవసాయ భూమి ముంపుకు గురి కాగా, ఆ జిల్లాకు సాగర్ ద్వారా అందవలసిన న్యాయబద్ధ వాటా దక్కలేదు.

6. గోదావరి పైన ప్రారంభించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు తెలంగాణకు మేలు చేస్తుంది. కానీ దీని పనులు నత్త నడక కాలంలో నడిపించారు. 20 లక్షల ఎకరాలకు నీరు అందించవలసిన ప్రాజెక్టు ఆయకట్టును 50 సంవత్సరాల రెండున్నర లక్షల ఎకరాలకు మాత్రమే అందేట్టు చేశారు. 1966 నాటికి ప్రాజెక్టు పూర్తి కావాలని ఆశించినా అది జరగలేదు.

7. తెలంగాణ ప్రాంతంలోని ప్రాజెక్టులలో నీటి కేటాయింపు హామీ ఉన్న శ్రీశైలం ఎడమగట్టు కాలువ పనులు సైతం సంతృప్తికరంగా ప్రగతి సాధించలేదు.

8. తెలంగాణలో నిజాం ప్రభుత్వ పాలనలో నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టును సరైన నిర్వహణ లేకుండా చేశారు. దాని పూడికమేట వేసి, ప్రాజెక్టు కింద ఆయకట్టు తగ్గిపోసాగింది.

9. మెదక్, నిజామాబాద్ జిల్లాలలోకి పొలాలకు నీరు అందించవలసిన మంజీరా నీళ్ళను, తాగునీటి అవసరాలకోసం హైదరాబాద్కు తరలించారు.

10. రాజోలి బండ డైవర్షన్ కెనాల్ ద్వారా నీరు, తెలంగాణలోని మహబూబ్నగర్లో 50 నుంచి 60 వేల ఎకరాలకు అందవలసి ఉండగా, ఆ జలాలను దౌర్జన్యంగా రాయలసీమకు తరలించారు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

ప్రశ్న 2.
భారత యూనియన్లో తెలంగాణ ఒక నూతన రాష్ట్రంగా ఏర్పడిన తీరును చర్చించండి.
జవాబు.
దశాబ్దాల పోరాటం తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇది 60 సంవత్సరాలుగా వివిధ రూపాలలో నడిచిన ప్రజాపోరాటాల అంతిమ విజయం. 1948 నుంచి 1956 వరకు తెలంగాణకు ప్రత్యేక ఉనికి, గుర్తింపు ఉన్నాయి. తెలంగాణకు ప్రత్యేక చారిత్రక, భౌగోళిక సంస్కృతిక గుర్తింపు, ప్రాతిపదిక ఉన్నాయి.

హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రరాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడం, ఇష్టంలేని, అసమానమైన ఇరుపక్షాలను బలవంతంగా ఒక్కటి చేయడం అనవచ్చు. అందువల్ల అవి విడిపోవడం అనే అనివార్యత, ఆ బలవంతపు కలయికలోనే ఉంది.

తెలంగాణ ప్రాంతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి అవకాశాలకు నోచుకోక, సహజవనరుల విషయంలో తీవ్రదోపిడీకి, ఇతర ప్రాంతాల అభివృద్ధికి తన వనరులను వదులుకోవాల్సిన పరిస్థితులకు గురి అయింది. పెద్ద మనుషుల ఒప్పందం పేరుతో తెలంగాణ ప్రాంతానికి కొన్ని సంరక్షణలు కల్పించినప్పటికీ, వివిధ ప్రభుత్వాల కుయుక్తుల వలన పాలనలో అవి అసంపూర్ణంగా, నిరర్థకంగా మారడం కనిపిస్తుంది.

ఆంధ్ర పాలకుల కుయుక్త నైపుణ్యాల ముందు తెలంగాణ రాజకీయ శిష్టవర్గం సరితూగలేకపోయింది. ప్రభుత్వ ఉద్యోగాలు, నదీజలాల్లో భాగస్వామ్యం, తెలంగాణ ప్రాంత మిగులు నిధుల అక్రమ తరలింపు, ముల్కీ నిబంధనల ఉల్లంఘనలు తదితర విషయాల్లో తెలంగాణకు ఎంతో అన్యాయం జరిగింది. ఈ పరిణామాలన్నీ తెలంగాణ యువతను నిరాశ నిస్పృహలకు గురిచేశాయి.

దీనితో 1969లో ప్రత్యేక తెలంగాణ ఆందోళన ప్రారంభమైంది. ఆ తరువాత కాలంలో, ఈ ప్రత్యేక రాష్ట్రవాదం తీవ్రతరమై, రాజీలేని పోరాటంగా మారి 2001-2014 మధ్యకాలంలో ఒక శక్తివంతమైన ఉద్యమంగా మారింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

భిన్న రాజకీయ భావజాలం గల శక్తులు జాయింట్ యాక్షన్ కమిటీగా రూపొందడం ఈ పోరాటంలో ఒక ప్రత్యేక అంశం. ఇది ఒక విధంగా ప్రజా రాజకీయాలలో (Mass Politics) కొత్త నేర్పు. ఈ JAC లలో రాజకీయ JAC కులసంఘాల JAC, విద్యార్థి JAC, ఉద్యోగుల JAC మొదలైనవి ప్రధానమైనవి. ఈ జాయింట్ యాక్షన్ కమిటీ వివిధ రాజకీయ బృందాలచే కాక వివిధ వృత్తుల సామాజిక శ్రేణులనూ, వివిధ కులసంఘాలనూ పోరాటంలోకి తీసుకువచ్చింది.

ఆ విధంగా ప్రత్యేక రాష్ట్ర మహాయత్వానికి విశాలమైన ప్రజామద్ధతులను కూడగట్టింది. తెలంగాణ రాష్ట్రసమితి పుట్టుక ఒక చారిత్రక సంఘటన, ప్రజా ఉద్యమాన్ని పార్లమెంటరీ రాజకీయాలలోకి ఒదిగించి, సమత్వం, న్యాయం, ఆత్మగౌరవం అన్న ప్రాతిపదికలతో దాన్ని చట్టసభల చర్చలలోకి తీసుకుపోయింది. తెలంగాణ రాష్ట్ర సాధనకు పార్టీ పుట్టుక ఎంతో పనికి వచ్చింది.

ఈ విధంగా దోపిడి, అణచివేత, ఆధిపత్యాల నుండి విముక్తి కోసం సాగించిన తెలంగాణ ఉద్యమం ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కల సాకారమయ్యింది. లోక్సభ, రాజ్యసభలలో రాష్ట్ర పునర్విభజన బిల్లు ఆమోదం పొంది మార్చి 1, 2014న రాష్ట్రపతి ఆమోదం పొందింది. దానితో 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ, భారత యూనియన్లో 29వ రాష్ట్రంగా అవతరించింది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని ప్రధానాంశాలు ఈ విధంగా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రం : తెలంగాణ 10 జిల్లాలు గల 29వ రాష్ట్రం (ప్రస్తుతం దేశంలో 28 రాష్ట్రాలు) తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి.)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం : 13 జిల్లాలు గల రాష్ట్రం.

హైదరాబాద్ ఉమ్మడి రాజధాని : 2014 నుంచి 10 సంవత్సరాలకు మించకుండా హైదరాబాద్ నగరమే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.

ఉమ్మడి గవర్నర్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉంటాడు. (ప్రస్తుతం వేరు, వేరు గవర్నర్లు ఉన్నారు.)

రాజ్యసభ సభ్యులు : తెలంగాణకు 7 మంది, ఆంధ్రప్రదేశ్కు 11 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు.

లోకసభ సభ్యులు : తెలంగాణ రాష్ట్రానికి 17 మంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25 మంది సభ్యులు ఉంటారు.

శాసనసభ సభ్యులు : తెలంగాణకు 119 మంది శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్కు 175 మంది సభ్యులు ఉంటారు.
శాసనమండలి : తెలంగాణ శాసనమండలి సభ్యులు 40, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు 50.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

ప్రశ్న 3.
తెలంగాణ ఉద్యమంలో సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి)ల పాత్రను వివరించండి.
జవాబు.
1. రాజకీయ సంయుక్త కార్యాచరణ కమిటీ (Political JAC) :
రాజకీయ సంయుక్త కార్యాచరణ కమిటీ (Political JAC) ని డిసెంబర్ 24, 2009న ఏర్పరచారు. దీనిలో ప్రధాన రాజకీయ పార్టీలైన తెలంగాణ రాష్ట్ర సమితి (TRS). భారతీయ జనతాపార్టీ (BJP), భారత కమ్యూనిస్టు పార్టీ (CPI), భారత జాతీయ కాంగ్రెస్ (INC), తెలుగుదేశం పార్టీ (TDP), సిపిఐ (ఎం.ఎల్) న్యూడెమొక్రసీ తదితర రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు తదితరులు అంతర్భాగమై ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నిర్వహించాయి.

2. కులసంఘాలు జెఎసి :
సమాజంలోని కొన్ని కులాలు సంఘాలు ఏర్పరచుకోవడం, ఈ సంఘాలన్నీ సంయుక్త కార్యాచరణ కమిటీగా ఏర్పడటం తెలంగాణ ఉద్యమంలో ఒక వినూత్న ధోరణిగా పేర్కొనవచ్చు.

తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొనడానికి సమాజంలో శతాబ్దాల తరబడి అణచివేతకు గురైన కుల సమూహాలు, వివిధ కుల వృత్తుల సమూహాలు, దళిత బహుజనులు, ఇతర వెనుకబడిన కులాలు, అల్ప సంఖ్యాక వర్గాలు ఒకే వేదిక పైకి వచ్చి, సంయుక్త కార్యాచరణ కమిటీ (JAC) గా ఏర్పడ్డాయి. ఈ విధంగా కులసంఘాలు సంఘటితమై పోరాటం చేయడాన్ని కులంపైన ఉండే ఆదిమ విశ్వాసంగా అర్థం చేసుకోరాదు.

3. విద్యార్థుల జెఎసి :
తెలంగాణ ఉద్యమం ప్రారంభించి, తీవ్రతరం చేసి వివిధ కళాశాలల విద్యార్థులు, విశ్వవిద్యాలయ విద్యార్థులు రాష్ట్ర సాధనకు ఎంతో కృషి చేశారు. వివిధ సిద్ధాంత భావజాలాలను నమ్మే విద్యార్థులు తమ మధ్యగల సైద్ధాంతిక విభేదాలను పక్కనబెట్టి తెలంగాణ ఉద్యమం నిర్వహించడానికి ఒక్కటై, పోరాడటానికి ఒక సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి)ని ఏర్పరచారు.

ఈ తరహా జెఎసిలు అనేక విశ్వవిద్యాలయాలు, కళాశాలల స్థాయిలో ఏర్పడ్డాయి. వీటిలో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు జెఎసి (OUJAC), కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థుల జెఎసి (KUJAC), ఉద్యమాన్ని క్రియాశీలంగా నడపడంలో కీలకపాత్ర పోషించాయి.

4. ఉద్యోగుల జెఎసి :
ఉద్యోగులు, కార్మికులు, శ్రామికులు, ఉపాధ్యాయులు తదితరవర్గాలు ఉద్యోగల సంయుక్త కార్యాచరణ కమిటీ (JAC) పేరుతో ఒక వేదికను ఏర్పరచుకొని అనేక నిరసన కార్యక్రమాలు, ఉద్యమాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని చురుకుగా నిర్వహించాయి.

వివిధ స్థాయిలకు చెందిన లక్షలాది మంది ఉద్యోగులు సహాయ నిరాకరణ, పెన్ డౌన్ (Pen Down), ఢిల్లీ ఛలో, మధ్యాహ్న భోజన విరామ నిరసన కార్యక్రమాలతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మితిమీరిన ఆలస్యానికి నిరసనగా ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపట్ల ఉదాసీనతకు వ్యతిరేకంగా ఉద్యోగల జెఎసి రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొన్నది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
పెద్దమనుషుల ఒప్పందంలోని నిబంధనలు తెలపండి.
జవాబు.
పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణలో రీజినల్ కౌన్సిల్ ఏర్పాటు అవుతుంది. ఒప్పందం ప్రకారం తెలంగాణలోని అభివృద్ధి, ప్రణాళికారచన, స్థానికపాలన, ప్రజారోగ్యం, ప్రాథమిక, మాధ్యమిక విద్య, తెలంగాణ ప్రాంత విద్యాలయాల్లో అడ్మిషన్లు, తెలంగాణా ప్రాంత వ్యవసాయ భూముల అమ్మకాలు, లఘు, కుటీర పరిశ్రమలను వీటిని రీజనల్ కౌన్సిల్ నిర్వహిస్తుంది.

ముల్కీ నిబంధనల ప్రకారం తెలంగాణలో 12 సంవత్సరాల శాశ్వత నివాసం ఉంటేనే వారికి తెలంగాణా ప్రాంతపు విద్యాలయాల్లో, ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.

ఇది ఒక ప్రధానమైన తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను రక్షించే చర్య, వీటితోపాటు మరో ప్రధాన రాజకీయ నిర్ణయం ఒప్పందంలో ఉన్నది. దాని ప్రకారం ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికి చెందినవాడైతే ఉపముఖ్యమంత్రి మరో ప్రాంతానికి చెందినవారై ఉండాలి.

అలాగే మంత్రివర్గంలో ఆంధ్ర-తెలంగాణ మంత్రుల నిష్పత్తి 60:40 ఉండాలని ప్రతిపాదించబడింది. అంతేకాకుండా 2 నుంచి 5 వరకు ఉండే ముఖ్యమైన మంత్రిత్వశాఖలు అంటే హోమ్, ఆర్థిక ప్రణాళిక, అభివృద్ధి, వాణిజ్యం, పరిశ్రమలు వంటి శాఖలు తెలంగాణ వారికి ఇవ్వాలి అని ఒప్పందం జరిగింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

ప్రశ్న 2.
1969 నాటి తెలంగాణ ఆందోళన గురించి వివరించండి.
జవాబు.
రకరకాల రూపాలలో పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘనకు గురి కాగా తెలంగాణాలో అసంతృప్తి రాజుకోసాగింది. ముఖ్యంగా స్థానికతకు సంబంధించిన ముల్కీ నియమాలు ఉల్లంఘించడంతో, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో జరిగిన అన్యాయానికి ఒక్కసారిగా వ్యక్తమయిన వ్యతిరేకతే 1909లో జరిగిన ‘జై తెలంగాణ ఉద్యమం’.

ఆనాటికి తెలంగాణ వారికి హక్కుగా లభించవలసిన 25,000 ఉద్యోగాలు తెలంగాణాలోకి వలసవచ్చిన ఆంధ్రావారికి వెళ్ళసాగాయి. ముల్కీ నిబంధనలను పూర్తి సరళంగా మార్చివేసి, 4 సంవత్సరాలు తెలంగాణలో ఉంటే చాలు ఎవరైనా తెలంగాణ వారే అనే వెసులుబాటు ఇవ్వడం వల్ల ఈ దుర్మార్గం జరిగిపోయింది.

ముల్కీ నియమాల ఉల్లంఘనవల్ల కాలేజీల్లో అడ్మిషన్లు కోల్పోవడం తెలంగాణ వారికి సర్వసాధారణమైపోయింది. ఖమ్మంలో ఇటువంటి సంఘటనకు వ్యతిరేకంగా మొదట నిప్పురవ్వ పుట్టింది. మెడికల్ కాలేజీలో అడ్మిషన్ విషయంలో ముల్కీ ఉల్లంఘన జరిగిందనే నిరసన, నిరాహార దీక్షగా పరిణమించింది.

1969లో అది వెనువెంటనే ఉప్మానియా విశ్వవిద్యాలయానికి పాకింది. తరువాత తెలంగాణ అంతటా విస్తరించింది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రతిపక్ష, శాసన సభ్యులూ విద్యార్థులకు మద్ధతుగా “ప్రత్యక్ష చర్యకు” పూరుకుంటామని హెచ్చరించారు.

యువకులు, మేధావులు, టీచర్లు మహిళలూ ఇలా వివిధ జనాల మద్ధతు ఉద్యమానికి తోడయింది. అధికార సభ్యుడయిన కొండాలక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమానికి మద్దతు తెలిపాడు. మదన్మోహన్, మల్లికార్జున్, పులి వీరన్న వంటి విద్యార్థి నాయకులు చురుకుగా ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు తెలంగాణ పరిరక్షణలు ఉల్లంఘనలను ప్రశ్నించి, పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలను హామీ మేరకు అమలుచేయాలని డిమాండ్ చేశారు.

ఈ పోరాటంలో 370 మంది విద్యార్థులు పోలీసు కాల్పుల్లో మృతి చెందారు. 70,000 మంది అరెస్టు అయ్యారు. కాసు బ్రహ్మానందరెడ్డి ఆధ్యర్యంలోని ప్రభుత్వ అణచివేత చర్యల ద్వారా ఉద్యమాన్ని నీరుకార్చింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

ప్రశ్న 3.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని అంశాలను తెలపండి.
జవాబు.
భారత రాజ్యాంగంలోని 3వ అధికరణ ప్రకారం, కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే సంపూర్ణ అధికారం పార్లమెంట్కు ఉంది. తెలంగాణ విషయంలో కేంద్రం ఈ ఆర్టికల్ కింద రాష్ట్ర పునర్విభజన ప్రక్రియ ఆరంభించింది. భారత రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ పునర్విభజన బిల్లును పరిశీలించి ఒక లాంఛనంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పంపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ బిల్లును తిరస్కరించింది. అంతిమంగా రాష్ట్రపతి బిల్లును పార్లమెంటుకు పంపారు.

లోక్సభ, రాజ్యసభలలో బిల్లు ఆమోదం పొంది మార్చి 1, 2014న రాష్ట్రపతి ఆమోదం పొందింది. భారత ప్రభుత్వం 2 జూన్ 2014న చట్టం అమలులోకి వస్తుందని ప్రకటించింది. దానితో 2 జూన్ 2014న తెలంగాణ, భారత యూనియన్లో 29న రాష్ట్రంగా అవతరించింది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని ప్రధానాంశాలు ఈ విధంగా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రం : తెలంగాణ 10 జిల్లాలు గల 29వ రాష్ట్రం (ప్రస్తుత దేశంలో 28 రాష్ట్రాలు, తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం : 13 జిల్లాలు గల రాష్ట్రం.

హైదరాబాద్ ఉమ్మడి రాజధాని : 2014 నుంచి 10 సంవత్సరాలకు మించకుండా హైదరాబాద్ నగరమే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.

ఉమ్మడి గవర్నర్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉంటాడు. (ప్రస్తుతం వేరు, వేరు గవర్నర్లు ఉన్నారు.)

రాజ్యసభ సభ్యులు : తెలంగాణకు 7 మంది, ఆంధ్రప్రదేశ్కు 11 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు.

లోకసభ సభ్యులు : తెలంగాణ రాష్ట్రానికి 17 మంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25 మంది సభ్యులు ఉంటారు.

శాసనసభ సభ్యులు : తెలంగాణకు 119 మంది శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్కు 175 మంది సభ్యులు ఉంటారు.

శాసనమండలి : తెలంగాణా శాసనమండలి సభ్యులు 40, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు 50.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

ప్రశ్న 4.
జూన్ 2, 2014కు గల ప్రాధాన్యతను వివరించండి.
జవాబు.
భారత రాజ్యాంగంలోని 3వ అధికరణ ప్రకారం కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే సంపూర్ణ అధికారం పార్లమెంట్కు ఉంది. తెలంగాణ విషయంలో కేంద్రం ఈ ఆర్టికల్ కింద రాష్ట్ర పనర్విభజన ప్రక్రియ ఆరంభించింది. భారత రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ పునర్విభజన బిల్లును పరిశీలించి ఒక లాంఛనంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పంపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ బిల్లును తిరస్కరించింది. అంతిమంగా రాష్ట్రపతి బిల్లును పార్లమెంటుకు పంపారు.

లోక్సభ, రాజ్యసభలలో బిల్లు ఆమోదం పొంది మార్చి 1, 2014న రాష్ట్రపతి ఆమోదం పొందింది. భారత ప్రభుత్వం 2 జూన్ 2014న చట్టం అమలులోకి వస్తుందని ప్రకటించింది. దానితో 2 జూన్ 2014న తెలంగాణ భారత యూనియన్లో 29 రాష్ట్రంగా అవతరించింది.

ఈ చట్టం రెండు రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులు ఉండాలని, నదీజదాల పంపకపు ట్రిబ్యునల్ ఉండాలని తెలిపింది.

దశాబ్దాల పోరాటం తరువాత తెలంగాణ రాష్ట్రం రూపొందించింది. జూన్ 2, 2014 చరిత్రలోనూ, తెలంగాణ ప్రజల జ్ఞాపకాలలోనూ నిలిచిపోయింది. ఈ మహా ప్రయత్నానికి కీ.శే. ప్రొఫెసర్ జయశంకర్ వంటి మేథావులు, ఎంతో ఊతం అందించారు. 2014 నాటి యు.పి.ఎ. ఛైర్పర్సన్ శ్రీమతి ఇందిరాగాంధీ, బిజెపి నాయకులు తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన మద్ధతు చాలా విలువైనది. వందలాది అమరుల త్యాగాల ద్వారా సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా మారాలని ఆశిద్దాం.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

ప్రశ్న 5.
తెలంగాణ ప్రాంతీయ సమన్వయ సంఘాల గురించి రాయండి.
జవాబు.
ఆంధ్ర, తెలంగాణ నాయకుల మధ్య జరిగిన పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ ప్రాంతీయ సమన్వయ సంఘం ఏర్పాటు ప్రధానమైంది. ప్రాంతీయ కమిటీ సలహాలను ప్రభుత్వం, రాష్ట్ర శాసనసభ అంగీకరించవలసి ఉండేది. తెలంగాణ ప్రాంతీయ సమన్వయ సంఘానికి ఈ కింది అంశాలపై అధికారం ఉంది.

  1. రాష్ట్ర శాసనసభ ఏర్పాటు చేసే అభివృద్ధి, ఆర్థిక ప్రణాళిక మొదలైన అంశాలు.
  2. స్థానిక స్వపరిపాలన ప్రభుత్వ అంశాలు నగరపాలక సంస్థల రాజ్యాంగ అధికారాలు, ట్రస్టుల అభివృద్ధి, జిల్లా బోర్డులు, జిల్లా అధికార సంస్థల అంశాలు.
  3. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, స్థానిక వైద్యశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు.
  4. ప్రాథమిక, సెకండరీ విద్య.
  5. తెలంగాణ ప్రాంతంలోని విద్యా సంస్థలలో ప్రవేశాల క్రమబద్ధీకరణ.
  6. మద్యపాన నిషేధం.
  7. వ్యవసాయ భూముల అమ్మకాలు
  8. హెచ్. కుటీర, చిన్న తరహా పరిశ్రమలు, వ్యవసాయం సహకార సంస్థలు మార్కెట్లు సంతలు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
హైదరాబాదు రాష్ట్రం.
జవాబు.
భారత యూనియన్ జరిపిన పోలీస్ చర్య పర్యవసానంగా స్వపరిపాలన కలిగిన హైదరాబాద్ రాజ్యం 1948లో హైదరాబాద్ రాష్ట్రంగా భారత యూనియన్లో విలీనమైంది. తరనంతరం జనరల్ చౌదరి రాష్ట్రపాలన పగ్గాలు చేపట్టారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటం వల్ల హైదరాబాద్ రాష్ట్ర పరిస్థితులు అల్లకల్లోలంగా ఉండేవి.

ఆ తరుణంలో భారత ప్రభుత్వం ఐ.సి.యస్. అధికారి యం.కె. వెల్లోడిని పాలనా వ్యవహారాలు చూసేందుకు నియమించింది. తదనంతరం జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రశ్న 2.
ముల్కీ నిబంధనలు.
జవాబు.
ఉర్దూ భాషలో ముల్కీ అంటే ఒక జాతి, రాజ్యం. ఆ జాతికి చెందిన ప్రజలందరిని ముల్కీలంటారు. హైదరాబాద్ రాష్ట్రంలో, 15 సంవత్సరాలు శాశ్వత ప్రాతిపదికగా నివసించిన పౌరులను ముల్కీలంటారు. ఆ మేరకు మెజిస్ట్రేట్ సమక్షంలో ఒక లిఖిత పూర్వకమైన అఫిడవిట్ మీద సంతకం చేసి తన పుట్టిన ప్రదేశానికి తిరిగి వెళ్ళనని ప్రకటించిన వారు ముల్కీలుగా పరిగణించబడతారు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

ప్రశ్న 3.
విశాలాంధ్ర.
జవాబు.
మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఆ రాష్ట్రంలోని రాజకీయ ప్రముఖులు హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు వారితో కలిసి ఒక విశాల తెలుగు రాష్ట్రం ఏర్పాటు జరగాలన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఆ ఆలోచనలను వారు విశాలాంధ్ర నినాదంగా మార్చారు.

ఈ ఆలోచనను జాతీయ స్థాయిలోని కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకత్వానికి సూచనప్రాయంగా తెలియజేసింది. అదే సమయంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా పెద్ద ఎత్తున తెలుగు మాట్లాడే వారందరికీ ఒకే తెలుగు రాష్ట్రం ఉంటే మంచిది అన్న వాదనను ‘విశాలాంధ్ర’ అనే పేరిట ప్రచారంలోకి తీసుకొచ్చింది.

ప్రశ్న 4.
1969 తెలంగాణ ఆందోళన.
జవాబు.
రకరకాల రూపాలలో పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘనకు గురికాగా తెంగాణలో అసంతృప్తి రాజుకోసాగింది. ముఖ్యంగా స్థానికతకు సంబంధించిన ముల్కీ నియమాలు ఉల్లంఘించడంతో, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో జరిగిన అన్యాయానికి ఒక్కసారిగా వ్యక్తమయిన వ్యతిరేకతే 1969లో జరిగిన ‘జైతెలంగాణ ఉద్యమం’. ఆనాటికి తెలంగాణ వారికి హక్కుగా లభించవలసిన 25,000 ఉద్యోగాలు తెలంగాణ లోకి వలసవచ్చిన ఆంధ్రావారికి వెళ్ళసాగాయి.

ముల్కీ నిబంధనలను పూర్తి సరళంగా మార్చివేసి, 4 సంవత్సరాలు తెలంగాణలో ఉంటే చాలు ఎవరైనా తెలంగాణ వారే అనే వెసులుబాటు ఇవ్వడం వల్ల ఈ దుర్మార్గం జరిగిపోయిది. 1969లో జరిగిన ‘ఉద్యమంలో 370 మంది విద్యార్థులు పోలీసు కాల్పుల్లో మృతి చెందారు. 70,000 మంది అరెస్టు అయ్యారు. కాసు బ్రహ్మానంద రెడ్డి ఆధ్వర్యలోని ప్రభుత్వం అణచివేత చర్యల ద్వారా ఉద్యమాన్ని నీరు కార్చింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

ప్రశ్న 5.
శ్రీకృష్ణకమిటీ రిపోర్టు 2010.
జవాబు.
శ్రీకృష్ణకమిటీ రిపోర్టులోని ప్రధానాంశాలు :

  1. రాష్ట్రాన్ని విభజించకుండా ఉంచుతూ, తెలంగాణ ప్రాంత సామాజికార్థికాభివృద్ధి కోసం రాజ్యాంగబద్ధమైన తెలంగాణ రీజన్ కౌన్సిలును ఏర్పాటు చేయటం.
  2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచటం.
  3. ఆంధ్రప్రదేశ్ తెలంగాణా, రాయలసీమ, కోస్తాంధ్రాలు కలిసిన రెండు రాష్ట్రాలుగా విభజించటం, హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం.

ప్రశ్న 6.
తెలంగాణ సంరక్షణల ఉల్లంఘనలు.
జవాబు.
ఎన్నో మంచి ఒప్పందాలు, ఎంతో విశ్వాసంతో మొదలైనా చిత్తశుద్ధి లేకపోతే, అమలులోకి రావు అనేది చారిత్రక సత్యం. పెద్ద మనుషుల ఒప్పందంలో పొందుపరచిన తెలంగాణ ప్రాంత సంరక్షణల ఉల్లంగన ఈ సత్యాన్నే లోకానికి తెలిపింది. మరోసారి వీటితో పలు ఉల్లంఘనలు కింది విధంగా జరిగాయి.

స్థానికత (Domicile) నియమాలను మార్చివేయటం ప్రధాన ఉల్లంఘన. తెలంగాణ ప్రాంతంలో స్థానికత రావాలంటే 12 సంవత్సరాల నిరంతరాయ నివాసం ఉండాలనే నియమం ఉండి. పెద్ద పమనుషుల ఒప్పందం దానిని ఒప్పుకొన్నది.

అమలు విషయానికి వచ్చేసరికి దానిని 4 సంవత్సరాలకు కుదించారు. ఈ ఉల్లంఘన వల్ల 50 వేలమంది ఆంధ్ర ప్రాంతీయులు తెలంగాణ ప్రాంత ఉద్యోగాల్లోకి చేరిపోయారు. తెలంగాణ వారికి ఒక్క దెబ్బతో విద్య, ఉద్యోగాలలో అవకాశాలు పోయాయి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

ప్రశ్న 7.
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్.
జవాబు.
ఆంధ్రప్రదేశ్ పనర్విభజన చట్టం 2014 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఈ చట్టం 2014 నుండి 10 సంవత్సరాలకు మించకుండా హైదరాబాద్ నగరమే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని స్పష్టంగా పేర్కొంది.

ప్రశ్న 8.
సకల జనుల సమ్మె.
జవాబు.
తెలంగాణ ఉద్యోగులు, విద్యార్థులు ఒక మహా సమ్మె తలపెట్టారు. 13 సెప్టెంబర్ నుంచి 24 అక్టోబర్ 2011 వరకు నలభై రోజులు తెలంగాణలో సాధారణ జనజీవితం స్తంభించింది. అన్ని వృత్తులవారు ఈ సమ్మెలో పాల్గొన్నారు. రోడ్లపైనే వంటావార్పులు, రైల్ రోకో, రోడ్డు దిగ్బంధాలు ఈ సమ్మె కాలంలో నిత్యకృత్యమైనాయి. ఇది చారిత్రాత్మకమైన ఉద్యమంగా
నిలిచింది.

ప్రశ్న 9.
మిలియన్ మార్ట్.
జవాబు.
17 ఫిబ్రవరి 2011లో మొదలుపెట్టి తెలంగాణ ప్రాంత ఉద్యోగులు 16 రోజులు సహాయనిరాకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడు లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగులు దీనిలో పాల్గొన్నారు.
దీని తరువాత తెలంగాణ జె.ఏ.సి. పదిలక్షల మంది (మిలియన్) జనాలను హైదరాబాద్కు ర్యాలీగా తరలి రమ్మని పిలుపునిచ్చారు.

అదే సంవత్సరం ఈజిప్ట్ లక్షలాది మంది ప్రజలు కైరోను దిగ్బంధించి అధికార మార్పు కోసం చేసిన పోరాటం స్ఫూర్తిగా దానికి మిలియన్ మార్చ్ అని పేరు పెట్టారు. మార్చ్ 10, 2011న హైదరాబాద్లో మిలియన్ మార్చ్ జరిగింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

ప్రశ్న 10.
రాజకీయ జెఎసి.
జవాబు.
రాజకీయ సంయుక్త కార్యాచరణ కమిటీ (Political JAC) : రాజకీయ సంయు కార్యాచరణ కమిటీ (Political JAC) ని డిసెంబర్ 24, 2009 న ఏర్పరచారు. దీనిలో ప్రధాన రాజకీయ పార్టీలైన తెలంగాణ రాష్ట్ర సమితి (TRS), భారతీయ జనతాపార్టీ (BJP), భారత కమ్యూనిస్టు పార్టీ (CPI), భారత జాతీయ కాంగ్రెస్ (INC), తెలుగుదేశం పార్టీ (TDP), సిసిఐ (ఎం.ఎల్), న్యూడెమొక్రసీ తదితర రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు తదితరులు అంతర్భాగమై ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నిర్వహించాయి.

ప్రశ్న 11.
విద్యార్థుల జెఎసి.
జవాబు.
తెలంగాణ ఉద్యమం ప్రారంభించి, తీవ్రతరం చేసి వివిద కళాశాలలు విద్యార్థులు, విశ్వవిద్యాలయ విద్యార్థులు రాష్ట్ర సాధనకు ఎంతో కృషి చేశారు. వివిధ సిద్ధాంత భావజాలాలలను నమ్మే విద్యార్థులు తమ మధ్యగల సైద్ధాంతిక విభేదాలను పక్కన బెట్టి తెలంగాణ ఉద్యమం నిర్వహించడానికి ఒక్కటై, పోరాడడానికి ఒక సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి)ని ఏర్పరచారు.

ఈ తరహా జెఎసిలు అనేక విశ్వవిద్యాలయాలు, కళాశాలలు స్థాయిల్లో ఏర్పడ్డాయి. వీటిలో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు జెఎసి (OUJAC), కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు జెఎసి (KUJAC), ఉద్యమాన్ని క్రియాశీలంగా నడపడంలో కీలకపాత్ర పోషించాయి.

TS Inter 2nd Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం – చారిత్రక నేపథ్యం

Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 1st Lesson భారత రాజ్యాంగం – చారిత్రక నేపథ్యం Textbook Questions and Answers.

TS Inter 2nd Year Political Science Study Material 1st Lesson భారత రాజ్యాంగం – చారిత్రక నేపథ్యం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారత జాతీయోద్యమ ఆవిర్భావానికి కారణాలను వివరించండి.
జవాబు.
ప్రజాబాహుళ్యంలో స్వయంపాలన – స్వేచ్ఛ తదితర సంవర్ధక ఆకాంక్షల ప్రాతిపదికగా భారతదేశంలో జాతీయవాదం వెళ్ళాలనుకుంది. ప్రపంచంలోని ఇతర దేశాల జాతీయోద్యమాల కంటే భారత జాతీయోద్యమం ఎంతో విశిష్టమైనదిగా మేధావులు పేర్కొంటారు.

భారతీయులకు ఒక సుసంపన్న వారసత్వం, సంస్కృతి, గత వైభవం ఉన్నాయి. సగర్వంగా స్వయంపాలన చేపట్టే సామర్థ్యం భారతీయులకు ఉంది. ఈ కారణం వల్ల భారతీయులు స్వయంపాలనకు జాతీయోద్యమాన్ని చేపట్టడంలో ఆశ్చర్యం లేదు.

మానసికంగా గతవైభవ, సుసంపన్న సంస్కృతి వారసత్వ భావనలు ఒకవైపు, బ్రిటీష్ పాలన దోపిడి- నిరంకుశత్వం మరోవైపు భారతీయులు ఒక బలమైన జాతీయోద్యమాన్ని చేపట్టడానికి దారితీసింది.

1. బ్రిటిష్ వలసవాద పాలన :
భారతదేశంలో బ్రిటీషు వారి పాలనకు అనుకూల, ప్రతికూల ప్రభావాలు రెండూ ఉన్నాయి. బ్రిటిషు పాలన భారతదేశంలో ఒక గట్టి పరిపాలన నిర్మాణాన్ని వివిధ శాఖల రూపంలో హేతుబద్ధంగా విభజించి ప్రవేశపెట్టింది. బ్రిటిషువారు పరిపాలన అవసరాల కోసం ఇండియన్ సివిల్ సర్వీస్ (ICS) ప్రారంభించారు.

భారత శిక్షా స్మృతి (Indian Penal Code), నేర విచారణ స్మృతి (Criminal Procedure Code) సంహితలను తయారుచేసి భారతదేశంలో పటిష్టమైన న్యాయవ్యవస్థ ఏర్పాటుకు కృషి చేశారు. పోస్టు – టెలిగ్రాఫ్, సమాచారవ్యవస్థ, రైల్వేలు, జాతీయ రహదారులు, ప్రధాన నీటి పారుదల ప్రాజెక్టులు ఏర్పరచి అభివృద్ధికి అవసరమయ్యే మౌలిక సదుపాయాలు ఏర్పరచారు.

2. సాంఘిక-సాంస్కృతిక పునరుజ్జీవం :
భారతదేశంలో 19వ శతాబ్దంలో వచ్చిన అనేక సాంఘిక-సాంస్కృతిక ఉద్యమాలు ప్రజల్లో సాంఘిక చైతన్యాన్ని, సాంస్కృతిక జాతీయవాద భావనలను ప్రోది చేశాయి.

ఈ ఉద్యమాలన్నింటికీ రాజా రామ్ మోహన్ రాయ్ స్థాపించిన బ్రహ్మసమాజ్ ఉద్యమం అగ్రగామిగా నిలిచి, సాంఘిక దురాచారాలైన సతీసహగమనం, బాల్యవివాహాలు, వితంతువులుగా మార్చడం, విగ్రహారాధన తదితరులకు వ్యతిరేకంగా సంస్కరణలు జరగాలని పిలుపునిచ్చింది.

దీనిని అనుసరించి ఆర్యసమాజం, రామకృష్ణ మిషన్, దివ్యజ్ఞాన సమాజం ప్రార్థన సమాజం, సత్యశోధక సమాజం, అలీఘర్ ఉద్యమం, వహాబీ ఉద్యమం తదితర సాంఘిక ఉద్యమాలు వచ్చాయి. ఈ ఉద్యమాలు ప్రజల్లో జాతీయతవాద భావనను, సాంఘిక – సాంస్కృతిక గుర్తింపును, దేశభక్తిని నింపి పరోక్షంగా ప్రజలు స్వయంపాలన కోరుకోవడానికి ప్రేరణ నిచ్చాయి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

3. మహాతిరుగుబాటు :
1857 వ సంవత్సరంలో భారతీయ సైన్యంలోని వేలాదిమంది సిపాయిలు, పదవీచ్యుతులైన సంస్థానాధీశులు, గ్రామీణ చేతివృత్తులవారు, చిన్నకారు సన్నకారు రైతులు భారతదేశంలో బ్రిటిషు వారి పాలనను అంతమొందించడానికి సమైక్య తిరుగుబాటు చేశారు.

బ్రిటిషు పాలకులు స్వదేశీ సంస్థానాల పాలకుల పట్ల సాధారణ ప్రజానీకంపట్ల చూపే నిరంకుశ పాశవిక విధానాలతో ప్రజలు విసిగి వేసారిపోయారు. ప్రత్యేకంగా లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన ‘రాజ్యాసంక్రమణ సిద్ధాంతం’ (Doctrine of Lapse) స్వదేశీ సంస్థానాధీశుల్లో ఆగ్రహం తెప్పించింది.

4. ఆంగ్లవిద్య :
భారతదేశంలో బ్రిటీషువారు ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు. దీనివల్ల సహేతుక శాస్త్రీయ భావనలు ప్రజాభిప్రాయాలను తీర్చిదిద్దాయి. ఆంగ్లవిద్య భారతీయులకు కీలక రాజకీయ ఆదర్శాలైన స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, ప్రజాస్వామ్యం తదితర విలువలపై అవగాహన కల్పించాయి. ఆంగ్ల విద్యను అభ్యసించిన మధ్యతరగతి వర్గాలు పాశ్చాత్య రాజనీతి తత్త్వవేత్తలైన జెర్మీబెంథాం.

జాన్ సూవర్ట్ మిల్, జాన్లాక్ రూసో, ఆడమస్మిత్, హెర్బర్ట్ స్పెన్సర్ తదితరుల తాత్త్విక భావజాలం నుంచి స్ఫూర్తిని పొందారు. అయితే ఈ ఆదర్శాలను, విలువలను బ్రిటిష్ వారు తమ మాతృదేశమైన ఇంగ్లాండును మాత్రమే గౌరవించి, భారతదేశంలో ఆచరించేవారు కాదు.

ఈ విధమైన ద్వంద్వప్రమాణాలు మధ్య తరగతి వర్గాలను ఆగ్రహానికి గురిచేశాయి. వారు భారత ప్రజానీకాన్ని రాజకీయ ఆదర్శాలు – విలువలపై చైతన్యపరచి, బ్రిటిష్ పాలనను ప్రశ్నించడం మొదలు పెట్టారు. ప్రధానంగా సమన్యాయ పాలన (Rule of Law) జాతీయవాదం, స్వయం ప్రభుత్వం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగత వాదం విద్యావంతులైన వర్గాల్లో ఆశలు రేకెత్తించాయి. దానితో మధ్యతరగతి విద్యావంతులు స్వయంపాలన, స్వాతంత్య్రం లక్ష్యాలుగా జాతీయోద్యమాన్ని ప్రారంభించారు.

5. ఆర్థిక దోపిడి :
బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని ఒక వలస ప్రాంతంగా మార్చి, ఆర్థిక వ్యవస్థను తమ ప్రయోజనాల కోసం దోపిడి చేశారు. బ్రిటిష్వారు భారతదేశంలోని ముడిపదార్థాలను ఇంగ్లాండ్లోని తమ పరిశ్రమలను నిర్వహించుకోవడానికి అతి స్వల్ప ధరలతో తరలించుకు పోయేవారు.

అలాగే ఇంగ్లాండ్లోని తయారైన వస్తువులను భారత మార్కెట్లో నింపివేసేవారు. భారతీయ పారిశ్రామికవేత్తల నుండి, చిన్న తరహా గ్రామీణ చేతివృత్తుల వారినుండి వస్తువులు-సేవల విషయంలో పోటీని నివారించడానికి కఠినతరమైన చర్యలకు పాల్పడేవారు.

ముఖ్యంగా బ్రిటిష్ వారు భారతీయ కుటీర పరిశ్రమలపైన, గ్రామీణ చేతివృత్తుల వారిపైన కఠిన నిబంధనలు విధించేవారు. దీనివల్ల భారతీయ చేతివృత్తులవారు తమతమ వృత్తులను వదిలివేసి, అప్పటికే ఎంతోమందితో పెనుభారంగా ఉన్న వ్యవసాయరంగంలోకి బదిలీ అయ్యారు. మరికొంతమంది గ్రామీణ చేతివృత్తుల వారు మహాసముద్రాలను కూడా లెక్కచేయక, విదేశాలకు కడుపు చేతపట్టుకొని వలసలు పోయారు.

6. కరువు కాటకాలు, పేదరికం :
భారతదేశం 19వ శతాబ్దం చివరిభాగంలో ఎన్నో కరువు కాటక పరిస్థితులను, అంట వ్యాధులను ఎదుర్కొంది. ప్రధానంగా 1873, 1875, 1877, 1895 సంవత్సరాలలో వందలాది మంది ప్రజలు కరువు కాటకాలతో, ఆకలి చావులతో ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనలు భారతీయ, సమాజంలో అశాంతిని, అలజడిని తీసుకువచ్చింది.

7. వార్తాపత్రికలు :
బ్రిటిష్ పాలన కాలంలో ఎన్నో వార్తాపత్రికలు, దినపత్రికలు, నియతకాలిక పత్రికలు భారతీయులలో జాతీయవాద భావాలను ప్రేరేపించాయి. వీటిలో ప్రముఖమైనవి అమృత బజారపత్రిక, కేసరి, పాట్రియాట్, ది హిందూ నవజీవన్, ఆంధ్రపత్రిక మొదలైనవి. ఈ పత్రికలు ప్రజలలో దేశభక్తి, జాతీయవాద భావాలను పెంచి పోషించాయి.

8. పాశవిక పాలన :
భారతదేశంలో బ్రిటిష్ పాలనా యంత్రాంగం భారతీయులకు వ్యతిరేకంగా పాశవికంగా వ్యవహరిస్తూ, నిరంకుశ చట్టాలను ప్రయోగించేది. వీటిలో దేశద్రోహ సమావేశాల చట్టం (Seditious Meetings Act), ఆయుధాల చట్టం (Arms Act), ప్రాంతీయ వార్తాపత్రికల చట్టం, (Vernacular press Act), రౌలత్ చట్టం (Rowlat Act) తదితర చట్టాలను ప్రయోగించి ప్రజల స్వేచ్ఛలను హరించేది. ప్రజల స్వేచ్ఛలను అడ్డుకోవడమేకాక, పత్రికాస్వేచ్ఛపై నిర్హేతుకమైన ఆంక్షలు విధించేది.

9. జాతి విచక్షణ :
బ్రిటిష్ ప్రభుత్వం న్యాయప్రక్రియల్లో, సివిల్ సర్వీసుల ఉద్యోగాల ప్రవేశంలో, హక్కులను అనుమతించడంలో ఎంతో వివక్షపూరిత ధోరణి ప్రదర్శించేది. జాతీయోద్యమ ప్రారంభదశలో భారతీయులు, సివిల్ సర్వీస్ ఉద్యోగాలలో ప్రవేశాలకు సంబంధించి విషయాలలో బ్రిటీషు అభ్యర్థులతో సమానంగా అవకాశాలు ఉండాలని డిమాండ్ చేసేవారు.

అలాగే బ్రిటిష్వారి వివక్షత విధానం. ఇల్బర్ట్ బిల్లు వివాదంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. భారతదేశంలోని యూరోపియన్ సమూహాలు భారతీయ న్యాయ మార్పులు తమ నేరాలను విచారించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ తరహా ధోరణులు భారతీయుల మనోభావాలను దెబ్బతీయడంతో, అది జాతీయోద్యమానికి దారితీసింది.

10. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన (Inceptino of Indian National Congress) :
భారత జాతీయోద్యమ చరిత్రలో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన (1885) ఒక మైలురాయిగా వర్ణించవచ్చు. మాజీ బ్రిటిష్ అధికారులు స్థాపించిన ఆ సంస్థ ప్రారంభంలో బ్రిటిష్ ప్రభుత్వ విధానాలను వెల్లడించడం, నిర్మాణాత్మక విమర్శలను చేయడం వంటి కర్తవ్యాలను నిర్వర్తించింది.

క్రమేణా ఆ సంస్థ భారతీయుల స్వపరిపాలన ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచింది. ప్రజా సమస్యలపై సమిష్టి పోరాటం, భారతీయుల జాతీయలో భావాలను పెంపొందించడం వంటి ఆశయాలతో జాతీయోద్యమానికి చోదక శక్తిగా ఎదిగింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 2.
భారత జాతీయోద్యమంలోని వివిధ దశలను వర్ణించండి.
జవాబు.
ప్రసిద్ధ భారతీయ చరిత్రకారుడు రమేష్ చంద్ర భారత జాతీయోద్యమాన్ని మూడు దశలుగా విభజించాడు. అవి:

  1. మితవాద దశ (1885 – 1905)
  2. అతివాద దశ (1906 -1919)
  3. గాంధీ దశ (1920 – 1947).

1. మితవాద దశ (1885 – 1905) :
భారత జాతీయ కాంగ్రెస్ లోని తొలి నాయకులు “మితవాదులు”గా పేర్కొనబడిరి. 1885 నుండి 1905 వరకు ఉన్న దశను భారత జాతీయోద్యమంలో మితవాద దశ అంటారు.

కాంగ్రెస్లోని మితవాదులు :
భారత జాతీయ కాంగ్రెస్లోని తొలి నాయకులను మితవాదులందురు. 1885 – 1905 -మధ్యకాలంలో మితవాద నాయకుల నాయకత్వంలో కాంగ్రెన్ నడిచెను. వారికి బ్రిటిష్ వారి న్యాయ విధానం నందు పూర్తి విశ్వాసము కలదు. అందువల్లనే మితవాదులు “ప్రార్థన, విజ్ఞప్తి, నిరసన” (Prayer, Petition, Protest) అనే పద్ధతులను అనుసరించి బ్రిటిష్ ప్రభుత్వంతో బేరసారాలాడే దృక్పథాన్ని అవలంభించారు.

కాంగ్రెస్ పార్టీలోని ప్రముఖ మితవాదులు దాదాబాయి నౌరోజీ, ఫిరోజే మెహతా, డి.యి. వాచా, డబ్ల్యు.సి. జెనర్జీ, ఎస్.ఎన్. బెనర్జీ, R.C. దత్తు, L.M. గోష్ మరియు G.K. గోఖలే మొదలగువారు.

మితవాదుల కోర్కెలు :

  1. సైనిక ఖర్చును తగ్గించుట
  2. ఇండియన్ కౌన్సిల్ను రద్దుచేయుట
  3. ఇంగ్లండ్ బాటు భారతదేశంలో కూడా సివిల్ పరీక్షలు నిర్వహించుట
  4. శాసన మండలిని విస్తృతపరచి భారతీయులను ఎక్కువ సంఖ్యలో సభ్యులను చేయుట.

2. అతివాద దశ (1905 – 1920) :
భారత జాతీయోద్యమంలోని రెండవ దశను అతివాద దశగా పేర్కొంటారు. 1906-1919 మధ్యకాలంలో కాంగ్రెస్లో అతివాదులు ప్రధాన పాత్ర పోషించారు. అతివాదులలో ప్రముఖులు బాలగంగాధర్ తిలక్, లాలాలజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్, అరవిందఘోష్ మొదలగువారు. వీరు అతివాద ఉద్యమంలో అగ్రశ్రేణి నాయకులు మితవాదుల సామరస్య వైఖరిని అతివాదులు విమర్శించారు.

అతివాద విధానాలు :

  1. అతివాదులలో ప్రముఖుడైన బాలగంగాధర్ తిలక్ ‘స్వరాజ్యం నా జన్మహక్కు – దాన్ని సాధించి తీరుతాను’ అని ప్రకటించెను. –
  2. అతివాదులకు బ్రిటిష్ వారి దయాదాక్షిణ్యాలపై ఏ మాత్రం విశ్వాసం లేదు. అనుకొన్నది సాధించుటయే అతివాదుల కార్యక్రమం.
  3. స్వరాజ్యం – స్వదేశీ నినాదాలను లేవనెత్తిరి.
  4. జాతీయ విద్యా విధానాన్ని సమర్థించిరి, ప్రాంతీయ భారతీయ భాషల ద్వారా విద్యాబోధన జరగాలి అని తెల్పిరి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

3. గాంధీ దశ (1920 – 1947) :
స్వాత్రంత్రోద్యమ మూడవ దశ గాంధీజీ నాయకత్వంలో నడిచింది. 1920-1947 మధ్యకాలంలో మహాత్మాగాంధీ నాయకత్వంలో జాతీయోద్యమం నడిచింది. అందుచే ఈ కాలమును గాంధీయుగం అందురు. ఈ సమయంలో క్రాంగ్రెస్ శాంతియుత పద్ధతుల ద్వారా పూర్ణస్వరాజ్య సాధన కోసం ఉద్యమించెను. విప్లవ మార్గంలో పోతున్న ప్రజలను శాంతియుత, ప్రజాస్వామిక పద్ధతుల ద్వారా నడిపించిన ఖ్యాతి మహాత్ముడికి దక్కెను.

సత్యాగ్రహం :
గాంధీజీ సత్యాగ్రహం అనే విధానాన్ని ప్రతిపాదించెను. సత్యాగ్రహం అంటే సత్యమైన సహనం. దీనికి అహింసా విధానమే మూలము.

రౌలత్ చట్టం వ్యతిరేకత :
భారత రాజకీయోద్యమాన్ని నడిపించిన తిలక్ మరణించడంతో మహాత్మాగాంధీ జాతీయోద్యమ నాయకుడయ్యెను. నాయకత్వం చేపట్టిన వెంటనే మొట్టమొదట రౌలత్ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా హర్తాళ్లు జరపవలసిందిగా గాంధీజీ పిలుపు ఇచ్చెను.

సహాయ నిరాకరణోద్యమం :
1920 ఆగస్టులో గాంధీజీ తొలిసారిగా సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించెను. ఈ ఉద్యమంలో కొన్ని అంశాలు ఇమిడి ఉన్నాయి. అవి : విదేశీ వస్తువులను బహిష్కరించుట, న్యాయస్థానాలను బహిష్కరించుట, పాఠశాలలు, కళాశాలలను, శాసనసభలను బహిష్కరించుట మొదలగునవి. ఈ అంశాల ప్రాతిపదికపై సత్యం అహింసా పద్ధతుల ద్వారా మాత్రమే పోరాటం సాగించాలని గాంధీజీ పిలుపునిచ్చెను.

శాసనోల్లంఘన ఉద్యమం:
జాతీయోద్యమ చరిత్రలో శాసనోల్లంఘన ఉద్యమం ఒక గొప్ప మలుపు. 1930 మార్చితో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం ద్వారా ఈ ఉద్యమాన్ని ప్రారంభించెను. గుజరాత్ తీరంలోని దండి గ్రామంలో ఉప్పు తయారుచేయడం ద్వారా ఉప్పు చట్టాన్ని గాంధీజీ అతిక్రమించెను. ఈ ఉద్యమంలో భాగంగా విదేశీ వస్తు బహిష్కరణ, ఖద్దరు ధరించుట, మద్యపాన నిషేధం, జెండా ఆవిష్కరణ వంటి కార్యక్రమాలు చేపట్టారు.

గాంధీ – ఇర్విన్ ఒడంబడిక :
మహాత్మాగాంధీ – వైశ్రాయ్ ఇర్విన్ల మధ్య ఒక అవగాహన కుదరడంతో శాసనోల్లంఘన ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు.

క్విట్ ఇండియా ఉద్యమం :
క్రిప్స్ రాయబారం విఫలం కావడంతో కాంగ్రెస్ గాంధీజీ అధ్యక్షతన 1942, ఆగస్టు 8న బొంబాయిలో సమావేశమై క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించెను. చిట్టచివరి స్వాతంత్ర్యోద్యమ ఘట్టం క్విట్ ఇండియా ఉద్యమం. ఈ తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ గాంధీజీ తన ఉపన్యాసాన్ని “విజయమో – వీరస్వర్గమో” (Do or Die) అంటూ ముగించారు. ఈ పిలుపు ప్రజల్లో ఉద్రేకం, ఉత్సాహం నింపి పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగడానికి దారితీసెను.

చివరగా క్యాబినెట్ మిషన్ ప్లాన్, మౌంట్ బాటన్ సూచనల మేర దేశ విభజనకు కాంగ్రెస్ నాయకులు అంగీకరించిరి. భారతదేశం, భారత్-పాకిస్తాన్లుగా విడిపోయెను. 1947, ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్య్రమును పొందెను.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 3.
భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రధాన అంశాలను, విమర్శనాత్మకంగా విశ్లేషించండి.
జవాబు.
1919 చట్టంలోని లోపాలను సరిదిద్దడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని రూపొందించెను. కొన్ని ఇతర కారణాలు కూడా ఈ చట్ట రూపకల్పనకు దోహదం చేశాయి. సైమన్ కమిషన్ నివేదిక పరిణామాలు, స్వరాజ్యవాదుల ఉద్యమాలు, నెహ్రూ నివేదిక, జిన్నా నివేదిక, గాంధీజీ ఆధ్వర్యంలో సాగిన శాసనోల్లంఘన ఉద్యమం మొదలగునవి ఈ చట్టం చేయడానికి దారితీసిన కొన్ని ముఖ్యమైన అంశాలు. ఈ చట్టం చాలా విస్తృతమైనది. ఇందులో 321 అధికరణాలు, 13 షెడ్యూళ్ళు ఉన్నాయి.

ప్రధానాంశాలు :
1. 1935 భారత ప్రభుత్వ చట్టం అతివివరణాత్మకమైన శాసనం.

2. బ్రిటిష్ పాలిత ప్రాంతాలలోనూ, సంస్థానాలలోనూ అఖిల భారత సమాఖ్య అనే ఒక నూతన వ్యవస్థను ఈ చట్టం ఆవిష్కరించెను.

3. పరిపాలనాంశాలను మూడు జాబితాలుగా విభజించెను. అవి :
i) 59 పాలనాంశాలతో కూడిన కేంద్ర జాబితా (Central list)
ii) 54 పాలనాంశాలతో కూడిన ప్రాంతీయ జాబితా (Provincial list)
iii) 36 పాలనాంశాలతో కూడిన ఉమ్మడి జాబితా (Concurrent list)

ఈ మూడు జాబితాలలో పేర్కొనని అవశిష్టాంశాల (Residuary items) పై శాసనాధికారం గవర్నర్ జనరల్ కు ఇచ్చెను.
ఎ) కేంద్ర జాబితాలో ఉన్న అంశాలపై కేంద్ర ప్రభుత్వానికే శాసనాధికారం ఉంటుంది.
ఉదా : విదేశీ వ్యవహారాలు, కరెన్సీ, నాణేలు, సైనిక దళాలు మొదలగు అంశాలు.
బి) ప్రాంతీయ లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాంతీయ జాబితాలో ఉన్న అంశాలపై శాసనాధికారం కలదు.
ఉదా : పోలీస్, విద్య, ప్రాంతీయ పబ్లిక్ సర్వీసులు మొదలైన అంశాలు.
సి) ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ శాసనం చేయవచ్చును.
ఉదా : క్రిమినల్ లా & ప్రొసీజర్, సివిల్ ప్రొసీజర్, వివాహాలు, విడాకుల వంటి అంశాలు

4. కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టిరి. కేంద్ర కార్యనిర్వహణాధికారం గవర్నర్ జనరల్కు ఇచ్చారు. కేంద్ర పాలనాంశాలను రిజర్వుడ్ ట్రాన్స్ఫర్డ్ పాలనాంశాలని విభజించారు. దేశ రక్షణ, మత విషయాలు, విదేశీ వ్యవహారాలు మొదలైన ప్రాముఖ్యం ఉన్న అంశాలు అన్నీ రిజర్వుడ్ పాలనాంశాలు.

వీటిని గవర్నర్ జనరల్ నిర్వహిస్తాడు. మిగిలిన అంశాలు ట్రాన్స్ఫర్డ్ అంశాలు. వీటిని ప్రజాప్రతినిధులైన శాసనసభలోని మంత్రులు నిర్వహిస్తారు. ఆరు రాష్ట్రాల్లో ద్వంద్వ సభా విధానాన్ని అమలు చేయడం జరిగెను.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

5. రాష్ట్రాల్లో స్వయం పాలనా ప్రతిపత్తి ప్రవేశపెట్టడం జరిగెను. అక్కడ బాధ్యతాయుత ప్రభుత్వం కూడా నెలకొల్పారు. గవర్నర్లకు విశేషమైన విచక్షణాధికారాలు ఇచ్చారు.

6. ఫెడరల్ న్యాయస్థానాన్ని ఢిల్లీలో స్థాపించారు. దానికి 1935 చట్టాన్ని కూడా వ్యాఖ్యానించే అధికారం కలదు.

7. 1858 చట్టము సృష్టించిన భారత మండలిని రద్దు చేశారు.

8. 1935 చట్టాన్ని సవరించడానికి బ్రిటిష్ పార్లమెంట్క అధికారం ఇచ్చారు. సంస్థానాలకు ప్రత్యేక హోదా కల్పించారు.

9. గవర్నర్ జనరల్కు విస్తృత అధికారాలు ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో గవర్నర్ జనరల్ సమాఖ్య వ్యవస్థను రద్దు చేయవచ్చు.

10. ఓటు హక్కును ఇతర వర్గాలకు కూడా విస్తరించారు.

విమర్శ :
భారత రాజ్యాంగ చరిత్రలో భారత ప్రభుత్వ చట్టం, 1935 ప్రగతి శీలక చట్టమని రాజ్యాంగ వాదులు భావించారు. ఎందుకంటే ఈ చట్టం ఆధారంగానే స్వతంత్ర భారత రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం జరిగింది. పూర్వ చట్టాలతో పోల్చితే ఈ చట్టం భారతదేశంలో మరింత బాధ్యతాయుత ప్రభుత్వ నిర్మాణానికి, స్పష్టమైన శాసన నిర్మాణ, న్యాయశాఖల అధికారాల పరిధిని విస్తృతం చేసింది.

అయితే ఈ చట్టాన్ని భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, నిశితంగా విమర్శించాయి. భారత వ్యతిరేక చట్టంగా సి.వై.చింతామణి పేర్కొన్నాడు. ఈ చట్టం ప్రాథమికంగా చెడిపోయిన, ఏ మాత్రం ఆమోదయోగ్యం కాని చట్టంగా మహ్మదాలీ జిన్నా విమర్శించాడు.

ఇక జవహర్లాల్ నెహ్రూ ఈ చట్టం గురించి వ్యాఖ్యానిస్తూ సామ్రాజ్యవాద దృక్పథం ఉన్న బ్రిటన్ రాజనీతిజ్ఞతతో భారతదేశం కోసం రూపొందించిన చట్టంగా వర్ణించాడు. రాజేంద్రప్రసాద్ మినూమసానీ, కె.టి.షా వంటి ప్రముఖ నాయకులు ఈ చట్టంలో ఎన్నో అసంగతమైన విషయాలున్నాయని వ్యాఖ్యానించారు.

ఇక బ్రిటన్లో క్లిమెంట్ అట్లీ వంటి ప్రతిపక్ష నాయకులు కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకించారు. ఏమాత్రం ఇష్టంలేని ప్రాంతాలను కలిపి ఉంచే ఉద్దేశంతో రూపొందిన, వింత పోకడలు గల రాజ్యాంగ సమ్మేళనంగా కొందరు ఈ చట్టాన్ని పరిగణించారు. భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో గోచరించే భూస్వామ్య వ్యవస్థను దృఢతరం చేయడానికి బ్రిటిష్ పాలకులు ఆడిన నాటకమే ఈ చట్టమని సుభాష్ చంద్రబోస్ విమర్శించాడు.

ఈ చట్టం సూచించిన అఖిల భారత సమాఖ్య ఆచరణ సాధ్యం కాదని కొందరు వాదించారు. ప్రతిపాదిత సమాఖ్యలో పాల్గొనే వివిధ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల, సంస్థానాధికారుల స్థాయిలలో తేడాలుండటం, రాష్ట్రాలు, సంస్థానాల మధ్య పాలనపరమైన వైవిధ్యాలు ఉండటంతో సమాఖ్య వ్యవస్థ సజావుగా కొనసాగదని వారు భావించారు.

అలాగే గవర్నర్ జనరల్, రాష్ట్ర గవర్నర్లకు మితిమీరిన అధికారాలను ఈ చట్టం కల్పించడంతో భారతీయులు కోరుకున్న స్వయంప్రతిపత్తి ఒక నినాదంగా మిగిలిపోయింది. ఈ చట్టం ద్వారా మైనారిటీలకు కల్పించిన ప్రత్యేక రక్షణలు భారతదేశంలో జాతీయతాభావ వికాసానికి అవరోధంగా నిలిచాయి.

ఈ చట్టం భారత వ్యవహారాల కార్యదర్శిని ఒక రాజులాగా వ్యవహరించే అవకాశాన్ని ఇచ్చింది. ఇక కేంద్ర శాసనసభలోని రాష్ట్రాల మండలి (Council of State) ని ఈ చట్టం ప్రగతి నిరోధక భావాలు, దుష్టజనకూటమి, సాంప్రదాయ భావాలు ఉన్న రాజకీయ నాయకుల నిలయంగా రూపొందించింది. మొత్తంమీద ఈ చట్టం ద్వారా కల్పించిన రక్షణలన్నీ కంటితుడుపు చర్యగా మిగిలిపోయాయని చెప్పవచ్చు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 4.
భారత రాజ్యాంగ ప్రధాన లక్షణాలను వివరించండి.
జవాబు.
భారత రాజ్యాంగ ప్రధాన లక్షణాలు :

1. అతిపెద్ద లిఖిత, వివరణాత్మక రాజ్యాంగం :
భారత రాజ్యాంగం ఒక అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ రూపకల్పన చేసి, చర్చించి మౌలిక చట్టంగా తయారు చేసింది. భారత రాజ్యాంగ రచనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది.

భారత రాజ్యాంగాన్ని 395 నిబంధనలు, 22 భాగాలు. 12 షెడ్యూళ్ళతో ఏర్పరచారు. భారత రాజ్యాంగం అతిపెద్ద పరిమాణంలో రూపొందడానికి ఎన్నో కారణాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తదితర పాలన ఏర్పాట్ల గురించి ఒకే రాజ్యాంగంలో చర్చించారు.

అలాగే సమాజంలోని షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలు, ఇతర వెనుకబడ్డ వర్గాలు మొదలైన వారి ప్రయోజనాల పరిరక్షణకు వివిధ ఏర్పాట్లు రాజ్యంగంలో పొందుపరచారు. ఇదే క్రమంలో ప్రత్యేక రాజ్యాంగబద్ధ సంస్థలైన ఎన్నికల సంఘం, యూనియన్ పబ్లిక్ సర్వీసు కమీషన్, రాష్ట్రపబ్లిక్ సర్వీసు కమీషన్ల ఏర్పాట్లు అధికారాలపై సంగ్రహ వివరణ రాజ్యాంగంలో ఉంది.

ఇదే విధంగా భారత రాజ్యాంగం పౌరులకు గల ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, నిర్దేశక నియమాలు, కేంద్ర – రాష్ట్ర సంబంధాలు, అధికార భాష – వివిధ ప్రాంతీయ భాషల గుర్తింపుకు సంబంధించిన అంశాలను విస్తృతంగా చర్చించింది. వీటన్నింటివల్ల భారత రాజ్యాంగం పరిమాణంలో పెద్దదిగా తయారైంది.

2. సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం:
భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించడంతో భారతదేశం ఒక సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మారింది. భారతదేశం పూర్తి సాధికారతతో స్వేచ్ఛ – స్వాతంత్య్రాలలో దేశీయంగా బాహ్యంగా నిర్ణయాలు తీసుకొనే సార్వభౌమాధికారాన్ని పొందింది.

రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాద లౌకిక అనే పదాలను రాజ్యాంగం 42వ సవరణ ద్వారా 1976 లో పొందుపరచారు. దీనివల్ల రాజ్యం ప్రజలందరికీ సాంఘిక-ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందిస్తూ, అన్ని రకాల దోపిడీలను అంతం చేస్తుంది.

3. విశిష్ట ఆశయాలు లక్ష్యాలు :
భారత రాజ్యాంగం ఎన్నో విశిష్ట ఆశయాలు-లక్ష్యాలను కలిగి ఉంది. భారత రాజ్యాంగం తన పౌరులందరికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అన్ని విషయాల్లో అందిస్తుంది. అలాగే పౌరులందరికీ ఆలోచనా స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ, నమ్మకం, విశ్వాసం, ఆరాధన తదితర విషయాల్లో స్వేచ్ఛలకు హామీ ఇస్తుంది.

ఇదే క్రమంలో భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమాన హోదా, సమాన అవకాశాలు కల్పిస్తుంది. భారత రాజ్యాంగం ప్రజలలో సౌభ్రాతృత్వాన్ని పెంపొందించి, వ్యక్తి గౌరవాన్ని – జాతి సమైక్యత, సమగ్రతలను పరిరక్షించడానికి హామీ ఇస్తుంది.

4. దృఢ – అదృఢల మేలు కలయిక :
భారత రాజ్యాంగాన్ని సవరించడానికి దృఢ అదృఢ పద్ధతులు ఉన్నాయి. కేంద్ర పార్లమెంట్ రాజ్యాంగంలోని కొన్ని భాగాలను సాధారణ మెజారిటీతో సవరించే అధికారాన్ని కలిగి ఉంది. ఉదాహరణకు భారత సమాఖ్యలో నూతన రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల సరిహద్దులు మార్చడం, పౌరసత్వానికి సంబంధించిన నియమ నిబంధనలు మొదలైన వాటిని సాధారణ మెజారిటీతో సవరించవచ్చు.

ఇది అదృఢ పద్ధతి. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, నిర్దేశక నియమాలు తదితర అంశాలను పార్లమెంట్లో మూడింట రెండువంతుల మెజారిటీ (2/3) తో సవరించవవచ్చు. ఇది దృఢ పద్ధతి. రాజ్యాంగంలోని మరికొన్ని అంశాల సవరణకు ఒక ప్రత్యేక మెజారిటీ పద్ధతి ఉంది. దీని ప్రకారం పార్లమెంట్లోని రెండు సభల్లో 2/3 మెజారిటీతోపాటు, కనీసం 50% రాష్ట్రాల శాసన సభలు సవరణకు ఆమోదించాలి. ఇది చాలా సంక్లిష్టమైన దృఢ పద్ధతి.

5. ఏకకేంద్ర – సమాఖ్య లక్షణాలు :
భారత రాజ్యాంగం భారతదేశాన్ని రాష్ట్రాల సమ్మేళనం (Union of States) గా అభివర్ణిస్తుంది. భారతదేశాన్ని ఏకకేంద్ర స్ఫూర్తితో సమాఖ్య వ్యవస్థగా ఏర్పరచింది. అంటే సాధారణ పరిస్థితుల్లో సమాఖ్య విధానాన్ని, అత్యవసర పరిస్థితుల్లో ఏకకేంద్ర నిర్మాణాన్ని పేర్కొంటుంది.

భారత రాజ్యాంగంలో ఏకకేంద్ర లక్షణాలైన ఏక పౌరసత్వం, ఏకీకృత న్యాయవ్యవస్థ, ఒకే ఒక్క ఎన్నికల సంఘం, రాష్ట్రాల పరిపాలనలో అఖిల భారత సర్వీస్ ఉద్యోగుల పాత్ర, కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్లు ఏజెంట్లుగా ఉండడం, రాజ్యాంగ సవరణ ప్రక్రియలో పార్లమెంట్కు గల విశేష అధికారాలు తదితర లక్షణాలు ఉన్నాయి.

ఇదే క్రమంలో భారత రాజ్యాంగంలో సమాఖ్య లక్షణాలైన లిఖిత దృఢ-సర్వోన్నత రాజ్యాంగం రెండు స్థాయిల్లో (కేంద్ర – రాష్ట్ర) ప్రభుత్వాలు, ద్విసభా పద్ధతి, కేంద్రపార్లమెంట్ ఎగువ సభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తదితర లక్షణాలు ఉన్నాయి.
ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు కె.సి. వైర్ భారతదేశాన్ని అర్థసమాఖ్యగా వర్ణించాడు.

6. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం:
భారత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వంలో, వివిధ రాష్ట్రాల స్థాయిలో బ్రిటీష్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది. అయితే బ్రిటీష్ తరహా వారసత్వ రాజరికాన్ని భారతదేశం స్వీకరించలేదు. దీనికి బదులుగా భారత రాజ్యాంగ నిర్మాతలు ఐర్లాండ్ తరహాలో ఎన్నికయ్యే అధ్యక్షుడు ఉండే వ్యవస్థను సూచించారు.

అలాగే బ్రిటీషు రాజకీయ వ్యవస్థ మిగిలిన ఇతర లక్షణాలైన రెండు రకాల కార్యనిర్వాహక నాయకత్వం (రాష్ట్రపతి – ప్రధానమంత్రి), కేంద్రంలో ప్రధానమంత్రి నాయకత్వం, సమిష్టి బాధ్యత నియమం, కేంద్ర కార్యనిర్వాహక వర్గం (మంత్రిమండలి) పై పార్లమెంటు నియంత్రణ, రాష్ట్రపతికి నామమాత్రపు అధికారాలు తదితర లక్షణాలను భారత రాజ్యాంగం స్వీకరించింది. ఇదే తరహా రాజకీయ వ్యవస్థను వివిధ రాష్ట్రాలకు కూడా అన్వయింపజేసింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

7. స్వతంత్ర న్యాయశాఖ:
భారత రాజ్యాంగం భారతీయులకు ఒక స్వతంత్ర, ఏకీకృత న్యాయశాఖను అందించింది. అందువల్ల భారత సుప్రీంకోర్టు వివిధ హైకోర్టులు శాసన నిర్మాణ శాఖకు – కార్యనిర్వాహక వర్గానికి భయం లేదా అనుకూలతలు లేకుండా స్వతంత్రంగా వ్యవహరించే అధికారాన్ని కలిగి ఉన్నాయి.

8. రాజ్య విధానాలపై ఆదేశక సూత్రాలు :
భారత రాజ్యాంగంలోని నాలుగో భాగంలో 36వ నిబంధన నుండి 51వ నిబంధన వరకు రాజ్యవిధానాల రూపకల్పనలో రాజ్యాంగ ఆదేశక సూత్రాలు పొందుపరచారు. భారత రాజ్యాంగ నిర్మాతలు వీటిని ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి స్వీకరించారు.

ఈ ఆదేశక సూత్రాలు భారతదేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగా, గాంధేయవాద దేశంగా, ఉదారవాద రాజ్యంగా రూపొందిస్తాయి. రాజకీయ భావజాలాలతో సంబంధం కాకుండా కేంద్ర ప్రభుత్వంలోని – రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టే అన్ని పార్టీలు ఈ మూల సూత్రాలను తప్పనిసరిగా అమలు చేయాలి.

9. ప్రాథమిక హక్కులు:
భారత రాజ్యాంగ ఉదారవాద ప్రజాస్వామ్య స్వభావం ప్రాథమిక హక్కుల్లో ప్రతిబింబిస్తుంది. ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగంలోని మూడో భాగంలో 12వ నిబంధన నుండి 35వ నిబంధన వరకు పొందుపరచారు. భారత పౌరులు కొన్ని హేతుబద్ధమైన పరిమితులకు లోబడి హక్కులను వినియోగించుకోవచ్చు. ఈ హక్కుల విషయంలో ప్రభుత్వంతో సహా ఎవ్వరి జోక్యాన్ని అనుమతించడం జరగదు. దేశ అత్యున్నత న్యాయవ్యవస్థ పౌరులకు హక్కుల పరిరక్షణలో తోడ్పడుతుంది.

రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఏడురకాల ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో ఉండేవి. ప్రస్తుతం ఇవి ఆరు హక్కులుగా ఉన్నాయి. అవి

  1. సమానత్వపు హక్కు
  2. స్వాతంత్రపు హక్కు
  3. పీడనను, దోపిడిని వ్యతిరేకించే హక్కు
  4. మత స్వేచ్ఛ హక్కు
  5. విద్య – సాంస్కృతిక హక్కులు
  6. రాజ్యాంగ పరిహార హక్కు
    అయితే ఆస్తి హక్కును 44వ రాజ్యాంగ సవరణ ఆధారంగా ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు.

10. ప్రాథమిక విధులు :
భారత రాజ్యాంగ సంస్కరణలపై స్వర్ణసింగ్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు భారత రాజ్యాంగం లోని నాలుగు-ఎ (Part – IV A) భాగంలో 51 ఎ (51 A) నిబంధనలో ప్రాథమిక విధులను పొందుపరచారు. మొదట్లో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ఆధారంగా పది ప్రాథమిక విధులుగా వీటిని ఏర్పరచారు. అయితే ఆ తరువాత భారత రాజ్యాంగ 86వ సవరణ చట్టం (2002) ఆధారంగా మరో ప్రాథమిక విధిని వీటికి జత చేశారు.

11. ఏక పౌరసత్వం :
భారత రాజ్యాంగం భారతదేశంలో జన్మించిన వారందరికీ, లేదా ఒక నిర్దిష్ట కాలంపాటు -భారతదేశంలో నివసిస్తున్న వారికి ఏకపౌరసత్వాన్ని అందిస్తుంది. భారతదేశ సమైక్యత – సమగ్రతను పరిరక్షించడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. భారతదేశంలో విచ్చిన్నకర ధోరణులు తలెత్తకుండా రాజ్యాంగ నిర్మాతలు ఏక పౌరసత్వం ఏర్పాటు చేశారు.

12. సార్వజనీన వయోజన ఓటు హక్కు:
భారత రాజ్యంగం భారతదేశ వయోజన పౌరులందరికీ సార్వజనీన ఓటుహక్కును కల్పించింది. దీని ఫలితంగా భారత పౌరులు కులం, మతం, భాష, ప్రాంతం, లింగ విచక్షణ, వర్ణం, జాతి సంపద తదితర అంశాల ఆధారంగా ఉండే విచక్షణలకు అతీతంగా, కేవలం వయోపరిమితితో మాత్రమే ఓటు హక్కును పొందుతారు.

భారతపౌరులు ఈ హక్కును సక్రమంగా వినియోగించుకోవచ్చు. వయోజన ఓటింగ్ వయస్సు 1950-1987 మధ్య కాలంలో 21 సంవత్సరాలుగా ఉండేది. అయితే ఈ వయోపరిమితిని భారత రాజ్యాంగ 61వ సవరణ ఆధారంగా 1988లో 18 సంవత్సరాలకు తగ్గించారు.

13. ద్విసభా పద్ధతి :
భారత రాజ్యాంగం జాతీయ స్థాయిలో ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టింది. దీనికి అనుగుణంగా భారత పార్లమెంట్లో లోక్సభ (దిగువసభ), రాజ్యసభ (ఎగువసభ) అనే రెండు సభలుంటాయి. లోక్సభ ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నికయ్యే ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.

14. పంచాయతీ రాజ్ – నగరపాలిక చట్టాలు :
దీనిని భారత రాజ్యాంగ విశిష్ట లక్షణంగా పేర్కొనవచ్చు. మహాత్మాగాంధీ ఎన్నో సందర్భాలలో స్థానిక స్వపరిపాలన సంస్థలను ఏర్పాటుచేసి, బలోపేతం చేయవలసిన అవసరాన్ని పేర్కొన్నాడు. ఈ సంస్థల కార్యసాధకతను పెంపొందించడానికి తగిన సదుపాయాలు అవకాశాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని విశ్వసించాడు. స్వాతంత్య్రానంతరం స్థానిక స్వపరిపాలన సంస్థల పటిష్టతకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. వీటన్నింటి ఫలితంగా భారత నగరపాలిక చట్టం 1992లో రూపొందింది.

15. షెడ్యూలు కులాలు, తెగల అభ్యున్నతికి ప్రత్యేక నిబంధనలు :
భారత రాజ్యాంగం భారతదేశంలోని షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల అభ్యున్నతికి కొన్ని నిర్దిష్ట మార్గదర్శకాలను సూచించింది. కేంద్రప్రభుత్వం – వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడ్డ వర్గాల అభ్యున్నతికి పెంపొందించే చర్యలను సమీక్షించడానికి వీలుగా స్వతంత్ర హోదాగల కమీషన్లు ఏర్పాటు చేయాలని సూచించింది. వాటి సిఫార్సులకు అనుగుణంగా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించడానికి అవకాశం కల్పించింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారత జాతీయోద్యమ ఆవిర్భావానికి ఏవేని నాలుగు కారణాలను తెలపండి.
జవాబు.
1. సాంఘిక-సాంస్కృతిక పునరుజ్జీవం :
భారతదేశంలో 19వ శతాబ్దంలో వచ్చిన అనేక సాంఘిక సాంస్కృతిక ఉద్యమాలు ప్రజల్లో సాంఘిక చైతన్యాన్ని, సాంస్కృతిక జాతీయవాద భావనలను ప్రోది చేశాయి. ఈ ఉద్యమాలన్నింటికి రాజా రామ్మోహన్రాయ్ స్థాపించిన బ్రహ్మసమాజ్ ఉద్యమం అగ్రగామిగా నిలిచి, సాంఘిక దురాచారాలైన సతీసహగమనం, బాల్యవివాహాలు, వితంతువులుగా మార్చడం, విగ్రహారాధన తదితరులకు వ్యతిరేకంగా సంస్కరణలు జరగాలని పిలుపునిచ్చింది.

దీనిని అనుసరించి ఆర్యసమాజం, రామకృష్ణ మిషన్, దివ్యజ్ఞాన సమాజం, ప్రార్థన సమాజం, సత్యశోధక సమాజం, అలీఘర్ ఉద్యమం, వహాబీ ఉద్యమం తదితర సాంఘిక ఉద్యమాలు వచ్చాయి. ఈ ఉద్యమాలు ప్రజల్లో జాతీయవాద భావనను, సాంఘిక – సాంస్కృతిక గుర్తింపును, దేశభక్తిని నింపి పరోక్షంగా ప్రజలు స్వయంపాలన కోరుకోవడానికి ప్రేరణ నిచ్చాయి.

2. వార్తాపత్రికలు :
బ్రిటిష్ పాలన కాలంలో ఎన్నో వార్తాపత్రికలు, దినపత్రికలు నియతకాలిక పత్రికలు భారతీయులలో జాతీయవాద భావాలను ప్రేరేపించాయి. వీటిలో ముఖ్యమైనవి అమృతబజార్ పత్రిక, కేసరి, పాట్రియాట్, ది హిందూ, నవజీవన్, ఆంధ్రపత్రిక మొదలైనవి. ఈ పత్రికలు ప్రజలలో దేశభక్తి, జాతీయవాద భావాలను పెంచి పోషించాయి.

జాతీయవాద భావాల వ్యాప్తిలోను, ప్రజల ఆకాంక్షలు, ఆశలు, డిమాండ్లు మొదలైన వాటిని బ్రిటిష్ ప్రభుత్వం ముందు వ్యక్తీకరించడంలోను వార్తాపత్రికలు కీలక పాత్ర పోషించాయి. ప్రఖ్యాత స్వాతంత్ర్యోద్యమ జాతీయ నాయకులు మోతీలాల్ నెహ్రూ, సురేంద్రనాధ్ బెనర్జీ, బాలగంగాధర్ తిలక్, మహాత్మాగాంధీ, డా॥బి.ఆర్. అంబేద్కర్ తదితరులు వార్తాపత్రికలు ద్వారా జాతీయవాద ఆదర్శాలను వ్యాపింపచేయడానికి ఎంతో కృషి చేశారు.

3. జాతి విచక్షణ :
బ్రిటిష్ ప్రభుత్వం న్యాయప్రక్రియల్లో, సివిల్ సర్వీసుల ఉద్యోగాల ప్రవేశంలో హక్కులను, అనుమతించడంలో ఎంతో వివక్షపూరిత ధోరణి ప్రదర్శించేది. జాతీయోద్యమ ప్రారంభదశలో భారతీయులు, సివిల్ సర్వీస్ ఉద్యోగాలలో ప్రవేశాలకు సంబంధించి విషయాలలో బ్రిటిషు అభ్యర్థులతో సమానంగా అవాకాశాలు ఉండాలని డిమాండ్ చేసేవారు.

అలాగే బ్రిటిష్వారి వివక్షత విధానం ఇల్బర్ట్ బిల్లు వివాదంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. భారతదేశంలోని యూరోపియన్ సమూహాలు భారతీయ న్యాయ మార్పులు తమ నేరాలను విచారించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ తరహా ధోరణులు భారతీయుల మనోభావాలను దెబ్బతీయడంతో, అది జాతీయోద్యమానికి దారితీసింది.

4. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన (Inceptin of Indian National Congress) :
భారత జాతీయోద్యమ చరిత్రలో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన (1885) ఒక మైలురాయిగా వర్ణించవచ్చు. మాజీ బ్రిటిష్ అధికారులు స్థాపించిన ఆ సంస్థ ప్రారంభంలో బ్రిటిష్ ప్రభుత్వ విధానాలను వెల్లడించడం, నిర్మాణాత్మక విమర్శలను చేయడం వంటి కర్తవ్యాలను నిర్వర్తించింది.

క్రమేణా ఆ సంస్థ భారతీయుల స్వపరిపాలన ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచింది. ప్రజా సమస్యలపై సమిష్టి పోరాటం, భారతీయులలో జాతీయ భావాలను పెంపొందించడం వంటి ఆశయాలతో జాతీయోద్యమానికి చోదక శక్తిగా ఎదిగింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 2.
భారత జాతీయోద్యమంలో అతివాదుల పాత్ర వివరించండి.
జవాబు.
భారతజాతీయోద్యమంలో రెండో దశయే అతివాదదశ. ఈ దశను కొందరు చరిత్రకారులు తీవ్ర జాతీయతా దశగా వర్ణించారు. హిందూ పునరుజ్జీవనం, బ్రిటిష్ పాలకులపట్ల ద్వేషం లార్డ్ కర్జన్ క్రూరపాలన, బెంగాల్ విభజన, క్షీణించిన ఆర్థిక పరిస్థితులు, సమకాలీన అంతర్జాతీయ సంఘటనలు, విదేశాలలో భారతీయుల కడగండ్లు మొదలైన అంశాలు భారతీయులను ఈ దశలో జాతీయోద్యమం వైపు మొగ్గు చూపేటట్లు ప్రభావితం చేశాయి. అలాగే మితవాదులు అనుసరించిన మెతకవైఖరి కూడా ఈ కాలంలో ఉద్యమకారులలో అసంతృప్తిని పెంపొందించింది.

బాలగంగాధర తిలక్, లాలాలజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్, అరవిందఘోష్ వంటి నాయకులు అతివాదులుగా పరిగణించబడి ఈ దశలో కీలకపాత్ర పోషించారు. బ్రిటిష్ పాలకులు బెంగాల్ను రెండు ముక్కలుగా విభజించడాన్ని అతివాదులు తీవ్రంగా వ్యతిరేకించారు.

బ్రిటిష్ పాలకులు ప్రజాస్వామ్య, స్వేచ్ఛాయుత, ఉదార ప్రియులనే మితవాదుల అభిప్రాయంలో అతివాదులు విభేదించారు. బ్రిటిష్పాలకులు భారతదేశంపట్ల అనుసరించిన అణచివేత, ప్రగతి వ్యతిరేకత, అప్రజాస్వామిక పద్ధతుల వల్లనే భారతీయులు బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు.

బాలగంగాధరతిలక్ ‘స్వరాజ్యం నా జన్మహక్కు- దాన్ని సాధించి తీరుతాను’ అనే నినాదంతో దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. అలాగే మిగిలిన అతివాదులు బ్రిటిష్ పాలకులపట్ల సకారాత్మక (passive) ప్రతిఘటన వైఖరిని అనుసరించారు. మొత్తం మీద అతివాదులు కింద పేర్కొన్న పద్ధతులను భారతీయులు అనుసరించవలసి ఉంటుందని ఉద్భోదించారు.

  1. వస్తువులను, బ్రిటిష్ ప్రభుత్వ గౌరవ బిరుదులను, కార్యాలయాలను బహిష్కరించడం.
  2. స్వదేశీ విద్యను ప్రోత్సహించడం.
  3. శాసన మండలల్లో భారతీయులకు సభ్యత్వం వంటి అంశాల అమలు కోసం కృషిచేయడం.
  4. స్వదేశీ వస్తువులను, పరిశ్రమలను ఆదరించడం.
  5. నకారాత్మక ప్రతిఘటనకు (Passive resistence) పాల్పడటం.

వందేమాతరం, స్వదేశీ వంటి ఉద్యమాలను అతివాదులు నిర్వహించారు. భారతీయులకు స్వయం పాలన, స్వరాజ్యం సాధించాలనే ప్రధాన ఆశయంతో వారు ఆ ఉద్యమాలను చేపట్టారు. తమ ఆశయసాధన కోసం ముస్లింలీగ్ వంటి ఇతర పార్టీలు, సంస్థలతో కలిసి ఉద్యమించారు.

అతివాదుల ఒత్తిడికి లోనైన బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ పునరేకీకరణ (reunification) కు అంగీకరించింది. అలాగే మాంటేగు ఛేమ్స్ఫర్డ్ పథకం ద్వారా ప్రాతినిథ్య సంస్థలలో భారతీయులకు సముచిత ప్రాధాన్యాన్ని ఇవ్వడానికి అంగీకరించారు. భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 3.
భారత జాతీయోద్యమంలోని గాంధీ దశలోని ప్రధాన సంఘటనలు రాయండి.
జవాబు.
1920 నుండి 1947 మధ్య జరిగిన భారత జాతీయోద్యమంలో గాంధీదశ చిట్ట చివరి దశగా, ముగింపు దశగా పేర్కొనవచ్చు. ఈ దశలో మహాత్మాగాంధీ కీలక పాత్ర పోషించి, మితవాద పద్ధతులు – అతివాద పద్ధతులను మేళవించి, జాతీయోద్యమాన్ని నడిపించారు.

గాంధీ దశలోని సంఘటనలు సహాయ నిరాకరణ ఉద్యమము :
భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో సహాయ నిరాకరణోద్యమం ఒక గొప్ప మలుపుగా చరిత్రకారులు భావించారు. ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతునిస్తూ, జలియన్వాలాబాగ్ ఘోర సంఘటనను నిరసిస్తూ గాంధీజీ ఉద్యమాన్ని 1920 ఆగస్టులో ప్రారంభించారు. అవి ఏమిటంటే :

  • సకారాత్మక కార్యక్రమాలు
  • నకారాత్మక కార్యక్రమాలు.

ఆ రెండింటిని కింద పేర్కొనడమైంది.

1. సకారాత్మక కార్యక్రమాలు (Positive or Constructive Programmes) :
సకారాత్మక కార్యక్రమాలలో క్రింది అంశాలు ఇమిడి ఉన్నాయి.
అ) సహాయ నిరాకరణ కార్యక్రమాలను అమలులో ఉంచడానికి కోటి రూపాయల విరాళాల సేకరణ.
ఆ) భారతీయులకు ఉపాధి కల్పించడానికి ఇరవై లక్షల రాట్నాల పంపకం.
ఇ) జాతీయ విద్యా ప్రణాళికల రూపకల్పన, అమలు మొదలగునవి.

2. నకారాత్మక కార్యక్రమాలు (Negative Programmes):
నకారాత్మక కార్యక్రమాలలో కింది అంశాలను ప్రస్తావించడమైంది.
అ) బ్రిటిష్ ప్రభుత్వం ప్రసాదించిన బిరుదులు, గౌరవ పదవులను పరిత్యజించడం.
ఆ) బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహించే అధికారిక సమావేశాలకు గైర్హాజరవడం.
ఇ) బ్రిటిష్ న్యాయస్థానాల బహిష్కరణ మొదలగునవి.

శాసనోల్లంఘనోద్యమం (Civil Disobedience Movement (1930 – 34) :
సహాయ నిరాకరణోద్యమం తరువాత భారత జాతీయోద్యమంలో చెప్పుకోదగిన సంఘటనలలో శాసనోల్లంఘన ఒకటి. ఈ ఉద్యమాన్ని 1930 మార్చి 12న భారత జాతీయ కాంగ్రెస్ గాంధీజీ మార్గదర్శకత్వంలో ప్రారంభించింది.

అంతకుముందు 1929 డిసెంబర్ 29న లాహోర్లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన సమావేశమైన భారత జాతీయ కాంగ్రెస్ భారతీయులకు సంపూర్ణ స్వరాజ్య సాధనయే తన ఆశయంగానూ, అందుకు బ్రిటిష్ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయాలనే అల్టిమేటము జారీచేసింది.

శాసనోల్లంఘన ఉద్యమంలో మూడు ప్రధాన దశలున్నాయి. మొదటి దశలో భారతీయులు ఉప్పుసత్యాగ్రహాన్ని నిర్వహించాలని గాంధీజీ సూచించాడు గాంధీజీ స్వయంగా 78 మంది అనుచరులతో కాలిబాటన సబర్మతీ ఆశ్రమం నుంచి 240 మైళ్ళ దూరంలో అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న ‘దండి’ అనే గ్రామానికి వెళ్ళి ఉప్పును తయారుచేశాడు. గాంధీజీతో సహా దేశవ్యాప్తంగా వేలాదిమంది ప్రజలు ఆయా ప్రాంతాలలో ఉప్పు సత్యాగ్రహాన్ని పాటించడానికి పోటీ పడ్డారు.

క్విట్ ఇండియా ఉద్యమం (Quit India Movement, 1942 August – 1994 May) :
భారత జాతీయోద్యమంలో అంతిమ ఘట్టమే క్విట్ ఇండియా ఉద్యమం. భారతదేశానికి స్వాతంత్య్రం, భారతీయులకు స్వీయ రాజ్యాంగం కావాలని అనేకసార్లు బ్రిటిష్ ప్రభుత్వానికి భారత జాతీయ నాయకులు విజ్ఞప్తి చేసినప్పటికీ వారి ప్రయత్నాలు సఫలం కాలేదు. ప్రతిసారీ బ్రిటిష్ పాలకులు భారతీయుల స్వాతంత్ర్య ఆకాంక్షలను సంపూర్ణంగా నెరవేర్చక, అరకొర పథకాలను మాత్రమే ప్రకటించారు.

వేరొకవైపు రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభంలో బ్రిటిష్ పాలకులు సంబంధిత భారత జాతీయ నాయకులతో చర్చించకుండానే భారతదేశాన్ని మిత్ర రాజ్యంగా ప్రకటించడం జరిగింది. 1942 నాటి క్రిప్స్ ప్రతిపాదనలు భారతీయులకు ఏ మాత్రం సంతృప్తినివ్వలేకపోయాయి.

అంతలో జపాన్ సైన్యం భారతదేశం వైపు దండయాత్రకు పాల్పడుతుందనే పుకార్లు వ్యాపించాయి. బ్రిటిష్ పాలకులు ఆ సమయంలో భారతదేశం వదలి వెళ్ళడం భావ్యమని, తద్వారా జపాన్ సైన్యం దండయాత్రను నివారించవచ్చనే అభిప్రాయాన్ని గాంధీజీ వెల్లడించాడు.

భారతీయులతో కూడిన తాత్కాలిక ప్రభుత్వాన్ని, రాజ్యాంగ పరిషత్తును వెంటనే ఏర్పాటు చేయాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తన నిర్ణయాన్ని కాంగ్రెస్ భారత రాజప్రతినిధితో తెలపడానికి మీరాబెన్ అనే కార్యకర్తను పంపించింది.

అయితే ఆమెతో భారత రాజప్రతినిధి సమావేశమవడానికి అంగీకరించలేదు. దాంతో గాంధీజీ నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమాన్ని 1942 ఆగస్టు 9న ప్రారంభించింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 4.
భారత స్వాతంత్ర్య పోరాటంలో హోమ్హూల్ ఉద్యమాన్ని వర్ణించండి.
జవాబు.
హోమ్హూల్ ఉద్యమం :
భారత జాతీయోద్యమ కాలంలో నిర్వహించబడిన ఉద్యమాలలో హోమ్హూల్ ఉద్యమం ఒకటి. ఈ ఉద్యమానికి లోకమాన్య బాలగంగాధర్ తిలక్, అనిబిసెంట్లు సారధ్యం వహించారు. మాండలే జైలులో ఆరేళ్ళపాటు కారాగార శిక్ష అనుభవించిన లోకమాన్య బాలగంగాధర్ తిలకన్ను 1914 జూన్లో బ్రిటిష్ ప్రభుత్వం వదిలిపెట్టింది.

భారతదేశానికి తిరిగి వచ్చిన తిలక్ భారత జాతీయ కాంగ్రెస్ నాయకులతో సహృద్భావ సంబంధాలు పునరుద్ధరించుకొని నిర్మాణాత్మక కార్యక్రమాల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వాన్ని నొప్పించకుండా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఐర్లాండ్ తరహాలో కొన్ని హోంరూల్ మండలులను నెలకొల్పడానికి కృషి చేశాడు. అందులో భాగంగా మద్రాస్లో దివ్యజ్ఞాన సమాజ

స్థాపకురాలు అనిబిసెంట్ అనే ఐరిష్ నాయకురాలితో సమన్వయం ఏర్పరచుకున్నాడు. 1916లో తిలక్, అనిబిసెంట్లు విడివిడిగా హోంరూల్ లీగ్్న స్థాపించి ప్రజలలో రాజకీయ చైతన్యం, ఆధ్యాత్మిక వికాసం సాధించడానికి కృషిచేశారు.

అనిబిసెంట్ న్యూఇండియా, కామన్వీల్ అనే పత్రికలను స్థాపించి జార్జి అరెండెల్ అనే వ్యక్తిని హోంరూల్ లీగ్ వ్యవస్థాపరమైన కార్యదర్శిగా నియమించింది. ఒక్క బొంబాయి మినహా మహారాష్ట్ర అంతటా, మైసూరు సెంట్రల్ ప్రావిన్సెస్, బీరార్లలోనూ, అనిబిసెంట్ దేశంలోని మిగిలిన ప్రాంతాలతో హోంరూల్ లీగ్ విధివిధానాలను ప్రజలలో వ్యాప్తిచేశారు.

హోంరూల్ లీగ్ కు సంబంధించిన కరపత్రాలను వారు దేశవ్యాప్తంగా విస్తృతంగా పంపిణీ చేశారు. అయితే తిలక్ సత్ప్రవర్తనతో వ్యవహరించలేదనే నెపంతో బ్రిటిష్ ప్రభుత్వం అతడిని 1916 జులైలో నిర్బంధంలో ఉంచింది.

దాంతో తిలక్ అభిమానులు, హోంరూల్ లీగ్ కార్యకర్తలు అసంతృప్తితో రగిలిపోయారు. నిర్బంధం నుంచి తిలకన్ను విడిపించడానికి మహమ్మదాలీ జిన్నా జిల్లాకోర్టు, హైకోర్టులలో తిలక్ తరఫున వాదించాడు. తిలకై తన పోరాటాన్ని ఉధృతం చేశాడు. తిలక్ 6 చోట్ల, అనిబిసెంట్ 20 చోట్ల హోంరూల్ లీగ్ కార్యాలయాలను స్థాపించారు.

హోంరూల్ ఉద్యమంలో భాగంగా గ్రంథాలయాలను స్థాపించడం, విద్యార్థులకు జాతీయ రాజకీయాలపై అవగాహన కల్పించడం, సామాజీక పునర్నిర్మాణ కార్యక్రమాలలో పాల్గొనడం, స్థానిక సంస్థలను బలోపేతం చేయడం వంటి అనేక కార్యక్రమాలను దేశవ్యాప్తంగా వారు ప్రారంభించారు.

భారతీయులకు స్వపరిపాలన (self rule) విషయంలో ఆసక్తిని పెంపొందించాడు. హోంరూల్ లీగ్ ఉద్యమ ఉధృతిని నివారించడానికి బ్రిటిష్ ప్రభుత్వం వారిరువురిని అనేక ప్రాంతాలలో బహిరంగ సభలలో పాల్గొనడాన్ని నిషేధించింది.

1916 డిసెంబర్లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో హోంరూల్ లీగ్ సభ్యులు విరివిగా పాల్గొన్నారు. ఆ సమావేశంలో చివరి రోజున హోంరూల్ల సభ్యులతో తిలక్ సమావేశాలు నిర్వహించాడు.

అయితే హోంరూల్ లీగ్ కు హెచ్చిన ప్రాధాన్యతను నివారించడానికి 1917 జూన్లో అనిబిసెంట్, ఆమె అనుచరుల బృందాన్ని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. మొత్తం మీద స్వపరిపాలన సంస్థలను ఏర్పరచి, వాటిని భారతీయ ప్రతినిధులతో నిర్వహించడానికి అవకాశం ఇవ్వాలనే హోంరూలీగ్ డిమాండ్ బ్రిటిష్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

భారత వ్యవహారాల కార్యదర్శి మాంటెగ్ 1917 ఆగస్టులో చారిత్రాత్మక ప్రకటన ద్వారా భారతీయులకు స్వపరిపాలన, స్వేచ్ఛలను ప్రసాదించడానికి అంగీకరించాడు. మాంటెంగ్ ప్రకటన తరువాత 1917 సెప్టెంబర్ లో అనిబిసెంట్ను బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేయడంతో హోంరూల్ ఉద్యమం సద్దుమనిగింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 5.
సహాయ నిరాకరణ ఉద్యమంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలను తెలపండి.
జవాబు.
ఈ ఉద్యమం భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో గొప్ప సంఘటనగా మిగిలిపోతుంది. మహాత్మాగాంధీ ఈ ఉద్యమాన్ని పంజాబ్ లోని జలియన్ వాలాబాగ్ లో జరిగిన మారణకాండకు నిరసనగా 1920-22 మధ్య కాలంలో నిర్వహించారు. ఉద్యమంలో చేపట్టిన కార్యక్రమాలు :

నకారాత్మక కార్యక్రమాలు: సకారాత్మక కార్యక్రమాలలో క్రింది అంశాలు ఇమిడి ఉన్నాయి.

  1. సహాయ నిరాకరణ కార్యక్రమాలను అమలులో ఉంచడానికి కోటిరూపాయల విరాళాల సేకరణ.
  2. భారతీయులకు ఉపాధి కల్పించడానికి ఇరవై లక్షల రాట్నాల పంపకం.
  3. జాతీయ విద్యా ప్రణాళికల రూపకల్పన, అమలు.
  4. బ్రిటిష్ శాసన మండలుల స్థానంలో కాంగ్రెస్ శాసన సంస్థల ఏర్పాటు.
  5. స్వదేశీ వస్తువుల వినియోగం.

సకారాత్మక కార్యక్రమాలు :
నకారాత్మక కార్యక్రమాలలో క్రింది అంశాలను ప్రస్తావించడమైంది.

  1. బ్రిటిష్ ప్రభుత్వం ప్రసాదించిన బిరుదులు, గౌరవ పదవులను పరిత్యజించడం.
  2. బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహించే అధికారిక సమావేశాలకు గైర్హాజరవడం.
  3. బ్రిటిష్ న్యాయస్థానాల బహిష్కరణ.
  4. శాసన మండలులకు జరిగే ఎన్నికల బహిష్కరణ.
  5. స్థానిక సంస్థల పదవులకు రాజీనామా సమర్పించడం.
  6. విదేశీ వస్తువుల బహిష్కరణ.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 6.
భారత ప్రభుత్వ చట్టం 1919 లోని ప్రధాన అంశాలేవి ?
జవాబు.
1919 భారత ప్రభుత్వ చట్టములోని ప్రధానాంశాలు :

  1. బ్రిటిష్ ఇండియా బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగంగానే కొనసాగుతుంది.
  2. భారత ప్రభుత్వం, దాని ఆదాయాలకు సంబంధించిన అన్ని కార్యకలాపాలపైన, చర్యలపైన పరిశీలన, నియంత్రణాధికారాలు భారత కార్యదర్శికే చెంది ఉంటాయి. ఆయన బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తాడు. రాష్ట్ర పాలనాంశాలపై భారత కార్యదర్శి అధికారాలను తగ్గించింది.
  3. ప్రభుత్వ పాలనాంశాలు రెండుగా విభజింపబడెను. అవి : 1) కేంద్ర పాలనాంశాలు (47), 2) రాష్ట్ర పాలనాంశాలు (51). రాష్ట్ర పాలనాంశాలను మళ్ళీ రెండుగా విభజించారు. అవి : 1) రిజర్వుడు పాలనాంశాలు (28), 2) ట్రాన్స్ఫర్డ్ పాలనాంశాలు (22). అఖిల భారత ప్రాముఖ్యం ఉన్న అంశాలు కేంద్ర పాలనాంశాల జాబితాలోను రాష్ట్ర ప్రాముఖ్యం ఉన్న పాలనాంశాలను రాష్ట్ర పాలనాంశాల జాబితాలోను చేర్చెను.
  4. భారత మండలి నిర్మాణంలో మార్పులు చేసిరి. భారత వ్యవహారాల కార్యదర్శి అధికారాలను కొన్నింటిని తొలగించి వాటిని భారత హైకమీషనర్ క్కు ఇచ్చారు.
  5. భారత ప్రభుత్వ బడ్జెట్ నుండి రాష్ట్ర బడ్జెట్లను వేరుచేశారు. ప్రాంతీయ వనరులకు సంబంధించి ప్రాంతీయ శాసనసభలకు తమ బడ్జెట్లను తామే సమర్పించుకోవడానికి, సొంతంగా పన్నులు విధించుకోవడానికి అధికారాలు కల్పించారు.
  6. కేంద్రంలో ద్విసభా విధానం ప్రవేశపెట్టబడింది. రాజ్యసభ ఎగువసభ కాగా, కేంద్ర శాసనసభ దిగువసభ అయ్యెను. ఎగువసభ పదవీకాలం 5 సంవత్సరాలుగా, దిగువసభ పదవీకాలం 8 సంవత్సరాలుగా నిర్ణయించబడింది.
  7. కేంద్ర శాసనసభ అధికారాలు పెరిగెను. అది బ్రిటిష్ ఇండియా మొత్తానికి, భారతీయ విషయాలకు ప్రభుత్వ ఉద్యోగులకు, బ్రిటిష్ రాజరికానికి సంబంధించిన సైనిక దళాలకు వర్తించేలా శాసనాలు రూపొందించవచ్చును.
  8. రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్ర పాలనాంశాలు రెండు భాగాలుగా విభజించారు. అవి: 1) రిజర్వుడు పాలనాంశాలు, 2) ట్రాన్స్ఫర్డ్ పాలనాంశాలు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 7.
భారత స్వాతంత్య్ర చట్టం – 1947 ముఖ్యాంశాలను వివరించండి.
జవాబు.
భారత వ్యవహారాల నిర్వహణ కోసం బ్రిటిష్ పార్లమెంటు రూపొందించి, అమలు చేసిన చట్టాలలో చిట్టచివరి చట్టమే భారత స్వాతంత్ర్య చట్టము 1947 ప్రధాని అట్లీ ఆధ్వర్యంలోని బ్రిటిష్ ప్రభుత్వం భారత గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ సలహామేరకు 1947, జులై 4వ తేదీన కామన్స్ సభలో భారత స్వాతంత్య్ర చట్ట ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.

తరువాత బ్రిటిష్ పార్లమెంటులోని రెండు సభలు దానిని రెండు వారాల్లోగా ఆమోదించాయి. భారత స్వాతంత్య్ర చట్ట ముసాయిదా తీర్మానంపై బ్రిటిష్ రాణి 1947, జులై 18వ తేదీన సంతకం చేసింది.

ప్రధానాంశాలు :

  1. ఇండియా, పాకిస్తాన్ అనే రెండు స్వతంత్ర రాజ్యాలు ఏర్పడతాయి.
  2. ఇండియా పాకిస్తాన్లకు వేర్వేరుగా రాజ్యాంగ పరిషత్తులు ఏర్పడతాయి.
  3. స్వదేశీ సంస్థానాలపై బ్రిటిష్ సార్వభౌమాధికారం రద్దవుతుంది.
  4. భారత వ్యవహారాల కార్యదర్శి పదవి రద్దవుతుంది.
  5. బ్రిటిష్ రాజు/రాణికి ఇప్పటివరకు ఉన్న “భారత చక్రవర్తి” అనే బిరుదు రద్దవుతుంది.”
  6. ఇండియా పాకిస్తాన్లు రెండింటికీ చెరొక గవర్నర్ జనరల్ నియమితులవుతారు.

ప్రశ్న 8.
భారత్ రాజ్యాంగ మౌలిక లక్షణాలలో ఏవేని మూడింటిని రాయండి.
జవాబు.
1. విశిష్ట ఆశయాలు లక్ష్యాలు :
భారత రాజ్యాంగం ఎన్నో విశిష్ట ఆశయాలు లక్ష్యాలను కలిగి ఉంది. భారత రాజ్యాంగం తన పౌరులందరికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అన్ని విషయాల్లో అందిస్తుంది. అలాగే పౌరులందరికీ, ఆలోచనా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, నమ్మకం, విశ్వాసం, ఆరాధన తదితర విషయాల్లో స్వేచ్ఛలకు హామీ ఇస్తుంది.

ఇదే క్రమంలో భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమాన హోదా, సమాన అవకాశాలు కల్పిస్తుంది. భారత రాజ్యాంగం ప్రజలలో సౌభ్రాతృత్వాన్ని పెంపొందించి వ్యక్తి గౌరవాన్ని జాతి సమైక్యత, సమగ్రతలను పరిరక్షించడానికి హామీ ఇస్తుంది.

2. రాజ్య విధానాలపై ఆదేశిక సూత్రాలు :
భారత రాజ్యాంగంలోని నాలుగో భాగంలో 36వ నిబంధన నుండి 51వ నిబంధన వరకు రాజ్య విధానాల రూపకల్పనలో రాజ్యాంగ ఆదేశక సూత్రాలు పొందుపరుచారు. భారత రాజ్యాంగ నిర్మాతలు వీటిని ఐర్లాండ్, రాజ్యాంగం నుండి స్వీకరించారు.

ఈ ఆదేశక సూత్రాలు భారతదేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగా, గాంధేయవాద దేశంగా, ఉదారవాద రాజ్యంగా రూపొందిస్తాయి. రాజకీయ భావజాలాలతో సంబంధం కాకుండా కేంద్ర ప్రభుత్వంలో-రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టే అన్ని పార్టీలు ఈ మూల సూత్రాలను తప్పనిసరిగా అమలు చేయాలి.

3. ఏక పౌరసత్వం :
భారత రాజ్యాంగం భారతదేశంలో జన్మించిన వారందరికీ, లేదా ఒక నిర్దిష్ట కాలంపాటు భారతదేశంలో నివసిస్తున్నవారికి ఏక పౌరసత్వాన్ని అందిస్తుంది. భారతదేశ సమైక్యత – సమగ్రతను పరిరక్షించడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. భారతదేశంలో విచ్ఛిన్నకర ధోరణులు తలెత్తకుండా రాజ్యాంగ నిర్మాతలు ఏకపౌరసత్వం ఏర్పాటు చేశారు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారత జీతీయోద్యమంలో మితవాదులు.
జవాబు.
మితవాద దశనే సంస్కరణల శకంగా వర్ణించడం జరిగింది. ఈ దశలో ప్రముఖ జాతీయ నాయకులైన గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయ్ నౌరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ వంటి ప్రముఖ నాయకులు కీలకపాత్ర పోషించారు. బ్రిటిష్ పాలకుల ఉదార వైఖరి పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ వారు బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో క్రమానుగత సంస్కరణలను అమలు చేయాలని సూచించారు.

బ్రిటిష్ ప్రజలు నిజమైన ప్రజాస్వామ్య, స్వేచ్ఛావాద ప్రియులనే, భారతీయులలో బ్రిటిష్ పాలకులు రాజకీయ చైతన్యాన్ని విజ్ఞప్తులు, మధ్యవర్తిత్వం వంటి పద్ధతులను అనుసరించడం ద్వారా బ్రిటిష్ పాలకుల దృష్టిని మితవాదులు ఆకర్షించగలిగారు. బ్రిటిష్ పాలన అనేది దైవ సమ్మతం, దైవ నిర్ణయంగా వారు పరిగణించారు.

ప్రశ్న 2.
అతివాదులు అనుసరించిన పద్ధతులు.
జవాబు.

  1. బ్రిటిష్ వస్తువులను, బ్రిటిష్ ప్రభుత్వ గౌరవ బిరుదులను, కార్యాలయాలను బహిష్కరించడం.
  2. స్వదేశీ విద్యను ప్రోత్సహించడం.
  3. శాసనమండలల్లో భారతీయులకు సభ్యత్వం వంటి అంశాల అమలు కోసం కృషి చేయడం.
  4. స్వదేశీ వస్తువులను, పరిశ్రమలను ఆదరించడం.
  5. నకారాత్మక ప్రతిఘటనకు పాల్పడటం.

ప్రశ్న 3.
సైమన్ కమీషన్.
జవాబు.
బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ‘భారత ప్రభుత్వ చట్టం 1919’ అమలు తీరును సమీక్షించి, సంస్కరణలు చేపట్టడానికి వీలుగా చర్యలు సూచించమని ఒక శాసనబద్ధ కమిషన్ ను నియమించింది. ఏడుగురు ఆంగ్లేయులతో కూడిన ఈ కమిషన్కు సర్ఆన్ సైమన్ చైర్మన్ గా వ్యవహరించాడు. భారత జాతీయ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా సైమన్ కమిషన్ కార్యవ్యవహారాలను బహిష్కరించాలని పిలుపునిచ్చి, ‘సైమన్ గో బ్యాక్’ (Simon Go Back) పేరుతో ఒక నినాదాన్నిచ్చింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 4.
శాసనోల్లంఘన ఉద్యమం.
జవాబు.
ఈ ఉద్యమాన్ని 1930 మార్చి 12న భారత జాతీయ కాంగ్రెస్ మార్గదర్శకత్వంలో ప్రారంభించుట జరిగినది. 1930 జనవరి 26వ తేదీన సంపూర్ణ స్వరాజ్యదినంగా పాటించాలని భారతీయులకు కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. శాసనోల్లంఘన ఉద్యమంలో మూడు ప్రధాన దశలున్నాయి. మొదటి దశలో భారతీయులు ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్వహించాలని గాంధీజీ సూచించాడు.

గాంధీజీ స్వయంగా 78 మంది అనుచరులతో కాలిబాటన సబర్మతి ఆశ్రమం నుంచి 240 మైళ్ళ దూరంలో అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న “దండి” అనే గ్రామానికి వెళ్ళి ఉప్పును తయారుచేశాడు. రెండోదశ గాంధీజీ ఎర్రవాడ (పూణె) కారాగారంలో ఉండగా 1932 జనవరి-1933 జులైల మధ్య నిర్వహించడం జరిగింది. శాసనోల్లంఘనలో మూడవదశ 1933 ఆగష్టు, 1934 మే నెల మధ్య కాలంలో నిర్వహించడం జరిగింది. ఆ దశలో భారత కాంగ్రెస్ నాయకులు సామూహిక శాసనోల్లంఘన స్థానాలలో వ్యక్తిగత శాసనోల్లంఘనోద్యమాన్ని కొనసాగించారు.

ప్రశ్న 5.
మింటో – మార్లే సంస్కరణల చట్టం.
జవాబు.
ఈ చట్ట రూపకల్పనలో భారత ప్రతినిధి లార్డ్మింటో భారత వ్యవహారాల కార్యదర్శి లార్డ్ మార్లేలు కీలకపాత్ర పోషించారు. దీనిని మింటోమార్లే సంస్కరణల చట్టంగా వర్ణించడం జరిగింది. భారతదేశంలో శాసనమండలాల నిర్మాణ, నిర్వహణలలో గణనీయమైన మార్పులకు ఈ నాంది పలికింది.

బెంగాల్ విభజనకు నిరసనగా ఉవ్వెత్తున ప్రారంభమైన వందేమాతరం ఉద్యమం, హిందూ-ముస్లింల మధ్య వైషమ్యాలు, లార్డ్ కర్జన్ నియంతృత్వ పోకడలు, పెద్ద దేశమైన రష్యాపై చిన్న దేశమైన జపాన్ విజయం, కాంగ్రెస్ నాయకులలో చీలికలు, ప్రవాస భారతీయుల కడగండ్లు, దుర్భర దారిద్య్రం, విప్లవ భావాలను రేకెత్తించిన కొన్ని రహస్య సంస్థల కార్యకలాపాలు వంటి అనేక అంశాలు ఈ చట్టం రూపకల్పనలో బ్రిటిష్ పాలకులను విశేషంగా ప్రభావితం చేశాయి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 6.
రాజ్యాంగ పరిషత్.
జవాబు.
భారత రాజ్యాంగ పరిషత్తులో 389 సభ్యులున్నారు. బ్రిటిష్ ఇండియాకు చెందిన 296 సభ్యులు ఉన్నారు. మిగిలిన 93 మంది స్వదేశీ సంస్థానాలకు చెందినవారు. భారత రాజ్యాంగ పరిషత్తుకు 1946 జులై – ఆగష్టులలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది.

మొత్తం సభ్యులలో 210 స్థానాలు జనరల్ కేటగిరీకి నిర్దేశించగా, వాటిలో 199 స్థానాలను కాంగ్రెస్ కైవశం చేసుకుంది. రాజ్యాంగ పరిషత్తులో ఆ పార్టీ బలం 208గా ఉంది. కాగా ముస్లింలీగ్ 73 స్థానాలను గెలుచుకుంది.

కాంగ్రెస్ తరఫున గెలిచిన సభ్యులలో మహాత్మాగాంధీ సూచించిన వివిధ రంగాలకు చెందిన 16 మంది మేధావులు ఉండటం విశేషం. మొత్తం మీద కాంగ్రెస్కు సంబంధించిన 30 మంది సభ్యులు రాజ్యాంగ పరిషత్తుకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. జవహర్లాల్ నెహ్రూ, రాజేంద్రప్రసాద్, అంబేద్కర్, శ్యాంప్రసాద్ ముఖర్జీ, దుర్గాబాయ్ దేశ్ ముఖ్, సరోజిని నాయుడు, విజయలక్ష్మి పండిట్, రాజ్కుమారి అమృత్కర్ ముఖ్య సభ్యులు. 1946 డిసెంబర్ 11న రాజేంద్రప్రసాద్ను రాజ్యాంగ పరిషత్తు శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడమైంది.

ప్రశ్న 7.
రాజ్యాంగ ముసాయిదా కమిటి.
జవాబు.
భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీని భారత రాజ్యాంగ పరిషత్తు 1947 ఆగష్టు 29న ఏర్పరచింది. కమిటీలో ఛైర్మన్, ఆరుగురు సభ్యులు ఉన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆ కమిటీ ఛైర్మన్గా వ్యవహరించారు. ఆ కమిటీలో సభ్యులుగా సర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్. గోపాలస్వామి అయ్యంగార్, సయ్యద్ మహమ్మద్ సాధుల్లా, డాక్టర్ కె.ఎమ్. మునీ, బి.ఎల్. మిత్తర్ సభ్యులుగా ఉన్నారు. రాజ్యాంగ ముసాయిదా కమిటి ముఖ్య లేఖకుడిగా ఎస్.ఎన్ ముఖర్జీ నియమితులయ్యారు.

ముసాయిదా కమిటీ అనేక దఫాలు సమావేశమై రాజ్యాంగ ముసాయిదాను రూపొందించి 1947 నవంబర్ 5న రాజ్యాంగ పరిషత్తుకు సమర్పించింది. రాజ్యాంగ ముసాయిదా ప్రతి 1948 ఫిబ్రవరి 21న ముద్రితమైంది. రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగ ముసాయిదాను నవంబరు 26న ఆమోదించింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 8.
భారత రాజ్యాంగ ధృఢ అధృఢ లక్షణాలు.
జవాబు.
రాజ్యాంగంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను అత్యంత కఠినమైన రీతిలో సవరించడానికి వీలుంటే, మరికొన్ని అంశాలను సరళమైన రీతిలో మార్పు చేయవచ్చు. ఇంకొన్ని అంశాలను సగం కఠినమైన, సగం సరళమైన రీతిలో మార్పు చేయవచ్చు.

భారత రాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టుల అధికారాలు, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు వంటి అంశాలను సవరించడానికి రాజ్యాంగ నిర్మాతలు పరుషమైన పద్ధతిని సూచించారు. రాష్ట్రాల పేర్లు, సరిహద్దులు, విస్తీర్ణం, విలీనం లేదా విభజన, రాష్ట్ర శాసనమండళ్ళ ఏర్పాటు లేదా రద్దు వంటి అంశాలను సులభమైన రీతిలో సవరించడానికి వీలుకల్పించారు. ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాలు వంటి అంశాలను మార్పు చేయడానికి పాక్షిక కఠిన, పాక్షిక సరళ పద్ధతికి అవకాశం ఇచ్చారు.

ప్రశ్న 9.
భారత రాజ్యాంగ ప్రవేశిక.
జవాబు.
రాజ్యాంగ నిర్మాతల ఆశయాలు, ఆకాంక్షలు, లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది. జవహర్లాల్నెహ్రూ ప్రవేశికను ఒక నిశ్చయాత్మక తీర్మానం ప్రమాణం హామిగా వర్ణించారు. ప్రవేశిక భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించింది. భారతీయులకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయాలను ప్రసాదిస్తున్నట్లు వెల్లడించింది.

భారతదేశంలోని సర్వసత్తాధికారం అంతిమంగా భారత ప్రజలకే చెందుతుందని సృష్టీకరించింది. ప్రవేశికను సుప్రీంకోర్టు న్యాయమూర్తి యధోల్కర్ రాజ్యాంగ ప్రధాన లక్షణాల సారం అని వర్ణిస్తే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిదయతుల్లా రాజ్యాంగపు ఆత్మగా ప్రస్తుతించారు.

ప్రశ్న 10.
పార్లమెంటరీ ప్రభుత్వం.
జవాబు.
భారత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వంలో, వివిధ రాష్ట్రాల స్థాయిలో బ్రిటిష్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది. అయితే బ్రిటిష్ తరహా వారసత్వ రాజరికాన్ని భారతదేశం స్వీకరించలేదు. దీనికి బదులుగా భారత రాజ్యాంగ నిర్మాతలు ఐర్లాండ్ తరహాలో ఎన్నికయ్యే అధ్యక్షుడు ఉండే వ్యవస్థను సూచించారు.

అలాగే బ్రిటిష్ రాజకీయ వ్యవస్థ మిగిలిన ఇతర లక్షణాలైన రెండు రకాల కార్యనిర్వాహక నాయకత్వం (రాష్ట్రపతి – ప్రధానమంత్రి), కేంద్రంలో ప్రధాన మంత్రినాయకత్వం, సమిష్టి బాధ్యత నియమం, కేంద్ర కార్యనిర్వాహక వర్గం (మంత్రిమండలి) పై పార్లమెంటు నియంత్రణ, రాష్ట్రపతికి నామమాత్రపు అధికారాలు తదితర లక్షణాలను భారత రాజ్యాంగం స్వీకరించింది. ఇదే తరహా రాజకీయ వ్యవస్థను వివిధ రాష్ట్రాలకు కూడా అన్వయింపజేసింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 11.
భారత రాజ్యాంగ ఏకకేంద్ర, సమాఖ్య లక్షణాలు.
జవాబు.
ఏకకేంద్ర రాజ్యలక్షణాలైన ఒకే పౌరసత్వం, ఒకే సమీకృత న్యాయశాఖ, ఒకే ఎన్నికల సంఘం, రాష్ట్రాల పాలనలో అఖిల భారత సర్వీసుల సిబ్బంది పాత్ర, రాష్ట్రాల రాజ్యాంగ అధిపతులుగా గవర్నర్ల నియామకం, రెండు ప్రభుత్వాలు, పార్లమెంటు ఎగువసభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం, రాజ్యాంగ అంశాల సవరణలో పార్లమెంటు చొరవ వంటి అంశాలు సమాఖ్య లక్షణాలైన లిఖిత రాజ్యాంగం, అధికారాల విభజన, న్యాయశాఖ ఔన్నత్యం, ద్విసభా విధానం వంటివి భారత రాజ్యాంగంలో పేర్కొనడమైంది. అయితే మొత్తం మీద భారత రాజ్యాంగంలో ఏకకేంద్ర రాజ్యం కంటే లక్షణాలే భారత రాజ్యాంగంలో అధికంగా ఉన్నాయి.

ప్రశ్న 12.
సార్వజనిక ఓటు హక్కు.
జవాబు.
భారతదేశంలో వయోజన పౌరులందరికి సార్వజనీన ఓటు హక్కును భారత రాజ్యాంగం ప్రసాదించింది. భారత పౌరులందరూ ఒక్క వయో సంబంధమైన పరిమితి మినహా ఇతర అంశాలైన కులం, మతం, భాష, ప్రాంతం, వర్ణం, వర్గం, ఆస్తులతో నిమిత్తం లేకుండా ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి స్వేచ్ఛను కలిగి ఉంటారు.

ఓటు హక్కు ద్వారా ప్రజా సార్వభౌమాధికార భావన ఆచరణలోకి వస్తుందని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. భారతదేశంలో స్వాతంత్య్రానంతరం ఓటు హక్కును పౌరులకు ప్రసాదించడానికి వయోపరిమితి 1950 నుంచి 1987 వరకు 21 ఏళ్ళగానూ, 1998 నుంచి (రాజ్యాంగం 61వ సవరణ చట్టం మేరకు) 18 ఏళ్ళుగానూ నిర్ణయించడమైనది.

TS Inter 2nd Year Political Science Study Material Chapter 8 భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు

Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 8th Lesson భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు Textbook Questions and Answers.

TS Inter 2nd Year Political Science Study Material 8th Lesson భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
అవినీతిని నిర్మూలించి, వివిధ అవినీతి రూపాలను తెలపండి.
జవాబు.
అవినీతి నిర్వచనం : ప్రపంచ బ్యాంకు నిర్వచనంలో “ప్రభుత్వ పదవిని (లేదా కార్యాలయాన్ని) ప్రైవేటు లాభార్జన కోసం వినియోగించడమే అవినీతి”.

అవినీతి రూపాలు :
అవినీతికి అనేక రూపాలున్నాయి. వీటిలో లంచాలు, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, బలవంతపు వసూల, ప్రభుత్వ ధనం దుర్వినియోగం, కుల-మత ప్రీతికర వివక్షత చూపడం వంటివి ఉన్నాయి. 1988లో వచ్చిన అవినీతి నిరోధక చట్టం ప్రకారం లంచగొండితనం, నిధుల దుర్వినియోగం, ధన సంబంధ ప్రయోజనాలు పొందడం, అధికార పదవిని హోదాను స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించడం, ఆదాయానికి మించి ఎన్నోరెట్లు ఆస్తులను కలిగి ఉండడం తదితర చర్యలు అవినీతి చర్యలుగా, చట్టపరంగా శిక్షార్హమైనవిగా పేర్కొంది.

ఇటీవలి సమకాలీన భారతదేశ అవినీతి రూపాలలో “పరస్పర ప్రతిఫల ప్రేరేపిత అవినీతి” ఎన్నోచోట్ల వెలుగులోకి వస్తోంది. దీని ప్రకారం, రాజకీయ నాయకులు, ఉన్నత అధికారులు కార్పొరేటర్లకు, బడా వ్యాపారవేత్తలకు అనుకూలంగా అధికారిక (ప్రభుత్వ) నిర్ణయాలు తీసుకున్నప్పుడు దీనికి బదులుగా (ప్రతిఫలంగా) వారు సంబంధిత నాయకులు-అధికారుల బంధువర్గానికి చెందిన పారిశ్రామిక యూనిట్లలో షేరు విలువలకు మించి కుప్పలు తెప్పలుగా అక్రమ పెట్టుబడులు పెట్టడం, స్వచ్ఛంద సేవా సంస్థలకు భారీస్థాయిలో విరాళాలు ఇవ్వడం జరుగుతోంది.

మరోవిధంగా చెప్పాలంగే, ప్రతిఫలాలను, ప్రయోజనాలను పరస్పరం (నాయకులు–అధికారులు, కార్పొరేట్లు- వాణిజ్యవేత్తలు) ఇచ్చి పుచ్చుకోవడం జరుగుతోంది. ఇటీవటి కాలంలో కేంద్ర నేరపరిశోధక సంస్థ (CBI) ఈ తరహా కేసులను (Quid Pro quo Cases) విచారిస్తూ కుంభకోణం ఆరోపణలను విచారిస్తోంది.

భారతదేశంలో అవినీతి భారతీయ విలువల వ్యవస్థలో ఒక పెద్ద ఉపద్రవంగా, సవాలుగా మారింది. ఇది అంటువ్యాధిలాగా వ్యపిస్తూ పరిపాలన యంత్రాంగాన్నీ, అభివృద్ధి ప్రక్రియలను, ప్రజాస్వామ్యాన్నీ అపహాస్యం చేస్తోంది. అవినీతి ఆర్థిక అభివృద్ధికి, పేదరిక నిర్మూలనకు వ్యతిరేకమైనది. జాతి వ్యతిరేకత లక్షణంగా గల అవినీతిలో రాజకీయ నాయకులు, ఉన్నత అధికారులు, ప్రభుత్వేతర సంస్థలు, నేరగాళ్ళు క్రియాశీల పాత్ర పోషిస్తూ ఉంటారు.

అవినీతి, వస్తువులు-సేవలు కొరతవల్ల, పరిపాలనలో తీవ్ర జాప్యం వల్ల, వ్యవస్థలో పారదర్శకత లోపించడంవల్ల తలెత్తుతుంది. అవినీతి ప్రజలలో అశాంతిని కలుగజేసి, వ్యవస్థపై ప్రజల నమ్మకం కోల్పోయేలా చేస్తుంది. ఫలితంగా తీవ్రవాదం, హింసావాదం, ఉగ్రవాదం ప్రబలే అవకాశం ఉంటుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 8 భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు

ప్రశ్న 2.
సంకీర్ణ రాజకీయాలు అంటే ఏమిటి ? వాటి లక్షణాలను, సంకీర్ణ రాజకీయాలలోని వివిధ దశలను
వివరించండి.
జవాబు.
సంకీర్ణ రాజకీయాలు-భావం :
కొన్ని రాజకీయ పార్టీలు ఉమ్మడిగా ప్రభుత్వ అధికారం పొందడం లేదా ఉమ్మడి ప్రతిపక్షాన్ని ఏర్పరచి రాజకీయ ప్రక్రియను ప్రజాస్వామీకరించం లక్ష్యంగా ఒక వ్యవస్థగా ఏర్పడడాన్ని సంకీర్ణ రాజకీయాలుగా పేర్కొనవచ్చు. ఈ విధంగా ఉమ్మడి కూటమిగా ఏర్పడ్డ రాజకీయ పార్టీలు తమలో తాము అంగీకరించిన ఎజెండా ఆధారంగా కనీస ఉమ్మడి కార్యక్రమం (Common Munimum Programme) ఏర్పరచుకొంటాయి.

లక్షణాలు :
సంకీర్ణ రాజకీయాలు భారతదేశానికి కొత్తేమీకాదు, వాస్తవానికి, నాలుగో సాధారణ ఎన్నికల తరువాత భారతదేశంలో వివిధ రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడి, వివిధ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి అశ్యర్థులను నిలబెట్టాయి. ప్రస్తుతం భారతదేశంలో రెండు ప్రధాన రాజకీయ కూటములు క్రియాశీలంగా పనిచేస్తున్నాయి.

వీటిలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో అకాలీదళ్, లోక్ జనశక్తి పార్టీ తదితర ప్రధాన రాజకీయ పార్టీలు “జాతీయ జాస్వామ్య కూటమి” (NDA) పేరుతో సంకీర్ణంగా ఏర్పడ్డాయి. మరో ప్రధాన సంకీర్ణ కూటమి ఐక్య ప్రగతిశీల కూటమి (UPA) పేరుతో భారత జాతీయ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, డి.ఎం.కె. తదితర పార్టీలు భాగస్వామ్య పక్షాలుగా కొనసాగుతోంది.

వివిధ దశలు :
భారతదేశంలో సంకీర్ణరాజకీయాల పరిణామ క్రమాన్ని వాటి స్వభావం-పనితీరు ఆధారంగా వివిధ దశలుగా అధ్యయనం చేసుకోవచ్చు. మొదటిదశ సంకీర్ణ రాజకీయాలు 1967-1971 మధ్యకాలంలో వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అవతరించి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను సవాలు చేయడంతో ప్రారంభమవుతుంది. భారతీయ జనసంఘ్, లోక్ దళ్, సోషలిస్టు పార్టీ, సంయుక్త విధాయక దళ్ మొదలైనవి ఉత్తర భారత రాష్ట్రాల్లో అవతరించి, సంకీర్ణాలు ఏర్పరచాయి.

సంకీర్ణ రాజకీయాలు రెండోదశ 1977-1980 మధ్య కాలంలో కేరళ, త్రిపుర, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల్లో వామపక్ష సిద్ధాంత భావజాలం ఆధారంగా వామపక్ష కూటిమి ప్రభుత్వాల ఏర్పాటులో ప్రతిబింబిస్తుంది. అలాగే 1977లో వచ్చిన జనతాపార్టీ కూడా సంకీర్ణ రాజకీయాల్లో భాగమని కొద్దిమంది భావిస్తారు. జనతాప్రయోగం కొద్దినెలలు మాత్రమే కేంద్రంలో అధికారంలో ఉంది.

సంకీర్ణ రాజకీయాల్లో మూడో దశ 1989-1991 మధ్యకాలంలో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో, వివిధ రాష్ట్రాల్లో కనిపిస్తుంది. అయితే ఈ దశలోని సంకీర్ణ రాజకీయాలలో సంకీర్ణ భాగస్వామ్య పక్షాల మధ్య సంబంధాల్లో ఒక నూతన ధోరణి కనిపిస్తుంది. సంకీర్ణ పక్షాలు కొన్ని ప్రభుత్వంలో చేరకుడా వెలుపలి నుండి మద్దతు (outside support) అందించి సంకీర్ణ రాజకీయాల్లో పాల్గొనేవి.

సంకీర్ణ రాజకీయాల్లో నాలుగో దశ 1996-1999 మధ్యకాలంలో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో అస్థిరతను, తరచుగా ప్రభుత్వాలు పతనం కావడాన్ని రాజీకీయ యుక్తులు-కుయుక్తులను సూచిస్తుంది. ఈ దశలో సంకీర్ణ భాగస్వామ్య పక్షాలు అనేక సంక్షోభాలను సృష్టిస్తూ తరచుగా ప్రభుత్వం నుంచి దూరంగా ఉండడం, మద్దతు ఉపయోగించుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఎంతో అస్థిరతను ఎదుర్కొంది. ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సంకీర్ణ రాజకీయాల ఫలితంగా పతనం చెందడం జరిగింది.

సంకీర్ణ రాజకీయాల్లో అయిదో దశగా 2004-2020 మధ్యకాలంలో హేతుబద్ధంగా కనీస ఉమ్మడి కార్యక్రమం ప్రాతిపదికగా భాగస్వామ్యపక్షాలు ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం గమనిస్తారు. దీనిలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) ఐక్య ప్రగతిశీల కూటమి (UPA) సంకీర్ణాలు భాగస్వామ్య పక్షాలందరికీ ఆమోదయోగ్యమైన ఎజెండాను “కనీస ఉమ్మడి కార్యక్రమం” (Common Minimum Programme) ప్రాతిపదికగా ఏర్పరచుకొని, ప్రభుత్వాలను పూర్తి పదవీకాలం, విజయవంతంగా నిర్వహించాయి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 8 భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారతదేశంలో సంకీర్ణ రాజకీయాలు, అవతరణకు గల కారణాలను వివరించండి.
జవాబు.
భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడడానికి ఎన్నో కారణాలు దోహదం చేశాయి. ఆధిపత్య పార్టీగా కొనసాగిన కాంగ్రెస్ పార్టీ దేశంలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైనోవడం, మెజారిటీ సాధించే స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఎన్నికల విజయాలు సాధించడం కారణంగా అనేక ఇతర పార్టీలు అవతరించి, అభివృద్ధి చెందాయి.

అలాగే వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని సవాలు చేసే విధంగా ప్రాంతీయ రాజకీయ పార్టీలు అవతరించి, ఇతర జాతీయ పార్టీలతో మైత్రి కూటములు ఏర్పాటు చేసుకోవడం కూడా సంకీర్ణ రాజకీయాలకు దారితీసింది.

సంకీర్ణ రాజకీయాలు వృద్ధి చెందడానికి గల కారణాలను ఈ కింది విధంగా పేర్కొనవచ్చు.

  1. ఏకపార్టీ ఆధిపత్యం నశించడం.
  2. ప్రజల ప్రాంతీయ ఆకాంక్షలు, ప్రయోజనాలు సంతృప్తి పరచడానికి ప్రాంతీయ రాజకీయ పార్టీలు అవతరించడం.
  3. సమాజంలోని వివిధ సమూహాలు తమ హక్కుల పట్ల చైతన్యం పొందడంతో సాంఘిక-రాజకీయ ఉద్యమాలు వ్యాప్తి చెందడం.
  4. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా జాతీయస్థాయిలో, రాష్ట్రాలస్థాయిలో రాజకీయ సంకీర్ణాలు ఏర్పరచవలసిన పరిస్థితులు ఏర్పడటం.

ప్రశ్న 2.
భారతదేశ నేపథ్యంలో వివిధ ఉగ్రవాద రూపాలను తెలియజేయండి.
జవాబు.
1. తెగల-జాతీయవాద ఉగ్రవాదం (Ethno-Nationalist Terrorism) :
ఉగ్రవాద సమూహాలు భారతదేశం నుంచి వేర్పాటును కోరుతూ లేదా భారత సమాఖ్యలో నూతన రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ ఉగ్రవాద చర్యలకు, హింసకు పాల్పడడాన్ని తెగల జాతీయవాద ఉగ్రవాదంగా పేర్కొనవచ్చు.

2. మతమౌఢ్య ఉగ్రవాదం (Religious Terrorism) :
ఈ తరహా ఉగ్రవాదం మత మౌఢ్యవాదం ఆధారంగా జనిస్తుంది. భారతదేశంలో ఎన్నో ఉగ్రవాద చర్యలు, సంఘటనలు, దాడులు ఈ కోవలోకి వస్తాయి. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐ.ఎస్.ఐ (ISI) సహాయంతో ఉగ్రవాద సంస్థలు-సమూహాలు ఎన్నో ప్రాంతాల్లో మతమౌఢ్య ఉగ్రవాదానికి పాల్పడ్డాయి.

2008 నవంబర్ 26న ముంబాయిలో ఉగ్రవాద దాడులు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన దాడులు, ప్రజలకు ఎంతో ప్రాణనష్టాన్ని, ఆస్తినష్టాన్ని కలిగించాయి. దీన్ని కొద్దిమంది జిహాదీ ఉగ్రవాదం పేరుతో కూడా వ్యవహరిస్తారు.

3. సిద్ధాంత (భావజాల) ఆధారిత ఉగ్రవాదం :
దీనినే వామపక్ష తీవ్రవాదమని కూడా వ్యవహరిస్తారు. సమాజ ఆర్థిక దోపిబిని, అణచివేతను, ఆర్థిక అసమానతలను నిర్మూలించడానికి వామపక్ష పోరాటమే మార్గమని నమ్ముతుంది. ప్రఖ్యాత కమ్యూనిస్టు సిద్ధాంతవేత్తలు కారల్ మార్క్స్, మావో, లెనిన్ తదితరుల సిద్ధాంత భావనల ఆధారంగా ఈ తీవ్రవాదం వ్యవహరిస్తుంది. సమాజంలోని విప్లవాత్మక మార్పు లక్ష్యాన్ని హింస, ఉగ్రవాదంతో చేరుకోవచ్చని నమ్ముతుంది.

4. రాజ్యప్రాయోజిక ఉగ్రవాదం (సీమాంతర ఉగ్రవాదం):
పొరుగు రాజ్యాలనుంచి పరోక్ష రూపంలో వ్యక్తమయ్యే ఉగ్రవాదం. సరిహద్దులకు వెలుపల ఇతర రాజ్యాలలో ఉగ్రవాద సంస్థలకు సమూహాలకు తోడ్పాటు అందిస్తూ భయానక వాతావరణాన్ని, అస్థిరతను కలుగజేసే లక్ష్యంతో ఉగ్రవాద చర్యలు ఉంటాయి.

భారతదేశం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్ చేతిలో ఈ తరహా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోంది. భారతదేశంలోని ఉగ్రవాద సమూహాలకు పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐ.ఎస్.ఐ (ISI), ఇతర ఏజెన్సీలు సహాయం అందిస్తున్నట్లు తెలుస్తోంది.

5.మాదక ద్రవ్య (గంధపు చెక్కలు మొదలైన వాటి అక్రమరవాణా) ఉగ్రవాదం :
ఈ తరహా ఉగ్రవాదం నిషేధించిన మాదకద్రవ్యాలు, గంధపు చెక్కల అక్రమరవాణాపై దృష్టి కేంద్రీకరిస్తుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 8 భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు

ప్రశ్న 3.
భారతదేశంలో అమలులో ఉన్న ఉగ్రవాద నిరోధక చట్టాలు ఏవి ?
జవాబు.
ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్టు, జాతీయ భద్రతాచట్టం (MISA), Conservation of Foreign Exchange and Preven- tion of Smuggle Activities Act (COFEPOSA), National Security ACT (NSA), ఉగ్రవాద నిరోధక చట్టం మొదలగునవి.

ప్రశ్న 4.
భారతదేశంలో వివిధ అవినీతి నిరోధక చట్టాలను పేర్కొనండి.
జవాబు.
భారత ప్రభుత్వం అవినీతి నిరోధానికి వివిధ స్థాయిలో అనేక చర్యలు చేపట్టింది. భారతదేశంలో ప్రజా జీవితంలో అవినీతిని అదుపు చేయడానికి అవినీతి నివారక చట్టాన్ని 1988లో రూపొందించింది. ఈ చట్టంలో మరిన్ని సవరణలు చేసి అవినీతి నివారణ చట్టం, 2018 రూపొందించింది.

దీని ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ ఉద్యోగులు తమ అధికారిక విధులను నిర్వహించే క్రమంలో చట్ట వ్యతిరేకంగా ప్రతిఫలాన్ని ఆశించండం లేదా లంచాలు తీసుకోవడాన్ని నిషేధించడం.

ఈ చట్టం లంచాలను ఇచ్చేవారిని, మధ్యవర్తులను కూడా దోషులుగా పరిగణిస్తుంది. అయితే కొద్దిమంది ఉన్నత పదవులలో ఉండే నాయకులు లేదా అధికారులపై అవినీతి కేసులు నమోదు చేయడానికి రాజ్యాంగ వ్యవహర్తల ముందు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.

రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై ఆరోపణల విషయంలో రాష్ట్ర గవర్నర్, కేంద్ర ప్రభుత్వ అధికారుల విషయంలో భారత రాష్ట్రపతి అనుమతి అవసరం అవుతుంది.

ఇదేకాక భారతీయ శిక్షాస్మృతి (Indian Penal code) లోని అనేక నిబంధనలు అవినీతి చర్యలకు పాల్పడే ఉద్యోగులపై శిక్షలు విధించడానికి తోడ్పడతాయి దీనితో పాటు మనీలాండరింగ్ నివారణ చట్టం (2002), సమాచార హక్కు చట్టం (2005) మొదలైనవి కూడా అవినీతి గుర్తించి, కేసులను నమోదు చేయడానికి తోడ్పడతాయి.

ప్రభుత్వోద్యోగులలో అవినీతిని నిరోధించడానికి 1964లో కేంద్ర నిఘా వ్యవహారాల కమిషన& (Central Vigilance Commission-CVC) ని స్థాపించారు. అవినీతికి సంబంధించిన అంశాల్లో పౌరులు చేయవలసిన, చేయకూడని పనులను ఈ కమిషన్ మార్గదర్శకాల రూపంలో రూపొందించింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 8 భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
జాతీయ స్థాయిలో సంకీర్ణ రాజకీయాలు.
జవాబు.
జాతీయ స్థాయిలో ఎన్నోసార్లు సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కేంద్రప్రభుత్వంలో మొదటిసారిగా 1977లో భారతీయ లోక్ దళ్, కాంగ్రెస్ (ఒ), జనసంఘ్, సోషలిస్టు పార్టీ, కొన్ని ఇతర చిన్న పార్టీలు కలిసి జనతా పార్టీగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇది జనతా ప్రయోగంగా ప్రఖ్యాత గాంచింది.

మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఈ ప్రభుతవ &ం ఏర్పడింది. కేంద్రప్రభుత్వంలో 1989లో వి.పి.సింగ్ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. జనమోర్చా, లోక్ దళ్ పార్టీలు నేషనల్ ఫ్రంట్ పేరుతో సంయుక్తంగా, భారతీయ జనతాపార్టీ, వామపక్షాల వెలుపలి మద్దతు అందించడంతో ఈ ప్రభుత్వాన్ని ఏర్పరచాయి.

1996 మే నెలలో హెచ్.డి. దేవగౌడ నాయకత్వంలో యునైటెడ్ ఫ్రంట్ (UF) ప్రభుత్వం ఏర్పడిది. దీనిలో జనతాదళ్, సి.పి.ఐ-సి.పి.ఎం తదితర పార్టీలు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. ఈ సంకీర్ణం తదనంతర కాలంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమిగా (NDA) ఆవిర్భవించింది. ఆ తరువాత 2004 సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటిమి (UPA) డా॥ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా అధికారాన్ని చేపట్టింది.

ప్రశ్న 2.
సంకీర్ణ రాజకీయాల ప్రయోజనాలు, నష్టాలు.
జవాబు.
భారతదేశంలో సంకీర్ణ రాజకీయాలు రాజకీయ సర్దుబాట్లకు, సహాయ సహకారాలకు దారితీశాయి. దీనికి అనుగుణంగా భారత సమాఖ్య స్వభావం మార్పుచెంది, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య అతి తక్కువ స్థాయికి వివాదాలు తగ్గిపోయాయి.

భారతాయ సమాఖ్య ఒక సహకార సమాఖ్యగా రూపాంతరం చెందింది. అలాగే సంకీర్ణ రాజకీయాలు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి దేశంలోని వివిధ స్థాయిల్లో ప్రత్యామ్నాయాన్ని ప్రజాసమస్యలు బాగా వెలుగులోకి రాగలగడతో భారత కాంగ్రెస్ పార్టీకి దేశంలోని వివిధ స్థాయిల్లో ప్రత్యామ్నాయాన్ని ప్రజాసమస్యలు బాగా వెలుగులోకి రాగలగడంతో భారత రాజకీయ వ్యవస్థ తన సామర్థ్యాలను పెంపొందించుకొని ప్రజల డిమాండ్లను పరిష్కరించడానికి సమాయత్తమవుతోంది.’

సంకీర్ణ రాజీకీయాల వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు తమ సంకీర్ణ భాగస్వామ్య పక్షాలతో రాజకీయ బేరసారాలకు దిగుతాయి. కొన్నిసార్లు దీని ఫలితంగా రాజకీయ కుయుక్తులు పెరిగి, రాజకీయ అస్థిరతకు దారితీస్తుంది. చాలా రాజకీయ పార్టీలకు స్వార్థ ప్రయోజనాలతో నిండిన ఎజెండా ఉండడం ఫలితంగా రాజకీయ నీచత్వం, దురాచారాలు, బెదిరింపులు, కుతంత్రాలు రాజ్యమేలుతాయి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 8 భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు

ప్రశ్న 3.
ఉగ్రవాదం లక్షణాలు.
జవాబు.
ఉగ్రవాదంపై జరిగిన అనేక అధ్యయనాలు, ఉగ్రవాద చర్యలలో కనిపించే సారూప్యతలను, ధోరణులను, లక్షణాలుగా తెలిపాయి.

  1. కొద్దిమంది వ్యక్తులు ప్రణాళికాబద్ధంగా, వ్యవస్థీకృతంగా బుద్ధి పూర్వకంగా చేసే హింసాత్మక చర్య ఉగ్రవాదంగా ఉంటుంది.
  2. ఉగ్రవాదం అమాయకపు ప్రజలను లేదా ఒక నిర్దిష్ట వర్గాన్ని పోలీసు అధికారులను, సాయుధ దళాలను లేదా కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని చేసే హింసాత్మక చర్య.
  3. సమాజంలోని సాంఘిక-ఆర్థిక లేదా రాజకీయ వ్యవస్థను సవాలుచేస్తూ, కొద్దిమంది ప్రేరణతో జరిగే హింస ఉగ్రవాదం లేదా తీవ్రవాదం రూపంలో బహిర్గతమవుతుంది.
  4. ఉగ్రవాదం ప్రభుత్వంపైన, రాజకీయ వ్యవస్థపైన జరిపే అనధికార యుద్ధంగా కనబడుతుంది.
  5. బెదిరింపులకు, పాశవికతకు ఉగ్రవాదం సాధనంలాగా ఉంటుంది. కొద్దిమంది తమ డిమాండ్లను హింసాత్మక ఉగ్రవాద చర్యలు ద్వారా వ్యక్తీకరిస్తారు.

ప్రశ్న 4.
అవినీతి రూపాలు.
జవాబు.
అవినీతికి అనేక రూపాలున్నాయి. వీటిలో లంచాలు, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, బలవంతపు వసూలు, ప్రభుత్వ ధనం, దుర్వినియోగం, కుల-మత ప్రీతికర వివక్షచూపడం వంటివి ఉన్నాయి.

1988లో వచ్చిన అవినీతి నిరోధక చట్టం ప్రకారం లంచగొండితనం, నిధుల దుర్వినియోగం, ధన సంబంధ ప్రయోజనాలు పొందడం, అధికార పదవిని, హెూదాను స్వార్థప్రయోజనాలకు ఉపయోగించడం, ఆదాయానికి మించి ఎన్నోరెట్లు ఆస్తులను కలిగిఉండం తదితర చర్యలు అవినీతి చర్యలుగా, చట్టపరంగా శిక్షార్హమైనదిగా పేర్కొంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 8 భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు

ప్రశ్న 5.
ప్రజావేగులు.
జవాబు.
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని వెల్లడించి, బహిర్గతం చేసి అవినీతికి వ్యతిరేకంగా ప్రజలను అప్రమత్తులను చేసే కార్యకర్తలలే (Whistle Blowers). వీరికి అవినీతి అధికారులు, నాయకుల నుంచి ప్రమాదాలు ఎదురవుతాయి. ఇటీవలి కాలంలో జాతీయ రహదారుల అథారిటీ కుంభకోణాన్ని వెలికితీసిన శ్రీ సత్యేంద్ర దూబే హత్య, సమాచార హక్కు కార్యకర్తల షీలా మసూద్ హత్య తదితర సంఘలనలు ప్రజావేగులకు రక్షణ కల్పించవలసిన అవసరాన్ని తెలియజేస్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం “ప్రజా ప్రయోజనాల వెల్లడి తీర్మానం” (Public Interest Disclosure resolution-PIDR) పేరుతో ఈ ప్రజావేగుల జీవితాలకు భద్రత కల్పించడానికి అనేక చర్యలు తీసుకొంటోంది.

TS Inter 2nd Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 6th Lesson స్థానిక ప్రభుత్వాలు Textbook Questions and Answers.

TS Inter 2nd Year Political Science Study Material 6th Lesson స్థానిక ప్రభుత్వాలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారతదేశంలో ప్రాంతీయ ప్రభుత్వాల చారిత్రక నేపథ్యాన్ని వివరించండి.
జవాబు.
చారిత్రక నేపథ్యం:
చక్కని పరిపాలనా వికేంద్రీకరణ, గ్రామ స్వరాజ్యం భారతదేశానికి ఎంతో అవసరమని గాంధీజీ ఏనాడో ఉద్భోదించారు. అనేక మంది జాతీయ నాయకులు ఈ భావనలను బలపరచారు. అయితే స్వాతంత్ర్యానంతరం ఏర్పడిన అనేక సంఘటనల కారణంగా భారత రాజ్యాంగ నిర్మాతలు జాతీయ సమైక్యత, సమగ్రతలకు ఎంతో ప్రాధాన్యం ఇవ్వవలసి వచ్చింది.

ఈ నేపథ్యంలో వారు ప్రాంతీయ ప్రభుత్వాలకు సముచితమైన స్థానాన్ని ఇవ్వలేకపోయారు. అయినప్పటికీ మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్య ఆశయాన్ని భారతరాజ్యాంగంలోని ఆదేశక సూత్రాలలో 40వ ప్రకరణలో వారు పొందుపరచారు. ఈ ప్రకరణ ప్రకారం “రాజ్యం పంచాయితీరాజ్ సంస్థలను నిర్వహించి, అవి స్వయం పాలనా సంస్థలుగా ఏర్పడటానికి తగిన అధికారాలు ఇవ్వాలి.

సామాన్య ప్రజానీకానికి పరిపాలనలో భాగస్వామ్యం, ప్రాతినిధ్యం కల్పించడానికి స్థానిక ప్రభుత్వాలు ఎంతో అవసరం. ఈ సంస్థలు ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులలాంటివి. ఈ సంస్థలను స్వయం పాలన సంస్థలుగా రూపొందించడానికి తగిన చర్యలను తీసుకునే ప్రధాన బాధ్యత రాజ్యానికి ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పంచాయితీరాజ్ సంస్థలను బలోపేతం చేయడానికి వివిధ చర్యలను చేపట్టింది. భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చిన తరువాత 1952లో సమాజాభివృద్ధి పథకం అమలు కోసం తగిన చర్యలు తీసుకుంది.

గ్రామీణ ప్రాంతంలోని వారికి శాస్త్రీయ, సాంకేతిక విజ్ఞానాన్ని అందించడం కోసం ఈ పథకం ద్వారా ప్రభుత్వం కృషి చేసింది. అయితే, ఈ పథకం ఆచరణలో ఆశించిన ఫలితాలను అందించలేకపోయింది. 1953లో కేంద్ర ప్రభుత్వం (National Extension Service Scheme – NESS) జాతీయ విస్తరణ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలను గ్రామీణాభివృద్ధి వ్యవహారాలలో భాగస్వామ్యం చేయడానికి ప్రభుత్వం కృషి చేసింది. అయితే ఈ పథకం కూడా ఆశించిన ఫలితాలను అందించలేదు. దీంతో భారత ప్రభుత్వం 1957లో బల్వంత్ రాయ్ మెహతా ఆధ్వర్యంలో ఒక పరిశీలనా సంఘాన్ని నియమించింది.

సమాజాభివృద్ధి పథకాల వైఫల్యానికి దారితీసిన పరిస్థితుల గురించి విచారణ జరపవలసిందిగా ఈ సంఘాన్ని ప్రభుత్వం కోరింది. బల్వంత్రెయ్మైహతా కమిటీ సుమారు 10 నెలల కాలంలో అనేక విషయాలను పరిశీలించి 1957 నవంబర్లో తుది నివేదికను సమర్పించింది. సమాజాభివృద్ధి వైఫల్యానికి తగిన కారణం, ఆచరణలో ఉన్న లోపాలు అని కమిటీ అభిప్రాయపడింది. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ పేరుతో గ్రామ పంచాయితీలను పునర్వ్యవస్థీకరించాలని కమిటీ సిఫార్సు చేసింది.

ఈ సందర్భంలో బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అనేక సిఫార్సులు చేసింది. వాటిలో ప్రధానమైనవి గ్రామపంచాయితీ, పంచాయితీ సమితి, జిల్లాపరిషత్ వంటి మూడు అంచెల ప్రాతినిధ్య సంస్థలను ప్రవేశపెట్టడం, ప్రాంతీయ ప్రభుత్వాలకు తగినంత నిధులు మంజూరు చేయడం మొదలైన అంశాలకు సంబంధించి బల్వంత్రాయ్ మెహతా కమిటీ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. కమిటీ సూచించిన పంచాయితీరాజ్ వ్యవస్థను అనేక రాష్ట్రాలు ఆమోదించాయి. వీటిలో రాజస్థాన్ మొదటి రాష్ట్రం.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 2.
73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ప్రధాన లక్షణాలను పేర్కొనండి.
జవాబు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఎంతో ప్రముఖమైనది. గ్రామస్థాయిలో, మాధ్యమిక స్థాయిలో, జిల్లాస్థాయిలో ఉన్న మూడంచెల పాలన గల పంచాయితీరాజ్ సంస్థలను ఈ చట్టం వ్యవస్థీకరించింది.

గ్రామీణ ప్రజలలో చక్కని నాయకత్వ లక్షణాలను, వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయాన్ని కలుగజేయడంలో ఈ చట్టం ప్రధానపాత్ర వహిస్తుంది. ఈ చట్టం ప్రధాన లక్షణాలను చట్టంలోని వివిధ ప్రకరణాల ద్వారా సంక్షిప్తంగా తెలుసుకుందాం.

చట్టం ప్రధానాంశాలు :
1. నిర్వచనాలు (243వ ప్రకరణ) :
గ్రామసభ, పంచాయితీ, జిల్లా మొదలైన అనేక పదాలను ఈ చట్టంలో వివిధ సందర్భంలో వాడటం జరిగింది. ఈ పదాల నిర్వచనాలు 243వ ప్రకరణలో ఉన్నాయి.

2. గ్రామసభ (243 – ఎ) :
చట్టం ప్రకారం గ్రామస్థాయిలో ఒక గ్రామ సభ ఉంటుంది. ఇది తన అధికారాలను శాసనసభ నిర్దేశించిన విధంగా చలాయిస్తుంది.

3. పంచాయితీ వ్యవస్థ (243-బి) :
ఈ చట్టం మూడు అంచెల ఏకరూప వ్యవస్థను నిర్దేశించింది. అవి (1) గ్రామస్థాయి (2) (మాధ్యమిక) మండలస్థాయి (3) జిల్లాస్థాయి.

4. పంచాయితీ నిర్మాణం (243-సి) :
పంచాయితీల నిర్మాణం గురించి శాసనసభ తగు నిబంధనలను రూపొందించాలని ఈ చట్టం పేర్కొంది. ప్రాదేశిక నియోజకవర్గాల ప్రాతిపదికపై పంచాయితీలకు ప్రత్యక్ష ఎన్నికలు ఉండాలని ఈ చట్టం పేర్కొంది.

5. సీట్ల రిజర్వేషన్లు (243-డి) :
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల, ప్రజాప్రతినిధులకు పంచాయితీలో వారి జనాభాను బట్టి. సీట్లు రిజర్వేషన్లు ఉండాలని ఈ చట్టం పేర్కొంటుంది. అలాగే 1/3 వంతుకు మించకుండా మహిళలకు రిజర్వేషన్లు కేటాయించాలని చట్టం పేర్కొంటుంది.

6. పంచాయితీల కాల పరిమితి (243-ఇ) :
ఈ చట్టం ప్రకారం పంచాయితీల కాల పరిమితి 5 సం||లు. కాలపరిమితికి ముందే ఒకవేళ అవి రద్దయితే వాటికి ఎన్నికలు నిర్వహించవలసి వస్తుంది.

7. అర్హతలు, అనర్హతలు (243-ఎఫ్) :
ఈ చట్టం పంచాయితీ సంస్థలకు పోటీ చేసే అభ్యర్థుల అర్హతలను, అనర్హతలను నిర్ధిష్టంగా పేర్కొంటుంది.

8. అధికారాలు, విధులు (243-జి):
11వ షెడ్యుల్ ద్వారా 29 అంశాలతో పంచాయితీ కార్యకలాపాలను ఈ చట్టం నిర్ధారించింది.

9. ఆదాయ వనరులు (243-హెచ్) :
పంచాయితీ సంస్థలకు గల వివిధ ఆదాయ వనరుల గురించి ఈ చట్టం పేర్కొనడం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు, పన్నుల ద్వారా ఆదాయం, భవనాల అద్దె మొ॥॥ వాటి ద్వారా ఈ సంస్థలు ఆదాయ వనరులను పొందుతాయి.

10. ఆర్థిక సంఘం (243 – ఐ) :
పంచాయితీల ఆర్థిక స్థితి సమీక్షకై ఒక ఆర్థిక సంఘాన్ని చట్టం ఏర్పరచి, తగిన విధి విధానాలను పేర్కొంటుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 3.
74వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ప్రధాన లక్షణాలను వివరించండి.
జవాబు.
74వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం రాజ్యాంగంలో IXA భాగం చేర్చబడినదని, ఇందులో 243 IP నుంచి 243.2F ప్రకరణలు ఉన్నాయని, ఈ భాగం “మున్సిపాలిటీస్” అనే శీర్షిక ద్వారా వివిధ పట్టణ స్థానిక సంస్థల గురించి వివరిస్తుందని తెలుసుకున్నాం. ఇందులో 243P ప్రకరణలో చట్టంలో ఉపయోగించబడిన అనేక పదాలకు నిర్వచనాలు ఉన్నాయి. ఇతర ప్రకరణలు పట్టణ స్థానిక ప్రభుత్వాల గురించి వివరిస్తాయి. వీటి గురించి తెలుసుకుందాం.

1. మున్సిపాలిటీల వ్యవస్థ (243. Q – ప్రకరణ) :
243Q – ప్రకరణ ప్రకారం, ప్రతి రాష్ట్రంలో ప్రధానంగా మూడు తరహాల మున్సిపాలిటీలు ఉండాలి. అవి :

  1. నగర పంచాయతీ (గ్రామీణ ప్రాంత స్థాయి నుండి పట్టణ ప్రాంతంగా పరివర్తన ప్రాంతంలో).
  2. మున్సిపల్ కౌన్సిల్ (చిన్న పట్టణ ప్రాంతాలలో).
  3. మున్సిపల్ కార్పోరేషన్ (బాగా విస్తరించిన పట్టణ ప్రాంతాలలో).

2. మున్సిపాలిటీల నిర్మాణం (243-R) :
మున్సిపాలిటీల నిర్మాణం గురించి ఈ చట్టం వివరిస్తుంది. దీని ప్రకారం మున్సిపల్ స్థానాలకు ప్రతినిధులు ఎంపిక ప్రత్యక్ష ఎన్నికల ద్వారా జరుగుతుంది. ఇందుకోసం మున్సిపాలిటీలను వార్డులుగా విభజిస్తారు. వార్డులలోని ప్రజలు తాము ప్రతినిధులను ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ఈ చట్టం ప్రకారం కొన్ని ప్రత్యేక అంశాలను సంబంధించి రాష్ట్ర శాసనసభలు శాసనాలు చేయవచ్చు.

ఉదాహరణకు, పురపాలక సంస్థలకు సమావేశాలలో అనుభవజ్ఞులు, నేర్పరితనంగల వ్యక్తులు పాల్గొనడానికి అవసరమైన నియమనిబంధనలను రాష్ట్ర శాసనసభలు చేయవచ్చు. అదేవిధంగా మున్సిపాలిటీ ప్రాంత పరిధిలోని రాష్ట్ర శాసనసభ / పార్లమెంట్ సభ్యులకు ఓటింగ్ హక్కులతో ప్రాతినిధ్యం కలిగించవచ్చు.

3. వార్డు కమిటీలు (243 – S) :
మూడు లక్షలు లేదా అంతకుమించి ఉన్న పురపాలక సంస్థలలో వార్డు కమిటీల ఏర్పాటు విషయంలో శాసనాలను రూపొందించే అధికారాన్ని రాష్ట్ర శాసనసభలు పొందుతాయని 243-S ప్రకరణ పేర్కొంటుంది.

4. సీట్ల రిజర్వేషన్లు (243 – T) :
243 – T ప్రకరణ ప్రకారం మున్సిపల్ ప్రాంతంలోని షెడ్యుల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి సీట్ల రిజర్వేషన్లు ఉండాలి. అంతేకాక 1/3వ వంతు స్థానాలను మహిళలకు కేటాయించాలని కూడా చట్టం నిర్దేశిస్తుంది.

5. మున్సిపాలిటీల పదవీకాలం (243 – U):
ఈ మున్సిపాలిటీల పదవీకాలాన్ని 5 సంగా నిర్ణయించింది. ఒకవేళ ఏ కారణం రీత్యానైనా పదవీకాలం ముగియకముందే మున్సిపాలిటీ రద్దయితే, తిరిగి ఆరుమాసాలలో వాటికి ఎన్నికలు జరిపించాలని కూడా ఈ చట్టం నిర్దేశిస్తుంది.

6. అనర్హతలు (243 – V) :
పురపాలక సంస్థల సభ్యులకు ఎన్నికలలో పోటీ చేయడానికి కావలసిన అర్హతలను, అనర్హతలను నిర్ణయించే అంశాలను ఈ చట్టం నిర్దిష్టంగా పేర్కొంటుంది. దీని ప్రకారం అనర్హతలకు సంబంధించిన వివాదాలను రాష్ట్ర శాసనసభ ఏర్పరచిన ఒక ప్రత్యేక అథారిటీ నిర్ణయిస్తుంది.

7. మున్సిపాలిటీల అధికారాలు, హక్కులు, బాధ్యతలు (243 – W) :
మున్సిపాలిటీలకు అధికారాలు, హక్కులు, బాధ్యతలను రాష్ట్ర శాసనసభలు ప్రత్యేక శాసనాల ద్వారా రూపొందించి, ఈ ప్రభుత్వాలను స్వయంపాలక సంస్థలుగా తీర్చిదిద్దాలని (243 – W) ప్రకరణ పేర్కొంటుంది.

18 అంశాలతో మున్సిపాలిటీలకు గల అధికారాలు, హక్కులు, బాధ్యతలను ఈ చట్టంతో రాజ్యాంగంలో ప్రత్యేకంగా చేర్చబడింది.
ఈ విధంగా 74వ రాజ్యాంగ సవరణ చట్టం పట్టణ, స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగపరమైన గుర్తింపును, సాధికారతను కలిగించి క్షేత్రస్థాయిలో ఉన్న ఈ ప్రభుత్వాలను బలోపేతం చేయడానికి తగిన ప్రధానాంశాలను కలిగి ఉందని చెప్పవచ్చు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 4.
2018 తెలంగాణ పంచాయితీ రాజ్ చట్టంపై సంక్షిప్త సమాధానం రాయండి.
జవాబు.
73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలకు అనుగుణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేవల్లో 1994లో “ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ “చట్టం” పేరుతో చట్టం చేయడమైనది. ఇది మే 30, 1994 నుంచి అమలులోకి వచ్చింది. జూన్ 2, 2014న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాక ఇదే చట్టాన్ని కొంతకాలం కొనసాగించారు. అనంతరం మన్యశ్రీ కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం 2018లో “తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం – 32018” పేరుతో నూతన చట్టాన్ని చేసింది.

ఈ చట్టం రాష్ట్రంలో ఏప్రిల్ 18, 2018 నుంచి అమలులోకి వచ్చింది. నూతన రాష్ట్రం ఆశలు, ఆశయాలు తీర్చుతూ తెలంగాణలో స్థానిక సంస్థలను బలోపేతం చేయడం ఈ చట్టం ప్రధాన లక్ష్యం. ఈ చట్టంలో 8 షెడ్యూల్స్, 9 భాగాలు మరియు 297 సెక్షన్లు ఉన్నాయి.

తెలంగాణ నూతన పంచాయతీరాజ్ చట్టం ముఖ్య లక్షణాలు :

1. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ :
ఈ చట్టం రాష్ట్రంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పరచింది. అవి గ్రామస్థాయిలో గ్రామపంచాయతీ, మండల స్థాయిలో ప్రజాపరిషత్, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్,

2. అరహతలు అనర్హతలు :
దీని ప్రకారం వివిధ పదవులకు కావలసిన అర్హతలను అనర్హతలను స్పష్టంగా పేర్కొంది. అవి :

  1. అతను/ఆమె 21 సంవత్సరాల వయస్సు పూర్తి అయి ఉండాలి.
  2. అతను/ఆమె పోటీ చేసే స్థానిక ప్రభుత్వ భౌగోళిక పరిధిలో ఓటరై ఉండాలి.
  3. అతను/ఆమె ప్రభుత్వం నుంచి ఆదాయం పొందే లాభసాటి పదవిలో ఉండరాదు.
  4. రాష్ట్ర శాసనసభ నిర్ణయించిన మేరకు నిర్ణీత డిపాజిట్లను చెల్లించాలి.
  5. అతను/ఆమె మే, 30, 1995 తరవాత మూడవ సంతానాన్ని పొందితే పోటీకి అనర్హులు.

వివరణ : దీని ప్రకారం ఒక వ్యక్తి మే, 31, 1995 కంటే ముందు ఇద్దరు కంటే ఎక్కువ సంతానాన్ని కలిగి ఉన్నప్పటికీ స్థానిక సంస్థలకు పోటీ చేయడానికి అర్హుడే.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 5.
తెలంగాణ జిల్లా పరిషత్ల నిర్మాణం, అధికారాలు వివరించండి.
జవాబు.
జిల్లా పరిషత్ నిర్మాణం : ప్రతిజిల్లా ప్రజా పరిషత్లో కింది సభ్యులు ఉంటారు.

1. ఎన్నికైన సభ్యులు :
వీరిని జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గ సభ్యులని (ZPTC) అంటారు.

2. పదవీరీత్యా సభ్యులు :
జిల్లా పరిధిలో గల నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడు (MLA), లోక్ సభ సభ్యుడు (MP), అదే విధంగా జిల్లాలో ఓటర్గా నమోదైన రాష్ట్ర విధాన పరిషత్ సభ్యుడు (MLC) రాజ్యసభ సభ్యుడు (MP), జిల్లా ప్రజాపరిషత్లో పదవీరీత్యా సభ్యులుగా (Ex-officio) ఉంటారు.

వీరు జిల్లా పరిషత్ సమావేశాలలో పాల్గొనవచ్చు, చర్చల్లో భాగస్వామ్యం కావచ్చు. అభిప్రాయాలు చెప్పవచ్చు. అదేవిధంగా జిల్లా పరిషత్ యొక్క వివిధ స్థాయి సంఘాల్లో సభ్యులు కావచ్చు. ఈ సమావేశాల్లో పాల్గొని తమ అభిప్రాయాలు చెప్పవచ్చు. కాని వివిధ తీర్మానాలపై ఓటు వేసే హక్కులేదు.

3. కో-ఆప్ట్ సభ్యులు :
జిల్లా ఓటర్గా నమోదై ఉన్న మైనారిటీ వర్గానికి చెందిన ఇద్దరిని జిల్లా పరిషత్ సభ్యులు కో-ఆప్ట్ చేసుకోవచ్చు. వీరికి 21 సంవత్సరాల వయస్సు పూర్తి అయి ఉండాలి.

జిల్లా పరిషత్ అధికారాలు, విధులు :

  1. జిల్లాలోని అన్ని మండల ప్రజాపరిషత్ల బడ్జెట్లను పరిశీలించి ఆమోదిస్తుంది.
  2. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల కింద ఇచ్చే నిధులను జిల్లాలోని అన్ని మండల ప్రజాపరిషత్లకు కేటాయిస్తాడు.
  3. జిల్లాలోని వివిధ మండలాల ప్రణాళికలు క్రోడీకరించి జిల్లా ప్రణాళికను రూపొందించి అమలు చేయడం.
  4. జిల్లాలోని అన్ని మండల ప్రజాపరిషత్లు మరియు గ్రామపంచాయతీల కార్యక్రమాలను పర్యవేక్షించి అవసరమైన సలహాలు, ఆదేశాలివ్వడం.
  5. చట్టం ప్రకారం విధించే పన్నులు లేదా రుసుములను వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవడం, జిల్లా బోర్డ్ అధికారాలను నిర్వహించడం.
  6. గ్రామీణాభివృద్ధికి, ప్రజాసంక్షేమానికై చేపట్టవలసిన వివిధ కార్యక్రమాలు, సేవల రూపకల్పనకై రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సలహా ఇచ్చింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
బల్వంత్రెయ్ మెహతా కమిటీ.
జవాబు.
మనదేశంలో శ్రీ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ సిఫారసులననుసరించి పంచాయితీరాజ్ వ్యవస్థ అమలులోకి వచ్చింది. స్వాతంత్య్రానంతరం భారతదేశంలో ప్రారంభించబడిన సమాజాభివృద్ధి పథకము, జాతీయ విస్తరణ సేవా పధకములు అమలు తీరును సమీక్షించుటకు భారత ప్రభుత్వం 1957లో బల్వంత్ రాయ్ మెహతా ఆధ్వర్యంలో ఒక పరిశీలనా సంఘాన్ని నియమించింది.

ఈ కమిటీ సుమారు 10 నెలల కాలంలో అనేక విషయాలను పరిశీలించి 1957 నవంబరులో తుది నివేదికను సమర్పించింది. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ పేరుతో గ్రామపంచాయితీ, పంచాయితీ సమితి, జిల్లా పరిషత్ వంటి మూడు అంచెల ప్రాతినిధ్య సంస్థలను ప్రవేశపెట్టాలని సూచించింది.

ప్రశ్న 2.
అశోక్ మెహతా కమిటి.
జవాబు.
మోరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా వ్యవస్థలను బలోపేతం చేయడానికి 1978లో 13
ప్రభుత్వం 1977లో అశోక్ మెహతా నాయకత్వంలో పంచాయతీరాజ్. సూచనలతో తన నివేదికను సమర్పించింది. అందులో ముఖ్యమైనవి.

  1. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ స్థానంలో రెండంచెల వ్యవస్థను అమలుచేయాలి. అవి జిల్లాస్థాయిలో జిల్లా పరిషత్, దిగువ స్థాయిలో వివిధ గ్రామాలతో కూడిన మండల పరిషత్.
  2. జిల్లాస్థాయిలో జిల్లాపరిషత్ కార్యనిర్వాహక వ్యవస్థగా పనిచేస్తుంది. జిల్లాస్థాయిలో అన్ని రకాల ప్రణాళికల రూపకల్పన, అమలు కోసం బాధ్యత వహిస్తుంది.

ప్రశ్న 3.
ఎల్.ఎం. సింఘ్వి కమిటి.
జవాబు.
‘ప్రజాస్వామ్యం, అభివృద్ధి’ పేరుతో పంచాయతారాజ్ వ్యవస్థలను పునఃనిర్మాణానికి రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1986లో L.M. సింఘ్వి నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. దీని సూచనలు :

  1. పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగబద్ధత కల్పిస్తూ, పటిష్టంగా అమలుచేయాలి.
  2. పంచాయతీరాజ్ సంస్థలకు స్వేచ్ఛగా, నిర్ణీతకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లను రాజ్యాంగంలో పొందుపరచాలి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 4.
ఎన్నికల సంఘం.
జవాబు.
రాష్ట్రంలో పంచాయితీరాజ్ సంస్థల మరియు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ, ఓటర్ల జాబితా మొదలగు అంశాలను స్వేచ్ఛగా, స్వతంత్రంగా నిర్వహించడానికి రాజ్యాంగ ప్రతిపత్తి గల రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని గవర్నర్ నియమిస్తాడు.

ప్రశ్న 5.
రాష్ట్ర ఆర్థిక సంఘం.
జవాబు.
73 మరియు 74వ రాజ్యాంగ సవరణ చట్టములలో అధికరణలు 243-I మరియు 243-Y వైల ప్రకారం పంచాయతీల ఆర్థికస్థితి సమీక్షపై ఒక ఆర్థిక సంఘం ఏర్పాటవుతుంది. ఈ ఆర్థిక సంఘం మున్సిపాలిటీల ఆర్థిక పరిస్థితిని కూడా సమీక్షించి, తగిన విధి, విధానాల సూచనతో రాష్ట్ర గవర్నర్కు నివేదికను సమర్పిస్తుంది.

ప్రశ్న 6.
జిల్లా ప్రణాళికా కమిటీ:
జవాబు.
ప్రతి రాష్ట్రం 243 (ZD) ప్రకారం, జిల్లా స్థాయిలో జిల్లా ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి. గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు, పట్టణ స్థానిక ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరుల పంపిణి కోసం ప్రణాళికలను రూపొందించడం దీని విధి. తెలంగాణ రాష్ట్రంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవీరీత్యా దీని ఛైర్మన్ గా ఉంటాడు. అదే విధంగా జిల్లా కలెక్టర్ దీనికి కన్వీనర్గా వ్యవహరిస్తాడు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 7.
గ్రామ పంచాయతీ
జవాబు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీరాజ్ సంస్థలో గ్రామపంచాయతీ పునాది నిర్మాణం వంటిది. ఇది గ్రామ స్థాయిలో శాసన నిర్మాణ వ్యవస్థగా, చర్చాసంబంద సంస్థగా ఉంటుంది. గ్రామ పంచాయతీ నెలకు కనీసం ఒకసారి సమావేశం కావాలి.

గ్రామ పంచాయతీ సమావేశానికి సర్పంచ్ అధ్యక్షతవహిలాస్తారు. అతను లేనిచో ఉప సర్పంచ్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. అన్ని రకాల నిర్ణయాలు, తీర్మానాలను గ్రామ పంచాయతీ సభ్యులు, సర్పంచ్ కలిపి మెజారిటీ తీర్మానంతో ఆమోదిస్తారు.

ప్రశ్న 8.
గ్రామ సభ.
జవాబు.
ప్రతి గ్రామపంచాయతీలో గ్రామసభ ఏర్పాటవుతుంది. దానిలో గ్రామానికి చెందిన రిజిష్టర్ ఓటర్లు సభ్యులుగా ఉంటారు. అది సంవత్సరానికి కనీసం మూడుసార్లయినా సమావేశమవుతుంది. గ్రామసభ పంచాయితీకి సంబంధించిన వార్షిక పరిపాలన, ఆడిట్ నివేదికలను పరిశీలించి ఆమోదిస్తుంది.

వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్దిదారుల జాబితాను ఖరారు చేస్తుంది. సమాజ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు శీఘ్రగతిన అమలులో ఉంచడానికి, ప్రజల భౌతిక సేవలను స్వచ్ఛందంగా వినియోగించుకోవడానికి తగిన సూచనలిస్తుంది.

ప్రశ్న 9.
సర్పంచ్.
జవాబు.
గ్రామంలో సర్పంచ్ ప్రథమ పౌరుడు. ఇతను గ్రామ పంచాయతీకి రాజకీయాధిపతిగా ఉంటాడు. సర్పంచ్ గ్రామంలో రిజిష్టర్ ఓటర్లచే ఎన్నికవుతాడు. ఇతను గ్రామపంచాయతీ, గ్రామ సభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. గ్రామ పంచాయతీ, గ్రామ సభ తీర్మానాలను అమలుచేసే బాధ్యతను నిర్వహిస్తాడు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 10.
పంచాయతీ కార్యదర్శి.
జవాబు.
రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడిన పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీలో ముఖ్య ప్రభుత్వోద్యోగి. గ్రామ పంచాయతీ పరిపాలనా వ్యవహారాలలో సర్పంచి సహాయంగా ఉంటూ అతని ఆదేశాలకు అనుగుణంగా తన విధులను నిర్వహిస్తాడు. ఇతను గ్రామ పంచాయతీ, గ్రామసభ సమావేశాలకు హాజరు కావచ్చు.. చర్చల్లో పాల్గొనవచ్చు. సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తాడు. కానీ తీర్మానాలపై ఓటు వేసే అధికారం మాత్రం లేదు.

ప్రశ్న 11.
మండల పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గ సభ్యుడు (MPTC).
జవాబు.
ప్రతి మండల ప్రజాపరిషత్ ను వివిధ ప్రాదేశిక నియోజక వర్గాలుగా విభజిస్తాడు. ఇందలో 3,000 నుంచి 4,000 మంది జనాభా ఉంటారు. ప్రతి ప్రాదేశిక నియోజక వర్గానికి ఒక్కొక్క ప్రతినిధి ఉంటారు. వారిని MPTC అని అంటారు. మండల ప్రజాపరిషత్లోని ఓటర్లచే రహస్య ఓటింగ్ పద్ధతిలో మీరు ఎన్నికౌతారు.

మండల ప్రజాపరిషత్ భౌగోళిక పరిధిలో ఎక్కడైన ఓటర్గా నమోదై ఉన్న వ్యక్తి ఆ మండంలంలోని ఏ ప్రాదేశిక నియోజక వర్గం నుంచి అయిన MPTC పోటీ చేయవచ్చు. మొత్తం MPTC సీట్లలో కొన్ని స్థానాలు చట్టం నిర్దేశించిన విధంగా SC, ST, BC మరియు మహిళలకు రిజర్వ్ చేస్తారు.

ప్రశ్న 12.
మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు (MPP).
జవాబు.
మండల ప్రజాపరిషత్ రాజకీయాధిపతిగా, ప్రథమ పౌరునిగా MPP వ్యవహరిస్తాడు. ప్రతి మండల ప్రజాపరిషత్కు ఒక అధ్యక్షడు, మరొకరు ఉపాధ్యక్షులుగా ఉంటారు. MPTC లు తమలో ఒకరిని MPP గా, మరొకరిని ఉపాధ్యక్షునిగా ఎన్నుకుంటారు. మండల ప్రజాపరిషత్ సమావేశాలను ఏర్పరచి, దానికి అధ్యక్షత వహిస్తాడు.

మండల ప్రజాపరిషత్ రికార్డు మొత్తం ఇతని అధీనంలో ఉంటాయి. మండల ప్రజాపరిషత్ తీర్మానాల అమలులో MPDO పై పాలనాపరమైన నియంత్రణను కలిగి ఉంటాడు. మండలాభివృద్ధి అనేది సమర్థతపై ఆధారపడి ఉంటుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 13.
మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO).
జవాబు.
రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడిన మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) మండల ప్రజాపరిషత్లో ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా వ్యవహరిస్తాడు. మండల ప్రజాపరిషత్ తీర్మానాల అమలు బాధ్యతను కలిగి ఉంటాడు. ప్రభుత్వం ఆదేశించిన ఇతర విధులను కూడా నిర్వర్తించాలి.

మండల పరిధిలోని గ్రామ పంచాయతీలను పర్యవేక్షించే అధికారం ఉంటుంది. మండల ప్రజాపరిషత్ అధ్యక్షుని ఆమోదంతో లేదా ఆదేశానుసారం MPDO నెలకు కనీసం ఒకసారి మండల ప్రజాపరిషత్ సమావేశాలను ఏర్పాటుచేయాలి. MPDO ఈ సమావేశాలకు హాజరు కావచ్చు.

ప్రశ్న 14.
జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు (ZPTC).
జవాబు.
ప్రతి జిల్లా పరిషత్లో అనేక మండలాలు ఉంటాయి. ప్రతి మండలాన్ని ఒక్కో ప్రాదేశిక నియోజక వర్గంగా ఏర్పాటు చేసి, ఒక్కొక్క దానికి ఒక్కో వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తాడు. వీరిని జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గ సభ్యుడు (ZPTC) అని అంటారు.

ఆయా నియోజక వర్గాలలోని ఓటర్లచే రహస్య ఓటింగ్ ప్రక్రియ ద్వారా ZPTC లు ప్రత్యక్షంగా ఎన్నికవుతారు. జిల్లా ప్రజాపరిషత్ ప్రాదేశిక పరిధిలో ఓటర్గా నమోదై ఉన్న ఆ జిల్లా ప్రజా పరిషత్ లో ఎక్కడ నుండైన ZPTC గా పోటీచేయవచ్చు. చట్టం నిర్దేశించిన విధంగా SC, ST, BC మరియు మహిళలకు కొన్ని స్థానాలు రిజర్వ్ చేస్తారు.

ప్రశ్న 15.
ముఖ్య కార్యనిర్వాహక అధికారి (CEO).
జవాబు.
రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడిన ముఖ్య కార్య నిర్వాహక అధికారి (CEO) జిల్లా పరిషత్లో ఉన్నత ప్రభుత్వోద్యోగిగా ఉంటాడు. జిల్లా ప్రజా పరిషత్ తీర్మానాలను అమలుచేయడానికి బాధ్యత వహిస్తాడు. రాష్ట్ర ప్రభుత్వం కాలానుగుణంగా జిల్లా పరిషత్క సంబంధించిన ఇచ్చే ఆదేశాలను కూడా అమలు చేసే బాధ్యతను కలిగి ఉంటాడు.

జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మన్ అనుమతి లేదా ఆదేశంతో జిల్లా ప్రజా పరిషత్ సమావేశాలను CEO నెలకు కనీసం ఒకసారి ఏర్పాటు చేస్తాడు. CEO జిల్లా ప్రజాపరిషత్ సమావేశాలలో, స్థాయి సంఘాల సమావేశాలలో, జిల్లా పరిధిలోని మండల ప్రజాపరిషత్ సమావేశాల్లో పాల్గొనవచ్చు. మాట్లాడవచ్చు. తన అభిప్రాయాన్ని చెప్పవచ్చు. కాని వివిధ తీర్మానాలపై ఓటువేసే హక్కు మాత్రం లేదు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 16.
మేయర్.
జవాబు.
నగర పాలక సంస్థ రాజకీయాధినేతగా, ప్రథమ పౌరునిగా మేయర్ ఉంటాడు. ప్రతి నగర పాలక సంస్థల కార్యక్రమాల నిర్వహణకై ఒక మేయర్, డిప్యూటీ మేయర్ ఉంటారు. నగర పాలక సంస్థ ఎన్నికల అనంతరం కార్పొరేటర్స్ తమలో ఒకరిని మేయర్గా, మరొకరిని డిప్యూటీ మేయర్గా ఎన్నుకుంటారు. వీరి ఎన్నికల్లో పదవీరీత్యా సభ్యులకు కూడా ఓటు హక్కు ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణాల రీత్యా మేయర్ పదవి ఖాళీ అయితే నూతన మేయర్ను ఎన్నుకునేంత వరకు డిప్యూటీ మేయర్ ఆ విధులను నిర్వహిస్తాడు.

ప్రశ్న 17.
తెలంగాణ రాష్ట్రంలోని మునిసిపల్ కార్పొరేషన్ల పేర్లు రాయండి.
జవాబు.

  1. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్
  2. గ్రేటర్, వరంగల్ మునిసిపల్ కార్పోరేషన్
  3. కరీంనగర్
  4. ఖమ్మం
  5. నిజామాబాద్
  6. రామగుండం
  7. బడంగ్ పేట్
  8. బండ్లగూడ
  9. మీర్పేట్
  10. బోడుప్పల్
  11. జవహర్ నగర్
  12. ఫీర్ణాధీగూడ
  13. నిజాంపేట

TS Inter 2nd Year Telugu Study Material Chapter 3 నా సాహిత్య పరిశోధన

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material 3rd Lesson నా సాహిత్య పరిశోధన Textbook Questions and Answers.

TS Inter 2nd Year Telugu Study Material 3rd Lesson నా సాహిత్య పరిశోధన

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
బిరుదురాజు రామరాజు సాహిత్య పరిశోధనలను తెలుపండి.
జవాబు:
బిరుదురాజు రామరాజు ప్రారంభ కాలంలో కొన్ని గేయాలు, పద్యాలు, నవలలు రాశారు. ప్రతిభా, వ్యుత్పత్తి, అభ్యాసాల్లో మొదటి రెండు తక్కువగా ఉన్నాయనుకొని సృజనాత్మక సాహిత్యరంగంలో రాణింపు రాదని భావించారు. గుర్తింపు కోసం లోకానికి క్రొత్త విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో పరిశోధనను ప్రారంభించారు. బి. రామరాజు ఉద్యోగంలో ఉన్నప్పుడే వరంగల్ స్నాతకోత్తర కేంద్రం తెలుగు శాఖకు విమర్శని పేరుతో, ఉస్మానియా తెలుగు శాఖకు వివేచన అనే పేరుతో రీసెర్చ్ జర్నల్స్ ప్రకటించే ఏర్పాటు చేసి అందుకు కావలసిన ఆర్థిక వనరులు యూనివర్సిటీ బడ్జెట్లోనే పొందుపరిచేటట్లు చూశారు.

బిరుదురాజు రామరాజు హైస్కూలు విద్యార్థిగా ఉండినప్పటి నుంచే భారతి మొదలైన పత్రికల్లో మానవల్లి రామకృష్ణకవి, వేటూరి ప్రభారక శాస్త్రి, నిడదవోలు వేంకటరావు, మల్లంపల్లి సోమశేఖరశర్మ వంటి పరిశోధకులు వ్యాసాలు, వారు సంపాదకత్వం వహించిన గ్రంథాల పీఠికలు చదివారు. అందువల్ల వారిలాగ ఇంతవరకు సాహిత్యలోకానికి తెలియని క్రొత్త విషయాలు చెప్పాలనే నిశ్చయంతో పరిశోధన రంగంలో అడుగు పెట్టారు. జానపద విజ్ఞానంలో విశ్వవిద్యాలయ స్థాయి పరిశోధనలో తెలుగులోనే కాదు దక్షిణ భారతదేశ భాషలన్నిటిలో తెలుగు జానపదగేయ సాహిత్యము అనే వీరి పరిశోధనా గ్రంథమే మొదటి సిద్ధాంత గ్రంథమైనది.

ఆ రంగంలో అనేక జానపద గేయ సంకలనాలు ప్రకటించారు. తెలుగులోను ఇంగ్లీషులోను జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పదుల సంఖ్యలో పరిశోధనాత్మక పత్రాలు సమర్పించారు. ఇంగ్లీషులో ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ.పి., ఫోక్లోర్ ఆఫ్ ఏ.పి., సౌత్ ఇండియన్ ఫోక్సాంగ్స్ ఇన్టూ తెలుగు ఫోక్లోర్ గ్రంథాలు ప్రకటించారు. అముద్రితంగా పడిఉన్న తెలుగు సంస్కృత రచనలు దాదాపు నూరు మొదటి సారి సాహిత్య ప్రపంచానికి తెలియపరిచారు. మరుగు పడిన మాణిక్యాలు, చరిత్రకెక్కని చరితార్థులు ఇతర ప్రత్యేక సంచికల్లో ప్రకటించిన వ్యాసాలు ఈ కోవకు చెందినవే.

సంస్కృత సాహిత్యానికి రామరాజు కృషి : సంస్కృతంలో కాళహస్తి కవి రచించిన వసుచరిత్రం, మధురవాణి రచించిన రామాయణ సారతిలకం, అభినవ కాళిదాసు వెల్లాల ఉమామహేశ్వరుల శృంగార శేఖర భాణం, శ్రీకృష్ణదేవరాయల జాంబవతీపరిణయ నాటకం మొదటిసారిగా పరిష్కరించి ప్రకటించారు.

ఇంకా కాకతి ప్రతాపరుద్ర చక్రవర్తి ఉషా రాగోదయం, బెల్లంకొండ రామారావుగారి రుక్మిణీ కల్యాణం, తిరుమల బుక్కపట్టణం, అణయాచార్యుల రసోదారభాణం, భారద్వాజ రామాచార్యుల భద్రగిరి చంపూ, ఓరుగంటి లక్ష్మణ యజ్వ సీతారామ విహారం (ఉ.వి. సంస్కృత అకాడమీ పక్షాన అర్యేంద్రశర్మగారి పేరుతో ప్రకటితం) పరశురామపంతుల అనంతరామయ్య సీతావిజయ చంపూ వంటి సంస్కృత కృతులు పరిష్కరించారు.

తెలుగు సాహిత్యానికి రామరాజు చేసిన కృషి : తెలుగులో బొడ్డుచెర్ల చినతిమ్మకవి ప్రసన్న రాఘవనాట్య ప్రబంధం, చింతలపల్లి ఛాయాపతి రాఘవాభ్యుదయం, సాయప వెంకటాద్రి నాయకుని సకలజీవ సంజీవనం, పాల్కురికి సోమనాథుని పండితారాధ్యోదాహరణం మొదటిసారి పరిష్కరించి ప్రకటించారు. శ్రీనాథుని శివరాత్రి మాహాత్మ్యం సంపూర్ణ గ్రంథం సంపాదించి పరిష్కరించి ప్రకటించారు. మడికి సింగన పద్మపురాణం, పాలవేకరి కదరీపతిరాజు శుకసప్తతి, సంశోధిత ముద్రణలు విపులమైన పీఠికలతో ప్రకటించారు. ఈ రెండు గ్రంథాల్లోని వందల సంఖ్యలో తప్పుడు పాఠాలు సవరించి చూపారు.

ఇంటర్ దాకా చదివిన ఉర్దూ సార్ధకమయ్యే విధంగా ఉర్దూ తెలుగు నిఘంటువును రాశారు. ఇంగ్లీషు నుంచి, హిందీ నుంచి నాలుగు గ్రంథాలు తెలుగులోనికి అనువదించారు. 38 మంది పరిశోధకులు రామరాజు పర్యవేక్షణలో ఎం.ఫిల్, పిహెచ్. పట్టాలు సంపాదించుకున్నారు.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 3 నా సాహిత్య పరిశోధన

ప్రశ్న 2.
జానపద గేయాలు సేకరించడంలో బిరుదురాజు అనుభవాలు ఎలాంటివి ?
జవాబు:
జానపద గేయాలు సేకరించినప్పటి అనుభవాలు : బిరుదురాజు రామరాజు సాహిత్యలోకానికి క్రొత్త విషయాలు చెప్పాలనే నిశ్చయంతో పరిశోధన రంగంలో అడుగు పెట్టారు. జానపద విజ్ఞానంలో విశ్వవిద్యాలయ స్థాయి పరిశోధనలో తెలుగులోనే కాదు దక్షిణ భారతదేశ భాషలన్నిటిలో తెలుగు జానపదగేయ సాహిత్యము అనే వీరి పరిశోధనా గ్రంథమే మొదటి సిద్ధాంత గ్రంథమైనది.

ఆ రంగంలో అనేక జానపదగేయ సంకలనాలు ప్రకటించారు. తెలుగులోను ఇంగ్లీషులోను జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పదుల సంఖ్యలో పరిశోధనాత్మక పత్రాలు సమర్పించారు. ఇంగ్లీషులో ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ.పి., ఫోక్లోర్ ఆఫ్ ఏ.పి., సౌత్ ఇండియన్ ఫోక్సాంగ్స్, గ్లింప్సెన్ ఇన్ టూ తెలుగు ఫోక్లోర్ గ్రంథాలు ప్రకటించారు. జానపద గేయాలు సేకరించిన రామరాజు అనుభవాలు కూడా ఆసక్తిదాయంగా ఉన్నాయి.

తెలంగాణ అంతటా తిరిగి 1953-1955 సంవత్సరాల మధ్య జానపద గేయాలు తాళపత్ర గ్రంథాలు, శిలాశాసనాలు సేకరించారు. ఆ రోజుల్లో పల్లెటూళ్ళకు బస్సులు లేవు, జిల్లా, తాలూకా కేంద్రాల నుండి కొన్ని చోట్లకు నడచి కొన్ని చోట్లకు సైకిల్ పైన, కొన్నిచోట్లకు ఎడ్లబండి పైన పోయి గేయాలు సేకరించారు. స్త్రీలకు రవిక ముక్కలు, పురుషులకు బీడీలు, చుట్టలు, కల్లుకు పైసలు ఇచ్చి గేయాలు పాడించి రాసుకున్నారు.

నల్గొండ జిల్లా నకిరేకల్లు గ్రామంలో కోలాటం పాటలు పాడేవారున్నారని విని అక్కడకు పోతే అక్కడి యువకులు సహకరించలేదు. రామరాజుకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ చేత బలవంతాన పట్టి తెప్పించి రాత్రి 11 గంటల నుండి ఒంటిగంట దాకా కోలాటాలు వేయించారు. ఇద్దరు యువకులు ఎదురు తిరిగితే పోలీసు సి.ఐ. వాళ్ళను కొట్టాడు కూడా. ఆ తెల్లవారి వారి ఇంటికి వెళ్ళి క్షమార్పణ చెప్పి డబ్బులిచ్చాడు. అట్లా బలవంతాన పాడించటం తప్పే అని తెలిసి కూడా చేసినందుకు బాధపడ్డాడు. గాయక భిక్షుకులు డబ్బులు, పాతబట్టలిస్తే సంతోషంగా గేయగాథలు పాడేవాళ్ళు. కాని ఫోటోలు తీయనిచ్చేవారు కాదు.

ఫోటోలు తీస్తే వాళ్ళ కంఠమాధుర్యం పోతుందని వారి భావన. వారికి నచ్చచెప్పి డబ్బులిచ్చి గాయక భిక్షుకుల ఫొటోలు తీసుకున్నారు. తాళపత్రాలకోసం ఒక వేసవిలో కరీంనగరం జిల్లా ఎల్లారెడ్డి పేటకు నడచిపోయి ఎండ తీవ్రతకు తట్టుకోలేక సొమ్మసిల్లి ఊరి బయట కొట్టం వద్ద, మూర్చపోయారు. కొట్టం యజమాని బలిజాయన మంచినీళ్ళు, పాలు ఇచ్చాడు. రెండు రూపాయలిస్తే బండి కట్టాడు. ఆ నారాయణపురం పోయి మురళీధరశర్మ అనే ఆయన దగ్గర బస్తా (సంచి) నిండా తాళపత్ర గ్రంథాలు తీసుకున్నాడు. తిరుగు ప్రయాణంలో వీరమ్మ-శివరాజం అనే ఆ బలిజ దంపతులే నీళ్ళచారు అన్నం పెట్టి బస్సెక్కించారు.

II సంగ్రహరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
జానపద సాహిత్య పరిశోధనలో బిరుదురాజు ముద్ర ఎట్టిది ? (Imp) (M.P.)
జవాబు:
బిరుదురాజు రామరాజు సాహిత్యలోకానికి క్రొత్త విషయాలు చెప్పాలనే నిశ్చయంతో పరిశోధన రంగంలోకి అడుగు పెట్టారు. జానపద విజ్ఞానంలో విశ్వవిద్యాలయ స్థాయి పరిశోధనలో తెలుగులోనే కాదు దక్షిణ భారతదేశ భాషలన్నిటిలో “తెలుగు జానపదగేయ సాహిత్యము” అనే వీరి పరిశోధనా గ్రంథమే మొదటి సిద్ధాంత గ్రంథం. ఆ రంగంలో అనేక జానపద గేయ సంకలనాలు ప్రకటించారు. తెలుగులోను ఇంగ్లీషులోను జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పదుల సంఖ్యలో పరిశోధనాత్మక పత్రాలు సమర్పించారు.

ఇంగ్లీషులో ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ.పి., ఫోక్లోర్ ఆఫ్ ఏ.పి., సౌత్ ఇండియన్ ఫోక్సాంగ్స్, గ్లింప్సెస్ ఇన్ టూ తెలుగు ఫోక్లోర్ గ్రంథాలు ప్రకటించారు. జానపద గేయాలు సేకరించిన రామరాజు అనుభవాలు కూడా ఆసక్తిదాయకంగా ఉన్నాయి. తెలంగాణ అంతటా తిరిగి 1953-1955 సంవత్సరాల మధ్య జానపద గేయాలు తాళపత్ర గ్రంథాలు, శిలాశాసనాలు సేకరించారు.

ప్రశ్న 2.
ఆంధ్రుల సంస్కృత సాహిత్యానికి బిరుదురాజు చేసిన కృషి తెలుపండి.
జవాబు:
బిరుదురాజు రామరాజు సంస్కృతంలో కృషిచేసిన తెలుగు వారి గురించి ప్రపంచానికి తెలిపారు. కాళహస్తి కవి రచించిన వసుచరిత్రం, మధురవాణి రచించిన రామాయణ సారతిలకం, అభినవ కాళిదాసు బిరుదాంకితుడైన వెల్లాల ఉమామహేశ్వరుల శృంగార శేఖర భాణం, శ్రీకృష్ణదేవరాయల జాంబవతీ పరిణయ నాటకం మొదటిసారిగా పరిష్కరించి ప్రకటించారు.

ఇంకా కాకతి ప్రతాపరుద్ర చక్రవర్తి ఉషా రాగోదయం, బెల్లంకొండ రామారావుగారి రుక్మిణీ కల్యాణం తిరుమల బుక్కపట్టణం, అణయాచార్యులు రసోదార భాణం, భారద్వాజ రామాచార్యులు భద్రగిరి చంపూ, ఓరుగంటి లక్ష్మణ యజ్వ సీతారామ విహారం, పరశురామపంతుల అనంతరామయ్య సీతావిజయ చంపూ వంటి సంస్కృత కృతులను పరిష్కరించి సాహిత్య చరిత్రలో వారి పేర్లకు చిరస్థాయి నందించారు.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 3 నా సాహిత్య పరిశోధన

ప్రశ్న 3.
విశ్వవిద్యాలయ ఆచార్యులుగా బిరుదురాజు రామరాజు సేవ ఎలాంటిది ?
జవాబు:
బి. రామరాజు ఉద్యోగంలో ఉన్నప్పుడు వరంగల్ స్నాతకోత్తర కేంద్రం తెలుగుశాఖకు విమర్శని పేరుతో, ఉస్మానియా తెలుగు శాఖకు వివేచన అనే పేరుతో రీసెర్చ్ జర్నల్స్ ప్రకటించే ఏర్పాటు చేశారు. అందుకు కావలసిన ఆర్థిక వనరులు యూనివర్సిటీ బడ్జెట్లోనే పొందుపరిచేటట్లు చూశారు. జానపద విజ్ఞానంలో దాక్షిణాత్య విశ్వవిద్యాలయాలలో మొదటిసారి సమ్మర్ కోర్సు నిర్వహించారు. ఏడవ అఖిలభారత జానపద విజ్ఞానసదస్సు తెలుగుశాఖ పక్షాన నిర్వహించాడు. 1978లో ఉస్మానియా విశ్వవిద్యాలయం వత్రోత్సవాల (అరవై ఏళ్ళ ఉత్సవం) సందర్భంగా “బోధన భాషగా తెలుగు” అనే సదస్సును నిర్వహించాడు.

వరంగల్ పి.జి. సెంటర్ ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు చిన్నప్పుడు ఈతకొట్టిన బాలసముద్రం వైపు సరదాగా తిరగడానికి వెళ్ళాడు. అక్కడ నరసముద్రం కోసం ఆ జలసముద్రం పాడు చేస్తున్నారు.

ఆ చెఱువుకట్ట గండిలో గణపతి దేవ చక్రవర్తి మంత్రి వేయించిన శాసనం సగం విరిగిన ముక్క లభిస్తే దానిని పి.జి. సెంటర్ తెలుగు శాఖ ముందు ప్రతిష్ఠించి జిల్లా కలెక్టరుకు, ఆర్షశాఖ డైరెక్టరుకు తెలియపరచారు. ఎం.ఏ. తెలుగు విద్యార్థులకు ఆ శాసనం ఆధారంగా శాసనలిపి చదివే విధానం. శాసనం తీసే విధానం ప్రాక్టికల్గా నేర్పించారు. ఆంధ్రలిపి పరిణామం తెలిపే లిపి బొమ్మలు ఛార్జ్ ఫోటోలు తీయించి ముందుగా ఎం.ఏ. తెలుగు క్లాసురూంలో, తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో పెట్టించారు.

ప్రశ్న 4.
బిరుదురాజు మల్లినాధసూరి తాళపత్ర గ్రంథాలు ఎట్లా సంపాదించాడు ?
జవాబు:
తెలుగుజాతికి గర్వకారణం తొలి మహామహోపాధ్యాయుడు కోలాచలం మల్లినాథసూరి. ఆయన స్వగ్రామం మెదక్ జిల్లాలోని కొలిచెలమ. అక్కడి కొలిచెలిమ వారింట్లో తాళపత్ర గ్రంథాలున్నాయని తెలిసి తన మిత్రుడు తహసీల్దార్ సి. హెచ్. కొండయ్యతో కలిసి వెళ్లి అమూల్యమైన తాళపత్ర గ్రంథాలు తెచ్చుకున్నారు. అంతటితో సంతృప్తి పడక వారి పూజాగృహంలో పెట్టుకున్న మల్లినాథసూరి ఘంటాలు చూచి కన్నుల కద్దుకొని వాటిని తనకివ్వండని డబ్బు ఇవ్వబోయారు. కాని అవి తరతరాల నుండి పూజాద్రవ్యాలుగా ఉన్నాయని చెప్పి వారు ఇవ్వలేదు.

తమకున్న రెండెకరాల పొలం అక్కడి భూస్వామి దున్నుతూ నామమాత్రపు కౌలు ఇస్తున్నాడనీ, భూమి తమ జీవనాధారమనీ కంటతడి పెట్టడం చూసి తన మిత్రుడు కొండయ్య సహకారంతో ఆ భూస్వామిని ఒప్పించి, భూమిని పురోహితునికి ఇప్పించారు. ఆ పురోహితుడు మల్లినాథ సూరి రెండు ఘంటాలను బిరుదురాజు రామరాజుకు ఇచ్చాడు.

III ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బిరుదురాజు రామరాజు స్వగ్రామమేది ?
జవాబు:
వరంగ్ జిల్లా దేవునూరు.

ప్రశ్న 2.
బిరుదురాజు రామరాజు పిహెచ్.డి గ్రంథం పేరేమి ?
జవాబు:
తెలుగు జానపద గేయ సాహిత్యం.

ప్రశ్న 3.
పరిణతవాణి పేరుతో ప్రసంగాలు ఏర్పాటుచేసిన సంస్థ ఏది ?
జవాబు:
ఆంధ్ర సారస్వత పరిషత్తు.

ప్రశ్న 4.
రామరాజు చిన్నప్పటినుండి ఎటువంటి భావాలు ప్రోది చేసుకున్నాడు ?
జవాబు:
దేశభక్తి భావాలు.

ప్రశ్న 5.
బిరుదురాజు రామరాజు ఎవరి పరిశోధనలను ఆదర్శంగా పెట్టుకున్నాడు ?
జవాబు:
మానవల్లి రామకృష్ణకవి, వేటూరి ప్రభాకర శాస్త్రి, నిడదవోలు వేంకటరావు, మల్లంపల్లి సోమశేఖరశర్మ.

ప్రశ్న 6.
ఉస్మానియా విశ్వవిద్యాలయం (1978) వత్రోత్సవాల సందర్భంగా నిర్వహించిన సదస్సు ఏది ?
జవాబు:
భోదనా భాషగా తెలుగు.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 3 నా సాహిత్య పరిశోధన

ప్రశ్న 7.
తెలుగుజాతికి గర్వకారణమైన తొలి మహామహోపాధ్యాయుడు ఎవరు ?
జవాబు:
శ్రీ కోలాచలం మల్లినాథ సూరి.

ప్రశ్న 8.
బిరుదురాజు సాహిత్య వ్యాసంగం ఏ గేయంతో ప్రారంభమైంది ?
జవాబు:
ఆంధ్రుడా ! ఓ ఆంధ్రుడా !

కఠిన పదాలకు అర్ధములు

55వ పుట

అధ్యాపకుడు = ఉపన్యాసకుడు, లెక్చరర్ (ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటున్నారు)
రీడర్ = అసోసియేట్ ప్రొఫెసర్
ఆచార్యుడు = ప్రొఫెసర్
డీన్ = పీఠాధిపతి
మార్గదర్శకుడు = ఆదర్శప్రాయుడు
తాళపత్ర గ్రంథాలు = తాటి ఆకులపై రాసిన పుస్తకాల
శిలా శాసనాలు = రాళ్ళపై చెక్కిన చట్టాలు, సమాచారం

56వ పుట

భవిష్యత్ తరాలకు = రాబోయే తరాలకు
పరిణతవాణి = (ఇక్కడ కార్యక్రమం పేరు), అనుభవజ్ఞుల మాట
ప్రసంగాలు = ఉపన్యాసాలు
తలచడం = అనుకోవడం
దైవమొకటి = దైవం మరొకటి
ఆశించినవి = కోరుకున్నవి
ప్రసాదించిన = ఇచ్చిన
ఆసక్తి = ఇష్టం
కృషి = శ్రమ, పని
ప్రోది = పోషించు, పెంచు
విలాయత్ = విదేశాలకు
ఐ.సి.ఎస్. = (ఇండియన్ సివిల్ సర్వీసెస్) ఇప్పటి ఐ.ఏ.ఎస్ లాంటి విద్య
దైవ + ఇచ్చ = దేవుని కోరిక
ప్రతిభా = పుట్టుకతో వచ్చిన తెలివి
వ్యుత్పత్తి = పాండిత్య౦
అభ్యాసం = సాధన
రాణింపు = గుర్తింపు
కొత్త పుంతలు = నూతన మార్గాలు
కృతకృత్యుడు = విజయం సాధించినవాడు
అభిరుచి = ఇష్టం
అరుదు = తక్కువ
దాక్షిణాత్య = దక్షిణ భారత
ప్రథముడు = మొదటివాడు
మధ్యకాలీన = మధ్యయుగం నాటి
కృతులు = రచనలు
పరిష్కరించి = తప్పొప్పులను సవరించి
ప్రకటించు = ప్రచురించు
సాటి = సమానమైన
తోటివారు = వెంట ఉన్నవాళ్ళు

57వ పుట

మెప్పు = పొగడ్త, గౌరవం
దృష్టి సోకని = కనిపించని
శ్రమించినట్లు = కృషి చేసినట్లు
థీసిస్ = పరిశోధనా గ్రంథం
అముద్రిత = ప్రచురించబడని
ఎమిరిటస్ ప్రొఫెసర్ = గౌరవ ఆచార్యుడు
సర్వేక్షణం = సర్వే చేయించడం, సేకరించడం
స్నాతకోత్తర = పోస్ట్ గ్రాడ్యుయేట్
రీసర్చ్ జర్నల్ = పరిశోధన పత్రిక
ఆర్థిక వనరులు = డబ్బుకు సంబంధించిన వనరులు
పక్షాన = తరపున
వత్రోత్సవాలు = అరవై సంవత్సరాల సందర్భంగా నిర్వహించే ఉత్సాహం
సదస్సు = సమావేశం
సంగ్రహంగా = క్లుప్తంగా, తక్కువగా
మనవి చేస్తాను = చెప్తాను
సంపాదించిన = సంపాదకత్వం వహించిన
పీఠికలు = ముందుమాటలు

58వ పుట

జానపద గేయ సంకలనం = జానపద గేయాలతో కూడిన పుస్తకం
ఎరుక పరచడం = తెలియజేయడం
మరుగు = కనపడకుండా
చరితార్థులు = చరిత్రను సృష్టించిన వారు, గొప్పవారు
సంచిక = ప్రత్యేక పుస్తకం
ఈ కోవకు = ఈ పద్ధతికి
పాఠాలు = ఒక గ్రంథానికి చెందిన వేరు వేరు తాళపత్రాలలో వేరు వేరుగా ఉన్న విషయాలు
నిఘంటువు = అక్షర క్రమంలో పదాల అర్థాలను సూచించే పుస్తకం
కూర్చడం = తయారుచేయడం
అనువాదం = భాషాంతరీకరణ

59వ పుట

గేయాలు = పాటలు
రవిక కనుములు =
జాకెట్ పీస్లలు, స్త్రీల వస్త్ర విశేషం
క్షమార్పణ = క్షమాపణ, మన్నించమనడం
గాయక భిక్షుకులు = పాటలుపాడి అడుక్కునే వారు
పాత గుడ్డలు = పాత బట్టలు
వేసవి = ఎండాకాలం
సొమ్మసిల్లి = స్పృహ తప్పి
బలిజాయన = బలిజ సామాజిక వర్గానికి చెందిన ఆయన (శైవుడు)
బస్తేడు = సంచి నిండా
ఆర్ష శాక = ఇప్పటి దేవాదాయ శాఖ వంటిది
లిపి = రాసే విధానం
తొలి పాఠాలు = మొదటిసారి నేర్చుకున్నవి, ప్రాథమిక అంశాలు
ఏటవాలులో = ఒక పక్క వంపులో
నూరడం = మొనతేల్చడానికి రాయడం
వరాహ లాంచనం = పంది గుర్తు
సత్యం + అప్రియం = అప్రియమైన (బాధ కలిగించే) సత్యాన్ని
న బ్రూయాత్ = చెప్పకూడదు

TS Inter 2nd Year Telugu Study Material Chapter 3 నా సాహిత్య పరిశోధన

60వ పుట

లెదర్ పాడ్ = శాసనాల అధ్యయనానికి ఉపయోగించే తోలు సంచి
మంది మార్బలం = ఎక్కువ మందితో
బ్రహ్మరథం (జాతీయం) = అధిక గౌరవం
వాహ్యాళి = సరదాగా తిరగడం, విహారం
గండి = చేరుకట్టకు పడిన రంధ్రం.
ప్రతిష్ఠించి = స్థాపించి
లిపి పరిణామం = రాత మారిన విధానం
తహసీల్దార్ = ఒక తాలూకాకు ఉన్నతాధికారి
పూజాగృహ = పూజగది
ఘంటాలు = తాళపత్రాలపై రాయడానికి వాడే ఇనుప కలాలు
కన్నులకద్దుకొని (జాతీయం) = నమస్కరించి
పూజాద్రవ్యం = పూజింపదగిన సామాగ్రి
నామమాత్రపు (జాతీయం) = అతి తక్కువ
కౌలు = వ్యవసాయ భూమి వినియోగించుకున్నందుకు భూ యజమానికి ఇచ్చే మొత్తం
కంటతడి (జాతీయం) = ఏడవడం
ఉపాయశాలి = ఉపాయం గల వ్యక్తి
పురోహితుడు = పూజారి, బ్రాహ్మణుడు
ఓరియంటల్ కాన్ఫరెన్సు = భాషాపరమైన సమావేశం

61వ పుట

అమూల్య = వెలకట్టలేని
వరివస్య = సేవ
భగవత్ + ఇష్టమే = భగవంతుని ఇష్టం
నమస్సులు = నమస్కారాలు

నా సాహిత్య పరిశోధన Summary in Telugu

రచయిత పరిచయం

TS Inter 2nd Year Telugu Study Material Chapter 3 నా సాహిత్య పరిశోధన 1

పాఠం పేరు : నా సాహిత్య పరిశోధన
దేని నుండి ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్వహించిన పరిణత వాణి కార్యక్రమంలో
గ్రహింపబడినది : ఉపన్యాసం
రచయిత పేరు : ఆచార్య బిరుదురాజు రామరాజు
రచయిత కాలం : జననం : ఏప్రిల్ 16, 1925, మరణం : ఫిబ్రవరి 8, 2010
రచయిత స్వస్థలం : వరంగల్ జిల్లా దేవునూరు
తల్లిదండ్రులు : లక్ష్మీదేవమ్మ, నారాయణరాజు
చదువు : నిజాం కళాశాలలో బి.ఏ., ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ., పిహెచ్.డి.
పరిశోధనాంశం : : తెలుగు జానపద గేయసాహిత్యం
పరిశోధన పర్యవేక్షణ : ఆచార్య ఖండవల్లి లక్ష్మీ రంజనం

ఉద్యోగం : 1952లో ఉస్మానియా తెలుగుశాఖలో అధ్యాపకుడు. 1973 నుంచి 1983 వరకు తెలుగు శాఖాధ్యక్షుడిగా ఉన్నారు. 1967 నుంచి 1974 వరకు వరంగల్ స్నాతకోత్తర పని చేశారు. 1978 నుంచి 1982 మధ్య ఆర్ట్స్ విభాగం పీఠాధిపతిగా ఉన్నారు. 1980 నుంచి 1981 వరకు నేషనల్ లెక్చరర్గా ఉన్నారు. 1983లో పదవీ విరమణ చేశారు.
తెలుగు రచనలు : ‘మరుగు పడిన మాణిక్యాలు’ ‘చరిత్రకెక్కని చరితార్థులు’, ఎన్నో జానపద గేయ సంకలనాలు.
ఆంగ్ల రచనలు : ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ.పి., ఫోక్లోర్ ఆఫ్ ఏ.పి., సౌత్ ఇండియన్ ఫోక్సాంగ్స్, గ్లింప్సెస్ ఇన్టూ తెలుగు ఫోక్లోర్.
జానపద గేయ సాహిత్యం : వీరి తెలుగు జానపద గేయసాహిత్యం అనే పరిశోధన దక్షిణ భారతదేశభాషల్లోనే మొదటి జానపద సాహిత్య పరిశోధన.

గ్రంథాలు : బిరుదు రామరాజు వందలకొద్దీ జానపద గేయాలను, అనేక తాళపత్ర గ్రంథాలను, శిలాశాసనాలను సేకరించాడు. ప్రాచీన కావ్యాలను పరిష్కరించాడు. ఆంధ్రదేశంలోని యోగుల చరిత్రలను సేకరించి పుస్తకాలుగా వెలువరించాడు.
‘జాతీయాచార్య’ పదవి : ఈయన చేసిన సాంస్కృతిక సేవకుగాను ‘జాతీయాచార్య’ పదవి లభించింది.

పాఠ్యభాగ నేపథ్యం

సాహిత్యరంగంలో 70 ఏండ్లు పైబడిన వారి జీవిత విశేషాలు, అనుభవాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా ఉంటాయనే ఉద్దేశంతో ఆంధ్రసారస్వత పరిషత్తు పరిణతవాణి అనే పేరుతో ప్రసంగాలు ఏర్పాటుచేసింది. అందులో భాగంలో 27 జులై 1995న ఆచార్య బిరుదురాజు రామరాజు చేసిన ప్రసంగమే ప్రస్తుత పాఠ్యాంశం.
ఇది ప్రసంగ వ్యాసం కాబట్టి ఉత్తమపురుషలో ఉంది. వారి భావాలను అర్థంచేసుకోవడానికి ప్రథమ పురుషలోకి మార్చి సారాంశాన్ని అందిస్తున్నాం.

పాఠ్యభాగ సారాంశం

అంతా దైవ నిర్ణయమే : తెలుగులో “తానొకటి తలచిన దైవమొకటి తలచును” అనీ, ఇంగ్లీషులో “మాన్ ప్రపోజెస్ (బట్) గాడ్ డిస్పోజెస్” అనే సామెతలున్నాయి. ఆ సామెతలు తనకోసమే పుట్టాయని, తన జీవితంలో చాలావరకు దైవమనుకున్నవే జరిగాయని బిరుదురాజు రామరాజు అన్నారు. అందువలన దైవం ప్రసాదించిన వాటిలోనే తన ఆసక్తిని పెంచుకొని కృషి చేశాడు. చిన్నప్పటి నుంచి దేశభక్తి భావాలు పెంచుకుని రాజకీయాల్లోకి పోదామనుకున్నాడు. వారి పెద్దలు తనను విదేశాలకు పంపించి ఐ.సి.ఎస్. చేయించాలనుకున్నారు. దైవం తెలుగు పంతుల్ని చేస్తే, దైవేచ్ఛనే తనయిష్టంగా మలచుకొని తెలుగు సాహిత్యరంగంలో స్థిరపడ్డాడు.

జానపద సాహిత్య పరిశోధనకు కారణాలు : బిరుదురాజు రామరాజు ప్రారంభ కాలంలో కొన్ని గేయాలు, పద్యాలు, నవలలు రాశారు. ప్రతిభా, వ్యుత్పత్తి అభ్యాసాల్లో మొదటి రెండు తక్కువగా ఉన్నాయనుకొని సృజనాత్మక సాహిత్యరంగంలో రాణింపు రాదని భావించారు. మంచి గుర్తింపు కోసం లోకానికి క్రొత్త విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో పరిశోధనను ప్రారంభించారు. కొత్త మార్గంలో కృషి చేసి గుర్తింపు పొందవచ్చునని జానపద విజ్ఞాన రంగంలో పరిశోధన ప్రారంభించి విజయం సాధించాడు. జానపద గేయాలతోపాటు వందల సంఖ్యలో తాళపత్ర గ్రంథాలు, పదుల సంఖ్యలో శిలాశాసనాలు సేకరించారు.

వారి తరం యూనివర్సిటీ తెలుగు అధ్యాపకుల్లో తాళపత్ర గ్రంథాల్లో, శాసనాల్లో అభిరుచిగల వాళ్ళు తక్కువ. కావున ఆ కృషి కూడా మంచి ఫలితాలను ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించేలా చేసింది. ఈ విధంగా విశ్వవిద్యాలయ స్థాయిలో జానపద విజ్ఞానంలో దాక్షిణాత్య సాహిత్యభాషల్లో పరిశోధన చేసిన వారిలో మొదటివాడుగా గుర్తింపు పొందారు.

జానపద సాహిత్య సేవలో బి. రామరాజు : మానవల్లి రామకృష్ణ కవి, వేటూరి ప్రభాకర శాస్త్రి, నిడుదవోలు వేంకటరావు వంటి పెద్దల పరిశోధనలు ఆదర్శంగా పెట్టుకొని సాహిత్య చరిత్రలకెక్కని ప్రాచీన మధ్యకాలంనాటి దాదాపు వంద తెలుగు, సంస్కృత కావ్యాలను మొదటిసారి ప్రపంచానికి పరిచయం చేశారు. అంతవరకు వెలుగు చూడని తెలుగు, సంస్కృత గ్రంథాలు పన్నెండు వరకు పరిష్కరించి ప్రకటించారు. ఈ రంగంలో సాటివారిలో, తోటివారిలో ఎవరూ చేయని పని చేసినందుకు పెద్దల మెప్పు పొందారు.

జానపద సాహిత్యం కోసం తాళపత్ర గ్రంథాల సేకరణ కోసం పల్లెటూళ్ళు తిరిగినపుడే ఇంతకు పూర్వం చారిత్రకుల దృష్టి సోకని క్రొత్త శిలాశాసనాలు నాలుగైదు కనుగొన్నాడు. జానపద గేయ సాహిత్యం గూర్చి శ్రమించినట్లే ఆంధ్రుల సంస్కృత సాహిత్య సేవ గురించి శ్రమించాడు. వాటినన్నిటిని గూర్చి సంస్కృత పరిశోధనా గ్రంథంలో రాశాడు. మద్రాసు, తంజావూరు, కాకినాడ, విశాఖపట్నాలలో ఉన్న తాళపత్ర గ్రంథాల్లోని ‘ఆంధ్రుల అముద్రిత సంస్కృత కృతుల పరిచయం కూడా చేశాడు.

1978-1982 మధ్యకాలం కళ పీఠాధిపతిగా ఉన్నప్పుడు, 1980-1981 యు.జి.సి. నేషనల్ లెక్చరర్ కాశ్మీరం నుండి కన్యాకుమారి దాకా ఐదు ప్రముఖ విశ్వవిద్యాలయాలలో తెలుగు జానపద సాహిత్యం గురించి ప్రసంగాలు చేశారు. రిటైర్ అయిన తరువాత ఉస్మానియా, యు.జి.సి. ఎమిరిటస్ ప్రొఫెసర్ గా ఉండి ఫోక్లోర్ సర్వే ఆఫ్ తెలంగాణ అనే ప్రాజెక్టును నిర్వహించారు. ఓరుగల్లు మండలం జానపద విజ్ఞానం సర్వేక్షణం కూడా చేయించారు.

బి. రామరాజు ఉద్యోగంలో ఉన్నప్పుడే వరంగల్ స్నాతకోత్తర కేంద్రం తెలుగు శాఖకు విమర్శని పేరుతో, ఉస్మానియా తెలుగు శాఖకు వివేచన అనే పేరుతో రీసెర్చ్ జర్నల్స్ ప్రకటించే ఏర్పాటు చేసి, దానికి కావలసిన ఆర్థిక వనరులు యూనివర్సిటీ బడ్జెట్లోనే పొందుపరిచేటట్లు చేశారు. జానపద విజ్ఞానంలో దాక్షిణాత్య విశ్వవిద్యాలయాలలో మొదటిసారి సమ్మర్ కోర్సు నిర్వహించారు. ఏడవ అఖిలభారత జానపద విజ్ఞానసదస్సు తెలుగు శాఖ పక్షాన నిర్వహించాడు. 1978లో ఉస్మానియా విశ్వవిద్యాలయం వద్రోత్సవాల (అరవై ఏళ్ళ ఉత్సవం) సందర్భంగా “బోధన భాషగా తెలుగు” అనే సదస్సును నిర్వహించాడు.

బిరుదురాజు రామరాజు హైస్కూలు విద్యార్థిగా ఉండినప్పటి నుంచే భారతి మొదలైన పత్రికల్లో మానవల్లి రామకృష్ణకవి, వేటూరి ప్రభాకర శాస్త్రి, నిడుదవోలు వేంకటరావు, మల్లంపల్లి సోమశేఖరశర్మ వంటి పరిశోధకుల వ్యాసాలు, వారు సంపాదకత్వం వహించిన గ్రంథాల పీఠికలు చదివారు. అందువల్ల వారిలాగ ఇంతవరకు సాహిత్యలోకానికి తెలియని క్రొత్త విషయాలు చెప్పాలనే నిశ్చయంతో పరిశోధన రంగంలో అడుగు పెట్టారు.

జానపద విజ్ఞానంలో విశ్వవిద్యాలయ స్థాయి పరిశోధనలో తెలుగులోనే కాదు దక్షిణ భారతదేశ భాషలన్నిటిలో తెలుగు జానపదగేయ సాహిత్యము అనే వీరి పరిశోధనా గ్రంథమే మొదటి సిద్ధాంత గ్రంథమైనది. ఆ రంగంలో అనేక జానపదగేయ సంకలనాలు ప్రకటించారు. తెలుగులోను ఇంగ్లీషులోను జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పదుల సంఖ్యలో పరిశోధనాత్మక పత్రాలు సమర్పించారు.

ఇంగ్లీషులో ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ.పి., ఫోక్లోర్ ఆఫ్ ఏ.పి., సౌత్ ఇండియన్ ఫోక్సాంగ్స్, గ్లింప్సెస్ ఇన్టూ తెలుగు ఫోక్లోర్ గ్రంథాలు ప్రకటించారు. మరుగు పడిన మాణిక్యాలు, చరిత్రకెక్కని చరితార్థులతో పాటు ఇతర ప్రత్యేక సంచికల్లో ప్రకటించిన వ్యాసాల ద్వారా అముద్రితంగా పడిఉన్న తెలుగు సంస్కృత రచనలు దాదాపు వందకుపైగా మొదటిసారి సాహిత్య ప్రపంచానికి తెలియచేశారు.

సంస్కృత సాహిత్యానికి రామరాజు కృషి: సంస్కృతంలో కాళహస్తి కవి రచించిన వసుచరిత్రం, మధురవాణి రచించిన రామాయణ సారతిలకం, అభినవ కాళిదాసు వెల్లాల ఉమామహేశ్వరుడు రాసిన శృంగార శేఖర భాణం, శ్రీకృష్ణదేవరాయల జాంబవతీపరిణయ నాటకం మొదటిసారిగా పరిష్కరించి ప్రకటించారు. ఇంకా కాకతి ప్రతాపరుద్ర చక్రవర్తి ఉషా రాగోదయం, బెల్లంకొండ రామారావు రాసిన రుక్మిణీ కల్యాణం, తిరుమల బుక్కపట్టణం, అణయాచార్యుల రసోదార భాణం, భారద్వాజ రామాచార్యులు భద్రగిరి చంపూ, ఓరుగంటి లక్ష్మణ యజ్వ సీతారామ విహారం, పరశురామ పంతుల అనంత రామయ్య సీతావిజయ చంపూ వంటి సంస్కృత కృతులు పరిష్కరించారు.

తెలుగు సాహిత్యానికి రామరాజు చేసిన కృషి : తెలుగులో బొడ్డుచెర్ల చినతిమ్మకవి ప్రసన్నరాఘవ నాట్య ప్రబంధం, చింతలపల్లి ఛాయాపతి రాఘవాభ్యుదయం, సాయప వెంకటాద్రి నాయకుని సకలజీవ సంజీవనం, పాల్కురికి సోమనాథుని పండితారాధ్యోదాహరణం మొదటిసారి పరిష్కరించి ప్రకటించారు. శ్రీనాథుని శివరాత్రి మాహాత్మ్యం, సంపూర్ణ గ్రంథం సంపాదించి పరిష్కరించి ప్రకటించారు. మడికి సింగన పద్మపురాణం, పాలవేకరి కదరీపతిరాజు శుకసప్తతి సంశోధిత ముద్రణలు విపులమైన పీఠికలతో ప్రకటించారు.

ఈ రెండు గ్రంథాల్లోని వందల సంఖ్యలో తప్పుడు పాఠాలు సవరించి చూపారు. ఇంటర్ వరకు ఉర్దూ నేర్చుకున్నందున ఉర్దూ – తెలుగు నిఘంటువును రాశారు. ఇంగ్లీషు, హిందీల నుంచి నాలుగు గ్రంథాలు తెలుగులోనికి అనువదించారు. 38 మంది పరిశోధకులు రామరాజు పర్యవేక్షణలో ఎం.ఫిల్., పిహెచ్.డి పట్టాలు సంపాదించుకున్నారు.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 3 నా సాహిత్య పరిశోధన

జానపద గేయాలు సేకరించినప్పటి అనుభవాలు : జానపద గేయాలు సేకరించిన రామరాజు అనుభవాలు కూడా ఆసక్తిదాయంగా ఉన్నాయి. తెలంగాణ అంతటా తిరిగి 1953 – 1955 సంవత్సరాల మధ్య కాలంలో జానపద గేయాలు తాళపత్ర గ్రంథాలు, శిలాశాసనాలు సేకరించారు. ఆ రోజుల్లో పల్లెటూళ్ళకు బస్సులు లేవు, జిల్లా, తాలూకా కేంద్రాల నుండి కొన్ని చోట్లకు నడచి కొన్ని చోట్లకు సైకిల్ పైన, కొన్నిచోట్లకు ఎడ్లబండి పైన పోయి గేయాలు సేకరించారు. స్త్రీలకు రవిక (జాకెట్) ముక్కలు, పురుషులకు బీడీలు, చుట్టలు, కల్లుకు పైసలు ఇచ్చి గేయాలు పాడించి రాసుకున్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్లు గ్రామంలో కోలాటం పాటలు పాడేవారున్నారని విని అక్కడకు పోతే అక్కడి యువకులు సహకరించలేదు. రామరాజుకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ చేత బలవంతాన పట్టి తెప్పించి రాత్రి 11 గంటల నుండి ఒంటి గంట దాకా కోలాటాలు వేయించారు.

ఇద్దరు యువకులు ఎదురు తిరిగితే పోలీసు సి.ఐ. వాళ్ళను కొట్టాడు కూడా. ఆ తెల్లవారి వారి ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పి డబ్బులిచ్చారు. అట్లా బలవంతాన పాడించటం తప్పే అని తెలిసి కూడా చేసినందుకు బాధపడ్డారు. గాయక భిక్షుకులు డబ్బులు, పాతబట్టలిస్తే సంతోషంగా గేయగాథలు పాడేవాళ్ళు. కాని ఫొటోలు తీయనిచ్చేవారు కాదు.

ఫొటోలు తీస్తే వాళ్ళ కంఠమాధుర్యం పోతుందని వారి భావన. వారికి నచ్చచెప్పి డబ్బులిచ్చి గాయక భిక్షుకుల ఫొటోలు తీసుకున్నారు. తాళపత్రాలకోసం ఒక వేసవిలో కరీంనగరం జిల్లా ఎల్లారెడ్డి పేటకు నడచిపోయి ఎండ తీవ్రతకు తట్టుకోలేక సొమ్మసిల్లి ఊరి బయట కొట్టం వద్ద, మూర్చపోయారు. కొట్టం యజమాని బలిజాయన మంచినీళ్ళు, పాలు ఇచ్చాడు. రెండు రూపాయలిస్తే బండి కట్టాడు. ఆ బండిలో నారాయణపురం పోయి మురళీధరశర్మ అనే ఆయన దగ్గర బస్తా (సంచి) నిండా తాళపత్ర గ్రంథాలు తీసుకున్నాడు. తిరుగు ప్రయాణంలో వీరమ్మ – శివరాజం అనే ఆ బలిజ దంపతులే నీళ్ళచారు అన్నం పెట్టి బస్సెక్కించారు.

శాసనాల సేకరణలో అనుభవాలు : అప్పటి ఆర్షశాఖ (ఇప్పటి దేవాదాయ శాఖ వంటిది) డైరెక్టర్ గొప్ప చారిత్రక పరిశోధకులు. వారివద్ద శాసన లిపులు చదివే తొలిపాఠాలు నేర్చుకున్నారు. తాళపత్రాల కోసం పోతూ ముస్తాబాదులో 29-10-1954 బస్సెక్కి మానేరు వద్ద దిగి ఆ ప్రాజెక్ట్ చూచి కాలినడకన గంభీరావుపేటకు పోతుంటే గంభీరావుపేట చెరువు కట్టకు ఏటవాలులో ఒక శిలాశాసనం కనబడింది. కొడవండ్లు, గొడ్డండ్లు నూరటం చేత శాసనం కొంత భాగం అరిగిపోయింది. వరాహ లాంఛనం (పంది గుర్తు) ఉండటం వల్ల అది కాకతీయుల కాలపు శాసనమని గుర్తించారు.

గంభీరావుపేటలో వై. రామేశ్వర శర్మ, కటకం వెంకటేశ్వర్ల ఇంట్లో వంద తాళపత్ర గ్రంథాలు తీసుకొని ఇద్దరు మనుషులను తీసుకొని చెరువు కట్ట దగ్గరున్న శాసనాన్ని తవ్వించారు. దానిని భూమిలోపల కనపడకుండా పూడ్చి పెట్టించారు. హైదరాబాదు వెళ్ళి ఆర్షశాఖ డైరెక్టరుకు ఈ విషయం చెప్తే శాసనలిపులు నేర్చి శాసనాలు తీసి ప్రకటించటం ఇష్టం లేకనో ఏమోగాని, ఆయన పాఠాలు చెప్పటం మానేశారు. అప్రియమైన సత్యాన్ని పలుకకూడదు. (నబ్రూయాత్ సత్యమప్రియం).

ఈ విషయం ఆదిరాజు వీరభద్రరావు గారికి చెప్పితే వారు శాసనలిపులు బోధించటమేకాక శాసనాలు తీసే విధానం నేర్పి, తమ వద్ద ఉన్న ఇనుప బ్రష్షు, మసి లెదర్ పాడ్ ఇచ్చారు. వాటి సహాయంతో రెండు మూడు శాసనాలు తీయించాడు. కరీంనగరం జిల్లా గంగాధర గ్రామం జమీందారు కొడుకు రామరాజు విద్యార్థి. తమ గ్రామం గుట్టపై శాసనముందని చెప్పితేపోయి చూసి చాలా గొప్ప శాసనం అనే గుర్తించారు. ఈ విషయం ఒక సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకునికి చెప్పితే వచ్చే ఆదివారం కలిసి పోదాం.

శాసనం తీసుకువద్దాం అని చెప్పి మరునాడే మంది మార్బలంతో పోయి శాసనం తీసుకువచ్చి మైసూరులో జరిగిన హిస్టరీ కాంగ్రెస్లో ఆ శాసనం గూర్చి పేపరు చదివి గొప్ప సన్మానం పొందాడు. వరంగల్ పి.జి. సెంటర్ ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు, చిన్నప్పుడు ఈతకొట్టిన బాలసముద్రం వైపు సరదాగా తిరగడానికి వెళ్ళినప్పుడు నరసముద్రం కోసం ఆ జలసముద్రం పాడు చేస్తున్నారు.

ఆ చెఱువుకట్ట గండిలో గణపతి దేవచక్రవర్తి మంత్రి వేయించిన శాసనం సగం విరిగిన ముక్క లభిస్తే దానిని పి.జి. సెంటర్ తెలుగు శాఖ ముందు ప్రతిష్ఠించి జిల్లా కలెక్టరుకు, ఆర్షశాఖ డైరెక్టరుకు తెలియపరచారు. ఎం.ఏ. తెలుగు విద్యార్థులకు ఆ శాసనం ఆధారంగా శాసనలిపి చదివే విధానం, శాసనం తీసే విధానం ప్రాక్టికల్గా నేర్పించారు. ఆంధ్రలిపి పరిణామం తెలిపే లిపి బొమ్మలు ఛార్ట్ ఫొటోలు తీయించి ముందుగా ఎం.ఏ. తెలుగు క్లాసురూంలో, ఆ తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో పెట్టించారు. వారి తరువాత తెలుగు విద్యార్థులకు శాసనాలతోపాటు శాసనలిపి కూడా బోధించవలెననే కోరికతో ఆ పటాలు పెట్టించినా ఇప్పుడా పటాలు లేవు, శాసనలిపి పాఠాలూ లేవు.

మల్లినాథ సూరి ఘంటాలు పొందిన విధానం : తెలుగుజాతికి గర్వకారణం తొలి మహామహోపాధ్యాయుడు కోలాచలం మల్లినాథసూరి. ఆయన స్వస్థలం మెదక్ జిల్లాలోని కొలిచెలమ. అక్కడి కొలిచెలిమ వారింట్లో తాళపత్ర గ్రంథాలున్నాయని తెలిసి తన మిత్రుడైన తహసీల్దార్ సి. హెచ్. కొండయ్యతో కలిసిపోయి అమూల్యమైన తాళపత్ర గ్రంథాలు తెచ్చుకున్నారు. పూజాగృహంలో పెట్టుకున్న మల్లినాథసూరి ఘంటాలు చూచి కన్నుల కద్దుకొని వాటిని తనకివ్వండని డబ్బు ఇస్తే వారు ఇవ్వలేదు. అవి తరతరాల నుండి పూజాద్రవ్యాలుగా ఉన్నాయని చెప్పారు. తమకున్న రెండెకరాల పొలం అక్కడి భూస్వామి దున్నుతూ నామమాత్రపు కౌలు ఇస్తున్నాడనీ ఆ భూమి తమ జీవనాధారమనీ కంటతడి పెట్టారు.

మిత్రుడు కొండయ్య సహకారంతో, ఆ భూస్వామిని ఒప్పించి భూమిని పురోహితునికి ఇప్పించాడు. ఆ పురోహితుడు మల్లినాథ సూరి రెండు ఘంటాలు రామరాజుకు ఇచ్చాడు. ఆల్ ఇండియా ఓరియంటల్ కాన్ఫరెన్స్కు తీసుకొనిపోయి పండితులకు చూపించారు. పద్మవిభూషణ ఆర్.ఎన్. దాండేకర్ రామరాజు గారి ఇంటికి వచ్చి వాటిని చూసిపోయారు. మల్లినాథసూరి గూర్చి పి. హెచ్. డి పరిశోధన చేసిన వారెవరో వాటి ఫొటోలు తమ గ్రంథంలో ప్రచురించారు. అటువంటి అమూల్య సంపదను కాపాడుకునే సంస్థ లేనందుకు బాధ పడ్డారు. బరోడా ప్రాచ్య సంస్థ వారికి గాని, పూనా ప్రాచ్యసంస్థవారికి గాని ఇస్తే కాపాడుతారేమోనని ఆశాభావం వ్యక్తం చేశారు.

చివరి కోరిక : 1945వ సంవత్సరంలో ‘ఆంధ్రుడా ! ఓ ఆంధ్రుడా !’ అనే గేయంతో ప్రారంభమైన తన సాహిత్య వ్యాసంగం “ఆంధ్ర యోగుల చరిత్రలు ఐదు సంపుటాలు”, “ఆంధ్రుల సంస్కృత సాహిత్య వరివస్య”, “నేను నా సాయి” అనే రచనలతో ముగిస్తే బాగుంటుందనేవి తన చివరి కోరికలన్నారు. అవి తీరి ఏ కోరిక కోరని స్థితి కల్పించవలెనని భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఇకపై భగవంతుని ఇష్టమే తన ఇష్టమని, నమస్కారాలతో బిరుదురాజు రామరాజు తన ప్రసంగాన్ని ముగించారు.