TS Inter 1st Year Telugu Grammar సమాసాలు

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material Grammar సమాసాలు Questions and Answers.

TS Inter 1st Year Telugu Grammar సమాసాలు

‘సమర్థంబులగు పదంబులేకపదంబగుట సమాసంబు’ అని చిన్నయసూరి బాల వ్యాకరణంలో సమాస లక్షణాన్ని వివరించాడు.

రెండు లేదా అంతకంటే ఎక్కువపదాలు కలసి ఒకే పదంగా ఏర్పడితే అది సమాసమవుతుంది.

సమాసంలోని మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండవ పదాన్ని ఉత్తరపదం అని అంటారు. ఈ రెండు పదాల మధ్య వివిధ విభక్తి ప్రత్యయాలను అవసరానికి తగినట్లు చేరిస్తే అది విగ్రహవాక్యం అవుతుంది. ఇది సమాసాన్ని వివరించి, విడమర్చి చెబుతుంది.

ఉదా:
‘సూర్య కిరణాలు’ అనే సమాసపదంలో
పూర్వపదం – సూర్య
ఉత్తరపదం కిరణాలు
విగ్రహ వాక్యం – సూర్యుని యొక్క కిరణాలు.

అర్థపరంగా సమాసాన్ని నాలుగు విధాలుగా విభజిస్తారు. అవి

  1. తత్పురుష
  2. బహుజొహి
  3. ద్వంద్వం
  4. అవ్యయీ భావం

1. తత్పురుష సమాసం:
తత్పురుష సమాసం వ్యధికరణమని, సమానాధికరణమని రెండు విధాలు.

(ఎ) వ్యధికరణ తత్పురుష సమాసం:
‘ద్వితీయాదులకు మీది పదంబు తోడ సమాసంబు వ్యధికరణంబునాబడు’ అని బాలవ్యాకరణంలో చెప్పబడింది. వ్యధికరణం అంటే విభక్తుల ఆధారంగా తయారు చేసే సమాసం. పూర్వపదం ద్వితీయాది విభక్తుల్లో ఉండి, ఉత్తర పదం ప్రథమావిభక్తిలో ఉంటుంది. ఇది ద్వితీయా తత్పురుష నుండి సప్తమీ తత్పురుష వరకు.

TS Inter 1st Year Telugu Grammar సమాసాలు

  1. ద్వితీయా తత్పురుషం: పూర్వపదం ద్వితీయా విభక్తిలో ఉండాలి.
    ఉదా: వేషధారి = వేషమును ధరించినవాడు
  2. తృతీయా తత్పురుషం: పూర్వపదం తృతీయా విభక్తిలో ఉండాలి.
    ఉదా: విద్యాధికుడు = విద్యచేత అధికుడు
  3. చతుర్థీ తత్పురుషం: పూర్వపదం చతుర్థి విభక్తిలో ఉండాలి.
    ఉదా: యజ్ఞవేదిక = యజ్ఞం కొరకు వేదిక
  4. పంచమీ తత్పురుషం: పూర్వపదం పంచమీ విభక్తిలో ఉండాలి.
    ఉదా: పాపభీతి = పాపము వలన భీతి
  5. షష్ఠీ తత్పురుషం: పూర్వపదం షష్ఠీ విభక్తిలో ఉండాలి.
    ఉదా: మాటతీరు = మాట యొక్క తీరు
  6. సప్తమీ తత్పురుషం: పూర్వపదం సప్తమీ విభక్తిలో ఉండాలి.
    ఉదా: మనోవేదన మనసు నందలి వేదన
  7. నజ్ తత్పురుష: వ్యతిరేకార్థాన్ని బోధించేది.
    ఉదా: అనంతం = అంతం లేనిది

(బి) సమానాధికరణం:
‘విశేషణంబునకు విశేష్యంబు తోడ సమానంబు సమానాధికరణంబు నాబడు” అని బాలవ్యాకరణంలో చెప్పబడింది. తత్పురుషలోని సమానాధి కరణ సమాసానికే కర్మధారయ సమాసమని పేరు. సమానాధికరణంలో సమాసంలోని రెండు పదాలలో ఒకటి విశేషణం, మరొకటి విశేష్యం (నామవాచకం) అవుతుంది. మరికొన్ని సార్లు ఒకపదం ఉపమానం మరోపదం ఉపమేయం అవుతుంది. ఇలా రెండు పదాలు సమానమైన ఆధారంతో ఉండటం సమానాధికరణం.

(i) విశేషణ పూర్వపద కర్మాధారయం:
ఈ సమాసంలోని రెండు పదాలలో మొదటి పదం విశేషణం. రెండవ పదం విశేష్యంగా ఉంటుంది.
ఉదా:

  • మధురోక్తులు = మధురమైన ఉక్తులు
  • ఎర్రగులాబి = ఎర్రనైన గులాబి
  • దివ్యాత్మ = దివ్యమైన ఆత్మ

పై ఉదాహరణల్లో పూర్వపదం విశేషణం. అందుకే ఈ సమాసానికి విశేషణ పూర్వపద సమాసమని పేరు.

TS Inter 1st Year Telugu Grammar సమాసాలు

(రిరి) విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం:
విశేషణం ఉత్తరపదంలో ఉండి, విశేష్యం (నామవాచకం) పూర్వపదంలో ఉంటే అది విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అవుతుంది.
ఉదా:

  • పురుషోత్తముడు = ఉత్తముడైన పురుషుడు
  • కపోతవృద్ధము = వృద్ధమైన కపోతము
  • పండిత శ్రేష్ఠుడు = శ్రేష్ఠుడైన పండితుడు

ఈ సమాసంలో విశేషణం ఉత్తరపదంగా ఉన్నా, విగ్రహవాక్యంలో మాత్రం విశేషణం ముందు రాయాలి. విశేష్యం తరువాత రాయాలి.

(iii) విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం:
ఈ సమాసంలో పూర్వపదం, ఉత్తర పదం రెండూ విశేషణాలుగా ఉంటాయి.
ఉదా:

  • మృదుమధురం = మృదువైనది, మధురమైనది
  • ధీరోదాత్తుడు = ధీరుడును, ఉదాత్తుడును
  • శీతోష్ణములు = శీతమును, ఉష్ణమును

(iv) ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం:
సమాసంలోని పూర్వపదం ఉపమానంగాను, ఉత్తర పదం ఉపమేయంగాను ఉంటుంది.
ఉదా:

  • తేనెపలుకులు = తేనె వంటి పలుకులు
  • బంగారుమాట = బంగారము వంటి మాట
  • హంసనడక = హంస వంటి నడక

TS Inter 1st Year Telugu Grammar సమాసాలు

(v) ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం:
సమాసంలోని ఉత్తరపదం ఉపమానం, పూర్వపదం ఉపమేయం అవుతుంది.
ఉదా:

  • పాదపద్మాలు = పద్మాల వంటి పాదాలు
  • ముఖారవిందము = అరవిందం వంటి ముఖము
  • ముఖచంద్రుము = చంద్రుని వంటి ముఖము

(vi) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం:
సంభావన అనగా సంజ్ఞ. సంజ్ఞా వాచకం పూర్వపదంగా గల కర్మధారయ సమాసాన్ని సంభావనా పూర్వపద కర్మధారయ సమాసమంటారు.
ఉదా:

  • ద్వారకానగరం = ద్వారక అనే పేరుగల నగరం
  • గంగానది = గంగ అనే పేరుగల నది
  • మామిడి చెట్టు = మామిడి అనే పేరుగల చెట్టు

(vii) అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం:
దీనికే రూపక సమాసం అని పేరు. ఇందులో ఉపమేయం పూర్వపదంగా, ఉపమానం ఉత్తరపదంగా ఉంటుంది. ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పబడుతుంది.
ఉదా:

  • కవితాసుధ = కవిత అనెడి సుధ
  • ఆశాసౌధం = ఆశయనెడి సౌధం
  • కాలచక్రం = కాలమనెడి చక్రం

TS Inter 1st Year Telugu Grammar సమాసాలు

(viii) ద్విగు సమాసం:
సంఖ్యాపూర్వక కర్మధారయం ద్విగువు. సంఖ్యాపూర్వక విశేషణం ముందుగా వున్న సమాసం ద్విగు సమాసం.
ఉదా:

  • ముల్లోకములు = మూడైన లోకములు
  • అష్టదిగ్గజాలు = అష్ట సంఖ్య గల దిగ్గజాలు
  • పంచభూతాలు = పంచ సంఖ్య గల భూతాలు

2. బహువ్రీహి సమాసం:
‘అన్యపదార్థ ప్రధానో బహుబ్లి హిః’. ‘అన్యపదార్థం’ అంటే సమాసంలోని పూర్వపదం, ఉత్తరపదాల అర్థాలు కాకుండా ఈ రెండు పదాలు కలిసి ఇచ్చే మరో అర్థం. దానికి ప్రాధాన్యత ఉంటుంది.
ఉదా:

  • ముక్కంటి = మూడు కన్నులు కలవాడు
  • మధురవాణి = మధురమైన వాక్కు కలది
  • మహాత్ములు = గొప్ప ఆత్మ కలవారు

3. ద్వంద్వ సమాసం:
ఉభయ పదార్థ ప్రాధాన్యం కలది ద్వంద్వ సమాసం. అంటే సమాసం లోని పూర్వపదం, ఉత్తరపదం రెండు పదాల అర్థాలకు సమ ప్రాధాన్యం ఉంటుంది.
ఉదా:

  • సీతారాములు = సీతయును, రాముడును
  • భయభక్తులు = భయమును, భక్తియును
  • తల్లిదండ్రులు = తల్లియును, తండ్రియును

TS Inter 1st Year Telugu Grammar సమాసాలు

4. అవ్యయీభావ సమాసం:
‘అవ్యయం’ అంటే లింగ, వచన, విభక్తుల వల్ల ఎటు వంటి మార్పుకు గురికాని పదం. అటువంటి పదాలు పూర్వపదంలో ఉంటే అది అవ్యయీభావ ‘సమాసం అవుతుంది.
ఉదా:

  • యథాశక్తి = శక్తి ననుసరించి
  • ప్రతి దినము = దినము దినము

TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 5th Lesson తెలంగాణ జాతీయాలు Textbook Questions and Answers.

TS Inter 1st Year Telugu Study Material 5th Lesson తెలంగాణ జాతీయాలు

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
పాఠ్యాంశంలో ఏవేని ఐదు జాతీయాలను సోదాహరణంగా వివరించండి?
జవాబు:
తెలంగాణ జాతీయాలు అను పాఠ్యభాగం వేముల పెరుమాళ్ళు రచించిన “తెలంగాణ జాతీయాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది. ఈ పాఠ్యభాగంలో తెలంగాణ జాతీయాలు వివరించబడ్డాయి.

1. వరిగడ్డిపంట :
ఎండుగడ్డి అంటిందే తడువుగా కాలుతుంది. వాముగా ఉన్నప్పుడు కుమ్ముగా కాలుతుంది. ‘మంచివాళ్ళకు వచ్చే కోపాన్ని వరిగడ్డి మంటతో పోలుస్తారు. వారి కోపం . వరిగడ్డి మంటలాంటిదంటారు. వరిగడ్డిమంటలాంటి కోపం ఆకాసేపు భరించలేనిదిగా ఉ న్నా దానికి ప్రమాదం లేదు. అదే అర్థంలో “వరిగడ్డిమంట” అను జాతీయాన్ని వాడతారు.

2. కుక్కిన పేను : రాకాసిబల్లుల లాంటి మహామహా జంతుజాలం నాశనం అయింది. కాని పేను జాతి మాత్రం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతూనే ఉంది. పేనును కుక్కితే చిటుక్కుమన్న శబ్ధం వస్తుంది. కొన్ని ఈడ్డులాంటి పేలు చిటుక్కుమనవు గోరువత్తిడికి తలకు అంటుకుపోతాయి. చచ్చినట్లుపడి ఉంటాయి. అలా కుక్కితే చచ్చిపోకుండా చచ్చినట్లు పడిఉండే పేలు కుక్కిన పేలు. “ఒక్క మాట అనకుండా వాడు పొద్దంతా అక్కడే కుక్కి పేనువలె పడున్నాడు” అనటానికి ఈ జాతీయాన్ని వాడతారు.

3. గద్ద తన్నుక పోయినట్లు ఏ కాస్త సందు దొరికినా, తల్లి నుండి కొద్ది ఎడబాసినట్లున్నా, ఏ చింతచెట్టు చాటారు కొమ్మనుండి కనిపెడుతుందో గాని గద్ద కోడిపిల్లను ఎత్తుకుపోతుంది. అలాగే ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ తిరుగుతూ ఉన్న వ్యక్తి ప్రమాదంలో చనిపోతాడు. ఇలా హఠాన్మరణం సంభవించినప్పుడు ఆ పరిస్థితిని అంచనా వేసి గద్ద తన్నుకుపోవటంతో పోలుస్తారు. “గంట క్రితం బజార్లకు ఆడుకొనపోయిన పిల్లలాడ్ని గద్ద తన్నుక పోయినట్లు బస్సుకిందపడి చచ్చిపోయే” అని జాతీయ ప్రయోగం.

TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు

4. చుక్కి టెగి పట్టట్లు :
ఆకాశం నుండి అప్పుడప్పుడు అకస్మాత్తుగా ఉల్కలు ఆకాశం నుండి వాతావరణంలోకి రాలిపడుతుంటాయి. ఇది దూరం నుండి చూసిన వారికి ఆకాశం నుండి చుక్కలు రాలిపడినట్లు భ్రాంతి కలుగుతుంది. దీనినే పల్లె భాషలో చుక్క తెగిపడినట్లు అని అంటుంటారు. మనం ఊహించని అతిథిగాని, వ్యక్తిగాని అనుకోని సందర్భంలో అకస్మాత్తుగా వస్తే “చుక్క తెగిపడినట్లు వచ్చావేమిటిరా అని ప్రశ్నిస్తాం. చుక్క తెగిపడటంచాల అరుదుగా జరుగుతుంది. ఎప్పుడు పడుతుందో తెలియదు. అర్థరాత్రి అదరాబాదరా వచ్చిన పాలేరుతో “ఈ సమయంలో వచ్చావు చుక్క తెగిపడినట్లు” అని ఇల్లాలు ప్రశ్నిస్తుంది.

5. రామ చక్కని : చక్కదనం అంటే అందం. రాముని చక్కని అందగాడిగా తెలుగువారు భావిస్తారు. మంచి గుణానికి అందానికి నాణ్యతకు చాలా సందర్భాలలో రామచక్కని బంధం ఉపయోగించబడుతుంది. “రామ చక్కని అద్దం పగుల గొడితివి గదరా” “రంగయ్య రామచక్కని మనిషి”, “రామ చక్కని పిల్ల అది” అని ప్రయోగం మన సమాజంలో ఉన్నదే కదా!

ప్రశ్న 2.
పాఠ్యాంశంలోని జంతువులు పక్షుల ఆధారంగా రూపొందిన ఏ వేని ఐదు జాతీయాలను వివరించండి?
జవాబు:
“తెలంగాణ జాతీయాలు” అను పాఠ్యభాగం వేముల పెరుమాళ్ళుచే రచింంచబడిన ‘తెలంగాణ జాతీయాలు’ అన్న గ్రంథం నుండి గ్రహించబడింది. ఇందులో జంతువుల పక్షులు ఆధారంగా కొన్ని జాతీయాలున్నాయి.

1. కోతికి పుండు పుట్టినట్లు ఒక కోతికి పుండయ్యింది. విచిత్రంగా కన్పించింది. మరొక కోతి వచ్చి ఆపుండును గిల్లి చూసి వెళ్ళిపోయింది. అలాగే మరొక కోతి కూడా అలా చేసింది. ఆకోతి కూడా పుండు బాధ పడలేక గోక్కున్నది. పుండు మరింత నెత్తురుకారి పెద్దదయింది. ఏ కోతికి పుండు పెద్దది కావాలని ఉండదు. అయినా తెలియని తనం వలన ఈ కోతి పుండు మానదు “అత్తా! ఈ పోరగాని కాలుకు దెబ్బ తాకిందని పట్టేసి బడికితోలేస్తే మళ్ళీ దెబ్బతాకించుకున్నాడు. కోతికి పుండు పుట్టించుకున్నట్లున్నది” అన్న కోడలి మాటల్లో ఈ జాతీయం పలుకబడింది.

TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు

2. ఎద్దును చూసి మేతెయ్యాలి : ఏనుగుకు చీమకు ఒకే విధంగా మేత వేస్తే కుదురుతుందా? విచక్షణతో దేనికేంత వేయాలో తెలుసుకోవాలి. ఎద్దుల్లో కొన్ని పెద్ద ఎద్దులుంటాయి. వాటికి తగ్గమేత వాటికి వేయాలి. కొన్ని బొండలుంటాయి. వాటి పుట్టుకే చిన్నది. కడుపు కూడా అంతకు తగ్గట్టుగానే ఉంటుంది. వాటికి మేత ఎక్కువ వేస్తే తొక్కి పాడుచేస్తాయి. ‘దసరా మామూళ్ళని అందరికి పదిరూపాలే ఇస్తిరి. ఎద్దును చూసి మేతెయ్యాలి. మే ఎల్లకాలం పనికచ్చేటోల్లం. మాది మా కుండాల” అని జాతీయం ప్రయోగించబడుతుంది.

3. ఊరుగొడ్డుపోలేదు : ఊరిలో ఎక్కడో ఒకచోట దొరకుండా పోదు అనుట ఒక కుటుంబంలో ఒక వస్తువు దొరకకుండా పోవచ్చు. ఊరిలో దొరకకుండా పోదు. గొడ్డు పోవుట అంటే వంధత్వం, అలభ్యం. ఒక కుటుంబంలో దొరకకపోతే వేరే కుటుంబంలో దొరుకుతుందని భావం” “అయ్యో! నీవు యియ్యకపోతే మాయె. ఊరుగొడ్డుపోయిందా? ఎక్కడో ఒకచోట ఎవరన్నా ఇస్తారు. అందరూ ఒకే తీరు ఉంటారా? అని ఈ జాతీయం ప్రయోగించబడుతుంది

4. కోడి మెదడు : అల్పత్వం మతిమాలిన తనం అని అర్థం. కోడి చిన్న ప్రాణి. దాని మెదడు కూడా చిన్నదే! చెపితే అర్థం చేసుకోకుండా తనకు తెలిసిందే గొప్ప అనుకునే వాడిని కోడిమెడవాడు అంటారు. “వానిది కోడి మెదడు. వానికి తోచదు. ఒకరు చెప్తే వినడు” అంటారు.

5. బుడుబుంగ : నీటిలో తిరిగే పక్షి, బాతు జాతికి చెందింది. నల్లగా ఉంటుంది. ఒక చోట బుడుక్కున మునుగుతుంది. కూత పెట్టు దూరంలో తేలుతుంది. మళ్ళీ మళ్ళీ మునిగినా అలాగే తేలుతుంది. లోపల చేపలను వేటాడుతుంది. ఇప్పుడు ఈ ఇంట్లో, వెంటనే మరో ఇంట్లో ఇలా కాలాగకుండా తిరిగే వాడిని బుడుబుంగ అని అంటారు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు

II. సంగ్రహ రూప ప్రశ్నలు – సమాధానాలు.

ప్రశ్న 1.
‘తాత జాగీరు’ జాతీయంలోని చారిత్రక విశేషాలను తెలపండి?
జవాబు:
కష్టార్జితం కాని సంపద, అనువంశికంగా సంక్రమించిన ఆస్తి, నైజాం ప్రభువులు తమ రాజరికాన్ని కాపాడు కోవటానికి జీతం లేని కొలువులు ఎన్నో ఏర్పాటు చేశారు. పటీలు, మావిపటీలు, పట్వారీ, కొత్వాలి వంటివి అనువంశికంగా సంక్రమించేవి. ఈ పనికి జీతం లేకపోయినా ప్రజలను వీళ్ళు ఎంత దోచుకున్నా తమ సొమ్ము ముట్టచెపితే చాలు.

ఆ విధంగా జమీందారులు, జాగీరుదారులు, ముక్తాదారులు, దేశాయిలు, సర్దేశాయిలుండేవారు. జమీందారుకు కొన్ని గ్రామాల్లో వేలాది ఎకరాల భూములు ఉండేవి. ముక్తాదారులంటే ఆ గ్రామమంతా ఆయనదే! ప్రజల వద్ద ఎంత దోచుకున్నా ప్రభుత్వం పట్టించుకోదు. కప్పం చెల్లిస్తే చాలు. తాత గారి జాగీరును మనమడు అనుభవిస్తున్నట్లు” ఇదేమన్నా నీ తాతగారి జాగీరనుకున్నావా” అన్న జాతీయాలు ప్రయోగించడం జరుగుతుంది.

ప్రశ్న 2.
ఇంటింటికి మంటి పొయ్యి జాతీయంలోని సామాజిక న్యాయాన్ని వివరించండి?
జవాబు:
తెలంగాణ జాతీయాలు అను పాఠ్యభాగం వేముల పెరుమాళ్ళుచే రచించబడిన “తెలంగాణ జాతీయాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.
కట్టెలతో వంటలు చేసేటప్పుడు ఏ ఇంటిలోనైనా మన్నుతో చేసిన పొయ్యి ఉండేది. నాకు ధనమున్నదికదా అని బంగారు పొయ్యి లాడరు కదా! సామాజిక న్యాయం అందరికి ఒక్కటే సమస్యలు లేని ఇల్లుండదు “మాకోడలు కొడుకు మొన్న నలుగురిలో నానామాటలన్నందుకు నల్ల మొఖం అనిపించింది.

బజారుకే రాబుద్ధికావడం లేదు” అంది పొరుగింటావిడ. “ఇంటింటికి మట్టి పొయ్యే ఈ కష్టాలు అందరికీ వచ్చేవే. నీ ఒక్కదానికని ఏముంది. నీ కొడుకు కోడలు ఏదో అంటే నీకెందుకు నల్లమొఖం. ముందటమాకురావా” అని ఓదార్చింది పొరుగింటి ఆవిడ. ఇలాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగించబడుతుంది.

TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు

ప్రశ్న 3.
బట్టకాల్చి మీద వేయడం అంటే ఏమిటి?
జవాబు:
తెలంగాణ జాతీయాలు అను పాఠ్యభాగం వేముల పెరుమాళ్ళుచే రచించబడిన తెలంగాణ జాతీయాలు” అనుగ్రంథం నుండి గ్రహించబడింది.

బట్టకాల్చి మీద వేయటమంటే నిందలు మోపటం అని అర్థం. ఒకరిని అన్యాయంగా వ్యాజ్యంలో ఇరికించడం. పరులను దోషులుగా చిత్రించడం “వాడు దొంగ తనం చేశాడు. నేను నా సొంత బంగామని వాడు చెప్పినందున ఆ సొమ్ము దాచాను. బట్టకాల్చి మీదేసినట్లు ఆ నింద వాడు నా మీద వేసి నన్ను కూడా వానితోపాటు కేసులో ఇరికించాడు అనటంతో ఈ జాతీయం ప్రస్తావించబడుతుంది.

ప్రశ్న 4.
వరిగడ్డిమంట :
జవాబు:
తెలంగాణ జాతీయాలు అను పాఠ్యభాగం వేముల పెరుమాళ్ళుచే రచించబడిన “తెలంగాణ జాతీయాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.

వరిగడ్డి ఎండినదైతే అగ్ని అంటిందే తడవుగా మంటలంటుకుని కాలుతుంది. వాముగా ఉంటే మాత్రం కమ్ముకుని పొగలేచి కుమ్ముగా కాలుతుంది. వంట చెరుకు అంటుకోవటానికి, పొయ్యి రాజుకోవటానికి, చలిమంటలకు బగ్గున లేచే మంటల కోసం వరిగడ్డినే వాడతారు. ఏదైనా వరిగడ్డి బగ్గున మండి బుగ్గయిపోతుంది. మంచివాళ్ళకు వచ్చే కోపం వరిగడ్డి. మంటతో పోలుస్తారు. వారి కోపం వరిగడ్డి మంటాలాంటిది. కొద్దిసేపటిలో మాయపై పోతుంది. అలాంటప్పుడు వరిగడ్డిమంటతో పోలుస్తారు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు

III. ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
వేముల పెరుమాళ్ళు విద్యాభాసం ఎక్కడ జరిగింది ?
జవాబు:
రాయికల్, కోరుట్ల, జగిత్యాలలో జరిగింది.

ప్రశ్న 2.
వేముల పెరుమాళ్ళు రాసిన త్రిశతి పేరేమిటి?
జవాబు:
వేముల పెరుమాళ్ళు వ్రాసిన త్రిశతి పేరు ‘గాంధీమార్గం’

ప్రశ్న 3.
వేముల పెరుమాళ్ళు ప్రసంగాల సంకలనం పేరేమిటి ?
జవాబు:
మానవతా పరిమళాలు

ప్రశ్న 4.
జాతీయాలలో ఏ చరిత్ర కళ్ళకు కట్టినట్లుంటుంది?
జవాబు:
జాతీయాలలో తరతరాల తెలంగాణ సామాజిక చరిత్ర కళ్ళకు కట్టినట్లుంటుంది

ప్రశ్న 5.
జానపదుల నోటి నుండి వెలువడ్డ జాతీయం సామెత ఎలాంటిది?
జవాబు:
గంగలో రాయివంటిది

TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు

ప్రశ్న 6.
“చుక్క తెగిపడ్డట్టు” అనే జాతీయంతో ఒక వాక్యం నిర్మించండి.
జవాబు:
చుక్కమ్మ చుక్క తెగిపడినట్లు చెప్పాపెట్టకుండా మా ఇంటికి వచ్చింది.

ప్రశ్న 7.
“రామచక్కని” అనే జాతీయాన్ని ఉపయోగించి ఒక వాక్యం తయారు చేయండి.
జవాబు:
శ్రీరాముడు రామచక్కనోడు

ప్రశ్న 8.
“లొల్లిలో లొల్లి” జాతీయం ఆధారంగా ఒక వాక్యం రాయండి?
జవాబు:
రాజకీయ పార్టీలు అవినీతిని గురించి ఇప్పుడు లొల్లిలో లొల్లి చేస్తున్నాయి.

తెలంగాణ జాతీయాలు Summary in Telugu

రచయిత పరిచయం

రచయిత : వేముల పెరుమాళ్ళు

పుట్టిన తేదీ : ఆగష్టు 8, 1943

పుట్టిన ఊరు : కరీంనగర్ జిల్లా రాయికల్

తల్లిదండ్రులు : వేముల ఆండాళ్ళమ్మ – రాజయ్యలు

విద్యాభ్యాసం : రాయకల్, కోరుట్ల, జగిత్యాలలో

వృత్తి : గ్రామాభివృద్ధి అధికారి

TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు

రచనలు :

  1. శ్రీరాజ రాజేశ్వర శతకం
  2. ధర్మపురి నృకేసరి శతకం

బాలసాహిత్యంలో

  1. ‘కిట్టు’ బాలనీతి శతకం
  2. ‘నిమ్మ’ పర్యావరణ శతకం
  3. ‘గాంధీమార్గం’ త్రిశతి
  4. ‘లోగుట్టు’ రాజనీతి చతుశ్శతి

ఆకాశవాణి ప్రసంగాలు

  1. మానవతా పరిమళాలు

మరణం : సెప్టెంబరు 17, 2005

కవి పరిచయం

వేముల పెరుమాళ్ళు కరీంనగర్ జిల్లా రాయికల్ గ్రామంలో ఆగష్టు 5, 1943 జన్మించారు. ఈయన తల్లిదండ్రులు వేముల ఆండాళ్ళమ్మ రాజయ్యలు. మాతా మహుడు కైరం భూమదాసు వరకవి గాయకుడు. వీరి విద్యాభ్యాసం రాయకల్ కోరుట్ల జగిత్యాలల్లో జరిగింది. గ్రామాభివృద్ధి అధికారిగా 18 సం॥లు పనిచేశారు. తరువాత రాజకీయ రంగంలో ప్రవేశించి రాయికల్ మండల అధ్యక్షునిగా పనిచేశాడు. సహకార రంగంలో గీత, పారిశ్రామిక కాంట్రాక్ట్ లేబర్, వినియోగ, గృహనిర్మాణ సంఘాలను స్థాపించాడు.

పెరుమాళ్ళు శ్రీరాజరాజేశ్వర, శ్రీధర్మపురి, నృకేసరి శతకాలను ప్రచురించారు. బాల సాహిత్యంలో వీరు బాలనీతి శతకం. ‘కిట్టూ’, పర్యావరణ శతకం ‘నిమ్ము’లు రాశారు. మహాత్ముని మహానీయ సూక్తులను “గాంధీమార్గం” త్రిశతిగా రచించాడు. రాజనీతి చతుశ్శతిగా వీరు “లోగుట్టు” రాశాడు.

1958 నుండి 1968 వరకు సమాజంలో జాతీయ పరిణామాలను పద్యాలుగా రాశాడు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా ఈయన “మానవతా పరిమళాలు” ప్రసంగాలుగా వెలువడ్డాయి. జీర్ణదేవాలయ పునరుద్ధరణ చేశారు. వీరు సెప్టెంబరు 17, 2005న కాలం చేశారు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు

ప్రస్తుత పాఠ్యభాగం “తెలంగాణ జాతీయాలు” గ్రంథం నుండి గ్రహించబడింది.

పాఠ్యభాగ సందర్భం

వేముల పెరుమాళ్ళు తన తల్లి నోటి నుండి వెలువడే జాతీయాలను విని ప్రేరణ పొంది తెలంగాణ వివిధ ప్రాంతాల నుండి వాటిని సేకరించారు. జానపద సాహిత్యం గురించి చెపుతూ “జానపద సాహిత్యం కూరాడుకుండలాంటిది. దానిని మైలపరచ కుండా చేసే బాధ్యత మనందరిది. జానపదుడు ఋషి వంటివాడు. జానపదుల నోట వెలువడిన జాతీయం సామెత గంగలో రాయిలాంటిది. తెలంగాణ భాషయాస అర్థం చేసుకుని చదివితే ఆసక్తికరమైన అంశాలు లభిస్తాయి” అంటారు.

తెలంగాణ జాతీయాలను విద్యార్థులకు తెలియచేసే సందర్భంలో ఈపాఠ్యభాగం ఇవ్వబడింది.

పాఠ్యాభాగ సారాంశం

“వేముల పెరుమాళ్ళు జాతీయాలను వివరిస్తూ “జానపద సాహిత్యం” కూరాడు కుండలాంటిది. దానిని మైల పరచకుండా చూసే బాధ్యత మనందరిది. జానపదుడు ఋషసోంటోడు. జానపదుల నోట వెలువడ్డ జాతీయం, సామెత గంగలో రాయివంటిది.

ఎన్నో వందల సంవత్సరాలు అది ప్రజల నోళ్ళలో నాని రగిడిల్లింది. ఒక్క మాటలో చెప్పాలంటే వీటిలో తరతరాల తెలంగాణా సామాజిక చరిత్ర కళ్ళకు కట్టినట్లుంటుంది. తెలంగాణ భాష, యాస, అర్థం చేసుకుని కొంచెం ఓపికగా చదివేవాళ్ళకు ఇందులో ఎన్నో ఆసక్తి కరమైన అంశాలు లభిస్తాయి.

TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు

జాతీయాలలో వరిగడ్డిమంట, లొల్లిలో లొల్లి, కోటిపండు పుట్టినట్లు, తాతజాగీరు, కుక్కిన పేను, ఏనుగెల్లింది తోకచిక్కింది, వెయ్యికాళ్ళజర్రి, గద్దతన్నుకు పోయినట్లు, పిల్లికి రొయ్యిల మొలతాడు, చుక్కతెగిపడినట్లు, ఎద్దును చూసిమేత వెయ్యాలి, ఊరుగొడ్డుపోలేదు. తూముకాడిపొలం, మొలదారం తెగ, పేర్నాల పెట్టుట మొదలగు ముఖ్యమైన నిత్య వాడుకలో ఉన్న వాటిని వివరించారు.

TS Inter 1st Year Telugu Grammar అనువాదం

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material Grammar అనువాదం Questions and Answers.

TS Inter 1st Year Telugu Grammar అనువాదం

ఒక భాష నందలి భావాన్ని మరొక భాషలోకి వ్యక్తీకరించే ప్రక్రియ అనువాదం. దీనినే ఆంగ్లంలో Translation అంటారు. అనువాదం చేయదలచుకున్న భాషను మూల భాష (Source Language) అని, అనువాదం ఏ భాషలోకి చేయదలచుకున్నారో భాషను లక్ష్య భాష (Target Language) అని అంటారు. ఒక భాషలోని చారిత్రక, శాస్త్ర, సాంకేతిక, సాహిత్యాంశాలను అనువాదం చేయటం ద్వారా మూల భాషా ప్రాంతం లోని విషయాలను, సంస్కృతీ విశేషాలను ఇతర భాషీయులు తెలుసుకోవచ్చు. ఇది ప్రాంతాల మధ్య, సంస్కృతుల మధ్య ఐక్యతకు తోడ్పడుతుంది.

భారతీయ భాషలలో ఒక భాషనుంచి మరొక భాషలోకి, విదేశీ భాషలలోకి, విశ్వసాహిత్యం నుంచి భారతీయ భాషలలోకి ఆదాన ప్రదానాలు జరిగాయి. తెలుగు భాషలోకి సంస్కృత, బెంగాలి, హిందీ, ఉర్దూ, తమిళ, మళయాళ, కన్నడ ఇత్యాది భారతీయ భాషల సాహిత్యం, ఆంగ్ల, ఫ్రెంచ్, రష్యన్, చైనీస్ భాషల సాహిత్యం అనువాదం అయింది.

మూలరచనను యథాతథంగా తెలుగులోకి తర్జుమా చేయడం ఒక పద్ధతి అయితే, మూల రచనకు భంగం వాటిల్లకుండా స్వేచ్ఛానుసరణ చేయడం మరొక పద్ధతి.

అనువాద విధానంలో పాటించాల్సిన మెలకువలు
అనువాదంలో సాంస్కృతికపరమైన సమస్యలు ఎదురవుతాయి. భాషాసంబంధమైన సమస్యలు కూడా ఎదురవుతాయి.

భిన్న సంస్కృతులు భిన్న భాషా పదాలను సృష్టించుకున్నప్పుడు, ఆ సాంస్కృతిక అంశాల పారిభాషిక పదాలను అనువాదం చేసే భాషలో ఉండే సామీప్య పద బంధా లను ముందుగా క్రోడీకరించుకోవాలి. ఇంగ్లీషులో ice, snow, dew లాంటి పదాల అనువాదంలో మంచు, చలిమంచు, పొగమంచు పదాలు అనువాదా నికి పనికి వస్తాయో లేదో ఆలోచించాలి.

TS Inter 1st Year Telugu Grammar అనువాదం

ఒక భాషా సమాజంలో ఒక పదం పుట్టుక ఆ భాషా సమాజంలోని సాంస్కృతిక అనుబంధం మీద, దాని పరిసర ప్రభావాల మీద ఆధారపడుతుంది. దానిని అనువాదం చేసేటప్పుడు దాని పరిసరానుబంధానికి విఘాతం జరగకుండా పదాలను ఎంపిక చేసుకోవాలి.

సాధారణంగా ఒక భౌగోళిక ప్రాంతంలో నివసించే ప్రజలంతా ఒకే భాషను మాట్లాడుతారు. అట్లాగే, ఒక భాషా ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు, అంటే -జాతికి, ఒక నిర్దిష్టమైన భౌతిక జీవనం ఉంటుంది. సాంఘిక జీవితం ఉంటుంది. మత విశ్వాసాలు ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే వీటన్నిటి ప్రభావాల వల్ల జాతిభావాలు, భావాల తీరును బట్టి భాషలుంటాయని గమనించాలి.

భౌగోళిక శీతోష్ణ పరిస్థితులను బట్టి పండే పంటల్లో తేడాలుంటాయి. ఆ తేడాలు ఆహారపు అలవాట్లను కూడా మారుస్తాయి. ఇంగ్లీషులో bread, soup, sandwich లాంటి మాటలను గమనించండి. తెలుగు అన్నంలోనూ, కూరల్లోనూ చాలా రకాలున్నాయి. వరి అన్నం వేరు, కొర్రన్నం వేరు, సంగటి వేరు.

ఇంగ్లీషులో Rice అంటే అన్నం కావచ్చు. బియ్యమూ కావచ్చు. అంటే, ఇంగ్లీషువారికి Rice అనే పదంతో వాళ్ళ అవసరాలు తీరుతున్నాయి. కాబట్టి కొత్తపదాల సృష్టి వాళ్ళకు అవసరం లేకుండా పోయింది. అంటే భిన్న భిన్న సంస్కృతులు భిన్న భిన్న పదాలకు ఆలవాలంగా ఉంటాయని గమనించాలి. కాబట్టి అనువాదం చేసేటప్పుడు సాంస్కృతిక ప్రభావం ప్రధానపాత్ర వహిస్తుందన్న సత్యాన్ని గమనించాలి.

అనువాదంలో భాషా సమస్యలు కూడా ప్రధాన అంశమే. మూలభాషా నిర్మాణానికి, లక్ష్య భాషా నిర్మాణానికి మధ్య తేడా ఉండటం వల్ల అనువాదంలో సమస్యలు ఏర్పడతాయి. ఇందులో కొన్ని……… 1. రాసే అలవాట్లు, 2. పదాలు, నుడికారాలు వాటి అర్థ విశేషాలు 3. పదనిర్మాణం 4. వాక్య భేదాలు, ప్రయోగాలు ఇవన్నీ భాషా నిర్మాణ సంబంధమైన సమస్యలుగా గుర్తించాలి.

మూలభాషలోని నుడికారం తెలియకపోతే, తప్పుడు అనువాదం చేసే అవకాశం ఉంది. కాబట్టి అనువాదం చేసేటప్పుడు స్థూలంగా పైన చెప్పిన సమస్యలను గుర్తించి అనువాదం చేస్తే ఆ అనువాదం సరైన విషయ సమగ్రతను కలిగి అనువాదం చేసుకున్న భాషా సమాజానికి కూడా మంచి సమాచారాన్ని అందిస్తుంది.

TS Inter 1st Year Telugu Grammar అనువాదం

అనువాదం అభ్యాసానికి కొన్ని ఆంగ్ల వాక్యాలు

ప్రశ్న 1.
A journey of thousand miles begins with a single step
జవాబు:
వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది.

ప్రశ్న 2.
There is plenty of water in that region.
జవాబు:
ఆ ప్రాంతంలో నీరు పుష్కలంగా ఉంది.

ప్రశ్న 3.
There is no substitute for hard work.
జవాబు:
కృషికి ప్రత్యామ్నాయం లేదు.

ప్రశ్న 4.
Imagination rules the world.
జవాబు:
ఊహాశక్తి ప్రపంచాన్ని శాసిస్తుంది.

ప్రశ్న 5.
Maturity comes with experience not age.
జవాబు:
పరిణతి, వయసుతో కాదు, అనుభవంతో వస్తుంది.

ప్రశ్న 6.
Language is the dress of the thought.
జవాబు:
ఆలోచనకి తొడిగిన ఆహార్యమే భాష.

TS Inter 1st Year Telugu Grammar అనువాదం

ప్రశ్న 7.
A picture is a poem without words.
జవాబు:
పదాలు లేని పద్యమే చిత్రం

ప్రశ్న 8.
The best way to predict the future is to create it.
జవాబు:
భవిష్యత్తును అంచనావేయటానికి ఉత్తమ మార్గం, దానిని సృష్టించటమే.

ప్రశ్న 9.
Learn as if you live forever.
జవాబు:
ఎప్పటికీ జీవిస్తావన్నట్లుగానే నేర్చుకోవాలి.

ప్రశ్న 10.
By failing to prepare you are preparing to fail.
జవాబు:
మీరు సంసిద్ధులు కావటంలో విఫలమవుతున్నారంటే, విఫలమవ్వటానికి సిద్ధపడుతున్నారని అర్థం.

ప్రశ్న 11.
Reading is to the mind what exercise is to the body.
జవాబు:
శరీరానికి వ్యాయామం ఎలాగో మెదడుకి పుస్తక పఠనం అలాంటిది.

ప్రశ్న 12.
Sometimes, later becomes never do it now.
జవాబు:
కొన్నిసార్లు, తరువాత అనుకున్నది ఎప్పటికీ కాదు, అందుకే ఇప్పుడే చెయ్యాలి.

TS Inter 1st Year Telugu Grammar అనువాదం

ప్రశ్న 13.
Don’t stop when you’re tired stop when you are done.
జవాబు:
అలసిపోయినప్పుడు కాదు, పనిపూర్తయినప్పుడే విశ్రమించాలి.

ప్రశ్న 14.
Education is the most powerful weapon which can change the world.
జవాబు:
ప్రపంచాన్ని మార్చగలిగే అత్యంత శక్తివంతమైన సాధనం విద్య మాత్రమే.

ప్రశ్న 15.
What you do is more important than what you say.
జవాబు:
నువ్వు చెప్పే మాటలకంటే నువ్వు చేసే పనులే నీ గురించి మాట్లాడతాయి.

ప్రశ్న 16.
Don’t judge book by its cover.
జవాబు:
ముఖ చిత్రాన్ని చూసి పుస్తకాన్ని అంచనా వెయ్యద్దు.

ప్రశ్న 17.
A poor workman blames his tools.
జవాబు:
పని చేతకానివాడు పనిముట్లని నిందిస్తాడు.

ప్రశ్న 18.
What time is our meeting on Wednesday?
జవాబు:
బుధవారం మన సమావేశం ఎన్ని గంటలకు?

ప్రశ్న 19.
I completed reading the book yesterday.
జవాబు:
నేను పుస్తకం చదవటం నిన్న పూర్తి చేశాను.

TS Inter 1st Year Telugu Grammar అనువాదం

ప్రశ్న 20.
Ours is a joint family.
జవాబు:
మాది ఉమ్మడి కుటుంబం.

TS Inter 1st Year Political Science Study Material Chapter 9 లౌకికవాదం

Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 9th Lesson లౌకికవాదం Textbook Questions and Answers.

TS Inter 1st Year Political Science Study Material 9th Lesson లౌకికవాదం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
లౌకికవాదమంటే ఏమిటో నిర్వచించి, లౌకికవాద భావనలను వివరించండి.
జవాబు.
పరిచయం :
లౌకికవాదమనేది ఒక ప్రధానమైన సామాజిక, రాజకీయ దృగ్విషయం. అనేక సమకాలీన ప్రపంచదేశాలు తమ ప్రభుత్వ వ్యవహారాలలో లౌకికతను అనుసరిస్తున్నాయి. లౌకికవాదం ప్రత్యేకంగా మతంతో సంబంధంలేని, స్వతంత్ర ఆదర్శాలను ప్రభోదిస్తుంది. ప్రభుత్వాలు మతంతో నిమిత్తం లేకుండా నైతికత, విద్యలాంటి సూత్రంపై ఆధారపడతాయనే దృక్పథమే లౌకికవాదం.

వర్తమాన ప్రాపంచిక జీవనం దైవికమైనది కాకుండా కొన్ని నైతిక ప్రమాణాలు, పాలనా నియమాలు మానవ కార్యకలాపాలను నిర్ణయిస్తాయని లౌకికవాదం పేర్కొంటుంది. లౌకికవాదానికి మతాన్ని దూషించే ఉద్దేశం లేదు. మతం, రాజ్యం అనేవి రెండు ప్రత్యేక విభాగాలని అది గట్టిగా ఉద్ఘాటించింది.

అర్థం :
Secular అనే ఆంగ్ల పదానికి లాటిన్ భాషలో అర్థం “ఇహలోకం” (This World) ఈ పదం మతానికి వ్యతిరేకమనే అర్థాన్ని ఇస్తుంది.

నిర్వచనం :
1. జి. జె. హోల్యోక్ :
“లౌకికవాదం అంటే మతవిశ్వాసాలను విమర్శించకుండా లేదా తిరస్కరించకుండా మతంతో సంబంధంలేని ఒకానొక సామాజిక వ్యవస్థను ప్రోత్సహించటమనే భావన” గా నిర్వచించారు.

2. ఎరిక్ ఎస్. వాటర్ హౌస్ :
“మతంలో పేర్కొన్న దానికంటే భిన్నమైన జీవనం, ప్రవర్తనలకు సంబంధించిన సిద్దాంతాన్ని ప్రతిపాదించే ఒకానొక ఆదర్శమే లౌకికవాదం” అని అభిప్రాయపడ్డారు.

లౌకికవాద భావనలు (Concepts of secularism) : లౌకికవాదం ప్రధానంగా నాలుగు భావనలను కలిగి ఉంది. అవి

  1. మానవతాపాదం, హేతువాద భావన
  2. రాజకీయ, సామాజిక దృక్కోణం
  3. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం
  4. మతం పట్ల వ్యతిరేకత

ఈ నాలుగు భావనలను గురించి ఈ దిగువ పేర్కొన్న విధంగా వివరించవచ్చు.
1. మానవతావాదం, హేతువాద భావన (Humanistic and Atheistic philosophy) :
లౌకికవాదం అనేక వ్యక్తిగత, సాంస్కృతిక, రాజకీయ, సామాజిక అంతరార్థాలను కలిగి ఉంటుంది. మానవుల శ్రేయస్సును కోరుకొనుట చేత అది మానవతా స్వభావాన్ని కలిగి ఉంటుంది.

మానవుడు అన్ని విషయాలకు కొలమానం అనే సామెతకు అది ప్రాముఖ్యతను ఇస్తుంది. ఇది మతాన్ని సమర్థించదు లేదా వ్యతిరేకించదు. వ్యక్తులు తమకు ఇష్టమైన మతాన్ని ఎంపిక చేసుకొని, అనుసరించేందుకు వీలు కల్పిస్తుంది.

2. రాజకీయ, సామాజిక దృక్కోణం (Political and Social dimension) :
లౌకిక వాదానికి నిర్దిష్టమైన రాజకీయ, సామాజిక దృక్కోణాలున్నాయి. అది సహజసిద్ధమైన, భౌతిక దృక్పథాలతోనూ, రాజకీయ, ఆర్థిక స్వావలంబనలతో కూడిన వ్యవస్థాపనకు ప్రతీకగా ఉంటుంది. కుటుంబానికి, సంస్థలకు మరియు సమాజానికి మత స్వాతంత్య్రానికి ఇది వీలు కల్పిస్తుంది.

3. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం (Liberty and Democracy) :
స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి లౌకికవాదం ప్రయోజనకరమైనది. అలాగే ఉదార ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికగా ఉంటుంది. లౌకికవాదం అధికారిక మత నాయకత్వాన్ని మత సంస్థల ఉనికి, కొనసాగింపు, మనుగడలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రజాసామ్యం, ప్రభుత్వాధికారాల వికేంద్రీకరణను సమర్థిస్తుంది.

4. మతం పట్ల వ్యతిరేకత (Opposition to Religion) :
లౌకికవాదం ప్రజా వ్యవహారాలను మతం సమర్థించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మతాధికారుల ప్రాబల్యతలను ఖండిస్తుంది. మానవజీవనానికి సంబంధించిన అప్రధాన అంశాలలో మతం ఒకటిగా పేర్కొంటూ, మత ప్రాధాన్యాన్ని తగ్గిస్తుంది. సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలగని రీతిలో ప్రజలు వారి మత విశ్వాసాలను, ఆచారాలను అనుసరించవచ్చని పేర్కొంటుంది.

ఇతర మతాలకు చెందిన వారికి ఏ విధమైన అపకారం, ద్వేషం, అసూయలు కలిగించకుండా వ్యక్తులు వారి మత కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని స్పష్టీకరించింది. రాజ్యాంగపు మహోన్నత ఆశయాలు, ఆకాంక్షలను ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుందని ఉద్ఘాటించింది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 9 లౌకికవాదం

ప్రశ్న 2.
లౌకికవాద సుగుణాల గురించి రాయండి.
జవాబు.
అర్థం :
Secular అనే ఆంగ్ల పదానికి లాటిన్ భాషలో అర్థం “ఇహలోకం” (This World) ఈ పదం మతానికి వ్యతిరేకమనే అర్థాన్ని ఇస్తుంది.

నిర్వచనం :
“మతంలో పేర్కొన్న దానికంటే భిన్నమైన జీవనం, ప్రవర్తనలకు సంబంధించిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించే ఒకానొక ఆదర్శమే లౌకికవాదం” అని ఎరిక్. ఎస్. వాటర్ హౌస్ పేర్కొన్నాడు.

లౌకికవాదం – సుగుణాలు (Merits of Secularism) :

1. సమత (Equity) :
లౌకికవాదం సమసమాజానికి ప్రాతిపదిక. అన్ని మతాల వారిని సమానంగా పరిగణిస్తుంది. మానవులు సృష్టించిన అసమానతలను గుర్తించదు. అలాగే కుల, మత, వర్ణ, వర్గ, ప్రాంతీయ భాషాపరమైన వివక్షతలకు తావు ఇవ్వదు. దాంతో ప్రజలు జాతిపట్ల ఎంతో దృఢమైన సానుకూలమైన భావాన్ని కలిగి ఉంటారు.

2. మత స్వాతంత్ర్యం (Religious Freedom) :
లౌకికవాదం, మత స్వాతంత్ర్యాన్ని ప్రజలు సంపూర్ణంగా అనుభవించుటకు దోహదపడుతుంది. రాజ్యం వ్యక్తుల మత వ్యవహారాలలో జోక్యం చేసుకోదు. లౌకిక రాజ్యంలో రాజ్యాంగం, వివిధ చట్టాలు, వ్యక్తులకు తమ ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించుటకు, ప్రబోధించుటకు, ప్రచారం చేసుకొనేందుకు, సంపూర్ణమైన స్వాతంత్య్రాన్ని ప్రసాదిస్తాయి.

3. శాంతి భద్రతలు (Law and Order) :
వర్తమాన కాలంలో రాజ్యం, ప్రభుత్వం, ఇతర సంస్థలు ఎంతో విచారకరమైన, దుఃఖదాయకమైన మతానుకూల ఉద్యమాలను ప్రోత్సహించడం లేదా ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు.

దాంతో విభిన్న మతసముదాయాలకు చెందిన ప్రజల మధ్య సామరస్యం సాధించడం అనేది పెద్ద సవాలుగా పరిణమించింది. అటువంటి సందర్భాలలో లౌకికవాదం మతపరమైన ఘర్షణలను, విద్వేషాలను నివారించగలుగుతుంది. అంతిమంగా, ప్రజల మధ్య మత సామరస్యాన్ని లౌకికవాదం పెంపొందించడం జరుగుతుంది.

4. సమన్యాయ పాలన (Rule of Law) :
లౌకికవాదం సమన్యాయపాలన అనే భావనకు ప్రాధాన్యతనిస్తుంది. లౌకికవాదాన్ని అనుసరించే రాజ్యం ఏ ఒక్క మతానికి కాకుండా అన్ని మతాలకు చెందిన ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చట్టాలను రూపొందించి అమలు చేస్తుంది. చట్ట నిర్మాణ సమయంలో ప్రజలకు మత ఛాందస భావాలను పరిగణనలోనికి తీసుకోదు. అలాగే చట్ట నిర్మాణం, చట్టాల అమలు, చట్టాల వ్యాఖ్యానంలో ప్రజలకు ఏ మతంతో సంబంధం లేకుండా లౌకిక రాజ్యం వ్యవహరిస్తుంది.

5. సహనం (Tolerance) :
లౌకికవాదం సహనం, దయార్ద్ర గుణాన్ని ప్రబోధిస్తుంది. విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని, భగవంతుడి పితృత్వంల (Fatherhood) పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటుంది. దాతృత్వం, జాలి, ప్రేమ, ఔదార్యం, అహింస వంటి మహోన్నత గుణాలను ప్రబోధించి, ప్రచారం గావించి ఆచరణలో ఉంచుతుంది.

6. జాతీయ సమైక్యత . (National Integration) :
లౌకికవాదం, ప్రజలలో జాతీయ సమైక్యత, సమగ్రత భావాలను పెంపొందించే ఉత్తమ సాధనంగా దోహదపడుతుంది. భిన్నత్వంలో ఏకత్వ సాధనకు ఉత్తమ కారకంగా భావించబడుతుంది. విభిన్న మతాలు, వాడుకలు అనుసరించే ప్రజల మధ్య ఐక్యతను సాధిస్తుంది.

7. మైనారిటీల రక్షణ (Protection to the Minorities) :
లౌకికవాద రాజ్యం అందరినీ ఒకే రకంగా ఆదరిస్తుంది. సమాజంలో మెజారిటీ వర్గం ఇతర వర్గాల మధ్య ఎటువంటి వివక్షతను చూపదు. అదే సమయంలో మతపరమైన మెజారిటీ వర్గం ఆధిపత్యాల నుంచి మైనారిటీ వర్గాల ప్రయోజనాలను పరిరక్షించి, వారికి ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తుంది. మైనారిటీ వర్గాల వారి పట్ల మతసహనాన్ని పాటించాల్సిందిగా ప్రజలకు బోధిస్తుంది.

8. అన్ని రంగాల ప్రగతి (Allround Progress) : లౌకికవాదంలోని అత్యంత గొప్ప సుగుణం ఏమిటంటే ప్రజలు అన్ని రంగాలలో ప్రగతిని సాధించేందుకు దోహదపడుతుంది. సమాన్యాయ పాలన, మత సహనం, ప్రభుత్వ తటస్థ వైఖరి వంటి అంశాలు లౌకికవాదంలో ఉండుట చేత ఆ రకమైన ప్రగతి సాధ్యమవుతుంది. ప్రత్యేకంగా సంక్షేమం, సామాజిక న్యాయం, అసౌకర్యానికి గురైన వర్గాల ప్రయోజనాల పరిరక్షణ వంటి విషయాలకు సంబంధించి అన్ని మతాలకు చెందిన ప్రజల ప్రగతికి లౌకిక వాదం కృషి చేస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 9 లౌకికవాదం

ప్రశ్న 3.
భారతదేశంలో లౌకికవాదంపై ఒక వ్యాసం రాయండి.
జవాబు.
బ్రిటిష్ ప్రభుత్వపాలన భారతదేశంలో అనేక విద్యా సంస్కరణలను ప్రారంభించింది. శాస్త్రవిజ్ఞానానికి ప్రాముఖ్యతను ఇచ్చింది. అదే సమయంలో భారతదేశంలోని రెండు ప్రధాన మతాలైన హిందువులు, మహమ్మదీయుల మధ్య మతపరమైన విషబీజాలను నాటింది.

అందులో భాగంగా చట్టసభలలో మహమ్మదీయులకు ప్రత్యేక స్థానాలను కేటాయించింది. దాంతో భారత రాజకీయాలలో మతపరమైన ఘర్షణలు ఎడతెగని లక్షణంగా పరిణమించాయి. ఈ పరిస్థితి పట్ల చరిత్రకారులు కూడా తీవ్ర విచారాన్ని వెలిబుచ్చారు.

ఈ సందర్భంలో వారు భిన్నమైన వివరణలను అందించారు. స్వాతంత్ర్యానికి పూర్వం భారతదేశంలో నెలకొన్న విచారకరమైన మత పరిస్థితులకు బ్రిటిష్ పాలకులను వారు నిందించారు. జనాభా పరిమాణం ఆధారంగా బ్రిటిష్ పాలకులు హిందువులు, మహమ్మదీయుల మధ్య ప్రాధాన్యత ఇవ్వటంతో మత అంశాల ప్రాతిపదికపై భారతీయుల మధ్య ఆవేశాలను ప్రోవు చేశారు.

దాంతో భారతదేశంలో నివసించే విషయంలో మైనారిటీలలో అభద్రతా భావం నెలకొంది. కాలక్రమేణా మతఘర్షణలు, మతవిద్వేషాలు అనేవి భారతదేశంలో దైనందిన చర్యలుగా పరిణమించాయి.

ఈ రకమైన పరిస్థితి అంతిమంగా మహమ్మదాలీ జిన్నా వంటి నాయకులు ‘ద్విజాతి సిద్ధాంతం’ (Two Nations Theory) ప్రతిపాదించేందుకు దారితీసింది. మరొకవైపు హిందూ మహాసభ వంటివి మత ప్రయోజనాలకు ప్రతీకగా నిలిచాయి. ఈ సంస్థలు భారతదేశాన్ని హిందూ ఆధిక్య ప్రధానమైన దేశంగా పరిగణించాయి.

1947 ఆగస్టులో భారత యూనియన్ ఇండియా, పాకిస్థాన్లుగా విడిపోవుటకు రాజకీయ పరిస్థితుల తీవ్రతయే కారణంగా పేర్కొనవచ్చు. దేశ విభజన తరువాత కూడా మతపరమైన విబేధాలు కొనసాగడం మతతత్వానికి పరాకాష్టగా భావించవచ్చు. స్వాతంత్య్రం సిద్ధించి ఆరు దశాబ్దాలు గడిచినప్పటికీ భారతదేశంలో ఏదో ఒక ప్రాంతంలో మత ఘర్షణలు సంభవించడం లౌకిక వాదానికి సవాలుగా పరిణమించిందని చెప్పవచ్చు.

భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత ఆమోదించబడిన భారత రాజ్యాంగం లౌకిక వాదాన్ని భారతదేశ గణతంత్ర వ్యవస్థకు ప్రధాన ఆలంబనగా పేర్కొన్నది. దాని ప్రకారం భారతరాజ్యాంగం భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా ప్రకటించింది.

భారతదేశంలోని కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు లౌకిక వాదాన్ని సిద్ధాంతపరమైన ఆచరణాత్మక భావనగా అనుసరించసాగాయి. చట్ట నిర్మాణం, దాని అమలు, రాజ్య పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలలో ఆ ప్రభుత్వాలేవీ మతాన్ని అనుసరించరాదని భారత రాజ్యాంగం పేర్కొంది.

భారతీయులు తమకు ఇష్టమైన మతవిశ్వాసాలను ప్రబోధించుకొనేందుకు, ప్రచారం గావించేందుకు సంపూర్ణమైన మతస్వాతంత్ర్యాన్ని కలిగి ఉండేందుకు భారత రాజ్యాంగం వీలు కల్పించింది. భారతదేశంలో రాజ్యం మతానుకూలమైనది, మత వ్యతిరేకమైనది కాదు. అందుకు బదులుగా అది రాజ్య వ్యవహారాలలో తటస్థ వైఖరిని అనుసరిస్తుంది. భారతరాజ్యాంగం మతం ఆధారంగా ప్రజలపై పన్నులు విధించి, వసూలు చేసేందుకు వీలు కల్పించలేదు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిధులతో సంపూర్ణంగా గానీ, పాక్షికంగా గానీ నిర్వహించబడే విద్యాసంస్థలలో మతం ఆధారంగా ప్రవేశాలను నిషేదించమని పేర్కొంది. అలాగే పైన పేర్కొన్న సంస్థలలో మత బోధనలను నిషేధించడమైంది. కాబట్టి రాజ్యాంగ పరమైన అంశాల ప్రకారం లౌకిక వాదానికి ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పవచ్చు.

భారత రాజ్యాంగ పీఠికలో ‘లౌకిక’ అనే పదాన్ని (42వ సవరణ) చట్టం ద్వారా 1976 లో చేర్చడమైంది. పార్లమెంటులో భారత రాజ్యాంగం (42వ సవరణ) ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా భారతదేశ తృతీయ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ కింది విధంగా ప్రకటించారు. “లౌకికవాదం అనేది మతానికి మతానికి మధ్య అభిమానాన్ని, వివక్షతను చూపడం కాదు.

అన్ని మతాల ప్రజల పట్ల సమానమైన గౌరవాన్ని ప్రదర్శించడమే లౌకిక వాదం. కేవలం మతసహనాన్ని ప్రదర్శించడం ద్వారానే ఏ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉండదు. ప్రతి మత సముదాయానికి చెందిన వారు ఇతర మతాల సముదాయాలకు చెందిన వారి పట్ల సానుకూల గౌరవాన్ని చూపడమనేది అందరి కర్తవ్యం”.

TS Board Inter First Year Political Science Study Material Chapter 9 లౌకికవాదం

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
లౌకికవాదం ఆవిర్భావం గురించి రాయండి.
జవాబు.
ప్రాచీన, మధ్యయుగాలలో మతపరమైన రాజ్యాలుండేవి. ఆ యుగాలలో రాజ్య వ్యవహారాలలో మతం ఎంతో ప్రాధాన్యమైన పాత్రను పోషించింది. పాలకులు, ప్రజల మతవిశ్వాసాలను గుర్తించి, గౌరవించి పరిపాలించేవారు. మతం సమాజంలో శాంతి భద్రత, స్థిరత్వాలను అందించి వ్యక్తుల మధ్య సంబంధాలను నియంత్రించింది. దేశ పరిపాలన సాఫీగా కొనసాగేందుకు అవసరమైన రాజకీయ విధేయతను అందించేందుకు మతం దోహదకారి అయింది.

అయినప్పటికీ మతాచార్యులకు, సంస్కరణవాదులకు మధ్య ఘర్షణలు ఏర్పడి సమాజంలో అరాచకం ప్రబలింది. మతం పేరుతో ప్రజల మీద అత్యున్నతాధికారం చెలాయించేందుకు ఆధ్యాత్మికవాదులు, మత పెద్దలు ప్రయత్నిస్తే లౌకిక పాలకులు వారి వ్యూహాలను నిర్వీర్యపరచారు. రాజ్య వ్యవహారాల నుంచి మతాన్ని వేరు చేసారు. ప్రాచీన రోమన్ చక్రవర్తులు క్రైస్తవ మతాన్ని గుర్తించేందుకు నిరాకరించారు.

మధ్యయుగంలో మార్టిన్ లూథర్, కాల్విన్ జ్వింగిల్ లాంటి సాంఘిక, మత సంస్కరణవాదులు మత పెద్దల ఆధ్యాత్మిక గుత్తాధిపత్యాన్ని సవాలు చేశారు. మత, ఆధ్యాత్మిక విషయాలన్ని కూడా పూర్తిగా వ్యక్తిగత, స్వీయ వ్యవహారాలుగా వీరు భావించారు. మతపరమైన విషయాలపై వారి ప్రసంగాలు విశేషమైన ప్రభావాన్ని చూపాయి. ఆధునిక కాలంలో మాకియవెల్లి, జీనో బోడిన్ వంటి రాజనీతి తత్వవేత్తలు రాజకీయాల నుంచి మతాన్ని వేరుచేయాలని గట్టిగా పేర్కొన్నారు.

జాన్లాక్ వంటి ఉదారవాద తత్వవేత్తలు మత సహనాన్ని ప్రజలు అనుసరించాలని సూచించారు. పైన పేర్కొన్న తాత్వికుల రచనలు కాలక్రమేణ ప్రజలపై ప్రభావాన్ని చూపటంతో, మతమనేది ఒక వైయుక్తిక, స్వీయ వ్యవహారంగా భావించటం మొదలైంది. అమెరికా దేశాధ్యక్షుడైన థామస్ జఫర్సన్ లౌకికవాదపు నిజమైన అర్థాన్ని వివరిస్తూ రాజ్యం, మతం మధ్య స్పష్టమైన హద్దులు ఉన్నాయని ప్రకటించారు.

కాబట్టి ఆధునిక కాలంలో లౌకికవాదాన్ని పైన పేర్కొన్న కారణాలు ప్రగాఢంగా ప్రభావితం చేసాయని పేర్కొనవచ్చు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 9 లౌకికవాదం

ప్రశ్న 2.
లౌకికవాదం ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఏమిటి ?
జవాబు.
నిర్వచనాలు :
1. జి. జె. హోల్యోక్ :
“లౌకికవాదం అంటే మతవిశ్వాసాలను విమర్శించకుండా లేదా తిరస్కరించకుండా మతంతో సంబంధంలేని ఒకానొక సామాజిక వ్యవస్థను ప్రోత్సహించటమనే భావన” గా నిర్వచించారు.

‘2. ఎరిక్ ఎస్. వాటర్ హౌస్ :
“మతంలో పేర్కొన్న దానికంటే భిన్నమైన జీవనం, ప్రవర్తనలకు సంబంధించిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించే ఒకానొక ఆదర్శమే లౌకికవాదం” అని అభిప్రాయపడ్డారు.

లక్షణాలు : లౌకిక రాజ్యం కింది లక్షణాలను కలిగి ఉంటుంది.

1. మతానికి తావు లేదు (No place for religion) :
లౌకిక రాజ్యం ఏ ఒక్క మతం పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపదు. మతపరమైన అంశాల ప్రాతిపదికపై చట్టాలను రూపొందించదు, అమలు చేయదు.

2. సమాన హోదా (Equal status) :
లౌకికరాజ్యం ప్రజలందరికీ సమాన హోదాను కల్పిస్తుంది. వ్యక్తుల మధ్య కులం, వర్ణం, మతం, తెగ, ప్రాంతం, భాషలవారీగా ఎటువంటి వివక్షతను చూపదు. దాంతో ప్రజలు సంతృప్తి చెంది, వివిధ విధానాలు, కార్యక్రమాల అమలులో ప్రభుత్వానికి సహకారాన్ని అందిస్తారు. విభిన్న మత సముదాయాలకు చెందిన వారందరూ ఇరుగు పొరుగు వారితో సామరస్యంతో కలసిమెలసి నివసిస్తారు.

3. అధికారిక మతం లేకుండుట (No State reglion) :
లౌకిక రాజ్యం ఏ ఒక్క మతాన్ని అధికార మతంగా గుర్తించదు. మత వ్యవహారాలలో తటస్థ వైఖరిని అవలంభిస్తుంది. ప్రజల మతపరమైన భావాలతో సంబంధం లేకుండా వివిధ చట్టాలను, సామాజిక సంక్షేమ కార్యకలాపాలను అమలు చేస్తుంది. ప్రభుత్వ వ్యవహారాలలో ఏ ఒక్క మతానికి ప్రత్యేకమైన ప్రాధాన్యతను ఇవ్వదు. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయ సంస్థలు వంటి అన్ని ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను ఏ ఒక్క మతంతో సంబంధం లేకుండా నిర్వహిస్తుంది.

లౌకికరాజ్యం ప్రాముఖ్యత (Importance of Secular State) :
ఇటీవల కాలంలో లౌకిక రాజ్య భావన ఎంతగానో ప్రాముఖ్యతను సంతరించుకొంది. ప్రజాస్వామిక స్ఫూర్తి, శాస్త్ర సాంకేతికత, రవాణా సదుపాయాల అభివృద్ధి, హేతుబద్ధమైన చింతన, శ్రేయోవాదం వంటి అంశాల ప్రభావం చేత లౌకిక రాజ్య ప్రాముఖ్యత పెరిగింది. మొత్తం మీద లౌకిక రాజ్య ప్రాముఖ్యతను కింది అంశాల ద్వారా వివరించవచ్చు.

  1. లౌకిక రాజ్యం దేశంలోని వివిధ రంగాలలోని మతేతర శక్తులను బలపరుస్తుంది.
  2. ప్రజల హృదయాలలో పాతుకుపోయిన దురాచారాలను, మూఢ విశ్వాసాలను పారద్రోలుతుంది.
  3. మత పరమైన విద్వేషం, మతమౌఢ్యాలను పారద్రోలడం ద్వారా సామాజిక సంస్కరణలకు దోహదపడుతుంది.
  4. ప్రజలలో శాస్త్రీయ చింతనను పెంపొందించి, వారి మేధోపరమైన వికాసానికి తోడ్పడుతుంది.
  5. విశ్వాసంపై హేతువుకు, కాల్పనికతపై తర్కానికి, కట్టుకథలపై వాస్తవికతలకు ఆధిక్యతనిస్తుంది.
  6. మతపరమైన మైనారిటీ వర్గాలకు భద్రతను కల్పించి వారి రక్షణకు హామీనిస్తుంది.
  7. ప్రతి వ్యక్తి మతపరమైన విశ్వాసాలను గౌరవిస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 9 లౌకికవాదం

ప్రశ్న 3.
లౌకికవాదంలోని నాలుగు సుగుణాలను వివరించండి.
జవాబు.
లౌకికవాదం – సుగుణాలు (Merits of Secularism) :

1. సమత (Equity) :
లౌకికవాదం సమసమాజానికి ప్రాతిపదిక. అన్ని మతాల వారిని సమానంగా పరిగణిస్తుంది. మానవులు సృష్టించిన అసమానతలను గుర్తించదు. అలాగే కుల, మత, వర్ణ, వర్గ, ప్రాంతీయ భాషాపరమైన వివక్షతలకు తావు ఇవ్వదు. దాంతో ప్రజలు జాతిపట్ల ఎంతో దృఢమైన సానుకూలమైన భావాన్ని కలిగి ఉంటారు.

2. మత స్వాతంత్ర్యం (Religious Freedom) :
లౌకికవాదం, మత స్వాతంత్ర్యాన్ని ప్రజలు సంపూర్ణంగా అనుభవించుటకు దోహదపడుతుంది. రాజ్యం వ్యక్తుల మత వ్యవహారాలలో జోక్యం చేసుకోదు. లౌకిక రాజ్యంలో రాజ్యాంగం, వివిధ చట్టాలు, వ్యక్తులకు తమ ఇష్టం వచ్చిన’ మతాన్ని స్వీకరించుటకు, ప్రబోధించుటకు, ప్రచారం చేసుకొనేందుకు, సంపూర్ణమైన స్వాతంత్ర్యాన్ని ప్రసాదిస్తాయి.

3. శాంతి భద్రతలు (Law and Order) :
వర్తమాన కాలంలో రాజ్యం, ప్రభుత్వం, ఇతర సంస్థలు ఎంతో విచారకరమైన, దుఃఖదాయకమైన మతానుకూల ఉద్యమాలను ప్రోత్సహించడం లేదా ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు. దాంతో విభిన్న మతసముదాయాలకు చెందిన ప్రజల మధ్య సామరస్యం సాధించడం అనేది పెద్ద సవాలుగా పరిణమించింది.

అటువంటి సందర్భాలలో లౌకికవాదం మతపరమైన ఘర్షణలను, విద్వేషాలను నివారించగలుగుతుంది. అంతిమంగా, ప్రజల మధ్య మత సామరస్యాన్ని లౌకికవాదం పెంపొందించడం జరుగుతుంది.

4. సమన్యాయ పాలన (Rule of Law) :
లౌకికవాదం సమన్యాయ పాలన అనే భావనకు ప్రాధాన్యతనిస్తుంది. లౌకికవాదాన్ని అనుసరించే రాజ్యం ఏ ఒక్క మతానికి కాకుండా అన్ని మతాలకు చెందిన ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చట్టాలను రూపొందించి అమలు చేస్తుంది.

చట్ట నిర్మాణ సమయంలో ప్రజలకు మత ఛాందస భావాలను పరిగణనలోనికి తీసుకోదు. అలాగే చట్ట నిర్మాణం, చట్టాల అమలు, చట్టాల వ్యాఖ్యానంలో ప్రజలకు ఏ మతంతో సంబంధం లేకుండా లౌకిక రాజ్యం వ్యవహరిస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 9 లౌకికవాదం

ప్రశ్న 4.
భారతదేశ లౌకికవాదం అంటే ఏమిటి ?.
“జవాబు. లౌకికవాదం అనే పదం ఉపయోగించడంలో భారతదేశ విధానం పాశ్చాత్య దేశాలలో ఉపయోగించిన దానికి భిన్నమైనది. భారతదేశంలో సాంస్కృతిక సహజీవనం కొత్త దృగ్విషయం కాదు. ఇది చాలా కాలం నుంచి భారతదేశంలో ఉంది. ఇది మధ్యయుగ ప్రారంభకాలంలో ముస్లింల దండయాత్రల నుంచి ప్రారంభమైంది. భారతదేశంలో బ్రిటిష్ పాలన క్రైస్తవ మతాన్ని పరిచయం చేసింది. అనేక క్రిష్టియన్ మిషనరీలు భారతదేశంలో పాఠశాలలు, ప్రార్థనాలయాలను ఏర్పాటు చేశాయి.

బ్రిటిష్ ప్రభుత్వపాలన భారతదేశంలో అనేక విద్యా సంస్కరణలు ప్రారంభానికి, శాస్త్ర విజ్ఞానానికి ప్రాముఖ్యతను కల్పించింది. అదే సమయంలో భారతదేశంలోని రెండు ప్రధాన మతాలైన హిందువులు, మహమ్మదీయుల మధ్య మతపరమైన విషబీజాలని నాటింది. అందులో భాగంగా చట్టసభలలో మహమ్మదీయులకు ప్రత్యేక స్థానాలను కేటాయించి జనాభా పరిమాణం ఆధారంగా బ్రిటిష్ పాలకులు హిందువులకు, మహమ్మదీయులకు ప్రాధాన్యతనివ్వటంతో మత అంశాల ప్రాతిపదికపై భారతీయుల మధ్య పొరపొచ్చాలు వచ్చాయి.

భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తరవాత ఆమోదించబడిన భారత రాజ్యాంగం లైకిక వాదాన్ని భారతదేశ గణతంత్ర వ్యవస్థకు ప్రధాన ఆలంబనగా పేర్కొన్నది. దాని ప్రకారం భారత రాజ్యాంగం భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా ప్రకటించింది. భారతదేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లౌకికవాదాన్ని సిద్ధాంతపరమైన ఆచరణాత్మక భావనగా అనుసరించసాగాయి.

చట్ట నిర్మాణం, దాని అమలు రాజ్య పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలలో ఆ ప్రభుత్వాలు ఏ మతాన్నీ అనుసరించరాదని భారతరాజ్యాంగం పేర్కొంది. భారతీయులు తమకు ఇష్టమైన మత విశ్వాసాలను ప్రబోధించుకొనేందుకు, ప్రచారం గావించేందుకు, సంపూర్ణమైన మతస్వాతంత్ర్యాన్ని కలిగి ఉండేందుకు భారత రాజ్యాంగం వీలుకల్పించింది.

భారతదేశంలో రాజ్యం మతానుకూలమైనది కాదు. మత వ్యతిరేకమైనది కాదు. అందుకు బదులుగా అది రాజ్య వ్యవహారాలలో తటస్థ వైఖరిని అనుసరిస్తుంది. భారత రాజ్యాంగం మతం ఆధారంగా ప్రజలపై పన్నులు విధించి వసూలు చేసేందుకు వీలు కల్పించలేదు.

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక నిధులతో సంపూర్ణంగా గాని, పాక్షికంగా గాని నిర్వహించబడే విద్యాసంస్థలలో మతం ఆధారంగా ప్రవేశాలను నిషేధించమని పేర్కొంది. అలాగే పైన పేర్కొన్న సంస్థలలో మత బోధలను నిషేధించింది. కాబట్టి రాజ్యాంగపరమైన అంశాల ప్రకారం లౌకికవాదానికి ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పవచ్చు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 9 లౌకికవాదం

ప్రశ్న 5.
లౌకికరాజ్యం ముఖ్య లక్షణాలు ఏమిటి ?
జవాబు.
లౌకికరాజ్యం కింది లక్షణాలను కలిగి ఉంటుంది.
1. మతానికి తావు లేదు (No place for religion) :
లౌకిక రాజ్యం ఏ ఒక్క మతం పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపదు. మతపరమైన అంశాల ప్రాతిపదికపై చట్టాలను రూపొందించదు, అమలు చేయదు.

2. సమాన హోదా (Equal status) :
లౌకికరాజ్యం ప్రజలందరికీ సమాన హోదాను కల్పిస్తుంది. వ్యక్తుల మధ్య కులం, వర్ణం, మతం. తెగ, ప్రాంతం, భాషలవారీగా ఎటువంటి వివక్షతను చూపదు. దాంతో ప్రజలు సంతృప్తి చెంది, వివిధ విధానాలు, కార్యక్రమాల అమలులో ప్రభుత్వానికి సహకారాన్ని అందిస్తారు. విభిన్న మత సముదాయాలకు చెందిన వారందరూ ఇరుగు పొరుగు వారితో సామరస్యంతో కలసిమెలసి నివసిస్తారు.

3. అధికారిక మతం లేకుండుట (No State region) :
లౌకిక రాజ్యం ఏ ఒక్క మతాన్ని అధికార మతంగా గుర్తించదు. మత వ్యవహారాలలో తటస్థ వైఖరిని అవలంబిస్తుంది. ప్రజల మతపరమైన భావాలతో సంబంధం లేకుండా వివిధ చట్టాలను, సామాజిక సంక్షేమ కార్యకలాపాలను అమలు చేస్తుంది. ప్రభుత్వ వ్యవహారాలలో ఏ ఒక్క మతానికి ప్రత్యేకమైన ప్రాధాన్యతను ఇవ్వదు. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయ సంస్థల వంటి అన్ని ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను ఏ ఒక్క మతంతో సంబంధం లేకుండా నిర్వహిస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 9 లౌకికవాదం

ప్రశ్న 6.
లౌకికవాదం, లౌకిక రాజ్యం గురించి వర్ణించండి.
జవాబు.
లౌకికవాదం :
లౌకికవాదమనేది ఒక ప్రధానమైన సామాజిక, రాజకీయ దృగ్విషయం. అనేక సమకాలీన ప్రపంచదేశాలు తమ ప్రభుత్వ వ్యవహారాలలో లౌకికతను అనుసరిస్తున్నాయి. లౌకికవాదం ప్రత్యేకంగా మతంతో సంబంధంలేని, స్వతంత్ర ఆదర్శాలను ప్రబోధిస్తుంది. ప్రభుత్వాలు మతంతో నిమిత్తం లేకుండా నైతికత, విద్య లాంటి సూత్రంపై ఆధారపడతాయనే ధృక్పధమే లౌకికవాదం.

వర్తమాన ప్రాపంచిక జీవనం దైవికమైనది కాకుండా కొన్ని నైతిక ప్రమాణాలు, పాలనా నియమాలు మానవ కార్యకలాపాలను నిర్ణయిస్తాయని లైకికవాదం పేర్కొంటుంది. లౌకికవాదానికి మతాన్ని దూషించే ఉద్దేశం లేదు. మతం, రాజ్యం అనేవి రెండు ప్రత్యేక విభాగాలని అది గట్టిగా ఉద్ఘాటించింది.

Secular అనే ఆంగ్ల పదానికి లాటిన్ భాషలో అర్థం “ఇహలోకం” (This World) ఈ పదం మతానికి వ్యతిరేకమనే అర్థాన్ని సూచిస్తుంది. ఆధునిక కాలంలో ఆ పదాన్ని మొదటి సారిగా 1851 లో బ్రిటిష్ రచయిత జార్జి జాకబ్ హోల్యోక్ (George Jacob Holyoke) ఉపయోగించాడు. లౌకికవాదం అనే పదాన్ని అనేక మంది రచయితలు మరియు ప్రముఖులు వివిధ రకాలుగా నిర్వచించారు.

1. జి.జె. హోల్యోక్ : “లౌకికవాదం అంటే మత విశ్వాసాలను విమర్శించకుండా లేదా తిరస్కరించకుండా. మతంతో సంబంధం లేని ఒకానొక సామాజిక వ్యవస్థను ప్రోత్సహించటమనే భావన”గా నిర్వచించారు.
2. ఎరిక్.ఎస్. – వాటర్ హౌస్ : “మతంలో పేర్కొన్నదానికంటే భిన్నమైన జీవనం, ప్రవర్తనలకు సంబంధించిన సిద్దాంతాన్ని ప్రతిపాదించే ఒకానొక ఆదర్శమే లౌకికవాదం” అని అభిప్రాయపడ్డారు.

లౌకికరాజ్యం :
ఆధునిక రాజ్యాలు, లౌకిక రాజ్యాలు అని రెండు రకాలుగా వర్గీకరించబడినాయి. రాజకీయ మేధావులు రజ్యంలో మతం, రాజకీయాలకు మధ్య ఉండే సంబంధం ఆధారంగా ఆరకమైన వర్గీకరణ చేశారు. గతంలో అనేక రాజ్యాలలో మతపరమైన ప్రభుత్వాలు వాడుకలో వున్నాయి. మతపరమైన రాజ్యాలు మతం ఆధారంగా పరిపాలనా వ్యవహారాలను నిర్వహిస్తుంటే, లౌకికరాజ్యం పరిపాలనలో మత సూత్రాలను ఏ మాత్రం పట్టించుకోదు.

డి.ఇ. స్మిత్ లౌకికరాజ్యాన్ని “వ్యక్తులకు స్వీయ, సమిష్టి మత స్వాతంత్ర్యాన్ని హామీ ఇస్తూ వ్యక్తులకు వారి మతంతో సంబంధం లేకుండా పౌరులుగా గుర్తించే రాజ్యం” గా నిర్వచించాడు. అంతే కాకుండ లౌకిక రాజ్యమంటే, రాజ్యాంగరీత్యా ఏ ఒక్క ప్రత్యేక మతాన్ని పోషించటంగాని, పెంపొందించటంగాని జరగదు. అదే విధంగా మత వ్యవహారాలలో జోక్యం చేసుకోదు. పైన పేర్కొన్న నిర్వచనాన్ని నిశితంగా పరిశీలించి లౌకిక రాజ్య స్వభావాన్ని తెలుసుకోవచ్చు.

లౌకిక రాజ్యం అనేది పూర్తిగా మత వ్యతిరేకం కాదు లేదా మత విరుద్ధమైనది కాదు. అలాగే అది పూర్తిగా మతానుకూలమైనది కాదూ ఏ ఒక్క మతం పట్ల ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శించదు. లౌకిక రాజ్యంలో ప్రభుత్వం ఒకానొక ప్రత్యేక మతానికి అనుకూలతను లేదా ప్రతికూలతను ప్రదర్శిస్తూ చట్టాలను రూపొందించదు.
ఉదా : భారతదేశం.

TS Board Inter First Year Political Science Study Material Chapter 9 లౌకికవాదం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
లౌకికవాదాన్ని నిర్వచించండి.
జవాబు.

  1. “లౌకికవాదం అంటే మతవిశ్వాసాలను విమర్శించకుండా లేదా తిరస్కరించకుండా మతంతో సంబంధం లేని ఒకానొక సామాజిక వ్యవస్థను ప్రోత్సహించటమనే భావన” అని జి.జె. హోల్యోక్ నిర్వచించాడు.
  2. “మతంలో పేర్కొన్న దానికంటే భిన్నమైన జీవనం, ప్రవర్తనలకు సంబంధించిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించే ఒకానొక ఆదర్శమే లౌకికవాదం” అని వాటర్ హౌస్ పేర్కొన్నాడు.

ప్రశ్న 2.
లౌకికవాదం అంటే ఏమిటి ?
జవాబు.
Secular అనే ఆంగ్ల పదంనకు లాటిన్ భాషలో అర్థం ఇహలోకం (This World) ఈ పదం మతానికి వ్యతిరేకమనే అర్థాన్ని సూచిస్తుంది. లౌకికవాదం అనే పదాన్ని అనేక మంది రచయితలు వివిధ రకాలుగా నిర్వచించారు.

  1. జి.జె. హోల్యోక్ : “లౌకికవాదం అంటే మత విశ్వాసాలను విమర్శించకుండా లేదా తిరస్కరించకుండా మతంతో సంబంధంలేని ఒకానొక సామాజిక వ్యవస్థను ప్రోత్సహించటమనే భావన” గా నిర్వచించారు.
  2. ఎరిక్.ఎస్.వాటర్ హౌస్ : “మతంలో పేర్కొన్న దానికంటే భిన్నమైన జీవనం, ప్రవర్తనలకు సంబంధించిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించే ఒకానొక ఆదర్శమే లౌకికవాదం” అని అభిప్రాయపడినారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 9 లౌకికవాదం

ప్రశ్న 3.
మత రాజ్యం అంటే ఏమిటి ?
జవాబు.
మత రాజ్యంలో రాజకీయాలు మతంతో మిళితమై ఉంటాయి. మతం రాజకీయాలను శాసిస్తుంది. ఇలాంటి రాజ్యాలలో ఒకే మతం ప్రబలంగా ఉంటుంది.
ఉదా : ఏక మత రాజ్యం.

పురాతన మత్త రాజ్యాలలో మతాధికారులే పరిపాలకులుగా ఉండేవారు. ప్రాచీన ఈజిప్టులో ఫారోస్, బైజాంటెన్ సామ్రాజ్యంలో చర్చి అధిపతే రాజుగా చిలామణి అయ్యేవారు. మధ్యయుగంలో, ముఖ్యంగా ఇటలీ సరిహద్దుల్లో కాథలిక్ చర్చి అధిపతి పోప్ దీర్ఘకాలంగా పరిపాలించాడు.

మత రాజ్యంలో మానవుల చేత రూపొందించబడే చట్టాలు దైవిక న్యాయం ఆధారంగా ఉంటాయి. మతపరమైన చట్టాలే ఆ దేశపు పాలనా చట్టాలుగా చెలామణి అవుతాయి. అదే విధంగా దేవుని ప్రతినిధిగా భావించే వ్యక్తే ఆ దేశపు మతానికి, రాజ్యానికి అధిపతిగా పరిగణించబడుతాడు.

ప్రశ్న 4.
లౌకికవాదం ఏ విధంగా వ్యక్తుల మత స్వేచ్ఛ, స్వాతంత్య్రతలకు దోహదపడుతుంది ?
జవాబు.
లౌకిక వ్యవస్థ అమలులో ఉన్న రాజ్యాలలో వ్యక్తులంతా సంపూర్ణ మత, స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను కలిగి ఉంటారు. ప్రతి వ్యక్తి తన కర్మ ప్రబోధం ప్రకారం తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు లేదా మతరహితంగా, హేతువాదిగా ఉండిపోవచ్చు. తను నమ్మిన మత సిద్ధాంతాలను వ్యాప్తి చేసుకోవచ్చు. మతవ్యాప్తికై వెచ్చించే ధనంపై ఎటువంటి పన్ను చెల్లించనవసరం లేదు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 9 లౌకికవాదం

ప్రశ్న 5.
సమన్యాయపాలన లౌకికవాదాన్ని ఏ విధంగా పెంపొందిస్తుంది.
జవాబు.
లౌకికవాదం సమన్యాయ పాలన అనే భావానికి ప్రాధాన్యతనిస్తుంది. రాజ్యం ఏ ఒక్క మతానికి కాకుండా అన్ని మతాలకు చెందిన ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చట్టాలను రూపొందించి అమలు చేస్తుంది. చట్ట నిర్మాణ సమయంలో ప్రజల మతఛాందస భావాలను పరిగణనలోకి తీసుకోదు. అందువలన లౌకిక రాజ్యాలలో ప్రజలు సంతృప్తిని, సంతోషాన్ని పొందుతారు.

ప్రశ్న 6.
లౌకిక రాజ్యాన్ని నిర్వచించండి.
జవాబు.
“వ్యక్తులకు స్వీయ, సమిష్టి మత స్వాతంత్ర్యాన్ని హామీ ఇస్తూ వ్యక్తులకు వారి మతంతో సంబంధం లేకుండా పౌరులుగా గుర్తించే రాజ్యమే లౌకిక రాజ్యం” అని డి.ఇ. స్మిత్ పేర్కొన్నాడు.

ప్రశ్న 7.
లౌకిక రాజ్యం రెండు లక్షణాలను తెలపండి.
జవాబు.

  1. మతానికి తావులేదు : లౌకిక రాజ్యం ఏ ఒక్క మతం పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపదు. మతపరమైన అంశాల ప్రాతిపదికపై చట్టాలను రూపొందించదు, అమలు చేయదు.
  2. సమాన హోదా : లౌకిక రాజ్యం ప్రజలందరికి సమాన హోదాను కల్పిస్తుంది. వ్యక్తుల మధ్య కులం, వర్ణం, మతం, తెగ, ప్రాంతం భాషల వారీగా ఎటువంటి వివక్షతను చూపదు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 9 లౌకికవాదం

ప్రశ్న 8.
లౌకిక రాజ్యం అర్థాన్ని వివరించండి.
జవాబు.
డి.ఇ. స్మిత్ లౌకిక రాజ్యాన్ని “వ్యక్తులకు స్వీయ, సమిష్టి మత స్వాతంత్య్రాన్ని హామీ ఇస్తూ వ్యక్తులకు వారి మతంతో సంబంధం లేకుండా పౌరులుగా గుర్తించే రాజ్యం”గా నిర్వచించాడు.

అంతేకాకుండ లౌకిక రాజ్యమంటే, రాజ్యాంగరీత్యా ఏ ఒక్క ప్రత్యేక మతాన్ని పోషించటంగాని, పెంపొందించటం గాని జరగదు. అదే విధంగా మత వ్యవహారాలలో జోక్యం చేసుకోదు. లౌకిక రాజ్యంలో ప్రభుత్వం ఒకానొక ప్రత్యేక మతానికి అనుకూలతను లేదా ప్రతికూలతను ప్రదర్శిస్తూ చట్టాలను రూపొందించదు.

TS Inter 1st Year Political Science Study Material Chapter 8 ప్రజాస్వామ్యం

Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 8th Lesson ప్రజాస్వామ్యం Textbook Questions and Answers.

TS Inter 1st Year Political Science Study Material 8th Lesson ప్రజాస్వామ్యం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ప్రజాస్వామ్యాన్ని నిర్వచించి దాని లక్షణాలను వివరించండి.
జవాబు.
నిర్వచనాలు :

  1. అబ్రహాం లింకన్ : “ప్రజలచేత, ప్రజలకొరకు, ప్రజలే నిర్వహించుకొనే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం”.
  2. లార్డ్ బ్రైస్ : “ఏ సమాజంలో ప్రభుత్వాధికారం చట్టరీత్యా ఏదో ఒక వర్గం లేదా వర్గాల చేతుల్లోగాక మొత్తం సభ్యులకు చెందుతుందో అదే ప్రజాస్వామ్యమవుతుంది”.

ప్రజాస్వామ్యం – లక్షణాలు :

1. స్వేచ్ఛ :
ప్రజాస్వామ్యం స్వేచ్ఛ, సమానత్వం అనే పునాదులపైనే ఆధారపడి ఉంది. ప్రజాస్వామ్య ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రజలకు సాధ్యమైనంత ఎక్కువ స్వేచ్ఛను అందించడమే. ప్రజలకు రాజ్యాంగపరమైన స్వేచ్ఛను అందించడంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఒక్కటే హామీ ఇవ్వగలదు అని చెప్పవచ్చు.

2. సమానత్వం :
ప్రొ. సీలీ అభిప్రాయంలో ప్రజాస్వామ్యం అనేది “ప్రతీ ఒక్కరికీ భాగస్వామ్యం ఉండే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం” అంటాడు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రతీ ఒక్కరికీ రాజకీయ వ్యవహారాలలో పాల్గొనే అవకాశం వస్తుంది. ఈ విధానంలో ప్రతి పౌరుడికి ఓటు వేసే హక్కు, ఎన్నికలలో పోటీ చేసే హక్కు ఉంటుంది.

3. స్వతంత్ర న్యాయశాఖ:
ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కచ్చితంగా న్యాయశాఖ స్వతంత్రంగా పని చేస్తుంది.

4. పౌరప్రభుత్వం :
ప్రజలచేత ఓటు హక్కు ద్వారా స్వచ్ఛందంగా ఎవరి ప్రలోభానికి లొంగకుండా ఎన్నుకునే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం. “ప్రజాస్వామ్యం బాలెట్ ప్రభుత్వమేగానీ బుల్లెట్ ప్రభుత్వం కాదు”.

5. అధిక సంఖ్యాకుల పాలన :
ప్రజాస్వామ్యం అధిక సంఖ్యాకుల మద్దతుతో అల్పసంఖ్యాకులకు రక్షణ కల్పించే ప్రభుత్వం. ప్రతీ ప్రజాస్వామ్య దేశంలో ఏ పార్టీకైతే మెజారిటీ శాసనసభ సీట్లు దక్కుతాయో ఆ పార్టీయే అధికారంలోకి వస్తుంది. అంటే ప్రజాస్వామ్యం “అధిక సంఖ్యాకుల మద్దతు ప్రభుత్వం” అని చెప్పవచ్చు.

6. రాజ్యాంగ నిబంధనల అమలు :
ప్రజాస్వామ్యం కచ్చితంగా రాజ్యాంగ నిబంధనలపైనే పని చేస్తుంది. అది లిఖిత పూర్వక రాజ్యాంగం కావచ్చు లేదా అలిఖితరాజ్యాంగం కావచ్చు.

7. సామ్రాజ్యవాదానికి, యుద్ధానికి వ్యతిరేకం:
ప్రజాస్వామ్యం, అంతర్జాతీయశాంతి, సమానత్వం, న్యాయం, సహకారం అనే అంశాలకు విలువిస్తుంది. ప్రజాస్వామ్యం తీవ్ర జాతీయ వాదానికి, సామ్రాజ్యవాదానికి, యుద్ధానికి వ్యతిరేకం.

8. బలప్రయోగాలకు అవకాశం లేదు :
ప్రజాస్వామ్యంలో బలప్రయోగానికి అవకాశం లేదు. ప్రజాసంక్షేమం పేరిట కూడా బలవంతపు విధానాలు, చట్టాలు ప్రజలపై రుద్దడానికి ప్రజాస్వామ్యంలో అవకాశం లేదు.

9. మానవ హక్కులకు ప్రాధాన్యత :
ప్రజాస్వామ్య ప్రభుత్వంలో వ్యక్తుల ఔన్నత్యానికి మానవహక్కులకు, ప్రాధాన్యత లభిస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే రాజ్యాంగపరంగా హక్కులు కల్పించడం ప్రజాస్వామ్య ప్రాథమిక బాధ్యతగా చెప్పవచ్చు.

10. వాక్ స్వాతంత్ర్యం (భావప్రకటన స్వేచ్ఛ) :
ప్రజాస్వామ్యంలో ప్రతీ ఒక్కరికీ తమ అభిప్రాయాలను వెలిబుచ్చే హక్కు ఉంది. తమ భావాలను వ్యక్తం చేయడంలో ఎవరి బలప్రయోగం ఉండదు.

11. ఆదర్శాలకు, సిద్ధాంతాలకు ప్రోత్సాహం :
ప్రజాస్వామ్యంలో విభిన్న ఆదర్శాలకు, భావాలకు, సిద్ధాంతాలు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. శాసనసభల్లో కూడా అనేక అంశాలపై నిరంతరం చర్చ జరుగుతూనే ఉంటుంది.

12. హింసకు, విప్లవాలకు వ్యతిరేకం :
ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం రాజ్యాంగ ప్రక్రియ ద్వారా మాత్రమే జరుగుతుంది తప్ప హింస ద్వారా, విప్లవాల ద్వారా అవకాశం లేదు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 8 ప్రజాస్వామ్యం

ప్రశ్న 2.
ప్రజాస్వామ్య రకాలను వివరించండి.
జవాబు.
ప్రజాస్వామ్యాన్ని ముఖ్యంగా రెండు రకాలుగా విభజించవచ్చు. అవి:

  • ప్రత్యక్ష ప్రజాస్వామ్యం
  • పరోక్ష ప్రజాస్వామ్యం.

1. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం :
ఏ ప్రభుత్వంలోనైతే ప్రజలు ప్రత్యక్షంగా ప్రభుత్వ వ్యవహారాలలో పాల్గొంటారో ఆ ప్రభుత్వమే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో పౌరులు ప్రభుత్వ విధానాలను, శాసనాలను ప్రభుత్వ కార్యక్రమాలను రూపొందించడంలో ముందుంటారు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రజాభీష్టం ప్రత్యక్షంగా వ్యక్తీకరించ బడుతుంది. కాని వారు ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా కాదు.

ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలు:

  • ప్రజాభిప్రాయసేకరణ
  • ప్రజాభిప్రాయ నివేదన
  • పునరాయనం
  • ప్రజానిర్ణయం.

ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతులు ప్రస్తుతం స్విట్జర్లాండ్లోను, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలలో అమలులో ఉంది. స్విట్జర్లాండ్లోని కొన్ని చిన్న కాంటన్స్ (స్థానిక ప్రాంతాలు)లలో ఏప్రిల్ లేదా మే నెలలోని ఏదైనా ఒక ఆదివారం రోజు సమావేశమై వారికి అవసరమైన ప్రతినిధులను ఎన్నుకొని పనులు చేయించుకుంటారు.

2. పరోక్ష ప్రజాస్వామ్యం :
పరోక్ష ప్రజాస్వామ్యాన్ని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ విధమైన ప్రజాస్వామ్యంలో తక్షణ సార్వభౌమాధికారానికి, అంతిమ సార్వభౌమాధికారానికి చాలా స్పష్టమైన తేడా ఉంటుంది.

ప్రజల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కూడిన శాసనసభ రాజ్య ఆశయాలను రూపొందిస్తుంది. కాబట్టి శాసనసభ అనేది తక్షణ సార్వభౌమాధికారిగా చెప్పవచ్చు. కాబట్టి అంతిమ సార్వభౌమాధికార ప్రభుత్వంలో ప్రజలు తమ ప్రతినిధులను ప్రత్యేక కాలపరిమితికి ప్రతినిధులను ఎన్నుకుంటారు.

ఆ కాల పరిమితికి వారు ఎన్నుకున్న ప్రతినిధుల కార్యకలాపాలను సమీక్ష చేస్తారు. ఒకవేళ ఈ కాలపరిమితిలో వీరితో సంతృప్తి చెందకపోతే వచ్చే ఎన్నికల్లో వీరిని ఎన్నుకోరు. ఎన్నికల్లో తిరస్కరిస్తారు. ప్రాతినిధ్య ప్రభుత్వం ప్రజాసార్వభౌమాధికారంచేత సమర్థవంతంగా నడుస్తుంది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ప్రజాభిప్రాయాన్ని నెరవేర్చడంలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తుంది. ఈ ప్రాతినిధ్య ప్రభుత్వంలో అధికారం ప్రజలదే.

TS Board Inter First Year Political Science Study Material Chapter 8 ప్రజాస్వామ్యం

ప్రశ్న 3.
ప్రజాస్వామ్యం అంటే ఏమిటి ? ప్రజాస్వామ్య ప్రయోజనాలు, లోపాలు వివరించండి.
జవాబు.
అర్థం :
Democracy అనే ఇంగ్లీషు పదం Demos మరియు Kratos అనే రెండు గ్రీకు పదాల కలయిక నుంచి ఆవిర్భవించింది. డెమోస్ అంటే ప్రజలు క్రటోస్ అంటే అధికారం లేదా ‘పాలన’ అని అర్థం.

నిర్వచనం :
ప్రజాస్వామ్యమంటే “ప్రజలచేత, ప్రజల కొరకు, ప్రజలే నిర్వహించుకొనే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం”. – అబ్రహాం లింకన్

ప్రజాస్వామ్య ప్రయోజనాలు :
ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో దాదాపు ప్రతి దేశం ప్రజాస్వామ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని ఎంచుకుంటున్నాయి. ప్రజాస్వామ్య ప్రయోజనాలను క్రింద వివరించడమైంది. అవి :

1. సమర్థవంతమైన ప్రభుత్వం (Efficient form of Government) :
ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ప్రజల అభీష్టం మేరకు పరిపాలన నిర్వహిస్తారు. ప్రజా ప్రతినిధులు ప్రజలకు ఎప్పుడూ బాధ్యత వహిస్తూ అనుభవజ్ఞులైన, సమర్థులైన నాయకులను సంప్రదిస్తూ వారి సలహాలు సూచనలతో ప్రజలకు సంబంధించిన శాసనాలను రూపొందిస్తారు. శాసనాల రూపకల్పనలో, వ్యయపరిమితులు, ఆర్థికపర సూత్రాలను పాటిస్తారు.

ప్రజాస్వామ్యంలో అనుభవజ్ఞులైన అధికారులు, ఇతర కార్యనిర్వాహక అధికారులు వారి ప్రతిభ మీద, సమర్థత మీద, అనుభవం మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటారు. వీరి అనుభవాన్ని, వీరి తెలివితేటలను, సమర్థతను ప్రజాసంక్షేమ కార్యక్రమాల్లో ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు.

2. వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ (Upholds Individual Liberties) :
ఒక్క ప్రజాస్వామ్య ప్రభుత్వంలోనే వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు హామీ ఉంటుందని చెప్పవచ్చు. ప్రజాస్వామ్యంలో నివసించే ప్రజలు మాత్రమే నిజంగా స్వేచ్ఛను అనుభవిస్తారు. ప్రజల హక్కులు, స్వాతంత్య్రం, స్వేచ్ఛ అన్నీ కూడా లిఖిత రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంటాయి.

3. సమానత్వానికి ప్రాధాన్యత (Importance to Equality) :
ప్రజాస్వామ్యం సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తుంది. ప్రజాస్వామ్యం ప్రజలందరికీ రాజకీయ ఆర్థిక, సామాజిక స్వేచ్ఛను, హక్కులను అందిస్తుంది. ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటరానితనం కట్టుబానిసత్వం, వెట్టిచాకిరి, మతం, భాష, ప్రాంతం, పుట్టుక పేరు మీద విచక్షణ చూపడాన్ని వ్యతిరేకిస్తుంది.

4. రాజకీయ చైతన్యం (Political Awareness) :
నిజానికి ప్రజాస్వామ్యం ప్రజలకు రాజకీయ చైతన్యవేదిక అని చెప్పవచ్చు. ఎన్నికల ప్రచారం ప్రజలకు చైతన్యాన్ని అందిస్తుంది. ఎన్నికల సమయంలో ప్రచారం ద్వారా, పత్రికల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తారు.

5. దేశభక్తిని పెంపొందిస్తుంది (Promotes Patriotism) :
ప్రజాస్వామ్యం ప్రజల మధ్య దేశభక్తిని పెంపొందిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు తరచు ఎన్నికల్లో పాల్గొని ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడాన్ని బాధ్యతగా భావిస్తారు.” రాజకీయ ప్రతినిధులు తమ విధులను నిర్వహించడంలో ప్రజలు తమవంతు సహకారం అందిస్తారు.

చాలా సందర్భాల్లో ప్రజలు దేశం సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు తమవంతు బాధ్యతను నిర్వహిస్తూ సంయమనం పాటించారు. ఉదాహరణకు భారతదేశంతో చైనా, పాకిస్తాన్ యుద్ధ సమయంలో ప్రజలు నిర్వహించిన పాత్ర శ్లాఘనీయం.

6. పౌరసత్వ శిక్షణ (School of Citizenship) :
ప్రజాస్వామ్య ప్రభుత్వపు మరొక ప్రయోజనం ఏమిటంటే, ప్రజలకు పౌరసత్వ శిక్షణ ఇస్తుంది. ప్రజాస్వామ్యంలో ఓటు వేసే హక్కు, పోటీ చేసే హక్కు, ప్రభుత్వాన్ని సద్విమర్శ చేసే హక్కు, ఇంకా ఇతర రాజకీయ హక్కులను పౌరులుగా వినియోగించుకుంటారు.

7. నైతిక విలువలకు ప్రాధాన్యత (Inculcates Moral Values) :
ప్రజాస్వామ్యంలో ప్రజలకు నైతిక విలువలు అలవడుతాయి.’ ప్రజాస్వామ్యం ప్రజలకు సహకారాలను, బాధ్యతను, సహనాన్ని, త్యాగాన్ని బోధిస్తుంది. లోవెల్ అభిప్రాయంలో “భవిష్యత్తు కాలంలో ప్రజలకు దృఢమైన మానసిక స్థైర్యాన్ని, సమైక్యతను, ఆత్మాభిమానాన్ని అందించే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ప్రజాస్వామ్య ప్రభుత్వం మాత్రమే”.

8. ప్రజాస్వామ్యం ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తుంది (Democracy gives Preference to Public Opinion) :
వాస్తవంగా ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి నిజమైన ప్రతినిధి. బర్నార్డ్ ప్రకారం “ప్రజాస్వామ్యం ప్రజలందరి మధ్య సంబంధాన్ని కలుపుతూ కాపాడుతుంది”.

TS Board Inter First Year Political Science Study Material Chapter 8 ప్రజాస్వామ్యం

9. విప్లవాన్ని నివారిస్తుంది (Reduces the Danger of Revolution) :
ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ తమ అభిప్రాయాలను విన్నవించుకొనే, పంచుకొనే అవకాశం ఉంది. కాబట్టి విప్లవం అనే ప్రసక్తే రాదు. ఒకవేళ ప్రభుత్వాన్ని మార్చాల్సివస్తే ఓటు ద్వారా మాత్రమే మారుస్తారు.

10. ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తుంది (Symbol of Progress and Welfare Programmes) :
ప్రజాసంక్షేమాన్ని సాధించడంలో ప్రజాస్వామ్యాన్ని మాత్రమే నిజమైన ప్రభుత్వంగా చెప్పవచ్చు. ప్రజాసంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం.

11. ప్రపంచ శాంతికి మద్దతు (Support to World Peace) :
ప్రజాస్వామ్యం ప్రపంచ శాంతికి మద్దతు ఇస్తుంది. హింసకు వ్యతిరేకి. ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో మార్పు రావాలంటే రాజ్యాంగపర ప్రక్రియద్వారా, శాంతి, సహకార పూర్వకమైన పద్ధతుల ద్వారా మాత్రమే సాధ్యమౌతుంది. బర్నార్డ్ ప్రకారం : “ప్రజాస్వామ్య ఉద్యమాలన్ని శాంతికోసం జరిగినవే”.

ప్రజాస్వామ్య ప్రభుత్వం – లోపాలు :

1. వ్యయంతో కూడుకున్న ప్రభుత్వం :
ప్రజాస్వామ్య ప్రభుత్వం చాలా ఖర్చుతో కూడుకున్న ప్రభుత్వం. ఎన్నికల ప్రచారంపై చాలా ధనం వెచ్చిస్తారు. శాసనసభలను నడపడానికి, కేంద్ర, రాష్ట్ర శాసనసభ సమావేశాల కోసం చాలా ఖర్చు చేయవలసి వస్తుంది. ఇటలీకి చెందిన పార్లమెంటు వట్టి “మాటల దుకాణం”. నియంత ముస్సోలిని మాటల్లో చెప్పాలంటే “కార్లే” మాటల్లో చెప్పాలంటే ప్రజాస్వామ్యం పేదదేశాలకు పనికిరాదు.

2. బలహీనమైన అస్థిర ప్రభుత్వం :
ప్రజాస్వామ్యం ఆచరణలో బలహీనమైన అస్థిర ప్రభుత్వం అని చెప్పవచ్చు. ఏ దేశంలోనైతే బహుళపార్టీ వ్యవస్థ ఉంటుందో అక్కడ ప్రభుత్వాలు తరచుగా మారుతుంటాయి.
ఉదా : భారతదేశంలో 1977 నుంచి 1979, 1989 నుంచి 1991, 1996 నుంచి 1999 వరకు సంకీర్ణ ప్రభుత్వాల వల్ల స్థిరమైన ప్రభుత్వాలు నడపడంలో విఫలమయ్యాయి.

3. అల్పసంఖ్యాక ప్రభుత్వం :
వాస్తవంగా గమనిస్తే ప్రజాస్వామ్య ప్రభుత్వం అధిక సంఖ్యాకుల అభిప్రాయాన్ని ప్రతిబింబించదు. ప్రజాస్వామ్యమంటే అత్యధిక సంఖ్యాకుల మద్దతుగల ప్రభుత్వం అని అంటారు. కాని వాస్తవంగా అదికాదు. చాలా దేశాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు వారి ఓటుహక్కును వినియోగించుకోరు. చాలా దేశాల్లో ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే ఎన్నికవుతారు.

ఓట్ల శాతంతో సంబంధం లేదు. అంతే కాకుండా తిరస్కరించిన వారి సంఖ్యతో కూడా సంబంధం లేదు. ఈ లెక్క ప్రకారం అధికారంలోకి వచ్చిన పార్టీకి వచ్చిన ఓట్లు వ్యతిరేకించిన వారి కంటే తక్కువ ఉంటాయి. కాబట్టి ప్రజాస్వామ్యం అధిక సంఖ్యాకుల ప్రభుత్వం అనడం వాస్తవం కాదు.

4. సంస్కృతికి, నాగరికతకు, మేధావుల విజ్ఞానానికి నిరోధకం:
ప్రజాస్వామ్యం మందిస్వామ్యంగా పేరుపడి సంప్రదాయకంగా పని చేస్తుంది. కళలు, సంస్కృతి, నాగరికతలలో సాధారణంగా శ్రద్ధ చూపరు. ప్రజాస్వామ్యంలో మేధావులు సాధారణంగా ఎన్నికలకు దూరంగా ఉంటారు. ప్రజాస్వామ్య ఎన్నికలలో ఓడిపోయిన మేధావులు ఎందరో ఉన్నారు.

5. నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం :
ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం ప్రమాదకరం. త్వరిత నిర్ణయాలు సాధ్యం కాదు. తద్వారా జరగవలసిన పనులు జాప్యంగా జరుగుతాయి. శాసనసభా వ్యవహారాలు, రాజకీయపార్టీలు, ప్రతిపక్షపార్టీలు, సంకీర్ణ ప్రభుత్వాలు మొదలైన విధాన్నాలు నిర్ణయంతో జోక్యం చేసుకోవడం వల్ల కూడా నిర్ణయాలు ఆలస్యం కావచ్చు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 8 ప్రజాస్వామ్యం

ప్రశ్న 4.
ప్రజాస్వామ్య విజయానికి అవసరమైన నిబంధనలను వివరించండి.
జవాబు.
అన్ని ప్రభుత్వాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వం అతిముఖ్యమైనది. కాని అదే సమయంలో క్లిష్టమైన ప్రభుత్వంగా చెప్ప్చ. ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే తప్పనిసరిగా కొన్ని అనుకూల పరిస్థితులు ఉండాలి. కొన్ని దేశాల్లో ప్రజాస్వామ్యం చాలా విజయవంతమైంది. మరికొన్ని దేశాల్లో అపజయం పొందింది.

1. నిష్పక్షపాతమైన, స్వతంత్ర పత్రికలు :
స్వతంత్ర, నిష్పక్షపాతమైన పత్రికలు అనేవి ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి అతిముఖ్యమైన సాధనాలు. స్వతంత్రమైన పత్రికలు ప్రజాసంబంధమైన జాతీయ సమస్యలపైన స్పందిస్తాయి.

పత్రికలు ప్రభుత్వం రూపొందించిన అనేక విధానాలపైన నిష్పక్షపాతమైన విమర్శను, సహేతుకమైన విమర్శలను చేస్తూ బాధ్యతగా వ్యవహరిస్తాయి. జాతీయ ప్రాముఖ్యమైన అనేక అంశాలపై ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానంగా పత్రికలు పని చేస్తాయి.

ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్ర్య పరిరక్షణలో రక్షణకర్తగా వ్యవహరిస్తాయి. అప్రజాస్వామికమైన, రాజ్యాంగ వ్యతిరేకమైన, ప్రజావ్యతిరేకమైన చర్యలపైన ప్రజలను అప్రమత్తం చేస్తుంది. నిజానికి నిష్పక్షపాతమైన పత్రికలు ఉంటేనే ప్రజాస్వామ్యం విజయం సాధ్యమౌతుంది.

2. లిఖితరాజ్యాంగం :
ప్రజాస్వామ్య విజయానికి లిఖితరాజ్యాంగం కూడా అతిముఖ్యమైన సాధనం. ఎందుకంటే లిఖిత రాజ్యాంగం పౌరులకు రాజకీయ హక్కుల గురించి, విధుల గురించి అవగాహన, నమ్మకాన్ని కలిగిస్తుంది.

3. ప్రజాస్వామ్యంపై కోరిక :
ప్రజలలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే కోరిక, ఇష్టం, స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను కాపాడుకోవాలనే కోరిక ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి తోడ్పడతాయి.

4. నిర్దంతర అప్రమత్తత (జాగరూకత) :
ప్రజల నిరంతర అప్రమత్తతనే ప్రజాస్వామ్య విజయానికి ముఖ్యమైన సాధనం. ప్రజలు, ప్రభుత్వ రాజకీయ కార్యకలాపాలను, రాజకీయ నాయకుల చర్యలను నిశ్శబ్దంగా గమనిస్తూ అప్రమత్తతతో వ్యవహరించాలి. కాబట్టి ప్రజాస్వామ్య విజయంలో ప్రజల నిరంతర అప్రమత్తతను (జాగరూకతను) మించింది ఏదీ లేదు. ప్రజలు వారి హక్కులను, విధులను కాపాడుకోవడంలో మేల్కొని ఉండాలి.

5. స్వతంత్ర న్యాయశాఖ:
నిష్పక్షపాతమైన, నిజాయితీతో కూడిన, భయాందోళనలకు అతీతమైన స్వతంత్ర న్యాయశాఖ ప్రజాస్వామ్య విజయానికి అతిముఖ్యమైంది. స్వతంత్ర న్యాయశాఖ ప్రజలకు ధైర్యాన్ని, నమ్మకాన్ని న్యాయం అందించడంలో హామీ ఇస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 8 ప్రజాస్వామ్యం

6. బలమైన ప్రతిపక్షం :
పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి బలమైన ప్రతిపక్షం అవసరం. ప్రతిపక్షం ప్రభుత్వం చేసే పనులకు నిరంతర చెక్ పెడుతూ అప్రమత్తం చేస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలైన ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికాలో ప్రతిపక్షాలు చాలా సమర్థంగా పని చేస్తాయి. భారతదేశంలో కూడా ప్రతిపక్షపార్టీలు చాలాసార్లు విజయవంతమైన గొప్ప పాత్ర వహించాయి.

7. క్రమం తప్పకుండా జరిగే ఎన్నికలు :
క్రమం తప్పకుండా జరిగే ఎన్నికలు ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని పెంచుతాయి. ఎన్నికలు అధికారంలో ఉన్న పార్టీ పని తీరుపై తీర్పుగా వ్యవహరిస్తాయి. స్వతంత్ర, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛావాతావరణంలో జరిగే ఎన్నికలు ప్రజాస్వామ్య విజయానికి సహకరిస్తాయి.

8. స్థానిక ప్రభుత్వాల చురుకైన పాత్ర :
ప్రజాస్వామ్యంలో స్థానిక ప్రభుత్వాలు చురుకైన పాత్ర వహిస్తాయి. స్థానిక ప్రభుత్వాలు ప్రజలకు రాజకీయ చైతన్యాన్ని, రాజకీయ భాగస్వామ్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి ప్రజల భాగస్వామ్యంతో ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే కచ్చితంగా స్థానిక ప్రభుత్వాలను ప్రోత్సహించాలి. జె. ఎస్. మిల్ ప్రజాస్వామ్యంలో స్థానిక ప్రభుత్వాలపై ప్రేమ ఉండడం మొట్టమొదటి నిబంధనగా పేర్కొంటాడు.

9. అధికారం వికేంద్రీకరణ :
ప్రజాస్వామ్య విజయానికి అధికార వికేంద్రీకరణ తప్పనిసరి. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు అధికారాలను పంచుకొని పరిపాలిస్తాయి. కాబట్టి ప్రజాస్వామ్యంలో అధికార కేంద్రీకరణకు, నియంతృత్వ ప్రభుత్వం ఏర్పడడానికి అసలు అవకాశం లేదు.

10. రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం :
ప్రజాస్వామ్య విజయానికి రాజకీయ స్వేచ్ఛ, ఆర్థిక సమానత్వం, సాంఘిక న్యాయం తప్పనిసరి.

11. మెరుగైన విద్యావ్యవస్థ :
ప్రజాస్వామ్య విజయంలో విద్యావ్యవస్థ చాలా ప్రభావాన్ని చూపుతుంది. నిరక్షరాస్యత, పట్టించుకోకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రధాన అడ్డంకి. విద్య మేధావులను అందిస్తుంది. అనేక అంశాలు అర్థం చేసుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని అందిస్తుంది. ఓటు వేసే హక్కును వినియోగించుకొనేలా చేయడంలో విద్య పౌరులను చైతన్య పరుస్తుంది.

12. ప్రజాస్వామ్యం పై నమ్మకం :
ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం ఉండాలి. ప్రజల మధ్య వ్యక్తిగత సామర్థ్యానికి, ప్రజల మధ్య పరస్పర సహకారానికి చర్చల ద్వారా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రజల మధ్య సహకార పూర్వక స్ఫూర్తి, రాజీపడే ధోరణి, ఎదుటి వారి అభిప్రాయాలకు కూడా విలువిచ్చే వ్యవస్థ ఉంటే ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 8 ప్రజాస్వామ్యం

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ప్రజాస్వామ్యాన్ని నిర్వచించి ప్రయోజనాలు పేర్కొనండి.
జవాబు.
నిర్వచనం :
“ప్రజాస్వామ్యమంటే ప్రజలచేత, ప్రజల కొరకు ప్రజలే నిర్వహించుకొనే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం” – అబ్రహాం లింకన్ ప్రజాస్వామ్య ప్రయోజనాలు : ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో దాదాపు ప్రతి దేశం ప్రజాస్వామ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని ఎంచుకుంటున్నాయి. ప్రజాస్వామ్య ప్రయోజనాలను క్రింద వివరించడమైంది. అవి :

1. సమర్థవంతమైన ప్రభుత్వం (Efficient form of Government) :
ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ప్రజల అభీష్టం మేరకు పరిపాలన నిర్వహిస్తారు. ప్రజా ప్రతినిధులు ప్రజలకు ఎప్పుడూ బాధ్యత వహిస్తూ అనుభవజ్ఞులైన, సమర్థులైన నాయకులను సంప్రదిస్తూ వారి సలహాలు సూచనలతో ప్రజలకు సంబంధించిన శాసనాలను రూపొందిస్తారు. శాసనాల రూపకల్పనలో వ్యయపరిమితులు, ఆర్థికపర సూత్రాలను పాటిస్తారు.

ప్రజాస్వామ్యంలో అనుభవజ్ఞులైన అధికారులు, ఇతర కార్యనిర్వాహక అధికారులు వారి ప్రతిభ మీద, సమర్థత మీద, అనుభవం మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటారు. వీరి అనుభవాన్ని, ‘వీరి తెలివితేటలను, సమర్థతను ప్రజాసంక్షేమ కార్యక్రమాల్లో ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు.

2. వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ (Upholds Individual Liberties) :
ఒక్క ప్రజాస్వామ్య ప్రభుత్వంలోనే వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు హామీ ఉంటుందని చెప్పవచ్చు. ప్రజాస్వామ్యంలో నివసించే ప్రజలు మాత్రమే నిజంగా స్వేచ్ఛను అనుభవిస్తారు. ప్రజల హక్కులు, స్వాతంత్ర్యం, స్వేచ్ఛ అన్నీ కూడా లిఖిత రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంటాయి.

3. సమానత్వానికి ప్రాధాన్యత (Importance to Equality) :
ప్రజాస్వామ్యం సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తుంది. ప్రజాస్వామ్యం ప్రజలందరికీ రాజకీయ ఆర్థిక, సామాజిక స్వేచ్ఛను, హక్కులను అందిస్తుంది. ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటరానితనం కట్టుబానిసత్వం, వెట్టిచాకిరి, మతం, భాష, ప్రాంతం, పుట్టుక పేరు మీద విచక్షణ చూపడాన్ని వ్యతిరేకిస్తుంది.

4. రాజకీయ చైతన్యం (Political Awareness) :
నిజానికి ప్రజాస్వామ్యం ప్రజలకు రాజకీయ చైతన్యవేదిక అని చెప్పవచ్చు. ఎన్నికల ప్రచారం ప్రజలకు చైతన్యాన్ని అందిస్తుంది. ఎన్నికల సమయంలో ప్రచారం ద్వారా, పత్రికల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తారు.

5. దేశభక్తిని పెంపొందిస్తుంది (Promotes Patriotism) :
ప్రజాస్వామ్యం ప్రజల మధ్య దేశభక్తిని పెంపొందిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు తరచు ఎన్నికల్లో పాల్గొని ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడాన్ని బాధ్యతగా భావిస్తారు. రాజకీయ ప్రతినిధులు తమ విధులను నిర్వహించడంలో ప్రజలు తమవంతు సహకారం అందిస్తారు.

చాలా సందర్భాల్లో ప్రజలు దేశం సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు తమవంతు బాధ్యతను నిర్వహిస్తూ సంయమనం పాటించారు. ఉదాహరణకు భారతదేశంతో చైనా, పాకిస్తాన్ యుద్ధ సమయంలో ప్రజలు నిర్వహించిన పాత్ర శ్లాఘనీయం.

TS Board Inter First Year Political Science Study Material Chapter 8 ప్రజాస్వామ్యం

6. పౌరసత్వ శిక్షణ (School of Citizenship) :
ప్రజాస్వామ్య ప్రభుత్వపు మరొక ప్రయోజనం ఏమిటంటే, ప్రజల పౌరసత్వ శిక్షణ ఇస్తుంది. ప్రజాస్వామ్యంలో ఓటు వేసే హక్కు, పోటీ చేసే హక్కు, ప్రభుత్వాన్ని సద్విమర్శ చేసే హక్కు, ఎకా ఇతర రాజకీయ హక్కులను పౌరులుగా వినియోగించుకుంటారు.

7. నైతిక విలువలకు ప్రాధాన్యత (Inculcates Moral Values) :
ప్రజాస్వామ్యంలో ప్రజలకు నైతిక విలువలు అలవడుతాయి. ప్రజాస్వామ్యం ప్రజలకు సహకారాలను, బాధ్యతను, సహనాన్ని, త్యాగాన్ని బోధిస్తుంది. లోవెల్ అభిప్రాయంలో “భవిష్యత్తు కాలంలో ప్రజలకు దృఢమైన మానసిక స్థైర్యాన్ని, సమైక్యతను, ఆత్మాభిమానాన్ని అందించే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ప్రజాస్వామ్య ప్రభుత్వం మాత్రమే”.

8. ప్రజాస్వామ్యం ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తుంది (Democracy gives Preference to Public Opinion) :
వాస్తవంగా ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి నిజమైన ప్రతినిధి. బర్నార్డ్ ప్రకారం “ప్రజాస్వామ్యం ప్రజలందరి మధ్య సంబంధాన్ని కలుపుతూ కాపాడుతుంది”.

9. విప్లవాన్ని నివారిస్తుంది (Reduces the Danger of Revolution) :
ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ తమ అభిప్రాయాలను విన్నవించుకొనే, పంచుకొనే అవకాశం ఉంది. కాబట్టి విప్లవం అనే ప్రసక్తే రాదు. ఒకవేళ ప్రభుత్వాన్ని మార్చాల్సివస్తే ఓటు ద్వారా మాత్రమే మారుస్తారు.

10. ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తుంది (Symbol of Progress and Welfare Programmes) :
ప్రజాసంక్షేమాన్ని సాధించడంలో ప్రజాస్వామ్యాన్ని మాత్రమే నిజమైన ప్రభుత్వంగా చెప్పవచ్చు. ప్రజాసంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం.

11. ప్రపంచ శాంతికి మద్దతు (Support to World peace) :
ప్రజాస్వామ్యం ప్రపంచ శాంతికి మద్దతు ఇస్తుంది. హింసకు వ్యతిరేకి. ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో మార్పు రావాలంటే రాజ్యాంగపర ప్రక్రియద్వారా, శాంతి, సహకార పూర్వకమైన పద్ధతుల ద్వారా మాత్రమే సాధ్యమౌతుంది. బర్నార్డో ప్రకారం : “ప్రజాస్వామ్య ఉద్యమాలన్ని శాంతికోసం జరిగినవే”.

TS Board Inter First Year Political Science Study Material Chapter 8 ప్రజాస్వామ్యం

ప్రశ్న 2.
ప్రజాస్వామ్యం అంటే ఏమిటి ? దోషాలు వివరించండి.
జవాబు.
ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ప్రజాస్వామ్య ఏర్పాటు అనేది ప్రజలకు ప్రభుత్వాలకు తప్పనిసరి లక్ష్యంగా మారింది. ప్రపంచ దేశాలలో ప్రజాసంక్షేమాన్ని సాధించడానికి అత్యున్నతమైన సాధనంగా ప్రజాస్వామ్యాన్ని భావిస్తున్నారు.

అర్థం : గ్రీక్ భాషా పదాలైన “డెమోస్” “క్రెటియా” అనే పదాల కలయికగా ఆంగ్లభాషలో ‘డెమోక్రసీ’ అనే పదం పుట్టింది. డెమోస్ అంటే ప్రజలు క్రెటియా అంటే అధికారం అని అర్థం.

నిర్వచనం : “ప్రజాస్వామ్యమంటే ప్రజలచేత, ప్రజల కొరకు ప్రజలే నిర్వహించుకొనే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం”. – అబ్రహం లింకన్.

ప్రజాస్వామ్య దోషాలు :
1. వ్యయంతో కూడుకున్న ప్రభుత్వం :
ప్రజాస్వామ్య ప్రభుత్వం చాలా ఖర్చుతో కూడుకున్న ప్రభుత్వం. ఎన్నికల ప్రచారంపై చాలా ధనం వెచ్చిస్తారు. శాసనసభలను నడపడానికి, కేంద్ర, రాష్ట్ర శాసనసభ సమావేశాల కోసం చాలా ఖర్చు చేయవలసి వస్తుంది. ఇటలీకి చెందిన పార్లమెంటు వట్టి “మాటల దుకాణం”: నియంత ముస్సోలిని మాటల్లో చెప్పాలంటే. “కార్లే” మాటల్లో చెప్పాలంటే ప్రజాస్వామ్యం పేదదేశాలకు పనికిరాదు.

2. బలహీనమైన అస్థిర ప్రభుత్వం :
ప్రజాస్వామ్యం ఆచరణలో బలహీనమైన అస్థిర ప్రభుత్వం అని చెప్పవచ్చు. ఏ దేశంలోనైతే బహుళపార్టీ వ్యవస్థ ఉంటుందో అక్కడ ప్రభుత్వాలు తరచుగా మారుతుంటాయి.
ఉదా : భారతదేశంలో 1977 నుంచి 1979, 1989 నుంచి 1991, 1996 నుంచి 1999 వరకు సంకీర్ణ ప్రభుత్వాల వల్ల స్థిరమైన ప్రభుత్వాలు నడపడంలో విఫలమయ్యాయి.

3. అల్పసంఖ్యాక ప్రభుత్వం:
వాస్తవంగా గమనిస్తే ప్రజాస్వామ్య ప్రభుత్వం అధిక సంఖ్యాకుల అభిప్రాయాన్ని ప్రతిబింబించదు. ప్రజాస్వామ్యమంటే అత్యధిక సంఖ్యాకుల మద్దతుగల ప్రభుత్వం అని అంటారు. కాని వాస్తవంగా అదికాదు. చాలా దేశాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు వారి ఓటుహక్కును వినియోగించుకోరు. చాలా దేశాల్లో ఎన్నికల్లో, ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే ఎన్నికవుతారు.

ఓట్ల శాతంతో సంబంధం లేదు. అంతే కాకుండా తిరస్కరించిన వారి సంఖ్యతో కూడా సంబంధం లేదు. ఈ లెక్క ప్రకారం అధికారంలోకి వచ్చిన పార్టీకి వచ్చిన ఓట్లు వ్యతిరేకించిన వారి కంటే తక్కువ ఉంటాయి. కాబట్టి ప్రజాస్వామ్యం అధిక సంఖ్యాకుల ప్రభుత్వం అనడం వాస్తవం కాదు.

4. సంస్కృతికి, నాగరికతకు, మేధావుల విజ్ఞానానికి నిరోధకం :
ప్రజాస్వామ్యం మందిస్వామ్యంగా పేరుపడి సంప్రదాయకంగా పని చేస్తుంది. కళలు, సంస్కృతి, నాగరికతలలో సాధారణంగా శ్రద్ధ చూపరు. ప్రజాస్వామ్యంలో మేధావులు సాధారణంగా ఎన్నికలకు దూరంగా ఉంటారు. ప్రజాస్వామ్య ఎన్నికలలో ఓడిపోయిన మేధావులు ఎందరో ఉన్నారు.

5. నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం :
ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం ప్రమాదకరం. త్వరిత నిర్ణయాలు సాధ్యం కాదు. తద్వారా జరగవలసిన పనులు జాప్యంగా జరుగుతాయి. శాసనసభా వ్యవహారాలు, రాజకీయపార్టీలు, ప్రతిపక్షపార్టీలు, సంకీర్ణ ప్రభుత్వాలు మొదలైన విధానాల నిర్ణయంతో జోక్యం చేసుకోవడం వల్ల కూడా నిర్ణయాలు ఆలస్యం కావచ్చు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 8 ప్రజాస్వామ్యం

ప్రశ్న 3.
ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ఏమిటి ? ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలు వివరించండి.
జవాబు.
ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతులు :
ప్రభుత్వ విధానాల నిర్ణయాలలో ప్రజలు ప్రత్యక్షంగా ప్రజాప్రతినిధులతో సంబంధం లేకుండా పాల్గొనే ప్రభుత్వమే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ప్రాచీనకాలంలో గ్రీక్, రోమ్ దేశాలలోని నగర రాజ్యాలలో ఉండేది. ప్రస్తుతం స్విజ్జర్లాండ్లో కొన్ని మార్పులతో అమలులో ఉంది.

ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలను క్రింది విధంగా చెప్పవచ్చు.

1. ప్రజాభిప్రాయ సేకరణ (Referendum) :
ప్రజాభిప్రాయ సేకరణను ఆంగ్లంలో referendum అని అంటారు. ఇది (refer) రిఫర్ అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. రిఫర్ అంటే “సూచించడం” అని అర్థం. ప్రజాభిప్రాయ సేకరణ అనేది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అతిముఖ్యమైన సాధనంగా చెప్పవచ్చు. ఒక ప్రత్యేక అంశం మీద గాని లేదా జాతీయ ప్రాధాన్యత ఉన్న అంశం మీద కాని ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని (రూఢి చేసుకుంటుంది) సేకరిస్తుంది.

ఇది రెండు రకాలు.
a) నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణ (Compulsory Referendum) :
నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణ అంటే కొన్ని రకాల బిల్లుల విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపి వారి ఆమోదం పొందితేనే ఆ బిల్లులు శాసనాలు అవుతాయి. ఈ బిల్లులను ఒకవేళ ప్రజలు ఆమోదించకపోతే శాసనాలుగా రూపొంది అమలులోకి రావు. నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణ మూలంగా ప్రజలు తమ ప్రయోజనాలకు విరుద్ధమైన శాసనాలను అడ్డుకోగలుగుతారు.

ఇది స్విట్జర్లాండ్లో అన్ని ముఖ్యమైన రాజ్యాంగ సవరణలకు సంబంధించి అమలులో ఉంది. అంతేగాక స్విట్జర్లాండ్లోని కొన్ని కాంటన్స్లలో సాధారణ బిల్లులను కూడా ప్రజాభిప్రాయ సేకరణకు పంపవలసి వస్తుంది. ఆస్ట్రేలియా, ఫ్రాన్సు దేశాలలో కూడా రాజ్యాంగ సవరణకు సంబంధించి నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణకు పంపుతారు.

b) ఐచ్ఛిక ప్రజాభిప్రాయ సేకరణ (Optional Referendum) :
కొన్ని రకాల బిల్లులను ప్రజల కోరిక మీద మాత్రమే ప్రజాభిప్రాయ సేకరణకు పంపడం జరుగుతుంది. అధిక సంఖ్యాక ప్రజల కోరికమేరకు వారి మద్దతుతో బిల్లులు శాసనాలుగా రూపొంది అమలులోకి వస్తాయి. ముఖ్యంగా స్విట్జర్లాండ్ లో 30 వేల మంది స్విస్ పౌరులు ప్రజాభిప్రాయ సేకరణకు పంపాల్సిందని కోరినట్లైతే ప్రజామోదానికి బిల్లును పంపుతారు. ఐచ్ఛిక ప్రజాభిప్రాయ సేకరణలో బిల్లు మీద ప్రజాభిప్రాయ సేకరణ జరపడం అనేది ప్రజల ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది.

2. ప్రజాభిప్రాయ నివేదన (చొరవ) (Initiative) :
చొరవ అనేది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం మరొక అతిముఖ్యమైన సాధనం. ఒక నిర్ణీత సంఖ్యలో ప్రజలకు సంబంధించిన ఏదైనా ఒక అంశంపై శాసనం చేయమని శాసనసభకు ప్రతిపాదిస్తే దానిని ప్రజాభిప్రాయ నివేధన అంటారు. ఇందులో ప్రజల చొరవతో లిఖితపూర్వకమైన ప్రతిపాదనతో ప్రభుత్వంచేత శాసనాలు రూపొందించబడుతాయి. ఇది ప్రస్తుతం స్విట్జర్లాండ్లో అమలులో ఉంది.

చొరవ రెండు రకాలు. అవి :
a) బిల్లు రూపంలో ప్రజాభిప్రాయ నివేదన.
b) బిల్లు రూపంలో లేని ప్రజాభిప్రాయ నివేదన.

a) బిల్లు రూపంలో ప్రజాభిప్రాయ నివేదన :
ఈ పద్ధతిలో ప్రజలే స్వయంగా ప్రజాప్రయోజనం దృష్ట్యా అవసరమని భావిస్తే ఆ అంశంపై తామే స్వయంగా లిఖితరూపంలో బిల్లు ముసాయిదా తయారుచేసి ప్రభుత్వానికి సమర్పిస్తూ కచ్చితంగా అమలుపరచమని కోరవచ్చు. అనంతరం ఆ అంశాన్ని శాసనసభ తప్పనిసరిగా చట్టంగా అనుమతించవలసి ఉంటుంది.

b) బిల్లు రూపంలో లేని ప్రజాభిప్రాయ నివేదన :
ఈ పద్ధతిలో ఏదైనా ఒక ప్రత్యేక అంశంపై ప్రజాప్రయోజనం కోసం శాసనం అవసరమని భావిస్తే సంక్షిప్త రూపంలో 50 వేల మంది ప్రజలు సంతకాలు చేసి శాసనసభకు నివేదించవచ్చు. అనంతరం శాసనసభ ఆ అంశంపై శాసనం రూపొందించి ప్రజామోదంతో అమలుపరుస్తుంది.

3. పునరాయనం (Recall) :
పునరాయనం అనేది ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతిలో అతిముఖ్యమైన సాధనం. ఈ పద్ధతిలో ప్రజలు తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు సంతృప్తికరంగా పనిచేయకపోతే వారిని వెనక్కి పిలిచే అవకాశం ఉంది. అధిక సంఖ్యాకులు ఈ ప్రతిపాదనకు మద్దతిస్తే ఆ ప్రతినిధి రాజీనామా చేయడానికి అవకాశం ఉంది. అంటే తాము ఎన్నుకున్న ప్రతినిధులు అసమర్థులు, అప్రయోజకులు అని భావిస్తే వారిని పదవి నుంచి తొలగించివేస్తారు.

4. ప్రజానిర్ణయం (Plebiscite) :
ప్లెబిసైట్ అనే పదం ఫ్రెంచిపదం. ఇది ఫ్రెంచి పదాలైన “ప్లెబిస్”, “సిస్లిమ్” నుంచి వచ్చింది. అంటే ప్రజల అభిలాష అని అర్థం. ప్రజానిర్ణయం ప్రజాభిప్రాయ సేకరణకు దగ్గరగా ఉంటుంది. ప్రజానిర్ణయంలో కేవలం రాజకీయ ప్రాధాన్యతగల సమస్యలపై ప్రజానిర్ణయాన్ని సేకరిస్తారు.

తద్వారా ప్రజల నిర్ణయంతో శాశ్వతమైన రాజకీయ పరిష్కారం సాధించే ప్రయత్నం జరుగుతుంది.
ఉదా : సరిహద్దులను మార్చడం, రాజ్య స్వాతంత్య్రం (స్వేచ్ఛ) దేశాల విభజన మొదలైనవి. ప్రజాభిప్రాయ సేకరణ ఒక శాసనప్రక్రియ, కాని ప్లెబిసైట్కు శాసనప్రక్రియతో సంబంధం లేదు. ప్రజానిర్ణయం అతిముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రజల నిర్ణయమే అంతిమ తీర్పు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 8 ప్రజాస్వామ్యం

ప్రశ్న 4.
ప్రజాస్వామ్యంలో “ప్రజాభిప్రాయం పాత్ర” ఏమిటి ?
జవాబు.
‘ప్రజాభిప్రాయం’ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా 17వ శతాబ్దంలో జాన్లాక్ ఉపయోగించాడు. అయినప్పటికీ జాన్ లాక్ కంటే ముందే ఈ భావన ఉంది. లాటిన్ భాషలో ‘వాక్స్ పాపులీ’ ‘Vo populi’ లేదా ‘ప్రజల గొంతుక’ ‘Voice of the People’ అనే పదాలు వాడుకలో ఉన్నాయి. ప్రజాభిప్రాయాన్ని ఈ విధంగా నిర్వచించారు – “రాజకీయ సంఘటనలు, ప్రభుత్వ విధానాలు, వివిధ సంస్థలు, వ్యక్తులకు సంబంధించిన అంశాలపై ప్రజల మూల్యాంకనం లేదా అభిప్రాయాల సారమే ప్రజాభిప్రాయం”.

ప్రజాస్వామ్యంలో రాజకీయ అధికారానికీ అంతిమంగా ప్రజలే మూలం కాబట్టి ప్రజాభిప్రాయానికీ చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రభుత్వ విధానంలో మార్పులు తీసుకొని రావడానికి, నిష్క్రియాత్మకమైన పరిశీలన ద్వారా పౌరులను ఏకం చేయటానికి ప్రజాభిప్రాయం తోడ్పడుతుంది.

సిద్ధాంతపరంగా ప్రభుత్వాధికారులు భవిష్యత్ చర్యలను ప్రజాభిప్రాయం నిర్ణయిస్తుంది. రాజకీయ నాయకులు ప్రజల కోరికలను ఎప్పుడూ నెరవేరుస్తారని దీని అర్థం కాదు. దేశంలో మెజారిటీ ప్రజలు పడుతున్న బాధలను తొలగించటానికి రాజకీయ నాయకులు చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.

వివిధ సమాచార సాధనాల ద్వారా, ఇతర వనరుల ద్వారా రాజకీయ పార్టీలు ప్రజాభిప్రాయాన్ని సేకరించి వాటి పరిష్కారానికి కృషి చేయాలి. ప్రఖ్యాత అమెరికా జర్నలిస్ట్ గ్రాంట్లాండ్ రైస్ ప్రకారం “ఒక తెలివైన వ్యక్తి స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటాడు. ఒక అజ్ఞాని మాత్రం ప్రజాభిప్రాయాన్ని అనుసరిస్తాడు.”

ప్రజాభిప్రాయానికి ఒక రూపత కల్పించడానికి గల కారకాలను అవగాహన చేసుకోవడం అవసరం. అవి సామాజిక వర్గం, విద్య, మతం, వయస్సు, లింగం, జాతి సమూహం మొత్తానికి సమాజం సజాతీయమైనది కాదు. అది వివిధ ఆలోచనల లేదా వర్గాల కలయికగా అవతరించింది. ప్రతీ విభాగం తమ విధుల నిర్వహణలో విభిన్న సవాళ్ళను ఎదుర్కొంటుంది. అందువల్ల ప్రతి విభాగంలోని సభ్యులు ప్రపంచాన్ని విభిన్న రకాలుగా భావిస్తారు.

ఈ విభిన్న అంశాలు అభిప్రాయాల ఘర్షణకు దారి తీసి రాజకీయ విస్తరణను చూరకొంటాయి. సమాజంలో సభ్యుల సమ్మతిపైనే రాజ్యం నిర్మించబడింది. ప్రజల సమష్టి ఆమోదంతోనే రాజ్యాంగం రచించబడింది. రాజ్యం, రాజ్యాంగం నిర్మాణంలో వ్యక్తులు ప్రాథమిక పద్ధతిలో తమ అభిప్రాయం చెప్పారో అదే ప్రజాభిప్రాయం.

అనేక ప్రభుత్వాలు తమ విధానాలు లేదా చర్యలు ప్రజలపై ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో సమాచార సాధనాల ద్వారా తెలుసుకుంటాయి.

ప్రజాస్వామ్య సమాజంలో ప్రజాభిప్రాయం ప్రత్యేక పాత్రను పోషిస్తుంది. ప్రజాభిప్రాయానికి ప్రభుత్వం స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. ప్రజాభిప్రాయం ద్వారా ప్రజల నుంచి డిమాండ్, మద్ధతుల పట్ల ప్రజాస్వామ్య సమాజం అప్రమత్తంగా ఉండాలి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 8 ప్రజాస్వామ్యం

ప్రశ్న 5.
ప్రజాస్వామ్య విజయానికి కావలసిన ఏవైనా నాలుగు పరిస్థితులను వివరించండి.
జవాబు.
1. సరైన విద్య (Sound system of Education) :
ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే పౌరులకు సరైన విద్య ఎంతో అవసరం. అజ్ఞానం, అమాయకత్వం, అవిద్య గల పౌరులు సరైన దృక్పథాన్ని కలిగి ఉండక, భారీ సంస్కరణల పట్ల విముఖత ప్రదర్శిస్తారు. విద్య అనేది వ్యక్తుల వివేకానికి పదును పెడుతుంది. అనేక విషయాల పట్ల సరియైన అవగాహనను పెంపొందిస్తుంది. పౌరులను అప్రమత్తులుగా చేస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వ విధానాలను అంచనా వేయడంలో, విమర్శించడంలో విద్య దోహదపడుతుంది.

2. వికాసవంతమైన పౌరసత్వం (Enlightened Citizenship) :
ప్రజాస్వామ్య రాజ్యానికి వికాసవంతమైన పౌరులు విలువైన ఆస్థిగా పరిగణించబడతారు. వారు ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు. వీరు ప్రభుత్వ వ్యవహారాలలో. చురుకుగా పాల్గొని, హక్కులు, విధుల సక్రమ నిర్వహణలో తోటి పౌరులకు సహాయంగా ఉంటారు. ప్రభుత్వం అమలుచేసే అన్ని మంచి కార్యక్రమాలకు సహకారాన్ని అందిస్తారు.

3. స్వతంత్ర పత్రికలు (Independent Press) :
ప్రజాస్వామ్యానికి స్వతంత్రమైన పత్రికలు ఎంతో ఆవశ్యకమైనవి. పత్రికలు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని ఖచ్చితంగానూ, నిష్పక్షపాతంగానూ ప్రజలకు తెలుపుతాయి. ప్రభుత్వ కార్యకలాపాల పట్ల ప్రజలకు సంబంధం కలిగి ఉండేటట్లు చూస్తాయి. ప్రజల ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతాయి. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సామరస్యపూర్వక సంబంధాలను పెంపొందించేందుకు కృషి చేస్తాయి.

4. దృఢమైన ప్రతిపక్షం (Strong Opposition) :
పార్లమెంటరీ ప్రజాస్వామ్య విజయం దృఢమైన, సమర్థవంతమైన ప్రతిపక్షంపై చాలా వరకు ఆధారపడుతుంది. అటువంటి ప్రతిపక్షం ప్రభుత్వ విధానాల లోపాలను వెల్లడించి, వాటి నివారణకు కృషి చేస్తుంది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి కొన్ని అభివృద్ధి చెందిన దేశాలలో ప్రతిపక్షాలు ప్రశంసనీయమైన పాత్రను పోషిస్తున్నాయనే విషయాన్ని ఈ సందర్భంలో మనం ప్రస్తావించవచ్చు.

భారతదేశంలో కూడా ఇటీవలి కాలంలో అధికారంలో కొనసాగిన అధికార పార్టీలకు చెందిన వ్యక్తులు పాల్పడిన కుంభకోణాలను వెలికి తీయడంలో ప్రతిపక్షం బృహత్తరమైన పాత్రను పోషించింది. పైన ఉదహరించిన దేశాలలోని అధికార పార్టీలు అనేక అంశాలలో ఎదురైన చిక్కుముడులను పరిష్కరించడంలో ప్రతిపక్షాల సలహాలను తీసుకోవడమైనది. ఇటువంటి పరిస్థితి అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాలు రెండింటిలో ప్రజాస్వామ్యపు ఆరోగ్యకర చిహ్నంగా పరిగణించవచ్చు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 8 ప్రజాస్వామ్యం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ప్రజాస్వామ్యాన్ని నిర్వచించండి.
జవాబు.
ప్రజాస్వామ్యాన్ని ఆంగ్లంలో ‘డెమోక్రసీ’ అంటారు. ఈ పదము రెండు గ్రీకు పదాలైన ‘డెమోస్’ మరియు ‘క్రటోస్’ ల నుండి గ్రహించబడింది. డెమోస్ అంటే ప్రజలు, క్రటోస్ అంటే అధికారం లేదా పాలన అని అర్థం. అంటే డెమోక్రసీ అంటే ప్రజల అధికారం లేదా ప్రజల పాలన.

  1. “ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క ప్రజల చేత, ప్రజల కొరకు పరిపాలించే, నిర్వహించబడే ప్రభుత్వం” అని అబ్రహాం లింకన్ పేర్కొన్నాడు.
  2. “ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వమే ప్రజాస్వామ్యం” అని జె.ఆర్.సీలీ పేర్కొన్నాడు.

ప్రశ్న 2.
పరోక్ష ప్రజాస్వామ్యం అంటే ఏమిటి ?
జవాబు.
ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధుల ద్వారా ప్రభుత్వ పాలన నిర్వహించబడటాన్ని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం లేదా పరోక్ష ప్రజాస్వామ్యం అని అంటారు. నిర్ణీత సమయానికి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు తమ అధికార, విధుల నిర్వహణలో ప్రజలకు బాధ్యత వహిస్తారు. ప్రజా ప్రతినిధులు తమ అధికార విధుల నిర్వహణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించటంలో విఫలమైతే వారిని ప్రజలు ఎన్నికల సమయంలో పదవుల నుండి తొలగిస్తారు.

ప్రశ్న 3.
ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ఏమిటి ?
జవాబు.
ఈ పద్ధతిలో ప్రజలు ప్రభుత్వ పాలన వ్యవహారాలలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. శాసన సంబంధమైన అధికారాలన్నీ వారు చెలాయిస్తారు. ప్రజలే చట్ట సభలలో పాల్గొని చట్టాలను రూపొందిస్తారు. రాజ్య వ్యవహారాలలో ప్రజలు ప్రత్యక్షంగా భాగస్వామ్యం వహిస్తారు.

ప్రత్యక్ష ప్రజాస్వామ్య విధానం ప్రస్తుతం స్విట్జర్లాండ్లో కొన్ని కాంటన్ల (Cantons) లోనూ; అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలోనూ నెలకొని ఉంది.

ప్రశ్న 4.
పునరాయనం అంటే ఏమిటి ?
జవాబు.
పునరాయనం అనేది ఒక ముఖ్యమైన ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనం. ఈ పద్ధతిలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు లేదా అధికారులు ఉద్దేశ్యపూర్వకంగా తమ కర్తవ్యాలను నిర్వహించడంలో విఫలమైతే వారిని ఓటర్లు వెనుకకు పిలిచేందుకు వీలుంటుంది. దీనినే పునరాయనం అంటారు. ఈ రకమైన పద్ధతి అమెరికాలోని అలెజోనా, మోంటానా, లూసియానా, కాన్సాస్, కాలిఫోర్నియా, నెవెడా, ఓరెగాన్ మొదలగు రాష్ట్రాలలో అమలులో ఉంది.

ప్రశ్న 5.
ప్రజానిర్ణయం అంటే ఏమిటి ?
జవాబు. ప్రజాభిప్రాయ నిర్ణయాన్ని ఆంగ్లంలో ‘ప్లెబిసైట్’ అంటారు. ఈ పదం లాటిన్ భాషలోని ‘ప్లెబిస్’ మరియు ‘సెటమ్’ అనే రెండు పదాల నుండి గ్రహించబడింది. ప్లెబిస్ అంటే ప్రజలు, సెటమ్ అంటే నిర్ణయం లేదా తీర్పు అని అర్థం. అంటే దీని అర్థం ప్రజా నిర్ణయం లేదా ప్రజాతీర్పు. ఒక ప్రభుత్వ విధానంపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు అనుసరించే ప్రజాస్వామ్య సాధనమే ప్రజాభిప్రాయ నిర్ణయమని భావించవచ్చు.

ప్రశ్న 6.
ప్రజాభిప్రాయ సేకరణ అంటే ఏమిటి ?
జవాబు.
‘ప్రజాభిప్రాయ సేకరణ’ని ఆంగ్లంలో ‘రిఫరెండమ్ ‘(Referendum)’ అంటారు. ఒకానొక అంశంపై ప్రజల అభిప్రాయాన్ని ప్రత్యక్షంగా తెలుసుకొనే ప్రక్రియనే ప్రజాభిప్రాయ సేకరణ అంటారు. ఇటువంటి అంశం సాధారణమైనది కావచ్చు లేదా రాజ్యాంగపరమైనది కావచ్చు. ఆర్.సి. బ్రూక్స్ ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ అనేది శాసనసభ ఇప్పటికే ఆమోదించిన బిల్లు లేదా చట్టంపై నియోజకుల అభిప్రాయాన్ని తెలుసుకొనేందుకు ఉద్దేశించింది.

ప్రశ్న 7.
ప్రజాభిప్రాయ నివేదన అంటే ఏమిటి ?
జవాబు.
శాసన నిర్మాణ ప్రక్రియలో ప్రజలు, పాల్గొనేందుకు తోడ్పడే ప్రక్రియనే ప్రజాభిప్రాయ నివేదన అని అంటారు.
ఉదా : స్విట్జర్లాండ్ లో 50,000 మంది పౌరులు ఏదైనా ఒక అంశంపై చట్టాన్ని రూపొందించాల్సిందిగా శాసనసభను కోరుతూ ఒక అర్జీపై సంతకం చేసినట్లయితే, వారి ప్రతిపాదనను ప్రజల అభిప్రాయానికి పంపబడుతుంది.

మెజారిటీ ప్రజలు ఆ ప్రతిపాదనను ఆమోదించినట్లయితే ఆ అంశం చట్టంగా ఆమోదితమై అమల్లోకి వస్తుంది. ఇది రెండు రకాలు :

  • విధాయక రూపంలో ఉన్న ప్రజాభిప్రాయ నివేదన.
  • విధాయక రూపంలో లేని ప్రజాభిప్రాయ నివేదన.

ప్రశ్న 8.
ప్రజాభిప్రాయం అంటే ఏమిటి ?
జవాబు.
లాటిన్ భాషలో ‘వాక్స్పాపులీ’ ‘Vox populi’ లేదా ప్రజల గొంతుక Voice of the People అనే పదాలు వాడుకలో ఉన్నాయి. ప్రజాభిప్రాయాన్ని ఈ విధంగా నిర్వచించారు – “రాజకీయ సంఘటనలు, ప్రభుత్వ విధానాలు, వివిధ సంస్థలు, వ్యక్తులకు సంబంధించిన అంశాలపై ప్రజల మూల్యాంకనం లేదా అభిప్రాయాల సారమే ప్రజాభిప్రాయం”.

ప్రజాస్వామ్యంలో రాజకీయ అధికారానికి అంతిమంగా ప్రజలే మూలం కాబట్టి ప్రజాభిప్రాయానికి చాలా ప్రాముఖ్యత వుంది. రాజకీయ పక్షాలు, పత్రికలు, వేదికలు, విద్యాసంస్థలు, శాసనసభ, రేడియో, టెలివిజన్, చలన చిత్రాలు ద్వారా ప్రజాభిప్రాయం వ్యక్తమవుతుంది.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds

Telangana TSBIE TS Inter 1st Year Chemistry Study Material 8th Lesson Hydrogen and its Compounds Textbook Questions and Answers.

TS Inter 1st Year Chemistry Study Material 8th Lesson Hydrogen and its Compounds

Very Short Answer Type Questions

Question 1.
The three isotopes of hydrogen differ in their rates of reaction. Give the reasons.
Answer:
Due to the difference in the bond dissociation enthalpies of the H2, D2 and T2 molecules differ in their rates of reaction. The reactivity order is H2 > D2 > T2.

Question 2.
Why is dihydrogen used in weldipg of high melting metals?
Answer:
Atomic hydrogen and oxy-hydrogen torches generate very high temperature of 4000K. So dihydrogen is used in welding of high-melting metals.

Question 3.
Describe one method of producing high-purity hydrogen.
Answer:
High purity (> 99.95%) dihydrogen can be obtained by electrolysing warm aqueous barium hydroxide solution using nickel electrodes.

Question 4.
Explain the term “SYNGAS”.
Answer:
The mixture of CO and H2 is called as water gas or SYNGAS because it is used in the synthesis of methanol and a number of hydrocarbons.

Question 5.
What is meant by coal gasification? Explain with relevant, balanced equation.
Answer:
The process of producing SYNGAS from coal is called coal gasification.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 1

TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds

Question 6.
Define the term Hydride. How many categories of hydrides are known? Name them.
Answer:
The binary compounds of hydrogen with other elements are called hydrides.
The hydrides are classified into three categories.

  1.  Ionic or saline or salt like hydrides.
  2. Covalent or molecular hydrides.
  3. Metallic or non-stoichiometric hydrides.

Question 7.
The unusual property of water in condensed phase leads to its high heat of vapourization. What is that property?
Answer:
The unusual property of water in condensed phase that leading to its high heat of vapourisation is due to the presence of extensive hydrogen bonding between water molecules.

Question 8.
During photosynthesis, water is oxidized to O2. Which element is reduced?
Answer:
The photosynthesis reaction is
6 CO2 + 6 H2O → C6 H12 O6 + 6 O2

The oxidation number of carbon in CO2 is + 4 but in carbohydrate formed the oxidation number of carbon is O. Thus carbon is reduced.

Question 9.
What do you mean by autoprotolysis? Give the equation to represent the auto-protolysis of water.
Answer:
Self – ionisation of water is known as autoprotolysis.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 2

Because of this property, water acts as Bronsted acid when dissolved in alkalis and also acts as Bronsted base when dissolved in acids.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds

Question 10.
Water behaves as an amphoteric substance in the Bronsted sense. How do you explain?
Answer:
Water can donate a proton and also can accept a proton. So it can act as both acid and base in bronsted sense. A substance which can act both as an acid and a base is called amphoteric substance. Hence, we can say that water is an amphoteric oxide.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 3

Short Answer Questions

Question 1.
The boiling points of NH3 H2O and HF are higher than those of the, hydrides of the subsequent members of the group. Give your reasons.
Answer:
Hydrogen is covalently bonded with more electronegative atoms such as F, O and N. The weak electrostatic attractive force is called hydrogen bond.

Because of the association of molecules through hydrogen bonds these hydrides have high boiling points. This is because some extra energy is required to break the hydrogen bond.

The electronegativities of the higher members of N, O, F groups are less. So their hydrides are less polar and cannot form hydrogen bonds. Hence the boiling points of the hydrides of the subsequent members of the N, O, F groups have low boiling points.

Question 2.
Discuss the position of hydrogen in the periodic table on the basis of its electronic configuration.
Answer:
Basing on its electronic configuration (1s¹), hydrogen has to be placed in the 1st period in group I along with alkali metals. Hydrogen resembles the alkali metals in its ability to form hydrated uni + ve ion (H+aq).

Hydrogen can also form uni -ve ion (H). Hence, it can be clubbed with VILA group elements.

However, the position of hydrogen in the periodic table is not satisfactory. It is a matter of choice of the individual to place it in group I along with alkali metals or with group VII along with halogens. Some prefer to place hydrogen separately at the top of the periodic table.

Question 3.
How is the electronic configuration of hydrogen suitable for its chemical reactions?
Answer:
The electronic configuration of hydrogen is 1s¹. It can participate in reactions (i) by losing one electron, (ii) by gaining one electron and (iii) by sharing its electrons.
eg : 1. By losing electron :
In the reaction with fluorine it gives electron but H+ ion cannot exist independently but in water it exist by combining with water.
HF + H2O → H3O+ + F

2. By gaining electron :
With highly electropositive metals it form hydrides by gaining electron.
Na+ + H → NaH

3. By sharing electrons. It forms sev¬eral compounds by sharing electrons.
H : Cl

Question 4.
What happens when dihydrogen reacts with a) Chlorine and b) Sodium metal? Explain.
Answer:
a) When chlorine react with hydrogen hydrogen chloride is formed.
H2 + Cl2 → 2HCl

In HCl, hydrogen shares its electron with chlorine. Hydrogen reduces chlorine to HCl.

b) When sodium reacts with hydrogen, sodium hydride is formed.
2Na + H2 → 2NaH

In this reaction, sodium loses electron while hydrogen gains electron forming Na+ and H ions. Here sodium is oxidised while hydrogen is reduced.

Question 5.
Write a note on heavy water.
Answer:
Heavy water is deuterium oxide. Its formula is D2O. It contains heavier deuterium atoms in the place of normal, hydrogen atoms of water molecule. It is prepared by the prolonged repeated electrolysis of \(\frac{M}{2}\) NaOH solution. The electrolytic cell consists of a steel tank which acts as cathode. A perforated nickel sheet acts as anode and 0.5M NaOH solution acts as electrolyte. The electrolysis is carried in 7 stages. At the end of seventh stage 99% heavy water is obtained.

Properties:
1) It reacts with CaC2 and liberates heavy acetylene.
CaC2 + 2D2O → C2D2 + Ca (OD)2

2) It reacts with S03 and produce heavy sulphuric acid.
SO3 + D2O → D2SO4

Hydrolysis reactions of salts with heavy water are called deuterolysis reactions.
Ex : AlCl3 + 3D2O → Al(OD)3 + 3DCl

Uses :
It is extensively used in nuclear reactors as a moderator and in exchange reactions for the study of reaction mechanism.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds

Question 6.
Name the isotopes of hydrogen. What is the ratio of the masses of these isotopes?
Answer:
Hydrogen 1¹H
Deuterium 1²H or 1²D
Tritium : 1³H or 1³T

The masses of these isotopes are H = 1.008,
D = 2.014 and T = 3.016.

Question 7.
What is water – gas shift reaction? How can the production of dihydrogen be increased by this reaction?
Answer:
Generally water gas produced by passing steam over red hot coke contain less percentage of H2.
C + H2O → CO + H2

The amount of H2 in water gas can be increased by reacting CO of syngas with steam in the presence of Iron chromate catalyst.

CO (g) + H2O (g) → CO2 + H2. This is called water gas shift reaction.

The CO2 formed is removed by scrubbing with sodium arsenite solution.

Question 8.
Complete and balance the following reactions :
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 4
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 5

Question 9.
What is the nature of the hydrides formed by elements of 13 group?
Answer:
Group 13 elements form covalent hydrides. These are mainly electron deficient hydrides. They act as Lewis acids.

Boron form large number of hydrides called boranes. Aluminium form a single polymeric hydride called allane. Gallium forms a dimerichydride and indium forms a polymeric hydride which are not stable. Thallium does not from any hydride.

Question 10.
Discuss the principle and the method of softening of hard water by synthetic, ion-exchange resins.
Answer:
The water which is free from all the dissolved mineral salts is called deionised water.

Deionised water can be prepared in two steps.
1) Removal of cations :
Hard water is passed through a tank containing cation exchange resin. Then the Ca+2 and Mg+2 ions present in the water are replaced by H+ ions from the resin.
2R COOH + Ca+2 → [R (COO)]2 Ca + 2H+

2) Removal of anions:
Now the water coming from the cation tank is passed through a tank containing anion exchange resin. This resin absorbs anions like Cl, SO-24 etc. from the hard water and OH ions are released.
RNH+3 OH + Cl → RNH+3 Cl + OH
2RNH+3 OH + SO-24 → (R – NH+3)2 SO-24 + 2OH

The H+ and OH ions unite to form Deionised water.

After some time the cation resin and the anion resin lose their capacities to remove the cations and anions from the hard water. Then the resins are said to be exhausted. Then they are to be regenerated. The cation resin is regenerated by passing a solution of H2SO4. Anion resin is regenerated by passing a moderately concentrated solution of NaOH.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds

Question 11.
Write a few lines on the utility of hydrogen as a fule. [Mar. ;13]
Answer:
Hydrogen releases large quantity of heat energy on combustion. Hence it is widely used as industrial fuel. Moreover, the pollutants released in the combustion of hydrogen will be less. Atomic hydrogen and oxy-hydrogen torches are used for welding and cutting metals. Hydrogen is also used as rocket fuel. It is also used in fuel cells for generating electric energy. On combination with carbon monoxide (water gas) it is used as industrial fuel.

Question 12.
A 1% solution of H2O2 is provided to you. What steps do you take to prepare pure H2O2 from it?
Answer:
The concentration of H2O2 involves three stages.
Stage (1) :
The dilute solution of H2O2 is carefully evaporated on a water bath under reduced pressure. Then 30% H2O2 solution is obtained.

Stage (2):
The 30% H2O2 solution is heated in a distillation flask under reduced pressure. Then 90% H2O2 is obtained.

Stage (3) :
The 90% H2O2 solution is subjected to crystallisation using solid CO2 and ether. Then 100% H2O2 separates out.

Question 13.
Mention any three uses of H2O2 in modern times.
Answer:

  1. Used as antiseptic in medicine and surgery.
  2. Used to bleach silk, wool, ivory, hair etc.
  3. Used to restore the colour of old and spoiled lead paintings.
  4. Used as an oxidising agent in the labo¬ratory.

Long Answer Questions

Question 1.
White an essay on the commercial preparation of dihydrogen. Give balanced equations.
Answer:
Commercially hydrogen is prepared by the following methods.

1) Electrolysis method :
Electrolysis of . acidified or alkaline water gives hydrogen.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 6

2) It is obtained as a byproduct during the manufacture of sodium hydroxide.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 7

3) By passing a mixture of steam and hydrocarbons over a catalyst gives a mixture of CO and H2.
CH4 + H2O → CO + 3H2
CnH2n+2 + nH2 → nCO + (2n + 1) H2

4) When steam is passed over red hot coke water gas is formed.
C + H2O → CO + H2

The hydrogen present in water gas obtained from hydrocarbons and steam or coke and steam is separated by water gas shift reaction. The water gas is mixed with steam and passed over iron chromate catalyst. Then CO converts into CO2 which is removed by scrubbing with sodium arsenate.
CO + H2O → CO2 + H2

Question 2.
Illustrate the chemistry of dihydrogen by its reaction with
i) N2
ii) Metal ions and metal oxides and
iii) Organic compounds
How is dihydrogen used in the manufac-ture of chemicals?
Answer:
i) Reaction with N2:
Hydrogen react with nitrogen in the presence of iron powder as catalyst forming ammonia.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 8

This reaction is used for the manufacture of ammonia by Haler’s process.

ii) Reaction with metal ions, metal oxides:
Hydrogen is a good reducing agent and reduces several metal oxides and metal ions to their corresponding metals.
Pd2+ + H2 → Pd + 2H+
CuO + H2 → CU + H2O

iii) Organic compounds :
Hydrogen will be added to the double bonds and triple bonds present in the unsaturated organic compounds in the presence of catalyst.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 9

A mixture of H2 and CO is added to 1 – alk- ene to give aldehydes which are further reduced to alcohols. This reaction is known as hydroformylation.
R CH = CH2 + H2 + CO → R CH2 – CH2 CHO
R CH2 CH2 CHO + H2 → R CH2 CH2 CH2OH

In the manufacture of chemicals:
a) HCl is manufactured by burning H2 in Cl2.
H2 + Cl2 → 2HCl

b) Ammonia is manufactured by Haber’s process.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 10

c) Methyl alcohol is manufactured by passing a mixture of CO and H2 over catalyst.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 11

Question 3.
Explain, with suitable examples, the following ; [AP Mar. ’19; (AP ’16; IPE ’14)]
i) electron-deficient
ii) electron-precise and
iii) electron-rich hydrides
Answer:
Dihydrogen forms molecular compounds with most of the p – block elements. These are three types.
i) Electron-deficient hydrides:
These are formed by elements of 13 group (Boron family). In these hydrides the electrons available are not sufficient for making the bonds. They do not have octet around the central atom. So they act as Lewis acids. Eg Diborane B2H6.

For writing the Lewis structure the number of available electrons are 12 but required are 14.

ii) Electron precise hydrides :
The hydrides whose central atom is having octet and all the electron pairs around the central are bond pairs are called electron precise hydrides. Eg: CH4, SiH4, CeH4, SnH4. Electron precise hydrides have required number of electrons for writing the Lewis diagrams.

iii) Electron rich hydrides :
The hydrides whose central atom is having octet and among the electron pairs around the central atom if some are bond pairs and some are lone pairs are called electron rich molecule. Eg NH3, H2O. These contain excess electrons which are present as lone pairs.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds

Question 4.
Write in brief on [AP Mar. ’19]
i) ionic hydrides
ii) interstitial hydrides.
Answer:
i) Ionic hydrides :
These are formed by the highly electropositive s – block metals. In s- block metal hydrides LiH, BeH2 and MgH2 have some covalent character. The ionic hydrides are crystalline. They are non-volatile compounds. They are non-conducting in solid state. But in molten condition, if electrolysed they give metal at cathode and hydrogen at anode.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 12

This reaction confirms that ionic hydrides contain H ion.

Ionic hydrides liberate hydrogen forming alkaline solution when dissolved in water.
NaH + H2O → NaOH + H2

So ionic hydrides are used as a source of hydrogen.

ii) Interstitial hydrides:
These are formed by many of d – and f – block elements. But metals of 7, 8 and 9 groups do not form hydride. This part of the periodic table is called hydride gap. These are non-stoichiometric compounds. Earlier it was thought the hydrogen atoms occupy the interstitial voids of metal crystals. So they are as interstitial compounds. This is correct only in the case of Ni, Pd, Ce and Ac. In most of other cases the crystal structure of metals is changing during the formation of these hydrides.

Some metals like Pd and Pt absorb large amounts of hydrogen. This property is known as occlusion. This property is also used as a storage of H2 and purification of H2. Also used in catalytic reduction / hydrogenation reactions.

Question 5.
Explain any four of the chemical properties of water.
Answer:
1. Amphoteric nature:
Water can act both as acid and base. In the Bronsted sense it acts as an acid with NH3 and a base with H2S.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 13

2. Reaction with Metals:
Water react with metals liberating hydrogen. Here water is reduced to hydrogen and metals is oxidised.
2Na + 2H2O → 2NaOH + H2

3. Hydrolysis reaction :
Several ionic and covalent compounds hydrolyse in water.
P4O10 + 6H2O → 4H3PO4
SiCl4 + 2H2O → SiO2 + 4HCl

4. Hydrates formation:
When several salts crystalysed as hydrated salts
Eg : i) [Cr (H2O)6] Cl3 – Coordinated water
ii) BaCl2.2H2O – Lattice water
iii) [Cu (H2O)4] SO4 . H2O. The H2O molecule outside the coordination sphere is hydrogen bonded water.

Question 6.
Explain the terms hard water and soft water. Write a note on the [Mar. ’18 (AP)]
i) ion-exchange method and
ii) Calgon method for the removal of hardness of water. [AP ’16; TS ’15 TS Mar. ’19]
Answer:
Water which gives ready and permanent lather with soap is called soft water.

Water which do not give ready and permanent lather with soap is called hard water.

Hardness of water is due to the presence of soluble chloride, sulphate and bicarbonate compounds of magnesium and calcium such as MgCl2, MgSO4, Mg(HCO3)2, CaCl2, CaSO4, Ca(HCO3)2.

1) Ion exchange method :
The water which is free from all the dissolved mineral salts is called deionised water.

Deionised water can be prepared in two steps.
1) Removal of cations :
Hard water is passed through a tank containing cation exchange resin. Then the Ca+2 and Mg+2 ions present in the water are replaced by H+ ions from the resin.
2R COOH + Ca+2 → [R (COO)]2 Ca + 2H+

2) Removal of anions:
Now the water coming from the cation tank is passed through a tank containing anion exchange resin. This resin absorbs anions like Cl, SO-224 etc. from the hard water and OH ions are released.
RNH33 OH + Cl → RNH+3 Cl + OH
2RNH+3 OH + SO-224 → (R – NH+3)2 SO-224 + 2OH

The H+ and OH ions unite to form Deionised water.

After sometime the cation resin and the anion resin lose their capacities to remove the cations and anions from the hard water. Then the resins are said to be exhausted. Then they are to be regenerated. The cation resin is regenerated by passing a solution of H2SO4. Anion resin is regenerated by passing a moderately concentrated solution of NaOH.

2) Calgon method :
Sodium hexametaphos- phate is commercially called as calgon.
When calgon is added to hard water it reacts with calcium and magnesium ions forming complex anions.
Na2 [Na4 (PO3)6] + 2Mg2+ → Na2 [Mg2 (PO3)6] + 4Na+
Na2 [Na4 (PO3)6] + 2Ca2+ → Na2 [Ca2 (PO3)6] + 4Na+

Due to the formation of the complex the Mg2+ and Ca2+ become inactive and cannot react with soap. So the water can give good lather. This method is used only for laundry process.

Question 7.
Write the chemical reaction to justify that hydrogen peroxide can function as an oxidizing as well as reducing agent. [TS Mar. ’18, (TS ’16; AP ’15]
Answer:
Hydrogen peroxide can act as both oxidising and reducing agent in both acid and basic medium.

Oxidation properties:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 14
Eg : H2O2 oxidises PbS to PbSO4 in acid medium
PbS + 4H2O2 → PbSO4 + 4H2O.

H2O2 oxidises formaldehyde to formic acid in basic medium.
2HCHO + H2O2 → 2HCOOH + H2

Reduction properties:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 15
Eg : H2O2 reduces acidified potassium per-manganate in acid medium.
2KMnO4 + 3H2SO4 + 5H2O2 → K2SO4 + 2MnSO4 + 8H2O + 5O2

H2O2 reduces potassium ferrycyanide in basic medium.
2K3 [Fe (CN)6] + 2KOH + H2O2 → 2K4[Fe (CN)6] + 2H2O + O2

Question 8.
Complete and balance the following chemical reactions:
i) PhS (s) + H2O2(aq) →
ii) MnO4 (aq) + H2O2 (aq) →
iii) CaO (s) + H2O (g) →
iv) Ca3 N2 (s) + H2O (l) →
Classify the above into (a) hydrolysis (b) redox and (c) hydration reactions.
Answer:
i) PbS + 4H2O2(aq) → PbSO4 + 4H2O
This reaction is redox reaction. Pbs is oxidised, H2O2 is reduced.

ii) 2MnO4 (aq) + 6H+ + 5H2O2 (aq) → 2Mn2+ + 8H2O + 5O2
This reaction is redox reaction. Here MnO4 is reduced while H202 is oxidised.

iii) CaO (s) + H2O (g) → Ca (OH)2
This reaction is hydration.

iv) Ca3 N2 (s) + 6H2O → 3Ca(OH)2 + 2NH3
This is hydrolysis reaction.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds

Question 9.
Discuss, with relevant chemical equations, various methods of preparing hydrogen peroxide. Which of these methods is useful to prepare D2 O2?
Answer:
Hydrogen peroxide can be prepared by the following methods.
1) By adding ice cold dilute sulphuric acid to barium peroxide gives hydrogen peroxide.
BaO2.8H2O (s) + H2SO4 (aq) → BaSO4 + H2O2 + 8 H2O

BaSO4 can be removed by filtration. Excess water can be removed by evaporation under reduced pressure.

2) Electrolysis of 50% H2SO4 using platinum anode and lead cathode gives H2O2.
2H2SO4 → 2H+ + 2HSO4
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 16

Hydrolysis of perdisulphuric acid gives hydrogen peroxide.
H2S2O8 + 2H2O → 2H2SO4 + H2O2.

3) Industrially it is prepared by the auto oxidation of 2 – alkylanthraquinols.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 17
K2S2O8 is used for the preparation of D2O2.
D2O2 can be prepared by dissolving K2S2O6 in heavy water.
K2S2O8 + 2D2O → 2KDSO4 + D2O2

Question 10.
In how many ways can you express the strength of H2O2? Calculate the strength of 15 volume solution of H2O2.in g/l. Express this strength in normality and molarity.
Answer:
i) Strength of H2O2 expressed in volumes:
Eg : 10 vol. H2O2, 20 vol. H2O2 and 100 vol. H2O2
20 vol. H2O2 means 1 ml of this solution liberates 20 ml of O2 gas at STP.
∴ 10 ml of 20 vol liberates 200 ml of oxygen at STP.
10 vol. H2O2 solution means 1 ml of this solution liberates 10 ml of O2 gas at STP.

ii) To express the strength in % (W/V) :
H2O2 decomposes, as shown below
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 18
1 mole of O2 gas is liberated from 2 notes of H2O2.
i.e., 22.4 lit of O2 is given by 2 × 34 g of H2O2.
∴ 10 lit of O2 gas at STP can be given by?
Weight of H2O2 in 1 lit of solution \(\frac{2\times34\times10}{22.4}\) = 30.36 g

30.36g (W/V) refers to the weight of H2O, in 1000 ml of solution.
∴ Strength of H2O2 = 3.036 % (W/V)
(Wt. of H2O2 in 100 ml solution is called its strength.)

iii) Molarity of H2O2 solution = \(\frac{30.36}{34}\) = 0.893 M

iv) Normality of solution is the number of gram equivalents of solute present in 1 lit of solution.
Equivalent weight of H2O2

TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 19

Strength of 15 vol H2O2 :
10 volume H2O2 is 3% W/V
15 volume H202 is
\(\frac{15\times3}{10}\) = 4.5 gm/100ml

∴ The wt. of H202 in 1 litre = 45 g/L
Normality of 10 vol. H2O2 is 1.786
Normality of 15 vol. H2O2 is
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 20

TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds

Question 11.
Explain the structure of the Hydrogen peroxide molecule.
Answer:
H2O2 has an open book structure. It is non-linear and non-polar. The two oxygen atoms are considered to be present on the spine of an open book. The two hydrogen atoms can be considered to be present on the two covers. H-O-O bond angle is 94° 48¹. O-O bond length is 1.48 A.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 21

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 2 బిచ్చగాడు?

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 2nd Lesson బిచ్చగాడు? Textbook Questions and Answers.

TS Inter 1st Year Non-Detailed 2nd Lesson బిచ్చగాడు?

ప్రశ్నలు- జవాబులు

ప్రశ్న 1.
‘బిచ్చగాడు కుటుంబానికి ఎదురైన కష్టాలను వివరించండి?
జవాబు:
బిచ్చగాడు కథ అంపశయ్య నవీనే చ్చే రచించబడింది. అంపశయ్య నవీన్ అసలు పేరు దొంగరి మల్లయ్య ‘బిచ్చగాడు’ పాఠ్యభాగం నవీన్ రాసిన ‘ఎనిమిదో అడుగు’ కథా సంపుటి నుండి గ్రహించబడింది.

ప్రపంచంలో పలు రకాల దోపిడీలు మోసాలు జరుగుతుంటాయి. అందులో శ్రామికుల కార్మికుల జీవితాలలో జరిగే శ్రమదోపిడి అత్యంత భయంకరమైనది. రోజువారి కూలీ పనులు చేస్తూన్న వలన కార్మికులలో, సంచార జీవనం సాగించేవారిలో, రోజు అడుక్కుంటూ పొట్టపోసుకునే బతుకులలో ఈ శ్రమదోపిడి మానవతా విలువలకు తావులేకుండా చేస్తుంది. వారి దోపిడీకి నగ్న సత్యంగా నిలచిన కథే ఈ బిచ్చగాడి కథ.. గౌరవ ప్రదమైన వృత్తులలో ఉన్నవారి హీన మనస్తత్వానికి దోపిడీ స్వభావానికి ఇది ఒక ఉదాహరణం. ఈ కథ అమానవీయతను, నైతిక పతనాన్ని తెలియచేస్తుంది.

ఈ కథ ప్రయాణ సమయంలో విభిన్న మనస్తత్వాలు గల మానవ హృదయాలను ఆవిష్కరిస్తుంది. రచయిత కొత్తగూడెంలో బంధువుల వివాహ వేడుకలకు అటెండయి తిరిగి వరంగల్లుకు వెళ్తున్న సందర్భంలో జరిగింది. రైలు చాల రద్దీగా ఉంది. కూర్చోటానికి జాగా ఎక్కడా కన్పించలేదు.

చివరికి ఒక కంపార్ట్మెంట్లో ఓ సీటు మొత్తాన్ని ఒకామె బోల్డు లగేజీతో సీటు మొత్తాన్ని ఆక్రమించేసింది. ఆమె ఓ బిచ్చగత్తె. ఆమె భర్త టికెట్ తీసుకురావటానికి వెళ్ళాడు. కౌంటర్ దగ్గర చాలా రద్దీగా ఉంది. బండి కదలటానికి సిద్ధమవటంతో అతడు పరిగెత్తుకొచ్చాడు. వాడికి టికెట్ అందనేలేదు. ఎవడికో డబ్బులిచ్చి వచ్చాడు. కొందరు టికెట్ లేకపోతే టి.సి వచ్చి నానాయాగీ చేస్తాడన్నాడు.

ట్రైన్ కదలింది. టికెట్ తెస్తానన్నవాడు ఆ డబ్బులతో అటే పోయాడు. టి.సి రానే వచ్చాడు. ఆ బిచ్చగాడి పేరు బ్రహ్మయ్య. ఒరేయ్ టికెట్ తీయరా! అన్నాడు టి.సి. “అయ్యా!

టికెట్ కోసమే పోయినయ్యా! ఇయ్యాళ కొత్తగూడెం టేషన్లో అంతా మందే…… టికెట్ తీసుకోమని మా అన్న కొడుకుని పంపిన. ఆడు చెయ్యి బెడ్తుండగనే బండి కదిలింది. నేను వాణ్ణి వదిలేసి బండెక్కిన” “నోర్ముయిరా దొంగ వెధవ. ఎక్కడివెళ్ళాలి” అన్నాడు. “నెక్కొండ” “బాంచెన్” అన్నాడువాడు. ఆ ఆడది నల్గురు పిల్లలు నీ వాళ్ళేనా”

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 2 బిచ్చగాడు?

“అయ్యా మా వాళ్ళే’ అయితే 56 రూపాయలు తియ్” అతడు వెంటనే టి.సి రెండు కాళ్ళు పట్టుకున్నాడు.

“లే గాడిద కొడకా! నా కాళ్ళెందుకుకురా పట్టుకుంటావ్” పైసలిస్తవా పోలీసోళ్ళకు పట్టించనా అన్నాడు టి.సి “నన్ను కోసినా నా దగ్గర పైసల్లేవు బాంచనా” ఈ భాగోతం అంతా బండిలో ఉన్న వారికి వినోదంగా మారింది” వరేయ్ బ్రహ్మయ్య! డబ్బు తియ్యరా” అన్నాడు టి.సి “అయ్యా! నన్ను కోసినా నా వద్దపైసాలేదయ్యా! అంటూ బ్రహ్మయ్య మళ్ళీ కాళ్ళు పట్టుకోబోయాడు. “నన్నుంటుకున్నావంటే చంపేస్తా…

బద్మాష్ లుచ్చ నీ దగ్గర డబ్బులేదురా. ఆరుమాలు తీయ్ ” అన్నాడు టి.సి “ఈ రూమాల్నేముందు బాంచెన్…. మీ అసుంటి ఓ దొర దగ్గర అడుక్కున్నా నన్ను నమ్మండ్రి బాంచెన్ అని మళ్ళీ కాళ్ళు పట్టుకోబోయాడు. ఇద్దరి మధ్య పెనుగులాటలో రుమాలు చిరిగి పోయింది. దాన్లో నుండి 30 రూ॥ బయట పడ్డాయి. ఆ ముప్పై ఇదేనా అన్నాడు టి.సి “ఛట్ దొంగ రాస్కెల్. ఇంకా మోసం చేద్దామని చూస్తావురా! తీయ్ మిగతా 26రూ॥ అన్నాడు. “మమ్ముల కొట్టుండి. సంపుండ్రి. ఈ బండ్లె నుంచి బయటకు ఇసిరి కొటుండ్రి మా వద్దిక పైసల్లేవ్ అంది బ్రహ్మయ్య భార్య.

“నోర్మూయ్యలే దొంగముండ. పైసల్ లేవంటే ఫైనెవ్వడు కడ్డడు. నీ నడుంకున్న ఆ సంచితియ్ అన్నాడు టి.సి. దాంట్లో ముంది నిన్న మొన్న అడుక్కున్న డబ్బులు. నిండు చూలాలు. నలుగురు పిల్లలలో ఉన్న ఆమెను చూస్తే ఎవరికి జాలి కలుగలేదు“ఈ పూటకు నూక మందమన్నా ఉంచుండ్రయ్యా! నిన్న మొన్న ఏమిటి నేను ఏమిటినేను.

నా పోరగాండ్లను సూడుండ్రి ఆకలితో నకనక లాడిపోతండ్రు అని ఎంత కాళ్ళు పట్టుకున్నా ప్రతమ్నాయం లేకపోయింది. ఆ సంచిలోని డబ్బంతా క్రిందపోసి 26 రూ॥ తీసుకుని ఒక రిసీట్ బుక్ తీసి ఏదో రాశాడు. నా దృష్టి ఆ కాగితం పై 22 రూ॥లు డోర్నక్ టు నెక్కొండ” అని పడింది. ఇంతకూ ఎవరు పెద్ద బిచ్చగాడో మీరే అర్ధం చేసుకోండి. అని కవికథలు ముగించాడు.

ప్రశ్న 2.
బిచ్చగాడు కథలోని ప్రయాణీకుల మనస్తత్వాన్ని విశ్లేషించండి?
జవాబు:
బిచ్చగాడు కథ అంపశయ్య నవీన్ చే రచించబడింది. ఈయన అసలు పేరు దొంగరి మల్లయ్య. ‘బిచ్చగాడు’ పాఠ్యభాగం నవీన్ రాసిన ‘ఎనిమిదో అడుగు’ కథా సంపుటి నుండి గ్రహించబడింది. గౌరవ ప్రదమైన వృత్తులలో ఉన్నవారి హీనమనసత్వాలను చక్కగా వివరించాడు. సమాజంలోని మనుషుల స్పందనా రాహిత్యాన్ని అమానవీయతను నైతిక పతనాన్ని ఈ కథ వివరిస్తుంది.

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 2 బిచ్చగాడు?

రచయిత కొత్తగూడెంలో బంధువుల వివాహానికి వెళ్ళి తిరిగి వరంగల్కు ప్రయాణం చేసే సందర్భంలో జరిగిన సంఘటనలకు సంబంధించిన కథ ఇది. ఆ రోజు స్టేషన్ చాల రద్దీగా ఉంది. టికెట్ దొరికే అవకాశం ఏ మాత్రం కన్పించలేదు. అంతలో ఒకప్పటి తన విద్యార్థి భాస్కర్ సి. ఐగా పని చేస్తాడు. అతని పుణ్యమా అని టికెట్ సంపాదించి ట్రైన్లోకి ప్రవేశించాడు. కూర్చోటానికి సీటు ఎక్కడా ఖాళీ లేదు. చివరికి ఒక కంపార్ట్మెంట్లో ఒక సీటు మొత్తాన్ని ఒక స్త్రీ తన సామానులతో ఆక్రమించింది.

ఆ సామానంతా అటూ ఇటూ జరిపితే ఐదుగురు కూర్చోవచ్చు. ఆ స్త్రీ చాల పేదరాలుగా ఉంది. బిచ్చగత్తెలా ఉంది. నలుగురు సంతానంతో చినిగిపోయిన గుడ్డపీలికలు కట్టుకునుండి. మురికిగా అసహ్యంగా ఉన్నారు. ఎలాగోలా అక్కడ కూర్చోవాలని “ఇదిగో ఇటు చూడు…. ఆ సామానంతా క్రిందపెట్టేస్తే ఇక్కడ ఇంకో ఇద్దరు ముగ్గురు కూర్చోవచ్చుగా అన్నాడు. ఆ స్త్రీ “గదంతేం లేదు మేము సామాను తియ్యం. ఇంకో డబ్బాలోకి పోయి కూకో”చాలా మొరటుగా సమాధానం చెప్పింది.

ఇంతలో అక్కడ కూర్చున్న పెద్ద మనిషి. “అధునా భిచ్చముండవు. నీ పొగరుండీ మాకెంతుండాల్నే ఆ సారెంత మర్యాదగా అడిగిండు- ఈ రైలు మీ తాతదనుకున్నావా” అని గద్దించాడు. చివరికి అక్కడ కూర్చున్నారు కవిగారు.

ఇంతలో గార్డువిజిల్ విన్పించింది. ఆ బిచ్చగత్తె గొంతులో ఆందోళన. “మీ అయ్యేడిరా! ఎక్కడ సచ్చిండు? రైలు పోతాంది” అంది ఇంతలో టికెట్ కోసం వెళ్ళిన వాడు వచ్చాడు. “టికెట్ దొరకనేలేదు బండిపోతాంది. సామానునంతా కిందకి దించి మీరు దిగుండే” అన్నాడు.

“ఓరిపిచ్చిగాడిద కొడకా సామానునంతా దించే వరకు బండి ఆగుతుందా ఏమిటి? టి.సి. గారితోని చెప్పి బండిలో కూర్చో అన్నాడు ఆ పెద్దమనిషి. అప్పటికే ఆ బిచ్చగాడు బండిదిగి టికెట్ తీయమని డబ్బులిచ్చిన వాడి దగ్గరకు పరిగెత్తాడు. ఆడురాక పోతే టి. సీకి కట్టడానికి నీ దగ్గర డబ్బులున్నాయా అన్నారొకరు.

“ఒక్కపైసాలేదు. లేదు బాంచెను “అందామె ఏడుస్తూ “నువ్వట్లనే అంటావు. ఇయ్యాళేపు బిచ్చగాళ్ళ దగ్గరున్నన్ని డబ్బులు మా అసంట్లోళ్ళ దగ్గర కూడా లేవు. మీకేందే పెట్టుబడి లేని వ్యాపారం” అన్నాడు ఎగతాళిగా. అక్కడ ఉన్నవారందరూ చులకనగా నవ్వారు.

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 2 బిచ్చగాడు?

మీ పనే బాగుందిరా. ఎక్కడా బిచ్చమే… కానీ ఖర్చులేని బతక్కు అన్నాడకొడు. ఊళ్ళన్నీ వాళ్ళవే! దేశాలన్నీ వాళ్ళవే దొరికింది తింటారు. లేకుంటే పస్తులుంటారు. ఏ బాదరాబందీ లేదు. మనకంటే వాళ్ళేనయం అన్నాడో ప్రయాణీకుడు. టి.సి రావడం ఆ బిచ్చగాణ్ణి బెదిరించడం జరిగాయి. ఆ బిచ్చగాడి రుమాలులో డబ్బులు కిందపడ్డాయి. అక్కడి ప్రయాణీకులలో బిచ్చగాడిపట్ల అప్పటి వరకు ఉన్న సానుభూతి ఎరిగిపోయింది.

“దొంగముండా కొడుకులు. వీళ్ళను చచ్చినా నమ్మోద్దు. టి.టి గారికి వీళ్ళ సంగతి బాగా తెలుసు. మంచిపని చేసుండు” అన్నాడు ఆ ఖద్దరు బట్టల నాయకుడు. నిండుచూలాలు వీళ్ళకు ఇలా జరుగుతుంటే వారిపై ప్రయాణీకులెవరికి జాలికలుగలేదు. అదే విషయం సినిమాలో చూస్తే కళ్ళ వెంట నీళ్ళు కారుస్తారు.

మేమంతా, టికెట్లు కొన్నాం. వీళ్ళు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు. మనకు లేని ప్రివిలేజ్ వీళ్ళకెందుకు పొందాలి అన్న ఈర్ష్య వారిలో కన్పించింది. టీ.సి ఆ గర్భిణి నుండి ‘సంచిని లాక్కొని డబ్బంతా కింద బోర్లించాడు. ఫైనుతో టికెట్కు సరిపడా డబ్బులు తీసుకుని మిగిలినవి ఆమెకివ్వబోయాడు. “వాటిని కూడా వార్నేతీసుకోమనురి” అంది ఆమె.

“చెప్పుతీసుకుని తంతాను దొంగముండా” అని ఇష్టమొచ్చినట్లు తిట్టి ఒక కాగితం ముక్క ఆ బిచ్చగాడి చేతిలో పెట్టాడు. ఆ చీటిలో 22 రూపాయలే రాసి ఉన్నాయి. ఆ ఇద్దరిలో ఎవరు బిచ్చగాడో కవిగారికి అర్థం కాలేదు. భిన్నమనస్తత్వాలు గల వ్యక్తులు వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారని కవి బాధపడ్డాడు.

ప్రశ్న 3.
‘బిచ్చగాడు’ కథలోని రచయిత అభిప్రాయాలను పరిశీలించండి?
జవాబు:
‘బిచ్చగాడు’ అను పాఠ్యభాగం ‘అంపశయ్య నవీన్’ చే రచించబడింది. నవీన్ రచించిన ఎనిమిదో అడుగు’ కథా సంపుటి నుండి ఈ పాఠ్యభాగం గ్రహించబడింది. నవీన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేసి పదవీరమణ పొందారు.

ప్రపంచంలో అనేక రకాల దోపిడీలు మోసాలు జరుగుతున్నాయి. అందులోను శ్రామికులు కార్మికుల జీవితాలలో జరిగే దోపిడీలు అత్యంత భయంకరమైనవి. మానవతా విలువలను దిగజార్చేచవని నవీన్ గారి అభిప్రాయం. రోజువారి కూలీపనులు చేస్తూ సంచార జీవన చేసేవారిలో దారిద్ర్యం, దైన్యం కన్పిస్తుందని అటువంటి వారిని కూడా దోపిడీ చేసే మనస్తత్వం గలవారు మన సమాజంలో ఉన్నారని వారిలో మార్పురావాలన్నది నవీన్ భావన. రోజూ అడుక్కుంటూ పొట్టపోసుకునే వ్యక్తులు దోపిడీకి గురి అవటం శోచనీయం అంటారు. నవీన్. ఇలాంటి వారు గౌరవనీయమైన వృత్తులలో ఉన్నవారి చేతుల్లోనే దోపిడీకి గురి అవుతున్నారు. అందుకు ఈ కథ ఒక ఉదాహరణం.

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 2 బిచ్చగాడు?

టికెట్ దొరకలేదని లబోదిబో మంటూ ఏడుస్తూ పరిగెత్తుకొచ్చి బిచ్చగాడిని చూసి ఒక పెద్దమనిషి ఇష్టమెచ్చినట్లు తిట్టడం రచయిత తప్పుపడతాడు. బిచ్చగాడు టికెట్ దొరకక తన వారినందరిని బండి దిగిపోండన్నప్పుడు ఆ పెద్ద మనిషి అన్న మాటలు అరె వారి పిచ్చిగాడిద కొడకా, నీ బండెడు సామాను దించే వరకు బండి ఆగుతుందిరా! ఈ మాటలు మానవత్వానికి మచ్చ అని రచయిత అభిప్రాయం.

“పాపం వాళ్ళలా బిక్కచచ్చి యేడుస్తుంటే మీరు ఇలా నవ్వటం ఏమిటి? అని వాళ్ళందరిని రచయిత గద్దించాలనుకున్నాడు. నేనలా అంటే నన్ను పిచ్చివాడిలా భావిస్తారేమోనని రచయిత భయమేసి ఊరుకున్నాడు. టి.టి బిచ్చగాడిని గద్దించి డబ్బురాబట్టడానికి ప్రయత్నిస్తుంటే, రచయిత టీ.టీగారూ! అతడు చెప్తున్నది కొంచెం విన్పించుకోండి అని ఇంగ్లీషులో మాట్లాడేసరికి కొంచెం టి.టి. తగ్గాడు. ఇక్కడ సత్యానికి విలువలేదు. సభ్యతకు తావులేదు. డబ్బుకే విలువ అన్న అభిప్రాయాన్ని రచయిత తెలియచేస్తున్నారు.

నిండుచూలాలుగా ఉన్న ఆ నిర్భాగ్యురాలిని చూసి ఆ కంపార్ట్మెంట్లో ఉన్నవారికి జాలి కలుగక పోగా ద్వేషపూరిత భావం కలగడం రచయితను బాధించింది. ఇలాంటి దృశ్యాన్నే సినిమాలో చూస్తే అందరూ కళ్ళంట నీళ్ళు కారుస్తారు. మనుషులలో ఈ భిన్న భావావేశాలకు కారణం ఏమిటి? అని రచయిత ఆలోచించాడు. ఎలాగైతేనేం బిచ్చగాడు.

బిచ్చగత్తె లిద్దరి వద్దా డబ్బురాబట్టుకున్నాటు టి.టి. వాళ్ళచేతిలో ఒక రిసీట్ పెట్టాడు. రచయిత ప్రక్కనే ఉండటంతో ఆ రిసీట్ మీద 22 రూ॥ మాత్రమే రాసుంది అన్న విషయం తెలిసింది. 56 రూపాయలు దండుకున్న టి.టి మోసాన్ని అందరికీ చెప్తామనుకున్నాడు రచయిత. కాని ఇవన్నీ మామూలే అని పెదవి విప్పలేకపోయాడు రచయిత. దోపిడీ చేసేవారికి ఉచ్చనీచాలు లేవని రచయిత అభిప్రాయంగా మనకు అర్థమౌతుంది.

బిచ్చగాడు Summary in Telugu

రచయిత పరిచయం

రచయిత పేరు : అంపశయ్య నవీన్

పుట్టిన తేదీ : డిశంబర్ 24, 1941

పుట్టిన ఊరు : వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం ‘వావిలాల’ గ్రామం

తల్లిదండ్రులు : పిచ్చమ్మ, నారాయణలు

చదువులు : ఉస్మానియాలో ఎం. ఏ అర్థశాస్త్రం

ఉద్యోగం : నల్గొండలో డిగ్రీ కళాశాల లెక్చరర్, ప్రినిపల్ రిటైర్మెంట్

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 2 బిచ్చగాడు?

రచనలు : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో

  1. 1965 – 69 మధ్యకాలంలో తన ఉపవాచకం అనుభవాలను ఇతివృత్తంగా వ్రాసిన నవల “అయ్య ప్పటికి 13 సార్లు ముద్రించబడింది.
  2. ముళ్ళపొదలు, అంతస్రవంతి నవలలు.
  3. ‘చీకటిరోజులు’ ఎమర్జెన్సీ కాలం నాటి స్థితిగతులపై వచ్చిన నవల
  4. ‘కాలరేఖలు’ నవల. ఇది 1944 నుండి 1947 వరకు జరిగిన సంఘటన సమ్మేళనం
    ఇవికాక నవీన్ అగాధాలు, దాగుడు మూతలు, ప్రత్యూష, ప్రయాణాల్లో ప్రమదలు, ఉమెన్స్ కాలేజీ, దృక్కోణాలు, చెదిరిన స్వప్నాలు, ఏ వెలుగులకీ ప్రస్థానం మొదలగు 31 నవలలను రాశాడు.

కథా సంపుటాలు : లైఫ్ ఇన్ ఏ కాలేజ్, ఎనిమిదో అడుగు, ఫ్రమ్ అనురాధ విత్లవ్, నిష్కృతి, బంధితులు, అస్మదీయులు తస్మదీయులు కథాసంపుటాలు.
సాహిత్య వ్యాసాలు, సాహిత్యకబుర్లు, తెలుగులో, ఆధునిక నవలలు సినిమా వీక్షణం – వీరి వ్యాస సంపుటాలు

TS Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

Telangana TSBIE TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ Textbook Questions and Answers.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
డిమాండ్ ఫలం అంటే ఏమిటి ? ఒక వస్తువు డిమాండ్ను నిర్ణయించే అంశాలు (కారకాలు) ఏమిటి ?
జవాబు.
“ఒక నిర్ణీతమైన కాలంలో, నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తు పరిమాణాన్ని ఆ వస్తువుకు లేదా సేవకు ఉన్న డిమాండ్” అంటారు.

ఒక వస్తువు డిమాండ్ దాని ధరపైనే కాకుండా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా వస్తువు డిమాండ్ను ప్రభావితము చేసే అంశాలు; ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలు, వినియోగదారుల ఆదాయం, వినియోగదారుల అభిరుచులు, అలవాట్లు మొదలైనవి. కనుక ఒక వస్తువు డిమాండ్ పరిమాణానికి, దీనిని నిర్ణయించే కారకాలకు మధ్యగల సంబంధాన్ని తెలియజేసేదే డిమాండ్ ఫలము. దీనిని ఈ క్రింది సమీకరణం ద్వారా చూపవచ్చు.

Dn = f (Pn, P1, P2, …………. Pn-1, y, T)
Dn = n వస్తువుల డిమాండ్ పరిమాణం
Pn = n వస్తువు ధర
P1, P1, ………….. Pn-1 = ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలు
y = వినియోగదారుని ఆదాయం
T = వినియోగదారుని అభిరుచులు, అలవాట్లు మొదలైనవి.
f = ప్రమేయ సంబంధము.

డిమాండ్ను నిర్ణయించే కారకాలు లేదా అంశాలు :
1. ఆదాయంలో మార్పు :
ప్రజల ఆదాయాల మార్పును బట్టి వస్తువుల డిమాండ్ లో మార్పు ఏర్పడుతుంది. ప్రజల ఆదాయం పెరిగితే వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. ఆదాయాలు తగ్గితే వస్తువుల డిమాండ్ తగ్గుతుంది.

2. అభిరుచులు, అలవాట్లలో మార్పులు :
ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చే మార్పుల వలన వస్తువు డిమాండ్లో మార్పు వస్తుంది.

3. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో మార్పులు :
ప్రజల అభిరుచులలో, అలవాట్లలో మార్పులవల్ల వస్తువు డిమాండ్లో మార్పులు వస్తాయి.

4. జనాభాలో మార్పు :
జనాభా పెరుగుదల, తగ్గుదలను అనుసరించి కూడా వస్తువుల డిమాండ్లో మార్పులు వస్తాయి.

5. వాతావరణంలో మార్పులు :
వాతావరణంలో మార్పులు కూడా డిమాండ్లో మార్పులను తీసుకొని వస్తాయి. ఉదా : వేసవికాలంలో చల్లని పానీయాలకు డిమాండ్ పెరుగుతుంది.

6. సాంకేతికాభివృద్ధి :
సాంకేతికాభివృద్ధి వలన వస్తూత్పత్తి వ్యయం తగ్గి, వస్తు ధరలు తగ్గుతాయి. అందువల్ల పూర్వం కొనుగోలు చేయడానికి ఉపయోగించిన ద్రవ్య పరిమాణంలో వస్తువులను ఎక్కువగా డిమాండ్ చేయటానికి అవకాశం ఉంటుంది.

7. ఆర్థిక స్థితిగతులు :
వాణిజ్య విజృంభణ కాలంలో అన్ని వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. కానీ, ఆర్థిక మాంద్య పరిస్థితులలో అన్ని వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది.

8. ప్రభుత్వ విధానము :
ప్రభుత్వ పన్నుల విధానం, రాయితీ విధానము మొదలైనవి వస్తువు ధర తగ్గితే డిమాండ్ ప్రభావితం చేయును.

9. వస్తువు ధర :
ఒక వస్తువు ధరకు, డిమాండ్కు విలోమ సంబంధం ఉన్నది. కనుక వస్తువు ధర తగ్గితే, డిమాండ్ పెరుగుతుంది. వస్తువు ధర పెరుగుటచే డిమాండ్ తగ్గుతుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 2.
డిమాండ్ సూత్రాన్ని తెలిపి, దాని మినహాయింపులను పరిశీలించండి.
జవాబు.
అర్ధశాస్త్రంలో డిమాండ్ భావనకు చాలా ప్రాధాన్యత ఉన్నది. ఒక వస్తువును కొనాలనే కోరికతోపాటు కొనే శక్తి, కొనాలన్న ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుంది. కనుక డిమాండ్ను ఈ క్రింది విధముగా నిర్వచించవచ్చు. “ఒక నిర్ణీత కాలంలో, నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తు పరిమాణాన్ని ఆ వస్తువుకు లేదా సేవకు ఉన్న డిమాండ్” అని బెన్హామ్ పేర్కొన్నాడు.

ఒక వస్తువుకున్న డిమాండ్ ముఖ్యంగా ఈ క్రింది అంశాలపై ఆధారపడి ఉండును.

  1. వినియోగదారుల అభిరుచులు, అలవాట్లు
  2. వస్తువుల ధరలు
  3. వినియోగదారుల ఆదాయాలు
  4. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలు మొదలైనవి.

డిమాండ్ సూత్రము :
డిమాండ్ సూత్రం వస్తువు ధరకు, డిమాండ్కు గల సంబంధాన్ని తెలియజేస్తుంది. “ఇతర అంశాలు స్థిరంగా ఉంటే, వస్తువు ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది. ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది” అని మార్షల్ డిమాండ్ సూత్రాన్ని నిర్వచించెను. డిమాండ్ సూత్రాన్ని ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చును.
Dn = f

డిమాండ్ పట్టిక :

వస్తువు ధర ₹వస్తువు డిమాండ్ కిలోలలో
1200
2150
3100
450
525

వినియోగదారుడు లేదా వినియోగదారులు ఒక వస్తువును వివిధ ధరల వద్ద ఏ పరిమాణంలో కొనుగోలు చేస్తారో తెలియజేస్తుంది డిమాండ్ పట్టిక. పట్టికననుసరించి వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుందని, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుందని తెలుస్తుంది. దీనిని ఆధారంగా చేసుకొని డిమాండ్ రేఖను గీయవచ్చును.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 1

పై రేఖాపటంలో ‘X’ అక్షముపై వస్తువు డిమాండ్ పరిమాణం, ‘Y’ అక్షముపై వస్తువు ధరను చూపినాము. ‘DD’ డిమాండ్ రేఖ. డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి క్రింది వైపుకు వాలి ఉంది. ఇది ఋణాత్మకమైన వాలు. వస్తువు ధరకు, డిమాండ్కు మధ్య విలోమ సంబంధమున్నదని ఋణాత్మకమైన వాలు తెలియజేస్తుంది.

మినహాయింపులు :
డిమాండ్ సూత్రానికి కొన్ని మినహాయింపులున్నాయి. అవి :

1. గిఫెన్ వైపరీత్యం :
పేద కార్మికులు రొట్టె ధర పెరిగితే మాంసముపై వెచ్చించే డబ్బును కూడా రొట్టెపై ఖర్చు చేస్తారు. అనగా రొట్టె ధర పెరిగినా డిమాండ్ తగ్గదు. ఇది పేదవాళ్ళ ఆహారం కావటమే ఇందుకు కారణము. ఈ సత్యాన్ని సర్ రాబర్ట్ గిఫెన్ అనే ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఆర్థికవేత్త 19వ శతాబ్దం మధ్య భాగంలో పరిశీలించాడు.

కనుక దీనిని గిఫెన్ వైపరీత్యం అంటారు. పేదవారు ముఖ్యంగా నిత్యావసర వస్తువులలో తక్కువ ధర గల వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ ప్రత్యేకమైన వస్తువులనే గిఫెన్ వస్తువులంటారు.
ఉదా : రాగులు, జొన్నలు మొదలైనవి.

2. గౌరవ సూచిక వస్తువులు :
గౌరవ సూచిక వస్తువుల ధర పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. వీటిని కొనుగోలు చేయటం వలన సమాజంలో గౌరవము, ప్రతిష్ఠ పెరుగుతాయని భావిస్తారు. వీటి ధర తగ్గితే గౌరవం, ప్రతిష్ఠ తగ్గుతాయని భావిస్తారు.
ఉదా : విలువ గల వజ్రాలు, ఆభరణాలు మొదలైనవి. ఇది డిమాండ్ సూత్రానికి వ్యతిరేకము. ఈ విషయాన్ని వెబ్లెన్ అనే అమెరికా ఆర్థికవేత్త తెలియజేసెను. అందువల్ల ఇటువంటి వస్తువులను వెబ్లెన్ వస్తువులంటారు.

3. అంచనా వ్యాపారం :
ఒక వస్తువు ధర మరింత పెరగడానికి వ్యాపారస్తులు, కొనుగోలుదారులు ఆ వస్తువును ఎక్కువగా డిమాండ్ చేస్తారు. అదేవిధంగా ధర తగ్గినప్పుడు ఇంకా తగ్గుతుందని భావిస్తే కొనుగోలు తగ్గిస్తారు. దీనినే సట్టా వ్యాపారం అని కూడా అంటారు.
ఉదా : షేర్లు, బాండ్లు.

4. భ్రాంతి :
కొంతమంది వినియోగదారులు కొన్నిసార్లు ఎక్కువ ధర కలిగి ఉన్న వస్తువులు ఎక్కువ నాణ్యతతో కూడి ఉంటాయన్న భ్రాంతిలో ఉంటారు. అందువల్ల ధర ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఇటువంటి వాటి విషయంలో డిమాండ్ సూత్రం వర్తించదు.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 3.
ఆదాయ డిమాండ్, జాత్యంతర డిమాండ్ భావనలను తగిన పటాల సహాయంతో వివరించండి.
జవాబు.
అర్థశాస్త్రంలో డిమాండ్ భావనకు చాలా ప్రాధాన్యత ఉంది. ఒక వస్తువును కొనాలనే కోరిక దానితోపాటు కొనే శక్తి ఈ రెండూ జతకూడినప్పుడే ఆ వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుంది. అందువల్ల “ఒక నిర్ణీత కాలంలో, నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తు పరిమాణాన్ని ఆ వస్తువుకు ఉన్న డిమాండ్” అంటారు.

డిమాండ్ను నిర్ణయించే కారకాలను బట్టి డిమాండ్ను మూడు రకములుగా విభజించవచ్చు.

  1. ధర డిమాండ్
  2. ఆదాయ డిమాండ్
  3. జాత్యంతర డిమాండ్.

1. ధర డిమాండ్ :
ఒక వస్తువు ధరకు, దాని డిమాండ్ పరిమాణానికి గల సంబంధాన్ని తెలియజేయునది ధర డిమాండ్. డిమాండ్ను ప్రభావితంచేసే ఇతర అంశాలలో మార్పులేదనే ప్రమేయంపై ఆధారపడి ధర డిమాండ్ నిర్వచించబడుతుంది. దీనిని ఈ విధంగా చూపవచ్చు.
Dx = f(Px)

2. ఆదాయ డిమాండ్ :
వినియోగదారుని ఆదాయానికి, వస్తువు డిమాండ్కు మధ్యనున్న సంబంధాన్ని ఆదాయ డిమాండ్ అంటారు. వివిధ ఆదాయాల వద్ద వస్తువు డిమాండ్ పరిమాణం ఏ విధంగా ఉందో ఆదాయ డిమాండ్ తెలియజేస్తుంది.
Dy = f(y)

ఇతర అంశాలు మారకుండా స్థిరంగా ఉన్నప్పుడు ఆదాయం పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. ధరకు, ఆదాయంకు ధనాత్మక సంబంధం ఉంది. ఆదాయ డిమాండ్ను అనుసరించి వస్తువులలో మేలురకం లేదా నాసిరకం వస్తువులుగా గుర్తించవచ్చు.

మేలురకం వస్తువులు / సాధారణ వస్తువులు :
ఆదాయం పెరిగితే మేలురకం వస్తువులు లేదా సాధారణ వస్తువుల డిమాండ్ పెరుగుతుంది.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 2

పై రేఖాపటంలో ‘OX’ అక్షంపై డిమాండ్ పరిమాణంను, ‘OY’ అక్షంపై ఆదాయంను తీసుకొన్నాం. ఆదాయం ‘OY’ ఉన్నప్పుడు ‘OQ’ వస్తు పరిమాణం డిమాండ్ చేయబడింది. ఆదాయం ‘OY’ నుంచి ‘OY’ కు పెరిగినప్పుడు మేలురకం వస్తువుల డిమాండ్ ‘0Q’ నుంచి ‘0Q1’ కు పెరిగింది. ‘YD’ రేఖ ధనాత్మక వాలు కలిగి ఉంటుంది.

నాసిరకం వస్తువులు :
మేలురకం వస్తువులకు భిన్నంగా వినియోగదార్ల ఆదాయం పెరిగితే నాసిరకం వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 3

పై రేఖాపటంలో ‘OX’ అక్షం మీద డిమాండ్ పరిమాణాన్ని, ‘OY’ అక్షం మీద ఆదాయంను తీసుకొన్నాం. ఆదాయం ‘OY,’ నుంచి ‘OY’ కు పెరిగినప్పుడు డిమాండ్ పరిమాణం ‘OQ’ నుంచి ‘OQ1‘ కు తగ్గును. ‘YD’ రేఖ ఎడమ నుండి కుడికి వాలి ఉంది.

3. జాత్యంతర డిమాండ్ :
ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలకు, ఒక వస్తువు డిమాండ్కు మధ్య ఉన్న సంబంధాన్ని జాత్యంతర డిమాండ్ అంటారు. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చిన మార్పుల వల్ల ఒక వస్తువు డిమాండ్లో వచ్చే మార్పులను జాత్యంతర డిమాండ్ తెలియజేయును.

జాత్యంతర డిమాండ్ను ఈ విధంగా వ్రాయవచ్చు.
Dx = f(Py).

ప్రత్యామ్నాయ వస్తువులు :
ఒక కోర్కెను తీర్చగల వివిధ వస్తువులను ప్రత్యామ్నాయ వస్తువులు అంటారు. ఉదా : కాఫీ, టీ. ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ ధనాత్మక సంబంధాన్ని తెలియజేయును. దీనిని ఈ క్రింది రేఖాపటం ద్వారా చూపవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 4

పై రేఖాపటంలో కాఫీ ధర ‘OY’ నుంచి ‘OY2‘ కు పెరిగినప్పుడు టీ, డిమాండ్ ‘OQ’ నుండి ‘OQ2‘ కు పెరిగింది. ‘CD’ రేఖ ధనాత్మక వాలును కలిగి ఉంది.

పూరక వస్తువులు : ఒకే కోరికను తీర్చగల సమిష్టి వస్తువులు.
ఉదా : పెట్రోలు, వీటి విషయంలో డిమాండ్ విలోమ సంబంధాన్ని తెలియజేయును.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 5

పై రేఖాపటంలో డిమాండ్ ‘OQ’ నుండి ‘OQ’ కు పెరిగింది. ధర ‘OP’ నుండి ‘OP’ కు తగ్గినప్పుడు ‘CD’ రేఖ ఋణాత్మక వాలు కలిగి ఉంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 4.
డిమాండ్ వ్యాకోచత్వ భావనను నిర్వచించండి. ఆదాయ, జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వాలను వివరించండి.
జవాబు.
ఆర్థికశాస్త్రంలో “డిమాండ్ వ్యాకోచత్వం” అనే భావనకు అధిక ప్రాధాన్యత ఉంది. ధరలో వచ్చిన మార్పుకు అనుగుణంగా డిమాండ్ ఎంత మేరకు మార్పు వస్తుందో డిమాండ్ వ్యాకోచత్వ భావన తెలుపుతుంది.

శ్రీమతి జోన్ రాబిన్సన్ అభిప్రాయంలో “ధరలో వచ్చిన అనుపాతపు మార్పు స్పందనకు బదులుగా డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాత మార్పు ప్రతిస్పందన ఏ మేరకు ఉంటుందో తెలియజేసే భావన డిమాండ్ వ్యాకోచత్వం”.
డిమాండ్ వ్యాకోచత్వం = డిమాండ్లో వచ్చిన అనుపాతపు మార్పు / ధరలో వచ్చిన అనుపాతపు మార్పు

ఈ వ్యాకోచత్వ భావన మూడు రకాలు.

  1. ధర డిమాండ్ వ్యాకోచత్వం
  2. ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం
  3. జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం

ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం :
ఆదాయంలో వచ్చే మార్పు వల్ల డిమాండ్ పరిమాణంలో ఏ మేరకు స్పందన వస్తుందో ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం తెలుపుతుంది. వినియోగదారుని ఆదాయం కొంత శాతం మార్పు చెందినప్పుడు, వస్తువు డిమాండ్ పరిమాణం ఎంత శాతం మార్పు చెందుతుందో ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం తెలియజేయును.

ఈ ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం మేలు రకం వస్తువుల విషయంలో ధనాత్మకంగా, నాసిరకం వస్తువుల విషయంలో రుణాత్మకంగా ఉంటుంది.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 6

జాత్యంతర వ్యాకోచ డిమాండ్ :
ఒక వస్తువుకున్న డిమాండ్ దాని ధరపైనే కాకుండా, దానికున్న ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరపైన కూడా ఆధారపడి ఉంటుంది. ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరల్లో వచ్చే అనుపాతపు మార్పు లేదా శాతం మార్పు ఆ వస్తు డిమాండ్లో ఎంత అనుపాత మార్పు కల్గిస్తుందో జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం తెలియజేయును.

ప్రత్యామ్నాయ వస్తువులైన టీ, కాఫీల విషయంలో ధనాత్మక సంబంధాన్ని, పూరక వస్తువుల విషయాలలో రుణాత్మక సంబంధాన్ని కలిగి ఉంటాయి.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 7

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 5.
ధర డిమాండ్ వ్యాకోచత్వం అంటే ఏమిటి ? ధర డిమాండ్ వ్యాకోచత్వంలోని రకాలను విపులీకరించండి.
జవాబు.
ధర డిమాండ్ వ్యాకోచత్వం అనే భావనను ఆల్ఫ్రెడ్ మార్షల్ అభివృద్ధిపరిచారు. ధర డిమాండ్ వ్యాకోచత్వం అనగా ధరలో వచ్చే అనుపాతపు మార్పువల్ల డిమాండ్లో వచ్చే అనుపాత మార్పు ఎంత ఉంటుందో తెలియజేస్తుంది.
Ep = డిమాండ్లో వచ్చిన మార్పు శాతం / ధరలో వచ్చిన మార్పు శాతం

వ్యాకోచత్వ విలువ ఆధారంగా ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని ఐదు రకాలుగా చెప్పవచ్చు.

  1. పూర్తి వ్యాకోచ డిమాండ్ (Ep = ∝)
  2. పూర్తి అవ్యాకోచ డిమాండ్ (Ep = 0)
  3. ఏకత్వ వ్యాకోచ డిమాండ్ (Ep = 1)
  4. సాపేక్ష వ్యాకోచ డిమాండ్ (Ep = > 1)
  5. సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ (Ep = < 1)

1. పూర్తి వ్యాకోచ డిమాండ్ :
ధరలో స్వల్ప మార్పు వచ్చినా లేదా రాకపోయినా డిమాండ్లో ఊహించలేనంతగా మార్పు కలిగితే దానిని పూర్తి వ్యాకోచ డిమాండ్ అంటారు. దీని వ్యాకోచ విలువ అనంతంగా ఉంటుంది. ఇక్కడ ‘ డిమాండ్ రేఖ ‘X’ అక్షంకు సమాంతరంగా ఉంటుంది.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 8

పై రేఖాపటంలో డిమాండ్ రేఖ ‘X’ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. Ed = ∞.

2. పూర్తి అవ్యాకోచ డిమాండ్ :
ధర పెరిగినా లేదా తగ్గినా డిమాండ్లో ఎలాంటి మార్పు రాకుంటే దానిని పూర్తి అవ్యాకోచ డిమాండ్ అంటారు. దీని విషయంలో వ్యాకోచత్వ విలువ ‘0’ గా ఉంటుంది. డిమాండ్ రేఖ ‘y’ అక్షానికి సమాంతరంగా ఉంటుంది.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 9

‘DD’ రేఖ ‘Y’ అక్షానికి సమాంతరంగా ఉంది. పూర్తి అవ్యాకోచ డిమాండ్ ఉన్నప్పుడు వ్యాకోచత్వం విలువ ‘0’ కు సమానం.
∴ Ed = 0

3. ఏకత్వ వ్యాకోచ డిమాండ్ :
వస్తువు ధరలో వచ్చే అనుపాతపు మార్పుకు, డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పుకు సమానమైతే దానిని ఏకత్వ వ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ డిమాండ్ వ్యాకోచత్వం విలువ ‘1’ కి సమానంగా ఉంటుంది. ఈ డిమాండ్ రేఖ “లంబ అతిపరావలయంగా” ఉంటుంది.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 10

పై రేఖాపటంలో OQ1 = PP1 కి సమానం.
అందువల్ల Ed = 1,

4. సాపేక్ష వ్యాకోచ డిమాండ్ :
వస్తువు ధరలో వచ్చే అనుపాతపు మార్పు కంటే డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పు ఎక్కువగా ఉంటే దానిని సాపేక్ష వ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ వ్యాకోచత్వం విలువ ‘1’
కంటే ఎక్కువగా ఉంటుంది.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 11

పై రేఖాపటంలో ‘DD’ రేఖ సాపేక్ష వ్యాకోచ డిమాండ్ను సూచించు . OQ > PP గా ఉంది. ఇక్కడ వ్యాకోచత్వ విలువ 1 కంటే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల AP కంటే AQ ఎక్కువగా ఉంటుంది.

5. సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ :
వస్తువు ధరలో వచ్చిన అనుపాతపు మార్పు కంటే డిమాండ్ పరిమాణంలో. వచ్చిన అనుపాత మార్పు తక్కువగా ఉంటుంది. దానిని సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ డిమాండ్ వ్యాకోచ విలువ ‘1’ కంటే తక్కువగా ఉంటుంది.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 12

‘DD’ రేఖ సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ను సూచిస్తుంది. ఇక్కడ వ్యాకోచత్వ విలువ ‘1’ కంటే తక్కువగా ఉంటుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 6.
ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్ణయించే అంశాలను (కారకాలను) చర్చించండి.
జవాబు.
ఒక వస్తువు ధరలో మార్పు కలిగినప్పుడు ఏ మేరకు డిమాండ్లో ప్రతిస్పందన వస్తుందో తెలియచేసేదే డిమాండ్ వ్యాకోచత్వము. ధర మార్పు శాతానికి, డిమాండ్లో వచ్చే మార్పు శాతానికి మధ్యగల నిష్పత్తినే వ్యాకోచత్వంగా నిర్వచించ వచ్చును. డిమాండ్ వ్యాకోచత్వము అన్ని వస్తువులకు ఒకే విధంగా ఉండదు. ధర డిమాండ్ వ్యాకోచత్వ స్వభావాన్ని లేదా స్థాయిని ఈ క్రింది అంశాలు నిర్ణయిస్తాయి.

డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్ణయించే కారకాలు :
1. వస్తువు స్వభావము :
వస్తువులలో కొన్ని అవసరాలు, మరికొన్ని సౌకర్యాలు, ఇంకొన్ని విలాసాలు ఉంటాయి. నిత్యావసర వస్తువులకు ధర పెరిగినా, డిమాండ్ తగ్గదు. కనుక వాటికి అవ్యాకోచ డిమాండ్ ఉంటుంది. ఇవి లేకపోతే మానవ మనుగడ కష్టం.

సౌకర్యాలు, విలాసాలకు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఇవి లేకపోయినా ప్రజలు బ్రతకగలరు. కనుక వీటి ధర మార్పు కంటే డిమాండ్లో వచ్చే మార్పు అధికంగా
ఉంటుంది.

2. ప్రత్యామ్నాయ వస్తువులు :
ప్రత్యామ్నాయ వస్తువులు అధిక సంఖ్యలో ఉన్న వస్తువులకు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ప్రత్యామ్నాయ వస్తువులు లేనప్పుడు డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది.

3. కొనుగోలు వాయిదా వేయటానికి అవకాశం :
కొనుగోలును వాయిదా వేయటానికి అవకాశం ఉన్న వస్తువుఁ విషయంలో ధర డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. కొనుగోలును వాయిదా వేయటానికి వీలులేని వస్తువులకు డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది.

4. బహుళ ప్రయోజనాలున్న వస్తువులు :
బొగ్గు, విద్యుచ్ఛక్తి మొదలగు బహుళ ప్రయోజనాలు గల వస్తువులకు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఒకే ప్రయోజనం లేక ఉపయోగం గల వస్తువులకు డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది.

5. కాలము :
స్వల్పకాలంలో డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. దీర్ఘకాలంలో వ్యాకోచత్వం ఎక్కువగా ఉంటుంది.

6. పూరక వస్తువులు :
పూర వస్తువుల విషయంలో డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది.

7. ధరస్థాయి :
ధర స్థాయి ఎక్కువగా ఉంటే వ్యాకోచమైన డిమాండ్ ఉంటుంది. ధర స్థాయి తక్కువగా ఉంటే అవ్యాకోచమైన డిమాండ్ ఉంటుంది.

8. వినియోగదారుని బడ్జెట్ లో వస్తువుకు గల ప్రాధాన్యం :
వినియోగదారుని ఆదాయంలో ఒక వస్తువుపై చేసే ఖర్చు శాతం తక్కువగా ఉంటే డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఆదాయంలో హెచ్చు శాతం ఖర్చు చేసే వస్తువుల విషయంలో డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది.

9. వస్తువు మన్నికపై ఆధారపడును :
మన్నికగల, నిల్వ చేయటానికి వీలైన అనశ్వర వస్తువులపై చేసే డిమాండ్ అవ్యాకోచంగాను, నశ్వర వస్తువులకు డిమాండ్ వ్యాకోచంగాను ఉంటుంది.

10. పేదవారి వస్తువులు :
పేదవారు వినియోగించే వస్తువులకు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఈ వస్తువుల ధరలు తగ్గినపుడు వాటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 7.
ధర డిమాండ్ వ్యాకోచత్వం ప్రాముఖ్యాన్ని విశదీకరించండి.
జవాబు.
ధరలోని మార్పుకు ప్రతిస్పందనగా డిమాండులో ఏమేరకు మార్పు వస్తుందనేది ధర డిమాండు వ్యాకోచత్వం తెలియజేస్తుంది. ధర డిమాండ్ వ్యాకోచత్వం అనే భావనను ఆల్ఫ్రెడ్ మార్షల్’ అనే ఆర్థికవేత్త అభివృద్ధి పరిచాడు.

స్వతంత్ర చలాంకమైన ధరలో వచ్చే మార్పులు ఆధార చలాంకమైన డిమాండ్ పరిమాణంలో కలిగించే మార్పులు ఎప్పుడూ ఇతర కారకాలలో మార్పులు లేకుండా ఉన్నప్పుడు ఒకే రీతిగా ఉండవు.

1. ఉత్పత్తిదార్లకు :
ఉత్పత్తిదార్లు వస్తువులకున్న డిమాండ్ వ్యాకోచత్వాన్ని అనుసరించి ఉత్పత్తి చేస్తారు. ఏ వస్తువులకైతే డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుందో ఆ వస్తువులను ఉత్పత్తి చేస్తారు. ఎందుకంటే అటువంటి వస్తువుల ధరను పెంచి లాభం పొందగలుగుతారు.

2. సమిష్టి వస్తువుల ధర నిర్ణయం :
జంటగా కొన్ని వస్తువులు ఉత్పత్తి చేయబడతాయి.
ఉదా : పంచదార, మొలాసిన్, ఈ వస్తువుల విషయంలో ఒక్కొక్క వస్తువు ఉత్పత్తి వ్యయాన్ని విడదీసి చెప్పడానికి వీలుండదు. అందువల్ల ఈ వస్తువుల ధర నిర్ణయంలో డిమాండ్ వ్యాకోచంగా ఉన్న వాటికి తక్కువ ధరను, అవ్యాకోచంగా ఉన్న వాటికి ఎక్కువ ధర నిర్ణయించడం జరుగుతుంది.

3. ఏకస్వామ్యదార్లు :
ఏకస్వామ్యదార్లు వస్తువుకున్న డిమాండ్ వ్యాకోచత్వం ఆధారంగా ధర నిర్ణయిస్తారు. అవ్యాకోచత్వం ఉన్న వస్తువులకు ఎక్కువ ధరను, వ్యాకోచత్వం ఎక్కువ ఉన్న వస్తువులకు తక్కువ ధరను నిర్ణయిస్తారు.

4. ప్రభుత్వం :
కొన్ని వస్తువులు ప్రజాసంక్షేమాన్ని పెంపొందిస్తాయి. అందువల్ల ఈ వస్తువులకు డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది.
ఉదా : మందులు, రైలు ప్రయాణం మొదలైనవి.

5. ఆర్థిక మంత్రికి :
పన్నులు విధించేటప్పుడు ఆర్థిక మంత్రికి వస్తువులకున్న డిమాండ్ వ్యాకోచత్వం ఉపయోగపడుతుంది. అంతేకాక ఆర్థిక మంత్రికి కోశ విధాన రూపకల్పనలో డిమాండ్ వ్యాకోచత్వ భావన తోడ్పడుతుంది.

6. అంతర్జాతీయ వ్యాపారం :
అంతర్జాతీయ వ్యాపారంలో వివిధ దేశాల మధ్య వస్తువుల మారకపు రేటును నిర్ధారించేటప్పుడు వస్తువులకున్న డిమాండ్ వ్యాకోచత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
ఉదా : ఏ దేశమైనా మూల్యహీనీకరణ ద్వారా ప్రయోజనం పొందాలనుకుంటే ఎగుమతి చేసే వస్తువులకు దిగుమతి చేసుకొంటున్న వస్తువులకు ధర డిమాండ్ వ్యాకోచత్వం ‘1’ కంటే ఎక్కువగా ఉండాలి.

7. పేదరికం :
సంపద మాటున దాగిఉన్న పేదరికంను అర్థం చేసుకోవడానికి డిమాండ్ వ్యాకోచత్వ భావన ఉపయోగపడుతుంది.

8.వేతనాలు :
శ్రామికులకున్న డిమాండ్ వ్యాకోచత్వం వారి వేతనాలను ప్రభావితం చేస్తుంది. అందువల్ల యాజమాన్యం వేతనాలను నిర్ణయించేటప్పుడు శ్రామికులకున్న డిమాండ్ వ్యాకోచత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
డిమాండ్ను నిర్ణయించే కారకాలు ఏమిటి ?
జవాబు.
“ఒక నిర్ణీతమైన కాలంలో, నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తు పరిమాణాన్ని ఆ వస్తువుకు లేదా సేవకు ఉన్న డిమాండ్” అంటారు.
డిమాండ్ను నిర్ణయించే కారకాలు లేదా అంశాలు :

1. ఆదాయంలో మార్పు :
ప్రజల ఆదాయాల మార్పును బట్టి వస్తువుల డిమాండ్లో మార్పు ఏర్పడుతుంది. ప్రజల ఆదాయం పెరిగితే వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. ఆదాయాలు తగ్గితే వస్తువుల డిమాండ్ తగ్గుతుంది.

2. అభిరుచులు, అలవాట్లలో మార్పులు:
ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చే మార్పుల వలన వస్తువు డిమాండ్లో మార్పు వస్తుంది.

3. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో మార్పులు :
ప్రజల అభిరుచులలో, అలవాట్లలో మార్పుల వల్ల వస్తువు డిమాండ్లో మార్పులు వస్తాయి.

4. జనాభాలో మార్పు :
జనాభా పెరుగుదల, తగ్గుదలను అనుసరించి కూడా వస్తువుల డిమాండ్లో మార్పులు వస్తాయి.

5. వాతావరణంలో మార్పులు :
వాతావరణంలో మార్పులు కూడా డిమాండ్లో మార్పులను తీసుకొని వస్తాయి.
ఉదా : వేసవికాలంలో చల్లని పానీయాలకు డిమాండ్ పెరుగుతుంది.

6. సాంకేతికాభివృద్ధి :
సాంకేతికాభివృద్ధి వలన వస్తూత్పత్తి వ్యయం తగ్గి, వస్తు ధరలు తగ్గుతాయి. అందువల్ల పూర్వం కొనుగోలు చేయడానికి ఉపయోగించిన ద్రవ్య పరిమాణంలో వస్తువులను ఎక్కువగా డిమాండ్ చేయటానికి అవకాశం ఉంటుంది.

7. ఆర్థిక స్థితిగతులు :
వాణిజ్య విజృంభణ కాలంలో అన్ని వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. కానీ, ఆర్థిక మాంద్య పరిస్థితులలో అన్ని వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది.

8. ప్రభుత్వ విధానము :
ప్రభుత్వ పన్నుల విధానం, రాయితీ విధానము మొదలైనవి వస్తువు ధర తగ్గితే డిమాండ్ ప్రభావితం చేయును.

9. వస్తువు ధర :
ఒక వస్తువు ధరకు, డిమాండ్కు విలోమ సంబంధం ఉన్నది. కనుక వస్తువు ధర తగ్గితే, డిమాండ్ పెరుగుతుంది. వస్తువు ధర పెరుగుటచే డిమాండ్ తగ్గుతుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 2.
డిమాండ్ సూత్రాన్ని వివరించండి.
జవాబు.
అర్థశాస్త్రంలో డిమాండ్ భావనకు చాలా ప్రాధాన్యత ఉన్నది. ఒక వస్తువును కొనాలనే కోరికతోపాటు కొనేశక్తి, కొనాలన్న ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుంది. కనుక డిమాండును ఈ క్రింది విధముగా నిర్వచించవచ్చు. “ఒక నిర్ణీత కాలంలో, నిర్ణీతమైన ధరవద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తువు పరిమాణాన్ని ఆ వస్తువుకు లేదా సేవకు ఉన్న డిమాండ్” అని బెన్హామ్ పేర్కొన్నాడు.

ధర డిమాండ్-డిమాండ్ సూత్రము :
డిమాండ్ సూత్రం వస్తువు ధరకు, డిమాండ్కు గల సంబంధాన్ని తెలియజేస్తుంది. “ఇతర అంశాలు స్థిరముగా ఉంటే, వస్తువు ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది. ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది.” అని మార్షల్ డిమాండ్ సూత్రాన్ని నిర్వచించెను. డిమాండ్ సూత్రాన్ని ఈ విధంగా పేర్కొనవచ్చును.
Dn = f[Pn]

వస్తువు ధర ₹

వస్తువు డిమాండ్ కిలోలలో

1

200

2

150
3

100

4

50
5

25

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 13

వినియోగదారుడు లేదా వినియోగదారులు ఒక వస్తువును వివిధ ధరల వద్ద ఏ పరిమాణంలో కొనుగోలు చేస్తారో తెలియజేస్తుంది డిమాండ్ పట్టిక. పట్టిక నుంచి వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుందని, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుందని తెలుస్తుంది. దీనిని ఆధారంగా చేసుకొని డిమాండ్ రేఖను గీయవచ్చును.

డిమాండ్ రేఖ :
పటములో X – అక్షముపై వస్తువు డిమాండ్ పరిమాణం, Y- అక్షముపై వస్తువు ధరను చూపినాము. DD డిమాండ్ రేఖ. డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి క్రిందివైపుకు వాలి ఉంది. ఇది ఋణాత్మకమైన వాలు. వస్తువు ధరకు, డిమాండ్కు మధ్య విలోమ సంబంధమున్నదని ఋణాత్మకమైన వాలు తెలియజేస్తుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 3.
డిమాండ్ సూత్రానికి మినహాయింపులను విపులీకరించండి.
జవాబు.
డిమాండ్ సూత్రం ప్రకారం వస్తు ధరకు, డిమాండ్కు విలోమ సంబంధాన్ని కలిగి ఉంటాయి. కాని కొన్ని పరిస్థితులలో ధర, డిమాండ్ అనులోమ సంబంధాన్ని కలిగి ఉంటాయి. అంటే ధర పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. ధర తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. ఈ పరిస్థితి డిమాండ్ సూత్రానికి మినహాయింపు.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 14

ధర ‘OP’ ఉన్నప్పుడు ‘OQ’ వస్తు పరిమాణం డిమాండ్ ధర చేయ కింది. ధర ‘OP’ నుంచి OP1 కు పెరగగా డిమాండ్ OQ1 కు పెరిగింది. ఈ పరిస్థితి డిమాండ్ సూత్రానికి విరుద్ధం.

మినహాయింపులు :
1. గిఫెన్ వైపరీత్యం :
పేద కార్మికులు రొట్టె ధర పెరిగితే మాంసముపై వెచ్చించే డబ్బును కూడా రొట్టెపై ఖర్చు చేస్తారు. అనగా రొట్టె ధర పెరిగినా డిమాండ్ తగ్గదు. ఇది పేదవాళ్ళ ఆహారం కావటమే ఇందుకు కారణము. ఈ సత్యాన్ని సర్ రాబర్ట్ గిఫెన్ అనే ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఆర్థికవేత్త 19వ శతాబ్దం మధ్య భాగంలో పరిశీలించాడు.

కనుక దీనిని గిఫెన్ వైపరీత్యం అంటారు. పేదవారు ముఖ్యంగా నిత్యావసర వస్తువులలో తక్కువ ధర గల వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ ప్రత్యేకమైన వస్తువులనే గిఫెన్ వస్తువులంటారు.
ఉదా : రాగులు, జొన్నలు మొదలైనవి.

2. గౌరవ సూచిక వస్తువులు :
గౌరవ సూచిక వస్తువుల ధర పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. వీటిని కొనుగోలు చేయటం వలన సమాజంలో గౌరవము, ప్రతిష్ఠ పెరుగుతాయని భావిస్తారు. వీటి ధర తగ్గితే గౌరవం, ప్రతిష్ఠ తగ్గుతాయని భావిస్తారు.
ఉదా : విలువ గల వజ్రాలు, ఆభరణాలు మొదలైనవి. ఇది డిమాండ్ సూత్రానికి వ్యతిరేకము. ఈ విషయాన్ని వెబ్లెన్ అనే అమెరికా ఆర్థికవేత్త తెలియజేసెను. అందువల్ల ఇటువంటి వస్తువులను వెబ్లెన్ వస్తువులంటారు.

3. అంచనా వ్యాపారం :
ఒక వస్తువు ధర మరింత పెరగడానికి వ్యాపారస్తులు, కొనుగోలుదారులు ఆ వస్తువును ఎక్కువగా డిమాండ్ చేస్తారు. అదే విధంగా ధర తగ్గినప్పుడు ఇంకా తగ్గుతుందని భావిస్తే కొనుగోలు తగ్గిస్తారు. దీనినే సట్టా వ్యాపారం అని కూడా అంటారు.
ఉదా : షేర్లు, బాండ్లు మొదలైనవి.

4. భ్రాంతి :
కొంతమంది వినియోగదారులు కొన్నిసార్లు ఎక్కువ ధర కలిగి ఉన్న వస్తువులు ఎక్కువ నాణ్యతతో కూడి ఉంటాయన్న భ్రాంతిలో ఉంటారు. అందువల్ల ధర ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఇటువంటి వాటి విషయంలో డిమాండ్ సూత్రం వర్తించదు.

ప్రశ్న 4.
డిమాండ్ రేఖ ఋణాత్మక వాలుకు గల కారణాలను విపులీకరించండి.
జవాబు.
ఒక నిర్ణీత కాలంలో, నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తువు పరిమాణాన్ని డిమాండ్ అంటారు. పరిస్థితులు మారకుండా స్థిరంగా ఉన్నప్పుడు ఒక నిర్ణీత కాలంలో ఒక వస్తువు ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది.” అని డిమాండ్ సూత్రం తెలియజేస్తుంది. దీనిని బట్టి వస్తువు ధరకు, డిమాండు విలోమ సంబంధం ఉందని తెలుస్తుంది. కనుక డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి క్రిందివైపుకు వాలి ఉంటుంది. దీనికి అనేక కారణాలున్నాయి. అవి :

1. క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం:
క్షీణోపాంత ప్రయోజనాన్ని ఆధారంగా చేసుకొని డిమాండ్ సూత్రం చెప్పబడినది. వస్తువు పరిమాణం ఎక్కువైతే ఉపాంత ప్రయోజనం తగ్గుతుంది. ఉపాంత ప్రయోజనం తక్కువగా ఉంటే వినియోగదారుడు ఆ వస్తువుకు ధర చెల్లించాలనుకున్నాడు. అందువల్ల ధర తక్కువగా ఉంటే ఎక్కువగానూ, ధర ఎక్కువగా ఉంటే తక్కువగాను వస్తు పరిమాణాన్ని బట్టి డిమాండ్ చేస్తాడు.

2. ఆదాయ ప్రభావము :
ఒక వస్తువు ధర పెరిగితే వినియోగదారుని వాస్తవిక ఆదాయం ధర పెరిగిన మేరకు తగ్గుతుంది. అందువల్ల వాస్తవిక ఆదాయం తగ్గినమేరకు ఆ వస్తువును తక్కువ పరిమాణంలో డిమాండ్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఒక వస్తువు ధర తగ్గితే ధర తగ్గిన మేరకు వాస్తవిక ఆదాయం పెరిగినట్లే అవుతుంది. కనుక ఆ మేరకు డిమాండ్ పెరుగుతుంది. దీనినే డిమాండ్పై ఆదాయ ప్రభావం అంటారు.
ఉదా : ఒక వస్తువుకు వినియోగదారుడు 5 రూపాయలు కేటాయిస్తే వస్తువు ధర ఒక రూపాయిగా ఉంటే 5 యూనిట్లు కొనుగోలు చేస్తాడు. వస్తువు ధర అర్థ రూపాయికి తగ్గితే 10 యూనిట్లను కొనుగోలు చేస్తారు.

3. ప్రత్యామ్నాయాల ప్రభావం :
రెండు వస్తువులు ప్రత్యామ్నాయ వస్తువులు అయితే ఒక వస్తువు ధర తగ్గి | మరొక వస్తువు ధర స్థిరంగా ఉంటే ధర తగ్గిన వస్తువుకు, ధర స్థిరంగా ఉన్న వస్తువుకు బదులుగా ప్రత్యామ్నాయం చేస్తారు.
ఉదా : పెప్సి, థమ్సప్ శీతల పానీయాలు. పెప్సి ధర పెరిగితే వినియోగదార్లు దానికి ప్రత్యామ్నాయంగా థమ్సప్ కొనుగోలు చేస్తారు.

4. పాత, నూతన కొనుగోలుదార్లు :
ఒక వస్తువు ధర తగ్గగానే ముందు నుంచి ఆ వస్తువును కొనుగోలు చేస్తున్న పాత వినియోగదారుల వాస్తవిక ఆదాయం పెరిగి ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా ఒక వస్తువు ధర తగ్గినప్పుడు ఆకర్షితులైన కొత్త వినియోగదార్లు ఆ వస్తువును ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అందువల్ల ధర తగ్గినప్పుడు వస్తువుకు డిమాండ్ పెరుగుతుంది.

5. వస్తువుకున్న బహుళ ఉపయోగాలు :
కొన్ని వస్తువులకు బహుళ ఉపయోగాలుంటాయి. మరికొన్ని వస్తువులు ఒక ప్రత్యేకమైన ఉపయోగానికి మాత్రమే వినియోగించబడతాయి. అనేక ఉపయోగాలున్న వస్తువులకు ధర తగ్గితే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
ఉదా : పాలు, బొగ్గు, విద్యుచ్ఛక్తి మొదలైనవి.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 5.
ఆదాయ డిమాండ్ భావనను చర్చించండి.
జవాబు.
వినియోగదారుని ఆదాయానికి, వస్తువు డిమాండ్కు మధ్యనున్న సంబంధాన్ని ఆదాయ డిమాండ్ అంటారు. వివిధ ఆదాయాల వద్ద వస్తువు డిమాండ్ పరిమాణం ఏవిధంగా ఉందో ఆదాయ డిమాండ్ తెలియజేస్తుంది.
Dx = f(y)
ఇతర అంశాలు మారకుండా స్థిరంగా ఉంటే ఆదాయం పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. ధరకు, ఆదాయంకు ధనాత్మక సంబంధం ఉంది. ఆదాయ డిమాండును అనుసరించి వస్తువులలో |మేలురకం లేదా నాసిరకం వస్తువులుగా గుర్తించవచ్చు.

మేలురకం వస్తువులు / సాధారణ వస్తువులు:
ఆదాయం పెరిగితే మేలురకం వస్తువులు లేదా సాధారణ వస్తువుల డిమాండ్ పెరుగుతుంది.
ప్రక్క రేఖాపటంలో ‘OX’ అక్షంపై డిమాండ్ పరిమాణంను, ‘OY’ అక్షంపై ఆదాయంను తీసుకొన్నాం. ఆదాయం ‘OY’ ‘ ఉన్నప్పుడు ‘0Q’ వస్తు పరిమాణం డిమాండ్ చేయబడింది. ఆదాయం ‘OY’ నుంచి ‘OY’ కు పెరిగినప్పుడు మేలురకం వస్తువుల డిమాండ్ ‘0Q’ నుంచి ‘001’ కు పెరిగింది. ‘YD’ రేఖ ధనాత్మక వాలు కలిగి ఉంటుంది.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 15

నాసిరకం వస్తువులు :
మేలురకం వస్తువులకు భిన్నంగా వినియోగదార్ల ఆదాయం పెరిగితే నాసిరకం వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది. ప్రక్క రేఖాపటంలో ‘OX’ అక్షం మీద డిమాండ్ పరిమాణాన్ని, ‘OY’ అక్షం మీద ఆదాయంను తీసుకొన్నాం. ఆదాయం ‘OY’ నుంచి ‘OY1‘ కు పెరిగినప్పుడు డిమాండ్ ‘OQ’ నుంచి ‘OQ1‘ కు తగ్గును. ‘OD’ రేఖ ఎడమ నుండి కుడికి వాలి ఉంది.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 16

ప్రశ్న 6.
జాత్యంతర డిమాండ్ భావనను వివరించండి.
జవాబు.
ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలకు, ఒక వస్తువు డిమాండ్కు మధ్య ఉన్న సంబంధాన్ని జాత్యంతర డిమాండ్ అంటారు. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చిన మార్పుల వల్ల ఒక వస్తువు డిమాండ్లో వచ్చే మార్పులను జాత్యంతర డిమాండ్ తెలియజేయును.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 17

జాత్యంతర డిమాండ్ను ఈ విధంగా వ్రాయవచ్చు.
Dx = f(Py).

ప్రత్యామ్నాయ వస్తువులు : ఒక కోర్కెను తీర్చగల వివిధ వస్తువులను ప్రత్యామ్నాయ వస్తువులు అంటారు.
ఉదా : కాఫీ, టీ. ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ ధనాత్మక సంబంధాన్ని తెలియజేయును. దీనిని రేఖాపటం ద్వారా చూపవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 18

పై రేఖాపటంలో కాఫీ ధర ‘OY’ నుంచి ‘OY,’ కు పెరిగినప్పుడు టీ డిమాండ్ ‘OQ’ నుండి ‘OQ్క’ కు పెరిగింది. ‘CD’ రేఖ ధనాత్మక వాలును కలిగి ఉంది.
పూరక వస్తువులు : ఒకే కోరికను తీర్చగల సమిష్టి వస్తువులు.
ఉదా : కారు, పెట్రోలు, వీటి విషయంలో డిమాండ్ విలోమ సంబంధాన్ని తెలియజేయును.

ప్రక్క రేఖాపటంలో డిమాండ్ ‘OQ’ నుండి ‘OQ2‘ కు పెరిగింది. ధర ‘OP’ నుండి ‘OP2‘ కు తగ్గినప్పుడు ‘CD’ రేఖ ఋణాత్మక వాలు కలిగి ఉంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 7.
డిమాండ్ వ్యాకోచత్వం అంటే ఏమిటి ?
జవాబు.
అర్థశాస్త్రంలో డిమాండ్ వ్యాకోచత్వం అనే భావనకు విశేష ప్రాధాన్యత ఉంది. ధరలో వచ్చిన మార్పుకు ప్రతిస్పందనగా డిమాండ్లో ఎంత మేరకు మార్పు వస్తుందో డిమాండ్ వ్యాకోచత్వ భావన తెలుపుతుంది. ఒక వస్తువు ధరలో వచ్చిన అనుపాతపు మార్పు వల్ల డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పు ఎంత ఉంటుందో డిమాండ్ వ్యాకోచత్వ భావన తెలియజేయును.

అంటే ధరలో వచ్చే శాతం మార్పుకు, డిమాండ్లో వచ్చే శాతం మార్పుకు మధ్య ఉన్న సంఖ్యాత్మక సంబంధాన్ని డిమాండ్ వ్యాకోచత్వం తెలుపుతుంది. డిమాండ్ వ్యాకోచత్వం అనే భావనను కీరనీట్, మిల్ రూపొందించినప్పటికీ, మార్షల్ అభివృద్ధిపరిచారు.

మార్షల్ అభిప్రాయంలో “ధర తగ్గినప్పుడు డిమాండ్ ఎక్కువ పెరిగిందా లేదా తక్కువ పెరిగిందా, ధర పెరిగినప్పుడు డిమాండ్ తక్కువ తగ్గిందా లేదా ఎక్కువ తగ్గిందా అనే దాని ఆధారంగా మార్కెట్ డిమాండ్ వ్యాకోచత్వం ఎక్కువగాని, తక్కువగాని ఉంటుంది.”

శ్రీమతి జోన్ రాబిన్సన్ అభిప్రాయంలో “ధరలో వచ్చే అనుపాత మార్పు స్పందనకు బదులుగా డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పుకు ప్రతిస్పందన ఏ మేరకు ఉంటుందో తెలియజేసే భావన డిమాండ్ వ్యాకోచత్వం”.

డిమాండ్ వ్యాకోచత్వం = డిమాండ్లో వచ్చిన అనుపాతపు మార్పు / ధరలో వచ్చిన అనుపాతపు మార్పు

డిమాండ్ వ్యాకోచత్వాన్ని మూడు రకాలుగా చెబుతారు. అవి :

  1. ధర డిమాండ్ వ్యాకోచత్వం
  2. ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం
  3. జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 8.
ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్వచించండి.
జవాబు.
ఇతర కారకాలలో ఎలాంటి మార్పులు లేవనే ప్రమేయంతో, ఒక వస్తువు ధరలో వచ్చే అనుపాతపు మార్పు వల్ల డిమాండ్లో వచ్చే అనుపాతపు మార్పు ఎంత ఉంటుందో ధర డిమాండ్ వ్యాకోచత్వ భావన తెలియజేస్తుంది. ధర కొంత శాతం మార్పు చెందినప్పుడు వస్తువు డిమాండ్ పరిమాణం ఎంత శాతం మార్పు చెందుతుంది అనే దాన్ని ధర డిమాండ్ వ్యాకోచత్వం తెలియజేస్తుంది.

వస్తువు ధర పెరిగితే డిమాండ్ పరిమాణం తగ్గుతుంది. అయితే అన్ని సందర్భాల్లో ధరలో వచ్చిన మార్పు ఫలితంగా డిమాండ్లో వచ్చే ప్రతిస్పందన ఒకే రీతిగా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ధరలో వచ్చిన స్వల్ప మార్పు వల్ల డిమాండ్లో గణనీయమైన మార్పులు సంభవిస్తాయి.

ఈ పరిస్థితిని వ్యాకోచ డిమాండ్ అంటారు. మరి కొన్నిసార్లు ధరలో గణనీయమైన మార్పులు సంభవించినప్పటికీ డిమాండ్లో స్వల్ప మార్పులు మాత్రమే రావచ్చు. ఈ పరిస్థితిని అవ్యాకోచ డిమాండ్ అంటారు. వ్యాకోచత్వ విలువ ఆధారంగా ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని అయిదు రకాలుగా చెప్పవచ్చు.

ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలవడానికి ప్రొఫెసర్ మార్షల్ కింది సమీకరణాన్ని రూపొందించాడు.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 19

ఇచ్చట, Ed = ధర డిమాండ్ వ్యాకోచత్వం
Q = వస్తువు డిమాండ్
ΔQ = వస్తువు డిమాండ్లో వచ్చిన మార్పు
P = వస్తువు (ప్రారంభ) ధర
ΔP = వస్తువు ధరలో వచ్చిన మార్పు.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 9.
ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్ణయించే ముఖ్య అంశాలు (కారకాలు) ఏమిటి ?
జవాబు.
ఒక వస్తువు డిమాండ్ వ్యాకోచత్వంగా ఉందా లేదా అవ్యాకోచంగా ఉందా అనే విషయాన్ని సులభంగా చెప్పలేం. ఎందుకంటే ఒక వస్తువుకు ఒక ప్రాంతంలో, ఒక వ్యక్తికి ఒక కాలంలో వ్యాకోచ డిమాండ్ ఉండవచ్చు. అదే వస్తువుకు మరో ప్రాంతంలో, మరో వ్యక్తికి మరో కాలంలో అవ్యాకోచ డిమాండ్ ఉంటుంది. వ్యాకోచత్వం విలువను అనేక అంశాలు నిర్ణయిస్తాయి. ఒక వస్తువుకున్న డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్ణయించే కొన్ని అంశాలను కింద పేర్కొన్నాం.

1. వస్తువు స్వభావం :
వస్తువు స్వభావం ఆధారంగా డిమాండ్ వ్యాకోచత్వం మారుతూ ఉంటుంది. నిత్యావసర వస్తువులైన బియ్యం, ఉప్పు, పప్పులు, పంచదార మొదలైన వాటికి డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. ఆ వస్తువుల ధరలు మారినా డిమాండ్ మారదు. అలాగే విలాస వస్తువులైన బంగారం, డైమండ్స్ మొదలైన వాటికి డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది.

2. ప్రత్యామ్నాయాల (Substitutes) లభ్యత :
ఒక వస్తువుకున్న డిమాండ్ను దానికున్న ప్రత్యామ్నాయాల ధరలు కొంతమేరకు ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు కోల్గేట్ ధర పెరిగితే క్లోజప్కు డిమాండ్ పెరుగుతుంది. అట్లాగే కోల్గేట్ ధర తగ్గితే క్లోజపు డిమాండ్ తగ్గుతుంది. ఒక వస్తువుకు ఎక్కువ సంఖ్యలో ప్రత్యామ్నాయాలు ఉన్నప్పుడు ఆ వస్తువుకు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఏ వస్తువుకైతే ప్రత్యామ్నాయ వస్తువులు తక్కువగా ఉంటాయో అది అవ్యాకోచ డిమాండ్ను కలిగి ఉంటుంది.

3. పూరక (Complementaries) వస్తువులు :
కోరికలను సంతృప్తి పరచుకోవడానికి కొన్ని వస్తువులను కలిపి ఉపయోగించవలసి ఉంటుంది. ఉదాహరణకు, కారు ఇంధనం.
ఉదా : కారు ధర పెరిగితే ఇంధనానికి డిమాండ్ తగ్గుతుంది. అట్లాగే కారు ధర తగ్గితే ఇంధనానికి డిమాండ్ పెరుగుతుంది. కార్ల డిమాండ్ వ్యాకోచంగా ఉంటే ఇంధనం డిమాండ్ కూడా వ్యాకోచంగా ఉంటుంది. అలాగే కార్ల డిమాండ్ అవ్యాకోచంగా ఉంటే ఇంధనం డిమాండ్ కూడా అవ్యాకోచంగా ఉంటుంది.

4. వస్తువుకు ఉన్న బహుళ ఉపయోగాలు :
ఏ వస్తువుకైతే బహుళ ఉపయోగాలు ఉంటాయో, ఆ వస్తువుకు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఎందుకంటే ధర తగ్గినప్పుడు ఆ వస్తువును అనేక ఉపయోగాలకు వాడుకోవచ్చని ఎక్కువగా కొంటారు. ధర పెరిగినప్పుడు ఆ వస్తువును ఒక ప్రత్యేక ఉపయోగానికి మాత్రమే పరిమితం చేసి తక్కువగా కొంటారు.

ఉదాహరణకు పాలు, బొగ్గు, విద్యుచ్ఛక్తి, పాల ధరలు తక్కువగా ఉన్నప్పుడు పాలను ఎక్కువగా కొనుగోలు చేసి పెరుగు, క్రీమ్, నెయ్యి, స్వీట్స్ మొదలైన ఉపయోగాలకు వాడతారు. అందుకు భిన్నంగా, ధర ఎక్కువగా ఉన్నప్పుడు పాలను చిన్న పిల్లలు, వృద్ధులకు ఆహారంగా మాత్రమే వాడతారు, ఇతర ఉపయోగాలకు తగ్గిస్తారు.

5. వినియోగాన్ని వాయిదా వేయగలగడం :
ఒక వస్తువు వినియోగాన్ని వాయిదా వేయడానికి వీలున్నట్లయితే ఆ వస్తువు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఉదాహరణకు వాహనాలు, నగలు, AC యూనిట్ల కొనుగోలు వాయిదా వేయగలం. మరికొన్ని వస్తువుల వినియోగాన్ని వాయిదా వేయలేం. ఉదాహరణకు ప్రాణరక్షణ మందులు. వీటి ధర పెరిగినా వినియోగాన్ని వాయిదా వేయలేం. ఈ వస్తువుల డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది.

6. ఆదాయంలో వస్తువుపై ఖర్చు పెట్టే అనుపాతం :
వినియోగదారులు మొత్తం ఆదాయం నుంచి ఏ వస్తువులపై తక్కువ అనుపాతంలో ఖర్చు చేస్తారో ఆ వస్తువుల ధర, డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. ఉదాహరణకు, ఉప్పు, వార్తాపత్రికలు మొదలైనవి. ఆదాయంలో ఎక్కువ భాగం ఏ వస్తువుల వినియోగంపై ఖర్చు చేస్తారో వాటి డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఉదాహరణకు ఎయిర్ కండిషనర్స్, వాహనాలు.

7. కాలం :
స్వల్ప కాలంలో వస్తువులు అవ్యాకోచ డిమాండు, దీర్ఘ కాలంలో వ్యాకోచ డిమాండ్ను కలిగి ఉంటాయి. ఎందుకంటే స్వల్ప కాలంలో వస్తువుల ధరలు పెరిగిన తక్షణమే ప్రత్యామ్నాయ వస్తువులను తయారు చేయలేం. ఉదాహరణకు స్వల్ప కాలంలో పెట్రోలు ధర పెరిగిన తక్షణమే పెట్రోలు ఇంజన్లకు ప్రత్యామ్నాయంగా డీజిల్ ఇంజన్లు తయారు చేయలేరు. కానీ దీర్ఘకాలంలో డీజిల్ ఇంజన్లు తయారు చేయగలరు.

8. ధరల స్థాయి :
వస్తువుల ధరలు చాలా ఎక్కువగా లేదా చాలా తక్కువగా ఉన్నా డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. అదే వస్తువుల ధరలు సాధారణ స్థాయిలో ఉంటే వాటి డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది.

9. వ్యసనానికి దోహదపడే వస్తువులు :
కొన్ని వస్తువుల వినియోగం వ్యసనానికి దారితీస్తుంది. ఆ వస్తువుల ధర పెరిగినప్పటికీ వాటిని వినియోగించాలనే కోరిక బలంగా ఉంటుంది. అందువల్ల ఈ వస్తువుల డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది.
ఉదా : పొగాకు, ఆల్కహాల్.

10. ఆదాయ వర్గాలు :
అధిక ఆదాయ వర్గానికి చెందిన వినియోగదార్లు కొనుగోలు చేసే వస్తువులకు డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. ఎందుకంటే వీరు ధర పెరిగినా వస్తువులను కొనగలరు. అల్ప, మధ్య ఆదాయ వర్గాలకు చెందినవారు కొనుగోలు చేసే వస్తువులకు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ధర పెరిగితే వీరు వస్తువులను కొనలేరు. ఒక వస్తువుకు వ్యాకోచ డిమాండ్ ఉందా లేదా అవ్యాకోచ డిమాండ్ ఉందా అనేది చెప్పడం కష్టం.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 10.
ధర డిమాండ్ వ్యాకోచత్వ ప్రాధాన్యతను వివరించండి.
జవాబు.
వ్యాపార సంస్థలు, వ్యాపారస్తులు, ప్రభుత్వం ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి నిర్ణయాలు తీసుకొనేటప్పుడు ధర డిమాండ్ వ్యాకోచత్వ భావన ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. డిమాండ్ వ్యాకోచత్వం ఎక్కువగా ఉపయోగపడే రంగాలను కొన్నింటిని కింద చూడవచ్చు.

1. ఏకస్వామ్య మార్కెట్ :
వివిధ మార్కెట్లలో డిమాండ్ వ్యాకోచత్వం వేరుగా ఉంటే దీన్ని బట్టి ఏకస్వామ్యదారుడు వివిధ ధరలను నిర్ణయిస్తాడు. వ్యాపారస్తులు వస్తువులకు ధర నిర్ణయించేటప్పుడు ఆ వస్తువుకున్న ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.

ఏకస్వామ్యదార్లు వస్తువుకున్న డిమాండ్ వ్యాకోచత్వం ఆధారంగా ధర నిర్ణయిస్తారు. వ్యాకోచత్వం ఎక్కువగా ఉన్న మార్కెట్లో వస్తువులకు తక్కువ ధరను, అవ్యాకోచత్వం ఉన్న మార్కెట్లో వస్తువులకు ఎక్కువ ధరను నిర్ణయిస్తారు.

2. సంయుక్త (Joint) వస్తువుల ధర నిర్ణయం :
జంటగా కొన్ని వస్తువులు ఉత్పత్తి చేయబడతాయి. ఉదాహరణకు మాంసం, ఉన్ని, పంచదార, మొలాసిస్. ఈ వస్తువుల విషయంలో ఒక్కొక్క వస్తువు ఉత్పత్తి వ్యయాన్ని విడదీసి చెప్పడానికి వీలుండదు. ఈ వస్తువుల ధర నిర్ణయంలో డిమాండ్ వ్యాకోచంగా ఉన్న వాటికి తక్కువ ధరను, అవ్యాకోచంగా ఉన్న వాటికి ఎక్కువ ధరను నిర్ణయించడం జరుగుతుంది.

3. ప్రభుత్వం :
కొన్ని వస్తువులు ప్రజా సంక్షేమాన్ని పెంపొందిస్తాయి. సాధారణంగా ఈ వస్తువులకు డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ వస్తూత్పత్తి పరిశ్రమలను ప్రజోపయోగాలుగా ప్రకటిస్తుంది. ఇందుకు మంచి ఉదాహరణగా రైల్వేలని చెప్పవచ్చు.

4. అంతర్జాతీయ వ్యాపారం :
రెండు దేశాల మధ్య వ్యాపారం జరగాలంటే రెండు దేశాల వస్తువులకున్న డిమాండ్ వ్యాకోచత్వాన్ని చూడాలి. అంతర్జాతీయ వ్యాపారంలో వివిధ దేశాల మధ్య వస్తువుల మారకపు రేటును నిర్ధారించేటప్పుడు వస్తువులకున్న డిమాండ్ వ్యాకోచత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.

5. వస్తువులపై పన్ను విధింపు :
ప్రభుత్వం తన రాబడిని పెంచుకోవడానికి సాధారణంగా పన్నులను విధిస్తుంది. పన్నులను విధించేటప్పుడు ఆర్థికమంత్రికి వస్తువులకున్న డిమాండ్ వ్యాకోచత్వ భావన ఉపయోగపడుతుంది. అంటే డిమాండ్ అవ్యాకోచంగా ఉన్న వస్తువులను ఎన్నుకొని ఎక్కువ పన్నులను విధిస్తారు.

6. వేతనాల నిర్ణయం :
శ్రామికులకున్న డిమాండ్ వ్యాకోచత్వం వారి వేతనాలను ప్రభావితం చేస్తుంది. వీరికున్న డిమాండ్ అవ్యాకోచంగా ఉంటే వేతనాల పెంపుదలకు కార్మిక సంఘాల ప్రయత్నం సఫలం అవుతాయి. శ్రామికులకున్న డిమాండ్ వ్యాకోచంగా ఉంటే వేతనాల పెంపుదలకు కార్మిక సంఘాల ప్రయత్నం విఫలం కావచ్చు.

7. సంపద మాటున దాగి ఉన్న పేదరికం :
సంపద మాటున దాగి ఉన్న పేదరికం అనే వైపరీత్యాన్ని అర్థం చేసుకోవడానికి డిమాండ్ వ్యాకోచత్వ భావన ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, ఆహార ధాన్యాలు బాగా పండితే రైతులు అధిక ఆదాయాన్ని పొందాలి. ఆహార ధాన్యాలు సమృద్ధిగా పండినప్పటికీ వాటికి ఉన్న డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. అందువల్ల ఆహార ధాన్యాల డిమాండ్ స్థిరంగా ఉండి, సరఫరా పెరిగినందువల్ల వాటికి తక్కువ ధర నిర్ణయించబడుతుంది.

8. వస్తూత్పత్తి నిర్ణయం :
‘ఉత్పత్తిదార్లు’ వస్తువులకున్న డిమాండ్ వ్యాకోచత్వాన్ని అనుసరించి ఉత్పత్తి చేస్తారు. ఏ వస్తువులకైతే డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుందో ఆ వస్తువులను ఉత్పత్తి చేస్తారు. ఎందుకంటే వాటి ధరలను పెంచి లాభం పొందగలుగుతారు. కాబట్టి ఉత్పత్తి ఎంత చేయాలని నిర్ణయించడానికి వ్యాకోచత్వ భావన తోడ్పడుతుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 11.
ఆదాయ, జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వాలను విశదీకరించండి.
జవాబు.
అర్థశాస్త్ర సిద్ధాంతాల్లో ‘డిమాండ్ వ్యాకోచత్వం’ అనే భావనకు విశేష ప్రాధాన్యత ఉంది. డిమాండ్ను నిర్ణయించే ఒక అంశంలో వచ్చిన మార్పు శాతానికి ప్రతిస్పందనగా డిమాండ్లో ఎంత శాతం మేరకు మార్పు వస్తుందో డిమాండ్ వ్యాకోచత్వ భావన తెలుపుతుంది.

వస్తువు ధర, ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలు, వినియోగదారుని ఆదాయం, అభిరుచులు, ప్రాధాన్యతలు మొదలగునవి ఒక వస్తువు డిమాండ్ను నిర్ణయిస్తాయని ఇంతకు ముందే చర్చించుకున్నాం.

ఒక వస్తువు డిమాండ్ పరిమాణంలో వచ్చిన మార్పు శాతాన్ని డిమాండ్ను నిర్ణయించే అంశాలలోని ఒక అంశంలో వచ్చిన మార్పుల శాతంతో భాగిస్తే డిమాండ్ వ్యాకోచత్వం వస్తుంది. డిమాండ్ వ్యాకోచత్వం అన్ని వస్తువులకు, అన్ని సమయాల్లో, అన్ని ప్రదేశాల్లో, అందరు వ్యక్తులకు ఒకేలా ఉండదు.

ఉదా : నిత్యావసర వస్తువులైన బియ్యం, ఉప్పు, కూరగాయలు మొదలైన వాటి ధరలలో గణనీయమైన మార్పులు వచ్చినా డిమాండ్లో పెద్దగా మార్పు రాదు. కానీ విలాస వస్తువులైన రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, వాషింగ్ మిషన్లు మొదలైన వాటి ధరలలో కొద్ది తగ్గుదల వచ్చినా, డిమాండ్లో గణనీయమైన మార్పులు వస్తాయి.

ఒక వస్తువు ధరలో వచ్చిన అనుపాతపు మార్పు వల్ల డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పు ఎంత ఉంటుందో డిమాండ్ వ్యాకోచత్వ భావన తెలియజేస్తుంది. అంటే ఒక వస్తువు ధరలో వచ్చే శాతం మార్పుకు, డిమాండ్లో వచ్చే శాతం మార్పుకు మధ్య ఉన్న సంఖ్యాత్మక సంబంధాన్ని డిమాండ్ వ్యాకోచత్వం తెలుపుతుంది.

ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం :
ఆదాయంలో వచ్చే మార్పు వల్ల (పెరుగుదల లేదా తగ్గుదల) డిమాండ్ పరిమాణంలో ఏ మేరకు స్పందన వస్తుందో ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం తెలుపుతుంది. వినియోగదారుని ఆదాయంలో వచ్చిన అనుపాతపు మార్పు వల్ల వస్తువు డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పును ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం అంటారు.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 20

జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం :
ఒక వస్తువుకున్న డిమాండ్ దాని ధర పైనే కాకుండా, దానికున్న ప్రత్యామ్నాయ, | పూరక వస్తువుల ధర పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఇతర కారకాలు మారకుండా ఉండి, ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరల్లో వచ్చే అనుపాతపు మార్పు లేదా శాతపు మార్పు ఆ వస్తువు డిమాండ్లో ఎంత అనుపాతపు మార్పు లేదా శాతపు మార్పు కలిగిస్తుందో జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం తెలియజేస్తుంది.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 21

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ధర డిమాండ్ అంటే ఏమిటి ?
జవాబు.
ఒక వస్తువును కొనాలనే కోరికతో పాటు, కొనగలిగే శక్తి ఉంటే దానిని అర్థశాస్త్రంలో ఆ వస్తువుకు గల డిమాండ్ అంటారు. ఒక నిర్ణీతకాలంలో మార్కెట్లోని వివిధ ధరల వద్ద ఒక వినియోగదారుడు కొనే వస్తువుల లేదా సేవల పరిమాణాలను ధర డిమాండ్ తెలియజేస్తుంది. ఇతర అంశాలు స్థిరంగా ఉన్నప్పుడు ధరకు, దాని డిమాండుకు మధ్య విలోమ సంబంధం ఉంటుంది.

ప్రశ్న 2.
వైయుక్తిక డిమాండ్ పట్టిక తయారు చేయండి.
జవాబు.
ఒక వినియోగదారుడు ఒక వస్తువును వివిధ ధరల వద్ద ఎంతెంత పరిమాణంలో కొనుగోలు చేస్తాడో తెలియజేయునది వైయుక్తిక డిమాండ్. దానిని పట్టిక రూపంలో తెలియజేస్తే అది వైయుక్తిక డిమాండ్ పట్టిక.

ప్రశ్న 3.
మార్కెట్ డిమాండ్ పట్టిక తయారు చేయండి.
జవాబు.
మార్కెట్లో అనేక మంది వినియోగదారులు ఉంటారు. వారందరి డిమాండ్ పట్టికలను కలిపితే మార్కెట్ డిమాండ్ పట్టిక వస్తుంది. మార్కెట్ డిమాండ్ వివిధ వినియోగదార్ల వస్తువులను వివిధ ధరల వద్ద ఒక వస్తువును ఎంతెంత పరిమాణంలో కొనుగోలు చేస్తారో తెలియజేస్తుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 4.
డిమాండ్ ఫలం అంటే ఏమిటి ?
జవాబు.
ఒక వస్తువు డిమాండ్ పరిమాణానికి, దానిని నిర్ణయించే కారకాలకు మధ్యగల సంబంధాన్ని డిమాండ్ ఫలం తెలియజేయును. డిమాండ్ ఫలాన్ని ఈ క్రింది సమీకరణం ద్వారా తెలియజేయవచ్చు.
DX = f (PX, PY, Y, T).
DX = X వస్తువు డిమాండ్
PX = x వస్తువు ధర
PY = ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలు
Y = వినియోగదారుని ఆదాయం
T = అభిరుచులు, అలవాట్లు.

ప్రశ్న 5.
గిఫెన్ వైపరీత్యం / గిఫెన్ వస్తువులు భావనను వివరించండి.
జవాబు.
ధర పెరిగినప్పటికి డిమాండ్ తగ్గకపోగా, పెరగటం లేదా అదే విధంగా డిమాండ్ను కలిగి ఉండే వస్తువులను గిఫెన్ వస్తువులంటారు. నాసిరకపు వస్తువులను గిఫెన్ వస్తువులంటారు. వాటి ధర పెరిగితే ఇతర వస్తువులపై ఖర్చు తగ్గించి ఈ వస్తువులను కొనుగోలు చేస్తారు. దీనిని సర్ రాబర్ట్ గిఫెన్ అనే ఆర్థికవేత్త పరిశీలించడం వల్ల దీనిని “గిఫెన్ వైపరీత్యం” అంటారు.

ప్రశ్న 6.
వెబ్లెన్ వస్తువులు (గౌరవ సూచిక వస్తువులు) అనగానేమి ?
జవాబు.
దీనిని గూర్చి చెప్పిన ఆర్థికవేత్త వెల్లెన్.. గౌరవ సూచిక వస్తువులయిన వజ్రాలు, బంగారు నగలు మొదలైనవి. కలిగి ఉండటం సమాజంలో ప్రతిష్టగా భావిస్తారు ధనికులు. వీటి ధర తగ్గితే వారి గౌరవం, ప్రతిష్ట తగ్గుతాయని కొనుగోలు తగ్గిస్తారు. కనుక ఈ వస్తువుల విషయంలో ధర తగ్గితే డిమాండ్ కూడా తగ్గును.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 7.
ఆదాయ డిమాండ్ అంటే ఏమిటి ?
జవాబు.
ఆదాయానికి, కొనుగోలు చేసే వస్తు పరిమాణానికి ఉన్న సంబంధాన్ని ఆదాయ డిమాండ్ పరిశీలిస్తుంది. సాధారణంగా ఆదాయం పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. ఆదాయ డిమాండ్ను బట్టి వస్తువులను మేలురకం అని, నాసిరకమని విభజించవచ్చు.
ఆదాయ డిమాండ్ Dn = f(y).

ప్రశ్న 8.
జాత్యంతర డిమాండ్ అంటే ఏమిటి ?
జవాబు.
ప్రత్యామ్నాయ, పూరక వస్తువు ధరలకు, ఒక వస్తువు డిమాండ్కు ఉన్న సంబంధాన్ని జాత్యంతర డిమాండ్ అంటారు. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చిన మార్పుల వల్ల ఒక వస్తువు డిమాండ్లో వచ్చే మార్పులను జాత్యంతర డిమాండ్ తెలియజేయును.
Dx = f(Py).

ప్రశ్న 9.
ప్రత్యామ్నాయాలు (ప్రతిస్థాపక వస్తువులు) వస్తువులను వివరించండి.
జవాబు.
సన్నిహిత సంబంధం ఉన్న వివిధ వస్తువులను ప్రత్యామ్నాయ వస్తువులంటారు.
ఉదా : కాఫీ, టీ. ఈ వస్తువుల విషయంలో ప్రత్యామ్నాయ వస్తువు ధరలో మార్పు వస్తే, మరో వస్తువు డిమాండ్లో మార్పు వస్తుంది. కనుక ఈ వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి పైకి వాలి ఉంటుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 10.
పూరక వస్తువులను వివరించండి.
జవాబు.
సంయుక్త వస్తువులను పూరక వస్తువులంటారు. ఉదా : కారు, పెట్రోలు. వీటిలో ఒకటి లేకపోయినా మరొకటి ఉపయోగపడదు. పూరక సంబంధం ఉన్న వస్తువు ధర పెరిగితే, ఇతర వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది. ధర తగ్గితే ఇతర వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. పూరక సంబంధం ఉన్న వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ క్రిందికి వాలి ఉంటుంది.

ప్రశ్న 11.
ధర డిమాండ్ వ్యాకోచత్వం అంటే ఏమిటి ?
జవాబు.
ఒక వస్తువు ధరలోని శాతం మార్పుకు, వస్తు డిమాండ్లో డిమాండ్ వ్యాకోచత్వం” అంటారు.
Ep = డిమాండ్లో వచ్చిన మార్పు శాతం / ధరలో వచ్చిన మార్పు శాతం

ప్రశ్న 12.
ధర డిమాండ్ వ్యాకోచత్వ రకాలు తెల్పండి.
జవాబు.
ధరలోని మార్పుకు ప్రతిస్పందనగా డిమాండ్లో ఏ మేరకు మార్పు వస్తుందనేది, ధర డిమాండ్ వ్యాకోచత్వం తెలియజేస్తుంది. ఈ భావనను మార్షల్ అభివృద్ధి పరచినాడు. దీనిని క్రింది విధంగా కొలవవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 22

ధర డిమాండ్ వ్యాకోచత్వపు రకాలు 5. అవి :

  1. పూర్తి వ్యాకోచ డిమాండ్ (Ep = ∞)
  2. సాపేక్ష వ్యాకోచ డిమాండ్ (Ed >1)
  3. పూర్తి అవ్యాకోచ డిమాండ్
  4. సాపేక్ష అవ్యాకోచ డిమాండ్
  5. ఏకత్వ వ్యాకోచ డిమాండ్

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 13.
ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం అంటే ఏమిటి ?
జవాబు.
వినియోగదారుని ఆదాయంలో వచ్చిన మార్పు శాతంకు, అతని డిమాండ్లో వచ్చిన శాతం మార్పును “ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం” అంటారు.
Ey = డిమాండ్లో వచ్చిన మార్పు శాతం / ఆదాయంలో వచ్చిన మార్పు శాతం

ప్రశ్న 14.
జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వంను వివరించండి.
జవాబు.
ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చిన శాతం మార్పుకు, డిమాండ్లో కలిగే శాతం మార్పును “జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం” అంటారు.
Ec = డిమాండ్లో వచ్చిన మార్పు శాతం / ప్రత్యామ్నాయ, పూరక వస్తువు ధరలో వచ్చిన మార్పు శాతం

ప్రశ్న 15.
పూర్తి వ్యాకోచ డిమాండ్ అంటే ఏమిటి ?
జవాబు.
ధరలో ఏ మార్పు వచ్చినా లేకున్నా డిమాండ్లో అంటారు. ఇక్కడ డిమాండ్ రేఖ ‘X’ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. దీని సంఖ్యాత్మక విలువ Ep = ∞.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 16.
పూర్తి అవ్యాకోచ డిమాండ్ అంటే ఏమిటి ?
జవాబు.
ధరలో ఎంత మార్పు వచ్చినా డిమాండ్లో ఏ మాత్రము మార్పు ఉండదు. దీనినే పూర్తి అవ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ డిమాండ్ రేఖ Y – అక్షానికి సమాంతరంగా ఉంటుంది. దీని సంఖ్యాత్మక విలువ Ep = 0.

ప్రశ్న 17.
ఏకత్వ వ్యాకోచ డిమాండ్ను వివరించండి.
జవాబు.
ఒక వస్తువు ధరలో వచ్చిన అనుపాతపు మార్పు డిమాండ్లో వచ్చిన అనుపాతపు మార్పుకు సమానమైతే దానిని ఏకత్వ వ్యాకోచ డిమాండ్ అంటారు. దీని విలువ ఒకటికి సమానము.
Ep = 1
ఇక్కడ డిమాండ్ రేఖ లంబ అతిపరావలయ ఆకారంలో ఉంటుంది.

ప్రశ్న 18.
సాపేక్ష వ్యాకోచ డిమాండ్ గురించి తెల్పండి.
జవాబు.
ఒక వస్తువు ధరలో వచ్చే అనుపాతపు మార్పు కంటే డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పు ఎక్కువగా ఉంటే దానిని సాపేక్ష వ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ వ్యాకోచత్వం విలువ ‘1’ కంటే ఎక్కువగా ఉంటుంది.

ప్రశ్న 19.
సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ గురించి తెల్పండి..
జవాబు.
వస్తువు ధరలో వచ్చిన అనుపాతపు మార్పు కంటే డిమాండ్ పరిమాణంలో వచ్చిన అనుపాతపు మార్పు తక్కువగా ఉన్నట్లయితే దీనిని సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ డిమాండ్ వ్యాకోచత్వం విలువ ‘1’ కంటే తక్కువగా ఉంటుంది.

ప్రశ్న 20.
మేలురకం వస్తువులను నిర్వచించండి.
జవాబు.
ఆదాయం పెరిగితే మేలు రకం వస్తువులు లేదా సాధారణ వస్తువులు డిమాండ్ పెరుగుతుంది. మేలు రకం వస్తువుల డిమాండ్ విషయంలో డిమాండుకు, ఆదాయానికి మధ్య ధనాత్మక సంబంధం ఉంటుంది. కాబట్టి ఆదాయ డిమాండ్ రేఖ ధనాత్మక వాలును కలిగి ఎడమ నుంచి కుడికి పైకి వెళ్తుంది.

ప్రశ్న 21.
నాసిరకం వస్తువులను నిర్వచించండి.
జవాబు.
ఆదాయం పెరిగేకొలది కొన్ని రకాల వస్తువులకు డిమాండ్ తగ్గును. ఆదాయం తగ్గితే డిమాండ్ పెరుగును. ఇటువంటి వస్తువులను నాసిరకం వస్తువులంటారు. ఈ వస్తువుల విషయంలో ఆదాయానికి, వస్తువు డిమాండ్కు విలోమ సంబంధం ఉంటుంది.
ఉదా : సజ్జలు, రాగులు.

TS Inter 1st Year Economics Study Material Chapter 7 జాతీయాదాయ విశ్లేషణ

Telangana TSBIE TS Inter 1st Year Economics Study Material 7th Lesson జాతీయాదాయ విశ్లేషణ Textbook Questions and Answers.

TS Inter 1st Year Economics Study Material 7th Lesson జాతీయాదాయ విశ్లేషణ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
జాతీయాదాయపు వివిధ నిర్వచనాలు ఏవి ? జాతీయాదాయ నిర్ణాయకాలను విశదీకరించండి.
జవాబు.
జాతీయాదాయం అనే భావన అనేక రకాలుగా నిర్వచింపబడ్డది. ఒక దేశంలో నిర్ణీత కాలంలో ఉత్పత్తి చేసిన వస్తువుల, సేవల మార్కెట్ విలువ మొత్తాన్ని జాతీయాదాయం అంటారు. ఇంకొక విధంగా చెప్పాలంటే వివిధ ఆర్థిక కార్యకలాపాల ద్వారా ఒక దేశంలో సమకూరే ఆదాయమే జాతీయాదాయం.

వివిధ ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలాలైన భాటకం, వేతనాలు, వడ్డీ మరియు లాభాల వంటివి ఇందులో కలిసి ఉంటాయి. జాతీయాదాయ నిర్వచనాలను స్థూలంగా రెండు రకాలుగా చెప్పవచ్చు. అవి :

  1. మార్షల్, పిగూ, ఫిషర్ ప్రతిపాదించిన సంప్రదాయ నిర్వచనాలు
  2. ఆధునిక నిర్వచనాలు.

1. మార్షల్ నిర్వచనం :
“ఒక దేశంలోని శ్రమ, మూలధనం సహజ వనరుల సహాయంతో ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసే భౌతిక, అభౌతిక వస్తు సేవలతో కూడుకున్న నికర వస్తు సేవల మొత్తమే ఆ దేశ వాస్తవిక నికర వార్షిక ఆదాయం”.

2. పిగూ నిర్వచనం :
పిగూ నిర్వచనం ప్రకారం ‘ద్రవ్య రూపంలో కొలవడానికి వీలయ్యి విదేశాల నుంచి లభించే నికర ఆదాయంతో సహా సమాజానికి సంప్రాప్తించే ఆదాయాన్ని జాతీయాదాయం’ అంటారు.

3. ఫిషర్ నిర్వచనం :
ఫిషర్ నిర్వచనం ప్రకారం “తుది వినియోగదారులు భౌతిక లేదా మానవ పరిసరాల నుంచి పొందే సేవల సముదాయమే జాతీయాదాయం”. మార్షల్, పిగూ నిర్వచనాల కంటే ఫిషర్ నిర్వచనం మెరుగైందని చెప్పవచ్చు.

ఎందుకంటే ఫిషర్ నిర్వచనం వినియోగంపై ఆధారపడ్డ ఆర్థిక సంక్షేమాన్ని కూడా పరిగణనలోకి తీసుకొంటుంది. అంతేకాక మార్షల్, పిగూ నిర్వచనాల కంటే ఫిషర్ ప్రతిపాదించిన నిర్వచనం దోషరహితమైనది. జాతీయాదాయ విశ్లేషణలో ఆర్థిక సంక్షేమ కారణాలను ఆర్థిక సంక్షేమ స్థాయిని పోల్చడానికి ఫిషర్ నిర్వచనం ఉపకరిస్తుంది.

4. కుజ్నెట్స్ నిర్వచనం :
‘ఒక దేశ ఉత్పాదక వ్యవస్థ నుంచి అంతిమ వినియోగదారులకు ఒక సంవత్సర కాలంలో ప్రవహించే వస్తు సేవల నికర ఉత్పత్తి లేదా దేశ మూలధన వస్తువులను నికరంగా చేరే వస్తు సేవలను జాతీయాదాయం అంటారు. దేశంలోని వ్యక్తులు, వ్యాపార సంస్థలు, సామాజిక, రాజకీయ సంస్థలు వారి ఆర్థిక వ్యాపారాలకు ప్రతిఫలంగా పొందే నికర ఆదాయ సముదాయమే జాతీయాదాయం’.

జాతీయాదాయ పరిమాణాన్ని నిర్ణయించే అంశాలు :
ఒక దేశ జాతీయాదాయ పరిమాణం అనేక అంశాలలో ప్రభావితమై నిర్ణయింపబడుతుంది. ఈ అంశాల కారణంగానే వివిధ దేశాలలో జాతీయాదాయ స్థాయి లేదా పరిమాణంలో వ్యత్యాసాలు గోచరిస్తాయి. ఒకే దేశంలో ఎప్పటికీ జాతీయాదాయ పరిమాణం ఒకే విధంగా ఉండదు. జాతీయాదాయ పరిమాణాన్ని నిర్ణయించే అంశాలలో ముఖ్యమైన వాటిని ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు.

ఎ) సహజ వనరులు :
సహజ వనరులు, శీతోష్ణస్థితి, భౌగోళిక అంశాలు, సారవంతమైన నేలలు, గనులు, ఇంధన వనరులు మొదలైనవి అధికంగాను, అనుకూలంగాను లభ్యమయ్యే దేశాలలో, అన్ని రంగాలలో అధికోత్పత్తులు సాధించవచ్చు. అందువల్ల జాతీయాదాయం పెరుగుతుంది.

బి) ఉత్పత్తికారకాల నాణ్యత, లభ్యత :
ఒక దేశంలో అధిక శక్తి సామర్థ్యం గల శ్రామికుల లభ్యత, చొరవ, సాహసం, సామర్థ్యం గల సమర్థవంతమైన వ్యవస్థాపకులు, మూలధనం పెరుగుదల రేటు జాతీయాదాయ పరిమాణాన్ని నిర్ణయిస్తాయి.

సి) సాంకేతిక విజ్ఞాన ప్రగతి :
ఒక దేశంలో సాంకేతిక విజ్ఞాన ప్రగతిని అనుసరించి ఉత్పత్తి, జాతీయాదాయ పరిమాణం నిర్ణయింపబడుతుంది. ప్రకృతి వనరుల అభిలషణీయ వినియోగానికి అధునాతన ఉత్పత్తి పద్ధతులు దోహదం చేస్తాయి.

డి) రాజకీయ నిర్ణయాలు, స్థిరత్వం :
ప్రణాళికాబద్ధమైన ఆర్థికాభివృద్ధికి, జాతీయాదాయ వృద్ధిరేటు పెంపుకు రాజకీయ నిర్ణయాలు, స్థిరత్వం దోహదం చేస్తాయి. ప్రభుత్వ విధానాలు, ఎగుమతి · దిగుమతి విధానాలు, మానవ వనరుల అభివృద్ధి, పరిశోధనలపై పెట్టుబడులు మొదలైన అంశాలు కూడా జాతీయాదాయాన్ని నిర్ణయిస్తాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 7 జాతీయాదాయ విశ్లేషణ

ప్రశ్న 2.
జాతీయాదాయాన్ని నిర్వచించి, దాని వివిధ భావనలను వివరించండి.
జవాబు.
ఒక సంవత్సర కాలంలో ఆర్థిక కార్యకలాపాల వలన దేశంలో ఉత్పత్తయ్యే వస్తుసేవల ద్రవ్యరూపం జాతీయాదా యంగా భావించవచ్చు. ఆధునిక అర్థశాస్త్రంలో ‘జాతీయాదాయం’ అనే అంశానికి చాలా ప్రాధాన్యత ఉంది.

జాతీయాదాయ భావనలు :
1. స్థూల జాతీయోత్పత్తి :
ఒక సంవత్సర కాలంలో దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తుసేవల ద్రవ్యరూపాన్ని స్థూల జాతీయోత్పత్తి అంటారు. దీనికి విదేశీ వ్యాపారం వలన లభించే ఆదాయం కలపాలి. స్థూల జాతీయోత్పత్తిని అంచనా వేయడంలో

  1. ప్రతి అంతిమ వస్తువు లేదా సేవల విలువలను ద్రవ్యరూపంలో చెప్పాలి.
  2. ఏ వస్తువు విలువను రెండుసార్లు లెక్కపెట్టకుండా జాగ్రత్తపడాలి.
  3. ముడిపదార్థాలను పూర్తిగా తయారు కాని వస్తువుల విలువను జాతీయోత్పత్తిలో కలపాలి. వీటిని

ఇన్వంటరీస్ అంటారు. వీటిలో తరుగుదల ఉంటే ఆ సంవత్సరపు జాతీయోత్పత్తి నుండి తీసివేయాలి.
స్థూల జాతీయోత్పత్తిని ఈ క్రింది విధముగా చెప్పవచ్చు.
GNP లేదా GNI = C + I + G + (X – M)

2. స్థూల దేశీయోత్పత్తి :
ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల ద్రవ్యరూపం మొత్తాన్ని స్థూల దేశీయోత్పత్తి అంటారు. స్థూల జాతీయోత్పత్తిలో వినియోగము, స్థూల దేశీయ పెట్టుబడి, ప్రభుత్వ వ్యయము, నికర విదేశీ ఆదాయం’ కలిసి ఉంటాయి.

స్థూల దేశీయోత్పత్తిలో వినియోగం, స్థూల దేశీయ పెట్టుబడి, ప్రభుత్వ వ్యయం మాత్రమే ఉంటాయి.
స్థూల దేశీయోత్పత్తి లేదా GDP = C + I + G.

3. నికర జాతీయోత్పత్తి – నికర దేశీయోత్పత్తి :
వస్తూత్పత్తిలో ఉత్పత్తి సంస్థలు, యంత్రాలు, భవనాలు, యంత్ర పరికరాలను ఇతర సామాగ్రిని వినియోగిస్తాయి. వీటిని అవిచ్ఛిన్నంగా ఉపయోగించడం వలన అవి తరుగుదలకు లోనవుతాయి. దీనినే మూలధనం తరుగుదల అంటారు.

ఈ తరుగుదలను స్థూల జాతీయోత్పత్తి లేదా స్థూల దేశీయోత్పత్తి నుండి తీసివేస్తే వచ్చేదే నికర జాతీయోత్పత్తి లేదా నికర దేశీయోత్పత్తి. నికర జాతీయోత్పత్తినే మార్కెట్ ధరలలో జాతీయాదాయం అని కూడా అంటారు. నికర జాతీయాదాయాన్ని అర్థశాస్త్ర పరిభాషలో ‘జాతీయాదాయం’ అంటారు.

నికర జాతీయోత్పత్తి స్థూల జాతీయోత్పత్తి – మూలధనం పెరుగుదల
NNP = GNP – Depreciation

నికర దేశీయోత్పత్తి = స్థూలదేశీయోత్పత్తి – మూలధనం తరుగుదల
NDP = GDP – Depreciation

నికర జాతీయాదాయాన్ని మదింపు చేయటంలో ఈ క్రింది అంశాలను దృష్టిలో ఉంచుకొనవలెను.

a) అంతర్జాతీయ వ్యాపారం వలన సంభవించే లాభనష్టాలను పరిగణనలోకి తీసుకోవాలి.
b) ప్రభుత్వ సంస్థలో ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవలను స్థూల, నికర జాతీయోత్పత్తులలోను, స్థూల, నికర దేశీయోత్పత్తులలోను భాగంగా పరిగణించాలి. సిబ్బందికి ప్రభుత్వం చేసే వ్యయం కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

4. వ్యష్టి ఆదాయం :
ఒక సంవత్సర కాలంలో దేశంలోని వివిధ వ్యక్తులకు, సంస్థలకు లభించే ఆదాయం. మొత్తము వ్యష్టి ఆదాయము. వ్యష్టి ఆదాయం, నికర జాతీయోత్పత్తి సమానం కాదు. సంస్థలు తమ లాభంలో కొంత భాగాన్ని ఆదాయ పన్నుగా ప్రభుత్వానికి చెల్లిస్తాయి.

కొంత భాగాన్ని పంపిణీ కాని లాభాల రూపంలో “రిజర్వ్ డ్ ఫండ్”గా ఉంచుతారు. మిగిలిన భాగాన్ని డివిడెండ్గా వాటాదార్లకు పంపిణీ చేస్తారు. డివిడెండ్లు మాత్రమే వ్యక్తిగత ఆదాయంలో చేరతాయి. కనుక సాంఘిక భద్రతా విరాళాలు, కార్పొరేట్ పన్నులు, పంపిణీ కాని లాభాలు నికర జాతీయోత్పత్తి నుండి మినహాయించాలి.

కొంతమంది వ్యక్తులు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనకపోయినప్పటికి ఆదాయం లభిస్తుంది. వీటిని జాతీయాదాయంలో చేర్చరాదు. వృద్ధాప్యపు పింఛనులు సిద్యోగ భృతి, వడ్డీలు మొదలైనవాటిని బదిలీ చెల్లింపులంటారు. ఇవి వ్యక్తిగత ఆదాయంలో చేరతాయి. ఈ బదిలీ చెల్లింపులను జాతీయాదాయంలో చేర్చరాదు.

వ్యష్టి ఆదాయం = జాతీయాదాయం – పంపిణీ కాని సంస్థల లాభాలు + బదిలీ చెల్లింపులు – సాంఘిక భద్రతా విరాళాలు – కార్పొరేట్ పన్నులు

5. వ్యయార్హ ఆదాయం :
వ్యక్తుల వినియోగానికి అందుబాటులో ఉండే ఆదాయాన్ని వ్యయార్హ ఆదాయం అంటారు. వ్యక్తులకు వివిధ రూపాలలో లభించే ఆదాయాలన్నింటిని ఖర్చు చేయడానికి వీలుండదు. ప్రభుత్వానికి వ్యక్తులు ప్రత్యక్ష పన్నులను చెల్లించవలసి ఉంటుంది. కనుక వ్యష్టి ఆదాయం నుండి ప్రత్యక్ష పన్నులను తీసివేస్తే వ్యయార్హ ఆదాయం వస్తుంది. వ్యయార్హ ఆదాయంలో కొంత భాగాన్ని మిగుల్చుకుంటే దానిని పొదుపు అంటారు.

దీనిని ఈ క్రింది విధంగా చూపవచ్చును.
వ్యయార్హ ఆదాయం = వ్యష్టి ఆదాయం – వ్యష్టి పన్నులు
వ్యయార్హ ఆదాయం = వినియోగము + పొదుపు

6. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయం :
వస్తూత్పత్తి ప్రక్రియలో వినియోగించిన ఉత్పత్తి సాధనాలకు ప్రతిఫలాలను చెల్లిస్తారు. వాటి మొత్తాన్ని ఉత్పత్తి వ్యయం అంటారు. దీనినే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయం అని అంటారు. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయోత్పత్తికి, నికర జాతీయోత్పత్తికి తేడా ఉంది. నికర జాతీయోత్పత్తి మొత్తం ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ కాదు.

నికర జాతీయోత్పత్తి నుండి పన్నులను తీసివేస్తే మిగిలేదే ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ అయ్యేది. ప్రభుత్వం కొన్ని వస్తువుల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఉత్పత్తి సంస్థలకు సబ్సిడీలు ” ఇస్తుంది. అప్పుడు వస్తువుల ధరలు సబ్సిడీల మేరకు తగ్గుతాయి. కనుక సబ్సిడీలను నికర జాతీయోత్పత్తికి కలపాలి.

ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయము = నికర జాతీయోత్పత్తి + సబ్సిడీలు – పరోక్ష పన్నులు
National Income at Factor Cost = Net National Income + Subsidies – Indirect Taxes.

7. తలసరి ఆదాయం : జాతీయాదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది.
తలసరి ఆదాయం = జాతీయాదాయం / దేశ జనాభా
ఒక దేశ ప్రజల సగటు జీవన ప్రమాణాన్ని తలసరి ఆదాయం నిర్ణయిస్తుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 7 జాతీయాదాయ విశ్లేషణ

ప్రశ్న 3.
జాతీయాదాయాన్ని లెక్కించడానికి గల వివిధ పద్ధతులు ఏమిటి ? వాటిని వివరించండి.
జవాబు.
ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తు, సేవల మొత్తం విలువను జాతీయాదాయం అంటారు.
జాతీయాదాయాన్ని గణించడానికి మూడు పద్ధతులు అమలులో ఉన్నాయి. అవి :

  • ఉత్పత్తి పద్ధతి లేదా ఉత్పాదిత పద్ధతి
  • వ్యయాల పద్ధతి
  • ఆదాయాల పద్ధతి

కైరన్ క్రాస్ అభిప్రాయం ప్రకారం “జాతీయాదాయాన్ని మూడు పద్ధతులలో ఏ పద్ధతి ద్వారానైనా తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరి ఆదాయాలను కలపడం పిల్ల, ప్రతి ఒక్క ఉత్పత్తిని కలపటం వల్ల, ప్రజలు కొనుగోలు చేసే అన్ని వస్తువుల విలువలను వారి పొదుపులను కలపటం ద్వారా జాతీయాదాయాన్ని గణన చేయవచ్చు”.

1. ఉత్పత్తి మదింపు పద్ధతి:
దీనిని ఇన్వెంటరీ పద్ధతి లేదా వస్తుసేవా పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో స్థూల జాతీయోత్పత్తి గణించడానికి ఒక సంవత్సర కాలంలో వివిధ రంగాలలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తుసేవల పరిమాణాన్ని వాటి మార్కెట్ ధరలతో గుణించి వాటి విలువను నిర్ణయిస్తారు.
మార్కెట్ ధరలలో నికర దేశీయోత్పత్తి = (P1Q1 + P2Q2 + …………….. + PnQn)
P = ధర
Q = పరిమాణం
1, 2, n = వివిధ రంగాలు ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవలు

జాతీయాదాయం :
ఈ పద్ధతిలో కేవలం అంతిమ వస్తువుల విలువలను మాత్రమే లెక్కించాలి. ముడిసరుకులు, మాధ్యమిక వస్తువులు మొదలైనవాటి విలువలను లెక్కించకూడదు.
“దీనిలో మదింపు చేసిన విలువలను వివిధ రంగాలైన వ్యవసాయం, పరిశ్రమ, సేవా రంగాలకు ఆపాదిస్తారు. అందువల్ల దీన్ని మదింపు చేసిన విలువ లేదా వాల్యుయాడెడ్ పద్ధతి అని కూడా అంటారు.

2. వ్యయాల మదింపు పద్ధతి:
ఈ పద్ధతిలో ఒక సంవత్సర కాలంలో వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వం వస్తు సేవలపై చేసిన ఖర్చు మొత్తాలను, నికర ఎగుమతులు, విదేశీ నికర ఆదాయం కూడితే జాతీయాదాయం తెలుస్తుంది.

NI = EH + EF + EG + Net exports + Net income from abroad
ఇచ్చట, EH గృహరంగం చేసిన ఖర్చు
EF = సంస్థల వ్యయం
EG = ప్రభుత్వం వస్తు సేవలపై చేసిన ఖర్చు మొత్తం

జాతీయాదాయం = ప్రైవేటు అంతిమ వినియోగ వ్యయం + ప్రభుత్వం అంతిమ వినియోగ వ్యయం + నికర దేశీయ మూలధన సంచయనం + నికర వినిమయం + నికర విదేశీ ఆదాయం
కేవలం అంతిమ వస్తుసేవలపై వ్యయాన్ని మాత్రమే గణనలో చేర్చే విధంగా జాగ్రత్త వహించాలి.

3. ఆదాయ మదింపు పద్ధతి :
ఈ పద్ధతిలో దేశంలో వివిధ ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలంగా లభించే భాటకం, వేతనం, వడ్డీ, లాభం, సంస్థలకు వచ్చిన ఆదాయాన్ని కలిపితే జాతీయాదాయం తెలుస్తుంది. ఈ పద్ధతిలో స్వయం ఉపాధి వల్ల ఆర్జించే ఆదాయాలను కలపాలి. బదిలీ చెల్లింపులను కలపకూడదు. ఇదియే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయం.

జాతీయాదాయం = భాటకం + వేతనం + వడ్డీ + లాభం + నికర విదేశీ ఆదాయం

ఉద్యోగిత ఆదాయం :
– స్వయం ఉద్యోగిత ఆదాయం
+ కంపెనీల స్థూల వ్యాపార లాభాలు
+ జాతీయం చేయబడిన పరిశ్రమల స్థూల వ్యాపారం మిగుళ్ళు
+ సాధారణ ప్రభుత్వ సంస్థల స్థూల వ్యాపారం మిగుళ్ళు
+ భాటకం
+ వ్యాపారంలో ఉపయోగించని మూలధన వినియోగానికి ఆపాదించిన ఛార్జీ
= మొత్తం గృహరంగ ఆదాయం
– స్టాక్ ఆప్రిసియేషన్
+ శేషించిన పొరపాటు
= ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి
ఈ పద్ధతిలో జాతీయాదాయం గణించడానికి వివిధ ఆధారాల నుంచి వేల సంస్థలో దత్తాంశ సేకరణ అవసరం. ఆచరణలో ఆదాయానికి సంబంధించిన అన్ని వివరాలు ఖచ్చితంగా తెలియకపోవచ్చు.

TS Board Inter First Year Economics Study Material Chapter 7 జాతీయాదాయ విశ్లేషణ

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
జాతీయాదాయాన్ని నిర్ణయించే అంశాలు ఏవి ?
జవాబు.
ఒక దేశ జాతీయాదాయ పరిమాణం అనేక అంశాలలో ప్రభావితమై నిర్ణయింపబడుతుంది. జాతీయాదాయ పరిమాణాన్ని నిర్ణయించే అంశాలలో ముఖ్యమైనవి.

ఎ) సహజ వనరులు :
సహజ వనరులు, భౌగోళిక అంశాలు, సారవంతమైన నేలలు మొ||నవి అధికంగా, అనుకూలంగాను లభ్యమై దేశాలలో అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి జాతీయాదాయంను పెంచుకోవచ్చు.

బి) ఉత్పత్తి కారకాల నాణ్యత, లభ్యత :
ఒక దేశంలో అధిక శక్తి సామర్థ్యం గల శ్రామికుల లభ్యత, చొరవ, సామర్థ్యం గల సమర్థవంతమైన వ్యవస్థాపకులు, మూలధనం పెరుగుదల రేటు జాతీయాదాయ పరిమాణాన్ని నిర్ణయిస్తాయి.

సి) సాంకేతిక విజ్ఞాన ప్రగతి :
ఒక దేశ సాంకేతిక ప్రగతి ఉత్పత్తి, జాతీయాదాయమును నిర్ణయిస్తుంది. ప్రకృతి వనరులను పూర్తిగా వినియోగించుకొనుటకు ఆధునిక సాంకేతిక పద్ధతులు ఉపకరిస్తాయి.

డి) రాజకీయ నిర్ణయాలు, స్థిరత్వం :
ఆర్థికాభివృద్ధికి, జాతీయాదాయ వృద్ధిరేటు పెంపుకు రాజకీయ నిర్ణయాలు, స్థిరత్వం దోహదం చేస్తాయి. ప్రభుత్వ విధానాలు, ఎగుమతి, దిగుమతి విధానాలు, పరిశోధనలపై పెట్టుబడులు మొదలైన అంశాలు కూడా జాతీయాదాయాన్ని నిర్ణయిస్తాయి.

ప్రశ్న 2.
మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తికి మధ్య గల తేడాలను వివరించండి.
జవాబు.
జాతీయాదాయం అనే భావన అనేక రకాలుగా నిర్వచింపబడ్డది. ఒక దేశంలో నిర్ణీత కాలంలో ఉత్పత్తి చేసిన వస్తువుల, సేవల మార్కెట్ విలువ మొత్తాన్ని జాతీయాదాయం అంటారు. ఇంకొక విధంగా చెప్పాలంటే వివిధ ఆర్థిక కార్యకలాపాల ద్వారా ఒక దేశంలో సమకూరే ఆదాయమే జాతీయాదాయం.

వివిధ ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలాలైన భాటకం, వేతనాలు, వడ్డీ మరియు లాభాలు వంటివి ఇందులో కలిసి ఉంటాయి. జాతీయాదాయ నిర్వచనాలను స్థూలంగా రెండు రకాలుగా చెప్పవచ్చు. అవి:

  1. మార్షల్, పిగూ, ఫిషర్ ప్రతిపాదించిన సంప్రదాయ నిర్వచనాలు
  2. ఆధునిక నిర్వచనాలు.

1. మార్షల్ నిర్వచనం :
“ఒక దేశంలోని శ్రమ, మూలధనం సహజ వనరుల సహాయంతో ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసే భౌతిక, అభౌతిక వస్తు సేవలతో కూడుకున్న నికర వస్తు సేవల మొత్తమే ఆ దేశ వాస్తవిక నికర వార్షిక ఆదాయం”.

మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి (Gross National Product GNP):
స్థూల జాతీయోత్పత్తినే మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి అని కూడా అంటారు. ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేసిన “అంతిమ వస్తు సేవల ప్రస్తుత మార్కెట్ విలువ మొత్తాన్ని మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి అంటారు.

ఇందులోని ప్రధాన భాగాలు :

  1. వినియోగదారులు కొనుగోలు చేసిన వస్తువులు, సేవలు (C)
  2. మూలధన వస్తువులపై స్థూల దేశీయ ప్రైవేటు పెట్టుబడి (I)
  3. ప్రజోపయోగ సేవలపై ప్రభుత్వ వ్యయం (G)
  4. అంతర్జాతీయ వ్యాపారం ద్వారా ఆర్జించిన ఆదాయాలు : (ఎగుమతుల విలువ దిగుమతుల విలువ X – M)
  5. మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి C + I + G + (X – M).
    మార్కెట్ ధరలలో GNP = వినియోగం + పెట్టుబడి/ఉత్పాదక వస్తువులు + ప్రభుత్వం మొత్తం వ్యయం + (ఎగుమతుల విలువ – దిగుమతుల విలువ).
    ఈ భావనలో వస్తువులు, సేవలు ఎవరు ఉత్పత్తి చేశారనేది ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. కానీ ఎక్కడ ఉత్పత్తయినది ముఖ్యం కాదు.

ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి (GNP at Factor Cost) :
ఉత్పత్తి కారకాల ద్వారా ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తువుల ద్రవ్య విలువల మొత్తాన్ని తెలిపేది ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయం.

మార్కెట్ ధరలో స్థూల జాతీయోత్పత్తిలో వేతనాలు, భాటకం, వడ్డీ, డివిడెండ్లు, చేయబడని కార్పొరేటు లాభాలు, మిశ్రమ ఆదాయం (చిల్లర వర్తకపు లాభాలు), ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నుల తరుగుదల, విదేశీ వ్యాపార నికర మిగులు కలిసి ఉంటాయి.

అయితే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయ త్పత్తిలో పరోక్ష పన్నులు మినహా మార్కెట్ ధరల్లో స్థూల జాతీయోత్పత్తిలో గల అన్ని అంశాలు ఉంటాయి. అందువల్ల మార్కెట్ ధరల్లో స్థూల జాతీయోత్పత్తి, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయ విలువ కంటే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఉత్పత్తిదారులకు సబ్సిడీలు కల్పించినచో ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయాన్ని లెక్కించుటకు, మార్కెట్ ధరల్లో జాతీయోత్పత్తికి సబ్సిడీలను కలపాలి.

ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి = మార్కెట్ ధరలో స్థూల జాతీయోత్పత్తి – పరోక్ష పన్నులు.

TS Board Inter First Year Economics Study Material Chapter 7 జాతీయాదాయ విశ్లేషణ

ప్రశ్న 3.
మార్కెట్ ధరలలో జాతీయాదాయం, ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయాదాయం అంటే ఏమిటి ?
జవాబు.
ఈ భావనలను క్రింది విధంగా వివరించవచ్చు.
మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి (Net National Product – NNP) :
వస్తు సేవల ఉత్పత్తిలో వినియోగించబడే యంత్రాలు, యంత్రపరికరాలు కొంత కాలం తరువాత కొంత తరుగుదలకు, అరుగుదలకు గురికావచ్చు లేదా కొంత కాలం తరువాత అవి నిరుపయోగం కావచ్చు. ఈ కారణం వల్ల స్థూల జాతీయోత్పత్తి నుంచి కొంత భాగం తరుగుదల, అరుగుదలను పూరించడానికి ఉపయోగించాల్సి ఉంటుంది.

అందువల్ల స్థూల జాతీయోత్పత్తి అంతా ఆ సంవత్సర ఆదాయంగా పరిగణించడానికి వీలుండదు. అందువల్ల స్థూల జాతీయోత్పత్తి నుంచి తరుగుదలకు, అరుగుదలకు కావలసిన మొత్తాన్ని మినహాయించగా మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి వస్తుంది.

మార్కెట్ ధరల్లో నికర జాతీయోత్పత్తి = మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి – మూలధన తరుగుదల.
మూలధన తరుగుదలను ‘user cost’ అని అంటారు.

ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయం :
ఒక ఆర్థిక వ్యవస్థలో నిర్ణీత సమయంలో ఉత్పత్తి కారకాలైన భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన పొందే ద్రవ్యరూప ప్రతిఫలాలైన భాటకం, వేతనం, వడ్డీ, లాభం కలిపితే వచ్చే మొత్తాన్ని ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయోత్పత్తి లేదా జాతీయాదాయం అంటారు.

దీనినే వస్తూత్పత్తిలో సేవలు లేదా వనరులు సప్లై చేసిన వ్యక్తులు పొందే ఆదాయాలుగా పేర్కొనవచ్చు. దీనిలో ఉద్యోగులు పొందే వేతనాలు, ప్రైవేటు వ్యక్తులకు చెల్లించిన వడ్డీ, భూస్వాములు పొందిన నికర భాటకం అన్ని రకాల వ్యాపార లాభాలు ఇమిడి ఉంటాయి. నికర జాతీయోత్పత్తి మొత్తం ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ కాదు. ఎందుకంటే సంస్థలు ప్రభుత్వానికి పరోక్ష పన్నులు.

ఉదా : ఎక్సైజ్, అమ్మకం పన్ను చెల్లిస్తారు. కాని ఉత్పత్తికారకాలకు కాదు. అదేమాదిరిగా ప్రభుత్వం కొన్ని రకాల వస్తుసేవలకు సబ్సిడీ చెల్లిస్తుంది. అంటే వస్తు ఉత్పత్తికారకాలకు కాదు. అందువల్ల వాస్తవ ఉత్పత్తి వ్యయాల కంటే తక్కువ ధరకే మార్కెట్లో వస్తువులు విక్రయింపబడతాయి.

అందువల్ల సబ్సిడీల విలువను నికర జాతీయాదాయానికి కలపాలి. ఈ రోజులలో ప్రభుత్వ రంగం విస్తరించుటయే కాకుండా అనేక పరిశ్రమలను, సంస్థలను నిర్వహిస్తున్నందువల్ల అది పొందుతున్న లాభాలు ఉత్పత్తి కారకాలకు పంపిణీ కావు. అందువల్ల ప్రభుత్వ సంస్థల లాభాలను నికర జాతీయాదాయం నుంచి తీసివేయాలి.

ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి లేదా జాతీయాదాయం = మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి – పరోక్ష పన్నులు + సబ్సిడీలు – ప్రభుత్వ సంస్థల లాభాలు.

TS Board Inter First Year Economics Study Material Chapter 7 జాతీయాదాయ విశ్లేషణ

ప్రశ్న 4.
ఏవేని మూడు జాతీయాదాయ నిర్వచనాలను చర్చించండి.
జవాబు.
ఒక ఆర్థిక వ్యవస్థలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తుసేవల మొత్తం నికర విలువను జాతీయా దాయంగా భావించవచ్చు. జాతీయాదాయం ఆ దేశంలోని ప్రజల జీవన స్థితిగతులకు, ప్రజల సంక్షేమానికి మధ్య ఉండే సంబంధాన్ని వివరిస్తుంది.

1. పిగూ నిర్వచనం :
ఆచార్య పిగూ నిర్వచనం ప్రకారం ద్రవ్యంలో కొలవదగిన ఆర్థిక వ్యవస్థ యొక్క నిరపేక్ష ఆదాయాన్ని విదేశాల నుంచి లభించే నికర ఆదాయాన్ని జాతీయోత్పత్తి అనవచ్చు.

2. ఫిషర్ నిర్వచనం :
తుది వినియోగదారులు భౌతిక లేదా మానవ పరిసరాల నుంచి పొందే సేవల సముదాయమే జాతీయాదాయం.

3. మార్షల్ నిర్వచనం :
ఒక దేశంలోని శ్రమ, మూలధనం, సహజ వనరుల సహాయంతో ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసే భౌతిక, అభౌతిక వస్తుసేవలతో కూడుకున్న నికర వస్తుసేవల మొత్తమే ఆ దేశ వాస్తవిక నికర వార్షిక ఆదాయం.

ప్రశ్న 5.
తలసరి ఆదాయాన్ని ఏ విధంగా లెక్కిస్తారు ? జనాభా, తలసరి ఆదాయం మధ్య గల సంబంధం ఎలాంటిది ?
జవాబు.
ఒక నిర్దేశిత సంవత్సరంలో ఒక దేశ ప్రజల సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం తెలుపుతుంది. ప్రస్తుత సంవత్సరపు జాతీయాదాయాన్ని ప్రస్తుత సంవత్సర జనాభాచే భాగించడం ద్వారా దీనిని లెక్కిస్తాం.
2010-11 సంవత్సరానికి తలసరి ఆదాయం = 2010-11 సం॥ మార్కెట్ ధరల్లో జాతీయాదాయం / 2010-11 సంవత్సరంలో జనాభా

తలసరి ఆదాయపు భావన దేశ ప్రజల జీవన ప్రమాణాన్ని తెలుపుతుంది. కాని ఇది సగటు రూపంలో ఉండటం వల్ల దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయని గమనించాలి. వాస్తవానికి సగటు ఆదాయం కంటే ఎక్కువ లేదా తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు అధిక సంఖ్యలో ఉంటే ఇది నమ్మదగిన ఫలితాన్ని ఇవ్వదు.

తలసరి ఆదాయాన్ని ప్రస్తుత ధరలలోనే కాకుండా ఆధార సంవత్సర ధరల ద్వారా కూడా లెక్కించవచ్చు. తద్వారా నిజ తలసరి ఆదాయాన్ని తెలుసుకోవచ్చు. ఇందుకోసం దిగువ తెలిపిన సూత్రాన్ని వాడతాం.
నిజ తలసరి ఆదాయం = నిజ జాతీయాదాయం / జనాభా

ఒక దేశంలో ఒక నిర్దేశిత సంవత్సర కాలంలో (అంటే ఒక విత్త సంవత్సరంలో నిజ (జాతీయాదాయాన్ని) ఆ దేశ జనాభాతో భాగిస్తే వచ్చేదే నిజ తలసరి ఆదాయం.

తలసరి ఆదాయానికి, జనాభాకు మధ్య గల సంబంధం :
జాతీయాదాయానికి, జనాభాకు చాలా దగ్గరి సంబంధాలు ఉంటాయి. ఈ రెండు భావనల ద్వారా తలసరి ఆదాయాన్ని లెక్కిస్తారు. జాతీయాదాయంలో పెరుగుదల రేటు 6 శాతం కాగా, జనాభా వృద్ధిలోని పెరుగుదల రేటు 3% అయితే, తలసరి ఆదాయంలో పెరుగుదల రేటు 3 శాతం అవుతుంది.

దీనిని ఈ విధంగా పేర్కొనవచ్చు.
gpc = gni – gp
gpc = తలసరి ఆదాయంలో పెరుగుదల రేటు
gni = జాతీయాదాయంలో పెరుగుదల రేటు
gp = జనాభా పెరుగుదల రేటు

తలసరి ఆదాయంలో పెరుగుదల ప్రజల జీవన ప్రమాణంలో పెరుగుదలను సూచిస్తుంది. అయితే జాతీయా దాయంలోని పెరుగుదల రేటు, జనాభా పెరుగుదల రేటు కంటే ఎక్కువగా ఉన్నప్పుడే ఇది సాధ్యపడుతుంది. క్రింది పటం స్థూల ఆర్థిక చలాంకాల మధ్యగల సంబంధాన్ని వివరిస్తుంది.

TS Inter 1st Year Economics Study Material 7th Lesson జాతీయాదాయ విశ్లేషణ 1

ఇచ్చట,
NIA = నికర విదేశీ ఆదాయాలు
D = తరుగుదల
ID = పరోక్ష పన్నులు
SUB =
UP = పంపిణీ కాని లాభాలు
CT = కార్పొరేటు పన్నులు
TrH = వ్యక్తులకు లభించే బదిలీ చెల్లింపులు
PTP = ప్రత్యక్ష పన్నులు
GDP = స్థూల దేశీయోత్పత్తి
GNP = స్థూల జాతీయోత్పత్తి
NNP = నికర జాతీయోత్పత్తి
NI = జాతీయాదాయం
PI = వ్యష్టి ఆదాయం
DI = వ్యయార్హ ఆదాయం

TS Board Inter First Year Economics Study Material Chapter 7 జాతీయాదాయ విశ్లేషణ

ప్రశ్న 6.
ఏవేని రెండు జాతీయాదాయ మదింపు పద్ధతులను విశ్లేషించండి.
జవాబు.
జాతీయాదాయాన్ని గణించడానికి మూడు పద్ధతులు అమలులో ఉన్నాయి. అవి

  1. ఉత్పత్తి పద్ధతి లేదా ఉత్పాదిత పద్ధతి
  2. వ్యయాల పద్ధతి
  3. ఆదాయాల పద్ధతి

కైరన్ క్రాస్ అభిప్రాయం ప్రకారం “జాతీయాదాయాన్ని మూడు పద్ధతులలో ఏ పద్ధతి ద్వారానైనా తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరి ఆదాయాలను కలపడం ద్వారా, ప్రతి ఒక్క ఉత్పత్తిని కలపటం ద్వారా, ప్రజలు కొనుగోలు చేసే అన్ని వస్తువుల విలువలను, వారి పొదుపులను కలపటం ద్వారా జాతీయాదాయాన్ని గణన చేయవచ్చు.”

1. ఉత్పత్తి మదింపు పద్ధతి (Product Method) :
దీన్ని ఇన్వెంటరీ పద్ధతి లేదా వస్తుసేవా పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో స్థూల జాతీయోత్పత్తి గణించడానికి ఒక సంవత్సర కాలంలో వివిధ రంగాలలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తుసేవల పరిమాణాన్ని వాటి మార్కెట్ ధరలతో గుణించి వాటి విలువను నిర్ణయిస్తారు.

స్థూల జాతీయోత్పత్తి (GNP) = (P1Q1 + P2Q2 + ………….. + PnQn)

విదేశీ నికర ఆదాయం .
GNP = స్థూల జాతీయోత్పత్తి
P = ధర
Q = పరిమాణం
1, 2, ………….. n = వివిధ రంగాలు ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవలు. ఈ పద్ధతిలో ముడిసరుకులు, మాధ్యమిక వస్తువులు మొదలైనవాటి విలువలను లెక్కించకూడదు. ఒక సంవత్సరంలో ఉత్పత్తి అయిన కేవలం అంతిమ వస్తు సేవల విలువలను మాత్రమే లెక్కించాలి.

2. ఆదాయ మదింపు పద్ధతి (Income Method) :
ఈ పద్ధతిలో దేశంలో వివిధ ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలంగా లభించే భాటకం, వేతనం, వడ్డీ, లాభం, సంస్థలకు వచ్చిన ఆదాయాన్ని కలిపితే జాతీయాదాయం తెలుస్తుంది. ఈ పద్ధతిలో స్వయం ఉపాధి వల్ల ఆర్జించే ఆదాయాలను కలపాలి. బదిలీ చెల్లింపులను కలపకూడదు. ఇదియే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయం.

జాతీయాదాయం = భాటకం + వేతనం + వడ్డీ + లాభం.
ఆర్థిక వ్యవస్థలో జాతీయాదాయంలో ఉత్పత్తి కారకాల వాటాలను పంపిణీ పద్ధతి ద్వారా మనం తెలుసుకోగలుగుతాం.

3. వ్యయాల మదింపు పద్ధతి (Expenditure Method) :
ఈ పద్ధతిలో ఒక సంవత్సర కాలంలో వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వం వస్తు సేవలపై చేసిన ఖర్చు మొత్తాలను, నికర ఎగుమతులు, విదేశీ నికర ఆదాయం కూడితే జాతీయాదాయం తెలుస్తుంది.

NI = EH + EF + EG + Net exports.
ఇచ్చట, NI = జాతీయాదాయం
EH = గృహరంగం చేసిన ఖర్చు
EF = సంస్థల వ్యయం
EG = వస్తు సేవలపై ప్రభుత్వం చేసిన ఖర్చు మొత్తం.

జాతీయాదాయం = ప్రైవేటు అంతిమ వినియోగ వ్యయం + ప్రభుత్వం అంతిమ వినియోగ వ్యయం + నికర దేశీయ మూలధన సంచయనం + నికర వినిమయం + నికర విదేశీ ఆదాయం.
కాబట్టి జాతీయ వ్యయానికి జాతీయాదాయం సమానమనే ప్రమేయం ద్వారా ఈ మదింపు జరుగుతుంది. కేవలం అంతిమ వస్తుసేవలపై వ్యయాన్ని మాత్రమే గణనలో చేర్చే విధంగా జాగ్రత్త వహించాలి.

TS Board Inter First Year Economics Study Material Chapter 7 జాతీయాదాయ విశ్లేషణ

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
జాతీయాదాయం అంటే ఏమిటి ?
జవాబు.
జాతీయాదాయం అనే భావన అనేక రకాలుగా నిర్వచింపబడ్డది. ఒక దేశంలో నిర్ణీత కాలంలో ఉత్పత్తి చేసిన వస్తువుల, సేవల మార్కెట్ విలువ మొత్తాన్ని జాతీయాదాయం అంటారు. ఇంకొక విధంగా చెప్పాలంటే వివిధ ఆర్థిక కార్యకలాపాల ద్వారా ఒక దేశంలో సమకూరే ఆదాయమే జాతీయాదాయం.

వివిధ ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలాలైన భాటకం, వేతనాలు, వడ్డీ మరియు లాభాలు వంటివి ఇందులో కలిసి ఉంటాయి. జాతీయాదాయ నిర్వచనాలను స్థూలంగా రెండు రకాలుగా చెప్పవచ్చు. అవి :

  1. మార్షల్, పిగూ, ఫిషర్ ప్రతిపాదించిన సంప్రదాయ నిర్వచనాలు
  2. ఆధునిక నిర్వచనాలు.

1. మార్షల్ నిర్వచనం :
“ఒక దేశంలోని శ్రమ, మూలధనం సహజ వనరుల సహాయంతో ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసే భౌతిక, అభౌతిక వస్తు సేవలతో కూడుకున్న నికర వస్తు సేవల మొత్తమే ఆ దేశ వాస్తవిక నికర వార్షిక
ఆదాయం”.

2. పిగూ నిర్వచనం :
పిగూ నిర్వచనం ప్రకారం ‘ద్రవ్య రూపంలో కొలవడానికి వీలయ్యి విదేశాల నుంచి లభించే నికర ఆదాయంతో సహా సమాజానికి సంప్రాప్తించే ఆదాయాన్ని జాతీయాదాయం’ అంటారు.

ప్రశ్న 2.
జాతీయాదాయాన్ని నిర్ణయించే అంశాలను పేర్కొనండి.
జవాబు.
జాతీయాదాయ పరిమాణాన్ని నిర్ణయించే అంశాలు :
ఒక దేశ జాతీయాదాయ పరిమాణం అనేక అంశాలలో ప్రభావితమై నిర్ణయింపబడుతుంది. ఈ అంశాల కారణంగానే వివిధ దేశాలలో జాతీయాదాయ స్థాయి లేదా పరిమాణంలో వ్యత్యాసాలు గోచరిస్తాయి. ఒకే దేశంలో ఎప్పటికీ జాతీయాదాయ పరిమాణం ఒకే విధంగా ఉండదు. జాతీయాదాయ పరిమాణాన్ని నిర్ణయించే అంశాలలో ముఖ్యమైన వాటిని ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు.

ఎ) సహజ వనరులు : సహజ వనరులు, శీతోష్ణస్థితి, భౌగోళిక అంశాలు, సారవంతమైన నేలలు, గనులు, ఇంధన వనరులు మొదలైనవి అధికంగాను, అనుకూలంగాను లభ్యమయ్యే దేశాలలో, అన్ని రంగాలలో అధికోత్పత్తులు సాధించవచ్చు. అందువల్ల జాతీయాదాయం పెరుగుతుంది.

బి) ఉత్పత్తికారకాల నాణ్యత, లభ్యత :
ఒక దేశంలో అధిక శక్తి సామర్థ్యం గల శ్రామికుల లభ్యత, చొరవ, సాహసం, సామర్థ్యం గల సమర్థవంతమైన వ్యవస్థాపకులు, మూలధనం పెరుగుదల రేటు జాతీయాదాయ పరిమాణాన్ని నిర్ణయిస్తాయి.

సి) సాంకేతిక విజ్ఞాన ప్రగతి :
ఒక దేశంలో సాంకేతిక విజ్ఞాన ప్రగతిని అనుసరించి ఉత్పత్తి, జాతీయాదాయ పరిమాణం నిర్ణయింపబడుతుంది. ప్రకృతి వనరుల అభిలషణీయ వినియోగానికి అధునాతన ఉత్పత్తి పద్ధతులు దోహదం చేస్తాయి.

డి) రాజకీయ నిర్ణయాలు, స్థిరత్వం :
ప్రణాళికాబద్ధమైన ఆర్థికాభివృద్ధికి, జాతీయాదాయ వృద్ధిరేటు పెంపుకు రాజకీయ నిర్ణయాలు, స్థిరత్వం దోహదం చేస్తాయి. ప్రభుత్వ విధానాలు, ఎగుమతి దిగుమతి విధానాలు, మానవ
వనరుల అభివృద్ధి, పరిశోధనలపై పెట్టుబడులు మొదలైన అంశాలు కూడా జాతీయాదాయాన్ని నిర్ణయిస్తాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 7 జాతీయాదాయ విశ్లేషణ

ప్రశ్న 3.
స్థూల జాతీయోత్పత్తి (GNP) భావనను వివరించండి.
జవాబు.
ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేసిన వస్తుసేవల మొత్తం విలువను స్థూల జాతీయోత్పత్తి అంటారు. మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి
(GNP) = C + I + G + (X – M).

ప్రశ్న 4.
ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి అంటే ఏమిటి ?
జవాబు.
నికర జాతీయోత్పత్తి అంతా మొత్తం ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ కాదు. సంస్థలు ప్రభుత్వానికి పరోక్ష పన్నులు చెల్లిస్తాయి. అదే విధంగా ప్రభుత్వం కొన్ని రకాల వస్తు సేవలకు సబ్సిడీ చెల్లిస్తుంది. అందువలన వాస్తవ ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరకే మార్కెట్లో వస్తువులు విక్రయించబడతాయి.

ప్రభుత్వ సంస్థల లాభాలు నికర జాతీయాదాయం నుంచి మినహాయించాలి.
ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి = మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి – పరోక్ష పన్నులు + సబ్సిడీ.

ప్రశ్న 5.
వ్యష్టి ఆదాయం అంటే ఏమిటి ?
జవాబు.
వ్యష్టి ఆదాయం (Personal Income):
ప్రత్యక్ష పన్నుల చెల్లింపుకు పూర్వం ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఆ దేశ పౌరులు పొందే మొత్తం ఆదాయాన్ని ఇది తెలుపుతుంది. జాతీయాదాయం పూర్తిగా వీరికి లభించదు. ఈ విధమైన ఆదాయం నుంచి సంస్థలు ప్రభుత్వానికి కార్పొరేట్ పన్నును చెల్లించాలి.

అలాగే సంస్థలు అవి పొందిన లాభాల మొత్తాన్ని వాటాదారులకు పంచకుండా సంస్థల విస్తరణకు లేదా అనుకోని పరిస్థితులను ఎదుర్కొనుటకు కొంత మొత్తం పంపిణీ చేయని కార్పొరేట్ లాభాల రూపంలో ఉంచుతాయి. కాగా వేతనం పొందే ఉద్యోగస్తులు సాంఘిక భద్రత కోసం కొంత మొత్తాన్ని చెల్లిస్తారు.

ప్రభుత్వం ఏ విధమైన ఉత్పాదక సేవలనందించని వారికి సాంఘిక భద్రతను కల్పించడానికి పెన్షన్లు, నిరుద్యోగభృతి, స్కాలర్షిప్స్, ఉపశమన చెల్లింపులు, ప్రభుత్వ ఋణాలపై వడ్డీ చెల్లింపులు మొదలైనవి చెల్లిస్తుంది. వీటినే బదిలీ చెల్లింపులు (transfer payments) అంటారు.

వ్యష్టి ఆదాయం = జాతీయాదాయం (ఉత్పత్తి కారకాల వ్యయం దృష్ట్యా నికర జాతీయ ఉత్పత్తి) – పంపిణీ చేయబడని కార్పొరేటు లాభాలు – కార్పొరేట్ పన్నులు – సాంఘిక భద్రత విరాళాలు + బదిలీ చెల్లింపులు.

TS Board Inter First Year Economics Study Material Chapter 7 జాతీయాదాయ విశ్లేషణ

ప్రశ్న 6.
సబ్సిడీలు అంటే ఏమిటి ?
జవాబు.
ఉత్పత్తిదారుడు ఉత్పత్తిని ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరకు అమ్మితే నష్టం వస్తుంది. దీని సర్దుబాటుకోసం ఉత్పత్తిదారులకు ప్రభుత్వం ఇచ్చే నిధులను సబ్సిడీలు అంటారు.

ప్రశ్న 7.
వాస్తవిక తలసరి ఆదాయం అంటే ఏమిటి ?
జవాబు.
తలసరి ఆదాయాన్ని స్థిరమైన ధరలలో కూడా లెక్కించి తద్వారా నిజ తలసరి ఆదాయాన్ని తెలుసుకోవచ్చు. ఒక ప్రత్యేక సంవత్సర నిజ జాతీయాదాయాన్ని ఆ సంవత్సరపు జనాభాచే భాగించుట వల్ల ఆ సంవత్సర నిజ తలసరి ఆదాయాన్ని తెలుసుకొనుట.
నిజ తలసరి ఆదాయం = నిజ జాతీయాదాయం / జనాభా.

ప్రశ్న 8.
జాతీయాదాయం నందలి భాగాలను తెలపండి.
జవాబు.
జాతీయాదాయం అనగా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయ్యే వస్తు సేవల నికర విలువను జాతీయాదాయం అంటారు.

జాతీయాదాయం-భాగాలు : జాతీయాదాయంలో 5 ప్రధాన భాగాలున్నాయి. అవి :
ఎ) వినియోగం – C
బి) స్థూల దేశీయ పెట్టుబడి – I
సి) ప్రభుత్వ వ్యయం – G
డి) నికర విదేశీ పెట్టుబడి – (X – M)
ఇ) నికర విదేశీ ఆదాయం.

TS Board Inter First Year Economics Study Material Chapter 7 జాతీయాదాయ విశ్లేషణ

ప్రశ్న 9.
జాతీయాదాయ గణనలో ఆదాయ మదింపు పద్ధతి అంటే ఏమిటి ?
జవాబు.
ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొన్న వివిధ ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలంగా లభించే భాటకం, వేతనం, వడ్డీ, లాభం, సంస్థలకు వచ్చిన ఆదాయాన్ని కలిపితే జాతీయాదాయం తెలుస్తుంది. ఈ పద్దతిలో కారకాల స్వయం ఉపాధి వలన వచ్చే ఆదాయాలను కలపాలి. అలాగే బదిలీ చెల్లింపులను జాతీయాదాయానికి కలుపకూడదు.
జాతీయాదాయం = భాటకం + వేతనం + వడ్డీ + లాభం.

ప్రశ్న 10.
భారతదేశంలో జాతీయాదాయ అంచనాను ఏవిధంగా చేస్తారు ?
జవాబు.
స్వాతంత్ర్యానంతరం 1949వ సంవత్సరంలో జాతీయాదాయ అంచనాల కమిటీని నియమించింది. ప్రస్తుతం జాతీయాదాయాన్ని లెక్కించే బాధ్యత CSO చూస్తుంది. భారతదేశంలో జాతీయాదాయం ఆదాయ మదింపు పద్ధతి, ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా లెక్కించబడుతుంది.

కేంద్ర గణాంక సంస్థ భారత ఆర్థిక వ్యవస్థను 13 రంగాలుగా వాటిని తిరిగి 5 విభాగాలుగా పరిగణిస్తుంది. అవి ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, రవాణా సమాచారం, విత్తం, రియల్ ఎస్టేట్, సామాజిక వ్యష్టి సేవలు.

ప్రశ్న 11.
తలసరి ఆదాయం (Per Capita Income) మరియు జాతీయాదాయాలను విభేదించండి.
జవాబు.
ఒక నిర్దేశిత సంవత్సరంలో ఒక దేశ ప్రజల సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం తెలుపుతుంది. ప్రస్తుత సంవత్సరపు జాతీయాదాయాన్ని ప్రస్తుత సంవత్సర జనాభాచే భాగించడం ద్వారా దీనిని లెక్కిస్తాం.

2017 – 18 సంవత్సరానికి తలసరి ఆదాయం = 2017 – 2018 సం||లో ప్రస్తుత ధరల్లో జాతీయాదాయం / 2017 – 18 సంవత్సరంలో జనాభా.

ఇది ప్రస్తుత ధరలలో తలసరి ఆదాయాన్ని కొలవడాన్ని సూచిస్తుంది. ఈ భావన ఒక దేశ ప్రజల సగటు ఆదాయం మరియు వారి జీవన ప్రమాణాన్ని వివరించే ఒక మంచి సూచిక. కాని ఇది విశ్వసించదగినది కాదు. ఎందుకంటే, సగటు ఆదాయంతో పోల్చినపుడు వాస్తవ ఆదాయం సగటు కంటే అధికంగానో లేదా తక్కువగానో ఉండవచ్చు.

తలసరి ఆదాయాన్ని స్థిరమైన ధరలలో కూడా లెక్కించి తద్వారా నిజ తలసరి ఆదాయాన్ని తెలుసుకోవచ్చు. ఒక ప్రత్యేక సంవత్సర నిజ జాతీయాదాయాన్ని ఆ సంవత్సరపు జనాభాచే భాగించుట వల్ల ఆ సంవత్సర నిజ తలసరి ఆదాయాన్ని తెలుసుకోగలం. ఒక దేశ జాతీయాదాయ పరిమాణం అనేక అంశాలలో ప్రభావితమై నిర్ణయింపబడుతుంది. జాతీయాదాయ పరిమాణాన్ని నిర్ణయించే అంశాలలో ముఖ్యమైనవి.

TS Board Inter First Year Economics Study Material Chapter 7 జాతీయాదాయ విశ్లేషణ

ప్రశ్న 12.
బదిలీ చెల్లింపులు అంటే ఏమిటి ? ఉదాహరణలిమ్ము.
జవాబు.
కొందరు వ్యక్తులు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనకపోయినా ఆదాయంలో కొంత భాగాన్ని చెల్లించవలసి ఉంటుంది. అవి పెన్షన్లు, నిరుద్యోగభృతి, ప్రభుత్వ బాండ్లపై వడ్డీ మొదలగునవి. వీటిని బదిలీ చెల్లింపులు అంటారు.

ప్రశ్న 13.
జాతీయాదాయ అంచనాల ప్రాముఖ్యత ఏమిటి ?
జవాబు.
స్వాతంత్య్రానంతరం 1949వ సంవత్సరంలో జాతీయాదాయ అంచనాల కమిటీని నియమించింది. ప్రస్తుతం జాతీయాదాయాన్ని లెక్కించే బాధ్యత CSO చూస్తుంది. భారతదేశంలో జాతీయాదాయం ఆదాయ మదింపు పద్ధతి, ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా లెక్కించబడుతుంది.

కేంద్ర గణాంక సంస్థ భారత ఆర్థిక వ్యవస్థను 13 రంగాలుగా వాటిని తిరిగి 5 విభాగాలుగా పరిగణిస్తుంది. అవి ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, రవాణా సమాచారం, విత్తం, రియల్ ఎస్టేట్, సామాజిక వ్యష్టి సేవలు.

ప్రశ్న 14.
సి.ఎస్.ఓ (C.S.O)ను విస్తరించండి. దాని బాధ్యత ఏమిటి ?
జవాబు.
స్వాతంత్ర్యానంతరం భారత ప్రభుత్వం 1949 సంవత్సరంలో P.C. మహలనోబిస్, గాద్గిల్, వి.కె.ఆర్. రావులతో జాతీయాదాయ అంచనాల కమిటీని నియమించింది. భారతదేశంలో జాతీయాదాయాన్ని మదింపు చేయడం దీని లక్ష్యం. ప్రస్తుతం కేంద్ర గణాంక సంస్థకు (CSO) జాతీయాదాయాన్ని లెక్కించే బాధ్యతను అప్పగించారు.

భారతదేశంలో జాతీయాదాయం రెండు పద్ధతులలో లెక్కింపబడుతుంది. అవి :

  • ఆదాయ మదింపు పద్ధతి
  • ఉత్పత్తి మదింపు పద్ధతి.

కేంద్ర గణాంక సంస్థ భారత ఆర్థిక వ్యవస్థను 13 రకాలుగా విభజించి, వాటిని తిరిగి 5 విభాగాలుగా పరిగణిస్తుంది. అవి :

  1. ప్రాథమిక రంగం : వ్యవసాయం, అడవులు, లాగింగ్, (Logging) చేపలు పట్టడం, గనుల తవ్వకం.
  2. ద్వితీయ రంగం : తయారీ సంస్థలు (రిజిస్టరయినవి, రిజిస్టరు కానివి), నిర్మాణం, విద్యుచ్ఛక్తి, గ్యాస్, నీటి సరఫరా.
  3. రవాణా, సమాచారం, వ్యాపారం : రైల్వేలు, ఇతర పద్ధతుల ద్వారా రవాణా, నిలవ (storage), కమ్యూనికేషన్స్, వ్యాపారం, హోటళ్ళు, రెస్టారెంట్లు.
  4. విత్తం, రియల్ ఎస్టేట్: బాంకింగ్, బీమా, రియల్ ఎస్టేట్, నివాస స్థలాల ఆధిపత్యం, వ్యాపార సేవాలు.
  5. సామాజిక, వ్యష్టి సేవలు : రక్షణ, ప్రభుత్వ పరిపాలన, ఇతర సేవలు.

TS Board Inter First Year Economics Study Material Chapter 7 జాతీయాదాయ విశ్లేషణ

ప్రశ్న 15.
తరుగుదల అంటే ఏమిటి ?
జవాబు.
యంత్రాలు నిరంతరం ఉపయోగించినప్పుడు అవి అరిగిపోయే అవకాశం ఉంది. వాటికయ్యే మరమ్మత్తు ఖర్చును తరుగుదల అంటారు.

TS Inter 1st Year History Study Material Chapter 7 దక్షిణ భారతదేశ రాజ్యాలు

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 7th Lesson దక్షిణ భారతదేశ రాజ్యాలు Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 7th Lesson దక్షిణ భారతదేశ రాజ్యాలు

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పృధ్వీరాజ్ రాసో గురించి రాయండి.
జవాబు.
రాజపుత్రుల పుట్టుక గురించి మరొక ఆసక్తికరమైన విషయాన్ని “పృధ్వీరాజ్ రాసో” అనే హింది కావ్యంలో చాంద్ బర్దాయ్ అనే కవి తెలియజేసాడు. ఇతడి ప్రకారం అబూ పర్వతం మీద వశిష్టుడు చేసిన హోమాగ్ని నుంచి ఉద్భవించిన వీరుడి సంతతి వారైనందువల్ల వీరు అగ్నికుల క్షత్రియులయ్యారని పేర్కొన్నాడు. ఈ యజ్ఞగుండం నుంచి నలుగురు వీరులు ఉద్భవించారని వారు ఒక్కొక్కరు ఒక్కొక్క రాజపుత్ర రాజ్యాన్ని స్థాపించారనే అభిప్రాయం కలదు. చౌహానులు, సోలంకీలు లేదా చాళుక్యులు, పరమారులు, ప్రతీహారులు ఈ వంశీయులని పేర్కొన్నాడు.

ప్రశ్న 2.
రాజతరంగిణి ప్రాధాన్యత.
జవాబు.
ప్రాచీన భారతదేశంలోని ముఖ్యమైన చారిత్రక రచన కల్హణుడు రచించిన ‘రాజ తరంగిణి’. ఇది క్రీ.శ. 1148 సం॥లో రచించబడినది. ఇది కాశ్మీర్ రాజుల చరిత్ర. కాశ్మీర్ వారు చరిత్రపట్ల అత్యంత ఆసక్తిని కనబరిచారని కల్హణుడు తెలియజేసినాడు. చరిత్రపట్ల ఆసక్తిని కలిగిన కల్హణుడు లభించిన ఆధారాలను ఉపయోగించి గొప్పగా రచించాడు.

ప్రశ్న 3.
భోజరాజు రచనలు ఏవి ?
జవాబు.
భోజరాజును “కవుల్లో రాజకుమారుడు” అంటారు. భోజరాజు కవితల మీద ‘సరస్వతీ కంఠాభరణం’, ‘శృంగార ప్రకాశ’ రాజనీతిపై ‘యుక్తికల్ప తరువు’, యోగ సూత్రాలపై ‘రాజమార్తాండ’ వ్యాఖ్యానం రచించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 7 దక్షిణ భారతదేశ రాజ్యాలు

ప్రశ్న 4.
అరబ్ దండయాత్రల ప్రభావం.
జవాబు.
ఇస్లాం మతాన్ని అరేబియా నుంచి తూర్పుదిశగా వ్యాప్తి చేయాలనేది అరబ్ల లక్ష్యం. దీనికై వారు అనేకసార్లు -దాడులు చేసారు. ఖలీఫా వాలిద్ అరేబియాను పాలిస్తున్న రోజులలో సింధ్ను ‘దాహిర్’ పరిపాలించేవాడు. సింధ్ రాజ్య సముద్ర దొంగలు. ఖలీఫా కోసం తీసుకెళుతున్న ఓడలను దోచుకున్నారు. దీనిపై దాహిర్ను వివరణ అడిగి సరైన సమాధానం లేదనే సాకుతో క్రీ.శ. 712లో మహ్మద్-బీన్-ఖాసిం నేతృత్వంలో దండెత్తాడు. ‘అలోర్’ వద్ద జరిగిన యుద్ధంలో దాహిర్ ఓడి ప్రాణాలు కోల్పోయాడు. భారతీయుల అనైక్యత అరబ్బుల దాడి విజయవంతం కావడానికి తోడ్పడింది. అయితే ఆచార్య లేనప్పూల్ అరబ్బుల సింధు ఆక్రమణను సత్ఫలితాలివ్వని ఘనవిజయంగా వర్ణించాడు.

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రెండో పులకేశి వ్యక్తిత్వాన్ని, విజయాలను వివరించండి.
జవాబు.
రెండో పులకేశి (క్రీ.శ. 609-642): రెండో పులకేశి బాదామి చాళుక్యుల్లోనే గాక ప్రసిద్ధ భారతీయ చక్రవర్తుల్లో ఒకడు. గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత దక్షిణాపథాన్ని పూర్తిగా జయించి ఏలిన మొదటి సార్వభౌముడు రెండో పులకేశి. ఇతని విజయాలను రవికీర్తి అనే జైన పండితుడు ‘ఐహోలు’ (ఐహోళి) శాసనంలో వివరించాడు. అధికారాన్ని . సుస్థిరం చేసుకున్న తర్వాత, రెండో పులకేశి దిగ్విజయ యాత్రలు సాగించాడు. ఇతడు బనవాసి, కొంకణ రాజ్యాలను జయించాడు. లాట, మాళవ, అళుప (ఉడిపి మండలం), ఘూర్జర ప్రభువులనణచి సామంతులుగా చేసుకున్నాడు. దక్షిణ కోసల, కళింగ రాజ్యాల మీద దండయాత్రలను నిర్వహించాడు. పిష్ఠపురం, కునాల (కొల్లేరు) యుద్ధాల్లో విజయాన్ని సాధించి వేంగిని ఆక్రమించాడు. అనంతరం తన తమ్ముడైన కుబ్జవిష్ణువర్ధనుణ్ణి ఈ ప్రాంతానికి రాజుగా నియమించాడు. పులకేశి మరణం తర్వాత, వేంగీ పాలకులు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుని, తూర్పు చాళుక్యులు లేదా వేంగీ చాళుక్యులుగా ప్రసిద్ధి గాంచారు. తర్వాత ఇతడు చేర, చోళ, పాండ్యరాజుల మైత్రిని సంపాదించి, పల్లవ రాజ్యంపై దండెత్తి, మహేంద్రవర్మను పుల్లలూరు యుద్ధంలో ఓడించాడు. చాళుక్య, పల్లవ రాజ్యాల మధ్య సంఘర్షణకు ఇది నాంది. పులకేశి విజయాలన్నిటిలో ఘనమైంది హర్షవర్ధనుణ్ణి ఓడించడం. ‘సకల ఉత్తరాపథేశ్వరుడైన’ హర్షవర్ధనుడు దక్షిణాపథాన్ని జయించాలని దండెత్తి వచ్చినప్పుడు పులకేశి అతణ్ణి నర్మదానది ఒడ్డున ఓడించి ‘పరమేశ్వర’ బిరుదును స్వీకరించాడు.

ఈ విజయ పరంపరలతో పులకేశి కీర్తి ప్రతిష్ఠలు దిగంతాలకు వ్యాపించాయి. పారశీక చక్రవర్తి రెండో ఖుస్రూ పులకేశి శక్తి సామర్థ్యాలను గురించి విని అతనితో దౌత్య సంబంధాలను నెలకొల్పుకున్నాడు. అజంతా మొదటి గుహలోని రెండు చిత్రాలు, ఈ రాయబారాలకు సంబంధించినవేనని కొందరి అభిప్రాయం. క్రీ.శ. 640-641 ప్రాంతంలో చైనా యాత్రికుడైన హూయాన్ త్సాంగ్ చాళుక్య రాజ్యాన్ని దర్శించి తన అనుభవాలను వివరించాడు. పులకేశి సామ్రాజ్యం సారవంతమై, సిరి సంపదలతో తులతూగుతున్న దేశమని అతను తెలిపాడు. అక్కడి ప్రజలు యుద్ధప్రియులని, మేలు చేసిన వారిపట్ల కృతజ్ఞులై ఉంటారని వారికోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సంసిద్ధులవు తారని, అలాగే కీడు తలపెట్టిన వారిపై ప్రతీకారం తీర్చుకోనిదే నిద్రపోరని అతను వివరించాడు. వారి రాజు పు-లో-కే-షి (పులకేశి) క్షత్రియ వీరుడని, తన ప్రజలను, సైనిక బలాన్ని చూసుకుని అతడు గర్విస్తాడని, పొరుగు రాజ్యాలంటే అతనికి లక్ష్యం లేదని అతను వర్ణించాడు.

ఇన్ని గొప్ప విజయాలను సాధించిన పులకేశి జీవితం విషాదాంతమైంది. క్రీ.శ.641లో పులకేశి రెండోసారి పల్లవరాజ్యం మీద దండెత్తినపుడు పల్లవరాజైన నరసింహవర్మ పులకేశిని బాదామి వరకు తరిమి వధించాడు. ఈ పరాజయం నుంచి బాదామి చాళుక్యులు ఒక శతాబ్దం వరకు కోలుకోలేదు.

ప్రశ్న 2.
దక్షిణభారతదేశ సంస్కృతికి పల్లవుల యొక్క సేవను వివరించండి.
జవాబు.
దాదాపు రెండున్నర శతాబ్దాల కాలం పాటు కాంచీపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన వారు పల్లవులు. వీరు క్రీ.శ 557 నుంచి క్రీ.శ 796 వరకు పరిపాలించారు. బాదామి చాళుక్యులు, మధురై పాండ్యులు వీరికి సమకాలికులు. వీరు ప్రస్తుత తమిళ, కన్నడ ప్రాంతాలను పరిపాలించారు. కావేరీ, తుంగభద్ర డెల్టాపై అధికారం సాధించేందుకు వీరు నిరంతరం యుద్ధాలలో మునిగి ఉండేవారు. సింహవిష్ణు నాయకత్వంలో తమిళదేశంలో అత్యంత శక్తివంతులుగా పేరొందారు. సింహవిష్ణు అనంతరం అతడి కుమారుడు మహేంద్రవర్మ రాజయ్యాడు. ఇతడు రెండవ పులకేశి చేతిలో క్రీ.శ 610లో పరాజితుడయ్యాడు. మహేంద్రవర్మ తర్వాత అతడి కుమారుడు నరసింహవర్మ రాజయ్యాడు. ఇతడు మణి మంగళం యుద్ధంలో రెండవ పులకేశిని ఓడించి, చంపి వారి రాజధాని బాదామిని దోచుకున్నాడు. ‘వాతాపికొండన్’ అనే బిరుదు ధరించాడు. చైనా యాత్రికుడు హూయాన్ త్సాంగ్ ఇతని ఆస్థానాన్ని దర్శించాడు. ఇతడి వారసులు బలహీనులు.

పల్లవుల రాజకీయ వ్యవస్థ: పల్లవులు దక్షిణ భారతదేశంలో సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించారు. భారతదేశ సాంస్కృతిక చరిత్రలో పల్లవయుగం గొప్పదశ. భారతదేశ సాంస్కృతిక ఐక్యత వీరి కాలంలో జరిగింది. పల్లవులు సంప్రదాయ నిరంకుశ రాజరిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. పరిపాలనా వ్యవస్థకు రాజే ప్రధాన సూత్రధారి. రాజుకు సర్వాధికారాలు ఉండేవి. అయినా నిరంకుశుడు కాదు. ధర్మాన్ని రక్షిస్తూ ఉండేవాడు. దైనందిన పరిపాలనలో రాజుకు అనేకమంది అధికారులు సహకరించేవారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని రాష్ట్రాలు, కొట్టాలు, గ్రామాలుగా విభజించారు. భూమిశిస్తు రాజ్యానికి ప్రధాన ఆదాయం. దీనికి తోడు వాణిజ్య పన్నులు, వస్తువులపై పన్నుల ద్వారా ఆదాయం లభించేది.

మతాభివృద్ధి: పల్లవులు వైదిక మతాభిమానులు. వీరిలో చాలామంది శైవులు. రాజసింహుడు వంటి కొంతమంది వైష్ణవ మతాభిమానులుండేవారు. శైవులను నాయనార్లని పిలిచేవారు. వీరిలో ‘అప్పార్’, ‘సంబంధార్’, ‘సుందరమూర్తి’, ‘మాళిక్కవాళగర్’ మొదలైనవారు శైవమత వ్యాప్తికి ఈ యుగంలో అంకితమయ్యారు. విప్రనారాయణ, తిరుమంగై మొదలైన ఆళ్వారులు వైష్ణవమత వ్యాప్తికి అంకితమయ్యారు. పల్లవ యుగంలో తిరుపతి, శ్రీరంగం మొదలైన వైష్ణవ క్షేత్రాలు భక్తులను ఆకర్షించాయి. జైన, బౌద్ధమతాలు కూడా ఈ యుగంలో విలసిల్లాయి. కాంచీపురంలో 180 బౌద్ధారామాలున్నట్లు హూయాన్ త్సాంగ్ రాశాడు. అయితే శైవమతం, వైష్ణవమతాల వ్యాప్తితో జైన, బౌద్ధమతాలు కొంతవరకు క్షీణించాయి.

విద్యాసారస్వతాల ప్రగతి: ప్రాచీన పల్లవుల కాలంలో సంస్కృతం రాజభాష అయింది. నవీన పల్లవులు తమ శాసనాలన్నిటినీ సంస్కృతంలోనే వేయించారు. వీరు ఘటికలను స్థాపించి, సంస్కృతాన్ని, వైదిక విద్యలను పోషించారు. ఈ ఘటికల్లో చతుర్విద విద్యలు అంటే అన్వీక్షకి (Philosophy), త్రయీ (Three Vedas), వార్తా (Economics), దండనీతి (Politics) బోధించేవారు. కాంచీపుర ఘటికా స్థానం, దేశవ్యాప్తంగా ప్రసిద్ధి వహించి, దూర ప్రాంతాల నుంచి విద్యార్థులను ఆకర్షించింది. సంస్కృత కవులైన భారవి, దండి వీరి కాలం వారే. విద్యలతోబాటు, తమిళదేశంలో నాట్య సంగీతాల్లో కూడా విశేషమైన కృషి జరిగింది. ఆనాటి వాఙ్మయంలో మృదంగం, యాళి, విరళి మొదలైన వాయిద్యాల పేర్లున్నాయి.

వాస్తు శిల్పాల్లో పల్లవుల కృషి: దక్షిణ భారతదేశంలో వాస్తు చరిత్ర పల్లవుల కాలంలోనే ప్రారంభమైందని విన్సెట్ స్మిత్ అభిప్రాయం. మనోహరమైన భారతీయ శిల్పరీతుల్లో పల్లవశైలి ఒకటి. వీరి కాలంనాటి శిల్పాలు, నిర్మాణాలు అపురూప కళాఖండాలు. ముఖ్యంగా కొండను తొలిచి ఆలయాలను నిర్మించే అద్భుతమైన కొత్త పద్ధతిని, మహేంద్రవర్మ తమిళ దేశంలో ప్రవేశపెట్టాడు. ఇదే పద్ధతిలో నరసింహవర్మ మహామల్లవరం (మహాబలిపురం)లో పంచపాండవుల రథాలను తొలిపించాడు. రాజసింహుడు మహాబలిపురంలో తీరదేవాలయాన్ని, కాంచీపురంలో కైలాసనాథ ఆలయాన్ని నిర్మించాడు. పల్లవుల వాస్తు ప్రత్యేకత కైలాసనాథ ఆలయంలో ప్రతిబింబిస్తుంది. శిల్పాల్లో మహామల్లపురంలో ఉన్న ‘గంగావతరణ’ శిల్పం విదేశీ కళావిమర్శకుల ప్రశంసలందుకున్నది.

ప్రశ్న 3.
చాళుక్యుల కాలంలో దక్కనులో నెలకొన్న పరిస్థితులను చర్చించండి.
జవాబు.
దక్కన్, దక్షిణ భారతదేశాన్ని పాలించిన రాజవంశాలలో చాళుక్యులు ప్రధానమైనవారు. చాళుక్యులు బాదామీ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, వేంగి చాళుక్యులు అనే మూడు ప్రధాన వంశాలుగా ఉన్నారు. వీరు కంచిని ఏలిన పల్లవులకు సమకాలీనులు. క్రీ.శ. 6వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం వరకు తిరిగి క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు సుదీర్ఘకాలం పరిపాలించారు.

రాజ్య విస్తరణ: బాదామీ చాళుక్యుల రాజ్యాన్ని పాలించిన మొదటిరాజు జయసింహ వల్లభుడు. వింధ్య పర్వతాలు, కృష్ణానది మధ్య ఉన్న దక్షిణా పథాన్ని పాలించాడు. బాదామీ చాళుక్యులలో గొప్పవాడు మొదటి పులకేశి. రెండవ పులకేశి అందరిలోకి గొప్పవాడు. ఇతను క్రీ.శ. 609-642 సంవత్సరం వరకు పరిపాలించాడు. క్రీ.శ. 609లో సింహాసనం అధిష్టించి అంతర్గత సమస్యలను అణచివేసాడు. కదంబులు, గాంగులను జయించాడు. లాటపాలకులు, మాళవులు, ఘార్జరులు ఇతని సార్వభౌమత్వాన్ని అంగీకరించారు. పల్లవ మహేంద్రవర్మను ఓడించాడు. వేంగి ప్రాంతాన్ని ఆక్రమించి తన సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుని పాలకుడిగా నియమించాడు. తరువాత వేంగి తూర్పు చాళుక్యుల రాజధాని అయింది. వారు రెండు శతాబ్దాలపాటు ఆంధ్రదేశాన్ని పరిపాలించారు.

రెండవ పులకేశి కాలంలో చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ బాదామీ చాళుక్యరాజ్యాన్ని సందర్శించాడు. హుయానాత్సాంగ్ రెండవ పులకేశి గొప్పతనాన్ని, సైనిక బలాన్ని కొనియాడాడు. రెండవ పులకేశి నర్మదా యుద్ధంలో హర్షవర్ధనుని ఓడించి నర్మదానదిని హర్షవర్ధనుని రాజ్యానికి హద్దుగా నిర్ణయించాడు. అయితే రెండవ పులకేశి చివరి రోజులు విషాదాంతమయ్యాయి. క్రీ.శ. 642లో జరిగిన మణమంగళం యుద్ధంలో రెండవ పులకేశి పల్లవరాజు చేతిలో ఓడిపోయి మరణించాడు. రెండవ పులకేశి వారసులు బలహీనులవుట వలన, రాష్ట్రకుట దంతిదుర్గుని దాడుల వలన బాదామీ చాళుక్యుల పాలన అంతమైంది.

పాలనా విధానం: చాళుక్యులది వంశపారంపర్య నిరంకుశ రాజరిక వ్యవస్థ. రాజుకు సర్వాధికారాలు ఉండేవి. రాజును దైవాంశ సంభూతుడిగా భావించేవారు. రాజులు ‘శ్రీ పృథ్వీ వల్లభ’ అనే బిరుదు ధరించారు. చాళుక్యుల పాలనలో నిర్దిష్టమైన మంత్రి పరిషత్ లేదు. రాజ కుటుంబానికి విశ్వాసపాత్రులు అయిన వారు పరిపాలనా వ్యవహారాలు · నిర్వహించేవారు. చాళుక్య రాజ్యంలో పాలన వికేంద్రీకరించబడింది. రాష్ట్రాలు, విషయాలు, నాడులు అనే పాలనావ్యవస్థలు ఉండేవి. విషయపతులు, సమర్థులు, గ్రామభోజకులు అనే అధికారుల గురించి చాళుక్యుల రికార్డులలో ప్రస్తావన లభిస్తుంది. పాలనా వ్యవహారంలో గ్రామం అత్యంత చిన్న విభాగం. ‘గాముండ’ అనే అధికారి గ్రామపాలనను నిర్వహించేవాడు. ఇతను గ్రామానికి, రాజుకు మధ్య వారధిగా ఉండేవాడు. సమర్థవంతమైన పన్నుల వ్యవస్థ అమలులో ఉండేది. సొంత గృహాలు, ఇంటి స్థలాలు ఉన్నవారు పన్నులు చెల్లించాల్సి ఉండేది.

TS Inter 1st Year History Study Material Chapter 7 దక్షిణ భారతదేశ రాజ్యాలు

సాంఘిక పరిస్థితులు:
విద్యా విధానం: ప్రజలు విద్యాభ్యాసం పట్ల శ్రద్ధ కనబరచేవారని హూయాన్ త్సాంగ్ పేర్కొన్నాడు. వీరి శాసనాల్లో బ్రాహ్మణులు పద్నాలుగు విద్యల్లో పాండిత్యం కలవారని చెప్పబడింది. బాదామీలో నాలుగు రకాల శాస్త్ర బోధన జరిగేదని తెలుస్తోంది. చాళుక్యుల సంప్రదాయం ప్రకారం పద్నాలుగు విద్యల్లో చతుర్వేదాలు, ఆరు అంగాలు, పురాణాలు, మీమాంస, న్యాయ, ధర్మశాస్త్రాలు ఉండేవి. వేదాలు, తత్త్వశాస్త్రం, అర్థశాస్త్రం, దండనీతి అనే నాలుగు విద్యలు ప్రధానమైనవిగా భావించేవారు.
మత విశ్వాసాలు: చాళుక్యులు సంప్రదాయ హిందూ మతస్థులు. వారు వైదిక బలిదానాలను పునరుద్ధరించారు. మొదటి పులకేశి అశ్వమేధయాగం చేశాడు. చాళుక్యులు బాదామీ, ఐహోలు, పట్టడకల్లలో గొప్ప ఆలయాలను నిర్మించారు.

సైనిక వ్యవస్థ: చాళుక్యులు పటిష్టమైన సైనిక వ్యవస్థను కలిగి ఉండేవారు. హర్షవర్ధనుడంతటి గొప్ప చక్రవర్తి రెండవ పులకేశి చేతుల్లో ఓడిపోవటం వీరి సైనిక శక్తికి నిదర్శనం.

కళాపోషణ: చాళుక్యరాజులు గొప్పవాస్తు శిల్పకళా పోషకులు. వీరి పోషణలో గొప్ప ప్రెస్కో చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. వీరు బాదామీ, ఐహోలు, పట్టడకల్లో నిర్మించిన ఆలయాలు గొప్ప కళాఖండాలు. ఈ ఆలయాలు సాంఘిక, సాంస్కృతిక రంగాలకు కేంద్రాలుగా విలసిల్లాయి.

ప్రశ్న 4.
ఘనులైన చోళరాజులు సాధించిన విజయాలను వివరించండి.
జవాబు.
దక్షిణ భారతదేశ చరిత్రలో రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో విశేషమైన విజయాలను సాధించిన తంజావూరు చోళులకు ప్రత్యేక స్థానం ఉంది.

రాజ్యస్థాపన: అశోకుని 2వ, 12వ శిలా శాసనాలలో చోళులను గురించిన ప్రస్తావన ఉంది. క్రీ.శ. 850 సంవత్సరంలో విజయాలయుడు స్వతంత్ర చోళ రాజ్యాన్ని స్థాపించాడు. అతడి రాజధాని ఉరయ్యార్. ఇతడు పల్లవుల వద్ద ఉద్యోగి. ముత్తరియార్ పాలకుల నుంచి విజయాలయుడు తంజావూరు స్వాధీనం చేసుకున్నాడు.

రాజ్యవిస్తరణ – సైనిక విజయాలు: చోళరాజులలో మొదటి ఆదిత్యుడు రెండో గొప్పరాజు. పల్లవరాజు అపరాజితవర్మను అంతమొందించాడు. అతని కుమారుడు పరాంతకుడు పాండ్యులను ఓడించి మధురై స్వాధీనం చేసుకొని, మధురైకొండ అనే బిరుదు ధరించాడు. అయితే ఇతను రాష్ట్రకూట పాలకుడు మూడవ కృష్ణుని చేతిలో ఓడిపోయాడు.

రెండవ పరాంతకుని కుమారుడైన రాజరాజు, తరువాత వచ్చిన మొదటి రాజేంద్రచోళుడు, తరువాతివాడైన రాజాధిరాజులు చోళపాలకుల్లో గొప్పవారు. క్రీ.శ. 985లో రాజరాజు సింహాసనాన్ని అధిష్టించాడు. అతడు చేర, పాండ్య రాజ్యాలను జయించాడు. రాజరాజు గొప్ప నౌకాదళాన్ని ఏర్పాటు చేసుకొని సిలోన్ (శ్రీలంక) ఉత్తర ప్రాంతాన్ని జయించాడు. తూర్పు చాళుక్యరాజు విమలాదిత్యుడు తన కుమార్తె కుందవైని రాజరాజుకిచ్చి వివాహం చేశాడు. రాజరాజు పరమత సహనం గల పాలకుడు. తంజావూరులోని బృహదీశ్వరాలయాన్ని నిర్మింపజేశాడు. బృహదీశ్వరాలయ గోపురం గొప్ప వాస్తు శిల్పకళాఖండం. నేటికీ ప్రపంచంలోని వివిధ ప్రాంతాల సందర్శకులను ఆకర్షిస్తోంది. తరువాత వచ్చిన మొదటిరాజేంద్ర చోళుడు సిలోన్పై దండయాత్ర చేశాడు. గాంగ, పాలరాజులపై విజయాలు సాధించి ‘గంగైకొండ రాజేంద్రచోళ’ అని పేరుగాంచాడు.

రాజేంద్ర చోళుడు గొప్ప పాలకుడు. గంగైకొండ చోళపురం (తిరుచినాపల్లి) అనే నూతన రాజధాని నగరాన్ని నిర్మింపజేసాడు. ఇది ఆగ్నేయాసియా దేశాలతో పటిష్ట వ్యాపార సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి తోడ్పడింది. పెద్ద కృత్రిమ రిజర్వాయర్ను నిర్మింపజేసి కొలెరుమ్, వెల్లార్ నదుల నుంచి కాలువల ద్వారా నీటిని నింపాడు.
రాజేంద్రచోళుడి తర్వాత వచ్చిన రాజాధిరాజు కాలం నాటికి అంతర్గత, బహిర్గత సమస్యలు ఎక్కువయ్యాయి. ఇతను పాండ్య, కేరళ పాలకులను అణచివేశాడు. పశ్చిమచాళుక్య పాలకుడైన మొదటి సోమేశ్వరునితో జరిగిన యుద్ధంలో రాజాధిరాజు మరణించాడు.

చోళుల పాలన – సామాజిక విశేషాలు: రాజు సర్వాధికారి. పాలనలో రాజుకి ‘ఉదంకుట్టం’ అనే ఉన్నతాధికారులు అండగా ఉండేవారు. చోళులు పటిష్టమైన ఉద్యోగ వ్యవస్థను ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థలకు పాలనలో విశేషాధికారాలు కల్పించారు. ఉత్తర మేరూరు శాసనం చోళుల కాలంనాటి స్థానిక స్వపరిపాలన విషయాలను తెలియజేస్తుంది. గ్రామపాలన, గ్రామ అసెంబ్లీలో సభ్యులుగా ఎన్నిక కావడానికి కావలసిన అర్హతలను ఈ శాసనం వివరించింది.

స్థానిక పాలన: చోళుల పరిపాలనా వ్యవస్థలోని గొప్ప అంశం, వారికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది గ్రామపాలనా వ్యవస్థ పట్టణాలు, గ్రామాలు అసెంబ్లీలను కలిగి ఉండేవి. ఊర్, సభ అనే రెండు రకాల అసెంబ్లీలు ఉండేవి. ‘ఊర్’ సాధారణ సభ్యులతో కూడిన అసెంబ్లీ కాగా, ‘సభ’ బ్రహ్మాండ గ్రామ పాలనా వ్యవహారాలకు సంబంధించింది. గ్రామ అసెంబ్లీ తన విధులను ‘వారియం’ అనే కమిటీల ద్వారా నిర్వహించేది. ఈ అసెంబ్లీ ‘తోట వారియం’, ‘చెరువు వారియం’ ఇలా అనేక కమిటీలు ఏర్పరిచేది. గ్రామ అసెంబ్లీలు పాలనలో సంపూర్ణ సార్వభౌమాధికారాన్ని చెలాయించేవి. గ్రామంలోని ఉమ్మడి భూములపై అధికారాన్ని కలిగి ఉండటంతో పాటు ప్రైవేట్ భూములపై క్రమబద్ధమైన అధికారాన్ని కలిగి ఉండేది.

గ్రామసభల కార్యనిర్వాహక కమిటీ సభ్యులను ప్రజలు ఎన్నుకొనేవారు. ప్రతి గ్రామం, పట్టణం అనేక వార్డులుగా విభజింపబడేవి. వార్డులను ‘కుటుంబం’ అని పిలిచేవారు. వీరికి కొన్ని అర్హతలను ఏర్పాటుచేసారు.

అర్హతలు:: 35-70 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి; వేదాలలో పాండిత్యాన్ని కలిగి గ్రామ నివాసి అయి ఉండాలి.
ఈ విధంగా చోళులు సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో తమదైన ముద్రవేసి దక్షిణ భారతదేశ చరిత్రలోనే కాక భారతదేశ చరిత్రలోనే ప్రత్యేక స్థానాన్ని కలిగివున్నారు.

TS Inter 1st Year History Study Material Chapter 7 దక్షిణ భారతదేశ రాజ్యాలు

ప్రశ్న 5.
చోళుల పరిపాలన ప్రధాన లక్షణాలను చర్చించండి.
జవాబు.
చోళుల పాలనా వ్యవస్థలోని ముఖ్య లక్షణం వారి స్థానిక స్వపరిపాలనా విధానం. చోళుల గ్రామ పరిపాలననే “స్థానిక స్వపరిపాలన” అని కూడా అంటారు. మొదటి పరాంతకుని ఉత్తరమేరూర్ శాసనంలోను, కులోత్తుంగుని శాసనాల్లోను చోళుల గ్రామ పాలనా పద్ధతి వివరించబడింది.

గ్రామ పాలన: చోళుల సామ్రాజ్యంలో ప్రతి గ్రామానికి స్వయం పాలనాధికారం ఉంది. ప్రతి గ్రామంలోను గ్రామ పెద్దల సభ వుండేది. ఈ గ్రామ సభ స్వరూప స్వభావాలను గ్రామ గ్రామానికి మారుతుండేవి.

గ్రామ సభలు: చోళుల కాలంలో గ్రామాల్లో మూడు రకాల సభలుండేవి. అవి: 1) ఊర్ 2) సభ 3) నగరం ఊర్ అనే సభలో గ్రామంలోని భూస్వాములందరూ సభ్యులే. “సభ”లో బ్రాహ్మణ అగ్రహారంలోని వారు మాత్రమే సభ్యులుగా ఉండేవారు. ‘నగరం’ అనేది వర్తకులకు సంబంధించిన సభ. బ్రాహ్మణ అగ్రహారంలోని సభ్యులకు దేవాలయమే సమావేశపు స్థలం. కొన్ని గ్రామాల్లో ప్రత్యేకించి కచేరీలుండేవి.

సభ్యుల ఎన్నిక: చోళుల కాలంలో ప్రతి గ్రామాన్ని 30 వార్డులుగా విభజించారు. ప్రతి వార్డు నుండి ఒక సభ్యుడ్ని లాటరీ పద్ధతిపై ఎన్నుకునేవారు. ఈ సభ్యులను గ్రామసభ ఉపసంఘాలుగా నియమించేది. చెరువులు, సత్రాలు, ఆలయాలు, తోటలు, పాఠశాలలు, నేర విచారణ, పన్నుల వసూలు మొదలైన వాటికి ప్రత్యేక ఉపసంఘాలుండేవి. “పంచదార వారియం” అనే ఉపసంఘం మిగిలిన సంఘాల కార్యక్రమాలను పరిశీలించేది.

అర్హతలు: గ్రామసభలోని సభ్యుల అర్హతలను గురించి ప్రత్యేక నిబంధనావళిని రూపొందించి అమలు చేశారు. సభ్యులుగా ఎన్నుకోబడుటకు ఒక వ్యక్తికి కొన్ని అర్హతలుండాలి. అతడు:

  1. 30 నుండి 70 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వుండాలి.
  2. విద్యావంతుడై వుండాలి.
  3. సొంత ఇల్లు కలిగి భూమికి యజమానై వుండాలి. అనర్హతలు: గ్రామసభ సభ్యులకు కొన్ని అర్హతలతో పాటు కొన్ని అనర్హతలు కూడా నిర్దేశించారు.

గ్రామసభకు ఎన్నుకోబడదలచుకున్న వ్యక్తి:

  1. పంచ మహాపాపాలు చేసినవాడై ఉండకూడదు.
  2. గత మూడు సంవత్సరాలుగా ఏ ఉపసంఘంలోను సభ్యుడిగా ఉండరాదు.
  3. ఒకసారి సభ్యుడిగా ఉండి లెక్కలను సరిగా అప్పగించని వాడు కూడా అనర్హుడే,
  4. నేరస్థులు వారి బంధువులు కూడా ఈ ఎన్నికల్లో పాల్గొనకూడదు.

గ్రామ సభ అధికారాలు: గ్రామంలోని భూములపై యాజమాన్యపు హక్కు సభకు ఉన్నది. పన్నులను విధించుట, అడవులను నరికించి కొత్త భూములను సాగులోకి తీసుకువచ్చుట మొదలగునవి ఈ సభ ముఖ్య విధులు. వీటితోపాటు భూమి, నీటి తగవులను పరిష్కరించుట, నేరాలను విచారించుట కూడా దీని విధులుగా చెప్పుకోవచ్చు. అయితే ఆదాయ వనరులు తక్కువ కావటంతో కేంద్ర ప్రభుత్వమే రహదారులు నిర్మించగా వాటిపై అజమాయిషీని సభ నిర్వహించేది. గ్రామసభలకు సలహాలివ్వటానికి అధికారులుండేవారు. కేంద్ర ప్రభుత్వము యొక్క అనవసర జోక్యము ఈ సభలలో ఉండేది కాదు.

ముగింపు: చోళుల గ్రామ పాలన సమర్థవంతమైనది, ఆదర్శవంతమైనది. చోళులు గ్రామ పరిపాలనను ఏర్పరచి అందులో ప్రజలను భాగస్వాములను చేయటం వల్ల పాలనలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సమన్వయం సాధ్యపడింది.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బాదామి చాళుక్య రాజ్యస్థాపనకు దారితీసిన పరిస్థితులను వివరించండి.
జవాబు.
దక్షిణాపథాన్ని పరిపాలించిన గొప్పపాలకుల్లో కర్ణాటకలోని ‘బాదామి’ కేంద్రంగా పరిపాలించిన చాళుక్యులు ఒకరు. వీరు 7వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం తొలిదశ వరకు పరిపాలించారు. వీరిలో రెండవ పులకేశిన్ సుప్రసిద్ధుడు. వీరినే పశ్చిమ చాళుక్యులు అని వర్ణిస్తారు. స్వతంత్ర్య బాదామి చాళుక్య రాజ్య స్థాపకుడు జయసింహుడు. ఇతడు మహాపరాక్రమవంతుడు. వీరు వింద్యాపర్వతాలకూ, కృష్ణానదికి మధ్య కల భూభాగాలను పరిపాలించి శాశ్వతకీర్తి గడించారు. జయసింహుడి అనంతరం అతని కుమారుడైన రణరంగుడు. ఇతడి అనంతరం పరిపాలించిన బాదామి చాళుక్య రాజుల్లో మొదటి పులకేశిన్ రణరంగుని కుమారుడు. ఇతడు క్రీ.శ. 535 – 566 మధ్యకాలంలో రాజ్యపాలన చేసాడు. బాదామి పట్టణం ఇతని రాజధాని. ఇతని వారసుడే ‘కీర్తివర్మ’. ఇతడు ‘మహారాజు’ అనే బిరుదు ధరించాడు. ఇతడు నలవాడి (కర్నూల్, బళ్ళారి) పాలకులను, బనవాసి కదంబులను ఓడించాడు. ఇతని కుమారుడైన రెండోపులకేశి బాలుడైనందున సోదరుడు మంగళేశుడు రాజ్య వ్యవహారాలు నిర్వహించాడు. ఇతడు కాలచురులను ఓడించి రేవతి .ద్వీపాన్ని ఆక్రమించాడు. క్రీ.శ. 609లో రెండో పులకేశి సింహాసనానికి వచ్చాడు.

ప్రశ్న 2.
మొదటి నర్సింహవర్మన్ సాధించిన విజయాలను చర్చించండి.
జవాబు.
ఇతను మహేంద్రవర్మ కుమారుడు. పల్లవ రాజులందరిలోనూ అగ్రగణ్యుడు. సింహాసనమెక్కిన వెంటనే నరసింహవర్మ చాళుక్యుల దండయాత్రను ఎదుర్కోవలసి వచ్చింది. క్రీ.శ. 641లో రెండో పులకేశి పల్లవ రాజ్యంపైకి దండెత్తినప్పుడు పల్లవసేనలు అతణ్ణి ఓడించి తరమడమేకాక నరసింహవర్మ నాయకత్వంలో బాదామి వరకు నడిచి పులకేశిని వధించి బాదామిని దోచుకొన్నాయి. తర్వాత చోళ, పాండ్య ప్రభువులు నరసింహవర్మకు సామంతులయ్యారు. ఈ విజయాలకు నిదర్శనంగా నరసింహవర్మ ‘వాతాపికొండ’, ‘మహామల్ల’ బిరుదులను ధరించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 7 దక్షిణ భారతదేశ రాజ్యాలు

నరసింహవర్మ కూడా తండ్రి మహేంద్రవర్మలాగా సారస్వతాన్నీ, వాస్తు, లలితకళలనూ పోషించాడు. ఇతను మహామల్లపురం (మహాబలిపురం)లో ఏకశిలా రథాలనే దేవాలయాలను నిర్మింపచేశాడు. సంస్కృతంలో ‘కిరాతార్జు నీయం’ అనే కావ్యాన్ని రచించిన భారవి కవిని ఇతను ఆదరించినట్లుగా తెలుస్తున్నది. నరసింహవర్మ కాలంలోనే హ్యూయాన్ త్సాంగ్ అనే చైనా యాత్రికుడు కాంచీపురాన్ని దర్శించాడు. పల్లవుల రాజ్యాన్ని తమిళ దేశంగా వర్ణిస్తూ ఇక్కడి ప్రజలు నీతిపరులని, సత్యప్రియులని, శ్రమజీవులని, వీరికి విద్యావ్యాసాంగాలలో శ్రద్ధాసక్తులు అధికమని చెప్పాడు. కాంచీపురంలో దాదాపు 100 బౌద్ధారామాలు, 80 దేవాలయాలు ఉన్నట్లుగా కూడా ఇతను తెలిపాడు. నలందా విశ్వవిద్యాలయానికి ఆచార్యుడైన ధర్మపాలుడి జన్మస్థలం కాంచీపురమని ఇతను రాశాడు.

ప్రశ్న 3.
పల్లవ చాళుక్యుల సంఘర్షణను వివరించండి.
జవాబు.
పల్లవ రాజులలో గొప్పవాడు మొదటి మహేంద్రవర్మ. ఇతడు సింహవిష్ణువు కుమారుడు. ఇతడు తన రాజ్యాన్ని. ఉత్తరాన కృష్ణానది వరకు విస్తరింపచేసాడు. ఇతని కాలం నుంచే పల్లవ బాదామి చాళుక్యుల మధ్య రాజ్య విస్తరణకై సంఘర్షణ ఆరంభమైంది. బాదామి చాళుక్యరాజైన రెండో పులకేశిన్ పల్లవరాజుకు చెందిన ‘కర్మ’ రాష్ట్రాన్ని ఆక్రమించాడు. ఆ తరువాత రెండో పులకేశిన్ పల్లవరాజును ‘పుల్లలూరు’ యుద్ధంలో (క్రీ.శ. 630) ఓడించాడు.

మొదటి నరసింహవర్మ మహేంద్రవర్మ కుమారుడు. యువరాజుగా ఉన్నపుడే మణిమంగళంగా యుద్ధంలో రెండో పులకేశిన్ సేనలను ఓడించి తన శక్తి, ప్రతాపాలను నిరూపించుకున్నాడు. చాళుక్యుల రాజధానియైన బాదామిని ధ్వంసం చేసాడు. రెండో పులకేశిన్ కుమారుడైన విక్రమాదిత్యుడు క్రీ.శ. 655లో పల్లవరాజైన నర్సింహవర్మను ఓడించి కాంచీపురాన్ని ఆక్రమించాడు. చోళ, పాండ్య రాజుల గర్వాన్ని అణచివేసాడు. వినయాదిత్యుడి తండ్రి అనంతరం బాదామి చాళుక్యరాజ్య సింహాసనం అధిష్టించాడు. ఇతని అనంతరం చాళుక్య రాజ్యం క్షీణదశకు చేరుకుంది. ఇదేకాలంలో అరబ్ల దండయాత్ర జరిగింది.

ప్రశ్న 4.
సాహిత్యం, వాస్తు, శిల్పకళల పురోభివృద్ధికి పల్లవులు చేసిన సేవను అంచనావేయండి.
జవాబు.
పల్లవుల రాజకీయ వ్యవస్థ: పల్లవులు దక్షిణ భారతదేశంలో సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించారు. భారతదేశ సాంస్కృతిక చరిత్రలో పల్లవయుగం గొప్పదశ. భారతదేశ సాంస్కృతిక ఐక్యత వీరి కాలంలో జరిగింది. పల్లవులు సంప్రదాయ నిరంకుశ రాజరిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. పరిపాలనా వ్యవస్థకు రాజే ప్రధాన సూత్రధారి. రాజుకు సర్వాధికారాలు ఉండేవి. అయినా నిరంకుశుడు కాదు. ధర్మాన్ని రక్షిస్తూ ఉండేవాడు. దైనందిన పరిపాలనలో రాజుకు అనేకమంది అధికారులు సహకరించేవారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని రాష్ట్రాలు, కొట్టాలు, గ్రామాలుగా విభజించారు. భూమిశిస్తు రాజ్యానికి ప్రధాన ఆదాయం. దీనికి తోడు వాణిజ్య పన్నులు, వస్తువులపై పన్నుల ద్వారా ఆదాయం లభించేది.

మతాభివృద్ధి: పల్లవులు వైదిక మతాభిమానులు. వీరిలో చాలామంది శైవులు. రాజసింహుడు వంటి కొంతమంది వైష్ణవ మతాభిమానులుండేవారు. శైవులను నాయనార్లని పిలిచేవారు. వీరిలో ‘అప్పార్’, ‘సంబంధార్’, ‘సుందరమూర్తి’, ‘మాళిక్కవాళగర్’ మొదలైనవారు శైవమత వ్యాప్తికి ఈ యుగంలో అంకితమయ్యారు. విప్రనారాయణ, తిరుమంగై మొదలైన ఆళ్వారులు వైష్ణవమత వ్యాప్తికి అంకితమయ్యారు. పల్లవ యుగంలో తిరుపతి, శ్రీరంగం మొదలైన వైష్ణవ క్షేత్రాలు భక్తులను ఆకర్షించాయి. జైన, బౌద్ధమతాలు కూడా ఈ యుగంలో విలసిల్లాయి. కాంచీపురంలో 180 బౌద్ధారామాలున్నట్లు హూయాన్ త్సాంగ్ రాశాడు. అయితే శైవమతం, వైష్ణవమతాల వ్యాప్తితో జైన, బౌద్ధమతాలు కొంతవరకు క్షీణించాయి.

విద్యాసారస్వతాల ప్రగతి: ప్రాచీన పల్లవుల కాలంలో సంస్కృతం రాజభాష అయింది. నవీన పల్లవులు తమ శాసనాలన్నిటినీ సంస్కృతంలోనే వేయించారు. వీరు ఘటికలను స్థాపించి, సంస్కృతాన్ని, వైదిక విద్యలను పోషించారు. ఈ ఘటికల్లో చతుర్విద విద్యలు అంటే అన్వీక్షకి (Philosophy), త్రయీ (Three Vedas), వార్తా (Economics), దండనీతి (Politics) బోధించేవారు. కాంచీపుర ఘటికా స్థానం, దేశవ్యాప్తంగా ప్రసిద్ధి వహించి, దూర ప్రాంతాల నుంచి విద్యార్థులను ఆకర్షించింది. సంస్కృత కవులైన భారవి, దండి వీరి కాలం వారే. విద్యలతోబాటు, తమిళదేశంలో నాట్య సంగీతాల్లో కూడా విశేషమైన కృషి జరిగింది. ఆనాటి వాఙ్మయంలో మృదంగం, యాళి, విరళి మొదలైన వాయిద్యాల పేర్లున్నాయి.

వాస్తు శిల్పాల్లో పల్లవుల కృషి: దక్షిణ భారతదేశంలో వాస్తు చరిత్ర పల్లవుల కాలంలోనే ప్రారంభమైందని విన్సెట్ స్మిత్ అభిప్రాయం. మనోహరమైన భారతీయ శిల్పరీతుల్లో పల్లవశైలి ఒకటి. వీరి కాలంనాటి శిల్పాలు, నిర్మాణాలు అపురూప కళాఖండాలు. ముఖ్యంగా కొండను తొలిచి ఆలయాలను నిర్మించే అద్భుతమైన కొత్త పద్ధతిని, మహేంద్రవర్మ తమిళ దేశంలో ప్రవేశపెట్టాడు. ఇదే పద్ధతిలో నరసింహవర్మ మహామల్లవరం (మహాబలిపురం)లో పంచపాండవుల రథాలను తొలిపించాడు. రాజసింహుడు మహాబలిపురంలో తీరదేవాలయాన్ని, కాంచీపురంలో కైలాసనాథ ఆలయాన్ని నిర్మించాడు. పల్లవుల వాస్తు ప్రత్యేకత కైలాసనాథ ఆలయంలో ప్రతిబింబిస్తుంది. శిల్పాల్లో మహామల్లపురంలో ఉన్న ‘గంగావతరణ’ శిల్పం విదేశీ కళావిమర్శకుల ప్రశంసలందుకున్నది.

ప్రశ్న 5.
రాజరాజచోళుని ఘనతను చర్చించండి.
జవాబు.
రెండవ పరాంతకుడి కుమారుడైన రాజరాజు క్రీ.శ 985 నుండి 1014 వరకు పరిపాలించారు. మొదటి రాజరాజు కాలం నుంచి చోళ రాజ్యంలో నూతన శకం ప్రారంభమైంది. రాజరాజు అనేక ఘన విజయాలను సాధించి చోళ రాజ్యాన్ని మహాసామ్రాజ్యంగా విస్తరింపచేశాడు. రాజరాజుకు ‘జయంగొండ’, ‘చోళమార్తాండ’ మొదలైన బిరుదు లున్నాయి. పాండ్యులను, చేర రాజులను ఓడించి వారి సామ్రాజ్య భాగాలైన కొడమలై, కొళ్ళంలను ఆక్రమించాడు. నౌకాదళంతో దాడి చేసి, మలయా ద్వీపాన్ని ఆక్రమించడమే కాకుండా శ్రీలంక మీద యుద్ధం చేసి అనూరాధపురాన్ని (ఉత్తర సింహళం) నాశనం చేశాడు. ఉత్తర సింహళానికి “ముమ్ముడి చోళమండల”మని నామకరణం చేశాడు. ఇతని కాలంలోనే కళ్యాణి చాళుక్యులకు, వేంగీ చాళుక్యులకు పోరు ప్రారంభమైంది. రాజరాజు వేంగీ చాళుక్యులకు మద్దతునిచ్చి తన ప్రాబల్యాన్ని వేంగీలో నెలకొల్పాడు.

రాజరాజు తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేయడమే కాకుండా క్రమబద్ధమైన పాలనా విధానాన్ని ప్రవేశపెట్టాడు. పంటపొలాలను సర్వే చేయించి, న్యాయసమ్మతమైన పన్నులను వసూలు చేశాడు. రాజరాజు శివభక్తుడు. తంజావూర్లో ‘రాజరాజేశ్వర’మనే పేరున్న బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. శైవుడైనప్పటికీ రాజరాజు పరమత సహనం ఉన్నవాడు.. శైలేంద్ర రాజైన శ్రీమార విజయోత్తుంగ వర్మకు నాగపట్టణంలో బౌద్ధ విహారాన్ని నిర్మించడానికి అనుమతినివ్వడమే కాకుండా ఆ విహారానికి ఒక గ్రామాన్ని దానం చేశాడు. ఇతను లలితకళల అభివృద్ధికి కూడా ఎంతో కృషి చేశాడు.

TS Inter 1st Year History Study Material Chapter 7 దక్షిణ భారతదేశ రాజ్యాలు

ప్రశ్న 6.
చోళులకాలంలో అభివృద్ధిచెందిన స్థానిక పరిపాలన పద్ధతిని వివరించండి.
జవాబు.
చోళుల పాలనా వ్యవస్థలోని ముఖ్య లక్షణం వారి స్థానిక స్వపరిపాలనా విధానం. చోళుల గ్రామ పరిపాలననే “స్థానిక స్వపరిపాలన” అని కూడా అంటారు. మొదటి పరాంతకుని ఉత్తరమేరూర్ శాసనంలోను, కులోత్తుంగుని శాసనాల్లోను చోళుల గ్రామ పాలనా పద్ధతి వివరించబడింది.

గ్రామ పాలన: చోళుల సామ్రాజ్యంలో ప్రతి గ్రామానికి స్వయం పాలనాధికారం ఉంది. ప్రతి గ్రామంలోను గ్రామ పెద్దల సభ వుండేది. ఈ గ్రామ సభ స్వరూప స్వభావాలను గ్రామ గ్రామానికి మారుతుండేవి.

గ్రామ సభలు: చోళుల కాలంలో గ్రామాల్లో మూడు రకాల సభలుండేవి. అవి: 1) ఊర్ 2) సభ 3) నగరం. ఊర్ అనే సభలో గ్రామంలోని భూస్వాములందరూ సభ్యులే. “సభ”లో బ్రాహ్మణ అగ్రహారంలోని వారు మాత్రమే సభ్యులుగా ఉండేవారు. ‘నగరం’ అనేది వర్తకులకు’ సంబంధించిన సభ. బ్రాహ్మణ అగ్రహారంలోని సభ్యులకు దేవాలయమే సమావేశపు స్థలం. కొన్ని గ్రామాల్లో ప్రత్యేకించి కచేరీలుండేవి.

సభ్యుల ఎన్నిక: చోళుల కాలంలో ప్రతి గ్రామాన్ని 30 వార్డులుగా విభజించారు. ప్రతి వార్డు నుండి ఒక సభ్యుడ్ని లాటరీ పద్ధతిపై ఎన్నుకునేవారు. ఈ సభ్యులను గ్రామసభ ఉపసంఘాలుగా నియమించేది. చెరువులు, సత్రాలు, ఆలయాలు, తోటలు, పాఠశాలలు, నేర విచారణ, పన్నుల వసూలు మొదలైన వాటికి ప్రత్యేక ఉపసంఘాలుండేవి. “పంచదార వారియం” అనే ఉపసంఘం మిగిలిన సంఘాల కార్యక్రమాలను పరిశీలించేది.

అర్హతలు: గ్రామసభలోని సభ్యుల అర్హతలను గురించి ప్రత్యేక నిబంధనావళిని రూపొందించి అమలు చేశారు. సభ్యులుగా ఎన్నుకోబడుటకు ఒక వ్యక్తికి కొన్ని అర్హతలుండాలి. అతడు:

  1. 30 నుండి 70 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వుండాలి,
  2. విద్యావంతుడై వుండాలి,
  3. సొంత ఇల్లు కలిగి భూమికి యజమానై వుండాలి.

అనర్హతలు: గ్రామసభ సభ్యులకు కొన్ని అర్హతలతో పాటు కొన్ని అనర్హతలు కూడా నిర్దేశించారు. గ్రామసభకు ఎన్నుకోబడదలచుకున్న వ్యక్తి:

  1. పంచ మహాపాపాలు చేసినవాడై ఉండకూడదు,
  2. గత మూడు సంవత్సరాలుగా ఏ ఉపసంఘంలోను సభ్యుడిగా ఉండరాదు,
  3. ఒకసారి సభ్యుడిగా ఉండి లెక్కలను సరిగా అప్పగించని వాడు కూడా అనర్హుడే,
  4. నేరస్తులు వారి బంధువులు కూడా ఈ ఎన్నికల్లో పాల్గొనకూడదు.

గ్రామ సభ అధికారాలు: గ్రామంలోని భూములపై యాజమాన్యపు హక్కు సభకు ఉన్నది. పన్నులను విధించుట, అడవులను నరికించి కొత్త భూములను సాగులోకి తీసుకువచ్చుట మొదలగునవి ఈ సభ ముఖ్య విధులు. వీటితోపాటు భూమి, నీటి తగవులను పరిష్కరించుట, నేరాలను విచారించుట కూడా దీని విధులుగా చెప్పుకోవచ్చు. అయితే ఆదాయ వనరులు తక్కువ కావటంతో కేంద్ర ప్రభుత్వమే రహదారులు నిర్మించగా వాటిపై అజమాయిషీని సభ నిర్వహించేది. గ్రామసభలకు సలహాలివ్వటానికి అధికారులుండేవారు. కేంద్ర ప్రభుత్వము యొక్క అనవసర జోక్యము ఈ సభలలో ఉండేది కాదు.

ముగింపు: చోళుల గ్రామ పాలన సమర్థవంతమైనది, ఆదర్శవంతమైనది. చోళులు గ్రామ పరిపాలనను ఏర్పరచి అందులో ప్రజలను భాగస్వాములను చేయటం వల్ల పాలనలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సమన్వయం సాధ్యపడింది.

ప్రశ్న 7.
మొదటి రాజేంద్రుని విజయాలను చర్చించండి.
జవాబు.
మొదటి రాజేంద్రుడు (క్రీ.శ. 1014-1044): రాజరాజు తరువాత చోళ సింహాసనాన్ని అధిష్టించినవాడు అతని కుమారుడు రాజేంద్ర చోళుడు. ఇతడు తండ్రిని మించిన శూరుడుగా కీర్తి ప్రతిష్టలను పొందాడు. అతడు తండ్రివలెనే దిగ్విజయ యాత్రలు సాగించి సామ్రాజ్య వ్యాప్తికి పాటుపడ్డాడు. మొదట పాండ్య, చేర రాజ్యములను జయించాడు. ఆ తరువాత సింహళముపై నౌకాదండయాత్రలు సాగించి దానినంతటిని జయించి తన ఆధిపత్యము క్రిందకు తెచ్చాడు. చాళుక్యరాజ్యంలో జరిగిన వారసత్వ యుద్దాల్లో వేంగి చాళుక్యుల పక్షాన నిలిచి రాజరాజ నరేంద్రునకు సహాయం చేశాడు. రాజరాజనరేంద్రునికి తన కుమార్తె అమ్మంగదేవినిచ్చి వివాహం చేశాడు. తరువాత గంగానది వరకు దండయాత్రలు చేసి, బెంగాల్ పాలవంశీయుడైన మహీపాలుని ఓడించి “గంగైకొండచోళ” అను బిరుదు ధరించాడు. ఈ విజయానికి గుర్తుగా “గంగైకొండ చోళపురము” అను నగరాన్ని నిర్మించి దానిని తన రాజధానిగా చేసుకున్నాడు. తరువాత గొప్ప నౌకాబలమును రూపొందించుకొని జావా, సుమత్రా ప్రాంతములను పాలించే శ్రీవిజయ సామ్రాజ్యాధినేతయైన సంగ్రామ విజయోత్తుంగవర్మను ఓడించి, అతని రాజధాని కడారం స్వాధీనం చేసుకొన్నాడు. ఈ విజయమునకు చిహ్నంగా “కడారంకొండ” అనే బిరుదును ధరించాడు. ఇట్టి దిగ్విజయముల వలన రాజేంద్రచోళుడు భారతదేశ సుప్రసిద్ధ పాలకులలో ఒకడుగా కీర్తిని పొందాడు. ఇతడు తన తండ్రివలె గొప్ప పరిపాలనాదక్షుడు. వ్యవసాయాభివృద్ధి కొరకు అనేక నీటివనరులను ఏర్పరచాడు. వైదిక కళాశాలను స్థాపించి, దాని పోషణకు కొంత భూభాగమును దానము చేశాడు. ఇతడు గొప్ప భవన నిర్మాత. ప్రజాసంక్షేమ పాలన సాగించి, “తండ్రిని మించిన తనయుడు” అనే కీర్తిని పొందాడు. ఇతడు శిల్పకళను ఆదరించాడు. గంగైకొండ చోళపురంలో ఒక శివాలయాన్ని నిర్మించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 7 దక్షిణ భారతదేశ రాజ్యాలు

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బాదామి చాళుక్యుల వంశపతనానికి దారితీసిన కారణాలు చర్చించండి.
జవాబు.
బాదామి చాళుక్య వంశరాజుల్లో రెండో కీర్తివర్మ సింహాసనం అధిష్టించాడు. ఇతడు క్రీ.శ. 746 757 మధ్యకాలంలో పాలనచేసాడు. పల్లవ – చాళుక్య సంఘర్షణవల్ల బాదామి చాళుక్యరాజ్యం బలహీనమైంది. ఆర్థికంగా, సైనికంగా చాలా శక్తి నశించింది. సామంతులు ఎదురుతిరిగారు. రాష్ట్రకూటులు దంతిదుర్గుని నేతృత్వంలో స్వతంత్ర్యం ప్రకటించుకున్నారు. దంతిదుర్గుడు ముఖాముఖి యుద్ధంలో రెండో కీర్తివర్మను ఓడించాడు. ఈ విధంగా దక్షిణభారతదేశ చరిత్రలో బాదామిచాళుక్యుల పాలన ముగిసింది.

ప్రశ్న 2.
చాళుక్యుల వాస్తుశిల్పకళ లక్షణాలను వివరించండి.
జవాబు.
చాళుక్యరాజులు గొప్ప వాస్తు – శిల్పకళ, సాహిత్య అభిమానులు. వీరికాలంలో అనేక భారీ దేవాలయాల నిర్మాణం జరిగింది. రాజుల పోషణలో వాస్తు – శిల్పులు సుందరమైన, భారీ దేవాలయాలను బాదామి, ఐహోలు, పట్టడకల్, ఆలంపూర్ మొదలైన ప్రదేశాల్లో నిర్మించారు. దేవాలయం, గుడి సామాజిక – సాంస్కృతిక కార్యకలాపాలకు కేంద్రమైంది. ఇక్కడ నిర్మించిన దేవాలయాల్లోని స్తంభాలు, విగ్రహాలు ఆనాటి శిల్పుల చాతుర్యానికి, శిల్పకళావైభవానికి నిదర్శనం. వీరి శిల్పకళారీతులచే ‘చాళుక్య శిల్పకళారీతి’ అని వర్ణించారు.

ప్రశ్న 3.
మొదటి రాజాధిరాజు సాధించిన విజయాలను చర్చించండి.
జవాబు.
మొదటి రాజాధిరాజు, మొదటి రాజేంద్రచోళుని కుమారుడు. ఇతని 11 ఏండ్ల పాలనంతా పొరుగు రాజ్యాలతో యుద్ధాల్లో గడిసింది. క్రీ.శ. 1052లో జరిగిన భీకర ‘కొప్పం’ యుద్ధంలో చాళుక్యరాజ్య సైన్యాలచేతిలో మొదటి రాజాధిరాజు ప్రాణాలు కోల్పోయాడు. ఇతని అనంతరం సోదరుడైన రెండో రాజేంద్రుడు సింహాసనం అధిష్టించాడు. కుడాల్ సంగం యుద్ధంలో (క్రీ.శ. 1062) ఇతడు మొదటి సోమేశ్వరున్ని ఓడించాడు.

ప్రశ్న 4.
ఐహోల్ శాసనం ప్రాధాన్యతను వివరించండి.
జవాబు.
ఐహోల్ కర్ణాటక రాష్ట్రములో ఉన్నది. ఈ ప్రదేశంలో పశ్చిమ చాళుక్యరాజు రెండవ పులకేశి యొక్క సేనాని రవికీర్తి వేయించిన ఐహోల్ శాసనం ఉంది. ఈ శాసనంలో రెండవ పులకేశి యొక్క దిగ్విజయ యాత్ర, హర్షునిపై అతని విజయం వర్ణించబడ్డాయి. ఐహోల్లో పశ్చిమ చాళుక్యుల కాలం నాటి దేవాలయాలున్నాయి.

ప్రశ్న 5.
మహాబలిపురంలోని రాతి ఆలయాలను (Rock-cut) వివరించండి.
జవాబు.
మహేంద్రవర్మ – I కాలంనుంచే పల్లవరాజ్యంలో శిల్పులు కొండలను తొలిచి ఆలయాలను నిర్మించారు. వీటినే ‘గుహాలయాలు’ లేదా మండపాలు అని వర్ణిస్తారు. మొదటి మహేంద్రవర్మకాలంలో నిర్మించిన ప్రసిద్ధ గుహాలయాల్లో. పేర్కొనదగినవి ‘పల్లవరం’ దళవనూర్ లో కట్టించిన ‘పంచపాండవ గుహాలయాలు’, ‘మల్లేశ్వరాలయం’ పేర్కొనదగినవి. మొదటి వర్మ స్వయంగా తాను ఎలాంటి ఇటుకలను, వెదురును, లోహాన్ని ఉపయోగించకుండా త్రిమూర్తి ఆలయాన్ని నిర్మించినట్లు తన ‘మండగపట్టుశాసనంలో పేర్కొన్నాడు. ఈ ఆలయంలో సువిశాల మండపాలు, విశాలమైన స్తంభాలపై నిర్మించాడు. స్తంభాలను చెక్కడంలో ఆనాటి శిల్పులు చూపిన ప్రతిభ అద్భుతమనీ వాస్తు శిల్ప పండితుల అభిప్రాయం.

TS Inter 1st Year History Study Material Chapter 7 దక్షిణ భారతదేశ రాజ్యాలు

ప్రశ్న 6.
అమోఘవర్షుని విజయాలను చర్చించండి.
జవాబు.
రాష్ట్రకూట పాలకుల్లో మొదట అమోఘవర్షుడు గొప్ప పాలకుడు. ఇతని పాలనాకాలం క్రీ.శ.814 – 878. ఇతడు మూడవ గోవిందుడి కుమారుడు. అతడు స్థానిక పాలకుల, సామంతుల తిరుగుబాట్లు అణచివేశాడు. అతడు వేంగి పాలకుడు విజయాదిత్యుడితో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. గంగరాజును ఓడించాడు. అతడు స్వయంగా గొప్ప కవి, కవి పండిత పోషకుడు. కన్నడంలో ‘కవిరాజ మార్గం’ అనే వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు. ‘మంఖేడ్’ అనే నూతన రాజధాని నగరాన్ని నిర్మింపజేశాడు.

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 1 గొల్ల రామవ్వ

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 1st Lesson గొల్ల రామవ్వ Textbook Questions and Answers.

TS Inter 1st Year Non-Detailed 1st Lesson గొల్ల రామవ్వ

ప్రశ్నలు- సమాధానాలు

ప్రశ్న 1.
‘గొల్లరామవ్య’ కథ ఇతివృత్తాన్ని పరిచయం చేయండి.
జవాబు:
‘గొల్లరామయ్య కథ’ దక్షిణ భారతదేశం నుండి తొలిసారి భారత ప్రధాని అయిన పాముల పర్తి వేంకటనరసింహారావుచే రచించబడింది. శ్రీమతి సురభి వాణీదేవి, చీకోలు సుందరయ్య సంపాదకత్వంలో వెలువడిన ‘గొల్లరామవ్వ – మరికొన్ని రచనలు’ సంపుటి నుండి గ్రహించబడింది.

నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా విముక్తి పోరాటంలో చిత్రించబడిన అద్భుతఘట్టం గొల్లరామవ్య కథ. పోలీసులకు, రజాకార్లకు వ్యతిరేకంగా ప్రజాశ్రేయస్సు కోసం విజృంభించిన ఒక సాహస విప్లవ కారుని ఒక సామాన్య వృద్ధురాలు రక్షించిన అపూర్వఘటం, ఇందులోని ఇతివృత్తం. తెలంగాణా పోరాట చరిత్రలో ఈ కథ ఒక సృజనాత్మక డాక్యుమెంట్.

అదో తెలంగాణ పల్లె, గొల్ల రామవ్వ తన గుడిసెలో చీకటిలోనే కూర్చుని ఉంది. ఆమె వడిలో పదిహేనేండ్ల బాలిక. ఆ గ్రామంలో అప్పుడు అయిన పెద్ద శబ్దాలకు గ్రామంలోకి వారితోపాటు వీరిద్దరి మొహాల్లో భయం తాలూకా ప్రకంపనలు కన్పిస్తున్నాయి.

“అవ్వా! గిప్పుడిదేం చప్పుడే! అని ఆ బాలిక ప్రశ్నించింది” “నీకెందుకే మొద్దముండా… అన్నీ నీకే కావాలె” అని నోరు మూయిచింది గొల్లరామవ్వ. హఠాత్తుగా కిటికీని ఎవరో తట్టినట్లుంది రజకార్లో, పోలీసులో అని భయపడింది గొల్లరామవ్వ. ఆమెకు మిన్ను విరిగి మీద పడ్డట్లయింది. అగంతకు డొకడు ఆ ఇంటి కిటికీ ద్వారా ఇంట్లోకి వచ్చాడు. సందేహం లేదు. రజాకార్లో, తురకోడో, పోలీసోడు అయి ఉండాడు. తనకు చావు తప్పదు. తను అల్లారు ముద్దుగా పెంచి పెళ్ళి చేసిన తన మనవరాలికి మానభంగం తప్పదు అని తల్లడిల్లిపోయింది.

అంతలో ఆగంతకుడు నేను దొంగను కాను, రజాకారును కాను పోలీసునూ కాను నేను మీలానే ఒక తెలుగోడిని. ఇది రివల్వార్ మిమ్మల్ని చంపేవాళ్ళను చంపేందుకది. ఈ రాత్రి ఇద్దరు పోలీసుల్ని చంపాను. మొన్న మీ గ్రామంలో నలుగురు అమాయకులను చంపిన పోలీసు లే, లే, ‘నేను స్టేట్ కాంగ్రెస్ వాలంటీర్ ‘ను నైజాం రాజుతోటి కాంగ్రెస్ పోరాడుతుంది.

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 1 గొల్ల రామవ్వ

తెల్లవారుతుండగా పోలీసులు గ్రామంలోకి ప్రతి ఇల్లును సోదాచేస్తున్నారు. గొల్ల రామవ్వ ఇంటికి కూడా వచ్చారు. ఆమె భయపడిపోయింది. కాంగ్రెస్ వాలంటీర్ అయిన ఆ యువకుని ఎలాగైనా రక్షించాలనుకుంది. తన మనవరాలిని గొంగళితో ఆయువకుని కప్పి ఉంచమన్నది. వారిద్దరిని ఒకే మంచంపై పడుకోమని ఆజ్ఞాపించింది. అతనికి గొల్లవేషం వేయించింది. ఇంటిలోపలికి ప్రవేశించిన పోలీసులతో ఆ పిల్లలిద్దరూ నా మనవరాలు ఆమె పెనిమిటి అని బొంకింది. పోలీసోడు గొల్లరామవ్వను వాడు ఎవడన్నావ్. కాంగ్రెసోడా ఏం అని ప్రశ్నించిన రామవ్వ కంగారు పడలేదు.

పోలీసులు వెళ్ళిపోయారు. రామవ్వ మంచం మీద కూర్చొంది. ఒక వైపు యువకుడు, మరోవైపు ఆమె మనవరాలు వారిది అపూర్వ సమ్మేళనం అన్పించింది ఆ యువకునికి “అవ్వా! నీవు సామాన్యురాలివి కావు. ‘సాక్షాత్ భరతమాతవే’ అన్నాడు. ఇలా ఒక విప్లవ కారుని సామాన్య వృద్ధురాలు రక్షించిన కథే గొల్ల రామవ్వ కథ.

ప్రశ్న 2.
గొల్ల రామవ్వ ఉద్యమకారుని ఏ విధంగా రక్షించింది?
జవాబు:
‘గొల్ల రామవ్వ’ అను పాఠ్యభాగం మాజీ భారతదేశ ప్రధాని కీ॥శే॥ పాములపర్తి వేంకట నరసింహారావుచే రచించబడింది. శ్రీమతి సురభివాణీదేవి, చీకోలు సుందరయ్య సంపాదకత్వంలో వెలువడిన “గొల్ల రామవ్వ మరి కొన్ని రచనలు” కథా సంపుటి నుండి గ్రహించబడింది.

నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా విముక్తిపోరాటకాలం నాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించిన కథ ఇది. నిజాం పోలీసులకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఒక స్టేట్ కాంగ్రెస్ ‘వాలంటీరును, విప్లవ కారుడిని ఒక సామాన్య వృద్ధురాలు రక్షించిన అపూర్వ ఇతివృత్తం గొల్లరామవ్వకథ. తెలంగాణపోరాట చరిత్రలో ఈ కథ ఒక సృజనాత్మక డాక్యుమెంట్

తెలంగాణలో అదో పల్లె. ఆ పల్లెలోకి ఉద్యమకారులు ప్రవేశించి రజాకార్లను, పోలీసులకు, నవాబులకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యం చేస్తున్నారని నిజాం ప్రభుత్వవాదన. ఆ రోజు ఇద్దరు పోలీసుల్ని చంపినట్లు సమాచారం. అర్ధరాత్రి ప్రశాంత వాతావరణాన్ని చిన్నాభిన్నం చేస్తూ బాంబులమోత.

గొల్లరామవ్వ తన గుడిసెలో చీకటిలోనే కూర్చొని ఉంది. ఆమె వడిలో భయం భయంగా పదిహేనేండ్ల బాలిక తలదాచుకుని ఉంది.

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 1 గొల్ల రామవ్వ

“అవ్వా గిప్పుడిదేం చప్పుడే” అని ప్రశ్నించింది మనమరాలు. “నీకెందుకే మొద్దుముండ, గదేంది గిదేంది – ఎప్పటికి అడుగుడే” అని కసిరింది. ఇంతలో ఇంటికిటికీ చప్పుడు ఆ కిటికీ గుండా ఓ అగంతకుడి ప్రవేశం. అతడు అవ్వ దగ్గరకు వచ్చి “చప్పుడు చేయకు” నేను దొంగను కాను, రజాకార్ను కాను, పోలీసును కాను, మిమ్మల్ని ఏమీ అనను. లొల్లి చేయకండి” అన్నాడు. నేను స్టేట్ కాంగ్రెస్ వాలంటీరును వారి నుండి మిమ్మల్ని రక్షించేవాడిని అన్నాడు. అతని శారీరక పరిస్థితిని తెలుసుకున్న అవ్వ మనఃస్థితిలో కాయకల్పమైంది. భావ పరివర్తన కలిగింది. “ఇదేం గతిరానీకు? గిట్లెందుకైనవు కొడకా? అని ప్రశ్నించింది.

“రాజోలిగెఉన్నవు కొడకా! నీ కెందుకు కొచ్చెరా ఈ కట్టం. పండు పండు గొంగల్ల పండు, బీరిపోతవేందిరా! పండు” అని అతన్ని ఓదార్చి సపర్యలు చేసింది. “కొడకా కొద్దిగ గింత గటుక చిక్కటి సల్లలు పిసుక్కచ్చిన గింత కడుపుల పడేసుకో” అంది. యువకుడు లేచాడు. అవ్వ ఇచ్చినది ప్రసాదంగా తీసుకున్నాడు.

పాలు పిండేవేళయింది. యువకుడు నిద్రపోతునే ఉన్నాడు. ఇంతలో “చస్తి సస్తి నీబాంచెన్… నాకెరుక లేదు, అయ్యో వావ్వో! వాయ్యో అన్న అరుపులు మిన్ను ముట్టే ఆక్రోశాలు” యువకుడు లేచాడు రివాల్వరు తోటాలతో నింపుకుని బయలుదేరాడు. వెనుక నుండి అతని భుజం మీద మరొక చేయబడ్డది”. యాడికి? అన్న ప్రశ్న. ముసల్వ మరేం మాట్లాడలేను. అతన్ని చెయ్యపట్టి వెనక్కి లాంగింది.

యువకునికి మనవరాలి చేత దుప్పటి కండువాను ఇప్పించింది. అతడిచే “గొల్లేశమేయిచింది. ఎవడన్నా మాట్లాడితే గొల్లునోలె మాట్లాడాలె” అన్నది. ఈ లోపు పోలీసులు అవ్వ ఇంటికి రానేవస్తిరి. ఇంకేముంది గొల్ల వేసమంతా వ్యర్థమైనట్లే అనుకున్నాడు యువకుడు. అవ్వ మనవరాలితో “మల్లీ! ఆ మూలకు మంచం వాల్చి గొంగడయ్యె! పిల్లగా ఆండ్ల పండుకో. ఈ పండుకో” అంది. “పొల్లా పోరని మంచానికి నాగడంచే అడ్డం పెట్టు” “మల్లీ మాట్లాడక ఆ పోరని పక్కల పండు ఊనడూ అంది”. “చెయ్యసి పండుకో పోండా దానిమీద! చూసెటోని కనువాదం రావద్దు” అంది.

అంతలోనే ఇట్లకొచ్చిన పోలీసోళ్ళు ఆ యువకుని చూసి “వాడు యెవడన్నావ్ చెప్పు! కాంగ్రెసోడా యేం” అని అవ్వను గద్దించాడు వాడెవ్వడా! ఎవ్వడు పడితేవాడు మా పక్కలల్ల పండుటానికి మేమేం బోగమోల్ల మనుకున్నావా? నిన్నెవడన్నా గట్లనే అడుగుతే ఎట్లంటది అని బొంకింది. అవ్వ మంచంమీద కూర్చుంది. ఒక వైపు యువకుడు మరో వైపు మల్లి. అపూర్వ సమ్మేళనం. అవ్వా నీవు సామాన్యరాలువుకావు. సాక్షాత్తు భారతమాతవే” అన్నాడు.

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 1 గొల్ల రామవ్వ

ప్రశ్న 3.
గొల్ల రామవ్వ సంభాషల్లోని ఔన్నత్యాన్ని విశ్లేషించండి?
జవాబు:
గొల్లరామవ్వ అను పాఠ్యభాగం మాజీ భారతదేశ ప్రధాని కీ॥శే॥ పాములపర్తి వేంకటనరసింహారావుచే రచించబడినది. శ్రీమతి సురభి వాణీదేవి, చీకోలు సుందరయ్య సంపాదనకత్వంలో వెలువడిన. “గొల్ల రామవ్వ మరికొన్ని రచనలు” కథా సంపుటి నుండి గ్రహించబడింది.

నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా విముక్తి పోరాట కాలం నాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించిన కథ ఇది. పోలీసులకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఒక స్టేట్ కాంగ్రెస్, ‘వాలంటీరును, విప్లవకారుని ఒక సామాన్య వృద్ధురాలు రక్షించిన అపూర్వ ఇతి వృత్తం. ‘గొల్ల రామవ్వకథ. తెలంగాణ పోరాట చరిత్రలో ఈ కథ ఒక సృజనాత్మక డాక్యుమెంట్.

అదో తెలంగాణ పల్లె. అందులో గొల్ల రామవ్వ తన పదియేనేండ్ల, మనవరాలితో కలిసి ఉంటుంది. ఆమె ప్రతి సంభాషణ ఉన్నత విలువలను గలినదే! అర్ధరాత్రి తనింటికి దొంగలా ప్రవేశించిన యువకుని రజోకారో పోలీసోడో అని భావించింది.

“నేను పోలీసోన్ని కాను రజోకార్నుకాను” అన్నమాటలో నమ్మలేక “అబ్బా ఎంతకైనా తగుతారీ రాక్షసులు! ఔను ముందుగా తీయని మాటలు అవి సాగకపోతే అన్యోపాయాలు – అదే కదా క్రమం అయింది. ఆ వ్యక్తి రెండు కాళ్ళు పట్టుకుని “బాంచెన్! చెప్పులు మోత్తా నా తలకాయైనా తీసుకో, పోర్ని మాత్రం ముట్టకు, అది నీకు చెల్లెలనుకో, నీ కాల్లు మొక్కుత! అంటుంది.

యువకుడు విప్లవకారుడని తెలుసుకుని ఉపచారాలు చేస్తుంది. ఆమె మనస్థితి కాయకల్పమైంది. “ఇదేం గతిరానీకు! గిట్లెందుకైనవు కొడకా! అంది. వెళ్ళిపోతానన్న యువకుని “ఆ మాపోతా! మా పోతా… ఒక్కటే పోకడ! చక్కంగ స్వర్గమే పోతా! హు పోతడండ యాడికో” అని నిలువరించింది.

రాజోలిగే ఉన్నవు కొడకా! నీవెందుకొచ్చెరా ఈకట్టం? పండుపండు గొంగల్లపండు” అని అతనిపై గాఢనిద్రలోని వెళ్ళేట్లు ఓదార్చింది. మనవరాలిని పిలిచి దీపం వెలిగించి ఆ యువకుని శరీరంపై గుచ్చుకున్న ముళ్ళను తీసేయమని చెప్పింది. “మా చేత్తవులే సంసారం! ఇక కూకోవాని పక్క, ముండ్లు తీసెయి ఉల్లుల్లుగ అయ్యో సిగ్గయితాందా వాని ముట్టుకుంటే, ఏం మానవతివి గదవే! నీ సిగ్గు అగ్గిలబడ! వాని పానం దీత్తవా యేం సిగ్గు సిగ్గను కుంట! ఊ చెయ్యి చెప్పినపని. పాపం పీనుగోలె పడున్నడు గాదె! వాని జూత్తే జాలి పుడుతలేదె నీకు! ఆ! గట్ల! నొప్పించకు పాపం” అమ్మ సంభాషన తీరిది.

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 1 గొల్ల రామవ్వ

యువకుని లేసి “ఇగ లే కొడకా కొద్దిగ గింత గటుక చిక్కటి సల్లల పిసుక్కచ్చిన …. గింత కడుపుల పడేసుకో! ఎన్నడన్న తాగినావు తాతా గట్క? వరి బువ్వ తినెటోనికి నీకే మెరుక? గొల్లరామి గల్కుంటే ఏమనుకున్నా? పోయేపానం మర్లుతది. చూడు మరి కులం జెడిపోతవని భయపడుతున్నావా? నువ్వు యేకులమోడవైనా సరే – మొదలు పానం దక్కిచ్చుకో…. తాగి పారెయ్యి గటగట” అంటుంది.

రాత్రి ఇద్దరు పోలీసోల్లను మట్టుపెట్టిన అని యువకుడు అనగానే అవ్వ “ఇద్దరా! కాని ఇంకిద్దరు మిగిలిన్రు కొడకా! సగంపనే చేసినవు” అంటుంది. పోలీసులు ఇంట్లోకి వచ్చి యువకుని వైపు చూపిస్తూ “వాడు యెవడన్నావ్ చెప్పు! కాంగ్రెసోడాయేం” అంటే “వాడెవ్వడా? ఎవ్వడు పడితే వాడు మా పక్కల పండుటానికి మేమేం బోగమోల్ల మనుకున్నవా? నిన్నెవడన్న గట్లనె అడుగితే ఎట్లుంటది! ఈ మాటల్తోటి మనం దీసుడెందుకు పానం తియ్యరా దుండి! నా బుద్దెరిగిన కాన్నుంచి నీనైతగింతచే ఇజ్జతి మాట యెవ్వల్ల నోట్నుంచి యినలే!. అంటుంది. రామవ్వ సంభాషచతురత అద్భుతమైంది అని ఈ సంభాషణ వలన తెలుస్తుంది.

గొల్ల రామవ్వ Summary in Telugu

రచయిత పరిచయం

రచయిత పేరు : పాముల పర్తి వేంకట నరసింహరావు

పుట్టిన తేదీ : జూన్ 28, 1921

పుట్టిన ఊరు : వరంగల్ జిల్లా, ‘లక్నెపల్లి’

తల్లిదండ్రులు : రుక్మాబాయమ్మ, సీతారామరావు

దత్తుడిగా : కరీంనగర్ జిల్లా, భీమదేవరపల్లి మండలం ‘వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావుకు దత్తుడిగా వెళ్ళాడు. అందుకే వంగర గ్రామవాసి అయ్యాడు.

చదువు : ఉస్మానియాలో బి.ఎస్.సి నాగపూర్లో న్యాయశాస్త్రంలో స్వర్ణపతకం

పదవులు : కేంద్రరాష్ట్ర స్థాయిలో మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, భారతదేశ ప్రధానిగా పనిచేశాడు.

భాషాపాండిత్యం : తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, ఫ్రెంచ్, స్పానిష్, అరబిక్, పార్సీ, హిందీ, సంస్కృతం, తమిళం, కన్నడం, మరాఠీ భాషలలో పండితుడు

పత్రికలు : ‘కాకతీయ’ పత్రికను నడిపారు.

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 1 గొల్ల రామవ్వ

రచనలు :

  1. ప్రేమ – ప్రణయం – ఖండకావ్యం
  2. గొల్లరామయ్య, మంగయ్య అదృష్టం కథా సంపుటాలు
  3. ‘ఇన్సైడర్’ ఆత్మకథ నవల ‘లోపలిమనిషి’ తెలుగులో అనువదింపబడింది.
  4. విశ్వనాథ వారి వేయిపడగలు ‘సవాస్రఫణ్’గా హిందీలోకి అనువదించారు.
  5. మరాఠీలో ‘ఆస్తీ’ నవలను ‘అబలాజీవితం’ పేరుతో తెలుగులోకి అనువదించారు.
  6. దేశవిభజన సమయంలో ‘బ్లూ సిల్క్ శారీ’ అనే ఆంగ్లకథను తెలుగులోకి అనువాదం చేశారు.
  7. హిందీ ఇంగ్లీషు తెలుగు భాషలలో విలువైన సాహిత్య వ్యాసాలను పీఠికలను అందించారు.

పురస్కారాలు : శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది.
ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కార కమిటీలో అధ్యక్షలుగా నియమించబడ్డారు.