TS 9th Class Telugu Grammar Questions and Answers

Telangana SCERT 9th Class Telugu Grammar Telangana తెలుగు వ్యాకరణం Questions and Answers.

TS 9th Class Telugu Grammar Questions and Answers

సంధులు

పాఠంలోని ముఖ్య సంధి పదాలు :

1) విమానాశ్రయం = విమాన + ఆశ్రయం = సవర్ణదీర్ఘ సంధి
2) శరీరాకృతి = శరీర + ఆకృతి = సవర్ణదీర్ఘ సంధి
3) మహోన్నత = మహా + ఉన్నత = గుణసంధి
4) ప్రత్యర్థి = ప్రతి + అర్థి = యణాదేశ సంధి
5) ఒక్కొక్క = ఒక్క + ఒక్క = ఆమ్రేడిత సంధి
6) జీవితాన్నంతా = జీవితాన్ని + అంతా = ఇత్వ సంధి
7) చెప్పినప్పటికీ = చెప్పిన + అప్పటికీ = అత్వసంధి
8) జ్ఞాపకముండడం = జ్ఞాపకము + ఉండడం = ఉత్వసంధి
9) ఎట్లని = ఎట్లు + అని = ఉత్వసంధి
10) కాలమంటూ = కాలము + అంటూ = ఉత్వసంధి
11) వరుగులయ్యే = వరుగులు + అయ్యే = ఉత్వసంధి
12) ఏమని = ఏమి + అని = ఇత్వ సంధి
13) కాదనుకున్నాడు = కాదు + అనుకున్నాడు = ఉత్వసంధి
14) పిల్లలందరూ = పిల్లలు + అందరూ = ఉత్వసంధి
15) కలహాగ్నులు = కలహ + అగ్నులు = సవర్ణదీర్ఘ సంధి
16) వేంకటేశ్వరా = వేంకట + ఈశ్వరా = గుణసంధి
17) యోధులనేకులు = యోధులు + అనేకులు = ఉత్వసంధి
18) కుండల మొప్పు = కుండలము + ఒప్పు = ఉత్వసంధి
19) కోపోద్రిక్తులు = కోప + ఉద్రిక్తులు = గుణసంధి

TS 9th Class Telugu Grammar Questions and Answers

20) సత్యాహింసలు = సత్య + అహింసలు = సవర్ణదీర్ఘ సంధి
21) ప్రాణాలర్పించడం = ప్రాణాలు + అర్పించటం = ఉత్వసంధి
22) జగములేలు = జగములు + ఏలు = ఉత్వసంధి
23) ఇన్నెలంత = ఈ + నెలంత = త్రికసంధి
24) నీరాట = నీరు + ఆట = ఉత్వసంధి
25) విషాదాంతం = విషాద + అంతం = సవర్ణదీర్ఘ సంధి
26) మేమెంత = మేము + ఎంత = ఉత్వసంధి
27) విచిత్రమైన = విచిత్రము + ఐన = ఉత్వసంధి
28) అపార్థం = అప + అర్థం = సవర్ణదీర్ఘ సంధి
29 గొంతెత్తి = గొంతు + ఎత్తి = ఉత్వసంధి
30) కళోపాసనం = కళా + ఉపాసనం = గుణసంధి
31) రసానందం = రస + ఆనందం = సవర్ణదీర్ఘ సంధి
32) ఉన్నతమైన = ఉన్నతము + ఐన = ఉత్వసంధి
33) దినములెన్ని = దినములు + ఎన్ని = ఉత్వసంధి
34) రోజులు + ఐనా = రోజులైనా = ఉత్వసంధి
35) ఆదర + అభిమానం = ఆదరాభిమానాలు = సవర్ణదీర్ఘ సంధి
36) లేదనక + ఉండ = లేదనకుండ = అత్వసంధి
37) వీలు + ఐతే = వీలయితే = ఉత్వసంధి
38) కావలసినవి + అన్నీ = కావలసినవన్న = ఇత్వ సంధి
39) పగలు + పగలు = పట్టపగల = ఆమేడ్రిత ద్విరుక్తటకారాదేశ సంధి

సమాసాలు

అభ్యాసం : ఈ కింది సమాసాలకు, విగ్రహవాక్యాలకు, సమాసం పేర్లు రాయండి.

1) ఉదగ్రతేజం – ఉదగ్రమైన తేజం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
2) తొల్లిటిరాజులు – తొల్లిటి వారలైన రాజులు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
3) ప్రియాటోపము – ప్రియమైన ఆటోపము – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
4) సకల జగములు – సకలమైన జగములు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
5) పరసేన – పరమైన సేన – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
6) తమ్ముకుర్రలు – కుర్రవారైన తమ్ములు – విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం
7) కార్మికవృద్ధులు – వృద్ధులైన కార్మికులు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
8) చారుసంసారం – చేరువయిన సంసారం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
9) పేదరికపుబుగులు – పేదరిక సంబంధమైన బుగులు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

TS 9th Class Telugu Grammar Questions and Answers

10) సత్యదూరము – సత్యమునకు దూరము – షష్ఠీ తత్పురుష సమాసం
11) అమెరికా రాయబారి – అమెరికా యొక్క రాయబారి – షష్ఠీ తత్పురుష సమాసం
12) వాదనాపటిమ – వాదన యందు పటిమ – సప్తమీ తత్పురుష సమాసం
13) అసాధ్యం – సాధ్యము కానిది – నఞ తత్పురుష సమాసం
14) నెలతాల్పు – నెలను ధరించువాడు – ద్వితీయా తత్పురుష సమాసం
15) గురుదక్షిణ – గురువు కొఱకు దక్షిణ – చతుర్థీ తత్పురుష సమాసం
16) వయోవృద్ధుడు – వయస్సుచే వృద్ధుడు – తృతీయా తత్పురుష సమాసం
17) దొంగ భయము – దొంగ వలన భయము – పంచమీ తత్పురుష సమాసం
18) రెండు రాష్ట్రాలు – రెండై రాష్ట్రాలు – ద్విగు సమాసం
19) శక్తి సామర్థ్యాలు – శక్తియు, సామర్ధ్యమును – ద్వంద్వ సమాసం
20) అమూల్య సమయం – అమూల్యమైన సమయం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
21) పూర్ణపురుషులు – పూర్ణులైన పురుషులు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
22) ప్రాచీన కావ్యాలు – ప్రాచీనమైన కావ్యాలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
23) పెద్ద కుటుంబం – పెద్దదైన కుటుంబం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
24) భద్రాచలం – ‘భద్ర’ అనే పేరుగల అచలం – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
25) విద్యాధనం – విద్య అనెడి ధనం – రూపక సమాసం
26) దయాభరణం – ‘దయ’ అనెడి ఆభరణం – రూపక సమాసం
27) కృపారసము – కృప అనెడి రసము – రూపక సమాసం
28) సరళాసాగరం – ‘సరళ’ అనే పేరుగల సాగరం – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
29) మన్నెంకొండ – మన్నెం అనే పేరుగల కొండ – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం

TS 9th Class Telugu Grammar Questions and Answers

30) కీర్తి కన్యక – కీర్తి అనే కన్యక – రూపక సమాసం
31) జ్ఞానజ్యోతి – జ్ఞానమనెడి జ్యోతి – రూపక సమాసం
32) రెండురోజులు – రెండయిన రోజులు – ద్విగు సమాసం
33) వజ్రవైఢూర్యములు – వజ్రమూ, వైదూర్యమూ – ద్వంద్వ సమాసం
34) తల్లీబిడ్డలు – తల్లియూ బిడ్డయు – ద్వంద్వ సమాసం
35) కార్యదక్షుడు – కార్యమందు దక్షుడు – సప్తమీ తత్పురుష సమాసం
36) మూడు దోషాలు – మూడైన దోషాలు – ద్విగు సమాసం
37) కర్మశాల – కర్మ కొఱకు శాల – చతుర్థీ తత్పురుష
38) ఆశాపాశం – ఆశ అనెడి పాశం – రూపక సమాసం
39) ప్రత్యంగుళం – అంగుళం అంగుళం – అవ్యయీభావ సమాసం
40) ధర్మయుద్ధం – ధర్మము కొఱకైన యుద్ధము – అవ్యయీభావ సమాసం
41) రక్తపాతం. – రక్తము యొక్క పాతం – అవ్యయీభావ సమాసం
42) శాంతి సందేశం – శాంతి యొక్క సందేశం – అవ్యయీభావ సమాసం
43) నాలుగెకరాలు – నాలుగైన ఎకరాలు – అవ్యయీభావ సమాసం
44) రక్కసి తేడు – రక్కసి యొక్క తోడు – అవ్యయీభావ సమాసం
45) నీరాట – నీరునందు ఆట – సప్తమీ తత్పురుష సమాసం
46) మాతృదేశం – తల్లి యొక్క దేశం – షష్ఠీ తత్పురుష సమాసం
47) కర్కశహృదయం – కర్కశమైన హృదయం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
48) సహాయనిరాకరణ – సహాయమునకు నిరాకరించడం – ద్వితీయా తత్పురుష సమాసం
49) అశ్వత్థవృక్షం – అశ్వత్థం అనే పేరుగల వృక్షం – సంభావన పూర్వపద కర్మధారయం

TS 9th Class Telugu Grammar Questions and Answers

50) శాస్త్రదృష్టి – శాస్త్రం యొక్క దృష్టి – షష్ఠీ తత్పురుష సమాసం
51) నా పాట – నా యొక్క పాట – షష్ఠీ తత్పురుష సమాసం
52) పఠనశక్తి – పఠనమునందు శక్తి – సప్తమీ తత్పురుష సమాసం
53) అభ్యుదయ పథం – అభ్యుదయమైన పథం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
54) ఆత్మశక్తి – ఆత్మ యొక్క శక్తి – షష్ఠీ తత్పురుష సమాసం
55) జీవితసాఫల్యం – జీవితము యొక్క సాఫల్యం – షష్ఠీ తత్పురుష సమాసం
56) అద్భుతశక్తి – అద్భుతమైన శక్తి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
57) ఎంగిలిమెతుకులు – ఎంగిలియైన మెతుకులు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
58) విషాగ్ని – విషము అనెడి అగ్ని – రూపక సమాసం
59) అధికారదర్పం – అధికారంచేత దర్పం – తృతీయా తత్పురుష సమాసం
60) గదితలుపులు – గది యొక్క తలుపులు – షష్ఠీ తత్పురుష సమాసం
61) మంచిబట్టలు – మంచివైన బట్టలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
62) పదిగంటలు – పది సంఖ్యగల గంటలు – ద్విగు సమాసం
63) న్యాయాన్యాయాలు – న్యాయమూ, అన్యాయమూ – ద్వంద్వ సమాసం.

వాక్య భేదములు

అభ్యాసము : కింది సామాన్య వాక్యాల్ని సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.

అ) విమల వంట చేస్తుంది. విమల పాటలు వింటుంది. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
విమల వంట చేస్తూ పాటలు వింటుంది

TS 9th Class Telugu Grammar Questions and Answers

ఆ) అమ్మ నిద్ర లేచింది. అమ్మ ముఖం కడుక్కుంది. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
అమ్మ నిద్రలేచీ ముఖం కడుక్కుంది.

అభ్యాసం : కింది సంక్లిష్ట వాక్యాలను, సామాన్య వాక్యాలుగా మార్చి రాయండి.

ప్రశ్న 1.
తాత భారతం చదివి నిద్రపోయాడు. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
తాత భారతం చదివాడు. తాత నిద్రపోయాడు. (సామాన్య వాక్యాలు)

ప్రశ్న 2.
చెట్లు పూత పూస్తే కాయలు కాస్తాయి. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
చెట్లు పూత పూయాలి. చెట్లు కాయలు కాయాలి. (సామాన్య వాక్యాలు)

TS 9th Class Telugu Grammar Questions and Answers

ప్రశ్న 3.
రాముడు నడుచుకుంటూ వెళ్ళి తన ఊరు చేరాడు. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
రాముడు నడుచుకుంటూ వెళ్ళాడు. రాముడు తన ఊరు చేరాడు. (సామాన్య వాక్యాలు)

అభ్యాసం : కింది సామాన్య వాక్యాల్ని సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.

ప్రశ్న 1.
ఆయన ఆంధ్రుడు. ఆయన కృష్ణాతీరమున పుట్టినవాడు (సామాన్య వాక్యాలు)
జవాబు:
ఆయన ఆంధ్రుడు మరియు కృష్ణా తీరమున పుట్టినవాడు. (సంయుక్త వాక్యం)

ప్రశ్న 2.
మోహన కూచిపూడి నృత్యం నేర్చుకొంది. భావన భరతనాట్యం నేర్చుకుంది. (సామాన్య వాక్యాలు)
జవాబు:
మోహన కూచిపూడి నృత్యం, భావన భరతనాట్యం నేర్చుకున్నారు. (సంయుక్త వాక్యం)

అభ్యాసం : కింది సామాన్య వాక్యాలను, సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.

ప్రశ్న 1.
చుక్క పొడుపుతో సీత లేచింది. సీత గడపను పూజించింది. (సామాన్య వాక్యాలు)
జవాబు:
సీత చుక్క పొడుపుతో లేచి గడపను పూజించింది. (సంక్లిష్ట వాక్యం)

TS 9th Class Telugu Grammar Questions and Answers

ప్రశ్న 2.
బంధుమిత్రులంతా వచ్చేశారు. కావలసిన సంభారాలు ఏర్పాటు చేసుకున్నారు. (సామాన్య వాక్యాలు)
జవాబు:
బంధుమిత్రులంతా వచ్చి కావలసిన సంభారాలు ఏర్పాటు చేసుకున్నారు. (సంక్లిష్ట వాక్యం)

అభ్యాసం : కింది సామాన్య వాక్యాలను, సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.

ప్రశ్న 1.
సీతక్క నిశ్చితార్థం జరిగింది. నాగయ్య సంబరపడ్డాడు. (సామాన్య వాక్యాలు)
జవాబు:
సీతక్క నిశ్చితార్థం జరిగింది కాబట్టి నాగయ్య సంబరపడ్డాడు. (సంయుక్త వాక్యం)

ప్రశ్న 2.
సీతక్క పెళ్ళికి ఏర్పాటుచేశారు. సీతమ్మ పెండ్లి పెటాకులయింది. (సామాన్య వాక్యాలు)
జవాబు:
సీతక్క పెళ్ళికి ఏర్పాటుచేశారు కాని పెండ్లి పెటాకులయ్యింది. (సంయుక్త వాక్యం)

A. కింది సామాన్య వాక్యాలను, సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.

అ) పూనాలోని ఫెర్గూసన్ కాలేజీలో చేరాడు. పర్షియన్ భాషను చదివాడు. ఆ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు. (సామాన్య వాక్యాలు)
జవాబు:
పూనాలోని ఫెర్గూసన్ కాలేజీలో చేరి పర్షియన్ భాషను చదివి ఆ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు. (సంక్లిష్ట వాక్యం)

ఆ)
1) బూర్గుల హైదరాబాదు రాష్ట్రంలో దున్నేవానికి భూమి హక్కు నిచ్చే కౌలుదారీ చట్టాన్ని తయారుచేశాడు.
2) బూర్గుల సామ్యవాద వ్యవస్థకు పునాది వేశాడు.
3) బూర్గుల అజరామకీర్తిని పొందాడు. (సామాన్య వాక్యాలు)
జవాబు:
బూర్గుల హైదరాబాదు రాష్ట్రంలో దున్నేవానికి భూమి హక్కునిచ్చే కౌలుదారి చట్టాన్ని తయారుచేసి సామ్యవాద వ్యవస్థకు పునాది వేసి అజరామర కీర్తిని పొందాడు. (సంక్లిష్ట వాక్యం)

TS 9th Class Telugu Grammar Questions and Answers

B. కింది సామాన్య వాక్యాలను, సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.
అ) వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొన్నారు. వేలాది యువకులు కారాగారాలకు వెళ్ళారు. (సామాన్య వాక్యాలు)
జవాబు:
వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొన్నారు మరియు కారాగారాలకు వెళ్లారు. (సంయుక్త వాక్యం)

ఆ) గాంధీ విధానాలను ఆచరించాలి.
గాంధీ విధానాల ద్వారా మంచిని సాధించాలి. (సామాన్య వాక్యాలు)
జవాబు:
గాంధీ విధానాలను ఆచరించాలి మరియు మంచిని సాధించాలి. (సంయుక్త వాక్యం)

కర్తరి వాక్యాలు – కర్మణి వాక్యాలు

అభ్యాసం – 1: `కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా రాయండి.

అ) వాల్మీకి రామాయణాన్ని రచించాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
వాల్మీకిచే రామాయణం రచింపబడింది. (కర్మణి వాక్యం)

ఆ) ప్రజలు శాంతిని కోరుతున్నారు. (కర్తరి వాక్యం)
జవాబు:
ప్రజలచే శాంతి కోరబడుతోంది. (కర్మణి వాక్యం)

అభ్యాసం – 2 : కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాయండి.

అ) లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నా చేత చదువబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నేను చదివాను. (కర్తరి వాక్యం)

TS 9th Class Telugu Grammar Questions and Answers

ఆ) నాచే రచింపబడిన గ్రంథం, నేతాజీ చరిత్ర. (కర్మణి వాక్యం)
జవాబు:
నేను రచించిన గ్రంథం, నేతాజీ చరిత్ర. (కర్తరి వాక్యం)

అభ్యాసం 3 : కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా రాయండి.

ఉదా : ఆళ్వారు స్వామి చిన్నప్పుడే కథ రాశారు. (కర్తరి వాక్యం)
జవాబు:
చిన్నప్పుడే ఆళ్వారు స్వామిచే కథ రాయబడింది. (కర్మణి వాక్యం)

అ) లింగయ్య ఉసిరికాయ తీసి నాయకునికి ఇచ్చాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
లింగయ్య చేత ఉసిరికాయ తీసి నాయకునికి ఇవ్వబడింది. (కర్మణి వాక్యం)

ఆ) నాయకులు పిల్లలతో అరగంట కాలం గడిపారు. (కర్తరి వాక్యం)
జవాబు:
నాయకులచేత పిల్లలతో అరగంట కాలం గడుపబడింది. (కర్మణి వాక్యం)

ఇ) వాద్యాల చప్పుడు విన్నారు. కర్తరి వాక్యం)
జవాబు:
వాద్యాల చప్పుడు వినబడింది. (కర్మణి వాక్యం)

అభ్యాసం : కింది వాక్యాల్లో కర్తరి, కర్మణి వాక్యాలను గుర్తించి, వాటిని కర్మణి / కర్తరి వాక్యాలుగా మార్చండి.

ప్రశ్న 1.
రచయిత్రులు ఎన్నో వివరాలు సేకరించారు. (కర్తరి వాక్యం)
జవాబు:
రచయిత్రులచే ఎన్నో వివరాలు సేకరింపబడ్డాయి. (కర్మణి వాక్యం)

TS 9th Class Telugu Grammar Questions and Answers

ప్రశ్న 2.
ఆమె ఇంటర్వ్యూ రికార్డు చేయబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
ఆమె ఇంటర్వ్యూను రికార్డు చేశారు. (కర్తరి వాక్యం)

ప్రశ్న 3.
కొంతమంది స్త్రీలతో జరిపిన ఇంటర్వ్యూలు యథాతథంగా ప్రచురించారు. (కర్తరి వాక్యం)
జవాబు:
కొంతమంది స్త్రీలతో జరిపిన ఇంటర్వ్యూలు యథాతథంగా ప్రచురింపబడ్డాయి. (కర్మణి వాక్యం)

ప్రశ్న 4.
వాళ్ళ భాష మార్పు చేయబడలేదు. (కర్మణి వాక్యం)
జవాబు:
వాళ్ళ భాషను మార్పు చేయలేదు. (కర్తరి వాక్యం)

ప్రశ్న 5.
ప్రతివాళ్ళూ భోజనాలు పెట్టి మల్ల రమ్మని పంపించారు. (కర్తరి వాక్యం)
జవాబు:
ప్రతివాళ్ళూ భోజనాలు పెట్టి మల్ల రమ్మని పంపించబడ్డారు. (కర్మణి వాక్యం)

ప్రశ్న 6.
దాదాపు నలభై ఇంటర్వ్యూలు చేశాం. (కర్తరి వాక్యం)
జవాబు:
దాదాపు నలభై ఇంటర్వ్యూలు చేయబడ్డాయి. (కర్మణి వాక్యం)

TS 9th Class Telugu Grammar Questions and Answers

ప్రశ్న 7.
ఊళ్ళో సమావేశం ఏర్పాటు చేయబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
ఊళ్ళో సమావేశాన్ని ఏర్పాటు చేశాం (లేదా) ఊళ్ళో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. (కర్తరి వాక్యం)

ప్రశ్న 8.
గోడల మీద అందమైన చిత్రాలు గీయబడ్డాయి. (కర్మణి వాక్యం)
జవాబు:
గోడల మీద అందమైన చిత్రాలను గీశారు. (కర్తరి వాక్యం)

ప్రశ్న 9.
దేహం పంచభూతాలచే నిర్మించబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
దేహాన్ని పంచభూతాలు నిర్మించాయి. (కర్తరి వాక్యం)

TS 9th Class Telugu Grammar Questions and Answers

ప్రశ్న 10.
మేం పెద్దలను గౌరవిస్తాం. (కర్తరి వాక్యం)
జవాబు:
మాచే పెద్దలు గౌరవింపబడతారు. (కర్మణి వాక్యం)

అలంకారాలు

అభ్యాసం : కింది పంక్తులను గమనించి, వాటిలో ఉన్న అలంకారాలను గుర్తించి రాయండి.

ప్రశ్న 1.
‘పువుకీ – ముళ్ళకీ భేదం చెప్తే
ప్రవాహానికీ నిశ్చలతకీ రూపం కలిస్తే
ఆలోచనకీ – ఆచరణకీ అర్థం చెప్తే ”
జవాబు:
పై పంక్తుల్లో “అంత్యానుప్రాస అలంకారం ఉంది.

ప్రశ్న 2.
కిశోర్ లేడిపిల్లలా పరుగెత్తుతున్నాడు.
జవాబు:
దీనిలో ‘ఉపమాలంకారం’ ఉంది.

ప్రశ్న 3.
మీ ఇంటి వాతావరణం పండుగ వాతావరణం మా అన్నట్లున్నది.
జవాబు:
పై వాక్యంలో ‘ఉత్ప్రేక్షాలంకారం’ ఉంది.

TS 9th Class Telugu Grammar Questions and Answers

ఛందస్సు

కవులు పద్యాలను, గేయాలను కొన్ని నియమములకు లోబడి రాస్తారు. అందువల్లనే అవి రాగంతో పాడుకోడానికి వీలుగా ఉంటాయి.

  1. లఘువు : రెప్పపాటు కాలంలో లేదా చిటికె వేసే కాలంలో ఉచ్చరించే అక్షరాలు “లఘువులు”. హ్రస్వాక్షరాలుగా మనం పిలుచుకొనే అక్షరాలు.
  2. గురువు : లఘువు ఉచ్చరించే సమయం కంటే ఎక్కువ సమయం అవసరమయ్యే అక్షరాలు “గురువులు”.

గురులఘువుల గుర్తులు

లఘువు అని తెలుపడానికి గుర్తు : I
గురువు అని తెలుపడానికి గుర్తు: U

గురులఘువుల నిర్ణయము

ఎ) గురువుల లక్షణాలు – వాటిని గుర్తించే విధం.
1) దీర్ఘాచ్చులు అన్నీ గురువులు. దీర్ఘాచ్చులు మొత్తం తొమ్మిది.
ఉదా :
TS 9th Class Telugu Grammar Questions and Answers 1

2) దీర్ఘాచ్చులతో కూడిన హల్లులు అన్నీ గురువులు.
ఉదా :
TS 9th Class Telugu Grammar Questions and Answers 2

3) విసర్గతో కూడిన అక్షరాలు అన్నీ గురువులు.
ఉదా :
TS 9th Class Telugu Grammar Questions and Answers 3

4) నిండు సున్నతో కూడిన అక్షరాలు గురువులు
ఉదా :
TS 9th Class Telugu Grammar Questions and Answers 4

5) పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు గురువులు.
ఉదా :
TS 9th Class Telugu Grammar Questions and Answers 5

6) సంయుక్తాక్షరాలకు, ముందు ఊది పలకబడే అక్షరాలు. గురువులు.
ఉదా :
TS 9th Class Telugu Grammar Questions and Answers 6
ఉదా : క్య, త్ర, క్ష – మొదలైనవి సంయుక్తాక్షరాలు.

7) ద్విత్వాక్షరాలకు ముందుండే అక్షరాలు గురువులు
ఉదా :
TS 9th Class Telugu Grammar Questions and Answers 7
ద్విత్వాక్షరం : ఒకే రకం హల్లులు కలిసిన అక్షరాన్ని ‘ద్విత్వాక్షరం’ అంటారు.
ఉదా : త్త, క్క, ప్ప, మ్మ – మొ||నవి ద్విత్వాక్షరాలు. వాటికి ముందున్న అక్షరాలు అ, న, అ

TS 9th Class Telugu Grammar Questions and Answers

బి) లఘువుల లక్షణాలు – వాటిని గుర్తించే విధం :

TS 9th Class Telugu Grammar Questions and Answers 8
గమనిక : గురువులు కాని, అక్షరాలన్నీ లఘువులు:
1) ఋ కారంతో కూడిన అక్షరం, సంయుక్తాక్షరం కాదు. ‘ఋ’ అనేది అచ్చు. అందువల్ల అది లఘువు. దానికి ముందు అక్షరం కూడా లఘువే.
ఉదా :
TS 9th Class Telugu Grammar Questions and Answers 9

TS 9th Class Telugu Grammar Questions and Answers

2) సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరాన్ని ఊది పలికితేనే, అది గురువు అవుతుంది. లేకపోతే లఘువు అవుతుంది.
ఉదా :
TS 9th Class Telugu Grammar Questions and Answers 10

3) ఏకపదంలోనూ, సమాసంలోనూ సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం ఊది పలకబడుతుంది. కాబట్టి అది గురువు అవుతుంది.
ఉదా :
TS 9th Class Telugu Grammar Questions and Answers 11

గణ విభజన

1) ఒకే అక్షరం గణాలు : ఒకే అక్షరం గణంగా ఏర్పడితే, అది ఏకాక్షర గణం. ఈ గణంలో ఒక గురువు లేదా ఒక లఘువు ఒక్కొక్కటే గణంగా ఉంటాయి.
ఉదా :
TS 9th Class Telugu Grammar Questions and Answers 12

TS 9th Class Telugu Grammar Questions and Answers

2) రెండక్షరాల గణాలు : రెండేసి అక్షరాలు కలిసి గణాలుగా ఏర్పడతాయి. వీటిలోనూ గురువులు, లఘువులు ఉంటాయి.
ఇవి నాలుగు రకాలు.
అ) ఒక గురువు ఒక లఘువు కలిసి గణంగా ఏర్పడితే ఆ గణాన్ని ‘గలం’ లేదా ‘హ’ గణం అనీ అంటారు.
ఉదా :
TS 9th Class Telugu Grammar Questions and Answers 13

ఆ) ఒక లఘువు, ఒక గురువు కలిపి గణంగా ఏర్పడితే అది ‘లగం’, లేదా ‘వ’ గణం అని అంటారు.
TS 9th Class Telugu Grammar Questions and Answers 14

ఇ) రెండూ గురువులే గల గణాన్ని – ‘గగము’ అంటారు.
ఉదా :
TS 9th Class Telugu Grammar Questions and Answers 15

ఈ) రెండూ లఘువులే గల గణాన్ని – ‘లలము’ అంటారు.
ఉదా :
TS 9th Class Telugu Grammar Questions and Answers 16

TS 9th Class Telugu Grammar Questions and Answers

అభ్యాసం : రెండక్షరాల గణాలు నాలుగు రకాలు ఉన్నాయి కదా ! ఒక్కొక్క దానికి 4 పదాల చొప్పున రాయండి.
ఉదా :
TS 9th Class Telugu Grammar Questions and Answers 17

మూడక్షరాల గణములు

మూడక్షరాల గణాలు మొత్తం ఎనిమిది (8).
TS 9th Class Telugu Grammar Questions and Answers 18

అ) మూడక్షరాల గణాలను గుర్తించే సులభ మార్గం:
TS 9th Class Telugu Grammar Questions and Answers 19
య, మా, తా, రా, జ, భా, న, స అనే సూత్రాన్ని కంఠస్థం చేసి, పై విధంగా ఒక చక్రం గీయండి. మీకు కావలసిన గణముపేరు గల మొదటి అక్షరం ఎక్కడ ఉందో గుర్తించండి. ఆ అక్షరాన్నుండి కుడిగా ఉన్న మూడక్షరాలలోనూ, గురు లఘువులు క్రమంగా ఉన్నాయో, మీకు కావలసిన గణానికి గురు లఘువులు ఆ క్రమంలో ఉంటాయి.

TS 9th Class Telugu Grammar Questions and Answers

‘ఉదా : మీకు య గణము యొక్క గురు లఘువుల క్రమం కావాలి అనుకోండి. అపుడు ‘య’ నుండి కుడివైపుగా ‘యమాతా’ అనే మూడక్షరాలను వేరుగా వ్రాయండి.
TS 9th Class Telugu Grammar Questions and Answers 20

ఆ) మూడక్షరాల గణాల నిర్ణయంలో మరో పద్ధతి :
TS 9th Class Telugu Grammar Questions and Answers 21
అని వ్రాసుకొని, దానికి గురు లఘువులు గుర్తించండి. మీకు కావలసిన గణము పేరు గల అక్షరంతో, ప్రక్క రెండు అక్షరాలూ కలిపి, దానిలోని గురు లఘువుఱ ఎలా ఉన్నాయో గమనిస్తే, ఏ గణానికి ఏ అక్షరాలు ఉంటాయో తెలుస్తుంది.
ఉదా :

  1. య గణము = యమాతా = I U U = ఆది లఘువు
  2. మ గణము = మాతారా = U U U = సర్వ గురువు
  3. త గణము = తారాజ = U U I = అంత్య లఘువు
  4. ర గణము = రాజభా = U I U = మధ్య లఘువు
  5. జ గణము = జభాన = I U I = మధ్య గురువు
  6. భ గణము = భానస = U I I = ఆది గురువు
  7. న గణము = నసల = I I I = సర్వ లఘువులు
  8. లగము (లేక ‘వ’ గణము = I U = లఘువు, గురువు)

నాలుగు అక్షరాల గణములు

TS 9th Class Telugu Grammar Questions and Answers 22

సూర్య గణములు – ఇంద్ర గణములు

1) సూర్య గణాలు : ఇవి రెండు రకాలు.
TS 9th Class Telugu Grammar Questions and Answers 23

TS 9th Class Telugu Grammar Questions and Answers

యతి ప్రాసలు

I. గమనిక : పద్యానికి సౌందర్యాన్ని చేకూర్చేవి యతి, ప్రాసలు.
1. యతి : పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు.
2. ప్రాస : పద్యపాదంలోని రెండవ అక్షరాన్ని ‘ప్రాస’ అంటారు.

II. గమనిక : నియమం చెప్పినచోట ‘యతి’, ‘ప్రాస’లు ప్రయోగించడం వల్ల చదవడానికీ, వినడానికీ, జ్ఞాపకం పెట్టుకోడానికీ సౌకర్యం కలుగుతుంది.
3. యతి మైత్రి : పద్యపాదం యొక్క మొదటి అక్షరంతో, ఆ పద్యంలో నిర్ణయింపబడిన స్థానమందలి అక్షరం మైత్రి కలిగి ఉండడాన్ని, యతిమైత్రి అంటారు. యతిమైత్రి యతిస్థానంలోని హల్లుకేకాక, అచ్చుతో కూడా మైత్రి ఉండాలి.

1. ఉత్పలమాల
కింది పద్య పాదాన్ని పరిశీలించండి. “ఆపుర మేలు మేలు బళియంచు బ్రజల్ జయవెట్టు చుండనా”
TS 9th Class Telugu Grammar Questions and Answers 24
గమనిక : పై పాదం ‘భ, ర, న, భ, భ, ర, వ’ అనే గణాలు వరుసగా వచ్చాయి. ఇలా పద్యంలో నాలుగు పాదాల్లోనూ ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉన్న పద్యాన్ని ‘వృత్త పద్యం’ అంటారు.

యతి : పద్య పాదంలో మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు. ఈ యతి అక్షరం గానీ, దాని వర్ణమైత్రి అక్షరం గాని ఆ పాదంలో మరొకచోట రావడాన్ని ‘యతి మైత్రి’ లేదా యతి స్థానం అంటారు.

TS 9th Class Telugu Grammar Questions and Answers

పై పద్యపాదాల్లో పదవ అక్షరం (ఆ – య) యతి.

ప్రాస : పై పద్యపాదం రెండవ అక్షరంగా నాలుగు పాదాల్లోనూ ‘ప’ అనే అక్షరం వచ్చింది. ఈ పద్యాలలో రెండవ అక్షరంగా ఒకే గుణింతాక్షరం రావడాన్ని ‘ప్రాస’ నియమం అంటారు. పై లక్షణాలు గల పద్యాన్ని ‘ఉత్పలమాల’ పద్యం అంటారు.
ఉత్పలమాల పద్యం లక్షణాలు :

  1. ఇది వృత్తపద్యం.
  2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలోనూ భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలుంటాయి.
  4. ప్రాస నియమం ఉంటుంది.
  5. ప్రతి పాదంలోనూ 20 అక్షరాలుంటాయి.

2. చంపకమాల
కింది పద్య పాదాన్ని పరిశీలించండి. “ఒరిమయు భక్తియున్ నెనరు నోర్పుఁగనంబడఁబెద్దపిన్నయం”
TS 9th Class Telugu Grammar Questions and Answers 25
చంపకమాల పద్య లక్షణాలు :

  1. ఇది వృత్తపద్యం.
  2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలో ‘న, జ, భ, జ, జ, జ, ర’ అనే గణాలుంటాయి.
  4. ప్రతి పాదంలో 11వ అక్షరం యతిస్థానం (ఒ – ఓ).
  5. ప్రాస నియమం ఉంటుంది.
  6. ప్రతి పాదంలోనూ 21 అక్షరాలుంటాయి.

TS 9th Class Telugu Grammar Questions and Answers

3. శార్దూలం
కింది పద్య పాదాన్ని పరిశీలించండి. “నాశీర్వాదమునొజ్జచే బడసి తానందంగ నౌనంబచితం”
TS 9th Class Telugu Grammar Questions and Answers 26

శార్దూల పద్య లక్షణాలు :

  1. ఇది వృత్తపద్యం.
  2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలోనూ ‘మ, స, జ, స, త, త, గ’ అనే గణాలుంటాయి.
  4. ప్రతి పాదంలో 13వ అక్షరం యతిస్థానం (నా నం).
  5. ప్రాస నియమం ఉంటుంది.
  6. ప్రతి పాదంలోనూ 19 అక్షరాలుంటాయి.

TS 9th Class Telugu Grammar Questions and Answers

4. మత్తేభం
కింది పద్య పాదాన్ని పరిశీలించండి. “చెవికిం గుండల మొప్పుగాదు శ్రుతమేచే దమ్మికి న్గంకణం”
TS 9th Class Telugu Grammar Questions and Answers 27

మత్తేభ పద్య లక్షణాలు :

  1. ఇది వృత్తపద్యం.
  2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలోనూ ‘స, భ, ర, న, మ, య, వ’ అనే గణాలుంటాయి.
  4. ప్రతి పాదంలో 14వ అక్షరం యతిస్థానం (చె- చే).
  5. ప్రాస నియమం ఉంటుంది.
  6. ప్రతి పాదంలోనూ 20 అక్షరాలుంటాయి.

TS 9th Class Telugu Grammar Questions and Answers

5. ఛందస్సు – తేటగీతి
ఉదా : ‘తేటగీతి’-.
‘తేటగీతి’ పద్యం, సూర్యచంద్రగణాలతో ఏర్పడుతుంది. ఈ పద్య లక్షణాలు తెలుసుకోబోయే ముందు సూర్యగణాలు,
ఇంద్రగణాలు అంటే ఏవో తెలిసికొందాము.
సూర్యగణాలు : (2)
TS 9th Class Telugu Grammar Questions and Answers 28
TS 9th Class Telugu Grammar Questions and Answers 29
పై ఉదాహరణ ఆధారంగా తేటగీతి పద్య లక్షణాలను కింది విధంగా చెప్పవచ్చు.
‘తేటగీతి’ పద్య లక్షణాలు .:

  1. ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి.
  2. ప్రతి పాదానికి వరుసగా ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి.
  3. నాలుగో గణం మొదటి అక్షరం యతిమైత్రి స్థానం. ప్రాసయతి కూడా చెల్లుతుంది.
  4. ప్రాస నియమం లేదు.

TS 9th Class Telugu Grammar లేఖలు

Telangana SCERT 9th Class Telugu Grammar Telangana లేఖలు Questions and Answers.

TS 9th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 1.
నచ్చిన రాజకీయ నాయకుని గురించి మిత్రునికి లేఖ.
జవాబు:

భద్రాచలం,
X X X X X

ప్రియ స్నేహితురాలు పద్మకు,

నేను క్షేమముగా ఉన్నాను. నీ క్షేమసమాచారములు తెలుపగలవు. నీవు ఈ మధ్య నాకు వ్రాసిన ఉత్తరములో నాకు నచ్చిన రాజకీయ నాయకుని గురించి వ్రాయమన్నావు కదా ! అందుకే ఈ లేఖ వ్రాయుచున్నాను.

నాకు నచ్చిన రాజకీయ నాయకుడు భారత మాజీ ప్రధాని, ‘భారతరత్న’ అవార్డు గ్రహీత శ్రీ మొరార్జీదేశాయ్. భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనిన మహోన్నత నాయకులలో ఆయన ఒకరు. గాంధీజీ ఆదర్శాలకోసం జీవితాంతము పాటుబడిన వ్యక్తి మొరార్జీ. ఉన్నతమైన విలువలు, ఆదర్శమైన విధానాలకు కట్టుబడిన వ్యక్తిగా మొరార్జీ ప్రపంచ ప్రఖ్యాతి పొందినారు. మొరార్జీ ఏనాడు పదవులను ఆశించలేదు, పదవులే ఆయనను జీవితాంతం ఆశించినాయి. నైతిక విలువలకు మొరార్జీ గొప్ప ఉదాహరణ. అందులకే ఆయన అంటే నాకు ఎంతో ఇష్టము.

ఇట్లు,
నీ స్నేహితురాలు,
పి. శశికళ.

చిరునామా :
వి. పద్మ,
10వ తరగతి, బాలికోన్నత పాఠశాల,
మధిర, ఖమ్మం జిల్లా.

TS 9th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 2.
నీ మాతృదేశాన్ని (భారతదేశం) గురించి పరిచయం చేస్తూ విదేశంలోని కలం స్నేహితునికి లేఖ.
జవాబు:

హైదరాబాదు,
X X X X X

ప్రియ కలం స్నేహితుడు జాన్ డేవిడ్ పాల్కు,

నేను క్షేమంగా ఉన్నాను. నీవు కూడా క్షేమంగా ఉన్నావని తలుస్తాను. నేను ఈ లేఖలో మా భారతదేశ విశేషాలు తెలియజేస్తున్నాను.

ఆసియా ఖండంలోగల పెద్ద దేశాలలో భారతదేశం ఒకటి. దీనినే ‘ఇండియా’ అని నేడు పిలుస్తున్నారు. మా భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రం ఎల్లలుగా ఉన్నాయి. మా దేశంలో సింధు, గంగ, యమున, కృష్ణ, గోదావరి వంటి జీవనదులెన్నో ఉన్నాయి.

భారతదేశంలో వివిధ జాతులవారు, మతాలవారు ఉన్నారు. ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనటానికి మా దేశాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సత్యం, అహింసయే ఆయుధాలుగా భావించే దేశం మాది. సర్వమానవులను సౌభ్రాతృత్వ దృష్టితో చూస్తూ అందరి సుఖశాంతులను కాంక్షించేదే మా భారతదేశం.

ఇట్లు,
నీ కలం స్నేహితుడు,
డి. వి. శ్యామసుందర్.

చిరునామా :
జాన్ డేవిడ్ పాల్,
డోర్ నెం. 30. 4/159,
కెనడీ రోడ్,
వాషింగ్టన్, అమెరికా.

TS 9th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 3.
మీ వీధిలో మంచినీటి సమస్య గురించి వివరించుచు సంబంధిత అధికారికి లేఖ రాయండి..
జవాబు:

మహబూబ్నగర్,
X X X X X

మంచినీటి సరఫరాశాఖ చీఫ్ ఇంజనీర్ గారికి నమస్కరించి
గోపాలకృష్ణ వ్రాయు విన్నపము.

మా ప్రాంత కుటుంబాలవారు మంచినీటి సరఫరా సక్రమంగా లేనందువల్ల నానా ఇబ్బందులు పడుతున్నారు. సుమారు పదిరోజులుగా మా ప్రాంతంలో, అందులోను ముఖ్యంగా మా వీధిలో మంచినీటి నల్లాలు పనిచేయడంలేదు. కాలనీవాసులు. త్రాగేటందుకు చుక్క నీరు దొరకక అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం బావినీటితోనే కాలక్షేపం చేస్తున్నారు. కాబట్టి మీరు వెంటనే తగు చర్యలు తీసుకొని నల్లాలు సరిగా పనిచేయునట్లు చూడవలసిందిగా కోరుతున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
వి. గోపాలకృష్ణ,

చిరునామా :
చీఫ్ ఇంజనీర్,
మంచినీటి సరఫరాశాఖ కార్యాలయం,
మహబూబ్నగర్.

TS 9th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 4.
మీ వాడలో ఎక్కువైన దోమల బాధను నివారించడానికి, తగు చర్యలు తీసుకోవలసినదిగా సంబంధిత అధికారికి ఒక లేఖ రాయండి.
జవాబు:

కరీంనగర్,
X X X X X

మునిసిపల్ కమిషనర్ గారికి,
కరీంనగర్ మునిసిపాలిటీ,
కరీంనగర్.

ఆర్యా,

కరీంనగర్ మునిసిపాలిటీ గాంధీనగర్ లోని మా పేటలో ఈ మధ్య దోమలు ఎక్కువయ్యాయి. మురుగు కాల్వలలో నీరు సరిగా ప్రవహించుట లేదు. మురుగు కాలువలు శుభ్రం చేయటం లేదు. ఒక్కొక్క చోట కాలువలు నిండి రోడ్లపై మురికినీరు పిల్ల కాలువల వలె ప్రవహిస్తున్నాయి. దానితో దోమలు పెరిగి మా వాడలోని ప్రజలు చాలా బాధపడుతున్నారు. రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు. చంటిపిల్లలు దోమలు కుట్టి రోగగ్రస్తులవుతున్నారు.

కావున మీరు శ్రద్ధవహించి, సంబంధిత అధికారులకు తెలిపి, మా వాడ పరిశుభ్రాన్ని కాపాడి, మమ్ము దోమల బారినుండి రక్షింపగలరని ఆశించుచున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
వి. రాజశేఖర్.

చిరునామా :
కమిషనర్,
పురపాలక సంఘ కార్యాలయం,
కరీంనగర్.

TS 9th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 5.
నగరంలో మొక్కల పెంపకం ఆవశ్యకత గురించి పత్రికా సంపాదకునికి ఒక లేఖ రాయండి.
జవాబు:

వరంగల్లు,
X X X X X

ఈనాడు పత్రికా సంపాదకునకు,

ఆర్యా,

మన వరంగల్లు నగరం వివిధ కాలుష్యాలకు లోనవుతూ ప్రజాజీవనం చాలా దుర్భరంగా తయారయింది. పట్టణాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి, జనాభా పెరుగుదల అనేక కారణాలు ప్రకృతిని కాలుష్యానికి గురిచేస్తున్నాయి. మంచిగాలి, మంచి వాతావరణం రోజురోజుకూ కరువైపోతున్నాయి.

ప్రకృతిలోని పచ్చనిచెట్లు మనిషికి స్వచ్ఛమైన గాలిని ప్రసాదించి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఈ విషయాన్ని గ్రహించి అందరు తమ ఇండ్లలోను, పరిసర ప్రాంతాలలోను, రోడ్ల ప్రక్కన మొక్కలను పెంచి నగర కాలుష్యం నుండి బయటపడునట్లు సహకరించవలసిందిగా మీ పత్రికా ముఖమున కోరుతున్నాము.

ఇట్లు,
తమ విధేయుడు,
పి. శ్రీనివాస్.

చిరునామా:
పత్రికా సంపాదకుడు,
ఈనాడు దినపత్రిక,
సోమాజీగూడ,
హైదరాబాదు.

TS 9th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 6.
నేత్రదానం చేయవలసిందిగా అందరిని ప్రోత్సహిస్తూ పత్రికలో ప్రచురించవలసిందిగా సంపాదకునికి లేఖ.
(లేదా)
నేత్రదానం ఆవశ్యకతను తెలియజేస్తూ పత్రికా సంపాదకుడికి లేఖ.
జవాబు:

ఆదిలాబాదు,
X X X X X

ఈనాడు పత్రికా సంపాదకునకు,

అయ్యా,

మన దేశంలో పాక్షిక గ్రుడ్డితనంతో బాధపడేవారి సంఖ్య చాలా ఎక్కువ. ‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అన్నారు పెద్దలు. అలాంటప్పుడు కళ్ళు లేనివారి జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. వారి జీవితాలలో వెలుగు ప్రసాదింపజేయటం సాటి మానవులుగా మన కర్తవ్యం.

అందుకు నేత్రదానం చేయడం ఎంతైనా అవసరం. మనిషి తాను మరణించిన తరువాత తన నేత్రాలను దానం చేయడం ద్వారా మరొకరికి చూపు ప్రసాదించిన వాడవుతాడు. కాబట్టి అన్ని దానాలలోకి నేత్రదానం చాలా గొప్పది. దీన్ని ప్రోత్సహిస్తూ మీ పత్రికలో ప్రచురించి ప్రజలు చైతన్యవంతులగునట్లు చేయవలసిందిగా కోరుతున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
ఐ. గణేష్ కుమార్.

చిరునామా :
పత్రికా సంపాదకుడు,
‘ఈనాడు’ కార్యాలయం,
సోమాజీగూడ,
హైదరాబాదు – 500 001.

TS 9th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 7.
రక్తదానం అవసరాన్ని తెలియజేస్తూ మిత్రునకు లేఖ.
జవాబు:

హైదరాబాదు,
X X X X X

ప్రియ మిత్రుడు నరేంద్రకు,

నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని తలుస్తాను. ముఖ్యంగా ఈ లేఖలో రక్తదానం అవసరాన్ని గూర్చి తెలియజేస్తున్నాను.

కొన్ని పరిస్థితులలో తోటి మానవుని ప్రాణాన్ని కాపాడటానికి రక్తదానం ఎంతైనా అవసరం. అలాంటప్పుడు ఆ వ్యక్తియొక్క రక్త గ్రూపునకు సంబంధించిన రక్తాన్నే దానం చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆ వ్యక్తి ప్రాణానికే ముప్పు సంభవించవచ్చు. అప్పటికప్పుడు ఆయా రక్త గ్రూపు కలవారు దొరకటం చాలా కష్టం.

కాబట్టి ముందుగానే రక్తదానం చేస్తే బ్లడ్ బ్యాంకులలో. నిల్వచేసి అవసరం వచ్చినపుడు ఆయా వ్యక్తులకు ఉపయోగిస్తారు. ఇది దృష్టిలో పెట్టుకొని నేను రక్తదానం చేశాను. నీవు కూడా నాలాగే రక్తదానం అవసరాన్ని గుర్తించి అందుకు సహకరించగలవని ఆశిస్తున్నాను.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
కోట రవికుమార్.

చిరునామా :
ఆర్. నరేంద్ర, 10వ తరగతి,
మున్సిపల్ హైస్కూలు,
బెల్లంపల్లి.

TS 9th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 8.
‘సంఘసంస్కర్త’ను గూర్చి వివరిస్తూ చెల్లికి లేఖ.
జవాబు:

భద్రాచలం,
X X X X X

ప్రియమైన చెల్లెలు సుజాతకు,

ఆశీస్సులు. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని తలుస్తాను. నేను ముఖ్యంగా ఈ లేఖలో గొప్ప సంఘసంస్కర్తయగు కందుకూరి వీరేశలింగం పంతులుగారిని గూర్చి నీకు తెలియజేయ తలచాను.

వీరేశలింగం పంతులుగారు కవిగా సంపాదించిన కీర్తి కంటే సంఘసంస్కర్తగా ఎనలేని ఖ్యాతి గడించారు. ఆయన బాల్య వివాహాలను నిరసించారు. వితంతు వివాహాలను, స్త్రీ విద్యను ప్రోత్సహించారు. హితకారిణి సమాజాన్ని స్థాపించి దాని ద్వారా అనాథ స్త్రీ ఉద్ధరణకు పాటుపడ్డారు. సంఘంలోని అనేక దురాచారాలను, మూఢాచారాలను ఖండించారు. అందుకే కందుకూరి వీరేశలింగం పంతులుగారు తెలుగుజాతి గర్వించతగ్గ గొప్ప సంఘసంస్కర్త అని నా అభిప్రాయం.

ఇట్లు,
మీ సోదరుడు,
పి. సందీప్ కుమార్.

చిరునామా :
పి. సుజాత, 10వ తరగతి,
ఎస్.ఆర్. హైస్కూలు,
పాల్వంచ, ఖమ్మం జిల్లా.

TS 9th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 9.
ఉగ్రవాదం వల్ల సంభవిస్తున్న నష్టాలను వివరిస్తూ మిత్రునకు ఒక లేఖ రాయండి.
జవాబు:

స్టేషన్ ఘనాపూర్,
X X X X X

ప్రియ మిత్రురాలు సాయిచంద్రికకు,

నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని తలుస్తాను. ఈ మధ్య దేశంలో ఉగ్రవాదం విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఎన్నో నష్టాలు సంభవిస్తున్నాయి. వాటిని గురించి ఈ లేఖలో తెలియజేయదలచాను.

ఉగ్రవాదం మన జాతీయ సమైక్యతకు తీవ్రభంగాన్ని, అశాంతిని కలిగిస్తున్నది. వారి పాశవిక చర్యలకు అనేకమంది తమ ప్రాణాలు కోల్పోవడం జరుగుతోంది. అంతేకాక వారు ప్రజల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు నష్టపరుస్తున్నారు. దీనివల్ల వారు సాధించేది ఏమీలేదు. కాబట్టి ఉగ్రవాదులు తమ దుష్టమైన మార్గాన్ని విడిచిపెట్టి దేశశ్రేయస్సుకు పాటుపడాలని ఆశిస్తున్నాను.

ఇట్లు,
నీ మిత్రురాలు,
హరి అపర్ణ.

చిరునామా :
గార్లపాటి సాయిచంద్రిక,
10వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,
భద్రాచలం,
ఖమ్మం జిల్లా.

TS 9th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 10.
మరుగుదొడ్ల నిర్మాణ ఆవశ్యకతను గూర్చి జిల్లా కలెక్టరుకు ఒక వినతి పత్రం రాయండి.
జవాబు:

అసిఫాబాదు,
X X X X X

కలెక్టరుగారి దివ్యసముఖమునకు
అసిఫాబాదు గ్రామ నివాసి వ్రాయు విన్నపం.

అయ్యా,

మాది అసిఫాబాదు. మా గ్రామంలో ఎంతోమంది నిరుపేదలు నివసిస్తున్నారు. ఏ రోజునకు ఆ రోజు కాయకష్టం. చేసుకొని జీవిస్తున్నారు. మా గ్రామ ప్రజలు మరుగుదొడ్ల సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడపడితే అక్కడ మలమూత్ర విసర్జన చేయడంవల్ల గ్రామంలోని వారంతా అనారోగ్యం పాలవుతున్నారు.

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు పెద్దలు. అందువల్లే ప్రభుత్వం కూడా ప్రజల ఆరోగ్య పరిరక్షణ బాధ్యతను చేపట్టి ఎన్నో పథకాలు ప్రవేశపెడుతోంది. కాబట్టి మా గ్రామంలో హాడ్కో పథకం కింద మరుగుదొడ్ల నిర్మాణం జరుగునట్లు చూడవలసినదిగా. మనవి చేస్తున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
అక్కపెద్ది పూర్ణచంద్.

చిరునామా :
జిల్లాధికారి,
జిల్లాధికారి కార్యాలయం,
ఆదిలాబాదు.

TS 9th Class Telugu Grammar లేఖలు

TS 9th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson నేను… సావిత్రిబాయిని

Telangana SCERT 9th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం 6th Lesson నేను… సావిత్రిబాయిని Questions and Answers.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson నేను… సావిత్రిబాయిని

“జ్యోతి ! సావిత్రికెందుకు చదువు నేర్పుతున్నావు ?”
“ఎందుకు నేర్పకూడదు ?”
అసలు మన కులంవాళ్ళమే చదువుకోకూడదు. అయినా నిన్ను చదివించాను. ఇప్పుడు నువ్వు నీ భార్యకు చదువు చెబుతున్నావు – “ఆమె కూడా మనిషే కదా ! కాదంటే చెప్పు”
“నిజమే కావచ్చు కానీ ఆడదానికి చదువు పనికిరాదు. చదువుకున్న ఆడది చెడిపోతది. బుద్ధి లేనిదవుతది”-
“నాన్నా! సావిత్రి చదువుకుని ఆ మాటలన్నీ అబద్ధాలని నిరూపిస్తుంది”
TS 9th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson నేను… సావిత్రిబాయిని 1

PAPER – I : వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన) (మార్కులు: 6)

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
సావిత్రీబాయి కాలంలో స్త్రీల పరిస్థితులు ఎలా ఉండేవి ?
జవాబు:
సావిత్రీబాయి కాలంలో ఆడవాళ్ళు గడప దాటకూడదు. ఆడదంటే వంటింటికీ, వంటింట్లో పొయ్యికీ కట్టుబడి ఉండాలి. ఆడపిల్ల నియమాలను ఎంతమాత్రం దాటరాదు.

ఆ రోజుల్లో పొయ్యిలో కర్రలూ, పొయ్యి ఊదే గొట్టం ఆడపిల్ల చేతిలో ఎప్పుడూ ఉండాల్సిందే. ఆడపిల్ల ఆ గొట్టంతో పొయ్యిని ఊదుతూ ఉండాల్సిందే. ఆడపిల్ల భర్తనూ, అత్తమామల్ని సేవించుకోవాలి. ఇప్పుడు రెండవతరగతి చదివే వయస్సులోనే ఆనాడు ఆడపిల్లలు అత్తవారింట్లో ఉండేవారు. అత్తవారి ఇల్లే ఆడపిల్ల అసలు ఇల్లని ఆ రోజుల్లో ఆడపిల్లలకు తల్లిదండ్రులు నొక్కి చెప్పేవారు.

ఆ రోజుల్లో ఆడపిల్లలకు చదువు పనికిరాదు. చదువుకున్న ఆడది చెడిపోతుందని, బుద్ధిలేనిది అవుతుందని అప్పటివారు నమ్మేవారు. ఆనాడు సావిత్రి ఆడపిల్లలకు చదువుచెప్పడానికి బడికి పోతూంటే, జనం కిటికీల వెనుక నిలబడి తిట్టేవారు. శాపనార్థాలు పెట్టేవారు. నీచమైన మాటలు అనేవారు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson నేను… సావిత్రిబాయిని

ప్రశ్న 2.
సేబీ అంటే ఎవరు ? ఆయన వ్యక్తిత్వాన్ని గురించి వివరించండి.
జవాబు:
సేబీ అంటే సావిత్రీబాయి భర్త “జ్యోతీరావ్ ఫూలే”. సేబీ, పూనాలో ఉండే ఫూలే కుటుంబంలో పుట్టాడు. సేబీకి ఎప్పుడూ బడి, పుస్తకాలు, చదువు అంటే ఇష్టం. సావిత్రీబాయి, జ్యోతీరావ్ ఫూలేని సేబీ అనే పిలిచేది.

మనిషి మంచివాడయితే, అతడు మనదేశం వాడయినా, విదేశీయుడయినా సరే, ఆయన జీవితం, వ్యక్తిత్వం విలువలూ అన్నీ తెలుసుకోవాలి అనేవాడు సేబీ. శివాజీ, వాషింగ్టన్ వంటి వారి జీవిత చరిత్రలు అన్నీ ఆయన చదివాడు. థామస్పెన్ రాసిన “మానవహక్కులు” పుస్తకం చదివి మనిషికి ఉన్న హక్కులూ, బాధ్యతలూ చక్కగా తెలిసికొన్నాడు.

మన కులవ్యవస్థ, మన సమాజాన్ని నాశనం చేస్తోందని సేరీ చెప్పేవాడు. ఒకప్పుడు మంచిగా ఉన్న మన మతం మూర్ఖపు ఆచారాల్లో చిక్కుకుందనీ, వాటిని రూపుమాపాలనీ అనేవాడు. సేబీ, కబీర్, తుకారాం వంటి భక్తుల సాహిత్యాన్నీ, మత సంస్కర్తల రచనల్నీ చదివాడు. ఆ కాలంలోని శూద్ర, అతిశూద్రకులాల గొడవలు, విద్య వల్లే పోతాయనీ, విద్యే మన ధ్యేయం కావాలనీ సేబీ చెప్పేవాడు. సేబీ, విద్య అనే తపన వహించిన మహావృక్షం వంటివాడు.

ఆడమనిషి చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుందని, భార్య సావిత్రికి చదువుచెప్పి, ఆమెను మొదటి పంతులమ్మగా చేశాడు. తక్కువ కులాల ఆడపిల్లల కోసం సొంత ధనంతో బడిపెట్టాడు.

మానవులందరూ పుట్టుకతో సమానులనీ, వాళ్ళు ఒకరినొకరు సమానులుగా చూసుకోవాలనీ సేర్ చెప్పేవాడు. ఆడపిల్లలకు చదువు చెపుతున్నందుకు కోపంతో కొందరు సేరీని చంపబోయారు. బీదవాళ్ళకు సాయం చెయ్యడమే తన జీవితాశయం అనీ, వాళ్ళ చేతుల్లో చావటానికి కూడా తాను సిద్ధం అని చెప్పి, హంతకుల మనస్సును సేబీ మార్చాడు.

శిశు హత్యలకు వ్యతిరేకంగా మొదటి ఆశ్రమం స్థాపించాడు. “దేవుడు ఒక్కడే. మనందరం ఆయన పిల్లలం. మనిషిని ‘ గొప్పవాడిగా చేసేది అతని గుణమే కాని, కులంకాదు. అనే సిద్ధాంతాలతో “సత్యశోధక సమాజాన్ని” స్థాపించాడు. సేర్జే అంటే జ్యోతీరావ్ ఫూలే. ఈయన స్త్రీ విద్యకూ, కులరహిత సమాజానికీ కృషిచేసిన మహనీయుడు.

ప్రశ్న 3.
జ్యోతీరావ్ ఫూలేని చంపడానికి వచ్చిన వాళ్ళు పరివర్తన చెందిన సంఘటనను తెలపండి.
జవాబు:
జ్యోతీరావ్ ఫూలే తక్కువ కులాల ఆడపిల్లల చదువులకై బడిపెట్టాడు. ఇది గిట్టని సంఘంలో కొందరు పెద్దమనుషులు పూలేని చంపమని దోండిరామ్, కుంబార్ అనే హంతకులను నియమించారు.

ఒకరోజు రాత్రి భోజనాలయ్యాక ఫూలే నిద్రపోడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో ఫూలే పెరటి గుమ్మం తీసుకొని ఇద్దరు హంతకులు గొడ్డళ్ళతో నీశ్శబ్దంగా లోపలకు వచ్చారు. వాళ్ళ ముఖాలు భయంకరంగా ఉన్నాయి. వాళ్ళు పూలే భార్య సావిత్రికీ, ఫూలేకీ ముందు నిలబడి, పూలేని చంపడానికి గొడ్డళ్ళు పైకెత్తారు. వెంటనే ఫూలే భార్య “అన్నల్లారా ! ఆగండి. దయచేసి వెళ్ళిపొండి” అని బ్రతిమాలింది. ఎందుకు వచ్చారని పూలే వాళ్ళను అడిగాడు.

ఫూలే బడులు నడపడం ఇష్టంలేని కొందరు పెద్దలు, ఆయనను చంపడానికి తమకు కాంట్రాక్టు ఇచ్చారని, వాళ్ళు ఫూలేకు చెప్పారు. అప్పుడు ఫూలే వాళ్ళతో – “నా చావు మీకు లాభం అయితే, నన్ను చంపండి. బీదవాళ్ళకు సాయం చెయ్యడమే, నా జీవితాశయం – బీదవారి చేతిలో చావడంలో తప్పులేదు. నన్ను చంపండి” అని మెడవంచి శాంతంగా చావుకు సిద్ధమయ్యాడు. వెంటనే దోండిరామ్, కుంబార్లు గొడ్డళ్ళు కిందపడేశారు. ఫూలే కాళ్ళమీద పడ్డారు. “మేము మిమ్మల్ని చంపం. మీరు మా తండ్రి వంటివారు. ఇప్పుడే వెళ్ళి మమ్మల్ని ఇక్కడకు పంపిన వాళ్ళను చంపుతాం” అన్నారు ఫూలే వాళ్ళను ఆపాడు. వారి ఆలోచన మారేదాకా వారితో మాట్లాడాడు.

వాళ్ళిద్దరూ ఫూలే రాత్రిబడిలో చేరారు. దోండే ఫూలేకు బాడీగార్డుగా తయారయ్యాడు. కుంబార్ “వేదాచార్” అనే పుస్తకం రాసి, పూలే పనికి సాయం చేశాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson నేను… సావిత్రిబాయిని

ప్రశ్న 4.
సావిత్రిబాయి ఫూలే పాత్రను ఏకపాత్రాభినయం చేయండి.
జవాబు:
“సావిత్రిబాయి ఫూలే” ఏకపాత్రాభినయం :
నేను సావిత్రిని.

ఈ రోజు మీతో మాట్లాడదామని మీ ముందుకు వచ్చా. మీరు, మేం మా కాలంలో ఎక్కడున్నామో అక్కడే నిలిచిపోయారా ? అని నాకు అనిపిస్తోంది. నేను మహారాష్ట్రలో సతారా జిల్లా, ఖండాలా తాలూకాలో నైగావ్ గ్రామంలో పాటిల్ గారి మొదటి సంతానంగా పుట్టా. చిన్నప్పుడు బాగా అల్లరి చేసేదాన్ని. చెట్లు ఎక్కి సీమ చింతకాయలు కోసుకు తినేదాన్ని.

నాకు ఏడవ సంవత్సరంలో పూనాలోని పూలే కుటుంబీకుడు జ్యోతిరావ్తో పెండ్లి జరిగింది. మా మామగారు మంచివారు. నా భర్తను నేను సేఠ్ జీ అని పిలిచేదాన్ని. సేఠ్ జీకి చదువు అంటే ఇష్టం. నాకు ఆయన అన్నీ చదివి చెప్పేవారు. సే సాగర్ వెళ్ళారు. ఆడది చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుందని అక్కడ ఒక తెల్లజాతి మనిషి సేబీకి చెప్పింది.

సేఠ్ జీ నాకు చదువు చెప్పడం ప్రారంభించారు. మా మామగారు చదువుకుంటే ఆడది చెడిపోతుందని సేబీకి సలహా చెప్పారు. అయినా సేఠ్ జీ ఆ మాట వినలేదు. నా భర్త తక్కువ కులాల ఆడపిల్లల చదువులకు రెండు బడులు పెట్టారు. ఇంతలో ఆ స్కూలు నడిపే బడిపంతులు మానివేశాడు. దానితో ఫూలే బలవంతంపై, నేనే ఆ పిల్లలకు పంతులమ్మనయి, స్త్రీలకు చదువు చెప్పాను. ఆ పని చేయడం ఇష్టం లేని జనం నన్ను తిట్టేవారు. కిటికీలు మూసి నేను వారికి పాఠాలు చెప్పాను.

ఒక రోజున నేనూ, సేఠ్ నిద్రపోవడానికి సిద్ధంగా ఉండగా ఇద్దరు హంతకులు సేబీని చంపడానికి మా ఇంటికి వచ్చారు. సేబీ తన్ను చంపండని తలవంచారు. హంతకుల మనస్సులు మారిపోయాయి. మేం ఓ పిల్లవాణ్ణి పెంచుకున్నాం. మా సొంతబిడ్డలాగే వాడిని చూసుకున్నాం. ‘నేనే మొదటి పంతులమ్మను. శిశు హత్యలకు వ్యతిరేకంగా మేము ఒక ఆశ్రమం స్థాపించాము.

సత్యశోధక సమాజాన్ని స్థాపించాము. మేం సాధించిన విజయాలను, మా తర్వాత వచ్చిన ప్రజలు ముందుకు తీసుకెళ్ళాలి. పక్షవాతంతో సేఠ్ మరణించారు. 1897లో పూనాలో ప్లేగువ్యాధి వచ్చింది. ప్లేగువ్యాధితో బాధపడే పసిపిల్లలను నేను చేరదీశాను. నేను కూడా ప్లేగువ్యాధితోనే కన్నుమూశాను. మా ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళండి. సెలవు.

PAPER – II : పరిచిత గద్యాలు (మార్కులు : 5)

1. కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

నేను …….. సావిత్రిబాయిని

1897లో పునాలో ప్లేగువ్యాధి ప్రబలింది. పట్టణం ఎడారి అయిపోయింది. జనమంతా దగ్గర్లో ఉన్న అడవుల్లోకి పారిపోయారు. ఇట్లాంటి సమయాల్లో తక్కువ కులాల వాళ్ళకు సహాయపడాలని ఎవరనుకుంటారు ? నేను, నా కొడుకు యశ్వంత్, సమాజం సభ్యులు వ్యాధిగ్రస్తులకు సాయంగా వెళ్ళాం. ఒక గుడిసెలో రెండేళ్ళ పసివాడు బాధతో లుంగలు చుట్టుకుపోతూ కనిపించాడు. ఆ పిల్లవాడిని యెత్తుకొని డాక్టర్ దగ్గరకు పరుగెత్తాను. ప్లేగు అంటువ్యాధైనా ప్రాణం కోసం పెనుగులాడుతున్న ఆ పసిగుడ్డును ఎత్తుకోకుండా ఎట్లా ఉండగలను ? నా గుండెలకు అదుముకున్నాను. ఆ పసిబిడ్డ చావవలసి ఉంటే మరొక మనిషి ప్రేమ ఇచ్చే వెచ్చదనంతో చనిపోనివ్వు. ఆ బిడ్డ చనిపోయాడు. నాకు కూడా ప్లేగువ్యాధి సోకింది.. నా ప్రయాణం పరిసమాప్తమయ్యింది. నేను పనిలో ఉండగా మృత్యువు వరించటం నా అదృష్టం.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
‘నా ప్రయాణం పరిసమాప్తమయ్యింది’ అంటే అర్థం ఏమిటి ?
జవాబు:
నా ప్రయాణం పరిసమాప్తమయ్యింది అంటే, తన జీవితకాలం ముగిసిందని తాను చచ్చిపోతున్నానని అర్థం.

ప్రశ్న 2.
సావిత్రిబాయి కుమారుడు పేరు ఏమిటి ?
జవాబు:
సావిత్రీబాయి కుమారుడి పేరు “యశ్వంత్”.

ప్రశ్న 3.
పూనాలో ప్లేగువ్యాధి ఎప్పుడు వ్యాపించింది? పట్టణం ఎడారి అయ్యింది అంటే ఏమిటి ?
జవాబు:
పూనాలో ప్లేగువ్యాధి 1897 లో వ్యాపించింది. పట్టణం ఎడారి అయ్యిందంటే ఎడారిలోలాగే మనుష్యులు లేకుండా నగరం నిర్జనంగా ఉందన్నమాట.

ప్రశ్న 4.
గుడిసెలో పిల్లవాడిని చూసి సావిత్రీబాయి ఏమి చేసింది ?
జవాబు:
గుడిసెలో పిల్లవాడిని చూసి సావిత్రీబాయి ఆ పిల్లవాడిని ఎత్తుకొని, డాక్టర్ దగ్గరకు పరుగెత్తింది.

ప్రశ్న 5.
ప్లేగువ్యాధిగ్రస్తులకు, ఎవరు సాయంగా వెళ్ళారు ?
జవాబు:
ప్లేగువ్యాధిగ్రస్తులకు సావిత్రీబాయీ, ఆమె కుమారుడు యశ్వంత్, సమాజం సభ్యులూ సాయంగా వెళ్ళారు.

2. కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

“నేను… సావిత్రిబాయిని’

ఒక రోజు నేను ఇల్లు సర్దుతున్నా. పుస్తకాల గుట్టమీద వున్న దుమ్ము దులుపుతున్నా. ఇల్లు శుభ్రంగా ఉండాలి గదా. అదుగో అప్పుడే ఆయనొచ్చాడు. “నా పుస్తకాలనేం చేస్తున్నావు!” అన్నాడు. “దుమ్ము దులిపి శుభ్రం చేయొద్దా?” అన్నా. “పేజీలు పోగొడతావ్ జాగ్రత్త?’ అంటే ‘ఎక్కడికి పోవు, అన్నీ ఉంటాయి అన్నా. ఇదేంటో మరి?’ ‘ఏ పేజీ అది పేజీనో ఏమిటో నాకేం తెలుస్తుంది ? ఏమయిందని మీరిప్పుడీ రగడ చేస్తున్నారు?’ అన్నా ! అవన్నీ జీవిత చరిత్రలు. ఇదిగో చూడు. ఇది శివాజీ గురించి రాసింది. ఆయన ఫోటో ఇది. ఇక్కడ వాషింగ్టన్ గురించి రాసింది. ఇది ఆయన ఫోటో. అని సేరీ అన్నాడు.

“ఎవరూ ? శివాజీ నాకూ తెలుసు. మనవాడే కదా! కానీ ఈయనెవరూ? పరాయిదేశం మనిషివలె ఉన్నాడు. మనదేశం అయితేనేం కాకపోతేనేం. మనిషి మంచి పనులు చేస్తే మనం అతని జీవితం, వ్యక్తిత్వం, విలువలు అన్నీ తెలుసుకోవాలి.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
పై పేరాలో విషయం మనకు చెపుతున్నది ఎవరు ?
జవాబు:
పై పేరాలో మనకు విషయం చెపుతున్నది ‘సావిత్రీ బాయి’.

ప్రశ్న 2.
మనిషి మంచి పనులు చేస్తే, ఏం చేయాలి ?
జవాబు:
మనిషి మంచి పనులు చేస్తే ఆ మనిషి జీవితం, వ్యక్తిత్వం, విలువలు అన్నీ తెలుసుకోవాలి.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson నేను… సావిత్రిబాయిని

ప్రశ్న 3.
పై పేరాలో పేర్కొన్న జీవిత చరిత్రలు, ఫోటోలు ఎవరికి సంబంధించినవి ?
జవాబు:
పై పేరాలో పేర్కొన్న జీవిత చరిత్రలు, ఫోటోలు

  1. శివాజీకి,
  2. వాషింగ్టన్కి సంబంధించినవి.

ప్రశ్న 4.
సావిత్రీబాయి ఏమి చేస్తోంది ?
జవాబు:
సావిత్రీబాయి, సేఠ్ పుస్తకాలపై పడ్డ దుమ్మును దులిపి శుభ్రం చేస్తోంది.

ప్రశ్న 5.
సేఠ్ ఎందుకు రగడ చేశాడు ?
జవాబు:
సేబీ తన పుస్తకాల్లో పేజీలు పోతాయనే భయంతో భార్య సావిత్రీబాయితో రగడ చేశాడు.

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

Telangana SCERT 9th Class Telugu Guide Telangana 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి Textbook Questions and Answers.

TS 9th Class Telugu 4th Lesson Questions and Answers Telangana రంగాచార్యతో ముఖాముఖి

చదువండి – ఆలోచించి చెప్పండి (Textbook Page No. 34)

తెలంగాణకు చెందిన ప్రముఖ భాషాశాస్త్రవేత్త డా॥ చేకూరి రామారావుతో పత్రికా విలేఖరి ముఖాముఖి.

పత్రికా విలేఖరి : మీ వ్యక్తిగత వివరాలు చెప్పండి.

చేకూరి రామారావు : మాది ఇల్లిందలపాడు గ్రామం, ఖమ్మం జిల్లా. తల్లి భారతమ్మ, తండ్రి లింగయ్య. భాషాశాస్త్రంలో ఉపన్యాసకుడిగా ఉద్యోగం ప్రారంభించి, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో డీన్ గా పదవీ విరమణ చేశాను.

పత్రికా విలేఖరి : మీకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎప్పుడు, ఏ రచనకు వచ్చింది ?

చేకూరి రామారావు : నేను రాసిన “స్మృతి కిణాంకం” అనే వ్యాస సంకలనానికి 2002 సంవత్సరంలో ఉత్తమమైన విమర్శ గ్రంథంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.

పత్రికా విలేఖరి : వాడుకభాష గురించి చెప్పండి.

చేకూరి రామారావు : వ్యావహారిక భాషావాదమంటే మాట్లాడినట్లు రాయడం కాదు. మాట్లాడే భాషకు, రాసే భాషకు పరిమితులు వేరు. ప్రయోజనం వేరు. రచనా వ్యవస్థకు కొన్ని నియమాలు అవసరం.

పత్రికా విలేఖరి : తెలుగు కనుమరుగు అవుతుందేమోనన్న ఆందోళన గురించి మీ అభిప్రాయం.

చేకూరి రామారావు : ఇన్ని కోట్లమంది మాట్లాడే భాష కనుమరుగుకాదు. కాకపోతే మన తెలుగులో ఇతర భాషల మిశ్రమం ఎక్కువగా కనిపిస్తున్నది.

ప్రశ్నలు

ప్రశ్న 1.
పై పేరాలో ఎవరు ఎవరిని ప్రశ్నలడుగుతున్నారు?
జవాబు:
పై పేరాలో ప్రముఖ భాషాశాస్త్రవేత్త అయిన డా॥ చేకూరి రామారావుగారిని, పత్రికా విలేఖరి ప్రశ్నలు అడుగుతున్నాడు.

ప్రశ్న 2.
పై సమాధానాల ద్వారా మీకు తెలిసిన సాహితీ విశేషాలేమిటి?
జవాబు:
వ్యవహారిక భాషావాదము అంటే, మాట్లాడినట్లు రాయడం కాదనీ, మాట్లాడే భాషకూ, రాసే భాషకూ పరిమితులు వేరనీ, ప్రయోజనం వేరనీ, రచనా వ్యవస్థకు కొన్ని నియమాలు అవసరమనీ తెలిసింది. నేటి తెలుగుభాషను కోట్లాదిమంది మాట్లాడుతున్నారు కాబట్టి తెలుగు ఎప్పటికీ కనుమరుగు కాదనీ, నేటి తెలుగులో ఇతర భాషల మిశ్రమం ఎక్కువగా ఉందనీ తెలిసింది.

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ప్రశ్న 3.
ఈ విధంగా ప్రశ్నలడిగే విధానాన్ని ఏమంటారు?
జవాబు:
ఈ విధంగా ప్రశ్నలడిగే విధానాన్ని ఇంగ్లీషు భాషలో ‘ఇంటర్వ్యూ’ అంటారు. తెలుగులో “ముఖాముఖి” అని, ‘పరిపృచ్ఛ’ అని పిలుస్తారు.

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 37)

ప్రశ్న 1.
“తెలంగాణ సాయుధపోరాటం” గురించి విన్నారా ? మీకు తెలిసింది చెప్పండి.
జవాబు:
తెలంగాణ ప్రాంతంలో భూస్వాముల నుండి, దొరల నుండి, నిజాం ప్రభుత్వం నుండి, వెట్టిచాకిరి నుండి, విముక్తి కోసం, రైతులూ, రైతుకూలీలూ, కార్మికులూ స్త్రీలూ, పిల్లలూ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిపిన పోరాటమే, “తెలంగాణ సాయుధపోరాటం”.

ఈ పోరాటం, 1946 నుండి 1951 వరకు కొనసాగింది. వందలాది ఎగరాలు కలిగిన భూస్వాములపై, వారికి అండదండలు అందించిన నిజాం ప్రభుత్వంపై, రైతులు చేసిన పోరాటం ఇది. భూమి కోసం, భుక్తి కోసం, బానిసత్వ విముక్తి కోసం, పేద రైతులు చేసిన ఈ సాయుధ పోరాటం, ఎంతో మందికి స్ఫూర్తిని ఇచ్చింది.

ప్రశ్న 2.
“వారసత్వం” అనే మాటను ఏ విధంగా గ్రహించాలి ?
జవాబు:
‘వారసత్వం’ అనే పదానికి, ఒకతరం నుండి మరో తరానికి వచ్చే సంప్రదాయ హక్కు అని అర్థము. తాత ఆస్తి తండ్రికి, తండ్రి ఆస్తి కొడుకుకి వారసత్వంగా సంక్రమిస్తుంది. అలాగే తెలంగాణ సాయుధపోరాట స్ఫూర్తి, ఒక తరం నుండి వారి తరువాత తరానికి సంక్రమించాలి.

తెలంగాణ సాయుధపోరాటంలో ఆనాటి రైతులూ వగైరా ప్రజలు, ఎలా ప్రభుత్వంపై, భూస్వాములపై, తమ హక్కుల కోసం పోరాడారో, అలాగే భావితరాల వారు కూడా, తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేసే పట్టుదల, దీక్ష, వారసత్వంగా వారికి రావాలని ఆ మనం ఈ మాటనుబట్టి గ్రహించాలి.

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 38)

ప్రశ్న 1.
“జనపదం” నవల ఇతివృత్తమేమిటి ?
జవాబు:
తెలంగాణలో పోలీసు యాక్షన్ తరువాత రైతుల భూములను దొరలు కాజేశారు. దానితో ‘జనపదం’ కథ మొదలవుతుంది. తరువాత వచ్చిన ఉద్యమాల గురించి, ఉద్యమాల పేరున జరిగిన మోసాల గురించి, ఆనాడు రాజకీయాలు భ్రష్టు పట్టడం గురించి, ఈ “జనపదం” నవలలో వివరంగా చెప్పబడింది. ఇది ఒక్క తెలంగాణ కాక, భారతదేశానికి చెందిన నవల. ఈ నవలలో నిజం చెప్పబడింది.

ప్రశ్న 2.
రంగాచార్య నవలల్లో ప్రధాన విషయం ఏమిటి ?
జవాబు:
రంగాచార్య నవలల్లో ప్రధాన విషయం, “తెలంగాణ సాయుధపోరాటం”. రంగాచార్య నవలలు, తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంగా రాయబడ్డాయి. ‘మోదుగు పూలు’ అనే నవల ఆయన జీవిత చరిత్ర ప్రధానంగా రాయబడింది.

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ప్రశ్న 3.
తన ఆత్మకథగా వర్ణించిన పుస్తకమేది ?
జవాబు:
రంగాచార్య రాసిన ‘మోదుగుపూలు’ అనే నవల సుమారుగా ఆయన ‘ఆత్మకథ’ వంటిది. రంగాచార్య తన జీవన యానాన్ని ఈ నవలా రూపంలో రాశాడు. ఈ నవల పర్ఫెక్షన్ సాగింది. ఈ నవలలో ఒక్క లోపాన్ని కూడా చూపించలేరని రంగాచార్య చెప్పారు. ఈ నవలలో సిద్ధాంతం కన్నా, విశ్వాసం కన్నా, కర్తవ్యం గొప్పది అని రంగాచార్య చెప్పాడు.

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 39)

ప్రశ్న 1.
‘మాండలికమే ప్రజల భాష !’ నిజమేనా ?
జవాబు:
మాండలిక భాష అంటే ఆ మండలంలో లేక ఆ ప్రాంతంలో సామాన్య ప్రజలు వారి నిత్య వ్యవహారాలలో ఒకరితో ఒకరు మాట్లాడుకొనే భాష, మాండలిక భాష, ప్రజల హృదయాల్లోంచి అప్రయత్నంగా వచ్చిన భాష, అది కావ్య భాషవలె కృత్రిమం కాదు. కాబట్టి మాండలిక భాషను నిజమైన ప్రజల భాష అని చెప్పవచ్చు.

ప్రశ్న 2.
‘వసుధైక కుటుంబం’ అంటే మీరు ఏమనుకుంటున్నారు?
జవాబు:
కుటుంబము అంటే మనకు తెలుసు. మన తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అప్పాచెల్లెండు, తాతామామ్మలు మన కుటుంబము. మన కుటుంబ సభ్యులపట్ల, మనం ప్రేమాదరాలతో ఉంటాము. మన కుటుంబ సభ్యుల కష్టసుఖాల్లో మనం పాలుపంచుకుంటాము.

వసుధైక కుటుంబం, అంటే ప్రపంచంలోని భూమండలంపై ఉండే ప్రజలందరూ ఒకే కుటుంబం అని అర్థం. అంటే ప్రపంచ ప్రజలంతా కులమత భేదాలు విడిచి, ఒకే తల్లిదండ్రుల పిల్లల్లా కలసిమెలసి, కష్టసుఖాల్లో పాలుపంచుకోడాన్ని ‘వసుధైక కుటుంబం’ అనవచ్చు.

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 39)

ప్రశ్న 1.
కృషి – గుర్తింపు వీటి మధ్య సంబంధాన్ని చెప్పండి.
జవాబు:
కొందరు వ్యక్తులు సంఘం కోసం తమ జీవితాన్ని కూడా త్యాగం చేసి ఎంతో ‘కృషి’ అనగా ప్రయత్నం చేస్తారు. కొందరు సంఘసంస్కర్తలు, సాంఘిక సంస్కరణల కోసం గొప్ప కృషి చేస్తారు. కొందరు శాస్త్రవేత్తలు, శాస్త్రాభివృద్ధికై కృషి చేస్తారు. కొందరు డాక్టర్లు, ఎన్నో పరిశోధనలు చేసి గొప్ప విజయాలు సాధిస్తారు. కొందరు రాజకీయ వేత్తలు దేశం కోసం కృషి చేస్తారు.

అందులో కొందరిని సంఘం గుర్తించి వారిని గౌరవిస్తుంది. వారికి సన్మానాలు చేస్తుంది. అందులో కొందరి కృషికి, గుర్తింపు ఉండదు. ఎవరూ వారి కృషిని మెచ్చుకోరు. కాబట్టి కృషికీ, గుర్తింపుకూ మధ్య సంబంధం ఉండదు.

ప్రశ్న 2.
సందేశమిచ్చే అవకాశం ఎవరికి ఉంటుందని మీరు అనుకుంటున్నారు ?
జవాబు:
కొందరు వ్యక్తులు దేశం కోసం, శాస్త్రాభివృద్ధి కోసం, జనం కోసం, ఎంతో కృషి చేసి తమ సర్వస్వాన్ని త్యాగం చేస్తారు. వారు ప్రజలకు చెప్పిన మాటలను తాము కూడా ఆచరిస్తారు. అటువంటి మహాత్ములకు, ఆదర్శ జీవనం కలవారికి, ఇతరులకు సందేశం ఇచ్చే అవకాశం ఉంటుంది.

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ప్రశ్న 3.
‘సాంస్కృతిక వైభవం’ అంటే ఏమని అర్థం చేసుకోవచ్చు?
జవాబు:
‘సంస్కృతి’ అంటే నాగరికత. ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని కళలు, కొన్ని ఆచార వ్యవహారాలు, కొన్ని పండుగలు, కొన్ని ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. తెలంగాణలో బతుకమ్మ పండుగ చేసుకుంటారు. గణేశ్ ఉత్సవాలు చేస్తారు. మహంకాళి అమ్మవార్ని ఆరాధిస్తారు. దీనినే సాంస్కృతిక వైభవం అని చెప్పవచ్చు.

ఇవి చేయండి

I. అవగాహన-ప్రతిస్పందన

ప్రశ్న 1.
దాశరథి రంగాచార్యతో ఇంటర్వ్యూ ఎట్లా అనిపించింది ? మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు:
దాశరథి రంగాచార్యగారితో ఇంటర్వ్యూ మంచి ఆనందాన్ని కల్గించింది. తెలంగాణ ముద్దుబిడ్డ అయిన రంగాచార్యగార్కి తెలంగాణ సాయుధపోరాటంతో గల సంబంధం, మాకు మంచి స్ఫూర్తినిచ్చింది. రంగాచార్య రచించిన చిల్లర దేవుళ్ళు, జనపదం, మోదుగుపూలు వంటి నవలలు కొని, తప్పక చదవాలనిపించింది. ఆ నవలలు ప్రతి పాఠశాల, గ్రంథాలయంలోనూ ఉండేలా, ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటే బాగుంటుదనిపించింది.

నాలుగు వేదాలనూ, 10 ఉపనిషత్తులనూ తెనిగించిన ఆ మహాపండితుడిని, ఒక్కసారి కన్నులారా చూడాలనిపించింది. రంగాచార్య వంటి పండితునిపై కమ్యూనిస్టుల ప్రభావం ఉందని తెలిసి, ఆశ్చర్యం అనిపించింది. రంగాచార్యగారు ఉత్తమ మనీషి అని, మంచి మనిషి అని నాకు అనిపించింది. రంగాచార్య ఉద్యమజీవి అనిపించింది. రంగాచార్య తెలంగాణ ముద్దుబిడ్డ అనిపించింది.

ప్రశ్న 2.
ఈ మధ్యకాలంలో టి.వి.లో లేదా ఇంకెక్కడైన మీరు చూసిన ఇంటర్వ్యూ గురించి మాట్లాడండి.
జవాబు:
అఖిల భారత, భారతీయ జనతాపార్టీ అధ్యక్షడు ‘అమిత్’తో, ఈనాడు పత్రిక వారు చేసిన ఇంటర్వ్యూ వివరాలను దిగువ ఇస్తున్నాం.

ఈనాడు ప్రతినిధి : మోదీ ప్రభుత్వం, మొదటి సంవత్సరం పాలనలో సాధించిన అతిపెద్ద విజయం ఏమిటి ?

అమిత్ షా : మేము 2014 మే 26న అధికారానికి వచ్చాం. ఈ ఏడాది పాలనలో మాపై ఒక్క అవినీతి మచ్చ కూడా లేదు. అదే యూ.పీ. ఏ – 10 ఏళ్ళ పాలనలో 12 లక్షల కోట్ల కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. ఇది మేము సాధించిన మొదటి పెద్ద విజయం.

ఈనాడు ప్రతినిధి : ఇవి కాకుండా, ఇంకా ఏమి సాధించారు ?

అమిత్ షా : గాడి తప్పిన ఆర్థిక రంగాన్ని పట్టాలపైకి ఎక్కించాం. ద్రవ్యలోటు దిగి వస్తోంది. కాశ్మీర్ వరదలు, నేపాల్ భూకంపం, వంటి ఉపద్రవాలలో, వేగంగా బాధితులను మేము ఆదుకున్నాం. ఏడాది కాలంలో 14 కోట్ల (జన్ ధన్) బ్యాంకు ఖాతాలు ప్రారంభించాం. మూడు సామాజిక భద్రతా పథకాలు, పేదవారి కోసం తీసుకువచ్చాం.

ఈనాడు ప్రతినిధి : మోదీ సర్కారు కార్పొరేట్లకు వత్తాసు పలుకుతోందని ప్రతిపక్షాలు అంటున్నాయి కదా!

అమిత్ షా : అదంతా వట్టి అబద్దం. గత ప్రభుత్వం, బొగ్గు, ఖనిజ నిక్షేపాలను, కార్పొరేట్లకు దాదాపు ఉచితంగా ఇచ్చింది. మేము మొత్తం గనుల్లో 10 శాతం వేలం వేస్తే, 2 లక్షల కోట్లు ప్రభుత్వానికి వచ్చింది. అలాగే స్పెక్ట్రమ్ వేలంలో 1.08 లక్షల కోట్లు ప్రభుత్వానికి వచ్చాయి. మీరే గమనించండి. ఎవరు ఎవరికి వత్తాసో !

ఈనాడు ప్రతినిధి : ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ?

అమిత్ షా : ఈ సమస్యను త్వరలో ఆర్థిక మంత్రి పరిష్కరిస్తారు.

ఈనాడు ప్రతినిధి : భూసేకరణ బిల్లును మీరు రాజ్యసభలో పాస్ చేయించుకోలేకపోతున్నారు కదా !

అమిత్ షా : అవును. ప్రతిపక్షాలు అనవసరంగా అడ్డు వస్తున్నాయి. ఆ బిల్లు త్వరలోనే పార్లమెంట్లో పాసవుతుంది.

ఈనాడు ప్రతినిధి : ధన్యవాదాలు, సెలవు.

ప్రశ్న 3.
పాఠం ఆధారంగా దాశరథి రంగాచార్య నవలలు, వాటిలోని ఇతివృత్తాలను తెలుపుతూ ఒక జాబితా రాయండి.
TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి 2
జవాబు:
TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి 3

ప్రశ్న 4.
ఇంటర్వ్యూకు సంబంధించిన కింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

పత్రికల్లో, టి.వి.లో రకరకాల ఇంటర్వ్యూలను చూస్తుంటాం. ఇంటర్వ్యూలు రెండు రకాలని తెలుసుకదా ! ఉద్యోగాల ఎంపికకై అభ్యర్థి ప్రతిభను పరీక్షించటానికి చేసేది ఒకరకం. ఉద్యోగాన్ని సంపాదించటానికి అభ్యర్థులు పూర్తి సంసిద్ధతతో ఇంటర్వ్యూకు పోతారు. దీనిలో ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు ముఖ్యపాత్ర పోషిస్తారు. ఇది మొదటిది. ప్రముఖుల జీవిత విశేషాలను తెలుసుకోవటానికి చేసేది మరోరకం. ప్రముఖుల, గొప్పవాళ్ళ నుండి వారి వివరాలను విశేషాలను తెలుసుకోవడానికి చేసేది రెండవది. దీనిలో ఇంటర్వ్యూ చేయబడే వ్యక్తే కీలకం.

రెండవ రకం ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు ముందుగా కొన్ని అంశాలపై ప్రశ్నలు తయారుచేసుకుంటారు. మొదట వారిని పరిచయం చేసుకొని వారి వ్యక్తిగత వివరాల నుండి మొదలై వారి జీవితంలోని ముఖ్య సన్నివేశాలు, ఘట్టాలు, వారందించిన సేవలు, ఆశయాలు, సమాజానికి వారిచ్చే సందేశంతో ముగ్గుస్తుంది.

ఇట్లా చేసే ఇంటర్వ్యూల వివరాలను పత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో ప్రజలు చూస్తుంటారు. ఆదర్శవంతులు, సంఘసంస్కర్తలు, కవులు, రచయితలు, ఉద్యమకారులు, శాస్త్రవేత్తలు, రాజకీయనాయకులు మొదలగు వారే కాకుండా మరే ఇతర రంగంలోనైనా ‘ఉత్తమ’ సేవలందించిన వాళ్ళందరిని ఇంటర్వ్యూ చేయడం మనం చూస్తుంటాం. వీళ్ళ జీవితాలు ఎందరికో స్పూర్తిని కలిగిస్తాయి. దారిని చూపుతాయి.

ప్రశ్నలు

అ) ఇంటర్వ్యూ అంటే ఏమిటి ?
జవాబు:
ఉద్యోగాల కొరకై అభ్యర్థుల ప్రతిభను పరీక్షించడానికి చేసే ఒక ప్రక్రియను ఇంటర్వ్యూ అంటారు.

ఆ) ప్రముఖులను ఇంటర్వ్యూ ఎందుకు చేస్తారు ?
జవాబు:
ప్రముఖుల జీవిత విశేషాలు, వారి అనుభవాలు, వారు అందించిన సేవలు, ఎందరికో స్ఫూర్తినిస్తాయి. మరెందరికో దారిని చూపుతాయి. అందుకోసం ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తారు.

ఇ) మొదటిరకం ఇంటర్వ్యూ దేనికి సంబంధించినది ?
జవాబు:
ఉద్యోగాల ఎంపికకై అభ్యర్థుల ప్రతిభను పరీక్షించడానికి చేసే ఇంటర్వ్యూ మొదటి రకం. దీనిలో ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు ప్రముఖపాత్ర వహిస్తారు.

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ఈ) ప్రముఖులను ఇంటర్వ్యూ చేయడానికి ఎట్లా సిద్ధం కావాలి ?
జవాబు:
ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు ముందుగా కొన్ని అంశాలపై ప్రశ్నలు తయారుచేసుకుంటారు. మొదట ప్రముఖులను పరిచయం చేసుకొని, వారి వ్యక్తిగత వివరాలను అడిగి, తరువాత వారి జీవితంలోని ముఖ్య సన్నివేశాలు, వారందించిన సేవలు, వారి ఆశయాలు, సమాజానికి వారిచ్చే సందేశంతో ఇంటర్వ్యూ ముగుస్తుంది.

ఉ) ప్రముఖుల నుండి ఇంటర్వ్యూలో సాధారణంగా రాబట్టే విషయాలు ఏవి ?
జవాబు:

  1. వ్యక్తిగత వివరములు,
  2. వారి జీవితంలోని ముఖ్య సన్నివేశాలు, ఘట్టాలు, వారందించిన సేవలు, వారి ఆశయాలు, సమాజానికి వారిచ్చే సందేశం మొదలయిన విషయాలు ప్రముఖుల నుండి రాబడతారు.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) దాశరథి రంగాచార్య తాను రచనలు ఎందుకు చేయాలనుకున్నారో సొంతమాటల్లో రాయండి.
జవాబు:
రంగాచార్య ఆంధ్ర మహాసభ ఉద్యమాల ప్రభావంతో మొదట రచన ప్రారంభించారు. నిజాం రాజ్యంలోని పరిస్థితులను గురించి, పత్రికలకు లేఖలూ, వ్యాసాలూ రాశారు.

ప్రభుత్వం, తెలంగాణ సాయుధపోరాట చరిత్రను వక్రీకరించింది. దాన్ని చెరిపివేసి విద్యార్థులకు తెలియకుండా చేసింది. అందువల్ల తెలంగాణ మహోజ్జ్వల వారసత్వం, తరువాతి తరాల వారికి తెలియకుండా పోతుందనే బాధతో, ఆందోళనతో, రంగాచార్య, తెలంగాణ సాయుధపోరాట గాథలో వట్టికోట ఆళ్వారుస్వామి రాయగా మిగిలిన విషయాలను నవలలుగా రచించారు.

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ఆ) “తెలంగాణ ఏర్పాటు సంతోషాన్ని”చ్చిందని రచయిత అనటంపై మీ అభిప్రాయాన్ని రాయండి.
జవాబు:
తెలంగాణ రాష్ట్రం 2014లో ఆవిర్భవించింది. అలా రాష్ట్రం ఏర్పాటు కావడం తనకు సంతోషాన్ని కలుగజేసిందని రంగాచార్యగారు చెప్పారు. అదే సందర్భంలో రంగాచార్యగారు తెలంగాణ వచ్చిందనుకుంటే లాభం లేదని, వచ్చిన తెలంగాణను కాపాడుకోవాలని, అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు.

దీనినిబట్టి దాశరథి రంగాచార్యగారికి, తెలంగాణ రాష్ట్రం పట్ల ఎంతో ప్రేమ ఉందని అర్ధం అవుతోంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న విషయంలో తెలంగాణలో పుట్టినవారందరూ సంతోషిస్తారని నా అభిప్రాయం.

ఇ) “ప్రజల భాష” అంటే మీరేమి అర్థం చేసుకున్నారో రాయండి.
జవాబు:
రంగాచార్య తన నవలలను ప్రజల భాషలో వ్రాశానని చెప్పారు. ప్రజల భాష అంటే ప్రజలు మాట్లాడుకొనే మాండలిక భాష, నవలల్లో పాత్రలకు వారు పాత్రోచితమైన తెలంగాణలోని మాండలిక భాష వాడారు. రంగాచార్య గారికి తెలంగాణ అంటే అభిమానం. తెలంగాణ యాస సొగసులు అంటే ఇష్టం. అందుకే వారు నవలలలోని పాత్రలను బట్టి, పాత్రలు మాట్లాడేటప్పుడు ప్రజల భాషయైన మాండలికాన్ని వాడారు.

ఇక కథను చెప్పేటప్పుడు సాధారణ భాషనే వాడారు. ఆయన ప్రజాజీవితాన్ని చిత్రించడానికి, ప్రజల కోసం రచనలు చేశారు. అందుకే ప్రజల భాషయైన తెలంగాణ యాసతో ప్రజలు మాట్లాడే భాషను, తమ నవలల్లో ఉపయోగించారని గ్రహించాను.

ఈ) రంగాచార్య తన రచనలకు “తెలంగాణ ప్రజల జీవితాన్ని” నేపథ్యంగా ఎందుకు తీసుకున్నాడు ?
జవాబు:
దాశరథి రంగాచార్య తెలంగాణ సాయుధపోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆయనను ఆ ఉద్యమం ఎక్కువగా ప్రభావితం చేసింది. ఆయన ఉద్యమ జీవి. ముఖ్యంగా కమ్యూనిష్టు ఉద్యమం, ఆయనకు జీవితాన్ని నేర్పి’ మనిషిని చేసింది.

ప్రభుత్వం తెలంగాణ సాయుధపోరాట చరిత్రను వక్రీకరించింది. దాన్ని చరిత్ర నుండి చెరిపేయడానికి ప్రయత్నించింది. రైతులూ, కూలీలూ, కార్మికులూ, స్త్రీలూ, పిల్లలూ చేసిన చారిత్రాత్మక పోరాటం భావితరాలకు తెలియకుండా పోతుందనే బాధతో, ఆవేదనతో రంగాచార్య తెలంగాణ ప్రజల జీవితాన్ని నేపథ్యంగా తీసుకొని, తన రచనలను సాగించారు. తెలంగాణ ప్రజా జీవితాలు, ప్రజల ఆశలు పోరాటాలు, శాశ్వతంగా భావితరాలకు స్ఫూర్తినియ్యాలని, రంగాచార్య తన రచనలను తెలంగాణ ప్రజల జీవితాలు నేపథ్యంగా రచించారు.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) డా॥ దాశరథి రంగాచార్య చేసిన సాహిత్యసేవను వివరించండి.
జవాబు:
మహాకవి దాశరథి రంగాచార్యగారు తెలంగాణ సాయుధపోరాటం నేపథ్యంగా చిల్లర దేవుళ్ళు, జనపదం, మోదుగుపూలు, మాయజలతారు వంటి అద్భుతమైన నవలలు రాశారు. చారిత్రాత్మకమైన తెలంగాణ పోరాట చరిత్రను తన రచనల ద్వారా భావితరాలకు వారు అందజేశారు.

ఇంతేకాక, నాలుగు వేదాలనూ, పది ఉపనిషత్తులనూ తెలుగులోకి అనువదించారు. రామాయణ, భారత, భాగవతాలను సరళవచనంలో రాశారు. తెలంగాణ జనజీవనం, రైతాంగ పోరాటం, వంటి అంశాలు నేపథ్యంగా ఈయన విశిష్టమైన నవలలు రచించి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. తెలుగు నవలలో పాత్రోచిత యాసను మొదటగా ప్రవేశపెట్టారు. వీరి రచనలు ఇతర భారతీయ భాషలలోకి కూడా అనువదింపబడ్డాయి.

ఈయన నవలలు చలన చిత్రాలుగా వచ్చాయి. ఈయన రచనాశైలి, పాఠకుడిని ఆకట్టుకొంటుంది. ఈయన రాసిన “చిల్లర దేవుళ్ళు” నవలకు, రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈయనను ‘గద్య దాశరథి’ అనేవారు. ఈయన సంస్కృతాంధ్ర భాషల్లో మహాపండితుడు. ఈయన జీవిత చరిత్రను ‘మోదుగుపూలు’ నవలలో చిత్రించారు. రంగాచార్య గొప్ప రచయిత.

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా రాయండి.

అ) మీ పాఠశాలకు ఒక క్రీడాకారుడు, కళాకారుడు లేదా నాయకుడు వచ్చాడనుకోండి. వారిని ఇంటర్వ్యూ చేయడానికి కావలసిన ప్రశ్నావళిని తయారు చేయండి.
జవాబు:
మా పాఠశాలకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వస్తే, నేను ఈ కింది ప్రశ్నలతో ఆయనను ఇంటర్వ్యూ చేస్తాను.

  1. భారతరత్న మహాశయా ! మీకు క్రికెట్ ఆట కాకుండా, ఇంకా ఇష్టమైన ఇతర ఆటలేవో చెప్పండి.
  2. మీరు ఎన్నో సంవత్సరంలో క్రికెట్ ఆడుగు పెట్టారు ?
  3. క్రికెట్లో మీరు సాధించిన విజయాలు మీకు పూర్తి సంతృప్తినిచ్చాయా ?
  4. క్రికెట్, పాఠశాలల్లో, కళాశాలల్లో బాగా వ్యాప్తి చెందడానికి ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టాలి ?
  5. నేడు భారత క్రికెట్ రంగంలో, రాజకీయాలు ప్రవేశించాయి కదా ! దానిపై మీ అభిప్రాయం ఏమిటి ?
  6. మీరు అభిమానించే క్రికెట్ క్రీడాకారుడు ఎవరు ?
  7. మీకు క్రికెట్ నేర్పిన గురువు ఎవరు ?
  8. భారత్లో క్రికెట్ అభివృద్ధికి మీరిచ్చే సూచనలు ఏమిటి ?
  9. క్రికెట్ నేర్చుకొనే యువతకు మీరిచ్చే సలహాలు ఏమిటి ?
  10. మొత్తంపై క్రీడాకారులకు మీరిచ్చే సందేశం ఏమిటి ?

(లేదా)

ఆ) డా॥ దాశరథి రంగాచార్య వ్యక్తిత్వాన్ని లేదా సాహిత్యసేవను ప్రశంసిస్తూ వార్తా పత్రికకు ఒక లేఖ రాయండి.
జవాబు:
నమస్తే తెలంగాణ పత్రిక ప్రధాన సంపాదకులకు లేఖ

నల్గొండ,
X X X X X.

ప్రధాన సంపాదకులు,
నమస్తే తెలంగాణ దినపత్రిక,
హైదరాబాదు.

ఆర్యా,

నమస్కారాలు. నేను నల్గొండ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను. మాకు దాశరథి రంగాచార్య గారితో ఇంటర్వ్యూ పాఠం ఉంది. శ్రీ రంగాచార్య మహా మనీషి, వారిని గూర్చి ప్రతి తెలంగాణబిడ్డ తెలుసుకోవాలి. వారిని గూర్చి తెలిసిన విషయాలు రాస్తున్నా. మీ పత్రిక ద్వారా ప్రజలకు అందించకోరుచున్నాను.

“దాశరథి రంగాచార్య తెలంగాణ సాయుధపోరాటంలో పాల్గొన్న ఉద్యమ శీలి. వీరు తెలంగాణ ప్రజాజీవితం నేపథ్యంగా ఎన్నో నవలలు రాశారు. వీరి నవలల్లో ‘చిల్లర దేవుళ్ళు’ నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ‘జనపదం’ అనే నవలలో మొత్తం సమాజాన్ని మైక్రోస్కోపిక్ గా చూపించారు. ఇది తెలంగాణకి సంబంధించిన నవల కాదు. ఇది భారతదేశానికి చెందిన నవల. ‘మోదుగుపూలు’ నవలలో వీరి జీవిత చరిత్రను రాశారు.

దాశరథి రంగాచార్య గారిపై కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం ఉంది. ఆ ఉద్యమం వీరికి జీవితాన్ని నేర్పింది. వీరిని మనిషిని చేసింది. ప్రభుత్వం, తెలంగాణ సాయుధపోరాటాన్ని వక్రీకరించింది. చరిత్ర నుండి చెరిపివేయడానికి ప్రయత్నించింది. ఎందరో రైతులు, కూలీలు, స్త్రీలు, కార్మికులు, పిల్లలు చేసిన ఆ చారిత్రక పోరాటం వివరాలు, భావితరాలకు అందజేయాలని వీరు తెలంగాణ ప్రజల నేపథ్యంలో నవలలు రాశారు.

ఈయనకు తెలంగాణ అంటే గొప్ప ప్రేమ. ఈయన నేపథ్యంలో మహాపండితుడు. నాలుగు వేదాలను, పది ఉపనిషత్తులను, తెలుగులోకి అనువదించారు. భారత, భాగవత, రామాయణములను సరళ వచనంలో రాశారు.

రంగాచార్య చరిత్రను మీ పత్రికలో తప్పక అచ్చువేయండి. నమస్తే కృతజ్ఞతలతో

ఇట్లు,
మీ విశ్వసనీయుడు,
పి. రామకృష్ణ,
9వ తరగతి, ప్రభుత్వ పాఠశాల,
నల్గొండ.

చిరునామా :

ప్రధాన సంపాదకుడు,
నమస్తే తెలంగాణ,
దినపత్రిక, హైదరాబాదు.

III. భాషాంశాలు

పదజాలం

1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.

ఉదా : విలువలతో కూడిన విద్య మానవ జీవన వికాసానికి దోహదం చేస్తుంది.
జవాబు:
వికాసం = వికసించడం, విప్పారడం

అ) రామప్పగుడి శిల్పకళ సొగసును వర్ణించ శక్యమా ?
జవాబు:
సొగసు = అందము, సౌందర్యము

ఆ) వట్టికోట ఆళ్వారుస్వామి రచనల్లో ప్రజల మనిషి ఉత్కృష్టమైన రచన.
జవాబు:
ఉత్కృష్టం = శ్రేష్ఠము, గొప్పది

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ఇ) భాగవతంలో కృష్ణలీలలు సమగ్రం గా రాశారు.
జవాబు:
సమగ్రం = సంపూర్ణంగా, సమస్తమూ

ఈ) నానాటికి మానవ సంబంధాలు క్షీణించి పోతున్నాయి.
జవాబు:
క్షీణించు = తరుగు, నశించు

2. కింది వాక్యాల్లో గల ప్రకృతి – వికృతులను గుర్తించి రాయండి.

అ) కథలంటే నాకిష్టమని మా నాయినమ్మ నాకు రోజూ కతలు చెప్పింది.
జవాబు:
కథ (ప్రకృతి) – కత (వికృతి)

ఆ) స్వచ్ఛభారతం కోసం ప్రతిజ్ఞ చేద్దాం. ప్రతిన చేయడమే కాదు పనిచేసి చూపుదాం.
జవాబు:
ప్రతిజ్ఞ (ప్రకృతి) – ప్రతిన (వికృతి)

ఇ) ప్రజలకోసం కవిత్వం రాశాడు. ఆ కైత ప్రజలను చైతన్యపరిచింది.
జవాబు:
కవిత్వం (ప్రకృతి) – కైతం (వికృతి)

ఈ) ఆశ ఉండవచ్చు. మితమీరిన ఆస ఉండరాదు.
జవాబు:
ఆశ (ప్రకృతి) – ఆస (వికృతి)

వ్యాకరణాంశాలు

ప్రశ్న 1.
కింది పదాలను విడదీయండి. సంధిపేరు రాయండి.
జవాబు:
సంధి పదం – విడదీసిన రూపం – సంధిపేరు
ఉదా :
పోయినాడంటే – పోయినాడు + అంటే -ఉత్వసంధి
అ) ఏమని – ఏమి + అని – ఇత్వసంధి
ఆ) కాదనుకున్నాడు – కాదు + అనుకున్నాడు – ఉత్వసంధి
ఇ) పిల్లలందరూ – పిల్లలు + అందరూ – ఉత్వసంధి

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ప్రశ్న 2.
కింది విగ్రహ వాక్యాలను సమాస పదాలుగా మార్చండి. సమాసం పేరు రాయండి.
ఉదా : మూడు సంఖ్యగల రోజులు మూడురోజులు – ద్విగు సమాసం

అ) రెండు సంఖ్యగల రోజులు = రెండురోజులు – ద్విగు సమాసం
ఆ) వజ్రమూ, వైడూర్యము = వజ్రవైడూర్యములు – ద్వంద్వ సమాసం (లేదా) ఉభయ పద విశేషణ కర్మధారయ సమాసం)
ఇ) తల్లియూ, బిడ్డయూ = తల్లీబిడ్డలు – ద్వంద్వ సమాసం

కర్తరి, కర్మణి వాక్యాలు

కింది వాక్యాలు పరిశీలించండి.

  1. ఆళ్వారుస్వామి “చిన్నప్పుడే” అనే కథ రాశాడు. (కర్తరి)
  2. ‘చిన్నప్పుడే అనే కథ ఆళ్వారుస్వామిచే రచింపబడింది. (కర్మణి)

పై రెండింటిలో మొదటివాక్యం కర్తరి వాక్యం. భావం సూటిగా ఉంది కదా ! అది కర్త ప్రధానంగా కలిగిన వాక్యం. అంటే ‘రాశాడు’ అనే క్రియ, ‘ఆళ్వారుస్వామి’ అనే కర్తను సూచిస్తోంది. ఇటువంటి వాక్యాలను ‘కర్తరి వాక్యాలు’ అంటారు. రెండవ వాక్యం ‘కర్మణి వాక్యం’. ఇది కర్మ ప్రధానంగా కలిగిన వాక్యం. అంటే ‘రాయబడింది’ అనే క్రియ, ‘చిన్నప్పుడే అనే కథ’ అనే కర్మను సూచిస్తోంది.

ఈ వాక్యంలో రెండు మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

  1. ‘బడు’ అనే ధాతువు చేరడం
  2. ‘చే’ అనే విభక్తి చేరడం.

కర్తరి వాక్యం : కర్త ప్రధానంగా రూపొందుతుంది.
కర్మణి వాక్యం : కర్మ ప్రధానంగా రూపొందుతుంది. క్రియ మీద ‘బడు’ ధాతువు, కర్తమీద ‘చే / చేత’ విభక్తి చేరుతుంది.

ప్రశ్న 3.
కింది వాక్యాలను కర్మణి వాక్యాలుగా మార్చి రాయండి.

అ) లింగయ్య మా నాయకునికి ఉసిరికాయ ఇచ్చాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
లింగయ్య చేత మా నాయకునికి ఉసిరికాయ ఇవ్వబడింది. (కర్మణి వాక్యం)

ఆ) బాలు ఇసుకతో ఇల్లు కట్టాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
బాలుచే ఇసుకతో ఇల్లు కట్టబడింది. (కర్మణి వాక్యం)

ఇ) అక్క ఇంటి ముందు ముగ్గు వేసింది. (కర్తరి వాక్యం)
జవాబు:
అక్కచే ఇంటి ముందు ముగ్గు వేయబడింది. (కర్మణి వాక్యం)

ప్రశ్న 4.
కింది వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాయండి.

అ) గ్రామీణులచే నాయకులు ఎదుర్కొని పోబడ్డారు. (కర్మణి వాక్యం)
జవాబు:
గ్రామీణులు నాయకులను ఎదుర్కొని పోయారు. (కర్తరి వాక్యం)

ఆ) కాయలన్నీ అతని చేత ముందర పోయబడ్డాయి. (కర్మణి వాక్యం)
జవాబు:
కాయలన్నీ అతని ముందర పోశారు. (కర్తరి వాక్యం)

ఇ) బాలురచే సెలవు తీసుకోబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
బాలురు సెలవు తీసుకున్నారు. (కర్తరి వాక్యం)

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ప్రశ్న 5.
మీరు తత్పురుష సమాసం గురించి తెలుసుకున్నారు కదా ! కింది విగ్రహవాక్యాల్లో గీత గీసిన విభక్తి ప్రత్యాయాల ఆధారంగా ఆయా తత్పురుష సమాసాల పేర్లు రాయండి.

అ) విద్యను అర్థించువారు
జవాబు:
(ద్వితీయా తత్పురుష సమాసం)

ఆ) గుణాలచేత< హీనుడు
జవాబు:
(తృతీయా తత్పురుష సమాసం)

ఇ) సభ కొరకు భవనం
జవాబు:
(చతుర్థీ తత్పురుష సమాసం)

ఈ) దొంగల వల్ల భయం
జవాబు:
(పంచమీ తత్పురుష సమాసం)

ఉ) రాముని యొక్క బాణం
జవాబు:
(షష్ఠీ తత్పురుష సమాసం)

ఊ) గురువు నందు భక్తి
జవాబు:
(సప్తమీ తత్పురుష సమాసం)

ప్రాజెక్టు పని

మీ గ్రామంలోని వేరు వేరు రంగాలకు చెందిన ప్రముఖులను ఇంటర్వ్యూ చేసేందుకు ప్రశ్నావళి రూపొందించుకుని ముఖాముఖి నిర్వహించండి. నివేదిక రాయండి.
జవాబు:
విద్యారంగం :

  • మీరు ఎంత కాలంనుండి విద్యాబోధన చేస్తున్నారు ?
  • విద్యా ప్రణాళికలో నైతిక విలువల ప్రాధాన్యత ఎంతవరకు ఉంది ?
  • ప్రాథమిక స్థాయిలో యోగా విద్యకు ప్రాధాన్యతను ఇవ్వాలా ?
  • ప్రస్తుత విద్యా విధానంలో పరీక్షల సంస్కరణలు ఎలా ఉండాలి ?
  • పనిబాట పట్టిన పిల్లలను బడిబాట పట్టడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి ?
  • పాఠశాల వాతావరణం ఎలా ఉండాలి ? లోపాలను ఎలా సరిదిద్దాలి ?

వ్యాపార రంగం :

  • వ్యాపారంలో నైతికత అవసరం ఎంతవరకు ఉంది ?
  • పెట్టుబడులకు బ్యాంకుల సహకారం ఎంతవరకు ఉండాలి?
  • వినియోగదారుల మన్ననను వ్యాపారులు ఎట్లా పొందాలి ?
  • వ్యాపారుల మధ్య పోటీ ఎలా ఉండాలి ?
  • వ్యాపారస్థులు సమాజం పట్ల బాధ్యతను ఎలా గుర్తించాలి ?

వైద్యరంగం :

  • గ్రామాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆవశ్యకత ఎంతవరకు ఉంది ?
  • గ్రామస్థులకు వైద్యులు ఎలాంటి ఆరోగ్య సూత్రాలను అందించాలి ?
  • వర్షాకాలంలోనూ, ఎండాకాలంలోనూ, ప్రజలకు ఎలాంటి సూచనలను వైద్యులు అందించాలి ?
  • అంటురోగాలు ప్రబలకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

వ్యవసాయరంగం :

  • పంటలో సేంద్రియ ఎరువుల ఆవశ్యకత ఎంతవరకు ఉంది ?
  • రైతులకు గిట్టుబాటు ధరలు కావాలంటే ప్రభుత్వం ఏం చేయాలి ?
  • ప్రస్తుత తరుణంలో సమష్టి వ్యవసాయం అవసరం ఉందా ? లేదా ?
  • రైతుల ఆత్మహత్యలను ఎలా నివారించాలి ?
  • ఆధునిక వ్యవసాయంలో ఎలాంటి మెలకువలు పాటించాలి ?

కఠిన పదాలకు అర్థాలు

I

36వ పేజి

సాహితీ రంగ ప్రవేశం = సాహిత్య రంగములో ప్రవేశించడం
ఆంధ్రమహాసభ = ఆంధ్రులు పెట్టుకున్న మహాసభ;
మహోద్యమం (మహా + ఉద్యమం) = గొప్ప పోరాటం ;
ప్రభావితుణ్ణయి = ప్రభావం పొందినవాడినయి
పూనుకున్నాను = సిద్ధపడ్డాను
ఉద్యమం = పోరాటం
ప్రజాజీవితం = ప్రజల యొక్క జీవితం
నేపథ్యంగా = పూర్వరంగంగా
వక్రీకరించింది = తప్పుదారి పట్టించింది ;
సాయుధపోరాటం = ఆయుధములతో పోరాటం ;
జడుసుకుంది = భయపడింది
బుగులుపడింది = కలతపడింది (కలత చెందింది)
చారిత్రాత్మక పోరాటం = చరిత్ర ప్రసిద్ధమైన పోరాటం
ప్రతిన = ప్రతిజ్ఞ
రక్తా రుణ సమరాలు
(రక్త + అరుణ, సమరాలు) = రక్తంతో ఎరుపెక్కిన యుద్ధాలు;
మహోజ్జ్వల వారసత్వం
(మహా + ఉజ్జ్వల, వారసత్వం) = గొప్పగా ప్రకాశించే వారసత్వం
వ్యథ = దుఃఖము
ఆవేదన = బాధ
ఆవిర్భవించినవి = పుట్టాయి
ఉత్కృష్టమైన = శ్రేష్ఠమైన
పోరాటగాథ = పోరాటానికి సంబంధించిన కథ;

37వ పేజి

ఆందోళన = ఊగిసలాట (కంగారు)
బృహత్ కార్యము = పెద్దపని
ఉపక్రమించినాను = మొదలుపెట్టినాను

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

II

37వ పేజి

అగ్రజులు = అన్నగారు
తొలుత = మొదట
ప్రక్రియలో = రచనా పద్ధతిలో
ఉభయులు = ఇద్దరూ
ప్రభావాత్మకము = ప్రభావం కల్గించేది
దృక్పథాన్ని = దృష్టి మార్గాన్ని
విస్తృతమయిన = విశాలమైన
సమాజాన్ని = సంఘాన్ని
మైక్రోస్కోపిక్ (Microscopic) = అత్యంత సూక్ష్మంగా ;
పోలీస్ యాక్షన్ (Police Action) = (1948లో నిజాం నుండి రాజ్యాన్ని స్వాధీనం చేసుకోడాన్ని భారత యూనియన్ వారు, చేపట్టిన పోలీసు చర్య)
కాజేయడం = ఆక్రమించడం;
ఉద్యమాలొచ్చినయి = ఉద్యమాలు (పోరాటాలు) వచ్చాయి
భ్రష్టుపట్టడం = చెడిపోవడం
వ్యాఖ్య చెయ్యడం = వివరంగా వ్యాఖ్యానించి చెప్పడం ;
గర్వకారణం = గర్వపడడానికి కారణం

38వ పేజి

ప్రియమయిన = ఇష్టమైన
ఆత్మకథ = తన జీవిత కథ
జీవనయానం = జీవన ప్రయాణం (ఆత్మ జీవిత కథ)
ఇవాల్టికీ = నేటికీ
పర్ఫెక్షన్ (Perfection) = సంపూర్ణత (లోపం లేకపోడం)
కర్తవ్యం = చేయదగిన పని
డూ ఆర్ డై (Do or die) = చేయడం లేకపోతే చావడం ;
సిద్ధాంతం = స్థిరమైన నిరూపిత సారాంశము

III

38వ పేజి

కృషి = ప్రయత్నం
భగవదనుగ్రహం
(భగవత్ + అనుగ్రహం) = భగవంతుడి దయ
విశ్వాసం = నమ్మకం
అసాధ్యమైన = సాధ్యముకాని
సంప్రదాయ సిద్ధము = గురుపరంపరగా వచ్చినట్టిది
చదువుల రాణి = సరస్వతి
కీర్తించు = పొగడను
శ్లాఘించను = కొనియాడను
మాండలికం = మండలములోని భాష (ప్రాంతీయమైన యాస పలుకుబడి)
తెలంగాణేతర
(తెలంగాణ + ఇతర) = తెలంగాణ కంటే ఇతరమైన
దురభిమానం = చెడ్డ అభిమానం
యాససొగసులు = మాట్లాడే తీరులోని అందాలు
నివేదనకు = వెల్లడించడానికి
సంక్షిప్తంగా = కొద్దిగా
వాల్మీకి = సంస్కృత రామాయణ కర్త
వ్యాసుడు = అష్టాదశపురాణాలు, భారత భాగవతాలు సంస్కృతంలో వ్రాసిన మునీశ్వరుడు
కాళిదాసు = అభిజ్ఞాన శాకుంతలం వంటి సంస్కృత నాటకాలు వ్రాసిన సంస్కృత మహాకవి
గోర్కీ = మాక్సింగోర్కి (రష్యన్ రచయిత ఈయన రాసిన ‘అమ్మ’ నవల ప్రసిద్ధము.)
చెఖోవ్ = రష్యాదేశ ప్రసిద్ధ కథా రచయిత;
డికెన్స్ = ఫ్రాన్సు దేశ రచయిత (A Tale of two cities) రెండు మహా నగరాల కథా రచయిత
ప్రేంచంద్ = హిందీ నవలా రచయిత (గోదాన్ నవలా కర్త)
ఉన్నవ = ఉన్నవ లక్ష్మీనారాయణ గారు (మాలపల్లి నవలా రచయిత)
విశ్వనాథ = వేయిపడగలు నవలా కర్త (విశ్వనాథ సత్యనారాయణగారు)
అల్లం రాజయ్య = నవలా రచయిత, కథా రచయిత
పరిధులు = సరిహద్దులు
వసుధైక కుటుంబం = ప్రపంచం అంతా ఒకే కుటుంబంగా భావించడం

39వ పేజి

ప్రభావితం చేసిన = ప్రభావం కలుగజేసిన
వ్యక్తులుగా = మనుషులుగా
ఉద్యమజీవిని = ఉద్యమమే ఊపిరిగా జీవించినవాడిని
సమాజం = సంఘము

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

IV

39వ పేజి

అధ్యయన దశ = గురుముఖంగా చదివి నేర్చుకోవలసిన, స్థితి
అధ్యయనం = చదవడం
ఆచరణ దశ = పనిచేయవలసిన, స్థితి
సాహిత్య సాంస్కృతిక జీవనవైభవానికి = సాహిత్యము, సంస్కృతికి సంబంధించిన, జీవితంలోని గొప్పదనానికి
జీవగడ్డ = జీవనాధారమైన నేల ;
వారసత్వ సంపద = పూర్వీకుల నుండి వచ్చే సంపద
పునరుజ్జీవనానికి (పునః + ఉజ్జీవనానికి) = తిరిగి, బ్రతికించడానికి
ప్రణాళిక = పథకము
మేనిఫెస్టోలు = ప్రకటన కాగితము
రూపొందించుకోవచ్చు = తయారుచేసికోవచ్చు
నిర్వర్తించాను = నెరవేరతాయి
సందేశం = చెప్పవలసి మాట
సిద్ధిస్తాయి = నెరవేర్చాను

పాఠం ఉద్దేశం

తెలంగాణకు ఒక విశిష్టమైన చరిత్ర ఉన్నది. నాటి నుండి నేటి వరకు ఈ గడ్డపై పోరాడిన వీరులు, కవులు, రచయితలు, కళాకారులు ఎంతోమంది ఉన్నారు. నాటి తెలంగాణ పోరాటాన్ని కళ్ళార చూసిన సాహితీయోధుడు డా॥ దాశరథి రంగాచార్య. తెలంగాణ ప్రజల జీవనాన్ని, అస్తిత్వాన్ని, పోరాటాలను తన రచనల ద్వారా ప్రతిఫలింప చేశాడు. అలాంటి ప్రముఖ రచయిత వ్యక్తిత్వస్ఫూర్తిని, రచనల గొప్పదనాన్ని ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా విద్యార్థులకు తెలియజేయటమే పాఠ్యాంశ ముఖ్య ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠ్యభాగం ఇంటర్వ్యూ (పరిపృచ్చ) ప్రక్రియకు చెందినది. ఇంటర్వ్యూ (Interview)నే, పరిపృచ్ఛ, లేక ‘ముఖాముఖి’ అని కూడా అంటారు. ఈ ఇంటర్వ్యూ రెండు రకాలుగా ఉంటుంది.

ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపికచేసే ప్రక్రియలో ఉద్యోగార్థుల ప్రతిభను పరీక్షించడం కోసం చేసే ఇంటర్వ్యూ మొదటిరకం. ఇక నిర్దిష్ట రంగంలో సేవలందించిన మహాత్ముల అనుభవాలను, అంతరంగాన్ని తెలిసికోడానికి చేసే ఇంటర్వ్యూ రెండవది.

డా॥ దాశరథి రంగాచార్య, వేరువేరు సందర్భములలో వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలోని ముఖ్యాంశాలే ఈ పాఠ్యభాగం.

డా॥ దాశరథి రంగాచార్య కవి పరిచయం

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి 1

పాఠము పేరు : “రంగాచార్యతో ముఖాముఖి”

ఇంటర్వ్యూలో జవాబులు చెప్పినవారు : దాశరథి రంగాచార్య

రంగాచార్య జననం : 24-08-1928

రంగాచార్య మరణం : 07-06-2015

జన్మస్థలం : మహబూబాబాద్ జిల్లాలోని చిన్న గూడూరులో జన్మించారు.

సోదరుడు : ప్రముఖ కవి డా|| దాశరథి కృష్ణమాచార్య వీరి సోదరుడు.

ఉద్యోగము : ఈయన ఉపాధ్యాయుడిగా, గ్రంథాలయ నిర్వాహకుడిగా, సికింద్రాబాద్ పురపాలకశాఖలో పనిచేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు.

నవలా రచన : ఈయన విశిష్టమైన తెలుగు నవలలు రచించి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు.

అనువాదము :

  1. నాలుగు వేదములను, పది ఉపనిషత్తులను, సంస్కృతం నుండి తెలుగులోకి అనువాదం చేశారు.
  2. రామాయణ, భారత, భాగవతాలను సరళమైన తెలుగు వచనంలో రాశారు.

రచనలలోని విషయము : తెలంగాణ జనజీవనము, రైతాంగ పోరాటం వంటి విషయాలు పూర్వరంగంగా, (నేపథ్యంగా) ఈయన రచనలు సాగాయి. వీరు తెలుగు నవలలో ‘పాత్రోచితయాస’ను ప్రవేశపెట్టారు. ఈయన రచనలు, ఇతర భాషల్లోకి అనువదింపబడ్డాయి. సినిమాలుగా వచ్చాయి.

పురస్కారం : వీరి “చిల్లర దేవుళ్ళు” నవలకు, రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.

శైలి : వీరి రచనాశైలి పాఠకులను ఆకట్టుకొంటుంది.

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ప్రవేశిక

తెలుగు సాహిత్యంలో దాశరథి రంగాచార్యులుగారికి విశిష్టస్థానము ఉంది. ఈయన తెలంగాణ పోరాటం పూర్వరంగాన్ని, తన జీవశక్తిగా మార్చుకొని, తెలుగువారి సాంస్కృతిక జీవనాన్ని అద్భుతంగా చిత్రించారు. అటువంటి రంగాచార్యగారి అంతరంగాన్ని మరింత దగ్గరగా తెలుసుకోవాలనే ఆసక్తి, ఉత్సాహం పాఠకులకు సహజంగానే ఉంటుంది. అలా తెలుసుకోడానికి ఈ ముఖాముఖి (Interview) ప్రక్రియ తోడ్పడుతుంది.

రచయితతో పరిచయం వల్ల, ఆయన రచనల్లో తెలియని కొత్త కోణాలు సాహితీలోకానికి పరిచయం అవుతాయి. అందుకోసం డా॥ దాశరథి రంగాచార్యగారితో ముఖాముఖిని చదువుదాం.

TS 9th Class Telugu Guide 9th Lesson కోరస్

Telangana SCERT 9th Class Telugu Guide Telangana 9th Lesson కోరస్ Textbook Questions and Answers.

TS 9th Class Telugu 9th Lesson Questions and Answers Telangana కోరస్

చదువండి – ఆలోచించి చెప్పండి (Textbook Page No. 91)

“అన్నపురాసులు ఒకచోట
ఆకలిమంటలు ఒకచోట
హంసతూలికలొక చోట
అలసినదేహాలొక చోట
సంపదలన్నీ ఒకచోట
గంపెడు బలగాలొకచోట
వాసన నూనియలొకచోట
మాసిన తలలింకొక చోట
కమ్మని చకిలాలొక చోట
గట్టిదొడలింకొక చోట”
-కాళోజి

ప్రశ్నలు

ప్రశ్న 1.
పై కవితాపంక్తులు ఏ విషయం గురించి చెప్తున్నాయి?
జవాబు:
పై పంక్తులు సంఘంలో ఉండే పరస్పర విరుద్ధ పరిస్థితులను వెల్లడిస్తున్నాయి. ఆకలి వేసేవాడి దగ్గర అన్నంలేదు. అక్కరలేనివాడి దగ్గర “అది పోగుపడి ఉంది అని ఈ పంక్తులు తెలుపుతున్నాయి.

ప్రశ్న 2.
అలసిన దేహాలకు ఏం కావాలి ?
జవాబు:
అలసిన దేహాలకు కొంచెం విశ్రాంతి కావాలి. కడుపునిండా తిండి కావాలి. కాసింత ఓదార్పు కావాలి. శ్రమపడ్డాడనే గుర్తింపు కావాలి. సంఘం యొక్క మన్నన కావాలి.

TS 9th Class Telugu Guide 9th Lesson కోరస్

ప్రశ్న 3.
‘అన్నపురాసులు ఒకచోట ఆకలి మంటలు ఒకచోట’ అంటే మీకేం అర్థమైంది ?
జవాబు:
ఆకలి లేనివాడికి, తింటే పడనివాడికి, దిట్టంగా వాడి దగ్గర ధనం, ఆహారపదార్థాలు ఉంటాయి. కాని వాడు వాటిని తినలేడు. వాడికి ఆకలి లేదు. తింటే వాడి ఆరోగ్యం చెడిపోతుంది. ఆకలి వేస్తున్నవాడికి అన్నం కావాలి కాని వాడికి తినడానికి తిండిలేని దరిద్రం. ఈ విధంగా సంఘంలో పరస్పర వైరుధ్యాలున్నాయని నాకు అర్థమయ్యింది.

ప్రశ్న 4.
“కమ్మని చకిలాలొకచోట – గట్టి దౌడలింకొక చోట” అనడంలో కవి ఉద్దేశం ఏమిటి ?
జవాబు:
‘కమ్మని చకిలాలు’ అంటే కమ్మని జంతికలు. అవి కొరికి తింటే కమ్మగా ఉంటాయి. వాడి దగ్గర ఆ చకిలాలు ఉన్నాయి. కాని గట్టిగా ఉండే వాటిని కొరికి తినడానికి వాడికి గట్టి దౌడలు, దంతాలు లేవు. అంటే ఆ కమ్మని చకిలాల ప్రయోజనం వాడికి అందదు. అలాగే మరో వ్యక్తికి గట్టి దౌడలు, దంతాలు ఉన్నాయి.

కాని వాడికి తినడానికి చక్కిలాలు లేవు. వాడికి గట్టి దౌడలు ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ విధంగా ప్రయోజనం, ఉపయోగం లేనిచోట సంపదలు పోగు పడుతున్నాయి. కావలసిన బీదవాడి వద్ద దరిద్రం ఉంటోందని అర్థం.

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 93)

ప్రశ్న 1.
‘భూమికి – ఆకాశానికి ఉన్న సంబంధం చెప్తే కొందరు నవ్వుతారు’ – అని కవి అనడానికి కారణం ఏమిటి ?
జవాబు:
దళితవాద కవి సలంద్ర లక్ష్మీ నారాయణగారు, తన ‘కోరస్’ అనే కవితలో భూమికీ, ఆకాశానికీ ఉన్న సంబంధం తాను చెప్తే కొంతమంది నవ్వుతారన్నాడు. నిజమే. `భూమికీ, ఆకాశానికీ మధ్య ఎంత దూరం ఉన్నా, వాటికి ఉన్న సహజ సంబంధాన్ని మనం గుర్తించాలని రచయిత ఉద్దేశం.

భూమి, ఆకాశము అనేవి రెండూ పంచ మహా భూతాలలోనివే. ఈ సృష్టి నిర్మాణానికి పంచమహా భూతములే కారణం. అటువంటిది ఉన్నత కులాలవారు, తాము ఆకాశం వలె ఎత్తుగా గొప్పవారము అని, దళితులు భూమిలా అడుగున పడియుండాలని అంటారు.

నిజానికి భూమ్యాకాశములు రెండూ సృష్టికి సమాన కారణాలే అయినట్లు, దళితులూ, అగ్రవర్ణాల వారూ అందరూ సమాజంలో సమానమే అని, ఆ మాట కవిగారు అంటే అగ్రవర్ణాలవారు నవ్వుతారనీ కవిగారి అభిప్రాయం.

TS 9th Class Telugu Guide 9th Lesson కోరస్

ప్రశ్న 2.
‘ప్రవాహం – నిశ్చలత’కు తేడాను మీరెట్లా అర్థం చేసుకుంటారు ?
జవాబు:
‘ప్రవాహం’ అంటే చైతన్యం. నీటిలో ప్రవాహం ఉంటే ఒక చోట నీరు కదలి, మరోచోటికి పోతుంది. పై నుండి అక్కడికి కొత్తనీరు వస్తుంది. సమాజం ఒక ప్రవాహం లాంటిది. పాత పోయి కొత్తదనం వస్తూ ఉంటుంది. ప్రవాహంలో స్తబ్ధత, నిశ్చలత ఉండవు. ప్రవాహంలో ఉండే కదలిక, చైతన్యము అనేవి, సమాజ లక్షణాలు.

నిశ్చలత అంటే కదలకుండా అక్కడే పడియుండడం. సమాజంలో వస్తున్న మార్పులను ఆహ్వానించకుండా, పాత చింతకాయ పచ్చడి మనస్తత్వాన్ని కల్గియుండడం ‘నిశ్చలత’.

సమాజంలో వస్తున్న కొత్తమార్పులను ఆహ్వానించడం ప్రవాహం అనీ, పాతతరం భావాలనే అంటిపెట్టుకొని పడియుండడం నిశ్చలత అనీ, నేను అర్థంచేసుకున్నాను.

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 94)

ప్రశ్న 1.
‘గొంతు నొక్కేయడం’ అనే పదంలో విశేషార్థంపై మాట్లాడండి.
జవాబు:
‘గొంతు నొక్కేయడం’ అంటే, గొంతు, నొక్కడం అని రెండు శబ్దాల అర్థం వేరుగా తీసుకొంటే, పీక నొక్కడం అనే అర్థం వస్తుంది. కాని గొంతు నొక్కేయడం అన్నది పదబంధము. ఏ మాటకు ఆ మాట అర్థం తీసికోరాదు.. ఆ రెండు పదాలు కలిసిన పదానికి, విశేషార్థం ఉంటుంది. ‘గొంతు నొక్కేయడం’ అనే పదబంధానికి, ఆ వ్యక్తి మనస్సులోని విషయం, పైకి రాకుండా తొక్కిపెట్టడం అనే విశేషార్థం వస్తుంది.

బలవంతంగానో, భయపెట్టో లేక బ్రతిమాలో ఒక వ్యక్తి చెప్పదలచుకున్న విషయాన్ని పైకి చెప్పనీయకుండా ఆపుచేయడాన్ని ‘గొంతు నొక్కేయడం’ అని చెప్పాలి.

TS 9th Class Telugu Guide 9th Lesson కోరస్

ప్రశ్న 2.
‘ఒంటరి’ అంటే మీకేం అర్థమయ్యింది. ?.
జవాబు:
‘ఒంటరి’ అంటే ఏకాకి. అనగా తాను చెప్పే విషయాన్ని ఇతరులెవ్వరూ సమర్థించకున్నా, తనతో ఇతరులు గొంతు కలుపకున్నా, తాను ఒక్కడే ధైర్యంగా నిర్భయంగా చెప్పదలచుకున్న విషయాన్ని లోకానికి చెపుతానని కవి అన్నాడు. దాన్నే కవి ‘ఒంటరి’ అన్నాడు.

ప్రశ్న 3.
‘చూపుడు వేళ్ళు’ – అన్న కవి మాటలో కవి భావనను ఎట్లా అర్థం చేసుకున్నారు ?
జవాబు:
సామాన్యంగా ఇతరులను బెదరించాలన్నా, ఇతరుల మాటల్లో తప్పులు ఎత్తి చూపాలన్నా, తమ చూపుడు వేళ్ళను ఎదుటివారికి చూపిస్తూ వారిని బెదిరిస్తారు.

“నిన్ను చంపేస్తాం జాగ్రత్త” అని ఎదుటివారిని భయపెట్టడానికి, మనం మన చూపుడువ్రేలిని ఎదుటివారి వైపు చూపిస్తాం. ఎదుటివారిని భయపెట్టడానికి, బెదిరించడానికి సామాన్యంగా మన చూపుడు వ్రేలును ఉపయోగిస్తాం. కవి కూడా తన భావాలు నచ్చనివారు తనవైపు వారి చూపుడు వ్రేళ్ళను చూపించి, భయపెట్టి తనను చంపుతారనీ, నిందిస్తారనీ అన్నాడు.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
“కోరస్” అనే పేరు వినగానే మీకేమనిపించింది ? ‘కోరస్’ అనే పేరు ఈ కవితకు సరిపోతుందా ? ఎందుకు ? మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు:
‘కోరస్’ అనే పేరు వినగానే మేము నిత్యమూ పాఠశాలలో బాలబాలికలు అందరూ కలిసి పాడే వందేమాతరం, జనగణమన గేయాలు గుర్తుకు వచ్చాయి. ఒక్కొక్కసారి, పై పాటలను ఒక విద్యార్థి లేక విద్యార్థిని చెపుతూంటే, మిగిలిన పిల్లలం మేము కోరస్ గా అనగా గొంతులు కలిపి ఒకే కంఠధ్వనితో పాడుతాము. లేదా మా పిల్లలం అంతా కలిసి, కోరస్ గా పాడతాము.

ఈ కవితకు కోరస్ అనే పేరు, అంతగా సరిపడదు. కాని ఈ కవిత చివర, రచయిత సమాజం అంతా చివరకు తన అభిప్రాయాలను గౌరవిస్తుందనీ, అందరూ తనతోపాటే గొంతు కలిపి తన పాటను పాడుతారనీ చెప్పాడు. సమాజం తనతో కోరస్ ఈ పాట పాడుతుందని కవి తన ఆకాంక్షనూ, తన ఆత్మ విశ్వాసాన్నీ ప్రకటించాడు.

అందువల్ల ఈ వచన కవితకు, ‘కోరస్’ అన్న శీర్షిక సరిపోవచ్చని నేను అభిప్రాయపడుతున్నాను.

TS 9th Class Telugu Guide 9th Lesson కోరస్

ప్రశ్న 2.
‘కోరస్ ‘ కవిత ద్వారా కవికి సమాజం పట్ల ఉన్న భావన ఎటువంటిదని భావిస్తున్నారు ? చర్చించండి.
జవాబు:
‘కోరస్’ కవిత ద్వారా కవికి సమాజం పట్ల ఉన్న భావనలివి.

  1. సమాజం కొత్త ధోరణులనూ, వాస్తవాలనూ, అంత తొందరగా అంగీకరించదు.
  2. భూమ్యాకాశాలకు సంబంధం ఉన్నదని చెపితే, సమాజం నవ్వుతుంది.
  3. పువ్వుకీ, ముళ్ళకూ మధ్య భేదం చెపితే, సమాజం కోపపడుతుంది.
  4. ప్రవాహ నిశ్చలతలకు, రూపం కల్పిస్తే సమాజం ఒప్పుకోదు.
  5. ఆలోచనకూ, ఆచరణకూ అర్థం చెప్తే సమాజం అపార్థం చేసుకుంటుంది.
  6. మేధస్సుకూ, మూర్ఖత్వానికీ ఉన్న పోలికను చెపితే, సమాజం రాళ్ళు విసరుతుంది.
  7. సమాజం యొక్క యథార్థ స్వరూపాన్ని సమాజానికి తెలియపరిస్తే సమాజం ఎదురుతిరుగుతుంది.
  8. సమాజాన్ని ఎవరైనా ఒంటరిగా ఒక వ్యక్తి విమర్శిస్తే, ఆ సమాజం ఆ వ్యక్తి గొంతును నొక్కేస్తుంది.
  9. సమాజం గురించి తనలో తానే విమర్శించుకుంటున్న వ్యక్తిని, సమాజం పిరికివాడంటుంది. మూర్ఖుడంటుంది. బెదరించి చంపుతుంది.
  10. చివరకు సమాజం తనతో కోరస్ పాడుతుంది.

పై విధమైన భావనలు సమాజం పట్ల కవికి ఉన్నాయి.

ప్రశ్న 3.
కింది కవితా పంక్తులు చదువండి. భావం రాయండి.

ఆకులు లేకుంటే
చెట్టునెలా గుర్తిస్తావు ?
పచ్చదనమే చెట్టుకు చిరునామా ! చెరువులో బంగళాలు మొలిచాయి నీటి తల్లికి ఇన్ని సమాధులా ! చెట్టుతనం కట్టెతనమయ్యింది
చిగురుకలలేవి ? చిటపటలు తప్ప ?
జవాబు:
పై కవితా పంక్తుల భావము :
చెట్టుకు ఆకులు లేకపోతే, అది ఏ చెట్టో గుర్తించడం ఎలా ? అది చెట్టు అనడానికి దానికి గల పచ్చదనమే గుర్తు. ఈనాడు చెరువులు కప్పుపడి, ఆ ప్రాంతంలో భవనాలు కట్టబడ్డాయి. తల్లి వంటి నీటికి ఇలా సమాధులు నిర్మిస్తారా ? చెరువులను కప్పివేస్తారా ? చెట్టు బ్రతికుంటేనే, దానికి చెట్టుతనం ఉంటుంది.

చెట్టు చచ్చిపోతే అది పొయ్యిలో కాల్చే కట్టె వలె అవుతుంది. చచ్చిన చెట్టులో కట్టెతనమే ఉంటుంది. చెట్టు, కట్టెగా మారితే, దానికి చిగురులు పుట్టినట్లు కలలు రావు. దానికి నిప్పుల్లో కాలిపోతున్నప్పుడు వినిపించే చిటపటలే వినబడతాయి.

TS 9th Class Telugu Guide 9th Lesson కోరస్

ప్రశ్న 4.
“కోరస్” కవిత నుండి – కింది భావాలకు తగిన కవితా పంక్తులు గుర్తించండి.

అ) నాకు భయమన్నదే లేదు – నేను ఒక్కడినే నా పాట పాడుకుంటా.
జవాబు:
“నాకు భయం లేదు, నేను నేడు, ఈ పాట,
ఒంటరిగానే పాడుకుంటాను !”

ఆ) నేను స్తబ్దంగా వుంటే పిరికివాడంటారు.
జవాబు:
“నేను
ఒంటరిగా ఆలోచనలలో
ఊరికే ఊబుసుపోక పరుగులు తీస్తే
నన్ను పిరికివెధవననీ”

ఇ) వీళ్ళ అసలు రూపాలు చూపిస్తే, తట్టుకోలేక నన్నే విమర్శిస్తారు.
జవాబు:
“మీ ముఖాలు చూసుకొండంటూ
ప్రతిబింబం చూపిస్తే వీళ్ళు ఆ అద్దాన్ని
ముక్కలు చెక్కలుగా పగుల గొట్టేస్తారు”

TS 9th Class Telugu Guide 9th Lesson కోరస్

ఈ) ఆలోచనలకు వాటి అమలుకు మధ్య రూపమిస్తే వీళ్ళు అంగీకరించరు.
జవాబు:
“ఆలోచనకీ – ఆచరణకీ అర్థం చెప్తే
వీళ్ళే అపార్థం చేసుకుంటారు”

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) తన మీద రాళ్ళు విసురుతారని కవి భావించడంలో అంతరార్థం ఏమిటి ? వివరించండి.
జవాబు:
కవి సలంద్ర లక్ష్మీనారాయణ, తన కోరస్ అనే కవితలో, తెలివికీ మూర్ఖత్వానికీ దగ్గర పోలిక ఉందని తాను అంటే, మేధావులు, తన మీద రాళ్ళు విసరుతారని చెప్పాడు. అంటే మేధావులు తనను నిందిస్తారని ఆయన చెప్పాడు.

మూర్ఖుడు తనకు తోచిందే తప్ప ఇతరులు చెప్పిన దానిని విని, ఆ మాటల్లోని మంచి చెడ్డలను గ్రహింపడు. మేధావులు కూడా, అంతా తమకే తెలుసుననీ, తమకు ఎవరూ ఏమీ చెప్పనవసరంలేదనీ అనుకుంటారు. ఇతరులు చెప్పింది. వినకపోడం మూర్ఖత్వమనీ, ఒక విధంగా మేధావికీ, మూర్ఖుడికీ పోలిక ఉందనీ చెపితే మేధావి కోపపడతాడు. తనను మూర్ఖుడితో పోల్చి చెప్పినవాడిపై మేధావి రాళ్ళు విసరుతాడు. అంటే కోపపడతాడు.

మేధావి కూడా మూర్ఖుడిలాగానే ఇతరులు చెప్పింది వినడని, ఈ మాటల్లోని అంతరార్థము.

ఆ) మేధస్సు, మూర్ఖత్వం మధ్య తేడా ఏమిటి ?
జవాబు:
మేధస్సు గల మేధావి తానే మేధ గలవాడిననే గర్వంతో ఇతరులు ఎవరైనా ఏదైనా చెపితే అది సరయినదే అయినా, తాను అంగీకరించడు. తనకున్న తెలివితో తాను చెప్పినదే సరయినదని వాదిస్తాడు. తన మూర్ఖపు పట్టు ఎంతమాత్రం విడిచిపెట్టడు.

మూర్ఖుడు కూడా తాను అనుకున్నదే కాని కొత్తదాన్ని అంగీకరించడు. “చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు” అని భర్తృహరి మూర్ఖుణ్ణి గూర్చి నిజం చెప్పాడు. ఒక విధంగా మేధావి కూడా మూర్ఖుడిలాగే ప్రవర్తిస్తాడు. తాను అనుకొన్నదే తప్ప, ఇతరులు చెప్పిన దానిని అతడు అంగీకరించడు.

దీనిని బట్టి మేధావికీ, మూర్ఖుడికీ పేరులో తప్ప వ్యవహారంలో పెద్దగా తేడా కనిపించదు.

TS 9th Class Telugu Guide 9th Lesson కోరస్

ఇ) కవి దృష్టిలో మేధావులంటే ఎవరు ?
జవాబు:
మేధావులు అంటే, తెలివిగలవారు. సమాజానికి ఏది మంచో, ఏది చెడో తెలిసికోగల బుద్ధిమంతుల్ని మేధావులు అని చెప్పాలి.

మూర్ఖుడి వలె, ఏది చెప్పినా వినని మేధావి కూడా మూర్ఖుడితో సమానమే అని కవి ఉద్దేశ్యము. సమాజంలో వస్తున్న మార్పులను గమనించలేనివారు మేధావులు కారని కవి భావన. ప్రజలకు ఏది ఉపయోగకరమో గ్రహింపలేనివాళ్ళు, ప్రజల పక్షాన నిలబడని వాళ్ళు, మేధావులు కాదనే సత్యాన్ని గ్రహించాలని కవి భావన.

ఈ) ‘గొంతునొక్కేయడం’ అంటే మీకేమి అర్థమయింది ? ఒక ఉదాహరణ తెలుపండి.
జవాబు:
‘గొంతు నొక్కేయడం’ అనేది ఒక పదబంధం. ఒక వ్యక్తి మనసులోని భావాన్ని పైకి చెప్పనీయకుండా అణచివేసే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు.

బలవంతంగానో, బయపెట్టో లేక మరో రీతిగానో ఒక వ్యక్తి చెప్పదలచుకున్న విషయాన్ని పైకి చెప్పనీయకుండా ఆపు చేయడాన్ని ‘గొంతు నొక్కేయడం’ అంటారు.
ఉదా : న్యాయస్థానంలో నిజం చెప్పడానికి వచ్చిన సాక్షి గొంతు నొక్కేశారు.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) “కోరస్” పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంతమాటలలో రాయండి.
జవాబు:
నేను భూమికీ, ఆకాశానికీ ఉన్న సంబంధాన్ని చెప్తే సమాజం నన్ను చూసి నవ్వుతుంది. పువ్వుకీ, ముళ్ళకీ ఉన్న తేడా చెప్తే సమాజం నాపై కోపపడుతుంది. ప్రవాహానికీ, నిశ్చలతకూ రూపం కల్పిస్తే సమాజం అంగీకరించదు. ఆలోచనలకూ, వాటి అమలుకూ మధ్య రూపమిస్తే సమాజం అంగీకరించదు. మేధావులకూ, మూర్ఖులకూ పోలిక ఉందంటే మేధావులు రాళ్ళతో కొడతారు. వారి అసలు రూపాలు వివరంగా చూపిస్తే నన్ను విమర్శిస్తారు.

TS 9th Class Telugu Guide 9th Lesson కోరస్

నేను గొంతెత్తి ఒంటరిగా మాట్లాడితే, నా గొంతు నొక్కేయాలని చూస్తారు. ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటే, పిరికి వాడవని అంటారు. నన్ను మూర్ఖుడని అంటారు. చూపుడు వేలుతో నన్ను బెదిరించి చంపేస్తారు. అయినా భవిష్యత్తులో నన్ను వ్యతిరేకించినవాళ్ళే, సత్యాన్ని గ్రహించి, తన మాటతో ఏకీభవిస్తారనీ, తనతో కలిసి కోరస్ ఆలపిస్తారనీ కవి ఆత్మ విశ్వాసాన్ని ప్రకటించాడు.

3. కింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా రాయండి.

అ). కవి సలంద్ర ఆలోచనలను, ఈ కవిత అంతరార్థాన్ని ప్రశంసిస్తూ ఏదైనా ఒక సాహిత్య పత్రికకు లేఖ రాయండి.
జవాబు:
సాహిత్య పత్రికకు లేఖ

ఖమ్మం,
X X X X.

ప్రధాన సంపాదకులు,
సాహితీ కౌముది,
ఉత్తమ సాహిత్య కళా సాంస్కృతిక మాసపత్రిక,
హైదరాబాదు.

సంపాదక మహాశయా!

నమస్కారాలు. మాకు తొమ్మిదవ తరగతిలో దళిత సాహిత్యోద్యమానికి పునాది వేసిన ‘దళిత మానిఫెస్టో’ కవితా రచయిత సలంద్ర లక్ష్మీనారాయణగారు రాసిన ‘కోరస్’ వచన కవిత పాఠ్యభాగంగా నిర్ణయింపబడింది. ఆ కవితలోని అంతరార్థాన్నీ, ఆ కవిగారి ఆలోచనలనూ నాకు నచ్చి లేఖారూపంగా రాస్తున్నా. దయతో దీన్ని పరిశీలించి, మీ సాహిత్య పత్రికలో ప్రచురింప కోరిక.

సలంద్ర వారి కోరస్ కవిత అద్భుతంగా ఉంది. సమాజం కొత్త ధోరణులనూ, వాస్తవాలనూ అంత తొందరగా అంగీకరించదనే విషయాన్ని గురించి కవి ఆవేదన వ్యక్తం చేస్తూ, అనేక విధాలుగా తన ప్రశ్నలనూ సందేహాలనూ ‘కోరస్’ అన్న తన వచన కవితలో వెలిబుచ్చాడు.

ఈయన భూమ్యాకాశాలకు మధ్య ఉన్న సహజ బంధాన్ని గుర్తించాలని, పూల సౌకుమార్యాన్నీ, ముళ్ళ కాఠిన్యాన్నీ గ్రహించాలనీ అంటాడు. నీటి ప్రవాహంలోని చైతన్యానికీ, నీటి నిశ్చలత్వానికీ గల తేడాను గ్రహించాలంటాడు. ఇవేవీ తెలుసుకోకుండా, కోపంతో అపార్థం చేసుకోవద్దంటాడు.

TS 9th Class Telugu Guide 9th Lesson కోరస్

ప్రజలకు ఏది ఉపయోగకరమో గ్రహించలేనివాళ్ళూ, ప్రజల పక్షాన నిలబడనివాళ్ళూ నిజమైన మేధావులు కారన్న సత్యాన్ని తెలిసికోమంటాడు. ఒంటరిగా తాను ప్రగతిశీల భావాలు పాడుతానంటాడు. తనను పిరికివాడిగా, మూర్ఖుడిగా ముద్రవేసినా తాను లెక్కచేయనన్నాడు. ఇప్పుడు తనను వ్యతిరేకించినవాళ్ళే, భవిష్యత్తులో తనతో ఏకీభవించి, తన పాటతో గొంతు కలిపి, కోరస్ పాడతారన్నాడు. సలంద్ర మహాకవి, అభ్యుదయ కవి.

ఇట్లు,
మీ విశ్వసనీయ
కొంగర సత్యవాణి,
తొమ్మిదవ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,
ఖమ్మం, తెలంగాణ రాష్ట్రం.

చిరునామా :
ప్రధాన సంపాదకులు,
సాహితీ కౌముది మాసపత్రిక,
అమీర్ పేట, హైదరాబాదు – 500004

III. భాషాంశాలు

పదజాలం

1. కింది పదాలకు అర్థాలు రాయండి. ఆ పదాలతో సొంతవాక్యాలు రాయండి.

మేధస్సు = తెలివి
ఉదా : వాక్యప్రయోగము : వికసించిన మానవుని మేధస్సు ప్రపంచ ప్రగతికి కారణమైంది. ఆచరించేది, చేసేది.

అ) ఆచరణ = ………………………
జవాబు:
ఆచరణ = ఆచరించేది, చేసేది.
వాక్యప్రయోగము : గురువుల ఉపదేశాలు ఆచరణ యోగ్యంగా ఉండాలి.

ఆ) ప్రతిబింబం = ………………….
జవాబు:
ప్రతిబింబం = మారురూపు
వాక్యప్రయోగము : సూర్యుడి ప్రతిబింబం చెరువు నీళ్ళలో కనబడుతుంది.

TS 9th Class Telugu Guide 9th Lesson కోరస్

ఇ) నిశ్చల = ………………………….
జవాబు:
నిశ్చల = స్థిరత్వము
వాక్యప్రయోగము : సంపూర్ణ నిశ్చలతతో కూడిన మనస్సుతో భగవంతుని స్మరించాలి.

ఈ) కోరస్ = ……………………………
జవాబు:
కోరస్ = గొంతు కలుపటం
వాక్యప్రయోగము : విద్యార్థినీ, విద్యార్థులందరూ కలిసి, కోరస్ గా జనగణమన గేయం పాడారు.

2. కింది జాతీయాలను వివరించండి.

అ) రాళ్ళు విసరడం : ………………………….
జవాబు:
‘రాళ్ళు విసరడం’ అంటే లేనిపోని నేరాలు ఆరోపించి తప్పుపట్టడం అని అర్థము. ఎవరైనా ఒక మంచిపని చేస్తోంటే అది చూసి సహించలేని దుర్మార్గులు మంచిపని చేసేవాడిపై లేని నేరాలు ఆరోపించి, అతడిపై దోషాలు ఆరోపిస్తారు. దాన్నే ‘రాళ్ళు విసరడం’ అంటారు.

ఆ) గొంతునొక్కేయడం : ……………………
జవాబు:
‘గొంతు నొక్కేయడం’ అంటే మాట పైకి రాకుండా అడ్డుపెట్టడం అని అర్థము. ఎవరైనా ఉన్న సత్యాన్ని ధైర్యంగా వారు గొంతు విప్పి మాట్లాడుతుండగా, వారు మాట్లాడితే సత్యం బయటపడుతుందనే భయంతో, బలవంతంగానో, లేక బెదరించో లేక బతిమాలో, అతడు గొంతువిప్పి మాట్లాడకుండా చేయడాన్ని, ‘గొంతునొక్కేయడం’ అంటారు.

TS 9th Class Telugu Guide 9th Lesson కోరస్

వ్యాకరణాంశాలు

1. కింది పదాలను విడదీసి, సంధుల పేర్లను రాయండి.

అ) చూసుకొండంటూ = …………………………….
జవాబు:
చూచుకొండు + అంటు – ఉత్వ సంధి

ఆ) గొంతెత్తి = …………………………….
జవాబు:
గొంతు + ఎత్తి – ఉత్వ సంధి

2. కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి.

అ) ముక్కలు చెక్కలు = ……………………
జవాబు:
ముక్కలును, చెక్కలును – ద్వంద్వ సమాసం

ఆ) గొంతునొక్కేయటం = ……………………….
జవాబు:
గొంతును నొక్కేయటం – ద్వితీయా తత్పురుష సమాసం

TS 9th Class Telugu Guide 9th Lesson కోరస్

ఇ) నా పాట = …………………………..
జవాబు:
నా యొక్క పాట – షష్ఠీ తత్పురుష సమాసం

3. కింది పంక్తులను గమనించి వాటిలో ఉన్న అలంకారములను గుర్తించి రాయండి.

* పువ్వుకీ – ముళ్ళకీ భేదం చెప్తే
ప్రవాహానికి నిశ్చలతకీ రూపం కలిస్తే.
“ఆలోచనకీ – ఆచరణకీ అర్థం చెప్తే
జవాబు:
పై గేయపంక్తులలో “అంత్యానుప్రాస అలంకారం ఉంది.

లక్షణం : పదాల, పాదాల, వాక్యాల, చరణాల చివరలో అక్షరాలు పునరుక్తమైతే, అది ‘అంత్యానుప్రాసాలంకారం’ అవుతుంది.

సమన్వయము : పై పాదాల్లో పదాల చివర ‘కీ’ అనే అక్షరం, పునరుక్తమయ్యింది. అంటే తిరిగి తిరిగి వచ్చింది – అలాగే వాక్యాల చివరలో “ప్తే, స్తే, ప్తే” – అనే సంయుక్తాక్షరం, పునరుక్తమయ్యింది. అందువల్ల పై పాదాల్లో ‘అంత్యానుప్రాస’ అనే శబ్దాలంకారం ఉంది.

* కిశోర్ లేడిపిల్లలా పరుగెత్తుతున్నాడు.
జవాబు:
పై వాక్యంలో ‘ఉపమాలంకారం’ ఉంది.

లక్షణం : ఉపమాన, ఉపమేయములకు పోలిక చెప్పినట్లయితే ‘ఉపమాలంకారం’ అవుతుంది.

సమన్వయము : పై వాక్యంలో

  1. ‘లేడిపిల్ల’ అనేది ఉపమానము;
  2. కిశోర్ అనేది “ఉపమేయం”
  3. ‘లా’ ఉపమావాచకం
  4. ‘పరుగెత్తుతున్నాడు’ అనేది సమానధర్మం.

పై విధంగా ఉపమాన, ఉపమేయములకు పోలిక చెప్పబడింది. కాబట్టి ఇది ఉపమాలంకారం.

TS 9th Class Telugu Guide 9th Lesson కోరస్

* మీ ఇంటి వాతావరణం పండుగ వాతావరణమా అన్నట్లున్నది.
జవాబు:
పై వాక్యంలో ఉత్ప్రేక్ష అలంకారం ఉంది.

లక్షణం : సమాన ధర్మాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడాన్ని ఉత్ప్రేక్షాలంకారం అంటారు.

సమన్వయము : ఇక్కడ ‘పండుగ వాతావరణం’ అనేది ఉపమానం. ‘ఇంటి వాతావరణం’ అనేది ఉపమేయం. ఉపమేయం అయిన ఇంటి వాతావరణాన్ని, ఉపమానం అయిన ‘పండుగ వాతావరణం’ గా ఊహించారు. కాబట్టి ‘ఉత్ప్రేక్షాలంకారం’.

4. కింది వాక్యాలను కర్మణి వాక్యాలుగా రాయండి.

అ) ఆయన ప్రశ్నలను, సందేహాలను ‘కోరస్’ కవిత ద్వారా లేవనెత్తాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
ఆయనచేత ప్రశ్నలు, సందేహాలు ‘కోరస్’ కవిత ద్వారా లెవనెత్తబడతాయి. (కర్మణి వాక్యం)

ఆ) నా మీద రాళ్ళు విసురుతారు. (కర్తరి వాక్యం)
జవాబు:
నా మీద రాళ్ళు విసరబడతాయి. (కర్మణి వాక్యం)

ప్రాజెక్టు పని

తెలుగు కవిత్వంలో అభ్యుదయ కవులుగా పేరు పొందిన ఎవరిదైన ఒకరి కవితలను సేకరించి నివేదిక రాసి, చదివి వినిపించండి.
జవాబు:
“శ్రీశ్రీ” గా పిలువబడే అభ్యుదయ కవి “శ్రీరంగం శ్రీనివాసరావు” గారు. ఆయన “మహాప్రస్థానం” అనే ఖండకావ్యం రాశాడు. ఆయన కవితలు రెండు పరిశీలిద్దాం.
జయభేరి
1. “నేను సైతం,
ప్రపంచాగ్నికి
సమిధ నొక్కటి ఆహుతిచ్చాను”.

TS 9th Class Telugu Guide 9th Lesson కోరస్

2. నేను సైతం
ప్రపంచాబ్దపు
తెల్లరేకై పల్లవిస్తాను
నేను సైతం
విశ్వవీణకు
తంత్రినై మూర్ఛనలు పోతాను
నేను సైతం
భువన భవనపు
బావుటానై పైకి లేస్తాను”

పై గేయంపై నా అభిప్రాయం :
ఇక్కడ నేను అంటే శ్రీశ్రీ కాదు. శ్రీశ్రీ కంఠంతో పలుకుతున్న శ్రామికుడు. ప్రపంచం యొక్క అభ్యుదయం కోసం, ఆ శ్రామికుడు ఎన్నో త్యాగాలు చేశాడు. ఎంతో కృషి చేశాడు. గతంలో నేను సైతం అనే నుడికారం, మానవజాతి చరిత్రలో పేరుకు కూడా నోచుకోని ఒక సామాన్యుడికి ప్రాముఖ్యం కలిగిస్తోంది. తరతరాల నుండి ఇతడికి చరిత్రలో గుర్తింపు లేదు. ఇప్పుడితడు తిరగబడి తన ప్రాముఖ్యాన్ని గుర్తించవలసిందిగా ఘోషిస్తున్నాడు.

3. “మరో ప్రపంచం
మరో ప్రపంచం
మరో ప్రపంచం పిలిచింది
పదండి ముందుకు
పదండి త్రోసుకు
పోదాం పోదాం పైపైకి
కదం తొక్కుతూ
పదం పాడుతూ
హృదంతరాళం గర్జిస్తూ
పదండి పోదాం
వినబడలేదా
మరో ప్రపంచపు జలపాతం” ……………..

పై గేయంపై నా అభిప్రాయం :
పై మహాప్రస్థాన గేయం, ఒక యుద్ధగీతంలా నడచింది. ఇదొక వీరగానం. మహాప్రస్థానం అంటే గొప్ప ప్రయాణం. ప్రస్తుత దోపిడీ వ్యవస్థ నుంచి, ఈ పీడిత సమాజం నుంచి, సామ్యవాద వ్యవస్థకి, సమసమాజ వ్యవస్థకి, ప్రయాణం చేయడమే మహాప్రస్థానం. అభ్యుదయ మార్గం వైపు ప్రస్థానం సాగించాలన్నది శ్రీశ్రీ ప్రబోధం. భావావేశానికి తగిన శబ్దప్రయోగంతో, శ్రీశ్రీ మహాప్రతిభకి ఈ గేయం అద్దం పడుతుంది. ఈ గేయం రచనా కాలంనాటికే, రష్యాలో సామ్యవాదవ్యవస్థ అనే ‘మరోప్రపంచం’ ఏర్పడింది.

TS 9th Class Telugu Guide 9th Lesson కోరస్

మహాప్రస్థాన గేయం ఒక మహాప్రవాహం. ప్రళయ ఝంఝా ప్రభంజనం. దీని వేగానికి తట్టుకోలేక సహృదయుడు, ఉక్కిరిబిక్కిరి అవుతాడు. దీని గమనవేగం, భావతీవ్రత, అంత శక్తివంతమైనవి.

వచన కవితా పంక్తులు – సారాంశము

I.

1 నుండి 6 పంక్తులు నేను –

నేను –
భూమికీ – ఆకాశానికీ వున్న
సంబంధాన్ని చెప్తే వీళ్ళు నవ్వుతారు,
నేను –
పువ్వుకీ – ముళ్ళకీ భేదం చెప్తే
వీళ్ళు కోప్పడుతారు

భావం :
భూమికీ, ఆకాశానికీ మధ్య ఎంత దూరం ఉన్నా, వాటికి ఉన్న సహజ సంబంధాన్ని గుర్తించాలి. పూలకు ఉన్న మెత్తదనాన్ని (సుకుమారత్వాన్ని), ముళ్ళకు ఉన్న కఠినత్వాన్ని గ్రహించాలి. నేను భూమ్యాకాశాలకు మధ్య ఉన్న సంబంధం గురించి చెపితే వీళ్ళు నవ్వుతారు. ముల్లుకూ, పువ్వుకూ తేడా చెపితే, కోపిస్తారు.

TS 9th Class Telugu Guide 9th Lesson కోరస్

7 నుండి 12 పంక్తులు

నేను –
ప్రవాహానికీ నిశ్చలతకీ రూపం కల్పిస్తే
వీళ్ళు ససేమిరా ఒప్పుకోరు,
నేను –
ఆలోచనకీ – ఆచరణకీ అర్థం చెప్తే
వీళ్ళే అపార్థం చేసుకుంటారు,

భావం :
నీటి ప్రవాహంలోని చైతన్యానికీ, కదలని నీటికి గల తేడాను అర్థం చేసుకోవాలి. ఏవేవో చేయాలనుకొనే ఆలోచనలకూ, ఏమి చేయలేనితనానికీ మధ్య గల స్థితిని తెలుసుకోవాలి. ఇవేమీ అంగీకరించకుండా, తెలుసుకోకుండా, కోపంతో అపార్థం చేసుకోవద్దని కవి కోరుతున్నాడు.

TS 9th Class Telugu Guide 9th Lesson కోరస్

3 నుండి 20 పంక్తులు

నేను –
మేధస్సుకీ – మూర్ఖత్వానికీ
సామ్యం చూపితే వీళ్ళు
నా మీద రాళ్ళు విసురుతారు.
నాకు తెలుసు
నేను మీ ముఖాలు చూసుకొండంటూ
ప్రతిబింబం చూపిస్తే వీళ్ళు ఆ అద్దాన్ని
ముక్కలు చెక్కలుగా పగుల గొట్టేస్తారు.

భావం :
నేను మూర్ఖుడికీ, తెలివి గలవాడికీ పోలికలు చూపిస్తే, సమాజం నామీద రాళ్ళు విసరుతుంది. మీరేమిటో మీరు తెలిసికోండని వారి ముఖం చూసుకోడానికి అద్దం చూపిస్తే, . దాన్ని ముక్కలుగా బద్దలు చేస్తుంది.

II.

1 నుండి 4 పంక్తులు నేను –

నేను –
గొంతెత్తి ఒంటరిగానే
పాట పాడినా మాట్లాడినా
నా గొంతు నొక్కేయ ప్రయత్నిస్తారు.

భావం :
కవి తాను ఎవరికోసమూ చూడకుండా, ఒంటరిగానే, తన ప్రగతిశీల భావాలను గొంతెత్తి పాడుతానంటున్నాడు. తన గొంతు పైకి విన్పించకుండా అణచి పెట్టాలని సమాజం ప్రయత్నిస్తుంది.

TS 9th Class Telugu Guide 9th Lesson కోరస్

5 నుండి 10 పంక్తులు

“నేను –
ఒంటరిగా ఆలోచనలలో
ఊరికే ఊసుపోక పరుగులు తీస్తే
నన్ను పిరికి వెధవననీ
మూర్ఖున్ననీ
చూపుడు వేళ్ళతో చంపేస్తారు

భావం :
తన పాటను అడ్డుకోవాలని, తన మాటను అణచి వేయాలని చూసేవాళ్ళకు కవి తాను భయపడనంటాడు. సమాజం తనను పిరికివాడిగా మూర్ఖుడిగా ముద్రవేసినా, తాను లెక్కచేయనని కవి ఈ పంక్తుల్లో ప్రకటించాడు.

(11 నుండి 17 పంక్తులు)

అయినా నాకు తెలుసు
రేపు వీళ్ళే
నా పాటకి కోరస్ అందుకుంటారు –
నాకు భయం లేదు
నేను నేడు
ఈ పాట
ఒంటరిగానే పాడుకుంటాను !

భావం :
భవిష్యత్తులో, నేడు తనను వ్యతిరేకించిన వాళ్ళే, యథార్థాన్ని తెలుసుకొని తన మాటతో ఏకీభవిస్తారనీ, తన పాటతో గొంతు కలుపుతారనీ (కోరస్ అందిస్తారనీ), ఆశావహ దృక్పథాన్ని కవి వెల్లడించాడు. అప్పటి వరకూ తాను ఒంటరిగానే, భయం లేకుండా, తన హృదయంలోని భావనలను ప్రకటిస్తానని కవి ఆత్మవిశ్వాసంతో పలికాడు.

TS 9th Class Telugu Guide 9th Lesson కోరస్

పాఠం ఉద్దేశం

తన చుట్టూ సమాజంలో జరుగుతున్న సంఘటనల మీద విద్యార్థికి ఒక అవగాహన కలిగి, ఏది మంచో, ఏది చెడో తెలుసుకొనేటట్లు చేయడం ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ప్రక్రియ – వచనకవిత
ఈ పాఠం వచనకవిత ప్రక్రియకు చెందినది. ఛందో నియమం లేని స్వేచ్ఛాకవిత్వాన్ని ‘వచనకవిత’ అంటారు. చెప్పేది వచనమే ఆ చెప్పే మాటల్లో ‘కవిత్వం’ పాలు వుంటేనే అది వచనకవిత అవుతుంది. వచనకవిత భావం ప్రధానంగా కవితాత్మక పంక్తులతో సాగుతుంది. వచనకవితలు ‘వస్తువు- అభివ్యక్తి-శిల్పం’ ఆధారంగా ప్రతిభ కలవిగా గుర్తింపబడతాయి.

ఈ పాఠం సలంద్ర లక్ష్మీనారాయణ రాసిన ‘చావుగీతం’ కవితా సంకలనం లోనిది.

కవి పరిచయం

TS 9th Class Telugu Guide 9th Lesson కోరస్ 1
పాఠం పేరు : ‘కోరస్’

కవి : సలంద్ర లక్ష్మీనారాయణ

దేని నుండి గ్రహింపబడింది : కవి రచించిన ‘చావుగీతం’ కవితా సంకలనం నుండి గ్రహించబడింది.

కవి జనన-మరణాలు : జననము : 12-01-1956
మరణము : 17-09-1986

జన్మస్థలము : నిజామాబాద్ పట్టణంలో జన్మించారు

TS 9th Class Telugu Guide 9th Lesson కోరస్

తొలి కవితా సంపుటి : ‘వేడిగాలి’ అనే కవితా సంకలనం ద్వారా ఈయన తన మొదటి కవితా సంపుటిని అందించారు.

‘చావుగీతం’ సంచలనం : 1979లో ఈయన రచించిన ‘చావుగీతం’ కవితాసంపుటి సంచలనం సృష్టించింది.

దళిత సాహిత్యోద్యమం : ఈ కవి రచించిన ‘దళిత మానిఫెస్టో’ అనే కవిత, దళిత సాహిత్య ఉద్యమానికి పునాది అని చెప్పదగినది.

ప్రవేశిక

వాస్తవాలు కఠినంగా ఉంటాయి. సమాజం కొత్త పోకడలను తొందరగా స్వాగతించదు. అయినా వాటిని గురించి. పదే పదే చెబుతూ, ఆచరిస్తూ ఉంటే ఎన్నో ప్రయత్నాల తర్వాత గుర్తించి, ఆ తర్వాత అనుసరిస్తుంది కూడా. ఈ నిజం తెలిసిన కవి తన పాటకు సమాజం కోరస్ అవుతుందని ఎంతో ఆత్మ విశ్వాసంతో ప్రకటిస్తున్నాడు. ఆ వైనాన్ని చదివి తెలుసుకుందామా ?

TS 9th Class Telugu Important Questions 10th Lesson వాగ్భూషణం

These TS 9th Class Telugu Important Questions 10th Lesson వాగ్భూషణం will help the students to improve their time and approach.

TS 9th Class Telugu 10th Lesson Important Questions వాగ్భూషణం

PAPER – I : PART – A

I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)

అ) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘వాగ్భూషణం’ పాఠం ఆధారంగా మీరు నేర్చుకున్న ముఖ్యమైన మూడు విషయాలు రాయండి.
జవాబు:
మాట్లాడడం మనిషికి మాత్రమే లభించిన మంచి వరం. మాటలను అందంగా, ఒక పద్ధతి ప్రకారం, అనుకున్న అంశం మీద మాట్లాడితే శ్రోతలకు వీనులవిందు అవుతుంది. సంస్కారవంతమైన మాట మాత్రమే మనిషికి నిజమైన అలంకారం అంటారు పెద్దలు. ‘వాగ్భూషణం’ పాఠంలో డా॥ ఇరివెంటి కృష్ణమూర్తిగారు అమూల్యమైన అంశాలు ఎన్నో చక్కగా వివరించారు. వాటిలో ముఖ్యమైనవి –

  1. ఉపన్యాసం చెప్పేటప్పుడు భయం, సిగ్గు లేకుండా మాటలు ధారాప్రవాహంగా మాట్లాడాలని
  2. ఉపన్యాసంలో క్లుప్తత, స్పష్టత అవసరమని
  3. వక్తృత్వం రాణించాలంటే తగిన పాండిత్యం ఉండాలని
  4. విషయానికి తగ్గట్టుగా తన కంఠధ్వనిని పరిమితం చేసుకోవాలని
  5. వక్తకు జ్ఞాపకశక్తి చాలా అవసరమని
  6. వక్తృత్వంలో సమయ నియమం అతిముఖ్యమైన విషయమని నేను గ్రహించాను.

ప్రశ్న 2.
‘వక్తృత్వంలో సమయ నియమం అతిముఖ్యమైన విషయం’ ఎందుకో వివరించండి.
జవాబు:
‘వక్తృత్వంలో సమయ నియమం అతిముఖ్యమైన విషయం’ అన్నమాట నూటికి నూరుపాళ్ళు నిజం. ఎందుకంటే తక్కువ సమయం మాట్లాడినంత మాత్రాన శక్తిహీనుడు కాదు. నిజానికి గంటలకొద్దీ మాట్లాడేవాడు మంచివక్త కాడు. అయిదు నిముషాలు మాట్లాడినా చెప్పే అంశం శ్రోతలకు అర్థమైతే చాలు.

సమయం దాటడం వల్ల వక్తకు కీర్తిరాదు. అపోహల పాలవుతాడు. విషయం కూడా శ్రోతలకు పూర్తిగా అర్థంకాదు. ఎక్కువసేపు మాట్లాడాలనే ఉత్సాహం అనవసరమైన అంశాలకు దారితీస్తుంది. క్లుప్తమైన ఉపన్యాసం గొప్పది. అందువల్లనే వక్తృత్వంలో సమయ నియమం అతిముఖ్యమైన విషయం.

TS 9th Class Telugu Important Questions 10th Lesson వాగ్భూషణం

ప్రశ్న 3.
“వాక్శక్తి మనిషికి వరప్రసాదం” ఎలాగో తెల్పండి.
జవాబు:
మాట అనేది మనిషికి దేవుడిచ్చిన వరం. మనిషికీ, పశువుకీ భేదం ప్రధానంగా వాక్కు వల్లనే కలుగుతుంది. మనిషి తన తెలివితేటలవల్ల భాషను సృష్టించుకొన్నాడు. భాష సహజం కాదు కృత్రిమం. మనిషి మారుతున్నకొద్దీ అదీ మారుతూ ఉంటుంది. జీవితంలో వాక్శక్తి నిర్వహించే పాత్ర అమేయమైనది. వాక్ శక్తి వలనే మనిషి తన ఇబ్బందులను పోగొట్టుకోవడంలోను, ఇతరుల బాధలను పంచుకోవడంలోను కృతకృత్యుడవుతున్నాడు. కనుక వాక్శక్తి మనిషికి వరప్రసాదం అని చెప్పవచ్చు. అందుకే ‘మంచివాక్కు కల్పతరువు’ అని పెద్దలంటారు.

ప్రశ్న 4.
మాటకున్న శక్తి అనంతం, అప్రతిహతం అంటే ఏమిటి ?
జవాబు:
‘అనంతం’ అంటే అంతం లేనిది. మాటకున్న శక్తి ‘ఇంత’ అని చెప్పడానికి వీలుకాదు అని అర్థం. అలాగే ‘అప్రతిహతం’ అనగా ఎదురులేనిది. మాటకున్న శక్తితో విజయ పరంపర పొందవచ్చు అని అర్థం. మొత్తం మీద వాక్ శక్తి ‘అంతులేనిది, అడ్డులేనిది’ అని అర్థమవుతుంది. అధికారం ఉన్నవాడు ఆ ప్రాంతం వరకే అతని అధికారం చెల్లుతుంది. మరి మాటకారితనం ఉన్నవాడు ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అనే భేదం లేకుండా ప్రపంచమంతా రాణిస్తాడు.

ప్రశ్న 5.
‘వాగ్భూషణం’ పాఠంలో అబ్రహాం లింకన్ మాటల ద్వారా నీవేమి గ్రహించావు?
జవాబు:
ఒకసారి అబ్రహాం లింకను ఎవరో గంటసేపు ప్రసంగించమన్నారు. గొప్పవక్తగా ప్రసిద్ధిపొందిన ఆ మహనీయుడు, “సరే పదండి ! అలాగే మాట్లాడుతాను” అన్నారు. అప్పుడు “ఏమీ ఆలోచించనక్కరలేదా ?” అని ప్రశ్నించారు అవతలివారు. లింకన్ “అయిదు నిమిషాలు మాట్లాడానికి ఒక గంటసేపు ఆలోచించవలసి ఉంటుంది. గంటసేపు ఆలోచన అనవసరం” అని సమాధానమిచ్చారు. దీనిని బట్టి సమయ నియమం వక్తకు అతిముఖ్యమైన విషయం అని గ్రహించాను.

TS 9th Class Telugu Important Questions 10th Lesson వాగ్భూషణం

ప్రశ్న 6.
‘Brievity is the soul of wit’ సామెత పాల్కురికి ఆలోచనకు ప్రతిధ్వని. ఎట్లా ?
జవాబు:
పరిమిత కాలంలో అభిలషితార్థాన్ని అందివ్వగలగడం సామాన్య విషయం కాదు. ఎంతో తపస్సు ఉంటేనే సాధ్యమవుతుంది. శబ్దప్రయోగంలో నిగ్రహం ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఇందుకు ఉదాహరణగా పాల్కురికి సోమనాథుని “అల్పాక్షరములందు అనల్పార్థ రచన

కల్పించుటయ కాదె కవి వివేకంబు” అన్నది చెప్పవచ్చు. ఈ సూక్తి కేవలం కవిత్వానికే వర్తిస్తుందని అనుకోవడం పొరపాటు. ఆ మనీషి చాలా విస్తృతమైన అర్థాన్ని అందించాడు ఈ ద్విపదలో. అందుకే ‘Brievity is the soul of wit’ అన్న ఆంగ్లాభాణకం పాల్కురికి సోమనాథుని ఆలోచనకు ప్రతిధ్వనిగా చెప్పవచ్చు.

ప్రశ్న 7.
ఉత్తమ ఉపన్యాస కోవకు చెందినవారి పేర్లు మీకు తెల్సినవి రాయండి.
జవాబు:
ధృతరాష్ట్రుని కొలువులో శ్రీకృష్ణుడు చేసిన ఉపన్యాసం, విశ్వమత మహాసభలో వివేకానందస్వామి చేసిన ఉపన్యాసం, పెట్టిన ్బర్గ్ అబ్రహాం లింకన్ చేసిన ఉపన్యాసం, మన స్వాతంత్ర్య సమర కాలంలో బిపిన్ చంద్రపాల్, మౌలానా ఆజాద్, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ వంటి ధీరోదాత్తుల ఉపన్యాసాలు ఉత్తమ ఉపన్యాస కోవకు చెందినవి.

ఆ) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘వాగ్భూషణం’ పాఠంలో మంచివక్తకు ఉండవలసిన లక్షణాలు ఏమేమి చెప్పబడినవో తెలుపండి ?
జవాబు:
“వాగ్భూషణం భూషణం” అన్నారు భర్తృహరి. మాట మాత్రమే మనిషికి నిజమైన అలంకారం. చక్కగా మాట్లాడే వ్యక్తినీ అందరూ గౌరవిస్తారు. మంచివాక్కు ఉన్నవారి మాటకు గౌరవం లభిస్తుంది. అంతేకాదు ఎదుటివారికి నచ్చచెప్పగలం.

TS 9th Class Telugu Important Questions 10th Lesson వాగ్భూషణం

విద్వత్తులేని వక్తృత్వం ఎంతోకాలం అంతటా రాణించదు. దానికై మంచివక్తకు ఉండవలసిన లక్షణాలను ‘వాగ్భూషణం’ పాఠం ద్వారా డా॥ ఇరివెంటి కృష్ణమూర్తి ఈ విధంగా తెలియజేస్తున్నారు.
వక్తకు ఉండవలసిన లక్షణాలు :

  1. మంచి వక్త కావడానికి విద్యావిజ్ఞానాల అవసరం అంతగా లేకపోయినా కొంత మాత్రమైనా విద్య ఉండడం అవసరం.
  2. వక్తకు జ్ఞాపకశక్తి చాలా అవసరం.
  3. చెప్పదలచిన అంశాన్ని బిడియ పడకుండా ధారాప్రవాహంగా చెప్పాలి.
  4. ప్రజల మనఃప్రవృత్తులను అర్థం చేసుకొని సహృదయంతో ఉపన్యసించాలి.
  5. కన్నులకు కట్టినట్టు ఒక అంశాన్ని అభివర్ణించి చెప్పడం మంచివక్త లక్షణాల్లో ఒకటి.
  6. పదజాలంతో చక్కని పరిచయం ఉండాలి.
  7. ఉపన్యాసం వ్యంగ్యార్థాన్ని ఆశ్రయించిప్పుడే ఉత్తమ ఉపన్యాసం అవుతుంది.
  8. శ్రోతల సంఖ్యను బట్టి తన ధ్వనిని, వక్త పరిమితులను కల్పించుకోవాలి.
  9. వక్తృత్వంలో సమయ నియమం అతిముఖ్య విషయం.
  10. వక్త తొలిపలుకులు నుండి చక్కని భాషతో చీకటిలో దివ్వె వెలిగినట్లుండాలి.

PAPER – I : PART – B

భాషాంశాలు – పదజాలం :

I. సొంతవాక్యాలు :

1. అప్రతిహతంగా : అప్రతిహతంగా సాగుతున్న అలెగ్జాండర్ దండయాత్రను పురుషోత్తముడు అడ్డుకున్నాడు.
2. అమేయము : రావణుడు అమేయమైన తపస్సుతో శివుని మెప్పించి ఆత్మలింగాన్ని పొందాడు.
3. ఉదాసీనత : రాముడు విద్యాభ్యాస సమయంలో ఎక్కడా ఉదాసీనత కనిపించనీయలేదు.
4. ఆచరణ : లాల్బహదూర్, టంగుటూరి ప్రకాశం వంటి నాయకులు తమ ఆశయాలను ఆచరణలో చూపించారు.
5. అంతర్లీనం : గంగా, యమునలు కనిపిస్తూ ప్రవహిస్తుంటే అంతర్లీనంగా సరస్వతీనది ప్రయాగ వద్ద ప్రవహించి త్రివేణి సంగమం ఏర్పడింది.
6. వినసొంపు : సామెతలు, జాతీయాలు వినసొంపుగా ఉండటమేగాక ఆలోచింపచేస్తాయి.
7. కల్పతరువు: కాశీనాథుని నాగేశ్వరరావుగారు పేదవిద్యార్థుల పాలిటి కల్పతరువు.
8. రూపుదిద్దుకొను : మంచి చదువు చదివి మంచి ఉద్యోగం సంపాదిస్తే మన కలలు రూపుదిద్దుకుంటాయి.
9. నిస్సంకోచంగా : పాఠం వింటున్నప్పుడు మనకు కలిగే అనుమానాలను నిస్సంకోచంగా ఉపాధ్యాయుని అడగాలి.
10. వ్యంగ్యార్థం : అన్నదమ్ములు కలిసి ఉండటమే గాక ధర్మాన్ని పాటించాలనే వ్యంగ్యార్థాన్ని రామాయణ, భారతాలు బోధిస్తాయి.
11. ధారాశుద్ధి : శ్లోకాలు, పద్యాలు కంఠస్థం చేయడంతో ధారాశుద్ధి పెరుగుతుంది.
12. వక్తృత్వకళ : సాధువులు, స్వామీజీలు వక్తృత్వకళ ద్వారానే మనలను ధర్మంపట్ల ఆకర్షిస్తారు.
13. తలమున్కలు : తీరిక లేకుండా ఉండటం – విద్యార్థులు రాజకీయాలలో తలమున్కలు కాకూడదు.
14. కన్నులకు కట్టినట్లు : చూస్తున్నట్లు – మా చరిత్ర మాస్టారు పాఠం కన్నులకు కట్టినట్లు చెబుతారు.

TS 9th Class Telugu Important Questions 10th Lesson వాగ్భూషణం

II. అర్థాలు:

ప్రశ్న 1.
ధారాళంగా మాట్లాడటం (ఉపన్యసించటం) అనే అర్థం వచ్చే పదం
A) మాట్లాడు
B) జవాబు
C) వక్తృత్వం
D) సంభాషణ
జవాబు:
C) వక్తృత్వం

ప్రశ్న 2.
నిరుద్యోగము యువతను నిద్రాణములో ఉంచుతున్నది – గీత గీసిన పదానికి అర్థం
A) నిద్రాస్థితి
B) ద్రావణస్థితి
C) కదలిక
D) చైతన్యము
జవాబు:
A) నిద్రాస్థితి

TS 9th Class Telugu Important Questions 10th Lesson వాగ్భూషణం

ప్రశ్న 3.
రాముని నాయకత్వంలో కపిసేన అమేయము ఐన బలం పొందింది.
A) మరువరాని
B) లెక్కింపశక్యం కాని
C) అద్భుత రసం
D) యుద్ధం చేయగల
జవాబు:
B) లెక్కింపశక్యం కాని

ప్రశ్న 4.
“నిరక్షరాస్యులు” అంటే అర్థం
A) రక్షణ లేనివారు
B) రహస్యంగా జీవించేవారు
C) రక్షణ ఉన్నవారు
D) చదువురానివారు
జవాబు:
D) చదువురానివారు

ప్రశ్న 5.
“కృపాణ ధార” అంటే అర్థం
A) ఆగనిధార
B) కత్తి అంచు
C) పదును పెట్టడం
D) పదునైన గొడ్డలి
జవాబు:
B) కత్తి అంచు

TS 9th Class Telugu Important Questions 10th Lesson వాగ్భూషణం

ప్రశ్న 6.
“తిరిగి జ్ఞప్తి చేసుకొంటూ చదవడం” అనే అర్థం గల పదం
A) బాహ్య పఠనం
B) పునశ్చరణ
C) మౌన పఠనం
D) మంత్రము
జవాబు:
B) పునశ్చరణ

ప్రశ్న 7.
ఒళ్ళు మరచిపోవడం – అనే అర్థం గల పదం
A) తన్మయత్వం
B) గర్వము
C) ధారాశుద్ధి
D) పరుండిపోవు
జవాబు:
A) తన్మయత్వం

ప్రశ్న 8.
“దృక్పథము” అనగా అర్థం
A) భాషణము
B) శ్రవణము
C) ఆలోచనా పద్ధతి
D) బాగుచేయుట
జవాబు:
C) సిగ్గుపడుట

TS 9th Class Telugu Important Questions 10th Lesson వాగ్భూషణం

ప్రశ్న 9.
చదువు విషయంలో బిడియం కూడదు – గీత గీసిన పదానికి అర్థం
A) సామెత
B) ముడుచుకొనిపోవు
C) సిగ్గుపడుట
D) ఆలోచన
జవాబు:
C) సిగ్గుపడుట

ప్రశ్న 10.
మాట్లాడే పద్ధతి – అనే అర్థం గల పదం
A) తీరుతెన్నులు
B) వచశ్శైలి
C) క్రమపద్ధతి
D) ధారణ పద్ధతి
జవాబు:
B) వచశ్శైలి

ప్రశ్న 11.
మౌనం కంటే, భాషణం మంచి సాధనం – గీత గీసిన పదానికి అర్థం
A) చర్చ
B) మాట్లాడటం
C) వినడం
D) గొడవ
జవాబు:
B) మాట్లాడటం

TS 9th Class Telugu Important Questions 10th Lesson వాగ్భూషణం

ప్రశ్న 12.
మాటకున్న శక్తి అనంతం, అప్రతిహతం – గీత గీసిన పదానికి అర్థం
A) అడ్డం
B) ఎదురు
C) అడ్డగించలేనిది
D) చూడలేనిది
జవాబు:
C) అడ్డగించలేనిది

ప్రశ్న 13.
ఆత్మవిశ్వాసమే ఉంటే దీనుడై పడి ఉండడు – గీత గీసిన పదానికి అర్థం
A) తనపై తనకు నమ్మకం
B) తనపై తనకు అధికారం
C) నమ్మకం
D) అధికారం
జవాబు:
A) తనపై తనకు నమ్మకం

ప్రశ్న 14.
ప్రతివ్యక్తి నిరంతర ప్రయత్నం వల్ల ఎంచుకున్న కళలో కౌశలం సంపాదిస్తాడు – గీత గీసిన పదానికి అర్థం
A) ఆరోగ్యం
B) అలవాటు
C) కుశలం
D) నేర్పు
జవాబు:
D) నేర్పు

III. ప్రకృతి, వికృతులు:

ప్రశ్న 1.
శక్తి అనే పదానికి వికృతి
A) సత్తి
B) శత్తి
C) స్తుతి
D) సత్తువ
జవాబు:
A) సత్తి

TS 9th Class Telugu Important Questions 10th Lesson వాగ్భూషణం

ప్రశ్న 2.
శాస్త్రము అనే పదానికి వికృతి
A) శాసనము
B) శతరము
C) చట్టము
D) చదును
జవాబు:
C) చట్టము

ప్రశ్న 3.
“స్నేహము” అనే పదానికి వికృతి
A) మైత్రి
B) నెయ్యము
C) నేస్తం
D) దోస్తానా
జవాబు:
B) నెయ్యము

ప్రశ్న 4.
“బాస” అనే పదానికి ప్రకృతి
A) బాష
B) భాష
C) భాషించు
D) బాడుగ
జవాబు:
B) భాష

TS 9th Class Telugu Important Questions 10th Lesson వాగ్భూషణం

ప్రశ్న 5.
పసులు మనకు జీవనాధారాలుగా మారాయి – గీత గీసిన పదానికి ప్రకృతి
A) చెట్లు
B) ధాన్యము
C) పశువులు
D) పసుపు
జవాబు:
C) పశువులు

ప్రశ్న 6.
మనిషి జీవితానికి దీపం చదువు – గీత గీసిన పదానికి వికృతి
A) దివ్యం
B) దీపు
C) లాంతరు
D) దివ్పే
జవాబు:
D) దివ్పే

ప్రశ్న 7.
ఎద, ఎడద, డెందము – అనే వికృతి పదాలు గల ప్రకృతి పదం
A) మనస్సు
B) బింబము
C) మతి
D) హృదయం
జవాబు:
D) హృదయం

TS 9th Class Telugu Important Questions 10th Lesson వాగ్భూషణం

ప్రశ్న 8.
“సద్దు” అనే పదానికి ప్రకృతి
A) శబ్దము
B) సద్దిమూడ
C) సుద్దులు
D) శుద్ధి
జవాబు:
A) శబ్దము

ప్రశ్న 9.
విన్నాణము – అనే పదానికి ప్రకృతి
A) తార్కాణము
B) విజ్ఞానము
C) విజ్ఞాపనము
D) విశేషణము
జవాబు:
B) విజ్ఞానము

ప్రశ్న 10.
“కష్టము” అనే పదానికి వికృతి
A) కర్జము
B) కసటు
C) కస్తి
D) ఉష్ణము
జవాబు:
C) కస్తి

TS 9th Class Telugu Important Questions 10th Lesson వాగ్భూషణం

ప్రశ్న 11.
మంచివక్త కావడానికి కొంత మాత్రమైనా విద్య ఉండడం అవసరం – గీత గీసిన పదానికి వికృతి
A) విద్దె
B) విదియ
C) విదయ
D) చదువు
జవాబు:
A) విద్దె

ప్రశ్న 12.
శ్రోతల హృదయాలలో ఆర్ద్రతను, రసికతను కలిగిస్తారు – గీత గీసిన పదానికి వికృతి
A) ఎదయం
B) ఎరదయం
C) హరదయం
D) ఎద
జవాబు:
D) ఎద

IV. పర్యాయపదాలు :

ప్రశ్న 1.
స్నేహం – అనే పదానికి పర్యాయపదాలు కాని జత.
A) మైత్రి, నెయ్యము
B) దోస్తి, చెలిమి
C) భావం, ద్రోహం
D) సఖ్యం, సంగడి
జవాబు:
C) భావం, ద్రోహం

TS 9th Class Telugu Important Questions 10th Lesson వాగ్భూషణం

ప్రశ్న 2.
కృపాణం, కరవాలం, ఖడ్గము – పర్యాయపదాలుగా గల
A) ఛురిక
B) బాకు
C) కైజారు
D) కత్తి
జవాబు:
D) కత్తి

ప్రశ్న 3.
మిత్రుడు – అనే పదానికి పర్యాయపదాలు
A) స్నేహితుడు, చెలిమి
B) నెచ్చెలికాడు, సఖుడు
C) దోస్తు, నేరం
D) సంగడికాడు, సోదరుడు
జవాబు:
B) నెచ్చెలికాడు, సఖుడు

ప్రశ్న 4.
కనకం మిక్కిలి విలువైన లోహం – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) కాంచనం, స్వర్ణం
B) పుత్తడి, తుత్తునాగం
C) పసిడి, లోహం
D) ధాతువు, బంగారం
జవాబు:
A) కాంచనం, స్వర్ణం

TS 9th Class Telugu Important Questions 10th Lesson వాగ్భూషణం

ప్రశ్న 5.
“తరువు” అనే పదానికి మరొక పర్యాయపదం గుర్తించండి.
A) శాఖ
B) భూరుహం
C) కాండం
D) మేడి
జవాబు:
B) భూరుహం

ప్రశ్న 6.
పలుకు, మాట, భాష, వాణి అనే పర్యాయపదాలు గల పదం
A) వ్యాకరణం
B) పదం
C) వాక్కు
D) ఉచ్చారణ
జవాబు:
C) వాక్కు

ప్రశ్న 7.
నిజం ఎప్పటికి జయిస్తుంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) సత్యము, ఋతము, నిక్కము
B) నిక్కువము, ఎక్కువ, మాట
C) సత్తు, నిబద్ధము
D) ధర్మము, న్యాయము, బాస
జవాబు:
A) సత్యము, ఋతము, నిక్కము

TS 9th Class Telugu Important Questions 10th Lesson వాగ్భూషణం

ప్రశ్న 8.
వివేకము, బోధ – అను పర్యాయపదాలు గల పదం
A) జ్ఞానము
B) తెలివి
C) సంగతి
D) చదువు
జవాబు:
B) తెలివి

ప్రశ్న 9.
వాక్ శక్తి మనిషికి వరప్రసాదం గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) మాట్లాడటం, వినడం
B) బలం, బలపం
C) సత్తువ, బలం
D) బలగం, మాట్లాడటం
జవాబు:
B) బలం, బలపం

ప్రశ్న 10.
శ్రోతల సంఖ్యను బట్టి తన ధ్వనిని వక్త పరిమితులను కల్పించుకోవాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) శబ్దం, చప్పుడు
B) సవ్వడి, గొంతు
C) సద్దు, భయం
D) గొంతు, కంఠం
జవాబు:
D) గొంతు, కంఠం

TS 9th Class Telugu Important Questions 10th Lesson వాగ్భూషణం

V. నానార్థాలు :

ప్రశ్న 1.
అదృష్టము, సంపద – అనే నానార్థాలు కల పదం
A) బంగారం
B) భాగ్యము
C) భోగము
D) వైభవం
జవాబు:
B) భాగ్యము

ప్రశ్న 2.
అక్షరము బాలుడు దిద్దుతున్నాడు – గీత గీసిన పదానికి నానార్థాలు
A) నాశనము లేనిది, కరిగిపోయేది.
B) అంకెలు, సంఖ్యలు
C) నాశనము లేనిది, అకారాది వర్ణమాల
D) అక్కరము, పెంపు
జవాబు:
C) నాశనము లేనిది, అకారాది వర్ణమాల

ప్రశ్న 3.
చిలుక, యుక్తితో మాట్లాడేవాడు అనే నానార్థాలు వచ్చే పదం
A) మేధావి
B) వాగ్మి
C) వాచాలుడు
D) అనువాదకుడు
జవాబు:
B) వాగ్మి

TS 9th Class Telugu Important Questions 10th Lesson వాగ్భూషణం

ప్రశ్న 4.
కళలు మనిషిని మైమరపిస్తాయి – గీత గీసిన పదానికి నానార్థాలు
A) చంద్రుని కళలు, అరవైనాల్గు కళలు
B) నిద్రకళ, శశికళ
C) కళారంగం, కాళిక
D) కలలు, కళలు
జవాబు:
A) చంద్రుని కళలు, అరవైనాల్గు కళలు

ప్రశ్న 5.
“ఊనిక” అనే పదానికి నానార్థాలు
A) ఉచ్చారణకు ఆధారము, ఆలంబన
B) ఊగులాట, ఒక కొలత
C) ఊతం , కొత్తది
D) చేయూత, పాతది
జవాబు:
A) ఉచ్చారణకు ఆధారము, ఆలంబన

ప్రశ్న 6.
శక్తి”ని కొందరు ఆరాధిస్తారు – గీత గీసిన పదానికి నానార్థాలు
A) భుజబలం, యంత్రబలం
B) ఒక ఆయుధం, కారణం
C) బలము, పార్వతి, ఒక ఆయుధం
D) సత్తువ, ద్వారం
జవాబు:
A) భుజబలం, యంత్రబలం

TS 9th Class Telugu Important Questions 10th Lesson వాగ్భూషణం

ప్రశ్న 7.
చింత, అనే పదానికి నానార్థాలు
A) ఒక చెట్టు, భాగము
B) పులుపు, చింతపండు
C) ఒక చెట్టు, విచారము, ఆలోచన
D) కొంచెము, దుఃఖము
జవాబు:
C) ఒక చెట్టు, విచారము, ఆలోచన

ప్రశ్న 8.
రసము అనే పదానికి నానార్థాలు
A) నీరసము, పాదరసము
B) నవరసములు, నీరు, పిండిన సారము
C) ధారణ, ఆరు రుచులు
D) చారు, ద్రవము
జవాబు:
B) నవరసములు, నీరు, పిండిన సారము

ప్రశ్న 9.
శ్వాసకోసం ముక్కును సృష్టికర్త ఏర్పాటు చేసాడు – గీత గీసిన పదానికి నానార్థాలు
A) పుట్టించుట, ప్రవర్తన
B) నడక, నడత
C) సృజించుట, ప్రకృతి
D) స్వభావం, నడత
జవాబు:
C) సృజించుట, ప్రకృతి

TS 9th Class Telugu Important Questions 10th Lesson వాగ్భూషణం

ప్రశ్న 10.
సమస్య పరిష్కరించేటప్పుడు భాషణం మంచి సాధనం – గీత గీసిన పదానికి నానార్థాలు
A) ఉపకరణం, ఉపాయం
B) సాధించు, ఫలితం
C) ఆలోచన, ధైర్యం
D) తెలివి, వివేకం
జవాబు:
A) ఉపకరణం, ఉపాయం

VI. వ్యుత్పత్యర్థములు :

ప్రశ్న 1.
క్షరము (నాశనము) లేనిది – అనే వ్యుత్పత్తి గల పదము
A) అక్షరము
B) క్షీరము
C) భక్షణము
D) వినాశము
జవాబు:
A) అక్షరము

ప్రశ్న 2.
సృష్టి ఆది నుండి ఉన్న నీరు – అనే వ్యుత్పత్తి గల పదము
A) ఆనీరు
B) కన్నీర
C) మున్నీరు
D) పన్నీరు
జవాబు:
C) మున్నీరు

TS 9th Class Telugu Important Questions 10th Lesson వాగ్భూషణం

ప్రశ్న 3.
హృదయం – అనే పదానికి సరియైన వ్యుత్పత్తి
A) సౌందర్యమును గమనించునది (మనస్సు)
B) (సౌందర్యముచే) హరింపబడునది (మనస్సు)
C) సౌందర్యాదులను చూసి సంతోషించునది (మనస్సు)
D) ఒకరికి ఊరక ఇచ్చివేయునది (మనస్సు)
జవాబు:
B) (సౌందర్యముచే) హరింపబడునది (మనస్సు)

ప్రశ్న 4.
“వసుమతి” అనే పదానికి సరియైన వ్యుత్పత్తి
A) (వసు) బంగారము గర్భము నందు కలది (భూమి)
B) వసువు అనే రాజు పాలించునది (భూమి)
C) వసువు మతిగాగలది (భూమి)
D) (వసు) బంగారము అతిగా కలది (భూమి)
జవాబు:
A) (వసు) బంగారము గర్భము నందు కలది (భూమి)

ప్రశ్న 5.
జయింప శక్యము కానివాడు – అనే వ్యుత్పత్తి గల పదం
A) జితుడు
B) జయుడు
C) అజేయుడు
D) విజేత
జవాబు:
C) అజేయుడు

TS 9th Class Telugu Important Questions 10th Lesson వాగ్భూషణం

ప్రశ్న 6.
“బాగుగా దాచబడినది” – అనే వ్యుత్పత్తి గల పదం
A) దాగుకొను
B) నిక్షిప్తము
C) ఆక్షేపణము
D) మరుగుపరచు
జవాబు:
B) నిక్షిప్తము

ప్రశ్న 7.
హరింపబడునది – అనే వ్యుత్పత్తి గల పదం
A) హరి
B) స్వర్గం
C) పాపం
D) హృదయం
జవాబు:
D) హృదయం

ప్రశ్న 8.
నాశనం పొందనిది – అనే వ్యుత్పత్తి గల పదం
A) అక్షరం
B) వయస్సు
C) స్త్రీ
D) కీర్తి
జవాబు:
A) అక్షరం

TS 9th Class Telugu Important Questions 10th Lesson వాగ్భూషణం

ప్రశ్న 9.
సత్పురుషులందు జనించేది – అనే వ్యుత్పత్తి గల పదం
A) పుణ్యం
B) సత్యం
C) న్యాయం
D) ధర్మం
జవాబు:
B) సత్యం

PAPER – II : PART – A

అపరిచిత గద్యాలు

ప్రశ్న 1.
కింది పేరా చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రూపొందించండి.

విజ్ఞానశాస్త్రం ఎంతో పెరిగింది. దానివల్ల మనుషుల ఆలోచనలో మార్పు వచ్చింది. దాని ఫలితంగా జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులన్నీ సాహిత్య ప్రక్రియల్లో కనపడుతూ ఉంటాయి. సామాన్య మనుషుల జీవితం, వాళ్ళ జీవితంలో సమస్యలు చిత్రించి, పరిష్కారం సూచించడమే సాహిత్య ప్రక్రియలు చెయ్యవలసిన పని అనే భావం ఏర్పడింది.

అందువల్ల సాహిత్యం ఇదివరకటిలాగా పండితులకు, జమీందారులకు పరిమితం కాదు. సాహిత్యం కేవలం చదివి ఆనందించడానికే అన్న అభిప్రాయాలు మారిపోయాయి. సామాన్యులలోకి సాహిత్యం వచ్చేసింది. అందుకు అనువైన ప్రక్రియలే కథానిక, నాటిక, ప్రహసనం, నవల మొదలైనవి. అందుకే వీటిలోని భాష వినగానే అర్థమయ్యేటంతగా సరళంగా ఉండటం ప్రధాన లక్షణమైంది. అంతేకాక రోజువారీ జీవితంలో సామాన్య ప్రజలు మాట్లాడే భాషే ‘వ్యావహారికం’ అనే పేరున ఒక స్పష్టమైన రూపంతో పత్రికల వల్ల బాగా ప్రచారం అయింది.

ముఖ్యంగా నాటకాల్లో, నాటికల్లో కథ అంతా పాత్రల సంభాషణ ద్వారానే జరుగుతుంది కనుక, ఆయా పాత్రలకు ఉచితమైన భాష ఆయా పాత్రల చేత పలికించడం అనేది ముఖ్యమైన లక్షణమైంది. ఉదాహరణకి, ఒక నాటికలో ఏమీ చదువుకోని ఒక పల్లెటూరి మనిషి గ్రాంథికభాషలో సంభాషణ జరిపినట్లు రచయిత రాస్తే ఆ నాటిక లక్ష్యమే దెబ్బతిని హాస్యాస్పదం అవుతుంది.
జవాబు:
ప్రశ్నలు

  1. దేనివల్ల మనుషుల ఆలోచనలో మార్పు వచ్చింది ?
  2. సాహిత్య ప్రక్రియలు చెయ్యవలసిన పని ఏమిటి ?
  3. భాషకు ప్రధాన లక్షణం ఏమిటి ?
  4. వ్యావహారికం అంటే ఏమిటి ?
  5. నాటకాల్లో, నాటికల్లో వాడే భాషకు ముఖ్యమైన లక్షణమేది ?

TS 9th Class Telugu Important Questions 10th Lesson వాగ్భూషణం

ప్రశ్న 2.
కింది పేరా చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రూపొందించండి.

భాష నేర్చుకోవడం రెండు రకాలు. భాష కోసం భాష, విషయం కోసం భాష, భాషా స్వరూప స్వభావాలను సమగ్రంగా అధ్యయనం చేయడం మొదటి రకంలోనిది. శాస్త్ర సాంకేతిక విషయాలను, సాహిత్య సాంస్కృతిక విషయాల వంటి వాటినీ అధ్యయనం చెయ్యడం రెండో రకంలోనిది. అలాగే భాష కూడా రెండు రకాలుగా తయారయింది. ప్రాచీన (కావ్య) భాష, ఆధునిక (ప్రమాణ) భాష.

సాహిత్యంలో తరతరాల వారసత్వాన్ని అవగాహన చేసుకొని ఆనందించడానికి ప్రాచీన భాష ఉపయోగిస్తుంది. కాని దాన్ని గురించి చెప్పడానికీ, రాయడానికీ ఆధునిక భాషే కావాలి. ఎందువల్లనంటే ఏ కాలంలో జీవించేవాడి ఆలోచనా, అలవాట్లూ ఆ కాలంనాటి భాషలోనే సాగుతుంటాయి కనుక. ప్రాచీన భాష ప్రయోజనం పరిమితం. ఆధునిక భాష ప్రయోజనం అపరిమితం. వివిధ శాస్త్ర విషయాలను వివరించడానికే కాదు, పూర్వ భాషా సాహిత్యాలను వివరించడానికి కూడా ఆధునిక భాషే కావాలి.
జవాబు:
ప్రశ్నలు

  1. భాషను ఏయే రకాలుగా నేర్చుకొంటాము ?
  2. భాష ఎన్ని రకాలుగా తయారయింది ?
  3. ప్రాచీన భాష ఎందుకు ఉపయోగిస్తుంది ?
  4. ఆధునిక భాష ఉపయోగం ఏమిటి ?
  5. ఏ భాష ప్రయోజనం పరిమితం ?

TS 9th Class Telugu Important Questions 10th Lesson వాగ్భూషణం

PAPER – II : PART – B

భాషాంశాలు – వ్యాకరణం

కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.

I. సంధులు:

ప్రశ్న 1.
సవర్ణదీర్ఘ సంధికి ఉదాహరణ కానిది.
A) అల్ప + అక్షరము
B) రస + ఆనందము
C) దీర్ఘ + ఉపన్యాసము
D) అనల్ప + అర్థము
జవాబు:
C) దీర్ఘ + ఉపన్యాసము

ప్రశ్న 2.
గుణసంధికి ఉదాహరణ కానిది.
A) పరభాగ్య + ఉపజీవి
B) యథా + ఉచితం
C) సు + ఉక్తి
D) కళా + ఉపాసన
జవాబు:
C) సు + ఉక్తి

ప్రశ్న 3.
ప్రతి + ఏకత → ప్రత్యేకత. ఇది ఏ సంధి ?
A) గుణసంధి
B) ఇత్వసంధి
C) యణాదేశ సంధి
D) యడాగమ సంధి
జవాబు:
C) యణాదేశ సంధి

TS 9th Class Telugu Important Questions 10th Lesson వాగ్భూషణం

ప్రశ్న 4.
ఆమ్రేడిత సంధికి ఉదాహరణ
A) మొదట + మొదట
B) నిడు + ఊర్పు
C) ఏక + ఏక
D) ప్రతి + ఏకత
జవాబు:
A) మొదట + మొదట

ప్రశ్న 5.
వీరందరూ విద్యార్థులు – గీత గీసిన పదం ఏ సంధి ?
A) సరళాదేశ సంధి
B) సవర్ణదీర్ఘ సంధి
C) విసర్గ సంధి
D) స్వాధి సంధి
జవాబు:
B) సవర్ణదీర్ఘ సంధి

ప్రశ్న 6.
ప్రణాళికలు అభ్యుదయమునకు బాటలు కావాలి – గీత గీసిన పదాన్ని విడదీస్తే
A) భ్యు + దయము
B) ఉ + ఉదయం
C) అభి + ఉదయం
D) అభ్యు + ఉదయం
జవాబు:
C) అభి + ఉదయం

TS 9th Class Telugu Important Questions 10th Lesson వాగ్భూషణం

ప్రశ్న 7.
రాముడు + అతడు; పద్యము + అడిగె అనే సంధి విడదీసిన పదములలో పూర్వ పరస్వరములు
A) ఉ + అతడు
B) ఉ + అడిగె
C) ఉ + అ
D) డు + ము
జవాబు:
C) ఉ + అ

ప్రశ్న 8.
క్రింది వానిలో త్రికములు
A) ఆ, ఈ, ఏ
B) ఏ, ఓ, అర్
C) ఇ, ఉ, ఋ
D) అ, ఇ, ఉ
జవాబు:
A) ఆ, ఈ, ఏ

ప్రశ్న 9.
క్రింది వానిలో పరుషములు
A) క, చ, ట, త, ప
B) గ, స, డ, ద, వ
C) గ, జ, డ, ద, బ
D) క, చ, ట, త, ప
జవాబు:
D) క, చ, ట, త, ప

TS 9th Class Telugu Important Questions 10th Lesson వాగ్భూషణం

ప్రశ్న 10.
ప్రథమ మీది పరుషములకు ఆదేశముగా వచ్చు అక్షరములు
A) క, చ, ట, ద, బ
B) గ, జ, డ, త, ప
C) గ, జ, డ, ద, బ
D) చ, త, ప, స, ద, వ
జవాబు:
A) క, చ, ట, ద, బ

ప్రశ్న 11.
ఇ, ఉ, ఋ లకు ఏ, ఓ, అర్లు ఆదేశంగా రావాలంటే ముందు ఉండవలసిన అచ్చు
A) ఇకారం
B) కారం
C) అకారం
D) ఋకారం
జవాబు:
C) అకారం

II. సమాసాలు:

ప్రశ్న 1.
షష్ఠీ తత్పురుష సమాసమునకు ఉదాహరణ
A) ప్రజా హృదయాలు
B) విద్యావిజ్ఞానాలు
C) ధీరోదాత్తులు
D) అప్రతిహతము
జవాబు:
A) ప్రజా హృదయాలు

TS 9th Class Telugu Important Questions 10th Lesson వాగ్భూషణం

ప్రశ్న 2.
వాక్కు అనెడు భూషణము. ఈ విగ్రహవాక్యం ఏ సమాసము ?
A) విశేషణ పూర్వపదము
B) సంభావనా పూర్వపదము
C) రూపక సమాసము
D) బహువ్రీహి
జవాబు:
C) రూపక సమాసము

ప్రశ్న 3.
వ్యంగ్యమైన అర్థం అనే విగ్రహవాక్యాన్ని సమాసంగా మార్చగా
A) వ్యంగ్యానికి అర్ధం
B) వ్యంగ్యార్థం
C) వ్యంగ్యముల అర్థం
D) వ్యంగ్యం అర్థం
జవాబు:
B) వ్యంగ్యార్థం

ప్రశ్న 4.
“అంతము కానిది” విగ్రహవాక్యమును సమాసంగా మార్చగా
A) అంతంత మాత్రం
B) అనంతము
C) అనంతపురము
D) విశ్వం
జవాబు:
B) అనంతము

TS 9th Class Telugu Important Questions 10th Lesson వాగ్భూషణం

ప్రశ్న 5.
మన శక్తిసామర్ధ్యాలు పెంచుకోవాలి – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం
A) శక్తికి తగిన సామర్థ్యం
B) శక్తికి మించిన సామర్థ్యం
C) శక్తి మరియు సామర్థ్యం
D) శక్తి వలన సామర్థ్యం
జవాబు:
C) శక్తి మరియు సామర్థ్యం

ప్రశ్న 6.
మన పఠనాసక్తి గ్రంథాలయం తీరుస్తుంది – గీత గీసిన పదం ఏ సమాసం ?
A) సప్తమీ తత్పురుష
B) షష్ఠీ తత్పురుష
C) పంచమీ తత్పురుష
D) ద్వంద్వ సమాసము
జవాబు:
A) సప్తమీ తత్పురుష

ప్రశ్న 7.
ధీరుడును, ఉదాత్తుడను – సమాసనామం
A) విశేషణ పూర్వపద కర్మధారయం
B) విశేషణ ఉభయపద కర్మధారయం
C) ద్వంద్వ సమాసం
D) షష్ఠీ తత్పురుష సమాసం
జవాబు:
B) విశేషణ ఉభయపద కర్మధారయం

TS 9th Class Telugu Important Questions 10th Lesson వాగ్భూషణం

ప్రశ్న 8.
యథోచితము – అనే సమాసపదమునకు విగ్రహవాక్యము
A) యథా ఉచితము
B) యథాకు ఉచితము
C) ఉచితమునకు తగినట్లు
D) యథా వంటి ఉచితము
జవాబు:
C) ఉచితమునకు తగినట్లు

ప్రశ్న 9.
అప్రతిహతము – సమాసనామము
A) నఞ తత్పురుష
B) ప్రథమా తత్పురుష
C) నజ్ తత్పురుష
D) నయ్ తత్పురుష
జవాబు:
A) నఞ తత్పురుష

ప్రశ్న 10.
ఉభయ పదార్థ ప్రధానము
A) ద్విగు సమాసము
B) ద్వంద్వ సమాసము
C) షష్ఠీ తత్పురుష
D) బహువ్రీహి
జవాబు:
B) ద్వంద్వ సమాసము

TS 9th Class Telugu Important Questions 10th Lesson వాగ్భూషణం

ప్రశ్న 11.
సంఖ్య ముందుగా (విశేషణంగా) వచ్చే సమాసం
A) ద్విగు సమాసము
B) ద్వంద్వ సమాసము
C) షష్ఠీ తత్పురుష
D) బహువ్రీహి
జవాబు:
A) ద్విగు సమాసము

III. వాక్యములు :

ప్రశ్న 1.
“వారు ఏమీ ఆలోచించ నక్కరలేదా ?” అని ప్రశ్నించారు. పరోక్ష కథనంలో రాయగా
A) వారు ఏమీ ఆలోచించ నక్కరలేదని చెప్పారు.
B) వారు ఆలోచించి ఏమీ అక్కరలేదన్నారు.
C) ఏమీ ఆలోచించనక్కరలేదని, వారన్నారు.
D) ఏమీ ఆలోచించారు మీరు అన్నారు వారు.

ప్రశ్న 2.
‘మంచివక్త మంచి ఉపన్యాసం ఇస్తాడు”. కర్మణి వాక్యంగా మార్చి రాయగా
A) మంచివక్తకు మంచి ఉపన్యాసం ఇవ్వబడుతుంది.
B) మంచివక్త నుండి మంచి ఉపన్యాసం ఇవ్వబడుతుంది.
C) మంచివక్త చేత మంచి ఉపన్యాసం ఇవ్వబడుతుంది.
D) మంచివక్తలే మంచి ఉపన్యాసకులుగా గుర్తించబడుతారు.
జవాబు:
C) మంచివక్త చేత మంచి ఉపన్యాసం ఇవ్వబడుతుంది.

TS 9th Class Telugu Important Questions 10th Lesson వాగ్భూషణం

ప్రశ్న 3.
“గొల్లపూడి మంచి నటుడు, గొల్లపూడి మంచి రచయిత.” సంయుక్త వాక్యంలోకి మార్చి రాయగా
A) గొల్లపూడికి మంచి నటుడుగానే గాక గొల్లపూడి మంచి రచయిత అనవచ్చు.
B) గొల్లపూడి మంచి నటుడుగాను, గొల్లపూడి మంచి రచయితగాను కీర్తి పొందాడు.
C) గొల్లపూడి మంచినటుడు మరియు రచయిత.
D) మంచి నటుడిగా, మంచి రచయితగా గొల్లపూడి పేరు చెప్పవచ్చు.
జవాబు:
C) గొల్లపూడి మంచినటుడు మరియు రచయిత.

ప్రశ్న 4.
లింగయ్య చేత ఉసిరికాయ తీసి నాయకునికి ఇవ్వబడింది. కర్తరి వాక్యంలోకి మార్చండి.
A) లింగయ్య ఉసిరికాయ తీసి నాయకునికి ఇచ్చాడు.
B) ఉసిరికాయ లింగయ్య చేత నాయకుడు తీసుకున్నాడు.
C) లింగయ్య ఉసిరికాయతో నాయకునికి ఇచ్చాడు.
D) లింగయ్య, నాయకుడు ఉసిరికాయ తీసి ఇచ్చాడు.
జవాబు:
A) లింగయ్య ఉసిరికాయ తీసి నాయకునికి ఇచ్చాడు.

IV. అలంకారాలు :

ప్రశ్న 1.
నా చొక్కా మల్లెపూవు వలె తెల్లగా ఉన్నది – ఈ వాక్యములో ఉన్న అలంకారము
A) ఉత్ప్రేక్ష
B) ఉపమా
C) ఛేకానుప్రాస
D) రూపక
జవాబు:
B) ఉపమా

TS 9th Class Telugu Important Questions 10th Lesson వాగ్భూషణం

ప్రశ్న 2.
వంటశాల గంట ఒంటిగంటకు మోగింది ఈ వాక్యంలో ఉన్న అలంకారం
A) అంత్యానుప్రాస
B) ఛేకానుప్రాస
C) వృత్త్యనుప్రాస
D) యమకము
జవాబు:
C) వృత్త్యనుప్రాస

ప్రశ్న 3.
కురిసింది వానజల్లు; మెరిసింది హరివిల్లు; చిరునవ్వుల విరిజల్లు. ఈ వాక్యాలలో ఉన్న అలంకారం
A) ఛేకానుప్రాస
B) అంత్యానుప్రాస
C) లాటానుప్రాస
D) లాటానుప్రాస
జవాబు:
B) అంత్యానుప్రాస

ప్రశ్న 4.
శార్దూల పద్యానికి యతి
A) 12వ అక్షరం
B) 13వ అక్షరం
C) 14వ అక్షరం
D) యతిలేదు
జవాబు:
B) 13వ అక్షరం

TS 9th Class Telugu Important Questions 10th Lesson వాగ్భూషణం

TS 9th Class Telugu Grammar వ్యాసాలు

Telangana SCERT 9th Class Telugu Grammar Telangana వ్యాసాలు Questions and Answers.

TS 9th Class Telugu Grammar వ్యాసాలు

1. వాతావరణ కాలుష్యం

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు పెద్దలు. వాతావరణం పరిశుభ్రంగా ఉండి, చక్కటి ఆరోగ్యకరంగా ఉంటే మానవుని జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. మానవునికి హానికరమైన పదార్థాలు వాతావరణంలో కలిసి ఉంటే దానిని వాతావరణ కాలుష్యం అంటారు.

వివిధ కర్మాగారాలు, పరిశ్రమలు, లెక్కలేనన్ని మోటారు వాహనాలు, మురికినీరు మొదలైనవి వాతావరణ కాలుష్యానికి కారణాలు. కర్మాగారాల వల్ల నదులన్నీ మురికినీటితో నిండిపోయి జలకాలుష్యం ఏర్పడుతోంది. పరిశ్రమలవల్ల గాలి కలుషితమవుతోంది. ‘మోటారు వాహనాల వల్ల నగరాలలోను, పట్టణాలలోను ధ్వని కాలుష్యం ఎక్కువవుతోంది.

వాతావరణ కాలుష్యం చాలా భయంకరంగా తయారయింది. పారిశ్రామికీకరణ వల్ల ఈ సమస్య మరీ ఘోరంగా తయారయింది. వాతావరణ కాలుష్యం మానవుని మనుగడకే పెద్ద సవాలుగా పరిణమించింది. దీనివల్ల ఉదరకోశవ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కేన్సర్, గుండెజబ్బుల వంటి వ్యాధులు పెరిగిపోతున్నాయి.

TS 9th Class Telugu Grammar వ్యాసాలు

వాతావరణ కాలుష్య నివారణకు ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రణాళికలు తయారుచేసి అమలు చేయాలి. పరిశ్రమలు, కర్మాగారాలు మానవుల నివాసాలకు దూరంగా నెలకొల్పాలి. ప్రతి వ్యక్తి తనఇంటినీ, పరిసరాలనూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అవకాశం ఉన్నచోట మొక్కలను విరివిగా పెంచాలి. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్యసంస్థలు పరిశోధనలు చేసి వాతావరణ కాలుష్య నివారణకు తగు సూచనలు చేశాయి. వాటిని మనం విధిగా పాటించాలి.

2. బాలకార్మికులు

నిరక్షరాస్యత, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, కరవు కాటకాల కారణంగా లక్షలాది పిల్లలు చిన్న వయస్సులోనే కార్మికులుగా చేరుతున్నారని అంతర్జాతీయ కార్మిక నిర్వహణ సంస్థ (ఐ.ఎల్.ఒ.) తన సర్వేలో వెల్లడించింది.

ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా భారతదేశంలో బాలకార్మిక వ్యవస్థ ఉందని ఐ.ఎల్.ఒ. నిర్వహించిన సర్వేలో తెలియజేసింది. దేశంలో ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా బాలకార్మికులు ఉన్నారని ఆ నివేదికలో పేర్కొన్నారు.

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పలు సందర్భాలలో చేస్తున్న ప్రకటనలు కేవలం ప్రకటనలుగానే మిగిలిపోతున్నాయి. కాబట్టి నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసి అది అమలు జరిగేటట్లు చూడాలి. ప్రభుత్వం రూపొందించిన బాలకార్మిక నియంత్రణ చట్టం సరిగా అమలు అయ్యేటట్లు చూడాలి.

భారతదేశంలో 8.7 కోట్ల మంది బాలలు పాఠశాలలకు వెళ్ళడం లేదని, వీరంతా ఇళ్ళలోను, కర్మాగారాల్లోను, పొలాల్లోను పని చేస్తున్నారని ‘గ్లోబల్ మార్చ్ ఎగనెస్ట్ చైల్డ్ లేబర్’ అనే అంతర్జాతీయ సంస్థ పేర్కొంది. కాబట్టి బాలకార్మికుల కోసం ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పాలి. వాళ్ళు చదువుకొనే అవకాశం కల్పించాలి.

మన రాష్ట్రంలో 16 లక్షల మంది బాలకార్మికులు ఉన్నారు. బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా రూపుమాపేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నది.

TS 9th Class Telugu Grammar వ్యాసాలు

బాలకార్మికులను కూలివారుగానే చూస్తే వారు కార్మికులుగానే మిగిలిపోతారు. వారిలో ఉన్న యోగ్యతను, ప్రతిభను వెలికి తీసేందుకు సహకారం అందజేస్తే భవిష్యత్తులో ఒక మంచి నిపుణుడిని అందించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

3. కరవు నివారణోపాయాలు

అనావృష్టి వల్ల కరవు వస్తుంది. వరుసగా కొన్నేండ్లు కరువు వస్తే క్షామం ఏర్పడుతంది. సామాన్య వర్షపాతంలో 75% కన్నా తక్కువ వర్షపాతం ఉండే స్థితిని ‘కరవు’గాను, 50% కన్నా తక్కువ వర్షపాతం ఉండే స్థితిని ‘తీవ్రమైన కరవు’ గాను భారత వాతావరణ శాఖ నిర్వచించింది.

ఋతుపవనాల నియమరహిత స్వభావం వల్ల దేశంలో ఏదో ఒకచోట ప్రతి సంవత్సరం తరచుగా కరవులు సంభవిస్తున్నాయి. ఎక్కువగా వాయవ్య భారతదేశం, ఆ తరువాత దక్షిణ మరియు మధ్య భారతదేశంలో తరచుగా కరవులు సంభవిస్తున్నాయి. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడులు ౬తిగా కరవులు సంభవించే రాష్ట్రాలు.

వారణోపాయాలు :

  1. కరవు పీడిత ప్రాంతాలలో భూమిశిస్తు పూర్తిగా తొలగించడం గానీ, తగ్గించడం గానీ చేయాలి.
  2. క్షామపీడిత ప్రాంతాలలో ప్రజలు తిరిగి వ్యవసాయం చేసుకొనేందుకు వీలుగా ఆర్థిక సహాయం అందించడం, నీటిపారుదల సౌకర్యాలు కలిగించడం వంటివి చేయాలి.
  3. ఆయా ప్రాంతాల అవి ఏయే పంటలు వేస్తే బాగా పండుతాయో వ్యవసాయదారులకు సూచనలిచ్చాలి.
  4. పండిన పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కలిగించాలి.
  5. తుపానులు వచ్చినపుడు తట్టుకొని, నిలబడి పంటనిచ్చే కొత్త రకాలను శాస్త్రజ్ఞులు కనిపెట్టాలి.
  6. వాతావరణ సమతౌల్యాన్ని కాపాడాలి.

TS 9th Class Telugu Grammar వ్యాసాలు

కరవు నష్టాలను తగ్గించేందుకు భారత ప్రభుత్వం “కరవుకు గురయ్యే ప్రాంతాల ప్రణాళిక (Drought prone area programme) ప్రవేశపెట్టింది. ఈ ప్రణాళికలో నీటిపారుదల, మృత్తికా పరిరక్షణ, వనీకరణ మొదలగు పథకాలున్నాయి. ప్రభుత్వమేకాకుండా ప్రజలు కూడా మానవతా దృష్టితో కరవుపీడిత ప్రాంతీయులను ఆదుకోవడం తమ కర్తవ్యంగా భావించాలి.

4. పర్యావరణ సంరక్షణ

భూమి, నీరు, గాలి మొదలైన వాటితో మనిషికి ఉండే అవినాభావ సంబంధమే పర్యావరణం. కాబట్టి పర్యావరణం అంటే పరిసరాల వాతావరణం అని అర్థం. పరిసరాల వాతావరణం కలుషితం కాకుండా కాపాడుకోవడమే పర్యావరణ సంరక్షణ అనబడుతుంది.

ప్రాణులు నివసించేది నేలపైన గదా ! ఆ నేలతల్లిని సరిగా చూసుకోవాలి. భూమిపై చెత్తా, చెదారమే కాదు ఓషధులుంటాయి. చెట్లుంటాయి.: జంతువులుంటాయి. మనం జీవించటానికి ఆహారం లభించేది భూమి వల్లనే గదా ! రసాయనిక ఎరువుల వాడకం వల్ల భూమి నిస్సారమైపోతోంది. భూమిని ఆరోగ్యంగా ఉంచాలి. భూమి సమతౌల్యాన్ని పోషించాలి.

జలకాలుష్యం మిక్కిలి భయంకరమైనది. రసాయనిక పదార్థాలు, పరిశ్రమల వల్ల విడుదలయ్యే ద్రవపదార్థాలు సాగునీటిని, త్రాగేనీటిని కాలుష్యపరుస్తాయి. మురుగునీరు, త్రాగేనీరు అనే భేదం లేకుండా పోతోంది. డ్రైనేజీ వ్యవస్థ అరకొరగా ఉంది. దీనివల్ల కలరా, మలేరియా ఫ్లోరోసిస్, విషజ్వరం, టైఫాయిడ్ వంటివేకాక వైద్యులకి అంతుపట్టని కొత్త రోగాలు కూడా బయలుదేరాయి.

ఇక వాయు కాలుష్యం, గాలివల్లనే మనం జీవిస్తున్నాం. అటువంటి గాలి స్వచ్ఛంగా ఉండాలి. కానీ ఆధునిక పారిశ్రామికత పేరుతో గాలి కూడా కలుషితమైపోతోంది. విషపూరితమైన గాలి పీల్చటం వలన ఊపిరితిత్తులు, జీర్ణకోశం, గుండెకాయ, కళ్ళు అనారోగ్యానికి గురై ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జీవితం రోగాలమయం అవుతోంది.

TS 9th Class Telugu Grammar వ్యాసాలు

యంత్రాలవల్ల, వాహనాల వల్ల ధ్వనికాలుష్యం వ్యాపిస్తోంది. అణుశక్తి పరీక్షల వల్ల కూడా వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది. 1970లో అమెరికాలో పర్యావరణ పరిరక్షణ ఉద్యమం బయలుదేరింది. వాటి నుంచి శాస్త్రజ్ఞులు పర్యావరణ కాలుష్యనివారణకు విశేషమైన కృషి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీని పర్యావరణ దినోత్సవంగా పాటిస్తున్నారు. పర్యావరణ వ్యవస్థలోని సమతౌల్యాన్ని కాపాడుకోవటానికి అందరూ కృషి చేయాలి.

5. విద్యార్థులు – క్రమశిక్షణ

విద్యను అర్థించేవారు విద్యార్థులు. క్రమశిక్షణ అంటే సక్రమమైన ప్రవర్తనని కలిగిఉండటం. నిజానికి క్రమశిక్షణ అన్ని వర్గాలవాళ్ళకీ, అన్ని వయస్సుల వాళ్ళకీ అవసరమే. అయితే విద్యార్థులు భావిభారత పౌరులు! జాతి భవిష్యత్తు వాళ్ళమీదే ఆధారపడి ఉంది. “మొక్కై వంగనిదే మానై వంగునా !” అన్నారు. చిన్నప్పుడే క్రమశిక్షణ అలవడటం సాధ్యం. పెద్దయిన తర్వాత మనిషి మారటం చాలా కష్టం. అందుకని విద్యార్థుల్లో క్రమశిక్షణ ఉండాలి.

అయితే విద్యార్థుల్లో క్రమశిక్షణ ఎందుకు లోపిస్తోంది ? అనే అంశాన్ని లోతుగా పరిశీలించవలసి ఉంది. అందుకు కొన్ని
కారణాలు :

  1. కావలసిన కోర్సులో సీటు దొరకకపోవడం కావలసిన రంగంలో ఉద్యోగం దొరకకపోవడం.
  2. రాజకీయ పార్టీల, నాయకుల ప్రభావం, జోక్యం.
  3. విద్యాలయాల్లో అవినీతి, అవకతవకల పరంపరలు !
  4. ప్రభుత్వం విద్యను వ్యాపారంగా చేయడం.
  5. తల్లిదండ్రుల అశ్రద్ధ, అలసత్వం.

ఇన్ని కారణాలతో పాటు పేర్కొనవలసిన మరొక రెండు ముఖ్యమైన అంశాలున్నాయి – ఒకటి సినిమా, రెండు టీ.వీ ! ఈ రెండూ మానసిక వికాసానికి, జ్ఞానాభివృద్ధికి ఉద్దేశించబడ్డాయి. కానీ పాశ్చాత్య విషసంస్కృతి ప్రభావంచే ఈ రెండు ప్రసార సాధనాలూ యువకులపై, విద్యార్థులపై “స్లోపాయిజన్” లా పనిచేస్తున్నాయి.

విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడాలంటే ముందుగా –

  1. విద్యను వ్యాపారంగా మార్చే ధోరణులపై కఠిన వైఖరి అవలంభించాలి.
  2. విద్యారంగంలోని అవకతవకల్ని, అవినీతిని (లీకేజీ, మాస్ కాపీయింగ్ సంప్రదాయాల్ని) అరికట్టాలి.
  3. ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో, ఆదర్శవంతంగా ప్రవర్తిస్తూ బోధనకి అంకితమవ్వాలి.
  4. రాజకీయ పార్టీల నీడ కూడా విద్యాలయాలపై పడకూడదు.
  5. విద్యాభ్యాసం తర్వాత ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీ ఉండాలి.
  6. విద్యార్థుల్లో దేశభక్తి, సచ్ఛీలత, సహనం అలవడేలా తగిన చర్యలు తీసుకోవాలి.

TS 9th Class Telugu Grammar వ్యాసాలు

క్రమశిక్షణ ఇతరులు బలవంతంగా రుద్దినట్లు ఉండకూడదు. ఆత్మగౌరవానికి సంబంధించినదిగా, ఆత్మశక్తికి సంబంధించినదిగా, జీవితధ్యేయంగా క్రమశిక్షణను అలవరచుకోవాలి. అప్పుడు విద్యార్థులతో పాటు దేశం కూడా అక్షరజ్యోతిగా వెలిగి అభివృద్ధి బాటలో పయనిస్తుంది.

6. దూరదర్శన్

విజ్ఞానశాస్త్ర ప్రగతికి, మానవుడి ప్రతిభకి నిదర్శనం టెలివిజన్ దృశ్యతరంగాలను గాలిలో ప్రసారం చేయటం ద్వారా దృశ్యాలు చూడగలుగుతున్నాం. శబ్దతరంగాల ద్వారా శబ్దం వింటున్నాం. టెలివిజన్ ను మానవుడి ప్రతిసృష్టిగా పేర్కొనాలి. ఇది బ్రిటన్లో 1936లో మొదట వ్యాప్తిలోకి వచ్చింది. దీనిని స్కాట్ దేశపు ఇంజనీర్ జాన్ లాగ్ బైర్డ్ 1928లో కనిపెట్టాడు.

టెలివిజన్ ఈనాడు ప్రపంచమంతటా వ్యాప్తిచెందింది. టీ.వీ.లు లేని ఊరులేదు. ఇది కేవలం ప్రచార సాధనమో, వినోద సాధనమో కాదు. టీ.వీ.ల ద్వారా ప్రభుత్వం, వాణిజ్యసంస్థలు ప్రచారం చేసుకోవచ్చు. మన సంస్కృతిని, కళలను కాపాడుకోవచ్చు. మనం చూడలేని ప్రదేశాలు చూడవచ్చు.

ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచాన్ని మన ముందు నిలబెట్టేది టెలివిజన్, విద్యారంగంలో, వైద్యరంగంలో, వాణిజ్యరంగంలో, విజ్ఞానశాస్త్ర రంగంలో నేడు టెలివిజన్కు తిరుగులేని స్థానం ఉంది. “వీడియో” పరిజ్ఞానానికి టీ.వీ. మూలకారణం. నిరక్షరాస్యత నిర్మూలనలో టెలివిజన్ కీలకపాత్ర వహిస్తోంది. ప్రజల్ని అన్ని రంగాలలోనూ చైతన్యవంతం చేస్తున్న శక్తివంతమైన సాధనం టెలివిజన్.

విదేశీ ఛానల్స్ ప్రసారం వల్ల యువత నిర్వీర్యమవుతోంది. మన సంస్కృతిని విస్మరిస్తున్నారు. సినిమాల వ్యామోహం, సెక్స్ వ్యామోహం ఎక్కువై పెడదారి పడుతున్నారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం పిల్లలపై టీ.వీ.లు దుష్ప్రభావం చూపిస్తున్నాయని వెల్లడైంది.

కాబట్టి టెలివిజన్ని మంచికి ఉపయోగించుకొనేలా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రైవేట్ ఛానల్స్ను నియంత్రించి వాటిపై సెన్సారు అధికారాన్ని కలిగిఉండాలి. అప్పుడే టీ.వీ. వల్ల సత్ప్రయోజనాలుంటాయి.

TS 9th Class Telugu Grammar వ్యాసాలు

7. గ్రంథాలయాలు

“చిరిగిన చొక్కా అయినా తొడుక్కో – కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో” అన్నది సూక్తి. ఇటువంటి సూక్తులెన్నో పుస్తకాల ప్రాముఖ్యాన్ని, ప్రాశస్త్యాన్ని వివరించేవి ఉన్నాయి. తరతరాల విజ్ఞాన సంపదను అందించేవి గ్రంథాలు. అటువంటి గ్రంథాలు గల నివాసాన్ని గ్రంథాలయం (Library) అంటారు.

అయ్యంకి వెంకట రమణయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు; నాళం కృష్ణారావు మొదలైనవాళ్ళు మన రాష్ట్రంలో గ్రంథాలయోద్యమాన్ని చేపట్టి గ్రంథాలయాలను స్థాపించారు. గ్రంథాలయ మహాసభలు నిర్వహించి పుస్తకాలను సేకరించి భద్రపరిచారు.

ప్రపంచంలో గొప్ప గొప్ప గ్రంథాలయాలున్నాయి. అమెరికాలో గల ‘కాంగ్రెసు లైబ్రరీ’, రోము నగరంలోని ‘వాటికన్ లైబ్రరీ’,’ ‘’బ్రిటిష్ లైబ్రరీ’ మొదలైనవి ప్రపంచంలో పేరొందాయి. మన దేశంలో చెన్నైలోని “కన్నెమరా” గ్రంథాలయం, తంజావూరులోని “సరస్వతీ మహలు”, వేటపాలెంలోని “సారస్వత నికేతనం”, హైదరాబాదులోగల “శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం” మొదలైనవి చెప్పుకోదగ్గవి చాలా ఉన్నాయి. కడపలో సి.పి. బ్రౌన్ స్మారక గ్రంథాలయం కూడా నెలకొల్పబడింది.

గ్రంథాలయాలలో చాలా రకాలున్నాయి. ప్రభుత్వ గ్రంథాలయాలు, స్వచ్ఛంద సంస్థల గ్రంథాలయాలు ఉన్నాయి.
గ్రంథాలయాల వల్ల చాలా లాభాలున్నాయి :

  1. గ్రంథాలయాలు మనిషిని మనీషిగా మారుస్తాయి.
  2. మహామేధావులు తరతరాలుగా సంపాదించిన అనుభవాలు, ఆలోచనలు గ్రంథాలలో భద్రపరచబడతాయి.
  3. దేశాభ్యుదయానికి, సమాజవికాసానికి మూలస్తంభాలు గ్రంథాలయాలు.
  4. గ్రంథపఠనమనే మంచి అలవాటు అలవడుతుంది.
  5. గ్రంథాలు తండ్రివలె ఆదేశిస్తాయి. తల్లివలె లాలిస్తాయి. మిత్రుని వలె ఆదుకుంటాయి. గురువువలె ప్రబోధిస్తాయి.

గ్రంథాలయాధికారులు పుస్తకాలు కొనేటప్పుడు అత్యంత శ్రద్ధ వహించాలి. డబ్బును దుర్వినియోగం చెయ్యకుండా మంచి పుస్తకాలనే కొనాలి. హాని కలిగించే పుస్తకాలను నిర్మొహమాటంగా తిరస్కరించాలి. పోటీ పరీక్షలకి, ఉద్యోగ పరీక్షలకి, చదువుకి కావలసిన పాఠ్య గ్రంథాలు, క్విజ్ పుస్తకాల వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వం గ్రంథాలయోద్యమాన్ని నీరుకార్చకుండా తగిన శ్రద్ధవహిస్తే సమాజం అభ్యుదయ పథంలో పయనిస్తుంది.

TS 9th Class Telugu Grammar వ్యాసాలు

8. కంప్యూటర్

కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం. కంప్యూటర్లో ‘డేటా’ (Data) ను నిల్వచేయవచ్చు. దాన్ని మళ్ళీ ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. అంతేకాకుండా కంప్యూటర్ చాలా కచ్చితంగా, త్వరగా ఫలితాన్ని ఇస్తుంది. ఇటువంటి అద్భుత సాధనమైన కంప్యూటర్ను కనిపెట్టినవాడు ఛార్లెస్ బాబ్బేజి.

కంప్యూటర్ గురించి మాట్లాడినప్పుడు మనం తరచుగా హార్డువేర్, సాఫ్ట్వేర్ అనే పదాలను వింటూ ఉంటాం. హార్డువేర్ అంటే కంప్యూటర్ పరికరాలు. సాఫ్ట్వేర్ అంటే కంప్యూటర్ పనిచేయడానికి కావలసిన పద్ధతిని తెలిపేది.

కంప్యూటర్లను ఉపయోగించి ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నారు. కూడికలు, తీసివేతలు, గుణకారాలు (హెచ్చవేతలు), భాగహారాలు వంటి లెక్కలు చాలా వేగంగా చేయడానికి కంప్యూటర్ బాగా పనికివస్తుంది. కంప్యూటర్ల ద్వారా వాతావరణ పరిస్థితిని తెలుసుకోవచ్చు. విమానాలు, బస్సులు, రైళ్ళు మొదలైనవాటి టెక్కెట్ల రిజర్వేషన్లకు కంప్యూటర్లను ఉపయోగిస్తారు.

పెద్ద పెద్ద కర్మాగారాల్లో, కార్యాలయాల్లో, బ్యాంకుల్లో ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. విద్య, వైద్య, వ్యాపార, వ్యవసాయ, సమాచార, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఈ కంప్యూటర్లు ప్రముఖపాత్ర వహిస్తున్నాయి. కంప్యూటర్ను ఉపయోగించి ఇంటర్ నెట్ అనే సౌకర్యం ద్వారా ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నింటినీ మన ఇంట్లోని కంప్యూటర్ ముందు కూర్చొని తెలుసుకోవచ్చు.

అయితే కంప్యూటర్లని వాడటం వల్ల ఉద్యోగాలకు నష్టం వాటిల్లుతుందనీ, నిరుద్యోగ సమస్య పెరుగుతుందనీ కొందరి వాదన. ఇది కొంతవరకు నిజమే. ఆ మాత్రంచేతనే ఆధునిక విజ్ఞానాన్ని త్రోసిరాజనడం న్యాయం కాదు. కాబట్టి భావిభారత పౌరులైన విద్యార్థులు కంప్యూటర్ విద్య ఆవశ్యకతను గుర్తించి తప్పక దాన్ని అభ్యసించాలి.

TS 9th Class Telugu Grammar వ్యాసాలు

9. జాతీయ సమైక్యత

ఒక దేశంలో పుట్టి పెరిగిన వారంతా ఒక జాతి వారని చెప్పవచ్చు. మనది భారతజాతి. భాష, మతం, సంస్కృతి, ఆచార వ్యవహారాలు ఒక్కటైనా, కాకున్నా ఒకే ప్రభుత్వం కిందనున్న ప్రజలంతా ఒకే జాతి అని చెప్పవచ్చు. మతాలు వేరయినా, భాషలు, రాష్ట్రాలు వేరయినా జాతి అంతా కలసి ఉండటమే జాతీయ సమైక్యత అంటారు.

మన భారతీయులలో కనిపించే దౌర్బల్యం అనైక్యత. మతం పేరిటనో, అధికారాన్ని ఆశించో మన రాజులొకరితో ఒకరు కయ్యాలాడుకొని విదేశీయుల పాలనలో దేశాన్ని పడవేశారు. నేటికీ మన దేశౌన్నత్యాన్ని సహింపలేని విదేశాలున్నాయి. దేశాలతో మన జాతి సమైక్యతకు భంగం కలిగించే కొన్ని శక్తులు, మన దేశంలోనే ఉండి పొత్తు పెట్టుకొంటున్నవి. అట్టి అవాంఛనీయ శక్తులను తుదముట్టించి మన జాతినంతా ఒకే త్రాటిపై నిలపాలి. మనం ఏ రాష్ట్రం వారమైనా, ఏ భాషను మాట్లాడే వారమైనా మనమందరం భారతీయులమనే మాట మరువరాదు.

కొందరు మత కలహాలు పెంచి వారిలో భేదాలు రెచ్చగొట్టి హత్యలకు, లూటీలకు, గృహదహనాలకు సిద్ధపడుతున్నారు. దీనివల్ల ప్రజలలో ఇతర మతంవారిపై ద్వేషం పెరుగుతుంది. కొందరికి ప్రాంతీయ దురభిమానం, మరికొందరికి తమ భాషలపై మోజు ఎక్కువ. స్వభాషాభిమానం ఉండటం మంచిదే. కానీ పరభాషపై ద్వేషం ఉండకూడదు. భాషా రాష్ట్రాలుగా విభజించిన తరువాత ప్రాంతీయ దురభిమానాలు పెరిగి నదీ జలాల కొరకు, తమ ప్రాంతాల అభివృద్ధి కొరకు పరస్పరం కలహించుకొంటున్నారు.

మన జాతిలో అనైక్యతను పోగొట్టి ఐక్యపరచటానికి ప్రభుత్వం జాతీయ సమైక్యతా మండలిని స్థాపించింది. భారత జాతి అంతా ఒక్కటే అని బోధిస్తున్నది. జాతీయ సమైక్యతవల్ల దేశం అన్నిరంగాలలో అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా విదేశాలలో భారతజాతి కీర్తిపతాకలు రెపరెపలాడతాయి.

TS 9th Class Telugu Grammar వ్యాసాలు

10. మతసామరస్యం

భారతీయ సమాజంలోని వ్యక్తులకు మతం అనేది పుట్టుక నుండి సంక్రమిస్తుంది. అదే విధంగా మతము యొక్క ప్రభావం వ్యక్తిపై పుట్టుక నుండి మరణించే వరకు ఉంటుంది. ప్రపంచంలో అధిక ప్రభావం కలిగిన ముఖ్యమైన మతాలన్నీ భారతదేశంలో ఉన్నాయి.

ఎవరికి వారు వారి మతం గొప్పదిగా భావించడం జరుగుతుంది. ఒకనాటి సమాజాన్ని క్రమబద్ధం చేయడానికి, ఆనాటి సమాజంలో శాంతిభద్రతలు కాపాడుకోవడానికి మతాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశంలో ఉన్న మతాలను ఏడు రకాలుగా విభజించవచ్చు.

  1. హిందూమతం,
  2. ముస్లింమతం,
  3. క్రైస్తవమతం,
  4. బౌద్ధమతం,
  5. జైనమతం,
  6. సిక్కుమతం,
  7. పార్సీ, .

యూదుమతం. భారతీయ సమాజంలో హిందూమతం వారే ఎక్కువగా ఉన్నప్పటికీ అనేక కారణాలవల్ల మతాల మధ్య వ్యత్యాసాలు, సంఘర్షణలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ విధమైన మతతత్వానికి అనేక కారణాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి :

  1. ప్రజలలో స్వార్థబుద్ధి,
  2. మహమ్మదీయులలో ఆర్థిక బలహీనతల కారణంగా మైనార్టీలకు ఎక్కువ సౌకర్యాలను కలిగించాలనే వారి వాదన,
  3. ప్రాంతీయతత్త్వం మొదలైన కారణాలవల్ల భారతీయ సమాజంలో మతతత్త్వం వెర్రితలలు వేస్తోంది. మతతత్వానికి మరొక ముఖ్యకారణం మతంతో రాజకీయాలు మిళితమై ఉండటం.

TS 9th Class Telugu Grammar వ్యాసాలు

మతాన్ని రాజకీయాల్లో చేర్చటంవల్ల భారత్ నుండి పాకిస్థాన్ విడిపోయింది. నేడు సిక్కుమతం వారు భారత్ నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడతామని అనేక సంవత్సరాలుగా ఉద్యమిస్తూనే ఉన్నారు. మరో ప్రక్క ‘రామజన్మభూమి – బాబ్రీమసీదు’ వివాదం మతసమస్యగా తయారయింది.

భారతదేశంలో మతకలహాలు తరచూ సంభవిస్తూనే ఉన్నాయి. అల్ప సంఖ్యాకులకు, అధిక సంఖ్యాకులకు మధ్య పరస్పర విశ్వాసం, సామరస్యం లోపించడంతో ఈ భయానక వాతావరణం ఏర్పడి అల్లర్లు, అలజడులు, ఆస్తినష్టం, ప్రాణనష్టం తరచు ఏర్పడుతూనే ఉన్నాయి. వివిధ రాజకీయ పక్షాలు పాక్షిక ప్రయోజనాల సాధనకోసం మతకలహాలను ఒక ఆయుధంగా ఉపయోగించుకొంటున్నాయి.

ఈ విధమైన పరిస్థితులను చక్కదిద్దాలంటే ప్రజలు చైతన్యవంతులై రాజకీయ నాయకుల బూటకపు మాటలకు మోసపోక పరమత సహనం కలిగిఉండాలి. మత సామరస్యంతో అందరూ కలిసిమెలసి జీవించడం నేర్చుకోవాలి.

11. జనాభా సమస్య (కుటుంబ నియంత్రణ)

జనాభా ఎక్కువగుట వలన సమస్య ఏర్పడటాన్ని జనాభా సమస్య అంటారు.

“అమెరికాలో డాలర్లు పండును
ఇండియాలో సంతానం పండును”

అని తెలుగులో బాలగంగాధరతిలక్ అనే కవి వ్యంగ్యంగా భారతీయులకి సంతానంపై గల మక్కువ తెలిపాడు. జనాభా సమస్య ఏర్పడటానికి ఈ క్రింది కారణాలు ముఖ్యం

  1. సంతానం ఎక్కువగా ఉండటం గొప్పదనంగా భావించడం.
  2. ఆడపిల్లలు లేదా మగపిల్లలు కావాలనే కోరికలు.
  3. చిన్నప్పుడే వివాహాలు చెయ్యటం.
  4. నిరక్షరాస్యత.
  5. మత విశ్వాసాలు.

ఇన్ని కారణాల వల్ల రాను రాను జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. జనాభా సమస్యను పరిష్కరించటానికి ప్రభుత్వం పటిష్ఠమైన ప్రణాళికా విధానం రూపొందించింది.

జనాభా సమస్య నిర్మూలనకు తీసుకోవలసిన చర్యలు :

  1. ‘కుటుంబ నియంత్రణ’ ను అన్ని మతాల ప్రజలు పాటించేలా చర్యలు తీసుకోవాలి.
  2. జనాభా సమస్య వల్ల ఏర్పడే నష్టాలను ప్రజలకు తేటతెల్లం చెయ్యాలి.
  3. స్త్రీల కంటె పురుషులు కుటుంబ నియంత్రణ చికిత్స చేసుకోవటం తేలిక అని చెప్పాలి.
  4. కుటుంబ నియంత్రణకి ప్రోత్సాహం కలిగించే సదుపాయాలు, సౌకర్యాలు కల్పించాలి.
  5. ఆడయినా, మగయినా ఒకటేనన్న భావాన్ని కలిగించాలి.
  6. కుటుంబ నియంత్రణ పాటించడం పాపమనే భావనని తొలగించాలి.

TS 9th Class Telugu Grammar వ్యాసాలు

అప్పుడు మాత్రమే జనాభా పెరుగుదలను అరికట్టడం సాధ్యమవుతుంది. జనాభా సమస్య వల్ల నష్టాలు ఇవి

  1. జనాభా పెరుగుదల వల్ల ఆహార సమస్య, నిరుద్యోగ సమస్య, కాలుష్య సమస్యల వంటివి ఎక్కువవుతాయి.
  2. విద్యాలయాలలో సీట్లు లభించక విద్యావకాశాలు తగ్గిపోతాయి.
  3. దేశ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమవుతుంది.
  4. “అందరికీ ఆరోగ్యం” అనేది సాధ్యం కానేరదు.
  5. సంతానం ఎక్కువగా ఉంటే తల్లిదండ్రులపై భారం ఎక్కువై పిల్లల్ని సక్రమంగా పెంచి పోషించలేరు.
  6. జనాభా ఇదే విధంగా పెరుగుతూవుంటే బట్టకీ, ఇంటికీ కూడా కరవు తప్పదు.

అందువల్ల ప్రభుత్వం జనాభా సమస్య నిర్మూలనకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ‘చిన్న కుటుంబమే చింతలు లేని కుటుంబం’ అని బోధించడమే కాదు. నాయకులు, అధికారులు తాము కూడా పాటించాలి. కుటుంబ నియంత్రణ పాటించని వారిని శిక్షించే చట్టం రూపొందించాలి. అప్పుడే దేశం ప్రగతి మార్గంలో పయనిస్తుంది.

12. విజ్ఞానయాత్రలు

విజ్ఞానయాత్రలు లోకజ్ఞానాన్ని కలిగించేవి. అయినా ఇవి వినోదయాత్రలుగా, విహారయాత్రలుగా వ్యవహారంలో ఉన్నాయి. అంటే కొన్ని ప్రత్యేకస్థలాలకి ప్రయాణం చేయటం వల్ల విజ్ఞానం సంపాదించవచ్చు. విజ్ఞాసమే కాకుండా వినోదం కూడా లభిస్తుంది.

పుస్తక పఠనం వల్ల పుస్తక జ్ఞానం మాత్రమే లభిస్తుంది. లోకానుభవం, ప్రజల ఆచారవ్యవహారాలు, మన సంస్కృతి తెలుసుకోవాలంటే పర్యటనలు తప్పనిసరి. పుస్తకాలలో ఉన్న విషయాలను పూర్తిగా ఆకళింపు చేసుకోవాలంటే యాత్రలు చేయవలసి ఉంది.

ఉదాహరణకు నీటి నుంచి విద్యుత్ ఎలా లభిస్తోందో పుస్తకాలలో వివరంగా ఉంటుంది. అది చదివితే కొంతమాత్రమే తెలుస్తుంది. అది కేవలం “Bookish knowledge”. జలవిద్యుత్ కేంద్రానికి వెళ్ళి, అది పనిచేసే విధానాన్ని పరిశీలించినప్పుడు సంపూర్ణ జ్ఞానం లభిస్తుంది. ముఖ్యంగా చరిత్ర, సైన్సు వంటి విషయాల అవగాహనకు యాత్రలు ఎంతో అవసరం.

TS 9th Class Telugu Grammar వ్యాసాలు

విజ్ఞానయాత్రల వల్ల ముఖ్యమైన ప్రయోజనాలు –

  1. లోకజ్ఞానం అలవడుతుంది.
  2. మానసిక విశ్రాంతి లభిస్తుంది.
  3. విభిన్న సంస్కృతుల్ని, భాషల్ని, జీవన విధానాల్ని తెలుసుకోవచ్చు.
  4. పదిమందితో ఏవిధంగా మెలగాలో అనుభవం వస్తుంది.
  5. స్నేహితులను పొందే అవకాశం లభిస్తుంది.
  6. జాతి సమైక్యత, దేశ సమైక్యతకి దోహదం చేస్తాయి.
  7. కవులకి, చిత్రకారులకి, మానసిక రోగులకి స్ఫూర్తిని, ఉల్లాసాన్ని కలిగిస్తాయి.

ఇటువంటి విజ్ఞాన యాత్రల్లో చాలా రకాలున్నాయి –

  1. ప్రకృతికి సంబంధించినవి – ఊటీ, హిమాలయాలు, జోగ్ జలపాతం మొదలగునవి.
  2. చారిత్రక సంబంధమైనవి-ఎల్లోరా, రామప్పగుడి, చార్మినార్ మొదలగునవి.
  3. శాస్త్ర సంబంధమైనవి-బిర్లా ప్లానిటోరియం, పరిశ్రమలు, అణుకేంద్రాలు మొదలగునవి.
  4. మత సంబంధమైనవి-కాశీ, మక్కా, వాటికన్, తిరుపతి మొదలగునవి.

ఈ యాత్రల పట్ల విద్యార్థి దశనుండే ఉత్సాహం ఏర్పడేలా చూడాలి. విద్యార్థిగా ఉన్నప్పుడే లోకజ్ఞానం అలవడితే జీవితం సంపన్నమవుతుంది – అర్ధవంతమవుతుంది. ఉపాధ్యాయుల, విద్యార్థుల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి. ఉపాధ్యాయుల వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. విద్యార్థులలో ఐకమత్యానికి కూడా ఈ యాత్రలు తోడ్పడతాయి.

విజ్ఞానయాత్రలు లేదా విహారయాత్రలు కేవలం యువకులకో లేదా విద్యార్థులతో, కళాకారులకో అనుకోవటం సరికాదు. అన్ని వయస్సులవాళ్ళకీ, అన్ని వృత్తులవాళ్ళకీ అవసరమే. కూపస్థ మండూకం లాగా జీవించటం మానవుడి నైజం కాదు కాబట్టి విజ్ఞానయాత్రలు అత్యంతావశ్యకాలు.

TS 9th Class Telugu Grammar వ్యాసాలు

13. విద్యార్థులు – సంఘసేవ

విద్యార్థుల ప్రప్రథమ కర్తవ్యం విద్యాభ్యాసం అనటంలో సందేహం లేదు. కానీ విద్యార్థులు కూడా ఈ దేశపు పౌరులే. వాళ్ళూ సంఘజీవులే. సంఘంలో భాగస్వాములే. కాబట్టి సంఘసేవలో వాళ్ళకీ బాధ్యత ఉంది. విద్యాభ్యాసానికి ఆటంకం లేకుండానే సంఘసేవ చేసే అవకాశాలున్నాయి.

“చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష” అని స్వార్థంగా జీవించటం సంఘజీవి లక్షణం కాదు. గురజాడ అన్నట్టు
“సొంతలాభం కొంత మానుకు
పొరుగువాడికి తోడుపడవోయ్”

అన్న భావనైనా కనీసం ఉండాలి. ఇతరులకి మనం తోడ్పడితే ఇతరులు మనకి తోడ్పడతారు. అదే సంఘీభావం అంటే. సంఘసేవ ఎలా చెయ్యాలి ? ఏ పనులు చేస్తే సంఘసేవ అవుతుంది ? విద్యార్థులు చేయదగిన కార్యక్రమాలు ఏవి ? అంటే-

  1. ప్రమాదాల బారినుండి కాపాడటం,
  2. వృద్ధులకి, అంగవికలురకి చేయూతనివ్వటం,
  3. ఆపదలో ఉన్నవారికి సహకారమందించటం,
  4. విద్యాదానం చేయటం,
  5. మురికివాడల్ని పరిశుభ్రం చెయ్యటం మొదలగునవి.

ఇవి ఏ విద్యార్థి అయినా చేయదగిన కనీస కార్యక్రమాలు. సంఘసేవకి పదవులు అక్కరలేదు. ధనమూ అంతగా అవసరం లేదు. సేవాతత్పరత ఉంటే చాలు. మానవతా దృక్పథం ఉంటే చాలు. కొందరు కీర్తికోసం, ప్రచారం కోసం సేవచేస్తున్నట్టు నటిస్తారు. అది స్వార్థపూరితమైన ప్రవర్తన అవుతుంది.

విద్యార్థులు అటువంటివారు కారు. నిజంగా తలచుకుంటే విద్యార్థులు చేయలేనిది ఏమీ ఉండదు. ఉత్సాహం, బలం, ఆసక్తి గల విద్యార్థులే అసలైన సంఘసేవా పరాయణులుగా ఉంటారు. అందుకనే జాతీయ సేవా పథకం (National Service Scheme – NSS) విద్యాలయాలలో ప్రవేశపెట్టారు.

TS 9th Class Telugu Grammar వ్యాసాలు

ప్రతి కళాశాలలోనూ ఈ జాతీయ సేవా పథకంలో చాలామంది విద్యార్థులు చేరి సంఘసేవ చేస్తున్నారు. హైస్కూల్సులో ఎన్సిసి, స్కౌట్స్లో కూడా చేరి సంఘసేవ చేస్తున్నారు. ఒక విధంగా ప్రభుత్వ సంస్థలు, దేశసేవకులనిపించుకొనే నాయకులు చేయని, చేయలేని పనులు విద్యార్థులు చేసి చూపించడం ప్రశంసనీయం.

విద్యార్థులు ఈ విధంగా సంఘసేవ చెయ్యటంలో వారికొక ఆత్మసంతృప్తి కలుగుతుంది. ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. తమ దేశభక్తిని ప్రకటించుకొనే సువర్ణావకాశం సంఘసేవ. కార్యదీక్షా దక్షతలు అలవడతాయి. కాబట్టి విద్యార్థుల్ని సత్పౌరులుగా తీర్చిదిద్దే సంఘసేవా కార్యక్రమాలకి ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలి.

14. నిరుద్యోగ సమస్య

ఉద్యోగం లేకపోవడమే నిరుద్యోగం. ఉద్యోగాలు చేయగలవారందరికీ ఉద్యోగాలు చూపించలేకపోవడాన్నే నిరుద్యోగ సమస్య అంటారు. పూర్వకాలంలో అందరూ కులవృత్తులకే ప్రాధాన్యమిచ్చేవారు. కానీ నేడు అందరూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎగబ్రాకుట వల్ల నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చింది.

మనకు స్వాతంత్ర్యం లభించిన తరువాత ప్రభుత్వం అనేక పాఠశాలలను, కళాశాలలను స్థాపించింది. వాటిలో చదివి ఉత్తీర్ణులైన అందరికీ ఉద్యోగాలు చూపించడం ఒక చిక్కు సమస్యగా తయారైంది. ఉద్యోగం లభించకపోవడంతో యువకులకు చదువులపై నిరాశానిస్పృహలు కలుగుతున్నాయి. అటు కులవృత్తి చేయలేక, ఇటు ఉద్యోగం లభింపక ఉభయభ్రష్టులవుతున్నారు.

నిరుద్యోగ సమస్య తీరాలంటే ప్రభుత్వం విద్యావిధానంలో విప్లవాత్మకమైన మార్పులు తేవాలి. వృత్తి విద్యల కెక్కువ ప్రోత్సాహమివ్వాలి. ఇంటికొక ఉద్యోగమిచ్చే పథకం ప్రవేశపెట్టాలి. పరిశ్రమలు విరివిగా స్థాపించాలి. స్వయం ఉపాధి పథకాలను ప్రవేశపెట్టి, బ్యాంకుల ద్వారా ఋణాలు ఇప్పించాలి.

TS 9th Class Telugu Grammar వ్యాసాలు

యువతీయువకులు నిరాశా నిస్పృహలకు లోనుకాకుండా, ధైర్యంగా ఏదో ఒక వృత్తిని చేపట్టి స్వతంత్రంగా జీవించడం అలవరచుకోవాలి.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson కాళోజి

Telangana SCERT 9th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం 3rd Lesson కాళోజి Questions and Answers.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson కాళోజి

వివక్ష ఎక్కడున్నా వ్యతిరేకించాడు.
మంచి ఎక్కడున్నా స్వాగతించాడు.
అన్యాయం, అణచివేతలపై తిరగబడ్డాడు
తన వాదనలతో తెలంగాణేతరుల మనసులను కూడ గెలుచుకున్నాడు.
తెలంగాణ వైతాళికుడని పేరుగన్నాడు.
ఈ నేల సాంస్కృతిక వారసత్వంలోనుండి ఎదిగిన ఆ మహనీయుడే – కాళోజి
TS 9th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson కాళోజి 1

PAPER – I : వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన) (మార్కులు: 6)

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
కాళోజి – బాల్యం – విద్యాభ్యాసంను గూర్చి రాయండి.
జవాబు:
కాళోజి నారాయణరావుగారు మొదటి ప్రపంచ యుద్ధం జరిగే రోజుల్లో అనగా 9-9-1914న జన్మించాడు. ఈయన ‘రట్టహళ్ళి’ అనే గ్రామంలో జన్మించారు. ఇది ప్రస్తుతం బీజాపూరు జిల్లాలో ఉంది. ఈ ఊరు, కర్ణాటక ప్రాంతంలోని పాత బొంబాయి ప్రెసిడెన్సీ కింద ఉండేది.

కాళోజీ బాల్యంలో వారి కుటుంబం, కొన్ని సంవత్సరాలు మహారాష్ట్రలోని ‘సాయరాం’ అనే గ్రామంలోనూ, మరికొంతకాలం తెలంగాణాలోని ఇల్లెందు తాలూకా ‘కారేపల్లి’ గ్రామంలోనూ నివసించేది. 1917 వరకూ కాళోజీ కుటుంబం ‘హనుమకొండ’ లో ఉండేది. తరువాత ‘మడికొండ’ కు మారింది.

కాళోజీ అన్న రామేశ్వరరావు న్యాయశాస్త్రం చదవడానికి హైదరాబాదు వెళ్ళవలసినప్పుడు కాళోజీ పాతబస్తీలోని చౌయహల్లా కాన్లీబడిలో సెకండ్ ఫారమ్లో చేరారు. ఆ తరువాత సుల్తాను బజారులోని రెసిడెన్సీ మిడిల్ స్కూలులో చేరారు. ఉన్నత విద్య కోసం 1934 ఏప్రిల్ వరంగల్ కాలేజిమేట్ హైస్కూలులో ఇంటర్మీడియట్లో ప్రవేశించారు. 1939లో కాళోజీ ‘లా’ పూర్తి చేశారు. 1940లో గవిచెర్ల గ్రామానికి చెందిన ‘రుక్మిణి’ని వివాహం చేసుకున్నారు.

ప్రశ్న 2.
కాళోజిగారి కథలను గూర్చి రాయండి.
(లేదా)
కథా రచయితగా కాళోజీ ఎలా రాణించారు ?
జవాబు:
కాళోజీ కవిగానేగాక, కథకునిగా కూడ రాణించాడు. ఈయన కథలో స్వచ్ఛత, సూటిదనం, నచ్చని విషయాలపై నిరసన, స్పష్టంగా కనిపిస్తాయి. కాళోజీ కథలకు ఈనాటికీ ‘ప్రాసంగికత’ ఉంది.

కులమతాలపేరిట, మనుషుల్ని హీనంగా చూడటం అవమానించడం, ఎంత దారుణమో ఈయన చెప్పారు. మనుషుల్లో ఉండే ద్వంద్వ ప్రవృత్తినీ, అన్యాయరీతుల్ని గూర్చి ఈయన తన కథల్లో చెప్పారు.

ఈయన ‘విభూతి లేక ఫేస్ పౌడర్ కథ’ వ్యంగ్య హేళనలతో సాగింది. ఈ కథలో అలంకరణల పట్ల మోజును గూర్చి, నవ్వు తెప్పించే విధంగా చెప్పాడు.

రాజకీయములో పరిపాలనలో ఉన్న అవకతవకలనూ, అక్రమాలనూ మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం. తెలంగాణాలో 1940 నాటికి ఉన్న రాజకీయ వ్యవస్థ శైశవ దశలో ఉంది. ఒకరిని మించి ఒకరు కుట్రలు కుతంత్రాలతో లౌక్యంతో రాజ్యపాలన సాగింది. ఈ పరిస్థితుల్ని రామాయణంలోని సుగ్రీవుడు, విభీషణుడి కథలకు ముడిపెట్టి, కాళోజీ రాసిన కథ పేరు “లంకా పునరుద్ధరణ”. రామాయణ కథపై విసరిన వ్యంగ్యాస్త్రమే, ‘లంకా పునరుద్ధరణ’ కథ.

రాతి బొమ్మకు గుడిని కట్టించే విషయంలో ముందుకు వచ్చిన ప్రజలు, ప్రాణం ఉన్న అనాథ శిశువుపై ఆదరణ చూపించలేకపోవడంపై విసరిన మరో వ్యంగ్యాస్త్రం, “భూతదయ” అనే కథ. ఈ విధంగా కాళోజీ కథలన్నీ ఒకరకంగా రాజకీయ కథలు. ఈ కథలో సాహిత్య విలువలను కాపాడడానికి కాళోజీ ప్రయత్నించారు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson కాళోజి

ప్రశ్న 3.
కాళోజి ‘కవిత్వం – భాష’ అనే వాటిని గూర్చి రాయండి.
జవాబు:
కాళోజి తన కవిత్వాన్ని ప్రజల జీవితాల్లోకి తీసుకువెళ్ళి ప్రజాకవిగా పేరు పొందాడు. తెలంగాణ పక్షాన నిలిచి, తాడిత, పీడిత ప్రజల గుండెల్లో కొలువైన మహాకవి కాళోజి. కాళోజి మాటలలో, చేతలలో, ఆలోచనలో, ఆవేదనలో, వేషభాషల్లో ప్రవర్తనలో తెలంగాణ స్వరూపం, సంపూర్ణంగా కనిపిస్తుంది.

ఈయన సమాజ గొడవను తన గొడవగా చేసుకొని, ‘నా గొడవ’ అనే పేరుతో అనేక కవితలు రాసి, వాటిని ఎనిమిది సంపూటాలుగా వెలువరించారు. కాళోజీ ప్రాంతీయ దృక్పథం, దేశీయ దృక్పథం, అంతర్జాతీయ దృక్పథం కలిగిన కవి. నిరంకుశ రాజ్యాలమీద తన జీవితాంతం కత్తి కట్టి పోరాడాడు. అందుకే రాజకీయాలతో, ప్రజా ఉద్యమాలతో, మమైకమైన కాళోజీ కవిత్వాన్ని తెలుగునాట ప్రజలు ఆదరించాడు.

రజాకార్లపై ఆయన కోపాన్ని పరాకాష్ఠకు చేర్చిన ఆయన కవిత, “కాటేసి తీరాలె” అనేది. ఇందులోని కసి తెలంగాణ ప్రజలది.

“మన పిల్లలను చంపి మనల బంధించిన
మానవాధములను మండాలధీశులను
మరచి పోకుండ గురుతుంచుకోవాలె
కసి ఆరిపోకుండ బుసకొట్టుచుండాలె
కాలంబు రాగానె కాటేసి తీరాలె”

కాళోజీ భాష : కాళోజీ దృష్టిలో భాష రెండు రకాలు. ఒకటి “బడి పలుకుల భాష”. రెండవది జనం నిత్యం వ్యవహారంలో వాడే “పలుకుబడుల భాష”. వీటినే గ్రాంథిక భాష, వ్యావహారిక భాష అంటాము.
ఏ భాషకైనా జీవధాతువు, మాండలికమే. కాళోజీ జీవభాష వైపే మొగ్గు చూపాడు.

ప్రశ్న 4.
కాళోజీ నారాయణరావుగారి ప్రజా జీవితం గురించి రాయండి.
జవాబు:
ఎనిమిది దశాబ్దాలుగా ప్రజా జీవితంలో కాళోజీ బ్రతుకు ముడిపడింది. ఆయన వివక్ష ఎక్కడ ఉన్నా వ్యతిరేకించాడు. మంచిని స్వాగతించాడు. అన్యాయం, అణచివేతలపై తిరుగుబడ్డాడు. ఆయన వాదనలోని సమర్థనలను, ఆలోచించ గలవారు గుర్తించారు. ఈయన పెక్కు సందర్భాల్లో తెలంగాణేతరుల మనస్సులను కూడా జయించాడు.

కాళోజిని తెలంగాణా వైతాళికుడిగా చెప్పాలి. ఈయన తెలంగాణ వారసత్వంలోంచి ఎదిగాడు. ఈయన మనుషులను అర్థం చేసుకున్న తీరు, విశిష్టమైనది. ఈయనకు భాగవతంలో ప్రహ్లాదుడి పాత్ర నచ్చిందని చాలాసార్లు చెప్పాడు. అన్యాయాన్ని ఎదిరించినవాడే తనకు పూజ్యుడని, కాళోజీ చెప్పారు.

ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా విలువ ఉంటుందని ఈయన భావించాడు. ఓటుహక్కు ప్రజాస్వామికమైనదని ప్రకటిస్తూ మెడలో బోర్డు వేసుకొని, ఈయన తిరిగాడు. ఈ స్వేచ్ఛా ప్రవృత్తి కాళోజిలో అడుగడుగునా కనిపిస్తుంది.

వ్యక్తిత్వం, స్వేచ్ఛ, అనే రెండు ప్రధాన విషయాలను మనిషి కోల్పోకూడదని, కాళోజీ చెప్పారు. కాళోజీ జీవితాంతం ప్రజాస్వామ్యవాదిగా ఉన్నారు. “నీ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా ప్రకటించే నీ హక్కులకోసం అవసరమైతే నా ప్రాణాలిచ్చి పోరాడుతా” అనే మాటల్ని కాళోజీ గుర్తు చేసేవారు. ఆ మేరకు ఆయన బతికారు.

తెలంగాణ ఇటీవల వరకు యుద్ధ భూమి అందులో కాళోజీ ప్రజల వైపు నిలబడి, కవిత్వం వినిపించాడు. నిజాంను ఎదిరించాడు. కాళోజీ ఉద్యమ కవి.

ప్రశ్న 5.
కాళోజీ నారాయణరావు వ్యక్తిత్వాన్ని గురించి సంక్షిప్తంగా రాయండి.
జవాబు:
కాళోజీ 9-9-1914న బీజపూర్ జిల్లా రట్టహళ్ళిలో జన్మించారు. 1939లో లా పూర్తిచేసి, 1940లో రుక్మిణిని పెండ్లాడారు. ఆచరణకు, ఆదర్శానికీ తేడాలేని జీవితం ఆయనది. కాళోజీ నిరంతర ఉద్యమ జీవి. తమ కాలంలో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. రజాకార్లను ఎదిరించి జైలు జీవితం గడిపారు. నిజాం రాజును ఎదిరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. ఇతరుల బాగు కోసం పోరాడేతత్త్వం, సామాజిక స్పృహ, కాళోజీలో ఉన్నాయి.

కాళోజీ తాడిత పీడిత ప్రజల గుండెల్లో నిలిచి కవి. ఆయనలో తెలంగాణా స్వరూపం దర్శనమిస్తుంది. దాశరథి అన్నట్లు, కాళోజీ, “తెలంగాణ ఆధునిక సాహిత్య ముఖద్వారం”. కాళోజీ, సమాజ గొడవను తన గొడవగా చేసుకొని, ‘నా గొడవ’ అనే పేరున అనేక కవితలు రాశాడు. కాళోజీ నిజానికి అంతర్జాతీయ కవి. రజాకార్లపై తన కోపాన్ని కాళోజీ ‘కాటేసి తీరాలె’ అన్న కవితలో రాశారు. కాళోజీ తన రచనలలో, జీవ భాష వైపే మొగ్గుచూపారు. ‘వీర తెలంగాణ నాది, వేరు తెలంగాణ నాది’, అని కాళోజీ ఎలుగెత్తి చాటాడు. కాళోజీ కవిగా, ఉద్యమకారునిగా, కథకునిగా కూడా, రాణించారు. కాళోజీ వివక్షను వ్యతిరేకించాడు. మంచిని స్వాగతించాడు. కాళోజీ తెలంగాణ వైతాళికుడు.

ఈయన, ప్రజాస్వామ్యంలో ఓటుకు విలువ ఉంటుందని చెప్పి, మెడలో బోర్డు వేసుకొని తిరిగేవాడు. ఆయన నిర్భయంగా మాట్లాడేవారు. కాళోజీ జీవితాంతం, ప్రజాస్వామ్య వాధిగా ఉన్నాడు. ఖలీల్ జిబ్రాల్ రాసిన “ది ప్రాఫెట్”ను ‘జీవనగీత’గా అనువదించాడు. తన భౌతిక శరీరాన్ని కాకతీయ మెడికల్ కాలేజీ వారికి అందించాడు.
కాళోజీ జీవితమంతా దేశంగా, ప్రజలుగా, ఉద్యమాలుగా బతికిన మహాకవి.

PAPER – II : పరిచిత గద్యాలు (మార్కులు : 5)

1. కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

తెలంగాణ పక్షాన నిలిచి తాడిత, పీడిత ప్రజల గుండెలలో కొలువైన కవి కాళోజి. మాటలలో, చేతలలో, ఆలోచనలలో, ఆవేదనలో, వేషభాషలలో, ప్రవర్తనలో, తెలంగాణ స్వరూపం సంపూర్ణంగా కనిపిస్తుంది. దాశరథి అన్నట్లు “తెలంగాణ ఆధునిక సాహిత్య ముఖద్వారం కాళోజి. తన కవిత్వాన్ని ప్రజల జీవితాల్లోకి తీసుకెళ్ళి ప్రజాకవిగా పేరుపొందినవాడు కాళోజీ.

సమాజ గొడవను తన గొడవగా చేసుకొని “నా గొడవ” పేరుతో అనేక కవితలు రాసి, వాటిని ఎనిమిది సంపుటాలుగా వెలువరించాడు. ప్రాంతీయ దృక్పథం, దేశీయ దృక్పథం, అంతర్జాతీయ దృక్పథం కలిగిన కాళోజి నిజానికి అంతర్జాతీయ కవి. ‘నిరంకుశ రాజ్యాలమీద జీవితాంతం కత్తిగట్టి పోరాడినవాడు కాళోజి. అందుకే రాజకీయాలతో, ప్రజా ఉద్యమాలతో మమైకమైన కాళోజి కవిత్వాన్ని తెలుగునాట ప్రజలు ఆదరించారు. రజాకార్లపై ఆయన కోపాన్ని పరాకాష్టకు చేర్చిన కవిత “కాటేసి తీరాలె”. ఇందులోని కసి తెలంగాణా ప్రజలందరిది.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
కాళోజీ గురించి దాశరథి అన్నమాట ఏది ?
జవాబు:
‘తెలంగాణ ఆధునిక సాహిత్య ముఖద్వారం ‘కాళోజి’ అని దాశరథి కాళోజి గురించి చెప్పాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson కాళోజి

ప్రశ్న 2.
కాళోజి ఎటువంటి కవి ?
జవాబు:
ప్రాంతీయ దృక్పథం, దేశీయ దృక్పథం, అంతర్జాతీయ దృక్పథం కలిగిన కాళోజి, నిజానికి అంతర్జాతీయ కవి.

ప్రశ్న 3.
కాళోజీలో ఏమి కనిపిస్తుంది ?
జవాబు:
కాళోజి మాటలలో, చేతలలో, ఆలోచనలలో, ఆవేదనలో, వేషభాషలలో, ప్రవర్తనలో తెలంగాణ స్వరూపం, సంపూర్ణంగా కనిపిస్తుంది.

ప్రశ్న 4.
కాళోజి ప్రజాకవి ఎట్లు అయ్యాడు ?
జవాబు:
తన కవిత్వాన్ని ప్రజల జీవితాల్లోకి తీసుకువెళ్ళాడు కాబట్టి, కాళోజి ప్రజాకవి అయ్యాడు.

ప్రశ్న 5.
‘నా గొడవ’ కవితా సంపుటాల గురించి తెలుపండి.
జవాబు:
కాళోజీ సమాజ గొడవను తన గొడవగా చేసుకొని, ‘నా గొడవ’ పేరుతో అనేక కవితలు రాసి, వాటిని ఎనిమిది సంపుటాలుగా వెలువరించాడు.

2. ఈ కింది పేరా చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

కవిగా, ఉద్యమకారునిగా పేరొందిన కాళోజి కథకునిగా కూడా రాణించాడు. ఇతని కథల్లో స్వచ్ఛత, సూటిదనం, నచ్చని విషయాలపై నిరసన స్పష్టంగా కనిపిస్తుంది. కాళోజి కథలకు ఈనాటికీ ప్రాసంగికత ఉన్నది. మతం పేరిట, కులంపేరిట మనుషుల్ని హీనంగా చూడటం, అవమానించటం ఎంత దారుణమో చెప్పాడు. మనుషుల్లోని ద్వంద్వ ప్రవృత్తి, అన్యాయమైన రీతుల్ని తెలియజెప్పాడు. వ్యంగ్యం, హేళనలతో సాగిన కథ విభూతి లేక ఫేస్ పౌడర్. ఇందులో అలంకరణల పట్ల గల మోజును నవ్వు తెప్పించే విధంగా చెప్పాడు. రాజకీయాల్లో, పరిపాలనలో అవకతవకల్ని, అక్రమాల్ని ఇప్పుడు కూడా చూస్తున్నాం. తెలంగాణాలో 1940 నాటికి ఉన్న రాజకీయ వ్యవస్థ శైశవ దశలో ఉంది. ఒకరి మించి ఒకరు కుట్రలు, కుతంత్రాలతో, లౌక్యంతో రాజ్యపాలన సాగింది.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
కాళోజి కథల్లో ఏమి కనిపిస్తుంది ?
జవాబు:
కాళోజీ కథలో స్వచ్ఛత, సూటిదనం, నచ్చని విషయాలపై నిరసన, స్పష్టంగా కనిపిస్తుంది.

ప్రశ్న 2.
తెలంగాణలో 1940 నాటి రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది ?
జవాబు:
తెలంగాణలో 1940 నాడు రాజకీయ వ్యవస్థ శైశవ దశలో ఉంది. ఒకరిని మించి ఒకరు కుట్రలు కుతంత్రాలతో లౌక్యంతో రాజ్యపాలన సాగింది.

ప్రశ్న 3.
‘ఫేస్ పౌడర్’ కథలో విశిష్టత ఏది ?
జవాబు:
`ఫేస్ పౌడర్ కథలో అలంకరణ పట్ల మోజును, నవ్వు తెప్పించే విధంగా కాళోజీ చెప్పాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson కాళోజి

ప్రశ్న 4.
కాళోజి ఎట్లా రాణించాడు ?
జవాబు:
కాళోజీ కవిగా, ఉద్యమకారునిగా, మరియు కథకునిగా, రాణించాడు.

ప్రశ్న 5.
కాళోజీ కథల్లో చెప్పిన సంగతులేవి ?
జవాబు:
కాళోజీ కథల్లో కులమతాల పేరిట మనుష్యుల్ని హీనంగా చూడటం, అవమానించడం, ఎంత దారుణమో చెప్పాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson సురవరం ప్రతాపరెడ్డి

Telangana SCERT 9th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం 2nd Lesson సురవరం ప్రతాపరెడ్డి Questions and Answers.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson సురవరం ప్రతాపరెడ్డి

తెలంగాణలో కవులే లేరనే నిందా వ్యాఖ్యలకు
“గోలకొండ కవుల సంచిక” ద్వారా సమాధానమిచ్చినవాడు.
తన కృషి సమాజపరంగా సాగించిన ఉద్యమశీలి.
సాహిత్య, సాంస్కృతిక సామాజిక, రాజకీయ రంగాల్లో
బహుముఖ ప్రతిభ చాటిన ప్రజ్ఞాశాలి. తెలంగాణ వైతాళికుడు
సురవరం ప్రతాపరెడ్డి. ఆయన జీవితం ఎట్లా స్ఫూర్తిదాయకమో
తెలుసుకుందాం.
TS 9th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson సురవరం ప్రతాపరెడ్డి 1

PAPER – I : వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన) (మార్కులు: 6)

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
సురవరం ప్రతాపరెడ్డిగార్ని గూర్చి మల్లంపల్లి సోమశేఖర శర్మగారు చేసిన పరిచయం ఎటువంటిది ?
జవాబు:
సురవరం ప్రతాపరెడ్డి పేరు వినగానే, ఒక గొప్ప మూర్తి మన కంటి ఎదుట దర్శనమిస్తుంది. బహుముఖ ప్రతిభకు, ప్రతాపరెడ్డి నిలువెత్తు ఉదాహరణం. సురవరం ప్రతాపరెడ్డి గారు మేధా సంపన్నుడు. సాహిత్య రంగంలో రెడ్డి గారి ప్రతిభకూ, ప్రజ్ఞకూ స్తాటిలేదు.

రెడ్డిగారు విమర్శకులలో గొప్ప విమర్శకుడు. కవులలో కవి. పండితులలో పండితుడు. రాజకీయవేత్తలలో గొప్ప రాజకీయవేత్త. పత్రికా రచయితలలో పత్రికా రచయిత. నాటక కర్తలలో నాటక కర్త. పరిశోధకులలో గొప్ప పరిశోధకుడు. దేశాభిమానులలో పెద్ద దేశాభిమాని, సహృదయులలో రెడ్డిగారు గొప్ప సహృదయులు.

ప్రతాపరెడ్డిగారి వంటి స్నేహితుణ్ణి, పండితుణ్ణి, రసజ్ఞుడిని చాలా అరుదుగా చూస్తాం. రెడ్డిగారు ఇంతటి ప్రజ్ఞా పాండిత్యములు కలవాడని, సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖర శర్మగారు వ్రాశారు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson సురవరం ప్రతాపరెడ్డి

ప్రశ్న 2.
సురవరం ప్రతాపరెడ్డిగారి ప్రతిభా పాండిత్యాలను వెల్లడించే శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో జరిగిన సభా విశేషాలు రాయండి.
జవాబు:
ఒకసారి హైదరాబాదులోని శ్రీకృష్ణదేవరాయంధ్ర భాషా నిలయంలో సాహిత్య సభ జరిగింది. ఆ రోజు నాచన సోమన రాసిన ఉత్తర హరివంశముపై విశ్వనాథ సత్యనారాయణగారు ప్రసంగం చేయాలి. ఆ సభకు అధ్యక్షుడిగా శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు కూర్చున్నారు.

సభ ప్రారంభం కాగానే, ప్రతాపరెడ్డిగారు ధీరగంభీరంగా తొలిపలుకులు మాట్లాడారు. క్రమంగా మాటల చినుకులు మహావర్షంగా మారాయి. దాదాపు గంటసేపు రెడ్డిగారు మాట్లాడిన ఆ ఉపన్యాసం, సభ్యులను కట్టిపడేసింది.

సోమన కవిత్వంలోని కొత్తకోణాలు సభ్యులకు పరిచితమవుతున్నాయి.. తరువాత విశ్వనాథ సత్యనారాయణగారు లేచి, అధ్యక్షులు ప్రతాపరెడ్డి గారు మాట్లాడిన తర్వాత, చెప్పడానికి తనకు ఇంకేమీ మిగుల లేదని, హరివంశంలోని కొన్ని పద్యాలు మాత్రం చదివి, వ్యాఖ్యానిస్తానని అన్నారట.

విశ్వనాథ వంటి మహాకవి, పండిత విమర్శకుడినే ఆ విధంగా ప్రతాపరెడ్డిగారి ఉపన్యాసం, ఆనాడు నిశ్చేష్టుడిని చేసింది. ఈ సంఘటన ప్రతాపరెడ్డిగారి ఉపన్యాస శక్తినీ, విమర్శనాశక్తినీ వెల్లడిస్తుంది.

ప్రశ్న 3.
సురవరం ప్రతాపరెడ్డిగారి బాల్యము – విద్యాభ్యాసము గూర్చి రాయండి.
జవాబు:
సురవరం ప్రతాపరెడ్డి గారు 1896లో మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల సంస్థాన రాజధానియైన “బోరవిల్లి” లో జన్మించారు. ఈయన మొదటి పేరు “పాపిరెడ్డి”. పాపిరెడ్డి గురువు, చండశాసనుడు. దానితో పాపిరెడ్డికి చదువుపై విముఖత పెరిగింది. బడిమానేసి, గోలీలాడుకొనేవాడు.

ఈ విషయం ప్రతాపరెడ్డి చిన్నాన్నకు తెలిసి, కచ్చితమైన దినచర్యను అమలు చేశాడు. దానితో ప్రతాపరెడ్డి జీవితం, మలుపు తిరిగింది. ప్రతాపరెడ్డి తొమ్మిదో తరగతి చదివేటప్పుడు, తెలుగులో కవియై కీర్తి సంపాదించాలని నిశ్చయించాడు. తన సంకల్పాన్ని అమలుచేశాడు. స్వయంకృషి, సాధన సంకల్పాన్ని నెరవేరుస్తాయి.

ప్రతాపరెడ్డి, చిలకమర్తి, వీరేశలింగం వంటి వారి రచనలు సంపాదించి చదివాడు. చేమకూర వెంకటకవి విజయ విలాసాన్నీ, ఇతర ప్రబంధాలనూ, తెలుగు నిఘంటువు సాయంతో చదివాడు. కర్నూలు వెల్లాల శంకరశాస్త్రి దగ్గర, సంస్కృత సాహిత్యం చదివాడు. బి.ఏ లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ద్వితీయ భాషగా సంస్కృతం చదవాలనుకున్నాడు. అందుకు వేదం వేంకటరామశాస్త్రి గారితో సిఫారసు కూడా చేయించాడు.

కాని సంస్కృతంలో ప్రతాపరెడ్డికి గల పరిచయాన్ని గూర్చి కాలేజీవారు పరీక్షించారు. ప్రతాపరెడ్డి భారత శ్లోకాన్ని పదవిభాగంతో సహా చెప్పి, కాలేజీ వారిచే మెప్పు పొందాడు.. సంస్కృతం వేదం వారి వద్ద చదవడం కోసం రెడ్డిగారు మాంసాహారాన్ని విడిచిపెట్టాడు. ప్రతాపరెడ్డి గారు పుస్తకాలు కొన్ని, విమర్శనాత్మకంగా చదివేవారు.

ప్రశ్న 4.
ప్రతాపరెడ్డిగార్కి గోల్కొండ పత్రికతో గల సంబంధాన్ని రాయండి.
జవాబు:
సురవరం ప్రతాపరెడ్డి గారికి, మద్రాసులో చదివే రోజులలోనే పత్రిక పెట్టాలని కోరిక కలిగింది. జాతీయోద్యమ ప్రభావంతో పత్రికకు ‘దేశబంధు’ అని పేరు పెట్టాలనుకున్నారు. చివరకు రెడ్డిగారు హైదరాబాదులో ఉన్నప్పుడు పత్రికను ప్రారంభించారు. దేశబంధు పేరుకు నిజాం ప్రభుత్వం అంగీకరించదని, ‘గోల్కొండ’ అనే పేరు పత్రికకు పెట్టారు.

10 మే, 1926న గోల్కొండ పత్రిక ప్రారంభమయ్యింది. గోల్కొండ పత్రిక, తెలుగు పత్రికా రంగంలో సంచలనాలు సృష్టించింది. ప్రతాపరెడ్డి పేరు వినగానే, గోల్కొండ పత్రిక గుర్తుకు వస్తుంది. పత్రిక ప్రారంభమయ్యింది కాని, తగిన ఆర్థిక వనరులు లేనందున, నడపడం కష్టమయ్యింది. అయినా ప్రతాపరెడ్డి గారు అధైర్యపడలేదు.

ప్రతాపరెడ్డి తానే రచయితగా, సంపాదకుడిగా, ప్రూఫ్ రీడర్ గా, గుమాస్తాగా అనేక అవతారాలు ఎత్తాడు. ఆటంకాలను దాటి, లక్ష్యమును చేరుకున్నాడు. గోల్కొండ పత్రిక రెండు లక్ష్యాలతో నడచింది.

1) ఆంధ్రభాషా సేవ

2) జాతి, మత, కులవివక్షత లేకుండా ఆంధ్రులలో అన్ని శాఖలవారి సత్వరాభివృద్ధికీ పాటు పడడం. నాటి నిజాం దుష్కృత్యాల గురించి, సంపాదకీయాలు సాగేవి. ప్రతాపరెడ్డి రచయితలను కవ్వించి, వారి ప్రతిభను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. ఎందరో రచయితలకు ప్రోత్సాహాన్ని ఇచ్చి, నిష్పక్షపాతంగా పత్రికను నడిపారు.

ఆ రోజుల్లో నిజాంకు వ్యతిరేకంగా వార్త రాసిన షోయబుల్లాఖాన్న, నడివీధిలో నరికి చంపారు. అటువంటి రోజుల్లో ప్రతాపరెడ్డి గారు సాహసంతో నిజాం దుర్మార్గాలను నిరసిస్తూ పత్రికలో సంపాదకీయాలు రాశారు. ఈయన 23 సంవత్సరాలు గోల్కొండ పత్రికలో సంపాదకుడిగా తెలంగాణకు సేవలందించాడు. ప్రతాపరెడ్డి ప్రాతఃస్మరణీయుడు.

ప్రశ్న 5.
ప్రతాపరెడ్డిగార్కి వివిధ సంస్థలతో గల అనుబంధం గురించి తెలపండి.
జవాబు:
ప్రతాపరెడ్డి గారిని గురించి, దాశరథి రాస్తూ “అతడు లేని తెలంగాణ, అలంకరణలేని జాణ” అని రాశాడు. ప్రతాపరెడ్డిగార్కి అనేక సంస్థలతో అనుబంధముంది. తెలంగాణలో ఆంధ్రమహాసభ, పరాయి భాషా దౌర్జన్య ప్రభంజనానికి అల్లాడుతున్న తెలుగు దీపాన్ని ఆరిపోకుండా చూసుకోడానికి ఆవిర్భవించింది. ఆ ఆంధ్రమహాసభ మొదటి సమావేశం, మెదక్ జిల్లా జోగిపేటలో జరిగింది. ఆ సభకు ప్రతాపరెడ్డిగారే అధ్యక్షత వహించారు.

విజ్ఞానవర్ధినీ పరిషత్తు, ఆంధ్ర సారస్వత పరిషత్తులకు ప్రతాపరెడ్డి గారు వ్యవస్థాపక సభ్యులు. ఆ తర్వాత, ఆ సంస్థలకు వీరే అధ్యక్షుడిగా వ్యవహరించారు. ప్రతాపరెడ్డిగార్కి కులమతాల పట్టింపులు లేవు. అందుకే రెడ్డిగారు, యాదవ సంఘం, ముదిరాజ్ సంఘం, గౌడ సంఘములకు కూడా అధ్యక్షులుగా ఉన్నారు.

ప్రతాపరెడ్డి గారు హైదరాబాదు ఆయుర్వేద సంఘం అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘ ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. రెడ్డిగార్కి శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, లక్ష్మణరాయ పరిశోధకమండలి, బాలసరస్వతీ గ్రంథాలయం, వేమన గ్రంథాలయం, మొదలయిన సంస్థలతో సన్నిహిత సంబంధం ఉండేది. ఈ విధంగా ఆనాడు తెలంగాణలో ఉన్న పెక్కు సాహిత్య సాంస్కృతిక సంస్థలతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వీరికి అనుబంధముంది.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson సురవరం ప్రతాపరెడ్డి

ప్రశ్న 6.
సురవరం ప్రతాపరెడ్డిగారి సాహిత్య కృషిని వివరించండి.
జవాబు:
ప్రతాపరెడ్డిగారు, ఎన్నో సాహిత్య ప్రక్రియలను సమర్థంగా నిర్వహించారు. కవిత్వము, కథ, నవల, నాటకం, వ్యాసం, జీవితచరిత్ర వంటి ప్రక్రియల్లో వీరు రచనలు చేశారు. ఎన్నో గ్రంథాలను పరిష్కరించారు. సాహిత్యాన్ని సేకరించారు. పరిశోధనాత్మక గ్రంథాలను ప్రకటించారు.

ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, రామాయణ విశేషములు అన్న వీరి రచనలు, పరిశోధకులుగా ప్రతాపరెడ్డిగార్కి సాటిలేని కీర్తిని తెచ్చిపెట్టాయి. రాజుల చరిత్రయే చరిత్రగా చెలామణి అయ్యే రోజుల్లో, ప్రజల సాంఘిక చరిత్రయే అసలైన చరిత్రగా రెడ్డిగారు ఆవిష్కరింపజేసారు. చరిత్ర రచనకు రెడ్డిగారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర అన్న గ్రంథము ఒజ్జబంతి అయ్యింది. అందుకే ఈ గ్రంథము కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన మొదటి గ్రంథంగా చరిత్ర సృష్టించింది.

వీరి హిందువుల పండుగలు అన్న గ్రంథము, హిందువుల పండుగల వెనుకనున్న నేపథ్యాలను, ఆచార సంప్రదాయాలను తెలిపే ప్రామాణిక గ్రంథము. వీరు, హిందువుల పండుగల విశేషాలెన్నింటినో పురాణ శాస్త్రప్రమాణంగా తెలిపారు. ప్రతాపరెడ్డి గారి ఈ హిందువుల పండుగలు అన్న గ్రంథానికి విపులంగా పీఠిక వ్రాయడానికి తనకు శక్తి, వ్యవధి కూడా చాలదని రాధాకృష్ణన్ గారు రాశారు. దానిని బట్టి, ఈ గ్రంథ ప్రత్యేకత ఏమిటో మనకు అర్థమౌతుంది.

సాహిత్యము ఆనందాన్నీ, ఉపదేశాన్నీ కూడా ఇవ్వాలి.

ప్రశ్న 7.
సురవరం ప్రతాపరెడ్డిగారి వ్యక్తిత్వాన్ని గూర్చి రాయండి.
జవాబు:
నిరాడంబరత, నిర్భీతి, నిజాయితి, నిస్వార్థత అన్నవి ప్రతాపరెడ్డి జీవ లక్షణాలు. వేషభాషల్లో ఈయన అచ్చమైన తెలుగు వాడిగా జీవించాడు. ఈయన తెలుగు అంకెలనే వాడేవాడు. ఈయన ‘స్వవేష భాషా దురభిమాని’ అని పేరు పొందాడు. ఈయన ఎవరినీ పొగిడేవాడు కాడు. తనను ఎవరైనా పొగిడితే, అంగీకరించేవాడు కాదు..

ప్రతాపరెడ్డి గారిలో ధర్మావేశం పాలు ఎక్కువ. ఆత్మీయతకే తప్ప, అహంకారానికి చోటులేని హృదయం ఈయనది. మంచి ఎక్కడున్నా, ఈయన గ్రహించేవాడు. ఆచార్య బిరుదు రాజు రామరాజు గారిని మొదట పరిశోధనవైపు మళ్ళించింది. సురవరం వారే ఈ విధంగా ఈయన ఎన్నో రచనలకు ప్రేరకుడు, కారకుడు.

ఈయనకు కులమతాల పట్టింపులేదు. జోగిపేటలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభలో, భాగ్యరెడ్డి వర్మకు సభలో పాల్గొనే అవకాశాన్ని రెడ్డిగారే కల్పించారు. అంబేద్కర్ కన్న ముందే, దళితోద్యమ స్ఫూర్తిని రగిల్చిన వాడు ‘భాగ్యరెడ్డివర్మ’. ప్రతాపరెడ్డిగారి ఆలోచనా సరళి విభిన్నంగా ఉంటుంది. శ్రీకృష్ణునికి మీసాలు ఉండాలని ప్రశ్నించి మీసాల కృష్ణుని చిత్రాన్ని తన గోల్కొండ పత్రికా కార్యాలయంలో వీరు పెట్టుకున్నాడు. వనపర్తి, ఆత్మకూరు, గద్వాల, గోపాలపేట, కొల్లాపూర్ సంస్థానాధీశులతో తనకు గల పరిచయాన్ని వీరు కేవలం సాహిత్య సమారాధనకే వినియోగించారు.

ప్రతాపరెడ్డి గారు ప్రజల మనిషి. 1952లో వనపర్తి శానస సభ్యుడిగా ఈయన ఎన్నికయ్యారు. తెలంగాణ సమాజాన్ని వీరు అన్ని కోణాల్లో ప్రభావితం చేశారు. ఈయన జీవనం పవిత్రం.
ప్రతాపరెడ్డి గారు రైతు, రాజబంధువు, కావ్య వేద నిష్ణాతుడు. స్వతంత్రుడు, శాసనకర్త, పురుషార్థజీవి, సంస్కృతీ పరిరక్షకుడు.

PAPER – II : పరిచిత గద్యాలు (మార్కులు : 5)

అ) కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

మద్రాసులో చదివేరోజుల్లోనే పత్రికొకటి పెట్టాలనే ఆలోచన కలిగింది ప్రతాపరెడ్డికి, జాతీయోద్యమంతో ప్రభావితుడై తన పత్రికకకు “దేశబంధు” అనే పేరు పెట్టాలనుకున్నాడు కూడా. మంచి ఆలోచనలెప్పుడూ మట్టిలో కలిసిపోవు. హైద్రాబాదులో ఉన్నప్పుడు ఈ ఆలోచనను ఆచరణలోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. “దేశబంధు” పేరుకు నిజాం ప్రభుత్వం అనుమతినిచ్చే పరిస్థితి లేదు. అందుకే “గోల్కొండ” పేరును ఖరారు చేసుకున్నాడు. అనుమతి దొరికింది. కార్యసాధనకు సమయస్ఫూర్తి కావాలి. 10 మే 1926 న గోల్కొండ పత్రిక పురుడు బోసుకుంది. నాటి తెలుగు పత్రికారంగంలో సంచలనాలకు తెరలేపింది. ప్రతాపరెడ్డి పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది గోల్కొండ పత్రిక. ఇది ప్రతాపరెడ్డి అక్షరాల కోట.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ప్రతాపరెడ్డి తన పత్రికకు ‘దేశబంధు’ అనే పేరు ఎందుకు పెట్టాలనుకున్నాడు .
జవాబు:
ప్రతాపరెడ్డి, జాతీయోద్యమంతో ప్రభావితుడయ్యాడు. అందుకే ఆయన తన పత్రికకు ‘దేశబంధు’ అనే పేరు పెడదామనుకున్నాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson సురవరం ప్రతాపరెడ్డి

ప్రశ్న 2.
గోల్కొండ పత్రిక ప్రారంభించిన తేదీ ఏది ?
జవాబు:
గోల్కొండ పత్రికను ప్రారంభించిన తేదీ 10 మే, 1926.

ప్రశ్న 3.
ప్రతాపరెడ్డి పేరు వినగానే, గుర్తుకు వచ్చే విషయం ఏది ?
జవాబు:
ప్రతాపరెడ్డి పేరు వినగానే “గోల్కొండ” పత్రిక గుర్తుకు వస్తుంది.

ప్రశ్న 4.
గోల్కొండ పత్రిక ప్రత్యేకత ఏది?
జవాబు:
గోల్కొండ పత్రిక నాటి తెలుగు పత్రికా రంగంలో సంచలనాలకు తెరలేపింది. అది ప్రతాపరెడ్డి అక్షరాలకోట.

ప్రశ్న 5.
కార్యసాధనకు కావలసినదేది ?
జవాబు:
కార్యసాధనకు కావలసినది “సమయస్ఫూర్తి”.

2. కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

“ఎన్నో సాహిత్య ప్రక్రియలను సమర్థంగా నిర్వహించాడు ప్రతాపరెడ్డి. కవిత్వం, కథ, నవల, నాటకం, వ్యాసం, జీవిత చరిత్ర వంటి ప్రక్రియల్లో రచనలు చేశాడు. గ్రంథ పరిష్కరణలు, జానపద సాహిత్య సేకరణ చేశాడు. పరిశోధనాత్మక గ్రంథాలు ప్రకటించాడు.

పరిశోధకుడుగా ప్రతాపరెడ్డికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టినవి “ఆంధ్రుల సాంఘిక చరిత్ర”, “హిందువుల పండుగలు”, “రామాయణ విశేషములు”. రాజుల చరిత్రయే, చరిత్రగా చెలామణి అయ్యేకాలంలో ప్రజల సాంఘిక చరిత్రే అసలైన చరిత్రగా ఆవిష్కరింపజేశాడు ప్రతాపరెడ్డి. చరిత్ర రచనకు ఈయన గ్రంథం ఒజ్జబంతి అయ్యింది. అందుకే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన మొదటి గ్రంథంగా చరిత్ర సృష్టించినదీ గ్రంథం.

హిందువుల పండుగల వెనుకనున్న నేపథ్యాలు, ఆచార సంప్రదాయాలు తెలిపే ప్రామాణిక గ్రంథం ‘హిందువుల పండుగలు’.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
పరిశోధకుడిగా సాటిలేని కీర్తిని ప్రతాపరెడ్డిగార్కి తెచ్చిన గ్రంథం ఏది ?
జవాబు:
పరిశోధకుడిగా ప్రతాపరెడ్డి గార్కి సాటిలేని కీర్తిని తెచ్చిన గ్రంథం “ఆంధ్రుల సాంఘిక చరిత్ర”.

ప్రశ్న 2.
చరిత్ర రచనలో ప్రతాపరెడ్డి గారు అనుసరించిన నూతన మార్గం ఏది ?
జవాబు:
రాజుల చరిత్రయే చరిత్రగా, ఆనాడు చెలామణి అయ్యేది. ఆ పరిస్థితులలో ప్రజల సాంఘిక చరిత్రే, అసలైన చరిత్రగా రెడ్డిగారు ఆవిష్కరింపచేశారు.

ప్రశ్న 3.
ప్రతాపరెడ్డి గారు ఆదరించిన సాహిత్య ప్రక్రియలను పేర్కొనండి.
జవాబు:
ప్రతాపరెడ్డి గారు కవిత్వము, కథ, నవల, నాటకం, వ్యాసం, జీవిత చరిత్ర వంటి సాహిత్య ప్రక్రియలను ఆదరించారు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson సురవరం ప్రతాపరెడ్డి

ప్రశ్న 4.
‘హిందువులు పండుగలు’ అన్న రెడ్డిగారి గ్రంథంలో గల విశేషాలేవి ?
జవాబు:
”హిందువులు పండుగలు’ అనే గ్రంథంలో రెడ్డిగారు, హిందువుల పండుగల వెనుక ఉన్న నేపథ్యాలనూ, ఆచార సంప్రదాయాలనూ వివరించారు.

ప్రశ్న 5.
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన మొదటి గ్రంథం ఏది ?
జవాబు:
ప్రతాపరెడ్డి గారి “ఆంధ్రుల సాంఘిక చరిత్ర” అన్న గ్రంథము, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన మొదటి గ్రంథము.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం

Telangana SCERT 9th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం 1st Lesson కుంరం భీం Questions and Answers.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం

‘జల్, జంగల్, జమీన్ (నీరు అడవి భూమి)
మనది…… అనే నినాదంతో గోండులను, కోయలను,
చెంచులను సంఘటితపరచి పోరుబాటలో నడిపించిన
విప్లవ వీరకిశోరం కుంరం భీం. ‘మా గూడెంలో
మా రాజ్యం’ అనే నినాదంతో గిరిజనులందరిని
ఏకంచేసి ప్రభుత్వంపై సమరం సాగించిన
పోరాటయోధుడు కుంరం భీం.
TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం 1

PAPER – I : వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన) (మార్కులు: 6)

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
బాల్యంలో కుంరం భీం, మనసుపై చెరగని ముద్రవేసిన సంఘటనను గూర్చి తెలపండి.
జవాబు:
కుంరం భీం ఒకసారి తన మిత్రులు జంగు, కొంతల్, మాదు, పైకులతో అడవికి వెళ్ళాడు. వారితో మేకపిల్లలు ఉన్నాయి. పైకు నారేపచెట్టు ఎక్కి, సన్న సన్న కొమ్మల్ని నరికి మేకలకు వేస్తున్నాడు. ఇంతలో జంగ్లాత్ జవాన్లు, ఒక సుంకరి వచ్చి చెట్టు కొమ్మలు నరుకుతున్న పైకును పట్టుకున్నారు. వారి వెంట అమీనాబ్ వచ్చి, పిల్లలందరినీ బంగ్లా దగ్గరికి తీసుకురమ్మని చెప్పాడు.

భీం తండ్రి, కుంరం చిన్ను, ఆ గూడెం పెద్ద. అమీనాబ్ పిల్లలు చెట్లు నరికినందుకు చిన్నును మందలించాడు. కొమ్మ నరికిన పిల్లవాడి వేళ్ళు నరకడమే తగిన శిక్ష అంటూ, ఎంత మంది బతిమాలినా వినకుండా భీం స్నేహితుడు పైకు వేళ్ళు నరికించాడు. పైకు అరుపులతో అడవి మారు మ్రోగింది. పైకు స్పృహతప్పి పడిపోయాడు.

ఈ సంఘటన భీంను పట్టి కుదిపింది. ఆవేశంలో వదినె దగ్గరకు వెళ్ళి “ఈ గాలి, నీరు, ఆకాశం మనవైనప్పుడు, ఈ భూమి, అడవి మనవి ఎందుకు కావు ? అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నను “మీ నాయినను అడుగు” అని వదినె భీంకు చెప్పింది.

పన్నుల రూపంలో తమ కష్టాన్ని అంతా గుంజుకుంటే ఆకలితో చచ్చిపోవాల్సిందేనా ? అని, ఆలోచిస్తూ, భీం ఆ రోజు ఆకలితో పడుకున్నాడు. ఈ సంఘటన భీం మనస్సుపై చెరగని ముద్రవేసింది. గిరిజనుల కష్టాన్ని ఇతరులు అన్యాయంగా తీసుకుపోతున్నారని భీం తెలుసుకున్నాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం

ప్రశ్న 2.
కుంఠం భీంపై, విటోబా ప్రభావం ఎటువంటిది ?
జవాబు:
సుర్దాపూర్ గొడవలో కుంరం భీం చేతిలో సిద్ధిక్ చచ్చిపోయాడు. భీం తన మిత్రుడు కొండల్తో కలిసి, ‘భారీలొద్ది’లో ఉన్న పెద్ద ముఖాసీని కలిసి, సర్కారుపై తాను తిరుగబడతాననీ, తనకు మద్దత్తు ఇమ్మనీ అడిగాడు. ముఖాసీ హింసా పద్ధతులు వద్దని సలహా చెప్పాడు.

దానితో భీం రైలెక్కి ఎలాగో చాందా పట్నానికి చేరాడు. రైల్వేస్టేషన్ బయట కూర్చున్న భీంకు, తన సామానులు మోయలేక బాధపడుతున్న ఒక ప్రయాణికుడు కనిపించాడు. ఆయనే విటోబా. భీం విటోబా సరకులను ఇంటికి చేర్చాడు. విటోబా ప్రింటింగ్ ప్రెస్సు యజమాని. నిజాం సర్కారుకూ, తెల్లదొరలకూ వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళతో విటోబాకు దగ్గర సంబంధాలున్నాయి. విటోబా రహస్యంగా ఒక పత్రికను నడిపేవాడు. రహస్య పార్టీ, రహస్య పత్రికల గురించి తెలుసుకున్న భీంకు, విటోబాపై మంచి అభిప్రాయం ఏర్పడింది. భీం, విటోబా దగ్గర ఒక సంవత్సరం ఉన్నాడు. అక్కడే

భీం తెలుగు, ఇంగ్లీషు, హిందీ చదవడం, రాయడం నేర్చుకున్నాడు. భీంకు విటోబా రాజకీయాల్నీ, సమాజ పరిణామాల్ని తెలియజేశాడు. సంఘంలో మార్పురావాలంటే త్యాగం చేయాలన్నాడు. ఒక రోజు రాత్రి పోలీసులు వచ్చి భీంను కొట్టి, విటోబాను అరెస్టు చేశారు. భీం తిరిగి రైల్వేస్టేషన్కు చేరాడు. అక్కడే భీంకు, మంచిర్యాల నుండి వచ్చిన ఒక తెలుగువాడితో పరిచయం అయ్యింది. వారిద్దరూ కలసి, ‘చాయ్పత్తా’ అని పిలువబడే అస్సాంకు వెళ్ళారు.

ప్రశ్న 3.
కుంరం భీంకు, అస్సాం తేయాకు తోటల్లో కలిగిన అనుభవాలను చెప్పండి.
జవాబు:
కుంరం భీం, అస్సాంలో తేయాకు తోటల్లో అడుగుపెట్టాడు. అక్కడ అనేక అనుభవాలతో ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు. ఎక్కడైనా కష్టజీవులకు బాధలు తప్పవనీ, కష్టపడే వానికి కడుపు నిండటం లేదనీ, భీం తెలుసుకున్నాడు. రోజు కూలీ పద్ధతిన, భీం తేయాకు తోటల్లో కష్టపడి పనిచేశాడు. అక్కడ చెమట తుడుచుకోడానికి లేచిన కార్మికులను, మేస్త్రీలు కొరడాలతో కొట్టేవారు. వారి సంపాదన వారి మందులకే సరిపోయేది కాదు. తోటల యజమానులకు కొంచెం కూడా దయాగుణం ఉండేది కాదు.

ఇవన్నీ చూస్తున్న భీంకు అసంతృప్తి రాజుకుంది. కుంరం భీం అస్సాంలో నాల్గు సంవత్సరాలున్నాడు. అక్కడే భీంకు మన్యం నుండి వచ్చిన ఒక తెలుగు వ్యక్తితో పరిచయం అయ్యింది. అతడి ద్వారా భీం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును గూర్చి తెలుసుకున్నాడు. మన్య ప్రాంత ప్రజల్ని సీతారామరాజు సమీకరించిన విధానాన్నీ, రామరాజు జరిపిన పోరాట రీతుల్ని, భీం అర్థం చేసుకున్నాడు. యువకులకు యుద్ధరీతులను రామరాజు ఎలా నేర్పాడో తెలుసుకున్నాడు.

అడవిపై తమకు తప్ప ఇతరులు ఎవరికీ అధికారం లేదని గిరిజనులతో చెప్పించిన రామరాజు యొక్క గొప్పతనాన్ని భీం అర్థం చేసుకున్నాడు. యుద్ధ సమయంలో సమాచారాన్ని చేరవేసే పద్ధతిని భీం గ్రహించాడు. యుద్ధ మెళుకువలను భీం గ్రహించాడు. క్రమంగా భీం ఎక్కుపెట్టిన బాణంలా తయారయ్యాడు.

ఈ సమయంలో తేయాకు తోటల్లో అన్యాయంగా ఇద్దరు కార్మికుల్ని కొడుతున్న మేస్త్రీతో, భీం తగవుపెట్టుకున్నాడు. మేస్త్రీలు కొరడా. భీం పైకి ఎత్తారు. భీం వారిని చితక కొట్టాడు. తోటల యజమాని పోలీసులతో చెప్పి భీంను జైల్లో వేయించాడు. ‘భీం’ జైలు నుండి తప్పించుకొని స్వగ్రామం వెళ్ళాడు.

ప్రశ్న 4.
కుంరం భీం, సర్కార్ (నిజాం) సైన్యంతో యుద్ధం చేసి అమరుడైన విధము తెలపండి.
(లేదా)
కుంరం భీం నాయకత్వంలో గోండు రాజ్య స్థాపనానికి గోండులు చేసిన యుద్ధ పరిణామాల్ని తెలుపండి.
జవాబు:
కుంరం భీం పినతండ్రి “కుర్దు” నాయకత్వంలో, బాబేఝరి ప్రాంతంలో గిరిజనులూ, గోండులూ అడవిని కొట్టి, వ్యవసాయం చేశారు. అది తెలిసి జంగ్లాత్ వాళ్ళు దాడిచేసి గిరిజన గూడేలను ధ్వంసం చేశారు. కుంరం భీం, బాబేఝరి వైపు వచ్చి “టొయికన్” గూడెంలో దిగాడు. భీం భార్య పైకూబాయి వకీలును పెట్టుకోమని భీంకి సలహా చెప్పింది. భీం వకీలును కలిశాడు. వకీలు నిజాంకు అసలు విషయం చెప్పమనీ, నిజాం అతడి ఇష్టం వచ్చినట్లు చేస్తాడనీ చెప్పాడు.

‘భీం’ పన్నెండు గూడేల ప్రజలను పట్నాపూర్ రమ్మని పిలిచాడు. గిరిజనులను భూములను దున్నండని, పంటలు పండించండని నిజాం మనుష్యులను తరిమికొడదామనీ చెప్పాడు. గిరిజనులు కూడా తాము ఆకలితో చావడం కన్న, పోరాటం చేసి చద్దాం అన్నారు. గోండులు భీం నాయకత్వాన్ని సమర్థించారు.

గోండులు అడవిని నరికి, పంటలు పండించారు. జంగ్లాత్ వాళ్ళు ‘బాబేఝరి’పై విరుచుకుపడ్డారు. ఒక జాగీర్దార్ తుపాకీపేల్చాడు. భీంకు అది భుజంపై తగిలింది. తాశీల్దార్ గోండులను అరెస్టు చెయ్యమని డి.ఎస్.పి. కి చెప్పాడు. కుంరం భీం, నిజాంను కలవాలని ప్రయత్నించాడు. కాని అతడికి నిజాం దర్శనం కాలేదు.

భీం, జోడెన్ ఘాట్ వెళ్ళి, గిరిజనుల్ని కలిసి, పరిస్థితుల్ని వారికి చెప్పాడు. “భూమి లేక చచ్చే కంటే, పోరాడి చద్దాం”. అన్నారు గిరిజనులు. గోండు రాజ్యస్థాపన లక్ష్యంగా, జోడెన్ ఘాట్ కేంద్రంగా, భీం నాయకత్వంలో నిజాంపై పోరాటానికి, గోండులు సిద్దమయ్యారు.

నిజాం సర్కారు ఆజ్ఞలను గోండులు వినలేదు. భీం నాయకత్వాన్ని ఇష్టపడ్డ ఇతర గ్రామాలవారు కూడా; గోండు రాజ్యస్థాపనకు భీంకు మద్దతిచ్చారు. తుపాకులు తయారయ్యాయి. గోండులు కుంరం భీంకు జై అన్నారు. నైజాం సైన్యాన్ని భీం బలగం, తరిమి కొట్టింది.

నైజాం సర్కారు సబ్కలెక్టర్, భీంను కలిసి, భీం కూ, అతని బంధువులకూ భూమి పట్టాలిస్తామన్నాడు. పోరు ఆపమని కోరాడు. చివరకు పన్నెండు గ్రామాల వారికీ పట్టాలిస్తానన్నా, భీం అంగీకరించలేదు. వేరుగా గోండు రాజ్యం కావాలన్నాడు. యుద్ధం ఏడు నెలలు సాగింది. నిజాం సైన్యం 10 రోజులు యుద్ధం చేసినా, కొండ ఎక్కలేకపోయింది. ఇంతలో కర్దూపటేల్ భీంను మోసం చేశాడు. సర్కారు సేనతో కలిసి, కొండ మీదికి దారి చూపాడు. నైజాం సైన్యం దొంగతనంగా వచ్చి, గోండు వీరుల్ని చంపింది. కుంరం భీంను కాల్చి చంపింది. ఈ విధంగా కుంరం భీం అమరుడయ్యాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం

ప్రశ్న 5.
గోండు నాయకుడు కుంరం భీంను గూర్చి రాయండి.
జవాబు:
ఆదిలాబాదు జిల్లా అడవుల్లోని యుద్ధ వీరులు గోండులు. వారిలో కుంరం భీం ప్రసిద్ధుడు. గూడెం పెద్ద చిన్ను కుమారుడు భీం. భీంకు సోము, బొజ్జు అనే అన్నలు ఉన్నారు. భీం చిన్నప్పుడు సంకెనపెల్లి గూడెంలో పెరిగాడు. భీం చిన్ననాటి నుండి సాహసుడు. నాయకలక్షణాలు కలవాడు. ఇతడి ఆలోచనలకు బలాన్ని ఇచ్చింది ఇతని వదినె కుకూబాయి.
ఒకసారి భీం మిత్రులతో అడవికి వెళ్ళాడు. చెట్టు కొమ్మలను నరికి మేకలకు వేశాడని, అమీనాబ్ ఇతని స్నేహితుడు పైకు వేళ్ళను నరికించాడు. ఆ సంఘటన భీం మనసుపై చెరగని ముద్రవేసింది. అక్కడి గాలి, ఆకాశం, నీరు తమదైనపుడు అక్కడ అడవి, భూమి తమవి ఎందుకు కావనీ, భీం వదినెను అడిగాడు.

భీం కుటుంబంతో సుర్దాపూర్ వెళ్ళి, అక్కడ అడవులు కొట్టి వ్యవసాయం చేశాడు. అక్కడ భూమి తనదన్న సిద్ధికు భీం కొట్టి చంపాడు. జంగ్లాతోళ్ళతో పోరు మంచిది కాదని, పెద్ద ముఖాసీ భీంకు సలహా చెప్పాడు. భీంకు చాందాలో విటోబాతో పరిచయం అయ్యింది. అక్కడ భీం తెలుగు, హిందీ, ఇంగ్లీషు చదవడం రాయడం నేర్చుకున్నాడు. విటోబా, నిజాంకు వ్యతిరేకంగా పత్రిక నడిపేవాడు. భీంకు రాజకీయాలను విటోబాయే తెలిపాడు.

భీం, అస్సాం తేయాకు తోటల్లో కూలీగా పనిచేశాడు. అక్కడే అల్లూరి సీతారామరాజు గిరిజనుల పక్షాన చేస్తున్న పోరాటం గురించి, యుద్ధరీతుల గురించి భీం తెలుసుకున్నాడు. తర్వాత “కాకన్ ఘాట్”లో అతడు అన్నలను కలిశాడు. దేవడం పెద్ద లచ్చుపటేల్, భీంకు సోంబాయితో పెళ్ళి చేయించాడు. పైకూబాయి కూడా భీం పట్ల ఆకర్షణతో అతణ్ణి పెళ్ళాడింది.

“బాబేఝరి” వద్ద భీం కుటుంబీకులు అడవిని కొట్టి వ్యవసాయం చేశారు. జంగ్లాత్ వాళ్ళు మన్నెంగూడేలను భస్మం చేశారు. భీం జనగామలో వకీలును కలిశాడు. భీం పన్నెండు గూడేల గిరిజనులను, పట్నాపూర్ పిలిచాడు. అక్కడ గిరిజనులు నైజాంతో పోరాటం చేసి చద్దామని నిశ్చయించారు. బాబేఝురి ప్రాంతంలో గిరిజనులు సర్కారు ఆజ్ఞలను లెక్కచేయలేదు. విషయం నైజాంకు చెప్పడానికి భీం ప్రయత్నించాడు. ఏడు నెలలు గిరిజనులకూ, నైజాం సైన్యానికి పోరాటం జరిగింది. ఒక గ్రామం పెద్ద కుట్రతో, నైజాం సైన్యం దొంగతనంగా వచ్చి గోండు వీరుల్నీ, భీంనూ కాల్చి చంపింది.

PAPER – II : పరిచిత గద్యాలు (మార్కులు : 5)

అ) కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

కుంరం భీం బాల్యం నుండి తెలివైనవాడు, సాహసవంతుడు, నాయకత్వ లక్షణాలున్నవాడు. భీం చిన్నప్పటి నుంచి ప్రతి విషయానికి స్పందించేవాడు. ఆలోచించేవాడు. దేన్నీ ఊరికే వదిలిపెట్టేవాడు కాదు. ఈ లక్షణాలే తరువాత అతడిని గిరిజన వీరుడిని చేశాయి. అతని ఆలోచనలకు పురుడు పోసింది, అతని భావాలకు బలాన్ని ఇచ్చింది అతని వదినె కుకూబాయి. భీం చిన్నప్పుడు సంకెనపెల్లి గూడెంలో పెరిగాడు. అక్కడి చెట్టూ, చేమా, బోళ్ళు, బండలు, కొండలు, వాగులు ఒకటేమిటి సమస్త ప్రకృతి అతడిని తీర్చిదిద్దింది. ఆ రోజుల్లోనే ఒక రోజు భీం తన మిత్రులైన జంగు, కొంతల్, మాదు, పైకులతో కలిసి అడవికి వచ్చాడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
కుంరం భీం భావాలకు బలాన్ని ఇచ్చిన వారెవరు ?
జవాబు:
కుంరం భీం భావాలకు బలాన్ని ఇచ్చింది అతని వదినె ‘కుకూబాయి’.

ప్రశ్న 2.
కుంరం భీంను తీర్చిదిద్దినవారు ఎవరు ?
జవాబు:
కుంరం భీంను సంకెనపెల్లి గూడెంలోని చెట్లూ, చేమా, కొండలూ వంటి సమస్త ప్రకృతి తీర్చిదిద్దాయి.

ప్రశ్న 3.
కుంరం భీం మిత్రుల పేర్లు ఏమిటి ?
జవాబు:
కుంరం భీం మిత్రులు

  1. జంగు,
  2. కొంతల్,
  3. మాదు,
  4. పైకు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం

ప్రశ్న 4.
కుంరం భీం వ్యక్తిత్వం ఎటువంటిది ?
జవాబు:
కుంరం భీం, బాల్యం నుండి తెలివిగలవాడు. నాయకత్వ లక్షణాలు గలవాడు. సాహసవంతుడు.

ప్రశ్న 5.
కుంరం భీం ఆలోచనలకు పురుడు పోసిన వదినె పేరు ఏమిటి ?
జవాబు:
కుంరం భీం ఆలోచనలకు పురుడు పోసిన వదినె పేరు “కుకూబాయి”.

ఆ) కింది పేరాను చదవండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

దేవడం పెద్ద లచ్చుపటేల్. అతని దగ్గర భీం జీతానికి కుదిరాడు: అతని పంట పొలాల్లో మార్పు తెచ్చాడు. పత్తి, మిరప వంటి వ్యాపార పంటలను వేశాడు. మొత్తానికి భీం తెలివిపరుడని, వ్యవహారదక్షుడని అందరితో అనిపించుకున్నాడు. లచ్చుపటేల్ భూముల వ్యవహారాలను ముందు నుంచి చూసే అంబటిరావుకు, “సోంబాయి” అనే కూతురు ఉంది. ఆమెను భీంకిచ్చి పెండ్లి చేస్తే బాగుంటుందని లచ్చుపటేల్ నిశ్చయించాడు.

ఆ విధంగా కుంరం భీం, సోంబాయిల పెండ్లి దేవడంలో లచ్చుపటేల్ ఆధ్వర్యంలో జరిగింది. ఆ రోజుల్లో కుంరం భీం వార్తల్లో వ్యక్తి అయినాడు. అతని పట్ల ఆకర్షణ పెంచుకున్న పైకూబాయి, అనే యువతి కోరి అతన్ని పెండ్లాడింది. భీం కాకన్ట్లో కాపురం పెట్టాడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
కుంరం భీం పెండ్లి ఎక్కడ, ఎవరి ఆధ్వర్యంలో జరిగింది ?
జవాబు:
కుంరం భీం పెండ్లి దేవడంలో లచ్చుపటేల్ ఆధ్వర్యంలో జరిగింది.

ప్రశ్న 2.
కుంరం భీం ఎవరి దగ్గర పనిచేశాడు? ఆయన ఎవరు ?
జవాబు:
కుంరం భీం, లచ్చుపటేల్ దగ్గర జీతానికి కుదిరాడు. లచ్చుపటేల్ “దేవడం” గ్రామపెద్ద.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం

ప్రశ్న 3.
పెండ్లి అయిన తర్వాత భీం, ఎక్కడ మకాం పెట్టాడు ?
జవాబు:
పెండ్లి అయిన తర్వాత భీం “కాకనాట్”లో కాపురం పెట్టాడు.

ప్రశ్న 4.
భీం తెలివిపరుడని, వ్యవహారదక్షుడని ఎందుకు పేరు తెచ్చుకున్నాడు ?
జవాబు:
భీం, లచ్చుపటేల్ దగ్గర జీతానికి కుదిరి, ఆయన పంట పొలాల్లో పత్తి, మిరపలాంటి వ్యాపార పంటలు వేశాడు. `ఆ విధంగా తెలివిపరుడని భీం పేరు తెచ్చుకున్నాడు.

ప్రశ్న 5.
అంబటి రావు ఎవరు ?
జవాబు:
అంబటి రావు, లచ్చుపటేల్ భూముల వ్యవహారాలను చూసేవాడు. అంబటిరావు కూతురు సోం బాయిని భీం పెండ్లాడాడు.

TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి

Telangana SCERT 9th Class Telugu Guide Telangana 6th Lesson దీక్షకు సిద్ధంకండి Textbook Questions and Answers.

TS 9th Class Telugu 6th Lesson Questions and Answers Telangana దీక్షకు సిద్ధంకండి

చదువండి – ఆలోచించి చెప్పండి (Textbook Page No. 60)

స్వచ్ఛతలో చరిద్దాం !! స్వచ్ఛతకై శ్రమిద్దాం !

స్వచ్ఛ భారత్కు సన్నద్ధం కండి !

ప్రియమైన విద్యార్థులారా ………….

దేశవ్యాప్తంగా ఇటీవల మనం స్వచ్ఛభారత్ పేరుతో ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టిన విషయం మీకు తెల్సిందే! ప్రజల బాధ్యతారాహిత్యం వల్ల దేశవ్యాప్తంగా పేరుకుపోతున్న అపరిశుభ్రతను అనతికాలంలోనే తొలగించాలన్నది ఒక దీక్షలాగ చేపట్టాం. నిరంతరం కొనసాగవలసిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు కూడా భాగస్వాములే ! మీ మీ పరిసరాల్లో పోగుపడ్డ చెత్తాచెదారాన్ని తొలగించుకుంటూ, వ్యక్తిగత శుభ్రతతో సామాజిక పరిశుభ్రతను గురించి పదిమందికి అవగాహన కల్పిస్తూ స్వచ్ఛభారత్ సాకారమయ్యే దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాం !

రానున్న రోజులలో భారతావని పరిశుభ్ర భారతంగా పరిఢవిల్లాలని కోరుకుందాం.

వైద్య, ఆరోగ్యశాఖ, రాష్ట్రం.
తెలంగాణ రాష్ట్రం

ప్రశ్నలు

ప్రశ్న 1.
ఇటువంటి పత్రాలు ఎక్కడైనా చూశారా ?
జవాబు:
ఇటువంటి పత్రాలను నేను చూశాను. వీటిని “కరపత్రాలు” అంటారు. వీటినే ఇంగ్లీషుభాషలో Pamphlet అంటారు. ఈ రోజుల్లో సమావేశాలకు రమ్మని పిలిచే ఆహ్వానాలకూ, ఆరోగ్యవర్ధకమైన ప్రభుత్వ ప్రచారాలకు, దైవసంబంధ కార్యక్రమాలకు ఈ కరపత్రాలను పంచుతున్నారు.

ప్రశ్న 2.
ఇట్లా పంచిపెట్టే పత్రాలను ఏమంటారు?
జవాబు:
ఇలా సమాచారాన్ని సంక్షిప్తంగా అందించేందుకు వినియోగించే పత్రాలను కరపత్రాలు అంటారు.

TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ప్రశ్న 3.
వీటిని ఎందుకు పంచిపెడుతారు?
జవాబు:
ఒక సమాచారాన్ని లేదా వివాదాస్పద అంశాన్ని ప్రజలందరికీ తెలియపరచడమే, కరపత్రం పంచడంలో గల ప్రధాన ఉద్దేశం. ఒక వ్యక్తిగాని, సంస్థగాని ప్రజలకు అందించాలనుకొనే సమాచారాన్ని వీలైనంత సంక్షిప్తంగా ముద్రిత రూపంలో అందించేందుకు ఈ కరపత్రాలను వినియోగిస్తారు.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
కరపత్రాలను ఎందుకు రూపొందిస్తారు ? మీరు చదివిన కరపత్రం గురించి మాట్లాడండి.
జవాబు:
ఒక వ్యక్తిగాని, సంస్థగాని ప్రజలకు అందించాలనుకొనే సమాచారాన్ని, వీలైనంత సంక్షిప్తంగా ముద్రిత రూపంలో అందించేందుకు కరపత్రాన్ని రూపొందిస్తారు. ఒక సమాచారాన్ని లేదా వివాదాస్పద విషయాన్ని ప్రజలందరికీ తెల్పడమే కరపత్రం యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సామాజిక ప్రయోజనాలు ఉన్న విషయాలను, సామాన్య ప్రజానీకానికి చేరవేయడానికి కరపత్రం, ఒక ముఖ్య సాధనంగా ఉంటుంది.

నేను చదివిన కరపత్రం : స్టేట్బ్యాంకు వారు ఇంటి అప్పులు తక్కువ వడ్డీకి, ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా ఇస్తారన్న కరపత్రాన్ని నేను చదివాను.

  1. ఇంటి అప్పుకు దరఖాస్తు చేసే వ్యక్తి పేర ఇంటిస్థలం ఉండాలి.
  2. ఇల్లు నిర్మాణానికి స్థానిక పంచాయితీ / మునిసిపల్ కార్పొరేషన్ వారి అనుమతి పత్రం ఉండాలి.
  3. నిర్మాణ ఖర్చులో 1/4 వంతు పెట్టుబడిగా పెట్టగలిగిన స్థోమత దరఖాస్తుదారుకు ఉండాలి.
  4. హామీదారు అవసరం లేదు.
  5. అప్పు వడ్డీతో సహా 15 సంవత్సరాలలో తీర్చగలగాలి.
  6. జీతం నుండి రికవరీ చేసి, బ్యాంకుకు కడతామన్న పై అధికారి, హామీపత్రం ఉండాలి.
  7. సంవత్సరానికి 8% వడ్డీకే ఋణం మంజూరు.
  8. ఋణం ముందుగా చెల్లిస్తే, వడ్డీలో కన్సెషన్లు ఇవ్వబడతాయి.

ప్రశ్న 2.
ప్రజా ఉద్యమాలను శాంతియుతంగానే నిర్వహించవలసిన అవసరం ఏమిటి? చర్చించండి.
జవాబు:
ప్రజా ఉద్యమాలను శాంతియుతంగానే నిర్వహించాలి. హింసా పద్ధతులతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రజల నిత్యావసరాల సరఫరాకు ఆటంకాలు కల్పించడం, వగైరా పనులు చేయరాదు.

ప్రజా ఉద్యమాలను శాంతియుతంగా నిర్వహిస్తే కలిగే లాభాలు :

  1. ఉద్యమకారులకు ప్రాణనష్టం, ధననష్టం జరుగదు.
  2. ఉద్యమకారులు ప్రాణభయంతో ఉద్యమం నుండి తప్పుకోరు.
  3. శాంతియుతంగా ఉద్యమాలు నడిపితే, ఉద్యమాన్ని ఎక్కువకాలం కొనసాగించవచ్చు.
  4. ఎక్కువకాలం శాంతియుతంగా ఉద్యమం నిర్వహిస్తే, ప్రభుత్వానికి కూడా ఉద్యమకారులపై సానుభూతి, దయ కలుగుతుంది.
  5. శాంతియుతంగా ఉద్యమం నడిపిన ఉద్యమకారులపై సామాన్య ప్రజలకు అభిమానం, సానుభూతి కలుగుతాయి.
  6. శాంతియుతంగా చేస్తే, ఉద్యమకారులను ప్రభుత్వం కూడా ఏమీ చేయదు.
  7. శాంతియుత ఉద్యమం తప్పక విజయాన్ని సాధిస్తుంది.

TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ప్రశ్న 3.
పాఠం చదువండి. అప్పటి ప్రభుత్వ పాలనను గురించి విమర్శిస్తూ వాడిన కీలక పదాలు వెతికి రాయండి. వాటిని వివరించండి.
TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి 1
జవాబు:
TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి 2

ప్రశ్న 4.
కింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఆంగ్లేయుల రాకకు ముందు మన భారతదేశంలో కరపత్రాలు లేవు. ఆధునిక కాలంలో ప్రతిరోజు మనం కనీసం ఒకకరపత్రమైనా చూస్తున్నాం.

ఒక సమాచారాన్ని లేదా ప్రత్యేక అంశాలను అందరికీ తెల్పడమే కరపత్రం ప్రధాన ఉద్దేశం. కరపత్రంలో సాధారణంగా వాడుకభాష ఉంటుంది. కరపత్రాలు వేసినవాళ్ళు, రాసినవాళ్ళ పేర్లు గాని, ముద్రణాలయం పేరు గాని కరపత్రాల్లో ఉండాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సామాజిక ప్రయోజనాలున్న అంశాలను సామాన్య ప్రజానీకానికి చేరవేయడానికి కరపత్రం ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడుతుంది. కరపత్రం మనిషి భావస్వేచ్ఛకు సంకేతం.

ప్రశ్నలు:

అ) పై పేరాకు శీర్షిక నిర్ణయించండి.
జవాబు:
‘కరపత్రాల ప్రయోజనం’ అనేది, పై పేరాకు శీర్షికగా సరిపడుతుంది.

ఆ) కరపత్రాలు మనదేశంలో ఎప్పటి నుండి ఉన్నాయి ?
జవాబు:
కరపత్రాలు, మనదేశంలో ఆంగ్లేయులు మన దేశానికి వచ్చినప్పటి నుండీ ఉన్నాయి.

ఇ) కరపత్రాలు ఎందుకు ?
జవాబు:
ఒక సమాచారాన్ని లేదా వివాదాస్పద అంశాన్ని అందరికీ తెల్పడానికి, కరపత్రాలు ఉపయోగిస్తారు.

ఈ) కరపత్రాలు ఎట్లా ఉండాలి ?
జవాబు:
కరపత్రాలలో సాధారణంగా వాడుకభాష ఉండాలి. కరపత్రాలు వేసినవాళ్ళు, రాసినవాళ్ళ పేర్లు గాని, ముద్రణాలయం పేరు గాని, కరపత్రాల్లో ఉండాలి.

ఉ) పై గద్యం ప్రకారం ఎక్కువగా వేటికి చెందిన కరపత్రాలు చూస్తున్నాం ?
జవాబు:
ప్రభుత్వ సంక్షేమ పథకాలనూ, సామాజిక ప్రయోజనాలున్న విషయాలనూ, సామాన్య ప్రజలకు చేరవేయడానికి నేడు ఎక్కువగా కరపత్రాలు వాడుతున్నాం.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) 1969 తెలంగాణ ఉద్యమకాలం నాటి పాలన ఎట్లా ఉందని భావిస్తున్నారు ?
జవాబు:
1969లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని, విద్యార్థులూ, ప్రజలూ, ఉద్యోగస్థులూ, రాజకీయ నాయకులూ పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తెలంగాణ నాయకుడు పి.వి. నరసింహారావుగారు ఉండేవారు. 1956లో ఆంధ్ర ప్రాంతమూ తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. తెలంగాణ ప్రాంతానికి ముల్కీ హక్కులు ఉండేవి.. దాని ప్రకారము తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం తెలంగాణ వారికే ఇవ్వాలి.

కాని ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత, తెలంగాణ ప్రాంతంలో సహితమూ, ముల్కీ నియమాలను ఉల్లంఘించి, ఆంధ్ర ప్రాంతం వారికి తెలంగాణలో ఉద్యోగాలు ఇచ్చారు. అదీగాక 1956 నుండి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఆంధ్ర ప్రాంతం వారే ఉండేవారు. వారు ఆంధ్ర ప్రాంతానికి మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకొనేవారు. తెలంగాణ ప్రాంతంలో వచ్చే ప్రభుత్వ రెవెన్యూను సైతం వారు ఆంధ్ర ప్రాంతంలో ఖర్చు చేసేవారు.

అందువల్ల తెలంగాణ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడింది. తెలంగాణ ఉద్యోగులు, ముల్కీ హక్కుల రక్షణకు, నిరవధిక సమ్మెలు ప్రారంభించారు. రాష్ట్ర నాయకులు సమ్మెలను నిర్దాక్షిణ్యంగా అణచివేశారు. విద్యార్థులు 9 నెలలపాటు సమ్మె చేసినా, ప్రభుత్వం పట్టించుకోలేదు. విద్యార్థులకు అప్పుడు ఒక విద్యా సంవత్సరం పూర్తిగా వ్యర్ధమయ్యింది.

TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ఆ) అప్పటి తెలంగాణ పోరాటంలో ప్రజలు కోపోద్రిక్తులు కావడానికి కారణాలు రాయండి.
జవాబు:
ప్రజలు శాంతియుతంగా నెలల తరబడి సమ్మెలు, ధర్నాలు, పికెటింగులు చేసినా, నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉద్యమ నాయకులను బలవంతంగా కారాగారాల్లో ప్రభుత్వము బంధించింది. ఎందరో యువకులు, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోలీసుల తుపాకుల తుటాలకు బలయ్యారు. ఎందరో ఉద్యమ నాయకులు, రక్తతర్పణ చేశారు. ఎందరో యువకులు అంగవికలులు అయ్యారు..

తెలంగాణ ప్రాంతం అంతా, అగ్నిగుండంగా మారింది. అయినా కేంద్రప్రభుత్వము తెలంగాణ ప్రజల కోరికను మన్నించలేదు. కనీసము వారిని శాంతింపచేయడానికి ప్రయత్నాలు కూడా చేయలేదు. ఆ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు కోపోద్రిక్తులయ్యారు.

ఇ) గాంధీజీ సిద్ధాంతాలకు అనుగుణంగా తెలంగాణ సాధించాలనడంలో ఆంతర్యం ఏమిటి ?
జవాబు:
1969వ సంవత్సరము గాంధీ శతజయంతి సంవత్సరము. గాంధీజీ శాంతి, సత్యము, అహింస అనే సిద్ధాంతాలతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య పాలకులను మనదేశం నుండి వెడలగొట్టగలిగారు. గాంధీజీ కార్యసాధనకు సత్యాగ్రహాలను, నిరాహారదీక్షలను నమ్మినవాడు. అటువంటి గాంధీజీ శత జయంతి సంవత్సరంలో, గాంధీజీ నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని, తెలంగాణ ప్రజాసమితి భావించింది. అందుకే విద్యార్థి నాయకుడు నిరాహారదీక్షకు సిద్ధపడ్డాడు.

ఉద్యమం శాంతియుతంగా నడవకపోతే, ప్రభుత్వం బలవంతంగా ఆ ఉద్యమాన్ని శాంతిస్థాపన పేరుతో అణచివేస్తుంది. అశాంతిగా ఉద్యమాన్ని నడిపిస్తే, నాయకులను, ప్రభుత్వం బంధిస్తుంది. ఆ పరిస్థితులు రాకుండా, తెలంగాణ ప్రజాసమితి నాయకత్వం ముందు జాగ్రత్తగా, రాష్ట్ర సాధనోద్యమాన్ని, గాంధీజీ సిద్ధాంతాలకు అనుగుణంగా సాగించాలని నిశ్చయించింది.

ఈ) ప్రజా ఉద్యమాలు హింసాత్మకంగా మారకుండా ఉండడానికి ఉద్యమనాయకత్వం ఏం చేయాలి?
జవాబు:
ప్రజా ఉద్యమాలు హింసాత్మకంగా మారకుండా ఉండాలంటే, ఉద్యమనాయకులు ఈ కింది పద్ధతులను ఆచరణలో పెట్టాలి.

  1. ఉద్యమానికి ప్రధాన నాయకునిగా ఆవేశపరుడు, ఉద్రేకం కలవాడు కాని, అనుభవం కల నాయకుడిని ఎన్నుకోవాలి.
  2. ఉద్యమం శాంతియుతంగా, గాంధీజీ నమ్మిన అహింసా మార్గంలోనే నడిపించాలి.
  3. ఉద్యమనాయకులు ప్రభుత్వ ఆస్తులకు ఏవిధమైన నష్టం కల్గించరాదు.
  4. ఉద్యమనాయకులు తమ అనుచరులకు హితాన్ని ఉపదేశించి, శాంతిమార్గంలో నడిచేలా చేయాలి.
  5. ఉద్యమనాయకులు ప్రభుత్వానికి తమ సమస్యలను ఎప్పటికప్పుడు శాంతియుతంగా తెలపాలి.
  6. ఉద్యమాన్ని హింసా పద్ధతిలోనికి ఎన్నడూ మార్చరాదు.
  7. ఉద్యమం హింసాపద్ధతిలోకి మళ్ళినట్లయితే, వెంటనే ఉద్యమాన్ని తాత్కాలికంగా నాయకుడు ఆపుచేయాం.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) 1969 నాటి తెలంగాణ ఉద్యమం ద్వారా రాష్ట్రం సాధించకపోవడానికి, నేటి ఉద్యమం విజయవంతం కావడానికి కారణాలు విశ్లేషించండి.
జవాబు:
1969 తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ నాయకులు డా॥ మర్రి చెన్నారెడ్డిగారు నాయకత్వం వహించారు. ఆ రోజుల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, ఈ మధ్య సాగిన ఉద్యమం కంటే తీవ్రస్థాయిలోనే జరిగింది. నాటి తెలంగాణ ప్రజాసమితి నాయకత్వాన్ని ప్రజలు కూడా ఎక్కువగానే సమర్థించారు.

అప్పుడు జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి నాయకులను 10 మందిని, ప్రజలు యమ్.పి లుగా నెగ్గించారు. విద్యార్థులు 9 నెలలపాటు పాఠశాలలనూ, కళాశాలలనూ బహిష్కరించారు. వారికి ఒక విద్యాసంవత్సరం మొత్తం నష్టం అయ్యింది. అయినా, ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాలేదు.
దానికి ముఖ్యకారణాలివి.

ఆనాటి తెలంగాణ ఉద్యమంలో అహింసా పద్ధతులు అమలయ్యాయి. హైదరాబాదు నగరంలో నివసిస్తున్న ఆంధ్రప్రాంత స్త్రీలను ఉద్యమకారులు అవమానించారు. అల్లర్లు చేశారు. ఈ విధంగా ఉద్యమంలో అహింసా పద్ధతులు అమలుచేయడం వల్లే, నాడు ఆ నాయకులు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధింపలేకపోయారు.

నేటి ఉద్యమ విజయానికి కారణాలు :

  1. నేటి ఉద్యమం, పట్టువదలని విక్రమార్కుడైన కె.సి.ఆర్ నాయకత్వంలో అహింసా పద్ధతులలో సాగింది.
  2. నిరాహారదీక్షలు, నిరసనలు, సమ్మెలు, సకలజనుల సమ్మె, ఉద్యోగుల సమ్మె వంటి పద్ధతుల ద్వారా కేంద్రప్రభుత్వాన్ని నేటి ఉద్యమ నాయకులు ఒప్పించగలిగారు.
  3. 1969 ఉద్యమానికి నాటి కాంగ్రెస్ పార్టీ, వ్యతిరేకంగా నిలిచింది. నేటి ఉద్యమనాయకులకు, తెలంగాణలోని అన్ని పార్టీలూ కలిసి వచ్చాయి.
  4. ముఖ్యంగా కాంగ్రెస్పార్టీ వారు ముందుండి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిపెట్టారు.
    ఈ విధంగా శాంతియుతంగా సాగడమే, నేటి ఉద్యమ విజయానికి ప్రథమ కారణం.

TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా రాయండి.

ఆ) తెలంగాణ ప్రజల జీవనానికి, గ్రామాల అభివృద్ధికి తోడ్పడేవి “చెరువులు”. ఈ చెరువుల ప్రాధాన్యత వివరిస్తూ, వీటిని కాపాడడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చే కరపత్రం తయారు చేయండి. చదివి వినిపించండి.
జవాబు:

‘తెలంగాణ ప్రజల జీవనానికి చెరువుల ప్రాధాన్యము’

మన తెలంగాణ ప్రాంతంలో నేడు నీటి కొరతను ఎదుర్కొంటున్నాం. మనకు కృష్ణా, గోదావరి జీవనదులు ఉన్నా, వర్షపాతం తగినంత లేకపోడం దానికి ముఖ్యకారణం. ప్రధానంగా మన తెలంగాణలో చెరువులు ముఖ్యనీటి వనరులుగా ఉండి, మనకు త్రాగునీటినీ, సాగునీటినీ అందిస్తూ వచ్చాయి. ఈ మధ్యకాలంలో చెరువులను పూడ్చి ఆ స్థలంలో భవనాలు కట్టడం జరుగుతోంది. ఉన్న చెరువులను లోతుగా త్రవ్వించి, దానితో నీటిని నిల్వ చేయడంలో శ్రద్ధ తగ్గిపోయింది. చెరువులు, నీటి తూడు వగైరా పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. కొన్ని చెరువులు ఎండిపోయాయి. అందువల్లనే నేడు భూగర్భజలాలు అడుగంటిపోయాయి. 1500 అడుగులు లోతు బోర్లు వేసినా, చుక్క నీరు లభించడం లేదు. దీనికి ముఖ్యకారణం, మనం చెరువుల విషయంలో చూపిస్తున్న అశ్రద్ధ.

మన తెలంగాణ ప్రాంతంలో శాతవాహనుల కాలం నుండి చెరువుల నిర్మాణంపై శ్రద్ధ ఉంది. కాకతీయుల కాలంలో చెరువుల నిర్మాణం ఉన్నత దశకు చేరింది. తెలంగాణ పాలకులు, అసఫ్జాహీలు, కుతుబ్షాహీలు, సంస్థానాధీశులు చెరువుల నిర్మాణాన్ని అభివృద్ధి చేశారు.

ఇప్పటి మన తెలంగాణ ప్రభుత్వము చెరువుల ప్రాధాన్యతను గుర్తించింది. ‘మిషన్ కాకతీయ’ అనే పేరుతో పాత చెరువుల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యతనిస్తోంది. మనం కూడా ప్రభుత్వంతో చేయి కలుపుదాం. మనం కూడా ఉద్యమస్ఫూర్తితో ముందుకు కదులుదాం. ప్రతి గ్రామంలో చెరువుల పునర్నిర్మాణంలో పాలు పంచుకుందాం. నీటి కొరతలేని బంగారు తెలంగాణను నిర్మించుకుందాం. కదలిరండి. చెరువులను పునర్నిర్మించండి.

ది. X X X X X

ఇట్లు
తెలంగాణ రాష్ట్ర జలవనరుల శాఖ.

III. భాషాంశాలు

పదజాలం

1. కింది వాక్యాల్లోని గీత గీసిన పదాలకు అర్థాలు రాస్తూ, సొంతవాక్యాల్లో ప్రయోగించండి.

అ) ఆయన అహర్నిశల ఆరాటము తీరని ఆవేదనగానే మిగిలిపోయినది.
జవాబు:
అహర్నిశలు = రాత్రింబగళ్ళు
వాక్యప్రయోగం : మనిషి అహర్నిశలూ విద్యాధనములు సంపాదించాలి.

ఆ) గాంధీ అహింసా మార్గంలో లక్ష్యాన్ని సాధించాడు.
జవాబు:
లక్ష్యం = తలపెట్టిన కార్యం
వాక్యప్రయోగం : ఏదైనా లక్ష్యాన్ని సాధించాలంటే పట్టుదల మెండుగా ఉండాలి.

ఇ) తెలంగాణ జనత ధర్మయుద్ధం సాగిస్తున్నది.
జవాబు:
జనత = జనుల గుంపు
వాక్యప్రయోగం : భారతదేశం జనత కష్టజీవులు. ధర్మవర్తనులు.

2. ఇచ్చిన వివరణలకు సరిపడే జాతీయాలను బ్రాకెట్లో ఇవ్వబడిన వాటి నుండి ఏరి వాటికెదురుగా ఉన్న గళ్లల్లో రాయండి.

TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి 3
(కట్టలు తెంచుకోవడం, ఏ ఎండకాగొడుగు, ఉక్కుపాదం మోపడం, తిలోదకాలు ఇవ్వడం)
జవాబు:
అ) ఆశలు వదులు కొనటం = తిలోదకాలు ఇవ్వడం
ఆ) బలవంతంగా అణచివేయటం = ఉక్కుపాదం మోపడం
ఇ) మితిమీరిపోవటం = కట్టలు తెంచుకోవడం
ఈ) అవకాశవాదం = ఏ ఎండకాగొడుగు

వ్యాకరణాంశాలు

1. కింది వాక్యాల్లో సంధి పదాలను గుర్తించి, ఆ పదాలను విడదీసి సంధి పేర్లు పేర్కొనండి.

అ) కోపోద్రిక్తులైన కార్యకర్తలను హింసకు తెగబడకుండా కట్టడి చేశారు.
__________ + _______ = __________
జవాబు:
కోపాద్రిక్తులు = కోప + ఉద్రిక్తులు = గుణసంధి

ఆ) నమ్మిన సిద్ధాంతం కోసం గొప్పవారు ప్రాణాలర్పించడం చూస్తనే ఉన్నాం.
__________ + _______ = __________
జవాబు:
ప్రాణాలర్పించడం = ప్రాణాలు + అర్పించడం = ఉత్వసంధి

ఇ) సత్యాహింసలు పాటించడం ద్వారా సమాజ శాంతికి బాటలు వేయవచ్చు.
__________ + _______ = __________
జవాబు:
సత్యాహింసలు = సత్య + అహింసలు = సవర్ణదీర్ఘ సంధి

TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి

2. సమాస పదాలకు చెందిన కింది పట్టికను పూరించండి.

TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి 6

‘సమాస పదం – విగ్రహవాక్యం – సమాస నామం

  1. భక్తి ప్రపత్తులు – భక్తియు, ప్రపత్తియు – ద్వంద్వ సమాసం
  2. ధర్మయుద్ధం – ధర్మము కొఱకు యుద్ధం – చతుర్థీ తత్పురుష సమాసం
  3. రక్తపాతం – రక్తం యొక్క పాతం – షష్ఠీ తత్పురుష సమాసం
  4. శాంతి సందేశం – శాంతి యొక్క సందేశం – షష్ఠీ తత్పురుష సమాసం
  5. నాలుగెకరాలు – నాలుగు సంఖ్య గల ఎకరాలు – ద్విగు సమాసం

3. కింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.

అ) వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొన్నారు.
వేలాది యువకులు కారాగారాలకు వెళ్లారు. (సామాన్య వాక్యాలు).
జవాబు:
వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొన్నారు మరియు కారాగారాలకు వెళ్ళారు. (సంయుక్త వాక్యం)

ఆ) గాంధీ విధానాలను ఆచరించాలి.
గాంధీ విధానాల ద్వారా మంచిని సాధించాలి. (సామాన్య వాక్యాలు)
జవాబు:
గాంధీ విధానాలను ఆచరించాలి మరియు మంచిని సాధించాలి (సంయుక్త వాక్యం)

ప్రాజెక్టు పని

మీ ప్రాంతంలో వివిధ రకాల కరపత్రాలు సేకరించి వాటి వివరాలు కింది పట్టిక రూపంలో నమోదు చేయండి. నివేదిక రాయండి.
TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి 4
జవాబు:
TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి 5

కఠిన పదాలకు అర్థాలు

I

62వ పేజీ

సామూహిక ఉపవాస దీక్ష = అందరూ కలసి గుంపుగా ఉపవాసవ్రతం చేపట్టడం
తెలంగాణ రాష్ట్ర ధ్యేయాన్ని = తెలంగాణ రాష్ట్ర సాధన వాంఛను
చాటి చెప్పడానికి = వెల్లడించడానికి
మహాత్ముని = మహాత్మగాంధీజీ యొక్క
ప్రగాఢ విశ్వాసాన్ని = గట్టి నమ్మకాన్ని
ఆదేశాలను = ఆజ్ఞలను
ప్రజా ఉద్యమము = ప్రజల పోరాటం
కొనసాగుతున్నా = సాగుతున్నప్పటికీ (జరుగుతున్నప్పటికీ)
నిరసనపత్రాలకు = వ్యతిరేకతను తెలిపే కాగితాలకు
బడా మనుషులు = పెద్ద మనుష్యులు
భుక్తి మార్గం = తిండికి మార్గం
మలిన హృదయాలను = మురికిపట్టిన మనస్సులను
మరుగుపరుస్తున్నారు = దాస్తున్నారు
జాతిపిత ప్రబోధాలకు = గాంధీజీ బోధనలకు
తిలోదకాలు
(తిల + ఉదకాలు) = నువ్వుల నీళ్ళు
తిలోదకాలిచ్చు = పూర్తిగా ఆశ వదలుకొను,
అహర్నిశలు = పగలు, రాత్రి
ఆరాటము = సంతాపము
ఆవేదన = బాధ
కన్నీటితో తడియడం = ఏడవడం వల్ల కన్నీరు కారడం
ఆంధ్రపాలకులు = ఆంధ్రదేశపు ముఖ్యమంత్రులు
బానిస బంధాలను = = బానిస బంధములను;
తెలంగాణ జనత = తెలంగాణ ప్రజలు;
ప్రాణాలు కోల్పోయినారు = ప్రాణాలు పోగొట్టుకున్నారు
అంగవిహీనులు = అవయవాలు లేనివారు
సత్యాగ్రహ సమరం = సత్యాగ్రహ యుద్ధం

TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి

కారాగారం = జైలు
పికెటింగు = అడ్డుకోడం
ధర్నా = నిరసన కార్యక్రమం
ఉత్కృష్ట లక్ష్యాన్ని= గొప్ప లక్ష్యమును
రాబందుల రాచరికం = రాబందుల పెత్తనం
శాంతియుత విప్లవాన్ని = శాంతితో కూడిన విప్లవాన్ని
ప్రశాంత గంభీర జలధి = ప్రశాంతమైన లోతైన సముద్రము
పరిశీలన = శోధన
ప్రజాభిప్రాయము = ప్రజల అభిప్రాయము
మన్నన = గౌరవము
దారుణ హింసాకాండ = భయంకరమైన హింసా కృత్యం
రక్తపాతం = రక్తం కారడం
కోపోద్రిక్తులను = కోపముతో విజృంభించిన వారిని
కట్టలు తెంచుకొంటున్నది = గట్టులు తెంపుకొంటోంది
సడలిపోయే = జారిపోయే
ఏ ఎండకా గొడుగు = సందర్భానుసారంగా ఆచరించి కాలం గడుపుకోడం

63వ పేజీ

శాసన సభ్యులపైన = శాసనసభలోని సభ్యులపై (MLA లపై)
పేరుకుంటున్నది = అతిశయిస్తోంది
అగ్నిజ్వాలలు = అగ్నిమంటలు
కేరింతలాడుతున్న = ఉత్సాహంతో కేకలు వేస్తున్న
స్వార్థపరులు = తమ ప్రయోజనము మాత్రమే చూసుకొనేవారు
ప్రదర్శించడం = చూపడం
ధ్యేయానికి = కోరిన లక్ష్యమునకు
కలచివేస్తున్న = బాధపెడుతున్న
వాస్తవమే = సత్యమే
గాంధీ శతజయంతి
సంవత్సరం = గాంధీగారి నూరవ పుట్టినరోజు అయిన 1969వ సంవత్సరం
సత్యాహింసలు
(సత్య + అహింసలు) = సత్యము, అహింస
వరప్రభుత్వాన్ని = విదేశ ప్రభుత్వాన్ని
పారద్రోలిన = వెళ్ళగొట్టిన
కాసురాకాసి = డబ్బు రాక్షసి
నిరాహారదీక్ష = ఆహారం తిననని పట్టుపట్టడం
సమ్మతిని = అంగీకారాన్ని
శతజయంతి = నూరవ పుట్టినరోజు
జన్మదినానికి = పుట్టినరోజుకు
చేపట్టడం = చేయవలెనని అనుకోడం
పుష్టిని = బలాన్ని
భక్తి ప్రపత్తులు = భక్తి మరియు శరణాగతి
కానుక = బహుమతి
దిగ్విజయం = జయప్రదం
వెలుగులు విరజిమ్మాలి = కాంతులు నింపాలి
సత్యమేవ, జయతే = సత్యమే జయిస్తుంది

పాఠం నేపథ్యం, ఉద్దేశం

తెలంగాణ ఉద్యమం ఈనాటిది కాదు. ఎంతోమంది అమరుల త్యాగాలకు చిహ్నంగా సాధించుకున్నదే ఈ తెలంగాణ రాష్ట్రం. ఇది ఉద్యమాల ఫలితంగానే సాకారమైంది. నిన్నటి ఉద్యమానికి ముందే 1969లో ‘తెలంగాణ ప్రజాసమితి’ పేరుతోటి ప్రత్యేకరాష్ట్ర సాధన పోరాటం మొదలైంది. ఆనాటి ఉద్యమ తీరుతెన్నులను తెలుపడం, కరపత్రం యొక్క స్వరూప స్వభావాలను పరిచయం చేయడం ఈ పాఠం ఉద్దేశం.

TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం కరపత్రం అనే ప్రక్రియకు చెందినది. ఒక వ్యక్తి గాని, సంస్థ గాని, ప్రజలకు అందించాలనుకొనే సమాచారాన్ని వీలయినంత సంక్షిప్తంగా అచ్చు రూపంలో అందించేందుకు ఉపయోగించే పత్రాన్ని కరపత్రం అంటారు. దీనినే ఆంగ్లభాషలో ‘పాంప్లెట్” (Pamphlet) అంటారు.

“తెలంగాణ హిస్టరీ సొసైటి తరపున 2009లో వెలువడ్డ పుస్తకం, “1969 ఉద్యమం – చారిత్రక పత్రాలు” అనేది. ఈ పుస్తకంలో 1969 నాటి తెలంగాణ ఉద్యమ స్థితి గతులను వెలుగులోకి తెచ్చే కరపత్రాలు ముద్రించబడ్డాయి. ఆ పుస్తకంలో నుండి ఒక కరపత్రం తీసుకోబడింది. ఆ కరపత్రమే, ఈ పాఠం.

ప్రవేశిక

దీర్ఘకాలంగా శాంతియుత ఉద్యమాలు నిర్వహిస్తున్నప్పుడు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించినా అణచివేతకు దిగినా ఉద్యమాలు హింసాయుతంగా మారే అవకాశం ఉన్నది. ముందుగానే అటువంటి పరిణామాన్ని ఊహించిన ఉద్యమనాయకత్వం పాలకులను ఎండగడుతూ గాంధీ సిద్ధాంతాల కనుగుణంగా ఉద్యమించాలని పిలుపునిచ్చింది. ఇందుకనుగుణంగా రూపొందించిన 1969 నాటి కరపత్రంలో వివరాలు ఏమున్నాయో తెలుసుకుందాం.