TS 8th Class Telugu 1st Lesson Questions and Answers Telangana త్యాగనిరతి

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 1st Lesson త్యాగనిరతి Textbook Questions and Answers.

త్యాగనిరతి TS 8th Class Telugu 1st Lesson Questions and Answers Telangana

చదువండి – ఆలోచించి చెప్పండి.

దధీచి మహా తపశ్శాలి. చ్యవన మహర్షి పుత్రుడు. ఒకప్పుడు రాక్షసులు దేవతల అస్త్రాలను గుంజుకొంటుండగా వాటిని దాచిపెట్టుమని దధీచికి దేవతలు ఇచ్చిపోయారు. కానీ ఎంతకాలమైనా వారు రాకపోయేసరికి దధీచి వారి అస్త్రాలను నీరుగా మార్చి తాగాడు. అటు తర్వాత దేవతలు మా అస్త్రాలు మాకిమన్నారు. అప్పుడు ఆ అస్త్రాలు తన ఎముకలను పట్టి ఉన్నందువల్ల యోగాగ్నిలో తన శరీరాన్ని దహించుకొని అస్థికలను తీసుకొమ్మన్నాడు. అట్లా దధీచి ఎముకల నుండి ఇంద్రుని వజ్రాయుధం రూపొందింది.

ప్రశ్న 1.
దధీచి ఎవరు ?
జవాబు.
దధీచి గొప్ప తపస్వి. చ్యవన మహర్షి కుమారుడు.

ప్రశ్న 2.
దధీచి చేసిన త్యాగం ఏమిటి ? ఎందుకు ?
జవాబు.
దధీచి తన శరీరాన్ని యోగాగ్నిలో దహించివేసుకొని తన ఎముకలను దేవతలకు ఆయుధాలుగా ఇచ్చాడు.

TS 8th Class Telugu 1st Lesson Questions and Answers Telangana త్యాగనిరతి

ప్రశ్న 3.
త్యాగం అంటే ఏమిటి ?
జవాబు.
తన కష్టనష్టాలను లెక్కచెయ్యకుండా పరహితం కోసం ప్రాణాలను సైతం ఇచ్చేయడమే త్యాగం.

ప్రశ్న 4.
మీకు తెలిసిన త్యాగమూర్తుల పేర్లను తెలుపండి.
జవాబు.
జీమూత వాహనుడు, బలిచక్రవర్తి, ఏకలవ్యుడు, హరిశ్చంద్రుడు మొదలైన వారు గొప్ప త్యాగధనులు.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No. 4)

ప్రశ్న 1.
సత్యధర్మ నిర్మలుడని శిబి చక్రవర్తిని ఎందుకన్నారు ?
జవాబు.
శిబి చక్రవర్తి సత్యం వ్రతంగా కలవాడు. ఆడినమాట తప్పనివాడు. అన్ని ధర్మములు తెలిసినవాడు. ధర్మం తప్పక ఆచరించేవాడు. నిర్మలమైన మనస్సు, ప్రవర్తన కలవాడు. అందుచేత ఆయనను సత్యధర్మ నిర్మలుడన్నారు.

ప్రశ్న 2.
“ధర్మువు సర్వంబునకు హితంబుగ వలయున్” దీనిపై మీ అభిప్రాయాన్ని చెప్పండి.
జవాబు.
‘సత్యం మాట్లాడండి. ధర్మం ఆచరించండి.’ అనే విషయాలను వేద శాస్త్రాలు చెబుతున్నాయి. కాని వాటిని పాటించే సమయంలో వాటివల్ల అందరికీ మేలు జరుగుతుందా, లేదా అని పరిశీలించాలి. ఒకవేళ కీడు కలిగేట్లైతే అప్పుడు వాటిని సరి చూసుకోవాలి. ఏ నియమాలైనా ప్రజలమేలు కోసం ఏర్పాటు చేయబడేవే. అందుకే కవి నన్నయ ధర్మం అందరికీ మేలు కలిగించాలి అని ప్రయోగించాడు.

ప్రశ్న 3.
‘ఆశ్రితులను ఎందుకు విడిచి పెట్టరాదు ?
జవాబు.
బలహీనుడు బలవంతుని వద్దకు రక్షణ కోసం వస్తాడు. అతడు తనను కాపాడగలడు అనే నమ్మకంతో వస్తాడు. కనుక అతనికి ఆశ్రయమిచ్చి కాపాడటం బలవంతుని కర్తవ్యం. ఎన్ని ఆటంకాలు కలిగినా వారి నమ్మకాన్ని వృథా చేయకుండా కాపాడాలి. అందుకే ఆశ్రితులను విడిచిపెట్టరాదు.

ప్రశ్న 4.
ఏ సందర్భంలో ఇతరులు మిమ్మల్ని ఆశ్రయిస్తారు ?
జవాబు.
జంతువుల వలన, ఇతరుల వలన భయం కలిగినప్పుడు, శత్రువులు దండెత్తినప్పుడు, దుష్టుల వలన ప్రాణాలకు ప్రమాదం ఏర్పడినప్పుడు, కష్టాలు కలిగినప్పుడు, తాను తలపెట్టిన మంచి పనులకు ఆటంకాలు కలిగినప్పుడు, తన కష్టాన్ని ఇతరులు దోచుకుంటున్నప్పుడు – ఇలా అనేక సందర్భాల్లో ఇతరులు మనను ఆశ్రయిస్తారు.

ఆలోచించండి – చెప్పండి. (TextBook Page No. 5)

ప్రశ్న 1.
డేగ తన ఆకలిని తీర్చుకోవడానికి శిబి మాంసాన్ని ఎందుకు కోరింది ?
జవాబు.
పావురం డేగకు సహజమైన ఆహారం. శిబి దానికి ఆశ్రయం ఇచ్చాడు. వదిలిపెట్టనంటున్నాడు. ధర్మబద్ధమైన తన ఆహారం తినకపోతే ఆకలితో చనిపోతానని, ఆపై తన భార్య, పిల్లలు కూడా బతకరని డేగ చెప్పింది. నీవు చెప్పింది ధర్మమే ఐనా నేను ఆశ్రయమిచ్చిన పావురాన్ని నీకు ఆహారం కానివ్వను. మరేది కోరినా తెప్పించి యిస్తాను అన్నాడు శిబి. అందుకని డేగ తన ఆకలిని తీర్చుకోడానికి శిబి మాంసాన్ని కోరింది.

ప్రశ్న 2.
‘అనుగ్రహించితి మహా విహగోత్తమ’ అని శిబి చక్రవర్తి అనటాన్ని మీరెట్లా అర్థం చేసుకున్నారు?
జవాబు.
పావురాన్ని తప్ప వేరే ఏ ఆహారాన్నైనా కోరుకో. తెప్పించి ఇచ్చి నీ ఆకలి తీరుస్తాను. పావురాన్ని మాత్రం వదలను అన్నాడు శిబి చక్రవర్తి. అప్పుడు డేగ పావురం బరువుకు సరితూగినంత మాంసాన్ని నీ శరీరం నుంచి కోసి యిస్తే ఒప్పుకుంటాను అన్నది. అందుకే శిబి పరమ సంతోషంతో “ఓ పక్షి రాజా ! నన్ను అనుగ్రహించావు. పావురాన్ని కాపాడతానన్న నా మాట నిలబెట్టావు” అని డేగతో అన్నాడు.

ప్రశ్న 3.
బలి చక్రవర్తి పావురాన్ని రక్షించడానికి ప్రాణత్యాగానికి పూనుకున్నాడు కదా ! త్యాగం ఆవశ్యకత ఏమిటి ? (టెక్స్ట్ బుక్ 5)
జవాబు.
త్యాగం అనేది గొప్ప పుణ్యకార్యం. మనకు అక్కరలేని దాన్ని ఇచ్చేసి త్యాగం చేశాను అనుకోవడం త్యాగం అనిపించుకోదు. తనను ఎవరైనా ఆశ్రయించినప్పుడు వారి కోరిక తీర్చడానికి అవసరమైతే తన ప్రాణాలను కూడా ఇవ్వడానికి సిద్ధపడాలి. అటువంటి వారే చరిత్రలో నిలచిపోతారు. ఆదర్శప్రాయులౌతారు. అందుకే త్యాగం చాలా గొప్ప గుణం.

ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

ప్రశ్న1.
త్యాగం అంటే ఏమిటి ? త్యాగంలోని గొప్పతనం ఏమిటి ?
జవాబు.
తనకు ఉన్నదానిలో కొంత ఇతరులకు ఇవ్వడమే త్యాగం. ఎన్ని కష్టాలకైనా ఓర్చుకొని తనను ఆశ్రయించిన వారికి కావలసిన దానిని ఇవ్వడమే త్యాగం. ఇందులో ప్రాణాలను కూడా లెక్కచేయకుండా త్యాగం చేసిన వారు మహనీయులు. మనం త్యాగం చేసినందువలన ఆ ఫలితాన్ని పొందినవారు, వారి ఆత్మీయులు ఎంతో సంతోషపడతారు. ఆ సంతోషం మనకెంతో తృప్తినిస్తుంది. అదీ త్యాగంలోని గొప్పతనం.

TS 8th Class Telugu 1st Lesson Questions and Answers Telangana త్యాగనిరతి

ప్రశ్న2.
ఇతరులకోసం, సమాజంకోసం త్యాగం చేసిన వారి గురించి చెప్పండి.
జవాబు.
భారతదేశాన్ని పరాయిపాలన నుంచి విడిపించి ప్రజలు పడుతున్న బానిసత్వపు బాధలను తొలగించడానికి ఎంతోమంది నాయకులు తమ సర్వస్వాన్నీ త్యాగంచేసి ఉద్యమంలో పాల్గొన్నారు. జవహర్లాల్ నెహ్రూ, ప్రకాశం పంతులు మొదలైన ఎందరో నాయకులు ధనాన్ని ఆస్తులను త్యాగం చేశారు. భగత్సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు వంటివారు ప్రాణాలను త్యాగం చేశారు. డా. ద్వారకానాథ్ కొట్నీస్ యుద్ధసైనికుల కోసం అమోఘమైన సేవలందించాడు.

II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

1. కింది వాక్యాల ఆధారంగా పాఠంలోని పద్యపాదాలను గుర్తించి రాయండి.

అ) ధర్మం జగత్తుకంతటికీ మేలు చేయాలి
జవాబు.
ధర్మువు సర్వంబునకు హితంబుగ వలయున్.

ఆ) ఈ పక్షి నాకు ప్రకృతి సహజంగా ఏర్పడిన ఆహారం
జవాబు.
ఇక్కపోతంబు నాకు వేదవిహితంబైన యాహారంబు.

ఇ) ఆశ్రయించిన వారిని విడిచిపెట్టడం ధర్మమవుతుందా చెప్పు
జవాబు.
శరణాగత పరిత్యాగంబు కంటే మిక్కిలి యధర్మం బొండెద్ది ?

2. కింది పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సరిపోయే జవాబును గుర్తించండి.

‘ఆ॥బ్రతికి నన్నినాళ్ళు ఫలము లిచ్చుటెగాదు.
చచ్చిగూడ చీల్చియిచ్చు తనువు
త్యాగ భావమునకు తరువులే గురువులు
లలిత సుగుణజాల తెలుగు బాల.

అ) ‘చెట్టు’ అను పదానికి సరిపోయే పదం
ఎ) తరువు
బి) గురువు
సి) ఫలం
డి) గుణం
జవాబు.
ఎ) తరువు

ఆ) త్యాగానికి గురువులు ఎవరు ?
ఎ) మానవులు
బి) చెట్లు
సి) పక్షులు
డి) జంతువులు
జవాబు.
బి) చెట్లు

ఇ) తనువును చీల్చి ఇచ్చేవి
ఎ) మేఘాలు
బి) నదులు
సి) చెట్లు
డి) పక్షులు
జవాబు.
సి) చెట్లు

ఈ) చచ్చుట పదానికి వ్యతిరేకార్థం
ఎ) పెరుగుట
బి) తరుగుట
సి) బ్రతుకుట
డి) మేల్కొనుట
జవాబు.
సి) బ్రతుకుట

ఉ) పై పద్యానికి తగిన శీర్షిక
ఎ) భారం
బి) ప్రాణం
సి) యోగం
డి) త్యాగం
జవాబు.
డి) త్యాగం

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) ఇతరులు ఆహారం తినేటప్పుడు ఎందుకు విఘ్నం కలిగించకూడదో రాయండి.
జవాబు.
ఎవరైనా ఆహారం తినేది ఆకలి తీర్చుకోవడానికే. ఎంతో పనిచేసి, కడుపు ఆకలితో కాలిపోతూంటే, భోజనం చేద్దామని కూర్చొన్న వ్యక్తికి, ఆటంకం కలిగిస్తే ఆ వ్యక్తి చాలా బాధపడతాడు. ఆకలితో నీరసించిపోతాడు. ఇక పని చేయలేడు. పనిచేయలేడు కాబట్టి తిండికి కావలసిన ధనం సంపాదించలేడు. చివరికి ఆరోగ్యమే పాడయ్యే ప్రమాదముంది. అందుకే ఆహారం తినేటప్పుడు విఘ్నం కలిగించకూడదంటారు. సైన్సుపరంగా కూడా కారణముంది. భోజనం చేసే సమయంలో కడుపులోని జీర్ణరసాలు ఉత్తేజంగా ఉంటాయి. భోజనానికి ఆటంకం కలిగిస్తే, ఆ ఊరిన రసాలు పేగుల మీద ప్రభావం చూపి అనారోగ్యం కలిగిస్తాయి.

ఆ) ‘అందరూ ధర్మాన్ని ఆచరించాలి’ అనే విషయాన్ని సమర్థిస్తూ రాయండి.
జవాబు.
‘సత్యం మాట్లాడండి. ధర్మం ఆచరించండి.’ అనే విషయాలను వేద శాస్త్రాలు చెబుతున్నాయి. కాని వాటిని పాటించే సమయంలో వాటివల్ల అందరికీ మేలు జరుగుతుందా, లేదా అని పరిశీలించాలి. ఒకవేళ కీడు కలిగేట్లైతే అప్పుడు వాటిని సరి చూసుకోవాలి. ఏ నియమాలైనా ప్రజలమేలు కోసం ఏర్పాటు చేయబడేవే. అందుకే కవి నన్నయ ధర్మం అందరికీ మేలు కలిగించాలి అని ప్రయోగించాడు.

ఇ) ఇతరుల కొరకు మనం ఎట్లాంటి త్యాగాలను చేయవచ్చో రాయండి.
జవాబు.
ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రాణాలను కూడా లెక్కచేయకుండా కాపాడాలి. మనం రక్తం దానం చేయవచ్చు. మన పనులను వాయిదా చేసుకొని వారిని హాస్పటల్స్కు తీసుకుని వెళ్ళవచ్చు. మన వాహనంలోనే ప్రమాదానికి గురైన వ్యక్తులను తరలించవచ్చు. నాన్న మనకోసం ఇష్టమైన వస్తువు తెచ్చినప్పుడు చెల్లికి అదే కావాలని అడిగితే తన కోసం మనం దాన్ని తాగ్యం చెయ్యవచ్చు. బస్సులోను, రైలులోను మనకంటే పెద్దవారు నిలబడి మనం కూర్చుని ఉంటే మన సీటు వారికోసం త్యాగం చెయ్యవచ్చు.

TS 8th Class Telugu 1st Lesson Questions and Answers Telangana త్యాగనిరతి

ఈ) “త్యాగనిరతి” అనే శీర్షిక పాఠానికి ఏ విధంగా తగినదో రాయండి.
జవాబు.
ఈ పాఠంలో డేగ పావురాన్ని తినడానికి వెంటపడింది. పావురానికి ఆశ్రయమిచ్చి శిబి చక్రవర్తి పావురం కోసం ఏమైనా త్యాగం చెయ్యడానికి సిద్ధపడ్డాడు. రాజు త్యాగ గుణాన్ని ఉపయోగించుకోడానికి డేగ పావురాన్ని త్యాగం చేసింది. డేగ రాజు శరీరంలోని మాంసాన్ని పావురం బరువుకు సరిపడ తూచి యిమ్మన్నది. అలా తూచడంలో చివరికి రాజు తానే త్రాసులో కూర్చుని తన ప్రాణాలనే త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. తన త్యాగ గుణాన్ని దేవతలు మెచ్చుకున్నారు. అందుచేత ఈ పాఠానికి “త్యాగనిరతి” అనే శీర్షిక తగి ఉన్నది.

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) త్యాగం చేయటంలో ఉన్న గొప్పతనాన్ని, అనుభూతిని వివరించండి. (లేదా) త్యాగనిరతి పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి. (లేదా) పావురాన్ని రక్షించుటకు శిబి చక్రవర్తి చేసిన త్యాగాన్ని వివరించండి. (లేదా) శిబి చక్రవర్తి తన శరీరాన్ని కోసివ్వటంలో ఆంతర్యం ఏమిటి ? (లేదా) శిబి చక్రవర్తి త్యాగ గుణాన్ని సొంతమాటల్లో వ్రాయండి. (లేదా) త్యాగ గుణం గొప్పతనాన్ని కవి ఎలా వివరించాడు ?
జవాబు.
ఇంద్రుడు, అగ్నిదేవుడు డేగ పావురాల రూపంలో శిబిచక్రవర్తి త్యాగ గుణాన్ని పరీక్షించడానికి వచ్చారు. శరణుకోరి వచ్చిన పావురానికి శిబి అభయమిచ్చాడు. అలా శరణన్న వారిని రక్షించటంలో ఎంతో ఆనందం ఉంటుంది. లోకంలో ఎంతోమంది ఉన్నా పావురం తన దగ్గరికే వచ్చిందంటే తన మీద ఎంతో నమ్మకం ఉండబట్టే గదా అని తలచుకుంటే శిబి గుండె సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఆ ఆనందం అనుభవించే వారికే తెలుస్తుంది.

అలాగే ధర్మాధర్మాల గురించి వాదించిన మీదట డేగ పావురానికి సరితూగినంత మాంసం శిబి శరీరం నుంచి తూచి ఇవ్వమన్నప్పుడు “నన్ననుగ్రహించితివి మహావిహగోత్తమ !” అంటూ ఎంతో సంతోషించాడు శిబి, తాను అన్నమాట నిలబెట్టుకోగలుగుతున్నాను గదా అని. అంతేగాక ఒకరిని రక్షించడానికి, మరొకరి ఆకలి తీర్చడానికి తాను ప్రాణత్యాగానికైనా సిద్ధపడ్డాడు. రెండు విధాలుగా ధర్మాన్ని రక్షించగలిగానన్న ఆనందం, అనుభూతి ఎంతో గొప్పవి. ఆ ఆనందం అనుభవించే వారికే బాగా అర్థమౌతుంది.

IV. సృజనాత్మకత/ప్రశంస

అ) అన్ని దానాల్లోకెల్ల అన్నదానం గొప్పది. శరీరంలోని అవయవదానం ఇంకా గొప్పది. అవయవదానంపై ప్రజలకు చైతన్యం కలిగించుమని వార్తాపత్రికలకు లేఖ రాయండి.

వరంగల్,
ది.XX. XX. XXXX

జవాబు.
గౌరవనీయులైన పత్రికా సంపాదకులకు,
నమస్తే తెలంగాణ పత్రిక

పుట్టుకతోనే అవయవలోపాలతో కొందరు పుడుతూ ఉంటే, ప్రమాదాల్లో అవయవాలు పోగొట్టుకునేవారు కొందరు. కన్ను, ముక్కు, చెవి, కాళ్ళు, చేతులు – వీటిలో ఏ అవయవం లేకపోయినా బాధాకరమే. మన చుట్టూ ఉన్న ప్రకృతిలోని అందాలను చూసి ఆనందించాలన్నా, చక్కని సంగీతం వినాలన్నా, సుందరమైన ప్రదేశాలకు వెళ్ళాలన్నా కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు తప్పనిసరి. ఇవేకాదు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు వంటి అవయవభాగాలు ముఖ్యమైనవే.

రక్తం అవయవ భాగం కాకపోయినా, అవయవమంత ప్రాముఖ్యమున్నదే. కళ్ళు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, రక్తంవంటి వాటిని దానమిచ్చి మన చుట్టూ ఆయా అవయవాల లోపంతో బాధపడేవారిని ఆదుకోవడమే మానవజన్మకు సార్థకత.
జీవించి ఉండగానే, కళ్ళు, మూత్రపిండాలు వంటివి దానం చేయవచ్చు. మరణించాక కూడా జీవించి ఉండడానికి మార్గం అవయవదానం. తమ మరణానంతరం, తమ కళ్ళను దానం చేస్తామంటూ, ఎంతోమంది నేటికాలంలో ముందుకొస్తున్నారు.

అలా నేత్రదానంతో ఎంతోమంది అంధులకు వెలుగునిస్తూ, మరణించాక కూడా జీవించడం గొప్ప విషయం. అలాగే ఇటీవల బెంగుళూరుకు చెందిన వ్యక్తి గుండె చెన్నైకి చెందిన మరొక వ్యక్తికి మార్పిడి చేయడం ద్వారా ఆ వ్యక్తికి ప్రాణం పోశారు. అలాగే ఇటీవల విజయవాడకు చెందిన మణికంఠ దానం చేసిన గుండె, నేత్రాలు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం మరికొందరిని జీవించగలిగేట్లు చేశాయి.

ఇలా అవయవ దానం వల్ల కొంతమంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. ఇటువంటివారు రాబోయే తరాలకు స్ఫూర్తిదాతలు. చనిపోయాక కూడా జీవించాలంటే అవయవదానమే మార్గం. అవయవ దానానికి అందరూ ముందుకు వచ్చేలా మీ పత్రిక ద్వారా చైతన్యం కలిగించమని విజ్ఞప్తి.

ఇట్లు
బాలభాను,
ఒక పాఠకుడు.

చిరునామా :
నమస్తే తెలంగాణ పత్రికా కార్యాలయం,
రోడ్ నెం. 10, బంజారా హిల్స్
హైదరాబాద్.

V. పదజాల వినియోగం

1. గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి.

ఉదా : కపోతములు శాంతికి చిహ్నాలని భావిస్తారు.
కపోతములు = పావురములు

అ) ఆశ్రితులను వదలి వేయుట ధర్మువు కాదు.
జవాబు.
ధర్మువు = ధర్మము

ఆ) ఉత్తముడు పరుల హితమునే కోరతాడు.
జవాబు.
హితమునే = మేలునే

ఇ) ఎందరో మహానుభావుల పరిత్యాగం వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది.
జవాబు.
పరిత్యాగం = సమర్పించడం

ఈ) దేశంలో సుఖశాంతులు వర్ధిల్లుగాక !
జవాబు.
వర్ధిల్లు = వృద్ధిపొందు

ఉ) బుభుక్షితుడు రుచిని పట్టించుకోకుండా ఆరగిస్తాడు.
జవాబు.
బుభుక్షితుడు = ఆకలితో బాధపడువాడు’

TS 8th Class Telugu 1st Lesson Questions and Answers Telangana త్యాగనిరతి

2. కింది వాక్యాలలోని నానార్థాలను గుర్తించి రాయండి.

ఉదా : ఈ సంవత్సరం వానలు తక్కువగా ఉన్నాయి.
వర్షం = సంవత్సరం, వాన

అ) న్యాయంగా ఆలోచిస్తే పాలల్లో నీళ్ళు కలపడం ధర్మం కాదు.
పాడి : __________, __________
జవాబు.
పాడి : న్యాయం, పాలు

ఆ) అడవిలోని జంతువులకు నీరు కరువవుతున్నది.
వనం : __________, __________
జవాబు.
వనం : అడవి, నీరు

VI. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది వాక్యాలను చదువండి. అవి ఎటువంటి వాక్యాలో గుర్తించి జతపరచండి.
ఉదా : లోపలకి రావచ్చు – అనుమత్యర్థక వాక్యం

అ) దయచేసి వినండి 1) ఆశ్చర్యార్థక వాక్యం
ఆ) రమ చక్కగా రాయగలదు 2) ప్రశ్నార్థక వాక్యం
ఇ) ఆహా ! ఎంత బాగుందో 3) సామర్థ్యార్థక వాక్యం
ఈ) అల్లరి చేయవద్దు 4) ప్రార్థనార్థక వాక్యం
ఉ) గిరి ! ఎక్కడున్నావు ? 5) నిషేధార్థక వాక్యం

జవాబు.
అ) 4
ఆ) 3
ఇ) 1
ఈ) 5
ఉ) 2

2. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.

అ) ఇంద్రాగ్నులు = _______ + _______ = _______
జవాబు.
ఇంద్ర + అగ్నులు = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.

ఆ) త్యాగమిది = _______ + _______ = _______
జవాబు.
త్యాగము + ఇది = ఉత్వ సంధి
సూత్రం : ఉత్తునకు అచ్చుపరమైనపుడు సంధి అవుతుంది.

ఇ) ఆహారార్థం = _______ + _______ = _______
జవాబు.
ఆహార + అర్థం = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.

ఈ) నేనెట్లు = _______ + _______ = _______
జవాబు.
నేను + ఎట్లు = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చుపరమైనపుడు సంధి అవుతుంది.

ఉ) శౌర్యాది = _______ + _______ = _______
జవాబు.
శౌర్య + ఆది = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని:

ప్రశ్న 1.
త్యాగబుద్ధి కలిగిన ఇద్దరు మహనీయుల వివరాలను లేదా కథలను లేదా సంఘటనలను సేకరించండి. నివేదిక రాసి తరగతిలో ప్రదర్శించండి.
జవాబు.
అ) ప్రాథమిక సమాచారం :
1) ప్రాజెక్టు పని పేరు : త్యాగబుద్ధి కలిగిన ఇద్దరు మహనీయులు.
2) సమాచారాన్ని సేకరించిన విధానం : ఉపాధ్యాయుని ద్వారా / ఇంటిలోని పెద్దల (తాత/నానమ్మ/ అమ్మమ్మ) ద్వారా / గ్రంథాలయ పుస్తకాల ద్వారా

ఆ) నివేదిక :
విషయ వివరణ :
“తనకు ఎంతో అవసరమైనప్పటికిని లెక్కచేయకుండా ఇతరులకు ఇవ్వడాన్నే త్యాగం అంటారు.” దానం, త్యాగం అనే రెండు పదాలు దగ్గర అర్థాన్నిచ్చేవిగా ఉన్నా వీటి మధ్య ఎంతో తేడా ఉంది.
తనకున్నంతలో ఇతరులకు ఇవ్వడం దానం అయితే, తనకున్నా లేకున్నా ఇతరులకు ఇవ్వగలిగే గుణాన్ని త్యాగంగా చెప్పవచ్చు. అలాంటి త్యాగబుద్ధి గలిగిన ఇద్దరు మహాపురుషుల గూర్చి, నేను నివేదికలో పొందు పరుస్తున్నాను.

1. రంతిదేవుడు
“అతిథి దేవో భవ” అనేది మన సాంప్రదాయం. దాన్ని అక్షరాల ఆచరించి శాశ్వత కీర్తి పొందిన రంతిదేవుని కథ నాకెంతోగానో నచ్చింది. రంతిదేవుడు ఒక మహారాజు. అమిత దానశీలి. తన రాజ్యాన్ని, సంపదలను దానం చేసి భార్యా బిడ్డలతో అడవికి వెళ్ళాడు.
TS 8th Class Telugu 1st Lesson Questions and Answers Telangana త్యాగనిరతి 1
అడవిలో కాయ, కసరులు తింటూ కడుపు నింపుకొనేవాడు, దైవికంగా లభించినది తిని తృప్తిపడేవాడు తప్ప దేన్నీ కోరేవాడు కాదు. భవిష్యత్ అవసరాలకు కూడా దేన్నీ దాచుకొనేవాడు కాదు. ఒకసారి 48 రోజులు పాటు అతనికి, అతని కుటుంబానికి ఏమీ లభించలేదు. 49వ రోజున కొంత ఆహారం లభించింది. కుటుంబమంతా కూర్చుండి తినడానికి ఉపక్రమించ బోతుండగా ఒక బ్రాహ్మణ అతిథి వచ్చాడు. అతనికి ఆహారం పెట్టాడు. తర్వాత ఒక బీదవాడు వచ్చాడు. రంతిదేవుడు అతని ఆకలి కూడా తీర్చి పంపాడు. తర్వాత ఒకడు, తన కుక్కల క్షుద్బాధ తీర్చమని వేడుకోగా వాటికి ఆహారం పెట్టాడు. చివరికి కొద్ది పాయసం మాత్రమే మిగిలింది. దాన్నే తలా కాస్తా తాగుదామనుకోగా, ఒక ఛండాలుడు వచ్చాడు. ఉన్న పాయసం అతనికి ఇచ్చి, ఆకలి బాధ తట్టుకోలేక రంతి దేవుడు స్పృహ తప్పి పోయాడు. మరుక్షణమే దేవుడు ప్రత్యక్షమై అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు.

TS 8th Class Telugu 1st Lesson Questions and Answers Telangana త్యాగనిరతి

2. బలిచక్రవర్తి
రాక్షస రాజైన బలి చక్రవర్తి మహా బలవంతుడు. అతనికి ఎదురొడ్డి పోరాడలేక దేవతలు మహావిష్ణువును శరణు కోరతారు. ఎలాగైనా బలి చక్రవర్తిని చంపనైనా చంపు లేదా మాపై ఆధిపత్యం చలాయించకుండానైనా చూడ మంటారు. అప్పుడు విష్ణువు వారికి అభయమిచ్చి, తాను వామనరూప ధారియై బలి వద్దకు వెళ్తాడు. గొడుగు ధరించి వచ్చిన ఆ వామనమూర్తిని చూడగానే రాక్షస గురువైన శుక్రాచార్యుల వారి మనస్సెందుకో కీడు శంకించింది.
TS 8th Class Telugu 1st Lesson Questions and Answers Telangana త్యాగనిరతి 2
దివ్యదృష్టితో అతడు శ్రీ మహావిష్ణువని గ్రహించి బలిని, అతనికి దానమివ్వవద్దని ఎంత చెప్పినా బలి చక్రవర్తి ససేమిరా వినడు. తన కులం, వంశం, దేశం నాశనమైనా, చివరికి తాను చనిపోయినా ఆడిన మాట తప్పను అని వామనునికి 3 అడుగుల నేల దానం చేస్తాడు. 2 అడుగులకే భూమ్యాకాశాలను ఆక్రమించిన వామనుడు, తన 3వ అడుగు ఎక్కడ పెట్టాలో చెప్పమంటాడు. అప్పుడు బలి, తన శిరస్సు పైన ఉంచమంటాడు. వామనుడు, బలి శిరస్సుపై తన పాదాన్ని ఉంచి పాతాళానికి తొక్కి వేస్తాడు. దాంతో దేవతలకు బలి చక్రవర్తి పీడ విరగడైంది.

ఇ) ముగింపు :
ఈ విధంగా తమ సచ్చీలత, త్యాగనిరతి అనే గుణాలతో చరిత్రలో నిలిచిపోయిన ఇరువురు మహాపురుషుల కథలు చదువుతుంటే నాలో ఎంతో ఉత్తేజం, ఉద్వేగం కలిగాయి. ఇలాంటి మహాపురుషులను కన్న భరతభూమికి వందనాలు అర్పించాలనిపించింది.

TS 8th Class Telugu 1st Lesson Important Questions త్యాగనిరతి

ప్రశ్న 1.
“శరణాగత పరిత్యాగంబు కంటె మిక్కిలి యధర్మం బొండెద్ది” అని శిబి అన్నాడు కదా! శరణాగతులను ఎందుకు విడువకూడదు ?
(లేదా)
శరణుకోరిన వారిని వదలకూడదు. ఎందుకు ?
(లేదా)
శరణాగత పరిత్యాగం అధర్మం అంటే నీకేమి అర్థమైంది ?
జవాబు.
తనను ఆశ్రయించినవారు శరణాగతులు. తనను కాపాడ గల్గినవారి వద్దకే, గొప్పనమ్మకంతో వస్తారు. ఆశ్రయమిచ్చిన వారిని కాపాడటం ధర్మం, కర్తవ్యం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆశ్రితులను కాపాడాలి శరణాగతులను వదలకూడదు. వారిని కాపాడకుండా వదిలిపెడితే అది అధర్మం అవుతుంది.

ప్రశ్న 2.
త్యాగం అంటే ఏమిటి ? త్యాగం ఎందుకు చేయాలి? దేనిని గొప్పత్యాగం అంటారు ? త్యాగగుణం ఎందుకు కలిగి
ఉండాలి ?
జవాబు.
తనకి ఉన్నంతలో కొంత ఇతరులకి ఇవ్వడమే త్యాగం. ఎన్ని కష్టాలకైనా ఓర్చుకొని తనను ఆశ్రయించిన వారికి కావలసిన దానిని ఇవ్వడమే త్యాగం. ఆశ్రయించినవారి కోసం తన ప్రాణాలనైనా సంతోషంగా ఇవ్వడానికి సిద్ధపడడాన్ని గొప్పత్యాగం అంటారు.
త్యాగ ఫలితాన్ని పొందినవారు, వారి ఆత్మీయులు ఎంతో సంతోషపడతారు కనుక ఆ సంతోషం మనకెంతో తృప్తినిస్తుంది. అదీ త్యాగంలోని గొప్పతనం. అనిర్వచనీయమైన ఆనందం, సంతృప్తి పొందటం కోసం త్యాగ గుణం కలిగి ఉండాలి.

ప్రశ్న 3.
శిబిచక్రవర్తి వంటి వాళ్ళ కీర్తి శాశ్వతమని వివరించండి.
జవాబు.
ప్రాణభయంతో ఆశ్రయించిన వారు నీచులే అయినా వారిని విడిచి పెట్టడం ధర్మం కాదు. ఆహారమే కావలసివస్తే అడవిలో ఎన్నో జంతువులు ఉంటాయి. వాటిని తిని ప్రాణాలు నిలుపుకోవచ్చు అని డేగతో అన్నాడు. ఆ డేగ శిబితో పావురం తనకు సహజసిద్ధంగా కల్పించబడిన ఆహారం. దీన్ని కాపాడాలనుకుంటే దాని బరువుకు తూగినంత మాంసం నీ శరీరం నుండి నాకు పెట్టమని అన్నది. తన ప్రాణాలను సైతం లక్ష్యపెట్టక ఆశ్రయించిన పావురాన్ని కాపాడటానికి సిద్ధపడ్డ శిబి చక్రవర్తిలాంటి వాళ్ళ కీర్తి శాశ్వతంగా నిలిచి ఉంటుంది.

TS 8th Class Telugu 1st Lesson Questions and Answers Telangana త్యాగనిరతి

ప్రశ్న 4.
త్యాగనిరతి పాఠం ద్వారా డేగ దృష్టిలో ధర్మం అంటే ఏది ?
జవాబు.
అన్ని ప్రాణులు ఆహారం తీసుకొనే బ్రతుకుతాయి. ఆహారం లేకపోతే ప్రాణులు ఉండవు. డేగకు పావురం వేదంచే నిర్దేశింపబడిన ఆహారం. డేగలు పావురాలను తింటాయి. కాబట్టి పావురాన్ని చంపి తినుట తప్పుకాదని, అది ధర్మబద్ధమే అని డేగ ఉద్దేశం.

ప్రశ్న 5.
త్యాగనిరతి పాఠం ఆధారంగా శిబి చక్రవర్తికి, డేగకు మధ్య జరిగిన సంభాషణ రాయండి.
జవాబు.

సంభాషణ

డేగ : ఓ శిబి చక్రవర్తీ ! నువ్వు గొప్ప సత్యధర్మ పరుడవని విన్నాను. మరి ఆకలిగొన్నవాడినైన నా ఆహారాన్ని తిననీకుండ చేస్తున్నావెందుకు ? నేను ఆకలితో చనిపోతే నా పిల్లలు, భార్య బతకరు. ఇన్ని ప్రాణాలు పోవడానికి నీవు కారణమౌతావు. ఇది నీకు ధర్మమా ?
శిబి చక్రవర్తి : నేను నీ ఆహారమైన పావురాన్ని రక్షిస్తానని మాట ఇచ్చాను. నీ ఆకలి తీర్చడానికి నీకేం కావాలో కోరుకో ఇస్తాను.
డేగ : పావురాలు మా జాతికి ఆహారమని వేదాల్లో కూడా చెప్పబడింది. కనుక నాకీ పావురాన్నిచ్చే సెయ్.
శిబి చక్రవర్తి : అడవిలోని ఏ జంతువుల మాంసం కావాలన్నా తెప్పించి ఇస్తాను. ఈ పావురాన్ని విడిచిపెట్టను. నేను ఆడిన మాట తప్పను.
డేగ : అయితే దీని బరువుకు సమానమైన మాంసము నీ శరీరం నుండి కోసి యివ్వు.
శిబి చక్రవర్తి : చాలా సంతోషం. తప్పక ఇస్తాను. (భటులతో-) భటులారా ! త్రాసు తీసుకురండి.
భటులు : చిత్తం మహాప్రభూ ! (త్రాసు తెచ్చారు. శిబి మాంసం కోసి త్రాసులో పెట్టాడు. రెండవ వైపు పావురాన్ని ఉంచారు.)
శిబి చక్రవర్తి : ఏమి ఆశ్చర్యం ! ఎంత మాంసం ఉంచినా తూగడం లేదు ! నేను స్వయంగా త్రాసులో కూర్చుంటాను. (కూర్చున్నాడు.)
డేగ : భళా ! శిబి చక్రవర్తీ ! నీ త్యాగనిరతి అపూర్వం. మెచ్చాను నీ త్యాగానికి.
శిబి చక్రవర్తి : మహానుభావా ! ఎవరు మీరు ?
డేగ : నేను ఇంద్రుడను. ఈ పావురం అగ్నిదేవుడు. నీ త్యాగాన్ని పరీక్షించడానికి ఈ రూపాలలో వచ్చాము. నీ ధైర్య శౌర్యాదిగుణాలు చాలా గొప్పవి. నీ కీర్తి ఆచంద్రతారార్కంగా వర్ధిల్లుతుంది.

పర్యాయపదాలు:

  • విఘ్నము : ఆటంకము, అడ్డంకి
  • భూతములు : ప్రాణులు, జీవులు
  • ఆహారము : అన్నము, భోజనము
  • పుత్త్రులు : కుమారులు, కొడుకులు
  • భార్య : సతి, ఇల్లాలు, పెండ్లము
  • కపోతము : పావురము, పారావతము
  • పక్షి : ఖగము, పులుగు
  • వనము : అడవి, అరణ్యం
  • మిక్కిలి : ఎక్కువ, అధికము, కడిది
  • అవని : భూమి, పుడమి, ధాత్రి
  • వాసవుడు : ఇంద్రుడు, పాకారి
  • తనువు : శరీరము, దేహము
  • దహనుడు : అనలుడు, అగ్ని, పావకుడు

నానార్థాలు:

  • ఆగ్రహము = పట్టుదల, కోపము
  • పాడి = న్యాయము, ధర్మము, తీర్పుస్వభావం, ఆచారం
  • తుల = త్రాసు, సమానము
  • భూతము = ప్రాణి, గతము

ప్రకృతి – వికృతులు:

  • ప్రకృతి -వికృతి
  • సత్యము – సత్తెము
  • ధర్మము – దమ్మము
  • ఆహారము – ఓగిరము
  • మతి – మది
  • హితము – ఇత
  • పక్షి – పక్కి
  • యత్నము – జనము
  • మృగము – మెకము
  • గుణము – గొనము
  • శబ్దము – సద్దు
  • బ్రహ్మ – బమ్మ, బొమ్మ
  • ఆశ్చర్యము – అచ్చెరువు
  • కీర్తి – కీరితి
  • అగ్ని – అగ్గి

వ్యుత్పత్త్యర్థాలు:

  • పక్షి : పక్షములు కలది (పక్షి)
  • ఖగము : ఆకాశమున తిరుగునది. (పక్షి)
  • దహనుడు : దహించు స్వభావము (అగ్ని)
  • బుభుక్ష : కలవాడు. తినవలెనను కోరిక (ఆకలి)
  • పుత్రుడు : పున్నామ నరకము నుండి రక్షించువాడు. (కొడుకు)

సంధులు

  • విఘ్నమిట్టులు : విఘ్నము + ఇట్టుల = ఉత్వసంధి
  • వియోగంబగు : వియోగంబు + అగు = ఉత్వసంధి
  • ఇమ్మని : ఇమ్ము + అనిన = ఉత్వసంధి
  • అధముడయిన : అధముడు + అయిన = ఉత్వసంధి
  • మాంసమెల్ల : మాంసము + ఎల్ల = ఉత్వసంధి
  • సూత్రం : ఉత్తునకు అచ్చుపరమైనపుడు సంధి అవుతుంది.
  • ఇంద్రాగ్నులు : ఇంద్ర + అగ్నుల = సవర్ణదీర్ఘ సంధి
  • శరణాగత : శరణ + ఆగత = సవర్ణదీర్ఘ సంధి
  • ఆహారార్ధం : ఆహార + అర్థం = సవర్ణదీర్ఘ సంధి
  • సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.
  • గుణోన్నతి : గుణ + ఉన్నతి = గుణసంధి
  • విహాగోతామ : విహగ + ఉత్తమ = గుణసంధి
  • సూత్రం : అకారానికి ఇ, ఉ, ఋ లు పరమైనపుడు క్రమంగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమవుతాయి.
  • ఎట్టియధముడు : ఎట్టి + అధముడు = యడాగమసంధి
  • మిక్కిలి యధర్మము : మిక్కిలి + అధర్మము = యడాగమసంధి
  • తులయెక్కె : తుల + ఎక్కె = యడాగమసంధి = యడాగమసంధి
  • సూత్రం : సంధిలేని చోట స్వరం కంటే పరంగా ఉన్న స్వరానికి యడాగమం అవుతుంది.

సమాసములు

  • ఇంద్రాగ్నులు – ఇంద్రుడును, అగ్నియును – ద్వంద్వ సమాసము
  • వాసవదహనులు -వాసవుడును, దహనుడును – ద్వంద్వ సమాసము
  • తనయంగము – తనదైన అంగము – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
  • సర్వభూతములు – సర్వములైన భూతములు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
  • పెక్కుజీవములు – అనేకములైన జీవములు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
  • వేదవిహితము – వేదముచేత విహితము – తృతీయా తత్పురుష సమాసము
  • విహగోత్తముడు – విహగములలో ఉత్తముడు – షష్ఠీ తత్పురుష సమాసము
  • అవనినాథుడు – అవనికి నాథుడు – షష్ఠీ తత్పురుష సమాసము
  • గుణోన్నతి – గుణములందు ఉన్నతి – సప్తమీ తత్పురుష సమాసము
  • ఒక్క కపోతము – ఒక్కటైన కపోతము – ద్విగు సమాసము
  • శబ్ద బ్రహ్మము – శబ్దమనెడి బ్రహ్మము – రూపక సమాసము

పద్యాలు – ప్రతిపదార్థాలు – తాత్పర్యాలు

1. ఆ॥ నిన్ను సత్య ధర్మ నిర్మలుఁగా విందు
నట్టి నీకు బాడియయ్య ? యిప్పు
డతి బుభుక్షితుండనై యున్న నాకు నా
హార విఘ్న మిట్టులాచరింప ?

ప్రతిపదార్థం :
అయ్య = ఓ రాజా ! శిబి చక్రవర్తీ!
నిన్ను = నిన్ను గురించి
సత్య ధర్మనిర్మలున్ + కాన్ = సత్యము, ధర్మము పాటించే పవిత్రునిగా
విందున్ = విని ఉన్నాను
అట్టి నీకు = అంత గొప్పవాడివైన నీకు
ఇప్పుడు = ఈ సమయంలో
అతి = మిక్కిలి
బుభుక్షితుండను + ఐ =ఆకలి గొన్నవాడనై
ఉన్న నాకున్ = ఉన్నటువంటి నాకు
ఇట్టులు = ఈ విధంగా
ఆహార విఘ్నము = భోజనానికి ఆటంకము
ఆచరింప = కలిగించుట
పాడి + అ = న్యాయమేనా ?

తాత్పర్యం:
ఓ శిబి చక్రవర్తీ ! నీవు సత్య ధర్మాలను ఆచరించటం చేత కళంకం లేనివాడివని విన్నాను. అటువంటి నీవు ఈ సమయంలో మిక్కిలి ఆకలితో ఉన్న నాకు ఆహారం దొరకకుండా చేయటం న్యాయమేనా ?

TS 8th Class Telugu 1st Lesson Questions and Answers Telangana త్యాగనిరతి

2. వ॥ సర్వ భూతంబులు నాహారంబున జీవించి వర్ధిల్లు, నిదినాకు, భక్ష్యంబు గానినాఁడు
బుభుక్షావేదనం జేసి ప్రాణ వియోగంబగు, నట్లయిన నా పుత్రులు భార్యయు జీవింపనేర,
రొక్క కపోతంబు రక్షించి పెక్కు జీవులకు హింససేయుట ధర్మవిరోధంబు

ప్రతిపదార్థం :

సర్వభూతంబులు ఆహారంబున = ప్రాణులన్నియు
జీవించి = బతికి
వర్ధిల్లు = వృద్ధిపొందును.
ఇది = ఈ పావురము
నాకు = డేగనైన నాకు
భక్ష్యంబు + కానినాడు = ఆహారం కాకపోతే
బుభుక్షావేదనన్ + చేసి = = ఆకలిబాధ వలన
ప్రాణ వియోగంబు + అగున్ = ప్రాణములు పోవును
అట్లు + అయిన = అలా జరిగితే
నా పుత్రులు = నా బిడ్డలు
భార్యయు = భార్యయును
జీవింప నేరరు = బ్రతకలేరు
ఒక్క కపోతంబు = ఒక్క పావురాన్ని
రక్షించి = కాపాడి
పెక్కు జీవులకు = అనేక ప్రాణులకు
హింస + చేయుట = బాధ కలిగించుట
ధర్మ విరోధంబు = ధర్మానికి విరుద్ధము

తాత్పర్యం:
అన్ని ప్రాణులు కూడా ఆహారం మూలంగానే బ్రతుకుతూ వృద్ధి పొందుతాయి. ఈ పావురం నాకు ఆహారం కాకపోతే ఆకలి బాధతో నా ప్రాణాలు పోతాయి. అట్లైతే పిల్లలు, భార్య కూడా బతుకజాలరు. ఒక్క పావురాన్ని కాపాడి ఇన్ని ప్రాణులను హింసించటం ధర్మానికి వ్యతిరేకమే కదా!

3. క॥ ధర్మజ్ఞులైన పురుషులు
ధర్మువునకు బాధసేయు ధర్మువునైనన్ ధర్మముగా మదిఁ దలఁపరు
ధర్మువు సర్వంబునకు హితంబుగ వలయున్

ప్రతిపదార్థం:
ధర్మజ్ఞులు + ఐన = ధర్మమును తెలిసిన
పురుషులు = మనుషులు
ధర్మువునకు = ధర్మానికి
బాధ + చేయు = హాని కలిగించే
ధర్మువున్ + ఐనన్ = ధర్మాన్నైనా సరే
మదిన్ = మనసులో
ధర్మముగా = ధర్మము అని
తలపరు = ఆలోచించరు
ధర్మువు = ధర్మమెప్పుడూ
సర్వంబునకు = ఎల్లరకు
హితంబుగ = మేలు కలిగించేదిగ
వలయున్ = ఉండవలెను.

తాత్పర్యం:
ధర్మం తెలిసినవారు ధర్మానికి కీడుచేసే ఎటువంటి ధర్మాన్నైనా ధర్మమని మనస్సులో తలచుకోరు. ధర్మం అనేది అన్నింటికీ మేలును కలిగించేదిగానే ఉండాలి.

4. వ॥ ఇక్కపోతంబు నాకు వేదవిహితంబైన యాహారంబు.
‘శ్యేనాః కపోతాన్ ఖాదయన్తి’ యను వేదవచనంబు
గలదు గావున దీని నాకు నాహారంబుగా నిమ్మనిన
దానికి శిబి యిట్లనియె

ప్రతిపదార్థం:
ఈ + కపోతంబు = ఈ పావురము
నాకు = డేగనైన నాకు
వేదవిహితంబు + ఐన = వేదములు నిర్దేశించిన
ఆహారంబు = ఆహారము
శ్యేనాః = డేగలు
కపోతాన్ = పావురాలను
ఖాదయంతి = తింటాయి
అను = అనునది
వేదవచనంబు+కలదు = వేదములు చెప్పిన మాట ఉన్నది.
కావున = అందుచేత
నాకున్ = నాకు
దీనిన్ = ఈ పావురాన్ని
ఆహారంబుగాన్ = భోజనంగా
ఇమ్ము = ఇవ్వవలసినది
అనిన = అనగా
దానికి = ఆ డేగకు
శిబి = శిబి చక్రవర్తి
ఇట్లు + అనియె = ఇలా అన్నాడు.

తాత్పర్యం:
ఈ పావురం నాకు వేదంచే నిర్దేశింపబడిన ఆహారం. “డేగలు పావులను తింటాయి” అనే వేద వాక్యం ఉన్నది. కాబట్టి దీనిని నాకు ఆహారంగా ఇవ్వుమని అడిగిన డేగతో శిబి ఈ విధంగా బదులు పలికాడు.

TS 8th Class Telugu 1st Lesson Questions and Answers Telangana త్యాగనిరతి

5. తే॥ ప్రాణభయమున వచ్చి యిప్పక్షి నన్ను
నాశ్రయించె నాశ్రితునెట్టి యధముఁడయిన విడువఁడనినను నేనెట్లు విడుతు దీని ?
నాశ్రిత త్యాగమిది ధర్మువగునె ? చెపుమ

ఈ + పక్షి = ఈ పక్షియైన పావురము
ప్రాణభయమున = ప్రాణం పోతుందనే భయంతో
వచ్చి = నా దగ్గరకు వచ్చి
నన్నున్+ఆశ్రయించెన్ = నా శరణు కోరింది.
ఎట్టి = ఎటువంటి
అధముడు+అయిన = నీచుడైనా కూడా
విడువడు = వదిలిపెట్టడు
అనినను = అంటారు గదా !
నేను = రాజునైన నేను
దీనిన్ = ఈ పక్షిని
ఎట్లు విడుతును = ఎలా వదిలిపెట్టగలను ?
ఇది = ఇలా
ఆశ్రిత త్యాగము = శరణు అన్నవారిని విడిచిపెట్టటం
ధర్మువు+అగును+ఎ = ధర్మము అనిపించుకుంటుందా ?
చెపుము + అ = నీవే చెప్పుము

తాత్పర్యం:
ప్రాణభయంతో వచ్చి ఈ పావురం నన్ను ఆశ్రయించింది. ఎంతటి నీచుడయినా రక్షించుమని వచ్చిన ఆశ్రితుడిని విడిచిపెట్టడు. నేనెట్లా విడిచిపెడతాను? ఆశ్రితులను విడిచిపెట్టడం ధర్మం ఎట్లా అవుతుందో నీవే చెప్పు.

6. వ॥ నీవు పక్షివయ్యును ధర్మమెఱింగినట్లు పలికితి, శరణాగత పరిత్యాగంబు కంటె మిక్కిలి యధర్మం బొండెద్ది?
నీ యాఁకలి దీననకాని యొంట నుపశమింపదే ? నీ యత్నం బాహారార్థం బేని యిప్పు డివ్వనంబున మృగ
మహిష వరాహ ఖగ మాంసంబులు దీనికంటె మిక్కిలిగాఁ బెట్టెద, నిక్కపోతంబు వలని యాగ్రహం బుడుగుము,
దీని నేనెట్లును విడువ’ననిన శ్యేనం బిట్లనియె ..

ప్రతిపదార్థం:
నీవు = నీవు
పక్షివి + అయ్యును = పక్షివై యుండి కూడా
ధర్మము+ఎఱింగిన + అట్లు = ధర్మాలు తెలిసిన వానివలె
పలికితి = మాట్లాడావు
శరణ + ఆగత = శరణు అంటూ వచ్చినవారిని
పరిత్యాగంబు కంటె = విడిచిపెట్టుట కంటె
అధర్మంబు = అధర్మం
ఒండు + ఎద్ది = వేరొకటి ఏమున్నది?
నీ + ఆకలి = నీ ఆకలి
దీనన కాని = దీనితోనే తప్ప
ఒంటన్ = వేరొకదానితో
ఉపశమింపదు + ఏ = = శాంతించదా ?
నీ యత్నంబు = నీ ప్రయత్నము
ఆహార + అర్థంబు +ఏని = ఆహారం కోసమే ఐతే
ఇప్పుడు = ఈ సమయంలో
ఈ + వనంబున = ఈ అడవిలోని
మృగ = జింకల
మహిష = దున్నల
వరాహ = పందులు
ఖగ = పక్షుల
మాంసంబులు = మాంసములను
దీనికంటె = ఈ పావురం కంటె
మిక్కిలి = ఎక్కువగా
పెట్టెదన్ = తినడానికి పెడతాను
ఈ + కపోతంబువలని = ఈ పావురం విషయంలో
ఆగ్రహంబు = పట్టుదల
ఉడుగుము = విడిచిపెట్టు
దీనిని = ఈ పావురాన్ని
నేను = నేను
ఎట్లును = ఏ పరిస్థితిలోనూ
విడువను = వదిలిపెట్టను
అనిన = అని రాజు పలుకగా
శ్యేనం = డేగ
ఇట్లు + అనియె = ఇలా అన్నది.

తాత్పర్యం:
నీవు పక్షివి ఐనప్పటికీ ధర్మం తెలిసిన దానివలె మాట్లాడావు. రక్షించుమని కోరి వచ్చిన వారిని విడిచిపెట్టటం కన్న అధర్మం మరొకటుంటుందా ? నీ ఆకలి ఈ పావురాన్ని తింటే కానీ తీరదా ? నీ ప్రయత్నం ఆహారం కోసమే అయితే ఇప్పుడు అడవిలో ఎన్ని జంతువులు లేవు ? లేళ్ళు, దున్నలు, పందులు, పక్షులు మొదలైన వాటి మాంసాలు దీని కన్నా ఎక్కువగా పెడతాను. ఈ పావురం మీద కోపాన్ని విడిచిపెట్టు. దీన్ని మాత్రం నేను విడువను. అని శిబి చెప్పగా డేగ ఇట్లా బదులు పలికింది.

TS 8th Class Telugu 1st Lesson Questions and Answers Telangana త్యాగనిరతి

7. ఆ॥ నాకు విహిత భక్షణంబిది; యిప్పక్షి బూని కావ నీకు బుద్ధియేని
యవని నాథ ! దీని యంత నీ మాంసంబు
దూచి నాకుఁ బెట్టు తొలగ కిపుడ

ప్రతిపదార్థం:
అవని నాథ = ఓ రాజా!
ఇది = ఈ పావురము
నాకు = డేగనైన నాకు
విహిత భక్షణంబు = విధించబడిన ఆహారము
పూని = పట్టుదలతో
ఈ + పక్షిన్ = ఈ పావురాన్ని
కావన్ = రక్షించడానికి
నీకు = నీకు
బుద్ధి + ఏని = ఇష్టమైనట్లైతే
దీని + అంత = దీనితో సమానమైన
నీ మాంసంబు = నీ శరీర మాంసాన్ని
తూచి = తూకంవేసి
తొలగక = తప్పించుకోకుండా
ఇపుడు + అ = ఇప్పుడే
నాకున్ + పెట్టు = నాకు ఆహారంగా పెట్టు

తాత్పర్యం :
ఓ రాజా ! ఈ పావురం నాకు సహజసిద్ధంగా కల్పించబడిన ఆహారం. ఒకవేళ దీన్ని నీవు కాపాడాలని అనుకుంటే, దాని బరువుకు తూగినంత మాంసాన్ని నీ శరరీం నుంచి నాకు పెట్టుమని అడిగింది.

8. చ॥ అనిన ‘ననుగ్రహించితి మహా విహగోత్తమ’ యంచు సంతసం
బున శిబి తత్క్షణంబ యసి పుత్రిక నాత్మశరీర కర్తనం ‘
బనఘుఁడు సేసి చేసి తన యంగమునం గల మాంసమెల్లఁ బె
ట్టినను గపోతభాగమ కడిందిగ డిందుచు నుండె నత్తులన్

ప్రతిపదార్థం:

అనినన్ = ఆ డేగ ఇలా పలుకగా
శిబి = శిబి చక్రవర్తి
మహావిహగ+ఉత్తమ = ఓ శ్రేష్ఠుడైన పక్షిరాజా !
ననున్ = నన్ను
అనుగ్రహించితి = కరుణించావు
అంచు = అని పలుకుతూ
సంతసంబున = సంతోషముతో
అనఘుడు = పుణ్యాత్ముడైన ఆ శిబి
తత్ + క్షణంబు + అ = వెంటనే
అసి పుత్రికన్ = చిన్న కత్తితో
ఆత్మ = తన యొక్క
శరర = దేహమును
కర్తనంబు
చేసి చేసి = కత్తిరించుట = ఎన్నోసార్లు చేసి
తన = తన యొక్క
అంగంబునన్ + కల = శరీరము నందున్న
మాంసము + ఎల్లన్ = మాంసమంతయు
ఆ + తులన్ = ఆ త్రాసులో
పెట్టినను = పెట్టినా
కపోత భాగము = పావురము ఉన్నవైపు
కడిందిగ = మిక్కిలిగా
డిందుచున్ + ఉండెన్ = దిగిపోతూ ఉన్నది.

తాత్పర్యం:
అనగా సంతోషించిన శిబి పక్షులన్నింటిలో గొప్ప.. దానివైన నీవు నాపై దయ చూపావు అని చెప్పి వెంటనే చిన్న కత్తితో తన శరీరంలోని మాంసాన్ని కోసి తక్కెడలో వేస్తూ పావురం బరువుతో తూకం వేశాడు. తన దేహంలోని మొత్తం మాంసం వేసినప్పటికీ పావురం ఉన్నవైపే తక్కెడ మొగ్గుతున్నది.

9. క॥ దానికి నచ్చెరువడి ధర
ణీ నాథుఁడు తనువు నందు నెత్తురు దొరుఁగం దాన తుల యెక్కె నంతన్
వాని గుణోన్నతికి మెచ్చి వాసవ దహనుల్

ప్రతిపదార్థం :

ధరణీ నాథుడు = శిబి మహారాజు
దానికిన్ = ఆ విచిత్రానికి
అచ్చెరు + పడి = ఆశ్చర్యపడి
తనువునందు = తన శరీరమందు
నెత్తురు = రక్తము
తొరుగన్ = కారుచుండగా
తాను + అ = తానే
తుల + ఎక్కెన్ = త్రాసులో కూర్చున్నాడు.
అంతన్ = వెంటనే
వాసవ దహనుల్ = ఇంద్రుడు, అగ్నిదేవుడు
వాని = ఆ రాజు యొక్క
గుణ + ఉన్నతికిన్ = గుణముల ఔన్నత్యానికి
మెచ్చి = మెచ్చుకొని

తాత్పర్యం :
తన శరీరం నుండి ఎంత మాంసం ఇచ్చినా పావురంతో సరితూగక పోవటంతో ఆశ్చర్యపడ్డ శిబి చక్రవర్తి తానే తక్కెడలో కూర్చున్నాడు. ఇటువంటి ఆత్మార్పణతో కూడిన అతని త్యాగ గుణాన్ని చూసి ఇంద్రుడు, అగ్నిదేవుడు మెచ్చుకొని

TS 8th Class Telugu 1st Lesson Questions and Answers Telangana త్యాగనిరతి

10. వ॥ శ్యేనకపోత రూపంబులు విడిచి నిజరూపంబులఁ జూపి ‘నీ ధైర్య శౌర్యాది గుణంబు లనన్యసాధారణంబులు
గావున నీ కీర్తి నిత్యంబై శబ్ద బ్రహ్మంబు గలయంత కాలంబు వర్తిల్లుచుండు’మని శిబికి వరంబిచ్చి ఇంద్రాగ్నులు
చనిరి.

ప్రతిపదార్థం :

శ్యేన కపోత రూపంబులు = డేగ పావురం రూపాలను
విడిచి = వదిలిపెట్టి
నిజరూపంబులన్ చూపి =తమ స్వీయరూపాలను చూపించి
నీ ధైర్యశౌర్య + ఆది = నీ ధైర్యము, శౌర్యము మొదలైన
గుణంబులు = లక్షణాలు
అనన్య సాధారణంబులు = ఇతరులెవ్వరికీ లేనివి
కావున = అందువలన
నీ కీర్తి = నీ యశస్సు
నిత్యంబు + ఐ = శాశ్వతమై
శబ్ద బ్రహ్మంబు + కల + అంతకాలంబు = శబ్దము ఉన్నంతకాలము
వర్తిల్లుచున్ = స్థిరముగా
ఉండుము + అని = ఉండిపోతావు అని
శిబికి = శిబి చక్రవర్తికి
వరంబు + ఇచ్చి = వరమిచ్చి
ఇంద్ర + అగ్నులు = ఇంద్రుడును, అగ్నియును
చనిరి = వెళ్ళారు.

తాత్పర్యం :
డేగ, పావురం రూపాల్లో ఉన్న ఇంద్రుడు, అగ్ని వారి నిజరూపాలతో సాక్షాత్కరించి “నీ ధైర్య, శౌర్య గుణాలు చాలా గొప్పవి. ఇవి ఇతరులకు సాధ్యంకావు. కావున నీ కీర్తి శాశ్వతంగా ఉంటుంది” అని వెళ్ళిపోయారు.

పాఠం ఉద్దేశం:
ప్రశ్న.
త్యాగనిరతి పాఠం నేపథ్యం వివరించండి.
జవాబు.
పూర్వకాలంలో శిబి భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేశాడు. అప్పుడు ఇంద్రుడు, అగ్నిదేవుడు శిబిచక్రవర్తి గుణగణాలను పరీక్షించాలనుకున్నారు. అగ్ని పావురంగా మారాడు. ఇంద్రుడు డేగ రూపం ధరించాడు. డేగంటే భయంతో పావురం శిబి చక్రవర్తి వద్దకు వచ్చి శరణు కోరింది.

పాఠ్యభాగ వివరాలు:
ప్రశ్న, త్యాగనిరతి పాఠ్యభాగ వివరాలు తెల్పండి.
జవాబు.
త్యాగనిరతి పాఠం ఇతిహాస ప్రక్రియకు చెందినది. ఇతిహాసం అంటే ‘ఇది ఇట్లా జరిగింది’ అని అర్థం. ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఈ కథలు గ్రంథస్థం కాక ముందు వాగ్రూపంలో ఉండేవి. భారత రామాయణాలను ఇతిహాసాలు అంటారు. ఈ పాఠాన్ని శ్రీమదాంధ్ర మహాభారతంలోని అరణ్యపర్వంలోని తృతీయ ఆశ్వాసం నుండి గ్రహించారు.

కవి పరిచయం:
ప్రశ్న.
త్యాగనిరతి పాఠం రచించిన కవిని పరిచయం చేయండి.
జవాబు.
రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థానకవి నన్నయ. ఇతనికి వాగనుశాసనుడనే బిరుదు ఉన్నది. 11వ శతాబ్దం వాడు.

వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాశాడు. నన్నయ మహాభారతంలోని పద్దెనిమిది పర్వాలలో ఆది, సభా పర్వాలు, అరణ్యపర్వంలో 4వ ఆశ్వాసంలో “శారదరాత్రులు” అనే పద్యం (11వ శతాబ్దం) వరకు తెలుగులోకి అనువదించాడు. “ఆంధ్రశబ్ద చింతామణి” అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. తన కవిత్వంలో ‘అక్షరరమ్యత, ప్రసన్నకథా కలితార్థయుక్తి, నానారుచిరార్థసూక్తి నిధిత్వం’ అనే లక్షణాలున్నాయని చెప్పుకున్నాడు.
(గమనిక : జవాబు రాసేటప్పుడు గీతగీసిన వాక్యాలు రాస్తే చాలు.)

TS 8th Class Telugu 1st Lesson Questions and Answers Telangana త్యాగనిరతి

ప్రవేశిక:
మన ప్రాచీన సాహిత్యంలో నైతిక విలువలకు ఎంతో ప్రాధాన్యం ఉన్నది. భారత, రామాయణాలు ఉత్తములైన రాజుల కథలను వివరిస్తాయి. వారిలో శిబి చక్రవర్తి త్యాగగుణానికి తార్కాణంగా నిలుస్తాడు. తనను ఆశ్రయించిన ఒక పావురాన్ని డేగ నుండి రక్షించడానికి తన ప్రాణాలను సైతం లెక్కచేయడు. అది ఎట్లానో తెలియజేయడం ఈ పాఠం నేపథ్యం.

కఠిన పదాలకు అర్ధాలు

భూతము = ప్రాణి
బుభుక్షావేదన = ఆకలిబాధ
పాడి = న్యాయము, ధర్మము
కపోతం = పావురం
ఖాదయంతి = తింటాయి
శ్యేనం = డేగ
అధముడు = నీచుడు
ఆశ్రితులు = ఆశ్రయించినవారు
పరిత్యాగం = విడిచిపెట్టుట
ఒండు = మరొకటి
మహిషం = దున్న
ఖగం = పక్షి, విహగము
వరాహం = పంది
ఉపశమించు = శాంతించు
విహితము = విధించబడిన, చెప్పబడిన
అసి = కత్తి
అపుత్రిక = చిన్నకత్తి
కర్తనము = కత్తిరించుట
అంగము = శరీరభాగము
కడు = మిక్కిలి
ధరణి= భూమి
నాథుడు = భర్త
ధరణీనాథుడు = = భూ భర్త = రాజు
తొరుగు = కారుచుండగా
వాసవ దహనులు = ఇంద్రుడు, అగ్నిదేవుడు
ఉన్నతి = ఔనత్యం
చనుట = వెళ్ళుట

నేనివి చేయగలనా?

TS 8th Class Telugu 1st Lesson Questions and Answers Telangana త్యాగనిరతి 4

TS 8th Class Telugu Guide Answers Study Material Telangana

TS 8th Class Telugu Guide Study Material Telangana Pdf Download

Class 8 Telugu Textbook Solutions Telangana

TS 8th Class Telugu Guide Telangana ఉపవాచకం

TS 8th Class Study Material

TS 8th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson Telangana ఇల్లు – ఆనందాలహరివిల్లు

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download ఉపవాచకం 4th Lesson ఇల్లు – ఆనందాలహరివిల్లు Textbook Questions and Answers.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson ఇల్లు – ఆనందాలహరివిల్లు

కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

1. “దేశానికి కుటుంబ వ్యవస్థ వెన్నెముక” అనడానికి కారణాలు రాయండి.
జవాబు.
‘కలిసి ఉంటే కలదు సుఖం’ అనే సూత్రం ఆధారంగా ఉమ్మడి కుటుంబం కుటుంబ వ్యవస్థకు బలాన్ని చేకూర్చేది. స్వార్థానికి తావు తక్కువ. ‘మన’ అనే భావం అందరిలో ఉండేది. రైతు కుటుంబాల్లో ఇంటిల్లిపాది ఇంటా, బయటా పనుల్లో పాలుపంచుకొనేవారు. శ్రామిక వర్గం కూడా అలాగే ఉండేది. ఊరిలో ఏదన్నా పెళ్లి లాంటి కార్యక్రమాలు జరిగితే అందరూ శ్రమను పంచుకొని ఆ కార్యక్రమం చేసే వారికి ఆనందం కల్గించేవారు. ఈ సంఘీభావమే దేశానికి వెన్నెముక అయింది.

2. “అసలు కంటే వడ్డీయే ముద్దు” ఈ సామెతను పాఠం ఆధారంగా వివరించండి.
జవాబు.
ఉమ్మడి కుటుంబాలలో పిల్లలు సరదా సరదాగా ఉండేవారు. ఆటపాటల్లోను, కొట్లాటల్లోను పోటీపడుతుంటారు. అవసరాలు తీర్చుకోవడంలోనూ పోటీపడేవారు. కాని పెద్దల కనుసన్నలలో భయభక్తులతో క్రమశిక్షణతో ఉండేవారు. ఏం కావాలన్నా, ఏదైనా జరిగినా అమ్మమ్మ, నాన్నమ్మల దగ్గరకు చేరేవారు. వాళ్ళు కూడా ప్రేమతో దగ్గరకు తీసుకొనేవారు. తమ కొడుకులు, కోడళ్ళ కంటే వారి పిల్లలంటే వారికి అభిమానం ఎక్కువ. “అసలు కంటే వడ్డీయే ముద్దు” కదా!

TS 8th Class Telugu ఉపవాచకం 4th Lesson Telangana ఇల్లు – ఆనందాలహరివిల్లు

3. “కలిసి ఉంటే కలదు సుఖం” దీన్ని వివరించండి.
జవాబు.
“కలిసి ఉంటే కలదు సుఖం” అంటే అందరూ కలిసికట్టుగా జీవిస్తే సుఖంగా ఉంటారు అని అర్థం. కలిసి ఉంటే కలదు సుఖం అనే సూత్రం ఆధారంగా సమిష్టి కుటుంబం, కుటుంబవ్యవస్థకు బలాన్ని చేకూర్చేది. కొందరి మనోభావాలు భిన్నంగా ఉన్నప్పటికీ మొత్తం కుటుంబానికి అక్కరకు వచ్చేదే అమలయ్యేది. స్వార్థపరతకు తావు తక్కువ. ‘మన’ అనే భావనకు అందరూలోనై ఉండేవారు. రైతుకుటుంబాల్లో ఐతే ఇంటిల్లిపాది ఇంటి పనుల్లో పాలు పంచుకొనేవారు. శ్రామిక వర్గం అంతా దాదాపు అలానే ఉండేది. ఊరిలో ఏదన్నా పెళ్ళి లాంటి కార్యక్రమాలు జరిగితే అందరూ శ్రమను పంచుకొని ఆ కార్యక్రమం చేసేవారికి ఆనందం కలిగించేవారు. ఈ సంఘీభావమే దేశానికి వెన్నెముక అయింది. సిరిసంపదలను పోగు చేసింది. ప్రపంచంలోనే భారతదేశాన్ని ఉన్నతస్థానంలో నిలబెట్టింది ఆనాడు. మన ఇతిహాసాలైన రామాయణ భారతాలు ఈ సమష్టి కుటుంబ వ్యవస్థను ప్రతిబింబిస్తాయి.

4. యాంత్రిక జీవనం అంటే ఏమిటి ?
జవాబు.
యాంత్రిక జీవనం అంటే యంత్రాల్లా జీవించడం. యంత్రాలు ఎటువంటి ఆనందాలు, బాధలు, అనుభూతులు లేకుండా జీవిస్తాయి. అలాగే మనుషులు ఎటువంటి భావనలు లేకుండా జీవిస్తున్నారు. ఎక్కువగా యంత్రాలపైన ఆధారపడి జీవిస్తున్నారు. బద్దకస్తులు అవుతున్నారు. అందరితో కలసి జీవించకుండా ఎవరికి వారే, యమునాతీరే అన్నట్లు బ్రతుకుతున్నారు. యాంత్రిక జీవనం సాగిస్తూ, రోగాలపాలౌతున్నారు.

5. మంచి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన పిల్లలే ఈ సమాజంలో నిలదొక్కుకుంటున్నారు. ఎందుకు ?
జవాబు.
మంచి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన పిల్లలకు కష్టం, సుఖం, బరువు, బాధ్యత తెలుస్తాయి. క్రమశిక్షణతో ఎదుగుతారు. వారు తమ తల్లిదండ్రుల ప్రభావంతో అందరితో కలిసిమెలిసి ఉంటారు. పెద్ద వారితో కష్ట సుఖాలు పంచుకుంటారు. ఎటువంటి అశాంతికి, హింసకు లోనుగాకుండా ఉంటారు. తల్లిదండ్రులు తమపై చూపించిన అభిమానాన్ని ఇతరులపైనా చూపిస్తారు. పెద్దవారంటే గౌరవం ఉంటుంది. మంచి వారితో స్నేహం చేస్తారు. అందువల్లనే మంచి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన పిల్లలే ఈ సమాజంలో నిలదొక్కుకుంటున్నారు.

TS 8th Class Telugu ఉపవాచకం 4th Lesson Telangana ఇల్లు – ఆనందాలహరివిల్లు

6. ‘మన’ అనే భావనవల్ల కలిగే ప్రయోజనాలేమిటి ?
జవాబు.
‘మన’ అనే భావన వలన అనేక ప్రయోజనాలు కల్గుతాయి. అందరం ఒకరికి ఒకరు సాయం చేసుకొనే అవకాశం ఉంటుంది. పిల్లలకు, అందరికీ సహాయం చెయ్యాలనే స్వభావం అలవడుతుంది. ‘మన’ అనే భావం వలన కుటుంబం, ఊరు వాడతో పాటు దేశం బాగుపడుతుంది. సమాజంలో అందరితో కలిసికట్టుగా జీవించే అవకాశం కల్గుతుంది. మంచి కుటుంబం, మంచి సమాజం, మంచి దేశం, మంచి ప్రపంచం ఏర్పడతాయి. ఎవరిలోను స్వార్థం పెరగదు. దాని వలన అన్యాయాలు, అక్రమాలు జరగవు. ప్రపంచమంతా శాంతితో నిండి ఉంటుంది. మన అనే భావనలో సార్థపరతకు తావు తక్కువ.

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

1. తల్లిదండ్రులు ఇతరులతో పోటీపడుతూ పరుగెడుతున్న నేటి సమాజంలో పిల్లల పరిస్థితులేమిటి ?
జవాబు.
తల్లిదండ్రులు ఇతరులతో పోటీపడుతూ పరుగెడుతున్నారు. అందువలన నేటి సమాజంలో పిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తల్లిదండ్రులు సంపాదనే ముఖ్యంగా భావించి పిల్లల గురించి ఆలోచించట్లేదు. దానివల్ల పిల్లలు ప్రేమకు, ఆప్యాయతకు దూరం అవుతున్నారు. మానవతావిలువల గురించి చెప్పేవారు లేక క్రమశిక్షణకు దూరమవుతున్నారు. చదువులో ఒత్తిడి పెరిగి, మానసికంగా, శారీరకంగా కుంగిపోతున్నారు.

కొందరు అందరూ ఉండి ఎవరూ లేని అనాథ పిల్లలుగా తయారవుతున్నారు. కొందరు పిల్లలు సమాజ వ్యతిరేక శక్తులుగా మారిపోతున్నారు. అశాంతికి, హింసకు ప్రధాన కారకులవుతున్నారు. మంచిని, నీతిని చెప్పే వారు లేక దురలవాట్లకు బానిసలవుతున్నారు. మానవతా విలువలు తెలియకుండా పెరుగుతున్నారు. ఇలా అనేక రకాలుగా నేటి సమాజంలో పిల్లల పరిస్థితి దయనీయంగా తయారవుతున్నది. అన్ని కుటుంబాల్లో ఇలా జరగకపోయినప్పటికీ ఎక్కువ కుటుంబాల్లో పరిస్థితి ఇలాగే ఉంది.

TS 8th Class Telugu ఉపవాచకం 4th Lesson Telangana ఇల్లు – ఆనందాలహరివిల్లు

2. సమిష్టి కుటుంబానికీ, వ్యష్టి కుటుంబానికీ మధ్య వ్యత్యాసమేమిటి ? దాని పరిణామాలెలా ఉన్నాయి ?
జవాబు.
సమిష్టి అంటే కలిసి ఉండేది అని అర్థం. సమిష్టి కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబం. అంటే ఇంటి యజమాని, తల్లిదండ్రులు, భార్య, పిల్లలు అందరూ కలిసి ఉండడం. వ్యష్టి అంటే ఒంటరిపాటు అని అర్థం. వ్యష్టి కుటుంబం అనగా ఇంటి యజమాని తన భార్యా పిల్లలతో మాత్రమే చిన్న కుటుంబంగా ఉండడం. సమష్టి కుటుంబాల్లో ‘మన’ అనే భావన ఉండేది. ఒకరిపై ఒకరు అభిమానంతో, గౌరవంతో ఉండేవారు. అందరూ కలిసికట్టుగా ఉండేవారు. వ్యష్టి కుటుంబాల్లో డబ్బు పరంగా స్వేచ్ఛ, ప్రత్యేక గుర్తింపు, స్వార్థం ఉంటాయి. దీని వలన కుటుంబపరమైన

వారసత్వ భావనలు అందడంలేదు. మానవ సంబంధాలు, ఆప్యాయతలు తగ్గిపోతున్నాయి. భాషను ప్రయోగించడం తగ్గుతుంది. పిల్లలపట్ల తల్లిదండ్రులకు శ్రద్ధ తగ్గిపోతుంది. పిల్లలకు మంచి అలవాట్లు నేర్చుకొనే అవకాశం ఉండదు. ఇలా అనేక పరిణామాలు కల్గుతాయి.
ఇది పిల్లలపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. పెద్దల పట్ల గౌరవం తగ్గిపోతుంది. పిల్లల యొక్క భావనలు
సంకుచితమౌతాయి.

3. వృష్టి కుటుంబమైనా, సమష్టి కుటుంబమైనా సమాజానికి, దేశానికి పనికొచ్చే పిల్లల్ని అందించాలంటే ఏం చేయాలి ?
జవాబు.
వ్యష్టి కుటుంబమైనా, సమష్టి కుటుంబమైనా దేశానికి పనికొచ్చే పిల్లల్ని అందించడం కుటుంబ బాధ్యత. తల్లిదండ్రులు పిల్లలపట్ల శ్రద్ధ చూపించి, ప్రేమను పంచాలి. పిల్లలకు వారసత్వంగా సంస్కారం, చదువు, పరోపకారం మొదలైనవి అందించాలి. తల్లిదండ్రులు ఉద్యోగ వ్యాపకాలలో ఎంత తిరుగుతున్నా పిల్లల కోసం కొంత సమయం కేటాయించాలి.

కుటుంబంలోని పెద్దలు నీతికి సంబంధించిన విషయాలు చెప్పాలి. తల్లిదండ్రులు మంచి నడవడికతో పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. సమాజంలో ఎలా నడచుకోవాలో పిల్లలకు వివరించి చెప్పాలి. కుటుంబంలో అందరూ మన అనే భావనతో ఉండాలి. కుటుంబ విలువలు, భావనలు పిల్లలకు వివరించి చెప్పాలి. ఇలా పిల్లల గురించి శ్రద్ధ తీసుకున్ననాడు దేశానికి మంచి పౌరులుగా పిల్లలు ఎదుగుతారు.

TS 8th Class Telugu ఉపవాచకం 4th Lesson Telangana ఇల్లు – ఆనందాలహరివిల్లు

4. కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి ?
జవాబు.
ఉమ్మడి కుటుంబంలో, వ్యష్టి కుటుంబంలో ఉండే మంచి గుణాల కలయికతో ఒక కొత్త కుటుంబ వ్యవస్థ రూపుదిద్దుకోవాలి. సమానత్వం, ఆర్థిక స్వాతంత్య్రం, వ్యక్తి స్వేచ్ఛ – వీటికి భంగం కలగకుండా ఉండాలి. ఆధిపత్యాల పోరు ఉండకూడదు. ప్రేమానురాగాలు, విలువలు, మానవ సంబంధాలు కలిగి ఉండాలి. ‘మన’ అనే భావం ఉండే విధంగా కొత్త కుటుంబ వ్యవస్థ రూపుదిద్దుకోవాలి.

కుటుంబం అనే హరివిల్లులో అమ్మ, నాన్న, పిల్లలతో పాటు నాన్నమ్మ, తాతయ్య ఉండాలి. పెద్దల బలాన్ని, బలగాన్ని పెంపొందించుకోవాలి. బాధ్యతలను అందరూ పంచుకోవాలి. కుటుంబంలో అందరూ సమస్యలపై పరస్పరం చర్చించుకొని పరిష్కరించుకోవాలి. యాంత్రికత తగ్గాలి. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. అపుడే మన కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగుతుంది.

5. కుటుంబ వ్యవస్థలో క్రమంగా వస్తున్న మార్పులు తెల్పండి.
జవాబు.
పూర్వపు రోజులో సమిష్టి కుటుంబాలు అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇంటి యజమాని, తల్లిదండ్రులు, భార్యా పిల్లలు అందరూ కలిసిమెలిసి ఉండేవారు. నానమ్మ, తాతయ్య, అమ్మమ్మలు, పిల్లలకు మంచి భక్తి, నీతి కథలు చెప్పేవారు. పెద్దవారిపట్ల ఎలా గౌరవంగా ఉండాలో, పిల్లలు చూసి తెలుసుకునేవారు. ఒకరి పట్ల ఒకరు ప్రేమాభిమానాలు కలిగి ఉండేవారు. ఇల్లంతా సందడి సందడిగా ఉండేది. ఒకరికొకరు నిస్వార్థంగా కష్టసుఖాల్లో సహాయం చేసుకునేవారు. సమిష్టి కుటుంబంలోని పిల్లలకు ఆరోగ్యం, సంస్కారం, చదువు, విజ్ఞానం, మంచితనం, పరోపకారం వారసత్వంగా వచ్చేవి. పిల్లలు నిజాయితీ గల ఉత్తమ పౌరులుగా ఎదిగే అవకాశం ఉండేది. సమిష్టి కుటుంబంలో “మన” అనే భావన ఉంటుంది.

వారసత్వ భావనలు అందడంలేదు. మానవ సంబంధాలు, ఆప్యాయతలు తగ్గిపోతున్నాయి. భాషను ప్రయోగించడం తగ్గుతుంది. పిల్లలపట్ల తల్లిదండ్రులకు శ్రద్ధ తగ్గిపోతుంది. పిల్లలకు మంచి అలవాట్లు నేర్చుకొనే అవకాశం ఉండదు. ఇలా అనేక పరిణామాలు కల్గుతాయి.
ఇది పిల్లలపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. పెద్దల పట్ల గౌరవం తగ్గిపోతుంది. పిల్లల యొక్క భావనలు
సంకుచితమౌతాయి.

TS 8th Class Telugu ఉపవాచకం 4th Lesson Telangana ఇల్లు – ఆనందాలహరివిల్లు

3. వ్యష్టి కుటుంబమైనా, సమష్టి కుటుంబమైనా సమాజానికి, దేశానికి పనికొచ్చే పిల్లల్ని అందించాలంటే ఏం చేయాలి?
జవాబు.
వ్యష్టి కుటుంబమైనా, సమష్టి కుటుంబమైనా దేశానికి పనికొచ్చే పిల్లల్ని అందించడం కుటుంబ బాధ్యత. తల్లిదండ్రులు పిల్లలపట్ల శ్రద్ధ చూపించి, ప్రేమను పంచాలి. పిల్లలకు వారసత్వంగా సంస్కారం, చదువు, పరోపకారం మొదలైనవి అందించాలి. తల్లిదండ్రులు ఉద్యోగ వ్యాపకాలలో ఎంత తిరుగుతున్నా పిల్లల కోసం కొంత సమయం కేటాయించాలి. కుటుంబంలోని పెద్దలు నీతికి సంబంధించిన విషయాలు చెప్పాలి.

తల్లిదండ్రులు మంచి నడవడికతో పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. సమాజంలో ఎలా నడచుకోవాలో పిల్లలకు వివరించి చెప్పాలి. కుటుంబంలో అందరూ మన అనే భావనతో ఉండాలి. కుటుంబ విలువలు, భావనలు పిల్లలకు వివరించి చెప్పాలి. ఇలా పిల్లల గురించి శ్రద్ధ తీసుకున్ననాడు దేశానికి మంచి పౌరులుగా పిల్లలు ఎదుగుతారు.

4. కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి ?
జవాబు.
ఉమ్మడి కుటుంబంలో, వ్యష్టి కుటుంబంలో ఉండే మంచి గుణాల కలయికతో ఒక కొత్త కుటుంబ వ్యవస్థ రూపుదిద్దుకోవాలి. సమానత్వం, ఆర్థిక స్వాతంత్య్రం, వ్యక్తి స్వేచ్ఛ – వీటికి భంగం కలగకుండా ఉండాలి. ఆధిపత్యాల పోరు ఉండకూడదు. ప్రేమానురాగాలు, విలువలు, మానవ సంబంధాలు కలిగి ఉండాలి.

‘మన’ అనే భావం ఉండే విధంగా కొత్త కుటుంబ వ్యవస్థ రూపుదిద్దుకోవాలి. కుటుంబం అనే హరివిల్లులో అమ్మ, నాన్న, పిల్లలతో పాటు నాన్నమ్మ, తాతయ్య ఉండాలి. పెద్దల బలాన్ని, బలగాన్ని పెంపొందించుకోవాలి. బాధ్యతలను అందరూ పంచుకోవాలి. కుటుంబంలో అందరూ సమస్యలపై పరస్పరం చర్చించుకొని పరిష్కరించుకోవాలి. యాంత్రికత తగ్గాలి. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. అపుడే మన కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగుతుంది.

5. కుటుంబ వ్యవస్థలో క్రమంగా వస్తున్న మార్పులు తెల్పండి.
జవాబు.
పూర్వపు రోజులో సమిష్టి కుటుంబాలు అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇంటి యజమాని, తల్లిదండ్రులు, భార్యా పిల్లలు అందరూ కలిసిమెలిసి ఉండేవారు. నానమ్మ, తాతయ్య, అమ్మమ్మలు, పిల్లలకు మంచి భక్తి, నీతి కథలు చెప్పేవారు. పెద్దవారిపట్ల ఎలా గౌరవంగా ఉండాలో, పిల్లలు చూసి తెలుసుకునేవారు.

ఒకరి పట్ల ఒకరు ప్రేమాభిమానాలు కలిగి ఉండేవారు. ఇల్లంతా సందడి సందడిగా ఉండేది. ఒకరికొకరు నిస్వార్థంగా కష్టసుఖాల్లో సహాయం చేసుకునేవారు. సమిష్టి కుటుంబంలోని పిల్లలకు ఆరోగ్యం, సంస్కారం, చదువు, విజ్ఞానం, మంచితనం, పరోపకారం వారసత్వంగా వచ్చేవి. పిల్లలు నిజాయితీ గల ఉత్తమ పౌరులుగా ఎదిగే అవకాశం ఉండేది. సమిష్టి కుటుంబంలో “మన” అనే భావన ఉంటుంది.

నేడు సమిష్టి కుటుంబాలు తగ్గి వ్యష్టి (ఒంటరి) కుటుంబాలు వచ్చాయి. ఇంటి యజమాని తన భార్యాపిల్లలతో మాత్రమే చిన్న కుటుంబంగా ఉంటున్నాడు. ఆర్థిక స్వేచ్ఛ తక్కువగా ఉండటం, ప్రజలలో స్వార్థం పెరగటం, ప్రత్యేక గుర్తింపు కోసం ఆరాటం వల్ల ఈ వ్యష్టి కుటుంబాలు ఏర్పడ్డాయి. దీనివల్ల కుటుంబపరమైన వారసత్వ భావనలు ముందు తరాలవారికి అందటం లేదు. మనుషుల్లో “మన” అనే భావన క్రమంగా తగ్గిపోతున్నది.

మానవ సంబంధాలు పరిమితంగా ఉండి, బంధాలు క్రమంగా తగ్గుతూ, ఆప్యాయతలు, అనురాగాలు, ప్రేమాభిమానాలు, పెద్దలపట్ల గౌరవ భావం, క్రమశిక్షణ తగ్గిపోతున్నది. పిల్లలకు మంచి అలవాట్లు రావటం కష్టమై హింస, పెరిగి అనాథలుగా మారి, సమాజ వ్యతిరేక శక్తులుగా మారే ప్రమాదం ఉంది. ఏది ఏమైనా ఉమ్మడి, వ్యష్టి కుటుంబాలలో విలువలతో కూడిన మానవసంబంధాలు, “మన” అనే భావన ఉంటేనే ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది. లేకపోతే కుటుంబం ఛిన్నాభిన్నం అవుతుంది.

పరిచిత గద్యభాగాలు

1. కింది పేరాను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
వేదకాలంనాటికే నాగరికమైన పద్ధతుల్లో ఈ కుటుంబవ్యవస్థ ఏర్పడిందని కొందరు చరిత్రకారుల భావన. వారి రాతల వల్ల కుటుంబ జీవనవిధానం ఆ కాలంలో అత్యున్నత స్థాయిలో ఉండేదనీ, భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు ఉన్నతశ్రేణిలో ఉండేవని తెలుస్తూంది. వేల ఏండ్ల నుంచి విలువలకు కట్టుబడి జీవిస్తూ విశ్వానికి ఆదర్శంగా నిలిచిన కుటుంబ వ్యవస్థ మనది.

ప్రశ్నలు :

1. కుటుంబ వ్యవస్థ ఎప్పుడు ఏర్పడింది ?
జవాబు.
వేదకాలం నాటికే కుటుంబ వ్యవస్థ ఏర్పడింది.

2. ఆనాటి జీవన విధానం ఎలా ఉండేది ?
జవాబు.
ఆనాటి జీవన విధానం అత్యనన్నత స్థాయిలో ఉండేది.

3. ఎవరి సంబంధ బాంధవ్యాలు ఉన్నత శ్రేణిలో ఉండేవి ?
జవాబు.
భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు ఉన్నత (శేణిలో ఉండేవి.

4. విలువలకు కట్టుబడి మనం ఎప్పటి నుండి జీవిస్తున్నాం ?
జవాబు.
వేల ఏండ్ల నుండి విలువలకు కట్టుబడి మనం జీవిస్తున్నాం.

5. మన కుటుంబ వ్యవస్థ ఎటువంటిది ?
జవాబు.
మస కుటుంబ వ్యవస్థ విశ్వానికి ఆదర్శంగా నిలిచింది.

TS 8th Class Telugu ఉపవాచకం 4th Lesson Telangana ఇల్లు – ఆనందాలహరివిల్లు

2. ఈ క్రింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ఈ యాంత్రిక జీవన విధానం వల్ల కుటుంబంలోని అందాలు, ఆనందాలు హరించిపోతున్నాయి. వ్యష్టి కుటుంబంలోని లోపభూయిష్టమైన, స్వార్థంతో కూడిన జీవన విధానం వల్ల ఈ మార్పులు సంభవించాయి. కుటుంబసభ్యులు సుఖాల్నీ, సంతోషాల్నీ, కష్టాల్నీ, బాధల్నీ, పరస్పరం పంచుకోవాల్సి ఉండగా ఎవరికి వారే యమునాతీరే’ అన్న విధంగా మెలగుతున్నారు. ఈ బలీయమైన కారణాల వల్లే పిల్లల్లో కొందరు అందరూ ఉండీ అనాథలుగా, మరికొందరు సమాజ వ్యతిరేకశక్తులుగా మారిపోతున్నారు. సమాజానికి పెను సవాళ్ళను విసురుతున్నారు; అశాంతి, హింసలకు ప్రధాన కారకులవుతున్నారు. పిల్లలపై తల్లిదండ్రుల ప్రభావంతో పాటు, సమాజం, సమవయస్కులు, ప్రసారసాధనాల ప్రభావం కూడా ఉందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. కాని ఇప్పటికీ మంచి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన పిల్లలు వీటన్నింటినీ అధిగమించి సమాజంలో నిలదొక్కుకుంటున్నారు.

ప్రశ్నలు :

1. యాంత్రిక జీవనం వలన ఏమి కోల్పోతున్నాము ?
జవాబు.
యాం|తిక జీవన విధానం వల్ల కుటుంబంలోని అందాలు, ఆనందాలు కోల్పోతున్నాము.

2. యాంత్రిక జీవనం వలన కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి ?
జవాబు.
యాంత్రిక జీవనం వలన కుటుంబ సభ్యులు సుఖాల్నీ, సంతోషాల్ని, కష్టాల్నీ, బాధల్నీ పరస్పరం పంచుకోలేకపోతున్నారు.

3. పిల్లలపై ఎవరెవరి ప్రభావం ఉంటుంది ?
జవాబు.
పిల్లలపై తల్లిదండ్రుల (ప్రభావంతో పాటు, సమాజం, సమవయస్కులు, ప్రసార సాధనాల ప్రభావం ఉంటుంది.

4. ఎటువంటి పిల్లలు సమాజంలో నిలదొక్కుకోగల్గుతున్నారు ?
జవాబు.
మంచి కుటుంబ నేసథ్యం నుంచి వచ్చిన పిల్లలు సమాజంలో నిలదొక్కుకుంటున్నారు.

5. పై పేరాలో ఉపయోగించిన ‘జాతీయము’ను గుర్తించుము.
జవాబు.
‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నది పై పేరాలోని జాతీయం.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson చిందు ఎల్లమ్మ

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download ఉపవాచకం 3rd Lesson చిందు ఎల్లమ్మ Textbook Questions and Answers.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson చిందు ఎల్లమ్మ

కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

1. ఎల్లమ్మ విద్యాభ్యాసం గురించి తెల్పండి.
జవాబు.
ఎల్లమ్మ చిన్నతనంలో ఎక్క అయ్యగారు చదువు చెప్పేవారు. కాని ఆమె దగ్గర చదువుకోడానికి పలకలుగాని ఆయనకివ్వడానికి పైసలుగాని లేవు. పగిలిన కుండ పెంకులు పెద్దవి ఏరుకొచ్చుకొని వాటిమీద బొగ్గుతో రాసుకొనేవాళ్ళు. అయ్యవారి దగ్గరున్న పెద్దబాలశిక్ష ఒక్కటే పుస్తకం. అదే చదివేవాళ్ళు. అలా ఎల్లమ్మ చదువుకోడానికి ఎంతో కష్టపడ్డది.

2. ఎల్లమ్మకు చిందుభాగోతంలో ప్రవేశం ఎలా జరిగింది ?
జవాబు.
ఎల్లమ్మ చిన్నతనంలో రెండు మూడు కథలే ఆడేవాళ్ళట. చిన్నప్పటి నుండే భాగోతం నేర్పుతుండే వాళ్ళు. ఆమెకు నాలుగేళ్ళ వయసులో మొహానికి రంగువేసి వేషం కట్టమన్నారు. బాలకృష్ణుని వేషంతో ఆమె రంగ ప్రవేశం చేసింది. తెర వెనుక పాడుతుంటే తెర ముందు ఎగిరిందట. అలా అలవాటై ఎనిమిదేళ్ళప్పుడు బాలకృష్ణుడు, రంభవేషాలు వేసింది. తరువాత రకరకాల ఆడ, మగ పాత్రలు వేసింది.

TS 8th Class Telugu ఉపవాచకం 3rd Lesson చిందు ఎల్లమ్మ

3. చిందు భాగోతం గురించి రాయండి.
జవాబు.
చిందు భాగోతం అన్నా యక్షగానమన్నా రెండూ ఒకటే. ఏమీ తేడా లేదు. చిందోళ్ళ ఆట అంటే అగ్ర కులస్థులు రారని చిందు యక్షగానం అని పిలిచేవారు. ఉదయం పదిగంటలకు ఆట మొదలు పెడితే సాయంత్రం దీపాలు పెట్టేదాకా ఆడేవాళ్ళు. యక్షగానం పుస్తకాల్లో చూసి కావలసినవి తీసుకొని నేర్చుకుంటారు. చిరుతల భాగోతులు, దాసరులు, చిందు భాగోతులు తీసుకొనే కథలు ఒకటే అయిన వాటి దరువులను బట్టి వేరుగా ఉంటాయి.

4. చిందు భాగోతంలో ఏఏ కథలు ఆడేవారు ? ఎల్లమ్మ పోషించిన పాత్రలేవి ?
జవాబు.
చిందు భాగోతంలో సారంగధర, చెంచులక్ష్మి, సతీసావిత్రి, ప్రహ్లాద, మైరావణ, మాంధాత చరిత్ర, రామాంజనేయ, సతీ అనసూయ, సతీ తులసి, బబృవాహన, బాలనాగమ్మ, హరిశ్చంద్ర, అల్లీరాణి, గంగా కళ్యాణం, రామదాసు చరిత్ర, సుగ్రీవ విజయం మొదలైన ఇరవైఐదు కథలు ఆడేవాళ్ళు. ఆ కథలన్నింటిలోనూ ఎల్లమ్మ ప్రధాన పాత్రలు పోషించేది. ఆడపాత్రలే కాదు. మగపాత్రలు గూడా ధరించేది.

5. చిందు భాగవతులు జీవనం ఎలా గడిపేవారు ?
జవాబు.
పాత రోజుల్లో భాగోత మాడితే ఏమంత ఆదాయం వచ్చేది కాదు. చాలా కష్టపడి బతుకీడ్చేవాళ్ళు. దసరాకు పెట్టెపూజ చేస్తారు. దీపావళి వెళ్ళాక ఊరూరూ తిరగటం మొదలు పెడతారు. సంక్రాంతి, శివరాత్రి దాక భాగోతాలు ఆడుతూనే ఉంటారు. మళ్ళీ వానాకాలం అప్పుడు ఇంటికొస్తారు. కొంతకాలం తెచ్చుకున్నదేదో తింటారు. లేకుంటే అప్పుతెచ్చుకుంటారు. కొంతమంది కూలికి పోతారు.

TS 8th Class Telugu ఉపవాచకం 3rd Lesson చిందు ఎల్లమ్మ

6. చిందు భాగోతానికి గుర్తింపు ఎలా వచ్చింది ?
జవాబు.
ప్రజలు చిందు భాగోతాన్ని ఆదరించి పోషించారు. కాని ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టించుకోలేదు. ఒకసారి నటరాజ రామకృష్ణ ఎల్లమ్మను పిలిచి చిందు పాడమన్నాడు. ఆయనకోసమని చెంచులక్ష్మి భాగోతం ఆడారు. ఆయన తన శాలువా తీసి ఎల్లమ్మకు కప్పాడు. చిందును గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయాడు. ఎల్లమ్మ బృందాన్ని పరిచయం చేశాడు. అలా చిందు భాగోతానికి గుర్తింపు లభించింది.

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

1. ఎల్లమ్మ చిన్నతనంలో చిందు భాగోతాల ప్రదర్శనల ఏర్పాట్లు ఎలా జరిగేవి ?
జవాబు.
భాగోతంలో ముందుగా అంబకీర్తన పాడి ఆట మొదలు పెడతారు. ముందు రంభ వేషం, వెనుక నుంచి గోపాల కృష్ణుని వేషం వస్తాయి.
“రంభా ఊర్వశులమమ్మా, మాయమ్మ” అని పాడుకుంటూ పిల్లలందర్నీ పరదా ముందు ఆడిస్తారు. అదే అంబ కీర్తన. అంటే ప్రార్థన అన్నమాట. ఇక ఆట మొదలౌతుంది. తెరవెనుక వేషాలు తయారయ్యేదాకా పిల్లలు చిన్నికృష్ణుడి పాట చిందేస్తూ ఉంటారు. పిల్లలకు ఆటనేర్పినట్టూ ఉంటుంది. ప్రజలను కూర్చోబెట్టిట్టూ ఉంటుంది. వేషాల తయారీ పూర్తవుతుంది. ఎక్కడ ఏ కొత్తపాట విన్నా పాడేస్తూ ఉండేది ఎల్లమ్మ. అసలు భాగోతం మొదలు పెట్టగానే ముందు గణపతి ప్రార్థన, తర్వాత సరస్వతీ ప్రార్థన చేసి ఆట మొదలు పెడతారు. ఇలా చుట్టు పక్కల ఊళ్ళల్లో గూడ ప్రదర్శనలిచ్చేవారు.

TS 8th Class Telugu ఉపవాచకం 3rd Lesson చిందు ఎల్లమ్మ

2. ఎల్లమ్మబృందం వారి చిందు భాగోతం ప్రత్యేకతలు తెల్పండి.
జవాబు.
ఎల్లమ్మ చిన్నప్పుడు మద్దెల తాళాలు గజ్జెలు మాత్రమే వాయిద్యాలుగా ఉండేవి. పూపూ అని ఊదే బుర్ర ఒకటుండేది. దాన్ని పుంగి అంటారు. ఈ పుంగిని ఆట మొదలైనప్పటి నుంచి చివరి వరకూ ఊదాలి. దీని కోసం ప్రత్యేకంగా ఎవరూ ఉండరు. తెరముందు ఎవరివేషం ఐపోతే వారు వెనక్కొచ్చి ఊదుతుండేవారు. అందరికీ చేతనౌను. ఎండిన సొరకాయను తయారుచేసుకొని ఊదుకొనేవారు.

తరువాత తబల, హార్మోనియం, తాళం, గజ్జెలు ఉపయోగించేవారు. అవీ బృందంలో వాళ్ళే వాయిస్తారు. ప్రతివారికి వాయించటం వచ్చు. మరొక ప్రత్యేకత ఏమంటే వాళ్ళ భాగోతానికి తెరవెనుక పల్లవి ఉంటుంది. ‘తైతకథోం తకథోం’ అని ఆ పల్లవి పాడేవాళ్ళు అన్న తరువాతే తెరముందు పాత్ర చిందు మొదలు పెడుతుంది. బుడ్డర్ ఖాన్ వేషం హాస్యపాత్ర. అందరినీ కడుపుబ్బ నవ్విస్తుంది. భాగోతానికి అదే నిండుదనం ఇస్తుంది. ఎప్పుడైనా ఏ పాత్రైనా రాకపోతే బృందంలో వాళ్ళే సర్దుకుంటారు. ఇవి ఎల్లమ్మ బృందం చిందు విశేషాలు

పరిచిత గద్యభాగాలు

1. కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

మాఊర్ల అందరికి సిన్నప్పటి నుండి భాగోతం నేర్పుతుండె. పెద్దోళ్లు నాకు నాలుగేండ్లు ఉండంగ నా ముఖంకు రంగు ఏసిండ్రు. బాలకృష్ణుని ఏషం గట్టిచ్చినరు. మావోల్లు పర్ద ఎనుక పాట పాడితే నేను పర్దముంగట ఎగిరిన. ఇగ అప్పటి నుండి మాతల్లి దండ్రులు యేషం ఏయించి నాచేయి పట్టుకపోయి తోలేసి ఎగురుమని అంటుండె. అట్ల నాకు భాగోతం ఆడుడు అలవాటు చేసినరు. నేను ఎనిమిదేండ్లప్పుడు బాలకృష్ణుని యేషం, తర్వాత రంభ యేషం కడుతుంటిని.

ప్రశ్నలు :

1. ఎల్లమ్మ ఎంత వయసులో మొదటిసారి భాగోతం ఆడింది ?
జవాబు.
నాలుగేళ్ళ వయసులో

2. ఆ ఊళ్ళో భాగోతం ఎప్పటి నుండి నేర్పేవారు ?
జవాబు.
చిన్న పిల్లలప్పటి నుండి

3. తల్లిదండ్రులు ఎల్లమ్మను ఏం చెయ్యమన్నారు ?
జవాబు.
చెయ్యి పట్టుకుని ప్రదర్శనలకు తీసుకెళ్ళి చిందు వెయమన్నారు.

TS 8th Class Telugu ఉపవాచకం 3rd Lesson చిందు ఎల్లమ్మ

4. ఎల్లమ్మ ఏఏ వేషాలు వేసింది ?
జవాబు.
బాలకృష్ణుడు, రంభ

5. ‘పర్ద’ అంటే ఏమిటి ?
జవాబు.
తెర

2. కింది పేరాను చదివి వాక్యాలలోని ఖాళీలు పూర్తిచేయండి.

మాకు అందరి కళారూపాలు నచ్చుతయి. హైదరాబాదుల కథల మల్లవ్వ ఉంటది. ఆమె కథలు మంచిగ చెపుతది… నాకు మనసౌతది. అది శారదకాల్లది.
ప్రజలు మమ్ముల ఎప్పటినుంచో బతికించుకుంటున్నరు గనీ, సర్కారుమాత్రం మమ్ములను నటరాజ రామకృష్ణవల్ల పట్టించుకున్నది. ఒకసారాయన చిందు పాడమని అన్నడు. ఆయనకోసమని చెంచులక్ష్మి భాగోతం ఆడినం. తన షాలువాతీసి నాకు కప్పిండు. సింధును సర్కారుకు గుర్తుజేసిండు ఆయన. మాకు సర్కారును సూపిచ్చిండు. ఈ సుట్టుపక్కల ఇసుంటి కళాకారులు లేరు. ‘చిందుల ఎల్లవ్వది సాగుతది ఇట్ల’ అంటారు. ఇతర కళాకారులు….దాసుడు (దాచిపెట్టడం) ఏంటికి ఉన్నది చెప్పాల….! ఇగ ఇట్లనే చెప్పుకుంట పోతం…. బతుకంతా…

1. హైదరాబాదుల కథల …………… ఉంటది.
2. సర్కారు మాత్రం మమ్ములను ………………. వల్ల పట్టించుకున్నది
3. ఆయన కోసమని …………… భాగోతం ఆడిన.
4. ఈ సుట్టుపక్కల ఇసుంటి …………… లేరు.
5. ఒకసారాయన …………… పాడమని అన్నడు.
జవాబు.
1. హైదరాబాదుల కథల మల్లవ్వ ఉంటది.
2. సర్కారు మాత్రం మమ్ములను నటరాజ రామకృష్ణ వల్ల పట్టించుకున్నది
3. ఆయన కోసమని చెంచులక్ష్మి భాగోతం ఆడిన.
4. ఈ సుట్టుపక్కల ఇసుంటి కళాకారులు లేరు.
5. ఒకసారాయన చిందు పాడమని అన్నడు.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson షోయబుల్లాఖాన్

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download ఉపవాచకం 2nd Lesson షోయబుల్లాఖాన్ Textbook Questions and Answers.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson షోయబుల్లాఖాన్

కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

1. కథకుడు ఎవరెవరికి వందనాలు చేశాడు ? ఎందుకు ?
జవాబు.
కథకుడు ముందుగా వీరులను కన్నతల్లి భారతమాతకు వందనాలు చేశాడు. తరువాత మహాత్మాగాంధీకి, జవహర్లాల్ నెహ్రూకు , సుభాష్ చంద్రబోసుకు, వల్లభాయ్ పటేలు ఇంకా అనేక స్వాతంత్ర్య సమర వీరులకు వందనాలు చేశాడు. ఎందుకంటే వారంతా భారతదేశపు బానిసత్వాన్ని తొలగించడానికి అనేక కష్టనష్టాల కోర్చినవారు. జైళ్ళకు వెళ్ళి, ప్రాణాలు బలి ఇచ్చి స్వాతంత్ర్యాన్ని సాధించి పెట్టిన సత్పురుషులు. మహామహులు. జనవందితులు. పూజనీయులు.

2. కథకుడు ఎవరి కథను చెప్తానన్నాడు ?
జవాబు.
కథకుడు రామరావణయుద్ధమో, కౌరవ పాండవుల కథో, పూర్వరాజుల చరిత్రో చెప్పలేదు. మహాత్మాగాంధీకి ఎంతో ప్రియమైన భక్తుడు, దేశసేవకే అంకితమైనవాడు, పక్షపాత రహితుడు అయిన షోయబుల్లాఖాన్ కథను చెప్తానన్నాడు. దుర్మార్గులు రాక్షసులు ఐన రజాకార్లను, నిజాం రాజును వ్యతిరేకించినందుకు వారి దుర్మార్గానికి బలియై వారి చేత హత్య చేయబడిన షోయబుల్లాఖాన్ కథ చెప్తానన్నాడు.

TS 8th Class Telugu ఉపవాచకం 2nd Lesson షోయబుల్లాఖాన్

3. షోయబుల్లాఖాన్ బాల్యవిశేషాలు తెల్పండి.
జవాబు.
షోయబుల్లాఖాన్ హైదరాబాదులో మానుకోట తాలూకాలో శుభ్రవాడు అనే గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి హబీబుల్లాఖాన్. తల్లిదండ్రులకు ఏడుగురు సంతానం పుట్టిచనిపోగా ఎనిమిదవ సంతానం షోయబుల్లాఖాన్. చిన్నప్పటి నుంచే ఎంతో తెలివితేటలు కలవాడు. దేశసేవే దేవునిసేవ అని నమ్మాడు. ప్రజలందరూ సహెూదరులని భావించాడు. అంత చిన్నతనంలోనే అంత గొప్ప భావాలు కలిగి ఉండటం ఆశ్చర్యకరం. అలా శుక్లపక్ష చంద్రునిలా వెలిగిపోతూ పెరిగి పెద్దవాడైనాడు. ఔజా అనే ఆమెను పెళ్ళిచేసుకున్నాడు.

4. హబీబుల్లా ఖానుకు గాంధీజీపై భక్తి భావం ఎలా కలిగింది ?
జవాబు.
ఒకసారి గాంధీజీ విజయవాడకు వెళుతున్నారు. దారిలో ఉన్న మానుకోట స్టేషన్లో హబీబుల్లాఖాన్ పోలీసు ఇన్స్పెక్టర్గా ఉన్నాడు. బాపూజీని రెప్పవెయ్యకుండా చూశాడు. వెంటనే అత్యంత భక్తితో ఆయనకు నమస్కరించాడు. ఆయన దివ్యమంగళ విగ్రహం అతని కళ్ళల్లో నిండిపోయింది. అదే సమయంలో ఇంటిదగ్గర షోయబుల్లాఖాన్ పుట్టాడు. కుమారుడిలో తండ్రికి గాంధీజీ పోలికలే కనిపించాయి. ఎంతో సంతోషపడ్డాడు. అలా హబీబుల్లాఖాన్క గాంధీజీపై భక్తి భావం కలిగింది.

5. నిజాం రజాకార్లను షోయబుల్లాఖాన్ పైకి ఎందుకు, ఎలా ఉసి గొల్పాడు ?
జవాబు.
షోయబుల్లాఖాన్ తను పెట్టిన ఇమ్రోజ్ పత్రికలో జాతీయభావాలు, దేశభక్తి ప్రబోధించాడు. నిజాం చర్యలను ఖండించాడు. అందుకు కోపంతో నిజాం హిందూ-ముస్లిం తేడా లేకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన వారి ప్రాణాలు తీయమని, చేతులు నరకమని రజాకార్లను ఉసిగొల్పాడు. వారు ముందుగా షోయబ్ను హెచ్చరించారు. కాని ప్రయోజనం లేదు. షోయబు బెదరలేదు. చంపుతామని బెదిరించారు. ఐనా అతడు లొంగలేదు. అలా చివరికి వాళ్ళచేతిలో హతమైపోయాడు.

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

1. షోయబుల్లాఖాన్ను రజాకార్లు అంతం చేసిన విధం తెల్పండి. (లేదా)
జవాబు.
షోయబుల్లాఖాన్ పట్ల నిజాం ప్రభుత్వం వ్యవహరించిన తీరు తెల్పండి.
హైదరాబాదు ప్రభుత్వం మత ప్రేరణచేస్తూ రజాకార్లు అనే దుర్మార్గులను పోషించేది. వాళ్ళు రాష్ట్రమంతా అరాచకాలు సృష్టిస్తున్నారు. షోయబుల్లాఖాన్ తాజ్వీ అనే ఉర్దూ పత్రిక ద్వారా వారి అన్యాయాలను ఖండించాడు. ప్రభుత్వం ఆ పత్రికను నిలిపివేసింది. షోయబు ‘ఇమ్రోజ్’ అనే దినపత్రికను ప్రారంభించి ప్రజలలో జాతీయ భావాలను నింపుతూ ప్రభుత్వాన్ని విమర్శించాడు.

ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు కలిగించినా షోయబు భయపడలేదు. ఖాసింరజ్వీ తన సైన్యాన్ని పిలిచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసినవారు హిందువైనా ముస్లిమైనా సరే వారి ప్రాణాలు తియ్యమని ఆదేశించాడు. రజాకార్లు హెచ్చరిక ఉత్తరాలెన్నో రాశారు. షోయబు భయపడలేదు. “నీవు గాంధీ కొడుకువా ? డొక్క చీల్చేస్తాం” అంటూ ఆకాశరామన్న ఉత్తరం వచ్చింది.

షోయబు పట్టించుకోలేదు. ఒకనాడు రాత్రి “నేటి భావాలు” అనే వ్యాసం రాసి, ఆ చీకట్లో దగ్గరలోనే ఉన్న తన ఇంటికి వెళుతున్నాడు షోయబు. రజాకార్లు వేట కుక్కల్లాగా వెంట తరిమి అతని చేతులు నరికేశారు. తుపాకులతో కాల్చి చంపేశారు. అలా ఆ స్వాతంత్ర్య వీరుణ్ణి అంతం చేశారు.

TS 8th Class Telugu ఉపవాచకం 2nd Lesson షోయబుల్లాఖాన్

2. రజాకార్ల చేతికి చిక్కిన షోయబుల్లాఖాన్ చనిపోయేముందు జరిగిన విషయాలు వివరించండి.
జవాబు.
చీకట్లో ఇంటికి వెళ్తున్న షోయబుల్లాఖాన్ ను రజాకార్లు తుపాకీ గుండ్లతో పేల్చారు. ఇమ్రోజ్ పత్రికను తీర్చిదిద్దిన చేతిని నరికేశారు. షోయబు బావమరిది వెనక నుండి కేకలు వేస్తూ వచ్చాడు. ఆయనకు కూడా గుండు దెబ్బతగిలింది. ఆయన రెండు చేతులు మణికట్టుదాకా నరికారు. బాధతో అరిచేసరికి జనమంతా పోగయ్యారు. రజాకార్లు పారిపోయారు. షోయబు భార్య, తల్లిదండ్రులు అతని మీదబడి కన్నీరు మున్నీరుగా ఏడ్చారు.

స్నేహితులంతా అక్కడికి చేరుకున్నారు. షోయబు శరీరం నుంచి రక్తంధారలు కారిపోతున్నాయి. స్పృహతప్పక ముందే తన వారిని కళ్ళారా చూసుకున్నాడు. నువ్వెందుకు అరవలేదని భార్య అడిగింది. అరిస్తే పిరికితనమౌతుంది. వీరుడిగా చనిపోతే స్వర్గం లభిస్తుంది. ఇదే అహింసా సిద్ధాంతం అన్నాడు షోయబు.

తల్లిని చూసి ‘అమ్మా! వీరుడిగా మరణిస్తున్నాను. నీవు వీరమాతవు. నా భార్య వీరపత్ని. నిండుచూలాలైన నా భార్య వీరమాత కావాలి. మీరు నా కోసం ఏడవకండి. నా ధైర్యం కోల్పోతున్నాను. నా వీర మరణానికి గర్వపడతానని నువ్వు మాట ఇచ్చావు కదమ్మా! ఏడవొద్దు” అని పలుకుతూ ప్రాణాలు వదిలాడు. షోయబుల్లాఖాన్ అమరజీవి అయ్యాడు.

3. నిజాం రాజులు మరియు పెట్టుబడిదారుల నుండి ప్రజలకు విముక్తి కలిగించి చైతన్యవంతులను చేయుటకు నాయకులు చేసిన కృషి ఎట్టిది ?
జవాబు.

  1. నాయకులు ఎన్నో కష్టనష్టాల కోర్చారు.
  2. పక్షపాత రహితులై దేశసేవ చేశారు.
  3. దుర్మార్గంగా, రాక్షసంగా ఉన్నవారిని ఎదిరించారు.
  4. తెలివితేటలతో వ్యవహరించి అందరిలో ఐక్యత తెచ్చారు.
  5. దేశసేవే దేవుని సేవగా భావించారు.
  6. వీరుల పట్ల, దేశభక్తుల పట్ల పూజ్యభావం కలిగి ఉన్నారు.
  7. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. పత్రికలు కూడా నడిపారు.
  8. చంపుతామని బెదిరించినా భయపడకుండా ఉద్యమం కొనసాగించారు.
  9. అహింసా సిద్ధాంతాన్ని నమ్మారు.
  10. వీరమరణానికే సిద్ధపడ్డారు కానీ విప్లవంలో వెనుకంజవెయ్యలేదు. వెనుదిరిగి పోలేదు.

నిజాం రాజుల నిరంకుశత్వం, పెట్టుబడిదారులు దోపిడీలను చూసి ప్రజలకు విముక్తిని కలిగించి చైతన్యవంతులను చేయటానికి నాయకులు ఎంతగానో కృషి చేశారు.

TS 8th Class Telugu ఉపవాచకం 2nd Lesson షోయబుల్లాఖాన్

4. షోయబుల్లాఖాన్ జీవిత విశేషాలను పొందుపరచండి.
జవాబు.
షోయబుల్లాఖాన్ హబీబుల్లాఖాన్ దంపతులకు ఎనిమిదవ సంతానంగా హైదరాబాదు మానుకోట తాలూకాలో శుభ్రవాడు అనే గ్రామంలో జన్మించాడు. చిన్నతనం నుంచే గాంధీజీ సిద్ధాంతాలు అతనిని ఆకట్టుకున్నాయి. ఆయనకు పరమభక్తుడైనాడు. దేశసేవే దేవునిసేవ అనీ, మానవులంతా సోదరులనీ నమ్మినవాడు. అతని భార్య ఔజా. ఏ ప్రలోభాలకూ లొంగకుండా ప్రజాక్షేమం కోరుతూ సత్యం, అహింసలను ప్రచారం చేశాడు.

హైదరాబాదు ప్రభుత్వం రజాకార్లు అనే దుష్టశక్తులను పోషిస్తూ మతప్రేరణ చేస్తుంటే రజాకార్లు ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నారు. తాజ్వీ అనే ఉర్దూ పత్రిక ద్వారా షోయబు ఆ అకృత్యాలను ఖండించాడు. ఆ పత్రిక నిలిపి వేస్తే తానే ఇమ్రోజు అనే పత్రిక స్థాపించి నిర్భయంగా నిష్పక్షపాతంగా నిజాలు ప్రకటించ సాగాడు. ప్రభుత్వం ఈర్ష్యతో ఎన్నో ఆటంకాలు కలిగించింది. అయినా షోయబు తన ప్రయత్నం విరమించలేదు.

అకస్మాత్తుగా జరిగిన గాంధీజీ అకాల మరణానికి క్రుంగిపోయాడు. పదినెలల నుండి షోయబు రాసిన సంపాదకీయాలు ప్రభుత్వాన్ని, సంఘ వ్యతిరేక శక్తులను గడగడ లాడించాయి. ప్రభుత్వం రజాకార్లను అతనిపైకి ఉసిగొల్పింది. వారు కొన్ని హెచ్చరికలు చేసి చివరకు ఒక రాత్రి అతను పని పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వస్తుండగా తుపాకులు పేల్చి చేయి నరికేశారు. అడ్డువచ్చిన బావమరిదిని కూడా అంతం చేశారు. అలా తాను నమ్మిన సిద్ధాంతాలను విడిచిపెట్టకుండా ప్రభుత్వంతో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందాడు. అమరజీవి అయ్యాడు షోయబుల్లాఖాన్.

పరిచిత గద్యభాగాలు

1. కింది అంశమును చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

షోయబుల్లాఖానుకు అదివరకే ఈ నిశాచరులు తన ప్రవర్తనను మార్చుకొమ్మని జాబులు రాశారు. అట్లు మార్చుకొనకుండినచో ప్రాణములు దక్కవని యెన్నో తీర్ల బెదరించినారు. అయినప్పటికిని సత్యమునకు పాటుపడ్డ మన షోయబు యా బెదిరింపులకు జంకలేదు. తనను ఇంచుకైనను మార్చుకోలేదు. ఇట్లుండ 20-08-1948 నాడు ఒక పేరు వూరులేని ఉత్తరం ఒకటి వచ్చింది. అందులో “నీవు గాంధీ కొడుకువా” జాగ్రత్త డొక్క చీల్చి వేస్తాం. ఇదివరకీలాటివెన్నో ఉత్తరాలు రాలేదా! అనుకొన్నాడు. తన పత్రికాలయములో కాంగ్రెసు నాయకులు రామకృష్ణారావు. రంగారెడ్డి మొదలగు షోయబు మిత్రులు యా బెదరింపు ఉత్తరములను గూర్చి చర్చించారు. శ్రీయుత రామకృష్ణారావుగారు షోయబు నామాట నీవు తప్పుగా భావించవద్దు, ఎందుకంటే రాక్షస రజాకార్లు నీ మీద కక్ష పెంచుకున్నారు. ఎప్పుడైనా ఏమైనా జరుగవచ్చు. నీవు జాగ్రత్తగా ఉండుము అని చెప్పినప్పటికిన్ని షోయబ్ తన విశ్వాసమును విడవలేదు.

ప్రశ్నలు :

1. నిశాచరులు షోయబును ఏమని బెదిరించారు ?
జవాబు.
నిశాచరులు షోయబును అతని ప్రవర్తన మార్చుకోమని, లేకపోతే ప్రాణాలు తీస్తామని బెదిరించారు.

2. ఉత్తరంలో ఏమని రాసుంది ?
జవాబు.
ఉత్తరంలో “నీవు గాంధీ కొడుకువా ? జాగ్తత్త డొక్క చీల్చేస్తాం” అని రాసుంది.

3. ఆ నిశాచరులు ఎవరు ?
జవాబు.
ఆ సిశాచరులు రజాకార్లు.

4. ఈ పేరాలో చెప్పిన షోయబు మిత్రులెవరు ?
జవాబు.
కాంగగగసు నాయకులు రామకృష్ణారావు, రంగారెడ్డి మొదలైనవారు.

TS 8th Class Telugu ఉపవాచకం 2nd Lesson షోయబుల్లాఖాన్

5. మిత్రులు షోయబుకు ఏమని నచ్చచెప్పారు ?
జవాబు.
మిత్రులు షోయబును జాగగత్తగా ఉండమని, ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చని హెచ్చరించారు.

2. ఈ కింది వాక్యాలను కథా క్రమంలో అమర్చండి.

షోయబు కుడిచేతిని దుండగులు నరికివేశారు.
షోయబుల్లాఖాన్ ను తుపాకులతో ఢాంఢాంఢాం అని కాల్చినారు. రెండు చేతులు మణికట్టు వరకు తీశారు.
ఆయనకు కూడా గుండు దెబ్బతగిలింది.
షోయబు బావమరిది వెనుకాల నుండి వస్తూ అరిచాడు.
జవాబు.

  1. షోయబుల్లాఖాన్ను తుపాకులతో ఢాం ఢాం ఢాం అని కాల్చినారు.
  2. షోయబు కుడి చేతిని దుండగులు నరికివేశారు.
  3. షోయబు బావమరిది వెనుకాల నుండి వస్తూ అరిచాడు.
  4. ఆయనకు కూడా గుండు దెబ్బ తగిలింది.
  5. రెండు చేతులు మణికట్లు వరకు తీశారు.

3. కింది పేరాను చదివి ఐదు ప్రశ్నలు రాయండి.

ఇట్లుండగా మహాత్ముడి అకాలమరణవార్త అకస్మాత్తుగా షోయబు విన్నాడు. నిర్ఘాంతపడ్డాడు. ఇంట తనగదిలో వెక్కివెక్కి యేడుస్తున్నాడు. బలమైన అతని శరీరం దుఃఖావేశంతో వణికి పోవుచున్నది. నోరు పెకలటం లేదాతనికి. ఇంతలో తన తల్లి వచ్చి నాయన ఏడవకుము. ఆయన మహాత్ముడు అతనికి అంతా సమానమే. చావుబ్రతుకుల్లో ఆయనకు భేదం లేదు. హిందూ, ముస్లింలలో సోదర భావాన్ని పెంపొందించుటకై ఆయన మహోత్కృష్టమైన సేవ జేశాడు. నీవు దుఃఖించుట మానుము. నాయనా ? ఏది ఒకసారి నవ్వుము. అని దీనంగా బ్రతిమాలుతున్న తన తల్లిని జూసి షోయబుల్లాఖానుడు అమ్మా! రేపు నీకొడుకు స్వాతంత్య్రము కొరకు బలైతే నీవు దుఃఖించవా యని యడిగినాడు.
జవాబు.
1. షోయబు ఏ వార్త విన్నాడు ?
2. గాంధీజీ ఎవరిలో సోదరభావం పెంచాడు ?
3. మహాత్ముడు వేదిని సమానంగా చూస్తాడు ?
4. ఔోయబు తల్లిని ఏమడిగాడు ?
5. ఈ పేరాలో ఉన్న పాత్రలేవి ?

TS 8th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson Telangana చిత్రగ్రీవం

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download ఉపవాచకం 1st Lesson చిత్రగ్రీవం Textbook Questions and Answers.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson చిత్రగ్రీవం

కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

1. చిత్రగ్రీవాన్ని గురించి మీకు ఆశ్చర్యం కలిగించిన విషయాలు ఏవి ?
జవాబు.
నాకు ఆశ్చర్యం కలిగించిన విషయాలు : గుడ్డు బద్దలుగొట్టి తల్లిపక్షి పిల్లపక్షిని ఈ ప్రపంచంలోకి తీసుకురావడం, పిల్లపక్షి నోటికి తల్లిపక్షి ధాన్యపు గింజల పాలను, తన కంఠంలో మెత్తబరచిన ఆహారాన్ని అందించి పెంచడం నాకు ఆశ్చర్యం కలిగించింది, మనుషుల్లాగానే మెత్తని గూడు అమర్చడం, తల్లిపక్షి పిల్లలకు పిల్లపక్షి ఏపుగా ఎదిగాక పసువు కలిసిన తెలుపు రంగులోకి మారడం, దుమ్ము ధూళి నుంచి ఎండ తీక్షణత నుంచి కళ్ళను కాపాడడానికి పక్షులకు ఉండే తెల్లని పొరలు నాకు ఆశ్చర్యం కలిగించిన అంశాలు.

2. మానవులను పావురాలకు మిత్రులూ, సహచరులని రచయిత ఎందుకు అన్నాడు ?
జవాబు.
కలిసి మెలిసి ఎగురుతూ ఆకాశంలో గుంపులు గుంపులుగా తిరిగే పెంపుడు పావురాలు అన్నీ గంటల తరబడి ఎంత దూరం ఎగిరినా చివరికి తమ తమ ఇళ్ళకూ, గూళ్ళకూ ఖచ్చితంగా చేరుకొంటాయి. పావురాలకు ఉన్న అద్భుతమైన దిశాపరిజ్ఞానం వల్ల తమ యజమానుల పట్ల వాటికి ఉన్న మిక్కిలి విశ్వాసం వల్లా అవి తమ గూళ్ళకు చేరుకోగలుగుతాయి. అందువల్లనే మానవులను పావురాలకు మిత్రులూ, సహచరులూ అని రచయిత అన్నాడు.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson Telangana చిత్రగ్రీవం

3. చిత్రగ్రీవం తండ్రిపక్షి గురించి రాయండి.
జవాబు.
జాతి పావురం : చిత్రగ్రీవం తండ్రిపక్షి ఒక గిరికీల మొనగాడు. అంటే ప్రసిద్ధ జాతి పావురం. తండ్రిపక్షి నుండి వేగం, చురుకుదనం, సాహసం పిల్లపక్షి సంతరించుకున్నది.

గుడ్డుల రక్షణ : రచయిత గుడ్లున్న గూడును శుభ్రం చేస్తున్నప్పుడు వాటిని నాశనం చేస్తున్నాడేమో అనే భయంతో పొరబాటున అతని మీద దాడి చేసింది. ఒక గుడ్డు చెయ్యి జారి నేలపాలు కావడానికి కారణమైంది. పొదగడం : గుడ్లను పొదగడంలో మూడింట రెండు వంతులు పాత్ర తల్లి పక్షిదైతే మూడవ వంతు పాత్ర తండ్రి పక్షిదే. పెంపకం : ఆహారపు గింజల్ని సంపాదించి వాటిని కంఠంలో మెత్తబరిచి బిడ్డలకు అందించి పోషించడంలో తల్లి తండ్రి పక్షులు రెండూ పాలుపంచుకుంటాయి. పిల్లలకు సౌఖ్యం కోసం గూడును మెత్తగా అమరుస్తాయి.

బిడ్డకు శిక్షణ : రెక్కలు వచ్చిన పిల్ల పావురానికి తండ్రి పక్షే ఎగరడం నేర్పించింది. బలవంతంగా మేడమీద నుంచి కిందికి జారేటట్టు చేసిన పిల్లపక్షి రెక్కలకు పని చెప్పింది.

4. చిత్రగ్రీవం తల్లిపక్షి గురించి రాయండి.
జవాబు.
తల్లిపక్షి చాలా అందమైనది. అది వార్తల పావురం. అది గూటిలో గుడ్లు పెట్టి పొదుగుతుంది. మూడింట రెండు వంతులు పొదగడం తల్లి పనే. అప్పుడప్పుడు తండ్రి పక్షి పొదుగుతుంది. సమయమైన తరువాత గుడ్డు పగులగొట్టి పిల్లను జాగ్రత్తగా బయటికి తీసి సంరక్షిస్తుంది. ఆహారం తినడం, ఎగరడం నేర్పుతుంది. పిల్లకు రెక్కలొచ్చే వరకూ కావలసినంత వెచ్చదనాన్ని ఇస్తుంది. గూటిని సౌకర్యవంతంగా ఉంచుతుంది.

5. పావురం గుడ్డు విషయంలో కథకుడు చేసిన తప్పిదం తెలపండి.
జవాబు.
ఒకనాడు కథకుడు తల్లిపావురం గుడ్లను పొదుగుతున్న గూటిని శుభ్రం చేద్దామని వెళ్ళాడు. చాలా జాగ్రత్తగా పావురం
గుడ్లను పక్కగూటిలో పెట్టి దాని గూడు శుభ్రంచేసి మళ్ళీ యథాస్థానంలో పెడుతున్నాడు. ఒక గుడ్డు పెట్టి రెండవ గుడ్డు పెట్టబోతుండగా తండ్రిపావురం అతనిపై దాడి చేసింది. దాని దాడిని తట్టుకోడానికి ప్రయత్నిస్తూ గాయపడ్డాడు. ఈ కంగారులో ఆ రెండో గుడ్డు చెయ్యి జారి కిందపడి పగిలిపోయింది. ఇదే అతను చేసిన తప్పిదం. తల్లిపావురం పెట్టిన గుడ్లలో ఒకదాన్ని జారవిడిచి పగలగొట్టినందుకు సిగ్గుపడుతూ, బాధపడుతూ ఉంటాడు.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson Telangana చిత్రగ్రీవం

6. గుడ్డు నుంచి చిత్రగ్రీవం బయటికి వచ్చిన విధం తెలపండి.
జవాబు.
ఇరవై రోజులు గుడ్డును పొదిగిన తరువాత ఇరవైఒకటవరోజు తల్లి దాని ప్రక్కనే జాగ్రత్తగా గమనించుకుంటూ తిరుగుతోంది. తండ్రిపక్షి గూటిలోకి రాబోతే దూరంగా తరిమేసింది. సుమారు రెండు గంటల తరువాత గుడ్డులోనించి పిల్ల కదులుతున్న శబ్దాలు కాబోలు విన్నది తల్లి. చాలా జాగ్రత్తగా గుడ్డును పరిశీలించి చూసి రెండేసార్లు ముక్కుతో కొట్టి గుడ్డును పగలగొట్టింది. పిల్లపక్షి బయటపడింది. తల్లిపక్షి పిల్లను రెక్కల కింద పొదువుకున్నది.

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.

1. చిత్రగ్రీవాన్ని గురించి మీ సొంత మాటల్లో వర్ణించండి.
జవాబు.
పరిచయం : ‘చిత్రగ్రీవం’ ధనగోపాల్ ముఖర్జీ రచించిన ఒక కథ. చిత్రగ్రీవం ఒక పెంపుడు పావురం. తల్లిదండ్రులు : చిత్రగ్రీవం తల్లి ఒక వార్తల పావురం. తండ్రి ఒక గిరికీల మొనగాడు. రెండూ విశిష్టమైనవి కావడం వల్ల చిత్రగ్రీవం ఎంతో సుందరంగా ఉండేది. అంతేగాక తల్లి నుండి తెలివితేటలు, తండ్రి నుంచి వేగం, చురుకుదనం, సాహసం సంతరించుకున్నది. అందువల్లే యుద్ధ రంగాల్లోనూ శాంతి సమయాల్లోనూ అమోఘంగా పని చేయగల వార్తాహరియైన పావురంగా రూపొందింది.

సంరక్షణ : తల్లితో సరిసమానంగా తండ్రి కూడా చిత్రగ్రీవం బాగోగులు చూడడంలోనూ, ఆహారం అందించడంలోనూ పాలుపంచుకున్నది. తల్లిదండ్రుల శ్రద్ధ పుణ్యమా అని చిత్రగ్రీవం మహా ఏపుగా పెరిగింది. గులాబీ రంగుతో మెరిసే పిల్ల పసుపు కలిసిన తెలుపు రంగులోకి మారింది.

సామర్థ్యం : మూడు వారాల వయసులో ఆహారం అనుకొని చీమను పొడిచి చంపింది. ఐదో వారానికల్లా గెంతుతూ జరగడం నేర్పింది. మరో రెండు వారాల్లో ఎగరడం నేర్చుకొన్నది. తల్లిదండ్రుల రక్షణ, శిక్షణలలో ఆకాశంలో విహరించే విద్య తెలుసుకోగలిగింది.

ముగింపు : ఈ విధంగా చిత్రగ్రీవం తల్లిదండ్రుల గొప్పది లక్షణాలను పుణికి పుచ్చుకొని వారి సంరక్షణలో పెరిగి పెద్దదై వారి శిక్షణ సాయాలతో స్వీయ సామర్థ్యాన్ని పెంపొందించుకున్నది.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson Telangana చిత్రగ్రీవం

2. శిశువుల పెంపకంలో పక్షులకు, మానవులకు మధ్య ఉన్న సామ్యాలను రాయండి.
జవాబు.
గుడ్డు పొదగడం : పక్షులు గుడ్డు దశలో ఉన్నప్పుడు తండ్రిపక్షి, తల్లిపక్షి పరిణత దశకోసం పొదుగుతాయి. కంటి రెప్పలా కాపాడుతాయి. ఇవి మనుషుల గర్భస్థ శిశువును సంరక్షించుకొనే పద్ధతుల లాగానే ఉంటాయి.

ఆలనా పాలన : మనం చిన్న పిల్లల్ని ఎత్తుకొని లాలిస్తే ఆ పిల్లలకు ఎలాంటి హాయీ సౌఖ్యము లభిస్తాయో పక్షులకు తమ తండ్రిపక్షి, తల్లిపక్షుల నుంచి అలాంటి వెచ్చదనం లభిస్తుంది. తల్లిపక్షి, తండ్రిపక్షి పిల్లపక్షి సుఖ సౌకర్యాల కోసం గూడులో తగిన రీతిలో అమర్చుతాయి. ఈ ఏర్పాటు పసిపిల్లలకు ఏర్పాటు చేసే మెత్తని గుడ్డల బొంతల వంటిది.

పోషణ : పెద్ద పక్షులు తాము సంపాదించిన ధాన్యపు గింజల నుంచి తయారు చేసిన పాలను పిల్ల పక్షుల నోళ్ళలో పోస్తాయి. అంతేగాక గింజల్ని, విత్తనాల్ని తమ కంఠంలో నానబెట్టి మెత్తబరిచాకే పిల్లపక్షులకు అందిస్తాయి. ఇది పళ్ళు రాని బోసి నోటి పెసిపిల్లలకు పెట్టే గుజ్జన గూళ్ళను పోలినదే.

శిక్షణ : పొడవడం, గెంతడం, ఎగరడం నేర్పిన పిల్లపక్షికి తండ్రిపక్షి ఆకాశంలో ఎగరడంలో శిక్షణ ఇస్తుంది. పిల్లపక్షికి ధైర్యం చెప్పేటందుకు తల్లిపక్షి తాను కూడా ఎగిరి సాయం చేస్తుంది. విద్యాభ్యాస దశలో పిల్లలకు తల్లిదండ్రుల నుంచి లభించే ప్రోత్సాహం, ధైర్యం ఇటువంటివే.

3. పశుపక్షులు తమ సంతానాన్ని పెంచే విధానాన్ని సొంతమాటల్లో వివరించండి.
జవాబు.
పశుపక్షులు తమ సంతానాన్ని పెంచే విధానం కూడా మనుషులు తమ బిడ్డలను పెంచే విధానంలాగానే ఉంటుంది. పశువులు కడుపులో మోసిన బిడ్డలను నెలలు నిండాక కంటాయి. పక్షులు మాత్రం గుడ్లు పెట్టి పొదుగుతాయి. ఆడపక్షితో పాటు మగపక్షి కూడా పొదుగుతుంది. కానీ గుడ్డును ఎప్పుడు ఎలా పగల గొట్టాలో ఆడపక్షికి మాత్రమే తెలుస్తుంది. పశుపక్షులు కూడా తమ పిల్లల ఆలనాపాలన కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటాయి. పశువులు తమ బిడ్డలను సాధ్యమైనంత వరకూ మెత్తని ప్రదేశంలో ఉండేటట్లు చూస్తాయి.

పక్షులైతే తమ పిల్లల కోసం గూళ్ళలోని మెత్తని పక్కలు ఏర్పాటు చేస్తాయి. పశువులు తమ పిల్లలకు పుట్టిన నాటి నుంచే పాలిచ్చి పోషిస్తాయి. పక్షులు మాత్రం తమ కంఠంలో నానబెట్టిన గింజల నుంచి వచ్చే పాలను బిడ్డల గొంతులో పోసి పోషిస్తాయి. పక్షుల పిల్లలు ఎగరడం, గెంతడం అవే నేర్చుకుంటాయి. ఆహారం సంపాదించడం, ప్రాణాలను రక్షించుకోవడం మాత్రం తల్లిదండ్రులను చూసి అలవాటు చేసుకుంటాయి. రెక్కలు వచ్చిన పిల్ల పక్షులకు ఆకాశంలో ఎగరడంలో మెలకువలు నేర్పుతాయి.

4. ఇంట్లో చాలామంది పావురాలను పెంచుకుంటారు కదా ? వారు పొందే అనుభూతిని సొంతమాటల్లో రాయండి.
జవాబు.
పావురాలు చాలా అందంగా ముద్దుముద్దుగా ఉంటాయి. అందుకే కొంతమంది పావురాలను ఇళ్ళలో పెంచుకొంటూ, వాటి పెంపకంలో ఆనందాన్ని పొందుతుంటారు. అవి గుంపులు గుంపులుగా ఎగురుతుంటే చాలా అందంగా ఉండి ఆనందాన్ని కలిగిస్తుంటాయి. మన ప్రాంతంలో కనబడే పావురాలు బూడిద రంగులో బొద్దుగా ఉంటాయి. పావురాలను కొందరు తమ పిల్లల్లాగా అల్లారుముద్దుగా పెంచుకొంటారు. వాటికి కావలసిన ధాన్యపుగింజలు వేస్తూ అవి తినే విధానాన్ని చూసి ఆనందిస్తుంటారు. పావురాలు గుడ్లుపెట్టి, పొదిగి, పిల్లల్ని చేసి, వాటిని జాగ్రత్తగా పెంచే విధానం, ఆ పిల్లలకు ఆహారాన్ని పెట్టే విధానం ఆశ్చర్యం కలిగిస్తుంది.

పావురాల యొక్క కువకువ ధ్వనులు ఎంతో శ్రావ్యంగా ఉంటాయి. ఇళ్ళకు సమీపంలో ఉన్న దేవాలయాల గోపురాల గూళ్ళలో దూరి అవి చేసే హావభావాలు చూసి యజమానితో పాటు, వాటిని చూసిన వారందరూ ఆనందాన్ని పొందుతుంటారు. ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు గోపురాలలో పావురాలు, చిలుకలు చేసే ధ్వనులను చక్కగా వర్ణించారు. పావురాలను, ఇతర పక్షులను పెంచుకోవడం అంటే జీవావరణాన్ని పరిరక్షించడమే. మానవతాదృక్పథంతో వాటిని ఆదరించడమే.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson Telangana చిత్రగ్రీవం

5. చిత్రగ్రీవం ఎగరడం ఎలా నేర్చుకున్నది ?
జవాబు.
కథకుడు చిత్రగ్రీవాన్ని రోజూ మేడ మీద పిట్టగోడమీద వదిలేవాడు. ఒకనాడు కొన్ని గింజలు నేలమీద వదిలి దాన్ని తినడానికి పిలిచాడు. చాలాసేపటి తర్వాత అతికష్టం మీద అది కిందికి దూకింది. గింజలమీద బాలెన్సు చేసుకొనే భాగంగా అప్రయత్నంగా, హఠాత్తుగా దాని రెక్కలు విప్పుకున్నాయి. కథకుడు చిత్రగ్రీవాన్ని రోజూ మణికట్టు మీద ఉంచుకొని చేతిని పైకీ కిందికీ పదేపదే కదిపేవాడు. అలా కదిపినప్పుడు చిత్రగ్రీవం బాలెన్సు నిలదొక్కుకోవడం కోసం రెక్కలు విప్పడం, ముడవడం చేసేది.

ఒకనాడు తండ్రిపక్షి చిత్రగ్రీవానికి ఎగరడం నేర్పే పని చేపట్టింది. దాన్ని పిట్టగోడ మీద తరుముకుంటూ వెళ్ళి కిందికి తోసి దానిపైనే ఎగురుతూపోయింది. జారిన చిత్రగ్రీవం తన్ను తాను రక్షించుకోడానికి రెక్కలు విప్పి గాలిలో తేలింది. తల్లిపక్షి కూడా వచ్చి సాయంగా ఎగిరింది. అలా ముగ్గురూ పది నిమిషాలు ఎగిరి కిందికి వచ్చి వాలాయి. నేల తాకేటప్పుడు చిత్రగ్రీవం కంగారు పడింది. కొంచెంగా దెబ్బ తగిలింది. కాని ఎగరడం వచ్చేసింది.

6. ‘చిత్రగ్రీవం’ పాఠంలోని బాలుని స్థానంలో నీవుంటే ఏమి చేస్తావో వివరించండి.
జవాబు.
సాధారణంగా పక్షులు గుడ్లు పొదిగేటప్పుడు వాటి జోలికి వెళ్ళకూడదనే విషయం నాకు తెలుసు. ఎందుకంటే మా యింటి దగ్గర చింతచెట్టు ఉంది. చింతకాయలు కోద్దామని చెట్టు ఎక్కాను. దాని మీద కాకిగూడు ఉంది. దాంట్లో చిన్న చిన్న కాకి పిల్లలు ఉన్నాయి. అయినా నేను వాటి జోలికి వెళ్ళలేదు. చింతకాయలు కొన్ని కోసుకొని చెట్టు దిగుతుండగా కాకులు నన్ను చూశాయి. అవి వచ్చి నను కాళ్ళతో తన్నుతూ ముక్కుతో పొడిచాయి. ఈ విధంగా కాకులు నన్ను వదలకుండా హింసించాయి. దాంతో చాలా భయం వేసింది.

చిత్రగ్రీవం పాఠంలో బాలుని స్థానంలో నేను గనుక ఉంటే – పావురాల గూటి దగ్గరకు వెళ్ళేవాణ్ణికాదు. దాని గూడు శుభ్రం చేయడం, తండ్రి పావురంతో పొడిపించుకోవడం, గుడ్డు జారవిడవడం వంటివి చేసేవాణ్ణికాదు. కాకులతో ఒకసారి దెబ్బతిన్నాను కాబట్టి ఆ బాలుడి లాగా అటువంటి పని చేయలేను. పక్షుల ప్రవర్తనలన్నీ ఒకేమాదిరిగా ఉంటాయని భావించాను.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson Telangana చిత్రగ్రీవం

7. పాఠం ఆధారంగా పావురాల జీవన విధానాన్ని రాయండి.
జవాబు.
పావురాలు రకరకాల రంగుల్లో ఉంటాయి. మన ప్రాంతంలో పావురాలు దాదాపు బూడిదరంగులో ఉంటాయి. తల్లిపావురం గుడ్డు పెట్టి పొదిగి పిల్లల్ని చేస్తుంది. మెత్తని గూళ్ళలో పిల్లల్ని పెట్టి రక్షిస్తూ పెంచుతుంటాయి. మెత్తని పాలతో నిండిన ధాన్యపు గింజల్ని వాటికి ఆహారంగా అందిస్తాయి. మనుషులలాగానే పిల్లల్ని పెంచడంలో జాగ్రత్తలు తీసుకుంటాయి. పావురాలు గుంపుగుంపులుగా ఆహారం కోసం ఎగిరి వెళతాయి.

మళ్ళీ తిరిగి తమ గూళ్ళకు చేరుకుంటాయి. అన్నీ కలిసిమెలిసి జీవిస్తుంటాయి. పావురాలకున్న దిశాపరిజ్ఞానం చాలా గొప్పది. పూర్వం పావురాల ద్వారానే వార్తలు అందించే వారనే సంగతులు మనకు తెలుసు. పెంపుడు పావురాలకైతే యజమానుల పట్ల ప్రేమ, గౌరవం ఎక్కువ. పావురాల పిల్లలు తల్లి నుండి తెలివితేటలు, తండ్రి నుండి వేగం, చురుకుదనం, సాహసం నేర్చుకుంటాయి. పావురాలు తమ పిల్లలకు మాటలు నేర్పుతాయి. ఎగరడానికి తగిన శిక్షణ ఇస్తాయి. ఈ విధంగా పావురాల జీవనవిధానం చక్కగా సాగుతుంది.

8. చిత్రగ్రీవం ఎదగడంలో వెనకబడడానికి కారణాలు ఏమై ఉంటాయి ?
(లేదా)
చిత్రగ్రీవం ఎదిగిన క్రమాన్ని వివరించండి.
జవాబు.
పరిచయం : ధనగోపాల్ ముఖర్జీ రచించిన చిత్రగ్రీవం కథలో చిత్రగ్రీవం అనే పిల్లపావురానికి ఉన్న ప్రత్యేక లక్షణాలను మనోహరంగా వర్ణించారు. తన దగ్గర ఉన్న పావురాలలో చిత్రగ్రీవం సుందరమైనది. అయినా అది ఎదగడంలో అన్నింటికంటే మందకొడి అని రచయిత వర్ణించారు.

ఇంద్రధనుస్సు లాంటి ఈకలు : చిత్రగ్రీవానికి ఈకలు బూడిరంగు కలిసిన నీలి వర్ణంతోనే ఉండేవి. తరువాత శరీరమంతా ఈకలు పెరిగాక దాని ఒళ్ళంతా సముద్రపు నీలిరంగు ఈకలతో ధగధగా మెరిసిపోయింది. దాని మెడప్రాంతం సూర్యకాంతిలో ఇంద్రధనుస్సు, రంగుల పూసల గొలుసులా శోభిల్లింది. ఎదిగేటప్పుడు కొన్ని జీవులకు సహజంగానే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండడమే దీనికి కారణం.

ఆహార సంపాదన : చిత్రగ్రీవం ఐదో వారానికల్లా గెంతడం నేర్చుకున్నా ఆహార సంపాదన విషయంలో మాత్రం ఇంకా తల్లిదండ్రుల మీదనే ఆధారపడ్డది. ఈ మందకొడితనానికి దాని సహజలక్షణమే కారణం.

ముగింపు : ఈ విధంగా చిత్రగ్రీవం ఎదగడంలో వెనకబడిపోవడానికి దాని సహజ లక్షణాలు, శిక్షణ అందివ్వకపోవడమే కారణాలుగా చెప్పవచ్చు.

పరిచిత గద్యభాగాలు

1. కింది గద్య భాగాన్ని చదవండి. ఐదు ప్రశ్నలు తయారుచేయండి.

చంటి పక్షులు ఎదిగి వచ్చే సమయంలో వాటి గూళ్ళలో మరీ ఎక్కువగా మెత్తటి దూదీ, పీచు లాంటి పదార్థాలను ఉంచగూడదు. వాటిని తగు మోతాదులోనే ఉంచాలి. లేకపోతే గూడు మరీ వెచ్చనైపోతుంది. అరకొర జ్ఞానపు పావురాల పెంపకందారులు పిల్లపక్షులు ఎదిగే సమయంలో తమ శరీరం నుంచే చాలా మోతాదులో వెచ్చదనాన్ని విడుదల చేస్తాయన్న విషయం గ్రహించరు. ఈ సమయంలో పావురాల గూళ్ళను మరీ తరచుగా శుభ్రం చెయ్యటం కూడా మంచిదిగాదు. తల్లిపక్షి, తండ్రిపక్షి ఆచి తూచి గూటిలో ఉండే ప్రతి వస్తువూ పిల్లపక్షి సుఖసౌకర్యాలకు దోహదం చేస్తాయి.
జవాబు.

  1. చంటి పక్షులు ఎదిగివచ్చే సమయంలో వాటిగూళ్ళలో మరీ ఎక్కువగా ఏం ఉంచకూడదు ?
  2. అలా ఉంచకపోతే ఏం జరుగుతుంది ?
  3. అరకొర జ్ఞానపు పావురాల పెంపకందార్లు ఏ విషయం గహించరు ?
  4. చంటిపక్షులు ఎదిగివచ్చే సమయంలో ఏది మంచది కాదు ?
  5. పిల్ల పక్షి సుఖసౌకర్యాలకు దోహదం చేసేవి ఏవి ?

TS 8th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson Telangana చిత్రగ్రీవం

2. కింది గద్య భాగాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

దాని తండ్రిపక్షి ఓ గిరికీల మొనగాడు. తల్లిపక్షి ఓ వార్తల పావురం. ఆ రోజుల్లో అది అతి సుందరమైన కులీన వంశానికి చెందిన పావురం. ఆ రెండు విశిష్టమైన పావురాలు జతకట్టాయి. గుడ్లు పెట్టాయి. వాటికి పుట్టిన చిత్రగ్రీవం అందువల్లనే తర్వాతి రోజుల్లో యుద్ధరంగాల్లోనూ శాంతి సమయాల్లోనూ అమోఘంగా పనిచెయ్యగల వార్తాహరియైన పావురంగా రూపొందింది. తల్లిపక్షి నుండి తెలివితేటలు సంపాదించుకుంది. తండ్రిపక్షి నుండి వేగం, చురుకుదనం, సాహసం సంతరించుకుంది.

ప్రశ్నలు :

1. తల్లిపక్షి ప్రత్యేకత ఏమిటి ?
జవాబు.
తల్లిపక్షి ఓ సమాచారాన్ని ఒకచోటి నుంచి మరొక చోటికి చేరవేసే వార్తల పావురం.

2. చిత్రగ్రీవానికి తెలివితేటలు ఎలా వచ్చాయి ?
జవాబు.
చిత్రగ్రీవానికి తెలివితేటలు తల్లి నుంచి వచ్చాయి.

3. తండ్రి నుంచి వచ్చిన లక్షణాలు ఏవి ?
జవాబు.
తండ్డి పక్షి నుంచి వేగం, చురుకుదనం, సాహసం అనే లక్షణాలు వచ్చాయి.

4. ఇందులో తల్లిదండ్రుల లక్షణాలను పుణికి పుచ్చుకున్నది ఏది ?
జవాబు.
ఇందులో తల్లిదండ్రుల లక్షణాలను పుణికిపుచ్చుకున్నది చిత్రగ్రీవం.

5. ఈ పేరాను రచించినది ఎవరు ?
జవాబు.
ఈ పేరాను రచించినది ధనగోపాల్ ముఖర్జీ.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson Telangana చిత్రగ్రీవం

3. క్రింది గద్యభాగమును చదివి ఇచ్చిన ప్రశ్నలకు సరియైన సమాధానాలు రాయండి.
చిత్రగ్రీవానికి మూడువారాల వయసప్పుడు దాని గూటిలోకి ఒక చీమ పాకింది. గూటి అంచున కూర్చొని ఉన్న చిత్రగ్రీవం ఎవరి ఉపదేశమూ లేకుండానే ఆ చీమను టక్కున తన ముక్కుతో పొడిచింది. అప్పటిదాకా ఏకఖండంగా సాగిన ఆ చీమ ఒక దెబ్బతో రెండు ముక్కలైపోయింది. తన ముక్కుతో ఆ చీమ తునకలను కదిపి చూసి తాను చేసిన ఘనకార్యం ఏమిటో అర్థం చేసుకునే ప్రయత్నం చేసింది చిత్రగ్రీవం. అది ఏదో తినే వస్తువు అనుకొని తమ పావురాల జాతికి మిత్రుడైన ఆ అమాయికపు నల్లచీమను చిత్రగ్రీవం పొడిచి చంపిందనడంలో సందేహం లేదు. తాను చేసిన పనిచూసి చిత్రగ్రీవం పశ్చాత్తాపపడిందనీ మనం అనుకోవచ్చు. ఏదేమైనా చిత్రగ్రీవం మళ్ళా ఎప్పుడూ తన జీవితంలో మరోసారి చీమను చంపలేదు.

ప్రశ్నలు :

1. చిత్రగ్రీవం చేసిందనుకున్న గొప్ప పని ఏమిటి ?
జవాబు.
నల్ల చీమను ముక్కుతో పొడిచి చంపడం.

2. తాను చేసిన పనికి చిత్రగ్రీవం పశ్చాత్తాపపడిందని రచయిత భావించడానికి కారణం ఏమిటి ?
జవాబు.
ఆ తర్వాత మళ్ళీ ఎప్పడూ మరో చీమను చిత్రగీవం చంపలేదు. అందువల్ల చిత్రగీవం పశ్చాత్తాపపడి ఉండవచ్చని రచయిత భావించాడు.

3. పావురాల జాతికి మిత్రుడెవరు ?
జవాబు.
నల్ల చీమలు

4. చీమను పొడిచి చంపేనాటికి చిత్రగ్రీవం వయసు ఎంత ?
జవాబు.
మూడు వారాలు

5. చీమను చిత్రగ్రీవం ఎందుకు చంపింది ?
జవాబు.
తినే వస్తువనుకొని చంపింది.

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download అపరిచిత గద్యాలు Questions and Answers.

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

ఈ క్రింది వచనాలను చదివి వాటి క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజాన్ని పరిపాలించిన రాజులలో అగ్రగణ్యులు. వీరి ఆస్థానంలో అష్టదిగ్గజములనే పేరుతో ఎనిమిది మంది కవి పండితులుండేవారు. వారిలో అల్లసాని పెద్దన మొదటివాడు. వీరు ‘మనుచరిత్ర’ అను ప్రబంధమును రాశారు. శ్రీకృష్ణదేవరాయలు తాను స్వయంగా కవి, ఆయన ‘ఆముక్త మాల్యద’ అను ప్రబంధాన్ని రాశాడు. దీనికే ‘విష్ణుచిత్తీయము’ అను నామాంతరం కలదు. ‘వికటకవి’ అని పేరుగాంచిన తెనాలి రామకృష్ణుడు తెలుగు నుడికారము వెల్లివిరియునట్లు ‘పాండురంగ మాహాత్మ్యము’ అను గ్రంథాన్ని రాసాడు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
వికటకవి ఎవరు?
జవాబు.
వికటకవి తెనాలి రామకృష్ణుడు.

ప్రశ్న 2.
పెద్దన రాసిన ప్రబంధమేది?
జవాబు.
పెద్దన ‘మనుచరిత్ర’ అను ప్రబంధమును రాశాడు.

ప్రశ్న 3.
ఆముక్తమాల్యదకు గల మరియెక పేరేది?
జవాబు.
ఆముక్తమాల్యదకు ‘విష్ణుచిత్తీయము’ అని మరొక పేరు కలదు.

ప్రశ్న 4.
అష్టదిగ్గజములు ఎవరి ఆస్థానములో వెలుగొందారు?
జవాబు.
అష్టదిగ్గజ కవులు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములో వెలుగొందారు.

ప్రశ్న 5.
తెనాలి రామకృష్ణుడు రాసిన గ్రంథమేది?
జవాబు.
తెనాలి రామకృష్ణుడు ‘పాండురంగ మాహాత్మ్యము’ అను గ్రంథాన్ని రాశాడు.

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

2. 1929 జనవరి 15న జార్జియాలోని అట్లాంటాలో మార్టిన్ లూథర్ కింగ్ జన్మించాడు. అమెరికాలో ఉన్న ఆఫ్రికన్ జాతీయుల నాయకుడితడు. మహాత్మాగాంధీ ఉపన్యాసం విని, ఉత్తేజితుడై తన నల్ల జాతీయుల విముక్తి కోసం పోరాటం సాగించాడు. మహాత్ముని పుస్తకాలను కొన్నాడు. 1951 లో బోస్టన్ యూనివర్శిటీలో డాక్టరేటు పేరు నమోదు చేసుకొని 1955లో డాక్టరేట్ను సంపాదించాడు. 1963లో ఆఫ్రికన్ అమెరికన్లతో శాంతియాత్రను కొనసాగించాడు. తన 35 వ ఏట అనగా 1964లో నోబెల్ శాంతి బహుమతిని పొందాడు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
మార్టిన్ లూథర్ కింగ్ ఎప్పుడు జన్మించాడు?
జవాబు.
1929 జనవరి 15న జన్మించాడు.

ప్రశ్న 2.
కింగ్ ఎవరి పుస్తకాలు కొన్నాడు?
జవాబు.
మహాత్ముని పుస్తకాలు కొన్నాడు.

ప్రశ్న 3.
నోబెల్ శాంతి బహుమతిని ఎపుడు పొందాడు?
జవాబు.
తన 35వ ఏట 1964లో పొందాడు.

ప్రశ్న 4.
కింగ్ ఏ జాతీయుల నాయకుడు?
జవాబు.
అమెరికాలో ఉన్న ఆఫ్రికన్ జాతీయుల నాయకుడు.

ప్రశ్న 5.
నల్ల జాతీయుల విముక్తి కోసం పోరాడడానికి కింగ్కు ప్రేరణ ఏది?
జవాబు.
మహాత్మాగాంధీ ఉపన్యాసం.

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

3. కవిత్వానికి లేని కొత్త సమస్య ఒకటి ఇప్పుడు తలెత్తింది. కవిత్వానికి ఛందస్సు అవసరమా ? అనవసరమా ? ఛందస్సు అంటే ఇక్కడ గణ, యతిప్రాసలతో నిబద్ధమైన పద్య నియమావళి. అప్పకవీయమూ తదితర గ్రంథాలలో వున్నది. నన్నయ మొదలుకొని తిరుపతి వేంకట కవుల వరకు పండిత కవులు అనుసరించినది. భావ కవులు గేయ ఛందస్సులను అనుసరించినా, ఈ పద్య ఛందస్సులను తిరస్కరించలేదు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
ఛందస్సు అనగా నేమి?
జవాబు.
గణ, యతిప్రాసలతో నిబద్ధమైన పద్య నియమావళినే ‘ఛందస్సు’ అని అంటారు.

ప్రశ్న 2.
గేయ ఛందస్సులను అనుసరించినవారు ఎవరు?
జవాబు.
భావ కవులు గేయ ఛందస్సులను అనుసరించారు.

ప్రశ్న 3.
ఇప్పుడు తలెత్తిన సమస్య ఏది?
జవాబు.
ఇప్పుడు కవిత్వానికి ఛందస్సు అవసరమా ? అనవసరమా ? అనే సమస్య తలెత్తింది.

ప్రశ్న 4.
భావ కవులు వేనిని తిరస్కరించలేదు?
జవాబు.
భావ కవులు పద్య ఛందస్సులను తిరస్కరించలేదు.

ప్రశ్న 5.
ఈ పేరాలోని జంటకవులు ఎవరు ?
జవాబు.
తిరుపతి వేంకట కవులు.

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

4. సమాజంలో మతం అంతర్భాగం. మన సమాజంలో ఎన్నో మతాలున్నాయి. ఏ మతమైనా అందరికి ప్రయోజనాన్ని చేకూర్చే సిద్ధాంతాలనే కలిగి ఉంటుంది. ఇతరులు మతం కంటే తమ మతం గొప్పదని చెప్పుకొనేవారు అవివేకులు. వారు తమ స్వార్థానికే ఇతర మతాలను దూషించుటకు ప్రయత్నిస్తారు. సర్వమతాలను సమానంగా భావించి మంచిని స్వీకరించువారే ఉత్తములు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
సమాజంలో అంతర్భాగమైనదేది ?
జవాబు.
మతం

ప్రశ్న 2.
ప్రతి మతంలోని ప్రధాన సిద్ధాంతమేమి ?
జవాబు.
అందరికీ ప్రయోజనాన్ని చేకూర్చడమే ప్రధాన సిద్ధాంతం.

ప్రశ్న 3.
ఎవరు అవివేకులు ?
జవాబు.
ఇతరుల మతం కంటే తమ మతం గొప్పదని చెప్పుకొనువారు అవివేకులు.

ప్రశ్న 4.
ఉత్తములు ఎవరు ?
జవాబు.
సర్వ మతాలను సమానంగా భావించి మంచిని స్వీకరించు వారే ఉత్తములు.

ప్రశ్న 5.
స్వార్థపరులు ఏం చేస్తారు ?
జవాబు.
ఇతర మతాలను దూషిస్తారు.

5. వీరేశలింగం పంతులు గారు ఆంధ్రభాషకు చేసిన సేవ ఎనలేనిది. పంతులుగారికి పూర్వము నవలా రచనలేదు. వారు రచించిన ‘రాజశేఖర చరిత్ర’ తెలుగులో ప్రసిద్ధి గాంచినది. మహాకవి కాళిదాసు రచించిన ‘అభిజ్ఞానశాకుంతలము’ను పంతులుగారు తెలుగున కనువదించారు. ఆంధ్ర కవుల చరిత్ర, స్వీయచరిత్ర మొదలగు క్రొత్త పోకడలను తెలుగు భాషలో వెలువరించారు. వారు కవిగా సంపాదించిన కీర్తి కంటే సంఘసంస్కర్తగా ఎనలేని ఖ్యాతి గడించారు. వితంతు వివాహములను, స్త్రీ విద్యను ప్రోత్సహించారు. ‘హితకారిణి’ సమాజమును స్థాపించి దాని ద్వారా అనాథ స్త్రీ ఉద్ధరణకు పాటుపడ్డారు.

ప్రశ్న 1.
తెలుగు భాషలో మొదటి నవల ఏది ?
జవాబు.
తెలుగు భాషలో మొదటి నవల ‘రాజశేఖర చరిత్ర’.

ప్రశ్న 2.
హితకారిణి సమాజ స్థాపన ఉద్దేశ్యమేమి ?
జవాబు.
హితకారిణి సమాజ స్థాపన ఉద్దేశ్యం అనాథ స్త్రీల ఉద్ధరణ.

ప్రశ్న 3.
వీరేశలింగం పంతులు గారు తెలుగులోనికి అనువదించిన నాటకమేది ?
జవాబు.
వీరేశలింగం పంతులు గారు ‘అభిజ్ఞాన శాకుంతలం’ అను నాటకాన్ని తెలుగులోనికి అనువదించారు.

ప్రశ్న 4.
ఆయన వేనిని ప్రోత్సహించారు ?
జవాబు.
ఆయన (కందుకూరి) వితంతు వివాహాలను, స్త్రీ విద్యను ప్రోత్సహించారు.

ప్రశ్న 5.
ఆయన తెలుగు భాషలో చూపిన కొత్త పోకడలకు రెండు ఉదాహరణలేవి?
జవాబు.
ఆంధ్ర కవుల చరిత్ర, స్వీయ చరిత్ర రచనలు.

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

6. “కవిత్వం, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పం ఈ ఐదింటిని లలితకళలంటారు. ఈ కళలలో కృష్ణదేవరాయలకు తగినంత చొరవ ఉండేది. ఆయన ఆస్థానంలో కవులు, గాయకులు, నాట్యకారులు, చిత్రకారులు, శిల్పులు ఉండేవారు. వారు తమ తమ కళలను అద్భుత రీతిలో ప్రదర్శించి రాయల మన్ననలందుకొనేవారు. కళలు మానవుని హృదయాన్ని స్పందింపజేసే స్వభావం కలవి. కళలను ఆనందించలేనివాడు రాయిలాగే జడుడని చెప్పవచ్చు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
లలితకళలేవి ?
జవాబు.
కవిత్వం, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పం అనేవి లలితకళలు.

ప్రశ్న 2.
కవులు రాయల మన్ననలందుకొనడానికి గల కారణమేమి ?
జవాబు.
అన్ని కళలలో రాయలకు తగినంత చొరవ ఉండటం కవులు తమ కళలను అద్భుత రీతిలో ప్రదర్శించడం రాయల మన్ననలందుకోవడానికి కారణం.

ప్రశ్న 3.
“కళలను ఆనందించలేనివారు రాయిలాగే జడుడు” అంటే అర్థం ఏమిటి ?
జవాబు.
కళలను చూచి విని ఆనందించలేనివాడు ప్రాణంలేని పదార్థం వంటివాడని, మూర్ఖుడని అర్థం.

ప్రశ్న 4.
సంగీతం పాడేవారిని గాయకులంటారు. అలాగే చిత్రాలను వేసేవారిని ఏమంటారు ?
జవాబు.
చిత్రాలను వేసేవారిని చిత్రకారులు అంటారు.

ప్రశ్న 5.
కళలకు ఏ స్వభావం ఉన్నది ?
జవాబు.
కళలకు మానవుని స్పందింపజేసే స్వభావం ఉంది.

7.క్రింది గద్యభాగాన్ని చదివి ప్రశ్నలు తయారు చేయండి.

మానవుని హృదయమును మధుర భావములతో నింపునది కవిత్వము. హృదయము దయార్ధమయినప్పుడు కవిత్వ మావిర్భవించునని వాల్మీకి చెప్పెను. ధర్మార్థకామమోక్షములు సాధించుటయే కవిత్వ ప్రయోజనమని కొందరు అంటారు. సంస్కృత కవితను వెలయించి భారతీయ సంస్కృతి, ధర్మములను నిలబెట్టిన వ్యాస, వాల్మీకి, కాళిదాసాదులు నిత్యస్మరణీయులు. తెలుగులో కవిత్రయము, శ్రీనాథ, పోతనలు, అష్టదిగ్గజ కవులు సుప్రసిద్ధులు.

ప్రశ్నలు :

1. కవిత్వము ఎటువంటిది ?
2. వాల్మీకి ఏమి చెప్పెను ?
3. కవిత్వ ప్రయోజనమేమి ?
4. నిత్యస్మరణీయులు ఎవరు ?
5. పై పేరాలో సంస్కృత కవులు ఎవరు ?

8. పొదుపు మానవ జీవితానికి అత్యవసరం. పొదుపు లేని మానవుడు దారం తెగిన గాలిపటం వంటివాడు. పొదుపు చేయకుండా అడ్డుపడే వాటిల్లో అతి ముఖ్యమైనవి కోరికలు. కోరికలు మానవుని మానసికంగా బలహీనుణ్ణి చేస్తాయి. పొదుపు అనేక విషయాలలో పాటించవచ్చు. ధనము, జలము, భాషణము మొదలగు వానిలో పొదుపు పాటించడం ద్వారా దేశాభివృద్ధిని సాధించగలము. పొదుపును నిర్లక్ష్యం చేస్తే అప్పులు చేయక తప్పదు. అప్పుచేయటం వలన మన వ్యక్తిత్వాన్నే కోల్పోతాము.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
పొదుపు పాటించవలసిన ముఖ్య విషయాలేవి ?
జవాబు.
పొదుపు పాటించవలసిన ముఖ్య విషయాలు ధనం, జలం, భాషణం.

ప్రశ్న 2.
పొదుపును నిర్లక్ష్యం చేస్తే ఏమి జరుగుతుంది ?
జవాబు.
పొదుపును నిర్లక్ష్యం చేస్తే అప్పులు చేయడం జరుగుతుంది.

ప్రశ్న 3.
అప్పు చేయటం వలన మనమేమి కోల్పోతాము ?
జవాబు.
అప్పు చేయటం వలన మనం వ్యక్తిత్వాన్ని కోల్పోతాము.

ప్రశ్న 4.
కోరికలు మానవుని ఏమి చేస్తాయి ?
జవాబు.
కోరికలు మానవుని మానసికంగా బలహీనుణ్ణి చేస్తాయి.

ప్రశ్న 5.
పొదుపు లేని మానవుడు ఎటువంటివాడు ?
జవాబు.
దారం తెగిన గాలిపటం వంటివాడు.

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

9. బ్రౌనును ఒక వ్యక్తిగా గాక, పెద్ద సాహిత్య సంస్థగా భావించడం అవసరం. యుగ సంధిలో నిలిచిన ఈ వ్యక్తి అనేకానేక తాళపత్ర లిఖిత ప్రతులను సేకరించి, అవి ఎక్కడున్నాసరే, ఎంత ధనవ్యయమైనా సరే, లెక్కపెట్టకుండా, తన ఉద్యోగుల ద్వారా సంపాదించాడు. కొందరు పండితులను సమీకరించి, వారికి జీతభత్యాలిచ్చి, శుద్ధప్రతులు వ్రాయించి, కొన్నిటికి అర్థతాత్పర్యాలు సిద్ధం చేయించాడు. ‘విశ్వదాభిరామ వినురవేమ’ పద్యం తెలియని తెలుగువాడు లేడు. అయితే ఈ పద్యాలను మొదట తెలుగువాళ్ళకు పరిచయం చేసినది విదేశీయుడైన బ్రౌను. బ్రౌను పేరు స్మరించగానే మనకు స్ఫురించేది బ్రౌను నిఘంటువు. ఈ కృషి 1832లో ఆరంభించబడి 1853లో పూర్తి అయి ప్రథమ ముద్రణయింది.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
తెలుగు సాహిత్యానికి సంబంధించినంతవరకు బ్రౌనును ఎట్లా పరిగణించడం భావ్యం ?
జవాబు.
తెలుగు సాహిత్యానికి సంబంధించినంతవరకు బ్రౌనును ఒక వ్యక్తిగా కాక ఒక పెద్ద సాహిత్య సంస్థగా పరిగణించడం భావ్యం.

ప్రశ్న 2.
బ్రౌను వేటిని సేకరించాడు ?
జవాబు.
బ్రౌను అనేక తాళపత్ర లిఖిత ప్రతులను సేకరించాడు.

ప్రశ్న 3.
పండితులతో బ్రౌను చేయించిన పనులు ఏమిటి ?
జవాబు.
పండితులతో బ్రౌను శుద్ధ ప్రతులను రాయించి కొన్నింటికి అర్థతాత్పర్యాలు సిద్ధం చేయించాడు.

ప్రశ్న 4.
నిఘంటువు ప్రథమ ముద్రణ ఎప్పుడు పూర్తి అయింది ?
జవాబు.
నిఘంటువు ప్రథమ ముద్రణ 1853లో పూర్తి అయింది.

ప్రశ్న 5.
బ్రౌను తెలుగు వారికి మొదట పరిచయం చేసిన దేమి ?
జవాబు.
వేమన పద్యాలు.

10. వీరభద్రారెడ్డికి అంకితంగా కాశీఖండం రచించిన శ్రీనాథుడు పోతనకు సమకాలికుడు. శ్రీనాథుడు కాశీఖండం, భీమఖండం పురాణాలను తెనిగించినా, వానిని స్వతంత్రించి ప్రబంధాలవలె తెనిగించాడు. భీమఖండం, గోదావరి తీరదేశ దివ్యవైభవ వర్ణనా గ్రంథమని చెప్పవచ్చు. కాశీఖండం ప్రౌఢాంధ్ర కవితా పరిజ్ఞానానికి చదువదగిన ప్రబంధం. “శివరాత్రి మాహాత్మ్యం” అనే గ్రంథాన్ని కూడా శ్రీనాథుడే రచించాడు. శ్రీనాథునకు ప్రౌఢకవి పాకం మీద ప్రీతి ఎక్కువ. ఆయన ‘హరవిలాసం’ రచించి అవచి తిప్పయ్య సెట్టికి అంకితమిచ్చాడు. ‘కవి సార్వభౌముడు’గా ప్రసిద్ధి చెందిన శ్రీనాథుడు 15వ శతాబ్దికి చెందినవాడు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
శ్రీనాథుడు రచించిన గ్రంథాలేవి ?
జవాబు.
శ్రీనాథుడు కాశీఖండం, భీమఖండం, శివరాత్రి మాహాత్మ్యం, హరవిలాసం మొదలైన గ్రంథాలను రచించాడు.

ప్రశ్న 2.
శ్రీనాథుడు ఎవరి సమకాలికుడు ?
జవాబు.
శ్రీనాథుడు పోతనకు సమకాలికుడు.

ప్రశ్న 3.
శ్రీనాథుడు తన ‘హరవిలాసం’ కావ్యాన్ని ఎవరికి అంకితమిచ్చాడు ?
జవాబు.
శ్రీనాథుడు తన హరవిలాస కావ్యాన్ని అవచి తిప్పయ్య సెట్టికి అంకితమిచ్చాడు.

ప్రశ్న 4.
శ్రీనాథుని బిరుదు ఏమిటి ?
జవాబు.
శ్రీనాథుని బిరుదు ‘కవి సార్వభౌముడు’.

ప్రశ్న 5.
భీమఖండం దేనిని వర్ణిస్తుంది ?
జవాబు.
గోదావరీ తీరదేశ వైభవాన్ని

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

11. క్రింది గద్యభాగాన్ని చదివి ప్రశ్నలు తయారు చేయండి.

తెలుగుభాషలో కావ్యరచన నన్నయతో మొదలయింది. తిక్కనాదులు విస్తృతం చేశారు. బమ్మెర పోతన భాగవతాన్ని తెనిగించాడు. పెద్దనాదులు ప్రబంధ రచన చేశారు. తిరుపతి వేంకట కవులు అవధాన విద్య ద్వారా వీరవిహారం చేశారు. వెయ్యేళ్ళ నుంచి నేటికీ పద్యం నిలద్రొక్కుకొని విరాజిల్లుతూ ఉంది.

ప్రశ్నలు :

1. తొలి తెలుగు కావ్యం ఎవరు రాశారు ?
2. భాగవతాన్ని తెలుగులో రాసింది ఎవరు?
3. ఎంతకాలం నుంచి పద్యం నిలచి ఉంది?
4. తిరుపతి వేంకటకవులు ఏ విద్యలో ప్రసిద్ధులు?
5. తెలుగులో కావ్య రచనను ఎవరు విస్తృతం చేశారు?

12. నేడు గ్రంథాలయాలు అనుసరిస్తున్న శాస్త్రీయ విధానాన్ని రూపొందించినవారు డా॥ ఎన్.ఆర్.రంగనాథన్ గారు. వృత్తిపరమైన వారి అనుభవంలోంచి పుట్టిందే ఈ కృషి. ఆయన భారతీయ గ్రంథాలయాలకు సరిపోయే విధంగా మూడు కార్డుల పద్దతి, చార్జింగ్ సిస్టమ్, బైండింగ్ ప్రమాణాలు లాంటి కొత్త మార్గాలను ప్రవేశపెట్టారు. ఆయన రూపొందించిన “గ్రంథాలయ సిబ్బంది విభజన ఫార్ములా” ప్రామాణికంగా ఇప్పటికీ పాటించబడుతోంది. పరిమిత వనరులతో, ఇబ్బందులతో కొనసాగే భారతీయ గ్రంథాలయాలకు రంగనాథన్ కనిపెట్టిన మార్గాలు ఎంతో ఉపయోగకరమైనవి.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
గ్రంథాలయాల విధానాన్ని రూపొందించిన వారెవరు ?
జవాబు.
గ్రంథాలయాల విధానాన్ని రూపొందించినది డా॥ ఎన్. ఆర్. రంగనాథన్.

ప్రశ్న 2.
రంగనాథన్ కృషి ఎందులోంచి పుట్టింది ?
జవాబు.
రంగనాథన్ కృషి వారి వృత్తిపరమైన అనుభవం లోంచి పుట్టింది.

ప్రశ్న 3.
ఆయన రూపొందించిన ఫార్ములా ఏది ?
జవాబు.
ఆయన రూపొందించిన ఫార్ములా “గ్రంథాలయ సిబ్బంది విభజన ఫార్ములా”.

ప్రశ్న 4.
రంగనాథన్ కనిపెట్టిన మార్గాలు వేటికి ఉపయోగకరమైనవి ?
జవాబు.
రంగనాథన్ కనిపెట్టిన మార్గాలు భారతీయ గ్రంథాలయాలకు ఉపయోగకరమైనవి.

ప్రశ్న 5.
రంగనాథన్ ప్రవేశపెట్టిన కొత్త మార్గాలేవి ?
జవాబు.
మూడు కార్డుల పద్ధతి, చార్జింగ్ సిస్టమ్, బైండింగ్ ప్రమాణాలు.

13. స్త్రీజనోద్ధరణము కూడా సంఘసేవయే. పురుషులు మాత్రమే చదివి లోకమున విజ్ఞులమని, ప్రయోజకులమని చెప్పుకొనుట చాలదు. స్త్రీలు సహితము పురుషులతో బాటుగా చదువుకొన్నప్పుడే సంఘము బాగుపడును. సంఘమను బండికి స్త్రీ, పురుషులిద్దరు రెండు చక్రముల వంటివారు. అందులో ఏ చక్రము అవిటిగా నున్నను ఆ బండి నడువజాలదు. కావున రెండు చక్రములును సరిగా నడుచునట్లు చూచుకొన్నప్పుడే బండి చక్కగా సాగిపోవును.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
సంఘసేవ యనదగినదేది ?
జవాబు.
స్త్రీ జనోద్ధరణము సంఘసేవ యనదగినది.

ప్రశ్న 2.
సంఘము ఎప్పుడు బాగుపడును ?
జవాబు.
స్త్రీలు కూడా పురుషులతో పాటుగా చదువు కున్నప్పుడే సంఘము బాగుపడును.

ప్రశ్న 3.
సంఘమనే బండికి చక్రములవంటి వారెవరు ?
జవాబు.
సంఘమనే బండికి స్త్రీ, పురుషులిద్దరు చక్రములంటివారు.

ప్రశ్న 4.
బండి ఎప్పుడు చక్కగా సాగును ?
జవాబు.
రెండు చక్రములు సరిగా నడుచునప్పుడే బండి చక్కగా సాగును.

ప్రశ్న 5.
పురుషులు ఏమని చెప్పుకుంటున్నారు ?
జవాబు.
తామే విజ్ఞులమని, ప్రయోజకులమని చెప్పుకుంటున్నారు.

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

14. సర్దార్పటేల్ వ్యక్తిత్వం ఓర్పు, నేర్పు, పట్టుదల మొదలైన సుగుణాలతో కూడినది. ఆయనకు ప్రతి విషయంపై ఇష్టానిష్టాలుండేవి. ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత ఆ విషయాన్ని గురించి సందేహములుండేవి కావు. వాటిని అమలు జరపడంలో బలప్రయోగం అవసరమైనా జంకేవాడు కాదు. ఆయన తీరిక సమయంలో వ్యవసాయం చేసేవాడు. భారతదేశ దాస్యానికి భారతీయులలో గల అనైక్యత, క్రమశిక్షణారాహిత్యం కారణమని చెప్పినాడు. పటేల్ బారిష్టర్ పట్టా పొందుటతో సర్వతోముఖ న్యాయశాస్త్రమును విస్తృతపరచుట, కార్యదీక్ష, ఐకమత్యం ద్వారా స్వాతంత్య్రం సముపార్జన కొరకు పాటుపడుట అతని ఆశయం. దేశ ప్రజల మధ్య తరతమ భేదాలు పూర్తిగా అదృశ్యమై “నవరూపకల్పన” భారత ఉపప్రధాని పటేల్ అవిరళ కృషి ఫలితం.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
పటేల్లోని సుగుణములేవి ?
జవాబు.
ఓర్పు, నేర్పు, పట్టుదల మొదలైనవి పటేల్లోని గుణాల

ప్రశ్న 2.
పటేల్గారి నిర్ణయములెట్లుండేవి ?
జవాబు.
పటేల్ గారి నిర్ణయాలు నిస్సందేహంగా ఉండేవి.

ప్రశ్న 3.
పటేల్ తీరిక సమయంలో ఏమి చేసేవాడు ?
జవాబు.
పటేల్ తీరిక సమయంలో వ్యవసాయం చేసేవాడు.

ప్రశ్న 4.
పటేల్ ఏ పదవినలంకరించెను ?
జవాబు.
పటేల్ “భారత ఉపప్రధాని” పదవిని అలంకరించెను.

ప్రశ్న 5.
స్వాతంత్ర్యం పొందాలంటే ఏమి కావాలి ?
జవాబు.
కార్యదీక్ష, ఐకమత్యం.

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

15. క్రింది గద్యభాగాన్ని చదివి ప్రశ్నలు తయారు చేయండి.
“జో అచ్యుతానంద జోజో ముకుందా ” అన్న జోలపాట ఒకనాడు పసిబిడ్డ గల ప్రతియింటా కన్న తల్లుల జిహ్వాగ్రాలపై నాట్యమాడేది. ఈ పదకర్తే క్రీ.శ. 1424 1503 మధ్యకాలంలో జీవించి 32 వేల మధుర భక్తి సంకీర్తనలతో తిరుమలేశుని గొలిచి, ఆంధ్రభారతిని స్వతస్సిద్ధమైన తెలుగుభాషా భూషలతో భూషింపజేసి, సర్వజనరంజనం చేసిన పదకవితా పితామహుడు, సంకీర్తనాచార్యుడు అన్నమాచార్యుడు. తెలుగులో సంకీర్తన యుగం పన్నెండవ శతాబ్దిలో కృష్ణమాచార్యుని “సింహగిరి” వచనాలతో ప్రారంభమైనప్పటికీ, అన్నమయ్య దానిని ఉన్నతోన్నతి శిఖరాల నధిరోహింపజేసి పదకవితకు యుగకర్త అయినాడు. తెలుగులో పదకవిత్రయం (అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య)లో ఆద్యుడైనాడు.

ప్రశ్నలు :

1. “జో అచ్యుతానంద ! జోజో ముకుందా ! అన్న జోలపాటను వ్రాసింది ఎవరు ?
2. తెలుగులో సంకీర్తన యుగం ఎప్పుడు ప్రారంభమైనది ?
3. పద కవిత్రయంగా వాసికెక్కిన వారెవరు ?
4. అన్నమాచార్యుడు తన సంకీర్తనలతో ఎవరిని సేవించాడు ?
5. సింహగిరి వచనాలు రాసిందెవరు ?

16. 20వ శతాబ్దపు తొలి రోజులలో కుటుంబ నియంత్రణను బూతుమాట క్రింద జమకట్టేవారు. అటువంటి సమయంలో నర్స్గా పనిచేసే మార్గరేట్ సాంగర్ అనేక కష్టాలకోర్చి కుటుంబ నియంత్రణను గూర్చి ప్రచారం చేశారు. 1914లో “ఉమన్ రెబల్” అన్న వ్యాసంలో ఆమె కుటుంబ నియంత్రణ కోసం తిరగబడమని పిలుపు నిచ్చారు. అమెరికా ప్రభుత్వ వత్తిడి తట్టుకోలేక ఆమె యూరప్కు వలస వెళ్ళి 1916 లో తిరిగి వచ్చి అదే ప్రచారాన్ని మళ్ళీ మొదలుపెట్టారు. పోలీసులు ఆమె ప్రారంభించిన ఆస్పత్రిపై దాడి చేశారు. అయినా ఆమె చలించకుండా 1923లో కుటుంబ నియంత్రణా పరిశోధనాశాలను నెలకొల్పారు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
కుటుంబ నియంత్రణ కోసం ప్రచారం చేసిన నర్స్ పేరేమి ?
జవాబు.
కుటుంబ నియంత్రణ కోసం ప్రచారం చేసిన నర్స్ మార్గరేట్ సాంగర్,

ప్రశ్న 2.
ఏ సంవత్సరంలో, ఏ వ్యాసంలో ఆమె కుటుంబ నియంత్రణ కోసం తిరగబడమని పిలుపునిచ్చారు ?
జవాబు.
ఆమె 1914లో “ఉమన్ రెబెల్” అనే వ్యాసంలో కుటుంబ నియంత్రణ కోసం తిరగబడమని పిలుపునిచ్చారు.

ప్రశ్న 3.
మార్గరేట్ సాంగర్ ఎప్పుడు, ఎక్కడికి వలస వెళ్ళింది ?
జవాబు.
1914 నుండి 1916 మధ్య కాలంలో మార్గరేట్ సాంగర్ యూరప్ కు వలస వెళ్ళింది.

ప్రశ్న 4.
1923లో సాంగర్ దేనిని నెలకొల్పింది ?
జవాబు.
1923లో సాంగర్ కుటుంబ నియంత్రణా పరిశోధనాశాలను నెలకొల్పింది.

ప్రశ్న 5.
మార్గరెట్ సాంగర్పై వత్తిడి తెచ్చిందెవరు ?
జవాబు.
అమెరికా ప్రభుత్వం.

17. ప్రాణికి కన్ను ప్రధానమైనది. “సర్వేంద్రియాణాం నయనం ప్రధానమ్” అను సూక్తి కూడా ఆ సత్యమునే చాటుచున్నది. అందము ఆనందహేతువు. సౌందర్యమును జూచి పులకించుట చూపులేనిదే సాధ్యముగాదు. కన్నులున్న ప్రతి మానవుడు సౌందర్యమును జూచి సంతోషించుననుటయు సత్యముకాదు. ప్రకృతిలోని అందమైన వస్తువు కొన్ని కన్నులలో ప్రతిబింబించును. ఆ నేత్రములు నిలువుటద్దములు మాత్రమే. అట్లుగాక కొన్ని కన్నులు తమలో ప్రతిబింబించిన అందాన్ని అంతరంగంలో ప్రతిఫలింపజేయగలవు. అవియే నిజమైన నేత్రములు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
కన్ను ప్రాధాన్యతను తెలియజేయు సూక్తి ఏది ?
జవాబు.
“సర్వేంద్రియాణాం నయనం ప్రధానమ్” అనేది కన్ను ప్రాధాన్యతను తెలియజేయు సూక్తి.

ప్రశ్న 2.
సౌందర్యాన్ని చూచి సంతోషించడానికేమి కావాలి ?
జవాబు.
సౌందర్యాన్ని చూచి సంతోషించడానికి కంటిచూపు కావాలి.

ప్రశ్న 3.
నిలువుటద్దములని కవి వేటిని గూర్చి చెప్పాడు ?
జవాబు.
ప్రకృతిలోని అందాన్ని తమలో మాత్రమే ప్రతిబింబింపజేసే కన్నులు నిలువుటద్దములని కవి చెప్పాడు.

ప్రశ్న 4.
ఏవి నిజమైన నేత్రములు ?
జవాబు.
తమలో ప్రతిబింబించిన అందాన్ని అంతరంగంలో ప్రతిఫలింపజేయగలవే నిజమైన నేత్రములు.

ప్రశ్న 5.
చూపు లేకుంటే ఏది సాధ్యం కాదు ?
జవాబు.
సౌందర్యాన్ని చూసి ఆనందించ లేము.

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

18. వార్తను యథాతథంగా ప్రకటించడం వార్తాపత్రికలకు తొలినాళ్ళలో ఆదర్శంగా ఉంది. ఇప్పుడు దానికి పూర్తిగా విరుద్ధంగా ముద్రణలో, వ్రాయడంలో, అభిప్రాయ స్ఫురణలో భిన్నంగా వార్తను ప్రకటిస్తున్నారు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఏమిటి, ఏ విధంగా అనే అంశాలు వార్తల్లో స్పష్టం కావాలి. అదే సమగ్ర వార్త. ఏదైనా క్రొత్త అంశాన్ని ప్రజల దృష్టికి తేవడం వార్తకున్న ప్రత్యేక లక్షణం. లభించిన సమాచారం నుండి ఒక ప్రత్యేక అంశాన్ని, అపూర్వ విషయాన్ని వెలికితేవడం, వార్త వ్రాయడం కోసం అన్వేషించడం పత్రికా రచయిత చేసే నిరంతర కృషి, ఒకే వార్తను అనేక పత్రికలు అనేక విధాలుగా ప్రచురిస్తుంటాయి. వార్తలోని ప్రత్యేకాంశం, కొత్తసంగతి, వాళ్ళ విజ్ఞానం, సంస్కారం, నైపుణ్యాల మీద ఆధారపడి ఒక్కొక్క పద్ధతిలో ముద్రింపబడుతుంది. ఇదే వార్తకు వైవిధ్యాన్ని సంపాదించి పెడుతుంది.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
ఇప్పుడు వార్తాపత్రికలు ఏమి చేస్తున్నాయి ?
జవాబు.
ఇప్పుడు వార్తాపత్రికలు వార్తను ముద్రించడంలో, వ్రాయడంలో, అభిప్రాయ ప్రకటనలో కొంత తేడాతో ప్రకటిస్తున్నాయి.

ప్రశ్న 2.
వార్తకున్న ప్రత్యేక లక్షణమేమిటి?
జవాబు.
క్రొత్త అంశాన్ని ప్రజల దృష్టికి తేవడమనేది వార్తకున్న ప్రత్యేక లక్షణం.

ప్రశ్న 3.
సమగ్రమైన వార్త లక్షణమేమిటి ?
జవాబు.
ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఏమిటి, ఏవిధంగా అనే అంశాలు స్పష్టమయ్యేట్లు ప్రకటించడం సమగ్ర వార్త లక్షణం.

ప్రశ్న 4.
వార్తకు వైవిధ్యాన్ని సంపాదించి పెట్టునవేవి ?
జవాబు.
వార్తల్లోని ప్రత్యేకాంశం, కొత్త సంగతి, వాళ్ళ విజ్ఞానం, సంస్కారం, నైపుణ్యం అనేవి వార్తకు వైవిధ్యాన్ని సంపాదించి పెడతాయి.

ప్రశ్న 5.
తొలినాళ్ళలో వార్తా పత్రికల ఆదర్శమేమిటి ?
జవాబు.
వార్తను ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించడం.

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

ప్రశ్న 19.
సమాజ శ్రేయస్సు కొరకు మతము ఏర్పడినది. ప్రతి మతము ఉన్నతాశయములు కలిగియున్నది. ఏ మతము చెడును బోధించదు. ఈ మతము గొప్పది, పరమతము నీచమైనదని ప్రచారము చేయువారు విశాల హృదయము లేనివారని సంకుచిత స్వభావులని భావింపవచ్చును. స్వార్థపరులని తలంపవచ్చును. అట్టివారి మాటలను నమ్ముట మన అజ్ఞానమునకు ప్రతీకయగును.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
మతము ఎందుకు ఏర్పడినది ?
జవాబు.
మతము సమాజ శ్రేయస్సు కొరకు ఏర్పడినది.

ప్రశ్న 2.
దేన్ని మతము బోధించదు ?
జవాబు.
చెడును మతము బోధించదు.

ప్రశ్న 3.
ప్రతి మతము ఏవి కల్గియున్నది ?
జవాబు.
ప్రతి మతము ఉన్నత ఆశయములు కలిగియున్నది.

ప్రశ్న 4.
ఎవరు విశాల హృదయం లేనివారు ?
జవాబు.
ఈ మతము గొప్పది, పరమతము నీచమైనదని ప్రచారము చేయువారు విశాల హృదయము లేనివారు.

ప్రశ్న 5.
మత భేదాలను ప్రచారం చేసేవారి మాటలను నమ్మటం దేనికి గుర్తు ?
జవాబు.
మన అజ్ఞానానికి గుర్తు.

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

20. విద్యార్థికి క్రమశిక్షణ చాలా అవసరం. ఒక క్రమపద్ధతి ప్రకారం తన పనులన్నీ తానే చేసుకోవాలి. ఇతరులపై ఆధారపడకూడదు. ఎప్పటి పని అప్పుడే చేయాలి. పనిని వాయిదా వేయకూడదు. ఆత్మనిగ్రహాన్ని అలవరచుకోవాలి. చీటికీ మాటికీ కోపం తెచ్చుకోకూడదు. తోటివారిని చూసి ఈర్ష్య పడకూడదు. అసూయ పడకూడదు. చదువులోనూ, సత్ప్రవర్తనలోనూ తోటి వారిని మించాలనే పట్టుదలతో కృషి చేయాలి. అంతేకాని వాళ్ళు నీ కంటే ముందున్నారని అసూయ పడకూడదు. నీకంటే ముందున్న వారిపట్ల అసూయ కూడనట్లే, నీకంటే వెనుకబడినవారి పట్ల చులకన భావం కూడా ఉండకూడదు. వాళ్ళకు తగిన ప్రోత్సాహమివ్వాలి.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
విద్యార్థికి ఏది అవసరం ?
జవాబు.
విద్యార్థికి క్రమశిక్షణ అవసరం.

ప్రశ్న 2.
విద్యార్థి దేన్ని అలవరచుకోవాలి ?
జవాబు.
విద్యార్థి ఆత్మనిగ్రహాన్ని అలవరచుకోవాలి.

ప్రశ్న 3.
ఏ విషయంలో పట్టుదలతో కృషి చేయాలి ?
జవాబు.
చదువులోను, సత్ప్రవర్తనలోను తోటివారిని మించాలనే పట్టుదలతో కృషి చేయాలి.

ప్రశ్న 4.
విద్యార్థికి ఎవరిపై చులకన భావం ఉండకూడదు?
జవాబు.
విద్యార్థికి తనకంటే వెనుకబడిన వారిపై చులకన భావం ఉండకూడదు.

ప్రశ్న 5.
పనులు ఎలా చేసుకోవాలి?
జవాబు.
క్రమ పద్ధతి ప్రకారం.

21. “దేశ భాషలందు తెలుగు లెస్స” అని సాహితీ సమరాంగణ సార్వభౌములచే ప్రశంసింపబడిన భాష మన తెలుగుభాష, భాషాభ్యుదయమునకు సాహిత్య సంపద జీవగర్ర. ఆదికవి నన్నయభట్టారకుని నాటి నుండి నేటి వరకు ఆంధ్రభాషా సాహిత్యము అవిచ్ఛిన్నముగా, బహుముఖములుగా రాణించింది. ముద్రణాది సౌకర్యములు ఏర్పడిన తరువాత మన తెలుగు భాషలో ప్రాచీన కావ్య పురాణాది వివిధ గ్రంథములు ప్రచురింపబడి సుప్రకాశితములయ్యాయి.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
తెలుగుభాష ఏమని ప్రశంసింపబడినది?
జవాబు.
తెలుగుభాష ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని ప్రశంసింపబడింది.

ప్రశ్న 2.
ముద్రణా సౌకర్యము ఏర్పడుట ద్వారా భాషకు కల్గిన ప్రయోజనమేమి ?
జవాబు.
ముద్రణా సౌకర్యము ఏర్పడుట ద్వారా భాషకు ప్రాచీన కావ్య పురాణాది గ్రంథములు ప్రచురింపబడ్డాయి.

ప్రశ్న 3.
ఆదికవి ఎవరు?
జవాబు.
ఆదికవి నన్నయ.

ప్రశ్న 4.
భాషాభ్యుదయమునకు ఏది జీవగర్ర?
జవాబు.
భాషాభ్యుదయమునకు జీవగర్ర సాహిత్య సంపద

ప్రశ్న 5.
తెలుగు భాషను మెచ్చుకున్న రాజెవరు?
జవాబు.
సాహితీ సమరాంగణ సార్వ భౌముడు శ్రీకృష్ణ దేవరాయలు.

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

22. కొమర్రాజు లక్ష్మణరావు విద్యాభ్యాస కాలంలో పలుభాషలు నేర్చెను. అందువలన ఆయనకు విశాలమైన దృక్పథం ఏర్పడి అనేక పరిశోధనలకు, చర్చలకు ఉపయోగపడింది. ఇంగ్లీషు పండితుల ఒరవడిలో ప్రామాణిక ప్రతులను ప్రచురించారు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం స్థాపించి సాంస్కృతిక పునరుజ్జీవనానికి నారు పోశారు. శాసనాలు సేకరించి, పరిశోధన చేసి, సాక్ష్యాధారాలతో చరిత్ర రచన చేశారు. ప్రపంచ విజ్ఞానాన్ని తెలుగు ప్రజలందరకు అందుబాటులోకి తేవడానికి ‘ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం’ రచనకు పూనుకున్నారు. ఏ విషయమైనా మొక్కుబడిగా కాకుండా దాని లోతులు చూచి అందివ్వడానికి ఆయన కృషి చేశారు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
లక్ష్మణరావుకు పలుభాషలు నేర్చుకోవడం ఎలా ఉపయోగపడింది ?
జవాబు.
లక్ష్మణరావుకు పలుభాషలు నేర్చుకోవడం అనేక పరిశోధనలకు, చర్చలకు ఉపయోగపడింది.

ప్రశ్న 2.
లక్ష్మణరావు చరిత్ర రచన ఎలా చేశారు?
జవాబు.
లక్ష్మణరావు శాసనాలు సేకరించి, పరిశోధన చేసి, సాక్ష్యాధారాలతో చరిత్ర రచన చేశారు.

ప్రశ్న 3.
తెలుగు ప్రజల కోసము ఏ రచనకు ఆయన పూనుకొన్నాడు?
జవాబు.
తెలుగు ప్రజల కోసం ‘ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం’ రచనకు ఆయన పూనుకున్నాడు.

ప్రశ్న 4.
ఎవరి ఒరవడిలో ప్రామాణిక ప్రతులను ప్రచురించారు ?
జవాబు.
ఇంగ్లీషు పండితుల ఒరవడిలో ప్రామాణిక ప్రతులను ప్రచురించారు.

ప్రశ్న 5.
లక్ష్మణరావు స్థాపించిన సంస్థ ఏది ?
జవాబు.
శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం.

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

23. క్రింది గద్యభాగాన్ని చదివి ప్రశ్నలు తయారు చేయండి.

భాష కాలక్రమేణ మారే స్వభావం కలది. కాబట్టి ఒక భాషలో కాలక్రమేణ వర్ణాలు, వ్యాకరణ నిర్మాణము మారినట్లుగానే కూడా మారతాయి. ఒక భాషలో పదములకు గల అర్థాలతో వచ్చిన మార్పును అర్థవిపరిణామం అంటారు. ఉదాహరణకు ప్రాచీన తెలుగులో ‘లావు’ అనే పదానికి ఇప్పటి ‘స్థాల్యం’ అవిగాక, ‘బలం’ అని అర్థం. పదాల అర్థాలకు, భాషను వాడేవారి సంస్కృతి సంప్రదాయములకు సన్నిహిత సంబంధముంది. పాశ్చాత్యులకు గోధుమరొట్టె ముఖ్యాహారం కాబట్టి ఇంగ్లీషులో ‘బ్రడ్’ అనే మాట ‘రొట్టె’ అనే అర్థంలోనే గాక ‘ఆహారం’ అనే సామాన్యార్థంలో కూడా వాడబడుతుంది. నిషిద్ధ ప్రయోగం, సభ్యోక్తి అనే ప్రక్రియలవల్ల కూడా అర్థ విపరిణామం ఏర్పడుతుంది.

ప్రశ్నలు :

1. భాషా స్వభావం ఎట్టిది ?
2. అర్థ విపరిణామం అంటే ఏమిటి ?
3. అర్థ విపరిణామానికి ఉదాహరణ వ్రాయండి. అర్ధానికి, సంస్కృతి సంప్రదాయములకు సంబంధం ఉందనడానికి ఉదాహరణ వ్రాయండి.
4. అర్థ విపరిణామం ఏర్పడడానికి కారణం ఏమిటి ?
5. భాషలో వచ్చే మార్పులేమిటి ?

24. లోకంలో రానురాను మంచితనం, నిజాయితీ తగ్గిపోతున్నాయి. చెప్పే మాటకు, చేసే పనికి సంబంధం ఉండడం లేదు. మోసం, అన్యాయం, అవినీతి పెరిగిపోతున్నాయి. ఎదుటివారు బాధపడుతుంటే తాము సంతోషపడే సంస్కృతి పెచ్చు
మీరుతోంది. ఆదర్శంగా ఉండాల్సిన పెద్దలే అప్పులు చేస్తుంటే మరి పిల్లలు మంచివాళ్ళెలా అవుతారన్నది జవాబు లేని ప్రశ్న కాదా ?

ప్రశ్నలు :

ప్రశ్న 1.
ఏ సంస్కృతి పెచ్చుమీరుతోంది ?
జవాబు.
ఎదుటివారు బాధపడుతుంటే తాము సంతోషపడే సంస్కృతి పెచ్చుమీరుతోంది.

ప్రశ్న 2.
జవాబు లేని ప్రశ్న ఏది ?
జవాబు.
ఆదర్శంగా ఉండాల్సిన పెద్దలే తప్పులు చేస్తుంటే మరి పిల్లలు మంచివాళ్ళెలా అవుతారన్నది జవాబులేని ప్రశ్న.

ప్రశ్న 3.
లోకంలో ఏవి తగ్గిపోతున్నాయి ?
జవాబు.
లోకంలో మంచితనం, నిజాయితీ తగ్గిపోతున్నాయి.

ప్రశ్న 4.
వేటికి సంబంధం ఉండడం లేదు ?
జవాబు.
చెప్పేమాటకు, చేసే పనికి సంబంధం ఉండదు.

ప్రశ్న 5.
లోకంలో ఏవి పెరిగిపోతున్నాయి ?
జవాబు.
మోసం, అన్యాయం, అవినీతి.

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

25. దేశభాషలో పరిపాలన, విద్యాబోధన, సమాచార వినిమయం వీటి ప్రాముఖ్యం రోజురోజుకు పెరిగిపోతోంది. అన్ని రంగాలలో భాష బహుముఖంగా వినియోగంలో ఉంది. ఈనాడు భాషా ప్రయోగరంగాలు విస్తరిస్తున్నాయి. ఆయాస్థాయిలలో విద్యార్థుల మానసిక స్థాయిని దృష్టిలో ఉంచుకొని భాషా పాఠ్యగ్రంథాలను రూపొందించవలసి ఉంది. భిన్నమైన శైలులు, భిన్నమైన ప్రక్రియలకు చెందిన పాఠ్యాంశాలను భాషా పాఠ్యగ్రంథాలలో చేర్చాలి. ఆధునిక వచన రచనాశైలికి విద్యార్థులకు పరిచయం చేయడం అత్యవసరం. పాఠ్యాంశాలు సమకాలీన సామాజిక దృషికి అభ్యంతరకరమైనవి కాకుండా ఉండాలి.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
దేనిని దృష్టిలో ఉంచుకొని భాషా పాఠ్యగ్రంథాలను రూపొందించాలి ?
జవాబు.
విద్యార్థుల మానసిక స్థాయిని దృష్టిలో ఉంచుకొని భాషా పాఠ్యగ్రంథాలను రూపొందించవలసి ఉంది.

ప్రశ్న 2.
భాషా పాఠ్యగ్రంథాలలో పాఠ్యాంశాలు ఎలాంటివి ఉండాలి ?
జవాబు.
భిన్నమైన శైలులు, భిన్నమైన ప్రక్రియలకు చెందిన పాఠ్యాంశాలు పాఠ్యగ్రంథాల్లో ఉండాలి.

ప్రశ్న 3.
ఎటువంటి పాఠ్యాంశాలు ఉండరాదు ?
జవాబు.
పాఠ్యాంశాలు సమకాలీన సామాజిక దృష్టికి అభ్యంతరకరమైనవిగా ఉండకూడదు.

ప్రశ్న 4.
విద్యార్థులకు దేనిని పరిచయం చేయడం అత్యవసరం ?
జవాబు.
విద్యార్థులకు ఆధునిక వచన రచనాశైలిని పరిచయం చేయడం అత్యవసరం.

ప్రశ్న 5.
ప్రస్తుతం వేటికి ప్రాముఖ్యం పెరిగి పోతోంది?
జవాబు.
దేశ భాషలో పరిపాలన, విద్యాబోధన, సమాచార వినిమయం.

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 5th Lesson శతక సుధ Textbook Questions and Answers.

శతక సుధ TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana

చదువండి – ఆలోచించి చెప్పండి.

యాదగిరీశుని వేడుకొంటూ తిరువాయిపాటి వేంకట కవి రచించిన కింది పద్యాన్ని చదువండి.

వాదము చేయఁగా నరులు వాక్య పరుండని యెగ్గు చేతురున్
మోదముతో భుజించునెడ ముందుగఁ బిల్తురు తిండిపోతుగా,
ఏదియుఁ బల్కకున్నయెడ నీతఁడు మూగని యెంచుచుంద్రుగా,
నీ దయగల్గఁగా సుఖము నేర్పును యాదగిరీంద్ర మ్రొక్కెదన్.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఈ పద్యం ఏ శతకం లోనిది ? కవి ఎవరు ?
జవాబు.
ఈ పద్యం శ్రీయాదగిరీంద్ర శతకం లోనిది. కవి తిరువాయిపాటి వేంకటకవి.

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ

ప్రశ్న 2.
ఈ పద్యాన్ని చదివినప్పుడు మీరేం గ్రహించారు ?
జవాబు.
ప్రజలు ప్రతి విషయానికీ ఎదుటి వారిని విమర్శిస్తూనే ఉంటారు. జనుల మెప్పుపొందడం తేలికకాదు అని ఈ పద్యాన్ని చదివి గ్రహించాను.

ప్రశ్న 3.
కవులు శతక పద్యాలు ఎందుకు రాస్తారు ?
జవాబు.

ప్రశ్న 4.
ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, సమాజంలోని మంచి చెడ్డలు తెలియజెప్పడానికి, ప్రజలకు మంచి నడవడి అలవర్చడానికి కవులు శతక పద్యాలు రాస్తారు.
ఈ పద్యంలోని మకుటం ఏమిటి ?
జవాబు.
“యాదగిరీంద్ర” అనేది ఈ పద్యంలోని మకుటం

ప్రశ్న 5.
మీకు తెలిసిన కొన్ని శతకాల మకుటాలను చెప్పండి.
జవాబు.
యాదగిరీంద్ర !
విశ్వదాభిరామ వినురవేమ |
సుమతీ !
దాశరథీ కరుణాపయోనిధీ,
శ్రీ కాళహస్తీశ్వరా !
కుమారా !
కుమారీ !
నరసింహ ! దురిత దూర మొదలైనవి.

ఆలోచించండి- చెప్పండి (TextBook Page No. 47)

ప్రశ్న 1.
కవి ఉద్దేశంలో నిజమైన సుఖం అంటే ఏమిటి ? ‘వివేకధనం’గా కవి వేటిని పేర్కొన్నాడు ?
జవాబు.
పేదలకు సమృద్ధిగా అన్నము, వస్త్రాలు దానం చేయాలి. నీచమైన సుఖాల కోసం అబద్ధాలు మాట్లాడకూడదు. ఇతరులతో తగవులు పెట్టుకోకూడదు. హద్దు మీరి ప్రవర్తించరాదు. అందరితో స్నేహంగా ఉండాలి. ఇవే తెలుసుకోవలసిన విషయాలు. ఇవన్నీ తెలుసుకోవడమే వివేకధనం అని కవి పేర్కొన్నాడు.

ఆలోచించండి- చెప్పండి (TextBook Page No. 48)

ప్రశ్న 1.
ఎట్లాంటి చదువు వ్యర్థమని మీరనుకొంటున్నారు. ఎందుకు ?
జవాబు.

ప్రశ్న 2.
మంచికూర ఎంత కమ్మగా నలభీమ పాకంగా చేసినా అందులో చాలినంత ఉప్పు వేయకపోతే రుచిగా ఉండదు. అలాగే ఎంత గొప్ప చదువులు చదివినా ఆ చదువులోని సారం గ్రహించలేకపోతే అటువంటి చదువు వ్యర్థం అని అనుకుంటున్నాను. సత్సంపదలు అంటే ఏవి ?
జవాబు.
మంచివారితో స్నేహం, మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం, మోక్షాన్ని పొందడం – ఇవీ సత్సంపదలు.

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ

ప్రశ్న 3.
డబ్బు కూడబెట్టి దానధర్మం చేయనివాడిని తేనెటీగతో ఎందుకు పోల్చారు ?
జవాబు. తేనెటీగ పువ్వు పువ్వుకూ తిరిగి తేనెను తెచ్చి పట్టులో దాచి పెడుతుంది. అది తాగదు. చివరికి బాటసారులు ఆ తేనెను పిండుకుంటారు. అలాగే పిసినారి దానధర్మాలు చేయకుండా డబ్బు దాచిపెట్టి తాను అనుభవించకుండా కష్టపడతాడు. చివరికి ఆ దాచిన డబ్బు రాజులపాలో దొంగలపాలో అవుతుంది. అందుచేత దానధర్మం చేయనివాడిని తేనెటీగతో పోల్చారు.

ఆలోచించండి- చెప్పండి (TextBook Page No. 49)

ప్రశ్న 1.
మంచిమార్గంలో నడిచే ఆలోచనలు కలుగకపోవటానికి కారణాలేవి ?
జవాబు.
మానవుడు అంతంలేని కోరికలతో ఇష్టాలను పెంచుకుంటూ కొత్త కొత్త వాటికోసం ఆశపడుతూనే ఉంటాడు. అవి తీర్చుకోడానికి మంచి చెడు తెలుసుకోలేని అమాయకుడై ఉక్కిరిబిక్కిరైపోతూ చెడుదారులలో తిరుగుతుంటాడు. అందుకనే మంచి మార్గంలో నడిచే ఆలోచన చెయ్యడానికి కూడా అతడికి తీరిక దొరకదు.

ప్రశ్న 2.
“చెప్పుట చేయుటేకమై” నడవటమంటే ఏమిటి ?
జవాబు.
మనం ఏమి ఆలోచిస్తున్నామో అదే ఇతరులకు చెప్పాలి. ఇతరులకు మనమేమి చెప్పామో అదే ఆచరించాలి. ఆలోచనచేసే మనస్సు, చెప్పే మాట, చేసే పని ఈ మూడూ ఒకటిగా ఉండాలి. దీనినే త్రికరణ శుద్ధిగా ఉండటం అంటారు. చెప్పుట చేయుట ఏకమై నడవడమంటే ఇదే.

ప్రశ్న 3.
కవి చెప్పిన పుణ్యపు పనులేవి ?
జవాబు.
ఆకలితో, దప్పికతో బాధపడేవారికి కొంచెం అన్నము గాని, కూరగాని, నీరుగాని ఇచ్చి వారి బాధను తీర్చాలి. అలాచేస్తే ఎన్నో పుణ్యాలు చేసినంత ఫలితం లభిస్తుంది. ఇతరులకు మేలు కలిగే పని చేసినందుకు, ప్రియమైన పనిచేసినందుకు దేవుడు మెచ్చుకుంటాడు.

ఇవి చేయండి

విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. పాఠంలోని పద్యాలను రాగ, భావయుక్తంగా చదవండి.

జవాబు.
విద్యార్థి కృత్యం.

2. శతక పద్యాలు సమాజాన్ని అర్థం చేసుకోవడానికి తోడ్పడుతాయి చర్చించండి.

జవాబు.
శతక పద్యాలలో కవులు వారి సమకాలికమైన సమాజంలోని ఆచారాలు, అలవాట్లు, నీతి నియమాలు, కట్టుబాట్లు మొదలైన వాటిని వివరిస్తారు. ఏది మంచి, ఏది చెడు అని తెలియజెప్పడానికి ప్రయత్నిస్తారు. అందుచేత శతక పద్యాలు సమాజాన్ని అర్థం చేసుకోవడానికి తోడ్పడుతాయి అని చెప్పవచ్చు.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

1. పాఠంలోని పద్యాల ఆధారంగా కింద తెలిపిన పదాలతో వేటిని పోల్చినారో రాయండి.

అ) ఉప్పు : _________________
జవాబు. రసజ్ఞతను

ఆ) వేదాలు : _________________
జవాబు. వివేకధనాన్ని

ఇ) సుడిగుండాలు : _________________
జవాబు. కోరికలను

2. కరీంనగర్ జిల్లా వేములవాడ కవి మామిడిపల్లి సాంబశివశర్మ రాసిన కింది పద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సరైన జవాబును గుర్తించండి.

పరువు లేకున్న జగతి సంబరము లేదు
సంబరము లేక అన్నమే సైపబోదు
అన్నమే లేక యున్న సోయగము సున్న
సోయగము లేక యున్న మెచ్చుదురె జనులు.

అ. అందంగా ఉండాలంటే ఇది అవసరం
ఎ) నగలు
బి) రంగు
సి) అన్నం
డి) వస్త్రాలు
జవాబు.
సి) అన్నం

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ

ఆ. పరువు అంటే అర్థం
ఎ) ధనం
బి) గౌరవం
సి) పండుగ
డి) ప్రాణం
జవాబు.
బి) గౌరవం

ఇ. సంతోషంగా లేకపోవడం వల్ల సహించనిది ఏది ?
ఎ) అన్నం
బి) చదువు
సి) ప్రార్థన
డి) భక్తి
జవాబు.
ఎ) అన్నం

ఈ. జనులు మెచ్చుకొనటానికి ఒక కారణం
ఎ) దుర్మార్గం
బి) కోపం
సి) ద్వేషం
డి) సోయగం
జవాబు.
డి) సోయగం

ఉ. ప్రపంచంలో ప్రతి మనిషికి ఉండవలసినది
ఎ) పరువు
బి) సంబరం
సి) అన్నం
డి) పైవన్నీ
జవాబు.
ఎ) పరువు

III. స్వీయరచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. “తుచ్ఛ సౌఖ్య సంపాదనకై యబద్ధములఁ బల్కకు, వాదము లాడబోకు” అని భాస్కరకవి ఎందుకు చెప్పి ఉంటాడు?
జవాబు.
ఎవరైనా మంచి ప్రవర్తన గలవారినే ఇష్టపడతారు. అబద్ధాలాడేవారిని, అన్యాయంగా ఒకరి సొమ్ము కాజేసే వారిని సమాజం హర్షించదు. అందరితో తగవులు పెట్టుకొని అబద్ధాలాడి అన్యాయాలు చేసి నీచమైన సుఖాలు పొందవలసిన పనిలేదు. అందువల్ల మంచి మార్గంలో నడిచి పది మందితో మంచి అనిపించుకోవాలని భాస్కర కవి చెప్పాడు.

ఆ. వివేకవంతునికి ఉండవలసిన లక్షణాలేవి ?
జవాబు.
వివేకి అయినవాడు తనకు ఉన్న దానిలో నుండి కొంతైనా అనాథలకు, పేదలకు సాయం చేయాలి. నీచమైన సుఖాల కోసం అబద్ధాలాడకూడదు. అనవసరంగా ఎవరితోనూ వాదనకు దిగకూడదు. అమర్యాదగా ప్రవర్తించ కూడదు. అందరితోనూ స్నేహంగా మెలగాలి. పైన చెప్పిన లక్షణాలన్నింటిని వేదాలుగా భావించాలి. ఇవే వివేకులకు ఉండవలసిన లక్షణాలు.

ఇ. పెంపునదల్లివై …. అనే పద్యంలోని అంతరార్థాన్ని మీరేమని గ్రహించారు ?
జవాబు.
భగవంతుడు సర్వ సమర్థుడు. ఆయన శరణు జొచ్చిన వారి పోషణ, రక్షణ మొదలైన అన్ని బాధ్యతలు ఆయనే చూసుకుంటాడు. మానసిక శారీరకమైన అన్ని జబ్బులను దూరంచేసి తన భక్తులను ఆరోగ్యంగా ఉంచుతాడు. పాపాలంటనీకుండా మంచిదారిలో నడిపిస్తాడు. శాశ్వతమైన మోక్ష పదాన్ని అనుగ్రహిస్తాడు. అని “పెంపున తల్లివై’ అనే పద్యం ద్వారా తెలుస్తుంది.

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ

ఈ. “కోరికలకు బానిసై ఉక్కిరి బిక్కిరి కావడం కంటె విశిష్టమార్గాన్ని వెతుక్కోవటం మంచిది” దీనిపై మీ అభిప్రాయాన్ని రాయండి.
జవాబు.
కోరికలు మనిషి మనుగడకు ఆటంకాలు. కోరికలు ఒకసారి మొదలైతే ఒకటి తీర్చుకుంటే మరొకటి పుట్టుకొస్తూనే ఉంటుంది. మనిషి ఆ కోరికల సాగరంలో కొట్టుకుపోతూ ఉక్కిరిబిక్కిరై పోతాడు. వాటిని సాధించుకోడానికి అక్రమ మార్గాలు వెతుక్కుంటాడు. అనేక కష్టనష్టాలకు గురి అవుతాడు. అందుకే విశిష్ట మార్గాన్ని వెతుక్కోవటం మంచిది.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ. శతక కవులు ఈ విధమైన పద్యాలను ఎందుకు రాసి ఉంటారో కారణాలు రాయండి.
జవాబు.
1. పరిచయం : వేమన, బద్దెన, పోతన, భాస్కర కవి, మారద వెంకయ్య, భక్త రామదాసు, శేషప్పకవి … ఇలా ఎందరో శతక కవులు మన సాహిత్యంలో కనబడతారు.

2. నిశిత పరిశీలన : శతక కవులు తమ కాలంలో తమ చుట్టూ ఉండే పరిసరాలు, సమాజం, మనుషులు, వారి ప్రవర్తన, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, మూఢనమ్మకాలు, ధనవంతుల అత్యాచారాలు, పేదవారి అగచాట్లు మొదలైన విషయాలను జాగ్రత్తగా పరిశీలించేవారు. వాటిని గమనిస్తూ వారి మనసుల్లో కలిగే భావాలను పద్యరూపంలో పెట్టి శతకాలుగా రాసి ఉంటారు.

3. సమాజాన్ని సంస్కరించాలనే తహతహ : కొన్ని భక్తి శతకాలు, కొన్ని నీతి శతకాలు మనకు లభిస్తున్నాయి. ఏ శతకమైనా పైన చెప్పిన అంశాలను ప్రజలకు వివరించడం, వాటిలోని మంచిచెడులను గుర్తింపజేయడం, మంచిమార్గంలో నడిచేందుకు స్ఫూర్తినివ్వడం, లక్ష్యంగా పెట్టుకొని శతక కవులు ఈవిధమైన పద్యాలు రాసి ఉండవచ్చు. ప్రజలు మూఢనమ్మకాల్లో కొట్టుకొని పోకుండా ఉండడానికి, సమాజం చెడుమార్గంలో వెళుతూ ఉంటే సరైన మార్గంలో పెట్టడానికి శతకాలు రాసి ఉంటారు.

IV. సృజనాత్మకత/ప్రశంస

1. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) పాఠశాలలో పిల్లలకు నిర్వహించే పద్యాల పోటీలో పిల్లలందరు పాల్గొనాలని కోరుతూ ఒక ప్రకటనను రాయండి. (ప్రకటనలో పోటీ నిర్వహణ తేదీ, స్థలం, సమయం మొదలైన వివరాలుండాలి)

ప్రకటన
పద్య పఠనం పోటీలు

ఎస్.ఆర్.ఎమ్. ప్రాథమికోన్నత పాఠశాల వారి ఆధ్వర్యంలో 6, 7, 8 తరగతుల విద్యార్థులకు అంతర పాఠశాలలతో పద్య పఠనం పోటీలు నిర్వహించబడతాయి. పోటీ ఆగష్టు 13వ తేదీన జరుగుతుంది. పోటీలో గెలిచినవారికి ఆగష్టు 15న జరిగే జెండా వందనం ఉత్సవంలో బహుమతులు అందించబడతాయి.

నిబంధనలు :
పద్యాలు రాగయుక్తంగా పాడాలి.
తప్పులు లేకుండా పాడాలి.
స్పష్టమైన ఉచ్చారణతో పాడాలి.
నిర్ణయం న్యాయ నిర్ణేతలదే.

ఆసక్తిగల విద్యార్థులు ఆగష్టు 5వ తేదీ నాటికి తమ పేర్లు నమోదు చేయించుకోగలరు.

వేదిక :
ఎస్.ఆర్.ఎమ్. ప్రాథమికోన్నత పాఠశాల, వరంగల్.
నిర్వహణ తేదీ : XX,XX.XXXX
సమయం ఉదయం 10 గంటల నుంచి

ఇట్లు
కార్యదర్శి,
ఎస్. ఆర్. ఎమ్. పాఠశాల
వరంగల్.

V. పదజాల వినియోగం:

1. కింది వాక్యాలలోని సమానార్ధక పదాలను గుర్తించి, గీత గీయండి.

అ) ఇతరుల దోషాలు ఎంచేవాళ్ళు తమ   తాము తెలుసుకోరు.
జవాబు.
దోషాలు = తప్పులు

ఆ) తేనెతెట్టు నుండి తేనెను సేకరిస్తారు. ఆ మధువు తీయగా ఉంటుంది.
జవాబు.
తేనె = మధువు

2. కింది వాక్యాలలోని గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.

ఉదా : సహృదయత గల వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది.
జవాబు.
సహృదయత = మంచి మనసు

అ) పూలతో పాటు దండలోని దారం కూడా పరిమళాన్నిస్తుంది.
జవాబు.
పరిమళం = సువాసన

ఆ) సజ్జనుల మైత్రి ఎప్పటికీ సంతోషాన్నిస్తుంది.
జవాబు.
మైత్రి = స్నేహం

3. కింద ఇవ్వబడిన పదాలలో ప్రకృతులకు వికృతులు, వికృతులకు ప్రకృతులు రాయండి.

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ 1
జవాబు.

ప్రకృతి వికృతి
గుణం గొనం
దోషం దోసం
సుఖం సుకం
పుణ్యెం పున్నెం
అగ్ని అగ్గి
వైద్యుడు వెజ్జు
ధర్మం దమ్మం

 

VI. భాషను గురించి తెలుసుకుందాం.

1. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.

అ) దశేంద్రియ = _________ + _________ + _________
జవాబు.
దశ + ఇంద్రియ – గుణసంధి

ఆ) లక్షాధికారి = _________ + _________ + _________
జవాబు.
= లక్ష + అధికారి – సవర్ణదీర్ఘ సంధి

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ

ఇ) పట్టెడన్నము = _________ + _________ + _________
జవాబు.
= పట్టెడు + అన్నము – ఉత్వ సంధి

ఈ) రాతికంటు = _________ + _________ + _________
జవాబు.
= రాతికి + అంటు – ఇత్వ సంధి

ఉ) చాలకున్న = _________ + _________ + _________
జవాబు.
చాలక + ఉన్న – అత్వసంధి

2. కింది విగ్రహవాక్యాలకు సమాసపదాలు రాసి, సమాసం పేరు రాయండి.

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ 2
జవాబు.
సమాసపదం – విగ్రహవాక్యం – సమాసం పేరు
అ) ఆకలిదప్పులు – ఆకలియు, దప్పియు – ద్వంద్వ సమాసం
ఆ) అన్నవస్త్రాలు – అన్నము, వస్త్రము – ద్వంద్వ సమాసం
ఇ) దశేంద్రియాలు – దశ సంఖ్య గల ఇంద్రియములు – ద్విగు సమాసం
ఈ) నాలుగు వేదాలు – నాలుగైన వేదాలు – ద్విగు సమాసం

ఛందస్సు – లఘువు, గురువు

కింది వానిని చదివి తెలుసుకోండి.

పద్యాలలో, గేయాలలో ఉండే మాత్రలు, గురు లఘువులు, గణాలు, యతులు, ప్రాసలు మొదలైన వాటిని గురించి తెలియజెప్పేది ఛందస్సు.

అ) “లఘువు” – ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేది. దీనిని ‘ల’ అక్షరంతో సూచిస్తారు. దీని గుర్తు “” (నిలువుగీత). లఘువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం.

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ 3

ఆ) “గురువు” – రెండు మాత్రల కాలంలో ఉచ్చరించేది. దీనిని ‘గ’ అనే అక్షరంతో సూచిస్తారు. దీని గుర్తు “U”. గురువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం.

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ 4

3. కింది పదాలకు గురులఘువులు గుర్తించండి.

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ 5
జవాబు.
TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ 6

గణాలు

గణం అంటే మాత్రల అక్షరాల సముదాయం. అంటే గురు లఘువుల సమూహం. ఈ గణాలలో ఏక అక్షర (ఒకే అక్షరం) గణాలు, రెండు అక్షరాల గణాలు, మూడు అక్షరాల గణాలు ఉంటాయి.

1. ఏక (ఒకే) అక్షర గణాలు. ఆ ఒకే అక్షరం లఘువు అయితే ” అనీ, గురువు అయితే ‘U’ అనీ గుర్తు ఉంటుంది.

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ 7

2. రెండు అక్షరాల గణాలు.
TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ 8

3. మూడు అక్షరాల గణాలు.
TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ 9

కింది పద్య పాదాలకు గురులఘువులను గుర్తించి గణ విభజన చేసిన తీరు చూడండి.
TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ 10

4. కింద పద్య పాదాలకు గురులఘువులను గుర్తించి గణ విభజన చేయండి.

అ) బీదల కన్న వస్త్రములు పేర్మినొసంగుము తుచ్ఛ సౌఖ్యసం
జవాబు.
TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ 11
సూచన : ఇందులో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు ఉన్నాయి. అందువల్ల ఇది ఉత్పలమాల పద్యపాదము –

ఆ) పొదవెడు నుప్పులేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా
జవాబు.
TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ 12
సూచన : ఇందులో న, జ, భ, జ, జ, జ, ర ‘అనే గణాలు ఉన్నాయి. అందువల్ల ఇది చంపకమాల పద్య పాదం. ‘పొ’ కి, ‘పు’ కి యతి స్థానం.

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని

కింది తరగతుల్లో ఇచ్చిన శతక పద్యాల ఆధారంగా ఆ శతకాల పేర్లు, వాటిని రాసిన కవుల పేర్లు సేకరించి, పట్టిక తయారుచేసి, నివేదిక రాసి తరగతిలో ప్రదర్శించండి.
TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ 13
జవాబు.

శతకం పేరు కవి పేరు
1. వేమన శతకం వేమన
2. సుమతీ శతకం బద్దెన
3. శ్రీకాళహస్తీశ్వర శతకం ధూర్జటి
4. వృషాధిప శతకము పాల్కురికి సోమన
5. దాశరథీ శతకం కంచర్ల గోపన్న
6. సుభాషిత త్రిశతి ఏనుగు లక్ష్మణకవి
7. భాస్కర శతకం మారద వెంకయ్య
8. నారాయణ శతకం పోతన
9. కుమార శతకము పక్కి అప్పల నర్సయ్య
10. చిత్తశతకం శ్రీపతి భాస్కరకవి
11. కాళికాంబ శతకం శ్రీ పోతులూరి వీరబ్రహ్మం
12. తెలుగుబాల జంధ్యాల పాపయ్యశాస్త్రి

 

ఇ) ముగింపు :
జంధ్యాల పాపయ్యశాస్త్రి
ఈ విధంగా వివిధ పుస్తకాలను అధ్యయనం చేయడం ద్వారా నేను వివిధ శతక కర్తలు, వారి పద్యాల గొప్పదనం తెలుసుకొన్నాను. అంత పురాతన కాలంలో, సాంఘిక రుగ్మతలు రూపు మాపటానికి కలాన్ని ఎన్నుకొని కృషి చేసిన ఆ మహనీయులు ఎంతో అభినందనీయులు.
TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ 14

TS 8th Class Telugu 5th Lesson Important Questions శతక సుధ

ప్రశ్న 1.
అంతరార్థం తెలుసుకోని చదువు వృథా అనడానికి భాస్కర శతక కర్త ఏ ఉదాహరణ చెప్పారు ?
జవాబు.
భాస్కరా! ఎంత చదువు చదివినా, అందులోని అంతరార్థాన్ని గ్రహించలేనప్పుడు ఆ చదువు వ్యర్థం. అటువంటి చదువును ఎక్కడైనా గుణవంతులు మెచ్చుకోరు. ఎంత బాగా వంటచేసినా దానిలో తగినంత ఉప్పు లేకపోతే అది రుచించదు కదా! అని భాస్కర శతక కర్త అన్నాడు.

ప్రశ్న 2.
“ఇతరులు గౌరవించనంత మాత్రాన తాను చేస్తున్న మంచి పనిని, వృత్తిని తక్కువగా అనుకోనక్కర్లేదు”. ఉదాహరణలతో రామసింహకవి ఎట్లా సమర్థించాడు ?
జవాబు.
మొగిలిపువ్వు మూలాలు బురదలో ఉన్నంత మాత్రాన దాని ప్రాధాన్యత ఎంత మాత్రం తగ్గదు. పశువుల దోషాలేవీ పాలకు అంటుకోవు. ఇచ్చే మందులకు వైద్యుని కులంతో సంబంధమేమి ఉండదు. కప్పల దోషాలవల్ల ముత్యాల వన్నె కొంచెం కూడా తగ్గదు. ఎద్దు స్వరూపం ఎట్లున్నా వ్యవసాయానికి ఇబ్బంది రాదు. మనిషిని వెలివేసినా, అతని విద్యకు లోటేమిరాదు. అపవిత్రత వలన కలిగే దోషాలతో అగ్నిదేవునికి సంబంధం లేదు. చందనం మలినమైనంత మాత్రాన సువాసనలు ఎక్కడికీపోవు. రాయికి అంటిన బెల్లం తీపి కొంచెం కూడా తగ్గదు. ఇతరులు గౌరవించనంత మాత్రాన అతని వృత్తి ఘనతకు ఏ భంగమూ కలుగదు అని పండిత రామసింహకవి చెప్పాడు.

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ

ప్రశ్న 3.
శతక పద్యాలలోని విలువలు విద్యార్థులను తీర్చి దిద్దుతాయి” ఎట్లాగో వివరించండి.
(లేదా)
శతక పద్యాలలో ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నారు కదా! వాటిని విద్యార్థులు తెలుసుకోవటం వల్ల భవిష్యత్తులో సమాజం చాలా బాగుంటుంది. ఎట్లాగో వివరించండి.
(లేదా)
“శతక సుధ” పాఠం ద్వారా మీరు తెలుసుకున్న మంచి విషయాలు ఏమిటి?
(లేదా)
సమాజం యొక్క మేలుకోసం శతక పద్యాలు ఏ విధంగా తోడ్పడుతాయి?
జవాబు.
సమాజహితాన్ని కోరి శతక కవులు శతక రచనలు చేశారు. సమాజంలోని పరిస్థితులను తెల్పుతూ, మానవుడిలో నైతిక, ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుటకు శతక కవులు కృషి చేశారు. సమాజంలోని ఆచారాలు, నీతిని వివరించుటే లక్ష్యంగా నీతి, భక్తి శతకాలను రచించారు. సమాజహితమే వీరి లక్ష్యం. సత్యం, దయ, శాంతం, భక్తి, ధ్యానం, మంచి మనసు, ధర్మం, ధైర్యం లాంటి గుణాలు నాకు ఇచ్చి నీ భక్తుడుగా ఉండే సుఖం ఇవ్వమని భక్తుల లక్షణాలు తెలిపారు.

పేదవారికి దానం, నీచ సుఖాలకి అబద్ధాలాడకుండుట, వాదనకు దిగకుండుట, హద్దు మీరి ప్రవర్తించకుండా సఖ్యంగా ఉండటం వివేకుల ధనం అని తెల్పారు. శాశ్వత సంపదలు ఇచ్చేది భగవంతుడు. దానం చేయకుండా దాస్తే పోయేముందు తీసుకెళ్ళడు. చివరికి బాటసారుల పాలౌతుంది. ఇతరులు గౌరవించనంతమాత్రాన వృత్తి ఘనతకు భంగం కలుగదు. భగవంతుని భక్తులను సేవించుట భగవంతుని సేవయే అని, మంచిదారిలో నడిచే ఆలోచన కల్గించేది భగవంతుడే అని తెలియచేశారు.

శతక పద్యాలలో ఇటువంటి ఎన్నో మంచి విషయాలు విద్యార్థులు తెలుసుకోవటం వల్ల విద్యార్థులు భవిష్యత్తులో మంచివారుగా ఉండటమే కాకుండా సమాజాభివృద్ధికి తోడ్పడగలరు. ఇట్లాంటి మంచి నీతులు తెల్పే శతక పద్యాలు విద్యార్థులు చదవటం ఎంతో అవసరం. ఈ నీతులు విద్యార్థులను మంచివారుగా తీర్చి దిద్దుతాయనుటలో అతిశయోక్తి లేదు.

ప్రశ్న 4.
“చెడ్డ వారితో ఉన్నంత మాత్రాన వారి దోషాలు మంచివారికి అంటుకోవు” శతక సుధ పాఠం ఆధారంగా వివరించండి.
జవాబు.

  1. మొగలి పువ్వు మూలాలు బురదలో ఉన్నా పువ్వు ప్రాధాన్యత తగ్గదు.
  2. పశువుల దోషాలు పాలకు అంటుకోవు.
  3. వైద్యుడిచ్చే మందులకు అతని కులంతో సంబంధమేమీ ఉండదు.
  4. కప్పల దోషాల వల్ల ముత్యాల వన్నె తగ్గదు.
  5. ఎద్దుల స్వరూపం ఎట్లా ఉన్నా వ్యవసాయానికి ఇబ్బంది రాదు.
  6. మనిషిని వెలివేసినా అతని విద్యకు లోటురాదు.
  7. అపవిత్ర దోషాలు అగ్నికి అంటవు.
  8. చందనం మలినమైనంత మాత్రాన దాని సువాసనలు ఎక్కడికీపోవు.
  9. రాయికి అంటిన బెల్లం తీపి కొంచెంకూడా తగ్గదు.
  10. ఇతరులు గౌరవించనంత మాత్రాన వృత్తి ఘనతకు ఏ భంగం కలుగదు.

దీనిని బట్టి చెడ్డవారితో ఉన్నంతమాత్రాన వారి దోషాలు మంచివారికి అంటుకోవని చెప్పవచ్చు.

ప్రశ్న 5.
శతక సుధ పాఠంలో నీవు చదివిన పద్యాల్లో నీకు బాగా నచ్చిన వాక్యం గురించి మీ చెల్లికి లేఖ రాయండి.

ది. XX.XX.XXXX,
ఖమ్మం.

ప్రియమైన చెల్లి దేవికకు!

నీవు బాగా చదువుకుంటున్నావని తలుస్తాను. నేనిక్కడ హాస్టల్లో బాగానే చదువుకుంటున్నాను. ఈమధ్యే మా తెలుగు మాస్టారు ‘శతక సుధ’ పాఠం చెప్పారు. అందులో ఎన్నో చక్కని విషయాలు చెప్పారు. అందులోని ప్రతి పద్యమూ మన జీవితాలకు ఉపయోగపడేదే.

అందులో పండిత రామసింహకవి రాసిన విశ్వకర్మ శతకం నుండి ‘మొదట కర్దమముంటే మొగలి పుష్పముకేమి’ అనే పద్యం నాకు బాగా నచ్చింది.

బురద ఉన్నా మొగలిపువ్వు వాసన తగ్గదు. అపవిత్ర దోషాలతో అగ్నిదేవునికి వచ్చిన చిక్కులేదు. ఇలా ఎన్నో ఉదాహరణలతో మనం చేసే మంచి పనిని ఒకరు గుర్తించకపోయినా నష్టం లేదు అని చెప్పారు. ఒకరి మెప్పుకోసం కాక మన పనిని మనం ఇష్టంతో చేయాలని దీనర్థం.

నీవు కూడా నీ పుస్తకంలోని శతక పద్యాలు చదువు. నీకిష్టమైన పద్యం గూర్చి రాయి. అమ్మనీ, నాన్ననీ అడిగానని చెప్పు.

నీ అక్క
కె. రాజ్యలక్ష్మి

చిరునామా :
కొప్పురావూరి దేవిక
C/o. రమేష్
పుణ్యపురం
వైరా మండలం
ఖమ్మం జిల్లా

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ

పర్యాయపదాలు:

  • కృప = దయ, కరుణ
  • చిత్తము = మతి, మనస్సు
  • కరము = మిక్కిలి, అధికము
  • మా = రమ, లక్ష్మీదేవి
  • తుచ్ఛము = నీచము, అల్పము
  • ఉప్పు = లవణం, రుచి
  • మెయి = మేను, శరీరం
  • విత్తము = ధనము, డబ్బు
  • పుష్పము = పూవు, కుసుమము
  • పరిమళము = సుగంధము, సువాసన
  • కలుషము = దోషము, పాపము

నానార్థాలు:

  • కరము = మిక్కిలి, చేయి, ఏనుగుతొండం, పన్ను
  • మర్యాద = గౌరవము, హద్దు
  • పెంపు =అభివృద్ధి, పెద్దచేయుట
  • కృషి = వ్యవసాయము, కష్టము

ప్రకృతులు – వికృతులు:

  • మర్యాద – మరియాద
  • శుద్ధి – సుద్ది
  • స్థిరము – తిరము
  • భృంగారము – బంగారము
  • కులము – కొలము
  • విద్య – విద్దె

వ్యుత్పత్త్యర్థాలు:

  • ఆంజనేయుడు = అంజనీదేవి కుమారుడు (హనుమంతుడు)
  • దాశరథి = దశరథుని యొక్క కుమారుడు (శ్రీరాముడు)
  • పయోనిధి = నీటికి నిలయమైనది (సముద్రము)
  • భాస్కరుడు = వెలుగునిచ్చు కిరణములు కలవాడు (సూర్యుడు)

సంధులు:

  • సతతాచారము = సతత + ఆచారము
  • లక్షాధికారి = లక్ష + అధికారి
  • సాధు జనానురంజన = సాధుజన + అనురంజన = సవర్ణదీర్ఘసంధి
    సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.
  • ప్రేమటంచు = ప్రేమము + అటంచు = ఉత్వ సంధి
  • వెజ్జువై = వెజ్జువు + ఐ = ఉత్వ సంధి
  • సంపదలీయ = సంపదలు + ఈయ = ఉత్వ సంధి
  • తేడెవ్వడు = తేడు + ఎవ్వడు = ఉత్వ సంధి
  • విత్తమార్జన = విత్తము + ఆర్జన = ఉత్వ సంధి
  • లవణమన్నము = లవణము + అన్నము
  • మరుగైన = మరుగు + అయిన = ఉత్వ సంధి
  • కర్దమముంటే = కర్దమము + ఉంటే = ఉత్వ సంధి
  • ఎట్లున్న = ఎట్లు + ఉన్న = ఉత్వ సంధి
    సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.
  • కాకుండ = కాక + ఉండ = అత్వ సంధి
  • నేర్చునటయ్యా = నేర్చునట + అయ్యా = అత్వ సంధి
  • ఒందకుండ = ఒందక + ఉండ = అత్వ సంధి
    సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.
  • తల్లివై = తల్లివి + ఐ = ఇత్వ సంధి
  • జుంటీగ = జుంటి + ఈగ = ఇత్వ సంధి
  • రాతికంటు = రాతికి + అంటు = ఇత్వ సంధి
  • ఇట్టివౌ = ఇట్టివి + ఔ = ఇత్వ సంధి
    సూత్రం : ఏమి మొదలైన పదాలలోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.

పద్యాలు – ప్రతిపదార్థాలు – తాత్పర్యాలు

1. మ॥ సతతాచారము సూనృతంబు కృపయున్ సత్యంబునున్ శీలమున్
నతి శాంతత్వము చిత్తశుద్ధి కరమున్నధ్యాత్మయున్ ధ్యానమున్
ధృతియున్ ధర్మము సర్వజీవ హితముం దూరంబు గాకుండ స
మ్మతికిం జేరువ మీ నివాస సుఖమున్ మానాథ నారాయణా !

ప్రతిపదార్థం:

మానాథా = లక్ష్మీదేవికి భర్త అయిన వాడా
నారాయణా = ఓ విష్ణుమూర్తీ!
సతత = ఎల్లప్పుడు
ఆచారము = పెద్దలు చెప్పినట్లు నడుచుకోవడం
సూనృతంబు = మంచి మాట
కృపయున్ = దయ
సత్యంబునున్ = నిజము మాట్లాడుట
శీలమున్ = మంచి స్వభావము
నతి = వినయంగా ఉండటము
శాంతత్వము = ఓర్పుతో ఉండటము
చిత్తశుద్ధి కరమున్ = మనస్సు నిర్మలంగా ఉండటము
అధి+ఆత్మయున్ ధ్యానమున్
ధ్యానమున్ = స్మరణ
ధృతియున్ = ఇంద్రియ నిగ్రహము
ధర్మము = ధర్మ ప్రవర్తనము
మిక్కిలిగా దేవుని మీద భక్తి
సర్వజీవ = ప్రాణులన్నింటికి
హితమున్ దూరంబు = మేలు కోరుట
గాకుండా = ఇవేవి వదిలి పెట్టకుండా
మీ చేరువన్ = మీ సమీపంలో
సమ్మతికిన్ = మీకిష్టమగునట్లుగా
నివాస = నివసించుట అనే
సుఖమున్ = సౌఖ్యమును (ప్రసాదించుము)

తాత్పర్యం :
లక్ష్మీదేవి భర్త అయిన ఓ నారాయణుడా! ప్రియవచనం, దయ, సత్యం, మంచి స్వభావం, మిక్కిలి శాంతం, నిర్మలమైన మనస్సు, భగవద్భక్తి, ధ్యానం, ధైర్యం, ధర్మాలను సదా ఆచరిస్తూ, సర్వప్రాణుల మేలు కోరేవాడిగా, మీ సన్నిధిలో మీ కిష్టమైన వాడిగా ఉండే సుఖాన్ని దయచేయి (ఇవ్వుమని అర్థం)

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ

2. ఉ॥ బీదల కన్నవస్త్రములు పేర్మి నొసంగుము, తుచ్ఛ సౌఖ్యసం
పాదనకై యబద్ధములఁ బల్కకు, వాదము లాడబోకు, మ
ర్యాద నతిక్రమింపకు, పరస్పరమైత్రి మెలంగు, మిట్టి వౌ
వేదములంచెరుంగుము, వివేకధనంబిది నమ్ము, చిత్తమా!

ప్రతిపదార్థం:

చిత్తము + ఆ = ఓ మనసా !
బీదలకున్ = పేదవారికి
అన్న వస్త్రములు = కూడును, గుడ్డయు (గ్రాసవాసములు)
పేర్మిన్ = ప్రేమతో, అధికముగా
ఒసంగుము = ఇమ్ము, దానము చేయుము
తుచ్ఛ = నీచమైన, అల్పమైన
సౌఖ్య = సుఖముల యొక్క
సంపాదనకున్ + ఐ = గడనకై, ఆర్జనమునకై
అబద్ధములన్ = అసత్యములను, కల్లలను
పల్కకు = మాటలాడకుము, చెప్పకుము
వాదములు = వాగ్వాదములు, తగవులు
ఆడ = చేయుటకు, నడపుటకు
పోకు = వెళ్ళకుము
మర్యాదన్ = నీతి పద్ధతిని, హద్దును
అతిక్రమింపకు = మీఱకుము
పరస్పర = అన్యోన్యమైన
మైత్రిన్ = స్నేహముతో
మెలంగుము = నడచుకొనుము
వేదములు = ఆగమములు
ఇట్టి+అవి+ఔన్ = ఇటువంటివే యగును
అంచున్ = అని
ఎరుంగుము = తెలిసికొనుము
ఇది = ఇద్ది (ఈ పద్ధతి, ఈ గుణము)
వివేక = మంచి చెడులను తెలిసికొను తెలివి కలవారి యొక్క
ధనంబు = సంపద
నమ్ము = విశ్వసింపుము

తాత్పర్యం :
ఓ చిత్తమా! పేదవారికి అన్నదానం, వస్త్రదానం అధికంగా చేయి. నీచమైన సుఖాలకోసం అబద్ధాలాడకు. అనవసరంగా ఎవరితోను వాదనకు దిగకు. హద్దుమీరి ప్రవర్తించకు. అందరితో సఖ్యంగా ఉండు. ఈ సూత్రాలనే వేదాలుగా భావించు. వివేకులకు ఈ లక్షణాలే సంపదగా భాసిల్లుతాయి.

3. చ|| చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం
బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా!

ప్రతిపదార్థం:

భాస్కరా ! = ఓ సూర్యదేవా !
చదువు + అది = విద్య అనునది
ఎంత = ఏ కొలది
కల్గినన్ = ఉన్నప్పటికిని
ఇంచుక = కొంచెము
రసజ్ఞత = రసికత
చాలక + ఉన్నన్ = సరిపడక పోయినచో
ఆ చదువు = ఆ గొప్ప చదువు
నిరర్థకంబు = ప్రయోజనం లేనిది (అవుతుంది)
గుణసంయుతులు = సుగుణములతో కూడినవారు (సుగుణవంతులు)
ఎవ్వరున్ = ఎవరైనను
ఎచ్చటన్ = ఎక్కడ కూడా
మెచ్చరు = మెచ్చుకోరు
పదనుగన్ = అన్నీ కుదిరేటట్లు చక్కగా
మంచి కూరన్ = మంచికూరను, ఇష్టమైన కూరను
నలపాకము = నలమహారాజు వంటవలె
చేసినన్ + ఐనన్ = వండినప్పటికిని
అందున్ = ఆ కూరలో
ఇంపు + ఒదవెడు = ఇష్టమును కలిగించే (రుచిని కలిగించే)
ఉప్పులేక = ఉప్పు లేకపోయినచో
రుచి = రుచి
పుట్టగన్ + నేర్చున్ ఆట + అయ్య = కలుగుతుందా ? (కలుగదని భావం)

తాత్పర్యం :
భాస్కరా! ఎంత చదువు చదివినా, అందులోని అంతరార్థాన్ని గ్రహించలేనప్పుడు ఆ చదువు వ్యర్థం. అటువంటి చదువును ఎక్కడైనా గుణవంతులు మెచ్చుకోరు. ఎంత బాగా వంటచేసినా దానిలో తగినంత ఉప్పు లేకపోతే అది రుచించదు కదా!

4. ఉ॥ పెంపునదల్లివై, కలుషబృంద సమాగమ మొందకుండ ర
క్షింపను దండ్రివై, మెయి వసించు దశేంద్రియ రోగముల్ నిపా
రింపను వెజ్జువై, కృపగుఱించి పరంబు దిరంబుగాగ స
త్సంపద లీయ నీవెగతి దాశరథీ! కరుణా పయోనిధీ!

ప్రతిపదార్థం:

దాశరథీ! = దశరథుని కుమారుడవైన శ్రీరామా!
కరుణా = దయకు
పయోనిధీ = సముద్రం వంటి వాడా
పెంపునన్ = పిల్లలను పెంచడంలో
తల్లివి + ఐ = తల్లి వంటి దానివై
కలుషబృంద = పాపాల సమూహంతో
సమాగమము = కలయిక
ఒందకుండా = కలుగకుండా
రక్షింపను = కాపాడే విషయంలో
తండ్రివి + ఐ = తండ్రి వంటి వాడవై
మెయి = శరీరంలో
వసించు = ఉన్న
దశ + ఇంద్రియ = పది ఇంద్రియములకు సంబంధించిన
రోగముల్ = జబ్బులను
నివారింపను = తొలగించుటకు
వెజ్జువు + ఐ = వైద్యుని వంటి వాడివై
కృప గురించి = దయతో
పరంబు = మోక్షము
తిరంబు + కాగ = శాశ్వతమగునట్లుగా
సత్ సంపదలు = సత్యమైన మోక్ష సంపదలు
ఈయన్ = ఇచ్చుట
నీవు + ఎ = నీవు మాత్రమే
గతి = ఆధారము

తాత్పర్యం :
దయా సముద్రుడవైన రామా! పెంపకంలో తల్లివి. చెడుదారిన నడువకుండా కాపాడే తండ్రివి. ఇంద్రియ (జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ) రోగాలను తొలగించే వైద్యుడివి. మోక్షం స్థిరమయ్యేటట్లుగా దయతో మేలైన సంపదలు ఇవ్వడానికి నీవే దిక్కు.

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ

5. సీ॥ తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు
వెళ్ళిపోయెడినాడు వెంటరాదు
లక్షాధికారైన లవణమన్నమె కాని
మెఱుగు బంగారంబు మ్రింగఁబోడు
విత్తమార్జన చేసి విఱ్ఱవీగుటె కాని,
కూడఁ బెట్టిన సొమ్ముఁ గుడువఁ బోడు
పొందుగా మఱుగైన భూమిలోపల పెట్టి
దానధర్మము లేక దాచి దాచి

తే॥ తుదకు దొంగల కిత్తురో ? దొరలకవునొ ?
తేనె జుంటీగలియ్యవా తెరువరులకు
భూషణ వికాస ! శ్రీ ధర్మపుర నివాస
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

ప్రతిపదార్థం:

భూషణ వికాస! = ఆభరణములతో ప్రకాశించువాడా!
శ్రీ ధర్మ పుర నివాసా = ధర్మపురంలో నివసించే స్వామీ
దుష్ట సంహార! = దుర్మార్గులను సంహరించేవాడా
దురితదూర! = పాపములను పోగొట్టే వాడా
నరసింహ = నరసింహ స్వామీ
ఎవ్వడు = ఎవరూ కూడా
తల్లి గర్భము నుండి = తల్లి కడుపు నుండి పుట్టేటప్పుడు
ధనము తేడు = డబ్బు తీసుకురాడు
వెళ్ళి పోయెడినాడు. = మరణించే సమయంలో
వెంటరాదు = తనతో పాటు రాదు
లక్ష అధికారి + ఐన = లక్షలకు అధిపతి అయినప్పటికీ
లవణము + అన్నము + ఎ = ఉప్పు అన్నము తప్ప
మెరుగు = మెరిసిపోయె
బంగారము = బంగారాన్ని
మ్రింగన్ + పోడు = తినలేడు
విత్తము = డబ్బు
ఆర్జన చేసి = సంపాదించి
విర్రవీగుట + ఎ + కాని = అహంకరించడమే తప్ప
కూడన్ + పెట్టిన = పోగు చేసిన
సొమ్మున్ = సంపదను
కుడువన్ + పోడు = అనుభవించబోడు
పొందుగా = చక్కగా
మరుగు + ఐన = రహస్యంగా ఉన్న
భూమిలోపల = భూమిలో
పెట్టి = పాతిపెట్టి
దాన ధర్మము లేక = దానము ధర్మము లేకుండా
దాచి దాచి = ఎంతో కాలం దాచిపెట్టి
తుదకు = చివరికి
దొంగలకు + ఇత్తురో? = దొంగల పాలు చేస్తారో ?
దొరలకు + అవునో? = రాజుల పాలవుతుందో ?
తేనెజుంటి + ఈగలు = తేనెటీగలు
తెరువరులకు = బాటసారులకు
తేనె = తేనెను
ఇయ్యవు + ఆ = ఇవ్వడం లేదా

తాత్పర్యం :
శ్రీ ధర్మపురి నివాసుడా! ఆభరణాలచేత ప్రకాశించేవాడా! పాపాలను దూరం చేసేవాడా! దుర్మార్గులను పారదోలేవాడా! ఓ నరసింహా! తల్లి కడుపులో నుంచి పుట్టినప్పుడు ఎవ్వడూ ధనాన్ని వెంట తీసుకొనిరాడు. పోయేటప్పుడు వెంటతీసుకొని వెళ్ళలేడు. లక్షాధికారైనా ఉప్పుతో కూడిన ఆహారాన్నే కాని బంగారాన్ని తినలేడు. డబ్బు సంపాదించి గర్వం పెంచుకోడమే కానీ, తాను కూడబెట్టిన సొమ్మును తినడు. అలాంటిదాన్ని దానం, ధర్మం చేయకుండా భూమిలో పాతిపెడుతూ ఉంటాడు. తేనెటీగలు తేనెను బాటసారులకు సమర్పించుకొన్నట్టు ఆ సొమ్మును అనుభవించకుండానే చివరకు దొంగలపాలో, రాజులపాలో చేస్తాడు.

6. సీ॥ మొదట కర్దమముంటె మొగిలిపుష్పముకేమి ?
పశువుల దోషముల్ పాలకేమి ?
అరయ వైద్యుని కులం బౌషధంబునకేమి ?
కప్పదోషము మౌక్తికములకేమి ?
వృషభంబు లెట్లున్న కృషికర్మమునకేమి ?
వెలియైన వాని సద్విద్యకేమి ?
అపవిత్ర దోషంబు లగ్నిహెూత్రునకేమి ?
గుణదోషములవల్ల కులముకేమి ?
మలినమై చందనము పరిమళము జెడున
రాతికంటు గుడము మధురంబు జెడున
వినయములు జెడ మావృత్తి ఘనత జెడున
విశ్వ పాలన ధర్మ ! శ్రీ విశ్వ కర్మ!

ప్రతిపదార్థం:

విశ్వపాలన ధర్మ! = ప్రపంచాన్ని రక్షించుటయే ధర్మముగా కలవాడా!
శ్రీవిశ్వకర్మ! = ప్రపంచాన్ని సృష్టించిన వాడా!
మొదట = వేళ్ళ దగ్గర
కర్దమము + ఉంటే = బురద ఉంటే
మొగిలిపుష్పముకు + ఏమి = మొగలిపువ్వు తప్పేమిటి
పశువుల దోషముల్ = జంతువులు తప్పులు
పాలకు + ఏమి = పాలకెందుకుంటాయి
అరయ = ఆలోచించినట్లయితే
వైద్యుని కులంబు = వైద్యుని యొక్క కులముతో
ఔషధంబునకు = మందుకు
ఏమి = పనేముంది
కప్పదోషము = కప్పల వలన దోషం జరిగితే
మౌక్తికములకు + ఏమి = ముత్యాల గొప్పదనం తగ్గుతుందా ?
కృషి కర్మమునకు = వ్యవసాయమునకు
వృషభంబులు = ఎద్దులు
ఎట్లు + ఉన్నన్ +ఏమి = ఎలా ఉంటే ఏమిటి ?
వెలి + ఐన = సమాజమునకుదూరమైనప్పటికీ
వాని = అతడి
సత్ + విద్యకు +ఏమి= విద్యాభ్యాసానికి అడ్డేమిటి
అగ్నిహోత్రునకు = అగ్నిదేవునకు
అపవిత్రదోషంబులు + ఏమి = పాపమెందుకు అంటుతుంది
కులముకు = వంశానికి
గుణ దోషముల వల్ల ఏమి = పాపపుణ్యాలతో సంబంధం ఏముంది ?
మలినమై చందనము = మురికి పట్టినంత మాత్రాన
పరిమళము = గంధము యొక్క సువాసన
చెడును + అ = చెడిపోతుందా ?
రాతికి + అంటు = గుండ్రాయికి అంటుకున్న
గుడము = బెల్లము యొక్క
మధురంబు = తియ్యదనము
చెడును + అ = తగ్గిపోతుందా ?
వినయములు చెడన్ = గౌరవము లోపించినంత మాత్రాన
మా వృత్తి = మా పని యొక్క
ఘనత = గొప్పదనము
చెడును + అ = పాడైపోతుందా ?

తాత్పర్యం :
శ్రీ విశ్వకర్మా! విశ్వాన్ని ధర్మబద్ధంగా పరిపాలించేవాడా! మొగిలిపువ్వు మూలాలు బురదలో ఉన్నంత మాత్రాన దాని ప్రాధాన్యత ఎంత మాత్రం తగ్గదు. పశువుల దోషాలేవి పాలకు అంటుకోవు. ఇచ్చే మందులకు వైద్యుని కులంతో సంబంధమేమి ఉండదు. కప్పల దోషాలవల్ల ముత్యాల వన్నె కొంచెం కూడా తగ్గదు. ఎద్దుల స్వరూపం ఎట్లున్నా వ్యవసాయానికి ఇబ్బందిరాదు. మనిషిని వెలివేసినా, అతని విద్యకు లోటేమిరాదు. అపవిత్రత వలన కలిగే దోషాలతో అగ్నిదేవునికి సంబంధం లేదు. చందనం మలినమైనంత మాత్రాన సువాసనలు ఎక్కడికిపోవు. రాయికి అంటిన బెల్లం తీపి కొంచెం కూడా తగ్గదు. ఇతరులు గౌరవించనంత మాత్రాన అతని వృత్తి ఘనతకు ఏ భంగమూ కలుగదు.

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ

7. ఉ॥ లెక్కకురాని కోరికల రీతులలో బడి మానవుండిటుల్
ముక్కువలన్ సృజించుచు సమాయకుడై సుడులన్ పదేపదే
యుక్కిరి బిక్కిరై తిరుగుచుండునుగాని, విశిష్ట మార్గముల్
ద్రొక్కు తలంపులేశము కుదుర్కొననీయడె? వేంకటేశ్వరా!

ప్రతిపదార్థం:

వేంకట + ఈశ్వరా! = పాపాలను పోగొట్టే దైవమా!
మానవుండు = మానవుడు
లెక్కకు రాని = అనంతమైన
కోరికల రీతులలో = కోరికల సమూహంలో
పడి = చిక్కుకు పోయి
ఇటుల్ = ఈ విధముగా
మక్కువలన్ = కోరికలను
సృజించుచూ = ఇంకా ఇంకా పెంచుకుంటూ
అమాయకుడై = తెలివిలేనివాడై
పదే పదే = మాటి మాటికి
సుడులన్ = కోరికల సుడిగుండాలలో
ఉక్కిరి బిక్కిరి + ఐ= ఊపిరాడకుండా
తిరుగుచు + ఉండును + కాని = తిరుగుతుంటాడే తప్ప
విశిష్ట మార్గముల్ = మంచి దారులలో
త్రొక్కు = నడిచే
తలంపు = ఆలోచన
లేశ్యము = కొంచెమైన
కుదుర్కొననీయడు + ఎ ? = స్థిరపడనివ్వడు కదా ?

తాత్పర్యం : ఓ వేంకటేశ్వరా! మనిషి అధికమైన కోరికలకు బానిసై అమాయకత్వంతో వివిధ అనుబంధాలను సృష్టించుకుంటూ సుడిగుండాలలో పడి, ఉక్కిరిబిక్కిరై తిరుగుతుంటాడే గాని మంచి దారిలో నడిచే ఆలోచన కలిగేటట్లుగా చేయడం లేదు కదా!

8. ఉ|| ఆకలిదప్పులన్ వనట నందిన వారికి పట్టెడన్నమో
శాకమొ, నీరమో యిడి, ప్రశాంతుల జేసిన సర్వపుణ్యముల్
చేకురు, నీవుమెచ్చెదవు, శ్రేయము, ప్రేయమటంచు నెంతయున్
బాకవరాంజనేయ! ఖలభంజన! సాధుజనానురంజనా!

ప్రతిపదార్థం:

ఖల భంజన! = దుష్టులను శిక్షించే వాడా
సాధుజన = మంచివారిని
అనురంజన! = సంతోషపెట్టేవాడా
బావ+ ఆంజనేయ! = బాకవరంలో వెలసిన ఆంజనేయ స్వామీ!
ఆకలిదప్పులన్ = ఆకలితోనూ, దాహంతోనూ
వనటన్ = బాధను
అందినవారికి = పొందినవారికి
పట్టెడు అన్నము + ఓ = గుప్పెడు ఆహారమో
శాకము + ఓ = కూర
నీరము + ఓ = మంచినీరో
ఇడి = ఇచ్చి
ప్రశాంతుల = శాంతి పొందిన వారిగా
చేసినన్ = చేసినట్లయితే
సర్వపుణ్యముల్ = అన్ని పుణ్యములు
చేకురు = కలుగును
ఎంతయున్ = మిక్కిలి
శ్రేయము = మేలు కలిగించేది.
ప్రేమయు = ఇష్టాన్ని కలిగించేది
అటంచు = అంటూ
నీవు = దేవుడవైన నీవు
మెచ్చెదవు = మెచ్చుకుంటావు

తాత్పర్యం : పాపులను నశింపజేసేవాడ! సాధుజనులను ఆనందింపజేసేవాడ! బాకవరంలో వెలసిన ఓ ఆంజనేయా! ఆకలిదప్పులతో అలమటించే వారికి పట్టెడన్నంగాని, శాకంగాని, నీళ్ళుగాని ఇచ్చి వారిని శాంతపరిస్తే సమస్త పుణ్యాలు లభిస్తాయి. ఆ విధంగా భక్తులు చేస్తే, అది వారికి మేలయినదని, ప్రియమైనదని నీవు మెచ్చుకుంటావు.

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ

పాఠ్యభాగ ఉద్దేశం

ప్రశ్న.
శతకసుధ పాఠ్యభాగం ఉద్దేశం తెల్పండి.

శతక పద్యాలు సమాజంలోని పోకడలను తెలుపుతాయి. వాటి ఆధారంగా విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందింపజేసి ఉత్తమ పౌరులుగా తయారుజేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం

పాఠ్యభాగ వివరాలు

ప్రశ్న.
శతక ప్రక్రియను గురించి వివరించండి.
జవాబు.
ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతకం అంటే నూరు పద్యాలు కలది. కాని నూటెనిమిది పద్యాలు ఉండడం శతకానికి పరిపాటి. ఈ పద్యాలకు సాధారణంగా మకుటం ఉంటుంది. పద్యం చివరి పదంగాని, పాదంగాని లేక రెండు పాదాలుగాని అన్ని పద్యాల్లో ఒకే విధంగా ఉంటే దాన్ని మకుటం అంటారు. మకుటమంటే కిరీటం అని కూడా అర్థం. శతకంలోని ప్రతి పద్యం దేనికదే స్వతంత్రభావాన్ని కల్గివుంటుంది.
ఈ పాఠంలోని పద్యాలను నారాయణ, చిత్త, భాస్కర, దాశరథి, నరసింహ, విశ్వకర్మ, శ్రీ వేంకటేశ్వర, శ్రీ బాకవరాంజనేయ శతకాల నుండి తీసుకున్నారు.

కవి పరిచయం

ప్రశ్న 1.
నారాయణ శతక కర్తను గురించి తెల్పండి.
జవాబు.
నారాయణ శతకం : ‘నారాయణా!’ అన్న మకుటంతో మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే అద్భుతమైన పద్యాలు ఇందులో ఉన్నవి. దీనిని పోతన రాశాడు. ఇతడు వరంగల్లు జిల్లా బమ్మెర వాసి. ఆంధ్ర మహాభాగవతం, భోగినీదండకం, వీరభద్ర విజయం రాశాడు.

ప్రశ్న 2.
చిత్త శతకం రచించిన కవిని గురించి రాయండి.
జవాబు.
చిత్త శతకం : శ్రీపతి భాస్కర కవి ‘చిత్తమా!’ అనే మకుటంతో పద్యాలను రాశాడు. ఈయన శైవ పండిత త్రయంలో ఒకరైన శ్రీపతి పండితుని వంశం వాడని పరిశోధకుల అభిప్రాయం.

ప్రశ్న 3.
భాస్కర శతకం రాసిన కవిని పరిచయం చేయండి.
జవాబు.
భాస్కర శతకం : మారద వెంకయ్య ‘భాస్కరా!’ అనే మకుటంతో పద్యాలను రాశాడు. భాస్కర శతకంలోని ప్రతి పద్యంలోను మొదటి, రెండు పాదాలలో ఒక నీతిని చెప్పి, తరువాతి పాదాలలో దానిని సమర్థిస్తూ ఒక దృష్టాంతాన్ని చెప్పడం ఈ శతకంలోని ప్రత్యేకత.

ప్రశ్న 4.
దాశరథీ శతక కర్తను పరిచయం చేయండి.
జవాబు.
దాశరథీ శతకం : కంచర్ల గోపన్న (భక్త రామదాసు) ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాస్తవ్యుడు. ‘దాశరథీ కరుణాపయోనిధీ!’ అనే మకుటంతో పద్యాలను రాశాడు. భద్రాచల రామునిపై అనేక కీర్తనలు రాశాడు.

ప్రశ్న 5.
నరసింహ శతకం రచించిన కవిని గురించి వివరించండి.
జవాబు.
నరసింహ శతకం : ఈ శతక కర్త కాకుత్థ్సం శేషప్పకవి. కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందినవాడు. “దుష్టసంహార నరసింహ దురితదూర!” అనే మకుటంతో పద్యాలను రాశాడు. ఈయన మృదంగం వాయించడంలో నేర్పరి. తన జీవితాన్ని శ్రీ ధర్మపురి నరసింహ స్వామికి అంకితం చేశాడు. ఈయన నరహరి, నృకేసరీ శతకాలు, ధర్మపురీరామాయణం మొదలగు
రచనలు చేశాడు.

ప్రశ్న 6.
పండిత రామ సింహ కవిని పరిచయం చేయండి.
జవాబు.
విశ్వకర్మ శతకం : ‘విశ్వపాలన ధర్మ! శ్రీ విశ్వకర్మ!’ అనే మకుటంతో పండిత రామసింహకవి ‘విశ్వకర్మ’ శతకాన్ని రాశాడు. ఈయన కరీంనగర్ జిల్లా నేటి జగిత్యాల జిల్లాలోని జగిత్యాల మండలంలోని పూర్వపు రాఘవపట్నం వాసి. ఈయన ఆశుకవి. దుష్ట ప్రపంచ వర్ణన, కలియుగ వర్ణాశ్రమ ధర్మాలు, భజన కీర్తనలు మొదలగునవి ఇతని రచనలు.

ప్రశ్న 7.
శ్రీవేంకటేశ్వర శతక కర్తను గురించి రాయండి.
జవాబు.
శ్రీవేంకటేశ్వర శతకం : నల్లగొండ జిల్లా మునగాల మండలం నరసింహాపురం గ్రామంలో జన్మించిన ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు ‘వేంకటేశ్వరా!’ అనే మకుటంతో పద్యాలను రాశాడు. ఈయన గోదాదేవి, యాదగిరి లక్ష్మీనరసింహ శతకం, గోదావరి, సత్యవతీ సాంత్వనం, మారుతి మొదలగు రచనలు చేశాడు. ఈయన ‘విద్వత్ కవి’గా ప్రసిద్ధి పొందాడు.

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ

ప్రశ్న 8.
శ్రీ బాకవరాంజనేయ శతకం రచించిన కవిని గురించి తెల్పండి.
జవాబు.
శ్రీ బాకవరాంజనేయ శతకం : రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నివాసియైన వేంకటరావు పంతులు, తాండూర్ దగ్గరలోని బాకవరం గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామిపై “బాకవరాంజనేయ! ఖలభంజన! సాధుజనానురంజనా! అనే మకుటంతో పద్యాలను రాశాడు. యక్షగానాలు, కీర్తనలు, గేయాలు రాశాడు.

ప్రవేశిక

ప్రశ్న
శతక ప్రక్రియ గురించి వివరించండి.
జవాబు.
విశిష్టమైన సాహిత్య ప్రక్రియల్లో శతకం ఒకటి. మేలిముత్యాల్లాంటి శతక పద్యాలనుండి కొన్నింటిని ఈ పాఠం ద్వారా చదువుకుందాం. నైతిక విలువలను పెంపొందించుకుందాం.

కఠిన పదాలకు అర్ధాలు

  • సూనృతం = మంచిమాట
  • శీలము = స్వభావం
  • నతి = వినయం
  • ధృతి = ధైర్యం
  • తుచ్ఛం = నీచము
  • మెయి = శరీరం
  • తిరము = శాశ్వత
  • గతి = దిక్కు ఆధారం
  • లవణము = ఉపు
  • వితం = ధనం
  • కుడువన్ = తినుటకు, అనుభవించుటకు
  • మరుగు = రహస్యము
  • తెరువరి = బాటసారి
  • రీతి = విధం
  • మక్కువ = ఇష్టం, కోరిక
  • దురిత = పాపం
  • విర్రవీగు = అహంకారంతో ఉండు
  • గుడము = బెల్లం
  • మౌక్తికం = ముత్యం
  • కృషి = వ్యవసాయం, ప్రయత్న
  • వెలివేయు = సమాజానికి దూరంగా ఉండు
  • లేశ్యము = కొంచెమ
  • వనట = బాధ
  • చేకురు = చేకూరును, కల్గును
  • ప్రియము = ఇష్టాన్ని కల్గించేది

నేనివి చేయగలనా ?

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ 15

TS 8th Class Telugu 12th Lesson Questions and Answers Telangana మాట్లాడే నాగలి

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 11th Lesson కాపుబిడ్డ Textbook Questions and Answers.

TS 8th Class Telugu 12th Lesson Questions and Answers Telangana మాట్లాడే నాగలి

చదువండి ఆలోచించి చెప్పండి

ఈ విశ్వంలో, ఈ భూమండలంలో, ఈ జీవనచక్రంలో మనకెంత ప్రాధాన్యముందో …. ఓ చీమకు, ఓ దోమకు, ఓ ఈగకు, ఓ బూగకు, ఓ తేనెటీగకు, ఓ గద్దకు చివరకు ఓ నత్తకూ, ఓ పీతకూ కూడ కాస్త అటు ఇటుగా అంతే ప్రాధాన్యం ఉందని తేలిపోయింది. సమస్యేమిటంటే ఉన్నత జీవులం కావటంతో మనకు తెలివి ఎక్కువనుకుంటాం. కాని ఆ తెలివిని మనం వినాశానికి ఉపయోగిస్తున్నామనుకోం. నాటి వేటకాలం నుంచీ నేటి పారిశ్రామిక యుగం వరకూ మనం ఇతర జీవులనూ, ఈ ప్రకృతిలోని జీవవైవిధ్యాన్ని కాపాడుకోలేకపోతున్నాం. ఫలితం – ఇప్పుడు ఈ భూమ్మీద మన అస్తిత్వమే అయోమయంలో పడింది.

ప్రశ్న 1.
పై పేరా దేన్ని గురించి తెలుపుతున్నది?
జవాబు.
పై పేరా జీవరాశి యొక్క మానవుల యొక్క అస్తిత్వాన్ని గురించి తెలుపుతున్నది.

ప్రశ్న 2.
తెలివిమీరిన మానవులు ఏం చేస్తున్నారు?
జవాబు.
తెలివిమీరిన మానవులు విశ్వం వినాశనానికి తమ తెలివిని ఉపయోగిస్తున్నారు.

TS 8th Class Telugu 12th Lesson Questions and Answers Telangana మాట్లాడే నాగలి

ప్రశ్న 3.
వీటి ఫలితాలు ఎలా ఉన్నాయి?
జవాబు.
వీటి ఫలితాలు అంటే మానవుల తెలివితేటలకు సంబంధించిన విషయాలు, వాటి ఫలితాలని అర్థం. ఆ తెలివి తేటలు లోకవినాశనానికి ఉపయోగ పడుతున్నట్లున్నాయి.

ప్రశ్న 4.
జీవవైవిధ్యాన్ని కాపాడటానికి మనం ఏం చేయాలి?
జవాబు.
జీవవైవిధ్యాన్ని కాపాడటానికి మనం ముందుగా జీవహింసను మానుకోవాలి. జీవన చక్రంలో మనకు ఎంత ప్రాముఖ్యం ఉందో వాటికీ అంతప్రాముఖ్యం ఉందని గుర్తించి మనలానే వాటిని కూడా బ్రతుకనీయాలి.

ఆలోచించండి – చెప్పండి.

ప్రశ్న 1.
ఓసెఫన్ను ఎద్దుపిచ్చోడు’ అనడం గురించి మీ అభిప్రాయం ఏమిటి ?
జవాబు.
ఓసెఫ్ నిజంగా ఎద్దు పిచ్చోడే. ఎద్దు సంగతి వచ్చేసరికి ఓసెఫ్ అన్నీ మరచిపోతాడు. ఓసెఫ్క తన ఎద్దు కన్నన్ తోడిదే లోకం. కనుక ఓసెఫ్ ఎద్దు పిచ్చోడే.

ప్రశ్న 2.
విచక్షణ అంటే నీకేమర్థమయింది ? కన్ననికి విచక్షణ ఉందని మీరెట్లా చెప్పగలరు?
జవాబు.
ఇది చేయదగిన పని ఇది చేయకూడని పని అని నిర్ణయించటమే విచక్షణ. కన్నన్కు ఆ విచక్షణ ఉన్నదనే చెప్పాలి. ఎందుకంటే ఓసెఫ్ ఏం చెబితే అది కన్నన్ చేసుకుపోతుంది. ఒక మడిలో నుండి మరొక మడిలోకి వెళ్ళేటప్పుడు ప్రత్యేకంగా దానికేమీ చెప్పనక్కర లేదు. గట్ల మీద కాలువేస్తే గట్లు తెగిపోతాయనే విచక్షణ దానికుండేది. దున్నటం పూర్తి అయ్యాక మేతకు వదిలి “కడుపు నింపుకో, అరటి చెట్లను ముట్టుకోకు” అని ఓసెఫ్ అనేవాడు. కన్నన్ ఎప్పుడూ అరటి చెట్లను గాని, కొబ్బరి మొలకలను గాని ముట్టుకునేది కాదు. అవి పాడైపోతాయనే విచక్షణ దానికి ఉండేది.

TS 8th Class Telugu 12th Lesson Questions and Answers Telangana మాట్లాడే నాగలి

ప్రశ్న 3.
సాటి మనుషులతో మన ప్రేమాభిమానాల్ని ఎట్లా వ్యక్తపరచవచ్చు?
జవాబు.
సాటి మనుషులపై ప్రేమాభిమానాల్ని మనసుకు హత్తుకొనే చక్కని మాటలతో వ్యక్తం చేయాలి. మంచిమాట మనసును ఆనందింప చేస్తుంది. మన వద్దకు వచ్చిన వారికి పంచభక్ష్య పరమాన్నాలు వడ్డించనక్కరలేదు. వారి మనసుకు బాధ కలుగకుండా ఉపశమనం కలిగించే రెండు మాటలు మాట్లాడి ఆప్యాయంగా ఆదరిస్తే చాలు ప్రేమాభిమానాలను వ్యక్తంచేసినట్లు అవుతుంది.

ప్రశ్న 4.
సంగీతానికున్న శక్తి ఎట్లాంటిది ?
జవాబు.
సంగీతం శిశువులను, పశువులను, చివరికి రాళ్ళను కూడా కరిగించగలిగిన శక్తిగలది. కన్నన్కి ఓసెఫ్ సంగీతం (పాట) అంటే ఇష్టం. పచన్ సంగీతం విన్న కన్నన్ సంగీతాన్ని అవమానించాడని కుడికాలు మీద తన్నింది. కాబట్టి సంగీతం చాలా గొప్ప శక్తిగలదని పశువులు కూడా ఆస్వాదిస్తాయని తెలుస్తుంది.

ప్రశ్న 5.
“ప్రేమంటే దుఃఖం తెలిసిన రెండు హృదయాల సాన్నిహిత్యమే”- దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు.
ప్రేమకు ఎపుడూ మాటలు ప్రదర్శనలు అవసరం లేదు. ప్రేమంటే రెండు మనసులు కలిసి అనుభవించే సుఖదుఃఖాల సాన్నిహిత్యం. దీనిలో సాన్నిహిత్యం ముఖ్యం. ఓసెఫ్ కన్నా కన్నన్కు దగ్గరయిన వారెవ్వరూ లేరు. అందువల్ల ఆ రెండు హృదయాలు మరింత దుఃఖాన్ని అనుభవించాయి. కనుక ప్రేమంటే దుఃఖం తెలిసిన రెండు హృదయాల సాన్నిహిత్యం.

TS 8th Class Telugu 12th Lesson Questions and Answers Telangana మాట్లాడే నాగలి

ప్రశ్న 6.
ఓసెఫ్ ఎద్దును అమ్మినప్పుడు మీకేమనిపించింది ? ఎందుకు?
జవాబు.
ఓసెఫ్ ఎద్దును అమ్మినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఓసెఫ్కు కన్నన్ తోడిదే లోకం. దానిని తన సంతానంగా భావించాడు. కూతురి పెళ్ళి ఆగిపోతుందన్న భయంతో అప్పటికే తన బంగారు బాతులాంటి పొలాన్ని తాకట్టు పెట్టాడు. ఇక మిగిలింది ఎద్దు. దాన్ని కూడా అమ్మాల్సి వచ్చింది. అందుకని ఓసెఫ్ పట్ల జాలి కలిగింది.

ప్రశ్న 7.
ధరల ప్రభావం మనిషి జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది?
జవాబు.
ధరల ప్రభావం మనిషి జీవితాన్ని అతలాకుతలం చేసేస్తుంది. మనుషుల అంచనాలను తారుమారు చేస్తుంది. అధిక ధరలు ఓసెఫ్ వంటి సామాన్యుల జీవితాలను శాసిస్తాయి. మధ్య తరగతి వారిని రోడ్డున పడవేస్తుంది. ధరల పెరుగుదల మనశ్శాంతిని దూరం చేస్తుంది.

ప్రశ్న 8.
‘భూతదయ’ – అంటే ఏమిటో వివరించండి.
జవాబు.
భూతదయ అంటే భూతములపట్ల దయ అని అర్థం. భూతములు అంటే జీవరాశి అనిఅర్థం. ఆ జీవులపై మనం చూపించే కరుణే భూతదయ. సృష్టిలో మానవునకు బ్రతికే హక్కు ఎంత ఉన్నదో మిగిలిన జీవరాశికీ అంతే ఉంది. వాటిపట్ల దయ, జాలి, కరుణలు చూపించాలి, అలా చూపించటాన్నే భూతదయ అంటాము.

ప్రశ్న 9.
ఈ “బిడ్డా, నన్ను గుర్తు పట్టావా ? నిన్నీ స్థితిలో చూడవలసి వచ్చిందా ?” దీని మీకేమి ద్వారా. అర్థమయ్యింది ?
జవాబు.
విధిలేని పరిస్థితిలో ఓసెఫ్ కన్నన్ను అమ్మేశాడు. ఇపుడు దానిని కబేళాకు తరలించారు. అక్కడ ఓసెఫ్ కన్నన్ను చూసి చలించి పోయాడు. బక్కచిక్కి ఎముకల గూడులా ఉన్న తన బిడ్డవంటి ఎద్దు కన్నన్ను చూసి ‘ఇలా నిన్ను చూడవలసి వచ్చిందా’ అని బాధపడ్డాడు. కన్నన్ కూడా ఓసెఫన్ను చూసి కన్నీరు కార్చి దగ్గరకు వచ్చి ఆప్యాయంగా నాకటం ప్రారంభించింది. దీనిద్వారా ఓసెఫ్, కన్నన్ల అనురాగ ఆప్యాయతలు తెలిశాయి. మనుషుల్లానే జంతువులకూ ప్రేమ ఉందని తెలిసింది.

TS 8th Class Telugu 12th Lesson Questions and Answers Telangana మాట్లాడే నాగలి

ప్రశ్న 10.
కన్నన్ తన యజమానిపై అభిమానాన్ని, ప్రేమని ప్రదర్శించిందని ఎట్లా చెప్పగలవు ?
జవాబు.
మూగజీవాలకు భాషతో, మాటతో భావాలను వ్యక్తం చేయటం రాకపోయినా చేష్టలతో వ్యక్తం చేయగలవు. కన్నన్ తన యజమానిని చూడగానే, అతని చేయి తాకగానే ఆ స్పర్శకు తన తోక ఎత్తింది. అది తన నోటితో కాదు హృదయంతో ఏడ్చింది. కన్నన్ తన పాత దొడ్లో ప్రవేశించి సంతోషంతో నేలమీద ఒరిగింది.

ప్రశ్న 11.
“నాన్నా! నువ్వు నాకింత పని చేస్తావని ఎప్పుడూ అనుకోలేదు” – అనే కత్రి మాటలను ఎట్లా అర్థం చేసుకుంటావు?
జవాబు.
కత్రి తనకు కొత్త బట్టలు తెచ్చిపెట్టి నాన్న కొత్తకాపురానికి పంపిస్తాడన్న ఆలోచనలో ఉంది. కొత్త బట్టలకు బదులు కన్నన్ ను వెంటబెట్టుకురావటంతో కత్రి తాను కొత్త కాపురానికి వెళ్తున్నానన్న ఆశలు అడియాసలయ్యాయి అని అర్థం చేసుకున్నాను.

ప్రశ్న 12.
ఈ “నాకు నువ్వెంతో కన్నన్ అంతే – దీని ద్వారా నీకేమర్థమయ్యింది
జవాబు.
“నాకు నువ్వెంతో కన్నన్ అంతే” అన్న మాటల వలన కన్నన్ పై ఓసెఫ్కు ఉన్న ప్రేమ అర్థమయింది. తన కన్న కూతురు కత్రిని ఎంత ప్రేమగా ఓసెఫ్ పెంచుకున్నాడో అంతే ప్రేమతో కన్నన్ను కూడా చూసుకున్నాడని అర్థమయింది. కన్నన్ ఓసెఫ్కు మరో బిడ్డ అని అర్థమయింది.

ఇవి చేయండి.

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. కింది అంశాల గురించి తెలుపండి.

అ. ఈ కథను సొంతమాటల్లో చెప్పండి.
జవాబు.
మానవత్వం గురించి, మూగ జీవుల పట్ల మానవులు చూపాల్సిన ప్రేమ గురించి చెప్పిన మంచి కథ ఇది. ఓసెఫ్ ఒక మనసున్న రైతు. అతని వద్ద కన్నన్ అనే ఎద్దు ఉండేది. ఆ ఎద్దే అతని లోకం. అది ఉంటే అతడు ఈలోకాన్ని మరచేవాడు. అందుకే అతనిని ఎద్దు పిచ్చోడు అని మిగిలిన రైతులు అనేవారు. కన్నన్ను ఎప్పుడూ ఓసెఫ్ చెర్నాకోలతో కొట్టలేదు. అదే తన యజమాని మనసు తెలుసుకుని ప్రవర్తించేది. పని అయిపోయాక హాయిగా కడుపునింపుకోమని వదిలేవాడు. అది గడ్డి తిన్నదే గాని ఏనాడు అరటి మొక్కలను కొబ్బరి మొక్కలను తాకనైనా తాకలేదు. ఓసెఫ్ పాట మాట అంటే కన్నన్కు ఇష్టం. ఇరవైఏళ్ళపాటు కన్నన్ ఓసెఫ్క మొక్కవోని సేవచేసింది.

ఓసెఫ్కు ఒక కూతురుంది. ఆమెపేరు కత్రి. ఆమెకు పెళ్ళిచేయాలనుకున్నాడు. కట్నంకోసం పొలాన్ని అమ్మాడు. అయినా చాలలేదు. కన్నన్ను కూడా అమ్మేయక తప్పిందికాదు. ఒక రోజు కూతురు కత్రికి బట్టలు తేవటానికి వెళ్ళిన ఓసెఫ్కు తన కన్నన్ను మాంసం దుకాణానికి తరలిస్తుండడం కన్పించింది. తట్టుకోలేక పోయాడు. కన్నన్.. అని పెద్దకేకవేసి బట్టలకని తెచ్చిన డబ్బులతో కన్నన్ను కొని ఇంటికి తీసుకువచ్చాడు. నాన్న బట్టలు తెస్తున్నాడని ఎదురువెళ్ళిన కత్రికి కన్నన్ కన్పించింది. విషయం అర్థమయింది. నాన్నా నువ్వు నాకు ఇలా అన్యాయం చేస్తావని ఎప్పుడూ అనుకోలేదని ఏడ్చింది. అప్పుడు ఓసెఫ్ “ఓ బిడ్డా నువ్వు నాకు ఎంతో కన్నన్ కూడా అంతే అన్నాడు.

TS 8th Class Telugu 12th Lesson Questions and Answers Telangana మాట్లాడే నాగలి

ఆ. ‘మాట్లాడే నాగలి’ అనే పేరు ఈ కథకు సరైందేనా? ఎందుకు?
జవాబు.
దేశాభివృద్ధిలో రైతులదే కీలకపాత్ర. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు ఆయుధం నాగలి. రైతు యొక్క జీవితాన్ని విశ్లేషించిన కథ ‘మాట్లాడే నాగలి’. రైతు అతనికి ప్రాణప్రదమైన ఎద్దుల అనుబంధం ఈ కథలో వివరించబడింది. కనుక ఈ కథకు మాట్లాడే నాగలి అనుపేరు సరైందేనని భావించాలి. ఇక్కడ నాగలి అంటే ఎద్దు. మాట్లాడడమంటే ప్రేమను చూపడం.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

1. కింది వాక్యాలు పాఠంలోని ఏ పేరాలో ఉన్నాయో గుర్తించండి. ఆ వాక్యాల కింద గీత గీయండి.

అ. ఒకసారి దాని చెవుల్లో జీవితం ప్రతిధ్వనించింది.
జవాబు.
ఈ వాక్యం పాఠంలోని 125వ పేజీలో మొదటి పేరాలో ఉంది. మొద్దుబారి పోయింది. కన్నన్ అప్పుడు ఆ బ్రహ్మాండమైన భవనం ముందర తలదించుకొని ఉంది. మళ్ళీ ఒకసారి దాని చెవుల్లో జీవితం ప్రతిధ్వనించింది. తలపైకెత్తి చుట్టూ చూసింది.

అ. అది తన నోటితో కాదు; హృదయంతో ఏడ్చింది.
జవాబు.
ఈ వాక్యం పాఠంలోని 125వ పేజీలో రెండవ పేరాలో ఉంది. బిడ్డా, నన్ను గుర్తుపట్టావా ? నిన్నీ స్థితిలో చూడవలసి వచ్చిందా? ప్రేమ స్పందిస్తున్న గుండెలకు అతను ఆ పశువును హత్తుకున్నాడు. దాని తలమీద నిమిరాడు. ఆ చేతుల స్పర్శ గుర్తించగానే అది తోకెత్తింది. అది తన నోటితో కాదు, హృదయంతో ఏడ్చింది. కన్నన్ మీద కూడా ముద్ర ఉందేమోనని చూశాడు ఓసెఫ్. ఔను, వెనకకాళ్ళ మీద ముద్ర స్పష్టంగా ఉంది. దాన్ని చెరిపెయ్యడానికి ప్రయత్నించాడు. కాని మునిసిపాలిటీ వేసిన ఆ నల్లముద్రను చెరపడం అంత సులభం కాదు.

2. కింది పేరా చదవండి. ఖాళీలు పూరించండి.

ఒక పండుగరోజు ఆశ్రమంలో సేవచేస్తున్న ఒక ముసలమ్మ హాలుకు ఎదురుగా ఉన్న గడపలకింద ఉన్న నేలమీద ముగ్గులు వేస్తుంది. అది రమణమహర్షి కంట పడింది. పాటీ! అని భగవాన్ పిలువగా ఎంతో సంతోషంగా భగవాన్ దగ్గరకు వచ్చిందామె. ఇదిగో అవ్వా! కష్టపడి ముగ్గులు పెడుతున్నావు గాని అది బియ్యపుపిండేనా ? అన్నారు భగవాన్. కాదు! రాతి ముగ్గే అంది ఆ అవ్వ. అయ్యో! చీమలకైనా ఉపయోగం ఉండదే. ముగ్గులు పెట్టడం అంటే చీమలకు ఆహారం వేయడమన్నమాట. ఆ ధర్మం విడిచిపెట్టి అచ్చంగా రాతిముగ్గే పెడితే చీమలు ఆ పక్కకే రావు. ఒకవేళ వచ్చినా ఆ ఘాటుకు చచ్చిపోతాయి కూడ. ఎందుకది ? కొంచెమైనా బియ్యపు పిండి చేర్చుకోండి అ సెలవిచ్చినారు భగవాన్. ఆ మాటలు విన్నవారొకరందుకొని “ధనుర్మాసంలో ముగ్గులు అధికంగా పెట్టడం చీమలకు ఆహారం వెయ్యడం కోసమేనా!” అన్నారు. ఆ! కాకపోతే మరేమి ? కొత్త ధాన్యం వచ్చిన సంబరంతో రంగవల్లులు తీర్చి చీమలకు ఆహారం వేస్తారన్నమాట. ‘పెద్దలు నిర్ణయించిన ఆచారాలన్నీ జీవకారుణ్యంతో కూడినవే! ఇప్పుడవి పాటించేదెవరు? అలంకారానికి ఏదో చేస్తారంతే’ అన్నారు భగవాన్.

అ. జీవకారుణ్యం అంటే …………….
జవాబు.
తోటి జీవుల పట్ల కారుణ్యంతో వ్యవహరించటం.

ఆ. ముగ్గులు పెట్టడంలో అంతరార్థం …………….
జవాబు.
చీమలకు ఆహారం వెయ్యటం

ఇ. పూర్వాచారాలను పాటించాలె ఎందుకంటే …………….
జవాబు.
ఆ ఆచారాలన్నీ జీవకారుణ్యంతో కలిసి ఉన్నవి.

TS 8th Class Telugu 12th Lesson Questions and Answers Telangana మాట్లాడే నాగలి

ఈ. పై పేరాకు శీర్షిక ………………
జవాబు.
జీవకారుణ్యం

ఉ. పై పేరాలోని ఐదు ముఖ్యమైన పదాలు ……………
జవాబు.
పండుగరోజు, ఆశ్రమం, బియ్యపుపిండి, ఘాటు, ధనుర్మాసం, రంగవల్లులు, జీవకారుణ్యం.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. ఓసెఫ్ స్థానంలో మీరుంటే ఏం చేస్తారు?
జవాబు.
ఓసెఫ్ స్థానంలో నేనుంటే కన్నన్ను ఓసెఫ్ లాగానే కన్న బిడ్డలా చూసుకుంటాను. దానితోడిదే లోకంలా భావిస్తాను. నా మనుగడకు కారణమైన కన్నన్ను జాగ్రత్తగా కాపాడుకుంటాను. అవసరం తీరిందిగదా, అది ఇంక ఎంతో కాలం పనిచేయలేదు కదా అని దానిని కటిక వానికి అమ్మను. పెంపుడు జంతువులపై ప్రేమను అందరికీ వివరిస్తాను.

ఆ. ‘పశువులపట్ల క్రూరత్వాన్ని మానాలని ఉపన్యాసాలు వింటే ఓసెఫ్కు చిర్రెత్తేది’ ఎందుకని?
జవాబు.
ఎవరైనా మాటల్లో చెప్పేవిషయాలు చేతల్లో చేసి చూపించాలనేది ఓసెఫ్ తత్వం. ఆయన పశువులను ప్రేమగా చూడడం కర్తవ్యంగా భావించేవాడు. అందుకే ఓసెఫ్ తనకుమార్తె అత్తారింటికి వెళ్ళటానికి బట్టలు కొనడం కన్నా, తనకు చాలా కాలం జీవనాధారంగా నిలచిన మూగజీవి కన్నన్ మాంసశాలకు వెళ్ళకుండా ఉండడానికి పైసలు ఖర్చు చేయడం సరైందని భావించాడు. పశువుల పట్ల క్రూరత్వాన్ని మానాలని ఉపన్యాసాలు చేసే కన్నా వాటిని రక్షిస్తే బాగుంటుందన్నాడు.

TS 8th Class Telugu 12th Lesson Questions and Answers Telangana మాట్లాడే నాగలి

ఇ. క్రయపత్రం అంటే ఏమిటి ? ఏ సందర్భాల్లో దీన్ని ఉపయోగిస్తారు?
జవాబు.
క్రయపత్రం అంటే బేరసారాలు జరిగేటప్పుడు కొనుగోలు దారుడు, అమ్మకం దారుడు నమ్మకం కోసం ఒకరికొకరు రాసుకునే పత్రం. వ్యాపార లావాదేవీలు ముగిసేవరకే దీని విలువ ఉంటుంది. పొలాలు, స్థలాలు, ఇండ్లు, గొడ్లు మొదలగు వాటికి క్రయవిక్రయాలు జరిపేటప్పుడు వీటిని రాసుకుంటారు. ఒక కంపెనీ తయారు చేసిన వస్తువులను ఇతరులకు విక్రయించేటప్పుడు కూడా ఈ క్రయపత్రాలు వ్రాసుకుంటారు. దీనిని ఇంగ్లీషులో ‘అగ్రిమెంట్’ అని వ్యవహరిస్తారు. ఒకనాడు నోటి మాటలతోనే క్రయవిక్రయాలు జరిగేవి. ఇపుడు క్రయపత్రం రాసుకోవటం తప్పనిసరి అయింది.

ఈ. కన్నన్తో తిరిగివచ్చిన తండ్రిని చూసి కత్రి “నాన్నా!” అంది. అట్లా అనడంలో ఆమె ఉద్దేశం ఏమై ఉంటుంది?
జవాబు.
కన్నన్తో తిరిగివచ్చిన తండ్రిని చూసి కత్రి ‘నాన్నా’ అంది. ఇలా అనటానికి కారణం లేకపోలేదు. తండ్రి తనకు
వివాహంచేసి అత్తగారింటికి పంపించటానికి బట్టలు తెస్తానని పెళ్ళిబట్టలు మానేసి కన్నన్ను వెంటబెట్టుకొచ్చాడు. మరి తను అత్తారింటికి వెళ్ళేదెట్లా. ఆ ఆశ నెరవేరేదెట్లా అని ఆలోచించిన కత్రి తన మనసులో కలిగిన ఆలోచనను ఆవేదనను ‘నాన్నా’ అన్న ఒక్క మాటలో వ్యక్తం చేయగలిగింది. ఇంత పనిచేస్తావని ఎప్పుడూ అనుకోలేదని మూగగా రోదించింది.

ఉ. మాట్లాడే నాగలి ఏ సాహిత్య ప్రక్రియకు చెందిన పాఠం ? రచయిత ఎవరు ? విశేషాలను తెలుపండి?
జవాబు.
మాట్లాడే నాగలి అను పాఠం అనువాద ప్రక్రియకు సంబంధించిన పాఠం. దీనిని మలయాళంలో పొన్కున్నం వర్కెయ్, వ్రాయగా దానిని ఎన్. వేణుగోపాలరావు తెలుగులోకి అనువదించాడు. ఒక భాషలో ఉన్న విషయాన్ని వేరొక భాషలోనికి మార్చి రాసినట్లైతే దానిని అనువాదం అంటాం. ఆంగ్లంలో అనువాదాన్ని ‘Translation’ అంటారు. సాహిత్య అకాడమీవారు ముద్రించిన భారతీయ సాహిత్యం సమకాలీన కథానికలు’ అనే గ్రంథంలో ప్రచురించిన మలయాళకథ ఇది. ప్రకృతి, మూగజీవుల పట్ల ప్రేమ ఆవశ్యకతను వివరించిన కథ ఇది. జీవకారుణ్యానికి ఈ కథ ఒక మచ్చుతునక.

TS 8th Class Telugu 12th Lesson Questions and Answers Telangana మాట్లాడే నాగలి

ఊ. కన్నను, దాని స్వభావాన్ని వివరించండి. (లేదా) మాట్లాడే నాగలి పాఠం ఆధారంగా కన్నన్ ఎద్దు స్వభావాన్ని వివరించండి.
జవాబు.
కన్నన్ ఓసెఫ్కు జీవనాధారమైన ఎద్దు. ఓసెఫ్క కన్నన్ తోడిదే జీవితం. అది బూడిదరంగులో బలంగా పొట్టిగా లావాటి వంపులు తిరిగిన కొమ్ములతో బ్రహ్మాండమైన ఆకారం గలిగిన వృషభరాజం. సుడి తిరిగిన బిగువైన చర్మం, బయటకు ఉబికిన కళ్ళుండేవి. అసలు కన్నన్ నడకలోనే ఒక ప్రత్యేకత కన్పించేది. కన్నన్ విచక్షణాజ్ఞానం కలిగిన ఎద్దు. దానిని తిట్టవలసిన కొట్టవలసిన అవసరం ఓసెఫ్కు ఏనాడు రాలేదట. దీనిని బట్టి కన్నన్ ఎంతటి పెంపుడు జంతువో అర్థమౌతుంది. ఓసెఫ్ మాటలను ముందుగానే అర్థంచేసుకొని కూతురితో సమానమనిపించుకుంది.

ఎ. ఓసెఫ్ కన్నన్ను ఎలా శాంతింపజేసేవాడు?
జవాబు.
ఓసెఫ్ మాట్లాడిన ప్రతిమాట కన్నన్ అర్థం చేసుకునేది. ఎంతటి గుంపులో ఉన్నా కన్నన్ ఓసెఫ్ గొంతును గుర్తుపట్టేది. నాగలిని ఓసెఫ్ పడితేనే ఇష్టపడేది. ఇంకెవరు పట్టినా తన కొంటెతనం చూపించేది. కన్నన్ హెచ్చరికతో దానిని శాంతింపజేసేవాడు. పొలాల్లో పనిచేసే రైతులు చక్కగా పాటలు పాడుకుంటారు. వాటికి వ్యాకరణంతోగాని, శాస్త్రీయ రాగాలతోగాని పనిఉండదు. ఓసెఫ్ గొంతెత్తి చక్కని పాటలు పాడేవాడు. ఆ ఆలాపన కన్నన్కు మహాఇష్టం. ఒకసారి మడి దున్నుతున్నపుడు ఓసెఫ్కు బదులు ఓసెఫ్ మిత్రుడు పచన్ పాట అందుకున్నాడు. ఆ పాటను విన్న కన్నన్ సంగీతాన్ని పచన్ అవమానిస్తున్నాడని కుడి కాలు మీద ఒక్కటి తన్నింది. ఓసెఫ్ మాటలతో మరలా శాంతించింది. ఇలా కన్నన్ విషయంలో ఎవరైనా ఓసెఫ్ తరువాతే, ఓసెఫ్కు కన్నన్ తరువాతే ఎవ్వరైనా!

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. ఓసెఫ్ కన్నన్ను ఏ విధంగా ప్రేమించేవాడో తెలుపండి. (లేదా) ‘మాట్లాడే నాగలి’ పాఠం ఆధారంగా ఓసెఫ్, కన్నన్ ల మధ్య అనుబంధం గురించి రాయండి.
జవాబు.
ఓసెఫ్ ఒక రైతు. అతడు తన ఎద్దు కన్నన్ సంగతి వచ్చేసరికి అన్నీ మరచిపోతాడు. ఓసెఫ్కు కన్నన్ తోడిదేలోకం. బూడిదరంగులో పొట్టిగా లావాటి ఒంపు తిరిగిన కొమ్ములతో, సుడిదిగిన బిగువైన చర్మంతో బయటకు ఉబికిన కళ్ళతో ఠీవిగా నడుస్తుంది. ఓసెఫ్ ప్రతి అడుగు ప్రతి మాట దానికి ఎరుకే! అందుకే కన్నన్ పై ఓసెఫ్ ఏనాడూ చెర్నాకోల వాడలేదు. కన్నన్ను ఓసెఫ్ ఎప్పుడూ కట్టేయ లేదు. దున్నటం పూర్తవగానే దానిని మేతకు వదిలేవాడు.

కన్నన్ వంటికి అంటిన బురదను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేవాడు. కన్నన్కు ఓసెఫ్ చేసేపనులలో నచ్చనిది ఇది ఒక్కటే. ఓసెఫ్ కన్నన్కు తన హృదయంలోని ప్రేమానురాగాలను పంచి పెట్టేవాడు. పశువులను రక్షించాలన్న ఉపన్యాస మంటే ఓసెఫ్కు కోపం వచ్చేది. ఓసెఫ్ దొడ్లో పశువులు ఆకలితో మాడితే ఆ ఇంటికి అరిష్టం వస్తుందనేవాడు. పనిఅవగానే ఇంటికి తీసుకొనిపోయి కన్నన్కు చేతినిండా గడ్డిపరకలను, అరటి తొక్కలను చిన్న కానుకగా ఇచ్చేవాడు.

ఓసెఫ్ ప్రేమగా కన్నన్ను దువ్వుతుంటే కన్నన్ అతనిని నాకుతుంటుంది. ప్రేమకు మాటలూ ప్రదర్శనలు అవసరంలేదు. ప్రేమంటే దుఃఖం తెలిసిన రెండు హృదయాలు. కుమార్తె “నాన్నా నువ్వు నాకింత పని చేస్తావని ఎపుడూ అనుకోలేదు” అని అన్నపుడు ఓసెఫ్ బిడ్డా “నాకు నువ్వెంతో కన్నన్ అంతే” అన్న మాటల్లో కన్నన్పట్ల ఓసెఫ్ ప్రేమ మనకు అర్థమౌతుంది.

ఆ. మూగజీవాలమీద ఎందుకు ప్రేమ చూపించాలి ? (లేదా) పశువుల్ని రక్షించుకోవాల్సిన అవసరం గురించి రాయండి.
జవాబు.
ఈ సృష్టిలో మనిషికి బ్రతికే హక్కు ఎంత ఉందో మిగిలిన జీవరాశికి బ్రతికే హక్కు అంతే ఉంది. కాబట్టి మనం మూగ జీవాల మీద ప్రేమచూపించాలి. జీవరాశిలో మానవుడు విలక్షణమైనవాడు. మిగిలిన జీవరాశుల కంటే మానవుడు ఆలోచనా జ్ఞానం విచక్షణా జ్ఞానం కలిగినవాడు. మానవుడు జీవరాశి అంతటికి ఉన్నతుడు అవటంచేత ఇతర జీవరాశుల నియంత్రణకు పాల్పడుతున్నాడు. అది సరైన పద్ధతి కానేకాదు.

ప్రతి జీవిపై ప్రేమాభిమానాలను చూపించాలి. మనిషి తాను సుఖంగా బతకాలనుకొని ఇతర జీవరాశిని నాశనం చేస్తే ప్రకృతిలో అసమతౌల్యత తలెత్తే ప్రమాదం ఉంది. ఆ అసమతౌల్యతను అధిగమించటానికైనా మనం మూగ జీవాల మీద ప్రేమను చూపించాలి. మూగజీవులకు మాటలేదు. తమ బాధలను చెప్పుకోలేవు. అందుకే వాటిని ప్రేమగా లాలించాలి. అవి చేతలతో వ్యక్తం చేసే బాధలను అర్థం చేసుకోవాలంటే ప్రేమ చూపించడమే మార్గం.

TS 8th Class Telugu 12th Lesson Questions and Answers Telangana మాట్లాడే నాగలి

ఇ. ఎద్దు (కన్నన్)ను అమ్మవలసిన పరిస్థితిలో ఓసెఫ్ పడిన బాధను వివరించండి. (లేదా) ఓసెఫ్కి ఎద్దులంటే చాలా ప్రేమ. వాటిని అమ్మేశాడు కదా ! పేదరైతులు తమకు విలువైన వాటిని ఎందుకమ్ముకుంటున్నారో వివరించండి.
జవాబు.
కన్నన్ ఓసెఫ్ దగ్గర పన్నెండు సంవత్సరాలు విశ్రాంతి లేకుండా పనిచేసింది. కాలానుగుణంగా వచ్చిన పరిస్థితుల ప్రభావం వలన ఓసెఫ్కు కన్నన్ ను అమ్మేయవలసిన పరిస్థితి వచ్చింది. అప్పటికే తాను బంగారు బాతులాంటి పొలాన్ని తాకట్టు పెట్టాడు. అది కూడా ఇష్టపూర్వకంగా కాదు. అంతకంటే గత్యంతరం లేదు. ఓసెఫ్కు పెళ్ళీడుకు వచ్చిన ముద్దుల కూతురుంది.

ఆమె పెళ్లికి కట్నకానుకలు సమర్పించటానికి పొలాన్ని, తనకు ఇష్టమైన కన్నన్నీ అమ్మేయవలసివచ్చింది. పెళ్లికొడుకు కుటుంబం పైసాకు రికాణా లేనిదైనా 3 వేలు కట్నంగా అడగటంతో అమ్మేయక తప్పిందికాదు. కన్నన్ ను అమ్మినపుడు ఓసెఫ్ అక్కడ లేడు. ప్రేమకు ఎప్పుడూ మాటలు, ప్రదర్శనలు ఉండవు. ప్రేమంటే దుఃఖం తెలిసిన రెండు హృదయాల సాన్నిహిత్యమే. ఓసెఫ్ బాధ ఎవరూ తీర్చలేనిది. ఓసెఫ్ మనసు మనసులో లేదు. కన్నన్ పట్ల ఓసెఫున్న ప్రేమ కథ చివరిలో కూతురుతో “బిడ్డా నాకు నువ్వెంతో కన్నన్ కూడా అంతే” అన్నమాటల్లో అర్థమౌతుంది.

IV సృజనాత్మకత/ప్రశంస

1. “మూగజీవులకు నోరొస్తే …..” ఊహాత్మకంగా ఒక కథ రాయండి.
జవాబు.
ఒక అడవిలోని మునీశ్వరుడు ఘోరతపస్సు చేసి ఎన్నో మహిమలు పొందాడు. ఆయన తన తపశ్శక్తిని పరీక్షింపదలచి తన ఆశ్రమంలోని జింకకు మాట్లాడే వరాన్నిచ్చాడు. దాంతో ఆ జింకకు గర్వమొచ్చి ఆశ్రమంలో తనకు అడ్డువచ్చే ప్రతి జంతువునూ నోటికొచ్చినట్లు తిట్టసాగింది. ఆశ్రమంలోని విద్యార్థులను కూడా అకారణంగా దూషించేది. ఒకరోజు తనకు మేత వేయడం ఆలస్యమైందని మహర్షిని కూడా తిట్టింది. దాంతో మహర్షికి కోపం వచ్చి మరలా దానికి మాట రాకుండా చేశాడు.
కాబట్టి ఎవరి స్థాయిని వారు మరువకూడదు.

2. “మూగజీవులను ప్రేమించాలి’ అన్న అంశాన్ని ప్రజలకు తెలియచెపుతూ ఒక కరపత్రం రాయండి.

మూగజీవులను ప్రేమించాలి

ప్రజలారా!
సృష్టిలోని ప్రతి ప్రాణిలో ప్రేమ, అనురాగం, ఆప్యాయత లుంటాయి. ముఖ్యంగా పెంపుడు జంతువుల విషయంలో మనం ప్రేమానురాగాలను చూపించాలి. మనింట్లో ఒక ఆవో గేదో ఉందనుకుందాం. అది మనతో 10, 15 ఏండ్ల పాటు కలిసి మెలసి ఉంటుంది. మనకు ఒకరకంగా జీవనోపాధినిస్తుంది. తరువాత అది పాలివ్వటం లేదని కటికవానికి అప్పగించకూడదు. నాలుగు గడ్డిపరకలు వేస్తే దాని జీవనం అది గడుపుతుంది. అంతకన్నా మూగజీవాలు మనల్ని ఏమీ కోరవు. వాటి మూగ వేదనను రోదనను భరించవలసిన పని మనకేమిటంటే ఇక మానవత్వం ఎక్కడున్నది.

ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూడండి. అవి మనకు ఏ హాని చేయవు. వాటిని ప్రేమిస్తూ నాలుగు గింజలను వాటికోసం ఉంచండి. మనకు పోయేదేంలేదు. దారి వెంట తనదారిన తాను పోతున్నా తొండల మీద పక్షుల మీద రాళ్ళను విసరటం మానుకోవాలి. అవి గాయపడితే మనకేం లాభం. కాబట్టి మూగజీవాలను ప్రేమతో ప్రేమించండి. ప్రేమిస్తారు కదూ!

ఇట్ల
జీవావరణ పరిరక్షణ కమిటీ,
వరంగల్.

V. పదజాల వినియోగం:

1. గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.

ఉదా : వృషభం పరమేశ్వరుడి వాహనం.

(అ) పిల్ల మనసులో ఏముంటుందో తల్లి పసికడుతుంది
జవాబు. వృషభం = ఎద్దు.

(ఆ) కన్నన్ ఠీవిగా నడుస్తూ వుంటే అందరూ మురిసిపోయేవారు.
జవాబు. పసికట్టు = కనిపెట్టు

(ఇ) మనిషిని అసహనం ఇబ్బందులకు గురిచేస్తుంది.
జవాబు. ఠీవిగా = దర్జాగా

(ఈ) పశువులు మేతకు మాడితే ఇంటికి అరిష్టం దాపురిస్తదని రైతుల నమ్మకం.
జవాబు.
అరిష్టం = కీడు

కింది వాక్యాలను చదివి సమానార్థం వచ్చే పదాలను గుర్తించి, వాటి కింద గీత గీయండి.

(అ) రైతు హృదయం దహించింది. కన్నన్ తన ఎదలో బాధను దాచుకున్నాడు. వీరి ఎడదను ఓదార్చేదెవరు?
జవాబు.
హృదయము, ఎద, ఎడద

(ఆ) పక్షులు ఆకలిని తీర్చుకోవటానికి సంచరిస్తాయి. కొంగలు క్షుద్బాధ కోసం చెరువును ఆశ్రయిస్తాయి. ఇక ప్రజలు బుభుక్షను తీర్చుకోవడానికి పనిచేస్తారు.
జవాబు.
ఆకలి, క్షుద్బాధ, బుభుక్ష

TS 8th Class Telugu 12th Lesson Questions and Answers Telangana మాట్లాడే నాగలి

(ఇ) పంటలు చేతికొచ్చినందుకు రైతులు సంబరపడ్డారు. వారి పిల్లలు సంతోషంతో గంతులు వేశారు. వారి కుటుంబమంతా ఆనందంగా గడిపింది.
జవాబు.
సంబరం, సంతోషం, ఆనందం

3. కింది గీత గీసిన పదాలకు గల వేర్వేరు అర్థాలు (నానార్థాలు) రాయండి.

(అ) తూర్పు దిక్కు వెళ్తున్న భక్తులు మాకు దేవుడే దిక్కు అంటూ వేడుకొంటున్నారు.
జవాబు.
దిక్కు = దిశ, శరణము, వైపు

(ఆ) రాజేశ్ ఉత్తరం వైపున ఉన్న పోస్టాఫీసుకు వెళ్ళి ఉత్తరం తెచ్చాడు. ఎందుకు తెచ్చావని తండ్రి అడిగితే ఉత్తరమివ్వ లేదు.
జవాబు.
ఉత్తరము = దిక్కు, లేఖ, జవాబు.

4. కింది ప్రకృతి – వికృతి పదాలను జతపరచండి.

ప్రకృతి (ఏ) వికృతి
1. మేఘం (ఊ) (అ) అచ్చెరువు
2. హృదయం (ఎ) (ఆ) ప్రేముడి
3. పశువు (అ) (ఇ) రాతిరి
4. ఆశ్చర్య (ఐ) (ఈ) మొగము
5. తోష (ఒ) (ఉ) అబ్బురం
6. దీపం (ఆ) (ఊ) ఎద
7. ప్రేమ (ఓ) (ఎ) పసరం
8. సహాయం (ఈ) (ఏ) మొగులు
9. ముఖము (ఉ) (ఐ) సంతసం
10. అద్భుతం (ఇ) (ఒ) దివ్వె
11. రాత్రి (ఏ) (ఓ) సాయం

VI. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది సంధులను విడదీసి, సంధి పేర్లను రాయండి.

దూపము విసంధి సవర్ణదీర్ఘసంధి
1. ప్రేమూనురాగాలు ప్రేమ + అనురాగాలు గుణసంధి
2. ఆనందోత్సాహాలు ఆనంద + ఉత్సాహాలు అత్వసంధి
3. ఇంకెవరు ఇంక + ఎవరు అత్వసంధి
4. ఎక్కడయనా ఎక్కడ + ఐనా ఇత్వసంధి
5. ఏమున్నద ఏమి + ఉన్నది ఉత్వసంధి
6. చేతులెట్లా చేతులు + ఎట్లా ఇత్వసంధి
7. పైకెత్తి పైకి + ఎత్తి ఉత్వసంధి
8. మరెక్కడ మరి + ఎక్కడ ఉత్వసంధి
9. సారమంతా సారము + అంత ఉత్వసంధి
10. ఆలస్యమయ్యంంది ఆలస్యమ + అయింది గుణసంధి
11. దుర్ళరమైనా దర్భరయు + ఐన సవర్ణదీర్ఘసంధి
12. రామేశ్వరం రామ + ఈశ్వరం గుణసంధి


2. కింది సమాసాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయండి.

సమాసపదం విగ్రహవాక్యం సమాసంపేరు
(అ) కీళ్ళ నొప్పులు క్ళీళ్ళ యొక్క నొప్పులు షష్ఠీతత్పురుష సమాసము
(ఆ) తల్లీ కూతుళ్ళూ తల్లియును కూతురును ద్వంద్ససమాసము
(ఇ) దయా హృదయం దయతో కూడిన హృదయం తృతీయ తత్పురుష సమాసము
(ఈ) భూమి శిస్తు భూమి యొక్క శిస్తు షష్ఠీ తత్పురుష సమాసము
(ఉ) రాతింబవళ్ళ్ రాత్రియును పగలును ద్వంద్వ సమాసము
(ఊ) పది సంవత్సరాలు పది సంఖ్యగల సంవత్సరాలు ద్విగు సమాసము
(ఎ) నలుదిక్కులు నాలుగు సంఖ్యగల దిక్కులు ద్విగు సమాసము

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని

ప్రశ్న 1.
నిత్యజీవితంలో జంతువులు, పక్షులపైన ప్రేమ చూపించే సంఘటనలు మీరు చూసినవి లేదా విన్నవాటి గురించి నివేదిక రాయండి.
జవాబు.
నిత్య జీవితంలో జంతువులు పక్షులపైన (పేమ చూపించే సంఘటనలు కోకొల్లలు. వాటిలో నాకు తెలిసిన కథ వివరిస్తాను. బౌద్ధమతం బుద్ధునిచే ప్రారంభించబడింది. అది ‘అహింసో పరమోధర్మః’ అని ర్రబోధించింది. బుద్ధుడు చిన్నతనంలో ఒకానాక రోజున ఉద్యానవనంలో విహరిస్తుండగా హంసలు ఆ వనంలో హాయిగా అటుఇటు తిరుగుతున్నాయి. బుద్ధుని అన్న కుమారుడు ఆ హంసలలో ఒకదానిని బాణంతో కొట్టాడు.

ఆ హంస బుద్ధుని వద్దకు వచ్చి పడిపోయింది. అపుడు బుద్ధుడు ఆ హంస శరీరంలో గుచ్చుకున్న బాణాన్ని తీసి తన వస్తాన్ని చించి కట్టుకట్టి సంరక్షించాడు. ఆ హంసను నేను వేటాడాను; అది నాది నాకిమ్మని పట్టుపట్టాడు అన్న కుమారుడు. బుద్ధుడు అందుకు ఒప్పుకోలేదు. వారి తగవు రాజు వద్దకు చేరింది. రాజు వారిద్దరి వాదనలు విని హంసను [పేమతో రక్షించిన వాడు బుద్ధుడు కావున అది బుద్ధునిదేనని తీర్పు ఇచ్చాడు. (పేమించిన వానిదే ప్రాణి కాని హింసించిన వానిది కాదని ఈ కథలోని నీతి.

TS 8th Class Telugu 12th Lesson Questions and Answers Telangana మాట్లాడే నాగలి

ప్రశ్న 2.
వివిధ జంతువులు / పక్షులు పెంపకం దారుల వద్దకు వెళ్ళి, ఆయా జంతువుల / పక్షుల పెంపకంలో ఎలాంటి శ్రద్ధ కనబరుస్తున్నారో తెలుసుకొని నివేదిక రాయండి.
జవాబు.
సంప్రదించిన వ్యక్తులు

  1. డేవిడ్ – కెన్నెల్ నిర్వాహకులు
  2. న్నూభాయ్ – పావురాల ప్రేమికుడు
  3. కిరణ్ – కుక్కపిల్ల (జూలీ) ని పెంచుకుంటున్న స్నేహితుడు
  4. రంగమ్మత్త – పిల్లికూనను పెంచుకుంటున్న పక్కింటి అత్తమ్మ 5. రామయ్య – ఆవును సాదుకుంటున్న పశుప్రేమికుడు
  5. సలీం అలీ – పక్షుల సంరక్షకుడు
  6. శ్రావణి – లవ్బర్డ్స్ని పెంచుతున్న ఒక అమ్మాయి.
  7. సురేందర్ – ఆక్వేరియంలో చేపపిల్లలను పెంచుతున్న మిత్రుడు

ఈవిధంగా మన చుట్టూ సమాజంలో ఉన్న రకరకాల జంతుప్రేమికులను, పక్షుల ప్రేమికులను, చేపల ప్రేమికులను సంప్రదించిన తర్వాత అనేక విషయాలు తెలిశాయి. వివిధ రకాల పశుపక్ష్యాదుల పెంపకం మనలో జీవకారుణ్యాన్ని పెంపొందించడమే గాక, బాధ్యతను, సహానుభూతినీ, క్రమశిక్షణనూ నేర్పిస్తాయనీ తెలుసుకున్నాను. వాళ్ళ అనుభవాలూ అనుభూతులూ ఒక కొత్త ప్రపంచంలో విహరింపజేశాయి.

నివేదిక :

మనుషులకు దగ్గరై, వాళ్ళతో చక్కని అనుబంధాన్ని పెంచుకొని, విశ్వాసాన్ని, ప్రేమను ప్రకటిస్తూ మనసులకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పెంచే జంతువులూ, పక్షులూ మనచుట్టూ ఉన్నాయని, వాటి రక్షణ, పోషణ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని తెలుసుకున్నాను. ముఖ్యంగా మూగజీవుల మనోవేదనను, స్పందనను బాగా అర్థం చేసుకోవడానికి ఈ పెంపకం ఉపకరిస్తుందనీ గ్రహించాను.

మనకు ఇష్టమైన పక్షినో, జంతువునో పెంచుకోవాలనుకున్నప్పుడు వాటిని చిన్న వయస్సులో ఉండగానే తెచ్చుకోవాలి. అట్లా తెచ్చుకోవడానికి ముందే వాటికి సంబంధించిన ఆహారపు అలవాట్లు, రక్షణ, భద్రత, పోషణకు సంబంధించిన అన్ని విషయాలూ కూలంకషంగా తెలుసుకోవాలి.

కొన్ని కొన్ని పక్షులకు / జంతువులకు ప్రత్యేకమైన ఆహారం, ఇష్టమైన ఆహారం ఉంటుంది. ఉదాహరణకు పావురాలకు జొన్నలంటే ఇష్టం. అదే లవ్బర్స్కైతే కొర్రలు ఇష్టమైన ఆహారం. పిల్లులూ కుక్కలు కూడా పాలన్నా, మాంసాహారమన్నా ఇష్టపడతాయి. కుక్కలకు రొట్టెలు ఇష్టం. పిల్లులకు పెరుగన్నం ప్రీతిపాత్రం. చేపలకు నిర్దేశించిన ఆహారం ఎక్కువైతే విషతుల్యమౌతుంది.

అవి నివసించే పరిసరాలు శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉండాలి. పిల్లులు, కుక్కలకు మల విసర్జన కోసం బయటికి తీసుకెళ్ళే అలవాటు చేయాలి. పావురాలు, లబ్బర్డ్స్ తమ గూళ్ళను, పంజరాన్నీ బాగా మలిన పరుస్తుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. పిల్లులకు, కుక్కలకు తరచూ స్నానం చేయిస్తుండాలి. ఆవులు కూడా స్నానానికి ఇష్టపడతాయి. ఎద్దులు అంతగా ఇష్టపడవు. చేపల అక్వేరియంలు తొందరగా మురికి అయిపోతుంటాయి. వాటిని 10-15 రోజులకొకసారి శుభ్రం చేయాలి.

పశువులు, పక్షులు సరిగ్గా నిద్రపోకున్నా, వాటి అరుపుల్లో తేడా వచ్చినా, నీరసంగా కనిపించినా వెంటనే వాటికి సంబంధించిన వైద్యులకో, అనుభవజ్ఞులకో చూపించి తగిన వైద్య సహాయం అందించాలి. అవి మూగజీవులు భాషను అవి అర్థం చేసుకుంటాయి. కాని వాటి భాషనే మనం అర్థం చేసుకోలేం. తగినంత శ్రద్ధ, పరిశీలన ఉంటే కనీసం వాటి మనోభావాలను అర్థం చేసుకొని, తగిన విధంగా స్పందించగలుగుతాం.

జీవులన్నీ స్వేచ్ఛను కోరుకుంటాయి. అందుకే వాటిని ఎప్పుడూ బంధించి ఉంచకూడదు. నగరాల్లో వాటిని స్వేచ్ఛగా వదిలేసే అవకాశం లేకుంటే కనీసం రోజుకొక్కసారైనా బయటి ప్రపంచంలో తిప్పడం మంచిది. లవ్బర్డ్స్ పెద్దవయ్యాక వాటిని పంజరంలో నుండి స్వేచ్ఛగా వదిలేయాలి. ఈవిధంగా తగినన్ని జాగ్రత్తలు తీసుకొని వాటిని పోషించడమేగాక, వీలైనంత సమయం వాటితో గడిపితే వాటికీ, మనకూ ఆనందంగా ఉంటుంది. మూగజీవులను స్వచ్ఛంగా ప్రేమించేవాళ్ళు సాటి మనుషులతో సఖ్యంగా నివసించగల్గుతారు.

TS 8th Class Telugu 12th Lesson Important Questions మాట్లాడే నాగలి

పర్యాయపదాలు:

  • రైతు = కృషీవలుడు, కర్షకుడు
  • లోకము = ప్రపంచము, జగత్తు
  • రాజు = చక్రవర్తి, భూపాలకుడు
  • కళ్ళు = నయనము, నేత్రములు
  • స్నేహితుడు = మిత్రుడు, నేస్తము
  • చెట్టు = తరువు, వృక్షము
  • భూమి = ఇల, ధరణి
  • పండుగ = ఉత్సవము, సంబరము

నానార్థాలు:

  • రాజు = చంద్డు, భూపాలుడు
  • ఊరు = గ్రామము, గ్రవించు
  • స్నేహితుడు = చెలికాడు, సూర్యుడు
  • అర్థము = శబ్దార్థము, ఏయోజనము

ప్రకృతిలు – వికృతిలు:

  • భాష – బాస
  • మనిషి – మనిసి
  • ప్రాణము – పానము
  • కష్టము – కస్తి
  • ఆశ – ఆస

సంధులు:

బహ్మాండమైన – బబ్మాండము + ఐన = ఉత్వసంధి
చిత్రమైన – చిత్రము + ఐన = ఉత్వసంధి
గొంతెత్తి – గొంతు + ఎత్తి = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడ సంధి అవుతుంది.

పత్యక్షము = పత్రి + అక్షము = యణాదేశసంధి
సూ(త్రం : ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు పరమైనప్పుడు య, వ, ర లు ఆదేశమవుతాయి.

చెప్పినదంతా = చెప్పినది + అంత = ఇత్వసంధి
సూత్రం : క్రియా పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికము అవుతుంది.

(పేమానురాగాలు = ప్రేమ + అనురాగాలు = సవర్ణదీర్ఘసంధి
సూత్రం: అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైతే వాటి దీర్ఘం ఏకాదేశమవుతుంది.

ఆనందోత్సాహాలు = ఆనంద + ఉత్సహాలు = గుణసంధి
సూత్రం : అకారానికి ఇ, ఉ, ఋలు పరమైతే (క్రమంగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమవుతాయి.

సమాసాలు:

అరటి చెట్టు – అరటి అనుపేరుగల చెట్టు = సంభావనా పూర్వపద కర్మధారయము
[పేమానురాగాలు – చేమయును, అనురాగమును = ద్వంద్వ సమాసము
మంచి భూమి – మంచిదైన భూమి = విశేషణపూర్వపద కర్మధారయము
మధ్యాహ్నము – అహ్నం యొక్క మధ్య భాగము = (ప్రమా తత్పురుష సమాసము

TS 8th Class Telugu 12th Lesson Questions and Answers Telangana మాట్లాడే నాగలి

చదవండి ఆలోచించండి – చెప్పండి.

ఈ విశ్వంలో, ఈ భూమండలంలో, ఈ జీవనచక్రంలో మనకంత ప్రాధాన్యముందో ….. ఓ చీమకు, ఓ దోమకు, ఓ ఈగకు, ఓ బూగకు, ఓ తేనెటీగకు, ఓ గద్దకు చివరకు ఓ నత్తకూ, ఓ ఏీతకూ కూడ 5ాస్త అటు ఇటుగా అంతే ప్రాధాన్యం ఉందని తేలిపోయింది. సమస్యేమిటంటే ఉన్నత జీవులం కావటంతో మనకు తెలివి ఎక్కువనుకుంటాం. కాని ఆ తెలివిని మనం వినాశానికి ఉపయోగిస్తున్నామనుకోం. నాటి వేటకాలం నుంచీ నేటి పారిశ్రామిక యుగం వరకూ మనం ఇతర జీవులనూ, ఈ ప్రకృతిలోని జీవవైవిధ్యాన్ని కాపాడుకోలేకపోతున్నాం. ఫలితం – ఇప్పుడు ఈ భూమ్మీద మన ఆస్తిత్వమే ఆయోమయంలో పడింది.

పాఠ్యభాగ ఉద్దేశం:

ప్రాణులకు – ముఖ్యంగా పెంపుడు జంతువులకూ సంవేదనలుంటాయనీ, మనం చూపే (పేమ, ఆప్యాయతలకు అవి స్పందిస్తాయనీ చెహ్తూ, తద్వారా జీవకారుణ్య దృష్టిని పెంపొందింపచేయటం ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు: 

ప్రశ్న 1.
అనువాద ప్రక్రియ గురించి రాయండి.
జవాబు.
ఒక భాషలో ఉన్న విషయాన్ని వేరొక భాషలోకి మార్చి రాసినట్లైతే దాన్ని అనువాదం (Translation) అంటారు. తెలుగు సాహిత్యంలో దీనిని ‘అనువాద ప్రక్రియ’గా పేర్కొనటం జరుగుతున్నది. సాహిత్య అకాడమీ వారు ముద్రించిన “భారతీయ సాహిత్యం – సమకాలీన కథానికలు” అనే (్రంథంలోని మలయాళ భాషలోని అనువాదకథ ప్రస్తుత పాఠ్యాంశం. మలయాళ భాషలో పొన్కనన్నం వర్కెయ్ రాసిన కథను తెలుగులోకి ఎన్. వేణుగోపాలరావు అనువాదం చేశాడు.

రచయిత పరిచయం:

రచయిత పేరు : పొన్కున్నం వర్కెయ్
పాఠ్యభాగం పేరు : మాట్లాడే నాగలి
కాలం : 1910 – 2004
రచనలు : 24 కథానికా సంపుటాలు, 16 నాటకాలు, 2 కవితా సంపుటాలు ఒక వ్యాస సంకలనం, ఆత్మకథ మొదలైనవి.

ప్రవేశిక:

ఈ సృష్టిలోని ప్రతి ప్రాణిలో [పేమ, ఆప్యాయతలు ఉంటాయి. మానవ సమాజంలో తన కుటుంబంతో ఎంతో మమైకమై సహజీవనం చేస్తున్న మూగజీవులను అనుకోని పరిస్థితులలో దూరం చేసుకొని, తిరిగి ఎప్పుడో కలుసుకున్నప్పుడు మనస్సు ఎంతగా స్పందిస్తుందో ‘ఓసెఫ్ – కన్నన్” ద్వారా తెలుస్తుంది. ఇంతకూ ఓసెఫ్ ఎవరు ? కన్నన్ను ఏ విధంగా చూసుకునేవాడు అనే విషయాన్ని ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం.

కఠిన పదాలకు అర్థాలు:

  • దివి = ఆకాశము
  • ముచ్చటపటడు = ఇష్టపడు
  • ఘోరము = సహించలేనిది
  • బృందము = సమాయాయు
  • మాధుర్యము = తీయనైన
  • స్వరాలు = చప్పుళ్ళు
  • తాకట్టు = కుదవపెట్టు
  • నిష్ఫలం = ఫలము లేనిది
  • దినము = రోజు
  • విపరీతంగా = ఎక్కువగా
  • స్సౌఖ్యము = సుఖము
  • చరమదశ = చివరిదశ
  • సంబరము = పండుగ
  • కార్యము = పని
  • ధరణి = భూమి
  • వృషభం = ఎద్దు
  • ఠీవి = హుందా, వైభవం
  • పాన్ = కిళ్ళీ
  • పోగు = కుప్పవేయు
  • అరిష్ఠం = కీడు
  • పురి = పింఛం
  • పరిరక్షించు = కాపాడు
  • డగ్గుత్తిక = బాధతో పూడుకుపోయిన గొంతుతో

నేనివి చేయగలనా?

TS 8th Class Telugu 12th Lesson Questions and Answers Telangana మాట్లాడే నాగలి 1

TS 8th Class Telugu 6th Lesson Questions and Answers Telangana తెలుగు జానపద గేయాలు

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 6th Lesson తెలుగు జానపద గేయాలు Textbook Questions and Answers.

తెలుగు జానపద గేయాలు TS 8th Class Telugu 6th Lesson Questions and Answers Telangana

చదువండి ఆలోచించి చెప్పండి.

చిక్కుడు పూసే చిక్కుడు కాసే తీగో నాగో ఉయ్యాలో
చిక్కుడు తెంపా ఎవ్వారు లేరూ తీగో నాగో ఉయ్యాలో
చిక్కుడు తెంపా సీరాములు లేరా తీగో నాగో ఉయ్యాలో
కొంగూలు పట్టా ఎవ్వారు లేరూ తీగో నాగో ఉయ్యాలో
కొంగూలు పట్టా సీతమ్మ లేదా తీగో నాగో ఉయ్యాలో
బీరలు పూసే బారలు కాసే తీగో నాగో ఉయ్యాలో
బీరలు తెంపా శివయ్య లేడా తీగో నాగో ఉయ్యాలో
కొంగూలు పట్టా ఎవ్వారు లేరూ తీగో నాగో ఉయ్యాలో
కొంగూలు పట్టా పార్తమ్మ లేదా తీగో నాగో ఉయ్యాలో

ప్రశ్నలు

ప్రశ్న 1.
ఈ గేయం దేన్ని గురించి చెప్తుంది ?
జవాబు.
ఈ గేయం తెలుగు వారి సంస్కృతీ సంప్రదాయాలను గురించి చెప్తుంది.

TS 8th Class Telugu 6th Lesson Questions and Answers Telangana తెలుగు జానపద గేయాలు

ప్రశ్న 2.
ఈ గేయాన్ని ఏమంటారో తెలుసా ?
జవాబు.
తెలుసు. ఈ గేయాన్ని జానపదగేయం అంటారు.

ప్రశ్న 3.
ఇట్లాంటి మరికొన్ని గేయాలు పాడండి.
జవాబు.
గోగులు పూచే గోగులు కాసే తీగో నాగో ఉయ్యాలో
నారలు తియ్యా ఎవ్వరు లేరూ తీగో నాగో ఉయ్యాలో
నారలు తీయా వీరులు లేరా తీగో నాగో ఉయ్యాలో
వాగులు పొంగే వంకలు పొంగే తీగో నాగో ఉయ్యాలో
దారులు చెయ్యా ఎవ్వారు లేరూ తీగో నాగో ఉయ్యాలో
దారులు ఇయ్యా ఏరులు లేవా తీగో నాగో ఉయ్యాలో

ప్రశ్న 4.
ఇట్లాంటి గేయాల గొప్పతనం ఏమిటి ?
జవాబు.
ఇట్లాంటి గేయాలు తెలుగువారి ఆచార సంప్రదాయాలనూ, చరిత్రను, గొప్పదనాన్ని తెలియజేస్తాయి.

ఆలోచించండి – చెప్పండి (Text Book Page No.59)

ప్రశ్న 1.
ఈ తెలుగు జానపద గేయ చరిత్ర ప్రాచీనమైనదని ఎట్లా చెప్పగలం ?
జవాబు.
మానవ సమాజం తాము పడే శ్రమను మరచిపోవడానికి సృష్టించుకొన్న కళే గేయం. ఈ గేయ సాహిత్యం భాష పుట్టినప్పటి నుంచే ఉండే అవకాశం ఉంది. రాసే పనిలేకుండా నోటి ద్వారానే ఒకతరం నుంచి మరొక తరానికి జానపదులు పాడుకుంటున్న ఈ గేయాల చరిత్ర ఎంతో ప్రాచీనమైనది. భాష పుట్టిన చాలా ఏళ్ళకు కానీ దాన్ని రాయడానికి అవసరమైన లిపి పుట్టదు. అందువల్ల లిపి అవసరం లేకుండా ఆనోటా ఆనోటా ప్రచారం అవుతున్న జానపద గేయచరిత్ర ప్రాచీనమైనదని చెప్పవచ్చు.

ప్రశ్న 2.
పౌరాణిక గాథలపై గ్రామీణులకు ఉండే భక్తి భావం ఎట్లాంటిది ?
జవాబు.
పౌరాణిక గాథలపై గ్రామీణులకు ఉండే భక్తి మెచ్చుకోదగినది. జానపద గేయాలలో దాదాపు ప్రసిద్ధ పౌరాణిక గాథలు అన్నీ ఉండటం వారి భక్తికి నిదర్శనం. రామాయణం, భారతం, భాగవతం మొదలైన పురాణాలలోని అమూల్యమైన ఉపదేశాలను జానపదులు గేయాలలో తమకు నచ్చిన విధంగా మలచుకున్నారు.

ప్రశ్న 3.
“ఇచ్చట పుట్టిన చిగురు కొమ్మైనా చేవగలదే” – దీనిని ఏ సందర్భంలో వాడారు. దీనిని మీరెట్లా అర్థం చేసుకున్నారు?
జవాబు.
తెలుగు వారు నివసించే ప్రాంతం వీరులకు నిలయమనే విషయాన్ని చెబుతున్న సందర్భంలో దీనిని వాడారు. తెలుగు భూమి మీద పుట్టిన చిగురు కొమ్మ కూడా బలంగా ఉంటుంది అని దీని అర్థం. అంటే పని పిల్లలకు కూడా పౌరుషం ఉంటుంది అని భావం. దేశక్షేమం కోసం, తమ జాతి రక్షణ కోసం పసిపిల్లలు కూడా పోరాటానికి వెనకాడరని తాత్పర్యం.

ఆలోచించండి – చెప్పండి (Text Book Page No.61)

ప్రశ్న 1.
వీరగీతాల ధ్యేయం వేరు. ఇతర జానపదగేయాల ధ్యేయం వేరు. దీనిని వివరించండి.
జవాబు.
వీరగీతాలు వీరత్వాన్ని, దేశభక్తిని చాటుతాయి. వీటిలో వీర రసం ప్రధానంగా ఉంటుంది. కనుకనే వీటిని వీరగీతాలు అని అంటారు. వీటినే చారిత్రక గేయాలు అని పిలుస్తారు. ఈ వీరగీతాలకు సంబంధించిన సన్నివేశాలను కనులారా చూసినప్పుడు, చెవులారా విన్నప్పుడు జానపదుడు ఉద్వేగంతో గానం చేసి వినిపిస్తాడు. ఇలా వీరగేయాలు జానపదగేయాలు అవుతాయి. జానపదగేయాల్లో స్త్రీల పాటలు, శ్రామిక గేయాలు కూడా భాగాలే. వీరగేయాల్లో కేవలం వీరరసమే ప్రధానం.

ప్రశ్న 2.
భక్తిగీతాలు కొందరికి జీవనోపాది. ఎట్లాగో చెప్పండి.
జవాబు.
తెలుగునాట భక్తిపాటలలో భద్రాచల రామదాసు కీర్తనలు, తూము నరసింహదాసు కీర్తనలు, పరాంకుశదాసు, ప్రకాశదాసు, వెంకటదాసు కీర్తనలు ఎంతో ప్రసిద్ధమైనవి. ఇటువంటి భక్తిగీతాలు పాడుకుంటూ జంగంవారు, హరిదాసులు తమ జీవనాన్ని సాగించుకుంటున్నారు.

ఆలోచించండి – చెప్పండి (Text Book Page No.62)

ప్రశ్న 1.
ఈ ‘నిష్కపటము, నిర్మలమైన హృదయం కలిగి ఉండడం అంటే ఏమిటి ?
జవాబు.
నిష్కపటం అంటే మోసం చేయాలనే ఆలోచనలు లేకపోవటం. నిర్మలం అంటే చెడు ఆలోచనలు లేకపోవడం. నిష్కపటము, నిర్మలము అయిన హృదయం కలిగి ఉండడం అంటే మోసం చేయాలనే ఆలోచనగానీ, చెడ్డ ఆలోచనలుగానీ లేని ‘స్వచ్ఛమైన మనసు’ కలిగి ఉండడం అని అర్థం.

ప్రశ్న 2.
ఆ జానపదగేయాలు ప్రచారానికి అత్యుత్తమ సాధనం. దీనిపై మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు.
జానపదగేయాలు వేల సంవత్సరాల నుంచీ ప్రజలకు వినోదాన్ని విజ్ఞానాన్ని కలిగిస్తూ ఆనోటా ఆనోటా ప్రచారం అవుతూ ఉంటాయి. పని పాటలు చేసుకొని జీవించే చదువుకోని వారిని ఈ జానపదగేయాలు ఇట్టే ఆకట్టుకుంటాయి. అందువల్ల ప్రభుత్వ పథకాలు, ఆరోగ్య జాగ్రత్తలు మొదలైన ప్రజాసంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి ఈ జానపద గేయాలు ఎంతో ఉపకరిస్తాయి.

TS 8th Class Telugu 6th Lesson Questions and Answers Telangana తెలుగు జానపద గేయాలు

ప్రశ్న 3.
జానపద గేయ సంపదను రక్షించుకోవడానికి ఏం చేయాలి ?
జవాబు.
జానపదగేయం సంపదపై విస్తృతంగా వివిధ కోణాలలో పరిశోధనలు జరగాలి. అమూల్యమైన గేయాలను యుద్ధ ప్రాతిపదికన సేకరించాలి. జానపదగేయాల గొప్పదనాన్ని ప్రచారం చేయాలి. సేకరించిన వాటిని తగిన రీతిలో భద్రపరచాలి. వాటికోసం ప్రత్యేక అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేయాలి. గేయ సాహిత్యాన్ని, వాటికి సంబంధించిన విశేషాలను అందరికీ అందుబాటులోకి తేవాలి.

ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. “జానపదగేయాలే తెలుగువారి సంస్కృతికి ఉత్తమదర్పణం” – చర్చించండి.

జవాబు.
పండితులైన కవులు దీక్ష పూని చేసే కావ్యం, శతకం, ప్రబంధం వంటి రచనలు శిష్టరచనలు. గ్రామీణ ప్రాంత ప్రజలు రోజంతా పనులు చేసుకుంటూ ఆ పని వల్ల కలిగే శ్రమను మరచిపోవడానికి అప్పటికప్పుడు తామే రచించుకొని లయబద్ధంగా పాడుకొనే పాటలే జానపదగేయాలు. శిష్ట రచనల్లాగే ఈ గేయాలన్నీ దాదాపుగా రామాయణం, భారతం, భాగవతం మొదలైన గ్రంథాలలోని ప్రసిద్ధ కథలకు సంబంధించినవే. శిష్ట సాహిత్యాన్ని చదువుకున్న వారు మాత్రమే చదువుకో గులుగుతారు. కానీ జానపదుల గేయాలు లయాత్మకంగా ఉండి పండితులనూ, పామరులనూ అలరిస్తాయి. ఈ గేయాలలో తెలుగు వారి దైనందిన జీవితం కనిపిస్తుంది. తెలుగువారి ఆచారాలు, సంప్రదాయలతో ఈ గేయాలు నిండి ఉంటాయి. అందువల్ల తెలుగువారి నాలుకలపై నిత్యం నర్తించే జానపదగేయాలు తెలుగువారి సంస్కృతికి ఉత్తమ దర్పణాలు అని చెప్పవచ్చు.

2. మీకు తెలిసిన జానపద గేయాలు పాడండి. వాటి గురించి మాట్లాడండి.

జవాబు.
“చీరలొచ్చినాయి మామ కట్టమిందికి!
మంచి చీరలొచ్చినాయి మామ కట్టమిందికి!”
“ఊరుకోండు! ఊరుకోండు!
నీకు కట్టను చాతగాదు ఊరుకోండు!”
“రవికలొచ్చినాయి మామ కట్టమిందికి! మంచి రవికలొచ్చినాయి మామ కట్టమిందికి!”
“ఊరుకోండు! ఊరుకోండు!
నీకు తొడగను చాతకాదు ఊరుకోండు!”
“పూవులొచ్చినాయి మామ కట్టమిందికి!
మల్లెపూవు లొచ్చినాయి మామ కట్టమిందికి!”
“ఊరుకోండు! ఊరుకోండు!
నీకు ముడవను చాతకాదు ఊరుకోండు!”

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం
1 కింద ఇచ్చిన అంశాల పేరా సంఖ్య. ఆ అంశాలకు సంబంధించిన కీలక విషయాలను పట్టికలో రాయండి.

TS 8th Class Telugu 6th Lesson Questions and Answers Telangana తెలుగు జానపద గేయాలు 1
జవాబు.

అంశం పేరా సంఖ్య కీలక (ముఖ్యమైన) విషయాల
పౌరాణిక గేయాలు 58వ పుటలో 4వ పేరా జానపద గేయాలలో ప్రసిద్ధ పౌరాణిక గాథలు
చారిత్రక గేయాలు 59వ పుటలో 2వ పేరా వీర గీతాల స్వరూప స్వభావాలు
శ్రామిక గేయాలు 61వ పుటలో 1వ పేరా జానపదగేయాల పుట్టుక నేపథ్యం
పిల్లల పాటలు 61వ పుటలో 2వ పేరా పిల్లల పాటల్లోని స్వచ్ఛత, మార్దవ గుణాలు


2. కింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

జానపదుల నిజమైన విద్యాభ్యాసానికి, లోకజ్ఞానానికి హేతువు వారి సాహిత్యమే. బడిలో చదివే చదువు కొంతే. సమాజం నుంచి నేర్చుకొనే చదువు కొండంత. పసి పిల్లలు ఆటలాడకుంటే వాళ్ళ మనస్సు చెడుతుంది. దేహ ఆరోగ్యం చెడుతుంది. శారీరక శిక్షణ అన్నది జానపదులు తమకుతామే సహజంగా నేర్చుకున్నదేగాని ఒకరు నేర్పింది కాదు. పసిపిల్లలకు పెద్దలు చెప్పే కథలవల్ల వినోదమే కాక విజ్ఞానం కూడా లభిస్తుంది. అనేక విషయాలను వారు ఆలోచించేటట్లు చేస్తాయి. ప్రశ్నించే మనస్తత్వాన్ని పెంపొందిస్తాయి. పొడుపుకథలు జానపదుల బుద్ధికి పదునుపెట్టే సమస్యలు. ముక్తపదగ్రస్త్రాలు పదజ్ఞానానికి సాటి అయింది మరొకటిలేదు. ఇవి జానపదులకు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి, వారిని సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతాయి. సంస్కృతికి సంబంధించిన విషయాలు కాలగర్భంలో కలిసిపోకుండా ఈ జానపద సాహిత్యం కాపాడుతుంది.

అ) జానపదులు సహజంగా నేర్చుకున్నది ఏమిటి ?
జవాబు.
జానపదులు సహజంగా నేర్చుకున్నది శారీరక శిక్షణ.

ఆ) పెద్దలు చెప్పే కథల వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనం ఏమిటి ?
జవాబు.
పెద్దలు చెప్పే కథల వల్ల పిల్లలకు వినోదమే కాక విజ్ఞానం కూడా లభిస్తుంది.

ఇ) పిల్లలు ఎక్కువ చదువు నేర్చుకొనేది ఎక్కడ ?
జవాబు.
పిల్లలు ఎక్కువ చదువు నేర్చుకొనేది సమాజం నుంచే.

TS 8th Class Telugu 6th Lesson Questions and Answers Telangana తెలుగు జానపద గేయాలు

ఈ) జానపద సాహిత్యం దేనికి హేతువు ?
జవాబు.
జానపద సాహిత్యం జానపదుల నిజమైన విద్యాభ్యాసానికి, లోకజ్ఞానానికి హేతువు.

ఉ) పొడుపు కథలు, ముక్తపదగ్రస్త్రాలు – వీటి ప్రత్యేకత ఏమిటి ?
జవాబు.
పొడుపు కథలు జానపదుల బుద్ధికి పదునుపెట్టే సమస్యలు. ముక్తపదగ్రస్త్రాల్లా పదజ్ఞానానికి సాటి అయింది మరొకటి లేదు.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) జానపదగేయాలను ఎందుకు భద్రపరచాలి ?
జవాబు.
ప్రజల నోటి నుండి అప్రయత్నంగా వెలువడిన జానపద గేయాలలో చక్కటి శిల్పం కానవస్తుంది. ఈ గేయ సంపదను భద్రపరచి విశ్లేషించి, పరిశీలించడం ఎంతైనా అవసరం. తెలుగు భాషా సంస్కృతుల చరిత్ర ఎంత ప్రాచీనమైనదో తెలుగు జానపద గేయ చరిత్ర కూడా అంత ప్రాచీనమైనది. జానపదగేయాలకు సాహితీపరమైన విలువ మాత్రమే కాకుండా సాంఘిక, సాంస్కృతిక, భాషా విషయక ప్రాధాన్యత కూడా ఉన్నది. నిఘంటువుల్లో లేని ఎన్నో అందమైన నుడికారాలు, పదాలు, ప్రయోగాలు వాటిలో కనుపిస్తాయి. అంతేకాక వాటిలో రమణీయమైన స్థానిక గాథలు ఎన్నో ఉన్నాయి. అందువల్ల జానపద గేయాలను భద్రపరచాలి.

ఆ) జానపదగేయాల్లో రామాయణ సంబంధమైన గేయాలు ఎక్కువగా ఉండడానికి కారణాలు ఏమిటి ?
జవాబు.
భారతీయ సంస్కృతికి తలమానికమైన రామాయణ మహాకావ్యం ముఖ్యమైనది. ప్రాచీనమైనది. తెలుగువారి జానపద గేయాలలో కథా వస్తువులలో దాదాపు ప్రసిద్ధ పౌరాణిక గాథలే ఎక్కువ. పురాణాలలోని అమూల్యమైన ఉపదేశాలను చదువుకుని అర్థం చేసుకోలేని గ్రామీణులు వాటిని జానపద గేయాలుగా మలుచుకొని నేర్చుకుంటారు. విద్యావంతుల రచనలలో లాగానే జానపదుల గేయాలలో కూడా రామాయణ సంబంధ గేయాలే ఎక్కువగా ఉన్నాయి.

అంతేకాక ఈ రామాయణ సంబంధ కథలను జానపదులు తమ తమ అభిప్రాయాలకు అనుగుణంగా మార్పులు చేసుకోవడం కూడా గమనించవచ్చు. అన్నదమ్ముల అనుబంధం, పిల్లలకు తల్లిదండ్రుల మాటపై గౌరవం, భార్యాభర్తల అనురాగం, రాజు ప్రజల అనుబంధం మొదలైన ఎన్నో కుటుంబ అనుబంధాలు, రాజ్యపాలన అనుభవాలు కలిగిన కథలు ఉండటం వల్ల జానపదగేయాల్లో రామాయణ సంబంధ గేయాలు ఎక్కువ ఉన్నాయి.

ఇ) “గృహజీవనంలో స్త్రీకి పురుషుని కంటె ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది” – దీనిపై మీ అభిప్రాయం ఏమిటి ?
జవాబు.
గృహజీవనంలో స్త్రీకి పురుషుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. భారతీయ కుటుంబ జీవనంలో ఇంటి యజమాని అయిన పురుషుడు కుటుంబ పోషణకోసం పొలంలోనో, పరిశ్రమలోనో, కొలువులోనో శ్రమచేసి సంపాదిస్తాడు. ఇల్లాలైన స్త్రీ భర్త శ్రమ చేసి తెచ్చిన సంపదను జాగ్రత్త చేస్తుంది. అర్థశాస్త్రవేత్తలా వాటిని అవసరాలకు వినియోగిస్తుంది. ఉత్తమ గృహిణిగా భర్త బాగోగులను చూసుకుంటుంది.

బిడ్డలను కనిపెంచి పోషించి ప్రయోజకులను చేస్తుంది. పెద్దలను సాకుతుంది. ఇంటిల్లిపాది ఆరోగ్యాలనూ కాపాడుతుంది. అయిన వాళ్ళను ఆదరిస్తుంది. అతిథులను గౌరవిస్తుంది. అవసరమైతే భర్తకు చేదోడుగా ఉంటూ తాను కూడా శ్రమపడి సంపాదిస్తుంది. తప్పని పరిస్థితులలో కుటుంబ భారాన్ని తానొక్కతే మోయడానికి సిద్ధమవుతుంది. అందువల్ల కుటుంబంలో ఎంతో ప్రముఖ పాత్ర పోషించే స్త్రీకి పురుషుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది.

ఈ) శ్రామిక గేయాల ప్రాముఖ్యత ఏమిటి ?
జవాబు.
కవిత్వం కేవలం ఉల్లాసం కలిగించేందుకే కాక కష్టనివారణ కోసం కూడా ఉదయిస్తుంది. స్త్రీ పురుషులు కాయకష్టం చేస్తున్నప్పుడు శ్రమ కనబడకుండా ఉండేందుకు అలసట చెందకుండా ఉండేందుకు అప్రయత్నంగా వారి నోటి నుండి కూనిరాగాలు, మాటలు వెలువడతాయి. సామూహిక కర్తృత్వంలో ఇటువంటి రాగాలు మాటలు జానపద గేయాలుగా పరిణమించి క్రమంగా వ్యాప్తి చెందుతాయి.

పిండి విసరడం, ఇల్లు అలకడం, ధాన్యం దంచడం, నాగలి దున్నడం మొదలైన పనులు ఈ పాటలు పాడుతూ చేయడం వల్ల హృదయంలోనూ, మనస్సులోనూ ఉండే బాధ తొలగిపోవడమే కాక, శారీరక శ్రమ కూడా తెలియదు. శ్రామిక గీతాలకు వస్తువేదైనా ఉండవచ్చు. వృత్తికి సంబంధించిన పాటలు శ్రామికులు పాడుకుంటారు. శ్రామిక గేయాలన్నీ సాధారణంగా వారి పనిపాట్లకు అనుగుణమై ఉంటాయి. శ్రామికుల శరీరభాగాల కదలికలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో ఈ గీతాలకు తాళలయలు సమకూరుతాయి.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) “స్త్రీల పాటల్లో తెలుగువారి సాంఘిక, సాంస్కృతిక జీవనం పూర్తిగా కనిపిస్తుంది.” – ఎట్లాగో వివరించండి.
జవాబు.
1. పరిచయం : ఆచార్య బిరుదురాజు రామరాజు రచించిన తెలుగు జానపదగేయాలు అనే పాఠ్యభాగంలో అతి ప్రాచీనమైన ఎంతో ప్రసిద్ధమైన తెలుగువారి జానపదగేయాల గురించి అపూర్వంగా వివరించారు. జానపద గేయాలలోని రకాలు వివరిస్తూ స్త్రీల పాటల ప్రత్యేకతలను వర్ణించారు.

2. స్త్రీల పాటలు : గృహజీవనంలో స్త్రీకి పురుషునికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కాబట్టి సంసార విషయాలకు సంబంధించిన కవితకు స్త్రీలే ఆలంబనం. వీటిని స్త్రీ పాటలు అనవచ్చు. వీటిలో వాస్తవికతపాలు ఎక్కువ. శిశుజననం పురస్కరించుకొని అనేక పాటలు పాడతారు. లాలి పాటలు, జోల పాటలు పాడి నిద్రపుచ్చుతారు. తల్లి తన కుమారుణ్ణి రాముడిగానో, కృష్ణుడుగానో, తన కుమార్తెను సీతగానో, రుక్మిణిగానో, గౌరిగానో తలచుకొని ఈ పాటలు పాడుతూ ఆనంద తన్మయత్వం చెందుతుంది.

TS 8th Class Telugu 6th Lesson Questions and Answers Telangana తెలుగు జానపద గేయాలు

3. సాంఘిక, సాంస్కృతిక జీవనం : స్త్రీలకు జరిపే ఆయా వేడుకలలో పాడే స్త్రీల పాటలు అన్నింటిలో తెలుగు వారి సాంఘిక, సాంస్కృతిక జీవనం పూర్తిగా ఆవిష్కృతమవుతుంది. వీటిని పెళ్ళిపాటలు, ఇతర వేడుకల పాటలు అని రెండు అంశాలుగా తెలుసుకోవచ్చు.

4. పెళ్ళి పాటలు : స్త్రీ జీవితంలో వివాహం అతి ముఖ్యమైన ఘట్టం పెండ్లికి సంబంధించిన వివిధ ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు, లాంచనాలు, పరిహాసాలు వర్ణిస్తూ, పెక్కు జానపదగేయాలు ఉద్భవించాయి. ఇవి పెండ్లిపాటలు. ఇవి కట్నములతో ప్రారంభమై అప్పగింతలతో ముగుస్తాయి. కట్నముల పాటలు, తలుపు దగ్గరపాటలు, బంతుల పాటలు, వధూవరుల పాటలు, ముఖము కడుగు పాటలు, కట్నాల పాటలు, అవిరేణి పాటలు, ఉయ్యాలవారి పాటలు, అప్పగింత పాటలు వంటివన్నీ పెండ్లి పాటలే.

5. ఇతర వేడుకల పాటలు : సీతసమర్త, సీతగడియ, సీతమ్మవారి వసంతం, సీత వామనగుంటలు, సుభద్రసారె, రుక్మిణీదేవి సీమంతం, కౌసల్య బారసాల మొదలైన ఆయా సందర్భాలలో పాడే పాటలు అతి రమణీయమైనవి.

ముగింపు : ఈ విధంగా స్త్రీ జీవిత కాలంలో జరిపే వివిధ వేడుకలలో పాడే సందర్భోచితమైన ఆయా పాటలలో తెలుగువారి సాంఘిక, సాంస్కృతిక జీవనం అద్దంలా కనిపిస్తుంది.

ఆ) “జానపద గేయాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి” దీన్ని వివరిస్తూ రాయండి.

(లేదా)

జానపద గేయాల గొప్పతనం వివరించండి.
జవాబు.
1. పరిచయం : ఆచార్య బిరుదురాజు రామరాజు ‘తెలుగు జానపద గేయాలు’ అనే పాఠ్యభాగంలో జానపదగేయాలలో ప్రతిబింబించే మన సంస్కృతీ సంప్రదాయాలను అపూర్వంగా వివరించారు. మతపరమైన ఉద్యమాలు, వీరకృత్యాలు, మహాపురుషుల గాథలు, ఆచారవ్యవహారాలు, సంప్రదాయాలు, విశ్వాసాలు, వినోద సాధనాలు మొదలైన అంశాలతో తెలుగు ప్రజల జీవితమంతా జానపదగేయాలలో ప్రతిధ్వనిస్తుంది. ఈ గేయాలను పౌరాణిక, చారిత్రక, పారమార్థిక గేయాలు, స్త్రీలపాటలు, శ్రామిక గేయాలు, పిల్లలపాటలు, కరుణరసగేయాలు అనే విభాగాలలో రచయిత వివరించారు. పౌరాణిక

2. గేయాలు : ప్రసిద్ధ రామాయణం, భారతం, భాగవతం మొదలైన పురాణాలలోని గాథలన్నీ జానపద గేయాలలో ఉన్నాయి.
ఉదా : శాంతాకల్యాణం, పుత్రకామేష్టి, శ్రీరాముల ఉగ్గుపాట మొదలైనవి.

3. చారిత్రక గేయాలు : వీరరసం ప్రధానంగా ఉండటం వల్ల వీటిని వీరగీతాలు అని కూడా అంటారు. ఇవి వీరత్వాన్ని, దేశభక్తిని బోధిస్తాయి. ఉదాహరణకు మియాసాబ్కథ, సోమనాద్రికథ, రామేశ్వరరావుకథ మొదలైనవి.
పారమార్థిక గేయాలు : పారమార్థిక గేయాలకు భక్తిగీతాలని పేరు. జంగంవారు, హరిదాసులు ఈ భక్తిగీతాలు పాడుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉదాహరణకు భద్రాచల రామదాసు కీర్తనలు, తూము నరసింహదాసు కీర్తనలు మొదలైనవి.

4. స్త్రీల పాటలు : గృహ జీవనంలో స్త్రీకి పురుషుని కంటే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. స్త్రీల పాటలలో లాలిపాటలు, జోలపాటలు, పెళ్ళిపాటలు, వివిధ ఆచారవ్యవహారాలు, సంప్రదాయాలు, లాంఛనాలు, పరిహాసాలు తెలిపే మొదలైనవి ఉంటాయి. ఉదాహరణకు కట్నముల పాటలు, నలుగు పాటలు, అలుక పాటలు మొదలైనవి.

5. శ్రామిక గేయాలు : పిండి విసరడం, ఇల్లు అలకడం, ధాన్యం దంచడం మొదలైన పనులకు, ఆయా వృత్తులకు సంబంధించి శ్రామికులు గేయాలు పాడుకుంటారు.

6. పిల్లల పాటలు : వీటిలో పిల్లల కోసం పెద్దలు రచించినవి కొన్ని కాగా పిల్లలు తమకు తామే సమకూర్చుకున్నవి మరి కొన్ని. ఉదాహరణకు చెమ్మచెక్క, కోతికొమ్మచ్చి మొదలైన ఆటలలో పాడే పాటలు.

7. కరుణరస గేయాలు : ఎరుకల నాంచారమ్మకథ, రాములమ్మపాట, సరోజనమ్మపాట మొదలైనవి.

ముగింపు : ఈ విధంగా జానపదగేయాలలో గ్రామీణుల ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయలు, వారి మనోభావాలు మృదుహృదయం ప్రతిబింబిస్తుంది.

IV సృజనాత్మకత/ప్రశంస

1. కింది ప్రశ్నకు జవాబును సృజనాత్మకంగా రాయండి.

అ) వారం రోజుల పాటు వివిధ జానపద కళారూపాల ప్రదర్శన జరుగుతుంది. ఏ కళారూపం ఏ రోజు, ఏ సమయంలో ప్రదర్శించబడుతుందో, ఎక్కడ ప్రదర్శించబడుతుందో మొదలైన వివరాలతో ఒక ఆహ్వాన పత్రికను తయారుచేయండి.

ఆహ్వానం

శ్రీ వికారినామ సంవత్సరం ఆశ్వయుజ మాస శుద్ధ పక్షంలో శరన్నవరాత్రులు, బతుకమ్మ పండగ సందర్భంగా హైదరాబాదు నగరంలో ఏర్పాటు చేసిన కళాప్రదర్శన వారోత్సవాలకు అందరికీ ఇదే సాదర ఆహ్వానం. ది. 10-10-2019 నుంచి 16-10-2019 వరకూ వారం రోజుల పాటు జరిగే ఈ వేడుకలలో దిగువ తెలిపిన కళారూపాలు వివిధ వేదికలపై ప్రదర్శించబడతాయి.

తేదీ సమయం ప్రదర్శించబడే కళారూపం వేదిక
1. 10-10-2019 సాయంత్రం గం. 6.00 ని||లు గుసాడి నృత్యం తెలుగు లలితకళాతోరణం, పబ్లిక్ గార్డెన్స్
2. 11-10-2019 సాయంత్రం గం. 6.00 ని||లు కొండరెడ్ల మామిడి నృత్యం తెలుగు లలితకళాతోరణం,పబ్లిక్ గార్డెన్స్
3. 12-10-2019 ఉదయం గం. 10.00 ని॥లు బతుకమ్మ ఆటలు పాటలు రవీంద్ర భారతి
4. 13-10-2019 ఉదయం గం. 10.00 ని॥లు తోలుబొమ్మలాట త్యాగరాయ గాన సభ
5. 14-10-2019 ఉదయం గం. 10.00 ని॥లు వీధి భాగవతాలు ఎ.వి. కళాశాల ప్రాంగణం
6. 15-10-2019 సాయంత్రం గం. 6.00 ని॥లు యక్షగానాలు నెక్లెస్ రోడ్డు
7. 16-10-2019 సాయంత్రం గం. 6.00 ని॥లు కాటి పాపలు హరికళాభవనం, సికిందరాబాదు

 

కనుక ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయవలసినదిగా కోరుతున్నాం.

స్థలం : హైదరాబాదు,
తేదీ : 5-10-2019.

ఇట్లు
ఆహ్వాన కమిటి,
భాగ్యనగర్ దసరా ఉత్సవ సంఘం.

V. పదజాల వినియోగం

కింది వాక్యాల్లో గీతగీసిన పదాలకు అదే అర్థం వచ్చే మరో రెండు పదాలను రాయండి.

ఉదా : కవితా సౌరంభం వెదజల్లుతుంది.
సౌరభం = సువాసన, పరిమళం.

అ) గృహజీవనానికి స్త్రీలే ఆలంబనం.
జవాబు.
ఆలంబనం = ఆధారం, ఆశ్రయం

ఆ) భక్తి మార్గం-మోక్ష సాధనం.
జవాబు.
మోక్షం = కైవల్యం, ముక్తి

ఇ) కాయ కష్టం చేసేవారు కొందరు. తినేది అందరూ.
జవాబు.
కష్టం = ఇక్కట్లు, శ్రమ

TS 8th Class Telugu 6th Lesson Questions and Answers Telangana తెలుగు జానపద గేయాలు

2. కింది పదాలతో సొంతవాక్యాలు రాయండి.

అ) పురోగతి
జవాబు.
ప్రజలంతా శక్తి వంచన లేకుండా కృషిచేసినప్పుడే జాతి పురోగతి సాధ్యం అవుతుంది. ఆ) రూపురేఖలు

ఆ) రూపురేఖలు :
జవాబు.
మనిషికి రూపురేఖలు కంటే మంచి గుణమే ముఖ్యం.

ఇ) కూనిరాగాలు
జవాబు.
కూనిరాగాలు తీస్తూ గొప్ప గాయకులమని ఊహించుకోకూడదు.

VI. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.

అ) మామయ్య ఇంటికి వచ్చాడు. మామయ్య కాఫీ తాగాడు.
జవాబు.
మావయ్య ఇంటికి వచ్చి కాఫీ తాగాడు.

ఆ) కొమ్మ విరిగిపోయింది. కొమ్మ కింద పడింది.
జవాబు.
కొమ్మ విరిగిపోయి కింద పడింది.

ఇ) శత్రువులు భయపడ్డారు. శత్రువులు పారిపోయారు.
జవాబు.
శత్రువులు భయపడి పారిపోయారు.

2. కింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.

అ) శివ అన్నం తిన్నాడు. రాజు పండ్లు తిన్నాడు.
జవాబు.
శివ అన్నము, రాజు పండ్లు తిన్నారు.

ఆ) ఆమె పూలు తెచ్చింది. ఆమె కొబ్బరికాయ తెచ్చింది.
జవాబు.
ఆమె పూలు, కొబ్బరికాయ తెచ్చింది.

ఇ) నల్లని మబ్బులు కమ్ముకొన్నాయి. వర్షం పడలేదు.
జవాబు.
నల్లని మబ్బులు కమ్ముకొన్నాయి కానీ వర్షం పడలేదు.

తత్పురుష సమాసం:

కింది వాక్యం చదువండి.

‘రాజభటుడు వచ్చాడు’.

పై వాక్యంలో వచ్చిన వాడు రాజా ? భటుడా ? అని చూస్తే భటుడే వచ్చాడని అర్థం వస్తుంది. అయితే ఆ భటుడు రాజుకు చెందిన వాడని చెప్పడానికి ‘రాజు యొక్క భటుడు’ అంటాం. ఇట్లా చెప్పడాన్ని విగ్రహవాక్యం అంటాం. విగ్రహవాక్యం చెప్పేటప్పుడు ఇక్కడ షష్ఠీ విభక్తి ప్రత్యయమైన “యొక్క” వాడినాం.

తిండి గింజలు తిండి ‘కొరకు’ గింజలు
పాపభీతి – పాపం ‘వల్ల’ భీతి

పై రెండు వాక్యాలను కూడా గమనిస్తే రెండు పదాల మధ్య విభక్తి ప్రత్యయాలు వాడినాం. పై విగ్రహ వాక్యాలు చూస్తే ఉత్తర పదాలైన భటుడు, గింజలు, భీతికి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇట్లా ఉత్తరపద ప్రాధాన్యతను తెలిపేది తత్పురుష సమాసం.

పూర్వ పదాలు ఉత్తర పదాలు
రాజు భటుడు
తిండి గింజలు
పాప భీతి

‘సమాసంలో ఉండే రెండు పదాలలో మొదటి పదం పూర్వపదం, రెండవ పదం ఉత్తరపదం.
పూర్వపదం చివర ఉండే విభక్తిని బట్టి వాటిని ఆయా విభక్తులకు చెందిన తత్పురుష సమాసాలుగా గుర్తించవచ్చు.

TS 8th Class Telugu 6th Lesson Questions and Answers Telangana తెలుగు జానపద గేయాలు

కింది పట్టికను చూడండి. చదువండి.

TS 8th Class Telugu 6th Lesson Questions and Answers Telangana తెలుగు జానపద గేయాలు 2
కింది వానిని చదువండి.
అసత్యం – సత్యం కానిది.
అధర్మం – ధర్మం కానిది
అన్యాయం – న్యాయం కానిది
ఇట్లా వ్యతిరేకార్థం తెలిపితే అది నఞ తత్పురుషం (నఇ’ అంటే వ్యతిరేకార్థం).

3. కింది పదాలు చదువండి. వాటి విగ్రహ వాక్యాలు రాయండి. అవి ఏ తత్పురుష సమాసాలో రాయండి.

TS 8th Class Telugu 6th Lesson Questions and Answers Telangana తెలుగు జానపద గేయాలు 3
జవాబు.

సమాసపదం విగ్రహవాక్యం

సమాసం పేరు

అ) గదాధరుడు గదను ధరించినవాడు ద్వితీయా తత్పురుష
ఆ) అగ్నిభయం అగ్ని వలన భయము పంచమీ తత్పురుష
ఇ) గుణహీనుడు గుణము చేత హీనుడు తృతీయా తత్పురుష
ఈ) ధనాశ ధనము నందు ఆశ సప్తమీ తత్పురుష
ఉ) దైవభక్తి దైవము నందు భక్తి సప్తమీ తత్పురుష
ఊ) అజ్ఞానం జ్ఞానం కానిది నఞ తత్పురుష


భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని

పెండ్లిళ్ళలో లేదా శ్రామికులకు సంబంధించిన జానపద గేయాలను సేకరించి నివేదిక రాయండి.

జవాబు.
అ) ప్రాథమిక సమాచారం
1) ప్రాజెక్టు పని పేరు : పెండ్లిళ్ళు మరియు శ్రామికులకు సంబంధించిన జానపద గేయాలు
2) సమాచారాన్ని సేకరించిన విధానం : ఇంటిలో పెద్దవాళ్ళ ద్వారా / గ్రంథాలయ పుస్తకాల ద్వారా

ఆ) నివేదిక :

1. పెండ్లిళ్ళలో పాడే పాటలు

1) నూతన వధువు గృహ ప్రవేశము :

పల్లవి :
మహాలక్ష్మి రావమ్మా శ్రీలక్ష్మి రావమ్మ
మా ఇంట కొలువుండ రావమ్మ
మంగళ హారతులు గొనుమమ్మ

చరణాలు :
1. అష్టలక్ష్మీ నీకు స్వాగతము పలికేము
ఇష్టముగ మా ఇంటి సౌభాగ్యములు కలుగ
గృహలక్ష్మివై నీవు రావమ్మా … || మంగళ ||

2. పదము పెట్టిన చోట సిరిసంపదలు గలుగ
కరము తాకిన వెనుక ధనధాన్య రాశులుగ
గృహలక్ష్మివై నీవు రావమ్మా … || మంగళ ||

3. పతి భక్తితో నీవు పతివ్రతగా వర్ధిల్లు
పదికాలములు పిల్లపాపలతో రాజిల్లు
గృహలక్ష్మివై నీవు రావమ్మా … || మంగళ ||

4. సకల సుఖశాంతులతో సంసారమును నడుప
తులసిదాసుడు నీకు శుభ మంగళము పలుక
గృహలక్ష్మివై నీవు రావమ్మా … || మంగళ ||

TS 8th Class Telugu 6th Lesson Questions and Answers Telangana తెలుగు జానపద గేయాలు

2) అప్పగింతల పాట :

పల్లవి :
కోటి శుభములు కలుగు నీకు పోయిరావమ్మ
ముక్కోటి వేల్పుల దీవెలనతో వెలయు మాయమ్మ || కోటి ||

చరణాలు :
1. కీర్తికాంతుల భాగ్యరాశుల శోభ నీదమ్మా
పుట్టినింటికి, మెట్టినింటికి పేరు తేవమ్మా

2. అత్తమామలె తల్లిదండ్రులు ఈ క్షణము నుండి
ఉత్తమ ఇల్లాలిగా నువు మసలుకోవమ్మా

3. మగని మనసెరిగి నీవు నడుచుకోవమ్మా
ప్రేమ మీరగ భర్త సేవలు చేసుకోవమ్మా

4.మరిది బావల ఆడపడచుల కలిసిమెసలమ్మా
బంధుమిత్రులు సేవకులను ఆదరించమ్మా.

5.అల్లుడా మా ముద్దు పట్టిని ఒప్పగించేము .
మనసుదీరగ మురిపెమారగ ఏలుకోవయ్యా

6. కల్ల కపటము లేని పిల్లను మీకు ఇచ్చేము
కంటి పాపగ వెంట నుండి చూసుకో వదినా || కోటి ||

3) బెస్తవాళ్ళ పాట :

ఏలియాల – ఏలియాల – ఏలియాల
ఐలేసా జోరిసెయ్యి – ఐలేసా బారుసెయ్యి
గంగమ్మ తల్లికి చెంగల్వ పూదండ
కాళిందికి తెల్ల కల్వదండ
జోర్సెయ్యి బార్సెయ్యి …………. జోర్సెయ్యి బార్సెయ్యి ॥ఏలియాల॥
గోదారి తల్లికి ………….. గొజ్జంగి పూదండ
సరస్వతికి …………….. సన్నజాజి దండ
కృష్ణవేణమ్మకు …………. గౌదంగి పూదండ
కావేరికి చంద్రకాంత దండా
ఐలేసా జోరుసెయ్యి – ఐలేసా బారుసెయ్యి ॥ఏలియాల॥

ఇ) ముగింపు : ఈ విధంగా పెండ్లిళ్ళ పాటలలో వరుడికి నలుగు పెట్టేప్పుడు పాట, వధువుకు నలుగు పెట్టేటపుడు పాట, అప్పగింతల పాట, నిశ్చయ తాంబూలం పాట, నూతన వధువు గృహప్రవేశం పాట.. ఇలా ఎన్నో పాటలు ఆయా సందర్భాలను బట్టి ఉన్నాయి. కానీ ప్రస్తుత కాలంలో వీటిని పాడేవాళ్ళు బహు అరుదు. అదే విధంగా కర్షకులు పొలం పని చేసేప్పుడు, శ్రామికులు ఆయా పనులు చేస్తున్నప్పుడు, తమ శ్రమను మరచి పోవడానికి అనేక జానపద గీతాలను పాడుతుంటారు. జానపదం అంటే జనం నోటితో పాడుకుంటూ, ఒక తరం నుండి మరొక తరానికి అందించే పాటలు. వీటికి లిఖిత రూపం ఉండదు. ఇలా సంస్కృతి వారసత్వంగా వస్తున్న ఈ పాటలను పరిరక్షించుకోవలిసిన అవసరం ఎంతైనా ఉన్నది.

TS 8th Class Telugu 6th Lesson Important Questions తెలుగు జానపద గేయాలు

ప్రశ్న 1.
పిల్లల పాటల గురించి రాయండి.
(లేదా)
పిల్లల పాటలు ప్రాధాన్యతను తెలపండి.
జవాబు.
జానపదగేయాలలో పిల్లల పాటల దొక ప్రత్యేకశాఖ. పసిపిల్లల లేత హృదయం లాగానే వారి పాటలు కూడా నిష్కపటంగానూ, నిర్మలంగానూ, స్వచ్ఛంగానూ, మార్దవంగానూ ఉంటాయి. ఈ గేయాలు అ) పిల్లల కోసం పెద్దలు రచించినవి ఆ) పిల్లలు రాసినవి అని రెండు విధాలు.

అ) పిల్లల కోసం పెద్దలు రచించినవి : వీటిలో లాలిపాటలు, జోలపాటలు ముఖ్యమైనవి. పిల్లలను లాలించేందుకు జోలపాడి నిద్రపుచ్చేందుకు ఇవి రచించబడ్డాయి. ఈ పాటలలోని భావాలు పిల్లలకు అర్థం కాకపోయినా వాటిలోని సంగీతం, లయ పిల్లలను లాలించి నిద్రపుచ్చుతాయి.

ఆ) పిల్లలు రాసినవి : పిల్లలు పాడే పాటలలో కొన్ని తమ సొంత రచనలు, మరొకొన్ని పెద్దల రచనలకు తమ కవిత్వం కలిపి కూర్చినవి ఉంటాయి. అనుకరణలో పిల్లలు పెద్దల రచనలలోని ధ్వనులను, మాటలను అర్థంతో పనిలేకుండా గ్రహిస్తారు. వాటిని అర్థంలేని పాటలు అని కూడా అంటారు. బాలబాలికలు ఆడే చెమ్మచెక్క, బిత్తి, కోతికొమ్మచ్చి, గుడుగుడుగుంచం, బుజబుజరేకులు, గొబ్బిళ్ళు, చిట్టిచిట్టి చిర్ర మొదలైన ఆటలలో పాడే పాటలు ఇందుకు ఉదాహరణలు.

TS 8th Class Telugu 6th Lesson Questions and Answers Telangana తెలుగు జానపద గేయాలు

ప్రశ్న 2.
జానపదగేయాలలో పారమార్థిక గేయాల ప్రత్యేకత ఏమిటి ?
జవాబు.
భక్తి, కర్మ, జ్ఞానం – అనే మూడు మోక్ష సాధనాలలో భక్తిమార్గం సులభమైనదని భారతీయులు నమ్ముతారు. ఈ భక్తిని ప్రబోధించే గేయాలే భక్తిగేయాలు. వీటినే పారమార్థిక గేయాలు అంటారు. తెలుగు ప్రాంతాలలో శైవభక్తిగీతాలు, వైష్ణవ భక్తిగీతాలు. వీటినే పారమార్థిక గేయాలు అంటారు. తెలుగు ప్రాంతాలలో శైవభక్తిగీతాలు, వైష్ణవ భక్తిగీతాలు వేల సంఖ్యలో ప్రచారం పొందాయి. భక్తిగీతాలు ప్రాచీనకాలం నుంచే ఉన్నట్లు తెలుస్తున్నది.

జంగంవారు, హరిదాసులు ఈ భక్తిగీతాలు పాడుకుంటూ తమ జీవనాన్ని సాగించుకుంటున్నారు. అంటే భక్తిగీతాలు వీరికి జీవనోపాధిని కల్పిస్తున్నాయన్నమాట. ఈ గీతాలలో భద్రాచలరామదాసు కీర్తనలు, తూము నరసింహదాసు కీర్తనలు, పరాంకుశదాసు, ప్రకాశదాసు, వెంకటదాసు కీర్తనలు మొదలైనవి తెలుగుసీమ అంతటా వినవస్తాయి. పదములు, దారువులు, మేలుకొలుపులు, భూపాళములు, లాలిపాటలు, జోలపాటలు, మంగళహారతులు, స్తోత్రములు, తారావళులు నామావళులు కూడా కీర్తనల కిందకే వస్తాయి.

ప్రశ్న 3.
స్త్రీల పాటలలో కనిపించే తెలుగువారి వేడుకలను తెలపండి.
(లేదా)
స్త్రీల పాటల్లో సంపూర్ణ జీవనం కనిపిస్తుంది. ఎలాగో వివరించండి.
జవాబు.
గృహజీవనంలో స్త్రీకి పురుషునికంటే ఎక్కువ ప్రాధాన్యం ఉన్నది. అందువల్ల సంసార సంబంధించిన కవితకు ఆలంబనం స్త్రీలే. కనుక వీటిని స్త్రీల పాటలు అనవచ్చు. వీటిలో వాస్తవికత పాలు ఎక్కువ. శిశువు పుట్టినప్పటి నుంచి వివాహం వరకూ జరిపే ప్రతి వేడుకకు సంబంధించిన పాటలు గమనించవచ్చు. పిల్లల్ని ఉయ్యాలలో ఉంచి పాడే లాలిపాటలు, జోలపాటలు ఎంతో ప్రసిద్ధమైనవి.

కట్నముల పాటలు, నలుగు పాటలు, అలుక పాటలు, తలుపుదగ్గర పాటలు, బంతుల పాటలు, వధూవరుల పాటలు, ముఖము కడుగుపాటలు, అవిరేణి పాటలు, ఉయ్యాలవారి పాటలు, అప్పగింత పాటలు మొదలైన పాటల ద్వారా కట్నాలు, నలుగులు, అలుకలు, బంతులు, అప్పగింతలు మొదలైన తెలుగువారి వేడుకలు తెలుస్తాయి. అంతేకాక సీతసమర్త, సీతగడియ, సీతమ్మవారి వసంతం, సీత వామనగుంటలు, సుభద్రసారె, రుక్మిణీదేవి సీమంతం, కౌసల్య బారసాల మొదలైనవి కూడా తరతరాల తెలుగు వారి వేడుకలను తెలిపేవే.

ప్రశ్న 4.
పనికి, పాటకి దగ్గర సంబంధం ఉంది అని శ్రామిక గేయాల ఆధారంగా తెల్పండి.
జవాబు.
పాటలు పాడుతూ పనిచేయటంవల్ల తాము చేసే కాయకష్టాన్ని మరిచి, హృదయంలోను మనసులోను ఉండే బాధ తొలగిపోవటమేకాక, శారీరక శ్రమ కూడా తెలియదు. శ్రామిక గీతాలకు వస్తువు ఏదైనా ఉండవచ్చు. వృత్తికి సంబంధించిన పాటలు, శ్రామికులు పాడుకుంటూ ఉంటారు. శ్రామిక గేయాలన్నీ సాధారణంగా వారి పనిపాట్లకు అనుగుణమై ఉంటాయి. శ్రామికుల శరీర భాగాల కదలికలో, ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో శ్రామికగేయాలకు, గీతాలకు తాళలయలు సమకూరి ఉంటాయి.ఉదా :- తిరుగలి పాటలు, దంపుడు పాటలు, పల్లకీ పాటలు, దుక్కి పాటలు, పడవలాగేటప్పుడు పాడే పాటలు (హైలెస్సో పాటలు) మొ||వి. దీనినిబట్టి చేసే పనికి, పాడే పాటకి దగ్గర సంబంధం ఉందని చెప్పవచ్చు.

ప్రశ్న 5.
జానపదాలను ఏయే సందర్భాలలో పాడటాన్ని నీవు గమనిస్తున్నావు ?
జవాబు.
1) పౌరాణిక గేయాలను పురాణేతిహాసాలపైన మక్కువగల గ్రామీణులు రామాయణం, భారతం, భాగవతాది పురాణాలలో కథలకు సంబంధించిన పాటలు మనోల్లాసానికి పాడుతారు.
ఉదా :- ఊర్మిళాదేవి నిద్ర, శ్రీరామ పట్టాభిషేకం.

2) చారిత్రక గేయాలను దేశభక్తిని కల్గించి వినోదాన్ని, ఉల్లాసాన్ని కల్గించి వీరరసంలో పాడుతారు.
ఉదా :- కాటమరాజు కథ, బొబ్బిలికథ, అల్లూరి సీతారామరాజు కథ.

3) పారమార్థిక గేయాలను భక్తి జ్ఞాన కర్మ మార్గాలలో భక్తి మార్గం ద్వారా మోక్షప్రాప్తి కోసం ఈ గేయాలు పాడుతారు.
ఉదా :- భద్రాచల రామదాసు కీర్తనలు, లాలిపాటలు, తత్త్వాలు, బతుకమ్మ పాటలు మొ||వి.

4) స్త్రీల పాటలను ఇంట్లో జరిగే విభిన్న వేడుకలలో సందర్భాన్ననుసరించి పాడుతారు.
ఉదా :- వియ్యాలవారి పాటలు, అప్పగింత పాటలు మొ||వి.

5) శ్రామిక గేయాలను కాయకష్టం చేసుకొనేవారు తమ కష్టం మరిచి పనిచేసుకోవడానికి పాడేవారు.
ఉదా :- తిరుగలి పాటలు, ఊడ్పు పాటలు, దంపుడు పాటలు.

6) పిల్లల పాటలను నిష్కపటంగా, నిర్మలముగా, మార్దవంగా ఉండే ఈ పాటలు పిల్లలకు పాడి, ఆటలు ఆడించేవారు.
ఉదా :- గుడిగుడిగుంచెం, గొబ్బిళ్ళు, కోతికొమ్మచ్చి మొ॥ వి.

7) కరుణరస గేయాలను విషాద సమయాలలో పాడి వినిపించేవారు. సందర్భాన్ని బట్టి పాడేవారు.
ఉదా :- ఎరుకల నాంచారి కథ, రాములమ్మ పాట.

ఈ విధంగా విభిన్న సందర్భాలలో సందర్భానికి తగిన జానపదగేయాలను పాడి వినోదం పొంది గ్రామీణులు ఆనందించేవారు.

పర్యాయపదాలు:

  • హృదయం గేయం = ఎద, మది, మనస్సు, గుండె
  • గేయం = గీతం, పాట, కీర్తన, సంకీర్తన
  • ప్రజలు = జనం, పౌరులు, పాలితులు, మనుషులు
  • భాష = మాట, వాక్కు
  • సాహిత్య = వాఙ్మయం, సారస్వతం
  • తొలి = ముందు, తొల్లి, పూర్వం
  • పెక్కు = చాలా, అనేక
  • పండితులు = విద్వాంసులు, విద్యావంతులు, చదువుకున్నవారు, శిష్టులు

TS 8th Class Telugu 6th Lesson Questions and Answers Telangana తెలుగు జానపద గేయాలు

నానార్థాలు:

  • అర్ధం = శబ్దార్థం, కారణం, ధనం, న్యాయం, ప్రయోజనం, వస్తువు
  • కాలం = నల్లని, సమయం, మరణం, ఇనుము
  • పదం = మాట, పాట
  • కవి = కవిత్వం చెప్పేవాడు, హంస, శుక్రాచార్యుడు, పండితుడు
  • వృత్తి = పని, జీవనోపాయము, స్థితి, పద్ధతి
  • అమూల్యం = వెలలేనిది, మిక్కిలి వెలగలది
  • వృత్తాంతం = సంగతి, కథ, విధం, అవసరం, ఉదాహరణం

వ్యుత్పత్త్యర్థాలు:

  • అదృష్టం = దైవకృతమగుట వలన కనబడనిది (భాగ్యము)
  • సాహిత్యం = హితంతో కూడినది, హితాన్ని చేకూర్చేది (సారస్వతం)
  • కృష్ణుడు = కృష్ణ (నలుపు) వర్ణము కలవాడు (విష్ణువు)
  • గ్రామము = ప్రాణుల చేత అనుభవించబడునది (ఊరు)
  • పండితుడు = శాస్త్రమందు మంచి బుద్ధి గలవాడు (విద్వాంసుడు)

ప్రకృతి – వికృతులు:

  • ప్రకృతి – వికృతి
  • అగ్ని – అగ్గి
  • శక్తి – సత్తి, సత్తు
  • కవిత – కయిత, కైత
  • కథ – కత, కద
  • స్నానం – తానం
  • ముఖం – మొకం, మొగం

సంధులు:

  • ప్రాంతమంతటా = ప్రాంతము + అంతటా = ఉత్వసంధి
  • దేశమంతటా = దేశము + అంతటా = ఉత్వసంధి
  • ఆవిష్కృతమవుతుంది = ఆవిష్కృతము + అవుతుంది = ఉత్వసంధి
  • సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.
  • ఎంతైనా ఎంత + ఐనా = అత్వ సంధి
  • ప్రాచీనమైనట్టిది = ప్రాచీనమైన + అట్టిది = అత్వసంధి
  • సూత్రం: అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.
  • ప్రేమాభిమానాలు = ప్రేమ + అభిమానాలు = సవర్ణదీర్ఘ సంధి
  • నామృతం = నా + అమృతం = సవర్ణదీర్ఘ సంధి
  • రామాయణాదులు = రామాయణ + ఆదులు = సవర్ణదీర్ఘసంధి
  • భాగవతాది = భాగవత + ఆది = సవర్ణదీర్ఘ సంధి
  • అభీష్టానుగుణం = అభీష్ట + అనుగుణం = వైష్ణవ + ఆది = సవర్ణదీర్ఘ సంధి
  • వైష్ణవాది = వైష్ణవ + ఆది = సవర్ణదీర్ఘ సంధి
  • సూత్రం : అ, ఇ, ఉ, ఋలకు సవర్ణాలైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.
  • పురాణేతిహాసాలు = పురాణ + ఇతిహాసాలు = గుణసంధి = గుణసంధి
  • విమోచనోద్యమం = విమోచన + ఉద్యమం
  • సూత్రం : అకారానికి ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమంగా ఏ, ఓ, అర్ లు ఏకాదేశమవుతాయి.
  • అత్యుత్తమ = అతి + ఉత్తమ = యణాదేశ సంధి
  • అత్యంత = అతి + అంత = యణాదేశసంధి
  • సూత్రం : ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు పరమైనపుడు క్రమంగా య, వ, ర లు ఆదేశమవుతాయి.

సమాసములు:

సమాసపదం విగ్రహవాక్యం సమాసం పేరు
1. ఇతర భాషలు ఇతరమైన భాషలు విశేషణ పూర్వపద కర్మధారయం
2. మృదుహృదయం మృదువైన హృదయం విశేషణ పూర్వపద కర్మధారయం
3. లేత హృదయం లేతదైన హృదయం విశేషణ పూర్వపద కర్మధారయం
4. భాషా సంస్కృతులు భాషయునూ సంస్కృతియునూ ద్వంద్వ సమాసం
5. ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉచ్ఛ్వాసయునూ నిశ్వాసయునూ ద్వంద్వ సమాసం
6. తాళలయలు తాళమునూ లయయునూ ద్వంద్వ సమాసం
7. దైవ సమానుడు దైవముతో సమానుడు తృతీయా తత్పురుష సమాసం
8. వీరపూజ వీరుల యొక్క పూజ షష్ఠీ తత్పురుష
9. జానపద గేయాలు జానపదుల యొక్క గేయాలు షష్ఠీ తత్పురుష
10. శిష్ట సాహిత్యం శిష్టుల యొక్క సాహిత్యం షష్ఠీ తత్పురుష
11. సీతా కళ్యాణం సీత యొక్క కళ్యాణము షష్ఠీ తత్పురుష
12. కాటమరాజు కథ కాటమరాజు యొక్క కథ షష్ఠీ తత్పురుష
13. మోక్ష సాధనాలు మోక్షము యొక్క సాధనాలు షష్ఠీ తత్పురుష
14. అగ్ని ప్రవేశం అగ్ని యందు ప్రవేశం సప్తమీ తత్పురుష సమాసం
15. వేదాంత సత్యాలు వేదాంతము నందలి సత్యాలు సప్తమీ తత్పురుష సమాసం


పాఠ్యభాగ ఉద్దేశం

తెలుగువారి ఆచార సంప్రదాయాలను, తాత్త్వికతను, చరిత్రను తెలిపే తెలుగు జానపద గేయాల గొప్పతనం, వాటి వైవిధ్యాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం వ్యాసప్రక్రియకు చెందినది. ఈ పాఠ్యాంశం ఆచార్య బిరుదురాజు రామరాజు రాసిన వ్యాసం.

TS 8th Class Telugu 6th Lesson Questions and Answers Telangana తెలుగు జానపద గేయాలు

కవి పరిచయం

ప్రశ్న.
బిరుదురాజు రామరాజుగారి పరిచయం రాయండి.
(లేదా)
బిరుదురాజు రామరాజుగారి జీవిత విశేషాలు తెల్పండి.
జవాబు.
తెలుగు జానపద సాహిత్యమనగానే మనకు గుర్తుకువచ్చేవాడు ఆచార్య బిరుదురాజు రామరాజు. పూర్వపు వరంగల్ జిల్లా దేవునూరు గ్రామంలో ఈయన జన్మించాడు. కవి, పరిశోధకుడు, అనువాద రచయిత, సంపాదకుడుగా ప్రసిద్ధుడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షుడుగా, డీన్ గా పనిచేశాడు. “తెలుగు జానపద గేయ సాహిత్యం” ఈయన పరిశోధన గ్రంథం. చరిత్రకెక్కన చరితార్థులు, ఆంధ్రయోగులు, మరుగునపడిన మాణిక్యాలు, ఉర్దూ – తెలుగు నిఘంటువు, 08-02-2010 తెలుగు జానపదరామాయణం, తెలంగాణ పల్లెపాటలు, తెలంగాణ పిల్లల పాటలు మొదలైనవి ఈయన ఇతర రచనలు.
గమనిక : పరీక్షలో గీత గీసిన వాక్యాలు రాస్తే జవాబు సరిపోతుంది.

ప్రవేశిక

జానపద సాహిత్యమనగానే గుర్తుకు వచ్చేది గేయమే. పదాలని, పాటలని జానపదులు పిలుచుకునే లయాత్మక రచనలు జానపదగేయాలు. ఈ గేయాలలో ఆయా ప్రాంత ప్రజల భావోద్వేగం, దైనందిన జీవితం, చరిత్ర, సంస్కృతి, భాష మొదలైనవి కనిపిస్తాయి. సామూహిక ప్రచారం, సరళభావం, జనప్రియత్వం వీటి లక్షణాలు. సాంస్కృతిక వారసత్వంగా వచ్చే ఈ జానపదగేయాల్లోని ఔన్నత్యాన్ని తెలుసుకుందాం.

కఠిన పదాలకు అర్ధాలు

  • దర్పణం = అద్దం
  • ఇతివృత్తం = తీసుకున్న విషయము (content), కథా సారాంశం, కథా వస్తువు.
  • గాథ = కథ, చరిత్ర లేదా విషయం
  • చేవ = బలం
  • దళం = సమూహం
  • ప్రజాబాహుళ్యం = ఎక్కువ మంది ప్రజలలో
  • శాఖ = విభాగం, కొమ్మ
  • మార్దవం = మృదుత్వం
  • విశ్వాసం = నమ్మకం, కృతజ్ఞతాభావం
  • ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు = గాలి పీల్చి వదలటం
  • నిష్కపటము = కపటం లేని (మోసం లేని)
  • జీవనోపాధి = జీవితానికి ఆధారం, బ్రతుకుతెరువు, మనుగడ, జరుగుబాటు, పొట్టకూడు.

నేనివి చేయగలనా ?

TS 8th Class Telugu 6th Lesson Questions and Answers Telangana తెలుగు జానపద గేయాలు 4

TS 8th Class Study Material Telangana Pdf Textbook Solutions

TS 8th Class Study Material Pdf Telangana | TS 8th Class Textbook Solutions Guide

TS Board Solutions