TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

Telangana SCERT 10th Class Telugu Guide Telangana 7th Lesson శతక మధురిమ Textbook Questions and Answers.

TS 10th Class Telugu 7th Lesson Questions and Answers Telangana శతక మధురిమ

చదవండి – ఆలోచించి చెప్పండి. (T.B. P.No. 66)

నల్లగొంగడిదెచ్చి చల్లనద్దినగాని
మల్లెపూల విధంబు తెల్లఁబడునె

వేపాకు పసరెంతసేపు గాచిన గాని
తేనెతో సమముగ తియ్యఁబడునె

వెల్లిపాయలు దెచ్చి వే గంధమునఁ గూర్చ
పరిమళించునె మొల్ల విరులవలెను

కుక్కతోకకు రాతిగుండు గట్టిన గాని
వంకబోయిన కొన చక్కనగునె

కొంటెలను సజ్జనులతోను గూర్చితేమి
ఆత్మపరిశుద్ధులై భక్తులౌదురెట్లు
చక్రధర ! ధర్మపురిధామ ! సార్వభౌమ !
నరహరీ ! భక్తజనకల్ప ! నాగతల్ప !

– నరహరి శతకము, కాకుత్థ్సం శేషప్పకవి

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ఈ పద్యం ఎవరు రాశారు ? ఏ శతకంలో ఉన్నది ?
జవాబు:
కాకుత్థ్సం శేషప్పకవి. నరహరి శతకములోనిది.

ప్రశ్న 2.
ఈ పద్యం ద్వారా మీరేమి గ్రహించారు ?
జవాబు:
చెడ్డవారిని సజ్జనులుగా మార్చుట కష్టమని గ్రహించాను.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

ప్రశ్న 3.
ఇట్లాంటి పద్యాలు మీకింకా ఏమి తెలుసు ?
జవాబు:

  1. గంగిగోవుపాలు గరిటెడైనచాలు ….. వినుర వేమ ||
  2. గాజుం బూస యనర్ఘ రత్నమగునా …….. పార్వతీ వల్లభా |

ఈ పద్యాలు చదివాను.

ప్రశ్న 4.
వీటిని ఎందుకు నేర్చుకోవాలి ?
జవాబు:
ఇటువంటి మంచి మంచి పద్యాలు నేర్చుకోవడం వలన నీతులు తెలుస్తాయి. మానవ స్వభావాలు అంచనా వేయవచ్చు. మంచి ప్రవర్తన అలవాటు అవుతుంది. చక్కగా మాట్లాడడం తెలుస్తుంది. ఏ సమస్యనైనా పరిష్కరించుకోగల నేర్పు వస్తుంది. జీవితంలో జరిగే సంఘటనలను ముందుగానే ఊహించవచ్చు.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 69)

ప్రశ్న 1.
దైవాన్ని పూజించే విధానాలు ఎట్లా ఉండాలి ? ఎందుకు ?
జవాబు:
సత్యం, దయ, విశిష్టమైన ఏకాగ్రత (భక్తియోగ విధానం) ఈ విధానాల ద్వారా దైవాన్ని పూజించాలి ఎందుకంటే ఇవి మనిషికి అత్యంత అవసరం.

ప్రశ్న 2.
ప్రజలు రాజులను ఆశ్రయించ వచ్చునా ? ఎందుకు ?
జవాబు:
ఆశ్రయించరాదు. తినడానికి భిక్షం పెడతారు. నివాసానికి గుహలున్నాయి. వస్త్రాలు వీథుల్లో దొరుకు తాయి. తాగడానికి నదుల్లో చల్లని నీరు దొరుకుతుంది. తపస్సు చేసే మునులను రక్షించటానికి శ్రీకాళ హస్తీశ్వరుడు ఉన్నాడు. ఇంకా ఎందుకు రాజులను ఆశ్రయించాలి (ఆశ్రయించరాదు).

ప్రశ్న 3.
సిరిలేకున్నా పండితుడు ఏయే గుణాలవల్ల శోభిస్తాడు ?
జవాబు:
తలవంచి గురువు పాదాలకు నమస్కరించేవాడు, దానగుణం కలిగినవాడు, చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినేవాడు. సత్యవ్రతుడైనవాడు. భుజబలంతో విజయా లను పొందేవాడు. మనస్సునిండా మంచితనం కల వాడయిన పండితుడు సంపదలు లేకున్నా ప్రకాశిస్తాడు.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 70)

ప్రశ్న 1.
రాముని గొప్పదనాన్ని ఏ విధంగా చాటిచెప్పవచ్చు?.
జవాబు:
దశరథుని కుమారుడు, దయాసముద్రుడైన శ్రీరాముడు యుద్ధరంగంలో శత్రుభయంకరుడని, దుఃఖాలు పొందేవారి పాలిట బంధువువని, కాంతిమంతమైన అమ్ములపొది, బాణాలు, కోదండముల నుపయోగించే నేర్పులో ప్రచండమైన భుజతాండనం చూపి, కీర్తి పొందిన నీకు సాటివచ్చే దైవం మరొకరులేరని, మదించిన ఏనుగు నెక్కి ఢంకా మ్రోగిస్తూ, భూమండల మంతా వినబడేటట్లు చాటి చెప్పవచ్చు.

ప్రశ్న 2.
సత్ప్రవర్తన వల్ల పొందే ఫలితాలు ఏమిటి ?
జవాబు:
విష్ణుభక్తులను నిందించకుండా ఉంటే అనేక గ్రంథాలను చదివినట్లే, భిక్షమిచ్చేవారిని ఆపకుంటేచాలు, అది దానము చేసినట్లే. సజ్జనులను మోసం చేయకుండా ఉంటే గొప్ప బహుమతినిచ్చినట్లే, దేవతా మాన్యములను ఆక్రమించకుండా ఉంటే అది బంగారు ధ్వజస్తంభంతో కూడిన గుడి కట్టించినట్లే. ఇంకొకరి ‘వర్షాశనం’ (ఒక ఏడాదికి సరిపడే భోజనాన్ని) రాకుండా చేయకుంటే చాలు. తన పేరుతో సత్రాలు కట్టించినట్లే అవుతుంది.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

ప్రశ్న 3.
మోసం ఎందుకు చేయకూడదు ?
జవాబు:
అనేక దుర్గుణాల్లో మోసం ఒకటి. మోసం ఎన్నడూ, ఎవరికీ చేయకూడదు. దీనివల్ల విశ్వాసం కోల్పోతారు. మానవీయ సంబంధాలు దెబ్బతింటాయి. గౌరవం అంతరించిపోతుంది. మానసిక స్పర్థలు కలుగుతాయి. అందువల్ల మోసం అనేది చేయకుండా ఉండాలి.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 71)

ప్రశ్న 1.
కవి దృష్టిలో నిజమైన ఘనుడెవరు ?
జవాబు:
స్వార్ధం లేనివాడు, త్యాగంతో కూడిన దీక్షను పూని జను లందరి దీనస్థితిని రూపుమాపి, అందరికి సుకుమారమైన, ఆనందకర జీవితసుఖాన్ని పంచి, మాతృదేశపు గొప్పతనాన్ని ఎవరయితే విశదపరుస్తారో వారే గొప్ప వారవుతారు. అపూర్వమైన కీర్తిమంతులవుతారు.

ప్రశ్న 2.
మిత్రుని సహాయం ఎన్ని విధాలుగా ఉంటుంది ?
జవాబు:
మిత్రుని సహాయం చాలా రకాలుగా ఉంటుంది. మంచి పుస్తకంలాగా మంచిని బోధిస్తాడు. కార్యసాధనంలో సంపదలా సహాయపడతాడు. స్వాధీనమైన కత్తిలాగ శత్రుసంహారం చేసేవాడు. రక్షించే మనసులాగ సౌఖ్యాలను ఇచ్చేవాడు నిజమైన మిత్రుడు.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

ప్రశ్న 3.
నరరూప రాక్షసులంటే ఎవరు ?
జవాబు:
కలలో కూడా సత్యాన్ని పలకడానికి ఇష్టపడనివాడు, మాయమాటలు చెప్పి ఇతరుల సొమ్ము అపహరించే వాడు, కులగర్వంతోటి పేదవాండ్ల ఇండ్లను నాశనం చేసేవాడు, లంచాలకు విలువను పెంచేవాడు, చెడు ప్రవర్తనతో తిరిగేవాడు, వావివరుసలను పాటించని వాడు, నవ్వుతూ ముచ్చటాడుతూనే ఎదుటివాడిని నాశనం చేయాలనుకునేవాడు, తల్లిదండ్రులను ఇంటినుంచి వెళ్ళగొట్టేవాడు ఈ భూమిమీద మానవ రూపంలో ఉన్న రాక్షసుడే.

ఇవి చేయండి

1. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
శతక ప్రక్రియ శతాబ్దాల తరబడి కొనసాగుతూ ఉన్నది. పాఠంలోని శతక పద్యాల భావాలు నేటి కాలానికి కూడా తోడ్పడుతాయని భావిస్తున్నారా ? ఎందుకు ? చర్చించండి.
జవాబు:
తెలుగు సాహిత్యంలో శతకాలకు ప్రత్యేక స్థానం ఉంది. వందల సంవత్సరాల నుండి శతకాలు మానవులలో నైతికతను, సద్గుణాలను, మానవీయ విలువలను, భక్తితత్త్వాన్ని పెంపొందించడానికి తోడ్పడుతున్నాయి. పూర్వపు విద్యావిధానంతో ప్రతి ఒక్క విద్యార్థి శతక పద్యాలను కంఠస్థం చేసేవారు.

శతక పద్యాలు రాని విద్యార్థి ఉండేవాడు కాదు. నేడు అన్ని రంగాలలో మార్పులు వచ్చినట్లే భాషను నేర్చుకొనే విధానంలో కూడా మార్పులు వచ్చాయి. అందువల్ల కొందరు మాత్రమే శతకాలు చదువుతున్నారు. అయితే కాలం ఎంత మారినా నేటి సమాజానికి కూడా శతకాలు చదవడం ముఖ్యావసరం అని చెప్పవచ్చు.

ప్రస్తుత పాఠంలోని సర్వేశ్వర శతక పద్యం ద్వారా దేవుని అనుగ్రహం పొందాలంటే కోట్లాది రూపాయలు అవసరం లేదని సత్యం, దయ, ఏకాగ్రత అనే పుష్పాలు ఉంటే చాలని తెలుసుకున్నాం. దీని వల్ల నేడు భక్తి పేర జరుగుతున్న వృథా ఖర్చులను తగ్గించు కునే అవకాశం కల్గుతుంది.

కాళహస్తీశ్వర శతకం రాజుల నాశ్రయించవద్దని తెలిపింది. ఇప్పుడు రాజులు లేనప్పటికీ వారి స్థానంలో వచ్చిన ఎమ్.ఎల్.ఏలు, ఎమ్.పి.ల దగ్గరికి చేరకూడదని గ్రహించవచ్చు.

లోకంలో సంపద లేకపోయినా గురువులకు నమస్కరించడం, సత్యం పలకడం, దానం చేయటం అనే గుణాల వల్ల పండితుడు ప్రకాశిస్తాడు అని చెప్పటం వల్ల డబ్బు కంటే సత్యం, దానం, గురువందనం గొప్పవని మల్ల భూపాలీయ శతకం వల్ల తెలుస్తున్నది. దాశరథీ శతకం వలన శ్రీ రాముని వైభవాన్ని తెలుసు కున్నాం. నృసింహ శతకం ద్వారా ఏయే పనులు చేయకూడదో గ్రహించవచ్చు.

అందులో చెప్పిన విషయాలు నేటి సమాజంలో కూడా జరుగుతున్నవే. విశ్వనాథేశ్వర శతకం గొప్పవారు కావాలంటే త్యాగం చెయ్యాలని చెప్పుటయేగాక విద్యార్థులు కూడా దేశం కోసం త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలని బోధిస్తున్నది.

లొంకరామేశ్వర శతకం మిత్రుడు పుస్తకం లాంటి వాడని తెలిపి ఈ నాటికి కూడా స్నేహితుల విలువను మనకు గుర్తుకు తెస్తుంది. ఇక వేణుగోపాల శతకంలో చెప్పిన విషయాలు నేడు కూడా జరుగుతున్నా వాటిని చేయకుండా ఉండటానికి ప్రతివిద్యార్థి ప్రయత్నించాలి.

ప్రశ్న 2.
కింది భావమున్న పద్య పాదాలను పాఠంలో గుర్తించండి.

అ) మిత్రుడు యుద్ధరంగంలో కత్తివలె ఉపయోగపడుతాడు.
జవాబు:
7వ పద్యం – పొత్తంబై కడునేర్పుతో ………. స్వాయత్తంబైన కృపాణమై యరుల నాహరించు మిత్రుండు

ఆ) రాముని మించిన దైవం లేడని చాటుతాను.
జవాబు:
4వ పద్యం – భండన భీమ ….. రెండవ సాటి దైవమిక లేఁడనుచున్ కరుణాపయోనిథీ” ||

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

ప్రశ్న 3.
విద్వాన్ కలువకుంట కృష్ణమాచార్య రాసిన కింది పద్యాన్ని చదువండి. భావాన్ని సొంతమాటల్లో రాయండి.

పద్యానికి తగిన శీర్షికను పెట్టండి.
అనుభవమ్మున నేర్చిన యట్టి చదువు
తండ్రివలె కాపునిచ్చును తాను ముందు
పడిన కష్టాలచే గుణపాఠమయ్యి
తగిన ప్రేరణ – కాపాడు తల్లివోలె

భావం : అనుభవముతో నేర్చుకొన్న చదువు తండ్రిలాగా -రక్షించును. ముందు పడిన కష్టాలు, గుణ పాఠాలుగా పొంది తగిన ప్రేరణను ఇస్తుంది. అమ్మలాగా చదువు కాపాడుతుంది అని అర్థం.
శీర్షిక : “చదువు గొప్పతనం”, “చదువు వల్ల ప్రయోజనం”.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) మీ దృష్టిలో అపూర్వ కీర్తిమంతుడంటే ఎట్లా ఉండాలి?
(లేదా)
కీర్తివంతుని లక్షణాలను పాఠం ఆధారంగా వివరించండి.
జవాబు:
త్యాగం గుణం కల్గి జనులందరి దీనస్థితిని రూపు మాపి, అందరికి సుఖమయమైన, ఆనందకర జీవిత సుఖాన్ని పంచి, మాతృదేశపు గొప్పతనాన్ని ఎవరయితే విశదపరుస్తారో వారే గొప్పవారవుతారు. అపూర్వమైన కీర్తిమంతులవుతారు. ఈ పై లక్షణాలన్ని అపూర్వ కీర్తిమంతునికి ఉండాలని నా అభిప్రాయం.

ఆ) త్యాగి లక్షణాలెట్లా ఉంటాయి ?
(లేదా)
త్యాగి లక్షణాలను వివరించండి.
జవాబు:
నిజమైన త్యాగి తన సర్వస్వాన్ని ధారపోయటానికి కూడా ఇష్టపడతాడు. అడిగితే కాదనకుండా ఇస్తాడు. తనకిష్టమైనా సరే తృణప్రాయంగా భావించి ఇస్తాడు. ఇది చాలా గొప్ప విషయం.

  1. అతడు తన ప్రాణాలు కూడా లెక్కచేయడు.
  2. గొప్ప కోసం చూడడు.
  3. కీర్తి ప్రతిష్ఠలను కూడా లెక్కచేయడు.
  4. తన సర్వసాన్ని ఇచ్చివేస్తాడు. ఇవి త్యాగి లక్షణాలు.
    ఉదా : కర్ణుడు, బలిచక్రవర్తి, శిబి చక్రవర్తి మొదలగువారు.

ఇ) మిత్రుడు పుస్తకంవలె మంచి దారి చూపుతాడని ఎట్లా చెప్పగలరు ?
జవాబు:
మంచి పుస్తకాన్ని మించిన స్నేహితుడు లేడు. మంచి స్నేహితుని మించిన పుస్తకం లేదు. పుస్తకం అంటే విజ్ఞానం. ఒక విషయం తెలుసుకోవాలంటే పుస్తకంలో చూసుకొంటాం లేదా స్నేహితులను అడుగుతాం. పుస్తకం మనకు కథల రూపంలో మంచి మంచి నీతులను చెబుతుంది. జీవితంలో ఉపయోగించే ఎన్నో మంచి విషయాలను చక్కటి పదాలతో చెబుతుంది.

అలాగే స్నేహితుడు కూడా ఎన్నో మంచి విషయాలు చెబుతాడు. తప్పు చేస్తుంటే చేయవద్దు అంటాడు. మనకు వినసొంపైన మాటలతో మంచిని చెబుతాడు. కష్టకాలంలో తోడుగా నిలబడతాడు. తప్పుచేస్తే పరిహారం కూడా చెబుతాడు. అందుకే స్నేహితుడు మంచి పుస్తకం వలె మంచి మార్గం చూపిస్తాడు అంటారు.

ఈ) పూజకు సత్యం, దయ, ఏకాగ్రత అనే పుష్పాలు అవసరమని పాఠంలో తెలుసుకున్నారు కదా ! మరి చదువు విషయంలో ఏవేవి అవసరమనుకుంటున్నారు?
జవాబు:
ఏకాగ్రత అవసరం. శ్రద్ధ చాలా అవసరం. ఉత్సుకత, కార్యదీక్ష కూడా అవసరం “శ్రద్ధయా వర్థతే విద్య”. విద్యార్థికి అలసత్వం పనికిరాదు. “అలసతకూడదు ఇంచుక అధ్యయనంబున, బోధనంబునన్” అని ఒక ప్రసిద్ధ కవి అన్నాడు. వినయం, విధేయత, క్రమశిక్షణ కూడా చాలా అవసరం. పట్టుదల సాధించాలనే తపన ఉండాలి. వీటితోపాటుగా శారీరక, మానసిక దృఢత్వం ఎంతో అవసరం.

ప్రశ్న 2.
క్రింది ప్రశ్నకు పది వాక్యాలలో జవాబు రాయండి.

అ) శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా ఉపయోగపడుతాయో విశ్లేషించి రాయండి.
(లేదా)
శతక పద్యాల్లోని నీతులు జగతికి మార్గదర్శకాలు ఎలా అవుతాయో విశ్లేషించండి.
జవాబు:
శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో చాలా ఉపయోగ పడతాయి. ఎలాగంటే ……. సర్వేశ్వర శతకంలోని ‘భవదీయార్చన……….` అనే పద్యంలో దేవుని పూజించడానికి సత్యం, దయ, ఏకాగ్రత అనే లక్షణాలు ఉండాలన్నారు.

సత్యం మాట్లాడే లక్షణం అలవాటైతే మోసంచేసే ఆలోచన రాదు. అందుచేత గౌరవం పెరుగుతుంది. దయ కలిగి ఉంటే, కష్టాలలో ఉన్నవారికి సహాయం చేస్తాము. దాని వలన సమాజంలో స్నేహభావం పెరుగు తుంది. కక్షలు కార్పణ్యాలూ ఉండవు.

ఏకాగ్రత కలిగి ఉంటే ఏ పనినైనా సాధించవచ్చు. ఏ విషయమైనా అర్థమవుతుంది. తెలివి పెరుగుతుంది. తెలివైన సమాజం సంపదలను అభివృద్ధి చేస్తుంది. దరిద్రం ఉండదు. కరవుకాటకాలు ఉండవు.

శ్రీకాళహస్తీశ్వర శతకంలోని ‘ఊరూరం జనులెల్ల ……….’ అనే పద్యంలో చక్కటి నీతులు ఉన్నాయి. అవి అర్థం చేసుకొంటే ‘నేను, నావాళ్ళు’ అనే స్వార్థం పోతుంది. సంపాదన మాత్రమే జీవితం కాదని తెలుస్తుంది. భగవంతునిపైన నమ్మకం పెరుగుతుంది. ఉత్తమమైన సంస్కారం కలుగుతుంది.

‘సిరిలేకైన విభూషితుండె’ అనే పద్యంలో గురువులను గౌరవించాలని చెప్పారు. ఈ రోజులలో గురువులంటే గౌరవం తగ్గుతోంది. దానగుణం కావాలన్నారు. దానగుణం ఉంటే దొంగతనాలు, దోపిడీలు ఉండవు. మంచి విషయాలను వినాలన్నారు. మంచి విషయాలను వింటే మంచి ఆలోచనలు వస్తాయి. మంచిపనులు చేస్తాం. మంచి సమాజం ఏర్పడుతుంది. మనసులో సౌజన్యం ఉండాలన్నారు. మనసులో సౌజన్యం ఉంటే ఎవ్వరిపైనా కోపం, ద్వేషం ఉండవు. అందరూ నావాళ్ళే అనే భావం కలుగుతుంది. గొడవలకు అవకాశం లేదు. అందుచేత శతక పద్యాలలో చెప్పిన నీతుల వలన అనేక ప్రయోజనాలున్నాయి.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

ప్రశ్న 3.
క్రింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

అ) ఈ పాఠం ఆధారంగా మనం అలవర్చుకోవాల్సిన మంచి గుణాలు, అలవర్చుకోకూడని గుణాలను వివరిస్తూ మిత్రునికి ఒక లేఖ రాయండి.
జవాబు:
వరంగల్,
9.6.2018.
ప్రియమైన మిత్రునకు,
ఉభయకుశలోపరి. నేను 10వ తరగతి చదువు చున్నాను. మన 10వ తరగతిలోని 7వ పాఠం “శతక మధురిమ” చాలా బాగుంది. ఈ పాఠంలో మంచి గుణాలు, ఉండకూడని గుణాలు మా పంతులుగారి ద్వారా తెలుసుకున్నాను. వాటిని ఇక్కడ రాస్తున్నాను.

అలవర్చుకోవాల్సిన మంచి గుణాలు :

  1. పూజకు సత్యం, దయ, ఏకాగ్రత ఉండాలి. ఇవి లేని పూజ వ్యర్ధం.
  2. రాజులను ఆశ్రయించరాదు. అది నరకంతో సమానం.
  3. శ్రద్ధ, దానగుణం గల సత్యవ్రతుడు సంపదలు లేకపోయినా ప్రకాశిస్తాడు.
  4. మిత్రుడు మంచి పుస్తకంలాగా, ధనంలాగా, సహాయపడతాడు నిండు మనస్సుతో సుఖాన్ని ఇస్తాడు.

అలవర్చుకోకూడని గుణాలు :

  1. విష్ణు భక్తులను నిందించరాదు.
  2. భిక్షం ఇచ్చేవారిని ఆపకూడదు.
  3. సజ్జనులను మోసం చేయరాదు.
  4. దేవతామాన్యములను ఆక్రమించరాదు.
  5. అసత్యాన్ని పలకరాదు.
  6. మాయమాటలు చెప్పరాదు. లంచాలకు విలువ ఇవ్వరాదు. చెడు ప్రవర్తనతో తిరగరాదు.
    మీ పాఠంలో నీవు తెలుసుకున్న విషయాలు తెలియపరచగలవు.

ఇట్లు,
నీ మిత్రుడు,
X X X X X.

చిరునామా :

యం. యుగంధర్,
10వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూల్,
బాసర,
ఆదిలాబాద్ (జిల్లా.)

(లేదా)

ఆ) ఏదైనా ఒక పద్యభావం ఆధారంగా నీతికథ రాసి ప్రదర్శించండి.
జవాబు:
6వ పద్య భావం ఆధారంగా నీతి కథ

త్యాగం : అన్ని సద్గుణాల్లోను ‘త్యాగం’ ఎంతో గొప్పది. ఇది మానవుడికి అజరామరమైన కీర్తిని సంపాదించిపెడుతుంది. మనం కన్న సంతానం కన్నా, మనం సంపాదించిన ధనం కన్నా, మనం చేసిన మంచి పనుల కన్నా, శాశ్వతత్వాన్ని సమకూర్చి పెట్టేది త్యాగం ఒక్కటే! అందుకనే “నకర్మణా నప్రజయా ధనేన, త్యాగేనైకేన అమృతత్వమానసు” అని వేదం ఘోషిస్తుంది. దానం – త్యాగం ఈ రెండూ దగ్గర లక్షణాలు కలవిగానే కనిపించినా రెండింటిలో చాలా తేడా ఉంది. తన దగ్గరవున్న దానిలో ఇతరు లకు ఇవ్వడం దానం.

తనకు మిక్కిలి అవసరమైనదని తెలిసికూడా, దానిని లెక్కపెట్ట కుండా ఇతరు లకు ఇచ్చేయడం త్యాగం. భారతీయ సంస్కృతి ఈ త్యాగానికి పెద్దపీట వేసింది. త్యాగధనుల్ని ప్రాతః స్మరణీయులుగా భావించి నిత్యం ఆరాధించింది. అలాంటి త్యాగానికి సంబంధించిన ఎన్నో కథల్లో భాగవతంలోని ‘రంతిదేవుని” చరిత్ర వినదగ్గది. రంతిదేవుడు గొప్ప మహారాజు. తన దగ్గర వున్న సంపదనంతా ప్రజలకు దానం చేశాడు.

చివరకు ఏమీలేని నిర్ధన స్థితిలో భార్యాబిడ్డలతో మిగిలి పోయాడు. తినడానికి, తాగడానికి ఏమీ లభించని పరిస్థితిలో 48 రోజులు గడిపాడు. అప్పుడు ఆయన ముందు ఆకస్మాత్తుగా పంచభక్ష్య పరమాన్నాలు ప్రత్యక్షమయ్యాయి. నకనకలాడే భార్యాబిడ్డలతో ఆ ఆహారాన్ని తీసుకోడానికి సిద్ధపడ్డాడు.

అంతలో ఒక బ్రాహ్మణుడు వచ్చి ‘అయ్యా ! ఆకలితో బాధ పడుతున్నాను. నాకేమైనా పెట్టండి’ అని దీనంగా అడిగాడు. రంతిదేవుడు ఆ పరిస్థితిలో కూడా అతడికి సగభాగం యిచ్చేశాడు. ఆ తరువాత మరొక అతిథి వచ్చాడు. అతడికి తన దగ్గరవున్న సగభాగం యిచ్చాడు.

వరుసగా వచ్చి అడిగే ఆర్తులతో ఆహారం అయిపోయింది. చివరకు పానీయం మాత్రమే మిగిలింది. కనీసం ఆ నీరైనా తాగి ఆకలిని తీర్చుకుందామని అనుకున్నాడు. సరిగ్గా ఆ సమ యంలోనే ఓ దాహార్తుడు వచ్చి మంచినీరు యివ్వమని కోరాడు. రంతిదేవుడు ఎంతో ఆప్యాయతతో “అన్నా ! కష్టాలు ఎవరికైనా వస్తాయి.

రా అన్నా. ఈ నీరు త్రాగు” అని తనవద్ద మిగిలివున్న మధుర పానీయాలను కూడా యిచ్చివేశాడు. ఇదీ అసలైన త్యాగం. త్యాగం చేసిన మహానుభావుడు రంతి దేవుడు. అతని త్యాగానికి అంతటి విలువ ఉంది.

III. భాషాంశాలు

పదజాలం

ప్రశ్న 1.
క్రింది పదాలతో సొంతవాక్యాలు రాయండి.

అ) భాసిల్లు = ప్రకాశించు
జవాబు:
వినయ విధేయలతో విద్యార్థులు భాసిల్లాలి.

ఆ) ఉద్బోధించు = మేలుకొల్పుట, రగుల్చు
జవాబు:
యువకులకు వివేకానందస్వామి ఉద్బోధించాడు.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

ఇ) దైన్యస్థితి = దారిద్ర్యం చేత కలుగు దురవస్థ, దీనత్వం
జవాబు:
కుచేలుడు దైన్యస్థితిలో జీవనం సాగించాడు.

ఈ) నరరూప రాక్షసుడు = మనుష్య రూపంలోని రాక్షసుడు
జవాబు:
నేడు సమాజంలో నరరూప రాక్షసులు ఎక్కువగా ఉన్నారు.

ప్రశ్న 2.
క్రింది వాక్యాలలోని పర్యాయపదాలు గుర్తించండి. రాయండి.

అ) అడవిలో ఏనుగుల గుంపు ఉన్నది. ఆ గుంపుకు ఒక గజము నాయకత్వం వహిస్తున్నది. ఆ కరి తన గుంపులోని నాగములను రక్షిస్తుంది.
జవాబు:
ఏనుగు, గజము, కరి, నాగము.

ఆ) స్నేహితులతో నిజాయితీగా ఉండాలి. ఆ నిజాయితీ ఎందరో మిత్రులను సంపాదిస్తుంది. ఆ నెచ్చెలులే మనకు నిజమైన సంపద.
జవాబు:
స్నేహితులు, మిత్రులు, నెచ్చెలులు.

ఇ) రాజుల వీరత్వానికి చిహ్నం కృపాణం. వారు కత్తి సాములో నైపుణ్యానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఆ అసితోనే రాజులు శత్రువులపై విజయం సాధిస్తారు.
జవాబు:
కృపాణం, కత్తి, అసి.

ఈ) బంగారం అంటే అందరికీ ఇష్టం. అందుకే కనకం కొనడానికి అందరూ ఆసక్తి చూపుతారు. ఆ స్వర్ణంతో స్వర్ణకారుల దగ్గరకు వెళ్ళి తమకు నచ్చిన పసిడి ఆభరణాలను తయారు చేయించుకుంటారు.
జవాబు:
కనకం, బంగారం, స్వర్ణం, పసిడి.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

ప్రశ్న 3.
క్రింది వాక్యాలలోని ప్రకృతి, వికృతులను గుర్తించండి. వేరు చేసి రాయండి.

అ) తూరుపు దెస ఎర్రబడింది. దక్షిణ దిశవైపున్న నేను ఒక్కసారిగా అటు తిరిగాను.
జవాబు:
దిశ (ప్రకృతి) – దెస (వికృతి)

ఆ) సముద్రంలోని కెరటాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. ఆ సమయంలో సంద్రం భయాన్ని కలిగిస్తుంది.
జవాబు:
సముద్రం (ప్రకృతి) – సంద్రం (వికృతి)

ఇ) రాయడు తలుచుకుంటే అన్నీ సాధ్యం. రాజు మనసును పసిగట్టడం కష్టం.
జవాబు:
రాజు (ప్రకృతి) – రాయడు (వికృతి)

వ్యాకరణాంశాలు

1. క్రింది వాక్యాలు చదివి సంధి పదాలు గుర్తించి, విడదీసి సంధుల పేర్లు రాయండి.

అ) సీతను అందరూ బుద్ధిమంతురాలు అంటారు.
జవాబు:
బుద్ధిమంత + ఆలు = బుద్ధిమంతురాలు
– రుగాగమ సంధి

ఆ) అచ్చోట ఆ గులాబి మొక్కకు ఎన్ని పూలు పూచినాయో !
జవాబు:
ఆ + చోట = అచ్చోట = త్రిక సంధి

ఇ) రోగికి వైద్యుడు దివ్యౌషధం ఇచ్చాడు.
జవాబు:
దివ్య + ఔషధం = దివ్యౌషధం = వృద్ధి సంధి

ఈ) ఎవరెస్టు నధిరోహించిన పూర్ణ సాహసవంతురాలు.
జవాబు:
సాహసవంత + ఆలు = సాహసవంతురాలు – రుగాగమ సంధి

ఉ) సమాజం అభివృద్ధి చెందాలంటే సమైక్యత అవసరం.
జవాబు:
సమ + ఐక్యత = సమైక్యత = వృద్ధి సంధి

ఊ) విద్యావంతులే ఎక్కాలంలోనైనా కీర్తించబడతారు.
జవాబు:
ఏ + కాలము = ఎక్కాలం = త్రిక సంధి

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

2. క్రింది పద్యపాదానికి గణవిభజన చేసి, గురు లఘువులను గుర్తించి, ఏ పద్యపాదమో తెలుపండి. (T.S) June ’16 ; Mar. ’16

అ) భండనభీముఁ డార్తజన బాంధవుఁ డుజ్జ్వల బాణతూణ కో
జవాబు:
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 11

ఇది ఉత్పలమాల పద్యపాదము.

  1. ప్రతి పాదంలోను నాలుగు పాదాలుంటాయి.
  2. భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు వచ్చాయి.
  3. యతి 1 – 10వ అక్షరం (భ – బా)
  4. ప్రాస నియమం కలదు (౦డ)

ఆటవెలది

క్రింది పద్యపాదాలను గమనించండి.

అ)
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 12
జవాబు:
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 13

ఆ)
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 15
జవాబు:
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 14

ఇ)
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 16
జవాబు:
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 17

ఈ)
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 19
జవాబు:
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 18

  1. పై పద్యంలో 4 పాదాలున్నాయి.
  2. ప్రతి పాదానికి ఐదు గణాలు ఉన్నాయి.
  3. 1, 3 పాదాల్లో వరుసగా మూడు సూర్యగణాలు, రెండు ఇంద్రగణాలు ఉన్నాయి.
  4. 2, 4 పాదాల్లో ఐదు సూర్యగణాలు ఉన్నాయి.
  5. ప్రతి పాదంలో 4వ గణంలోని మొదటి అక్షరం యతి చెల్లింది.
    (బ్ర – బ, వ – వ, జే – జె, మా – మా)
  6. ప్రాసనియమం పాటించలేదు.

ఇట్లాంటి లక్షణాలున్న పద్యాన్ని ‘ఆటవెలది’ పద్యం అని అంటారు.
సూర్యగణాలు : నగణం (| | |), హగణం – U |

ఇంద్రగణాలు :
నల (| | |), నగ (| | | U) సల (| | UI), భ (U | |) ర (U | U), త (U U |) లు.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

క్రింది పద్యపాదాన్ని గణవిభజన చేసి ఏ పద్య పాదమో గుర్తించండి.

ఆ)
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 20
1 సూర్యగణము + 2 ఇంద్రగణాలు + 2 సూర్యగణాలు ఉన్న పద్యంను తేటగీతి పద్యం అంటారు.

ప్రాజెక్టు పని

6 నుండి 10 వ తరగతి వరకు చదువుకొన్న శతకాల పేర్లు, శతక కవుల వివరాలు కింది పట్టికలో రాసి ప్రదర్శించండి. వాటిలో ఎన్ని పద్యాలు మీరు కంఠస్థం చేశారో తెలుపండి.
జవాబు:
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 21

విశేషాంశాలు

  1. శతకం శతకం అనగా ముక్తకం. ముక్తకం స్వతంత్ర భావంతో ఉంటుంది. ఏ పద్యానికి ఆ పద్యం ప్రత్యేక భావాన్ని ప్రకటించడానికి అనువుగా ఉంటుంది. శతకం మకుట నియమం కలిగి ఉంటుంది. సంఖ్యా నియమం కల్గి ఉంటుంది. శతకాల్లో సమకాలీన సామాజికాంశాల విమర్శ సాధారణంగా కనిపించే లక్షణం. ఇది విద్యార్థులను ఆకట్టుకుంటుంది. తన చుట్టూ ఉన్న సమాజాన్ని విమర్శనాత్మకంగా చూస్తుంది.
  2. బృహస్పతి దేవతల గురువు. అంగీరసుడి కొడుకు. ఉతధ్యుడు, సంవర్తనుడు ఇతడి సోదరులు. బృహస్పతి భార్య తార. ఇతనికి శంయుడు అనే కొడుకున్నాడు. శుక్రనీతి, కణికనీతి లాగా బృహస్పతి నీతిసూత్రాలు ప్రసిద్ధి చెందాయి.
  3. శైవ కవిత్రయం నన్నె చోడుడు, మల్లిఖార్జున పండితారాధ్యుడు, పాల్కురికి సోమన. ఈ ముగ్గురిని శైవ కవిత్రయం అంటారు.
  4. శైవ పండిత త్రయం శ్రీపతి పండితుడు, మల్లిఖార్జున పండితారాధ్యుడు. శివలెంక మంచన. ఈ ముగ్గురిని శైవ పండిత త్రయం అంటారు.
  5. చింతామణి కోరిన కోర్కెలను తీర్చే మణి. నాగరాజు శిరస్సు నుంచి ఈ మణిని పొందవచ్చని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి.
  6. భాగీరథి గంగ, భగీరథుని ప్రయత్నం చేత భూమి మీదకు తీసుకురాబడినది. అందువల్ల భాగీరథి అయ్యింది.
  7. జాహ్నవి సగరులకు ఉత్తమ లోకాలు కల్గించడానికి భగీరథుడు తెచ్చిన గంగ జహ్నుమహర్షి యాగాన్ని పాడుచేసింది. జహ్నుమహర్షి కోపించి ఆ గంగను త్రాగివేసాడు. భగీరథుని కోరిక మేరకు (అభ్యర్థన వల్ల) తిరిగి ఎంగిలి కాకుండా తన చెవుల ద్వారా విడిచి పెడతాడు. కాబట్టి జహ్నుమహర్షి చేత త్రాగి విడువబడినది కాబట్టి దానికి జాహ్నవి అనే పేరు వచ్చింది.
  8. అంతరింద్రియాలు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ నాల్గింటిని అంతరింద్రియాలు అంటారు.
  9. బాహ్య ఇంద్రియాలు కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం ఈ ఐదింటిని బాహ్య ఇంద్రియాలు అంటారు.

సూక్తి : తన తోటి వారితో స్నేహంగా ఉంటూ ఇతరులకు మంచిని పంచుతూ, గురువులకు విధేయుడై ఉంటూ అభ్యసించే విద్య మంచి ఫలితాన్నిస్తుంది.

ప్రతిపదార్థ తాత్పర్యాలు

I.

1. మ.
భవదీయార్చన సేయుచోఁ బ్రథమ పుష్పంబెన్న సత్యంబు, రెం
డవ పుష్పంబు దయాగుణం, బతివిశిష్టం బేకనిష్ఠా సమో
త్సవ సంపత్తి తృతీయ పుష్పమది భాస్వద్భక్తి సంయుక్తి యో
గవిధానం బవి లేని పూజల మదింగైకోవు సర్వేశ్వరా.

కవి పరిచయం
ఈ పద్యము యధావాక్కుల అన్నమయ్యచే రచింపబడిన సర్వేశ్వర శతకము నుండి గ్రహింపబడినది.

ప్రతిపదార్థము (June 2017)

సర్వ + ఈశ్వరా = లోకాలన్నిటికీ ప్రభువైన ఓ ఈశ్వరా!
భవదీయ + ఆర్చన = నీ పూజ
చేయుచో = చేసేటప్పుడు
ప్రథమ పుష్పంబు + ఎన్నన్ = మొదటి పుష్పం
సత్యంబు = సత్యం
రెండవ పుష్పం = రెండవ పుష్పం
దయాగుణం = కారుణ్యమనే గుణం (దయ)
తృతీయ పుష్పము +
అది = మూడో పుష్పం
అతి = మిక్కిలి
విశిష్ట = విశిష్టమైన
ఏకనిష్టా = ఏకాగ్రతతో
సమోత్సవ సంపత్తి = సమానమైనది
అది = ఆ విధంగా మూడు పువ్వులు సమర్పించడం
భాస్వద్భక్తిసంయుక్తి విధానం = భక్తియోగ విధానం
అవి = ఈ మూడు పుష్పాలు
లేని = లేని
పూజలను = పూజలను
మదిన్ = మనస్సులో
గైకోవు = అంగీకరించవు కదా ! (అంగీకరించవు అని అర్థం)

తాత్పర్యము ఓ సర్వేశ్వరా ! నీ పూజ చేసేటప్పుడు మొదటి పుష్పం సత్యం. రెండవ పుష్పం దయ. మూడో పుష్పం మిక్కిలి విశిష్టమైన ఏకాగ్రత. ఇది భక్తియోగ విధానం. ఈ మూడు పుష్పాలు లేని పూజలను నీవు అంగీకరించవు కదా !

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

2. శా.
ఊరూరం జనులెల్ల భిక్షమిడరో, యుండంగుహల్గల్గవో
చీరానీకము వీథులందొరకదో, శీతామృత స్వచ్ఛవాః
పూరం బేరుల బారదో, తపసులం బ్రోవంగ నీ వోపవో
చేరం బోవుదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వరా !

కవి పరిచయం
ఈ పద్యము ధూర్జటిచే రచింపబడిన శ్రీకాళహస్తీశ్వర శతకము నుండి గ్రహింపబడినది.

ప్రతిపదార్థము

శ్రీకాళహస్తీశ్వరా = శ్రీకాళహస్తిలో వెలసిన ఓ ఈశ్వరా !
ఊరూరన్ = ప్రతి గ్రామములోనూ
జనులు + ఎల్లన్ = ప్రజలందరూ
భిక్షము + ఇడరో = అడిగితే భిక్షము పెట్టరా ?
ఉండన్ = నివసించడానికి
గుహల్ = గుహలు
కల్గవో చీరానీకము = లేవా ?
(చీర + అనీకము) = వస్త్రముల గుంపు
వీథులన్ = వీధులలో (అంగళ్ళలో)
దొరకదో = దొరకవా ?
శీతామృత స్వచ్ఛవాః పూరంబు ; శీత = చల్లని
అమృత = అమృతము వంటి తియ్యని
స్వచ్ఛ = నిర్మలమైన
వాఃపూరంబు = జలప్రవాహము
ఏఱులన్ = సెలయేళ్ళలో పాఱదో
(పాఱదు + ఓ) = ప్రవహించడం లేదా ?
తపసులన్ = తపశ్శాలులను
బ్రోవంగన్ = రక్షించడానికి
నీవు = నీవు
ఓపవో (ఓపవు + ఓ) = సమర్థుడవు కాదా ?
జనుల్ = ప్రజలు
రాజులన్ = రాజులను
చేరన్ = సమీపించడానికి
పోవుదురు + ఏల = ఎందుకు పోతారో !

తాత్పర్యము
శ్రీకాళహస్తీశ్వరా ! తినడానికి అడిగితే ఎవరయినా ఇంత భిక్షం పెడతారు. నివసించడానికి గుహలు ఉన్నాయి. వస్త్రాలు వీధుల్లో దొరుకుతాయి. తాగడానికి నదుల్లో చల్లని అమృతంవంటి స్వచ్ఛమైన నీరు దొరుకుతుంది. తాపసులను కాపాడటానికి నీవున్నావు. అయినా ఈ ప్రజలు రాజులను ఎందుకు ఆశ్రయిస్తారో తెలియదు.

3. మ.
సిరి లేకైన విభూషితుండె యయి భాసిల్లున్ బుధుండౌదలన్
గురుపాదానతి కేలనీగి చెవులందున్విన్కి వక్త్రంబునన్
స్థిర సత్యోక్తి భుజంబులన్విజయమున్ చిత్తంబునన్ సన్మనో
హర సౌజన్యము గల్గినన్ సురభిమల్లా ! నీతివాచస్పతీ !

కవి పరిచయం
ఈ పద్యము ఎలకూచి బాలసరస్వతీచే రచింపబడినది.

ప్రతిపదార్థము

సురభిమల్లా = ఓ “సురభిమల్ల” భూపాలుడా !
నీతివాచస్పతీ = నీతిశాస్త్రమునందు దేవతల గురువైన బృహస్పతి వంటివాడా !
ఔదలన్ = శిరస్సునందు
గురుపాదానతి
(గురుపాద + ఆనతి)
గురుపాద = గురువుగారి పాదాలకు
ఆనతి = మ్రొక్కుటయు (నమస్కరించడము)
కేలన్ = చేతియందు
ఈగి = దానగుణమునూ
చెవులందున్ = చెవులయందు
విన్కి = శాస్త్ర శ్రవణమునూ (శాస్త్రములు వినుటయూ)
వక్త్రంబునన్ స్థిరసత్యోక్తి ; = ముఖమునందు
స్థిర = స్థిరమైన
సత్యోక్తి (సత్య + ఉక్తి) = సత్యమైన వాక్కునూ
భుజంబులన్ = భుజములందు
విజయమున్ = విజయమునూ
చిత్తంబునన్ = మనస్సు నందు సన్మనోహర సౌజన్యము ;
సత్ = చక్కని
మనోహర = ఇంపైన
సౌజన్యము = మంచితనమునూ
కల్గినన్ = కల్గి ఉన్నట్లయితే
బుధుండు = పండితుడు
సిరి = ఐశ్వర్య౦
లేకైనన్
(లేక + ఐనన్) = లేకుండా ఉన్నా (లేకపోయినా)
విభూషితుండె ;
(విభూషితుండు + ఎ) = అలంకరింపబడినవాడే
అయి = అయి
భాసిల్లున్ = ప్రకాశిస్తాడు

తాత్పర్యము
నీతిలో బృహస్పతి అంతటి వాడవయిన ఓ సురభిమల్లా ! తలవంచి గురువు పాదాలకు నమస్కరించే వాడు, దానగుణం కలిగినవాడు, చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినేవాడు, సత్యవ్రతుడైనవాడు, భుజబలంతో విజయాలను పొందేవాడు, మనస్సునిండా మంచితనం కలవాడయిన పండితుడు సంపదలు లేకున్నా ప్రకాశిస్తాడు.

II

4. ఉ.
భండనభీముఁ డార్తజన బాంధవుఁ డుజ్జ్వల బాణతూణ కో
దండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్
రెండవ సాటి దైవమిక లేఁడనుచున్ గడగట్టి భేరికా
దాండ దడాండదాండ నినదంబులజాండము నిండ మత్తవే
దండము నెక్కి చాటెదను దాశరథీ ! కరుణా పయోనిధీ !!

కవి పరిచయం
ఈ పద్యము కంచర్ల గోపన్నచే రచింపబడిన దాశరథి శతకము నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్దము

దాశరథీ = దశరథుని కుమారా !
కరుణాపయోనిథీ = దయాసముద్రునివైన ఓ రామా !
భండన భీముడు = నీవు యుద్ధరంగంలో శత్రు భయంకరునివని
ఆర్తజన = దుఃఖాలు పొందేవారి పాలిట
బాంధవుడు = బంధువువని
ఉజ్వల = కాంతిమంతమైన
తూణ = అమ్ములపొది
బాణ = బాణాలు
కోదండ = కోదండములు
కళాప్రచండ = ఉపయోగించే నేర్పులో ప్రచండమైన
భుజతాండవ = భుజతాండవం చూపి
కీర్తికి = కీర్తిపొందిన
రామమూర్తికిన్ = శ్రీరామచంద్రునకు
రెండవసాటి దైవము = సాటివచ్చే మరియొక దైవం
ఇకన్ = ఇంక
లేడనుచున్ = లేరని
గడగట్టి = స్తంభము నాటి
భేరికా = ఢంకా యొక్క
దాండడ, డాండ, డాండ = డాం డాం డాం అనే
నినదంబులు = ధ్వనులు
అజాండము = బ్రహ్మండం
నిండన్ = వ్యాపించే విధంగా
మత్త = మదించిన
వేదండమునెక్కి = ఏనుగునెక్కి
చాటెదను = చాటుతాను

తాత్పర్యము
దశరథుని కుమారా ! దయాసముద్రునివైన ఓ శ్రీరామా ! నీవు యుద్ధరంగంలో శత్రుభయంకరుడవు, దుఃఖాలు పొందేవారి పాలిట బంధువువు, కాంతిమంతమైన అమ్ములపొది, బాణాలు, కోదండమును కలిగి ప్రచండ భుజతాండవంతో, ధనుర్విద్యాకళలో కీర్తి పొందిన నీకు సాటివచ్చే దైవం మరొకరు లేరని, మదించిన ఏనుగు నెక్కి ఢంకా మ్రోగిస్తూ, భూమండలమంతా వినబడేటట్లు చాటుతాను !

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

5. సీ. హరిదాసులను నిందలాడకుండినఁ జాలుఁ
సకల గ్రంథమ్ములు చదివినట్లు
భిక్షమియ్యంగఁ దప్పింపకుండినఁ జాలుఁ
జేముట్టి దానంబు చేసినట్లు
మించి సజ్జనుల వంచింపకుండినఁ జాలుఁ
నింపుగా బహుమాన మిచ్చినట్లు
దేవాగ్రహారముల్ దీయకుండినఁ జాలు
గనకకంబపుగుళ్ళు గట్టినట్లు

తే.గీ. ఒకరి వర్షాశనము ముంచకున్నఁ జాలు
బేరు కీర్తిగ సత్రముల్ పెట్టినట్లు
భూషణవికాస! శ్రీధర్మపురి నివాస !
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

కవి పరిచయం
ఈ పద్యం కాకుత్థ్సం శేషప్ప కవిచే రచింపబడిన నరసింహ శతకం నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థము

భూషణవికాస = అలంకారాల చేత శోభిల్లేవాడా !
శ్రీ ధర్మపుర నివాస = ధర్మపురి క్షేత్రంలో వెలసినవాడా !
దుష్టసంహార = దుష్టులను సంహరించేవాడా !
దురితదూర = పాపాలను పోగొట్టేవాడా !
నరసింహా = నరసింహా
హరిదాసులను = విష్ణుభక్తులను
నిందలాడకుండిన + చాలు = నిందించకుండా ఉంటే చాలు
సకల గ్రంథాలను = అనేక గ్రంథాలను
చదివినట్లు = చదివినట్లే
భిక్షము + ఇయ్యంగ = భిక్షమిచ్చేవారిని
తప్పింపకుండినచాలు = ఆపకుంటేచాలు
చేముట్టిదానము = అది దానము
చేసినట్లే = చేసినట్లే
మించి = అతిసయించి, ఉప్పొంగి
సజ్జనుల = సజ్జనులను
వంచింపకుండిన = మోసం చేయకుండా ఉంటే
చాలు = చాలు
ఇంపుగా = చక్కగా
చాలు = చాలు
బహుమానమిచ్చినట్లు = బహుమతినిచ్చినట్లే
దేవ = దేవతా
అగ్రహారముల్ = మాన్యములను
తీయకుండిన = ఆక్రమించకుండా ఉంటే
చాలు = చాలు
కనకకంబపు = అది ధ్వజస్తంభంతో కూడిన
గుళ్ళు + కట్టినట్లు = గుళ్ళు కట్టించినట్లే
ఒకరి = ఇంకొకరి
వర్షాశనము = వర్షాసనం (ఒక ఏడాదికి సరిపడే భోజనాన్ని)
మంచుకున్న = పాడు చేయకుండునట్లైతే
చాలు = చేయకుంటేచాలు
పేరు = తన పేరుతో
కీర్తిగ = కీర్తితో
సత్రముల్ = సత్రాలు
పెట్టినట్లు = కట్టించినట్లే అవుతుంది

తాత్పర్యము
అలంకారాల చేత శోభిల్లేవాడా ! ధర్మపురి క్షేత్రంలో వెలసినవాడా ! దుష్టులను సంహరించేవాడా ! పాపాలను పోగొట్టేవాడా! నరసింహా ! విష్ణుభక్తులను నిందించకుండా ఉంటే చాలు, అనేక గ్రంథాలను చదివినట్లే. భిక్షమిచ్చేవారిని ఆపకుంటేచాలు, అది దానము చేసినట్లే. సజ్జనులను మోసం చేయకుండా ఉంటే చాలు, గొప్ప బహుమతినిచ్చినట్లే. దేవతా మాన్యములను ఆక్రమించకుండా ఉంటే చాలు, అది బంగారు ధ్వజ స్తంభంతో కూడిన గుడికట్టించినట్లే. ఇంకొకరి ‘వర్షా శనాన్ని’ (ఒక ఏడాదికి సరిపడే భోజనాన్ని) ముంచకుంటే చాలు, తన పేరుతో సత్రాలు కట్టించినట్లే అవుతుంది.

III

6. మ.
ఘనుడవ్వాడగు, వేడు త్యాగమయ దీక్షంబూని సర్వంసహా
జన ధైన్యస్థితి బోనడంచి సకలాశాపేశలానంద జీ
వన సంరంభము పెంచి, దేశజననీ ప్రాశస్త్యమున్ పంచునో
అనిదంపూర్వ యశస్వి యాతడగు నన్నా ! విశ్వనాథేశ్వరా !

కవి పరిచయం
ఈ పద్యము గుమ్మన్నగారి లక్ష్మీ నరసింహ శర్మచే రచింపబడిన విశ్వనాథేశ్వర శతకము నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థము

విశ్వనాథేశ్వరా ! = విశ్వనాథేశ్వరా !
వేడు = ఎవడు
త్యాగమయ = త్యాగంతో కూడిన
దీక్షన్ + పూని = దీక్షను పూని
సర్వంసహాజన = జనులందరి
దైన్యస్థితి + పోనడంచి = దీనస్థితిని రూపుమాపి
సకల = అందరికి (సమస్తమైన, అన్ని)
ఆశాపేశ = కోరికలతో అలంకరింపబడిన
ఆనంద = ఆనందకర
జీవన సంరంభము = జీవిత సుఖాన్ని
పెంచి = పెంచి
దేశ జననీ = మాతృదేశపు
ప్రాశస్త్యమున్ = గొప్పతనాన్ని
పంచునో = ఎవరయితే విశదపరుస్తారో
అవ్వాడు (అ+వాడు) = అటువంటివాడే
అనిందపూర్వ = నిందించుటకు వీలులేని
ఘనుడు + అగున్ = గొప్పవారవుతారు
యశస్వి + ఆతడగు = అపూర్వమైన కీర్తిమంతులవుతారు

తాత్పర్యము
విశ్వనాథేశ్వరా! త్యాగంతో కూడిన దీక్షను పూని జనులందరి దీనస్థితిని రూపుమాపి, అందరికి సుకుమారమైన, ఆనందకర జీవితసుఖాన్ని పంచి, మాతృదేశపు గొప్పతనాన్ని ఎవరయితే విశదపరుస్తారో వారే గొప్ప వారవుతారు. అపూర్వమైన కీర్తిమంతులు అవుతారు.

7. శా.
పొత్తంబై కడునేర్పుతో హితము నుద్బోధించు మిత్రుండు, సం
విత్తంబై యొక కార్యసాధనమునన్ వెల్గొందు మిత్రుండు, స్వా
యంబైన కృపాణమై యరుల నాహారించు మిత్రుండు, ప్రో
చ్చిత్తంబై సుఖమిచ్చు మిత్రుడు దగన్ శ్రీలొంకరామేశ్వరా !

కవి పరిచయం
ఈ పద్యం నంబి శ్రీధరరావుగారిచే రచింప బడిన శ్రీలొంక రామేశ్వర శతకము నుండి గ్రహించ బడినది.

ప్రతిపదార్థము (Mar. ’17)

శ్రీలొంకరామేశ్వరా ! = ఓ లొంకరామేశ్వరా !
మిత్రుండు = మిత్రుడైనవాడు
పొత్తంబు + ఐ = పుస్తకం మాదిరిగా
కడున్ = మిక్కిలి
నేర్పుతో = నేర్పుతో
హితమున్ = మంచిని
ఉద్బోధించు = బోధిస్తాడు
ఒక = ఒకానొక
కార్య = కార్య
సాధనమునన్ = సఫలతలో
మిత్రుండు = మిత్రుడైనవాడు
కార్య = కార్య
సాధనమునన్ = సఫలతతో
వెల్గొందు = విలువైన
సంవిత్తంబు + ఐ = ధనం వలె
వెల్గొందు = ఉపకరిస్తాడు
అరులన్ = శత్రు నాశనంలో
మిత్రుండు = మిత్రుడైనవాడు
స్వాయత్తంబు + ఐన = స్వాధీనమైన
కృపాణము + ఐ = కత్తి వలె
ప్రోచు = రక్షించెడు
తగన్ = తగినవిధంగా
ఆహారించు = సహాయపడతాడు
ప్రోచిత్తంబు + ఐ = నిండు మనస్సై
సుఖమిచ్చు = సుఖాన్నిస్తాడు.

తాత్పర్యము
ఓ లొంకరామేశ్వరా ! మిత్రుడైనవాడు పుస్తకం మాదిరిగా మిక్కిలి నేర్పుతో మంచిని బోధిస్తాడు. కార్య సఫలతలో విలువైన ధనం వలె ఉపకరిస్తాడు. శత్రు నాశనంలో స్వాధీనమైన కత్తివలె సహాయపడుతాడు. నిండు మనస్సై సుఖాన్నిస్తాడు.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

8. సీ. కలనైన సత్యంబు బలుకనొల్లనివాడు (June 2018)
మాయమాటల సొమ్ము దీయువాడు
కులగర్వమున పేద కొంపలార్చెడివాడు
లంచంబులకు వెల బెంచువాడు
చెడు ప్రవర్తనలందు జెలగి తిరుగువాడు
వరుసవానికి నీళ్ళు వదులువాడు
ముచ్చటాడుచు కొంప ముంచజూచెడివాడు
కన్నవారల గెంటుచున్నవాడు

గీ. పుడమిలో నరరూపుడై పుట్టియున్న
రాక్షసుడు గాక వేరౌన రామచంద్ర
కృపనిధీ ధరనాగరకుంటపారి
వేణుగోపాలకృష్ణ మద్వేల్పు శౌరి

కవి పరిచయం
ఈ పద్యము గడిగె భీమ కవిచే రచింప బడిన వేణుగోపాల శతకము నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్దము

“కృపనిధీ = దయకు నిధివంటివాడా !
రామచంద్ర = ఓ శ్రీ రామచంద్రా !
ధర నాగరకుంటపౌరి = నాగరకుంటపురమునందు కొలువైన వాడా !
వేణుగోపాలకృష్ణ = ఓ వేణుగోపాలకృష్ణా
మత్ + వేల్పు = నా దైవమా !
శౌరి ! = శ్రీ కృష్ణా !
కలన్ + ఐన = కలలో కూడా
సత్యంబున్ = సత్యాన్ని
పలుకన్ + = పలకడానికి
ఒల్లనివాడు = ఇష్టపడనివాడు
మాయమాటలు = మాయమాటలు చెప్పి
సొమ్మున్ = ఇతరుల సొమ్మును
తీయువాడు = అపహరించేవాడు
కులగర్వమున = కుల గర్వంతోటి
పేద = పేదవాండ్ల
కొంపల్ = ఇండ్లను
ఆర్చెడివాడు = నాశనం చేసేవాడు
లంచంబులకు = లంచాలకు
వెలన్ = విలువను
పెంచువాడు = పెంచేవాడు
చెడు ప్రవర్తనలందు = చెడు ప్రవర్తనతో
చెలగితిరుగువాడు = తిరిగేవాడు
వరుసవావికి = వావివరుసలను
నీళ్ళు వదలువాడు = పాటించనివాడు
ముచ్చటన్ + ఆడుచూ = నవ్వుతూ ముచ్చటాడుతూనే
కొంప = ఎదుటివాడిని
ముంచ = నాశనం
చూచెడివాడు = చేయాలనుకునేవాడు
కన్నవారల = తల్లిదండ్రులను
గెంటువాడు = ఇంటి నుంచి వెళ్ళగొట్టేవాడు
పుడమిలో = ఈ భూమిమీద
నరరూపుడై = మానవరూపంలో ఉన్న
పుట్టియున్న = పుట్టినట్టి
రాక్షసుడుగాక = రాక్షసుడుగాని
(వేరు + ఔన) వేరౌన = వేరొకరు గారు కదా !

తాత్పర్యము
దయకు నిధివంటివాడా ! శ్రీ రామచంద్రా ! నాగరకుంట పురమునందు కొలువైనవాడా! ఓ వేణు గోపాల- కృష్ణా ! నా దైవమా ! శ్రీ కృష్ణా ! కలలో కూడా సత్యాన్ని పలకడానికి ఇష్టపడనివాడు, మాయమాటలు చెప్పి ఇతరుల సొమ్మును అపహరించేవాడు, కులగర్వంతోటి పేదవాండ్ల ఇండ్లను నాశనం చేసేవాడు, లంచాలకు విలువను పెంచేవాడు, చెడు ప్రవర్తనతో తిరిగేవాడు, వావి వరుసలను పాటించనివాడు, నవ్వుతూ ముచ్చటాడుతూనే ఎదుటివాడిని నాశనం చేయాలనుకునేవాడు. తల్లి తండ్రులను ఇంటినుంచి వెళ్ళగొట్టేవాడు ఈ భూమిమీద మానవరూపంలో ఉన్న రాక్షసుడే.

పాఠం ఉద్దేశం

సమాజహితాన్ని కోరి కవులు శతక రచనలు చేశారు. సమాజంలోని పరిస్థితులను తెలుపుతూ మానవులలో నైతిక, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుటకు శతక కవులు కృషిచేశారు. అట్లాంటి వివిధ శతక పద్యాల్లోని విలువలను తెలియజేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతకాలలోని పద్యాలను ‘ముక్తకాలు’ అంటారు. ముక్తక పద్యం దేనికదే స్వతంత్ర భావంతో ఉంటుంది. శతకాల్లో మకుటం సాధారణంగా పద్యపాదం చివర ఉంటుంది. అయితే మకుట రహితంగా కూడా కొన్ని శతకాలు ఉన్నాయి. ఈ పాఠ్యభాగంలో సర్వేశ్వర, శ్రీకాళహస్తీశ్వర, మల్లభూపాలీయ, దాశరథి, నరసింహ, విశ్వనాథేశ్వర, లొంక రామేశ్వర, వేణుగోపాల శతకాల పద్యాలు ఉన్నాయి.

కవుల పరిచయం

1. కవి : యథావాక్కుల అన్నమయ్య
కాలం : 13వ శతాబ్దం
శైలి : ధారాళమైనది
శతకం పేరు : సర్వేశ్వర శతకం.
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 1

2. కవి : ధూర్జటి
కాలం : 16వ శతాబ్దం
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 2
ఇతర అంశాలు :
శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యమనే గ్రంథం రాశాడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాల్లో ఒకరు. రాజుల ఆస్థానంలో ఉండి కూడా “రాజుల్ మత్తులు, వారి సేవ నరకప్రాయం” అని చెప్పిన ధీశాలి.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

3. కవి : ఎలకూచి బాలసరస్వతి
కాలం : 17వ శతాబ్దం
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 3
ఇతర అంశాలు : నాగర్ కర్నూల్ జిల్లా జటప్రోలు సంస్థానాధీశుడైన సురభి మాధవ రాయల ఆస్థానకవి.

రచనలు :

  1. తెలుగులో మొదటి త్ర్యర్థి కావ్యం “రాఘవ యాదవ పాండ వీయం” ను రాశాడు.
  2. భర్తృహరి సంస్కృతంలో రాసిన “సుభాషిత త్రిశతి”ని తెలుగులో అనువదించిన తొలికవి.

విశేషాంశం : ఈయన రచన పాండిత్య స్ఫోరకంగా, ధారాళంగా ఉంటుంది.

4. కవి : కంచెర్ల గోపన్న
కాలం : 17వ శతాబ్దం
జన్మస్థలం : ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి
రచన : దాశరథి శతకం
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 4
ఇతర అంశాలు : భద్రాచలంలో శ్రీరామాలయాన్ని నిర్మించిన భక్తాగ్రేసరుడు. శ్రీరాముని పేర దాశరథి శతకాన్ని రాసాడు. ఎన్నో కీర్తనలు రచించాడు. అందమైన శబ్దాలంకారాలు ఈయన కవిత్వంలో
జాలువారాయి.

5. కవి : కాకుత్సం శేషప్ప కవి
కాలం : 18వ శతాబ్దం
జన్మస్థలం : జగిత్యాల జిల్లా, ధర్మపురి నివాసి
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 5
శతకం : నరహరి శతకంతోపాటు, నృకేసరి శతకం, ధర్మపురి రామాయణం (యక్షగానం) రాశాడు.
ఇతర అంశాలు : ఇతని రచనల్లో భక్తి తత్పరతతోపాటు తాత్త్వికచింతన, సామాజిక స్పృహ కనిపిస్తుంది. తెలంగాణ ప్రాంతంలోని జానపదులు కూడా నరసింహ శతక పద్యాలను పాడుకుంటారు.

6. కవి : గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ
కాలం : 1934 – 2011
జన్మస్థలం : సిద్ధిపేట జిల్లా, పోతారెడ్డి పేట
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 6
(1934-2011)
ఇతర అంశాలు : 300 పైగా అష్టావధానాలు చేసాడు. హిందోళ రాగంలో ఈయన పద్యపఠన విన్యాసం ప్రత్యేకమైనది.
బిరుదులు : అవధాని శశాంక, ఆశు కవితాకేసరి.
ఇతర రచనలు : కవితా కళ్యాణి, అవధాన సరస్వతి, వాగీశ్వరీస్తుతి, ఆద్యమాతృక, పద్యోద్యానము మొదలైనవి.

7. కవి : నంబి శ్రీధరరావు
కాలం : 1934 – 2000
జన్మస్థలం : నిజామాబాద్ జిల్లా, భీమ్ గల్ (వేముగల్లు) నివాసి
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 7
(1934-2000)
రచన : శ్రీలొంక రామేశ్వర శతకం
ఇతర రచనలు : శ్రీమన్నింబాచల మాహాత్మ్యము, శ్రీమన్నింబగిరి నరసింహశతకం
బిరుద : కవిరాజ

8. కవి : గడిగె భీమకవి
జననం : 14.1.1920
మరణం : 3.4.2010
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 8
(14-01-1920
03-04-2010)
రచన : వేణుగోపాల శతకం
జన్మస్థలం : రంగారెడ్డి జిల్లా, షాబాద్ మండలం, నాగరకుంట గ్రామం
ఇతర విషయాలు : వీధిబడి వరకు విద్యాభ్యాసం చేసిన ఈయనకు పద్యరచనలో నైపుణ్యం అబ్బడం విశేషం.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

ప్రవేశిక

మానవుల ప్రవర్తన ఎట్లా ఉండాలి ? ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి ? స్నేహితులు ఎట్లా ఉంటారు ? భగవంతుని గుణగణాలు, భక్తులతో ఎట్లా ఉండాలి ? కీర్తిమంతులు ఎవరు? మనుషుల్లోని రాక్షసగుణాలు ఏవి ? అని తెలుపుతూ వివిధ శతకకర్తలు రాసిన పద్యాలను పాఠం చదివి తెలుసుకోండి. వీటి ఆవశ్యకతను అర్థం చేసుకోండి. ఆచరించే ప్రయత్నం చేయండి.

విద్యార్థులకు సూచనలు

  • పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
  • పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత
    గీయండి.
  • వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పదవిజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకోండి.

ప్రక్రియ శతకం

ప్రాచీన తెలుగు సాహిత్య ప్రక్రియలలో ‘శతకం’ ఒకటి. ఇందులో వంద పద్యాలు ఉంటాయి. కొన్నింటిలో వందకు పైగా పద్యాలు ఉంటాయి. శతకాల్లో మకుటం ప్రధానంగా ఉంటుంది. కొన్ని శతకాల్లో మకుటం లేకుండా పద్యాలు ఉంటాయి. ఏ పద్యానికాపద్యమే స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటుంది. శతకాలు నీతి, ధర్మం, సత్యం, భక్తి, వైరాగ్యం మొదలైన విషయాలను బోధిస్తాయి. సుమతీ శతకం, వేమన శతకం మొదలైనవి శతక గ్రంథాలుగా పేర్కొనవచ్చు.

TS 10th Class Telugu Grammar ఇంటర్వ్యూలు

Telangana SCERT 10th Class Telugu Grammar Telangana ఇంటర్వ్యూలు Questions and Answers.

TS 10th Class Telugu Grammar ఇంటర్వ్యూలు

ప్రశ్న 1.
మీ గ్రామానికి వచ్చిన వ్యవసాయ శాస్త్రవేత్తను చేయడానికి పది ప్రశ్నలు ఇంటర్వ్యూ తయారుచేయండి. (June 2018)
జవాబు:
ప్రశ్నావళి (ఇంటర్వ్యూ): మా గ్రామానికి విచ్చేసిన వ్యవసాయ శాస్త్రవేత్తకు నమస్కారములు.
ప్రశ్నలు:

  1. మీ పేరు మా అందరికీ తెలుసు. అయినా మీ నోటితో మీ పేరు వినాలని మా కుతూహలం. మీ పేరు చెప్పండి.
  2. మీ స్వగ్రామం ఏది ?
  3. మీరు మీ విద్యాభ్యాసం మీ గ్రామంలోనే కొనసాగించారా ?
  4. మీ తండ్రి గారి వృత్తి ఏమిటి ?
  5. వ్యవసాయం అంటే మీకు ఎప్పటి నుండి ఆసక్తి కలిగింది ?
  6. వ్యవసాయ శాస్త్రవేత్త కావాలన్నది మీ కోరికా ? ఆశయమా ?
  7. మీకు ప్రేరణ ఎవరు ? వివరించండి.
  8. మీ ఈ శాస్త్రజ్ఞానం వలన సమాజానికి ఉపయోగం ఏమిటి ?
  9. మీరు వ్యవసాయ శాస్త్రవేత్తగా సాధించిన విజయాలు ఏమిటి ? వివరించండి.
  10. నేటి యువతకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి ?

మీ వంటి వ్యవసాయ శాస్త్రవేత్త మా గ్రామానికి వచ్చి, మాకు సందేశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం.

TS 10th Class Telugu Grammar ఇంటర్వ్యూలు

OR

  1. సర్ ! భూసార పరీక్ష ద్వారా నేల ఏ పంటకు అనుకూలమో చెప్పడం దేని ద్వారా తెలుస్తుంది ?
  2. మెట్ట పంటలు, మాగాణి పంటలు నేలను బట్టి వేరు చేస్తారా ? లేక నీటి వసతిని బట్టి వేరు చేస్తారా ?
  3. వ్యవసాయ శాస్త్రవేత్త కావడానికి ఏ చదువు చదవాలి ?
  4. భూసార పరీక్షలు సత్ఫలితాలే ఇస్తాయా ?
  5. రసాయన ఎరువులు నష్టాన్ని కలిగిస్తాయని ఇప్పుడు చెబుతున్నారు ? అలాంటి వాటిని తయారు చేసి రైతులకు ఎందుకు ఇస్తున్నారు ?
  6. సేంద్రియ ఎరువుల వాడకం మీద ప్రచారం ప్రభుత్వమే బాధ్యతగా చేయవచ్చు కదా ?
  7. వరి పంటలలో రకరకాల పేర్లతో (సన్నాలు, BPTL, 92 ….. ఇలా) ఎలా తయారు చేస్తారు ?
  8. మీరు ఏదైనా ప్రయోగం చేశారా ?
  9. యువకులకు, విద్యార్థులకు, రైతులకు మీరిచ్చే సందేశం ?

ప్రశ్న 2.
మీ పాఠశాల వార్షికోత్సవానికి ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్ వస్తున్నాడు. అతనిని ఇంటర్వ్యూ చేయడానికి ప్రశ్నావళి తయారు చేయండి.
జవాబు:

  1. ప్రముఖ క్రికెటర్ టెండూల్కర్ గార్కి మా ఆహ్వానము.
  2. మీకు నచ్చిన నేటి క్రికెటర్ ఎవరు ?
  3. విరాట్ కోహ్లి మీ స్థానాన్ని భర్తీ చేస్తాడని మీరనుకుంటున్నారా ?
  4. మీకు క్రికెట్పై ఆసక్తి కల్పించిన వారు ఎవరు ?
  5. మీరు మొదటగా జాతీయ క్రికెట్ జట్టులో చేరాక ఏ దేశంలో క్రికెట్ ఆడారు ?
  6. మీకు ‘వన్డే క్రికెట్’, ‘ఇరవై ఓవర్ల క్రికెట్, టెస్టులు’ – వీటిలో ఏవంటే ఇష్టం ?
  7. ఎమ్.పి.గా అయ్యాక మీరు చేసిన దేశసేవ ఏమిటి ?
  8. మీరు అంతర్జాతీయ క్రికెట్లో టెస్టుల్లో ఎన్ని శతకాలు చేశారు ?
  9. పాఠశాల దశలో మీ క్రికెట్ జీవితం గూర్చి తెలుపండి.
  10. మీకు నచ్చిన ప్రముఖ క్రికెట్ వీరుడు ఎవరు ?
  11. మీరు మెచ్చే ఇతర ఆటలు ఏవి ?
  12. మీరు మీ పిల్లలకు ఇచ్చే సందేశం ఏమిటి ?
  13. నేటి కాన్వెంటులలో చదువుకు ఇచ్చే ప్రాముఖ్యత, ఆటలకు ఇవ్వడం లేదని మీరు అనుకుంటున్నారా ?
  14. మీకు పిల్లలు ఎందరు ? వాళ్ళు క్రికెట్ ఆడతారా ? మీ అబ్బాయి పేరు చెప్పండి.

TS 10th Class Telugu Grammar ఇంటర్వ్యూలు

ప్రశ్న 3.
మీ పాఠశాలలకు విద్యార్థుల్ని పరీక్షచేయుటకు ‘పిల్లల డాక్టరు’ వచ్చారు. వారిని ఎలా ఇంటర్వ్యూ చేస్తారో వివరించండి.
జవాబు:

  1. నమస్కారం డాక్టరు గారూ !
  2. నాతోటి బాలబాలికల్ని ఎప్పుడెప్పుడు వచ్చి పరీక్షిస్తారు ?
  3. సర్వ సాధారణంగా విద్యార్థుల్లో వచ్చే వ్యాధులేమిటి ? వాటికి నివారణోపాయాలేమిటి ?
  4. కొన్ని కొన్ని సందర్భాల్లో విద్యార్థుల్లో ‘డిస్లెక్సియా’ వ్యాధి వస్తూంటుంది అని నేను విన్నాను. దాని లక్షణాలేంటి ? ఆ వ్యాధిని ఎలా ఎదుర్కోవాలి ?
  5. పేద విద్యార్థులకు మందులు కొనే పరిస్థితి లేదు. వారికి మందులిప్పించే ఏర్పాటు చేయగలరా ?
  6. మేం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే తగిన సలహాల్ని ఇవ్వవలసినదిగా కోరుచున్నాను.

ప్రశ్న 4.
మీ పాఠశాలకు ఒక ప్రసిద్ధ సినిమా నాయకుడు వచ్చాడు. ఆ నాయకుణ్ని చూసి మీరు ఎలా ఇంటర్వ్యూ చేస్తారు చెప్పండి.
జవాబు:

  1. నమస్కారం ప్రసిద్ధ సినిమా హీరోగారికి !
  2. అగ్రనటులుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పేరు తెచ్చుకున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి ?
  3. ఈ స్థాయికి రావడానికి కారకులెవరు ? ఎలా కష్టపడ్డారు?
  4. మీరేమైనా సంక్షేమ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారా ?
  5. అవయవదానాలపై మీ అభిప్రాయం ఏమిటి ?
  6. మీరు చలనచిత్ర రంగానికి రావడానికి కారకు లెవరు ? మిమ్మల్ని ప్రోత్సహించినదెవరు ?
  7. ఈనాటి సినిమాల్లో స్త్రీని అర్ధనగ్న వేషధారణలో చూపిస్తున్నారు కదా ! దీనిపై మీ అభిప్రాయం ఏమిటి ?
  8. “యత్ర నార్యన్తు పూజ్యన్తో తత్రరమన్తి దేవతాః” అని కూడా ఆర్యోక్తి. దీనిపై మీ స్పందన ఎలా తెలియజేస్తారు ?
  9. సినిమా జీవితంలో మీ వారసత్వం ఉంటుందా ?
  10. విద్యార్థులకు మీరిచ్చే సందేశమేమిటి ?

TS 10th Class Telugu Grammar ఇంటర్వ్యూలు

ప్రశ్న 5.
మీకు చదువు చెప్పిన గురువులు మీ పాఠశాలకు ఆహ్వానంపై వచ్చారు. ఎలా స్పందించి ఇంటర్వ్యూ చేస్తారో తెల్పండి.
జవాబు:

  1. నమోనమః గురువుగారు !
  2. చాలా కాలానికి మిమ్మల్ని చూసే అదృష్టం కలిగింది. మీ ఆరోగ్యం ఎలా ఉంది గురువు గారూ?
  3. ఇంకా మీరు కావ్యాల్ని రాస్తున్నారా ?
  4. మీకేమైనా అవార్డులు వచ్చాయా ?
  5. ఈనాడున్న విద్యా వ్యవస్థపై ఎలా స్పందిస్తారు స్వామీ ?
  6. గురువుగారు, అమ్మగారు బాగున్నారా ? ఏం చేస్తున్నారు ?
  7. ‘చిన్ని’ ఎలాగున్నాడు ? ఉద్యోగం చేస్తున్నాడా ?
  8. గురువుగారూ ! మా పాఠశాలలో ఉన్న విద్యార్థుల్ని. గురించి సందేశం ఇవ్వమని కోరుచున్నాను ?

ప్రశ్న 6.
మీ పాఠశాలలో జరుగబోయే అష్టావధానంలో నీవే అప్రస్తుత ప్రసంగ పృచ్ఛకుడవైతే ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు ?
జవాబు:

  1. రాజకీయ పక్షాన్ని, విందును ఆంగ్లంలో ఒకటే పదం వాడతాం. అది ఏమిటి ?
  2. మోతరాని డోలు ఏది ?
  3. గుడ్డ నెత్తి మీద ఉంటే ఏమంటారు ?
  4. పావుసేరు పాలల్లో పాలెన్ని ?
  5. పళ్ళూడిన రానిదెవరికి ?
  6. తినలేని తీపి ఏది ?
  7. హైదరాబాదులో ప్రశాంతంగా జీవించాలంటే ఎక్కడ నివసించాలి ?
  8. ‘నిదానమే ప్రధానం’ అని పెద్దలు ఎందుకు అన్నారు ?
  9. ఎన్ని తిన్నా లావు కానిదెప్పుడు ?
  10. వెలుగులేని మెరుపు ఏది ?

TS 10th Class Telugu Grammar ఇంటర్వ్యూలు

ప్రశ్న 7.
దానశీలం పాఠం విన్న తర్వాత నీకు ఏవైనా అనుమానాలు వచ్చాయా? వాటిని గూర్చి మీ గురువు గారిని ఏమని అడిగావు ?
జవాబు:

  1. మంచివాడైనా బలిని వామనుడు ఎందుకు దానం అడిగాడు ?
  2. బలి చేసిన పనిని బట్టి గురువుల మాట వినాలా ? వద్దా ?
  3. ‘ఎటువంటి చెడ్డపని చేసిన వానినైనా భరిస్తాను’ అన్న భూదేవి మాటలకు అర్థం ఏమిటి ?
  4. వింధ్యావళి లాగా ఈ నాటి స్త్రీలు ఉండగలరా ?
  5. చిన్నవాడు, రాక్షస జాతికి పరమవిరోధి అయిన వామనుని కాళ్ళు బలి చక్రవర్తి ఎందుకు కడగాలనుకున్నాడు ?
  6. నీటిని ధారపోసినంత మాత్రంతోనే హక్కులు పోగొట్టుకుంటామా ?

ప్రశ్న 8.
మీ పాఠశాలకు దాశరథి కృష్ణమాచార్యుల వారసులు (పిల్లలు) వస్తే వారిని మీరు ఏమి అడుగుతారు ?
జవాబు:

  1. దాశరథివారు తెలంగాణ పోరాటంలో పాల్గొన్నప్పుడు ప్రభుత్వం నుండి మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా ?
  2. దాశరథి గారికి నచ్చిన కవి, స్వాతంత్ర్య సమరయోధుడు ఎవరు ?
  3. తన భావాలను మీలో ఎవరితో ఎక్కువగా పంచుకొనేవారు ?
  4. దాశరథి గారిని జైలులో పెట్టినప్పుడు మీకు భయం వేసి, కవితలు రాయొద్దని చెప్పలేదా ?
  5. దాశరథిగారి స్నేహితుల్లో కవులు ఎవరైనా మీ ఇంటికి వచ్చినపుడు మీ భావన ఎలా ఉంటుంది ?
  6. ఖాళీ సమయాన్ని ఆయన ఎలా గడిపేవారు ?

TS 10th Class Telugu Grammar ఇంటర్వ్యూలు

ప్రశ్న 9.
సమాజసేవ చేసే పెద్దలెవరైనా మీ పాఠశాలకు వస్తే వారిని మీరేమి అడుగుతారు ?
జవాబు:

  1. సమాజసేవ చేయాలనే భావన మీకు ఏ వయసులో కలిగింది ?
  2. ఈ భావన ఎందుకు కలిగింది ?
  3. తొలిగా దేనితో ఈ సేవ ప్రారంభించారు ?
  4. ఇలా చేయడంలో మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు ?
  5. మీరు ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడంలో అంతర్యం ఏమిటి ?
  6. ఈ ప్రయాణంలో ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా ?
  7. ఎప్పుడైనా సేవ చేయడం విషయంలో మనసు మార్చుకున్నారా ?
  8. ఈపనిలో మీకుటుంబసభ్యులు సహకరించారా ?

ప్రశ్న 10.
మీ కళాశాల రజతోత్సవానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించారు కదా ! మీ కళాశాలకు వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఎలా ఇంటర్వ్యూ చేస్తారో తెల్పండి.
జవాబు:

  1. అయ్యా ! ముఖ్యమంత్రి గారూ ! నమస్కారం !
  2. మీ రాజకీయ జీవితం బాగుందా ?
  3. మీరు ఉపాధ్యాయవృత్తిని వదలి రాజకీయాల్లోకి ఎందుకువచ్చారు ?
  4. ఉపాధ్యాయ వృత్తిలో మనశ్శాంతి కల్గలేదా ?
  5. మీరు రాజకీయాల్లోకి రావడానికి స్వాగతించినది ఎవరు ?
  6. రాజకీయాల్లోనికి రావడానికి ప్రోత్సహించినదెవరు ?
  7. ముఖ్యమంత్రిగా ఎటువంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు ? వాటిని ఎలా పరిష్కరిస్తారు ?
  8. విద్యా వ్యవస్థపై మీ అభిప్రాయమేంటి ?
  9. ప్రస్తుతం విద్యా వ్యవస్థలో 5 + 5 + 2 + 3 విధానం ఉంది కదా ! దీనిపై మీ అభిప్రాయం ఏమిటి ?
  10. ఇటీవలే C.G.E మెథడ్ను అమలుపర్చారు కదా ! కాని విద్యార్థులు, ఉపాధ్యాయ సంఘాలవారు వ్యతిరేకిస్తున్నారు. ఏం చేద్దామనుకుంటున్నారు ?
  11. మీకు కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలున్నాయా ? మీ అభిప్రాయాన్ని కేంద్రం వారు స్వాగతిస్తున్నారా ?
  12. రాజకీయంలో మీ వారసత్వం సంప్రదాయాన్ని పాటిస్తారా ?
  13. విద్యార్థులకు మీరు ఇచ్చే సందేశమేమిటి ?

TS 10th Class Telugu Grammar ఇంటర్వ్యూలు

ప్రశ్న 11.
మీరు 100 పద్యాలు ధారణ చేశారు. ఈ విషయంలో నేర్చుకొనేవారికి మీరిచ్చే సలహాలు ఏమిటి ?
జవాబు:

  1. ఏ శతకం అయితే ధారణ చేయబోతున్నారో దానిలో పద్యాలకు భావాలు తెల్సి ఉండాలి.
  2. ముందు ఒక పద్యం, తర్వాత రెండవ పద్యం, తర్వాత ఒకటి, రెండు పద్యాలు, తర్వాత మూడవ పద్యం, తర్వాత ఒకటి, రెండు, మూడు పద్యాలు ఇలా ప్రతిసారీ ముందు పద్యాలను కలుపుకుంటూ ధారణ చేయాలి.
  3. ఇలా ధారణ చేస్తూ, ఇరవై ఐదు పద్యాలు ఒక భాగంగా శతకాన్ని భావిస్తూ యాభై, డెబ్భైఐదు, నూటయెనిమిది పద్యాలు (మూడుభాగాలు) మొత్తం నాలుగు భాగాలుగా విభజించుకోవాలి.
  4. నూటయెనిమిది పద్యాలు ధారణ చేయడంతో పాటు ఎక్కడ అడిగినా చెప్పేటట్లుగా నిన్ను నీవు తీర్చిదిద్దుకోవాలి.
  5. పద్యాలను చూడకుండా రాయడం కూడా మేలే.
  6. గర్వం ఎక్కడా, రాకుండా చూసుకోవాలి.

ప్రశ్న 12.
నిరుత్సాహం, జీవితంపై విరక్తి కల్గినవారు మీకు ఎదురైతే వారితో మీరు ఏం మాట్లాడతారు ?
జవాబు:

  1. దేనికి నీవు ఇలా ఉన్నావు ?
  2. అంతమాత్రాన అలా అయిపోతావా ?
  3. జీవితం మీద నీకు ఆశ లేదా ?
  4. నీవు ఇలా ఉంటే నీ వాళ్ళు ఎంత బాధపడతారో కదా !
  5. ఒక్కసారి మళ్ళీ ఆలోచించు, ఎక్కడ లోపం జరిగింది ?
  6. ఎంత కష్టమొచ్చినా స్థిరంగా ఉండడం నేర్చుకో, అప్పుడు భయం ఉండదు.
  7. ఏదో చూసి భయపడితే, ప్రతిదీ నిన్ను భయపెడుతుంది.
  8. చాలా సంతోషంగా ఉంది. నీవు ఎప్పుడూ సంతోషంగా ఉండు. మళ్ళీ కలుద్దాం.

TS 10th Class Telugu Grammar ఇంటర్వ్యూలు

ప్రశ్న 13.
మీ పాఠశాల తరుఫున చూసిన పర్యాటక ప్రదేశంలో నీకు కల్గిన అనుమానాలను మీ గురువుతో ఏమని అడుగుతావు ?
జవాబు:

  1. గోలకొండ కోటలో మిద్దెల మీద రూఫ్గ గార్డెన్స్ ఏర్పాటు ఆ రోజుల్లోనే ఎలా చేయగలిగారు ? ఈ ఆలోచన ఎలా వచ్చింది ?
  2. ఒక వృక్షాన్ని ఇతర దేశాల నుండి తెప్పించుకొనే ఆలోచన ఎలా కల్గింది
  3. ఒక ముస్లిం రాజు బ్రాహ్మణ భక్తి కలవాడై మత సామరస్యాన్ని చాటాడు. తర్వాత కాలంలో వచ్చిన నైజాం నవాబు తెలంగాణ నేలపై హింసను ప్రజ్వరిల్ల చేశాడు. ఎందుకు ఈ తేడా ?
  4. మహామారీ పీడ తొలగించడానికి సాధువులు పీర్ల పంజాలు, తాబూతులు పట్టుకొని భజనలు చేశారని, దాని ఫలితంగా ఆ పీడ పోయిందంటారు. ఆ రోజుల్లో జన విజ్ఞాన కేంద్రాలు లేవా ?
  5. ఉమ్రావు విహారానికి రావడంలోని ఆర్భాటం నేటి నాయకుల వృథా ప్రయాణాలను తలపిస్తోంది. ప్రజల సొమ్ము దుబారా కావడం లేదా ?

TS 10th Class Telugu Grammar ఇంటర్వ్యూలు

ప్రశ్న 14.
మీ పాఠశాలకు సినీ యాక్టర్ వస్తే అతనిని ఎటువంటి ప్రశ్నలను అడుగుతావు ?
జవాబు:

  1. సినిమారంగం వైపు రావడానికి గల కారణం ఏమిటి ?
  2. సినిమారంగం అంటేనే విలాసాల జీవితం అంటారు. మీరూ ఇంతేనా ! లేక మీ ఆదాయంలో కొంత దానధర్మాలు వంటివి చేస్తారా ?
  3. మీ దృష్టిలో హీరోయిజం అంటే ఏమిటి ?
  4. హీరో, హీరోయిన్ పైన కిందా పడితే పాట, హీరో, విలన్ పైనా కిందా పడితే పాట ! ఇదేనా సినిమా అంటే ?
  5. సంగీతం అంటే డబ్బాలో రాళ్ళు వేసినట్టు మోతేనా ? మీ సినిమాల్లో మెలోడీస్ తక్కువ ఉన్నాయి ఎందుకు ?
  6. కథలో భాగంగా హాస్యం మీ సినిమాల్లో ఉంటే బాగుంటుందేమో ?
  7. మాతో మీ విలువైన సమయం, అభిప్రాయాలు పంచుకున్నందుకు థ్యాంక్స్.

TS 10th Class Telugu Grammar సంభాషణలు

Telangana SCERT 10th Class Telugu Grammar Telangana సంభాషణలు Questions and Answers.

TS 10th Class Telugu Grammar సంభాషణలు

ప్రశ్న 1.
పల్లెటూళ్ళలో ఉండే ఆనందం, గొప్పదనం గురించి ఇద్దరు నగరవాసులు మాట్లాడుకుంటున్నట్టుగా సంభాషణ రాయండి. (March 2017)
జవాబు:
(రవి, సోము హైదరాబాద్లో చదువుకుంటున్నారు. వారిద్దరు ఒకసారి పల్లెటూరికి వచ్చారు. అక్కడ వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ)

రవి : ఆహా ! ఈ పల్లె వాతావరణం ఎంత బాగుందో !

సోము : ఔను ! నిజంగా మనం ఇంత ప్రశాంత వాతావరణాన్ని మన నగరంలో చూడలేదు.

రవి : మన నగరంలో ఎక్కడా పచ్చని చెట్లు కనిపించవు.

సోము : నిజమే ! పచ్చని పంటపొలాలు కూడా లేవు.

రవి : ఇక్కడ ప్రజల అప్యాయతలు మధురంగా ఉంటాయి.

సోము : ప్రజల మధ్య ఐక్యత పల్లెల్లో బాగా కనిపిస్తుంది.

రవి : పల్లెలో ఒకరి కష్టాల్లో, సుఖాల్లో పరస్పరం పాలుపంచుకుంటారు.

సోము : మన నగరాల్లో అలాంటి వాతావరణం కనిపించదు. ఎవరికివారే సొంతంగా జీవిస్తారు

రవి : ఇప్పటికైనా పట్టణాల్లో చెట్లు బాగా నాటాలి.

సోము : అంతేగాదు ప్రజల మధ్య కూడా ఆనందం వెల్లివెరియాలి.

TS 10th Class Telugu Grammar సంభాషణలు

OR

శ్రీరామ్ : హలో శ్రీనివాస్. ఈ మధ్య నీ దర్శనం లేదు. షికారుకు రాటల్లేదా ?

శ్రీనివాస్ : నమస్తే శ్రీరామ్. పోయినవారం, మా తాత గారి ఊరు పేరూరు వెళ్ళాను. అది మంచి పల్లెటూరు. అక్కడ ఉన్న నాల్గురోజులూ ఎంతో హాయిగా ఉంది.

శ్రీరామ్ : శ్రీనివాస్ ! నీవు నిజం చెప్పావు. పల్లెటూరులో నివాసం, అక్కడి ప్రజల ఐకమత్యం చూస్తే, నాకు కూడా చాలా సంతోషం వేస్తుంది. మొన్న నెల మా మేనమామ గారి ఊరు ‘అత్తిలి’ వెళ్ళాను. అక్కడ గ్రామంలో ప్రవహించే పంట కాలువలు, కాలువ గట్లపై కొబ్బరి చెట్లు, ఆ చెట్ల నుండి వచ్చే చల్లని గాలి, ప్రతి ఇంట్లో ఉన్న అందమైన పూలమొక్కలు, నాకు కన్నులపండువు చేశాయి.

శ్రీనివాస్ : శ్రీరామ్ నీవు నిజం చెప్పావు. మా తాతగారి ఊరు పేరూరు పక్కనే “వైంతేయ” నది ఉంది. అది, గోదావరీ నదికి ఒక పాయ. ఆ నదిలో పడవపై షికారు, ఆ నదీతీరంలోని చేలపై నుండి వచ్చే చల్లని గాలి, నాకు సంతోషం కల్గించాయి. ఆ పల్లెటూరి ప్రజలు ఐకమత్యంతో ఒకరికి ఒకరు సాయపడతారు. అప్పుడే పితికిన పాలతో కాఫీ, కమ్మని నేయి, పాలు, పెరుగు, ఎంతో రుచిగా ఉన్నాయి. గోబర్ గ్యాస్తో వంట. ఇళ్ళ ముందు ముగ్గులు, పూలతోటలు, మహానందంగా ఉందనుకో.

శ్రీరామ్ : నాకు కూడా నదిలో పడవపై షికారు చేయాలని ఉంది. ఈ పర్యాయము నీతో నేను కూడా “పేరూరు” వస్తా, నీకు అభ్యంతరం లేదు కదా !

శ్రీనివాస్ : లేదు. చాలా సంతోషం. మళ్ళీ నెల ‘పేరూరు’ గ్రామానికి తప్పక మనం వెడదాం. “సరే వస్తా”

TS 10th Class Telugu Grammar సంభాషణలు

ప్రశ్న 2.
మన రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలైన చార్మినార్, గోల్కొండ . లాంటి పురాతన కట్టడాలను రక్షించుకోవల్సిన అవసరం ఉందని ఇద్దరి మిత్రుల మధ్య జరిగే చర్చను సంభాషణ రూపంలో రాయండి. (March 2019)
(లేదా)
గోల్కొండ కోట యొక్క గొప్పదనాన్ని మీ ప్రాంతములో మాట్లాడుకొనే తెలుగు మాటలలో మీకు, మీ మిత్రునికి/మిత్రురాలికి సంభాషణ జరిగిన విధానాన్ని రాయండి.
జవాబు:
నాగరాజు : శ్రావ్యా ! మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ చారిత్రక కట్టడాలను గురించి తెలుసా ?

శ్రావ్య : నాకు ఎందుకు తెలియదు. ఒకటి చార్మినార్, రెండు గోల్కొండ.

నాగరాజు : బాగా చెప్పావ్ ! చార్మినార్ గొప్పతనమేమిటి ?

శ్రావ్య : క్రీ.పూ. 1591లో ఇది నిర్మించారు. ఇది మహమ్మద్ కులీకుతుబ్షాచే నిర్మించబడింది. ప్లేగువ్యాధిని నివారించడానికి నిర్మించారు.

నాగరాజు : అవును. బాగా చెప్పావ్ ! నాలుగు మీనార్ లో నిర్మితమైనందువల్ల దీనిని “చార్మీనార్” అని పేరు వచ్చిందని అంటారు.

శ్రావ్య : అవును. అంతేగాక ప్రతీ కోణంలో ‘నాలుగు’ ప్రతిబింబించేలా నిర్మించారట.

నాగరాజు : అది సరే ! ఇది ఎక్కడ ఉంది ?

శ్రావ్య : ఇది హైదరాబాద్ పాతబస్తీలో ఉంది. దీనికి ఈశాన్యంలో లాడ్ బజార్ మరియు పడమరన గ్రానైట్తో చక్కగా నిర్మించబడిన ‘మక్కామస్జిద్’ ఉన్నాయి. 149 మెట్లు ఉన్నాయట కదా ! అవునా !

నాగరాజు : అవును. నిజం. ఇక్కడ గాజులు, చీరలు, ముత్యాలకు మంచిపేరుంది తెలుసా ?

శ్రావ్య : అవును తెలుసు. మా నాన్నగారు చెప్పారు.

నాగరాజు : మరి నీకు గోల్కొండ కోట గురించి తెలుసా ?

శ్రావ్య : హైదరాబాద్కు 11 కి.మీ. దూరంలో ఉంది. దీనిని క్రీ.శ. 1083 నుండి 1323 వరకూ కాకతీయులు పరిపాలించారు. గోల్కొండ అసలు పేరు గొల్లకొండ అని పేరుంది.

నాగరాజు : అవును. తెల్సు. గొల్లకొండ గోల్కొండగా మారిందని చదివాను.

శ్రావ్య : చాలాకాలంగా ఇది కాకతీయుల అధీనంలో ఉందట. తర్వాత యుద్ధ సమయంలో సంధిలో భాగంగా 1371లో గోల్కొండ కోట అజీం హుమాయూన్ వశం అయిందట.

నాగరాజు : అవును. 15వ శతాబ్దంలో కుతుబ్షాహీ వంశం వారి అధీనంలోకి వెళ్ళిందని నేను మా పాఠంలో చదువుకున్నాను.

శ్రావ్య : అవును. బాగా గుర్తు చేసావ్ ! గోలకొండ పట్టణ పథకానికి, కర్త ‘ఆజంఖాన్’ అనే ఇంజనీర్ అని సోషల్ మాస్టార్ చెప్పారు.

నాగరాజు : ఇంకా నగీనాబాగ్, మిద్దెల తోటలు చూడతగిన ప్రదేశాలని చదివాను. నిజమా ?

శ్రావ్య : నిజం. నేను అవి చూసాను.

నాగరాజు : సరే మన పాఠశాల ఎక్స్కర్షన్కు (విజ్ఞానయాత్ర) వెళ్ళి వీటిని చూద్దాం సరేనా !

శ్రావ్య : సరే ఉంటాను.

నాగరాజు : మంచిది.

TS 10th Class Telugu Grammar సంభాషణలు

ప్రశ్న 3.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రావిర్భావానికి దారితీసిన పరిస్థితులను గూర్చి ఇద్దరు మిత్రుల మధ్య సంభాషణను రాయండి.
జవాబు:
ఇద్దరు మిత్రుల మధ్య సంభాషణ :
శ్రీరామ్ : గోపాల్ ! నీకు మన నూతన రాష్ట్ర శుభాకాంక్షలు. నిజంగా ఈ రోజు మన కలలు పండిన బంగారు రోజు.

గోపాల్ : శ్రీరామ్ ! నీకు కూడా, నా నూతన రాష్ట్ర శుభాకాంక్షలు. ఈ మన కోరిక తీరడం వెనుక, ఎందరో మన పెద్దల కృషి, ఎందరో అమాయకుల ప్రాణత్యాగాలు ఉన్నాయి కదూ !

శ్రీరామ్ : అవును గోపాల్ ! మట్టి చెన్నారెడ్డిగారి నాయకత్వంలో 1969లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, ఈ మన రాష్ట్ర సాధనకు తొలిమెట్టు అని, పెద్దలంటున్నారు.

గోపాల్ : రాష్ట్ర సాధనకు మన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులూ, ఉపాధ్యాయులూ, చేసిన సమ్మెలూ, పోరాటాలు కూడా, ప్రధాన పాత్ర వహించాయి.

శ్రీరామ్ : ముఖ్యంగా మన ముఖ్యమంత్రి కె.సి.ఆర్ నాయకత్వంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి పర్యవేక్షణలో, టి.ఆర్.యస్. పార్టీ సాగించిన పోరాటాలు, సమ్మెలు, రైల్రోకోలు, వంటా వార్పులు, మన కోరికలు తీరడానికి ప్రధానంగా దోహదం చేశాయి.

గోపాల్ : తెలంగాణ ప్రజలు అందరూ రోడ్లపైకి వచ్చి, “సకల జనుల సమ్మె, వంటా వార్పూ వంటివి చేపట్టారు. ముఖ్యంగా మన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు, ఈ ఉద్యమంలో అంతులేని మహత్తరమైన పోరాటాన్ని చేశారు.

శ్రీరామ్ : ఎన్నోసార్లు మన టి.ఆర్.యస్. పార్టీ ఎమ్.ఎల్.ఏలు, యమ్.పిలు, తమ పదవులకు రిజైన్ చేశారు. నిజానికి అన్ని పార్టీలూ, ఈ మన చిరకాల వాంఛ నెరవేరడానికి ఉద్యమంలో ముందుకు దూకాయి.

గోపాల్ : ` అటు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్, బి.జె.పి పార్టీలు కూడా, ఈ విషయంలో ఏకమై, మన కోరికను తీర్చాయి.

శ్రీరామ్ : గోపాల్ ! నీవు చెప్పింది నిజం. మన తెలంగాణ బిడ్డలు సైతం, ఎందరో ఈ ఉద్యమంలో పాల్గొని తమ ప్రాణాలు అర్పించారు. వారి త్యాగాల్ని మనం ఎప్పుడూ మరువకూడదు.

గోపాల్ : నిజం చెప్పావు. ఉంటా.

TS 10th Class Telugu Grammar సంభాషణలు

ప్రశ్న 4.
పల్లె పట్నం గురించి మాట్లాడుకుంటున్న ఇద్దరు వ్యక్తుల సంభాషణలు రాయండి.
జవాబు:
వెంకన్న : బాబూ ! తవరిదే ఊరు ?

నిఖిల్ : హైదరాబాద్, నీది ?

వెంకన్న : నిజామాబాద్ జిల్లాలో పల్లెటూరు.

నిఖిల్ : మీరు పల్లెల్లో ఎలా బతుకుతారు ?

వెంకన్న : కల్తీ లేని ఆహారం తింటూ బతుకుతాం.

నిఖిల్ : మీకు కరెంటు ఉండదు. వేసవికాలం ఉక్కపోత కదా !

వెంకన్న : హాయిగా ఆరుబయట మంచాలు వేసుకొని మా వీధి వాళ్ళందరం కబుర్లు చెప్పుకొంటూ పడుకొంటాం. చల్లగా ఉంటుంది.

నిఖిల్ : హోటల్స్ ఉండవు కదా !

వెంకన్న : కొత్తవారిని ఆదరించి కడుపు నిండా తిండి పెడతాం. వసతి కల్పిస్తాం. ఇంక హోటల్స్ ఎందుకు ?

నిఖిల్ : హాస్పటల్స్ ఉండవు కదా !

వెంకన్న : కష్టపడి పనులు చేసుకొంటాం. సాధారణంగా ఏ జబ్బూ రాదు. వచ్చినా చిన్న డాక్టరుంటాడు. పెద్ద జబ్బయితే పట్నం వస్తాం.

TS 10th Class Telugu Grammar సంభాషణలు

నిఖిల్ : అయితే మా పట్నం కంటే మీ పల్లెటూరే బాగుంటుందా ?

వెంకన్న : ఒకసారి వస్తే మళ్ళీ విడిచిపెట్టవు. ఈ రణగొణ ధ్వనులు, కాలుష్యం ఇవేమీ ఉండవు. హాయిగా ఉంటుంది. నా చిరునామా ఇస్తాను, తప్పకుండా రా ! మా ఇంట్లో ఉందువుగాని.

నిఖిల్ : మీతో మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది. తప్పక వస్తా ! నా బస్సొచ్చేసింది. బై.

వెంకన్న : మంచిది బాబూ ! జాగ్రత్తగా ఎక్కు

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

Telangana SCERT 10th Class Telugu Grammar Telangana కరపత్రాలు Questions and Answers.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 1.
మాతృభాష గొప్పదనాన్ని తెలియజేస్తూ కరపత్రం రాయండి. (June 2018)
జవాబు:
భాషాభిమానం
తెలుగు వెలుగు – నిండు నూరేళ్ళు

తల్లి నుండి బిడ్డ నేర్చుకొనెడి భాషే మాతృభాష. మానసిక భావపరంపరను వ్యక్తులు పరస్పరం తెలియజేసుకోవడానికి ఉపయోగించే సాధన భాష. మనందరి మాతృభాష తెలుగు. తెలుగు చాలా మధురమయిన భాష, తెలుగును “ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్” అంటారు. తెలుగులో అనేక జాతీయాలు, నుడికారాలు, సామెతలు, పదబంధాలు ఉన్నాయి.

తెలుగు భాష అభివృద్ధికై ఎందరో కవులు, రచయితలు కృషి చేశారు. విదేశీయులు సైతం మెచ్చుకునే భాష మన తెలుగు భాష, ఎందరో చక్రవర్తులు, రాజులు, జమిందార్లు అభిమానించి, ఆదరించిన భాష మన తెలుగు భాష.

కానీ ఎవరి ప్రాంతపు మాండలికమంటే వారికి మక్కువ. ఎవరి ప్రాంతపు యాస అంటే వారికి ప్రీతి. అందరి మాతృభాష ఒకటే అయినా ప్రాంతాన్ని బట్టి భాషలో యాస మారుతుంది. ప్రతీ తెలుగువాడు గర్వించదగ్గ భాష తెలుగు భాష అటువంటిది. మాతృభాష అభివృద్ధికి అందరం కృషి చేద్దాం.

దేశభాషలందు తెలుగు లెస్స.

తేది : XXXX

ఇట్లు,
మాతృభాషాభివృద్ధి సంఘం,
వరంగల్.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

OR

మాతృభాష గొప్పదనాన్ని తెలిపే కరపత్రము :

ప్రియమైన మాతృభాషా ప్రేమికులారా !

ఇద్దరు ఇంగ్లీషు వ్యక్తులు కలిస్తే ఇంగ్లీషులోనే మాట్లాడతారు. ఇద్దరు హిందీ మాతృభాషగా కలవారు అమెరికాలో కలిసినా సరే వారి సంభాషణ హిందీలోనే జరుగుతుంది. అలాగే తమిళులు తమిళంలోనే మాట్లాడడానికే మొగ్గు చూపిస్తారు. మరి మన తెలుగువారి దౌర్భాగ్యం ఏమిటో గాని ఇద్దరు తెలుగువాళ్ళు కలిస్తే తెలుగే రాదన్నట్టు ఇంగ్లీషులోనో, మరేదో భాషలోనో మాట్లాడడానికి ఇష్టపడతారు.

మాతృభాషలో సాగే విద్యాభ్యాసం మెట్ల మీద నుండి ఇంటి పైకి చేరినట్లుంటుంది. అదే పరాయి భాషలో సాగడం మెట్లు లేకుండా ఇంటి పై భాగానికి చేరడంలా ఉంటుందని, మాతృభాషలో విద్యాభ్యాసం కళ్ళ వంటిదని, పరాయి భాషలో అయితే కళ్ళజోడు వంటిదని ఎందరో పెద్దలు చెప్పారన్న సంగతి మరువద్దు.

మాతృభాష తల్లి పాలవంటిది. ఇతర భాషలు నేర్చుకోండి. కానీ మాతృభాషను మరువవద్దు. “తల్లికి తిండిపెట్టనివాడు పిన్నికి గాజులు వేయిస్తానన్నట్లు” ఉండవద్దు. ఎంత ఎత్తు ఎదిగినా మన మూలాలను మరువవద్దు. మాతృభాషను మృతభాషగా చేయకండి. భాష జీవిస్తేనే మనం జీవిస్తున్నట్లు అన్న మాట మరువకండి.

ప్రశ్న 2.
“అవయవదానం” గురించి తెల్పుతూ కరపత్రం రాయండి. (March 2018)
జవాబు:
అవయవదానం చేయండి

సోదర సోదరీమణులారా !

‘పరోపకారార్థమిదం శరీరమ్’ – అని ఆర్యోక్తి కాబట్టి ఇతరులకు ఉపకారం చేయుట కొరకే భగవంతుడు శరీరమిచ్చాడని గ్రహించాలి.

ఎంతోమంది మానవులు అనేక రకాలైన ప్రమాదాల్లో అవయవాలు పోగొట్టుకుంటుంటారు. అలా పోగొట్టుకుంటే శరీరంలో ఏ అవయవం లేకపోయినా జీవించడం కష్టం.

కళ్ళు, మూత్రపిండాలు, కాలేయం వంటి వాటిని దానమిచ్చి, మనచుట్టూ ఆయా అవయవాల లోపంతో బాధపడేవారిని ఆదుకోవడమే మానవ జన్మకు సార్థకత.

నేడు వైద్యరంగంలో మనిషి యొక్క ఒక అవయవం పాడయితే దాన్ని తొలగించి, ఇతరులు దానం చేసిన అవయవాలను అక్కడ అతికించి వారికి ప్రాణదానం చేస్తున్నారు. ఇప్పుడు నేత్రదానం, కిడ్నీల దానం, కాలేయము వగైరా అవయవాలు దానం చేస్తున్నారు.

ప్రమాదాలలో “బ్రెయిన్డెడ్” అయిన వారి అవయవాలను సేకరించి, వాటిని అవసరం ఉన్నవారికి అతుకు తున్నారు. మనిషికి ఒక మూత్రపిండం ఉంటే చాలు. కాబట్టి ప్రతివ్యక్తీ ఒక మూత్రపిండాన్ని దానం చేసి, అది అవసరమైన వారి ప్రాణాలు కాపాడాలి. మనం నేత్రదానం చేస్తే ఆ మనిషి మరణించినా అతని కళ్ళు శాశ్వతంగా నిలుస్తాయి. అలాగే కాళ్ళు, చేతులు మొదలైన అవయవాలు కూడా మరణానంతరం దానం చేయాలి.

ఈ విధంగా మానవులందరు తమ తమ అవయవాల్ని దానం చేస్తే కొంతమంది జీవితాల్లో వెలుగుల్ని నింపవచ్చు. ఇటువంటివారు రాబోయే తరాలవారికి స్ఫూర్తి ప్రదాతమవుతారు.

తేది : X X X X

ఇట్లు,
రాష్ట్ర యువజనసమితి,
సిరిసిల్ల.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 3.
‘సమాజంలోని మూఢనమ్మకాలను పారద్రోలడం’ అనే అంశంపై కరపత్రం తయారు చేయండి. (March 2016)
జవాబు:
‘మూఢనమ్మకాలను తరిమికొడదాం’

మన సమాజములో ఎంతో కాలంగా ఎన్నో దురాచారములు, మూఢనమ్మకాలు పాతుకు పోయాయి. వాటిని మనం గుడ్డిగా నమ్మి పాటిస్తూ వస్తున్నాము. రాజారామమోహనారయ్ు, ఈశ్వర చంద్ర విద్యాసాగర్, కందుకూరి వీరేశలింగము పంతులుగారు వంటి సంఘ సంస్కర్తలు, సతీ సహగమనము, భర్తపోయిన స్త్రీలకు అలంకారాలు తొలగించడం, వంటి దురాచారాల నిర్మూలనకు కృషిచేసి, విజయం సాధించారు. మన ఆంధ్ర దేశంలో కందుకూరి వీరేశలింగము పంతులుగారు విధవలకు తిరిగి వివాహాలు జరిపించారు. ఎన్నో మూఢాచారాలను వారు నిర్మూలించారు.

దెయ్యాలు లేవని, భూత వైద్యం అంతాదగా అని వారు నిరూపించారు. సంఘంలో దెయ్యాలు, చేతబడులు, శకునాలు, వంటి వాటిని నమ్ము తున్నారు. చేతబడులు చేశారని కొంత మందిని
చంపేస్తున్నారు. శకునం మంచిది కాదని, ఆ రోజు తిథి మంచిది కాదని, పనులు ఆపేస్తున్నారు. ఇవన్నీ మూఢాచారాలు.

దెయ్యాలు లేవు. భగవంతుడు సృష్టించిన రోజులు, తిథులు అన్నీ మంచివే. ఎవరు శకునం వచ్చినా, ఫర్వాలేదు. పిల్లి శకునం, వెధవ ముండ శకునం వంటి వాటిని పాటించనక్కరలేదు. అలాగే అంటరానితనాన్ని పాటించకూడదు.

దేవుడి దృష్టిలో అంతా సమానమే. మూఢ నమ్మకాలను తరిమికొట్టండి. మంచిని పాటించండి. పక్కవారిలో దైవాన్ని చూడండి. మతాలు అన్నీ మంచిని చెప్పేవే, నమ్మండి.

తేది : XXXX

ఇట్లు,
వరంగల్ జిల్లా,
విద్యార్థి సంఘం.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

OR

మూఢనమ్మకాలకు స్వస్తి పలుకుదాం

సోదర సోదరీమణులారా !

మానవ సమాజంలో అనేక దురాచారాలు, మూఢనమ్మకాలు అనాదిగా నెలకొనియున్నాయి. తర్వాతి తరాలవారు వాటిని గుడ్డిగా నమ్మారు. ఆ మూర్ఖత్వం నుండి ఆ మూఢత్వం నుండి ఇంకను జాగృతం కాని మానవసమాజం నేటికి కూడా మనకు కనిపిస్తుంది.

బాల్యవివాహాలు జరపడం, సతీసహగమనాలు, అంటరానితనం, కూకటివేళ్ళతో పేరుకునిపోయి ఉన్నాయి. ఇంకా దయ్యాలనీ, భూతాలనీ, చేతబడులనీ నేటికి మానవాళి విశ్వసిస్తూనే ఉన్నది. కొన్ని ప్రాంతాలలో అయితే క్షుద్రశక్తుల్ని వశం చేసుకొనుటకు నరబలులు ఇస్తూనే ఉన్నారు. ఇటువంటి మూఢాచారాన్ని నశింపచేయాలి.

ఈ ఆధునికయుగంలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రాజారామమోహనరాయలు, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి సంఘసంస్కర్తలు సతీసహగమనాన్ని మాన్పించారు. బాల్యవివాహాల్ని నిర్మూలించారు. వితంతు వివాహాల్ని పునరుద్ధరింపచేశారు.

శకునం మంచిది కాదని, ఆ రోజు తిథి మంచిది కాదని, పనులు చేయడం ఆపేస్తున్నారు. ఇటువంటి మూఢనమ్మకాల నుండి ప్రజల్ని జాగృతం చెయ్యాలి.

భగవంతుని సృష్టిలో అందరూ సమానమే. మూఢనమ్మకాల్ని తరిమికొట్టండి. సాటిమనిషిని మనిషిగా గుర్తించి, మానవత్వాన్ని పరిమళింపచెయ్యాలి. ఏ మతమైనా మానవత్వం ఒక్కటే. అని ఎలుగెత్తి చాటాలి.
తేది : x x x x x.

ఇట్లు,
నవయువత జాగృతి పరిషత్,
షాద్నగర్.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 4.
నీటిని ప్రతి చుక్క పొదుపుగా వాడుకోవాలని సూచిస్తూ కరపత్రం తయారు చేయండి.
జవాబు:
నీటి పొదుపు

మిత్రులారా! నీరు మనకు భగవంతుడిచ్చిన గొప్పవరము. ఆహారం లేకుండా అయినా ఉండగలమేమో కాని, నీరు లేకుండా త్రాగకుండా ఒక్కరోజు గడపలేము. పంచభూతాలలో నీరు ముఖ్యమైనది.

ఒకప్పుడు నీరు ప్రపంచంలో సమృద్ధిగా దొరొకేది. మంచి వర్షాలు కురిసి ఆ నీరు చెరువుల ద్వారా, కాలువల ద్వారా, నదుల ద్వారా, బావుల ద్వారా, ప్రజలకు లభించేది. ప్రపంచంలో జనాభా పెరిగింది. మానవుడికి నీటి పట్ల అశ్రద్ధ పెరిగింది. వాతావరణ కాలుష్యం వల్ల వర్షాలు తగ్గాయి. మానవుడి అవివేకంవల్ల చెరువులు, నదులు ఎండిపోతున్నాయి.

బోరుల వల్ల నేలలోని నీరు సైతం ఎండి పోతుంది. బోర్లు ఎండిపోయి త్రాగడానికి నీటిచుక్క లేక ప్రజలు వలసలు పోతున్నారు. దీనికి పరిష్కారం నీటిని పొదుపుగా వాడుకోవాలి. పొలాల్లో, ఇళ్ళల్లో ఇంకుడు గుంతలు తవ్వాలి.

కురిసిన ప్రతి వర్షపు నీటి బిందువు నేలలో ఇంకాలి. చెరువులు కలుషితం కాకుండా ప్రజలు చూసుకోవాలి. నీటిని మిక్కిలి పొదుపుగా వాడుకోవాలి. ప్రతి గ్రామములో చెరువులు, బావులు శుభ్రంగా ఉండాలి. చెరువులో నీరు పుష్కలంగా ఉంటే, గ్రామాలలోని బావులలో నీరు నిండుగా ఉంటుంది.

నదులు, ఏరులలో నీరు సముద్రంలోకి పోకుండా అడ్డుకట్టలు వేసి ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవాలి. బోరులు ఇష్టానుసారం వేయకూడదు. మొక్కలను విరివిగా పెంచి వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలి.

ప్రతి వ్యక్తి ఈ జలయజ్ఞంలో పాల్గొనాలి. పాల్గొందాము. సరేనా ? నీటిని పొదుపు చేసి మనల్ని మనము రక్షించుకుందాం.

తేది : 10.10.2016.

ఇట్లు,
తెలంగాణ జల సంరక్షణ సమితి.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 5.
స్వచ్ఛ భారత్లో ప్రతి వ్యక్తి పాల్గొనాలని ప్రబోధిస్తూ కరపత్రము తయారు చెయ్యండి.
జవాబు:
‘ఆరోగ్యమే మహాభాగ్యము’ అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. మన ఇల్లు, మనవీధి, మన గ్రామము, శుభ్రంగా స్వచ్ఛంగా ఉంటే, దేశమంతా స్వచ్ఛంగా ఉంటుంది. దేశమంతా స్వచ్ఛంగా ఉంటే దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ప్రజలకు వైద్యం ఖర్చులు తగ్గుతాయి.

ఒకనాడు గ్రామాలలో ఇల్లు, వాకిలి శుభ్రంగా తుడుచుకొని నీళ్ళు చల్లుకొని ముగ్గులు పెట్టుకొనేవారు. గ్రామాలలో అడుగుపెడితే ఆ పరిశుభ్ర వాతావరణానికి ముచ్చట వేసేది. శుభ్రమైన ఆ ఇళ్ళల్లో మహాలక్ష్మి సిరిసంపదలతో కొలువు తీరేది.

ఈనాడు గ్రామాలు, నగరాలు చెత్తకు, మురికి కాలువలకు నిలయమైపోయాయి. పందులు, పశువులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, వైద్యశాలలు, పాఠశాలలు, కళాశాలలు సైతం చెత్త కుప్పలతో కలుషిత వాతావరణంతో దుర్గంధమును వెదజల్లుతున్నాయి. అపరిశుభ్రమైన వైద్యశాలల్లో మందులు సేవించినా రోగాలు తగ్గవు.

కాబట్టి ప్రతి పౌరుడు తన ఇల్లు, తన గ్రామము, తన వాడ, తన నగరము పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ప్లాస్టిక్ వస్తువులు, సంచులు వాడరాదు. ఎవరికి వారు తమ ఇల్లు, వీధి శుభ్రం చేసుకొని ఆ చెత్తను పంచాయితీ మునిసిపల్ వారి బళ్ళకు అందించాలి. చెత్తను పోగుచేసి ప్రభుత్వము దానిని చేలకు ఎరువులుగా తయారు చేయాలి. చెత్త నుండి విద్యుచ్ఛక్తి తయారు చేయాలి.

‘స్వచ్ఛభారత్’ అని మన ప్రధాని ఇచ్చిన పిలుపును ప్రతివ్యక్తి అందుకొని, దేశాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యవంతంగా ఉంచే బాధ్యతను తీసుకోవాలి. ఇది ఒక మహా యజ్ఞం. ఈ యజ్ఞంలో ప్రతి భారతీయుడు పాల్గొనాలి. పాల్గొందాం.

‘జై స్వచ్ఛ భారత్’

తేది. 10.08.2018.

ఇట్లు,
స్వచ్ఛ భారత్ యువజన సంఘం,
నల్గొండ జిల్లా శాఖ.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 6.
‘వందేమాతరానికి వందేళ్ళు’ పూర్తయిన సందర్భాన్ని గుర్తుచేస్తూ ఒక కరపత్రాన్ని తయారు చేయండి.
జవాబు:
మన భారతదేశంలో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించిన మహా ఉద్యమం వందేమాతరానికి వందేళ్ళు పూర్తయిన సందర్భంగా 2005వ సంవత్సరంలో ఉత్సవాలు నిర్వహించాం. వందేమాతరం గీతం బంకించంద్ర చటర్జీ రచించిన ‘ఆనంద మఠం’ అనే నవలలోనిది. ఆ నవలలో సన్యాసుల తిరుగుబాటు సందర్భంలో ఈ గీతం ఉంది.

బ్రిటిష్వాళ్ళు దేశ ఐక్యతను చెడగొట్టే ప్రయత్నంలో భాగంగా బెంగాల్ రాష్ట్రాన్ని విభజించడానికి పూనుకున్నారు. దీనికి వ్యతిరేకంగా వందేమాతరం ఉద్యమం ప్రారంభమైంది. 1905లో బిపిన్ చంద్రపాల్ వంటి దేశభక్తులు దేశమంతటా సంచరించి, ప్రజలకు నాడు జరుగుతున్న విషయాలను విశదీకరించారు. దేశమంతటా ‘లాల్, బాల్, పాల్’త్రయాల ప్రసంగాల ఫలితంగా వందేమాతరం ఉద్యమం వ్యాపించింది.

దేశప్రజలలో ఐకమత్యకు ఎంతో ఉపకరించింది ఈ వందేమాతరం ఉద్యమం. మొదట బీజప్రాయం కాగా అది మొలకెత్తి మహావృక్షమై దేశమంతటా అలుముకున్నది. అదే మహాస్వాతంత్ర్యోద్యమమై మనకు 1947 ఆగస్ట్ 15న స్వాతంత్య్రం రావడానికి కారణభూతమైంది.

ఆనాటి జాతీయ స్ఫూర్తి, స్వాతంత్ర్య దీప్తిని దేశమంతటా వ్యాపింపచేసిన వందేమాతరం ఉద్యమాన్ని మనం గుర్తు చేసుకోవడానికి ఈ ఉత్సవం ఎంతో తోడ్పడుతుంది. చీలిపోతే కూలిపోతామనీ, కలిస్తేనే నిలుస్తామనీ ఈ ఉద్యమం మనకు చెబుతున్నది. ఈ స్ఫూర్తికి మనం తిరిగి ఈనాడు పొందడానికి వందేమాతరం ఉద్యమ శతసంవత్సరాల పండుగ తోడ్పడుతున్నది.

ఇట్లు,
X X X X X

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 7.
మీ పాఠశాలలో ఉండే సౌకర్యాలు, బోధన, ఇతర ప్రత్యేకతలు తెల్పుతూ, పాఠశాలలో పిల్లలను చేర్పించమని కోరుతూ, కరపత్రం తయారు చేయండి.
జవాబు:
సురక్షితం ! మా బడిలో చేర్పించండి! సలక్షణం!

మా పాఠశాలలో 2017 – 2018 సంవత్స రానికి అన్ని తరగతులకు అడ్మిషన్లు తెరవబడినాయి. నగరంలోనే మా పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. చూడండి ! మా ప్రత్యేకతలు.

బోధన : అనుభవజ్ఞులైన, సుశిక్షితులైన అధ్యాపకులచే బోధన, కేరళ ఉపాధ్యాయులచే ఇంగ్లీషు బోధన, వారాంత పరీక్షలు, సి.సి.ఇ. పద్ధతిలో బోధన.
సౌకర్యాలు : విశాలమైన తరగతిగదులు, విశాలమైన క్రీడా ప్రాంగణం, పచ్చని చెట్లతో కూడిన ప్రశాంత వాతావరణం.
ప్రత్యేకతలు : ఎలాంటి డొనేషన్లు లేవు, పాఠ్య పుస్తకాలు, యూనిఫాం ఉచితం. ప్రభుత్వ నిర్ణీత ఫీజులు, సంగీతం, క్రీడలు, వృత్తివిద్యలయందు ప్రత్యేక శిక్షణ. దూర ప్రాంతాల వారికి బస్సు సదుపాయం కలదు.

ఇట్లు,
యాజమాన్యం,
శ్రీ వివేకానంద ఉన్నత పాఠశాల,
నల్గొండ.

ప్రశ్న 8.
గ్రంథాలయాల ఆవశ్యకత, ప్రయోజనాలు, సంరక్షణ గురించి అవగాహన కల్పిస్తూ కరపత్రం తయారు చేయండి.
జవాబు:
చదవండి – విజ్ఞానం పొందండి

సమాజంలో గ్రంథాలయాల పాత్ర సమున్నతంగా ఉంది. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు. పరిశోధనలకు నిలయాలు. విద్యార్థుల బుద్ధి వికాసానికి సోపానాలు. తరతరాల భారతీయ సంస్కృతికి, సాహితీరసాస్వాదనానికి దేవాలయాలు.

మనం గ్రంథాలయాలకు వెళ్ళాలి. విజ్ఞాన గ్రంథాలను చదవాలి. గ్రంథాలయాల్లో విస్తృత పఠనం, మౌనపఠనం అలవడుతుంది. మనం ఈ గ్రంథాలయాలను రక్షించాలి. పతనం చెందుతున్న మన గ్రంథాలయాలను ఆదుకోవాలి. మనవంతు కృషిచేయాలి.

ఇట్లు,
గ్రంథాలయ సంరక్షణ కమిటీ,
కావలి.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 9.
‘చెట్టు – నీరు’ పథకం గురించి, ప్రజలందరూ దానిలో పాల్గొనాలని ప్రబోధిస్తూ కరపత్రం సిద్ధం చేయండి.
జవాబు:
‘చెట్టు – నీరు పథకం’

ఈనాడు దేశం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ‘నీరు’ యొక్క కొరత. మనకు పూర్వకాలంలో మహారాజులు, దాతలు గ్రామాల్లో చెరువులు త్రవ్వించి, వర్షం నీటిని దానిలో నిల్వ చేసి ప్రజలకు నీటి సదుపాయం కల్పించారు. దేశ విస్తీర్ణంలో మూడవ వంతు అడవులు ఉంటే మంచి వర్షాలు పడతాయి. ఇప్పుడు అడవుల విస్తీర్ణం తగ్గి పోయింది. దానితో వర్షాలు లేవు. దానితో నదులు నిండుగా ప్రవహించడం లేదు.

ఇప్పుడు రోడ్లు, ఇళ్ళు అన్నీ కాంక్రీట్ అయి పోయాయి. దానితో నీరు భూముల్లోకి ఇంకడం లేదు. అందువల్ల ప్రతి ఇంటివారు ఇంకుడు గుంటలు ఏర్పాటు చేయాలి. చెరువులను బాగా త్రవ్వించి నీరు నిలువ చేయాలి. చెరువులలో, కాలువల్లో నీరు నిండుగా ఉంటే భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయి.

ప్రతి ఒక్కరు ఖాళీ ప్రదేశాల్లో చెట్లు పెంచాలి. అందువల్ల వాతావరణం చల్లబడుతుంది. పరిశుభ్ర మవుతుంది. మంచి వర్షాలు పడతాయి. ప్రభుత్వం ఇందుకే చెట్టు – నీరు పథకం మొదలు పెట్టింది. దీనిలో ప్రజలంతా పాల్గొనాలి. తమ ఊరిలో చెరువు వారు బాగు చేసుకోవాలి. ప్రజలందరికీ నీరు పుష్కలంగా లభించేలా చూడాలి. నీటి వనరులను కలుషితం కాకుండా కాపాడుకోవాలి.

వృక్ష పరిరక్షణ సమితి,
హైదరాబాద్.

ప్రశ్న 10.
బహుళ ప్రయోజనాలను చేకూర్చే నదుల ప్రాముఖ్యం వివరిస్తూ, ఆ నదులు కాలుష్యం బారిన పడకుండా చూడటానికి ప్రజలను చైతన్యపరుస్తూ ఒక కరపత్రం తయారు చేయండి.
జవాబు:
నదులను కాపాడుకుందాం !

ప్రజలారా !

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎన్నో నదులతో భారతదేశం పవిత్రమవుతోంది. మన రాష్ట్రంలో గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, తుంగభద్ర మొదలైన నదులున్నాయి. నదులకూ మానవ జీవితానికి అవినాభావ సంబంధం ఉన్నది. నదుల మీద కడుతున్న ఆనకట్టలతో, నీటిని నిల్వచేసి వ్యవసాయానికి నీరు అందించుకోగలుగు తున్నాం.

నదుల్లో చేపల వంటి విలువైన జలసంపదను పెంచుకో గలుగుతున్నాం. విద్యుత్ను ఉత్పత్తి చేసుకో గలుగుతున్నాం.

కానీ మన స్వార్థంతో నేడు మనకు ప్రాణాధార మైన నదులను కలుషితం చేస్తున్నాం. పారిశ్రామిక వ్యర్థాలను నదుల్లోకి వదిలి నీటిని కలుషితం చేస్తున్నాం. ఇకపై పారిశ్రామిక వ్యర్థాలను నదుల్లోకి
కలపకుండా చూడాలి.

నదుల్లో మల, మూత్రాదులను వదిలి కలుషితం చేస్తున్నాం. మల, మూత్రాదులను నదుల్లో కలప కుండా రక్షణ చర్యలు చేపట్టాలి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి.

పశువులను, బట్టలను నదులలో కడగడం, ఉతకడం వంటి నదులను కలుషితం చేసే పనులను ఆపాలి.

ఇకనైనా చైతన్యవంతులమవుదాం. నదుల కాలుష్యాన్ని అరికడదాం.

రోగాల బారిన పడకుండా మనల్ని కాపాడు కుందాం.

ఇట్లు,
రోటరీక్లబ్,
భద్రాచలం.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 11.
అనేక వ్యాధులకు కారణమవుతున్న దోమల్ని నివారించడానికి తెలియజేస్తూ కరపత్రం తయారుచేయండి. (March 2017)
జవాబు:
దోమల నిర్మూలన

సోదర సోదరీమణులారా !

ఈరోజు మనగ్రామంలో దోమల బాధ ఎక్కువగా ఉంది. ఈ దోమల వల్ల మానవాళికి అనేక రకాలైన వ్యాధులు వస్తున్నాయి. కలరా, మలేరియా, టైఫాయిడ్ వ్యాధిని వ్యాప్తి చేసే దోమలెన్నో పుట్టుకువస్తున్నాయి. అంతేకాకుండా బోదకాలు వ్యాధిని కూడా వ్యాప్తిని చేసే దోమలు అనేక విధాలుగా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రజలందరు జాగ్రత్తలు పాటించినట్లైతే రోగాలపాలు కాకుండా ఉంటారు.

‘ఆరోగ్యమే మహాభాగ్య’మన్నారు పెద్దలు. కనుక ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. త్రాగునీటిని కాచి చల్లార పెట్టి త్రాగవలెను. మురికి కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి. ఫినాయిల్ను ఉపయోగించాలి. దోమలు నివసించే ప్రదేశాల్లో డి.డి.టి మందుల్ని వారానికి రెండుసార్లు ఉపయోగించాలి. చెత్తకుండీల్ని ప్రత్యేకంగా ఏర్పాటుచేసి అందులో చెత్తనుంచాలి. దానిని వారానికి రెండుసార్లు తగలబెట్టాలి.

రోడ్ల వెంట చెట్లను విరివిగా నాటాలి. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయకుండా తగు చర్యలు తీసుకోవలెను. పారిశుద్ధ్యం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. పరిసరాల పరిశుభ్రతతోనే మనందరి అభివృద్ధి ఉందని గ్రహించాలి. దీనికై అందరు ఉద్యమించాలి.

ఇట్లు,
ప్రాథమిక ఆరోగ్యకేంద్రం,
సిద్ధిపేట.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 12.
‘పచ్చని చెట్లు – ప్రగతికి మెట్లు’ అంటూ పర్యావరణ పరిరక్షణకు చెట్ల ఆవశ్యకతను వివరిస్తూ ఒక కరపత్రం రూపొందించండి. (March 2017)
జవాబు:
చెట్లు లేనిదే బ్రతుకు లేదు

సోదర సోదరీమణులారా !

“వృక్షో రక్షతి రక్షితః” – అని ఆర్యోక్తి. అనగా చెట్లను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అని అర్థం. భూగోళంలో మూడువంతులు నీరు, ఒక వంతు నేల మాత్రం కల్గి ఉంది. ఆ నేలలో సగభాగం అరణ్యాలు, కొండలు ఉన్నాయి. భూమి వేడెక్కకుండా ఉండాలంటే అరణ్యాలు ముఖ్యపాత్ర వహిస్తున్నాయి. అంతేకాక వర్షపాతాన్ని కూడా అధికంగా పెంచుతాయి.

మానవాళి తమ తమ శరీరంలో దిగువభాగం నుండి వదిలెడి దుర్గంధ వాయువుల్ని చెట్లు పీల్చుకుంటాయి.’ తర్వాత మానవాళి జీవించడానికి అవసరమైన ప్రాణవాయువునిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణకు సహకరిస్తున్నాయి. సూర్యుని వద్ద నుండి వెలువడే అతినీలలోహిత కిరణాలు భూమి చుట్టూ ఉన్న భూకక్ష్యను తాకి, మార్పు చెంది, ఆ తర్వాత చెట్లను తాకుతాయి. ఆ తర్వాత భూమి పైకి వస్తాయి. ఈ చెట్లు భూమి వెడెక్కకుండా రక్షిస్తాయి.

భూమిని రక్షించడంలో ముఖ్యపాత్ర వహిస్తున్న చెట్లను స్వార్థంతో అకారణంగా నరికివేస్తున్నాడు. ధనదాహంతో అడవుల్ని నశింపచేసి ఇళ్ళ నిర్మాణమంటూ ద్రోహం చేస్తున్నాడు. మానవాళిని రక్షించే చెట్లను నరకుట మానాలి. ప్రభుత్వాలు శాసనాలు చేసి చెట్లను రక్షించాలి. ప్రతి మానవుడు చెట్లను నాటి వాటి ఆవశ్యకతను గుర్తించాలి. “పచ్చని చెట్లు ప్రగతికి మెట్లను” అనే నినాదంతో రాబోయే భావితరాలవారికి ఇబ్బంది కలుగకుండా చెట్లను నాటి, వాటి పెరుగుదలకు దోహదపడాలి. అప్పుడే లోకకల్యాణం సిద్ధిస్తుంది. అనారోగ్యాల బారి నుండి మానవుడు రక్షింపబడతాడు.

ఇట్లు,
పర్యావరణ పరిరక్షణ సమితి,
భద్రాచలం.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 13.
నేటి కాలంలో “ఎంతోమంది వృద్ధుల్ని వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారు. ఇది సరికాదని తెలియజేస్తూ” ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:
‘తాతా · మామ్మ ముద్దు’ వృద్ధాశ్రమం వద్దు

సోదర సోదరీమణులారా !

అనాధి నుంచి మన భారతదేశం కుటుంబవ్యవస్థకు పెట్టింది పేరు. ఎన్నెన్నో కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలుగా ఖ్యాతిని పొందాయి. అమ్మమ్మ, తాతయ్య, అమ్మానాన్నలు, పిల్లలు ఇలా కలసి ఉండే అందమైన కుటుంబాలు మనవి. వీరంతా ఒకరికొకరు కలసిమెలసి పరస్పర సహాయ సహకారాలు చేసుకుంటూ జీవించేవారు. అన్ని విషయాల్లో ఐకమత్యంగా ఉండేవారు.

కాని నేడు మనదేశంలో ప్రతివ్యక్తికి స్వార్థం పెరిగిపోయింది. మనమనేభావన పోయింది. నాదన్న భావన పెరిగిపోయింది. నేను, నా భార్య, నా పిల్లలు అనే స్వార్థంతో పెద్దల్ని దూరంగా ఉంచుతున్నారు. వృద్ధుల విషయంలో శ్రద్ధపోయి విసుక్కుంటున్నారు. అసహించుకుంటున్నారు. నిరాదరణ పెరిగిపోయింది. పైగా ఇంట్లో ఉంచుకోకుండా వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారు.

ఈనాడు అనేకమంది వృద్ధులు నిరాదరణకు గురై, అనాథలుగా జీవిస్తున్నారు.

కనుక ఈనాటి బాలబాలికలే రేపటి భావిభారత పౌరులు కదా ! అందువల్ల దయను చూపిస్తూ వృద్ధుల్ని గౌరవించండి. ఆదరణతో ఆదుకొనండి. వారి అనుభవాల్ని తెలుసుకుని, నేటి విద్యార్థులంతా పాఠాలుగా స్వీకరించండి. ఉమ్మడి కుటుంబాలే ఈనాటి సమాజానికి వెన్నుముక వంటిదవుతుంది. మంచి ప్రపంచం ఏర్పడి, ఆరోగ్యవంతమైన వాతావరణం కల్గుతుంది. ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి.

తేది : xxxxx,

ఇట్లు,
వృద్ధజన సేవాసమితి,
హైదరాబాద్.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 14.
“నదుల ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ఒక కరపత్రం రూపొందించండి.
జవాబు:
నదుల్ని కాపాడుకుందాం !

మిత్రులారా !

మనదేశం వ్యవసాయిక దేశం. వ్యవసాయానికి ముఖ్యంగా కావలసింది నీరు. మనదేశంలో ఆసేతు హిమాలయ పర్యంతమూ అనేక నదులు కలవు. అందులో మన ఆంధ్రరాష్ట్రంలో గోదావరి, కృష్ణా, పెన్నా, తుంగభద్ర మున్నగు జీవ నదులున్నాయి. ఈ నదులకు మానవాళికి అవినాభావ సంబంధం కలదు.

ఈ నదులపై అనేక ఆనకట్టలు కట్టి, నీరును నిల్వచేసి, ఎగువ ప్రాంతాలకు ప్రవహింపచేసి వ్యవసాయానికి నీరందిస్తున్నారు. అంతేకాక జలసంపదను అభివృద్ధిని సాధిస్తున్నారు. మరియు నీటి నుండి విద్యుత్తును సృష్టించి వ్యవసాయానికి, పారిశ్రామిక రంగానికి ఉత్పత్తి చేస్తున్నారు.

కాని, మానవుడు స్వార్థంతో నేడు మనకు ప్రాణాధారమైన నదుల్ని కలుషితం చేస్తున్నారు. పారిశ్రామిక వ్యర్థాల్ని వదలి నీటిని కలుషితం చేస్తున్నారు. నగర, పట్టణాలందలి మురికినీటిని నదులలోకి వదలి కలుషితం చేస్తున్నారు. ఆ నీరే తాగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. నదులు కాలుష్యకోరల్లో చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకనైనా ప్రజలంతా చైతన్యవంతులవ్వాలి. రోగాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకుందాం.

తేది : x x x x x.

ఇట్లు,
జాతీయ విద్యార్థి సంఘం,
సికింద్రాబాద్.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 15.
“తెలుగు వారందరూ ఒక్కటే” అంటూ సోదరభావం కలిగేలా ఒక కరపత్రాన్ని తయారుచేయండి.
జవాబు:
తెలుగువారందరూ ఒక్కటే

సోదర సోదరీ మణులారా !

“తెలుగుజాతి మనది – నిండుగ వెలుగుజాతి మనది” – అని డా. సి. నారాయణరెడ్డి అన్నారు. ప్రాంతీయ భేదాలు మనల్ని మన మనసుల్ని కలుషితం చేస్తాయి. ప్రాంతాలు వేరైనా మనభాష తెలుగుభాషే. ఆంధ్రాయైనా, తెలంగాణయైనా, మనమంతా తెలుగువారం. ఆత్మీయతకు, అనురాగానికి పుట్టినిల్లు మన తెలుగునేల.

ప్రాంతాలు విడిపోయినా, సంస్కృతీ సంప్రదాయాల్లో, భాషా వ్యవహారాల్లో మనమంతా ఒక్కటే. ‘కలసి ఉంటే కలదు సుఖం’ అని పెద్దలు చెప్పుచున్నారు కదా ! మనమంతా మన మాతృభాషను గౌరవిద్దాం. ఆంధ్రభోజునిగా కీర్తిపొందిన శ్రీకృష్ణదేవరాయలు దక్షిణాపథాన్ని ఒకే గొడుగు క్రిందకు తీసుకొచ్చి మన ఆంధ్రదేశాన్ని పాలిస్తూ “దేశభాషలందు తెలుగు లెస్స” – అని పల్కాడు. మన తెలుగుదేశ గొప్పతనాన్ని ప్రపంచమంతా కొనియాడింది.

మనలో మనకు ఈర్ష్యా ద్వేషాలు; వైషమ్యాలు మున్నగునవి పతనానికి దారితీస్తాయే కాని అభివృద్ధిని సాధించలేవు. ఒక తల్లిబిడ్డల్లా విడిపోయినా కలసిమెలసి అందరం అభివృద్ధి పథంలో పయనిద్దాం. ప్రాంతీయవాదం జాతి సమైక్యతకు గొడ్డలిపెట్టు. మనమంతా ఒకే తల్లిబిడ్డల్లా, అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉందాం. మన తెలుగువారంతా ఒక్కటే అన్న నినాదాన్ని ప్రపంచమంతా చాటి చెప్పుదాం.

జై తెలుగుతల్లి

తేది : x x x x x.

ఇట్లు,
తెలుగు సాహితీ సమితి,
శంషాబాద్.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 16.
“స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాల్ని ఖండిస్తూ వారిని గౌరవించాలని తెలుపుతూ” ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:
స్త్రీలను గౌరవిద్దాం

సోదర సోదరీ మణులారా !

స్త్రీ తల్లిగా, చెల్లిగా, భార్యగా కుటుంబంలో పోషించే పాత్ర కదా ! ఆమె నిస్వార్థంగా సేవచేస్తూ మమతానుబంధాల్ని పంచుతూ జీవిస్తుంది.

అందుకే “యత్ర నార్యస్తు పూజ్యంతే, తత్సరమంతే దేవతాః” – అని ఆర్యోక్తి. అనగా ఎక్కడ స్త్రీలు పూజింపబడుతారో అక్కడ దేవతలు ఆనందిస్తారని స్త్రీ యొక్క గొప్పతనాన్ని ఆర్యులు గొప్పగా చెప్పారు.

ప్రాచీనకాలం నుంచి విజ్ఞానరంగంలో స్త్రీలు, పురుషునితో పోటీపడుతూనే ఉన్నారు. నేడు స్త్రీలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారు. చదువుల్లో పురుషునికంటే ముందంజ వేస్తున్నారు. సమాజంలో క్రియాశీలమైన స్త్రీలపై అత్యాచారాలు జరగడం సిగ్గుచేటు, స్త్రీని గౌరవించడం అనే మంచి సంప్రదాయం ఉన్న మనదేశానికి అవమానకరం.

క్షణికమైన ఆవేశంతో స్త్రీలపై అత్యాచారాలు చేయడం వల్ల మన జాతి నిర్మాతలైన సోదరీమణుల ఆత్మగౌరవం దెబ్బ తింటుంది. విలువైన ప్రాణాలు పోతున్నాయి. జాతికి పరువుపోతుంది. కనుక స్త్రీలను గౌరవిద్దాం ! వారి ఆత్మగౌరవానికి ఆటంకం కలిగించకుండా పురుషునితో సమానంగా ఆదరిద్దాం ! మహాకవి చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు “ముదితల్ నేర్వగలేని విద్య కలదే ముద్దార నేర్పించినన్” అని స్త్రీ యొక్క గొప్పతనాన్ని ఏనాడో విశ్లేషించి చెప్పాడు. స్త్రీల కున్న స్వేచ్ఛను రక్షించుదాం ! వారి హక్కుల్ని కాపాడుదాం !

తేది : X X X X,

ఇట్లు,
తెలంగాణ మహిళాసంఘం,
సికింద్రాబాద్.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 17.
“బాలకార్మిక వ్యవస్థను నిర్మూలిస్తూ” ఒక కరపత్రాన్ని తయారుచేయండి.
జవాబు:
బాలకార్మికుల్ని రక్షిద్దాం

మిత్రులారా !

“కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్లను, నిరక్షరాస్యత వల్లను, కరవు కాటకాల కారణంగా లక్షలాది పిల్లలు చిన్నవయస్సు లోనే కార్మికులుగా చేరుతున్నారు.” – అని అంతర్జాతీయ కార్మిక నిర్వహణ సంస్థ (IOL) తన సర్వేలో వెల్లడించింది. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా మన భారతదేశంలో బాలకార్మిక వ్యవస్థ ఉందని ఐ.ఓ.యల్ (IOL) తన సర్వేలో తెలియజేసింది. మనదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా బాలకార్మికులు ఉన్నారని ఆ నివేదికలో పేర్కొన్నారు.

భారతదేశంలో 9.9 కోట్లమంది బాలలు పాఠశాలలకు వెళ్ళడంలేదని, వీరంతా ఇళ్ళలోను, కర్మాగారాల్లోను, పొలాల్లోను పనిచేస్తున్నారని “గ్లోబల్ మార్చ్ ఎగనెస్ట్ లేబర్” అనే అంతర్జాతీయసంస్థ పేర్కొంది. బాలకార్మికుల కొరకు ప్రత్యేక పాఠశాలల్ని ఏర్పాటు చెయ్యాలి. వారు చదువకొనే అవకాశాన్ని కల్పించాలి.

మన రాష్ట్రంలో 16 లక్షలమంది బాలకార్మికులున్నారు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామనే ప్రభుత్వం పలు సందర్భాల్లో చేస్తున్న ప్రకటనలు కేవలం ప్రకటనలుగానే మిగిలిపోతున్నాయి.

కాబట్టి నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసి అది అమలు జరిగేట్లు చూడాలి. ప్రభుత్వం రూపొందించిన బాలకార్మిక నియంత్రణ చట్టం సరిగా అమలు అయ్యేటట్లు చూడాలి.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 18.
“వరకట్న సమస్యను నిర్మూలిస్తూ” ఒక కరపత్రాన్ని తయారుచేయండి.
జవాబు:
వరకట్నం నిర్మూలిద్దాం

సోదర సోదరీ మణులారా !

వివాహం అయిన తదుపరి పెళ్ళికూతుర్ని అత్తవారింటికి పంపుతూ కూతురు మీద ఉన్న ప్రేమతో తల్లిదండ్రులు అనేక కానుకలనిచ్చి పంపుతారు. రానురాను ఈ సంప్రదాయం భయంకరంగా రూపొందించుకుంది. అది ఒక పెద్ద సమస్యగా పరిణమించింది.

ఈ కట్నం అనే లాంఛనం తప్పనిసరిగా వరుడికిచ్చే పరిస్థితి నేడు నెలకొంది. ఆడపిల్లకు వివాహం చేయాలంటే కట్నకానుకలను ఇచ్చే స్తోమత లేక అనేకమంది అనేక రకాలుగా బాధపడుతున్నారు. వరకట్నం తీసుకోవడంగానీ, ఇవ్వడంగానీ నేరం అని చట్టం చెబుతున్నా పట్టించుకునేవాళ్ళు లేరు. ఈ చట్టాన్ని ఎవరు పాటించడం లేదు. చట్టాన్ని కాపాడవలసిన అధికారులే కట్నం తీసుకుంటున్నారు. వరకట్నం ఇస్తున్నారు. కంచే చేను మేస్తుంటే చేసేదేముంది ?

వరకట్న సమస్య నశించాలంటే ముందు పెద్దల్లో మార్పురావాలి. శాఖాంతర, కులాంతర ప్రేమ వివాహాల్ని ప్రోత్సహించాలి. యువతీ యువకులు కూడా ఆదర్శాలతో ఈ వరకట్న మనే దురాచారాన్ని రూపుమాపాలి. అబ్బాయికిచ్చినా, అమ్మాయికిచ్చినా రెండూ అక్రమమేనన్న ఆలోచన కలగాలి. నేడు ప్రచార, ప్రసార సాధనాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక వీటి ద్వారా ప్రచారం జరగాలి. వరకట్న సమస్యను రూపుమాపాలి.

ప్రశ్న 19.
“నిరుద్యోగ సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపెడుతూ” ఒక కరపత్రాన్ని తయారుచేయండి.
జవాబు:
నిరుద్యోగ సమస్య పారదోలుదాం !

మిత్రులారా !

ప్రస్తుత పరిస్థితుల్లో చదివిన వారందరూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎగబ్రాగటం వల్ల నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చింది. కులవృత్తులు చేయువారు కూడా ఉద్యోగాలకు పరుగులిడుతున్నారు. అవి రాని పరిస్థితి వల్ల కులవృత్తులందు తగిన నైపుణ్యాన్ని కోల్పోయారు.

నిరుద్యోగ సమస్య తీరాలంటే ప్రభుత్వాలు విద్యావిధానాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి. వృత్తి విద్యలకు, కులవృత్తులకు ప్రోత్సాహమియ్యాలి. లఘు పరిశ్రమల్ని, కుటీర పరిశ్రమల్ని ప్రోత్సహించాలి. అవసరమైతే బ్యాంకుల ద్వారా వారికి ఋణాల్ని ఇప్పించాలి. ఉపాధి అవకాశాల్ని మెరుగుపర్చాలి.

యువతీయువకులు ప్రభుత్వ ఉద్యోగాలకు పరుగు విడక స్వయం ఉపాధికై అన్వేషణ జరపాలి. స్వతంత్రంగా జీవించడానికి సంసిద్ధులు కావాలి. అంతేకాదు ఏ యువకుడైనా తన కాళ్ళపై తాను నిలబడిన తాను పదిమందికి దారి చూపిననాడు నిరుద్యోగ సమస్య నశించిపోతుంది.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 20.
“పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను గూర్చి ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:
పర్యావరణ పరిరక్షణ – మన ఆరోగ్యపు సంరక్షణ

మిత్రులారా !

మానవుడు భూమిపై నివసిస్తున్నాడు కదా ! అతడు తన పరిసర ప్రాంతాల్ని కలుషితం కాకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా మానవుడు చేయగలిగిననాడు పర్యావరణ పరిరక్షణకు సాకారం జరుగుతుంది.

పర్యావరణంలో భాగంగా జలకాలుష్యం మిక్కిలి భయంకరమైనది. రసాయనిక పదార్థాలు, పరిశ్రమల వల్ల విడుదలయ్యే వ్యర్థ పదార్థాలు సాగునీటిని, త్రాగునీటిని కాలుష్యం చేస్తున్నాయి. మురుగు నీటికి, త్రాగునీటికి తేడా లేకుండా పోయింది.

వాయు కాలుష్యం పారిశ్రామిక వ్యవస్థ వల్ల మితిమీరిపోతోంది. విషపూరితమైన గాలి పీల్చడం వల్ల మానవులకు అనేక వ్యాధులు సంక్రమించి మరణావస్థకు దారితీస్తున్నాయి.

యంత్రాల వల్ల, వాహనాల వల్ల ధ్వని కాలుష్యం పెరిగిపోతోంది. అణుశక్తి పరీక్షల వల్ల కూడా వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది. పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లను పెంచాలి. కలుషితమైన నీటిని శుభ్రం చేసి, ప్రత్యేక కాలువల ద్వారా మురుగును సముద్రంలోనికి వెళ్ళేటట్లు చూడాలి పరిశ్రమల వ్యవస్థ వల్ల గాలి కలుషితం కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.

పర్యావరణ వ్యవస్థలోని సమతౌల్యాన్ని కాపాడుకోవడానికి అందరూ కృషి చేయాలి.

ఇట్లు,
పర్యావరణ పరిరక్షణ సమితి,
వరంగల్.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 21.
“మానవాళి నీటిని ఎంతో జాగ్రత్తగా వాడవలసిన అవసరం ఉందని” తెలియజేస్తూ ఒక కరపత్రాన్ని విడుదల చెయ్యండి.
జవాబు:
నీటి రక్షకుడు – లోకరక్షకుడు

మిత్రులారా !

సకల చరాచర జీవరాసులకి నీరే ప్రాణాధారం. నీరులేనిదే ఏ జీవి జీవించలేదు. ప్రతిరోజూ దైనందిన జీవితంలో నీటి ప్రాముఖ్యత ఎంతో ఉంది. మానవులు, పశువులు, పక్షులు ఒకటేమిటి అనేక జీవరాశులు నీరులేనిదే జీవించలేవు. ఇంత ఆవశ్యకత ఉన్న నీటి లభ్యత క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఆనాటికానాటికి భూగర్భజలాలు అంతరించిపోతున్నాయి.

మానవాళికి ఆహారం కావాలంటే పంటలు పండాలంటే సాగునీరు అవసరం. కనుక భూగర్భజలాలు పెరిగితే పుష్కలంగా నీరు లభిస్తుంది.

భూమిపైన జనాభా నానాటికీ పెరిగిపోతుంది. ప్రస్తుతం ఉన్న నీరు భవిష్యత్తుకుపయోగపడదు. కనుక ప్రజలు నీటి ఆవశ్యకతను గ్రహించి విరివిగా చెట్లను పెంచాలి. కాలుష్య పొరల నుండి భూమిని కాపాడాలి. గాలి కాలుష్యం కాకుండా చూడాలి.

పరిశ్రమలు వదిలే వ్యర్థ పదార్థాల్ని శుద్ధిచేసి ప్రత్యేక కాలువల ద్వారా సముద్రంలోకి వదలాలి. చెట్లను నరకకుండా తగు చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. అడవుల్ని సంరక్షించాలి. అపుడే వర్షపాతం పెరిగి తద్వారా భూగర్భజలాలు పెరుగుతాయి. అంచేత సాగునీరు, త్రాగునీరు పుష్కలంగా భవిష్యత్తులో కొన్ని శతాబ్దాల వరకు లభిస్తుందనుటలో సందేహం లేదు.

ఇట్లు,
జల సంరక్షణ సమితి,
మెదక్.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 22.
నైతిక విలువలు – మనిషిని మహనీయునిగా మారుస్తాయి అంటూ ఒక కరపత్రాన్ని రూపొందించండి.
జవాబు:
ప్రియమైన మిత్రుడా !

ఎదుటివారిలో తప్పులు వెదకడం కన్నా వారి నుండి మంచిని స్వీకరించు. ఈ గుణం నీకు వారిలోని మంచిని తెలుసుకోవడానికి, నీలోని మంచితనం లోకానికి తెలియజేయడానికి తోడ్పడుతుంది. నీతిని పాటించే విలువలు నైతిక విలువలు. ఇవి సమాజాన్ని సన్మార్గంలో నడిపించడానికి తోడ్పడతాయి. ఈ విలువలు పాటించిన మహర్షులు, ప్రజా నాయకులు, దేశభక్తులు, దాతలు తరతరాలకు మార్గదర్శకులౌతారు. నైతిక విలువలతో సత్యం, ధర్మం, న్యాయం, మానవీయతలు ప్రకాశిస్తుంటాయి.

ఒక అగ్గిపుల్ల తాను మండిపోతూ ఇంకొకదానిని మండిస్తుంది. అట్లాగే నైతిక విలువలు లేని వ్యక్తి తాను నాశనమౌతూ, సమాజానికీ చెడునే చేస్తాడు. ఇది ఎలా అంటారా ? దుర్యోధనుడు ఎప్పుడూ పాండవులకు హాని చేద్దామా అని వారి లోపాలు వెతుకులాటలోనే జీవితాన్ని గడిపాడు. ఇక ధర్మరాజు అన్నివేళలా ధర్మం తప్పని ధర్మమూర్తిగా, తోటివారి పట్ల ప్రేమ మూర్తిగా కనిపిస్తాడు. ఎదుటివారి అవగుణాలు గణింపక, సుగుణాలను స్వీకరించి, తనను తాను తీర్చిదిద్దుకోవడానికే ప్రయత్నించాడు.

మన చరిత్రను పరిశీలిస్తే గురుకులాలలో దేవాలయాలలో నైతికవిలువలు ప్రబోధించే, పెంపొందించే కార్యక్రమాలు విరివిగా జరిగాయి. సాహిత్యం, కళలు ద్వారా సమాజంలో మార్పును తేవడానికి ఎందరో మహనీయులు తమ జీవితాలను ధారపోశారు.

ఇట్లు,
తెలంగాణ వైతాళిక సంఘం.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 23.
ఆడపిల్లల పట్ల, స్త్రీల పట్ల మనం ఎలా ప్రవర్తించాలో తెలిపే కరపత్రం తయారు చేయండి.
జవాబు:
ప్రియమైన సోదరులారా !

భారతీయ సంస్కృతి స్త్రీలకు గొప్ప స్థానాన్నిచ్చింది. ప్రతి స్త్రీలోనూ తల్లిని చూడమని చెబుతుంది మన సంస్కృతి. మన ప్రాచీన సాహిత్యం లోతులు చూస్తే ‘మాతృదేవోభవ’, ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ అని తల్లి వైభవాన్ని తెలుపుతాయి.

త్రిమూర్తులను తన పాతివ్రత్యంతో చంటిబిడ్డలుగా చేసి, వారికి జోలపాడిన మహనీయురాలు అనసూయ, యమధర్మరాజు పాశాన్ని ఎదిరించి, తన భర్త ప్రాణాన్ని రక్షించుకొన్న పవిత్రురాలు సావిత్రి; భగభగమండే అగ్నిగుండంలో కూడా పూలరాశిలో తిరిగినట్లు తిరిగి బయటకు వచ్చిన పతివ్రత సీత; భర్త కోసం సూర్యభగవానుని ఉదయించకుండా నిలిపిన పుణ్యస్త్రీ సుమతి. ఇలా ఎందరో భారతీయ స్త్రీలు తమ పాతివ్రత్యంతో ఈ నేలను పునీతం చేసారు. అటువంటి మాతృమూర్తుల పట్ల మనం ప్రవర్తించాల్సినది ఇట్లాగేనా ?

“యత్రనార్యస్తు పూజ్యంతే, రమయంతే తత్ర దేవతాః” అని మనుస్మృతిలో చెప్పబడింది. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని దీనర్థం. ఒక్కసారి మనం గతంలోకి వెళ్తే రామాయణంలో పరస్త్రీ వ్యామోహంతో రావణుడు తన వంశానికే చేటు తెచ్చుకొన్నాడు. భారతంలో దుర్యోధనుడు తల్లితో సమానమైన ద్రౌపదిని వివస్త్రను చేయడానికి పూనుకొని, చరిత్రహీనుడయ్యాడు. మనం పసితనంలో తడబడిన అడుగులు వేసాము. మనలో కొందరు పెరిగి పెద్దయి కూడా తప్పటడుగులు ఇంకా వేస్తూనే ఉన్నారు.

పుట్టిన బిడ్డకు తల్లి సాయం కావాలి. పెరిగిన తర్వాత అక్క, చెల్లి తనతో ఆడటానికి, ఆడిపించడానికి కావాలి. తర్వాత తన వంశం వృద్ధి చెందడానికి భార్య కావాలి. తన బిడ్డలకు తల్లి కావాలి. ఇలా ప్రతి మగవాడి జీవితంలో స్త్రీ లేకపోతే, ఆ మగవాడి జీవితం వెలుతురు లేని చీకటే అవుతుంది. “స్త్రీ సృష్టికి జీవగఱ్ఱ”. అటు స్త్రీల పట్ల, పసి బాలికల పట్ల అమానుషంగా ప్రవర్తించుట సరికాదు.

ఇట్లు,
తెలంగాణ స్త్రీ జాగృతి సంఘం.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 24.
“పల్లెటూర్లు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు” అన్న అంశంపై కరపత్రం తయారు చేయండి.
జవాబు:
ఓ అన్నలారా ! అక్కలారా !

ఒక దేశం సుభిక్షంగా ఉండాలంటే రెండు అంశాలను పరిగణనలోనికి తీసుకోవాలి. ఒకటి వ్యవసాయం, రెండు పరిశ్రమలు. వ్యవసాయంపై ఆధారపడినపుడు పల్లెటూళ్ళు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. అందుకే “పల్లెటూళ్ళే దేశానికి పట్టుకొమ్మలు” అన్నారు పెద్దలు.

ప్రకృతి అందచందాలకు భూతలస్వర్గం పల్లె. పచ్చని పొలాలతో, చక్కని పొదరిళ్ళ బారులతో, ప్రతి ఇంటిముందు పాడి పశువులతో పల్లెలు అలరారుతుంటాయి. మమతానురాగాలతో కూడిన పిలుపులతో, చక్కని అనుబంధాలతో సౌహార్థానికి ఐకమత్యానికి నిలయాలు పల్లెటూర్లు.

స్వచ్ఛమైన గాలి, నీరు, వెలుతురు దొరికే భూలోక స్వర్గం పల్లెటూరు. పల్లెప్రజలు ఎండనక, వాననక, పగలనక, రాత్రనక చెమటోడ్చి కష్టపడతారు. కష్టపడుతున్నామన్న బాధను మరచి చిరునవ్వులు చిందిస్తారు. పల్లె గీతాలతో నేల తల్లికి హారతులు పడతారు.

“జనాః పద్యంతే అత్ర జనపదః”, నియమేన వర్తంతే జనా అస్మిన్ ఇతి నీ పృత్” – అని అమరకోశంలో చెప్పబడింది. విద్య లేదేమో కాని వినయంలో ఎవరికీ తీసిపోరు జానపదులు. ఆర్థిక ఇబ్బందులు వస్తూ పోతుంటాయి. కానీ ముఖాలపై చిఱునవ్వు చెరగదు. కష్టం తెలిసినవారు, సుఖాలకై పరుగిడని వారు. సోమరితనం దరిచేరనివారు, ఇంకెవరు పల్లెటూరి వారే.

దేశానికి వెన్నెముక, అన్నదాత అయిన రైతు వ్యవసాయాన్ని ఒక తపస్సుగా భావిస్తాడు. పేదసాదలకు ఉన్నంతలో దానం చేసి తృప్తిగా జీవిస్తాడు. కులవృత్తులు, చేతివృత్తులు, చేనేత వృత్తులు వారును, ఒగ్గు కథలవారు, హరిదాసులు, తోలుబొమ్మలు ఆడించేవారు, పగటివేషగాళ్ళు, గంగిరెద్దులవాళ్ళు ఇలా ఎన్నో జానపదకళలకు ఆలవాలమై పల్లెటూళ్ళు శోభిస్తున్నాయి.

చక్కని పాడిపంటలతో అలరారే పల్లెటూళ్ళలోని ముంగిళ్ళు అందమైన ముగ్గులతో స్వాగతమంటూ ఆహ్వానిస్తాయి. కనువిందైన కట్టుబొట్టుతో పల్లెపడుచులు చిఱునవ్వులు చిందిస్తారు. ప్రశాంతతకు, ఆధ్యాత్మికతకు నిలయాలు ఇక్కడి దేవాలయాలు, స్వచ్ఛమైన కోనేరులు, చూడచక్కని పుష్పజాతులతో, పక్షి జాతులతో అలరారుతుంటాయి. ఇలాంటి పల్లెలను కాపాడాల్సిన బాధ్యత మనందరిది. చేయి చేయి కలుపుదాం పల్లెటూళ్ళను కాపాడదాం. “పల్లెటూళ్ళు బాగుంటేనే ప్రపంచమంతా బాగుంటుంది” అన్న కరుణశ్రీ మాటలు స్ఫూర్తిదాయకాలు.

ఇట్లు,
జనపద సంక్షేమ సంఘం.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 25.
నగరం, పల్లె దేని గొప్పదనం దానిదే అని తెలిపే కరపత్రం తయారు చేయండి.
జవాబు:
ఓ అమ్మలారా ! అయ్యలారా !

“నగరాల్లో వసతులెక్కువ, పల్లెలలో తక్కువ. నగరాల్లో ఖుషీ, జల్సాలు ఎక్కువ. పల్లెల్లో తక్కువ. అక్కడ ఉన్న ఆనందం ఇక్కడ ఉండదు” ఇలాంటి మాటలతో పల్లె, పట్టణం ఏది గొప్పదో తేల్చుకోలేకపోతున్నారా ? ఇదిగో ఇది చదవండి. మీకే అర్థమౌతుంది. మన ఆలోచనలే సరిగాలేక అటూ ఇటూ ఊగిసలాడుతున్నాయి. రెండూ గొప్పవే. వీటిలో కొన్ని సుఖాలు, కొన్ని ఇబ్బందులు అనేవి సహజం. ఇంక విషయంలోకి వెళితే –

“నగ సదృశాః ప్రసాదాదయో అత్ర సంతీ ఇతి నగరీ” అని అమరకోశంలో చెప్పబడింది. అంటే పర్వత సమానాలైన రాజగృహాలు మొదలగునవి దీని యందు కలవు అని అర్థం. ఎత్తైన భవన సముదాయాలు కలవని భావం. అంతేగాక “క్రీడార్థం నగాః పర్వతావా అత్ర సంతీ ఇతి నగరీ” అని కూడా అమరకోశం చెబుతోంది. విహారార్థమై వృక్షాలు, పర్వతాలు గాని దీనియందు కలవని అర్థం. ప్రస్తుతార్థంలో విహారకేంద్రాలు, ఎత్తైన ప్రదేశాలు కలవని గ్రహించాలి.

అన్ని విద్యలకు ఆటపట్లు నగరాలు. నవ్య సంప్రదాయాలకు, నూత్న ధోరణులకు, విలాసవంతమైన జీవనం, అనేక నాగరికతలతో కొత్త పాతల మేలు కలయికలతో భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిపాదిస్తాయి నగరాలు. ఇక్కడ ఒకరునొకరితో ధన శక్తిని, శ్రమ శక్తిని బదలాయింపు చేసుకొంటారు. ‘గుడ్డలు లేని వారికి గుడ్డలిచ్చి అవమానించడం ఎందుకు ? పని ఇవ్వండి. పని ద్వారా తన గుడ్డలకు కావాల్సిన డబ్బును తానే సంపాదించుకుంటాడు” అని గాంధీజీ అన్నట్లు నగరం అందరికీ ఎవరు చేయదగ్గ పనిని వారికి చూపిస్తుంది”.

ఇక పల్లె విషయానికొస్తే “జనాః పద్యంతే అత్రజనపదః”, “నియమేన వర్తంతే జనా అస్మిన్ ఇతి నీ పృత్” అని అమరుకం చెబుతోంది. నియమానుసారంగా ఎక్కడ జనులు నివసిస్తారో అవే జనపదాలని అర్థం. ప్రపంచీకరణ ప్రభావంతో నగరం శరవేగంగా తన రూపం మార్చుకుంటున్నది. తల్లి ఒడి ఒక జీవశక్తి. అలాంటి జీవశక్తి పల్లెసీమల్లో తొణికిసలాడుతుంది. పల్లెలు ప్రాచీన సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను ఇంకా పాటిస్తూనే ఉన్నాయి. విశ్రాంతి అనే తియ్యదనం, శ్రమ అనే చేదు నుండి లభిస్తుందనే సంగతి మరువనపుడు నగరమైనా, పల్లె అయినా ఒకటే.

ఇట్లు,
తెలంగాణ జనజాగృతి సంఘం.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 26.
మాతృభాష గొప్పదనాన్ని తెలిపే కరపత్రం తయారు చేయండి.
జవాబు:
తెలుగుభాష గొప్పదనం :

“దేశభాషలందు తెలుగులెస్స” అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. మన తెలుగుభాష, అజంత భాష. ఇది సంగీతానికి అనువైన భాష. అందుకే త్యాగరాజు వంటి తమిళులు సైతం తెలుగులోనే పాటలు రాశారు. “తెలుగు తేట, కన్నడ కస్తూరి, అరవమధ్వానం” అన్నారు. మన తెలుగు, తూర్పు ప్రాంతాన ఉన్న ఇటలీ భాష వంటిదని పాశ్చాత్యులు ప్రశంసించారు. (ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్)

ఎంతో తపస్సు చేసుకుంటే తప్ప ఆంధ్రత్వమూ, ఆంధ్రభాష లభింపవని అప్పయ్య దీక్షితుల వంటి తమిళపండితులు మెచ్చుకున్నారు. జన్మజన్మల తపస్సు యొక్క ఫలితము, తెలుగువారిగా జన్మించడం అని రాయప్రోలువారు అన్నారు.

మన తెలుగు కమ్మని భాష, తెలుగు పద్యము తెలుగువారి ఆస్తి. తెలుగులోని యతి ప్రాసలు పద్యానికి వాద్య సహకారం అందించి, గానకచేరి చేస్తాయి. తెలుగు కవులలో కవిత్రయం, శ్రీనాధ పోతనలు, అష్టదిగ్గజ కవులు గొప్పవారు. మన తెలుగు మందార మకరంద సదృశమైన భాష. తేనెవంటిది తెలుగుభాష. తెలుగుభాష అష్టావధానాలకు అనుకూలమైనది.

వెయ్యేళ్ళ చరిత్ర ఉన్న తెలుగుభాషను ప్రాచీన భాషగా గుర్తింపు పొందడమే ఆలస్యం. ఇంకా తెలుగుభాషకు గల ప్రత్యేకత – మనం ఏ అక్షరాలు పలుకుతామో అవే వ్రాస్తాం. ఏవి వ్రాస్తామో అవే పలుకుతాం. ఈ ప్రత్యేకత భారతదేశంలోని భాషలలో ఒక్క సంస్కృతం, తెలుగు భాషలకే ఉంది. కూతకు, రాతకు తెలుగులో తేడా లేదు. మిగిలిన భాషలలో కొంత తేడా ఉంది. తెలుగులో అనేక జాతీయాలు, సామెతలు, పదబంధాలు ఉన్నాయి.

ఇట్లు,
తెలుగుభాషాభివృద్ధి సంఘం.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 27.
‘తెలంగాణ తల్లి’ వైభవాన్ని వివరిస్తూ కరపత్రం తయారు చేయండి.
జవాబు:
తెలంగాణ తల్లి ముద్దుబిడ్డలారా !

“నా తెలంగాణ కోటి రత్నాల వీణ” అన్న దాశరథి కృష్ణమాచార్యుల పలుకులు అక్షరసత్యం. కాకతీయుల కదనరంగం తెలంగాణ. ఆ వీరుల వారసత్వాన్ని అందిపుచ్చుకున్న తరువాతి తరాలవారు నిజాం పాలనను తరిమికొట్టారు. కళలకు మూలస్తంభం తెలంగాణ. పోతన, దాశరథి, సి.నా.రె వంటి వారు గొప్ప కవిత్వాన్ని ఈ నేలలో పండించారు.

రామప్పగుడి, కాకతీయశిల్పం, చార్మినార్ వంటి అపురూప కట్టడాలతో ఈ నేల విరాజిల్లుతోంది. భద్రాద్రి, యాదాద్రి, మెదక్ చర్చి, ఎన్నో ప్రాచీన దర్గాలతో సర్వమత సమానత్వాన్ని చాటుతోంది. అన్ని సంస్కృతులకూ సంగమమైన భాగ్యనగరం భారతదేశంలోనే గొప్ప నగరాలలో తలమానికంగా ఉంది. గాయకులు, నాట్యకళావంతులకు ఈ గడ్డ పెట్టింది పేరు. రామదాసాది భక్తాగ్రగణ్యులు, వాగ్గేయకారులుగా వెలుగొందారు. గోలకొండ కోట మన ఘనచరిత్రకు తార్కాణం.

ఈ నేల స్వాతంత్ర్యానికై ఎందరో వీరులు చూపిన త్యాగనిరతి వారి బలిదానం చరిత్రను తట్టిలేపింది. యావత్ భారతాన్నీ కదిలించింది. ఎందరో కవులు ఈ నేలతల్లి ఋణం తీర్చుకోవడానికి అక్షరానికి ఆవేశాన్ని తొడిగి అభ్యుదయ మార్గంలో తమ కవిత్వాన్ని నడిపారు. ఆ కవుల కలాలు వరద గోదావరిలా, ఆవేశంతో, వీరరసోద్రేకంతో, తెలంగాణ మాతృ సంకీర్తనతో, రసవంతంగా సాగాయి. గోదావరి, కృష్ణమ్మ వంటి గంగా ప్రవాహాలు ఈ నేల తల్లి ఒడిలో ప్రవహిస్తూ, సస్యశ్యామలం చేస్తున్నాయి. ఈ తెలంగాణ ముద్దుబిడ్డలు ప్రేమమూర్తులు. సహనశీలురు.

విప్లవ వీరులకు, యోధులకు, కళలకు, ఘన సంస్కృతికి, అపురూప నిర్మాణాలకు, పుణ్యక్షేత్రాలకు, తీర్థాలకు నిలయమైన తెలంగాణ ఘనతను కాపాడాల్సిన బాధ్యత మనందరిది. మన చరిత్రను కీర్తించండి. ప్రగతి కాముకులై మన భాగ్య నగరాన్ని విశ్వనగరంగా, మన రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కండి. మీకు విజయోస్తు.

ఇట్లు,
తెలంగాణ అభ్యుదయ సంఘం.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 28.
‘సమాజ సేవ చేయడం మనందరి కర్తవ్యం’ అని కరపత్రం రాయండి.
జవాబు:
కొందరు ఏ పని చేసినా దీంట్లో నాకేం లాభం ? అని ఆలోచిస్తారు. ‘నాదంతా దాచుకోవాల’ను కొనేవారు కొందరైతే, “దొరికినంత దోచుకోవాలనుకొనేవారు” మరికొందరు. కాని నిస్వార్థంగా, నిజాయితీగా తన సంపదను, జ్ఞాన సంపదను సమాజాభివృద్ధికి సమర్పణ చేసే త్యాగధనులు కొందరే.

ఎవరెట్లాపోతే నాకేంటి నేను బాగుంటే చాలనుకొనేవాడు అధముడు. ముందు నేను బాగుండాలి, తర్వాత సమాజం బాగుండాలనుకొనేవాడు మధ్యముడు. నేనెట్లా ఉన్నా ఫర్వాలేదు, ముందు సమాజం బాగుండాలి అనుకొనేవాడు ఉత్తముడు. ఉత్తమ భావాలతో ప్రజలను, దేశాన్ని ముందుకు నడిపించేవాడే ఉత్తమోత్తముడు. “దైవం మానుషరూపేణా” అన్నారు. దైవం ఎక్కడోలేడు. అనాథలను, అభాగ్యులను, బాల, వృద్ధ, వ్యాధిగ్రస్తులను ఎవరైతే ఆపన్నహస్తంతో ఆదుకుంటారో అదిగో ! వారే దైవస్వరూపులు.

సమాజం అంటే ఒక్కరు కాదు, అందరు. అందుకే అరిస్టాటిల్ ‘మనిషి సంఘజీవి’ అన్నారు. నేను బాగుండాలి అనుకొనేదానికన్నా మనం బాగుండాలి అనుకోవడంలో మనిషిలోని మానవత్వం ప్రకాశిస్తుంది. ఈ మానవీయ విలువలను పాటించటం వలన జాతీయ సమైక్యత వర్ధిల్లుతుంది.

ఇట్లు,
తెలంగాణ జనజాగృతి సంఘం.

ప్రశ్న 29.
సంపాదకీయాల ప్రాధాన్యతను తెలిపే కరపత్రం రాయండి.
జవాబు:
ఒక్క సిరా చుక్క – లక్ష మెదళ్ళలో కదలిక

సమాజంలోని అన్ని విషయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించేవి పత్రికలు. ఆ వార్తలను పరిశీలించి ముద్రణకు అనుమతించే అధికారం కలిగినవారు సంపాదకుడు. “ఎడిటర్” అనే ఆంగ్ల పదానికి “సంపాదకుడు” అనే తెలుగు పదం అందించినది ఆనాటి “స్వరాజ్య” పత్రిక సంపాదకుడు శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమరావు. పత్రికలో సంపాదకుడు రాసే ప్రత్యేక వ్యాసాలను సంపాదకీయ వ్యాసాలు అంటారు.

సంపాదకీయ వ్యాసాలు సమాజానికి దిశానిర్దేశం చేస్తాయి. సమాజానికి వెలుగుదివ్వెలు వంటివి. సమాజంలోని లోపాలను ఎత్తి చూపుతాయి. దేశాన్ని అన్ని రంగాలలోనూ ఉన్నత స్థానంలో నిలుపటానికి సంపాదకీయాలు తోడ్పడతాయి.

సామాన్య వార్తలా కాకుండా ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చేవిగా ఉండే ఈ సంపాదకీయాలు, కొద్ది ప్రాంతానికో, కొంతమంది వ్యక్తులకో పరిమితం కాకుండా సామాజిక సమస్యలను ప్రతిబింబించే విధంగా ఉంటాయి.

దేశ రక్షణ, ఆర్థికరంగం పటిష్టత, అసమానతల నిర్మూలన, ప్రజా సంక్షేమం, ప్రజా జీవితం తీరుతెన్నులు, దేశ ప్రగతిని దెబ్బతీసే పోకడలు వంటివి ఎన్నెన్నో ప్రధానమైన అంశాలు సంపాదకీయాలుగా వెలువడుతుంటాయి. సమాజంలోని అస్తవ్యస్త పరిస్థితుల్ని ఎత్తి చూపే అక్షరాయుధాలు సంపాదకీయాలు, వీటి రచనలో సంపాదకుని బహుముఖీన ప్రజ్ఞ కనిపిస్తుంది. అందుకే సంపాదకుణ్ణి పత్రికారంగంలో ‘లీడర్’గా పిలిచే ఆనవాయితి ఉండేది.

ఎన్నెన్నో దురాచారాలను రూపుమాపటానికి యుగకర్త కందుకూరి వారి ‘వివేకవర్ధిని’ మున్నగు పత్రికల సంపాదకీయాలు అగ్రస్థానం అలంకరిస్తాయి. అలాగే చిలకమర్తివారి ‘దేశమాత, మనోరమ’ పత్రికలలోని సంపాదకీయాలు, ప్రజల భాషను కాపాడడానికి గిడుగువారి ‘తెలుగు’ పత్రిక సంపాదకీయాలు వ్యవహారిక భాషకు వెలుగులు పంచాయి.

భారత స్వాతంత్ర్యం కోసం జరిగిన జాతీయోద్యమాన్ని దేశం నలుమూలలకు మోసుకెళ్ళిన ఘనత పత్రికలదే. సంపాదకీయాల పరిధి విస్తృతమైనది. సాధారణ వార్తలను మాత్రమే చదివి, ఆలోచనాత్మకమైన సంపాదకీయాలను కొందరు నిర్లక్ష్యం చేయడం విచారకరం. ఇప్పటికైనా సంపాదకీయాల ప్రాధాన్యత గుర్తించి, దేశ ప్రగతికి తోడ్పడే వీటిలోని విశేషాలను గ్రహించగలరు.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 30.
“కోపం మనిషి విచక్షణను నశింపచేస్తుంది” అను విషయాన్ని కరపత్రంగా రాయండి.
జవాబు:
జ్ఞానవంతులారా !

మంచైనా, చెడైనా మనం పెంచి పోషిస్తేనే అది పెరుగుతుంది. మంచిని పెంచడం వల్ల మనిషి ఋషి అవుతాడు. చెడును పోషిస్తే సమాజం చేత తిరస్కారాన్ని పొందుతాడు. ఇది తెలిసినవాడే వివేకవంతుడు. ‘కోపం, క్రోధం, ఆవేశం, ఆగ్రహం’. ఇవన్నీ ఒకదానికొకటి పర్యాయపదాలని తెలిసినా, వాటివల్ల వచ్చే అనర్థాన్ని మాత్రం మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. కోపం అగ్నితో పోల్చబడింది. అందుకే ‘కోపాగ్ని’ అన్నారు.

బద్దెన చెప్పిన ‘తన కోపమే తన శత్రువు’ అన్న మాట మరిచారా ? కోపం మనిషిని పశువుగా మార్చి విచక్షణా జ్ఞానాన్ని నశింపజేస్తుంది. కోపాన్ని జయించిన వారికి లోకం దాసోహం అంటుంది. ఇది చరిత్ర ప్రసిద్ధం. నిప్పు కల్గిన కట్టె అగ్నిచే దహించబడినట్లు, కోపం కల్గినవాడు నాశనం పొందుతాడు. ఇంద్రియ నిగ్రహం లేనివాడు, అరిషడ్వర్గాలకు బానిసౌతాడు. తద్వారా మానసిక స్థైర్యాన్ని కోల్పోయి, ఇంటా బయటా హీనంగా చూడబడతాడు.

పురాణాలలో మహనీయులుగా చెప్పబడిన దుర్వాసుడు, పరశురాముడు, విశ్వామిత్రుడు వంటివారు సైతం కోపిష్ఠులుగా కనబడతారు. హద్దుమీరిన కోపం వ్యాసుణ్ణి కాశీపట్టణ హద్దులను దాటించింది కదా !

చిన్న చిన్న కారణాలు పెద్ద పెద్ద దేశాలను సైతం ఆవేశానికి గురిచేసి, యుద్ధ వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. ప్రజల జీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. గ్రామాల్లో సైతం కోపావేశాలకు గురై వీధి గొడవులతో చంపుకొనేవరకు దారితీస్తున్నాయి.

కోపం అదుపులో ఉంచుకోవడం చిన్ననాటి నుండి అలవర్చుకొని, విద్యాబుద్ధులు నేర్చి కన్నవారికి, ఉన్న ఊరికి కీర్తి ఇనుమడింపజేయాల్సిన బాధ్యత మనందరిది.

ఇట్లు,
తెలంగాణ జనజాగృతి సంఘం.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 31.
“రామాయణం మన జీవన పారాయణం” అంశంపై కరపత్రం రాయండి.
జవాబు:
సోదర సోదరీ మణులారా !

మానవ జీవితాన్ని సంస్కరింపగల మహాకావ్యం రామాయణం. మానవ హృదయాల నుండి ఎప్పటికి చెరగని కథ. రామాయణాన్ని చదవడమంటే జీవితాన్ని చదవడమే. రామాయణం పారాయణగ్రంథం కాదు, ఆచరణ ప్రధాన గ్రంథం. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనిషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్నందిస్తుంది.

ధర్మానికి రూపునిస్తే రాముడి రూపం వస్తుందన్నంత పవిత్రంగా జీవించాడు. చేతికి అందివచ్చిన సింహాసనం దక్కకపోయినా, స్వయంగా భరతుడే వచ్చి రాజ్యానికి రమ్మని అడిగినా, ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన సీతను రావణుడు అపహరించినా, సందర్భమేదైనా కానీ ధర్మాన్ని విడిచిపెట్టలేదు.

శక్తి ఉన్నా ఒద్దికగా ఉండటం రామతత్త్వం. అవకాశం ఉన్నా భర్త వెంట నడవడం సీతతత్త్వం. కష్టాల్లో తోడు నిల్వడం లక్ష్మణతత్త్వం. నమ్మినవారి కోసం తెగించడం ఆంజనేయతత్త్వం. ప్రతి అడుగులో మంచిని గ్రహించాలన్నదే రామాయణ పరమార్థం. సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందుతరాలవారికి స్ఫూర్తి కోసం రాయబడిన అద్భుత ఇతిహాసం రామాయణం.

మనిషికి కష్టాలు రావడం సహజం. ఆ సమయంలో కూడా సంయమనం పాటించడం ఎలా అన్నది రాముని పాత్ర చెబుతుంది. నేటి సమాజంలో యువతకు ఓర్పు, నేర్పు తగ్గిపోతున్నాయి. బాధలు ఎదురవ్వగానే భయానికి లోనవ్వడం, చుట్టుపక్కల వాళ్ళని భయభ్రాంతులకు గురిచెయ్యడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లేదా ప్రాణాలే తీసుకోవడం వంటి మూర్ఖపు ఆలోచనలు చేస్తున్నారు. రామాయణ, భారతాలు చదవడం ద్వారా మనసు స్థిరంగా ఉండడమే కాక మనం నలుగురికి ఉపయోగపడగలం. లేకపోతే మానసిక నిపుణుల చుట్టూ తిరుగుతూనే ఉండవలసివస్తుంది.

ఇట్లు,
భారతీయ ఇతిహాస పరిరక్షణ మండలి.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 32.
‘స్వచ్ఛభారత్ ‘ను ఉద్యమంగా దేశంలో అందరూ పాటించాలని ప్రబోధిస్తూ కరపత్రం తయారుచేయండి.
జవాబు:
స్వచ్ఛభారత్ ఉద్యమం

మిత్రులారా ! గత సంవత్సరం మన ప్రధాని మోడీగారు మనదేశాన్ని పరిశుభ్రంగా, కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలని మన ప్రజలందరికీ పిలుపు ఇచ్చిన విషయము మనకందరికీ విదితమే. ఈ రోజున ముఖ్యంగా నగరాలు, నగర పరిసరాల్లో ప్రవహించే నదులు, మురికివాడలుగా, మురికి కూపాలుగా, మారిపోతున్నాయి.

మనం మన ఇంటిని, పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకున్నట్లే, మన వీధినీ, మన వాడనూ, మన నగరాన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి. ఫ్యాక్టరీలు వదలే రసాయనిక జలాలతో, గంగానది వంటి పవిత్రజలాలు సహితం, కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. మనకు త్రాగునీటినీ, సాగునీటినీ అందించే నదీజలాలనూ, కాలువలనూ పరిశుభ్రంగా ఉంచుదాము. నగరాలలో, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలను పెంచి, తద్వారా పరిశుభ్రమైన గాలిని పీలుద్దాం. ఆరోగ్యవంతులుగా పెరుగుదాం! వైద్య ఖర్చులు తగ్గిద్దాం. అకాల మరణాలను తగ్గిద్దాం.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

మన పాఠశాలలన్నిటిలో, మన గ్రామాలన్నిటిలో మరుగుదొడ్లు నిర్మిద్దాం. మనం ఈ యజ్ఞంలో పాల్గొందాం. మన వారందరినీ దీనిలో పాల్గొనమని ప్రభోదిద్దాం. స్వచ్ఛభారతమే, మన ధ్యేయం. మన తల్లిని మనము శుభ్రంగా ఉంచి, మంచి పిల్లలం అనిపించుకుందాం. స్వచ్ఛభారత్ మన దేశాన్ని తీర్చిదిద్దడమే, మనందరి కర్తవ్యం. ఇదే మనం మన తల్లికిచ్చే కానుక. కదలి రండి. ఉద్యమించండి.

తేది : x x x x.

మోడీ యువజన సంఘం,
నల్గొండ.

TS 10th Class Telugu Grammar నినాదాలు

Telangana SCERT 10th Class Telugu Grammar Telangana నినాదాలు Questions and Answers.

TS 10th Class Telugu Grammar నినాదాలు

ప్రశ్న 1.
‘స్త్రీ విద్యా ప్రాముఖ్యతను తెలియజేస్తూ మీ సొంతంగా ఐదు నినాదాలు రాయండి. (June 2017)
జవాబు:

  1. ఇల్లాలి చదువు – ఇంటికి వెలుగు
  2. స్త్రీవిద్యను ప్రోత్సహించు – ప్రగతిబాట పయనించు
  3. మహిళలు చదవాలి – స్వావలంబన సాధించాలి
  4. మహిళా చైతన్యం – సాధికారితకు సాకారం
  5. ఇల్లంతా చదివినట్లే – ఇల్లంతా చదివితే

ప్రశ్న 2.
సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా 5 నినాదాలు తయారుచేయండి. (June 2016)
జవాబు:

  1. దురాచారాలను తొలగించు – సమానతను పంచు.
  2. అంటరానితనం వద్దు – సంకుచితంగా మసలవద్దు.
  3. వరకట్నాన్ని నిర్మూలిద్దాం – ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు నింపుదాం.
  4. కులంకన్న గుణంమిన్న.
  5. అసమానతలకు దూరంగా ఉండు – అందరికి ఆదర్శంగా జీవించు.
  6. కులమతాలను దూరం చేయి – సమసమాజాన్ని అందించు.

TS 10th Class Telugu Grammar నినాదాలు

ప్రశ్న 3.
ఆడినమాట తప్పకపోవడం, దానగుణం కలిగి ఉండడం మొదలైన విశిష్ట లక్షణాల ఆవశ్యకతను తెల్పుతూ నినాదాలు, సూక్తులు వ్రాయండి. (March 2015)
జవాబు:
నినాదాలు :
ఆడి తప్పకూడదు – పలికి బొంక కూడదు
ఆడితప్పకు – ఇచ్చిదెప్పకు
ఇచ్చిన మాట నిలబెట్టండి – నీతిగా జీవించండి
రక్తదానం – ప్రాణత్యాగానికి ప్రతీక
అవయవదానం చెయ్యండి – మరణమొందిన జీవిస్తారు

సూక్తులు:
మాటకు ప్రాణం సత్యం
అభాగ్యతులకు దానం – అందిపుచ్చుకున్న మోక్షధనం
కుడి చేత్తో ఇచ్చింది – ఎడమచేతికి తెలియనిది
సత్యం వంటి సుకృతం – అసత్యం వంటి పాతకం సృష్టిలో లేవు
మానవసేవయే – మాధవసేవ
దాతలేని ఊరు – దరిద్రానికి మరోపేరు
అభిమానధనులు – మాట తప్పని ఘనులు
దానం చెయ్యని చెయ్యి – అడవిలో పెరిగిన కొయ్య
దాతలేని కొంప – దయ్యాల పెనువాడ

ప్రశ్న 4.
నగర జీవనంపై కొన్ని నినాదాలు రాయండి.
జవాబు:

  1. “నగరంలో మనిషి జీవితం – చదవదగ్గ ఒక గ్రంథం”.
  2. “నగరజీవికి తీరిక దక్కదు – నగరజీవికి కోరిక తీరదు”.
  3. “నగరంలో మనిషివి మెర్క్యూరి నవ్వులు – నగరంలో మనిషివి పాదరసం నడకలు”.
  4. “నగరంలో వాహనాల రద్దీ – అవుతాడు మనిషి రోగాల బందీ”.
  5. “నగరంలో కొందరికి సుఖాల నెలవు – కొందరికి కష్టాల కొలువు”.
  6. “విద్యా – వైద్య కేంద్రం నగరం – విలాసాల సంద్రం నగరం”.
  7. “సాంకేతికతకు పెద్దన్న నగరం – వ్యాపారాలు దండిగున్నది నగరం”.
  8. “పల్లె తల్లివంటిది – నగరం ప్రియరాలివంటిది”.

TS 10th Class Telugu Grammar నినాదాలు

ప్రశ్న 5.
ఆడపిల్లను సమానంగా చూడాలన్న అంశంపై ఐదు నినాదాలు రాయండి.
జవాబు:

  1. ఆడపిల్లే కావాలి – సౌభాగ్యం వర్థిల్లాలి.
  2. ఆడపిల్ల – ఆ ఇంటి మహాలక్ష్మి.
  3. ఆడపిల్ల పుట్టింది – అదృష్టం పట్టింది.
  4. ఆడపిల్ల చదువు – దేశానికది మలుపు.
  5. అమ్మాయైనా, అబ్బాయైనా ఇద్దరూ సమానమే.

ప్రశ్న 6.
తెలుగుభాష గొప్పతనంపై స్వంతంగా 5 నినాదాలు తయారుచేయండి. (June 2019)
జవాబు:

  1. దేశ భాషలందు తెలుగు లెస్స
  2. తెలుగుతేట, కన్నడ కస్తూరి, అరవ అధ్వాన్నం
  3. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ – తెలుగు
  4. జన్మజన్మల తపస్సు ఫలం – తెలుగు వారిగా జన్మించడం.
  5. కమ్మనైన భాష – తెలుగు భాష

ప్రశ్న 7.
స్త్రీ విద్యా ప్రాముఖ్యతను తెలియజేస్తూ మీ సొంతంగా 5 నినాదాలు వ్రాయండి. (June 2017)
జవాబు:
ఇల్లాలి చదువు – ఇంటికి వెలుగు
మహిళల చదువు – ప్రగతికి మదుపు
విద్య నేర్చిన స్త్రీ – వివేకానికి చుక్కాని
నేడు చదువుకున్న స్త్రీలు – రేపటి దేశనాయికామణులు
ఇంట్లో చదువురాని స్త్రీ ఉంటే – కళ్ళున్నా చూడలేని గ్రుడ్డివాళ్ళు.
విద్యావతియైన తల్లి – ఆయింట వెలసిన కల్పవల్లి.

TS 10th Class Telugu Grammar నినాదాలు

ప్రశ్న 8.
సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా 5 నినాదాలు వ్రాయండి. (June 2016)
జవాబు:
వైధవ్య వివాహాలు – భావిభారతకు సౌభాగ్యాలు
మత పిశాచాలను చంపు – మమతానుబంధాల్ని పెంచు
అంటరానితనము – సమాజాన్ని కూల్చే అణుబాంబు
మూఢవిశ్వాసాన్ని త్యజించు – నూత్న సత్యాన్ని ఆహ్వానించు
శకునాలు చూడడం – పిఱికితనాన్ని గౌరవించడం.

ప్రశ్న 9.
ఆడినమాట తప్పకపోవడం, దానగుణం కలిగి ఉండడం మొదలైన విశిష్ట లక్షణాల ఆవశ్యకతను తెల్పుతూ నినాదాలు, సూక్తులు వ్రాయండి. (March 2015)
జవాబు:
నినాదాలు :
ఆడి తప్పకూడదు – పలికి బొంక కూడదు.
ఆడితప్పకు – ఇచ్చిదెప్పకు
ఇచ్చిన మాట నిలబెట్టండి – నీతిగా జీవించండి
రక్తదానం – ప్రాణత్యాగానికి ప్రతీక
అవయవదానం చెయ్యండి – మరణమొందిన జీవిస్తారు.

సూక్తులు :
మాటకు ప్రాణం సత్యం
అభ్యాగతులకు దానం – అందిపుచ్చుకున్న మోక్షధనం.
కుడి చేత్తో ఇచ్చింది – ఎడమచేతికి తెలియనిది
సత్యం వంటి సుకృతం – అసత్యం వంటి పాతకం సృష్టిలో లేవు
మానవసేవయే – మాధవసేవ
దాతలేని ఊరు – దరిద్రానికి మరోపేరు
అభిమానధనులు – మాట తప్పని ఘనులు
దానం చెయ్యని చెయ్యి – అడవిలో పెరిగిన కొయ్య
దాతలేని కొంప – దయ్యాల పెనువాడ

TS 10th Class Telugu Grammar నినాదాలు

ప్రశ్న 10.
స్త్రీల పట్ల మనం ఎలా ప్రవర్తించాలో, మన బాధ్యతలు ఏమిటో తెలిపేలా నినాదాలు – సూక్తులు రాయండి.
జవాబు:
ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా – ప్రతి మానవుడు తల్లికి బిడ్డే
ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో – అక్కడ దేవతలు పూజలందుకుంటారు.
సృష్టికి మూలం స్త్రీ – ప్రేమకు పెన్నిధి స్త్రీ
స్త్రీ లేని ಇಲ್ಲು – గుండెలేని శరీరం
ఇంటిని ఇల్లాలు – కంటిని రెప్పలు కాపాడుతాయి ఇంటికి దీపం ఇల్లాలు
స్త్రీలే జాతికి మణిదీపాలు – స్త్రీలే జగతికి ఆణిముత్యాలు
స్త్రీ సమాజానికి వెన్నుముక – పల్లె సీమలు దేశానికి వెన్నుముక
అమ్మలేని జీవితం – కన్నతల్లి, తల్లిని కన్న దేశం – స్వర్గాని కన్నా గొప్పది.

ప్రశ్న 11.
నీకు తెలిసిన పల్లెసీమల అందాల్ని గూర్చి సూక్తులు రాయండి.
జవాబు:
పల్లెసీమల అందం – పసిడి పంటల నిలయం
పచ్చని చెట్లు – ప్రగతికి మెట్లు
పాడిపంటలతో పల్లెలు – పసిడి నవ్వులతో పిల్లలు
సమాజానికి మూలనిధులు
పల్లెల సీమల జగతి – దేశాభివృద్ధుల ప్రగతి.
పల్లె సీమలే మన దేశపుధాన్యాగారాలు.
రణగొణ ధ్వనులు లేని పల్లెటూళ్ళు – ప్రశాంతమైన పరుకటిళ్ళు
దేశానికి పట్టుగొమ్మలు – మన పల్లెటూళ్ళు.

TS 10th Class Telugu Grammar నినాదాలు

ప్రశ్న 12.
తెలుగు తియ్యదనాన్ని తెలిపే నినాదాలు రాయండి.
జవాబు:
తేనెలొలుకు తెలుగు పలుకు.
యాభై ఆరు రెక్కలున్న పులుగు తెలుగు.
‘కొమ్ము’ లుండి పొగరు లేని నెమ్మదైన తెలుగు.
తేనె తేటల ఊట తెలుగుమాట.
కూతకు రాతకు భేదం లేని భాష తెలుగు.
చెఱకు గడలకు లేదు తెలుగుల తియ్యదనము.
దేశభాషలందు తెలుగు లెస్స.

ప్రశ్న 13.
తెలంగాణ వైభవాన్ని తెలిపే నినాదాలు రాయండి.
జవాబు:
తెలంగాణ వీరుల గడ్డ – త్యాగాలకు అడ్డ.
కాకతీయుల కదనరంగం తెలంగాణ
కళలకు మూలస్తంభం తెలంగాణ
సర్వమానవ సమానత్వం అది తెలంగాణ తత్త్వం.
దాశరథి పద్యాలు వరద గోదావరి పరవళ్ళు.
తెలంగాణ కోటి రత్నాల వీణ.
భిన్న సంస్కృతుల సంగమం తెలంగాణ.
కలం పట్టిన కవులెందరికో కన్నతల్లి తెలంగాణ.
గలగలమని నదులు నడయాడిన నేల తెలంగాణ.

TS 10th Class Telugu Grammar నినాదాలు

ప్రశ్న 14.
పల్లె గొప్పదనాన్ని తెలిపే సూక్తులు రాయండి.
జవాబు:
దేశానికి పల్లెలు పట్టుకొమ్మలు.
పల్లెలు తల్లి వంటిది. పట్నం ప్రియురాలి వంటిది
పల్లె రమ్మంటుంది. పట్నం తెమ్మంటుంది.
పల్లెను దైవం సృష్టిస్తే, పట్నం మానవుడు నిర్మించాడు.
పల్లె గేయం, పట్నం నాటకీయం.
పల్లెల్లో దైవత్వం నిండి ఉంటుంది.

ప్రశ్న 15.
ప్రకృతి వైభవాన్ని చాటే సూక్తులు తెలపండి.
జవాబు:
ప్రకృతి మన మాతృమూర్తి.
పుస్తకాల కన్నా ప్రకృతి ఎక్కువ విషయాలను నేర్పుతుంది.
ఏదీ కోరని వారే ప్రకృతిని జయించినవారు.
తనను ప్రేమించే హృదయాన్ని ప్రకృతి ఎన్నడూ మోసగించదు.
ప్రకృతి ఒడిలో పూల హృదయం వికసిస్తుంది.
ప్రకృతి సౌందర్యానికి పర్వతాలే సర్వస్వం.
ప్రకృతి హక్కులనివ్వదు, బాధ్యతలను గుర్తు చేస్తుంది.
ప్రకృతి పుస్తకానికి రచయిత దేవుడే.
ప్రకృతికి విధేయులమై ఉన్నప్పుడే దానిని మనం ఆజ్ఞాపించగలం.
ప్రకృతిలో బహుమతులు గాని, శిక్షలు గాని లేవు, ఫలితాలు మాత్రమే ఉంటాయి.
ప్రకృతిని అధ్యయనం చేయి, ప్రకృతి సత్యానికి స్నేహితురాలు.

TS 10th Class Telugu Grammar నినాదాలు

ప్రశ్న 16.
పట్టణం / నగరం గూర్చి సూక్తులు :
జవాబు:
పట్టణాలు మనుషుల ఎదుగుదలకు దోహదపడి,
సంభాషణా చతురులుగా మారుస్తాయి.
గొప్పవారైన స్త్రీ పురుషులకు నిలయం పట్టణం.
విద్యలకు ఆటపట్టు నగరం.
కొత్తపాతల కలయిక పట్టణం..
నవ్య సంప్రదాయాలు, నూత్న ధోరణలు, విలాసవంతమైన
జీవితాలు పట్టణాలు, భిన్నత్వంలో ఏకత్వం ప్రతి పాదిస్తుంది నగరం.
ధనశక్తిని శ్రమశక్తిని బదలాయింపు చేసుకొనే నిలయాలు నగరాలు.

ప్రశ్న 17.
పద్యం, కవి విశిష్టతలను తెలిపే సూక్తులు రాయండి :
జవాబు:
శతక పద్యాలు ద్రాక్షా గుత్తుల వంటివి, దేని రుచి దానిదే.
రాజుకు కిరీటం, పద్యానికి మకుటం, దేని అందం దానిదే.
పద్య కవి ప్రజల నాల్కులపై ఆడుతుంటాడు.
శృతి, లయ ప్రధానమైన పద్యం ఎప్పుడూ హృద్యమే.
కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడు కవి.
రవి గాంచని చోటు కవి గాంచును.
అల్పాక్షరాలతో అనల్పార్థానిచ్చేదే పద్యం.
తక్కువ పదాలతో ఎక్కువ విషయాలు చెప్పేది పద్యం.
ఛందస్సు కాదు ఛందోబద్ధమైన వాదన పద్యాన్ని తయారుచేస్తుంది.

పద్యం ఒక ఔషధం వంటిది.
గన్ను పేలితే నాశనం. పెన్ను కదిలితే ప్రేరణ, చైతన్యమే.
పద్యం కొన్ని సమయాల్లో తత్త్వశాస్త్రంలా ఉంటుంది.
చరిత్ర కన్నా గంభీరంగా ఉంటుంది.
పద్యం శబ్ద, అర్థ, ఛందస్సుల త్రివేణి సంగమం.

TS 10th Class Telugu Grammar నినాదాలు

ప్రశ్న 18.
పత్రిక విశిష్టతను తెలుపుతూ సూక్తులు రాయండి.
జవాబు:
సమాజంలోని సంఘటనలను మన ముందరుంచేవి. పత్రికలు.
North + East + West + South ల కలయికయే వార్త.
వార్తల కదంబమే పత్రిక
ప్రజల్లో కొత్త భావాలను, ఆలోచనలను, చైతన్యాన్ని రగిల్చేది పత్రికలు.
పత్రికా హృదయమే సంపాదకీయం.
అక్షరరూపం దాల్చిన ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళకు మెరుపుల కదలిక.

ప్రశ్న 19.
నిస్వార్థ త్యాగం మనిషిని చరిత్రలో శాశ్వతంగా నిలుపుతుంది కదా ! ‘త్యాగం’ ఆధారంగా చేసుకొని కొన్ని సూక్తులు రాయండి.
జవాబు:
తన కోసం చేసేది స్వార్థం. ఇతరుల కోసం చేసేది త్యాగం.
ఏ దేశంలో త్యాగమనే గుణం అపారంగా ఉంటుందో,
ఆ దేశం ఉన్నత లక్ష్యాలను అందుకోవడం ఖాయం.
త్యాగం ఎంత నిస్వార్థంగా ఉంటే అభివృద్ధి అంత ఎక్కువగా ఉంటుంది.
స్వర్గ ద్వారాన్ని తెరిచే బంగారు తాళపు చెవి త్యాగం.
చిన్న చిన్న త్యాగాల ద్వారానే మనిషికి మంచితనం అబ్బుతుంది.
గొప్ప కార్యాలెప్పుడూ గొప్ప త్యాగాల వల్లనే సాధించ బడతాయి.
త్యాగం వల్ల శాంతి కలుగుతుంది.
త్యాగానికి పట్టం కడితేనే ప్రేమకు స్వాగతం పలకడానికి వీలవుతుంది.
కర్మ ఫలితాన్ని ఈశ్వరార్పణం చేయడమే త్యాగం.
‘తప్పులు అందరూ చేయగలిగితే, త్యాగాలు కొందరే చేయగలుగుతారు.
త్యాగధనులకు ఆదర్శాలుంటాయి. ఇతరులకు కోరికలుంటాయి..

TS 10th Class Telugu Grammar నినాదాలు

ప్రశ్న 20.
కోపం అనర్థదాయకం అని చెప్పే సూక్తులు రాయండి.
జవాబు:
తన కోపమే తన శత్రువు.
కోపమున ఘనత కొంచమై పోవును.
బుద్ధిగల వాళ్ళకు కోపం కొనియాడదగింది కాదు.
కోపం ఆవహిస్తే వివేకం విడాకులిస్తుంది.
క్రోధం తమోగుణ లక్షణం, క్రోధ పరవశుడైన వ్యక్తి వివేకాన్ని కోల్పోతాడు.

కోపం శాపానికి ధూపం.
కోపిష్టి నోరు తెరచి, కళ్ళు మూసుకుంటాడు.
కోపంలో చేసిన పనులకు తీరికగా పశ్చాత్తాపపడతాం.
క్రోధాన్ని అణచడమే మానవత్వం.
కంఠస్వరం పెద్దదయ్యేకొద్దీ బుద్ధి చిన్నదవుతుంది.
కోపం ధర్మకార్యాలకు ఆటంకం అవుతుంది.
క్రోధాన్ని అణగద్రొక్కిననాడే ఆనందం ప్రాప్తిస్తుంది.

ప్రశ్న 21.
సమాజం గురించి నినాదాలు రాయండి.:
జవాబు:
మనిషి నిజమైన జీవితం సమాజంలోనే ఉంది.
సమాజమే సమస్త శక్తికి మూల సదస్సు.
సమాజాన్ని కించపరుస్తూ ఎప్పుడూ మాట్లాడవద్దు,
దానిలో ఇమడలేని వాళ్ళే అలా మాట్లాడతారు.
సమాజంలో ఇమడలేని వాడికి సమాజం ద్వారా సుఖం లభించదు.
సమాజంలోని జీవించలేనివాడు పశువైనా అయి
ఉండాలి లేదా దేవుడైనా అయి ఉండాలి..
చీమలు మంచి పౌరులు. క్రమశిక్షణ కల అవి సమాజ శ్రేయస్సుకే ప్రాధాన్యమిస్తాయి.
హిందూ సంస్కృతికి మూలం సమాజం. రాజకీయాలు కాదు.

TS 10th Class Telugu Grammar నినాదాలు

ప్రశ్న 22.
సమస్యలను చూసి భయపడేవారికి ధైర్యాన్ని కలిగించే సూక్తులను రాయండి.
జవాబు:
భయపడకు నేస్తం. ఉంటుంది ఆదుకొనే హస్తం.
సమస్యల వల్ల కష్టాలు రావు.
కష్టాలే ఉంటాయనుకొంటే సమస్యలు పెరుగుతాయి.
ప్రతి సమస్యనూ కాలం పరిష్కరిస్తుంది.
సమస్యలు ఏర్పడినపుడే బుర్ర చురుకుగా పనిచేస్తుంది.
సమస్యలు లేని జీవితం పందిరి లేని పాదు వంటిది.
సమస్యలు మనుషులకు కాక మానులకొస్తాయా ?
సాధన చేస్తే సాధ్యం కానిది లేదు.
ప్రయత్నిస్తే పరమాత్మైనా కనిపిస్తాడు.
ధైర్యమే విజయం.

TS 10th Class Telugu Grammar కథలు

Telangana SCERT 10th Class Telugu Grammar Telangana కథలు Questions and Answers.

TS 10th Class Telugu Grammar కథలు

ప్రశ్న 1.
జంతువులను పాత్రలుగా ఉపయోగించి ఒక కథ వ్రాయండి.
జవాబు:
ఒక వ్యాపారి ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద, గుర్రం ఉన్నాయి. గుర్రాన్ని రోజూ బండికి కట్టేవారు. గుర్రమంటే వాళ్ళందరికీ చాలా ఇష్టం. చాలా ప్రేమగా చూసేవారు. ఒకసారి గాడిద తన పరిస్థితి గురించి గుర్రం దగ్గర బాధపడింది. నీకు గౌరవం దక్కేలా చేస్తానని గుర్రం మాట ఇచ్చింది.

మరునాడు బరువుగా ఉన్న సరుకులతో బండి కట్టారు. గుర్రం చాలా నీరసంగా ఉన్నట్లు నటించింది. జాలిగా చూసింది. గాడిద వైపు చూసింది. సరే గాడిదను ఉపయోగిద్దామను కొన్నారు. అప్పటినుండి బరువు పనులకు గాడిదను ఉపయోగిస్తూ, దానిని ప్రేమగా చూడసాగారు. గుర్రానికి గాడిద కృతజ్ఞతలు చెప్పింది.

TS 10th Class Telugu Grammar కథలు

ప్రశ్న 2.
స్నేహం గొప్పదనాన్ని తెలిపే కథలను వ్రాయండి.
జవాబు:
1. మిత్రలాభం :
‘చిత్రగ్రీవుడు’ పావురాల రాజు. అతగాడు తన పావురాలతో ఆకాశంలో తిరుగుతున్నాడు. గోదావరీ తీరంలో ఒక మర్రిచెట్టు ఉంది. ఒక బోయవాడు వచ్చి ఆ చెట్టు దగ్గరలో నూకలు చల్లి దానిమీద వల వేశాడు. “పక్షులు నూకల కోసం వల మీద వాలతాయి. వాటిని పట్టుకొని అమ్ముకుందాం” అనుకున్నాడు.

చిత్రగ్రీవుడితో ఎగురుతున్న పావురాలు ఆ నూకలను చూశాయి. అవి నేలమీద వాలి, నూకలను తిందామనుకున్నాయి. “ఇది మనుష్యుల సంచారం లేని అడవి ఈ నూకలు ఇక్కడకు ఎందుకు వస్తాయి ? కాబట్టి ఈ నూకలకు ఆశపడకండి” అని చిత్రగ్రీవుడు స్నేహితులకు సలహా చెప్పాడు. ఒక ముసలిపావురం చిత్రగ్రీవుడి మాటలు కాదంది. నూకలు తిందామంది. సరే అని పావురాలు కిందికి దిగాయి. వలలో చిక్కుకున్నాయి.

పావురాలు అప్పుడు ముసలిపావురాన్ని తిట్టాయి. చిత్రగ్రీవుడు “తిట్టకండి. మనం అంతా కలిసి ఎగిరిపోదాం. నాకో స్నేహితుడు ఉన్నాడు మనల్ని రక్షిస్తాడు” అని చెప్పింది. పావురాలు అన్నీ కలసి వల ఎత్తుకొని, చిత్రగ్రీవుడి స్నేహితుడు హిరణ్యకుడు అనే ఎలుక ఉండే కన్నం దగ్గర వాలాయి. హిరణ్యకుణ్ణి చిత్రగ్రీవుడు గొంతెత్తి పిలిచాడు. హిరణ్యకుడు స్నేహితుని మాట విని పావురాల బంధాలన్నీ తన పళ్లతో కొరికివేశాడు. పావురాలు చిత్రగ్రీవుజ్జీ, హిరణ్యకుణ్ణి మెచ్చుకున్నాయి. అందుకే మనందరికీ మంచి స్నేహితులు ఉండాలి.

2. స్నేహితుని సాయం:
ఒక చెరువులో తాబేలు ఉండేది. ఆ చెరువుకు దగ్గరలో ఉండే ఒక నక్కతో అది స్నేహం చేసింది. ఒక రోజు వారవురూ మాట్లాడుకుంటుండగా అక్కడకు ఒక చిరుతపులి వచ్చింది. అది గమనించిన నక్క తాబేలు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తమ నివాసాల వైపు పరుగెత్తాయి. నక్క మాత్రం వేగంగా పరుగెత్తి వెళ్ళి తన బొర్రెలోకి దూరిపోయింది. తాబేలు మెల్లగా నడుస్తుంది. కాబట్టి తానుండే చెరువుకు చేరుకోలేక పోయింది. చిరుతపులి తాబేలు దగ్గరకు వచ్చింది. తాబేలు చిరుతపులి బారి నుండి తప్పించుకోలేక పోయింది.

చిరుతపులి తాబేలును నోట కరచుకొని, దానిని తినడానికి ఒక చెట్టు కిందకు తీసుకువెళ్ళింది. అది ఎంత ప్రయత్నించినా తాబేలు పైనున్న పెంకును కొరకలేకపోయింది. నక్క తన బొర్రె నుండి ఇదంతా గమనిస్తూనే ఉంది. తన స్నేహితుడిని కాపాడాలని ఆలోచించింది. వెంటనే బొర్రె నుంచి చూస్తూ నక్క అమాయకంగా చిరుతపులితో – “తాబేలును నీటిలోకి విసరండి. అది కొద్దిసేపు నీటిలో నానుతుంది. దానిమీద ఉన్న పెంకు మెత్తనవు తుంది” అని చెప్పింది.

చిరుతపులి – వెంటనే పరీక్షిస్తాను’ అని తాబేలును నీటిలోనికి విసిరివేసింది. వెంటనే తాబేలు చిరునవ్వుతో చెరువు నీటిలో ఈదుకుంటూ వెళ్ళిపోయంది.

TS 10th Class Telugu Grammar కథలు

ప్రశ్న 3.
“దురాశ దుఃఖానికి కారణం” ఎలానో వివరించండి.
జవాబు:
“ఆశకు అంతే లేదు” అన్నది ఆర్యోక్తి. “ఆశాపాశము తాకడున్ నిడుపు” అంటాడు వామనావతారం ఎత్తిన శ్రీహరి. “దురాశ దఃఖము చేటు” అన్న సామెత మనం నిత్యం వింటూనే ఉంటాం. ఈ సూక్తులన్నింటి లోనూ పేరాశ పనికిరాదనే హితోక్తి మనకు స్పష్టమౌతుంది. అయితే అసలు ఆశ అనేది వుండకూడదని మాత్రం దీని అర్థం కాదు.

హద్దులు దాటని ఆశ, పరిథులు దాటని కోరిక మనిషిని ప్రయత్నశీలుణ్ణి చేసి, తాను ఆశించిన ఫలితాలను అందుకోవడానికి ప్రోత్సాహమిస్తాయి. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా భవిష్యత్తుపైన ఉన్న చిన్ని ఆశ మానవుణ్ణి ధైర్యంగా ముందుకు నడిపిస్తుంది. అయితే ఈ ఆశ అత్యాశగా మారి హద్దుల్ని అతిక్రమిస్తే, అది మనిషిపాలిట శాపంగా మారి అతడిని నరకప్రాయం చేస్తుంది. కొన్ని సందర్భాలలో ప్రాణాలకు కూడా ముప్పు తీసుకువస్తుంది.

మనలో కూడా చాలామంది ఇంకా ఇంకా సంపాదించాలని అత్యాశతో కుటుంబ సౌఖ్యాన్ని, వ్యక్తిగత ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. దుర్మార్గాలకు, దౌర్జన్యాలకు పాల్పడి మానవ మనుగడను నరకంగా మారుస్తున్న వాళ్ళూ వున్నారు. నిజానికి వీరంతా ఆ సంపాదనను అనుభవిస్తున్నారా అంటే లేదు అనేది జగమెరిగిన సత్యం.

ఇందులో చాలామంది తమ దురాశల పరుగుపందెంలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నా రన్నది పచ్చినిజం. అందుకే అత్యాశకు పోకుండా వున్నదానితో తృప్తిగా జీవించటం మనం నేర్చుకోవాలి. ప్రాప్తమైనా లేశమైనా పదివేలు అనుకొని జీవితాన్ని ఆనందంగా గడపాలి. అప్పుడు ప్రతి ఇల్లూ ఆనందాల హరివిల్లుగా మారుతుంది. ఆత్మీయతల పొదరిల్లుగా నవ్వులు కురిపిస్తుంది.

ప్రశ్న 4.
నగరం విస్తరణ – సౌకర్యాలు – వలసలు – కాలుష్యం – ప్రజల జీవనం – సమస్యలు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని నగరం మాట్లాడుతున్నట్లు ‘నగరం’ ఆత్మకథ’ ను రాయండి. (March 2019)
జవాబు:
నేను నగరాన్ని. ఒకప్పుడు నేను అంటే అందరికీ గౌరవం. ఇప్పుడు రణగొణ ధ్వనులతో నిండిపోయాను. నాలుగు రోడ్ల కూడలిలో వినిపించే ధ్వనులు, ఢంకా నాదంలా, జలపాతం హోరులా వినిపిస్తాయి. ఇవి నగరంలో నివసిస్తున్న జీవుల బతుకు పోరాటంలో నుంచి వచ్చిన ఉరుములు.

నామీద అందరికీ మక్కువ ఎక్కువ. పల్లెల్ని వదలి నా దగ్గరకు వలస వస్తారు. తలదాచుకోడానికి చోటులేక, ఇనప్పెట్టె లాంటి ఇరుకు ఇళ్ళల్లో మురికివాడలలో నివాసం ఉంటారు. ఎంతోమందికి నేను ఆశ్రయం ఇస్తాను.

నా దగ్గర ఎంతోమంది విద్యావంతులు నివసిస్తారు. నా దగ్గర పిల్లలు బస్సుల్లో, రిక్షాల్లో కాన్వెంటుకు వెడుతూ పువ్వుల్లా పేవ్మెంట్లపై సందడి చేస్తూ ఉంటారు.

నా దగ్గర పెద్ద భవంతులు, ప్రక్కనే పేదల పూర్ళిళ్ళు కూడా ఉంటాయి. ఐశ్వర్యం, దరిద్ర్యాలు, సమాంతర రేఖల్లా కనిపిస్తాయి.

నా దగ్గర వెరైటీ సమస్యలు ఉంటాయి. నా దగ్గర జీవులకు ఎవరికీ తీరిక ఉండదు. వారి కోరికలు తీరవు. ప్రజలు అసహజంగా నవ్వుతారు. వారివి పాదరసపు నడకలు. అనుక్షణం ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఎవరికి ఎవరూ కారు. అందరూ ఏకాకులు. అర్థం కాని రసాయన శాల. చిక్కువీడని పద్మవ్యూహం. నేను ఎవరికీ అంతుపట్టను. ఇది నా ఆత్మకథ.

TS 10th Class Telugu Grammar కథలు

ప్రశ్న 5.
‘కష్టపడితే విజయాన్ని సాధించవచ్చు’ అనే నీతిని తెలియజెప్పే ఒక కథను రాయండి.
జవాబు:
రామాపురం గ్రామంలో రామయ్య అనే రెండు ఎకరాల రైతు ఉండేవాడు. రామయ్య భార్య పేరు సీతమ్మ, ఈమె పేరుకు దగ్గ ఉత్తమురాలు. వీరికి ‘రమేష్’ అనే పిల్లవాడు ఉండేవాడు. రమేష్ గ్రామంలోనే హైస్కూలులో 9వ తరగతి చదువుతున్నాడు. ఇంతలో రామయ్యకు గుండెజబ్బు వచ్చి, అకస్మాత్తుగా చనిపోయాడు.

పూలరథంలా సాగే వారి కుటుంబానికి కష్టాలు వచ్చాయి. అయితే సీతమ్మ కంగారు పడలేదు. ధైర్యం తెచ్చుకొంది. రమేష్ చదువుకు ఆటంకాలు లేకుండా తాను పొలంలో కష్టపడేది. కొత్త వ్యవసాయ పద్ధతులు తెలుసుకొని, స్వయంగా రమేష్ తోడుగా మంచి పంటలు పండించింది. తల్లి సాయంతో నాలుగు గేదెలను కొని, పాడి పరిశ్రమ మొదలు పెట్టాంది.

రమేష్, తల్లికి తోడుగా ఉంటూనే యమ్.ఏ పూర్తిచేశాడు. ఎంతో శ్రద్ధగా చదివి, చిన్న పిల్లలకు పాఠాలు చెప్పి, కొంచెం డబ్బూ, మరింత జ్ఞానం గడించాడు. పబ్లిక్ సర్వీసు కమీషన్ పరీక్షలు వ్రాసి, రెవెన్యూ డివిజనల్ ఆఫీసరుగా ఎన్నికయ్యాడు. వారి కష్టాలన్నీ తీరాయి.

సీతమ్మ, రమేష్కు పెండ్లి చేసింది. వారి జీవితం ఇప్పుడు పూలరథంలా సాగిపోతోంది. దీనిని బట్టి కష్టపడితే విజయాన్ని సాధింపవచ్చు అని తెలుస్తుంది.

TS 10th Class Telugu Grammar కథలు

ప్రశ్న 6.
‘శతక మధురిమ’ పద్యాలు ఆధారంగా ఏదైనా నీతికథ రాయండి.
జవాబు:
‘ప్రజలు రాజులను ఆశ్రయించడం వ్యర్థము’ అనే నీతిని తెల్పే కాళహస్తీశ్వర శతక పద్యాన్ని, ఒక కవిపండితుడు బాగా అర్థం చేసుకొని, తన జీవితాన్ని చక్కగా మలచుకున్నాడు. ఈ నీతి కథ చదవండి.

నీతి కథ

ఒక ఊరిలో రామయ్య అనే మంచి కవిపండితుడు ఉండేవాడు. ఆయన ఎన్నో పరీక్షలు పాసైనా, ఆయనకు ఉద్యోగం దొరకలేదు. రామయ్యగారు చక్కగా పద్యాలు రాస్తాడు. పెళ్ళిళ్ళలో ఆశీర్వచన పద్యాలు చదువుతాడు. మంత్రులపై స్వాగత పత్రాలు, సన్మాన పత్రాలు బాగా రాస్తాడు.

రామయ్య గార్కి ఎవరో చెప్పారు. గ్రామంలోని ఎమ్మెల్యే కోటిరెడ్డిగార్ని ఆశ్రయించమని రామయ్యగారు ఎమ్మెల్యే గార్ని ఆశ్రయించాడు. ఆనాటి నుండి రామయ్యగార్కి, ఎమ్మెల్యేగార్ని పొగడడమే పని. ఆయనపై పద్యాలు రాసి, స్తోత్రం చెయ్యడమే పని అయ్యింది. అందువల్ల రామయ్యగారి కడుపు మాత్రం నిండలేదు.

ఇంతలో ఎవరో రామయ్యగార్కి ఒక సలహా ఇచ్చారు. చదువుకున్న పండితుడివి హాయిగా గుళ్ళో భారత, భాగవత పురాణాలు చెప్పండని. రామయ్య ఎమ్మెల్యేగారితో విసిగిపోయి, గుడిలో దేవుడిని ఆశ్రయించాడు. రామయణ భారత, భాగవతాలు గుడిలో చక్కగా పురాణం ప్రారంభించాడు. దైవం దయవల్ల భక్తుల దక్షిణలతో, రామయ్యగార్కి జీవితం హాయిగా సాగిపోసాగింది. “చేరంబోవుదు రేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వరా !” అన్న ధూర్జటి శతక పద్యం, అప్పుడు రామయ్యగార్కి గుర్తు వచ్చింది.

నీతి : అధికారులను నమ్ముకోడం కన్నా, దేవుడిని నమ్ముకోడం మంచిది.

TS 10th Class Telugu Grammar కథలు

ప్రశ్న 7.
కోపం మంచిది కాదనే నీతిని తెలిపే కథను రాయండి.
జవాబు:
పేరూరులో నాగన్న, రంగన్న అనే అన్నదమ్ములు ఉండేవారు. వారి తండ్రి తన ఆస్తిని కుమారులకు సమంగా పంచాడు. అయినా రంగన్న చీటికీ మాటికీ తమ్ముడితో పేచీ పడేవాడు. పెద్దవాడైన నాగన్న తమ్ముడు రంగన్నను కత్తితో నరకి చంపడానికి సిద్ధం అయ్యాడు.

దానితో నాగన్నను పోలీసులు జైలుకు పంపారు. రంగన్న శాంత స్వభావుడు. తాను కష్టపడి పొలంలో పనిచేసి తన పిల్లలను బాగా చదివించాడు. వారికి మంచి ఉద్యోగాలు వచ్చాయి. నాగన్న జైలుకు వెళ్ళడం వల్ల నాగన్న పిల్లలు కూలీ పనులు చేసి జీవించేవారు.

నాగన్న జైలు నుండి తిరిగి వచ్చాడు. తమ్ముడు పిల్లలు బాగుపడ్డారని గ్రహించాడు. తన కోపమే తనకు శత్రువు అయ్యిందని గ్రహించాడు. ఆనాటి నుండి తమ్ముడితో ప్రేమగా మసలు కొనేవాడు.

నీతి : కోపము శత్రువు వంటిది. ఓర్పు, ధనము వంటిది అని గ్రహించాలి.

TS 10th Class Physical Science Important Questions Chapter 2 Chemical Equations

These TS 10th Class Physical Science Chapter Wise Important Questions Chapter 2 Chemical Equations will help the students to improve their time and approach.

TS 10th Class Physical Science Important Questions Chapter 2 Chemical Equations

1 Mark Questions

Question 1.
What are the reactants and products in a chemical reaction.
Answer:
The substances which undergo chemical changes In a reaction are called reactants and the new substances formed are called products.

Question 2.
What Is meant by balanced equation?
Answer:
A chemical equation Is said to be balanced when the number of atoms of each element is same on both reactant side and product side.

Question 3.
If you keep an iron piece in solid-state CuSO4 crystals, does it get any reaction? Guess the reason.
Answer:
Reaction will not takes place if an ¡ron piece is placed in solid state CuSO4 crystals because there will not exist separate Cu2+, SO4-2 ions in CuSO4 crystals. In aqueous solution, they exists. So iron cannot displace copper.

Question 4.
Baiancethefollowlng equations.
(1) Na + O2 → Na2O
(2) H2O2 → H2O + O2
(3) Mg(OH)2 + HCl → MgCl2 + H2O
(4) Fe + O2 → Fe2O3
Answer:
(1) 4Na + O2 → 2Na2O
(2) 2H2O2 → 2H2O + O2
(3) Mg(OH)2+ 2HCl → MgCl2 + 2H2O
(4) 4Fe + 3O2 → 2Fe2O3

TS 10th Class Physical Science Important Questions Chapter 2 Chemical Equations

Question 5.
Balance the following equations. (AS1)
(1) Al(OH)3 → Al2O3 + H2O
(2) NH3 + CuO → Cu + N2 + H2O
(3) Al2(SO4)3 + NaOH → Al(OH)3 + Na2SO4
(4) HNO3 + Ca(OH)2 → Ca(NO3)2 + H2O
(5) NaOH + H2SO4 → Na2SO4 + H2O
(6) BaCl2 + H2SO4 → BaSO4 + HCl
Answer:
(1) 2Al(OH)3 → Al2O3 + 3H2O
(2) 2NH3 + 3CuO → 3Cu + N2 + 3H2O
(3) Al2(SO4)3+ 6NaOH → 2Al(OH)3 + 3Na2SO4
(4) 2HNO3 + Ca(OH)2 → Ca(NO3)2 + 2H2O
(5) 2NaOH + H2SO4 → Na2SO4 + 2H2O
(6) BaCl2 + H2SO4 → BaSO4 + 2HCl

Question 6.
What is a chemical equation?
Answer:
Describing a chemical reaction using least possible words or symbols is called a chemical equation.
Ex : CaO + H2O → Ca(OH)2

Question 7.
MnO2 + 4HCl → MnCl2+ 2H2O + Cl2. In the given equation, name the compound which is oxidized and which is reduced?
Answer:
In the above equation Ha compound is oxidized and MnO2 is reduced.

Question 8.
What happens If the copper sulphate crystals taken into dry test tube are heated?
Answer:

  1. When copper sulphate crystals are heated, water present in crystals is evaporated and the salt turns white.
  2. Evaporated water appears as droplets on the walls of the test tube.
  3. Blue-coloured copper sulphate (CuSO45H2O) is turned into white colour beacuse 5H2O molecules are evaporated from crystals.

Question 9.
Write the equation for the chemical decomposition reaction of silver chloride In the presence of sunlight.
Answer:
TS 10th Class Physical Science Important Questions Chapter 2 Chemical Equations 1

2 Marks Questions

Question 1.
What do you observe during chemical change?
Answer:
During chemical change, we observe that

  1. The original substances have their characteristic properties. Hence these may be products with different physical states colours and different compositions.
  2. Chemical changes may be exothermic or endothermic.
  3. They may form an Insoluble substance known as precipitate.
  4. There may be gas liberation in a chemical danger.

Question 2.
How do you Write a chemical equation?
Answer:

  1. A chemical reaction, written tri the form of formula equation, shows the change of reactants to products by an arrow placed between them.
  2. The reactants are written on the left side of arrow and the final substances or products are written on the right side of the arrow.
  3. The arrowhead points towards the products and shows the direction of reaction.
  4. If there are more than one reactant or product involved in the reaction, they are separated with a plus (+) sign between them.

TS 10th Class Physical Science Important Questions Chapter 2 Chemical Equations 2

Question 3.
What are the effects of oxidation on everyday life?
Answer:
1. Combustion is the most common example for oxidation reactions.
2. Rising of dough with yeast depends on oxidation of sugars to carbon dioxide and water.
3. Metals are corroded due to oxidation.
4. Bleaching of coloured objects using moist chlorine.
Cl + H2O → HOCl + HCl
HOCl → HCl + (O)
Coloured object + (0) → Colourless object (Here O’ is known as Nascent oxygen)
5. Sometimes during rainy season the power supply to our homes from the electric pole will be interrupted due to formation of metal oxide layer on the electric wire. This metal oxide is an electrical insulator. On removing the metal oxide layer formed on the wire with sandpaper, supply of electricity can be restored.

TS 10th Class Physical Science Important Questions Chapter 2 Chemical Equations

Question 4.
What are the important characteristics of chemical reactions?
Answer:
The important characteristics of chemical reactions are

  1. Evolution of a gas
  2. Formation of a precipitate
  3. Formation of new substances,
  4. Change in colour
  5. Change in temperature
  6. Change in state

Question 5.
Write some chemical reactions occurring in our daily life.
Answer:

  1. Souring of milk
  2. Formation of curd from milk
  3. Cooking of food
  4. Digestion of food in our body
  5. Fermentation of grapes
  6. Rusting of iron
  7. Burning of fuels
  8. Burning of cooking gas
  9. Ripening of fruits.

Question 6.
What symbols do we use to indicate the physical state of reactants and products In an equation?
Answer:

  1. Solid state is indicated by the symbol (s)
  2. Liquid state is indicated by the symbol ( l )
  3. Gaseous state is indicated by the symbol (g)
  4. Aqueous solution is indicated by the symbol (aq)
  5. Precipitate Is Indicated by an arrow with head downwards (↓)

Question 7.
Comment on “C(s) + O2(g) → CO2(g) + Heat’ equation.
Answer:

  1. The burning of carbon In oxygen Is an exothermic reaction because heat is evolved in this reaction.
  2. An exothermic reaction is indicated by writing + Heat or + Heat energy or just+ Energy on product side of an equation.

Question 8.
Comment on ‘N2(g) + O2(g) + Heat → 2NO(g)” equation.
Answer:

  1. The reaction between nitrogen and oxygen to form Nitrogen Monoxide is endothermic reaction because heat is absorbed n this reaction.
  2. An endothermic reaction is usually indicated by writing + Heat or Just ‘+ Energy on the reactants side of an equation.

Question 9.
2Cu + O2 → 2CuO What information do you get from above equation?
Answer:
The above equation tells us that.

  1. Copper reacts with oxygen to form copper oxide.
  2. The formula of copper oxide.is, CuO and that of oxygen is
  3. 2 moles of copper atoms react with 1 mole of oxygen molecules (O2) to produce 2 moles of copper oxide (CuO).

Question 10.
Balance the following chemical equation and follow the steps involved in balancing a chemical equation.
Cu2S + O2 → Cu2O + SO2
Answer:
Step 1: Write the unbalanced equation using correct chemical formula for all substances
Cu2S + O2 → Cu2O + SO2
Step 2: Compare no. of atoms of each element on both sides.

AtomNo. of atoms in L.H.S.No. of atoms in R.H.S.
Cu22
S11
O23

Balancing Cu, S, O atoms both sides
2Cu2S + 3O2 → 2Cu2O + 2SO2
The equation is balanced.

Step 3: Write the co-efficient smallest ratio.
2Cu2S +3O2 → 2Cu2O + 2SO2

Step 4: Verify above equation for balancing of atom of each element on both sides.
2Cu2S + 3O2 → 2Cu2O + 2SO2

Question 11.
Observe the following balanced chemical equation and answer the given questions.
C3H8(8) + 5O2(g) → 3CO2(g) + 4H2O(g)
(i) How many molecules of Oxygen are involved In this chemical reaction?
(ii) How many moles of Propane are required to get 20 moles of Water?
Answer:
(i) In this chemical reactIon five molecules of oxygen are involved.
(ii) Five moles of propane are required to get 20 moles of water.

Question 12.
Write the products of given reactions, if any. Give reason.
FeCl2 + Zn →
ZnCl2 + Fe →
Answer:
FeCl2 + Zn → ZnCl2+Fe (Displacement reaction)
ZnCl2 + Fe → No reaction. (Low reactive metals cannot displace high reactive metals).

TS 10th Class Physical Science Important Questions Chapter 2 Chemical Equations

Question 13.
Balance the following chemical equations:
(i) Na+ H2O → NaOH+H2
(ii) K2CO3+HCl →KCl+H2O+CO2
Answer:
(i) 2Na + 2H2O → 2NaOH + H2
(ii) K2CO3 +2HCl → 2KCl + H2O+CO2

4 Marks Questions

Question 1.
What are the materials required for the experiment to show the chemical decomposition of water? Write the procedure of the experiment. Name the products which we get in this reaction.
Answer:
Material required for chemical decomposition of water:
A plastic mug, two carbon rods, two corks, two test tubes, connecting wires, 9V battery, water, and some drops of acid.

Procedure:

  1. Take a plastic mug, drill holes at the base.
  2. Fit two one-holed rubber stoppers in these holes.
  3. Insert two carbon electrodes in these rubber stoppers.
  4. Connect the electrodes to 9V battery.
  5. Fill the mug with water, so that the electrodes are immersed.
  6. Add few mops of any acid.
  7. Take two test tubes tilled with water and insert them over the two carbon electrodes.
  8. Switch or’ the circuit and leave the apparatus undisturbed for some time.
  9. We notice the liberation of bubbles at both the electrodes. These bubbles displace the water in the test tubes.
  10. After the test tubes are filled with gas, take them out and test the gases with the burning match Stick.

The products which we get in this reaction:
The gases are condensed oxygen and hydrogen.

Question 2.
Explain the steps involved in balancing a chemical equation with an example.
(or)
Why should we balance a chemical equation? Take any one chemical equation and explain the procedure of balancing it.
Answer:
A chemical equation in which the number of atoms of different elements on the reactants side are same as those on product side is called a balanced equation.
Steps involved In balancing a chemical reaction: Let us consider the combustion reaction of Propane.
Step 1: Write the unbalanced equation using correct chemical formulae for all substances.
C3H8 + O2 → CO2 + H2O (Skeleton equation)

Step 2: Compare number of atoms of each element on both sides.
TS 10th Class Physical Science Important Questions Chapter 2 Chemical Equations 3

Find the coefficients to balance the equation. In this case, there are 3 carbon atoms on the left side of the equation but only one on the right side. If we add a coefficient of 3 to CO2 on the right side the carbon atoms balance.
C3H8 + O2 → 3CO2 + H2O
Now, look at the number of hydrogen atoms. There are 8 hydrogen atoms on the left but only 2 on the right side. By adding a coefficient of 4 to the H2O on the right side, the hydrogen atoms get balanced.
C3H8+ O2 → 3CO2 + 4H2O
Finally, look at the number of oxygen atoms. There are 2 on the left side but 10 on the right side. By adding a coefficient of 5 to the 02 on the left side, the oxygen atoms get balanced.
C3H8 + 5O2 → 3CO2 + 4H2O

Step 3: Make sure the coefficients are reduced to their smallest whole number values. The above equation is already with the coefficients in smallest whole numbers. There is no need to reduce its coefficients. Hence the final equation is
C3H8 + 5O2 → 3CO2 + 4H2O

Step 4: Check the answer. Count the numbers and kinds of atoms on both sides of the equation to make sure they are the same.

Question 3.
How to make a chemical equation more informative?
Answer:
Chemical equations can be made more informative by expressing the following characteristics of the reactants and products.
(i) Physical state
(ii) Heat exchange (exothermic or endothermic change)
(iii) Gas evolved (if any)
(iv) Precipitate formed (If any)
(i) Expressing the physical state: The physical state of the substances maybe mentioned along with their chemical formulae. The different states i e., gaseous, liquid and solid states are represented by the notations(g), (I) and (s) respectively. If the substance is present as a solution in water, it Is represented as (aq).
Eg : Fe2O3(s) + 2Al(s) → 2Fe(s) +Al2O< sub>3(s)

(ii) Heat exchange: Heat is liberated in exothermic reactions and heat is absorbed in endothermic reactions.
Eg: 1. C(s) + O2(g) → CO2(g) + Q (exothermic reaction)
2. N2(g)+ O2(g) → 2NO(g) — Q (endothermic reaction)
(or) TS 10th Class Physical Science Important Questions Chapter 2 Chemical Equations 4

(iii) Gas evolved: If a gas is evolved in a reaction, it is denoted by an upward arrow ↑or (g)
Eg: Zn(s) + H2SO4(aq) → ZnSO4(aq) + H2(g)

(iv) Precipitate formed: If a precipitate is formed in the reaction, it Is denoted by a downward arrow.
Eg : AgNO3(aq) + NaCl(aq) → AgCl(s) ↓ + NaNO3(aq)

Question 4.
Balance the following chemical equations.
(a) Na2SO4 + BaCl2 → BaSO4 + NaCl
(b) Al4C3 + H2O → CH4 + Al(OH)3
(c) Pb(NO3)2 → PbO + NO2 + O2
(d) Fe2O3 + Al → Al2O3 + Fe
Answer:
(a) Na2SO4 + BaCl2 → BaSO4 + 2NaCl
(b) Al4C3 + 12H2O → CH4 + 4Al(OH)3
(c) 2Pb(NO3)2 → 2PbO + 4NO2 + O2
(d) Fe2O3 + 2Al → Al2O3 + 2Fe

TS 10th Class Physical Science Important Questions Chapter 2 Chemical Equations

Solved Problems

Question 1.
Al(s) + Fe2O3(s) → Al2O3(s) + Fe(s) (atomic masses of Al = 27U, Fe = 56U, and O = 16U)
TS 10th Class Physical Science Important Questions Chapter 2 Chemical Equations 5
Suppose that you are asked to calculate the amount of aluminum, required to get 1120 kg of iron by the above reaction.
Solution:
As per the balanced equation
Aluminium → Iron
54g → 112g
X? → (1120 x 1000)g
∴ xg = \(\frac{(1120 \times 1000) \mathrm{g} \times 54}{112 \mathrm{~g}} \) = 10000 x 54g = 540000 g (or) 540 kg.
To get 1120 kg of iron we have to use 540 kg of aluminum.

Question 2.
Calculate the volume, mass, and number of molecules of hydrogen liberated when 230 g of sodium reacts with excess of water at STP. (atomic masses of Na = 23U), O=16U, and H=1U)
The balanced equation for the above reaction is,
TS 10th Class Physical Science Important Questions Chapter 2 Chemical Equations 6
Solution:
As per the balanced equation
46g of Na gives 2g of hydro9en.
230g of Na gives …………………? g of hydrogen.
\(\frac{230 \mathrm{~g} \times 2 \mathrm{~g}}{46 \mathrm{~g}} \) = 10g of hydrogen.
I gram molar mass of any gas at STP ie, standard temperature 273K and standard pressure 1 bar occupies 22.4 liters known as gram molar volume.

2.0 g of hydrogen occupies 22.4 liters at STP.
10.0 g of hydrogen occupies…… ? litres at STP.
\(\frac{10.0 \mathrm{~g} \times 22.4 \text { litres }}{2.0 \mathrm{~g}}\) = 112 litres
2 g of hydrogen i.e, 1 mole of H2 contains 6.02 x 1023 (H2) molecules 10 g of hydrogen contain ……………………. ?
\(\frac{10.0 \mathrm{~g} \times 6.02 \times 10^{23} \text { molecules }}{2.0 \mathrm{~g}} \) = 30.10 x 1023 molecules = 3.01 × 1024 molecules

Question 3.
Calculate the volume and No. of molecules of CO2 liberated at STP if 50g of CaCO3 is treated with dilute hydrochloric acid which contains 7.3 g of dissolved HCI gas.
Solution:
The Chemical equation for the above the relation is
CaCO3(s) + 2HCl (aq) → CaCl2(aq) + H2O(l) + CO2(g)
As per the stoichiometric equation, 100 g of CaCO3 reacts with 73 kg of HCl to liberate 44 g of CO2.
In the above problem the amount of CaCO3, taken is 50 gm and HCl available is 7.3 g
100g of CaCo3, require 73g of HCl and 50 g of CaCo3 required 36.6 g of HCl but, only 7.3 g of HCI is available.
Hence the product CO2 formed depends only on the amount of HCl which Is in the the least amount but not on the amount of CaCO3 which is an excess. The reactant available in less amount Is called limiting reagent as it limits the amount of prouct formed.

Therefore, we can write
73 g of HCl → 44 g CO2
7.3g of HCl- ?
\(\frac{7.3 g \times 44 g}{73 g}\) = 4.4 g
44 g of CO2 occupies 22.4 L volume at STP
4.4 g of CO2 occupies – ?
\(\frac{4.4 g \times 22.4 L}{44 g} \) = 2,24L
44 g of CO2 contain 6.023 × 1023 mol of CO2 4.4 g Contains – ?
\(\frac{4.4 g \times 6.023 \times 10^{23}}{44 g}\) = 6.023 × 1022 mol

TS 10th Class Physical Science Important Questions Chapter 2 Chemical Equations

Question 4.
Write the equation for the reaction of Zinc with hydrochloric acid and balance the equation. Find out the number of molecules of hydrogen gas produced In this reaction, when 1 mole of HCl completely reacts at S.T.P. [Gram molar volume is 22.4 liters at S.T.P., Avogadro’s number is 6.023 x1023]
Answer:
Zn + HCl → ZnCl2+H2
Zn(s) + 2HCl(l) → ZnCl2(s)+H2(g)
From the above equation
2 moles of HCl produces 1 moIe of H2 gas
1 moIe of HCl produces \(\frac{1}{2}\) mole of H2 gas
1 mole of H2 gas at S.T.P Contains 6.023 x 1023 molecules
\(\frac{1}{2}\) mole of H2 gas contains = \(\frac{6.023 \times 10^{23}}{2}\)
= 3.0115 x 1023 molecules

TS 10th Class Telugu Grammar కవితలు

Telangana SCERT 10th Class Telugu Grammar Telangana కవితలు Questions and Answers.

TS 10th Class Telugu Grammar కవితలు

ప్రశ్న 1.
బలిచక్రవర్తికి వామనుడికి మధ్య జరిగిన సంభాషణ ఆధారంగా ఓ కవితను రాయండి. (June 2018)
జవాబు:
దాతల్లో గొప్పదాత బలి.
సత్యం తప్పనివాడు. కీర్తి కోరేవాడు.
ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం ప్రాణాలు కూడా ధారపోస్తాడు.

కవిత

దాతల్లో గొప్పవాడా ……
మాటను తప్పనివాడా …..
సాయం అనే చేతులకు దారిని చూపేవాడా
ప్రాణం పోతున్న మాటని వీడని వాడా ….
అసురుల చక్రవర్తిగా మెప్పును పొందిన వాడా …..
చివరికి విష్ణు పాదభారాన్ని మోసిన దానస్వరూపుడా….
ప్రాణాన్ని విడిచి చరిత్రలో నిలిచిన దానశీలుడా ….

TS 10th Class Telugu Grammar కవితలు

ప్రశ్న 2.
చదువుకునేవారైనా, పనిచేసేవారైనా, మరెవరైనా సరే తీవ్ర ఒత్తిడికి లోనైతే వారి వారి పనులను సరిగా చేయలేక తీవ్ర ఇబ్బందుల పాలౌతారు. ఈ విషయం చెప్పడానికి “సుఖం – దుఃఖం – విజయం – లోకం – మోదం – ఘోరం” లాంటి అంత్యానుప్రాస పదాలు వాడి ఒక కవిత చెప్పండి. (March 2018)
జవాబు:
చదువుకునేవారు :
విద్యార్జనమిస్తుంది సుఖం
సోమరితనమిస్తుంది దుఃఖం
విద్యావంతులు సాధిస్తారు విజయం
పొందుతారు జనులందరి ఆమోదం
విద్యాధికులతో భరతకు ప్రమోదం
విద్యావిహీనుల కెపుడు భేదం
ధనలేమితో ఒత్తిళ్ళ సుడిగుండాలు
దినభృతి లేక నిత్యమూ ప్రాణగండాలు
అంతం కాదిది – పునరావృతమయ్యే నిత్యాగ్ని గుండాలు
అందుకే ప్రతి జీవికి కావాలి సహనాభరణం.

పనిచేసేవారు:
కష్టార్జితం కల్గిస్తుందెపుడు సుఖం
పరభాగ్యోప జీవితం సదా దుఃఖం
శ్రమను నమ్ముకొన్నవాడికి విజయం
శ్రమను దోచు కొన్నవాడికి అపజయం
గతిలేని బడుగుల బ్రతుకులు ఘోరం
ఆకటికై తపించు శ్రామికుల లోకం
శ్రమశక్తిని ధరించు కార్మికుల ప్రపంచం
వ్యవసాయాన్ని వహించు కర్షకులలోకం
సంతృప్తే వారికి ప్రమోదం
సహజీవనమే వారి కామోదం

TS 10th Class Telugu Grammar కవితలు

ప్రశ్న 3.
‘మీకు తెలిసిన ప్రసిద్ధమైన నగర విశేషాలను’ వర్ణిస్తూ కవిత రాయండి. (June 2017)
జవాబు:
నగర జీవితం నగరవాసులకొక వరం !
సకల సదుపాయాల సమాహారం
వినోదాల విన్యాసాల కళాతోరణం
విశిష్ట వినూత్న భవన నిర్మాణ సమాహారం

విశాల రహదారుల కళాతోరణం
విద్యా వైజ్ఞాన కేంద్రాల నిలయస్థానం
సాహిత్య సమావేశాల మణిహారం
మాన్యనాయకగణా నివాస మందిరం

నివసించాలి ప్రజలందరిక్కడ
సిరిసంపదలతో తులతూగాలిక్కడ
పర్యావరణాన్ని రక్షించి కాపాడాలిక్కడ
అప్పుడే అవుతుంది సుఖమయం నగర జీవనం.

ప్రశ్న 4.
‘గోలకొండ పట్టణము’ లోని అందచందాలను ‘వచన కవిత’ రూపంలో రాయండి. (June 2016)
జవాబు:
గోలకొండ దక్షిణాపథమ్మున అలరె
జగతికి జాగృతిని కల్పించె
తెలంగాణమ్ములన మకుటాయమానమ్ముగ
నిలచె గగన తలంబుదాక !

శిల్పకళావైభవంబున కొదువలేదు
నిర్మాణ కౌశలమ్మునకు ఎదురు లేదు

ప్రకృతిరమణీయతకు తిరుగులేదు.
చూచినంతనే చూడాలనిపించు
వ్యాపార సామ్రాజ్యమునకు నెలవుగా నిలిచె
రామదాసు కీర్తనలకు ఆలవాలమాయె
పాలకుల ఏలుబడిలో జీవకారుణ్యం అలరె
సకల వసతులకు మూలకేంద్రమాయె.

TS 10th Class Telugu Grammar కవితలు

ప్రశ్న 5.
వెన్నెలను వర్ణిస్తూ చిన్నపదాలతో ఒక కవిత రాయండి.
జవాబు:
“వెన్నెలా ! కన్నెపిల్లల చిన్నారి ముద్దుల చెల్లెలా !
వెన్నెలా ! ప్రేమికుల మనసుల మల్లెచెండులా
వెన్నెలా ! చంద్రుని చిరునవ్వుల పన్నీరులా
వెన్నెలా ! పసిపాపల ముద్దుల బోసి నవ్వులా
వెన్నెలా ! కన్నతల్లులు కమనీయ రాగవెల్లిలా
వెన్నెలా ! మా చిన్నారి పొన్నారి చూపులా
వెన్నెలా ! కలువల చుట్టపు చూపులా
వెన్నెలా ఉన్నావు, చల్లావు చంద్రికలు
నయనారవిందాల నయగార మధురిమలు”

ప్రశ్న 6.
బలిచక్రవర్తికి, వామనుడికి మధ్య జరిగిన సంభాషణ ఆధారంగా ఓ కవితను రాయండి. (June 2018)
జవాబు:
ఏమి ఇది ఏమి ఇది మహాతేజం
అపురూపం – హరి రూపం,
అపురూపం – శ్రీహరి రూపం
వడివడిగా వచ్చెను ఒక వడుగు
పాపాలను పరిమార్చె పిడుగు
తడబాటు ఎరుగదు అతని అడుగు
ధన్యుల తలపై ముడవని గొడుగు.
అహో ఏమి రూపం, అఖిల లోకాలకు దీపం.   – సేకరణ

TS 10th Class Telugu Grammar కవితలు

ప్రశ్న 7.
చదువుకునేవారైనా, పనిచేసేవారైనా, మరెవరైనా సరే తీవ్ర ఒత్తిడికి లోనైతే వారి వారి పనులను సరిగా చేయ లేక తీవ్ర ఇబ్బందుల పాలౌతారు. ఈ విషయం చెప్పడానికి “సుఖం – దుఃఖం – విజయం – లోకం – మోదం – ఘోరం” లాంటి అంత్యానుప్రాస పదాలు వాడి ఒక కవిత చెప్పండి.   (March 2018)
జవాబు:
చదువుకునేవారు :
విద్యార్జనమిస్తుంది సుఖం
సోమరితనమిస్తుంది దుఃఖం
విద్యావంతులు సాధిస్తారు విజయం
అపుడందరూ తెల్పుతారు ఆమోదం
విద్యాధికులతో భరతకు ప్రమోదం
విద్యా విహీనుల కెపుడు భేదం
ధనలేమితో ఒత్తిళ్ళ సుడిగుండాల
దినభృతి లేక నిత్యమూ ప్రాణగండాలు
అంతం కాదిది-పునరావృతమయ్యే నిత్యాగ్నిగుండాలు.
అందుకే ప్రతి జీవికి కావాలి సహనాభరణం.

పనిచేసేవారు :
కష్టార్జితం కల్గిస్తుందెపుడు సుఖం
పరభాగ్యోప జీవితం సదా దుఃఖం
శ్రమను నమ్ముకొన్నవాడికి విజయం
శ్రమను దోచు కొన్నవాడికి అపజయం
గతిలేని బడుగుల బ్రతుకులు ఘోరం
ఆకటికై తపించు శ్రామికుల లోకం
శ్రమశక్తిని ధరించు కార్మికుల ప్రపంచం
వ్యవసాయాన్ని వహించు కర్షకులలోకం
సంతృప్తే వారికి ప్రమోదం
సహజీవనమే వారి కామోదం

TS 10th Class Telugu Grammar కవితలు

ప్రశ్న 8.
మీకు తెలిసిన ప్రసిద్ధమైన నగర విశేషాల్ని వర్ణిస్తూ ఒక కవితను వ్రాయండి. (June 2017)
జవాబు:
అందమైన నగరం – మన ‘భాగ్యనగరం’
అద్భుతమైన నగరం – అందాలకు నిలయం
భిన్న సంస్కృతులకాలయం – ఉన్నతమైన మేడలకావాసం
జంట నగరాలకనుసంధానం – విశాల ‘హుస్సేన్ సాగరం’
వింతవింతల మహాలయం – వినూత్న సాలార్జంగ్ మ్యూజియం
హైటెక్ సిటీల నిర్మాణం – హిందూ ముస్లిం సమైక్యతకు నిదర్శనం
చూడాలి నిలువెత్తు బుద్ధ విగ్రహం – చూసి తరించాలి బిర్లామందిరం
ఎన్నెన్నో విశ్వవిద్యాలయాలు – అన్నువైన ఉద్యానవనాలు
ఘనతకెక్కిన అసెంబ్లీ భవనం – వన్నె కెక్కిన రాజభవనాలు
ఇంకా ఎన్నెన్నో చారిత్రక విశేషాలు – త్యాగజీవులైన వారి అవశేషాలు
ఇది అందాల సుందరనగరం – భాగమతికై ఏర్పడిన భాగ్యనగరం

ప్రశ్న 9.
గోల్కొండ పట్టణంలోని అందచందాలను ‘వచన కవిత’ రూపంలో వ్రాయండి. (June 2016)
జవాబు:
గోల్కొండ నిర్మాణం – కోర్కెలకు నిలయం
గోల్కొండ వైభవం – నిజాం కీర్తికి నిదర్శనం
విశాల నగరవీధులు – వేర్వేరుగ మొహల్లాలు
సరదార్ల మేడలు – సరదాలకు నిలయాలు
నగీనాబాగ్ తోట – అందాలకు రాశులచట
రాజ హార్మ్యం సొగసుచూడ – షాహిమహలు తెరచి చూడు
దిల్ కుషా భవనం – సౌందర్య నిలయం
గోల్కొండ సొగసుపెంచే – ఉద్యానములచట మించె
`మిద్దెమీది తోటలు – శిల్పుల నేర్పుకు గీటురాళ్ళు
బాల్బోవా వృక్షం – నేత్రపర్వ దృశ్యం
అందాల గోల్కొండ – చేయును కనులవిందు.

TS 10th Class Telugu Grammar కవితలు

ప్రశ్న 10.
‘అమ్మ’ను గూర్చి వివరిస్తూ అంత్యప్రాసలతో ఒక కవిత వ్రాయండి.
జవాబు:
జన్మనిచ్చిన కన్నతల్లి – వరముల నొసగె పాలవెల్లి
కరుణలు వెదజల్లు కల్పవల్లి – కనికరించి కాచు బంగారు తల్లి
తొలి నడకలు నేర్పిన నవమల్లి – చేయూతగ నిల్చిన సిరిమల్లి.
కమ్మనైన పిలుపుకు అమ్మ – తీయనైన పలుకుకు అమ్మ
తనివితీర లాలించేది అమ్మ – పరవశించి పాలించేది అమ్మ
పేగుబంధం తెలిపేది అమ్మ – ప్రేమబంధంతో ముడిచేది అమ్మ
అమ్మ పలుకు అమృతం – అమ్మ దీవెన సుకృతం
మమకారానికి మారుపేరు అమ్మ
మమతాశలను పంచేది అమ్మ.
కంటికి రెప్పయై కాచేది అమ్మ
కడుపును కాంచుచు ప్రోచేది అమ్మ
ప్రగతికి మూలం అమ్మ
జగతికి దైవం అమ్మ

ప్రశ్న 11.
పల్లె సౌందర్యాన్ని వర్ణిస్తూ పది పంక్తుల వచన కవిత వ్రాయండి.
జవాబు:
పల్లెసీమల అందాలు
ప్రకృతి విడిన చందాలు
భరతమాతకివి మూలధనాలు
జానపదుల గీతాలు – జాగృతులొసగే ప్రభాతాలు
పల్లీయుల జీవితాలు పరిమళించే కంజాతాలు
భాసిలు ముగ్గుల వాకిల్ళు – పసిడిపంటల లోగిళ్ళు
పిల్ల కాలువల తియ్యని నీళ్ళు – తివాసీలు పరచిన పచ్చికబీళ్ళు
కోడెల గెంతుల సందళ్ళు – పామరుల యింట శోభిల్లు
కోకిలల కిలకిలారవాలు – గువ్వ పిట్టల కువకువలు
క్రేల కృతుల విన్యాసాలు – మనోహర సౌందర్య దృశ్యాలు
సొంపైన రొదరొదలతో – కమ్మటి సువాసనలతో
తియ్యటి తీపుల దినాలు – అవ్యాజ ప్రేమలిడే జనాలు

TS 10th Class Telugu Grammar కవితలు

ప్రశ్న 12.
జీవనభాష్యం గజల్స్ ని అంత్యప్రాసల ఆధారంగా సొంతంగా ఒక వచన కవితను వ్రాయండి.
జవాబు:
శాంతి సమీరం వీచితే
కోపాగ్నిభం నీరవుతుంది .
పదిమంది పెద్దలు నడిస్తే
లోకానికది దారవుతుంది
నేలను దున్ని విత్తితే
తప్పక ఆశల పైరవుతుంది.
కులమత గోడలు కూల్చితే
ఆ సమాజమే నీ ఊరవుతుంది
వాగులు వంకలు కలిస్తే
ఎడతెగని పారే ఏరవుతుంది.
సత్యం ధర్మం న్యాయం నీదయితే
జగతిలో చెరగని నీ పేరవుతుంది.
ఆపన్నుల ప్రేమను కాచితే
ఆనందం నీ సహవాసమవుతుంది.

ప్రశ్న 13.
‘భిక్ష, రక్ష, పరీక్ష, సమీక్ష, వివక్ష’ వంటి పదాలతో ఒక చక్కని భావాన్ని ప్రకటించి, ప్రశంసిస్తూ ఒక కవితను వ్రాయండి.
జవాబు:
మహాత్మా ! నీవు పురుషోత్తముడవు !
బానిసత్వంలో మగ్గిన భరతను సమీక్ష చేశావు
దక్షత కల్గిన నీ మనోధైర్యంతో ముందుకు నడిచావు
ఆంగ్లేయులు పెట్టిన పరీక్షలో నెగ్గావు
స్వాతంత్ర్య సమరంలో వివక్ష చూపక జగతిని ఒకే తాటిపై నడిపావు
సత్యాహింసల ధర్మాలే నీకురక్ష అయ్యాయి.
స్వాతంత్ర్య ఫలాల్ని మాకు భిక్షగా ఒసగినావు.
అందుకే నీవు జాతిపితవు. మా గాంధీ తాతవు.

TS 10th Class Telugu Grammar కవితలు

ప్రశ్న 14.
నగరజీవనంలోని అనుకూల అంశంపై కవిత రాయండి.
జవాబు:
నవ్య నాగరికతకు నిలయం – నగర జీవనం
భవ్య భవితకు ఆదర్శం – నగర జీవితం

ఉపాధి అవకాశాలకు నిలయం
ఉన్నత స్థితికెపుడు ఆలవాలం

దీనభత్యం ఎంతైనా లభించు నచట
కూలివానికెపుడు పర్వమే అచట

దినదినాభివృద్ధి చెందురచట
కోర్కె లీడేరు సర్వము నచట

దొరకని వస్తువు లేవీ ఉండవచట
తెలియని విద్యలేవీ ఉండవచట

సదుపాయాలు ఎన్నెన్నో కలవచట
సకల నిధులు సమకూరునచట

నిజం నిజం నగర జీవనం
సౌఖ్యాలకు మూలం నగర జీవితం

TS 10th Class Telugu Grammar కవితలు

ప్రశ్న 15.
‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది’ – ఈ అంశాన్ని గూర్చి ఒక కవిత వ్రాయండి.
జవాబు:
నవ తెలంగాణ సాధనకై నడుం బిగించి
శ్రీకారం చుట్టి;
నడిపించిరి ఉద్యమాల పోరు బాటలో
ఆవిష్కారం కావించి,
నరసింగములై దుర్మార్గుల్ని చీల్చి చెండాడి
ఘీంకారం చేసి,
ననలెత్తిన మతోన్మాదుల సైతం
అహంకారాల్ని త్రుంచి,
నవకోవిదులు శక్తియుక్తులతో నైజాం రాజుల
అహంకారాన్ని త్రుంచి,
నమ్మిన సిద్ధాంతాలలో నయవంచకుల్ని
మట్టుబెట్టి సాకారం చేసి,
ననలెత్తిన మతోన్మాదుల చీత్కారాల్ని
నశింపచేసి,
నలువంకలు విప్లవాత్మకమైన కదలికలతో
పరిష్కారం చూపించి,
కోటి రతనాల వీణల సుస్వర గీతాలకు
ఓంకారం పలికారు
పూత్కారం గొన్న నవ తెలంగాణకు
తెలంగాణ భాషానుడికారాలతో
స్వాగత చందనాలర్పించారు.
మమకారాలతో సత్కారం కావించి
నవ్యాకారం చేశారు.
నవ తెలంగాణకు శ్రీకారం నడిపించిన ఉద్యమాలకు సాకారం

TS 10th Class Telugu Grammar కవితలు

ప్రశ్న 16.
‘ఓ విద్యార్థి’ శీర్షికన జాగృతం చేస్తూ అంత్య ప్రాసలతో కవిత వ్రాయండి.
జవాబు:
ఓ విద్యార్థీ !
పొందాలి జ్ఞాన కిరణాలు
కావాలి సహనాభరణాలు
వెతకాలి నీవు కారణాలు
చేయకూడదు సదారణాలు
మహనీయుల సంస్మరణాలు
భావిపౌరులకవి తోరణాలు
కోరాలి వాగ్దేవి శరణాలు
స్మరించాలి సదా ఆ తల్లి చరణాలు

ప్రశ్న 17.
అడుగు, కడుగు, గొడుగు, బుడుగు పదాలను అంత్యప్రాసగా ఉపయోగించి వామనావతారంపై కవితను రాయండి.
జవాబు:
వామనుడైన బుడుగు
చేతబట్టెను గొడుగు
బలిని తొక్కిన అడుగు
రాక్షసత్వాన్ని కడుగు – కంచిభొట్ల ఫణిరామ్

TS 10th Class Telugu Grammar కవితలు

ప్రశ్న 18.
‘నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది’ అంటూ మాట్లాడాల్సిన విధానాన్ని వచన కవితలో రాయండి.
జవాబు:
ప్రశ్నేదైనా సరే, ప్రేమతో బదులిస్తే మనం గడిపే
ప్రతిరోజూ ఇంకొంచెం అందంగా ఉంటుంది.
నీ పరిస్థితిని ఎప్పుడూ, ఎవ్వరూ ఆలోచించరు,
నీ పలకరింపును మాత్రమే గుర్తు పెట్టుకుంటారు.
అది మనిషి సహజ స్వభావం
కాకి – కోకిల రెండూ అరుస్తాయి.
కానీ కాకిది గోలంటారు, కోకిలది పాటంటారు.
ఆలోచించు ఎందుకో !
బదులిచ్చే విధానంతోనే సగం ప్రపంచాన్ని గెలిచేయవచ్చు. – సేకరణ

ప్రశ్న 19.
చదువు చెప్పే గురువును చదువుకొనే రోజుల్లో ఒకలా, చదువు పూర్తయిన తర్వాత మరోలా భావిస్తాం. ఆ భావాలకు అక్షర రూపం ఇస్తూ ఒక వచనకవిత రాయండి.
జవాబు:
అక్షరాలు దిద్దిస్తున్నప్పుడు తెలియలేదు
నా జీవితాన్ని మలుపు తిప్పుతున్నారని
కోపగించుకున్నప్పుడు తెలియలేదు
నాపై బాధ్యతను పెంచుకుంటున్నారని
చేతిమీద కొట్టినప్పుడు తెలియలేదు
నా చేతులకి పదును పెడుతున్నారని
ప్రశ్నలడిగినపుడు తెలియలేదు
నా ఆత్మ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారని
మార్కులిస్తున్నప్పుడు తెలియలేదు
నాలో సామర్థ్యాన్ని నింపుతున్నారని
కానీ ……….

ఈ క్షణం తెలిసింది.
నాలో ఒక విశాల ప్రపంచాన్నే సృష్టించారని,
నన్ను ఒక మహాశక్తిగా మలిచారని …………
కాలం వెనక్కి వెళితే, మళ్ళీ
మీ చేతి దెబ్బలు తింటూ మీ అనురాగానికి
పాత్రులం కావాలనుందీ. – సేకరణ

TS 10th Class Telugu Grammar కవితలు

ప్రశ్న 20.
ఓటమిని చూసి భయపడాల్సిన అవసరం లేదని చెబుతూ ఒక వచన కవిత రాయండి.
జవాబు:
నడుస్తున్న కాళ్ళు మనకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పిస్తాయి.
ముందున్న కాలికి గర్వం లేదు.
వెనుకున్న కాలికి అవమానం లేదు.
ఎందుకంటే
ఆ రెండింటికి తెలుసు,
వాటి స్థానం మారటానికి ఒక్క క్షణం చాలు అని. – సేకరణ

ప్రశ్న 21.
కలాన్ని ఆయుధంగా చేసుకొని సమాజం బాగుకోసం కవిత్వాన్ని రాసిన కవులను స్మరిస్తూ ఒక వచన కవిత రాయండి.
జవాబు:
బుద్ధి బలాన్ని సిరాగా మార్చి కలం పట్టిన
కవులకు మనమేమివ్వగలం ?
విలువలకు ఛందస్సులు తొడిగిన ఘనులే !
సాహిత్యపు మాగాణంలో పండిన మణులే !
ఆలోచనలే అక్షర రూపం దాల్చగా
పథం చూపే కథనాలను అందించిన
కవులకు మనమేమివ్వగలం ?
జయంతికో, వర్థంతికో ఓ వందనం తప్ప. – కంచిభొట్ల ఫణిరామ్

TS 10th Class Telugu Grammar కవితలు

ప్రశ్న 22.
ప్రకృతిలో మమేకం అయినపుడు కలిగే భావాలను వచన కవితగా రాయండి.
జవాబు:
గురువులు శిష్యులకు కల్పతరువులు
పెద్దల మాటలు అనుభవాల పాఠాలు
ఆనందానుభూతుల చిరుజల్లులు
ఆ సంజ వెలుగులు బంగరు నెలవులు
ఆ పిల్లల నవ్వులు అరవిరిసిన పువ్వులు
అరుణ కిరణాలు ఆనంద తరంగాలు
తరువులు పచ్చదనానికి గురువులు
చెట్లు చేమలు నేలతల్లి సంతకాలు
ప్రకృతి చేవ్రాలు పక్షుల కిలకిలరావాలు
ప్రకృతి కాంత ఆశలు వసంత విలాసాలు – కంచిభొట్ల ఫణిరామ్

ప్రశ్న 23.
“పల్లెలు ప్రకృతికాంతకు పుట్టిళ్ళు” అంటూ పల్లెను గూర్చి కవిత రాయండి.
జవాబు:
విత్తనాలు ఊపిరి పోసుకుంటాయ్ పొలాల్లో
మొక్కలు పిలుస్తుంటాయ్ ప్రేమగా పల్లెల్లో
పద్మాలు కళ్ళు విప్పి చూస్తుంటాయ్ చెఱువు నీళ్ళల్లో
గంటలు మ్రోగుతుంటాయ్ వేదంలా గుళ్ళల్లో !

పల్లె హాయిగా ఉంటుంది ప్రశాంత నిలయంలా
పల్లె అన్నం పెడుతుంది అన్నపూర్ణ దరహాసంలా
పల్లె స్నేహంగా పిలుస్తుంది శాంతి నినాదంలా
పల్లెలో ఆత్మీయతలు పెనవేసుకుంటాయి పేగు బంధంలా !

మానవతా వాదం బ్రతుకుతోంది పల్లెల్లో
అందాలతో ప్రకృతి హాయిగా నవ్వుతోంది పల్లెల్లో
వాడిపోయే ప్రేమలు చిగురిస్తాయి పల్లెల్లో
పాడిపంటలు పదే పదే పలకరిస్తాయి పల్లెల్లో !

అయ్యలార ! అమ్మలార ! అన్నలార ! అక్కలార !
కలసిమెలసి మీరంతా కదలి రండి
మమతాను బంధాల్ని నిలుపుకొని
నేలతల్లికి భక్తితో ప్రణమిల్లుదామ్ ! – కంచిభొట్ల ఫణిరామ్

TS 10th Class Telugu Grammar కవితలు

ప్రశ్న 24.
బడికి తొలిసారిగా వెళ్ళే విద్యార్థి ఎలా ఫీలవుతాడో వచన కవితలో రాయండి.
జవాబు:
బడికి తొలిసారిగా బెరుకుగా, తడబడుతూ వెళ్ళా
అంతకు ముందు వరకు నేనేం చెప్పినా, చేసినా సంతోషించినవాళ్ళే.
కాని ‘అలా వద్దు, ఇలా వద్దు’ అని నియంత్రణ నా పై మొదలైంది నాడే.
ఒక్కసారిగా బడిలో భూలోక యముడిలా, దర్శనమిచ్చాడు గురువు
చేతిలో బెత్తం, పెద్ద గొంతు, ఆ అరుపులకే నోట మాట లేదు కళ్ళలో భయం తప్ప.
కొత్త కొత్త పరిచయాలు, ఏం మాట్లాడాలో ! ఎలా మాట్లాడాలో !
“మాటలు రావా ?” అన్న మాటలు చెవులను తాకుతున్నాయి ‘వచ్చు’ అని
చెప్పాలని వుంది. కానీ ఆ మాట ఎక్కడో నూతిలో ఉందేమో అని అనిపించింది.

తొందరగా బడి వదిలితే బావుణ్ణు అని అనిపించింది.
నాకోసం తొలిసారిగా భగవంతుణ్ణి తలచుకొన్నాను.
అమ్మ గారాబంగా చూస్తే మాటవినని నేను తొలిసారిగా
అమ్మను తొందరగా చూడాలనిపించింది. పలక మీద బలపం ఉంది కానీ మనసు అక్కడ లేదు.
మొత్తానికి ఇంటి గంట కొట్టారు.
పంజరం విడిచిన చిలుకలా, విల్లు వదిలిన బాణంలా
నేనూ ఒకటే పరుగు. ఎవరో పిలుస్తున్నారా. ‘జాగ్రత్తా, పడతావు’
అని. అమ్మో! ఆగితే, ఏమైనా ఉందా. ఏడుపు వస్తోంది.
ఇంటి ముందు అమ్మ నాకోసం నిలబడింది. ఆ రోజు అమ్మ నాకు వరమిచ్చే దేవతలా కనిపించింది.
అందుకే ఇంకా వేగంగా పరుగెత్తాను. – కంచిభొట్ల ఫణిరామ్

ప్రశ్న 25.
‘వీరతెలంగాణ’ పాఠంలోని కొన్ని పదాలను ఉపయోగించి తెలంగాణ స్వాతంత్ర్య ఉద్యమకారుని పోరాటాన్ని కవిత రూపంలో రాయండి.
జవాబు:
ఓ తెలంగాణ వీరుడా !

బానిస బతుకులకు కాలం చెల్లిందంటూ,
బతుకు భారంగా కాలం ఈదలేక,
మనమేం చేయగలం అని కలవరపడక,
మెరుపు తీగలా,
విల్లు విడిచిన బాణంలా,
ఉరికావా, ఉరికంబమెక్కావా ?

ప్రాణాన్ని పణంగా పెట్టిన శూరుడా !
ఓ తెలంగాణ వీరుడా !

గడ్డిపోచలన్నీ మదపుటేనుగును కట్టినట్లు
రక్తం చిందించి నిజాం నవాబును పట్టావా,
తరతరాల బూజును తరిమికొట్టిన ధీరుడా !
నీ త్యాగం వృథా కాలేదు.
భావి తరాలకు స్వేచ్ఛా వాయువులిచ్చి,
అనంత వాయువుల్లో కలసిన ఆప్తుడా !
నీ త్యాగం
మరువం, మరువం, మరువం ……. – కంచిభొట్ల ఫణిరామ్

TS 10th Class Telugu Grammar కవితలు

ప్రశ్న 26.
అంటరానితనం నిరసిస్తూ ఒక కవిత రాయండి.
జవాబు:
“అంటరాని వారెవరో కాదు మా వెంటరానివారే”
అన్న పెద్దల సుద్దులు పెడచెవిన పెట్టే బాబులారా !
ఖురాన్ గీతా బైబిల్ ఏది చెప్పినా
మనుషులంతా ఒక్కటే అన్న సత్యాన్ని మరిచారా !
నన్ను తాకకు అనేది ఓ మానసికమైన జబ్బు.
కులం పేరడిగి తక్కువ చేస్తే బాకుతో కుమ్మినట్టుంది. చెప్పడానికి తుంది.

పాషాణపు చుక్క పాలను విషం చేసినట్లు,
ఈ అస్పృశ్యత సమాజాన్ని కలుషితం చేస్తుంది.
మనిషి ప్రగతికి అడ్డుగోడ ఈ మూఢాచారం కాదా ?
బలహీన మనస్కుల మతం అంటరానితనం అన్న సంగతి మరువకు.

పైకి లేచి వచ్చిన వాడి పల్లకీ మోస్తారు,
కాలు జారిపడ్డ వాణ్ణి లేవదీయడెవ్వడూ అన్న మాటలు నిజం చెయ్యక
మానవత్వాన్ని మంటగొల్పక
సమ సమాజ స్థాపనకు సహకరించవా ?
నిద్రించే వాడిని లేపచ్చు. మేల్కొన్నవాడితో ఇబ్బందే లేదు.
నిద్ర నటించే వాడితోనే సమస్య. నీవు ఇటువంటి వాడివేనా ?
నిర్ణయించుకో ? గుండెను సముదాయించుకో ? – కంచిభొట్ల ఫణిరామ్

TS 10th Class Telugu Grammar కవితలు

ప్రశ్న 27.
తెలుగు వైభవాన్ని తెలుపుతూ ఒక కవిత రాయండి.
జవాబు:
తెలుగు తెలుగు తెలుగు అమ్మలాంటి తెలుగు
ఇది కమ్మనైన తెలుగు
యాబదారు రెక్కలున్న అద్భుతాల పులుగు
ఇది అద్వితీయ వెలుగు తెలుగు

సంస్కృతిలో భాగమైన – సంపద ఈ తెలుగు
నుదుటి బొట్టు తెలుగు – పంచకట్టు తెలుగు
వీధి మోము తొలి సిగ్గుల – ముగ్గులీ తెలుగు
పట్టు పరికిణీ బుగ్గన – మొగ్గలీ తెలుగు

పందిళ్ళకు అల్లుకున్న – పచ్చదనము తెలుగు
హరిదాసు, చిడతల – మేలుకొలుపు తెలుగు
గొబ్బెమ్మలపై నిలుపు – ముద్దబంతి తెలుగు
‘కొమ్ము’లుండి పొగరులేని – నెమ్మదైన తెలుగు
తెలుగు తెలుగు తెలుగు అమ్మలాంటి తెలుగు ఇది కమ్మనైన తెలుగు. – వలివేటి వేంకట శివరామకృష్ణమూర్తి గారు

ప్రశ్న 28.
కోపం వల్ల అనర్థాలు కవిత రూపంలో రాయండి.
జవాబు:
దరి చేరనీయరాదు కోపం.
మనసుకు హాయిని గొల్పేదే శాంతం.
ఉన్నదానితో తృప్తి చెందడం మోక్ష మార్గం.
తోటివారి పట్ల దయను చూపడం సన్మార్గం.
కట్టెను అగ్ని దహించినట్లు, కోపం కల్గిన వ్యక్తి దహించబడదా ?
ఎంతటి వారికైనా నిగ్రహమే ప్రథమ సూత్రం మరియు కర్తవ్యం. – కంచిభొట్ల ఫణిరామ్

TS 10th Class Telugu Grammar కవితలు

ప్రశ్న 29.
రైతుల కష్టాన్ని తెలుపుతూ అంత్యప్రాసగా ‘నీరు’తో కవి రాయండి.
జవాబు:
నేల తల్లి పులకరించేట్టు కురిసింది వాననీరు
తొలకరులు రైతులు పాలిట కావా పన్నీరు
మితిమీరిన వానలు మిగిల్చెను రైతులకు కన్నీరు
పండిన కొద్ది పంటకు ధరలేక విలపించె రైతు కన్నీరు మున్నీరు. – కంచిభొట్ల ఫణిరామ్

ప్రశ్న 30.
మనిషిలోని మనస్తత్వం సరిగాలేదు. ఈ విషయంపై కవి రాయండి.
జవాబు:
కరుగుతున్న కొవ్వొత్తి వెలుగునిస్తోంది,
పెరిగే వ్యక్తి చీకటినేగా ఇస్తా !
తింటుంటే కాకర లోనూ తీపే
కానీ మనిషిలో నిండా చేదే !
విధిని ఎదిరించు వెలుగును చూస్తావు.
వెక్కిరించావో విశ్వంలో కలుస్తావు ! – కంచిభొట్ల ఫణిరామ్

TS 10th Class Telugu Grammar కవితలు

ప్రశ్న 31.
నేటి తెలంగాణను వర్ణిస్తూ ఒక కవిత రాయండి.
జవాబు:
బంగారు తెలంగాణ

కష్టాల కడలిని దాటిన వీరహనుమ మా తెలంగాణ
ఉప్పొంగిన ఆవేశంతో ఏర్పడిన బంగరు కొండ మా తెలంగాణ
పెరుగుతున్న పసిపాప మా పసిమి తెలంగాణ
పచ్చ పచ్చని పైరు సీమల కనక సీమ మా తెలంగాణ
కల్లలెరుగని తేట తెలుగు చిరునామా మా తెలంగాణ
దానం, ధర్మం, నీతి, న్యాయం కలబోత మా తెలంగాణ
విశ్వ విఖ్యాతమైన విజ్ఞాన మేరువు మా తెలంగాణ
మా తెలంగాణ కోటి రత్నాల వీణ

TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం

Telangana SCERT 10th Class Telugu Guide Telangana 6th Lesson భాగ్యోదయం Textbook Questions and Answers.

TS 10th Class Telugu 6th Lesson Questions and Answers Telangana భాగ్యోదయం

చదవండి – ఆలోచించి చెప్పండి (T.B. P.No. 56)

నవభారత రాజ్యాంగ నిర్మాత, చరిత్రకారుడు, జాతీయతావాది, తత్త్వశాస్త్రవేత్త, దళిత నాయకుడు డా॥ బి.ఆర్. అంబేద్కర్. దేశంలోని అస్పృశ్యతను నివారించడానికి, దళితుల అభ్యున్నతికి ఎంత గానో కృషి చేశాడు. నిమ్న వర్గాలలో ‘అందరిలాగ మనమూ అన్నీ చేయగలం’ అన్న ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం అతని లక్ష్యం. దేశప్రజలు అందరికీ సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని రూపొందించాడు. దేశ విదేశాలలో విద్యను అభ్యసించి ప్రపంచంలోనే మహామేధావిగా గుర్తింపు పొందాడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
పై పేరా ఎవరిని గురించి తెలుపుతున్నది?
జవాబు:
డా॥ బి.ఆర్. అంబేద్కర్ గురించి తెలుపుతున్నది.

ప్రశ్న 2.
ఆయన ఎవరి గురించి కృషి చేశాడు ? ఎందుకు ?
జవాబు:
నిమ్న వర్గాల గురించి కృషి చేశాడు. వారిలో ఆత్మ విశ్వాసాన్ని నెలకొల్పటానికి కృషిచేశాడు. వారు వెనుకబడి ఉన్నారు కాబట్టి.

TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం

ప్రశ్న 3.
మన రాష్ట్రంలో దళితులు, నిమ్నజాతుల వారి కోసం కృషి చేసిన వ్యక్తులు ఎవరు ? వాళ్ళ గురించి చెప్పండి.
జవాబు:
కృష్ణస్వామి ముదిరాజ్ : తన మిత్రుడు భాగ్యరెడ్డి వర్మతో కలిసి దళితుల అభ్యున్నతి కోసం కృషిచేశాడు. 1948లో ఉర్దూలో ‘హైదరాబాద్ – కి తీస్ సాలా సియాసి జదు జిహిద్’ పేరుతో హైదరాబాద్ లోని రాజకీయోద్యమాలపై గ్రంథాన్ని రాశాడు.

భాగ్యరెడ్డి వర్మ : దళితులు తమ పరిస్థితిని గుర్తించి హక్కుల కోసం పోరాడటానికి కృషి చేశారు. అలాగే దళితులను ‘అది ఆంధ్రులు’ గా పిలుచుకోవాలని, దళిత బాలికలను దేవదాసీలుగా, జోగినులుగా చేయడాన్ని వ్యతిరేకించెను.

జ్యోతిబాపూలే : 1848 వ సం||లో ‘అంటరాని’ కులాల బాలికల కోసం జ్యోతిబా ఒక పాఠశాల స్థాపించి సావిత్రిబాయికి శిక్షణనిచ్చి మొదటి మహిళా ఉపాధ్యాయినిగా చేశాడు.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No.59)

తన జాతి జనుల ………………..
అనుచరులలో కలిగేటట్టు చేయగలిగాడు.

ప్రశ్న 1.
కుల వ్యవస్థ వలన, సమాజంలో ఏం జరుగుతున్నది ?
జవాబు:
కుల వ్యవస్థ వలన ఒక వర్గం వారు అంటరాని వారిగా చూడబడ్డారు. ఒక వర్గం తక్కువ, మరో వర్గం ఎక్కువ అనే భావం ప్రజల్లో ఉండేది. సామాజిక, ఆర్థిక అసమానతలు చోటుచేసుకున్నాయి. కొన్ని కులాల వారు అణగారిన వర్గాలుగా దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నారు. కులవ్యవస్థ వలన సమాజానికి ఏమీ ఉపయోగం లేదు. ఒకరిపై ఒకరికి స్నేహభావం తగ్గుతోంది.

ప్రశ్న 2.
చిత్తశుద్ధి, నిజాయితీ అంటే మీకు ఏమి అర్థమయింది ?
జవాబు:
చిత్తము అంటే మనస్సు. కొంతమంది మనసులో ఇష్టం లేకపోయినా పది మంది మెప్పుకోసం మంచి పనులు చేస్తారు. పేదలకు సహాయం చేస్తారు. పూర్తిగా వారు బాగుపడాలంటే మనసులో ఆ భావాలు బలంగా ఉండాలి. మనసులో బలమైన సంకల్పం కలగాలి. ఆ విధంగా మనసులో బలమైన సంకల్పం కలగడమే చిత్తశుద్ధి అంటారు. అంటే మనసులోని వ్యతిరేక భావాలను తొలగించుకోవడమే చిత్తశుద్ధి అంటారు.

నిజాయితీ : నిజమును అనుసరించి ప్రవర్తించడం అంటే సత్యవర్తన కలిగి ఉండడం. చేసే పనిలో తన స్వార్థం చూసుకోకుండా ఉండడం, చేసే పనిని కచ్చితంగా చేయడం. ఎదురుగా ఒక విధంగా వెనుక ఒక విధంగా ప్రవర్తించకుండా ఉండడం. నిజాయితీగా చేసే ఏ పని అయినా సాధ్యమే.

ప్రశ్న 3.
అజ్ఞానం, ఉదాసీనత వలన నష్టాలేమిటి? చర్చించండి.
జవాబు:
జ్ఞానం అంటే తెలివి. ఒక విషయం గురించి పూర్తిగా తెలుసుకోవడం, ఏదైనా సమస్యను సులువుగా పరిష్కరించగల శక్తిని కూడా జ్ఞానం అంటారు. అజ్ఞానం అంటే సరిపడ తెలివిలేకపోవడం. ఒక సమస్య యొక్క మూల స్వభావాన్ని తెలుసుకోలేక పోవడం కూడా అజ్ఞానమే. అసలు దానిని సమస్యగా గుర్తించలేకపోవడం కూడా అజ్ఞానమే.

ఉదాసీనత అంటే దేనినీ పట్టించుకోకపోవడం. తమకు ఉపకారం జరుగుతున్నా, అపకారం జరుగు తున్నా పట్టించుకోకపోవడం, మంచికానీ, చెడుకానీ పట్టించుకోకపోవడం కూడా ఉదాసీనతే. తెలిసినా తెలియనట్లు ఉండడం కూడా ఉదాసీనతే.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No.59)

మనుషులంతా ……………… రాణిస్తారని నిరూపించాడు.

ప్రశ్న 1.
మూఢనమ్మకాలు అంటే మీకేం అర్థమయ్యింది ?
జవాబు:
శాస్త్రీయత లేకుండా గుడ్డిగా ఆచరించేవి అని అర్థం. అయితే పెరిగిన వాతావరణం, సంప్రదాయాలు, అజ్ఞానం వల్ల మూఢనమ్మకాలు మనిషిని పతనం (పడిపోయేటట్లు) చేస్తున్నాయి.
ఉదా : పిల్లి వస్తే వెనుకకు రావటం, విధవ (భర్త చనిపోయిన స్త్రీ) వస్తే వెనుకకు రావటం, తుమ్మితే ఆగిపోవటం మొదలగునవి.

ప్రశ్న 2.
వర్మ తన జాతి జనుల్లో ఏ విధమైన మార్పును తీసుకురాగలిగాడు ?
జవాబు:
మనుష్యులంతా పుట్టుకతో సమానమని, ఎవరూ ఎక్కువ ఎవరూ తక్కువ కాదన్న సత్యాన్ని తెలుసు కునేటట్లు చేశాడు. నమ్మకాల అజ్ఞానాన్ని తొలగించాడు. అంటరాని వర్గాలు చదువుకునేటట్లు ప్రోత్సహించాడు. తన జాతి జనుల్లో చైతన్యాన్ని తీసుకువచ్చాడు. దేవదాసి, ముర్లీ, వేశ్యా సంప్రదాయాలు అడ్డుకున్నాడు. నిమ్న వర్గాల్లో తాగుడు అలవాటును మాన్పించాడు.

TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం

ప్రశ్న 3.
మంచివక్త అని ఎవరిని అనవచ్చు ?
జవాబు:
ప్రతీ విషయాన్ని కూలంకషంగా (విస్తృతంగా, వివరంగా) చెప్పుట, తన అభిప్రాయాన్ని సశాస్త్రీయంగా నిరూపించుట, సమయం, సందర్భం పరిస్థితులనుబట్టి బాగా మాట్లాడేవాణ్ణి మంచి వక్త అని అనవచ్చును. అణగారిన వర్గాలలో చైతన్యాన్ని, సమాజాన్ని ప్రభావితం చెయ్యగలిగేటట్లు ప్రసంగించగలిగితే అతడిని మంచి వక్త అంటారు.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No.60)

ఆదిహిందువుల మేలుకోసం ……….. కాకుండా రక్షించగలిగాడు.

ప్రశ్న 1.
చదువుకోవడం వల్ల సమాజం ఏవిధంగా చైతన్యవంత మవుతుంది ?
జవాబు:
సొంతకాళ్ళ మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గం. మంచీ చెడు, కష్టం – సుఖం, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనేది, జ్ఞానం – అజ్ఞానం తెలియాలంటే తప్పనిసరిగా చైతన్యవంతమైన, జ్ఞానాత్మకమైన చదువును చదువుకోవల్సిందే. ఇంతకంటే వేరొక మార్గమే లేదు.

ప్రశ్న 2.
నాయకత్వ పటిమను ఏవిధంగా అంచనా వేయ వచ్చు?
జవాబు:
ఒక నాయకుడు, ఒక వ్యక్తి తను చెప్పిన అంశాలు ప్రజామోదం పొందినప్పుడు, అందరినీ మెప్పించ, గలిగినప్పుడు, అతని పలుకులే (మాటలే) శిరోధార్య మవుతాయి. దానినే నాయకత్వ పటిమ అని అంటారు. పైన చెప్పిన ప్రకారం ప్రజలలో నాయకునికి ఉన్న ఆదరణ బట్టే నాయకత్వ పటిమను మనం అంచనా వేయవచ్చు.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
నిమ్న వర్గాలలో భాగ్యరెడ్డి వర్మ తెచ్చిన మార్పులు చెప్పండి.
జవాబు:

  1. దళితుల అభ్యున్నతి కొరకు కృషి చేశాడు.
  2. అనేక బహిరంగ సభలు నిర్వహించాడు.
  3. సామాజిక స్వచ్ఛత గురించి చెప్పాడు.
  4. తనజాతి జనులను (నిమ్న వర్గాలను) ఏకతాటిపై నడిపాడు.
  5. దేవదాసి, ముర్లీ, వేశ్యా సంప్రదాయాలను అడ్డు కున్నారు.
  6. ఆడ, మగ పిల్లలను దేవునికి వదలివేయడాన్ని తీవ్రంగా నిరసించాడు.
  7. కులవ్యవస్థ నిర్మూలన కొరకు శ్రమించాడు.
  8. మనుషులంతా పుట్టుకతో సమానం అనే భావం కలిగించాడు.
  9. చదువుపై శ్రద్ధ కల్గించాడు.
  10. సాంఘిక దురాచారాలను నిర్మూలించాడు.

ఈ పై పనుల వల్ల నిమ్న వర్గాలలో సామాజిక భాగస్వామ్యం, స్వయంకృషి, ఆత్మవిశ్వాసం, నిస్వార్థసేవ వంటి మంచి విషయాలలో మార్పులు తీసుకువచ్చారు.

ప్రశ్న 2.
భాగ్యరెడ్డి వర్మ, అంబేద్కర్ ల మధ్య పోలికలను తెలుపండి.
జవాబు:
TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం 1
TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం 2

TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం

ప్రశ్న 3.
క్రింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

మహారాష్ట్రలో పుట్టిన జ్యోతిబాఫూలె బహు జనుల అభివృద్ధికి విశేషకృషి చేశాడు. దొరల దోపిడీ దౌర్జన్యాలను ధైర్యంతో ఎదుర్కొన్నాడు. పేదలందరికీ విద్య అందుబాటులోకి రావాలని ఉద్యమాలు చేశాడు. సత్యశోధక సమాజం ఏర్పాటుచేశాడు. బి.యస్. వెంకటరావు హైదరాబాద్లోని ఘాసండిలో పుట్టాడు.

హైదరాబాదు అంబేద్కర్గా ప్రసిద్ధిచెందాడు. హైదరాబాదులో అంబేద్కరిజానికి పాదులు తీసి, దారులు వేశాడు. సమరోత్సాహంతో దళిత ఉద్యమా లను నడిపిన ధీశాలి. హైదరాబాద్లో దేవదాసీ దురాచార నిర్మూలనకు, దళితులలో విద్యాభివృద్ధికి కృషి చేశాడు. 1926 లో ఆదిహిందూ మహాసభను స్థాపించాడు.

సరైన జవాబు గుర్తించి కుండలీకరణం (బ్రాకెట్)లో రాయండి.

అ) జ్యోతిబాఫూలె స్థాపించిన సమాజం పేరు ఏమిటి ?
అ) సత్యశోధక
ఆ) సమసమాజం
ఇ) నవసమాజం
జవాబు:
అ) సత్యశోధక

ఆ) పేదలందరికీ అందుబాటులోనికి రావలిసింది.
అ) డబ్బు
ఆ) చదువు
ఇ) న్యాయం
జవాబు:
ఆ) చదువు

ఇ) దేవదాసీ దురాచార నిర్మూలనకు కృషిచేసింది.
అ) జ్యోతిబాఫూలె
ఆ) అంబేద్కర్
ఇ) బి.ఎస్. వెంకటరావు
జవాబు:
ఇ) బి.ఎస్. వెంకటరావు

ఈ) ఆదిహిందూ మహాసభను స్థాపించిన సంవత్సరం
అ) 1936
ఆ) 1926
ఇ) 1916
జవాబు:
ఆ) 1926

II. వ్యక్తీకరణ సృజనాత్మకత

ప్రశ్న 1.
క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) చదువుకుంటే కలిగే లాభాలను తెలుపండి.
జవాబు:
విద్యలేనివాడు వింత పశువు అని పెద్దలు అంటారు. చదవటం, రాయడం లెక్కలు నేర్చుకోవడమే అక్షరాస్యత. చదువుకుంటే ఎవరిమీద ఆధారపడకుండా జీవితాన్ని సాగించవచ్చు.

  1. విద్య వల్ల మనకు జ్ఞానం కలుగుతుంది.
  2. మంచి కీర్తిని తెచ్చిపెడుతుంది.
  3. భోగములను ఇస్తుంది.
  4. దొంగలు దొంగిలించలేని విద్య సొంతమైతే అజ్ఞానాన్ని పోగొడుతుంది.
  5. సక్రమ మార్గంలో నడిపిస్తుంది.
  6. ఆర్థిక భద్రత, సామాజిక భద్రత కల్పిస్తుంది.
  7. విచక్షణా జ్ఞానం కలుగుతుంది. ఇంకా ఎన్నో, ఎన్నెన్నో లాభాలు ఉన్నాయి.

ఆ) అసమానతలు తొలగి సమానత్వం రావాలంటే ఏం జరగాలి ?
జవాబు:

  1. విద్యను నేర్చుకోవాలి / నేర్పాలి.
  2. నిమ్న వర్గాలు “అందరిలాగా మనము అన్నీ చేయగలం” అన్న ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి.
  3. దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలి.
  4. స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు విలసిల్లాలి (వెల్లివిరియాలి).
  5. జాతీయ జీవన స్రవంతిలో అందరూ కలవాలి. కులతత్వం, మతతత్వం, అంటరానితనం రూపు మాసిపోవాలి.
  6. మూఢనమ్మకాలను పారద్రోలాలి.

ఇవన్నీ సాధించితే అసమానతలు తొలగి సమానత్వం ఏర్పడుతుంది.

ఇ) అంకితభావంతో పనిచేయడం అంటే ఏమిటి ?
జవాబు:
ఒక లక్ష్యం కోసం దీక్షతో పనిచేయడాన్ని అంకిత భావంతో పనిచేయడం అంటారు. ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా లక్ష్యాన్ని విడిచి పెట్టకూడదు. లక్ష్య సాధన దిశగా మనపని మనం చేసుకుంటూ పోవాలి.

డా॥ బి.ఆర్. అంబేద్కర్. మహాత్మాగాంధీ లాంటి వారు అంకిత భావంతో కృషి చేయడం వల్లనే సమాజంలో ఎన్నో సంస్కరణలు చోటుచేసుకున్నాయి. సమాజాభివృద్ధిని కృషి చేయాలనుకునే నాయకులను అంకితభావం, చిత్తశుద్ధి, నిజాయితీ అవసరం.

ఈ) వ్యసనాల వలన ఎట్లాంటి నష్టాలు కలుగుతాయి ?
(లేదా)
దుర్వ్యసనాల వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి ?
జవాబు:
వ్యసనం అంటే అలవాటు. అది మంచి అలవాటు అయితే సద్వ్యసనం అంటారు. చెడు అలవాటైతే దుర్వ్యసనం అంటారు. సాధారణంగా ‘వ్యసనం’ అనే మాట “చెడు అలవాటు” అనే అర్థంలోనే ఉపయోగి స్తాము.

  1. మనిషి జీవనం పతనమవుతుంది.
  2. చెదపురుగు వృక్షాన్ని నాశనం చేసినట్లు వ్యసనాలు మనిషిని సమూలంగా నాశనం చేస్తాయి.
  3. ధర్మరాజు వ్యసనం వల్లనే కదా రాజ్యాన్ని పోగొట్టుకుంది.
  4. వ్యసనాల వల్ల మనిషి తన ఉనికిని కోల్పోతాడు.
  5. త్రాగుడు (మద్యపానం), జూదం, వ్యభిచారం, లంచ గొండితనం మొదలైనవి సమాజంలో వ్యసనాలుగా చెప్పవచ్చును.
  6. వ్యక్తి నాశనమే కాక సమాజానికి హాని జరుగుతుంది.
  7. సమాజంలో గౌరవ మర్యాదలను కోల్పోతాడు.

ప్రశ్న 2.
క్రింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) మీ చుట్టూ ఉన్న సమాజంలో నెలకొన్న మూఢ నమ్మకాలను పారదోలడానికి మీరు ఏం చేయగలరు?
(లేదా)
మీ పరిసరాల్లో మీకు కన్పించే మూఢనమ్మకాల నిర్మూలనకు ఎలాంటి చర్యలను తీసుకుంటారు ?
జవాబు:
మన చుట్టూ ఉన్న సమాజాన్ని అనేక మూఢనమ్మకాలు ప్రభావితం చేస్తున్నాయి. వాటిని పారద్రోలడానికి నేను చేసే పనులను వివరిస్తాను.

  1. ముందుగా నిరక్షరాస్యులకు విద్య నేర్పుతాను.
  2. వయోజనులకు మంచిగా నచ్చచెపుతాను.
  3. స్వచ్ఛత, స్వేచ్ఛ, సమానత్వం గురించి వివరించి చెపుతాను. అప్పటికీ మార్పు రాకపోతే సామాజిక సేవా కార్యకర్తలు, సంస్కర్తలచే చెప్పిస్తాను.
  4. మూఢనమ్మకాల వల్ల కలిగే నష్టాలను చిన్నచిన్న నాటికల ద్వారా మా వాడలో ప్రదర్శిస్తాను.
  5. మూఢనమ్మకాలను పారద్రోలటానికి, ర్యాలీలు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేయిస్తాను.
  6. మూఢనమ్మకాల వల్ల కలిగే నష్టాలను, కరపత్రాల ద్వారా మౌఖికంగా వివరిస్తాను.
  7. వయోజనులతో సత్సంబంధాలను కల్గి, వారికి నచ్చచెప్పి మూఢనమ్మకాలపై వారికి అవగాహన కల్పిస్తాను.
  8. నా మిత్ర బృందంతో కల్సి వారి జీవితాలలో మార్పు కొరకు కృషిచేస్తాను.

(లేదా)

ఆ) భాగ్యరెడ్డివర్మ ఆదిహిందువుల కోసం చేసిన కృషిని వివరించండి.
(లేదా)
ఆదిహిందువుల కోసం భాగ్యరెడ్డి వర్మ చేసిన కృషిని సొంత మాటల్లో వ్రాయండి.
జవాబు:
ఆదిహిందువుల మేలుకోసం వర్మ నిరంతరం చేపట్టిన కార్యాచరణ ఎంతోమంది ప్రముఖుల మనసులను చూరగొని వారు ఆదిహిందువులకు దగ్గరయ్యేలా చేసింది. భాగ్యరెడ్డివర్మ నిరంతర కార్యాచరణ సభల వలన ఆదిహిందూ సమాజం జాగరూకమయ్యింది. ఆది హిందువులు సొంతకాళ్ళ మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గమని వర్మ బలమయిన నమ్మకం. ఈ విషయంలో ఆయన ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తన బాధ్యతను గుర్తించేలా చేశాడు.

కృషి, పోరాటం ఫలితంగా ప్రభుత్వం ఆది హిందువుల కోసం ఎన్నో పాఠశాలలు నెలకొల్పింది. 1931 జనాభా లెక్కల సేకరణ సందర్భంగా వర్మ ఎంతగానో శ్రమపడి అంటరాని వర్గాలను ఆది హిందువులుగా నమోదు చేయించాడు. మానవులలలో ఎక్కువ, తక్కువలు లేవని ఆది హిందువులు తెలుసుకొనేలా చేశాడు.

3,348 ఉపన్యాసాలు ఇచ్చి ఆదిహిందువులను చైతన్య పరిచాడు. ఇది ఆయన నాయకత్వ పటిమకు మచ్చుతునక. హిందూ సమాజం మొత్తంగా ఆయనకు రుణపడి ఉండాలె. ఆ చర్యతో హిందూ సమాజాన్ని ఆయన చీలికలు, పేలికలు కాకుండా రక్షించగలిగాడు.

ప్రశ్న 3.
క్రింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

అ) భాగ్యరెడ్డి వర్మ గురించి తెలుసుకున్నారు కదా ! ఇట్లాగే సమాజం కోసం పాటుపడిన వాళ్ళలో ఎవరి గురించైనా “అభినందన” వ్యాసం రాయండి.
జవాబు:
మలాలా యూసుఫ్ జాయ్
మలాలా యూసుఫయ్ ఈ తరం బాలికల నూతన స్ఫూర్తికి ప్రతినిధి. మలాలా పాకిస్థాన్లోని స్వాత్ లోయ మింగోరా పట్టణంలో 12 జూలై, 1997లో జన్మించింది.

చిన్నప్పటి నుంచి చదువంటే చాలా ఆసక్తిగల మలాలాకు తమ ప్రాంతంలోని ప్రతికూల పరిస్థితులకు ఎదురు నిలిచి పోరాడింది. అక్కడి ప్రభుత్వంపై ఆధిపత్యం వహిస్తున్న తాలిబాన్ ఛాందసవాదులు బాలికలు పాఠశాలకు వెళ్ళడం, చదువుకోవడంపై నిషేధం విధించారు. మలాలా ఏ మాత్రం భయ పడకుండా చదువుకుంటూనే తన తోటి బాలికలకు చదువుపై ఆసక్తిని పెంచి పాఠశాలకు వెళ్ళేటట్లుగా ప్రోత్సహించింది.

దీంతో ఆగ్రహించిన తాలిబాన్లు మలాలాపై 9, అక్టోబర్ 2012 న కాల్పులు జరిపారు. ఆమె తీవ్రంగా గాయపడింది. ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా మలాలాపై సానుభూతి వెల్లువెత్తింది. అందరూ ఆమె కోలు కోవాలని కోరుకున్నారు.

ఆమె ప్రాణాపాయ స్థితి నుండి బయటికి వచ్చింది. మలాలా చైతన్యానికి, సాహసానికి, ఆత్మస్థైర్యానికి ముగ్ధులైన ఐక్యరాజ్య సమితి ఆమె జన్మదినాన్ని (జూలై 12ను) ‘మలాలా రోజు’ (Malala Day) గా ప్రకటించింది. ప్రతీ బాలిక చదువుకోవడం ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించింది. మలాలాను ‘ఇంటర్నేషనల్ చిల్డ్రన్ పీస్ ప్రైజ్’ కు నామినీగా స్వీకరించింది.

ఈ విధంగా తన ప్రాణాలను లెక్కచేయకుండా మలాలా యూసఫ్ జాయ్ ఎదుర్కొంది. ఇది నాకు స్ఫూర్తినిచ్చిన అంశం.

III. భాషాంశాలు

పదజాలం

1. క్రింది పదాలకు పర్యాయపదాలను రాయండి.

అ) అండ = ఆసరా, తోడు, ఆలంబనం, ఆశ్రయం
ఆ) ఉన్నతి = వికాసం, అభివృద్ధి, ప్రగతి, ప్రవృద్ధి, ఘనత
ఇ) స్వేచ్ఛ = స్వతంత్రత, సొంతం, అలవోక, విచ్చలవిడి
ఈ) వికాసం = వికసనము, తెలివి, అభివృద్ధి, ప్రగతి

TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం

2. క్రింది పదాలను ఉపయోగిస్తూ సొంతవాక్యాలు రాయండి.

అ) ఏకతాటిపై = ఒక మాటమీద నిలబెట్టడం
జవాబు:
గాంధీగారు స్వాతంత్య్ర పోరాటాన్ని ఏకతాటి పై నిలారు.

ఆ) మచ్చుతునక = ఉదాహరణ
జవాబు:
ఆమ్లవర్షాలు పడటం పర్యావరణం దెబ్బతినటానికి మచ్చుతునక.

ఇ) మహమ్మారి = వ్యాధి
జవాబు:
నేడు అవినీతి అనే మహమ్మారి ఎక్కువయింది.

ఈ) నిరంతరం = ఎల్లప్పుడు
జవాబు:
1) జీవన పోరాటం నిరంతరం జరుగుతూనే ఉంటుంది.
2) విద్యార్థులు నిరంతరం అధ్యయనంపై దృష్టిపెట్టాలి.

3. కింది పదాలు / పదబంధాలను వివరించి రాయండి.

అ) అంకితం కావడం = సమర్పించడం / లీనం కావడం
జవాబు:
ఒక పనిని శ్రద్ధగా చేయడం, ఇచ్చిన పనిని త్రికరణ శుద్ధిగా చేయడం అని అర్థం.
మహాత్మాగాంధీ జాతికి స్వాతంత్ర్యం కోసం అంకిత మయ్యారు.

ఆ) నైతిక మద్దతు = నీతికి ఓటు వేయడం, నీతిని సమర్థించడం
జవాబు:
ఒక మంచి పనికి నైతిక మద్దతు చాలా అవసరం. అది లేనిదే విజయం లభించదు.
మంచిచేసేవారికి / సంఘసంస్కర్తలకు నైతిక మద్దతు ఇవ్వాలి.

ఇ) చిత్తశుద్ధి = మనస్పూర్తిగా, మనస్సు దోషం లేకుండా
జవాబు:
“చిత్తశుద్ధి కల్గి చేసిన పుణ్యము వృథా కాదు” అని వేమన చెప్పాడు.
నేడు ఎక్కడచూసినా చిత్తశుద్ధి లేకుండా పనిని చేస్తున్నారు. తర్వాత బాధపడుతున్నారు. ఇది పనికిరాదు.

ఈ) సాంఘిక దురాచారాలు = సంఘమునందలి చెడ్డ ఆచారములు
జవాబు:
సాంఘిక దురాచారాలు ప్రగతికి ఆటంకం కల్గిస్తాయి. సమాజం అభివృద్ధి సాధించాలంటే తప్పనిసరిగా సాంఘిక దురాచారాలకు దూరంగా ఉండాలి.
సాంఘిక దురాచారాలను రూపుమాపటానికి ఎందరో సంస్కర్తలు నడుంబిగించారు.

ఉ) సొంతకాళ్ళపై నిలబడడం అంటే స్వతంత్ర భావనతో జీవించడం అని అర్థం.
జవాబు:
ఒకరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడరాదని భావం. శ్రమ పడకుండా డబ్బు సంపాదించటం నేడు సరదాగా మారింది. పరుల సొమ్ము పాము వంటిది. కాబట్టి తన కాళ్ళపై తను నిలబడి స్వతంత్రంగా జీవించడం అని దీని అర్థం.

TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం

వ్యాకరణాంశాలు

క్రింది వాక్యాలను పరిశీలించండి.

ప్రత్యక్ష కథనం :
అ)“అక్కా! ఆ చెరువు జూడు”.
ఆ)”నేను రాన్రా తమ్ముడు”.
ఇ) “పిల్లలూ ! రేపు బీర్పూరు జాతరకు వెళుతున్నాను”.
ఈ) “మేమూ వస్తాం సర్”.

పై వాక్యాలను పరిశీలించారు గదా !
పై వాక్యాలు నేను, మేము మొదలైనవారు చెబు తున్నట్లుగా ఉన్నాయి కదా !

ఇట్లా ఉత్తమపురుషలోని వాక్యాలు సాధారణంగా ప్రత్యక్షంగా చెపుతున్నట్లు ఉంటాయి. కాబట్టి ఇవి “ప్రత్యక్ష” కథనంలో ఉన్న వాక్యాలు. – ప్రత్యక్ష కథనానికి ఉద్ధరణ చిహ్నాలు (“ ” ఉండాలి. కింది ఉదాహరణలను పరిశీలించండి.

అ)“మనుషులంతా పుట్టుకతో సమానం, ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు” అన్నాడు. భాగ్యరెడ్డి వర్మ.
ఆ)రుద్రమదేవితో తల్లి నారాంబ “నువ్వు నేను మామూలు స్త్రీలం కాదు. నువ్వు పట్టమహిషివి, నేను భావిచక్రవర్తిని, మనకు కండ్లు మటుకే ఉండాలి. కాని కన్నీళ్ళు ఉండకూడదు” అన్నది.

పై ఉదాహరణలను పరిశీలిస్తే ప్రత్యక్ష కథనంలో రాసేటప్పుడు కింది నియమాలను గుర్తుంచు కోవాలని తెలుస్తున్నది.

  • ఒకరు చెప్పిన మాటలు / వాక్యాలను చెప్పింది చెప్పినట్లే రాయాలి.
  • ఆ మాటలకు / వాక్యాలకు ఉద్ధరణ చిహ్నాలు ఉండాలి.
  • ప్రథమపురుషలో ఉన్న పదాలు (అనగా తమను, తమ, తాను, తాము వంటి పదాలు) ఉత్తమ పురుషలోనికి నేను, మేముగా మారుతాయి.

పరోక్ష కథనం :

క్రింది వాక్యాలు చదువండి.

అ) హర్షవర్ధన్ తాను రానని హర్షిణితో అన్నాడు.
ఆ) ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లు చేస్తామని పిల్లలు అన్నారు.
ఇ) తనను క్షమించమని రాజు తన మిత్రునితో అన్నాడు. పైనున్న వాక్యాలు చదివారు కదా !

ఇవి సూటిగా వాళ్లే చెప్తునట్లుకాకుండా ! ఇంకొకళ్ళు చెప్తున్నట్లున్నాయి కదా !
ఇలాంటి వాక్యాలను “పరోక్ష కథనం” లో ఉన్న వాక్యాలు అంటారు. వీటిలో ఉద్ధరణ చిహ్నాలు ఉపయోగించవలసిన అవసరం లేదు.

క్రింది వాక్యాలను చదువండి. ఏం మార్పు జరిగిందో చెప్పండి.

అ)“నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను” అన్నాడు శ్రీనివాస్. (ప్రత్యక్ష కథనం)
ఆ) తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నానని శ్రీనివాస్ అన్నాడు.
(పరోక్ష కథనం)

మొదటి వాక్యంలో శ్రీనివాస్ మాటలకు ఉద్ధరణ చిహ్నాలు పెట్టారు.
రెండవ వాక్యంలో శ్రీనివాస్ మాటలను ఇంకొకరు చెప్పినట్లు రాశారు.
ఇందుకోసం ఉద్ధరణ చిహ్నాలు తీసేసి “అని” చేర్చి వాక్యం రాశారు.
మొదటిది ప్రత్యక్ష కథనం. రెండవది పరోక్ష కథనం.

పై ఉదాహరణల పరిశీలన ద్వారా పరోక్ష కథన వాక్యాలు రాసేటప్పుడు కింది నియమాలను గుర్తుంచుకోవాలని తెలుస్తున్నది.

పరోక్ష కథనంలో ఉద్ధరణ చిహ్నాలు తొలగించి “అని” చేరుస్తారు.
ఉత్తమ పురుష పదాలు నేను, మేము, నా, మా వంటివి. ప్రథమ పురుష పదాలుగా తాను, తాము, తన, తమ లుగా మారుతాయి.

పాఠంలోని పరోక్ష కథన వాక్యాలను గుర్తించండి. వాటిని ప్రత్యక్ష కథన వాక్యాలుగా మార్చండి.

1. పరోక్ష కథనం : తన జాతి జనులను ఏకతాటి పై నడుప గలనని ఆయన అన్నారు.
ప్రత్యక్ష కథనం: “నా జాతి జనులను ఏకతాటిపై నడుప గలను” అని ఆయన అన్నారు.

2. పరోక్ష కథనం : ఆది హిందువులు సొంతకాళ్ళ మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గమని భాగ్యరెడ్డి వర్మ అన్నారు.
ప్రత్యక్ష కథనం: “ఆది హిందువులు సొంతకాళ్ళ మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గము” అని భాగ్యరెడ్డి వర్మ అన్నారు.

ప్రాజెక్టు పని

బడుగు వర్గాల కోసం కృషిచేసిన జ్యోతిబాఫూలె, అంబేద్కర్, సావిత్రీబాయి ఫూలె జీవితాల్లోని ఏదైనా ముఖ్యమైన ఘట్టాన్ని మీ మాటల్లో రాయండి. నివేదిక రాసి తరగతిలో చదివి వినిపించండి.
జవాబు:
జ్యోతిబాఫూలె జీవితంలోని ముఖ్యమైన ఘటన :

ఒకరోజు రాత్రి ఇద్దరు మనుషులు జ్యోతిబాఫూలె చంపడానికి వచ్చారు. సావిత్రి బాఫూలె వాళ్ళకు, సేరీకి మధ్యలో నిలబడింది. ‘అన్నలారా – ఆగండి, దయచేసి వెళ్ళిపొండి’ అని వారిని భయంతో ప్రార్థించింది. వాళ్ళలో ఒకడు సావిత్రిపై గర్జించాడు. ‘మేం ఆగటానికి రాలేదు’. “అయితే మీరిక్కడకు ఎందుకొచ్చారు” అని అడిగాడు సేబీ నెమ్మదిగా. “కొందరు పెద్దలు నిన్ను చంపే కాంట్రాక్టు మాకిచ్చారు.

నువ్వు ఈ బడులు నడపటం, ఈ యవ్వారమంతా మానేస్తేగాని సంఘం బాగుపడదని వాళ్ళు చెప్పారు” అని వాళ్ళు అనగా తన చావు వాళ్ళకు లాభం అయితే చంపమని, బీదవాళ్ళకు సాయం చేయడమే తన జీవితాశయం అని సేరీ మెడవంచి చంపమని శాంతంగా చావుకు సిద్ధమయ్యాడు.
TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం 3
ఆ ఇద్దరు మనుషులు గొడ్డళ్ళు క్రింద పారేసి, సేరీ కాళ్ళమీద పడ్డారు. “మేం మిమ్మల్ని చంపం. మీరు మాకు తండ్రి లాంటివారు. ఇప్పుడే వెళ్ళి మమ్మల్ని పంపిన వాళ్ళని చంపివస్తాం” అని అనగానే సేరీ వాళ్ళను ఆపి వాళ్ళ ఆలోచన మారే దాకా వాళ్ళతో మాట్లాడాడు. ఆ ఇద్దరు హంతకుల పేర్లు దోండిరామ్, నామ్రేవ్ కుంబార్డే.

వాళ్ళు ఇద్దరూ రాత్రి బడిలో చేరారు. తర్వాత రోడే సేరీ బాడీగార్డుగా తయారయ్యాడు. కుంబార్ ‘వేదాచార్’ అనే పుస్తకం వ్రాసి ఫూలే దంపతులకు సహకరించాడు. చంపటానికి వచ్చిన వాళ్ళ హృదయం ఆ విధంగా పరివర్తన చెందిందంటే ఆ రోజుల్లో మనుషులు అలా ఆలోచించేవారని తెలుస్తోంది.

అంబేద్కర్ జీవితంలో ముఖ్యఘటన:

1931 రెండవ రౌండు టేబుల్ సమావేశం తర్వాత బ్రిటిషు ప్రభుత్వం కమ్యూనల్ అవార్డు ద్వారా హరిజనులకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించింది. కాని అంబేద్కర్ గాంధీజీ పూనా ఒడంబడి చేసుకొని ప్రత్యేక నియోజకవర్గాలకు బదులుగా కాంగ్రెస్ అభ్యర్థులను నిలిపేటట్లుగా అంగీకరింపచేశాడు. ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పరచటం సాధ్యం చేశారు.
అంబేద్కర్ సాంఘిక దురాచారాలకు లొంగక వాటిని ఎదిరిస్తూ జీవితమంతా ఏటికి ఎదురీదాడు.
TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం 4

విశేషాంశాలు

1. దేవదాసి : ఆలయాలలో నృత్యం చేస్తూ ఆలయ సేవకే అంకితమయిన వాళ్ళను దేవదాసీలుగా పిలిచేవాళ్ళు. ఈ దేవదాసి వ్యవస్థ చాళుక్యకాలంనుండే ఉన్నట్లు తెలుస్తున్నది. కాలక్రమంలో దేవదాసీలు చిన్న చూపుకు గురయినారు. అనేక ఉద్యమాలు నిరసనల కారణంగా ఈ వ్యవస్థ లేకుండపోయింది.

సూక్తి : మంచి సమాజం మనిషి శరీరం వంటిది. అందుకే శరీరమైనా, సమాజమైనా – అందులో ఏ ఒక్క భాగానికి బాధ కలిగినా, నివారణకు అందరూ నడుం బిగించాలి.
-వినోబాభావే

పదాలు – అర్థాలు

I

గమనం = ప్రయాణం
నిర్దేశించు = చూపు
అవస్థ = కాలకృతమైన స్థితి, సంకటం, దశ
గట్టెక్కడం = ఒడ్డుకు చేరడం (కష్టాలుతీరడం)
అంకితభావం = వేరే ఆలోచన లేకపోవడం
వికాసం = వికసించడం, ప్రకాశం
అణగారిన = అణచి వేయబడిన
చిత్తసుద్ది = చెప్పింది చేసే నిజాయితీ
నివసించు = తిరస్కరించు
ఏకతాటి పై = ఐక్యంగా
ఎరుక = తెలివి, జ్ఞానం
అవగతము = తెలియబడినది, పొందుట
కడగండ్లు = కష్టములు, విపత్తులు
ఉదాసీనత = నిర్లిప్తత
అండ = ఆసరా
మహమ్మారి = మశూచి, అమ్మతల్లి (ఓ పెద్ద అంటురోగం)

TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం

II

జీర్ణించుకుపోవడం = బాగా అర్థం కావడం
అజ్ఞానం = చీకటి
నిరంతరం = ఎల్లప్పుడు
మటుమాయం = కన్పించకుండా
ఏకతాటి = ఒకే మాటపై నిలబెట్టడం
స్వచ్ఛత = నిర్మలత్వం
దుర్భరం = భరింపరాని
మార్గదర్శి = మార్గమును చూపువాడు
ఆదిగా = మొదలుగా
కృషి = ప్రయత్నం

III

జాగరూకమయ్యింది = అప్రమత్తమయింది
నెలకొల్పుట = ఏర్పాటుచేయుట
పటిమ = నేర్పు, ఓపిక, బిగువు
మచ్చుతునక = ఉదాహరణ
మేలుకోసం = మంచికోసం
నమ్మకం = విశ్వాస

పాఠం ఉద్దేశం

స్వయంకృషి, ఆత్మవిశ్వాసం ఉంటే ప్రతి ఒక్కరూ ఏమైనా సాధించగలరు. అన్ని వర్గాల వాళ్ళలో సామాజిక భాగస్వామ్యం, చైతన్యం అవసరం. స్వార్ధం పెరిగిపోతున్న ప్రస్తుత సమాజంలో ఇతరుల గురించి ఆలోచించి, వాళ్ళ ప్రగతికి తోడ్పడే వ్యక్తులు అరుదు. అటువంటి వ్యక్తిత్వం నుండి స్ఫూర్తి పొందడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

భాగ్యరెడ్డివర్మ కుమారుడైన ఎం.బి. గౌతమ్ రచించిన ‘భాగ్యరెడ్డివర్మ జీవితచరిత్ర’ గ్రంథంలోని కృష్ణస్వామి ముదిరాజ్ రాసిన వ్యాసంలోనిది ఈ పాఠ్యభాగం.

రచయిత పరిచయం

రచయిత : కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్
జననం : 25.8.1893
మరణం : 15.12.1967
వృత్తి / ఇతర

అంశాలు : స్వాతంత్య్ర సమర యోధుడు, రచయిత, జర్నలిస్టు, విద్యాసంస్థల స్థాపకుడు, బహుజన సమాజ సంస్కర్త, విద్యావేత్త, హైదరాబాద్ మేయర్, ఆంధ్ర మహాసభ నిర్వాహకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి.

ఇతర రచనలు / పనులు :

  1. 1957 లో హైదరాబాద్ మేయర్గా “మాస్టర్గాన్” ను తయారుచేసిన దార్శనికుడు.
  2. దక్కన్లోర్లో సంపాదకీయాలు, వ్యాసాలు రాసారు.
  3. హైదరాబాద్ నగరంపై “పిక్టో రియల్ హైదరాబాద్” అనే అద్భుత గ్రంథాన్ని రాశారు.
  4. దళితుల అభ్యున్నతి కొరకు కృషి చేశాడు.
  5. 1948 లో ఉర్దూలో “హైదరాబాద్ – కి – తీస్ సాలాసియాసి జదు జిహిద్” పేరుతో రాజకీయోద్య మాలపై గ్రంథాన్ని రాశాడు.
  6. “భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర” రాసే సంఘంలో ప్యానల్ సభ్యుడిగా పనిచేశారు.

ప్రవేశిక

ఆయన అనేక బహిరంగ సభలు నిర్వహించాడు. సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి, తన జాతి జనులను ఏకతాటిపై నడుపగలిగాడు. ఆయన చేపట్టిన పనులలోకెల్లా మరపురానిది దేవదాసి, ముర్లీ, వేశ్యా సంప్రదాయాలను అడ్డుకోవడం. ఆడ, మగ పిల్లలను దేవునికి వదిలి వేయడాన్ని తీవ్రంగా నిరసించాడు. తాగుడును మానిపించాడు. ఈ విధంగా సామాజిక బాధ్యతను నెరవేర్చడానికి తన జీవితాన్నంతా ధారపోసే మహోన్నత వ్యక్తులు కొందరే ఉంటారు. ఆ కొందరిలోనూ ముందు వరుసలో ఉండే భాగ్యరెడ్డి వర్మ గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం కదా !

TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం

విద్యార్థులకు సూచనలు

  • పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
  • పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత గీయండి.
  • వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పదవిజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకొండి.

ప్రక్రియ – జీవిత చరిత్ర

ఈ పాఠ్యాంశం ‘జీవిత చరిత్ర’ ప్రక్రియకు చెందినది. విభిన్న రంగాలలో పనిచేస్తూ సమాజంమీద ప్రభావం చూపిన వ్యక్తుల విశిష్టతలను తెలుపుతూ రాసే గ్రంథమే ‘జీవిత చరిత్ర’.

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

Telangana SCERT 10th Class Telugu Grammar Telangana అపరిచిత పద్యాలు Questions and Answers.

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 1.
కింది పద్యమును చదవండి. ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.

అనువుగాని చోట నధికుల మనరాదు
కొంచమైన నదియు ఁగొదువ గాదు
కొండ యద్దమందు గొంచమై యుండదా!
విశ్వదాభిరామ వినురవేమ !

ప్రశ్నలు – జవాబులు :
1. ఎక్కడ అధికులము అని అనగూడదు ?
జవాబు:
అనువుగానిచోట అధికులమని అనగూడదు.

2. ఇంకా ఎక్కడెక్కడ ఒదిగి ఉండాలి ?
జవాబు:
సంపద, విద్య, అధికారములయందు ఒదిగి ఉండాలి.

3. కొండ అద్దములో ఎలా ఉంటుంది ?
జవాబు:
కొండ అద్దంలో చిన్నదిగా ఉంటుంది.

4. పై పద్యాన్ని రాసిన కవి ఎవరు ?
జవాబు:
పై పద్యాన్ని రాసిన కవి వేమన.

5. ఈ పద్యంలోని మకుటం ఏది ?
జవాబు:
ఈ పద్యంలోని మకుటం విశ్వదాభిరామ వినురవేమ

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 2.
కింది పద్యమును చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు తగు జవాబులివ్వండి.

సత్యసూక్తి ఘటించు, ధీజడిమ మాన్చు
గౌరవమొసంగు జనులకు కలుషమడచు
కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి జేయు
సాధుసంగమంబు సకలార్థ సాధనంబు.

ప్రశ్నలు – జవాబులు :
1. జనులకు కలుషమును పోగొట్టేదేది ?
జవాబు:
సాధుసంగము

2. సూక్తి అంటే ఏమిటి ?
జవాబు:
మంచిమాట

3. సాధుసంగమనగానేమి
జవాబు:
మంచివారితో స్నేహము.

4. ఈ పద్యానికి శీర్షిక ప్రకటించుము.
జవాబు:
ఈ పద్యానికి ‘సజ్జన సాంగత్యం’ అనే శీర్షిక తగినది.

5. కీర్తి ఎప్పుడు కలుగుతుంది.
జవాబు:
కీర్తి సజ్జన సాంగత్యంతో కలుగుతుంది.

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 3.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు
నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు
సజ్జ జొన్న కూళ్ళు సర్వంబులు, దేళ్ళు
పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు

ప్రశ్నలు – జవాబులు :
1. నాగులేరు ఏ సీమలో ప్రవహిస్తున్నది ?
జవాబు:
నాగులేరు పల్నాటిసీమలో ప్రవహిస్తున్నది.

2. పల్నాటిసీమ ప్రజల ఆహారం ఏది ?
జవాబు:
పల్నాటి సీమ ప్రజల ఆహారం సజ్జ, జొన్నకూళ్ళు.

3. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి ‘పల్నాటి పల్లెటూళ్ళు’ అని పేరు పెట్టవచ్చు.

4. ఈ పద్యంలోని శబ్దాలంకారమేమిటో రాయండి.
జవాబు:
ఈ పద్యంలోని శబ్దాలంకారం వృత్త్యనుప్రాసం.

5. ఈ పద్యంలోని చిల్లర దేవుళ్ళు ఎవరు ?
జవాబు:
చిన్న చిన్న రాళ్ళు ఈ పద్యంలోని చిల్లరదేవుళ్ళు.

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 4.
క్రింది గేయ ఖండికను చదవండి. క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఆలోచించి రాయండి.

“ఇది హైదరాబాదు ……………….. ఇది హైదరాబాదు
ఇది భిన్న సంస్కృతిలో ఎదిగిపూచిన పాదు
ఇట మల్కిభరాము ప్రచురితమ్మెనరించె
తెలుగు భారతి శింజినుల మంజుల స్వనము
ఇచట గోపన్న చేయించె తన బతుకు వెచ్చించి
సీతమ్మ కొక చింతాకు పతకమ్ము
ఇచట తెల్గుల వాణి ఇచట ఉర్దూ బాణి
కల్పిపోయినవి ముక్తాప్రవాళములట్లు

ప్రశ్నలు – జవాబులు :
1. ఈ గేయభాగం, ఎక్కడి సంస్కృతిని గూర్చి వర్ణిస్తున్నది ?
జవాబు:
ఈ గేయం హైదరాబాదు సంస్కృతిని గూర్చి వర్ణిస్తున్నది.

2. ముక్తా ప్రవాళాల్లా కలిసిపోయినవి ఏవి ?
జవాబు:
తెల్గులవాణి, ఉర్దూబాణి, ముక్తా ప్రవాళాల్లో కలిసి పోయాయి.

3. సీతమ్మకు చింతాకుపతకం చేయించినవారెవరు ?
జవాబు:
సీతమ్మకు గోపన్న చింతాకుపతకం చేయించాడు.

4. భిన్నసంస్కృతి అంటే ఏమిటి ?
జవాబు:
వేరు వేరు మతాల, జాతుల, భాషల, ఆచారాల సంస్కారం.

5. హైదరాబాదుకు గల మరొక పేరు ?
జవాబు:
హైదరాబాదుకు గల మరొక పేరు భాగ్యనగరం.

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 5.
ఈ క్రింది పద్యమును చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.

అనగ ననగ రాగ మతిశయిల్లుచు నుండు
తినగ తినగ వేము తీయనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ ! వినురవేమ !

ప్రశ్నలు – జవాబులు :
1. అంటూ ఉంటే అతిశయిల్లేది ఏది ?
జవాబు:
అంటూ ఉంటే అతిశయిల్లేది రాగము.

2. తింటూ ఉంటే తీయనయ్యేది ఏది ?
జవాబు:
తింటూ ఉంటే తీయనయ్యేది వేము.

3. సాధనతో సమకూరేవి ఏవి ?
జవాబు:
సాధనముతో పనులు సమకూరును.

4. ఈ పద్యానికి మకుటం ఏది ?
జవాబు:
ఈ పద్య మకుటం “వేమ”.

5. ఈ పద్యాన్ని రాసింది ఎవరు ?
జవాబు:
ఈ పద్యాన్ని రాసింది వేమన.

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 6.
ఈ క్రింది పద్యమును చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.

నీళ్ళలోని చేప నెరిమాంసమాశకు
గాలమందు చిక్కి కూలినట్లు
ఆశపుట్టి మనుజుడారీతి చెడిపోవు
విశ్వదాభిరామ ! వినురవేమ !

ప్రశ్నలు – జవాబులు :
1. చేప దేనికి ఆశపడును ?
జవాబు:
చేప మాంసమునకు ఆశపడును.

2. దేనికి చిక్కును ?
జవాబు:
గాలానికి చేప చిక్కును.

3. చేప ఏమగును ?
జవాబు:
చేప మరణించును.

4. చేపతో పోల్చబడినది ఎవరు ?
జవాబు:
ఆశగల మానవుడు చేపతో పోల్చబడినాడు.

5. ఈ పద్యంలోని మకుటం ఏది ?
జవాబు:
ఈ పద్యంలోని మకుటం విశ్వదాభిరామ! వినుర వేమ!

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 7.
ఈ క్రింది పద్యమును చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.

తలనుండు విషము ఫణికిని
వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్
లయనకయుండును
ఖలునకు నిలువెల్ల విషముగదరా సుమతీ !

ప్రశ్నలు – జవాబులు :
1. పాముకు విషము ఎక్కడుండును ?
జవాబు:
పాముకు తలయందు విషముండును.

2. తోకయందు విషము దేనికి ఉండును ?
జవాబు:
తోకయందు వృశ్చికమునకు విషము ఉండును.

3. నిలువెల్ల విషము గలవాడెవడు ?
జవాబు:
ఖలునకు నిలువెల్ల విషముండును.

4. ఈ పద్యము నందు చెప్పబడిన విషయమేది ?
జవాబు:
ఈ పద్యమునందు ఖలుని స్వభావము చెప్పబడినది.

5. ఈ పద్యంలోని మకుటం ఏది ?
జవాబు:
ఈ పద్యంలో మకుటం సుమతి.

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 8.
ఈ క్రింది పద్యమును చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.

రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు
సుకవి చేతి కలము సుధలు గురియు
అతడేల గలుగు యావత్ప్రపంచంబు
నీతడేల గలుగు ఇహము పరము

ప్రశ్నలు – జవాబులు :
1. రక్తాన్ని కురిపించునదేది ?
జవాబు:
రాజు చేతిలోని కత్తి రక్తాన్ని కురిపిస్తుంది.

2. అమృతాన్ని కురిపించునదేది ?
జవాబు:
కవి చేతిలోని కలము అమృతాన్ని కురిపిస్తుంది.

3. యావత్ప్రపంచాన్ని పాలించగలిగేదెవరు ?
జవాబు:
రాజుయావత్ప్రపంచాన్ని పాలించగలుగుతాడు.

4. ఇహమును, పరమును పాలించగలవాడెవడు ?
జవాబు:
కవి ఇహమును, పరమును పాలించగలడు.

5. ఈ పద్యంలో ఎవరి గొప్పతనం చెప్పబడింది ?
జవాబు:
ఈ పద్యంలో కవి గొప్పతనం చెప్పబడింది.

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 9.
ఈ క్రింది పద్యమును చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.

వినదగునెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
కనికల్ల నిజము దెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ !

ప్రశ్నలు – జవాబులు :
1. ఈ పద్యం ఏ శతకంలోనిది ?
జవాబు:
ఈ పద్యం సుమతీ శతకంలోనిది

2. ఏది వినదగినది ?
జవాబు:
ఎవరు ఏవిషయమును గూర్చి చెప్పినను ముందు దానిని వినదగును.

3. వినిన తర్వాత ఏమి చేయవలెను ?
జవాబు:
వినిన తర్వాత తొందరపడకుండా ఆ విషయాన్ని గూర్చి ఆలోచించాలి.

4. నీతిపరుడెవ్వడు ?
జవాబు:
విన్నదానిలో సత్యమెంతో, అసత్యమెంతో తెలిసికొన గల్గిన వాడే నీతిపరుడు.

5. ఈ పద్యంలోని మకుటం ఏది ?
జవాబు:
ఈ పద్యంలో మకుటం సుమతి.

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 10.
ఈ క్రింది పద్యమును చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.

మఱవవలెఁ గీడు నెన్నఁడు
మఱవంగా రాదు మేలు మర్యాదలలోఁ
దిరుగవలె సర్వజనములఁ
దరిఁప్రేమన్ మెలగవలయుఁ దరుణి కుమారీ !

ప్రశ్నలు – జవాబులు :
1) దేనిని మరచిపోవాలి ?
జవాబు:
కీడును మరచిపోవాలి.

2) దేనిని మరువరాదు ?
జవాబు:
మేలును మరువరాదు.

3) అందరి ఎడల ఎట్లా మెలగాలి ?
జవాబు:
అందరి యెడల మర్యాదలతోను, ప్రేమతోను మెలగాలి.

4) ఈ పద్యం ఏ శతకం లోనిది ?
జవాబు:
ఈ పద్యం ‘కుమారీ శతకం’ లోనిది.

5) ‘మేలు’ పదానికి వ్యతిరేక పదం రాయండి.
జవాబు:
మేలు × కీడు

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 11.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాన్ని గుర్తించండి.

చేతులారంగ శివుని పూజింపడేని
నోరునొవ్వంగ హరికీర్తినుడువడేని
దయయుసత్యంబులోనుగా దలపడేని
కలుగనేటికి తల్లుల కడుపుచేటు

ప్రశ్నలు – జవాబులు :
1. ‘కడుపుచేటు’ అనే మాటకు అర్థం………… ( )
ఎ) చెడ్డకడుపు
బి) పుట్టుక దండగ
సి) తల్లులకు బాధ
డి) ప్రజలకు చేటు
జవాబు:
బి) పుట్టుక దండగ

2. శివపూజ ఎలా చేయమంటున్నాడు కవి ? ( )
ఎ) ఆరు చేతులతో
బి) చేతులు నొప్పి పుట్టేటట్లు
సి) చేతులతో తృప్తి కలిగేటట్లు
డి) భక్తితో
జవాబు:
సి) చేతులతో తృప్తి కలిగేటట్లు

3. దయను, సత్యాన్ని మనిషి వేటిని తలచాలి.( )
ఎ) దయనుమాత్రమే
బి) సత్యాన్ని మాత్రమే
సి) దయను, సత్యాన్ని రెండింటిని
డి) ఈ రెండింటిని కాదు
జవాబు:
సి) దయను, సత్యాన్ని రెండింటిని

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

4. నోరారా హరి కీర్తిని …….. ( )
ఎ) పిలవాలి
బి) పలకాలి
సి) అరవాలి
డి) ఏమీ చెయ్యకూడదు
జవాబు:
బి) పలకాలి

5. ‘కీర్తి’ కి వికృతి పదం ఏది ? ( )
ఎ) కవిత
బి) కృతి
సి) కీరితి
డి) కైత
జవాబు:
సి) కీరితి

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 12.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.

పాలమీగడ మించిన పసిడి మనసు
తెలుగుభాషను మించిన తీపి పలుకు
పౌరుషంబుగ పులిపిల్ల తీరునలరు
తెలుగుబిడ్డను గాంచంగ వెలుగు జగము

ప్రశ్నలు – జవాబులు:
1. పసిడి అంటే అర్థం ఏమిటి?
ఎ) బంగారం
బి) సింగారం
సి) కంగారు
డి) వెండి
జవాబు:
ఎ) బంగారం

2. తెలుగుభాష కంటే తియ్యనిది ఏది?
జవాబు:
తెలుగు బిడ్డ పలుకు తెలుగుభాష కంటే తియ్యనిది.

3. పౌరుషం కలిగిన జంతువుగా దేనిని పేర్కొన్నారు ?
జవాబు:
పౌరుషం కలిగిన జంతువుగా పులిని పేర్కొన్నారు.

4. లోకానికి వెలుగునిచ్చేది ఎవరు ?
జవాబు:
లోకానికి వెలుగునిచ్చేది ‘తెలుగుబిడ్డ’.

5. ఈ పద్యంలో మకుటం ఏది ?
జవాబు:
తెలుగుబిడ్డను గాంచంగ వెలుగుజగము

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 13.
క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు సరియైన సమాధానాన్ని గుర్తించండి.

వాని రెక్కల కష్టంబు లేనివాడు
సస్యరమ పండి పులకింప సంశయించు
వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు
భోజనము బెట్టు వాడికి భుక్తిలేదు.

ప్రశ్నలు – జవాబులు
1. ఎవరికి భుక్తి కరువు ? ( )
ఎ) సస్యరమకు
బి) ప్రపంచానికి
సి) కష్టజీవికి
డి) దయామయుడికి
జవాబు:
సి) కష్టజీవికి

2. ‘సస్యరమ’ అంటే ? ( )
ఎ) పంట అనే లక్ష్మి
బి) లక్ష్మి అందం
సి) అందమైన పచ్చదనం
డి) చిక్కటి చీకటి
జవాబు:
ఎ) పంట అనే లక్ష్మి

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

3. రైతురెక్కల కష్టంతో పులకించేది ఏది? ( )
ఎ) పంట
బి) భూమి
సి) చెట్టు
డి) పక్షి
జవాబు:
బి) భూమి

4. ప్రపంచానికి భోజనం పెట్టేది ఎవరు ? ( )
ఎ) రాజు
బి) రైతు
సి) ఉద్యోగి
డి) కార్మికుడు
జవాబు:
బి) రైతు

5. ఈ పద్యం ఎవరిగురించి చెప్పబడింది. ( )
ఎ) రైతు
బి) కవి
సి) కర్త
డి) ధర్మ
జవాబు:
ఎ) రైతు

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 14.
గేయం చదివి ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.

తూరుపు తెలవారుతుంది ప్రతిదినం
కాలంగతి మారుతుంది ప్రతిక్షణం
మంచి మార్పు లోకానికి మంగళదాయకం
అది వికటించిందా – అభ్యుదయ వినాశకం.

ప్రశ్నలు – జవాబులు :
1. గేయాన్ని అనుసరించి మారేది ఏది ?
జవాబు:
కాలంగతి

2. మంచి మార్పువల్ల లోకానికి ఏం ప్రయోజనం కల్గుతుంది ?
జవాబు:
మంచి మార్పు లోకానికి మంగళదాయకం.

3. ప్రతిదినం జరిగేది ఏది ?
జవాబు:
ప్రతిదినం తూరుపు తెలవారుతుంది.

4. అభ్యుదయానికి ఆటంకం ఎప్పుడు ఏర్పడుతుంది ?
జవాబు:
మంచి మార్పు జరగనప్పుడు అభ్యుదయానికి ఆటంకం ఏర్పడుతుంది.

5. అభ్యుదయం ఏ సంధి ?
జవాబు:
యణాదేశ సంధి.

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 15.
గేయం చదివి జవాబును గుర్తించండి.

పైన కఠినమనిపించును
లోన వెన్న కనిపించును
జీవమున్న మనిషి కన్న
శిలలే నయమనిపించును
ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో
ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో

ప్రశ్నలు – జవాబులు :
1. ఈ గేయంలో కనిపిస్తున్న అలంకారం – ( )
A) యమకం
B) అంత్యానుప్రాస
C) రూపకం
D) వృత్త్యానుప్రాస
జవాబు:
B) అంత్యానుప్రాస

2. మనిషి కన్నా నయమనిపించేవి – ( )
A) రాళ్ళు
B) శిల్పాలు
C) గుండెలు
D) సంతువులు
జవాబు:
A) రాళ్ళు

3. బండలు మాటున ఏమున్నాయంటున్నాడు కవి ? ( )
A) వెన్న
B) గుండెలు
C) జీవం
D) జంతువులు
జవాబు:
B) గుండెలు

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

4. పైకి కఠినంగా కనిపించేది ( )
A) రాళ్ళు
B) మనిషి
C) నలుపు
D) ఇనుము
జవాబు:
A) రాళ్ళు

5. ఇందులో దేని గొప్పతనం ఉంది ? ( )
A) శిల
B) కవి
C) వల
D) శర
జవాబు:
A) శిల

ప్రశ్న 16.
ఈ పద్యంను చదివి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

కుక్కగోవు గాదు : కుందేలు పులి గాదు
దోమ గజము గాదు దొడ్డదైన
లోభి దాత గాడు లోకంబు లోపల
విశ్వదాభిరామ! వినుర వేమ!

ప్రశ్నలు – జవాబులు :
1. ఎంత పెద్దదైనప్పటికీ దోమ దేనిగా మారదు ?
జవాబు:
ఎంత పెద్దదైనప్పటికీ దోమ గజంగా మారదు.

2. ఎన్ని సాధు లక్షణాలు ఉన్నా ఏది ఆవు కాజాలదు ?
జవాబు:
ఎన్ని సాధు లక్షణాలు ఉన్నా కుక్క ఆవు కాజాలదు.

3. లోకంలో దాతగా ఎవరు కాలేరు ?
జవాబు:
లోకంలో లోభి దాతగా కాలేడు.

4. పై పద్యం ఏ శతకంలోది ?
జవాబు:
పై పద్యం వేమన శతకంలోది.

5. పై పద్యానికి శీర్షిక సూచించండి.
జవాబు:
పై పద్యానికి శీర్షిక ‘గుణం మారదు’.

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 17.
ఈ క్రింది కవితను చదివి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ఆ బక్కపలుచని రూపం గుర్తొస్తే చాలు
ఒక్కసారిగా నా జాతి యావత్తూ
స్వేచ్ఛా విహంగమై విహరిస్తుంది.
ప్రపంచ విజేతలా తలెత్తుకు నిలుస్తుంది.
ప్రతి ఒక్క ఛాతీ ఆకాశమౌతుంది.
నరాలన్నీ ఒక్కొక్కటిగా
ఉక్కు తీగల్లా మారుతాయి.
ఉప్పొంగిన స్వరంతో
మీసం కుడిచేతి మునివేళ్ళ మధ్యకొస్తుంది !
రవి అస్తమించని సామ్రాజ్యాన్ని
సరిహద్దు కావలకు తరిమి
నిరంకుశ వలసపాలనకు
పాతర వేసినవారు ఆయనే కదా!
ఎముకల గూడు కాదది
ఏనుగుల గుంపు!

ప్రశ్నలు – జవాబులు :
1. ఈ కవిత ఏ వ్యక్తి గురించి తెల్పుతున్నది ?
జవాబు:
ఈ కవిత జాతిపిత మహాత్మాగాంధీ గురించి తెలుపు తున్నది.

2. విహంగం అంటే అర్థం ఏమిటి ?
జవాబు:
విహంగం అంటే పక్షి అని అర్థం.

3. కవి, నరాలను వేటితో పోల్చాడు ?
జవాబు:
కవి నరాలను ఉక్కు తీగలతో పోల్చాడు.

4. ‘ఏనుగుల గుంపు’ అనేది దేనికి సూచన ?
జవాబు:
‘ఏనుగుల గుంపు’ అనేది ఎముకల గూడుకు సూచన.

5. ఛాతి ఆకాశం కావడం – అంటే ?
జవాబు:
‘ఛాతి ఆకాశం కావడం’ అంటే ఆకాశంలా విస్తరించడం.

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 18.
కింది పద్యం చదువండి. తప్పొప్పులను గుర్తించండి. (తప్పైతే ‘తప్పు’ అని, ఒప్పైతే ‘ఒప్పు’ అని రాయండి.)

కూరిమిగల దినములలో
నేరము లెన్నడును గలుఁగ నేరవు మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ!

ప్రశ్నలు – జవాబులు
1. కూరిమి అనగా స్నేహము.
జవాబు:
ఒప్పు

2. నేరము అనగా మిత్రుడు.
జవాబు:
తప్పు

3. ఈ పద్యం సుమతీ శతకం లోనిది.
జవాబు:
ఒప్పు

4. విరసం అంటే తప్పులని అర్థం.
జవాబు:
తప్పు

5. నిక్కము అనగా నిజము.
జవాబు:
ఒప్పు

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 19.
క్రింది పద్యాన్ని చదివి, అర్థం చేసుకుని, ఇచ్చిన ఖాళీలను పూరించండి. (March 2015)

వాక్కు వలన గలుగు పరమగు మోక్షంబు,
వాక్కు వలన గలుగు పఠలు ఘనత,
వాక్కు వలన గలుగు నెక్కుడైశ్వర్యంబు
విశ్వదాభిరామ వినురవేమ !

ఖాళీలు
1. ఈ పద్యంలో మకుటం ………………………
జవాబు:
విశ్వదాభిరామ వినురవేమ !

2. ఘనత ………………….. కలుగుతుంది.
జవాబు:
వాక్కు వల్ల

3. పద్యంలో సంపదను సూచించే పదం ………………….
జవాబు:
ఐశ్వర్య

4. విశ్వదాభిరామ పదాన్ని విడదీస్తే ……………………
జవాబు:
విశ్వదా+అభిరామ

5. ఈ పద్యాన్ని …………………. కవి రచించాడు.
జవాబు:
వేమన

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 20.
క్రింది పద్యాన్ని చదివి, అర్థం చేసుకుని, ఇచ్చిన ఖాళీలను పూరించండి. (June 2015)

తలనుండు విషము ఫణికిని
వెలయంగాఁ దోఁక నుండు వృశ్చికమునకున్
దల తోఁక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ !

ఖాళీలు – జవాబులు :
1. పాముకు విషం ………………. లో ఉంటుంది.
జవాబు:
తల

2. వృశ్చికమనగా ………………….
జవాబు:
తేలు

3. శరీరమంత విషం ……………….. ఉంటుంది.
జవాబు:
ఖలునకు

4. పై పద్య మకుటం ………………………..
జవాబు:
సుమతీ

5. పై పద్యాన్ని రచించిన కవి ……………………
జవాబు:
బద్దెన

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 21.
కింది పద్యాన్ని చదివి చేసుకోండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (March 2016)

భూమి నాదియన్న భూమి ఫక్కున నవ్వు
ధనము నాదియన్న ధనము నవ్వు
కదన భీతుఁజూచి కాలుండు నవ్వును
విశ్వదాభిరామ వినురవేమ.

ప్రశ్నలు – జవాబులు :
1. భూమి ఫక్కున ఎందుకు నవ్వుతుంది ?
జవాబు:
భూమి నాది అని అన్నందుకు.

2. ధనము నాది అంటే ధనము ఏం చేస్తుంది ?
జవాబు:
ధనము నవ్వుతుంది.

3. కదన భీతుడంటే మీకేమర్థమైంది ?
జవాబు:
యుద్ధమంటే భయపడువాడు.

4. పై పద్యంలోని మకుటం ఏది ?
జవాబు:
విశ్వదాభిరామ వినురవేమ.

5. పై పద్యాన్ని రాసిన కవి ఎవరు ?
జవాబు:
వేమన

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 22.
కింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (June 2016)

ఆకొన్న కూడె యమృతము
తాకొంచక నిచ్చువాడె దాత ధరిత్రిన్
సోఁకోర్చువాఁడె మనుజుడు
తేఁకువ గలవాడె వంశతిలకుడు సుమతీ !

ప్రశ్నలు – జవాబులు :
1. నిజమైన దానశీలి ఎవరు ?
జవాబు:
తాకొంచక ఇచ్చువాడే దాత.

2. అన్నము ఎప్పుడు రుచిగా ఉంటుంది ?
జవాబు:
ఆకలి కలిగి ఉన్నప్పుడే అన్నం రుచిగా ఉంటుంది.

3. నిజమైన మనిషి అని ఎప్పుడు అంటారు ?
జవాబు:
సోకోర్చువాడే నిజమైన మనిషి అని అంటారు.

4. ఎవరు వంశానికి వన్నె తెస్తారు ?
జవాబు:
తేకువ గలవాడే వంశానికి వన్నె తెస్తాడు.

5. ఈ పద్యానికి మకుటము ఏది ?
జవాబు:
ఈ పద్యానికి మకుటము సుమతీ.

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 23.
కింది పద్యం చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.   (March 2017)

కం. కాకేమి తన్ను తిట్టెనె
కోకిల తననేమి ధనము కో కొమ్మనెనే,
లోకము పగయగు బరుసని
వాకున;జుట్టమగు మధురవాక్యమువలనన్

ప్రశ్నలు – జవాబులు :
1. ఎట్లా మాట్లాడితే లోకము చుట్టము అవుతుంది ?
జవాబు:
మధురముగా మాట్లాడితే లోకము చుట్టము అవుతుంది.

2. ఎట్లా మాట్లాడితే లోకము శత్రువౌతుంది ?
జవాబు:
కఠినముగా మాట్లాడితే లోకము శత్రువు అవుతుంది.

3. పై పద్యంలో పరుషముగా మాట్లాడేవారికి ఉదాహ రణగా దేనిని చూపాడు ?
జవాబు:
పై పద్యంలో పరుషముగా మాట్లాడేవారికి ఉదాహరణగా కాకిని చూపాడు.

4. పై పద్యంలో కోకిలను దేనికి ఉదాహరణగా చూపాడు ?
జవాబు:
కోకిలను మధురముగా మాట్లాడేదానికి ప్రతీకగా చూపాడు.

5. పై పద్యానికి శీర్షికను పెట్టండి.
జవాబు:
పై పద్యానికి ‘మధురవచనము’ అనే శీర్షిక తగినది.

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 24.
కింది పద్యం చదువండి. తప్పొప్పులను గుర్తించండి. (June 2017)

కూరిమిగల దినములలో
నేరము లెన్నడును గలుఁగ నేరవు మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ!

ప్రశ్నలు – జవాబులు :
1. కూరిమి అనగా స్నేహము. (   )
జవాబు:
ఒప్పు (✓)

2. ‘నేరము’ అనగా మిత్రుడు. (   )
జవాబు:
తప్పు (✗)

3. ఈ పద్యం సుమతీ శతకం లోనిది. (   )
జవాబు:
ఒప్పు (✓)

4. ‘విరసం’ అంటే తప్పులని అర్థం. (   )
జవాబు:
తప్పు (✗)

5. నిక్కము అనగా నిజము. (   )
జవాబు:
ఒప్పు (✓)

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 25.
కింది పద్యం చదివి ఆ తరువాత గల ప్రశ్నలకు జవాబులు రాయండి. (March 2018)

కోపమునను ఘనత కొంచెమై పోవును
కోపమునను మిగుల గోడు గలుగు
కోపమడచె నేని కోరిక లీడేరు
విశ్వదాభిరామ వినుర వేమ!

ప్రశ్నలు – జవాబులు :
1. కోపం వలన తగ్గేది ఏది ?
జవాబు:
కోపం వలన తగ్గేది ఘనత.

2. దుఃఖం ఎప్పుడు కలుగుతుంది ?
జవాబు:
దుఃఖం కోపం ఉన్నప్పుడు కలుగుతుంది.

3. కోపం అణచివేస్తే తీరేవి ఏవి ?
జవాబు:
కోపం అణచివేస్తే తీరేవి కోరికలు.

4. ‘కొంచెమైపోవును’ అంటే మీరేమి అర్థం చేసు కున్నారు ?
జవాబు:
తగ్గిపోతుంది

5. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘కోపము’.

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 26.
కింది పద్యం చదువండి. ఆ తర్వాత కింది వాక్యాలలోని తప్పొప్పులను గుర్తించి బ్రాకెట్లో సూచించండి. (June 2018)

పత్రికొక్కటున్న పదివేల సైన్యంబు
పత్రికొక్కటున్న మిత్రకోటి
పత్రిక లేకున్న ప్రజకు రక్షలేదు
వాస్తవమ్ము నార్లవారి మాట.

ప్రశ్నలు – జవాబులు :
1. పది వేల సైన్యానికి పత్రిక ఒకటే ఉన్నది. (   )
జవాబు:
తప్పు (✗)

2. ఒక పత్రిక కోటి మిత్రులతో సమానం. (   )
జవాబు:
ఒప్పు (✓)

3. నార్లవారి మాట అవాస్తవం. (   )
జవాబు:
తప్పు (✗)

4. పత్రికల వలన కూడా ప్రజలకు రక్షణ లభిస్తుంది. (   )
జవాబు:
ఒప్పు (✓)

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

5. పై పద్యం పత్రికల గొప్పతనాన్ని తెలియజేస్తుంది. (   )
జవాబు:
ఒప్పు (✓)

TS 10th Class Telugu Grammar లేఖలు

Telangana SCERT 10th Class Telugu Grammar Telangana లేఖలు Questions and Answers.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 1.
కోపం వల్ల కలిగే అనర్థాలను తెలుపుతూ సోదరి / సోదరుడికి లేఖ రాయండి.
జవాబు:

నల్గొండ,
ది. 10-10-2018.

ప్రియమైన సోదరి / సోదరుడు,

నీ సోదరి / సోదరుడు వ్రాయునది. ముందుగా నీకు నా శుభాకాంక్షలు. ముఖ్యంగా వ్రాయునది అరిషడ్వర్గాలలో కోపం అత్యంత ప్రమాదకరమైనది. కోపం మానవునికి అంతర్గతమైన శత్రువు. కోపం ప్రశాంతతను దెబ్బతీస్తుంది. తోటివారిని ప్రశాంతంగా ఉండనీయదు. విచక్షణా జ్ఞానం క్రమంగా తొలగుతుంది. ఆప్తులు, స్నేహితులు దూరమౌతారు. సంపదలు తొలగిపోతాయి. సంస్కారం చెడిపోతుంది. ప్రేమాభిమానాలకు దూరమౌతారు. అనారోగ్య సమస్యలు ఎదురౌతాయి. కోపం వల్ల ఎన్నో దుర్గుణాలు కూడా కలుగుతాయి. అందువల్ల మనం కోపాన్ని దూరం చేసుకోవాలి. అప్పుడే మనం సుఖమయ జీవితాన్ని గడుపుతాము. అందరికి ఆదర్శంగా ఉండగలుగుతాము.

ఇట్లు,
నీ ప్రియ సోదరి / సోదరుడు,
xxxx

చిరునామా:
XXXXXX,
10వ తరగతి, నిర్మల ఉన్నత పాఠశాల,
పాల్వంచ,
ఖమ్మంజిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 2.
మీ పాఠశాలలో జరిగిన స్వయం పాలనా దినోత్సవం గురించి మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

మిత్రునికి లేఖ

వరంగల్,
X X X X

మిత్రుడు శేఖర్కు,

నీ లేఖ చేరింది. ఉభయ కుశలోపరి. గత నెల 26.1.2017న మా పాఠశాలలో మహా వైభవంగా స్వయంపాలన దినోత్సవం జరిగింది. ఆ రోజు మేము మా పాఠశాలను రంగు కాగితాలతో, మామిడి తోరణాలతో చక్కగా అలంకరించాము. 26వ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు మా ఎమ్.పి. గారు, మా పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేశారు. మా ఎన్.సి.సి. విద్యార్థులు వందనం చేశారు. మేమంతా ఒకే కంఠంతో జెండా పాట పాడాము.

తరువాత సభ జరిగింది. ఆ సభకు స్థానిక ఎమ్.ఎల్.ఏ గారు అధ్యక్షత వహించారు. ఎమ్.పి. గారు, ఎమ్.ఎల్.ఏ. గారు, మా ప్రధానోపాధ్యాయులు స్వయంపాలన దినోత్సవం ప్రాముఖ్యతను గూర్చి మాకు వివరించారు. ఈ సందర్భంగా జరిగిన పోటీలలో గెలిచిన వారికి బహుమతులు పంచారు. నా నాయకత్వంలోని క్రికెట్ టీముకు, మొదటి బహుమతి వచ్చింది. డా. బి.ఆర్. అంబేద్కర్, పండిట్ నెహ్రూజీ, పటేల్ వంటి దేశనాయకుల సేవలను మేము గుర్తు చేసుకున్నాము.

విద్యార్థినీ, విద్యార్థులకు మిఠాయిలు పంచారు. తప్పక లేఖలు రాస్తూ ఉండు. ఉంటాను.

ఇట్లు,
నీ మిత్రుడు,
XXXXXXX

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 3.
మీ పాఠశాలలో జరిగిన వార్షికోత్సవమును గూర్చి మిత్రునకు లేఖ వ్రాయండి.
జవాబు:

నిజామాబాద్,
16-2-2018.

ప్రియమైన మిత్రునకు,

నేను కులాసాగా ఉన్నాను. నీవు క్షేమమని అనుకుంటాను. ప్రతి సంవత్సరం లాగానే మా పాఠశాల వార్షికోత్సవం 14వ తేదీన చాలా ఘనంగా జరుపుకున్నాము. వార్షికోత్సవానికి ముందే వ్యాస రచన, వక్తృత్వము, ఆటల పోటీలు జరుపబడ్డాయి. వార్షికోత్సవానికి మా పాఠశాలకు తనిఖీకి వచ్చు ఉప విద్యాశాఖాధికారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. వార్షికోత్సవం పిల్లలకు ఆనందం ఇచ్చే అంశం. కనుక మేము పాఠశాల ఆవరణను, తరగతి గదులను అందంగా అలంకరించాము.

పాఠశాల కమిటీ కార్యదర్శిగారు జాతీయ జెండాను ఎగురవేశారు. రాబోయే పరీక్షలలో మంచి మార్కులతో విద్యార్థులు ఉత్తీర్ణులు అయి పాఠశాలకు పేరు తేవాలని ముఖ్య అతిథి సందేశమిచ్చారు. సభకు ప్రధానోపాధ్యాయులు అధ్యక్షత వహించారు. పోటీలలో విజేతలకు విద్యాశాఖాధికారిగారు బహుమతులిచ్చారు. నాకు వ్యాసరచనలో ప్రథమ బహుమతిగా తెలుగు నిఘంటువు ఇచ్చారు. తర్వాత విద్యార్థులు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. మీ పాఠశాలలో వార్షికోత్సవం జరిగినదా ? జరిగినచో ఆ విశేషాలు నాకు తెలుపగలవు.

ఇట్లు,
నీ స్నేహితుడు,
X X X X X.

చిరునామా:
ఎ. సుబ్రహ్మణ్య శర్మ,
10వ తరగతి – ‘ఏ’ సెక్షన్,
రామలింగేశ్వరరావు హైస్కూల్,
శాంతినగర్, కరీంనగర్ – 12.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 4.
మీకు నచ్చిన పుస్తకాన్ని గూర్చి సోదరునికి లేఖ వ్రాయండి.
జవాబు:

చేవెళ్ళ,
10-8-2018.

ప్రియమైన సోదరుడు సాంబశివరావుకు,

నేను బాగానే చదువుతున్నాను. ఈ మధ్య నాన్నగారు బారిష్టరు పార్వతీశం అనే పుస్తకాన్ని ఎగ్జిబిషన్లో కొని తెచ్చారు. నేను దాన్ని చదివాను. పార్వతీశంలోని పల్లెటూరితనమూ, పుట్టినరోజుకు అతని మిత్రులు చేసిన హంగామా భలే బాగున్నాయి. పార్వతీశం ఆవకాయజాడీ, గొడుగు, ట్రంకు పెట్టెలతో విదేశీ ప్రయాణానికి వెళ్ళడం చదివి కడుపుబ్బ నవ్వుకున్నాను. తివాచీ తొక్కకూడదని అనుకొని ప్రక్కగా నడిచి పడటము చదువుతుంటే ఇలాంటివారు ఆ కాలంలో నిజంగా ఉన్నారా అనిపించింది. మొత్తం మీద మొక్కపాటి నరసింహ శాస్త్రిగారి ఈ నవల చదివేవారిని ఆకర్షిస్తుందనడం సత్యము. నీవు కూడా సెలవుల్లో గ్రంథాలయానికి వెళ్ళి ఈ పుస్తకం తప్పక చదవగలవు.

ఇట్లు,
నీ అన్నయ్య,
X X X X X.

చిరునామా:
ఐ. సాంబశివరావు,
10వ తరగతి,
రామకృష్ణ ఉన్నత పాఠశాల,
నల్గొండ.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 5.
రక్తదానం అవసరాన్ని తెలియజేస్తూ మిత్రునకు లేఖ వ్రాయండి.
జవాబు:

రంగారెడ్డి,
28-9-2018.

ప్రియమైన మిత్రునకు,

నీ మిత్రుడు వ్రాయునది. రక్తం యొక్క ఉపయోగాలు నీకు కూడా తెలుసుగదా ! రోగులకు రక్తం ప్రాణదాత. అనారోగ్యవంతునకు శరీరంలో రక్తం తగ్గిపోతోంది. ఆపరేషన్ల సమయంలో రోగి చాలా రక్తాన్ని కోల్పోతాడు. ఆ సమయంలో శరీరంలోకి పంపేందుకు రక్తం చాలా అవసరం. ఎవరో ఒకరు రక్తాన్ని దానం చేస్తేనే రోగి మరల బ్రతుకుతాడు. అంటే రక్తదానం చాలా గొప్పది. ఒక జీవికి ప్రాణం పోస్తుంది. ప్రతి మనిషి జీవితంలో ఒకసారైనా రక్తదానం చేయడం అవసరం అని పెద్దలు చెబుతారు. రెడ్ క్రాస్ సంస్థ, కొన్ని స్వచ్ఛంద సంస్థలు రక్తదాన శిబిరాల ద్వారా రక్తాన్ని సేకరించి ఉంచి, అవసరమైన రోగులకు ఉపయోగిస్తున్నాయి. విద్యార్థులమైన మనం ఈ విషయాలన్నీ తెలుసుకొని, ఆచరించాలని నీకు వ్రాస్తున్నాను.

పరీక్షలు కాగానే సెలవులకు ఇక్కడకు రాగలవు.

నీ మిత్రుడు,
XXXXX.

చిరునామా:
ఎ. జగదీష్ కుమార్,
10వ తరగతి,
వివేకానంద మెమోరియల్ హైస్కూల్,
ఆదిలాబాద్.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 6.
నీవు చూసిన యాత్రాస్థలమును వివరిస్తూ, ఇతర ప్రాంతములో చదువుతున్న నీ సోదరికొక లేఖ వ్రాయండి.
జవాబు:

మహబూబ్నగర్,
16-2-2018.

ప్రియమైన సోదరికి,

నీ అన్నయ్య వ్రాయునది. సంక్రాంతి సెలవులకు మా పాఠశాల ఉపాధ్యాయులు మమ్మల్ని విహార యాత్రకు తీసుకొని వెళ్ళారు. మన రాష్ట్రంలో విహారయాత్రా స్థలంగా పేరుపొందిన నాగార్జున సాగర్కు వెళ్ళాము. పూర్వము బౌద్ధ పండితుడైన నాగార్జునుడు ఇక్కడే నివసించెనట. ఈయన తత్త్వవేత్తయేగాక, ఆయుర్వేద పండితుడు కూడా. కృష్ణానదిపై ఇక్కడ నాగార్జునసాగర్ ప్రాజెక్టు కట్టబడింది. రెండు కొండల మధ్య ఇది నిర్మితము.

ఆనకట్ట వెనుక సరోవరం కలదు. సరోవరం నీటిలో చారిత్రక శిథిలాలు మునిగిపోకుండా వాటిని కొండపై నిర్మించిన మ్యూజియంలో ప్రభుత్వం భద్రపరిచింది. మ్యూజియంలో అనేక పాలరాతి శిల్పాలు, బౌద్ధవిగ్రహాలు, పనిముట్లు మొదలైనవి చాలా చూశాము. చుట్టూ గల ప్రకృతి దృశ్యాలు కూడా రమణీయంగా ఉన్నాయి. మా ఉపాధ్యాయులు అన్ని వివరాలు తెలియజేశారు. ప్రకృతి దృశ్యాలు – చారిత్రక ప్రసిద్ధి గల ఈ స్థలాన్ని నీవు కూడా తప్పక చూడాలని కోరుతున్నాను. అమ్మా, నాన్నలకు నా నమస్కారాలు చెప్పగలవు.

ఇట్లు,
నీ ప్రియమైన అన్నయ్య,
XXXX.

చిరునామా:
కె. సుజాత,
10వ తరగతి,
రామకృష్ణ మెమోరియల్ హైస్కూల్,
ఖమ్మం.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 7.
గురుపూజోత్సవం గురించి మిత్రునికి లేఖ వ్రాయండి.
జవాబు:

మెదక్,
10-9-2018.

ప్రియమిత్రుడు ఆనంద్కు,

గడచిన సెప్టెంబర్ 5న మా పాఠశాలలో గురు పూజోత్సవం బ్రహ్మాండంగా జరుపుకున్నాము. ఆ రోజు మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. ఆయన జయంతినే ప్రభుత్వం గురుపూజోత్సవ దినంగా ప్రకటించింది కదా ! ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు డా ॥ రాధాకృష్ణగారి జీవిత విషయాలను, మాకు తెలిపినారు. మేము మా పాఠశాలలోని ఉపాధ్యాయు లందరిని ఆరోజున ప్రత్యేకంగా సన్మానించాం. వారి ఆశీర్వచనాలు పొందాము. మనకు విద్య నేర్పుతున్న గురువులను గౌరవించి సన్మానించడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది.

ఇట్లు
నీ ప్రియ మిత్రుడు,
XXXXX.

చిరునామా:
ఎస్. ఆనంద్,
10వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,
ఖైరతాబాద్,
హైదరాబాదు.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 8.
మొక్కల పెంపకం ఆవశ్యకత గురించి పత్రికా సంపాదకునకు లేఖ రాయండి.
జవాబు:

హైదరాబాద్,
తేది : 10-7-2018.

ఈనాడు పత్రికా సంపాదకులకు,

ఆర్యా,

మన హైదరాబాద్ నగరం వివిధ కాలుష్యాలకు లోనవుతూ ప్రజాజీవనం చాలా దుర్భరంగా తయారయింది. పట్టణాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి, జనాభా పెరుగుదల అనేక కారణాలు ప్రకృతిని కాలుష్యానికి గురిచేస్తున్నాయి. మంచిగాలి, మంచి వాతావరణం రోజురోజుకూ కరువైపోతున్నాయి.

ప్రకృతిలోని పచ్చనిచెట్లు మనిషికి స్వచ్ఛమైన గాలిని ప్రసాదించి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఈ విషయాన్ని గ్రహించి అందరు తమ ఇండ్లలోను, పరసర ప్రాంతాలలోను, రోడ్ల ప్రక్కన మొక్కలను పెంచి నగర కాలుష్యం నుండి బయటపడునట్లు సహ కరించవలసిందిగా మీ పత్రికా ముఖమున కోరు తున్నాము.

ఇట్లు
తమ విధేయుడు,
పి. శ్రీరాం.

చిరునామా:
పత్రికా సంపాదకుడు,
ఈనాడు దినపత్రిక,
వెస్ట్ మారేడ్పల్లి, సికింద్రాబాద్.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 9.
కుటుంబంలో సమాజంలో స్త్రీల పాత్ర గురించి నీ స్నేహితురాలికి లేఖ రాయండి.
జవాబు:

వరంగల్,
తేది : 10-8-2018.

ప్రియ స్నేహితురాలు జానకికి,

నీ మిత్రురాలు రాయునది. ఇక్కడ నేను క్షేమం. అక్కడ నీవు క్షేమమని తలుస్తున్నాను. నీవు ఎలా చదువుతున్నావు ? నేను ఈ లేఖలో ‘కుటుంబంలో సమాజంలో స్త్రీల పాత్ర’ గురించి తెలుపుతాను.

భారతీయ సంస్కృతిలో స్త్రీలకు ప్రాధాన్యత ఇవ్వబడింది. ఒకనాడు మనదేశంలో మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది. కుటుంబ పెద్దగా తల్లి నిర్ణయాలు తీసుకొనేది. తల్లి విద్యావంతురాలైతే కుటుంబమంతా తీర్చిదిద్దబడుతుంది. చరిత్రలో ఎందరో తల్లులు బిడ్డలను ఉత్తములుగా తయారు చేశారు. అందుకే ‘ఇల్లాలు చదువు – ఇంటికి వెలుగు’ అని సూక్తి. తల్లిగా, భార్యగా, సోదరిగా కుటుంబాన్ని సక్రమంగా ఉంచడంలో స్త్రీల ప్రాధాన్యత ఎంతైనా ఉంది. చిన్నప్పుడే తమ పిల్లలకు నీతి పద్యాలు, పురాణ, ఇతిహాసాలు గురించి చెప్పినట్లైతే వారు సంస్కార వంతులుగా రూపొందుతారు.

సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను, దురా చారాలను, అవినీతిని రూపుమాపడానికి ఎందరో స్త్రీలు కృషిచేశారు. నేటికాలంలో కూడా అన్యాయాలకు, అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో స్త్రీలు సమర్థవంతంగా తమ బాధ్యతను నిర్వహించాలి. నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా చేసి, వారి సమస్యల పరిష్కారం కోసం కూడా విద్యా వంతులైన స్త్రీలు కృషి చేయాలి. మొత్తానికి రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో స్త్రీలు ప్రధానపాత్ర వహించి దేశాభివృద్ధికి దోహద పడతారని ఆశిస్తున్నాను.

ఇట్లు
నీ ప్రియమిత్రురాలు,
X X X X X.

చిరునామా:
బి. జానకి,
10వ తరగతి,
రామకృష్ణ స్కూల్,
మణుగూరు, ఖమ్మంజిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 10.
మీ వీధిలో పారిశుద్ధ్య పరిస్థితిని గూర్చి వివరించుచు సంబంధిత అధికారికి లేఖ రాయండి.
జవాబు:

జగిత్యాల,
తేది : 10-11-2018.

మున్సిపల్ ఆరోగ్యశాఖాధికారి గారికి నమస్కరించి వ్రాయు విన్నపము.

అయ్యా,

నేను కరణం గారి వీధిలో నివాసం ఉంటున్నాను.. మా వీధిలో ఎక్కడ చూసినా చెత్త, దుమ్ము, మురికి కనిపిస్తున్నాయి. చెత్త వెయ్యడానికి చెత్త కుండీలు లేవు. మురికినీరు కాలువలు నిండిపోయి రోడ్డుమీదే ప్రవహిస్తుంది. ఇక దుర్గంధం చెప్పడానికి వీలులేదు. ఆ మురికివల్ల దోమల బాధకూడా ఎక్కువైంది. దీనివల్ల మలేరియా సోకే ప్రమాదముంది. కాబట్టి మా వీధి పారిశుద్ధ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిందిగా ప్రార్థిస్తున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
X X X X X X X.

చిరునామా:
ఆరోగ్యశాఖాధికారి గారు,
పురపాలక సంఘ కార్యాలయం,
జగిత్యాల, కరీంనగర్ జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 11.
మరుగుదొడ్ల నిర్మాణ ఆవశ్యకతను గూర్చి జిల్లా కలెక్టరుకు ఒక వినతిపత్రం రాయండి.
జవాబు:

ఉట్నూరు,
తేది : 10-07-2018.

ఆదిలాబాద్ జిల్లా కలెక్టరుగారి దివ్యసముఖమునకు,
ఉట్నూరు గ్రామ నివాసి వ్రాయు విన్నపం.

అయ్యా,

మాది ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు గ్రామం. మా గ్రామంలో ఎంతోమంది నిరుపేదలు నివ సిస్తున్నారు. ఏ రోజుకు ఆ రోజు కాయకష్టం చేసుకొని జీవిస్తున్నారు. మా గ్రామ ప్రజలు మరుగు దొడ్ల సౌకర్యంలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడపడితే అక్కడ మలమూత్ర విసర్జన చేయడం వల్ల గ్రామంలోని వారంతా అనారోగ్యం పాలవు తున్నారు.

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు పెద్దలు. అందువల్లే ప్రభుత్వం కూడా ప్రజల ఆరోగ్య పరిరక్షణ బాధ్యతను చేపట్టి ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుంది. కాబట్టి మా గ్రామంలో హడ్కో పథకం కింద మరుగుదొడ్ల నిర్మాణం జరుగునట్లు చూడవలసినదిగా మనవి చేస్తున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
X X X X X.

చిరునామా:
జిల్లా కలెక్టరుగారు,
జిల్లా కలెక్టరు గారి కార్యాలయం,
ఆదిలాబాద్ జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 12.
స్వచ్ఛభారత్ కార్యక్రమం గూర్చి మిత్రునకు లేఖ వ్రాయండి.
జవాబు:

భద్రాచలం,
23-3-2018.

ప్రియ స్నేహితుడు రవికి,

ఇచ్చట నేను క్షేమం. అచ్చట నీవు క్షేమమని తలుస్తాను. ముఖ్యముగా మా పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నాం. ముఖ్య అతిథిగా మా ప్రాంత యం.యల్.ఎ.గారు విచ్చేసారు. మా పాఠశాల ఆవరణ పరిశుభ్రం చేసాము.

ఈ ఉద్యమం దేశమంతా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ గారి స్ఫూర్తితో విజయవంతమైంది. ఎందరో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ పాఠశాలలో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గురించి తెలుపగలవు.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
X X X X X.

చిరునామా:
పి. రవి,
10 వ తరగతి,
జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల,
మిర్యాలగూడ,
నల్గొండజిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 13.
పెద్దనోట్ల రద్దుపై నీ అభిప్రాయాన్ని తెలుపుతూ మిత్రునికి లేఖ వ్రాయండి.
జవాబు:

నిజామాబాద్,
23-3-2018.

ప్రియమైన మిత్రుడు రామచంద్రకు,

నీ మిత్రుడు వ్రాయునది, నేను బాగా చదువు తున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యంగా వ్రాయునది ఇటీవల మన ప్రధానమంత్రిగారు పెద్ద నోట్లను రద్దు చేశారు. అవినీతిపరులపై సింహస్వప్నంగా నిలిచారు. దేశంలో పేరుకుపోయిన నల్లధనాన్ని వెలికి తీయడానికి ఈ చర్య దోహదం చేస్తుంది. కొద్దిరోజులు ప్రజలు అసౌకర్యాలు పొందినది, దీర్ఘకాలికంగా ఈ చర్య సత్ఫలితాలను అందించగలదని ఆశిస్తున్నాను. ఈ విషయంలో నీ అభిప్రాయాన్ని తెలుపగలవు.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
X X X X X.

చిరునామా:
పి. రామచంద్ర,
10 వ తరగతి,
నెహ్రూ ఉన్నతపాఠశాల,
కరీంనగర్.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 14.
కోపం తగ్గించుకోవడం మంచిది అనే అంశాన్ని బోధిస్తూ, మిత్రుడికి లేఖ రాయండి. (June 2016) (June 2015)
జవాబు:

హైదరాబాదు,
X X X.

మిత్రుడు రఘునందను,

నీ లేఖ అందింది. నేనూ, మా తల్లిదండ్రులు క్షేమం. నీవు రాసిన లేఖలో నీ ప్రియమిత్రుడైన సీతారామ్తో, నీకు తగవు వచ్చిందనీ, మీరు కొట్లాడుకున్నారనీ రాశావు.

నీ ఉత్తరం చూసి, నేను చాలా బాధపడ్డాను. సహజంగా నీవు శాంత స్వభావుడవు. నీకు కోపం ఎందుకు వచ్చిందో రాశావు. అయినా దెబ్బలు తగిలేటంతగా మీ మిత్రులు దెబ్బలాడుకోవడం ఏమీ బాగాలేదు.

‘తన కోపమె తన శత్రువు’ అని సుమతీ శతక కర్త రాశాడు. “క్రోధము మనకు శత్రువు” అని భర్తృహరి కూడా చెప్పాడు. అయినా నీకు అన్ని విషయాలు తెలుసు.

కోపం వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. కోపంతో మన వివేకం నశిస్తుంది. మనం మూర్ఖులం అయిపోతాము. పశువులవలె అయిపోతాము. కాబట్టి నీవు కోపం తగ్గించుకో. నీ మిత్రుడితో నీ విరోధం విషయం, మీ తల్లిదండ్రులకు చెప్పు. వారే మీ తగవు తీరుస్తారు. కోపం తగ్గించుకొని, శాంతంగా ఉండమని నిన్ను నేను కోరుతున్నా.

త్వరలో నీవు, సీతారామ్, తిరిగి మిత్రులవుతారని నాకు నమ్మకం. ఉంటా…

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
అవసరాల యుగంధర్,
10వ తరగతి,
భాష్యం హైస్కూలు, అమీర్పేట.

చిరునామా :
కె. రఘునందన్,
S/o. కె. రాజారావు గారు,
ఇంటి నెం. 4-1-101,
వరంగల్లు, తెలంగాణ,

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 15.
మీ పాఠశాలలో జరిగిన స్వయంపాలన దినోత్సవం గురించి మిత్రునికి లేఖ రాయండి. (March 2016)
జవాబు:
మిత్రునికి లేఖ

కరీంనగర్,
X X X X X.

మిత్రుడు శేఖర్కు, / మిత్రురాలు కవితకు,

నీ లేఖ చేరింది. ఉభయ కుశలోపరి. గత నెల 26.1.2017న మా పాఠశాలలో మహా వైభవంగా స్వయంపాలన ‘దినోత్సవం జరిగింది. ఆ రోజు మేము మా పాఠశాలను రంగు కాగితాలతో, మామిడి తోరణాలతో చక్కగా అలంకరించాము. 26వ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు మా MP గారు, మా పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేశారు. మా NCC విద్యార్థులు వందనం చేశారు. మేమంతా ఒకే కంఠంతో జెండా పాట పాడాము.

తరువాత సభ జరిగింది. ఆ సభకు స్థానిక MLA గారు అధ్యక్షత వహించారు. MP గారు, MLA గారు, మా ప్రధానోపాధ్యాయులు స్వయంపాలన దినోత్సవం ప్రాముఖ్యతను గూర్చి మాకు వివరించారు. ఈ సందర్భంగా జరిగిన పోటీలలో గెలిచిన వారికి బహుమతులు పంచారు. నా నాయకత్వంలోని క్రికెట్ టీముకు, మొదటి బహుమతి వచ్చింది. డా.బి.ఆర్ అంబేద్కర్, పండిట్ నెహ్రూజీ, పటేల్ వంటి దేశనాయకుల సేవలను మేము గుర్తు చేసుకున్నాము.

విద్యార్థినీ, విద్యార్థులకు మిఠాయిలు పంచారు. తప్పక లేఖలు రాస్తూ ఉండు. ఉంటాను.

ఇట్లు,
నీ మిత్రుడు, / మిత్రురాలు,
కె. రవి / పి. నీరజ,

చిరునామా :
S. శేఖర్, / P. కవిత,
పదవ తరగతి,
నెహ్రూజీ కాన్వెంట్,
ఖమ్మం, తెలంగాణ.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 16.
పుస్తకంలోని ‘ముందుమాట’ యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ మీ మిత్రుడికి / మిత్రురాలికి ‘లేఖ’ రాయండి. (June 2019)
జవాబు:

వరంగల్లు,
X X X X X,

ప్రియమైన మణికి,

నేను క్షేమము. నీవు క్షేమమని తలుస్తాను. నేను మొన్న ఒక పుస్తకం చదివాను. అది చాలా బాగుంది. దాని ముందుమాట చాలా గొప్పగా రాశారు. పుస్తకాలు చదివితే విజ్ఞానం, వివేచనాశక్తి, ఉత్సాహం, ఆనందం, పరిశీలనా దృష్టి, జిజ్ఞాస కలుగుతాయి. పుస్తకాన్ని చదవాలంటే ఆ పుస్తక పరిచయ వాక్యాలు చదవాలి. అవి ఆసక్తిని కల్గిస్తాయి. వాటిని ముందుగా చదవాలి. పుస్తకం ఆశయం గురించి, దాని అంతస్సారాన్ని గురించి, గ్రంథనేపథ్యాన్ని గురించి రచయితగానీ, మరొకరు గానీ, విమర్శకులు గానీ రాసే పరిచయవాక్యాలు, పుస్తకాన్ని చదువాలనే ఆసక్తిని కల్గిస్తాయి.

ఉదాహరణకు బారిష్టరు పార్వతీశం, మహాప్రస్థానం, భారత రామాయణ కథలు వంటి పుస్తకాల ముందుమాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. దీనినే పీఠికని, ముందుమాట, భూమిక, ప్రస్తావన, తొలిపలుకు, మున్నుడి, ఆముఖం మొదలైన పేర్లతో పిలుస్తారు.

మెతుకును చూసి అన్నం ఉడికిందో లేదో చెప్పవచ్చు. అట్లే “పుస్తక పరిచయ వ్యాసాన్ని లేదా సమీక్షను చదివితే కూడా ‘ఆ పుస్తకం గురించి ఆమూలాగ్రంగా అర్థం చేసుకోవచ్చని” చెప్పవచ్చు.
పుస్తకం ద్వారా మనం ఏ విషయాలు తెలిసికోగలమో, ఇంకా ఏయే విషయాలు ఆ గ్రంథంలో తెలియచేస్తే బాగుండేదో, పుస్తక పరిచయంలో రాయబడుతుంది. కాబట్టి పుస్తక పరిచయ వ్యాసం, ఆ గ్రంథాన్ని మనకు చక్కగా పరిచయం చేస్తుంది. పుస్తక పరిచయం చదివితే రేఖా మాత్రంగానైనా ఆ పుస్తకాన్ని గురించి తెలుసుకోవచ్చు.

కాబట్టి పుస్తకంలోని ముందుమాట యొక్క ప్రాముఖ్యతను, దాని ప్రాధాన్యతను గురించి నాకు తెలిసిన విషయాలు తెలియచేసాను. నీకు తెలిసిన విషయాలు నీవు తెలియచేయగలవు.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
బి.యన్. రాజు.

చిరునామా :
కె. మణి
నెం : 6, 10వ తరగతి..
జిల్లా పరిషత్ హైస్కూల్, లోనికలాన్,
మెదక్ జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 17.
ప్రభుత్వోద్యోగముల కోసం వెంపర్లాడకుండా, సొంతకాళ్ళపై నిలవాల్సిన ఆవవ్యకతను తెల్పుతూ మిత్రునకు లేఖ.
జవాబు:

నిజామాబాద్,
X X X X X.

మిత్రమా రాజశేఖరా !
నమస్కారం !!

నీ లేఖ చేరింది. నీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించలేదని వ్రాశావు. నీవు ఇప్పటికే B.Sc. అగ్రికల్చరల్ డిగ్రీ పట్టాను పొందావు. మీకు ఉమ్మడి వ్యవసాయం ఉందికదా ! పైగా 50 ఎకరాల భూస్వాములు మీరు. మీ నాన్నగారు. పెద్దవారు అవుతున్నారు.

ఆధునిక పద్ధతులు తెలిసిన నీవు వ్యవసాయం చేయించడంలో అనేక మెలకువలను పాటించు. ట్రాక్టర్లను తీసుకో. నీరు లేని పొలాల్లో బోర్లు వేయించు. నీటి సౌకర్యం ఉన్నచోట అంతర పంటలుగా కూరగాయల్ని పండించు. వాణిజ్యపు పంటలు పండించు. ఇపుడు మన ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేసింది. కనుక పండిన కూరగాయల్ని రైతు బజార్లలో అమ్మి మంచి ఫలసాయం పొందవచ్చును కదా !

వ్యవసాయానికి తోడు పాడిపరిశ్రమను కూడా ఏర్పాటు చెయ్యి. నీతో మరికొందరి యువకుల్ని ప్రోత్సహించు. నీ కాళ్ళపై నీవు నిలబడటమే కాక మరికొంతమందికి ఆశ్రయం కల్పించు. చదువుకున్నవాళ్ళు ముఖ్యంగా సిరిసంపదలు కల్గిన వాళ్ళు తమ తమ సొంతకాళ్ళపై నిలబడి కుటీర పరిశ్రమల్ని, ప్రోత్సహించే పరిస్థితిని కల్పించు. నీ కారణంగా మీ గ్రామంలోనున్న యువకులకు ఆదర్శప్రాయుడివై మార్గదర్శకుడవుతావు. అంతేకాక నీ గ్రామమే ఆదర్శవంతమవుతుంది. మన ప్రభుత్వాలు నిన్ను గుర్తించి, అనేక అవార్డులతో నిన్ను సత్కరిస్తారని ఆశిస్తున్నాను.

ఇట్లు,
నీ మిత్రుడు,
X X X X X.

చిరునామా :
పొన్నం రాజశేఖర్,
S/O పొన్నం వెంకటేష్,
బెల్లంపల్లి (PO), ఆదిలాబాదు జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 18.
నీవు చూచిన ఒక నగరంలోని విశేషాలను వర్ణిస్తూ నీ మిత్రునకు లేఖ.
జవాబు:

నాగార్జున సాగర్,
X X X X X,

ప్రియమిత్రునకు నమస్కారం !
ఉభయకుశలోపరి !

నీ వద్దనుండి ఎటువంటి సమాచారం లేదు. నేను గడచిన సంక్రాంతి సెలవులకు భాగ్యనగరమైన మన రాష్ట్ర రాజధాని హైదరాబాదు వెళ్ళాను. అక్కడ గడిపిన సెలవుల రోజులలో ఎంతో విజ్ఞాన దాయకంగా గడిచింది.

హైదరాబాదు, సికింద్రాబాద్లను కలిపే ట్యాంక్ బండ్ మరింతగా అభివృద్ధి చేసింది మన ప్రభుత్వం. హుస్సేన్ సాగర్, అందులో నిలబెట్టిన బుద్ధ విగ్రహం అత్యంత మనోహరంగా ఉంది. బోటు షికారు చేశాను.

సాలార్జంగ్ మ్యూజియం, పబ్లిక్ గార్డెన్స్, అక్కడే ఉన్న అసెంబ్లీ భవనం, రవీంద్రభారతి చూశాను. మన ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన ప్రగతి భవనం చాలా బాగుంది. జంట నగరాల్లో ముఖ్యంగా కొత్తగా ప్రవేశపెట్టబడిన మెట్రోరైలు ప్రారంభించబడింది. అందులో విహరించాను. ఆ మెట్రో రైలును స్త్రీలే నడుపుతున్నారు. ఇదే ఆశ్చర్యకర విషయం.

సినిమా షూటింగ్స్, రామోజీ ఫిలింసిటీ, అన్నపూర్ణ, రామకృష్ణా స్టూడియోలు, రామానాయుడు స్టూడియోలు, సినీ తారలు నివసించే కాలనీలు, హైటెక్ సిటీలు అన్నీ చూశాను. చాలా ఆనందంగా, విజ్ఞానదాయకంగా గడిచాయి. తప్పక నీవు కూడా మన రాజధాని నగరం చూడవలసింది.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
X X X X X

చిరునామా :
బి. రామారావు, S/O దశరథుడు,
వాహనాల వీధి, భద్రాచలం,
ఖమ్మం జిల్లా, తెలంగాణరాష్ట్రం.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 19.
నగర జీవితంలోని కష్టాల్ని వివరిస్తూ నీ మిత్రురాలికి లేఖ.
జవాబు:

హైదరాబాద్,
X X X X X.

నా ప్రియ మిత్రురాలికి,
నమస్కారం !

నీ లేఖ అందింది. నేను హైదరాబాదులో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను. ఇక్కడ చదువు విషయంలో ఎటువంటి సమస్యలు లేవు. కాని స్కూలు ఫీజులు ఎక్కువ. ఇకపోతే ఈ నగరజీవితం చాలా కష్టంగా ఉంది. నగరంలో రోడ్లన్నీ వాహనాలతో నిండి యుంటాయి. ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. భయంకరమైన రణగొణధ్వనులుంటాయి. వాయుకాలుష్యం ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా వాహనాలు వదలే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై యాక్సైడ్ వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయి. చాలామందికి ఎలర్జీ ఆస్తమా ఉంటోంది.

నగరానికి వలస వచ్చిన పేదవాళ్ళు చిన్నచిన్న ఇరుకు ఇళ్ళల్లో, మురికివాడల్లో ఉంటూ ఉంటారు. ఎవరిగోలవారిది. ఎవరికివారే యమునాతీరే అన్నట్లుగా ఉంటుంది. పరస్పర సహకార సహాయాలుండవు. చాలీచాలని బ్రతుకులు. దారిద్ర్యరేఖలతో పేదవారు సతమతమవుతూంటారు. జబ్బులు చేస్తే నయం అయ్యే మార్గాలు లేవు. ఖరీదైన హాస్పటల్స్ సామాన్య మానవునికి అందుబాటులో ఉండవు.

ఎప్పుడూ వాహన ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. మమతానురాగాలుండవు. ఈ నగరం చూస్తే అర్థంకాని, రసాయనశాల వంటిది. ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి.
నువ్వు బాగా చదువుతావని తలుస్తూ ……………

ఇట్లు,
నీ ప్రియమిత్రురాలు,
X X X X X.

చిరునామా :
ఎస్. ఉష, 10వ తరగతి,
D/O వేంకటేశ్వరరావు,
ఢిల్లీ పబ్లిక్స్కూలు,
మంచిర్యాల, తెలంగాణ.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 20.
“శతక మధురిమ” పాఠం ఆధారంగా, మనం అలవర్చుకోవలసిన మంచి గుణాలను, ఉండకూడని గుణాలను, వివరిస్తూ మీ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:
మిత్రునకు లేఖ

వరంగల్లు,
X X X X X.

మిత్రుడు రాజారెడ్డికి / మిత్రురాలు రమ్యకు,

ఇక్కడ కుశలం. అక్కడ కుశలమే కదా !

మా గురువుగారు శతక మధురిమ పద్యాలు చెప్పారు. వాటిలో మనం అలవాటు చేసుకోవలసిన మంచి గుణాలూ, మనకు ఉండకూడని గుణాలనూ గూర్చి చెప్పారు.

అలవరచుకోవలసిన గుణాలు : సత్యమునే చెప్పాలి. దయ కలిగి ఉండాలి. మనము చేసే పనిలో ఏకాగ్రత కలిగి ఉండాలి. గురుభక్తి, మనస్సులో సౌజన్యమూ ఉండాలి. త్యాగదీక్ష కలిగి, దీనుల దైన్యాన్ని పోగొట్టాలి. దేశమాత గౌరవాన్ని కాపాడాలి. పెంచాలి. మంచి మిత్రులను సంపాదించాలి.

ఉండకూడని గుణాలు : భక్తులను నిందించకూడదు. దాతలను చెడగొట్టకూడదు. స్వార్థం ఉండకూడదు. మంచివారిని మోసగించకూడదు. మాయమాటలు చెప్పి, పరుల ధనాన్ని అపహరించకూడదు. లంచాలు ఇవ్వకూడదు. తల్లిదండ్రులను ఇంటి నుండి గెంటకూడదు. ఇతరుల కొంపలు ముంచకూడదు. కులగర్వం పనికిరాదు.

నీవు కూడా నీవు నేర్చిన విషయాలు, నాకు రాయి. మీ తల్లిదండ్రులకు నా నమస్కారాలు చెప్పు.

ఇట్లు,
నీ, మిత్రుడు, / నీ మిత్రురాలు,
రవికాంత్, / జ్యోత్స్న.

చిరునామా :
కె. రాజారెడ్డి, / కె. రమ్య,
10వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
వేములవాడ.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 21.
మీరు చూచిన గోలకొండ కోట విశేషాలను గూర్చి, నీ మిత్రుడికి ఒక లేఖ రాయండి.
జవాబు:
లేఖ

హైదరాబాదు,
X X X X X.

మిత్రుడు నిర్మల్క,

మిత్రమా ! ఈ లేఖలో నీకు గోల్కొండ కోటను గూర్చి రాస్తున్నా. ఈ మధ్యనే నేను, విహారయాత్రకు వెళ్ళి మిత్రులతో కలిసి గోల్కొండకోట చూసివచ్చాను.

దక్షిణభారతంలో గోలకొండ పట్టణం ప్రసిద్ధిచెందింది. గోలకొండ దుర్గం అంటే, మూడు కోటలు. ఈ దుర్గానికి ఏడుమైళ్ళ కైవారం 87 బురుజులు ఉన్నాయి. ఆజంఖాన్ అనే ఇంజనీరు ఈ గోలకొండ పట్టణాన్ని నిర్మించాడు. ఈ పట్టణంలో వీధులను, మొహల్లాలు అని పిలిచేవారు.

ఈ పట్టణంలో ‘నగీనాబాగ్’ అనే అందమైన ఉద్యానవనం ఉంది. షాహిమహలు, దిల్కషా అనే అందమైన రాజభవనాలు ఉన్నాయి. రెండు బారకాసులు ఉన్నాయి. అందమైన మిద్దెల మీద తోటలున్నాయి. పట్టణ ప్రజలకు ‘కటోరాహువుజు’ ద్వారా నీర సరఫరా చేసేవారు.

గోల్కొండ కోటను బండరాళ్ళతో కట్టారు. మొగలాయీ సైన్యం 9 నెలలు శ్రమపడి, గోల్కొండకోటలో ఒక్క బురుజును మాత్రమే కూల్చగలిగిందట. ఆ బురుజు బదులుగా మరో బురుజును ఒక్క రాత్రిలో సైనికాధికారులు కట్టారట. గోల్కొండ కోటలో కొండపై ‘బాలహిస్సారు’ అనే ప్రాసాదము ఉంది. దానికి వెళ్ళేదారిలో ద్వారం దగ్గర, ఒక రాతి గుండు ఉంది. ఆ రాతిపై నిలిచి, చప్పట్లు కొడితే ఆ శబ్దం బాలహిస్సారు భవనంలోకి వినబడేదట.

గోల్కొండ కోటను తప్పక చూడాలి. సెలవులకు నీవు వస్తే నేను చూపిస్తా. శుభాకాంక్షలు.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
X X X X X X.

చిరునామా :
పి. నిర్మల్, 10వ తరగతి,
జవహర్ కాన్వెంటు,
ఖమ్మం.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 22.
ఆడినమాట తప్పకపోవడం, దానగుణం కలిగి ఉండడం మొదలయిన విశిష్ట లక్షణాల ఆవశ్యకతను తెలుపుతూ నీ మిత్రునికి / స్నేహితురాలికి లేఖ రాయండి.
జవాబు:
లేఖ

భద్రాచలం,
X X X X X.

మిత్రుడు రామ్ పాల్కు, / మిత్రురాలు రాధికకు,

నీ లేఖ చేరింది. నిత్య జీవితంలో మనం ఎలా నడచుకోవాలో తెలుపుతూ మా రామాలయంలో ఓ సాధువుగారు మాట్లాడారు. ఆయన జీవితంలో సత్యవాక్కు, దానగుణము ఉండాలని చెప్పారు. ఆయన మాటలు నాకు నచ్చాయి.

పురాణాల్లో కర్ణుడుని దానకర్ణుడు అంటారు. తన ప్రాణానికి ముప్పు వస్తుందని తెలిసినా కర్ణుడు తన సహజ కవచకుండలాలను దానం చేశాడు. అలాగే మనం చదివిన దానశీలము పాఠంలో బలిచక్రవర్తి, గురువు గారు వద్దంటున్న మానకుండా వామనుడికి మూడు అడుగుల నేలను సంతోషంగా ధారపోశాడు. ఆ దానం వల్ల బలి చక్రవర్తి పాతాళలోకంలోకి తొక్కి వేయబడ్డాడు. అయినా ఈ భూమండలం ఉన్నంతవరకు బలిచక్రవర్తి కీర్తి శాశ్వతంగా నిలిచింది.

అలాగే శిబి చక్రవర్తి పావురాన్ని రక్షించడానికి తన శరీరాన్ని కోసి ఇచ్చాడు. వారి కీర్తి చిరస్థాయిగా నిలిచింది. మనం కూడా చీటికీ మాటికీ అబద్ధాలు ఆడడం మాని వేయాలి. సత్యవాక్యాన్ని నిలబెట్టాలి. మన మిత్రులకు అవసరం అయినప్పుడు దానం చెయ్యాలి.

నేను సత్యమే మాట్లాడతానని, ఉన్నమేరకు ఇతరులకు దానధర్మాలు చేస్తానని ప్రతిజ్ఞ చేశాను. నీవు కూడ తప్పక ఈ మంచి గుణాలను పాటించు.

ఇట్లు,
నీ మిత్రుడు, / మిత్రురాలు,
శివరావు. / సరోజ.

చిరునామా :
పి. రామ్ గోపాల్, / పి. రాధిక,
S/o వెంకట్రావు, / D/o వెంకట్రావు,
10వ తరగతి, బాపూజీ నగర్,
ఖమ్మం, తెలంగాణ.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 23.
మీ పాఠశాలలో జరిగిన వార్షికోత్సవాన్ని గూర్చి నీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:
లేఖ

ఆదిలాబాదు,
X X X X X.

మిత్రుడు ప్రశాంత్ కు, / మిత్రురాలు మాధురికి,

నీ లేఖ చేరింది. ఈ మధ్య మా పాఠశాలలో వార్షికోత్సవం జరిగింది. మా జిల్లా విద్యాశాఖాధికారి గారు ముఖ్య అతిధిగా వచ్చారు. ఉదయము మా ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను, పాఠశాల పతాకాన్ని ఎగురవేశారు.

పాఠశాలలో ఈ సందర్భంగా సాహిత్య సాంస్కృతిక పోటీలు, ఆటలు పోటీలు’ జరిగాయి. నాకు ఇంగ్లీషు, తెలుగు వ్యాసరచనలలో ప్రథమ బహుమతి వచ్చింది. సాయంత్రము 5 గంటలకు వార్షికోత్సవ సభ జరిగింది. మా పాఠశాల అన్ని రంగాలలో ముందున్నదని మా DEO గారు మెచ్చుకున్నారు. పబ్లిక్ పరీక్షలలో నూటికి నూరు శాతం కృతార్థులు కావాలని చెప్పారు.

DEO గారు మాకు బహుమతులు పంచారు. విచిత్రవేషాలు, నాటికలు ప్రదర్శించారు. బాలికలు నృత్యం చేశారు. పాటలు పాడారు. తెలంగాణ తల్లిపై మంచి పాటలు పాడారు. మీ పాఠశాలలో జరిగిన వార్షికోత్సవం గురించి తప్పక రాయి.

ఇట్లు,
నీ మిత్రుడు, / మిత్రురాలు,
రవిబాబు. / నీరజ.

చిరునామా :
K. ప్రశాంత్, / P. మాధురి,
– S/o K. రాజా, D/o P. రమణకుమార్,
వరంగల్లు, తెలంగాణ.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 24.
విహార యాత్రను వివరిస్తూ తండ్రికి లేఖ.
జవాబు:

రామగుండం,
X X X X X.

పూజ్యులైన నాన్నగారికి నమస్కారములు.

నేను క్షేమంగానే ఉన్నాను. అక్కడ అందరూ క్షేమమని తలుస్తాను. ఇటీవల నేను నా మిత్రులతో కలిసి హైదరాబాదు విహారయాత్రకు వెళ్ళి వచ్చాను. ఆ విశేషాలు ఈ లేఖలో తెలియజేస్తున్నాను.

గడచిన బుధవారం సాయంకాలం రామగుండంలో రైలు ఎక్కి తెల్లవారేసరికి హైదరాబాదు చేరాం. అక్కడ కార్యక్రమాలన్నీ ముగించుకొని నగరదర్శనానికి బయలుదేరాం.

ఆ నగర శోభను చూస్తుంటే నాకెంతో ఆశ్చర్యం వేసింది. ఎక్కడ చూసినా ఫ్లైఓవర్ బ్రిడ్జీలు చూడముచ్చటగా ఉన్నాయి. ట్యాంక్ బండ్ పై గల విగ్రహాలు చూపరులను అట్టే ఆకర్షించేలా ఉన్నాయి.

ముఖ్యంగా సాలార్జంగ్ మ్యూజియం, నెహ్రూ జంతుప్రదర్శనశాల, చార్మీనార్, బిర్లామందిర్, పబ్లిక్ గార్డెన్స్, రామోజీ ఫిల్మ్ సిటీ, గోలకొండ కోట వంటివి యాత్రికులను బాగా ఆకర్షిస్తాయి. రెండు రోజులపాటు అక్కడి దర్శనీయ స్థలాలను చూసి మరల రైలులో సరదాగా పాటలు పాడుకొంటూ జోక్స్ వేసుకొంటూ కాలం తెలియకుండా తిరుగు ప్రయాణం చేశాం. అమ్మగారికి నా నమస్కారాలు.

ఇట్లు,
తమ కుమారుడు,
రాళ్ళభండి సిద్ధార్థ.

చిరునామా :
శ్రీరాళ్ళబండి శ్రీనివాస్ గారు,
మంథని,
కరీంనగర్ జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 25.
మీ వీధిలో పారిశుధ్య పరిస్థితిని (అపరిశుభ్రతను) గూర్చి వివరించుచు సంబంధిత అధికారికి లేఖ వ్రాయుము.
జవాబు:

కరీంనగర్,
X X X X X.

మున్సిపల్ ఆరోగ్యశాఖాధికారి గారికి నమస్కరించి మోహన్ వ్రాయు విన్నపము.

అయ్యా,

నేను కరణం గారి వీధిలో నివాసం ఉంటున్నాను. మా వీధిలో ఎక్కడ చూసినా చెత్త, దుమ్ము, మురికి ప్రత్యక్షమవుతాయి. చెత్త పారెయ్యడానికి చెత్త కుండీలు లేవు. మురికినీరు కాలువలు నిండిపోయి రోడ్డుమీదే ప్రవహిస్తుంది. ఇక దుర్గంధం చెప్పడానికి వీలులేదు. ఆ మురికి వల్ల దోమల బాధకూడా ఎక్కువైంది. దీనివల్ల మలేరియా సోకే ప్రమాదముంది. కాబట్టి మావీధి పారిశుధ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవల్సిందిగా ప్రార్థిస్తున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
వి.యస్. మోహన్.

చిరునామా :
ఆరోగ్యశాఖాధికారి గారు,
పురపాలక సంఘ కార్యాలయం,
కరీంనగర్.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 26.
పుట్టినరోజుకు ఆహ్వానిస్తూ మిత్రునికి లేఖ.
జవాబు:

సిద్ధిపేట,
X X X X X.

ప్రియమిత్రుడు శ్రీనివాసు,

నేను బాగుగానే చదువుచున్నాను. నీవు కూడ బాగుగా చదువుచున్నావని తలచెదను.

వచ్చే బుధవారము నా పుట్టినరోజు. ఆ రోజున మిత్రులందరిని ఆహ్వానించి అందరి సమక్షంలో నా పుట్టినరోజు పండుగను బ్రహ్మాండముగా జరుపుకొనవలెనని నిశ్చయించుకొంటిని. నీవు ఎన్ని పనులున్నను తప్పక నా పుట్టినరోజు పండుగకు హాజరు కావలసినదిగా కోరుచున్నాను. ఆ రోజు ఉదయం నుండి సాయంకాలము వరకు వివిధ కార్యక్రమములు నిర్వహింపబడును. కనుక నీవు ఒక రోజు ముందుగానే రావలసినదిగా తెలియజేయుచున్నాను.

నీ తల్లిదండ్రులకు నా నమస్కారములు.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
వి. ప్రసాద్.

చిరునామా :
పి. శ్రీనివాస్,
10వ తరగతి,
గవర్నమెంట్ హైస్కూలు,
సికింద్రాబాదు.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 27.
నీ మాతృదేశాన్ని (భారతదేశం) గురించి పరిచయం చేస్తూ విదేశంలోని కలం స్నేహితునికి లేఖ.
జవాబు:

హైదరాబాద్,
X X X X X.

ప్రియ కలం స్నేహితుడు జాన్ డేవిడ్ పాల్కు,

నేను క్షేమంగా ఉన్నాను. నీవు కూడా క్షేమంగా ఉన్నావని తలుస్తాను. నేను ఈ లేఖలో మా భారతదేశ విశేషాలు తెలియజేస్తున్నాను.

ఆసియా ఖండంలోగల పెద్ద దేశాలలో భారతదేశం ఒకటి. దీనినే ‘ఇండియా’ అని పిలుస్తారు. మా భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రం ఎల్లలుగా ఉన్నాయి. మా దేశంలో సింధు, గంగ, యమున, కృష్ణ, గోదావరి వంటి జీవనదులెన్నో ఉన్నాయి.

భారతదేశంలో వివిధ జాతులవారు, మతాలవారు ఉన్నారు. ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనటానికి మా దేశాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సత్యం, అహింసయే ఆయుధాలుగా భావించెడి దేశం మాది. సర్వమానవులను సౌభ్రాతృత్వ దృష్టితో చూస్తూ అందరి సుఖశాంతులను కాంక్షించేదే మా భారతదేశం.

ఇట్లు,
నీ కలం స్నేహితుడు,
డి. వి. శ్యామసుందర్.

చిరునామా :
జాన్ డేవిడ్ పాల్,
డోర్ నెం. 4/159,
కెనడీ రోడ్, వాషింగ్టన్,
అమెరికా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 28.
మంచి పుస్తకాన్ని గూర్చి స్నేహితునికి లేఖ .
(లేదా)
నచ్చిన పుస్తకాన్ని పరిచయం చేస్తూ మిత్రునికి లేఖ.
జవాబు:

నిజామాబాదు,
X X X X X.

ప్రియ మిత్రుడు శేఖర్ బాబుకు,

నీ ప్రియ మిత్రుడు శశిధర్ అనేక శుభాకాంక్షలతో వ్రాయునది. ఉభయకుశలోపరి. నేను ఈ మధ్య కందుకూరి వీరేశలింగం పంతులుగారు రచించిన “రాజశేఖర చరిత్ర” చదివాను. ఈ గ్రంథములో రాజశేఖరుడు అనే బ్రాహ్మణుడు నాయకుడు. ఈ గ్రంథము ఆంధ్రభాషలో రచించిన తొలి తెలుగు నవలయని తెలిసింది. ఈ నవలను వీరేశలింగంగారు తన కాలములో ఉన్న సాంఘిక దురాచారాలను ఖండించడానికి వ్రాశారు.

ఆనాడు సంఘంలో పొగడ్తలకు లొంగి గొప్పగా కుమార్తెల పెండ్లిండ్లు చేసి అప్పుల పాలైన రాజశేఖరుడుగారి వంటి సంపన్నులు ఉన్నారు. దయ్యములు, భూతవైద్యము, జ్యోతిషం మొదలైన వానిపై ప్రజలకు నమ్మకముండేది. దానితో ఆ పేరు చెప్పుకొని సిద్ధాంతులు, దామోదరయ్య వంటి వారు తమ పొట్టపోసుకొనేవారు. పెద్దాపురం రాజా వంటి మంచి రాజాధికారులు కూడ ఉండేవారని తెలుస్తుంది. గ్రాంథిక భాషలో ఈ నవల చక్కగా వ్రాయబడినది. తెలుగు భాషలో మొదటి నవలయైన రాజశేఖరచరిత్ర తెలుగు నవలా సాహిత్యంలో మణిపూస.

నీవు కూడా ఈ మధ్య చదివిన పుస్తకం గూర్చి వ్రాస్తావని ఆశిస్తున్నాను. శుభాకాంక్షలతో.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
కె. శశిధర్.

చిరునామా :
కె. శేఖర్ బాబు,
10వ తరగతి, జిల్లా పరిషత్ హైస్కూలు,
నిజామాబాదు.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 29.
మీ వీధిలో మంచినీటి సమస్య గురించి వివరించుచు సంబంధిత అధికారికి లేఖ వ్రాయుము.
జవాబు:

నిర్మల్,
X X X X X.

మంచినీటి సరఫరాశాఖ చీఫ్ ఇంజనీర్ గారికి నమస్కరించి
గోపాలకృష్ణ వ్రాయు విన్నపము.

అయ్యా,

మా ప్రాంతంలోని ప్రజలు మంచినీటి సరఫరా సక్రమంగా లేనందువల్ల నానా ఇబ్బందులు పడుతున్నారు. సుమారు పదిరోజులుగా మా ప్రాంతంలో, అందులోను ముఖ్యంగా మా వీధిలో మంచినీటి పంపులు పనిచేయడంలేదు. ప్రజలు త్రాగేటందుకు చుక్క నీరు దొరకక అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం బావినీటితోనే కాలక్షేపం చేస్తున్నారు. కాబట్టి మీరు వెంటనే తగు చర్యలు తీసుకొని పంపులు సరిగా పనిచేయునట్లు చూడవలసిందిగా కోరుతున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
వి. గోపాలకృష్ణ.

చిరునామా :
చీఫ్ ఇంజనీర్,
మంచినీటి సరఫరాశాఖ కార్యాలయం,
నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 30.
ఉపకార వేతనాన్ని కోరుతూ జిల్లా విద్యాశాఖాధికారికి దరఖాస్తు.
జవాబు:

వరంగల్,
X X X X X.

వరంగల్ జిల్లా విద్యాశాఖాధికారి గారి దివ్య సముఖమునకు,

అయ్యా,

నేను జిల్లా పరిషత్ హైస్కూలులో పదవ తరగతి చదువుచున్నాను. నేను ఆర్థికముగా వెనుకబడిన కుటుంబమునకు చెందినవాడను. 9వ తరగతి పరీక్షలలో నాకు 600 మార్కులకు 530 మార్కులు వచ్చినవి. పై చదువులు చదువుటకు ఆర్థిక శక్తి లేకపోవుటచే మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పవలసి వచ్చుచున్నది. కనుక తమరు నాయందు దయయుంచి ఉపకార వేతనమును మంజూరు చేయవలసినదిగా ప్రార్థించుచున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
అగ్గిరాజు శ్రీహర్ష.

చిరునామా :
జిల్లా విద్యాశాఖాధికారి గారికి,
జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం,
వరంగల్, వరంగల్ జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 31.
పుస్తక విక్రేతకు లేఖ.
జవాబు:

వరంగల్,
X X X X X.

శ్రీయుతులు వి.జి.యస్. పబ్లిషర్స్
మేనేజర్ గారికి నమస్కారములు.

ఆర్యా!

ఈ దిగువ తెలియజేయబడిన పుస్తకాలను శ్రీ రామదాసు మోటారు ట్రాన్సుపోర్టు ద్వారా పార్శిలులో పంపించ ప్రార్థన. మీకు అడ్వాన్సుగా రూ.100/- (వంద రూపాయలు) పంపుచున్నాను. మిగిలిన పైకమును చెల్లించి పుస్తకముల పార్శిలు విడిపించుకొనగలవాడను. పుస్తకములపై తగిన కమీషన్ ఇవ్వవలసినదిగా కోరుచున్నాను.
పుస్తకముల వివరములు :

  1. పదో తరగతి తెలుగు క్వశ్చన్ బ్యాంకులు – 10 కాపీలు
  2. పదో తరగతి ఇంగ్లీషు క్వశ్చన్ బ్యాంకులు – 20 కాపీలు
  3. పదో తరగతి హిందీ క్వశ్చన్ బ్యాంకులు – 15 కాపీలు
  4. పదో తరగతి గణితశాస్త్రం క్వశ్చన్ బ్యాంకులు – 20 కాపీలు

ఇట్లు,
మీ విశ్వాసపాత్రుడు,
ఐ.వి. గణేష్కుమార్.

చిరునామా :
మేనేజర్,
వి.జి.యస్. పబ్లిషర్స్,
నింబోలి అడ్డ, కాచిగూడ,
హైదరాబాదు.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 32.
దొంగిలింపబడిన సైకిలును గూర్చి సంబంధిత అధికారికి లేఖ.
జవాబు:

వరంగల్,
X X X X X.

స్టేషను హౌసు ఆఫీసరుగార్కి,
ఒకటవ టౌను పోలీసు స్టేషను,
వరంగల్.

ఆర్యా,

నేను మహాత్మాగాంధీజీ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్నాను. నేను నిన్న స్కూల్ విడిచిపెట్టిన తరువాత రవీంద్ర కేఫ్ టిఫిను తినడానికి వెడుతూ నా సైకిలు హోటల్ ఎదుట పెట్టి తాళం వేశాను. నా సైకిలు హేండిల్బారుపై “కె. రవి” అని పేరు ఉంది. నాది హీరో సైకిలు. రెండేళ్ళ క్రిందట కొన్నది. ఇంకా క్రొత్త సైకిలువలె రంగు మాయకుండ ఉన్నది. నలుపురంగు, సైకిలు నెంబరు 186281. స్టీలు ఊసలుగల చక్రాలు ఉన్నాయి.

దయతో నా సైకిలును గూర్చి దర్యాప్తుచేసి నాకు దానిని నా స్కూల్ వద్ద అప్పచెప్పవలసినదిగా కోరుచున్నాను.

ఇట్లు,
కాగితాల రవి,
‘పదవ తరగతి,
మహాత్మాగాంధీజీ హైస్కూల్,
వరంగల్.

చిరునామా:
స్టేషన్ హౌస్ ఆఫీసర్,
I టౌన్ పోలీస్ స్టేషన్,
వరంగల్, వరంగల్ జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 33.
నగరంలో మొక్కల పెంపకం ఆవశ్యకత గురించి పత్రికా సంపాదకునికి లేఖ.
జవాబు:

హైదరాబాదు,
X X X X X.

ఈనాడు పత్రికా సంపాదకులకు,

ఆర్యా,

మన హైదరాబాదు నగరం వివిధ కాలుష్యాలకు లోనవుతూ ప్రజాజీవనం చాలా దుర్భరంగా తయారయింది. పట్టణాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి, జనాభా పెరుగుదల అనేక కారణాలు ప్రకృతిని కాలుష్యానికి గురిచేస్తున్నాయి. మంచిగాలి, మంచి వాతావరణం రోజురోజుకూ కరువైపోతున్నాయి. ప్రకృతిలోని పచ్చనిచెట్లు మనిషికి స్వచ్ఛమైన గాలిని ప్రసాదించి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఈ విషయాన్ని గ్రహించి అందరు తమ ఇండ్లలోను, పరిసర ప్రాంతాలలోను, రోడ్ల ప్రక్కన మొక్కలను పెంచి నగర కాలుష్యం నుండి బయటపడునట్లు సహకరించవలసిందిగా మీ పత్రికా ముఖమున కోరుతున్నాము.

ఇట్లు,
తమ విధేయుడు,
పి. శ్రీనివాస్.

చిరునామా:
పత్రికా సంపాదకుడు,
ఈనాడు దినపత్రిక,
సోమాజిగూడ, హైదరాబాద్.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 34.
నేత్రదానం చేయవలసిందిగా అందరిని ప్రోత్సహిస్తూ పత్రికలో ప్రచురించవలసిందిగా సంపాదకునికి లేఖ. (లేదా) నేత్రదానం ఆవశ్యకతను తెలియజేస్తూ పత్రికా సంపాదకుడికి లేఖ.
జవాబు:

వరంగల్,
X X X X X.

ఈనాడు పత్రికా సంపాదకునకు,

అయ్యా,

మన దేశంలో గ్రుడ్డితనంతో బాధపడేవారి సంఖ్య చాలా ఎక్కువ. ‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అన్నారు పెద్దలు. అలాంటప్పుడు కళ్ళు లేనివారి జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. వారి జీవితాలలో వెలుగు ప్రసాదింపజేయటం సాటి మానవులుగా మన కర్తవ్యం. అందుకు నేత్రదానం చేయడం ఎంతైనా అవసరం. మనిషి తాను మరణించిన తరువాత తన నేత్రాలను దానం చేయడం ద్వారా మరొకరికి చూపు ప్రసాదించిన వాడవుతాడు. కాబట్టి అన్ని దానాలలోకి నేత్రదానం చాలా గొప్పది. దీన్ని ప్రోత్సహిస్తూ మీ పత్రికలో ప్రచురించి ప్రజలు చైతన్యవంతులగునట్లు చేయవలసిందిగా కోరుతున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
ఐ. గణేష్ కుమార్.

చిరునామా :
పత్రికా సంపాదకుడు,
‘ఈనాడు’ కార్యాలయం,
వరంగల్.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 35.
రక్తదానం అవసరాన్ని తెలియజేస్తూ మిత్రునకు లేఖ.
జవాబు:

హైదరాబాదు,
X X X X X.

ప్రియ మిత్రుడు నరేంద్రకు,

నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని తలుస్తాను. ముఖ్యంగా ఈ లేఖలో రక్తదానం అవసరాన్ని గూర్చి తెలియజేస్తున్నాను.

కొన్ని పరిస్థితులలో తోటి మానవుని ప్రాణాన్ని కాపాడటానికి రక్తదానం ఎంతైనా అవసరం. అలాంటప్పుడు ఆ వ్యక్తియొక్క రక్త గ్రూపునకు సంబంధించిన రక్తాన్నే దానం చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆ వ్యక్తి ప్రాణానికే ముప్పు సంభవించవచ్చు. అప్పటికప్పుడు ఆయా రక్త గ్రూపు కలవారు దొరకటం చాలా కష్టం. కాబట్టి ముందుగానే రక్తదానం చేస్తే బ్లడ్ బ్యాంకులలో నిల్వచేసి అవసరం వచ్చినపుడు ఆయా వ్యక్తులకు ఉపయోగిస్తారు. ఇది దృష్టిలో పెట్టుకొని నేను రక్తదానం చేశాను. నీవు కూడా నాలాగే రక్తదానం అవసరాన్ని గుర్తించి అందుకు సహకరించగలవని ఆశిస్తున్నాను.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
కోట రవికుమార్.

చిరునామా :
ఆర్. నరేంద్ర, 10వ తరగతి,
మున్సిపల్ హైస్కూలు,
ఆదిలాబాద్.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 36.
గురుపూజోత్సవం గురించి మిత్రునికి లేఖ.
జవాబు:

పాల్వంచ,
X X X X X.

ప్రియమిత్రుడు ఆనందు,

గడచిన సెప్టెంబర్ 5న మా పాఠశాలలో గురుపూజోత్సవం బ్రహ్మాండంగా జరుపుకున్నాం. ఆ రోజు మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. ఆయన జయంతినే ప్రభుత్వం గురుపూజోత్సవ దినంగా ప్రకటించింది కదా ! మేము . మా పాఠశాలలోని ఉపాధ్యాయులందరిని ఆ రోజున ప్రత్యేకంగా సన్మానించాం. వారి ఆశీర్వచనాలు పొందాం. మనకు విద్య నేర్పుతున్న గురువులను గౌరవించి సన్మానించడం నా కెంతో ఆనందాన్ని కలిగించింది.

ఇట్లు,
నీ మిత్రుడు,
రాజారాం.

చిరునామా :
ఎస్. ఆనంద్, 10వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,
ఖమ్మం, ఖమ్మం జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 37.
ఉగ్రవాదం వల్ల సంభవిస్తున్న నష్టాలను వివరిస్తూ మిత్రునకు లేఖ.
జవాబు:

ఆసిఫాబాద్,
X X X X X.

ప్రియ మిత్రురాలు సాయిచంద్రికకు,

నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని తలుస్తాను. ఈ మధ్య దేశంలో ఉగ్రవాదం విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఎన్నో నష్టాలు సంభవిస్తున్నాయి. వాటిని గురించి ఈ లేఖలో తెలియజేయదలచాను.

ఉగ్రవాదం మన జాతీయ సమైక్యతకు తీవ్రభంగాన్ని, అశాంతిని కలిగిస్తున్నది. వారి పాశవిక చర్యలకు అనేకమంది తమ ప్రాణాలు కోల్పోవడం జరుగుతోంది. అంతేకాక వారు ప్రజల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు నష్టపరుస్తున్నారు. దీనివల్ల వారు సాధించేది ఏమీలేదు. కాబట్టి ఉగ్రవాదులు తమ దుష్టమైన మార్గాన్ని విడిచిపెట్టి దేశశ్రేయస్సుకు పాటుపడాలని ఆశిస్తున్నాను.

ఇట్లు,
నీ మిత్రురాలు,
హరి అపర్ణ.

చిరునామా :
గార్లపాటి సాయిచంద్రిక,
10వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,
మంచిర్యాల,
ఆదిలాబాద్ జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 38.
మరుగుదొడ్ల నిర్మాణ ఆవశ్యకతను గూర్చి జిల్లాకలెక్టరుకు వినతిపత్రం :
జవాబు:

జోగిపేట,
X X X X X.

మెదక్ జిల్లా కలెక్టరుగారి దివ్యసముఖమునకు
జోగిపేట గ్రామ నివాసి వ్రాయు విన్నపం.

అయ్యా,

మాది ఆంథోల్ మండలంలోని జోగిపేట. మా గ్రామంలో ఎంతోమంది నిరుపేదలు నివసిస్తున్నారు. ఏ రోజునకు ఆ రోజు కాయకష్టం చేసుకొని జీవిస్తున్నారు. మా గ్రామ ప్రజలు మరుగుదొడ్ల సౌకర్యంలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడపడితే అక్కడ మలమూత్ర విసర్జన చేయడంవల్ల గ్రామంలోని వారంతా అనారోగ్యం పాలవుతున్నారు.

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు పెద్దలు. అందువల్లే ప్రభుత్వం కూడా ప్రజల ఆరోగ్య పరిరక్షణ బాధ్యతను చేపట్టి ఎన్నో పథకాలు ప్రవేశపెడుతోంది. కాబట్టి మా గ్రామంలో హాడ్కో పథకం కింద మరుగుదొడ్ల నిర్మాణం జరుగునట్లు చూడవలసినదిగా మనవి చేస్తున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
అక్క పెద్ద నర్సయ్య.

చిరునామా :
జిల్లాధికారి,
జిల్లాధికారి కార్యాలయం,
మెదక్, మెదక్ జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 39.
పాఠశాలలో కావలసిన సౌకర్యాలను కోరుతూ విద్యాశాఖాధికారికి లేఖ.
జవాబు:

ఉట్నూరు,
X X X X X.

ఆదిలాబాద్ విద్యాశాఖాధికారి గారి దివ్యసముఖమునకు,

అయ్యా,

నేను ఉట్నూరు ఎస్.ఆర్.యం. హైస్కూలులో పదవతరగతి చదువుతున్నాను. మా పాఠశాలలో 900 మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థులందరికి సరిపడ తరగతి గదులు లేక ఇబ్బంది పడుతున్నాం. అలాగే మా పాఠశాలకు గ్రంథాలయ వసతి కాని, లేబరేటరి వసతికాని లేదు. వీటికి తోడు ఉపాధ్యాయుల కొరత కూడా కలదు. అందువల్ల మా కెంతో అసౌకర్యంగా ఉంది. తమరు దయయుంచి పై విషయాలను దృష్టిలో పెట్టుకొని తగిన ఏర్పాట్లు చేసి మా విద్యాభివృద్ధికి సహాయపడవలసినదిగా ప్రార్థించుచున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
ఆర్. రమేష్.

చిరునామా :
జిల్లా విద్యాశాఖాధికారి,
జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం,
ఆదిలాబాద్, ఆదిలాబాద్ జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 40.
వ్యాయామశాల స్థాపనకై పత్రికా సంపాదకునకు లేఖ.
జవాబు:

వనపర్తి,
X X X X X.

‘ఆంధ్రజ్యోతి’ సంపాదకులకు,
వనపర్తి గ్రామ నివాసి వ్రాయు విన్నపం –

ఆర్యా

మానవుని మనుగడకు ఆహారం ఎంత అవసరమో వ్యాయామం కూడా అంతే అవసరం. శరీర ఆరోగ్యం బాగా ఉండాలంటే అందరూ తప్పక వ్యాయామం చేయాల్సిందే.

కుస్తీలు పట్టుట, బస్కీలు, దండెములు తీయుట, బరువైన వస్తువులు పైకెత్తుట మొదలైన వ్యాయామ సాధనకు ఒక వ్యాయామ శాల ఉంటే అందరికీ అనుకూలంగా ఉంటుంది.

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు కదా ! అలాంటి ఆరోగ్యానికి మూలం శరీర వ్యాయామం. ఈ వ్యాయామం చేయటానికి మా గ్రామంలో ఒక వ్యాయామశాలను ప్రభుత్వం స్థాపించే విధంగా తమ పత్రికాముఖంగా సహకరించవలసిందిగా కోరుతున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
హరి బుచ్చికోటయ్య.

చిరునామా :
సంపాదకుడు,
‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక,
మహబూబ్నగర్,
మహబూబ్నగర్ జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 41.
పాఠశాలలో జరిగిన క్రీడోత్సవాలను గురించి మిత్రునకు లేఖ (ఆటల పోటీలు).
జవాబు:

హైదరాబాద్,
X X X X X.

ప్రియమిత్రుడు రాజేషు,

నేను క్షేమంగా ఉన్నాను. నీవుకూడా క్షేమంగా ఉన్నావని తలుస్తాను. ఈ లేఖలో మా పాఠశాలలో జరిగిన క్రీడోత్సవాలను గురించి తెలియజేస్తున్నాను.

గడచిన బుధవారం మా పాఠశాలలో జిల్లాస్థాయి క్రీడోత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయి. ఈ క్రీడోత్సవాలలో జిల్లా నాల్గు మూలల నుండి వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు. మా జిల్లాధికారి ఈ ఉత్సవాలను ప్రారంభించారు. కబాడి, ఖోఖో, వాలీబాల్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ మొదలైన ఆటల పోటీలు రెండురోజులపాటు జరిగాయి. మా పాఠశాల జట్టు బాస్కెట్బాల్ పోటీలో పాల్గొని విజయం సాధించింది. మీ పాఠశాలలో జరిగిన ఆటల పోటీలను గురించి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
కోట రవికుమార్.

చిరునామా :
పి. రాజేష్,
10వ తరగతి,
సెంట్రల్ పబ్లిక్ స్కూల్,
వరంగల్, వరంగల్ జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 42.
వేసవి సెలవులను గడిపే విధానాన్ని గురించి మిత్రునికి లేఖ.
జవాబు:

సంగారెడ్డి,
X X X X X.

ప్రియమిత్రుడు ఆనంద్కు,

నేను పబ్లిక్ పరీక్షలు బాగానే రాస్తున్నాను. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడను కావాలనే పట్టుదలతో బాగా చదివి పరీక్షలు ఎంతో శ్రద్ధగా రాస్తున్నాను.

పరీక్షలు అయిపోయిన తరువాత వేసవి సెలవులలో నేను కంప్యూటర్ విద్య నేర్చుకోవాలనుకొంటున్నాను. ఇంటర్మీడియట్లో కూడా నేను కంప్యూటర్ కోర్సు చదువతలచాను. అందువల్ల సెలవులు వృధా కాకుండా కంప్యూటర్ నేర్చుకోదలచాను. భవిష్యత్తులో కంప్యూటర్ ఇంజనీరు కావాలనేది నా ఆకాంక్ష. అందుకు ఎంతైనా శ్రమపడి చదవాలనుకొంటున్నాను. దీనికి తోడు ఇంగ్లీషు గ్రామర్ నేర్పే ‘కోచింగ్ సెంటర్’లో చేరి ఇంగ్లీషు భాషపై పట్టు సాధించాలనుకొంటున్నాను. ఈ విధంగా వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలనుకొంటున్నాను. నీ అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను.

ఇట్లు,
నీ మిత్రుడు,
చంద్రకాంత్.

చిరునామా :
పి. ఆనంద్, 10వ తరగతి,
విజ్ఞానభారతి విద్యాలయం,
ఆదిలాబాద్.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 43.
నిరక్షరాస్యత నిర్మూలనకు వేసుకున్న ప్రణాళికను వివరిస్తూ మిత్రునకు లేఖ.
జవాబు:

భీమ్గల్,
X X X X X.

ప్రియ మిత్రురాలు పద్మకు,

నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని తలుస్తాను. నేను ఈ లేఖలో నిరక్షరాస్యత నిర్మూలనకు వేసుకున్న ప్రణాళికను గురించి తెలియజేస్తున్నాను.

పిల్లలందరిని పాఠశాలలో చేర్పించే కార్యక్రమం చేపట్టాలి. బాల కార్మికులను గుర్తించి వారిని కూడా బడిలో చేర్పించాలి. నిరక్షరాస్యులైన వయోజనులను ప్రోత్సహించిన చదువు నేర్చేటట్లు చేయాలి. కనీసం చదవడం, వ్రాయడం, లెక్కలు చూడటమైనా వచ్చేలా చేయాలి. పాఠ్య గ్రంథాలు అందమైన చిత్రాలతో ఆకర్షణీయంగా ఉండేలా చూడాలి. పాఠ్యగ్రంథాలను అందరికీ ఉచితంగా అందజేయాలి. గ్రామాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి. అవసరమైన చోట రాత్రి పాఠశాలలు నెలకొల్పాలి.

ఈ విధంగా నిరక్షరాస్యతా నిర్మూలనకు నేను కొన్ని ప్రణాళికలను వేసుకున్నానని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఇట్లు,

ఇట్లు,
నీ ప్రియ మిత్రురాలు,
అగ్గిరాజు శ్రీవిద్య.

చిరునామా :
జి. పద్మ. 10వ తరగతి,
శ్రీగీత కాన్వెంట్ హైస్కూల్,
నందిపేట్, నిజామాబాద్.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 44.
పాఠ్య పుస్తకాలను త్వరగా విడుదల చెయ్యాలని డి.ఇ.ఓ. (జిల్లా విద్యాశాఖాధికారి) గారికి లేఖ.
జవాబు:

నిర్మల్,
X X X X X.

ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి గారికి,

అయ్యా,

నేను నిర్మల్ మున్సిపల్ హైస్కూలులో పదవ తరగతి చదువుతున్నాను. పాఠశాలలు తెరచి రెండు నెలలు గడచినా మా నిర్మల్లో 10వ తరగతి పాఠ్యపుస్తకాలు ఒక్కటి కూడా లభించడం లేదు. మా పదవ తరగతి విద్యార్థులం ఎలా చదువుకోవాలో అర్థం కాక అయోమయ స్థితిలో ఉన్నాం.

పైగా క్వార్టర్లీ పరీక్షలు కూడా సమీపిస్తున్నాయి. కాబట్టి మీరు దయయుంచి ప్రభుత్వం ప్రచురించిన పదవ తరగతి పాఠ్యపుస్తకాలను త్వరలో మా పాఠశాలకు అందునట్లు చూడవలసిందిగా ప్రార్థిస్తున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
కోట రవి కుమార్.

చిరునామా :
జిల్లా విద్యాశాఖాధికారి గారు,
జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం,
ఆదిలాబాద్, ఆదిలాబాద్ జిల్లా.