TS 10th Class Telugu Grammar వ్యాసాలు

Telangana SCERT 10th Class Telugu Grammar Telangana వ్యాసాలు Questions and Answers.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 1.
సమాజంలోని మూఢనమ్మకాల్ని నిర్మూలించ డానికి మీరిచ్చే సలహాలు, సూచనలు ఆధారంగా చేసుకుని వ్యాసం వ్రాయండి. (March 2018)
జవాబు:
సమాజం అంటే సమూహం అని అర్థం. మానవ సమాజమనగా మానవుల సమూహమని అర్థం. అనూచానంగా మనదేశంలో మానవుల మనుగడ కల్పించేందుకై మహర్షులు కొన్ని నీతి నియమాల్ని ఏర్పాటుచేశారు. అలాగే మన సమాజంలో కొన్ని మూఢాచారాలు, మూఢనమ్మకాలు నెలకొని యున్నాయి. అయితే మానవాళి ఆ మూఢాచారాల్ని, మూఢనమ్మకాల్ని గుడ్డిగా నమ్మటం వల్ల పతనానికి దారితీశాయి. మానవాళి వృద్ధి చెందలేదు.

కాలానుగతంగా నేడు మానవ సమాజంలో అనేక మార్పులు వచ్చాయి. బాల్యవివాహాలు, సతీసహగమనాలు, జీవహింస చెయ్యటం, ప్రకృతి వైద్యమంటూ మానవుల్ని వల్లకాటికి పంపడం, చేతబడులు చెయ్యటం, దుష్టశక్తుల్ని వశం చేసుకొనుట మున్నగు దురాచారాలు ఎన్నో నెలకొని యున్నాయి. అయితే వీటిని గ్రహించి కూకటి వ్రేళ్ళతో సమూలంగా నాశనం చేయుటకు కొంతమంది సంఘ సంస్కర్తలు నడుం బిగించారు.

వారిలో కందుకూరి వీరేశలింగం పంతులు, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రాజారామమోహన రాయ్ వంటి పెద్దలు ముందుగా స్త్రీలకు ప్రత్యేక పాఠశాలల్ని ఏర్పాటు చేసి స్త్రీలకు విద్య నేర్పించారు. ఆ తర్వాత బాల్య వివాహాల్ని రద్దుచేసి శాసనాలతో చట్టం చేశారు. వితంతు వివాహాల్ని పునరుద్ధ రించారు. సమాజంలో దయ్యాలు, భూతాలు లేవని నిరూపించి ప్రజల్ని జాగృతులు చేశారు. అదేవిధంగా భూతవైద్యాన్ని, చేతబడుల్ని నిర్మూలించారు. శకునాల్ని నమ్మవద్దని, అవి కేవలం మానవుల చిత్రభ్రమలని తెలియజేశారు.

ముఖ్యంగా మానవుల్లో నెలకొనియున్న అంటరానితనాన్ని నిర్మూలించారు. భగవంతుని సృష్టిలో మానవులందరూ ఒకటేయనీ, మూఢ నమ్మకాల్ని తరిమి తరిమి కొట్టండనీ హెచ్చరించారు.

కనుక మానవులందరు పరమత సహనాన్ని పాటిస్తూ, మంచిని గ్రహించాలి. సమాజంలో నెలకొనియున్న మూఢనమ్మకాల్ని తరిమికొట్టాలి.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 2.
‘విద్యావంతుడైన ఒక యువకుడు ఉద్యోగాల కోసం పాకులాడకుండా, స్వంతంగా వ్యవసాయం చేస్తూ, చక్కగా పంటలు పండిస్తూ, ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. ప్రభుత్వంచే ఆవార్డులను కూడా పొందాడు.’ అటువంటి యువకుణ్ణి పొగుడుతూ అభినందన వ్యాసం రాయండి. (March 2017)
జవాబు:
ఆధునిక సమాజంలో శాస్త్రసాంకేతిక రంగ ప్రభావం తీవ్రంగా ఉంది. విజ్ఞానశాస్త్ర ప్రభావంతో మానవుడు సమున్నత స్థాయికి చేరుకుంటున్నాడు. సాధారణం గా ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగాలు కోసం వెంపర్లాడుతారు. స్వయం ఉపాధి మార్గాలకై అన్వేషింపరు.

కాని ఈ యువకుడు విద్యావంతుడై కూడా ప్రభుత్వ ఉద్యోగాలకోసం పాకులాడలేదు. స్వయంశక్తితో ఎదగాలనుకున్నాడు. తాను బ్రతుకుతూ మరికొందరికి ఉపాధిని కల్పించాలను కున్నాడు.

వ్యవసాయంలో ప్రవేశించాడు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించాడు. అధిక దిగుబడులను పొందాడు. అందరికి ఆదర్శంగా నిలిచాడు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను పొందాడు. అందువల్ల అతడు నిజంగా అభినంద నీయుడు. అందరికి మార్గదర్శకంగా నిలిచాడు. నేటియువతరమంతా నిరుత్సాహ పడకుండా స్వయంఉపాధి మార్గాలను అన్వేషించాలి.

ప్రశ్న 3.
నేడు నగర జీవనం ఎందుకు సంక్లిష్టంగా మారిందో విశ్లేషించి వ్యాసం రాయండి. (June 2015)
జవాబు:
నేడు మనుష్యులంతా నగరాల్లోనే జీవించాలని, తాపత్రయపడుతున్నారు. నగరాల్లో ఉన్నత విద్య, ఆధునిక వైద్య సౌకర్యాలు, ఉద్యోగావకాశాలు ఉన్నాయి. అన్ని తరగతుల ప్రజలకూ అక్కడ జీవించడానికి ఉపాధి సౌకర్యాలు లభిస్తాయి. అందువల్ల గ్రామీణ ప్రజలందరూ, నగరాలకు ఎగబ్రాకుతున్నారు.

పై కారణాల వల్ల నగరాల్లో జనాభా పెరిగి పోయింది. నగరాల్లోకి వచ్చే ప్రజలకు ఉండడానికి ఇళ్ళు సరిపడ దొరకడం లేదు. నగరాల్లో ప్రజలు నడచి వెళ్ళడానికి సైతం, రోడ్లు చాలటల్లేదు. సిటీ బస్సులు ఖాళీలుండటం లేదు. తరచుగా ట్రాఫిక్కు జామ్లు అవుతున్నాయి. త్రాగడానికి నగరాల్లో సరిపడ మంచినీరు దొరకడం లేదు. నిత్యావసరాలకు సహితం, నీరు కొనవలసి వస్తోంది. ఆహారపదార్థాల ధరలు, పెరిగిపోతున్నాయి. సామాన్య మానవులు, హోటళ్ళలో ఏమీ కొని తినే పరిస్థితి లేదు. వారికి వైద్య ఖర్చులు పెరిగి పోతున్నాయి.

సామాన్యులు నగరాల్లో, మురికివాడల్లో, గుడిసెల్లో బ్రతకవలసి వస్తోంది. తక్కువ ఆదాయం వారి బ్రతుకులు నగరాల్లో కుక్కల కంటే హీనంగా ఉంటోంది. నగరాల్లో ఇండ్ల స్థలాలు, లేక, చెరువులు కప్పి ఇళ్ళు కడుతున్నారు. వర్షాలు వస్తే ఆ ఇళ్ళు మునిగి పోతున్నాయి.

నగరాల్లో ఉద్యోగాలు సహితం, తేలికగా దొరకడం లేదు. పోటీ పెరిగిపోయింది. వలసలు వచ్చినవారు, తమ పిల్లలను కాన్వెంటు ఫీజులు కట్టి చదివించలేక పోతున్నారు. వారు కార్పొరేట్ వైద్యశాలల ఫీజులు కట్టి వైద్యం చేయించుకోలేక పోతున్నారు. నగరాలలో ఏదో బ్రతకాలని వచ్చిన గ్రామీణులు, ఉభయ భ్రష్టులయి, నగరాలలో ఇలా కష్టనష్టాలకు గురి అవుతున్నారు.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 4.
“ఒక పత్రికలోని సంపాదకీయాలను చదివితే, ఆ పత్రిక ఆలోచనా ధోరణులనూ, దృక్పథాన్నీ అర్థం చేసుకో వచ్చు” దీని పట్ల మీ అభిప్రాయాన్ని సోదాహరణంగా వ్రాయండి. (March 2015)
జవాబు:
సమకాలీన సంఘటనలలో ముఖ్యమైన వాటిని తీసుకుని పత్రికల్లో వ్యాఖ్యాన రూపంతో పూర్వాపరాలను పరామర్శిస్తూ సాగే రచన సంపాదకీయ వ్యాసం. తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకుంటూ, ఆలోచింప చేయగలగడం మంచి సంపాదకీయ వ్యాసం. తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకుంటూ, ఆలోచింప చేయగలగడం మంచి సంపాదకీయ లక్షణం. ఇవి తత్కాలానికి సంబంధించినవే అయినా ఒక్కొక్క సందర్భంలో విభిన్న కాలాలకూ అనువర్తింప చేసుకోవచ్చును.

పత్రికల్లోని సంపాదకీయాలను చదివితే ఆ పత్రిక ఆలోచనా ధోరణిని, ధృక్పథాన్ని తెలుసుకోవచ్చును. తెలంగాణ రాష్ట్రంలో వెలువడే ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో సంపాదకీయం ఆ ప్రభుత్వానికి అద్దం పట్టి ప్రతి పనినీ, సమర్థిస్తూ వ్రాయబడుతుంది.

అదే ఈనాడు పత్రికైతే అందులోని సంపాద కీయాలు కాంగ్రేసు పార్టీని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా సంపాదకీయాలుంటాయి. కాని ఈనాడు పత్రికలో సంపాదకీయాలు మంచిని ప్రశంసిస్తూ, చెడును విమరిస్తూ వ్రాయబడతాయి. నిజానికి సంక్షేమ పథకాలు, ప్రకటనలు, కొత్తవేవీ కావు. గత ప్రభుత్వాలు పాలించిన కాలంలో ఎన్నెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టబడ్డాయి.

అయితే పత్రికలన్నీ సామాజిక బాధ్యతతో, నిజాయితీతో మంచిని మంచిగా, చెడ్డను చెడ్డగా విశ్లేషిస్తూ సంపాదకీయాలు వ్రాస్తే జగతి జాగృతం అవుతుంది.

ప్రశ్న 5.
పెద్దనోట్ల రద్దువల్ల కలిగే పరిణామాలను గురించి ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
స్వాతంత్య్రం వచ్చి దేశానికి 65 సం॥ దాటినా అవినీతి మాత్రం ఎక్కడా తగ్గలేదు. కొంతమంది గొప్ప ధనవంతులు అవినీతి మార్గంలో సాధించిన డబ్బును గుప్తంగా దాచుకుంటున్నారు. దేశవిదేశాల్లో నల్లకుబేరులు పెరిగిపోయారు. దొంగనోట్ల చెలామణి ఎక్కువగా ఉంది. దీంతో దేశ ఆర్థిక ప్రగతి తీవ్రంగా మందగించింది.

దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి, నల్లధనాన్ని వెలికితీయడానికి మన ప్రధానమంత్రిగారు పెద్ద నోట్లను రద్దు చేశారు. అవినీతిపరుల గుండెల్లో సింహస్వప్నంగా నిలిచారు. పారిశ్రామిక, రాజకీయ, వ్యాపారస్థుల దగ్గర మూలుగుతున్న నల్లధనాన్ని వెలికితీయడానికి ఈ చర్య సహకరిస్తుంది. అయితే కొంత ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందడంవల్ల సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చిల్లర నోట్లు దొరక్క ఇబ్బందులు పడ్డారు.

ప్రజలు కూడా ప్రధానమంత్రి తీసుకున్న సాహ సోపేత నిర్ణయాన్ని సమర్థించారు. తాత్కాలికంగా ఇబ్బందులు పడినా దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయని ప్రజలు భావించారు. రాజకీయ పార్టీలు సంకుచిత విధానాలను వీడి ప్రభుత్వానికి సహకరించాలి. అవినీతి సొమ్మును బయటకు తీసుకొనిరావడానికి సహకరించాలి.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 6.
నవసమాజంలో విద్యార్థుల పాత్ర అనే అంశంమీద వ్యాసం రాయండి.
జవాబు:
విద్యను అర్థించువారు విద్యార్థులు. సంఘమునకు చేయు సేవ సంఘసేవ. విద్యార్థులు బాల్యము నుండే సంఘమునకు సేవచేయు అలవాటును కలిగియుండ వలెను. నేటి విద్యార్థులే రేపటి పౌరులు. కనుక సంఘసేవ పట్ల ఆసక్తి గల విద్యార్థులు భవిష్యత్తులో ప్రజానాయకులై దేశమును అన్ని రంగములలోనూ అభివృద్ధిలోనికి తీసుకుని రాగలరు.

సంఘసేవలో విద్యార్థుల విధులు – పాత్ర :
విద్యార్థులలో సేవాభావమును అభివృద్ధి చేయుటకై పాఠశాలలో స్కౌట్స్ మరియు గైడ్స్, ఎన్.సి.సి. వంటి పథకములు ప్రవేశపెట్టబడినవి. ఇవేకాక కళాశాలల యందు జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్.) అను దానిని ప్రవేశపెట్టారు. వీటిలో ఉత్సాహవంతులు అయిన విద్యార్థులు సభ్యులుగా చేరవచ్చును. ఆ విద్యార్థుల్ని సేవా పథకంలో పాల్గొనచేయుటకు ఒక ఉపాధ్యాయుడు నాయకత్వము వహించును.

విద్యార్థులు అనేక విధాలుగా సంఘసేవ చేస్తూ జాతీయాభ్యుదయానికి సహకరించవచ్చును. తామున్న ప్రాంతములోను, మురికివాడలకును పోయి అక్కడివారికి పరిశుభ్రత యొక్క అవసరమును వివరించి అందరూ శుభ్రముగా ఉండునట్లు చూడవచ్చును. చదువురాని వయోజనులకు విద్య నేర్పవచ్చును. పట్టణాలలో రహదారి నిబంధనలను తప్పకుండా ఉండునట్లు చేయుటలో పోలీసువారికి విద్యార్థులు సహకరించవచ్చును. ఉత్సవాలు, సభలు జరుగునపుడు విద్యార్థులు స్వచ్ఛంద సేవకులుగా పాల్గొని అచ్చటి జనులకు అవసరమైన సేవలు చేయవచ్చును.

ముగింపు :
ఈ విధంగా విద్యార్థులు బాల్యం నుండి తమ యింటిలో అమ్మ నాన్నలకు వారు చేయు పనిలో సహకరించడంతో పాటు సంఘసేవా కార్యక్రమాలలో పాల్గొనుట వలన మంచి పనులు చేయుచున్నాము అన్న తృప్తి వారికి కలుగుతుంది. దేశానికి సేవ చేసినట్లు అవుతుంది.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 7.
‘పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు’ అనే అంశంపై వ్యాసాన్ని రాయండి.
జవాబు:
పర్యావరణ పరిరక్షణ భూగోళానికి ఎంతో ప్రముఖ మైంది. పర్యావరణ పరిరక్షణలో చెట్ల ప్రాధాన్యం విలువైంది. పచ్చని చెట్లు ప్రకృతికి మరింత అందాన్ని తెచ్చిపెడతాయి. పచ్చని చెట్లని ప్రగతికి మెట్లగా భావిస్తారు.

ఈనాడు దేశం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ‘నీరు’ యొక్క కొరత, మనకు చాలా కాలంగా మహారాజులు, దాతలు గ్రామాల్లో చెరువులు త్రవ్వించి, వర్షం నీటిని దానిలో నిల్వ చేసి ప్రజలకు నీటి సదుపాయం కల్పించారు. దేశ విస్తీర్ణంలో మూడవ వంతు అడవులు ఉంటే మంచి వర్షాలు పడతాయి. ఇప్పుడు అడవుల విస్తీర్ణం తగ్గిపోయింది. దానితో వర్షాలు లేవు. దానితో నదులు నిండుగా ప్రవహించడం లేదు.

ఇప్పుడు రోడ్లు, ఇళ్ళు అన్నీ కాంక్రీట్ అయి పోయాయి. దానితో నీరు భూముల్లోకి ఇంకడం లేదు. అందువల్ల ప్రతి ఇంటివారు ఇంకుడు గుంటలు ఏర్పాటు చేయాలి. చెరువులను బాగా త్రవ్వించి నీరు నిలువ చేయాలి. చెరువులలో, కాలువల్లో నీరు నిండుగా ఉంటే భూగర్భజలాలు పుష్కలంగా ఉంటాయి.

ప్రతి ఒక్కరు ఖాళీ ప్రదేశాల్లో చెట్లు పెంచాలి. అందువల్ల వాతావరణం చల్లబడుతుంది. పరిశుభ్ర మవుతుంది. మంచి వర్షాలు పడతాయి. ప్రభుత్వం ఇందుకే చెట్లు – నీరు పుష్కలంగా లభించేలా
చూడాలి. నీటి వనరులను కలుషితం కాకుండా కాపాడుకోవాలి.

సూచనలు :
ఈ కార్యక్రమాన్ని మొక్కుబడితోకాక, చిత్తశుద్ధితో అమలు చేయాలి. నాటిన మొక్కలను పెంచి పోషించే గురుతర బాధ్యతను కూడా మనమే స్వీకరించాలి. మొక్కల సంరక్షణ మన కర్తవ్యంగా భావించాలి. “వృక్షో రక్షతి రక్షితః”. అని అంటారు. అంటే వృక్షాలను మనం రక్షిస్తే అవి మనందరిని రక్షిస్తాయి అని చెట్లను విచక్షణా రహితంగా నరికేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. ఆ రోజే ఈ కార్యక్రమ రూపకల్పనకు ఒక అర్థం, పరమార్థం ఏర్పడుతుంది. అంతేకాదు మనం కలలుకంటున్న స్వర్ణాంధ్రప్రదేశ్ ఆచరణరూపం దాలుస్తుంది.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 8.
ప్రభుత్వాలకు – ప్రజలకు మధ్య అనుసంధానంగా వ్యవహరించే వార్తాపత్రికల గురించి ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
ప్రచారసాధనాల్లో ప్రముఖ పాత్ర వహించేవి వార్తాపత్రికలు. ఒక్కపత్రిక పదివేల సైన్యంతో సమానమని మన పెద్దలు భావించారు. ఈనాడు వార్తాపత్రికలు గొప్పగా జాతికి ఉపయోగపడు తున్నాయి. ప్రపంచంలో గల అన్ని దేశాలలోని వింతలు, విశేషాలను మనకు వెంట వెంటనే తెలియజేసేందుకు వార్తాపత్రికలు బాగా ఉపయోగ పడతాయి. వీటినే ఆంగ్లంలో “న్యూస్ పేపర్స్” అంటారు. నాలుగు దిక్కుల మధ్యగల ప్రదేశాలకు సంబంధించిన విశేషాలను వార్తలని కొందరు చమత్కరించారు.

“వెనిస్” నగరంలో 16వ శతాబ్దంలో వార్తాపత్రికలు మొదలు పెట్టబడినాయి. భారతదేశంలో తొలి వార్తాపత్రిక ఇండియా గెజిట్ అని కొంతమంది, బెంగాల్ గెజిట్ అని కొంతమంది అంటారు. వంగదేశంలో రాజారామ్మోహన్రాయ్, ఆంధ్రదేశంలో ముట్నూరి కృష్ణారావుగారు, కాశీనాథుని నాగేశ్వరరావు గారు పత్రికలను మొదట స్థాపించారు. పత్రికలను నడుపుటకు సంపాదకులు, వార్తలను సేకరించుటకు విలేకరులు పనిచేస్తూ ఉంటారు. రోదసిలోని ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ సౌకర్యంతో చాలా వేగంగా వార్తలు సేకరించబడు తున్నాయి. వెలువడే సమయాన్ని బట్టి దిన, వార, పక్ష భేదములతో ఇవి నడుస్తున్నాయి.

పత్రికలను నిత్యం చదవడం వల్ల అనేక విషయాలు తెలుస్తాయి. చదివేవారికి ప్రపంచజ్ఞానం తెలుస్తుంది. మనుష్యుల దృష్టి విశాలమవుతుంది. ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి, వాటిలోని మంచి చెడులను గురించి, అవి అమలు జరుగుతున్న తీరును గురించి. ఈ పత్రికలు వివరిస్తాయి. ఇవి ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధుల వంటివి. వీటివల్ల భాష మెరుగులు దిద్దుకుంటుంది. అయితే ఈ పత్రికలు అబద్ధపు వార్తలను, వక్రీకరించబడిన వార్తలను ప్రచురించకూడదు. ప్రజలకు సేవచేసే ఉద్దేశంతోనే వెలువడాలి. కనుక వారిని మభ్యపెట్టే రచనలు చేయకూడదు.

పత్రికలు సక్రమంగా నిర్వహించబడి, సేవా దృక్పథంతో ప్రచురించబడితే చాలా ఉపయోగకరంగా నిలిచి శాశ్వత కీర్తిని సంపాదించుకోగలవు.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 9.
నేటి ఆధునిక సమాజంలో కంప్యూటర్ల పాత్రపై ఒక వ్యాసమును వ్రాయండి.
జవాబు:
నిరంతర అన్వేషియగు మానవుడు విజ్ఞానశాస్త్ర అభివృద్ధితో టెలిఫోన్, టెలిగ్రాఫ్, రేడియో, దూరదర్శన్ వంటి అనేక సాధనాలు కనుగొన్నాడు. ఆధునిక ఆవిష్కరణల్లో “కంప్యూటర్” ఒకటి. నిత్య జీవితంలో అది ఒక భాగమయింది. కంప్యూటర్ అంటే కూడటం అని అర్థం. అన్ని రకాల గణిత సమస్యలను సాధించే యంత్రమునే కంప్యూటర్ అనవచ్చును. కంప్యూటర్లో కీబోర్డు, టెలివిజన్ స్క్రీన్ ముఖ్యమైనవి.

మనం ఏం చెపితే అది చేసే ఎలక్ట్రానిక్ యంత్రం కంప్యూటర్. అంకెలకు సంబంధించినవి డిజిటల్ కంప్యూటర్లు కాగా, పరిమాణాలకు రాసులకు చెందినవి ఎనలాగ్ కంప్యూటర్లు. ఇవి సమాచారాన్ని గ్రహిస్తాయి, నిల్వ చేస్తాయి, మనకు చెబుతాయి. చైనాలో వాడిన అబాకస్ అనే పలక కంప్యూటరుకు ఆధారం. బాబేజ్ అనే శాస్త్రవేత్త 1880లో తయారుచేసిన పలక రూపాంతరం చెంది నేటి కంప్యూటరయింది. వీటి తయారీలో అమెరికా, జపాన్ దేశాలు పోటీపడు తున్నాయి.

సున్నితమైన వీటిని దుమ్ము చేరడానికి వీలులేని ఎయిర్ కండిషన్ గదుల్లో ఉంచి వాడతారు. ఇది సమాచారాన్ని ఖచ్చితంగాను, త్వరగాను అందిస్తుంది. ఇది 1, 0 లను మాత్రమే గ్రహిస్తుంది. మనం చెప్పే విషయాన్ని 1, 0 లలోకి మార్చేందుకు ట్రాన్స్ లేటర్స్ ఉంటాయి. అవి విషయాన్ని మార్చి కంప్యూటర్ భాషలో అందిస్తాయి. జవాబును మనకు అర్థమయ్యే భాషలో అందిస్తాయి. సాధారణంగా కంప్యూటర్లు అనగానే సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అని వింటుంటాము. సాఫ్ట్వేర్ అంటే కంప్యూటర్ నడిపే విధానానికి చెందింది. హార్డ్వేర్ అనగా కంప్యూటర్కు కావలసిన సాధనాలు.

కంప్యూటర్ల ఉపయోగాలు నేడు అనేకం ఉన్నాయి. అమెరికా, జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాలు వీటి వాడకంలో చాలా ముందున్నాయి. కృత్రిమ ఉపగ్రహాల ప్రయోగం, గమనములకే గాక అణ్వస్త్రాల ప్రయోగానికి కూడా వాడడానికి సిద్ధమవుతున్నాయి.

వీటివలన నిరుద్యోగ సమస్య పెరుగుతుందనే కారణం కొంత సమంజసమే అయినా ఆధునిక విజ్ఞానాభివృద్ధిని త్రోసిపుచ్చలేము కనుక కంప్యూటర్ విజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉపాధి అవకాశాలు కల్పించుకోవడం మంచిది.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 10.
విద్యార్థికి మాతృభాషలోనే విద్యాబోధన జరగాలనే అంశం గురించి నీ అభిప్రాయాన్ని ఒక వ్యాస రూపంలో వ్రాయండి.
జవాబు:
తల్లి నుండి బిడ్డ నేర్చుకొనెడి భాషే మాతృభాష. తల్లి ఒడిలోని శిశువు మాతృస్తన్యముతో పాటే మాతృ భాషామృతాన్ని కూడా పానం చేస్తుంది. మానసిక మైన భావపరంపరను వ్యక్తులు పరస్పరం తెలియ జేసుకోవడానికి ఉపయోగించే వాగ్రూపమైన సాధనమే భాష.

తన జాతి ఆచార వ్యవహారాలను, తనవారి తీరు తెన్నులను, కట్టుబొట్టు మున్నగు సంప్రదాయాలవంటి అనేక విశేషాలను బాల్యం నుండియే తెలుసుకోవడానికి అనువైనది మాతృభాష, బాహ్య ప్రపంచాన్ని తెలుసుకోవడానికి తొలి ఆధారం మాతృభాష. అయిదేండ్ల ప్రాయంగల విద్యార్థికి మాతృభాషలోనే విద్యాభ్యాసం ప్రారంభించడం మన సంప్రదాయం. విద్యను బాల బాలికలు మాటలు వచ్చినది మొదలు ఏ భాషను ఉపయోగించు కొనుటకు అలవాటుపడతారో దానిలోనే నేర్చు కోవడం సులభం.

ప్రాచీన కాలము నుండి మన విజ్ఞానమంతయు సంస్కృతమునందే కలదు. మెకాలే విద్యావిధానం అమలు జరగడంతో ఆంగ్లభాష దేశంలో నిర్బంధ విద్య అయింది. అది ప్రపంచ భాష అయినందున, దాన్ని నేర్చుకోవాలనే తపన స్వదేశీయులలో కూడా పెరిగింది. ఆంగ్లభాష ప్రాబల్యం పెరిగి మాతృభాష నిర్లక్ష్యం కావడం జరిగింది. పానుగంటివారి ‘సాక్షి’ వ్యాసాలలోని “స్వభాష” అనే వ్యాసంలో జంఘాల శాస్త్రి మాతృభాష మాట్లాడలేని వారిని వ్యంగ్యంగా పరిహసించాడు. బోధన, పరిపాలన మాతృభాషలోనే జరగడం తల్లిపాలవంటిది అని, పరాయిభాషలో జరగడం పోతపాలవంటిదని 1913లో దేశభక్త కొండా వెంకటప్పయ్యగారు అన్న మాటలు మనం జ్ఞప్తియందుంచుకోవాలి.

1947లో దేశానికి స్వాతంత్య్రం లభించిన తరువాత ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నతస్థాయి విద్య గ అవకాశాలు ఎక్కువగా లేకపోవడమే. రష్యా వంటి పెద్ద దేశములలో భాషలనేకం ఉన్నను రష్యన్ భాషకే ప్రాధాన్యత. చైనా, జర్మన్, ఫ్రాన్సు దేశాలు ఇంగ్లీషుకు ప్రాధాన్యతనిస్తూ మాతృభాషలోనే బోధనా, పాలనలు జరుపుకొంటున్నందున అవి పురోగతిని సాధిస్తున్నా యనే సత్యాన్ని మనం గుర్తించాలి.

మాతృభాషలో భావ వ్యక్తీకరణ సులభమగును. ఎక్కువ శ్రద్ధతో నేర్చుకోవచ్చును. సంభాషణ, విషయ విశ్లేషణ చేయడం తేలిక. జ్ఞానార్జన, అవగాహన, మూర్తిమత్వ వికాసాలకు మాతృభాషా బోధన తోడ్పడుతుంది. ఆయా రాష్ట్రాల్లో మాతృభాషా విద్యాబోధన, పాలనలకు ఎక్కువ స్థానం కలిగించి, నేర్చినవారికి ఉద్యోగావకాశాలు రాష్ట్రస్థాయిలో కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిది.

అధికార భాషా సంఘం, ప్రభుత్వం, విద్యాధికులు మాతృ భాషలో విద్యాబోధనకు మరింతగా కృషి చేయాలి. మాతృభాషలో విద్యాబోధన చేయడం, ఇంగ్లీషును నిర్భందంగా ఒక స్థాయి వరకు నేర్పించడం చాలా అవసరం. మాతృభాషతో పాటు ఇతర భాషలను కూడా నేర్చే విద్యార్థికి సమాధానాలు వ్రాసే భాషను ఎన్నుకొనే స్వేచ్ఛను కల్పించాలి.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 11.
సత్వరమే ప్రపంచమంతా సమాచారాన్ని అందించుటలో దూరదర్శన్ పోషిస్తున్న పాత్రను తెలపండి.
జవాబు:
వింతలకు పుట్టినిల్లయిన 20వ శతాబ్దములో మానవుడు విద్యుత్తును, దానితో పనిచేసే వార్తా ప్రసార సాధనాలను ఎన్నింటినో తయారుచేశాడు. నిత్యజీవితములో టెలిఫోన్, టెలిగ్రాఫ్, టెలిప్రింటరు, వైర్ లెస్ రేడియో వంటి సాధనాల వాడకాన్ని గూర్చి తెలియని వారుండరు.

1925లో బ్రిటిష్ శాస్త్రవేత్తలైన జె.యల్. బయర్డు, జెనిన్సు అనేవారు దూరదర్శన్ను కనుగొన్నారు. దూరదర్శన్ లో మాట వినిపించడంతో పాటు అది పలికే వ్యక్తి కూడా మనకు కనిపించడం విశేషం. బ్రిటిష్ శాస్త్రజ్ఞులు లండనులో తొలిసారి దీనిని ప్రదర్శించారు. దూరదర్శన్ ప్రసార కేంద్రం లోని ట్రాన్స్ మిషన్ శబ్ద, చిత్ర తరంగాలను విద్యుత్త రంగాలుగా మార్చి అంతరిక్షంలోకి వదులుతుంది. ఇండ్లలోని దూరదర్శన్ల యందున్న రిసీవర్ యంత్రము వాటిని ఆకర్షిస్తుంది. అవి తిరిగి శబ్ద, చిత్ర తరంగాలుగా మార్పు చెంది మన కనుల ముందు ప్రత్యక్షమగును.

బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బి.బి.సి) వారు 1936లో దూరదర్శన్ కార్యక్రమాలను ప్రచారంలోకి తెచ్చారు. దూరదర్శన్ మన దేశంలో తొలిసారిగా 1957లో ఢిల్లీలో ప్రారంభమైంది. పిదప ముంబాయి (బొంబాయి), చెన్నై (మద్రాసు), కోల్కతా (కలకత్తా) లలోను క్రమంగా రాష్ట్ర రాజధానులలోను ఏర్పాటయింది. మన రాష్ట్రంలో హైదరాబాదులో ప్రసార కేంద్రం ఉంది. నేడు మన దేశంలో ప్రసార కేంద్రాలు 200లకు పైగా పనిచేస్తున్నాయి. “దూరదర్శన్” అనే పేరుతో ప్రభుత్వం ఒక ప్రత్యేక సంస్థను స్థాపించింది.

దూరదర్శన్ వీనులకు విందును, కనులకు పండుగను కల్పిస్తున్నది. విజ్ఞానంతోపాటు వినోదాన్ని కూడా ప్రజలకు పంచిపెట్టే సాధనం టెలివిజన్. చిత్ర గీతాలు – చలనచిత్రాలు ఇల్లు కదలకుండానే ఆబాలగోపాలం చూచి ఆనందించుటకు వీలు కలిగింది. క్రీడలు నేరుగా జరుగుతుండగానే ఇంటియందు మనం చూడవచ్చును. పిల్లలకు బాల వినోదిని, వార్తా ప్రసారములు, ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతున్నాయి. వ్యవసాయ, ఆరోగ్య, వైద్య, సాహిత్య, సంగీత, క్రీడాకార్యక్రమాల వంటివి ఆయా రంగాలలో అభిరుచి గలవారికి ఆనందాన్ని – విజ్ఞానాన్ని కలిగిస్తాయి.

చాలా కేంద్రాలు విద్యాబోధనకు కూడా దూరదర్శనన్ను వినియోగిస్తున్నాయి. పొదుపు – పెట్టుబడులు, షేర్ మార్కెట్టు మొదలైనవన్నీ దూరదర్శన్లో ప్రసారం అవుతున్నాయి. దూరదర్శన్ ప్రసారాలకై వివిధ ఛానల్స్ పనిచేస్తున్నాయి. అందువలన కార్యక్రమాల్లో వైవిధ్యము, పోటీ కనబడుతున్నాయి. మంచి విలువగల్గి ఉపయోగ కరములైన కార్యక్రమాలు మాత్రమే వచ్చేట్లు ప్రభుత్వం చూడాలి.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 12.
సంఘసేవలో విద్యార్థులు ఆచరించవలసిన విధి విధానాలను విశ్లేషణాత్మకంగా వ్యాసరూపకంగా వ్రాయండి.
జవాబు:
విద్యను అర్థించువారు విద్యార్థులు. సంఘమునకు చేయు సేవ సంఘసేవ. విద్యార్థులు బాల్యము నుండే సంఘమునకు సేవచేయు అలవాటును కలిగియుండ వలెను. నేటి విద్యార్థులే రేపటి పౌరులు. కనుక సంఘసేవ పట్ల ఆసక్తి గల విద్యార్థులు భవిష్యత్తులో ప్రజానాయకులై దేశమును అన్ని రంగములలోనూ అభివృద్ధిలోనికి తీసుకుని రాగలరు.

సంఘసేవలో విద్యార్థుల విధులు పాత్ర :
విద్యార్థులలో సేవాభావమును అభివృద్ధి చేయుటకై పాఠశాలలో స్కౌట్స్ మరియు గైడ్స్, ఎన్.సి.సి. వంటి పథకములు ప్రవేశపెట్టబడినవి. ఇవేకాక కళాశాలల యందు జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్.) అను దానిని ప్రవేశపెట్టారు. వీటిలో ఉత్సాహ వంతులు అయిన విద్యార్థులు సభ్యులుగా చేరవచ్చును. ఆ విద్యార్థుల్ని సేవా పథకంలో పాల్గొనచేయుటకు ఒక ఉపాధ్యాయుడు నాయకత్వము వహించును.

విద్యార్థులు అనేక విధాలుగా సంఘసేవచేస్తూ జాతీయాభ్యుదయానికి సహకరించవచ్చును. తామున్న ప్రాంతములోను, మురికివాడలకును పోయి అక్కడివారికి పరిశుభ్రత యొక్క అవసరమును వివరించి అందరూ శుభ్రముగా ఉండునట్లు చూడవచ్చును. చదువురాని వయోజనులకు విద్య నేర్పవచ్చును. పట్టణాలలో రహదారి నిబంధనలను తప్పకుండా ఉండునట్లు చేయుటలో పోలీసువారికి విద్యార్థులు సహకరించవచ్చును. ఉత్సవాలు, సభలు జరుగునపుడు విద్యార్థులు స్వచ్ఛంద సేవకులుగా పాల్గొని అచ్చటి జనులకు అవసరమైన సేవలు చేయవచ్చును.

ముగింపు :
ఈ విధంగా విద్యార్థులు బాల్యం నుండి తమ యింటిలో అమ్మ నాన్నలకు వారు చేయు పనిలో సహకరించడంతో పాటు సంఘసేవా కార్యక్రమాలలో పాల్గొనుట వలన మంచి పనులు చేయుచున్నాము అన్న తృప్తి వారికి కలుగుతుంది. దేశానికి సేవ చేసినట్లు అవుతుంది.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 13.
పర్యావరణ పరిరక్షణలో ప్రజలపాత్రపై ఒక వ్యాసాన్ని వ్రాయండి.
జవాబు:
భూమి, గాలి, నీరు మొదలైన వాటితో మనిషికి ఉండే అవినాభావ సంబంధమే పర్యావరణం. అందువల్ల పర్యావరణం అంటే పరిసరాల ‘వాతావరణం’ అని అంటారు. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం వల్లే మనం ఆరోగ్యంగా బతుకుతున్నాము. పరిసరాల వాతావరణం కలుషితంకాకుండా కాపాడు కోవటమే పర్యావరణ సంరక్షణ అనబడుతుంది.

విషయ ప్రస్తావన :
నీరు ప్రాణాధారతకు, దాహాన్ని తీర్చడానికి, పంటలు పండటానికి ఉపయోగపడు తోంది. చెట్లు శుభ్రమైన గాలినిస్తూ, వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తున్నాయి. అయితే రాను రాను జనాభా పెరుగుదల మూలంగాను, నాగరికత మోజు వల్లను, మన పరిసరాలను మనమే పాడు చేసు కుంటున్నాము. కర్మాగారాలు, యంత్రాలు, వాహనాలు పెరిగి’ వాతావరణం కాలుష్యంతో నిండిపోతుంది. ఉష్ణోగ్రత పెరిగిపోయి అనావృష్టి లేక అతివృష్టిని కల్గించేలా దురదృష్టకర మార్పులు ఏర్పడుతున్నాయి. అడవులను నరికివేయడం వల్ల వరదలేర్పడి జన నష్టం, పంటనష్టం ఏర్పడుతోంది.

రక్షణ చర్యలు :
పర్యావరణ పరిరక్షణకై ప్రపంచ సంస్థలు, మన ప్రభుత్వాలు ఎన్నో తీవ్ర చర్యలు తీసుకుంటున్నాయి. జన్మభూమి పథకం క్రింద మన ఇళ్ళను, గ్రామాలను, పరిశుభ్రంగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇంటిలోని చెత్తను ఇంటియందు పారవేయకుండా, వీధి చివర కుండీ ఏర్పాటు చేసుకొని అందులో పారవేయాలి. కుళాయి వద్ద, మురికి కాల్వల వద్ద చెత్త ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

మలేరియా, టైఫాయిడ్, రోగ కారకమైన దోమలు విజృంభించ కుండా డి.డి.టి. వంటి మందులు చల్లుకోవాలి. మురికివాడల వాసులకు శుభ్రత గూర్చి తెలియ జేయాలి. చెట్లను నాటాలి. పారిశుధ్య కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలి. గాలి, వెలుతురులు వచ్చేలా ఇళ్ళు నిర్మించుకోవాలి. పరిసరాల పరిశుభ్రతతోనే మనందరి అభివృద్ధి ఉందని గ్రహించాలి. దీనికై అందరూ ఉద్యమించాలి. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీ పర్యావరణ దినోత్సవంగా పాటిస్తున్నారు. పర్యావరణ వ్యవస్థ లోని సమతౌల్యాన్ని కాపాడు కోవడానికి అందరూ కృషి చేయాలి.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 14.
అవయవదానంపై ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
ఉపోద్ఘాతం : పుట్టుకతోనే అవయవ లోపాలతో కొందరు పుడుతూ ఉంటే, ప్రమాదాల్లో అవయవాలు పోగొట్టుకునేవారు కొందరు. కన్ను, ముక్కు, చెవి, కాళ్ళు, చేతులు – వీటిలో ఏ అవయవం లేకపోయినా బాధాకరమే.

విషయ విశ్లేషణ :
మన చుట్టూ ఉన్న ప్రకృతిలోని అందాలను చూసి ఆనందించాలన్నా, చక్కని సంగీతం వినాలన్నా, సుందరమైన ప్రదేశాలకు వెళ్ళాలన్నా కళ్ళు, ముక్కు, కాళ్ళు చేతులు తప్పనిసరి. ఇవేకాదు మూత్రపిండాలు ఊపిరితిత్తులు వంటి అవయవ భాగాలు ముఖ్యమైనవే. రక్తం అవయవ భాగం కాకపోయినా, అవయవమంత ప్రాముఖ్య మున్నదే.

కళ్ళు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, రక్తం వంటి వాటిని దానమిచ్చి మన చుట్టూ ఆయా అవయవాల లోపంతో బాధపడేవారిని ఆదుకోవడమే మానవజన్మకు సార్థకత.

జీవించి ఉండగానే, కళ్ళు, మూత్రపిండాలు వంటివి దానం చేయవచ్చు. మరణించాక కూడా జీవించి ఉండటానికి మార్గం అవయవదానం.

తమ మరణానంతరం, తమ కళ్ళను దానం చేస్తామంటూ, ఎంతోమంది నేటికాలంలో ముందు కొస్తున్నారు. అలా నేత్రదానంతో ఎంతోమంది అంధులకు వెలుగునిస్తూ, మరణించాక కూడా జీవించడం గొప్ప విషయం.

అలాగే ఇటీవల బెంగుళూరుకు చెందిన వ్యక్తి గుండె చెన్నైకి చెందిన మరొక వ్యక్తికి మార్పిడి చేయడం ద్వారా ఆ వ్యక్తికి ప్రాణం పోశారు. అలాగే ఇటీవల విజయవాడకు చెందిన మణికంఠ, మరొక యువకుడు దానం చేసిన గుండె, నేత్రాలు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం మరికొందరివి జీవించగలిగేటట్లు చేశాయి.

ముగింపు :
ఇలా అవయవ దానం వల్ల కొంతమంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. ఇటువంటివారు రాబోయే తరాలకు స్ఫూర్తిదాతలు.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 15.
విజ్ఞానశాస్త్ర ప్రయోజనాలు
జవాబు:
పరిచయం :
మానవుడు భూమిపై అవతరించి నప్పటి నుంచీ పంచభూతాలతో నిండిన ప్రకృతిని నిశితంగా పరిశీలించి తన సుఖజీవనానికి మలచుకొన సాగారు. జిజ్ఞాస పెరిగేకొద్దీ కాలక్రమేణ మనిషి నేల, నిప్పు, నీరు, గాలి, నింగిని పరిశోధించి వాటి తత్త్వాన్ని ఆకళింపు చేసుకున్నాడు.

ఖగోళ విజ్ఞానం, గృహ సంచారం, భూగోళ స్వరూప స్వభావాలు, పంచభూతాల శక్తులు మనిషికి లొంగసాగాయి. తాను గ్రహించిన విజ్ఞానాన్ని శాస్త్ర రూపంలో రచించి తరువాతి తరాల వాళ్ళకు అందించాడు విజ్ఞానియైన మానవుడు. క్రమంగా ఆ విజ్ఞానం పెరిగి విస్తరించి శాఖోపశాఖలైంది. దీనినే విజ్ఞానశాస్త్రం అంటున్నాం.

ఉద్దేశ్యం :
ఆధునిక యుగంలో పదార్థ విజ్ఞా ప్రధానమైంది భౌతికశాస్త్రం. ఇందులో శబ్దం, కాంతి దర్శనం వంటి అంశాల మీద విశేష పరిశోధన జరిగింది. ఇంకా జరుగుతోంది. దీని ఫలితంగా భూమి పైన, విశ్వాంతరాళంలో ఎక్కడికైనా రేడియో ప్రసారావకాశాలు, దూరదర్శన్ ప్రసారాలు, ఛాయాచిత్ర సేకరణ వంటివి సాధ్యమయ్యాయి. అణువిచ్ఛిత్తి వలన విద్యుచ్ఛక్తి ఉత్పత్తి, ఐసోటోపులు సాధ్యమై అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి.

వైద్య రంగంలో ఎక్స్, లేజర్ కిరణాల వలన, వ్యాధి నిర్ణయ విధానంలో కొత్తరీతులు సాధ్య మయ్యాయి. రకరకాల రాడార్లు తుఫాను రాకడ, వర్షా గమనం వంటి వాటిని ముందే తెలుపుతున్నాయి. యుద్ధ పరికరాలు, అస్త్రశాస్త్రాలు, ఆటంబాంబులు, హైడ్రోజన్ బాంబు, సుదూర లక్ష్యఛేదనం మరింత అభివృద్ధి చెందాయి. రసాయనశాస్త్ర పరిశోధనల వలన రకరకాల రసాయనాలు తయారై మందులకు, పరిశ్రమలకు ప్రజలకు ఉపయోగ పడుతున్నాయి.

వృక్షశాస్త్ర రంగంలో పరిశోధనల వలన రక రకాల కొత్త వంగడాలు, అధిక దిగుబడి సాధ్యమైంది. ఆహార పదార్థాల ఉత్పత్తి హెచ్చింది. ఇంజనీరింగు, సాంకేతిక శాస్త్ర రంగంలో జరుగుతున్న కృషి ఫలితంగా ఎన్నో ఖనిజాలను, సంపదను వెలికి తీయటం, రకరకాల యంత్ర, వస్తు నిర్మాణం, శీఘ్రగమనం సులభసాధ్యమైంది.

సృష్టిలో పనికిమాలినది లేదని, ప్రతిదీ ఏదో ఒక పరమ ప్రయోజనాన్ని కలిగిస్తుందని ఆధునిక విజ్ఞానశాస్త్రం నిరూపిస్తున్నది. చెత్తనుంచి, పేడనుంచి విద్యుదుత్పత్తి, తవుడు నుంచి నూనె, మురుగునీటి నుంచి మంచినీరు వంటివాటిని ఉత్పత్తి చేయటం.

సూర్యరశ్మి నుంచి విద్యుత్తును గ్రహించి మానవో పయోగానికి తేవటం, యంత్ర మానవులను సృష్టించటం, వాటితో పెద్ద పెద్ద పరిశ్రమల్ని నిర్వహించటం ఈనాడు జరుగుతున్నది. గగనంలో చాలా ఎత్తుగా, వేగంగా పయనించటం, గ్రహాంత రాలకు రాకెట్లు, ఉపగ్రహాలు పంపటం, నేలమీద గంటకు కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో పోయే రైళ్ళను నడపటం విజ్ఞానశాస్త్రం సాధించిన ఘన కార్యాలుగా పరిగణింపబడుతున్నాయి.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ముగింపు :
సృష్టికి ప్రతిసృష్టి చేస్తున్న విజ్ఞానశాస్త్రం మానవ జీవితంలో అనూహ్యమైన మార్పుల్ని తెస్తున్నది. మృత్యుముఖంలో ఉన్న మనుష్యుణ్ణి మృత్యువు నుంచి కాపాడి ప్రాణం పోస్తున్నది. దీనికి విరుద్ధంగా ఆటంబాంబులు, హైడ్రోజన్ బాంబులు, ఖండాంతర వేధులు, మృత్యుకిరణాలు, విషవా యువులు వంటివి మానవజాతి మనుగడకే సవాలుగా పరిణమించాయి. ఊపిరిపోస్తున్న విజ్ఞాన శాస్త్రమే ఊపిరి తీసివేస్తున్నది. ఇది అత్యంత విషాదకరం. మనుష్యుడు వివేకంతో విజ్ఞాన శాస్త్రాన్ని మానవాభ్యుదయానికి మాత్రమే వినియోగిస్తే సర్వ మానవాళి సుఖ శాంతులతో వర్ధిల్లుతుంది.

ప్రశ్న 16.
దేశభక్తుల వల్ల దేశ ప్రజలకు కలిగే ప్రయోజనాలు వ్యాసంగా రాయండి.
జవాబు:
దేశమును ప్రేమించుమన్నా – మంచి అన్నది పెంచమన్నా
సొంతలాభం కొంత మానుక – పొరుగువారికి తోడుపడవోయ్.

ఇది దేశభక్తుని లక్షణం. తాను, తన కుటుంబం బాగుంటే చాలనుకోడు దేశభక్తుడు. తన చుట్టూ ఉన్న వారి క్షేమంలోనే తన క్షేమం ఉందని భావిస్తాడు.

చుట్టూ ఉన్న అన్యాయాలను, అక్రమాలను చూస్తూ సామాన్యుడు తలదించుకొని వెళతాడు. నా ఒక్కడితో ఏమౌతుంది అనే నిర్వేదంలో ఉంటాడు. అలాంటి సామాన్యులను ఒక్కతాటి మీదకు తెచ్చి వారి వెనక తాను ఉన్నాననే ధైర్యాన్ని ఇస్తాడు దేశభక్తుడు. అవినీతిపై మడమతిప్పని పోరాటం చేస్తున్న అన్నా హజారే దీనికి మంచి ఉదాహరణ.

దేశభక్తుడు నిరాడంబర జీవితాన్ని గడుపుతూ దేశ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తాడు. ప్రజలు కూడా తనలాగే నిరాడంబరంగా జీవించేలా ప్రేరేపిస్తాడు. గాంధీజీ నిరాడంబర జీవనం చూసి, అలాగే నిరాడంబర జీవనం గడిపిన పొట్టి శ్రీరాములు, బులుసు సాంబమూర్తి మనకు తెలుసు.

దేశభక్తుడు క్రమశిక్షణకు, పనిపట్ల నిబద్దతకు ప్రాముఖ్యమిస్తాడు. పొదుపును పాటిస్తాడు. ప్రజల కోసం తన సుఖాన్ని త్యాగం చేస్తాడు. జాతిని నిర్వీర్యం చేసే కులమత వైషమ్యాలను పక్కన పెడతాడు. మానవతే తన మతమని చాటుతాడు.

ఇలాంటి దేశభక్తుల మూలంగా దేశప్రజలు చైతన్యవంతులౌతారు. వారి బాటలో సామాన్యులు కూడా మాన్యులవుతారు.

ప్రఖ్యాత ఇంజనీర్లు కె.యల్. రావు, మోక్ష గుండం విశ్వేశ్వరయ్య దేశ సాంకేతిక అభివృద్ధికి కృషి చేసిన దేశభక్తులు. వారానాడు నిర్మించిన ఆనకట్టల వల్ల దేశ ప్రజల ఆహార సమస్యతీరింది.

కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, కొమఱ్ఱాజు లక్ష్మణరావు వంటి సంఘసంస్కర్తల వల్ల సంఘంలోని మూఢాచారాలు తగ్గాయి.

స్త్రీలలో స్వేచ్ఛాకాంక్షను పెంచి, తమ స్థితిని బాగు చేసుకోవాలనే తపన పెంచి, స్త్రీలను చైతన్య పరచిన ఉన్నవ లక్ష్మీబాయమ్మ, కనుపర్తి వరలక్ష్మమ్మ వంటి దేశభక్తురాళ్ళెందరో!

తమ ధన, మాన, ప్రాణాలను సైతం తృణ ప్రాయంగా దేశం కోసం త్యాగం చేసే దేశభక్తుల వల్ల ప్రజల్లో విద్య, ధర్మం, నీతి, సంఘంపట్ల చైతన్యం ఏర్పడతాయి.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 17.
సమాజంలో నైతిక, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుటకు కృషి చేస్తున్న శతక కవులను అభినందిస్తూ వ్యాసం రాయండి. (May 2022) (March 2019)
జవాబు:
“లావుగల వాని కంటెను
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ” అని సుమతీ శతకకారుడు నీతి గల వానిని గురించి చెప్పాడు. చిన్న చిన్న నీతివాక్యాలే మనిషికి ప్రవర్తనా పద్ధతులు నేర్పుతాయి. స్వార్ధరహితంగా ఉండడమే అన్ని నీతులలో కెల్లా గొప్ప నీతి, నీతిని కలిగి ఉండుటే నైతికత. నీతి అంటే ఏమిటి ? ఓ సంఘటన తర్వాత నీవు ఆనందంగా, హాయిగా భావిస్తే అదే నైతికత. తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, పెద్దల పట్ల మర్యాదగా నడుచుకోవడం నైతికతలో భాగం. తోటివారి పట్ల స్నేహంగా మెలగడం కూడా దీనిలో భాగమే. అసత్యం, కులగర్వం, పరుల సొమ్ము ఆశించడం, వరుస, వావి లేకుండడం, మోసం, స్వార్థం, కుటిలత్వం మొదలైనవి లేకుండా జీవించేవారు నైతిక విలువలు పాటిస్తున్నట్లే.

ఈ నైతికతకు ఆధ్యాత్మికత తోడైతే బంగారానికి తావి అబ్బినట్లే. మనం ఈ తప్పు చేస్తే భగవంతుడు శిక్షిస్తాడు – అనే భావన తప్పు చేయనీదు. అందుకే పెద్దలు తప్పు చేస్తే నరకంలో శిక్షలు అనుభవించాల్సి ఉంటుందని చెబుతారు. భయం, భక్తి లేకపోతే సమాజం సజావుగా సాగదు. తప్పు చేద్దామనే భావం హెచ్చుమీరుతుంది. ఇక తెగించినవాడి గురించి మాట్లాడుకోవడం అనవసరం. చదువుకునేవారికి కేవలం పోటీతత్త్వమే కాకుండా తన చదువు మరొకరికి దారి చూపేదిగా ఉండాలని చెప్పినప్పుడే అతనికి, సమాజానికి మేలు జరుగుతుంది. అందుకే పెద్దలు “శీలేన శోభతే విద్యా అన్నారు.

చేసేపనిని శ్రద్ధా భక్తులతో చేయడం వల్ల పనితనం, పనిలో విజయం చేకూరతాయి. మనం సంపాదించే ధనంలో కొంత పేదా బీదలకు ఇవ్వడం నీ ఉన్నతికి కారణమౌతుంది. నైతిక విలువలు కోల్పోయిన వ్యక్తి తన సర్వస్వాన్ని కోల్పోయినట్లే. సమాజంలోని మనిషి తన నిత్య జీవితంలో ఎలా బ్రతకాలో, ఎలా బ్రతుకకూడదో తెలియజెప్పే నైతిక విలువలు పాటించడం అత్యావశ్యకం. వీటిలో సత్యం, ధర్మం, న్యాయం, మానవీయతలు ప్రకాశిస్తుంటాయి.

మన గత చరిత్రను పరిశీలిస్తే గురుకులాలలో, దేవాలయాలలో నైతిక, ఆధ్యాత్మిక విలువలను ప్రబోధించే, పెంపొందించే కార్యక్రమాలు జరుగుతుంటాయని తెలుస్తుంది. వీటి పరిరక్షణయే లక్ష్యంగా సాహిత్యం మొదలైన కళలన్నీ ఆవిర్భవించాయి. ఎందరో మహనీయులు ఈ విలువలను సుస్థాపితం చేయడానికి తమ జీవితాలు ధారపోశారు. ఈ విలువలను మనం పాటించడం వారి శ్రమను గుర్తించడమే అవుతుంది.

శతకం బ్రతుకుకు మార్గం
శతక కవులు అభినందనీయులు వారి మార్గం ఆచరణీయం
శతక కవులకు సమర్పిద్దాం ప్రణామాలు.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 18.
సమాజంలోని మూఢనమ్మకాల్ని నిర్మూలించడానికి మీరిచ్చే సలహాలు, సూచనలు ఆధారంగా చేసుకుని వ్యాసం వ్రాయండి. (March 2018)
జవాబు:
సమాజం అంటే సమూహం అని అర్థం. మానవ సమాజమనగా మానవుల సమూహమని అర్థం. అనూచానంగా మనదేశంలో ‘మానవుల మనుగడ కల్పించేందుకై మహర్షులు కొన్ని నీతి నియమాల్ని ఏర్పాటుచేశారు. అలాగే మన సమాజంలో కొన్ని మూఢాచారాలు, మూఢనమ్మకాలు నెలకొనియున్నాయి. అయితే మానవాళి ఆ మూఢాచారాల్ని, మూఢనమ్మకాల్ని గుడ్డిగా నమ్మటం వల్ల పతనానికి దారితీశాయి. మానవాళి వృద్ధి చెందలేదు.

కాలానుగతంగా నేడు మానవ సమాజంలో అనేక మార్పులు వచ్చాయి. బాల్యవివాహాలు, సతీసహగమనాలు, జీవహింస చెయ్యటం, ప్రకృతి వైద్యమంటూ మానవుల్ని వల్లకాటికి పంపడం, చేతబడులు చెయ్యటం, దుష్టశక్తుల్ని వశం చేసుకొనుట మున్నగు దురాచారాలు ఎన్నో నెలకొనియున్నాయి. అయితే వీటిని గ్రహించి కూకటి వ్రేళ్ళతో సమూలంగా నాశనం చేయుటకు కొంతమంది సంఘ సంస్కర్తలు నడుం బిగించారు.

వారిలో కందుకూరి వీరేశలింగం పంతులు, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రాజారామమోహనరాయ్ వంటి పెద్దలు ముందుగా స్త్రీలకు ప్రత్యేక పాఠశాలల్ని ఏర్పాటు చేసి స్త్రీలకు విద్య నేర్పించారు. ఆ తర్వాత బాల్య వివాహాల్ని రద్దు చేసి శాసనాలతో ‘చట్టం చేశారు. వితంతు వివాహాల్ని పునరుద్ధరించారు. సమాజంలో దయ్యాలు, భూతాలు లేవని నిరూపించి ప్రజల్ని జాగృతులు చేశారు. అదేవిధంగా భూతవైద్యాన్ని, చేతబడుల్ని నిర్మూలించారు. శకునాల్ని నమ్మవద్దనీ, అవి కేవలం మానవుల చిత్తభ్రమలని తెలియజేశారు.

ముఖ్యంగా మానవుల్లో నెలకొనియున్న అంటరానితనాన్ని నిర్మూలించారు. భగవంతుని సృష్టిలో మానవులందరూ ఒకటేయనీ, మూఢనమ్మకాల్ని తరిమి తరిమి కొట్టండనీ హెచ్చరించారు.

కనుక మానవులందరు పరమత సహనాన్ని పాటిస్తూ, మంచిని గ్రహించాలి. సమాజంలో నెలకొనియున్న మూఢనమ్మకాల్ని తరిమికొట్టాలి.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 19.
విద్యావంతుడైన ఒక యువకుడు ఉద్యోగాల కోసం పాకులాడకుండా, సొంతంగా వ్యవసాయం చేస్తూ, చక్కగా పంటలు పండిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. ప్రభుత్వంచే అవార్డులను కూడా పొందాడు. అటువంటి యువకుణ్ణి పొగుడుతూ అభినందన వ్యాసం వ్రాయండి. (March 2017)
జవాబు:
ప్రియ మిత్రమా ! రామచంద్రా ! నీకు నా ప్రత్యేక అభినందనల్ని తెల్పుచున్నాను. ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలను సంపాదించడం చాలా కష్టతరమైంది. కాని పై చదువులకు ఎక్కడకు వెళ్ళకుండా, చదివి అగ్రికల్చరల్ B.Sc. ని చదివి ఆపేశావు.

నీవు నీ గ్రామానికి వెళ్ళి, నీ తండ్రికి తోడుగా నిల్చావు. ‘గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయమని’ గాంధీగారు చెప్పినట్లు వ్యవసాయానికే నీ చదువునుపయోగించావు. ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేసి పదిమంది రైతులకు మార్గదర్శకు డవయ్యావు. వ్యవసాయం చేయుటలో మెళుకువలన్నీ సాటి రైతులకు చెప్పావు.

అధిక దిగుబడుల నిచ్చే వరి వంగడాల్ని ఎన్నుకొని నీ పొలాన్ని సాగుచేసి, సస్యశ్యామలం చేశావు. క్రిమిసంహారక మందుల్ని వాడకుండా, కంపోస్టు ఎరువుల్ని ఉపయోగించావు. రసాయనిక ఎరువుల వల్ల కలిగే నష్టాల్ని నీ గ్రామ ప్రజలకి తెలియజేశావు. ఎకరానికి 50 నుండి 60 బస్తాలు (క్వింటాళ్ళు) ధాన్యాన్ని పండించావు.

వ్యవసాయానికి తోడుగా పాడిపరిశ్రమను చేపట్టావు. నీ వల్ల పలు నగరాలకు నాణ్యమైన పాలను సరఫరా చేశావు. గోసంరక్షణ చేసి, పలు సంస్థల నుండి గౌరవ పురస్కారాన్ని పొందావు.

నీటి సమస్య లేకుండా నీ పొలంలోనే చెరువును త్రవ్వించి నీటిని నిల్వచేశావు. త్రాగునీరు, సాగునీరు సమస్య లేకుండా చేశావు. దీనికి తోడు కోళ్ళ పరిశ్రమను ఏర్పాటు చేశావు. నీవు నీ కాళ్ళపై నిలబడటమే కాకుండా దాదాపు చాలామందికి ఉపాధిని కల్పించావు.

నేడు నీవు చదివిన చదువు సార్థకమైంది. ఇంత పరిశ్రమ చేసిన నిన్ను రాష్ట్ర- కేంద్ర ప్రభుత్వాలు అవార్డులతో సత్కరించుట నీ గ్రామానికే గర్వకారణం. నిజంగా తెలుగుతల్లి ముద్దుబిడ్డవు.. నీకు నా తరఫున, నా మిత్రుల తరఫున అభినందన మందారాలనందిస్తున్నాను. ఇంకా నీవు అభివృద్ధి చెంది మరికొంతమందికి ఉపాధి కల్పిస్తావని ఆశిస్తూ. సెలవు.

ఇట్ల
నీ ప్రియమిత్రుడు,
యన్. బాలకృష్ణ.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 20.
నేడు నగర జీవనం ఎందుకు సంక్లిష్టంగా మారిందో విశ్లేషించి వ్యాసం రాయండి. (June 2015)
జవాబు:
నేడు మనుష్యులంతా నగరాల్లోనే జీవించాలని, తాపత్రయపడుతున్నారు. నగరాల్లో ఉన్నత విద్య, ఆధునిక వైద్య సౌకర్యాలు, ఉద్యోగావకాశాలు ఉన్నాయి. అన్ని తరగతుల ప్రజలకూ అక్కడ జీవించడానికి ఉపాధి సౌకర్యాలు లభిస్తాయి. అందువల్ల గ్రామీణ ప్రజలందరూ, నగరాలకు ఎగబ్రాకుతున్నారు.

పై కారణాల వల్ల నగరాల్లో జనాభా పెరిగిపోయింది. నగరాల్లోకి వచ్చే ప్రజలకు ఉండడానికి ఇళ్ళు సరిపడ దొరకడం. లేదు. నగరాల్లో ప్రజలు నడచి వెళ్ళడానికి సైతం, రోడ్లు చాలటల్లేదు. సిటీ బస్సులు ఖాళీలుండటం లేదు. తరచుగా ట్రాఫిక్కు జామ్లు అవుతున్నాయి. త్రాగడానికి నగరాల్లో సరిపడ మంచినీరు దొరకడం లేదు. నిత్యావసరాలకు సహితం, నీరు కొనవలసి వస్తోంది. ఆహారపదార్థాల ధరలు, పెరిగిపోతున్నాయి. సామాన్య మానవులు, హోటళ్ళలో ఏమీ కొని తినే పరిస్థితి లేదు. వారికి వైద్య ఖర్చులు పెరిగిపోతున్నాయి.

సామాన్యులు నగరాల్లో, మురికివాడల్లో, గుడిసెల్లో బ్రతకవలసి వస్తోంది. తక్కువ ఆదాయం వారి బ్రతుకులు నగరాల్లో కుక్కల కంటే హీనంగా ఉంటోంది. నగరాల్లో ఇండ్ల స్థలాలు లేక, చెరువులు కప్పి ఇళ్ళు కడుతున్నారు. వర్షాలు వస్తే ఆ ఇళ్ళు మునిగిపోతున్నాయి.

నగరాల్లో ఉద్యోగాలు సహితం, తేలికగా దొరకడం లేదు. పోటీ పెరిగిపోయింది. వలసలు వచ్చినవారు, తమ పిల్లలను కాన్వెంటు ఫీజులు కట్టి చదివించలేకపోతున్నారు. వారు కార్పొరేట్ వైద్యశాలల ఫీజులు కట్టి వైద్యం చేయించుకోలేకపోతున్నారు. నగరాలలో ఏదో బ్రతకాలని వచ్చిన గ్రామీణులు, ఉభయ భ్రష్టులయి, నగరాలలో ఇలా కష్టనష్టాలకు గురి అవుతున్నారు.

ప్రశ్న 21.
ఏదైనా పూర్వ పరిపాలకులు పాలించిన పట్టణం యొక్క చారిత్రక సాంస్కృతిక విశేషాల్ని వ్రాయండి. (June 2015)
జవాబు:
గోల్కొండ దుర్గాన్ని కేంద్రంగా చేసుకుని నవాబులు హైదరాబాదు రాజ్యాన్ని పాలించారు. గోల్కొండ దుర్గమంటే మూడు కోటలు. ఈ కోటలు ఒకదానిని మరొకటి చుట్టుకొని ఉంటాయి. ఈ పట్టణ నిర్మాణ పథకానికి కర్త ఆజంఖాన్ అను ఇంజనీరు. పట్టణంలోని భాగాల్ని ‘మొహల్లాలు’ అని పిలుస్తారు. వీరికి జుమ్లా మొహల్లా, మాదన్న మొహల్లా వంటి పేర్లు ఉండేవి.

‘గోల్కొండ పట్టణాన్ని అందంగా కులీకుతుబ్షా, అబ్దుల్లా కుతుబ్షా తీర్చిదిద్దారు. గోల్కొండలో ‘నగీనాబాగ్’ అనే అందమైన ఉద్యానవనం ఉండేది. ‘దిల్కుషా’ వంటి అందమైన భవనాలు ఉండేవి. గోల్కొండలో మిద్దెలతోటలు (Roof Gardence) ఉండేవి. ఈ ఉద్యానవనానికి నీరు అందించే నీటి కాలువలు జలాశయాలు ఉండేవి.

గోల్కొండలో విదేశీ వర్తకులు వర్తకం చేసేవారు. వజ్రాలకు గోల్కొండ పుట్టినిల్లు. కులీకుతుబ్షా కాలంలో తెలంగాణ ప్రపంచపు అంగడిగా ఉండేది.

గోల్కొండలో ఉన్ని పరిశ్రమ, ఇనుము పరిశ్రమ, ఆయుధ పరిశ్రమ సాగుతుండేది. ఇబ్రహీం కుతుబ్షా తెలుగు సాహిత్యాన్ని ఆదరించాడు. 1589 సంవత్సరంలో గోల్కొండలో మహామారీ పీడ వచ్చింది. ఎందరో మరణించారు. పీర్ల పంజాలు, సాధువులు భజనలతో ఊరేగారు. అప్పుడు మహామారి తగ్గింది. దానికి గుర్తుగానే హైదరాబాదులో తాబూతు ఆకారంలో నేటి చార్మినార్ నిర్మాణం జరిగింది.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 22.
“ఒక పత్రికలోని సంపాదకీయాలను చదివితే, ఆ పత్రిక ఆలోచనా ధోరణులనూ, దృక్పథాన్నీ అర్థం చేసుకోవచ్చు” దీని పట్ల మీ అభిప్రాయాన్ని సోదాహరణంగా వ్రాయండి. (March 2015)
జవాబు:
సమకాలీన సంఘటనలలో ముఖ్యమైన వాటిని తీసుకుని పత్రికల్లో వ్యాఖ్యాన రూపంతో పూర్వాపరాలను పరామర్శిస్తూ సాగే రచన సంపాదకీయ వ్యాసం. తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకుంటూ, ఆలోచింప చేయగలగడం మంచి సంపాదకీయ లక్షణం. ఇవి తత్కాలానికి సంబంధించినవే అయినా ఒక్కొక్క సందర్భంలో విభిన్న కాలాలకూ అనువర్తింప చేసుకోవచ్చును.

పత్రికల్లోని సంపాదకీయాలను చదివితే ఆ పత్రిక ఆలోచనా ధోరణిని, ధృక్పథాన్ని తెలుసుకోవచ్చును. తెలంగాణ రాష్ట్రంలో వెలువడే ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో సంపాదకీయం ఆ ప్రభుత్వానికి అద్దం పట్టి ప్రతి పనినీ, సమర్థిస్తూ వ్రాయబడుతుంది.

అదే ఈనాడు పత్రికైతే అందులోని సంపాదకీయాలు కాంగ్రేసు పార్టీని వ్యతిరేకిస్తూ, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా సంపాదకీయాలుంటాయి. కాని ఈనాడు పత్రికలో సంపాదకీయాలు మంచిని ప్రశంసిస్తూ, చెడును విమర్శిస్తూ వ్రాయబడతాయి.

నిజానికి సంక్షేమ పథకాలు, ప్రకటనలు, కొత్తవేవీకావు. గత ప్రభుత్వాలు పాలించిన కాలంలో ఎన్నెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టబడ్డాయి.

అయితే పత్రికలన్నీ సామాజిక బాధ్యతతో, నిజాయితీతో, చిత్తశుద్ధితో మంచిని మంచిగా, చెడ్డను చెడ్డగా విశ్లేషిస్తూ సంపాదకీయాలు వ్రాస్తే జగతి జాగృతం అవుతుంది.

ప్రశ్న 23.
సమాజం కోసం పాటుపడిన వాళ్ళలో ఎవరి గురించైనా ఒకరిని గురించి అభినందన వ్యాసం రాయండి.
జవాబు:
సెయింట్ మదర్ థెరీసా
దీనజన బంధువు, కరుణామయి, విశ్వశాంతి నోబెల్ బహుమతి గ్రహీత, అయిన మదర్ థెరీసా పూర్తిపేరు, “ఆగ్నస్ గోన్షా బొజాక్షువా”. ఈమె యుగోస్లోవియాలో 1910 లో జన్మించింది.

మదర్ థెరీసాకు వాటికన్ సిటీలో పోప్ పునీత (సెయింట్) అనే హోదాను ఇచ్చారు. కలకత్తాలో ఎంటలీ ప్రాంతంలో ఈమె ఒక కాన్వెంట్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయినిగా ఉండేది.

ఆ పాఠశాల ప్రక్కన ఉన్న ‘మోతీజీన్’ మురికివాడలో పాకీవారు, కూలిజనం, కార్మికులు నివసించేవారు. అక్కడ అంతా దరిద్రం తాండవించేది. ఆ ప్రజల సముద్ధరణకు, థెరీసా కంకణం కట్టుకొంది.

థెరీసా, తినడానికి తిండిలేక, కట్టుకోడానికి బట్టలు లేక, బాధపడే అన్నార్తులకు, అసహాయులను ఆదుకోడానికి, అవతరించిన మాతృమూర్తి. ఈమె, అనురాగమయి. ఈమె అనాథ పసిపాపలను ఆదరించి, పెంచి, ప్రేమను అందించిన కరుణామయి. నిస్వార్థంగా పేదలకు సేవ చేసిన త్యాగమయి.

థెరీసా, మానవసేవయే మాధవసేవగా తలచి, పేదలకు మనశ్శాంతినీ, ప్రేమనూ అందజేసిన మానవతా మూర్తి. ప్రపంచ దేశాల నుండి, అనేక విరాళాలు, బహుమతులు ఈమె స్వీకరించి, భారతదేశంలోని అనాథలకు ఖర్చు చేసిన కరుణామయి. ఈమె అభాగ్యులకు, అనాథలకు అభయహస్తం అందించిన అమృత హృదయ.

మదర్ థెరీసా అందరికీ మాత. ఈమె విశ్వమాత. నిర్మల హృదయ్, నిర్మల శిశుసదన్, శిశుసదనాలు, శాంతినగర్, ప్రేమదాన్, వంటి సంస్థల ద్వారా అనాథలకు, వృద్ధులకు, కుష్ఠు రోగులకు, శరణార్థులకు, సేవలందించి నేడు సెయింట్ అయిన మదర్ థెరీసాకు నా అభినందనలు.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 24.
‘పరిసరాల కాలుష్యం’ – అనే అంశంపై ఒక వ్యాసాన్ని వ్రాయండి.
జవాబు:
పరిసరమనగా మనచుట్టూ ఉన్నదే పరిసరమంటారు. మనచుట్టూ గాలి, నీరు, నిప్పు, నింగి, నేల మున్నగునవి ఉన్నాయి కదా ! మన ఆరోగ్యానికి ఆహారం, శరీర వ్యాయామం, పోషక పదార్థాలు ముఖ్యమైనవి. ఇవి అన్నియు పరిశుభ్రంగా ఉంటేనే మానవులకు ఆరోగ్యం కలుగుతుంది. అలాగే మానవుల చుట్టూ ఉన్న పరిసరాలు కూడా శుభ్రంగా ఉన్నప్పుడే మానవుల ఆరోగ్యం మరింత ద్విగుణీకృత ఆరోగ్యం కలుగుతుంది.

పరిసరాలు కాలుష్యానికి గురి కాకుండా చూడాలి. ముఖ్యంగా వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం, జల కాలుష్యం ఏర్పడుతున్నాయి. వీటి విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వీనివల్ల ప్రాణవాయువు (ఆక్సిజన్) తగ్గిపోతుంది. విషవాయువులు పెరుగుతున్నాయి. వీనివల్ల మానవాళికే కాక, ఇతర ప్రాణిజాలం యొక్క మనుగడకు ముప్పు ఏర్పడుతోంది.

పరిశ్రమల నుండి బయటకు వెలువడే వ్యర్థ పదార్థాల వల్ల నీరు కలుషితమౌతోంది. మురుగునీటిని శుద్ధిచేసి చెట్లకు వాడాలి. భూమి వేడెక్కకుండా రక్షించేది చెట్లు మాత్రమే. కనుక చెట్లను నరకకూడదు. చెట్ల వల్ల వర్షపాతం అధికమౌతుంది. తద్వారా భూగర్భజలాలు పెరుగుతాయి. భావితరాల వారికి కూడా పుష్కలంగా త్రాగునీరు, సాగునీరు లభ్యమౌతుంది.

నదీ జలాల్ని రక్షించాలి. ప్రభుత్వాలు కూడా చట్టాలు చేసి, అమలు చేయడంలో నిర్దాక్షిణ్యంగా, కఠినంగా వ్యవహరిస్తే తప్ప లేకపోతే మానవ మనుగడకు ముప్పువాటిల్లుతుంది. ప్రజలు కూడా వీని ఆవశ్యకతను గుర్తించి కాలుష్యాల నివారణకు నివారణ చర్యలు చేసుకొన్నచో లోకకల్యాణం జరుగుతుంది. పరిసరాలు ఆరోగ్యవంతంగా ఉంటేనే జీవకోటి సురక్షితంగా
ఉంటాయి.

ప్రశ్న 25.
‘స్వచ్ఛభారత్’ ఉద్యమంలో అందరూ పాల్గొనవలసిన ఆవశ్యకతను తెల్పుతూ ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
స్వచ్ఛము అనగా నిర్మలము, ఆరోగ్యవంతమైన, తెల్లనైన అనే అర్థాలున్నాయి. స్వచ్ఛభారత్ అనగా భారతదేశమంతా నిర్మలమైన ఆరోగ్యవంతమైన దేశమని అర్థం.

దేశమంతా ఆరోగ్యవంతమైన వాతావరణం కలగాలంటే ఏం చెయ్యాలి. ప్రజలందరు వారి వారి గ్రామాల్లోను, పట్టణాల్లోను వీధులన్నియు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి. చెత్తాచెదారాన్ని ఎత్తి ఒక కుండీలో వేయుట, వారానికి రెండు పర్యాయాలు తగులబెట్టుట వంటి పనులు చెయ్యాలి. ముఖ్యంగా డ్రైనేజివ్యవస్థను మెరుగుపరచి ప్రత్యేక కాలువల్లోకి మళ్ళించుట ఆ తర్వాత – ఆ మురుగునీరంతా సముద్రంలోకి వెళ్ళేదట్లు ఏర్పాటుచేయాలి.

దోమల బెడద లేకుండా క్రిమిసంహారక మందుల్ని పిచికారి చేయుట, ఫినాయిల్ ఎప్పటికప్పుడు చల్లుట వంటివి చేయాలి. చెట్లను నరకకుండా రక్షించాలి. ఖాళీ ప్రదేశాల్లో చెట్లను నాటాలి. పర్యావరణ పరిరక్షణకుద్యుక్తులవ్వాలి.

ధ్వని కాలుష్యం, వాయు కాలుష్యం, జల కాలుష్యం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలి. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ పదార్థాలను ప్రత్యేక ఖాళీస్థలాల్లో వేసి ఎప్పటికప్పుడు కాల్చివేయాలి. పరిశ్రమలనుంచి వెలువడు మురుగునీటిని శుద్ధిచేసి తర్వాత చెట్లకు వాడాలి.

భారతదేశమంతా పరిశుభ్రంగా ఉంచుటకై కోట్లాదిరూపాయల్ని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి. “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే నానుడిని నిజం చేసి, దేశం సస్యశ్యామలంగా తీర్చిదిద్దుట ప్రజల కర్తవ్యము. అపుడే ‘స్వచ్ఛభారత్’కు నిజమైన ఆకృతి సాకారమవుతుంది.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 26.
‘మిషన్ భగీరథ’ పథకాన్ని గురించి, సొంతంగా ఒక వ్యాసం రాయండి.
జవాబు:
ఈనాడు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరికీ త్రాగునీటిని కుళాయిల ద్వారా ఇంటింటికీ అందించడానికి నడుం బిగించింది. ఈ పథకానికి ‘మిషన్ భగీరథ’ అని నామకరణం చేసింది.

పూర్వం ఇక్ష్వాకువంశంలో పుట్టిన దిలీపుని కుమారుడు భగీరథుడు. ఇతడు తన పితృదేవతల్ని ఉద్దరించడానికి, ఆకాశంలోనున్న గంగను నేలకు దింపి పాతాళానికి గంగాజలాన్ని తీసుకువెళ్ళే గొప్ప ప్రయత్నం చేసి, ఆ కృషిలో సఫలం అయ్యాడు. భగీరథునిలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో దూరంలో నున్న మంచినీటి గొట్టాల ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి, ప్రతి నగరానికి, ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా మనిషికి 135 లీటర్లు చొప్పున అందించాలని ఈ ‘మిషన్ భగీరథ’ పథకాన్ని ప్రారంభించారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామల్లో నేడు త్రాగునీరు దొరకక ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో భూగర్భజలాలు ఫ్లోరైడ్తో కలిసి, అనారోగ్యానికి దారితీస్తున్నాయి. ఇవన్నీ గమనించి, ఎంత ఖర్చు అయినా, రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా, మంచినీటిని అందించారు, ఇక ముందు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వచ్ఛమైన మంచినీరు పుష్కలంగా లభిస్తుందని ఆశిద్దాం.

ప్రశ్న 27.
‘మిషన్ కాకతీయ’ పవిత్ర యజ్ఞం గురించి సొంతంగా ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో వెయ్యేండ్ల క్రితం కాకతీయుల కాలంలో గణపతిదేవుడు తవ్వించిన 46,445 చెరువులు నీరులేక, పూడిక తీసేవారులేక అలానే ఉండిపోయినాయి. ఆ చెరువుల్ని పునరుద్ధరించినది తెలంగాణ ప్రభుత్వం. కనుక ఈ పథకానికి ‘మిషన్ కాకతీయ’ అని పేరు పెట్టింది.

ఈ చెరువులన్నింటిలో పూడికతీయుట, నీటితో నింపుట, చెరువుకట్లన్ని బలవంతం చేయుట ముఖ్యఉద్దేశ్యం. తెలంగాణ ప్రభుత్వం చరిత్రాత్మక సంకల్పం చేసింది. ఆయువుపట్టయిన ఈ చెరువుల్ని తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయుటకు నడుంబిగించింది. 46 వేలకు పైగా ఉన్న చెరువులన్నీ మళ్ళీ జలకళ లాడించేందుకు కంకణం కట్టుకున్నది. సదాశివ నగర్లోని పాతచెరువులో పూడిక తీయడంలో ప్రారంభం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. చెరువుపై ఆధారపడిన సకల సామాజిక వర్గాల బతుకు చిత్రాన్ని మార్చేసింది. దీన్ని పవిత్ర యజ్ఞంగా భావించారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరు దీనిలో భాగస్వాములయ్యారు. ఆర్థికంగా అనేకమంది దాతలు లక్షలాది రూపాయల్ని మిషన్ కాకతీయకు దానమిచ్చారు. అనేకమంది శ్రమదానం చేశారు.

వర్షాధార పంటలకు నీటికొరత లేకుండా చెరువులు సాగునీటినిచ్చాయి. ప్రతి వర్షపుచుక్కను ఒడిసిపట్టి చెరువుల్ని నింపారు. ఈ చెరువుల క్రింద వేల ఎకరాలు సాగులోనికి వచ్చాయి. పంటలు అనుకున్నదానికంటే అధికంగా పండాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్లాదిరూపాయల్ని ఖర్చు చేస్తోంది. రాష్ట్రమంతా సస్యశ్యామలమై దరిద్రాన్ని పోగొట్టారు.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 28.
“అన్నం మెతుకును చూచి అన్నం ఉడికిందో లేదో చెప్పవచ్చు. అలాగే పుస్తక పరిచయ వ్యాసాన్ని (లేదా) పుస్తక సమీక్షను చదివితే, ఆ పుస్తకం గురించి ఆమూలాగ్రమంగా తెలుసుకోవచ్చు” ఎట్లాగో వ్రాయండి.
జవాబు:
ఒక పుస్తకం యొక్క లక్షణం, శైలి, రచనా విధానం, దాని తత్త్వం, పుస్తకం ద్వారా రచయిత లేక కవి చెప్పదలచిన అంతరార్థం, వాని దృక్పథాన్ని, వానిలో నిబిడీకృతమైయున్న సారాంశాన్ని పుస్తక పరిచయ వ్యాసం ద్వారా పాఠకులకు తెలియజేస్తాడు. దీనికే ముందుమాట, పీఠిక, తొలిపలుకు, ఆముఖం, ప్రస్తావన, మున్నుడి మున్నగు పేర్లు కలవు.

ఈ పుస్తకం యొక్క నేపథ్యాన్ని, లక్ష్యాల్ని పుస్తక పరిచయకర్త పాఠకులకు తెలియజేస్తాడు. అంతేకాక ఆ పుస్తకంలో రచయిత లేక కవి వివరించిన తీరు, అందులోని మంచిచెడ్డలు, పుస్తక పరిచయకర్త లేక సమీక్షకుడు తెలియచేస్తాడు.

ఉదాహరణకు ‘భూమిక’ అను ప్రస్తుత పాఠాన్ని చదివితే కేశవస్వామి తన కథల్ని రెండు భాగాలుగా 1969, 1981 సంవత్సరాలలో విడుదల చేశాడని తెలుస్తోంది. స్వాతంత్ర్యానికి పూర్వం నుండి, భారత్లో విలీనం అయ్యేవరకు హైదరాబాదు రాజ్యం చరిత్ర, ఈ కథలు తెలుపుతాయని తెలుస్తోంది. హైదరాబాదులోని సామాజిక పరిణామాలు, ఈ పుస్తకంలో ఉన్నట్లు తెలిసింది.

కేశవస్వామి రచనల్లో హైదరాబాదు జీవభాషను చిత్రించినట్లు కూడా తెలుస్తోంది. కేశవస్వామి కథలు చదివితే, కేశవస్వామి హృదయం వెల్లడవుతుందని తెలుస్తోంది. కేశవస్వామి కథలలోని సారాంశం, దీనివల్ల టూకీగా తెలుస్తుంది.

అందుచేత గూడూరి సీతారాం రాసిన పుస్తక పరిచయాన్ని చదవడం వల్ల, నెల్లూరి కేశవస్వామి గురించి, ఆయన రచనల గురించి, ఆ రచనలలోని కథాంశాల వైవిధ్యం గురించి, రచయిత హృదయాన్ని గురించి మనం తెలుసుకోవచ్చు.

ప్రశ్న 29.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, జాతి చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టంగా ఎందుకు అనుకుంటున్నారో వ్యాసంగా రాయండి.
జవాబు:
తెలంగాణ రాష్ట్రం, ప్రత్యేకమైన సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతి, భౌగోళిక పరిస్థితులు గల సంపన్న రాష్ట్రము. స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకడం, తెలంగాణ ప్రజలకు అలవాటు. అలాంటి రాష్ట్రం చాలాకాలం నుండి పరాయివారి పాలనలో అణగారిపోయింది. నైజాం కాలంలో ప్రజలు ఎన్నో కడకండ్లు అనుభవించారు. సామాజిక జీవనం ఛిన్నాభిన్నమయ్యింది. 1948లో పటేల్ చొరవతో తెలంగాణ ప్రాంతము ఇండియన్ యూనియన్లో ఏకమై స్వాతంత్య్రం పొందింది.

1956లో తిరిగి తెలంగాణ, ఆంధ్రప్రాంతంతో కలిసింది. ఆంధ్రప్రాంత పాలకులు, తెలంగాణ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. దానితో ప్రజలకు తెలంగాణ వేరు రాష్ట్రం కావాలనే ప్రగాఢమైన కోరిక కల్గింది.

అందుకే. కవులు, కళాకారులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు ఏకమై తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించారు. 1969 డా॥ మర్రి చెన్నారెడ్డిగారి నాయకత్వంలో ప్రత్యేక రాష్ట్ర సాధనకు మహోద్యమం నడిచింది. ఎందరో విద్యార్థులు, యువకులు ప్రాణాలు వదిలారు.

తరువాత కె.సి.ఆర్ నాయకత్వంలో సుమారు దశాబ్దంపాటు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాగింది. సకలజనుల సమ్మె జరిగింది. చివరకు 2014 జూన్ 2న, ప్రత్యేక రాష్ట్రం ప్రజల కోరిక మేరకు సిద్ధించింది. చిరకాల వాంఛ నెరవేరినందున, జాతిచరిత్రలో, దీనిని అద్భుత ఘట్టంగా అనుకుంటున్నారు.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 30.
నేటి సమాజానికి దాతృత్వం గల వ్యక్తుల ఆవశ్యకతను తెల్పండి.
జవాబు:
సమాజం అనగా సమూహమని అర్థం. మానవ సమాజం అనగా మానవాళి సమూహమని అర్థం. “పరోపకారార్థమిదం శరీరం” – అన్నట్లుగా ఈ శరీరం ఉన్నది తోటివారికి సహాయం చేయుట కొఱకేనని అర్థం. సమాజంలో నున్న మానవులు ఒకరికొకరు సహాయసహకారాలందించు కొన్నప్పుడు సమాజాభివృద్ధి జరుగుతుంది. దరిద్రం అన్న మాటలు ఆ సమాజంలో ఉండవు.

ఈనాటి సమాజంలో ధనవంతులు – దరిద్రులు ఉన్నారు. దరిద్రునికి కావలసింది తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు కావాలి. త్రాగడానికి సరియైన నీరు కూడా లభించని ప్రాంతాలనేకం ఉన్నాయి.

ధనవంతులు తమ శక్త్యానుసారం దాతృత్వం కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు పేదవానికి ఇతోధికంగా సహాయం అందించాలి. నేడు చాలామంది ధనవంతులు తమ డబ్బును ఇతర దేశాల్లో దాచుకుంటున్నారు. ప్రభుత్వానికి కట్టవలసిన ఆదాయం పన్ను ఎగకొడుతున్నారు. కాని ఒక్క విషయం ధనవంతులు గుర్తుంచుకోవాలి.

ఏ వ్యక్తి అయినా ప్రాణం పోయిన తర్వాత దాచుకొన్న ధనం అక్కరకు రాదు కదా ! ఎంతటి ధనవంతుడైన తినేది లవణమూ, అన్నమే కదా ! బంగారాన్ని, ధనాన్ని తినలేడు. ఈ నగ్న సత్యాన్ని గ్రహించి దాతృత్వాన్ని అలవాటు చేసుకొన్న యెడల ఒకరికి సహాయం చేసిన పుణ్యమే తాను మరణించిన తదుపరి వెంట వస్తుంది.

మన భారతదేశంలో చాలామంది కోట్లకు పడగలెత్తిన ధనవంతులున్నారు. వారు కనక ధర్మకార్యాలు చేస్తే మనదేశ ప్రగతి సాధిస్తుంది. బిల్ గేట్స్, విప్రో అధిపతి ప్రేమ్జీలా, తాతా బిర్లాల వలె తమ సొమ్ములో కొంత భాగాన్ని ధర్మకార్యాలకు వినియోగించాలి. దీనివల్ల ఆత్మ సంతృప్తి, పుణ్యం లభిస్తాయి. పుణ్యం కంటికి కనిపించదు. మరణించిన తదుపరి ఆ పుణ్యం గొప్పదనం కన్పిస్తుంది. పేదవాళ్ళ ముఖాల్లో నవ్వుల పువ్వులు విరబూస్తాయి.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 31.
స్త్రీ విద్యా ప్రాముఖ్యతను గూర్చి తెలియజేస్తూ నీ సొంతమాటలతో వ్యాసం వ్రాయండి.
జవాబు:
స్త్రీలు విద్యావంతులైనచో సమాజం వివేకవంతమవుతుంది. పిల్లల్ని కని, పెంచి పెద్దవారిగా చేసి తీర్చిదిద్దెడి తల్లులు విద్యావంతులైనచో సంఘానికి కలిగే ప్రయోజనం ఇంతింతయని చెప్పుటకు వీలులేదు.

అత్యంత ప్రాచీనకాలంలో స్త్రీలు బ్రహ్మ విద్యా వివరణ చేసినట్లు తెలియుచున్నది. బ్రహ్మచారిణులై ఉపనిషత్తులపై చర్చలు జరిపారు. తర్వాతి కాలమందు కవయిత్రులై పలు భాషల్లో గ్రంథాల్ని రచించారు. లీలావతి వంటి గణిత శాస్త్రజ్ఞురాలు, విదుషీమణి మనకు చరిత్ర చెబుతున్నది.

ప్రస్తుతం స్త్రీలకు అనేక సౌకర్యాలు కలిగాయి. స్త్రీలకు ప్రత్యేక కళాశాలలు, విద్యాలయాలు వెలిశాయి. స్త్రీలు చాలా ఉద్యోగాల్ని సంపాదించుకొని వన్నెకెక్కుచున్నారు.

మనదేశానికి స్వాతంత్ర్యం సంపాదించుటకై గాంధీ మహాత్ముడు తన నిర్మాణ కార్యక్రమంలో మహిళాభ్యుదయమే ప్రధానంగా చేర్చాడు. స్త్రీ విద్యకు ప్రాముఖ్యమిచ్చాడు. ఆధునికయుగంలో కందుకూరి వీరేశలింగం పంతులుగారు స్త్రీ విద్యకై మొట్టమొదట ఒక పాఠశాలను స్థాపించి కృషి చేశారు. ఆ కారణంగా క్రమక్రమంగా స్త్రీ విద్య వ్యాప్తిలోనికి వచ్చింది.

విద్యావంతురాలైన భారత మహిళ ‘విజయలక్ష్మి పండిట్’ ఐక్యరాజ్య సమితికి అధ్యక్షురాలై వన్నెకెక్కింది. శ్రీమతి ఇందిరాగాంధీ భారత ప్రధానిగా చేసి కీర్తిని సంపాదించింది. నేటి కాలంలో అనేకమంది మహిళలు పార్లమెంటు సభ్యులుగా, స్పీకర్లు, రాష్ట్రపతులుగా, ముఖ్యమంత్రులుగా, శాస్త్రజ్ఞులుగా, క్రీడాకారులుగా వివిధ పదవుల్ని అలంకరించి ఖ్యాతిని పొందారు.

స్త్రీలు తమ సంతానానికి విద్యాబుద్ధులు నేర్పుటలో శ్రద్ధ వహించి వారిని సత్పురుషులుగా తీర్చిదిద్దుచున్నారు. నేడు అధిక సంఖ్యలో స్త్రీలు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి సమర్థతతో నిర్వహించుచున్నారు. పాఠశాలల్లో N.C.C మున్నగు యుద్ధ విద్యా శిక్షణాన్ని కూడా పొంది అబలలు సబలలని నిరూపించుచున్నారు. కనుక స్త్రీ విద్యను ఇతోధికంగా ప్రోత్సహించినచో దేశానికి, సమాజానికి శ్రేయస్సు కలుగుతుందనుటలో అతిశయోక్తి లేదు.

ప్రశ్న 32.
ఈ మధ్యకాలంలో చోటుచేసుకున్న ఏదైనా సామాజికాంశం / సంఘటనలు ఆధారంగా, సంపాదకీయ వ్యాసం రాయండి.
జవాబు:
“సెల్ఫీల పిచ్చి”
ఇటీవల మన ప్రధాని నరేంద్రమోడీ, చైనాను సందర్శించినపుడు ఆ దేశ ప్రధానితో సెల్ఫీ తీసుకున్నట్లు వార్త వచ్చింది. ఈ స్మార్ట్ఫోన్ వ్యామోహంలో, ఈ సెల్ఫీలు తీసుకొనే ధోరణి, నేడు ఒక వైరస్ వ్యాపించింది. మనదేశ ప్రధానికి, సెల్ఫీ వ్యామోహం ఉండడం ఒక విచిత్రం.

నిజానికి సెల్ఫీ తీసుకోడం, తప్పుకాదు. కొత్తరకం ఫోన్లో కెమెరా సౌకర్యం ఉండడం వరకు బాగుంది. కాని నేటి యువత, ఈ సెల్ఫీల మోజులో ఎంతో సమయాన్ని దుర్వినియోగపరుస్తున్నారు. సెల్ఫీ తీసుకోవడం, దాన్ని నెట్వర్క్ పోస్టు చేయడం, దానిపై వచ్చే వ్యాఖ్యలను చూసి మురిసిపోవడం లేదా బాధపడడం జరుగుతోంది. ఒకొక్కప్పుడు కొంతమంది, ఆ బాధతో ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు.

ఈ పిచ్చి ఇలా ముదిరిపోయింది. ఒకడు వచ్చే రైలుముందు నిలబడి, ఫోటో తీసుకోవాలని, పట్టాల మీద నిలబడి ప్రాణం పోగొట్టుకున్నాడు. మరొకడు మంటలముందు హీరోయిజాన్ని ప్రదర్శించబోయి సజీవదహనం అయ్యేడు. మరొకడు కొండ ఎక్కి సెల్ఫీ తీసుకోబోయి, కొండ నుండి జారి తల పగిలి చచ్చాడు. ఒకడు ఇళ్ళు కాలి, గుండె పగిలి ఏడుస్తూంటే, సెల్ఫీ తీసుకున్నాడు.

ఇవన్నీ మనిషిలోని మనిషి మాయమయ్యాడని చెపుతున్నాయి. అతనికి ఫోటో తప్ప, మరేమి ముఖ్యం కాదు. ఈ మానసిక జాడ్యాన్ని అరికట్టాలి. సెల్ఫీ అంటే మనని మనం, సమీక్షించుకోవడం. అంతేకాని ‘సెల్ఫీ’ అంటే ఫోటో కాదని యువత గుర్తించాలి. ఆ రోజు త్వరగా రావాలని ఆకాంక్షిద్దాం.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 33.
తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల పాత్రను గూర్చి వ్యాసం రాయండి.
జవాబు:
తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజాప్రతినిధులు, అసెంబ్లీలోనూ, పార్లమెంటులోనూ, రాజకీయ వేదికలపైనా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నిర్మాణ ఆవశ్యకతను గొంతెత్తి చాటారు. ఎన్నో పర్యాయాలు అసెంబ్లీని, పార్లమెంటునూ, స్తంభింపచేశారు. సామాన్యంగా రాజకీయ నాయకులకు పదవీ వ్యామోహం ఎక్కువగా ఉంటుంది. కాని తెలంగాణ రాజకీయ నాయకులు ప్రత్యేక రాష్ట్ర సాధనకై తమ పదవులను తృణప్రాయంగా, చాలాసార్లు విడిచి పెట్టారు. అన్ని పార్టీల వారు తమకు వేరు రాష్ట్రం కావాలని కేంద్రానికి లేఖలు ఇచ్చారు.

వివిధ పార్టీల వారికి తమలో తమకు, ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్న, రాష్ట్ర సాధన విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తపరచారు. టి.ఆర్.యస్ పార్టీ తరఫున కె. చంద్రశేఖరరావుగారు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించి, అహింసా పద్ధతులలో ఉద్యమాన్ని ముందుకు నడిపించి, విజయం సాధించారు.

కె.సి.ఆర్ గారు రెండుసార్లు తమ యమ్.పి. పదవులకు రాజీనామా ఇచ్చారు. కేంద్రమంత్రి పదవిని సైతం త్యాగం చేశారు. 1969లో డా॥ మర్రి చెన్నారెడ్డిగారు తెలంగాణ ప్రజాసమితి పేరున మహోద్యమాన్ని చేపట్టారు. ఆయన నగరంలో విద్యార్థుల సహకారంతో, కేంద్రప్రభుత్వాన్ని కదలించారు. ఆనాడు ఇందిరాగాంధీకి ఎదురుగా నిలిచి ఆయన 10 మంది ఎమ్.పి.లను నెగ్గించుకున్నారు.

ఈ విధంగా ప్రత్యేక రాష్ట్ర సాధనలో, రాజకీయ నాయకులే, ప్రధానపాత్ర వహించి విజయాన్ని సాధించారు.

ప్రశ్న 34.
‘తెలంగాణ పోరాటాల పురిటిగడ్డ’ అనే వాక్యాన్ని సమర్థిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
తెలంగాణ ప్రాంతం, చాలాకాలం సుల్తానుల పాలనలో ఉంది. తరువాత ఢిల్లీ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండ కోటను ధ్వంసం చేసి, తాను ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు.

చివరి నైజాం నవాబు కాలంలో సుల్తాను రజాకార్లను పంపి తెలంగాణ ప్రజలను దోచుకున్నాడు. ఆ నవాబు కాలంలో ప్రజలు నైజాం పాలన నుండి విముక్తి కోసం పెద్ద ఎత్తున విముక్తి పోరాటం సాగించారు. తెలంగాణలోని గడ్డిపోచ కూడా కత్తి పట్టి నిజాం పాలనను ఎదిరించింది. చివరకు ఆనాటి మన ఉపప్రధాని పటేలు పోలీసు యాక్షన్తో నైజాం నవాబు తోక ముడిచాడు. అప్పుడే తెలంగాణము భారత యూనియన్లో కలిసి 1948లో స్వతంత్ర రాష్ట్రమయ్యింది.

తరువాత హైదరాబాదులోని తెలుగువారు, ఆంధ్ర ప్రాంతంలోని తెలుగువారితో కలిసి ‘మహాంధ్ర’ ఏర్పడాలని “మహాంధ్ర” ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం ఫలించి, 1956లో హైదరాబాదు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది.

తరువాత తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా విడదీయాలని మర్రి చెన్నారెడ్డి గారు 1969లో పెద్ద ఉద్యమాన్ని లేవదీశారు. 9 నెలలపాటు పాఠశాలలు, కళాశాలలు ‘బందు’ అయ్యాయి. తిరిగి 1973 లో మరోసారి ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. తరువాత మన ముఖ్యమంత్రి కె.సి.ఆర్ నాయకత్వంలో శాంతియుతంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున పొంగింది. ఉద్యోగులు, విద్యార్థులు, సకలజనుల సమ్మె చేశారు. వంటావార్పు రోడ్డు ఎక్కింది.

చివరకు 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. పై చరిత్రను చూస్తే తెలంగాణ ‘పోరాటాల పురిటిగడ్డ’ అని చెప్పవచ్చు.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 35.
‘సత్యమేవ జయతే’ అన్న మాటను వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
“ధర్మాత్ములైన వారిని సత్యం అనే నావ ఎటువంటి విపత్తుల నుంచి అయినా దరిచేర్చగలుగుతుంది.” – అని ఋగ్వేదం చెబుతోంది. అసలు సత్యం అంటే – ఏది శాశ్వతమో అదే సత్యం. “సత్పురుషుల యందు పుట్టునది సత్యము” అని శబ్ద రత్నాకరం తెలుపుతోంది. సత్యం ఒక మహావృక్షం. దానిని మనం ఎంతగా పోషిస్తే అది అంతగా ఫలాలనిస్తుంది. లోకంలో అందరూ సత్యాన్ని గురించి మాట్లాడేవారే కాని కొందరే దానిని పాటించేది. ఇది బాధాకరమైన విషయం. ప్రస్తుత సమాజంలో సత్యం ఉరికంబంపైన ఉక్కిరిబిక్కిరి అవుతుంటే, అసత్యం సింహాసనంపైన కులుకుతోంది. సంతోషానికి సద్గుణాలే ఆధారం కావాలి. సత్యం దానికి విధిగా పునాది అవ్వాలి. అప్పుడే భూమి స్వర్గం అవుతుంది. సత్యం కరదీపిక. దానిని కదిపేకొద్దీ ప్రకాశవంతమవుతుంది.

సత్యాన్ని అనుసరించడానికి కావలసింది సాహసం ఒక్కటే అంటారు గాంధీజీ. సత్యం కోసం అన్నీ త్యాగం చేయవచ్చు. కాని, సత్యాన్ని దేనికోసమూ త్యాగం చేయకూడదు. నిజం చేదుగా ఉంటుంది. అబద్దం అతిమధురంగా ఉంటుంది. కాని శాశ్వతత్వం ఉండేది నిజంతోనే.

తాత్కాలిక సుఖాలకోసం శాశ్వత కష్టాలను కోరుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. కష్టంగా కనిపించినా సుఖాన్నిచ్చేది, భూమిపై శాశ్వత కీర్తినిచ్చేది మాత్రం సత్యమే. ‘సత్యం వద – ధర్మం చర’ అని పెద్దలు ఊరికే చెప్పలేదు. సత్యమార్గం వీడక హరిశ్చంద్రుడు సత్యహరిశ్చంద్రుడనే కీర్తి పొందాడు.

సత్యం ఆధ్యాత్మికత యొక్క అతి ముఖ్య లక్షణం. నిజం చెప్పడానికి ఎంతో ధైర్యం ఉండాలి. అలాగే నిజాన్ని ఒప్పుకోవడానికి కూడా అంతకుమించిన ధైర్యం ఉండాలి. అలాగే సత్యాన్వేషి అయిన మానవుని మనస్సు భూమిపైన స్వర్గం వంటిది. “సత్యంచే సకలార్ధ సాధకమగున్…..” అని చెప్పిన బలిజేపల్లి వారి మాటలను గుర్తుకు తెచ్చుకోవాలి. అప్పుడే లోకం కృతయుగాన్ని తలపిస్తుంది. సత్యమే ఎప్పటికి యిస్తుంది. జయాన్నిస్తుంది.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 36.
భాషకు అలంకారాలు పలుకుబడులు, నుడికారాలు అని వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
మనోగత హావభావాలను తెలియజేసేది భాష, భాష వల్ల మానవుని సభ్యత, సంస్కారం, సంస్కృతి తేటతెల్లం అవుతాయి. మాట్లాడే భాష ప్రజల భావాలకు అద్దంపట్టాలి. సునిశిత హాస్యం, వ్యంగ్యోక్తి, లాలిత్యం, లోకానుభావం, విమర్శనా వైశిష్ట్యం, మార్గదర్శకత్వం మొదలైన అన్ని అంగాలనూ కలిగి ఉండి, నిత్య జీవితంలో జరిగే అతి చిన్న సంఘటననూ, సాంఘీక జీవనంలోని లోతులనూ సంపూర్తిగా ఎత్తి చూపిస్తుండాలి.

ఒక్కొక్కసారి మాట్లాడుతున్నప్పుడు ఎదుటివారి స్వభావాన్ని గానీ, మరేదైనా గానీ ముఖాముఖీ విమర్శించలేనప్పుడు నర్మ గర్భంగా, అన్యోపదేశంగా ఆ వ్యక్తి తప్పొప్పుల్ని, స్వభావాన్ని విమర్శించడం జరుగుతుంది. చెప్పదలచుకున్న భావాన్ని మనసుకు హత్తుకొనే విధంగా చెప్పడానికి మనం ‘నుడికారాలు’ ప్రయోగిస్తాం. పలుకుబడి, నుడికారం, జాతీయం అనేవి భాషకు అలంకారాన్నిస్తుంది.

పలుకుబడి అంటే ఉచ్ఛారణలో ఉండే విలక్షణత. దీన్నే ‘యాస’ అంటారు. యాసలో మాట్లాడితే, ఆ ప్రాంతం వారికి వినసొంపుగా ఉంటుంది. మాండలిక యాసతో కూడిన పలుకుబడి, వినడానికి అందంగా, అలంకారంగా ఉంటుంది. నుడికారం అంటే ‘మాట చమత్కారం’. ఈ నుడికారం ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిలోంచి,

ఆచార వ్యవహారాల్లోంచి పుడుతుంది. చెప్పదల్చుకున్న భావం మనస్సుకు హత్తుకుంటుంది. నుడికారాలు జాతీయాలుగా, సామెతలుగా ఉంటాయి. నుడికారం వల్ల చమత్కారం, దాని వల్ల ఆనందం కలుగుతాయి. అందుకే అది అలంకారం. ఇక జాతీయం అంటే విశిష్ట పదబంధం. జాతీయాలను పలుకుబళ్ళు, నుడికారాలు అని కూడా అంటాం. నుడికారం, పలుకుబడి అన్నవి ఆ భాషకు మాత్రమే సాధ్యం.

జాతీయం ఆ జాతి వాడుకలో రూపుదిద్దుకుంటుంది. జాతీయంలోని పదాల అర్థాన్ని ఉన్నదున్నట్లుగా చూస్తే వచ్చే అర్థం వేరు. ఆ పదాల పొందికతో మరో అర్థం వస్తుంది. ‘చేతికి ఎముక లేదు’ అనే జాతీయం బాగా దానాలు చేస్తాడనే భావాన్నిస్తుంది. అలాగే ‘కళ్ళలో కారం పోసుకుంటాడు”.

సామెతల విషయానికొస్తే మాట్లాడే భాషకు నవ్యత్వం, పురిపుష్టిని కల్గించేవి సామెతలు. సామెత అంటే అనుభవం నేర్పిన పాఠమే. అనుభవించిన అనుభవానికీ, అనుభూతికి అక్షరరూపం సామెత. జీవితాన్ని కాచివడపోసిన సత్యం సామెత. అనుభవం గడించిన భావావేశంలో వెలువడినవి కాబట్టే సామెతలలో ఒక విధమైన ప్రాస, లయ ఉన్నాయి. కొండంత భావం సంక్షిప్త రూపంతో వీటిలో ఇమిడి ఉంది.

అందుకే ‘తేట తేనెల ఊట తెలుగు సామెత’ అన్నారు. సామెతలను రచించిందీ, పోషించిందీ ప్రజలే. అనంతమైన భావాన్ని ముచ్చటగా మూడు ముక్కల్లో చెప్పగలిగే సామాన్య ప్రజా భాషా . ప్రక్రియ సామెత. అందుకే “సామెత లేని మాట – ఆమెత లేని యిల్లు” అనే సామెత పుట్టింది. సామెతలు చిన్నవైనా, పెద్దవైనా అర్థాన్ని విశ్లేషించి చూస్తే సూటిగా ప్రజల మనసు లోతుల్ని తాకి, ఆలోచనా స్రవంతిని కదిలించి చైతన్యవంతుల్నిగా చేసే విజ్ఞాన భాండాగారాలు. “అయిదు శిఖలున్నా ఇబ్బంది లేదు కానీ మూడు కొప్పులు చేరాయంటే ముదనష్టమే”, “అవ్వను పట్టుకొని వసంతాలాడినట్లు”, “పిట్ట కొంచెము – కూత ఘనము” వంటివి ఎన్నో తెలుగుభాషను సుసంపన్నం చేస్తున్నాయి.

పలుకుబడి, నుడికారం, జాతీయం అనేవి భాషకు అలంకారాల వంటివి అని చెప్పడంలో సందేహం లేదు.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 37.
చదువు వల్ల కలిగే ప్రయోజనాలను తెలుపుతూ వ్యాసం రాయండి.
జవాబు:
“దేనివల్ల శీల నిర్మాణం జరుగుతుందో, దేనివల్ల వ్యక్తి వికాసం పెంపొందుతుందో, మానసిక శక్తి విస్తృతమౌతుందో, సాంస్కృతిక చైతన్యం ఎక్కడైతే కలుగుతుందో, మానవుడు తన కాళ్ళపై తాను ఎప్పుడైతే నిలబడగలుగుతాడో అదే విద్య పరమావధి కావాలి” అన్న స్వామీ వివేకానంద మాటలను మనం గుర్తుచేసుకోవాలి.

చదువుకోవడం వల్ల సమాజం చైతన్యవంతం అవుతుంది. విచక్షణ కలుగుతుంది. ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. మనం చేసే పనిలో నైపుణ్యం పెరుగుతుంది. గౌరవం పెరుగుతుంది.. మూఢాచారాలు నశిస్తాయి. ప్రతి విషయాన్ని శాస్త్రబద్ధంగా ఆలోచిస్తాము. దురలవాట్ల వల్ల కలిగే అనర్థాలు తెలిసి, మానివేస్తాము. ఉపాధి దొరుకుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమస్యలను పరిష్కరించుకోగల సామర్థ్యం వస్తుంది. ఈ భావాలనే….

శ్లో॥ “విద్యాదదాతి వినయం – వినయం ద్యాతి పాత్రతామ్ |
పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాత్ ధర్మం తతః సుఖమ్ || (హితోపదేశం)

పోతన తన భాగవతంలో “చదువని వాడజ్ఞుండగు” అంటూ చదువు యొక్క పరమార్థాన్ని వివరించారు. దేశం అభివృద్ధి సాధించాలంటే, అక్షరాస్యత శాతం పెరగాలన్న గాంధీజీ మాటలను వేదవాక్కుగా భావిద్దాం.

“విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళిన్” అని ఏనుగు లక్ష్మణ కవి ; దొరలు దోచలేరు, దొంగలెత్తుకుపోరు ; భ్రాతృజనము వచ్చి పంచుకోరు ; విశ్వవర్ధనంబు విద్యాధనంబురా” అని కరుణశ్రీ విద్య విశిష్టతను తెలిపారు.

మనోధైర్యాభివృద్ధితో బుద్ధి వికాసం పొంది, మానవుడు తన కాళ్ళపై నిలువగల శీలాన్ని నిర్మించుకోగల విద్య మనకు అవసరం. విద్య అనే వృక్షంలో వేళ్ళు చేదుగా అనిపించొచ్చేమో గానీ అది అందించే ఫలాలు మాత్రం చాలా మధురం.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 38.
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న మాటను వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
‘శ్రీశైలం, కాళేశ్వరం, దాక్షారామం’ ఈ మూడు దేవాలయాల మధ్య భూభాగాన్ని కాకతీయులు పాలించారు. ఈ ప్రాంతం త్రిలింగదేశంగా పిలువబడింది. ఇదే కాలగమనంలో ‘తెలంగాణ’ అనే పదంగా మారింది. 2014 జూన్ 2 నాడు తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడింది. ఎందరో మహనీయుల కృషితో పాటుగా ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ పార్టీ ఏర్పాటు చేసిన కె. చంద్రశేఖరరావు ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా పనిచేసి విజయం సాధించారు.

ప్రాచీన కాలంలోనే తెలంగాణ ప్రాంతంలో సాహిత్యం విలసిల్లింది. 10వ శతాబ్దంలో మంథాన భైరవుడు భైరవతంత్రం, 13వ శ॥ గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం ఇలా ప్రారంభమై పోతన, దాశరథి, సి.నా.రె వంటివారు గొప్పకవిత్వం ఈ నేలలో పండించారు. రామప్పగుడి, కాకతీయ శిల్పం, చార్మినార్ వంటి అపురూప కట్టడాలతోను, భద్రాద్రి, మెదక్ చర్చి, ఎన్నో ప్రాచీన దర్గాలతో సర్వమత సమానత్వాన్ని ఈ నేల చాటుతున్నది.

అన్ని సంస్కృతులకు సంగమమైన భాగమతి ప్రేమ కానుకగా నిర్మించిన భాగ్యనగరం భారతదేశంలోనే గొప్ప నగరాలలో గొప్పది. రామదాసాది భక్తాగ్రగణ్యులు వాగ్గేయకారులుగా వెలుగొందారు. గోలకొండ కోట మన ఘనచరిత్రకు తార్కాణం. గోదావరి, కృష్ణ, మంజీరా, ప్రాణహిత, మూసీ, దిండి, పాలేరు, మున్నేరు మున్నగు నదులు ప్రవహించి ఈ నేలను సస్యశ్యామలం చేశాయి.

విప్లవ వీరులకూ, కళలకూ, ఘన సంస్కృతికీ, అపురూప శిల్పాలకూ, ప్రఖ్యాతి వహించిన సరస్వతీ దేవాలయం గల బాసర వంటి పుణ్యక్షేత్రాలకూ, తీర్థాలకూ నిలయం ఈ గడ్డ. నీలగిరి, గోలకొండ, హితబోధిని లాంటి పత్రికలు రాకతో సాహిత్యం మరింత వృద్ధి చెందింది. హైదరాబాదు సంఘసంస్కర్తగా పేరొందిన భాగ్యరెడ్డివర్మ ఇక్కడివాడే.

సరోజినీనాయుడు, మిద్దెరాములు, కొండా లక్ష్మణ్ బాపూజీ, దేవులపల్లి రామానుజరావు, పి.వి. నరసింహారావు, బిరుదురాజు రామరాజు, జమలాపురం కేశవరావు, టి.యస్.సదాలక్ష్మి, రాంజీ గోండు, సురవరం ప్రతాపరెడ్డి మొ||వారు ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖులలో కొందరు.

వచ్చింది వచ్చింది నా తెలంగాణ తెచ్చింది తెచ్చింది బంగారు నజరానా.
ఏనాటికలలో ఫలించిన శుభతరుణంలో – మురిసింది మురిసింది తెలంగాణ.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 39.
‘సమాజంలోని మూఢనమ్మకాలను పారదోలడం’ అనే అంశాన్ని వ్యాసంగా రాయండి.
జవాబు:
మన సంఘంలో ఎన్నో నమ్మకాలు ఆచారంగా వస్తున్నాయి. వాటిలో కొన్ని నమ్మకాలు దురాచారాలై పీడిస్తున్నాయి. ఇవే మూఢనమ్మకాలు. అంటే తోటి మానవులను, కొన్నిసార్లు వారినే బాధించేవి. మూఢనమ్మకాలు ఏవంటే దెయ్యాలు, చేతబడులు, శకునాలు వంటివి నమ్మడమే. ఇంకా పురుడు, మైల, పూజ, మడి, అంటు, కఠినమైన ప్రమాణాలు వంటివి కూడా మూఢనమ్మకాల జాబితాలో చేరతాయి.

పూర్వం బాల్య వివాహాలు, సతీ సహగమనం దురాచారాలు ఉండేవి. తర్వాత కాలంలో భర్త చనిపోయిన స్త్రీలకు తలవెంట్రుకలు తీయించి, తెల్లచీర కట్టించి, మంగళద్రవ్యాలు వాడనీయకుండా మూలన కూర్చోబెట్టారు. అంతేకాక వీరు ఎదురొస్తే వెళ్ళే పనికాదని, వీళ్ళు శుభకార్యాలకు రాకూడదని ఆంక్షలు విధించారు. ఇప్పటికి అవి అమలవుతూనే ఉన్నాయి.

దెయ్యాలున్నాయని కొందరు భయపడుతుంటే, చేతబడులున్నాయని మరికొందరు భయపెడుతున్నారు. పిల్లలు లేని తల్లులను లక్ష్యంగా చేసుకొని కొందరు బురిడీ బాబాలు మోసాలకు పాల్పడుతున్నారు. రాగి, ఇత్తడి, ఇనుము వంటి వాటిని బంగారం చేస్తామని ప్రజలకు ఆశ కలిగించి మోసం చేస్తున్నారు. పై వాటిలో మనం గమనించుకొంటే మనోధైర్యం లేకపోవడం అతిగా నమ్మడం, అత్యాశకు పోవడం అనేవి మనలోని బలహీనతలు. వాటిని ఆధారం చేసుకొని నమ్మకాన్ని కల్గించి వాళ్ళు మనల్ని దోచుకుంటున్నారు.

ఎందరో సంఘసంస్కర్తలు రాజారామమోహనరాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, కందుకూరి వీరేశలింగం పంతులుగారు, గురజాడ, చిలకమర్తి వంటి మహాత్ములు, ఈ మూఢ నమ్మకాలు తొలిగించడానికి కృషి చేశారు.

మంత్రాలకు చింతకాయలు రాలడం, పూజలు చేస్తే పిల్లలు పుట్టడం ఇవన్నీ వట్టి పిచ్చి నమ్మకాలు. నేటి యువత అభ్యుదయ దృష్టితో ముందుకు సాగాలి. ‘కష్టేఫలీ’ అని గుర్తించి, శ్రమ చేస్తేనే ఫలితం అన్న సంగతి మరువకూడదు. మనం మోసపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడే ఎవరైనా మోసం చేయడానికి అవకాశం. కనుక దేనికోసం ఎదురు చూడకుండా ధర్మంగా, న్యాయంగా పని చేసుకుంటూ ముందుకు నడవాలి.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 40.
భిక్షాటన ఎంతవరకు సమంజసమో వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
ఈ రోజుల్లో ‘భిక్ష’ అనే మాట ‘అడుక్కుతినడం’ అనే అల్పార్థానికి పరిమితమైంది. నిజానికి ఒకప్పుడు ‘భిక్ష’ అనేది పరమపవిత్రమైన వ్రతం. శివుడు ఆది భిక్షువుగా ప్రసిద్ధి చెందాడు. గురువులు శిష్యులకు ‘జ్ఞానభిక్ష’ పెట్టేవారు. గౌతమబుద్ధుడు భిక్షా వృత్తితోనే జీవనం సాగించాడు. గురుకులంలో చదువుకొనే రాజకుమారులు సైతం, భిక్షాటనతోనే విద్యార్థి జీవనం గడిపేవారు. భిక్షపెట్టడం అన్నది, ఒక మహాపుణ్యకార్యంగా భావించేవారు. ఎవరికి భిక్ష ఇవ్వాలో మనుచరిత్రలో ఇలా చెప్పబడింది – “బధిర పగ్వంధ, భిక్షుక, బ్రహ్మచారి జటి పరివ్రాజకా తిథి క్షపణ కావధూత కాపాలి కాద్యనాథులకు” అని.

శంకరాచార్యులు భిక్షాటనతోనే జీవించారు. భాగవతంలో రంతిదేవుని కథలో రంతిదేవుడు ఉంఛ వృత్తితో అన్నాన్ని సేకరించాడు. భారతంలో కౌశికుడు మాధుకరీయం చేసుకొని జీవించినట్లు ఉంది. ఎవరికైనా బీదలకు దానధర్మాలు చెయ్యడం కర్తవ్యమనీ మన ధర్మశాస్త్రాలు బోధిస్తున్నాయి. ఎవరైనా గతిలేనప్పుడు భిక్షకి బయలుదేరతాడు. అటువంటి వారికి భిక్షమెయ్యడం సబబు. అంగవైకల్యం, వృద్ధ, బాల, స్త్రీలకు భిక్ష వేయడం ధర్మం. వారు కష్టించి పనిచేయలేరు కనుక.

ప్రస్తుతం సమాజంలో అడుక్కోవడం ఒక వృత్తి అయ్యింది. ఆఖరికి ఆరోగ్యంగా, వయసులో ఉన్న వ్యక్తులు అయ్యప్పమాల ధరించామనో, ఇంకేదో అనో ఊరూరా, ఇంటింటికి వెళ్ళి భిక్షమెత్తుతున్నారు. ఇవ్వకపోతే సాక్షాత్ దేవుడే వచ్చి శపిస్తాడన్న ఫీలింగ్ చూపిస్తాడు. ఇంకొందరు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో తిరుగుతూ లేని రోగాలను నటిస్తూ, పిల్లకు పెళ్ళి చేయాలని, ఇల్లు కాలిపోయిందని, చెబుతూ డబ్బులు దండుకోవాలని చూస్తుంటారు. వీరిలో కొందరు నిజం చెప్పవచ్చు కూడా. ఇవన్నీ ఆధునికులైన చాలామందికి నచ్చకపోవచ్చు.

కుంటి, గ్రుడ్డి వికలాంగులై అడుక్కునే అర్హత గల బిచ్చగాళ్ళను ఒకచోటికి చేర్చి వారికి దాతలు భోజనం ఏర్పాటు చేయాలి. వారికి విరాళాలు ఇచ్చి, అన్న సత్రాల నిర్వహణను సంఘంగా ఏర్పరచి నిర్వహించాలి. నిజమైన బిచ్చగాళ్ళకు ఆదరణతో పెట్టాల్సిందే. వృత్తిగా చేసేవారికి వేయకపోవడమే మంచిది.

ఒకసారి గాంధీగారు శరీరం బాగున్న బిచ్చగాడితో “నీవు ముట్టెత్తుకోపోతే పని చేసుకోరాదా ?” అన్నారట, వెంటనే వాడు తన దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ చూపించి, అడుక్కోవడం ‘నా వృత్తి. ఇష్టమైతే పెట్టు, లేకపోతే మాను, అన్నాడట. ఇట్లాంటి వారిని చూస్తే పెట్టేవాళ్ళకి కూడా పెట్టుయ్యటం లేదు.

ప్రశ్న 41.
“అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది” అని వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అని పెద్దలమాట. ఆకలితో ఉన్నవానికి గుప్పెడు అన్నం పెడితే జీవితాంతం గుర్తు పెట్టుకొంటాడు. అదీ అన్నం విలువ. దానాలు అనేక రూపాల్లో చేయవచ్చు. విద్య, ధనం ఇలా ఏదొక రూపంలో దానాలు చేసేవాళ్ళు ఉంటారు. ఎక్కువమంది అన్నదానాన్ని ఇష్టపడతారు. కారణం మనవల్ల ఒక పేదవాడు ఒక్కపూటైనా కడుపునిండా తినగల్గుతున్నాడనే సంతృప్తి. కనుకనే “అన్ని దానాల్లోకీ అన్నదానం మిన్న” అనే భావన లోకంలో ఉంది.

దేశంలో ఏ సమస్యనైనా ఒకనాటికి కాకపోతే మరొక నాటికైనా తొలిగించవచ్చునేమో గాని ఆకలి సమస్యను ఎవరూ తీర్చలేడు. ఉన్నవాడు అజీర్తితో బాధపడుతుంటే లేనివాడు ఆకలితో అలమటిస్తున్నాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు “అన్నమో రామచంద్ర” అన్న మాటలు మన చెవులలో మారు మ్రోగుతున్నాయంటే ఆకలి ఎంతగా బాధిస్తుందో కదా ! అందుకే పెద్దలు ఎక్కడ అన్నదానం జరుగుతున్నా దానిలో వారు భాగస్వాములౌతారు. కారణం వారికి అన్నం విలువ, ఆకలి విలువ తెలుసు.

“దానం చేసే అవకాశం దక్కడం మన భాగ్యం అది తెలుసుకోవడం వల్లనే మనం పురోభివృద్ధి చెందుతున్నాం” అని స్వామి వివేకానంద దానమహిమను తెలియజేశారు. “ఆ కొన్నఁగూడెయమృతము” అన్న బద్దెన మాటలు అక్షరసత్యాలు. అన్నదానం తానే స్వయంగా స్వహస్తాలతో చేయడానికి ప్రతి ఒక్కరికీ వీలైనది. మిగతా దానాల్లో ఈ విధానం ఉండకపోవచ్చు. ఆకలిగొన్నవానికి మనం పెట్టె గుప్పెడు అన్నం వాడి గుండె చప్పుళ్ళలో మన పట్ల వాని కృతజ్ఞత వినిపిస్తుంది.

కలియుగ వైకుంఠంగా చెప్పబడే తిరుమలలో నిత్యాన్నదానంలో ఎంతోమంది కడుపునింపు కుంటున్నారు. అట్లాగే జిల్లెళ్ళమూడి అమ్మ ‘అందరిల్లు’లోని అన్నపూర్ణాలయంలోను అన్న వితరణ నిత్యము జరుగుతోంది. “కోటి విద్యలు కూటి కొరకే” అని వినలేదా ! ఎవరెన్ని పనులు చేసినా ఆకలి బాధ తీర్చుకోవడానికే. అందుకే “అన్ని దానాలలోకి అన్నదానమే మిన్న” అని చెప్పవచ్చు.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 42.
పల్లె, నగర / పట్టణ ప్రాంతాలలో ఉండే ఇబ్బందులను వ్యాసంగా రాయండి.
జవాబు:
‘పల్లెటూళ్ళు దేశానికి పట్టుకొమ్మలు’, పల్లెటూర్లు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు, ‘పల్లె తల్లి వంటిది’ – ఇలా పెద్దలు చెప్పిన మాటలు చద్దిమూటలు. బిడ్డల ఆనందమే తల్లికి పరమానందం. పల్లె ప్రజలు ఎండనక, వాననక, పగలనక, రాత్రనక చెమటోడ్చి కష్టపడతారు. ‘రెక్కాడితేగాని డొక్కాడని’ జీవితాలు వాళ్ళవి. పల్లెలు వ్యవసాయంపై ఆధారపడి ఉంటాయి. వ్యవసాయానికి పశువులను ఉపయోగిస్తూ, ఇటు వ్యవసాయం, అటు పశువులను ఒక క్రమపద్ధతిలో పోషించుకుంటూ జీవనం సాగిస్తారు.

ప్రస్తుత కాలంలో మనిషి ఆధునికతకు ఆకర్షితుడై, వ్యవసాయం పనిముట్లు వీడి, యంత్రాలను ఉపయోగిస్తున్నాడు. అలాగే సేంద్రియ ఎరువులు కన్నా రసాయనిక ఎరువులు సత్వర ఫలితం ఇస్తున్నాయని వాటిని వాడి నేలను, శరీరాన్ని గుల్ల చేస్తున్నాడు. నాగరికతకు అలవాటుపడి ‘కష్టేఫలి’ అన్నమాట మరచాడు. పల్లెల్లో సరైన విద్య, వైద్య సదుపాయాలు ఉండవు.

సరైన రవాణా వసతి, కరెంటు ఇత్యాది నిత్యావసర సదుపాయాలు ఉండవు. గ్రామోద్ధరణంటూ పత్రికల్లో రాస్తేనో, ఉపన్యాసాలిస్తేనో పనికాదు. చదువులేని పల్లె ప్రజల కష్టాన్ని దళారులు, మధ్యవర్తులు, స్వార్థపరులు దోచుకుంటున్నారు. ఇవన్నీ పక్కనబెడితే ఆప్యాయతలు, అనుబంధాలు కలగలిపి ప్రశాంత జీవితాన్ని, ప్రకృతి రమణీయతను పల్లెలు ప్రసాదిస్తాయి.

నాగరికత వృద్ధి చెందిన ప్రాంతాలను నగరాలని, పట్టణాలని అంటారు. ఆధునికమైన వస్తు వినియోగంతో విలాసవంతమైన జీవితాలు నగర, పట్టణాల్లో మనకు కానవస్తాయి. సుఖవంతమైన జీవితం గడుపుతున్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు లేకపోయినప్పటికీ పట్న వాసాలలో తెలియని అభద్రతాభావం ఉంటుంది.

మనుష్యుల మధ్య, మనసులలో దూరాలు పెరిగి, స్వార్థపు ఆలోచనలు నిండి, “ఎవరికి వారే యమునా తీరే” అన్నట్లు వారి బ్రతుకులుంటాయి. విద్యా, ఆరోగ్యం ఇలా వివిధాంశాలలో అభివృద్ధి పట్న వాసాలలో ఎక్కువగా ఉంటాయి. పట్నాల్లో ఒక రూపాయి ఒక దమ్మిడీలాగ ఖర్చు పెడతారు. ఉద్యోగాలకై దేవులాట, అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకొంటారు. సంఘం గురించి ఆలోచన చేయరు. నేను బాగుంటే చాలు. ఎవరెలా పోతే నాకెందుకు అనే ఆలోచనలు ఎక్కువమందిలో ఉంటాయి. పక్కవాడి గురించి ఆలోచించే మనసు, సమయం వారికి ఉండదు.

ఇలా భిన్న ధ్రువాల వలె పల్లె, నగర/పట్టణవాస ప్రజలు ప్రక్క ప్రక్కనే ఉన్నా దూరంగా బతుకుతుంటారు.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 43.
నేటి కాలంలో ‘కంప్యూటర్’ మన జీవితంలో ఒక భాగమైంది. అలాంటి కంప్యూటర్ను అభినందిస్తూ ఒక వ్యాసం: వ్రాయండి.
జవాబు:
కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం. కంప్యూటర్లో ‘డేటా’ (Data)ను నిల్వచేయవచ్చు. దాన్ని మళ్ళీ ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. అంతేకాకుండా కంప్యూటర్ చాలా ఖచ్ఛితంగా, త్వరగా ఫలితాన్ని ఇస్తుంది. ఇటువంటి అద్భుత సాధనమైన కంప్యూటర్ను కనిపెట్టినవాడు ఛార్లెస్ బాబ్బేజి.

కంప్యూటర్ గురించి మాట్లాడినప్పుడు మనం తరచుగా హార్డువేర్, సాఫ్ట్వేర్ అనే పదాలను వింటూ ఉంటాం. హార్డువేర్ అంటే కంప్యూటర్ పరికరాలు. సాఫ్ట్వేర్ అంటే కంప్యూటర్ పనిచేయడానికి కావలసిన పద్ధతిని తెలిపేది. కంప్యూటర్లను ఉపయోగించి ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నారు. కూడికలు, తీసివేతలు, గుణకారాలు (హెచ్చవేతలు), భాగహారాలు వంటి లెక్కలు చాలా వేగంగా చేయడానికి కంప్యూటర్ బాగా పనికివస్తుంది.

కంప్యూటర్ల ద్వారా వాతావరణ పరిస్థితిని తెలుసుకోవచ్చు. విమానాలు, బస్సులు, రైళ్ళు మొదలైన వాటి టిక్కెట్ల రిజర్వేషన్లకు కంప్యూటర్లు ఉపయోగిస్తారు. పెద్ద పెద్ద కర్మాగారాల్లో, కార్యాలయాల్లో, బ్యాంకుల్లో ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. విద్యా, వైద్య, వ్యాపార, వ్యవసాయ, సమాచార శాస్త్ర సాంకేతిక రంగాలలో ఈ కంప్యూటర్లు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. కంప్యూటర్ను ఉపయోగించి ఇంటర్ నెట్ అనే సౌకర్యం ద్వారా ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నింటిని మన ఇంట్లోని కంప్యూటర్ ముందు కూర్చొని తెలుసుకోవచ్చు.

అయితే కంప్యూటర్లని వాడటం వల్ల ఉద్యోగాలకు నష్టం వాటిల్లుతుందనీ, నిరుద్యోగ సమస్య పెరుగుతుందనీ కొందరి వాదన. ఇది కొంతవరకు నిజమే. ఆ మాత్రంచేతనే ఆధునిక విజ్ఞానాన్ని త్రోసిరాజనడం న్యాయం కాదు. కాబట్టి భావిభారత పౌరులైన విద్యార్థులు కంప్యూటర్ విద్య ఆవశ్యకతను గుర్తించి తప్పక దాన్ని అభ్యసించాలి.

ప్రశ్న 44.
మీకు నచ్చిన కవిని గురించి మీ స్వంత మాటలలో ఒక వ్యాసం రాయండి.
జవాబు:
డా॥ అందెశ్రీగారు పోతనగారు పుట్టిన వరంగల్లు జిల్లాలోని ‘రేబర్తి’ గ్రామంలో జన్మించారు. ఆయన అతి సాధారణ నిరక్షరాస్య కుటుంబంలో జన్మించారు. ఆయన ప్రత్యేకించి ఏ పాఠశాలలోను, కళాశాలలోను చదువపోయినా, సహజ సాహితీజ్ఞాన సుగంధాన్ని సంపాదించాడు.

డా॥ అందెశ్రీగారు తన పాటలతో సభలలో లక్షలాది ప్రజలను పరవశింపజేశారు. ఆయన ‘వాక్కులమ్మ’ అంటే సరస్వతికి వరపుత్రుడు. ఆయన 1995లో ‘పాటల పూదోట’ అనే లలిత గీతాల సంపుటిని వెలువరించి సాహితీ లోకంలో స్థిరమైన స్థానాన్ని సంపాదించాడు. ఆయన ‘స్వర్ణకంకణ సత్కారాన్ని పొందారు.

డా॥ అందెశ్రీగారు 21 సినిమాలకు అద్భుతమైన పాటలు రాశారు. కేవలం సినిమా కవిగానేకాక, అభిమాన ప్రేక్షక గుండెల్లో నిలిచిన కవిగా సుస్థిర స్థానాన్ని పొందారు.

డా॥ అందెశ్రీగారు వందలాది కవి సమ్మేళనాలలో పాల్గొని, శ్రోతన మెప్పుపొందారు. సింగపూర్, దుబాయి వంటి విదేశాల్లో పర్యటించి, తన కవితా వాణిని అక్కడి తెలుగువారికి వినిపించి, వారి ప్రశంసలు అందుకున్నారు.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

డా॥ అందెశ్రీగారిని కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. విజయవాడ ఆంధ్రా ఆర్ట్స్ వారు ‘జానపద వాగ్గేయబ్రహ్మ’ అనే బిరుదుతో సత్కరించారు. భాగ్యనగర్ కల్చరల్ అసోసియేషన్వారు ‘సహజ కవికోకిల’ అన్న బిరుదుతో సత్కరించారు.

డా॥ అందెశ్రీగారు తెలంగాణ ఉద్యమగీతాన్ని రచించి, తెలంగాణ ప్రాంతంలో ప్రజాకవిగా, ‘అభినవ పోతన’గా ప్రశంసలు పొందారు. వీరు రచించిన ‘మనిషి’ అన్న గేయం వేలాది సభల్లో లక్షలాది ప్రజల మనస్సులను కదిలించింది.

TS 10th Class Physical Science Important Questions Chapter 3 Acids, Bases, and Salts

These TS 10th Class Physical Science Chapter Wise Important Questions Chapter 3 Acids, Bases, and Salts will help the students to improve their time and approach.

TS 10th Class Physical Science Important Questions Chapter 3 Acids, Bases, and Salts

1 Mark Questions

Question 1.
What are olfactory indicators?
Answer:
Olfactory indicators are substances which have different odour In aced and base solutions.
Eg : Vanilla essence has characteristic pleasant smell in acid solution and no smell in alkali solution.

Question 2.
What is Plaster of Paris? Give its chemical formula. (AS1)
Answer:
Plaster of Paris the substance which doctors use as plaster for supporting fractured bones in the right position. Its chemical formula Is CaSO4. 1/2 H2O.

Question 3.
What are alkalis?
Answer:
Bases which are soluble In water are called alkalis.

Question 4.
What is pH scale?
Answer:
A scale for measuring hydrogen Ion concentration In a solution Is called pH scale. pH Is a negative longarithm of hydrogen ions [H+].

TS 10th Class Physical Science Important Questions Chapter 3 Acids, Bases, and Salts

Question 5.
Write a short note about the pH of the soil? (AS1)
Answer:
Plants require a specific pH range for their healthy growth. To find out the pH required for the healthy growth of a plant you can collect the soil samples from various places.

Question 6.
Give pH of neutral, acid, base? (ASI)
Answer:
Neutral = 7
Acid <7 Base > 7

Question 7.
Is the substance present in antacid tablet acidic or basic?
Answer:
The substance present in antacid tablet is basic.

Question 8.
What type of reaction takes place in stomach when an antacid tablet is consumed?
Answer:
Neutralisation reaction takes place In stomach when an antacid tablet is consumed.

Question 9.
What is the name of aqueous sodium chloride?
Answer:
Brine solution.

Question 10.
Write the common name of sodium hydrogen carbonate.
Answer:
Baking soda [NaHCO3]

Question 11.
Which salt Is used in the manufacture of borax?
Answer:
Washing soda (Na2CO3)

Question 12.
Give example for salt possesses water of crystallization.
Answer:
Gypsum (CuSO4.2H2O)

Question 13.
What Is the chemical formula for Plaster of Paris?
Answer:
CaSO4. H2O

TS 10th Class Physical Science Important Questions Chapter 3 Acids, Bases, and Salts

Question 14.
Which gas evolves when acids are react with metals?
Answer:
Hydrogen gas.

Question 15.
The reaction in which acid reacts with base forming salt and water is called as.
Answer:
Neutralization.

Question 16.
Bases which are soluble in water are called as.
Answer:
Alkali

Question 17.
Who introduced pH?
Answer:
Sorensen,

Question 18.
Classify the following examples as acid, base (or) salt. (ASI)
Mg[OH]2, H3PO4, KNO2, Ba[OH]2, KCl, HBr, NaCl, HFO4, HCl, Al[OH]3.
Answer:
Acids: H3PO4, HBr, HFO4, HCl
Bases : Mg[OH]2, Ba(OH)2, Al(OH)3
Salts: KNO2, NaCl, KCl

Question 19.
What Is the change you observe in litmus paper with acid?
Answer:
In acidic medium, blue litmus turns red and red litmus remains unchanged.

Question 20.
What is a litmus solution?
Answer:
Litmus solution is a dye extracted from lichen, a plant belonging to tIie division of Thallophyta and is used as indicator.

Question 21.
What is the change you observe in litmus paper with base?
Answer:
In the presence of base, red litmus turns blue and blue litmus remains unchanged.

Question 22.
What is the action of acids and bases with metals? Give examples.
Answer:
When acids and bases reacts with metals, H, gas is evolved.
Eg:

  1. 2HCl + Zn → ZnCl + H2O
  2. 2NaOH + Zn → Na2ZnO2+H2

Question 23.
What is the action of acids with carbonates and metal hydrogen carbonates?
Answer:
The reaction of metal carbonates and hydrogen carbonates with acids give a corresponding salt, CO2 and water.
Eg:
1) Na2CO3 + 2HCl → 2NaCl + H2O + CO2
2) NaHCO3 + HCl → NaCl + H2O + CO2

Question 24.
What Is a neutralIzation reaction?
Answer:
The reaction of an acid with a base to give a salt and water is known as a neutralization reaction.
Base + Acid → Salt + Water

TS 10th Class Physical Science Important Questions Chapter 3 Acids, Bases, and Salts

Question 25.
What Is the reaction of metal oxides with acids?
Answer:
Metal oxides react with acid to give salt and water.
Metal oxide + Acid → Salt + Water

Question 26.
Metal oxide reacts with acid and gives salt and water. What is the nature of metal oxides’
Answer:
Metal oxides are basic in nature.

Question 27.
What do acids have In common
Answer:
Hydrogen is common element in all acids.

Question 28.
What is responsible for acidic property of acids?
Answer:
Acids produce H ions in aquatic solution, which are responsible for their acidic properties.

Question 29.
What do bases have in common?
Answer:
OH’ ion (Hydroxide) s common in all bases.

Question 30.
What does the given symbol represent?
Answer:
The given symbol represents that the container is filled with concentrated acids or bases.
TS 10th Class Physical Science Important Questions Chapter 3 Acids, Bases, and Salts 1

Question 31.
When acid Is added to water, what type of reactIon Is It?
Answer:
When acid Is added to water, it is an exothermic reaction.

Question 32.
How do you decide the strength of acid or base?
Answer:
The strength of acid or base can be deoded on the basis of no. of H3O+ ions or OH ions produced in a solution.

Question 33.
How does the universal indicator help us to know the strength of acid or base?
Answer:
1. Universal indicator is a mixture of several indicators,
2. The universal Indicator shows different colours at different concentrations of hydrogen ions In a solution.

TS 10th Class Physical Science Important Questions Chapter 3 Acids, Bases, and Salts

Question 34.
What Is a pH scale?
Answer:
A scale for measuring hydrogen Ion concentration in a solution is called pH scale.

Question 35.
What Is pH value of a solution?
Answer:
pH value of a solution is simply a number, which Indicates the acidic or basic nature of a solution. ¡t is the negative logarithm of R’ ion concentration in a solution.

Question 36.
What is the range of a pH scale?
Answer:
The range of pH scale is from O to 14.

Question 37.
How do you use pH scale to know whether a solution Is acid or base?
Answer:
If the pH value of a solution is 7, it is a neutral solution. If pH is less than 7, it is an acid and if pH is greater than 7, it Is a base.

Question 38.
What is the chemical name and formula of table salt?
Answer:
The chemical name of table salt is sodium chloride. Its formula is NaCl.

Question 39.
What is the nature of the salt CaSO4 formed by the reaction between calcium hydroxide and sulphuric acid?
Answer:
Calcium hydroxide and sulphuric acid are strong acid and bases. Hence the salt (CaSO4) formed is neutral.

Question 40.
What are the uses of Hydrochloric acid (HCl)?
Answer:
HCl is used as cleaning agent for silts, floor and toilets. It is also used in preparation of medicines, cosmetics etc.

Question 41.
What Is bleaching powder? Write Its formula.
Answer:
Bleaching powder Is produced by the action of chlorine on dry slaked lime.
Ca(OH)2 + Cl2 → CaOCl2 + H2O
Formula of bleaching powder is CaOCl2.

Question 42.
Write the chemical equation for preparation of Baking soda.
Answer:
The chemical name of baking soda is Sodium Hydrogen Carbonate (NaHCO3).
The chemical equation for preparation of baking soda is
NaCl + H2O + CO2 + NH3 → NH4Cl + NaHCO3

Question 43.
What Is Baking powder?
Answer:
Baking powder is a mixture of baking soda and a mild edible acid such as tartaric acid.

Question 44.
What is water of crystallization?
Answer:
Water of crystallization is the fixed number of water molecules present in one formula unit of salt.

TS 10th Class Physical Science Important Questions Chapter 3 Acids, Bases, and Salts

Question 45.
How is plaster of Paris obtained from gypsum?
Answer:
On careful heating of gypsum at 373 K. it loses water molecules partially to become calcium sulphate hemihydrate. This is called plaster of Paris (CaSO4. 1/2 H20).

Question 46.
What Is the reaction of plaster of Paris with water?
Answer:
Plaster of Paris is a white powder and on mixing with water, It sets Into hard solid mass due to the formation of gypsum.
CaSO4 1/2 HO+ 1’/2H2O → CaSO4.2H2O.

Question 47.
What are the salts obtained from common salt?
Answer:
The various salts obtained from common salt are sodium hydroxide, and baking soda. washing soda, bleaching powder sodium silicate and, many more.

Question 48.
What is a rock salt
Answer:

  1. Deposits of solid salts are found In several parts of the earth. These deposits of large crystals are often brown due to impurities. This Is called rock salt.
  2. Beds of rock salt are formed when seas of bygone ages dried up. Rock salt is mined like coal.

Question 49.
What does 10H20 signify in the formula Na2CO310H2O?
Answer:
1) 10H2O in Na2CO3 10H2O represents that there are 10 water molecules In one formula unit of sodium carbonate.
2) But sodium carbonate is not wet.

Question 50.
How do acids neutralize bases? (OR) How do acids and bases react with each other?
Answer:
According to Arrhenius, theory acids produce H+ ions and bases produce OH ions in aqueous media.
The combination of H+ and OH ions is called ‘neutralization’. Thus acids neutralize bases.
(OR)
The reaction of acids neutralizing bases by producing salt (respective) and water. Thus acids neutralize bases.

Question 51.
How strong are acids and base solutions?
Answer:
The acids of pH value as much less as possible have more concentration [pH<7] Basic nature increases as pH value increases.
(Or)
Acidic nature increases with decrease in Its pH value whereas basic nature increases as pH value increases.

Question 52.
Write the chemical formulae of the following
(i) Bleaching powder
(ii) Sodium Chloride
(iii) Slaked lime
(iv) Baking Soda
(v) Washing Soda
(vi) Gypsum
(vii) Plaster of Paris
(viii) Acetic acid
(ix) Sodium Hydroxide
(x) Common salt
Answer:
(i) Bleaching powder = CaOCl2
(ii) Sodium Chloride = NaCl
(iii) Slaked lime = Ca(OH)2
(iv) Baking Soda = NaHCO3
(v) Washing Soda = Na2CO3.10H2O
(vi) Gypsum = CaSO4.2H2O
(vii) Plaster of Paris — CaSO4.t/2H20
(viii) Acetic acid = CH3COOH
(ix) Sodium Hydroxide = NaOH
(x) Common salt = NaCI

Question 53.
Why do acids not show acidic behaviour in the absence of water?
Answer:
Aods dont show acidic behaviour in the absence of water as H ions are absent In them.

TS 10th Class Physical Science Important Questions Chapter 3 Acids, Bases, and Salts

Question 54.
If someone in the family is suffering from a problem of acidity, which of the following would you suggest as a remedy: lemon juice, vinegar or baking soda solution? Which property do you think of while suggesting the remedy?
Answer:

  1. I suggest a baking soda solution. As acidity can be neutralized by baking soda solution. We can use it.
  2. Acidity is caused due to excess secretion of hydrochloric acid In the stomach. Baking soda is a mild base and it can neutralize the acid in the stomach.

Question 55.
Tap water conducts electricity whereas distilled water does not. Why?
Answer:
Tap water contains some impurities in the form of salts. Due to the presence of salts it conducts electricity. Distilled water is free from all kinds of salts and hence does not conduct electricity.

Question 56.
What do you mean by dilution of an acid or base? Why is it done?
Answer:
Dilution of an acid or base means mixing an acid or base with water, This is done to decrease the concentration of ions per unit volume. In this way the acid or the base is said to be diluted.

Question 57.
Which bases are called alkalies? Give an example of alkali.
Answer:
Water-soluble bases are called alkalies. Examples of Alkalies are NaOH, KOH etc.

Question 58.
Two solutions A and B have pH values of 5 and 8 respectively. Which solution will be basic in nature?
Answer:
Solution B(pH=8) will be basic because Its pH is more than 7.

Question 59.
Why acetic acid is called as weak acid though there are four H atoms in the molecule?
A. Only one of the four H atoms of the monobasic is released as H+ Ion in solution. So acetic acid is called as weak acid.

Question 60.
How does a strong acid differ from a concentrated acid?
Answer:
The strength of an acid depends upon its dissociation power where as concentration depends on water content in the acid.

Question 61.
A student took test tubes containing 2 ml of dilute HCI and added Zn granules to test tube
(A) and solid sodium carbonate to test tube
(B) as shown below.
What would be the correct observation given by the student?
TS 10th Class Physical Science Important Questions Chapter 3 Acids, Bases, and Salts 2
Answer:
There will be rapid reactions In both the test tubes.

Question 62.
Who am I?
(1) I can roughly measure pH value from O-14.
Answer:
pH scale.

(2) I am called antichlor and am used to remove excess chlorine from clothes when treated with bleaching powder.
Answer:
Slaked lime.

(3) I am a product of gypsum and am used for making chalks and fireproof materials.
Answer:
Plaster of Paris.

(4) lama compound of calcium and can be used for disinfecting drinking water as well as for decolourisation.
Answer:
Bleaching powder.

(5) I give different smell in acid and base solution.
Answer:
Olfactory indicator.

(6) I am an oxide capable of showing properties of both acids and bases.
Answer:
Amphoteric oxide

(7) I am a covalent compound and conduct electricity in aqueous medium.
Answer:
Acids.

(8) I am a salt of potassium hydroxide and nitric acid.
Answer:
Potassium Nitrate.

(9) I am derived from tomato and turn blue lItmus Into red.
Answer:
Oxalic acid / Acetic acid.

Question 63.
Mention the precautions to take while conducting an experiment to prove acids produce Ions only in aqueous solutions.
Answer:

  1. Testing of the evolved gas by using dry litmus paper first. Then with wet litmus paper.
  2. Using guard tube containing calcium chloride.

2 Marks Questions

Question 1.
Solution x turned blue litmus red and Solution y turned red litmus blue.
(a) What products could be formed when x and y are mixed?
(b) Which gas is released when we put magnesium pieces in solution X?
(c) Will any chemical reaction take place when zinc pieces are put in solution y?
(d) Which of the above solutions contains more hydrogen ions?
Answer:
Given solution ‘x’ turned blue litmus into red so, X is an acid.
Given solution ‘y’ turned red litmus into blue so, ‘y’ is a base.
a) The reaction of an acid (x) with a base to give a salt and water.
b) When we put magnesium pieces in solution releases hydrogen gas.
c) When zinc pieces are put in solution y a chemical reaction will takes place.
d) Acids contain more H+ ions in the given solutions, ‘x’ has more H’ ions because It Is an acid.

TS 10th Class Physical Science Important Questions Chapter 3 Acids, Bases, and Salts

Question 2.
How do you know the nature of salt formed due to the reaction between acids and bases?
Answer:
The nature of salt depends on the strength of acid and base which form the salt.
Eg strong acid + strong base →b neutral salt
strong acid + weak base → acidic salt
weak acid + strong base → basic salt
weak acid + weak base → depends on relative strength of acid and base.

Question 3.
How washing soda is obtained?
Answer:

  1. Washing soda can be obtained from sodium chloride.
  2. Baking soda is obtained from sodium chloride as follows.
    NaCl + H2O + CO2 + NH3 → NH4Cl + NaHCO3
  3. On heating, baking soda produces sodium carbonate.
    TS 10th Class Physical Science Important Questions Chapter 3 Acids, Bases, and Salts 3
  4. Recrystallization of sodium carbonate gives washing soda.
    Na2CO3 + 10H2O → Na2CO3.10H2O

Question 4.
Write a short note on pH scale.
Answer:

  1. A scale for measuring hydrogen ion concentration in a solution is called pH scale.
  2. pH value of a solution is simply a number which indicates the acidic or basic nature of a solution.
  3. If pH value = 7, it is a neutral solution pH value < , It Is an acidic solution pH value> 7, it Is a basic solution
  4. The range of pH value is from 0 to 14.
  5. As pH increases from 7 to 14, it represents a decrease in H3O ion concentration or an increase in OH ion concentration In the solution.

TS 10th Class Physical Science Important Questions Chapter 3 Acids, Bases, and Salts 4

Question 5.
What is the role of pH in our digestive system’
Answer:

  1. Our stomach produces HCl. It helps in digestion of food without harming the stomach.
  2. Dunng indigestion, the stomach produces too much acid and this causes pain and Irritation.
  3. To get rid of this pain, people use bases called antacids.
  4. These antacids neutralize the exess acid In stomach.
  5. Magnesium hydroxide (milk of magnesia), a mild base is often used for this purpose.

Question 6.
Explain the self-defence by animals and plants through chemical warfare.
Answer:

  1. If you have been stung by a honey bee, the sting leaves an acid which causes pain and irritation.
  2. Use of a mild base like baking soda on the stung area gives relief.
  3. Stinging hair of leaves of nettle plant, Inject methanoic acid or formic acid causing burning pain.
  4. A traditional remedy is rubbing the area with the leaf of the dock plant, which often grows beside the nettle in the wild.

Question 7.
Write about universal indicators.
Answer:

  • The universal indicator is used to know the strength of acid or base.
  • A universal indicator is a mixture of several indicators.
  • The universal Indicator shows different colours at different concentrations of hydrogen ions in a solution.

Question 8.
What do acids have in common?
Answer:
Common characteristics of acids :

  1. Similar chemical properties.
  2. Acids generate hydrogen gas on reacting with metals.
  3. Hydrogen is common to acids.
  4. Acids are sour to taste and turn blue litmus to red and react with bases to form salt and water.

Question 9.
What do bases have in common?
Answer:
Common characteristics of bases :

  1. Bitterintaste.
  2. Soapy to touch.
  3. Turn red litmus to blue colour.
  4. On heating decompose into metal oxides and water.
  5. React with acids to form salt and water.
  6. Produce OH ions in aqueous solution.

Question 10.
Four setups are given below to identify the gas evolved when dilute hydrochloric acid was added to zinc granules. Which is the most appropriate setup?
Answer:
TS 10th Class Physical Science Important Questions Chapter 3 Acids, Bases, and Salts 5
The gas evolved can be tested as shown in IV set-up because In the delivery tube thistle funnel is -used to drop dilute HCI and to evolve H gas, it should not dip In the acid.

Question 11.
“While constructing a house, a builder selects marble flooring and marble table tops for the kitchen where vinegar and juice of lemon, tamarind etc., are more often used for cooking. Will you agree to this selection and why? Give reasons.
Answer:
No, I didn’t agree with him, because

  1. The substances like vinegar, tamarind etc., contain acids which accidentally fall on marble will damage it.
  2. Reason for that marble is calcium carbonate and will react with the acids to undergo chemical changes and thus making marks.

TS 10th Class Physical Science Important Questions Chapter 3 Acids, Bases, and Salts

Question 12.
Why do we use antacids? Write its nature.
Answer:

  1. Pain and irritation will be caused In stomach during the acidity problem/ indigestion problem. Antacids are used to neutralize the excess acid in the stomach and gives relief from acidity.
  2. Antacids are basic in nature.

Question 13.
Calcium compound which is a yellowish-white powder is used as a disinfectant and also in textile industry
a) Name the compound.
a) Which gas is released when this compound is left exposed to air?
Answer:
a) The compound s Bleaching powder r calcium oxi chloride. (CaOCl2)
b) When it is exposed to air, it releases Cl gas according to the following reaction with CO2 present in air.
CaOCl2 + CO2 → CaCO3 + Cl2

Question 14.
Why are some salts called hydrated salts? Give two examples of white-coloured hydrated salts with their chemical formulae.
Answer:
a) Salts which contain water of crystallisation are called as hydrated salts.
b) Two white-coloured hydrated salts are

  • Gypsum – CaSO4. 2H2O
  • Washing soda – Na2CO3. 10H2O

Question 15.
Discuss briefly the examples showing the importance of pH in daily life.
Answer:

  1. Living organisms can survive only in a narrow range of pH change. For example it lowers the pH of the river water, the survival of aquatic life in such novels becomes difficult.
  2. Tooth decay starts when the change In pH value of mouth.
  3. Our stomach produces HCI which control the digestion of food in our stomach.
  4. Plants require a specific pH range for their healthy growth.
  5. Animals and plants use chemical solutions having certain pH value for their self-defence.

Question 16.
Which product will form when CaO is dissolved in water? How do you find the nature of product?
Answer:

  1. CaO reacts with water and gives calcium hydroxide [Ca(OH)2].
  2. The nature of the calcium hydroxide will be tested with red litmus paper or pH paper.
  3. Calcium hydroxide turns red litmus Into blue. Thus we can say that Ca(OH)2 is basic in nature.
  4. Ca(OH)2 shows pH value more than 7 on pH paper. Thus we can say that Ca(OH)2 is basic in nature.

4 Marks Questions

Question 1.
If the pH values of solutions X, Y and Z are 13, 6 and 2 respectively then
(a) Which solution is a strong acid? Why?
(b) Which solution contains ions along with molecules of solution?
(c) Which solution is a strong base? Why?
(d) Does the pH value of a solution increase or decrease when a base is added to it? Why?
Answer:
The strength of an acid (or) an alkali can be tested by using pH value of a solution. If the value of a pH of a solution is less than, then that solution exhibits acidic nature. If the value of a pH of a solution is more than, then that solution exhibits basic nature.
pH value of a solution “X” is 13
pH value of a solution Y’ is 6
pH value of a solution “Z” Is 2
a) Solution ‘Z’ is strong acid because its pH is 2.
b) Among given solutions, solution ‘Y’ is weakest acid. Weak solution contains ions along with molecules of solution. So ‘y’ exhibits like this character.
c) Solution X is strong base. Because its pH Is 13.
d) If base is added to a solution then its pH will increase.

Question 2.
Describe how sodium hydroxide Is obtained from common salt?
Answer:

1. When electricity Is passed through an aqueous solution of sodium chloride (called brine), It decomposes to form sodium hydroxide
2. The process is called choir-alkali process – because of the products formed chior for chlorine and alkali for sodium hydroxide.
TS 10th Class Physical Science Important Questions Chapter 3 Acids, Bases, and Salts 6
2NaCl(aq) + 2H2O(l) → 2NaOH(aq)+Cl2(g)+H2(g)
3. Chlorine gas is liberated at the anode and hydrogen gas at the cathode.
4. Sodium hydroxide solution is formed near the cathode.
5. The three products produced in this process are all useful.

Question 3.
Describe process of preparation of bleaching powder? Write its uses.
Answer:
Preparation of Bleaching Powder:

  1. Chlorine gas is produced during electrolysis of aqueous sodium chloride.
  2. This chlorine gas is used for the manufacture of bleaching powder.
  3. Bleaching powder is produced by the action of chlorine on slaked lime.

TS 10th Class Physical Science Important Questions Chapter 3 Acids, Bases, and Salts 7

Uses of Bleaching powder:

  1. It is used for bleaching cotton and linen in the textile industry, for bleaching wood pulp in paper Industry and for bleaching washed clothes in laundry.
  2. Used as an oxidizing agent in many chemical industries.
  3. Used for disinfecting drinking water to make it free of germs.
  4. Used as a reagent in the preparation of chloroform.

TS 10th Class Physical Science Important Questions Chapter 3 Acids, Bases, and Salts

Question 4.
Write the chemical equation of preparation of baking soda. What are the uses of baking soda?
Answer:
Preparation of Baking Soda:

  1. The chemical name of baking soda is sodium hydrogen carbonate and the formula is NaHCO3.
  2. It is prepared as follows.
    NaCl+ H2O + CO2 + NH3 → NH4Cl + NaHCO3

Uses of Baking soda:

  1. Baking soda is added for faster cooking.
  2. It is used as an ingredient ¡n antacids.
  3. It Is also, used in soda-acid fire extinguishers.
  4. It acts as a mild antiseptic.
  5. Baking powder can be prepared as a mixture of baking soda and a mild edible acid such as tartaric acid.
  6. Baking powder is used in preparation of bread or cake to make them soft and spongy.

Question 5.
How do you prepare washing soda? What are its uses?
Answer:
Preparation of Washing soda:
1. Washing soda can be obtained from sodium chloride.
2. Baking soda is obtained from sodium chloride as follows.
NaCl + H2O + CO2 + NH3 → NH4Cl+ NaHCO3
3. On heating, baking soda produces sodium carbonate
TS 10th Class Physical Science Important Questions Chapter 3 Acids, Bases, and Salts 8
4. Recrystallization of sodium carbonate gives washing soda.
Na2CO3 → 10H2O+ Na2CO3.10H2O.

Uses of Washing soda:

  1. Washing soda (sodium carbonate) is used in glass, soap and paper industries.
  2. It is used in the manufacture of sodium compounds such as borax.
  3. Sodium carbonate can be used as a cleaning agent for domestic purposes.
  4. it Is used for removing permanent hardness of water.

Question 6.
Draw a neat diagram showing variation of pH with the change in concentration of H+(aq) ions and OH(aq) ions.
Answer:
TS 10th Class Physical Science Important Questions Chapter 3 Acids, Bases, and Salts 9
Variation of pH with the change in concentration of H+ ions and OH(aq) ions.

Question 7.
Write the pH values of some things.
Answer:

pH valueThings
0Battery Acid
1Con.H2SO4
2Lemon juice
3Orange Juice
4Tomato juice
5Black coffee, Bananas
6Milk, urine
7Pure water
8Sea water, eggs
9Baking soda
10Milk of magnesia
11Ammonia solution,
12Soapy water
13Bleach oven cleaner
14Liquid drain cleaner

Question 8.
Distinguish between acids and bases.
Answer:

AcidsBases
1) An acid is a substance which gives H+ ions In water solution.1) A base is a solution which contains OH group in water solution and gives hydroxyl Ions OH.
2) Acids are sour in taste.2) Bases are bitter In taste.
3) Acid turns blue litmus to red.3) Bases turn red litmus to blue.
4) The orange colour of methyl orange indicator changes to red In acid medium.4) The orange colour of methyl orange indicator changes to yellow in bases medium.
5) Acids are formed when non-metal oxides are dissolved in water.5) Bases are formed when metal oxides are dissolved in water.
6) pH value of acid is less than 7.6) pH value of base is greater than 7.

Question 9.
Observe the following table and answer the questions given below. The table contains the aqueous solutions of different substances with the same concentrations and their respective pH value.
TS 10th Class Physical Science Important Questions Chapter 3 Acids, Bases, and Salts 10
(i) Which one of the above acid solutions is the weakest acid? Give a reason.
(ii) Which one of the above solutions is the strongest base? Give reason.
(iii) Which of the above two produce maximum heat when they react? What does that heat energy called?
(iv) Which one of the above solutions has the pH equal to that of the distilled water? What is the name given to solutions of that pH value?
Answer:
(i) ‘C’ Is the weakest acid because it has less H ior concentration.
(ii) ‘H’ is the strongest base because It contains more OH ion concentration.
(iii) ‘B’ and ‘H’ produce maximum heat energy. This heat energy ¡s called ‘Heat of Neutralization’.
(iv) ‘G’. It ¡s named as Neutral solution.

Question 10.
List out the materials required to test whether the solutions of given acids and bases contain ions or not. Explain the procedure of the experiment.
Answer:
Materials Required:
Beaker, Graphite rods, dil.HCl solution, bulb, glucose, alcohol solutions and connecting wires.

Aim:
To test whether the solutions of given acids and bases contain ions or not.
Procedure:
1. Prepare solutions of glucose, alcohol, hydrochloric acid and sulphuric acid.
2. Dril two holes on a rubber cork and introduce two iron nails Into the holes.
3. Connect two different coloured electrical wires and keep it in a loo ml. beaker.
4. Connect free ends of the wire to 6V battery and complete the circuit.
5. Pour some diluted HCl in the beaker and switch on the current.
TS 10th Class Physical Science Important Questions Chapter 3 Acids, Bases, and Salts 11
6. We find that the bulb glows.
7. Repeat the activity with diluted H2SO4, glucose and alcohol solutions separately.
8. The bulb glows when acid is taken in the beaker. But the bulb does not glow when glucose and alcohol are taken in the beaker.
9. Glowing of bulb indicates that there Is flow of electric current through the solution.
10. Acid solutions have ions and the movement of these ions helps flow of current but glucose and alcohol solutions do not have free ions and so current does not pass through them.

TS 10th Class Physical Science Important Questions Chapter 3 Acids, Bases, and Salts

Question 11.
Write any four chemical properties of acids.
Answer:
Chemical properties of acids:

  1. Active metal react with acids and liberate hydrogen gas.
    Zn + HCl → ZnCl2 + H2
  2. Acids react with bases to form salt and water.
    HCl(aq) + NaOH(aq) → NaCl(aq) + H2O(l)
  3. Acids react with metallic oxides to form salt and water.
    MgO(s) + 2HCl(aq) → MgCl2(aq) + H2O(l)
  4. Acids react with carbonates and hydrogen carbonates and release” carbon dioxide gas.

TS 10th Class Physical Science Important Questions Chapter 3 Acids, Bases, and Salts 12

Question 12.
Six solutions A, B, C, D, E, F as 5, 2, 1, 3, 7 and 9 respectIvely which solution is
a) Neutral
b) Strongly alkaline
c) Strongly acid
d) Weakly acidic
Arrange the pH in increasing order of Hydrogen ion concentration.(ASI)
Answer:
a) solution E is neutral
b) solution F is Alkaline
C) solution C is strongly acidic
d) solution A is weakly acidic
e) Solution B is strongly acidic
f) solution D is strongly acidic.
g) Ascending order of increase of Hydrogen ion concentration is F, E, A, D, B, C

Question 13.
By observing the given pH scale, answer the following.
TS 10th Class Physical Science Important Questions Chapter 3 Acids, Bases, and Salts 13
(i) Which of the body fluid Is basic in nature?
(ii) Is lemon juice a strong acid or weak acid?
(iii) Which of the above liquid have strong basic character?
(iv) What is the pH of distilled water?
Answer:
From the above pH scale:
(i) The body fluid that is basic in nature is blood (pH>7).
(ii) The pH of lemon juice is less than three. So t is a strong acid.
(iii) NaOH is the strong base because it has highest pH value.
(iv) The pH of distilled water is 7.

Do You Know

1. Litmus solution is a dye extracted from lichen, a plant belonging to the division of Thallophyta and is used as indicator. In neutral solution litmus colour is purple. Coloured petals of some flowers such as Hydrangea, Petunia and Geranium are also used as indicators.

2. To avoid the negative powers of H+ concentration in dilute acid and base solutions Sorensen introduced the concept of pH. Due to this pH concept may be restricted for solutions of [H+] less than 1 molar.

The pH scale is from 0-14. The ph Is an indication of concentration of H. For example, at a ph of zero the hydronium ion concertration is one molar.
Typically the concentrations of H in water in most solutions fall between a range of 1 M (pHO) and 10-14 M (pH=14). Figure 8 depicts the pH scale with common solutions.
TS 10th Class Physical Science Important Questions Chapter 3 Acids, Bases, and Salts 14
3. Sait – a symbol of freedom struggle: You know common salt is a substance which enhances the taste of food; it also has played a remarkable role in motivating the people towards freedom struggle. The tax levied by the British government on common food substance (salt), for both the poor and the rich, made them to become united in the freedom struggle. You must have heard about Mahatma Gandhi’s Dandi March and about ‘salt satyagraha’ in the struggle for freedom of India.

TS 10th Class Telugu Guide 10th Lesson గోలకొండ పట్టణము

Telangana SCERT 10th Class Telugu Guide Telangana 10th Lesson గోలకొండ పట్టణము Textbook Questions and Answers.

TS 10th Class Telugu 10th Lesson Questions and Answers Telangana గోలకొండ పట్టణము

చిత్రాన్ని చూడండి – ఆలోచించి చెప్పండి (T.B. P.No. 95)

TS 10th Class Telugu Guide 10th Lesson గోలకొండ పట్టణము 1

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
పై చిత్రంలో ఏం కనిపిస్తున్నది ?
జవాబు:
పై చిత్రంలో జెండా వందనం జరుగుచున్నది. జెండా ఎగురవేయుచున్నారు.

ప్రశ్న 2.
జెండా ఎగురవేస్తున్నవారు ఎవరు ?
జవాబు:
జెండా ఎగురవేస్తున్నది తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు.

TS 10th Class Telugu Guide 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 3.
జెండాను ఎక్కడ ఎగురవేశారు ? ఎందుకు ?
జవాబు:
జెండాను గోలకొండ కోట దగ్గర ఎగురవేశారు. చారిత్రాత్మక కట్టడమైన గోలకొండ దగ్గర ఎగురవేస్తే ప్రజలకు పాలన దగ్గరవుతుందని అక్కడ ఎగుర వేశారు.

ప్రశ్న 4.
గోలకొండ కోట ప్రత్యేకతలు మీకేమైనా తెలుసా ?
జవాబు:
తెలుసు. కోటకు చుట్టూ పెద్దపెద్ద పటిష్టమైన గోడలు ఉన్నాయి. వీటినే బురుజులు అంటారు. శత్రువుల దాడి నుండి రక్షణ కల్పిస్తాయి ఈ బురుజులు.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 98)

పట్టణమనగా గోలకొండ పట్టణమనియే ………..
విహారభూమిగా నుండెను.

ప్రశ్న 1.
ఆజంఖాను ఎవరు ? ఆయన గొప్పతనం ఏమిటి ?
జవాబు:
గోలకొండ పట్టణ నిర్మాణ పథకమునకు కర్త. గొప్ప ఇంజనీరు. ఆయన పట్టణం యొక్క రూపురేఖలను దిద్దినారు. పట్టణాన్ని పెక్కుభాగాలుగా విభజించారు.

ప్రశ్న 2.
పట్టణం అలంకార భూయిష్టంగా ఉండడం అంటే ఏమిటి?
జవాబు:
ఇబ్రహీం కుతుబ్షా సరదార్లను, భాగ్యవంతులను కోట లోపల మేడలు కట్టవలసినదిగా ఆజ్ఞాపించాడు. అందరూ ఉత్సాహంతో ఈ పనిచేసిరి. అంటే పట్టణం అంతా అందంగా అలంకారముతో కూడి ఉన్నదని అర్థం.

ప్రశ్న 3.
గోలకొండ కోట ఎందుకు అచ్చెరువు గొల్పుతున్నది?
జవాబు:
గోలకొండ పట్టణములో ఉద్యానవన నిర్మాణము నందు విలక్షణమయి, ఆకర్షణీయమైనట్టివి మిద్దెల మీది తోటలు (Roof gardens) భవనముల పైభాగం ఎంతో నైపుణ్యంతో రూపురేఖలు దిద్ది, తీర్చి, రమ్యోద్యానములను మనోహరంగా నిర్మించారు. ఈ ఉద్యానవనమునకు నీటిని సప్లయిచేయు విధానము, అందులో నీటి కాలువలు, జలాశయములు, కేళా కూళులు, జలపాతములు అచ్చెరువు గొల్పుచుండెను.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 101)

హైదరాబాదునగరము…. ఓడలవ్యాపారము చేయుచుండెను.

ప్రశ్న 1.
గోలకొండ వదిలి సామాన్యజనం హైదరాబాదుకు ఎందుకు వెళ్ళి ఉంటారు ?
జవాబు:
గోలకొండ పట్టణంలో జనాభా ఒత్తిడి ఎక్కువ అయ్యింది. ప్రజలకు కావలసిన నీటివసతి కూడా చాలలేదు. అందువల్ల కొందరు పాదుషాలు, గొప్పవారు, కొందరు వర్తకులు, హైదరాబాదులో నివసించేవారు. హైదరాబాదు నిర్మాణం క్రమంగా అభివృద్ధి చెందడంతో గోలకొండ ప్రాధాన్యం తగ్గింది.

అందువల్ల గోలకొండలోని వర్తకులు, సర్దారులు సామాన్యజనం గోలకొండను వదలి, హైదరాబాదులో నివసించేవారు. పట్టణంలోకి రాడానికి పోడానికి, కొత్తవారికి అధికారుల అనుమతి కావలసి వచ్చేది. కొత్తవారు కోటలోకివస్తే అధికారులు వారి శరీరాన్ని అంతా వెతికేవారు. దానితో సామాన్యులు గోలకొండ వదలి, హైదరాబాదుకు వెళ్ళి ఉంటారు.

TS 10th Class Telugu Guide 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 2.
గోలకొండ పట్టణంలో వర్తక వాణిజ్యాలు ఎట్లా సాగాయి ?
జవాబు:
పట్టణములోని బజార్లలో చిల్లర వస్తువులు, తిను బండారములు, విలాస వస్తువులు, నగలు, నాణెములు విరివిగా అమ్మబడుచుండెను. వ్యాపారులు విదేశములతో వర్తకము చేయుచు కుబేరులతో సములయి ఉండిరి. అప్పుడీ పట్టణములో దొరకని వస్తువే లేదు. వజ్రాలకు గోలకొండ పుట్టినిల్లే గదా !

భారతభూమి నలుమూలల నుండి వర్తకం సాగు చుండెను. విదేశముల నుండి వచ్చెడి సరుకులు మచిలీపట్టణము నుండి నేరుగా గోలకొండకు వచ్చు చుండెను. ఇది కేంద్రంగా తెలంగాణమునంతకును ప్రాకుచుండెను. ఇబ్రహీం కులీకుతుబ్షా కాలములో తెలంగాణ ఈజిప్టు వలె ప్రపంచపు అంగడిగా నుండెను.

ప్రశ్న 3.
గోలకొండ పట్టణంలోకి రాకపోకల విషయంలో ఎందుకు జాగ్రత్తలు తీసుకునేవారు ?
జవాబు:
గోలకొండ పట్టణంలోనికి రాకపోకల విషయంలో జాగ్రత్తలు వహించేవారు. క్రొత్తవారు వచ్చినచో వానికి ప్రవేశం దుర్లభం.వానికి దారోగా యొద్ది నుండి అనుమతిపత్రం ఉండాలి. లేదా రాజోద్యోగులలో ఎవ్వని పరిచయమయినా ఉండాలి.

క్రొత్తవారు రాగానే వానివద్ద ఉప్పుగాని, పొగాకుగాని ఉన్నదే మోనని వళ్ళు, బట్టలు బాగా తడవి చూచెదరు. దీనివల్ల రెవిన్యూ బాగా వచ్చేది. రెండు మూడు రోజుల వరకు అనుమతి వచ్చేది కాదు. సాకులు చెప్పి ద్వారరక్షకులు వానినుండి లాభం పొందటానికి ప్రయత్నించేవారు.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 103)

గోలకొండ పాదుషాలలో ………. వైభవములు, ఠీవి పరిసమాప్తి జెందెను.

ప్రశ్న 1.
గోలకొండ పాదుషాలు జీవకారుణ్యం గలవారని, ప్రకృతి ప్రేమికులని ఎట్లా చెప్పగలవు ?
జవాబు:
గోలకొండ లోపలి కోటలో ఉత్తర భాగమునందు జింకల వనము ఒకటి ఉండెను. ఈ జింకల గుంపును ఎవరునూ కొట్టకూడదు. బాధింపకూడదు అని రాజాజ్ఞ ఉండెను. పట్టణములో ద్రాక్షతోటలు ఉండెను. ద్రాక్ష నుండి ద్రాక్షాసవము తయారుచేసి త్రాగుచుండిరి. ఈ విషయములను బట్టి గోలకొండ పాదుషాలు జీవకారుణ్యం కలవారని, ప్రకృతి ప్రేమికులని చెప్పవచ్చును.

ప్రశ్న 2.
పట్టణాల్లో జనాభా ఎందుకు పెరుగుతుంది ?
జవాబు:
మంచి వసతులు, సౌకర్యాలు ఉంటాయి. మనిషి భోగజీవి. సుఖాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ఇవన్నీ పట్టణాలలో ఉంటాయి. అందుకని పల్లెల నుండి పట్టణాలకు తరలివెళ్ళడం వలన పట్టణాలలో జనాభా పెరుగుతుంది.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
గోలకొండ పట్టణము పాఠం ఆధారంగా నాటి చరిత్ర, సంస్కృతికి సంబంధించిన అంశాలు ఎట్లా ఉండేవని భావిస్తున్నారు ? చర్చించండి.
జవాబు:
పట్టణమనగా గోలకొండ పట్టణమనియే దక్షిణాపథమున ప్రసిద్ధి. గోలకొండ దుర్గమనగా ఒక్క కోట కాదు. మూడు కోటలు. గోలకొండ పట్టణ నిర్మాణ పథక మునకు కర్త ఆజంఖాన్ అను ఇంజనీరు అని తెలియుచున్నది. ఇతడే పట్టణము యొక్క రూపు రేఖలను దిద్దినవాడు. గోలకొండ పట్టణములో ఏనుగులు, ఒంటెలు, గుఱ్ఱాలు అధిక సంఖ్యలో నుండి పట్టణములో సందడిగా సంచరించుచుండెను.

గోలకొండ పట్టణం అలంకార భూయిష్టముగా ఉంటుంది. గోలకొండ పట్టణములో ఉద్యానవన నిర్మాణమునందు విలక్షణమయి, ఆకర్షణీయమైనట్టివి మిద్దెల మీది తోటలు భవనముల పైభాగము ఎంతో మనోహరంగా నిర్మించినారు. ఈ విధంగా ఆనాటి చరిత్ర, సంస్కృతి మనకు తెలుస్తోంది.

ప్రశ్న 2.
క్రింద ఇచ్చిన పదాలు ఏయే పేరాల్లో ఉన్నాయో గుర్తించి, పట్టికలో వివరించి రాయండి.
జవాబు:
TS 10th Class Telugu Guide 10th Lesson గోలకొండ పట్టణము 2

TS 10th Class Telugu Guide 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 3.
క్రింది పేరా చదవండి. పట్టిక రాయండి.

భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన కోటల్లో దేవరకొండ కోట ఒకటి. రేచర్ల నాయకరాజుల పరిపాలనలో ఈ కోట ఎంతో గొప్పగా విరాజిల్లినది. రెండవ మాదా నాయకుడు ఈ కోటను నిర్మించారు. ఎత్తైన ఏడు కొండలను కలుపుతూ ఈ దుర్గాన్ని అత్యద్భుతంగా నిర్మించాడు. ఐదువందల ఎకరాల పైగా విస్తీర్ణంగల ఈ కోటలో పంట భూములు, కాలువలు, ధాన్యాగారాలు, సెలయేళ్ళు, సైనిక శిబిరాలు, గుర్రపుశాలలు, ఆలయాలు ఉన్నాయి.

ఈ కోటకు 360 బురుజులు ఉన్నాయి. 9 ప్రధానద్వారాలు, 23 పెద్దబావులు, 53 దిగుడు బావులు, 6 కోనేర్లు ఉన్నాయి. అత్యంత కళాకృతమైన సింహద్వారాలు ఉన్నాయి. మన పాఠ్యపుస్తకాల మొదటి పేజీలో కనిపించే విశిష్టమైన ‘పూర్ణకుంభ’ చిహ్నం ఇక్కడే లభించింది. ఈ కోటయొక్క విశేషం ఏమిటంటే ఏ శత్రురాజు దీన్ని ఆక్రమించుకోలేకపోయాడు. నాయకరాజుల కాలంలో ఇది స్వయంప్రతిపత్తిగల దుర్గంగా వెలిగింది. దీనికి దగ్గరలో కల రాచకొండ సమీపంలోని నాగసముద్రం చెరువులను ఈ రాజులే తవ్వించారు.
TS 10th Class Telugu Guide 10th Lesson గోలకొండ పట్టణము 3
జవాబు:
TS 10th Class Telugu Guide 10th Lesson గోలకొండ పట్టణము 4

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) “గోలకొండ పాదుషాలు సాహిత్య పోషకులు” అనడానికి ఉదాహరణలు తెలుపండి. (Mar. ’15)
(లేదా)
గోలకొండ నవాబుల సాహిత్య సేవ ఎట్టిది ? (Mar. ’18)
(లేదా)
ఇబ్రహీం కుతుబ్షా సాహిత్య పిపాస గూర్చి వివరించండి. (June ’18)
జవాబు:
“గోలకొండ పాదుషాలలో ఇబ్రాహీం కుతుబుషా విద్యా ప్రియుడు. ఈతని ఆస్థానములో కవులు, పండితులు హిందువులలో, మహ్మదీయులలో ఉండిరి. విద్యాగోష్ఠి సదా సాగుచుండెను. పాదుషా వారు పండితులను బాగుగా సన్మానించుచుండిరి. ఇబ్రాహీం కుతుబ్షా చాలాకాలము విజయనగరము నందు రాజాదరణమున పెరిగినవాడగుటచే ఆంధ్ర భాషా మాధుర్యమును గ్రోలినవాడు ఆంధ్రభాష యందు అభిమానము గలిగి, ఆంధ్ర కవులను సత్కరించుచుండెను. అద్దంకి గంగాధర కవి “తపతీ సంవరణోపాఖ్యాన” కావ్యమును రచించి ఈ పాదుషాకు అంకితమిచ్చియున్నాడు.

ఇబ్రాహీం పాదుషా మహబూబునగరు జిల్లాలో నివశించు చుండిన ఆసూరి మరింగంటి సింగరాచార్య మహాకవికి “మత్తగంధేభసితఛత్ర ముత్తమాశ్వ హాటకాంబర చతురంతయాన యగ్రహారములను” ఇచ్చి సత్కరించినాడు. సుల్తాన్ ఇబ్రాహీం పాదుషా సేనానియగు అమీర్ ఖాన్ మొట్టమొదటి అచ్చతెనుగు కబ్బమగు “యయాతిచరిత్ర”కు కృతిభర్తయయి, ఆ కావ్యమును రచించిన పొన్నగంటి తెలగనార్యుని సత్కరించినాడు.

TS 10th Class Telugu Guide 10th Lesson గోలకొండ పట్టణము

ఆ) నాటి తెలంగాణలో కూడా తెలుగు భాష ఉచ్చ స్థితిలో ఉందని ఎట్లా చెప్పగలరు ?
జవాబు:
ఇబ్రహీం కుతుబ్షా తెలుగుభాష తియ్యదనం తెలిసినవాడు. తెలుగు భాషయందు అభిమానంతో తెలుగు కవులను, పండితులను సత్కరించేవాడు. అద్దంకి గంగాధర కవి రచించిన ‘తపతీ సంవరణో పాఖ్యాన కావ్యము’ వీరికి అంకితమివ్వబడినది. వీరు మహాకవి ఆసూరి మరింగంటి సింగరాచార్యను చతురంతయాన అగ్రహారాలను ఇచ్చి సత్కరించారు.

మొట్టమొదటి అచ్చ తెనుగు కావ్యం ‘యయాతి చరిత్ర’ దీనిని పొన్నగంటి తెలగనార్యులు రచించారు. ఈ కావ్యానికి కృతిభర్త ఇబ్రహీం పాదుషా సేనాని అమీర్ ఖాన్. దీనిని రచించిన కవిని ఘనంగా సత్కరించారు. దీనిని బట్టి నాటి తెలంగాణలో కూడా తెలుగు భాష ఉచ్చస్థితిలో ఉందని చెప్పవచ్చు.

ఇ) “తెలంగాణము ఈజిప్టువలె ప్రపంచపు అంగడి” అనడానికి కారణాలు రాయండి.
జవాబు:
పట్టణములోని బజార్లలో చిల్లర వస్తువులు, తిను బండారములు, విలాస వస్తువులు, నగలు, నాణెములు విరివిగా అమ్మబడుచుండెను. వ్యాపారులు విదేశములతో వర్తకము చేయుచు కుబేరులతో సములయి ఉండిరి. అప్పుడీ పట్టణములో దొరకని వస్తువే లేదు. వజ్రాలకు గోలకొండ పుట్టినిల్లే గదా ! భారతభూమి నలుమూలల నుండి వర్తకం సాగు చుండెను.

విదేశముల నుండి వచ్చెడి సరుకులు మచిలీపట్టణం నుండి నేరుగా గోలకొండకు వచ్చు చుండెను.ఇది కేంద్రంగా తెలంగాణమునంతకును ప్రాకుచుండెను. ఇబ్రహీం కులీకుతుబ్షా కాలములో తెలంగాణము ఈజిప్టు వలె ప్రపంచపు అంగడిగా నుండెను.

ఈ) ఈనాడు పట్టణాలలో జనాభా అధికమవడం వలన కలిగే ఇబ్బందులు ఏమిటి ?
జవాబు:
ప్రజలు వలసపోవటం : బ్రతుకు తెరువుకోసం, ఉపాధి కోసం ఎక్కువమంది పల్లె ప్రజలు నగరాలకు వలస పోవటం.

జనాభా పెరుగుదల : విద్యా, ఉద్యోగ అవకాశాలు, వైద్య సదుపాయాలు నగరాల్లో ఎక్కువగా ఉంటాయని ప్రజలు నగరాలకు వెళ్ళడంతో విపరీతంగా జనాభా పెరగటం.
రద్దీ పెరగటం : ప్రమాదాలు జరగటం, ఎప్పుడూ రోడ్లు రద్దీగా ఉండడంతో ప్రతిరోజు ప్రమాదాలు ఎక్కువగా జరగటం.

నీటి సమస్య : చెరువులు భూమి ఆక్రమణలకు గురియై భూగర్భ జలాలు తగ్గి త్రాగునీటికి, వాడుక నీటికీ కొరత ఏర్పడటం, ఉన్న చెరువులు, బావులు అవసరాలకు చాలకపోవటం.
కాలుష్యం పెరగటం : వాహనాలు, కర్మాగారాల్లో ఇంధనం ఎక్కువగా వాడటం, మురుగునీటి సౌకర్యాలు లేకపోవటంతో జల కాలుష్యం, వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం పెరగటం.

ధరల పెరుగుదల : జనాభా పెరగటంతో వస్తువులకు గిరాకీ పెరిగి ధరలు విపరీతంగా పెరిగిపోవటం.
విదేశీ సంస్కృతి ప్రభావం : భిన్న సంస్కృతుల ప్రజలు ఒక్కచోట ఉండటంతో ప్రజలు విదేశీ వ్యామోహానికి గురికావటం.
సగటు మనిషి పడేపాట్లు : ఇరుకు ఇళ్ళల్లో, అధిక ధరలతో, రణగొణ ధ్వనులతో, నీటి వసతులు లేక, నిరంతరం జీవనపోరాటం చేస్తూ పద్మవ్యూహం లాంటి నగరంలో సగటు మనిషి, ఎన్నో అగచాట్లు పడుతున్నాడు. క్లిష్ట సమస్యలను మానసిక సంఘర్షణ తో ఎదుర్కోవటంతో నేడు నగర జీవితం నరక ప్రాయంగా మారుతుంది.

ప్రశ్న 2.
క్రింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) గోలకొండ పట్టణము విశిష్టతను తెలుపండి.
జవాబు:
పట్టణమంటే గోలకొండ పట్టణమే అనే ప్రఖ్యాతి పొందింది. అందుకు కారణం గోలకొండ యొక్క అందచందాలు, వైభవం, విశిష్టతలు.

అందచందాలు : గోలకొండ పట్టణ నిర్మాణ పథకకర్త ఆజంఖాన్, పట్టణాన్ని మొహల్లాలుగా విభజించారు. వీధులు విశాలంగా ఉంటాయి. భాగ్యవంతులు, సరదార్ల మేడలు కోట లోపల ఉంటాయి. పట్టణానికి ఆ భవనాలన్నీ అలంకారాలుగా ఉంటాయి. నగీనాబాగ్ ఒక అందాలకుప్ప అయిన ఉద్యానవనం.

షాహిమహలులు అనే రాజహర్మ్యములు చాలా అందమైనవి. దిల్కుషా భవన సౌందర్యం వర్ణనాతీతం. ఉద్యానవన నిర్మాణాలు గోలకొండ పట్టణం అందచందాలను చాలా పెంచాయి. మిద్దెలమీది తోటలు శిల్పకళా నిపుణత్వానికి గీటు రాళ్ళు. ఈ ఉద్యానవనాలకు నీరు సరఫరా చేసే కాలువలు, జలాశయాలు, కేళాకూళులు, జలపాతాలు చూసి ఆశ్చర్యపడని వారుండరు. బాల్బోవా వృక్షం పట్టణం అందాలను పెంచింది.

వైభవం : గోలకొండ పట్టణం వజ్రాలకు పుట్టినిల్లు. అక్కడి వ్యాపారులు మహాధనవంతులు. దేశవిదేశాలతో ఎగుమతి దిగుమతి వాణిజ్యం చేసేవారు. అప్పుడా పట్టణంలో దొరకని వస్తువు లేదు. వజ్రాల వ్యాపారం, ఓడల వ్యాపారం కూడా జోరుగా సాగేది.

విశిష్టత : కవులు, పండితులను పోషించేవారు. అనేక గ్రంథాలను రచింపచేసి, అంకితం పుచ్చు కొనేవారు. కవులను ఘనంగా సన్మానించేవారు. అగ్రహారాలిచ్చేవారు. జంతు ప్రేమికులు. ద్రాక్ష తోటలు పెంచేవారు. ఉమ్రావులు విలాసవంతంగా జీవించే వారు. శిక్షలు కఠినం.

TS 10th Class Telugu Guide 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 3.
క్రింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

అ) ఏదైనా ఒక పట్టణం లేదా ఊరి చారిత్రక/సాంస్కృతిక విశేషాలతో వ్యాసం రాయండి.
జవాబు:
పర్యాటక క్షేత్రం – ఆదిలాబాద్ జిల్లా బాసర
పవిత్ర గోదావరీ నదికి సుమారు అరవై మైళ్ళ దూరంలో ఒక ఋష్యాశ్రమం ఉండేది. దానిని వ్యాస మహర్షి స్థాపించడం చేత దానికి “వ్యాసపురి” అని పేరు వచ్చింది. తరువాత ‘వాసర’ అని పిలువబడుతుండేది.

కాలక్రమంలో అదే ‘బాసర’ అని ప్రసిద్ధిపొందింది. ఇక్కడ సరస్వతీ దేవి దేవాలయం ఉంది. ఉత్తర భారతదేశంలో కాశ్మీరంలో, దక్షిణ భారతదేశంలో తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న బాసరలో మాత్రమే సరస్వతీ దేవి దేవాలయాలు ఉన్నాయి. సాక్షాత్ నారాయణాంశతో జన్మించిన వేదవ్యాస మహర్షి మహాభారత భాగవతాది అష్టాదశ పురాణాలు, వ్యాఖ్యాన గ్రంథాలు రచించి, నాలుగు వేదాలను పరిష్కరించి మానవాళికి అందించిన మహోన్నతుడు.

అటువంటి వేదవ్యాసునికే ఒకసారి మనశ్శాంతి లేక సకల మునిగణ సేవితుడై ఉత్తరభారతదేశ యాత్రచేసి, దండకారణ్యానికి వచ్చాడట. కలిదోష నివారణ చేయగలిగిన గౌతమీ నదిలో స్నానం చేసి, సంధ్యా వందనము వంటి అనుష్ఠానాలను పూర్తిచేసుకుని, అమ్మను ప్రార్థించి సాకారముగా ఇక్కడనే నెలకొని ఉండమని శ్రీ సరస్వతీ దేవిని ప్రార్థించాడు. ప్రతిరోజూ గౌతమీ నదిలో స్నానము చేసి మూడు గుప్పెడులతో ఇసుక ను తెచ్చి ఒక చోట ఉంచేవాడు.
TS 10th Class Telugu Guide 10th Lesson గోలకొండ పట్టణము 5
క్రమంగా అది మూడు మూర్తు లుగా మారి శ్రీ మహాసరస్వతీ, శ్రీ మహాలక్ష్మీ, శ్రీ మహాకాళి రూపాలతో ఆవిర్భ వించింది. అందులో శ్రీ మహా సరస్వతిని అధి దేవతగా మిగిలిన దేవతలను పరివార దేవతలుగా ఆరాధించేవాడు. తరువాతి కాలంలో తురుష్కులు దండయాత్రలలో ఈ మందిరాన్ని నాశనం చేయటం జరిగింది.
TS 10th Class Telugu Guide 10th Lesson గోలకొండ పట్టణము 6

వీరశైవులైన ‘మాక్కజీ పటేలు’ సమూహము వాళ్ళను ఎదిరించారు. శిథిలమైన దేవాలయం పునరుద్ధరించబడింది. శృంగేరి పీఠాధిపతి శ్రీ జగద్గురు శ్రీ విద్యారణ్య భారతీ స్వామి వారు శ్రీ సరస్వతీ దేవిని పునఃప్రతిష్ఠ చేసి పునరుద్ధరించారు. ఇక్కడ దత్తమందిరము, గణేశ మందిరము, ఏకవీర మందిరము, పాతాళేశ్వర మందిరము,

ఆంజనేయ మందిరము’ ఉన్నాయి. శ్రీ సరస్వతీదేవి ఆలయము కేంద్రంగా ఇంద్రేశ్వరము, సూర్యేశ్వరము, నారాయణేశ్వరము మొదలైన ఆలయ సముదాయ ముతో కూడిన మహాక్షేత్రము బాసర. ఇక్కడ ప్రతి సంవత్సరము విజయదశమికి, శివరాత్రికి ఉత్సవాలు జరుగుతాయి. అనేకమంది భక్తులు ఇక్కడకు వచ్చి శ్రీ సరస్వతీదేవిని దర్శించి, ఆమె అనుగ్రహంతో పిల్లలకు విద్యాభ్యాసాలు జరుపుకుంటారు. పల్లె వాసుల జాతరలు, శుభకార్యాలు కూడా జరుగు తుంటాయి.

III. భాషాంశాలు

పదజాలం

1. క్రింది వాటిని సొంతవాక్యాల్లో ప్రయోగించండి.

అ) పుట్టినిల్లు
జవాబు:
భారతదేశం కళలకు పుట్టినిల్లు.

ఆ) పాటుపడడం
జవాబు:
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎందరో వీరులు పాటుపడ్డారు.

ఇ) పీడవదలడం
జవాబు:
కంసుని వధతో ఆ రాజ్యానికి పీడవదిలింది.

ఈ) తలదాచుకోవడం
జవాబు:
కాశ్మీరీ పండిట్లు ఢిల్లీ పురవీధుల్లో తలదాచుకున్నారు.

2. క్రింది పదాలను వివరించి రాయండి.

అ) పటాటోపము : మితిమీరిన వస్త్రాలంకారణాన్ని పటాటోపం అని అంటారు. ‘పటము’ అనగా వస్త్రము అని అర్థం అనగా బాగా అలంకరించుకొని హడా వుడిగా తిరుగు అని భావం.

ఆ) అగ్రహారం : ఇబ్రహీం పాదుషా మహబూబునగరు జిల్లాలో నివసించుచుండిన ఆసూరి మరింగంటి సింగరాచార్య మహాకవికి “మత్తగంధేభసితఛత్ర ముత్త మాశ్వ హాటకాంబర చతురంతయాన అగ్రహార ములను” ఇచ్చి సత్కరించినాడు.

ఇ) బంజారాదర్వాజా : పట్టణంలోనికి సరుకంతయు బంజారాదర్వాజా ద్వారానే వచ్చుచుండును. బంజారాలు అనబడు లంబాడీలు ధాన్యము, ఉప్పు మొదలగునవి తెచ్చుచుండుటచే ప్రవేశద్వారమునకు బంజారా దర్వాజా అను పేరు వచ్చినది.

TS 10th Class Telugu Guide 10th Lesson గోలకొండ పట్టణము

ఈ) ధర్మశాల : పుణ్యాన్ని పొందదలచి యాత్రికులకు, బాటసారులకు, అనాథలకు ఆశ్రయాన్ని కల్పించేందుకు నిర్మించబడిన వసతి గృహాలను ధర్మశాలలు అని అంటారు. ఇవి ఎక్కువగా పుణ్యక్షేత్రాల్లో కనిపిస్తాయి. వీటిలో కులమతాలకు అతీతంగా జనులు ఆశ్రయం పొందుతారు.

వ్యాకరణాంశాలు

1. క్రింది వాక్యాలలో సంధి పదాలను విడదీసి అవి ఏ సంధులో రాయండి.

అ) పండుగ దినాలలో దేవాలయాలు భక్తులతో కిట కిటలాడుతాయి.
జవాబు:
దేవ + ఆలయాలు = దేవాలయాలు (సవర్ణదీర్ఘ సంధి)

ఆ) మధురలోని రమ్యోద్యానములు చూపరుల మనస్సు లను ఆకట్టుకుంటాయి.
జవాబు:
రమ్య + ఉద్యానములు = రమ్యోద్యానములు (గుణ సంధి)

ఇ) ఛత్రపతి శివాజీ అశ్వారూఢుడు అయి శత్రువులను సంహరించాడు.
జవాబు:
‘అశ్వ + ఆరూఢుడు = అశ్వారూఢుడు (సవర్ణదీర్ఘ సంధి)

ఈ) రాజాజ్ఞ లేనిదే ఏ కార్యక్రమాలు జరుపరు.
జవాబు:
రాజ + రాజాజ్ఞ (సవర్ణదీర్ఘ సంధి)

బహువ్రీహి సమాసము

క్రింది సమాసపదాలను వాటి విగ్రహవాక్యాలను పరిశీలించండి.

అ) ఆజానుబాహుడు – జానువుల వరకు బాహువులు కలవాడు.
ఆ) ముక్కంటి – మూడు కన్నులు కలవాడు.
ఇ) గరుడ వాహనుడు – గరుడుడు వాహనముగా కలవాడు.
ఈ) చతుర్ముఖుడు – నాలుగు ముఖాలు కలవాడు.
ఉ) పద్మాక్షి – పద్మం వంటి కన్నులు కలది.

పై పదాలలో మొదటి పదానికి గాని రెండవ పదానికి గాని ప్రాధాన్యం లేదు. రెండు పదాలు మరో పదం యొక్క అర్థాన్ని స్ఫురింపజేస్తున్నాయి. ఇలా మరో పదం యొక్క అర్థానికి ప్రాధాన్యం ఉన్న సమాసాన్ని “బహువ్రీహి” సమాసం అంటారు.

ఉదా : ‘చక్రపాణి’ అనే సమాసపదంలో ‘చక్రము’ అనే పదానికి ప్రాధాన్యం లేదు. ‘పాణి’ (చేయి) అనే పదానికి కూడా ప్రాధాన్యం లేదు. చక్రము పాణియందు కలిగిన వానికి ప్రాధాన్యం ఉన్నది. ఇట్లా సమాసంలో పదాల ద్వారా వచ్చే మరో పదము యొక్క అర్థానికి ప్రాధాన్యం ఉన్నది కాబట్టి ఇది బహువ్రీహి సమాసం.
అన్యపదార్థ ప్రాధాన్యం బహువ్రీహి.

2. క్రింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసాలను రాయండి.

ఉదా : యయాతిచరిత్ర – యయాతి యొక్క చరిత్ర – షష్ఠీ తత్పురుష సమాసం.

TS 10th Class Telugu Guide 10th Lesson గోలకొండ పట్టణము 7

3. క్రింది వాక్యాలను వ్యవహారభాషలోనికి మార్చండి.

ఉదా : పట్టణము అలంకారముగానుండుటకు
అందరును ఉత్సాహముతో పాటుపడిరి.
పట్టణం అలంకారంగా ఉండడానికి అందరూ
ఉత్సాహంతో పాటుపడ్డారు.

అ) ఈ మందిరము నందే పారశీకపు రాయబారికిని, అతని అనుచరవర్గమునకును బస ఏర్పాటు చేసిరి.
జవాబు:
ఈ మందిరము నందే పారశీకపు రాయబారికి, అతని అనుచర వర్గానికి బస ఏర్పాటు చేసిరి.

ఆ) నీటి కాలువలు, జలాశయములు, జలపాతములు అచ్చెరువు గొల్పుచుండెను.
జవాబు:
నీటి కాలువలు, జలాశయాలు, జలపాతాలు ఆశ్చర్యం గొల్పుతాయి.

ఇ) పెద్ద అధికారుల యొక్కయు మందిరములన్నియు లోపలి కోటలో నుండుచుండును.
జవాబు:
పెద్ద అధికారుల మందిరాలన్నీ కోటలో ఉండేవి.

ఈ) వజ్రములకు గోలకొండ పుట్టినిల్లే గదా !
జవాబు:
“వజ్రాలకు గోలకొండ పుట్టిల్లు” కదా !

TS 10th Class Telugu Guide 10th Lesson గోలకొండ పట్టణము

ఉ) పట్టణములోనికి సరుకంతయు బంజారాదర్వాజా ద్వారానే వచ్చుచుండును.
జవాబు:
పట్టణంలోనికి సరుకంతా బంజారాదర్వాజా ద్వారా వచ్చును.

ప్రాజెక్టు పని

మీ జిల్లాలోని వివిధ కోటల చిత్రాలు లేదా మీరు చూసిన కోట/ప్రాచీన గుడి / కట్టడం ఆధారంగా నివేదిక రాయండి. ప్రదర్శించండి.
జవాబు:
నివేదిక

నేను చూసిన ప్రాచీన కట్టడం వరంగల్లు నగరం. వరంగల్లును ఓరుగల్లు అని, ఏకశిలా నగరం అని పిలిచేవారు. హైదరాబాద్కు 80 కి.మీ. దూరంలో ఉన్నది. వరంగల్లు, హనుమకొండ, ఖాజీపేటలు కలిసే ఉంటాయి.

వరంగల్లు 42 గ్రామ పంచాయితీలతో 1 మిలియన్ జనాభాను మించిపోయింది. కాకతీయులు 1195 నుండి 1323 వరకు పరిపాలన సాగించారు.
స్వయంభూ దేవాలయం ఇక్కడ ఉంది. రెండవ ప్రతాప రుద్రుని తర్వాత ముసునూరి నాయకులు పరి పాలించారు. వేయిస్తంభాల గుడి ప్రసిద్ధమైన గుడి. ఇక్కడ NIIT వరంగల్, కాకతీయ యూనివర్శిటీ, కాకతీయ మెడికల్ కాలేజి (కాళోజి హెల్త్ యూని వర్శిటీ) ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. గ్రానైట్ క్వారీలు ఎక్కువగా ఉన్నాయి.

బతుకమ్మ పండుగ ఘనంగా జరుపుతారు. 9 రోజులపాటు రకరకాల పూలతో అలంకారం చేస్తారు. భద్రకాళి గుడి, కాకతీయ శిల్పాలు, ఏకశిలా గుట్ట, రామప్ప దేవాలయం మొదలైనవి ప్రసిద్ధమైనవి. కాక తీయుల కోట ఎంతో గొప్పది. ఇటీవల మా పాఠశాల వారు వరంగల్లు జిల్లాలోని ముఖ్యమైన ప్రదేశములను మాకు చూపారు. అందరూ గర్వించ దగ్గ నగరం వరంగల్లు.

సూక్తి : చరిత్ర స్వదేశాభిమానాన్ని నేర్పే చక్కనైన సాధనం

మీకు తెలుసా ?

గోల్కొండ కోటను బండరాళ్ళతో కట్టారు. గోల్కొండ కైవారము నాలుగు మైళ్ళను మించి ఉంటుంది. దీనికి ఎనిమిది బురుజులున్నవి. ఈ బురుజులన్నియు శతఘ్నుల స్థావరములు. మొగలు సైన్యం సర్వశక్తియుక్తులను కూడ దీసుకొని తొమ్మిది నెలలు శ్రమించి ఒక్క బురుజును మాత్రమే కూల్చగలిగిరి. ఐతే ఆ బురుజు స్థానమున ఒక్క రాత్రిలో మరొక బురుజును కుతుబ్షాహీ సైనికాధికారులు కట్ట గలిగిరి. గోల్కొండ కోటలో కొండశిఖరమున ‘బాలహిస్సారు’ అను ప్రాసాదమున్నది.

దానికి పోవు మార్గమునకు, కోట ప్రాకారమునకు అమర్చిన ద్వారముకడ ఒక రాతి గుండున్నది. ఆ రాతిపై నిలచి చప్పట్లు కొట్టిన ఆ శబ్దము బాలహిస్సారు లోనికి స్పష్టంగ వినిపించును. అట్లు ప్రతిధ్వనించు ఏర్పాటును నిర్మాణములోనే కల్పించిరి. ఇవి అన్నియు మానవుని ప్రజ్ఞ వలన నెలకొన్న అమర్పులు.

మూలం : కె.వి. భూపాల్రావు రాసిన ‘మహామంత్రి మాదన్న కథ’లోనిది.

విశేషాంశములు

1. బురుజులు : కోటగోడయందుండు దిబ్బ. శత్రురక్షణ దృష్టిలో ప్రత్యేకంగా చేపట్టిన నిర్మాణం. ఇక్కడి నుండి శత్రువుల కదలికలను గమనించవచ్చు. శత్రువులపై దాడిచేసే సందర్భంలో ఇక్కడ ఫిరంగులను పెట్టి కాలుస్తారు.

2. ఇబ్రహీం కుతుబ్షా : 1550 – 1580 సంవత్సరాల మధ్య గోలకొండ రాజ్యాన్ని పరిపాలించిన మాలిక్ ఇబ్రాహీం కుతుబ్షాహీ రాజు. జనవ్యవహారంలో ‘మల్కిభరాం’ గా ప్రసిద్ధుడు. పరిపాలనాదక్షుడు. తెలుగు భాష పట్ల మమకారాన్ని ప్రకటించాడు. తెలుగు కావ్యాన్ని అంకితం పొందిన ముస్లింరాజు ఇతడే. గోలకొండ రాజ్యంలో ఉద్యోగి సారంగు తమ్మయ తన తపతీ సంవరణోపాఖ్యానాన్ని ఇబ్రహీం కుతుబ్షాకు అంకితం ఇచ్చాడు. ఈ రాజు 1578 లో పురానా పూలు నిర్మించాడు.

3. కులీకుతుబ్షా : 1580 – 1612 సంవత్సరాల మధ్య గోలకొండ రాజ్యాన్ని పరిపాలించిన కులీ కుతుబ్షా హైదరాబాద్ నగర నిర్మాత. చక్కని కవి. హైదరాబాద్ ప్రాంతానికి ప్రత్యేకమైన ‘దక్కనీ ఉర్దూ’ ను ప్రోత్సహించాడు.ఈ మాండలికంలో దాదాపు 1800 పుటల కవిత్వాన్ని రచించాడు. తెలుగులోనూ కవిత్వాన్ని రచించినట్టు చెబుతారు. అవి లభ్యంకాలేదు.

4. మేనా : పెళ్ళి ఉరేగింపు వాహనాలలో ఒకటి, ఇది పల్లకి వలెనే ఉంటుంది కానీ పల్లకి అంత సున్నిత మైనది కాదు. మోటారు వాహనాలు లేని రోజుల్లో వధూవరులను ఇందులో కూర్చుండబెట్టి మనుషులు మోసేవారు.
5. హోన్ను : గోలకొండ కుతుబ్షాహి రాజ్యంలో ప్రధానమైన నాణెం హోన్ను. ఇది బంగారు నాణెం. విదేశీయులు దీన్నే పెగోడా అనేవారు.

ముఖ్య పదాలు – అర్థాలు

I

కైవారము = చుట్టూరా, వందిస్తోత్రము
అధికసంఖ్య = ఎక్కువ సంఖ్య
జనసమ్మర్ధం = ఎక్కువ జనాభా కలిగి ఉండటం
సొంపు = ఆనందం
రమ్యోద్యానములు = అందమైన ఉద్యానవనములు
మున్నగునవి = మొదలగునవి
హర్మ్యము = ఎత్తైన మేడ
ఉపాహారము = అల్పాహారము (టిఫిన్)
కేళాకూళులు = క్రీడా సరస్సులు

TS 10th Class Telugu Guide 10th Lesson గోలకొండ పట్టణము

II

హూను = సుమారు 4 రూపాయిల విలువగల బంగారు నాణెం
సర్ధారు = శూరుడు
పానీయ జలము = త్రాగునీరు
హవుజు = భవనం
అంగడి = దుకాణము
పైఠన్ = జలతారు
దారోగా = పై అధికారి
పుట్టి = 20 మణుగులు
తటాకము = చెరువు
వణికుంగవులు = శ్రేష్ఠులైన వ్యాపారులు
కౌశల్యము = నేర్పు
పణం = పందెం
దుర్లభము = కష్టము

III

పాదుషా = చక్రవర్తి
ఇభము = ఏనుగు
హాలకము = బంగారము
శస్త్రము = విసరకుండా యుద్ధం చేసే ఆయుధం – గద, కత్తి మొదలైనవి.
ఠీవి = దర్జా
అంబరము = ఆకాశము
వాఙ్మయము = భాష
సురటీ = విసనకర్ర
బోయీ = పల్లకి మోసేవాడు
భీతి = భయము
మాధుర్యము = తియ్యదనము, మధురత్వము
సత్కరించుట = గౌరవించట
కావ్యము = కబ్బము
పెక్కు = చాలా
పక్వము = పంట
ధ్వజము = జెండా
అశ్వము = గుఱ్ఱము
పదాతివర్గం = కాలి బలగం
యుద్ధభీతి = యుద్ధ భయం
పానుపు = పరుపు, పడక
మనోజ్ఞము = అందము
ఆకర్షణీయము = అందము
పరిసమాప్తి = ముగింపు, అంతము

పాఠం ఉద్దేశం

తెలంగాణలో చారిత్రక కట్టడాలకు కొదువ లేదు. వీటిలో గోలకొండ ఘనమైన చారిత్రకప్రాధాన్యం సంతరించు కొన్నది. ఈ పట్టణం యొక్క ప్రాశస్త్యం… నాటి కోటల నిర్మాణం… మంచి నీటి వసతుల కల్పన… అద్భుత సాంకేతిక నిర్మాణాలు… పట్టణంలో జరిగిన ప్రపంచస్థాయి వర్తక, వ్యాపారాలు… ఆహారపుటలవాట్లు, కోటలో జరిగిన కార్య కలాపాలు, స్థాపించిన పరిశ్రమలు, గోలకొండ పట్టణ ప్రాముఖ్యతతోపాటు 1940ల నాటి తెలంగాణ వచన రచనా శైలిని తెలుపడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ వ్యాసం ఆదిరాజు వీరభద్రరావు రాసిన ‘మన తెలంగాణము’ అనే వ్యాససంపుటి లోనిది.

రచయిత పరిచయం

రచయిత : ఆదిరాజు వీరభద్రరావు
జననం : 16.11.1890
మరణం : 28.9.1973
జన్మస్థలం : ఖమ్మంజిల్లా మధిర తాలూకా

ఇతర రచనలు : ప్రాచీనాంధ్ర నగరములు, లలిత కథావళి, రత్నప్రభ, జీవిత చరితావళి, జీవిత చరిత్రలు, నవ్వుల పువ్వులు, మిఠాయిచెట్టు, షితాబ్ ఖాన్. సంగ్రహాంధ్ర విజ్ఞానకోశంలో యాభైవ్యాసాలు రాశాడు. హైదరాబాద్ రేడియోలో తొలి ప్రసంగం చేశాడు.

వృత్తి : చాదర్ ఘాట్ హైస్కూల్ హైదరాబాదులో ప్రధాన తెలుగుపండితుడిగా పనిచేశాడు.
ప్రవృత్తి : “లక్ష్మణరాయ పరిశోధక మండలి” కి కార్యదర్శిగా వ్యవహరించాడు. తన పాండిత్యం, పరిశోధనలతో “తెలంగాణ భీష్ముడి” గా పేరు తెచ్చుకున్నాడు.

TS 10th Class Telugu Guide 10th Lesson గోలకొండ పట్టణము

ప్రవేశిక

ఏ జాతికైనా, ఏ ప్రాంతానికైనా తమ చరిత్రను మరచిపోవడమంత దురదృష్టం మరొకటి ఉండదు. తెలంగాణలోనే ఎంతో విశిష్టతను సంతరించుకున్న గోలకొండ పట్టణ వైభవాన్ని, నాటి అద్భుత నిర్మాణాలను వర్ణించడానికి మాటలు చాలవు. చిరస్మరణీయమైన ఈ కట్టడంలోని సాంకేతిక నైపుణ్యాన్ని ఎందరో చరిత్రకారులు అభివర్ణించే ప్రయత్నం చేశారు.

గోలకొండ వైభవాన్ని కళ్ళతో చూడవలసిందేకాని మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. ఆదిరాజు వీరభద్రరావు ఆ ప్రయత్నం చేశాడు. ఆయన మాటల్లోనే గోలకొండ పట్టణ విశేషాలను, ఆనాటి పరిస్థితులను ఈ పాఠం చదివి తెలుసుకోండి. ప్రత్యక్షంగా చూసిన అనుభూతిని పొందండి.

విద్యార్థులకు సూచనలు

  • పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
  • పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత గీయండి.
  • వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పదవిజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకోండి.

ప్రక్రియ – చారిత్రక వ్యాసం

ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. వ్యాసం అంటే వివరించి చెప్పడం. చరిత్రను తెలిపే వ్యాసాన్ని చారిత్రక వ్యాసం అంటారు. తెలంగాణ ప్రాంతంలోని కోటల నిర్మాణ వైభవాన్ని, విశిష్టతను తెలుపుతూ రాసిన వ్యాసమే ఈ పాఠం.

TS 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

Telangana SCERT 10th Class Telugu Grammar Telangana Chandassu ఛందస్సు Questions and Answers.

TS 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

1. ఉత్పలమాల :

  1. ఉత్పలమాల వృత్తము నందు సాధారణముగా నాలుగు పాదములుండును.
  2. ప్రతి పాదమునందును భ, ర, న, భ, భ, ర, వ అను గణములు వరుసగా ఉండును.
  3. పదవ అక్షరము యతి స్థానము.
  4. ప్రాస నియమము కలదు.

2. చంపకమాల :

  1. ప్రతి పద్యమునందును నాలుగు పాదము లుండును. ఇది వృత్తము.
  2. ప్రతి పాదములోను న, జ, భ, జ, జ, జ, ర అను గణాలు వరుసగా ఉండును.
  3. పదకొండవ అక్షరమున యతి చెల్లును.
  4. ప్రాస నియమము కలదు.

3. శార్దూలము:

  1. నాలుగు పాదములు గల వృత్తము.
  2. ప్రతి పాదంలోను 19 అక్షరాలు ఉంటాయి.
  3. ప్రతి పాదములోను మ, స, జ, స, త, త, గ అను గణములు వరుసగా ఉండును.
  4. పదమూడవ అక్షరమున యతి చెల్లును.
  5. ప్రాస నియమము కలదు.

TS 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

4. మత్తేభము :

  1. నాలుగు పాదములు గల వృత్తము.
  2. ప్రతి పాదంలోను 20 అక్షరాలు ఉంటాయి.
  3. ప్రతి పాదము నందు స, భ, ర, న, మ, య, వ అను గణములు వరుసగా ఉండును.
  4. పదునాల్గవ అక్షరము యతి స్థానము.
  5. ప్రాస నియమము కలదు.

5. తేటగీతి :

  1. తేటగీతి పద్యమునందు సాధారణముగా నాలుగు పాదములుండును.
  2. ప్రతి పాదము నందును ఒక సూర్యగణము, రెండు ఇంద్ర గణములు, రెండు సూర్యగణములు వరుసగా ఉండును.
  3. నాలుగవ గణము మొదటి అక్షరము యతి స్థానము.
  4. ప్రాస నియమము లేదు.
  5. ప్రాసయతి వేయవచ్చును.

6. ఆటవెలది :

  1. ఆటవెలది పద్యమునందు నాలుగు పాదము లుండును.
  2. 1, 3 పాదములలో మూడు సూర్యగణములు, మా రెండు ఇంద్రగణములు వరుసగా వచ్చును.
  3. 2, 4 పాదములలో అయిదు సూర్యగణములే ఉండును.
  4. నాలుగవ గణము మొదటి అక్షరము యతి స్థానము.
  5. ప్రాస నియమము లేదు.
  6. ప్రాసయతి వేయవచ్చును.

TS 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

7. కందము :

  1. 1, 3 పాదములలో మూడేసి గణములు, 2, 4 పాదములలో ఐదేసి గణములు ఉండును. అనగా 1, 2 పాదాలలో 8 గణములు అట్లే 3, 4 పాదములలో కలిసి 8 గణములు ఉండును.
  2. గగ, భ, జ, స, నల యను గణములు ద్రగణలు మాత్రమే వాడవలెను.
  3. ప్రాస నియమము కలదు.
  4. 2, 4 పాదములలో చివరి అక్షరము గురువుగా ఉండవలెను.
  5. 2, 4 పాదములలో మూడవ గణము (1, 2 భగణం పాదములు కలిపిన 6వ గణము) నలము గాని, జగణము గాని తప్పక ఉండవలెను.
  6. 2, 4 పాదములలోని మొదటి గణం మొదటి అక్షరానికి, అదే పాదములోని నాల్గవ గణం మొదటి అక్షరానికి యతి చెల్లును.
  7. బేసి గణము (1, 3, 5, 7) జగణము కాకూడదు.

8. ద్విపద :
రెండు పాదములే ఉండును. ప్రతి పాదము నందును 3 ఇంద్ర గణములు, 1 సూర్యగణము ఉండును. 3వ గణము మొదటి అక్షరమున యతిమైత్రి చెల్లును. రెండేసి పాదములకు ఒక ప్రాస ఉండును.

9. సీసము :

  1. ప్రతి పాదమునందును ఆరు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు వరుసగా ఉండును.
  2. ఒకటి, మూడు, అయిదు, ఏడు గణముల ప్రథమాక్షర ములకు యతి చెల్లును.
  3. ప్రాస నియమము లేదు.
  4. ప్రాసయతి వేయవచ్చును.
  5. నాలుగుపాదాల చివర ఆటవెలదిగాని, తేటగీతిగాని తప్పక చేర్చవలెను.
  6. ప్రతి పాదాన్ని నాలుగేసి గణాలకు విరిచి, రెండు భాగాలుగా చేయవచ్చును.
  7. మొదటి భాగంలో నాలుగు ఇంద్రగణాలు, రెండో భాగంలో రెండు సూర్యగణాలు వరుసగా ఉండును.

TS 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

గురు లఘువులను గుర్తించి, పద్య వృత్తమును గుర్తించటం

1.
TS 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 1
ఇది చంపకమాల పద్యపాదము.

2.
TS 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 2
ఇది “ఉత్పలమాల” పద్యపాదము.

3.
TS 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 3 ఇందులో 3 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉన్నాయి. ఇది ద్విపద పద్యపాదము.

4.
TS 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 4
ఈ పద్యపాదంలో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు ఉన్నాయి. కాబట్టి ఇది “ఉత్పలమాల” పద్యపాదము.

TS 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

5.
TS 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 5
ఈ పద్యపాదంలో న, జ, భ, జ, జ, జ, ర అనే గణాలు ఉన్నాయి. కాబట్టి ఇది “చంపకమాల” పద్యపాదము.

6.
TS 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 6 ఈ పద్యపాదంలో మ, స, జ, స, త, త, గ అనే గణాలు ఉన్నాయి. కాబట్టి ఇది “శార్దూల” పద్యపాదం.

7.
TS 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 7
ఈ పద్యపాదంలో స, భ, ర, న, మ, య, వ అనే గణాలు ఉన్నాయి. కాబట్టి పద్యపాదము మత్తేభము.

8.
TS 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 8
ఇది తేటగీతి పద్యపాదము.

TS 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

9.
TS 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 9
ఇది ద్విపద పద్యపాదము.

TS 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

Telangana SCERT 10th Class Telugu Grammar Telangana Alankaralu అలంకారాలు Questions and Answers.

TS 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

1. శబ్దాలంకారాలు

1. వృత్త్యనుప్రాసాలంకారం :
లక్షణం :ఒకటిగాని, అంతకంటే ఎక్కువగాని హల్లులు అనేకసార్లు వచ్చునట్లు చెబితే దాన్ని వృత్త్యను ప్రాసాలంకారం’ అని అంటారు.
ఉదాహరణ : వీరు పొమ్మను వారు గారు పొగబెట్టు వారు.
సమన్వయం : పై ఉదాహరణ వాక్యంలో ‘ర’ కారం పలుమార్లు వచ్చింది. అందువల్ల ఇది వృత్త్యనుప్రాసా లంకారం.

2. ఛేకానుప్రాసాలంకారం :
లక్షణం :
అర్థభేదంతో కూడిన హల్లుల జంట అవ్యవధానంగా (వెంట వెంటనే) వస్తే ఛేకాను ప్రాసాలంకారం అని అంటారు.

ఉదాహరణ :
అనాథ నాథ నంద నందన నీకు వందనం.

సమన్వయం :
పై ఉదాహరణ వాక్యంలో ‘నాథ’ ‘నంద’ అనే హల్లుల జంట అర్థభేదంతో వెంట వెంటనే వచ్చాయి. అందువల్ల ఇది ఛేకాను ప్రాసాలంకారం.

TS 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

3. లాటానుప్రాసాలంకారం :
లక్షణం :
అర్థభేదం లేకున్నా తాత్పర్య భేదముతో ఒకే పదం మరల మరల వచ్చునట్లు ప్రయోగించ బడితే దాన్ని ‘లాటాను ప్రాసాలంకారం’ అని అంటారు.

ఉదాహరణ :
కమలాక్షు నర్చించు కరములు కరములు.

సమన్వయం :
పై ఉదాహరణ వాక్యంలో ‘కరములు’ అనే పదం రెండు మార్లు ప్రయోగింపబడింది. రెండు మార్లు అర్థంలో తేడా లేదు. ‘కరములు’ అనగా చేతులు. కానీ రెండవసారి ప్రయోగింపబడిన ‘కరములు’ అనే పదానికి ధన్యములైన చేతులని తాత్పర్య భేదం ఉంది.

అ) హరి భజియించు హస్తములు హస్తములు ……….. (చేతులే, నిజమైనచేతులు)
ఆ) చిత్తశుద్ధితో జేసెడి సేవ సేవ. (సేవయే నిజమైన సేవ)

TS 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

పై రెండు సందర్భాల్లోను ఒకే పదం అర్థంలో తేడా లేకున్నా భావంలో తేడా ఉండేటట్లు ప్రయోగించారు. ఈ విధంగా ఒకే పదాన్ని, అర్థం ఒకటే అయినా తాత్పర్య భేదంతో ప్రయోగించ డాన్ని ‘లాటానుప్రాసాలంకారం’ అంటారు.

4. యమకాలంకారం :
లక్షణం :
అచ్చులలో హల్లులో మార్పులేనట్టి అక్షరాల సమూహం అర్థభేదంతో మరల మరల ప్రయోగింపబడితే దాన్ని ‘యమకాలంకారం’ అని అంటారు.

ఉదాహరణ 1 :
పురము నందు నందిపురమునందు.

సమన్వయం :
పై ఉదాహరణ వాక్యంలో ‘పురము’ అనే అక్షర సమూహం అర్థభేదంతో మరల మరల ప్రయోగింపబడింది. అందువల్ల దీనిని ‘యమకాలంకారం’ అని అంటారు.

ఉదాహరణ 2 :
లేమా ! దనుజుల గెలువఁగలేమా
(లేమ = స్త్రీ; గెలువగలేమా = గెలువడానికి మేమిక్కడ లేమా (ఉన్నాం కదా !)

ఉదాహరణ 3 :
ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది.
(తోరణం = ద్వారానికి కట్టే అలంకారం; రణం = యుద్ధం)
పై రెండు సందర్భాలల్లోను ఒకే పదం అర్థభేదంతో ప్రయోగించడం జరిగింది. దీనినే ‘యమకాలంకారం’ అంటారు.

5. అనుప్రాసాలంకారం :
లక్షణం :
ఒకటిగాని, అంతకంటే ఎక్కువ వర్గాలు గాని, ఒకటి కంటే ఎక్కువసార్లు ఆవృత్తం అయినట్లైతే దాన్ని ‘అనుప్రాసాలంకారం’ అని అంటారు.

ఉదాహరణ :
అక్క ముక్కుకు చక్కని ముక్కర.

సమన్వయం :
పై ఉదాహరణ వాక్యంలో ‘క్క’ అనే అక్షరం పలుమార్లు ఆవృత్తం అయింది. అందువల్ల దీన్ని ‘అనుప్రాసాలంకారం’ అని అంటారు.

TS 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

6. అంత్యానుప్రాసాలంకారం :
లక్షణం :
ప్రాస పాదం చివర ఒక అక్షరంగాని, అక్షర సముదాయంగాని ఉండేటట్లు రచన చేయడాన్ని ‘అంత్యాను ప్రాసం’ అని అంటారు.

ఉదా 1 :
నగారా మోగిందా
నయాగరా దుమికిందా
ఇది అంత్యానుప్రాసాలంకారానికి చెందినది. ఇందులో ‘దా’ అనే హల్లు రెండు పదాల్లోను అంత్యంలో ప్రయోగించబడింది.
అందువల్ల ఇది అంత్యానుప్రాసాలంకారం.

ఉదా 2:
రంగదరాతిభంగ; ఖగరాజతురంగ; విపత్పరంపరో
త్తుంగ తమఃపతంగ; పరితోషితరంగ;
దయాంతరంగ; స
త్సంగ; ధరాత్మజా హృదయ సారస భృంగ;
నిశాచరాబ్జ మా
తంగ; శుభాంగ ! ……………
ఇందులో అంత్యానుప్రాసాలంకారం ఉంది. ఇక్కడ అంత్యప్రాసగా ‘గ’ అనే ఒకే హల్లు, రంగ అనే హల్లుల జంట వాడబడినాయి. అందువల్ల ఇక్కడ అంత్యానుప్రాసాలంకారం ఉంది.

ఉదా 3 :
కొందరికి రెండుకాళ్ళు
రిక్షావాళ్ళకి మూడుకాళ్ళు
ఉన్నవాళ్ళకి నాలుక్కాళ్ళు
ఇక్కడ అంత్యానుప్రాసాలంకారం ఉంది. ఈ ఉదాహరణ లోని పాదాల్లో చివరగా ‘కాళ్ళు’ అనే హల్లుల జంట అంత్యప్రాసగా వాడబడింది. అందువల్ల ఇక్కడ అంత్యాను ప్రాసాలంకారం ఉంది.

TS 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

ఉదా 4 :
“అప్పుడు మా కులం వారిని ఆడవద్దన్నారు.
తర్వాత అన్ని కులాల వారిని ఆడవచ్చన్నారు”
పై ఉదాహరణ యందు మొదటి వాక్యంలో చివరనున్న ‘ఆడవద్దన్నారు’ అనే పదం రెండవ వాక్యం చివర కూడా వస్తుంది. అందువల్ల అక్కడ అంత్యానుప్రాసాలంకారం ఉంది.

2. అర్థాలంకారాలు

1. ఉపమాలంకారం :
లక్షణం :
ఉపమాన ఉపమేయాలకు మనోహరమైన పోలిక వర్గింపబడినట్టైతే దానిని ‘ఉపమాలంకాలరం’ అని అంటారు.

ఉదాహరణ 1 :
ఓ కృష్ణా ! నీ కీర్తి హంసలాగా ఆకాశ గంగలో మునుగుతూ ఉంది.

సమన్వయం :
ఉపమేయం – కీర్తి, ఉపమానం – హంస, ఉపమానవాచకంలాగా, ఈ పై ఉదాహరణ వాక్యంలో కీర్తి హంసతో మనోహరంగా పోల్చ బడింది. అందువల్ల దీన్ని ‘ఉపమాలంకారం’ అని అంటారు.

ఉదాహరణ 2:
కుముదినీరాగ రసబద్ధ గుళికయనగఁ
జంద్రుఁడుదయించెఁ గాంతి నిస్తంద్రుఁడగుచు.
పై ఉదాహరణయందు చంద్రోదయాన్ని రసమణి తోను, ఔషధపు ముద్దతోను పోల్చాడు. అందువల్ల ఇక్కడ ఉపమాలంకారం ఉంది.

TS 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

ఉదాహరణ 3:
శ్రీమంత్ చొక్కా మల్లెపూవులా తెల్లగా ఉంది.
ఇందులో ఉపమాలంకారం ఉంది. ఈ వాక్యంలో
చొక్కా – ఉపమేయం
మల్లెపూవు – ఉపమానం
సమానధర్మం – తెల్లగా ఉండటం
ఉపమా వాచకం -లాగా
ఇక్కడ ఉపమాన ఉపమేయాలకు చక్కనిపోలిక వర్ణించి చెప్పడం జరిగింది. అందువల్ల ఇందులో ఉపమాలంకారం ఉంది.

2. రూపకాలంకారం :
లక్షణం :
1. ఉపమానానికి, ఉపమేయానికి భేదం లేనట్లు వర్ణించి చెప్పినట్లైతే దాన్ని ‘రూపకాలంకారం’ అని అంటారు.
(లేదా)
2. ఉపమేయమందు ఉపమాన ధర్మాన్ని ఆరోపించి చెప్పినట్లైతే దాన్ని ‘రూపకాలంకారం’ అని అంటారు.

ఉదాహరణ 1:
లతాలలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లిరి.

వివరణ :
పై ఉదాహరణ వాక్యంలో లతాలలనలు అంటే ‘తీగలు అనే స్త్రీలు’ అని అర్థం. ఇక్కడ తీగలకూ, స్త్రీలకూ భేదం లేనట్లు చెప్పబడింది. అదే విధంగా “కుసుమాక్షతలు” అన్నప్పుడు కూడా పూలకూ, అక్షతలకూ భేదం లేనట్లు చెప్పబడింది. అందువల్ల దీన్ని “రూపకాలంకారం” అని అంటారు.

ఉదాహరణ 2 :
సంసార సాగరాన్ని భరించటం మిక్కిలి కష్టం.

సమన్వయం :
పై ఉదాహరణ వాక్యంలో ఉపమేయ మైన సంసారమందు ఉపమానమైన సాగర ధర్మం ఆరోపించబడింది. అందువల్ల దీన్ని “రూపకా లంకారం” అని అంటారు.

ఉదాహరణ 3 :
ఓ రాజాఁ నీ యశశ్చంద్రికలు దిగంతాలకు వ్యాపించాయి.
ఇది రూపకాలంకారానికి చెందినది.

సమన్వయం :
ఇందులో యశస్సు – ఉపమేయం, చంద్రిక – ఉపమానం. ఈ పై ఉదాహరణ యందు ఉపమేయమైన యశస్సునందు ఉపమానమైన చంద్రికల ధర్మాన్ని ఆరోపించడం జరిగింది. అందు వల్ల ఇది రూపకాలంకారం.

TS 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

ఉదాహరణ 4:
అజ్ఞానాంధకారంలో కూర్చోకుండా విజ్ఞాన వీధుల్లో విహరించాలి.
ఇది రూపకాలంకారమునకు చెందినది.

సమన్వయం :
పై ఉదాహరణయందు అజ్ఞానము – ఉపమేయము, అంధకారము – ఉపమానము. ఇక్కడ ఉపమేయమైన అజ్ఞానమునందు ఉపమాన మైన అంధకార ధర్మం ఆరోపించబడింది. అందువల్ల ఇది రూపకాలంకారం.

3. ఉత్ప్రేక్షాలంకారం :
లక్షణం :
ఉపమాన ధర్మసామ్యంచేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే దాన్ని ‘ఉత్ప్రేక్షాలం కారం’ అని అంటారు.

ఉదాహరణ :
ఈ వెన్నెల పాలవెల్లియో అన్నట్లుంది.

సమన్వయం :
పై ఉదాహరణ వాక్యంలో వెన్నెల, పాలవెల్లి (పాల సముద్రం)గా ఊహించబడింది. దీన్ని ‘ఉత్ప్రేక్షాలం కారం’ అని అంటారు.

4. అర్థాంతరన్యాసాలంకారం :
లక్షణం:
విశేష వాక్యాన్ని సామాన్య వాక్యంచేత గాని, సామాన్య వాక్యాన్ని విశేష వాక్యంచేత గాని సమర్థించి చెప్పినట్లయితే దాన్ని ‘అర్థాంతరన్యాసా లంకారం’ అని అంటారు.

ఉదాహరణ :
హనుమంతుడు సముద్రాన్ని దాటాడు. మహాత్ములకు సాధ్యము కానిదేమున్నది?

సమన్వయం :
పై ఉదాహరణ వాక్యంలో మొదటి వాక్యం విశేష వాక్యం. రెండవది సామాన్య వాక్యం. ఇక్కడ విశేషం సామాన్యం చేత సమర్థించడం జరిగింది. అందువల్ల దీన్ని ‘అర్థాంతరన్యాసా లంకారం’ అని అంటారు.

TS 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

5. దృష్టాంతాలంకారం :
లక్షణం :
ఉపమాన, ఉపమేయ వాక్యాల యొక్క వేరు వేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావంతో వర్ణించి చెప్పినట్లయితే దాన్ని ‘దృష్టాంతాలంకారం’ అని అంటారు.

ఉదాహరణ :
ఓ రాజా ! నీవే కీర్తిమంతుడవు. చంద్రుడే కాంతిమంతుడు.

సమన్వయం :
పై ఉదాహరణ వాక్యంలో రాజు ఉపమేయం. చంద్రుడు ఉపమానం. ఉపమేయమైన రాజు యొక్క ధర్మం కీర్తి, ఉపమానమైన చంద్రుని యొక్క ధర్మం కాంతి. కీర్తి, కాంతి అనే రెండు భిన్న ధర్మాలు కలిగి ఉన్నాయి. దిక్కుల చివరి దాకా వ్యాపించి ఉండటం వీని సమానధర్మం. ఈ రెండు బింబ, ప్రతిబింబ భావంతో వర్ణించబడ్డాయి. కాబట్టి దీన్ని “దృష్టాంతాలంకారం” అని అంటారు.

6. అతిశయోక్త్యలంకారం :
లక్షణం :
ఒక వస్తువు గురించి గాని, ఒక సందర్భాన్ని గురించి గాని, ఉన్నదానికంటే ఎక్కువగా చేసి చెప్పినట్లయితే దాన్ని ‘అతిశయోక్త్యలంకారం’ అని అంటారు.

ఉదాహరణ 1:
నగరంలోని భవనాలు నక్షత్రాలను తాకుతున్నాయి.

సమన్వయం :
పై ఉదాహరణ వాక్యంలో నగరంలోని మేడలు మిక్కిలి ఎత్తయినవి అని చెప్పడానికి బదులుగా నక్షత్రాలను తాకుచున్నాయని ఎక్కువగా చేసి చెప్పడం జరిగింది. అందువల్ల దీన్ని ‘అతిశ యోక్త్యలంకారం’ అని అంటారు.

ఉదాహరణ 2:

  1. మా చెల్లెలు తాటిచెట్టంత పొడవుంది.
  2. దేవాలయ గోపురాలు ఆకాశానికంటుతున్నాయి.

పై వాక్యాల్లో చెల్లె ఎత్తును, గోపురాల ఎత్తులను ఉన్న ఎత్తు కంటే ఎక్కువచేసి చెప్పడం జరిగింది కదా! అంటే అతిశయంగా చెప్పడం అన్నమాట. ఇలా చెప్పటాన్ని అతిశయోక్తి అంటారు.

TS 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

ఉదాహరణ 3 :
కం. చుక్కలు తల పూవులుగా
అక్కజముగ మేనుపెంచి యంబర వీధిన్ వెక్కసమై చూపట్టిన
అక్కోమలి ముదము నొందె ఆత్మస్థితిలోన్.

ఇక్కడ చుక్కలను తల పూలుగా చేసుకొని, ఆకాశమంత ఎత్తు పెరిగాడని, హనుమంతుడిని గూర్చి ఎక్కువగాచేసి చెప్పడం జరిగింది. అందువల్ల ఇక్కడ అతిశయోక్తి అలంకారం ఉన్నది.

ఉదాహరణ 4:
మా పొలంలో బంగారం పండింది. సాధారణంగా పొలంలో పంట పండుతుంది. కాని బాగా పంట పండిందనే విషయాన్ని తెలియ జేయడానికి బంగారం పండిందని ఎక్కువగా చేసి చెప్పడం జరిగింది. అందువల్ల ఇక్కడ అతిశయోక్తి అలంకారం ఉన్నది.

7. శ్లేషాలంకారం :
లక్షణం : అనేకమైన అర్థాలు గల శబ్దాలను ఉపయోగించి చెబితే దాన్ని “శ్లేషాలంకారం” అని అంటారు.
ఉదాహరణ 1:
రాజు కువలయానందకరుడు.
సమన్వయం : రాజు = ప్రభువు, చంద్రుడు;
కువలయం భూమి, కలువపూవు

  1. ప్రభువు భూమికి ఆనందాన్ని కలిగిస్తాడు.
  2. చంద్రుడు కలువపూలకు ఆనందాన్ని ఇస్తాడు.
    ఇక్కడ రెండు అర్థములు వచ్చునట్లుగా చెప్పబడింది. అందువల్ల దీన్ని ‘శ్లేషాలంకారం’ అని అంటారు.

ఉదాహరణ 2 :
మిమ్ము మాధవుడు రక్షించుగాక ! అర్థం :

  1. మిమ్ము మాధవుడు (విష్ణువు) రక్షించుగాక !
  2. మిమ్ము ఉమాధవుడు (శివుడు) రక్షించుగాక !

TS 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

ఉదాహరణ 3 :
మానవ జీవనం సుకుమారం. అర్థం :

  1. మానవ (ఆధునిక) జీవితం సుకుమారమైనది.
  2. మానవ (మనిషి) జీవితం సుకుమారమైనది.

పై అర్థాలను గమనించారు కదా ! ఒకే శబ్దం రెండు వేర్వేరు అర్థాలనందిస్తున్నది. అంటే విభిన్న అర్థాలు ఆశ్రయించి ఉన్నాయి. ఇలా ఉంటే వాటిని ‘శ్లేషాలంకారం’ అని అంటారు.

ఉదాహరణ 4 :
నీవేల వచ్చెదవు
పై ఉదాహరణలో రెండు అర్థాలు స్ఫురిస్తున్నాయి.

  1. నీవు ఏల వచ్చెదవు ? (నీవు + ఏల)
  2. నీవేల (ఏ సమయంలో ? వచ్చెదవు)

ఈ అర్థాలను వాక్యంలో వ్రాస్తే, క్రింది విధంగా ఉంటాయి.

  1. నీవు ఏల వచ్చెదవు ?
  2. నీవు ఏ సమయంలో వచ్చెదవు ?

ఇట్లా ఒకే వాక్యంలో రెండు కానీ అంతకుమించి అర్థాలను కానీ కూర్చడమే శ్లేషాలంకారం.

8. స్వభావోక్త్యలంకారం :
లక్షణం :
జాతి, గుణ, క్రియాదులలోని స్వభావమును ఉన్నది ఉన్నట్లు మనోహరంగా వర్ణింపబడినచో దాన్ని ‘స్వభావోక్త్య లంకారం’ అని అంటారు.

ఉదాహరణ :
అడవిలోని లేళ్ళు చెవులు నిక్కబొడుచు కొని చెంగుచెంగున గంతులేస్తూ బిత్తరచూపులతో పరుగెత్తు చున్నాయి.

సమన్వయం :
పై ఉదాహరణ వాక్యంలో లేళ్ళ స్థితిని ఉన్నది ఉన్నట్లుగా మనోహరంగా వర్ణించబడింది. అందువల్ల దీన్ని స్వభావోక్త్యలంకారం అని అంటారు.

TS 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

9. ముక్తపదగ్రస్త అలంకారం :
కం. మన వేటికి నూతనమా !
తన మానినిఁ బ్రేమఁ దనకుఁ దక్కితిననుమా
నను మానక దయ దనరం
దనరంతులు మాని నరసధవు రమ్మనవే.

ఒక పద్యపాదంగాని, వాక్యంగానీ ఏ పదంతో పూర్తవు తుందో అదే పదంతో తర్వాత పాదం / వాక్యం మొదలవు తున్నది. దీన్నే ముక్తపదగ్రస్త అలంకారం అంటారు.

TS 10th Class Telugu Grammar Sandhulu సంధులు

Telangana SCERT 10th Class Telugu Grammar Telangana Sandhulu సంధులు Questions and Answers.

TS 10th Class Telugu Grammar Sandhulu సంధులు

I. సంస్కృత సంధులు :

1. సవర్ణదీర్ఘసంధి :
అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘము ఏకాదేశ మగును.
అ, ఆలకు అ, ఆలు
ఇ, ఈలు ఇ, ఈలు
ఉ, ఊలకు ఉ, ఊలు
ఋ, ఋలకు ఋ, ౠలు సవర్ణములు. సవర్ణములకు దీర్ఘము ఆదేశముగా వచ్చును. కనుక సవర్ణదీర్ఘ సంధి.
ఉదా :
నర + అంతకుడు – నరాంతకుడు
దివ్య + ఆనందము – దివ్యానందము
యతి + ఇంద్రుడు – యతీంద్రుడు
ముని + ఈశ్వరుడు – మునీశ్వరుడు
గురు + ఉపదేశము – గురూపదేశము
పితౄ + ఋణము – పితౄణము
కుల + ఆచార్యుడు – కులాచార్యుడు
దిశ + అంచలము – దిశాంచలము
శ్రావణ + అభ్రము – శ్రావణాభ్రము
ఆంధ్ర + అంబిక – ఆంధ్రాంబిక
విభ + ఆవళులు – భావళులు
సచివ + ఆలయం – సచివాలయం
శీత + అమృతము – శీతామృతము
అశ్వ + ఆరూఢుడు – అశ్వారూఢుడు
పుణ్య + అంగన – పుణ్యాంగన
ముని + ఈశ్వర – మునీశ్వర

TS 10th Class Telugu Grammar Sandhulu సంధులు

2. గుణసంధి:
అకారమునకు ఇ, ఉ, ఋలు పరమైనపుడు వరుసగా ఏ, ఓ, అర్ లు ఏకాదేశ మగును.
ఏ, ఓ, అర్లకు గుణములని పేరు.

ఉదా :
నర + ఇంద్రుడు – నరేంద్రుడు
మహా + ఇంద్రుడు – మహేంద్రుడు
మహా + ఈశుడు – మహేశుడు
సూర్య + ఉదయము – సూర్యోదయము
మహా + ఋషి – మహర్షి
గర్వ + ఉన్నతి – గర్వోన్నతి
రమ్య + ఉద్యానములు – రమోద్యానములు
వదాన్య + ఉత్తముడు – వదాన్యోత్తముడు
సర్వ + ఈశ్వరా – సర్వేశ్వరా
భాగ్య + ఉదయం – భాగ్యోదయం
సత్య + ఉక్తి – సత్యోక్తి
దానవ + ఇంద్రుడు – దానవేంద్రుడు
నవ + ఉదయం – నవోదయం

3. వృద్ధిసంధి:
అకారమునకు ఏ, ఐలు పరమగునపుడు ‘ఐ’ కారమును, ఓ, ఔలు పరమగునపుడు ‘ఔ’ కారమును ఏకాదేశమగును.

ఉదా :
ఏక + ఏక – ఏకైక
లోక + ఐక్యము – లోకైక్యము
గంగ + ఓఘము – గంగౌఘము
గ్రామ + ఔన్నత్యము – గ్రామౌన్నత్యము
నాటక + ఔచిత్యం – నాటకౌచిత్యం
ఏక + ఏక – ఏకైక
వసుధ + ఏక – వసుధైక
దివ్య + ఐరావతం – దివ్యైరావతం
దేశ + ఐశ్వర్యం – దేశైశ్వర్యం
వన + ఓషధి – వనౌషధి
సమ + ఐక్యత – సమైక్యత

TS 10th Class Telugu Grammar Sandhulu సంధులు

4. యణాదేశసంధి :
ఇ, ఉ, ఋలకు సవర్ణములు కాని అచ్చులు పరమగునపుడు క్రమముగా య, వ, ర, లు ఆదేశమగును.

ఉదా :
ప్రతి + ఏకము – ప్రత్యేకము
వస్తు + ఐక్యము – వస్వైక్యము
పితృ + అంశము – పిత్రంశము
అతి + అంత – అత్యంత
అభి + ఆగతులు – అభ్యాగతులు
అణు + ఆయుధాలు – అణ్వాయుధాలు
అతి + అద్భుతం – అత్యద్భుతం
(ఇ + ఇ కాని అచ్చు – య
ఉ + ఉ కాని అచ్చు – వ
ఋ + ఋ కాని అచ్చు – ర)

5. జస్త్వసంధి :
క, చ, ట, త, పలకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరములు గాని, శ, ష, సలు గాక మిగిలిన హల్లులుగాని, అచ్చులుగాని పరమైనపుడు క్రమముగా గ, జ, డ, ద, బలు ఆదేశమగును.
ఉదా :
వాక్ + అధిపతి – వాగధిపతి
అచ్ + అంతము – అజంతము
షట్ + రసములు – షడ్రసములు
సత్ + రూపము – సద్రూపము

TS 10th Class Telugu Grammar Sandhulu సంధులు

6. శ్చుత్వసంధి :
సకార తవర్గలకు శకార చవర్గలు పరమైనప్పుడు శకార చవర్గములే ఆదేశమగును.
ఉదా :
సత్ + జనులు – సజ్జనులు
మనస్ + చంద్రికలు – మనశ్చంద్రికలు

7. ష్టుత్వసంధి :
సకార తవర్గాలకు, షకార టవర్గలు పరమైనచో షకార టవర్గలే ఆదేశమగును.
ఉదా :
మనస్ + షట్పదము – మనష్షట్పదము
దనుస్ + టంకము – ధనుష్టంకము
తత్ + టీకా – తట్టీకా

8. అనునాసిక సంధి:
క, చ, ట, త, పలకు న, మలు పరమైనప్పుడు ఆయా వర్గ పంచమాక్షరములే వైకల్పికముగా ఆదేశమగును.
ఉదా :
వాక్ + మహిమ – వాఙ్మహిమ, వాగ్మహిమ
రాట్ + నిలయము – రాణ్ణిలయము, రాడ్నిలయము
కకుప్ + నేత – కకుమ్నేత, కకుబ్నేత

9. విసర్గసంధి :
i) హస్వ అకారము మీది విసర్గకు వర్గ ప్రథమ, ద్వితీయాక్షరములు గాని, శ, ష, సలు తప్ప మిగిలిన హల్లులు గాని పరమైనచో విసర్గకు ముందున్న అకారమునకు “ఓ”కారమాదేశ మగును.
ఉదా :
మనః + గతి – మనోగతి
తపః + ధనము – తపోధనము
మనః + రథము – మనోరథము
శిరః + రత్నము – శిరోరత్నము

TS 10th Class Telugu Grammar Sandhulu సంధులు

ii) విసర్గాంత శబ్దములకు అచ్చులు గాని, వర్గ తృతీయ, చతుర్ధ, పంచమాక్షరములు గాని, హ, య, వ, రలు గాని పరమైనపుడు విసర్గకు రేఫము ఆదేశమగును.
ఉదా :
చతుః + ఆత్మ – చతురాత్మ
చతుః + భుజుడు – చతుర్భుజుడు
ధనుః + వేదము – ధనుర్వేదము
పునః + దర్శనము – పునర్దర్శనము

iii) విసర్గకు క, ఖ, ప, ఫలు పరమైనపుడు విసర్గకు మార్పురాదు.
ఉదా :
యశః + కాయము – యశఃకాయము
తపః + ఫలము – తపఃఫలము

10. సకారాంత సంధి:
i) ‘అస్’ అంతమున గల పదమునకు అకారము పరమైనచో రెండింటికిని కలిపి ‘ఓ’ కారమాదేశ మగును.
ఉదా :
మనస్ + అభిలాష – మనోభిలాష
యశస్ + అబ్ధి – యశోబ్ధి

ii) సకారాంత శబ్దములకు శ, షలు పరమైనచో శ, షలు గాని, విసర్గము గాని వచ్చును.
ఉదా :
మనస్ + శక్తి – మనశ్శక్తి, మనఃశక్తి
చతుస్ + షష్టి – చతుష్షష్టి, చతుఃషష్టి

TS 10th Class Telugu Grammar Sandhulu సంధులు

iii) సకారాంత శబ్దములకు ట, ఠలు పరమైనప్పుడు ‘ష’ వర్ణమాదేశమగును.
ఉదా :
అయస్ + టంకము – అయష్టంకము
ధనుస్ + టంకారము – ధనుష్టంకారము

II. తెనుగు సంధులు :

తెలుగు అజంత భాష. అనగా తెనుగు పదములు అచ్చుతో అంతమగును. సంధి అనగా పూర్వపర స్వరములకు పరస్వరము ఏకాదేశ మగుట.
ఉదా :
రాముడు + అతడు – రాముడతడు
ఏమి + ఏమి – ఏమేమి
సీత + అయ్య – సీతయ్య

1. అకార సంధి :
అత్తునకు సంధి బహుళము.
ఉదా :
రామ + అయ్య – రామయ్య
సీత + అక్క – సీతక్క
మేన + అత్త – మేనత్త
పుట్టిన + ఇల్లు – పుట్టినిల్లు, పుట్టినయిల్లు
దూత + ఇతడు – దూతయితడు
అమ్మ + ఇచ్చెను – అమ్మయిచ్చెను
ఒక + ఒక – ఒకానొక అన్యవిధము
ముచ్చట + ఆడు – ముచ్చటాడు
పుట్టిన + ఇల్లు – పుట్టినిల్లు
ముత్త + ఐదువ – ముత్తైదువ
పొత్తుల + ఇల్లు – పొత్తులి

2. ఇకార సంధి:
i) మధ్యమ పురుష క్రియలయందు ఇత్తునకు సంధియగు.
ఉదా :
చేసితివి + అపుడు – చేసితినపుడు
ఏలితిరి + ఇపుడు – ఏలితిరిపుడు

ii) ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగాను.
ఉదా :
ఏమి + అంటివి – ఏమంటివి, ఏమియంటివి
మఱి + ఏమి – మఱేమి, మఱియేమి
దారిని + ఇచ్చిరి – దారినిచ్చిరి
వేయి + ఏటికిన్ – యేటికిన్
అక్కడికి + అక్కడ – అక్కడికక్కడ
గెల్చితిమి + అమ్మ – గెల్చితిమమ్మ

iii) క్త్వార్థంబైన ఇత్తునకు సంధిలేదు.
ఉదా :
వచ్చి + ఇచ్చెను – వచ్చియిచ్చెను

TS 10th Class Telugu Grammar Sandhulu సంధులు

3. ఉకారసంధి:
ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధి యుగు.
ఉదా :
రాముడు + అతడు – రాముడతడు
అతడు + ఎక్కడ – అతడెక్కడ .
మనము + ఉన్నాము – మనమున్నాము
యుద్ధము + అడి – యుద్ధమాడి
పేరు + అవుతుంది – పేరవుతుంది
ధరాతలము + ఎల్ల – ధరాతలమెల్ల
సయ్యాటలు + ఆడెన్ – సయ్యాటలాడెన్
జగమ + ఎల్ల – జగమెల్ల
దారి + అవుతుంది – దారవుతుంది
ఎత్తులకు + ఎదిగిన – ఎత్తులకెదిగిన

4. అపదాదిస్వర సంధి :
అంద్వవగాగమంబులం దప్ప నపదాది స్వరంబు పరంబగునప్పుడచ్చునకు సంధియగు.
ఉదా :
మూర + ఎడు – మూరెడు
ఆర్థి + ఇంచు – అర్ధించు

III. ఆగమ సంధులు :

1. యడాగమ సంధి: సంధిలేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు యడాగమంబగు.
ఉదా :
మా + అమ్మ – మాయమ్మ
వచ్చి + ఇచ్చెను – వచ్చియిచ్చెను

TS 10th Class Telugu Grammar Sandhulu సంధులు

2. రుగాగమ సంధి
i) పేదాది శబ్దములకు ఆలు శబ్దము పరంబగునపుడు కర్మధారయమునందు రుగాగమంబగు.
ఉదా :
పేద + ఆలు – పేదరాలు
మనుమ + ఆలు – మనుమరాలు
జవ + ఆలు – జవరాలు
ముద్ద + ఆలు – ముద్దరాలు
జవ + ఆలు – జవరాలు
బాలింత + ఆలు – బాలింతరాలు
బీద + ఆలు – బీదరాలు

ii) కర్మధారయమునందు తత్సమంబులకు ఆలు శబ్దము పరంబగునపుడు అత్వంబునకు ఉత్వంబును రుగాగమంబు నగు.
ఉదా :
ధీర + ఆలు – ధీరురాలు
గుణవత + ఆలు – గుణవంతురాలు
ధైర్యవంత + ఆలు – ధైర్యవంతురాలు
శ్రీమంత + ఆలు – శ్రీమంతురాలు

3. టుగాగమ సంధి
i) కర్మధారయములందుత్తునకు అచ్చు పరంబగు నపుడు టుగాగమంబగు.
ఉదా :
నిగ్గు + అద్దము – నిగ్గుటద్దము
కఱకు + అమ్ము – కఱకుటమ్ము
సరసపు + అలుక – సరసపుటలుక

కర్మధారయములందు అనుటచే ఉకారములేని వాటికి కూడా కొన్ని చోట్ల టుగాగమంబు వచ్చును.
దుక్కి + ఎద్దు – దుక్కిటెద్దు
పల్లె + ఊరు – పల్లెటూరు

ii) కర్మధారయమునందు పేర్వాది శబ్దములకు అచ్చు పరంబగునపుడు టుగాగమంబు విభాషనగు.
ఉదా :
పేరు + ఉరము – పేరుటురము , పేరుమ
పొదరు + ఇల్లు – పొదరుటిల్లు, పొదరిల్లు

TS 10th Class Telugu Grammar Sandhulu సంధులు

4. దుగాగమ సంధి :
నీ, నా తన శబ్దములకు ఉత్తర పదము పరంబగునపుడు దుగాగమంబు విభాషనగు.
ఉదా :
నీ + చెలిమి – నీదుచెలిమి
నా + నేరము – నాదునేరము
తన + కోపము – తనదుకోపము

5. నుగాగమ సంధి:
1) సమాసంబుల ఉదంతంబులగు స్త్రీ సమంబులకును, పంపులకును పరుష సరళములు పరమగునపుడు నుగాగమంబగు.
ఉదా :
చిగురు + కయిదువు – చిగురుంగయిదువు చిగురుఁగయిదువు చిగురున్దయిదువు

2) షష్ఠీ సమాసమునందుకార, ఋకారములకు అచ్చు పరంబగునపుడు నుగాగమంబగు.
ఉదా :
రాజు + ఆనతి – రాజునానతి
విధాతృ + ఆజ్ఞ – విధాతృనాజ్ఞ

3) ఉదంత తద్ధర్మార్థక విశేషణమునకు అచ్చు పరంబగునపుడు నుగాగమంబగు.
ఉదా :
చేయు + అతడు – చేయునతడు
చదువు + అతడు – చదువునతడు

IV. ఆమ్రేడిత సంధులు :

1) అచ్చునకు ఆమ్రేడితంబు పరంబగునపుడు సంధి తరచుగానగు.
ఉదా :
ఔర + ఔర – ఔరౌర
ఆహా + ఆహా – ఆహాహా

2) ఆమ్రేడితంబు పరంబగునపుడు కడాదుల తొలి అచ్చు మీది వర్ణంబుల కెల్ల అదంతంబైన ద్విరుక్త టకారంబగు.
ఉదా :
కడ + కడ – క + ట్ట + కడ – కట్టకడ
ఎదురు + ఎదురు – ఎట్టఎదురు
మొదలు + మొదలు – మొట్టమొదట

TS 10th Class Telugu Grammar Sandhulu సంధులు

3) ఆమ్రేడితంబు పరంబగునపుడు మధ్యమ పురుష ‘ము’, ‘డు’ లకు లోపంబు విభాషనగు.
ఉదా :
నిలుము + నిలుము – నిలునిలుము, నిలుమునిలుము
కొట్టుడు + కొట్టుడు – కొట్టుకొట్టుడు, కొట్టుడుకొట్టుడు

4) ఆమ్రేడితంబు పరంబగునపుడు విభక్తి లోపంబు బహుళంబుగా నగు.
ఉదా :
నాడు + నాడు – నానాడు, నాడునాడు
ఇంచుక + ఇంచుక – ఇంచించుక, ఇంచుకించుక

5) అందదుకు ప్రభృతులు యథా ప్రయోగంబుగ గ్రాహ్యంబులు.
ఉదా :
అదుకు + అదుకు – అందదుకు
చెదరు + చెదరు – చెల్లాచెదరు
తునియలు + తునియలు – తుత్తునియలు
మిట్లు + మిట్టు – మిఱుమిట్లు

V. ఆదేశ సంధులు :

1. ద్విరుక్తటకారాదేశ సంధి:
కుఱు, చిఱు, కడు, నడు, నిడు శబ్దముల ఱ, డలకు అచ్చు పరంబగునపుడు ద్విరుక్త టకారంబగు.
ఉదా :
కుఱు + ఉసురు – ‘కుట్టుసురు
చిఱు + ఎలుక – చిట్టెలుక
కడు + ఎదుట – కట్టెదుట
నడు + ಇల్లు – నట్టిల్లు
నిడు + ఊరుపు – నిట్టూరు

2. సరళాదేశ సంధి :
ద్రుత ప్రకృతికముల మీది పరుషములకు సరళములగు,
ఉదా :
తోచెను + చుక్కలు – తోచెను + జుక్కలు
పూచెను + కలువలు – పూచెను + గలువలు
మూటన్ + కట్టు – మూట + గట్టు
ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషలు విభాషనగు.
తోచెను + జుక్కలు – తోచెంజుక్కలు , తోచెఁజుక్కలు (బిందువు) , తోచెన్జుక్కలు (సంశ్లేష)
పూచెను + గలువలు – పూచెంగలువలు , పూచెఁగలువలు(బిందువు) , పూచెన్గలువలు (సంశ్లేష)

TS 10th Class Telugu Grammar Sandhulu సంధులు

3. గసడదవాదేశ సంధి:
i) ప్రథమ మీది పరుషములకు గ, స, డ, ద, వలు బహుళంబుగానగు.
ఉదా :
వాడు + కొట్టె – వాడుగొట్టె, వాడుకొట్టె
నీవు + టక్కరివి – నీవుడక్కరివి, నీవుటక్కరివి
నాల్కలు + చాచును – నాల్కలు సాచుచు
ప్రాణాలు + కోల్పోవు – ప్రాణాలుగోల్పోవు
ఆసు + పోయుట – ఆసువోయుట
కాలు + చేతులు – కాలుసేతులు

ii) ద్వంద్వంబునం బదంబుపై పరుషములకు గ, స, డ, ద, వలగు.
ఉదా :
కూర + గాయ – కూరగాయలు
కాలు + చేయి – కాలుసేతులు
తల్లి + తండ్రి – తల్లిదండ్రులు

4. పుంప్వాదేశ సంధి :
కర్మ ధారయములందలి ‘ము’ వర్ణమునకు పుంపులగు.
ఉదా :
సరసము + వచనము – సరసపువచనము – సరసంపువచనమ
విరసము + మాట – విరసపుమాట , విరసంపుమాట

VI. లోప సంధులు :

1. పడ్వాది సంధి :
పడ్వాదులు పరంబగునపుడు ‘ము’ వర్ణంబునకు లోపపూర్ణబిందువులు విభాషనగు.
ఉదా :
భయము + పడు – భయపడు , భయంపడు, భయముపడు
సూత్రము + పట్టె – సూత్రపట్టె, సూత్రంపట్టె , సూత్రముపట్టె

2. డు వర్ణలోప సంధి (లేక) సమానాధికరణ సంధి :
సమానాధికరణంబగు ఉత్తరపదంబు పరంబ గునపుడు మూడు శబ్దము ‘డు’ వర్ణమునకు లోపంబును, మీది హల్లునకు ద్విత్వంబునగు.
ఉదా :
మూడు + లోకములు – ముల్లోకములు
మూడు + జగములు – ముజ్జగములు
(ద్విరుక్తంబగు హల్లు ………. అను సూత్రముచే దీర్ఘమునకు హ్రస్వము)

TS 10th Class Telugu Grammar Sandhulu సంధులు

3. ప్రాతాది సంధి :
i) సమాసంబుల ప్రాతాదుల తొలియచ్చు మీది వర్ణంబుల కెల్ల లోపంబు బహుళంబుగానగు.
ఉదా :
ప్రాత + ఇల్లు – ప్రాయిలు, ప్రాతయిల్లు
పూవు + రెమ్మ – పూరెమ్మ, పూవురెమ్మ

ii) లుప్త శేషంబునకు పరుషములు పరంబగునపుడు నుగాగమంబగు.
ఉదా :
పూవు + తోట – పూన్ తోట
సరళాదేశ దృత సంధులు రాగా పూఁదోట అగును.
అట్లే, కెంపు + తామర – కెందామర

iii) క్రొత్త శబ్దమునకు ఆద్యక్షర శేషంబునకు కొన్ని యెడల నుగాగమంబును, కొన్ని యెడల మీది హల్లునకు ద్విత్వంబు నగు.
ఉదా :
క్రొత్త + పసిడి – క్రొంబసిడి
క్రొత్త + తావి – క్రొత్తవి

iv) అన్యంబులకు సహితము ఇక్కార్యంబులు కొండొకచో కానంబడియెడి
ఉదా :
పది + తొమ్మిది – పందొమ్మిది
నిండు + వెఱ – నివ్వెఱ
నెఱ + నడుము – నెన్నడుము

4. లు, ల, నల సంధి :
లు, ల, నలు పరంబగునపుడు ఒకానొకచో ముగాగమంబునకు లోపంబును, తత్పూర్వ స్వరంబునకు దీర్ఘంబును విభాషనగు.
ఉదా :
మీసము + లు – మీసాలు, మీసములు
వజ్రము + లు – వజ్రాలు, వజ్రములు
చుట్టము + లు – చుట్టాలు, చుట్టములు
పగడము + లను – పగడాలను, పగడములను

5. త్రిక సంధి :
i) ఆ, ఈ, ఏలు త్రికములు.
ii) త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు.
ఉదా :
ఆ + కన్య – ఆ + క్కన్య
ఈ + కాలము – ఈ + క్కాలము
ఏ + వాడు – ఏ + వాడు

iii) ద్విరుక్తంబగు హల్లు పరంబగునపుడు ఆచ్చికంబగు దీర్ఘంబునకు హ్రస్వంబగు. అక్కన్య, ఇక్కాలము, ఎవ్వాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

Telangana SCERT 10th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం పరిచిత గద్యాలు Questions and Answers.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 1.
క్రింది పేరాను చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

సరయూ నదీతీరంలో ‘కోసల’ అనే సుప్రసిద్ధ దేశముంది. అందులోనిదే ‘అయోధ్యా’ అనే మహానగరం. ‘అయోధ్యా’ అంటే యోధులకు జయించడానికి శక్యం కానిది. మనువు దీన్ని నిర్మించాడు. కోసల దేశాన్ని దశరథమహారాజు పరిపాలిస్తున్నాడు. అతడు సూర్యవంశం వాడు, మహావీరుడు. దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో మార్లు యుద్ధం చేసినవాడు. ధర్మపరాయణుడు. ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకునేవాడు. వశిష్ఠ, వామదేవులు అతని ప్రధాన పురోహితులు. సుమంత్రుడు మొదలుగాగల ఎనిమిది మంది మంత్రులు. ఇతని పాలనలో కోసల దేశం భోగ భాగ్యాలతో విలసిల్లింది. ప్రజలు ధర్మవర్తనులై సుఖసంతోషాలతో ఉన్నారు. ‘యథారాజా తథా ప్రజాః’ – రాజు ఎలా ఉంటే ప్రజలూ అలాగే ఉంటారు.

ప్రశ్నలు – జవాబులు :
1. అయోధ్యానగరి ఏ దేశంలో ఉంది ?
జవాబు:
అయోధ్యానగరి కోసల దేశంలో ఉంది.

2. అయోధ్యానగర ప్రభువు ఎవడు ?
జవాబు:
అయోధ్యానగర ప్రభువు దశరథ మహారాజు.

3. దశరథుడు ఏ వంశంలోనివాడు ?
జవాబు:
దశరథుడు సూర్యవంశంలోని వాడు.

4. దశరథుని ప్రధాన పురోహితులు ఎవరు ?
జవాబు:
దశరథుని ప్రధాన పురోహితులు వశిష్ఠ, వామ దేవులు.

5. సుమంత్రుడు ఎవరు ?
జవాబు:
దశరథుని మంత్రులలో సుమంత్రుడు ఒకడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 2.
క్రింది పేరాను చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

వాలి వధకు ఇక ఏ మాత్రం ఆలస్యం వద్దని శ్రీరాముణ్ణి తొందరపెట్టాడు. అందరూ కిష్కింధకు వెళ్ళారు. సుగ్రీవుడు భయంకరంగా గర్జిస్తూ వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. మహాబలశాలి అయిన వాలి క్షణాలలో అక్కడ వాలాడు. ఇద్దరి యుద్ధం అక్కడ భయానక వాతావరణాన్ని సృష్టించింది. వాలి సుగ్రీవులు ఒకే పోలికతో ఉన్నారు. అందుకే శ్రీరాముడు వాలిని స్పష్టంగా గుర్తించలేకపోయాడు. వాలి విజృంభణకు తట్టుకోలేకపోయాడు సుగ్రీవుడు. శ్రీరాముడి కొరకు చూశాడు. కనిపించలేదు గుండె గుభేలుమంది. ప్రాణభయంతో ఋష్య మూకానికి పరుగులు తీశాడు సుగ్రీవుడు. అక్కడకు వెళ్ళలేని వాలి సుగ్రీవుడితో ‘బతికావు పో’ అని మరలిపోయాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. వాలిని యుద్ధానికి ఆహ్వానించింది ఎవరు ?
జవాబు:
వాలిని యుద్ధానికి ఆహ్వానించింది సుగ్రీవుడు.

2. సుగ్రీవుడు ఎవరిని శరణు వేడాడు ?
జవాబు:
సుగ్రీవుడు శ్రీరాముడిని శరణు వేడాడు.

3. ఋష్యమూకానికి పరుగులు తీసినది ఎవరు ?
జవాబు:
ఋష్యమూకానికి పరుగులు తీసినది సుగ్రీవుడు.

4. ఒకే పోలికతో ఉన్న వానర వీరులు ఎవరు ?
జవాబు:
ఒకే పోలికతో ఉన్న వానర వీరులు వాలి, సుగ్రీవులు.

5. యుద్ధంలో ఎవరు ఓడిపోయారు ?
జవాబు:
యుద్ధంలో సుగ్రీవుడు ఓడిపోయాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 3.
క్రింది గద్యాన్ని చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

శ్రీరాముడి శోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు. సీతాదేవిని తీసుకు రావడంలో తన వంతు సాయం చేస్తానన్నాడు. రావణుణ్ణి సపరివారంగా హతమార్చేందుకు తన శక్తియుక్తులన్నింటినీ వినియోగిస్తా నన్నాడు. దుః ఖం అనర్థదాయకం కనుక ఎప్పుడూ దుః ఖించవద్దన్నాడు. ఎల్లప్పుడు దుఃఖించేవారికి సుఖముండదు. తేజస్సు క్షీణిస్తుంది. ప్రాణాలు నిలపడమే కష్టంగా ఉంటుంది. కనుక దుఃఖస్థితి నుండి బయటపడమని ధైర్యవచనాలు చెప్పాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. శ్రీరాముడు ఎందుకు శోకించాడు ?
జవాబు:
తన భార్య సీతను రావణుడు అనే రాక్షసుడు అపహరించి తీసుకొని వెళ్ళాడని తెలిసి రాముడు శోకించాడు.

2. సుగ్రీవుడు దేని కొఱకు తన శక్తిని వినియోగిస్తా నన్నాడు ?
జవాబు:
సపరివారంగా రావణుణ్ణి హతమార్చేందుకు తన శక్తియుక్తులనన్నింటినీ వినియోగిస్తానన్నాడు.

3. దుఃఖం వలన ఏం కలుగుతుంది ?
జవాబు:
దుఃఖం వలన సుఖము ఉండదు. తేజస్సు క్షీణిస్తుంది. దుఃఖించే వారి ప్రాణాలు నిలవడం కూడా కష్టంగా ఉంటుంది.

4. శ్రీరాముడిని ఓదార్చినవారెవరు ?
జవాబు:
శ్రీరాముడిని సుగ్రీవుడు ఓదార్చాడు.

5. ఈ భాగం ఏ కాండంలోనిది ?
జవాబు:
ఈ భాగం ‘కిష్కింధకాండం’ లోనిది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 4.
క్రింది పేరా చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

పంచవటిలో జీవనం ప్రశాంతంగా గడుస్తున్నది. ఒకనాడు శ్రీరాముడు పురాణ కథా ప్రసంగంలో ఉన్నాడు. అంతలో ‘శూర్పణఖ’ అనే రాక్షసి వచ్చింది. ఈమె రావణాసురుడి చెల్లెలు. శ్రీరాముడి సౌందర్యానికి ముగ్ధు రాలైంది. తనను చేపట్టమన్నది. తమ మధ్య అడ్డుగా ఉన్న సీతాలక్ష్మణులను చంపి తింటా నన్నది. శ్రీరాముడు పరిహాసంగా లక్ష్మణుని వద్దకు వెళ్ళమన్నాడు. లక్ష్మణుడు తాను అన్న దాసుడనని, తనతో ఉంటే శూర్పణఖ కూడా దాస్యం చేయాల్సివస్తుందనీ, అందుకే శ్రీరాముణ్ణి చేరడమే సబబని సమాధానమిచ్చాడు. శ్రీరాముడివైపు తిరిగి శూర్పణఖ. సీత ఉండడం వల్లనే తనను నిరాకరిస్తున్నాడని అట్టుడికి పోయింది. సీతాదేవిని అడ్డు తొలగించు కోవాలని ఆమెపై దాడికి దిగింది.
అవగాహన – ప్రతిస్పం

ప్రశ్నలు – జవాబులు :
1. లక్ష్మణుడు శూర్పణఖతో ఏమన్నాడు ?
జవాబు:
తాను అన్నకు దాసుడననీ, శూర్పణఖ తనతో ఉంటే శూర్పణఖ కూడా దాస్యం చేయాల్సి వస్తుందనీ లక్ష్మణుడు శూర్పణఖతో అన్నాడు.

2. శ్రీరాముడు శూర్పణఖను ఎందుకు నిరాకరించాడు ?
జవాబు:
తనకు భార్య ఉంది. కాబట్టి రాముడు శూర్పణఖను నిరాకరించాడు.

3. శూర్పణఖ ఎవరు ?
జవాబు:
శూర్పణఖ రావణాసురుని చెల్లెలైన రాక్షసి.

4. సీతారామలక్ష్మణులు ఎక్కడ ఉన్నారు ?
జవాబు:
సీతారామలక్ష్మణులు పంచవటిలో ఉన్నారు.

5. ఈ పేరాకు శీర్షికను నిర్ణయించండి.
జవాబు:
ఈ పేరాకు “శ్రీరాముని అరణ్యవాసం” అనే శీర్షిక తగియుంటుంది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 5.
క్రింది గద్యాన్ని చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

దశరథుడు పుత్రకామేష్టి చేసినప్పుడు యజ్ఞ గుండం నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్యపురుషుడు ఆవిర్భవించాడు. అతడు బ్రహ్మ పంపగా వచ్చినవాడు. చేతిలో బంగారుపాత్ర, వెండి మూతతో, అందులో దివ్యపాయస మున్నది. దాన్ని దశరథునకందించాడు. ఈ పాయసం సంపదలనిస్తుంది. ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అన్నింటినీ మించి సంతానాన్ని ప్రసాదిస్తుందన్నాడు. పేదవానికి పెన్నిధి దొరికినట్లైంది దశరథునికి. అతని మనస్సు ఆనంద తాండవం చేసింది.

ప్రశ్నలు – జవాబులు :
1. యజ్ఞగుండం నుండి ఉద్భవించిన దివ్యపురుషుడు ఎవరి ఆదేశానుసారం వచ్చాడు ?
జవాబు:
యజ్ఞగుండం నుండి దివ్యపురుషుడు బ్రహ్మ ఆదేశాను సారం వచ్చాడు.

2. దశరథుడు నిర్వహించిన యాగమేది ?
జవాబు:
దశరథుడు నిర్వహించిన యాగం ‘పుత్రకామేష్టి.

3. దివ్యపురుషుడు ప్రసాదించిన పాయసం ప్రత్యేకత ఏమిటి ?
జవాబు:
ఆ పాయసం సంపదలనిస్తుంది. ఆరోగ్యాన్ని పెంపొంది స్తుంది. సంతానాన్ని ప్రసాదిస్తుంది.

4. పేదవానికి పెన్నిధి దొరికినట్లుగా భావించిన దశరథుడు నిజంగా ఏ విషయంలో పేదవాడు ?
జవాబు:
దశరథుడు నిజంగా సంతాన భాగ్యంలో పేదవాడు.

5. ఈ పేరాకు శీర్షిక నిర్ణయించండి.
జవాబు:
ఈ పేరాకు శీర్షిక ‘పాయసప్రదానం’ అంటే సరి పోతుంది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 6.
క్రింది గద్యాన్ని చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

కిష్కింధకు ప్రయాణమయ్యారందరూ. సుగ్రీవుడు వాలిని మళ్ళీ యుద్ధానికి ఆహ్వానించాడు. వాలి అడుగు ముందుకు వేశాడు. కాని, అతని భార్య తార అడ్డుపడింది. ఒకసారి ఓడిపోయి దెబ్బలు తిన్న సుగ్రీవుడు మళ్ళీ ఆహ్వానించడం వెనుక ఏదో అంతర్యం ఉందని అభిప్రాయపడింది. సుగ్రీవుడికి శ్రీరాముడు అండగా ఉన్నాడన్న విషయాన్ని ప్రస్తావించింది. పెడచెవిన పెట్టాడు వాలి. యుద్ధ దిశగా అడుగులు వేశాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. వాలి క్షేమం కోరేవారెవరు ?
జవాబు:
వాలి క్షేమాన్ని అతని భార్య తార కోరుతుంది.

2. వాలి విరోధి ఎవరు ?
జవాబు:
వాలి విరోధి అతని తమ్ముడు సుగ్రీవుడు.

3. పై పేరాను బట్టి జరగబోయే యుద్ధంలో ఎవరు ఓడిపోవచ్చును ?
జవాబు:
పై పేరాను బట్టి జరుగబోయే యుద్ధంలో వాలి ఓడిపోవచ్చు.

4. వాలి తన భార్య మాటను పాటించాడా ?
జవాబు:
వాలి తన భార్య మాటను పాటించలేదు.

5. పై పేరాకు తగిన శీర్షికను పెట్టండి.
జవాబు:
‘హితోపదేశాన్ని తిరస్కరించడం’ అనేది ఈ పేరాకు తగిన శీర్షిక.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 7.
క్రింది గద్యాన్ని చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుణ్ణి కుంగదీసింది. సంతానప్రాప్తి కోసం అశ్వమేధయాగం చేయాలన్న ఆలోచన కలిగింది. వెంటనే పురోహితులు, గురువులతో సమావేశమయ్యాడు. మనసులోని మాట చెప్పాడు. వారు తథాస్తు అన్నారు. సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది. మంత్రి సారథీ అయిన సుమంత్రుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమౌతుందని సూచించాడు. ఋష్య శృంగుడు విభాండక మహర్షి కుమారుడు. నిష్ఠాగరిష్ఠుడు. అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి. దశరథుని ఆజ్ఞ మేరకు ఋష్యశృంగుణ్ణి సగౌరవంగా తోడ్కొని వచ్చారు. మూడు రోజులపాటు అశ్వమేధ యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ప్రశ్నలు – జవాబులు :
1. దశరథుణ్ణి ఏది కుంగదీసింది ?
జవాబు:
దశరథుణ్ణి సంతానం లేదన్న చింత కుంగదీసింది.

2. దశరథుడు ఎవరితో సమావేశమయ్యాడు ?
జవాబు:
దశరథుడు పురోహితులు, గురువులతో సమావేశ మయ్యాడు.

3. ఋష్యశృంగుడు ఎవరి కుమారుడు ?
జవాబు:
ఋష్యశృంగుడు విభాండక మహర్షి కుమారుడు.

4. దశరథుని మంత్రి ఎవరు ?
జవాబు:
దశరథుని మంత్రి సుమంత్రుడు.

5. సంతాన ప్రాప్తికై ఏమి చేశారు ?
జవాబు:
సంతాన ప్రాప్తికై అశ్వమేధయాగం చేశారు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 8.
క్రింది గద్యాన్ని చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

మారీచ, సుబాహులు అనుచరులతో వచ్చారు. యజ్ఞవేదిక పరిసరాలు రక్తవర్షంతో తడిసి ముద్దయ్యాయి. రాముడు ‘శీతేషువు’ అన్న మానవాస్త్రాన్ని మారీచుడి పైకి ప్రయోగించాడు. దాని దెబ్బకు మారీచుడు నూరు యోజనాల దూరం ఎగిరి సముద్రంలో పడిపోయాడు. స్పృహకోల్పోయి గిరగిరా తిరుగుతూ కొట్టుకు పోతున్నాడు. మరు నిముషంలో ‘ఆగ్నేయాస్త్రం’ తో సుబాహుని వక్షస్థలాన్ని వ్రక్కలు చేశాడు. ‘వాయవ్యాస్త్రం’తో మిగతా రాక్షసుల భరతం పట్టాడు. రాక్షసబాధ తొలగింది. యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది. విశ్వామిత్రుడు సంతోషించాడు. సమర్థులైన శిష్యులను చూసి ఏ గురువు సంతోషించడు ?

ప్రశ్నలు – జవాబులు :
1. రాముడు ఏ అస్త్రాన్ని మారీచుడి పైకి ప్రయోగిం చాడు ?
జవాబు:
రాముడు ‘శీతేషువు’ అనే అస్త్రాన్ని మారీచుడి పైకి ప్రయోగించాడు.

2. మారీచుడు ఎక్కడ పడ్డాడు ?
జవాబు:
మారీచుడు సముద్రంలో పడ్డాడు.

3. సుబాహునిపైకి రాముడు ప్రయోగించిన అస్త్రం ఏది ?.
జవాబు:
సుబాహునిపైకి రాముడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు.

4. రాక్షసులపైన రాముడు ఏ అస్త్రాన్ని ప్రయోగించాడు ?
జవాబు:
రాక్షసులపై రాముడు వాయువ్యాస్త్రమును ప్రయోగించాడు.

5. ఎవరు యజ్ఞవేదిక వద్దకు అనుచరులతో వచ్చారు ?
జవాబు:
యజ్ఞవేదిక వద్దకు మారీచ, సుబాహులు అనుచరులతో వచ్చారు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 9.
క్రింది గద్యాన్ని చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

రథం వేదశ్రుతి, గోమతీ, సనందికా నదులను దాటింది. కోసల దేశపు పొలిమేరలకు చేరుకుంది. అక్కడి నుండి అయోధ్యవైపుగా తిరిగి శ్రీరాముడు నమస్కరించాడు. ముందుకు సాగుతూ గంగాతీరానికి చేరుకున్నారు. ఆ తీరంలో శృంగిబేరపురమున్నది. ‘గుహుడు’ ఆ ప్రదేశానికి రాజు. అతడు శ్రీరామభక్తుడు. శ్రీరాముడు వచ్చాడన్న వార్త విని తనవారితో శ్రీరాముని దగ్గరకు బయల్దేరాడు. గుహుణ్ణి చూసి రాముడు లక్ష్మణునితోపాటు ఎదురువెళ్ళి కలుసుకున్నాడు. ఆ రాత్రి గుహుడి ఆతిధ్యం తీసుకున్నాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. రథం ఏయే నదులను దాటింది ?
జవాబు:
రథం వేదశ్రుతి, గోమతీ, సనందికా నదులను దాటింది.

2. గంగాతీరంలో ఉన్న గ్రామమేది ?
జవాబు:
గంగాతీరంలోని గ్రామం శృంగిబేరపురం.

3. గుహుడు ఎవరు ?
జవాబు:
గుహుడు శృంగిబేరపుర రాజు మరియు శ్రీరామ భక్తుడు.

4. రామలక్ష్మణులు ఎవరి ఆతిథ్యం స్వీకరించారు ?
జవాబు:
రామలక్ష్మణులు గుహుని ఆతిథ్యం స్వీకరించారు.

5. ఈ భాగం ఏ కాండంలోనిది ?
జవాబు:
ఈ భాగం అయోధ్యా కాండంలోనిది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 10.
క్రింది గద్యాన్ని చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

పుత్ర వ్యామోహంతో కౌసల్య శ్రీరాముని వెంట వనవాసానికి సిద్ధపడింది. కాని భర్తను వదలిరావడం ధర్మంకాదన్నాడు శ్రీరాముడు. ఎలాగో మనసును స్తిమితపరుచుకొని కౌసల్య శ్రీరాముణ్ణి దీవించింది. ‘రామా ! సత్పురుషుల బాటలో నడువు. నీ ధర్మమే నీకురక్ష. నువ్వు చేసిన తల్లిదండ్రుల సేవ, నీ సత్య బలం నీకు రక్షగా ఉంటాయి. నీకు ఎలాంటి బాధలు కలుగ కుండుగాక’ అని శుభాశీస్సులందించింది.

ప్రశ్నలు – జవాబులు :
1. శ్రీరామునితో వనవాసానికి సిద్ధపడిందెవరు ?
జవాబు:
కౌసల్య శ్రీరామునితో వనవాసానికి సిద్ధపడింది.

2. శ్రీరాముడు కౌసల్యతో ఏమని పలికాడు ?
జవాబు:
భర్తను (దశరథుడిని వదిలి రావడం ధర్మం కాదని కౌసల్యతో రాముడు పలికాడు.

3. కౌసల్య రామునితో ఏమని పలికింది ?
జవాబు:
మంచివారి బాటలో నడవమని నీ ధర్మమే నీకు రక్షయని, తల్లిదండ్రులకు చేసిన సేవ, నీ సత్యబలం నీకు రక్ష అని కౌసల్య పలికింది.

4. కౌసల్యకు గల వ్యామోహమేమి ?
జవాబు:
కౌసల్యకు గల వ్యామోహం పుత్రవ్యామోహం.

5. ఈ గద్యం రామాయణంలోని ఏ కాండంలోనిది ?
జవాబు:
ఈ గద్యం రామాయణంలోని అయోధ్యకాండం లోనిది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 11.
క్రింది గద్యాన్ని చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

కబంధుడు సూచించిన మార్గంలో ప్రయాణిస్తూ పంపాసరస్సున్న ప్రాంతానికి చేరారు రామలక్ష్మణులు. ఆ తీరంలో ఉన్న శబరి ఆశ్రమానికి వెళ్ళారు. శబరి తపస్సిద్ధురాలు, జ్ఞానవయోవృద్ధురాలు. శ్రీరామ దర్శనంతో ఆమె తనువు పులకించింది. పంపాతీరంలో దొరికే పండ్లను స్వామికి సమర్పించింది. తన జన్మ ధన్య మైనట్లు భావించింది. శ్రీరాముడి అనుమతిని పొంది తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసి అగ్నికాంతితో ఊర్థ్వలోకాలకు వెళ్ళింది.

ప్రశ్నలు – జవాబులు :
1. రామలక్ష్మణులు ఎక్కడికి చేరారు ?
జవాబు:
రామలక్ష్మణులు పంపాసరస్సు ప్రాంతానికి చేరారు.

2. రామలక్ష్మణులు ఎవరి ఆశ్రమానికి వెళ్ళారు ?
జవాబు:
రామలక్ష్మణులు శబరి ఆశ్రమానికి వెళ్ళారు.

3. శబరి రామునకు ఏమి సమర్పించింది ?
జవాబు:
శబరి రామునకు పంపాతీరంలో దొరికే పండ్లను సమర్పించింది.

4. శబరి ఎక్కడికి వెళ్ళింది ?
జవాబు:
శబరి శ్రీరాముని అనుమతితో దేహాన్ని అగ్నికి ఆహుతి చేసి ఊర్థ్వలోకాలకు వెళ్ళింది.

5. శబరి ఎటువంటిది ?
జవాబు:
శబరి తపస్సిద్ధురాలు, జ్ఞాన వయోవృద్ధురాలు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 12.
క్రింది పేరా చదవండి. సరైన వివరణతో ఖాళీలు పూరించండి.

దండకారుణ్యంలోని మునుల ఆశ్రమాలను సందర్శిస్తూపోతున్నారు సీతారామలక్ష్మణులు. అక్కడక్కడ కొంతకాలం ఉంటున్నారు. ఇలా పది సంవత్సరాలు గడిచింది. మళ్ళీ సుతీక్ష మహర్షి వద్దకు వచ్చారు. అతనితో అగస్త్యమహర్షిని దర్శించుకోవాలన్న తమ ఆకాంక్షను వెలి బుచ్చారు. సుతీక్ష మహర్షి మార్గాన్ని చెప్పాడు. తన ఆశ్రమానికి దక్షిణంగా నాల్గు యోజనాల దూరంలో అగస్త్య సోదరుని ఆశ్రమం, అక్కడికి యోజన దూరంలో అగస్త్యాశ్రమం ఉందని తెలిపాడు. మహర్షి వద్ద సెలవు తీసుకొని బయలుదేరారు సీతారామ లక్ష్మణులు.

ఖాళీలు – జవాబులు :
1. సీతారామలక్ష్మణులు సుతీక్ష మహర్షి వద్దకు రావడానికి కారణం …………………..
జవాబు:
వారిని దర్శించుకోవాలన్న ఆకాంక్ష

2. మహర్షి వద్ద సెలవు తీసుకొని సీతారాములు బయలు దేరిన ప్రదేశం ………………………
జవాబు:
అగస్త్యాశ్రమం

3. సుతీక్ష మహర్షి తన ఆశ్రమానికి అగస్త్యాశ్రమం గురించి తెలిపిన దూరం ……………………….
జవాబు:
4 యోజనాల దూరం

4. ………………. లో ఈ సంఘటన జరిగింది.
జవాబు:
దండకారుణ్యం

5. దండకారుణ్యంలో ఇలా …………………….. సంవత్సరాలు గడిచింది.
జవాబు:
10

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 13.
క్రింది పేరాను చదివి ఐదు ప్రశ్నలు తయారు చేయండి.

విశ్వకర్మ కుమారుడైన “నలుడు” శిల్పకళా నిపుణుడు. ఉత్సాహం, శక్తి ఉన్నవాడు. సేతువు (వంతెన)ను నిర్మించడానికి అతడే యోగ్యుడని సముద్రుడు తెలిపాడు. ఆసేతువును తాను భరిస్తానని మాట ఇచ్చాడు. సేతువు నిర్మాణానికి వానర నాయకులకు ఆజ్ఞ ఇచ్చాడు శ్రీరాముడు. అందరూ మహారణ్యం దారిపట్టారు. పెద్ద పెద్ద చెట్లను బండరాళ్ళను మోసుకువస్తున్నారు. సముద్రంలో పడేస్తున్నారు. వాటి దెబ్బకు సముద్రంలోని నీరు ఆకాశానికి ఎగిసిపడు తున్నది. నలుని సూచనల ననుసరించి కొలతల ప్రకారం సేతువు నిర్మాణం జరుగుతుంది. వంద యోజనాల పొడవు, పది యోజనాల వెడల్పు ఉన్న సేతువును కట్టడం ఐదు రోజుల్లో పూర్తయింది.

జవాబు:
1. విశ్వకర్మ కుమారుడెవరు ?
2. సేతువును నిర్మించడానికి యోగ్యుడెవరు ?
3. శ్రీరాముడు ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడు ?
4. నీరు ఆకాశానికి ఎగిసిపడటానికి కారణం ఏమిటి ?
5. సేతువు పొడవు ఎంత ? దాన్ని కట్టడానికి ఎన్ని రోజులు పట్టింది ?

ప్రశ్న 14.
కింది పేరా చదవండి. ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.

శ్రీరాముడి ఆదేశం మేరకు లక్ష్మణుడు విభీషణుణ్ణి అలంకారాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. సీతతో తన విజయవార్తను తెలపమని హనుమంతుణ్ణి ఆదేశించాడు శ్రీరాముడు.
హనుమంతుడు వెంటనే వెళ్ళి ఈ శుభవార్తను సీతమ్మకు చెప్పాడు. ఆమె ఆనందానికి అవధులు లేవు. ఇంతకాలం చుట్టూ చేరి బాధించిన రాక్షస స్త్రీలను చంపడానికి అనుమతినిమ్మన్నాడు హనుమ. తగనిపని, వద్దని వారించింది సీత.

ప్రశ్నలు – జవాబులు :
1. పై పేరాకు శీర్షికను పెట్టండి.
జవాబు:
శ్రీరామ విజయం.

2. విభీషణుడు లంకకు రాజు ఎలా అయ్యాడు ?
జవాబు:
శ్రీరాముడి ఆదేశం మేరకు లక్ష్మణుడు విభీషణుణ్ణి లంకా రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు.

3. పై పేరాలోని శుభవార్త ఏది ?
జవాబు:
శ్రీరాముని విజయవార్త శుభవార్త.

4. “ఆనందానికి అవధుల్లేవు” అనే పదాన్ని వివరించండి.
జవాబు:
అవధి అనగా హద్దు అని అర్థం. ఆనందానికి ఎల్లలు లేవు. హద్దులు లేవు. చాలా బాగా సంతోషం కలిగిన సందర్భంలో దీనిని వాడతారు.

5. పై పేరాను బట్టి సీతగుణం ఎలాంటిదని భావిస్తు న్నారు ?
జవాబు:
“అపకారికి ఉపకారం” అనగా తనను బాధించిన వారిని అవకాశం వచ్చినా చంపవద్దని, తగదని హనుమను వారించింది. దీనిని బట్టి సీతాదేవి గుణం క్షమాగుణం అని తెలుస్తుంది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 15.
క్రింది పేరా చదివి ఐదు జంట పదాలను వ్రాయండి.

అంగరంగ వైభవంగా సీతారాముల పట్టాభిషేక మహోత్సవం జరిగింది. లక్ష్మణ, భరత, శత్రుఘ్నలు మొదలుగా గల వారందరూ అక్కడ ఉన్నారు. యువరాజుగా ఉండాల్సిందిగా శ్రీరాముడు లక్ష్మణున్ని కోరాడు కాని అతడు ఎంత మాత్రం ఒప్పుకోలేదు. అప్పుడు భరతుణ్ణి యువరాజుగా చేసాడు. యజ్ఞయాగాది క్రతువులను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు. శ్రీరాముడు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసు కుంటున్నాడు. ఎలాంటి ఈతిబాధలూ లేవు. అందరూ ధర్మబద్ధంగా నడుచుకొంటున్నారు. ఇలా పదకొండువేల సంవత్సరాల కాలం ప్రజా నురంజకంగా పరిపాలించాడు శ్రీరాముడు. అందుకే ‘రామ రాజ్యం’ అన్న మాట నాడూ నేడూ ఆదర్శమై నిలిచింది.

జవాబు:
జంట పదాలు :

  1. అంగరంగ వైభవంగా
  2. యజ్ఞయాగాది క్రతువులు
  3. ఈతిబాధలూ
  4. సీతారాములు
  5. నాడూనేడూ

ప్రశ్న 16.
ఈ క్రింది గద్యాన్ని చదివి, ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.

సముద్రముపై సాగిపోతున్న హనుమంతున్ని చూసి సాగరుడు సహాయపడదలచాడు. తానింతవాడు కావడానికి ఇక్ష్వాకు ప్రభువైన సగరుడే కారణమని సాగరుని అభిపరాయం. ఆ ఇక్ష్వాకు కులతిలకుడైన శ్రీరాముని కార్యం కోసం వెళ్తున్న హనుమంతునికి శ్రమ కలగ కూడదనుకున్నాడు. సముద్రంలో ఉన్న మైనాకున్ని బయటకు రమ్మన్నాడు. అతని బంగారు గిరి శిఖరాల మీద ఒకింతసేపు విశ్రాంతి తీసుకో గలడని భావించాడు.

మైనాకుడు సరేనన్నాడు. ఒక్కసారి సముద్రం మధ్య నుంచి పైకి లేచాడు. ఆకస్మాత్తుగా పైకిలేచిన మైనాకున్ని తనకు ఆటంకంగా తలచాడు మారుతి. తన యెదతో నెట్టివేసాడు. మైనాకుడు అబ్బురపడ్డాడు. మానవ రూపంలో గిరిశిఖరం మీద నిలిచాడు. ఆంజనేయునికి సముద్రుని కోరికను తెలిపాడు. హనుమంతుడు మైనాకునితో ‘నీ ఆదరపూర్వక మైన మాటలకు తృప్తిపడ్డాను. అతిథ్యం అందు కున్నట్లే భావించు. సమయంలేదు. ఆగడానికి వీలులేదు’ అని చెప్పి చేతితో అతన్ని తాకాడు. ఆతిథ్యం గ్రహించినట్లుగా తెలిపి ముందుకు సాగాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. హనుమంతుడు ఎవరి కార్యం మీద వెళ్తున్నాడు ?
జవాబు:
హనుమంతుడు ఇక్ష్వాకు కులతిలకుడైన శ్రీరాముని కార్యం మీద వెళ్తున్నాడు.

2. బంగారు శిఖరాలు ఎవరికున్నాయి ?
జవాబు:
సముద్రంలో ఉన్న మైనాకునికి

3. మైనాకుడు అబ్బురపడడానికి కారణం ?
జవాబు:
హనుమ తనయెదతో నెట్టినందుకు మైనాకుడు అబ్బుర పడ్డాడు.

4. ఆతిథ్యం గ్రహించినట్లే, అని తెల్పడానికి హనుమంతుడు ఏం చేసాడు ?
జవాబు:
మైనాకుణ్ణి హనుమ చేతితో తాకాడు.

5. హనుమంతునికి పర్యాయపదాలు ఇక్కడ ఏవి ఉపయోగించారు ?
జవాబు:
మారుతి, ఆంజనేయుడు

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 17.
క్రింది గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

రావణుడు మళ్ళీ మారీచుని వద్దకు వెళ్ళాడు. సీతాపహరణకు బంగారులేడిగా మారి సహకరించమన్నాడు. ఆ ఆలోచనను విరమించుకోమని లంకేశునికి పరిపరివిధాల నచ్చజెప్పజూశాడు మారీచుడు. విశ్వామిత్రుని యాగ సంరక్షణ సందర్భంలో రామబాణం రుచి ఏమిటో తాను తెలుసుకున్నానన్నాడు. మారీచుని మాటలను పెడచెవిన పెట్టాడు. రావణుడు. నేను చెప్పినట్లు చేయకుంటే నా చేతిలో నీకు చావు తప్పదని హెచ్చరించాడు. రావణుడు. ఆశ్రమానికి వెళ్తే శ్రీరాముడు చంపు తాడు. వెళ్ళకుంటే రావణుడు చంపుతాడు. ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా ఉంది మారీచుని స్థితి. చివరికొక నిర్ణయానికి వచ్చాడు. రావణునితో ‘నీ చేతిలో చావడం కన్నా శ్రీరాముని చేతిలో చావడమే నయం. నా జన్మ తరిస్తుంద’ని తేల్చి చెప్పాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. ‘మారీచుడు శ్రీరాముని చేతిలోనే చావడానికి సిద్ధపడ్డాడు’ ఎందుకని ?
జవాబు:
రావణుని చేతిలోకంటే రాముని చేతిలో మరణిస్తే జన్మతరిస్తుందని శ్రీరాముని చేతిలో చావడానికి సిద్ధపడ్డాడు.

2. రామబాణం రుచి చూడటమంటే ఏమిటి ?
జవాబు:
రాముని యొక్క బాణం శక్తిని రుచి చూడటమని అర్థం.

3. రావణుడు మారీచుని ఏవిధంగా సహకరించ మన్నాడు ?
జవాబు:
సీతాపహరణకు బంగారు లేడిగామారి సహకరించ మన్నాడు.

4. రావణుణ్ణి ఆలోచన విరమించుకోమని మారీచుడు ఎందుకు చెప్పాడు ?
జవాబు:
రామునిశక్తి తెలిసినవాడు కనుక.

5. పై పేరాలోని ఒక జాతీయాన్ని రాయండి.
జవాబు:
పెడచెవిన పెట్టు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 18.
క్రింది గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

“ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకునాలు తోచాయి. చెట్టుపైన ఉన్న హనుమంతుడు సీతాదేవిని ఎలా కాపాడు కోవాలో అని మథనపడ్డాడు. రామకథా గానమే సరైన మార్గమని ఎంచుకున్నాడు. సీతాదేవికి వినబడేటట్లు రామకథను వర్ణించాడు. సీతాదేవి అన్నివైపులా చూచింది. చెట్టు మీదున్న హనుమంతుణ్ణి చూసి ఆశ్చర్యానికి లోనైంది. హనుమంతుడు చెట్టు దిగి నమస్కరించాడు. “అమ్మా ! నీవెవరవు ? ఒక వేళ సీతాదేవివే అయితే శుభమగుగాక ! దయతో విషయాలు చెప్పమ”ని ప్రార్ధించాడు. తనను సీత అంటారని తెలిపిందా సాధ్వి తన వృత్తాంతమంతా వివరించింది. హనుమంతుడు తాను శ్రీరామ దూతనని చెప్పుకున్నాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. హనుమంతుడు ఏ మార్గమును ఎన్నుకున్నాడు ?
జవాబు:
రామకథా గానమే సరైన మార్గమని.

2. హనుమంతుడు సీతకు తనను తాను ఎలా పరిచయం చేసుకున్నాడు ?
జవాబు:
శ్రీరామదూతగా పరిచయం చేసుకున్నాడు.

3. హనుమంతుడు ఎందుకు మథనపడ్డాడు ?
జవాబు:
సీతాదేవిని ఎలా కాపాడుకోవాలో అని మథనపడ్డాడు.

4. హనుమంతుడు సీతతో ఏమని అన్నాడు ?
జవాబు:
అమ్మా ! నీవెవరవు ? ఒకవేళ సీతాదేవివే అయితే శుభమగుగాక ! దయతో విషయాలు చెప్పమని ప్రార్థించాడు.

5. పై పేరా ఏ కాండం నుండి తీసుకోబడినది ?
జవాబు:
సుందరకాండ నుండి తీసుకోబడింది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 19.
కింది పేరాను చదివి, ప్రశ్నలను తయారు చేయండి.

విభీషణుడు పల్లకిలో సీతాదేవిని శ్రీరాముడి దగ్గరకి చేర్చాడు. సంతోషంతో భర్తను చేరింది సీత. ఆమెను స్వీకరించడానికి రాముడు నిరాకరించాడు. ‘నా వంశ ప్రతిష్ఠ నిలుపు కోవడానికి దుష్ట రావణుని చెర నుంచి నిన్ను విడిపించాను. ఇంతకాలం పరుడి పంచన ఉన్నందువల్ల నీ ప్రవర్తన గురించి నాకు సందేహం ఉంది. కాబట్టి నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్లవచ్చునని శ్రీరాముడు అన్నాడు. శ్రీరాముని మాటలు నీతకు ములుకుల్లా గుచ్చుకున్నాయి. స్థాయికి తగినట్లుగా మాట్లాడలేదని రాముడితో అంది. శ్రీరాముడికి విశ్వాసం కలిగించడానికి ‘అగ్నిప్రవేశం’ ఒక్కటే శరణ్యమని భావించింది. శ్రీరాముడి మనసెరిగి లక్ష్మణుడు చితిని సిద్ధపరిచాడు. సీత అగ్నిలోకి ప్రవేశించింది. అక్కడి వారంతా ఆందోళన చెందారు. అగ్నిదేవుడు స్వయంగా సీతాదేవిని తీసుకువచ్చి. ఆమె గొప్పదనాన్ని వెల్లడించాడు. ఆమెను స్వీకరించాల్సిందిగా శ్రీరాముణ్ణి కోరాడు.

జవాబు:

  1. సీతను శ్రీరాముడి దగ్గరకు చేర్చింది ఎవరు ?
  2. నీ ప్రవర్తనపై సందేహముందని ఎవరు అన్నారు ?
  3. చితిని ఎవరు సిద్ధపరిచారు ?
  4. సీత గొప్పతనం గురించి వెల్లడించినవారు ?
  5. ఈ పేరాకు శీర్షికను సూచించండి.

ప్రశ్న 20.
కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

సీతాదేవి దర్శనంతో ప్రధాన కార్యం ముగిసింది. హనుమంతుడికి రావణుడి గురించి, అతని సైన్యం శక్తి సామర్థ్యాల గురించి కూడా తెలుసుకోవాలనిపించింది. అందుకు అశోకవనాన్ని ధ్వంసం చేయడమే మార్గంగా భావించాడు. అనుకున్నంత చేశాడు ఆ కపి వీరుడు. రాక్షస స్త్రీలు పరుగు పరుగున వెళ్లి లంకేశునికి విషయం చెప్పారు.

రావణుడు ఎనభైవేల మంది రాక్షసులను పంపాడు. హనుమంతుడు వారందరినీ మట్టుపెట్టాడు. తనపైకి వచ్చిన జంబుమాలిని, మంత్రి పుత్రులు ఏడుగురిని, రావణుడి సేనాధిపతులు అయిదు గురిని, అక్ష కుమారుణ్ని అంతమొందించాడు. చివరకు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి, హనుమంతుణ్ని బంధించాడు.

బ్రహ్మవరం కారణంగా అది హనుమంతుడి మీద క్షణ కాలమే పనిచేస్తుంది. అయినా తాను దానికి కట్టుబడి ఉన్నట్లు నటించాడు హనుమంతుడు. రావణుడి ముందు ప్రవేశపెట్టారతడిని. రావణుడు అడగగా తాను రామదూతనని చెప్పాడు. శ్రీరాముడి పరాక్రమ మెలాంటిదో సభాముఖంగా చాటాడు. సహించలేని రావణుడు హనుమంతుణ్ణి చంపమని ఆజ్ఞ ఇచ్చాడు. దూతను చంపడం భావ్యం కాదన్నాడు విభీషణుడు. ఇతర పద్ధతుల్లో దండించవచ్చన్నాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్నలు – జవాబులు :
1. హనుమంతుడు ఎవరి శక్తి సామర్థ్యాలు తెలుసుకోవా లనుకున్నాడు ?
జవాబు:
హనుమంతుడు రావణుడి సైన్యం శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలనుకున్నాడు.

2. రావణుడి సేనాపతులు ఎంతమంది ?
జవాబు:
రావణుడి సేనాపతులు అయిదుగురు.

3. ఏ ప్రయోగంతో హనుమంతుడిని బంధించారు ?
జవాబు:
ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో హనుమంతుడిని బంధించాడు.

4. శ్రీరాముడి పరాక్రమం విన్న రావణుడు ఏమని ఆజ్ఞాపించాడు ?
జవాబు:
శ్రీరాముడి పరాక్రమం విన్న రావణుడు హనుమంతుణ్ణి చంపమని ఆజ్ఞాపించాడు.

5. దూతను చంపడం మంచిదికాదని ఎవరన్నారు ?
జవాబు:
దూతను చంపడం మంచిది కాదని విభీషణుడు అన్నాడు.

ప్రశ్న 21.
కింది గద్యాన్ని చదువండి. అర్థాలను వివరించండి.

సుగ్రీవ హనుమదాదులు శ్రీరాముని దగ్గరకు వచ్చారు. హనుమంతుడు శ్రీరామునితో సుగ్రీవుని పట్టాభిషేక విషయం ప్రస్తావించాడు. దీనికోసం కిష్కింధకు రమ్మని ప్రార్థించాడు. తండ్రి ఆజ్ఞ మేరకు పద్నాలుగు సంవత్సరాల వరకు ఏ గ్రామంలో గాని, నగరంలో గాని, తాను అడుగుపెట్టనని చెప్పి పితృవాక్య పరిపాలనను మరోమారు చాటు కున్నాడు శ్రీరాముడు. సుగ్రీవునికి శుభం పలికాడు. తాను ప్రసవణగిరి మీదే ఉంటానన్నాడు. వర్షాకాలం పోయాక సీతాన్వేషణ ప్రయత్నం ప్రారంభించమని సుగ్రీవుణ్ణి ఆదేశించాడు. సరేనన్నాడు సుగ్రీవుడు. కిష్కింధకు రాజుగా సుగ్రీవుడు, యువరాజుగా అంగదుడు పట్టాభిషిక్తుల య్యారు. కాలం గడుస్తూన్నది. శరత్కాలం వచ్చింది. సీతాన్వేషణ కార్యభారాన్ని సుగ్రీవుడికి గుర్తు చేశాడు హనుమంతుడు.

అర్థాలు – జవాబులు :
1. శుభం పలుకడం
జవాబు:
ఏదేని ఒక మంచి పని గూర్చి క్షేమకరంగా మాట్లాడటం.

2. ప్రస్తావన
జవాబు:
ఏదైనా ఒక విషయాన్ని తెలియజెప్పడం.

3. పితృవాక్య పరిపాలన
జవాబు:
తండ్రి ఆదేశాలను ఎల్లవేళలా శిరసా పాటించడం.

4. అన్వేషణ
జవాబు:
ఏదైనా ఒక వ్యక్తిని, వస్తువును వెదకడం.

5. కార్యభారం
జవాబు:
చేయదలచిన పనిని నిర్వహించే శక్తిసామర్థ్యం.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 22.
కింది గద్యాన్ని చదివి ఖాళీలు పూరించండి.

రావణుని బాణశక్తికి సుగ్రీవుడు మూర్ఛ పోయాడు. శ్రీరాముడు విల్లందుకున్నాడు. అన్నను వారించి లక్ష్మణుడు రావణుణ్ణి ఎదిరించడానికి పూనుకున్నాడు. వానరసేన మీద శరవర్ష ధార కురిపిస్తున్నాడు రావణుడు. ఆంజనేయుడు రావణుడి ధాటికి అడ్డుకట్ట వేశాడు. అరచేతితో హనుమంతుని బలంగా చరచాడు రావణుడు. మారుతి చలించిపోయాడు. అయినా క్షణంలో తేరుకున్నాడు. అరచేతితో రావణుణ్ణి ఒక్క దెబ్బ వేశాడు. దశగ్రీవుడు కంపించిపోయాడు. తేరుకుని వానరా ! భళా !, నాకు శత్రువువే అయినా నీ శక్తిని మెచ్చుకుంటున్నానని యుద్ధస్ఫూర్తిని చాటాడు రావణుడు.

ఖాళీలు – జవాబులు :
1. రావణుడు …………………….. మీద శరవర్ష ధార కురిపిస్తున్నాడు.
జవాబు:
వానరసేన మీద

2. రావణుని దెబ్బకు చలించిపోయిన వాడు ……………..
జవాబు:
మారుతి

3. రావణుడు ………………. దెబ్బతో చలించిపోయాడు.
జవాబు:
హనుమంతుని

4. మారుతి ……………… చేత మెచ్చుకోబడ్డాడు.
జవాబు:
రావణుని

5. లక్ష్మణుడు రావణుణ్ణి ఎదిరించడానికి …………….. ను వారించాడు.
జవాబు:
అన్నను

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 23.
కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. (March 2015)

రావణుడు మారీచుని వద్దకు వెళ్ళాడు. సీతాపహరణకు బంగారు లేడిగా మారి సహకరించ మన్నాడు. ఆ ఆలోచనను విరమించుకోమని లంకేశుని పరిపరి విధాల నచ్చజెప్పజూశాడు మారీచుడు. విశ్వామిత్రుని యాగ సంరక్షణ సందర్భంలో రామబాణం రుచి ఏమిటో తాను తెలుసుకున్నానన్నాడు. మారీచుడి మాటలను రావణుడు పెడచెవిన పెట్టాడు. మూర్ఖులకు హితబోధలు చెవికెక్కవు. “నేను చెప్పినట్లు చేయకుంటే నాచేతిలో చావు తప్పదని” రావణుడు హెచ్చరించాడు. ఆశ్రమానికి వెళ్తే శ్రీరాముడు చంపుతాడు. వెళ్ళకుంటే రావణుడు చంపుతాడు. “ముందు నుయ్యి వెనుక గొయ్యి” లా ఉంది మారీచుని స్థితి. చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు.

“నీ చేతిలో చావడం కన్నా శ్రీరాముని చేతిలో చావడం నయం. నా జన్మ తరిస్తుంది” అని తేల్చి చెప్పాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. రావణుడు మారీచుణ్ణి ఎలా సహకరించమన్నాడు ?
జవాబు:
మారీచుణ్ణి బంగారు లేడిగా మారి, తనకు సహకరించమని మారీచుడికి రావణుడు చెప్పాడు.

2. రామబాణం రుచి చూడటమంటే ఏమిటి ?
జవాబు:
రామబాణం రుచి చూడటమంటే, రాముని బాణం వల్ల తగిలే తీవ్రమైన బాధను అనుభవించడం అని అర్థం.

3. పై పేరాలోంచి ఒక జాతీయాన్ని గుర్తించి రాయండి.
జవాబు:
“ముందు నుయ్యి, వెనుక గొయ్యి” అన్నది, పై పేరాలో గల ఒక జాతీయము.

4. రావణుణ్ణి ఆలోచన విరమించుకోమని మారీచుడు ఎందుకు చెప్పాడు ?
జవాబు:
విశ్వామిత్రుని యాగ సంరక్షణ సందర్భంలో మారీచుడు రామబాణం రుచి ఏమిటో తెలిసికొన్నాడు. అందుకే రాముని జోలికి వెళ్ళడం మంచిది కాదని, రావణునికి మారీచుడు సలహా చెప్పాడు.

5. మారీచుడు శ్రీరాముని చేతిలో చావడానికే సిద్ధపడ్డాడు. ఎందుకు ?
జవాబు:
తాను చెప్పినట్లు చేయకపోతే మారీచుణ్ణి రావణుడు చంపుతానన్నాడు. రావణుని చేతిలో చావడం కన్న, రాముని చేతిలో చస్తే, తన జన్మ తరిస్తుందని, మారీచుడు రాముని చేతిలో చావడానికి సిద్ధపడ్డాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 24.
క్రింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (June 2015)

జాంబవంతుడు హనుమంతుణ్ణి చేరాడు. అతని శక్తియుక్తులెంతటివో తెలుపుతూ ప్రేరేపించాడు. దీనికి వానరుల ప్రశంసలు తోడైనాయి ఇంకేముంది ? హనుమంతుడు రెట్టించిన ఉత్సాహంతో బలాన్ని పుంజుకున్నాడు. అద్భుతమైన తేజస్సుతో వెలుగు తున్నాడు. వానరులతో “నేను మహా సముద్రాలను అవలీలగా దాటగలనని” ఆత్మశక్తిని ప్రకటించాడు. ప్రతివారిలో ఏదో ఒక శక్తి ఉంటుంది. సరైన ప్రేరణ దొరికితే అది వెలికి వస్తుంది. హనుమంతుడి మాటలకు జాంబవంతుడు ఆనందించాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. జాంబవంతుడు హనుమంతుణ్ణి ఎలా ప్రేరేపించాడు ?
జవాబు:
జాంబవంతుడు హనుమంతుని శక్తియుక్తులు ఎంతటివో తెలుపుతూ ప్రేరేపించాడు.

2. ప్రేరణ వలన ఏమి బయటపడుతుంది ?
జవాబు:
ప్రేరణ వలన ఆత్మశక్తి బయటపడుతుంది.

3. హనుమంతుడు వానరులతో ఏమన్నాడు ?
జవాబు:
తాను మహాసముద్రాలను అవలీలగా దాటగలనని హనుమంతుడు వానరులతో అన్నాడు.

4. హనుమంతుడి మాటలు ఏమి తెలియజేస్తున్నాయి ?
జవాబు:
హనుమంతుడి మాటలు అతని ఆత్మశక్తిని, సముద్రం దాటగలడనే ఉత్సాహాన్ని తెలియజేస్తున్నాయి.

5. పై పేరాకు తగిన శీర్షికను సూచించండి.
జవాబు:
సముద్ర లంఘనం అనేది తగిన శీర్షిక.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 25.
క్రింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (March 2016)

అప్పుడప్పుడే నిద్రకుపక్రమిస్తున్న జటాయువుకు సీతాదేవి ఆర్తనాదాలు వినబడ్డాయి. చూసుసరికల్లా సీతను అపహరించుకుపోతున్న రావణుడు కంటపడ్డాడు. జటాయువు రావణుణ్ని ఎదిరించాడు. ఇద్దరి మధ్య పోరు హోరుహోరుగా సాగింది. చివరకు రావణుడు ఖడ్గంతో జాటాయువు రెక్కలను, కాళ్ళను నరికివేశాడు. నేలపై కూలాడు జటాయువు. రక్తంతో తడిసి ముద్దయిన అతణ్ణి చూసి ఆత్మ బంధువును పోగొట్టుకున్నట్లు సీత ఆక్రందించింది.

ప్రశ్నలు – జవాబులు :
1. జటాయువు రావణుణ్ణి ఎందుకు ఎదిరించాడు ?
జవాబు:
రావణుడు సీతాదేవిని అపహరించుకుపోతున్నాడు. అందువల్ల జటాయువు రావణుణ్ణి ఎదిరించాడు.

2. జటాయువుకి సీతాదేవి ఆర్తనాదాలు ఎప్పుడు వినబడ్డాయి ?
జవాబు:
జటాయువు నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో సీతాదేవి ఆర్తనాదాలు వినబడ్డాయి.

3. సీతాదేవి ఎందుకు ఆక్రందించింది ?
జవాబు:
రావణుడు తనను అపహరించుకుపోతున్నాడు. అందువల్ల సీతాదేవి ఆక్రందించింది.

4. పై పేరాలో పోరు ఎవరెవరికి మధ్య జరిగింది ?
జవాబు:
పై పేరాలో రావణుడికి, జటాయువుకు మధ్య పోరు జరిగింది.

5. పై పేరాలోని జాతీయాలు గుర్తించి రాయండి.
జవాబు:
పై పేరాలో (1) హోరాహోరిగా (2) తడిసి ముద్దయిన అనేవి రెండు జాతీయాలు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 26.
కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. (June 2016)

రామలక్ష్మణులు దండకారణ్యం నుండి క్రౌంచారణ్యానికి చేరుకున్నారు. అక్కడి వనంలో భయంకరుడైన ఒక రాక్షసుణ్ణి చూశారు. అతని తల, మెడ కనబడడం లేదు. కడుపు భాగంలో ముఖముంది. రొమ్ము మీద ఒకే కన్ను ఉంది. యోజనం పొడవు వ్యాపించిన చేతులు. ఆ చేతులతో పక్షులను, మృగాలను పట్టి తింటాడు. అతని పేరు కబంధుడు.

తన సమీపంలోకి వచ్చిన రామలక్ష్మణులను అమాంతంగా రెండు చేతులతో పట్టుకున్నాడు. అతని చేతుల్లో చిక్కితే తప్పించుకోవడం ఎవరితరం కాదు. కబంధుడు రామలక్ష్మణులను భక్షించడానికి నోరు తెరిచాడు. అన్నదమ్ములిద్దరూ తమ ఖడ్గాలతో ఆనాయాసంగా వాడి భుజాలను నరికివేశారు. కబంధుడు కుప్పకూలాడు. రామలక్ష్మణుల గురించి తెలుసు కున్నాడు. తన గురించి చెప్పుకున్నాడు. శాప కారణంగా తనకీ వికృతరూపం ప్రాప్తించిందన్నాడు.

శ్రీరాముడు కబంధునితో ‘మాకు రావణుని పేరు మాత్రమే తెలిసింది. అతని రూపం, ఉండే చోటు, శక్తి సామర్థ్యాలు తెలియవు. వాటిని చెప్ప వలసిందని’ అడిగాడు. సమాధానంగా కబంధుడు ‘శ్రీరామా ! నాకిప్పుడు దివ్యజ్ఞానం లేదు. నా శరీరాన్ని దహిస్తే నా నిజరూపం వస్తుంది. అప్పుడు చెప్పగల’ నన్నాడు. కబంధుని శరీరానికి అగ్నిసంస్కారం చేశారు రామలక్ష్మణులు. ఆ జ్వాలల నుంచి దివ్య దేహంతో బయటికి వచ్చాడు కబంధుడు.

ప్రశ్నలు – జవాబులు :
1. రామలక్ష్మణులను పట్టుకున్న రాక్షసుడి ప్రత్యేకత ఏమిటి ?
జవాబు:
రామలక్ష్మణులను పట్టుకున్న కబంధుడు అనే రాక్షసుడికి తల, మెడ కనబడలేదు. అతడి కడుపు భాగంలో ముఖముంది. రొమ్ము మీద ఒకే కన్ను ఉంది. అతనికి యోజనం పొడవు వ్యాపించిన చేతులు ఉన్నాయి. అతడు ఆ చేతులతో పక్షులను, మృగాలను పట్టి తింటాడు.

2. ‘కబంధ హస్తాలు’ అనే జాతీయం ఎలా పుట్టింది ?
జవాబు:
కబంధుడు అనే రాక్షసుడికి, యోజనం పొడవు వ్యాపించిన చేతులు ఉన్నాయి. అతడు ఆ చేతులతో పక్షులను, మృగాలను పట్టి తింటాడు. అతని చేతుల్లో చిక్కితే తప్పించుకోడం ఎవరితరమూ కాదు. తప్పించుకోడానికి వీలు కాని చేతులు అనే అర్థంలో, ఈ విధంగా కబంధ హస్తాలు అనే జాతీయం పుట్టింది.

3. కబంధుడికి దివ్యజ్ఞానం తిరిగి ఎట్లా వస్తుంది ?
జవాబు:
కబంధుని శరీరాన్ని దహిస్తే అతడి నిజరూపమూ, దివ్యజ్ఞానమూ వస్తాయి.

4. కబంధుడు రామలక్ష్మణులను ఎట్లా పట్టుకున్నాడు ?
జవాబు:
కబంధుడు తన సమీపంలోకి వచ్చిన రామలక్ష్మణులను, అమాంతంగా తన రెండు చేతులతోనూ, పట్టుకున్నాడు.

5. రామలక్ష్మణులు కబంధున్ని ఏ సహాయం అడిగారు ?
జవాబు:
రామలక్ష్మణులు, తమకు, రావణుని రూపం గురించి, అతడు ఉండే చోటును గురించి, రావణుని శక్తి సామర్థ్యాలను గురించి చెప్పవలసిందని, కబంధుణ్ణి అడిగారు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 27.
కింది గద్యాన్ని చదువండి. (March 2017)

సుగ్రీవ హనుమదాదులు శ్రీరాముని దగ్గరకు వచ్చారు. హనుమంతుడు శ్రీరామునితో సుగ్రీవుని పట్టాభిషేక విషయం ప్రస్తావించాడు. దీనికోసం కిష్కింధకు రమ్మని ప్రార్థించాడు. తండ్రి ఆజ్ఞ మేరకు పద్నాలుగు సంవత్సరాల వరకు ఏ గ్రామంలో గాని, నగరంలో గాని, తాను అడుగుపెట్టనని చెప్పి పితృవాక్య పరిపాలనను మరోమారు చాటుకున్నాడు శ్రీరాముడు. సుగ్రీవునికి శుభం పలికాడు. తాను ప్రసవణగిరి మీదే ఉంటానన్నాడు. వర్షాకాలం పోయాక సీతాన్వేషణ ప్రయత్నం ప్రారంభించమని సుగ్రీవుణ్ణి ఆదేశించాడు. సరేనన్నాడు సుగ్రీవుడు. కిష్కింధకు రాజుగా సుగ్రీవుడు, యువరాజుగా అంగదుడు పట్టాభిషిక్తులయ్యారు. కాలం గడుస్తూన్నది. శరత్కాలం వచ్చింది. సీతాన్వేషణ కార్యభారాన్ని సుగ్రీవుడికి గుర్తు చేశాడు హనుమంతుడు.

కింది కీలక పదాల అర్థాలను ఒక్క వాక్యంలో వివరించండి.
1. శుభం పలుకడం : ……………………..
జవాబు:
శుభము కలగాలని ఆశీర్వదించడం.

2. ప్రస్తావన : ……………………
జవాబు:
ముచ్చటించుట

3. పితృవాక్య పరిపాలన : ……………………
జవాబు:
తండ్రి చెప్పిన మాటను పాటించడం.

4. అన్వేషణ : …………………
జవాబు:
వెదకడం

5. కార్యభారం : …………………
జవాబు:
పని యొక్క బరువు

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 28.
కింది గద్యాన్ని చదివి ఖాళీలు పూరించండి. (June 2017)

రావణుని బాణశక్తికి సుగ్రీవుడు మూర్ఛపోయాడు. శ్రీరాముడు విల్లందుకున్నాడు. అన్నను వారించి లక్ష్మణుడు రావణుణ్ణి ఎదిరించడానికి పూనుకున్నాడు. వానరసేన మీద శరవర్ష ధార కురిపిస్తున్నాడు రావణుడు. ఆంజనేయుడు రావణుడి ధాటికి అడ్డుకట్ట వేశాడు. అరచేతితో హనుమంతుని బలంగా చరచాడు రావణుడు. మారుతి చలించిపోయాడు. అయినా క్షణంలో తేరుకున్నాడు. అరచేతితో రావణుణ్ణి ఒక్క దెబ్బ వేశాడు. దశగ్రీవుడు కంపించిపోయాడు. తేరుకుని వానరా ! భళా !, నాకు శత్రువువే అయినా నీ శక్తిని మెచ్చుకుంటున్నానని యుద్ధస్ఫూర్తిని చాటాడు రావణుడు.

ప్రశ్నలు – జవాబులు:
1. రావణుడు …………………. మీద శరవర్ష ధార కురిపిస్తున్నాడు.
జవాబు:
వానరసేన మీద

2. రావణుని దెబ్బకు చలించిపోయిన వాడు ……………………
జవాబు:
మారుతి (హనుమంతుడు)

3. రావణుడు ………………. దెబ్బతో చలించి పోయాడు.
జవాబు:
హనుమంతుని ఒక్క అరచేతి

4. మారుతి …………………. చేత మెచ్చుకోబడ్డాడు.
జవాబు:
రావణుని

5. లక్ష్మణుడు రావణుణ్ణి ఎదిరించడానికి ………………….. ను వారించాడు.
జవాబు:
అన్న

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 29.
క్రింది గద్యాన్ని చదువండి. (March 2018)

పరమశివుడు శ్రీరాముణ్ణి ప్రశంసించాడు. దుష్ట సంహారం చేసిన శ్రీరాముణ్ణి ప్రజానురంజకంగా పరిపాలన చేయమన్నాడు. శ్రీరాముని కోరిక మేరకు ఇంద్రుడు మృతులై పడి ఉన్న వానరులను మళ్ళీ బ్రతికించాడు. విభీషణుడు లంకలో కొంతకాలం ఉండమని శ్రీరాముణ్ణి అభ్యర్ధించాడు. భరతుని కొరకు తాను త్వరగా ప్రయాణం కావలసిందేనన్నాడు శ్రీరాముడు. వానరులను వాళ్ళ స్వస్థానాలకు వెళ్ళమని చెప్పి, విభీషణుని వీడ్కోలు అందుకున్నాడు. పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరాడు. దారిలో ఆప్రదేశాలన్నీ సీతకు చూపుతున్నాడు. భరద్వాజా శ్రమాన్ని సందర్శించారు. శ్రీరామాజ్ఞతో హనుమంతుడు శ్రీరాముడు వస్తున్న విషయాన్ని భరతునికి, గుహునికి ముందుగా వెళ్ళి తెలియ జేశాడు. వాళ్ళెంతో ఆనందించారు.

ప్రశ్నలు – జవాబులు :

క్రింది ప్రశ్నలకు సరైన జవాబు గుర్తించి రాయండి.
1. లంకలో కొంతకాలం ఉండమని శ్రీరాముని అభ్యర్థించినది.
అ) శివుడు
ఆ) విభీషణుడు
ఇ) గుహుడు
జవాబు:
ఆ) విభీషణుడు

2. భరద్వాజ ఆశ్రమాన్ని చూసినవారు.
అ) శ్రీరాముడు
ఆ) సీతారాములు
ఇ) సీత
జవాబు:
ఆ) సీతారాములు

3. వానరులను బతికించినది.
అ) భరద్వాజుడు
ఆ) ఇంద్రుడు
ఇ) శ్రీరాముడు
జవాబు:
ఆ) ఇంద్రుడు

4. శ్రీరాముడు సంహరించినది.
అ) శిష్టులను
ఆ) ఇష్టులను
ఇ) దుష్టులను
జవాబు:
ఇ) దుష్టులను

5. శ్రీరాముని రాకను ముందుగా భరతునికి తెలియ జేసినది.
అ) హనుమంతుడు
ఆ) గుహుడు
ఇ) విభీషణుడు
జవాబు:
అ) హనుమంతుడు

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 30.
క్రింది గద్యాన్ని చదువండి. (June 2018)

సరయూ నదీ తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశమున్నది. అందులోనిదే ‘అయోధ్యా’ అనే మహానగరం. అయోధ్యా అంటే యోధులకు జయించడానికి శక్యం కానిది. మనువు దీనిని నిర్మించాడు. కోసల దేశాన్ని దశరథమహారాజు పరిపాలిస్తున్నాడు. అతడు సూర్యవంశం వాడు. మహావీరుడు. దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో మార్లు యుద్ధం చేసినవాడు. ధర్మపరాయణుడు. ప్రజలను కన్న బిడ్డలవలె చూసుకొనేవాడు. వసిష్ఠ వామదేవులు అతని ప్రధాన పురోహితులు. సుమంత్రుడు మొదలుగా గల ఎనిమిది మంది మంత్రులు. ఇతని పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో విలసిల్లింది. ప్రజలు ధర్మవర్తనులై సుఖసంతోషాలతో ఉన్నారు.

ప్రశ్నలు – జవాబులు :

క్రింద ఇచ్చిన వాక్యాలలో సరైన దానికి (✓) గుర్తు పెట్టి సూచించండి.
1. అ) శ్రీరాముడు సూర్యవంశం వాడు. ( )
ఆ) సూర్యవంశానికి చెందినవాడు కాదు దశరథుడు. ( )
జవాబు:
అ) శ్రీరాముడు సూర్యవంశం వాడు. (✓)

2. అ) దశరథునికి సుమంత్రుడు మంత్రి. (  )
ఆ) సుమంత్రుడు దశరథుని కొలువులో లేడు. (  )
జవాబు:
అ) దశరథునికి సుమంత్రుడు మంత్రి. (✓)

3. అ) యోధులు జయించటానికి శక్యమైన నగరం కోసల. (  )
ఆ) అయోధ్య యోధులు జయించటానికి శక్యం కానిది. (  )
జవాబు:
ఆ) అయోధ్య యోధులు జయించటానికి శక్యం కానిది. (✓)

4. అ) కోసలదేశపు రాజ పురోహితులలో వసిష్ఠుడు ఒకర ( )
ఆ) దశరథుడి పురోహితులు వశిష్ఠుడు, వామదేవుడు కార.
జవాబు:
అ) కోసలదేశపు రాజ పురోహితులలో వసిష్ఠుడు ఒకర (✓)

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

5. అ) పై గద్యం ప్రకారం రాక్షసులతో యుద్ధం చేసింది దశరథుడు. (  )
ఆ) శ్రీరాముడు రాక్షసులతో యుద్ధం చేసినట్లు పై గద్యంలో ఉంది. (  )
జవాబు:
అ) పై గద్యం ప్రకారం రాక్షసులతో యుద్ధం చేసింది దశరథుడు. (✓)

TS 10th Class Telugu Grammar Samasalu సమసాలు

Telangana SCERT 10th Class Telugu Grammar Telangana Samasalu సమసాలు Questions and Answers.

TS 10th Class Telugu Grammar Samasalu సమసాలు

సమర్థంబులగు పదంబులు ఏకపదంబగుట సమాసంబు. అనగా వేర్వేరు అర్థములు గల పదములు ఒకే అర్థమునిచ్చు ఏకపదముగా ఏర్పడుట సమాసము అనబడును.

రాజు అనగా ప్రభువు. భటుడు అనగా సేవకుడు. రెండును వేర్వేరు పదములు. అవి రెండు కలిసి “రాజ భటుడు” అని ఒకే అర్థం ఇచ్చే ఒక పదమైనపుడు అది సమాసము అనబడును.

సమాసంలో లోపించిన విభక్తి ప్రత్యయాలను చేర్చి చెప్పేది విగ్రహవాక్యము. రాజు యొక్క భటుడు. సమాసము లోని మొదటి పదమును పూర్వపదము అంటారు.

సమాసంలోని రెండవ పదాన్ని ఉత్తరపదము అంటారు.
అర్థభేదముననుసరించి సమాసములు ప్రధానంగా నాలుగు విధాలు. నామభేదమును బట్టి ఆరు రకాలు.
అవి :

  1. తత్పురుషము,
  2. కర్మధారయము,
  3. ద్విగువు,
  4. ద్వంద్వము,
  5. బహువ్రీహి,
  6. అవ్యయీ భావము.

TS 10th Class Telugu Grammar Samasalu సమసాలు

1. తత్పురుష సమాసము :
ఉత్తర పదార్థ ప్రధానము తత్పురుషము. అనగా సమాసంలోని రెండవ పదము యొక్క అర్థము ప్రధానంగా గలది.
రాజభటుడు వెళ్ళెను – వెళ్ళినది భటుడు.
పూర్వ పదమునకు విగ్రహవాక్యంలో చేరే విభక్తిని బట్టి సమాసం పేరుండును.

i) ప్రథమా తత్పురుష
– అర్ధరాత్రి – రాత్రి యొక్క అర్థభాగము
– మధ్యాహ్నము – అహ్నము యొక్క మధ్యభాగము

ii) ద్వితీయా తత్పురుష
– నెలతాల్పు – నెలను తాల్చినవాడు
– ఇందుధరుడు – చంద్రుని ధరించినవాడు

iii) తృతీయా తత్పురుష
– ప్రభాభాసితము – ప్రభచేత భాసితము
– ధనాధికులు – ధనము చేత అధికులు

iv) చతుర్థీ తత్పురుష
– దూడ గడ్డి – దూడ కొఱకు గడ్డి
– దేవరమేలు – దేవర కొఱకు మేలు
– కళ్యాణ ఘంటలు – కళ్యాణం కొరకు ఘంటలు
– సంక్షేమ పథకాలు – సంక్షేమం కొరకు పథకాలు
– దేవాగ్రహారములు – దేవతల కొరకు అగ్రహారములు
– భిక్షా గృహములు – భిక్ష కొరకు గృహములు

TS 10th Class Telugu Grammar Samasalu సమసాలు

v) పంచమీ తత్పురుష
– దొంగ భయము – దొంగ వలన భయము

vi) షష్ఠీ తత్పురుష
– రాజ భవనము – రాజు యొక్క భవనము
– పురుష శ్రేష్ఠుడు – పురుషులలో శ్రేష్ఠుడు
– దేవనది – దేవతల యొక్క నది
– కాకతీయుల కంచుగంట – కాకతీయుల యొక్క కంచుగంట
– పుష్ప గుచ్ఛము – పుష్పముల యొక్క
– గజ్జెల సప్పుడు – గజ్జెల యొక్క సప్పుడు
– బ్రతుకు త్రోవ – బ్రతుకు యొక్క త్రోవ
– యయాతి చరిత్ర – యయాతి యొక్క చరిత్ర
– భుజ తాండవం – భుజముల యొక్క తాండవడం

vii) సప్తమీ తత్పురుష
– యుద్ధ నిపుణుడు – యుద్ధము నందు నిపుణుడు
– మాటనేర్పరి – మాట యందు నేర్పరి

viii) నఞ తత్పురుష,
– అసత్యము – సత్యము కానిది
– అసాధ్యము – సాధ్యము కానిది
– అన్యాయం – న్యాయం కానిది
– అధర్మం – ధర్మం కానిది
– ఆజ్ఞానం – జ్ఞానం కానిది
– అపూర్వం – పూర్వం కానిది

TS 10th Class Telugu Grammar Samasalu సమసాలు

2. కర్మధారయ సమాసము:
విశేషణమునకు విశేష్యముల (నామవాచకము) తో జరుగు సమాసము కర్మధారయము.
ఉదా : మంచి బాలుడు.
బాలుడు – విశేష్యము, మంచి విశేషణము.
ఇది ఎనిమిది విధములు.

i) విశేషణ పూర్వపద కర్మధారయము :
మొదటి పదము విశేషణముగా ఉండును.
ఉదా :
నల్ల గుఱ్ఱము – నల్లనైన గుఱ్ఱము
సరసపు వచనము – సరసమైన వచనము
కొత్తబాట – కొత్తదైన బాట
అంకితభావం – అంకితమైన భావం
సుందరాకారములు – సుందరములైన ఆకారములు
మహారవములు – గొప్పదైన రవములు
బృహత్కార్యం – బృహత్తు అయిన కార్యం

ii) విశేషణ ఉత్తరపద కర్మధారయము :
సమాసములోని రెండవ పదము విశేషణమై యుండును.
ఉదా :
కపోత వృద్ధము -వృద్ధమైన కపోతము
తమ్ముకుఱ్ఱలు – కుఱ్ఱవైన తమ్ములు

iii) విశేషణ ఉభయపద కర్మధారయము :
సమాసము లోని రెండు పదాలు విశేషణములుగా ఉండును.
ఉదా :
శీతోష్ణము – శీతమును, ఉష్ణమును
మృదుమధురము – మృదువును, మధురమును

TS 10th Class Telugu Grammar Samasalu సమసాలు

iv) ఉపమాన పూర్వపద కర్మధారయము :
మొదటి పదము ఉపమానముగాను, రెండవ పదము ఉపమేయముగాను ఉండును.
ఉదా :
తేనెపలుకులు – తేనెవంటి పలుకులు
చిగురుకేలు – చిగురువంటి కేలు

v) ఉపమాన ఉత్తరపద కర్మధారయము :
ఉపమానము రెండవ పదముగాను, ఉపమేయము మొదటి పదముగాను ఉండును.
ఉదా :
ముఖపద్మము – పద్మము వంటి ముఖము
బాహువల్లి – వల్లివంటి బాహువులు

vi) రూపక సమాసము :
దీనినే అవధారణా పూర్వపద కర్మధారయము అందురు. ఒక వస్తువు నందు వేరొక వస్తువు ధర్మమును ఆరోపించుట.
ఉదా :
సంసారసాగరము – సంసారము అనేది సాగరం
కోపాగ్ని – కోపమనే అగ్ని
ఇసుక గుండెలు – ఇసుక అనెడి గుండెలు
కాంతివార్ధులు – కాంతులు అనెడి వార్ధులు
మత పిశాచి – మతం అనెడి పిశాచి
దేశ జనని – దేశము అనెడి జనని
నగరారణ్యం – నగరం అనెడి అరణ్యం

vii) సంభావనా పూర్వపద కర్మధారయము :
సంజ్ఞ మొదటి పదముగా గలది.
ఉదా :
కృష్ణానది – కృష్ణ అనే పేరుగల నది
జనక మహారాజు – జనకుడు అనే పేరుగల మహారాజు
తెలంగాణ రాష్ట్రం – తెలంగాణ అనే పేరు గల రాష్ట్రం
గోలకొండ పట్టణం – గోలకొండ అనే పేరు గల పట్టణం
కాశికా పట్టణం – కాశికా అనే పేరు గల పట్టణం
హిందూ మతం – హిందూ అనే పేరు గల మతం

TS 10th Class Telugu Grammar Samasalu సమసాలు

3. ద్విగు సమాసము :
సంఖ్యా వాచక శబ్దము పూర్వ పదము గాను, నామవాచకము ఉత్తరపదముగాను కలది.
ఉదా :
నాల్గులోకములు – నాల్గు సంఖ్యగల లోకములు
పంచపాండవులు – పంచసంఖ్యగల పాండవులు
సప్త సముద్రములు – సప్త సంఖ్యగల సముద్రములు
దశ దిక్కులు – దశ సంఖ్య గల దిక్కులు
మూడుతరాలు – మూడైన తరాలు
నాలుగు కాళ్ళు – నాలుగు సంఖ్య గల కాళ్ళు
రెండేళ్లు – రెండైన ఏళ్లు
పన్నెండు ద్వారములు – పన్నెండు సంఖ్య గల ద్వారములు

4. ద్వంద్వ సమాసము:
ఉభయ పదార్థ ప్రధానము ద్వంద్వము. అనగా సమాసములోని రెండు పదాల అర్థము ముఖ్యముగా గలది. పదములు నామ వాచకాలై యుండును.
ఉదా :
సీతారాములు – సీతయును, రాముడును
రామలక్ష్మణులు – రాముడును, లక్ష్మణుడును
అన్నదమ్ములు – అన్నయును, తమ్ముడును
కులమతాలు – కులమును, మతమును
పెంపుసొంపులు – పెంపును, సొంపును
జీవధనములు – జీవమును, ధనమును
యువతీయువకులు – యువతులును, యువకులును
క్రయవిక్రయాలు – క్రయమును, విక్రయమును
భూతప్రేతములు – భూతములు, ప్రేతములు
శక్తియుక్తులు – శక్తియును, యుక్తియును
అందచందములు – అందమును, చందమును
కూరగాయలు – కూరలు, కాయలు

TS 10th Class Telugu Grammar Samasalu సమసాలు

5. బహువ్రీహి సమాసము:
అన్యపదార్థ ప్రధానము. సమాసములోని పదముల అర్థము గాక ఇతర పదము యొక్క అర్థము ప్రధానముగా గలది బహువ్రీహి.
ఉదా :
ముక్కంటి – మూడు కన్నులు గలవాడు – శివుడు
చక్రహస్తుడు – చక్రము హస్తము నందు కలవాడు – విష్ణువు
చిగురుబోడి – చిగురు వంటి మేను కలది – స్త్రీ
చక్రపాణి – చక్రము పాణియందు కలవాడు
ఆజానుబాహుడు – జానువుల వరకు బాహువులు కలవాడు
గరుడవాహనుడు – గరుడుడు వాహనముగా కలవాడు
ముక్కంటి – మూడు కన్నులు కలవాడు
దశకంఠుడు – దశ సంఖ్య గల కంఠములు కలవాడు
చంచలాక్షి – చంచలములైన అక్షులు కలది
మృగనేత్ర – మృగము వంటి నేత్రములు కలది

6. అవ్యయీభావ సమాసము:
పూర్వపదము యొక్క అర్థము ప్రధానముగా గలది. పూర్వపదము అవ్యయముగా నుండును.
ఉదా :
యథాశక్తి – శక్తిననుసరించి (లేక) శక్తిని అతిక్రమించక
ప్రతిదినం – దినముననుసరించి
నిర్జనం – జనంలేనిది

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం అయోధ్యాకాండ

Telangana SCERT 10th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం రామాయణం అయోధ్యాకాండ Questions and Answers.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం అయోధ్యాకాండ

అయోధ్యా కాండం

TS 10th Class Telugu Guide రామాయణం అయోధ్యాకాండ 1
శ్రీరాముడంటే తల్లిదండ్రులకే కాదు, ప్రజ లందరికీ ప్రేమ. రాముడు రాజుకావాలని దశరథుని కోరిక. యువరాజు అభిషేకం చేయాలనే తన కోరిక వెల్లడించగానే ప్రజలందరూ సంతోషించారు. పట్టాభిషేక ప్రయత్నాలు ప్రారంభ మయ్యాయి. నగర ప్రజలు ఉత్సవం చేస్తున్నారు. కైకేయి దాసి మంథర మాత్రం మండిపడింది. కైకకు విషపు మాటలు నూరి పోసింది. రాముడి సంతానానికే రాజ్యం వస్తుంది. భరతుడికి ఏమీ రాదన్నది. దుర్బోధ గావించింది. కైక కోపగృహానికి పోయింది. దశ రథుడు ఓదార్చ డానికి ప్రయత్నించాడు. గతంలో తనకు ఇస్తానన్న రెండు వరాలను ఇప్పుడు ఇవ్వమని కైక కోరింది. ఒకటి భరతుడికి పట్టాభిషేకం చేయాలి. రెండోది శ్రీరాముడు పదునాలుగేండ్లు అరణ్యవాసం గావించాలి. దశరథుడు దుఃఖించాడు. రాముడు లేనిదే తాను జీవించలేనన్నాడు. కైక మనసు కరగ లేదు. రాముడిని పిలిపించింది. తన వరాల సంగతిని రాముడికి కైక చెప్పింది.

దశరథుడు దుఃఖంతో మాట్లాడలేకపోయాడు. రాముడు సంతోషంగా కైకేయి రెండు కోరికలను ఆచరించడానికి అంగీకరించాడు. దశరథుడు స్పృహ కోల్పోయాడు. శ్రీరాముడు తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించాడు.

కౌసల్యా లక్ష్మణులు నచ్చజెప్పినా రాముడు వినలేదు. తల్లి ఆశీస్సులు తీసుకున్నాడు. సీత కూడా రాముని వెంట బయలుదేరింది. లక్ష్మణుడు కూడా అన్నకు సేవ చేయడానికి వెంట బయలుదేరాడు. ముగ్గురూ అరణ్యవాసానికి బయలుదేరారు. ప్రజలు వారిని అనుసరించారు. తమసానదీ తీరంలో విడిది చేశారు. పౌరులు నిద్రపోతూ వున్నప్పుడు సీతారామలక్ష్మణులు వెళ్ళిపోయారు. పంపా తీరం చేరారు.

శృంగిబేరపురం రాజు గుహుడు ఆతిథ్యం ఇచ్చాడు. రామలక్ష్మణులు జటాధారులయ్యారు. గుహుని పడవ ఎక్కి అవతల తీరం చేరి వనాలలో ప్రవేశించి, భరద్వాజుని ఆశ్రమానికి వెళ్ళారు. భరద్వాజుని సూచనను అనుసరించి చిత్రకూటానికి వెళ్ళారు. లక్ష్మణుడు కుటీరాన్ని నిర్మించాడు. సీతారామ లక్ష్మణులు ఆ కుటీరంలో ఉన్నారు. సుమంత్రుని ద్వారా దశరథుడు ఈ సంగతులన్నీ తెలుసుకొని గుండెపగిలి మరణించాడు. తండ్రి అంత్యక్రియలను భరతుడు చేశాడు. భరతుడు తల్లిని దూషించాడు.

అతడు సింహాసనం అధిరోహించ డానికి తిరస్కరించాడు. అయోధ్య ప్రజలతో కలిసి భరతుడు శ్రీరాముడిని తీసుకు రావడానికి వెళ్ళాడు. లక్ష్మణుడు దూరం నుండి చూచి భరతుడు దండెత్తి వస్తున్నాడేమో అనుకున్నాడు. రాముడు భరతుని శీలాన్ని ప్రశంసించాడు. భరతునికి రాముడు రాజ ధర్మాలను వివరించాడు. తండ్రి మరణవార్త విని రాముడు దుఃఖించాడు. తిరిగి అయోధ్యకు పోవడానికి అంగీకరించలేదు. భరతుడు శ్రీరాముని పాదుకలను స్వీకరించి, వాటికి పట్టాభిషేకం చేశాడు. శ్రీరాముడు సీతాలక్ష్మణులతో అత్రిమునిని దర్శించాడు. అక్కడ నుండి అరణ్యంలోకి వారు ప్రవేశించారు.

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
‘శ్రీరామ పాదుకలు రామరాజ్యాన్ని పాలించాయి’ దీన్ని సమర్థించండి.
జవాబు:
భరతుడు అయోధ్యావాసులతో కలిసి బయలుదేరి శృంగి బేరపురం చేరాడు. గుహుడు భరతుని అను మానించాడు. కాని విషయం తెలిసి భరతునికి స్వాగతం పలికాడు. భరతుడు గుహుని సహకారంతో భరద్వాజుని ఆశ్రమం చేరాడు. భరద్వాజుని సత్కారాలు పొంది చిత్రకూటం వైపుకు వెళ్ళాడు. రాముడు అడవిలో మృగాల అలజడి విని, కారణం తెలుసుకొమ్మని లక్ష్మణునికి చెప్పాడు.

లక్ష్మణుడు చెట్టు ఎక్కి చూశాడు. సైన్యంతో వస్తున్న భరతుడు కనిపించాడు. వెంటనే చెట్టుదిగి శ్రీరాముని దగ్గరకు వచ్చాడు. భరతుడు దుర్బుద్ధితో సైన్యాన్ని తీసుకొస్తున్నాడు. మనం ధనుర్బాణాలను సిద్ధం చేద్దామని అన్నాడు. శ్రీరాముడు లక్ష్మణా ! నీవు ఆలోచిస్తున్నది తప్పు. భరతుడు అలాంటివాడు కాదు అని అన్నాడు.

భరతుడు పర్ణశాలకు వచ్చాడు. భరత శత్రుఘ్నులు శ్రీరాముణ్ణి చూడగానే దుఃఖం ఆపుకోలేకపోయారు. రాముడు కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాడు. భరతుణ్ణి కుశల ప్రశ్నలు వేశాడు. రాజనీతి ధర్మాలను భరతునికి బోధించాడు. రాముడు తండ్రి మరణ వార్తవిని ఎంతగానో విలపించాడు. భరతుడు రాముణ్ణి అయోధ్యకు రమ్మన్నాడు. రాజువు కమ్మన్నాడు. రాముడు అంగీకరించలేదు. తండ్రి మాట జవదాటనని అన్నాడు.

రాముడు భరతుని అభ్యర్థన మేరకు తన పాదుకలను ఇచ్చాడు. భరతుడు అన్నా ! నీ బదులు నీ పాదుకలే రాజ్యాన్ని పాలిస్తాయి. నువ్వు వచ్చేవరకు నేను జడలు ధరించి నందిగ్రామంలో ఉంటాను అని చెప్పి భరతుడు నందిగ్రామం చేరాడు. పాదుకలకు పట్టాభిషేకం చేశాడు.

TS 10th Class Telugu Guide రామాయణం అయోధ్యాకాండ

ప్రశ్న 2.
సీతారామలక్ష్మణుల వనవాసయాత్ర ఎట్లా ఆరంభమైంది ? వివరించండి.
జవాబు:
తండ్రిమాట నిలబెట్టడంకోసం, రాముడు అడవికి బయలుదేరాడు. సీతారామ లక్ష్మణులు సుమంత్రుడు తెచ్చిన రథం ఎక్కారు. ప్రజలు రాముణ్ణి విడిచి పెట్టలేక రథానికి రెండు వైపులా, వెనుక భాగంలో వేలాడారు. మంగళ వాయిద్యాలతో కళకళలాడాల్సిన అయోధ్యానగరం ఆర్తనాదాలతో నిండిపోయింది. దశరథుడు కౌసల్య మందిరానికి వచ్చాడు. సుమిత్ర ఏడుస్తున్న కౌసల్యను ఓదార్చింది.

ప్రజలు రాముని రథాన్ని అను సరిస్తున్నారు. రాముడు అయోధ్యకు వెళ్ళి పొమ్మని ప్రజలకు ఎంతగానో నచ్చ చెప్పాడు. ప్రజలు వినలేదు. రాముని వెంటే వస్తామని అన్నారు. రథం తమసానది ఒడ్డుకు చేరింది. రాముడు ఆ రాత్రి ప్రజలు నిద్రిస్తుండగా రథంపై బయలుదేరాడు. తెల్లవారింది. రాముడు కనబడకపోయేసరికి, ప్రజలు తమను తామే నిందించుకొని అయోధ్యకు తిరిగి వెళ్ళారు.

రాముని రథం కోసల పొలిమేరకు చేరింది. రాముడు అయోధ్య వైపు తిరిగి నమస్కరించాడు. రథం ముందుకు సాగుతూ గంగానది ఒడ్డుకు చేరింది. అక్కడ శృంగిబేరపురం ఉంది. గుహుడు ఆ ప్రదేశానికి రాజు. రాముని భక్తుడు. రాముడు వచ్చాడని తెలిసి ఎదురుగా వెళ్ళాడు. సీతారామ లక్ష్మణులు ఆ రాత్రి గుహుని ఆతిథ్యాన్ని తీసు కున్నారు. రాముడు గంగను దాటడానికి గుహుడు ఏర్పాట్లు చేశాడు. శ్రీరాముడు మర్రిపాలు తెప్పించి, తనకు లక్ష్మణునకు జడలను సిద్ధపరిచాడు. సీతారామలక్ష్మణులు పడవెక్కారు. సుమంత్రుడు, గుహుడు వెనుదిరిగారు. ఇలా సీతారామలక్ష్మణుల వనవాస యాత్ర ప్రారంభమైంది.

ప్రశ్న 3.
శ్రీరాముడు వనవాసానికి ఎలా వెళ్ళాడు ?
(లేదా)
సీతాలక్ష్మణ సమేతుడై శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి గల పరిస్థితులు విశ్లేషించండి.
(లేదా)
అధికార పీఠం ఎక్కాల్సిన రాముడు అరణ్యాలకు వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి ?
జవాబు:
దశరథుడు శ్రీరామునికి యువరాజుగా పట్టం కట్టాలని ఆలోచించాడు. అందరూ సంతోషించారు. అయోధ్య నగరంలో పండుగ వాతావరణం చోటు చేసుకున్నది. దశరథుడు రామునికి పట్టాభిషేకం గూర్చి చెప్పి, రాజధర్మాలు బోధించాడు. సీతారాములు ఉపవాస దీక్ష చేపట్టారు.

రాముని పట్టాభిషేకం వార్త మంథరకు తెలిసింది. మంథర కైకకు చెప్పి, ఆమె మనస్సును మార్చింది. దశరథుడు వెనుక కైకకు ఇచ్చిన వరాలను ఉపయోగించు కోమని మంథర కైకకు దుర్బోధ చేసింది. కైక కోపగృహానికి చేరింది. కైక దశరథుణ్ణి రెండు వరాలు కోరింది.
అవి :

  1. భరతుడికి పట్టాభిషేకం,
  2. రాముడి వనవాసం.

దశరథుడు రాముణ్ని అడవులకు పంపవద్దని కైకను బ్రతిమాలాడు. కైక మనస్సు మారలేదు. కైక భర్త అనుమతితో రామునికి కబురు చేసింది. రాముడు వచ్చి తండ్రి విచారానికి కారణం ఏమిటని కైకను అడిగాడు. కైక, తాను కోరిన వరాలను గూర్చి రాముడికి చెప్పింది. తండ్రి మాటను పాటిస్తానన్నాడు రాముడు. కైక మాటపై రాముడు దండకారణ్యానికి వెడతానన్నాడు.

రాముడు తల్లి కౌసల్య వద్దకు వెళ్ళాడు. రాముడిని అడవికి వెళ్ళవద్దని తల్లీ, లక్ష్మణుడు చెప్పారు. కాని రాముడు తండ్రి మాటనే గౌరవిస్తానన్నాడు. రాముని వెంట సీతాలక్ష్మణులు వనవాసానికి వస్తానన్నారు. సీతారామలక్ష్మణులు తండ్రి వద్దకు వెళ్ళారు. కైకేయి వారికి నారచీరలను ఇచ్చింది. వారు నారచీరలు ధరించారు.

సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు. సీతారామ లక్ష్మణులు రథం ఎక్కారు. ఈ విధంగా రాముడు సీతాలక్ష్మణ సమేతంగా వనవాసానికి వెళ్ళాడు.

TS 10th Class Telugu Guide రామాయణం అయోధ్యాకాండ

ప్రశ్న 4.
దశరథుని మరణవార్త విని, భరతుడెలా స్పందించాడ
జవాబు:
రాముడు అడవికి వెళ్ళాడని దశరథుడు దుఃఖంతో మరణించాడు. దూతలు వెళ్ళి మేనమామ ఇంట్లో ఉన్న భరతుడిని అయోధ్యకు తీసుకువచ్చారు. భరతుడు, తండ్రికి అంత్యక్రియలు చేశాడు.

భరతుడు కైకను తప్పు పట్టాడు. మంత్రులు భరతుడిని రాజ్యాధికారం చేపట్టమన్నారు. పెద్దవాడైన రాముడే రాజు కావాలనీ, తాను రాముణ్ణి తీసుకు వస్తాననీ, భరతుడు అడవికి బయలుదేరాడు.

భరత శత్రుఘ్నులు అడవిలో రాముడిని కలిసి, ఆయన పాదాలపై పడ్డారు. తండ్రి మరణ వార్త తెలిసి రాముడు కన్నీరు పెట్టాడు. రాముడిని అయోధ్యకు తిరిగి వచ్చి రాజువు కమ్మని భరతుడు కోరాడు. రాముడు తండ్రి మాటయే తనకు శిరోధార్యం అన్నాడు.

చివరకు భరతుడు కోరగా, రాముడు తన పాదుకలను భరతుడికి ఇచ్చాడు. రాముని పాదుకల మీదనే రాజ్యభారం ఉంచి, భరతుడు నారచీరలు ధరించి, తాను అయోధ్యా నగరం బయట ఉంటానన్నాడు. భరతుడు నందిగ్రామం చేరి, రామపాదుకలకు పట్టాభిషేకం చేశాడు.

ప్రశ్న 5.
చెప్పుడు మాటలు చేటుకు కారణమని రామాయణం ఆధారంగా ఎలా సమర్థిస్తావు?
జవాబు:
రాముడికి పట్టాభిషేకం చేస్తారని కైక అరణపుదాసి అయిన మంథరకు తెలిసింది. ఆమె, ఆ విషయం కైకతో చెప్పింది. కైకకు రాముడంటే చాలా ఇష్టం. అందుకే ఆ వార్త తెచ్చిన మంథరకు, ఆనందంతో కైక మంచి బహుమతిని ఇచ్చింది. కైక ప్రవర్తనకు మంథర ఆశ్చర్యపోయింది. ఏడ్వవలసిన సమయం లో ఎందుకు సంతోషిస్తున్నావని మంథర కైకను అడిగింది. తనకు రామభరతులు ఇద్దరూ సమానమే అని కైక చెప్పింది.

అప్పుడు మంథర కైకకు దుష్టబోధ చేసింది. “రాముడు రాజు అయితే కౌసల్య రాజమాత అవుతుంది. కైక దాసి అవుతుంది. రాముడికి భరతుడు దాస్యం చేయవలసి వస్తుంది. తరువాత రాముడి సంతానానికే రాజ్యాధికారం వస్తుంది.

భరతుడి సంతానానికి రాజ్యం రాదు. కాబట్టి భరతుడికి రాజ్యాధికారం దక్కేటట్లు, రాముడు అడవులపాలు అయ్యేటట్లు చూడు” అని మంథర కైకకు చెప్పుడు మాటలు చెప్పింది. ఆ చెప్పుడు మాటలు విని, కైక మనస్సు మార్చుకుంది. రాముడిని అడవులకు పంపింది.

అందుకే చెప్పుడు మాటలు, చేటుకు కారణం అని చెప్పాలి.

TS 10th Class Telugu Guide రామాయణం అయోధ్యాకాండ

ప్రశ్న 6.
రామాయణం ఆధారంగా కైకేయి పాత్ర స్వభావాన్ని వివరించండి. (June 2016)
జవాబు:
‘కైక’, దశరథ మహారాజు గారి మూడవ పట్టపురాణి. ఈమె కుమారుడు భరతుడు. సహజంగా కైకకు, శ్రీరాముడు అంటే అమితమైన ప్రేమ. అందుకే రామునికి పట్టాభిషేకం చేస్తారని మంథర చెప్పగానే కైక సంతోషించి, ఆ వార్త చెప్పినందుకు మంథరకు బహుమానాన్ని ఇచ్చింది. కైక, మంథరతో, తనకు రాముడూ, భరతుడూ సమానం అని, రామ పట్టాభిషేకం కంటె తనకు ఆనందం, మరొకటి లేదనీ చెప్పింది.

చెప్పుడు మాటల ప్రభావంతో కైక మనస్సు మారిపోయింది. రాముడు రాజయితే కౌసల్య రాజమాత అవుతుందనీ, కైక అప్పుడు కౌసల్యకు దాసిగా అవుతుందనీ మంథర, కైకకు దుర్బోధ చేసింది. దానితో తగిన ఉపాయం చెప్పమని, కైక మంథరను అడిగింది.

కైక, మంథర చెప్పిన ఉపాయంతో, కోపగృహంలోకి ప్రవేశించింది. దశరథుడు, కైక, కోరికను తీరుస్తానని ఆమెకు మాట ఇచ్చాడు. రాముడిని 14 సంవత్సరాలు అడవికి పంపి, భరతుడికి పట్టాభిషేకం చేయుమని కైక దశరథుని అడిగింది.

కైక మూర్ఖత్వము : రాముడిని విడిచి తాను జీవించలేననీ, కైక పాదాలు పట్టుకుంటాననీ, రాముడిని అడవికి పంపవద్దనీ దశరథుడు కైకను ఎంతగానో బ్రతిమాలాడు. కాని కఠిన శిల వంటి కైక మనస్సు మారలేదు.

కైక రాముడిని కబురు పెట్టి రప్పించి, జరిగిన విషయం చెప్పింది. కైక స్వయంగా సీతారామలక్ష్మణులకు నారచీరలు ఇచ్చి వారిని అడవికి పంపింది.

దశరథుడు కైకను మందలించాడు. బ్రతిమాలాడు. అయినా కైక తన మొండిపట్టును విడిచిపెట్టలేదు. సీతారాములను అన్యాయంగా, అక్రమంగా, పుత్రప్రేమతో, మంథర దుర్బోధను విని కైక 14 సంవత్సరాలు వనవాసానికి పంపింది. కైక మూర్ఖపు పట్టుదల కలది. చెప్పుడు మాటలు వినే స్వభావం కలది. పుత్రప్రేమ కలది.

ప్రశ్న 7.
సీతారామలక్ష్మణులు వనవాసానికి వెళ్ళిన వృత్తాంతాన్ని తెలపండి.
జవాబు:
శ్రీరాముడు అంటే ప్రజలకు ఇష్టం. ప్రజల కోరిక మేరకు దశరథుడు రాముడికి యువరాజ పట్టాభిషేకం చేద్దామనుకున్నాడు. రాజాజ్ఞతో మంత్రులూ, అధికారులూ రాముని యువరాజ పట్టాభిషేకానికి, ఏర్పాట్లు చేస్తున్నారు. దశరథుడు రాముని పిలిచి, పట్టాభిషేకం గూర్చి చెప్పి, రాజధర్మాలు బోధించాడు. సీతారాములు పట్టాభిషేకానికి ఉపవాస దీక్ష చేపట్టారు.

రాముడి పట్టాభిషేకం వార్త, కైక దాసి మంథరకు తెలిసింది. ఆ వార్తను మంథర కైకకు చెప్పింది. కైక సంతోషించింది. కాని మంథర దుర్బోధతో, కైక మనస్సు మారింది. భరతుడికి పట్టాభిషేకం జరగడానికి, దశరథుడు వెనుక కైకకు ఇచ్చిన రెండు వరాలనూ ఉపయోగించుకోమని, మంథర కైకకు సలహా చెప్పింది. కైక కోపగృహానికి చేరింది. దశరథుడు కైకను బ్రతిమాలాడు. కైక దశరథుణ్ణి రెండు వరాలు కోరింది. 1) భరతుడికి పట్టాభిషేకం 2) రాముడి వనవాసం. దశరథుడు రాముణ్ణి అడవులకు పంపవద్దని కైకను బ్రతిమాలాడు. కాని కైక మనస్సు మారలేదు.

కైక రామునికి కబురంపింది. రాముడు వచ్చి తండ్రిగారి విచారానికి కారణం ఏమిటని కైకను అడిగాడు. కైక రాముడికి తాను కోరిన వరాలను గురించి చెప్పింది. తండ్రి మాటను పాటిస్తానని రాముడు చెప్పాడు. కైక మాటపై రాముడు దండకారణ్యానికి బయలుదేరతానన్నాడు. దశరథుడు దుఃఖించాడు. రాముడు తండ్రికీ, కైకకూ నమస్కరించాడు. రాముడు తల్లి కౌసల్యను దర్శించాడు. రాముని వనవాసం గూర్చి విని కౌసల్య దుఃఖించింది. రాముడిని అడవికి వెళ్ళవద్దని తల్లి, లక్ష్మణుడు కూడా చెప్పారు. కాని రాముడు. తండ్రి మాటనే గౌరవిస్తానన్నాడు.

కౌసల్య రాముని వెంట వనవాసానికి వస్తానంది. అది ధర్మం కాదు, తండ్రిగారి సేవ చేయాలని రాముడు తల్లికి నచ్చ చెప్పాడు. సీత కూడా వనవాసానికి వస్తానంది. లక్ష్మణుడు కూడా రాముని వెంట వస్తానన్నాడు. సీతారామలక్ష్మణులు దశరథుని వద్దకు వెళ్ళారు. కైకేయి వారికి నారచీరలను ఇచ్చింది. వారు నారచీరలు ధరించారు. సుమిత్ర లక్ష్మణుడితో సీతారాములను.తల్లిదండ్రులవలె సేవింపుమని ఉపదేశించింది.

సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు. సీతారామలక్ష్మణులు రథం ఎక్కారు. పౌరులు వెంట బయలుదేరారు. ఈ విధంగా రాముడు భార్యాసోదరులతో అడవికి వెళ్ళాడు.

TS 10th Class Telugu Guide రామాయణం అయోధ్యాకాండ

ప్రశ్న 8.
సీతారామలక్ష్మణులు అయోధ్యను వీడి, చిత్రకూటం చేరిన వృత్తాంతాన్ని తెలపండి. (వనవాసానికి వెళ్ళిన వృత్తాంతం)
జవాబు:
సీతారామలక్ష్మణులు సుమంత్రుడు తెచ్చిన రథాన్ని ఎక్కారు. శ్రీరాముడిని విడిచిపెట్టలేక, కొందరు పౌరులు రథానికి ప్రక్కలనూ, వెనుక భాగంలోనూ వేలాడారు. అయోధ్య ఆర్తనాదాలతో నిండింది. కౌసల్యను సుమిత్ర ఓదార్చింది.

రాముని రథాన్ని ప్రజలు నీడలా అనుసరిస్తున్నారు. అయోధ్యకు వెళ్ళిపొండని రాముడు వారికి ఎంతగానో నచ్చ చెప్పాడు. రాముడిని అయోధ్యకు తిరిగి రమ్మనీ లేక తమను అడవికి వెంటరానిమ్మనీ ప్రజలు రాముణ్ణి వేడుకున్నారు. రథం తమసానది దగ్గరకు చేరింది. ఆ రాత్రి ప్రజలు నిద్రిస్తుండగా రాముడు రథంపై బయలుదేరాడు. ప్రజలు లేచి చూశారు. తాము నిద్రపోయినందుకు తమను తామే నిందించుకొని వారు అయోధ్యకు తిరిగి వెళ్ళారు.

రాముని రథం కోసల దేశం పొలిమేరకు చేరింది. రాముడు అయోధ్యవైపు తిరిగి నమస్కరించాడు. క్రమంగా వారు గంగాతీరానికి చేరారు. ఆ తీరంలో ‘శృంగిబేరపురం’ ఉంది. గుహుడు ఆ దేశానికి రాజు. అతడు శ్రీరాముని భక్తుడు. అతడు రాముని వద్దకు వచ్చాడు. రాముడు గుహుడికి ఎదురేగివెళ్ళి గుహుని ఆతిథ్యం తీసుకున్నాడు.

గుహుడు గంగను దాటడానికి రామునికోసం నావను ఏర్పాటు చేశాడు. శ్రీరాముడు మర్రిపాలు తెప్పించి తనకూ, తమ్మునికీ జడలను సిద్ధం చేశాడు. అడవిలో ముందు లక్ష్మణుడు, వెనుక సీత, ఆ వెనుక రాముడు నడిచారు. వారు సాయంత్రానికి భరద్వాజాశ్రమానికి చేరారు. మహర్షి సీతారామలక్ష్మణులకు అతిథి సత్కారాలు చేశాడు. వనవాస కాలాన్ని తన ఆశ్రమంలో గడపమని భరద్వాజ మహర్షి వారిని కోరాడు.

జనులకు అందుబాటులో ఉండని, ఆశ్రమ వాసానికి తగిన ప్రదేశాన్ని సూచించండని రాముడు భరద్వాజ మహర్షిని కోరాడు. పది కోసుల దూరంలో ఉన్న ‘చిత్రకూటం’ పవిత్రమైనదనీ, అది మహర్షుల నివాస స్థానం అనీ, భరద్వాజుడు వారికి చెప్పాడు. రామలక్ష్మణులు యమునను దాటి ‘చిత్రకూటం’ చేరుకున్నారు. లక్ష్మణుడు అన్న ఆదేశం ప్రకారం, అక్కడ కుటీరం నిర్మించాడు. సీతారామలక్ష్మణులు చిత్రకూటంలో వనవాసం చేశారు.

TS 10th Class Telugu Guide రామాయణం అయోధ్యాకాండ

ప్రశ్న 9.
“భరతుని పాదుకా పట్టాభిషేకం” గురించి రాయండి.
జవాబు:
దశరథుడు శ్రీరాముని ఎడబాటును సహింపలేక ప్రాణాలు విడిచాడు. రామలక్ష్మణులు అడవికి వెళ్ళారు. భరత శత్రుఘ్నులు మేనమామ ఇంటిలో ఉన్నారు. వశిష్ఠుడి ఆజ్ఞమేరకు, దశరథుని శరీరాన్ని తైలద్రోణిలో జాగ్రత్త చేశారు. దూతలు వెళ్ళి ఎనిమిదవరోజున భరత శత్రుఘ్నులను అయోధ్యకు తీసుకువచ్చారు. భరతుడు తండ్రికి అంత్యక్రియలు పూర్తి చేశాడు.

భరతుడు కైకను తప్పు పట్టాడు. శత్రుఘ్నుడు మంథరను చంపడానికి సిద్ధమయ్యాడు. మంత్రులు భరతుణ్ణి రాజ్యాధికారం స్వీకరించమన్నారు. పెద్దవాడైన రాముడే రాజు కావాలని భరతుడు పట్టుపట్టాడు. తాను వెళ్ళి రాముణ్ణి అయోధ్యకు తిరిగి తీసుకువస్తానని, భరతుడు అయోధ్యాపురవాసులతో కలసి అడవికి బయలుదేరాడు.

భరతుడు శృంగిబేరపురం చేరాడు. గుహుడు భరతుడి మనస్సు తెలియక, తికమక పడ్డాడు. విషయం తెలిసి గుహుడు భరతుణ్ణి ఆహ్వానించాడు. భరతుడు గుహుడితో కలిసి, భరద్వాజాశ్రమం చేరి విందు స్వీకరించాడు. తరువాత చిత్రకూటం బయలుదేరాడు.

భరతుడు సేనలతో వస్తూ ఉండడం చూసి, లక్ష్మణుడు పొరపాటుపడ్డాడు. భరతుడు రాముని మీదికి యుద్ధానికి వస్తున్నాడని, లక్ష్మణుడు రామునికి చెప్పాడు. భరతుడు అటువంటివాడుకాడని రాముడు లక్ష్మణునకు చెప్పాడు.

భరత శత్రుఘ్నులు వెళ్ళి, రాముని పాదాలపై పడ్డారు. రాముడు కన్నీళ్ళు పెట్టాడు. రాముడు భరతునికి రాజనీతులు బోధించాడు. రాముణ్ణి అయోధ్యకు తిరిగి రమ్మని భరతుడు కోరాడు. రాముడు తండ్రి మాటే తనకు శిరోధార్యం అన్నాడు.

చివరకు భరతుని కోరికపై శ్రీరాముడు తన పాదుకలను భరతునికి ఇచ్చాడు. ఆ పాదుకల మీదనే రాజ్యభారం ఉంచి, తాను నారచీరలు ధరించి, నగరం వెలుపల ఉంటాననీ, పదునాల్గవ సంవత్సరం పూర్తి కాగానే, రామదర్శనం కాకపోతే తాను అగ్ని ప్రవేశం చేస్తానని భరతుడు రామునితో చెప్పాడు.
భరతుడు నందిగ్రామం చేరి, రామపాదుకలకు పట్టాభిషేకం చేశాడు.

ప్రశ్న 10.
శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా వనవాసానికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది?
జవాబు:
ప్రజల కోరిక మేరకు దశరథుడు రాముడికి యువరాజు పట్టాభిషేకం చేద్దామనుకున్నాడు. రామునికి దశరథుడు పట్టాభిషేకం గురించి చెప్పాడు. సీతారాములు ఉపవాస దీక్ష చేపట్టారు. రాముని పట్టాభిషేక వార్త కైక దాసి మంథరకు తెలిసింది. మంథర కైకకు దుర్బోధచేసి, ఆమె మనస్సును మార్చింది. కైకకు దశరథుడు వెనుక రెండు వరాలు ఇచ్చాడు. వాటిని అప్పుడు ఉపయోగించుకోమని కైకకు మంథర చెప్పింది.

కైక, కోపగృహానికి చేరింది. కైక దశరథుణ్ణి రెండు వరాలు కోరింది. 1) భరతునికి పట్టాభిషేకం 2) రాముని వనవాసం. దశరథుడు రాముని అడవులకు పంపవద్దని, కైకను బ్రతిమాలాడు. కాని ఆమె మనస్సు మారలేదు. కైక దశరథుని అనుమతితో రాముని కబురుపెట్టింది.

రాముడు వచ్చి తండ్రి విచారానికి కారణం ఏమిటని, కైకను అడిగాడు. కైక తాను కోరిన వరాలను గూర్చి చెప్పింది. రాముడు తండ్రి మాటను పాటిస్తానన్నాడు. రాముడు దండకారణ్యానికి వెడతానన్నాడు.

రాముడు తల్లి కౌసల్య వద్దకు వెళ్ళాడు. రాముడిని అడవికి వెళ్ళవద్దని తల్లీ, లక్ష్మణుడూ చెప్పారు. కాని రాముడు తండ్రి మాటనే గౌరవిస్తానన్నాడు.

రాముని వెంట సీతాలక్ష్మణులు కూడా వనవాసానికి వస్తానన్నారు. సీతా రామలక్ష్మణులు దశరథుని వద్దకు వెళ్ళారు. కైక వారికి నారచీరలు ఇచ్చింది. సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు. సీతా రామలక్ష్మణులు రథాన్ని ఎక్కారు. ఈ విధంగా సీతా రామలక్ష్మణులు వనవాసానికి వెళ్ళారు.

TS 10th Class Telugu Guide రామాయణం అయోధ్యాకాండ

ప్రశ్న 11.
దశరథునికి “శ్రీరాముని మీద మక్కువ ఎక్కువ” వివరించండి.
జవాబు:
దశరథునికి కొడుకులమీద ప్రేమ ఎక్కువ. నలుగురు కొడుకులను నాలుగు చేతులలాగా భావించాడు. భరత, శత్రుఘ్నులు దేశాంతరంలో ఉండడం వల్ల వారంటే బెంగ. శ్రీరాముని మీద మక్కువ ఎక్కువ. అందుకు కారణం శ్రీరాముడు సద్గుణరాశి. రూపంలో గుణంలో శ్రేష్ఠుడు, మహావీరుడు. మృదువుగా మాట్లాడుతాడు. కోపం, గర్వం లేనివాడు, సత్యం పలికేవాడు. పరుల సంపదను ఆశించడు. శరణుకోరేవారిని కాపాడేవాడు. దీనులను ఆదుకునేవాడు. కాలాన్ని వృథా చేయక సజ్జనులతో వివిధ విషయాలు చర్చించేవాడు. వినయశీలి. తల్లిదండ్రులు, గురువుల పట్ల భక్తి కలవాడు. సోమరితనం, ఏమరుపాటు, అసూయ, మాత్సర్యం లేనివాడు. ప్రజల పట్ల వాత్సల్యం కలవాడు. కళలలో ఆరితేరినవాడు.

ప్రశ్న 12.
కైకేయి వరాల ప్రభావం ఏమిటి ?
జవాబు:
రామపట్టాభిషేకం వార్త విన్న మంథర కైకకు గతం గుర్తు చేసింది. ఒక సందర్భంలో కైకకు దశరథుడు ఇస్తానన్న వరాలను ఉపయోగించుకోమన్నది. కైక దశరథుడికి గతం గుర్తుచేసి వరాలను తీర్చమని దశరథుని కోరింది. ఆ వరాలే 1) భరతుడి పట్టాభిషేకం, 2) రాముడి వనవాసం. దశరథునికి కాదనే పరిస్థితి వచ్చింది.

విషయం తెలిసిన రాముడు తండ్రి మాటను గౌరవిస్తానని, తండ్రి తనకు గురువు, పాలకుడు, హితుడు అని కైకేయి కోరిక మేరకు వనవాసానికి బయలుదేరాడు. విషయం తెలిసిన రాముని తల్లి కౌసల్య రామునితో వనవాసానికి వస్తానంది. కాని భర్తను వదిలి రావడం ధర్మం కాదని రాముడు తల్లికి వివరించాడు. సీతా, లక్ష్మణులు వెంటరాగా రాముడు . తల్లిదండ్రుల దీవెనలు తీసుకుని వనవాసానికి బయలుదేరాడు.

TS 10th Class Telugu Guide రామాయణం అయోధ్యాకాండ

ప్రశ్న 13.
శ్రీరామునికి గల పితృ భక్తిని గురించి వివరించండి.
(లేదా)
శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులను వివరించండి.
జవాబు:
శ్రీరామ పట్టాభిషేకానికి అయోధ్య అలంకరించుకొంది. నగరమంతా ఆనందంగా ఉంది. అది చూసి మంథర చాలా ‘బాధ పడింది. ఆమె కైకకు అరణపుదాసి. కైక వద్దకు పరుగెత్తింది. పట్టాభిషేకం గురించి చెప్పింది. కైక ఆనందించింది. తన దుర్బోధతో కైక మనసు మార్చింది. రాముడిని అడవికి పంపమంది. భరతునికి పట్టాభిషేకం చేయించమన్నది.

అప్పుడే దశరథుడు శ్రీరామ పట్టాభిషేకం గురించి కైకకు చెప్పడానికి వచ్చాడు. కైక తన మనసులోని మాట బయట పెట్టింది. దశరథుడు చాలా బాధపడ్డాడు. ఎంత బెదిరించినా, తిట్టినా, బ్రతిమాలినా కైక మనసు మారలేదు. శ్రీరామునికి కబురంపింది. విషయం చెప్పింది. పితృవాక్య పరిపాలన తన కర్తవ్యమన్నాడు రాముడు. అడవికి వెడతాను అన్నాడు.

కేవలం తన తండ్రి కైకకు ఇచ్చిన మాటకు కట్టుబడి రాముడు అడవికి వెళ్ళాడు. యాగానికి విశ్వామిత్రునితో వెళ్ళినపుడు కూడా గురువుగారు చెప్పినట్లు చేయమని దశరథుడు శ్రీరామునకు చెప్పాడు. తాటకని వధించేటపుడు విశ్వామిత్రుని మాటను శిరోధార్యంగా పాటించాడు. అందుకే శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడని చెప్పవచ్చు.

ప్రశ్న 14.
కైకకు వరాలిచ్చినపుడు దశరథుని వేదనను విశ్లేషించండి.
జవాబు:
మంథర దుర్బోధతో కైక మనసు మారింది. శ్రీరాముని అడవులకు పంపమన్నది. భరతునకు పట్టాభిషేకం చేయమంది.

శ్రీరాముడంటే దశరథ మహారాజుకు ప్రాణం. రాముని యాగసంరక్షణకు విశ్వామిత్రునితో పంపడానికే దశరథుడు ఇష్టపడలేదు. కాని, తప్పక పంపాడు. అటువంటి శ్రీరాముని అడవులకు పంపాలనే మాటను దశరథుడు భరించలేకపోయాడు. స్పృహ తప్పి పడిపోయాడు. కైకను ప్రాధేయపడ్డాడు. అసత్య దోషానికి కూడా భయపడలేదు. రాముని ఎలాగైనా ఆపాలనుకొన్నాడు. సాధ్యపడలేదు. తండ్రికి అపఖ్యాతి రావడానికి రాముడు అంగీకరించలేదు. రాముడు అడవులకు వెళ్ళిపోయాడు. దశరథుడు రామునికై కలవరించాడు. తపించాడు. దుఃఖించాడు. చివరకు మరణించాడు.

TS 10th Class Telugu Guide రామాయణం అయోధ్యాకాండ

ప్రశ్న 15.
సీతారామలక్ష్మణులు అడవికి ఏ వరుసలో నడిచారు ? ఎందుకు ? విశ్లేషించండి.
జవాబు:
ముందు లక్ష్మణుడు, తర్వాత సీత, ఆ తర్వాత శ్రీరాముడు నడిచి అడవిలోకి వెళ్ళారు.

కష్టాలు ఎదురైనపుడు భార్య మొదట నడవాలి. వెనుక భర్త నడవాలి అని ధర్మశాస్త్రం చెబుతోంది. అప్పుడు కష్టాలు నివారించబడతాయి. కనుక సీతారామలక్ష్మణులు ఆ వరుసలో వెళ్ళారు. ఇది ఒక కారణం.

అడవిలో ప్రమాదాలు ఎదురౌతాయి. రాక్షసులు, క్రూరమృగాలు ఉంటాయి. అవి ఎదురుగా వస్తే లక్ష్మణుడు ఎదురొడ్డి పోరాడతాడు. వెనుక నుండి ప్రమాదాలు వస్తే శ్రీరాముడు ఎదుర్కొంటాడు. అందుకే సీతను మధ్యలో ఉంచి నడిచారు. ఇది మరొక కారణం.

ప్రశ్న 16.
భరతుడు అడవికి ఎందుకు వచ్చాడు ? అతని రాకను ఎవరెవరు ఎలా భావించారు ? ఎందుకు ? విశ్లేషించండి.
జవాబు:
దశరథ మహారాజు మరణించాడు. భరతుడు అంత్యక్రియలు చేశాడు. తన తల్లి కైకను, మంథరను తప్పుబట్టాడు. శ్రీరాముడే అయోధ్యకు రాజు కావాలన్నాడు. తాను వనవాసం చేస్తానన్నాడు. చతురంగ బలాలను సిద్ధపరిచారు. రాముని ఒప్పించి, రాజ్యం అప్పగించి, తను ఆయనకు బదులు వనవాసం చేస్తానని చెప్పడానికి భరతుడు శ్రీరాముని కొరకు అడవికి వెళ్ళాడు.

భరతుని, సైన్యాన్ని చూసిన గుహుడు యుద్ధసన్నద్ధుడయ్యాడు. కాని, భరతుని ఆంతర్యం తెలిసి ఆదరించాడు. గుహుని సహకారంతో చిత్రకూట పర్వతం వైపు వెళ్ళారు.

లక్ష్మణుడు వారి రాకను గమనించాడు. రాజ్యకాంక్షతో యుద్ధానికి వస్తున్నాడనుకొన్నాడు. అదే రామునకు చెప్పాడు. రాముడు అంగీకరించలేదు. భరతునికి రాజ్యకాంక్ష లేదన్నాడు.

TS 10th Class Telugu Guide రామాయణం అయోధ్యాకాండ

ఈ విధంగా భరతుని రాకను శ్రీరాముడు మాత్రమే అర్థం చేసుకొన్నాడు. గుహుడు, లక్ష్మణుడు కూడా భరతుని అపార్థం చేసుకొన్నారు. అతని తల్లి కూడా భరతుని అంతరంగం తెలుసుకోలేకపోయింది.

పరిచిత గద్యాలు

ప్రశ్న 1.
కింది పేరా చదవండి. దిగువ నున్న మాటలకు ఒక వాక్యంలో వివరణను ఇవ్వండి.

అక్కడి నుండి సీతా మందిరానికి వెళ్ళాడు శ్రీరాముడు. తన వనవాస విషయం చెప్పాడు. అయోధ్యలో ఎలా మసలు కోవాలో సీతకు తెలిపాడు. కాని సీత రాముని వెంటే వనవాసానికి వెళ్ళడానికి నిశ్చయించుకుంది. ఆ మాటే శ్రీరామునితో చెప్పింది. “మీరు లేకుండా స్వర్గసుఖాలు లభించినా ఇష్టపడను. పతిని అనుసరించడమే సతికి ధర్మం, సుఖప్రదం, శుభప్రదం” అని తెలిపింది. శ్రీరాముడు అంగీకరించక తప్పలేదు. తనను కూడా వెంట తీసుకెళ్ళమని లక్ష్మణుడు శ్రీరాముణ్ణి ప్రాధేయపడ్డాడు. శ్రీరాముని సేవాభాగ్యం ముందు త్రిలోకాధిపత్యం కూడా చిన్నదేనని, సకలోపచారాలు చేసే అవకాశం తన కిమ్మని అభ్యర్థించాడు. సరేనన్నాడు శ్రీరాముడు.

ప్రశ్న 1.
మసలుకోవడం
జవాబు:
అంటే ఉండడం అని అర్థము. అనగా నడచుకోవడం అని భావము.

ప్రశ్న 2.
సుఖప్రదం, శుభప్రదం
జవాబు:
సుఖాన్ని ఇచ్చేది, శుభమును కల్గించేది అని భావము.

ప్రశ్న 3.
త్రిలోకాధిపత్యం
జవాబు:
మూడు లోకములకూ ప్రభువు కావడం. అనగా ముల్లోకాలనూ పరిపాలించడం అని భావము.

ప్రశ్న 4.
ప్రాధేయపడ్డాడు
జవాబు:
అంటే వేడుకొన్నాడు. అనగా బ్రతిమాలాడు అని భావము.

ప్రశ్న 5.
వనవాసం
జవాబు:
అంటే అడవిలో నివసించడం అని భావము.

TS 10th Class Telugu Guide రామాయణం అయోధ్యాకాండ

ప్రశ్న 2.
కింది పేరాను చదివి, కింద ఇచ్చిన పదాల భావాన్ని ఒక వాక్యంలో వివరించండి.

“శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంది. నగరమంతా ఆనందశోభ తాండవిస్తున్నది. ఇది చూసిన మంథర కళ్ళలో నిప్పులు పోసుకున్నది. కైకేయి అత్తవారింటికి వచ్చినపుడు వెంట వచ్చిన అరణపు దాసి మంథర పరుగు పరుగున కైకేయి దగ్గరికి వెళ్ళి పట్టాభిషేక విషయం చెప్పింది. కైకేయి చాలా ఆనందించి, వార్త చెప్పినందుకు మంథరకు విలువైన బహుమానాన్ని అందించింది. నిశ్చేష్టురాలైంది మంథర. దుఖించవలసిన సమయంలో ఎందుకు సంతోషిస్తున్నావని నిలదీసింది కైకేయిని “నాకు రాముడు, భరతుడు ఇద్దరూ సమానమే రాముడు పట్టాభిషిక్తుడు అవుతున్నాడంటే అంతకన్నా నాకు ఆనందమేముంటుందన్నది కైకేయి.

ప్రశ్న 1.
తనను తాను అలంకరించుకుంది.
జవాబు:
తన్ను తానే అలంకరించుకున్నట్లు, ఎక్కువ శోభాయమానంగా కనిపించిందని భావము.

ప్రశ్న 2.
తాండవిస్తున్నది.
జవాబు:
అంటే గంతులు వేస్తోందని అర్థము. ఆనందంతో చిందులు తొక్కుతోందని భావము.

ప్రశ్న 3.
కళ్ళలో నిప్పులు పోసుకున్నది.
జవాబు:
అంటే ఇతరుల గొప్పస్థితిని చూసి ఓర్వలేక పోయింది అని భావము.

ప్రశ్న 4.
అరణపు దాసి
జవాబు:
పుట్టింటి వారు తమ పిల్లతోపాటు అత్తింటికి పంపిన దాసీ స్త్రీ.

ప్రశ్న 5.
పరుగుపరుగున
జవాబు:
అంటే పరుగుపెడుతున్నంత వేగంగా అని భావం.

TS 10th Class Telugu Guide రామాయణం అయోధ్యాకాండ

ప్రశ్న 3.
కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.

దశరథుడు శ్రీరామ పట్టాభిషేక వార్తను తెలపడానికి కైకేయివద్దకు వచ్చాడు. కటికనేలపై ఉన్నది కైకేయి. తీవ్రమైన అలకతో ఉన్నది. దశరథుడు ఓదార్చడానికి పూనుకున్నాడు. కాని అతని ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఏం చేయాలో పాలుపోలేదు. విషయమడిగాడు. అదే అదనుగా భావించింది కైకేయి. ‘నాకొక కోరిక ఉంది. దాన్ని మీరే తీర్చాలి. అలా తీరుస్తానని మాట ఇవ్వా’లన్నది. ప్రాణానికి ప్రాణమైన శ్రీరాముడి మీద ఒట్టు పెట్టి సరేనన్నాడు దశరథుడు. ఇంకేం మనసులోని మాటను చెప్పేసింది. గతంలో మీరిచ్చిన రెండు వరాలను ఇప్పుడు కోరుకుంటున్నాను. శ్రీరాముడి కోసం ఏర్పాటుచేసిన సన్నాహాలతో భరతుడికి పట్టాభిషేకం చేయాలి. శ్రీరాముడు నారచీరలు, జింకచర్మం ధరించి, జటాధారి అయి దండకారణ్యానికి వెళ్ళి తాపసవృత్తిలో పదునాల్గు సంవత్సరాలు ఉండాలి. శ్రీరాముడు ఇప్పుడే, నేను చూస్తుండగానే బయలుదేరాలి’ అని కోరింది.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
బూడిదలో పోసిన పన్నీరు అంటే ఏమిటి ?
జవాబు:
వృథా

ప్రశ్న 2.
కైకేయి కోరికలెన్ని ?
జవాబు:
కైకేయి కోరికలు రెండు.

ప్రశ్న 3.
కైకేయి మొదటి కోరిక ఏమిటి ?
జవాబు:
భరతుని పట్టాభిషేకం

ప్రశ్న 4.
తపస్సు చేసుకొనేవారెలా ఉంటారు ?
జవాబు:
నార చీరలు, జింక చర్మం ధరించి జటాధారులై ఉంటారు.

TS 10th Class Telugu Guide రామాయణం అయోధ్యాకాండ

ప్రశ్న 5.
అలక అంటే ఏమిటి ?
జవాబు:
కోపం

TS 10th Class Maths Bits Chapter 5 Quadratic Equations

Solving these TS 10th Class Maths Bits with Answers Chapter 5 Quadratic Equations Bits for 10th Class will help students to build their problem-solving skills.

Quadratic Equations Bits for 10th Class

Question 1.
The roots of the equation 3x2 – 2 \(\sqrt{6}\)x + 2 = 0 are
A) \(\frac{2}{\sqrt{3}}\), \(\frac{-2}{\sqrt{3}}\)
B) \(\frac{1}{\sqrt{3}}\), \(\frac{-1}{\sqrt{3}}\)
C) \(\sqrt{\frac{2}{3}}\), \(\sqrt{\frac{2}{3}}\)
D) \(\frac{1}{\sqrt{3}}\), \(\frac{5}{\sqrt{3}}\)
Answer:
C) \(\sqrt{\frac{2}{3}}\), \(\sqrt{\frac{2}{3}}\)

Question 2.
One solution of the Q.E. 2x2 – 5x
A) x = 2
B) x = – 1
C) x = -3
D) x = 3
Answer:
D) x = 3

TS 10th Class Maths Bits Chapter 5 Quadratic Equations

Question 3.
The positive root of \(\sqrt{3 x^2+6}\) = 9 is
A) 3
B) 5
C) 4
D) \(\frac{2}{5}\)
Answer:
B) 5

Question 4.
Which of the following Q.E. has real and equal roots ?
A) x2 – 4x + 4 = 0
B) 2x2 – 4x + 3 = 0
C) 3x2 – 5x + 2 = 0
D) x2 – 2\(\sqrt{2}\)x – 6 = 0
Answer:
A) x2 – 4x + 4 = 0

Question 5.
Which of the following is a Q.E. ?
A) (x + 1)2 = 3(x + 7)
B) (x – 1) (x + 3) = (x – 2) (x + 1)
C) x2 + 5x – 7 = (x – 4)2
D) x3 – 9 = 0
Answer:
A) (x + 1)2 = 3(x + 7)

Question 6.
The sum of a number and its reciprocal is \(\frac{5}{2}\) then the number is
A) 2 or \(\frac{1}{3}\)
B) 3 or \(\frac{1}{2}\)
C) 2 or \(\frac{1}{2}\)
D) 5 and \(\frac{1}{5}\)
Answer:
C) 2 or \(\frac{1}{2}\)

Question 7.
If the equation x2 – kx + 1 = 0 has equal roots, then
A) k = 1
B) k = – 1
C) k = 2
D) k = – 4
Answer:
C) k = 2

Question 8.
The Q.E. whose one root is 2 – \(\sqrt{3}\) is
A) x2 – 4x + 1 = 0
B) x2 + 4x – 1 = 0
C) x2 – 4x – 1 = 0
D) x2 – 2x – 3 = 0
Answer:
A) x2 – 4x + 1 = 0

Question 9.
The roots of a quadratic equation \(\frac{x}{p}\) = \(\frac{p}{x}\)
A) ± p
B) p, 2p
C) -p, 2p
D) -p, -2p
Answer:
A) ± p

Question 10.
\(\sqrt{2}\)x2 – 3x + 5\(\sqrt{2}\) = 0, sum of the root is ……….
A) \(\sqrt{2}\)
B) \(\frac{-3}{\sqrt{2}}\)
C) 3
D) 5
Answer:
A) \(\sqrt{2}\)

TS 10th Class Maths Bits Chapter 5 Quadratic Equations

Question 11.
The quadratic equation whose roots are -3 and -4 is ……..
A) 7x2 + x + 1 = 0
B) x2 + 7x + 12 = 0
C) x2 – 3x + 1 = 0
D) none
Answer:
B) x2 + 7x + 12 = 0

Question 12.
The nature of the roots of a quadratic equation 4x2 – 12x + 9 = 0 is ……….
A) real and equal
B) real and distinct
C) imaginary
D) none
Answer:
A) real and equal

Question 13.
The roots of the quadratic equation \(\frac{x^2-8}{x^2+20}\) = \(\frac{1}{2}\) are….
A) ±2
B) ±6
C) ±13
D) ±7
Answer:
B) ±6

Question 14.
If b2 – 4ac = 0 then the roots of the quadratic equations are
A) real and distinct
B) real and equal
C) imaginary
D) none
Answer:
B) real and equal

Question 15.
The nature of roots of 3x2 + 6x – 2 = 0 is
A) real and distinct
B) real and equal
C) complex
D) none
Answer:
A) real and distinct

Question 16.
Product of the roots of ax2 + bx + c = 0 is
A) \(\frac{c}{a}\)
B) \(\frac{-b}{a}\)
C) \(\frac{-c}{a}\)
D) none
Answer:
A) \(\frac{c}{a}\)

Question 17.
The quadratic equation whose roots are 2, 3 is …………
A) x2 – 5x + 1 = 0
B) x2 – 5x – 6 = 0
C) x2 – 3x + 1 = 0
D) x2 – 5x + 6 = 0
Answer:
D) x2 – 5x + 6 = 0

Question 18.
\(\frac{2 a^2+a-1}{a+1}\) + \(\frac{3 a^2+5 a+2}{3 a+2}\) + \(\frac{4-a^2}{a+2}\) + ……..
A) \(\frac{\mathrm{a}}{2}\)
B) \(\frac{a+1}{2}\)
C) 2(a + 1)
D) none
Answer:
C) 2(a + 1)

Question 19.
TS 10th Class Maths Bits Chapter 5 Quadratic Equations 1
A) 1
B) x2
C) x
D) 0
Answer:
C) x

Question 20.
Sum of the roots of bx2 + ax + c = 0 is ………
A) \(\frac{-b}{a}\)
B) \(\frac{c}{a}\)
C) \(\frac{c}{a}\)
D) \(\frac{-a}{b}\)
Answer:
D) \(\frac{-a}{b}\)

Question 21.
The nature of roots of 3x2 + 13x – 2 = 0 is ……..
A) real and unequal
B) real and equal
C) complex
D) none
Answer:
A) real and unequal

Question 22.
Product of the roots of x2 + 7x = 0 is ………
A) 1
B) -7
C) -3
D) 0
Answer:
D) 0

Question 23.
If α and β are the roots of x2 – 2x + 3 = 0 then α2 + β2 = ………
A) 1
B) 4
C) 8
D) none
Answer:
D) none

TS 10th Class Maths Bits Chapter 5 Quadratic Equations

Question 24.
If α and β are the roots of x2 – 5x + 6 = 0 then the value of α – β = ……….
A) ±1
B) ±2
C) -3
D) none
Answer:
A) ±1

Question 25.
Form a quadratic equation from x3 – 4x2 – x + 1 = (x – 2)3 = …….
A) 2x2 – x + 1 = 0
B) 2x2 – 13x + 9 = 0
C) x2 + x + 1 = 0
D) none
Answer:
B) 2x2 – 13x + 9 = 0

Question 26.
The product of two consecutive positive in¬teger is 306 then the smallest number is
A) 16
B) 13
C) 19
D) 17
Answer:
D) 17

Question 27.
x(x + 4) = 12 then x = …….
A) – 6 or 2
B) 6 or 7
C) 8 or – 9
D) none
Answer:
A) – 6 or 2

Question 28.
9 and 1 are the roots of ……
A) x2 – 10x + 9 = 0
B) x2 – x + 1 = 0
C) x2 + 3x + 4 = 0
D) none
Answer:
A) x2 – 10x + 9 = 0

Question 29.
The discriminant of 3x2 – 2x = \(\frac{-1}{3}\) is ……..
A) 1
B) –\(\frac{-1}{3}\)
C) 8
D) 0
Answer:
D) 0

Question 30.
Which of the following is a quadratic equation ?
A) x2 – 3x + 1
B) 8x3 + 7x2 + 1
C) x2 – x + 1 = 0
D) all
Answer:
C) x2 – x + 1 = 0

Question 31.
(α + β)2 – 2αβ = ………..
A) α2 + β2 + 1
B) α2 + β2
C) α2 + β2
D) αβ
Answer:
C) α2 + β2

Question 32.
If α, β are the roots of x2 – px + q = 0 then α3 + β3 = ………
A) p + q3
B) p – 3p3q
C) p3 – 3pq
D) p2 – 3pq
Answer:
C) p3 – 3pq

Question 33.
(1 – 5x) (9x + 1) = …….
A) 3x2 + 1 + x
B) 8x2 – 5x + 1
C) 1 – 4x + 5x2
D) 1 + 4x – 45x2
Answer:
D) 1 + 4x – 45x2

Question 34.
The roots of x = \(\frac{1}{x}\) are ……..
A) 2 or -2
B) 2 or \(\frac{1}{2}\)
C) 1 or – 1
D) all
Answer:
C) 1 or – 1

Question 35.
If \(\frac{-7}{3}\) is a root of 6x2 – 13x – 63 = 0 then other root is ……..
A) 8
B) \(\frac{1}{3}\)
C) \(\frac{2}{9}\)
D) \(\frac{9}{2}\)
Answer:
D) \(\frac{9}{2}\)

TS 10th Class Maths Bits Chapter 5 Quadratic Equations

Question 36.
\(\sqrt{a \sqrt{a \sqrt{a \ldots \ldots \infty}}}\) = ………
A) a1/2
B) a
C) a3
D) a/2
Answer:
B) a

Question 37.
If one root of x2 – x – k = 0 is square of other then k =
A) 2
B) 3
C) -4
D) none
Answer:
D) none

Question 38.
The roots of 2x2 + x – 4 = 0 are ………
A) \(\frac{-1 \pm \sqrt{33}}{4}\)
B) \(\frac{-1 \pm \sqrt{31}}{2}\)
C) \(\frac{-1 \pm \sqrt{29}}{2}\)
D) none
Answer:
A) \(\frac{-1 \pm \sqrt{33}}{4}\)

Question 39.
If b2 < 4ac then shape of graph is …….
TS 10th Class Maths Bits Chapter 5 Quadratic Equations 2
Answer:
A)
TS 10th Class Maths Bits Chapter 5 Quadratic Equations 6

Question 40.
One of the root of the Q.E. 6x2 – x – 2 = 0 is
A) \(\frac{1}{3}\)
B) \(\frac{-1}{3}\)
C) \(\frac{-2}{3}\)
D) \(\frac{2}{3}\)
Answer:
D) \(\frac{2}{3}\)

Question 41.
The sum of a number and its reciprocal is \(\frac{50}{7}\), then the number is
A) \(\frac{1}{7}\)
B) 5
C) \(\frac{2}{7}\)
D) \(\frac{3}{7}\)
Answer:
A) \(\frac{1}{7}\)

Question 42.
If 5x2 – kx + 11 = 0 has a root x = 3 then k =
A) \(\frac{16}{3}\)
B) \(\frac{56}{3}\)
C) \(\frac{-17}{3}\)
D) 15
Answer:
B) \(\frac{56}{3}\)

Question 43.
The value of p for which 4x2 – 2px + 7 = 0 has a real root is
A) p > 2\(\sqrt{7}\)
B) p > \(\sqrt{7}\)
C) p > \(\sqrt{5}\)
D) p > \(\sqrt{3}\)
Answer:
A) p > 2\(\sqrt{7}\)

Question 44.
The standard form of a Q.E. is
A) ax + b = 0
B) ax2 + bx + c = 0; a ≠ o
C) ax3 + bx2 + cx + d = 0
D) a2 x + b2 y = c2
Answer:
B) ax2 + bx + c = 0; a ≠ o

Question 45.
The roots of the Q.E. \(\frac{9}{x^2-27}\) = \(\frac{25}{x^2-11}\)
A) ±11
B) ± 3
C) ± 9
D) ± 6
Answer:
D) ± 6

Question 46.
The Q.E. whose roots are -2, -3 is
A) x2 – 5x + 6 = 0
B) x2 + 5x + 6 = 0
C) x2 – 5x – 6 = 0
D) x2 + 5x – 6 = 0
Answer:
B) x2 + 5x + 6 = 0

Question 47.
Form a quadratic equation whose roots are k and \(\frac{1}{\mathbf{k}}\)
A) x2 + (k + \(\frac{1}{\mathbf{k}}\)) x + 1 = 0
B) xk2 – kx + 1 = 0
C) x2 – (k + k) + 1 = 0
D) x2 – (k + \(\frac{1}{\mathbf{k}}\)) x + 1 = 0
Answer:
D) x2 – (k + \(\frac{1}{\mathbf{k}}\)) x + 1 = 0

Question 48.
The sum of the roots of the quadratic equation 5x2 + 4 \(\sqrt{3}\)x – 11 = o is
A) \(\frac{-11}{5}\)
B) \(\frac{11}{4}\)
C) \(\frac{-4}{3}\)
D) \(\frac{-4}{5} \sqrt{3}\)
Answer:
D) \(\frac{-4}{5} \sqrt{3}\)

Question 49.
If one root of a quadratic equation is 7 – \(\sqrt{3}\) then the quadratic equation is ……..
A) x2 – 7x + 3 = 0
B) x2 – 4x + 6 = 0
C) x2 – 7x + 1 = 0
D) x2 – 14x + 46 = 0
Answer:
D) x2 – 14x + 46 = 0

Question 50.
The roots of a quadratic equation (\(\sqrt{2}\)x + 3) (5x – \(\sqrt{3}\)) = 0 are ….
A) \(\frac{1}{3}\), \(\frac{1}{\sqrt{2}}\)
B) \(\frac{1}{2}\), \(\frac{3}{\sqrt{5}}\)
C) \(\frac{-3}{\sqrt{2}}\), \(\frac{1}{5}\)
D) \(\frac{-3}{\sqrt{2}}\), \(\frac{\sqrt{3}}{5}\)
Answer:
D) \(\frac{-3}{\sqrt{2}}\), \(\frac{\sqrt{3}}{5}\)

Question 51.
If b2 – 4ac > 0 then the roots of the quadratic equations are ……..
A) real and distinct
B) real and equal
C) imaginary
D) none
Answer:
A) real and distinct

Question 52.
The roots of 7x2 + 3x + 8 = 0 are
A) real
B) not real
C) real and equal
D) none
Answer:
B) not real

TS 10th Class Maths Bits Chapter 5 Quadratic Equations

Question 53.
The quadratic equation whose roots are – 2 and -3 is
A) x2 + 6x + 1 = 0
B) x2 + 5x + 6 = 0
C) x2 – 5x + 1 = 0
D) none
Answer:
B) x2 + 5x + 6 = 0

Question 54.
\(\frac{1}{a+3}\) + \(\frac{1}{a-3}\) + \(\frac{6}{9-a^2}\) = ……….
A) \(\frac{1}{a+2}\)
B) \(\frac{3}{a+2}\)
C) \(\frac{2}{a+3}\)
D) \(\frac{2}{a+3}\)
Answer:
D) \(\frac{2}{a+3}\)

Question 55.
If (2x – 1) (2x + 3) = 0 then x = ……….
A) \(\frac{1}{2}\) or \(\frac{-1}{2}\)
B) \(\frac{1}{2}\) or \(\frac{-3}{2}\)
C) \(\frac{1}{2}\) or \(\frac{2}{3}\)
D) none
Answer:
B) \(\frac{1}{2}\) or \(\frac{-3}{2}\)

Question 56.
If α and β are the roots of the quadratic equation 2x2 + 3x – 7 = 0 then \(\frac{a^2+b^2}{a b}\) = …………
A) \(\frac{-37}{16}\)
B) \(\frac{-37}{4}\)
C) \(\frac{-37}{14}\)
D) \(\frac{37}{8}\)
Answer:
C) \(\frac{-37}{14}\)

Question 57.
The degree of any quadratic equation is …………
A) 4
B) 1
C) 2
D) 3
Answer:
C) 2

Question 58.
The product of two consecutive positive integer is 306 then the largest number is ………..
A) 12
B) 16
C) 18
D) 10
Answer:
C) 18

Question 59.
3(x – 4)2 – 5(x – 4) = 12 then x = ……….
A) 6, \(\frac{-1}{17}\)
B) 8, \(\frac{-1}{2}\)
C) 3, 4
D) 3, \(\frac{-4}{3}\)
Answer:
D) 3, \(\frac{-4}{3}\)

Question 60.
Discriminant of the quadratic equation
px2 + qx + r = 0 is…… ( )
A) q2 – pr
B) q – 4pr
C) q2 – 4pr
D) none
Answer:
C) q2 – 4pr

Question 61.
If a is a root of ax2 + bx + c = 0 then aα2 + bα + c = ………
A) -c
B) 0
C) 8
D) 1
Answer:
B) 0

Question 62.
Discriminant of the quadratic equation x + \(\frac{1}{x}\) = 3 is ………..
A) -10
B) 9
C) 6
D) 5
Answer:
D) 5

Question 63.
If the sum of the roots of kx2 – 3x + 1 = 0 is \(\frac{-4}{3}\) then k = …………
A) \(\frac{-4}{9}\)
B) \(\frac{9}{5}\)
C) \(\frac{-9}{4}\)
D) none
Answer:
C) \(\frac{-9}{4}\)

Question 64.
If ax2 – 4x + 3 = 1 then x = ………., a ≠ 0
A) 1 or 3
B) 2 or 7
C) 8 or \(\frac{1}{2}\)
D) 2 or -3
Answer:
A) 1 or 3

Question 65.
TS 10th Class Maths Bits Chapter 5 Quadratic Equations 3
A) \(\frac{1+\sqrt{1+4 a}}{2}\)
B) \(\frac{1-\sqrt{4 a-2}}{3}\)
C) \(\frac{1+\sqrt{2}}{2}\)
D) none
Answer:
A) \(\frac{1+\sqrt{1+4 a}}{2}\)

TS 10th Class Maths Bits Chapter 5 Quadratic Equations

Question 66.
If \(\frac{1}{x-2}\) + \(\frac{2}{x-1}\) = \(\frac{6}{x}\) then x = ………
A) 3 or \(\frac{4}{3}\)
B) 3 or \(\frac{-1}{3}\)
C) 1 or \(\frac{2}{3}\)
D) 8 or \(\frac{7}{2}\)
Answer:
A) 3 or \(\frac{4}{3}\)

Question 67.
Sum of the roots of a pure quadratic equation is ……..
A) -13
B) 12
C) -9
D) 0
Answer:
D) 0

Question 68.
If the sum of the squares of two consecutive odd numbers is 74; then the smaller number is
A) 11
B) 3
C) 7
D) 5
Answer:
D) 5

Question 69.
The roots of the Q.E. \(\sqrt{3}\)x2 – 2x – \(\sqrt{3}\) = 0 are
A) Real and distinct
B) Real and equal
C) Not real
D) Can’t be determined
Answer:
A) Real and distinct

Question 70.
The roots of 5x2 – x + 1 = 0 are
A) Real and equal
B) Real and unequal
C) Imaginary
D) None
Answer:
C) Imaginary

Question 71.
The roots of the Q.E. (7x – 1) (2x + 3) = 0 are
A) 1, 3
B) \(\frac{1}{7}\), \(\frac{3}{2}\)
C) \(\frac{1}{7}\), \(\frac{-3}{2}\)
D) \(\frac{-1}{7}\), \(\frac{-3}{2}\)
Answer:
C) \(\frac{1}{7}\), \(\frac{-3}{2}\)

Question 72.
The roots of the Q.E. (x – \(\frac{1}{3}\))2 = 9 are
A) 10, 8
B) \(\frac{-10}{8}\), \(\frac{8}{3}\)
C) \(\frac{10}{3}\), \(\frac{-8}{3}\)
D) (-3, 3)
Answer:
C) \(\frac{10}{3}\), \(\frac{-8}{3}\)

Question 73.
If(x – 3) (x + 3) = 16 then the value of x is
A) ± 4
B) ± 3
C) ± 6
D) ± 5
Answer:
D) ± 5

Question 74.
The product of the roots of the quadratic equation \(\sqrt{2}\)x2 – 3x + 5\(\sqrt{2}\) = 0 is ………
A) \(\frac{-5}{3}\)
B) \(\sqrt{2}\)
C) 5
D) 3
Answer:
C) 5

Question 75.
The nature of the roots of quadratic equation 3x2 + x + 8 = 0 is ……….
A) real and distinct
B) real and equal
C) Imaginary
D) none
Answer:
C) Imaginary

Question 76.
If b2 – 4ac < 0 then the roots of the quadratic equations are ………..
A) distinct
B) equal
C) imaginary
D) none
Answer:
C) imaginary

Question 77.
Sum of the roots of ax2 + bx + c = 0 is ………….
A) \(\frac{c}{a}\)
B) \(\frac{b}{a}\)
C) \(\frac{a}{b}\)
D) none
Answer:
D) none

Question 78.
\(\frac{x}{x-y}\) – \(\frac{y}{x+y}\) = …………
A) \(\frac{x^2+y^2}{x^2-y^2}\)
B) \(\frac{x^2+y^2}{x+y}\)
C) \(\frac{x^2 y^2}{x+y}\)
D) none
Answer:
A) \(\frac{x^2+y^2}{x^2-y^2}\)

Question 79.
(x + \(\frac{1}{x}\))2 – (y + \(\frac{1}{y}\))2 – (xy – \(\frac{1}{x y}\)) . (\(\frac{x}{y}\) – \(\frac{y}{x}\)) = ………..
A) 0
B) 1
C) xy
D) \(\frac{1}{x y}\)
Answer:
A) 0

Question 80.
The roots of (x – a) (x – b) = b2 are ……….
A) real
B) not real
C) complex
D) none
Answer:
A) real

Question 81.
Form a quadratic equation from
x(2x + 3) = x2 + 1
A) x2 + 3x – 1 = 0
B) x2 – 3x – 2 = 0
C) x2 + x + 1 = 0
D) none
Answer:
A) x2 + 3x – 1 = 0

TS 10th Class Maths Bits Chapter 5 Quadratic Equations

Question 82.
The roots of \(\sqrt{2}\)x2 + 7x + 5\(\sqrt{2}\) = 0 are
A) \(\frac{-5}{\sqrt{2}}\) or 7
B) -1 or -5
C) –\(\sqrt{2}\) or \(\frac{5}{\sqrt{3}}\)
D) all
Answer:
B) -1 or -5

Question 83.
On solving x2 + 5 = -6x we get x = …………….
A) 5 or – 2
B) -1 or – 5
C) -3 or – 7
D) none
Answer:
B) -1 or – 5

Question 84.
If kx(x – 2) + 6 = 0 has equal roots then k = ………..
A) 3
B) -6
C) 7
D) 6
Answer:
D) 6

Question 85.
If one root of x2 – (p – 1) x + 10 = 0 is 5 then p = ……..
A) 8
B) 7
C) -3
D) none
Answer:
A) 8

Question 86.
\(\sqrt{k+1}\) = 3 then k = ………
A) 24
B) 16
C) 19
D) none
Answer:
D) none

Question 87.
The quadratic inequation with 2 < x < 3 is
A) x2 + 6x + 5 < 0
B) x2 – 5x + 6 > 0
C) x2 – 5x + 6 < 0
D) none
Answer:
C) x2 – 5x + 6 < 0

Question 88.
\(\frac{1}{x+4}\) – \(\frac{1}{x-7}\) = \(\frac{11}{30}\), x ≠ -4 or 7 then x = ………
A) -2 or 1
B) 2 or 1
C) -1 or 3
D) 7 or \(\frac{1}{2}\)
Answer:
B) 2 or 1

Question 89.
The roots of the equation 4x2 + 4\(\sqrt{\mathbf{3}}\) x + 3 = 0 are
A) \(\frac{\sqrt{3}}{2}\)
B) \(\frac{-\sqrt{3}}{2}\)
C) -4
D) -2
Answer:
B) \(\frac{-\sqrt{3}}{2}\)

Question 90.
The sum of the roots of the equation 3x2 – 7x + 11 = 0
A) \(\frac{11}{3}\)
B) \(\frac{-7}{3}\)
C) \(\frac{7}{3}\)
D) \(\frac{3}{7}\)
Answer:
C) \(\frac{7}{3}\)

Question 91.
The roots of the Q.E. (\(\sqrt{5} x\)x – 3)(\(\sqrt{5} x\)x – 3) = 0 are
A) \(\frac{3}{\sqrt{5}}\), \(\frac{3}{\sqrt{5}}\)
B) \(\frac{-3}{\sqrt{5}}\), \(\frac{-3}{\sqrt{5}}\)
C) \(\frac{3}{\sqrt{5}}\), \(\frac{-3}{\sqrt{5}}\)
D) \(\frac{\sqrt{3}}{\sqrt{5}}\), \(\frac{\sqrt{3}}{\sqrt{5}}\)
Answer:
A) \(\frac{3}{\sqrt{5}}\), \(\frac{3}{\sqrt{5}}\)

Question 92.
The roots of the Q.E. (3x + 4)2 – 49 = 0 are
A) 1, \(\frac{-11}{3}\)
C) \(\frac{-1}{3}\), \(\frac{-11}{3}\)
D) 1, -11
Answer:
A) 1, \(\frac{-11}{3}\)

Question 93.
If the sum of the roots of the Q.E. 3x2 + (2k + 1)x – (k + 5) = 0 is equal to the product of the roots, then the value of k is
A) 3
B) 4
C) 2
D) 6
Answer:
B) 4

Question 94.
The product of roots of the quadratic equation 5x2 + 4\(\sqrt{3}\)x – 11 = 0 is
A) \(\frac{5}{-11}\)
B) \(\frac{1}{5}\)
C) \(\frac{-11}{5}\)
D) \(\frac{1}{5}\)
Answer:
C) \(\frac{-11}{5}\)

Question 95.
The discriminant of 5x2 – 3x – 2 = 0 is …………
A) 49
B) 89
C) 20
D) none
Answer:
A) 49

Question 96.
The roots of 4x2 – 20x + 25 = 0 are ….
A) real and equal
B) imaginary
C) real and distinct
D) none
Answer:
A) real and equal

TS 10th Class Maths Bits Chapter 5 Quadratic Equations

Question 97.
4x2 + kx – 2 = 0 has no real roots if ………….
A) k > – \(\sqrt{32}\)
B) k = 10
C) k < – \(\sqrt{32}\)
D) none
Answer:
C) k < – \(\sqrt{32}\)

Question 98.
(x – α)(x – β) = 0 then …….
A) x2 – (α)x + βα = 0
B) x2 – (α + β)x + αβ = 0
C) ax2 – xβ + αβ = 0
D) none
Answer:
B) x2 – (α + β)x + αβ = 0

Question 99.
For what values of m are the roots of the equation mx2 + (m + 3) x + 4 = 0 are equal ?
A) 1 or 5
B) -1 or 2
C) 8 of 1
D) 9 or -7
Answer:
A) 1 or 5

Question 100.
If x + \(\frac{1}{x}\) = 2 then x2 + \(\frac{1}{x^2}\) = …………
A) 8
B) 0
C) 4
D) 2
Answer:
D) 2

Question 101.
1 and \(\frac{3}{2}\) are the roots of ………..
A) 2x2 – 5x + 3 = 0
B) x2 – 5x + 1 = 0
C) 2x2 – x + 3 = 0
D) all
Answer:
A) 2x2 – 5x + 3 = 0

Question 102.
The equation 5x2 + 2x + 8 = 0 has ……….
A) no real roots
B) real roots
C) equal roots
D) none
Answer:
A) no real roots

Question 103.
Diagonal of a rectangle is …….
A) \(\sqrt{l}\) + b2
B) \(\sqrt{l}\) + b
C) \(\sqrt{l \mathrm{~b}}\)
D) \(\sqrt{l^2+\mathrm{b}^2}\)
Answer:
D) \(\sqrt{l^2+\mathrm{b}^2}\)

Question 104.
The coefficient of x in a pure quadratic equation is…
A) 2
B) 0
C) 8
D) none
Answer:
B) 0

Question 105.
If 2 is a root of x2 + 5x + r = 0 then r = ……..
A) -4
B) -14
C) 16
D) 8
Answer:
B) -14

Question 106.
x2 + (x + 2)2 = 290 then x = ………
A) 9 or -13
B) 8 or -12
C) 11 or -13
D) all
Answer:
C) 11 or -13

Question 107.
If 3y2 = 192 then y = ……..
A) 12
B) 6
C) 8
D) none
Answer:
D) none

Question 108.
If x2 – 2x + 1 = 0, then x + \(\frac{1}{x}\) =
A) 0
B) 2
C) 1
D) None
Answer:
B) 2

Question 109.
Product of the roots of the Q.E.
3x2 – 6x + 11 = 0 is
A) -2
B) \(\frac{-11}{3}\)
C) \(\frac{-11}{6}\)
D) \(\frac{11}{3}\)
Answer:
D) \(\frac{11}{3}\)

Question 110.
The roots of a quadratic equation ax2 + bx + c = 0 is….
TS 10th Class Maths Bits Chapter 5 Quadratic Equations 4
Answer:
\(\frac{-b \pm \sqrt{b^2-4 a c}}{2 a}\)

Question 111.
The nature of the roots of a quadratic equation 4x2 + 5x + 1 = 0 is ……
A) real and distinct
B) real and equal
C) imaginary
D) none
Answer:
A) real and distinct

Question 112.
If the roots of a quadratic equation ax2 + bx + c = 0 are real and equal then b2 = …………….
A) 4ab
B) 4ac
C) \(\frac{\mathrm{ac}}{4}\)
D) a2 c2
Answer:
B) 4ac

TS 10th Class Maths Bits Chapter 5 Quadratic Equations

Question 113.
3x2 + (-kx) + 8 = 0 has real roots of ………..
A) k < 4\(\sqrt{6}\) B) k > 4\(\sqrt{6}\)
C) k = 6
D) k = 0
Answer:
B) k > 4\(\sqrt{6}\)

Question 114.
If k2 – 8k + 16 = 0 has equal roots then ………
A) k = ±\(\sqrt{2}\)
B) k = ±7
C) k = + 1
D) none
Answer:
C) k = + 1

Question 115.
Sum of the roots of -7x + 3x2 – 1 = 0 ………..
A) \(\frac{3}{4}\)
B) \(\frac{1}{7}\)
C) \(\frac{7}{3}\)
D) \(\frac{1}{2}\)
Answer:
C) \(\frac{7}{3}\)

Question 116.
If α and β are the roots of x2 – 2x + 3 = 0 the value of α3 + β3 = …….
A) -10
B) 10
C) 8
D) 12
Answer:
A) -10

Question 117.
In the quadratic equation x2 + x – 2 = 0, a + b + c = …………
A) 7
B) 0
C) 8
D) 1
Answer:
B) 0

Question 118.
The roots of 2x2 – x + \(\frac{1}{8}\) = 0 are……..
A) \(\frac{1}{4}\), \(\frac{1}{2}\)
B) \(\frac{1}{3}\), \(\frac{1}{7}\)
C) \(\frac{1}{2}\), \(\frac{1}{8}\)
D) \(\frac{1}{4}\), \(\frac{1}{4}\)
Answer:
D) \(\frac{1}{4}\), \(\frac{1}{4}\)

Question 119.
Number of distinct line segments that can be formed out of n – points is….
A) \(\frac{\mathrm{n}(\mathrm{n}-1)}{2}\)
B) \(\frac{\mathrm{n}}{2}\)
C) \(\frac{\mathrm{n}+1}{2}\)
D) \(\frac{n^2(n-1)}{2}\)
Answer:
A) \(\frac{\mathrm{n}(\mathrm{n}-1)}{2}\)

Question 120.
From the figure, x = ………
A) 7
B) 3
C) 10
D) none
TS 10th Class Maths Bits Chapter 5 Quadratic Equations 5
Answer:
C) 10

Question 121.
P(x) = x2 + 2x + 1 then P(x2) = …….
A) x4 + 2x2 + 1
B) x4 + 2x + 1
C) x3 + 2x + 1
D) none
Answer:
A) x4 + 2x2 + 1

Question 122.
If α and β are the roots of the quadratic equation x2 – 3x + 1 = 0 then \(\frac{1}{\alpha^2}\) + \(\frac{1}{\beta^2}\) = …………
A) 7
B) 8
C) -3
D) none
Answer:
A) 7

Question 123.
\(\sqrt{x}\) = \(\sqrt{2 x-1}\) then x =
A) 1
B) 4
C) 2
D) none
Answer:
A) 1

TS 10th Class Maths Bits Chapter 5 Quadratic Equations

Question 124.
A pentagon has ……… diagonals.
A) 6
B) 7
C) 9
D) none
Answer:
D) none

Question 125.
Product of the roots of 1 = x2 is ……..
A) -1
B) 7
C) 0
D) 1
Answer:
A) -1

Question 126.
If α and β are the roots of
x2 + x + 1 = 0 then α2 and β2 = ………
A) 8
B) -1
C) 12
D) 0
Answer:
B) -1

Question 127.
\(\frac{x}{a-b}\) = \(\frac{\mathbf{a}}{\mathbf{x}-\mathbf{b}}\) then x = ……….
A) b – a or \(\frac{\mathrm{a}}{2}\)
B) b – a or -a
C) b + a or -a
D) all
Answer:
B) b – a or -a

Question 128.
\(\frac{n(n+1)}{2}\) = 55 then n = ……….
A) 13
B) 16
C) 10
D) 12
Answer:
C) 10

Question 129.
If α and β are the roots of x2 – 2x + 3 = 0 then α2β + β2α = ……..
A) -3
B) 8
C) 6
D) none
Answer:
C) 6

Question 130.
x2 – 7x – 60 = 0 the x = …….. (A.P.Mar. 15)
A) 12, 17
B) 12, -5
C) 8, 11
D) 12, 16
Answer:
B) 12, -5

Question 131.
The general form of a quadratic equation in variable x is ……. (A.P. Mar. 15)
A) ax2 + bx + c = 0 (a ≠ 0)
B) ax + bx2 + c = 0 (b ≠ 0)
C) ax2 + bx = 0 (a ≠ 0)
D) a2x + bx + c = 0 (b ≠ 0)
Answer:
A) ax2 + bx + c = 0 (a ≠ 0)

Question 132.
The possible numbers of roots to a quadratic equation are …….. (A.P. Mar.15)
A) At a maximum of 3
B) At a maximum of 2
C) Infinite
D) At a maximum of 5
Answer:
B) At a maximum of 2

Question 133.
If the roots of a quadratic equation px2 + qx + r = 0 are imaginary then ……… (A.P. June 15)
A) q2 > 4pr
B) q2 < 4pr
C) q2 = 4pr
D) p = q + r
Answer:
B) q2 < 4pr

TS 10th Class Maths Bits Chapter 5 Quadratic Equations

Question 134.
The discriminant of quadratic equation 2x2 + x – 4 = 0 is ………. (A.P.June’15)
A) 35
B) 36
C) 33
D) 38
Answer:
C) 33

Question 135.
The product of roots of quadratic equation ax2 + bx + c = 0 is (A.P. June’15)
A) \(\frac{c}{a}\)
B) \(\frac{-b}{a}\)
C) \(\frac{-c}{a}\)
D) \(\frac{b}{c}\)
Answer:
A) \(\frac{c}{a}\)

Question 136.
For what positive value of x the quadratic equation 4x2 – 9 = 0 (A.P. June’15)
A) \(\frac{2}{3}\)
B) \(\frac{-2}{3}\)
C) \(\frac{-3}{2}\)
D) \(\frac{3}{2}\)
Answer:
D) \(\frac{3}{2}\)

Question 137.
Which of the following quadratic equations the roots are equal? (A.P.Mar.16)
A) x2 – 5 =0
B) x2 – 10x + 25 = 0
C) x2 + 5x + 6 = 0
D) x2 – 1 = 0
Answer:
B) x2 – 10x + 25 = 0

Question 138.
If x2 + ax + b = 0; x2 + bx + a = 0 have a common roots then
A) a + b = 0
B) ab = 1
C) a + b = 1
D) a + b + 1 = 0
Answer:
D) a + b + 1 = 0

Question 139.
A metal cuboid of dimensions 22 cm × 15 cm × 7.5 cm was melted and cast into a cylinder of height 14 cm. Its radius is …………
A) 15 cm
B) 7.5 cm
C) 22.5 cm
D) 7 cm
Answer:
B) 7.5 cm

Question 140.
Solution of x – y = 2; x + y = 0 lies in quadratic. (AP-SA-I:2016)
A) I
B) IV
C) II
D) III
Answer:
B) IV

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం బాలకాండ

Telangana SCERT 10th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం రామాయణం బాలకాండ Questions and Answers.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం బాలకాండ

బాలకాండం

TS 10th Class Telugu Guide రామాయణం బాలకాండ 1
వాల్మీకి రామాయణ రచన :
నారదుడు వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి నారదుడిని “ఓ మహర్షీ ! అన్నీ మంచి గుణాలే గలవాడు, కష్టాలకు కుంగిపోనివాడు, ధర్మయుతుడు, శరణు వేడినవారిని రక్షించేవాడు, ఆడిన మాట తప్పనివాడు, సకలప్రాణులకూ మేలు చేసేవాడు, శూరుడు, అసూయ లేనివాడు, సౌందర్యవంతుడు ఈ గుణాలన్నీ గలవాడెవరు?” అని అడిగాడు. “ఈ గుణాలన్నీ గలవాడు శ్రీరాముడు !” అంటూ నారదుడు శ్రీరాముని చరిత్రను వినిపించాడు.

వాల్మీకి ఒకరోజు శిష్యులతో కలిసి తమసానదికి వెళుతూ వుండగా ఒక దృశ్యం చూశాడు. జంటగా నున్న క్రౌంచపక్షులలో మగదానిని ఒక వేటగాడు బాణంతో కొట్టాడు. అనుకోకుండానే వాల్మీకి నోటివెంట “ఓ కిరాతుడా? ప్రేమతో ఉన్న జంట పిట్టల్లో ఒక దాన్ని చంపిన నీవు శాశ్వత అపకీర్తిని పొందుతావు” అనే భావం వచ్చే శ్లోకం వెలువడింది. ఆశ్చర్యకరంగా అది ఛందస్సుతో కూడి వుంది. అది ‘అనుష్టుప్’ అనే ఛందస్సు. బ్రహ్మ రామచరిత్రను రాయమని వాల్మీకికి చెప్పాడు. వాల్మీకి రామాయణం రచించాడు.

అయోధ్యా నగరం :
సరయూ నదీతీరంలో ఉన్న కోసల రాజ్యానికి రాజధాని అయోధ్య. దశరథుడు రాజు. ప్రజలను సొంత బిడ్డల్లా పాలించేవాడు. రాజ్యంలో ప్రజలు సుఖంగా ఉండేవారు కాని అతడికి సంతానం లేదు. ఋష్యశృంగుడు దశరథునిచే పుత్రకామేష్టియాగం చేయించాడు.

రావణాసురుడు ముల్లోకాలను బాధిస్తూ వుండేవాడు. దేవతలు బ్రహ్మను ప్రార్థించారు. మానవుడి చేతిలో రావణునికి మరణం వుందని బ్రహ్మ చెప్పాడు. దేవతలు విష్ణువును ప్రార్థించారు. యజ్ఞకుండం నుండి దివ్య పురుషుడు ఉద్భవించి దశరథునికి పాయసం అందించాడు. దశరథుడు తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు పాయసాన్ని పంచాడు. కౌసల్యకు శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. వాళ్ళు సద్గుణసంపన్నులు. సర్వ విద్యలను అభ్యసించారు. లక్ష్మణుడు రాముణ్ణి భక్తితో సేవించేవాడు. భరత శత్రుఘ్నులకు ప్రేమాభి మానాలు మెండు.

విశ్వామిత్రుని యాగ సంరక్షణ :
ఒక రోజు విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చి తానొక యజ్ఞం చేస్తున్నానని మారీచ, సుబాహులనే రాక్షసులు విఘ్నం కలుగజేస్తున్నారని, యజ్ఞాన్ని రక్షించడానికి శ్రీరాముని పంపమని దశరథుని కోరాడు. దశరథుడు “మహర్షీ! బాలుడైన రాముడిని నీ వెంట పంపలేను. కావాలంటే నేను వస్తాను. మీ యజ్ఞాన్ని పాడు చేస్తున్న రాక్షసులెవరు ?” అన్నాడు. “రావణాసురుడు పంపిన రాక్షసులు మారీచ సుబాహులు !” అని సమాధానమిచ్చాడు విశ్వామిత్రుడు దశరథుడు భయపడి నాకుమారుడిని పంపను అన్నాడు. విశ్వామిత్రుడికి కోపం వచ్చింది.

వాళ్ళ కులగురువైన వశిష్ఠుడు రాముణ్ణి విశ్వామిత్రుని వెంట పంపమని సలహా ఇచ్చాడు. దశరథుడు శ్రీరాముని విశ్వామిత్రుని వెంట పంపాడు. లక్ష్మణుడు అన్నని అనుసరించాడు. విశ్వామిత్రుడు వారికి బల, అతి బల అనే విద్యలను ఉపదేశించాడు. గురుసేవగావిస్తూ రామలక్ష్మణులు సరయూ గంగానదుల సంగమప్రదేశాన్ని చేరారు. అక్కడ నుండి మలద, కరూశ ప్రాంతాలకు చేరుకున్నారు. తాటక అనే యక్షిణి తనకుమారుడైన మారీచునితో కలిసి ప్రజలను పీడిస్తున్నది. తాటకను చంపమని విశ్వామిత్రుడు శ్రీరామునికి చెప్పాడు.

తాటక కాబట్టి, స్త్రీవధగావించడానికి శ్రీరాముడు వెను కాడాడు. దుష్టురాలైన స్త్రీని చంపితే తప్పుగాదని విశ్వామిత్రుడు చెప్పాడు. తాటక మాయాయుద్ధానికి పూనుకున్నది. సంధ్యాసమయం కంటే ముందే ఆమెను వధించమని విశ్వామిత్రుడు ఆదేశించగా రాముడు శబ్దబేధితో ఆమెను చంపాడు. విశ్వా మిత్రుడు సంతోషించి రాముడికి దివ్యాస్త్రాలు ప్రసాదించాడు.

విశ్వామిత్రుడు సిద్ధాశ్రమంలో యజ్ఞం ప్రారంభించాడు. మారీచ సుబాహులు యజ్ఞవేదికపై రక్తవర్షాన్ని కురిపించారు. రాముని అస్త్రం దెబ్బకు మారీచుడు సముద్రంలో ఎగిరి పడ్డాడు. రాముడు సుబాహుని చీల్చాడు. విశ్వా మిత్రుడు నిర్విఘ్నంగా యజ్ఞం పూర్తిగావించాడు. మరునాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంటపెట్టుకొని మిథిలకు బయలు దేరాడు. దారిలో గంగానదిని దర్శించారు. విశ్వామిత్రుడు గంగానది వృత్తాంతాన్ని వినిపించాడు.

తన పితరులైన సగరులకు ఉత్తమగతులు కలిగించడానికి భగీరథుడు గంగను వారి బూడిదలపై ప్రసరింపజేయ సంకల్పించాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా లెక్కచేయక తీవ్రతపస్సు గావించాడు. చివరకు గంగను పాతాళానికి తీసుకు వెళ్ళాడు, రాముడు ఆ భగీరథ వంశపువాడే !

TS 10th Class Telugu Guide రామాయణం బాలకాండ

విశ్వామిత్రుడు రామలక్ష్మణులను గౌతముని ఆశ్రమం వద్దకు తీసుకువెళ్ళాడు. అహల్య గౌతముని శాపానికి గురియై అక్కడే పడివుంది. గురువుగారి కోరిక మేరకు రాముడు గౌతమాశ్రమంలో కాలుమోపి అహల్యకు శాపవిమోచనం కలిగించాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మిథిలలో జనకుని వద్దకు తీసుకువెళ్ళాడు. జనకుడు శివధనస్సును చూపాడు. జనకుడు శివధనస్సు ఘనతను వర్ణించాడు. అయిదు వేల మంది మోసుకువచ్చిన ధనస్సును రాముడు అవలీలగా ఎత్తి వింటినారి సంధించి ఎక్కుపెట్టగా అది ఫెళ్ళున విరిగింది.

దానిని ఎక్కుపెట్ట గలవాడే తనకుమార్తె సీతకు భర్త అని జనకుడు చెప్పివున్నాడు. ఇచ్చినమాట ప్రకారం సీతారాముల వివాహాన్ని నిశ్చయించాడు. అయోధ్య నుండి దశరథుడు వచ్చాడు. సీతను రాముడికి, ఊర్మిళను లక్ష్మణునికి, మాండవిని భరతునికి, శ్రుతకీర్తిని శత్రుఘ్నునికి ఇచ్చి పెళ్ళి చేశారు. తిరిగి వెళుతూ వుండగా పరశురాముడు ఎదురై రాముడితో తన వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టమని సవాలు చేశాడు. రాముడు దాన్ని కూడా ఎక్కుపెట్టాడు. పరశురాముడు ఓడిపోయాడు. రాముడు అయోధ్యకు చేరి తల్లిదండ్రులను సేవిస్తూ వున్నాడు. భరత శత్రుఘ్నులు తాతగారి దేశానికి వెళ్ళారు.

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
శోకం నుండి శ్లోకం ఎలా పుట్టిందో రాయండి.
జవాబు:
ఒకసారి నారదుడు వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. మాటల మధ్యలో శ్రీరాముని గుణగణాలను వర్ణించి చెప్పాడు. రాముని కథ వాల్మీకి మనసుకు హత్తు కున్నది. ఒకనాడు వాల్మీకి సరయూ నదికి స్నానానికి వెళుతున్నాడు. దారిలో ఒక కొమ్మపైన క్రౌంచ పక్షుల జంటను చూసి ఎంతో ఆనందించాడు. అంతలో ఒక బోయవాడు బాణంవేసి మగపక్షిని నేల గూల్చాడు. వాల్మీకి హృదయంలో కరుణ పొరలింది. బోయవాడి మీద కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే ఆయన నోటినుంచి శ్లోకం వెలువడింది. దాని భావం – ‘ఈ క్రౌంచ పక్షుల జంటలో ఒక దానిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలౌతావు’ అని.

“మానిషాధ ప్రతిష్టాంత్వ
మగమః శాశ్వతీః సమాః
యత్ క్రౌంచ మిథునాదేకమ్
అవధీః కామమోహితమ్”

అనే నాలుగు పాదాలతో లయబద్ధంగా వచ్చిన ఈ శ్లోకం ఆయనకే ఆశ్చర్యం కలిగించింది. అలా వాల్మీకి శోకం నుంచి శ్లోకం పుట్టింది. అది ‘అనుష్టుప్’ ఛందస్సు అని, ఆ ఛందంలోనే రామాయణం రాయమని బ్రహ్మ వాల్మీకిని ఆదేశించాడు.

ప్రశ్న 2.
దశరథునికి పుత్రజననం గురించి రాయండి. (లేదా) రామ, లక్ష్మణ భరత, శత్రుఘ్నులు జన్మించిన విధం వ్రాయండి.
జవాబు:
కోసలదేశ రాజు దశరథుడు. సంతానం లేదనే దిగులుతో దశరథుడు తన కులగురువైన వశిష్ఠుని ఆదేశంతో ‘పుత్రకామేష్టియాగం’ చేశాడు. యాగం పూర్తికాగానే గొప్ప తేజస్సుతో యజ్ఞపురుషుడు ఆవిర్భవించి పాయస పాత్రను తెచ్చి దశరథుని చేతిలో ఉంచాడు. “ఈ పాయసం సంపదలనిస్తుంది. ఆరోగ్యాన్ని పెంచుతుంది. సంతానాన్ని ప్రసాదిస్తుంది” అని చెప్పాడు. దశరథుడు ఎంతో సంతోషంతో ఆ పాయసాన్ని తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు పంచాడు. వారు గర్భం ధరించారు. చైత్రమాసంలో శుద్ధనవమినాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. దశమినాడు కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రఘ్నుడు జన్మించారు. అలా నలుగురు కుమారులు జన్మించి నందుకు దశరథుని ఆనందానికి మేరలేదు. ఈ వార్త విని అయోధ్య ప్రజలంతా ఆనందంతో ఉప్పొంగి పోయారు.

TS 10th Class Telugu Guide రామాయణం బాలకాండ

ప్రశ్న 3.
రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు. దీన్ని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
కోసల దేశాన్ని దశరథ మహారాజు పాలించేవాడు. అతడు మహావీరుడు. ధర్మపరాయణుడు. ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకునేవాడు. అతని పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో విలసిల్లింది. ప్రజలు ధర్మవర్తనులై సుఖసంతోషాలతో ఉన్నారు.

అలాగే శ్రీరాముడు కూడా ప్రజలను కన్న బిడ్డలవలె చూసుకున్నాడు. రాజ్యంలో ఏ ఈతి బాధలూ లేవు. ప్రజలంతా ధర్మమార్గంలో నడిచారు. బంధుత్వాలు, బాధ్యతలు, అప్యాయతలూ కలిగి ఉండి సత్ప్రవర్తనతో జీవించారు. కాబట్టి రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు అని చెప్పవచ్చు.

ప్రశ్న 4.
రామాయణం బాలకాండం ఆధారంగా గురు శిష్యుల అనుబంధాన్ని విశ్లేషించండి.
జవాబు:
రామాయణం బాలకాండలో గురువు విశ్వామిత్రుడు. శిష్యులు రామలక్ష్మణులు. విశ్వామిత్రుడు తాను చేసే యాగాన్ని రాక్షసులు పాడు చేస్తున్నారని యాగరక్షణ కోసం రామలక్ష్మణులను తనతో తీసుకెళ్ళాడు. బాగా ఎక్కువైపోయిన రాక్షసమూకను అంతంచేయడానికి కావలసినంత అస్త్రశస్త్ర విద్యలు వారికందించాలని విశ్వామిత్రుని కోరిక. అంత సమర్థుడైన గురువు దొరకడం రామలక్ష్మణుల అదృష్టం.

ఇంతమందిలో చిన్నవయసు వారైన రామలక్ష్మణులను ఎంచు కోవడం వారి అదృష్టం. ఎంతో భక్తితో విశ్వామిత్రుని సేవిస్తూ వెంటనడుస్తున్నారు వారు. దారిలోని ప్రదేశాలను పరిచయం చేస్తూ ధర్మాలనుపదేశిస్తూ నడిపిస్తున్నాడు గురువు. అక్షరం పొల్లు పోకుండా గ్రహిస్తున్నారు శిష్యులు. ఉత్తముడైన గురువు ఉపదేశించిన బల, అతిబల అనే విద్యలను, అస్త్రశస్త్ర ప్రయోగాలను శ్రద్ధగా నేర్చుకున్న ఉత్తమశిష్యులు రామలక్ష్మణులు.

ప్రశ్న 5.
గంగావతరణాన్ని గురించి విశ్వామిత్రుడు రామునికి చెప్పడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటి ?
జవాబు:
విశ్వామిత్రుని యాగాన్ని రక్షించడానికి రామ లక్ష్మణులు ఆయనతో వెళ్ళారు. యజ్ఞం పూర్తయిన తరువాత రామలక్ష్మణులను మిథిలానగరానికి తీసుకొని వెళ్ళాడు. దారిలో రాముడు తమ వంశం పుట్టు పూర్వోత్తరాలు వినాలని ఉన్నదని కోరాడు. అట్లే ఆవంశ చరిత్ర వినిపించాడు విశ్వామిత్రుడు. మరునాడు గంగావతరణ వృత్తాంతం తెలుపుమని రాముడు ప్రార్థించాడు.

విశ్వామిత్రుడు వెంటనే భగీరథుని దృఢసంకల్పం, పట్టుదల గురించి వివరించాడు. దివినుండి గంగను భువికి దింపి పాతాళంలో పారించి బూడిద కుప్పలుగా పడి ఉన్న తన పితృదేవతలకు మోక్షప్రాప్తి కలిగించి కార్య సాధకుడైన విషయాన్ని వివరించాడు. భగీరథుని వంశంలోనే వాడే రాముడు. అతనివలె పట్టుదల, కార్యదీక్ష రాముడు అలవరచుకుంటాడని, దృఢ సంకల్పానికి అసాధ్యమైనది ఏదీ లేదని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా పనిని వదలకుండా చేస్తే జయం కలుగుతుందనే ఆశయంతో విశ్వామిత్రుడు గంగావతరణాన్ని గురించి రామునికి చెప్పాడు.

TS 10th Class Telugu Guide రామాయణం బాలకాండ

ప్రశ్న 6.
జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండడం ఉత్తమ విద్యార్థుల లక్షణం-సమర్థిస్తూ రాయండి.
జవాబు:
రామాయణంలోని బాలకాండలో రామలక్ష్మణుల విద్యాభ్యాసం ద్వారా ఉత్తమ విద్యార్థి లక్షణాలను తెలుసుకోవచ్చు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు మొదట వేదశాస్త్రాలను అభ్యసించారు. ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు. విజ్ఞానఖనులయ్యారు. సద్గుణాలకు ఆటపట్టినారు. ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలివి.

ఆ తర్వాత వివిధ అస్త్ర ప్రయోగదక్షుడైన విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు యాగరక్షణ కోసం వెళ్ళారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు బల, అతిబల విద్యలను ఉపదేశించాడు. వీటి ప్రభావం వల్ల అలసట, ఆకలిదప్పులు ఉండవు. రూపకాంతులు తగ్గవు. నిద్రలో ఉన్నా ఏమరు పాటుతో ఉన్నా రాక్షసులేమీ చేయలేరు.

తమకు విద్య నేర్పిన విశ్వామిత్రునికి సేవలు చేశారు. రామలక్ష్మణులు యాగరక్షణ చేసి, విశ్వా మిత్రుని మెప్పించారు. సంతుష్టుడైన విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు ఎన్నో దివ్యాస్త్రాలను అను గ్రహించాడు. విశ్వామిత్రుని ఆశ్రమానికి వెళుతూ ఆ తర్వాత మిథిలా నగరానికి వెళుతూ దారిలోని విశేషాలను విశ్వామిత్రుని అడిగి తెలుసు కున్నారు రామలక్ష్మణులు. ఇలా రామ లక్ష్మణులు తెలియని విషయాలను తెలుసుకోవడానికి ఎప్పుడూ ఆసక్తి కనబరచడం వల్ల అనేక విద్యలను, రహస్యాలను తెలుసుకోగలిగారు. వారికున్న ఆసక్తిని గమనించి విశ్వామిత్రుడు తనకు తెలిసిన అన్ని విద్యలను, రహస్యాలను, విశేషాలను రామ లక్ష్మణులకు తెలియచేశాడు.

జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండడం ఉత్తమ విద్యార్థుల లక్షణమని రామ లక్ష్మణులు నిరూపించారు.

ప్రశ్న 7.
రామలక్ష్మణ భరత శత్రఘ్నులు ఉత్తమ విద్యార్థులు అని తెలుసుకున్నారు కదా ! ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలేమిటో సొంతమాటల్లో రాయండి.
జవాబు:
ఉత్తమ విద్యార్థులకుండవలసిన ప్రధాన లక్షణం ఏకాగ్రత, చెప్పిన ప్రతివిషయాన్ని శ్రద్ధగా గ్రహించాలి. తరువాత గురుభక్తి, గురువుపట్ల అచంచల భక్తివిశ్వాసాలతో మెలగుతూ గురువును దైవంగా భావించాలి. వినయవిధేయతలతో అధ్యయనం చేయాలి. పెద్దల పట్ల గౌరవము, చిన్నవారి పట్ల ఆదరాభిమానాలు కలిగి ఉండాలి. తల్లిదండ్రులను దైవసమానంగా భావించి వారి ఆజ్ఞను శిరసావహించాలి. అందరితో స్నేహంగా ఉండాలి. వృద్ధులపట్ల ప్రేమ, ఆదరం కలిగి ఉండాలి.

సమాజంలో దీనులపట్ల ఆదరం చూపాలి. తోటి వారికి చేతనైన సహాయం చేయాలి. చదువులో పోటీతత్వం కలిగి ఉండాలి. ఆటలమీద ఆసక్తి కలిగి ఉండాలి. ఈ విధంగా ప్రవర్తించిన విద్యార్థులు సమగ్ర వ్యక్తిత్వం కలవారిగా తీర్చిదిద్దబడతారు. సమాజంలో ఉన్నత స్థానం పొందగలుగుతారు.

TS 10th Class Telugu Guide రామాయణం బాలకాండ

ప్రశ్న 8.
ఉత్తమ విద్యార్థుల లక్షణాలేమిటి ? రామలక్ష్మణులు ఉత్తమ విద్యార్థులని ఎలా చెప్పగలవు ?
జవాబు:
జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండడం, ఉత్తమ విద్యార్థుల లక్షణం. గురువుగారికి సేవ చేయడం కూడా ఉత్తమ విద్యార్థి లక్షణం.

రామలక్ష్మణులు ఉత్తమ విద్యార్థులు. వారు తమ గురువైన విశ్వామిత్రుడి పాదాలు ఒత్తారు. వారు గురువు వెంట వెళ్ళి, సకాలంలో లేచి, నిత్యకర్మలు చేసేవారు. గంగాసరయూ నదుల సంగమం వంటి వాటి గురించి గురువుగారిని అడిగి వివరంగా తెలిసి కొన్నారు. గురువు ఆజ్ఞను పాటించడం శిష్యుడి కర్తవ్యమని గ్రహించి, విశ్వామిత్రుడు చెప్పినట్లుగా వారు తాటకను వధించారు.

వారు సిద్ధాశ్రమం చేరి విశ్వామిత్రుని యజ్ఞాన్ని కాపాడారు. మారీచ సుబాహులను తరిమికొట్టారు. మిథిలా నగరానికి గురువుగారితో వెడుతూ, గంగ మొదలయిన వాటిని గురించి గురువుగారిని అడిగి తెలుసుకొన్నారు. గురువుగారి అనుగ్రహంతో ఎన్నో అస్త్రాలను ప్రయోగ, ఉపసంహారాలతో నేర్చు కున్నారు.

దీనిని బట్టి రామలక్ష్మణులు ఉత్తమ విద్యార్థులని చెప్పగలము.

ప్రశ్న 9.
రాముడు తొలిసారిగా తాటక అనే స్త్రీని సంహరించడాన్ని ఎలా సమర్థించగలవు ?
జవాబు:
తాటక, ఒక యక్షిణి. ఆమె వేయి ఏనుగుల బలం కలది. తాటక, ఆమె కుమారుడు మారీచుడు, కలసి మలద, కరూశ జనపదాలను విధ్వంసం చేశారు. దుష్టురాలు తాటకను వధించమని విశ్వామిత్రుడు రామునికి చెప్పాడు. రాముడు కొంచెంసేపు మాట్లాడ లేదు.

అప్పుడు విశ్వామిత్రుడు “స్త్రీని చంపడం ఎలా అని, నీకు అనుమానం వద్దు, అధర్మపరురాలయిన తాటకను చంపితే దోషం రాదు” అని రాముడికి కర్తవ్యం ఉపదేశించాడు.

విశ్వామిత్రుడు చెప్పినట్లు చేయమని దశరథుడు రాముడికి వచ్చేటప్పుడు చెప్పాడు. తండ్రిగారి ఆజ్ఞ రామునకు శిరోధార్యము. అలాగే గురువుగారయిన విశ్వామిత్రుడి ఆజ్ఞను పాటించడం శిష్యుడిగా రాముడి కర్తవ్యం. అందువల్లనే తాటక స్త్రీ అయినప్పటికీ, తండ్రి, గురువుల ఆజ్ఞలను శిరసా వహించి, రాముడు తాటకను చంపాడు. అందులో తప్పు లేదు.

TS 10th Class Telugu Guide రామాయణం బాలకాండ

ప్రశ్న 10.
బ్రహ్మ దగ్గర దేవతలంతా ఏమని గోడు వెళ్ళబోసు కున్నారు ? బ్రహ్మ వారికిచ్చిన జవాబేమి ?
జవాబు:
రావణాసురుడు బ్రహ్మ వరప్రభావం చేత విర్ర వీగుతూ తమను చిత్రహింసలకు గురిచేస్తున్నా డన్నారు. ముల్లోకాలను బాధించడమేగాక ఇంద్రుణ్ణి సైతం రాజ్యభ్రష్టుణ్ణి చేయడానికి పూనుకొన్నాడని తెలిపారు. అతని ఆగడాలకు అంతే లేదన్నారు. ఋషులు, యక్షగంధర్వులమాట అటుంచి అతని భయంతో సూర్యుడు, సముద్రుడు, వాయువు కూడా తమ సహజస్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయారు. అతనిపీడ విరుగడయ్యే ఆలోచనను బ్రహ్మనే చెప్పమని వేడుకున్నారు.

బ్రహ్మ దేవతలతో “రావణుడు గంధర్వ, యక్ష, దేవ, దానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరాడు. మానవులపట్ల అతనికి చులకన భావం అందుకే వారి గురించి ప్రస్తావించలేదు. కనుక మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉందని” అన్నాడు.

ప్రశ్న 11.
రాముడు తాటకని సంహరించిన సన్నివేశాన్ని వివరించండి. (June 2015)
జవాబు:
తాటక అనే యక్షిణి వేయి ఏనుగుల బలం కలిగినది. ఆమెను ఎవరూ ఎదిరించలేకపోతున్నారు. దుష్టురాలైన తాటకను చంపుమని విశ్వామిత్రుడు రామునికి చెప్పాడు. అధర్మపరురాలయిన తాటకను చంపితే దోషం రాదని మహర్షి చెప్పాడు. గురువు ఆజ్ఞను పాటించాలని రాముడికి తండ్రి కూడా చెప్పాడు.

వికృతాకారంతో విరుచుకుపడుతున్న తాటక చేతులను రాముడు వాడి బాణాలతో ఖండించాడు. అయినా ఆవేశంతో వస్తున్న తాటక ముక్కుచెవులను లక్ష్మణుడు కోసి వేశాడు. తాటక ఆవేశం రెండింతలయ్యింది. తాను కనిపించకుండా రామలక్ష్మణులపై రాళ్ళ వర్షం కురిపించింది.

అసుర సంధ్యాకాలంలో రాక్షసులు మహాబలం పొందుతారు. సంధ్యాకాలం రాకుండానే తాటకను చంపమని మహర్షి రాముడికి చెప్పాడు. దానితో రాముడు శబ్దవేధి విద్యను ప్రదర్శిస్తూ తాటకపై బాణప్రయోగం చేశాడు. క్షణకాలంలో తాటక నేలపైపడి ప్రాణాలను వదలింది. మహర్షి సంతోషించి రాముడికి ఎన్నో దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు.

TS 10th Class Telugu Guide రామాయణం బాలకాండ

ప్రశ్న 12.
రామలక్ష్మణులు విశ్వామిత్రుని యజ్ఞ సంరక్షణను చేసిన తీరును తెలపండి. (March 2015)
(లేదా)
శ్రీరాముడు విశ్వామిత్రుని యజ్ఞాన్ని సంరక్షించిన విధానాన్ని వివరించండి. (June 2019)
జవాబు:
రామలక్ష్మణులు దశరథుని పుత్రులు. ధనుర్విద్య నేర్చారు. విశ్వామిత్రుడు దశరథుని వద్దకు వచ్చి, రాక్షసులు తన యజ్ఞానికి విఘ్నం కలుగజేస్తున్నారనీ, యజ్ఞ రక్షణకు రాముణ్ణి తనతో 10 రోజులు పంపమనీ కోరాడు. రాముడికి ఇంకా 16 ఏళ్ళు నిండలేదనీ యజ్ఞరక్షణకు తానే వస్తానని దశరథుడన్నాడు.

తన యజ్ఞానికి మారీచ సుబాహులు విఘ్నాలు కలుగజేస్తున్నారని విశ్వామిత్రుడు చెప్పాడు. రాక్షసులు మీదికి రాముణ్ణి పంపలేనన్నాడు దశరథుడు. విశ్వామిత్రునికి కోపం వచ్చింది. వశిష్ఠ మహర్షి దశరథునికి నచ్చచెప్పి, రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుని వెంట పంపాడు.

విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ‘బల’, ‘అతిబల’ అనే విద్యలు ఉపదేశం చేశాడు. ఆ విద్యల మహిమవల్ల రామలక్ష్మణులకు ఆకలిదప్పులు ఉండవు. మార్గమధ్యంలో తాటక అనే రాక్షసి రాగా విశ్వామిత్రుని మాటపై రాముడు తాటక బాహువులు ఖండించాడు. లక్ష్మణుడు దాని ముక్కు, చెవులు కోశాడు. శబ్దవేధి బాణంతో రాముడు తాటకను చంపాడు.

విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో సిద్ధాశ్రమం చేరి, యజ్ఞదీక్ష చేపట్టాడు. మారీచ సుబాహులు యజ్ఞకుండంలో రక్తం కురిపించారు. మారీచుడిపై రాముడు ‘శీతేషువు’ అనే మానవాస్త్రాన్ని ప్రయోగించాడు. మారీచుడు సముద్రంలో పడ్డాడు. ఆగ్నేయాస్త్రంతో రాముడు సుబాహుణ్ణి చంపాడు. మిగిలిన రాక్షసులను, ‘వాయవ్యాస్త్రం’తో తరిమారు. మహర్షి యజ్ఞం చక్కగా పూర్తయ్యింది.

ప్రశ్న 13.
రామలక్ష్మణులు విశ్వామిత్ర యాగాన్ని రక్షించిన వృత్తాంతాన్ని తెలపండి.
(లేదా)
విశ్వామిత్రుని వెంట వెళ్ళిన రామలక్ష్మణులు అతని యాగాన్ని కాపాడిన విధానాన్ని వివరించండి. (May 2022)
జవాబు:
రామలక్ష్మణులు దశరథుని పుత్రులు. ధనుర్విద్య నేర్చారు. విశ్వామిత్రుడు దశరథుని వద్దకు వచ్చి, రాక్షసులు తన యజ్ఞానికి విఘ్నం కలుగజేస్తున్నారనీ, యజ్ఞ రక్షణకు రాముణ్ణి తనతో 10 రోజులు పంపమనీ కోరాడు. రాముడికి ఇంకా 16 ఏళ్ళు నిండలేదనీ యజ్ఞరక్షణకు తానే వస్తానని దశరథుడన్నాడు.

తన యజ్ఞానికి మారీచ సుబాహులు విఘ్నాలు కలుగజేస్తున్నారని విశ్వామిత్రుడు చెప్పాడు. రాక్షసుల మీదికి రాముణ్ణి పంపలేనన్నాడు దశరథుడు. విశ్వామిత్రునికి కోపం వచ్చింది. వశిష్ఠ మహర్షి దశరథునికి నచ్చచెప్పి, రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుని వెంట పంపాడు.

విశ్వామిత్రుడు . రామలక్ష్మణులకు ‘బల’, ‘అతిబల’ అనే విద్యలు ఉపదేశం చేశాడు. ఆ విద్యల మహిమవల్ల రామలక్ష్మణులకు ఆకలిదప్పులు ఉండవు. మార్గమధ్యంలో తాటకి అనే రాక్షసి రాగా విశ్వామిత్రుని మాటపై రాముడు తాటక బాహువులు ఖండించాడు. లక్ష్మణుడు దాని ముక్కు, చెవులు కోశాడు. శబ్దభేది బాణంతో రాముడు తాటకను చంపాడు.

విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో సిద్ధాశ్రమం చేరి, యజ్ఞదీక్ష చేపట్టాడు. మారీచ సుబాహులు యజ్ఞకుండంలో రక్తం కురిపించారు. మారీచుడిపై రాముడు ‘శీతేషువు’ అనే మానవాస్త్రాన్ని ప్రయోగించాడు. మారీచుడు సముద్రంలో పడ్డాడు. ఆగ్నేయాస్త్రంతో రాముడు సుబాహుణ్ణి చంపాడు. మిగిలిన రాక్షసులను, ‘వాయవ్యాస్త్రం’తో తరిమారు. మహర్షి యజ్ఞం చక్కగా పూర్తయ్యింది.

TS 10th Class Telugu Guide రామాయణం బాలకాండ

ప్రశ్న 14.
వాల్మీకి మహర్షి రామాయణ రచనకు శ్రీకారం చుట్టిన విధానం గురించి తెలపండి.
జవాబు:
నారద మహర్షి ఒకసారి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. “మంచిగుణాలు కలవాడూ, మాట తప్పనివాడూ, ధర్మం తెలిసినవాడూ మొదలయిన శుభలక్షణాలు గలవాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా ? అని, వాల్మీకి మహర్షి నారదుని ప్రశ్నించాడు. “సాధారణంగా ఇన్ని విశిష్ట గుణాలు కలవాడు ఉండడు. కాని శ్రీరాముడు ఒక్కడు మాత్రం అలాంటివాడు ఉన్నాడు అని చెప్పి, నారదుడు వాల్మీకికి రామకథను చెప్పాడు. నారదుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు.

వాల్మీకి రామకథను గురించి ఆలోచిస్తూ, శిష్యులతో తమసానదీ స్నానానికి వెళ్ళాడు. అక్కడ ఒక వేటగాడు బాణంతో ఒక మగ క్రౌంచ పక్షిని కొట్టి చంపాడు. వాల్మీకి హృదయంలో కరుణ రసం పొంగింది. “మానిషాద” అనే శ్లోకం ఆయన నోట వెలువడింది. వాల్మీకి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు.

సృష్టికర్త అయిన బ్రహ్మ, వాల్మీకిని చూడడానికి వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి బ్రహ్మకు ఉపచారాలు చేశాడు. బ్రహ్మ, వాల్మీకిని కూర్చోమన్నాడు. వాల్మీకి హృదయంలో ‘మానిషాద’ శ్లోకం, మళ్ళీ మళ్ళీ ప్రతిధ్వనించింది. బ్రహ్మ చిరునవ్వు నవ్వి వాల్మీకితో “నీవు పలికినది శ్లోకమే. ఈ ఛందస్సులోనే, నీవు రామాయణం రాయి. భూమండలంలో పర్వతాలూ, నదులూ ఉన్నంతకాలం, ప్రజలు రామాయణగాథను కీర్తిస్తూనే ఉంటారు” అని చెప్పాడు.

ఈ విధంగా బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం, వాల్మీకి మహర్షి రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు.

ప్రశ్న 15.
దశరథునికి పుత్రజననం గురించి రాయండి. (లేదా) రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల జననం.
జవాబు:
సరయూనదీ తీరంలో “కోసల” దేశం ఉంది. దాని ముఖ్యనగరం ‘అయోధ్య. దాన్ని దశరథ మహారాజు పాలిస్తున్నాడు. దశరథుడు ధర్మపరాయణుడు. ఇతని పాలనలో దేశం, భోగభాగ్యాలతో విలసిల్లేది. ప్రజలు సుఖంగా ఉండేవారు. దశరథునకు సంతానం లేదు. సంతానం కోసం ఆయన అశ్వమేథయాగం చేద్దామనుకున్నాడు. దశరథుని మంత్రి సుమంత్రుడు అందుకు ఋష్యశృంగమహర్షిని పిలవమన్నాడు.

ఋష్యశృంగుడు ఉన్నచోట వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఋష్యశృంగుడు మూడురోజులు అశ్వమేథయాగం చేయించాడు. పుత్రుల కోసం యజ్ఞం చేయించమని దశరథుడు, ఋష్యశృంగుని కోరాడు. ఇంతలో దేవతలు రావణాసురుడు తమను చిత్రహింస పెడుతున్నాడని బ్రహ్మకు చెప్పారు. రావణాసురుని బాధ తప్పే ఉపాయం చెప్పమునీ, దేవతలు బ్రహ్మను కోరారు.

బ్రహ్మ, దేవతలతో రావణాసురునికి మానవులవల్లనే మరణం ఉందని చెప్పాడు. ఇంతలో శ్రీమహావిష్ణువు వచ్చాడు. దేవతలు మానవుడిగా పుట్టి రావణాసురుని సంహరించమని విష్ణుమూర్తిని కోరారు. దశరథ మహారాజు ముగ్గురు భార్యలకూ నాలుగురూపాలలో పుత్రుడిగా పుట్టమని దేవతలు విష్ణువును కోరారు. విష్ణువు వారికి అభయం ఇచ్చాడు.

దశరథుడి పుత్రకామేష్టి యజ్ఞకుండం నుండి, బ్రహ్మ పంపించగా ఒక దివ్యపురుషుడు బంగారు పాత్రతో దివ్యపాయసం తీసుకొనివచ్చాడు. ఆ పాయసపాత్రను అతడు దశరథుడికి ఇచ్చాడు. దశరథుడు ఆ పాయసాన్ని తన భార్యలయిన కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు పంచాడు. కౌసల్యకు రాముడు, కైకకు భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు.

TS 10th Class Telugu Guide రామాయణం బాలకాండ

ప్రశ్న 16.
సీతారాముల వివాహ వృత్తాంతాన్ని రాయండి.
జవాబు:
విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో “జనక మహారాజు యజ్ఞం చేస్తున్నాడు. అక్కడ ఒక మహాధనుస్సు ఉంది. అక్కడకు వెడదాం” అన్నాడు. రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట మిథిలకు బయలుదేరారు. దారిలో మహర్షి రామలక్ష్మణులకు తన వంశాన్ని గూర్చి, గంగ వృత్తాంతాన్ని గూర్చి చెప్పాడు. భగీరథుని వృత్తాంతం చెప్పాడు.

మిథిలా నగరం సమీపంలో, వారు గౌతమ మహర్షి ఆశ్రమం చూశారు. ఆ ఆశ్రమంలో అహల్యాగౌతములు ఉండేవారు. అహల్య తప్పు చేసిందని గౌతముడు అహల్యను వేల సంవత్సరాల పాటు అన్నపానాలు లేకుండా బూడిదలో పడి ఉండమని శపించాడు. రాముని రాకతో ఆమెకు శాపవిముక్తి కలుగుతుందని చెప్పాడు. రాముడు మహర్షి ఆదేశంపై గౌతమాశ్రమంలో కాలుమోపి, అహల్యకు శాపవిముక్తి కల్పించాడు.

మిథిలలో జనకమహారాజు వీరిని ఆదరించాడు. అహల్యా గౌతముల కుమారుడు శతానందుడు, రామునికి కృతజ్ఞతలు చెప్పాడు. జనకుడు రామలక్ష్మణులను ఆహ్వానించాడు. విశ్వామిత్రుడు జనకునితో “వీరు దశరథ పుత్రులు రామలక్ష్మణులు. నీ ధనుస్సును చూద్దామని వచ్చారు. చూపించు శుభం కలుగుతుంది” అని చెప్పాడు. జనకుడు శివధనుస్సు చరిత్రను వివరించి తన కూతురు సీత నాగటి చాలులో దొరికిందనీ, ఆ సీతను శివధనుస్సును ఎక్కుపెట్టగల వీరునికి ఇచ్చి పెండ్లి చేస్తాననీ చెప్పాడు. చాలామంది రాజులు శివధనుస్సును ఎక్కుపెట్టలేకపోయారని కూడా చెప్పాడు.

విశ్వామిత్రుడు శివధనుస్సును తెప్పించమన్నాడు. ఐదువేలమంది కలసి శివధనుస్సు ఉన్న పెట్టెను సభలోకి తెచ్చారు. రాముడు పట్టుకోగానే శివధనుస్సు వంగింది. నారి ఎక్కుపెట్టగా ఆ ధనుస్సు ధ్వని చేస్తూ విరిగింది.

జనకుడు సీతారాములకు పెండ్లి చేయడానికి సిద్ధం అయ్యాడు. దశరథునికి కబురుపెట్టారు. అయోధ్య నుండి అందరూ వచ్చారు. జనకుడు తన కుమార్తెలు సీతా, ఊర్మిళలను, రామలక్ష్మణులకు, తన తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలు మాండవిని, శ్రుతకీర్తిని భరతశత్రుఘ్నులకు ఇచ్చి పెండ్లి చేశాడు.

ప్రశ్న 17.
శ్రీరాముడు శివధనుస్సును విరిచిన విధానాన్ని తెల్పండి.
జవాబు:
జనక మహారాజు, విశ్వామిత్ర రామలక్ష్మణులను ఆహ్వానించాడు. విశ్వామిత్రుడు జనక మహారాజునకు రామలక్ష్మణులను చూపించి, “వీరు దశరథ మహారాజు కుమారులు, వీరులు. వీరు శివధనుస్సును చూడాలనుకుంటున్నారు” అని చెప్పాడు. జనకుడు శివధనుస్సు చరిత్రను చెప్పాడు. యాగం కోసం తాను భూమిని దున్నుతుండగా ‘సీత’ దొరికిందనీ, శివధనుస్సును ఎక్కుపెట్టిన వీరుడే సీతకు తగిన భర్త అనీ అన్నాడు. పూర్వంలో రాజులు ఎవ్వరూ శివధనుస్సును ఎక్కుపెట్టలేకపోయారని జనకుడు చెప్పాడు.

విశ్వామిత్రుడు జనకమహారాజు మాటలు విని శివధనుస్సును తెప్పించమన్నాడు. ఐదువేలమంది బలవంతులు శివధనుస్సు ఉన్న పెట్టెను తెచ్చారు. విశ్వామిత్రుని అనుమతితో రాముడు ధనుస్సు మధ్యభాగాన్ని అవలీలగా పట్టుకొన్నాడు. ధనుర్విద్యలో ఆరితేరిన రాముని చేయి తగలగానే శివధనుస్సు వంగింది.

రాముడు వింటికి నారిని సంధించాడు. అల్లెత్రాడును ఆకర్ణాంతంగా లాగాడు. పిడుగు పడ్డట్టుగా భయంకర శబ్దాన్ని చేస్తూ శివధనుస్సు ఫెళ్ళున విరిగింది. జనక విశ్వామిత్రులు, రామలక్ష్మణులు తప్ప, మిగిలినవారంతా మూర్ఛపోయారు.

TS 10th Class Telugu Guide రామాయణం బాలకాండ

ప్రశ్న 18.
“జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండడం, ఉత్తమ విద్యార్థుల లక్షణం” సమర్థిస్తూ రాయండి.
జవాబు:
విశ్వామిత్రుడు యజ్ఞ రక్షణకై రాముని తన వెంట పంపించమని దశరథుని కోరాడు. వశిష్ఠుని హితవచనాలు విని, దశరథుడు రామలక్ష్మణులను విశ్వామిత్రుడికి అప్పగించాడు.

విశ్వామిత్రుని రామలక్ష్మణులు అనుసరించారు. వారు చాలాదూరం, సరయూ నదీ తీరం వెంట ప్రయాణించారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ‘బల’, ‘అతిబల’ అనే విద్యలను బోధించాడు. ఆ విద్యల ప్రభావం వల్ల వారికి ఆకలి దప్పులు ఉండవు. రూపకాంతులు తగ్గిపోవు. నిద్రలో ఉన్నా, ఏమరుపాటుతో ఉన్నా రాక్షసులు వారిని ఏమీ చేయలేరు. మూడు లోకాల్లో రామలక్ష్మణులను ఎదిరించి పోరాడేవారు ఉండరు.

రాముడు గురుసేవలో నిమగ్నుడయ్యాడు. విశ్వామిత్రుని పాదాలు ఒత్తాడు. గురుసేవ విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఈ విధంగా జ్ఞానాన్ని పొందడంలో శిష్యులు నిరంతరం అప్రమత్తులై ఉండాలి. అదే ఉత్తమ విద్యార్థుల లక్షణం.

ఉత్తమ విద్యార్థులైన రామలక్ష్మణులు, గురువుగారు చెప్పినట్లు ‘తాటకి’ అనే రాక్షసిని సంహరించారు. అందుకు సంతోషించి విశ్వామిత్ర మహర్షి, రామలక్ష్మణులకు ఎన్నో దివ్యాస్త్రాలను ప్రసాదించాడు. గురువు అనుగ్రహిస్తే శిష్యునకు ఇవ్వలేనిది ఏమీ ఉండదు. జ్ఞానాన్ని పొందడంలో ఎప్పుడూ అప్రమత్తులై ఉండడం, ఉత్తమ విద్యార్థుల లక్షణం అని దీనిని బట్టి గ్రహించాలి.

రాముడు అప్రమత్తుడై ఉన్నందువల్లే, విశ్వామిత్రుడి నుండి అనేక విద్యలూ, శస్త్రాస్త్రములూ సంపాదించాడు.

ప్రశ్న 19.
దశరథుడు సంతానం కోసం చేసిన యాగాలు ఏమిటి ? యాగ నిర్వహణ భారం ఎవరు వహించారు ?
జవాబు:
దశరథుడు సంతాన ప్రాప్తి కోసం “అశ్వమేధయాగం”, పుత్ర సంతానం కోసం “పుత్రకామేష్టి” యాగం చేశాడు. అశ్వమేధయాగం చేయాలి అనుకొన్నప్పుడు మంత్రీ, సారథీ అయిన సుమంత్రుని సలహా మేరకు ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానించాడు. ఋష్యశృంగుడు విభాండక మహర్షి కుమారుడు. నిష్ఠాగరిష్ఠుడు. మూడు రోజులపాటు అశ్వమేధ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించాడు.

తర్వాత దశరథుని కోరిక మేరకు ఋష్యశృంగుడు పుత్రకామేష్టి యాగభారాన్ని కూడా వహించాడు. ఈ యాగానికి బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు హాజరై దశరథుని కోరిక తీరాలని దీవించారు.

TS 10th Class Telugu Guide రామాయణం బాలకాండ

ప్రశ్న 20.
శ్రీరాముడు శివధనుస్సును విరిచిన విధానాన్ని తెలపండి.
జవాబు:
విశ్వామిత్రుడు జనకుని ఆహ్వానం మేరకు రామలక్ష్మణులతో కలిసి మిథిలా నగరానికి వెళ్ళాడు. దశరథ కుమారులైన రామ లక్ష్మణులను జనక మహారాజుకు చూపించి, జనకుని వద్ద ఉన్న శివధనుస్సును వారికి చూపించమన్నాడు. జనకుడు శివధనుస్సుని చరిత్రను వివరించి, దానిని ఎక్కుపెట్టిన వారిని సీతకు తగిన భర్తగా గుర్తిస్తానన్నాడు. గతంలో ఎందరో రాజులు ప్రయత్నించి విఫలమయ్యారని చెప్పాడు. జనకుని ఆజ్ఞ మేరకు బలిష్టులు, ఆజానుబాహులు అయిన ఐదువేలమంది శివధనుస్సు ఉన్న పెట్టెను సభావేదికపై ఉంచారు.

విశ్వామిత్రుని అనుమతితో శ్రీరాముడు ధనుస్సు మధ్యభాగాన్ని పట్టుకుని పైకి లేపాడు. ధనుర్విద్య యందు ఆరితేరిన శ్రీరాముడు వింటినారిని పట్టి లాగాడు. పిడుగుపాటు వంటి భయంకరమైన శబ్దంతో శివధనుస్సు విరిగింది. విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు తప్ప మిగిలిన వారంతా మూర్ఛపోయారు.

ప్రశ్న 21.
భగీరథ ప్రయత్నం అనే జాతీయానికి సంబంధించిన కథను తెలపండి.
జవాబు:
భగీరథుడు పాతాళంలో బూడిదకుప్పలై పడి ఉన్న సాగరపుత్రులకు ఉత్తమగతులు కల్పించాలనుకున్నాడు. అందుకు ఆకాశంలో ఉన్న సురగంగను పాతాళానికి రప్పించాలి. దృఢసంకల్పానికి అసాధ్యమేమున్నది. బ్రహ్మ కోసం తపస్సు చేసి అతని సలహా మేరకు గంగను ఒప్పించి, ఆకాశం నుండి దూకే గంగను భరించడానికి శివుణ్ణి మెప్పించి, గంగను నేలకు తెచ్చి జహ్నుడు అడ్డురాగా అతనిని ప్రార్థించాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా భయపడక గంగను పాతాళం దాకా తీసుకువెళ్ళి పని పూర్తి చేయగలిగాడు. అందుకే ఎన్ని అడ్డంకులు వచ్చినా పట్టువదలని సందర్భంలో భగీరథ ప్రయత్నం అనే జాతీయం ఏర్పడింది.

ప్రశ్న 22.
రామాయణం మానవ జీవితానికి స్ఫూర్తి నిచ్చే మహాకావ్యం అని ఎలా చెప్పగలవు ? (లేదా) రామాయణాన్ని ఎందుకు చదవాలి ? (లేదా) రామాయణం చదవడం వలన ప్రయోజనమేమిటి ?
జవాబు:
మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం. మానవ హృదయాలను పరిశుద్ధం చేయగల మహా కావ్యం రామాయణం. అమ్మానాన్నలకు పిల్లలపై గల వాత్సల్యం దశరథుని పాత్ర ద్వారా తెలియజేస్తోంది. రామలక్ష్మణుల ద్వారా అన్నదమ్ములెలా ఉండాలో తెలియజేస్తోంది. సీతారాముల పాత్రల ద్వారా భార్యాభర్తల అనురాగం ఎలా ఉండాలో తెలియజేస్తోంది. గురువుగారి పట్ల శిష్యుల భక్తి, శిష్యుల పట్ల గురువులకు ఉండవలసిన వాత్సల్యాన్ని విశ్వామిత్రుడు, రామలక్ష్మణుల పాత్రలు తేలియజేస్తున్నాయి.

సేవకుడు-యజమాని ఉండవలసిన తీరును హనుమ – శ్రీరామ, హనుమ-సుగ్రీవ పాత్రలు తెలియజేస్తాయి. స్నేహితులు ప్రవర్తించవలసిన తీరును తెలియజేసేవి శ్రీరామ సుగ్రీవ పాత్రలు. ఈ విధంగా రామాయణం చదవడం వలన సమాజంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. మానవ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం తెలుస్తుంది. ధర్మంగా ప్రవర్తించడం తెలుస్తుంది.

TS 10th Class Telugu Guide రామాయణం బాలకాండ

ప్రశ్న 23.
అహల్యకు శాపవిముక్తి కలిగిన విధానాన్ని రాయండి.
(లేదా)
‘శ్రీరామ పాదం సోకి రాయి ఆడదైనది’ అనే విషయాన్ని సమర్థించండి.
జవాబు:
మిథిలానగర సమీపానికి చేరుకొన్నారు విశ్వామిత్ర రామలక్ష్మణులు. అక్కడ గౌతముని ఆశ్రమం చూశారు. ఆ ఆశ్రమం అందంగా ఉంది. కాని, జనసంచారం లేదు. గౌతమ మహర్షి భార్య అహల్య అనీ, ఆమె ఒక తప్పు చేసినందుకు ఆమెను గౌతముడు శపించాడనీ విశ్వామిత్ర మహర్షి చెప్పాడు. అప్పటి నుండి అహల్య వాయువే ఆహారంగా తీసుకొని జీవిస్తూ బూడిదలో పడి ఉంది.

అహల్య అదృశ్య రూపంలో ఉంది. రాముని రాకతో ఆమెకు నిజరూపం కల్గుతుందని గౌతముడు చెప్పాడని విశ్వామిత్రుడు శ్రీరామునకు చెప్పాడు. విశ్వామిత్రుని ఆజ్ఞతో గౌతముని ఆశ్రమంలో శ్రీరాముడు పాదం మోపాడు. ఆ పవిత్ర పాదం పెట్టగానే అహల్య పూర్వ రూపం పొందింది. అహల్యా గౌతములు శ్రీరాముని సత్కరించారు.

ప్రశ్న 24.
విశ్వామిత్రుని వెంట అయోధ్య నుండి బయలుదేరి, సిద్ధాశ్రమం చేరేవరకు రామలక్ష్మణులకు ఎదురైన సంఘటనల గురించి రాయండి.
జవాబు:
వశిష్ఠుని హిత వచనాలతో విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులను దశరథుడు పంపాడు.

రామలక్ష్మణులు, విశ్వామిత్రుడు సరయూనది వెంబడి నడుస్తున్నారు. కొంత దూరం ప్రయాణించాక రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు ‘బల’, ‘అతిబల’ విద్యలనుపదేశించాడు. వీటి వల్ల అలసట, ఆకలి, దాహం, శత్రుభయం ఉండవు. మరునాడు ‘మలద’, ‘కరూశ’ జనపదాలకు చేరారు. అక్కడ విశ్వామిత్రుని ఆజ్ఞతో శబ్దభేది విద్యతో ‘తాటక’ను చంపాడు. విశ్వామిత్రుడు ఆనందించాడు. ఎన్నో దివ్యాస్త్రాలను ఇచ్చాడు.

తర్వాత సిద్ధాశ్రమం చేరారు. అదే విశ్వామిత్రుని యజ్ఞభూమి.

ప్రశ్న 25.
అయోధ్య నగరం గురించి రాయండి.
జవాబు:
సరయూనదీ తీరంలో ‘కోసల’ దేశం ఉంది. అందులోనే అయోధ్యా నగరం ఉంది. అయోధ్య అంటే యోధులకు జయించడానికి వీలులేనిది అని అర్థం. అయోధ్యా నగరాన్ని మనువు నిర్మించాడు. కోసల దేశాన్ని పాలించిన రాజులంతా అయోధ్యను రాజధానిగా చేసుకొని పరిపాలించారు. చాలా మంది ధర్మమూర్తులైన చక్రవర్తులు పరిపాలించారు. ప్రజలు కూడా ధర్మపరాయణులు. సుఖసంతోషాలలో జీవించారు. అయోధ్యా నగరం భోగభాగ్యాలతో విలసిల్లింది.

TS 10th Class Telugu Guide రామాయణం బాలకాండ

ప్రశ్న 26.
విశ్వామిత్రుడెందుకు అగ్గిమీద గుగ్గిలమయ్యాడు ? అది సమంజసమా ? వివరించండి..
జవాబు:
విశ్వామిత్రుడు కోరినది చేస్తానని దశరథుడు మాట ఇచ్చాడు. శ్రీరాముని తన వెంట యాగరక్షణకు పంపమని విశ్వామిత్రుడు కోరాడు. తన చిన్ని రాముడు యుద్ధం చేయలేడనీ, తానే వస్తానన్నాడు దశరథుడు. ఈ విధంగా ఇచ్చిన మాట తప్పే ప్రయత్నం చేసిన దశరథునిపై విశ్వామిత్రునికి కోపం వచ్చింది. అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు.

అది సమంజసమే. ఎందుకంటే బాల రామునికి విలువిద్యలో మెళకువలు నేర్పాలని విశ్వామిత్రుని ప్రయత్నం. రామునికి రాక్షస సంహారంలో అనుభవ పూర్వకమైన విజ్ఞానం కల్గించాలని విశ్వామిత్రుని ఆలోచన. దానికి ఆటంకం ఏర్పడింది. ముందు ఇచ్చిన మాట తప్పడం దశరథుని (సూర్య) వంశపు రాజులెవరూ చేయలేదు. దశరథుడు మాట మార్చడం వలన ఆ వంశానికి చెడ్డపేరు వస్తుంది. అలా జరగకూడదని విశ్వామిత్ర మహర్షి కోరిక.

ప్రశ్న 27.
గంగావతరణాన్ని గురించి విశ్వామిత్రుడు రామునికి చెప్పడంలో ఆంతర్యం ఏమిటి ?
జవాబు:
శ్రీరాముడు తన పూర్వీకుల గొప్పతనం తెలుసుకోవాలి. వారి గౌరవానికి తగినట్లుగా తన శిష్యుడైన శ్రీరాముడు కూడా ప్రవర్తించాలి అని విశ్వామిత్రుని ఆంతర్యం. తన పూర్వుల వలె శ్రీరాముడు కూడా తల్లిదండ్రుల పట్ల భక్తి గౌరవాలు కల్గి ఉండాలి. చేపట్టిన పనిని పూర్తి చేసే పట్టుదల అలవడాలి. తన పూర్వుల కంటె ఉన్నతంగా, ఆదర్శవంతంగా జీవించాలనే కోరిక శ్రీరామునిలో కల్గించడమే విశ్వామిత్రుని లక్ష్యం. అదే ఆయన ఆంతర్యం.

పరిచిత గద్యాలు

ప్రశ్న 1.
కింది పేరాను చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మను చేరి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. రావణాసురుడు బ్రహ్మ వరప్రభావం చేత విర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురిచేస్తున్నాడన్నారు. ముల్లోకాలను బాధించడమే కాక ఇంద్రుణ్ణి సైతం రాజ్యభ్రష్టుణ్ణి చేయడానికి పూనుకొన్నాడని తెలిపారు. అతని దుండగాలకు అంతే లేదన్నారు. ఋషుల, యక్ష గంధర్వుల మాట అటుంచి అతని భయంతో సూర్యుడు, సముద్రుడు, వాయువు కూడా తమ సహజస్థితిని ప్రకటించలేక పోతున్నారని వాపోయారు. అతని పీడ విరగడయ్యే ఆలోచనను బ్రహ్మనే చెప్పమని వేడుకున్నారు.

ప్రశ్నలు – జవాబులు :

ప్రశ్న 1.
దేవతలంతా తమ కష్టాలను ఎవరికి చెప్పుకున్నారు ?
జవాబు:
దేవతలంతా తమ కష్టాలను బ్రహ్మకు చెప్పుకున్నాడు.

ప్రశ్న 2.
బ్రహ్మ వరప్రభావం చేత విర్రవీగుతున్నది ఎవరు ?
జవాబు:
బ్రహ్మ వరప్రభావం చేత విర్రవీగుతున్నది రావణాసురుడు.

TS 10th Class Telugu Guide రామాయణం బాలకాండ

ప్రశ్న 3.
రావణుడి భయం వల్ల ఎవరు తమ సహజస్థితిని ప్రకటించ లేకపోతున్నారు ?
జవాబు:
రావణుడి భయం వల్ల సూర్యుడు, సముద్రుడు, వాయువు తమ సహజస్థితిని ప్రకటించ లేకపోతున్నారు.

ప్రశ్న 4.
ఎవరిని రాజ్యభ్రష్టుణ్ణి చేయడానికి రావణుడు పూనుకొన్నాడు ?
జవాబు:
ఇంద్రుణ్ణి రాజ్యభ్రష్టుణ్ణి చేయడానికి రావణుడు పూనుకొన్నాడు.

ప్రశ్న 5.
గోడు వెళ్ళబోసుకోవడం అంటే ఏమిటి ?
జవాబు:
బాధలు, కష్టాలు చెప్పుకోవడాన్ని గోడు వెళ్ళబోసుకోవడం అంటారు.

ప్రశ్న 2.
కింది గద్యాన్ని చదువండి. ఆ తర్వాత ప్రశ్నలకు జవాబులు రాయండి. (June 2019)

విశ్వామిత్రుడు సమాధానమిస్తూ “పౌలస్త్యవంశజుడైన విశ్రవసుడనే ముని కుమారుడు రావణాసురుడు. అతడు కుబేరుని సోదరుడు. అనేక రాక్షస బలాలు కలవాడు. బ్రహ్మ ఇచ్చిన అసాధారణ వరాల వల్ల అతని గర్వం ఇబ్బడిముబ్బడైంది. ముల్లోకాలనూ అల్లకల్లోలం చేస్తున్నాడు. అటువంటివాడికి యజ్ఞం భగ్నం చేయడమనేది అల్పంగా తోస్తున్నది. అందుకే ఇటువంటి పనులలో పాల్గొనడు. మారీచ సుబాహులు ఇతనిచేత ప్రేరితులై యజ్ఞాలకు విఘ్నాలను కలిగిస్తున్నా” రనగానే దశరథుడు మరింత భయపడ్డాడు. “యుద్ధంలో యమునితో సమానులైన వారి నెదుర్కోవడానికి నా చిన్నిపాపణ్ణి పంపను. నేను కూడా యుద్ధ విషయంలో అశక్తు” డనని పలికాడు.

ప్రశ్నలు – జవాబులు :
ప్రశ్న 1.
రావణుడి గర్వానికి కారణం ఏమిటి ?
జవాబు:
బ్రహ్మ ఇచ్చిన అసాధారణ వరాల వల్ల రావణుడికి గర్వం కలిగింది.

ప్రశ్న 2.
పై పేరాలో సంభాషణ ఎవరెవరి మధ్య జరిగినది ?
జవాబు:
విశ్వామిత్రునకు, దశరథ మహారాజునకు మధ్య సంభాషణ జరిగింది.

ప్రశ్న 3.
యమునితో సమానులైన వారు ఎవరు ?
జవాబు:
మారీచ సుబాహులు యమునితో సమానులైనవారు.

TS 10th Class Telugu Guide రామాయణం బాలకాండ

ప్రశ్న 4.
ఎవరి ప్రేరణతో మారీచ సుబాహులు యజ్ఞాలకు విఘ్నం కలిగిస్తున్నారు ?
జవాబు:
రావణాసురుని ప్రేరణతో మారీచ సుబాహులు యజ్ఞాలకు విఘ్నం కలిగిస్తున్నారు.

ప్రశ్న 5.
రావణుడు ఏ వంశానికి చెందినవాడు ?
జవాబు:
రావణుడు పౌలస్త్య వంశానికి చెందినవాడు.

ప్రశ్న 3.
కింది గద్యాన్ని చదువండి. (June 2018)

సరయూ నదీ తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశమున్నది. అందులోనిదే ‘అయోధ్యా’ అనే మహానగరం. అయోధ్యా అంటే యోధులకు జయించడానికి శక్యం కానిది. మనువు దీనిని నిర్మించాడు. కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. అతడు సూర్యవంశం వాడు. మహావీరుడు. దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నోమార్లు యుద్ధం చేసినవాడు. ధర్మ పరాయణుడు, ప్రజలను కన్న బిడ్డలవలె చూసుకొనేవాడు. వసిష్ఠ వామదేవులు అతని ప్రధాన పురోహితులు. సుమంత్రుడు మొదలుగా గల ఎనిమిది మంది మంత్రులు. ఇతని పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో విలసిల్లింది. ప్రజల ధర్మ వర్తనులై సుఖసంతోషాలతో ఉన్నారు.

కింద ఇచ్చిన వాక్యాలలో సరైన దానికి (✓) గుర్తు పెట్టి సూచించండి.
1.
అ) శ్రీరాముడు సూర్యవంశం వాడు. [✓]
ఆ) సూర్యవంశానికి చెందినవాడు కాదు దశరథుడు. [ ]

2.
అ) దశరథునికి సుమంత్రుడు మంత్రి. [✓]
ఆ) సుమంత్రుడు దశరథుని కొలువులో లేడు. [ ]

3.
అ) యోధులు జయించటానికి శక్యమైన నగరం’ కోసల. [ ]
ఆ) అయోధ్య యోధులు జయించటానికి శక్యం కానిది. [✓]

4.
అ) కోసలదేశపు రాజ పురోహితులో వసిష్ఠుడు ఒకరు. [✓]
ఆ) దశరథుడి పురోహితులు వసిష్ఠుడు, వామదేవుడు కారు. [ ]

5.
అ) పై గద్యం ప్రకారం రాక్షసులతో యుద్ధం చేసింది దశరథుడు. [ ✓]
ఆ) శ్రీరాముడు రాక్షసులతో యుద్ధం చేసినట్లు పై గద్యంలో ఉంది. [ ]

TS 10th Class Telugu Guide రామాయణం బాలకాండ

ప్రశ్న 4.
కింది పేరాను చదవండి – క్రింది మాటలకు ఒక వాక్యంలో వివరణ వ్రాయండి.

ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుణ్ణి కుంగదీసింది. సంతానప్రాప్తి కోసం అశ్వమేధయాగం చేయాలన్న ఆలోచన కలిగింది. వెంటనే పురోహితులు, గురువులతో సమావేశమయ్యాడు. మనసులోని మాట చెప్పాడు. వారు తథాస్తు అన్నారు. సరయూనదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది. మంత్రీ, సారథీ అయిన సుమంత్రుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమౌతుందని సూచించాడు. ఋష్యశృంగుడు విభాండక మహర్షి కుమారుడు. నిష్ఠాగరిష్టుడు. అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి. దశరథుని ఆజ్ఞమేరకు ఋష్యశృంగుణ్ణి సగౌరవంగా తోడ్కొనివచ్చారు. మూడు రోజులపాటు అశ్వమేధయాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ప్రశ్న 1.
కుంగదీసింది : ……………………………
జవాబు:
అంటే, నీరసింప చేసింది అని భావము. అనగా అణగిపోయాడు అని భావము.

ప్రశ్న 2.
తథాస్తు అన్నారు : ……………………………
జవాబు:
అంటే “అలాగే కానియ్యండి” అని అర్ధము. అందుకు అంగీకరించారని భావం.

ప్రశ్న 3.
నిష్ఠాగరిష్ఠుడు : …………………………….
జవాబు:
‘నిష్ఠ’ అంటే ధర్మము మొదలయిన వాని యందు నమ్మకం కలిగియుండడం. అటువంటి నిష్ఠ. కలవారిలో గొప్పవాడు అని భావం.

ప్రశ్న 4.
సగౌరవంగా తోడ్కొని వచ్చారు : ……………………………
జవాబు:
అంటే గౌరవంగా వెంటబెట్టుకొని తీసుకొని వచ్చారు అని భావము.

ప్రశ్న 5.
శాస్త్రోక్తంగా నిర్వహించారు: …………………………….
జవాబు:
శాస్త్రములో చెప్పిన విధంగా చక్కగా జరిపించారు అని భావము.

TS 10th Class Telugu Guide రామాయణం బాలకాండ

ప్రశ్న 5.
కింది పేరాను చదవండి. దాని కింది మాటలకు ఒక వాక్యంలో వివరణ ఇవ్వండి.

“కాలచక్రం తిరుగుతున్నది. ఒకనాడు దశరథుడు తన మంత్రులు పురోహితులతో సమావేశమయ్యాడు. తన కుమారుడు వివాహ ప్రస్తావన చేస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగుపెట్టాడు. మహా తేజశ్శాలియైన విశ్వామిత్ర మహర్షి, సృష్టికి ప్రతిసృష్టి చేయగల సమర్థుడతడు. దశరథుడు ఎదురేగి స్వాగతించాడు. అతిథి దేవోభవ. అతిథి మనకు దేవునితో సమానం. ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రునకు సముచిత రీతిన మర్యాదలు గావించాడు. వినయపూర్వకంగా చేతులు జోడించి విశ్వామిత్రుని రాకకు కారణాన్ని అడిగాడు. తన పైన కార్యభారాన్ని పెడితే నెరవేరుస్తానన్నాడు. దశరథుని వినయానికి మురిసిపోయాడు విశ్వామిత్రుడు.

ప్రశ్న 1.
సమావేశమయ్యాడు
జవాబు:
అంటే ఇతరులతో కలిసి ఒకచోట కూర్చున్నాడు అని భావము.

ప్రశ్న 2.
వివాహ ప్రస్తావన
జవాబు:
వివాహమును గూర్చి మాట్లాడడం అని భావము.

ప్రశ్న 3.
అతిథి దేవోభవ
జవాబు:
అంటే అతిథిని మనము దేవునితో సమానంగా గౌరవించాలి అని భావము.

ప్రశ్న 4.
సముచిత రీతి
జవాబు:
అంటే మిక్కిలి తగిన విధముగా అని భావము

ప్రశ్న 5.
నెరవేరుస్తానన్నాడు
జవాబు:
అంటే సిద్ధింప చేస్తానన్నాడు. చెప్పినట్లు చేస్తానన్నాడని భావము.

TS 10th Class Telugu Guide రామాయణం బాలకాండ

ప్రశ్న 6.
కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూవున్న ప్రకృతి అందాలకు పరవశిస్తున్నాడు. సమీపంలో ఒక కొమ్మపైన క్రౌంచ పక్షుల జంటను చూశాడు. వాటి అనురాగం ముచ్చటగొలుపుతున్నది. వాటి మధురధ్వనులు వీనులవిందు చేస్తున్నాయి. ఇంతలో ఒక వేటగాడు క్రూరబాణంతో మగపక్షిని నేలకూల్చాడు. అది నెత్తురోడుతూ విలవిలలాడుతూ ప్రాణాలను విడచింది. ఆ ఎడబాటును తట్టుకోలేని ఆడపక్షి తల్లడిల్లిపోయింది. హృదయ విదారకమైన ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి. కరుణరసం జాలువారింది. ధర్మావేశం కట్టలు తెంచుకుంది.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
నదీ తీరంలోని ప్రకృతి ఎలా ఉంటుంది ?
జవాబు:
అందంగా ఉంటుంది.

ప్రశ్న 2.
వేటగాడు పక్షిని ఎందుకు కొట్టాడు ?
జవాబు:
వేటగాడు తన ఆహారం కోసం పక్షిని కొట్టాడు.

ప్రశ్న 3.
వాల్మీకి హృదయం ఎటువంటిది ?
జవాబు:
వాల్మీకి హృదయం సున్నితమైనది.

ప్రశ్న 4.
పక్షుల జంటను చూసి ఎవరు ఆనందించారు ?
జవాబు:
పక్షుల జంటను చూసి వాల్మీకి ఆనందించాడు.

ప్రశ్న 5.
జీవహింస మంచిది కాదా ?
జవాబు:
జీవహింస మంచిది కాదు.

TS 10th Class Telugu Guide రామాయణం బాలకాండ

ప్రశ్న 7.
కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

సరయూ నదీతీరంలో ‘కోసల’ అనే సుప్రసిద్ధ దేశముంది. అందులోనిదే ‘అయోధ్యా’ అనే మహానగరం. ‘అయోధ్యా’ అంటే యోధులకు జయించడానికి శక్యం కానిది. మనువు దీన్ని నిర్మించాడు. కోసల దేశాన్ని దశరథమహారాజు పరిపాలిస్తున్నాడు. అతడు సూర్యవంశం వాడు. మహావీరుడు. దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నోమార్లు యుద్ధం చేసినవాడు. ధర్మపరాయణుడు. ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకునేవాడు. వశిష్ఠ, వామదేవులు అతని ప్రధానపురోహితులు. సుమంత్రుడు మొదలుగాగల ఎనిమిది మంది మంత్రులు. ఇతని పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో విలసిల్లింది. ప్రజలు ధర్మవర్తనులై సుఖసంతోషాలతో ఉన్నారు. ‘యథారాజా తథా ప్రజాః’ – రాజు ఎలా ఉంటే ప్రజలూ అలాగే ఉంటారు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
కోసల దేశంలో ప్రవహించే నది ఏది ?
జవాబు:
కోసల దేశంలో సరయూ నది ప్రవహిస్తోంది.

ప్రశ్న 2.
ఆదర్శవంతమైన రాజు ఎవరు ?
జవాబు:
దశరథ మహారాజు.

ప్రశ్న 3.
కోసల రాజ్యంలో ప్రజలు ఎలా ఉండేవారు ?
జవాబు:
దశరథ మహారాజు వలె ధర్మవర్తనులై ఉండేవారు.

ప్రశ్న 4.
అయోధ్యా నగర నిర్మాణంలో కీలకపాత్ర ఎవరిది ?
జవాబు:
అయోధ్యా నగర నిర్మాణంలో కీలకపాత్ర మనువుది.

ప్రశ్న 5.
కోసల దేశం ఎందుకు భోగభాగ్యాలతో విలసిల్లింది
జవాబు:
దశరథ మహారాజు ధర్మబద్ధంగా పరిపాలించినందున.

TS 10th Class Telugu Guide రామాయణం బాలకాండ

ప్రశ్న 8.
కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారు. వేదశాస్త్రాలనభ్యసించారు. ధనుర్విధ్యలో నైపుణ్యం సంపాదించారు. విజ్ఞానఖనులయ్యారు. సద్గుణాలకు ఆటపట్లైనారు. ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలివి. రాముడు ఎప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యేవాడు. చిన్ననాటి నుంచీ అన్నసేవే మిన్నగా భావించేవాడు లక్ష్మణుడు. ఇతడు రాముడికి బహిఃప్రాణం. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అన్యోన్య ప్రేమాభిమానాలు కలవారు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎలా ఉండేవారు ?
జవాబు:
అన్యోన్య ప్రేమాభిమానాలతో ఉండేవారు.

ప్రశ్న 2.
“వేదశాస్త్రాలను అభ్యసించారు” – దీనిలో సమాసపదం ఏది ?
జవాబు:
వేదశాస్త్రాలు

ప్రశ్న 3.
రాజ కుమారులను శుక్లపక్ష చంద్రునితో ఎందుకు పోల్చారు ?
జవాబు:
రోజు రోజుకు అభివృద్ధి చెందడం వలన.

ప్రశ్న 4.
ఈ పేరాను బట్టి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు ఎవరిని సేవించటం అలవాటు ?
జవాబు:
తమ కంటే పెద్దవారిని సేవించేవారు.

ప్రశ్న 5.
ఈ పేరాకు తగిన శీర్షికను నిర్ణయించండి.
జవాబు:
ఉత్తమ విద్యార్థి.

TS 10th Class Telugu Guide రామాయణం బాలకాండ

ప్రశ్న 9.
కింది గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

దశరుథుడు పుత్రకామేష్టి చేసినప్పుడు యజ్ఞగుండం నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్యపురుషుడు ఆవిర్భవించాడు. అతడు బ్రహ్మ పంపగా వచ్చినవాడు చేతిలో బంగారుపాత్ర, వెండి మూతతో. అందులో దివ్యపాయసమున్నది. దాన్ని దశరథునకందించాడు. ఈ పాయసం సంపదలనిస్తుంది. ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అన్నిటినీ మించి సంతానాన్ని ప్రసాదిస్తుందన్నాడు. పేదవానికి పెన్నిథి దొరికినట్లైంది దశరథునికి. అతని మనస్సు ఆనందతాండవం చేసింది.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
యజ్ఞగుండం నుండి ఉద్భవించిన దివ్యపురుషుడు ఎవరి ఆదేశానుసారం వచ్చాడు ?
జవాబు:
యజ్ఞగుండం నుండి దివ్యపురుషుడు బ్రహ్మ ఆదేశానుసారం వచ్చాడు.

ప్రశ్న 2.
దశరథుడు నిర్వహించిన యాగమేది ?
జవాబు:
దశరథుడు నిర్వహించిన యాగం ‘పుత్రకామేష్టి’.

ప్రశ్న 3.
దివ్యపురుషుడు ప్రసాదించిన పాయసం ప్రత్యేకత ఎట్టిది?
జవాబు:
ఆ పాయసం సంపదలనిస్తుంది. ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. సంతానాన్ని ప్రసాదిస్తుంది.

ప్రశ్న 4.
పేదవానికి పెన్నిథి దొరికినట్లుగా భావించిన దశరథుడు నిజంగా ఏ విషయంలో పేదవాడు?
జవాబు:
దశరథుడు నిజంగా సంతాన భాగ్యంలో పేదవాడు.

ప్రశ్న 5.
ఈ పేరాకు శీర్షిక నిర్ణయించండి.
జవాబు:
ఈ పేరాకు శీర్షిక ‘పాయసప్రదానం’ అంటే సరిపోతుంది.

TS 10th Class Telugu Guide రామాయణం బాలకాండ

ప్రశ్న 10.
కింది గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గిమీద గుగ్గిలమైనాడు. “ఇచ్చిన మాట తప్పడం మా ఇంటావంటా లేదు. నీవందుకు సిద్ధపడితే రిక్తహస్తాలతో తిరిగి వెడతాను, మీరు సుఖంగా ఉండండి” అన్నాడు విశ్వామిత్రుడు. పరిస్థితి తీవ్రతను గమనించాడు వశిష్ఠమహర్షి. ఇచ్చిన మాట నిలుపుకోమని దశరథునికి హితవు పలికాడు. మాట నిలబెట్టుకోని వానికి ధర్మకార్యాల నాచరించిన ఫలం నశిస్తుందని హెచ్చరించాడు. వివిధాస్త్ర ప్రయోగ విధుడైన విశ్వామిత్రుడి వెంట రాముణ్ణి పంపడంలో సంశయానికి తావుండగూడదన్నాడు. రాముణ్ణి పంపితే మేలు జరుగుతుందని సుతిమెత్తగా సూచించాడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
విశ్వామిత్రుడికి ఎందుకు కోపం వచ్చింది ?
జవాబు:
“తనపై పెట్టిన కార్యభారాన్ని నెరవేరుస్తాను” అని ఇచ్చిన మాటను తప్పడం వల్ల దశరథునిపై విశ్వామిత్రుడికి కోపం వచ్చింది.

ప్రశ్న 2.
‘రిక్త హస్తాలతో వెడతాను’ అంటే అర్థం ఏమిటి ?
జవాబు:
వట్టి చేతులతో వెడతానని అర్థం. రాముడిని తీసుకొని వెళ్ళకుండానే వెడతానని భావం.

ప్రశ్న 3.
దశరథునికి వశిష్ఠుడు ఏమని హితము చెప్పాడు ?
జవాబు:
విశ్వామిత్రునకు ఇచ్చిన మాటను నిలుపుకొమ్మని వశిష్ఠుడు దశరథునికి హితము చెప్పాడు.

ప్రశ్న 4.
దశరథుడికి వశిష్ఠుడు ఏమని సూచించాడు ?
జవాబు:
రాముణ్ణి విశ్వామిత్రుని వెంట పంపితే మేలు జరుగుతుందని వశిష్ఠుడు సుతిమెత్తగా సూచించాడు.

ప్రశ్న 5.
ఇంటావంటా లేనిది ఏమిటి ? ఎవరి ఇంట లేదు ?
జవాబు:
‘ఇచ్చిన మాట తప్పడం’ దశరథుని ఇంటావంటా లేదు.

TS 10th Class Telugu Guide రామాయణం బాలకాండ

ప్రశ్న 11.
కింది గద్యభాగాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

“ఇదంతా విని శివధనుస్సును తెప్పించమన్నాడు విశ్వామిత్రుడు. సరేనన్నాడు జనకుడు. బలిష్ఠులు, దీర్ఘకాయులు, అయిన ఐదు వేల మంది అతి కష్టం మీద శివధనుస్సుతో కూడిన పేటికను తీసుకువచ్చారు.

విశ్వామిత్ర మహర్షి అనుమతితో ధనుస్సు మధ్య భాగాన్ని అవలీలగా పట్టుకొన్నాడు రాముడు. ధనుర్విద్య యందు ఆరితేరిన రాముని చేయి సోకినంతనే ఆ ధనుస్సు వంగింది. వింటి నారిని సంధించాడు. వేలకొలది సదస్యులు ఆశ్చర్యంలో మునిగి పోయారు. అల్లెత్రాడును ఆకర్ణాంతంగా లాగాడు రాముడు. పిడుగుపాటులా భయంకర శబ్దాన్ని చేస్తూ ఫెళ్ళున విల్లు విరిగింది. విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు తప్ప మిగతా వారంతా మూర్ఛపోయారు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
శివధనుస్సు పేటికను ఎవరు తెచ్చారు ?
జవాబు:
బలిష్ఠులు, దీర్ఘకాయులు అయిన భటులు శివధనుస్సు ఉన్న పేటిక సభలోకి తెచ్చారు.

ప్రశ్న 2.
ధనుస్సు ఎందుకు వంగింది?
జవాబు:
ధనుర్విద్యలో ఆరితేరిన శ్రీరాముని చేయి సోకగానే ధనుస్సు వంగింది.

ప్రశ్న 3.
విల్లు విరిగినప్పుడు ఎటువంటి శబ్దం వచ్చింది ?
జవాబు:
విల్లు విరిగినపుడు పిడుగుపాటు వంటి భయంకర శబ్దం వినబడింది.

ప్రశ్న 4.
రాముడు శివధనుస్సును ఎవరి అనుమతితో ఎలా పట్టుకొన్నాడు ?
జవాబు:
రాముడు విశ్వామిత్రుని అనుమతితో, అవలీలగా శివధనుస్సును పట్టుకున్నాడు.

ప్రశ్న 5.
శివ ధనుర్భంగ శబ్దం విని మూర్ఛపడని వారెవరు ?
జవాబు:
రామలక్ష్మణులు, విశ్వామిత్రుడు, జనకుడు మూర్ఛ పడలేదు.

TS 10th Class Telugu Guide రామాయణం బాలకాండ

ప్రశ్న 12.
కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

దశరథుడు పుత్రకామేష్టి చేసినప్పుడు యజ్ఞకుండం నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్యపురుషుడు ఆవిర్భవించాడు. అతడు బ్రహ్మపంపగా వచ్చినవాడు చేతిలో బంగారుపాత్ర వెండిమూతతో. అందులో దివ్యపాయసముంది. దాన్ని దశరథునకందించాడు. ‘ఈ పాయసం సంపదలనిస్తుంది, ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అన్నిటినీ మించి సంతానాన్ని ప్రసాదిస్తుంద’న్నాడు. పేదవానికి పెన్నిధి దొరికినట్లైంది దశరథునికి. అతని మనస్సు ఆనందతాండవం చేసింది.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
పాయస పాత్రను ఎవరు పంపారు ?
జవాబు:
బ్రహ్మదేవుడు పంపాడు.

ప్రశ్న 2.
పుత్రకామేష్టియాగం ఎందుకు చేస్తారు ?
జవాబు:
సంతానం కోసం.

ప్రశ్న 3.
దశరథునికి ఎందుకు ఆనందం కలిగింది ?
జవాబు:
తనకు సంతానం కలుగుతుందని.

ప్రశ్న 4.
మానవునికి కావలసినదేమిటి ?
జవాబు:
సంపద, ఆరోగ్యం, సంతానం.

ప్రశ్న 5.
బంగారు పాత్రలో ఏముంది ?
జవాబు:
దివ్యపాయసం.

TS 10th Class Telugu Guide రామాయణం బాలకాండ

ప్రశ్న 13.
కింది పేరాను చదివి, ఎందుకు, ఏమిటి, ఎలా అనేవి ఉపయోగించి 5 ప్రశ్నలు తయారుచేయండి.

రామలక్ష్మణ సహితుడయి విశ్వామిత్రుడు ‘సిద్ధాశ్రమం’ చేరుకున్నాడు. అదే అతని యజ్ఞభూమి. రామలక్ష్మణులు వినయంగా చేతులు జోడించి గురువుగారిని యజ్ఞదీక్షను స్వీకరించమని ప్రార్థించారు. మన్నించాడు మహర్షి.. యజ్ఞదీక్షితుడయ్యాడు. మరునాడు యజ్ఞం ప్రారంభమైంది. ఆరు రోజులపాటు సాగే ఈ యజ్ఞ విషయంలో అత్యంత జాగరూకులై ఉండమని రామలక్ష్మణులకు సూచించారు మునులు. ఐదురోజులైంది. కంటిమీద కునుకు లేకుండా యజ్ఞాన్ని కాపాడుతున్నారు రామలక్ష్మణులు. కర్తవ్యాన్ని నెరవేర్చడంలో ఇంత నిష్ఠ ఉండాలి. చివరిరోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా యజ్ఞకుండం నుండి జ్వాలలు ఎగసిపడ్డాయి. ఇది రాక్షసుల రాకకు సూచన.
జవాబు:

ప్రశ్నలు

  1. సిద్ధాశ్రమం ఏమిటి ?
  2. ఏమి ప్రారంభమయ్యింది ?
  3. రామ, లక్ష్మణులు ఎందుకు వచ్చారు ?
  4. గురువును ఎలా ప్రార్థించారు ?
  5. ఆరు రోజులపాటు ఏం జరిగింది ?