TS 9th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson ఆచార్య కొత్తపల్లి జయశంకర్

Telangana SCERT 9th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం 4th Lesson ఆచార్య కొత్తపల్లి జయశంకర్ Questions and Answers.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson ఆచార్య కొత్తపల్లి జయశంకర్

TS 9th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 1

తెలంగాణ చెరువు తీరు
మన జయశంకరు సారూ
అలుగు దుంకి పారూ
పదునైన మాట జోరు
పాలు పోసుకున్న పజ్జోన్న కంకులల్ల
పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్ల
మీ ఆశయాల వ్రాలూ
కనిపించే ఆనవాలూ ….
కన్నులలో ఆవేశం కదలాడిన రుద్రుడు
ఆధిపత్య శక్తులపై అతడు వీరభద్రుడు
ఆలోచనల అవసరాన్ని తెలిపిన నిబద్ధుడు
తెలంగాణ కనుగొన్న అతడు మరో

PAPER – I : వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన) (మార్కులు: 6)

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
జయశంకర్ బాల్యం, విద్యాభ్యాసం గురించి రాయండి.
జవాబు:
తెలంగాణను శ్వాసించిన మహోపాధ్యాయుడు, జయశంకర్, వరంగల్లు జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో లక్ష్మీకాంతరావు, మహాలక్ష్మీ దంపతులకు 1934 ఆగస్టు 6న జన్మించాడు. ఆ రోజుల్లో ఉర్దూ మీడియం పాఠశాలలు మాత్రమే ఉండేవి. జయశంకర్ ఆ రోజుల్లో హన్మకొండలోని మర్కజీ పాఠశాలలో ప్రాథమిక విద్య నేర్చాడు. హన్మకొండ న్యూ హైస్కూలులో మాధ్యమిక వరకు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్.ఎస్. సీ వరకు చదువుకున్నాడు.

జయశంకర్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ. పూర్తి చేశాడు. బెనారస్ విశ్వవిద్యాలయం, ఆలీగఢ్ విశ్వవిద్యాలయాల నుండి పి.జి. పూర్తి చేశాడు. ఆ రోజుల్లో వరంగల్లో డిగ్రీ కళాశాల లేదు. డిగ్రీ చదవాలంటే, హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చేది. లెక్చరర్ గారి ప్రోద్బలంతో కాలేజీ కావాలని విద్యార్థులు ఉద్యమం చేశారు. అందులో జయశంకర్ ముందువరుసలో నిలిచాడు.

ఊరేగింపులో జయశంకర్ నినాదాలిస్తున్నాడు. “వరంగల్కు డిగ్రీ కాలేజి కావాలి” అని నినాదాలు ఇవ్వడానికి బదులు, యూనివర్సిటీ కావాలి అని జయశంకర్ నినాదం ఇచ్చాడు. అందరూ నవ్వుకున్నారు. అప్పుడు జయశంకర్ను బాగా ఇష్టపడే ఒక లెక్చరరు, “ఏయ్ పిచ్చిపిల్లాడా ! ఏమయ్యింది” అని జయశంకరుని మందలించాడు. చిత్రంగా ఈ సంఘటన జరిగిన పదేళ్ళకు డిగ్రీ కాలేజి, 30 ఏళ్ళకు యూనివర్సిటీ వరంగల్లులో ప్రారంభమయ్యాయి. అంతేకాదు. పిచ్చిపిల్లాడనిపించుకున్న ఆ జయశంకర్, వరంగల్లు యూనివర్సిటీ వైసాఛాన్సలరు అయ్యాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson ఆచార్య కొత్తపల్లి జయశంకర్

ప్రశ్న 2.
జయశంకర్ ఉద్యోగ జీవితం గురించి తెలపండి.
జవాబు:
జయశంకర్ 1960లో ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టాడు. దానితో జయశంకర్ ఉద్యోగ జీవితం మొదలయ్యింది. తరువాత హన్మకొండలో ఉపాధ్యాయుడిగా నియమింపబడ్డాడు. అక్కడి నుండి లెక్చరర్గా ఆదిలాబాద్కు వెళ్ళాడు. 1975-79 వరకు సి.కె. యం. కళాశాల ప్రిన్సిపాలుగా, బోర్డు మెంబరుగా జయశంకర్ సేవలందించాడు.

1982 – 91 వరకు, సీఫెల్ రిజిష్ట్రారుగా పనిచేశాడు. ఈయన 1991 94 వరకు కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు. ఇవియే కాకుండా, వివిధ ప్రభుత్వ హోదాల్లో, సంఘాల పదవుల్లో పనిచేసి, తనదైన ముద్ర వేశాడు.

జయశంకర్ ఎన్నో పదవుల్లో పనిచేశాడు. తనకు వైస్ ఛాన్సలర్గా చేసిన పనిలో తృప్తి కంటే, సి.కె. ఎం. కళాశాల ప్రిన్సిపాలుగా పనిచేయడం, ఎక్కువ తృప్తినిచ్చిందని జయశంకర్ సార్ చెప్పేవాడు. ఈ విధంగా హన్మకొండలో టీచర్ గా మొదలైన జయశంకర్ ఉద్యోగ జీవితం, అదే ఊళ్ళో వైస్ ఛాన్సలర్గా పదవీ విరమణతో ముగిసింది.

ప్రశ్న 3.
తెలంగాణ ఉద్యమంలోని మూడు దశల్లో జయశంకర్ నిర్వహించిన పాత్రను గురించి రాయండి.
జవాబు:
తెలంగాణ ఉద్యమంలో మూడు ప్రధాన దశలు ఉన్నాయి. మొదటిది భావజాల వ్యాప్తి. రెండవది ఆందోళనా కార్యక్రమం. మూడవది రాజకీయ ప్రక్రియ. ఈ మూడు దశల్లోనూ జయశంకర్ పాత్ర మరచిపోలేనిది. అందుకే, జయశంకర్ తెలంగాణ సిద్ధాంతకర్త.

ఇందులో మొదటిది తెలంగాణ భావజాల వ్యాప్తి :
తెలంగాణ భావజాలం ఎంతగా ప్రజల్లోకి వెళ్ళిందో జయశంకర్ ఒకరోజు ఇలా చెప్పాడు. “ఎందుకమ్మా తెలంగాణ” అని అడిగితే, తెలంగాణ వస్తే మా పొలాలకు నీళ్ళొస్తాయి. మా పిల్లలకు ఉద్యోగాలొస్తాయి అని చదువు రాని ఆడవాళ్ళు చెప్పారు” – ఈ విధంగా తెలంగాణ భావజాలం వ్యాపించింది.

రెండవది ఆందోళన కార్యక్రమం. తెలంగాణలో జరిగిన ఆందోళనలు, ఉద్యమాన్ని రెండింతలు చేశాయి. ఈ ఉద్యమాల వెనుక జయశంకర్ వంటి మేథావులు, ఉద్యమ కార్యకర్తల సూచనలు, సలహాలు ఉన్నాయి. జయశంకర్ ఆందోళనకారులకు కావలసిన పూర్తి వివరాలు, విశ్లేషణలతో ముందుంచేవాడు.

మూడవ దశ రాజకీయ ప్రక్రియ. జయశంకర్ రాజకీయ ప్రక్రియలో పాల్గొనకపోయినా, తెలంగాణ రాజకీయ నాయకులందరికీ, తన సహకారం అందించాడు. చెన్నారెడ్డి నుండి చంద్రశేఖరరావు వరకు ప్రతి రాజకీయ పార్టీకి జయశంకర్ తన మేథోశ్రమను ధారపోశాడు. జయశంకర్ ఊహించినట్టే, చివరకు రాజకీయ ప్రక్రియతోనే తెలంగాణ వచ్చింది.

ప్రశ్న 4.
జయశంకర్ సమయపాలన, నిబద్ధతల గురించి తెలిపే సంఘటనలను తెలపండి.
జవాబు:
జయశంకర్ నీతి,నిజాయితి, నిరాడంబరత, నిబద్ధత సమయపాలన వంటి లక్షణాలు ఉన్న మహా మనీషి. ఈయన సమయపాలన, నిబద్ధతలను గురించి తెలిపే ఒక సంఘటనను పరిశీలిద్దాం. జయశంకర్ సీఫెల్ రిజిష్ట్రారుగా ఉన్న సమయంలో సాయంత్రం 5.30 నుండి రాత్రి 10.30 వరకు తన పరిశోధక విద్యార్థికి సమయం కేటాయించేవారు. తన భోజన సమయంలో విద్యార్థిని కూర్చోబెట్టుకొని, మెటీరియల్ చూసేవారు. ఒకసారి జయశంకర్ సార్ స్నేహితుడొకడు 5 గంటల వరకూ ఆయనతో గడపి, తృప్తిలేక ఇంకా మాట్లాడడానికి ప్రయత్నించాడు.

జయశంకర్ నిర్మొహమాటంగా తన పి.హెచ్.డి విద్యార్థి వచ్చే సమయమయ్యిందనీ మిత్రునితో మరొకసారి కలుద్దామని చెప్పి, మిత్రుని బయటకు పంపించారు. పై పరిశోధక విద్యార్థే తరువాతి కాలంలో ఖమ్మం కళాశాల ప్రిన్సిపాల్ అయ్యాడు. అప్పుడు జయశంకర్ కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా ఉండేవారు. పై ప్రిన్సిపాలు వైస్ ఛాన్స్లర్గా ఉన్న జయశంకర్ సార్తో ఒకసారి సమయం తెలియకుండా మాట్లాడుతున్నాడు. అప్పుడు జయశంకర్ “నీకు రైలు టైం అవుతుంది. స్టేషన్కు వెళ్ళడం ఆలస్యం అవుతుంది నీవు వెళ్ళు” అని చెప్పి పంపించివేశారట. దీనిని బట్టి జయశంకర్ సమయానికి విలువ ఇస్తారని అర్థమవుతోంది.

ప్రశ్న 5.
జయశంకర్ సార్ వ్యక్తిత్వాన్ని గురించి రాయండి.
జవాబు:
జయశంకర్ తెలంగాణకు చిరునామా. తెలంగాణకు మార్గదర్శి. జయశంకర్ జీవితాంతం ఉద్యమాల్లో తిరిగాడు. పెళ్ళి చేసుకోలేదు. ఉద్యోగం ద్వారా వచ్చిన జీతాన్ని ఉద్యమాల కోసం ఖర్చు పెట్టాడు. తన ఉమ్మడి కుటుంబానికి జయశంకర్ చేదోడువాదోడుగా ఉండేవాడు. ఉమ్మడి కుటుంబంలో వారందరూ పెరిగి పెద్దవారు అయ్యారు. జయశంకర్ ఒంటరిగా మిగిలాడు. జయశంకర్ తనకు సాయంగా ఉండడానికి తల్లిదండ్రులు లేని అనాథ పిల్లవాడిని చేరదీశాడు. అతడిని చదివించి పెళ్ళి చేశాడు. వారికో పిల్ల పుట్టింది. వారితో కలసి జయశంకర్ చివరి దశలో గడిపాడు. తనకు తల్లిదండ్రులిచ్చిన పాత ఇల్లు అమ్మి వరంగల్లులో ఒక ఫ్లాట్ తీసుకున్నాడు, అదే జయశంకర్ ఆస్తి.

ఉదాత్తమైన వ్యక్తిత్వం, మృదుభాషణం, ఉద్యమస్ఫూర్తి, స్థితప్రజ్ఞత – అనేవి కలిస్తే జయశంకర్. తెలంగాణ వారందరిచే ఈయన జయశంకర్ సార్ అని ప్రేమగా పిలిపించుకున్నాడు. జయశంకర్ ఉద్యమ పితామహులుగా, తెలంగాణ జాతిపితగా పేరు పొందాడు. ఈయనకు కార్యకర్తకు కావాల్సిన కార్యదక్షత ఉన్నది. కె.సి. ఆర్. వంటి నాయకులకు ఆత్మ విశ్వాసాన్ని
ఈయన అందించారు.

జయశంకర్ సార్ శనివారం భోజనం చేసేవారు కాదు. ఈయన జీవితంలో రెండు విషయాల్లో రాజీ పడలేదు.

1) శనివారం పస్తుండటం.

2) తెలంగాణ అంశం మాట్లాడకుండా ఉండలేకపోవడం. తెలంగాణ రాకముందే, జయశంకర్ అస్తమించాడు.
జయశంకర్ జీవితాంతం, ఒకే మార్గంలో నడిచాడు. ఒకే మాటపై నిలబడ్డాడు. అందరినీ తన మార్గంలో నడిపించాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson ఆచార్య కొత్తపల్లి జయశంకర్

PAPER – II : పరిచిత గద్యాలు (మార్కులు : 5)

1. కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

1996లో నాటి ప్రధాని 15 ఆగస్టు ఎర్రకోట నుండి చేసిన ఉపన్యాసం తెలంగాణా వాదులందరిని తట్టిలేపింది. తెలంగాణ సాధనకు ఎలాంటి వ్యూహాలు రచించాలో జయశంకర్కు తెలుసు. మొత్తం తెలంగాణ ఉద్యమానికి మూడు దశలున్నాయి. మొదటిది భావజాల వ్యాప్తి. అది జరిగింది. రెండోది ఆందోళనా కార్యక్రమం. అది కొనసాగుతున్నది. ఇక మిగిలింది రాజకీయ ప్రక్రియ. అది జరగాల్సి ఉంది. దానిని పూర్తి చేయడమే ఉద్యమ కర్తవ్యం కావాలి. దానికి రాజకీయ చిత్తశుద్ధి అవసరం. ‘ఇప్పుడున్న రాజకీయ నాయకత్వం ఆ పని పూర్తిచేస్తుందని నేను నమ్ముతున్నాను’ అని అన్నాడు. ఈ మూడు దశల్లో కూడా జయశంకర్ పాత్ర మరువలేనిది. అందుకే అతడు తెలంగాణ సిద్ధాంతకర్త. మొదటిది తెలంగాణ భావజాల వ్యాప్తి. అది ఎంతగా ప్రజల్లోకి చొచ్చుకపోయిందో జయశంకర్ ఒక రోజు ఇట్లా చెప్పిండు. “ఎందుకమ్మా తెలంగాణ అంటే ? ‘ఏం సార్ తెలంగాణ వస్తె మా పొలాలకు నీళ్ళొస్తయ్, మా పోరగానికి కొలువొస్తది” అనే భావన వారికి కలిగిందని” చదువురాని ఆడవాళ్ళు చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకొన్నాడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
తెలంగాణ ఉద్యమంలో రెండవదశ ఏది ?
జవాబు:
తెలంగాణ ఉద్యమంలో రెండవ దశ “ఆందోళన కార్యక్రమం”.

ప్రశ్న 2.
తెలంగాణ వస్తే ఏమవుతుందని చదువురాని ఆడవాళ్ళు చెప్పారు ?
జవాబు:
తెలంగాణ వస్తే వారి పొలాలకు నీళ్ళు వస్తాయని, వారి పిల్లలకు ఉద్యోగాలొస్తాయని ఆడవాళ్ళన్నారు.

ప్రశ్న 3.
తెలంగాణ వాదులను తట్టిలేపింది ఏది ?
జవాబు:
1996లో ఆగస్టు 15, నాటి ప్రధాని ఎర్రకోట నుండి చేసిన ఉపన్యాసం తెలంగాణ వాదులను తట్టిలేపింది.

ప్రశ్న 4.
జయశంకర్ తెలంగాణ సిద్ధాంతకర్త ఎలా అయ్యాడు ?
జవాబు:
తెలంగాణ ఉద్యమం మూడు దశల్లోనూ జయశంకర్కు గల పాత్ర మరువలేనిది. అందుకే జయశంకర్ తెలంగాణ సిద్ధాంతకర్త అయ్యాడు.

ప్రశ్న 5.
తెలంగాణ ఉద్యమంలో ప్రధానమైన మూడు దశలు తెల్పండి.
జవాబు:

  1. భావజాల వ్యాప్తి
  2. ఆందోళన కార్యక్రమం
  3. రాజకీయ ప్రక్రియ అనేవి తెలంగాణ ఉద్యమంలో మూడు దశలు.

2. ఈ కింది పేరా చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

జీవితాంతం పదవుల్లో ఉద్యమాల్లో తిరిగిన జయశంకర్ పెండ్లి చేసుకోలేదు. ఉద్యోగరీత్యా సంపాదించినదంతా ఉద్యమాల కోసం ఖర్చు బెట్టాడు. ఉమ్మడి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్నాడు. జీవిత కాలం ఎక్కువగా ఇట్లాగే ఖర్చు అయింది. ఉమ్మడి కుటుంబంలోని వాళ్ళందరు పెరిగి, ఎవరి సంసారాలు వాళ్ళకు అయినంక జయశంకర్ ఒంటరిగా మిగిలాడు. జయశంకర్ తనకు సహాయంగా ఉండటానికి తల్లిదండ్రులు లేని అనాథ పిల్లవాడిని చేరదీశాడు. అతడిని చదివించాడు. అనాథ పిల్లతో పెండ్లి చేశాడు. వారికో పాప పుట్టింది. వాళ్ళతో కలిసి జీవితం చివరిదశలో గడిపాడు. తల్లిదండ్రులు ఇచ్చిన పాత ఇల్లు అమ్మి, వరంగల్లో ఫ్లాట్ తీసుకున్నాడు. అదే అతని ఆస్తి. పెన్షన్తో కాలం
గడిపాడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
జయశంకర్ తన సంపాదనను ఎలా ఖర్చు చేశాడు ?
జవాబు:
జయశంకర్ తన సంపాదనను అంతా ఉద్యమాల కోసం ఖర్చు చేశాడు.

ప్రశ్న 2.
జయశంకర్ పెండ్లి ఎందుకు చేసికోలేదు ?
జవాబు:
జయశంకర్ జీవితాంతం పదవుల్లో, ఉద్యమాల్లో తిరిగినందున పెండ్లి చేసుకోలేదు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson ఆచార్య కొత్తపల్లి జయశంకర్

ప్రశ్న 3.
జయశంకర్ చివరి దశలో ఎవరితో గడిపాడు ?
జవాబు:
జయశంకర్ చివరి దశలో తాను చేరదీసిన అనాథ పిల్లవాడితో, అతని భార్యాపిల్లలతో గడిపాడు.

ప్రశ్న 4.
జయశంకర్ ఆస్తి ఏమిటో చెప్పండి.
జవాబు:
జయశంకర్ తనకు తల్లిదండ్రులు ఇచ్చిన పాత ఇల్లును అమ్మి, వరంగల్లులో ఒక ఫ్లాట్ తీసుకున్నాడు. అదే ఆయన ఆస్థి.

ప్రశ్న 5.
జయశంకర్ ఒంటరివాడు ఎందుకు అయ్యాడు ?
జవాబు:
‘ జయశంకర్ ఉమ్మడి కుటుంబ సభ్యులు అందరూ పెరిగి, ఎవరి సంసారాలు వారు చేసుకుంటున్నారు. అందువల్ల జయశంకర్ ఒంటరివాడయ్యాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson నేను… సావిత్రిబాయిని

Telangana SCERT 9th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం 6th Lesson నేను… సావిత్రిబాయిని Questions and Answers.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson నేను… సావిత్రిబాయిని

“జ్యోతి ! సావిత్రికెందుకు చదువు నేర్పుతున్నావు ?”
“ఎందుకు నేర్పకూడదు ?”
అసలు మన కులంవాళ్ళమే చదువుకోకూడదు. అయినా నిన్ను చదివించాను. ఇప్పుడు నువ్వు నీ భార్యకు చదువు చెబుతున్నావు – “ఆమె కూడా మనిషే కదా ! కాదంటే చెప్పు”
“నిజమే కావచ్చు కానీ ఆడదానికి చదువు పనికిరాదు. చదువుకున్న ఆడది చెడిపోతది. బుద్ధి లేనిదవుతది”-
“నాన్నా! సావిత్రి చదువుకుని ఆ మాటలన్నీ అబద్ధాలని నిరూపిస్తుంది”
TS 9th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson నేను… సావిత్రిబాయిని 1

PAPER – I : వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన) (మార్కులు: 6)

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
సావిత్రీబాయి కాలంలో స్త్రీల పరిస్థితులు ఎలా ఉండేవి ?
జవాబు:
సావిత్రీబాయి కాలంలో ఆడవాళ్ళు గడప దాటకూడదు. ఆడదంటే వంటింటికీ, వంటింట్లో పొయ్యికీ కట్టుబడి ఉండాలి. ఆడపిల్ల నియమాలను ఎంతమాత్రం దాటరాదు.

ఆ రోజుల్లో పొయ్యిలో కర్రలూ, పొయ్యి ఊదే గొట్టం ఆడపిల్ల చేతిలో ఎప్పుడూ ఉండాల్సిందే. ఆడపిల్ల ఆ గొట్టంతో పొయ్యిని ఊదుతూ ఉండాల్సిందే. ఆడపిల్ల భర్తనూ, అత్తమామల్ని సేవించుకోవాలి. ఇప్పుడు రెండవతరగతి చదివే వయస్సులోనే ఆనాడు ఆడపిల్లలు అత్తవారింట్లో ఉండేవారు. అత్తవారి ఇల్లే ఆడపిల్ల అసలు ఇల్లని ఆ రోజుల్లో ఆడపిల్లలకు తల్లిదండ్రులు నొక్కి చెప్పేవారు.

ఆ రోజుల్లో ఆడపిల్లలకు చదువు పనికిరాదు. చదువుకున్న ఆడది చెడిపోతుందని, బుద్ధిలేనిది అవుతుందని అప్పటివారు నమ్మేవారు. ఆనాడు సావిత్రి ఆడపిల్లలకు చదువుచెప్పడానికి బడికి పోతూంటే, జనం కిటికీల వెనుక నిలబడి తిట్టేవారు. శాపనార్థాలు పెట్టేవారు. నీచమైన మాటలు అనేవారు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson నేను… సావిత్రిబాయిని

ప్రశ్న 2.
సేబీ అంటే ఎవరు ? ఆయన వ్యక్తిత్వాన్ని గురించి వివరించండి.
జవాబు:
సేబీ అంటే సావిత్రీబాయి భర్త “జ్యోతీరావ్ ఫూలే”. సేబీ, పూనాలో ఉండే ఫూలే కుటుంబంలో పుట్టాడు. సేబీకి ఎప్పుడూ బడి, పుస్తకాలు, చదువు అంటే ఇష్టం. సావిత్రీబాయి, జ్యోతీరావ్ ఫూలేని సేబీ అనే పిలిచేది.

మనిషి మంచివాడయితే, అతడు మనదేశం వాడయినా, విదేశీయుడయినా సరే, ఆయన జీవితం, వ్యక్తిత్వం విలువలూ అన్నీ తెలుసుకోవాలి అనేవాడు సేబీ. శివాజీ, వాషింగ్టన్ వంటి వారి జీవిత చరిత్రలు అన్నీ ఆయన చదివాడు. థామస్పెన్ రాసిన “మానవహక్కులు” పుస్తకం చదివి మనిషికి ఉన్న హక్కులూ, బాధ్యతలూ చక్కగా తెలిసికొన్నాడు.

మన కులవ్యవస్థ, మన సమాజాన్ని నాశనం చేస్తోందని సేరీ చెప్పేవాడు. ఒకప్పుడు మంచిగా ఉన్న మన మతం మూర్ఖపు ఆచారాల్లో చిక్కుకుందనీ, వాటిని రూపుమాపాలనీ అనేవాడు. సేబీ, కబీర్, తుకారాం వంటి భక్తుల సాహిత్యాన్నీ, మత సంస్కర్తల రచనల్నీ చదివాడు. ఆ కాలంలోని శూద్ర, అతిశూద్రకులాల గొడవలు, విద్య వల్లే పోతాయనీ, విద్యే మన ధ్యేయం కావాలనీ సేబీ చెప్పేవాడు. సేబీ, విద్య అనే తపన వహించిన మహావృక్షం వంటివాడు.

ఆడమనిషి చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుందని, భార్య సావిత్రికి చదువుచెప్పి, ఆమెను మొదటి పంతులమ్మగా చేశాడు. తక్కువ కులాల ఆడపిల్లల కోసం సొంత ధనంతో బడిపెట్టాడు.

మానవులందరూ పుట్టుకతో సమానులనీ, వాళ్ళు ఒకరినొకరు సమానులుగా చూసుకోవాలనీ సేర్ చెప్పేవాడు. ఆడపిల్లలకు చదువు చెపుతున్నందుకు కోపంతో కొందరు సేరీని చంపబోయారు. బీదవాళ్ళకు సాయం చెయ్యడమే తన జీవితాశయం అనీ, వాళ్ళ చేతుల్లో చావటానికి కూడా తాను సిద్ధం అని చెప్పి, హంతకుల మనస్సును సేబీ మార్చాడు.

శిశు హత్యలకు వ్యతిరేకంగా మొదటి ఆశ్రమం స్థాపించాడు. “దేవుడు ఒక్కడే. మనందరం ఆయన పిల్లలం. మనిషిని ‘ గొప్పవాడిగా చేసేది అతని గుణమే కాని, కులంకాదు. అనే సిద్ధాంతాలతో “సత్యశోధక సమాజాన్ని” స్థాపించాడు. సేర్జే అంటే జ్యోతీరావ్ ఫూలే. ఈయన స్త్రీ విద్యకూ, కులరహిత సమాజానికీ కృషిచేసిన మహనీయుడు.

ప్రశ్న 3.
జ్యోతీరావ్ ఫూలేని చంపడానికి వచ్చిన వాళ్ళు పరివర్తన చెందిన సంఘటనను తెలపండి.
జవాబు:
జ్యోతీరావ్ ఫూలే తక్కువ కులాల ఆడపిల్లల చదువులకై బడిపెట్టాడు. ఇది గిట్టని సంఘంలో కొందరు పెద్దమనుషులు పూలేని చంపమని దోండిరామ్, కుంబార్ అనే హంతకులను నియమించారు.

ఒకరోజు రాత్రి భోజనాలయ్యాక ఫూలే నిద్రపోడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో ఫూలే పెరటి గుమ్మం తీసుకొని ఇద్దరు హంతకులు గొడ్డళ్ళతో నీశ్శబ్దంగా లోపలకు వచ్చారు. వాళ్ళ ముఖాలు భయంకరంగా ఉన్నాయి. వాళ్ళు పూలే భార్య సావిత్రికీ, ఫూలేకీ ముందు నిలబడి, పూలేని చంపడానికి గొడ్డళ్ళు పైకెత్తారు. వెంటనే ఫూలే భార్య “అన్నల్లారా ! ఆగండి. దయచేసి వెళ్ళిపొండి” అని బ్రతిమాలింది. ఎందుకు వచ్చారని పూలే వాళ్ళను అడిగాడు.

ఫూలే బడులు నడపడం ఇష్టంలేని కొందరు పెద్దలు, ఆయనను చంపడానికి తమకు కాంట్రాక్టు ఇచ్చారని, వాళ్ళు ఫూలేకు చెప్పారు. అప్పుడు ఫూలే వాళ్ళతో – “నా చావు మీకు లాభం అయితే, నన్ను చంపండి. బీదవాళ్ళకు సాయం చెయ్యడమే, నా జీవితాశయం – బీదవారి చేతిలో చావడంలో తప్పులేదు. నన్ను చంపండి” అని మెడవంచి శాంతంగా చావుకు సిద్ధమయ్యాడు. వెంటనే దోండిరామ్, కుంబార్లు గొడ్డళ్ళు కిందపడేశారు. ఫూలే కాళ్ళమీద పడ్డారు. “మేము మిమ్మల్ని చంపం. మీరు మా తండ్రి వంటివారు. ఇప్పుడే వెళ్ళి మమ్మల్ని ఇక్కడకు పంపిన వాళ్ళను చంపుతాం” అన్నారు ఫూలే వాళ్ళను ఆపాడు. వారి ఆలోచన మారేదాకా వారితో మాట్లాడాడు.

వాళ్ళిద్దరూ ఫూలే రాత్రిబడిలో చేరారు. దోండే ఫూలేకు బాడీగార్డుగా తయారయ్యాడు. కుంబార్ “వేదాచార్” అనే పుస్తకం రాసి, పూలే పనికి సాయం చేశాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson నేను… సావిత్రిబాయిని

ప్రశ్న 4.
సావిత్రిబాయి ఫూలే పాత్రను ఏకపాత్రాభినయం చేయండి.
జవాబు:
“సావిత్రిబాయి ఫూలే” ఏకపాత్రాభినయం :
నేను సావిత్రిని.

ఈ రోజు మీతో మాట్లాడదామని మీ ముందుకు వచ్చా. మీరు, మేం మా కాలంలో ఎక్కడున్నామో అక్కడే నిలిచిపోయారా ? అని నాకు అనిపిస్తోంది. నేను మహారాష్ట్రలో సతారా జిల్లా, ఖండాలా తాలూకాలో నైగావ్ గ్రామంలో పాటిల్ గారి మొదటి సంతానంగా పుట్టా. చిన్నప్పుడు బాగా అల్లరి చేసేదాన్ని. చెట్లు ఎక్కి సీమ చింతకాయలు కోసుకు తినేదాన్ని.

నాకు ఏడవ సంవత్సరంలో పూనాలోని పూలే కుటుంబీకుడు జ్యోతిరావ్తో పెండ్లి జరిగింది. మా మామగారు మంచివారు. నా భర్తను నేను సేఠ్ జీ అని పిలిచేదాన్ని. సేఠ్ జీకి చదువు అంటే ఇష్టం. నాకు ఆయన అన్నీ చదివి చెప్పేవారు. సే సాగర్ వెళ్ళారు. ఆడది చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుందని అక్కడ ఒక తెల్లజాతి మనిషి సేబీకి చెప్పింది.

సేఠ్ జీ నాకు చదువు చెప్పడం ప్రారంభించారు. మా మామగారు చదువుకుంటే ఆడది చెడిపోతుందని సేబీకి సలహా చెప్పారు. అయినా సేఠ్ జీ ఆ మాట వినలేదు. నా భర్త తక్కువ కులాల ఆడపిల్లల చదువులకు రెండు బడులు పెట్టారు. ఇంతలో ఆ స్కూలు నడిపే బడిపంతులు మానివేశాడు. దానితో ఫూలే బలవంతంపై, నేనే ఆ పిల్లలకు పంతులమ్మనయి, స్త్రీలకు చదువు చెప్పాను. ఆ పని చేయడం ఇష్టం లేని జనం నన్ను తిట్టేవారు. కిటికీలు మూసి నేను వారికి పాఠాలు చెప్పాను.

ఒక రోజున నేనూ, సేఠ్ నిద్రపోవడానికి సిద్ధంగా ఉండగా ఇద్దరు హంతకులు సేబీని చంపడానికి మా ఇంటికి వచ్చారు. సేబీ తన్ను చంపండని తలవంచారు. హంతకుల మనస్సులు మారిపోయాయి. మేం ఓ పిల్లవాణ్ణి పెంచుకున్నాం. మా సొంతబిడ్డలాగే వాడిని చూసుకున్నాం. ‘నేనే మొదటి పంతులమ్మను. శిశు హత్యలకు వ్యతిరేకంగా మేము ఒక ఆశ్రమం స్థాపించాము.

సత్యశోధక సమాజాన్ని స్థాపించాము. మేం సాధించిన విజయాలను, మా తర్వాత వచ్చిన ప్రజలు ముందుకు తీసుకెళ్ళాలి. పక్షవాతంతో సేఠ్ మరణించారు. 1897లో పూనాలో ప్లేగువ్యాధి వచ్చింది. ప్లేగువ్యాధితో బాధపడే పసిపిల్లలను నేను చేరదీశాను. నేను కూడా ప్లేగువ్యాధితోనే కన్నుమూశాను. మా ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళండి. సెలవు.

PAPER – II : పరిచిత గద్యాలు (మార్కులు : 5)

1. కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

నేను …….. సావిత్రిబాయిని

1897లో పునాలో ప్లేగువ్యాధి ప్రబలింది. పట్టణం ఎడారి అయిపోయింది. జనమంతా దగ్గర్లో ఉన్న అడవుల్లోకి పారిపోయారు. ఇట్లాంటి సమయాల్లో తక్కువ కులాల వాళ్ళకు సహాయపడాలని ఎవరనుకుంటారు ? నేను, నా కొడుకు యశ్వంత్, సమాజం సభ్యులు వ్యాధిగ్రస్తులకు సాయంగా వెళ్ళాం. ఒక గుడిసెలో రెండేళ్ళ పసివాడు బాధతో లుంగలు చుట్టుకుపోతూ కనిపించాడు. ఆ పిల్లవాడిని యెత్తుకొని డాక్టర్ దగ్గరకు పరుగెత్తాను. ప్లేగు అంటువ్యాధైనా ప్రాణం కోసం పెనుగులాడుతున్న ఆ పసిగుడ్డును ఎత్తుకోకుండా ఎట్లా ఉండగలను ? నా గుండెలకు అదుముకున్నాను. ఆ పసిబిడ్డ చావవలసి ఉంటే మరొక మనిషి ప్రేమ ఇచ్చే వెచ్చదనంతో చనిపోనివ్వు. ఆ బిడ్డ చనిపోయాడు. నాకు కూడా ప్లేగువ్యాధి సోకింది.. నా ప్రయాణం పరిసమాప్తమయ్యింది. నేను పనిలో ఉండగా మృత్యువు వరించటం నా అదృష్టం.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
‘నా ప్రయాణం పరిసమాప్తమయ్యింది’ అంటే అర్థం ఏమిటి ?
జవాబు:
నా ప్రయాణం పరిసమాప్తమయ్యింది అంటే, తన జీవితకాలం ముగిసిందని తాను చచ్చిపోతున్నానని అర్థం.

ప్రశ్న 2.
సావిత్రిబాయి కుమారుడు పేరు ఏమిటి ?
జవాబు:
సావిత్రీబాయి కుమారుడి పేరు “యశ్వంత్”.

ప్రశ్న 3.
పూనాలో ప్లేగువ్యాధి ఎప్పుడు వ్యాపించింది? పట్టణం ఎడారి అయ్యింది అంటే ఏమిటి ?
జవాబు:
పూనాలో ప్లేగువ్యాధి 1897 లో వ్యాపించింది. పట్టణం ఎడారి అయ్యిందంటే ఎడారిలోలాగే మనుష్యులు లేకుండా నగరం నిర్జనంగా ఉందన్నమాట.

ప్రశ్న 4.
గుడిసెలో పిల్లవాడిని చూసి సావిత్రీబాయి ఏమి చేసింది ?
జవాబు:
గుడిసెలో పిల్లవాడిని చూసి సావిత్రీబాయి ఆ పిల్లవాడిని ఎత్తుకొని, డాక్టర్ దగ్గరకు పరుగెత్తింది.

ప్రశ్న 5.
ప్లేగువ్యాధిగ్రస్తులకు, ఎవరు సాయంగా వెళ్ళారు ?
జవాబు:
ప్లేగువ్యాధిగ్రస్తులకు సావిత్రీబాయీ, ఆమె కుమారుడు యశ్వంత్, సమాజం సభ్యులూ సాయంగా వెళ్ళారు.

2. కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

“నేను… సావిత్రిబాయిని’

ఒక రోజు నేను ఇల్లు సర్దుతున్నా. పుస్తకాల గుట్టమీద వున్న దుమ్ము దులుపుతున్నా. ఇల్లు శుభ్రంగా ఉండాలి గదా. అదుగో అప్పుడే ఆయనొచ్చాడు. “నా పుస్తకాలనేం చేస్తున్నావు!” అన్నాడు. “దుమ్ము దులిపి శుభ్రం చేయొద్దా?” అన్నా. “పేజీలు పోగొడతావ్ జాగ్రత్త?’ అంటే ‘ఎక్కడికి పోవు, అన్నీ ఉంటాయి అన్నా. ఇదేంటో మరి?’ ‘ఏ పేజీ అది పేజీనో ఏమిటో నాకేం తెలుస్తుంది ? ఏమయిందని మీరిప్పుడీ రగడ చేస్తున్నారు?’ అన్నా ! అవన్నీ జీవిత చరిత్రలు. ఇదిగో చూడు. ఇది శివాజీ గురించి రాసింది. ఆయన ఫోటో ఇది. ఇక్కడ వాషింగ్టన్ గురించి రాసింది. ఇది ఆయన ఫోటో. అని సేరీ అన్నాడు.

“ఎవరూ ? శివాజీ నాకూ తెలుసు. మనవాడే కదా! కానీ ఈయనెవరూ? పరాయిదేశం మనిషివలె ఉన్నాడు. మనదేశం అయితేనేం కాకపోతేనేం. మనిషి మంచి పనులు చేస్తే మనం అతని జీవితం, వ్యక్తిత్వం, విలువలు అన్నీ తెలుసుకోవాలి.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
పై పేరాలో విషయం మనకు చెపుతున్నది ఎవరు ?
జవాబు:
పై పేరాలో మనకు విషయం చెపుతున్నది ‘సావిత్రీ బాయి’.

ప్రశ్న 2.
మనిషి మంచి పనులు చేస్తే, ఏం చేయాలి ?
జవాబు:
మనిషి మంచి పనులు చేస్తే ఆ మనిషి జీవితం, వ్యక్తిత్వం, విలువలు అన్నీ తెలుసుకోవాలి.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson నేను… సావిత్రిబాయిని

ప్రశ్న 3.
పై పేరాలో పేర్కొన్న జీవిత చరిత్రలు, ఫోటోలు ఎవరికి సంబంధించినవి ?
జవాబు:
పై పేరాలో పేర్కొన్న జీవిత చరిత్రలు, ఫోటోలు

  1. శివాజీకి,
  2. వాషింగ్టన్కి సంబంధించినవి.

ప్రశ్న 4.
సావిత్రీబాయి ఏమి చేస్తోంది ?
జవాబు:
సావిత్రీబాయి, సేఠ్ పుస్తకాలపై పడ్డ దుమ్మును దులిపి శుభ్రం చేస్తోంది.

ప్రశ్న 5.
సేఠ్ ఎందుకు రగడ చేశాడు ?
జవాబు:
సేబీ తన పుస్తకాల్లో పేజీలు పోతాయనే భయంతో భార్య సావిత్రీబాయితో రగడ చేశాడు.

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

Telangana SCERT 9th Class Telugu Guide Telangana 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి Textbook Questions and Answers.

TS 9th Class Telugu 4th Lesson Questions and Answers Telangana రంగాచార్యతో ముఖాముఖి

చదువండి – ఆలోచించి చెప్పండి (Textbook Page No. 34)

తెలంగాణకు చెందిన ప్రముఖ భాషాశాస్త్రవేత్త డా॥ చేకూరి రామారావుతో పత్రికా విలేఖరి ముఖాముఖి.

పత్రికా విలేఖరి : మీ వ్యక్తిగత వివరాలు చెప్పండి.

చేకూరి రామారావు : మాది ఇల్లిందలపాడు గ్రామం, ఖమ్మం జిల్లా. తల్లి భారతమ్మ, తండ్రి లింగయ్య. భాషాశాస్త్రంలో ఉపన్యాసకుడిగా ఉద్యోగం ప్రారంభించి, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో డీన్ గా పదవీ విరమణ చేశాను.

పత్రికా విలేఖరి : మీకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎప్పుడు, ఏ రచనకు వచ్చింది ?

చేకూరి రామారావు : నేను రాసిన “స్మృతి కిణాంకం” అనే వ్యాస సంకలనానికి 2002 సంవత్సరంలో ఉత్తమమైన విమర్శ గ్రంథంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.

పత్రికా విలేఖరి : వాడుకభాష గురించి చెప్పండి.

చేకూరి రామారావు : వ్యావహారిక భాషావాదమంటే మాట్లాడినట్లు రాయడం కాదు. మాట్లాడే భాషకు, రాసే భాషకు పరిమితులు వేరు. ప్రయోజనం వేరు. రచనా వ్యవస్థకు కొన్ని నియమాలు అవసరం.

పత్రికా విలేఖరి : తెలుగు కనుమరుగు అవుతుందేమోనన్న ఆందోళన గురించి మీ అభిప్రాయం.

చేకూరి రామారావు : ఇన్ని కోట్లమంది మాట్లాడే భాష కనుమరుగుకాదు. కాకపోతే మన తెలుగులో ఇతర భాషల మిశ్రమం ఎక్కువగా కనిపిస్తున్నది.

ప్రశ్నలు

ప్రశ్న 1.
పై పేరాలో ఎవరు ఎవరిని ప్రశ్నలడుగుతున్నారు?
జవాబు:
పై పేరాలో ప్రముఖ భాషాశాస్త్రవేత్త అయిన డా॥ చేకూరి రామారావుగారిని, పత్రికా విలేఖరి ప్రశ్నలు అడుగుతున్నాడు.

ప్రశ్న 2.
పై సమాధానాల ద్వారా మీకు తెలిసిన సాహితీ విశేషాలేమిటి?
జవాబు:
వ్యవహారిక భాషావాదము అంటే, మాట్లాడినట్లు రాయడం కాదనీ, మాట్లాడే భాషకూ, రాసే భాషకూ పరిమితులు వేరనీ, ప్రయోజనం వేరనీ, రచనా వ్యవస్థకు కొన్ని నియమాలు అవసరమనీ తెలిసింది. నేటి తెలుగుభాషను కోట్లాదిమంది మాట్లాడుతున్నారు కాబట్టి తెలుగు ఎప్పటికీ కనుమరుగు కాదనీ, నేటి తెలుగులో ఇతర భాషల మిశ్రమం ఎక్కువగా ఉందనీ తెలిసింది.

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ప్రశ్న 3.
ఈ విధంగా ప్రశ్నలడిగే విధానాన్ని ఏమంటారు?
జవాబు:
ఈ విధంగా ప్రశ్నలడిగే విధానాన్ని ఇంగ్లీషు భాషలో ‘ఇంటర్వ్యూ’ అంటారు. తెలుగులో “ముఖాముఖి” అని, ‘పరిపృచ్ఛ’ అని పిలుస్తారు.

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 37)

ప్రశ్న 1.
“తెలంగాణ సాయుధపోరాటం” గురించి విన్నారా ? మీకు తెలిసింది చెప్పండి.
జవాబు:
తెలంగాణ ప్రాంతంలో భూస్వాముల నుండి, దొరల నుండి, నిజాం ప్రభుత్వం నుండి, వెట్టిచాకిరి నుండి, విముక్తి కోసం, రైతులూ, రైతుకూలీలూ, కార్మికులూ స్త్రీలూ, పిల్లలూ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిపిన పోరాటమే, “తెలంగాణ సాయుధపోరాటం”.

ఈ పోరాటం, 1946 నుండి 1951 వరకు కొనసాగింది. వందలాది ఎగరాలు కలిగిన భూస్వాములపై, వారికి అండదండలు అందించిన నిజాం ప్రభుత్వంపై, రైతులు చేసిన పోరాటం ఇది. భూమి కోసం, భుక్తి కోసం, బానిసత్వ విముక్తి కోసం, పేద రైతులు చేసిన ఈ సాయుధ పోరాటం, ఎంతో మందికి స్ఫూర్తిని ఇచ్చింది.

ప్రశ్న 2.
“వారసత్వం” అనే మాటను ఏ విధంగా గ్రహించాలి ?
జవాబు:
‘వారసత్వం’ అనే పదానికి, ఒకతరం నుండి మరో తరానికి వచ్చే సంప్రదాయ హక్కు అని అర్థము. తాత ఆస్తి తండ్రికి, తండ్రి ఆస్తి కొడుకుకి వారసత్వంగా సంక్రమిస్తుంది. అలాగే తెలంగాణ సాయుధపోరాట స్ఫూర్తి, ఒక తరం నుండి వారి తరువాత తరానికి సంక్రమించాలి.

తెలంగాణ సాయుధపోరాటంలో ఆనాటి రైతులూ వగైరా ప్రజలు, ఎలా ప్రభుత్వంపై, భూస్వాములపై, తమ హక్కుల కోసం పోరాడారో, అలాగే భావితరాల వారు కూడా, తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేసే పట్టుదల, దీక్ష, వారసత్వంగా వారికి రావాలని ఆ మనం ఈ మాటనుబట్టి గ్రహించాలి.

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 38)

ప్రశ్న 1.
“జనపదం” నవల ఇతివృత్తమేమిటి ?
జవాబు:
తెలంగాణలో పోలీసు యాక్షన్ తరువాత రైతుల భూములను దొరలు కాజేశారు. దానితో ‘జనపదం’ కథ మొదలవుతుంది. తరువాత వచ్చిన ఉద్యమాల గురించి, ఉద్యమాల పేరున జరిగిన మోసాల గురించి, ఆనాడు రాజకీయాలు భ్రష్టు పట్టడం గురించి, ఈ “జనపదం” నవలలో వివరంగా చెప్పబడింది. ఇది ఒక్క తెలంగాణ కాక, భారతదేశానికి చెందిన నవల. ఈ నవలలో నిజం చెప్పబడింది.

ప్రశ్న 2.
రంగాచార్య నవలల్లో ప్రధాన విషయం ఏమిటి ?
జవాబు:
రంగాచార్య నవలల్లో ప్రధాన విషయం, “తెలంగాణ సాయుధపోరాటం”. రంగాచార్య నవలలు, తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంగా రాయబడ్డాయి. ‘మోదుగు పూలు’ అనే నవల ఆయన జీవిత చరిత్ర ప్రధానంగా రాయబడింది.

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ప్రశ్న 3.
తన ఆత్మకథగా వర్ణించిన పుస్తకమేది ?
జవాబు:
రంగాచార్య రాసిన ‘మోదుగుపూలు’ అనే నవల సుమారుగా ఆయన ‘ఆత్మకథ’ వంటిది. రంగాచార్య తన జీవన యానాన్ని ఈ నవలా రూపంలో రాశాడు. ఈ నవల పర్ఫెక్షన్ సాగింది. ఈ నవలలో ఒక్క లోపాన్ని కూడా చూపించలేరని రంగాచార్య చెప్పారు. ఈ నవలలో సిద్ధాంతం కన్నా, విశ్వాసం కన్నా, కర్తవ్యం గొప్పది అని రంగాచార్య చెప్పాడు.

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 39)

ప్రశ్న 1.
‘మాండలికమే ప్రజల భాష !’ నిజమేనా ?
జవాబు:
మాండలిక భాష అంటే ఆ మండలంలో లేక ఆ ప్రాంతంలో సామాన్య ప్రజలు వారి నిత్య వ్యవహారాలలో ఒకరితో ఒకరు మాట్లాడుకొనే భాష, మాండలిక భాష, ప్రజల హృదయాల్లోంచి అప్రయత్నంగా వచ్చిన భాష, అది కావ్య భాషవలె కృత్రిమం కాదు. కాబట్టి మాండలిక భాషను నిజమైన ప్రజల భాష అని చెప్పవచ్చు.

ప్రశ్న 2.
‘వసుధైక కుటుంబం’ అంటే మీరు ఏమనుకుంటున్నారు?
జవాబు:
కుటుంబము అంటే మనకు తెలుసు. మన తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అప్పాచెల్లెండు, తాతామామ్మలు మన కుటుంబము. మన కుటుంబ సభ్యులపట్ల, మనం ప్రేమాదరాలతో ఉంటాము. మన కుటుంబ సభ్యుల కష్టసుఖాల్లో మనం పాలుపంచుకుంటాము.

వసుధైక కుటుంబం, అంటే ప్రపంచంలోని భూమండలంపై ఉండే ప్రజలందరూ ఒకే కుటుంబం అని అర్థం. అంటే ప్రపంచ ప్రజలంతా కులమత భేదాలు విడిచి, ఒకే తల్లిదండ్రుల పిల్లల్లా కలసిమెలసి, కష్టసుఖాల్లో పాలుపంచుకోడాన్ని ‘వసుధైక కుటుంబం’ అనవచ్చు.

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 39)

ప్రశ్న 1.
కృషి – గుర్తింపు వీటి మధ్య సంబంధాన్ని చెప్పండి.
జవాబు:
కొందరు వ్యక్తులు సంఘం కోసం తమ జీవితాన్ని కూడా త్యాగం చేసి ఎంతో ‘కృషి’ అనగా ప్రయత్నం చేస్తారు. కొందరు సంఘసంస్కర్తలు, సాంఘిక సంస్కరణల కోసం గొప్ప కృషి చేస్తారు. కొందరు శాస్త్రవేత్తలు, శాస్త్రాభివృద్ధికై కృషి చేస్తారు. కొందరు డాక్టర్లు, ఎన్నో పరిశోధనలు చేసి గొప్ప విజయాలు సాధిస్తారు. కొందరు రాజకీయ వేత్తలు దేశం కోసం కృషి చేస్తారు.

అందులో కొందరిని సంఘం గుర్తించి వారిని గౌరవిస్తుంది. వారికి సన్మానాలు చేస్తుంది. అందులో కొందరి కృషికి, గుర్తింపు ఉండదు. ఎవరూ వారి కృషిని మెచ్చుకోరు. కాబట్టి కృషికీ, గుర్తింపుకూ మధ్య సంబంధం ఉండదు.

ప్రశ్న 2.
సందేశమిచ్చే అవకాశం ఎవరికి ఉంటుందని మీరు అనుకుంటున్నారు ?
జవాబు:
కొందరు వ్యక్తులు దేశం కోసం, శాస్త్రాభివృద్ధి కోసం, జనం కోసం, ఎంతో కృషి చేసి తమ సర్వస్వాన్ని త్యాగం చేస్తారు. వారు ప్రజలకు చెప్పిన మాటలను తాము కూడా ఆచరిస్తారు. అటువంటి మహాత్ములకు, ఆదర్శ జీవనం కలవారికి, ఇతరులకు సందేశం ఇచ్చే అవకాశం ఉంటుంది.

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ప్రశ్న 3.
‘సాంస్కృతిక వైభవం’ అంటే ఏమని అర్థం చేసుకోవచ్చు?
జవాబు:
‘సంస్కృతి’ అంటే నాగరికత. ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని కళలు, కొన్ని ఆచార వ్యవహారాలు, కొన్ని పండుగలు, కొన్ని ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. తెలంగాణలో బతుకమ్మ పండుగ చేసుకుంటారు. గణేశ్ ఉత్సవాలు చేస్తారు. మహంకాళి అమ్మవార్ని ఆరాధిస్తారు. దీనినే సాంస్కృతిక వైభవం అని చెప్పవచ్చు.

ఇవి చేయండి

I. అవగాహన-ప్రతిస్పందన

ప్రశ్న 1.
దాశరథి రంగాచార్యతో ఇంటర్వ్యూ ఎట్లా అనిపించింది ? మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు:
దాశరథి రంగాచార్యగారితో ఇంటర్వ్యూ మంచి ఆనందాన్ని కల్గించింది. తెలంగాణ ముద్దుబిడ్డ అయిన రంగాచార్యగార్కి తెలంగాణ సాయుధపోరాటంతో గల సంబంధం, మాకు మంచి స్ఫూర్తినిచ్చింది. రంగాచార్య రచించిన చిల్లర దేవుళ్ళు, జనపదం, మోదుగుపూలు వంటి నవలలు కొని, తప్పక చదవాలనిపించింది. ఆ నవలలు ప్రతి పాఠశాల, గ్రంథాలయంలోనూ ఉండేలా, ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటే బాగుంటుదనిపించింది.

నాలుగు వేదాలనూ, 10 ఉపనిషత్తులనూ తెనిగించిన ఆ మహాపండితుడిని, ఒక్కసారి కన్నులారా చూడాలనిపించింది. రంగాచార్య వంటి పండితునిపై కమ్యూనిస్టుల ప్రభావం ఉందని తెలిసి, ఆశ్చర్యం అనిపించింది. రంగాచార్యగారు ఉత్తమ మనీషి అని, మంచి మనిషి అని నాకు అనిపించింది. రంగాచార్య ఉద్యమజీవి అనిపించింది. రంగాచార్య తెలంగాణ ముద్దుబిడ్డ అనిపించింది.

ప్రశ్న 2.
ఈ మధ్యకాలంలో టి.వి.లో లేదా ఇంకెక్కడైన మీరు చూసిన ఇంటర్వ్యూ గురించి మాట్లాడండి.
జవాబు:
అఖిల భారత, భారతీయ జనతాపార్టీ అధ్యక్షడు ‘అమిత్’తో, ఈనాడు పత్రిక వారు చేసిన ఇంటర్వ్యూ వివరాలను దిగువ ఇస్తున్నాం.

ఈనాడు ప్రతినిధి : మోదీ ప్రభుత్వం, మొదటి సంవత్సరం పాలనలో సాధించిన అతిపెద్ద విజయం ఏమిటి ?

అమిత్ షా : మేము 2014 మే 26న అధికారానికి వచ్చాం. ఈ ఏడాది పాలనలో మాపై ఒక్క అవినీతి మచ్చ కూడా లేదు. అదే యూ.పీ. ఏ – 10 ఏళ్ళ పాలనలో 12 లక్షల కోట్ల కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. ఇది మేము సాధించిన మొదటి పెద్ద విజయం.

ఈనాడు ప్రతినిధి : ఇవి కాకుండా, ఇంకా ఏమి సాధించారు ?

అమిత్ షా : గాడి తప్పిన ఆర్థిక రంగాన్ని పట్టాలపైకి ఎక్కించాం. ద్రవ్యలోటు దిగి వస్తోంది. కాశ్మీర్ వరదలు, నేపాల్ భూకంపం, వంటి ఉపద్రవాలలో, వేగంగా బాధితులను మేము ఆదుకున్నాం. ఏడాది కాలంలో 14 కోట్ల (జన్ ధన్) బ్యాంకు ఖాతాలు ప్రారంభించాం. మూడు సామాజిక భద్రతా పథకాలు, పేదవారి కోసం తీసుకువచ్చాం.

ఈనాడు ప్రతినిధి : మోదీ సర్కారు కార్పొరేట్లకు వత్తాసు పలుకుతోందని ప్రతిపక్షాలు అంటున్నాయి కదా!

అమిత్ షా : అదంతా వట్టి అబద్దం. గత ప్రభుత్వం, బొగ్గు, ఖనిజ నిక్షేపాలను, కార్పొరేట్లకు దాదాపు ఉచితంగా ఇచ్చింది. మేము మొత్తం గనుల్లో 10 శాతం వేలం వేస్తే, 2 లక్షల కోట్లు ప్రభుత్వానికి వచ్చింది. అలాగే స్పెక్ట్రమ్ వేలంలో 1.08 లక్షల కోట్లు ప్రభుత్వానికి వచ్చాయి. మీరే గమనించండి. ఎవరు ఎవరికి వత్తాసో !

ఈనాడు ప్రతినిధి : ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ?

అమిత్ షా : ఈ సమస్యను త్వరలో ఆర్థిక మంత్రి పరిష్కరిస్తారు.

ఈనాడు ప్రతినిధి : భూసేకరణ బిల్లును మీరు రాజ్యసభలో పాస్ చేయించుకోలేకపోతున్నారు కదా !

అమిత్ షా : అవును. ప్రతిపక్షాలు అనవసరంగా అడ్డు వస్తున్నాయి. ఆ బిల్లు త్వరలోనే పార్లమెంట్లో పాసవుతుంది.

ఈనాడు ప్రతినిధి : ధన్యవాదాలు, సెలవు.

ప్రశ్న 3.
పాఠం ఆధారంగా దాశరథి రంగాచార్య నవలలు, వాటిలోని ఇతివృత్తాలను తెలుపుతూ ఒక జాబితా రాయండి.
TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి 2
జవాబు:
TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి 3

ప్రశ్న 4.
ఇంటర్వ్యూకు సంబంధించిన కింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

పత్రికల్లో, టి.వి.లో రకరకాల ఇంటర్వ్యూలను చూస్తుంటాం. ఇంటర్వ్యూలు రెండు రకాలని తెలుసుకదా ! ఉద్యోగాల ఎంపికకై అభ్యర్థి ప్రతిభను పరీక్షించటానికి చేసేది ఒకరకం. ఉద్యోగాన్ని సంపాదించటానికి అభ్యర్థులు పూర్తి సంసిద్ధతతో ఇంటర్వ్యూకు పోతారు. దీనిలో ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు ముఖ్యపాత్ర పోషిస్తారు. ఇది మొదటిది. ప్రముఖుల జీవిత విశేషాలను తెలుసుకోవటానికి చేసేది మరోరకం. ప్రముఖుల, గొప్పవాళ్ళ నుండి వారి వివరాలను విశేషాలను తెలుసుకోవడానికి చేసేది రెండవది. దీనిలో ఇంటర్వ్యూ చేయబడే వ్యక్తే కీలకం.

రెండవ రకం ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు ముందుగా కొన్ని అంశాలపై ప్రశ్నలు తయారుచేసుకుంటారు. మొదట వారిని పరిచయం చేసుకొని వారి వ్యక్తిగత వివరాల నుండి మొదలై వారి జీవితంలోని ముఖ్య సన్నివేశాలు, ఘట్టాలు, వారందించిన సేవలు, ఆశయాలు, సమాజానికి వారిచ్చే సందేశంతో ముగ్గుస్తుంది.

ఇట్లా చేసే ఇంటర్వ్యూల వివరాలను పత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో ప్రజలు చూస్తుంటారు. ఆదర్శవంతులు, సంఘసంస్కర్తలు, కవులు, రచయితలు, ఉద్యమకారులు, శాస్త్రవేత్తలు, రాజకీయనాయకులు మొదలగు వారే కాకుండా మరే ఇతర రంగంలోనైనా ‘ఉత్తమ’ సేవలందించిన వాళ్ళందరిని ఇంటర్వ్యూ చేయడం మనం చూస్తుంటాం. వీళ్ళ జీవితాలు ఎందరికో స్పూర్తిని కలిగిస్తాయి. దారిని చూపుతాయి.

ప్రశ్నలు

అ) ఇంటర్వ్యూ అంటే ఏమిటి ?
జవాబు:
ఉద్యోగాల కొరకై అభ్యర్థుల ప్రతిభను పరీక్షించడానికి చేసే ఒక ప్రక్రియను ఇంటర్వ్యూ అంటారు.

ఆ) ప్రముఖులను ఇంటర్వ్యూ ఎందుకు చేస్తారు ?
జవాబు:
ప్రముఖుల జీవిత విశేషాలు, వారి అనుభవాలు, వారు అందించిన సేవలు, ఎందరికో స్ఫూర్తినిస్తాయి. మరెందరికో దారిని చూపుతాయి. అందుకోసం ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తారు.

ఇ) మొదటిరకం ఇంటర్వ్యూ దేనికి సంబంధించినది ?
జవాబు:
ఉద్యోగాల ఎంపికకై అభ్యర్థుల ప్రతిభను పరీక్షించడానికి చేసే ఇంటర్వ్యూ మొదటి రకం. దీనిలో ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు ప్రముఖపాత్ర వహిస్తారు.

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ఈ) ప్రముఖులను ఇంటర్వ్యూ చేయడానికి ఎట్లా సిద్ధం కావాలి ?
జవాబు:
ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు ముందుగా కొన్ని అంశాలపై ప్రశ్నలు తయారుచేసుకుంటారు. మొదట ప్రముఖులను పరిచయం చేసుకొని, వారి వ్యక్తిగత వివరాలను అడిగి, తరువాత వారి జీవితంలోని ముఖ్య సన్నివేశాలు, వారందించిన సేవలు, వారి ఆశయాలు, సమాజానికి వారిచ్చే సందేశంతో ఇంటర్వ్యూ ముగుస్తుంది.

ఉ) ప్రముఖుల నుండి ఇంటర్వ్యూలో సాధారణంగా రాబట్టే విషయాలు ఏవి ?
జవాబు:

  1. వ్యక్తిగత వివరములు,
  2. వారి జీవితంలోని ముఖ్య సన్నివేశాలు, ఘట్టాలు, వారందించిన సేవలు, వారి ఆశయాలు, సమాజానికి వారిచ్చే సందేశం మొదలయిన విషయాలు ప్రముఖుల నుండి రాబడతారు.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) దాశరథి రంగాచార్య తాను రచనలు ఎందుకు చేయాలనుకున్నారో సొంతమాటల్లో రాయండి.
జవాబు:
రంగాచార్య ఆంధ్ర మహాసభ ఉద్యమాల ప్రభావంతో మొదట రచన ప్రారంభించారు. నిజాం రాజ్యంలోని పరిస్థితులను గురించి, పత్రికలకు లేఖలూ, వ్యాసాలూ రాశారు.

ప్రభుత్వం, తెలంగాణ సాయుధపోరాట చరిత్రను వక్రీకరించింది. దాన్ని చెరిపివేసి విద్యార్థులకు తెలియకుండా చేసింది. అందువల్ల తెలంగాణ మహోజ్జ్వల వారసత్వం, తరువాతి తరాల వారికి తెలియకుండా పోతుందనే బాధతో, ఆందోళనతో, రంగాచార్య, తెలంగాణ సాయుధపోరాట గాథలో వట్టికోట ఆళ్వారుస్వామి రాయగా మిగిలిన విషయాలను నవలలుగా రచించారు.

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ఆ) “తెలంగాణ ఏర్పాటు సంతోషాన్ని”చ్చిందని రచయిత అనటంపై మీ అభిప్రాయాన్ని రాయండి.
జవాబు:
తెలంగాణ రాష్ట్రం 2014లో ఆవిర్భవించింది. అలా రాష్ట్రం ఏర్పాటు కావడం తనకు సంతోషాన్ని కలుగజేసిందని రంగాచార్యగారు చెప్పారు. అదే సందర్భంలో రంగాచార్యగారు తెలంగాణ వచ్చిందనుకుంటే లాభం లేదని, వచ్చిన తెలంగాణను కాపాడుకోవాలని, అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు.

దీనినిబట్టి దాశరథి రంగాచార్యగారికి, తెలంగాణ రాష్ట్రం పట్ల ఎంతో ప్రేమ ఉందని అర్ధం అవుతోంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న విషయంలో తెలంగాణలో పుట్టినవారందరూ సంతోషిస్తారని నా అభిప్రాయం.

ఇ) “ప్రజల భాష” అంటే మీరేమి అర్థం చేసుకున్నారో రాయండి.
జవాబు:
రంగాచార్య తన నవలలను ప్రజల భాషలో వ్రాశానని చెప్పారు. ప్రజల భాష అంటే ప్రజలు మాట్లాడుకొనే మాండలిక భాష, నవలల్లో పాత్రలకు వారు పాత్రోచితమైన తెలంగాణలోని మాండలిక భాష వాడారు. రంగాచార్య గారికి తెలంగాణ అంటే అభిమానం. తెలంగాణ యాస సొగసులు అంటే ఇష్టం. అందుకే వారు నవలలలోని పాత్రలను బట్టి, పాత్రలు మాట్లాడేటప్పుడు ప్రజల భాషయైన మాండలికాన్ని వాడారు.

ఇక కథను చెప్పేటప్పుడు సాధారణ భాషనే వాడారు. ఆయన ప్రజాజీవితాన్ని చిత్రించడానికి, ప్రజల కోసం రచనలు చేశారు. అందుకే ప్రజల భాషయైన తెలంగాణ యాసతో ప్రజలు మాట్లాడే భాషను, తమ నవలల్లో ఉపయోగించారని గ్రహించాను.

ఈ) రంగాచార్య తన రచనలకు “తెలంగాణ ప్రజల జీవితాన్ని” నేపథ్యంగా ఎందుకు తీసుకున్నాడు ?
జవాబు:
దాశరథి రంగాచార్య తెలంగాణ సాయుధపోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆయనను ఆ ఉద్యమం ఎక్కువగా ప్రభావితం చేసింది. ఆయన ఉద్యమ జీవి. ముఖ్యంగా కమ్యూనిష్టు ఉద్యమం, ఆయనకు జీవితాన్ని నేర్పి’ మనిషిని చేసింది.

ప్రభుత్వం తెలంగాణ సాయుధపోరాట చరిత్రను వక్రీకరించింది. దాన్ని చరిత్ర నుండి చెరిపేయడానికి ప్రయత్నించింది. రైతులూ, కూలీలూ, కార్మికులూ, స్త్రీలూ, పిల్లలూ చేసిన చారిత్రాత్మక పోరాటం భావితరాలకు తెలియకుండా పోతుందనే బాధతో, ఆవేదనతో రంగాచార్య తెలంగాణ ప్రజల జీవితాన్ని నేపథ్యంగా తీసుకొని, తన రచనలను సాగించారు. తెలంగాణ ప్రజా జీవితాలు, ప్రజల ఆశలు పోరాటాలు, శాశ్వతంగా భావితరాలకు స్ఫూర్తినియ్యాలని, రంగాచార్య తన రచనలను తెలంగాణ ప్రజల జీవితాలు నేపథ్యంగా రచించారు.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) డా॥ దాశరథి రంగాచార్య చేసిన సాహిత్యసేవను వివరించండి.
జవాబు:
మహాకవి దాశరథి రంగాచార్యగారు తెలంగాణ సాయుధపోరాటం నేపథ్యంగా చిల్లర దేవుళ్ళు, జనపదం, మోదుగుపూలు, మాయజలతారు వంటి అద్భుతమైన నవలలు రాశారు. చారిత్రాత్మకమైన తెలంగాణ పోరాట చరిత్రను తన రచనల ద్వారా భావితరాలకు వారు అందజేశారు.

ఇంతేకాక, నాలుగు వేదాలనూ, పది ఉపనిషత్తులనూ తెలుగులోకి అనువదించారు. రామాయణ, భారత, భాగవతాలను సరళవచనంలో రాశారు. తెలంగాణ జనజీవనం, రైతాంగ పోరాటం, వంటి అంశాలు నేపథ్యంగా ఈయన విశిష్టమైన నవలలు రచించి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. తెలుగు నవలలో పాత్రోచిత యాసను మొదటగా ప్రవేశపెట్టారు. వీరి రచనలు ఇతర భారతీయ భాషలలోకి కూడా అనువదింపబడ్డాయి.

ఈయన నవలలు చలన చిత్రాలుగా వచ్చాయి. ఈయన రచనాశైలి, పాఠకుడిని ఆకట్టుకొంటుంది. ఈయన రాసిన “చిల్లర దేవుళ్ళు” నవలకు, రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈయనను ‘గద్య దాశరథి’ అనేవారు. ఈయన సంస్కృతాంధ్ర భాషల్లో మహాపండితుడు. ఈయన జీవిత చరిత్రను ‘మోదుగుపూలు’ నవలలో చిత్రించారు. రంగాచార్య గొప్ప రచయిత.

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా రాయండి.

అ) మీ పాఠశాలకు ఒక క్రీడాకారుడు, కళాకారుడు లేదా నాయకుడు వచ్చాడనుకోండి. వారిని ఇంటర్వ్యూ చేయడానికి కావలసిన ప్రశ్నావళిని తయారు చేయండి.
జవాబు:
మా పాఠశాలకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వస్తే, నేను ఈ కింది ప్రశ్నలతో ఆయనను ఇంటర్వ్యూ చేస్తాను.

  1. భారతరత్న మహాశయా ! మీకు క్రికెట్ ఆట కాకుండా, ఇంకా ఇష్టమైన ఇతర ఆటలేవో చెప్పండి.
  2. మీరు ఎన్నో సంవత్సరంలో క్రికెట్ ఆడుగు పెట్టారు ?
  3. క్రికెట్లో మీరు సాధించిన విజయాలు మీకు పూర్తి సంతృప్తినిచ్చాయా ?
  4. క్రికెట్, పాఠశాలల్లో, కళాశాలల్లో బాగా వ్యాప్తి చెందడానికి ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టాలి ?
  5. నేడు భారత క్రికెట్ రంగంలో, రాజకీయాలు ప్రవేశించాయి కదా ! దానిపై మీ అభిప్రాయం ఏమిటి ?
  6. మీరు అభిమానించే క్రికెట్ క్రీడాకారుడు ఎవరు ?
  7. మీకు క్రికెట్ నేర్పిన గురువు ఎవరు ?
  8. భారత్లో క్రికెట్ అభివృద్ధికి మీరిచ్చే సూచనలు ఏమిటి ?
  9. క్రికెట్ నేర్చుకొనే యువతకు మీరిచ్చే సలహాలు ఏమిటి ?
  10. మొత్తంపై క్రీడాకారులకు మీరిచ్చే సందేశం ఏమిటి ?

(లేదా)

ఆ) డా॥ దాశరథి రంగాచార్య వ్యక్తిత్వాన్ని లేదా సాహిత్యసేవను ప్రశంసిస్తూ వార్తా పత్రికకు ఒక లేఖ రాయండి.
జవాబు:
నమస్తే తెలంగాణ పత్రిక ప్రధాన సంపాదకులకు లేఖ

నల్గొండ,
X X X X X.

ప్రధాన సంపాదకులు,
నమస్తే తెలంగాణ దినపత్రిక,
హైదరాబాదు.

ఆర్యా,

నమస్కారాలు. నేను నల్గొండ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను. మాకు దాశరథి రంగాచార్య గారితో ఇంటర్వ్యూ పాఠం ఉంది. శ్రీ రంగాచార్య మహా మనీషి, వారిని గూర్చి ప్రతి తెలంగాణబిడ్డ తెలుసుకోవాలి. వారిని గూర్చి తెలిసిన విషయాలు రాస్తున్నా. మీ పత్రిక ద్వారా ప్రజలకు అందించకోరుచున్నాను.

“దాశరథి రంగాచార్య తెలంగాణ సాయుధపోరాటంలో పాల్గొన్న ఉద్యమ శీలి. వీరు తెలంగాణ ప్రజాజీవితం నేపథ్యంగా ఎన్నో నవలలు రాశారు. వీరి నవలల్లో ‘చిల్లర దేవుళ్ళు’ నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ‘జనపదం’ అనే నవలలో మొత్తం సమాజాన్ని మైక్రోస్కోపిక్ గా చూపించారు. ఇది తెలంగాణకి సంబంధించిన నవల కాదు. ఇది భారతదేశానికి చెందిన నవల. ‘మోదుగుపూలు’ నవలలో వీరి జీవిత చరిత్రను రాశారు.

దాశరథి రంగాచార్య గారిపై కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం ఉంది. ఆ ఉద్యమం వీరికి జీవితాన్ని నేర్పింది. వీరిని మనిషిని చేసింది. ప్రభుత్వం, తెలంగాణ సాయుధపోరాటాన్ని వక్రీకరించింది. చరిత్ర నుండి చెరిపివేయడానికి ప్రయత్నించింది. ఎందరో రైతులు, కూలీలు, స్త్రీలు, కార్మికులు, పిల్లలు చేసిన ఆ చారిత్రక పోరాటం వివరాలు, భావితరాలకు అందజేయాలని వీరు తెలంగాణ ప్రజల నేపథ్యంలో నవలలు రాశారు.

ఈయనకు తెలంగాణ అంటే గొప్ప ప్రేమ. ఈయన నేపథ్యంలో మహాపండితుడు. నాలుగు వేదాలను, పది ఉపనిషత్తులను, తెలుగులోకి అనువదించారు. భారత, భాగవత, రామాయణములను సరళ వచనంలో రాశారు.

రంగాచార్య చరిత్రను మీ పత్రికలో తప్పక అచ్చువేయండి. నమస్తే కృతజ్ఞతలతో

ఇట్లు,
మీ విశ్వసనీయుడు,
పి. రామకృష్ణ,
9వ తరగతి, ప్రభుత్వ పాఠశాల,
నల్గొండ.

చిరునామా :

ప్రధాన సంపాదకుడు,
నమస్తే తెలంగాణ,
దినపత్రిక, హైదరాబాదు.

III. భాషాంశాలు

పదజాలం

1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.

ఉదా : విలువలతో కూడిన విద్య మానవ జీవన వికాసానికి దోహదం చేస్తుంది.
జవాబు:
వికాసం = వికసించడం, విప్పారడం

అ) రామప్పగుడి శిల్పకళ సొగసును వర్ణించ శక్యమా ?
జవాబు:
సొగసు = అందము, సౌందర్యము

ఆ) వట్టికోట ఆళ్వారుస్వామి రచనల్లో ప్రజల మనిషి ఉత్కృష్టమైన రచన.
జవాబు:
ఉత్కృష్టం = శ్రేష్ఠము, గొప్పది

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ఇ) భాగవతంలో కృష్ణలీలలు సమగ్రం గా రాశారు.
జవాబు:
సమగ్రం = సంపూర్ణంగా, సమస్తమూ

ఈ) నానాటికి మానవ సంబంధాలు క్షీణించి పోతున్నాయి.
జవాబు:
క్షీణించు = తరుగు, నశించు

2. కింది వాక్యాల్లో గల ప్రకృతి – వికృతులను గుర్తించి రాయండి.

అ) కథలంటే నాకిష్టమని మా నాయినమ్మ నాకు రోజూ కతలు చెప్పింది.
జవాబు:
కథ (ప్రకృతి) – కత (వికృతి)

ఆ) స్వచ్ఛభారతం కోసం ప్రతిజ్ఞ చేద్దాం. ప్రతిన చేయడమే కాదు పనిచేసి చూపుదాం.
జవాబు:
ప్రతిజ్ఞ (ప్రకృతి) – ప్రతిన (వికృతి)

ఇ) ప్రజలకోసం కవిత్వం రాశాడు. ఆ కైత ప్రజలను చైతన్యపరిచింది.
జవాబు:
కవిత్వం (ప్రకృతి) – కైతం (వికృతి)

ఈ) ఆశ ఉండవచ్చు. మితమీరిన ఆస ఉండరాదు.
జవాబు:
ఆశ (ప్రకృతి) – ఆస (వికృతి)

వ్యాకరణాంశాలు

ప్రశ్న 1.
కింది పదాలను విడదీయండి. సంధిపేరు రాయండి.
జవాబు:
సంధి పదం – విడదీసిన రూపం – సంధిపేరు
ఉదా :
పోయినాడంటే – పోయినాడు + అంటే -ఉత్వసంధి
అ) ఏమని – ఏమి + అని – ఇత్వసంధి
ఆ) కాదనుకున్నాడు – కాదు + అనుకున్నాడు – ఉత్వసంధి
ఇ) పిల్లలందరూ – పిల్లలు + అందరూ – ఉత్వసంధి

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ప్రశ్న 2.
కింది విగ్రహ వాక్యాలను సమాస పదాలుగా మార్చండి. సమాసం పేరు రాయండి.
ఉదా : మూడు సంఖ్యగల రోజులు మూడురోజులు – ద్విగు సమాసం

అ) రెండు సంఖ్యగల రోజులు = రెండురోజులు – ద్విగు సమాసం
ఆ) వజ్రమూ, వైడూర్యము = వజ్రవైడూర్యములు – ద్వంద్వ సమాసం (లేదా) ఉభయ పద విశేషణ కర్మధారయ సమాసం)
ఇ) తల్లియూ, బిడ్డయూ = తల్లీబిడ్డలు – ద్వంద్వ సమాసం

కర్తరి, కర్మణి వాక్యాలు

కింది వాక్యాలు పరిశీలించండి.

  1. ఆళ్వారుస్వామి “చిన్నప్పుడే” అనే కథ రాశాడు. (కర్తరి)
  2. ‘చిన్నప్పుడే అనే కథ ఆళ్వారుస్వామిచే రచింపబడింది. (కర్మణి)

పై రెండింటిలో మొదటివాక్యం కర్తరి వాక్యం. భావం సూటిగా ఉంది కదా ! అది కర్త ప్రధానంగా కలిగిన వాక్యం. అంటే ‘రాశాడు’ అనే క్రియ, ‘ఆళ్వారుస్వామి’ అనే కర్తను సూచిస్తోంది. ఇటువంటి వాక్యాలను ‘కర్తరి వాక్యాలు’ అంటారు. రెండవ వాక్యం ‘కర్మణి వాక్యం’. ఇది కర్మ ప్రధానంగా కలిగిన వాక్యం. అంటే ‘రాయబడింది’ అనే క్రియ, ‘చిన్నప్పుడే అనే కథ’ అనే కర్మను సూచిస్తోంది.

ఈ వాక్యంలో రెండు మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

  1. ‘బడు’ అనే ధాతువు చేరడం
  2. ‘చే’ అనే విభక్తి చేరడం.

కర్తరి వాక్యం : కర్త ప్రధానంగా రూపొందుతుంది.
కర్మణి వాక్యం : కర్మ ప్రధానంగా రూపొందుతుంది. క్రియ మీద ‘బడు’ ధాతువు, కర్తమీద ‘చే / చేత’ విభక్తి చేరుతుంది.

ప్రశ్న 3.
కింది వాక్యాలను కర్మణి వాక్యాలుగా మార్చి రాయండి.

అ) లింగయ్య మా నాయకునికి ఉసిరికాయ ఇచ్చాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
లింగయ్య చేత మా నాయకునికి ఉసిరికాయ ఇవ్వబడింది. (కర్మణి వాక్యం)

ఆ) బాలు ఇసుకతో ఇల్లు కట్టాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
బాలుచే ఇసుకతో ఇల్లు కట్టబడింది. (కర్మణి వాక్యం)

ఇ) అక్క ఇంటి ముందు ముగ్గు వేసింది. (కర్తరి వాక్యం)
జవాబు:
అక్కచే ఇంటి ముందు ముగ్గు వేయబడింది. (కర్మణి వాక్యం)

ప్రశ్న 4.
కింది వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాయండి.

అ) గ్రామీణులచే నాయకులు ఎదుర్కొని పోబడ్డారు. (కర్మణి వాక్యం)
జవాబు:
గ్రామీణులు నాయకులను ఎదుర్కొని పోయారు. (కర్తరి వాక్యం)

ఆ) కాయలన్నీ అతని చేత ముందర పోయబడ్డాయి. (కర్మణి వాక్యం)
జవాబు:
కాయలన్నీ అతని ముందర పోశారు. (కర్తరి వాక్యం)

ఇ) బాలురచే సెలవు తీసుకోబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
బాలురు సెలవు తీసుకున్నారు. (కర్తరి వాక్యం)

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ప్రశ్న 5.
మీరు తత్పురుష సమాసం గురించి తెలుసుకున్నారు కదా ! కింది విగ్రహవాక్యాల్లో గీత గీసిన విభక్తి ప్రత్యాయాల ఆధారంగా ఆయా తత్పురుష సమాసాల పేర్లు రాయండి.

అ) విద్యను అర్థించువారు
జవాబు:
(ద్వితీయా తత్పురుష సమాసం)

ఆ) గుణాలచేత< హీనుడు
జవాబు:
(తృతీయా తత్పురుష సమాసం)

ఇ) సభ కొరకు భవనం
జవాబు:
(చతుర్థీ తత్పురుష సమాసం)

ఈ) దొంగల వల్ల భయం
జవాబు:
(పంచమీ తత్పురుష సమాసం)

ఉ) రాముని యొక్క బాణం
జవాబు:
(షష్ఠీ తత్పురుష సమాసం)

ఊ) గురువు నందు భక్తి
జవాబు:
(సప్తమీ తత్పురుష సమాసం)

ప్రాజెక్టు పని

మీ గ్రామంలోని వేరు వేరు రంగాలకు చెందిన ప్రముఖులను ఇంటర్వ్యూ చేసేందుకు ప్రశ్నావళి రూపొందించుకుని ముఖాముఖి నిర్వహించండి. నివేదిక రాయండి.
జవాబు:
విద్యారంగం :

  • మీరు ఎంత కాలంనుండి విద్యాబోధన చేస్తున్నారు ?
  • విద్యా ప్రణాళికలో నైతిక విలువల ప్రాధాన్యత ఎంతవరకు ఉంది ?
  • ప్రాథమిక స్థాయిలో యోగా విద్యకు ప్రాధాన్యతను ఇవ్వాలా ?
  • ప్రస్తుత విద్యా విధానంలో పరీక్షల సంస్కరణలు ఎలా ఉండాలి ?
  • పనిబాట పట్టిన పిల్లలను బడిబాట పట్టడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి ?
  • పాఠశాల వాతావరణం ఎలా ఉండాలి ? లోపాలను ఎలా సరిదిద్దాలి ?

వ్యాపార రంగం :

  • వ్యాపారంలో నైతికత అవసరం ఎంతవరకు ఉంది ?
  • పెట్టుబడులకు బ్యాంకుల సహకారం ఎంతవరకు ఉండాలి?
  • వినియోగదారుల మన్ననను వ్యాపారులు ఎట్లా పొందాలి ?
  • వ్యాపారుల మధ్య పోటీ ఎలా ఉండాలి ?
  • వ్యాపారస్థులు సమాజం పట్ల బాధ్యతను ఎలా గుర్తించాలి ?

వైద్యరంగం :

  • గ్రామాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆవశ్యకత ఎంతవరకు ఉంది ?
  • గ్రామస్థులకు వైద్యులు ఎలాంటి ఆరోగ్య సూత్రాలను అందించాలి ?
  • వర్షాకాలంలోనూ, ఎండాకాలంలోనూ, ప్రజలకు ఎలాంటి సూచనలను వైద్యులు అందించాలి ?
  • అంటురోగాలు ప్రబలకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

వ్యవసాయరంగం :

  • పంటలో సేంద్రియ ఎరువుల ఆవశ్యకత ఎంతవరకు ఉంది ?
  • రైతులకు గిట్టుబాటు ధరలు కావాలంటే ప్రభుత్వం ఏం చేయాలి ?
  • ప్రస్తుత తరుణంలో సమష్టి వ్యవసాయం అవసరం ఉందా ? లేదా ?
  • రైతుల ఆత్మహత్యలను ఎలా నివారించాలి ?
  • ఆధునిక వ్యవసాయంలో ఎలాంటి మెలకువలు పాటించాలి ?

కఠిన పదాలకు అర్థాలు

I

36వ పేజి

సాహితీ రంగ ప్రవేశం = సాహిత్య రంగములో ప్రవేశించడం
ఆంధ్రమహాసభ = ఆంధ్రులు పెట్టుకున్న మహాసభ;
మహోద్యమం (మహా + ఉద్యమం) = గొప్ప పోరాటం ;
ప్రభావితుణ్ణయి = ప్రభావం పొందినవాడినయి
పూనుకున్నాను = సిద్ధపడ్డాను
ఉద్యమం = పోరాటం
ప్రజాజీవితం = ప్రజల యొక్క జీవితం
నేపథ్యంగా = పూర్వరంగంగా
వక్రీకరించింది = తప్పుదారి పట్టించింది ;
సాయుధపోరాటం = ఆయుధములతో పోరాటం ;
జడుసుకుంది = భయపడింది
బుగులుపడింది = కలతపడింది (కలత చెందింది)
చారిత్రాత్మక పోరాటం = చరిత్ర ప్రసిద్ధమైన పోరాటం
ప్రతిన = ప్రతిజ్ఞ
రక్తా రుణ సమరాలు
(రక్త + అరుణ, సమరాలు) = రక్తంతో ఎరుపెక్కిన యుద్ధాలు;
మహోజ్జ్వల వారసత్వం
(మహా + ఉజ్జ్వల, వారసత్వం) = గొప్పగా ప్రకాశించే వారసత్వం
వ్యథ = దుఃఖము
ఆవేదన = బాధ
ఆవిర్భవించినవి = పుట్టాయి
ఉత్కృష్టమైన = శ్రేష్ఠమైన
పోరాటగాథ = పోరాటానికి సంబంధించిన కథ;

37వ పేజి

ఆందోళన = ఊగిసలాట (కంగారు)
బృహత్ కార్యము = పెద్దపని
ఉపక్రమించినాను = మొదలుపెట్టినాను

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

II

37వ పేజి

అగ్రజులు = అన్నగారు
తొలుత = మొదట
ప్రక్రియలో = రచనా పద్ధతిలో
ఉభయులు = ఇద్దరూ
ప్రభావాత్మకము = ప్రభావం కల్గించేది
దృక్పథాన్ని = దృష్టి మార్గాన్ని
విస్తృతమయిన = విశాలమైన
సమాజాన్ని = సంఘాన్ని
మైక్రోస్కోపిక్ (Microscopic) = అత్యంత సూక్ష్మంగా ;
పోలీస్ యాక్షన్ (Police Action) = (1948లో నిజాం నుండి రాజ్యాన్ని స్వాధీనం చేసుకోడాన్ని భారత యూనియన్ వారు, చేపట్టిన పోలీసు చర్య)
కాజేయడం = ఆక్రమించడం;
ఉద్యమాలొచ్చినయి = ఉద్యమాలు (పోరాటాలు) వచ్చాయి
భ్రష్టుపట్టడం = చెడిపోవడం
వ్యాఖ్య చెయ్యడం = వివరంగా వ్యాఖ్యానించి చెప్పడం ;
గర్వకారణం = గర్వపడడానికి కారణం

38వ పేజి

ప్రియమయిన = ఇష్టమైన
ఆత్మకథ = తన జీవిత కథ
జీవనయానం = జీవన ప్రయాణం (ఆత్మ జీవిత కథ)
ఇవాల్టికీ = నేటికీ
పర్ఫెక్షన్ (Perfection) = సంపూర్ణత (లోపం లేకపోడం)
కర్తవ్యం = చేయదగిన పని
డూ ఆర్ డై (Do or die) = చేయడం లేకపోతే చావడం ;
సిద్ధాంతం = స్థిరమైన నిరూపిత సారాంశము

III

38వ పేజి

కృషి = ప్రయత్నం
భగవదనుగ్రహం
(భగవత్ + అనుగ్రహం) = భగవంతుడి దయ
విశ్వాసం = నమ్మకం
అసాధ్యమైన = సాధ్యముకాని
సంప్రదాయ సిద్ధము = గురుపరంపరగా వచ్చినట్టిది
చదువుల రాణి = సరస్వతి
కీర్తించు = పొగడను
శ్లాఘించను = కొనియాడను
మాండలికం = మండలములోని భాష (ప్రాంతీయమైన యాస పలుకుబడి)
తెలంగాణేతర
(తెలంగాణ + ఇతర) = తెలంగాణ కంటే ఇతరమైన
దురభిమానం = చెడ్డ అభిమానం
యాససొగసులు = మాట్లాడే తీరులోని అందాలు
నివేదనకు = వెల్లడించడానికి
సంక్షిప్తంగా = కొద్దిగా
వాల్మీకి = సంస్కృత రామాయణ కర్త
వ్యాసుడు = అష్టాదశపురాణాలు, భారత భాగవతాలు సంస్కృతంలో వ్రాసిన మునీశ్వరుడు
కాళిదాసు = అభిజ్ఞాన శాకుంతలం వంటి సంస్కృత నాటకాలు వ్రాసిన సంస్కృత మహాకవి
గోర్కీ = మాక్సింగోర్కి (రష్యన్ రచయిత ఈయన రాసిన ‘అమ్మ’ నవల ప్రసిద్ధము.)
చెఖోవ్ = రష్యాదేశ ప్రసిద్ధ కథా రచయిత;
డికెన్స్ = ఫ్రాన్సు దేశ రచయిత (A Tale of two cities) రెండు మహా నగరాల కథా రచయిత
ప్రేంచంద్ = హిందీ నవలా రచయిత (గోదాన్ నవలా కర్త)
ఉన్నవ = ఉన్నవ లక్ష్మీనారాయణ గారు (మాలపల్లి నవలా రచయిత)
విశ్వనాథ = వేయిపడగలు నవలా కర్త (విశ్వనాథ సత్యనారాయణగారు)
అల్లం రాజయ్య = నవలా రచయిత, కథా రచయిత
పరిధులు = సరిహద్దులు
వసుధైక కుటుంబం = ప్రపంచం అంతా ఒకే కుటుంబంగా భావించడం

39వ పేజి

ప్రభావితం చేసిన = ప్రభావం కలుగజేసిన
వ్యక్తులుగా = మనుషులుగా
ఉద్యమజీవిని = ఉద్యమమే ఊపిరిగా జీవించినవాడిని
సమాజం = సంఘము

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

IV

39వ పేజి

అధ్యయన దశ = గురుముఖంగా చదివి నేర్చుకోవలసిన, స్థితి
అధ్యయనం = చదవడం
ఆచరణ దశ = పనిచేయవలసిన, స్థితి
సాహిత్య సాంస్కృతిక జీవనవైభవానికి = సాహిత్యము, సంస్కృతికి సంబంధించిన, జీవితంలోని గొప్పదనానికి
జీవగడ్డ = జీవనాధారమైన నేల ;
వారసత్వ సంపద = పూర్వీకుల నుండి వచ్చే సంపద
పునరుజ్జీవనానికి (పునః + ఉజ్జీవనానికి) = తిరిగి, బ్రతికించడానికి
ప్రణాళిక = పథకము
మేనిఫెస్టోలు = ప్రకటన కాగితము
రూపొందించుకోవచ్చు = తయారుచేసికోవచ్చు
నిర్వర్తించాను = నెరవేరతాయి
సందేశం = చెప్పవలసి మాట
సిద్ధిస్తాయి = నెరవేర్చాను

పాఠం ఉద్దేశం

తెలంగాణకు ఒక విశిష్టమైన చరిత్ర ఉన్నది. నాటి నుండి నేటి వరకు ఈ గడ్డపై పోరాడిన వీరులు, కవులు, రచయితలు, కళాకారులు ఎంతోమంది ఉన్నారు. నాటి తెలంగాణ పోరాటాన్ని కళ్ళార చూసిన సాహితీయోధుడు డా॥ దాశరథి రంగాచార్య. తెలంగాణ ప్రజల జీవనాన్ని, అస్తిత్వాన్ని, పోరాటాలను తన రచనల ద్వారా ప్రతిఫలింప చేశాడు. అలాంటి ప్రముఖ రచయిత వ్యక్తిత్వస్ఫూర్తిని, రచనల గొప్పదనాన్ని ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా విద్యార్థులకు తెలియజేయటమే పాఠ్యాంశ ముఖ్య ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠ్యభాగం ఇంటర్వ్యూ (పరిపృచ్చ) ప్రక్రియకు చెందినది. ఇంటర్వ్యూ (Interview)నే, పరిపృచ్ఛ, లేక ‘ముఖాముఖి’ అని కూడా అంటారు. ఈ ఇంటర్వ్యూ రెండు రకాలుగా ఉంటుంది.

ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపికచేసే ప్రక్రియలో ఉద్యోగార్థుల ప్రతిభను పరీక్షించడం కోసం చేసే ఇంటర్వ్యూ మొదటిరకం. ఇక నిర్దిష్ట రంగంలో సేవలందించిన మహాత్ముల అనుభవాలను, అంతరంగాన్ని తెలిసికోడానికి చేసే ఇంటర్వ్యూ రెండవది.

డా॥ దాశరథి రంగాచార్య, వేరువేరు సందర్భములలో వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలోని ముఖ్యాంశాలే ఈ పాఠ్యభాగం.

డా॥ దాశరథి రంగాచార్య కవి పరిచయం

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి 1

పాఠము పేరు : “రంగాచార్యతో ముఖాముఖి”

ఇంటర్వ్యూలో జవాబులు చెప్పినవారు : దాశరథి రంగాచార్య

రంగాచార్య జననం : 24-08-1928

రంగాచార్య మరణం : 07-06-2015

జన్మస్థలం : మహబూబాబాద్ జిల్లాలోని చిన్న గూడూరులో జన్మించారు.

సోదరుడు : ప్రముఖ కవి డా|| దాశరథి కృష్ణమాచార్య వీరి సోదరుడు.

ఉద్యోగము : ఈయన ఉపాధ్యాయుడిగా, గ్రంథాలయ నిర్వాహకుడిగా, సికింద్రాబాద్ పురపాలకశాఖలో పనిచేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు.

నవలా రచన : ఈయన విశిష్టమైన తెలుగు నవలలు రచించి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు.

అనువాదము :

  1. నాలుగు వేదములను, పది ఉపనిషత్తులను, సంస్కృతం నుండి తెలుగులోకి అనువాదం చేశారు.
  2. రామాయణ, భారత, భాగవతాలను సరళమైన తెలుగు వచనంలో రాశారు.

రచనలలోని విషయము : తెలంగాణ జనజీవనము, రైతాంగ పోరాటం వంటి విషయాలు పూర్వరంగంగా, (నేపథ్యంగా) ఈయన రచనలు సాగాయి. వీరు తెలుగు నవలలో ‘పాత్రోచితయాస’ను ప్రవేశపెట్టారు. ఈయన రచనలు, ఇతర భాషల్లోకి అనువదింపబడ్డాయి. సినిమాలుగా వచ్చాయి.

పురస్కారం : వీరి “చిల్లర దేవుళ్ళు” నవలకు, రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.

శైలి : వీరి రచనాశైలి పాఠకులను ఆకట్టుకొంటుంది.

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ప్రవేశిక

తెలుగు సాహిత్యంలో దాశరథి రంగాచార్యులుగారికి విశిష్టస్థానము ఉంది. ఈయన తెలంగాణ పోరాటం పూర్వరంగాన్ని, తన జీవశక్తిగా మార్చుకొని, తెలుగువారి సాంస్కృతిక జీవనాన్ని అద్భుతంగా చిత్రించారు. అటువంటి రంగాచార్యగారి అంతరంగాన్ని మరింత దగ్గరగా తెలుసుకోవాలనే ఆసక్తి, ఉత్సాహం పాఠకులకు సహజంగానే ఉంటుంది. అలా తెలుసుకోడానికి ఈ ముఖాముఖి (Interview) ప్రక్రియ తోడ్పడుతుంది.

రచయితతో పరిచయం వల్ల, ఆయన రచనల్లో తెలియని కొత్త కోణాలు సాహితీలోకానికి పరిచయం అవుతాయి. అందుకోసం డా॥ దాశరథి రంగాచార్యగారితో ముఖాముఖిని చదువుదాం.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson కాళోజి

Telangana SCERT 9th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం 3rd Lesson కాళోజి Questions and Answers.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson కాళోజి

వివక్ష ఎక్కడున్నా వ్యతిరేకించాడు.
మంచి ఎక్కడున్నా స్వాగతించాడు.
అన్యాయం, అణచివేతలపై తిరగబడ్డాడు
తన వాదనలతో తెలంగాణేతరుల మనసులను కూడ గెలుచుకున్నాడు.
తెలంగాణ వైతాళికుడని పేరుగన్నాడు.
ఈ నేల సాంస్కృతిక వారసత్వంలోనుండి ఎదిగిన ఆ మహనీయుడే – కాళోజి
TS 9th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson కాళోజి 1

PAPER – I : వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన) (మార్కులు: 6)

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
కాళోజి – బాల్యం – విద్యాభ్యాసంను గూర్చి రాయండి.
జవాబు:
కాళోజి నారాయణరావుగారు మొదటి ప్రపంచ యుద్ధం జరిగే రోజుల్లో అనగా 9-9-1914న జన్మించాడు. ఈయన ‘రట్టహళ్ళి’ అనే గ్రామంలో జన్మించారు. ఇది ప్రస్తుతం బీజాపూరు జిల్లాలో ఉంది. ఈ ఊరు, కర్ణాటక ప్రాంతంలోని పాత బొంబాయి ప్రెసిడెన్సీ కింద ఉండేది.

కాళోజీ బాల్యంలో వారి కుటుంబం, కొన్ని సంవత్సరాలు మహారాష్ట్రలోని ‘సాయరాం’ అనే గ్రామంలోనూ, మరికొంతకాలం తెలంగాణాలోని ఇల్లెందు తాలూకా ‘కారేపల్లి’ గ్రామంలోనూ నివసించేది. 1917 వరకూ కాళోజీ కుటుంబం ‘హనుమకొండ’ లో ఉండేది. తరువాత ‘మడికొండ’ కు మారింది.

కాళోజీ అన్న రామేశ్వరరావు న్యాయశాస్త్రం చదవడానికి హైదరాబాదు వెళ్ళవలసినప్పుడు కాళోజీ పాతబస్తీలోని చౌయహల్లా కాన్లీబడిలో సెకండ్ ఫారమ్లో చేరారు. ఆ తరువాత సుల్తాను బజారులోని రెసిడెన్సీ మిడిల్ స్కూలులో చేరారు. ఉన్నత విద్య కోసం 1934 ఏప్రిల్ వరంగల్ కాలేజిమేట్ హైస్కూలులో ఇంటర్మీడియట్లో ప్రవేశించారు. 1939లో కాళోజీ ‘లా’ పూర్తి చేశారు. 1940లో గవిచెర్ల గ్రామానికి చెందిన ‘రుక్మిణి’ని వివాహం చేసుకున్నారు.

ప్రశ్న 2.
కాళోజిగారి కథలను గూర్చి రాయండి.
(లేదా)
కథా రచయితగా కాళోజీ ఎలా రాణించారు ?
జవాబు:
కాళోజీ కవిగానేగాక, కథకునిగా కూడ రాణించాడు. ఈయన కథలో స్వచ్ఛత, సూటిదనం, నచ్చని విషయాలపై నిరసన, స్పష్టంగా కనిపిస్తాయి. కాళోజీ కథలకు ఈనాటికీ ‘ప్రాసంగికత’ ఉంది.

కులమతాలపేరిట, మనుషుల్ని హీనంగా చూడటం అవమానించడం, ఎంత దారుణమో ఈయన చెప్పారు. మనుషుల్లో ఉండే ద్వంద్వ ప్రవృత్తినీ, అన్యాయరీతుల్ని గూర్చి ఈయన తన కథల్లో చెప్పారు.

ఈయన ‘విభూతి లేక ఫేస్ పౌడర్ కథ’ వ్యంగ్య హేళనలతో సాగింది. ఈ కథలో అలంకరణల పట్ల మోజును గూర్చి, నవ్వు తెప్పించే విధంగా చెప్పాడు.

రాజకీయములో పరిపాలనలో ఉన్న అవకతవకలనూ, అక్రమాలనూ మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం. తెలంగాణాలో 1940 నాటికి ఉన్న రాజకీయ వ్యవస్థ శైశవ దశలో ఉంది. ఒకరిని మించి ఒకరు కుట్రలు కుతంత్రాలతో లౌక్యంతో రాజ్యపాలన సాగింది. ఈ పరిస్థితుల్ని రామాయణంలోని సుగ్రీవుడు, విభీషణుడి కథలకు ముడిపెట్టి, కాళోజీ రాసిన కథ పేరు “లంకా పునరుద్ధరణ”. రామాయణ కథపై విసరిన వ్యంగ్యాస్త్రమే, ‘లంకా పునరుద్ధరణ’ కథ.

రాతి బొమ్మకు గుడిని కట్టించే విషయంలో ముందుకు వచ్చిన ప్రజలు, ప్రాణం ఉన్న అనాథ శిశువుపై ఆదరణ చూపించలేకపోవడంపై విసరిన మరో వ్యంగ్యాస్త్రం, “భూతదయ” అనే కథ. ఈ విధంగా కాళోజీ కథలన్నీ ఒకరకంగా రాజకీయ కథలు. ఈ కథలో సాహిత్య విలువలను కాపాడడానికి కాళోజీ ప్రయత్నించారు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson కాళోజి

ప్రశ్న 3.
కాళోజి ‘కవిత్వం – భాష’ అనే వాటిని గూర్చి రాయండి.
జవాబు:
కాళోజి తన కవిత్వాన్ని ప్రజల జీవితాల్లోకి తీసుకువెళ్ళి ప్రజాకవిగా పేరు పొందాడు. తెలంగాణ పక్షాన నిలిచి, తాడిత, పీడిత ప్రజల గుండెల్లో కొలువైన మహాకవి కాళోజి. కాళోజి మాటలలో, చేతలలో, ఆలోచనలో, ఆవేదనలో, వేషభాషల్లో ప్రవర్తనలో తెలంగాణ స్వరూపం, సంపూర్ణంగా కనిపిస్తుంది.

ఈయన సమాజ గొడవను తన గొడవగా చేసుకొని, ‘నా గొడవ’ అనే పేరుతో అనేక కవితలు రాసి, వాటిని ఎనిమిది సంపూటాలుగా వెలువరించారు. కాళోజీ ప్రాంతీయ దృక్పథం, దేశీయ దృక్పథం, అంతర్జాతీయ దృక్పథం కలిగిన కవి. నిరంకుశ రాజ్యాలమీద తన జీవితాంతం కత్తి కట్టి పోరాడాడు. అందుకే రాజకీయాలతో, ప్రజా ఉద్యమాలతో, మమైకమైన కాళోజీ కవిత్వాన్ని తెలుగునాట ప్రజలు ఆదరించాడు.

రజాకార్లపై ఆయన కోపాన్ని పరాకాష్ఠకు చేర్చిన ఆయన కవిత, “కాటేసి తీరాలె” అనేది. ఇందులోని కసి తెలంగాణ ప్రజలది.

“మన పిల్లలను చంపి మనల బంధించిన
మానవాధములను మండాలధీశులను
మరచి పోకుండ గురుతుంచుకోవాలె
కసి ఆరిపోకుండ బుసకొట్టుచుండాలె
కాలంబు రాగానె కాటేసి తీరాలె”

కాళోజీ భాష : కాళోజీ దృష్టిలో భాష రెండు రకాలు. ఒకటి “బడి పలుకుల భాష”. రెండవది జనం నిత్యం వ్యవహారంలో వాడే “పలుకుబడుల భాష”. వీటినే గ్రాంథిక భాష, వ్యావహారిక భాష అంటాము.
ఏ భాషకైనా జీవధాతువు, మాండలికమే. కాళోజీ జీవభాష వైపే మొగ్గు చూపాడు.

ప్రశ్న 4.
కాళోజీ నారాయణరావుగారి ప్రజా జీవితం గురించి రాయండి.
జవాబు:
ఎనిమిది దశాబ్దాలుగా ప్రజా జీవితంలో కాళోజీ బ్రతుకు ముడిపడింది. ఆయన వివక్ష ఎక్కడ ఉన్నా వ్యతిరేకించాడు. మంచిని స్వాగతించాడు. అన్యాయం, అణచివేతలపై తిరుగుబడ్డాడు. ఆయన వాదనలోని సమర్థనలను, ఆలోచించ గలవారు గుర్తించారు. ఈయన పెక్కు సందర్భాల్లో తెలంగాణేతరుల మనస్సులను కూడా జయించాడు.

కాళోజిని తెలంగాణా వైతాళికుడిగా చెప్పాలి. ఈయన తెలంగాణ వారసత్వంలోంచి ఎదిగాడు. ఈయన మనుషులను అర్థం చేసుకున్న తీరు, విశిష్టమైనది. ఈయనకు భాగవతంలో ప్రహ్లాదుడి పాత్ర నచ్చిందని చాలాసార్లు చెప్పాడు. అన్యాయాన్ని ఎదిరించినవాడే తనకు పూజ్యుడని, కాళోజీ చెప్పారు.

ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా విలువ ఉంటుందని ఈయన భావించాడు. ఓటుహక్కు ప్రజాస్వామికమైనదని ప్రకటిస్తూ మెడలో బోర్డు వేసుకొని, ఈయన తిరిగాడు. ఈ స్వేచ్ఛా ప్రవృత్తి కాళోజిలో అడుగడుగునా కనిపిస్తుంది.

వ్యక్తిత్వం, స్వేచ్ఛ, అనే రెండు ప్రధాన విషయాలను మనిషి కోల్పోకూడదని, కాళోజీ చెప్పారు. కాళోజీ జీవితాంతం ప్రజాస్వామ్యవాదిగా ఉన్నారు. “నీ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా ప్రకటించే నీ హక్కులకోసం అవసరమైతే నా ప్రాణాలిచ్చి పోరాడుతా” అనే మాటల్ని కాళోజీ గుర్తు చేసేవారు. ఆ మేరకు ఆయన బతికారు.

తెలంగాణ ఇటీవల వరకు యుద్ధ భూమి అందులో కాళోజీ ప్రజల వైపు నిలబడి, కవిత్వం వినిపించాడు. నిజాంను ఎదిరించాడు. కాళోజీ ఉద్యమ కవి.

ప్రశ్న 5.
కాళోజీ నారాయణరావు వ్యక్తిత్వాన్ని గురించి సంక్షిప్తంగా రాయండి.
జవాబు:
కాళోజీ 9-9-1914న బీజపూర్ జిల్లా రట్టహళ్ళిలో జన్మించారు. 1939లో లా పూర్తిచేసి, 1940లో రుక్మిణిని పెండ్లాడారు. ఆచరణకు, ఆదర్శానికీ తేడాలేని జీవితం ఆయనది. కాళోజీ నిరంతర ఉద్యమ జీవి. తమ కాలంలో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. రజాకార్లను ఎదిరించి జైలు జీవితం గడిపారు. నిజాం రాజును ఎదిరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. ఇతరుల బాగు కోసం పోరాడేతత్త్వం, సామాజిక స్పృహ, కాళోజీలో ఉన్నాయి.

కాళోజీ తాడిత పీడిత ప్రజల గుండెల్లో నిలిచి కవి. ఆయనలో తెలంగాణా స్వరూపం దర్శనమిస్తుంది. దాశరథి అన్నట్లు, కాళోజీ, “తెలంగాణ ఆధునిక సాహిత్య ముఖద్వారం”. కాళోజీ, సమాజ గొడవను తన గొడవగా చేసుకొని, ‘నా గొడవ’ అనే పేరున అనేక కవితలు రాశాడు. కాళోజీ నిజానికి అంతర్జాతీయ కవి. రజాకార్లపై తన కోపాన్ని కాళోజీ ‘కాటేసి తీరాలె’ అన్న కవితలో రాశారు. కాళోజీ తన రచనలలో, జీవ భాష వైపే మొగ్గుచూపారు. ‘వీర తెలంగాణ నాది, వేరు తెలంగాణ నాది’, అని కాళోజీ ఎలుగెత్తి చాటాడు. కాళోజీ కవిగా, ఉద్యమకారునిగా, కథకునిగా కూడా, రాణించారు. కాళోజీ వివక్షను వ్యతిరేకించాడు. మంచిని స్వాగతించాడు. కాళోజీ తెలంగాణ వైతాళికుడు.

ఈయన, ప్రజాస్వామ్యంలో ఓటుకు విలువ ఉంటుందని చెప్పి, మెడలో బోర్డు వేసుకొని తిరిగేవాడు. ఆయన నిర్భయంగా మాట్లాడేవారు. కాళోజీ జీవితాంతం, ప్రజాస్వామ్య వాధిగా ఉన్నాడు. ఖలీల్ జిబ్రాల్ రాసిన “ది ప్రాఫెట్”ను ‘జీవనగీత’గా అనువదించాడు. తన భౌతిక శరీరాన్ని కాకతీయ మెడికల్ కాలేజీ వారికి అందించాడు.
కాళోజీ జీవితమంతా దేశంగా, ప్రజలుగా, ఉద్యమాలుగా బతికిన మహాకవి.

PAPER – II : పరిచిత గద్యాలు (మార్కులు : 5)

1. కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

తెలంగాణ పక్షాన నిలిచి తాడిత, పీడిత ప్రజల గుండెలలో కొలువైన కవి కాళోజి. మాటలలో, చేతలలో, ఆలోచనలలో, ఆవేదనలో, వేషభాషలలో, ప్రవర్తనలో, తెలంగాణ స్వరూపం సంపూర్ణంగా కనిపిస్తుంది. దాశరథి అన్నట్లు “తెలంగాణ ఆధునిక సాహిత్య ముఖద్వారం కాళోజి. తన కవిత్వాన్ని ప్రజల జీవితాల్లోకి తీసుకెళ్ళి ప్రజాకవిగా పేరుపొందినవాడు కాళోజీ.

సమాజ గొడవను తన గొడవగా చేసుకొని “నా గొడవ” పేరుతో అనేక కవితలు రాసి, వాటిని ఎనిమిది సంపుటాలుగా వెలువరించాడు. ప్రాంతీయ దృక్పథం, దేశీయ దృక్పథం, అంతర్జాతీయ దృక్పథం కలిగిన కాళోజి నిజానికి అంతర్జాతీయ కవి. ‘నిరంకుశ రాజ్యాలమీద జీవితాంతం కత్తిగట్టి పోరాడినవాడు కాళోజి. అందుకే రాజకీయాలతో, ప్రజా ఉద్యమాలతో మమైకమైన కాళోజి కవిత్వాన్ని తెలుగునాట ప్రజలు ఆదరించారు. రజాకార్లపై ఆయన కోపాన్ని పరాకాష్టకు చేర్చిన కవిత “కాటేసి తీరాలె”. ఇందులోని కసి తెలంగాణా ప్రజలందరిది.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
కాళోజీ గురించి దాశరథి అన్నమాట ఏది ?
జవాబు:
‘తెలంగాణ ఆధునిక సాహిత్య ముఖద్వారం ‘కాళోజి’ అని దాశరథి కాళోజి గురించి చెప్పాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson కాళోజి

ప్రశ్న 2.
కాళోజి ఎటువంటి కవి ?
జవాబు:
ప్రాంతీయ దృక్పథం, దేశీయ దృక్పథం, అంతర్జాతీయ దృక్పథం కలిగిన కాళోజి, నిజానికి అంతర్జాతీయ కవి.

ప్రశ్న 3.
కాళోజీలో ఏమి కనిపిస్తుంది ?
జవాబు:
కాళోజి మాటలలో, చేతలలో, ఆలోచనలలో, ఆవేదనలో, వేషభాషలలో, ప్రవర్తనలో తెలంగాణ స్వరూపం, సంపూర్ణంగా కనిపిస్తుంది.

ప్రశ్న 4.
కాళోజి ప్రజాకవి ఎట్లు అయ్యాడు ?
జవాబు:
తన కవిత్వాన్ని ప్రజల జీవితాల్లోకి తీసుకువెళ్ళాడు కాబట్టి, కాళోజి ప్రజాకవి అయ్యాడు.

ప్రశ్న 5.
‘నా గొడవ’ కవితా సంపుటాల గురించి తెలుపండి.
జవాబు:
కాళోజీ సమాజ గొడవను తన గొడవగా చేసుకొని, ‘నా గొడవ’ పేరుతో అనేక కవితలు రాసి, వాటిని ఎనిమిది సంపుటాలుగా వెలువరించాడు.

2. ఈ కింది పేరా చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

కవిగా, ఉద్యమకారునిగా పేరొందిన కాళోజి కథకునిగా కూడా రాణించాడు. ఇతని కథల్లో స్వచ్ఛత, సూటిదనం, నచ్చని విషయాలపై నిరసన స్పష్టంగా కనిపిస్తుంది. కాళోజి కథలకు ఈనాటికీ ప్రాసంగికత ఉన్నది. మతం పేరిట, కులంపేరిట మనుషుల్ని హీనంగా చూడటం, అవమానించటం ఎంత దారుణమో చెప్పాడు. మనుషుల్లోని ద్వంద్వ ప్రవృత్తి, అన్యాయమైన రీతుల్ని తెలియజెప్పాడు. వ్యంగ్యం, హేళనలతో సాగిన కథ విభూతి లేక ఫేస్ పౌడర్. ఇందులో అలంకరణల పట్ల గల మోజును నవ్వు తెప్పించే విధంగా చెప్పాడు. రాజకీయాల్లో, పరిపాలనలో అవకతవకల్ని, అక్రమాల్ని ఇప్పుడు కూడా చూస్తున్నాం. తెలంగాణాలో 1940 నాటికి ఉన్న రాజకీయ వ్యవస్థ శైశవ దశలో ఉంది. ఒకరి మించి ఒకరు కుట్రలు, కుతంత్రాలతో, లౌక్యంతో రాజ్యపాలన సాగింది.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
కాళోజి కథల్లో ఏమి కనిపిస్తుంది ?
జవాబు:
కాళోజీ కథలో స్వచ్ఛత, సూటిదనం, నచ్చని విషయాలపై నిరసన, స్పష్టంగా కనిపిస్తుంది.

ప్రశ్న 2.
తెలంగాణలో 1940 నాటి రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది ?
జవాబు:
తెలంగాణలో 1940 నాడు రాజకీయ వ్యవస్థ శైశవ దశలో ఉంది. ఒకరిని మించి ఒకరు కుట్రలు కుతంత్రాలతో లౌక్యంతో రాజ్యపాలన సాగింది.

ప్రశ్న 3.
‘ఫేస్ పౌడర్’ కథలో విశిష్టత ఏది ?
జవాబు:
`ఫేస్ పౌడర్ కథలో అలంకరణ పట్ల మోజును, నవ్వు తెప్పించే విధంగా కాళోజీ చెప్పాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson కాళోజి

ప్రశ్న 4.
కాళోజి ఎట్లా రాణించాడు ?
జవాబు:
కాళోజీ కవిగా, ఉద్యమకారునిగా, మరియు కథకునిగా, రాణించాడు.

ప్రశ్న 5.
కాళోజీ కథల్లో చెప్పిన సంగతులేవి ?
జవాబు:
కాళోజీ కథల్లో కులమతాల పేరిట మనుష్యుల్ని హీనంగా చూడటం, అవమానించడం, ఎంత దారుణమో చెప్పాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson సురవరం ప్రతాపరెడ్డి

Telangana SCERT 9th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం 2nd Lesson సురవరం ప్రతాపరెడ్డి Questions and Answers.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson సురవరం ప్రతాపరెడ్డి

తెలంగాణలో కవులే లేరనే నిందా వ్యాఖ్యలకు
“గోలకొండ కవుల సంచిక” ద్వారా సమాధానమిచ్చినవాడు.
తన కృషి సమాజపరంగా సాగించిన ఉద్యమశీలి.
సాహిత్య, సాంస్కృతిక సామాజిక, రాజకీయ రంగాల్లో
బహుముఖ ప్రతిభ చాటిన ప్రజ్ఞాశాలి. తెలంగాణ వైతాళికుడు
సురవరం ప్రతాపరెడ్డి. ఆయన జీవితం ఎట్లా స్ఫూర్తిదాయకమో
తెలుసుకుందాం.
TS 9th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson సురవరం ప్రతాపరెడ్డి 1

PAPER – I : వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన) (మార్కులు: 6)

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
సురవరం ప్రతాపరెడ్డిగార్ని గూర్చి మల్లంపల్లి సోమశేఖర శర్మగారు చేసిన పరిచయం ఎటువంటిది ?
జవాబు:
సురవరం ప్రతాపరెడ్డి పేరు వినగానే, ఒక గొప్ప మూర్తి మన కంటి ఎదుట దర్శనమిస్తుంది. బహుముఖ ప్రతిభకు, ప్రతాపరెడ్డి నిలువెత్తు ఉదాహరణం. సురవరం ప్రతాపరెడ్డి గారు మేధా సంపన్నుడు. సాహిత్య రంగంలో రెడ్డి గారి ప్రతిభకూ, ప్రజ్ఞకూ స్తాటిలేదు.

రెడ్డిగారు విమర్శకులలో గొప్ప విమర్శకుడు. కవులలో కవి. పండితులలో పండితుడు. రాజకీయవేత్తలలో గొప్ప రాజకీయవేత్త. పత్రికా రచయితలలో పత్రికా రచయిత. నాటక కర్తలలో నాటక కర్త. పరిశోధకులలో గొప్ప పరిశోధకుడు. దేశాభిమానులలో పెద్ద దేశాభిమాని, సహృదయులలో రెడ్డిగారు గొప్ప సహృదయులు.

ప్రతాపరెడ్డిగారి వంటి స్నేహితుణ్ణి, పండితుణ్ణి, రసజ్ఞుడిని చాలా అరుదుగా చూస్తాం. రెడ్డిగారు ఇంతటి ప్రజ్ఞా పాండిత్యములు కలవాడని, సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖర శర్మగారు వ్రాశారు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson సురవరం ప్రతాపరెడ్డి

ప్రశ్న 2.
సురవరం ప్రతాపరెడ్డిగారి ప్రతిభా పాండిత్యాలను వెల్లడించే శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో జరిగిన సభా విశేషాలు రాయండి.
జవాబు:
ఒకసారి హైదరాబాదులోని శ్రీకృష్ణదేవరాయంధ్ర భాషా నిలయంలో సాహిత్య సభ జరిగింది. ఆ రోజు నాచన సోమన రాసిన ఉత్తర హరివంశముపై విశ్వనాథ సత్యనారాయణగారు ప్రసంగం చేయాలి. ఆ సభకు అధ్యక్షుడిగా శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు కూర్చున్నారు.

సభ ప్రారంభం కాగానే, ప్రతాపరెడ్డిగారు ధీరగంభీరంగా తొలిపలుకులు మాట్లాడారు. క్రమంగా మాటల చినుకులు మహావర్షంగా మారాయి. దాదాపు గంటసేపు రెడ్డిగారు మాట్లాడిన ఆ ఉపన్యాసం, సభ్యులను కట్టిపడేసింది.

సోమన కవిత్వంలోని కొత్తకోణాలు సభ్యులకు పరిచితమవుతున్నాయి.. తరువాత విశ్వనాథ సత్యనారాయణగారు లేచి, అధ్యక్షులు ప్రతాపరెడ్డి గారు మాట్లాడిన తర్వాత, చెప్పడానికి తనకు ఇంకేమీ మిగుల లేదని, హరివంశంలోని కొన్ని పద్యాలు మాత్రం చదివి, వ్యాఖ్యానిస్తానని అన్నారట.

విశ్వనాథ వంటి మహాకవి, పండిత విమర్శకుడినే ఆ విధంగా ప్రతాపరెడ్డిగారి ఉపన్యాసం, ఆనాడు నిశ్చేష్టుడిని చేసింది. ఈ సంఘటన ప్రతాపరెడ్డిగారి ఉపన్యాస శక్తినీ, విమర్శనాశక్తినీ వెల్లడిస్తుంది.

ప్రశ్న 3.
సురవరం ప్రతాపరెడ్డిగారి బాల్యము – విద్యాభ్యాసము గూర్చి రాయండి.
జవాబు:
సురవరం ప్రతాపరెడ్డి గారు 1896లో మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల సంస్థాన రాజధానియైన “బోరవిల్లి” లో జన్మించారు. ఈయన మొదటి పేరు “పాపిరెడ్డి”. పాపిరెడ్డి గురువు, చండశాసనుడు. దానితో పాపిరెడ్డికి చదువుపై విముఖత పెరిగింది. బడిమానేసి, గోలీలాడుకొనేవాడు.

ఈ విషయం ప్రతాపరెడ్డి చిన్నాన్నకు తెలిసి, కచ్చితమైన దినచర్యను అమలు చేశాడు. దానితో ప్రతాపరెడ్డి జీవితం, మలుపు తిరిగింది. ప్రతాపరెడ్డి తొమ్మిదో తరగతి చదివేటప్పుడు, తెలుగులో కవియై కీర్తి సంపాదించాలని నిశ్చయించాడు. తన సంకల్పాన్ని అమలుచేశాడు. స్వయంకృషి, సాధన సంకల్పాన్ని నెరవేరుస్తాయి.

ప్రతాపరెడ్డి, చిలకమర్తి, వీరేశలింగం వంటి వారి రచనలు సంపాదించి చదివాడు. చేమకూర వెంకటకవి విజయ విలాసాన్నీ, ఇతర ప్రబంధాలనూ, తెలుగు నిఘంటువు సాయంతో చదివాడు. కర్నూలు వెల్లాల శంకరశాస్త్రి దగ్గర, సంస్కృత సాహిత్యం చదివాడు. బి.ఏ లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ద్వితీయ భాషగా సంస్కృతం చదవాలనుకున్నాడు. అందుకు వేదం వేంకటరామశాస్త్రి గారితో సిఫారసు కూడా చేయించాడు.

కాని సంస్కృతంలో ప్రతాపరెడ్డికి గల పరిచయాన్ని గూర్చి కాలేజీవారు పరీక్షించారు. ప్రతాపరెడ్డి భారత శ్లోకాన్ని పదవిభాగంతో సహా చెప్పి, కాలేజీ వారిచే మెప్పు పొందాడు.. సంస్కృతం వేదం వారి వద్ద చదవడం కోసం రెడ్డిగారు మాంసాహారాన్ని విడిచిపెట్టాడు. ప్రతాపరెడ్డి గారు పుస్తకాలు కొన్ని, విమర్శనాత్మకంగా చదివేవారు.

ప్రశ్న 4.
ప్రతాపరెడ్డిగార్కి గోల్కొండ పత్రికతో గల సంబంధాన్ని రాయండి.
జవాబు:
సురవరం ప్రతాపరెడ్డి గారికి, మద్రాసులో చదివే రోజులలోనే పత్రిక పెట్టాలని కోరిక కలిగింది. జాతీయోద్యమ ప్రభావంతో పత్రికకు ‘దేశబంధు’ అని పేరు పెట్టాలనుకున్నారు. చివరకు రెడ్డిగారు హైదరాబాదులో ఉన్నప్పుడు పత్రికను ప్రారంభించారు. దేశబంధు పేరుకు నిజాం ప్రభుత్వం అంగీకరించదని, ‘గోల్కొండ’ అనే పేరు పత్రికకు పెట్టారు.

10 మే, 1926న గోల్కొండ పత్రిక ప్రారంభమయ్యింది. గోల్కొండ పత్రిక, తెలుగు పత్రికా రంగంలో సంచలనాలు సృష్టించింది. ప్రతాపరెడ్డి పేరు వినగానే, గోల్కొండ పత్రిక గుర్తుకు వస్తుంది. పత్రిక ప్రారంభమయ్యింది కాని, తగిన ఆర్థిక వనరులు లేనందున, నడపడం కష్టమయ్యింది. అయినా ప్రతాపరెడ్డి గారు అధైర్యపడలేదు.

ప్రతాపరెడ్డి తానే రచయితగా, సంపాదకుడిగా, ప్రూఫ్ రీడర్ గా, గుమాస్తాగా అనేక అవతారాలు ఎత్తాడు. ఆటంకాలను దాటి, లక్ష్యమును చేరుకున్నాడు. గోల్కొండ పత్రిక రెండు లక్ష్యాలతో నడచింది.

1) ఆంధ్రభాషా సేవ

2) జాతి, మత, కులవివక్షత లేకుండా ఆంధ్రులలో అన్ని శాఖలవారి సత్వరాభివృద్ధికీ పాటు పడడం. నాటి నిజాం దుష్కృత్యాల గురించి, సంపాదకీయాలు సాగేవి. ప్రతాపరెడ్డి రచయితలను కవ్వించి, వారి ప్రతిభను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. ఎందరో రచయితలకు ప్రోత్సాహాన్ని ఇచ్చి, నిష్పక్షపాతంగా పత్రికను నడిపారు.

ఆ రోజుల్లో నిజాంకు వ్యతిరేకంగా వార్త రాసిన షోయబుల్లాఖాన్న, నడివీధిలో నరికి చంపారు. అటువంటి రోజుల్లో ప్రతాపరెడ్డి గారు సాహసంతో నిజాం దుర్మార్గాలను నిరసిస్తూ పత్రికలో సంపాదకీయాలు రాశారు. ఈయన 23 సంవత్సరాలు గోల్కొండ పత్రికలో సంపాదకుడిగా తెలంగాణకు సేవలందించాడు. ప్రతాపరెడ్డి ప్రాతఃస్మరణీయుడు.

ప్రశ్న 5.
ప్రతాపరెడ్డిగార్కి వివిధ సంస్థలతో గల అనుబంధం గురించి తెలపండి.
జవాబు:
ప్రతాపరెడ్డి గారిని గురించి, దాశరథి రాస్తూ “అతడు లేని తెలంగాణ, అలంకరణలేని జాణ” అని రాశాడు. ప్రతాపరెడ్డిగార్కి అనేక సంస్థలతో అనుబంధముంది. తెలంగాణలో ఆంధ్రమహాసభ, పరాయి భాషా దౌర్జన్య ప్రభంజనానికి అల్లాడుతున్న తెలుగు దీపాన్ని ఆరిపోకుండా చూసుకోడానికి ఆవిర్భవించింది. ఆ ఆంధ్రమహాసభ మొదటి సమావేశం, మెదక్ జిల్లా జోగిపేటలో జరిగింది. ఆ సభకు ప్రతాపరెడ్డిగారే అధ్యక్షత వహించారు.

విజ్ఞానవర్ధినీ పరిషత్తు, ఆంధ్ర సారస్వత పరిషత్తులకు ప్రతాపరెడ్డి గారు వ్యవస్థాపక సభ్యులు. ఆ తర్వాత, ఆ సంస్థలకు వీరే అధ్యక్షుడిగా వ్యవహరించారు. ప్రతాపరెడ్డిగార్కి కులమతాల పట్టింపులు లేవు. అందుకే రెడ్డిగారు, యాదవ సంఘం, ముదిరాజ్ సంఘం, గౌడ సంఘములకు కూడా అధ్యక్షులుగా ఉన్నారు.

ప్రతాపరెడ్డి గారు హైదరాబాదు ఆయుర్వేద సంఘం అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘ ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. రెడ్డిగార్కి శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, లక్ష్మణరాయ పరిశోధకమండలి, బాలసరస్వతీ గ్రంథాలయం, వేమన గ్రంథాలయం, మొదలయిన సంస్థలతో సన్నిహిత సంబంధం ఉండేది. ఈ విధంగా ఆనాడు తెలంగాణలో ఉన్న పెక్కు సాహిత్య సాంస్కృతిక సంస్థలతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వీరికి అనుబంధముంది.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson సురవరం ప్రతాపరెడ్డి

ప్రశ్న 6.
సురవరం ప్రతాపరెడ్డిగారి సాహిత్య కృషిని వివరించండి.
జవాబు:
ప్రతాపరెడ్డిగారు, ఎన్నో సాహిత్య ప్రక్రియలను సమర్థంగా నిర్వహించారు. కవిత్వము, కథ, నవల, నాటకం, వ్యాసం, జీవితచరిత్ర వంటి ప్రక్రియల్లో వీరు రచనలు చేశారు. ఎన్నో గ్రంథాలను పరిష్కరించారు. సాహిత్యాన్ని సేకరించారు. పరిశోధనాత్మక గ్రంథాలను ప్రకటించారు.

ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, రామాయణ విశేషములు అన్న వీరి రచనలు, పరిశోధకులుగా ప్రతాపరెడ్డిగార్కి సాటిలేని కీర్తిని తెచ్చిపెట్టాయి. రాజుల చరిత్రయే చరిత్రగా చెలామణి అయ్యే రోజుల్లో, ప్రజల సాంఘిక చరిత్రయే అసలైన చరిత్రగా రెడ్డిగారు ఆవిష్కరింపజేసారు. చరిత్ర రచనకు రెడ్డిగారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర అన్న గ్రంథము ఒజ్జబంతి అయ్యింది. అందుకే ఈ గ్రంథము కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన మొదటి గ్రంథంగా చరిత్ర సృష్టించింది.

వీరి హిందువుల పండుగలు అన్న గ్రంథము, హిందువుల పండుగల వెనుకనున్న నేపథ్యాలను, ఆచార సంప్రదాయాలను తెలిపే ప్రామాణిక గ్రంథము. వీరు, హిందువుల పండుగల విశేషాలెన్నింటినో పురాణ శాస్త్రప్రమాణంగా తెలిపారు. ప్రతాపరెడ్డి గారి ఈ హిందువుల పండుగలు అన్న గ్రంథానికి విపులంగా పీఠిక వ్రాయడానికి తనకు శక్తి, వ్యవధి కూడా చాలదని రాధాకృష్ణన్ గారు రాశారు. దానిని బట్టి, ఈ గ్రంథ ప్రత్యేకత ఏమిటో మనకు అర్థమౌతుంది.

సాహిత్యము ఆనందాన్నీ, ఉపదేశాన్నీ కూడా ఇవ్వాలి.

ప్రశ్న 7.
సురవరం ప్రతాపరెడ్డిగారి వ్యక్తిత్వాన్ని గూర్చి రాయండి.
జవాబు:
నిరాడంబరత, నిర్భీతి, నిజాయితి, నిస్వార్థత అన్నవి ప్రతాపరెడ్డి జీవ లక్షణాలు. వేషభాషల్లో ఈయన అచ్చమైన తెలుగు వాడిగా జీవించాడు. ఈయన తెలుగు అంకెలనే వాడేవాడు. ఈయన ‘స్వవేష భాషా దురభిమాని’ అని పేరు పొందాడు. ఈయన ఎవరినీ పొగిడేవాడు కాడు. తనను ఎవరైనా పొగిడితే, అంగీకరించేవాడు కాదు..

ప్రతాపరెడ్డి గారిలో ధర్మావేశం పాలు ఎక్కువ. ఆత్మీయతకే తప్ప, అహంకారానికి చోటులేని హృదయం ఈయనది. మంచి ఎక్కడున్నా, ఈయన గ్రహించేవాడు. ఆచార్య బిరుదు రాజు రామరాజు గారిని మొదట పరిశోధనవైపు మళ్ళించింది. సురవరం వారే ఈ విధంగా ఈయన ఎన్నో రచనలకు ప్రేరకుడు, కారకుడు.

ఈయనకు కులమతాల పట్టింపులేదు. జోగిపేటలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభలో, భాగ్యరెడ్డి వర్మకు సభలో పాల్గొనే అవకాశాన్ని రెడ్డిగారే కల్పించారు. అంబేద్కర్ కన్న ముందే, దళితోద్యమ స్ఫూర్తిని రగిల్చిన వాడు ‘భాగ్యరెడ్డివర్మ’. ప్రతాపరెడ్డిగారి ఆలోచనా సరళి విభిన్నంగా ఉంటుంది. శ్రీకృష్ణునికి మీసాలు ఉండాలని ప్రశ్నించి మీసాల కృష్ణుని చిత్రాన్ని తన గోల్కొండ పత్రికా కార్యాలయంలో వీరు పెట్టుకున్నాడు. వనపర్తి, ఆత్మకూరు, గద్వాల, గోపాలపేట, కొల్లాపూర్ సంస్థానాధీశులతో తనకు గల పరిచయాన్ని వీరు కేవలం సాహిత్య సమారాధనకే వినియోగించారు.

ప్రతాపరెడ్డి గారు ప్రజల మనిషి. 1952లో వనపర్తి శానస సభ్యుడిగా ఈయన ఎన్నికయ్యారు. తెలంగాణ సమాజాన్ని వీరు అన్ని కోణాల్లో ప్రభావితం చేశారు. ఈయన జీవనం పవిత్రం.
ప్రతాపరెడ్డి గారు రైతు, రాజబంధువు, కావ్య వేద నిష్ణాతుడు. స్వతంత్రుడు, శాసనకర్త, పురుషార్థజీవి, సంస్కృతీ పరిరక్షకుడు.

PAPER – II : పరిచిత గద్యాలు (మార్కులు : 5)

అ) కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

మద్రాసులో చదివేరోజుల్లోనే పత్రికొకటి పెట్టాలనే ఆలోచన కలిగింది ప్రతాపరెడ్డికి, జాతీయోద్యమంతో ప్రభావితుడై తన పత్రికకకు “దేశబంధు” అనే పేరు పెట్టాలనుకున్నాడు కూడా. మంచి ఆలోచనలెప్పుడూ మట్టిలో కలిసిపోవు. హైద్రాబాదులో ఉన్నప్పుడు ఈ ఆలోచనను ఆచరణలోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. “దేశబంధు” పేరుకు నిజాం ప్రభుత్వం అనుమతినిచ్చే పరిస్థితి లేదు. అందుకే “గోల్కొండ” పేరును ఖరారు చేసుకున్నాడు. అనుమతి దొరికింది. కార్యసాధనకు సమయస్ఫూర్తి కావాలి. 10 మే 1926 న గోల్కొండ పత్రిక పురుడు బోసుకుంది. నాటి తెలుగు పత్రికారంగంలో సంచలనాలకు తెరలేపింది. ప్రతాపరెడ్డి పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది గోల్కొండ పత్రిక. ఇది ప్రతాపరెడ్డి అక్షరాల కోట.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ప్రతాపరెడ్డి తన పత్రికకు ‘దేశబంధు’ అనే పేరు ఎందుకు పెట్టాలనుకున్నాడు .
జవాబు:
ప్రతాపరెడ్డి, జాతీయోద్యమంతో ప్రభావితుడయ్యాడు. అందుకే ఆయన తన పత్రికకు ‘దేశబంధు’ అనే పేరు పెడదామనుకున్నాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson సురవరం ప్రతాపరెడ్డి

ప్రశ్న 2.
గోల్కొండ పత్రిక ప్రారంభించిన తేదీ ఏది ?
జవాబు:
గోల్కొండ పత్రికను ప్రారంభించిన తేదీ 10 మే, 1926.

ప్రశ్న 3.
ప్రతాపరెడ్డి పేరు వినగానే, గుర్తుకు వచ్చే విషయం ఏది ?
జవాబు:
ప్రతాపరెడ్డి పేరు వినగానే “గోల్కొండ” పత్రిక గుర్తుకు వస్తుంది.

ప్రశ్న 4.
గోల్కొండ పత్రిక ప్రత్యేకత ఏది?
జవాబు:
గోల్కొండ పత్రిక నాటి తెలుగు పత్రికా రంగంలో సంచలనాలకు తెరలేపింది. అది ప్రతాపరెడ్డి అక్షరాలకోట.

ప్రశ్న 5.
కార్యసాధనకు కావలసినదేది ?
జవాబు:
కార్యసాధనకు కావలసినది “సమయస్ఫూర్తి”.

2. కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

“ఎన్నో సాహిత్య ప్రక్రియలను సమర్థంగా నిర్వహించాడు ప్రతాపరెడ్డి. కవిత్వం, కథ, నవల, నాటకం, వ్యాసం, జీవిత చరిత్ర వంటి ప్రక్రియల్లో రచనలు చేశాడు. గ్రంథ పరిష్కరణలు, జానపద సాహిత్య సేకరణ చేశాడు. పరిశోధనాత్మక గ్రంథాలు ప్రకటించాడు.

పరిశోధకుడుగా ప్రతాపరెడ్డికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టినవి “ఆంధ్రుల సాంఘిక చరిత్ర”, “హిందువుల పండుగలు”, “రామాయణ విశేషములు”. రాజుల చరిత్రయే, చరిత్రగా చెలామణి అయ్యేకాలంలో ప్రజల సాంఘిక చరిత్రే అసలైన చరిత్రగా ఆవిష్కరింపజేశాడు ప్రతాపరెడ్డి. చరిత్ర రచనకు ఈయన గ్రంథం ఒజ్జబంతి అయ్యింది. అందుకే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన మొదటి గ్రంథంగా చరిత్ర సృష్టించినదీ గ్రంథం.

హిందువుల పండుగల వెనుకనున్న నేపథ్యాలు, ఆచార సంప్రదాయాలు తెలిపే ప్రామాణిక గ్రంథం ‘హిందువుల పండుగలు’.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
పరిశోధకుడిగా సాటిలేని కీర్తిని ప్రతాపరెడ్డిగార్కి తెచ్చిన గ్రంథం ఏది ?
జవాబు:
పరిశోధకుడిగా ప్రతాపరెడ్డి గార్కి సాటిలేని కీర్తిని తెచ్చిన గ్రంథం “ఆంధ్రుల సాంఘిక చరిత్ర”.

ప్రశ్న 2.
చరిత్ర రచనలో ప్రతాపరెడ్డి గారు అనుసరించిన నూతన మార్గం ఏది ?
జవాబు:
రాజుల చరిత్రయే చరిత్రగా, ఆనాడు చెలామణి అయ్యేది. ఆ పరిస్థితులలో ప్రజల సాంఘిక చరిత్రే, అసలైన చరిత్రగా రెడ్డిగారు ఆవిష్కరింపచేశారు.

ప్రశ్న 3.
ప్రతాపరెడ్డి గారు ఆదరించిన సాహిత్య ప్రక్రియలను పేర్కొనండి.
జవాబు:
ప్రతాపరెడ్డి గారు కవిత్వము, కథ, నవల, నాటకం, వ్యాసం, జీవిత చరిత్ర వంటి సాహిత్య ప్రక్రియలను ఆదరించారు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson సురవరం ప్రతాపరెడ్డి

ప్రశ్న 4.
‘హిందువులు పండుగలు’ అన్న రెడ్డిగారి గ్రంథంలో గల విశేషాలేవి ?
జవాబు:
”హిందువులు పండుగలు’ అనే గ్రంథంలో రెడ్డిగారు, హిందువుల పండుగల వెనుక ఉన్న నేపథ్యాలనూ, ఆచార సంప్రదాయాలనూ వివరించారు.

ప్రశ్న 5.
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన మొదటి గ్రంథం ఏది ?
జవాబు:
ప్రతాపరెడ్డి గారి “ఆంధ్రుల సాంఘిక చరిత్ర” అన్న గ్రంథము, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన మొదటి గ్రంథము.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం

Telangana SCERT 9th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం 1st Lesson కుంరం భీం Questions and Answers.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం

‘జల్, జంగల్, జమీన్ (నీరు అడవి భూమి)
మనది…… అనే నినాదంతో గోండులను, కోయలను,
చెంచులను సంఘటితపరచి పోరుబాటలో నడిపించిన
విప్లవ వీరకిశోరం కుంరం భీం. ‘మా గూడెంలో
మా రాజ్యం’ అనే నినాదంతో గిరిజనులందరిని
ఏకంచేసి ప్రభుత్వంపై సమరం సాగించిన
పోరాటయోధుడు కుంరం భీం.
TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం 1

PAPER – I : వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన) (మార్కులు: 6)

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
బాల్యంలో కుంరం భీం, మనసుపై చెరగని ముద్రవేసిన సంఘటనను గూర్చి తెలపండి.
జవాబు:
కుంరం భీం ఒకసారి తన మిత్రులు జంగు, కొంతల్, మాదు, పైకులతో అడవికి వెళ్ళాడు. వారితో మేకపిల్లలు ఉన్నాయి. పైకు నారేపచెట్టు ఎక్కి, సన్న సన్న కొమ్మల్ని నరికి మేకలకు వేస్తున్నాడు. ఇంతలో జంగ్లాత్ జవాన్లు, ఒక సుంకరి వచ్చి చెట్టు కొమ్మలు నరుకుతున్న పైకును పట్టుకున్నారు. వారి వెంట అమీనాబ్ వచ్చి, పిల్లలందరినీ బంగ్లా దగ్గరికి తీసుకురమ్మని చెప్పాడు.

భీం తండ్రి, కుంరం చిన్ను, ఆ గూడెం పెద్ద. అమీనాబ్ పిల్లలు చెట్లు నరికినందుకు చిన్నును మందలించాడు. కొమ్మ నరికిన పిల్లవాడి వేళ్ళు నరకడమే తగిన శిక్ష అంటూ, ఎంత మంది బతిమాలినా వినకుండా భీం స్నేహితుడు పైకు వేళ్ళు నరికించాడు. పైకు అరుపులతో అడవి మారు మ్రోగింది. పైకు స్పృహతప్పి పడిపోయాడు.

ఈ సంఘటన భీంను పట్టి కుదిపింది. ఆవేశంలో వదినె దగ్గరకు వెళ్ళి “ఈ గాలి, నీరు, ఆకాశం మనవైనప్పుడు, ఈ భూమి, అడవి మనవి ఎందుకు కావు ? అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నను “మీ నాయినను అడుగు” అని వదినె భీంకు చెప్పింది.

పన్నుల రూపంలో తమ కష్టాన్ని అంతా గుంజుకుంటే ఆకలితో చచ్చిపోవాల్సిందేనా ? అని, ఆలోచిస్తూ, భీం ఆ రోజు ఆకలితో పడుకున్నాడు. ఈ సంఘటన భీం మనస్సుపై చెరగని ముద్రవేసింది. గిరిజనుల కష్టాన్ని ఇతరులు అన్యాయంగా తీసుకుపోతున్నారని భీం తెలుసుకున్నాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం

ప్రశ్న 2.
కుంఠం భీంపై, విటోబా ప్రభావం ఎటువంటిది ?
జవాబు:
సుర్దాపూర్ గొడవలో కుంరం భీం చేతిలో సిద్ధిక్ చచ్చిపోయాడు. భీం తన మిత్రుడు కొండల్తో కలిసి, ‘భారీలొద్ది’లో ఉన్న పెద్ద ముఖాసీని కలిసి, సర్కారుపై తాను తిరుగబడతాననీ, తనకు మద్దత్తు ఇమ్మనీ అడిగాడు. ముఖాసీ హింసా పద్ధతులు వద్దని సలహా చెప్పాడు.

దానితో భీం రైలెక్కి ఎలాగో చాందా పట్నానికి చేరాడు. రైల్వేస్టేషన్ బయట కూర్చున్న భీంకు, తన సామానులు మోయలేక బాధపడుతున్న ఒక ప్రయాణికుడు కనిపించాడు. ఆయనే విటోబా. భీం విటోబా సరకులను ఇంటికి చేర్చాడు. విటోబా ప్రింటింగ్ ప్రెస్సు యజమాని. నిజాం సర్కారుకూ, తెల్లదొరలకూ వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళతో విటోబాకు దగ్గర సంబంధాలున్నాయి. విటోబా రహస్యంగా ఒక పత్రికను నడిపేవాడు. రహస్య పార్టీ, రహస్య పత్రికల గురించి తెలుసుకున్న భీంకు, విటోబాపై మంచి అభిప్రాయం ఏర్పడింది. భీం, విటోబా దగ్గర ఒక సంవత్సరం ఉన్నాడు. అక్కడే

భీం తెలుగు, ఇంగ్లీషు, హిందీ చదవడం, రాయడం నేర్చుకున్నాడు. భీంకు విటోబా రాజకీయాల్నీ, సమాజ పరిణామాల్ని తెలియజేశాడు. సంఘంలో మార్పురావాలంటే త్యాగం చేయాలన్నాడు. ఒక రోజు రాత్రి పోలీసులు వచ్చి భీంను కొట్టి, విటోబాను అరెస్టు చేశారు. భీం తిరిగి రైల్వేస్టేషన్కు చేరాడు. అక్కడే భీంకు, మంచిర్యాల నుండి వచ్చిన ఒక తెలుగువాడితో పరిచయం అయ్యింది. వారిద్దరూ కలసి, ‘చాయ్పత్తా’ అని పిలువబడే అస్సాంకు వెళ్ళారు.

ప్రశ్న 3.
కుంరం భీంకు, అస్సాం తేయాకు తోటల్లో కలిగిన అనుభవాలను చెప్పండి.
జవాబు:
కుంరం భీం, అస్సాంలో తేయాకు తోటల్లో అడుగుపెట్టాడు. అక్కడ అనేక అనుభవాలతో ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు. ఎక్కడైనా కష్టజీవులకు బాధలు తప్పవనీ, కష్టపడే వానికి కడుపు నిండటం లేదనీ, భీం తెలుసుకున్నాడు. రోజు కూలీ పద్ధతిన, భీం తేయాకు తోటల్లో కష్టపడి పనిచేశాడు. అక్కడ చెమట తుడుచుకోడానికి లేచిన కార్మికులను, మేస్త్రీలు కొరడాలతో కొట్టేవారు. వారి సంపాదన వారి మందులకే సరిపోయేది కాదు. తోటల యజమానులకు కొంచెం కూడా దయాగుణం ఉండేది కాదు.

ఇవన్నీ చూస్తున్న భీంకు అసంతృప్తి రాజుకుంది. కుంరం భీం అస్సాంలో నాల్గు సంవత్సరాలున్నాడు. అక్కడే భీంకు మన్యం నుండి వచ్చిన ఒక తెలుగు వ్యక్తితో పరిచయం అయ్యింది. అతడి ద్వారా భీం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును గూర్చి తెలుసుకున్నాడు. మన్య ప్రాంత ప్రజల్ని సీతారామరాజు సమీకరించిన విధానాన్నీ, రామరాజు జరిపిన పోరాట రీతుల్ని, భీం అర్థం చేసుకున్నాడు. యువకులకు యుద్ధరీతులను రామరాజు ఎలా నేర్పాడో తెలుసుకున్నాడు.

అడవిపై తమకు తప్ప ఇతరులు ఎవరికీ అధికారం లేదని గిరిజనులతో చెప్పించిన రామరాజు యొక్క గొప్పతనాన్ని భీం అర్థం చేసుకున్నాడు. యుద్ధ సమయంలో సమాచారాన్ని చేరవేసే పద్ధతిని భీం గ్రహించాడు. యుద్ధ మెళుకువలను భీం గ్రహించాడు. క్రమంగా భీం ఎక్కుపెట్టిన బాణంలా తయారయ్యాడు.

ఈ సమయంలో తేయాకు తోటల్లో అన్యాయంగా ఇద్దరు కార్మికుల్ని కొడుతున్న మేస్త్రీతో, భీం తగవుపెట్టుకున్నాడు. మేస్త్రీలు కొరడా. భీం పైకి ఎత్తారు. భీం వారిని చితక కొట్టాడు. తోటల యజమాని పోలీసులతో చెప్పి భీంను జైల్లో వేయించాడు. ‘భీం’ జైలు నుండి తప్పించుకొని స్వగ్రామం వెళ్ళాడు.

ప్రశ్న 4.
కుంరం భీం, సర్కార్ (నిజాం) సైన్యంతో యుద్ధం చేసి అమరుడైన విధము తెలపండి.
(లేదా)
కుంరం భీం నాయకత్వంలో గోండు రాజ్య స్థాపనానికి గోండులు చేసిన యుద్ధ పరిణామాల్ని తెలుపండి.
జవాబు:
కుంరం భీం పినతండ్రి “కుర్దు” నాయకత్వంలో, బాబేఝరి ప్రాంతంలో గిరిజనులూ, గోండులూ అడవిని కొట్టి, వ్యవసాయం చేశారు. అది తెలిసి జంగ్లాత్ వాళ్ళు దాడిచేసి గిరిజన గూడేలను ధ్వంసం చేశారు. కుంరం భీం, బాబేఝరి వైపు వచ్చి “టొయికన్” గూడెంలో దిగాడు. భీం భార్య పైకూబాయి వకీలును పెట్టుకోమని భీంకి సలహా చెప్పింది. భీం వకీలును కలిశాడు. వకీలు నిజాంకు అసలు విషయం చెప్పమనీ, నిజాం అతడి ఇష్టం వచ్చినట్లు చేస్తాడనీ చెప్పాడు.

‘భీం’ పన్నెండు గూడేల ప్రజలను పట్నాపూర్ రమ్మని పిలిచాడు. గిరిజనులను భూములను దున్నండని, పంటలు పండించండని నిజాం మనుష్యులను తరిమికొడదామనీ చెప్పాడు. గిరిజనులు కూడా తాము ఆకలితో చావడం కన్న, పోరాటం చేసి చద్దాం అన్నారు. గోండులు భీం నాయకత్వాన్ని సమర్థించారు.

గోండులు అడవిని నరికి, పంటలు పండించారు. జంగ్లాత్ వాళ్ళు ‘బాబేఝరి’పై విరుచుకుపడ్డారు. ఒక జాగీర్దార్ తుపాకీపేల్చాడు. భీంకు అది భుజంపై తగిలింది. తాశీల్దార్ గోండులను అరెస్టు చెయ్యమని డి.ఎస్.పి. కి చెప్పాడు. కుంరం భీం, నిజాంను కలవాలని ప్రయత్నించాడు. కాని అతడికి నిజాం దర్శనం కాలేదు.

భీం, జోడెన్ ఘాట్ వెళ్ళి, గిరిజనుల్ని కలిసి, పరిస్థితుల్ని వారికి చెప్పాడు. “భూమి లేక చచ్చే కంటే, పోరాడి చద్దాం”. అన్నారు గిరిజనులు. గోండు రాజ్యస్థాపన లక్ష్యంగా, జోడెన్ ఘాట్ కేంద్రంగా, భీం నాయకత్వంలో నిజాంపై పోరాటానికి, గోండులు సిద్దమయ్యారు.

నిజాం సర్కారు ఆజ్ఞలను గోండులు వినలేదు. భీం నాయకత్వాన్ని ఇష్టపడ్డ ఇతర గ్రామాలవారు కూడా; గోండు రాజ్యస్థాపనకు భీంకు మద్దతిచ్చారు. తుపాకులు తయారయ్యాయి. గోండులు కుంరం భీంకు జై అన్నారు. నైజాం సైన్యాన్ని భీం బలగం, తరిమి కొట్టింది.

నైజాం సర్కారు సబ్కలెక్టర్, భీంను కలిసి, భీం కూ, అతని బంధువులకూ భూమి పట్టాలిస్తామన్నాడు. పోరు ఆపమని కోరాడు. చివరకు పన్నెండు గ్రామాల వారికీ పట్టాలిస్తానన్నా, భీం అంగీకరించలేదు. వేరుగా గోండు రాజ్యం కావాలన్నాడు. యుద్ధం ఏడు నెలలు సాగింది. నిజాం సైన్యం 10 రోజులు యుద్ధం చేసినా, కొండ ఎక్కలేకపోయింది. ఇంతలో కర్దూపటేల్ భీంను మోసం చేశాడు. సర్కారు సేనతో కలిసి, కొండ మీదికి దారి చూపాడు. నైజాం సైన్యం దొంగతనంగా వచ్చి, గోండు వీరుల్ని చంపింది. కుంరం భీంను కాల్చి చంపింది. ఈ విధంగా కుంరం భీం అమరుడయ్యాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం

ప్రశ్న 5.
గోండు నాయకుడు కుంరం భీంను గూర్చి రాయండి.
జవాబు:
ఆదిలాబాదు జిల్లా అడవుల్లోని యుద్ధ వీరులు గోండులు. వారిలో కుంరం భీం ప్రసిద్ధుడు. గూడెం పెద్ద చిన్ను కుమారుడు భీం. భీంకు సోము, బొజ్జు అనే అన్నలు ఉన్నారు. భీం చిన్నప్పుడు సంకెనపెల్లి గూడెంలో పెరిగాడు. భీం చిన్ననాటి నుండి సాహసుడు. నాయకలక్షణాలు కలవాడు. ఇతడి ఆలోచనలకు బలాన్ని ఇచ్చింది ఇతని వదినె కుకూబాయి.
ఒకసారి భీం మిత్రులతో అడవికి వెళ్ళాడు. చెట్టు కొమ్మలను నరికి మేకలకు వేశాడని, అమీనాబ్ ఇతని స్నేహితుడు పైకు వేళ్ళను నరికించాడు. ఆ సంఘటన భీం మనసుపై చెరగని ముద్రవేసింది. అక్కడి గాలి, ఆకాశం, నీరు తమదైనపుడు అక్కడ అడవి, భూమి తమవి ఎందుకు కావనీ, భీం వదినెను అడిగాడు.

భీం కుటుంబంతో సుర్దాపూర్ వెళ్ళి, అక్కడ అడవులు కొట్టి వ్యవసాయం చేశాడు. అక్కడ భూమి తనదన్న సిద్ధికు భీం కొట్టి చంపాడు. జంగ్లాతోళ్ళతో పోరు మంచిది కాదని, పెద్ద ముఖాసీ భీంకు సలహా చెప్పాడు. భీంకు చాందాలో విటోబాతో పరిచయం అయ్యింది. అక్కడ భీం తెలుగు, హిందీ, ఇంగ్లీషు చదవడం రాయడం నేర్చుకున్నాడు. విటోబా, నిజాంకు వ్యతిరేకంగా పత్రిక నడిపేవాడు. భీంకు రాజకీయాలను విటోబాయే తెలిపాడు.

భీం, అస్సాం తేయాకు తోటల్లో కూలీగా పనిచేశాడు. అక్కడే అల్లూరి సీతారామరాజు గిరిజనుల పక్షాన చేస్తున్న పోరాటం గురించి, యుద్ధరీతుల గురించి భీం తెలుసుకున్నాడు. తర్వాత “కాకన్ ఘాట్”లో అతడు అన్నలను కలిశాడు. దేవడం పెద్ద లచ్చుపటేల్, భీంకు సోంబాయితో పెళ్ళి చేయించాడు. పైకూబాయి కూడా భీం పట్ల ఆకర్షణతో అతణ్ణి పెళ్ళాడింది.

“బాబేఝరి” వద్ద భీం కుటుంబీకులు అడవిని కొట్టి వ్యవసాయం చేశారు. జంగ్లాత్ వాళ్ళు మన్నెంగూడేలను భస్మం చేశారు. భీం జనగామలో వకీలును కలిశాడు. భీం పన్నెండు గూడేల గిరిజనులను, పట్నాపూర్ పిలిచాడు. అక్కడ గిరిజనులు నైజాంతో పోరాటం చేసి చద్దామని నిశ్చయించారు. బాబేఝురి ప్రాంతంలో గిరిజనులు సర్కారు ఆజ్ఞలను లెక్కచేయలేదు. విషయం నైజాంకు చెప్పడానికి భీం ప్రయత్నించాడు. ఏడు నెలలు గిరిజనులకూ, నైజాం సైన్యానికి పోరాటం జరిగింది. ఒక గ్రామం పెద్ద కుట్రతో, నైజాం సైన్యం దొంగతనంగా వచ్చి గోండు వీరుల్నీ, భీంనూ కాల్చి చంపింది.

PAPER – II : పరిచిత గద్యాలు (మార్కులు : 5)

అ) కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

కుంరం భీం బాల్యం నుండి తెలివైనవాడు, సాహసవంతుడు, నాయకత్వ లక్షణాలున్నవాడు. భీం చిన్నప్పటి నుంచి ప్రతి విషయానికి స్పందించేవాడు. ఆలోచించేవాడు. దేన్నీ ఊరికే వదిలిపెట్టేవాడు కాదు. ఈ లక్షణాలే తరువాత అతడిని గిరిజన వీరుడిని చేశాయి. అతని ఆలోచనలకు పురుడు పోసింది, అతని భావాలకు బలాన్ని ఇచ్చింది అతని వదినె కుకూబాయి. భీం చిన్నప్పుడు సంకెనపెల్లి గూడెంలో పెరిగాడు. అక్కడి చెట్టూ, చేమా, బోళ్ళు, బండలు, కొండలు, వాగులు ఒకటేమిటి సమస్త ప్రకృతి అతడిని తీర్చిదిద్దింది. ఆ రోజుల్లోనే ఒక రోజు భీం తన మిత్రులైన జంగు, కొంతల్, మాదు, పైకులతో కలిసి అడవికి వచ్చాడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
కుంరం భీం భావాలకు బలాన్ని ఇచ్చిన వారెవరు ?
జవాబు:
కుంరం భీం భావాలకు బలాన్ని ఇచ్చింది అతని వదినె ‘కుకూబాయి’.

ప్రశ్న 2.
కుంరం భీంను తీర్చిదిద్దినవారు ఎవరు ?
జవాబు:
కుంరం భీంను సంకెనపెల్లి గూడెంలోని చెట్లూ, చేమా, కొండలూ వంటి సమస్త ప్రకృతి తీర్చిదిద్దాయి.

ప్రశ్న 3.
కుంరం భీం మిత్రుల పేర్లు ఏమిటి ?
జవాబు:
కుంరం భీం మిత్రులు

  1. జంగు,
  2. కొంతల్,
  3. మాదు,
  4. పైకు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం

ప్రశ్న 4.
కుంరం భీం వ్యక్తిత్వం ఎటువంటిది ?
జవాబు:
కుంరం భీం, బాల్యం నుండి తెలివిగలవాడు. నాయకత్వ లక్షణాలు గలవాడు. సాహసవంతుడు.

ప్రశ్న 5.
కుంరం భీం ఆలోచనలకు పురుడు పోసిన వదినె పేరు ఏమిటి ?
జవాబు:
కుంరం భీం ఆలోచనలకు పురుడు పోసిన వదినె పేరు “కుకూబాయి”.

ఆ) కింది పేరాను చదవండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

దేవడం పెద్ద లచ్చుపటేల్. అతని దగ్గర భీం జీతానికి కుదిరాడు: అతని పంట పొలాల్లో మార్పు తెచ్చాడు. పత్తి, మిరప వంటి వ్యాపార పంటలను వేశాడు. మొత్తానికి భీం తెలివిపరుడని, వ్యవహారదక్షుడని అందరితో అనిపించుకున్నాడు. లచ్చుపటేల్ భూముల వ్యవహారాలను ముందు నుంచి చూసే అంబటిరావుకు, “సోంబాయి” అనే కూతురు ఉంది. ఆమెను భీంకిచ్చి పెండ్లి చేస్తే బాగుంటుందని లచ్చుపటేల్ నిశ్చయించాడు.

ఆ విధంగా కుంరం భీం, సోంబాయిల పెండ్లి దేవడంలో లచ్చుపటేల్ ఆధ్వర్యంలో జరిగింది. ఆ రోజుల్లో కుంరం భీం వార్తల్లో వ్యక్తి అయినాడు. అతని పట్ల ఆకర్షణ పెంచుకున్న పైకూబాయి, అనే యువతి కోరి అతన్ని పెండ్లాడింది. భీం కాకన్ట్లో కాపురం పెట్టాడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
కుంరం భీం పెండ్లి ఎక్కడ, ఎవరి ఆధ్వర్యంలో జరిగింది ?
జవాబు:
కుంరం భీం పెండ్లి దేవడంలో లచ్చుపటేల్ ఆధ్వర్యంలో జరిగింది.

ప్రశ్న 2.
కుంరం భీం ఎవరి దగ్గర పనిచేశాడు? ఆయన ఎవరు ?
జవాబు:
కుంరం భీం, లచ్చుపటేల్ దగ్గర జీతానికి కుదిరాడు. లచ్చుపటేల్ “దేవడం” గ్రామపెద్ద.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం

ప్రశ్న 3.
పెండ్లి అయిన తర్వాత భీం, ఎక్కడ మకాం పెట్టాడు ?
జవాబు:
పెండ్లి అయిన తర్వాత భీం “కాకనాట్”లో కాపురం పెట్టాడు.

ప్రశ్న 4.
భీం తెలివిపరుడని, వ్యవహారదక్షుడని ఎందుకు పేరు తెచ్చుకున్నాడు ?
జవాబు:
భీం, లచ్చుపటేల్ దగ్గర జీతానికి కుదిరి, ఆయన పంట పొలాల్లో పత్తి, మిరపలాంటి వ్యాపార పంటలు వేశాడు. `ఆ విధంగా తెలివిపరుడని భీం పేరు తెచ్చుకున్నాడు.

ప్రశ్న 5.
అంబటి రావు ఎవరు ?
జవాబు:
అంబటి రావు, లచ్చుపటేల్ భూముల వ్యవహారాలను చూసేవాడు. అంబటిరావు కూతురు సోం బాయిని భీం పెండ్లాడాడు.

TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి

Telangana SCERT 9th Class Telugu Guide Telangana 6th Lesson దీక్షకు సిద్ధంకండి Textbook Questions and Answers.

TS 9th Class Telugu 6th Lesson Questions and Answers Telangana దీక్షకు సిద్ధంకండి

చదువండి – ఆలోచించి చెప్పండి (Textbook Page No. 60)

స్వచ్ఛతలో చరిద్దాం !! స్వచ్ఛతకై శ్రమిద్దాం !

స్వచ్ఛ భారత్కు సన్నద్ధం కండి !

ప్రియమైన విద్యార్థులారా ………….

దేశవ్యాప్తంగా ఇటీవల మనం స్వచ్ఛభారత్ పేరుతో ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టిన విషయం మీకు తెల్సిందే! ప్రజల బాధ్యతారాహిత్యం వల్ల దేశవ్యాప్తంగా పేరుకుపోతున్న అపరిశుభ్రతను అనతికాలంలోనే తొలగించాలన్నది ఒక దీక్షలాగ చేపట్టాం. నిరంతరం కొనసాగవలసిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు కూడా భాగస్వాములే ! మీ మీ పరిసరాల్లో పోగుపడ్డ చెత్తాచెదారాన్ని తొలగించుకుంటూ, వ్యక్తిగత శుభ్రతతో సామాజిక పరిశుభ్రతను గురించి పదిమందికి అవగాహన కల్పిస్తూ స్వచ్ఛభారత్ సాకారమయ్యే దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాం !

రానున్న రోజులలో భారతావని పరిశుభ్ర భారతంగా పరిఢవిల్లాలని కోరుకుందాం.

వైద్య, ఆరోగ్యశాఖ, రాష్ట్రం.
తెలంగాణ రాష్ట్రం

ప్రశ్నలు

ప్రశ్న 1.
ఇటువంటి పత్రాలు ఎక్కడైనా చూశారా ?
జవాబు:
ఇటువంటి పత్రాలను నేను చూశాను. వీటిని “కరపత్రాలు” అంటారు. వీటినే ఇంగ్లీషుభాషలో Pamphlet అంటారు. ఈ రోజుల్లో సమావేశాలకు రమ్మని పిలిచే ఆహ్వానాలకూ, ఆరోగ్యవర్ధకమైన ప్రభుత్వ ప్రచారాలకు, దైవసంబంధ కార్యక్రమాలకు ఈ కరపత్రాలను పంచుతున్నారు.

ప్రశ్న 2.
ఇట్లా పంచిపెట్టే పత్రాలను ఏమంటారు?
జవాబు:
ఇలా సమాచారాన్ని సంక్షిప్తంగా అందించేందుకు వినియోగించే పత్రాలను కరపత్రాలు అంటారు.

TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ప్రశ్న 3.
వీటిని ఎందుకు పంచిపెడుతారు?
జవాబు:
ఒక సమాచారాన్ని లేదా వివాదాస్పద అంశాన్ని ప్రజలందరికీ తెలియపరచడమే, కరపత్రం పంచడంలో గల ప్రధాన ఉద్దేశం. ఒక వ్యక్తిగాని, సంస్థగాని ప్రజలకు అందించాలనుకొనే సమాచారాన్ని వీలైనంత సంక్షిప్తంగా ముద్రిత రూపంలో అందించేందుకు ఈ కరపత్రాలను వినియోగిస్తారు.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
కరపత్రాలను ఎందుకు రూపొందిస్తారు ? మీరు చదివిన కరపత్రం గురించి మాట్లాడండి.
జవాబు:
ఒక వ్యక్తిగాని, సంస్థగాని ప్రజలకు అందించాలనుకొనే సమాచారాన్ని, వీలైనంత సంక్షిప్తంగా ముద్రిత రూపంలో అందించేందుకు కరపత్రాన్ని రూపొందిస్తారు. ఒక సమాచారాన్ని లేదా వివాదాస్పద విషయాన్ని ప్రజలందరికీ తెల్పడమే కరపత్రం యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సామాజిక ప్రయోజనాలు ఉన్న విషయాలను, సామాన్య ప్రజానీకానికి చేరవేయడానికి కరపత్రం, ఒక ముఖ్య సాధనంగా ఉంటుంది.

నేను చదివిన కరపత్రం : స్టేట్బ్యాంకు వారు ఇంటి అప్పులు తక్కువ వడ్డీకి, ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా ఇస్తారన్న కరపత్రాన్ని నేను చదివాను.

  1. ఇంటి అప్పుకు దరఖాస్తు చేసే వ్యక్తి పేర ఇంటిస్థలం ఉండాలి.
  2. ఇల్లు నిర్మాణానికి స్థానిక పంచాయితీ / మునిసిపల్ కార్పొరేషన్ వారి అనుమతి పత్రం ఉండాలి.
  3. నిర్మాణ ఖర్చులో 1/4 వంతు పెట్టుబడిగా పెట్టగలిగిన స్థోమత దరఖాస్తుదారుకు ఉండాలి.
  4. హామీదారు అవసరం లేదు.
  5. అప్పు వడ్డీతో సహా 15 సంవత్సరాలలో తీర్చగలగాలి.
  6. జీతం నుండి రికవరీ చేసి, బ్యాంకుకు కడతామన్న పై అధికారి, హామీపత్రం ఉండాలి.
  7. సంవత్సరానికి 8% వడ్డీకే ఋణం మంజూరు.
  8. ఋణం ముందుగా చెల్లిస్తే, వడ్డీలో కన్సెషన్లు ఇవ్వబడతాయి.

ప్రశ్న 2.
ప్రజా ఉద్యమాలను శాంతియుతంగానే నిర్వహించవలసిన అవసరం ఏమిటి? చర్చించండి.
జవాబు:
ప్రజా ఉద్యమాలను శాంతియుతంగానే నిర్వహించాలి. హింసా పద్ధతులతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రజల నిత్యావసరాల సరఫరాకు ఆటంకాలు కల్పించడం, వగైరా పనులు చేయరాదు.

ప్రజా ఉద్యమాలను శాంతియుతంగా నిర్వహిస్తే కలిగే లాభాలు :

  1. ఉద్యమకారులకు ప్రాణనష్టం, ధననష్టం జరుగదు.
  2. ఉద్యమకారులు ప్రాణభయంతో ఉద్యమం నుండి తప్పుకోరు.
  3. శాంతియుతంగా ఉద్యమాలు నడిపితే, ఉద్యమాన్ని ఎక్కువకాలం కొనసాగించవచ్చు.
  4. ఎక్కువకాలం శాంతియుతంగా ఉద్యమం నిర్వహిస్తే, ప్రభుత్వానికి కూడా ఉద్యమకారులపై సానుభూతి, దయ కలుగుతుంది.
  5. శాంతియుతంగా ఉద్యమం నడిపిన ఉద్యమకారులపై సామాన్య ప్రజలకు అభిమానం, సానుభూతి కలుగుతాయి.
  6. శాంతియుతంగా చేస్తే, ఉద్యమకారులను ప్రభుత్వం కూడా ఏమీ చేయదు.
  7. శాంతియుత ఉద్యమం తప్పక విజయాన్ని సాధిస్తుంది.

TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ప్రశ్న 3.
పాఠం చదువండి. అప్పటి ప్రభుత్వ పాలనను గురించి విమర్శిస్తూ వాడిన కీలక పదాలు వెతికి రాయండి. వాటిని వివరించండి.
TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి 1
జవాబు:
TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి 2

ప్రశ్న 4.
కింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఆంగ్లేయుల రాకకు ముందు మన భారతదేశంలో కరపత్రాలు లేవు. ఆధునిక కాలంలో ప్రతిరోజు మనం కనీసం ఒకకరపత్రమైనా చూస్తున్నాం.

ఒక సమాచారాన్ని లేదా ప్రత్యేక అంశాలను అందరికీ తెల్పడమే కరపత్రం ప్రధాన ఉద్దేశం. కరపత్రంలో సాధారణంగా వాడుకభాష ఉంటుంది. కరపత్రాలు వేసినవాళ్ళు, రాసినవాళ్ళ పేర్లు గాని, ముద్రణాలయం పేరు గాని కరపత్రాల్లో ఉండాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సామాజిక ప్రయోజనాలున్న అంశాలను సామాన్య ప్రజానీకానికి చేరవేయడానికి కరపత్రం ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడుతుంది. కరపత్రం మనిషి భావస్వేచ్ఛకు సంకేతం.

ప్రశ్నలు:

అ) పై పేరాకు శీర్షిక నిర్ణయించండి.
జవాబు:
‘కరపత్రాల ప్రయోజనం’ అనేది, పై పేరాకు శీర్షికగా సరిపడుతుంది.

ఆ) కరపత్రాలు మనదేశంలో ఎప్పటి నుండి ఉన్నాయి ?
జవాబు:
కరపత్రాలు, మనదేశంలో ఆంగ్లేయులు మన దేశానికి వచ్చినప్పటి నుండీ ఉన్నాయి.

ఇ) కరపత్రాలు ఎందుకు ?
జవాబు:
ఒక సమాచారాన్ని లేదా వివాదాస్పద అంశాన్ని అందరికీ తెల్పడానికి, కరపత్రాలు ఉపయోగిస్తారు.

ఈ) కరపత్రాలు ఎట్లా ఉండాలి ?
జవాబు:
కరపత్రాలలో సాధారణంగా వాడుకభాష ఉండాలి. కరపత్రాలు వేసినవాళ్ళు, రాసినవాళ్ళ పేర్లు గాని, ముద్రణాలయం పేరు గాని, కరపత్రాల్లో ఉండాలి.

ఉ) పై గద్యం ప్రకారం ఎక్కువగా వేటికి చెందిన కరపత్రాలు చూస్తున్నాం ?
జవాబు:
ప్రభుత్వ సంక్షేమ పథకాలనూ, సామాజిక ప్రయోజనాలున్న విషయాలనూ, సామాన్య ప్రజలకు చేరవేయడానికి నేడు ఎక్కువగా కరపత్రాలు వాడుతున్నాం.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) 1969 తెలంగాణ ఉద్యమకాలం నాటి పాలన ఎట్లా ఉందని భావిస్తున్నారు ?
జవాబు:
1969లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని, విద్యార్థులూ, ప్రజలూ, ఉద్యోగస్థులూ, రాజకీయ నాయకులూ పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తెలంగాణ నాయకుడు పి.వి. నరసింహారావుగారు ఉండేవారు. 1956లో ఆంధ్ర ప్రాంతమూ తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. తెలంగాణ ప్రాంతానికి ముల్కీ హక్కులు ఉండేవి.. దాని ప్రకారము తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం తెలంగాణ వారికే ఇవ్వాలి.

కాని ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత, తెలంగాణ ప్రాంతంలో సహితమూ, ముల్కీ నియమాలను ఉల్లంఘించి, ఆంధ్ర ప్రాంతం వారికి తెలంగాణలో ఉద్యోగాలు ఇచ్చారు. అదీగాక 1956 నుండి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఆంధ్ర ప్రాంతం వారే ఉండేవారు. వారు ఆంధ్ర ప్రాంతానికి మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకొనేవారు. తెలంగాణ ప్రాంతంలో వచ్చే ప్రభుత్వ రెవెన్యూను సైతం వారు ఆంధ్ర ప్రాంతంలో ఖర్చు చేసేవారు.

అందువల్ల తెలంగాణ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడింది. తెలంగాణ ఉద్యోగులు, ముల్కీ హక్కుల రక్షణకు, నిరవధిక సమ్మెలు ప్రారంభించారు. రాష్ట్ర నాయకులు సమ్మెలను నిర్దాక్షిణ్యంగా అణచివేశారు. విద్యార్థులు 9 నెలలపాటు సమ్మె చేసినా, ప్రభుత్వం పట్టించుకోలేదు. విద్యార్థులకు అప్పుడు ఒక విద్యా సంవత్సరం పూర్తిగా వ్యర్ధమయ్యింది.

TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ఆ) అప్పటి తెలంగాణ పోరాటంలో ప్రజలు కోపోద్రిక్తులు కావడానికి కారణాలు రాయండి.
జవాబు:
ప్రజలు శాంతియుతంగా నెలల తరబడి సమ్మెలు, ధర్నాలు, పికెటింగులు చేసినా, నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉద్యమ నాయకులను బలవంతంగా కారాగారాల్లో ప్రభుత్వము బంధించింది. ఎందరో యువకులు, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోలీసుల తుపాకుల తుటాలకు బలయ్యారు. ఎందరో ఉద్యమ నాయకులు, రక్తతర్పణ చేశారు. ఎందరో యువకులు అంగవికలులు అయ్యారు..

తెలంగాణ ప్రాంతం అంతా, అగ్నిగుండంగా మారింది. అయినా కేంద్రప్రభుత్వము తెలంగాణ ప్రజల కోరికను మన్నించలేదు. కనీసము వారిని శాంతింపచేయడానికి ప్రయత్నాలు కూడా చేయలేదు. ఆ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు కోపోద్రిక్తులయ్యారు.

ఇ) గాంధీజీ సిద్ధాంతాలకు అనుగుణంగా తెలంగాణ సాధించాలనడంలో ఆంతర్యం ఏమిటి ?
జవాబు:
1969వ సంవత్సరము గాంధీ శతజయంతి సంవత్సరము. గాంధీజీ శాంతి, సత్యము, అహింస అనే సిద్ధాంతాలతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య పాలకులను మనదేశం నుండి వెడలగొట్టగలిగారు. గాంధీజీ కార్యసాధనకు సత్యాగ్రహాలను, నిరాహారదీక్షలను నమ్మినవాడు. అటువంటి గాంధీజీ శత జయంతి సంవత్సరంలో, గాంధీజీ నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని, తెలంగాణ ప్రజాసమితి భావించింది. అందుకే విద్యార్థి నాయకుడు నిరాహారదీక్షకు సిద్ధపడ్డాడు.

ఉద్యమం శాంతియుతంగా నడవకపోతే, ప్రభుత్వం బలవంతంగా ఆ ఉద్యమాన్ని శాంతిస్థాపన పేరుతో అణచివేస్తుంది. అశాంతిగా ఉద్యమాన్ని నడిపిస్తే, నాయకులను, ప్రభుత్వం బంధిస్తుంది. ఆ పరిస్థితులు రాకుండా, తెలంగాణ ప్రజాసమితి నాయకత్వం ముందు జాగ్రత్తగా, రాష్ట్ర సాధనోద్యమాన్ని, గాంధీజీ సిద్ధాంతాలకు అనుగుణంగా సాగించాలని నిశ్చయించింది.

ఈ) ప్రజా ఉద్యమాలు హింసాత్మకంగా మారకుండా ఉండడానికి ఉద్యమనాయకత్వం ఏం చేయాలి?
జవాబు:
ప్రజా ఉద్యమాలు హింసాత్మకంగా మారకుండా ఉండాలంటే, ఉద్యమనాయకులు ఈ కింది పద్ధతులను ఆచరణలో పెట్టాలి.

  1. ఉద్యమానికి ప్రధాన నాయకునిగా ఆవేశపరుడు, ఉద్రేకం కలవాడు కాని, అనుభవం కల నాయకుడిని ఎన్నుకోవాలి.
  2. ఉద్యమం శాంతియుతంగా, గాంధీజీ నమ్మిన అహింసా మార్గంలోనే నడిపించాలి.
  3. ఉద్యమనాయకులు ప్రభుత్వ ఆస్తులకు ఏవిధమైన నష్టం కల్గించరాదు.
  4. ఉద్యమనాయకులు తమ అనుచరులకు హితాన్ని ఉపదేశించి, శాంతిమార్గంలో నడిచేలా చేయాలి.
  5. ఉద్యమనాయకులు ప్రభుత్వానికి తమ సమస్యలను ఎప్పటికప్పుడు శాంతియుతంగా తెలపాలి.
  6. ఉద్యమాన్ని హింసా పద్ధతిలోనికి ఎన్నడూ మార్చరాదు.
  7. ఉద్యమం హింసాపద్ధతిలోకి మళ్ళినట్లయితే, వెంటనే ఉద్యమాన్ని తాత్కాలికంగా నాయకుడు ఆపుచేయాం.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) 1969 నాటి తెలంగాణ ఉద్యమం ద్వారా రాష్ట్రం సాధించకపోవడానికి, నేటి ఉద్యమం విజయవంతం కావడానికి కారణాలు విశ్లేషించండి.
జవాబు:
1969 తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ నాయకులు డా॥ మర్రి చెన్నారెడ్డిగారు నాయకత్వం వహించారు. ఆ రోజుల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, ఈ మధ్య సాగిన ఉద్యమం కంటే తీవ్రస్థాయిలోనే జరిగింది. నాటి తెలంగాణ ప్రజాసమితి నాయకత్వాన్ని ప్రజలు కూడా ఎక్కువగానే సమర్థించారు.

అప్పుడు జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి నాయకులను 10 మందిని, ప్రజలు యమ్.పి లుగా నెగ్గించారు. విద్యార్థులు 9 నెలలపాటు పాఠశాలలనూ, కళాశాలలనూ బహిష్కరించారు. వారికి ఒక విద్యాసంవత్సరం మొత్తం నష్టం అయ్యింది. అయినా, ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాలేదు.
దానికి ముఖ్యకారణాలివి.

ఆనాటి తెలంగాణ ఉద్యమంలో అహింసా పద్ధతులు అమలయ్యాయి. హైదరాబాదు నగరంలో నివసిస్తున్న ఆంధ్రప్రాంత స్త్రీలను ఉద్యమకారులు అవమానించారు. అల్లర్లు చేశారు. ఈ విధంగా ఉద్యమంలో అహింసా పద్ధతులు అమలుచేయడం వల్లే, నాడు ఆ నాయకులు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధింపలేకపోయారు.

నేటి ఉద్యమ విజయానికి కారణాలు :

  1. నేటి ఉద్యమం, పట్టువదలని విక్రమార్కుడైన కె.సి.ఆర్ నాయకత్వంలో అహింసా పద్ధతులలో సాగింది.
  2. నిరాహారదీక్షలు, నిరసనలు, సమ్మెలు, సకలజనుల సమ్మె, ఉద్యోగుల సమ్మె వంటి పద్ధతుల ద్వారా కేంద్రప్రభుత్వాన్ని నేటి ఉద్యమ నాయకులు ఒప్పించగలిగారు.
  3. 1969 ఉద్యమానికి నాటి కాంగ్రెస్ పార్టీ, వ్యతిరేకంగా నిలిచింది. నేటి ఉద్యమనాయకులకు, తెలంగాణలోని అన్ని పార్టీలూ కలిసి వచ్చాయి.
  4. ముఖ్యంగా కాంగ్రెస్పార్టీ వారు ముందుండి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిపెట్టారు.
    ఈ విధంగా శాంతియుతంగా సాగడమే, నేటి ఉద్యమ విజయానికి ప్రథమ కారణం.

TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా రాయండి.

ఆ) తెలంగాణ ప్రజల జీవనానికి, గ్రామాల అభివృద్ధికి తోడ్పడేవి “చెరువులు”. ఈ చెరువుల ప్రాధాన్యత వివరిస్తూ, వీటిని కాపాడడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చే కరపత్రం తయారు చేయండి. చదివి వినిపించండి.
జవాబు:

‘తెలంగాణ ప్రజల జీవనానికి చెరువుల ప్రాధాన్యము’

మన తెలంగాణ ప్రాంతంలో నేడు నీటి కొరతను ఎదుర్కొంటున్నాం. మనకు కృష్ణా, గోదావరి జీవనదులు ఉన్నా, వర్షపాతం తగినంత లేకపోడం దానికి ముఖ్యకారణం. ప్రధానంగా మన తెలంగాణలో చెరువులు ముఖ్యనీటి వనరులుగా ఉండి, మనకు త్రాగునీటినీ, సాగునీటినీ అందిస్తూ వచ్చాయి. ఈ మధ్యకాలంలో చెరువులను పూడ్చి ఆ స్థలంలో భవనాలు కట్టడం జరుగుతోంది. ఉన్న చెరువులను లోతుగా త్రవ్వించి, దానితో నీటిని నిల్వ చేయడంలో శ్రద్ధ తగ్గిపోయింది. చెరువులు, నీటి తూడు వగైరా పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. కొన్ని చెరువులు ఎండిపోయాయి. అందువల్లనే నేడు భూగర్భజలాలు అడుగంటిపోయాయి. 1500 అడుగులు లోతు బోర్లు వేసినా, చుక్క నీరు లభించడం లేదు. దీనికి ముఖ్యకారణం, మనం చెరువుల విషయంలో చూపిస్తున్న అశ్రద్ధ.

మన తెలంగాణ ప్రాంతంలో శాతవాహనుల కాలం నుండి చెరువుల నిర్మాణంపై శ్రద్ధ ఉంది. కాకతీయుల కాలంలో చెరువుల నిర్మాణం ఉన్నత దశకు చేరింది. తెలంగాణ పాలకులు, అసఫ్జాహీలు, కుతుబ్షాహీలు, సంస్థానాధీశులు చెరువుల నిర్మాణాన్ని అభివృద్ధి చేశారు.

ఇప్పటి మన తెలంగాణ ప్రభుత్వము చెరువుల ప్రాధాన్యతను గుర్తించింది. ‘మిషన్ కాకతీయ’ అనే పేరుతో పాత చెరువుల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యతనిస్తోంది. మనం కూడా ప్రభుత్వంతో చేయి కలుపుదాం. మనం కూడా ఉద్యమస్ఫూర్తితో ముందుకు కదులుదాం. ప్రతి గ్రామంలో చెరువుల పునర్నిర్మాణంలో పాలు పంచుకుందాం. నీటి కొరతలేని బంగారు తెలంగాణను నిర్మించుకుందాం. కదలిరండి. చెరువులను పునర్నిర్మించండి.

ది. X X X X X

ఇట్లు
తెలంగాణ రాష్ట్ర జలవనరుల శాఖ.

III. భాషాంశాలు

పదజాలం

1. కింది వాక్యాల్లోని గీత గీసిన పదాలకు అర్థాలు రాస్తూ, సొంతవాక్యాల్లో ప్రయోగించండి.

అ) ఆయన అహర్నిశల ఆరాటము తీరని ఆవేదనగానే మిగిలిపోయినది.
జవాబు:
అహర్నిశలు = రాత్రింబగళ్ళు
వాక్యప్రయోగం : మనిషి అహర్నిశలూ విద్యాధనములు సంపాదించాలి.

ఆ) గాంధీ అహింసా మార్గంలో లక్ష్యాన్ని సాధించాడు.
జవాబు:
లక్ష్యం = తలపెట్టిన కార్యం
వాక్యప్రయోగం : ఏదైనా లక్ష్యాన్ని సాధించాలంటే పట్టుదల మెండుగా ఉండాలి.

ఇ) తెలంగాణ జనత ధర్మయుద్ధం సాగిస్తున్నది.
జవాబు:
జనత = జనుల గుంపు
వాక్యప్రయోగం : భారతదేశం జనత కష్టజీవులు. ధర్మవర్తనులు.

2. ఇచ్చిన వివరణలకు సరిపడే జాతీయాలను బ్రాకెట్లో ఇవ్వబడిన వాటి నుండి ఏరి వాటికెదురుగా ఉన్న గళ్లల్లో రాయండి.

TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి 3
(కట్టలు తెంచుకోవడం, ఏ ఎండకాగొడుగు, ఉక్కుపాదం మోపడం, తిలోదకాలు ఇవ్వడం)
జవాబు:
అ) ఆశలు వదులు కొనటం = తిలోదకాలు ఇవ్వడం
ఆ) బలవంతంగా అణచివేయటం = ఉక్కుపాదం మోపడం
ఇ) మితిమీరిపోవటం = కట్టలు తెంచుకోవడం
ఈ) అవకాశవాదం = ఏ ఎండకాగొడుగు

వ్యాకరణాంశాలు

1. కింది వాక్యాల్లో సంధి పదాలను గుర్తించి, ఆ పదాలను విడదీసి సంధి పేర్లు పేర్కొనండి.

అ) కోపోద్రిక్తులైన కార్యకర్తలను హింసకు తెగబడకుండా కట్టడి చేశారు.
__________ + _______ = __________
జవాబు:
కోపాద్రిక్తులు = కోప + ఉద్రిక్తులు = గుణసంధి

ఆ) నమ్మిన సిద్ధాంతం కోసం గొప్పవారు ప్రాణాలర్పించడం చూస్తనే ఉన్నాం.
__________ + _______ = __________
జవాబు:
ప్రాణాలర్పించడం = ప్రాణాలు + అర్పించడం = ఉత్వసంధి

ఇ) సత్యాహింసలు పాటించడం ద్వారా సమాజ శాంతికి బాటలు వేయవచ్చు.
__________ + _______ = __________
జవాబు:
సత్యాహింసలు = సత్య + అహింసలు = సవర్ణదీర్ఘ సంధి

TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి

2. సమాస పదాలకు చెందిన కింది పట్టికను పూరించండి.

TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి 6

‘సమాస పదం – విగ్రహవాక్యం – సమాస నామం

  1. భక్తి ప్రపత్తులు – భక్తియు, ప్రపత్తియు – ద్వంద్వ సమాసం
  2. ధర్మయుద్ధం – ధర్మము కొఱకు యుద్ధం – చతుర్థీ తత్పురుష సమాసం
  3. రక్తపాతం – రక్తం యొక్క పాతం – షష్ఠీ తత్పురుష సమాసం
  4. శాంతి సందేశం – శాంతి యొక్క సందేశం – షష్ఠీ తత్పురుష సమాసం
  5. నాలుగెకరాలు – నాలుగు సంఖ్య గల ఎకరాలు – ద్విగు సమాసం

3. కింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.

అ) వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొన్నారు.
వేలాది యువకులు కారాగారాలకు వెళ్లారు. (సామాన్య వాక్యాలు).
జవాబు:
వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొన్నారు మరియు కారాగారాలకు వెళ్ళారు. (సంయుక్త వాక్యం)

ఆ) గాంధీ విధానాలను ఆచరించాలి.
గాంధీ విధానాల ద్వారా మంచిని సాధించాలి. (సామాన్య వాక్యాలు)
జవాబు:
గాంధీ విధానాలను ఆచరించాలి మరియు మంచిని సాధించాలి (సంయుక్త వాక్యం)

ప్రాజెక్టు పని

మీ ప్రాంతంలో వివిధ రకాల కరపత్రాలు సేకరించి వాటి వివరాలు కింది పట్టిక రూపంలో నమోదు చేయండి. నివేదిక రాయండి.
TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి 4
జవాబు:
TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి 5

కఠిన పదాలకు అర్థాలు

I

62వ పేజీ

సామూహిక ఉపవాస దీక్ష = అందరూ కలసి గుంపుగా ఉపవాసవ్రతం చేపట్టడం
తెలంగాణ రాష్ట్ర ధ్యేయాన్ని = తెలంగాణ రాష్ట్ర సాధన వాంఛను
చాటి చెప్పడానికి = వెల్లడించడానికి
మహాత్ముని = మహాత్మగాంధీజీ యొక్క
ప్రగాఢ విశ్వాసాన్ని = గట్టి నమ్మకాన్ని
ఆదేశాలను = ఆజ్ఞలను
ప్రజా ఉద్యమము = ప్రజల పోరాటం
కొనసాగుతున్నా = సాగుతున్నప్పటికీ (జరుగుతున్నప్పటికీ)
నిరసనపత్రాలకు = వ్యతిరేకతను తెలిపే కాగితాలకు
బడా మనుషులు = పెద్ద మనుష్యులు
భుక్తి మార్గం = తిండికి మార్గం
మలిన హృదయాలను = మురికిపట్టిన మనస్సులను
మరుగుపరుస్తున్నారు = దాస్తున్నారు
జాతిపిత ప్రబోధాలకు = గాంధీజీ బోధనలకు
తిలోదకాలు
(తిల + ఉదకాలు) = నువ్వుల నీళ్ళు
తిలోదకాలిచ్చు = పూర్తిగా ఆశ వదలుకొను,
అహర్నిశలు = పగలు, రాత్రి
ఆరాటము = సంతాపము
ఆవేదన = బాధ
కన్నీటితో తడియడం = ఏడవడం వల్ల కన్నీరు కారడం
ఆంధ్రపాలకులు = ఆంధ్రదేశపు ముఖ్యమంత్రులు
బానిస బంధాలను = = బానిస బంధములను;
తెలంగాణ జనత = తెలంగాణ ప్రజలు;
ప్రాణాలు కోల్పోయినారు = ప్రాణాలు పోగొట్టుకున్నారు
అంగవిహీనులు = అవయవాలు లేనివారు
సత్యాగ్రహ సమరం = సత్యాగ్రహ యుద్ధం

TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి

కారాగారం = జైలు
పికెటింగు = అడ్డుకోడం
ధర్నా = నిరసన కార్యక్రమం
ఉత్కృష్ట లక్ష్యాన్ని= గొప్ప లక్ష్యమును
రాబందుల రాచరికం = రాబందుల పెత్తనం
శాంతియుత విప్లవాన్ని = శాంతితో కూడిన విప్లవాన్ని
ప్రశాంత గంభీర జలధి = ప్రశాంతమైన లోతైన సముద్రము
పరిశీలన = శోధన
ప్రజాభిప్రాయము = ప్రజల అభిప్రాయము
మన్నన = గౌరవము
దారుణ హింసాకాండ = భయంకరమైన హింసా కృత్యం
రక్తపాతం = రక్తం కారడం
కోపోద్రిక్తులను = కోపముతో విజృంభించిన వారిని
కట్టలు తెంచుకొంటున్నది = గట్టులు తెంపుకొంటోంది
సడలిపోయే = జారిపోయే
ఏ ఎండకా గొడుగు = సందర్భానుసారంగా ఆచరించి కాలం గడుపుకోడం

63వ పేజీ

శాసన సభ్యులపైన = శాసనసభలోని సభ్యులపై (MLA లపై)
పేరుకుంటున్నది = అతిశయిస్తోంది
అగ్నిజ్వాలలు = అగ్నిమంటలు
కేరింతలాడుతున్న = ఉత్సాహంతో కేకలు వేస్తున్న
స్వార్థపరులు = తమ ప్రయోజనము మాత్రమే చూసుకొనేవారు
ప్రదర్శించడం = చూపడం
ధ్యేయానికి = కోరిన లక్ష్యమునకు
కలచివేస్తున్న = బాధపెడుతున్న
వాస్తవమే = సత్యమే
గాంధీ శతజయంతి
సంవత్సరం = గాంధీగారి నూరవ పుట్టినరోజు అయిన 1969వ సంవత్సరం
సత్యాహింసలు
(సత్య + అహింసలు) = సత్యము, అహింస
వరప్రభుత్వాన్ని = విదేశ ప్రభుత్వాన్ని
పారద్రోలిన = వెళ్ళగొట్టిన
కాసురాకాసి = డబ్బు రాక్షసి
నిరాహారదీక్ష = ఆహారం తిననని పట్టుపట్టడం
సమ్మతిని = అంగీకారాన్ని
శతజయంతి = నూరవ పుట్టినరోజు
జన్మదినానికి = పుట్టినరోజుకు
చేపట్టడం = చేయవలెనని అనుకోడం
పుష్టిని = బలాన్ని
భక్తి ప్రపత్తులు = భక్తి మరియు శరణాగతి
కానుక = బహుమతి
దిగ్విజయం = జయప్రదం
వెలుగులు విరజిమ్మాలి = కాంతులు నింపాలి
సత్యమేవ, జయతే = సత్యమే జయిస్తుంది

పాఠం నేపథ్యం, ఉద్దేశం

తెలంగాణ ఉద్యమం ఈనాటిది కాదు. ఎంతోమంది అమరుల త్యాగాలకు చిహ్నంగా సాధించుకున్నదే ఈ తెలంగాణ రాష్ట్రం. ఇది ఉద్యమాల ఫలితంగానే సాకారమైంది. నిన్నటి ఉద్యమానికి ముందే 1969లో ‘తెలంగాణ ప్రజాసమితి’ పేరుతోటి ప్రత్యేకరాష్ట్ర సాధన పోరాటం మొదలైంది. ఆనాటి ఉద్యమ తీరుతెన్నులను తెలుపడం, కరపత్రం యొక్క స్వరూప స్వభావాలను పరిచయం చేయడం ఈ పాఠం ఉద్దేశం.

TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం కరపత్రం అనే ప్రక్రియకు చెందినది. ఒక వ్యక్తి గాని, సంస్థ గాని, ప్రజలకు అందించాలనుకొనే సమాచారాన్ని వీలయినంత సంక్షిప్తంగా అచ్చు రూపంలో అందించేందుకు ఉపయోగించే పత్రాన్ని కరపత్రం అంటారు. దీనినే ఆంగ్లభాషలో ‘పాంప్లెట్” (Pamphlet) అంటారు.

“తెలంగాణ హిస్టరీ సొసైటి తరపున 2009లో వెలువడ్డ పుస్తకం, “1969 ఉద్యమం – చారిత్రక పత్రాలు” అనేది. ఈ పుస్తకంలో 1969 నాటి తెలంగాణ ఉద్యమ స్థితి గతులను వెలుగులోకి తెచ్చే కరపత్రాలు ముద్రించబడ్డాయి. ఆ పుస్తకంలో నుండి ఒక కరపత్రం తీసుకోబడింది. ఆ కరపత్రమే, ఈ పాఠం.

ప్రవేశిక

దీర్ఘకాలంగా శాంతియుత ఉద్యమాలు నిర్వహిస్తున్నప్పుడు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించినా అణచివేతకు దిగినా ఉద్యమాలు హింసాయుతంగా మారే అవకాశం ఉన్నది. ముందుగానే అటువంటి పరిణామాన్ని ఊహించిన ఉద్యమనాయకత్వం పాలకులను ఎండగడుతూ గాంధీ సిద్ధాంతాల కనుగుణంగా ఉద్యమించాలని పిలుపునిచ్చింది. ఇందుకనుగుణంగా రూపొందించిన 1969 నాటి కరపత్రంలో వివరాలు ఏమున్నాయో తెలుసుకుందాం.

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

These TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు will help the students to improve their time and approach.

TS 9th Class Telugu 1st Lesson Important Questions ధర్మార్జునులు

PAPER – I : PART – A

I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)

అ) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘ధర్మార్జునులు’ పాఠం ఆధారంగా రాజుకు ఉండవలసిన ఐదు లక్షణాలు తెల్పండి.’
జవాబు:
“యథా రాజా తథా ప్రజాః” – రాజు ఎట్లా ఉంటే, ప్రజలు. అట్లే ఉంటారు. ధర్మరాజు మహాపురుషుల మార్గంలో నడుస్తూ, ప్రజారంజకమైన విధానాలతో ధర్మపరిపాలన అందించాడు. ప్రస్తుత పాఠం ఆధారంగా రాజుకు ఉండవలసిన

లక్షణాలు – అవి :

  1. ధర్మ ప్రవర్తన కలిగి ఉండాలి.
  2. దానగుణం కల్గి, పూర్తిస్థాయిలో చెయ్యాలి.
  3. ముఖప్రీతి మాటలుకాక మనస్ఫూర్తిగా మాట్లాడాలి.
  4. ప్రజల సంపదను చూసి అసూయపడకూడదు.
  5. రాత్రింబగళ్ళు ధర్మకార్యాలు చేయాలి.
  6. కోపం కొంచెం కూడా ఉండకూడదు.
  7. మంచి చెడులను తాను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
  8. ఆడంబరాలు లేని స్థిరస్వభావం ఉండాలి.

ప్రశ్న 2.
ఒక కుటుంబంలోని అన్నదమ్ములు ఎలా ఉండాలి ?
జవాబు:
అరమరికలు లేని అన్నదమ్ములు ఆణిముత్యాలు. సోదర ప్రేమకు నిలువుటద్దం రామాయణభారతాలు. శ్రీరాముడు సోదరులైన లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుల పట్ల భ్రాతృప్రేమను చాటాడు. అలాగే రాముని పట్ల మిగిలినవారు అంతటి సోదరభావాన్ని ప్రదర్శించారు. అట్లాగే భారతంలోని పాండవులు స్నేహము, భక్తి, సహనం కలిగి, చిన్నా పెద్దా అనే తేడాలు చూసుకుంటూ, ఒకరిమాట ఒకరు పాటిస్తూ అందరూ ఒకే మనస్సుతో పనులు చేస్తూ, అన్యోన్య ప్రేమతో ప్రవర్తించేవారు.

కుటుంబంలోని అన్నదమ్ములు శ్రీరాముని సోదరులను, పాండవులను ఆదర్శంగా తీసుకోవాలి. ఒద్దిక కలవారై ఒకరి మనసు ఒకరు తెలుసుకుని మెలగాలి.

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 3.
చేమకూర వేంకట కవి కవితా శైలిని గూర్చి రాయండి.
జవాబు:
చేమకూర వేంకట కవి భారత కథలో అవసరమైన చక్కని మార్పులు చేసి, “ప్రతిపద్య చమత్కారం”తో స్వతంత్ర కావ్యంగా “విజయ విలాసము” తీర్చిదిద్దాడు. ఈ ప్రబంధం రఘునాథ నాయకునికి అంకితమివ్వబడింది. ఈ కావ్యంలో శబ్దాలంకారాలు సొగసులతో, తెలుగు నుడికారాలతో, అందమైన శైలి, ప్రసన్న గంభీరమైన పద్యం నడక కనబడుతుంది.

విజయ విలాసంలో, చమత్కారం లేని ఒక్క పద్యం కూడా లేదని పేరుపొందాడు. ‘పిల్ల వసుచరిత్ర’ అనే ప్రశంసను పొందిన ఈ కావ్యం, తెలుగులోని పంచమహాకావ్యాలతో సరితూగగలదని విజ్ఞులు తలుస్తారు.

ప్రశ్న 4.
‘అతని నుతింపశక్యమె’ అని అర్జునుడిని గురించి వేంకటకవి అన్నాడు. అర్జునుడి గొప్పతనాన్ని వివరించండి.
జవాబు:
అర్జునుడు అన్నల విషయంలోనూ, తమ్ముళ్ళ విషయంలోనూ సమానంగా ప్రవర్తించే వాడనే పేరు పొందిన ఘనుడు. రాజులందరిలోనూ ఎక్కడా ఎదురులేనివాడని ప్రసిద్ధినీ, గొప్పతనాన్నీ పొందిన పరాక్రమశాలి. అర్జునుడు సాత్త్వికులు ప్రశంసించే, ధర్మప్రవర్తన కలవాడు.

అర్జునుడు అందంలో ఇంద్రుని కుమారుడు జయంతుని అంతటివాడు. దయా స్వభావంలో కృష్ణుడికి ప్రాణమిత్రుడు. యుద్ధ విజయాలలో శివుడితో పోటీపడే వీరుడు. ఈ భూమండలంలో అర్జునుడికి అర్జునుడే సాటియైనవాడు.

అర్జునుడు తేరిపార చూస్తే, శత్రుసైన్యం పారిపోడానికి సిద్ధం అవుతుంది. అర్జునుడు విల్లుఎత్తి పట్టుకోడానికి వంగితే శత్రువులు వీర స్వర్గం దారిపడతారు. అర్జునుడితో సాటి అని చెప్పదగినవాడు, పోల్చదగిన వీరుడు ఈ లోకంలో శ్రీరాముడు తప్ప మరొకరు లేడు.

ఆ) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
ధర్మరాజు పాలనతో, నేటి నాయకుల పాలనను పోల్చి రాయండి.
జవాబు:
ధర్మము తెలిసినవాడు ధర్మరాజు. ధర్మరాజు తాను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం, తాను సహితం ఆచరించేవాడు. శాంతము, దయ, సత్యము అనే సద్గుణాలు కలవాడు. మంచివారిని ఆదరించేవాడు. దానము చేయడంలో ఆసక్తి కలవాడు. ముఖప్రీతి కోసం మాట్లాడేవాడు కాడు. కోపం లేనివాడు. లోకువ చేసేవాడు కాడు.

అసూయ లేనివాడు. మెచ్చుకున్నప్పుడు తృప్తిగా ఇచ్చేవాడు. ఇలా కృతయుగ (సత్యకాలం) లక్షణాలతో విరాజిల్లే ధర్మరాజుతో నేటి నాయకుల పాలనను పోల్చడానికి మనసు రావడం లేదు, పెన్ను కదలడం లేదు.

ఆకలితో అలమటించేవారికి రూపాయి ఖర్చుపెట్టడానికి ఆలోచించే నేటి నాయకులు ఎన్నికలలో డబ్బును ఎన్ని రూపాల్లో పంచవచ్చో అలా పంచేస్తున్నారు. ఓటుకు నోటు ఇచ్చినవాడు తిరిగి మాట మీద నిలబడి మనకు మేలు చేస్తాడని నమ్మడం, ఓటు అమ్ముకోవడం మనం చేస్తున్న దోషాలు. నాణ్యత లేమి ప్రతి పనిలో కనబడుతుంది. ముందుచూపు లేని నాయకుల పాలనలో ప్రజలు ప్రకృతి బీభత్సాలకు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఆవేశం కలిగిన నాయకులు ప్రజలకు అనర్థాలే కలిగిస్తున్నారు.

పెద్దల సభలలో వారి ప్రవర్తన జుగుప్స కల్గిస్తుంది. ముఖప్రీతి మాటలే చెబుతున్నారు. ప్రజలకు ఇచ్చేటప్పుడు పత్రికల ముందు గొప్ప కోసం తప్ప తృప్తిగా ఇచ్చేది లేదు. ప్రభుత్వ పథకాలు అర్హులు అయిన వారికన్నా అనర్హులకే పొడుగు చేతుల పందేరం అవుతోంది. శాంతి, దయ, సత్యం, మత సహనం అనే లక్షణాలు నామమాత్రంగానే ఉన్నాయి.

గాంధీ వంటి మహాత్ముల పేరు చెప్పుకొని బ్రతుకుతున్న నాయకులంతా దేశభక్తిని విడిచి భుక్తి మార్గం వెతుకుతున్నారు. తెల్లరంగు ఛాయలో తమ మలిన హృదయాలను దాచుకుంటున్నారు. త్యాగమూర్తుల ప్రబోధాలకు నీళ్ళొదులుతున్నారు. ఇది కచ్చితంగా కలికాలం. కష్టాల కాలమే.

PART – I : PART – B

భాషాంశాలు – పదజాలం :

1. సొంతవాక్యాలు :

1. సోయగం : చెరువు గట్టున ఉన్న మాయింటి సోయగం చూపులకే కాదు, మనస్సుకు హాయినిస్తుంది.
2. ఏవురు : స్నేహితులు నల్వురు ఏవురు వున్నా, మంచివారై ఉండాలని అమ్మ చెప్పింది.
3. కొంగుపసిడి : మా తాతయ్య మాయింటికే కాదు ఊరికే కొంగుపసిడి అని అంతా అంటారు.
4. సరాగము : మా ఉమ్మడి కుటుంబంలో సరాగము పండుగ రోజుల్లో కనబడుతుంది.
5. ప్రతిజోదు : మా తెలివితేటలకు ప్రతిజోదు మా మావయ్య అడిగే క్విజ్ ప్రశ్నలు.
6. అసూయపడు : ఎదుటివారి సంపదలకు అసూయపడితే నిద్ర రాదు, ఫలితం ఉండదు.
7. సౌజన్యం : ఆపదలు ఎదురైనప్పుడు మనిషిలో సౌజన్యం బయటపడుతుంది.
8. వన్నె, వాసిగాంచు : వన్నె, వాసిగాంచిన మహాపురుషుల గురించి, చిన్నప్పటి నుండి తెలుసుకొంటే మనకు లక్ష్యం ఏర్పడుతుంది.
9. శాంతి : ఎప్పుడూ బాధ లేకుండా ఉండటం ఎల్లప్పుడు మనము శాంతినే కోరుకోవాలి.
10. అసూయపడుట : ఈర్ష్యపడుట – పాండవుల ఐశ్వర్యానికి దుర్యోధనుడు అసూయపడ్డాడు.
11. వెలసిరి : అవతరించటం – విష్ణువు భక్త సంరక్షణార్థమై కలియుగంలో వేంకటేశ్వర స్వామిగా తిరుమలలో వెలసెను.
12. పుణ్యభూమి : గొప్పభూమి – ధర్మ పరిపాలనా తత్పరులు పాలించిన పుణ్యభూమి మనదేశం.

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

II. అర్థాలు:

అ) కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.

ప్రశ్న 1.
శ్రీరాముడు దశరథుని తనూజుడు – గీత గీసిన పదానికి అర్థం
A) తండ్రి
B) కుమారుడు
C) వారసుడు
D) వంశకర్త
జవాబు:
B) కుమారుడు

ప్రశ్న 2.
“క్షితి” అంటే అర్థం
A) చితి
B) ఒక పక్షి
C) భూమి
D) రాజు
జవాబు:

ప్రశ్న 3.
“ఎడాటము” అనే పదానికి సరియైన అర్థం
A) పెంపకము
B) తడబాటు
C) విషయము
D) శ్రద్ధ
జవాబు:
C) విషయము

ప్రశ్న 4.
“ధర్మరాజు” అనే అర్థం వచ్చే పదం
A) అజయుడు
B) ధర్మ తనూజుడు
C) ఉద్ధతుడు
D) కోవిదుడు
జవాబు:
B) ధర్మ తనూజుడు

ప్రశ్న 5.
మనకు కొదవ లేనివి ప్రకృతి వనరులు గీత గీసిన పదానికి అర్థం
A) కొఱత
B) ధనము
C) మర్యాద
D) ఎక్కువ
జవాబు:
A) కొఱత

ప్రశ్న 6.
కలిమి గలనాడె దేవుని పూజింపుము – గీత గీసిన పదానికి అర్థం
A) బలము
B) ధాన్యము
C) భక్తి
D) సంపద
జవాబు:
D) సంపద

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 7.
“జలధి” అనే పదానికి సరియైన అర్థం
A) వారధి
B) వారిధి
C) వారిజాతము
D) పారిజాతము
జవాబు:
B) వారిధి

ప్రశ్న 8.
“భూమి” అనే అర్థం వచ్చే సరియైన పదం
A) మిన్ను
B) చక్రము
C) వసుమతి
D) దానవుడు
జవాబు:
C) వసుమతి

ప్రశ్న 9.
సోదరులు – అనే అర్థం గల పదము
A) అనుజన్ములు
B) కుమార్తెలు
C) తనూజులు
D) తండ్రి, బాబాయి
జవాబు:
A) అనుజన్ములు

ప్రశ్న 10.
సత్త్వగుణం కలవారు – అనే అర్థం వచ్చే సరియైన పదం
A) సరసులు
B) సంపన్నులు
C) ధర్మరాజు
D) సాత్త్వికులు
జవాబు:
D) సాత్త్వికులు

ప్రశ్న 11.
ధర్మరాజు శాంతి, దయలనే ఆభరణాలుగా ధరించాడు – గీత గీసిన పదానికి అర్థం
A) గుణాలు
B) గుడ్డలు
C) నగలు
D) సుగంధాలు
జవాబు:
C) నగలు

ప్రశ్న 12.
పాండురాజు జ్యేష్ఠ కుమారుడు ధర్మరాజు – గీత గీసిన పదానికి అర్థం
A) చివరి
B) మధ్య
C) పెద్ద
D) ఆరంభం
జవాబు:
C) పెద్ద

ప్రశ్న 13.
ధర్మకార్యాలు చేస్తూ పుణ్యం సంపాదించాలనే దృష్టి – గీత గీసిన పదానికి అర్థం
A) చూపు
B) చాప
C) కోరిక
D) దిష్టి
జవాబు:
A) చూపు

ప్రశ్న 14.
మనుష్యులలో వ్యత్యాసం తెలిసినవాడు – గీత గీసిన పదానికి అర్థం
A) ఎక్కువ
B) తేడా
C) తక్కువ
D) సమానం
జవాబు:
B) తేడా

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 15.
యాచకుల దీనత్వం పోగొట్టడానికి ఎల్లప్పుడూ ఉత్సాహం కలిగి ఉంటారు – గీత గీసిన పదానికి అర్థం
A) యాత్రికులు
B) అనాథలు
C) దానం కోరువారు
D) వీధిబాలలు
జవాబు:
C) దానం కోరువారు

ప్రశ్న 16.
లోకంలో అన్నదమ్ముల ఒద్దిక అంటే వారిదే సుమా – గీత
A) అధికారం
B) పెత్తనం
C) అయిష్టం
D) అనుకూలం.
జవాబు:
D) అనుకూలం.

ప్రశ్న 17.
శత్రు సమూహం వీరస్వర్గం దారిపడుతుంది – గీత గీసిన
A) ఇంటిదారి
B) వీరమరణం
C) సుఖం
D) నరకం
జవాబు:
B) వీరమరణం

ప్రశ్న 18.
యథా రాజా తథా ప్రజాః – గీత గీసిన పదానికి అర్థం
A) అట్లు
B) వలన
C) ఎట్లు
D) ఇట్లు
జవాబు:
A) అట్లు

III. పర్యాయపదాలు :

ప్రశ్న 1.
దేవతలు, దివిజులు, సురలు – అనే పర్యాయపదాలు గల పదము
A) దైత్యుతులు
B) అమరులు
C) భాసురులు
D) శ్రమణకులు
జవాబు:
B) అమరులు

ప్రశ్న 2.
ఎప్పుడూ పసిడి ధర ఎక్కువే – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) వెండి, బంగారం
B) నగలు, ప్లాటినం
C) పుత్తడి, పైడి, స్వర్ణము
D) సొమ్ములు, నగలు, ఆభరణాలు
జవాబు:
C) పుత్తడి, పైడి, స్వర్ణము

ప్రశ్న 3.
తనూజుడు పుట్టినప్పుడు కాక కుమారుడు ప్రయోజకుడైతే, ఆ సుతుని చూచి తండ్రి ఆనందపడతాడు. పై వాక్యంలో పర్యాయపదాలు ఉన్న పదం.
A) జనకుడు
B) ఆనందము
C) ప్రయోజనము
D) పుత్రుడు
జవాబు:
D) పుత్రుడు

ప్రశ్న 4.
పురము – అనే పదానికి పర్యాయపదాలు
A) పురము, పురహరుడు
B) పట్టణము, జనపదం
C) ప్రోలు, పట్టణము, నగరం
D) జనపదం, భాగ్యనగరం
జవాబు:
C) ప్రోలు, పట్టణము, నగరం

ప్రశ్న 5.
క్షితి – అనే పదానికి పర్యాయపదం కానిది.
A) భూమి
B) ధరణి
C) వసుమతి
D) పక్షి
జవాబు:
D) పక్షి

ప్రశ్న 6.
నరుడు, మానవుడు – అనే పర్యాయపదాలుగా గల పదం
A) మానిసి
B) ఉత్తముడు
C) దనుజుడు
D) కృష్ణుడు
జవాబు:
A) మానిసి

ప్రశ్న 7.
రాజు అనే పదానికి పర్యాయపదాలు
A) ఏలిక, ప్రభువు
B) ధనికుడు, రాజు
C) చంద్రుడు, రాజు
D) రాజనాలు, ప్రభువు
జవాబు:
A) ఏలిక, ప్రభువు

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 8.
ఇల, మహి, వసుమతి – అనే పర్యాయపదాలు గల పదం
A) క్షితి
B) స్త్రీ
C) ధర్మము
D) అర్జునుడు
జవాబు:
A) క్షితి

ప్రశ్న 9.
మన మాటలో నిజం ఎదుటివాడికి వినబడాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) నిజాయితీ, నైజం
B) ఋతము, సత్య
C) అనృతం, అమృతం
D) సత్తువ, సాపత్తి
జవాబు:
B) ఋతము, సత్య

ప్రశ్న 10.
“శత్రువు” అనే పదానికి పర్యాయపదాలు
A) వైరి, అరి, రిపుడు
B) విరోధం, పగ, విజితులు
C) మిత్రుడు, స్నేహితుడు, దోస్తు
D) వెన్నుజూపు, పాఱజూచు
జవాబు:
A) వైరి, అరి, రిపుడు

ప్రశ్న 11.
నిజం చెప్పడంలోని స్వారస్యాన్ని తెలిసినవాడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) అబద్ధం, అసత్యం
B) సత్యం, ఋతం
C) ఋతం, ఋతం
D) నాసికం, కర్ణం
జవాబు:
B) సత్యం, ఋతం

ప్రశ్న 12.
అతని ముఖము పై చిరునవ్వు ఎప్పుడూ ఉంటుంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) చెవులు, కాళ్ళు
B) ముక్కు చేతులు
C) ఆననం, ఆస్యం
D) నాసికం, కర్ణం
జవాబు:
C) ఆననం, ఆస్యం

ప్రశ్న 13.
సముద్రం ఈ భూమండలాన్ని ఆవరించియున్నది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) సాగరం, రత్నాకరం
B) ఘోష, రొద
C) నదీనదం, వారిధి
D) సంగ్రామం, సంగరం
జవాబు:
A) సాగరం, రత్నాకరం

ప్రశ్న 14.
అయిదు దేవతా వృక్షాలు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) ఋక్షం, చెట్టు
B) మహీరుహం, భూజం
C) భూగృహం, రంధ్రము, కాలము
D) మొక్క ఆకు
జవాబు:
B) మహీరుహం, భూజం

ప్రశ్న 15.
కృష్ణునికి ప్రాణమిత్రుడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) రాముడు, భీముడు
B) విష్ణువు, ధనువు
C) కన్నయ్య, కన్నమ్మ
D) విష్ణువు, కిట్టయ్య
జవాబు:
D) విష్ణువు, కిట్టయ్య

ప్రశ్న 16.
శివునివలె యుద్ధ విజయాలలో పోటీపడే వీరుడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) శంకరుడు, విష్ణువు
B) కృష్ణుడు, రుద్రుడు
C) భవుడు, రుద్రుడు
D) బ్రహ్మ, ఈశ్వరుడు
జవాబు:
C) భవుడు, రుద్రుడు

ప్రశ్న 17.
తేరిపార చూస్తే చాలు శత్రు సైన్యం పారిపోతుంది – గీసిన పదానికి పర్యాయపదాలు
A) దండు, సేన
B) దండ, సాన
C) సైనికులు, రైతులు
D) కార్మికులు, జాలరులు
జవాబు:
A) దండు, సేన

IV. నానార్థాలు:

ప్రశ్న 1.
ఆస్యమును ప్రతి ఉదయము, రాత్రి శుభ్రపరచుకోవాలి – గీత గీసిన పదానికి నానార్థాలు
A) నోరు, నాలుక
B) ముఖము, నోరు
C) చేతులు, ముఖము
D) వాకిలి, ఇల్లు
జవాబు:
B) ముఖము, నోరు

ప్రశ్న 2.
భాషను కాపాడతానని బాస చేస్తున్నాను- గీత గీసిన పదానికి నానార్థాలు
A) భాష, ప్రతిజ్ఞ
B) ఆజ్ఞ, వాణి
C) అధికారి, భాష
D) ఆధారము, అనుమతి
జవాబు:
B) ఆజ్ఞ, వాణి

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 3.
దిశ, ఆశ్రయం (ఆధారం) – అనే నానార్థాలు గల పదం
A) వైపు
B) అరణము
C) దిక్కు
D) పర్ణశాల
జవాబు:
C) దిక్కు

ప్రశ్న 4.
మామిడి పళ్ళు ప్రియము – గీత గీసిన పదానికి నానార్థాలు
A) ఇష్టము, ప్రేమ
B) ప్రియమైనది, అధిక ధర
C) పులుపు, తీపి
D) పండు, కాయ
జవాబు:
B) ప్రియమైనది, అధిక ధర

ప్రశ్న 5.
ఇతడే మా ఏలిక, ఆకాశానికి చంద్రుడు ఇతడు – ఈ వాక్యంలో నానార్థాలు గల పదం
A) నక్షత్రము
B) శివుడు
C) దాత
D) రాజు
జవాబు:
D) రాజు

ప్రశ్న 6.
మరణం లేనివారు, దేవతలు – అను నానార్థాలు గల పదం
A) అమరులు
B) సురపానం
C) పుణ్యాత్ములు
D) పాండవులు
జవాబు:
A) అమరులు

ప్రశ్న 7.
“చౌక” అను పదానికి నానార్థాలు
A) వెల తక్కువ, చులకన
B) నాలుగు దారులు, చదరము
C) చవుక, ఆకాశము
D) చమత్కారము, చదరము
జవాబు:
A) వెల తక్కువ, చులకన

ప్రశ్న 8.
“ధర్మరాజు” అను పదానికి నానార్థాలు
A) ధర్మరాజు, అర్జునుడు
B) ధర్మరాజు, ధార్మికుడు
C) ధర్మరాజు, యముడు
D) ధర్మడు, అధర్ముడు
జవాబు:
C) ధర్మరాజు, యముడు

ప్రశ్న 9.
“మునుపు” అనే పదానికి సరియైన నానార్థాలు
A) నునుపు, పంపుట
B) మునులు, తపస్వినులు
C) ముందు, పూర్వము
D) ఎదురు, తిట్టు
జవాబు:
C) ముందు, పూర్వము

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 10.
సాధుజనుల పట్ల ఆదరణ కల్గి ఉండాలి – గీత గీసిన పదానికి నానార్థాలు
A) సాధువులు, సన్యాసులు
B) మంచివారు, సాధువులు
C) నిదానం, నెమ్మది
D) మంచి, ధర్మం
జవాబు:
B) మంచివారు, సాధువులు

ప్రశ్న 11.
ధర్మరాజు ఆజ్ఞా పరిపాలన వ్రతుడు – గీత గీసిన పదానికి నానార్థాలు
A) ఉత్తరువు, ఉత్తరం
B) దండన, బెత్తం
C) ఉత్తరువు, దండన
D) ఉత్తరం, బెత్తం
జవాబు:
C) ఉత్తరువు, దండన

V. ప్రకృతి, వికృతులు :

ప్రశ్న 1.
ఆజ్ఞను కొందరు ఆనతి అంటారు – గీత గీసిన పదానికి వికృతి
A) అధికారం
B) ఆన
C) గుర్తు
D) ప్రతిన
జవాబు:
B) ఆన

ప్రశ్న 2.
“పురము”నకు సరియైన వికృతి పదము
A) వూరు
B) కాపురము
C) ప్రోలు
D) పూరణ
జవాబు:
C) ప్రోలు

ప్రశ్న 3.
మనస్సుకు భాష వస్తే కవిత్వం వస్తుంది గీత గీసిన పదానికి వికృతి పదం
A) భాస
B) బాస
C) బాష
D) బాసులు
జవాబు:
B) బాస

ప్రశ్న 4.
“దిష్టి” అనే పదానికి సరియైన వికృతి పదం
A) దూరము
B) అదృష్టం
C) దుష్టుడు
D) దృష్టి
జవాబు:
D) దృష్టి

ప్రశ్న 5.
ఈ కింది వానిలో ప్రకృతి – వికృతి సరిగా లేనిది
A) రాజు – తేడు
B) కీర్తి – కీరితి
C) వర్ణము – పర్ణము
D) కన్య – కన్నె
జవాబు:
C) వర్ణము – పర్ణము

ప్రశ్న 6.
“ధర్మము (ప్ర) – ధమ్మము (వి)” వీటిలో వికృతి పదం సరిగా లేదు. సరైన వికృతి
A) ధరమము
B) దమ్మము
C) దమము
D) ధరమ
జవాబు:
B) దమ్మము

ప్రశ్న 7.
“యోధుడు” – ప్రకృతి పదమునకు వికృతి
A) జోదు
B) యోద్ధ
C) యెద
D) ఎదిరి
జవాబు:
A) జోదు

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 8.
అద్దములో మన రూపము చూడవచ్చు – గీత గీసిన పదానికి వికృతి
A) రూప్యము
B) రూపాయి
C) రూపు
D) రూపాలు
జవాబు:
C) రూపు

ప్రశ్న 9.
“కుమారుడు” అనే పదానికి వికృతి పదము
A) కొడుకు
B) కొమరుడు
C) కన్నయ్య
D) కుమారిత
జవాబు:
B) కొమరుడు

ప్రశ్న 10.
ఈ వస్త్రము వర్ణము బాగుంది – గీత గీసిన పదానికి వికృతి
A) పర్ణము
B) వర్ణి
C) తారు
D) వన్నె
జవాబు:
D) వన్నె

ప్రశ్న 11.
యమధర్మరాజు కుమారుడు ధర్మరాజు – గీత గీసిన పదానికి వికృతి
A) పుత్రుడు.
B) సుతుడు
C) బొట్టె
D) కొమరుడు
జవాబు:
D) కొమరుడు

ప్రశ్న 12.
తన కీర్తి కాంతులను ప్రసరింపచేస్తూ ధర్మరాజు పాలించేవాడు – గీత గీసిన పదానికి వికృతి
A) పేరు
B) ప్రతిష్ఠ
C) కీరితి
D) కొరతి
జవాబు:
C) కీరితి

ప్రశ్న 13.
సత్యమును రూపముగా కలవాడు – గీత గీసిన పదానికి వికృతి
A) బలం
B) సత్తు
C) సత్వం
D) నిజం
జవాబు:
B) సత్తు

ప్రశ్న 14.
ధర్మమును అనుసరించువాడు ధర్మరాజు – గీత గీసిన పదానికి వికృతి
A) దమ్మం
B) దరమం
C) ధరమం
D) దమ్ము
జవాబు:
A) దమ్మం

ప్రశ్న 15.
విష్ణువు ఆయుధాలలో శార్జ్గవము ఒకటి – గీత గీసిన పదానికి వికృతి
A) విల్లు
B) కత్తి
C) సింగిణీ
D) సారగవము
జవాబు:
C) సింగిణీ

VI. వ్యుత్పత్త్యర్ధములు :

ప్రశ్న 1.
తన దేహము నుండి పుట్టినవాడు – వ్యుత్పత్త్యర్ధము గల పదము
A) కొడుకు
B) తనూజుడు
C) దేహి
D) దేవత
జవాబు:
B) తనూజుడు

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 2.
ధర్మనందనుడు – అను పదానికి సరియైన వ్యుత్పత్తి
A) ధర్మము మరియు నందనుడు
B) ధర్ముని కొరకు నందనుడు
C) యమధర్మరాజు యొక్క కొడుకు
D) నందనుడైన ధర్ముడు.
జవాబు:
C) యమధర్మరాజు యొక్క కొడుకు

ప్రశ్న 3.
“జలమునకు నిధి” అను వ్యుత్పత్త్యర్ధము గల పదము
A) జలధి
B) జలజము
C) జలజాకరము
D) బావి
జవాబు:
A) జలధి

ప్రశ్న 4.
పాండవులు – అను పదానికి సరియైన వ్యుత్పత్తి
A) ధర్మభీమార్జునులు
B) పాండురాజు యొక్క కుమారులు
C) పాండవులు వేయిమంది
D) కౌరవులు కానివారు.
జవాబు:
B) పాండురాజు యొక్క కుమారులు

ప్రశ్న 5.
“నరులను పాలించువాడు” అను వ్యుత్పత్తి అర్థము గల పదము
A) నరనారాయణుడు’
B) చక్రవర్తి
C) నృపాలుడు
D) రాజు
జవాబు:
C) నృపాలుడు

ప్రశ్న 6.
అమరులు-అను పదానికి సరియైన వ్యుత్పత్త్యర్ధము గల పదము
A) మరులు కొన్నవారు
B) స్వర్గములో ఉండువారు
C) మరణము లేనివారు
D) చెట్లు గల వారు వ్యుత్పత్తి అర్థము గల పదము
జవాబు:
C) మరణము లేనివారు

ప్రశ్న 7.
సంతోష పెట్టువాడు – అను వ్యుత్పత్తి అర్థము గల పదము
A) స్నేహితుడు
B) నందనుడు
C) సోదరుడు
D) భగవంతుడు
జవాబు:
B) నందనుడు

ప్రశ్న 8.
సత్యప్రధానమైన యుగము – అను వ్యుత్పత్తి అర్థము గల పదము
A) కలియుగం
B) ద్వాపరయుగం
C) కృతయుగం
D) త్రేతాయుగం
జవాబు:
C) కృతయుగం

PAPER – II : PART – A

అపరిచిత పద్యాలు

1. క్రింది పద్యాన్ని చదివి, అర్థం చేసుకుని, ఇచ్చిన ఖాళీలను పూరించండి.

తలనుండు విషము ఫణికిని
వెలయంగాఁ దోఁక నుండు వృశ్చికమునకున్
దల తోఁక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ !

ఖాళీలు

1) పాముకు విషం ………… లో ఉంటుంది.
జవాబు:
తల

2) వృశ్చికమనగా ………….
జవాబు:
తేలు

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

3) శరీరమంత విషం ……….. ఉంటుంది.
జవాబు:
ఖలునకు

4) పై పద్య మకుటం ………….
జవాబు:
సుమతీ

5) పై పద్యాన్ని రచించిన కవి ……..
జవాబు:
బద్దెన

2. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు
నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు
సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులు, దేళ్ళు
పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు.

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
నాగులేరు ఏ సీమలో ప్రవహిస్తున్నది?
జవాబు:
నాగులేరు పల్నాటి సీమలో ప్రవహిస్తున్నది.

ప్రశ్న 2.
పల్నాటిసీమ ప్రజల ఆహారం ఏది?
జవాబు:
పల్నాటి సీమ ప్రజల ఆహారం సజ్జ, జొన్నకూళ్ళు.

ప్రశ్న 3.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి ‘పల్నాటి పల్లెటూళ్ళు’ అని పేరు పెట్టవచ్చు.

ప్రశ్న 4.
ఈ పద్యంలోని శబ్దాలంకారమేమిటో రాయండి.
జవాబు:
ఈ పద్యంలోని శబ్దాలంకారం వృత్త్యనుప్రాసం.

ప్రశ్న 5.
ఈ పద్యం వల్ల ఏమి తెలుస్తోంది ?
జవాబు:
ఈ పద్యం వల్ల పల్నాటి సీమ పల్లెటూళ్ళ గురించి తెలుస్తోంది.

3. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

అక్షరంబు వలయు కుక్షి జీవనులకు
నక్షరంబు జిహ్వ కిక్షు రసము
అక్షరంబు తన్ను రక్షించు గావున
నక్షరంబు లోక రక్షితంబు.

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
మానవులకు ఏం కావాలి ?
జవాబు:
మానవులకు అక్షరం (విద్య) కావాలి.

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 2.
అక్షరం జిహ్వకు ఎటువంటిది ?
జవాబు:
అక్షరం జిహ్వకు చెరకురసం వంటిది.

ప్రశ్న 3.
అక్షరము దేనిని రక్షిస్తుంది ?
జవాబు:
అక్షరము తనను (చదువుకున్నవానిని) రక్షిస్తుంది.

ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘అక్షరాలు నేర్చుకో.’

ప్రశ్న 5.
ఈ పద్యంలో దేన్ని గురించి తెలియజేయబడింది?
జవాబు:
ఈ పద్యంలో ‘చదువు’ గురించి తెలియజేయబడింది.

4. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

కందుకము వోలె సుజనుడు
క్రిందంబడి మగుడ మీదికి న్నెగయుఁ జుమీ
మందుడు మృత్పిండమువలె
గ్రిందంబడి యడగియుండుఁ గృపణత్వమునన్.

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
సుజనుడు ఎట్లా ఉంటాడు ?
జవాబు:
సుజనుడు కందుకంలా ఉంటాడు.

ప్రశ్న 2.
మందుడు ఎలా ఉంటాడు ?
జవాబు:
మందుడు మృత్పిండంలా ఉంటాడు.

ప్రశ్న 3.
సుజనుని కవి దేనితో పోల్చాడు ?
జవాబు:
సుజనుని కవి బంతితో పోల్చాడు.

ప్రశ్న 4.
ఈ పద్యంలోని అలంకారమేమి ?
జవాబు:
ఈ పద్యంలో ఉపమాలంకారం ఉంది.

ప్రశ్న 5.
ఈ పద్యానికి శీర్షిక సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘నీతిపద్యం’.

5. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

కలహపడునింట నిలువదు.
కలుముల జవరాలు కానఁ గలకాలం బే
కలహములులేక సమ్మతి
మెలఁగంగా నేర్చెనేని మేలు కుమారీ !

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
కలహపడే ఇంట్లో ఏం నిలువదు ?
జవాబు:
కలహపడే ఇంట్లో లక్ష్మి (సంపద) నిలువదు.

ప్రశ్న 2.
కలకాలం ఎలా మెలగాలి ?
జవాబు:
కలకాలం ఏ విధమైన కలహాలు లేకుండా మెలగాలి.

ప్రశ్న 3.
ఈ పద్యం ఎవరిని సంబోధిస్తూ చెప్పబడింది ?
జవాబు:
ఈ పద్యం కుమారీని సంబోధిస్తూ అంటే ఆడపిల్లలను సంబోధిస్తూ చెప్పబడింది.

ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘కలహం వద్దు’.

ప్రశ్న 5.
ఈ పద్యం ఏ శతకం లోనిది?
జవాబు:
ఈ పద్యం కుమారీ శతకం లోనిది.

PAPER – II : PART – B

భాషాంశాలు – వ్యాకరణం

కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.

1. సంధులు:

ప్రశ్న 1.
భీమార్జునులు – సంధి విడదీస్తే
A) భీముడు + అర్జునుడు
B) భీ + మార్జునులు
C) భీమ + అర్జునుడు
D) భీముని + అర్జునుడు
జవాబు:
C) భీమ + అర్జునుడు

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 2.
“జయ + పెట్టు” – గసడదవాదేశ సంధి చేయగా
A) జయము + వెట్టు
B) జయవెట్టు
C) జయము పెట్టు
D) జోతపెట్టు
జవాబు:
B) జయవెట్టు

ప్రశ్న 3.
పాండవాగ్రేసరుడు – సంధి విడదీయగా
A) పాండ + వాగ్రేసరుడు
B) పాండవాగ్ర + ఇసరుడు
C) పాండవాగ్రే + సరుడు
D) పాండవ + అగ్రేసరుడు
జవాబు:
D) పాండవ + అగ్రేసరుడు

ప్రశ్న 4.
“కన్యకాధిపతి”లో వచ్చు సంధి
A) యణాదేశ సంధి
B) సవర్ణదీర్ఘ సంధి
C) యడాగమ సంధి
D) గుణసంధి
జవాబు:
B) సవర్ణదీర్ఘ సంధి

ప్రశ్న 5.
“అర్ధికి + ఇచ్చు” – ఏ సంధి
A) ఇత్వ సంధి
B) అత్వ సంధి
C) యడాగమ సంధి
D) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
A) ఇత్వ సంధి

ప్రశ్న 6.
వాలి, సుగ్రీవులు అన్నదమ్ములు – గీత గీసిన పదానికి సంధి విడదీసి రాయండి.
A) అన్న + దమ్ములు
B) అన్నయు + తమ్ముడు
C) అన్న + తమ్ములు
D) అన్నా + దమ్ములు
జవాబు:
C) అన్న + తమ్ములు

ప్రశ్న 7.
“పంచ + ఆస్యము” అని విడదీయగా పూర్వ పరస్వరములు
A) చ + ఆ
B) అ + ఆ
C) పంచ + ఆస్యము
D) ఆ మరియు అ
జవాబు:
B) అ + ఆ

ప్రశ్న 8.
“సవర్ణదీర్ఘ సంధి”కి సరియైన ఉదాహరణ
A) అతనికి + ఇచ్చు
B) యడాగమ సంధి
C) పంచ + అమరతరులు
D) వాడు + ఉండెను
జవాబు:
C) పంచ + అమరతరులు

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 9.
ఇచ్చకము + మెచ్చు – సంధి చేయగా వచ్చు సంధి
A) పుంప్వాదేశ సంధి
B) మేన + అత్త
C) ఉత్వ సంధి
D) లులనల సంధి
జవాబు:
A) పుంప్వాదేశ సంధి

ప్రశ్న 10.
య, వ, ర లు ఆదేశము వచ్చు సంధి పేరు
A) యడాగమ సంధి
B) యణాదేశ సంధి
C) గసడదవాదేశ సంధి
D) గుణసంధి
జవాబు:
B) యణాదేశ సంధి

ప్రశ్న 11.
త్రికములు అనగా
A) ఏ, ఓ, అర్
B) ఇ, ఉ, ఋ
C) ఆ, ఈ, ఏ
D) ఏ, ఐ, ఓ, ఔ
జవాబు:
C) ఆ, ఈ, ఏ

ప్రశ్న 12.
ఏ, ఓ, అర్ లను ఏమంటారు ?
A) త్రికములు
B) గుణములు
C) సరళములు
D) వృద్ధులు
జవాబు:
B) గుణములు

II. సమాసములు :

ప్రశ్న 1.
ధర్మార్జునులు – అను దానికి సరియైన విగ్రహవాక్యము
A) ధర్మము మరియు అర్జునుడు
B) ధర్మరాజు మరియు అర్జునుడు
C) ధర్మరాజు తమ్ముడైన అర్జునుడు
D) ధర్మర్జునులు మొదలైనవారు
జవాబు:
B) ధర్మరాజు మరియు అర్జునుడు

ప్రశ్న 2.
“ద్వంద్వ సమాసము”నకు ఉదాహరణ
A) రేపగలు
B) దయాభరణుడు
C) ధర్మనందనుడు
D) దోఃఖర్జులు
జవాబు:
A) రేపగలు

ప్రశ్న 3.
పంచాయుధములు, పంచాస్యములు – ఏ సమాసమునకు ఉదాహరణ ?
A) ద్వంద్వ సమాసము
B) విశేషణ పూర్వపద కర్మధారయము
C) ద్విగు సమాసము
D) రూపక సమాసము
జవాబు:
C) ద్విగు సమాసము

ప్రశ్న 4.
పాండు కుమారులు – అను పదమునకు విగ్రహవాక్యము రాయగా
A) పాండురాజు వలన కుమారులు
B) కుమారులగు పాండవులు
C) పాండవులును, కుమారులును
D) పాండురాజు యొక్క కుమారులు
జవాబు:
D) పాండురాజు యొక్క కుమారులు

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 5.
కృప అనెడు రసము – అనే విగ్రహవాక్యాన్ని సమాసము చేయగా
A) కృపకు రసము
B) కృపతో రసము
C) కృపాభావము
D) కృపారసము
జవాబు:
D) కృపారసము

ప్రశ్న 6.
ధర్మరాజుకు నలుగురు తమ్ముకుర్రలు కలరు – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం
A) కుర్రలైన తమ్ములు
B) తమ్ములైన కుర్రలు
C) తమ్ములును, కుర్రలును
D) తమ్ముల వంటి కుర్రలు
జవాబు:
A) కుర్రలైన తమ్ములు

ప్రశ్న 7.
“విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము”నకు ఉదాహరణ
A) కార్మిక వృద్ధులు
B) పాదపద్మం
C) తొల్లిటిరాజులు
D) పాండునందనులు
జవాబు:
C) తొల్లిటిరాజులు

ప్రశ్న 8.
చతురబ్ధులు – ఇది ఏ సమాసమునకు ఉదాహరణగా గుర్తించవచ్చు.
A) ద్వంద్వ సమాసము
B) ద్విగు సమాసము
C) విశేషణ పూర్వపదం
D) బహువ్రీహి
జవాబు:
B) ద్విగు సమాసము

ప్రశ్న 9.
“విశేషణం ఉత్తరపదం”గా ఉన్న సమాసము
A) విశేషణ పూర్వపద కర్మధారయము
B) ఉపమాన పూర్వపద కర్మధారయము
C) విశేషణ ఉత్తరపద కర్మధారయము
D) ఉపమాన ఉత్తరపద కర్మధారయము
జవాబు:
C) విశేషణ ఉత్తరపద కర్మధారయము

ప్రశ్న 10.
కన్యక (పార్వతి)కు అధిపతి – సమాసము పేరు
A) షష్ఠీ తత్పురుష
B) చతుర్థీ తత్పురుష
C) బహువ్రీహి
D) సంభావనా పూర్వపద కర్మధారయము
జవాబు:
A) షష్ఠీ తత్పురుష

III. ఛందస్సు :

ప్రశ్న 1.
అతని కతండె సాటి చతురబ్ధి పరీత మహీతలమ్మునన్ – ఏ పద్యపాదం ?
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) కందం
D) సీసం
జవాబు:
B) చంపకమాల

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 2.
మ, స, జ, స, త, త, గ – అను గణములు వరుసగా వచ్చు పద్యం.
A) శార్దూలము
B) మత్తేభము
C) చంపకమాల
D) ఉత్పలమాల
జవాబు:
A) శార్దూలము

ప్రశ్న 3.
“నీవేనా” అను పదమును గణ విభజన చేయగా
A) U IU
B) UUU
C) UUI
D) IUI
జవాబు:
B) UUU

ప్రశ్న 4.
IIU – ఇది ఏ గణం ?
A) భ గణం
B) జ గణం
C) స గణం
D) ర గణం
జవాబు:
C) స గణం

ప్రశ్న 5.
సూర్య గణములు
A) న, హ(గల)
B) భ, ర, త
C) గగ, నల
D) లగ, గల
జవాబు:
A) న, హ(గల)

IV. అలంకారములు :

ప్రశ్న 1.
ఒక వస్తువునకు మరొక వస్తువుతో రమణీయమైన పోలిక చెప్తే
A) రూపకం
B) ఉపమా
C) ఉత్ప్రేక్ష
D) యమకం
జవాబు:
B) ఉపమా

ప్రశ్న 2.
తెలుగువీర లేవరా !
దీక్షబూని సాగరా !
అదరవద్దు బెదరవద్దు !
నింగి నీకు హద్దురా !
పై గీతంలో ఉన్న అలంకారం
A) యమకం
B) వృత్త్యనుప్రాస
C) అంత్యానుప్రాస
D) లాటానుప్రాస
జవాబు:
C) అంత్యానుప్రాస

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 3.
ఒకే అక్షరం పలుమార్లు ఆవృత్తి అయితే,
A) అంత్యానుప్రాస.
B) ఛేకానుప్రాస
C) యమకము
D) వృత్త్యనుప్రాస
జవాబు:
D) వృత్త్యనుప్రాస

ప్రశ్న 4.
“భూమి బంతి వలె గోళంగా ఉన్నది.” – ఈ వాక్యంలో గల అలంకారం
A) ఉత్ప్రేక్ష
B) ఉపమా
C) రూపకము
D) వృత్త్యనుప్రాస
జవాబు:
B) ఉపమా

V. వాక్యాలు:

ప్రశ్న 1.
ఈ కింది వాక్యాలలో కర్తరి వాక్యము
A) ఆమె డాక్టరు.
B) ఈ రోజు ఇంటికి వెళ్ళండి.
C) రాము సైకిల్ను తొక్కుతున్నాడు.
D) రాము బజారుకు వెళుతున్నాడు.
జవాబు:
C) రాము సైకిల్ను తొక్కుతున్నాడు.

ప్రశ్న 2.
“రాము తోటపనిని చేస్తున్నాడు.” – ఈ వాక్యమును కర్మణి వాక్యములోనికి మార్చగా
A) తోటపనిని రాము చేస్తున్నాడు.
B) తోటపని రాము చేత చేయబడుచున్నది.
C) చేస్తున్నాడు, రాము తోటపనిని.
D) రాము చేస్తున్న పని, తోటపని.
జవాబు:
B) తోటపని రాము చేత చేయబడుచున్నది.

ప్రశ్న 3.
“వారిచే సినిమా నిర్మించబడినది.” – ఇది ఏ వాక్యం ?
A) కర్మణి వాక్యం
B) కర్తరి వాక్యం
C) సంయుక్త వాక్యం
D) ప్రారంభ వాక్యం
జవాబు:
A) కర్మణి వాక్యం

ప్రశ్న 4.
“ధర్మరాజు తమ్ములను ఆదరించాడు.” ఇది ఏ వాక్యం ?
A) సంయుక్త వాక్యం
B) కర్తరి వాక్యం
C) సంశ్లేష వాక్యం
D) అప్రధాన వాక్యం
జవాబు:
B) కర్తరి వాక్యం

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

These TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి will help the students to improve their time and approach.

TS 9th Class Telugu 6th Lesson Important Questions దీక్షకు సిద్ధంకండి

PAPER – 1 : PART – A

I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)

అ) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
తెలంగాణ జనత ఆత్మగౌరవం కాపాడుకొనుటకు ధర్మయుద్ధం సాగిస్తున్నది- దీనిలోని ఆంతర్యం వివరించండి.
జవాబు:
గాంధీ పేరు చెప్పుకొని బ్రతుకుతున్న నాయకులు దేశభక్తి కన్నా తమ భుక్తే లక్ష్యంగా ఉంటూ జాతిపిత ప్రబోధాలకు నీళ్ళు ఒదులుతున్నారు. మతకల్లోలాలతో, హత్యలతో దేశంలోని ప్రతి అంగుళం రక్తంతోనో, కన్నీటితోనో తడుస్తోంది. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ వెనుకబడింది. ఆంధ్ర ప్రభుత్వ ఉక్కుపాదాల కింద తెలంగాణ ప్రజలు నలిగిపోయి, స్వేచ్ఛను కోల్పోతున్నారు. దీని నుండి విముక్తి పొందడానికై తమ బానిస బంధాలను తెంచుకొని ఆత్మగౌరవం కాపాడుకోవడానికి తెలంగాణ జనత ధర్మయుద్ధం సాగిస్తున్నది.

ఆ) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘దీక్షకు సిద్ధంకండి’ పాఠం ఆధారంగా 2014లో తెలంగాణ సిద్ధించుటకు తోడ్పడిన అంశాలు రాయండి.
జవాబు:
తెలంగాణ ఉద్యమం ఈ మధ్య వచ్చింది కాదు. ఎంతోమంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనోద్యమంలో తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ అమరజీవుల త్యాగాలకు గుర్తే ఈ తెలంగాణ రాష్ట్రం. ఈ కొత్త రాష్ట్రం ఉద్యమాల ఫలితంగానే రూపుదిద్దుకొంది. ఈ మధ్య జరిగిన తెలంగాణ ఉద్యమానికి ముందే 1969లో తెలంగాణ ప్రజాసమితి పేరుతో ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటం మొదలయ్యింది. .

దీర్ఘకాలంగా శాంతియుతంగా ఉద్యమాలు చేసినప్పుడు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తాయి. లేదా అణచివేయడానికి ప్రయత్నిస్తాయి. అప్పుడు ఉద్యమాలు హింసాయుతంగా మారే అవకాశం ఉంది. ఉద్యమ నాయకత్వం, ఆ పరిణామాన్ని ముందుగానే ఊహించి, పాలకుల నిర్లక్ష్యాన్ని తప్పుపడుతూ, గాంధీజీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉద్యమం చేపట్టాలని పిలుపు నిచ్చారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో అహింసా పద్ధతులు అమలయ్యాయి. హైదరాబాదులో నివసిస్తున్న ఆంధ్రా స్త్రీలను ఉద్యమకారులు అవమానించారు. అల్లర్లు చేశారు.

2014లో తెలంగాణ సిద్ధించడానికి ప్రధాన కారణం ఆనాటి ఉద్యమ హింసా వాతావరణం లేకపోవడం. నిరాహారదీక్షలు, నిరసనలు, సకలజనుల సమ్మెవంటి పద్ధతులలో ఉద్యమం నడిచింది. నేటి ఉద్యమ నాయకులకు తెలంగాణలోని అన్ని పార్టీలు కలిసివచ్చాయి. ఈ విధంగా శాంతియుతంగా సాగడమే తెలంగాణ సిద్ధించడానికి తోడ్పడింది.

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ప్రశ్న 2.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమం గురించి వివరించండి.
జవాబు:
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మూడు దశలుగా ఉద్యమం జరిగింది. 1952 వరకు, 1969, 1996 లో తెలంగాణ ఉద్యమం సాగింది. తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ ఎందరో మహనీయులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహరహం శ్రమించారు. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ వెనుకబడింది. ఆంధ్ర ప్రభుత్వ ఉక్కుపాదాల కింద తెలంగాణ ప్రజలు నలిగిపోయారు. తమ బానిస బంధాలను తెంచుకొని ఆత్మగౌరవం కాపాడుకోవడానికి తెలంగాణ జనత ధర్మయుద్ధం సాగించింది. ఈ ప్రజా పోరాటంలో వందలాది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేలాది యువకులు అంగవిహీనులయ్యారు. ఖైదు చేయబడ్డారు. గాంధీ కలలుగన్న దేశంలో రాబందుల రాచరికం నడుస్తున్నది.

రాష్ట్రంలో రోజురోజుకు దారుణ హింసాకాండ, రక్తపాతం ప్రజలను కోపోద్రిక్తులను చేస్తున్నది. అహింసా సిద్ధాంతం పట్ల ఆత్మవిశ్వాసం సడలిపోయే ప్రమాదం కనబడుతోంది. నాయకులు ఏ ఎండకాగొడుగు పడుతున్నారు. ముఠా రాజకీయాలు పెరిగిపోతున్నాయి. అప్పటి ఫజల్ అలీ కమిషనన్ను కలిసిన విద్యార్థి నాయకుడు ‘మంచిగ బతకలేకుంటే, బిచ్చమెత్తుకోనైనా అని ఖరాఖండిగా చెప్పి, నిరాహార దీక్షలు ప్రారంభించాడు. సామూహిక ఉపవాసదీక్షలు చేపట్టి, గాంధీ మార్గంలో నడిచి జాతిపితకు అంకితం చేశారు. మన ఆకలి మంటల జ్వాలలో గాంధీ సిద్ధాంతాలు వెలుగులు విరజిమ్మాలని కార్యకర్తలు ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమం నడిచింది.

PAPER – I : PART – B

భాషాంశాలు – పదజాలం :

I. సొంతవాక్యాలు :

1. అహర్నిశలు : రైతులు తమ పంట ఇంటికి వచ్చేదాక అహర్నిశలు కష్టపడతారు.
2. జనత : జనత కోరుకొన్న సాధారణ కోర్కెలకేకాక అసాధారణ ప్రాజెక్టులకు ప్రణాళికలు వేసి దేశాభివృద్ధికి పాటుపడాలి.
3. తిలోదకములిచ్చు : ప్రజానాయకులు ఓటు కోసం ఓటి మాటలకు తిలోదకాలిచ్చి గట్టి మేలు తలపెట్టాలి.
4. జాతిపిత : గాంధీ మన జాతిపితగానే గాక అహింసా మార్గ పోరాటం నేర్పి విశ్వపిత అయినాడు.
5. ఉపమానం : ఆయుధం లేకుండా శత్రువును ఓడించిన వారికి ఒక ఉపమానం గాంధీ తాత.
6. ఉక్కుపాదం ఆశ్రమ విద్యాభ్యాసం కాలంలో బ్రహ్మచారులు కోర్కెలను ఉక్కుపాదంతో అణిచిపెట్టి కోరిన విద్యలు నేర్చుకొనేవారు.
7. కట్టలు తెంచుకోవడం : తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెలువడగానే ప్రజలలో ఆనందం కట్టలు తెంచుకొని ప్రవహించింది.
8. ఏ ఎండకాగొడుగు : ఏ ఎండకాగొడుగు పట్టే మా బాబాయి అంటే ఊరి వాళ్ళకెందుకో అంత ఇష్టం ?
9. ‘ రాబందులు : తుపానుకు కొంపగోడు పోయి ప్రజలు బాధపడుతుంటే రాబందుల్లా దోపిడి దొంగలు ఎగబడ్డారు.

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

II. అర్థాలు :

ఆ) కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.

ప్రశ్న 1.
అమ్మ అహర్నిశలు మన కోసం శ్రమిస్తుంది – గీత గీసిన పదానికి అర్థం
A) కొంతకాలం
B) ఎల్లవేళలా (పగలురాత్రి)
C) చిన్నతనంలో
D) పెరిగేంతవరకు
జవాబు:
B) ఎల్లవేళలా (పగలురాత్రి)

ప్రశ్న 2.
సమ్మక్క-సారక్క జాతరకు జనత మొత్తం కదలివచ్చింది – గీత గీసిన పదానికి అర్థం
A) ఒక రైలు బండి
B) పాలకులు
C) జన సమూహం
D) భక్త బృందం
జవాబు:
C) జన సమూహం

ప్రశ్న 3.
“ఉక్కుపాదం మోపడం” అంటే అర్థం
A) ఇనుముతో చేసిన పాదం పెట్టు
B) బూట్లు ఇనుముతో చేసినవి
C) బలవంతంగా అణిచివేయడం
D) బరువు మీద పెట్టడం
జవాబు:
C) బలవంతంగా అణిచివేయడం

ప్రశ్న 4.
“తిలోదకాలు ఇవ్వడం” అంటే అర్థం
A) ఆశ వదులుకోవడం
B) అమరులైన వారికి నమస్కరించు
C) అన్నం నీళ్ళు ఇవ్వడం
D) ఒక పాదం ముందు పెట్టడం
జవాబు:
A) ఆశ వదులుకోవడం

ప్రశ్న 5.
“పోరాటం” అనే అర్థంలో వాడుతున్న పదం
A) సమ్మె
B) ఉద్యమం
C) బందులు
D) నిరాహారదీక్ష
జవాబు:
B) ఉద్యమం

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ప్రశ్న 6.
“పోరాటం” అనే అర్థంలో వాడుతున్న పదం
A) తృణం
B) నమస్సు
C) నిర్బంధం
D) సమ్మతి
జవాబు:
D) సమ్మతి

ప్రశ్న 7.
“బడా మనుషులు” అంటే అర్థం
A) పొడుగు మనుష్యులు
B) ధనం కలవారు
C) పెద్ద మనుషులు
D) చెడ్డ మనసులు
జవాబు:
C) పెద్ద మనుషులు

ప్రశ్న 8.
“శత జయంతి” అనే పదానికి అర్థం
A) పుట్టి నూరు సంవత్సరాలు
B) వంద పరుగులు
C) ఒక పూవు పేరు
D) వందనము
జవాబు:
A) పుట్టి నూరు సంవత్సరాలు

ప్రశ్న 9.
ప్రతి చిన్న విషయం రుజువు చేయనక్కర లేదు – గీత గీసిన పదానికి అర్థం
A) సత్యవాక్యము
B) సాక్ష్యము చూపించు
C) ప్రయోగము చేయు
D) ఒట్టు వేయు
జవాబు:
B) సాక్ష్యము చూపించు

ప్రశ్న 10.
మన్నన చేయు – అనే పదానికి అర్థం
A) అంగీకరించు
B) తుంచి వేయు
C) గౌరవించు
D) ప్రోగుచేయు
జవాబు:
C) గౌరవించు

ప్రశ్న 11.
ఎంతోమంది అమరుల త్యాగాలకు చిహ్నంగా నిలిచింది ఈ తెలంగాణ – గీత గీసిన పదానికి అర్థం
A) కోరిక
B) చిత్తం
C) గుర్తు
D) జ్ఞానం
జవాబు:
C) గుర్తు

ప్రశ్న 12.
లక్షలాది ప్రజలు సత్యాగ్రహ సమరంలో పోరాడారు – గీత గీసిన పదానికి అర్థం
A) స్వర్గం
B) విజయం
C) సంగరం
D) సమయం
జవాబు:
C) సంగరం

ప్రశ్న 13.
ఉపవాస దీక్షల ద్వారా వారు నమ్మిన సిద్ధాంతానికి పుష్టిని చేకూర్చండి – గీత గీసిన పదానికి అర్థం
A) బలం
B) ధైర్యం
C) నమ్మకం
D) గర్వం
జవాబు:
A) బలం

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

III. ప్రకృతి, వికృతులు:

ప్రశ్న 1.
ఛాయ – అనే పదానికి వికృతి
A) చాయి
B) చాయ
C) చూచు
D) చేయను
జవాబు:
B) చాయ

ప్రశ్న 2.
గౌరవం అంటే మనల్ని చూడగానే ఎదుటివారు పలకరించాలి – గీత గీసిన పదానికి వికృతి
A) గారవము
B) పెద్దరికము
C) గార
D) గౌరు
జవాబు:
A) గారవము

ప్రశ్న 3.
హృదయము – అనే పదానికి వికృతి
A) హృది
B) హృత్
C) ఎద
D) ఉదయం
జవాబు:
C) ఎద

ప్రశ్న 4.
“దమ్మము” వికృతిగా గల పదం
A) దయ
B) ధర్మం
C) దమ్ము
D) ధార్మికం
జవాబు:
B) ధర్మం

ప్రశ్న 5.
ఎంతోమంది అమరుల త్యాగఫలితం నేటి మన స్వేచ్ఛ – గీత గీసిన పదానికి వికృతి
A) యాగం
B) చాగం
C) తాగం
D) తయాగం
జవాబు:
B) చాగం

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ప్రశ్న 6.
దీర్ఘకాలంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నా ఫలితంలేదు – గీత గీసిన పదానికి వికృతి
A) దీగ
B) దీర్గ
C) తీగె
D) వైరు
జవాబు:
C) తీగె

ప్రశ్న 7.
జాతిపిత ప్రబోధాలకు తిలోదకాలిస్తున్నారు – గీత గీసిన పదానికి వికృతి
A) తెలకలు
B) నువ్వులు
C) తిలకం
D) నీళ్ళు
జవాబు:
A) తెలకలు

ప్రశ్న 8.
ఈ ప్రజా పోరాటంలో ఎందరో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు – గీత గీసిన పదానికి వికృతి
A) ఆయువు
B) పానం
C) నమ్మకం
D) గర్వం
జవాబు:
B) పానం

IV. పర్యాయపదాలు :

ప్రశ్న 1.
నమ్మిక, విశ్వాసం – పర్యాయపదాలుగా గల పదము
A) నమ్మకము
B) విసుమానము
C) నిశ్చయము
D) దృఢము
జవాబు:
A) నమ్మకము

ప్రశ్న 2.
“సముద్రము”నకు పర్యాయపదాలు కానివి.
A) జలధి, పయోధి
B) సముద్రము, సాగరము
C) సరస్సు, సరోవరము
D) సంద్రము, వారిధి
జవాబు:
C) సరస్సు, సరోవరము

ప్రశ్న 3.
“యుద్ధం” అనే పదానికి పర్యాయపదాలు
A) యుద్ధం, మేళనం
B) పోరాటం, రణము, సమరం
C) ప్రయాణం, కారణం
D) దొమ్మి, లాఠీ
జవాబు:
B) పోరాటం, రణము, సమరం

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ప్రశ్న 4.
జ్వాల – అనే పదానికి పర్యాయపదాలు
A) మంట, శిఖ
B) నిప్పు, దాహం
C) వెలుగు, కాల్చు
D) పొగ, వేడి
జవాబు:
A) మంట, శిఖ

ప్రశ్న 5.
వంట చేయటానికి ఇప్పుడు అగ్ని కావాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) అనలం, నిప్పు
B) అగ్గి, ఆజ్యం
C) దాహం, తృష్ణ
D) కాల్చు, దహించు
జవాబు:
A) అనలం, నిప్పు

ప్రశ్న 6.
దేశంలోని ప్రతి అంగుళం రక్తంతోనో, కన్నీటితోనో తడిసిపోయింది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) నల్ల, నెల్ల
B) రగతం, తగరం
C) రుధిరం, నెత్తురు
D) నలుపు, ఎఱుపు
జవాబు:
C) రుధిరం, నెత్తురు

ప్రశ్న 7.
ప్రశాంత గంభీర జలధిలోని ప్రళయాల పరిశీలన జరగడం లేదు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) సముద్రం, నది
B) సాగరం, రత్నాకరుడు
C) సంద్రం, జలదం
D) పయోధి, పదిలం
జవాబు:
B) సాగరం, రత్నాకరుడు

ప్రశ్న 8.
జాతిపితకు తెలంగాణ ప్రజలు భక్తి ప్రపత్తులతో సమర్పించే కానుక ఉపవాసదీక్ష – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) తండ్రి, నాన్న
B) పిత, మాత
C) అయ్య, అన్న
D) జనకుడు, జనం
జవాబు:
A) తండ్రి, నాన్న

V. నానారాలు :

ప్రశ్న 1.
ప్రజలు, సంతానము – అను నానార్థములు గల పదం
A) సంతు
B) ప్రజ
C) జనులు
D) పుత్రులు
జవాబు:
B) ప్రజ

ప్రశ్న 2.
“ధర్మము” అను పదమునకు సరియగు నానార్థాలు
A) స్వధర్మము, శ్రేయస్సు
B) రసాయన ధర్మము, భిక్షము
C) న్యాయము, స్వభావము
D) పాడి, ధర
జవాబు:
C) న్యాయము, స్వభావము

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ప్రశ్న 3.
సరుకులు పుష్టిగా తెప్పించాము – గీత గీసిన పదానికి నానార్థాలు
A) అధికం, కొంచెం
B) బలము, సమృద్ధి
C) నిండుగా, నీరసంగా
D) తోడు, వెంట
జవాబు:
B) బలము, సమృద్ధి

ప్రశ్న 4.
అంగము అను పదమునకు నానార్థము
A) శరీరభాగము, అంగదేశము
B) దేశము, విజ్ఞానము
C) సైన్యంలో భాగము, ఒకరోజు
D) శరీర అవయవము, చొక్కా
జవాబు:
A) శరీరభాగము, అంగదేశము

ప్రశ్న 5.
జాతిపిత ప్రభోధాలకు తిలోదకాలిస్తున్నారు – గీత గీసిన పదానికి నానార్థాలు
A) మాట, పాట
B) ఆట, మాట
C) మేలుకోలు, మిక్కిలి తెలివి
D) అనుబోధం, నమ్మకం
జవాబు:
C) మేలుకోలు, మిక్కిలి తెలివి

ప్రశ్న 6.
గాంధీజీ కన్న కలలు ఫలించి తీరుతాయి – గీత గీసిన పదానికి నానార్థాలు
A) నిద్ర, నిదుర
B) స్వప్నం, శిల్పం
C) భాగం, పాలు
D) వడ్డీ, అసలు
జవాబు:
B) స్వప్నం, శిల్పం

ప్రశ్న 7.
భక్తిని వదిలేసి భుక్తి మార్గం వెతుకుతున్నారు – గీత గీసిన పదానికి నానార్థాలు
A) సేవ, స్నేహం
B) భాగం, వంతు
C) మైత్రి, నైయ్యం
D) ఊడిగం, కయ్యం
జవాబు:
A) సేవ, స్నేహం

VI. వ్యుత్పత్యర్థములు :

ప్రశ్న 1.
మరణముతో కూడినది – అను వ్యుత్పత్తి గల పదం
A) సమరం
B) యుద్ధం
C) రణం
D) పోరు
జవాబు:
A) సమరం

ప్రశ్న 2.
అగ్నికి జ్వాల అందం – గీత గీసిన పదానికి సరియైన వ్యుత్పత్తి
A) చాలా మండునది
B) జ్వలించునది (మండునది)
C) జలజల మండునది
D) జారుడు స్వభావం కలది
జవాబు:
B) జ్వలించునది (మండునది)

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ప్రశ్న 3.
“జలము దీనిచే ధరించబడును” – అను వ్యుత్పత్తి గల పదం
A) జలదము
B) జలజము
C) జలధి
D) జలపుష్పం
జవాబు:
C) జలధి

ప్రశ్న 4.
సాగరం – అనే పదానికి సరియైన వ్యుత్పత్తి
A) గరంగరంగా సాగునది
B) సాగని నీరు కలది
C) సగరులచే త్రవ్వబడినది
D) పెద్ద అలలు కలది
జవాబు:
C) సగరులచే త్రవ్వబడినది

ప్రశ్న 5.
సత్యం – అనే పదానికి వ్యుత్పత్త్యర్థాలు
A) చెడ్డవారి మనసులో ఉండేది’
B) దేవతలకు సంబంధించినది
C) సత్పురుషులందు పుట్టునది
D) రాక్షసులకు చెందినది
జవాబు:
C) సత్పురుషులందు పుట్టునది

ప్రశ్న 6.
జ్వలించునది – అనే పదానికి వ్యుత్పత్త్యర్థాలు
A) చలి
B) జ్వాల
C) రవ్వ
D) శిఖ
జవాబు:
B) జ్వాల

PAPER – II : PART – A

అపరిచిత గద్యాలు

ప్రశ్న 1.
కింది గద్యాన్ని చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలను తయారుచేయండి.

“తెలుగు సాహిత్యంలోని పంచకావ్యాల్లో మనుచరిత్రను మొట్టమొదట లెక్కపెడతారు. ఆంధ్రప్రబంధ కవులలో ప్రథమపూజ అల్లసాని పెద్దన గారికే చేస్తారు. ఆదికవులు, కవిబ్రహ్మలు, ప్రబంధ పరమేశ్వరులు, కవి సార్వభౌములు మొదలైన ఆజానుబాహులు ఎందరున్నా, మన సాహితీ రంగంలో ఒక జానెడు ఎత్తుగా కనిపించే జాణ ఆంధ్రకవితా పితామహ బిరుదాంకితులు అల్లసాని పెద్దనగారే. దీనికి కారణం కృష్ణరాయలవారు అందరికన్నా పెద్దనగారికి పెద్దపీట వేయడమే కాదు. ఆయన సహజంగా ఉన్నతుడు. దానికి కారణం ఆయనలో పూర్వకవుల శుభలక్షణాలన్నీ కేంద్రీకృతం అయ్యాయి.
జవాబు:
ప్రశ్నలు

  1. తెలుగు పంచకావ్యాల్లో మొదట లెక్కపెట్టదగిన కావ్యం ఏది ?
  2. ఆంధ్ర ప్రబంధ కవులలో ఎవరిని శ్రేష్ఠునిగా గౌరవిస్తారు ?
  3. ‘ఆంధ్రకవితా పితామహుడు’ అనే బిరుదు పొందిన కవి ఎవరు ?
  4. పెద్దన కవి సహజంగా ఉన్నతుడు కావడానికి కారణం ఏమిటి ?
  5. పెద్దన గారిని ఆదరించిన కవి రాజు ఎవరు ?

ప్రశ్న 2.
కింది వచనాన్ని చదివి, దాని దిగువ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

“సాహితీ సృజనలో అంతర్జాతీయ కీర్తి నందుకొన్న మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్. కవిగా, రచయితగా, తత్త్వవేత్తగా, సంగీతజ్ఞుడిగా, చిత్రకారుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. వీరి పేరు వినగానే చప్పున స్ఫురించేవి ‘జనగణమన ‘గీతం’, ‘గీతాంజలి’. జనగణమన గీతం భారత జాతీయ గీతంగా గుర్తింపబడింది. బంగ్లాదేశ్ జాతీయ గీతం కూడా వీరి లేఖిని నుండి వెలువడినదే. ఇలా రెండు జాతీయ గీతాలనందించిన కవిగా, అపూర్వ చరిత్రను సృష్టించారు. “శాంతి నికేతన్” పేరున ఆదర్శ విద్యాలయాన్ని స్థాపించి, ‘గురుదేవుడు’ గా కీర్తింపబడ్డారు.

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
అంతర్జాతీయ కీర్తినందుకొన్న భారతీయ మహాకవి ఎవరు ?
జవాబు:
అంతర్జాతీయ కీర్తినందుకొన్న భారతీయ మహాకవి “రవీంద్రనాథ్ ఠాగూర్”.

ప్రశ్న 2.
ఏ రెండు దేశాలకు ఠాగూర్ జాతీయ గీతాలను అందించాడు ?
జవాబు:
భారత్, బంగ్లాదేశ్లకు ఠాగూర్ జాతీయ గీతాలను అందించాడు.

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ప్రశ్న 3.
రవీంద్రనాథ్ ఠాగూర్ నెలకొల్పిన విద్యాసంస్థ ఏది ?
జవాబు:
రవీంద్రనాథ్ ఠాగూర్ ‘శాంతినికేతన్’ అనే విద్యాసంస్థను నెలకొల్పాడు.

ప్రశ్న 4.
రవీంద్రుని ప్రసిద్ధ రచనలు రెండింటిని రాయండి.
జవాబు:
రవీంద్రుడు 1) గీతాంజలి 2) జనగణమన గీతం రచించాడు.

ప్రశ్న 5.
రవీంద్రుని బహుముఖ ప్రజ్ఞను వివరించండి.
జవాబు:
రవీంద్రుడు కవి, రచయిత, తత్త్వవేత్త, సంగీతజ్ఞుడు, చిత్రకారుడు.

ప్రశ్న 3.
కింది వచనాన్ని చదివి, కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

“పద్యనాటక రచయితలలో ప్రత్యేకస్థానాన్ని అందుకున్న వారు తిరుపతి వేంకట కవులు. వీరు

1) దివాకర్ల తిరుపతిశాస్త్రి
2) చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి.
వీరు శతావధానులు. తమ అవధానాలతో వీరు ఆంధ్రదేశం అంతా పర్యటించి, సాహిత్య ప్రపంచంలో నూతనోత్తేజాన్ని కలిగించారు. వీరి అవధానాలతో స్ఫూర్తి పొందిన ఎందరో వ్యక్తులు సాహిత్యరంగంలో అడుగిడి కృషి చేశారు. ఆధునికాంధ్ర సాహిత్యంలో వీరికి ఎందరో లబ్ధ ప్రతిష్ఠులైన శిష్యులున్నారు. విశ్వనాథ, వేటూరి, కాటూరి, పింగళి వారలు వీరి శిష్యులే. వీరు రచించిన పాండవోద్యోగ విజయ నాటకాలకు లభించిన ప్రసిద్ధి ఇంతింతనరానిది. పశులకాపరి నుండి పండితుల వరకు అందరి నాల్కలపై వీరి పద్యాలు నాట్యం చేస్తున్నాయి.

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
తిరుపతి వేంకట కవులు ఎవరు ?
జవాబు:
తిరుపతి వేంకట కవులు జంట కవులు. వీరు

  1. దివాకర్ల తిరుపతి శాస్త్రి
  2. చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి.

ప్రశ్న 2.
వీరు సాహిత్య రంగంలో నూతనోత్తేజాన్ని దేని ద్వారా కల్పించారు ?
జవాబు:
వీరు అవధానాల ద్వారా సాహిత్యరంగంలో నూతనోత్తేజాన్ని కలిగించారు.

ప్రశ్న 3.
వీరి శిష్యులలో ఇద్దరిని పేర్కొనండి.
జవాబు:
‘పాండవోద్యోగ విజయాలు’ అనే వీరి నాటకాలు ప్రసిద్ధి పొందాయి.

ప్రశ్న 4.
వీరి ప్రసిద్ధికెక్కిన నాటకాలు ఏవి ?
జవాబు:
వీరి శిష్యులలో

  1. విశ్వనాథ సత్యనారాయణ
  2. వేటూరి ప్రభాకరశాస్త్రి ప్రసిద్ధులు.

ప్రశ్న 5.
అందరి నాల్కలపై నాట్యం చేసే వీరి పద్యాలు ఏ నాటకాలలోనివి ?
జవాబు:
వీరి పాండవోద్యోగ విజయాలు అనే నాటకాలలో పద్యాలు ప్రజల నాల్కలపై నాట్యం ఆడుతున్నాయి.

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ప్రశ్న 4.
కింది పేరా చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రూపొందించండి.

గాంధీ మహాత్ముడు పోరుబందరులో జన్మించాడు. అక్కడ అతని బాల్యంలో చదువు ఏ మాత్రమూ సాగలేదు. అతని తండ్రి పోరుబందరు నుండి రాజకోట వచ్చి కొత్త ఉద్యోగంలో చేరాడు. అక్కడ గాంధీ విద్యార్థి జీవితం ప్రారంభం అయింది. అతడు ముందుగా సబర్బను స్కూలులోను, ఆ తరువాత హైస్కూలులోను చేరి చదువుకున్నాడు. విద్యార్థి దశలో అతను ఎక్కువ బిడియంతో ఉండి ఎవరితోను కలిసిమెలిసి ఉండేవాడు కాదు. ఒకనాడు పరీక్షాధికారి అయిదు మాటలు చెప్పి వాటి వర్ణక్రమాన్ని వ్రాయమన్నాడు. వాటిలో కెటిల్ అనే మాటను గాంధీ తప్పుగా వ్రాశాడు.
జవాబు:

ప్రశ్నలు

  1. గాంధీ ఎక్కడ జన్మించాడు?
  2. అతడు ఏయే స్కూళ్లల్లో చదువుకున్నాడు?
  3. విద్యార్థి. దశలో అతను ఎలా ఉండేవాడు?
  4. అతడు పరీక్షలో దేనిని తప్పుగా వ్రాశాడు?
  5. గాంధీ తండ్రి పోరుబందరు నుండి ఎక్కడకు వచ్చాడు ?

ప్రశ్న 5.
కింది పేరా చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రూపొందించండి.

“కవిత్వం, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పం – ఈ ఐదింటిని లలిత కళలంటారు. ఈ కళల్లో కృష్ణరాయలకు తగినంత చొరవ ఉండేది. ఆయన ఆస్థానంలో కవులు, గాయకులు, నాట్యకారులు, చిత్రకారులు, శిల్పులు ఉండేవారు. వారు తమ తమ కళలను అద్భుతరీతిలో ప్రదర్శించి రాయల మన్ననలందుకొనేవారు. కళలు మానవుని హృదయాన్ని స్పందింపజేసే స్వభావం కలవి. కళలను ఆనందించలేనివాడు రాయిలాగే జడుడని చెప్పవచ్చు.”
జవాబు:

ప్రశ్నలు

  1. లలితకళ లేవి?
  2. కవులు రాయల మన్ననలందుకొనడానికి గల కారణమేమి?
  3. కళలను ఆనందించలేని వాడు రాయిలాగే జడుడు అంటే అర్థం ఏమిటి?
  4. సంగీతం పాడేవారిని గాయకులంటారు. అలాగే చిత్రాలను వేసే వారిని ఏమంటారు?
  5. కళల స్వభావం ఏమిటి ?

వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
“చెరువులు గ్రామాలకు పట్టుకొమ్మలు” అని తెలుపుతూ నీ మిత్రునికి లేఖ రాయుము.
జవాబు:

లేఖ

ముదిగొండ,
X X X X.

ప్రియ మిత్రుడు ప్రవీణ్కు,

నేను బాగా చదువుతున్నాను. నీవూ బాగా చదువుతున్నావనుకుంటున్నాను. ‘చెరువులు గ్రామాలకు పట్టుకొమ్మలు’ అనే విషయం నీకు చెప్పదలచి ఈ లేఖ రాస్తున్నాను.

మన తెలంగాణ ప్రాంతంలో నేడు నీటి కొరతను మనం ఎదుర్కొంటున్నాం. మనకు కృష్ణా, గోదావరి నదులు ఉన్నా తగినంత వర్షపాతం లేకపోవడం దానికి ముఖ్య కారణం. ఈ మధ్యకాలంలో చెరువులు పూడ్చి, ఆ స్థలంలో భవనాలు కట్టడం జరుగుతోంది. చెరువుల పట్ల శ్రద్ధ తగ్గడం వల్ల నీటితూడు వగైరా పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. కొన్ని చెరువులు ఎండిపోయాయి.

శాతవాహనుల కాలం నుండి మన ప్రాంతంలో చెరువుల నిర్మాణంపై శ్రద్ధ ఉంది. మన ప్రభుత్వం చెరువుల ప్రాధాన్యం గుర్తించి “మిషన్ కాకతీయ” పేరుతో పాత చెరువుల అభివృద్ధికి ప్రాధాన్యత నిస్తోంది. చెరువులు కళకళలాడుతుంటేనే ప్రజలు, పశువులు, పక్షులు జీవంతో ఉండేది. వ్యవసాయం, తాగునీరు, నిత్యావసర పనులకు చెరువులపై ఆధారపడే గ్రామాలకు చెరువులు పట్టుకొమ్మలు కదా !

మీ అమ్మానాన్నలకు నా నమస్కారాలు.

ఇట్లు,
నీ మిత్రుడు,
కె. జస్వంత్.

చిరునామా :
డి. ప్రవీణ్,
9వ తరగతి,
పాల్వంచ, ఖమ్మం జిల్లా.

ప్రశ్న 2.
స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో నగరాన్ని / గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకుందామని కరపత్రాన్ని తయారుచేయండి. (లేదా) స్వచ్ఛ తెలంగాణ – సామాజిక బాధ్యత ఈ అంశంపై కరపత్రం తయారుచేయండి.
జవాబు:
సూచన : ప్రశ్నలలో భారత్ / తెలంగాణ అడగడం జరిగింది. పేరు మార్చి రెండిటికి విషయం ఒకటే.

స్వచ్ఛ భారత్ / స్వచ్ఛ తెలంగాణ

ప్రియమైన నా సోదర సోదరీమణులారా !

ఎక్కడ చూసినా, ఎటు చూసినా అపరిశుభ్రం, అశుద్ధం. దోమలు, ఈగల నిలయాలా ? ఇవి జనవాసాలా ? ఆలోచించే శక్తి కోల్పోయారా ? ఆలోచించరా ? ఇప్పటికైనా కళ్ళు తెరవండి, చైతన్యవంతులు కండి. పరిసరాలు శుభ్రంగా లేకపోతే రోగాలు చుట్టుముట్టుతాయి. దోమలు, ఈగల వల్ల భయంకర వ్యాధులు సోకుతాయి. మన నివాసాలు, పశువుల కొట్టాలకన్నా అధ్వానంగా ఉన్నాయి. నీ ఒక్క ఇల్లు బాగుంటే చాలనుకోకు. బయటకు రా. నీతోటి వారి క్షేమాన్ని నీవే కోరకపోతే ఎవరొస్తారు. ఒకరికొకరు మనమే సాయం చేసుకోవాలి. ఈ మురికిలోనే పసిపిల్లలు తిరుగుతున్నారు. వారి భవిష్యత్ కోసమైన పాటుపడదాం. మీ కోసం మేము తోడుంటాం. మరి మీ కోసం మీరేమి చేయరా ? చేయి చేయి కలిపి కష్టాన్ని దూరం చేద్దాం. గ్రామాన్ని తద్వారా దేశాన్ని ప్రగతి పథాన నడుపుదాం. ఈ రోజు నుండే పరిసరాలను శుభ్రంగా ఉంచుదాం. స్వచ్ఛ భారత్ / స్వచ్ఛ తెలంగాణలో భాగస్వాములవుదాం.

ఇట్లు,
స్వచ్ఛ భారత్ / స్వచ్ఛ తెలంగాణ నిర్మాణ యువత.

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ప్రశ్న 3.
తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఒక పెద్ద రాజకీయ నాయకుడు నీ వద్దకు వస్తే ఆయన్ని ఏమేమి ప్రశ్నలడుగుతావో ప్రశ్నావళిని తయారుచేయండి.
జవాబు:
తెలంగాణ ఉద్యమంలో పాల్గొని వచ్చిన రాజకీయ నాయకునితో ఈ ప్రశ్నలు అడుగుతాను.

  1. రాష్ట్రానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ?
  2. మీరు చెప్పినవన్నీ నిస్వార్థంగా చేస్తారా ?
  3. ఎన్నిసార్లు మీరు జైలు కెళ్ళారు ?
  4. ఓటుకు నోటు ఇచ్చారా ?
  5. ఉద్యమంలో పాల్గొనటం కాక ఇంకా మీరు ఏమి చేశారు ?
  6. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పిస్తారా ?
  7. ఖద్దరు ధరించిన మీరు గాంధీ సిద్ధాంతాలు పూర్తిగా పాటిస్తున్నారా ?
  8. మద్యపాన రహిత రాష్ట్రంగా తెలంగాణను చూడగలమా ?
  9. అంటరానితనం నేరమంటూనే పుట్టింది మొదలు చచ్చేవరకు కులం అనే ‘కాలం’ ఎందుకు సర్టిఫికెట్స్లో పెట్టారు?

PAPER – II : PART – B

భాషాంశాలు – వ్యాకరణం

కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.

I. సంధులు:

ప్రశ్న 1.
“ప్రత్యేకం” సంధి విడదీసి రాయగా
A) ప్రత్య + ఏకం
B) ప్రతి + యేకం
C) ప్రతి + ఏకం
D) ప్రతికి + ఏకం
జవాబు:
C) ప్రతి + ఏకం

ప్రశ్న 2.
“సవర్ణదీర్ఘ సంధి”కి ఉదాహరణ
A) ప్రత్యేకం
B) ప్రజాభిప్రాయం
C) ప్రజలంతా
D) నాలుగెకరాలు
జవాబు:
B) ప్రజాభిప్రాయం

ప్రశ్న 3.
చిన్నచిన్న హాస్యాలకు కోపోద్రిక్తులు కాకండి – గీత గీసిన పదం ఏ సంధి ?
A) సవర్ణదీర్ఘ సంధి
B) గుణసంధి
C) ఉత్వ సంధి
D) అత్వ సంధి
జవాబు:
B) గుణసంధి

ప్రశ్న 4.
“స్వ + ఇచ్ఛ” సంధి కలిపి రాయగా
A) స్వచ్ఛ
B) స్వచ్ఛ
C) సర్వేఛ్ఛ
D) స్వేచ్ఛ
జవాబు:
D) స్వేచ్ఛ

ప్రశ్న 5.
“సవర్ణదీర్ఘ సంధి”కి ఉదాహరణ కానిది.
A) ప్రజాభిప్రాయం
B) సత్యాగ్రహం
C) సత్యాహింసలు
D) తిలోదకాలు
జవాబు:
D) తిలోదకాలు

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ప్రశ్న 6.
“ప్రాణాలు + అర్పించు” – సంధికార్యములో వచ్చు సంధి పేరు
A) ఉత్వ సంధి
B) అత్వ సంధి
C) గుణసంధి
D) వృద్ధి సంధి
జవాబు:
A) ఉత్వ సంధి

ప్రశ్న 7.
య, వ, రలు ఆదేశముగా వచ్చు సంధి
A) యడాగమ సంధి
B) గుణసంధి
C) యణాదేశ సంధి
D) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
C) యణాదేశ సంధి

II. సమాసములు :

ప్రశ్న 1.
సత్యమును, అహింసయు, భక్తియు మరియు ప్రపత్తియు – అనే విగ్రహవాక్యాలు ఏ సమాసానికి చెందినవి ?
A) ద్విగు సమాసము
B) ద్వంద్వ సమాసము
C) బహువ్రీహి సమాసము
D) షష్ఠీ తత్పురుష సమాసము
జవాబు:
B) ద్వంద్వ సమాసము

ప్రశ్న 2.
“విద్యార్థి నాయకుడు” – అను సమాస పదంనకు సరియైన విగ్రహవాక్యము
A) విద్యార్థుల యందు నాయకుడు
B) విద్యార్థి నాయకుడుగా కలవాడు
C) విద్యార్థుల వలన నాయకుడు
D) విద్యార్థులకు నాయకుడు
జవాబు:
D) విద్యార్థులకు నాయకుడు

ప్రశ్న 3.
మలినమైన హృదయము – సమాసముగా మార్చగా
A) మలిన హృదయము
B) మలినమగు హృదయము
C) మలినాల హృదయము
D) మలిన హృదయుడు
జవాబు:
A) మలిన హృదయము

ప్రశ్న 4.
“విశేషణ పూర్వపద కర్మధారయము”నకు ఉదాహరణ
A) సత్యాహింసలు
B) సత్యాగ్రహము
C) ఉత్కృష్టమైన లక్ష్యము
D) రాష్ట్ర ధ్యేయము
జవాబు:
C) ఉత్కృష్టమైన లక్ష్యము

ప్రశ్న 5.
“సత్యం కొరకు ఆగ్రహం” – ఈ విగ్రహవాక్యము ఏ సమాసమునకు ఉదాహరణ ?
A) షష్ఠీ తత్పురుష
B) చతుర్థీ తత్పురుష
C) తృతీయా తత్పురుష
D) ద్వంద్వ సమాసము
జవాబు:
B) చతుర్థీ తత్పురుష

ప్రశ్న 6.
“తీవ్ర పరిస్థితుల వలన ధర్మయుద్ధంలో విద్యార్థులు అగ్నిజ్వాలల వలె మండిపడ్డారు.” – ఈ వాక్యములో షష్ఠీ తత్పురుష సమాసమునకు ఉదాహరణ
A) తీవ్ర పరిస్థితులు
B) ధర్మయుద్ధం
C) అగ్నిజ్వాలలు
D) మండిపడు
జవాబు:
C) అగ్నిజ్వాలలు

ప్రశ్న 7.
“ప్రాణాలను అర్పించు” వారు త్యాగవీరులు – ఈ విగ్రహవాక్యంను సమాసంగా మార్చండి.
A) ప్రాణార్పణవీరులు
B) ప్రాణాలర్పించు
C) ప్రాణదాతలు
D) ప్రాణ త్యాగవీరులు
జవాబు:
B) ప్రాణాలర్పించు

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

III. అలంకారములు :

ప్రశ్న 1.
“కిషోర్ లేడిపిల్లలా పరుగులు పెడుతున్నాడు.” – ఈ వాక్యంలో ఉన్న అలంకారం
A) ఉపమాలంకారం
B) ఉత్ప్రేక్షాలంకారం
C) అంత్యానుప్రాస
D) యమకము
జవాబు:
A) ఉపమాలంకారం

ప్రశ్న 2.
……….. గుడిసెకు విసిరి పోతివా
……….. నడుం చుట్టుక పోతివా
………. దిక్కు మొక్కుతు పోతివా – ఈ వాక్యాలలో ఉన్న అలంకారం
A) ఛేకానుప్రాస
B) లాటానుప్రాస
C) వృత్త్యనుప్రాస
D) అంత్యానుప్రాస
జవాబు:
D) అంత్యానుప్రాస

IV. వాక్యాలు

ప్రశ్న 1.
వెంకట్రామయ్య ఆఫీసు పనిమీద మద్రాసు వెళ్ళాడు. వెంకట్రామయ్య ఆఫీసు పనిమీద బెంగళూరు వెళ్ళాడు. పై వాక్యాలను సంయుక్త వాక్యంగా మార్చండి.
A) వెంకట్రామయ్య ఆఫీసు పనిమీద మద్రాసు వెళ్ళి బెంగళూరు వెళ్ళాడు.
B) వెంకట్రామయ్య ఆఫీసు పనిమీద మద్రాసు మరియు బెంగళూరు వెళ్ళాడు.
C) వెంకట్రామయ్య ఆఫీసు పనిమీద మద్రాసు నుండి బెంగళూరు వెళ్ళాడు.
D) వెంకట్రామయ్య వెళ్ళాడు బెంగళూరుకి, మద్రాసుకి.
జవాబు:
B) వెంకట్రామయ్య ఆఫీసు పనిమీద మద్రాసు మరియు బెంగళూరు వెళ్ళాడు.

ప్రశ్న 2.
సీత కాఫీ తాగుతుంది. సీత హార్లిక్స్ తాగుతుంది.
పై వాక్యాలను సంయుక్త వాక్యంగా మార్చండి.
A) సీత కాఫీ మరియు హార్లిక్స్ కూడా తాగుతుంది.
B) సీత కాఫీ తాగి హార్లిక్స్ తాగుతుంది.
C) సీత తాగింది హార్లిక్స్ మరియు కాఫీలు.
D) సీతకు కాఫీ మరియు హార్లిక్స్ కూడా ఇష్టమే.
జవాబు:
A) సీత కాఫీ మరియు హార్లిక్స్ కూడా తాగుతుంది.

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

These TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ will help the students to improve their time and approach.

TS 9th Class Telugu 5th Lesson Important Questions శతక మధురిమ

PAPER – 1 : PART – A

I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)

అ) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘ధనికుని కంటే పేద గొప్ప కదా !’ అన్న కవి అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా ? ఎందుకు ?
జవాబు:
ఉత్పల సత్యనారాయణాచార్య “ధనము, ధనాభిమానము, శ్రియఃపతీ !” అను పద్యంలో ‘ధనికుని కంటే పేద కడు ధన్యుడు” అన్న వారి అభిప్రాయంతో నేను గొంతు కలుపుతున్నాను. ఎందుకంటే ధనం, ధనంపై అభిమానం, ఎల్లప్పుడు ధనం సంపాదించాలనే కోరిక అనే ఈ మూడు దోషాలు ధనికునికి ఉన్నాయి. కాని పేదవానికి ధనం ఉండదు. ధనంపై ఆశ ఉన్నా మంచివారికి దగ్గరగా ఉండటం వల్ల అది కూడా నశిస్తుంది. కనుక ధనికుని కంటే పేద గొప్ప కదా !

ఆ) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
“చేతులకు దానమే అందం, కానీ కంకణాలు కావు” ఎందుకు ? సమర్థిస్తూ రాయుము.
జవాబు:
“దానేన పాణిర్నతు కఙ్కణేన” అన్న భర్తృహరి వాక్యానికి ‘మల్ల భూపాలీయం’ నీతిశతక కర్త ఎలకూచి బాలసరస్వతి తెలుగు సేత ‘చేతులకు దానమే అందం కానీ కంకణాలు కావు’ అన్న వాక్యం.

పరోపకారం చేయడం కోసం దేవుడు మనకు శరీరాన్ని ఇచ్చాడు. అందువల్ల మనశక్తి కొలది ఇతరులకు సాయం చేయాలి. మనచుట్టూ ఉన్న ప్రకృతిని గమనిస్తే ఇతరుల కోసమే నదులు ప్రవహిస్తున్నాయి, పండ్లు ఫలిస్తున్నాయి, గోవులు పాలిస్తున్నాయి. వీటన్నిటి ఉపకారాలు పొందుతూ మనిషి మాత్రం స్వార్థంగా జీవిస్తున్నాడు. తాత్కాలికంగా మంచివాడనిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడేకాని స్వార్థాన్ని పూర్తిగా విడువలేకపోతున్నాడు.

స్వార్థ చింతన కొంతమాని పొరుగువాడికి సాయం చేయాలనే భావన మాత్రం కలుగడం లేదు. తన వైభవమే “చూసుకోవడం తప్ప తోటివారి బాధలు గమనించడం లేదు. అందుకే కవి “చేతులు మనకు భగవంతుడు ఇచ్చింది పరులకు గొప్పగా సాయం చేయమనే కాని కంకణాలు ధరించటానికి కాదంటాడు”.

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

ప్రశ్న 2.
అందరిని ఆదరంగా చూస్తే భూమి మీద కష్టాలు పుట్టవు అని చెప్పిన ‘శతక మధురిమ’ పద్యం అంతరార్థం సోదాహరణంగా వివరించండి.
జవాబు:
“అఖిల జీవుల తనవోలె నాదరింప

ఉద్భవించునే యాపదలుర్వియందు అంటారు నింబగిరి నరసింహ శతక కర్త శ్రీ అందె వేంకట రాజం. సహజంగా ఇళ్ళలో అత్తాకోడళ్ళ విషయంలో కొన్ని బాధలుంటాయి. అత్త కోడలిని కొడుకు భార్యగా కాక పరాయిపిల్ల అనుకోవడం, కోడలు అత్తను రాక్షసిగా భావించడం, కట్నం విషయంలో అత్త కోడల్ని నిందించడం, కోడలి పుట్టింటి వారిని గూర్చి తక్కువ చేసి మాట్లాడటం ఇలా ఎన్నో ఉంటాయి. కోడలిని కూతురి మాదిరిగా చూస్తే ఇంట్లో ఘోరాలు సంభవించవు.

కార్మికులను భాగస్థులను చేస్తే, కర్మాగారాల్లో అల్లర్లు జరుగవు. ప్రపంచంలో ఎన్నో మతాలున్నాయి. అన్ని మతాలు చెప్పేది ఒకటే. ఇతర మతస్థులను మన అన్నదమ్ముల వంటి వారిగా ఆదరిస్తే, మతకలహాలు, కొట్లాటలు లేక ప్రపంచం శాంతిధామం అవుతుంది. కనుక ప్రాణులందరినీ తనవలె ఆదరంగా చూస్తే భూమి మీద కష్టాలు పుట్టవు అని ‘శతక మధురిమ’ పద్యం చక్కగా వివరిస్తోంది.

ప్రశ్న 3.
పాఠశాలలో జరిగే భాషోత్సవాన్ని తిలకించడానికి ప్రముఖ శతక కవులు వచ్చారు. వారిని మీరు ఏమని ఇంటర్వ్యూ చేస్తారు ? అవసరమైన ప్రశ్నావళి రాయండి.
జవాబు:
ప్రశ్నావళి :

  1. శతకంలోని ‘మకుట నియమం’ యొక్క ఉద్దేశం ఏమిటి ?
  2. ఇందలి పద్యాలు దేనికవే వేరుగా అర్థాన్నిస్తాయి కదా ? మరి శతక రచన ఉద్దేశం ఏమిటి ?
  3. “చదువ పద్యమరయ చాలదా నొక్కటి” అని వేమన చెప్పాడు కదా ? ఇన్ని శతక పద్యాలు చదువక్కరలేదా ?
  4. పుత్రోత్సాహం అన్నారే కాని పుత్రికోత్సాహం అని ఎందుకు అనలేదు ?
  5. “తివిరి యిసుమున తైలంబు తీయవచ్చు” అను పద్యంలో లేనివి, రానివి చెప్పబడ్డాయి. దీని ఉద్దేశం ఏమిటి ?
  6. శతకం అంటే నూరు కదా మరి నూట ఎనిమిది పద్యాలు ఉండాలనే నియమాన్ని ఎందుకు పాటించారు ?
  7. శతక పద్యధారణ ఎవరికి అవసరం ?
  8. శతకం కవి ఆత్మీయతకు ప్రతిబింబమా ?

PAPER – 1 : PART – B

భాషాంశాలు – పదజాలం :

1. సొంతవాక్యాలు :

అ) కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

1. జాతుల్చెప్పుట : టి.వి.లో జాతుల్చెప్పు వారిలో ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి ఒకరు.
2. పరద్రవ్యము : పరద్రవ్యము పాము కంటే ప్రమాదము కాబట్టి దానిని కోరవద్దు.
3. నిక్కం : అవగాహన చేసుకొని చదివినదే నిక్కమైన చదువు.
4. ఒజ్జ : అన్ని విద్దెలకు ఒజ్జ ఆ బొజ్జగణపయ్య.
5. తృష్ణ : అర్జునుని గెలవాలన్న తృష్ణతో కర్ణుడు పరశురాముని శిష్యుడయ్యాడు.
6. విభూషణము : నెమలి ఈక అదృష్టం ఏమిటంటే శ్రీకృష్ణుని విభూషణం కావడమే.
7. ఆభరణం : నగ – పరోపకారమే శరీరానికి ఆభరణం వంటిది.
8. ఆదరం : ఆదరణ – అన్ని జీవులను తనవలె ఆదరంగా చూస్తే భూమ్మీద కష్టాలుండవు.
9. ఆశీర్వాదం: దీవెన – గురువు ఆశీర్వాదం పొందిన శిష్యుడే శ్రేష్ఠమైన సాధనాన్ని పొందుతాడు.

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

II. అర్థాలు:

ఆ) కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.

ప్రశ్న 1.
“కృష్ణ” అంటే అర్థం
A) తృణము
B) దప్పిక
C) ఒక తులసి
D) బిందువు
జవాబు:
B) దప్పిక

ప్రశ్న 2.
సజ్జనులు మంచినే కోరుకుంటారు – గీత గీసిన పదానికి అర్థం
A) బుట్ట
B) ఒక ధాన్యము
C) సత్పురుషులు
D) సంఘజీవులు
జవాబు:
C) సత్పురుషులు

ప్రశ్న 3.
“మహి” అంటే అర్థం
A) మహిమ
B) భూమి
C) పాము
D) ఒక స్త్రీ
జవాబు:
B) భూమి

ప్రశ్న 4.
ఆకసమున శీతభానుడు వెన్నెల కురిపిస్తున్నాడు – గీత గీసిన పదానికి అర్థం
A) చందమామ
B) సూర్యుడు
C) వెన్నెల
D) నక్షత్రములు
జవాబు:
A) చందమామ

ప్రశ్న 5.
అబద్ధములు – అనే అర్థం వచ్చే పదం
A) బద్ధము
B) మృషలు
C) సత్యాలు
D) అశుద్ధి
జవాబు:
B) మృషలు

ప్రశ్న 6.
మంత్రులు – అనే అర్థం వచ్చే పదం
A) ప్రధానులు
B) రాజోద్యోగులు
C) మంత్రగాళ్ళు
D) సేనాపతులు
జవాబు:
A) ప్రధానులు

ప్రశ్న 7.
కొండెములాడు వానితో స్నేహం వద్దు – గీత గీసిన పదానికి అర్థం
A) కొండ ఎక్కువాడు
B) కొంచెం చెప్పువాడు
C) చాడీలు చెప్పేవాడు
D) తొండం
జవాబు:
C) చాడీలు చెప్పేవాడు

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

ప్రశ్న 8.
“పరద్రవ్యం” అంటే అర్థం
A) ఇతరులు
B) ఇతరుల సొమ్ము
C) బరువైన ద్రవం
D) పరమాత్ముడు
జవాబు:
B) ఇతరుల సొమ్ము

ప్రశ్న 9.
ఉర్వి అంటే ధరణి అనే అర్థం. ఇటువంటి అర్థం వచ్చే మరొక పదం
A) ఉర్వీశ
B) భూమి
C) ధరణీశ
D) జగదీశ
జవాబు:
B) భూమి

III. పర్యాయపదాలు :

ప్రశ్న 1.
కూతురు – అనే పదానికి పర్యాయపదాలు
A) కుమార్తె, పుత్రిక, దుహిత
B) సుత, జనని
C) ఆత్మజ, మహిత
D) బిడ్డ, ఫలము
జవాబు:
A) కుమార్తె, పుత్రిక, దుహిత

ప్రశ్న 2.
శరీరము – అనే పదానికి పర్యాయపదాలు
A) తనువు, మైపూత
B) మేను, ఒడలు, కాయము
C) దేహము, సందేహము
D) గాత్రము, కళత్రము
జవాబు:
B) మేను, ఒడలు, కాయము

ప్రశ్న 3.
“క్ష్మాపతి”కి మరొక పర్యాయపదం
A) దేశము
B) రాణువ
C) భూపతి
D) శ్రీపతి
జవాబు:
C) భూపతి

ప్రశ్న 4.
గరము మింగిన జోదు, ఈశ్వరుడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) గరళము, వ్యాళము
B) గరళము, విషము, శ్రీ
C) విషము, తీపి
D) చేదు, వేడి
జవాబు:
B) గరళము, విషము, శ్రీ

ప్రశ్న 5.
శ్రీ కాళహస్తీశ్వరా ! – అనే పదంలో గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) సాలీడు, లూత, సాలెపురుగు
B) లక్ష్మి, సాలెపురుగు, శివుడు
C) లాభం, లూత
D) లచ్చి, శివుడు
జవాబు:
A) సాలీడు, లూత, సాలెపురుగు

ప్రశ్న 6.
అన్నిటికంటే ఎత్తైన శైలము హిమగిరి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) అద్రి, పర్వతము, అచలం
B) గట్టు, మెట్ట
C) నగము, శిఖరము
D) కొండ, తరువు
జవాబు:
A) అద్రి, పర్వతము, అచలం

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

ప్రశ్న 7.
పిపాస, ఈప్స, కాంక్ష – అను పర్యాయపదాలు గల పదం
A) దప్పిక
B) దాహము
C) తృష్ణ
D) త్రప
జవాబు:
C) తృష్ణ

ప్రశ్న 8.
నరుడు, మానవుడు, మర్త్యుడు – అనే పర్యాయపదాలు గల పదం
A) మనిషి
B) దానవుడు
C) మరుడు
D) అమరుడు
జవాబు:
A) మనిషి

IV. నానార్థాలు:

ప్రశ్న 1.
శ్రీ – అనే పదానికి నానార్థాలు
A) సాలెపురుగు, లక్ష్మి, సంపద
B) ధనము, ప్రకృతి
C) శోభ, భాష
D) కవిత, కావ్యము
జవాబు:
A) సాలెపురుగు, లక్ష్మి, సంపద

ప్రశ్న 2.
మనిషి ఆశతో జీవిస్తాడు – గీత గీసిన పదానికి నానార్థాలు
A) కోరిక, ప్రేమ
B) పేరాశ, దిక్కు
C) కోరిక, దిక్కు
D) ఆసక్తి, అధికము
జవాబు:
C) కోరిక, దిక్కు

ప్రశ్న 3.
చెవిపోగులు, పాము – అను నానార్థాలు వచ్చే పదము
A) ఆభరణము
B) కుండలి
C) సర్పము
D) నాగము
జవాబు:
B) కుండలి

ప్రశ్న 4.
“దోషము” అను పదమునకు నానార్ధములు – “తప్పు” మరియు ……….
A) రాత్రి, పాపము
B) దోసకాయ, దోషకారి
C) వేషము, రోషము
D) కోపము, పాపము
జవాబు:
A) రాత్రి, పాపము

ప్రశ్న 5.
శ్రియః – అను పదమునకు నానార్ధములలో ఒకటి లక్ష్మీదేవి మరియొకటి
A) ప్రజ్ఞ – ప్రజ
B) ప్రజ్ఞ – ప్రగ్గడ
C) ప్రజ్ఞ – పగ్గె
D) ప్రజ్ఞ – ప్రతిజ్ఞ
జవాబు:
C) ప్రజ్ఞ – పగ్గె

ప్రశ్న 6.
ఇటువంటి గుణము కావాలి – గీత గీసిన పదానికి నానార్థాలు
A) స్వభావము, వింటినారి
B) లక్షణము, వైద్యుడు
C) హెచ్చవేత, మాత్ర
D) దారము, దూది
జవాబు:
A) స్వభావము, వింటినారి

ప్రశ్న 7.
వైభవంలో ఇంద్రుని మించినవాడా ! – గీత గీసిన పదానికి నానార్థాలు
A) ప్రభువు, రాజు
B) శేషుడు, నాగరాజు
C) దేవేంద్రుడు, శ్రేష్ఠుడు
D) ఈశ్వరుడు, శివుడు
జవాబు:
C) దేవేంద్రుడు, శ్రేష్ఠుడు

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

ప్రశ్న 8.
ఓ వేంకట పతీ ! పరబ్రహ్మమూర్తి – గీత గీసిన పదానికి నానార్థాలు
A) చంద్రుడు, వైశ్యుడు
B) నలువ, విష్ణువు
C) శివుడు, క్షత్రియుడు
D) సూర్యుడు, నక్షత్రం
జవాబు:
B) నలువ, విష్ణువు

ప్రశ్న 9.
లక్ష్మీనాథా ! నీవే దిక్కు – గీత గీసిన పదానికి నానార్థాలు
A) శ్రీదేవి, సిరి
B) తామర, మల్లె
C) కలువ, పారిజాతం
D) పసుపు, కుంకుమ
జవాబు:
A) శ్రీదేవి, సిరి

ప్రశ్న 10.
గురువు ఆశీస్సును పొందినపుడే, శిష్యుడు శాంతాన్ని – సాధించగలుగుతాడు – గీత గీసిన పదానికి నానార్థాలు
A) హితం, కీడు
B) ఇచ్ఛ, కోరిక
C) పాముకోర, విషం
D) ఆశీర్వాదం, స్తోత్రం చేయుట
జవాబు:
D) ఆశీర్వాదం, స్తోత్రం చేయుట

V. ప్రకృతి, వికృతులు:

ప్రశ్న 1.
ఈ కింది ప్రకృతి – వికృతులలో సరికాని జోడు ఏది ?
A) దోషము – దొసగు
B) సింహం – సింగ౦
C) కార్యము – కారణము
D) కలహము – కయ్యం
జవాబు:
C) కార్యము – కారణము

ప్రశ్న 2.
“అగ్ని”కి సరియైన వికృతి పదం
A) అగిని
B) అగ్గి
C) నిప్పు
D) మంట
జవాబు:
B) అగ్గి

ప్రశ్న 3.
“పాము విషము కన్నా అవినీతి సర్పము యొక్క విసము ప్రమాదము.’ ఈ వాక్యములో ఉన్న సరియైన ప్రకృతి – వికృతులు
A) పాము – సర్పము
B) అవినీతి – అనీతి
C) ప్రమాదము – ప్రమోదము
D) విషము – విసము
జవాబు:
D) విషము – విసము

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

ప్రశ్న 4.
“సూది” అను పదము వికృతిగా గల పదము
A) సూచన
B) సూచి
C) సూచించు
D) దబ్బనము
జవాబు:
B) సూచి

ప్రశ్న 5.
శ్రియః – అను పదమునకు నానార్ధములలో ఒకటి లక్ష్మీదేవి మరియొకటి
A) ప్రజ్ఞ – ప్రజ
B) ప్రజ్ఞ – ప్రగ్గడ
C) ప్రజ్ఞ – పగ్గె
D) ప్రజ్ఞ – ప్రతిజ్ఞ
జవాబు:
C) ప్రజ్ఞ – పగ్గె

ప్రశ్న 6.
“శ్రీ” అను పదమునకు సరియైన వికృతి
A) సిరి
B) స్త్రీ
C) ఇంతి
D) సిరి
జవాబు:
A) సిరి

ప్రశ్న 7.
యోధులు – అను పదమునకు సరియైన వికృతి
A) యోద్ధలు
B) జోదులు
C) జోగి
D) యాది
జవాబు:
B) జోదులు

ప్రశ్న 8.
కలహం పేరు వింటే నారదుడు గుర్తుకు వచ్చాడా ? గీత గీసిన పదానికి వికృతి
A) కార్యం
B) పేచి
C) కయ్యం
D) తగవు
జవాబు:
C) కయ్యం

ప్రశ్న 9.
భగవంతునికి తన భక్తుడు అంటే ప్రేమ – గీత గీసిన పదానికి వికృతి
A) భక్తి.
B) భజన
C) భాగ్యశాలి
D) బత్తుడు
జవాబు:
D) బత్తుడు

ప్రశ్న 10.
`శిష్యుడు అంటే వివేకానందుడే ఆదర్శం – గీత గీసిన పదానికి వికృతి
A) సిసువుడు
B) సచివుడు
C) శశికరుడు
D) సాధన
జవాబు:
A) సిసువుడు

ప్రశ్న 11.
“నిచ్చలు” అను పదానికి ప్రకృతి
A) నిశ్చయం
B) గోరు
C) నింగి
D) నిరూపణ
జవాబు:
B) గోరు

ప్రశ్న 12.
“ఘోరము” అను పదమునకు వికృతి
A) గరువము
B) గోరు
C) గోరము
D) గోస
జవాబు:
C) గోరము

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

ప్రశ్న 13.
రావే ఈశ్వరా, కావవే వరదా.
A) శివుడు
B) ఈసరుడు
C) శంకరుడు
D) రుద్రుడు
జవాబు:
B) ఈసరుడు

VI. వ్యుత్పత్త్యర్ధములు :

ప్రశ్న 1.
“అచ్యుతుడు” – అను పదమునకు సరియైన వ్యుత్పత్తి
A) చ్యుతము నుండి జారినవాడు
B) నాశనము (చ్యుతి) లేనివాడు
C) అచ్యుతానంత అని పాడువాడు
D) చ్యుతునికి సోదరుడు
జవాబు:
B) నాశనము (చ్యుతి) లేనివాడు

ప్రశ్న 2.
“ప్రకాశమును కలిగించువాడు” – అను వ్యుత్పత్తి కలిగిన పదము
A) భానుహుడు
B) భాస్కరుడు
C) భారతీయుడు
D) చంద్రుడు
జవాబు:
B) భాస్కరుడు

ప్రశ్న 3.
“మనువు సంతతికి చెందినవారు” – అను వ్యుత్పత్తి గల పదము
A) మానవులు
B) భారతీయుడు
C) దానవులు
D) మారినవారు
జవాబు:
A) మానవులు

ప్రశ్న 4.
“సహెూదరులు” – అను పదమునకు సరియైన వ్యుత్పత్తి
A) అపూర్వమైనవారు
B) తోడ (ఒకే గర్భము నుండి) పుట్టినవారు
C) దరిదాపులనున్నవారు
D) ఒక అన్నకు తమ్ముడు
జవాబు:
B) తోడ (ఒకే గర్భము నుండి) పుట్టినవారు

ప్రశ్న 5.
“జలజాతము, అబ్జము” – అను పదములకు సరియైన వ్యుత్పత్తి “నీటి (జలము, అప్పు) నుండి పుట్టినది.” – దీనికి సరియైన పదము
A) అగ్ని
B) పద్మము
C) చేప
D) లక్ష్మి
జవాబు:
B) పద్మము

ప్రశ్న 6.
ఈమెచే సర్వము చూడబడును – అను వ్యుత్పత్తి కలిగిన పదము
A) కన్ను
B) లక్ష్మి
C) సూర్యుడు
D) పార్వతి
జవాబు:
B) లక్ష్మి

ప్రశ్న 7.
విష్ణువు నాశ్రయించునది – అను వ్యుత్పత్తి కలిగిన పదము
A) బ్రహ్మ
B) లక్ష్మి
C) భూదేవి
D) నారదుడు
జవాబు:
B) లక్ష్మి

ప్రశ్న 8.
కంకణం – అను వ్యుత్పత్తి కలిగిన పదము
A) కడియం
B) గాజు
C) మ్రోయునది
D) మెరియునది
జవాబు:
C) మ్రోయునది

PAPER – II : PART – A

అపరిచిత పద్యాలు

1. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

తనిసిరే వేల్పు లుదధి రత్నముల చేత ?
వెఱచిరే ఘోర కాకోల విషము చేత ?
విడిచిరే యత్న మమృతంబు వొడుముదనుక ?
నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు.

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
ఉదధి రత్నముల చేత తృప్తి చెందని వారెవరు ?
జవాబు:
వేల్పులు ఉదధి రత్నములచేత తృప్తి చెందలేరు.

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

ప్రశ్న 2.
నిపుణమతులు ఎటువంటివారు ?
జవాబు:
నిపుణమతులు తాము అనుకున్న కార్యం నెరవేరే – వరకు తమ ప్రయత్నాన్ని వదలరు.

ప్రశ్న 3.
వేల్పులు దేన్ని చూసి భయపడలేదు ?
జవాబు:
వేల్పులు ఘోర కాకోల విషాన్ని చూసి భయపడలేదు.

ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక “నిపుణమతుల లక్షణం”.

ప్రశ్న 5.
ఉదధి అంటే ఏమిటి ?
జవాబు:
ఉదధి అంటే సముద్రం.

2. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

విద్యచే భూషితుండయి వెలయుచున్నఁ
దొడరి వర్ణింపనగుఁ జుమీ దుర్జనుండు
చారు మాణిక్య భూషిత శస్త మస్త
కంబయిన పన్నగము భయంకరము గాదె.

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
చదువుకున్నప్పటికీ విడువదగినవాడు ఎవరు ?
జవాబు:
దుర్జనుడు చదువుకున్నప్పటికీ విడువదగినవాడు.

ప్రశ్న 2.
ఎటువంటి పాము భయంకరమైనది ?
జవాబు:
మణులచేత అలంకరింపబడిన శిరస్సుగల పాము భయంకరమైనది.

ప్రశ్న 3.
ఈ పద్యంలోని దుర్జనుడు దేనితో పోల్చబడ్డాడు ?
జవాబు:
ఈ పద్యంలో దుర్జునుడు పాముతో పోల్చబడ్డాడు.

ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘దుర్జనుడితో స్నేహం పనికిరాదు.’

ప్రశ్న 5.
మస్తకము అంటే ఏమిటి ?
జవాబు:
మస్తకం అంటే తల.

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

3. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు
సుకవి చేతి కలము సుధలు కురియు
ఆత డేల గలుగు యావత్ప్రపంచంబు
నీత డేల గలుగు ఇహము పరము

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
రాజు చేతి కత్తి దేన్ని వర్షిస్తుంది?
జవాబు:
రాజు చేతి కత్తి రక్తాన్ని వర్షిస్తుంది.

ప్రశ్న 2.
సుధలు కురిపించునది ఏది?
జవాబు:
సుకవి చేతి కలము సుధలు కురిపిస్తుంది.

ప్రశ్న 3.
యావత్ప్రపంచాన్ని పరిపాలించగలిగింది ఎవరు?
జవాబు:
రాజు యావత్ప్రపంచాన్ని పరిపాలించగలడు.

ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘రాజు సుకవి’.

ప్రశ్న 5.
ఇహము పరము ఏలగలిగేది ఎవరు ?
జవాబు:
ఇహము పరము ఏలగలిగేది సుకవి.

4. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను
సజ్జనుండు బల్కు చల్లగాను
కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ !

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
అల్పుడు మాట్లాడే తీరు ఎలాంటిది?
జవాబు:
అల్పుడు మాట్లాడే తీరు ఆడంబరంగా ఉంటుంది.

ప్రశ్న 2.
సజ్జనుడు ఎలా మాట్లాడుతాడు?
జవాబు:
సజ్జనుడు చల్లగా మాట్లాడుతాడు.

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

ప్రశ్న 3.
కంచు మ్రోగునట్లు మ్రోగనిదేది?
జవాబు:
కంచు మ్రోగునట్లు మ్రోగనిది బంగారం.

ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘అల్పుడు – సజ్జనుడు’.

ప్రశ్న 5.
ఈ పద్యం ఏ శతకం లోనిది ?
జవాబు:
ఈ పద్యం వేమన శతకం లోనిది.

5. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

కుసుమ గుచ్ఛంబునకుఁబోలె బొసగు శౌర్య
మానవంతున కివి రెండు మహితగతులు
సకలజన మస్తక ప్రదేశములనైన
వనమునందైన జీర్ణభావంబుఁ గనుట

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
శౌర్య మానవంతుడు ఎవరితో పోల్చబడ్డాడు?
జవాబు:
శౌర్య మానవంతుడు పుష్పగుచ్ఛంతో పోల్చబడ్డాడు.

ప్రశ్న 2.
కుసుమ గుచ్ఛం ఎక్కడ అలంకరింపబడుతుంది.?
జవాబు:
కుసుమ గుచ్ఛం సమస్త ప్రజల శిరస్సులందు అలంకరింపబడుతుంది.

ప్రశ్న 3.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘శౌర్య మానవంతుని లక్షణం’.

ప్రశ్న 4.
ఈ పద్యంలోని అలంకారం రాయండి.
జవాబు:
ఈ పద్యంలో ‘ఉపమాలంకారం’ ఉంది.

ప్రశ్న 5.
శౌర్యమానవంతునకు మహితగతులు ఎన్ని ?
జవాబు:
శౌర్యమానవంతునకు రెండు మహిత గతులు.

వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
శతక మధురిమలోని ఏదైనా ఒక పద్యం ఆధారంగా ఒక నీతికథను తయారుచేయండి.
జవాబు:
భక్తులే కాదు మనుషులన్న వారెవ్వరైనా పద్ధతిని, నీతిని తప్పకూడదని సర్వేశ్వర శతకపద్యం చెబుతోంది. నీతి, నిజాయితీలు మనిషి ఉన్నతికి దోహదపడతాయనేదే ఈ కథ.

నిజాయితీ

రామాపురంలో రాజయ్య అనే పేదవాడు ఉన్నాడు. అతడు ప్రతిరోజు అడవికి పోయి కట్టెలు కొట్టుకొని, వాటిని అమ్మి జీవించేవాడు. ఒకరోజు రాజయ్య ఆ అడవిలో నది ఒడ్డునున్న పెద్ద చెట్టెక్కి కట్టెలు కొడుతుండగా చేయి జారి గొడ్డలి నదిలో పడిపోయింది. ఆ నది చాలా లోతు. రెండు, మూడు సార్లు నదిలో దిగి ఎంతో ప్రయత్నించాడు. కాని గొడ్డలి దొరకలేదు. ఎంతో బాధతో భగవంతుణ్ణి మనసులో ప్రార్థించాడు. తన గొడ్డలి ఇప్పించమని వేడుకున్నాడు.

అతని ప్రార్ధనను విని గంగాదేవి ప్రత్యక్షమై, “ఎందుకు బాధపడుతున్నావు” అని అడిగింది. “తల్లీ! నన్ను రక్షించు. నా జీవనాధారమైన గొడ్డలి నదిలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా అది దొరకలేదు” అని బాధపడ్డాడు. ”సరే ఉండు అంటూ దేవత నీటిలో మునిగి బంగారు గొడ్డలితో ప్రత్యక్షమైంది. “ఇదేనా నీ గొడ్డలి ?” అని బంగారు గొడ్డలిని చూపించింది. “నాది కాదు తల్లీ !” అన్నాడు. మళ్ళీ నీళ్ళలో మునిగి దేవత వెండి గొడ్డలితో ప్రత్యక్షమైంది. “ఇదేనా నీ గొడ్డలి?” అని వెండి గొడ్డలిని చూపించింది. కాదని తల అడ్డంగా ఊపాడు. ఈసారి అతని గొడ్డలితోనే ఎదుట నిలిచి “ఇదేనా ?” అన్నది. రాజయ్య సంతోషంతో “అమ్మా ! ఇదే నా గొడ్డలి” అని ఆనందంతో పరవశించాడు.
రాజయ్య నిజాయితీకి మెచ్చి గంగాదేవి మూడు గొడ్డళ్ళు ఇచ్చి మాయమైపోయింది.
నీతి : నిజాయితీయే రాజయ్యను ధనవంతుణ్ణి చేసింది.

PAPER – II : PART – B

భాషాంశాలు – వ్యాకరణం

కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.

I. సంధులు:

ప్రశ్న 1.
“శ్రీకాళహస్తి + ఈశ్వరా”, “పుణ్య + ఆత్ముడు” – అను వాటికి వచ్చు సంధి కార్యము
A) గుణసంధి
B) ఇత్వ సంధి
C) సవర్ణదీర్ఘ సంధి
D) అత్వ సంధి
జవాబు:
C) సవర్ణదీర్ఘ సంధి

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

ప్రశ్న 2.
రాజరాజేశ్వరా – సంధి విడదీసి రాయగా
A) రాజ + రాజేశ్వరా
B) రాజరా + జేశ్వరా
C) రాజరాజ + ఈశ్వరా
D) రాజరాజ + యీశ్వరా
జవాబు:
C) రాజరాజ + ఈశ్వరా

ప్రశ్న 3.
“నెఱి + మేను” – కలిపి రాయగా
A) నెఱిమేను
B) నెమ్మనము
C) నెమ్మేను
D) నిండుమేను
జవాబు:
C) నెమ్మేను

ప్రశ్న 4.
ఈశ్వరుని పదాబ్జములను కొలుతును – గీత గీసిన పదానికి సంధి కార్యము
A) గసడదవాదేశ సంధి
B) సవర్ణదీర్ఘ సంధి
C) అత్వ సంధి
D) గుణసంధి
జవాబు:
B) సవర్ణదీర్ఘ సంధి

ప్రశ్న 5.
“జాతుల్ + చెప్పుట” – సంధి చేసి రాయగా
A) జాతుచెప్పుట
B) జాతికి సెప్పుట
C) జాతులెప్పుట
D) జాతులే సెప్పుట
జవాబు:
D) జాతులే సెప్పుట

ప్రశ్న 6.
“ఏమి + అయినన్” – ఇది ఏ సంధి ?
A) ఇత్వ సంధి
B) అత్వ సంధి
C) గుణసంధి
D) యణాదేశ సంధి
జవాబు:
A) ఇత్వ సంధి

ప్రశ్న 7.
క, చ, ట, త, ప ల స్థానంలో గ, స, డ, ద, వలు వచ్చు సంధి నామము
A) సరళాదేశ సంధి
B) గసడదవాదేశ సంధి
C) ద్రుత సంధి
D) ఆమ్రేడిత సంధి
జవాబు:
B) గసడదవాదేశ సంధి

ప్రశ్న 8.
“వేంకటేశ్వరా” అను పదమును విడదీయగా వచ్చు సంధి
A) సవర్ణదీర్ఘ సంధి
B) గుణసంధి
C) యణాదేశ సంధి
D) యడాగమ సంధి
జవాబు:
B) గుణసంధి

ప్రశ్న 9.
“తలఁదాల్చు” అను పదాన్ని విడదీసి రాయగా
A) తలతోన్ + తాల్చు
B) తల + తాల్చు
C) తలన్ + తాల్చు
D) తలఁ + తాల్చు
జవాబు:
C) తలన్ + తాల్చు

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

II. సమాసములు :

ప్రశ్న 1.
“షష్ఠీ తత్పురుష సమాసాని”కి ఉదాహరణ
A) నీ భక్తుడు
B) చేదమ్మి
C) నెమ్మేన
D) కలహాగ్నులు
జవాబు:
A) నీ భక్తుడు

ప్రశ్న 2.
జలజాతప్రియ శీతభానులు అను దానికి విగ్రహవాక్యం
A) జలజాతము మరియు ప్రియమైన శీతము భానుడును
B) జలజాతప్రియుడును మరియు శీతభానుడును
C) జలజాతప్రియము వంటి శీతభానులు
D) జలజాత ప్రియుని యొక్క శీతభానులు
జవాబు:
B) జలజాతప్రియుడును మరియు శీతభానుడును

ప్రశ్న 3.
“కార్యము నందు దక్షుడు” – అను విగ్రహవాక్యమునకు సమాసరూపం
A) కార్యదక్షుడు
B) కార్యమున దక్షుడు
C) కార్యాధ్యక్షుడు
D) కార్యములందు దక్షుడు
జవాబు:
A) కార్యదక్షుడు

ప్రశ్న 4.
“మూడు దోషాలు” సమాసము పేరు
A) ద్వంద్వ సమాసము
B) ద్విగు సమాసము
C) రూపక సమాసము
D) బహువ్రీహి సమాసము
జవాబు:
B) ద్విగు సమాసము

ప్రశ్న 5.
“ఆశాపాశం”లో చిక్కినవాడు, బయటపడలేడు – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం
A) ఆశ యందు పాశము
B) ఆశ యొక్క పాశం
C) ఆశ అనెడు పాశము
D) ఆశలు మరియు పాశాలు
జవాబు:
C) ఆశ అనెడు పాశము

ప్రశ్న 6.
అబ్జముల వంటి పదములు – విగ్రహవాక్యమునకు సమాసము
A) విశేషణ పూర్వపద కర్మధారయము
B) సంభావనా పూర్వపద కర్మధారయము
C) ఉపమాన ఉత్తరపద కర్మధారయము
D) బహువ్రీహి
జవాబు:
C) ఉపమాన ఉత్తరపద కర్మధారయము

ప్రశ్న 7.
“బహువ్రీహి సమాసము”నకు ఉదాహరణ
A) పుణ్యాత్ముడు
B) పరమేశ్వరుడు
C) కలహాగ్నులు
D) పరద్రవ్యము
జవాబు:
A) పుణ్యాత్ముడు

ప్రశ్న 8.
భీష్మద్రోణులు దుర్యోధనుని కొలువులో ఉన్నారు – గీత గీసిన పదం ఏ సమాసం ?
A) ద్వంద్వ సమాసము
B) ద్విగు సమాసము
C) ప్రాది సమాసము
D) షష్ఠీ తత్పురుష సమాసం
జవాబు:
A) ద్వంద్వ సమాసము

III. ఛందస్సు

ప్రశ్న 1.
“నీయాత్మ” అను పదమును గణవిభజన చేయగా
A) య గణం
B) త గణం
C) జ గణం
D) స గణం
జవాబు:
B) త గణం

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

ప్రశ్న 2.
UUI, UIU – ఈ గణములకు సరియైన పదం
A) శ్రీరామ భూపాల
B) సీతామనోహరా
C) రాజరాజాధిపా
D) తారాశశాంకము
జవాబు:
B) సీతామనోహరా

ప్రశ్న 3.
“శార్దూల పద్యం”లో వచ్చు గణములు
A) న, జ, భ, జ, జ, జ, ర
B) స, భ, ర, న, మ, య, వ
C) మ, స, జ, స, త, త, గ
D) భ, ర, న, భ, భ, ర, వ
జవాబు:
C) మ, స, జ, స, త, త, గ

ప్రశ్న 4.
ధనము, ధనాభిమానము, సదా ధనతృష్ణయు మూడు దోషముల్ – ఈ పద్యపాదంలో 11వ స్థానం యతి వచ్చింది. అయితే ఈ పద్యపాదం
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) మత్తేభం
D) శార్దూలం
జవాబు:
B) చంపకమాల

ప్రశ్న 5.
ఇంద్ర గణములు ఏవి ?
A) న, హ
B) నగ, నల, సల, భ, ర, త
C) య, ర, త, భ, జ, స
D) మ, న, లగ
జవాబు:
B) నగ, నల, సల, భ, ర, త

IV. వాక్యాలు :

ప్రశ్న 1.
రామకృష్ణారావు సత్యాగ్రహం చేశారు. రామకృష్ణారావు జైలుకు వెళ్ళారు. పై వాక్యాలు సంక్లిష్ట వాక్యాలుగా మారిస్తే
A) రామకృష్ణారావు సత్యాగ్రహం చేశారు, జైలుకు వెళ్ళారు.
B) రామకృష్ణారావు సత్యాగ్రహం చేశారు కాబట్టి జైలుకు వెళ్ళారు.
C) రామకృష్ణారావు సత్యాగ్రహం చేసి, జైలుకు వెళ్ళారు.
D) రామకృష్ణారావు సత్యాగ్రహం చేసినా జైలుకు వెళ్ళారు.
జవాబు:
C) రామకృష్ణారావు సత్యాగ్రహం చేసి, జైలుకు వెళ్ళారు.

ప్రశ్న 2.
పాండవులు అరణ్యవాసం చేశారు. పాండవులు అజ్ఞాతవాసం చేశారు. పై వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మారిస్తే
A) పాండవులు అరణ్యవాసం చేసి, అజ్ఞాతవాసం చేశారు.
B) పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేశారు.
C) పాండవులు అరణ్యవాసం చేశారు కాని అజ్ఞాతవాసం కూడా చేశారు.
D) పాండవులు అరణ్యవాసం చేసినా అజ్ఞాతవాసం కూడా చేశారు.
జవాబు:
B) పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేశారు.

ప్రశ్న 3.
సామాన్య వాక్యాలు ఏవి ?
A) చైతన్య వాలీబాల్ ఆడతాడు. నిర్మల్ క్రికెట్ ఆడతాడు.
B) చైతన్య వాలీబాల్ ఆడితే, నిర్మల్ క్రికెట్ ఆడతాడు.
C) చైతన్య వాలీబాల్ ఆడతాడు కాబట్టి, నిర్మల్ క్రికెట్ ఆడతాడు.
D) చైతన్య మరియు నిర్మల్లు, వాలీబాల్ మరియు క్రికెట్ ఆడతారు..
జవాబు:
A) చైతన్య వాలీబాల్ ఆడతాడు. నిర్మల్ క్రికెట్ ఆడతాడు.

ప్రశ్న 4.
“నేను ఈ ఇడ్లీలు చేశాను” అంది హైమ – ఈ వాక్యాన్ని పరోక్ష కథనంలోకి మారిస్తే
A) హైమ అన్నది “నేను ఈ ఇడ్లీలు చేశాను,” అని.
B) తాను ఈ ఇడ్లీలు చేశానని హైమ అన్నది.
C) తాను చేసిన ఇడ్లీలు ఏవి అని హైమ అన్నది.
D) హైమ చేసిన ఇడ్లీలు ఇవి అని ఆమె అన్నది.
జవాబు:
B) తాను ఈ ఇడ్లీలు చేశానని హైమ అన్నది.

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

Telangana SCERT 9th Class Telugu Guide Telangana 5th Lesson శతక మధురిమ Textbook Questions and Answers.

TS 9th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక మధురిమ

చదువండి – ఆలోచించి చెప్పండి (Textbook Page No. 45)

బలవంతుఁడ నాకేమని
పలువురతో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము
చలిచీమల చేతఁజిక్కి చావదె సుమతీ!

ప్రశ్నలు

ప్రశ్న 1.
బలవంతుడననే అహంకారం ఎందుకు ఉండకూడదు ?
జవాబు:
బలవంతుడను అనే అహంకారంతో పదిమందితోనూ తగవు పెంచుకుంటే, ఆ పదిమంది కలసి, ఆ బలవంతుణ్ణి చావగొడతారు. అందువల్ల బలవంతుడననే అహంకారం ఉండరాదు.

ప్రశ్న 2.
చలిచీమల నుంచి మీరేమి తెలుసుకున్నారు ?
జవాబు:
చలిచీమలు సహజంగా బలములేనివి. కాని ఆ చలిచీమలు అన్నీ కలిసి, బలవంతమైన సర్పాన్ని చంపుతాయి. దానిని బట్టి సంఘీభావంతో బలహీనులు కూడా, ఎంతటి ఘనకార్యాన్ని అయినా చేయగలరని చలిచీమల నుండి నేను నేర్చుకున్నాను.

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

ప్రశ్న 3.
పై పద్యం ద్వారా తెలిసే నీతి ఏమిటి?
జవాబు:

  1. బలవంతుడనే గర్వంతో, పెక్కుమందితో విరోధం కూడదు.
  2. బలహీనులు కూడా కలసిమెలసి ఉంటే, ఎంతటి ఘనకార్యాన్ని అయినా చేయగలరు. అనే నీతులు ఈ పద్యం ద్వారా గ్రహించాలి.

ప్రశ్న 4.
ఇట్లాంటి నీతులు ఉండే పద్యాలు సాధారణంగా ఏ ప్రక్రియలో కనబడుతాయి ?
జవాబు:
ఇట్లాంటి నీతులు ఉండే పద్యాలు సాధారణంగా శతక ప్రక్రియలో కనబడతాయి.

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 48)

ప్రశ్న 1.
“భక్తుడు పద్ధతి తప్పడు” అని కవి అన్నాడు కదా! పద్ధతి తప్పడమంటే, మీరేమనుకుంటున్నారు ?
జవాబు:
భక్తుడు పద్ధతి తప్పడు అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, భక్తుడు భగవంతుణ్ణి విశ్వసించి భగవంతుణ్ణి త్రికరణశుద్ధిగా ఆరాధిస్తాడనీ, తాను చేసే దైవ పూజా పద్ధతిని విడిచి, మరోదారి త్రొక్కడనీ ఎల్లవేళలా భక్తుడు భగవంతుడినే నమ్మి కొలుస్తాడనీ దీని భావము.

ప్రశ్న 2.
కీర్తి ఎలా కలుగుతుంది?
జవాబు:
కీర్తి అంటే మంచిపేరు. లోకానికి ఉపకారం జరిగే మంచి పనులు చేస్తే, కీర్తి కలుగుతుంది. మిగిలిన వారికంటె తాను కష్టపడి మంచి విజయాలు సాధిస్తే, అతడికి మంచి కీర్తి కలుగుతుంది. రాజులు వంటివారు మంచిగా ప్రజలను పాలిస్తే, వారికి కీర్తి కలుగుతుంది. కవులూ, పండితులూ వంటివారు మంచి గ్రంథ రచనలు చేస్తే వారికి కీర్తి కలుగుతుంది.

ప్రశ్న 3.
మనిషి చేయకూడని పనులేమిటి?
జవాబు:
ఇతరుల సొమ్మును ఆశించి, జోస్యాలు చెప్పరాదు. అబద్ధాలు చెప్పరాదు. అన్యాయంగా కీర్తిని పొందరాదు. కొండెములు చెప్పరాదు. హింస చేయరాదు. లేనిపోని వ్యాఖ్యానాలు చేయరాదు.

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 49)

ప్రశ్న 1.
“పరోపకారం శరీరానికి ఆభరణం” అని కవి ఏ ఉద్దేశంతో అన్నాడు ?
జవాబు:
పరోపకారం చేయడం కోసమే దేవుడు మనకు శరీరాన్ని ఇచ్చాడు. అందువల్ల మన శక్తి కొద్దీ, మనం ఇతరులకు సాయపడాలి. మన శరీరానికి అందం కోసం, సుగంధద్రవ్యాలు రాసుకుంటూ ఉంటాము. నిజానికి అవి శరీరానికి అందాన్ని ఇవ్వవనీ, పరులకు గొప్పగా ఉపకారం చేయడమే, మనిషికి నిజమైన అలంకారమనీ కవి తన అభిప్రాయం వెలిబుచ్చాడు.

ప్రశ్న 2.
రాజు ఏ విధంగా ప్రవర్తిస్తే, పనులు నెరవేరుతాయి ?
జవాబు:
రాజు తనకు తానుగా తన బుద్ధితో చక్కగా ఆలోచించి కార్య నిర్ణయం చేయాలి. అతనికి స్వయంగా మంచి బుద్ధి పుట్టాలి. అప్పుడే ఆయన పనులు నెరవేరతాయి.

ప్రశ్న 3.
దుర్యోధనుడు ఎట్లాంటివాడు ?
జవాబు:
దుర్యోధనుడికి తనకు తానుగా బుద్ధిలో ఆలోచన పుట్టదు. అతడు తన మిత్రులు సలహా ప్రకారమే నడచుకొనేవాడు. దుష్ట చతుష్టయము” అని పిలువబడే ఆ మిత్రుల సలహా సంప్రదింపుల ప్రకారమే, దుర్యోధనుడు నడచుకొనేవాడు.

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 50)

ప్రశ్న 1.
సజ్జనాప్తి వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి?
జవాబు:
సజ్జనాప్తి వల్ల పేదవాడికి ధనతృష్ణ నశిస్తుంది.

ప్రశ్న 2.
ధనమువల్ల కలిగే దోషాలు ఏవి ?
జవాబు:
ధనము ఉంటే ధనం మీద అభిమానము, ఇంకా ధనం సంపాదించాలనే దురాశ పెరుగుతాయి. ధనము వల్ల మదము, అహంకారము పెరుగుతాయి. ధనతృష్ణ పెరిగితే, ధన సంపాదన కోసం తప్పుడు మార్గాలను మానవుడు అనుసరిస్తాడు. అవినీతికి పాల్పడుతాడు. సజ్జనులకు కష్టాలు కల్గిస్తాడు.

ప్రశ్న 3.
మనుషులు విషంతో నిండి ఉన్నారని అనడంలో కవి ఉద్దేశం ఏమిటి ?
జవాబు:
మనుషులు కామక్రోధలో భమదమోహమాత్సర్యములతో నిండి యున్నారని చెప్పడానికే, కవి మనుషులు విషంతో నిండియున్నారని చెప్పాడు. మనుషులలో స్వార్థం, అవినీతి, దుర్మార్గం, మోసం పెరిగిపోయాయని చెప్పడానికే, కవి మనుషులు విషంతో నిండియున్నారని చెప్పాడు.

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 51)

ప్రశ్న 1.
ఇంట్లో బాధలు కలగడానికి గల కారణాలు ఏమై ఉంటాయి?
జవాబు:
సహజంగా ఇళ్ళల్లో అత్తాకోడళ్ళ విషయంలో కొన్ని బాధలు వస్తూ ఉంటాయి.

  1. వచ్చిన కోడలిని అత్తగారు తన కుమారుని భార్యగా ఆదరించకుండా, వేరింటి పిల్లగా చూడడం మొదటి కారణం.
  2. వచ్చిన కోడలు అత్తగారిని తన తల్లిగా చూడడం మాని, ఏదో రాక్షసిని చూసినట్లు చూడడం రెండో కారణం.
  3. కోడలు కట్న కానుకలను ఎక్కువగా తేలేదని, ఆమెను నిందించడం.
  4. కోడలి పుట్టింటి వారిని గూర్చి అగౌరవంగా మాట్లాడడం.
  5. ఇచ్చిన కట్నం చాలలేదనడం, మనవడే పుట్టాలనడం వంటి కారణాల వల్ల ఇంట్లో బాధలు కలుగుతాయి.

ప్రశ్న 2.
ఇతర మతస్థులతో కూడా ఎందుకు ప్రేమగా ఉండాలి ?
జవాబు:
ప్రపంచంలో ఎన్నో మతాలున్నాయి. అన్ని మతాలూ దైవాన్ని గురించి ఒకే మాట చెపుతున్నాయి. భగవంతుడిని ప్రేమించాలని ఆయనే సర్వానికీ కారణమనీ, అన్ని మతాలూ చెపుతున్నాయి.

అన్ని మతాలు చెప్పేది ఒకటే కనుక, ఇతర మతస్థులతో కూడా మనం ప్రేమగా ఉండాలి. ఇతర మతస్థులను మన అన్నదమ్ముల వంటి వారిగా ఆదరిస్తే, మత కలహాలు, కొట్లాటలు లేక ప్రపంచం శాంతి ధామం అవుతుంది.

ప్రశ్న 3.
‘శాంతి’ అంటే ఏమిటి? ఇది నేడు ఎందుకు కనుమరుగైపోయింది ?
జవాబు:
‘శాంతి’ అంటే కామక్రోధాది షడ్గుణాలు లేకపోవడం. ‘శాంతి’ అంటే ప్రేమ, సహనము, ఆదరము. నేడు కులమత కలహాల వల్ల, ఉన్నదానితో సంతృప్తి లేకపోవడం వల్ల, అవినీతి, లంచగొండితనం, అక్రమ పరిపాలనల వల్ల, అశాంతి పెరిగింది. మనుష్యులలో మానవత్వం నశించి, దానవత్వం ప్రబలింది. అన్ని ప్రాణులనూ తనలాగే చూస్తే, శాంతి వర్ధిల్లుతుంది.

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి.

అ) “సమాజానికి మార్గనిర్దేశనం చేసేవాళ్ళు శతకకవులు” చర్చించండి.
జవాబు:
శతకకవులు తమ శతకాలను తమకు గల ఎంతో అనుభవంతో, తమకు కలిగిన పుస్తక జ్ఞానంతో, దృష్టాంతాలతో, నీతులతో రాస్తారు. కాబట్టి శతకాలలో ముఖ్యంగా నీతి శతకాల్లో శతకకవులు చెప్పిన నీతులు సమాజానికి చక్కని మార్గాన్ని నిర్దేశిస్తాయి.

ఉదాహరణకు మనం చదివిన శతక పద్యాలు చూద్దాం.

  1. అందె వేంకటరాజం గారు, నింబగిరి శతకంలో కోడలిని కూతురుగా చూడాలని, కార్మికులను కర్మశాలల్లో భాగస్థులను చేయాలని, దళితులను సోదరులుగా చూడాలని, ఇతర మతాల వారిని తమ వారిగా ప్రేమించాలని చెప్పి, సమాజానికి మంచి మార్గాన్ని చూపించారు.
  2. అలాగే కాళహస్తీశ్వర శతకంలో పరుల సొమ్మును ఆశించి మనుష్యులు చేసే చెడ్డపనులను గూర్చి చెప్పారు. పరద్రవ్యమును ఆశించి, ఆ చెడ్డపనులు చేయరాదని ధూర్జటి ఆ విధంగా సమాజానికి హితాన్ని బోధించాడు.
  3. మల్ల భూపాలీయంలో చెవికి శాస్త్రజ్ఞానము, చేతికి దానము, శరీరానికి పరోపకారము ముఖ్యాలంకారాలని కవి చెప్పాడు.
  4. రాజుకు సరైన ఆలోచన మనస్సులో పుట్టడం ముఖ్యమని భాస్కర శతక కర్త చెప్పాడు. దీనిని బట్టి శతకకవులు సమాజానికి మార్గనిర్దేశకులు అన్న మాట సత్యము.

ప్రశ్న 2.
పాఠంలోని పద్యాలలో కింది భావాలకు తగిన పద్య పాదాలను గుర్తించండి.

అ) “సూర్యచంద్రులు గతిదప్పినా”
జవాబు:
“జలజాతప్రియ శీతభానులు యథాసంచారముల్ దప్పినన్” అనేది, పై భావాన్ని ఇచ్చే పద్యపాదము.

ఆ) ‘మొదటిదైన ధనం పేదకు ఉండదు’
జవాబు:
‘తొల్తటిది ద్రవ్యము పేదకు లేదు’ – అనేది, పై భావాన్ని ఇచ్చే శతక పద్యపాదము.

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

ఇ) ‘అన్ని జీవులను తనలాగే ఆదరిస్తే’
జవాబు:
‘’అఖిల జీవుల తనవోలె నాదరింప’ – అనేది, పై భావాన్ని ఇచ్చే శతక పద్యపాదము.

ప్రశ్న 3.
కింది పద్యాలను పాద భంగము లేకుండా పూరించండి. వాటి భావం రాయండి.

అ) కులశైలంబులు ………………. సర్వేశ్వరా!
జవాబు:
“కులశైలంబులు పాదు పెల్లగిలి దిక్కులంబునం గూలినన్
జలధుల్ మేరల నాక్రమించి సముదంచద్భంగి నుప్పొంగినన్,
జలజాతప్రియ శీతభానులు యథాసంచారముల్ దప్పినన్!
దలకం డుబ్బఁడు చొప్పుదప్పుఁడు భవద్భక్తుండు సర్వేశ్వరా !

భావం : ఓ సర్వేశ్వరా! కుల పర్వతాలు స్థిరత్వాన్ని తప్పి పెల్లగిలి దిగంతముల వద్ద పడిపోయినా, సముద్రాలు హద్దులను అతిక్రమించి పైకి నెట్టబడి ఉప్పొంగినా, సూర్య చంద్రులు తిరుగవలసిన రీతిగా తిరగడం మానినా నీ భక్తుడు చలించడు. పొంగిపోడు. తన పద్దతిని తప్పడు.

ఆ) ధనము, ధనాభిమానము, ………. శ్రియఃపతీ !
జవాబు:
ధనము, ధనాభిమానము, సదాధనతృష్ణయు మూడు దోషముల్
ధనికున కందు తొల్తటిది ద్రవ్యము పేదకు లేదు కావునన్
ధనికుని కంటె పేదకడు ధన్యుడు, యాతని తృష్ణ సజ్జనా
ప్తిని శమియించు వేంకటపతీ! అఖిలాండపతీ! శ్రియఃపతీ !

భావం : ఓ వేంకటపతీ! బ్రహ్మాండాధిపతీ! లక్ష్మీనాథా! ధనమూ, ధనముపై అభిమానమూ, ఎల్లప్పుడూ ధనం సంపాదించాలనే కోరికా అనే మూడు దోషాలూ ధనవంతుడికి ఉంటాయి. కాని పేదవాడికి అందులో ధనము అనే దోషం ఉండదు. పేదవాడికి ధనాశ ఉన్నా మంచివారికి దగ్గర ఉండడం వల్ల అతడిలో ధనాశ పోతుంది. కాబట్టి పేదవాడు ధనికుని కంటె ధన్యుడు.

ప్రశ్న 4.
కింది పద్యాన్ని చదువండి.

సీ|| కోపంబు చే నరుల్ క్రూరాత్ములగుదురు
కోపంబు మనుషుల కొంప ముంచు
కోపంబు వలననె పాపంబులును హెచ్చు
కోపంబుననె నింద గూడ వచ్చు
కోపంబు తన చావు కొంచెంబు నెరుగదు
కోపంబు మిత్రులన్ కొంచెపరుచు

కోపంబు హెచ్చినన్ శాపంబులున్ వచ్చు
కోపంబు జూడగా కొరివి యగును
తే॥ కోపము నరుని సాంతము కూల్చును భువి
లేదు వెదికిన యిటువంటి చేదు ఫలము
వినుడి మాయప్ప శిద్దప్ప విహితుడప్ప కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప
– ప్రసిద్ధి రామప్పవరకవి (సిద్దప్ప), కరీంనగర్ జిల్లా.

పై పద్యం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.

అ) కవి చేదు ఫలమని దేనిని అన్నాడు ?
ఎ) వేపపండు
బి) కోపం
సి) పాపం
డి) కాకరపండు
జవాబు:
బి) కోపం

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

ఆ) కోపం ఎక్కువైతే వచ్చే ఫలితం ?
ఎ) శాపం
బి) పాపం
సి) నింద
డి) కొరివి
జవాబు:
ఎ) శాపం

ఇ) కోపంచేత మనుషులు ఎట్లా మారుతారు ?
ఎ) పాపాత్ములు
బి) దురాత్ములు
సి) నీచాత్ములు
డి) క్రూరాత్ములు
జవాబు:
డి) క్రూరాత్ములు

ఈ) ‘సొంతం’ అను పదం అర్థమేమిటి?
ఎ) కొంత
బి) మొత్తం
సి) సగం
డి) శూన్యం
జవాబు:
బి) మొత్తం

ఉ) కోపం ఎవరి కొంప ముంచుతుంది ?
ఎ) మనుషుల
బి) మంచివారి
సి) దుర్మార్గుల
డి) నీచుల
జవాబు:
ఎ) మనుషుల

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

ప్రశ్న 1.
కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) ధనతృష్ణ ఎప్పుడు నశిస్తుందో వివరించండి.
జవాబు:
ధనతృష్ణ సజ్జనాప్తిచే నశిస్తుంది. సజ్జనాప్తి అంటే సత్పురుష సహవాసం. శంకరాచార్యులవారు భజగోవింద శ్లోకాలలో, సత్సంగత్వం వల్ల నిస్సంగత్వము, నిస్సంగత్వము వల్ల నిర్మోహత్వము ఏర్పడుతాయని చెప్పారు.

ధనముపై దురాశ అంత తేలికగా నశించదు. మంచివారితో కలియడం వల్ల, వారి మంచి మాటల వల్ల క్రమంగా ధనముపై దురాశ పోతుంది. చనిపోయినపుడు మనం సంపాదించిన ద్రవ్యం, మన వెంటరాదని, మనం చేసుకున్న పుణ్యపాపకర్మల ఫలమే, మన వెంట వస్తుందనీ, సజ్జన సహవాసం వల్ల తెలుస్తుంది. దాని వల్ల ధనతృష్ణ క్రమంగా నశిస్తుంది.

ఆ) మనిషికి నిజమైన అందాన్ని ఇచ్చేవి ఏవి ?
జవాబు:
చెవులకు శాస్త్ర పాండిత్యము అందాన్ని ఇస్తుంది. కుండలాలు చెవులకు అందాన్ని ఇవ్వవు. చేతులకు దానము అందాన్ని ఇస్తుంది. చేతులకు కంకణాలు అందాన్ని ఇవ్వవు. శరీరానికి పరోపకారమే అందాన్ని ఇస్తుంది. శరీరానికి సుగంధలేపనాలు, అందాన్ని ఇవ్వవు. శాస్త్ర పాండిత్యము, దానము, పరోపకారము అనేవి మనిషికి నిజమైన అందాన్నిస్తాయి.

ఇ) ఆపదలు రాకుండా ఉండాలంటే ఎక్కడ ఎట్లా ప్రవర్తించాలి ?
జవాబు:
ఆపదలు రాకుండా ఉండాలంటే, మన ప్రవర్తనలో మార్పులు రావాలి.

  1. కోడలిని కూతురివలె చూడాలి.
  2. కార్మికులను కర్మశాలల్లో భాగస్థులను చేయాలి.
  3. దళితులను తన సోదరుల వలె మన్నించాలి.
  4. పరమతస్థులను తనవారివలె ప్రేమించాలి.
  5. జీవులందరినీ తనవలె చూసుకొని, ప్రేమతో ఆదరించాలి.

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

ఈ) “ధనవంతునికంటే కూడా పేదవాడు గొప్పవాడు.” దీని గురించి మీ అభిప్రాయం తెలుపండి.
జవాబు:
ధనవంతుడిలో సామాన్యంగా ఈ కింది మూడు దోషాలు ఉంటాయి.

  1. ధనము,
  2. ధనాభిమానము,
  3. ధనతృష్ణ.

ఇందులో పేదవాడికి ధనము ఉండదు. కాబట్టి పేదవాడికి ‘ధనము’ అనే దోషం అతడిలో ఉండదు – ధనవంతుడిలో ఉండే ధనతృష్ణ అనే దోషము పేదవాడికి సజ్జన సహవాసం చేత పోతుంది. అందువల్ల పేదవాడిలో ధనము, ధనతృష్ణ అనే రెండు దోషాలు ఉండవు. అందుచేతనే ధనికుని కంటే పేదవాడు గొప్పవాడని చెప్పాలి.

ధనము ఉన్న కొద్దీ, ఇంకా సంపాదించాలనే దురాశ పెరుగుతుంది. ఆ ధనాన్ని ఎలా వృద్ధి చేయాలా ? అనే చింత పట్టుకుంటుంది. ఆ ధనాన్ని ఎలా దాచాలా అనే విచారం కలుగుతుంది. ఆ విచారంతో ధనవంతుడు ఎ.సి గదుల్లో కూడా హాయిగా నిద్రపోలేడు.

పేదవాడికి ధనం పోతుందనే విచారం లేదు. అందువల్ల ధనికుని కంటే పేదవాడు గొప్ప అని నా అభిప్రాయం.

ప్రశ్న 2.
కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) ‘శతక పద్యాలు సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తాయి – విమర్శిస్తాయి’ వివరించండి.
జవాబు:
సామాన్యంగా శతకకవులు తన కాలం నాటి సంఘంలోని మంచి చెడులను గూర్చి తమ పద్యాలలో చెపుతారు. ఆ కవులు నాటి సంఘంలోని దురాచారాల్ని ఎత్తి చూపి విమర్శిస్తారు. నీతి మార్గాన్ని సంఘానికి బోధిస్తారు. మన శతకపద్యాల్లో ధూర్జటి రచించిన కాళహస్తీశ్వర శతక పద్యంలో నాటి సంఘంలోని మనుష్యులు, పరద్రవ్యాన్ని ఆశించి ఎలా బ్రతుకుతున్నారో చెప్పాడు.

పరద్రవ్యాన్ని ఆశించి జోస్యాలు చెప్పడం, అబద్ధాలాడడం, వంకర మార్గంలో కీర్తిని సాధించే ప్రయత్నం చేయడం, చాడీలు చెప్పడం, హింసను ప్రేరేపించడం వంటి పనులు చేస్తున్నారని చెప్పాడు. ఇది ధూర్జటి కాలం నాటి సమాజ ప్రతిబింబం అనడంలో వివాదం అక్కరలేదు.

అలాగే అందె వేంకటరాజంగారు ఇంట్లో అత్తాకోడళ్ళ పోరాటాలు, కర్మశాలలో అలజడులు, దళితుల పట్ల అగ్రవర్ణాల అరాచకాలు, మతహింస వంటి, నేటి సమాజంలోని లోపాలను ఎత్తిచూపి, వాటిని పరిహరించే మార్గాలను కూడా ఉపదేశించారు. ఈ పద్యం నేటి సమాజానికి చక్కని ప్రతిబింబం.

ఈశ్వరుడు విషాన్ని మింగడం గొప్పకాదనీ, నేటి మనుష్యులలోని విషాన్ని పోగొట్టమనీ రాజరాజేశ్వర శతక పద్యంలో కవి చెప్పారు. నేటి మనుష్యులలో అవినీతి, లంచగొండితనం, దురాచారాలు వంటి విషం పెరిగి పోయిందని, కవి ఈనాటి సంఘాన్ని గురించి దీనిలో విమర్శించారు. కాబట్టి శతక పద్యాలు, సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తాయనీ, విమర్శిస్తాయనీ చెప్పడం యథార్థము.

ప్రశ్న 3.
కింది అంశాల గురించి సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా రాయండి.

అ) పాఠంలోని మీకు నచ్చిన పద్య భావాల్ని ఆధారంగా చేసుకొని ఒక కథను రాయండి.
జవాబు:

తీరని రుక్కు కోరిక

‘రుక్కు’ గారి భర్త, రైల్వేలో ఏదో పనిచేసేవాడు. రుక్కుగారి పెద్దకొడుకు కంప్యూటర్ ఇంజనీరు. రుక్కుగారు పెద్దకొడుక్కి మూడేళ్ళ కితం పెళ్ళయింది. ప్రస్తుతం రుక్కుగార్కి ఏడాది దాటిన మనవడు ఉన్నాడు. రుక్కుగారి కోడలు కూడా కంప్యూటర్ బి.టెక్ చదివింది. రుక్కుగార్కి మరో కొడుకు ఉన్నాడు. కాని ఎడ్రస్ లేదు. పెద్ద కొడుకు చేత హైదరాబాద్లో బ్యాంకు లోను పెట్టించి, రుక్కు మూడు బెడ్రూమ్ల ఇల్లు కొనిపించింది. రుక్కుగారి భర్త ఈ మధ్యనే రిటైరయ్యాడు. రుక్కుగార్కి హైదరాబాద్ వెళ్ళి కోడలుపై పెత్తనం చేస్తూ కొడుకు డబ్బును అంతా తానే మేనేజ్ చేయ్యాలని పెద్ద ఆశ. రుక్కుకు ఇంకెక్కడా ఇల్లు లేదు. మొగుడికి ఏదో కొద్దిపాటి పెన్షను రావచ్చు. కోడలును తన గుప్పిట్లో పెట్టి నలిపేస్తూ, మనవడిని తన ఇష్టం వచ్చినట్లు పెంచాలని రుక్కుగారి ఉబలాటం. రుక్కుకు కూతురు లేదు. రుక్కుకు తన మాట ఇంట్లో సాగకపోతే, ఏడుపు వస్తుంది.

‘రుక్కు’ తన ఇంటికి వచ్చినప్పుడల్లా పెంట పెడుతుంది. ఇప్పుడు పర్మనెంటుగా మొగుడిని వెంట పెట్టుకొని హైదరాబాద్ వస్తే ఏం అల్లరిచేస్తుందో అని రుక్కు కోడలుకు గుండె గుబగుబలాడుతోంది. రుక్కు మొగుడు పాపం పెంపుడు కుక్క పిల్లలాంటివాడు. నోట్లో నాలుక లేదు. “అద్దె ఇంట్లో మనమిద్దరం హాయిగా ఉందాం. హైదరాబాద్ వద్దు. అన్నాడు రుక్కుతో ఆమె భర్త. రుక్కుకు చాలా కోపం వచ్చింది. ఏడ్చింది. రుక్కుకు జోస్యాల మీద మంచి నమ్మకం. ఒక మఠంలో సన్యాసి రుక్కు హైదరాబాద్ వెళ్ళడం మంచిది కాదని జోస్యం చెప్పాడు. పాపం రుక్కుకు కోడల్ని ఎలా సతాయించాలో అర్థం కాలేదు. కొడుకు కూడా రుక్కును రావద్దన్నాడు. జోస్యం అల్లాగే ఉంది. రుక్కు కోరిక తీరే మార్గం ఇప్పట్లో లేనట్లే.

(లేదా)

ఆ) పాఠంలోని పద్యభావాల ఆధారంగా విద్యార్థులలో నీతి, విలువల పట్ల అవగాహన పెంచటానికై ఒక కరపత్రాన్ని తయారు చేయండి.
జవాబు:
‘విద్యార్థులు – నీతినియమాలు’

విద్యార్థి సోదరులారా! దైవభక్తి కలిగి ఉండండి. ఐశ్వర్యం శాశ్వతం కాదు. ధనం కోసం అబద్ధాలాడకండి. ర్యాంకుల కోసం తప్పుడుదారులు తొక్కకండి. తోడి పిల్లలపై కొండెములు చెప్పి, హింసను ప్రేరేపించకండి. సిరి శాశ్వతం కాదు. వేషభాషలపై వెర్రితనం మంచిది కాదు. విద్య ప్రధానము. అలంకారాలు ముఖ్యం కాదు. పరోపకారమే విద్యార్థులకు నిజమైన అలంకారం అని తెలుసుకోండి.

మీరు కార్యాన్ని సాధించాలంటే బాగా బుద్ధి పెట్టి ఆలోచన చెయ్యండి. ఇతరుల సలహాలపై ముందుకు సాగకండి. ధనముపై దురాశ పెంచుకోకండి. మన చుట్టూ మనుష్యులలో విషం ఉన్న వాళ్ళున్నారు. వారి విషయంలో జాగ్రత్తపడండి.

మీ దళిత మిత్రులను సోదరులుగా చూడండి. పరమతాల వారిని ప్రేమించండి. జీవులందరినీ మీలాగే చూడండి. గురువుల మాటలను తలదాల్చండి. శాంతి, సత్యము, అహింసలకు ప్రధాన స్థానమియ్యండి. ఇది కరపత్రం కాదు. భగవద్గీత అని నమ్మండి.

ఇట్లు,
విద్యార్థి మిత్రులు.

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

III. భాషాంశాలు

పదజాలం

1. కింది పదాలకు అర్థాలు రాస్తూ, సొంతవాక్యాలు రాయండి.

ఉదా : ఆపద = కష్టం
వాక్యప్రయోగం : ఆపదలు వచ్చినపుడు ఓర్పుతో, ఉపాయంతో వ్యవహరించాలి.

అ) నిక్క = నిజము
వాక్యప్రయోగం : సర్వకాలములయందు భగవంతుని ముందు నిక్కం మాట్లాడాలి.

ఆ) ఒజ్జ = గురువు
వాక్యప్రయోగం : శిష్యులకు ఒజ్జలమాటలు శిరోధార్యములు.

ఇ) తృష్ణ = దప్పి, పేరాస
వాక్యప్రయోగం : ధనతృష్ణ మానవులకు సర్వానర్ధదాయకము.

ఈ) విభూషణం = ఆభరణము
వాక్యప్రయోగం : నేటికాలంలో యువతకు విద్యయే విభూషణం.

2. కింది పదాలకు పర్యాయపదాలు రాసి, వాటితో వాక్యాలు రాయండి.

ఉదా : కూతురు : పుత్రిక, కుమార్తె
వాక్యప్రయోగము : జనకుని పుత్రిక సీతాదేవి, ఈ కుమార్తె వలన జనకుడు పరమానందాన్ని పొందాడు.

అ) తృష్ణ :

  1. దప్పిక
  2. దప్పి
  3. పిపాస

వాక్యప్రయోగము : వేసవి తాపం వల్ల దప్పిక పెరిగింది. పిపాస తీరాలంటే నిమ్మ నీరు త్రాగాలి.

ఆ) సజ్జనుడు :

  1. సత్పురుషుడు
  2. సుజనుడు

వాక్యప్రయోగము : సుజనుడికి లోకమంతా మంచిగానే కన్పిస్తుంది. ఆ సత్పురుషుడు లోకానికి మంచి మార్గాన్ని చూపిస్తాడు.

ఇ) మహి :

  1. భూమి
  2. ధరణి
  3. వసుధ

వాక్యప్రయోగము : భూమిపై పచ్చనిచెట్లు లేవు. ధరణి అంతా నిర్జీవంగా కనిపిస్తోంది.

ఈ) శైలము :

  1. పర్వతము
  2. అద్రి
  3. గిరి

వాక్యప్రయోగము : గిరి పుత్రిక పార్వతి పర్వతమును ఎక్కుతోంది.

3. కింది వాక్యాలను గమనించండి. ఆయా వాక్యాల్లోని ప్రకృతి – వికృతుల్ని గుర్తించండి. వాటి కింద గీత గీయండి.

అ) ప్రతి మనిషికి తెలియకుండా దోషం చేయడం తప్పుకాదేమో కాని తెలిసి దోసం చేయడం తప్పు.
జవాబు:
ప్రతి మనిషికి తెలియకుండా దోషం చేయడం తప్పుకాదేమో కాని తెలిసి దోసం చేయడం తప్పు.

ఆ) సింహం వేట ద్వారా ఆహారాన్ని పొందుతుంది. కానీ ఆకలి వేసినప్పుడే సింగం వేటాడుతుంది.
జవాబు:
సింహం వేట ద్వారా ఆహారాన్ని పొందుతుంది. కానీ ఆకలి వేసినపుడే సింగం వేటాడుతుంది.

ఇ) ఏ కార్యమైనా శ్రమిస్తేనే పూర్తి చేయగలం. కాని కర్ణం నిర్వహించే తీరు తెలియాలి.
జవాబు:
ఏ కార్యమైనా శ్రమిస్తేనే పూర్తి చేయగలం. కాని కర్ణం నిర్వహించే తీరు తెలియాలి.

ఈ) కలహం ఏర్పడినపుడు శాంతం వహిస్తే, కయ్యం నెయ్యంగా మారుతుంది.
జవాబు:
కలహం ఏర్పడినపుడు శాంతం వహిస్తే, కయ్యం నెయ్యంగా మారుతుంది.

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

వ్యాకరణాంశాలు

1. కింది పదాలను విడదీయండి. సంధుల పేర్లు గుర్తించి రాయండి.

అ) కలహాగ్నులు = కలహ + అగ్నులు = సవర్ణదీర్ఘ సంధి
ఆ) వేంకటేశ్వరా = వేంకట + ఈశ్వరా = గుణసంధి
ఇ) కుండలమొప్పు = కుండలము + ఒప్పు = ఉత్వసంధి
ఈ) యోధులనేకులు = యోధులు + అనేకులు = ఉత్వసంధి

2. కింది సమాసపదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేర్లు రాయండి.

అ) కార్యదక్షుడు – కార్యమునందు దక్షుడు – సప్తమీ తత్పురుష సమాసం
ఆ) మూడుదోషాలు – మూడైన దోషాలు – ద్విగు సమాసం
ఇ) కర్మశాల – కర్మము కొఱకు శాల – చతుర్థీ తత్పురుష సమాసం
ఈ) ఆశాపాశం – ఆశ అనె పాశం – రూపక సమాసం

3. కింది పద్యపాదాలు పరిశీలించి, గణవిభజన చేసి, గణాలు గుర్తించి, ఏ పద్యపాదమో రాయండి.

అ) ధనము, ధనాభిమానము, సదా ధనతృష్ణయు మూడు దోషముల్
TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 9
పై పాదంలో న, జ, భ, జ, జ, జ, ర గణాలున్నాయి. కాబట్టి ఇది ‘చంపకమాల’ పద్యపాదం.

ఆ) భూపతికాత్మబుద్ధి మదిఁబుట్టనిచోటఁ బ్రధానులెంత ప్రజ్ఞా…..
TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 10
పై పాదంలో భ, ర, న, భ, భ, ర వ గణాలున్నాయి. కాబట్టి ఇది ‘ఉత్పలమాల’ పద్యపాదం.

సరళాదేశ సంధి

కింది పదాలు చదువండి. పదంలోని చివరి అక్షరం కింద గీతలు గీయండి.
ఉదా : 1) పూచెను
2) చూసెను
3) వచ్చెను
4) తినెను
5) చేసెన్
6) నడిచెన్
7) వెళ్ళెన్
జవాబు:
1) పూచెను
2) చూసెను
3) వచ్చెను
4) తినెను
5) చేసెన్
6) నడిచెన్
7) వెళ్ళెన్ ………..

పై పదాలను గమనిస్తే, ఆ పదాల చివర ను, న్ లు కనిపిస్తాయి. అంటే పదాల చివర ‘న’ కారం ఉన్నది. ఈ ‘న’ కారాన్ని ద్రుతం అంటారు. ద్రుతం (న) చివరగల పదాలను ‘ద్రుత ప్రకృతికాలు’ అంటారు. కావున చూచెను, పూచెను, తినెను, చేసెన్, నడిచెన్ మొదలైన పదాలు ద్రుతప్రకృతికాలే.

అభ్యాసము : మీరు కూడా మరికొన్ని ద్రుతప్రకృతిక పదాలు రాయండి.

  1. చేసెను
  2. వ్రాసెను
  3. వచ్చుచున్
  4. నాకొఱకున్
  5. నాయందున్

కింది వాటిని పరిశీలించండి.

అ) పూచెన్ + కలువలు = పూచెన్ + గలువలు
ఆ) దెసన్ + చూచి = = దెసన్ + జూచి
ఇ) చేసెన్ + టక్కు = చేసెన్ + డక్కు
ఈ) పాటిన్ + తప్ప = పాటిన్ + దప్ప
ఉ) వడిన్ + పట్టి = వడిన్ + బట్టి

పై పదాలను పరిశీలిస్తే

‘న్’ కు ‘క’ పరమైతే ‘క’ – ‘గ’ గా మారుతుంది.
”న్’ కు – ‘చూ’ పరమైతే ‘చూ’ – ‘జూ’ గా మారుతుంది.
‘న్’ కు ‘ట’ పరమైతే ‘ట’ – ‘డ’ గా మారుతుంది.
‘న్’ కు ‘త’ పరమైతే, ‘త’ – ‘ద’ గా మారుతుంది.
‘న్’ కు – ‘ప’ పరమైతే, ‘ప’ – ‘బ’ గా మారుతుంది.
అంటే
క → గ
చ → ‘జ’
ట → ‘డ’
త → ‘ద’
ప → ‘ఐ’ లుగా మారాయి
క, చ, ట, త, ప – లకు వ్యాకరణ పరిభాషలో పరుషాలని పేరు.
గ, జ, డ, ద, బ – లకు వ్యాకరణ పరిభాషలో సరళాలని పేరు.

పై ఉదాహరణలలోని భావాన్ని బట్టి సూత్రీకరిస్తే,

సూత్రము : ద్రుత ప్రకృతికాలకు పరుషాలు లు పరమైతే ఆ పరుషాలు సరళాలుగా మారుతాయి.

ఇప్పుడు కింది ఉదాహరణలను పరిశీలించండి.
పూచెన్ + కలువలు = పూచెన్ + గలువలు

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 11
పై ఉదాహరణ ఆధారంగా సంధి జరిగిన విధానాన్ని సూత్రీకరిస్తే

సూత్రము : ఆదేశ సరళానికి ముందున్న ద్రుతానికి బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయి.

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

4. కింది సంధి పదాలను విడదీసి, ద్రుత ప్రకృతిక సంధి లక్షణాలను పరిశీలించండి.

అ) గురువులఁగాంచి = గురువులన్ + కాంచి – గురువులఁగాంచి; గురువులం గాంచి ; గురువులన్గాంచి
ఆ) ఎక్కువగఁజొప్పడ = ఎక్కువగన్ + చొప్పడ – ఎక్కువగఁజొప్పడ ; ఎక్కువగంజొప్పడ ; ఎక్కువగన్జప్పడ
ఇ) తలఁదాల్చి = తలన్ + తాల్చి – తలదాల్చి ; తలం దాల్చి ; తలన్దాల్చి
ఈ) చెవికింగుండలంబు = చెవికిన్ + కుండలంబు – చెవికిఁగుండలంబు ; చెవికి౦గుండలంబు ; చెవికిన్గు౦డలంబు

శార్దూలం

కింది రెండు పద్యపాదాలను గణవిభజన చేసి పరిశీలిద్దాం!

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 12

గమనిక :

  1. పై పద్యపాదంలో వరుసగా మ, స, జ, స, త, త, గ గణాలు వచ్చాయి.
  2. పద్యానికి నాలుగు పాదాలున్నాయి.
  3. ప్రతి పాదంలో రెండవ అక్షరంగా ‘శ’ ఉన్నది. అంటే ప్రాస నియమం కలిగి ఉంది.
  4. 13వ అక్షరంతో యతి మైత్రి (నా 5) ప్రతి పాదంలో 19 అక్షరాలున్నాయి.

పై లక్షణాలు గల పద్యం “శార్దూలం”.

మత్తేభం

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 13

పై పద్యపాదాన్ని పరిశీలిస్తే

  1. దీనిలో వరుసగా స, భ, ర, న, మ, య, వ గణాలు వచ్చాయి.
  2. పద్యానికి నాలుగు పాదాలున్నాయి. ప్రతిపాదంలో ‘వ’ రెండవ అక్షరంగా ఉండి ప్రాసనియమం కలిగి ఉన్నది.
  3. 14వ అక్షరం యతి మైత్రి (చె – చే) చెల్లుతుంది.
  4. ప్రతిపాదంలో 20 అక్షరాలున్నాయి.
  5. ఈ లక్షణాలు గల పద్యం “మత్తేభం”.

ఈ పాఠ్యాంశంలోని ఐదు, ఏడు పద్యాలకు గణవిభజన చేసి అవి ఏ పద్యపాదాలో తెలుపండి.
TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 14

గమనిక :

  1. పై పాదంలో న, జ, భ, జ, జ, జ, ర గణాలున్నాయి.
  2. కాబట్టి ఇది చంపకమాల పద్యపాదము.
  3. యతి 11వ అక్షరము (ధ-దా) లకు.

7వ పద్యం :

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 15

గమనిక :
1) పై ఏడవ పద్యపాదంలో వరుసగా 6 ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు క్రమంగా వచ్చాయి. కాబట్టి ఇది ‘సీస
పద్యపాదము’
1, 3 గణాద్యక్షరాలకు యతి కూకో
5, 7 గణాద్యక్షరాలకు యతి మం – మం

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

ప్రాజెక్టు పని

మీ పాఠశాలలోని గ్రంథాలయాన్ని సందర్శించి శతకపద్యాల పుస్తకాలను పరిశీలించి, మీకు నచ్చిన ఏవేని ఐదు పద్యాలు సేకరించి, వాటికి భావాలు రాయండి. నివేదిక రాసి, ప్రదర్శించండి.

ప్రశ్న 1.
సిరిలేకైన విభూషితుండె యయి భాసిల్లున్ బుధుండౌదలన్
గురుపాదానతి కేలనీగి చెవులందు న్విన్కి వక్త్రంబునన్
స్థిరసత్యోక్తి భుజంబులన్విజయమున్జిత్తం బునన్సన్మనో
హర సౌజన్యము గల్గిన న్సురభిమల్లా! నీతివాచస్పతీ!

భావం : నీతిలో బృహస్పతి వంటివాడా! సురభిమల్లా! తలకు, గురుపాదాలకు పెట్టే నమస్కారం, చేతులకు త్యాగం, చెవులకు మంచి వినే గుణం ఉండాలి. నోటికి సత్యవాక్కు ఉండాలి. బాహువులకు విజయం, మనసుకు మంచితనం ఉండాలి. అలాంటి పండితుడు సంపదలేకపోయినా ప్రకాశిస్తాడు.

ప్రశ్న 2.
బీదలకన్న వస్త్రములు పేర్మినొసంగుము తుచ్ఛసౌఖ్యసం
పాదనకై యబద్ధముల బల్కకు, వాదములాడబోకు, మ
ర్యాదనతిక్రమింపకు, పరస్పరమైత్రి మెలంగు, మిట్టివౌ
వేదములంచెరుంగుము, వివేకధనంబిదినమ్ముచిత్తమా!

భావం : ఓ మనసా ! బీదవారికి అన్నదానం, వస్త్రదానం చేయాలి. నీచమైన సౌఖ్యాల కోసం అబద్ధాలు చెప్పకు. తగవులు పెట్టుకోకు. మర్యాదను మీరకు. ఒకరితో ఒకరు స్నేహంగా ఉండాలి. ఇటువంటివే జీవన వేదాలని తెలుసుకో. వివేకమనే ధనం ఇదే కదా !

ప్రశ్న 3.
పట్టుగ నీశ్వరుండు తన పాలిట నుండిపుడిచ్చినంతలోఁ
దిట్టక దీనదేహులను తేటగ లాలనజేసి, యన్నమున్
పెట్టు వివేకి మానసముఁ బెంపొనరించుచు నూరకుండినన్
గుట్టుగ లక్ష్మిఁబొందుఁ; దరిగొండనృసింహ! దయాపయోనిధీ!

భావం : దయా సముద్రుడా ! తరిగొండ నరసింహస్వామీ ! ఈశ్వరుడు పట్టుదలతో తన పక్షం వహించి ప్రసాదించిన సంపదలో శక్తిమేరకు పేదవారికి పెట్టాలి. అలాగే పేదలను నిందించకుండా అన్నం పెట్టిన వానికి మనస్సుకు ఆనందం కలుగుతుంది. ప్రయత్నించకపోయినా సంపద చేరుతుంది.

పద్యాలు – ప్రతిపదార్థాలు – భావాలు

I

1వ పద్యం: (కంఠస్థ పద్యం)

మ॥ “కులశైలంబులు పాదు పెల్లగిలి దిక్కులంబునం గూలినన్
జలధుల్ మేరల నాక్రమించి సముదంచదృంగి నుప్పొంగినన్,
జలజాతప్రియ శీతభానులు యథాసంచారముల్ దప్పినన్
దలకం డుబ్బఁడు చొప్పుదప్పుఁడు భవద్భక్తుండు సర్వేశ్వరా!

ప్రతిపదార్థం :

సర్వేశ్వరా = ఓ సర్వేశ్వర స్వామీ !
కులశైలంబులు = కులపర్వతాలు (సప్తకుల పర్వతాలు)
పాదు = ఆశ్రయము (స్థిరత్వము)
పెల్లగిలి = పెల్లగింపబడి (ఉన్మూలితమై)
దిక్కులంబునన్
(దిక్ + కూలంబునన్ = దిక్కుల ఒడ్డున (దగ్గర)
కూలినన్ = కూలిపోయినప్పటికీ
జలధుల్ = సముద్రములు
మేరలన్ = హద్దులను (చెలియలికట్టలను)
ఆక్రమించి = అతిక్రమించి
సముదంచద్భంగిన్
(సముదంచత్ + భంగిన్)
సముదంచత్ = అధికంగా పైకినెట్టబడిన
భంగిన్ = విధముగా
ఉప్పొంగినన్ = మిక్కిలి పొంగినా
జలజాతప్రియ శీతభానులు ;
జలజాతప్రియ = పద్మములకు ప్రియుడైన సూర్యుడును
శీతభానులు = చల్లని కిరణములు గల చంద్రుడునూ
యథాసంచారముల్ = (వారు) సంచరింపవలసిన తీరుగా సంచరించడం (తిరుగవలసిన రీతిగా తిరగడం)
తప్పినన్ = మరచిపోయినా
భవద్భక్తుండు
(భవత్ + భక్తుండు) = నీ భక్తుడు
తలకండు = చలించడు;
ఉబ్బడు = పొంగిపోడు;
చొప్పు = పద్ధతిని
తప్పడు = దాటడు; (విడిచిపెట్టడు)

భావం : ఓ సర్వేశ్వరా ! కుల పర్వతాలు స్థిరత్వాన్ని తప్పి పెల్లగిలి దిగంతముల వద్ద పడిపోయినా, సముద్రాలు హద్దులను అతిక్రమించి, పైకి నెట్టబడి ఉప్పొంగినా, సూర్యచంద్రులు తిరుగవలసిన రీతిగా తిరగడం మానినా, నీ భక్తుడు చలించడు. పొంగిపోడు. తన పద్ధతిని తప్పడు.

విశేషములు :
1) కులపర్వతాలు ఏడు అవి :

  1. మహేంద్రము
  2. మలయము
  3. సహ్యము
  4. శక్తిమంతము
  5. గంధమాదనము
  6. వింధ్యము
  7. పారియాత్రము

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

2వ పద్యం : (కంఠస్థ పద్యం)

శా॥ జాతుల్ సెప్పుట, సేవ చేయుట మృషల్ సంధించు టన్యాయ వి
ఖ్యాతిం బొందుట కొండెకాఁ డవుట హింసారంభకుం డౌట మి
ధ్యాతాత్పర్యము లాడు టన్నియుఁ బరద్రవ్యంబు నాశించి యీ
శ్రీ తా నెన్ని యుగంబు లుండఁ గలదో శ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం :

శ్రీకాళహస్తీశ్వరా = శ్రీకాళహస్తిలో వెలసిన ఈశ్వరా!
జాతుల సెప్పుట
(జాతుల్ + చెప్పుట) = జాతకాలు చెప్పడమూ,
సేవచేయుట = రాజులకు కాని, ఇతరులకు కాని సేవ చేయడము
మృషల్ = అసత్యములు
సంధించుట = కూర్చుటయు; (మాట్లాడడమూ)
అన్యాయవిఖ్యాతిన్;
అన్యాయ = అన్యాయ మార్గములో
విఖ్యాతిన్ = కీర్తిని
పొందుట = పొందడమూ
కొండెకాడు = కొండెములు చెప్పేవాడు (ఒకరిమీద చాడీలు చెప్పేవాడు)
అవుట = అవడమూ, (కావడం)
హింసారంభకుండు
(హింసా + ఆరంభకుండు) = హింసా ప్రయత్నము చేసేవాడు
జౌట = అగుటయూ (కావడమూ)
మిధ్యా తాత్పర్యములు = అసత్యమైన భావములు
ఆడుట = చెప్పడమూ;
అన్నియున్ = ఈ పైన చెప్పిన అన్ని పనులునూ
పరద్రవ్యంబున్ = ఇతరుల ధనాన్ని
ఆశించి = చేజిక్కించుకోవాలనే ఆశ చేతనే కదా!
ఈ శ్రీ = ఇలా సంపాదించిన ధనము
తాను = తాను
ఎన్నియుగంబులు = ఎన్ని యుగాలకాలముపాటు
ఉండగలదో = నిలిచి యుంటుందో! (ఎవ్వరికీ తెలియదు)

భావం : ఓ శ్రీకాళహస్తీశ్వరా! లోకములోని మనుష్యులు, జాతకములు చెప్పడమూ, ఇతరులకు సేవలు చేయడమూ, అసత్యము లాడడమూ, అన్యాయంగా కీర్తిని సంపాదించడమూ, చాడీలు చెప్పడమూ, హింసా ప్రయత్నం చేయడమూ, అనవసర అర్థాలు చెప్పడమూ వంటి పనులు చేస్తూ, తాము ఇతరుల ధనాన్ని ఆశిస్తున్నారు. కాని ఇలా సంపాదించిన ధనం, ‘ఎంతకాలం నిలుస్తుంది ? (ఎంతోకాలం నిలబడదని భావం.)

II

3వ పద్యం : (కంఠస్థ పద్యం)

మ॥ చెవికిం గుండల మొప్పుగాడు శ్రుతమే, చేదమ్మికిన్గంకణం
బు విభూషాఢ్యము గాదు దానమె మహిన్బుణ్యాత్మునెమ్మేనికిన్
బ్రవిలేపంబులు గావు సొమ్ములుపకారప్రౌఢియే నిక్కమౌ
లవితేంద్రాతిగ వైభవా! సురభిమల్లా! నీతివాచస్పతీ!

ప్రతిపదార్థం :

లవితేంద్రాతి వైభవా !
లవిత (లలిత) = సుందరుడైన
ఇంద్ర = ఇంద్రుడి
అతిగ = అతిక్రమించిన (మించిన)
వైభవా = వైభవము గలవాడా!
నీతివాచస్పతీ = నీతి శాస్త్రమునందు దేవతలకు గురువైన బృహస్పతి వంటి వాడా!
సురభి మల్లా = ఓ సురభిమల్ల భూపాలుడా!
చెవికిన్ = చెవులకు
శ్రుతమే (శ్రుతము +ఏ) = శాస్త్రపాండిత్యమే కానీ,
కుండలము = కుండలములు ధరించడం
ఒప్పుగాదు (ఒప్పు + కాదు) = అందము కాదు
చేదమ్మికిన్ = పద్మము వంటి చేతికి;
దానమే
(దానము + ఎ) = దానమే కాని
కంకణంబు = కంకణము
‘విభూషాఢ్యము
(విభూషా + ఆఢ్యము) = గొప్ప అలంకారము
కాదు = కాదు;
మహిన్ = భూమండలములో
పుణ్యాత్ము = పుణ్యాత్ముని యొక్క
నెమ్మేనికిన్
(నెఱి + మేనికిన్) = అందమైన శరీరానికి
ఉపకార ప్రౌఢియే = గొప్ప ఉపకారమే కాని
ప్రవిలేపంబులు = పూత పూసుకొనే సుగంధ ద్రవ్యములు
సొమ్ములు + కావు = ఆభరణములు కావు

భావం : వైభవంలో ఇంద్రుని మించినవాడా! నీతిలో బృహస్పతితో సమానమైన వాడా! ఓ సురభిమల్ల మహారాజా! చెవులకు శాస్త్రపాండిత్యమే అందంకాని, కుండలాలు కాదు. చేతులకు దానమే అందంకాని, కంకణాలు కాదు. శరీరానికి పరోపకారమే ఆభరణం కాని, సుగంధ విలేపనాలు కావు.

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

4వ పద్యం : (కంఠస్థ పద్యం)

ఉ॥ భూపతికాత్మబుద్ధి మదిఁబుట్టని చోటఁబ్రధానులెంత ప్ర
జ్ఞా పరిపూర్ణులైనఁ గొనసాగదు కార్యము కార్యదక్షులై
యోపిన ద్రోణ భీష్మకృప యోధులనేకులుఁ గూడి కౌరవ
క్ష్మాపతి కార్యమేమయినఁ జాలిరెచేయఁగ వారు భాస్కరా!

ప్రతిపదార్థం:

భాస్కరా = ఓ సూర్య భగవానుడా!
భూపతికిన్ = రాజునకు;
ఆత్మబుద్ధి = తన తెలివి
మదిన్ = మనస్సు నందు
పుట్టనిచోన్ = కలుగకున్న పక్షంలో
ప్రధానులు = (ఆ రాజుగారి) మంత్రులు
ఎంత = ఎంతయో
ప్రజ్ఞాపరిపూర్ణులు = గొప్పబుద్దితో నిండినవారు
ఐనన్ = అయినప్పటికీ
కార్యము = పని
కొనసాగదు = నెరవేరదు;
ఎట్లనన్ = ఎలా అంటే
కార్యదక్షులై = పనులయందు నేర్పరులైన
ద్రోణభీష్మకృప యోధులు ;
ద్రోణ = ద్రోణాచార్యులు
భీష్మ = భీష్ముడు
కృప = కృపాచార్యుడు మొదలయిన
యోధులు = వీరులు;
అనేకులు = అనేకమంది
కూడి = కలసి
కౌరవక్ష్మాపతికార్యము = కౌరవులకు రాజయిన దుర్యోధనుని పనిని; (యుద్ధ విజయాన్ని)
ఏమైనన్ = ఏ మాత్రమైనా
చేయగన్ = చేయడానికి
చాలిరె = సరిపోయినారా? (సరిపోలేదు)

భావం : భాస్కరా! రాజుకు సరైన ఆలోచన పుట్టనపుడు, మంత్రులు ఎంత తెలివి కలవారయినా, కార్యాన్ని నెరవేర్చలేరు. కార్యాలోచనలేని దుర్యోధనుడి పనులను, కార్యదక్షులైన ద్రోణ, భీష్మకృపాచార్యాది మహావీరులు, నెరవేర్పలేక పోయారు కదా!

విశేషము : దుర్యోధనుని పక్షంలో మహావీరులయిన భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు వంటి వారున్నా, దుర్యోధనుడికి యుద్ధ విజయాన్ని వారు తెచ్చిపెట్టలేకపోయారు.

III

5వ పద్యం : (కంఠస్థ పద్యం)

చం॥ ధనము, ధనాభిమానము, సదాధనతృష్ణయు మూడు దోషముల్
ధనికున కందు తొల్తటిది ద్రవ్యము పేదకు లేదు కావునన్
ధనికుని కంటె పేదకడు ధన్యుడు, యాతని తృష్ణ సజ్జనా
ప్తిని శమియించు వేంకటపతీ! అఖిలాండపతీ! శ్రియఃపతీ!

ప్రతిపదార్థం :

వేంకటపతి
అఖిలాండపతీ = ఓ వేంకటేశ్వరా!
(అఖిల + అండ, పతీ) = ఓ బ్రహ్మాండనాథా!
శ్రియఃపతీ = లక్ష్మీపతీ!
ధనమున్ = ధనమునూ
ధనాభిమానమున్
(ధన + అభిమానమున్) = ధనమునందు అభిమానమునూ
సదా = ఎల్లప్పుడునూ
తృష్ణయున్ = పేరాశయునూ (అనే); (ధనం సంపాదించాలనే కోరికయును)
మూడు దోషముల్ = మూడు దోషాలూ
ధనికునకున్ = ధనవంతుడికి (ఉంటాయి)
అందున్ = ఆ మూడు దోషాలయందు
తొల్తటిది = మొదటిది (అనగా ధనము)
పేదకున్ = బీదవానికి
లేదు = లేదు
అతని = ఆ పేదవాడి
తృష్ణ = ధనముపై పేరాశ
సజ్జనాప్తిని (సజ్జన + ఆప్తిని) = మంచివారితో కూడడం (సహవాసం) వల్ల
శమించున్ = శమిస్తుంది (నశిస్తుంది)
కావునన్ = కాబట్టి
ధనికుని కంటెన్ = ధనవంతుడి కన్నా
పేద = బీదవాడు
కడున్ = మిక్కిలి
ధన్యుడు = ధన్యాత్ముడు

భావం : ఓ వేంకటపతీ! బ్రహ్మాండాధిపతీ! లక్ష్మీనాథా! ధనమూ, ధనముపై అభిమానమూ, ఎల్లప్పుడూ ధనం సంపాదించాలనే కోరికా, అనే మూడు దోషాలూ ధనవంతుడికి ఉంటాయి. కాని పేదవాడికి అందులో ధనము అనే దోషం ఉండదు. పేదవాడికి ధనాశ ఉన్నా మంచివారికి దగ్గర ఉండడం వల్ల అతడిలో ఆ ధనాశ పోతుంది. కాబట్టి పేదవాడు ధనికుని కంటె ధన్యుడు.

6న పద్యం: (కంఠస్థ పద్యం)

మ॥ గరమున్ మ్రింగి హరించితిన్ సుజన దుఃఖమ్మంచు నీయాత్మలో
మురియంబోకు మనుష్యదుర్విషమునున్మూలింపుమా ముందు యీ
నరులందుండు విషమ్ము సూది విడనైనన్సంధి లేదో ప్రభూ
హర శ్రీవేములవాడ రాజఫణి హారా! రాజరాజేశ్వరా!

ప్రతిపదార్థం :

ఓ ప్రభూ = ఓ ప్రభువా!
హర = ఈశ్వరా
శ్రీవేములవాడ = సంపత్కరమైన వేములవాడ అనే పుణ్యక్షేత్రంలో వెలసిన
రాజఫణి, హారా = పెద్ద సర్పము కంఠహారంగా కలవాడా?
రాజరాజేశ్వరా = ఓ రాజరాజేశ్వర స్వామీ !
గరమున్ = కాలకూట విషాన్ని
మ్రింగి = మ్రింగి (తిని)
సుజన దుఃఖమ్మున్ = సత్పురుషులైన దేవతల దుఃఖాన్ని
హరించితిన్ = పోగొట్టాను
అంచున్ = అని
నీ యాత్మలోన్ (నీ + ఆత్మలోన్) = నీ మనస్సులో
మురియంబోకు = సంతోషపడవద్దు
ఈ నరులందున్ = ఈ మనుష్యులందు
ఉండు = ఉండే
విషమ్ము = విషము
సూదిన్ = సూదిని
ఇడనైనన్ = గ్రుచ్చడానికైనా
సంధిలేదు = సందులేదు
ముందు = ముందుగా
మనుష్యదుర్విషమున్ = మనుష్యులలో ఉన్న చెడ్డ విషాన్ని
ఉన్మూలింపుమా = నశించునట్లు చెయ్యి

భావం : సర్పరాజు వాసుకిని కంఠమున ధరించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామీ ! విషాన్ని మ్రింగి దేవతల దుఃఖాన్ని పోగొట్టానని నీలో నీవు మురిసిపోవద్దు. సూదిమొనకు కూడా చోటు లేనంతగా నిండిపోయిన ఆ మనుష్యులలోని భయంకరమైన విషాన్ని ముందుగా తొలగించు.

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

7వ పద్యం : (కంఠస్థ పద్యం)

సీ||
కూతురు చందాన కోడలిన్ జూచిన
మండునే ఘోరముల్ మందిరమున ?
కార్మిక జనుల భాగస్థులుగాఁ గాంచ
క్రమ్మునే అలజడుల్ కర్మశాల ?
దళితుల నిజ సహోదరులుగా మన్నించ
పుట్టునే ఉత్పాతములు జగాన?
పరమతస్థుల తమ వారిగా ప్రేమించ
రేగునే కలహాగ్నులాగడములు?
తేగీ॥
అఖిల జీవుల తనవోలె నాదరింప
ఉద్భవించునే యాపదలుర్వియందు?
వరశుభవిలాస | శ్రీనింబగిరి నివాస!
భవ్యగుణధామ ! నరసింహ! దివ్యనామ!

ప్రతిపదార్థం :

వరశుభవిలాస;
వర = శ్రేష్ఠమైన
శుభ = శుభాలతో
విలాస = అలరారే వాడా!
భవ్యగుణధామ;
భవ్య = శ్రేష్ఠమైన
గుణ = గుణాలకు
ధామ = నిలయమైనవాడా!
‘శ్రీ నింబగిరి నివాస;
శ్రీ = సంపత్కరమైన
నింబగిరి = నింబగిరియందు
నివాస = నివసించేవాడా?
దివ్యనామ = ఇంపయిన పేరుగలవాఁడా?
నరసింహ = ఓ నరసింహస్వామీ
కోడలిన్ = కోడలిని (కొడుకు భార్యను)
కూతురు చందానన్ = తన కూతురునువలె
చూచినన్ = చూచినట్లయితే
మందిరమునన్ = ఇంట్లో
ఘోరముల్ = భయంకరములైన సంఘటనలు (కోడలిని దహనం చేయడం, కొట్టడం, విషాన్ని త్రాగించడం వంటివి)
మండునే = చెలరేగుతాయా ?
కార్మిక జనులన్ = ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులను
భాగస్థులుగాన్ = (ఆ) ఫ్యాక్టరీ లాభనష్టాల్లో భాగము కలవారిగా
కాంచన్ = చూస్తే
కర్మశాలన్ = ఫ్యాక్టరీలో
అలజడుల్ = ఆందోళనలు (సమ్మెలు వగైరా)
క్రమ్మునే = వ్యాపిస్తాయా? (జరుగుతాయా?)
దళితులన్ = హరిజనులను
నిజసహోదరులుగాన్ = తన తోడబుట్టినవారిగా
మన్నించన్ = గౌరవిస్తే (ఆదరిస్తే)
జగానన్ = ప్రపంచంలో
ఉత్పాతములు = ఉపద్రవములు
పుట్టునే = కలుగుతాయా ?
పరమతస్థులన్ = = ఇతర మతాలవారిని
తమ వారిగా = తమకు కావలసిన వారిగా (తమ మతంలోని వారిగా)
ప్రేమించన్ = ప్రేమగా చూస్తే
కలహాగ్నులు
(కలహా + అగ్నులు) = కయ్యాలు అనే అగ్నిహోత్రములు
ఆగడములు = దౌష్ట్యములు (అన్యాయాలు)
రేగునే = విజృంభిస్తాయా? (పెరుగుతాయా?)
అఖిల జీవులన్ = అన్ని ప్రాణులనూ
తనవోలెన్ = తనవలెనే (ఆత్మవత్ సర్వభూతాని అన్న విధంగా)
ఆదరింపన్ = ప్రేమగా చూస్తే
ఉర్వియందున్ = భూమండలంలో
ఆపదలు = ఆపత్తులు
ఉద్భవించునే = సంభవిస్తాయా ? (సంభవింపవు)

భావం : నింబగిరిలో విలసిల్లే దేవా! శ్రేష్ఠమైన శుభాలతో ఒప్పేవాడా! అత్యుత్తమ గుణాలకు నిలయమైనవాడా! ఓ నరసింహదేవా! కోడలిని కూతురి మాదిరిగా చూస్తే, ఇంట్లో ఘోరాలు సంభవించవు. కార్మికులను భాగస్థులను చేస్తే, కర్మాగారంలో అల్లర్లు జరుగవు. దళితులను తన సొంత అన్నదమ్ముల్లాగా భావిస్తే, ప్రపంచంలో ఉపద్రవాలు పుట్టవు. ఇతర మతస్థులను తనవారిగా ప్రేమతో చూస్తే, కొట్లాటలు, ఆగడాలు పెరగవు. ప్రాణులనందరినీ తనవలె ఆదరంగా చూస్తే, భూమిమీద కష్టాలు పుట్టవు గదా!

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

8వ పద్యం : (కంఠస్థ పద్యం)

శా॥ ఆశాపాశ నిబద్ధుడై చెడక నిత్యంబోర్సుతో దేశికా
దేశంబుందలఁదాల్చి యోగ విధులర్డిన్ సల్పుచున్ భవ్యమౌ
నాశీర్వాదము వొజ్జచేఁ బడసితానందంగనౌ నంచితం
బౌశాంతంబును వచ్యుతార్చిత పదాబ్జా! చంద్రమౌళీశ్వరా!

ప్రతిపదార్థం:

అచ్యుతార్చితపదాబ్జా ;
అచ్యుత = శ్రీమహావిష్ణువు చేత
అర్చిత = పూజింపబడిన
పదాబ్జా (పద + అబ్జా) = పద్మములవంటి పాదములు
చంద్రమౌళీశ్వరా = చంద్రుడు శిరస్సున గల ఓ చంద్రమౌళీశ్వర స్వామీ !
ఆశాపాశ నిబద్ధుడై ;
ఆశాపాశ = ఆశలు అనే త్రాళ్ళచే
నిబద్ధుడై = కట్టబడినవాడై
చెడక = చెడిపోక
నిత్యంబు = ఎల్లప్పుడునూ
ఓర్పుతో = సహనముతో
దేశికాదేశంబున్ ;
దేశిక = గురువుగారి యొక్క
ఆదేశంబున్
తలదాల్చి
(తలన్ + తాల్చి) = శిరసావహించి
యోగవిధులు = యోగాభ్యాస విధులు (యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అనే అష్టాంగయోగ విధులు)
అర్థిన్ = ప్రీతితో
సల్పుచున్ = ఆచరిస్తూ
భవ్యమ్ = అనుకూలమైన
ఆశీర్వాదమున్ = ఆశీస్సును
ఒజ్జచేస్ = గురువుగారిచేత
పడసి = పొంది
(అంచితంబు + ఔ) = ఒప్పియున్న
తాన్ = తాను
అందంగనౌన్ = అందుకోగలడు (సంపాదించగలడు)

భావం : విష్ణువుచే పూజింపబడిన పాదపద్మాలు కలిగిన ఓ చంద్రమౌళీశ్వరా! ఆశ అనే పాశముచే బంధింపబడి, చెడిపోకుండా, ఎల్లప్పుడూ ఓర్పుతో గురువుగారి ఆదేశాలను తలదాల్చి, యోగాభ్యాస విధులను ఆచరిస్తూ, గురువుగారి దివ్యమైన ఆశీస్సును పొందినపుడే, శిష్యుడు శ్రేష్ఠమైన శాంతిని
పొందగలుగుతాడు.

పాఠం ఉద్దేశం

శతక పద్యాలు నైతికవిలువల్ని పెంపొందింపజేస్తాయి. భావి జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. శతక పద్యాల ద్వారా నైతిక విలువలను పెంపొందించడమే ఈ పాఠ్యం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం, శతక ప్రక్రియకు చెందినది. సాధారణంగా శతకపద్యాల్లో ప్రతిపద్యం చివర ‘మకుటం’ ఉంటుంది. శతక పద్యాలు ముక్తకాలు. అంటే ఏ పద్యానికదే స్వతంత్రభావంతో ఉంటుంది. ప్రస్తుత పాఠంలో మల్లభూపాలీయం, సర్వేశ్వర, భాస్కర, శ్రీకాళహస్తీశ్వరశతకం, ఉత్పలమాల, ఏకప్రాసశతపద్యమాలిక, నింబగిరి నరసింహ, చంద్రమౌళీశ్వర శతకాల పద్యాలున్నాయి.

కవుల పరిచయం

1) సర్వేశ్వర శతక కర్త :
TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 1

  1. యథావాక్కుల అన్నమయ్య.
  2. ఈయన కవితా శైలి ధారాళమైనది.
  3. ఈ సర్వేశ్వర శతకానికి శతక సాహిత్యములో గొప్ప పేరున్నది. ఈయన కాలము 13వ శతాబ్దం.

2) శ్రీకాళహస్తీశ్వర శతక కర్త :
TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 2

  1. ధూర్జటి
  2. ఈయన కాలము 16వ శతాబ్దం.
  3. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో “ధూర్జటి” ఒకడు.
  4. రాజుల సేవను ఈయన ధైర్యంగా ధిక్కరించాడు.
  5. ఈయన కవిత్వాన్ని శ్రీకృష్ణదేవరాయలు, “అతులితమాధురీమహిమ” కలదిగా మెచ్చుకున్నాడు.
  6. ఈయన
    1. శ్రీకాళహస్తీశ్వర శతకం,
    2. శ్రీకాళహస్తి మాహాత్మ్యం అనే ప్రబంధాన్ని రాశాడు.

3) “మల్ల భూపాలీయం” నీతిశతక కర్త :
TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 3

  1. ఎలకూచి బాల సరస్వతి. కాలం 17వ శతాబ్దం.
  2. ఈయన నాగర్ కర్నూల్ జిల్లా జటప్రోలు సంస్థానంలో సురభి మాధవరాయల ఆస్థానకవి.
  3. ఈయన తెలుగులో మొదటి త్ర్యర్థి కావ్యం రాఘవ యాదవ పాండవీయంతో పాటు, 12 గ్రంథాలు రచించాడు.
  4. భర్తృహరి సుభాషిత త్రిశతిని, తెలుగులోనికి అనువదించిన వారిలో ఈయన మొదటివాడు.

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

4) భాస్కర శతక కర్త :
TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 4

  1. మారద వెంకయ్య. కాలం 17వ శతాబ్దం.
  2. ఈయన ‘భాస్కరా’ అనే మకుటంతో ఎన్నో నీతులను మనసుకు హత్తుకొనేటట్లు, తన పద్యధారను కొనసాగించాడు.

5) ఉత్పలమాల :
TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 5

  1. ఉత్పల సత్యనారాయణాచార్య
  2. జననం : 4-7-1928. మరణం : 23-10-2007,
  3. ఈయన ఖమ్మం జిల్లాలోని చింతకాని ప్రాంతీయుడు.
  4. రసధ్వని, “ఈ జంటనగరాలు హేమంతశిశిరాలు,” గజేంద్రమోక్షం, భ్రమరగీతం, శ్రీకృష్ణ చంద్రోదయం మొదలైనవి రాశాడు.

6) ఏకప్రాస శతపద్యమాలిక కర్త:
TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 6

  1. గౌరీభట్ల రఘురామ శాస్త్రి
  2. జననం : 22-04-1929, మరణం : 4-2-2004.
  3. సిద్ధిపేట జిల్లాలో “రిమ్మనగూడ” ఈయన జన్మస్థానం.
  4. వ్యాసతాత్పర్య నిర్ణయం, గోమాత కళ్యాణ దాసచరిత్రం, శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శతపద్యమాలిక, శివపద మణిమాల, భావానంద స్వామి చరిత్ర మొదలైనవి రచించారు.

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

7) నింబగిరి నరసింహ శతక కర్త:
TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 7

  1. డా॥ అందె వేంకటరాజం
  2. జననం : 14-10-1933, మరణం : 11-09-2006. జన్మస్థలం : జగిత్యాల జిల్లా కోరుట్ల,
  3. రచనలు : నవోదయం, మణిమంజూష, కళాతపస్విని అనే పద్యకావ్యాలు, “భారతరాణి” నాటికల సంపుటి మొదలైనవి రాశాడు.
  4. బిరుదులు : కవి శిరోమణి, అవధాన యువకేసరి, అవధాన చతురానన మొదలైనవి.

8) చంద్రమౌళీశ్వర శతక కర్త :
TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 8

  1. ఇమ్మడిజెట్టి చంద్రయ్య. నాగర్ కర్నూల్ జిల్లా “తాళ్లపల్లి” జన్మస్థలం.
  2. జననం : 31-03-1934. మరణం : 11-03-2001
  3. రచనలు :
    1. హనుమద్రామ సంగ్రామం, భక్తసిరియాళ, వీరబ్రహ్మేంద్ర విలాసం అనే హరికథలు, రామప్రభు శతకం, మృత్యుంజయ శతకం మొదలైనవి.

ప్రవేశిక

పద్య ప్రక్రియలో శతకం ఒక విభాగం. నీతినీ, జీవిత అనుభవాలనూ, భక్తినీ, వైరాగ్యాన్నీ శతకపద్యాలలో కవులు రాశారు. ఈ శతక పద్యాలు, నైతిక విలువలను పెంపొందిస్తూ, రసానుభూతిని కలిగిస్తాయి. ఇటువంటి కొన్ని శతక పద్యాలను మనం చదువుదాం.