TS 10th Class Physical Science Important Questions Chapter 6 Structure of Atom

These TS 10th Class Physical Science Chapter Wise Important Questions Chapter 6 Structure of Atom will help the students to improve their time and approach.

TS 10th Class Physical Science Important Questions Chapter 6 Structure of Atom

1 Mark Questions

Question 1.
What is the speed of the light?
Answer:
The speed of light (c) ¡s 3 x 108 ms-1.

Question 2.
Define wavelength.
Answer:
The wavelength of the wave ¡s the distance from one wave peak to the next.

Question 3.
Define frequency (v).
Answer:
The frequency (v) of a wave Is simply the number of wave peaks that pass through a given point In unit time.
v=1/λ (or) c = vλ, where ‘c’ is the speed of light in vacuum.

Question 4.
What is electromagnetic spectrum?
Answer:
electromagnetic waves have a wide variety of frequencies. The entire range of electromagnetic wave frequencies Is known as the electromagnetic spectrum.

TS 10th Class Physical Science Important Questions Chapter 5 Human Eye and Colourful World

Question 5.
What is visible spectrum? What Is its wavelength range?
Answer:
The range of wavelengths covering red colour to violet colour is called the visible spectrum. It can be seen by naked eye. Its wavelength range is from 400 nm to 700 nm.

Question 6.
What is the significance of Plancks’ proposal?
Answer:
The significance of PlanKc’s proposal Is that electromagnetic energy can be gained or lost in discrete values and not in a continuous manner.

Question 7.
What is the use of line spectra?
Answer:
The lines in atomic spectra can be used to identify unknown atoms, just like fingerprints are used to Identify Individual people.

Question 8.
What do you mean by ground state?
Answer:
The lowest energy state of the electron is known as ground state.

Question 9.
What happens when an electron gains energy?
Answer:
When an electron gains energy it moves to a higher energy level, known as excited state.

Question 10.
What are the failures of Bohr’s model of atom?
Answer:

  1. Bohr’s model failed to account for splitting of line spectra.
  2. This model failed to account for the atomic spectra of atoms possessing more than one electron.

Question 11.
What is Sommerfeld’s contribution for the structure of atom?
Answer:
In an attempt to account for the splitting of line spectra. Sommerfeld modified Bohr’s atomic model by adding elliptical orbits.

Question 12.
What is an orbital?
Answer:
The region of space around the nucleus where the probability of finding the electron is high is called an orbital.

Question 13.
What are quantum numbers?
Answer:
Each electron in an atom Is defined by a set of three numbers called quantum numbers. These numbers indicate the probability of finding the electron In the space around the nucleus.

Question 14.
What Information do the quantum numbers provide?
Answer:
The quantum numbers describe the space around the nucleus where the electrons can be found and also their energies.

Question 15.
How many electrons can occupy an orbital?
Answer:
An orbital can hold only two electrons.

Question 16.
When are electromagnetic waves produced?
Answer:
Electromagnetic waves are produced when an electric charge vibrates.

Question 17.
What happens when an object is suitably excited by heating?
Answer:
Light is emitted by the object.

Question 18.
What is an electronic configuration?
Answer:
The distribution of electrons In shells, sub-shells and orbitals In an atom is known as electronic configuration.

Question 19.
State the Paull’s exclusion principle.
Answer:
According to Pauli’s exclusion principle, no two electrons of the same atom can have all four quantum numbers the same.

Question 20.
Write the Aufbau principle.
Answer:
In the ground state, the electronic configuration can be built up by placing electrons in the lowest available orbitals until the total number of electrons added is equal to the atomic number.

TS 10th Class Physical Science Important Questions Chapter 5 Human Eye and Colourful World

Question 21.
What is Hund’s rule?
Answer:
Hund’s rule: According to this rule, electron pairing In orbital’, starts only when all available empty orbitals of the same energy are singly occupied.

Question 22.
Give an example for continuous spectrum.
Answer:
Rainbow.

Question 23.
Which is example for line spectrum?
Answer:
The atomic spectrum of hydrogen atom.

Question 24.
Which model explains fine spectrum of atom?
Answer:
Bohr – Sommerfeld model.

Question 25.
How wavelength and velocity of light related?
Answer:
c = vλ
where c = velocity of light
v = frequency of light
λ = wavelength of light.

Question 26.
What is meant by Aufbau?
Answer:
The German word Aufbau means building up.

Question 27.
Which group elements are called Noble gases?
Answer:
VIII A group or 18th group elements are called inert gases (or) Noble gases.

Question 28.
Which elements are examples for Noble gases?
Answer:
helium (tie), Neon (Ne), Argon (Ar), Krypton (Kr), Xenon (Xe) and Radon (Rn) are examples for Noble gases.

TS 10th Class Physical Science Important Questions Chapter 5 Human Eye and Colourful World

Question 29.
Which elements are highly stable?
Answer:
Noble gases are highly stable.

Question 30.
Which element has duplet configuration?
Answer:
The inert gas Helium (1s2).

Question 31.
What Is the general electronic configuration of Noble gases?
Answer:
ns2 np6

Question 32.
Why is spin quantum number Introduced?
Answer:
When we observe spectrum of yellow light by using high-resolution spectroscope It has very closely spaced doublet. Similar patterns are shown by Alkali and Alkaline earth metals. In order to account this, spin quantum number is introduced.

Question 33.
Write the set of quantum numbers for the electrons In a 3p0. orbital.
Answer:

Orbitalnlm1ms
First electron320+1/2
Second electron320-1/2

Question 34.
What is the difference between an orbit and orbital?
Answer:
An orbit is a well-defined path of electron that revolves around the nucleus. An orbital Is the space around the nucleus, where the probability of finding electrons Is maximum.

Question 35.
Write the set of quantum numbers for the added electron of oxygen atom.
Answer:
Configuration of oxygen is Is22s22p4.
The added electron is the 4th in the 2p.
The set of quantum numbers(2, 1, -1, 1/2)

Question 36.
What are the factors which influence electromagnetic energy?
Answer:
Electromagnetic energy depends on two factors.
They are :

  1. wavelength
  2. frequency

Question 37.
Write the four quantum numbers for the differentiating electrons of lithium (Li) atom.
Answer:
The electronic configuration of lithium is 1s2 2s1. So differentiating electron enters into 2s. The values of four quantum numbers as given below.

nlm1m1s
200+½or-½

Question 38.
Write four quantum numbers for 2p1 electrons.
Answer:
The four quantum numbers for 2p are
TS 10th Class Physical Science Important Questions Chapter 6 Structure of Atom 1

Question 39.
If n=3, mention the orbitals present in shell and write maximum number of electrons In the shell.
Answer:

  1. If n=3, the shell Is M shell. OrbitaIs present In this shell are s, p and d.
  2. Maximum number of electrons present in this shell are 18(2n2= 2 x 32=18)

Question 40.
How many maximum numbers of electrons that can be accommodated In an l sub-shell?
Answer:
l subshell has 3 orbitals, Each orbital accommodates 2 electrons. So 6 electrons can be filled in I sub shell.

Question 41.
How many maximum number of electrons can be accommodated In ‘d’ orbital? (AS1)
Answer:
d sub shell has 5 orbitaIs. So 10 electrons can be filled in d subshell.

Question 42.
What is Zeeman effect and Stark effect?
Answer:

  • Zeeman effect: The splitting up of spectral lines in the presence of strong external magnetic field is called Zeeman effect.
  • Stark effect: The splitting up of spectral lines in presence of strong electrical field is called Stark effect.

Question 43.
Write the symbol of the outermost shell of magnesium (Z=12) atom. How many electrons are present In the outermost shell of magnesium?
Answer:
The symbol Is ‘M’. The electrons present in outermost shell are 2.

Question 44.
The four quantum number values of the 21st electron of scandium (Sc) are given In the following table.
TS 10th Class Physical Science Important Questions Chapter 6 Structure of Atom 2
Write the values of the four quantum numbers for the 20th electron of scandium (Sc) in the form of the table.
Answer:
n=4, l=0, m1 = 0, ms = –\(\frac{1}{2}\)

2 Marks Questions

Question 1.
The electronic configuration of an atom is as follows 1S22S22p2.
a) Which element’s atom is it?
b) Which orbital Is the last electron In?
c) When excited what could be the number of lone / sIngle electrons In this atom? (AS1)
d)What is the value of principal quantum numbers of two electrons in the first box?
Answer:
Given electronic configuration of atom is 1S22S22p2.
a)The element is carbon.
b)The valence electron enters into 2p orbital.
c) In excited state the electron in 2S orbital enters into 2P orbital. So it has 4 unpaired electrons.
d)The value of principal quantum number is 1.

Question 2.
How do the vibrating electric and magnetic fields around the charge become a wave that travel through space?
Answer:
A vibrating electric charge creates a change In the electric field. The change in electric field creates a change In magnetic field. This process continues, with both the created fields being perpendicular to each other and at right angles to the direction of propagation of the wave.

TS 10th Class Physical Science Important Questions Chapter 5 Human Eye and Colourful World

Question 3.
What are the characteristics of electromagnetic waves?
Answer:

  1. electromagnetic waves can be described by means of vibrating electrical and magnetic fields which are mutually perpendicular to each other.
  2. The nature of these waves is transverse. These waves travel with a speed equal to the speed of light In vacuum.

Question 4.
Fill the following table and write the rule which you used in tilling the table.

l0123
Sub-shellsPdf
Number of orbitals

Answer:

l0123
Sub-shellspdf
Number of orbitaIs1357

The number of orbitals for a sub-shell Is given by (2l + 1) rule.

Question 5.
Write the differences between orbit and orbital.
Answer:

OrbitOrbital
1. The path of an electron which revolving around the nucleus in an orbit.1. The probability of finding electron around the nucleus in an orbital.
2. Orbits are represented by K, L, M, N or 1,2,3,42. Orbitals are represented by s, p, d, f, g.
3. Orbits are circular/ elliptical in shape.3. Orbitals have different shapes like spherical (s), dumbell (p), double dumbell. (d) etc.
4. The maximum number of electrons in any orbit is 2n2.4. The maximum number of electrons in an orbitai is 2.

Question 6.
The electron enters into 4s orbital after filling 3p orbital but not Into 3d. Explain the reason.
Answer:
As per Aufbau principle, electron enters into the orbital whose (n +l) value ¡s less.
The (n +l) values for 4s and 3d are
4s = 4+0 = 4
3d = 3+2 = 5
Here the (n+1) value of 4s < 3d. Hence electron enters Into 4s orbital after filling ‘3p instead of’3d.

Question 7.
Give the equation which gives electromagnetic energy (light) can have only certain discrete energy values.
Answer:
E = hv E=Energyoflight
h = Planck’s constant = 6.625 x 10-27 erg sec or 6.625 x 10-34 Joule-sec
v = Frequency of radiation
This equation Is called Planck’s equation.

Question 8.
Explain Paulis Exclusion principle with an example.
Answer:
Pauil’s exclusion principle: According to Paull’s exclusion principle, no two electrons of the same atom can have all four quantum numbers are same.
Eg: He (Z = 2)
The electronic configuration is 1s2,i.e TS 10th Class Physical Science Important Questions Chapter 6 Structure of Atom 3
The set of four quantum numbers Is
TS 10th Class Physical Science Important Questions Chapter 6 Structure of Atom 4

Question 9.
Explain Aufbau principle with an example.
Answer:
Aufbau Principle: Orbitais are filled in the order of increasing energy.
Two general rules that help us to predict electronic configuration.
1. Electrons are assigned to orbitals in order of increasing value of (n + l)
2. For sub-shells with the same value of (n + l), electrons are assigned first to the sub-shell with lower ‘n
Ascending order of energies of various atomic orbitals is given below :
Is<2s<2p<3s<3p<4s<3d<4p<5s<4d<Sp<6s<4f<5d< 6p<7s< 5f<6d<7p<8s.

Question 10.
Explain Hund’s rule with an example.
Answer:
Hund’s Rule: According to this rule electron pairing In orbitals starts only when all available empty orbitals of the same energy are singly occupied.
Eg :
1. The configuration of carbon atom (Z = 6) is 1s2 2s2 2p2.
2. The first four electrons go into the is and 2s orbitals.
3. The next two electrons go into separate 2p orbitalis, with both electrons having the same in.
TS 10th Class Physical Science Important Questions Chapter 6 Structure of Atom 5
4. Note that the unpaired electrons in the 2p orbitals are shown with parallel spins.

Question 11.
What is spectrum? How many types of spectrum are there?
Answer:
Spectrum: A collection of dispersed light giving Its wavelength composition is called a spectrum. Spectrums are of two types:
1. Emission spectrum
2. Absorption spectrum

TS 10th Class Physical Science Important Questions Chapter 5 Human Eye and Colourful World

Question 12.
How many elliptical orbits are added by Sommerfeld in third Bohr’s orbit? What was the purpose of adding these elliptical orbits?
Answer:
Sommerfeld added two elliptical orbits to Bo1r’s third orbit.
Purpose of adding elliptical orbits
1. Bohr’s model failed to account for splitting of line spectra.
2. In an attempt to account for the structure of line spectrum, Sommerfeld modified Bohr’s atomic model by adding elliptical orbits.

Question 13.
Why there are exemptions in writing the electronic configurations of Chromium and Copper?
Answer:
Elements which have half-filled or completely filled orbitals have greater stability. So in chromium and copper the electrons in 4s and 3d redistribute their energies to attain stability by acquiring half-filled and completely filled d orbitals. Hence the actual electronic configuration of chromium and copper are as follows.
TS 10th Class Physical Science Important Questions Chapter 6 Structure of Atom 6

Question 14.
Write the electronic configuration of the atom of an element having atomic number 11. Write the names of the rules and the laws followed by you in writing this electronic configuration.
Answer:
Sodium (Na) — 11 — 1s22s22p63s1
The rules followed in writing this electronic configuration are Hund’s rule and Aufbau principle.

4 Marks Questions

Question 1.
Draw Moelier’s chart showing the increasing order of energy levels of various orbitals.
Answer:
TS 10th Class Physical Science Important Questions Chapter 6 Structure of Atom 7
The filling order of atomic orbitals (Moeller Chart)

Question 2.
Explain electromagnetic spectrum. Draw its diagram.
Answer:
Electromagnetic waves can have a wide variety of wavelengths. The entire range of Wave lengths is known as electromagnetic spectrum.
TS 10th Class Physical Science Important Questions Chapter 6 Structure of Atom 8
The electromagnetic spectrum consists of a continuous range of wavelengths of gamma rays at the shorter wavelength to radio waves at the longer wavelength. But our eyes are sensitive only to visible hght.

Question 3.
Explain the quantum mechanical model otan atom.
Answer:
We know that electrons do not follow definite paths in an atom and it is not possible to pinpoint an electron in an atom. Under these circumstances, in order to understand the properties of electrons in an atom1 a quantum mechanical model of atom was developed by Erwin Schrodinger.

According to this model of an atom, Instead of orbits of Bohr’s model, the electrons are thought to exist in a particular region of space around the nucleus at a given Instant of time called as orbitals. Each orbital of a stable energy state for the electron is described by a particular set of quantum numbers.

Question 4.
Draw the shapes of s, p, and d orbitals.
Answer:
TS 10th Class Physical Science Important Questions Chapter 6 Structure of Atom 9

Question 5.
Explain Bohr’s model of hydrogen atom and its limitations.
(OR)
Write postulates and limitations of Bohr Hydrogen atomic model.
Answer:
Postulates:
(a) Electrons In an atom occupy stationary orbits of f Dced energy at different distances from the nucleus.
(b) When an electron jumps from a lower energy state to higher energy state, it absorbs energy and emits energy when such a jump occurs from a higher energy state to lower energy state.
(c) The energies of an electron in an atom can have only certain values E1, E2, E3, i.e., the energy is quantized. The states corresponding to these energies are called stationary states and the possible values of the energy are called energy levels.

Limitations
1. Bohr’s model failed to account for splitting of line spectra of hydrogen atom.
2. This model failed to account for the atomic spectra of atoms of more than one electron.

Question 6.
Do the electrons follow definite paths around the nucleus? Explain.
Answer:
1. If the electron revolves around the nucleus in definite paths or orbits the exact position of the electron at various times will be known. For that, we want to know the velocity and exact position of electron.
2. Electrons are invisible to naked eye, so light of very short wavelength is required for this task.
3. This short-wavelength light interacts with the electron and disturbs the motion of the electron. Hence the position and velocity of electrons cannot be measured accurately.
4. So, it is clear that electrons do not follow definite paths In an atom.

Question 7.
Draw the diagram of electromagnetic wave.
Answer:
TS 10th Class Physical Science Important Questions Chapter 6 Structure of Atom 10

Question 8.
Explain Bohr – Sommerfeld model of an atom. What is the merit of this model? What are Its limitations?
Answer:
TS 10th Class Physical Science Important Questions Chapter 6 Structure of Atom 11

  1. In an attempt to account for the structure of line spectra, Sommerfeld modified Bohr’s atomic model by adding elliptical orbits.
  2. While retaining the first of Bohr’s circular orbit as such, he added one elliptical orbit to Bohr’s second orbit, two elliptical orbits to Bohr’s third orbit etc.
  3. The Nucleus of the atom is one of the principal foci of these elliptical orbits because periodic motion under the influence of a central force will lead to elliptical orbits with the force situated at one of the foci.
    Merit: Bohr Sommerfeld’s model is successful in accounting for the fine line structure of hydrogen atomic spectra.

Limitations:
1. This model failed to account for the atomic spectra of atoms of more than one electron.
2. It did not explain Zeeman and stark effects.

TS 10th Class Physical Science Important Questions Chapter 5 Human Eye and Colourful World

Question 9.
Distinguish between emission and absorption spectrum.
Answer:

Emission spectrumAbsorption spectrum
1) The spectrum produced by emitted radiation is called emission spectrum.1) The spectrum produced by absorption of radiation Is called absorption spectrum.
2) The emission spectrum contains bright lines on the dark back ground.2) The absorption spectrum contains dark lines on the bright background.
3) The emission spectrum corresponds the radiation emitted when an excited electron returns back to the ground state.3) The absorption spectrum corresponds the radiation absorbed in exciting an electron from lower to the higher energy levels.

Question 10.
Observe the information provided in the table about quantum numbers. Then answer the questions given below it.
TS 10th Class Physical Science Important Questions Chapter 6 Structure of Atom 12
(i) Write the ‘l’ value and symbol of the spherical-shaped sub-shell.
(ii) How many values that ‘m,’ takes for l=2? What are they?
(iii) Write the symbols of the orbitals for l=1 sub-shell.
(iv) What Is the shape of the sub-shell for l=2? What Is the maximum number of electrons that can occupy this sub-shell?
Answer:
(i) l = 0. Its symbol is s’
(ii) m1 takes 2l+1 = 2(2)+1=5 values
They are -2, -1, 0,+1, +2
(iii) Px, Py, Pz
(iv) Double dumbelL The maximum number of electrons in this subshell are 10.

Question 11.
Observe the information and answer the following questions.

Name of the ElementAtomic NumberElectronic Configuration
Sodium11[Ne] 3s1
Magnesium12[Ne] 3s2
Potassium19[Ne] 4s1
Calcium20[Ne] 4s2

(1) What is valency of Magnesium?
(2) Which element has more electro-positivity?
(3) Write the elements which belongs to (third) 3rd perk,d.
(4) Write the elements which belongs to 1st Group.
Answer:
(i) Valency of magnesium is two.
(ii) Potassium (K) has more electro-positivity.
(lii) The elements which belong to 3rd period are Sodium (Na), Magnesium (Mg).
(iv) Sodium (Na), Potassium (K) belong to 1st Group.

TS 10th Class Telugu Important Questions 12th Lesson భూమిక

These TS 10th Class Telugu Important Questions 12th Lesson భూమిక will help the students to improve their time and approach.

TS 10th Class Telugu 12th Lesson Important Questions భూమిక

PAPER – 1 : PART- A

I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)

1. లఘు సమాధాన ప్రశ్నలు (3 మార్కులు)

అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘భూమిక లేక పీఠిక’ అనే సాహిత్య ప్రక్రియను గూర్చి వివరించండి.
జవాబు:
ఒక పుస్తకానికి ముందు రాసే ముందుమాటనే ‘పీఠిక’ లేక ‘భూమిక’ అని అంటారు. ఒక పుస్తకం ఆశయాన్నీ, దానిలోని సారాన్నీ, దాని తత్త్వాన్నీ, ఆ గ్రంథ రచయిత దృక్పథాన్నీ, ‘ముందుమాట’ తెలియజేస్తుంది.

ఒక గ్రంథము యొక్క నేపథ్యమును, లక్ష్యములను పరిచయము చేస్తూ స్వయంగా ఆ గ్రంథ రచయిత గానీ, మరొకరు గానీ, లేదా ఒక విమర్శకుడు గానీ రాసే విశ్లేషాత్మక పరిచయ వాక్యాలను, ‘పీఠిక’ లేక ‘భూమిక’ అని పిలుస్తారు. ఈ పీఠికనే, ముందుమాట, భూమిక, ప్రస్తావన, తొలిపలుకు, ఆముఖము, మున్నుడి అనే పేర్లతో కూడా పిలుస్తారు.
నేషనల్ బుక్ ట్రస్టు ప్రచురించిన నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథల సంపుటానికి, శ్రీ గూడూరి సీతారాం గారు పీఠిక రాశారు.

ప్రశ్న 2.
సంక్షుభిత వాతావరణంలో హిందూ, ముస్లింల సఖ్యత కోసం ఎందరో ప్రజాస్వామిక వాదులు నడుం బిగించారు అంటే మీకేమి అర్థమయింది ?
జవాబు:
ఆ రోజులలో హిందూ – ముస్లింల సఖ్యత లోపించింది. మానవ సంబంధాలు మరుగునపడ్డాయి. మమతలు మసకబారినాయి. మతాల ముసుగులో దారుణాలు ఎక్కువయ్యాయి. కులాతీత సమాజం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. మతాతీత స్నేహాలు మటుమా యమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆత్మీయతలు అడుగంటిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. అందుకే దానిని సంక్షుభిత వాతావరణం అన్నారు.

ఆ సంక్షుభిత వాతావరణాన్ని చక్కబరిచి, మళ్ళీ మమతలు, ఆత్మీయతలు, స్నేహాలు పెంపొంది కులాతీత మతాతీత సమాజం ఏర్పడటానికి చాలామంది ప్రజాస్వామికవాదులు పూనుకొన్నారని అర్థమయింది.

TS 10th Class Telugu Important Questions 12th Lesson భూమిక

ప్రశ్న 3.
నెల్లూరి కేశవస్వామి హృదయాన్ని ఆవిష్కరించండి.
జవాబు:
ఒక రచయిత యొక్క హృదయం అతని రచనలలో కన్పిస్తుంది. అలాగే నెల్లూరి కేశవస్వామి హృదయం ఆయన రచనలలో కన్పిస్తుంది. కేశవస్వామి హృదయం ఆయన రాసిన కథలలో కనిపిస్తుంది. స్వామి లోహియా సోషలిస్టు. సమాజంలో అన్ని కులాలవారు, అన్ని మతాల వారు స్నేహభావంతో ఉండాలని ఆయన ఆలోచన.

దానికి విఘాతం కలిగితే తట్టుకోలేడు. అందుకే హిందూ – ముస్లిం సఖ్యత లోపించినపుడు అశాంతిగా గడిపాడు. ఎన్నో రాత్రులు నిద్రలేకుండా గడిపాడు. స్నేహం కోసం తపించాడు. ఆత్మీయత కోసం అర్రులు చాచాడు. కులాతీత, మతాతీత సమాజ నిర్మాణం కోసం చాలా ప్రయత్నం చేశాడు. ఆయన రచించిన చార్మినార్ కథలలో ఇవే కనిపిస్తాయి.

సామాజిక శాస్త్రవేత్తగా తన ప్రయత్నాలు తాను చేస్తూనే, ఉత్తమ సమాజ నిర్మాణానికి కథల ద్వారా పాఠకులలో చైతన్యం కల్గించాడు. సామాజిక మార్పులను తన కథలలో వ్యక్తపరిచాడు. సామాజిక చరిత్రను కథలలో రాశాడు.

ప్రశ్న 4.
కేశవస్వామి చాలా కథలు రచించాడు కదా! కథా రచన వలన ప్రయోజనం ఏమిటి?
జవాబు:
కేశవస్వామి తన కథల ద్వారా నాటి సమాజాన్ని గురించి తెలియజేశారు. ఆనాటి సమాజాన్ని చైతన్యపరిచారు. అలాగే కథల వలన సమాజాన్ని చైతన్యపరచవచ్చు. సమాజాన్ని సంస్కరించవచ్చును. సమాజంలోని అసమానతలను ప్రశ్నించవచ్చు. సమాజంలోని సమస్యలకు పరిష్కారాలు సూచించవచ్చును.

కథలోని భాష, శైలి సామాన్య పాఠకులను కూడా ఆకట్టుకొనేలా ఉండాలి. పాఠకుల హృదయాలను కదిలించగలవు. ఉత్తమ సమాజ నిర్మాణానికి తమవంతు ప్రయత్నాన్ని తాము చేయాలనే సంకల్పం కలిగిస్తాయి. ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకొనే అవకాశం కల్పిస్తాయి. పాఠకుల మనోధైర్యాన్ని పెంచుతాయి. పాఠకులకు ఆనందాన్ని కల్గిస్తాయి. కత్తితో సాధ్యం కానిది, కలంతో సాధ్యమని కథలు నిరూపిస్తాయి. అందుకే ఉత్తమ కథా సాహిత్యం ఉత్తమ సమాజాన్ని రూపొందిస్తుందంటారు.

ప్రశ్న 5.
నెల్లూరి కేశవస్వామి కథల్లోని వస్తు వైవిధ్యాన్ని వివరించండి.
జవాబు:
కేశవస్వామి ‘చార్మినార్ కథలు’ సంపుటిలో 11 కథలున్నాయి. ఈ కథలన్నీ విశిష్టమైనవి, దేనికదే ప్రత్యేకమైనవి. ‘యుగాంతం’ కథ ఆనాటి సామాజిక, చారిత్రక పరిణామాల నేపథ్యంలో సాగింది. ‘మహీఅపా’ కథలో ముస్లిం నవాబులు ఒక ముజ్రాల రమణిని గౌరవించిన తీరు వారి హృదయం సంస్కారానికి అద్దం పడుతోంది. వంశాకురం వధ ముస్లిం పెళ్లి సంబంధాలు ఎలా ఉంటాయో, కొడుకు కావాలనే ఆశ ఆడపిల్లల జీవితాలను ఎలా అతలాకుతలం చేస్తుందో చిత్రించింది. ‘కేవలం మనుషులం’ కథ మతాల సరిహద్దులను చెరిపివేసిన స్నేహం గురించి వివరిస్తుంది. భరోసా కథ నమ్మిన పేదలను నట్టేట ముంచిన వైనాన్ని తెలుపుతుంది.

ప్రశ్న 6.
‘భూమిక’ పాఠం రచయితను గురించి రాయండి. (June ’17)
జవాబు:
‘భూమిక’ పాఠ్యభాగ రచయిత గూడూరి సీతారాం. వీరు 18.07.1936న రాజన్న సిరిసిల్ల జిల్లా దగ్గర గల హనుమాజీ పేటలో జన్మించారు. 1953 నుండి 1965 వరకు సుమారు 80 కథలు రాశారు. తెలంగాణ భాషను, యాసను ఒలికించడం ఈయన కలానికున్న ప్రత్యేకత. తెలంగాణ కథా సాహిత్యంలో పేదకులాల జీవితాలను, అట్టడుగు వర్గాల భాషను అక్షర బద్ధం చేసిన రచయిత. తెలంగాణా రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేశాడు. మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజారికం మొదలగునవి వీరి రచనలు. 25.09.2011 న వీరు మరణించారు.

TS 10th Class Telugu Important Questions 12th Lesson భూమిక

ప్రశ్న 7.
“ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోహినూర్, జాకోబ్ వజ్రాల వంటివే స్వర్గీయ నెల్లూరి కేసవస్వామి చార్మినార్ కథను ” వివరించండి.
జవాబు:
నెల్లూరి కేశవస్వామి ‘చార్మినార్ కథలు’ ఆనాటి చారిత్రక, సామాజిక పరిణామాలను నమోదు చేశాయి. మొత్తం 11 కథలలో దేనికదే ప్రత్యేకమైనది. దేనికదే విశిష్టమైనది, వస్తు వైవిధ్యంతో ఆనాటి హైదరాబాద్ లోని సామాజిక సమస్యలను మానవీయ కోణంలో స్పృశించారు. మతాతీతమైన స్నేహం, తెలంగాణా సాయుధ పోరాటం, ముస్లిం జీవన విధానం, ముస్లిం నవాబు హృదయ సంస్కారం మొదలైన అంశాలు ఇతి వృత్తాలుగా కథలు సాగాయి. అందుకే కేశవస్వామి కథలు కోహినూర్ వజ్రం లాంటివని గూడూరి సీతారాం వ్యాఖ్యానించారు.

ప్రశ్న 8.
గూడూరి సీతారాం సాహిత్యసేవను వివరించండి.
జవాబు:
గూడూరి సీతారాం కరీంనగర్ జిల్లా హనుమాజీపేటలో జన్మించారు. 80 కథలు రాస్తే వాటిలో కొన్ని మాత్రమే లభ్యమవుతున్నాయి. తెలంగాణ కథా సాహిత్యాన్ని పేదల జీవితంతో, అట్టడుగు వర్గాల వారి జీవిత విశేషాలతో నింపారు. తెలంగాణ తొలితరం కథలకు దిక్సూచి. తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పని చేసారు. మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజీరికం లాంటి కథలు రాసారు. తెలంగాణ భాష, యాసను వాడిన గొప్ప కవి.

ప్రశ్న 9.
‘ఈ ఒక్క కథ రాసి మరేమి రాయక పోయినప్పటికీ నెల్లూరి కేశవస్వామి భారతదేశం గర్వించదగిన గొప్ప కథకుల్లో ఒక్కడుగా కీర్తించబడేవాడు’ – ఆ ఒక్క కథ ఏది ? దానికున్న ప్రాధాన్యాన్ని తెలుపండి. (June ’18)
జవాబు:
యుగాంతం నిజంగానే ఒక గొప్పకథ. ఇండియా రెండు దేశాలుగా విడిపోయి పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితులు. సంక్షోభాలు, హత్యాకాండ గురించి భీష్మ సహాని “తమస్” నవలలో చిత్రించారు. అది దూరదర్శన్ టి.వి.

సీరియల్గా ప్రసారమైనపుడు పెద్ద ఎత్తున చర్చ సాగింది. అలాంటి పరిస్థితులే హైదరాబాద్ రాజ్యంలో 1946-1950ల మధ్య ఎలా కొనసాగాయో చాలా మందికి తెలియదు. హైదరాబాద్ రాష్ట్ర చరిత్ర ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డంతో మూలకు నెట్టివేయబడింది. ఒక సామాజిక వ్యవస్థ, రాజరిక వ్యవస్థ అంతమవుతూ ఒక నూతన దశలోకి సమాజం, మానవ సంబంధాలు మారుతున్న పరిణామాలను చిత్రించడం వల్ల కథకు యుగాంతం అనే పేరు సార్థకతను చేకూర్చింది.

అందుకే ఈ ఒక్క కథ రాసి మరేమి రాయక పోయినా నెల్లూరి కేశవస్వామి భారతదేశం గర్వించదగ్గ గొప్ప కథకుల్లో ఒకడుగా కీర్తించబడేవాడు.

2. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు (6 మార్కులు)

క్రింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న1.
నెల్లూరి కేశవస్వామి కథలలోని ప్రత్యేకతలను వివరించండి. (Mar. ’16)
నెల్లూరి కేశవస్వామి భారతదేశం గర్వించదగిన గొప్ప కథకుల్లో ఒకరు. సమర్థించండి. (Mar. ’18)
జవాబు:
నెల్లూరి కేశవస్వామి, సుప్రసిద్ధ కథా రచయిత. ఈయన మొదటి కథల సంపుటి, ‘పసిడి బొమ్మ’. ఈయన రెండవ కథా సంపుటం చార్మినార్ కథలు. తాను అనుభవించిన జీవితం, స్నేహం, కులాతీత, మతాతీత వ్యవస్థలు, తెలిపే విధంగా ఓల్డ్ సిటీ. జీవితాన్ని, ‘చార్మినార్ కథలు’గా ఈయన రాశాడు.

ఒక సామాజిక శాస్త్రవేత్తగా, చైతన్యశీలిగా, తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఈ కథలను, ఈయన రాశాడు. ఈ చార్మినార్ కథలు, వాస్తవిక జీవితాల సామాజిక పరిణామాల చరిత్రతో నిండిన చారిత్రాత్మక కథలు. ఈ కథలో కేశవస్వామి హృదయం ఉంది.

ఈయన ‘రుహీ ఆపా’ అనే కథ, ముస్లిం నవాబులలోని హృదయ సంస్కారాన్ని తెలుపుతుంది. ఈయన కథలు, దేనికవే విశిష్టమైనవి. ప్రత్యేకమైనవి. ఈయన ‘యుగాంతం’ కథ, నిజంగానే ఒక యుగాంతాన్ని చిత్రించిన గొప్పకథ. ఈ కథలో హైదరాబాద్ రాజ్యంలో ప్రత్యేక పరిణామాలను ఒక చరిత్ర డాక్యుమెంటుగా ఈయన రాశాడు. ఈ కథ ఒక్కటే ఈయన రాసినా, భారతదేశం గర్వించదగ్గ కథకులలో ఒకడుగా ఈయన ఉండేవాడు.

ఈయన ‘వంశాకురం’ కథలో ముస్లిం పెళ్ళి సంబంధాలు ఎలా ఉంటాయో చెప్పాడు. పేదల నమ్మకాలను ఎలా భగ్నం చేస్తారో ‘భరోసా’ కథలో చెప్పాడు.
ఈయన కథలు, ‘కొహినూర్’, ‘జాకోబ్’ వజ్రాల వంటివి. ఈయన వాసిలో వస్తు నైపుణ్యంలో పేరుకెక్కిన కథలు రాశాడు.

TS 10th Class Telugu Important Questions 12th Lesson భూమిక

ప్రశ్న2.
గూడూరి సీతారాం వ్యాసం ఆధారంగా నెల్లూరి కేశవస్వామి కథలను గురించి రాయండి.
జవాబు:
నెల్లూరి కేశవస్వామి సుప్రసిద్ధ కథా రచయిత. ఆయన రాసిన కొన్ని కథలు నేడు దొరకట్లేదు. ఈయన తన కథలను కొన్ని సంపుటాలుగా వెలువరించాడు. ఈయన తొలికథల సంపుటి “పసిడి బొమ్మ”. ఇది 1969లో వెలువడింది. ఇది భాస్కరభట్ల కృష్ణారావుగారికి అంకితం ఇవ్వబడింది. ఈయన రెండవ కథా సంకలనం

“చార్మినార్” కథలు. ఇవి ఊహించి రాసిన కథలు కావు. ఇది సమాజంలోని మార్పులను కథలుగా రాసిన సామాజిక చరిత్ర రచన అని చెప్పాలి. చార్ మినార్ కథలు హైదరాబాదు సంస్కృతినీ, మానవ సంబంధాలనూ, అక్కడి ముస్లింల జీవితాలనూ అపూర్వంగా చిత్రించాయి. ఇవి మొత్తం 11 కథలు. హైదరాబాద్ నగరం కాస్మో పాలిటన్ నగరంగా ఎదిగింది. ఆ నేపథ్యాలనూ, ఆ జీవితాలనూ కేశవస్వామి చార్మినార్ కథల్లో చిత్రించాడు.

ఈయన “యుగాంతం” కథ సార్థకమైంది. దీనిలో హైదరాబాద్ రాజ్యంలో పరిణామాలను ఒక చారిత్రక డాక్యుమెంటుగా రాశాడు. ఈ ఒక్క కథే రాసినా, కేశవస్వామి భారతదేశం గర్వించదగ్గ గొప్ప కథకుల్లో ఒక్కడు అయ్యేవాడు.

చార్మినార్ కథల్లో కేశవస్వామి హృదయం ఉంది. ఇవి నిజాం రాజ్యయుగం అంతరించిన పరిణామాలకు చిత్రించిన కథలు, కేశవస్వామి రాసిన ‘రుహీ అపో’ కథ, గొప్ప మానవీయ సంబంధాలనూ, కులమతాలకు అతీతంగా స్పందించిన మనిషినీ చిత్రించిన కథ. ఈ కథలో ముస్లిం నవాబుల్లో ఉన్న హృదయ సంస్కారాన్ని రచయిత చక్కగా చూపించాడు.

ఈయన ‘వంశాంకురం’ కథలో ముస్లిం పెళ్ళి సంబంధాలు ఎలా ఉంటాయో చెప్పాడు. నమ్మిన పేదల నమ్మకాలను ఎలా భగ్నం చేస్తారో ‘భరోసా’ కథలో చెప్పాడు. కేశవస్వామి వాసిలో, వస్తు నైపుణ్యంలో వాసికెక్కిన కథలు రాశాడు. ఈయన హిందీ కథా రచయితలు ప్రేమ్చంద్, కిషన్ చందర్లతో పోల్చదగిన గొప్ప కథా రచయిత.

PAPER – II : PART – A

I. అవగాహన – ప్రతిస్పందన

అపరిచిత గద్యాలు

ప్రశ్న1.
క్రింది గద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన వాక్యాలలో తప్పొప్పులను గుర్తించండి. (5 మార్కులు)

“పూర్వం నుండి మనకు తులసి, రావి, వేప చెట్లను పూజించే సంప్రదాయం ఉంది. అనాది నుండి మనం తులసిని దేవతగా పూజిస్తూ వస్తున్నాం. తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నట్లు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. పూర్వకాలంలో తట్టు, ఆటలమ్మ వంటి వ్యాధులు వచ్చినప్పుడు రోగి దగ్గర వేపాకులు ఉంచేవారు. వేపాకులను ఒంటికి రాసేవారు. స్నానం చేయించే ముందు వేపాకులు ముద్దగా నూరి, నూనె, పసుపు కలిపి ఒంటికి రాసేవారు. ఎందుకనగా తట్టు, ఆటలమ్మ వస్తే దేహంపై పొక్కులు వస్తాయి. కొన్ని పచ్చిగా దురద పెడతాయి. అలా దురద రాకుండా ఉండడానికి, గోకటం మానడానికి, ఈ వేపాకు, పసుపు దోహద పడతాయి. ఈ రకంగా వైద్యశాస్త్రానికి సంబంధించిన వేప, సంస్కృతీపరంగా కూడా ప్రాధాన్యతను సంతరించుకొంది.

తప్పొప్పులు

1. తులసిని మనము నేడు దేవతగా పూజిస్తున్నాం.
జవాబు:
తప్పు

TS 10th Class Telugu Important Questions 12th Lesson భూమిక

2. తులసిలో ఔషధ గుణాలున్నాయని శాస్త్రజ్ఞుల కథనం.
జవాబు:
ఒప్పు

3. వేపకు వైద్యశాస్త్రంలోనే ప్రాధాన్యత ఉంది.
జవాబు:
తప్పు

4. దురద రాకుండా, గోకకుండా పసుపు, వేపాకులు ఉపయోగపడతాయి.
జవాబు:
ఒప్పు

5. తట్టు, ఆటలమ్మ వ్యాధులకు, పూర్వం వైద్యం లేదు.
జవాబు:
తప్పు

ప్రశ్న2.
క్రింది గద్యాన్ని చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలను తయారుచేయండి.

వీరభద్రారెడ్డికి అంకితముగా కాశీఖండము రచించిన శ్రీనాథుడు, పోతనకు సమకాలికుడు. శ్రీనాథుడు కాశీఖండము అనే పురాణాన్ని తెనిగించినను దానిని స్వతంత్రించి ప్రబంధముల వలె రచించినాడు. భీమఖండము గోదావరి తీర దేశ దివ్య వైభవ వర్ణనా గ్రంథమని చెప్పవచ్చును. కాశీఖండము ప్రౌఢాంధ్ర కవితా పరిజ్ఞానమునకు చదువదగిన గ్రంథము. ఈయన హరవిలాసం వ్రాసి అవచి తిప్పయ్య శెట్టికి అంకితమిచ్చాడు. కవి సార్వభౌముడిగా ప్రసిద్ధి చెందిన శ్రీనాథుడు 15వ శతాబ్దివాడు. ఈయనకు ప్రౌఢ కవితా పాకంపై ప్రీతి ఎక్కువ.
జవాబులు:

  1. శ్రీనాథుని గ్రంథములెవ్వి ?
  2. శ్రీనాథుని బిరుదమేమి ?
  3. శ్రీనాథుడు హరవిలాసమును ఎవరికి అంకితమిచ్చెను?
  4. శ్రీనాథునికి దేనిపై మక్కువ ఎక్కువ ?
  5. వీరభద్రారెడ్డికి అంకితమిచ్చిన గ్రంథమేది ?

ప్రశ్న3.
క్రింది గద్యాన్ని చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

స్త్రీ జనోద్ధరణము కూడా సంఘసేవయే. పురుషులు మాత్రమే చదివి లోకమున విజ్ఞులమని, ప్రయోజకులమని చెప్పుకొనుట చాలదు. స్త్రీలు సహితము పురుషులతో పాటుగా చదువుకొన్నప్పుడే సంఘము బాగుపడును. సంఘమనే బండికి పురుషులిద్దరు రెండు చక్రములు వంటివారు. అందులో ఏ చక్రము అవిటిగా నున్నను ఆ బండి నడువజాలదు. కావున రెండు చక్రములను సరిగా నడుచునట్లు చూచుకొన్నప్పుడే బండి చక్కగా సాగిపోవును.

ప్రశ్నలు – జవాబులు

1. సంఘ సేవ యనదగినదేది ?
జవాబు:
స్త్రీల జనోద్ధరణము సంఘసేవ అనదగినది.

TS 10th Class Telugu Important Questions 12th Lesson భూమిక

2. సంఘము ఎప్పుడు బాగుపడును ?
జవాబు:
స్త్రీలు కూడా పురుషులతో పాటుగా చదువుకొన్నప్పుడే సంఘం బాగుపడును.

3. సంఘమనే బండికి చక్రములవంటి వారెవరు ?
జవాబు:
సంఘమనే బండికి స్త్రీ పురుషులిద్దరూ రెండు చక్రముల వంటివారు.

4. బండి ఎప్పుడు చక్కగా సాగును ?
జవాబు:
రెండు చక్రములు సరిగా నడుచుచున్నట్లు చూచుకొన్నప్పుడే బండి చక్కగా సాగును.

5. ఎవరు విజ్ఞులమని, ప్రయోజకులమని చెప్పుకొనుట చాలదు ?
జవాబు:
పురుషులు మాత్రమే చదివి లోకమున విజ్ఞులమని, ప్రయోజకులమని చెప్పుకొనుట చాలును.

ప్రశ్న4.
క్రింది గద్యాన్ని చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

పొదుపు మానవ జీవితానికి అత్యవసరము. పొదుపు లేని మానవుడు దారం తెగిన గాలిపటం వంటివాడు. పొదుపు చేయకుండ అడ్డుపడే వాటిల్లో అతి ముఖ్యమైనవి కోరికలు. కోరికలు మానవుడిని మానసికంగా బలహీనుణ్ణి చేస్తాయి. పొదుపు అనేక విషయాలలో పాటించవచ్చు. ధనము, జలము, భాషణము మొదలగు వానిలో పొదుపు పాటించడం ద్వారా దేశాభివృద్ధిని సాధించగలము. పొదుపును నిర్లక్ష్యం చేస్తే అప్పులు చేయక తప్పదు. అప్పు చేయటం వలన మన వ్యక్తిత్వాన్నే కోల్పోతాము.

ప్రశ్నలు – సమాధానాలు

1. పొదుపు లేని మానవుడు ఎట్టివాడు ?
జవాబు:
పొదుపు లేని మానవుడు దారం తెగిన గాలిపటం వంటివాడు.

2. కోరికలు మానవుని ఏమి చేస్తాయి ?
జవాబు:
కోరికలు మానవుడిని మానసికంగా బలహీనుణ్ణి చేస్తాయి.

3. పొదుపు పాటించవలసిన ముఖ్య విషయాలేవి ?
జవాబు:
పొదుపు పాటించవలసిన ముఖ్య విషయాలు ధనం, జలం, భాషణం.

4. పొదుపును నిర్లక్ష్యం చేస్తే ఏమి జరుగుతుంది ?
జవాబు:
పొదుపును నిర్లక్ష్యం చేస్తే, అప్పులు చేయడం జరుగుతుంది.

5. అప్పు చేయటం వలన మనమేమి కోల్పోతాము ?
జవాబు:
అప్పు చేయడం వలన మనం మన వ్యక్తిత్వాన్ని కోల్పోతాము.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

సృజనాత్మక ప్రశ్నలు (5 మార్కులు)

ప్రశ్న 1.
ఉత్తమ సమాజం గురించి వివరించే కవిత రాయండి.
జవాబు:
ఆదర్శ సమాజం

కులాల కుళ్ళు లేదు.
మతాల మతలబులు లేవు.
ధనిక పేద తేడాలసలే లేవు.
మేడా మిద్దె గూడూ గుడిసె ఒక్కటే.
రాజకీయపు రంగురంగుల వలలు లేవు.
అరాచకపు ఆనవాళ్ళు అసలే లేవు.
ఆనందం, స్నేహం, సౌఖ్యం ఉన్నాయి.
అందరం ఒకే కుటుంబం అందరం బంధువులమే.
ఇదే మా ఆదర్శ సమాజం.

అదనపు వ్యాకరణాంశాలు

PAPER – 1: PART – B

1. సొంతవాక్యాలు

1. ఉన్నత శిఖరాలు : ప్రతి వ్యక్తి తన జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలి అని ఆశించాలి.

2. సామాజిక పరిణామం : సంస్కర్తలు, తన శక్తి కొద్దీ మంచి సామాజిక పరిణామం తీసుకు రావడం కోసం కృషి చేయాలి.

3. నడుం బిగించు : హనుమంతుడు, కార్యసాధన కై నడుం బిగించాడు.

4. భారతీయ సంస్కృతి : వివేకానంద స్వామి దేశ విదేశాల్లో మన భారతీయ సంస్కృతి యొక్క గొప్ప తనాన్ని ప్రచారం చేశారు.

5. హృదయ విదారకం : వరద బాధితుల కష్టాలు వినడానికే హృదయ విదారకంగా ఉన్నాయి.

6. ఆదానప్రదానాలు
(ఇచ్చి పుచ్చుకోవడాలు) : అనుకున్న పని నెరవేరాలంటే, ఆదాన ప్రదానాలు రెండూ ఉండాలి.

7. అపూర్వంగా : షాజహాన్ తాజమహల్ను అపూర్వంగా నిర్మించాడు.

TS 10th Class Telugu Important Questions 12th Lesson భూమిక

2. పర్యాయపదాలు

స్నేహము = ప్రేమ, ప్రియము, సాంగత్యము, మైత్రి, నెయ్యం
కథ = కత, కథానిక, ఆఖ్యాయిక, గాథ
సైన్యము = సేన, ధ్వజని, వాహిని, బలం, దండు, దళం
కవిత్వము = కవనము, కవిత, కయిత
ముస్లిమ్ = మహమ్మదీయుడు, తురుష్కుడు, పఠాణీ, యవనుడు
వంశము = కులము, అన్వయము, గోత్రము, జాతి, తెగ, సంతతి
పెళ్ళి = పరిణయము, వివాహము, ఉద్వా హము, కరగ్రహణము, కల్యాణము, మనువు

3. వ్యుత్పత్త్యర్థాలు

అంధకారము = లోకులను అంధులుగా చేయునట్టిది (చీకటి)
వార్తాపత్రిక = వార్తలను ప్రకటన చేయు కాగితం (వార్తాపత్రిక)

కేశవులు =
1) మంచి వెంట్రుకలు కలవాడు
2) కేశి అను రాక్షసుని చంపినవాడు

కథ = కొంచెము సత్యమును, కొంత కల్పన గల చరిత్ర – కత
అదృష్టము = చూడబడనిది – భాగ్యము
ఆయుధము = యుద్ధము చేయుటకు తగిన సాధనము – శస్త్రము
యుగాంతము = యుగముల అంతము మహా ప్రళయము
తెలుగు = త్రిలింగముల మధ్య ఉపయోగించబడు భాష – తెనుగు
వాతావరణము = గాలితో కూడి ఉండునది పర్యావరణము
హృదయము = హరింపబడునది గుండెకాయ

4. నానార్థాలు

భాష = బాస, మాట, వ్రతము, ప్రతిన
కథ = కత, పూర్వకథ, చెప్పుట, గౌరి
సుధ = అమృతము, సున్నము, ఇటుక
సొంపు = ఒప్పు, సంతోషం, సమృద్ధి
స్నేహము = చెలిమి, చమురు, ప్రేమ
రాజు = ప్రభువు, పాలకుడు, క్షత్రియుడు, యక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు
పత్రిక = కాగితము, పత్రము, జాబు, వార్తాపత్రిక
అచ్చు = ముద్ర, విధము, ప్రతిబింబము, నాణెము, పోతపోసిన అక్షరములు
పసిడి = బంగారము, ధనము
జీవితము = ప్రాణము, జీతము, జీవితకాలము, జీవనము
అపూర్వము = అపురూపము, తెలియనిది, క్రొత్తది, కారణములేనిది, పరబ్రహ్మము
వంశము = కులము, వెదురు, పిల్లనగ్రోవి, వెన్నెముక, సమూహము
యుగము = కాల పరిమాణ విశేషము, జత, కాళి, వయస్సు, రెండు బార
అదృష్టము = భాగ్యము, కర్మఫలము, చూడబడనిది, అనుభవింపబడనిది
చర్చ = విచారము, చింత, అధ్యయనము చేయుట, పార్వతి
సన్నివేశము = ఇంటివెనుక పెరడు, కలయిక, సమీపము, తావు
సంబంధము = చుట్టరికము, కూడిక
అక్క = పెద్దదైన తోబుట్టువు, పూజ్యస్త్రీ, వంటలక్క, తల్లి
భరణము = భరించుట, కూలి, జీతము

5. ప్రకృతి – వికృతులు

ప్రకృతి – వికృతి

స్నేహము -నెయ్యము
స్వామి – సామి
కవి – కయి
ఆర్య – అయ్య
రాజు – తేడు
పీఠము – పీట
కథ – కత
వృద్ధి – వడ్డీ
అత్యంత – అందంద
అంబ – అమ్మ
స్వీకారం – సేకరము
కథ – కత
జీవితము – జీతము
చిత్రము – చిత్తరువు
త్రిలింగము – తెలుగు
ప్రజ – పజ
అపూర్వము – అపురూపము
విధము – వితము
ఆశ్చర్యము – అచ్చెరువు
నిద్ర – నిదుర
హృదయము – ఎద
రాత్రి – రేయి
వంశము – వంగడము

PAPER – II : PART – B

1. సంధులు

1. సవర్ణదీర్ఘ సంధి

సూత్రం : అ, ఇ, ఉ, ఋలకు సవర్ణములైన అచ్చులు పరమగునప్పుడు వాని దీర్ఘము ఏకాదేశమగును.

ఉదా :
రంగాచార్య – రంగ + ఆచార్య
విద్యాలయం – విద్య + ఆలయం
హిమాలయాలు – హిమ + ఆలయాలు
కోస్తాంధ్ర – కోస్త + ఆంధ్ర
వంశాకురం – వంశ + అంకురం
యుగాంతం – యుగ + అంతం
ఉత్తరాంధ్ర – ఉత్తర + ఆంధ్ర
సార్ధకత – స + అర్ధకత
అపార్ధాలు – అప + అర్ధాలు
కులాతీతము – కుల + అతీతము
మతాతీతము – మత + అతీతము
చారిత్రాత్మకం – చారిత్ర + ఆత్మకం

2. గుణ సంధి

సూత్రం: అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమగునప్పుడు క్రమముగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమగును.

ఉదా :
జాతీయోద్యమం – జాతీయ + ఉద్యమం
మహోన్నతము – మహ + ఉన్నతము

TS 10th Class Telugu Important Questions 12th Lesson భూమిక

2. సమాసాలు

సమాసపదం – విగ్రహవాక్యం – సమాసం పేరు

తెలుగు సాహిత్యము – తెలుగు అను పేరుగల సాహిత్యం – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము

ఉస్మానియా యూనివర్శిటీ – ఉస్మానియా అను పేరుగల యూనివర్శిటీ – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము

హైదరాబాద్ రాజ్యం – హైదరాబాద్ అను పేరుగల రాజ్యం – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము

సమాజ పరిశీలన – సమాజం యొక్క పరిశీలన – షష్ఠీ తత్పురుష సమాసము

తెలంగాణ పలుకుబడులు – తెలంగాణ యొక్క పలుకుబడులు – షష్ఠీ తత్పురుష సమాసము

హైదరాబాద్ రాష్ట్ర చరిత్ర – హైదరాబాద్ రాష్ట్రం యొక్క చరిత్ర – షష్ఠీ తత్పురుష సమాసము

రైతాంగ పోరాటం – రైతాంగము యొక్క పోరాటం – షష్ఠీ తత్పురుష సమాసము

వంశాకురం – వంశమునకు అంకురం – షష్ఠీ తత్పురుష సమాసము

స్వేచ్ఛావాయువులు – స్వేచ్ఛ అనెడి వాయువులు – రూపక సమాసము

అదృష్టం – దృష్ఠం కానిది – నఞ తత్పురుష సమాసము

రాజకీయ పరిణామాలు – రాజకీయములందలి పరిణామాలు – సప్తమీ తత్పురుష సమాసము

శిల్ప నైపుణ్యము – శిల్పము నందు నైపుణ్యము – సప్తమీ తత్పురుష సమాసము

ప్రపంచ ప్రఖ్యాతి – ప్రపంచము నందు ప్రఖ్యాతి – సప్తమీ తత్పురుష సమాసము

3. వాక్య పరిజ్ఞానం

ఈ క్రింది వాక్యాలు ఏ రకానికి చెందినవో వ్రాయండి.

ప్రశ్న 1.
ఈనాటికీ విదేశీయులెవరైనా మన మహానగరాలకు వచ్చినట్లయితే వాళ్ళకు పావురాలు బృందాలు కనిపిస్తాయి.
జవాబు:
చేదర్థక వాక్యం

ప్రశ్న 2.
తెల్ల జెండాలు ఊపుతూ సంకేతాలు అందించే కుర్రాళ్ళు కనబడతారు.
జవాబు:
శత్రర్థక వాక్యం

ప్రశ్న 3.
రంగు రంగుల పావురాలతోనూ, నీలికళ్ళతో కువకువలాడే గువ్వలతోనూ నిండి ఉండడం కద్దు.
జవాబు:
సంయుక్త వాక్యం

ప్రశ్న 4.
అలా కలగలిసి, ఎగసి గంటల తరబడి ఎగిరాక తిరిగి అన్నీ విడివిడిగా తమ తమ యజమానుల ఇళ్ళకు చేరుకుంటాయి.
జవాబు:
సంక్లిష్ట వాక్యం

TS 10th Class Telugu Important Questions 12th Lesson భూమిక

4. కర్తరి – కర్మణి వాక్యాలు

1. కర్తరి : అవి ఒక బృహత్తర సమూహంగా రూపొందుతాయి.
కర్మణి : ఒక బృహత్తర సమూహం వాటిచేత రూపొందించ బడుతుంది.

2. కర్తరి : మా పావురాన్ని హరివిల్లు మెడగాడు అని ముద్దుగా పిలుస్తూ ఉంటాను.
కర్మణి : మా పావురం హరివిల్లు మెడగాడని నా చేత ముద్దుగా పిలువబడుతూ ఉంటుంది.

3. కర్తరి : చిత్రగ్రీవం కథను నేను మొట్టమొదట్నుంచీ మొదలెడతాను.
కర్మణి : నా చేత చిత్రగ్రీవం కథ మొట్టమొదట్నుంచీ మొదలెట్టబడుతుంది.

4. కర్తరి : ఆ రోజును నేను ఎప్పటికీ మరచిపోలేను.
కర్మణి : ఆ రోజు నా చేత ఎప్పటికీ మరచిపోబడదు.

5. కర్తరి : తల్లిపిట్టను మృదువుగా లేపి తీసి ఓ పక్కన ఉంచాను.
కర్మణి : తల్లిపిట్ట నా చేత మృదువుగా లేపబడి తీయబడి ఓ పక్కన ఉంచబడింది.

6. కర్తరి : వాటిని తగు మోతాదులోనే ఉంచాలి.
కర్మణి : అవి తగు మోతాదులోనే ఉంచబడాలి.

7. కర్తరి : ఆ ఆహారాన్ని పిల్లలకు అందిస్తాయి.
కర్మణి : ఆ ఆహారం పిల్లలకు అందించబడుతుంది.

8. కర్తరి : ఆ రోజుల్లోనే నేనో విషయం కనిపెట్టాను.
కర్మణి : ఓ విషయం ఆ రోజులలో నా చేత కనిపెట్ట

9. కర్తరి : ఆ రోజుల్లోనే దాని ఈకల రంగు మారడం గమనించాను.
కర్మణి : దాని ఈకల రంగు మారడం ఆ రోజులలోనే నా చేత గమనించబడింది.

10. కర్తరి : తండ్రిపక్షి జరగటం కొనసాగించింది.
కర్మణి : తండ్రిపక్షిచేత కూడా జరగటం కొనసాగించబడింది.

TS 10th Class Telugu Important Questions 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

These TS 10th Class Telugu Important Questions 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు will help the students to improve their time and approach.

TS 10th Class Telugu 2nd Lesson Important Questions ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

PAPER – 1 – PART – A

I. వ్యక్తీకరణ-సృజనాత్మకత (స్వీయరచన)

1. లఘు సమాధాన ప్రశ్నలు (3 మార్కులు)

కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
‘ఆడవాళ్ళ నోట అసలైన భాష’ వినగలం – దీన్ని మీరు సమర్ధిస్తారా ? రెండు కారణాలు వ్రాయండి. (T.S June ’17)
జవాబు:
సదాశివగారు వరంగల్లు తెలుగు గురించి చెపుతూ, వరంగల్లులో కూరగాయలు అమ్మే స్త్రీల మాటల్లోనూ అచ్చమైన తెలుగు మాట వినిపిస్తుందని చెప్పారు. అంతేకాదు. ఏ ప్రాంతంలోనైనా అసలైన భాష ఆడవాళ్ళ నోటనే వినగలం అని సదాశివగారు చెప్పారు.

ఉర్దూ మాట్లాడే ముస్లిము స్త్రీలు, ఇల్లు దాటి వెళ్ళని వాళ్ళు, రాజమహళ్ళలో ఉండే బేగములు మాట్లాడే భాష శుద్ధమైనదని ఆనాటి విద్వాంసులు భావించేవారు. అందుకే కల్తీలేని ఉర్దూను, ‘బేగమాతీజుబాన్’, ‘మహెల్లాతీ జుబాన్’ అని పిలిచేవారు. ఈ విధంగా ఆడవాళ్ళ నోట అసలైన భాష వినిపిస్తుందని, సదాశివగారు అభిప్రాయపడ్డారు.

ప్రశ్న 2.
ఎవరిభాష వాళ్ళకు వినసొంపు ఎందుకు ? (T.S Mar. ’16)
జవాబు:
భాష అంతా ఒకటే అయినా ఏ ప్రాంతపు వాళ్ళు ఆ ప్రాంతపు మాండలిక భాషను, మాట్లాడతారు.

ఆ మాట్లాడే పదాల్లో ఒక రకమైన యాస ఉంటుంది. ఆయా ప్రాంతాలలో ఉపయోగించే పదాలు, నుడికారాలు, జాతీయాలు, పలుకుబడులు వేర్వేరుగా ఉంటాయి.

తెలుగుభాష అంతా ఒకటే అయినా కోస్తావారు, రాయలసీమవారు, తెలంగాణవారు వేర్వేరు మాండలిక పదాలు ఉపయోగిస్తారు. ఆ ప్రాంతంలో పరిచయంలో ఉన్న పదాలతో కూడిన భాష ఆ ప్రాంతం వారికి వినడానికి ఇంపుగా, సొంపుగా ఉంటుంది. వారికి బాగా అలవాటులో ఉన్న పదాలు, నుడికారపు సొంపు, పలుకుబడి కల భాష కాబట్టి, ఎవరి భాష వారికి వినసొంపుగా ఉంటుంది.

TS 10th Class Telugu Important Questions 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ప్రశ్న 3.
మరాఠీ పురోహితుని తెలుగుభాష ముచ్చటను గూర్చి వివరించండి.
జవాబు:
సదాశివగారి గ్రామంలో పూజలు చేయించే మరాఠీ పురోహితుడు ఒకడు ఉండేవాడు. ఆయన పూజలు చేయిస్తూ, “మొదలు మీ కండ్లకు నీళ్ళు పెట్టుకోండి” అనేవాడు. సదాశివగారు ఆ పూజారిని అలా అనవద్దనీ, శుభం అని పూజ చేస్తూ కళ్ళ నీళ్ళు పెట్టుకోవడం అన్న మాట, అశుభంగా ఉంటుందని పూజారికి చెప్పేవారు. పూజారిని అందరికీ తెలిసిన మరాఠీలో చెప్పమనేవారు. తరువాత పూజారి “కళ్ళకు నీళ్ళు పెట్టుకోండి” అని ‘కు’ ప్రత్యయం చేర్చి చెప్పేవాడు. పూజారి కళ్ళను నీటితో తుడుచుకోండి అన్న అర్థంలో అలా చెప్పేవాడు. కాని వినేవారికి వారిని ‘కన్నీరు కార్చండి’ అని చెప్పినట్లు అర్ధం వచ్చేది. అది తప్పుగా ఉండేది.

ప్రశ్న 4.
“ఆమెను చూస్తూవుంటే, వాగ్ధాటి వింటూ వుంటే ఎవరో యాదికి వచ్చినారు ” ఈ మాటల్లోని అంతరార్థాన్ని వివరించండి.
జవాబు:
భాసరలో వ్యాస వాంజ్ఞయం మీద ప్రసంగించిన కె. కమల గారి ప్రసంగాన్ని విని డా॥ సామల సదాశివ వారి నాన్నగారైన కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని యాది చేసుకుంటారు. మాట్లాడిన భాష, మాట్లాడే వారి యొక్క ప్రాంతీయ అస్థిత్వాన్ని, వారసత్వాన్ని తెలియజేస్తుందనటానికి ఇదొక ఉదాహరణ. ఏ ప్రాంతపు యాస, పలుకుబడులు ఆ ప్రాంత ప్రత్యేకతను, సంస్కారాన్ని తెలియ జేస్తుంది.

ప్రశ్న 5.
“వరంగల్లు తెలుగును టక్సాలీ తెలుగు అనవచ్చు” దానిలో అంతరార్థాన్ని వివరించండి.
జవాబు:
టక్సాలా అంటే టంకసాల. టంకసాలలో తయారయ్యే నాణేలకే విలువ. అవి ఎక్కడైనా చెల్లుతాయి. ఇతరులెవరైనా తయారుచేస్తే అవి నకిలీ నాణేలు. అవి చెలామణి కావు. పైగా ప్రభుత్వం జప్తు చేస్తుంది. వరంగల్లు ప్రాంత ప్రజలు మాట్లాడే భాష స్వచ్ఛమైనది, ప్రామాణికమైనది. అందుకే వరంగల్లు తెలుగును టక్సాలీ తెలుగు అనవచ్చు. వరంగల్లులో కూరగాయలమ్మే స్త్రీల మాటల్లో కూడా అచ్చమైన తెలుగు నుడి వినిపిస్తుంది.

TS 10th Class Telugu Important Questions 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ప్రశ్న 6.
మహబూబ్నగర్ తెలుగు నుడికారాన్ని వివరిం చండి.
జవాబు:
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సాహితీ ప్రముఖులు కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, సురవరం ప్రతాపరెడ్డి, గడియారం రామకృష్ణశర్మ గారు లాంటి వారి రాతలోనూ, మాటలోనూ మహబూబ్నగర్ జిల్లా ప్రాంతీయ భాషా మాధుర్యం కనిపించేది. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పడటానికి ముఖ్య కారకులైన గడియారం రామకృష్ణశర్మగారు, రచయిత సామల సదాశివ గారికి గురుతుల్యులు. మహబూబ్ నగర్ వాళ్ళ భాష తెలుగుతనాన్ని కలిగి ఉండేది.

ప్రశ్న 7.
‘ఎవరి భాష వాళ్ళకు వినసొంపు’ రచయిత డా॥ సామల సదాశివ గురించి రాయండి.
జవాబు:
డాక్టర్ సామల సదాశివ గారు బహుభాషా కోవిదులు. సంస్కృతం, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, ఫార్సీ, మరాఠీ, తెలుగు భాషల్లో పండితుడు. సాహిత్యానికే తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు. అన్ని ప్రాంతాల తెలుగు పలుకుబడులను, నుడికారాలను గౌరవించాలనే సహృదయుడు. స్వీయ అనుభవాలను, జ్ఞాపకాలను నెమరువేసుకున్న శీర్షిక ‘యాది’ వార్త పత్రికలో చాలా కాలం నడిచింది. వీరి ‘సంగీత శిఖరాలు’ హిందుస్తానీ సంగీతాన్ని గురించి తెలుగు లో వెలువడిన మొదటి గ్రంథం.

ప్రశ్న 8.
‘ప్రజల పలుకుబడిలో నుండి వచ్చిన భాష సహజ సుందరమైనది’ సమర్థిస్తూ రాయండి.
(లేదా)
‘మాతృభాష మధురమైన భాష’ దీన్ని సమర్థిస్తూ రాయండి.
(లేదా)
‘కల్తీ లేని తెలుగు’ అంటే మీకేమి అర్థమైంది ?
జవాబు:
ప్రజల పలుకుబడులు, జాతీయాలు, నుడికారాలు ఉపయోగిస్తూ ప్రాంతీయ మాండలికాలతో ఉపయోగించే భాష వినసొంపుగా ఉంటుంది. ఎంత గొప్ప పండితుడైనా తన వ్యావహారిక భాషలో మాట్లాడడానికే ఎక్కువ ఇష్టపడతాడు. ఆ భాష వినిపిస్తే పరవశించి పోతాడు. అందుకే “తాతా ! ఇగపటు నీ పాను, జర్దా డబ్బీ” అని మనవరాలు అనగానే తాతగారు చాలా అబ్బురపడ్డారు. ఆనందించారు. తమ ప్రాంతీయ భాష తన మనవరాలికి అలవడినందుకు ఆయన ఆశ్చర్యానికి, ఆనందానికి అవధి లేదు.

వరంగల్లు తెలుగు టక్సాలీ తెలుగు. అంటే టంకశాలలో తయారైన ఒరిజినల్ నాణెం లాంటిది. కల్తీ లేనిది. ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతపు భాష అలా అనిపిస్తుంది. అదే కల్తీ లేని తెలుగని రచయిత అభిప్రాయం.

TS 10th Class Telugu Important Questions 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ప్రశ్న 9.
ప్రాంతీయ భాష యొక్క మాధుర్యం ఎటువంటిది ?
(లేదా)
ప్రాంతీయత కనిపించే భాష అంటే ఏమిటి ? వివరించండి.
(లేదా)
“పసందైన ప్రాంతీయ భాష” దీనిని ఎట్లా అర్థం చేసుకొన్నారో వివరించండి.
(లేదా)
“వారి రాతలోను, మాటలోను ప్రాంతీయత కనిపించేది ” దీని గురించి చర్చించండి.
(లేదా)
“ఏ ప్రాంతపు వాళ్ళ తెలుగు ఆ ప్రాంతపు వాళ్ళకు ఇంకా మంచిగా ఉంటుంది” సమర్థించండి.
జవాబు:
ఒక ప్రాంతపు యాస, మాండలికం కల భాషను ప్రాంతీయ భాష అంటారు. ప్రాంతీయ భాష చాలా మధురంగా ఉంటుంది.

ఏ ప్రాంతం వారికైనా ఆ ప్రాంతంలో ఉపయోగించే పదాలు, జాతీయాలు, నుడికారాలు, పలుకుబడులు అంటే ఇష్టం ఉంటుంది. అవి తమ భాషలో ఉపయోగిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలలోనూ తెలుగు భాషనే మాట్లాడతారు. కాని, రెండు రాష్ట్రాలలోని ప్రతి జిల్లాకు ‘యాస’ మారిపోతుంది. మాండలికాలు మారిపోతాయి. నుడికారాలు మారిపోతాయి. ఇతర ప్రాంతాలవారికి కొన్ని అర్థం కావు. అయినా ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతపు భాష పసందుగా ఉంటుంది. వినే కొద్దీ వినాలనిపిస్తుంది. చదివే కొద్దీ చదవాలనిపిస్తుంది.

పండితులు తమ కావ్యాలలో శిష్టవ్యావహారికం ప్రయోగించినా తమ మాటలలోనూ, ఉత్తర ప్రత్యుత్తరాలలో ప్రాంతీయ భాషనే ఉపయోగిస్తారు. ఎందుకంటే ప్రాంతీయ భాష మాధుర్యం అటు వంటిది.

ప్రశ్న 10.
వ్యావహారిక భాష గురించి సామల సదాశివగారి అభిప్రాయాలను విశ్లేషించండి.
జవాబు:
తన మనుమరాలు “తాతా ! ఇగపటు నీ పాను, జర్దా డబ్బీ” అనగానే చాలా ఆనందించారు. తమ ‘ఆదిలాబాద్ జిల్లా’ ‘యాస’లో మాట్లాడింది. ‘ఇగపటు’ అని తమ ప్రాంతీయ పద ప్రయోగం వినబడేసరికి ఎక్కడ లేని ఆనందం కలిగింది.

ఒకప్పుడు సామల సదాశివగారు కూడా గ్రాంధిక భాషలోనే పుస్తకాలు, వ్యాసాలు రచించారు. కాని, వారికి కాలక్రమేణా వ్యావహారిక భాషపై మక్కువ పెరిగింది. అప్పుడిక ఆయనకు గ్రాంధిక భాషలో రచించిన తన పుస్తకాలే తనకు నచ్చలేదు. అందుచేత వ్యావహారిక భాషలోనే పుస్తకాలు రాయాలనేది సామలవారి నిశ్చితాభిప్రాయం.

TS 10th Class Telugu Important Questions 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ప్రశ్న 11.
‘మీర్ తఖీమీర్’ కవిత్వంలోకి సాధారణ ప్రజల భాష ఎట్లా వచ్చింది ? (T.S Mar. ’17)
జవాబు:
ఉర్దూ సాహిత్యంలో పండితుల పారసీ సమాసాల కంటే ప్రజల పలుకుబడికే మీర్ తఖీమీర్ ప్రాధాన్యం ఇచ్చేవారు. వారి కవిత గంభీర భావ భరితమైనా, భాష ప్రజల పలుకుబడిలోంచి వచ్చిన సహజసుందరమైనది.

ఆయన ప్రతి శుక్రవారం దిల్లీ జామె మసీదు మెట్ల మీద కూర్చుంటాడు. ఆ మెట్లమీదనే అటూ ఇటూ వరుసగా ఫకీర్లు, బిచ్చగాళ్ళు, బిచ్చగత్తెలు కూర్చుండి ఏవేవో మాట్లాడుకుంటారు. అవన్నీ శ్రద్ధగా వినేవారు. నమాజు చదవడానికి ఎందరో వస్తారు, పోతుంటారు. మాట్లాడుకుంటారు. అలా ప్రజల పలుకుబడిని, జాతీయాలను నేర్చుకున్నారు. దాని ప్రభావం అతని భాషపై పడింది.

2. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు (6 మార్కులు )

కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
తెలుగు వ్యావహారిక భాషలోని ప్రాంతీయ భేదాలను గురించి, సదాశివగారి అభిప్రాయం ఏమిటి ?
జవాబు:
సదాశివగారు మొదట్లో వ్యాసాలనూ, పుస్తకాలనూ గ్రాంథికభాషలో రాసేవారు. కాని ఆయన వ్యావహారిక వాదులతోనే గొంతు కలిపేవారు. ఉర్దూ, మరాఠీ పిల్లలు తమ ఇంట్లో మాట్లాడే భాషనే, బడులలోనూ చదివేవారు. కాని మొదట్లో తెలుగుపిల్లలు ఇంట్లో ఒక భాష మాట్లాడేవారు. బడులలో వేరే భాష చదివేవారు.

తెలుగులో వ్యావహారిక భాష అమలులోకి వచ్చాక తెలుగు పిల్లలు సైతం, ఇంట్లో మాట్లాడే భాషనే బడుల్లోనూ నేడు చదువుతున్నారు. అయితే మనం మాండలిక భేదాలు మాట అట్లుంచినా, ప్రాంతీయ భేదాలను కూడా సరిచేసుకోలేక పోతున్నామని సదాశివగారు అభిప్రాయపడ్డారు.

సరిచేసుకోవాలంటే తొలగించడం దిద్దుకోవడం కాదనీ, అన్ని ప్రాంతాల పలుకుబళ్ళనూ ఇప్పటి తెలుగు భాషలో కలుపుకోవడం అవసరమనీ సదాశివగారు అభిప్రాయపడ్డారు.

TS 10th Class Telugu Important Questions 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ప్రశ్న 2.
‘పలుకుబడి, నుడికారం, జాతీయాలు ఒక భాషకు అలంకారాల వంటివి’ ఈ అభిప్రాయాన్ని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
1) పలుకుబడి :
పలుకుబడి అంటే ఉచ్ఛారణలో ఉండే విలక్షణత. దీన్నే ‘యాస’ అంటారు. యాసలో మాట్లాడితే, ఆ ప్రాంతం వారికి వినసొంపుగా ఉంటుంది. మాండలిక యాసతో కూడిన పలుకుబడి, వినడానికి అందంగా, అలంకారంగా ఉంటుంది.

2) నుడికారం :
నుడికారం అంటే ‘మాట చమత్కారం’. ఈ నుడికారం ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిలోంచి, ఆచార వ్యవహారాల్లోంచిపుడుతుంది. చెప్పదలచుకున్న భావం మనస్సుకు హత్తకుంటుంది. నుడికారాలు జాతీయాలుగా, సామెతలుగా ఉంటాయి. నుడికారం వల్ల ఒక చమత్కారం, దానివల్ల ఆనందం, కలుగుతాయి. అందుకే అది అలంకారం.

3) జాతీయము :
జాతీయము ఆ జాతి వాడుకలో రూపుదిద్దుకుంటుంది. జాతీయంలోని పదాల అర్థాన్ని ఉన్నదున్నట్లుగా చూస్తే వచ్చే అర్థం వేరు. ఆ పదాల పొందికతో మరో అర్థం వస్తుంది. ఈ జాతీయము యొక్క భావం ఆ ప్రాంతం వారికి బాగా అర్థమై ఆనందాన్ని కల్గిస్తుంది. కాబట్టి పలుకుబడి, నుడికారం, జాతీయం అనేవి భాషకు అలంకారాల వంటివని చెప్పగలం.

ప్రశ్న 3.
ఇంట్లో మాట్లాడే భాష, బళ్ళో చదివే భాష వేరు వేరని సామల సదాశివ చెప్పటం వెనుకగల కారణాలను (సహేతుకంగా చర్చించండి.) .
(లేదా)
విద్యార్థుల భాష ఎన్ని రకాలుగా ఉంటుందని సామల సదాశివగారి అభిప్రాయమో తెల్పండి. విశ్లేషించండి.
జవాబు:
సామల సదాశివగారు తొలినాళ్ళలో గ్రాంథిక భాషలోనే పుస్తకాలు, వ్యాసాలు రాసేవారు. అప్పట్లో ఆయన పాఠశాలలో తెలుగు పాఠాలు చెప్పేవారు. ఆ పాఠాలన్నీ గ్రాంథిక భాషలోనే ఉండేవి. పిల్లలకు ఆ పాఠాలు సరిగా అర్థం అయ్యేవి కావు. అప్పట్లో పాఠ్యబోధన వ్యావహారిక భాషలో చేసేవారు కాదు. ప్రశ్నలకు జవాబులను కూడా పిల్లలు గ్రాంథిక భాషలోనే రాయవలసి వచ్చేది. ఈ విధానం సామల సదాశివగారికి నచ్చేది కాదు.

మరాఠీ, ఉర్దూ పాఠశాలల్లో పిల్లలకు వ్యావహారిక భాషలోనే బోధించేవారు. తెలుగు విద్యార్థులకు మాత్రం బడిలో గ్రాంథిక భాషను బోధించేవారు. ఇళ్ళ వద్ద మాత్రం వ్యావహారిక భాష మాట్లాడేవారు. అందుకే సామల సదాశివగారు విద్యార్థుల భాషను రెండు రకాలుగా పేర్కొన్నారు. అవి 1. ఇంట్లో మాట్లాడే భాష, 2. బళ్ళో చదివే భాష.

ఈ విధమైన రెండు భాషల విధానం సామల సదాశివగారికి ఇష్టం లేదు.

TS 10th Class Telugu Important Questions 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ప్రశ్న 4.
” గద్య, పద్య సాహిత్యం ప్రచారంలో ఉన్నంతకాలం ఎక్కడి తెలుగైనా ఒక్కటే” అన్న సామల సదాశివగారి మాటలను విశ్లేషించండి.
(లేదా)
ఇది విన్నప్పుడల్లా నేను రెండు ప్రశ్నలు వేసు కుంటాను. “ఏ తెలుగు, ఎక్కడి తెలుగు” అని. ఈ మాటలను సామల సదాశివగారు అనడం వెనుక కారణాలు ఏమై ఉంటాయో విశ్లేషించండి. (T.S Mar. ’17)
జవాబు:
సామల సదాశివగారు తెలంగాణ అభిమాని. తమ ప్రాంతం దాటి ఏనాడూ ఆంధ్రాకు కూడా రాలేదు. తమ యాస అంటే చాలా ఇష్టం. తమ ప్రాంతపు మాండలికాలంటే ఆయనకు ప్రాణం. తెలంగాణ నుడికారాలంటే ఆయనకు మక్కువ ఎక్కువ. తెలంగాణ పదబంధాలపై ఆయన అభిమానం వర్ణనాతీతం.

కాని, ప్రతి జిల్లాకు యాస, నుడికారం, పదబంధాలు మారిపోతాయి. అవి ఆయా వ్యావహారిక భాషలలోనే కనబడతాయి. గ్రాంథిక భాషలో రచింపబడిన గ్రంథాలలో ఏ ప్రాంతపు మాండలికాలూ, యాసలు పెద్దగా కనబడవు. సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చినవే ఎక్కువగా కనిపిస్తాయి.

అందుచేత గ్రాంథిక భాషలో రచించిన పద్యాలు, గద్యాలతో ఉన్న కావ్యాలలో కనిపించే తెలుగంతా ఒకలాగే ఉంటుంది. వ్యావహారికతకు, ప్రాంతీయతకు స్థానం ఉండదని సామల సదాశివ గారి అభిప్రాయం.

ప్రశ్న 5.
“తెలుగు పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు, బళ్ళో చదివే భాష వేరు”, అనే వాక్యాలు మీరు సమర్థిస్తారా ? ఎందుకు ? (T.S June ’17)
జవాబు:
పిల్లలు ఇంట్లో తమ తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో అక్కాచెల్లెండ్రతో, పనివారితో ప్రాంతీయమైన మాండలిక యాసలో మాట్లాడుతారు. వారు పాఠశాలకు వెళ్ళిన తరువాత, వారి పుస్తకాల్లో ఉన్న గ్రాంథిక భాషనూ పత్రికల్లో ఎక్కువమంది వాడే శుద్ధ వ్యావహారిక భాషనూ చదువుతారు. మాట్లాడుతారు.

TS 10th Class Telugu Important Questions 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ఇంట్లో మాట్లాడేది ప్రాంతీయపు యాసతో నిండిన మాండలిక భాష, బడిలో చదివేది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యే గ్రాంథిక భాష లేక శుద్ధ వ్యావహారిక భాష. కాబట్టి పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు. బళ్ళో చదివే భాష వేరు అన్నది నిజం.

PAPER – II : PART – A

1. అపరిచిత గద్యాలు (5 మార్కులు)

ప్రశ్న 1.
కింది పేరా చదివి, పట్టికను పూరించండి.

“తెలుగు సాహిత్యం మొదట గద్యపద్యాల మిశ్రితమై వెలువడినా, తరువాత కాలంలో పద్యకావ్యాలు, గద్యకావ్యాలు వేరువేరుగా వెలుగుచూశాయి. పద్యగద్య మిశ్రిత రచనలు చంపూ కావ్యాలు. 18వ శతాబ్దం వరకూ, ఈ రచనా సంప్రదాయం సాహిత్య రంగంలో కొనసాగింది. 19వ శతాబ్దం నుండి ఆంగ్లభాష సాహిత్యాల అధ్యయన ప్రభావంతో ఆ భాషలోని వివిధ రచనా రీతులు తెలుగు వారికి పరిచయం అయినాయి. అలా తెలుగులోకి ప్రవేశించిన రచనా ప్రక్రియ ‘నవల’. ఈ ప్రక్రియను తెలుగునాట ప్రచారంలోకి తెచ్చినవాడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు..

ప్రశ్నలు – జవాబులు
1. పద్యగద్యాల మిశ్రిత కావ్యాలు.
జవాబు:
చంపూ కావ్యాలు

2. 19వ శతాబ్దానికి పూర్వం తెలుగుభాషలో లేని ప్రక్రియ.
జవాబు:
నవల

3. పలు రచనా రీతులు తెలుగులోకి రావడానికి కారణం.
జవాబు:
ఆంగ్లభాషా సాహిత్యాల అధ్యయన ప్రభావం.

4. నవలా ప్రక్రియకు తెలుగునాట ఆద్యుడు.
జవాబు:
కందుకూరి వీరేశలింగం పంతులు గారు.

5. తెలుగు సాహిత్యం మొదట ఎలా ఉంది ?
జవాబు:
పద్యగద్యాల మిశ్రితమై వెలువడింది.

TS 10th Class Telugu Important Questions 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ప్రశ్న 2.
క్రింది పేరా చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రూపొందించండి. (T.S June ’15)

“గోదావరి నదికి ఇరువైపులా ఉన్న ఆదిలాబాదు, కరీంనగరు జిల్లాల్లోని గిరిజనులు, వారి ఆధ్వర్యం లోని రైతులు పూజించే దేవుళ్ళు చిన్నయ్య, పెద్దయ్య, “చిన్నయ్య, పెద్దయ్య / చిలుకల భీమయ్య” అని స్థానికంగా వినిపించే జానపద గేయంలో, చిన్నయ్య అంటే అర్జునుడు. పెద్దయ్య అంటే ధర్మరాజు. వారితో కూడిన భీముడ్ని పూజిస్తారు అని స్పష్టమౌతుంది. భీముడ్ని ప్రత్యేకంగా కొలువడానికి కారణముంది. పాండవులు వనవాసం చేస్తూ, ఇక్కడికి వచ్చినపుడు ఇక్కడి గిరిజన అమ్మాయి హిడింబిని భీముడు పెళ్ళి చేసుకొని, ఆ స్థానిక గిరిజనులకు ఆరాధ్య దైవమయ్యాడు”.
జవాబు:
ప్రశ్నలు

  1. గోదావరి నదికి ఇరువైపులా ఉన్న జిల్లాలు ఏవి ?
  2. గిరిజనులు, వారి ఆధ్వర్యంలో రైతులు పూజించే దేవుళ్ళు ఎవరు ?
  3. స్థానికంగా వినిపించే గేయమేది ?
  4. పెద్దయ్య, చిన్నయ్య అంటే ఎవరు ?
  5. గిరిజనులకు భీముడు ఎందుకు ఆరాధ్య దైవమయ్యాడు ?

ప్రశ్న 3.
కింది గద్యభాగాన్ని చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలను తయారుచేయండి.

“శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దివాడు. సాహిత్యంపై ప్రత్యేక అభిమానం కలవాడు. భువనవిజయమనే సభామండపంలో సాహిత్యగోష్ఠి నిర్వహించేవాడు. అనేక కవి పండితులను పోషించే వాడు. ఆయన ఆస్థానంలోని ఎనిమిది మంది ప్రసిద్ధ కవులను అష్టదిగ్గజాలు అని పిలిచారు. అందులో అల్లసాని పెద్దన అగ్రగణ్యుడు. వారిలో తెనాలి రామకృష్ణుడు వికటకవిగా పేరు పొందాడు. రాయలు రాజు మాత్రమే కాదు, కవి కూడా. దేశభాషలందు తెలుగు లెస్స అని చాటాడు. ఆయన కాలం తెలుగుభాషకు స్వర్ణయుగమై భాసిల్లింది.
జవాబు:
ప్రశ్నలు

  1. శ్రీకృష్ణదేవరాయలు ఏ కాలము వాడు ?
  2. శ్రీకృష్ణదేవరాయల సభాభవనం పేరు ఏమి ?
  3. ‘అష్టదిగ్గజాలు’ అంటే ఎవరు ? వారిలో అగ్రగణ్యుడు ఎవరు ?
  4. తెలుగుభాషకు ఎవరి కాలం స్వర్ణయుగం ?
  5. తెనాలి రామకృష్ణుడు ఏ విధంగా పేరు పొందాడు ?

TS 10th Class Telugu Important Questions 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ప్రశ్న 4.
క్రింది పేరా చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రూపొందించండి.

“ఏకశిలా నగరాన్ని రాజధానిగా చేసుకొని, తెలుగునేలను వైభవ స్థితిలో నిలిపిన కాకతీయ రాజులలో చివరివాడు రెండవ ప్రతాపరుద్రుడు. అతడు ఉత్తమ పరిపాలకుడు మాత్రమే కాదు, ‘మానవ ధర్మాన్ని, కళా మర్మాన్ని ఎరిగిన సాహితీ మూర్తి. సంస్కృతాంధ్రభాషల్లో అనుపమానమైన పాండిత్యాన్ని సొంతం చేసుకున్న సత్కవీంద్రుడు. సంగీత సాహిత్య నృత్య చిత్రలేఖన శిల్పకళలకు ఇతోధిక ప్రాధాన్యత నిచ్చి, వాటి విస్తృతికి విశేష సహకారమందించిన రసహృదయుడు, సహృదయుడు. ఎంతటి మహోన్నతులకయినా, చంద్రునిలో మచ్చలా ఏవో బలహీనతలుంటాయి. వేట ప్రతాపరుద్రుని బలహీనత. క్రమం తప్పకుండా వేట వినోదాన్ని ఆస్వాదించేవాడు ప్రతాపరుద్రుడు. ఆ వ్యసనం నుండి మహారాజును దూరం చేయాలని ఎంతగా ప్రయత్నించినా సఫలం కాలేకపోయినాడు మంత్రి యుగంధరుడు.
జవాబు:
ప్రశ్నలు

  1. కాకతీయుల రాజధాని ఏది ?
  2. రెండవ ప్రతాపరుద్రుడు ఏయే భాషల్లో పండితుడు ?
  3. ప్రతాపరుద్ర చక్రవర్తి యొక్క బలహీనత ఏమిటి ?
  4. యుగంధరుడు ఎవరు ?
  5. ప్రతాపరుద్రుడు లలితకళలను ఎలా పోషించాడు ?

ప్రశ్న 5.
క్రింది గద్యాన్ని చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

భాష నేర్చుకోడం రెండు రకములు. భాష కోసం భాష, విషయం కోసం భాష. భాషాస్వరూప స్వభావములను సమగ్రంగా అధ్యయనం చెయ్యడం మొదటి రకంలోనిది. శాస్త్ర సాంకేతిక విషయము లను, సాహిత్య సాంస్కృతిక విషయాల వంటి వాటిని అధ్యయనం చెయ్యడం రెండవ రకంలోనిది. అలాగే భాష కూడా రెండు రకములుగా తయారయింది. ప్రాచీన భాష, ఆధునిక భాష. సాహిత్యంలో తరతరాల వారసత్వాన్ని అవగాహన చేసుకొని ఆనందించడానికి ప్రాచీన భాష ఉపయోగిస్తుంది. ఆధునిక భాష ప్రయోజనం అపరిమితం. ప్రాచీన భాష ప్రయోజనం పరిమితం.

ప్రశ్నలు – జవాబులు
1. భాష ఎన్ని రకాలుగా తయారయింది ?
జవాబు:
ప్రాచీన భాష, ఆధునిక భాష అని రెండు రకాలుగా తయారయింది.

2. భాష ఏయే రకాలుగా నేర్చుకొంటాము ?
జవాబు:
భాష కోసం భాష, విషయం కోసం భాష అని భాషను రెండు రకాలుగా నేర్చుకొంటాము.

3. ప్రాచీన భాష ఎందుకు ఉపయోగిస్తుంది ?
జవాబు:
సాహిత్యంలో తరతరాల వారసత్వాన్ని అవగాహన చేసుకొని అందించడానికి ప్రాచీన భాష ఉపయోగ పడుతుంది.

4. ఆధునిక భాష ప్రయోజనం ఎటువంటిది ?
జవాబు:
ఆధునిక భాష ప్రయోజనం అపరిమితం.

5. ప్రాచీన భాష ప్రయోజనం ఎటువంటిది ?
జవాబు:
ప్రాచీన భాష ప్రయోజనం పరిమితం.

TS 10th Class Telugu Important Questions 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ప్రశ్న 6.
కింది గద్యభాగాన్ని చదవండి. కింద ఇచ్చిన ఐదు వాక్యాలలోని తప్పొప్పులను గుర్తించి బ్రాకెట్లలో రాయండి.

“అంతరించిపోతున్న తెలుగుభాషా సంస్కృతులకు పునరుజ్జీవనం కల్పించుటకై రంగంలోకి దిగిన కందుకూరి పూర్తి సంఘసంస్కరణ దృక్పథంతో పనిచేశారు. ఒకే రంగాన్ని ఎంచుకోకుండా, సంఘంలో అపసవ్యంగా సాగుతున్న పలు అంశాల వైపు దృష్టిని సారించాడాయన. ప్రధానంగా స్త్రీల అభ్యున్నతిని కాంక్షించిన మహామనీషిగా వాళ్ళ చైతన్యం కోసం అనేక రచనలు చేశారు. చంద్రమతి చరిత్ర, సత్యవతి చరిత్ర వంటివి అందులో కొన్ని. వారి బ్రహ్మవివాహం నాటకం, పెద్దయ్య గారి పెళ్ళి పేరుతో, వ్యవహార ధర్మబోధిని, ప్లీడర్ నాటకం పేరుతోనూ, ప్రసిద్ధి పొందాయి.

ప్రశ్నలు – జవాబులు
1. కందుకూరి పూర్తిపేరు వీరేశలింగం పంతులు.
జవాబు:
ఒప్పు

2. చంద్రమతి చరిత్ర కందుకూరి రాసిన గొప్ప నాటకం.
జవాబు:
తప్పు

3. సంఘంలోని సవ్యమైన అంశాలపై దృష్టి సారించా డాయన.
జవాబు:
తప్పు

TS 10th Class Telugu Important Questions 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

4. కందుకూరి గొప్ప సంఘసంస్కర్త.
జవాబు:
ఒప్పు

5. తెలుగుభాషా సంస్కృతులను పునరుజ్జీవింపచేశారు కందుకూరి.
జవాబు:
ఒప్పు

2. వ్యక్తీకరణ – సృజనాత్మకత (5 మార్కులు )

ప్రశ్న 1.
నీ మాతృభాష గొప్పతనాన్ని వివరిస్తూ నీ మిత్రునకు లేదా మిత్రురాలికి లేఖ రాయి.
జవాబు:
లేఖ

రామాపురం,
X X X X X.

ప్రియమైన శ్రీలతకు,
నీ స్నేహితురాలు వ్రాయు లేఖ,

ఇక్కడ మేమంతా క్షేమం. అక్కడ మీరంతా క్షేమమని తలచెదను.

మేము ఈ రోజు ‘ఎవరి భాష వాళ్ళకు వినసొంపు’ అనే పాఠం చదువుకున్నాం. అది సామల సదాశివగారి రచన. ఆ పాఠం నాకు చాలా బాగా నచ్చింది.

ఎవరి ప్రాంతంలో మాట్లాడే భాషంటే వాళ్ళకు చాలా ఇష్టంగా ఉంటుంది. మనందరి మాతృభాష తెలుగు. తెలుగు చాలా మధురమైన భాష. తెలుగును ‘ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్’ అంటారు. తెలుగులో అనేక జాతీయాలు, సామెతలు, పదబంధాలు ఉన్నాయి. తెలుగులో ఎంతోమంది కవులు, రచయితలు ఉన్నారు. విదేశీయులు కూడా మెచ్చుకొన్న భాష మన తెలుగుభాష. ఎంతోమంది చక్రవర్తులు, రాజులు, జమీందార్లు అభిమానించి, ఆదరించిన భాష మన తెలుగుభాష.

కాని ఎవరి ప్రాంతపు మాండలికమంటే వారికి ఇష్టం. ఎవరి ప్రాంతపు ‘యాస’ అంటే వారికి ప్రీతి. ఎవరి ప్రాంతపు నుడికారాలు, పదబంధాలు, సామెతలంటే వారికి మక్కువ ఎక్కువ. అందరి మాతృభాష ఒకటే అయినా, ప్రాంతాన్ని బట్టి అభిమానం పెరుగుతుంది. ఇది సహజం కదా ! మరి ఉంటా !

తప్పనిసరిగా జవాబు వ్రాయి. మీ పెద్దలకు నా నమస్కారాలు.

ఇట్లు,
నీ స్నేహితురాలు,
X X X.

చిరునామా :
కె. శ్రీలత,
10వ తరగతి, నెం. 18,
జిల్లా పరిషత్ పాఠశాల,
సుభాష్ నగర్, రంగారెడ్డి జిల్లా.

TS 10th Class Telugu Important Questions 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ప్రశ్న 2.
మాతృభాషపై మీకు ఉన్న మక్కువను తెలియజేస్తూ కవి రాయండి.
జవాబు:
మా అమ్మ మనసు వలె కమ్మనైనది మా భాష
మా ఇంటి పదాల ఘుమఘుమలకు ఆలవాలం మా భాష
మా తాత ముత్తాతల నానుడుల తియ్యందనం మా భాష
మా ఊరి చెరువు నీరంత తియ్యనిది మా ప్రాంత భాష
మా ఊరి రచ్చబండలా పిలిచేది మా భాష
మా ఇంటి సిరి లాగ మెరిసేది మా భాష
మా భాష పలుకులు చిలకల కులుకులు
మా భాష వింటేనే శరీరమంతా పులకలు

ప్రశ్న 3.
మీ ప్రాంతంలో జరిగిన వ్యావహారిక భాషా సదస్సుపై నివేదిక తయారుచేయండి.
జవాబు:
భాషా సదస్సుపై నివేదిక

28.6.16 తేదీన ఉదయం 10 గంటలకు ఠాగూర్ ఆడిటోరియంలో ప్రముఖ కవి రామ్మూర్తిగారి అధ్యక్షతన వ్యావహారిక భాషా సదస్సు ప్రారంభ మైంది. స్థానిక ప్రజాప్రతినిధి చేత జ్యోతి ప్రజ్వలన చేయబడింది. సరస్వతీదేవి చిత్రపటాన్ని, కాళోజీ నారాయణరావు గారి చిత్రపటాన్ని పూలమాలలతో అలంకరించారు.

సుమారు 100 మంది హాజరయ్యారు. వేదికపై ప్రముఖ కవులు, పండితులు ఆశీనులయ్యారు. గ్రాంధిక భాష నుండి వ్యావహారిక భాష వైపు సాగిన సాహితీ ప్రయాణాన్ని వక్తలు వివరించారు. వ్యావహారిక భాషలోనే రచనలు చేయాలని సమావేశం తీర్మానించింది.

చిత్రకవి గారి వందన సమర్పణతో మధ్యాహ్నం 1 గంటకు సమావేశం ముగిసింది.

TS 10th Class Telugu Important Questions 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ప్రశ్న 4.
సామల సదాశివగారిని అభినందిస్తూ ఒక అభినందన పత్రం రాయండి.
జవాబు:
ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు అయిన సామల సదాశివగారి సాహిత్య సేవలకు వారిని ఘనంగా సన్మానించి, సమర్పించు.

అభినందన పత్రం

గ్రాంథిక భాషలో ఆరితేరిన సదాశివా !
వ్యావహారిక భాషలో ముచ్చటించే సదాశివా !
నీ కిష్టమైన భాష తెలుగు – నీవు పుట్టింది తెలుగు పల్లె
కఠినమైన గ్రాంథికం దహించడానికేనేమో నీది దహెగామ్ మండలం
ఏడు భాషలలో పాండిత్యం సొంతమైనా
‘ఇగపటు’ అంటే మురిసిపోయే నీ స్వభావం మాకిష్టం.
వేలూరి వారి ఏకలవ్య శిష్యుడినంటూనే
ఏలేశావు సాహితీ ప్రపంచాన్ని
మన తెలంగాణా ‘యాస’ కు ‘బాస’ కు కట్టుబడిన
బిడ్డా ! నీకివే మా వందనాలివే –

ఇట్లు
అభిమానులు.

ప్రశ్న 5.
తెలుగు భాషా మాధుర్యం తెలియజేసే నినాదాలు రాయండి.
జవాబు:
తెలుగుభాష పలుకు నీ భవిత వెలుగు
మన వాడుక భాష – మనకు తోడైన భాష
దేశ భాషలందు – తెలుగు లెస్స
తెలుగు విలువను పెంచరా – తెలివిగా మలచుకో జీవి
అమ్మ వంటిది మన భాష – అమృతం చిందించు భాష

TS 10th Class Telugu Important Questions 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ప్రశ్న 6.
మాతృభాషను కాపాడమని కోరుతూ కరపత్రం తయారుచేయండి.
జవాబు:
తెలుగు – వెలుగు

తెలుగువాడా ! మేలుకో ! నీ మాతృభాషను కాపాడుకో ! రాజాస్థానాలలో, బంగారు పల్లకీలలో ఊరేగిన మన తెలుగు భాష వెలుగు తగ్గుతోంది.

జమీందారీ సంస్థానాలలో అగ్రతాంబూలాలను అందుకొన్న మన తెలుగు భాష అదృశ్యమౌతోంది. ప్రజల నాలుకలపై నర్తించి, అమృతం చిలికిన మన తెలుగు మృత భాషలలో చేరుతోందట.

తెలుగుకు విలువ పెంచుదాం. తెలుగులోనే పలుకుదాం. తెలుగుభాషను రక్షిద్దాం.

ఇట్లు
తెలుగు భాషా పరిరక్షణ కమిటీ,

అదనపు వ్యాకరణాంశాలు

PAPER – 1 PART – B

1. సొంతవాక్యాలు

  1. ఏకలవ్య శిష్యుడు : నేను దాశరథి గారికి, ఏకలవ్య శిష్యుడిని.
  2. సన్నిధానం – (సమీపం) : దేవుని సన్నిధానంలో భక్తులు పరవశిస్తారు.

2. పర్యాయపదాలు

ఆలయం = ఇల్లు, గృహం
త్యాగం = ఈవి, ఈగి
పోరాటం = యుద్ధం, సంగ్రామం, సమరం
ప్రశంస = పోగడ్త, స్త్రోత్రం
సొంపు = సోయగం, అందం
మిత్రుడు = స్నేహితుడు, నేస్తము, చెలికాడు
పుస్తకము = పొత్తము, గ్రంథము, కావ్యము
పండితుడు = విద్యాంసుడు, బుధుడు, కోవిదుడు
ఆజ్ఞ = ఆన, ఆదేశము, ఆనతి, ఉత్తరువు
పుత్రిక = కూతురు, కుమార్తె, కుమారి, తనూజ
సభ = కూటము, పరిషత్తు, సదస్సు
గ్రామం = ఊరు, జనపదం
భాష = భాషితం, బాస, వాక్కు
కావ్యం = కబ్బం, కృతి

TS 10th Class Telugu Important Questions 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

3. నానార్థాలు

ఆశ = కోరిక, దిక్కు
కవి = కవిత్వం చెప్పేవారు, పండితులు, శుక్రుడు, జలపక్షి, ఋషి
సాహిత్యము = కలయిక, వాజ్మయం
క్షేత్రము = చోటు, పుణ్యస్థానం, భూమి, శరీరం
సీమ = ఎల్ల, వరిమడి, ఒడ్డు, దేశము
తాత = తండ్రి తండ్రి లేక తల్లి తండ్రి, బ్రహ్మ
పండితుడు = విద్యాంసుడు, బుద్ధిశాలి, వ్యాపారి
వారము = ఏడురోజులు కాలం, సమయము, మద్యపాత్రము, సమూహము
అయ్య = తండ్రి, పూజ్యుడు, ప్రశ్నార్థకము

4. ప్రకృతి – వికృతులు

ప్రకృతి – వికృతి
ఆజ్ఞ – ఆన
విద్య – విద్దె, విదియ
కార్యం – కర్జం
శక్తి – సత్తి
భాష – బాస
సహజం – సాజం
త్రిలింగము – తెలుగు
పుస్తకము – పొత్తము
ప్రాంతము – పొంత
జీవితము – జీతము
వ్యవహారము – బేరము
భోజనము – బోనము
శిష్యుడు – సువుడు
ఆర్య – అయ్య

TS 10th Class Telugu Important Questions 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

5. వ్యుత్పత్త్యర్థాలు

గురువు = అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవాడు (ఉపాధ్యాయుడు).
భాష = భాషింపబడునది
అధ్యక్షుడు = చర్యలను కనిపెట్టి చూచేవాడు (అధ్యక్షుడు).
పండితుడు = శాస్త్రమందు మంచి బుద్ధి గలవాడు (విద్వాంసుడు).
కవి = చాతుర్యము చేత వర్ణించువాడు – విద్వాంసుడు.
మిత్రుడు = స్నేహించువాడు – స్నేహితుడు
గ్రామము = అనుభవింపబడునది – ఊరు
పురోహితుడు = పురము యొక్క క్షేమమును కోరు వాడు – పూజలు చేయించువాడు
సాహిత్యము = కావ్య, నాటక, అలంకారాదుల అర్ధ జ్ఞానము – వాఙ్మయం

PAPER – II . PART-B

1. సంధులు

1. నాలుగేళ్ళు = నాలుగు + ఏళ్ళు – ఉత్వసంధి
2. రెండేళ్లు = రెండు + ఏళ్ళు – ఉత్వసంధి
3. సొంపయినదే = సొంపు + అయినదే – ఉత్వసంధి
4. ఒక్కొక్కప్పుడు = ఒక్కొక్క + అప్పుడు – అకారసంధి
5. అమ్మమ్మ = అమ్మ + అమ్మ – అత్వసంధి
6. ఒక్కొక్క = ఒక్క + ఒక్క – ఆమ్రేడితసంధి
7. అక్కడక్కడ = అక్కడ + అక్కడ – ఆమ్రేడిత సంధి
8. ప్రాంతపువాళ్ళు = ప్రాంతము + వాళ్ళు – పుంప్వాదేశ సంధి
9. ప్రాంతీయపు తీయన = ప్రాంతీయము + తీయన – పుంప్వాదేశ సంధి
10. మనుమరాలు = మనుమ + ఆలు – రుగాగమ సంధి
11. జాతీయాలు = జాతీయము + లు – లులనల సంధి
12. ప్రసంగాలు = ప్రసంగము + లు – లులనల సంధి

TS 10th Class Telugu Important Questions 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

2. సమాసాలు

సమాస పదము – విగ్రహవాక్యము – సమాసము పేరు

నాలుగేళ్ళు – నాలుగు సంఖ్యగల ఏళ్ళు – ద్విగు సమాసం
నాలుగేళ్ళు – నాలుగైన ఏళ్ళు – ద్విగు సమాసం
నాలుగు మాటలు – నాలుగైన మాటలు – ద్విగు సమాసం
సంస్కృతాంధ్ర భాషలు – సంస్కృత భాషయు, ఆంధ్ర భాషయును – ద్వంద్వ సమాసం
కావ్యవ్యాకరణాలు – కావ్యమును, వ్యాకరణమును – ద్వంద్వ సమాసం
చివరిపేజి – చివరిదైన పేజి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
చిన్నముచ్చట – చిన్నదైన ముచ్చట – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
మొదటి వాక్యం – మొదటిదైన వాక్యం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
ఉద్దండ పండితులు – ఉద్దండులైన పండితులు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
మహాపండితుడు – గొప్పవాడైన పండితుడు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
ప్రౌఢకావ్యం – ప్రౌఢమైన కావ్యం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
పెద్ద పుస్తకం – పెద్దదైన పుస్తకం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
పెద్ద మనుమరాలు – పెద్దదైన మనుమరాలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము

TS 10th Class Telugu Important Questions 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

నకిలీ నాణేలు – నకిలీవైన నాణేలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
వ్యాసవాఙ్మయం – వ్యాసుని యొక్క వాఙ్మయం – షష్ఠీ తత్పురుష సమాసం
కాళోజీ వర్ధంతి – కాళోజీ యొక్క వర్ధంతి – షష్ఠీ తత్పురుష సమాసం
లావణ్య వాక్యం – లావణ్య యొక్క వాక్యం – షష్ఠీ తత్పురుష సమాసం
కవి సమ్మేళనం – కపుల యొక్క సమ్మేళనం – షష్ఠీ తత్పురుష సమాసం
గురు పుత్రిక – గురువు యొక్క పుత్రిక – షష్ఠీ తత్పురుష సమాసం
ఈశ్వరాలయం – ఈశ్వరుని యొక్క ఆలయం – షష్ఠీ తత్పురుష సమాసం
ఉస్మానియా యూనివర్సిటీ – ఉస్మానియా అను పేరుగల యూనివర్సిటీ – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము
ఆంధ్రభాష – ‘ఆంధ్రము’ అనే పేరుగల భాష – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము
వ్యాకరణ శాస్త్రం – వ్యాకరణము అనే పేరుగల శాస్త్రము – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము
మధ్యాహ్నం – ఆహ్నం యొక్క మధ్య భాగం – ప్రథమా తత్పురుష సమాసం
బాల్యమిత్రులు – బాల్యమందు మిత్రులు – సప్తమీ తత్పురుష సమాసం
ఆంధ్ర బిల్హణుడు – ఆంధ్రమందు బిల్హణుడు – సప్తమీ తత్పురుష సమాసం
తెలుగు విద్వాంసులు – తెలుగు నందు విద్వాంసులు – సప్తమీ తత్పురుష సమాసం
ఏకలవ్య శిష్యుడు – ఏకలవ్యుని వంటి శిష్యుడు – ఉపమానోత్తర పద కర్మధారయ సమాసము
రెండు ప్రశ్నలు – రెండైన ప్రశ్నలు – ద్విగు సమాసం
సీమోల్లంఘనం – సీమను ఉల్లంఘించడం – ద్వితీయా తత్పురుష సమాసం
బిరుదాంచితులు – బిరుదు అంచితులు – తృతీయా తత్పురుష సమాసం
వార్తాపత్రిక – వార్తలు కొఱకు పత్రిక – చతుర్థీ తత్పురుష సమాసం

TS 10th Class Telugu Important Questions 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

3. వాక్య పరిజ్ఞానం

అ) సంక్లిష్ట, సంయుక్త వాక్యాలు

ప్రశ్న 1.
వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కాఫీ ఇచ్చారు. (సంక్లిష్ట వాక్యంగా మార్చండి.)
జవాబు:
వాళ్ళింటికి వెళితే కాఫీ ఇచ్చారు.

ప్రశ్న 2.
ఆలస్యంగా ఇంటికి వెళ్ళాను. అమ్మతిట్టింది. (సంయుక్త వాక్యంగా రాయండి.)
జవాబు:
ఆలస్యంగా వెళ్ళాను కాబట్టి అమ్మ తిట్టింది.

ప్రశ్న 3.
సీత నిశ్చితార్థం జరిగింది. నాగయ్య సంబరపడ్డాడు. (సంయుక్త వాక్యంగా రాయండి.)
జవాబు:
సీత నిశ్చితార్థం జరిగింది కాబట్టి నాగయ్య సంబర పడ్డాడు

ప్రశ్న 4.
సీతమ్మ పెళ్ళికి ఏర్పాటుచేశారు కాని పెండ్లి పెటాకులయ్యింది. (సామాన్య వాక్యాలుగా రాయండి.)
జవాబు:
సీతమ్మ పెళ్ళికి ఏర్పాటు చేశారు. సీతమ్మ పెండ్లి పెటాకులయ్యింది.

ప్రశ్న 5.
సుజిత అక్క, రజిత చెల్లెలు. (సంయుక్త వాక్యంగా రాయండి.)
జవాబు:
సుజిత అక్క రజిత చెల్లెలు.

TS 10th Class Telugu Important Questions 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ప్రశ్న 6.
నవీన్ కష్టపడ్డాడు కానీ గెలవలేకపోయాడు. (సామాన్య వాక్యాలుగా రాయండి.)
జవాబు:
నవీన్ కష్టపడ్డాడు. నవీన్ గెలువలేకపోయాడు.

ప్రశ్న 7.
జంధ్యాల గొప్ప దర్శకుడు, నటుడు. (సామాన్య వాక్యాలుగా రాయండి.)
జవాబు:
జంధ్యాల గొప్ప దర్శకుడు. జంధ్యాల గొప్ప నటుడు.

ఆ) కర్తరి – కర్మణి వాక్యాలు

ప్రశ్న 1.
బాలురచే సెలవు తీసుకోబడింది. (కర్తరి వాక్యంలోకి మార్చండి.)
జవాబు:
బాలురు సెలవు తీసుకున్నారు.

ప్రశ్న 2.
కాయలు అతని ముందర పోశారు. (కర్మణి వాక్యంలోకి మార్చండి.)
జవాబు:
కాయలు అతనిముందర పోయబడ్డాయి.

ప్రశ్న 3.
సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు. (కర్మణి వాక్యంలోకి మార్చండి.)
జవాబు:
సంఘసంస్కర్తలచేత దురాచారాలు నిర్మూలించ బడ్డాయి.

ప్రశ్న 4.
చంద్రునిలోని మచ్చ విష్ణువులాగా కన్పిస్తూ అలరిస్తున్నది. (కర్మణి వాక్యంలోకి మార్చండి.)
జవాబు:
చంద్రునిలోని మచ్చ విష్ణువులాగా కన్పిస్తూ అలరింప బడుతున్నది.

TS 10th Class Telugu Important Questions 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ప్రశ్న 5.
తిరుమల రామచంద్ర గారు కొంత కాలం ఆంధ్రప్రభ వార పత్రికలో చివరిపేజీ రాసేవారు. (కర్మణి వాక్యం లోకి మార్చండి.)
జవాబు:
ఆంధ్రప్రభ వారపత్రికలో చివరిపేజీ తిరుమల రామచంద్ర గారిచేత కొంతకాలం రాయబడింది.

ప్రశ్న 6.
ప్రభుత్వంచే జప్తు చేయబడుతుంది. (కర్తరి వాక్యంలోకి మార్చండి.)
జవాబు:
ప్రభుత్వం జప్తు చేస్తుంది.

ఇ) పత్యక్ష కథనం – పరోక్ష కథనం

ప్రశ్న 1.
“నాది ప్రజా కవిత కదా” అన్నాడట మహాకవి మీర్ తఖీమీర్. (పరోక్ష కథనంలోకి మార్చండి.)
జవాబు:
మహాకవి మీర్ తఖీమీర్ తనది ప్రజాకవిత కదా అని అన్నాడు.

ప్రశ్న 2.
“తాతా ! ఇగపటు నీ పాను, జర్దా డబ్బీ” అని మనుమరాలు అన్నది. (పరోక్ష కథనంలోకి మార్చండి.)
జవాబు:
ఆయన పాను, జర్దాడబ్బీ ఇగపట్టుమని తాతతో మనుమరాలు అన్నది.

ప్రశ్న 3.
తన పుస్తకాలు, కాగితాలు ఏమైనాయని, ఎవరు తీసారని అంబేద్కర్ కేకలు వేసేవాడు. (ప్రత్యక్ష కథనంలోకి మార్చండి.)
జవాబు:
నా పుస్తకాలు, కాగితాలు ఏమైనాయి ? ఎవరుతీశారు అని అంబేద్కర్ కేకలు వేసేవాడు.

ప్రశ్న 4.
తనకు ఎవ్వరూ ఇవ్వనక్కర్లేదని శివుడే ఉన్నాడని దాసు అన్నాడు. (ప్రత్యక్ష కథనంలోకి మార్చండి.)
జవాబు:
“నాకు ఎవ్వరూ ఇవ్వనక్కర్లేదు శివుడు ఉన్నాడు” అని దాసు అన్నాడు.

TS 10th Class Telugu Important Questions 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ప్రశ్న 5.
“నేనొక్కడినే అదృష్టవంతుడినా” అన్నాడు జంఘాల శాస్త్రి. (పరోక్ష కథనంలోకి మార్చండి.)
జవాబు:
తనొక్కడినే అదృష్టవంతుడినా అని జంఘాల శాస్త్రి అన్నాడు.

ప్రశ్న 6.
“నన్ను మీరు దీవించ వలయును” అని రమేశ్ అన్నాడు. (పరోక్ష కథనంలోకి మార్చండి.)
జవాబు:
తనకు వాళ్ళు దీవించాలని రమేశ్ అన్నాడు.

ఈ) ఆధునిక వచనాలు

ఈ క్రింది వాక్యాలను ఆధునిక భాషలోకి మార్చి రాయండి.

ప్రశ్న 1.
పక్షి ప్రపంచములో రెండు దృశ్యములతి మనోహర మైనవి.
జవాబు:
పక్షి ప్రపంచంలో రెండు దృశ్యాలు అతి మనోహర మైనవి.

ప్రశ్న 2.
నా హృదయములోని పేదరికమును సమూలముగా తొలగించు.
జవాబు:
నా హృదయంలోని పేదరికాన్ని సమూలంగా పోగొట్టు.

ప్రశ్న 3.
చూడాకర్ణుడా ! యేమది మీదు చూచినేల కఱ్ఱతోఁ కొట్టుచున్నావు ?
జవాబు:
చూడాకర్ణుడా ! ఏమిటిపైకి చూసి నేలమీద కఱ్ఱతో కొట్టుచున్నావు.

TS 10th Class Telugu Important Questions 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ప్రశ్న 4.
ధనమును బాసిన క్షణముననే లాతివాడగును.
జవాబు:
ధనం పోయిన క్షణంలోనే పరాయివాడౌతాడు.

ప్రశ్న 5.
రవీ ! ఈనాడు నీవు నాకు ప్రాణమిత్రుడవైనావు.
జవాబు:
రవీ ! ఈరోజు నీవు నా ప్రాణమిత్రుడయ్యావు.

4. అలంకారాలు

ఈ క్రింది వాక్యాలలో ఏ అలంకారం ఉన్నదో గుర్తించండి.

ప్రశ్న 1.
‘అబద్ధముల బల్కకు, వాదములాబోకు, మర్యాదనతి క్రమింపకు’.
జవాబు:
అంత్యానుప్రాస

ప్రశ్న 2.
కోడిరామమూర్తి భీముడి వలె బలవంతుడు.
జవాబు:
ఉపమాలంకారం

ప్రశ్న 3.
ఆ మబ్బులు ఏనుగు పిల్లల్లా అన్నట్లు ఉన్నవి.
జవాబు:
ఉత్ప్రేక్ష

ప్రశ్న 4.
అడుగులు తడబడుతూ బుడిబుడి నడకలతో బుడతడు వస్తున్నాడు.
జవాబు:
వృత్త్యానుప్రాసాలంకారం

TS 10th Class Telugu Important Questions 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ప్రశ్న 5.
అజ్ఞాన తిమిరాన్ని తొలగించి జ్ఞానజ్యోతి వెలిగించేది గురువులే.
జవాబు:
రూపకాలంకారం

TS 10th Class Physical Science Important Questions Chapter 5 Human Eye and Colourful World

These TS 10th Class Physics Chapter Wise Important Questions Chapter 5 Human Eye and Colourful World will help the students to improve their time and approach.

TS 10th Class Physical Science Important Questions Chapter 5 Human Eye and Colourful World

1 Mark Questions

Question 1.
What is the range of vision of a normal human eye?
Answer:
25 cm to infinity.

Question 2.
What is angle of vision?
Answer:
The maximum angle, at which we can see the whole object is called angle of vision.

Question 3.
What is cornea?
Answer:
The front curved portion of eye, which covered by a transparent protective membrane is called the cornea.

Question 4.
What Is “Iris” and “Pupil”
Answer:
IrIs: The part between the aqueous humour and the lens having muscular diaphragm is called ‘Iris’.
Pupil: It is the name of the small hole In ‘Pupil.

TS 10th Class Physical Science Important Questions Chapter 5 Human Eye and Colourful World

Question 5.
What are three common defects of vision? (ASI)
Answer:
The common defects of vision are i) Myopia ii) Hypermetropia iii) Presbyopia

Question 6.
What is the purpose of human eye?
Answer:
It uses to see and perceive of the objects around us.

Question 7.
Why do stars twinkle? (AS 1)
Answer:
Due to change in atmosphere conditions, density changes so position keeps on changing.

Question 8.
What Is “lens”? (ASL)
Answer:
It is an optical system (material) with two refracting spherical surfaces.

Question 9.
Why is normal eye not able to see clearly the objects placed closer than 25cm?
Answer:
The focal length of eye lens cannot decrease below 25 cm.

Question 10.
State the colour of sunlight scattered by aIr molecules in the atmosphere.
Answer:
Blue colour.

Question 11.
What is the relation between power of lens and focal length (f) ?
Answer:
Power of lens (concave/convex)
P = \(\frac{1}{f(\text { inmt })} \text { (or) } \frac{100}{f(\text { incm })} \)

Question 12.
On which factor does the colour of the scattered white light depend?
Answer:

  1. Angle of scattering
  2. Distance travelled by light
  3. Size of the molecules

Question 13.
What is “Dloptre”?
Answer:
It is the ST unit of power.

Question 14.
What Is “Retina”?
Answer:
The image is formed on the retina which Is the internal part of eye. It Is retained.

Question 15.
What do you mean by least distance of distinct vision? What Is Its value?
Answer:
To see an object comfortably and distinctly, one must hold at a distance of about 25 cm from his/her eyes. This distance is called least distance of distinct vision.

TS 10th Class Physical Science Important Questions Chapter 5 Human Eye and Colourful World

Question 16.
What is the angle of vision? (AS1)
Answer:
The maximum angle at which we are able to see the whole object is called angle of vision. The angle of vision for a healthy human being is about 600.

Question 17.
Which part of the eye acts as variable aperture for entry of light into the eye?
Answer:
The ‘Iris’ enables ‘pupil’ to act as a variable aperture for entry of light Into the eye, by helping the ‘pupil’ to expand In low light conditions and contract in bright light conditions.

Question 18.
What is the role of rods and cones in the human eye?
Answer:
Retina contains about 125 million receptors called rods and cones. Rods identify the colour and cones identify the intensity of light.

Question 19.
What do you mean by ‘accommodation of eye lens’?
Answer:
The ability of eye lens to change its focal length and It is called accommodation of lens.

Question 20.
What Is myopia? How is it corrected?
Answer:
Some people cannot see objects at long distances but can see nearby objects clearly. This type of defect in vIsion Is called ‘Myopia’ or near sightedness’. This can be corrected by using a concave lens of suitable focal length.

Question 21.
What is ‘far point’?
Answer:
The point of maximum distance at which the eye lens can form an image on the retina ¡s called ‘far point’.

Question 22.
What is hypermetropla ? How Is It corrected?
Answer:
A person with hypermetropia can see distant objects clearly but cannot see objects at near distances. This is also known as ‘far sightedness This can be corrected by using a convex lens of suitable focal length.

Question 23.
What is near point?
Answer:
The point of minimum distance at which the eye lens can form an image on the retina is called near point.

Question 24.
What is presbyopia?
Answer:
Presbyopia is vision defect when the ability of accommodation of the eye usually decreases with age.

Question 25.
What Is power of lens? What are its units?
Answer:
The degree of convergence or divergence of light rays that can be achieved by lens Is expressed in terms of its power.
The reciprocal of focal length is called power of lens.
Power of lens P = \(\frac{1}{f(\text { in } m)}\) or P = \(\frac{100}{f(\text { in cm })}c \)
The unit of power of lens is dioptre, denoted by ‘D’.

Question 26.
What Is dispersion?
Answer:
The splitting of white light into different colours Is called dispersion.

TS 10th Class Physical Science Important Questions Chapter 5 Human Eye and Colourful World

Question 27.
Definelntensityof light.
Answer:
The intensity of light is the energy of light passing through unit area of plane, taken normal to the direction of propagation of light, In one second.

Question 28.
What is the scattering of light?
Answer:
The process of re-emission of absorbed light in all directions with different intensities by atoms or molecules Is called scattering of light.

Question 29.
When we look at the sky in a direction perpendicular to the direction of the sun rays, what will be the colour of the sky?
Answer:
When we look at the sky in a direction perpendicular to the direction of the sun rays, the sky appears to be blue in colour.

Question 30.
Why street lights are designed to give yellow color light? (AS1)
Answer:
The sensitivity of human eye varies with frequency (colour) for the same brightness of different colours. Our eyes have maximum sensitivity (response) to yellow coiour so the street lights are yellow.

Question 31.
Why do a normal eye not able to see clearly the objects placed closer than 25 cm?
Answer:
The maximum accommodation of a normal eye Is at a distance of 25 cm from the eye. The focal length of the eye lens cannot be decreased below this. Thus an object placed closer than 25 cm cannot be seen clearly by a normal eye.

Question 32.
Have you seen a rainbow in the sky after rain? How it has formed?
(or)
In which conditions does a rainbow form? Why?
Answer:

  1. A rainbow Is a natural spectrum of sunlight in the form of bows appearing in the sky when the sun shines on raindrops after the rain.
  2. It is formed due to reflection, refraction and dispersion of sunlight by tiny water droplets present in the atmosphere.

Question 33.
Does rainbow form always opposite to sun? Why?
Answer:
Yes. A rainbow is always formed in the opposite direction of the sun. As the sun rays should fall on rain drops It happens so.

Question 34.
“To look at the twinkling of stars Is a wonderful experience”. How It’s happening?
Answer:
The continuously changing atmosphere (due to varying atmospheric temperature and density) refracts the light from the stars by varying amounts and in different directions from one moment to the next.

TS 10th Class Physical Science Important Questions Chapter 5 Human Eye and Colourful World

Question 35.
Write the reason for Sun appears red during the Sun-rise and Sun-set.
Answer:
Due to the high velocity (wavelength) of red right, It reaches our eye without undergoing any scattering. So, sun appears red during sunrise and sunset.

Question 36.
“Sky appears dark to passengers flying at very high altitudes” why?
Answer:
At very high altitudes, there is no atmosphere. So there is no scattering of light at such heights. So sky appears dark to passengers.

Question 37.
A short-sighted person may read a book without spectacles. Comment.
Answer:
The statement is true, because a short-sighted person has difficulty in observing far-off objects.

Question 38.
Why are danger signals red?
Answer:
Among the colours of visible light, red has more wavelength and least scattered. Thus, red colour can easily go through fog or mist or smoke without getting scattered. It can be seen from long distance. So red colour Is used in universal danger signal.

Question 39.
“Smoke coming out of coal-fired in chimney appears blue on a misty day”. Why?
Answer:

  1. On a misty day, the air has large amount of tiny particles of water droplets, dust and smoke.
  2. These tiny particles present In the air scatter blue colour of the white light passing through It.
  3. When this scattered blue light reaches our eyes the smoke appears blue.

Question 40.
Give two more examples, which appear blue on a misty day.
Answer:

  • The long-distance hills covered with thick growth of trees appear blue.
  • The smoke coming from a cigarette oran Incense stick (agarbatti) appears blue on a misty day.

Question 41.
“Motorist uses orange light on a foggy day rather than normal white light”. Why?
Answer:

  1. On a foggy day, the air has large amount of water droplets.
  2. If a motorist uses white light, the water droplets present in the air scatter large amount of the blue light.
  3. This on reaching our eyes decreases visibility and hence driving becomes extremely difficult.
  4. Whereas orange light has longer wavelength and hence it is least scattered.

Question 42.
Which coloured suits do rescue workers wear?
Answer:
Rescue workers wear orange coloured suits during any rescue operations.

Question 43.
Which colour is best for school buses?
Answer:
Orange or yellow colour is best for school buses.

Question 44.
What Is persistence of vision?
Answer:
The time for which the sensation of vision (of an object) continues in the eye is called persistence of vision. It is about 1/ 16th part of a second.

Question 45.
Why do some people can’t IdentIfy some colours?
Answer:
Rods identify the colours In the retina. If some rods are absent, the distinction of colours is not possible. In such cases, persons can’t identify some colours.

Question 46.
Write the reasons for colour blindness.
Answer:

  1. Absence of colour-responding rod cells in the retina.
  2. Due to genetic disorder.

Question 47.
Why does It take some times to see objects In a dim room when we enter the room from bright sunlight outside?
Answer:
In bright light the size of the pupil Is small to control the amount of light entering the eye. When we enter a dim room, it takes sometime so that the pupil expands and allows more light to enter and helps us to see things clearly.

Question 48.
Doctor advised to use 20 lens. What is the focal length of It?
Answer:
Given, power of lens (P) = 2D ⇒ f = ?
We know P = \(\frac{100}{f(\text { incm })} \Rightarrow 2=\frac{100}{f} \Rightarrow f=\frac{100}{2}\) = 50 cm
∴ Focal length of lens (f) = 50 cm

Question 49.
What Tyndall effect?
Answer:
The Penonienon of scattering of white light by colloidal particles is known as “Tyndall effect”.

TS 10th Class Physical Science Important Questions Chapter 5 Human Eye and Colourful World

Question 50.
Give two examples illustrating “Tyndall effect”.
Answer:

  1. A fine beam of sunlight entering a smoke filed room through a hole Smoke particles scatter the white light and hence the path of light beam becomes visible.
  2. Sunlight passing through trie trees In forest.
  3. tiny water droplets through the trees in forest.

Question 51.
A short-sighted person cannot see clearly beyond 2m. Calculate the power of lens required to correct his vision.
Answer:
image distance, v = -2 m, u = ∞
TS 10th Class Physical Science Important Questions Chapter 5 Human Eye and Colourful World 1

Question 52.
We see advertisements for eye donation on television o In newspaper. Write the importance of such advertisements.
Answer:
eye donation advertisements are important as

  1. The peoole are aware about donation of organs after the,r death.
  2. Sympathetic nature towards others.

Question 53.
An eye donation camp is being organised by social workers in your locality. How and why would you help in this cause?
Answer:

  • We can intimate other people to participate in the camp.
  • As a human being we should also register our eyes for donation after death.

Question 54.
Vhicn colour of light bends the most and the least?
Answer:
colour ends the least and violet bends more.

Question 55.
An eye camp was organised by the doctors in a village. What were the benefits to organise such camps iii rural areas?
Answer:

  1. To make people aware of eye diseases
  2. To suggest them to take proper and balanced diet that helps to keep their eyes healthy.

Question 56.
Will a star appear to twinkle if seen from free space?
Answer:
No, because there is no atmosphere In free space for refraction.

Question 51.
Write the relation between Intensity of scattered light (1) and wavelength (λ)?
Answer:
Light of short wavelength is scattered more than the light of long wavelength.

Question 52.
Why sky would have looked dark If the earth had no atmosphere?
Answer:
If the earth had no atmosphere, no particles are present either. Thus no scattering of light. Then, the sky appears dark.

Question 59.
What Is the essential condition for observing a rainbow? (AS1)
Answer:

  1. The sun must be on the backside of the observer.
  2. The sun rays should fall obliquely on raindrops.

Question 60.
Describe a triangular prism.
Answer:

  1. A prism is a transparent medium separated from the surrounding medium by at least two plane surfaces which are Inclined at a certain angle In such a way that, light incident on one of the plane surfaces emerges from the other plane surface.
  2. A triangular prism contains two triangular bases and three rectangular plane lateral surfaces. These lateral surfaces are Inclined to each other.

Question 61.
Define the following terms with respect to a prism.
(a) Incident ray
(b) Normal
(c) Angle of incidence
(d) Emergent ray
(e) Angle of emergence
(f) Angle of the prism
(g) Angle of deviation (d).
Answer:
(a) Let us consider that ΔPQR represents p outline of the prism where It rests on Its triangular base.
(b) Let us assume that a light ray is incident on the plane surface PQ of a prism at M. This ray is called incident ray. Draw a perpendicular to PQ at M. It becomes a normal to that surface.
(c) The angle between incident ray and normal Is called angle of Incidence (I).
(d) The ray Is refracted at M. It moves through prism and meets the other plane surface at N and finally comes out of the prism. The ray which comes out of the surface PR at N is called emergent ray.
(e) Draw a perpendicular to PR at point N. The angle between the emergent ray and normal Is called angle of emergence (i2).
TS 10th Class Physical Science Important Questions Chapter 5 Human Eye and Colourful World 2
(f) The angle between the plane surfaces PQ and PR Is called the angle of the prism or refracting angle of prism (A).
(g) The angle between the Incident ray and emergent ray formed by producing them backwards is called angle of deviation (d).

TS 10th Class Physical Science Important Questions Chapter 5 Human Eye and Colourful World

Question 62.
When a single colour ray has been sent through a prism, does It split into more colours? Why?
Answer:
We know that the frequency of light is the property of the source and it is equal to number of waves leaving the source per second. This cannot be changed by any medium. Hence frequency doesn’t change due to refraction. Thus coloured light passing through any transparent medium retains its colour.

Question 63.
What happens to the Image distance in the eye when we increase the distance of an object from the eye?
Answer:
In the eye, the image distance (distance between eye lens and retina) is fixed and cannot be changed. So when we Increase the distance of an object, there is no change in the image distance.

Question 64.
A rainbow viewed from an airplane may form a complete circle. Where will the shadow of the airplane appear? Explain.
Answer:
A rainbow viewed from an airplane forms a complete circle because the earth does not come along the way of the airplane and rainbow. A rainbow is a three-dimensional cone of dispersed light and it appears as a complete circle. The shadow of the airplane appears within the circle of the rainbow.

Question 65.
When a monochromatic light passes through a prism will it show dispersion?
Answer:
No, it will not show any dispersion but shows deviation.

Question 66.
Why do we use lenses In spectacles to correct defects of vision?
Answer:
The process of adjusting focal length ¡s called “accommodation’. This process has to be done by eye itself. Sometimes the eye may gradually lose its power of accommodation. In such condition, the person will not be able to see the object clearly and comfortably. In this situation, we have to use lenses In
spectacles to correct defects of vision.

Question 67.
What happens If the eye lens of a person cannot accommodate its focal length more than 2.4 cm?
Answer:
The person cannot be able to see the distant objects clearly.

2 Marks Questions

Question 1.
Kishore wore spectacles. When you saw through his specs the size of his eyes seemed bigger than their original size?
a) Which lens did he use?
b) Explain that defect of vision (with the help of a diagram)
Answer:
a) When we saw through Kishore’s expects the size of his eyes seemed bigger than their original size. This Is possible with convex lens only, because magnification of the lens is greater than ‘I’.
b) The defects he suffers Is hypermetropia. This also called as farsightedness. A person who suffers with this type of defect, he can’t see the object clearly which are placed near distance because the image formed beyond the retina. So by using convex lens the rays can be converged on retina.
TS 10th Class Physical Science Important Questions Chapter 5 Human Eye and Colourful World 3

Question 2.
Define the words associated with prism with the help of figure.
Answer:

  1. Angle of incidence The angle between incident ray and normal is called angle of incidence.
  2. Angle of emergence The angle between normal and emergent ray ts called angle of emergence.
  3. Normal: Perpendicular drawn to the surface of prism.
  4. Angle of deviation: The angle between extended incident ray and emergent ray is called angle of deviation.

Question 3.
Two observers standing apart from one another do not see the same” rainbow. Explain.
Answer:

  1. All the raindrops that disperse the light to form rainbow lie within a cone of semi vertical angle 400 to 420.
  2. If two observers are standing at a distance apart, they will observe different parts of rainbow on the surface of the cone.
  3. So the portion of the rainbow observed by an observer depends on the position of the observer.
  4. Two different observers will form two different cones with the observer standing at the vertex of the cone, therefore rainbow seen by them will be different.

Question 4.
How do we see colours?
Answer:

  1. The retina of human eye has a large number of receptors.
  2. These receptors are of two types i.e., rods and cones.
  3. The rod cells recognise the colour of light rays, while the cones Identify the intensity of light.
  4. It is these rod cells, which make It possible for a man to see different colours and distinguish between them.

Question 5.
A prism with an angle A = 60° produces an angle of minimum deviation (D) of 30°. Find the refractive Index of material of the prism.
Answer:
Given, A = 60° and D= 30°
TS 10th Class Physical Science Important Questions Chapter 5 Human Eye and Colourful World 4
The refractive index of the given prism = ∠2

Question 6.
Give the differences between Myopia and Hypermetropia.
Answer:

MyopiaHypermetropia
1. In short sightedness one can see nearby object but cannot see far off objects.1. In far sightedness one can see distant object but cannot see near by objects.
2. Image is formed ¡n front of retina.2. Image is formed behind of retina.
3. The size of eye bail increases.3. The size of eye bail decreases.
4. Focal length of eye lens decreases.4. Focal length of eye lens increases
5. Corrected by concave lens.5. Corrected by using convex lens.

Question 7.
A convex lens of power 4 D is placed at a distance of 40 cm from a wall. At what distance from the lens should a candle be placed so that its image Is formed on the wall?
Answer:
f = \(\frac{1}{P}=\frac{1}{4 D}=\frac{1}{4}\) m = 25 cm ; v = 40 cm; P = 4D; u = 40 cm.
∴ \(\frac{1}{v}-\frac{1}{u}=\frac{1}{f}\)
⇒ \(\frac{1}{u}=\frac{1}{v}-\frac{1}{f}=\frac{1}{40}-\frac{1}{25}=\frac{5-8}{200}=-\frac{3}{200} \)
∴ u = \(\frac{3}{200}\)
So candle should be placed at a distance of, \(\frac{200}{3}\) cm from the lens.

TS 10th Class Physical Science Important Questions Chapter 5 Human Eye and Colourful World

Question 8.
What happens, If Ciliary muscles do not perform contraction and expansion? Guess and write.
Answer:
1) If Cillary musdes do not perform contraction and expansion, focal length of eye lens do not change.
2) Human eye can see the objects at specific distance only, eye cannot see the object either nearer or far distance.

4 Marks Questions

Question 1.
Find the minimum and maximum focal lengths of the eye lens.
Answer:
1. When the object is at infinity, the parallel rays from the object failing on the eye lens are refracted and they form a point-sized image on the retina.
2. In this situation, eye lens has a maximum focal length.
3. When the object is at infinity,
u = – ∞ v = 2.5 cm (distance between eye lens and retina)
Using lens formula \(\frac{1}{f}=\frac{1}{v}-\frac{1}{u} \Rightarrow \frac{1}{f_{\max }}=\frac{1}{2.5}+\frac{1}{\infty} \Rightarrow \frac{1}{f_{\max }}=\frac{1}{2.5}+0 \)
\(\frac{1}{f_{\max }}=\frac{1}{2.5} \)
∴ fmax = 2.5 cm
TS 10th Class Physical Science Important Questions Chapter 5 Human Eye and Colourful World 5
4. ConsIder that an object is placed at a distance of 25 cm from your eye.
5. In this situation eye has minimum focal length.
Here u=-25cm,v= 2.5 cm
Using Lens formula, \(\frac{1}{f}=\frac{1}{v}-\frac{1}{u}\)
TS 10th Class Physical Science Important Questions Chapter 5 Human Eye and Colourful World 6
6. If the position of an object is between infinity and the point of least distance of distinct vision, then the eye lens adjusts its focal length in between 2.5 cm to 2.27 cm to form a clear ¡mage on the retina.

Question 2.
What is scattering? Explain how a light scatters.
Answer:
Scattering: The process of re-emission of absorbed light in al! directions with different intensities by atoms or molecules Is called scattering of light.

Process of scattering:

  1. Let us consider that the free atom or free molecule is somewhere In space.
  2. Light of certain frequency falls on that atom or molecule.
  3. This atom/molecule responds to light whenever the size of the atom/molecule is comparable to the wavelength of light.
  4. If this condition is satisfied, the atom absorbs light and vibrates.
  5. Due to this vibration, the atom re-emits a certain fraction of absorbed energy in all directions with different Intensities.
  6. The re-emitted light is called scattered light and the process or re-emission of light in all directions with different intensity is called scattering of light.
  7. The atoms/molecules are called scattering centre.

TS 10th Class Physical Science Important Questions Chapter 5 Human Eye and Colourful World 7

Question 3.
A prism causes dispersion of white light while a rectangular glass block does not. Explain.
Answer:

  1. In a prism the refraction of light at the two plane surfaces.
  2. The dispersion of white light occurs at the first surface of prism where Its constituent colours are deviated through different angles.
  3. At the second surface, these split colours suffer only refraction and they get ‘further separated.
  4. But in a rectangular glass block, the refraction of light takes place at the two parallel surfaces.
  5. At the first surface, although the white light splits into its constituent colours on refractions, but they split colours on suffering refraction at the second surface emerge out in the form of a parallel beam, which give an impression of white light.

Question 4.
Why white tight splits Into different colours when It passes through a prism?
Answer:

  1. The speed of light Is constant In vacuum for all colours, but It depends on the wavelength of light when It passes through a medium.
  2. We know refractive Index of a medium depends on wavelength of light.
  3. When white light passes through a medium, each colour selects Its least time path and we have refraction of different colours to different extents.
  4. This results in separation of colours, producing a spectrum.
  5. It has been experimentally found that refractive index decreases with an increase in wavelength.
  6. In VIBGYOR, red colour has longest wavelength and violet colour has shortest wavelength. The refractive index of red Is low, hence It suffers low deviation.

Question 5.
A person unable to see distant objects. Show the defect of vision of the person with the help of ray diagram.
Answer:
1. His vision defect is Myopia.
2. Ray diagram :
TS 10th Class Physical Science Important Questions Chapter 5 Human Eye and Colourful World 8

Question 6.
Write the differences between a camera and the human eye?
Answer:

CameraHuman eye
1) A real and inverted image is formed on the photographic film,1) A real and inverted image Is formed on the retina.
2) Image is formed by a convex lens made of glass.2) Image Is formed by the eye lens made of fibrous and jelly Iikè material
3) Diaphragm controls the amount of light entering the camera.3) Pupil in the iris controls the amount of light entering the eye.
4) Time of exposure is controlled by a shutter.4) Time of exposure is controlled by the eyelids.
5) Focal length of camera lens is fixed.5) Focal length of eye lens can be changed with the help of ciliary muscles.
6) The angular region covered is about 60°.6) The angular region covered is about 150°.

Question 7.
Read the following Information.
‘Use a lens of – 2D for Kishore.” The doctor said. By above statement what information you can give? Explain the eye defect and also how you will correct it?
Answer:
Negative sign indicates the lens is concave lens.
2D represents 2 dioptres focal power of the concave lens.

  • Kishore is suffering from eye problem
  • Focal power P= \(\frac{1}{f} \) . f= \(\frac{1}{P} \) = \(\frac{1}{2} \) =0.5m =50cm
  • Klshore able to see near objects and unable see dIstant objects.
  • He is suffering from MYOPIA (OR) short-sightedness.
  • The image of the object is falling Infront of the retina.
  • To correct this defect Kishore has to use a concave lens which can diverge the image exactly on retina.
  • Kishore has to use a concave lens of focal length 50 cm.

TS 10th Class Physical Science Important Questions Chapter 5 Human Eye and Colourful World 9

Question 8.
Draw the structure of human eye and explain Its parts.
Answer:
TS 10th Class Physical Science Important Questions Chapter 5 Human Eye and Colourful World 10

Question 9.
Study the diagram given below and answer the questions that follow.
a) Which defect of vision is represented in this case? Give reason for your answer.
TS 10th Class Physical Science Important Questions Chapter 5 Human Eye and Colourful World 11
b) What could be the two causes of this defect?
c) With the help of a diagram show how this defect can be corrected by the use of a suitable lens.
Answer:
a) This defect is hypermetropia. The reason is the image of near point is formed beyond retina.
TS 10th Class Physical Science Important Questions Chapter 5 Human Eye and Colourful World 12
b) The two causes of the defect are

  • Size of eyeball decreases.
  • Focal length of the lens increases.

c) This defect can be corrected by using a convex lens of suitable focal length.

Question 10.
Study the diagram given below and answer the questions that follow it.
a) Name the defect and give reason.
b) Give two causes for this defect.
c) Give the correction – draw diagram for the same.
TS 10th Class Physical Science Important Questions Chapter 5 Human Eye and Colourful World 13
Answer:
a) The defect is Myopia or short-sightedness.
b) It is caused due to the decrease in the focal length of the eye lens and increase in the size of the eye ball.
c) The defect can be corrected by using the concave lens.
TS 10th Class Physical Science Important Questions Chapter 5 Human Eye and Colourful World 14

Question 11.
An eye specialist suggested a+2D lens to the person with defect in vision. Which kind of defect in vision does he have? Draw the diagrams to show the defect of vision and its correction with a suitable lens.
Answer:
He is suffering from Hypermetropia. The light from a distant object among at the eye-lens gets converged at a point behind the retina. This type of defect is called Hypermetropia. To correct this, we interpose a convex lens between the eye and the object.
TS 10th Class Physical Science Important Questions Chapter 5 Human Eye and Colourful World 15

Question 12.
How will you calculate the focal length of a biconvex lens that ¡s used to correct the defect of Hypermetropia? Explain it mathematically.
Answer:
1. To find the focal length of lens let us consider that the object is at the point of least distance of distinct vision (L)
2. Then the defect of vision, Hypermetropla, Is corrected when the image of the object at L is formed at the near point (H) by using a biconvex lens as shown In the fig.
TS 10th Class Physical Science Important Questions Chapter 5 Human Eye and Colourful World 16
3. The image acts like an object for the eye lens. Hence final image due to eye is formed at retina.

Here object distance (u) = – 25cm
Image distance (v) = Distance of near point = — d
Let ‘f be the focal length of bi-convex lens.
Using lens formula, \(\frac{1}{f}=\frac{1}{V}-\frac{1}{u} \)
\(\frac{1}{f}=\frac{1}{-d}+\frac{1}{25} \)
\(\frac{1}{f}=\frac{d-25}{25 d} \)
f = \(\frac{25 d}{d-25} \) (f Is measured In cm)
So, by determining the near point of a person with hypermetropia eye, we can calculate the focal length of the biconvex lens to be used to correct the defect.

TS 10th Class Physical Science Important Questions Chapter 5 Human Eye and Colourful World

Do You Know

Our beloved scientist and Nobel prize winner; Sir C.V. Raman explained the phenomenon of light scattering In gases and liquids. He found experimentally that the frequency of scattered light by the liquids Is greater than the frequency of incident light. This is called Raman Effect. By using this effect scientists determine the shapes of the molecules. (Page 102)

TS 10th Class Telugu Grammar అపరిచిత గద్యాలు

Telangana SCERT 10th Class Telugu Grammar Telangana అపరిచిత గద్యాలు Questions and Answers.

TS 10th Class Telugu Grammar అపరిచిత గద్యాలు

ప్రశ్న 1.
క్రింది పేరాను చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

అన్ని మార్పులూ మంచికే అని బల్లగుద్ది చెప్పలేం. వెల్లువలా వస్తున్న ఒక సంస్కృతీ ప్రభావానికిలోనైగాని, పాలకుల ప్రభావానికి లోనైగాని సమాజంలో కొన్ని మార్పులు జరుగు తుంటాయి. పరాయి సంస్కృతీ సంప్రదాయా లను గుడ్డిగా అనుసరించడం వల్ల వచ్చే నష్టాలు చాపకింద నీరు లాంటివి. కొంప మునిగిన తర్వాతగానీ వాటి వల్ల వచ్చే నష్టాలు కంటికి కనిపించవు. అందువల్ల చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు కాకుండా కొన్ని విషయాల్లో ముందే మేల్కొనే ప్రయత్నం చేద్దాం !

ప్రశ్నలు – జవాబులు :
1. ఇందులో చాపకింద నీరు అని దేన్ని ఉద్దేశించి చెప్పడమైంది ?
జవాబు:
ఇందులో చాపకింద నీరు అని పరాయి సంస్కృతీ సంప్రదాయాలను ఉద్దేశించి చెప్పబడింది.

2. ఈ పేరాలో నీకు తెలిసిన సామెత ఉంటే తెల్పండి ?
జవాబు:
ఈ పేరాలో నాకు వచ్చిన సామెత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు.

3. సమాజంలో వచ్చే మార్పులకు ప్రధానకారణమేమి ?
జవాబు:
వెల్లువగావస్తున్న ఒక సంస్కృతీ ప్రభావం, పాలకుల ప్రభావం సమాజంలో వచ్చే మార్పులకు ప్రధాన కారణాలు.

4. ఈ పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి ?
జవాబు:
ఈ పేరా ద్వారా మనం ఏమి గ్రహింపవచ్చు ?

5. ఎటువంటి నష్టాలు చాపకింద నీరులాంటివి ?
జవాబు:
పరాయి సంస్కృతీ సంప్రదాయాలను గుడ్డిగా అనుసరించడం వల్ల వచ్చే నష్టాలు.

TS 10th Class Telugu Grammar అపరిచిత గద్యాలు

ప్రశ్న 2.
క్రింది గద్యాన్ని చదివి, అర్థవంతమైన ప్రశ్నలను తయారుచేయండి.

“శ్రీ రావూరి భరద్వాజగారు స్వయం కృషితో సామాన్యుడి స్థాయి నుండి సమున్నత స్థాయి వరకు ఎదిగిన తపస్వి. ఆయన చదువు అంతంత మాత్రమే. ఆంగ్లం అసలే తెలియని ఆయన తన బలహీనతలన్నీ సవరించుకొని, తనదైన సొంత శైలిలో రచనలు చేపట్టారు. అనేక కథలు, నవలలు రాశారు. “పిడికెడు మెతుకుల కోసం – నేను వ్యవసాయ కూలీగా పనిచేశాను.” వారి గురించి వారే చెప్పిన మాటలివి. ‘ఒకానొక అవమానం, నన్ను చదువు వైపు మళ్ళించింది”. ఇవి కూడా వారి మాటలే ….. అటుంటి వీరిని “జ్ఞానపీఠం” అనే అత్యున్నత పురస్కారం వరించింది.
జవాబు:
ప్రశ్నలు :

  1. రావూరి భరద్వాజ గారి విశిష్టత ఏమి ?
  2. రావూరిగారు తన గురించి ఏమని చెప్పుకున్నారు ?
  3. రావూరిగారు పొందిన విశిష్ట పురస్కారం ఏది ?
  4. రావూరి భరద్వాజ గారు ఏమి రచించారు ?
  5. రావూరిగారి పాండిత్యం ఎట్టిది ?

ప్రశ్న 3.
క్రింది గద్యాన్ని చదివి, ప్రశ్నలను తయారు చేయుము.

20వ శతాబ్దపు తొలిరోజులలో కుటుంబ నియంత్రణను బూతు మాట క్రింద జమకట్టే వారు. అటువంటి సమయంలో నర్స్లో పనిచేసే మార్గరేట్ సాంగర్ అనేక కష్టాలకోర్చి కుటుంబ నియంత్రణను గూర్చి ప్రచారం చేశారు. 1914లో “ఉమెన్ రెబల్” అన్న వ్యాసంలో ఆమె కుటుంబ నియంత్రణ కోసం తిరగబడమని పిలుపునిచ్చారు. అమెరికా ప్రభుత్వ ఒత్తిడి తట్టుకోలేక ఆమె యూరప్కు వలసవెళ్ళి 1916లో తిరిగి వచ్చి అదే ప్రచారాన్ని మళ్ళీ మొదలుపెట్టారు. పోలీసులు ఆమె ప్రారంభించిన ఆస్పత్రిపై దాడి చేశారు. అయినా ఆమె చలించ కుండా 1923లో కుటుంబ నియంత్రణ పరిశోధనాశాలను నెలకొల్పారు.
జవాబు:
ప్రశ్నలు

  1. కుటుంబ నియంత్రణ కోసం ప్రచారం చేసిన నర్స్ పేరేమి ?
  2. ఏ సంవత్సరంలో, ఏ వ్యాసంలో ఆమె కుటుంబ నియంత్రణ కోసం తిరగబడమని పిలుపునిచ్చారు ?
  3. మార్గరేట్ సాంగర్ ఎప్పుడు, ఎక్కడికి వలస వెళ్ళినది ?
  4. 1923లో సాంగర్ దేనిని నెలకొల్పినది ?
  5. ఎప్పుడు కుటుంబ నియంత్రణను బూతుమాట కింద జమకట్టేవారు ?

TS 10th Class Telugu Grammar అపరిచిత గద్యాలు

ప్రశ్న 4.
క్రింది గద్యాన్ని చదివి, ప్రశ్నలు తయారుచేయండి.

జనపదం అంటే పల్లెటూరు. జనపదాలలో ఉండేవారు జానపదులు. వారు పాడుకొనే పాటలు లేదా గేయాలను జానపద గేయా లంటారు. వీనినే ఆంగ్లంలో ‘ఫోక్ సాంగ్స్’
అంటారు. ఉత్తర భారతదేశంలో జానపద గేయాలను ‘లోక్ గీత్’ లేదా ‘లోక్ సాహిత్య’ అంటారు. జానపద గేయానికి ఒక ప్రత్యేక కవి ఉండడు. జానపద గేయం సమిష్ఠి సంపద. శిష్ట సాహిత్యంలాగా కాక, జానపద సాహిత్యం పలువురి చేతులలో పెరిగినది. ఇది దాని మొదటి లక్షణం. గేయ రచనా కాలం స్పష్టంగా ఉండకపోవడం మరో లక్షణం, నదీనదాలూ, వాగులూ, వంకలూ మనకు ఉపయోగపడక, సముద్రం పాలయినట్లే జానపద గేయ స్రవంతి చాలా భాగం మనకు అందలేదు. జానపద సాహిత్యాన్ని భద్రపరచవలసిన అవసరం ఉంది.
జవాబు:
ప్రశ్నలు

  1. జానపదులు అంటే ఎవరు ?
  2. ఉత్తర భారతదేశంలో జానపద గేయాలను ఏమంటారు ?
  3. జానపద సాహిత్యం మొదటి లక్షణం ఏమిటి ?
  4. ఆంగ్లంలో జానపద గేయాలను ఏమంటారు ?
  5. ‘జానపద గేయాలు’ అని వేటినంటారు ?

ప్రశ్న 5.
క్రింది గద్యాన్ని చదివి, ప్రశ్నలు తయారుచేయండి.

సమాజ శ్రేయస్సు కొరకు మతము ఏర్పడినది. ప్రతి మతము ఉన్నతాశయములు కల్గియున్నది. ఏ మతము చెడును బోధించదు. ఈ మతము గొప్పది, పరమతము నీచమైనదనే ప్రచారము చేయువారు విశాల హృదయములేని వారని, సంకుచిత స్వభావులని భావింప వచ్చును. స్వార్థపరులని తలంపవచ్చును. అట్టివారి మాటలను నమ్ముట మన అజ్ఞానము నకు ప్రతీక యగును.
జవాబు:
ప్రశ్నలు

  1. మతము ఎందులకు ఏర్పడినది ?
  2. దేన్ని మతము బోధించదు
  3. ప్రతి మతము ఏవి కల్గియున్నది ?
  4. ఎవరు విశాల హృదయం లేనివారు ?
  5. ఏది అజ్ఞానమునకు ప్రతీక ?

TS 10th Class Telugu Grammar అపరిచిత గద్యాలు

ప్రశ్న 6.
క్రింది గద్యాన్ని చదివి, ప్రశ్నలు తయారుచేయండి.

విద్యార్థికి క్రమశిక్షణ చాలా అవసరం. ఒక క్రమపద్ధతి ప్రకారం తన పనులన్నీ తానే చేసుకోవాలి. ఇతరులపై ఆధారపడకూడదు. ఎప్పటి పని అప్పుడే చేయాలి. పనిని వాయిదా వేయకూడదు. ఆత్మనిగ్రహాన్ని అలవరచుకోవాలి. చీటికీ మాటికీ కోపం తెచ్చుకోకూడదు. తోటి వారిని చూసి ఈర్ష్య పడకూడదు. అసూయ పడకూడదు. చదువులోనూ, సత్ప్రవర్తనలోనూ తోటి వారిని మించాలనే పట్టుదలతో కృషి చేయాలి. అంతేకాని వాళ్ళు నీ కంటే ముందున్నారని అసూయ పడకూడదు. నీకంటే ముందున్న వారిపట్ల అసూయ కూడనట్లే, నీకంటే వెనుక బడినవారి పట్ల చులకన భావం కూడా ఉండ కూడదు. వాళ్ళకు తగిన ప్రోత్సాహమివ్వాలి.
జవాబు:
ప్రశ్నలు

  1. విద్యార్థికి ఏది అవసరం ?
  2. విద్యార్థి దేన్ని అలవరచుకోవాలి ?
  3. ఏ విషయంలో పట్టుదలతో కృషిచేయాలి ?
  4. ఎవరిపై చులకన భావం ఉండకూడదు ?
  5. విద్యార్థి ఎవరిపై అసూయ పడకూడదు ?

ప్రశ్న 7.
క్రింది పేరా చదవండి.

ముందుగా వ్యక్తి బాగుపడవలెను. ఆ వెనుక సంఘము బాగుండును. ముందుగా సంఘమును సంస్కరించవలెననుట వెట్టి మాట. మాటలో, చేతలో, తుదకు భావనలో సంస్కారముట్టి పడవలెను. అట్టి వ్యక్తులు పెక్కుమంది ఉన్నచో తనంతట తానే సంఘము ఉద్దరింపబడును. వ్యక్తిని, తుదకు జాతిని తీర్చి దిద్దుకునే ఈ సంస్కారములు, వాని ప్రణాళికను గమనించినచో “చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష” అనురీతిలో ఉండక వ్యక్తి శ్రేయస్సు, సమాజ కళ్యాణము, పరస్పరము ముడిపడియున్నదని విడివిడిగా లేదని తెలివిడి చేయును.

ఉదాహరణకు ప్రతి గృహస్థు విధిగా చేయవలసిన పంచమహా యజ్ఞములను చూడుడు. దేవయజ్ఞమందు దేవతలను, ఋషియజ్ఞము నందు ఋషులను, వారందించిన విజ్ఞానమును, పితృయజ్ఞము యందు పితృదేవతలను కొలుచుచున్నాడు కదా! భూతయజ్ఞము నందు కుక్కలకు, కాకులకు బలివేయుచున్నాడు కదా ! పొరుగువారిని ప్రేమింపమని ఇతర మతములన్నచో, పొరుగు ప్రాణిని కూడా ప్రేమింపమని సనాతన ధర్మము చాటుచున్నది.

పై పేరా ఆధారంగా కింది వాక్యములు సరైనవో కాదో (✓) (✗) గుర్తుల ద్వారా గుర్తించండి :
1. వ్యక్తి బాగుపడినప్పుడే సంఘము బాగుపడుతుంది.
జవాబు:

2. మాటలు, చేతలు, భావనలతో సంస్కారముట్టిపడదు.
జవాబు:

3. ప్రతిగృహస్థు విధిగా పంచ మహాయజ్ఞములను చేయవలెను.
జవాబు:

4. పొరుగువానిని ప్రేమించమని, పొరుగు ప్రాణిని ద్వేషించమని సనాతన ధర్మము చాటుచున్నది.
జవాబు:

5. వ్యక్తి శ్రేయస్సు, సమాజకళ్యాణము పరస్పరము ముడిపడియున్నవి.
జవాబు:

TS 10th Class Telugu Grammar అపరిచిత గద్యాలు

ప్రశ్న 8.
క్రింది గద్యాన్ని చదివి ఖాళీలు పూరించండి.

మన సాహిత్యంలో కావ్య-ప్రబంధ – పద్యగద్య రచనలు చేయని గొప్ప ఉపదేశాన్ని – గొప్ప చైతన్యాన్ని ప్రసాదించిన ప్రక్రియల్లో ప్రప్రథమంగా పేర్కొనదగింది శతకం. నీతిని, వ్యక్తుల తీరును గొప్పగా వర్ణించినట్టివి శతకాలే. అందువలన కవితాభ్యాసదశలో చిన్న చిన్న పద్యాలతో ఆరంభించి శతకం దాకా వచ్చి దానిలో తమ ప్రతిభను నిరూపించుకున్న కవి వర్యులున్నారు. శతకంలో వివిధ రీతులున్నట్లే శతకంలోని ఛందస్సు కూడా వైవిధ్యం కలిగి యున్నది. కందం నుండి మధ్యాక్కరల దాకా వాస్తవమైన ఛందం కవుల ప్రతిభ వలన చక్కగా పొదిగింది. చిన్ననాడు బాలబాలికలకు శతక పద్యాలను, నీతి పద్యాలు, కథలను చెప్పడం ఒకనాటి సంఘంలో ఉన్న నియమం.

ఖాళీలు – జవాబులు :
1. గొప్ప చైతన్యాన్ని ప్రసాదించిన ప్రక్రియల్లో ప్రప్రథమంగా పేర్కొనదగింది …………….
జవాబు:
శతకం

2. చిన్ననాడు బాలబాలికలకు నేర్పవలసినవి …………………….
జవాబు:
శతకపద్యాలు, నీతిపద్యాలు, కథలు.

3. శతకంలోని ఛందస్సు …………………… కలిగియున్నది.
జవాబు:
వైవిధ్యాన్ని

4. కందం నుండి మధ్యాక్కరల దాకా వ్యాప్తమైంది ……………………
జవాబు:
శతకం

5. శతకాలు గొప్పగా వర్ణించినది …………………
జవాబు:
నీతిని, వ్యక్తుల తీరును

TS 10th Class Telugu Grammar అపరిచిత గద్యాలు

ప్రశ్న 9.
క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.

బుద్ధుడి బోధనల్లో చాలావరకూ సామాన్యుల్ని ఉద్దేశించినవే. నిత్యజీవితంలో ముడిపడినవే. ‘మహామంగళస్తుతం’లో ఎలాంటి జీవన విధానాన్ని అనుసరించాలో చెప్పాడు. మూర్ఖుల సహవాసం వద్దంటాడు. గౌరవించాల్సిన వ్యక్తులకు గౌరవం ఇవ్వ మంటాడు. నివాసానికి చక్కని పరిసరాలు అవసరమని అంటాడు. ఉపాధిని ఎంచుకుంటున్నప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించమంటాడు. నీకు ఇష్టమైన పనినీ, చికాకు కలిగించని వృత్తినీ స్వీకరించ మంటాడు. జీవితంలో క్రమశిక్షణ చాలా అవసరమనీ చెబుతాడు. గౌరవం, వినమ్రత, సంతృప్తి, కృతజ్ఞత వీటిలో ఏ ఒక్కటీ లేకపోయినా, జీవితానికి అర్థమే లేదంటాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. బుద్ధుడి బోధనలు ఎవరిని ఉద్దేశించినవి ?
జవాబు:
బుద్ధుడి బోధనలు చాలావరకు సామాన్యుల్ని ఉద్దేశించినవి.

2. బుద్ధుడు ఎవరి సహవాసం వద్దని అంటున్నాడు ?
జవాబు:
మూర్ఖుల

3. జీవితానికి అవసరమైనవి ఏవని బుద్ధుడు బోధించాడు ?
జవాబు:
గౌరవం, వినమ్రత, సంతృప్తి, అన్నీ

4. పై పేరాకు శీర్షికను నిర్ణయించండి.
జవాబు:
బుద్ధుడి బోధనలు

5. బుద్ధుడు నివాసానికి ఏవి అవసరమన్నాడు ?
జవాబు:
చక్కని పరిసరాలు

TS 10th Class Telugu Grammar అపరిచిత గద్యాలు

ప్రశ్న 10.
క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.

విభిన్న భాషా మత సంప్రదాయాలతో ఉప ఖండంగా పేరొందినది ఈ భారతమాత. ఆమె పవిత్ర దేహంలో కర్ణాటక రాష్ట్రం ఒక భాగం. ఆ భాగంలో ‘కూర్గు ప్రాంతం కూడ పేరెన్నిక గన్నదే. అందు ‘విరాజ్పేట’ గ్రామం అశ్వని జన్మస్థానమై ప్రపంచమంతటా గుర్తింపు పొందింది. ఈమె క్రీ.శ. 21-10-1967న పార్వతి అప్ప నాచప్ప దంపతులకు కుమార్తెగా జన్మించింది. తండ్రి ఉద్యోగరీత్యా కన్నడ భాషా సంస్కృతులకు దూరంగా కలకత్తా నగరంలో ‘బిర్లా రేయాన్స్’లో పనిచేస్తున్నాడు. శుక్లపక్ష చంద్రునిలా దినదినాభివృద్ధి చెందుతున్న అశ్వని తన ఎనిమిదవ ఏటనుండే స్కూల్ పోటీల్లో పాల్గొన్నది. వందమీటర్ల పరుగుపందెం, లాంగ్ జంప్ రెండూ ఆమె కిష్టమైనవే. క్రమేపి లాంగ్ జంపు స్వస్తి చెప్పి, పరుగుమీదనే తన దృష్టి కేంద్రీకరించింది. ఇండియన్ లేడీ రన్నర్స్ అందరిలోనూ ఎలాగైనా ఉషను అధిగ మించాలనే ఆకాంక్ష బలవత్తరంగా ఉన్న రోజులవి. ఎందుకంటే ఉష ప్రభ పట్టపగటి సూర్యుడిలా వెలిగిపోతున్నది. కాని ఆ ఆకాంక్షను నిజం చేసుకోగల్గింది మాత్రం అశ్వనియే.

ప్రశ్నలు – జవాబులు :
1. భారతదేశం గొప్పతనం ఎటువంటిది ?
జవాబు:
భారతదేశం విభిన్న భాషా మత సంప్రదాయాలతో ఉపఖండంగా పేరొందింది.

2. కర్ణాటకలోని ‘విరాజ్పేట’ గ్రామం, ఎవరివల్ల గుర్తింపు పొందినది ?
జవాబు:
అశ్వనికి జన్మస్థానమై, అశ్వని వల్ల ఆ గ్రామం గుర్తింపు పొందింది.

3. అశ్వని నాచప్పకు ఇష్టమైన పరుగు పందెం గురించి తెలుసుకున్నాము కదా ! మీకిష్టమైన ఆటల గురించి రాయండి.
జవాబు:
కబడ్డీ, క్రికెట్, లాంగ్ జంప్.

4. పై పేరాకు తగిన శీర్షికను నిర్ణయించండి.
జవాబు:
‘అశ్వనీ నాచప్ప’

5. అశ్వని ఎన్నో ఏట నుండి స్కూల్పోటీల్లో పాల్గొన్నది?
జవాబు:
ఎనిమిదవ ఏట నుండి.

TS 10th Class Telugu Grammar అపరిచిత గద్యాలు

ప్రశ్న 11.
క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.

అడవుల్ని కాపాడుకోకపోతే మనుగడ కష్టమే అని ‘సైమన్’కు తెలుసు. అందుకే కుర్రాళ్ళను ఏకం చేసి అటవీ సంరక్షణ దళాలను ఏర్పాటుచేశాడు. గతంలో చెట్లను నరికివేసిన ప్రాంతాలలో 35 వేలకు పైగా చెట్లను పెంచడంతోపాటు వాటి సంరక్షణ బాధ్యతను చూసు కుంటున్నారు. ఫలితంగా నేల సారవంత మైంది. కరవుతో కటకటలాడిన గ్రామాలన్నీ సైమన్ పుణ్యమా అని సుభిక్షంగా మారాయి. జార్ఖండ్ వ్యాప్తంగా ఏడాదికి సాధారణంగా ఒక పంట వేస్తే, ఈ 51 గ్రామాల్లో మాత్రం నీరు సమృద్ధిగా ఉండటంతో వరితోసహా ఏటా నాలుగు పంటలు వేస్తున్నారు. ఈ గ్రామాల నుండి 20 వేల మెట్రిక్ టన్నుల కూరగాయలు గుజరాత్, బీహార్, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి.

ప్రశ్నలు – జవాబులు :
1. అడవులను కాపాడకపోతే ఏమవుతుంది ?
జవాబు:
అడవులను కాపాడకపోతే, మనుగడ కష్టం అవుతుంది.

2. నేలను సారవంతంగా మారటానికి సైమన్ ఏమి చేశాడు?
జవాబు:
చెట్లు నరికివేసిన ప్రాంతంలో 35 వేల చెట్లు పెంచి, వాటి సంరక్షణ బాధ్యత చేపట్టాడు.

3. ఏఏ రాష్ట్రాలకు కూరగాయలు ఎగుమతి చేస్తున్నారు ?
జవాబు:
గుజరాత్, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు

4. పై పేరా చదివిన తరువాత నీవు పొందిన స్ఫూర్తి ఏమిటి?
జవాబు:
చెట్లను పెంచి సంరక్షించాలి అనే స్ఫూర్తి కల్గింది.

5. 51 గ్రామాల నుండి ఎన్నివేల టన్నుల కూరగాయలు ఎగుమతి అవుతున్నాయి ?
జవాబు:
20 వేల మెట్రిక్ టన్నులు

TS 10th Class Telugu Grammar అపరిచిత గద్యాలు

ప్రశ్న 12.
క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.

ఈ దేశం గతంలో చిన్నచిన్న రాజ్యాలుగా విడిపోయి ఉంది. అంతఃకలహాల కారణంగా వేయి సంవత్సరాలు పరాయి పాలనలో మ్రగ్గి బలహీన పడింది. ఇంత శ్రమపడి సంపాదించు కొని ఈనాడు కూడా వాటినలాగే వదిలివేస్తే ఈనగాచి నక్కలపాలు చేసినట్లవుతుంది. అందు వలన ఈ సంస్థానాలన్నింటిని భారతదేశంలో విలీనం చేసి దేశాన్ని శక్తివంతం చేయాలనే ఉద్దేశంతో సంస్థానాల శాఖ ఒకటి ఏర్పడింది.

దానికి మంత్రి పటేల్, ఆయన సంస్థానాధీశుల్ని సమావేశపరిచారు. వారికెన్నో విధాల నచ్చచెప్పి వారి భయాల్ని తీర్చారు. వారు కూడ ఆయన ప్రతిపాదనలకు సమ్మతించి తమ సంస్థానాలను ఇండియన్ యూనియన్లో విలీనం చేశారు. కాని జునాగఢ్, కాశ్మీర్, హైదరాబాద్ సంస్థానాల దగ్గర సమస్య లెదురయ్యాయి. కాని పటేల్ తన అచంచల ధైర్య సాహసాలతో, పట్టుదలతో వాటిని కూడా ఇండియన్ యూనియన్లో విలీనం చెయ్యగలిగారు.

ప్రశ్నలు – జవాబులు :
1. ఇండియన్ యూనియన్ చేరడానికి సహకరించని రాజ్యాలు ఏవి ?
జవాబు:
జునాగఢ్, కాశ్మీర్, హైదరాబాద్ రాజ్యాలు.

2. పటేల్ అభిప్రాయం ప్రకారం చిన్నరాజ్యాలు మంచివా ? యూనియన్గా ఉండడం మంచిదా ?
జవాబు:
పటేల్ అభిప్రాయం ప్రకారం యూనియన్గా ఉండడం మంచిది.

3. ఏ సంస్థానాల విషయంలో సమస్యలెదురయ్యాయి ?
జవాబు:
జునాగఢ్, కాశ్మీర్, హైదరాబాద్ సంస్థానాల విషయంలో.

4. పై పేరాలోని జాతీయాన్ని గుర్తించండి.
జవాబు:
‘ఈనగాచి నక్కలపాలు చేసినట్లు’ అన్నది జాతీయం.

5. సంస్థానాల శాఖామంత్రి ఎవరు ?
జవాబు:
పటేల్

TS 10th Class Telugu Grammar అపరిచిత గద్యాలు

ప్రశ్న 13.
క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.

అది భువనవిజయ సభమండపం, రాయలవారు తన ఆస్థానకవి పండితులతో సమావేశమై కవితాగోష్ఠి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రధాన ద్వారం వద్ద పండితా గమనం సూచించే గంట నిర్విరామంగా మోగుతోంది. సామాన్యంగా ఒక్కసారి గంట మోగిస్తే ఒక విద్యలో పండితుడని తెల్పుతుంది. కాని ఇన్నిమార్లు గంట మోగిస్తున్న ఆ పండితు డెవరో చూడాలని కుతూహలం రాయల వారిలోను, సభాసదులలోను కల్గింది.

రాజాజ్ఞానుసారం భటుడా అగంతకుని లోనికి తీసుకువచ్చాడు. అతడు రాయలవారికి, సభాసదులకు నమస్కరించి అన్నాడు. “మహా ప్రభూ” ! నన్ను రామకృష్ణుడంటారు. నేనేర్చిన విద్యల ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి మోగిస్తే మీగంట బద్దలైపోతుంది. పరీక్షార్ధినై వచ్చాను. నా అదృష్టం బాగుండి నెగ్గితే నన్ను మీ ఆస్థానంలో చేర్చుకోండి అని అన్నాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. తెనాలి రామకృష్ణుడు ఎందుకు గంటను మోగించాడు ?
జవాబు:
తాను విద్యావంతుడననీ, తన విద్యలను పరీక్షించ మని కోరుతూ గంట మోగించాడు.

2. నిర్విరామంగా మోగించిన గంట వల్ల ఏమి తెలుస్తుంది ?
జవాబు:
పండితుడు వచ్చాడని నిర్విరామంగా మోగించిన గంట వల్ల తెలుస్తుంది.

3. రాయల ఆస్థానంలో ఇంకా ఎంత మంది కవులు ఉన్నారు ?
జవాబు:
రాయలవారే కాక, ఇంకా ఎందరో కవి పండితులు ఉన్నారు.

4. పై పేరాకు శీర్షికను నిర్ణయించండి.
జవాబు:
భువనవిజయసభ – రామకృష్ణుడు గంట వాయించడం.

5. ఒకసారి గంట మోగిస్తే ఏమని తెలుస్తుంది ?
జవాబు:
ఒక విద్యలో పండితుడని తెలుస్తుంది.

TS 10th Class Telugu Grammar అపరిచిత గద్యాలు

ప్రశ్న 14.
క్రింది గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.

పద్యనాటక రచయితలలో ప్రత్యేకస్థానాన్ని అందుకున్నవారు తిరుపతి వేంకట కవులు. వీరు 1) దివాకర్ల తిరుపతిశాస్త్రి 2) చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి. వీరు శతావధానులు. తమ అవధానాలతో వీరు ఆంధ్రదేశం అంతా పర్యటించి సాహిత్య ప్రపంచంలో నూతనో త్తేజాన్ని కలిగించారు. వీరి అవధానాలతో స్పూర్తి పొందిన ఎందరో వ్యక్తులు సాహిత్య రంగంలో అడుగిడి కృషిచేశారు. ఆధునికాంధ్ర సాహిత్యంలో వీరికి ఎందరో లబ్ధ ప్రతిష్టులైన శిష్యులున్నారు. విశ్వనాథ, వేటూరి, కాటూరి, పింగళి వారలు వీరి శిష్యులే. వీరు రచించిన పాండవోద్యోగ విజయ నాటకాలకు లభించిన ప్రసిద్ధి ఇంతింతన రానిది. పశులకాపరి నుండి పండితుల వరకు అందరి నాల్కలపై వీరి పద్యాలు నాట్యం చేశాయి.

ప్రశ్నలు – జవాబులు :
1. వీరు సాహిత్య రంగంలో నూతనోత్తేజాన్ని దేని ద్వారా కల్పించారు ?
జవాబు:
తమ అవధానాలతో.

2. తిరుపతి వేంకట కవులు ఎవరు ?
జవాబు:
దివాకర్ల తిరుపతిశాస్త్రి, చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి

3. వీరి శిష్యుల పేర్లను రాయండి.
జవాబు:
విశ్వనాథ, వేటూరి, కాటూరి, పింగళి

4. అందరి నాల్కలపై నాట్యం చేసే వీరి పద్యాలు ఏ నాటకాలలోనివి ?
జవాబు:
పాండవోద్యోగ విజయాలు.

5. వీరి ప్రసిద్ధ నాటకాలు ఏవి ?
జవాబు:
పాండవోద్యోగ విజయాలు.

TS 10th Class Telugu Grammar అపరిచిత గద్యాలు

ప్రశ్న 15.
క్రింది పేరా చదివి, ఇచ్చిన వాక్యాలు సరైనవో కాదో (✓ ) (✗) గుర్తుల ద్వారా గుర్తించండి.

అందరికీ ఆధారమైన చెట్లు నేడు కను మరుగై పోతున్నాయి. ఊళ్లను, పట్టణాలను భవనాలతో నింపుతున్నారు. చెట్లు పెంచాలన్న ధ్యాస లేకుండా పోతోంది. జనాలు తాము మొక్కలు నాటి పెంచాలన్న ఆలోచనను మరిచి, ఏళ్ల తరబడిగా విస్తరించిన వటవృక్షాలను కూడా నేల కూలుస్తున్నారు. దీనంతటికీ మనిషి అత్యాశే ప్రధాన కారణం. స్వార్థంతో ముందు చూపు లేకుండా ప్రకృతినంతా అంతరింప జేస్తూ, అభివృద్ధి పేరుతో ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తున్నాడు. అలాగే రోడ్లను ఆనుకుని ఉన్న వ్యవసాయ భూములను ప్లాట్లుగా చేసి విక్ర యిస్తున్నాడు. కొన్నాళ్లకు వ్యవసాయ భూమి కొరవడి మనిషి ‘అన్నమో రామచంద్రా’ అని అరిచి చావక తప్పని పరిస్థితిని చేజేతులా సృష్టించుకుంటున్నాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. అందరికీ ఆధారమైనవి చెట్లు. (  )
జవాబు:
(✓ )

2. చెట్లను పెంచాలన్న ధ్యాస అందరిలో పెరిగి పోయింది. (  )
జవాబు:
(✗)

3. మనిషి అత్యాశ లేకుండా జీవిస్తున్నాడు. (  )
జవాబు:
(✗)

4. వ్యవసాయ భూములు ప్లాట్లుగా మారుతున్నాయి. (  )
జవాబు:
(✓ )

5. అన్నం దొరకని పరిస్థితి రాబోతుంది. (  )
జవాబు:
(✓ )

TS 10th Class Telugu Grammar అపరిచిత గద్యాలు

ప్రశ్న 16.
కింది పేరాను చదివి, ప్రశ్నలు తయారు చేయండి.

చదువుకోని సామాన్య ప్రజలకు తరతరాలుగా వస్తున్న నోటి మాటల భాష ఒక్కటే వాడుకలో ఉండగా, చదువుకున్న వాళ్ళకు, ఆ భాషతోపాటు గ్రంథాల్లో ఉన్న కావ్య భాష కూడా అవసరమైంది. కావ్యాలు రాసేటప్పుడు తమకు పూర్వులు రాసిన భాషలోనే తాము కూడా రాస్తూ వచ్చారు. పూర్వులు ఉపయోగించిన ఛందస్సులనే తాము ఉపయోగిస్తూ వచ్చారు. కానీ కావ్యాల గురించి నోటితో చెప్పేటప్పుడు వాడుక భాషలోనే వివరిస్తూ, వ్యాఖ్యానిస్తూ వచ్చిన ఆ వివరణ లనూ, వ్యాఖ్యనాలను రాయడం మొదలు పెట్టే సరికి కావ్య భాష ప్రభావం కొంత చొరబడుతూ వచ్చింది. ఇది వ్యావహారిక, గ్రాంథిక భాషలను కలిపినట్ల నిపిస్తుంది. అది ఉద్దేశపూర్వకంగా జరిగిందని చెప్పడానికి వీల్లేదు. అయినా వచన రచనా సంప్రదాయానికి వాడుక భాషే ప్రధానంగా ఉండేది.
జవాబు:
ప్రశ్నలు

  1. చదువుకున్న వాళ్లకు ఏ భాష అవసరమైంది ?
  2. పూర్వకాలంలో ఉపయోగించినవి ఏమిటి ?
  3. కావ్యాలను నోటితో ఏ భాషలో చెప్పేవారు ?
  4. వ్యాఖ్యానాలు చేసేటప్పుడు ఏ భాష ఉండేది ?
  5. వచన రచనకు ప్రధానమైన భాష ఏది ?

ప్రశ్న 17.
కింది పేరాను చదివి ఐదు ప్రశ్నలు తయారు చేయండి. (March 2015)

మంచిపని ఏ రూపంలోనైనా ఉండవచ్చు. తాను చదువుకున్నవాడైతే పదిమందికి చదువును పంచిపెట్టవచ్చు. తన ధనాన్ని పదిమందికి వినియోగించవచ్చు. ధర్మ కార్యాలకు, సమాజ కల్యాణకార్యక్రమాలకు ఇతోధికంగా సాయపడ వచ్చు. అధికారి తన పరిధిని దాటకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు చేసి ప్రజల మన్ననలు పొందవచ్చు. తనకు మంచిపేరు వస్తుంది. ప్రజలకు మేలు కలుగుతుంది. ధనికులు పరిశ్రమలను స్థాపించి, పదిమందికి ఉద్యోగావకాశాలు కల్పించ వచ్చు. అధిక లాభాన్ని ఆపేక్షించకుండా తక్కువ ధరలకే వస్తువుల నమ్మవచ్చు. ఇలా సమాజంలోని వారంతా తమ తమ పరిధుల్లో ప్రజలకు మేలు కల్పించే పనులు చేసినపుడు, దేశంలో సమస్యలే ఉండవు. ప్రజలంతా సుఖశాంతులతో జీవిస్తారు.
జవాబు:
ప్రశ్నలు

  1. ధనం ఉన్నవాడు ఆ ధనాన్ని ఎలా సద్వినియోగం చేయవచ్చు ?
  2. ఒక అధికారి ఏ విధంగా మంచిపని చేయవచ్చు ?
  3. ధనికులు ఏవిధంగా మంచిపని చేయవచ్చు ?
  4. వర్తకులు ఏవిధంగా మంచిపని చేయవచ్చు ?
  5. సమాజంలోని వారంతా ప్రజలకు మేలు కల్పించే పనులు చేస్తే ఏమవుతుంది ?

TS 10th Class Telugu Grammar అపరిచిత గద్యాలు

ప్రశ్న 18.
కింది పేరాను చదివి ఐదు ప్రశ్నలు తయారు చేయండి. (June 2015)

గోదావరి నదికి ఇరువైపులా ఉన్న ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని గిరిజనులు, వారి ఆధ్వర్యంలో రైతులు, పూజించే దేవుళ్ళు చిన్నయ్య, పెద్దయ్య, “చిన్నయ్య, పెద్దయ్య / చిలుకల భీమయ్య” అని స్థానికంగా వినిపించే జానపద గేయంలో చిన్నయ్య అంటే అర్జునుడు. పెద్దయ్య అంటే ధర్మరాజు. వారితో కూడిన భీముడ్ని పూజిస్తారు. అని స్పష్టమవుతుంది. భీముడ్ని ప్రత్యేకంగా కొలవడానికి కారణముంది. పాండవులు వనవాసం చేస్తూ, ఇక్కడికి వచ్చినపుడు ఇక్కడి గిరిజన అమ్మాయి హిడింబిని భీముడు పెళ్ళిచేసుకొని, ఆ స్థానిక గిరిజనులకు ఆరాధ్య దైవమయ్యాడు.
జవాబు:
ప్రశ్నలు

  1. గోదావరి నదికి ఇరువైపులా ఉన్న జిల్లాలు ఏవి ?
  2. గిరిజనులూ, వారి ఆధ్వర్యంలో రైతులూ పూజించే దేవుళ్ళు ఎవరు ?
  3. స్థానికంగా వినిపించే గేయం ఏది ?
  4. పెద్దయ్య, చిన్నయ్య అంటే ఎవరు ?
  5. గిరిజనులకు భీముడు ఎందుకు ఆరాధ్య దైవమయ్యాడు ?

ప్రశ్న 19.
కింది పేరాను చదివి పట్టికను పూరించండి. (March 2016)

తెలుగు సాహిత్యం మొదట పద్యగద్యాల మిశ్రితమై వెలువడినా తరువాత కాలంలో పద్యకావ్యాలు, గద్య కావ్యాలు వేరు వేరుగా వెలుగు చూశాయి. పద్య గద్య మిశ్రిత రచనలు చంపూ కావ్యాలు. 18వ శతాబ్దం వరకూ ఈ రచనా సంప్రదాయం సాహిత్య రంగంలో కొనసాగింది. 19వ శతాబ్దం నుండి ఆంగ్లభాష, సాహిత్యాల అధ్యయన ప్రభావంతో ఆ భాషలోని వివిధ రచనా రీతులు తెలుగువారికి పరిచయం అయినాయి. అలా తెలుగులోకి ప్రవేశించిన రచనా ప్రక్రియ నవల. ఈ ప్రక్రియను తెలుగునాట ప్రచారంలోకి తెచ్చిన వాడు కందుకూరి వీరేశలింగం పంతులుగారు.

పట్టిక పూరణం
1. పద్యగద్యాల మిశ్రిత కావ్యాలు.
జవాబు:
చంపూ కావ్యాలు

2. 19వ శతాబ్దానికి పూర్వం తెలుగు భాషలో లేని ప్రక్రియ
జవాబు:
నవల

3. పలు రచనా రీతులు తెలుగులోకి రావడానికి కారణం
జవాబు:
ఆంగ్లభాషా సాహిత్యాల అధ్యయన ప్రభావం

4. నవలా ప్రక్రియకు తెలుగునాట ఆద్యుడు.
జవాబు:
కందుకూరి వీరేశలింగం పంతులు గారు

5. తెలుగు సాహిత్యం మొదట ఎలా ఉంది ?
జవాబు:
పద్యగద్యాల మిశ్రితమై వెలువడింది.

TS 10th Class Telugu Grammar అపరిచిత గద్యాలు

ప్రశ్న 20.
కింది పేరా చదివి 5 ప్రశ్నలు తయారుచేయండి. (June 2016)

మానసికంగా ఎదగడానికి, పరోపకార బుద్ధిని బాల్యం నుంచి నేర్చుకోవాలి. మనవద్ద ఉన్నది ఇతరులకు ఇచ్చి మనం అనుభవించాలి అనే స్వార్ధరాహిత్యాన్ని అలవాటు చేసుకోవాలి. అన్నీ మనకే కావాలి – నాకే ఉండాలి అనే భావన ఉండరాదు. దీన్ని ‘లోభగుణం’ అంటారు. చిన్నప్పుడు ఈ గుణం తప్పని ధృతరాష్ట్రుడు, గాంధారి చెప్పకపోవటం వల్లనే దుర్యోధనుడు తరువాత కాలంలో పాండవులకు రాజ్యభాగం ఇవ్వనన్నాడు. ఇతరులు కష్టంలో ఉన్నప్పుడు అయ్యో పాపం ! అనే సానుభూతి గుణం బాల్యం నుంచే పెద్దల వల్ల పిల్లలు నేర్చుకోవాలి. ఎవరు ఏమైతే నాకేం. ‘నాకు, నా పొట్టకు శ్రీరామరక్ష అనే స్వార్థ ధోరణి ఈ రోజుల్లో పిల్లల్లో అధికమౌతుంది సహకార జీవన భావన దీనివల్ల లోపిస్తుంది.
జవాబు:
ప్రశ్నలు

  1. మనం బాల్యం నుండి ఏ బుద్ధిని నేర్చుకోవాలి ?
  2. మానవులు ఎలాంటి అలవాటును అలవరచుకోవాలి ?
  3. “లోభగుణం” అంటే ఏమిటి ?
  4. పెద్దల వద్ద పిల్లలు ఏమి నేర్చుకోవాలి ?
  5. శ్రీరామరక్ష అనే జాతీయాన్ని ఏ సందర్భంలో వాడుతారు ?

ప్రశ్న 21.
కింది గద్యాన్ని చదివి ఖాళీలను పూరించండి. (March 2017)

మాటలను ఉచ్చరించునపుడు కొన్నింటిని తేల్చి పలుకుటయు, కొన్నింటిని ఒత్తి పలుకుటయు, కొన్నింటిని మధ్యస్థముగా పలుకుటయు అనుభవ సిద్ధమగు విషయమే. ఈ విధముగా ఆరోహణా వరోహణాది క్రమములో పలుకుటను ‘స్వరము’ అని యందురు. ఉచ్చారణ సమయమున కంఠము నందలి నాదతంత్రులు ప్రకంపించునట్టి వేగమును బట్టి ఈ స్వరము కలుగును. ఉచ్చారణ సమయమున నాదతంత్రులు సాగిన దూరమును బట్టి ఊనిక కలుగును. ఏదేని మాటను ఒత్తి చెప్పవలసి వచ్చినప్పుడు గట్టిగా బలముగా చెప్పుట స్వాభావికం. ఊనిక, స్వరము ఈ రెండింటి కారణముగా ఉచ్చారణమున పెక్కు మార్పులు కలుగవచ్చును. అవి క్రమముగా భాషలో స్థిరపడవచ్చును.

ఖాళీలు
1. స్వరమంటే ……………………
జవాబు:
ఆరోహణ అవరోహణాది క్రమములో పలుకుట.

2. ఉచ్చారణ సమయంలో ప్రకంపించేవి ………………………
జవాబు:
కంఠమునందలి నాదతంత్రులు.

3. స్వరము కలగడానికి కారణం …………………..
జవాబు:
ప్రకంపన వేగము.

4. ఊనిక కలగడానికి కారణం …………………
జవాబు:
నాదతంత్రులు సాగిన దూరం వలన.

5. ఉచ్చారణలో మార్పులు కలగడానికి కారణం ………………….
జవాబు:
నాదతంత్రుల ప్రకంపనలు, నాదతంత్రులు సాగిన దూరము.

TS 10th Class Telugu Grammar అపరిచిత గద్యాలు

ప్రశ్న 22.
కింది గద్యాన్ని చదివి, కింద ఇచ్చిన పట్టికను పూరించండి. (June 2017)

అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వారం రోజులుగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో 39.54 సెంటీమీటర్ల గరిష్ట వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వేలాది చెరువులు నిండి అలుగులు పోస్తుండగా, 71 చెరువులకు గండ్లు పడ్డాయి. గోదావరి బేసిన్లోని ఎస్సారెస్పీ, సింగూరు, మంజీర, ఎల్లంపల్లి, కడెం, గడ్డెన్నవాగు ప్రాజెక్ట్లు నిండుకుండల్లా మారాయి. భారీ వర్షాలతో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ సైన్యం రంగంలోకి దిగింది.

ఖాళీలు
1. ఎక్కువ వర్షపాతం నమోదైన పట్టణం ………………….
జవాబు:
ఆర్మూర్

2. నీటితో నిండిన రెండు ప్రాజెక్టులు ………………….
జవాబు:
ఎస్సారెస్పీ, సింగూరు, మంజీర, ఎల్లంపల్లి, కడెం, గడ్డెన్నవాగు ప్రాజెక్ట్లు

3. సహాయక చర్యలు చేపట్టింది ………………….
జవాబు:
ఎన్డీఆర్ఎఫ్ సైన్యం

4. వర్షం కురవడానికి కారణం ………………….
జవాబు:
అల్పపీడన ప్రభావం

5. ’71’ అను సంఖ్య సూచిస్తున్నది ………………….
జవాబు:
చెరువులగండ్ల సంఖ్య

TS 10th Class Telugu Grammar అపరిచిత గద్యాలు

ప్రశ్న 23.
క్రింది గద్యాన్ని చదివి అందలి ఐదు కీలకమైన పదాలను గుర్తించి రాయండి. (March 2018)

పత్రికలలో దినపత్రికలకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. ఈనాడు, వార్త, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, నవతెలంగాణ, సాక్షి వంటి దినపత్రికలు నేడు బహుళ ప్రచారంలో ఉన్నవి. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య పత్రికలు వారధిలా పనిచేస్తాయి. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ప్రకటనలను పత్రికలు ప్రజలకు తెలియజేస్తాయి. వాటిని గురించి ప్రజల స్పందన ఎట్లా ఉన్నదో వివరించే బాధ్యత కూడా పత్రికలపైన ఉన్నది. పత్రికలు సమాజాన్ని మేల్కొలిపే వైతాళికుల లాంటివి. అందుకే విద్యార్థులు పత్రికా పఠనాన్ని ఒక అనివార్య విషయంగా భావించి దాని సాధనకు తప్పనిసరిగా సమయం కేటాయించుకోవాలి.
జవాబు:
కీలక పదాలు :

  1. దినపత్రికలు
  2. వారధి
  3. ప్రజలస్పందన
  4. వైతాళికులు
  5. పత్రికా పఠనం

TS 10th Class Telugu Grammar అపరిచిత గద్యాలు

ప్రశ్న 24.
కింది గద్యాన్ని చదువండి. (June 2018)

బొగ్గు పెట్రోలియం వంటి శిలాజ ఇంధనాలు, భూగోళాన్ని నిప్పుల కుంపటిగా మార్చేస్తూ జీవరాసుల మనుగడకు ముప్పు తెస్తున్నాయి. ఈ విపత్తును నివారించాలంటే మనిషి ప్రకృతి వనరులను నిర్మాణాత్మకంగా సృజనశీలంగా ఉపయోగించుకోవాలి. శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయాలను కనుగొనాలి. మోటారు వాహనాలను నడపడానికి డీజిల్ ఇంజిన్ను సృష్టించిన జర్మన్ శాస్త్రవేత్త సర్ రూడాల్ఫ్ డీజిల్ ఈ సంగతి ముందే చెప్పడమే గాదు, చేసి చూపించారుకూడా. 1893 ఆగస్టు 10న వేరుసెనగ నూనెను ఇంధనంగా వాడి ఒక ఇంజన్ను పనిచేయించారు. భవిష్యత్లో మోటారు వాహనాలు ఇలాంటి జీవ ఇంధనాలతోనే నడుస్తాయని సూచించారు. అందుకే ఏటా ఆగస్టు పదవతేదినాడు ప్రపంచ జీవ ఇంధన దినోత్సవాన్ని పాటిస్తున్నారు.

క్రింది వివరణలను సూచించే పదాలను గద్యంలో గుర్తించి క్రింది ఖాళీలలో రాయండి.

వాక్యాలు
1. ఒకదానికి బదులుగా మరొకటి అనే అర్థం ఇచ్చే పదం ( )
జవాబు:
ప్రత్యామ్నాయం

2. పై గద్యంలో వాడిన ‘జాతీయం’ ( )
జవాబు:
నిప్పుల కుంపటి

3. అనేక జీవుల, నిర్జీవుల సమూహ నివాసస్థానం ( )
జవాబు:
భూగోళం

4. ‘రాబోయే కాలంలో’ అని సూచించడానికి వాడిన పదం ( )
జవాబు:
భవిష్యత్

TS 10th Class Telugu Grammar అపరిచిత గద్యాలు

5. పై గద్యంలో సూచించిన విపత్తు ( )
జవాబు:
జీవరాశి మనుగడకు ముప్పు

TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం

Telangana SCERT 10th Class Telugu Guide Telangana 5th Lesson నగరగీతం Textbook Questions and Answers.

TS 10th Class Telugu 5th Lesson Questions and Answers Telangana నగరగీతం

చదవండి – ఆలోచించి చెప్పండి (T.B. P.No. 47)

చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్ళు చెరుగుతున్నప్పుడు
సంసారం బరువెంతో సమీక్షించగలిగినవాణ్ణి
ఆకుపచ్చని చెట్టు, ఆహ్లాదభరితమైన వాతావరణమేమి
లేకుండానే
పగలూరాత్రి ఆస్బెస్టాస్ రేకులకింద పడి ఎంత వేడెక్కినా
మాడిపోకుండా ఉండగల్గిన మానవాతీతుణ్ణి
నరకప్రాయమైన నగర నాగరికతను నరనరానా
జీర్ణించుకున్నవాణ్ణి
రోజుకో రెండు కవితా వాక్యాల్ని రాయలేనా…
అది మనకు పెన్నుతో పెట్టిన విద్య… అఫ్ కోర్సు…
కవిత్వం ఎంత నిత్యనూతనంగా వెలికి వచ్చినా
రాసిన ప్రతిదీ ఆణిముత్యం కాదని అందరికి తెలుసు
– అలిశెట్టి ప్రభాకర్

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
“చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్ళు చెరుగు తున్నప్పుడు” వాక్యం ద్వారా మీరేం గ్రహించారు ?
జవాబు:
అర్ధాంగి ఇంట్లో సరుకులన్నీ ఉన్నప్పుడు సంతోషంగా వంటావార్పులు చేస్తుంది. ఇంట్లో సరుకులు లేనప్పుడు కన్నీళ్ళతో ఖాళీ చేటనే చెరుగుతుంది. చూచేవారికి ఇంట్లో అన్నీ ఉన్నట్లు అనుకుంటారు. దీనిద్వారా సంసారాన్ని నిర్వహించడం ఎంత కష్టమో తెలుసుకోవాలని కవి సూచించాడు.

ప్రశ్న 2.
కవి నివాసం ఎట్లా ఉన్నది ?
జవాబు:
పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం లేనటు వంటి పగలూ, రాత్రి ఆస్బెస్టాస్ రేకుల షెడ్లో రచయిత నివాసం ఉంటున్నాడు. ఆ ఇంట్లో సకల కష్టాలను అనుభవిస్తున్నాడు.

TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం

ప్రశ్న 3.
నగర నాగరికతను నరకప్రాయమని కవి ఎందుకు అని ఉంటాడు ? దానిపై మీ అభిప్రాయాలు చెప్పండి.
జవాబు:
నగర నాగరికత నరకప్రాయమని కవి చెప్పాడు. ఇది యదార్థమే. నగరంలో ప్రశాంత వాతావరణం ఉండదు. కలుషితమైన వాతావరణం ఉంటుంది. శబ్ద కాలుష్యం, ధ్వని కాలుష్యం, నీటి కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. మానవీయ సంబంధాలు అంతగా ఉండవు. జీవితం ఉరుకులుపరుగులతో కూడి ఉంటుంది. అందువల్ల నగర నాగరికతను నరకప్రాయమని కవి చెప్పాడు.

ప్రశ్న 4.
కవితాత్మక వాక్యాలు చదివారు కదా! ఈ కవి గురించి మీకు ఏమర్థమైంది ?
జవాబు:
జీవితాన్ని నిరాశానిస్పృహలతో గడపకూడదని, సాధించాల్సిన దానిని సాధించాలని, నరకప్రాయమైన నగర నాగరికతను కూడా జీర్ణించుకోవాలనే సత్యాన్ని చెప్పినట్లుగా అర్థమవుతుంది.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 50)

ప్రశ్న 1.
పల్లెసీమల్ని కవి తల్లిఒడితో ఎందుకు పోల్చాడు ?
జవాబు:
పల్లెసీమలు ప్రకృతి అందాలకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ప్రశాంత వాతావరణం పల్లెల్లో ఉంటుంది. మరువలేని, మరుపురాని ఆత్మీయతాను బంధాలు పల్లెల్లో ఉంటాయి. అక్కడి ప్రజలు ఒకరి కష్టసుఖాల్లో మరొకరు పాలుపంచుకుంటారు. తల్లి ఒడిలోని పిల్లవానికి ఎంత రక్షణ ఉంటుందో, పల్లెసీమలో ఉండే మనిషికి కూడా అంతటి రక్షణ ఉంటుందనే ఉద్దేశ్యంతో పల్లెసీమల్ని తల్లిఒడితో పోల్చాడు.

ప్రశ్న 2.
పట్టణాలను ‘ఇనప్పెట్టెలు’ అని అనడంలో కవి ఉద్దేశం ఏమై ఉంటుంది ?
జవాబు:
ఇనప్పెట్టెలను డబ్బు దాచుకోవడానికి వాడతారు. అవి చిన్నవిగా, ఇరుకుగా ఉంటాయి. ఇన ప్పెట్టెలో ఊపిరి పీల్చుకోడానికి కూడా గాలి రాదు. నగరాల లోని ఇళ్లలో కూడా తగినంత ఖాళీ ప్రదేశం లేక ఇరుకుగా ఉంటుంది. ఆ దృష్టితోనే కవి నగరాలను ఇనప్పెట్టెలతో పోల్చాడు.

ప్రశ్న 3.
‘నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే’ అనే వాక్యం గురించి మీకు ఏమర్థమైంది ?
జవాబు:
పఠనీయ గ్రంథంలో ఎన్నో విషయాలు చదివి తెలుసు కోవలసినవి ఉంటాయి. వాటిలో ఎంతో సమాచారం దాగి ఉంటుంది. అలాగే నగరంలో నివసించే ప్రతి మనిషికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. అక్కడ ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా జీవనం సాగిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తుల జీవన చరిత్రలు తప్పక తెలుసుకోతగ్గట్టుగా ఉంటాయి. అందుకే నగరంలో ప్రతి మనిషిని పఠనీయ గ్రంథం అని కవి చెప్పాడు.

TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం

ప్రశ్న 4.
“పేవ్మెంట్లపై విరబూసిన కాన్వెంటు పువ్వుల సందడి” అని కవి ఎవరి గురించి అన్నాడు ? దీని గురించి మీ అభిప్రాయం తెలుపండి.
జవాబు:
నగరంలో ఉదయాన్నే సిటీబస్సుల్లో, ఆటోల్లో, పేవ్మెంట్లపై విరబూసిన పువ్వుల్లాంటి స్కూల్ పిల్లలు సందడి చేస్తుంటారు. వారి మాటల్లో చదువుల పుప్పొడి రాలుతుంది. విరబూసిన పువ్వులతో పిల్లలను పోల్చాడు. పిల్లలు సుకుమార మనస్కులు. వారి నవ్వులు ఆహ్లాదంగా ఉంటాయి.

ఆలోచించండి – చెప్పండి. (T.B. P.No. 50)

ప్రశ్న 1.
“సిటీ అంటే అన్నీ బ్యూటీ బిల్డింగ్లు కావు!” ఇది వాస్తవమేనా ? ఎందుకు ?
జవాబు:
సిటీ అంటే అన్నీ బ్యూటీ బిల్డింగ్లు కావు. ఇది వాస్తవమే. ఎందుకంటే ఒకవైపు ఖరీదైన భవంతులు పక్క పక్కనే చిన్న చిన్న పూరిపాకలు సమాంతర గీతలుగా కనిపిస్తాయి. నగరం వైవిధ్యమైన సమస్యల తో, విభిన్న మనస్తత్వాలతో కనిపిస్తుంది. అనగా నగరంలో అందమైన భవనాలేకాదు, మురికివాడలు కూడా ఉంటాయని చెప్పడమే కవి ఉద్దేశ్యం.

ప్రశ్న 2.
రెండు కాళ్ళు, మూడు కాళ్ళు, నాలుగు కాళ్ళు అని కవి అనడంలో ఉద్దేశం ఏమిటి ?
జవాబు:
రెండుకాళ్ళు అంటే కాలినడక, మూడుకాళ్ళంటే రిక్షా, నాలుగుకాళ్ళంటే కారు అని అర్థం. అనగా వారివారి ఆర్థిక స్తోమతనుబట్టి మానవులు ప్రయాణం సాగిస్తారని భావం.

ప్రశ్న 3.
“మహానగరాల రోడ్లకి మరణం నాలుగువైపులు” అంటే ఏమిటి ?
జవాబు:
నగరంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. నగరంలో అన్నివైపులా ప్రమాదాలు పొంచి ఉంటాయి. నగరంలో నాలుగుదిక్కుల్లోని రోడ్లలో మృత్యువు పొంచి ఉంటుందని కవి హెచ్చరిస్తున్నాడు.

ప్రశ్న 4.
నగరాన్ని రసాయనశాల అనీ, పద్మవ్యూహం అనీ కవి అనడంలో ఉద్దేశం ఏమై ఉంటుంది ?
జవాబు:
రసాయనశాల అంటే రసాయనద్రవ్యాలు, ఆమ్లాలు ఉన్న ప్రయోగశాల అని అర్థం. ప్రయోగశాలలో ఏవేవో తెలియని రసాయన ద్రవాలూ, ఆమ్లాలు ఉంటాయి. ఆ ద్రవాలకు వేర్వేరు చర్యలు ఉంటాయి. వాటి చర్యలు అందరికీ అర్థం కావు. నగరం కూడా ఎవరికీ అర్థం కాదు. అందుకే నగరాన్ని కవి “రసాయనశాల” అన్నాడు.

ఇక పద్మవ్యూహం సంగతి. పద్మవ్యూహంలో ప్రవేశించినవాడు తిరిగి తేలికగా బయటకు రాలేడు. అక్కడే జీవనపోరాటం చేస్తూ మరణిస్తాడు.

నగరం కూడా ఇటువంటిదే, బతుకు కోసం నగరానికి వచ్చిన సామాన్యులకు ఉపాధి దొరకక పోయినా వారు ఏదో ఒక రోజున దొరుకుతుందనే ఆశతో, నగరంలోనే ఉండి దానికై ఎదురుచూస్తూ ఉంటారు. నగరంలోని సౌకర్యాలకూ, వినోద విలాసాలకూ, పైపై మెరుగులకూ వారు లొంగిపోతారు. మరోవైపు నిరుద్యోగం, అధిక ధరలు భయపెడుతున్నా నగరాన్ని విడిచి వారు వెళ్ళలేరు. వారిని కాలుష్యం కలవరపెట్టినా, వింత వింత జబ్బులు పీడిస్తున్నా, ట్రాఫికామ్లలో చిక్కుకుంటున్నా వారు నగరాన్ని విడిచి ప్రశాంతమైన తమ పల్లెలకు వెళ్ళలేరు. అందుకే కవి నగరాన్ని “పద్మవ్యూహం” అని పిలిచాడు.

TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
క్రింది అంశాలలో ఒకదాని గురించి చర్చించండి.

అ) మీరు ఇప్పటివరకు ఏయే నగరాలను చూశారు ? మీరు చూసిన నగరాల్లో మీకు నచ్చిన, నచ్చని అంశాలు తెలుపండి.
జవాబు:
నేను ఇప్పటి వరకు ఎన్నో నగరాలు చూశాను. వాటిలో నాకు నచ్చిన అంశాలు ఉన్నాయి, నచ్చని అంశాలు కూడా ఉన్నాయి. వాటిని ఈ పట్టిక ద్వారా తెలియజేస్తున్నాను.
TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం 1
TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం 2

ఆ) మీ ఊరి నుండి ఎవరైనా నగరాలకు వలస వెళ్ళారా ? ఎందుకు వెళ్ళవలసి వచ్చింది ? వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు ?
జవాబు:
మా ఊరు నుండి ఎంతోమంది యువతీయువకులూ, వివిధమైన చేతివృత్తులవారూ, బ్రాహ్మణులూ హైదరాబాద్ నగరానికి వలస వెళ్ళారు.

వలస వెళ్ళడానికి కారణం : మా గ్రామంలో వారికి సరైన ఉపాధి సౌకర్యాలు లేవు. విద్యా వైద్య సదుపాయాలు లేవు. ఇక్కడ వారికి ఉద్యోగాలు దొరకలేదు. అందువల్ల వారు నగరానికి వలస పోయారు. మా గ్రామంలో వ్యవసాయం వారికి గిట్టుబాటు కానందున, చిన్న చిన్న ఉద్యోగాల కోసం, కూలిపనుల కోసం, తాపీ, వడ్రంగం వంటి వృత్తుల వారు సైతం నగరాలకు వలసవెళ్ళారు. మరికొందరు యువకులు, సినీమా పరిశ్రమలో చేరి, తమ నైపుణ్యాన్ని పెంపొందించుకొని, నటులుగా కళాకారులుగా అభివృద్ధి చెందాలని. నగరానికి వలస వెళ్ళారు.

కొందరు యువకులు అక్కడ కూలీ పనులు చేస్తున్నారు. కొందరు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు. కొందరు లఘుపరిశ్రమలు పెట్టారు. కొందరు బ్రాహ్మణులు గుళ్ళలో పూజారులుగా, పురోహితులుగా పనిచేస్తున్నారు. కొందరు తమకు తెలిసిన చేతివృత్తులు చేసుకుంటూ అపార్ట్మెంట్ల వద్ద కాపలాదార్లుగా పనిచేస్తున్నారు.

ఇంజనీరింగ్ చదివిన యువతీ యువకులు నగరంలో శిక్షణ పొంది, చిన్న పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారిలో కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా, ప్రభుత్వంలో ఉద్యోగులుగా, ప్రైవేటు పరిశ్రమల్లో కార్మికులుగా, కొందరు నిరుద్యోగులుగా ఉంటున్నారు. కొందరు వైద్యశాలల్లో నర్సులుగా పనిచేస్తున్నారు.

ప్రశ్న 2.
పాఠం ఆధారంగా కింది కవితా పంక్తుల్లో దాగిన అంతరార్థాన్ని గుర్తించి రాయండి.

అ) నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే.
జవాబు:
పట్టణాల్లో నివసిస్తున్న ప్రతిమనిషి వెనుక ఎంతో చరిత్ర ఉంటుంది. వారంతా ఏదో వృత్తిని అన్వేషిస్తూ అక్కడకు వచ్చినవారే అయి ఉంటారు. వారిలో కొందరు నిరుద్యోగులు, కొందరు చిరుద్యోగులు, కొందరు విద్యార్థులుగా, బీదవారుగా, కొందరు మధ్యతరగతి వారుగా ఉంటారు. వారు ఎన్నో రకాల సమస్యలలో చిక్కుపడి ఉంటారు. వారందరిని గూర్చి పూర్తిగా తెలుసుకోవలసిన అవసరం ఉందని పై వాక్య సారాంశము.

గ్రంథం అట్ట చూసినంత మాత్రాన ఆ గ్రంథంలోని విషయం ఏమిటో తెలియదు. అలాగే నగరవాసి పై వేషభాషల్ని బట్టి అతడి చరిత్రను గ్రహించలేము. నగరవాసిని అడిగి తెలుసు కోవాలి. అతడు చదివి తెలుసుకోవలసిన పుస్తకం వంటి వాడని భావం.

ఆ) నగరం మహావృక్షంమీద ఎవరికి వారే ఏకాకి.
జవాబు:
వృక్షాలమీద ఉండే పక్షులు పరస్పరం కలిసిపోయి కలివిడిగా ఉంటాయి. నగరమనే మహావృక్షంమీద నివసించే ఈ మనుషులు సాటిమనిషితో ఎటువంటి ఆత్మీయ పలకరింపులు లేకుండా ఇరుగూ పొరుగనే భావన లేకుండా ఎవరికి వారే ఏకాకిగా బతుకు తుంటారు. ఈ యాంత్రిక మానసిక స్థితిని కవి నిరసిస్తున్నాడు.

ఇ) మహానగరాల రోడ్లకు మరణం నాలుగు వైపులు.
జవాబు:
నగరంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. నగరంలో అన్నివైపులా ప్రమాదాలు పొంచి ఉంటాయి. నగరంలో నాలుగు దిక్కుల్లోని రోడ్లలో మృత్యువు పొంచి ఉంటుందని కవి హెచ్చరిస్తున్నాడు. కావున రోడ్లపై జాగ్రత్తగా వెళ్ళాలని కవి స్పష్టం చేయదలచుకున్నాడు.

TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం

ప్రశ్న 3.
క్రింది వచన కవితను చదవండి.

నా జ్ఞాపకాల్లో గూడు కట్టుకొన్న మమతల ముల్లె
మలిన మెరుగని మట్టి మనుషుల ఎదమల్లె నా పల్లె!

చుట్టూ బాంధవ్యాల పాతాళ గరిగె నా పల్లె
అనుబంధాల పెరుగు గురిగి నా పల్లె!
తనువంతా తంగేడు పూలు పేర్చుకొన్న బతుకమ్మ
కాపురాజయ్య గీతల్లో బోనాలెత్తిన పల్లెపడతి బొమ్మ

అసోయ్ దూలాల పీరీల పండుగ
అలాయ్ బలాయ్లా దసరా పండుగ
ఆటల అల్లిబిల్లి జూలా నా పల్లె!
నా పల్లెలో మా ఇళ్ళు
ఊరంతటికి ఆనందాల్ని పంచే లోగిళ్ళు!

కవిత చదివారు కదా! కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) కవితలోని ప్రాస పదాలను గుర్తించి రాయండి.
జవాబు:
మమతల ముల్లె
ఎదమల్లె నా పల్లె
పాతాళగరిగె నా పల్లె

గురిగి నా పల్లె
పేర్చుకొన్న బతుకమ్మ
పల్లెపడతి బొమ్మ

పీరీల పండుగ
దసరా పండుగ
నా పల్లె
మా ఇళ్ళు
పంచే లోగిళ్ళు !

ఆ) కవితలో కవి ఏయే పండుగలు ప్రస్తావించాడు ?
జవాబు:
బతుకమ్మ, బోనాలు, పీరీల పండుగ, అలాయ్, బలాయ్, దసరా పండుగ.

ఇ) మనుషుల నడుమ బాంధవ్యాలను కవి వేటితో పోల్చాడు ?
జవాబు:
పాతాళ గరిగె, అనుబంధాల పెరుగు గురిగితో పోల్చాడు.

ఈ) కవితకు శీర్షిక పెట్టండి. ఎందుకు ఆ శీర్షిక పెట్టారో వివరించండి.
జవాబు:
ఈ కవిత కు శీర్షిక “నా పల్లె”. ఈ వచన కవితలో అంతా చక్కని పల్లె గురించి రాసాడు. కాబట్టి “నా పల్లె” అనే శీర్షిక పెట్టాను.

TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) అలిశెట్టి ప్రభాకర్ గురించి వ్రాయండి.
జవాబు:
కరీంనగర్ జిల్లా జగిత్యాల అలిశెట్టి ప్రభాకర్ జన్మస్థలం. మొదట చిత్రకారుడుగా జీవితం ప్రారంభించాడు. ప్రారంభంలో పండుగల, ప్రకృతి దృశ్యాల, సినీనటుల బొమ్మలను పత్రికలకు వేశాడు. తరువాత జగిత్యాలలో సాహితీ మిత్రదీప్తి’ సంస్థ పరిచయంతో కవిత్వ రంగంలోకి ప్రవేశించాడు. 1974 లో ఆంధ్రసచిత్ర వార్తాపత్రికలో వచ్చిన ‘పరిష్కారం’ అచ్చయిన ఆయన మొదటి కవిత. ఎర్ర పావురాలు (1978) మొదటి కవితా సంకలనం.

మంటల జెండాలు, చురకలు (1979), రక్తరేఖ (1985), ఎన్నికల ఎండమావి (1989), సంక్షోభగీతం (1990), సిటీలైఫ్ (1992) అచ్చయిన కవిత్వ సంకలనాలు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్ళపాటు సీరియల్గా ‘సిటీలైఫ్’ పేరుతో హైదరాబాదు నగరంపై రాసిన మినీ కవితలతో ప్రఖ్యాతిపొందాడు. తన కవిత్వంతో పాఠకుల్లో ఆలోచనాదృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన కవి అలిశెట్టి ప్రభాకర్.

ఆ) ‘నగరజీవికి తీరిక దక్కదు, కోరిక చిక్కదు’ అనే కవితా పంక్తుల్లోని వాస్తవాన్ని వివరించండి.
జవాబు:
నగరవాసులకు తీరిక ఉండదు. నగరంలో ఉద్యోగాలు చేసేవారు ఉదయమే బయలుదేరి దూరంగా ఉన్న తమ కార్యాలయాలకు ఉరుకులు పరుగులు పెడుతూ వెళ్లాలి. ట్రాఫిక్ఆమ్లు ఉంటాయి. కాబట్టి ఆఫీసు వేళకు చాలా ముందుగానే వారు బయలుదేరాలి. తిరిగి వచ్చేటప్పటికి పొద్దుపోతుంది.

అలాగే కూలిపనులు చేసి జీవించే వారికి కూడా వారికి పని దొరికే ప్రాంతానికి రావడానికీ, పోవడానికీ ఎంతో సమయం పడుతుంది. అందుచేత వారికి కూడా తీరిక దక్కదు.

ఎంత కష్టపడినా నగరజీవి చిరుసంపాదనతో వారి కోరికలు తీరవు. తిండికి, బట్టకూ, ప్రయాణాలకూ వారికి ఖర్చయిపోతుంది. అందువల్ల నగరవాసులకు తీరిక దక్కదు, కోరిక చిక్కదు అని కవి నిజం చెప్పాడు.

ఇ) నగర జీవితంలోని ప్రతికూల అంశాలను ఇంత కఠినంగా వర్ణించడంలో కవి ఆంతర్యం ఏమిటి ?
జవాబు:
‘నగరగీతం’ అనే పాఠ్యభాగం ద్వారా కవి నగర జీవన చిత్రాన్ని చక్కగా ఆవిష్కరించాడు. నగరంలోని కష్టాలను వివరించాడు. ప్రమాదాల గురించి, అసమానతల గురించి కూడా కవి చక్కగా తెలియజేశాడు.

కవి ఇంత కఠినంగా నగర జీవన చిత్రాన్ని ఆవిష్కరించడంలో ఆంతర్యం లేకపోలేదు. ముఖ్యంగా నగర జీవన విధానంలో మార్పు రావాలని, ప్రజలమధ్య అసమానతలు తొలిగి, ఐకమత్యం వర్థిల్లాలని, మురికి వాడలులేని సుందర నగరం ఉండాలని కవి ఆకాంక్షించాడు. అందుకోసమే నగర ప్రజలను జాగృతం చేయదలిచాడు.

ఈ) నగరంలో మనిషి జీవన విధానం గురించి పాఠం ఆధారంగా వివరించండి.
జవాబు:
‘నగరగీతం’ అనే పాఠ్యభాగంలో అలిశెట్టి ప్రభాకర్ నగర జీవన చిత్రాన్ని చక్కగా ఆవిష్కరించారు. నగరంలో జీవించే ప్రజల కష్టసుఖాలను వివరించిన తీరు అద్భుతంగా ఉంది. నగర ప్రజలు ఎప్పుడూ రణగొణ ధ్వనులతో ఇబ్బందులు పడతారు. ఇరుకైన ఇండ్లలోను, మురికివాడల్లోను జీవనం సాగిస్తారు. నగరంలోని మనిషి వెనుక ఆసక్తికరమైన ఆనంద, విషాద గాథలు ఉంటాయి. నగర ప్రజలకు ఏనాడు విశ్రాంతి దొరకదు. సంపాదించిన ధనంతో కోరికలను తీర్చుకోలేరు. రోడ్డు ప్రమాదాలతో ప్రజలు అవస్థలుపడతారు. చిక్కు విడదీయలేని పద్మవ్యూహంలాంటి నగరంలో ప్రజల దుస్థితి హృదయ విదారకంగా ఉంటుంది.

ప్రశ్న 2.
క్రింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ)
నేడు నగర జీవనం ఎందుకు సంక్లిష్టంగా మారిందో విశ్లేషించండి.
(లేదా)
నేడు నగర జీవితం ఎలా ఉన్నదో తెలుపండి.
(లేదా)
‘నగర జీవనం’ పాఠ్యాంశం ఆధారంగా నగరం ఎంత సంక్లిష్టంగా మారిందో వివరించండి.
జవాబు:
ప్రజలు వలసపోవటం : బ్రతుకు తెరువుకోసం, ఉపాధి కోసం ఎక్కువమంది పల్లె ప్రజలు నగరాలకు వలస పోవటం.
జనాభా పెరుగుదల : విద్యా, ఉద్యోగ అవకాశాలు, వైద్య సదుపాయాలు నగరాల్లో ఎక్కువగా ఉంటాయని ప్రజలు నగరాలకు వెళ్ళడంతో విపరీతంగా జనాభా పెరగటం.
రద్దీ పెరగటం : ప్రమాదాలు జరగటం, ఎప్పుడూ రోడ్లు రద్దీగా ఉండడంతో ప్రతిరోజు ప్రమాదాలు ఎక్కువగా జరగటం.

నీటి సమస్య : చెరువుల భూమి ఆక్రమణలకు గురియై భూగర్భ జలాలు తగ్గి త్రాగునీటికి, వాడుక నీటికీ కొరత ఏర్పడటం, ఉన్న చెరువులు, బావులు అవసరాలకు చాలకపోవటం.
కాలుష్యం పెరగటం : వాహనాలు, కర్మాగారాల్లో ఇంధనం ఎక్కువగా వాడటం, మురుగునీటి సౌకర్యాలు లేకపోవటంతో జల కాలుష్యం, వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం పెరగటం.

ధరల పెరుగుదల : జనాభా పెరగటంతో వస్తువులకు గిరాకీ పెరిగి ధరలు విపరీతంగా పెరిగిపోవటం. విదేశీ సంస్కృతి ప్రభావం : భిన్న సంస్కృతులు ప్రజలు ఒక్కచోట ఉండటంతో ప్రజలు విదేశీ వ్యామోహానికి గురికావటం.

సగటు మనిషి పడేపాట్లు : ఇరుకు ఇళ్ళల్లో, అధిక ధరలతో, రణగొణ ధ్వనులతో, నీటి వసతులు లేక, నిరంతరం జీవనపోరాటం చేస్తూ పద్మవ్యూహం లాంటి నగరంలో సగటు మనిషి ఎన్నో అగచాట్లు పడు తున్నాడు. క్లిష్ట సమస్యలను మానసిక సంఘర్షణతో ఎదుర్కోవటంతో నేడు నగర జీవితం నరకప్రాయంగా మారుతుంది.

TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం

ప్రశ్న 3.
క్రింది అంశాల గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

అ) మన పరిసరాల పరిశుభ్రత కోసం అందరూ కృషి చేయాలని తెలిపేటట్లు కరపత్రం రాసి ప్రదర్శించండి.
జవాబు:
పర్యావరణ పరిరక్షణ – పర్యావరణ స్పృహ

ఉపోద్ఘాతము :

మనము నివసించు భూమిపై మానవులే గాక గాలి, నీరు, చెట్లు, పర్వతాలు మొదలైనవి ఉంటాయి. ఈ మొత్తాన్నే వాతావరణం లేదా పర్యావరణం అంటారు. మనము ఎల్లప్పుడూ చక్కని ఆరోగ్యంతో ఉండాలంటే వీటిపై చక్కని అవగాహన కలిగి ఉండాలి. ఇట్లు అవగాహన కలిగి ఉండుటనే “పర్యావరణ స్పృహ” అని అంటారు. ప్రస్తుతం ఈ ఆధునిక యుగంలో మనం పీల్చేగాలి, త్రాగేనీరు, నివసించు స్థలం ఇవన్నీ కలుషితమే. రోజురోజుకీ మన ఆరోగ్యాన్ని హరిస్తూ ఆయుష్షును తగ్గిస్తున్నాయి. ఈ కాలుష్యం అనేది ప్రధానంగా 4 రకాలుగా ఉంటుంది.

1. వాయు కాలుష్యం
2. జల కాలుష్యం
3. ధ్వని కాలుష్యం
4. భూమి కాలుష్యం

1) వాయు కాలుష్యం : మనం ఎంతటి సౌకర్య వంతమైన జీవితం గడుపుతున్నా మనం ఉదయం పూట పీల్చే రెండు గంటల గాలి తప్ప మిగిలిన గాలంతా విషతుల్యమే. ఫ్యాక్టరీలు, వాహనాలు వదిలే పొగతో పాటు బొగ్గు, వంటచెరకు, చెత్తా చెదారం వంటివి కాల్చడం వలన మన ఎముకలకు, మూత్ర పిండాలకు, ఊపిరితిత్తులకు హాని జరిగి, అనేక రకాల భయంకరమైన రోగాలు వచ్చు ప్రమాదం ఉంది.

2) జలకాలుష్యం : నేడు మన భారతదేశంలోని ముఖ్యమైన 14 నదులతో పాటు అనేక ఉపనదులు, సరస్సులు, చెరువులు, తీవ్రమైన కాలుష్యానికి గురి అవుతున్నాయి. ఫ్యాక్టరీల నుండి వెలువడు మలినాలు, విషపదార్థాలు అనేకం నీటిలో కలవడం వలన జలకాలుష్యం జరుగుతున్నది. ప్రస్తుతం ప్రజలలో చాలా ఎక్కువ మంది ఈ నీటి కాలుష్యం వల్లనే బాధలు అనుభవిస్తున్నారు. దీని వలన మనకు కలరా, టైఫాయిడ్, మలేరియా మరియు డయేరియా వంటి వ్యాధులు వస్తాయి.

3) ధ్వని కాలుష్యం : ధ్వని కాలుష్యం నేడు పెద్ద పెద్ద పట్టణాలలో తీవ్రతరం అగుచున్నది. మోటారు వాహనాలు, ఫ్యాక్టరీలు, విమానాలు, రైల్వేలు, లౌడుస్పీకర్లు మొదలైనవి ధ్వని కాలుష్యానికి కారణాలు. దీని వలన మనకు చెవుడు, జ్ఞాపకశక్తి తగ్గిపోవుట, ఏకాగ్రత లోపించుట, తలనొప్పి, జీర్ణశక్తి తగ్గుట, రక్తపోటు గుండెదడ వంటి జబ్బులు వస్తాయి.

4) భూమి కాలుష్యం : ప్రాణులన్నీ భూమిపైనే నివసిస్తాయి. మనం జీవించడానికి కావలసిన ఆహారం భూమిపైనే లభిస్తుంది. అటువంటి భూమి రసాయన ఎరువుల వాడకం వల్ల నిస్సారమై పోతోంది. చెత్త, చెదారం, ప్లాస్టిక్ సంచుల వాడకం మొదలైన కారణాల వల్ల భూమి సమతౌల్యం దెబ్బతింటోంది.

కాలుష్య నివారణ మార్గాలు : వాతావరణం మనకు రక్షణ కవచం వంటిది. కాబట్టి చక్కని ఆరోగ్యం అందరికి కావలెనన్న ఈ పర్యావరణ పరిరక్షణ బాధ్యతను మనం మనందరి బాధ్యతగా గుర్తించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కాలుష్య నివారణకు తగిన చర్యలు చేపట్టాలి. వాహనాలు పొగను తగ్గించాలి.

నీరు కలుషితం కాకుండా చెరువులు, బావుల యందలి నీటిలో క్లోరిన్ వంటి క్రిమి సంహారక మందులు కలపాలి. మొక్కలు విస్తారంగా నాటి, సాధ్యమైనంత విశాల భూమిని పచ్చపచ్చగా ఉంచాలి. దంపతులైన వారు విధిగా కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించాలి. ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని నిషేధించాలి. ఎల్లరూ కూడ “వన రక్షణే జన రక్షణ” అన్న సూక్తిని మరువరాదు. “వృక్షో రక్షతి రక్షితః” “చెట్లు పెంచితే క్షేమం – నరికితే క్షామం”.

III. భాషాంశాలు

పదజాలం

1. క్రింది పదాలకు అర్థాలు రాయండి.

అ) నగారా
ఆ) సందడి
ఇ) ఘోష
ఈ) పఠనీయ గ్రంథం
జవాబు:
అ) నగారా : పెద్ద ఢంకా
ఆ) సందడి : జన సమూహధ్వని
ఇ) ఘోష : ఉరుము, ఆవులమంద, కంచు
ఈ) పఠనీయ గ్రంథం : చదువదగిన గ్రంథము

TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం

2. క్రింది పదాలకు పర్యాయపదాలు రాసి వాటితో వాక్యాలు రాయండి.

అ) నరుడు
ఆ) అరణ్యం
ఇ) రైతు
ఈ) పువ్వు
ఉ) మరణం
ఊ) వాంఛ
ఎ) వృక్షం

ఉదా ॥ పల్లె – గ్రామం, జనపదం

పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అని గ్రామస్వరాజ్యం కోసం గాంధీజీ కలలు కన్నాడు. జనపదాలను బాగుజేసుడే దేశ సౌభాగ్యమనుకున్నాడు.

అ) నరుడు – మానవుడు, మనిషి
నరుడు జ్ఞానవంతుడని, లోకంలో మానవుడు సాధించ లేనిది ఏదీలేదన్నారు. మనిషి తన శక్తి సామర్థ్యాలను వినియోగించుకోవాలి.

ఆ) అరణ్యం – విపినం, అడవి
అరణ్యంలో ప్రకృతి సౌందర్యం ఉట్టిపడుతుండటం వల్ల సింహాలు విపినంలో నివసిస్తాయి. అడవి జంతువులకు రక్షణ కావాలి.

ఇ) రైతు – కర్షకుడు, కృషీవలుడు

రైతు లేనిదే రాజ్యం లేదు. కర్షకుడు పండిస్తే పంటలు పండుతాయి అందువల్ల మనమంతా కృషీవలునికి ఋణపడియున్నాము.

ఈ) పువ్వు – కుసుమం, పుష్పం
ఉద్యానవనంలో గులాబీపువ్వు, మందార కుసుమం, మల్లెపుష్పం ఉన్నాయి.

ఉ) మరణం – మృత్యువు, చావు
పుట్టినవానికి మరణం తప్పదని తెలిసినా మానవుడు మృత్యువుకు భయపడతాడు. చావును ధైర్యంగా ఎదుర్కొనాలి.

ఊ) వాంఛ – కోరిక, ఇచ్ఛ
రవి తీరని వాంఛలను పొందలేక, వేరొక కోరిక కోరాడు. తన ఇచ్ఛ నెరవేరలేదని దిగులు చెందాడు.

ఎ) వృక్షం – చెట్టు, తరువు
ఇంటి ముందు వృక్షం ఉంటే ఆ చెట్టు గాలికి పరవశిస్తాము. తరువులపై జీవనం నిలిచియుంది.

వ్యాకరణాంశాలు

ప్రశ్న 1.
క్రింది కవితా భాగాల్లోని అలంకారాన్ని గుర్తించండి.

అ)నగారా మోగిందా
నయాగరా దుమికిందా
జవాబు:
ఇది అంత్యానుప్రాసాలంకారానికి చెందినది. ఇందులో ‘దా’ అనే హల్లు రెండు పదాల్లోను అంత్యంలో ప్రయోగించబడింది. అందువల్ల ఇది అంత్యానుప్రాసాలంకారం.

లక్షణం : ప్రాస పాదం చివర ఒక అక్షరంగాని, అక్షర సముదాయంగాని ఉండేటట్లు రచన చేయడాన్ని ‘అంత్యానుప్రాసం’ అని అంటారు.

ఆ)కొందరికి రెండు కాళ్ళు
రిక్షావాళ్ళకి మూడు కాళ్ళు
ఉన్నవాళ్ళకి నాలుక్కాళ్ళు
జవాబు:
ఇక్కడ అంత్యానుప్రాసాలంకారం ఉంది. ఈ ఉదాహరణలోని పాదాల్లో చివరగా ‘కాళ్ళు’ అనే హల్లుల జంట అంత్యప్రాసగా వాడబడింది. అందువల్ల ఇక్కడ అంత్యానుప్రాసాలంకారం ఉంది. లక్షణం : ప్రాస పాదం చివర ఒక అక్షరంగాని, అక్షర సముదాయంగాని ఉండేటట్లు రచన చేయడాన్ని ‘అంత్యానుప్రాసం’ అని అంటారు.

TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం

ప్రశ్న 2.
క్రింది పద్యాలలోని అలంకారాలను గుర్తించండి.

అ) అడిగెద నని కడువడిఁ జను
నడిగినఁదను మగుడ నుడుగఁడని నడ
యుడుగున్
వెడవెడ చిడిముడి తడఁబడ
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్
జవాబు:
ఇది వృత్త్యనుప్రాసాలంకారం.
లక్షణము : ఒకే హల్లు పలుమార్లు ఆవృత్తము చెందినది. కావున దీనిని వృత్త్యనుప్రాసాలంకారం అంటారు.

ఆ) రంగదరాతిభంగ; ఖగరాజతురంగ, విపత్పరంపరో
త్తుంగ తమఃపతంగ; పరితోషితరంగ, దయాంతరంగ; స
త్సంగ; ధరాత్మజా హృదయ సారస భృంగ; నిశాచరాబ్జ మా
తంగ; శుభాంగ ! భద్రగరి దాశరథీ! కరుణా పయోనిధీ !
జవాబు:
ఇందులో అంత్యానుప్రాసాలంకారం ఉంది. ఇక్కడ అంత్యప్రాసగా ‘గ’ అనే ఒకే హల్లు, రంగ అనే హల్లుల జంట వాడబడినాయి. అందువల్ల ఇక్కడ అంత్యాను ప్రాసాలంకారం ఉంది.

లక్షణం : ప్రాస పాదం చివర ఒక అక్షరంగాని, అక్షర సముదాయంగాని ఉండేటట్లు రచన చేయడాన్ని ‘అంత్యానుప్రాసం’ అని అంటారు.

రూపకాలంకారము

క్రింది వాక్యాలను పరిశీలించండి.

  1. ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేస్తాడు.
  2. బతుకాటలో గెలుపు ఓటములు సహజం.
  3. వానజాణ చినుకుపూలను చల్లింది.
  4. నవ్వులనావలో తుళ్ళుతూ పయనిస్తున్నాం..

పై వాక్యాలను గమనించారు కదా ! ఏం అర్థమయ్యింది. మొదటి వాక్యంలో జ్ఞానమే జ్యోతిగా చెప్పబడింది. ఇందులో జ్ఞానం ఉపమేయం.
జ్యోతి ఉపమానం. ఈ రెండింటికి భేదం లేనట్లు (అభేదం)గా చెప్పబడింది. ఇట్లా అభేదం చెప్పడాన్నే ‘రూపకాలంకారం’ అంటారు.
ఉదా :నగరారణ్య హోరు నరుడి జీవనఘోష.

సమన్వయం:ఇందులో నగరం ఉపమేయం. అరణ్యం ఉపమానం. ఇక్కడ ఉపమేయమైన నగరానికి, ఉపమానమైన అరణ్యానికి భేదం ఉన్నా, లేనట్లే చెప్పబడింది. కాబట్టి ఇది రూపకాలంకారం.
(ii) (iii) (iv) లలో ఒక వాక్యానికి సమన్వయం రాయండి.
జవాబు:
ii) బతుకాటలో గెలుపు ఓటములు సహజం.
సమన్వయం : ఈ వాక్యంలో బతుకు, ఆట వేరువేరు కాదు. బతుకు ఉపమేయం, ఆట ఉపమానం. ఈ రెండింటికి భేదం ఉన్నా లేనట్లు చెప్పబడింది. కాబట్టి ఇది రూపకాలంకారం.

iii) వానజాణ చినుకుపూలను చల్లింది.

సమన్వయం : వాన ఉపమేయం – జాణ ఉపమానం
చినుకు ఉపమేయం – పూలను
ఉపమానం.వాన, జాణ వేరైనప్పటికి అభేదం (భేదం లేనట్లు) చెపితే అది రూపకాలంకారం.

iv) ‘నవ్వులవానలో తుళ్ళుతూ పయనిస్తున్నాం’.

సమన్వయం : నవ్వులు అనేది ఉపమేయం వాన అనేది ఉపమానం భేదం లేనట్లు చెప్పటం.

పై ఉదాహరణలలో ఉపమేయమునకు, ఉపమాన మునకు భేదం ఉన్నా లేనట్లు చెప్పబడింది. కావున `ఇది రూపకాలంకారం.

ఇలాంటివి పాఠంలో వెతికి రాయండి. సమన్వయం చేయండి.
1. చదువుల పుప్పొడి
2. నగరం మహావృక్షం

1 వ వాక్యం : చదువుల పుప్పొడి
సమన్వయం : ఇందులో ‘చదువులు’ అనేది ఉపమేయం. ‘పుప్పొడి’ అనేది ఉపమానం. ఇక్కడ ఉపమేయమైన చదువులకు, ఉపమానమైన పుప్పొడికి, భేదం ఉన్నా, లేనట్లే చెప్పబడింది. కాబట్టి ఈ వాక్యంలో రూపకాలంకారం ఉంది.
2 వ వాక్యం : నగరం మహావృక్షం.
సమన్వయం: ఇందులో ‘నగరం’ అనేది ఉపమేయం. ‘మహావృక్షం’ అనేది ఉపమానం. ఇక్కడ ఉపమేయమైన నగరానికీ, ఉపమానమైన మహావృక్షానికీ భేదం ఉన్నా, లేనట్లే చెప్పబడింది. కాబట్టి ఈ వాక్యంలో రూపకాలంకారం ఉంది.

ప్రాజెక్టు పని

పల్లెలు / పట్నాలలోని జీవన విధానానికి గల తేడాలు పట్టికగా రాయండి. నివేదిక రాసి ప్రదర్శించండి.
జవాబు:
TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం 3

మీకు తెలుసా ?

పట్టణ వీధుల్లో విద్యుత్తు వాడకం తక్కువగా ఉండటానికి నియాన్ దీపాలను వాడుతారు. అయితే ఈ నియాన్ దీపాల వెలుగు ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నదని ‘ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సస్టైనబుల్’ అనే సంస్థ ప్రకటించింది. ముంబయి నగరంలో నియాన్ దీపాల వాడకాన్ని నిషేధించాలని ముంబయి నగరపాలక సంస్థ మీద కోర్టులో కేసు వేసింది. ముంబయి కోర్టు ఒక కమిటీని ఏర్పరచింది.

కమిటీ నివేదిక ప్రకారం నియాన్ దీపాల వెలుగు చాలా ఎక్కువగా ఉంటే మూర్ఛరోగం వచ్చే అవకాశం ఉంటుంది. కళ్ళు, మెదడుకు హాని కలిగిస్తుంది. అధికరక్తపీడనం, నరాలక్షీణత, అల్సరు వంటి రోగాలకు కారణమవుతుంది. అందువలన రాత్రి పదకొండు గంటలనుండి నియాన్ దీపాలను వాడరాదని హైకోర్టు తీర్పునిచ్చింది.

విశేషాంశాలు :

1.పద్మవ్యూహం : మహాభారతంలో ఈ మాట ఉంది. బయటకు వెళ్ళడానికి వీలు లేకుండా కట్టుదిట్టంగా శత్రువును బంధించే యుద్ధ వ్యూహం ఇది. భారతంలో అభిమన్యుడు ఈ పద్మవ్యూహంలో చిక్కుకొని వీర మరణాన్ని పొందాడు. ఎవరైనా తమ శత్రువులు పన్నిన, సంక్లిష్టమైన ఉచ్చులో పడినట్టయితే “అతడు పద్మ వ్యూహంలో చిక్కుకున్నాడు” అంటారు.

సూక్తి : సహజమైన పర్యావరణ పరిసరాలవల్ల జీవనానందం పునరుత్తేజం పొందుతుంది.
జీవించాలనే తపన నిరంతరం పునరావృత్తమవుతుంది.

TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం

అర్థ తాత్పర్యాలు

I

నగారా మోగిందా
నయాగరా దుమికిందా
నాలుగురోడ్ల కూడలిలో ఏమది ?
అదే, నగరారణ్యహోరు నరుడి జీవనఘోష

తల్లి ఒడివంటి
పల్లెసీమల్నొదిలి
తరలివచ్చిన పేదరైతులూ
ఇనప్పెట్టెల్లాంటి
ఈ పట్టణాల్లో
ఊపిరాడని మీ బతుకులూ

నగరంలో ప్రతిమనిషి
పఠనీయ గ్రంథమే
మరి నీ బతుకు
పేజీలు తిరగేసేదెవరో!

ఉదయమే
బస్సుల్లో రిక్షాల్లో
పేవ్మెంట్లపై విరబూసిన
కాన్వెంటు పువ్వుల సందడి
రాలే చదువుల పుప్పొడి!

అర్ధాలు

మినీ కవిత = గొప్ప ప్రాధాన్యం కల విషయాన్ని కొద్దిమాటలలో చెప్పడం (Mini Poetry)
నగారా, మోగిందా = పెద్ద ఢంకా, చేసిందా శబ్దం
నయాగరా దుమికిందా = ‘నయాగరా’ అనేది అమెరికాలోని పెద్ద జలపాతం. అది కిందికి దుమికిందా ? (దుమికినపుడు పెద్ద ధ్వని వస్తుంది.)
నాలుగురోడ్ల కూడలిలో = నాలుగు రోడ్లూ కలిసే చోటులో (Four Roads Junction)
ఏమది (ఏమి + అది) = ఏమిటి అది ?

అదే = ఆ ధ్వని
నగరారణ్యహోరు
(నగర +అరణ్య, హోరు) = పట్టణం అనే అరణ్యంలో వినిపించే ధ్వని, గాలి వీచేటప్పుడు వచ్చే ధ్వనిని “హోరు” అంటారు.
నరుడి, జీవనఘోష = మానవుడి బ్రతుకు పోరాటం లోంచి వచ్చిన ఉరుము వంటి శబ్దం.
తల్లి ఒడివంటి = అమ్మ ఒడిలాంటి
పల్లెసీమల్నొదిలి
(పల్లె సీమలన్+వొదిలి) = గ్రామ సీమలను వదలి (గ్రామసీమలను విడిచిపెట్టి)
తరలివచ్చిన పేదరైతులు = బయలుదేరి వచ్చిన బీద రైతులూ
ఇనప్పెట్టెల్లాంటి = ఇనుముతో చేసిన పెట్టెలవలె ఇరుకుగా ఉన్న

ఈ పట్టణాల్లో = ఈ నగరాలలోని ఇళ్ళలో
ఊపిరాడని
(ఊపిరి+అడని) = శ్వాస పీల్చుకోవడానికి కూడా గాలి దొరకని
మీ బతుకులూ = మీ జీవితాలు
నగరంలో ప్రతిమనిషి = పట్టణంలో నివసించే ప్రతి మనిషి కూడా
పఠనీయ గ్రంథమే = చదువదగిన పుస్తకం వంటి వాడే, (చదువదగిన పుస్తకం లాంటి వాడే పుస్తకం చదివితే, ఎన్నో విషయాలు తెలుస్తాయి. అలాగే నగరజీవి యొక్క చరిత్రను పరిశీలిస్తే, ఎన్నో జీవన సత్యాలు వెల్లడి అవుతాయని భావం. )

మరి నీ బతుకు = మరి నీ జీవితం అనే పుస్తకం యొక్క
పేజీలు తిరగేసేదెవరో = పుటలు ఎవరు తెరచి చదువుతారో ! (ఎవ్వరూ నగరజీవి చరిత్రను పట్టించుకోరని భావం. నగర జీవుల చరిత్రలలో ఆసక్తికరమైన, దుఃఖభరితమైన సంగతులు ఎన్నో ఉంటాయి. కాని ఎవ్వరూ అతడి వివరాలు జీవన విధానాలు పట్టించుకోరని కవి చెప్పారు)
ఉదయమే = ప్రొద్దున్నే
బస్సుల్లో, రిక్షాల్లో = స్కూలు వారు తీసుకెళ్ళే బస్సులలోనూ, సిటీబస్సుల్లోనూ, ఆటోరిక్షాల వారు తీసుకువెళ్ళే రిక్షాల్లోనూ.
పేవ్మెంట్లపై (Pavements) = రోడ్లు ప్రక్కన రాళ్ళు పరచి చదును చేసిన నడకదారుల పైన
విరబూసిన
(విరియబూసిన) = సమృద్ధిగా పూసిన
కాన్వెంటు పువ్వుల
సందడి = (convent) కాన్వెంటు బడులలో చదువుకొనే పువ్వుల వంటి పిల్లల గోల
రాలే చదువుల పుప్పొడి = ఆ పిల్లల మాటలు, ఆ పిల్లలనే పువ్వుల నుండి రాలిపడే పుప్పొడి లాంటివి.

తాత్పర్యము

అనేక వాహనాల శబ్దాలు, మనుషుల మాటలు, చిరు వ్యాపారుల అరుపులతో నగరంలోని నాలుగు రోడ్ల కూడలిలో వినిపించే రణగొణ ధ్వనులు గుండెలదిరిపోయేలా మోగిస్తున్న ఢంకానాదంలా, ఉధృతమైన వేగంతో దూకే నయాగరా జలపాతం హోరులా అనిపిస్తుంది. నిజానికది అరణ్యంలాంటి నగరం చేస్తున్న ధ్వనిలా, నగరజీవి బతుకు పోరాటంలోంచి వచ్చిన ఉఱుములాంటి శబ్దంలా ఉన్నాయని కవి వర్ణిస్తున్నాడు.

అమ్మఒడిలాంటి పుట్టిన ఊరిని వదిలి ఉపాధికోసం నగరం తరలివచ్చిన వారికి ఇంత పెద్ద పట్నంలో తలదాచు కోవడానికి కాసింత స్థలం కూడా దొరకదు. పేదరైతులు ఇనప్పెట్టెల్లాంటి ఇరుకిరుకు మురికి ప్రదేశంలో ఊపిరాడని స్థితిని అనుభవిస్తూ బతుకుతుంటారు.

నగరంలో ప్రతిమనిషీ చదువవలసిన ఒక పుస్తకం లాంటివాడు. అయితే ఎవరూ అతని బతుకు పుస్తకములోని పేజీలను చదివేవారు ఉండరు. నగరంలోని మనిషివెనక అనేక ఆసక్తికరమైన ఆనంద, విషాదగాథలుంటాయి. ఒక్క రైనా అతని బాగోగులు పట్టించుకునేవారే ఉండరనే చేదునిజాన్ని చెపుతున్నాడు కవి.

నగరంలో ఉదయాన్నే సిటీబస్సుల్లో, ఆటోల్లో, పేవ్మెంట్లపై విరబూసిన పువ్వుల్లాంటి స్కూల్పిల్లలు సందడి చేస్తుంటారు. వారి మాటల్లోంచి చదువుల పుప్పొడి రాలుతుంది.

TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం

II

సిటీ అంటే అన్నీ
బ్యూటీ బిల్డింగ్లు కావు
అటు భవంతులూ ఇటు పూరిళ్ళూ
దారిద్ర్యం, సౌభాగ్యం సమాంతర రేఖలు!

ఇది వెరైటీ సమస్యల మనుష్యుల
సమ్మేళన కోలాహలం!
ఎంతచేసినా ఎవరికీ
తీరిక దక్కదు కోరిక చిక్కదు

మెర్క్యూరీ నవ్వులు, పాదరసం నడకలు
కొందరికి రెండు కాళ్ళు
రిక్షావాళ్ళకి మూడుకాళ్ళు
ఉన్నవాళ్ళకి నాలుక్కాళ్ళు!

నగరంలో అన్నిపక్కలా
సారించాలి మన చూపులు
మహానగరాల రోడ్లకి
‘మరణం నాలుగువైపులు!

నగరం మహావృక్షంమీద
ఎవరికి వారే ఏకాకి!
నగరం అర్ధంకాని రసాయనశాల!
నగరం చిక్కు వీడని పద్మవ్యూహం!!

అర్ధాలు

సిటీ (City) = నగరం, పట్టణం
అంటే = అన్నట్లయితే
అన్నీ = అక్కడ ఉన్నవన్నీ
(Beauty Buildings) కావు = కావు
ఇటు పూరిళ్ళూ = మరింకోపక్క, గడ్డితో నేసిన ఇళ్ళు
దారిద్య్రం = బీదతనం
సౌభాగ్యం = ధనవైభవం (అదృష్టం)
సమాంతర రేఖలు = సమానమైన మధ్యదూరం గల రేఖలు (సమాంతర రేఖలు ఎంత దూరం పొడిగించినా కలిసికోవు)
ఇది = ఈ పట్టణం
వెరైటీ సమస్యలు
(Variety) = నానావిధాలయిన చిక్కులు గల
మనుష్యుల = మానవుల

సమ్మేళన కోలాహలం = కలయికల పెద్ద రొద (చప్పుడు)
ఎంతచేసినా = ఎంత కష్టపడి పనిచేసినా (ప్రొద్దుస్తమానం పనిచేసినా)
ఎవరికీ = నగరవాసులు ఎవరికీ
తీరిక = విశ్రాంతి
దక్కదు = లభించదు (అక్కడ మనిషికి విశ్రాంతి తీసుకోడానికి సమయం దొరకదు)
కోరిక = కోరిన కోరిక
చిక్కదు = దొరకదు (సంపాదించిన ధనం తో వారి కోరికలు తీరవు)

మెర్క్యురీ నవ్వులు (Mercury) = పాదరసం నవ్వులు (కృత్రిమపు నవ్వులు) (తెచ్చి పెట్టుకొన్న అసహజపు నవ్వులు)
పాదరసం నడకలు = పాదరసం దొర్లిపోయేలా, వేగంగా పరుగువంటి నడకలు
కొందరికి రెండు కాళ్ళు= నగరంలో ప్రయాణాలు చేసే వాళ్ళలో కొందరికి రెండు కాళ్ళు, అంటే వారు కాలి నడకన ప్రయాణాలు సాగిస్తారు. వారికి, వారి రెండు కాళ్ళే ప్రయాణ సాధనాలు

రిక్షావాళ్ళకి మూడుకాళ్ళు = రిక్షాల్లో తిరిగేవాళ్ళకు మూడు కాళ్ళు, అంటే మూడుచక్రాల రిక్షాలూ, ఆటో రిక్షాలూ వారి ప్రయాణ సాధనాలు.
ఉన్నవాళ్ళకి నాలుక్కాళ్ళు = డబ్బు ఉన్నవారికి నాల్గు కాళ్ళు అనగా నాల్గుచక్రాలు గల కార్లలో వారు తిరుగుతారు. అంటే వారి ప్రయాణసాధనాలు కార్లు.
నగరంలో = పట్టణంలో
అన్నిపక్కలా = అన్నివైపులకూ
సారించాలి = ప్రసరింపచేయాలి.(అన్నివైపులకూ చూస్తూ ప్రయాణం సాగించాలి)
మన చూపులు = మన చూపులను
మహానగరాల రోడ్లకి = పెద్ద పట్టణాలలోని రోడ్లకు

మరణం నాలుగువైపులు = నాలుగు వైపుల నుండి చావు రావడానికి సావకాశం ఉంటుంది. (ఏ వైపు నుండైనా, ఎవరైనా వచ్చి తమ వాహనంతో పొర పాటున గుద్దుతారు. అందువల్ల రోడ్డుపై నడిచేటప్పుడు నాలుగు వైపులకూ చూసుకుంటూ ఉండాలి. లేకపోతే ఏ వైపు నుంచైనా మరణం సంభవిస్తుంది,)

నగరం మహావృక్షంమీద = పట్టణం అనే ఒక పెద్ద చెట్టు మీద
ఎవరికి వారే ఏకాకి = ఎవరికి వారే ఒంటరిగా ఉంటారు.
నగరం = పట్టణం
అర్థంకాని = అది ఏమిటో తెలియని
రసాయనశాల = ప్రయోగశాల (Laboratory)
నగరం చిక్కువీడని
పద్మవ్యూహం = పట్టణం చిక్కులో తగిలిన నగరవాసులు, దాని నుండి తప్పించు కొని బయటకు రాలేని పద్మవ్యూహం వంటిది

తాత్పర్యము

నగరం నిండా అన్నివైపులా అందమైన ఎత్తైన భవనాలు ఉంటాయనుకోవద్దు. ఒకవైపు ఖరీదైన భవంతుల పక్కనే చిన్న చిన్న పూరిపాకలూ ఉంటాయి. ఇక్కడ ఐశ్వర్యం దారిద్ర్యం పక్కపక్కనే సమాంతర రేఖలుగా కనిపిస్తాయి. నగరం వైవిధ్యమైన సమస్యలతో, విభిన్న మనస్తత్వాలతో కలిసిపోయి కలకలంతో నిండి ఉంటుంది.

ఎంత నిరంత రాయంగా పనిచేసినా నగరంలోని మనిషికి విశ్రాంతి తీసుకోవడానికి అనువైన సమయం దొరకదు. సంపాదించిన ధనంతో కోరికను తీర్చుకునే తీరిక దొరకదు. కృత్రిమమైన వెలుగుల్లాంటి అసహజపు నవ్వులతో, స్థిరత్వంలేని హడావుడి నడకలతో వెళ్ళేవారు, ఆటోరిక్షాల్లో తిరిగేవాళ్ళు, కార్లలో ప్రయాణించే ధనవంతులూ ఉంటారు.

నగరంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. నగరంలో అన్నివైపులా ప్రమాదాలు పొంచి ఉంటాయి. నగరంలో నాలుగు దిక్కుల్లోని రోడ్లలో మృత్యువు పొంచి ఉంటుందని కవి హెచ్చరిస్తున్నాడు.

వృక్షాలమీద ఉండే పక్షులు పరస్పరం కలిసిపోయి కలివిడిగా ఉంటాయి. నగరమనే మహావృక్షంమీద నివసించే ఈ మనుషులు సాటిమనిషితో ఎటువంటి ఆత్మీయ పలకరింపులు లేకుండా ఇరుగూ పొరుగనే భావన లేకుండా ఎవరికి వారే ఏకాకిగా బతుకుతుంటారు. ఈ యాంత్రిక మానసిక స్థితిని నిరసిస్తున్నాడు కవి.

ప్రయోగశాలలో ఏవేవో రసాయన ద్రవాలు, ఆమ్లాలు ఉంటాయి. వాటి చర్యలు అందరికీ అర్థం కావు. నగరం అంతకంటే అర్థంకాని రసాయనశాలలా ఉంటుంది. నగరంలో బతుకుదామని వచ్చినవారు, ఉపాధి దొరకక పోయినా ఏదో ఒకరోజు దొరుకుతుందని ఆశగా వేచి చూస్తుంటారు. ఇక్కడి సౌకర్యాలు, విలాసాలు, వినోదాలు పైపై మెరుగులు బలంగా ఆకర్షిస్తాయి.

మరోవైపు నిరుద్యోగం, జీవనవ్యయం భయపెడుతున్నా నగరం విడిచి వెళ్ళబుద్ధికాదు. కాలుష్యం కలవరపెట్టినా, ట్రాఫిక్ జామ్ జీవితం ఇరుక్కు పోయినా నగరం విడిచి ప్రశాంతంగా మన పల్లెలకు వెళ్ళనివ్వని, చిక్కువిడదీయలేని పద్మవ్యూహం లాంటిది నగరం.

పాఠం నేపథ్యం / ఉద్దేశం

ఆధునిక కాలంలో మనుషులంతా నగరాల్లో జీవించాలని కోరుకుంటున్నారు. మరోవైపు పల్లెల్లో ఉపాధి అవకాశాలు తగ్గడంతో బతుకుతెరువుకోసం నగరాలకు వలసలు పెరిగాయి. నగరంలోని అనుకూలాంశాలన్నింటిని వినియోగించుకోవాలనే కోరికతో మనుషులు నగరంలో ఉండడానికి తాపత్రయపడుతున్నారు. దీనితో అనేక నగరాలు అత్యధిక జనాభాతో కిక్కిరిసిపోతున్నాయి. చాలా సమస్యలు పెరిగిపోయాయి.

ప్రపంచీకరణ ప్రభావంతో నగరం శర వేగంగా తన రూపం మార్చుకుంటున్నది. సామాన్యుడికి అంద నంత దూరంగా కదిలిపోతున్నది. మధ్యతరగతికి అంతుచిక్కని ప్రాంతంగా మారిపోయింది. మనిషి యాంత్రిక స్థితిలోకి మారిపోతున్నాడు. తనకుతానే పరాయీకరణకు గురవు తున్నాడు.

ఈ నేపథ్యంలో నగరజీవితంలోని యథార్థదృశ్యాల్ని మన కళ్ళముందు నిలుపుతూ, నగరపు మరో పార్శ్వాన్ని చూపుతూ, వాస్తవాల్ని కఠినంగా నిర్వచించిన తీరును తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం “మినీ కవిత” అనే ప్రక్రియకు చెందినది. ఏదైనా ఒక అంశాన్ని కొసమెరుపుతో, వ్యంగ్యంగా, చురకల తో తక్కువ పంక్తుల్లో చెప్పడమే మినీ కవిత.
‘అలిశెట్టి ప్రభాకర్ కవిత’ అనే గ్రంథంలోని ‘సిటీలైఫ్’ అనే మినీ కవితలలో కొన్నిటిని ‘నగరగీతం’ గా కూర్చడమైనది.

కవి పరిచయం

కవి పేరు : అలిశెట్టి ప్రభాకర్

జననం : 12-01-1954 వ సం॥

మరణం : 12-01-1993 వ సం॥

జన్మస్థలం : పూర్వపు కరీంనగర్ జిల్లా నేటి జగిత్యాల జిల్లా

తల్లిదండ్రులు : వీరి తండ్రి “అలిశెట్టి చినరాజం”, తల్లి “లక్ష్మి”.

వ్యాసంగం : మొదట ఆర్టిస్ట్గా ఎదిగాడు. ప్రారంభం లో పత్రికలకు పండగలు, ప్రకృతి, సినీనటుల బొమ్మలు వేసేవాడు. తరువాత జగిత్యాలలో ‘సాహితీ మిత్రదీప్తి’ సంస్థ పరిచయంతో కవిత్వ రంగంలోకి ప్రవేశించాడు. 1974లో ఆంధ్రసచిత్ర వారపత్రికలో వచ్చిన ‘పరిష్కారం’ అచ్చయిన మొదటి కవిత. జగిత్యాలలో ‘స్టూడియో పూర్ణిమ’ (1976), కరీంనగర్లో స్టూడియో శిల్పి’ (1979) హైదరాబాద్లో ‘స్టూడియో చిత్రలేఖ’ (1983) ఏర్పాటు చేసుకొని జీవిక కోసం ఫోటోగ్రాఫర్గా, జీవిత పోరాటంలో కవిగా ఎదిగాడు.

మొదటి కవిత : ‘పరిష్కారం’ అన్న వీరి కవిత, మొదటగా ఆంధ్రసచిత్ర వార్త పత్రిక లో అచ్చయ్యింది.

రచనలు :

  1. ఎర్ర పావురాలు (1978) మొదటి కవితా సంకలనం,
  2. మంటల జెండాలు, చురకలు (1979),
  3. రక్తరేఖ (1985),
  4. ఎన్నికల ఎండమావి (1989),
  5. సంక్షోభ గీతం (1990),
  6. సిటీలైఫ్ (1992)

అచ్చయిన కవిత్వ సంకలనాలు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్ళ పాటు సీరియల్గా ‘సిటీలైఫ్” పేరుతో హైదరాబాదు నగరంపై వ్రాసిన మినీ కవితలతో ప్రఖ్యాతి పొందాడు.

శైలి : కవిత్వాన్ని ఆయుధంగా మలచుకొని పాఠకుల్లో ప్రగతిని, ఆలోచనా దృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన కవి అలిశెట్టి ప్రభాకర్.

ప్రవేశిక

దృష్టిని బట్టి సృష్టి గోచరిస్తుంది.
కొందరిని కొన్ని సన్నివేశాలు విశేషంగా ఆకర్షిస్తాయి. సహృదయుడు ప్రతి కదలిక నుంచీ ప్రేరణ పొందుతాడు. అతనికి భాష ఆయుధమైతే, భావం కవితారూపం సంతరించుకుంటుంది.

నగరంలోని మూలలను, మూలాలనూ ఓ కవి హృదయం ఎట్లా దర్శించిందో- ‘అలిశెట్టి’ మినీ కవిత(లు) మన కళ్ళకు గడుతుంది. మనసు కిటికీ తెరిచి చూస్తే అక్షరాల వెనుక అనంత దృశ్యాలు కనిపిస్తాయి ……………

TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం

విద్యార్థులకు సూచనలు

  • పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠం లోని విషయాన్ని ఊహించండి.
  • పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత గీయండి..
  • వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పదవిజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకోండి

ప్రక్రియ -వచన కవిత

ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియలలో ‘వచన కవిత’ అనే ప్రక్రియ ముఖ్యమైనది. ఇది పద్య, గేయాల్లో ఉండే ఛందస్సు. మాత్రాగణాలతో సంబంధం లేకుండా, వ్యావహారిక భాషలో రాసే కవితను వచనకవితగా పేర్కొనవచ్చు. చిన్న చిన్న పద్యాలు, వాక్యాలతో ధ్వని గర్భితంగా ఉండే కవిత వచన కవిత.

పాఠ్యభాగ సారాంశము

అనేకరకాల వాహనాల శబ్దాలు, మనుషుల మాటలు, చిన్న వ్యాపారుల అరుపులతో నాలుగురోడ్ల కూడలి దద్దరిల్లిపోతుంది. నిజానికి ఆ శబ్దం నయాగరా జలపాతం హోరులా, నగరజీవి బతుకు పోరాటంలోంచి వచ్చిన ఉరుము లాంటి శబ్దంలా ఉంది. అమ్మఒడిలాంటి పుట్టిన ఊరును వదిలి ఉపాధికోసం కొందరు పట్టణాలకు వలసవెళ్తున్నారు. పేద రైతులు నగరంలో ఇనుప పెట్టెలవంటి ఇళ్ళల్లోను, మురికివాడల్లోను నివసిస్తుంటారు. నగరంలో ప్రతి మనిషి చదువవలసిన ఒక పుస్తకంలాంటివాడు. నగరంలోని మనిషి వెనుక ఆసక్తిదాయకమైన ఆనంద, విషాదగాథలు ఉంటాయి. పిల్లలు చదువులతో సందడిచేస్తుంటారు.

నగరంలో అందమైన ఎత్తైన భవనాలు ఒకపక్క ఉన్నా, మరొకపక్క మురికివాడలు కూడా ఉంటాయి. నగరంలోని మనిషికి విశ్రాంతి తీసుకోవడానికి అనువైన సమయం దొరకదు. కొందరు కాలినడకతో, మరికొందరు ఆటోరిక్షాల్లో, ధనవంతులు కార్లలో ప్రయాణంచేస్తూ ఉంటారు. నగరంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

నగరంలో ప్రమాదాలు అన్ని వైపులా పొంచిఉన్నాయి. నగర ప్రజలు పరస్పరం పలకరించుకోకుండా ఏకాకిగా బతుకు తారు. నగరం అర్థంకాని రసాయనశాలలా ఉంటుంది. ఇక్కడి సౌకర్యాలు, విలాసాలు, వినోదాలు, పైపై మెరుగులు బలంగా ఆకర్షిస్తాయి. మరోవైపు నిరుద్యోగం, జీవన వ్యయం భయపెడుతున్నా నగరం విడిచి వెళ్ళబుద్ధికాదు.

TS 10th Class Telugu Important Questions 1st Lesson దానశీలము

These TS 10th Class Telugu Important Questions 1st Lesson దానశీలము will help the students to improve their time and approach.

TS 10th Class Telugu 1st Lesson Important Questions దానశీలము

PAPER – 1 : PART- A

I. వ్యక్తీకరణ-సృజనాత్మకత (స్వీయరచన)

1. లఘు సమాధాన ప్రశ్నలు  (3 మార్కులు)

కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
‘దానశీలము’ పాఠ్యాంశ కవిని గూర్చి రాయండి. (Mar. ’17)
జవాబు:
‘దానశీలము’ అనే పాఠము పోతన రచించిన ఆంధ్రమహా భాగవతము అష్టమ స్కంధములోనిది. పోతన తల్లి లక్క మాంబ. తండ్రి కేసన. పోతన కాలము 15వ శతాబ్దం. పోతన భాగవతమునే కాక, వీరభద్ర విజయము, భోగినీ దండకము, నారాయణ శతకమును కూడా రచించాడు. పోతనకు ‘సహజ పండితుడు’ అనే బిరుదు ఉంది. పోతన భాగవతాన్ని శ్రీరామచంద్రునికి అంకితం చేశాడు. శబ్దాలంకారాల సొగసుతో, భక్తిరస ప్రధానంగా పోతన రచన సాగింది.

ప్రశ్న 2.
బలిచక్రవర్తి తన నిశ్చయాన్ని గురువుగార్కి ఎలా తెలిపాడు ?
జవాబు:
బలిచక్రవర్తి గురువుగారితో, తనకు నరకం దాపురించినా, బంధనం ప్రాప్తించినా, భూమండలం అదృశ్యం అయినా, తనకు దుర్మరణం వచ్చినా, తన వంశం అంతా నశించినా, ఏమైనా కానీ తాను ఆడినమాట తప్పననీ, వచ్చినవాడు శివుడు, బ్రహ్మ, విష్ణువు అనే వారిలో ఎవరైనా సరే, తన నాలుక వెనుదిరుగదనీ చెప్పి, తన దృఢమైన మనో
నిశ్చయాన్ని గురువుగార్కి వెల్లడించాడు.

TS 10th Class Telugu Important Questions 1st Lesson దానశీలము

ప్రశ్న 3.
పలికి బొంకకుండా, సత్యంతో బ్రతకాలని బలి చక్రవర్తి శుక్రునకు ఎలా నచ్చచెప్పాడు ?
జవాబు:
గురువర్యా ! “అర్థం, కామం, కీర్తి, జీవనాధారం అనే వాటిలో ఏది అడిగినా ఇస్తానని వామనుడికి మాట ఇచ్చాను. ఇప్పుడు ధనంపై దురాశతో లేదని చెప్పి అతడిని తిప్పి పంపించలేను. ఇచ్చిన మాట తప్పటం, మహాపాపం. అదీగాక భూదేవి ఎటువంటి చెడ్డపని చేసిన వాడినైనా భరిస్తాను కాని, ఆడినమాట తప్పినవాడిని మోయలేను అని చెప్పింది. యుద్ధంలో వెనుదిరుగకుండా వీరమరణం పొందడం, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడమూ అన్నవి, అభిమాన వంతులకు మేలైన మార్గాలు” అనిచెప్పి, తాను అన్నమాట ప్రకారం దానం ఇస్తానని బలి గురువుకు నచ్చచెప్పాడు.

ప్రశ్న 4.
‘బలిచక్రవర్తి ఆడినమాట తప్పనివాడు’, సమర్థిస్తూ వ్రాయండి. (June ’16)
జవాబు:
బలిచక్రవర్తి మహాదాత. అంతకు మించిన మానధనుడు. ఆడినమాట తప్పని సత్యసంధుడు. తన గురువైన శుక్రాచార్యుడు వామనునికి మూడు అడుగుల భూమిని దానం ఇవ్వవద్దని, వచ్చినవాడు సామాన్యుడు కాదు, సాక్షాత్తు శ్రీమహావిష్ణువని చెప్పాడు.

అయినా బలిచక్రవర్తి ఆడినమాటకు కట్టుబడి ఉన్నాడు. రాజ్యం పోయినా, సంపద పోయినా, చివరకు మరణించినా ఆడిన మాటను తప్పనని ప్రతిజ్ఞ చేశాడు. మూడు అడుగుల భూమిని దానం చేశాడు. పాతాళా నికి వెళ్ళాడు. బలిచక్రవర్తిలోని త్యాగగుణం జగతికి ఆదర్శంగా నిలుస్తుంది.

ప్రశ్న 5.
బలిచక్రవర్తి స్వభావం గూర్చి వ్రాయండి.
జవాబు:
విరోచనుని కుమారుడు ప్రహ్లాదుని మనుమడు బలి చక్రవర్తి. అసుర చక్రవర్తులలో గొప్ప చక్రవర్తి, పరా క్రమవంతుడు. గొప్పదాత, అడిగిన వారికి లేదు అన కుండా ఇచ్చే స్వభావం కలవాడు. ఇచ్చిన మాట కోసం తన ప్రాణాలను సైతం లెక్కపెట్టని వాడు. దేవతలను ఆపదల పాలు చేశాడు. అప్పుడు విష్ణుమూర్తి బలిచక్రవర్తిని శిక్షించడానికి వామనావతారంలో వచ్చి బలిని దానం అడిగినపుడు తన ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా దానం చేసిన వ్యక్తి. ఈ విధంగా బలిచక్రవర్తి గొప్పదాత అని తెలుస్తుంది.

ప్రశ్న 6.
విష్ణుమూర్తి దక్షిణ పాదం ఎలా ఉంది ?
జవాబు:
విష్ణుమూర్తి యొక్క దక్షిణపాదం దేవతలను కష్టాలనుండి కాపాడేది. కలకాలమూ మేలు కలిగించేది. అన్ని ఉపనిషత్తులకూ అలంకార ప్రాయమైనది. భవబంధాలను పోగొట్టి మోక్షాన్ని సమకూర్చేదిగా ఉంది.

TS 10th Class Telugu Important Questions 1st Lesson దానశీలము

ప్రశ్న 7.
పూర్వపు రాజుల గురించి బలి చక్రవర్తి అభిప్రాయం ఏమిటి
జవాబు:
పూర్వం ఎన్నో రాజ్యాలు, ఎంతో మంది రాజులు కలరు. వారు రాజరికంతో అహంకారంతో విర్రవీగారు. పెత్తనం చేశారు. వారు సంపాదించిన దానిలో కొంచెం కూడా తీసుకుపోలేదు. కావున దానధర్మాలు చేసిన శిబి ప్రముఖులు ఎంతో పేరుపొందారని బలిచక్రవర్తి అభిప్రాయం.

ప్రశ్న 8.
కీర్తి గొప్పదా ? ధనం గొప్పదా ? విశ్లేషించండి.
జవాబు:
మానవ జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోయేది కీర్తి మాత్రమే. ధనం సంపాదిస్తే అది ఎప్పటికైనా ఖర్చయి పోతుంది. తెలివితేటలు సంపాదిస్తే అవి ఆ వ్యక్తితోనే అంతమైపోతాయి. పదవి వస్తే అది కూడా కొంత కాలమే ఉంటుంది. కీర్తిని సంపాదిస్తే అది శాశ్వతంగా ఉంటుంది. సత్కీర్తి తరతరాలుగా నిలిచిపోతుంది.

అందువల్లనే ఎంతోమంది సంపదల కంటే కీర్తికే ప్రాధాన్యం ఇచ్చారు. సత్కీర్తిని పొందటానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. బలిచక్రవర్తి కూడా అంత ప్రాధాన్యం ఇచ్చాడు. బలిచక్రవర్తి ధనానికి, ఆస్తికి, చివరకు తన ప్రాణానికి కూడా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆడిన మాటకు కట్టుబడి వామనునికి దానం ఇచ్చాడు. శాశ్వతమైన కీర్తి పొందాడు.

ప్రశ్న 9.
‘దానశీలము’ అనే పాఠ్యభాగం ఆధారంగా పోతన కవిత్వం ఎట్లా ఉంటుందని అనుకుంటున్నారు ?
జవాబు:
తెలుగు సాహిత్యంలో పోతనకు సమున్నతమైన స్థానం ఉంది. అతని కవిత్వం ఆపాత మధురంగా ఉంటుంది. లలిత పదాలతోను, సరళమైన పదబంధనంతోను కూడియుంటుంది. పోతనకు శబ్దాలంకారాలంటే చాలా ఇష్టం. అతని పద్యాల్లో శబ్దాలంకారాల విన్యాసం అడుగడుగునా కనిపిస్తుంది. కఠినమైన సమాసాలు ఉండవు. భక్తిరసం పద్యాల్లో తొణికిసలాడుతుంది. ద్రాక్షారస శైలి పోతనగారికే చెల్లింది.

TS 10th Class Telugu Important Questions 1st Lesson దానశీలము

ప్రశ్న 10.
“ఎట్టి దుష్కర్ముని నే భరించెద గాని సత్యహీనుని మోవజాలను” అనే మాటలు ఎవరు ఎవరితో అన్నారు ? ఆ సందర్భాన్ని రాయండి. (June ’17)
జవాబు:
ఈ మాటలను బలిచక్రవర్తి తన గురువైన శుక్రాచార్యునితో పలికిన సందర్భంలోనిది.

శుక్రాచార్యుడు వామనునికి దానం చేయవద్దని, దానితో అనర్థం కలుగుతుందని, ఆపదల సమయంలో అసత్యం పలికినా తప్పుకాదని సూచించాడు. ఆ మాటలు విని బలిచక్రవర్తి పూర్వం భూదేవి చెప్పిన మాటలను కూడా బలి గుర్తుచేశాడు. బ్రహ్మాతో భూదేవి ఎలాంటి దుర్మార్గుడినైనా భరిస్తాను గాని, ఆడినమాట తప్పిన వానిని మాత్రం భరించనని చెప్పింది.

2. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
బలిచక్రవర్తి తప్పక వామనునకు దానం చేస్తానని, తన నాలుక అబద్ధం ఆడదని శుక్రాచార్యునకు ఎలా నచ్చచెప్పాడు ? (June ’15)
జవాబు:
బలిచక్రవర్తి శుక్రాచార్యునితో ఇలా చెప్పాడు.

“మహాత్మా ! మీరు నిజం చెప్పారు. ఇదే గృహస్థధర్మం. ఏదడిగినా ఇస్తానని చెప్పి, ఇప్పుడు ధనంపై ఆశతో వామనుని తిప్పి పంపలేను. ఇచ్చిన మాట తప్పడం కన్నా పాపం లేదు. ఆడినమాట తప్పినవాడిని భూదేవి మోయలేనని చెప్పింది. సత్యంతో బ్రతకడం, మానధనులకు మంచి మార్గం.

దాతకు మంచి ప్రతిగ్రహీత దొరకడం అదృష్టం. పూర్వం ఎందరో రాజులున్నారు. వారు ఎవ్వరూ సంపదలను మూటకట్టుకు పోలేదు. శిబి వంటి దాతలను లోకం నేటికీ మఱవలేదు. విష్ణువే స్వయంగా వచ్చి అడిగితే నా వంటివాడు తప్పక దానం ఇవ్వాలి.

కాబట్టి నాకు నరకం వచ్చినా, బంధనం కలిగినా, దుర్మరణం వచ్చినా, నా వంశం నశించినా, వచ్చినవాడు త్రిమూర్తులలో ఎవరైనా, నా నాలుక తిరుగదు. మానధనులు మాట తిరుగరు” అని బలి చక్రవర్తి తన గురువు శుక్రాచార్యుడికి నచ్చ చెప్పాడు.

TS 10th Class Telugu Important Questions 1st Lesson దానశీలము

ప్రశ్న 2.
‘తిరుగన్ నేరదు నాదు జిహ్వ’ అని బలిచక్రవర్తి శుక్రాచార్యునితో ఎందుకన్నాడు ? ఆ మాటల్లో గల సామంజస్య మెట్టిదో చర్చించండి.
జవాబు:
శుక్రాచార్యుడు, వామనుడు విష్ణుమూర్తి అని మూడు అడుగులతో మూడు లోకాలను కొలుస్తాడనీ, కాబట్టి దానం చెయ్యవద్దనీ బలిచక్రవర్తికి హితమును ఉపదేశించాడు.

ఇచ్చినమాట తప్పడం పాపమని, ఆడినమాట తప్పినవాడిని భూదేవి భరించలేనని చెప్పిందనీ, సత్యంతో బ్రతకడం మానధనులకు మంచిదనీ, బలిచక్రవర్తి శుక్రునకు నచ్చ జెప్పాడు. దాత అన్నవాడికి, మంచి ప్రతిగ్రహీత దొరకడం అదృష్టం అన్నాడు. పూర్వము రాజ్యాలు పాలించిన రాజులు ఎవ్వరూ సంపదలను మూటకట్టుకు వెళ్ళలేదు. శిబిచక్రవర్తి వంటి దాతలను లోకం నేటికీ మరువలేదు అని చెప్పాడు.

కాబట్టి నరకం వచ్చినా, దుర్మరణం వచ్చినా, నా వంశం నశించినా, వచ్చిన వామనుడు త్రిమూర్తులలో ఎవరైనా, నా నాలుక వెనుదిరగదు అని బలి నొక్కి చెప్పాడు.

బలి మానధనుడు. సత్యమే మాట్లాడే రాక్షస రాజు. కాబట్టి వామనుడికి ఇచ్చిన మాటను నిలబెట్టు కున్నాడు. బలి మాటల్లో న్యాయము ఉంది.

ప్రశ్న 3.
బలిచక్రవర్తి గురువు చెప్పిన మాట వినకుండా, దానం చేయడం సమంజసమా ? చర్చించండి.
జవాబు:
శుక్రుడు రాక్షసులకు గురువు. శుక్రుడు రాక్షసులకు హితాన్ని కోరి, రాక్షసులకు మంచిని బోధించేవాడు. కాని బలిచక్రవర్తి, శుక్రుని హితోపదేశాన్ని కాదని, వామనుడికి దానం చేశాడు.

బలిచక్రవర్తి చేసిన పని సమంజసంగానే ఉంది. ఎందుకంటే, అబద్ధాలాడడం మహాపాపం. మరణం ఎప్పటికైనా జీవికి తప్పదు. వామనుడికి దానంచేయడం వల్లనే, బలిచక్రవర్తి కీర్తి లోకంలో శాశ్వతంగా నిలిచింది. గురువుగారి మాటలో సత్యము ఉంది. కాని గురువు అబద్ధం ఆడమన్నాడు. దానం చేయవద్దన్నాడు. పలికి బొంకడం ధర్మం కాదు. అదీగాక, సాక్షాత్తు విష్ణుమూర్తి చేయి క్రిందు అవడం, బలి చక్రవర్తి చేయి పైన ఉండడం జరిగింది. విష్ణుమూర్తి చేయి లక్ష్మీదేవి శరీరంపై ఉండి, గొప్ప గౌరవం పొందింది. అటువంటి చేయి దానం తీసికొనేటప్పుడు, క్రిందు అయ్యింది. బలి చేయి పైన ఉంది.

శుక్రుడు చెప్పినది రాక్షస నీతి. దాన్ని పాటించక పోడంలో తప్పులేదు. శుక్రుని మాటలు కాదని, దానం చేయడం వల్లనే బలికి సుతలలోక నివాసమూ, సావర్ణి మనువు కాలంలో దేవేంద్ర పదవి లభించాయి.

TS 10th Class Telugu Important Questions 1st Lesson దానశీలము

ప్రశ్న 4.
బలిచక్రవర్తి వామనునికి దానం చేసిన వివరాలను తెలపండి.
జవాబు:
బలిచక్రవర్తి తన గురువుగారికి తన మనోనిశ్చయాన్ని తెలిపి, భార్యకు సైగ చేశాడు. బలి భార్య వింధ్యావళి భర్త సైగను గమనించి, బంగారు కలశంతో బ్రహ్మ చారియైన వామనుని కాళ్ళు కడుగడానికి నీరు తెచ్చింది.

బలిచక్రవర్తి, కాళ్ళు కడుగుతానని వామనుని రమ్మని పిలిచాడు. ముందుగా బలిచక్రవర్తి వామనుడి కుడిపాదాన్ని కడిగాడు. తరువాత వామనుడి ఎడమపాదాన్ని కడిగాడు. పవిత్రమైన వామనుడి పాదజలాన్ని, బలి తన నెత్తిపై చల్లుకున్నాడు. ఆచమనం చేశాడు. దేశ, కాల పూర్వకమైన సంకల్పాన్ని చెప్పాడు.

బలిచక్రవర్తి వామనుడిని పూజించి, “పరమాత్మునకు ప్రీతి కలుగుగాక” అంటూ మూడు అడుగుల నేలను దానం చేస్తూ, వామనుని చేతిలో దానధార పోశాడు. అప్పుడు దిక్కులూ, పంచభూతాలూ బళి బళి అంటూ బలిచక్రవర్తిని పొగిడాయి.

ప్రశ్న 5.
దాతృత్వగుణం గొప్పతనం గురించి బలిచక్రవర్తి ఆధారం గా వ్రాయండి.
జవాబు:
దానం చేసే గుణాన్ని దాతృత్వం అంటారు. దాతృత్వం కలవారు, అడిగినవారికి లేదనకుండా దానం చేస్తారు. దానం వలన తమకు నష్టం కలిగినా లెక్క చేయరు. తమ ప్రాణాలకే ప్రమాదం కలిగినా బాధపడరు. తమ సర్వస్వం పోయినా చింతించరు.

బలి చక్రవర్తి వామనునకు మూడు అడుగుల నేల దానంగా ఇస్తానన్నాడు. ఆయన గురువైన శుక్రాచార్యుడు దానం ఇవ్వవద్దు అన్నాడు. ఆ వామనుడు శ్రీమహావిష్ణువన్నాడు. దానం చేస్తే ప్రాణానికే ప్రమాద మని హెచ్చరించాడు.

అయినా బలి చక్రవర్తి భయపడలేదు. సంకోచించలేదు. మాట తప్పలేదు. మూడు అడుగులు దానం చేసేశాడు. ఆ దాన గుణానికి దిక్కులు కూడా ఆనందించాయి. అభినందించాయి. బలి చక్రవర్తి వంటి దాతను దిక్కులు ఎప్పుడూ చూడలేదు. అటువంటి సత్యవాక్పరిపాలకుని దిక్కులు గమనించలేదు. అందుకే బలి చక్రవర్తిని భళి భళి అని అభినందించాయి.

TS 10th Class Telugu Important Questions 1st Lesson దానశీలము

ప్రశ్న 6.
‘దానగుణం గల వ్యక్తుల వల్ల ఈ సమాజం మెరుగైన స్థితికి చేరుకుంటుంది.” – సమర్థించండి. (Mar. ’17)
జవాబు:
సమాజానికి నేడు విశిష్ట వ్యక్తుల సేవల అవసరం చాలా ఉంది. అన్ని రంగాలలో అవినీతి పేరుకుపోయింది. స్వార్థం పెచ్చుమీరిపోయింది. స్వార్థంతో ప్రగతి శూన్య మయింది. భేదభావాలు రాజ్యమేలుతున్నాయి. అన్యాయాలు, అక్రమాలు పెచ్చుమీరిపోయాయి.

దేశభక్తి, అనన్యమైన మాతృభూమి సేవచేయగల యువత అవసరం ఉన్నది. నీతి, అవినీతి మధ్య సంఘర్షణ పెరిగిపోయింది. స్వామి వివేకానంద విశాల భారతదేశం కావాలంటే “ఇనుపకండలు, ఉక్కునరాలు కలిగిన యువత కావాలి,” అని ప్రబోధించారు. కార్మికులు, కర్షకులు, దేశభక్తి కలిగిన ప్రజలు నిర్మాణం కావాలి. త్యాగం, దానం మొదలైన లక్షణాలు గల మనుషులు కావాలి. సమాజానికి అర్పణ చేసే మంచి మనుషులు కావాలి. జాతీయాదర్శాలుగా దానం శోభిల్లాలి. రామరాజ్యం నిర్మాణం కావాలంటే దాన గుణం గల (మనుషుల) వ్యక్తుల అవసరం ఎంతో ఉన్నది.

TS 10th Class Telugu Important Questions 1st Lesson దానశీలము

ప్రశ్న 7.
ఈ పాఠాన్నిబట్టి పోతన కవిత్వం ఎట్లా ఉందని భావిస్తు న్నారు?
జవాబు:
ఈ పాఠాన్ని బట్టి పోతన కవిత్వాన్ని చక్కగా విశ్లేషించ వచ్చు.
విశ్లేషణ

  1. పోతన ప్రతి పద్యంలోనూ నాటకీయతను ప్రదర్శించారు. శుక్రాచార్యుడు, బలిచక్రవర్తి, వామనుడు మాట్లాడు కుంటున్నట్లు పద్యాలు ఉన్నాయి. అవి కూడా ఎవరి స్వభావానికి తగినట్లు వారు మాట్లాడారు.
  2. లోకజ్ఞానం కనిపిస్తుంది. మొదటి పద్యంలో ‘ఈ కుబ్జుండు విశ్వంభరుండలఁతింబోడు’ అన్నాడు. సాధారణంగా ‘పొట్టివాళ్ళు చాలా గట్టివాళ్ళు’ అనే లోక సహజమైన భావం కనిపిస్తుంది.
  3. అదే పద్యంలో ‘దానము గీనము’ అనే దాంట్లో నిందార్థంలో ‘గి, గీ’ లు వాడేవాడు భాషా సంప్రదాయం ప్రయోగించాడు. ఇది వ్యాకరణానికి కూడా ఆమోదమే.
  4. ‘నిజమానతిచ్చితి …’ అనే సీస పద్యంలో ‘సత్య హీనుని మోయలేను’ అని భూమాత చెప్పిన మాటల ను బట్టి పోతన పాండిత్యం తెలుస్తుంది.
  5. ‘పలికి బొంకరాదు’ వంటి నీతులు కూడా ఈ పాఠంలో ఉన్నాయి.
  6. ధనానికి దానం చేయడమే మంచికీర్తిని తెస్తుందని చెప్పాడు. దానివలన దానగుణం పెంపొందింపచేశాడు.
  7. ‘నిరయంబైన … ’అనే పద్యంలో ఏది ఏమైనా మాట తప్పకూడదని బోధించాడు.
  8. ‘విప్రాయ…’ అనే పద్యంలో పోతనకున్న వేద వేదాంత పరిజ్ఞానం బయటపడింది.
  9. ‘కలకల, భళిభళి వంటి పదాలు ప్రయోగించి పద్యాల ను ఆకర్షణీయంగా రచించాడు.
  10. పై వాటినన్నిటినీ పరిశీలిస్తే పోతన కవిత్వం యొక్క చక్కదనం తెలుస్తుంది. గొప్పదనం తెలుస్తుంది.

PAPER – II : PART – A

1. అపరిచిత పద్యాలు (5 మార్పులు)

ప్రశ్న 1.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

కం॥ “ఇందుగలడందులేడని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూచిన
నందందే కలడు దానవాగ్రణి వింటే

TS 10th Class Telugu Important Questions 1st Lesson దానశీలము

ప్రశ్నలు – సమాధానములు
1. సర్వోపగతుండెవరు ?
జవాబు:
సర్వోపగతుండు ‘చక్రి’. చక్రి అనగా చక్రమును ధరించే శ్రీమహావిష్ణువు.

2. చక్రి ఎక్కడున్నాడు ?
జవాబు:
చక్రి అన్ని చోట్లా ఉంటాడు.

3. ఈ పద్యం ఎవరిని సంబోధిస్తుంది ?
జవాబు:
ఈ పద్యం, దానవాగ్రణిని అంటే రాక్షసరాజు హిరణ్యక శిపుని సంబోధిస్తుంది.

4. ఈ పద్యం ఏ గ్రంథంలోనిది ? (రామాయణం, భారతం, భాగవతం)
జవాబు:
ఈ పద్యం భాగవతం లోనిది.

5. ఎందెందు వెదకి చూచిన అందందే గలవాడు ఎవరు ?
జవాబు:
ఎందెందు వెదకి చూచిన అందందే గలవాడు, “శ్రీమహా విష్ణువు”.

TS 10th Class Telugu Important Questions 1st Lesson దానశీలము

ప్రశ్న 2.
కింది పద్యాన్ని చదివి, అర్థం చేసుకుని సరియైన సమాధానాలు రాయండి. (June ’16)

ఆకొన్న కూడె యమృతము
తాకొంచక నిచ్చువాడె దాత ధరిత్రిన్
సోఁకోర్చువాఁడె మనుజుడు
తేఁకువ గలవాడె వంశతిలకుడు సుమతీ !

ప్రశ్నలు – సమాధానములు
1. నిజమైన దానశీలి ఎవరు ?
జవాబు:
తాకొంచక ఇచ్చువాడే దాత.

2. అన్నము ఎప్పుడు రుచిగా ఉంటుంది ?
జవాబు:
ఆకలి కలిగి ఉన్నప్పుడే అన్నం రుచిగా ఉంటుంది.

3. నిజమైన మనిషి అని ఎప్పుడు అంటారు ?
జవాబు:
సోకోర్చువాడే నిజమైన మనిషి అని అంటారు.

4. ఎవరు వంశానికి వన్నె తెస్తారు ?
జవాబు:
తేకువ గలవాడే వంశానికి వన్నె తెస్తాడు.

5. ఈ పద్యానికి మకుటము ఏది ?
జవాబు:
ఈ పద్యానికి మకుటము సుమతీ !

TS 10th Class Telugu Important Questions 1st Lesson దానశీలము

ప్రశ్న 3.
క్రింది పద్యాన్ని చదివి అర్థం చేసుకోండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (Mar. ’16)

భూమి నాదియన్న భూమి ఫక్కున నవ్వు
ధనము నాదియన్న ధనము నవ్వు
కదన భీతుఁజూచి కాలుండు నవ్వును
విశ్వదాభిరామ వినురవేమ.

ప్రశ్నలు – సమాధానములు
1. భూమి ఫక్కున ఎందుకు నవ్వుతుంది ?
జవాబు:
భూమి నాది అని అన్నందుకు.

2. ధనము నాది అంటే ధనము ఏం చేస్తుంది ?
జవాబు:
ధనము నవ్వుతుంది.

3. కదన భీతుడంటే మీకేమర్థమైంది ?
జవాబు:
యుద్ధమంటే భయపడువాడు.

4. పై పద్యంలోని మకుటం ఏది ?
జవాబు:
విశ్వదాభిరామ వినురవేమ.

5. పై పద్యాన్ని రాసిన కవి ఎవరు ?
జవాబు:
వేమన.

TS 10th Class Telugu Important Questions 1st Lesson దానశీలము

ప్రశ్న 4.
క్రింది పద్యం చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

“చదువది ఎంత గల్గిన, రసజ్ఞత ఇంచుక చాలకున్న, నా
చదువు నిరర్థకంబు, గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం,
బదనుగ మంచికూర నలపాకము చేసిననైన, నందు ఇం
పొదవెడు నుప్పు లేక రుచిపుట్టగనేర్చు నటయ్య భాస్కరా!”

ప్రశ్నలు – సమాధానములు
1. ఈ పద్యంలో మకుటం ఏది ?
జవాబు:
ఈ పద్యంలో “భాస్కరా” అనేది మకుటము.

2. ‘రసజ్ఞత’ అంటే ఏమిటి ?
జవాబు:
రసమును గుర్తించే శక్తి అనగా రసమును తెలియుట.

3. చదువును దేనితో సమన్వయించారు ?
జవాబు:
చదువును నలపాకము చేసిన మంచి కూరతో సమన్వయించారు.

4. భాస్కరుని పర్యాయపదాలేవి ?
జవాబు:
భాస్కరుని పర్యాయపదాలు

5. ‘చదువది’ పదాన్ని విడదీసి సంధి గుర్తించండి.
జవాబు:
చదువది = చదువు + అది = ఉత్వసంధి లేక ఉకారసంధి

TS 10th Class Telugu Important Questions 1st Lesson దానశీలము

2. వ్యక్తీకరణ – సృజనాత్మకత (5 మార్కులు)

ప్రశ్న 1.
సత్యవాక్యాన్ని పలకడంలోనూ, దానశీలం కలిగి యుండడం లోనూ గల విశిష్టతను తెలుపుతూ (వ్యాసం) రాయండి.
జవాబు:
సత్యదాన విశిష్టత :
సత్యాన్ని మించిన దైవము లేదు. సత్యవాక్యాన్ని మించిన ధర్మం లేదు. ఆడి తప్పరాదు. తనకున్న దానిలో పరులకు కొంతదానం చేయాలి. ఈ జన్మలో పెట్టుకుంటే, మరుసటి జన్మలో మరింతగా సంపన్నుడిగా జన్మిస్తాడు.

మనం పుట్టినపుడు మన వెంట ఏ ధనాన్నీ తేలేదు. తిరిగి చనిపోయినప్పుడు మన వెంట ఏమీ తీసుకుపోము. బలిచక్రవర్తి గురువుగారికి చెప్పినట్లు, ఎందరో రాజులు తాము చక్రవర్తులమని గర్వించారు. వారు చనిపోయినప్పుడు, వారు సంపాదించిన ధనాన్ని వెంట తీసుకుపోలేదు. నేడు లోకంలో వారి పేరు కూడా లేదు.

శిబిచక్రవర్తి, కర్ణుడు వంటి గొప్పదాతలు చేసిన దానాలను గూర్చి, వారి త్యాగాలను గూర్చి, నేటికీ లోకంలో చెప్పుకుంటున్నారు. వారి కీర్తి చిరస్థాయిగా నిలిచింది. హరిశ్చంద్రుడు ఎన్ని కష్టాలు వచ్చినా సత్యాన్నే మాట్లాడాడు. చివరకు కష్టాలను అధిగమించాడు.

రంతిదేవుడు, సక్తుప్రస్థుడు వంటి దాతలు, తమ సర్వస్వాన్నీ దానం చేసి పేరు పొందారు. ప్రాణాలు పోతాయని తండ్రి దేవేంద్రుడు హెచ్చరించినా, కర్ణుడు కవచకుండలాలు బ్రాహ్మణుడికి దానం చేశాడు. బలిచక్రవర్తి గురువు కాదన్నా, మూడు అడుగుల భూమిని వామనునికి ధారపోశాడు.

సత్యం, దానం విశిష్టగుణాలు, మనం సత్యమే పలుకుదాం. మనకు ఉన్నంతలో పరులకు దానం చేద్దాం.

TS 10th Class Telugu Important Questions 1st Lesson దానశీలము

ప్రశ్న 2.
రక్తదానం, నేత్రదానం, అవయవదానం చేయడం పట్ల ప్రజలలో చైత్యం కలిగించేలా ‘కరపత్రం తయారు చేయండి.
(లేదా)
దానం చేయమని, దానగుణం పెంచుకోమని కోరుతూ కరపత్రం తయారు చేయండి.
జవాబు:
దానగుణం

వదాన్యులారా ! మానవత్వం మూర్తీభవించిన కరుణామూర్తులారా ! సోదర సోదరీమణులారా !

దానగుణం పెంపొందించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. మన పూర్వులు మహాదాతలు. మనమూ ఆ బాటలో నడుద్దాం.

అన్నదానం చేస్తే ఒక్కపూట ఆకలి తీర్చిన పుణ్యం వస్తుంది. ధనదానం చేస్తే కొన్ని అవసరాలను తీర్చినవారం అవుతాం. వస్త్రదానం చేస్తే కొద్దికాలమే ఆ వస్త్రాలు ఉపయోగిస్తాయి.
రక్తదానం చేస్తే ప్రాణాలు కాపాడవచ్చు. ప్రాణ దానం చేసిన పుణ్యం వస్తుంది. నేత్రదానం చేస్తే మరణించిన తర్వాత కూడా గ్రహీత ద్వారా లోకాన్ని చూడవచ్చు. అవయవదానం చేసినా శాశ్వతంగా జీవించవచ్చు.

దానం చేద్దాం. తోటి వారికి సాయపడదాం.

ఇట్లు
అవయవదాన కమిటీ,
ఖమ్మం.

TS 10th Class Telugu Important Questions 1st Lesson దానశీలము

ప్రశ్న 3.
దానం చేయడం వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తూ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

హైదరాబాద్,
XXXXX.

ప్రియమైన శరత్కు,

నీ స్నేహితుడు రాజా రాస్తున్న లేఖ.

మా తరగతిలో మొన్ననే ‘దానశీలము’ పాఠం చెప్పుకొన్నాం. మా గురువుగారు బలిచక్రవర్తి యొక్క దాన గుణాన్ని చాలా చక్కగా వివరించారు. దానం చేయాలని చెప్పారు. శిబి, బలి, కర్ణుడు, రంతిదేవుడు మొదలైన మహాదాతల గురించి వివరించారు.

వారి గురించి తెలుసుకొన్నాక నాకొకటి అనిపించింది. దానం చేయడంలోనే నిజమైన ఆనందం ఉందని, అన్నదానం, విద్యాదానం, రక్తదానం, అవయవ దానం మొదలైన దానాల వలన ఎంతో ప్రయోజనం ఉందని కూడా తెలుసుకొన్నాం.

అందుచేత మనం కూడా ఏదో ఒకదానం చేయాలి. దానం చేయడం వలన చాలా ఆనందం కలుగుతుంది. తృప్తిగా ఉంటుంది.

ఇట్లు,
రాజా.

చిరునామా :
సి. శరత్,
నెం. 3, 10వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
కరీంనగర్ జిల్లా.

TS 10th Class Telugu Important Questions 1st Lesson దానశీలము

ప్రశ్న 4.
ఒక దాతకు, గ్రహీతకు జరిగిన సంభాషణ ఊహించి వ్రాయండి.
జవాబు:
దాత  :  ఏం కావాలి ?
గ్రహీత  :  నేను ఎనీమిక్ పేషెంటును.
దాత  :  అంటే ?
గ్రహీత  :  నేను రక్తహీనతతో బాధపడుతున్నాను. నాకు రక్తం కావాలి.
దాత  :  అయినా, నా రక్తం గ్రూపు సరిపోవాలి కదా !
గ్రహీత  :  ఏ గ్రూపయినా ఫరవాలేదన్నారు. మీరు రక్తం ఇస్తే నా గ్రూపు రక్తం నాకెక్కిస్తారు.
దాత  :  తప్పకుండా ఇస్తాను. ఆసుపత్రికి పదండి.
గ్రహీత  :  మీరు నా ప్రాణాలు కాపాడుతున్న దైవం.
దాత  :  అదేం కాదు. మానవులుగా ఒకరినొకరు కాపాడుకోవడం మన ధర్మం. అదే మానవత్వం. అందులోనే తృప్తి ఉంది.

ప్రశ్న 5.
దానం యొక్క గొప్పతనాన్ని వివరించే నినాదాలు వ్రాయండి.
జవాబు:

  1. దానం చేయండి – ధన్యత పొందండి
  2. అవయవ దానాన్ని మించిన దానం లేదు – ఆదుకోవడాన్ని పోయే ప్రాణాలు నిలబెట్టండి
  3. వట్టిమాటలు కట్టిపెట్టు – గట్టిదానం చేసి చూపెట్టు
  4. అనుభవించడం స్వార్థం – దానం చేయడం త్యాగం
  5. నేత్రాలను దానం చేయండి నలుగురికి చూపు ప్రసాదించండి.

ప్రశ్న 6.
దాతృత్వాన్ని ప్రోత్సహించే కవిత వ్రాయండి.
జవాబు:
బలి చేశాడు భూదానం
శిబి చేశాడు ప్రాణదానం
కర్ణుడు చేశాడు కవచదానం
రంతిదేవుడు చేశాడు అన్నదానం
ఎందరో చేశారు రక్తదానం
ఇంకెందరో చేస్తున్నారు నేడు అవయవ దానం.

TS 10th Class Telugu Important Questions 1st Lesson దానశీలము

ప్రశ్న 7.
ఒక దాతను అభినందిస్తూ అభినందన పత్రం వ్రాయండి.
జవాబు:
వేంకటేశ్వరుని దయాగుణం ఉన్న వేంకటాచలం సరస్వతీ నిలయమైన బడికి ఇచ్చారు మీ స్థలం. ఎందరో విద్యార్ధులకిది అవుతోంది నిలయం మీ దానగుణాన్ని అభినందిస్తున్నాం అందరం అందుకోండి మా అభినందన మందారాలు.

అదనపు వ్యాకరణాంశాలు

PAPER – I : PART – B

1. సొంతవాక్యాలు

1. దశదిశలు : మన జాతిపిత మహాత్మాగాంధీ కీర్తి, ప్రపంచంలో దశదిశలా వ్యాపించింది.

2. కాళ్ళు కడుగు : అత్తమామలు అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు.

3. అభ్యాగతుడు : అభ్యాగతుడు స్వయంగా విష్ణుమూర్తి వంటివాడని పెద్దలంటారు.

4. మానధనులు : మానధనులే నిజమైన కోటీశ్వరులు.

5. సత్యహీనుడు : సత్యహీనునిగా బ్రతకడం కంటే మరణము మేలు.

6. సిరి మూట కట్టుకొని పోవడం : ఏ వ్యక్తికీ సిరి మూట కట్టుకొని పోవడం శక్యం కాదు. బ్రతికుండగానే దానధర్మాలు చేసుకోవాలి.

7. ఆకర్ణించు : గురువులు చెప్పే పాఠమును శ్రద్ధగా ఆకర్ణించాలి.

8. వృత్తి : ఏ వృత్తిని చేపట్టినా గౌరవంగా బ్రతకాలి.

9. గర్వోన్నతి : ఎంత గొప్ప పదవినలంకరించినా గర్వోన్నతి పనికిరాదు.

10. యశఃకాములు : యశఃకాములు అందరి గౌరవాన్ని పొందుతారు.

TS 10th Class Telugu Important Questions 1st Lesson దానశీలము

11. ననుబోటి : ననుబోటివాడు ఇది చేయగలడా అని ఆలోచించకూడదు.

12. సముద్ధరణము : మన ముఖ్యమంత్రిగారు తెలంగాణ సముద్ధరణకు కంకణం కట్టుకున్నారు.

13. ప్రక్షాళనము : తెలంగాణలో అవినీతిని ప్రక్షాళన చేయడం మన అందరి లక్ష్యం.

2. పర్యాయపదాలు

కులము = వంశము, కొలము, వంగడం, అభిజనము
విశ్వంభరుడు = విష్ణువు, నారాయణుడు, కృష్ణుడు, వైకుంఠుడు
దానము = త్యాగము, విహాపితము, ఉత్సర్జనము, వితరణము
అర్ధము  = సంపద, ధనం
సత్యము = నిజము, నిక్కము, తథ్యము, యధార్థము
భూస్వామి = అచల, అనన్త, విశ్వంభర, ఊర్వి, ధాత్రి
క్షేత్రము = స్థలము, పొలము
ప్రీతి = ముదము, సంతోషం, హర్షము
హరుడు = శివుడు, శంభుడు, శంకరుడు, సర్వజ్ఞుడు
విష్ణువు = నారాయణుడు, కేశవుడు, దామోదరుడు
వటువు = బ్రహ్మచారి, వడుగు, వర్ణి, ఉపవీతుడు
చరణము = అడుగు, అంఘి, పదము, పాదము
దిశ = దిక్కు ఆశ, దెస, కడ
రాజ్యము = దేశము, ప్రదేశము, రాష్ట్రము, నేల, విలాయతి
కర్ణము = చెవి, జానుగు, శ్రుతి, శ్రోతము, శ్రవణము
వర్ణి = బ్రహ్మచారి, వటువు, వటుడు, దండ హస్తుడు, వడుగు
ఆచార్యుడు = గురువు, ఉపదేశికుడు, దేశికుడు, విద్యాదాత
లోచనము = కన్ను, నేత్రము, నయనము
యశము = కీర్తి, ప్రఖ్యాతి, విఖ్యాతి, ఖ్యాతి, సుప్రతిష్ట
వృత్తి = ఉపజీవిక, జీవనోనాయము, జీవనా ధారము, కాయకము, జీవిక
భూమి = పుడమి, ధాత్రి, ధరణి, ఇల, నేల
బ్రహ్మ = అంబుజగర్భుడు, కమలజుడు, చతుర్ముఖుడు, దాత, నీరజభవుడు
భార్గవుడు = శుక్రాచార్యుడు, కావ్యుడు, భృగువు, శ్వేతుడు
రాజు = అధిపతి, ఏలిక, చక్రవర్తి, ధరణీపతి, నరేంద్రుడు, నృపతి
జిహ్వ = నాలుక, రసజ్ఞ, రసన
క్రతువు = యాగము, ఇష్టి, మేధము, యజ్ఞము,
దనుజులు = రాక్షసులు, దానవులు, దైత్యులు, రాత్రించరులు, అసురులు
మరాళము = హంస, అంచ, కలకంఠము, రాజహంస, సుగ్రీవము
హేమము = బంగారము, కనకము, పుత్తడి

TS 10th Class Telugu Important Questions 1st Lesson దానశీలము

3. వ్యుత్పత్త్యర్థాలు

త్రివిక్రముడు = మూడడుగులచే ముల్లోకములను కొలిచిన వాడు (విష్ణువు).
నీరజభవుడు = విష్ణువు నాభి కమలము నుండి పుట్టిన వాడు (బ్రహ్మ).
విశ్వంభరుడు = విశ్వమును భరించువాడు (విష్ణువు)
విష్ణువు = విశ్వమంతటా వ్యాపించియుండువాడు (విష్ణువు)
వదాన్యుడు = మిక్కిలిగా ఇచ్చేవాడు (మంచిదాత)
ధాత్రి = సర్వమునూ ధరించేది (భూమి)
భార్గవుడు = భృగు వంశమున పుట్టినవాడు (పరశు రాముడు)
హరి = భక్తుల హృదయాలను ఆకర్షించేవాడు (విష్ణువు)
హరుడు = భక్తుల పీడలను సర్వమునూ హరించే వాడు (శివుడు)
దానవులు = దనువు అనే స్త్రీ వలన పుట్టినవారు (రాక్షసులు)
బ్రహ్మ = ప్రజలను వర్థిల్ల చేయువాడు (బ్రహ్మ)
కులము = సజాతీయమైన ప్రాణుల గుంపు (వంశము)
వర్ణి = స్తుతులు గలవాడు (బ్రహ్మచారి)
ఆచార్యుడు = సంప్రదాయమును గ్రహింపచేయువాడు (గురువు)
క్షేత్రము = దీనియందు ధాన్యముల చేత నుండ బడును (భూమి)
జిహ్వ = రసముతో ఉన్న వస్తువులను ఇష్ట పడునది (నాలుక)
హేమము = లోహాంతరమును కూడి వృద్ధి పొందునది (బంగారము)
మాణవకుడు = మనువు యొ క్క అల్పుడైన సంతానము (బాలుడు)

TS 10th Class Telugu Important Questions 1st Lesson దానశీలము

4. నానార్థాలు

కులము = వంశము, జాతి, శరీరం, ఇల్లు
గురువు = ఉపాధ్యాయుడు, తండ్రి, బృహస్పతి
క్షేత్రము = చోటు, పుణ్యస్థానము, భూమి, శరీరం
సిరి = సంపద, లక్ష్మి
హరి = విష్ణువు, ఇంద్రుడు, గుఱ్ఱం, దొంగ, సింహం, కోతి
మహి = భూమి, శక్తి, మహిమ, ఉత్సవము
ధర్మము = పుణ్యము, ఎద్దు, నీతి, విల్లు, యజ్ఞము
అర్థము = శబ్దార్థము, ధనము, కార్యము, యాచన
ధాత్రి = నేల, తల్లి, ఉసిరిక, దాది
చిత్రము = చిత్తరువు, అద్భుతరసం, ఆశ్చర్యము
రాజు = ప్రభువు, క్షత్రియుడు, ఇంద్రుడు, చంద్రుడు
సత్యము = నిజము, కృతయుగము, ఒట్టు, ఒక లోహము
హేమము = బంగారు, ఉమ్మెత్త, గుఱ్ఱము, మంచు
వర్ణి = బ్రహ్మచారి, వ్రాతగాడు, ఋషి, చిత్తరువు, మూర్ఖుడు
బీజము = విత్తనము, నిజము, కారణము
బ్రహ్మ = నలువ, విష్ణువు, శివుడు, సూర్యుడు, చంద్రుడు, బ్రాహ్మణుడు
కాలము = సమయము, నలుపు, చావు, తాడి
జిహ్వ = నాలుక, వాక్కు, జ్వాల
అవసరమ = సమయము, ఆకాశము, ఆవశ్యకము, నైవేద్యము, విశ్రాంతి
పాదము = అడుగు, పద్యమునందలి చరణము, కాలు, స్థంభము, కిరణము
శిరము = తల, సేనాగ్రము, శిఖరము, ముఖ్యము
భూతము = ప్రాణి, దేవతా భేదము, పంచ భూతములలో ఒకటి, సత్యము, న్యాయము
తోడు = సహాయము, ఒట్టు, స్నేహము

TS 10th Class Telugu Important Questions 1st Lesson దానశీలము

5. ప్రకృతి – వికృతులు

ప్రకృతి – వికృతి
ధర్మము – దమ్మము
సంజ్ఞ – సన్న
కార్యము – కర్ణము
ఆశ్చర్యము – అచ్చెరువు
కులము – కొలము
విష్ణువు – వెన్నుడు.
విప్రుడు – పాణుడు
హితము – ఇతము
గర్వము – గరువము
శ్రీ – సిరి
భూ – భువి
భద్రము – పదిలము
భాగ్యము – బాగెము
దక్షిణము – దక్కినము
మృత్యువు – మిత్తి
గృహము – గీము
భూతము – బూచి
భూమి – బూమి
వ్రతము – బత్తము
నిజము – నిక్కము
దేవి – దేవేరి
శిరస్ – సిరసు
బ్రహ్మ – బమ్మ, బొమ్మ
యశము – ఆసము
వటుడు – వడుగు
జీవితము – జీతము
చిత్రము – చిత్తరువు
దాస్యము – దాసము
విద్య – విద్దె
కీర్తి – కీరితి

PAPER – II : PART – B

1. సంధులు

ఎ. తెలుగు సంధులు

1. సరళాదేశ సంధి
సూత్రములు:

  1. దృతప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
  2. ఆదేశ సరళమునకు ముందున్న దృతములకు బిందు సంశ్లేషలు విభాషనగు.

ఉదా :
రాజ్యముఁదేజమున్ – రాజ్యమున్ +తేజమున్
అలతిబ్రోడు – అలతిన్ + పోడు
బ్రహ్మాండముంగలడే- బ్రహ్మాండమున్ + కలడె
గీనముఁబనుపు – గీనమున్ + పనుపు
అర్థంబుఁగామంబు – అర్థంబున్ +కామంబు
అర్థిఁబొమ్మనుట – అర్థిన్ + పొమ్మనుట
కంటెఁబాపము – కంటెన్ + పాపము
భరించెదఁగాని – భరించెదన్ +కాని .
మోవఁజాలను – మోవన్ + చాలను
అనుచుఁబలుకదె – అనుచున్ + పలుకదె
కంటెంబ్రలికి – కంటెన్ + పలికి
పొడవునఁగురచ – పొడవునన్ + కురచ
ఔదిరుగన్ – ఔన్ + తిరుగన్
వచ్చుఁగాక – వచ్చున్ + కాక
ఐనఁజెడు – ఐనన్ + చెడు
అగుటంగలకల – అగుటన్ + కలకల

TS 10th Class Telugu Important Questions 1st Lesson దానశీలము

2. ఉత్వ సంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు.
ఉదా :
వాడై – వాడు + ఐ
పలుకులాకర్ణింపు – పలుకులు + ఆకర్ణింపు
లేదనక – లేదు + అనక
లోచనుండు – అయి + లోచనుండయి
ఇట్లనియె – ఇట్లు + అనియె
పేరైనన్ – పేరు + ఐనన్
కాములై – కాములు + ఐ
నిరయంబైన – నిర్ణయంబు + ఐన
హరుడైనన్ – హరుడు + ఐనన్
రమ్మా – రమ్ము + ఆ
లేదనక – లేదు + అనక
ప్రీతమ్మని – ప్రీతమ్ము + అని
నాయకుడగుటన్ – నాయకుడు + అగుటన్
పంచకమనఘా – పంచకము + అనఘా
వారేరి – వారు + ఏరి

3. ఉకార వికల్ప సంధి
సూత్రం : ప్రథమేతర విభక్తి శత్రర్థ చువర్ణంబులందున్న ఉ-కారమునకు సంధి వైకల్పికముగానగు.
ఉదా :
పలుకుచున్న – పలుకుచున్ + ఉన్న
దాతకీవియు – దాతకున్ + ఈవియు

TS 10th Class Telugu Important Questions 1st Lesson దానశీలము

4. గసడదవాదేశ సంధి
సూత్రం : ప్రథమమీది పరుషములకు గసడదవలు బహుళముగానగు.
ఉదా :
ప్రక్షాళనంబు సేసి- ప్రక్షాళనంబు + చేసి
పాదంబుగడిగి – పాదంబు + కడిగి
ధారవోసె – ధార + పోసె
కాళ్ళుగడుగ – కాళ్ళు + కడుగ
పరిగణనంబుసేసి – పరిగణనంబు + చేసి
చేసాచి – చే + చాచి

5. అత్వ సంధి
సూత్రం : అత్తునకు సంధి బహుళముగానగు.
ఉదా :
పొమ్మనుటెట్లు – పొమ్మనుట + ఎట్లు
కుఱుచై – కుఱుచ + ఐ
లేదనకిత్తున్ – లేదనక + ఇత్తున్
ఉత్తమా – ఉత్తమ + ఆ
ఎయ్యది – ఎ + అది

6. యడాగమ సంధి
సూత్రం : సంధిలేని చోట స్వరంబుకంటే పరంబయిన స్వరంబునకు యడాగమంబగు.
ఉదా :
అనియిట్లు – అని + ఇట్లు
యశస్వీట్లు – యశస్వి + ఇట్లు
సన్నగి – సన్న + ఎఱిగి
భళిభళియని – భళిభళి + అని
ఆయడుగుల – ఆ + అడుగుల

7. త్రిక సంధి
సూత్రాలు :

  1. ఆ, ఈ, ఏ అను సర్వనామములు త్రికములనబడును.
  2. త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు.
  3. ద్విరుక్తంబగు హల్లు పరమగునపుడు ఆచ్ఛికంబగు దీర్ఘంబునకు హ్రస్వంబగు.

TS 10th Class Telugu Important Questions 1st Lesson దానశీలము

ఉదా :
ఎయ్యది – ఏ + అది (యడాగమ, త్రికసంధులు)
అయ్యవసరంబున – ఆ + అవసరంబున (,, )
అద్దానవేంద్రుడు – ఆ + దానవేంద్రుడు ( ,, )
ఇక్కాలము – ఈ + కాలము (యడాగమ, త్రికసంధులు)

బి. సంస్కృత సంధులు

1. సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋలకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు దాని దీర్ఘము ఏకాదేశమగును.
ఉదా :
బ్రహ్మాండము – బ్రహ్మ + అండము
కులాచార్యుడు – కుల + ఆచార్యుడు
మహాత్మక – మహా + ఆత్మక
మహానుభావ – మహా + అనుభావ
ఇష్టార్థంబులు – ఇష్ట + అర్థంబులు
కులాంతము – కుల + అంతము
వింధ్యావళి – వింధ్య + ఆవళి
నిగమాంతాలంకరణము – నిగమ + అంత + అలంకరణము
కాలాది – కాల + ఆది
నలినాక్షుడు – నలిన + అక్షుడు
ప్రార్థింప – ప్ర + అర్థింప

2. గుణ సంధి
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋలు పరమైనప్పుడు క్రమముగా ఏ, ఓ, ఆర్లు ఏకాదేశమగును.
ఉదా :
వదాన్యోత్తమా – వదాన్య + ఉత్తమా
గర్వోన్నతి – గర్వ + ఉన్నతి
దానవేంద్రుండు దానవ + ఇంద్రుండు
దనుజేశ్వరుడు – దనుజ + ఈశ్వరుండు
అసురోత్తముడు – అసుర + ఉత్తముడు
మాణవకోత్తమ – మాణవక + ఉత్తమ

TS 10th Class Telugu Important Questions 1st Lesson దానశీలము

3. విసర్గ సంధి
సూత్రం 1 : విసర్గకు క, ఖ, ప, ఫలు పరమైతే విసర్గ మారదు.
ఉదా : యశఃకాములు -యశః + కాములు

సూత్రం 2 : ఇస్, ఉస్ల విసర్గకు క, ఖ, ప, ఫలు కలిస్తే ఆ విసర్గ ‘ష’ కారంగా మారుతుంది.
ఉదా : దుష్కర్ముడు
దుష్ + కర్ముడు
దుస్ + కర్ముడు

సూత్రం 3 : అంతః, దుః, చతుః, ఆశాః పునః మొదలైన పదాల విసర్గ రేఫగా (ర్) గా మారుతుంది.
ఉదా : నిర్మూలనంబు – నిః + మూలనంబు

4. యణాదేశ సంధి.
సూత్రం : ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు పరమైతే వాటికి క్రమంగా య, వ, ర లు ఆదేశమగును.
ఉదా :
అభ్యాగతుడు – అభి + ఆగతుడు

2. సమాసాలు

సమాస పదము – విగ్రహవాక్యముసమాసము పేరు
కులాచార్యుడు – కులమునకు ఆచార్యుడు – షష్ఠీ తత్పురుష సమాసము
నాదు జిహ్వ – నా యొక్క జిహ్వ – షష్ఠీ తత్పురుష సమాసము
గృహస్థ ధర్మము – గృహస్థ యొక్క ధర్మము – షష్ఠీ తత్పురుష సమాసము
గర్వోన్నతి – గర్వము యొక్క ఉన్నతి – – షష్ఠీ తత్పురుష సమాసము
కులాంతము – కులము యొక్క అంతం – షష్ఠీ తత్పురుష సమాసము
దానవేంద్రుడు – దానవులలో ఇంద్రుడు – షష్ఠీ తత్పురుష సమాసము
అసురోత్తముడు – అసురులలో ఉత్తముడు – షష్ఠీ తత్పురుష సమాసము
దనుజేశ్వరుడు – దనుజులలో ఈశ్వరుడు – షష్ఠీ తత్పురుష సమాసము
నా పలుకులు – నా యొక్క పలుకులు – షష్ఠీ తత్పురుష సమాసము
వటునికాళ్ళు – వటుని యొక్క కాళ్ళు – షష్ఠీ తత్పురుష సమాసము
భర్త సన్న – భర్త యొక్క సన్న (సంజ్ఞ) – షష్ఠీ తత్పురుష సమాసము
సురలోకము – సురలయొక్క లోకము – షష్ఠీ తత్పురుష సమాసము
నీ వాంఛితంబు – నీ యొక్క వాంఛితంబు – షష్ఠీ తత్పురుష సమాసము
దనుజలోకనాథుడు – దనుజలోకమునకు నాథుడు – షష్ఠీ తత్పురుష సమాసము
భూతనాయకుడు – భూతములకు నాయకుడు – షష్ఠీ తత్పురుష సమాసము
భూతపంచకము – భూతముల యొక్క పంచకము – షష్ఠీ తత్పురుష సమాసము
మానధనులు – మానము ధనముగా కలవారు – బహువ్రీహి సమాసము.
మహాత్ముడు – గొప్ప ఆత్మ కలవాడు – బహువ్రీహి సమాసము.
దుష్కర్ముడు – దుష్టమైన కర్మలు గలవాడు – బహువ్రీహి సమాసము.
రాజవదన – చంద్రుని వంటి వదనము కలది – బహువ్రీహి సమాసము.

TS 10th Class Telugu Important Questions 1st Lesson దానశీలము

మదమరాళగమన – మదమరాళము వంటి గమనము కలది – బహువ్రీహి సమాసము.
నలినాక్షుడు – నలినముల వంటి అక్షులు కలవాడు – బహువ్రీహి సమాసము.
అనఘుడు – అఘము లేనివాడు – నఞ బహువ్రీహి సమాసము
జీవధనములు – జీవము అనెడి ధనములు – రూపక సమాసము
వామపాదము – ఎడమదైన పాదము – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
ఇష్టార్థంబులు – ఇష్టమైన అర్థములు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
హేమఘటము – బంగారుదైన ఘటము – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
కపట వటువు – కపటుడైన వటువు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
పావనజలము – పావనమైన జలము – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
బహుబంధనములు – అనేకములైన బంధనములు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
వదాన్యోత్తముడు – ఉత్తముడైన వదాన్యుడు – విశేషణోత్తరపద కర్మధారయ సమాసము
అసురోత్తముడు – ఉత్తముడైన అసురుడు – విశేషణోత్తరపద కర్మధారయ సమాసము
మాణవకోత్తముడు – ఉత్తముడైన మాణవకుడు – విశేషణోత్తరపద కర్మధారయ సమాసము
దశదిక్కులు – పది సంఖ్య గల దిక్కులు – ద్విగు సమాసము
త్రివిక్రమ – మూడు రకాల (వైపుల) విక్రమం – ద్విగు సమాసము
విశ్వంభరుడు – విశ్వమును భరించువాడు – ద్వితీయా తత్పురుష సమాసము
వేదప్రామాణ్యవిదుడు – వేద ప్రామాణ్యమును తెలిసినవాడు – ద్వితీయా తత్పురుష సమాసము
సత్యహీనుడు – సత్యము చేత హీనుడు – తృతీయా తత్పురుష సమాసము
నిగమాంతాలంకరణం – నిగమాంతములచేత అలంకరణము – తృతీయా తత్పురుష సమాసము
ధరణీసురుడు – ధరణియందు సురుడు – సప్తమీ తత్పురుష సమాసం

TS 10th Class Telugu Important Questions 1st Lesson దానశీలము

3. అలంకారాలు

1. వృత్త్యనుప్రాసాలంకారం
లక్షణం : ఒకటిగాని, రెండుగాని అంతకుమించిన హల్లులు పలుమార్లు ఆవృత్తి అయినట్లేతే అది వృత్త్యను ప్రాసాలంకారం.
ఉదా :

  1. నీ కరుణా కటాక్షవీక్షణములకు నిరీక్షిస్తున్నాడు.
  2. అడిగెదనని కడువడిజను.
  3. చిటపట చినుకులు పట పట పడెను.

2. రూపకాలంకారం
లక్షణం : ఉపమానోపమేయాలను అభేదం చెప్పినట్లేతే అది రూపకాలంకారం.
ఉదా :

  1. ఈ రాజు సాక్షాత్తు పరమేశ్వరుడే.
  2. అజ్ఞానాంధకారమును జ్ఞానజ్యోతితో తొలగించాలి.
  3. సంసార సాగరమును తరించుట మిక్కిలి కష్టం.

TS 10th Class Telugu Important Questions 1st Lesson దానశీలము

4. గణవిభజన

అ) క్రింది పదాలకు గణాలను గుర్తించడం.

  1. దానము – U l l – భగణము
  2. కులమున్ – l l U – నగణము
  3. హితంబు – l U l – జగణము
  4. భాగ్యము – U l l – భగణము
  5. నిర్ణయం – l l U – సగణం
  6. వారేరీ – UUU – మగణం

ఆ) వృత్తాలు – గణాలు

  1. ఉత్పలమాల : భ, ర, న, భ, భ, ర, వ
  2. చంపకమాల : న, జ, భ, జ, జ, జ, ୪ గ
  3. శార్దూలం : మ, స, జ, స, త, త,
  4. మత్తేభం : స, భ, ర, న, మ, య, వ.

5. వాక్య పరిజ్ఞానం

అ) క్రింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యంగా గుర్తించండి.

ప్రశ్న 1.
రవి అన్నం తిన్నాడు. రవి బడికి వెళ్ళాడు.
జవాబు:
రవి అన్నం తిని బడికి వెళ్ళాడు.

TS 10th Class Telugu Important Questions 1st Lesson దానశీలము

ప్రశ్న 2.
లత పూలుకోసింది. లత దండకట్టింది.
జవాబు:
లత పూలుకోసి దండకట్టింది.

ప్రశ్న 3.
అమ్మ గుడికి వెళ్ళింది. అమ్మ పూజలుచేసింది.
జవాబు:
అమ్మ గుడికి వెళ్ళి పూజలుచేసింది.

ప్రశ్న 4.
రమ పాఠాలు విన్నది. రమ బాగా చదివింది.
జవాబు:
రమ పాఠాలు విని బాగా చదివింది.

ప్రశ్న 5.
వామనుడు వచ్చాడు. వామనుడు దానం కోరాడు.
జవాబు:
వామనుడు వచ్చి దానం కోరాడు.

ప్రశ్న 6.
బలిచక్రవర్తి దానం చేసాడు. బలి కీర్తి పొందాడు.
జవాబు:
బలిచక్రవర్తి దానం చేసి కీర్తి పొందాడు.

ఆ) క్రింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగాను, కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగాను రాయండి.

ప్రశ్న 1.
పోతన భాగవతం రచించాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
పోతనచేత భాగవతం రచింపబడింది. (కర్మణి వాక్యం)

ప్రశ్న 2.
బలి దానం చేసాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
బలిచేత దానం చేయబడింది. (కర్మణి వాక్యం)

TS 10th Class Telugu Important Questions 1st Lesson దానశీలము

ప్రశ్న 3.
వామనునిచేత వరాలు కోరబడినాయి. (కర్మణి వాక్యం)
జవాబు:
వామనుడు వరాలు కోరాడు. (కర్తరి వాక్యం)

ప్రశ్న 4.
సజనులు దానం చేశారు. (కర్తరి వాక్యం)
జవాబు:
సజనులచేత దానం చేయబడింది. (కర్మణి వాక్యం)

ప్రశ్న 5.
బలిచక్రవర్తి చేత కీర్తి సంపాదింపబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
బలిచక్రవర్తి కీర్తి సంపాదించాడు. (కర్తరి వాక్యం)

ఇ) క్రింది పరోక్ష కథనాలను ప్రత్యక్ష కథనంలోకి మార్చి రాయండి.

ప్రశ్న 1.
తాను దానం చేస్తానని బలిచక్రవర్తి చెప్పాడు.
జవాబు:
“నేను దానం చేస్తాను” అని బలిచక్రవర్తి చెప్పాడు.

ప్రశ్న 2.
తనకు ఆహారం వద్దని రవి అన్నాడు.
జవాబు:
“నాకు ఆహారం వద్దు” అని రవి అన్నాడు.

TS 10th Class Telugu Important Questions 1st Lesson దానశీలము

ప్రశ్న 3.
తన పెళ్ళికి రమ్మని కృష్ణ పిలిచాడు.
జవాబు:
“నా పెళ్ళికి రండి” అని కృష్ణ పిలిచాడు.

ప్రశ్న 4.
తాను నగరం వెళ్ళానని లత చెప్పింది.
జవాబు:
“నేను నగరం వెళ్ళాను” అని లత చెప్పింది.

ప్రశ్న 5.
‘తనకు దైవమే రక్ష’ అని భక్తుడు చెప్పుకున్నాడు.
జవాబు:
“నాకు దైవమే రక్ష” అని భక్తుడు చెప్పుకున్నాడు.

ఈ) ఈ క్రింది వాక్యాలు ఏ రకమైన వాక్యాలో గుర్తించండి.

  1. ఆహా ! బలిచక్రవర్తి దానగుణం ! (ఆశ్చర్యార్థకం)
  2. ఆవు పాలు తెల్లగా ఉంటాయి. (తద్ధర్మార్థకం)
  3.  దైవం నిన్ను కరుణించుగాక ! (ఆశీర్వచనార్థకం)
  4. దొంగతనాలు చేయవద్దు. (నిషేధార్థకం)
  5. రవి వస్తాడో ! రాడో ! (సందేహార్థకం)
  6. దానం ఎందుకు చేయాలి ? (ప్రశ్నార్థకం)
  7. దేవా ! నన్ను అనుగ్రహించు. (ప్రార్థనార్థకం)
  8. అందరు దానం చేయాలి. (విధ్యర్థకం)

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

Telangana SCERT 10th Class Telugu Guide Telangana 12th Lesson భూమిక Textbook Questions and Answers.

TS 10th Class Telugu 12th Lesson Questions and Answers Telangana భూమిక

చదువండి – ఆలోచించి చెప్పండి (T.B. P.No. 120)

పుస్తకాలకు రెక్కలుండవు. కాని వాటిని చదివితే మనకు రెక్కలు మొలిచినట్లుగా ఉంటుంది. ఆ రెక్కలు జ్ఞానాన్ని, ఆలోచనాశక్తిని, సృజనాత్మకతా నైపుణ్యాన్ని, లోకపరిశీలనా దృష్టిని, జిజ్ఞాసను, ఉత్సాహాన్ని అందిస్తాయి. మంచిపుస్తకం ఉత్తమమిత్రునితో సమానం. శరీరానికి వ్యాయామం ఎట్లాంటి శక్తినిస్తుందో మంచిపుస్తకం చదవడంవల్ల మనసుకు అలాంటి ఉత్తేజం కలుగుతుంది. ఏది మంచిపుస్తకం, ఏ పుస్తకాన్ని చదువాలనే ఎంపికలో పుస్తక పరిచయవాక్యాలు మార్గదర్శనం చేస్తాయి.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
పుస్తకాలు చదువడంవల్ల కలిగే ప్రయోజనాలు ఏవి ?
జవాబు:
పుస్తకాలు జ్ఞానాన్ని, ఆలోచనా శక్తిని, సృజనాత్మక శక్తిని, లోకపరిశీలనా దృష్టిని, జిజ్ఞాసను, ఉత్సాహాన్ని అందిస్తాయి.

ప్రశ్న 2.
ఎటువంటి పుస్తకాలను చదువాలి ?
జవాబు:
మనకు స్ఫూర్తినిచ్చే, జ్ఞానాన్ని ఇచ్చే పుస్తకాలను చదువాలి.

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

ప్రశ్న 3.
‘ఏదైనా పుస్తకాన్ని చదువాలి’ అనే ఆసక్తిని కలిగించే అంశమేది ?
జవాబు:
పుస్తక పరిచయ వాక్యాలు మనకు ఏదైనా పుస్తకాన్ని చదువాలనే ఆసక్తిని కలిగిస్తాయి.

ప్రశ్న 4.
మీరు చదివిన కొన్ని పుస్తకాల పేర్లు చెప్పండి.
జవాబు:
మహాప్రస్థానం, మహాభారతం, రామాయణం, దేవరకొండ, అమృతం కురిసిన రాత్రి.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 124)

నెల్లూరి కేశవస్వామితో స్నేహం ………. సాహిత్యంలో ఈ కథలకు విశిష్ట స్థానం ఉంది.

ప్రశ్న 1.
కథలకు, కవిత్వానికి గల భేదం ఏమిటి ? మీకు ఏవంటే ఇష్టం ? ఎందుకు ?
జవాబు:
కథలు సరళభాషలో సాగే వచన రచన. విశిష్టమైన వస్తు, శిల్పంతో సాగే రచన కథలు. ఛందస్సుతో ముడిపడి సాగే రచన కవిత్వం. ప్రాసలతో, అలంకారములతో కూడిన రచన కవిత్వం. నాకు కవిత్వం అంటే ఇష్టం. వినసొంపుగా, పాడుకోవటానికి వీలుగా ఉంటుంది. అందుకని కవిత్వం అంటే నాకు ఇష్టం.

ప్రశ్న 2.
నాటి హైదరాబాదు రాజ్యంలో హక్కుల కోసం, స్వాతంత్య్రం కోసం ప్రజలు ఎందుకు ఉద్యమించి ఉండవచ్చు?
జవాబు:
తెలంగాణ రైతు పోరాటం జరిగింది. ఈ సాయుధ పోరాటంలో 4 వేల మంది చనిపోయారు. మరోవైపు రజాకార్లు విజృంభించి రైతాంగ పోరాటంపై దాడులు చేశారు. ఈ కారణాల వల్ల హక్కుల కోసం, స్వాతంత్ర్య కోసం ప్రజలు ఉద్యమించి ఉండవచ్చు.

ప్రశ్న 3.
హైదరాబాదు నగర జీవితాన్ని, సంస్కృతిని తెలుగులో చిత్రించడం అంటే మీకేమి అర్థమైంది ?
జవాబు:
హైదరాబాదు నగరంలోని ప్రజల జీవితాలను, సంస్కృతిని బాగా పరిశీలించాలి, విశ్లేషించాలి. ఆ పట్టణ ప్రజల మానసిక స్థితిని కూడా అవగాహన చేసుకోవాలి. సమాజంలో నానాటికి వస్తున్న మార్పులను ఆకళింపు చేసుకోవాలి.

ఫ్యూడల్ సమాజంలో ఉండే బాధలు, వ్యతిరేకతలు పరిశీలించాలి. ప్రజాస్వామ్యంలోని స్వేచ్ఛా వాయువుల హాయిని కూడా పరిశీలించాలి. రకరకాల కులవృత్తులను పరిశీలించాలి.

ఉద్యమాలు, రాజకీయ మార్పులు, సంస్కృతి, గ్రామీణ జీవితం ఇలా అన్ని కోణాలలోనూ హైదరాబాదు నగరాన్ని పరిశీలించాలి. పై వాటి నన్నింటినీ కళ్ళకు కట్టినట్లు వివరించడమే చిత్రించడం. అది తెలుగుభాషలో చేస్తే తెలుగులో చిత్రించడం అంటారని మాకర్థమైంది.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 125)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, …….. కేశవస్వామి హృదయం ఉంది.

ప్రశ్న 1.
అపార్థాలు ఎందుకు వస్తాయి ?
జవాబు:
అవగాహనా లోపం వలన అపార్థాలు వస్తాయి. ఎదుటి వ్యక్తిని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వలన, వారి ఆలోచనా విధానం నచ్చకపోయినా అపార్థాలు తలెత్తుతాయి. మరియు ఇద్దరి వ్యక్తుల మధ్య అభిప్రాయాలు విభిన్నంగా ఉండటం వలన అపార్థాలు ఏర్పడతాయి. అపార్థాలు మనిషిలోని ఆలోచనా శక్తిని వక్రమార్గంలో నడిపిస్తాయి. మనిషిని భ్రమకు లోనుచేసి వ్యక్తుల మధ్య సంబంధాలను దూరం చేస్తాయి.

ప్రశాంతంగా ఉండనివ్వదు. మనిషి ఆలోచనా శక్తిని, జ్ఞానాన్ని క్రమంగా క్షీణింప చేస్తుంది. ఆప్తులను, స్నేహితులను దూరం చేస్తుంది. గౌరవ మర్యాదలు తగ్గిస్తుంది. కనుక మనిషి కోపాన్ని దూరం చేసుకోవాలి. అపుడే అందరికీ ఆదర్శంగా ఉండగలము అనే విషయాన్ని గ్రహించాలి. మనిషికి కేవలం శాస్త్రజ్ఞానం మాత్రమే ఉంటే సరిపోదనీ, ఆత్మజ్ఞానం మరియు ఇంద్రియ నిగ్రహం ఉండాలని వ్యాసుని పాత్ర ద్వారా గ్రహింపవచ్చు.

ప్రశ్న 2.
‘చార్మినార్’ కథలను ఎందుకు చదువాలి ?
జవాబు:
చార్మినార్ కథలు కేవలం కథలు కావు. వాస్తవ జీవితంలో సామాజిక పరిణామాల సామాజిక చరిత్రను నిక్షిప్తం చేసుకున్న చారిత్రాత్మక కథలు. కాబట్టి తప్పక చదువాలి.

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

ప్రశ్న 3.
రెండు మతాల మధ్య ఆలోచనలు, సంస్కృతిలో ఆదాన ప్రదానాలు జరగడం అంటే ఏమిటి ?
జవాబు:
11వ శతాబ్దం నుండి ఇండియాలో సాగిన ముస్లింల వలసలు, రాజ్యాలు, అవి తెచ్చిన పరిపాలనా విధానాలు, జీవనవిధానం, సంస్కృతి, భారతీయ సంస్కృతిపై, జీవన విధానంపై చెరగని ముద్ర వేసాయి. భారతీయ సంస్కృతిలో, జీవితంలో అంతర్భాగమైనాయి. అవి హిందూ ప్రజల జీవితంలోకి కూడా ప్రవేశిస్తూ రెండు మతాల మధ్య ఆలోచనల్లో, సంస్కృతిలో, జీవితంలో ఆదానప్రదానాలు జరిగాయి. అలా ఒక నూతన సమన్వయ సంస్కృతి విస్తరించిందని దాని అర్థం.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 127)

అందులో భాగంగా చూసినప్పుడు …………. వజ్రాల వంటివే స్వర్గీయ నెల్లూరి కేశవస్వామి కథలు

ప్రశ్న 1.
హృదయ సంస్కారం అంటే ఏమిటి ? కొన్ని ఉదాహరణలు చెప్పండి.
జవాబు:
హృదయ సంస్కారం అంటే మనసులో ఉండే మంచి భావన. నాకు మా తాతగారు, అమ్మా, నాన్నలు మంచి ప్రవర్తన అలవర్చుకోవాలని చాలా విషయాలు, కథలు చెబుతుంటారు.

ఉదాహరణకు మా తాతగారు మా గ్రామంలో జరిగిన ఒక సంఘటన చెప్పారు. మా తాతగారి చిన్నతనంలో బాల్యవివాహాలు జరిగేవిట. ఒకసారి మా గ్రామంలో ఒక 12 సం॥ల అమ్మాయిని పెళ్ళిచూపులు చూసుకొందుకు 60 సం॥ల వృద్ధుడు వచ్చేడుట. ఆ అమ్మాయిది చాలా పేద కుటుంబం. డబ్బుకు ఆశపడి వృద్ధుడికి పెళ్ళి చేద్దామనుకొన్నారు. వృద్ధుడు అమ్మాయి నచ్చిందన్నాడు.

వాళ్ళడిగిన డబ్బిచ్చాడు. ఆ అమ్మాయిని వృద్ధుడు ‘నేను నీకు నచ్చానా?’ అన్నాడుట. భయం, భయంగా ‘ఊ’ అందిట. ‘మరి, నేను చెప్పినట్లు వింటావా ?’ అన్నాడట, ‘ఊ’ అంది. ‘నీకేమిష్టం ?” అన్నాడు. ‘చదువు’ అంది అమ్మాయి.

అంతే వృద్ధుడు పకపకానవ్వాడుట. ‘పెళ్ళి ముహూర్తం పెట్టించమంటారా ? బాబూ అని అమ్మాయి తండ్రి అడిగాడుట.

‘పెట్టించండి. కానీ, పెళ్ళికి కాదు. దత్తతకు, ఈ రోజు నుండి మీ బంగారుతల్లి నాకు బంగారు తల్లి అయింది. బాగా చదివిస్తాను. మంచి కుర్రాడికిచ్చి పెళ్ళిచేస్తాను. రామ్మా ! మనింటికి వెడదాం’ అన్నాడట. ‘అదీ హృదయ సంస్కారం’ అన్నారు మా తాతగారు. ఆ అమ్మాయి తర్వాత బాగా చదువుకొని జిల్లా కలెక్టరైందిట. ఎంతోమంది పేదల జీవితాలలో వెలుగులు నింపిందట.

ప్రశ్న 2.
“స్నేహం మతాల సరిహద్దులను చెరిపివేస్తుంది”? – సమర్థించండి.
జవాబు:
అవును. “స్నేహాని కన్న మిన్న లోకాన లేదు కన్నా” అని కదా ! ఇది మతం, కులం, ప్రాంతం, భాషలను చూడదు. స్నేహం త్యాగాన్ని కోరుతుంది. “కేవలం మనుషులం” కథలో హుస్సేన్మీర్జా, మహబూబ్ సక్సేనా దశాబ్దాల స్నేహితులు. వారి స్నేహానికి మతం అడ్డు రాలేదు. ఇది చక్కని కథ. నేను స్నేహం మతాల సరిహద్దులను
చెరిపివేస్తుందని నమ్ముతాను.

ప్రశ్న 3.
పేదల కష్టాలు ఎట్లా ఉంటాయి ? పేదల జీవితాల్లో మార్పులు రావడానికి ఏం చేస్తే బాగుంటుంది ?
జవాబు:
పేదల కష్టాలు వర్ణించటానికి కూడా వీలుకానివి. ఆర్థికం, సామాజికం అనే సమస్యలతో అతలాకుతలం అవుతారు. వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలంటే ప్రభుత్వం వారికి ఆర్థిక స్వావలంబన కల్పించాలి. రాయితీలు ఇవ్వాలి. సబ్సిడీలు ఇవ్వాలి. వారికి ప్రభుత్వం విశ్వాసం, భరోసా కల్పించాలి.

కూడు, గుడ్డా, నీడ కల్పిస్తే చాలావరకు వారి జీవితాల్లో వెలుగులు (మార్పులు) వచ్చినట్లే.

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
కవులు, రచయితలు రాసిన పుస్తకాలను అందరికీ పరిచయం చేయడానికి పుస్తకావిష్కరణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇటువంటి కార్యక్రమాలలో ఏమేం చేస్తారో చెప్పండి.
జవాబు:

  1. సభా నిర్వహణ : అతిథులను, పుస్తక రచయితనూ, సమీక్షకున్నీ వేదికపైకి పిలిచి సభ నిర్వహిస్తారు.
  2. పుస్తకావిష్కరణ : ముఖ్య అతిధి చేతుల మీదుగా పుస్తకాన్ని ఆవిష్కరింపజేస్తారు.
  3. పుస్తక సమీక్ష : సమీక్షకుడు పుస్తకంలోని అంశాలను రేఖా మాత్రంగా స్పృశిస్తూ పుస్తకాన్ని పరిచయం చేస్తారు.
  4. ప్రసంగాలు : అతిథులు పుస్తకం గురించి, రచయిత గురించి ప్రశంసిస్తూ మాట్లాడతారు.
  5. కవి సత్కారం : పుస్తక రచయితను అందరూ సన్మానిస్తారు.
  6. కవి స్పందన : ఈ కార్యక్రమ నిర్వహణపై కవి లేదా రచయిత తన స్పందనను తెలియజేస్తారు.

ప్రశ్న 2.
నేటి సమాజానికి ఎటువంటి రచయితల అవసరం ఉందో చెప్పండి.
జవాబు:
మానవ మనస్తత్వాన్ని, సమాజంలోని కుళ్ళునూ, సమాజపు స్థితిగతులను కళ్ళకు కట్టినట్లు చూపించే రచయితలు అవసరం. సమాజానికి ప్రతినిధిగా రచయిత ఉండాలి. నిజాన్ని నిర్భయంగా చెప్పగలగాలి. ఒక సమస్యను చూపి, దానికి పరిష్కారాన్ని కూడా చెప్పగలిగే రచయితలు అవసరం.

సమాజంలోని రుగ్మతలను, మూఢనమ్మకాలను, దురాచారాలను ఖండించగలిగే నిర్భయత్వం గల రచయితలు కావాలి. ఉదాహరణకు వేమన, శ్రీశ్రీలాంటి వారు నేటి సమాజానికి చాలా అవసరం.

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

ప్రశ్న 3.
ఈ పాఠం ఆధారంగా కింది పట్టికను పూరించండి.
జవాబు:
TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక 1

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) ‘ఒక భాషలోని సాహిత్యం చదవడం ద్వారా నాటి పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు’ దీనిపై మీ అభిప్రాయం చెప్పండి.
(లేదా)
‘ఒక భాషలోని సాహిత్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా అప్పటి సమాజ స్థితిగతులను గ్రహించవచ్చు’ దీన్ని విశ్లేషించండి.
జవాబు:
నెల్లూరి కేశవస్వామి గారి ‘చార్మినార్ కథలు’ చదివితే ఆనాటి నవాబుల గురించి తెలుసుకోవచ్చు. ఆనాటి డేవిడీల గురించి తెలుసుకోవచ్చు. ఆనాటి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు తెలుస్తాయి. అలాగే ఆ రోజులలో కల్మషం ఎరుగని స్నేహాలు, ఆత్మీయతలు, కులమతాలకు అతీతమైన వారి మమతలు తెలుస్తాయి.

అలాగే ఆంగ్లసాహిత్యం చదివితే, ఆంగ్ల దేశాల ఆచార వ్యవహారాలు తెలుస్తాయి. బ్రిటిషుకాలంనాటి ఇంగ్లాండు పరిస్థితులు తెలియాలంటే ఆనాటి బ్రిటన్ సాహిత్యం చదవాలి. ప్రేమచంద్, కిషన్చందర్ సాహిత్యం చదివితే ఆనాటి ఉర్దూ, హిందీ భాషా ప్రాంతాల ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు తెలుస్తాయి.

రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలు చదివితే ఆనాటి బెంగాల్ పరిస్థితులు తెలుస్తాయి. వారి సంప్రదాయాలు తెలుస్తాయి.

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

ఆ) తెలంగాణ పలుకుబడులంటే ఏమిటి ? కొన్ని ఉదాహరణలు రాయండి.
(లేదా)
తెలంగాణ భాషలోని పలుకుబడులను గురించి విశ్లేషించండి.
జవాబు:
పలుకుబడి అంటే ఉచ్ఛారణము, వచో నిబంధనము, ఒడంబడిక, మాటచెల్లుబడి అని నిఘంటువులో చెప్పబడింది. తెలంగాణ ప్రాంతంలోని మాట చెల్లుబడి, మాటల ఉచ్ఛారణము అని అర్థం. ఏ భాషకైనా పలుకుబడులు, జాతీయాలు, గుండెకాయ (ముఖ్యమైనవి) వంటివి. అవి భాషను పదికాలాల పాటు నిలిపి ఉంచుతాయి.

ఉదాహరణలు :

సామెతలు :

  1. అతి రహస్యం బట్టబయలు.
  2. నక్క నదిలో కొట్టుకుపోతూ ప్రపంచమంత మునుగు- తుందన్నదట.
  3. మావోనికి ముప్ఫైరెండు గుణాలు మంచియే రెండే రెండు పాడు తనకు దెలది ఒకడు చెపితే వినడు.
  4. చెరువుల పడ్డాన్ని తీసి బావిలేసినట్లు.

జాతీయాలు :

జాతీయం – సందర్భం

  1. అగ్గిబుక్కుట – కోపంతో ఉడికిపోవుట
  2. ఉడుంపట్టు – గట్టి పట్టుదల
  3. ఒంటికోతి – ఏకాకి, ఒంటరివాడు
  4. కడుపు కుటుకుట – ఓర్వలేనితనం

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

ఇ) “తెలంగాణ కథ పుట్టుక నుండి సామాజిక చైతన్యం తోనే కొనసాగుతూ వచ్చింది” అనే వాక్యం ద్వారా మీకేమర్థ మయిందో తెలుపండి.
(లేదా)
తెలంగాణ కథల పుట్టుక గురించి, సామాజిక చైతన్యం గురించి రాయండి.
జవాబు:
కథ, వస్తు, శిల్ప నైపుణ్యంతో ఉంటుంది. తెలంగాణ కథ మొదటి నుండి సామాజిక పరిణామాలను చిత్రిస్తూ వచ్చింది. 1902 నుండి తెలంగాణ కథ ప్రారంభమైంది. పుట్టుకనుండి సామాజిక చైతన్యంతోనే కొనసాగుతూ వచ్చింది. ఉద్యమాలు, పోరాటాలు మున్నగునవి పలు కోణాల్లో చిత్రించబడ్డాయి. 1918లో స్థాపించబడిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇందుకు తోడ్పడింది. ఈ విధంగా తెలంగాణ కథ పుట్టుక నుండి సామాజిక చైతన్యం, ఉద్యమాలు, పోరాటాలను చూపిస్తూ వచ్చిందని నాకర్థమయింది.

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

ప్రశ్న 2.
కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబులు రాయండి. “మెతుకును చూసి అన్నం ఉడికిందో లేదో చెప్పవచ్చు”. అట్లే “పుస్తక పరిచయ వ్యాసాన్ని లేదా సమీక్షను చదివితే కూడా ఆ పుస్తకం గురించి ఆమూలా గ్రంగా అర్థం చేసుకోవచ్చు” ఎట్లాగో రాయండి.
(లేదా)
పుస్తక సమీక్ష ద్వారా ఆ పుస్తకము యొక్క విశేషాలను తెలుసుకోవచ్చు. దీన్ని సమీక్షించండి.
జవాబు:

  1. పీఠిక లేదా సమీక్షను చదివితే చాలా విషయాలు తెలుస్తాయి.
  2. పుస్తకం యొక్క ఆశయాన్ని, అంతస్సారాన్ని, తాత్త్వికతను, రచయిత దృక్పథాన్ని సవివరంగా వివరిస్తుంది పుస్తక సమీక్ష.
  3. ఇది విశ్లేషణాత్మకంగా ఉంటుంది.
  4. నైతిక విలువలను వివరిస్తుంది.
  5. సామాజిక బాధ్యతను తెలియజేస్తుంది.
  6. మానవుల మనస్తత్వాన్ని, సంఘర్షణను తెలుపుతుంది.
  7. చార్మినార్ కథలు సామాజిక పరిణామాలకు సాహిత్య రూపం ఇచ్చిన సామాజిక చరిత్ర అని చెప్పవచ్చును.
  8. పాఠకుడు మూలగ్రంథాన్ని చదివే తీరిక లేనప్పుడు పుస్తకం సమీక్ష కొంతవరకు విషయాన్ని మనకు తేటతెల్లం చేస్తుంది.
  9. పుస్తక సమీక్షలు ఆధారం ఒక్కొక్కసారి ఒక గ్రంథంతో ప్రజాదరణ పొందిన సందర్భాలూ ఉన్నాయి.
  10. నిష్పక్షపాతంగా, నిర్భయంగా రచనలను సమీక్ష చెయ్యాలి. అప్పుడు మాత్రమే ఆ పుస్తకం ఆమూలాగ్రంగా అర్థంచేసుకోటానికి వీలు కలుగుతుంది.
  11. పుస్తక సమీక్షను చదివితే ఆ గ్రంథాన్ని ఆమూలాగ్రం చదువాలనే ఉత్సాహం, ఉత్సుకత కల్గించేలా సమీక్ష ఉండాలి.

(లేదా)

ఆ) కేశవస్వామి కథల గురించి గూడూరి సీతారాం రాసిన వ్యాసం ఆధారంగా కేశవస్వామి రచనల గురించి రాయండి. (Mar. ’15)
(లేదా)
కేశవస్వామి రచనల విశిష్టతలను విశ్లేషించండి.
జవాబు:
విశిష్టమైన వస్తు, శిల్ప నైపుణ్యంతో మహోన్నతమైన కథలు రాసిన నెల్లూరి కేశవస్వామి భారతీయ కథా సాహిత్యంలో సుప్రసిద్ధమైన ప్రేమ్చంద్, కిషన్ చందర్ లతో పోల్చదగిన వారు.

  1. తొలి కథల సంపుటి “పసిడి బొమ్మ”. ఇది 1969 ఆగస్టులో వెలువడింది.
  2. రెండవ కథా సంకలనం “చార్మినార్ కథలు”. ఇవి కేవలం ఊహాజనిత కథలు కావు. సామాజిక పరిణామాలకు సాహిత్యరూపం ఇచ్చిన సామాజిక చరిత్ర రచన ఇది. దీనిలో హైదరాబాద్ రాజ్య చరిత్ర, సంస్కృతిని, మానవ సంబంధాలను, ఇక్కడి ముస్లిం జీవితాలను అపూర్వంగా చిత్రించారు.
  3. “యుగాంతం” కథలో హైదరాబాద్ గురించి వివరించారు. ఇండియా రెండు దేశాలుగా విడిపోయి నాటి పరిస్థితులు, సంక్షోభాలు, హత్యాకాండ ఎట్లా జీవనాన్ని కుదిపేసాయో అట్లే హైదరాబాద్ రాజ్యంలో 1946 – 50ల మధ్య పరిస్థితులు ఎలా కొనసాగాయో వివరించబడింది. సమాజం, మానవ సంబంధాల గురించి వివరించబడింది.
  4. “వంశాకురం” కథలో ముస్లిం పెళ్ళి సంబంధాలు ఎలా ఉంటాయో, కొడుకు పుట్టాలనే ఆశ ఆడపిల్లల జీవితాలను ఎలా అతలాకుతలం చేసి ఆత్మహత్యకు పురికొల్పుతాయో హృదయ విదారకంగా చిత్రించింది.
  5. “కేవలం మనుషులం’ కథలో హుస్సేన్ మిర్జా, మహబూబ్రాయ్ సక్సేనాల మతాల సరిహద్దులను చెరిపివేసిన స్నేహం గురించిన చక్కని కథ.
  6. “భరోసా కథ” నమ్మిన పేదలను నట్టేట ఎలా ముంచుతారో భరోసాను భగ్నం చేసిన యదార్థ కథ.
  7. “ఆఖరి కానుక” కథ రోజు రోజుకు పేదరికంలోకి ఈడ్వబడుతున్న ముస్లిం కుటుంబాలు అరబ్బు దేశాల షేక్లకు తమ కూతుళ్ళను ఇచ్చి పెళ్ళిచేసి తద్వారా కాస్త ఆర్థిక సౌలభ్యం పొందాలనుకునే దుస్థితిని తెలియచేస్తుంది.

ఈ విధంగా కేశవస్వామి కథల గురించి గూడూరి సీతారాం గారు అద్భుతంగా, సజీవంగా, సప్రమాణకంగా వ్యాసం రాశారు.

ప్రశ్న 3.
కింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

అ) మీ పాఠశాల గ్రంథాలయంలోని ఏదైనా ఒక కథల పుస్తకం తీసుకొని చదువండి. దీనికి పుస్తక పరిచయం (పీఠిక) రాయండి.
జవాబు:
వివిధ రంగాల్లో కృషిచేసిన మహిళామూర్తుల సేవలను స్మరిస్తూ ‘మహిళావరణం’ అనే గ్రంథాన్ని కొందరు రచించారు. దీనికి ముందుమాటను ప్రముఖ వ్యాసకర్తలు రచించారు. సమాజంలో వివిధరంగాల్లో రమణీయమైన సేవలను చేసిన వారి త్యాగాలను, సాహసాలను చక్కగా వివరించారు.

ఎందరో స్త్రీలు ఉద్యమాలు చేశారు. చదువులు చదివారు. రాజకీయ నాయకులైనారు. డాక్టర్లు అయ్యారు. నాటక, క్రీడ మొదలైన రంగాల్లో రాణించారు. అయినా వారికి తగిన గౌరవం చరిత్రలో దొరకలేదు. పురుషాధిక్యంతో స్త్రీల సేవలను చరిత్ర గుర్తించడం లేదు. స్త్రీలందరు అద్భుతమైన చరిత్ర నిర్మాణానికి ఎంతో మూల్యం చెల్లించారు. ఎన్నో త్యాగాలు చేశారు.

వివిధ రంగాలలో ప్రసిద్ధి చెందిన మహిళలను ఎంపిక చేసి, వారి వివరాలు, వారి ఇంటర్వ్యూలను కలిపి ‘మహిళావరణం’ అనే పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఆర్థికపరమైన భారాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక వందమంది మహిళల గురించి మాత్రమే ఇందులో ప్రస్తావించారు.

వారికి సంబంధించిన వివరాలను ఈ పుస్తకంలో పొందుపరచారు. ఈ పుస్తక నిర్మాణంలో ఎందరో తమ సహాయసహకారాలను అందించారు. వారందరి సేవలు చిరస్మరణీయంగా ఉంటాయి. రచయితలు వారందరికి కృతజ్ఞతలు తెలియజేశారు.

III. భాషాంశాలు

పదజాలం

ప్రశ్న 1.
గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి.

అ) రాజు ధ్యాస అంతా క్రికెట్ ఆటపైనే ఉన్నది.
జవాబు:
దృష్టి (ఆలోచన)

ఆ) ప్రజ్ఞ, మనోజ్ఞ ఇద్దరూ సఖ్యత తో మెలుగుతారు.
జవాబు:
స్నేహం

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

ఇ) ఫల్గుణ్ హస్తవాసి చాలా మంచిది.
జవాబు:
చేతిచలువ

ఈ) తెలంగాణలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రఖ్యాతి చెందింది.
జవాబు:
మిక్కిలి ప్రసిద్ధి.

ఉ) పూర్వం జమీందారులు దేవిడీలలో చర్చాగోష్ఠులు జరిగేవి.
జవాబు:
సంపన్నులు నివసించే పెద్ద భవంతి

ప్రశ్న 2.
కింది పదాలను వివరించి రాయండి.
జవాబు:
అ) హృదయసంస్కారం : మనసుకు సంబంధించిన సంస్కారం. ఇది ఎంతో విలువ కలిగినది. సొంత కూతురులా నవాబు, నవాబు కొడుకు ఒక ముజ్రాల రమణిని గౌరవించిన తీరును చిత్రించడం ద్వారా ముస్లిం నవాబుల్లో కొనసాగిన హృదయ సంస్కారాన్ని రచయిత ఒడిసిపట్టారు.

ఆ) సామాజిక పరిణామం : సమాజపరంగా జరిగే మార్పు యుగాంతం కథలో వివరించబడింది. మానవ సంబంధాలు, మారుతున్న పరిణామాలను చిత్రించడం వల్ల కథకు “యుగాంతం” అనే పేరు సార్ధకతను చేకూర్చింది.

ఇ) భారతీయ సంస్కృతి : ఇది ఎంతో విశిష్ఠమైంది. 11వ శతాబ్దం నుండి ఇండియాలో సాగిన ముస్లిం వలసలు, రాజ్యాలు, అవి తెచ్చిన పరిపాలనా విధానాలు, జీవన విధానం, సంస్కృతి భారతీయ సంస్కృతిపై జీవన విధానంపై చెరగని ముద్ర వేసారు.

ఈ) అతలాకుతలం : విపరీతంగా శ్రమపడడం లేదా క్రింది లోకం, పైలోకం అల్లకల్లోలమైనంత శ్రమ అనే అర్థంలో దీన్ని వాడతారు. అతలము అనగా ‘పాతాళము’. కుతలము అనగా భూమి అని అర్థం.

వ్యాకరణాంశాలు

1. కింది పదాలకు విగ్రహవాక్యాలురాసి, సమాసాలు గుర్తించండి.

అ) దశకంఠుడు = దశ కంఠములు కలవాడు – బహువ్రీహి సమాసము
ఆ) పీతాంబరుడు = పీతము అంబరముగా కలవాడు – బహువ్రీహి సమాసము
ఇ) అరవిందానన = అరవిందము ఆననముగా కలది – బహువ్రీహి సమాసము
ఈ) మృగనేత్ర = మృగము వంటి నేత్రములు కలది – బహువ్రీహి సమాసము
ఉ) చంచలాక్షి = చంచలమైన అక్షములు కలది – బహువ్రీహి సమాసము
ఊ) మానధనులు = మానమే ధనముగా కలవారు – బహువ్రీహి సమాసము
ఋ) రాజవదన = రాజు యొక్క వదనం కలవాడు – బహువ్రీహి సమాసము
ౠ) నీరజభవుడు = నీరజము నుండి పుట్టినవాడు – బహువ్రీహి సమాసము

2. కింది ప్రత్యక్ష వాక్యాలను పరోక్ష వాక్యాలుగా మార్చండి.

అ) “హైదరాబాదు రాజ్యం ఇండియన్ యూనియన్లో విలీనమైంది” అని సర్దార్ వల్లభభాయ్ పటేల్ ప్రకటించాడు. (ప్రత్యక్షం)
జవాబు:
హైదరాబాదు రాజ్యం ఇండియన్ యూనియన్లో విలీనమైందని సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రకటించాడు. (పరోక్షం)

ఆ) “తెలుగు కథాసాహిత్యంలో రమణీయమైన పోకడలు కల్పించిన ప్రసిద్ధ కథకుల్లో ఒకరు నెల్లూరి కేశవ స్వామి” అని గూడూరి సీతారాం అన్నాడు. (ప్రత్యక్షం)
జవాబు:
తెలుగు కథాసాహిత్యంలో రమణీయమైన పోకడలు కల్పించిన ప్రసిద్ధ కథకుల్లో ఒకరు నెల్లూరి కేశవస్వామియని గూడూరి సీతారాం అన్నాడు. (పరోక్షం)

ఇ) “చార్మినార్ అనే పేరును బట్టే ఈ కథల విశిష్టత వ్యక్తమవుతుంది” అని డి. రామలింగం పేర్కొన్నాడు. (ప్రత్యక్షం)
జవాబు:
చార్మినార్ అనే పేరును బట్టే ఈ కథల విశిష్టత వ్యక్తమవుతుందని డి. రామలింగం పేర్కొన్నాడు. (పరోక్షం)

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

3. కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా మార్చండి.

అ) పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితుల గురించి భీష్మ సహాని “తమస్” నవలలో చిత్రించాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితుల గురించి భీష్మసహాని చేత తమస్ నవలలో చిత్రించబడింది. (కర్మణి వాక్యం)

ఆ) హైదరాబాద్ రాష్ట్ర చరిత్రను ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత మూలకు నెట్టివేశారు. (కర్తరి వాక్యం)
జవాబు:
హైదరాబాద్ రాష్ట్ర చరిత్ర ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత మూలకు నెట్టివేయబడింది. (కర్మణి వాక్యం)

ఇ) నెల్లూరి కేశవస్వామిని భారతదేశం గర్వించ దగిన గొప్ప కథకుల్లో ఒకడిగా కీర్తించారు. (కర్తరి వాక్యం)
జవాబు:
నెల్లూరి కేశవస్వామి భారతదేశం గర్వించదగిన గొప్ప కథకుల్లో ఒకడిగా కీర్తించబడ్డారు. (కర్మణి వాక్యం)

శ్లేషాలంకారం

కింది వాక్యాలను పరిశీలించండి.

అ) మిమ్ముమాధవుడు రక్షించుగాక !
అర్థం :

  1. మిమ్ము మాధవుడు (విష్ణువు) రక్షించుగాక !
  2. మిమ్ము ఉమాధవుడు (శివుడు) రక్షించుగాక !

ఆ) మానవ జీవనం సుకుమారం.
అర్థం :

  1. మానవ (ఆధునిక) జీవనం సుకుమారమైంది.
  2. మానవ (మనిషి) జీవనం సుకుమారమైంది.

పై అర్థాలను గమనించినారు కదా ! ఒకే శబ్దం రెండు వేర్వేరు అర్థాలనందిస్తున్నది. (విభిన్న అర్థాలు ఆశ్రయించి ఉన్నాయి.) ఇట్లా విభిన్న అర్థాలను కలిగి ఉండే పదాలుంటే దానిని ‘శ్లేషాలంకారం’ అని అంటారు.

లక్షణం : నానార్థాలను కలిగి ఉండే అలంకారం శ్లేష.

4. కింది లక్ష్యాలలో ఉన్న అలంకారాన్ని గుర్తించి సమన్వయం చేయండి.

1. రాజు కువలయానందకరుడు :
రాజు = ప్రభువు, చంద్రుడు
కువలయం = భూమి, కలువపూవు
ఆనందకరుడు = ఆనందింప చేసేవాడు
1వ అర్ధములో = ప్రభువు భూమిని ఆనందింప చేసేవాడు.
2వ అర్థములో = చంద్రుడు కలువ పూవులను ఆనందింపచేసేవాడు.
అనేకమైన అర్థాలు గల శబ్దాలను ఉపయోగించి చెబితే దాన్ని శ్లేషాలంకారం అని అంటారు.

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

2. నీవేల వచ్చెదవు.

  1. నీవు ఏల వచ్చెదవు = నీవు ఏల వచ్చెదవు.
  2. నీవేల వచ్చెదవు = నీవు ఏ సమయంలో వచ్చెదవు.
    ఇట్లా ఒకే వాక్యంలో రెండు కానీ అంతకుమించి అర్థాలను కానీ కూర్చడమే శ్లేషాలంకారం.

5. క్రింది వాక్యాల్లోని అలంకారాలను గుర్తించండి.

అ) మావిడాకులు తెచ్చివ్వండి.

  1. మామిడి ఆకులను తెచ్చి ఇవ్వమని ఒకటి.
  2. మా ‘విడాకులను’ తెచ్చి ఇవ్వమని ఒకటి అర్థం స్ఫురిస్తుంది. ఇది శ్లేషాలంకారం.

ఆ) వాడి కత్తి తీసుకోండి.

  1. వాడి యొక్క కత్తిని తీసుకోమని
  2. వాడియైన (పదును గల) కత్తిని తీసుకోమని ‘అర్థం’ వాడబడింది.
    ఇది శ్లేషాలంకారం.

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

ఇ) “ఆమె లత పక్కన నిలుచున్నది”.

  1. ఆమె లత అనే ఆమె ప్రక్కన నిలుచున్నది (ఒక అర్థం)
  2. ఆ, మెలత (స్త్రీ), ప్రక్కన నిలుచున్నది (రెండవ అర్థం) ఇది శ్లేషాలంకారం.

ప్రాజెక్టు పని

వార్తా పత్రికలు లేదా మ్యాగజైన్లలో వచ్చిన పుస్తకం పరిచయాలను / సమీక్షా వ్యాసాలను సేకరించండి. నివేదిక రాసి తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:
బతుకు పుస్తకం అనేది సావిత్రి సమగ్ర రచనా సంపుటిలోనిది. బతుకు పుస్తకం లక్ష్మణరావుగారి జీవితచరిత్ర. ఇది ఆంధ్రజ్యోతి వారి వారపత్రికలో ధారావాహికంగా వెలువడింది.

‘బతుకు పుస్తకం’ రచయిత లక్ష్మణరావుగారు నిజాయితీ గల సాహితీమూర్తి అని రచయిత్రి నమ్మకం. బతుకు పుస్తకం చదవడానికి ముందే లక్ష్మణరావు గారు రచించిన ‘అతడు-ఆమె’ పుస్తకాన్ని రచయిత్రి చదివిందట. లక్ష్మణరావుగారి మీదా, ఆయన జీవితభాగస్వామి మెల్లీ మీదా రచయిత్రికి మంచి అభిమానం ఉంది.

లక్ష్మణరావుగారు మంచి సహృదయుడైన రచయిత అనడానికి ఉదాహరణలు ఇచ్చింది. మెల్లీ కరుణ గల విజ్ఞాని అని, మహా సాహసి అని, పట్టుపట్టి తాను అనుకున్నది సాధించే గుణం కలదని, అనడానికి సబర్మతి జైలులో ఆమె చేసిన సత్యాగ్రహం సంఘటనను పేర్కొంది.

లక్ష్మణరావుగారు కరుణ గల విజ్ఞాని అని, ఆయన చూపిన విజ్ఞత, ప్రపంచం పట్ల ఆయన చూపిన బాధ్యత మరచిపోరానివని గుర్తు చేసింది. మన దేశానికి ఉపయోగించని పరిశోధనలు అనవసరం అని పరిశోధనలకు స్వస్తి చెప్పి అనువాదక వృత్తిని ఆయన చేపట్టిన విషయాన్ని రచయిత్రి గుర్తు చేసింది.
మొత్తముపై లక్ష్మణరావుగారి జీవితంలోని ముఖ్య సంఘటనలను, బతుకు పుస్తకం నుండి రచయిత్రి ఎత్తి చూపింది.

విశేషాంశాలు

1. హైదరాబాద్ రాజ్యం : 1724లో అసఫ్ జాహీ వంశీయుడైన నిజం ఉల్ముల్క్ ఈ రాజ్య స్థాపకుడు. ఇతడు మొగలాయీ చక్రవర్తులకు అత్యంత విశ్వాసపాత్రుడు. హైదరాబాద్ రాజ్యాన్నే ‘హైదరాబాద్ సంస్థానం’ అనే పేరుతో వ్యవహరించేవారు. ఏడుగురు నిజాం వంశీయులు ఈ రాజ్యాన్ని పరిపాలించారు. రాజ్యంలో ప్రస్తుత తెలంగాణతో పాటు నేటి కర్ణాటకలోని మూడు, మహారాష్ట్రలోని ఐదు జిల్లాలు కలిసి ఉండేవి.

2. తెలంగాణ రైతాంగపోరాటం: వందలాది ఎకరాలు కలిగిన భూస్వాములు, వారికి అండదండలు అందించిన నిజాం ప్రభుత్వంపై రైతులు చేసిన పోరాటం ఇది. చారిత్రాత్మకమైన ఈ పోరాటం 1946-51 సంవత్సరాల మధ్య కొనసాగింది. భూమికోసం – భుక్తి కోసం – బానిసత్వ విముక్తికోసం పేదరైతులు చేసిన ఈ సాయుధ పోరాటం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది.

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

3. దేవిడి : నిజాం పాలనా కాలంలో నిర్మించిన పెద్ద పెద్ద భవనాలను ‘దేవిడీ’ లు అనే పేరుతో పిలిచేవారు. ఇవి పెద్ద భవంతులు. వీటిలో సంస్థానాలకు చెందిన సంపన్నులు నివసించేవారు. హైదరాబాద్ పాతనగరం తోపాటు తెలంగాణలోని పలు పట్టణాలలోనూ పాతబడిన దేవిడీలు కనబడతాయి.

4. పాన్దాన్ : తాంబూలాన్ని వేసుకునేవారు. తమలపాకులతోపాటు సున్నం, కాచు, పోకలు, ఇతర సుగంధ ద్రవ్యాలను ఒక చిన్న పెట్టెలో సర్దిపెట్టుకునేవారు. దానిని ‘పాన్దాన్’ అనే పేరుతో వ్యవహరించేవారు. ఇది ఉర్దూపదం.

5. కోహినూర్ : కుతుబ్షాహిల ఖజానాలో ఉండేది ఈ కోహినూర్ వజ్రం. ఈ వజ్రం బరువు 750 ఇంగ్లీషు కారెట్లుగా నిర్థారించారు. కోహినూర్ వజ్రం ప్రపంచంలోని వజ్రాల చరిత్రలోనే అత్యంత విలువైనది, విశిష్టమైనది.

సూక్తి : మంచిపుస్తకం మంచిమనసుకు మరోపేరు సొంతపుస్తకం మంచి మనిషికి మరోతోడు.

చదువండి – తెలుసుకొండి

విశ్వకవి ‘గీతాంజలి’

సాహిత్య సృజనలో అంతర్జాతీయ కీర్తినందుకొన్న మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్. కవిగా రచయితగా తత్త్వవేత్తగా సంగీతజ్ఞుడిగా చిత్రకారుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించాడు. రవీంద్రునిపేరు వినగానే చప్పున స్ఫురించేవి. ‘జనగణమన’ గీతం, ‘గీతాంజలి’. ‘జనగణమన’ గీతం భారత జాతీయగీతంగా గుర్తింపబడింది.

బంగ్లాదేశ్ జాతీయగీతం కూడా ఇతని లేఖిని నుండి వెలువడినదే. ఇలా రెండు జాతీయగీతాలనందించిన కవిగా అపూర్వ చరిత్రను సృష్టించాడు. ‘శాంతినికేతన్’ పేరున ఆదర్శవిద్యాలయాన్ని స్థాపించి ‘గురుదేవుడు’గా కీర్తింపబడ్డాడు. ఈ సంస్థద్వారా సంస్కారయుక్తమైన విద్యనందించాడు.

కవిగా ఇతనికి ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చిన రచన ‘గీతాంజలి’. 1913లో దీనికి ‘నోబెల్ సాహిత్య పురస్కారం’ దక్కింది. నోబెల్ బహుమతిని అందుకున్న తొలి భారతీయుడిగా ఠాగూర్ అరుదైన గౌరవాన్ని పొందాడు. ‘గీతాంజలి’ భారతీయ భాషల్లోకి మాత్రమేకాక ఎన్నో విదేశీ భాషలలోకి అనువదింపబడింది. ఒక్క తెలుగు భాషలోనే దాదాపు 50 దాకా అనువాదాలొచ్చాయంటే దీని గొప్పదనమేమిటో ఊహించవచ్చు. తాత్త్విక, సామాజిక అంశాలను స్పృశిస్తూ సాగిన ఈ రచన పాఠకుని హృదయాన్ని కదిలిస్తుంది.

‘గీతాంజలి’లోని రెండు అనువాద కవితా ఖండికలను ఇప్పుడు చూద్దాం.

1. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో
ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో
ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో
సంసారపు గోడలమధ్య ఎక్కడ భాగాల కింద ప్రపంచం విడిపోలేదో

ఎక్కడ సత్యాంతరాళంలోంచి పలుకులు బైలు వెడలతాయో
ఎక్కడ అలసటనెరగని శ్రమ తన బహువుల్ని పరిపూర్ణతవైపు జాస్తుందో
ఎక్కడ నిర్జీవమైన ఆచారపుటెడారిలో స్వచ్ఛమైన బుద్ధిప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో
ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకీ, కార్యాలలోకీ నీచే నడపబడుతుందో
ఆ స్వేచ్ఛా స్వర్గానికి, తండ్రీ! నా దేశాన్ని మేల్కొలుపు. – చలం

2. నా హృదయంలోని పేదరికాన్ని సమూలంగా తొలగించు ప్రభూ – ఇదే నా ప్రార్థన.
నా సుఖదుఃఖాలను తేలికగా భరించ గలిగే శక్తిని నాకు ప్రసాదించు.
సేవలోనే నా ప్రేమను ఫలింపజేసుకొనే శక్తిని అందజేయి,
పేదలను కాదనకుండా, అధికారదర్పానికి దాసోహమనకుండా ఉండే శక్తిని ప్రసాదించు.
దైనందిన అల్పవిషయాలకు అతీతంగా బుద్ధిని నిలుపుకోగల శక్తిని ప్రసాదించు.
నీ అభీష్టానికి ప్రేమతో నా శక్తిని అర్పించుకోగలిగే శక్తి నివ్వు. – డా॥ జె. భాగ్యలక్ష్మి

పదాలు – అర్థాలు

I

భూమిక = ప్రదేశము
సాయుధ = ఆయుధాలతో
విరివిగా = ఎక్కువగా
ధ్యాస = ఆలోచన, దృష్టి
విశ్లేషణ = వివరణ
చిత్రించబడ్డాయి = వివరించబడ్డాయి
విజృంభించి = అతిసయించి
దివాన్ = మంత్రి
జనాభా = పరివారము
కోఠీ = వేశ్యావాటిక
అంతర్యుద్ధం = లోలోపల వారిలో జరిగే
ఒప్పందం = ఒడంబడిక
రిటైర = పదవీ విరమణ
విశిష్ట స్థానం = ప్రత్యేక స్థానం
సంక్షుభిత = చిన్నాభిన్నమైన

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

II

నిర్దిష్టం = నిర్దేశించబడిన
వెలువడింది = వచ్చింది
అంకితం = ఒక గ్రంథమును వ్రాసి మఱి యొకరి పేర కృతి ఇచ్చుట
అపూర్వము = అపురూపము, క్రొత్తది, కారణం లేనిది
ఆదానప్రదానాలు = ఇచ్చిపుచ్చుకొనుట
నేపథ్యం = వస్త్రాద్యలంకారం, వేషము నాట్య స్థానము, నాట్య రంగమందు తెర లోపలి ప్రదేశం
తమస్ = చీకటి
పరిణామాలు = మార్పులు

III

ప్రోగ్రాం = కార్యక్రమము
మహోన్నతము = గొప్పదైన
అతీతంగా = అతిక్రాంతము, కడచినది
పొడసూపితే = కలిగితే
సున్నితమైన = మృదువైన
అతలాకుతలం = నలుగుట, శ్రమము, చెదరిపోవుట
సౌలభ్యం = సులభత్వం
దేవిడీ = సంపన్నులు నివసించే పెద్ద భవంతి

పాఠం ఉద్దేశం

ముందుమాట వల్ల పుస్తకంపై ప్రాథమిక అవగాహన ఎలా కలుగుతుందో, పుస్తకాన్ని చదవాలనే ఆసక్తి, ఆతురత ఎట్లా ఏర్పడుతాయో తెలియజేస్తూ దాని స్వరూప స్వభావాలను పరిచయం చేయడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

నేషనల్ బుక్స్ట్ ప్రచురించిన ‘నెల్లూరి కేశవస్వామి ఉత్తమకథలు’ సంపుటికి గూడూరి సీతారాం రాసిన పీఠిక ప్రస్తుత పాఠ్యాంశం.

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

కవి పరిచయం

రచయిత : గూడూరి సీతారాం
నివాసం : రాజన్న సిరిసిల్ల జిల్లా దగ్గర గల హనుమాజీ పేట
జననం : 18.07.1936
మరణం : 25.09.2011
రచనలు : 1953 నుండి 1965 వరకు సుమారు 80 కథలు రాశారు. కొన్ని మాత్రమే ప్రస్తుతం దొరుకు తున్నాయి.
ప్రత్యేకత : తెలంగాణ భాషను, యాసను ఒలికించడం ఈయన కలానికున్న ప్రత్యేకత.
ఇతర అంశాలు : తెలంగాణ కథా సాహిత్యంలో పేద కులాల జీవితాలను, అట్టడుగు వర్గాల భాషను అక్షరబద్ధం చేసిన రచయిత. తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేశాడు.
ఇతర రచనలు : మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజీరికం మొదలగునవి.

ప్రవేశిక

కథలు ఒకప్పుడు మానసికానందాన్ని, నైతిక విలువలను చెప్పడానికి పరిమితమై ఉండేవి. 20వ శతాబ్దంలో ఆధునిక కథానిక సాహితీరంగ ప్రవేశం చేయడంతో కథ స్వరూప స్వభావాల్లో స్పష్టమైన మార్పులు చోటుచేసుకున్నాయి. కథానిక సామాజిక బాధ్యతను తలకెత్తుకున్నది. మానవ మనస్తత్త్వాన్ని, సంఘర్షణను భిన్న సంస్కృతులను తన జీవ లక్షణాలుగా చేసుకున్నది. తెలుగు కథానిక అంతర్జాతీయ వేదికల మీద గర్వంగా తలెత్తుకొని నిలబడింది. అటువంటి గొప్ప కథానికా రచయితల్లో నెల్లూరి కేశవస్వామి ఒకరు.

విశిష్టమైన వస్తు, శిల్ప నైపుణ్యంతో మహోన్నతమైన కథలు రాసిన నెల్లూరి కేశవస్వామి భారతీయ కథా సాహిత్యంలో సుప్రసిద్ధులైన ప్రేమ్చంద్, కిషన్ చందర్ తో పోల్చదగిన వాడు. ఆయన ఉత్తమ కథల గురించి కొంతైనా తెలుసు కోవడం ఎంతైనా అవసరం.

విద్యార్థులకు సూచనలు

  • పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
  • పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత గీయండి.
  • వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పద విజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకోండి.

ప్రక్రియ – పీఠిక

ఈ పాఠం ‘పీఠిక’ ప్రక్రియకు చెందినది. ఒక పుస్తకం ఆశయాన్ని, అంతస్సారాన్ని, తాత్త్వికతను, రచయిత దృక్పథాన్ని, ప్రచురణకర్త వ్యయప్రయాసలను తెలియజేసేదే పీఠిక. ఒక గ్రంథ నేపథ్యాన్ని, లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయితగాని, మరొకరుగాని, విమర్శకుడుగాని రాసే విశ్లేషణాత్మక పరిచయవాక్యాలను పీఠిక అంటారు. దీనికే ముందుమాట, భూమిక, ప్రస్తావన, తొలిపలుకు, మున్నుడి, ఆముఖం మొదలైన పేర్లెన్నో ఉన్నాయి.

TS 10th Class Telugu Grammar Questions and Answers

Telangana SCERT 10th Class Telugu Grammar Telangana తెలుగు వ్యాకరణం Questions and Answers.

TS 10th Class Telugu Grammar Questions and Answers

భాషాభాగములు

ఆంధ్రభాషలోని పదాలను అయిదు రకాలుగా విభజించిరి. అవి :
1. నామవాచకము :
దీనికి విశేష్యము అని కూడా పేరు కలదు. పేర్లను తెలుపు పదాలు నామవాచకాలు. రాముడు, కృష్ణానది, బల్ల, మేడ. ఇది సంజ్ఞ, జాతి, గుణ క్రియా భేదములచే నాలుగు రకములైనది.

2. సర్వనామము :
నామవాచకములకు బదులుగా వాడబడేది. అతడు, ఆమె, అది, ఇది, ఇవి, వాడు, వారు మొ||నవి. ఇది కూడా ప్రశ్న వాచక, సంబంధ వాచకాది భేదములతోనున్నది.

3. విశేషణము :
నామవాచకముల, సర్వనామముల విశేషములను రంగు, రుచి మొ||నవి. వాటిని తెలుపు పదము. నల్లని, కమ్మని, చెడ్డ మొదలగునవి.

4. క్రియ :
పనిని తెలుపు పదాలు క్రియలు. ఉదా : చదివెను, వ్రాయును.

TS 10th Class Telugu Grammar Questions and Answers

5. అవ్యయము :
లింగ, వచన, విభక్తులు లేనిది. ఆహా, అయ్యో, ఔరా, భళా, చేసి, చూసి, చేయక.

విభక్తులు

వాక్యములోని వేర్వేరు పదాలకు ఒకదానితో ఒకటికి గల సంబంధమును తెలిపేవే విభక్తి ప్రత్యయములు. ఇవి ఏడు విధములు.

విభక్తి  –  ప్రత్యయములు
ప్రథమా విభక్తి  –  డు, ము, వు, లు
ద్వితీయా విభక్తి  –  నిన్, నున్, లన్, కూర్చి, గురించి
తృతీయా విభక్తి  –  చేతన్, చేన్, తోడన్, తోన్
చతుర్థీ విభక్తి  –  కొరకున్, కై
పంచమీ విభక్తి  –  వలనన్, కంటెన్, పట్టి
షష్ఠీ విభక్తి  –  కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్
సప్తమీ విభక్తి  –  అందున్, నన్
సంబోధనా ప్రథమా విభక్తి  –  ఓ, ఓయి, ఓరి, ఓసి

విభక్తిని ఆధారంగా చేసుకొని శబ్దములకు చివర ఆగముగా గాని, ఆదేశముగా గాని వచ్చి చేరేటటువంటి ఇ, టి, తి వర్గములు ఔప విభక్తికములు.
కాలు + చే = కాలిచే
అన్ని + ని = అన్నిటిని
చేయి + లో = చేతిలో.
సూచనలు : ప్రాచీన గ్రంథాలలో వాడింది కావ్యభాష. దాన్నే గ్రాంథిక భాష అంటారు. నేడు వాడుకలో ఉండే భాషే వ్యావహారిక భాష, దాన్నే ఆధునిక భాష అంటారు. గ్రాంథిక భాషను ఆధునిక భాషలోకి మార్చేటప్పుడు క్రింది మార్పులు గమనించాలి.
1. ఎ, ఏ లకు ముందున్న వకారం లోపిస్తుంది. పట్టుకు + వెళ్ళాడు – పట్టుకు + ఎళ్ళాడు – పట్టుకెళ్లాడు. అలాగే పడేశాడు మొ॥

2. పెట్టు క్రియలోని వకారం లోపిస్తుంది. కూడు + పెట్టాడు – కూడు + ఎట్టాడు – కూడెట్టాడు

3. పదాదిలోని వకారం ఒకారంగా మారుతుంది.
వాడు వదలడు – వాడొదలడు
పట్టుకు వచ్చాడు – పట్టుకొచ్చాడు.

4. సాగుతున్న వర్తమాన కాలాన్ని సూచించే చోట ఊకారానికి మారుగా ఓకారం వస్తుంది.
ప్రవహిస్తూ + ఉంది – ప్రవహిస్తూంది – ప్రవహిస్తోంది
ఇట్లే చేస్తోంది. రాస్తోంది మొ॥

5. ము, మ్ము, ంబుల చోట ‘o’ వస్తుంది.
వర్షము – వర్షం; వృక్షమ్ము – వృక్షం; దేశంబు – దేశం

6. ని / ను, కి / కులకు ముందున్న మకారం లోపిస్తుంది. దానికి ముందున్న అచ్చు దీర్ఘం అవుతుంది. ని అనేది న్నిగా మారుతుంది.
దేశమును – దేశాన్ని; దేశమునకు – దేశానికి ; దానిని – దాన్ని; పందెమునకు – పందానికి

7. ఇ, ఈ, ఎ, ఏ లకు ముందు ‘య’ చేరుతుంది.
ఎక్కడ – యెక్కడ; ఇటు = యిటు

8. ఉ, ఊ, ఒ, ఓ లకు ముందు వకారం చేరుతుంది.
ఉండ + ఒచ్చు – ఉండొచ్చు – వుండొచ్చు

TS 10th Class Telugu Grammar Questions and Answers

9. రెండు పదాలు కలిసినపుడు రెండో పదం మొదట గల ‘అ’ లోపిస్తుంది లేదా ‘అ’ కు ముందు టకారం చేరవచ్చు.
చచ్చే + అంత – చచ్చేంత – చచ్చేటంత

10. పొమ్ము, రమ్ము వంటి పదాలలోని ‘మ్ము’ లోపించి ముందు అచ్చు దీర్ఘం అవుతుంది. పొమ్ము – పో; రమ్ము – రా
చూడుము, వెళ్ళుము వంటి వాటిలో ‘ము’ లోపిస్తుంది. చూడు, వెళ్ళు, వచ్చెను, పోయెను లలో ‘ను’ లోపించి వచ్చె, పోయె అవుతాయి.

ఆధునిక భాషలోని పరివర్తనం

క్రింది వాక్యాలను ఆధునిక భాషలోకి పరివర్తనం చేయండి.

1. వివేకహీనుడయిన ప్రభువును సేవించుట కంటే వనవాసముత్తమము.
ఆధునిక భాష : వివేకహీనుడైన ప్రభువును సేవించడం కంటే వనవాసం ఉత్తమం.

2. ఎలుక ప్రతిదినము చిలుకకొయ్య మీఁదికెగిరి పాత్రము నందున్న యన్నము భక్షించి పోవుచున్నది.
ఆధునిక భాష : ఎలుక ప్రతిదినం చిలుకకొయ్య పైకి ఎగిరి పాత్రలో ఉన్న అన్నాన్ని భక్షించిపోతోంది. “తని పోతుంది.

3. బుద్ధిహీనత వలన సమస్త కార్యములు నిదాఘనదీ పూరములట్లు వినాశము నొందును.
ఆధునిక భాష : బుద్ధిహీనత వల్ల సమస్తకార్యాలు నిదామన పూరములైనట్లుగా వినాశనాన్ని పొందుతాయి.

4. అతని వ్యాపారము న్యాయమార్గమున సాగుచున్నది.
ఆధునిక భాష : అతని వ్యాపారం న్యాయమార్గంలో సాగుతోంది.

5. నేటి విద్యార్థులు జ్ఞాన సంపాదనకు తగినంత శ్రద్ధ వహించుట లేదు.
ఆధునిక భాష : నేటి విద్యార్థులు జ్ఞానం సంపాదించడం కోసం తగినంత శ్రద్ధ తీసుకోవడం లేదు.

6. పదేపదే చదివినచో పద్యము తప్పక అర్థమగును.
ఆధునిక భాష : పదే పదే చదివితే పద్యం తప్పకుండా అర్థమవుతుంది.

7. స్వాతంత్య్రమనగా స్వరాజ్యమని మాత్రమే కాదు.
ఆధునిక భాష : స్వాతంత్ర్యం అంటే స్వరాజ్యం అని మాత్రమే కాదు.

TS 10th Class Telugu Grammar Questions and Answers

8. పురుషుడు న్యాయము తప్పక విద్యా ధనములు గడింపవలెను.
ఆధునిక భాష : పురుషుడు న్యాయాన్ని తప్పక విద్యా సంపాదించాలి ధనాల్ని గడించాలి.

కర్తరి వాక్యాన్ని కర్మణి వాక్యంగా మార్చుట

‘కర్త’ ఆధారంగా రూపొందిన వాక్యాలు కర్తరి వాక్యాలని, ‘కర్మ’ ప్రధానంగా రూపొందించిన వాక్యాలను కర్మణి వాక్యాలని అంటారు.
ఉదా:
రామకృష్ణారావు ఆమోదముద్ర వేశారు. (కర్తరి వాక్యం)
రామకృష్ణారావుచే ఆమోదముద్ర వేయబడింది. (కర్మణి వాక్యం)

వివరణ :
(ఆమోదముద్రవేయడం – కర్తకు సంబంధించిన క్రియ.
ఆమోదముద్ర వేయబడటం – కర్మకు సంబంధించిన క్రియ.)

1. ఆయన కన్నుమూసిన విషయం పత్రికలో వ్రాశారు. (కర్తరి వాక్యం)
ఆయనచే కన్నుమూయబడిన విషయం పత్రికలో వ్రాయబడింది. (కర్మణి వాక్యం)

2. సుగ్రీవుడు వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. (కర్తరి వాక్యం)
సుగ్రీవునిచే వాలి యుద్ధానికి ఆహ్వానించబడ్డాడు. (కర్మణి వాక్యం)

ప్రత్యక్ష కథనం – పరోక్ష కథనం

ప్రత్యక్ష కథనం :
ఇతరులు చెప్పిన దానిని లేక తాను చెప్పిన దానిని ఉన్నది ఉన్నట్టుగా అనుసరించి చెప్పడం. దీనిలో ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయి. ఉదా : ‘దీన్ని నరికివేయండి’ అని తేలికగ అంటున్నారు.

పరోక్ష కథనం :
అనుకరించిన దానిలోని విషయాన్ని లేక అభిప్రాయాన్ని మాత్రమే అనుకరించడం. దీనిలో ఇన్వర్టెడ్ కామాస్ ఉండవు.

ప్రత్యక్ష కథనం = పరోక్ష కథనం
నేను – నా – నాకు = తాను – తన – తనకు
మేము – మాకు = తాము – తమకు
నీవు – నీకు – నీది = అతడు / ఆమె – అతడికి / ఆమెకు – అతనిది / ఆమెది
మీ – మీకు = వారి – వారికి
ఇది – ఇవి – ఇక్కడ = అది – అవి – అక్కడ అని మార్పు చెందుతాయి.

TS 10th Class Telugu Grammar Questions and Answers

1. ప్రత్యక్ష కథనం : “నా పుస్తకాలూ, కాగితాలూ ఏవీ ? ఎవరు తీశారు ?” అని రాజు కేకలు వేసేవాడు.
పరోక్ష కథనం : తన పుస్తకాలూ, కాగితాలూ ఏమైనాయనీ, ఎవరు తీశారనీ రాజు కేకలు వేసేవాడు.

2. ప్రత్యక్ష కథనం : “నా రచనలలో నా జీవితం ఉంటుంది” అని రచయిత మిత్రునితో అంటున్నాడు.
పరోక్ష కథనం : తన రచనలలో తన జీవితం ఉంటుందని ఒక రచయిత తన మిత్రునితో అంటున్నాడు.

3. ప్రత్యక్ష కథనం : “నేను కఠినుడనని అందరూ అంటారు. నిజానికి నేను చాలా శాంత స్వభావం కలవాడిని. పచ్చికవలె మృదువయినవాడిని. కోపం వచ్చినప్పుడే నన్ను సంభాళించడం కష్టమౌతుంది” అని తనను గురించి చెప్పుకున్నాడు.
పరోక్ష కథనం : తాను కఠినుడని అందరూ అంటారనీ, నిజానికి తాను చాలా శాంత స్వభావం కలవాడనీ, మృదువయిన వాడనీ, కోపం వచ్చినప్పుడు తనను సంభాళించడం కష్టమవుతుందనీ ఆయన తన గురించి చెప్పుకున్నాడు.

4. ప్రత్యక్ష కథనం : “నేను మా ఊళ్ళో నాలుగో తరగతిదాకా చదివాను” అని లక్ష్మి చెప్పింది.
పరోక్ష కథనం : తాను వాళ్ళ ఊళ్ళో నాలుగో తరగతిదాకా చదివానని లక్ష్మి చెప్పింది.

5. ప్రత్యక్ష కథనం : “గంభీరమైన నా ముఖం చూసి ఎవరూ నాతో స్నేహం చేయడానికి ఇష్టపడరు” అని అంబేద్కర్ అంటుండేవాడు.
పరోక్ష కథనం : గంభీరమైన తన ముఖం చూసి ఎవరూ తనతో స్నేహం చేయడానికి ఇష్టపడరని అంబేద్కర్ అంటుండేవాడు.

6. ప్రత్యక్ష కథనం : “నాకు ఏ వ్యసనాలు లేవు. శీల సంవర్ధనంలో అభిమానపడతాను” అని ఆయన అన్నాడు.
పరోక్ష కథనం : తనకు ఏ వ్యసనాలు లేవనీ శీల సంవర్ధనంలో అభిమానపడతానని ఆయన అన్నాడు.

7. ప్రత్యక్ష కథనం : “నేను రాకున్నా నీవు తప్పక వెళ్ళి చూచి రా” అని రవి నాతో అన్నాడు.
పరోక్ష కథనం : తాను రాకున్నా నన్ను తప్పక వెళ్ళి చూచి రమ్మని రవి నాతో అన్నాడు.

8. ప్రత్యక్ష కథనం : “నాకు చాలా ముఖ్యమైన పని ఉందని రాము చెప్పాడు.
పరోక్ష కథనం : తనకు చాలా ముఖ్యమైన పని ఉందని రాము చెప్పాడు.

జాతీయాల వివరణ

1. మంత్రాలకు చింతకాయలు రాలడం :
మంత్రాలు మనస్సుకు సంబంధించినవి. అవి చదివినంత మాత్రాన తక్షణమే భౌతికమైన పనులు జరుగవు. చింతచెట్టు కింద నిలబడి ఎన్ని మంత్రాలు చదివినా ఒక్క చింతకాయ కూడా రాలదు. మానసిక ప్రయత్నంకంటే భౌతిక ప్రయత్నమే ముఖ్యమని తెలియజెప్పే సందర్భంలో దీన్ని ప్రయోగిస్తారు.

TS 10th Class Telugu Grammar Questions and Answers

2. మిన్నందుకోవడం :
మిన్ను అనగా ఆకాశం. నిత్యావసర వస్తువుల ధరలు కొనలేనంతగా బాగా పెరిగిన సందర్భంలోను లేదా ఎత్తైన భవన నిర్మాణం జరిగినప్పుడు దాని ఎత్తును తెలియజేసే సందర్భం లోను దీన్ని ప్రయోగిస్తారు.

3. గజ్జెకట్టడం :
ఎవరైనా నాట్యం చేయడానికి ఆరంభంగా ముందుగా కాళ్ళకు గజ్జెలు కడతారు. ఏదైనా ఒకపని ఆరంభమైందనే విషయాన్ని తెలియ జేసే సందర్భంలో దీన్ని వాడుతారు.

4. గుండెలు బరువెక్కడం:
సాధారణంగా గుండె సున్నితంగా ఉంటుంది. బరువులను మోయలేదు. మానసిక వత్తిడిని కూడా తట్టుకోలేదు. ఎప్పుడైనా తీవ్రమైన బాధ కల్గిన సందర్భంలోను, ఆత్మీయులు, స్నేహితులు మొదలైన వారిని కోల్పోయి బాధలో ఉన్నప్పుడు ఈ జాతీయాన్ని వాడుతాము.

5. నీరుకారిపోవడం :
ఘనపదార్థంగా ఉన్న మంచు ముక్క క్రమంగా నీరుగా మారిపోవడం అంటే ఉనికిని కోల్పోవడం. అదే విధంగా మనిషికి చెమట పట్టి ఒక పనిని చేయలేని సందర్భములో ఈ జాతీయాన్ని వాడుతాము.

6. కనువిప్పు :
‘విప్పు’ అంటే విచ్చుకోవడం, తెరుచు కోవడం. కన్ను తెరవడం ద్వారా కలిగే జ్ఞానం మిగిలిన నాలుగు జ్ఞానేంద్రియాల ద్వారా కలిగే జ్ఞానం కంటే ఎక్కువైనా, ఇక్కడ కనువిప్పు అంటే మనోనేత్రం విచ్చుకోవడం అని భావం. భ్రమలన్నీ తొలగిపోయి, సత్యం గోచరించడమే కనువిప్పు.

7. కాలధర్మం చెందడం :
కాలధర్మం అంటే ‘మరణించుట’ అని అర్థం. ఎవరైనా మరణించిన సందర్భంలో మరణించారు అనే పదాన్ని ప్రయోగించ కుండా కాలధర్మం (కాలధర్మాన్ని అనుసరించి మరణం పొందు) అనే పదం ప్రయోగిస్తారు.

8. తునాతునకలు :
ఏదైనా ఒక వస్తువు అజాగ్రత్త వల్ల గాని, నిర్లక్ష్యంగా గాని కిందపడినపుడు అది బ్రద్దలై ముక్కలుముక్కలైపోతుంది. లేదా వేలుళ్ళు సంభవించినపుడు కూడా వస్తువులు ముక్కలు ముక్కలై పోతాయి. అందువల్ల ఒక వస్తువు చిన్నా భిన్నమై పగిలిన సందర్భాన్ని తెలియజేయునపుడు దీన్ని వాడతారు.

9. పురిటిలోనే సంధి కొట్టడం :
పని ప్రారంభించగానే ఆ పనికి విఘ్నం కలగడం అనే అర్థంలో వాడే జాతీయం.

TS 10th Class Telugu Grammar Questions and Answers

10. ఉన్నదంతా ఊడ్చుకుపోవడం :
పూర్తిగా నాశనం కావడం అని భావం.

11. శ్రీరామరక్ష :
రక్షింపగలిగినది, సర్వరక్షకమైనది అనే అర్థం.

12. గీటురాయి :
కొలబద్ద ప్రమాణము అని ఈ జాతీయానికి భావము. నాణ్యత నిర్ణయించడానికి బంగారాన్ని గీటురాయిపై గీత పెడతారు.

13. కారాలు మిరియాలు నూరడం :
మండిపడడం, మిక్కిలి కోపగించడం అని ఈ జాతీయానికి భావం.

14. స్వస్తి వాచకం :
ముగింపు, వదలివేయడం అని ఈ జాతీయానికి భావం.

15. అగ్రతాంబూలం : అందరికంటే ముందుగా గుర్తింపబడడం, గౌరవింపబడడం అని భావం.

16. దిక్కులు పిక్కటిల్లడం :
‘అంతటా వ్యాపించు’ అనే అర్థంలో వాడే జాతీయం.

17. విజయవంతం కావడం అంటే :
ఎవరైనా ఏదైనా ఒకపనిని కష్టపడి చేసినప్పుడు అది విజయవంతం అవుతుంది. ఆ విధంగా చేపట్టిన పని విజయం పొందిన సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. విజయవంతం కావడం అంటే కార్యసాఫల్యతను పొందడం అని అర్థం.

TS 10th Class Telugu Grammar Questions and Answers

18. ఉలుకు పలుకూ లేకపోవడం అంటే :
‘ఉలుకు’ అంటే భయం ‘పలుకు’ అంటే మాట ఎవరైనా ఎక్కడైనా భయంకరమైన జంతువును చూచినప్పుడుగాని, భయంకరాకృతిని చూచిన సందర్భంలోను నిశ్చేష్ఠులై పడి ఉండటాన్ని ఈ పదం తెలియజేస్తుంది. నిష్క్రియత్వం లేకపోవడమే ఉలుకు పలుకూ లేకపోవడం.

వాక్య ప్రయోగాలు

1. శ్రీరామరక్ష : ధీమంతులకు ఆత్మస్థైర్యమే శ్రీరామరక్షగా ఉంటుంది.

2. గీటురాయి : ఎన్నికలు ప్రజాభిప్రాయానికి గీటు రాయి.

3. రూపుమాపడం : విద్యార్థులు తమలోని దుర్గుణాలను రూపు మాపడం తప్పనిసరి.

4. కారాలుమిరియాలు నూరడం : పాలకపక్షం, విపక్షం ఎప్పుడూ ఒకదానిపై మరొకటి కారాలు, మిరియాలు నూరుకొంటాయి.

5. స్వస్తి వాచకం : పురోహితులు భక్తులకు స్వస్తి వాచకం పలుకుతారు.

6. శ్రద్ధాసక్తులు : చదువుపట్ల శ్రద్ధాసక్తులు ప్రదర్శించే వారు విజయాన్ని పొందుతారు.

7. ప్రేమ ఆప్యాయతలు : తల్లిదండ్రులు తమ పిల్లలపట్ల ప్రేమ ఆప్యాయతలు ప్రదర్శించాలి.

8. వన్నెచిన్నెలు : అప్సరసలు తమ వన్నెచిన్నెలతో దేవేంద్రుని అలరించారు.

9. సమయసందర్భాలు : కొందరు సమయసందర్భాలు పాటించకుండా మాట్లాడుతారు.

10. హాయిసౌఖ్యాలు : ప్రతిఫలాపేక్ష లేకుండా సేవచేయు వానికి జీవితంలో హాయిసౌఖ్యాలు కలుగుతాయి.

11. సాన్నిధ్యం (సామీప్యం, ఎదురు) : భగవంతుని సాన్నిధ్యంలో అందరూ సమానులే.

12. మైత్రి : దుర్జనులతో మైత్రి చేయవద్దు.

13. ఏకాకి (ఒంటరి) : అభిమన్యుడు పద్మవ్యూహంలో ఏకాకి అయినాడు.

14. రోమాంచితం : భారతదేశం, క్రికెట్ ఆటలో ప్రపంచ కప్ సాధించినదని విని, నాకు రోమాంచితం అయ్యింది.

15. కనువిప్పు : గురువుగారి హెచ్చరికతో నాకు కనువిప్పు కలిగింది.

16. పొద్దస్తమానం : సోమరులు పొద్దస్తమానం కాల క్షేపాలతో సమయాన్ని వ్యర్థం చేస్తుంటారు.

TS 10th Class Telugu Grammar Questions and Answers

17. చమత్కారం : చాటుపద్యాల్లోని చమత్కారం పాఠకులను ఆనందపరుస్తుంది.

18. కష్టఫలం : రైతు సోదరులు కష్టఫలంగానే పంటలు పండుతాయి.

19. కడుపులు మాడ్చుకొను : దీనజనులు తిండితిప్పలు లేకుండా కడుపులు మాడ్చుకొని జీవిస్తున్నారు.

20. అడుగున పడిపోవు : పసిబాలుడు లోతైన బోరుబావి అడుగున పడిపోవడం విచారకరం.

సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చుట

వాక్యాల మార్పిడిలో గుర్తుంచుకోదగిన అంశాలు :

సామాన్య వాక్యం :
సమాపక క్రియ కల్గి కర్త, కర్మలు గల వాక్యం సామాన్య వాక్యం.
ఉదా :
రాముడు సీతను పెండ్లాడెను.

సంక్లిష్ట వాక్యం :
ఒక సమాపక క్రియ; ఒకటిగాని, అంత కంటే ఎక్కువగాని అసమాపక క్రియలు గల వాక్యం సంక్లిష్ట వాక్యం. సమాపక క్రియగలది ప్రధాన వాక్యంగా, అసమాపక క్రియగలది ఉప వాక్యంగా ఉంటుంది. అసమాపక క్రియ భూతకాలాన్ని సూచిస్తుంది.

ఉదాహరణలు :
I. క్రింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యంగా మార్చండి.

ప్రశ్న 1.
నా మల్లెలు ఎంతోమంది యువతులు ధరించారు. ఆనందించారు.
జవాబు:
నా మల్లెలు ఎంతోమంది యువతులు ధరించి ఆనందించారు.

ప్రశ్న 2.
పిల్లలు సముద్రతీరాన ఆడుకొంటున్నారు. ఇసుకలో ఇల్లు కట్టుకున్నారు.
జవాబు:
పిల్లలు సముద్రతీరాన ఆడుకొంటూ, ఇసుకలో ఇల్లు కట్టుకున్నారు.

ప్రశ్న 3.
బొండుమల్లెలు వేసింది తానే, పెంచింది తానే, డబ్బు చేసిందీ తానే.
జవాబు:
బొండుమల్లెలు వేసి, పెంచి, డబ్బు చేసింది తానే.

TS 10th Class Telugu Grammar Questions and Answers

ప్రశ్న 4.
ఎందరో దేశభక్తులు తమ ధన, మాన, ప్రాణాలను కోల్పోయారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చారు.
జవాబు:
ఎందరో దేశభక్తులు తమ ధన, మాన, ప్రాణాలను కోల్పోయి, దేశానికి స్వాతంత్య్రం తెచ్చారు.

ప్రశ్న 5.
ఈ సంవత్సరం వర్షాలు బాగా కురిశాయి. పంటలు బాగా పండాయి.
జవాబు:
ఈ సంవత్సరం వర్షాలు బాగా కురియడంతో పంటలు బాగా పండాయి.

ప్రశ్న 6.
విలేఖరులు వింకిల్ను పట్టణానికి తీసికెళ్ళారు. అతన్ని అనేక ప్రశ్నలడిగారు.
జవాబు:
విలేఖరులు వింకిల్ను పట్టణానికి తీసికెళ్ళి అనేక ప్రశ్నలడిగారు.

ప్రశ్న 7.
వినోద్ బొంబాయి వెళ్ళాడు. అతడు మిత్రుణ్ణి కలిశాడు.
జవాబు:
వినోద్ బొంబాయి వెళ్ళి మిత్రుణ్ణి కలిశాడు.

ప్రశ్న 8.
వదరుబోతు జన్మించినది అనంతపురమందు – వదరుబోతు పని చేసినది, సన్యసించినది అనంతపురమందే.
జవాబు:
వదరుబోతు జన్మించినది, పని చేసినది, సన్యసించినది అనంతపురమందే.

TS 10th Class Telugu Grammar Questions and Answers

ప్రశ్న 9.
నా భయం కళ్ళకు కప్పేసింది. రాలేక నిలబడి పోయాను.
జవాబు:
నా భయం కళ్ళకు కప్పేయ్యటంతో రాలేక నిలబడి పోయాను.

II. క్రింది సంక్లిష్ట వాక్యాలను సామాన్య వాక్యాలుగా మార్చండి.

ప్రశ్న 1.
జనమంతా పగలబడి నవ్వుతూ గోల చేస్తున్నారు
జవాబు:
జనమంతా పగలబడి నవ్వుతున్నారు. గోల చేస్తున్నారు.

ప్రశ్న 2.
అతను మాట్లాడుతూ అన్నం తింటున్నాడు.
జవాబు:
అతను మాట్లాడుతున్నాడు. అన్నం తింటున్నాడు.

ప్రశ్న 3.
అంబేద్కర్ అమెరికా వెళ్ళి తనతో ఇరవైనాలుగు పెట్టెల పుస్తకాలు తెచ్చుకున్నాడు.
జవాబు:
అంబేద్కర్ అమెరికా వెళ్ళాడు. తనతో ఇరవైనాలుగు పెట్టెల పుస్తకాలు తెచ్చుకున్నాడు.

ప్రశ్న 4.
రాము కాఫీ తాగుతూ చదువుతున్నాడు.
జవాబు:
రాము కాఫీ తాగుతున్నాడు. రాము చదువుతున్నాడు.

TS 10th Class Telugu Grammar Questions and Answers

ప్రశ్న 5.
కృష్ణ ఉద్యోగం చేసుకుంటూ చదువుకొంటున్నాడు.
జవాబు:
కృష్ణ ఉద్యోగం చేసుకుంటున్నాడు. కృష్ణ చదువు కొంటున్నాడు.

సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్పుట

సంయుక్త వాక్యం :
సమ ప్రాధాన్యం గల వాక్యాలను కలపడం వల్ల ఏర్పడే వాక్యాలను సంయుక్త వాక్యాలు అంటారు.

ప్రశ్న 1.
వీరు పొమ్మను వారు కారు. వీరు పొగబెట్టు వారు.
జవాబు:
వీరు పొమ్మను వారు కారు, పొగబెట్టువారు.

ప్రశ్న 2.
రైలు వచ్చింది. చుట్టాలు రాలేదు.
జవాబు:
రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు.

ప్రశ్న 3.
నాలో చురుకుదనం ఉంది. జిజ్ఞాస ఉంది.
జవాబు:
నాలో చురుకుదనం, జిజ్ఞాస ఉన్నాయి.

ప్రశ్న 4.
పదేళ్ళకే మాకు ఎంతో మాటకారితనం వచ్చేది. ఎంతో పెద్దరికమూ వచ్చేది.
జవాబు:
పదేళ్ళకే మాకు ఎంతో మాటకారితనమూ, పెద్దరికమూ వచ్చేవి.

ప్రశ్న 5.
ఆయన సత్యకాలంవాడు. పరమ సాత్వికుడు.
జవాబు:
ఆయన సత్యకాలంవాడు మరియు పరమ సాత్త్వికుడు. (లేదా) ఆయన సత్యకాలం వాడు, పరమ సాత్త్వికుడు కూడా.

TS 10th Class Telugu Grammar Questions and Answers

ప్రశ్న 6.
అంబేద్కర్ కార్యవాది. క్రియాశీలి.
జవాబు:
అంబేద్కర్ కార్యవాది మరియు క్రియాశీలి. (లేదా) అంబేద్కర్ కార్యవాది, క్రియాశీలి కూడా.

ప్రశ్న 7.
కమల బాగా చదివింది. కమలకు ర్యాంకు రాలేదు.
జవాబు:
కమల బాగా చదివింది కాని ర్యాంకు రాలేదు.

ప్రశ్న 8.
రాముడు శివధనుస్సును విరచెను. రాముడు సీతను వివాహమాడెను.
జవాబు:
రాముడు శివధనుస్సును విరచెను మరియు సీతను వివాహమాడెను.

ప్రశ్న 9.
పోటీలో చాలామంది పాల్గొన్నారు. బహుమతి ముగ్గురికే ఇచ్చారు.
జవాబు:
పోటీలో చాలామంది పాల్గొన్నప్పటికీ బహుమతి ముగ్గురికే ఇచ్చారు.

ప్రశ్న 10.
రవి సాయంకాలం వరకు పనిచేసేవాడు. రవి చీకటి పడుతుంటే ఇంటికి వెళ్లేవాడు.
జవాబు:
రవి సాయంకాలం వరకు పనిచేసేవాడు కాని చీకటి పడుతుంటే ఇంటికి వెళ్ళేవాడు.

ప్రశ్న 11.
అనిల్ ఎంతో కష్టపడి చదివాడు. అతడు పరీక్షలో తప్పాడు.
జవాబు:
అనిల్ ఎంతో కష్టపడి చదివాడు కానీ పరీక్షలో తప్పాడు.

ప్రశ్న 12.
ప్రకాశం పంతులుగారు ధైర్యశాలి. అతడు త్యాగశీలి.
జవాబు:
ప్రకాశం పంతులుగారు ధైర్యశాలి మరియు త్యాగశీలి.

TS 10th Class Telugu Grammar Questions and Answers

ప్రశ్న 13.
సీత పాఠం అర్థం చేసుకొంది. సీత పరీక్ష బాగా వ్రాసింది.
జవాబు:
సీత పాఠం అర్థం చేసుకొనడంతో పరీక్ష బాగా వ్రాసింది.

వాక్యాంగములు

సాధారణంగా వాక్యంలో కర్త, కర్మ, క్రియ అనే మూడు అంగాలు ఉంటాయి.
కర్త (Subject) – పనిని చేసేవాడు కర్త.
కర్మ (Object) – పని యొక్క ఫలితాన్ని అనుభవించేవాడు కర్మ.
క్రియ (Verb) – చేసిన పనిని తెలిపే పదం క్రియ.
ఉదా : వేటగాళ్ళు వలలు పన్నారు.
ఈ వాక్యంలో వేటగాళ్ళు – కర్త, వలలు – కర్మ, పన్నారు – క్రియ.

క్రియను ఎవడు, ఎవరు అను పదాలతో ప్రశ్నించగా వచ్చే జవాబు కర్త.

క్రియను దేనిని, వేనిని అను ప్రశ్నించగా వచ్చే జవాబు కర్మ.

కర్తను తెలిపే పదం కర్తృపదం అనీ, కర్మను తెలిపే పదం కర్మపదం అనీ అంటారు.

కొన్నిచోట్ల వాక్యాల్లో కర్త లోపించవచ్చును.
ఉదా : బడికి వెళ్ళాడు
(ఇక్కడ ‘వాడు’ అనే కర్త పదం లేదు)

కొన్నిచోట్ల వాక్యాల్లో కర్మ లోపించవచ్చును.
ఉదా : నేను చదువుతున్నాను.
(ఇక్కడ కర్మ పదం ‘పాఠం’ లేదు)

కొన్నిచోట్ల క్రియలేని వాక్యాలు ఉండవచ్చును.
ఉదా : దశరథునకు ముగ్గురు భార్యలు.

క్రియలు – భేదములు

పనిని తెలుపు పదములు క్రియలు. ధాతువునకు ప్రత్యయములు చేరి క్రియలు ఏర్పడును. తెనుగున ధాతువులు ఉకారాంతములై ఉండును.

ధాతువునకు ఉదా : వండు, వ్రాయు, కొట్టు, తిను మొదలగునవి.
క్రియకు ఉదా : వండెను, వ్రాయుచున్నాడు, కొట్టగలడు, తినెను మొదలగునవి.

క్రియలు పనిని తెలిపే విధానమును బట్టి రెండు రకములు. అవి :

  1. సమాపక క్రియలు,
  2. అసమాపక క్రియలు.

సమాపక క్రియ – వాక్యార్థమును పూర్తి చేయునది. – తిన్నాడు, చూశాడు, చదివాడు.
ఉదా : సీత బడికి వెళ్ళెను.

TS 10th Class Telugu Grammar Questions and Answers

అసమాపక క్రియ – వాక్య భావమును పూర్తి చేయని క్రియ. – తిని, చూసి, వండి, చేస్తూ
ఉదా : సీత బడికి వెళ్ళి

సమాపక క్రియలు కాలము, వచనము మొదలగు వాటిని అనుసరించి మారుచుండును. అసమాపక క్రియలు మారవు. అందుకే వాటిని అవ్యయములు అని లెక్కించిరి.
పని జరుగు సమయమును బట్టి సమాపక క్రియలు నాలుగు కాలములందు వాడబడును.
భూతకాల క్రియ – జరిగిపోయిన పనిని తెలుపును.
ఉదా : వెళ్ళెను, వెళ్ళితిని, వ్రాసితిమి.

వర్తమానకాల క్రియ – జరుగుచున్న పనిని తెలుపు క్రియ.
ఉదా: వెళ్ళుచున్నావు, వ్రాయుచున్నాడు, తినుచున్నాము.

భవిష్యత్కాల క్రియ – జరుగబోవు పనిని తెలుపు క్రియ.
ఉదా : వెళ్ళగలను, వ్రాయగలడు, తినగలము.

తద్ధర్మార్థక క్రియ – భూత భవిష్యద్వర్తమానముల కంటే భిన్నమై, ఆ మూడు కాలములను తెలుపు క్రియ.
ఉదా : వెళ్ళును, వెళ్ళెదము, చేసెదవు.
(ఇప్పటి వ్యవహారమున తద్ధర్మార్థక క్రియ భవిష్య దర్థములో వాడుచున్నారు)

అసమాపక క్రియలు :
1. క్త్వార్థకము – భూతకాలమును తెలిపే అసమాపక క్రియ. ధాతువు చివర ‘ఇ’ చేరును.
ఉదా : చేయు + ఇ = చేసి, తిను + ఇ = తిని.

2. వ్యతిరేక క్త్వార్థకము – క్త్వార్థకమునకు వ్యతిరేకము. ధాతువునకు “అక” చేరును.
ఉదా : చేయు + అక = చేయక,
తిను + అక = తినక.

3. శత్రర్థకము – వర్తమానార్ధమును తెలుపునట్టిది. ధాతువునకు “చున్” ప్రత్యయము చేరును.
ఉదా : చేయు + చున్ = చేయుచున్
తిను + చున్ = తినుచున్.

4. తుమున్నాద్యర్థకము – కారణమును తెలియజేసేది. ధాతువునకు “అన్” చేరును.
ఉదా : చేయన్, తినన్.

5. చేదర్థకము – కార్యకారణ సంబంధాన్ని తెలియ జేసేది. ధాతువునకు “ఇనన్” ప్రత్యయము చేరును.
ఉదా : చదివినన్, చేసినన్, తినినన్.

TS 10th Class Telugu Grammar Questions and Answers

6. అనంతర్యార్థకము – తరువాత అనే అర్థాన్ని తెలుపుతూ ధాతువునకు “డున్” చేరును.
ఉదా : చదువుడున్, చేయుడున్, తినుడున్.

7. భావార్థకము – ధాతువు యొక్క భావాన్ని తెలిపేది. “ట” చేరును.
ఉదా : విను – వినుట, చేయు – చేయుట, తిను – తినుట, వండు వండుట.

8. వ్యతిరేక భావార్ధకము – ధాతువు యొక్క అర్థానికి వ్యతిరేకార్థమును తెలుపుచూ “అమి” చేరిన అసమాపక క్రియ.
ఉదా : విను – వినమి, చేయు – చేయమి, తిను – తినమి.

వాక్యములలో రకములు

వాక్యాలు చెప్పే భావాన్ని, విధానాన్ని బట్టి కొన్ని రకాలుగా విభజించబడ్డాయి.

1. విద్యర్థక వాక్యం – కర్త పనిని చేయాలని ఆదేశించి నట్లుగా ఉంటుంది.
ఉదా :

  1. సలీం ! నీవు తరగతిలో కూర్చో.
  2. మీరు చదవండి.
  3. మీరు చిత్రం వేయండి.
  4. నీవు గూడూరు వెళ్ళు.
  5. మీరు వెళ్ళాల్సిందే.
  6. మీరు వ్రాయండి.
  7. నువ్వు వాడు.

2. అనుమత్యర్థక వాక్యం – కర్త చేయవలసిన పనిని చేయవచ్చునని అనుమతి ఇచ్చినట్లుంటుంది.
ఉదా :

  1. పిల్లలూ ! ఇక మీరు ఆటలాడుకోవచ్చు.
  2. మీరు ఆటలు ఆడవచ్చు.
  3. పిల్లలు ఊరికి వెళ్ళవచ్చు.
  4. మీరు భోజనం చేయవచ్చు.
  5. మీరు రావచ్చు.
  6. నేను లోపలికి రావచ్చునా ?
  7. మేము ఆటలు ఆడవచ్చునా ?

TS 10th Class Telugu Grammar Questions and Answers

3. సందేహార్థక వాక్యం – కర్త చేయవలసిన పనిని చేస్తాడో, చేయడో అనే అనుమానం తెలుపుతుంది.
ఉదా :

  1. రాము ఈ రోజు బడికి రాడేమో.
  2. రవి చూస్తాడో ? చూడడో ?
  3. అమ్మ రమ్మంటుందో ? వద్దంటుందో ?
  4. ఈ గొయ్యి లోతో ? కాదో ?
  5. వారు వెళ్ళవచ్చా ?
  6. వాన పడుతుందో, లేదో ?

4. ప్రశ్నార్థక వాక్యం – కర్త చేయవలసిన పని జరిగిందా అని ప్రశ్నిస్తున్నట్లు ఉంటుంది.
ఉదా :

  1. లలిత బడికి వచ్చిందా ?
  2. పాఠాలు బాగా విన్నారా ?
  3. పరీక్షలు బాగా వ్రాశారా ?
  4. పదార్థాలు రుచిగా ఉన్నాయా ?
  5. వారందరికి ఏమైంది ?

5. వ్యతిరేకార్థక వాక్యం – కర్త చేయవలసిన పనిని చేయడు అని చెప్పడం.
ఉదా :

  1. రాజు ఈరోజు బడికి రాడు.
  2. లత సినిమా చూడదు.
  3. అమ్మ ఊరికి వెళ్ళదు.
  4. వాడు పాఠం వ్రాయడు.
  5. రాము చదవడు.

TS 10th Class Telugu Grammar Questions and Answers

6. నిషేధార్థక వాక్యం – ఎవరూ ఈ పనిని చేయకూడదనే భావన ఉంటుంది.
ఉదా :

  1. పరీక్ష మొదలైన తరువాత ఎవరూ లోనికి రాకూడదు.
  2. మీరు అల్లరి చేయవద్దు.
  3. మీరు బయట తిరగవద్దు.
  4. దుష్టులతో స్నేహం వద్దు.
  5. మీరు రావద్దు.
  6. మీరు వెళ్ళవద్దు.
  7. నీవు తినవద్దు.

7. నిశ్చయార్థక వాక్యం – ఒక నిశ్చయాన్ని తెలిపేందుకు వాడే వాక్యం. కర్తకు లేక మరొక పదానికి “ఏ, అ”లు చేర్చడం వలన ఏర్పడును. లేకుండా కూడా ఉండవచ్చును.
ఉదా :

  1. రాముడే రక్షకుడు, రాముడు రక్షకుడు, వాడు శాస్త్రవేత్త.
  2. నేను తప్పక వస్తాను.
  3. నేను రేపు రాస్తాను.
  4. రాము తప్పక వెళ్తాడు.
  5. గోపాల్ చెట్టు ఎక్కాలి.

8. ఆశ్చర్యార్థక వాక్యం – ఆశ్చర్యాన్ని తెలిపేది.
ఉదా :

  1. అయ్యో ! ఎంత కష్టం వచ్చింది, ఆహా ! ఎంత బాగున్నదో !
  2. ఆహా ! కూర ఎంత బాగుందో !
  3. ఆహా ! చిత్రం ఎంత అద్భుతంగా ఉందో !
  4. ఆహా ! ఏమి ప్రకృతి రమణీయత !
  5. ఆహా ! ఎంత బాగుందీ !

TS 10th Class Telugu Grammar Questions and Answers

9. ప్రార్థనార్థక వాక్యం – ఇతరులను ప్రార్థించు, అర్థించు అనే విషయంలో ఈ వాక్యాలు వస్తాయి.
ఉదా :

  1. దయచేసి అనుమతించండి.
  2. నన్ను అనుగ్రహించండి.
  3. నాకు సెలవు ఇవ్వండి.
  4. లోపలికి అనుమతించండి.
  5. అయ్యా ! నాకు చదువు చెప్పండి.
  6. దయచేసి నన్ను కాపాడు.
  7. దయచేసి ఆ పనిని పూర్తి చేయండి.

10. అప్యర్థకం – ‘అపి’ అనగా కూడా అని అర్థం. కూడా అనే పదాన్ని ప్రయోగించాల్సిన సమయంలో ఈ వాక్యాలను వాడుతాము.
ఉదా :

  1. వర్షాలు వచ్చినా చెరువు నిండలేదు.
  2. అధికారులు వచ్చినా సమస్యలు తీరలేదు.
  3. ముఖ్యమంత్రి వచ్చినా స్పందన లేదు.
  4. వర్షాలు పడినా ధరలు తగ్గలేదు.
  5. బాగా చదివినా మార్కులు రాలేదు.
  6. రైలు వచ్చినా చుట్టాలు రాలేదు.
  7. దేవుడు దిగివచ్చినా, ఆయన గెలవలేదు.

11. శత్రర్థకము వర్తమాన అసమాపక క్రియను శత్రర్థకము అని అంటారు.
ఉదా :

  1. రాము తింటూ వింటున్నాడు.
  2. అమ్మ వండుతూ చదువుతున్నది.
  3. లత పాడుతూ నటిస్తున్నది.
  4. శ్రీను పాఠం వింటూ రాస్తున్నాడు.

TS 10th Class Telugu Grammar Questions and Answers

12. తద్ధర్మార్థక వాక్యం – మూడు కాలాల యందును జరుగు పనులను తెలియజేయును.
ఉదా :

  1. సూర్యుడు తూర్పున ఉదయించును.
  2. అగ్ని మండును.
  3. సముద్రపు నీరు ఉప్పగా ఉండును.
  4. ఆవుపాలు మధురంగా ఉండును.

13. ఆశీర్వచనార్థకం – ఆశీస్సును తెలియజేయు వాక్యములను ఆశీర్వచనార్థక వాక్యాలు అంటారు.
ఉదా :

  1. మీకు మేలు కలుగుగాక
  2. మీకు క్షేమం కలుగుగాక
  3. భగవంతుడు మిమ్ము అనుగ్రహించు గాక
  4. మీ మార్గం ఫలప్రదం అగునుగాక
  5. మీకు విజయం సిద్ధించుగాక.
  6. మీరు ఉత్తీర్ణులగుదురుగాక.

14. హేత్వర్థక వాక్యం – హేతువు అనగా కారణం. ఒక పని జరగడానికి ఒక నిమిత్తం ఉండాలి. అలాంటి వాక్యాలను హేత్వర్థక వాక్యాలు అని అంటారు.
ఉదా :

  1. బాగా చదవడం వల్ల మార్కులు వచ్చాయి.
  2. వరదలు రావడంతో ఇబ్బందులు వచ్చాయి.
  3. మురుగునీరు రావడంతో దోమలు వచ్చాయి.
  4. వర్షాలు కురవడంతో రైతులు ఆనందించారు.

TS 10th Class Telugu Grammar Questions and Answers

15. సామర్థ్యార్థకం – పనిని చేయుటయందు సమర్థత కలిగి ఉండటం.
ఉదా :

  1. రవి పాడగలడు.
  2. లత చక్కగా చిత్రం వేయగలదు.
  3. అర్జునుడు యుద్ధం చేయగలడు.
  4. ప్రధాని సామర్థ్యాన్ని నిరూపించుకొనగలడు.

వాక్యములు – భేదములు

ఒక భావమును తెలుపు పదముల సముదాయమే వాక్యము.
ఉదా : రాముడు పాఠమును చదివెను.

ఒక్కొక్కప్పుడు ప్రశ్నకు సమాధానంగా ఒక మాటనే చెప్పవచ్చును. అది పూర్తి భావాన్ని ఇస్తుంది. కనుక అదియును వాక్యమే అగును.
ఉదా : నీదేవూరు ? – విజయవాడ.
నీ పేరేమి ? – రామరాజు.
వాక్యములు ముఖ్యముగా మూడు రకములు.
అవి :

  1. సామాన్య వాక్యము,
  2. సంక్లిష్ట వాక్యము,
  3. సంయుక్త వాక్యము.

1. సామాన్య వాక్యము (Simple Sentence) :
దీనిని సంపూర్ణ వాక్యము అని కూడా అంటారు. పూర్తి అర్థమును తెలుపుతూ సమాపక క్రియతో కూడినది సామాన్య వాక్యము.
ఉదా :
హనుమంతుడు సముద్రమును దాటెను. భావమును పూర్తిగా చెప్పకుండా అసమాపక క్రియతో కూడిన వాక్యము అసంపూర్ణ వాక్యము. దీనినే ఉపవాక్యము అందురు. ఉదా : నేను బడికి వెళ్ళి.

2. సంక్లిష్ట వాక్యము (Complex Sentence) :
ఒక ప్రధాన వాక్యము, ఒకటిగాని అంతకంటే ఎక్కువగాని ఉపవాక్యములు కలిగియుండు వాక్యమే సంక్లిష్ట వాక్యము. దీనిలో ప్రధాన వాక్యంలో సమాపక క్రియ, ఉపవాక్యాల్లో అసమాపక క్రియ ఉంటాయి.

TS 10th Class Telugu Grammar Questions and Answers

ఉదా :
మీరు వచ్చినచో, ఊరికి వెళ్ళుదము. సీత పాటను పాడి, బహుమతి గెల్చుకొనెను. వాడు చదివినా, అర్థం కాలేదు.
రెండు సామాన్య వాక్యాలు కలిపి సంక్లిష్ట వాక్యముగా చేయవచ్చును. అప్పుడు మొదటి వాక్యంలోని క్రియ అసమాపక క్రియ అవుతుంది.
ఉదా :

  1. వాడు బడికి వెళ్ళాడు. వాడు పాఠమును చదివాడు.
    వాడు బడికి వెళ్ళి పాఠమును చదివాడు.
  2. సీత నవ్వుతున్నది. సీత మాట్లాడుతున్నది.
    సీత నవ్వుతూ మాట్లాడుతున్నది.

3. సంయుక్త వాక్యము (Compound Sentence) :
పరస్పర సంబంధము గల రెండు వాక్యములు ఒకే వాక్యములో ఉన్నచో అది సంయుక్త వాక్యము.
ఉదా : అతడు విద్యావంతుడే గాక వినయశీలి కూడ.
వాడు చదివాడు కాని, అర్థం కాలేదు.

అర్థాలు

అంగన = స్త్రీ
అగ్రహారం = బ్రాహ్మణ పండితులకు రాజులు బహుమతిగా ఇచ్చే ఇళ్లు, భూములు
అభీప్సితం = కోరిక
అభ్యాగతుడు = భోజన సమయానికి వచ్చిన అతిథి
ఆర్ధ = తడిసిన
ఆసరా = తోడు
ఈవి = త్యాగం
ఉద్ది = జత
ఉన్నతి = ప్రగతి
ఉమ్రావులు = ఉన్నత వంశీయులైన కళాపోషకులు
ఏపు = వికాసం
ఏరుతార్లు = భేదాలు
కడగండ్ల = కష్టాలు
కయ్య = కాలువ
కర్దమం = బురద

TS 10th Class Telugu Grammar Questions and Answers

పర్యాయ పదాలు

యశం = కీర్తి, గొప్ప
రవం = శబ్దం, ధ్వని
జెండా = పతాకం, కేతనం
రైతు = హాలికుడు, కర్షకుడు
అరణ్యం = వనం, అడవి
పల్లె = గ్రామం, జనపదం
తారలు = చుక్కలు, నక్షత్రాలు
మబ్బు = మేఘం, తెచ్చి
హాటకం = బంగారం, హోన్ను
సంబురం = సంతోషం, ఆనందం
వేదండము = ఏనుగు, కరి
వెన్నెల = జ్యోత్స్న, కౌముది
వటువు = బ్రహ్మచారి, వర్ణి, వడుగు
భండనం = యుద్ధం, రణం
కృపాణం = కత్తి, ఖడ్గం
పొలిమేర = సరిహద్దు, ఎల్ల
పొంకంగ = సొంపుగా, అందంగా
దేవాలయం = గుడి, కోవెల
పురాగ = మొత్తం, అంతా

వ్యుత్పత్త్యర్థాలు

నీరజభవుడు  –  విష్ణువు నాభి కమలము నందు పుట్టినవాడు (బ్రహ్మ)
పారాశర్యుడు  –  పరాశర మహర్షి కుమారుడు (వ్యాసుడు)
త్రివిక్రముడు  –  ముల్లోకాలను ఆక్రమించినవాడు (విష్ణువు)
గురువు  –  ఆజ్ఞానమనే అంధకారిని తొలగించే వాడు (ఉపాధ్యాయుడు)
అధ్యక్షుడు  –  చర్యలను కనిపెట్టి చూచేవాడు
విశ్వంభరుడు  –  విశ్వాన్ని భరించేవాడు (విష్ణువు)
భాగీరధీ  –  భగీరథమునిచే తీసుకురాబడదు
భాష  –  భాషింపబడేది (గంగ)
విష్ణువు  –  విశ్వమంతటా వ్యాపించి ఉండేవాడు (విష్ణుమూర్తి)

TS 10th Class Telugu Grammar Questions and Answers

నానార్థాలు

అంబరము = వస్త్రం, ఆకాశం
ఆశ = కోరిక, దిక్కు
హరి = విష్ణువు, ఇంద్రుడు, గుర్రం
క్షేత్రం = చోటు, పుణ్యస్థానం
స్కందం = కొమ్మ, ప్రకరణం
సిరి = సంపద, లక్ష్మీ
రాజు = ప్రభువు, ఇంద్రుడు
బుధుడు = పండితుడు, బుధగ్రహం
వర్షం = వాన, సంవత్సరం, దేశం
పణం = పందెం, కూలి, వెలి
ఘనం = మేఘం, ఏనుగు, కఠినం
గురువు = ఉపాధ్యాయుడు, తండ్రి, బృహస్పతి
కులం = వంశం, జాతి
సాహిత్యం = కలయిత, వాజ్ఞ్మయం
వీడు = పట్టణం, వదలడం, ఇతడు
బాష్పం = కన్నీరు, ఆవిరి

ప్రకృతి – వికృతులు

ప్రకృతి – వికృతి

సముద్రం – సంద్రం
ఆధారం – అదెరువు
విద్య – విద్దె
శిఖ – సిగ
ప్రయాణం – పైనం
దిశ – దెస
భిక్ష – బిచ్చ
యాత్ర – జాతర
మత్స్యం – మచ్చెం
పంక్తి – బంతి
రత్నం – రతనం
ఆజ్ఞ – ఆన
ఆశ్చర్యం – అచ్చెరువు
కవిత – కైత
కార్యం – కర్జం
కావ్యం – కబ్బం
భాష – బాస

TS 10th Class Telugu Grammar Questions and Answers

సొంత వాక్యాలు

1. సయ్యాటలాడు : ఆకాశంలో ఎగిరిన పతంగి గాలితో సయ్యాటలాడుతోంది.

2. చెవి వారిచ్చి : మా నానమ్మ చెప్పే కథలను చెవి వారిచ్చి వింటాను.

3. కుటిలవాజితనం : మనుషులకు ఉండకూడని లక్షణం కుటిలవాజితనం.

4. పొలిమేర : మా ఊరి పొలిమేరలో మంజీర నది ప్రవహిస్తుంది.

5. నగారా : అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది.

6. మచ్చుతునక : తెలంగాణ చరిత్రలో పాపన్నపేట సంస్థానం మచ్చుతునక.

7. భాసిల్లు : ఏడుపాయల వనదుర్గ ఆలయం పచ్చని రమణీయతల మధ్య భాసిల్లుతోంది.

8. ముసురుకొను : బెల్లం చుట్టూ ఈగలు ముసురు కున్నాయి.

9. ప్రాణం పోయడం : తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ ప్రాణం పోశారు.

10. గొంతు వినిపించు రాష్ట్ర సమస్యలపై ప్రధానితో అభిలాష్ తన గొంతు వినిపించాడు.

11. యజ్ఞం : గ్రామ క్షేమం కోసం మందిరంలో యజ్ఞం జరిగింది.

12. చెరగని త్యాగం : తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న విద్యార్థులు చెరగని త్యాగంగా మిగిలారు.

13. పుట్టినిల్లు : సంస్కృతి సంప్రదాయాలకు భారతదేశం పుట్టినిల్లు.

14. ఏకాకి : పల్లెల్లో ఏకాకి జీవనం కనిపించదు.

TS 10th Class Telugu Grammar Questions and Answers

15. చిత్తశుద్ధి : చిత్తశుద్ధితో చేసిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది.

16. గజ్జెకట్టు : ఆర్థిక అసమానతలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు వీరేశం గజ్జెకట్టాడు.

17. పఠనీయ గ్రంథం : మనిషి జీవితం పఠనీయ గ్రంథం లాంటిది.

TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి

Telangana SCERT 10th Class Telugu Guide Telangana 8th Lesson లక్ష్యసిద్ధి Textbook Questions and Answers.

TS 10th Class Telugu 8th Lesson Questions and Answers Telangana లక్ష్యసిద్ధి

ప్రశ్నలు – జవాబులు (T.B. P.No. 77)

ప్రశ్న 1.
పైనున్న సంపాదకీయ శీర్షికలు ఏ విషయాన్ని తెలుపుతున్నాయి ?
జవాబు:
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని గురించి.

ప్రశ్న 2.
ఆ వార్తకున్న ప్రాధాన్యమేమిటి ?
జవాబు:
తెలంగాణ ప్రజలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తాము నష్టపోతున్నామనీ, ప్రత్యేకంగా తెలంగాణగా విడిపోతే, తమ ప్రాంతాన్ని తాము అభివృద్ధి చేసుకోవచ్చనీ, చాలాకాలంగా తమ ప్రాంతాన్ని వేరు రాష్ట్రంగా ప్రకటించమనీ కోరుతున్నారు. ఆ ప్రజల అభి మతమూ, వారి లక్ష్యమూ సిద్ధించాయని ఆ వార్త తెలుపుతోంది.

TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 3.
మీరెప్పుడైనా సంపాదకీయాలు చదివారా ? సంపాదకీయమంటే ఏమిటి ?
జవాబు:
సినిమా వార్తలు, క్రీడావార్తలు తప్ప సంపాదకీయాలను పెద్దగా చదువం. కాని, సంపాదకీయమంటే తెలుసు. ప్రతిరోజూ వార్తలు దినపత్రికలలో ప్రచురిస్తారు. ఒక్కొక్క రోజున ఒక్కొక్క వార్త చాలా ప్రాధాన్యం కలిగి ఉంటుంది. ఆ విధంగా ప్రాధాన్యం కలిగిన వార్తలోని విషయాన్ని పత్రికా సంపాదకులు విశ్లేషిస్తారు. అదే సంపాదకీయం. అంటే సమకాలీన వార్తలపైన పత్రికల విశ్లేషణ.

ప్రశ్న 4.
సంపాదకీయాల ద్వారా ఆయా పత్రికల గూర్చి మనం ఏం తెలుసుకోవచ్చు?
జవాబు:
సంపాదకీయాల ద్వారా ఆయా పత్రికల మనో భావాలు తెలుస్తాయి. ఆ పత్రిక ఎవరికి అను కూలమో కూడా తెలుసుకోవచ్చు. పత్రికల యొక్క విశ్లేషణా సామర్థ్యం తెలుసుకోవచ్చు. సమకాలీన సమస్యలపై పత్రికకు ఉన్న అవగాహన తెలుస్తుంది.

TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 79)

“అర్థరాత్రి వేళ ప్రపంచమంతా నిద్రిస్తున్నప్పుడు ………… హృదయాలను ఆర్ద్రంగా మార్చాయి.

ప్రశ్న 1.
“సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది.” ఈ మాటలన్నది ఏ సందర్భంలో ? ఎవరన్నారు?
జవాబు:
పాతదనంలోంచి కొత్తదనంలోకి అడుగుపెడుతాం. ఒక శకం ముగుస్తుంది. సుదీర్ఘకాలం అణచివేయ బడిన తెలంగాణ జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుం దని” దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు నెహ్రూ గారు ఈ మాటలన్నారు.

ప్రశ్న 2.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటంలోని ఏయే ఘట్టాలు ఈ ప్రాంత ప్రజల హృదయాలను ఆర్ద్రంగా మార్చాయి?
జవాబు:
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన వేళ మూడు తరాల తెలంగాణ బిడ్డల నుండి భావోద్వేగంతో భాష్పాలు రాలాయి. 1969 ఉద్యమం, మలిదశ పోరాటం, పతాకస్థాయి ఘట్టాలు, లాఠీలు ….. తూటాలు ….. గాయాలు ఇట్లా ఎవరి జ్ఞాపకాలు, అనుభూతులు వారివి. ఆనందోత్సాహాలతో పాటు పోరాట జ్ఞాపకాలు కూడా ముసురుకొని హృదయాలను ఆర్థంగా మార్చాయి.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 80)

తెలంగాణలోని ప్రతి అడుగడుగూ ఉద్యమ చరిత్రతో ………. అమరవీరులకు నివాళులు

ప్రశ్న 1.
‘జై తెలంగాణ’ నినాదం బలపడడానికి దారితీసిన సంఘటనలేవి ? వాటి పర్యవసానాలేవి ?
జవాబు:
తెలంగాణ ప్రతి విషయం ఉద్యమంతో ముడిపడి ఉన్నదే. ప్రతి ప్రదేశం ఉద్యమంతో ముడిపడిన పవిత్ర ప్రదేశమే. సచివాలయంలో ‘నల్లపోచమ్మ’ గుడి ఉండేది. అది మనకు పరమ పవిత్రమైన దేవాలయం కదా ! అక్కడ ‘నల్లపోచమ్మ’ను మాయం చేసి ‘బెజవాడ కనకదుర్గ’ ను పెట్టారు.

దాంతో తెలంగాణ ఉద్యోగులు పోరాటానికి దిగారు. మళ్ళీ ‘నల్లపోచమ్మ’ వెలిసింది. ఇది ‘జై తెలంగాణ’ నినాదాన్ని బలపరిచింది. పర్యవసానంగా మన తొలి ముఖ్యమంత్రి కె.సి.ఆర్. గారు ఆ గుడిలోనే పూజలు చేశారు.

ఉద్యమం చివరిదశలో ‘పరేడ్ గ్రౌండ్’ లో సభ పెట్టుకోవడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. దానితో ‘జై తెలంగాణ’ నినాదం మిన్నంటింది. తెలంగాణ మొత్తం ‘జై తెలంగాణ’ నినాదంతో దద్దరిల్లి పోయింది. పర్యవసానంగా మన బంగారు ‘తెలంగాణ’ మనకేర్పడింది. మన ప్రియతమ ముఖ్యమంత్రిగారు అదే ‘పరేడ్ గ్రౌండ్’ లో గౌరవ వందనం స్వీకరించారు.

ప్రశ్న 2.
ఉద్యమకాలంలో హైదరాబాదు వీధులు, మైదానాల ప్రత్యేకతలు ఏమిటి ?
జవాబు:
ఉస్మానియా క్యాంపస్లో లాఠీచార్జీ, గస్పార్క్ అమర వీరుల స్తూపం దగ్గర చర్చలు, ముళ్ళతీగలను ఛేదించుకొని అమర వీరుల స్తూపం దగ్గరకు ఉరకడం ‘ఇవన్నీ’ ఉద్యమకాలంలో జరిగిన ప్రత్యేకతలు.

ప్రశ్న 3.
“గన్పార్క్ అమరవీరుల స్తూపంతో ముడిపడిన సంఘటన లెన్నో……….. ఆ సంఘటనలను గురించి చర్చించండి.
జవాబు:
తెలంగాణ ఉద్యమం గస్పార్క్ అమరవీరుల స్తూపంతో విడదీయలేని సంబంధం కలిగి ఉంది. ఉద్యమం ప్రతి దశలో, ప్రతి మలుపులోనూ, ప్రతి సంఘటనలోనూ ‘గస్పార్క్’ ససాక్ష్యంగా నిలిచింది. తెలంగాణ బిడ్డలు ‘గస్పార్క్’ దగ్గర కలుసుకొని చర్చించుకొనేవారు. వలసపాలకులు ఆంక్షలను ఉద్యమకారులు ధిక్కరించేవారు.

లాఠీ దెబ్బలకు జంకలేదు. ముళ్ళతీగలను ఛేదించేవారు. అమర వీరుల స్తూపం దగ్గరకు ఉరికేవారు. జూన్ రెండున అనేకమంది అక్కడ చేరి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. ‘గన్పార్క్’ చూస్తే అమరవీరుల త్యాగాలు గుర్తుకు వస్తాయి. కళ్ళు చెమ్మగిల్లుతాయి.

TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 81)

స్వీయరాష్ట్రం సిద్ధించింది గనుక ఇక జాతి ……..
…………. ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది.

ప్రశ్న 1.
తెలంగాణ పునర్నిర్మాణంలో ఎట్లాంటి చర్యలు వెంటనే చేపట్టాలని సంపాదకుడు భావిస్తున్నాడు ? దీన్ని మీరు సమర్థిస్తారా ?
జవాబు:
తెలంగాణ పునర్నిర్మాణం జరగాలి. తెలంగాణ ప్రజలకు కావలసింది ప్రశాంతత. పచ్చని బతుకు. తెలంగాణ పునర్నిర్మాణానికి శక్తియుక్తులన్నీ కూడ గట్టాలని సంపాదకీయం పేర్కొంది. మా అభిప్రాయం కూడా ఇదే. మూడు తరాల నుండి ఉద్యమాలతో ప్రశాంతత లేదు. ఎటు చూసినా బాధలే. ఎటు చూసినా కన్నీరే. ఎటు చూసినా ఉద్రిక్తతలే. ఇంక మంచిరోజులు వచ్చాయి. ఇంక కావలసినది ప్రశాంతత.

ఉద్యమాలతో చాలామంది తమ ప్రాణాలను కోల్పోయారు. ప్రాణప్రదమైన వారిని కోల్పోయేరు. ఇక పచ్చని బతుకులు కావాలనేదే మా అందరి కోరిక. తెలంగాణ ప్రజలందరికీ కావలసినది కడుపు నిండా తిండి. కంటినిండా నిద్ర. రేపటి గురించి గుబులు లేని జీవితం అని కూడా సంపాదకీయం పేర్కొంది. మా కోరిక కూడా అదే.

ప్రశ్న 2.
నవ తెలంగాణ నిర్మాణంలో ప్రభుత్వ వ్యూహాలు ఏమిటి
జవాబు:
మూడు తరాల నుండి అణచివేతలో మగ్గిన సమాజాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం వ్యూహాలు తయారుచేసుకొంది.

  1. సంక్షేమ పథకాలు కచ్చితంగా అమలు జరిగేలా చూడాలి. అణచివేతకు గురైన మన సమాజాన్ని ఆదుకోవాలి.
  2. రుణమాఫీ – రైతులు అప్పులపాలై అప్పులు తీర్చే దారిలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆ పరిస్థితి నివారించాలంటే ‘రుణమాఫీ’ తప్పనిసరిగా అమలు జరగాలి.
  3. నీటి పారుదల – నీటి విషయంలో కూడా వివక్షకు గురయ్యాం. గురవుతున్నాం. ఈ పరిస్థితి నివారించక పోతే పంట పొలాలు ఎండిపోతాయి. విద్యుత్తు తగ్గిపోతుంది. అందుచేత ‘నీటి పారుదల’ అనేది చాలా పెద్ద పని.
  4. పరిపాలనా సంస్కరణలు – పాలనాపరమైన సంస్కరణలు కూడా చేపట్టాలి. మన పరిపాలన మనమే చేసుకొనే బంగారు రోజులు వచ్చాయి. కనుక మనకు అనుకూలమైన సంస్కరణలు పరిపాలనలో తీసుకొని రావాలి.

ప్రశ్న 3.
తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మీరెట్లాంటి పాత్ర పోషిస్తారు?
జవాబు:

  1. సంక్షేమ పథకాలు అమలయ్యేటట్లు చూస్తాను.
  2. రుణాలు మాఫీ, 2 పడకల గదుల ఇల్లు. ఇలాంటి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చుతాను.
  3. వ్యక్తిగా ప్రభుత్వపు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల నిర్వహణలో ప్రభుత్వానికి అండగా ఉంటాను.
  4. గౌరవానికి భంగం కలుగకుండా నవతెలంగాణ నిర్మాణానికి సహకరిస్తాను.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కృషిచేసిన వారిని అభినందించడానికి మీ పాఠశాలలో సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఏదైనా ఒక అంశం గురించి మాట్లాడాలి. మీరైతే కింది అంశాలలో దేని గురించి మాట్లాడుతారు ?
అ) రాష్ట్రసాధనలో కవులు, కళాకారుల పాత్ర.
ఆ) ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల పాత్ర.
ఇ) ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల పాత్ర.
ఈ) సకలజనుల పాత్ర.
జవాబు:
అ) రాష్ట్ర సాధనలో కవులు, కళాకారుల పాత్ర :

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కవులు, కళాకారుల పాత్ర ఎంతో ముఖ్యమయినది. 1969 తెలంగాణ తొలి ఉద్యమం కంటే ముందే 1925లో తెలంగాణ ఔన్నత్యాన్ని నిజాం రాష్ట్ర ప్రశంస పేరుతో శేశాద్రి రమణ కవులు ప్రచురించారు. ఆ తర్వాత 1934లో గోల్కొండ కవుల సంచిక ప్రచురితమైంది. దానికి కొనసాగింపుగా వట్టికోట అళ్వారుస్వామి సంపాద కత్వంతో “ఉదయ ఘంటలు” వెలువడింది.

1950లో ‘ప్రత్యూష’ కవితా సంకలనం హైద్రాబాదు కవులు తెచ్చారు. ‘తొలి కారు’ పేరుతో 1957లో వరంగల్ నుంచి కవిత్వ సంకలనం దాశరథి సంకిరెడ్డి నారాయణరెడ్డి గారి “మత్తడి”, “పొక్కిలి” తరువాత జాగో జగావో, దిమ్మెస, క్విట్ తెలంగాణ, ‘గాయాలే గేయాలై’, ‘మునుం’ వంటి కవితా సంకలనాలు వెలువడినాయి. అంతేకాక అనేక జిల్లాల నుండి కవితా సంపుటులు వెలువడ్డాయి.

అందెశ్రీ, గద్దర్, గోరెటి వెంకన్న, జయరాజ్ యస్పాల్ ధూంధాంలు నిర్వహించారు. తొలితరం ఉద్యమంలోనే గూడ అంజయ్య, మిత్ర, దరువు ఎల్లన్న, విమలక్క వంటి గాయకులు, కవులు ఎందరో 1949-1950లో చిత్తలూరి వీరస్వామి, రావెళ్ళ వెంకట్రామారావు మొదలయిన వారితో రసమయి బాలకిషన్, దేశపతి శ్రీనివాస్ వంటి గాయకులు, ఘంటాచక్రపాణి, ఎన్. వేణుగోపాల్, అన్నవరం దేవేందర్, ఘనపురం దేవేందర్, జ్వలిత, జూపాక సుభద్ర, షాజహానా వంటి కవయిత్రులు ఎందరో తెలంగాణ ఉద్యమంలో తమ పాత్ర పోషించారు.

TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి

ఆ) ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల పాత్ర :

ఉద్యోగులు, ఉపాధ్యాయులు తెలంగాణ రాష్ట్ర సాధనకు వెనుదిరగని ఉద్యమాలు చేశారు. సచివాలయంలో రోజూ ఉద్యమాలే. తెలంగాణ ఉద్యోగులు తమ ఉద్యోగాలకంటే ఆత్మాభిమానానికే విలువనిచ్చారు. బెదిరింపులకు భయపడలేదు. నాల్గవ తరగతి ఉద్యోగి నుండి అత్యున్నత అధికారి వరకు ఒకేమాట. ఒకేబాట. అదే ప్రత్యేక రాష్ట్ర సాధన. అవసరమైతే తమ ఉద్యోగాలు వదులుకునేందుకు కూడా సిద్ధపడ్డారు.

ఉపాధ్యాయులదీ అదే బాట. అందుకే అన్నమాట ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ‘స్పెషల్ ఇంక్రి మెంట్’ ఇచ్చి గౌరవించింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా 43 శాతం ఫిట్మెంట్ కూడా ఇచ్చింది.

ఇక విద్యార్థుల ఆవేశం కట్టలు తెచ్చుకొంది. చాలామంది ప్రాణాలను కూడా తృణప్రాయంగా విడిచిపెట్టారు. ఉస్మానియా క్యాంపస్ లో పోలీసు ఆంక్షలను లెక్క చేయకుండా ఉద్యమించారు. తెలంగాణలోని అన్ని యూనివర్శిటీలు, కళాశాలలది ఇదే పరిస్థితి. కేజీ నుండి పీ.జీ వరకు ఒకటేమాట. ఒకేబాట. అదే ‘ జై తెలంగాణ’. తెలంగాణ రాష్ట్రం కావాలి’. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎక్కువ కష్టాలను ఎదుర్కొన్నది విద్యార్థి లోకం.

ఇ) ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల పాత్ర :

ఒక రాష్ట్ర సాధన కోసమే ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డల ఆత్మగౌరవంకు నినాదంగా రూపుదిద్దుకున్నది. ‘తెలంగాణా రాష్ట్ర సమితి టి.ఆర్.యస్.పార్టీ. రాష్ట్ర సాధనకోసం గ్రామ స్థాయి నుంచి ఉద్యమ పార్టీగా, ఉద్యమమే ధ్యేయంగా రూపుదిద్దుకున్నది. ఇతర పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం, కమ్యూనిస్టు పార్టీలు తమ వంతు కృషిచేసినా. వేరు స్థాయినుంచి పటిష్టమైన నిర్మాణం చేయగలిగింది తెరాసే.

ప్రజాప్రతినిధులుగా ప్రజల ఆశలను, ఆలోచన లనూ ప్రతిబింబించే బాధ్యతలను నెత్తికెత్తుకున్న ప్రజాప్రతినిధులు రాష్ట్ర సాధనకై పలుమార్లు తమ పదవులకు రాజీనామాలు చేసి తిరిగి ఎన్నిక కావటం ద్వారా ఈ ప్రాంతపు ప్రజల మనోభావాలను ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేశారు.

రాజకీయ నాయకులుగా రాష్ట్రశ్రేయస్సుకోసం పనిచేస్తూనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషిచేసి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి ప్రత్యేక రాష్ట్ర సాధనకు కృషిచేసిన వాళ్ళందరకీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

ఈ) సకలజనుల పాత్ర :

సకలజనుల సమ్మె ఉద్యమ ఘట్టంలో ప్రధాన భూమిక పోషించింది. అందరూ ‘చేయి చేయి కలిపి’ ముందుకు సాగారు. నాటి ప్రభుత్వానికి వణుకు పుట్టించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సకల జనుల సమ్మెకు దిగి వచ్చాయి. ఈ విధంగా అనేక రకాల ఉద్యమాలు, ఎందరో వీరుల త్యాగఫలమే మన నేటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం.

ప్రశ్న 2.
కింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

1926 మే 19న గోలకొండ పత్రిక ప్రారంభ మైంది. నేడు ఉన్న సదుపాయాలు నాడు పత్రికా నిర్వహణకు ఏమాత్రం లేకుండె. సంపాదకుడే అన్ని పనులు నిర్వహించుకొనేవాడు. విలేఖరిపని, వ్యాస రచయితలపని, గుమాస్తాపని, ప్రూఫ్ రీడర్ పని ఇట్లా దాదాపు అన్ని పనులను ఒక్కరే చేయవలసి వచ్చేది. ఈ పరిస్థితుల్లో గోలకొండ పత్రిక ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొన్నది. బంధుమిత్రుల సహకారంతో సురవరం ప్రతాపరెడ్డి పట్టుదలతో పత్రిక నిర్వహించాడు. 1939 ఆగస్టు 3వ తేదీ నుండి గోలకొండ పత్రికకు సంపాదకుడిగా ప్రతాపరెడ్డి నియమితుడయ్యాడు. గోలకొండ పత్రిక ప్రతాపరెడ్డి ప్రతిభకు అద్దం పట్టింది. తెలంగాణ ప్రజానీకాన్ని జాగృతపరిచింది.

ఆయన రాసిన వ్యాసాలు, విమర్శలు, సంపాద కీయాలు వెయ్యికిపైగా ఉంటాయి. పత్రికలో చర్చా వేదికను నిర్వహించి సత్యాలను నిగ్గుతేల్చే అవకాశాలను విమర్శకులకు కలిగించే వాడు. వ్యక్తి స్వాతంత్ర్యం, పౌరహక్కులు, ప్రాంతీయ భాషలకు, పత్రికా స్వాతంత్ర్యానికి గడ్డురోజులు ఉన్నప్పటికీ కూడా నిజాం ప్రభుత్వం ఆంక్షల నెదుర్కొంటూ గోలకొండ పత్రిక తెలంగాణ ప్రజల్లో కొత్త భావాలను, ఆలోచనలను, చైతన్యాన్ని రగిల్చింది.

అ) గోలకొండ పత్రిక సంపాదకుడెవరు ?
జవాబు:
గోలకొండ పత్రిక సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి గారు.

ఆ) నాటి పత్రికాసంపాదకులు ఏయే పనులు చేసేవారు ?
జవాబు:
నాటి పత్రికాసంపాదకుడే, అన్ని పనులూ నిర్వహించే వాడు. విలేఖరులపని, వ్యాసరచయితలపని, గుమాస్తాపని, ప్రూఫ్ రీడర్పని ఇట్లా అన్ని పనులు చేసేవారు.

TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి

ఇ) ప్రతాపరెడ్డి గోలకొండపత్రిక ద్వారా ఏం చేశాడు?
జవాబు:
సురవరం ప్రతాపరెడ్డిగారు గోలకొండ పత్రిక ద్వారా తెలంగాణా ప్రజానీకాన్ని జాగృతపరచాడు. పత్రికలో చర్చావేదికను నిర్వహించి సత్యాలను నిగ్గు తేల్చేవారు.

ఈ) గోలకొండ పత్రిక వల్ల తెలంగాణ ప్రజలకు కలిగిన ప్రయోజనమేమిటి ?
జవాబు:
వ్యక్తి స్వాతంత్య్రం, పౌరహక్కులు, ప్రాంతీయ భాషలకు పత్రికా స్వాతంత్ర్యానికి గడ్డు రోజులు ఉన్నప్పటికీ కూడా నిజాం ప్రభుత్వం ఆంక్షల నెదుర్కొంటూ గోలకొండ పత్రిక ప్రజల్లో కొత్త భావాలను, ఆలోచనను, చైతన్యాన్ని రగిల్చింది. గోలకొండ పత్రిక వల్ల తెలంగాణ ప్రజలకు నిగ్గు తేల్చే నిజాలను తెలుసుకునే అవకాశం కలిగింది. ప్రజలను ప్రభుత్వంపై ధైర్యంగా పోరాడే ఆత్మస్థైర్యం, సంకల్పబలం కలిగింది. ప్రజల్లో నూతన ఆలోచనల ఆవిష్కరణకు అవకాశం కల్పించింది.

ఉ) పై పేరాకు పేరు పెట్టండి.
జవాబు:
శీర్షిక “గోలకొండ పత్రిక” – ప్రతాపరెడ్డి సంపాదకత్వం.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జాతి చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టంగా ఎందుకు అనుకుంటున్నారు?
జవాబు:
1969 నుండి జూన్, 2014 వరకు సాగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సఫలమై, తెలంగాణ సకల జనుల స్వప్నం సాకారమైన వేళ, భారతదేశ పటంపై 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఇది అద్భుతమైన ఘట్టం. చరిత్రలో అరుదుగా కన్పిస్తుంది. పాతదనం లోంచి కొత్త దనంలోకి అడుగుపెట్టడం.

ఒక శకం ముగుస్తుంది. సుదీర్ఘ కాలం అణచివేయబడిన జాతి తన గొంతు విన్పించింది. ఇది తెలంగాణ సమాజం చేసిన సమిష్టి ప్రకటన. తెలంగాణ పోరాటం గమ్యాన్ని ముద్దాడిన క్షణమది. జాతి చరిత్రలో అరుదైనక్షణం. అత్యద్భుతమైన క్షణం.

ఆ) తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మీరు ఎట్లాంటి పాత్ర పోషిస్తారు?
జవాబు:
తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మేము మా సర్వ శక్తులు ధారపోస్తాము. తెలంగాణా జాతి సర్వతో ముఖాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటాము. తెలంగాణా ఉద్యమకాలంలో ప్రాణాలర్పించిన అమర వీరుల ఆశయాల సాధనకు ఊపిరి ఉన్నంతవరకూ పోరాడుతాము. తెలంగాణా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలూ శ్రమించి వారి కలలను సాకారం చేస్తాము.

తెలంగాణ భాష సంస్కృతులకు మళ్ళీ ప్రాణం పోసి, ఉత్కృష్టమైన తెలంగాణ జీవన విధానాన్ని పునరుద్ధరింపజేసే విధంగా యువతను జాగురూకులను చేస్తాము. రాష్ట్ర ప్రజల మధ్య సామాజిక సంబంధాలు బలపడే విధంగా సామాజిక చర్యలు చేపడతాము. ప్రభుత్వ వ్యూహాలను ప్రజలకు తెలియజేసి, వాటి అమలుకు కృషి చేస్తాము.

  • ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు అన్ని సకాలంలో అమలయ్యే విధంగా చూస్తాము.
  • పరిపాలనా రంగంలో నూతన సంస్కరణలు ప్రవేశ పెట్టి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతాము.
  • తెలంగాణా పునర్నిర్మాణానికి మా శక్తియుక్తులన్ని కూడదీసుకుని కార్యాచరణ దిశగా పయనిస్తాము.
  • నవతెలంగాణ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తామని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తాము.

TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి

ఇ) సంపాదకీయాలు పత్రికల్లో ఎందుకు రాస్తారు ?
జవాబు:
ఒక్కొక్క పత్రికకు కొన్ని విశిష్ఠ లక్షణాలుంటాయి. ఆ పత్రిక ద్వారా చాలా విషయాలు వెలుగు చూస్తాయి. నార్ల వేంకటేశ్వరరావు, తాపీ ధర్మారావు, విద్వాన్ విశ్వం, పింగళి వెంకటకృష్ణారావు, బూదరాజు రాధాకృష్ణ, సురవరం ప్రతాపరెడ్డి లాంటి వ్యక్తులు తమ తమ జ్ఞానంతో, మేధస్సుతో రచనలు చేశారు.

పత్రికలు సమాజానికి ప్రతిబింబాలు. అసంఖ్యాకంగా పాఠకులు చదువుతారు. కాబట్టి సంపాదకీయాలు పత్రికల్లోనే రాస్తారు. అవి ప్రజాదరణ పొందుతాయి.

ఈ) పత్రికలలోని సంపాదకీయాలకు, సాధారణ వార్తాంశాలకు మధ్యనున్న భేదాలేవి ?
జవాబు:
పత్రికకు ప్రాణం సంపాదకీయం. సంపాదకీయం మొత్తం పత్రికకు ప్రతిబింబం. ఆ రోజు జరిగిన ముఖ్యమైన సంఘటనపై సంపాదకుని వ్యాఖ్యానం, విశ్లేషణల సమాహారమే సంపాదకీయం. ఇది వార్తాంశం కాదు. వార్తాంశంపై సమగ్ర విశ్లేషణ. పూర్వాపరాల పరామర్శ, అవసరమైతే తర్వాత కాలానికి కూడా వర్తిస్తుంది. ఇది ప్రధాన సంపాదకుడు రాస్తాడు. సాధారణ వార్తాంశం అంటే ఒక వార్తగా ప్రచురిస్తారు.

ఆయా ప్రాంతాలలోని విలేఖరులు వార్తలు పంపుతారు. వాటి ప్రాధాన్యతాక్రమాన్ని బట్టి పత్రికలో ఏ పేజీలో వెయ్యాలో నిర్ణయిస్తారు. వార్తకు ఆ రోజుకు మాత్రమే విలువ ఉంటుంది. మరునాటికది మామూలు విషయమే. వార్తాంశంలో పెద్దగా విశ్లేషణలు, వ్యాఖ్యానాలు ఉండవు. కేవలం జరిగిన సంఘటన, ప్రజాభిప్రాయం మాత్రమే పాఠకుల దృష్టికి వస్తుంది.

ప్రశ్న 2.
క్రింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) “సంపాదకీయాలు సమకాలీన అంశాలను ప్రతి బింబిస్తాయి” – దీనిని సమర్థిస్తూ వ్రాయండి.
(లేదా)
సంపాదకీయాలు సమకాలీన అంశాలను స్పృశిస్తాయి. దీనిని నీవు ఎలా సమీక్షిస్తావు ?
జవాబు:
ఆధునిక తెలుగు సాహిత్యంలో సంపాదకీయాలకు సమున్నతమైన స్థానం ఉంది. సంపాదకుడిచేత, లేదా సంపాదకుడి తరపున రాయబడేవి సంపాదకీయాలు. ఈ సంపాదకీయాలు దిన పత్రికలకు, ఇతర మాస, వార, సాంవత్సరిక పత్రికలకు తేడాగా ఉంటాయి.

దిన పత్రికల్లోని సంపాదకీయాలు సమకాలీన అంశాలపై స్పందిస్తాయి. ప్రజలను చైతన్యవంతులనుగా చేస్తాయి. ఈ సంపాదకీయాలు పత్రికలకు గుండెకాయ వంటివి. ఇవి ప్రజాశ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని రాయబడతాయి.

ఈ సంపాదకీయాలు సమకాలీన అంశాలపై తీవ్రంగా స్పందిస్తాయి. ముఖ్యంగా స్వాతంత్రపోరాట సమయంలోను, తెలంగాణా ఉద్యమకాలంలోను వ్రాసిన సంపాదకీయాలు ప్రజలను చైతన్యవంతులనుగా మార్చాయి. సంపాదకీయాల్లోని అక్షరాలు ఒక్కోసారి ఫిరంగుల్లా పనిచేస్తాయి. పాలకుల గుండెల్లో దిగిపోతాయి.

తెలంగాణ పోరాటసమయంలో పత్రికలు సంధించిన సంపాదకీయాలు ప్రత్యేకరాష్ట్ర ఆవశ్యకతను తెలియ జేశాయి. తెలంగాణ ప్రాంత ప్రజల్లో వీరత్వం నింపాయి. అందువల్లనే సంపాదకీయాలు సమకాలీన అంశాలను ప్రతిబింబిస్తాయని చక్కగా తెలుస్తోంది.

ప్రశ్న 3.
క్రింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ వ్రాయండి.

అ) ఈ మధ్యకాలంలో చోటుచేసుకున్న ఏదైనా ఒక ప్రధాన సామాజికాంశం / సంఘటనల ఆధారంగా సంపాద కీయ వ్యాసం రాయండి. మీ తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:
సంపాదకీయ వ్యాసం
అవ్యవస్థను చక్కదిద్దిన ఏడాది !
‘ఆరంభం బాగుంటే సగం పని పూర్తి అయినట్లే’ అన్నది ఆంగ్లేయుల నానుడి. ‘నేను ప్రధానమంత్రిని కాను, ప్రధాన సేవకుణ్ణి’ అని ఎర్రకోట బురుజులనుంచి ప్రకటించిన నరేంద్రమోదీ ఏలుబడికి నేటితో ఏడాది పూర్తి అవుతోంది.

పదేళ్ళ యూపీఏ అన్ని రంగాల్లోనూ దేశాన్ని సర్వభ్రష్టం చేసి, అవినీతిలో మాత్రం కొత్త రికార్డులు నెలకొల్పి చరిత్రపుటల్లో కలిసిపోగా, ‘అచ్ఛేదిన్’ కోసం మోదీ సారథ్యంపై ఆమ్ ఆద్మీ పెట్టుకొన్న కొండంత ఆశ ఎన్డీఏకు దక్కిన బంపర్ మెజారిటీల్లోనే ప్రస్ఫుటమైంది.

యూపీఏ నిర్వాకాల వల్ల దేశపాలనకు సంబంధించిన సకల వ్యవస్థలనూ నిష్క్రియాపరత్వం కమ్మేసి, అంతర్జాతీయ పెట్టుబడిదారులు దృష్టిపథంలో ఇండియా లేకుండాపోయిన నేపథ్యంలో అధికారానికి వచ్చిన మోదీ ప్రభుత్వానికి – ఇంటాబయటా ఆ ప్రమాద కర స్తబ్ధతను బదాబదలు చెయ్యడమే ప్రాధాన్య అంశంగా మారింది. విధానాల రూపకల్పన, అమలులో మంత్రివర్గ సచివాలయం (క్యాబినెట్ సెక్రటేరియట్) ద్వారా ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) నిర్ణాయక పాత్ర పోషించేలా వ్యవస్థాగత మార్పులు తెచ్చి, ప్రణాళిక సంఘానికి కొరత వేసిన మోదీ ప్రభుత్వం – పాలనను కొత్త పుంతలు తొక్కించింది.

అవినీతికి ఆస్కారంలేని అవకాశాల స్వర్గంగా ఇండియాను ఆవిష్కరించి, దేశ విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడం ద్వారా మౌలిక సదుపాయాల్ని పెంపొందించి, పారిశ్రామికీకరణకు కొత్త ఊపుతో ఉపాధి అవకాశాలను విస్తారం చేసి, ప్రజల జీవన ప్రమాణాలను పెంచే వ్యూహానికి అనుగుణంగా మోదీ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.

అవినీతి నిరోధక శాసనాలు, భారత్లో తయారీ, స్వచ్ఛభారత్, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి పథకాలు, పెట్టుబడులపై గురిపెట్టి విస్తృతంగా విదేశీ యాత్రలు …. ఇవన్నీ శ్రేష్ఠ భారత్ లక్ష్య సాధనకు ప్రాతిపదికలే. అదే సమయంలో, 128 కోట్ల జనావళి అభివృద్ధి కాంక్షలకు గొడుగు పట్టే విధంగా మోదీ ప్రభుత్వం మరెంతో చెయ్యాల్సి ఉందన్నదీ నిజమే !

III. భాషాంశాలు

పదజాలం

ప్రశ్న 1.
క్రింది పదాలు ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

అ) ముసురుకొను = మూగు, కమ్ము
జవాబు:
మధ్య తరగతి మానవుడిని అనేక సమస్యలు ముసురుకుంటున్నాయి.

ఆ) ప్రాణం పోయు = జీవాన్ని ఇవ్వడం
జవాబు:
మానవత్వంతో చేయు మంచిపనులు సమాజానికి ప్రాణం పోయుచున్నాయి.

ఇ) గొంతు వినిపించు = సమస్యపై స్పందించు, గొంతు విప్పి మాట్లాడుట
జవాబు:
అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు “తమ గొంతును వినిపించుట” లేదు.

ఈ) యజ్ఞం = దీక్షగా చేయు
జవాబు:
విద్యార్థులు విద్యను యజ్ఞంగా చేయాలి.

ప్రశ్న 2.
కింది పదాలకు పర్యాయపదాలు రాసి, వాటితో వాక్యాలు రాయండి.
ఉదా : తారలు = చుక్కలు, నక్షత్రాలు
ఆకాశంలో నక్షత్రాలు మల్లెలు విరబూసినట్లుగా ఎంతో అద్భుతంగా ఉన్నాయి.

అ) జ్ఞాపకం = గుర్తు, లక్ష్యము, లెక్క, జ్ఞప్తి, స్మృతి తెలంగాణ లక్ష్యంగా ప్రజాఉద్యమాలు జరిగాయి.
ఆ) పోరాటం = సమరం, యుద్ధం, కయ్యం, రణం కాకతీయ వీరులు యుద్ధపటిమ కల్గినవారు.
ఇ) విషాదం = భేదం, బాధ, దుఃఖం, వ్యధ భూకంపం వల్ల నేపాల్లో దుఃఖం అలుముకుంది.
ఈ) సంస్కరణ = మార్పుతీసుకొచ్చుట, బాగు చేయుట, సత్కర్మము
కందుకూరి వీరేశలింగంగారు సంఘంలో మార్పు తీసుకువచ్చారు.

TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 3.
దిన పత్రికలకు సంబంధించిన పదజాలం ఆధారంగా భావనా చిత్రాన్ని గీయండి.
జవాబు:
TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి 1

  1. కాశ్మీర్లో తొలి మహిళ ఐపీయస్
  2. మధుమేహం
  3. వారెవ్వా అనార్కలీ
  4. ఇష్టపడి చదివా. నెంబర్వనయ్యా

వ్యాకరణాంశాలు

ప్రశ్న 1.
కింది ప్రత్యక్ష కథన వాక్యాలను పరోక్ష కథనంలోకి మార్చండి.

అ) రాజకీయపార్టీలవారు “జనానికి తక్షణం కావల్సింది కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర” అని ఎన్నికల ప్రకటించారు.
జవాబు:
రాజకీయపార్టీలవారు జనానికి తక్షణం కావల్సింది కడుపునిండా తిండి, కంటినిండా నిద్రాయని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటించారు.

ఆ) “సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది” అని నెహ్రూ అన్నాడు.
జవాబు:
సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుందని నెహ్రూ అన్నాడు.

ప్రశ్న 2.
క్రింది పరోక్ష కథన వాక్యాలను ప్రత్యక్ష కథనంలోకి మార్చండి.

అ) పరిపాలనారంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం అవసరమని ముఖ్యమంత్రి ప్రకటించాడు.
జవాబు:
“పరిపాలనారంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం అవసరం” అని ముఖ్యమంత్రి ప్రకటించాడు.

ఆ) సమాజాన్ని సంక్షేమపథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరని మేధావులు నిర్ణయించారు.
జవాబు:
“సమాజాన్ని సంక్షేమపథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరి” అని మేధావులు నిర్ణయించారు.

ఇ) తెలుగులోనే రాయండని, తెలుగే మాట్లాడండని టివి ఛానల్లో ప్రసారం చేశారు.
జవాబు:
“తెలుగులోనే రాయండి. తెలుగే మాట్లాడండి” అని టివి. ఛానల్లో ప్రసారం చేశారు.

ప్రశ్న 3.
క్రింది పదాలను విడదీసి, సంధులను గుర్తించి, సూత్రాలను రాయండి.

అ) ప్రపంచమంతా = ప్రపంచము + అంతా – ఉకారసంధి
సూత్రం: ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు.

ఆ) అత్యద్భుతం = అతి + అద్భుతం = యణాదేశసంధి
సూత్రం: ఇ, ఉ, ఋ లకు అసవర్ణములైన అచ్చులు పరమగునప్పుడు క్రమముగా య, వ, ర లు ఆదేశంగా వస్తాయి.

ఇ) సచివాలయం = సచివ + ఆలయం = సవర్ణదీర్ఘసంధి
సూత్రం: అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమగునప్పుడు వాని దీర్ఘము ఏకాదేశమగును.

ప్రశ్న 4.
క్రింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి.
సమాసపదం – విగ్రహవాక్యం – సమాసం పేరు
అ) బృహత్కార్యం – బృహత్ అయిన కార్యం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఆ) శక్తియుక్తులు – శక్తియును, యుక్తియును – ద్వంద్వ సమాసం
ఇ) సంక్షేమ పథకాలు – సంక్షేమము కొరకు పథకాలు – చతుర్థీతత్పురుష సమాసం

TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి

అతిశయోక్తి అలంకారం

III. కింది ఉదాహరణను పరిశీలించండి.

ఉదా : హిమాలయ శిఖరాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

హిమాలయ పర్వతాలు చాలా ఎత్తుగా ఉంటాయి. కాని అవి నిజంగా ఆకాశాన్ని తాకవు. కాని వాటిని ఎక్కువచేసి చెప్పడంవల్ల ‘ఆకాశాన్ని తాకుతున్నాయి” అని అంటున్నాము.

ఏదైనా ఒక వస్తువుని గాని, విషయాన్ని గాని ఉన్న దాని కంటే ఎక్కువ చేసి చెప్పడం ‘అతిశయోక్తి’ అలంకారం

కింది లక్ష్యాలను పరిశీలించండి. అలంకారం గుర్తించండి.
(కింది పద్యం సీతాదేవి, అశోకవనంలో హనుమంతుని విరాడ్రూప దర్శన సందర్భంలోనిది)

అ) కం. చుక్కలు తల పూవులుగా
నక్కజముగ మేను పెంచి యంబరవీథిన్
వెక్కసమై చూపట్టిన
నక్కోమలి ముదము నొందె నాత్మస్థితిలోన్.
– మొల్ల రామాయణం

పై పద్యపాదం అతిశయోక్తి అలంకారానికి చెందినది.

సమన్వయం : పై పద్యంలో హనుమంతుడు శరీరాన్ని పెంచితే ఆకాశంలోని నక్షత్రాలు కనబడ్డాయని అనగా బాగా ఎత్తు పెరిగాడని చెప్పడానికి ఉన్న దాని కన్నా ఎక్కువ చేసి చెప్పబడినది కావున ఇది అతిశయోక్తి అలంకారం.

ఆ) మా ఊర్లో సముద్రమంత చెరువు ఉన్నది.
జవాబు:
వివరణ : చెరువును వర్ణించుట ప్రధానం. దానిని ఎక్కువ చేసి సముద్రమంత అని చెప్పడం అతిశయోక్తి.

ఇ) అభిరాం తాటి చెట్టంత పొడవు ఉన్నాడు.
జవాబు:
సమన్వయం / వివరణ / = అభిరాం యొక్క పొడవును చెప్పటాన్కి తాటిచెట్టంత అని చెప్పడం అతిశయోక్తి కావున దీనిలో అతిశయోక్తి అలంకారం ఉంది.

స్వభావోక్తి అలంకారం

క్రింది ఉదాహరణను పరిశీలించండి.
శివాజీ ఎర్రబడిన కన్నులతో అదిరిపడే పై పెదవితో ఘనహుంకారముతో కదలాడే కనుబొమ్మ ముడితో గర్జిస్తూ “గౌరవించదగిన, పూజించదగిన స్త్రీని బంధించి అవమానిస్తావా ? అని సోన్దేవుని మంద లించాడు.

పై వాక్యంలో కన్నులు ఎర్రబడటం, పై పెదవి అదరడం, గట్టిగా హుంకరించడం, కనుబొమ్మ ముడి కదలాడటం కోపంగా ఉన్నప్పుడు కలిగే స్వభావాలు. ఇట్లా ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడం కూడా ఒక అలంకారమె. దీన్ని ‘స్వభా వోక్తి’ అలంకారం అంటారు.

స్వభావోక్తి అలంకారం : విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడమే ‘స్వభావోక్తి అలంకారం’. “జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు నిగిడ్చి చెంగు చెంగున గెంతుతున్నాయి”.
పై వాక్యంలోని అలంకారాన్ని గుర్తించండి.

సమన్వయం : జింకలు సహజంగానే బిత్తర చూపులు చూడటం, చెవులు నిగిడ్చిటం, చెంగు చెంగున గెంతడం సహజ సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం.

ప్రాజెక్టు పని

వివిధ దిన పత్రికల ఆధారంగా 5 సంపాదకీయ వ్యాసాలు సేకరించండి. చదివి అర్థం చేసుకొండి. కీలకాంశాలను గుర్తించండి. పట్టికలో నమోదు చేయండి. నివేదిక రాసి ప్రదర్శించండి.
TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి 2
జవాబు:
TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి 3
TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి 4

TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి

విశేషాంశాలు:

1969 – ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం :
తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన కొన్ని రక్షణలు, షరతులు ప్రాతిపదికపై ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. పెద్దమనుషుల ఒప్పందం కుదుర్చుకొనబడింది. ప్రభుత్వానికి తగు సిఫార్సులు చేసేటందుకు ఒక ప్రాంతీయ సంఘం ఉండేది. పెద్దమనుషుల ఒప్పందం తూ.చ. తప్పకుండ అమలవు తుందని కేంద్ర ప్రభుత్వం వారు హామీ ఇచ్చారు. కాని విఫలమయ్యారు. ప్రజల నమ్మకానికి ద్రోహం జరిగింది.

ప్రజల్లో పెద్దపెట్టున అసంతృప్తి చెలరేగింది. తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరు కున్నారు. స్వల్ప వ్యవధిలోనే ఇది స్వచ్ఛందమైన, ఉద్ధృత మైన ప్రజోద్యమంగా మారింది. గ్రామం మొదలుకొని నగరం వరకు అన్ని రంగాలకు చెందిన యువకులు, మహిళలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరు ఉద్యమంలో పాల్గొన్నారు.

నాటి పత్రికలైన ‘జై తెలంగాణ’, ‘తెలుగుగడ్డ’, ‘తెలుగువాణి’ కూడ వీటికి తమ మద్దతును ప్రకటించాయి. ఈ సందర్భంలోనే తెలంగాణ ప్రజాసమితి, తెలంగాణ విమోచనోద్యమ సమితి వంటి సంస్థలు ఆవిర్భవించాయి.

సూక్తి : సత్యాన్ని త్రికరణశుద్ధిగా నమ్మితే విజయం తథ్యం. నెమ్మదిగానైనా సరే మనం జయించక తప్పదు.
– స్వామి వివేకానంద

ముఖ్య పదాలు – అర్థాలు.

I
అరుదుగా = అపూర్వము, ఆశ్చర్యము
శకము = ఒకదేశము, ఒకజాతి, ఒకని పరిపాలనతో చేరిన సంవత్సరం
సంబురాలు = వేడుకలు
ఆవిర్భవించు = పుట్టు, జన్మము, కలుగు
పతాకస్థాయి = చివరి దశ
స్వతంత్రము = స్వచ్ఛందము, సొంతము
భాష్పాలు = కళ్ళనీళ్ళు
అనుభూతి = అనుభవము, అనుభవించు
సుదీర్ఘకాలం = ఎక్కువ సంవత్సరాలు / ఎక్కువ కాలంపాటు

II

ఉద్రిక్తత = అతిశయించినది
రాచఠీవి = దర్జా, రాజదర్పం
ముడిపడు = కూడుకొని, కలిసి
సచివాలయం = మంత్రులు ఉండుచోటు, పరిపాలనా భవనం
ధిక్కరించడం = వ్యతిరేకించడం, లెక్కచేయకపోవడం
ఘట్టం = సంఘటన
ఆంక్ష = వెలివేయుట, బహిష్కారము
అమరుడు = చావనివాడు
జడుపు = జంకు, భయం

TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి

III

అస్తిత్వం = ఉనికి
స్వీయరాష్ట్రం = సొంతరాష్ట్రం
సిద్ధించింది = లభించింది
సంక్షోభం = ఎక్కువ వ్యాకులత
ఛిద్రము = ముక్కలు
పునర్నిర్మాణ = తిరిగి నిర్మించుకోవడం
విషాదం = దుఃఖం
సర్వతోముఖాభివృద్ధి = అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించుట
పాటుపడు = చేయుట
ఋగులు = కలత
అనుగుణం = తగినది
తక్షణం = వెంటనే
క్షోభ = కలత

పాఠం ఉద్దేశం

దిన పత్రికల్లోని సంపాదకీయాలు, వ్యాఖ్యలు సమాజ చైతన్యానికి తోడ్పడుతాయి. కాబట్టి విద్యార్థుల్లో సంపాదకీయ వ్యాసాలు, వ్యాఖ్యల పట్ల అభిరుచిని కలిగిస్తూ, ఆసక్తిని పెంపొందింపజేయడం, సాధారణ వార్తలకు, సంపాద కీయాలకు మధ్య ఉండే తేడాను, వాటి ప్రాధాన్యాన్ని అర్థం చేసుకొనేందుకు ఉద్దేశించినదే ఈ పాఠం.

పాఠ్యభాగ వివరాలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా 2వ జూన్, 2014 నాడు “నమస్తే తెలంగాణ” దినపత్రికలో వెలువడిన సంపాదకీయ వ్యాసం ఇది.

ప్రవేశిక

‘సంపాదకీయం’ సమకాలీన ప్రపంచంలో జరిగిన స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంఘటనలను గాని, దాని పరిణామాలనుగాని, అద్భుత విశేషాలనుగాని వివరిస్తుంది. జాతిపిత మహాత్మాగాంధీ మృతి చెంది నప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పత్రికలన్నీ సంతాపం తెలియజేస్తూ గాంధీ గొప్పతనాన్ని కీర్తిస్తూ ప్రత్యేక సంపాదకీయాలు రాశాయి. అదే విధంగా మన భారతీయ క్రీడాకారులు, శాస్త్రవేత్తలు ఆయా రంగాల్లో అద్భుత విజయాలు ఆవిష్కరించినప్పుడు (ఆనాటి) దినపత్రికలన్నీ వారిని ప్రశంసిస్తూ సంపాదకీయాలు రాశాయి.

అట్లాగే 1969 నుండి 2 జూన్, 2014 వరకు సాగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సఫలమై, తెలంగాణ సకల జనుల స్వప్నం సాకారమైన వేళ, భారతదేశ పటంపై 29వ రాష్ట్రంగా ‘తెలంగాణ’ అవతరించింది. ఈ సందర్భంగా పత్రికలన్నీ పతాక శీర్షికలతో ఈ వార్తను ప్రచురించి, ప్రత్యేక సంపాదకీయాలు రాశాయి. అట్లాంటి సంపాదకీయాల్లో ఒకటి ప్రస్తుత పాఠ్యాంశం. తెలంగాణ ఉద్యమ మహా ప్రస్థానంలోని మైలురాళ్ళను మనకు పరిచయం చేస్తున్నదీ వ్యాసం.

విద్యార్థులకు సూచనలు

  • పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
  • పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత గీయండి.
  • వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పదవిజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకొండి.

ప్రక్రియ – సంపాదకీయ వ్యాసం

ఈ పాఠం సంపాదకీయ వ్యాస ప్రక్రియకు చెందినది. సమకాలీన సంఘటనలలో ముఖ్యమైన వాటిని తీసుకొని పత్రికల్లో వ్యాఖ్యాన రూపంతో పూర్వా పరాలను పరామర్శిస్తూ సాగే రచన సంపాదకీయ వ్యాసం. తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకుంటూ, ఆలోచింపచేయగలగడం మంచి సంపాదకీయ లక్షణం. ఇవి తత్కాలానికి సంబంధించినవే అయినా ఒక్కొక్క సందర్భంలో విభిన్న కాలాలకూ అనువర్తింప జేసుకోవచ్చు.

TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం

Telangana SCERT 10th Class Telugu Guide Telangana 9th Lesson జీవనభాష్యం Textbook Questions and Answers.

TS 10th Class Telugu 9th Lesson Questions and Answers Telangana జీవనభాష్యం

చదువండి – ఆలోచించి చెప్పండి (T.B. P.No. 87)

పరులకోసం పాటుపడని
నరునిబతుకు దేనికని ?
మూగనేలకు నీరందివ్వని
వాగుపరుగు దేనికని ?
జల్లుకు నిలవని ఎండకు ఆగని
చిల్లులగొడుగు దేనికని ?
పదపదమంటూ పదములేగాని
కదలని అడుగు దేనికని ?
– సినారె

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
పరుల కోసం పాటుపడటం అంటే ఏమిటి ?
జవాబు:
పాటుపడటం అంటే కష్టపడడం, పనిచేయడం. ఎవరైనా తమ గురించి, తమ కుటుంబం గురించి, తమ వాళ్ళ గురించి పాటుపడడం సహజం. పరులు అంటే ఇతరులు. అంటే మనకు సంబంధం లేనివాళ్ళు. వాళ్ళ గురించి కష్టపడడం గొప్పవారి లక్షణం. ఇతరులకు ఉపకారం చేయడానికి దేనినీ లెక్క చేయకూడదు. అంటే సమాజం కోసం కష్టపడాలి. సమాజ అభివృద్ధి కోసం
పాటు పడాలని కవి సందేశం.

ప్రశ్న 2.
కవి ప్రశ్నల్లోని ఆంతర్యం ఏమిటి ?
జవాబు:
ప్రతిదానికీ ఒక ఉపయోగం ఉంటుంది. కొన్ని ఖచ్చితంగా కొన్ని పనులకు ఉపయోగపడాలి. ఆయా పనులకు ఉపయోగపడనపుడు అవి ఉన్నా లేక పోయినా ఒకటే అని కవిగారి ఉద్దేశం.

  1. సమాజం కోసం పాటుపడని మనిషి ఉన్నా లేకపోయినా ఒకటే.
  2. చేలకు నీరివ్వని ఏరు వలన ప్రయోజనం లేదు.
  3. ఎండా, వానలనుండి కాపాడలేని గొడుగు వృథా.
  4. మాటలే తప్ప కదలని అడుగులు వలన ఏమీ సాధించలేము.

TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం

ప్రశ్న 3.
దీనిని రాసిందెవరు ?
జవాబు:
ఈ కవితను డా॥ సి. నారాయణరెడ్డి గారు (సినారె) రచించారు.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 89)

ప్రశ్న 1.
‘మనసుకు మబ్బుముసరడం’ అనడంలో ఆంతర్యంమేమిటి?
జవాబు:
నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కితే వర్షమై అవి భూమి మీద కురుస్తాయి. అలాగే మనసుకు ఆందోళనలు, బాధలు, చింతలు అనే దిగులు మబ్బులు కమ్ముకుంటే దుఃఖస్థితి వస్తుంది. అది కన్నీరుగా మారుతుంది.

ప్రశ్న 2.
‘జంకని అడుగులు కదిలితే అది దారవుతుం’దనడాన్ని మీరెట్లా సమర్థిస్తారు ?
జవాబు:
లోకం భయపెడుతుంది. ఆ మాటలకు జంకకుండా, అడుగులు ముందుకు వేస్తే, అనగా భయపడకుండా, నిరుత్సాహపడకుండా ముందుకు నడిస్తే నీకు విజయం లభిస్తుంది. ఆ స్ఫూర్తే నలుగురూ అనుసరించేందుకు ఒక దారిగా మారుతుందని దీని అర్థం. నేను కూడా ఇది సరైనదేనని సమర్థిస్తాను.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 90)

ప్రశ్న 1.
మనిషి మృగము ఒకటేనా ? కాదా ? చర్చించండి .
జవాబు:
మనిషీ, మృగమూ ఒక్కటికానేకాదు. మనిషికి ఆలోచనాశక్తి వుంది. భావాలను తెలుపగలిగే భాష ఉంది. కానీ మృగానికి ఆలోచనాశక్తీ, భావాలను తెలిపే భాష లేవు. కనుక మనిషి మృగమూ ఒకటికాదు. ఆలోచనాశక్తి నశించి మానవత్వం మరిచిపోతే మనిషినే మృగం అనవచ్చు.

ప్రశ్న 2.
హిమగిరి శిరసు మాడటం అంటే మీకేమర్థమయింది ?
జవాబు:
హిమాలయ పర్వతం ప్రపంచంలోనే ఎత్తైనది. అయినా దాని నెత్తిని కూడా సూర్యుడు తన వేడి కిరణాలతో మాడుస్తాడు. అంత ఎత్తు ఉన్నా హిమగిరికీ సూర్యుని తాపం తప్పలేదు కదా ! ఎండవేడికి అది కరిగి ఏఱుగా, అనగా నదిగా ప్రవహించవలసిందే. అలాగే ఎంతటి మనిషైనా అతని గర్వం, సమస్యలకు వేడెక్కి నీరుగా కారిపోవలసిందే అని నాకు అర్థమయింది.

ప్రశ్న 3.
‘చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుం’దనడాన్ని మీరు సమర్థిస్తారా ? ఎట్లా?
జవాబు:
త్యాగం అంటే మనకున్నది ఇతరులకు ఇవ్వడం. స్వార్థం చూసుకోకుండా ఇవ్వడం. ప్రతిఫలం ఆశించకుండా ఇవ్వడం. మనకోసం ఎవరైనా ఏదైనా త్యాగం చేస్తే మనం వారిని జీవితాంతం మరచిపోలేము.

అలాగే తమకున్న డబ్బుతో గుడి, బడి, ఆసుపత్రి, అన్నదాన సత్రము మొదలైనవి కట్టిస్తే వారి పేరును సమాజం గుర్తు పెట్టుకొంటుంది. ఉదాహరణకు రంగయ్యగారు బడి కట్టిస్తే, దానిని రంగయ్య బడి అంటాం. బిర్లా టెంపుల్ మొదలైనవి. అంటే అవి ఉన్నంతకాలం వారి పేరు కూడా ఉంటుంది. అందుకే ఇది సమర్థించతగినది.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
క్రింది అంశాన్ని గురించి చర్చించండి.

అ) ‘జీవనభాష్యం’ అనే శీర్షిక ఈ గజల్కు ఎలా సరి పోయిందో చెప్పండి..
జవాబు:
ఈ పాఠానికి ‘జీవన భాష్యం’ అనే పేరు తగినదిగా ఉంది. ఎందుకంటే ఈ పాఠ్యభాగంలో మానవుడు తన జీవితంలో ఎప్పుడు గౌరవం పొందుతాడు. ఎలా జీవించాలి అనే విషయాలను లోతుగా పరిశీలించి కవి మనకు అందించారు. మానవ జీవిత పరమార్థాన్ని ఈ చిన్న గజల్ ద్వారా అందించడం జరిగింది.

మానవుడు దుఃఖాలన్నింటిని సమర్థవంతంగా తట్టుకుంటూ, కష్టాలను సాహసంతో ఎదుర్కొంటూ ఉండాలని, తనంతట తాను ఉన్నతంగా ఎదుగుతూ, తోటి వారి కోసం పాటుపడుతూ జీవించాలనే జీవిత సత్యం ఇందులో ఉంది. అందువల్ల ఈ పాఠానికి ‘జీవన భాష్యం’ అనేపేరు తగినదిగా చెప్పవచ్చు.

TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం

ప్రశ్న 2.
పాఠం చదివి ప్రాస పదాలను గుర్తించండి. రాయండి.
జవాబు:
TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం 1

ప్రశ్న 3.
క్రింది అపరిచిత గేయ పాదాలను చదువండి.

భీతి లేక మనిషి ఎచట శిరమునెత్తి నిలుచునో
తనివి తీర జనులకెల్ల జ్ఞానసుధలు దొరుకునో
అడ్డుగోడ లేని సమసమాజమెచట నుండునో
హృదంతరాళ జనితమౌ సత్యమెచట వరలునో
ఆ స్వతంత్ర స్వర్గసీమ నిర్మింపగ తరలి రమ్ము
లెమ్ము లెమ్ము లెమ్ము లెమ్ము లెమ్ము సోదరా !

గేయం చదివి క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) ‘శిరమునెత్తి నిలుచునో’ అంటే మీకేమి అర్థమైంది?
జవాబు:
భీతి లేకుండా (భయం) ఉంటే మనిషి తలఎత్తుకొని నిలబడతాడని అర్థమైంది.

ఆ) జ్ఞానసుధలు ఎట్లా ఉండాలని గేయంలో ఉన్నది ?
జవాబు:
జ్ఞానసుధలతో తృప్తి కలగాలి. అంటే జ్ఞానతృష్ణ తీరాలి.

ఇ) సమసమాజం ఎట్లా ఏర్పడుతుంది ?
జవాబు:
సమసమాజం అడ్డుగోడలు లేకుండా ఏర్పడుతుంది.

ఈ) సత్యం విలసిల్లడం అంటే ఏమిటి ?
జవాబు:
మనస్సులో నుండి వచ్చే నిజమే విలసిల్లుతుంది.

ఉ) ‘స్వర్గసీమ’ అనడంలో అంతరార్థం ఏమిటి ?
జవాబు:
స్వర్గసీమలో భయం ఉండదు. తృప్తి కలిగించే జ్ఞానం దొరుకుతుంది. కుల, మతాలు, ధనిక, పేద అనే అడ్డుగోడలుండవు. నిజమైన మాట, ఆలోచన, ప్రవర్తన ఉంటుంది. పూర్తిగా స్వతంత్రం ఉంటుంది. అటువంటి ప్రదేశం కావాలి కనుక స్వర్గసీమ అన్నారు.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) ‘చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది’ అంటే త్యాగం చేసేవారి, మంచిపనులు చేసే వారి పేర్లు చరిత్రలో శాశ్వతంగా నిలుస్తాయి అని అర్థం. అందుకోసం ఎట్లాంటి మంచిపనులు చేయాలి?’
జవాబు:

  1. దశదానాలు, షోడశమహాదానాలు చేయాలి.
  2. గ్రామంలో దేవాలయము కట్టించాలి.
  3. పేద బ్రాహ్మణుడికి పెళ్ళి చేయించాలి.
  4. ఒక కవి రాసిన కావ్యాన్ని అంకితం తీసుకోవాలి.
  5. గ్రామంలో అందరికీ త్రాగేందుకు నీటి కోసం చెరువు తవ్వించాలి.
  6. ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయాలి. పైన చెప్పినవి అన్నీ “సప్త సంతానములు” అనే వాటిలోని మంచి పనులు.

ఇవిగాక పాఠశాలలూ, కళాశాలలూ ఏర్పాటు చేయించడం, పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వడం, చదువులు చెప్పించడం, పేదవారికి వైద్య ఖర్చులు భరించడం, గ్రామాలకు మంచినీటి సదుపాయాలు, రోడ్లు వేయించడం, దైవపూజలు చేయించడం, పేదల కోసం పెళ్ళి ఖర్చులు భరించడం, మంగళసూత్రాలు దానం చేయడం వంటి మంచి పనులు చేస్తే వారి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుంది.

ఆ) “ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు” అనే వాక్యం ద్వారా విద్యార్థులకు ‘సినారె’ ఇచ్చే సందేశం ఏమై ఉండవచ్చు?
జవాబు:
జీవన భాష్యం’ అనే పాఠ్యభాగంలో “ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు” అనే వాక్యం ద్వారా సినారె విద్యార్థులకు అద్భుతమైన సందేశాన్ని ఇచ్చాడు. విద్యార్థులు చదువులో ఒక్కోసారి వెనుకబడతారు. చదువుకునేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. అయినప్పటికీ విద్యార్థులు తమకు ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి. కష్టాలను ఓర్పుతో సహించాలి.

అవాంతరాలను అధిగమించాలి. అప్పుడే విద్యార్థులు చదువులో రాణిస్తారు. ప్రగతి పథంలో పయనించ గలుగుతారు. ఉత్తమ ఫలితాలను పొంద గలుగుతారు. తమకు డబ్బులేదని, చదువు సరిగా రావడం లేదని నిరాశపడవద్దని, అధైర్యంతో ఆత్మహత్యలకు పాల్పడ కుండా ధైర్యంతో ముందుకు వెళ్ళాలనే ఉపదేశాన్ని నారాయణరెడ్డి గారు విద్యార్థులకు అందించారని భావిస్తున్నాను.

TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం

ఇ) ‘మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది” అని ‘సినారె’ ఎందుకు అని ఉంటాడు ?
జవాబు:
“జీవన భాష్యం” అనే పాఠ్యభాగంలో మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది” అని నారాయణ రెడ్డి గారు ఉపదేశించారు. సమాజంలో మానవులంతా కలిసిమెలిసి జీవించాలి. పరస్పర సహకారాన్ని పొందాలి. వర్గ వైషమ్యాలను విడనాడాలి. కులమతాల అడ్డు గోడలను తొలగించుకోవాలి. ఒకరినొకరు గౌరవించు కోవాలి. ఆపదల్లో ఉన్న తోటివారిని ఆదుకోవాలి.

అప్పుడే సమాజంలోని వారందరూ సుఖశాంతులతో వర్ధిల్లుతారని, అటువంటి ప్రశాంతతో కూడిన గ్రామీణ వాతావరణం రావాలని కవి కోరుతున్నారు. పరస్పర సహకారంతో జీవించడమే ఉత్తమ సాంఘిక జీవనం. సాటి మనుషుల పట్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పరచు కోవాలి. అప్పుడే అందరు కలిసి ఆనందంగా జీవించ గలుగుతారని, అలాంటి మనుషులంతా ఏకమైతేనే చల్లని ఊరు ఏర్పడుతుందని కవి భావించాడు.

ప్రశ్న 2.
క్రింది ప్రశ్నలలో ఒకదానికి పది వాక్యాల్లో జవాబు వ్రాయండి.

అ) ‘జీవనభాష్యం’ అందించే సందేశాన్ని వివరించండి.
జవాబు:
జీవనభాష్యం ద్వారా ఇతరుల కోసం పాటుపడుతూ జీవించే మనిషి సమాజంలో గౌరవం పొందుతాడనీ మరియు వ్యక్తులు మాత్రమే కాకుండా ప్రకృతిలో ఇటువంటి పరోపకార గుణం గల ఎన్నో విషయాలు ఉన్నాయని తెలుస్తుంది. అంతేగాకుండా పరోపకార గుణం గల నదులు, మేఘాలు, వృక్షాలు మనకు ఎంతో సహకారం అందిస్తాయి. జీవనభాష్యం ద్వారా చింతలు, బాధలు, ఆందోళనలు అనేవి మనసును కుంగదీసినపుడు అవి కన్నీరు రూపంలో బయటకు వస్తాయి.

ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ఎన్నో అడ్డంకులు ఎదురైతే వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు నడిచినపుడే మనకు విజయం చేకూరుతుంది. అదే విధంగా బీడు భూమిలో ఏ పంటలూ పండవని నిరాశపడకుండా అదే నేలను కష్టపడి దున్నితే, విశ్వాసంతో విత్తనాలు నాటితే మంచి పంటలు పండుతాయి.

సాటి మనుషుల పట్ల ప్రేమ ఆప్యాయత, సంబంధాలు కలిగి ఉండాలని నేర్పుతుంది జీవనభాష్యం. అటువంటి మనుషులు కలిస్తేనే ఒక ఊరు ఏర్పడుతుందని కవి భావన.

అలాగే “కష్టం వెనుక సుఖం, సుఖం వెనుక కష్టం” ఒకదాని తరువాత మానవ జీవితంలో పరిపాటి అని తెలుస్తుంది. ఏమి ఆలోచించకుండా మబ్బు వర్షాన్ని ఇస్తుంది. నదులు నీటిని అందిస్తాయి. అలాగే రైతు మనందరి కోసం రేయింబవళ్ళు కష్టపడి మనకు ఆహారాన్ని అందించి “అన్నదాత” గా మారాడు.

అటువంటి రైతు చేసే గొప్ప పని, నిస్వార్థ త్యాగం మనం మరచిపోరాదు. మన పేరు ప్రపంచానికంతా తెలిసేలా ప్రఖ్యాతి పొందే పనులు చేసి, నిజమైన విలువ, గుర్తింపు పొందాలని ఈ పాఠం ద్వారా తెలుస్తుంది. అప్పుడే మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుందని జీవనభాష్యం మనకు సందేశం ఇస్తుంది.

ప్రశ్న 3.
క్రింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ వ్రాయండి.

అ) “జీవన భాష్యం” గజల్లోని అంత్యప్రాసల ఆధారంగా సొంతగా ఒక వచన కవితను రాయండి.
జవాబు:

1) మంచు కరిగితే నీరవుతుంది.
2) మంచి నడకనడిస్తే దారవుతుంది.
3) వర్షం కురిస్తే పంట పైరవుతుంది.
4) మంచి వ్యక్తులు కూడితే ఊరవుతుంది.
5) నదులు పారితే అది ఏరవుతుంది.
6) త్యాగధనులుంటే పేరవుతుంది.

(లేదా)

ఆ) ఆచార్య సి. నారాయణ రెడ్డి గారు ఒకవేళ మీ పాఠశాలకు వస్తే మీరు వారి నుండి ఏం తెలుసుకోవాలనుకొంటున్నారో ప్రశ్నలు వ్రాయండి.
జవాబు:

  1. మీ రచనలలో మీకు బాగా నచ్చిన కావ్యం ఏది ?
  2. ‘ప్రపంచ పదులు’ దీన్ని మీరు ఎలా సృష్టించారు ?
  3. మీ సినీగేయాలలో మీకు నచ్చిన గేయం ఏది ?
  4. మిమ్ములను కవిత్వం వైపు నడిపించినది ఎవరు ?
  5. మీ రచనలకు ప్రేరణనందించిన అంశాలు ఏవి ?
  6. మధ్యతరగతి మందహాసంలోని ప్రధానమైన అంశం ఏమిటి ?
  7. ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతన్నలకు, మీరిచ్చే సందేశం ఏమిటి ?
  8. విద్యార్థులు మానసిక వత్తిడి నుండి ఎలా బయట పడగలుగుతారు ?
  9. నేటి యువ రచయితలకు మీరిచ్చే సలహాలు ఏమి ?
  10. ప్రస్తుతం మీరు ఎందుకు సినిమా పాటలు రాయడం లేదు ?

III. భాషాంశాలు

పదజాలం

1. క్రింది పదాలకు పర్యాయపదాలు రాయండి.

అ) మబ్బు: మేఘం, చీకటి, అజ్ఞానము, అంబుదం, జలదం
ఆ) గుండె : హృదయము, మనస్సు, ధైర్యము, ఎద, ఎడద
ఇ) శిరసు : తల, శిఖరము, సీనాగ్రము, ప్రధానము, మస్తకం

2. క్రింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

అ) వ్యాప్తి : తెలంగాణా సంగీతాన్ని రాష్ట్ర ప్రభుత్వం దేశం అంతట వ్యాప్తి చేసింది.
ఆ) జంకని అడుగులు: గుండె బలం కలవాడు జంకని అడుగులు వేస్తూ ముందుకు వెళ్తాడు.
ఇ) ఎడారి దిబ్బలు : ప్రయోజనంలేని ఎడారి దిబ్బలపై కూడా కష్టపడితే పంటలు పండించవచ్చు.
ఈ) చెరగని త్యాగం : పరోపకార పరాయణులు చెరగని త్యాగగుణం కలవారుగా ఉంటారు.

TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం

వ్యాకరణాంశాలు

1. క్రింది పదాలను కలిపి, సంధిని గుర్తించి వ్రాయండి.

అ) నీరు + అవుతుంది – నీరవుతుంది – ఉకార సంధి
ఆ) ఎత్తులకు + ఎదిగిన = ఎత్తులకెదిగిన – ఉకార సంధి
ఇ) పేరు + అవుతుంది = పేరవుతుంది – ఉకార సంధి

2. క్రింది పంక్తులలోని సమాస పదాలు గుర్తించి, విగ్రహ వాక్యాలు రాసి, అవి ఏ సమాసాలో తెలియజేయండి.

అ) ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు.
జవాబు:
ఎడారి దిబ్బలు – ఎడారి యొక్క దిబ్బలు (షష్ఠీ తత్పురుష సమాసం)

ఆ) ఇసుకగుండెలు పగిలితే అది పైరవుతుంది.
జవాబు:
ఇసుకగుండెలు – ఇసుక అనెడి గుండెలు (రూపక సమాసం)

3. క్రింది వాటిని చదివి ఏ అలంకారాలో గుర్తించండి.

అ) నీకు వంద వందనాలు
జవాబు:
పై వాక్యంలో వంద అనే హల్లుల జంట, వెంటవెంటనే అర్థ భేదంతో వచ్చింది. ఇక్కడ మొదట వచ్చిన ‘వంద’ నూరు సంఖ్యను తెలుపుతుంది. రెండోసారి వచ్చిన ‘వంద’ వందనాలు అంటే నమస్కారాలు అని తెలుపుతోంది. కావున ఇది ఛేకానుప్రాసాలంకారం.

ఛేకానుప్రాసాలంకారం : హల్లుల జంట, అర్థభేదంతో వెంటవెంటనే వస్తే దానిని ‘ఛేకానుప్రాస’ అలంకారం అంటారు.

ఆ) తెలుగు జాతికి అభ్యుదయం
నవ భారతికే నవోదయం
జవాబు:
పై గేయంనందు ప్రాసపదాలు అంత్యములో ఉన్నాయి కాబట్టి ఇది అంత్యానుప్రాసాలంకారం.

ఇ) రాజు రివాజులు బూజు పట్టగన్
జవాబు:
ఇది వృత్త్యానుప్రాసాలంకారం. పదం మధ్యలో జ అనే అక్షరం పలుమార్లు వచ్చింది. కాబట్టి ఇది వృత్త్యానుప్రాసాలంకారం.

ఈ) అజ్ఞానాంధకారం తొలిగితే మంచిది.
జవాబు:
ఇది రూపకాలంకారం
అజ్ఞానము – ఉపమేయం
అంధకారం – ఉపమానం

ఇక్కడ ఉపమేయమైన అజ్ఞానమునందు ఉపమానమైన అంధకార ధర్మం ఆరోపించబడింది. కావున ఇది రూపకాలంకారం.

ప్రాజెక్టు పని

డా|| సి. నారాయణ రెడ్డి రాసిన ఏవైనా రెండు గేయాలు/ గజల్లను సేకరించండి. నివేదిక రాసి ప్రదర్శించండి.
జవాబు:
కొన్ని (సినారె) గేయాలు :

1) “నా పేరు కవి
ఇంటి పేరు చైతన్యం
ఊరు సహజీవనం
తీరు సమభావనం”

TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం

2) “నా వచనం బహువచనం
నా వాదం సామ్యవాదం
కవిత్వం నా మాతృభాష
ఇతివృత్తం మానవత్వం”

3) “ఊపిరాడడం లేదు
ఉక్కపోస్తుంది. ఎ.సి గదిలో
కారణం తెలిసిపోయింది.
కవిత రాయలేదు ఇవాళ”

నివేదిక

డా॥ సి. నారాయణరెడ్డి గారు తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధ కవులుగా కీర్తి పొందారు. వీరి గేయాలు భావస్ఫోరకంగా ఉంటాయి. తేటతెలుగు పదాలతో అలరారుతుంటాయి. అంత్యప్రాసలు పాటలకు మరింత అందాన్ని ఇస్తాయి. చిన్న పదాలతో విస్తృతమైన భావాన్ని గేయాల ద్వారా అందించడం నారాయణరెడ్డి గారి ప్రత్యేకత.

సన్నివేశానికి అనుగుణంగా పదాలను గేయంలో చూపించడం నారాయణరెడ్డి గారికే చెల్లుతుంది. జాతీయాలను, తెలుగు నుడికారాలను చక్కగా చెప్పగల విశిష్ట కవి. పదలాలిత్యం, అంతకుమించిన గుణాత్మకశైలి గేయాలకు వన్నె చేకూరుస్తాయి. అందుకే తరాలు మారినా తెలుగువాడి మదిలో నారాయణరెడ్డి గారి గేయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. గేయరచనలో వీరు చూపిన దారి అందరికి ఆదర్శంగా నిలుస్తుంది.

విశేషాంశాలు

ఆచార్య సింగిరెడ్డి నారాయణరెడ్డిగారి రచనలు

1) ఆధునికాంధ్ర కవిత్వము

  • సంప్రదాయములు
  • ప్రయోగములు

2) ‘విశ్వంభర’ – (జ్ఞానపీఠ అవార్డు వచ్చిన కావ్యం)
3) నాగార్జున సాగరం
4) కర్పూర వసంతరాయలు
5) మధ్యతరగతి మందహాసం
6) ప్రపంచపదులు

7) విశ్వనాథనాయకుడు
8) నారాయణరెడ్డి గేయాలు
9) దివ్వెల మువ్వలు
10) అజంతా సుందరి
11) రామప్ప
12) నవ్వని పువ్వు
13) వెన్నెలవాడ
14) ఋతుచిత్రం
15) స్వప్నభంగం
16) విశ్వగీతి

17) జలపాతం
18) సినీగేయాలు
19) జాతిరత్నం
20) తరతరాల వెలుగు (గేయ రూపకాలు)
21) అక్షరాల గవాక్షాలు
22) మంటలు – మానవుడు
23) ఉదయం నా హృదయం
24) మార్పు నా తీర్పు
25) ఇంటి పేరు చైతన్యం

TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం

26) రెక్కలు
27) నడక నా తల్లి
28) కాలం అంచుమీద
29) కవిత నా చిరునామా
30) కలం సాక్షిగా
31) భూమిక, మట్టీ – మనిషి (దీర్ఘ కావ్యాలు)
32) తెలుగు గజళ్ళు
33) వ్యాసవాహిని, సమీక్షణం
34) పాశ్చాత్యదేశాల్లో 50 రోజులు (యాత్రా సాహిత్యం)
35) పాటలో ఏముంది – నా మాటలో ఏముంది (సినిమా పాటల విశ్లేషణ)

సూక్తి : మనిషిలో ఏ గుణం సన్నగిల్లినా మానవత్వం మృతి చెందకుండా ఉంటే చాలు. ఆ మానవత్వమే మనిషిని మహనీయుడిని చేస్తుంది.

అర్థాలు – భావాలు

I

మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది
మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది
వంకలు డొంకలు కలవనీ జడిపించకు నేస్తం !
జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది.

అర్థాలు

నేస్తం = స్నేహితుడా !
మబ్బుకు = మేఘానికి
మనసే = హృదయమే
కరిగితే = కరిగినట్లయితే
అది = ఆ మేఘం
నీరు + అవుతుంది = నీరుగా మారుతుంది
ముసిరితే = ముసిరినట్లయితే
కన్నీరు + అవుతుంది = కన్నీళ్ళుగా అవుతుంది
వంకలు డొంకలు = వంకలు, సందులు
కలవనీ = కలిసిపోవని
జడిపించకు = భయపెట్టకు
నేస్తం = మిత్రమా
జంకని = భయపడని
అడుగులు = అడుగులు
కదిలితే = కదిలినట్లయితే
అది = ఆ నడిచిన ప్రదేశం
దారి + అవుతుంది = మార్గం అవుతుంది

భావం:
నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కితే వర్షమై అవి భూమి మీద కురుస్తాయి. అలాగే మనసుకు ఆందోళనలు, బాధలు, చింతలు అనే దిగులు మబ్బులు కమ్ముకుంటే దుఃఖస్థితి వస్తుంది. అది కన్నీరుగా మారుతుంది.

ఒక లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరినపుడు అడుగడుగునా ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదురవుతాయని లోకం భయపెడుతుంది. కాని ఆ మాటలకు భయపడకుండా, నిరుత్సాహపడకుండా ముందుకు నడిస్తేనే విజయం లభిస్తుంది. ఆ స్ఫూర్తే నలుగురు అనుసరించే దారిగా మారుతుంది.

TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం

II

ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు
ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది
మనిషీ మృగమూ ఒకటనీ అనుకుంటే వ్యర్థం
మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది
ఎంతటి ఎత్తుల కెదిగినా ఉంటుంది పరీక్ష
హిమగిరి శిరసే మాడితే అది యేరవుతుంది
బిరుదులు పొందే వ్యాప్తికీ విలువేమి “సినారె”
చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది.

అర్థాలు

ఎడారి దిబ్బలు = బీడుగా ఉన్న ప్రాంతాలు
దున్నితే = దున్నినట్లయితే
ఫలము = ప్రయోజనం
ఏముంది + అనకు = ఏముంటుందని అనవద్దు
ఇసుక గుండెలు = ఇసుకతో ఉన్న హృదయాలు
పగిలితే = పగిలినట్లయితే
అది = ఆ భూమి
పైరు + అవుతుంది = పంటలు పండుతుంది
మనిషి = మానవుడు
మృగము = మృగము
ఒకటని = ఒక్కటే అని
అనుకుంటే = భావిస్తే
వ్యర్థం = అనవసరము
మనుషులు = మానవులు
పదుగురు = అనేకమంది
కూడితే = కలిసినట్లయితే
ఒక ఊరవుతుంది = ఒక గ్రామం అవుతుంది
ఎంతటి ఎత్తులకు = ఎంతటి ఎత్తుకైనా
ఎదిగినా = ఎదిగినప్పటికీ
ఉంటుంది = ఉండును
పరీక్ష = పరీక్ష
హిమగిరి = హిమాలయ
శిరసే = శిఖరమే
మాడితే = ఎండితే
ఏ + అవుతుంది = నది అవుతుంది
బిరుదులు = పురస్కారాలు
పొందే = పొందేటటువంటి
వ్యాప్తికే = కీర్తికే
చెరగని = చెదిరిపోని
విలువేమి = విలువ ఏమిటి ?
సినారె = సి. నారాయణరెడ్డి
త్యాగం = త్యాగము
ఒక పేరు + అవుతుంది = ఒక పేరుగా నిలుస్తుంది

భావం
బీడుపడి, పనికిరాకుండా ఉన్న నేలలో ఏ పంటలూ పండవని ఏ ప్రయత్నాలూ చేయకుండానే నిరాశపడవద్దు. కష్టపడి ఆ నేలను దున్నితే విశ్వాసంతో విత్తనాలు నాటితే మంచి పంటలు పండుతాయి.

నలుగురు మనుషులు కలిసి పరస్పర సహకారంతో జీవించడమే ఉత్తమ సాంఘిక జీవనం. సాటి మనుషుల పట్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోవాలి. అప్పుడే అందరు కలిసి ఆనందంగా జీవించగలుగుతారు. అటువంటి మనుషులు కలిస్తేనే ఒక ఊరు ఏర్పడుతుంది.

ఎంత సామర్థ్యమున్నా, అధికారం, సంపదలు ఉన్నా, ఎన్నో విజయాలు సాధించినా, ఇక నాకు ఏ కష్టాలూ, బాధలు రావని ధీమాగా ఉండలేం. విధి ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో, సమస్యల పరీక్షలు పెడుతుందో ఎవరూ ఊహించలేరు. దాని శక్తి ముందు ఎవరైనా తలవంచవలసిందే. ఉన్నతమైన హిమాలయ పర్వత శిఖరం కూడా ఎండ వేడికి కరిగిపోయి నదిగా ప్రవహించవలసిందే ! అలాగే ఎంతటి మనిషైనా గర్వం నీరు కారిపోవలసిందే.

మనపేరు ప్రపంచానికంతా తెలిసేలా ప్రఖ్యాతి పొందామని, ప్రతిష్టాత్మక బిరుదులు, సత్కారాలు పొందామని అనుకోవడంలో నిజమైనవిలువ, గుర్తింపు లేదు. మానవాళికి పనికివచ్చే గొప్పపని, నిస్వార్థ త్యాగం చేస్తేనే ఆ మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది.

పాఠం ఉద్దేశం

మనిషి దేన్ని గురించి నిరుత్సాహపడకూడదు. దేన్నైనా ప్రయత్నం ద్వారా సాధించవచ్చు. దుఃఖాన్ని తట్టుకుంటూ, కష్టాలను ఎదుర్కొంటూ, తనంతటతాను ఎదుగుతూ, ఇతరుల కోసం పాటుపడుతూ జీవించే మనిషి సమాజంలో గౌరవం పొందుతాడని చెప్పడం, తెలుగులో గజల్ ప్రక్రియను పరిచయం చేయడం ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ప్రస్తుత పాఠ్యభాగం డాక్టర్ సి. నారాయణరెడ్డి సమగ్ర సాహిత్యం “ఆరవ సంపుటిలోని తెలుగు గజళ్ళు” లోనిది.

కవి పరిచయం

కవి పేరు : డా॥ సింగిరెడ్డి నారాయణరెడ్డి (సి.నా.రె)
జన్మస్థలం : రాజన్న సిరిసిల్లాజిల్లా హనుమాజీ పేట గ్రామం.
దేనినుండి గ్రహింపబడినది : నారాయణరెడ్డి సమగ్ర సాహిత్యం ఆరవ సంపుటిలోని ‘తెలుగు గజళ్ళు’ నుండి.
జననం : 1931, జులై 29

కవి విశేషాలు : ప్రముఖ ఆధునిక కవి, వక్త, పరిశోధకుడు, బహుభాషావేత్త, ప్రయోగశీలి, సినీగేయ రచయిత
ఇతర రచనలు : నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మంద హాసం, విశ్వంభర, ప్రపంచపదులు మొదలైనవి. నలభైకి పైగా కావ్యాలు, అద్భుతమైన సినీ గేయాలు, గజల్స్ రచించారు.

ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయ ములు – ప్రయోగములు, వీరి ప్రామాణిక సిద్ధాంత గ్రంథం.
బిరుదులు : పద్మభూషణ్, జ్ఞానపీఠ అవార్డు.
పురస్కారాలు : ‘విశ్వంభర’ కావ్యానికి జాతీయ స్థాయిలో అత్యున్నత జ్ఞానపీఠ పురస్కారం.

ఉద్యోగ నిర్వహణ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖలో ఆచార్యులుగా, అధికార భాషాసంఘం అధ్యక్షులుగా, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికీ,
తెలుగు విశ్వ విద్యాలయానికీ ఉపకులపతి, రాజ్యసభ సభ్యులు.

సారస్వత సేవ : ఆంధ్ర సారస్వత (వైస్ ఛాన్స్లర్) సేవలు అందించారు.
కవితాశైలి : శబ్దశక్తి, అర్థయుక్తి సినారె కలానికీ, గళానికీ ఉన్న ప్రత్యేకత. వీరి రచన సరళంగాను, మనోహరంగాను ఉంటుంది.
మరణం : 2017, జూన్ 12

TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం

ప్రవేశిక

ఏ ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగే ప్రయాణానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉండదు. అనేక రకాల అవరోధాలను, ఆటుపోట్లను అనుభవిస్తూ విజయాన్ని సాధించడంలోనే ఆనందం, సంతృప్తితోపాటు నిజమైన గుర్తింపు లభిస్తుంది. అటువంటి అనేక జీవన విలువలను ఉద్బోధించే మానవ వికాస భాష్యాన్ని విందాం.

విద్యార్థులకు సూచనలు

  • పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
  • పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత గీయండి.
  • వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పద విజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకోండి.

ప్రక్రియ – గజల్

ఈ పాఠం ‘గజల్’ ప్రక్రియకు చెందినది. గజల్లో పల్లవిని “మత్లా” అని, చివరి చరణాన్ని “మక్తా” అని, కవి నామముద్రను “తఖల్లుస్” అని అంటారు. పల్లవి చివర ఉన్న పదం, ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది. సరస భావన, చమత్కార ఖేలన, ఇంపూ, కుదింపూ గజల్ జీవగుణాలు.

పాఠ్యభాగ సారాంశం

నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కితే వర్షమై అవి భూమి మీద కురుస్తాయి. అలాగే మనసుకు ఆందోళనలు, బాధలు, చింతలు అనే దిగులుమబ్బులు కమ్ముకుంటే దుఃఖస్థితి వస్తుంది. అది కన్నీరుగా మారుతుంది.

ఒక లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరినపుడు అడుగడుగునా ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదురవుతాయని లోకం భయపెడుతుంది. కాని ఆ మాటలకు భయపడకుండా నిరుత్సాహపడకుండా ముందుకు నడిస్తేనే విజయం లభిస్తుంది. ఆ స్ఫూర్తే నలుగురు అనుసరించే దారిగా మారుతుంది. బీడుపడి, పనికిరాకుండా ఉన్న నేలలో ఏ పంటలూ పండవని ఏ ప్రయత్నాలూ చేయకుండానే నిరాశపడవద్దు. కష్టపడి ఆ నేలను దున్నితే, విశ్వాసంతో విత్తనాలు నాటితే మంచి పంటలు పండుతాయి.

నలుగురు మనుషులు కలిసి పరస్పర సహకారంతో జీవించడమే ఉత్తమ సాంఘిక జీవనం. సాటి మనుషులు పట్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పరుచుకోవాలి. అప్పుడే అందరు కలిసి ఆనందంగా జీవించగలుగుతారు. అటువంటి మనుషులు కలిస్తేనే ఒక ఊరు ఏర్పడుతుంది.

ఎంత సామర్థ్యమున్నా, అధికారం, సంపదలు ఉన్నా ఎన్నో విజయాలు సాధించినా ఇక నాకు ఏ కష్టాలూ బాధలూ రావని ధీమాగా ఉండలేం. విధి ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో సమస్యల పరీక్షలు పెడుతుందో ఎవరూ ఊహించలేరు. దాని శక్తిముందు ఎవరైనా తలవంచ వలసిందే. ఉన్నతమైన హిమాలయ పర్వత శిఖరం కూడా ఎండ వేడికి కరిగిపోయి నదిగా ప్రవహించవలసిందే ! అలాగే ఎంతటి మనిషి గర్వమైనా నీరుకారిపోవలసిందే.

మనపేరు ప్రపంచానికంతా తెలిసేలా ప్రఖ్యాతి పొందామని, ప్రతిష్ఠాత్మక బిరుదులు, సత్కారాలు పొందామని అనుకోవడంలో నిజమైనవిలువ, గుర్తింపు లేదు. మానవాళికి పనికివచ్చే గొప్పపని, చెరగని త్యాగం చేస్తేనే ఆ మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచి పోతుంది.