TS Inter 1st Year Commerce Study Material Chapter 6 కంపెనీ స్థాపన

Telangana TSBIE TS Inter 1st Year Commerce Study Material 6th Lesson కంపెనీ స్థాపన Textbook Questions and Answers.

TS Inter 1st Year Commerce Study Material 6th Lesson కంపెనీ స్థాపన

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కంపెనీ వ్యాపార ప్రారంభ దశలను వివరించండి.
జవాబు.
కంపెనీ స్థాపనలో నాలుగు దశలుంటాయి. అవి.

  1. వ్యవస్థాపన
  2. నమోదు లేదా రిజిస్ట్రేషన్
  3. మూలధన – సమీకరణ
  4. వ్యాపార ప్రారంభము.

1) వ్యవస్థాపన: కంపెనీ ఏర్పాటుకు ముందు జరిగే కార్యక్రమాన్ని వ్యవస్థాపన అంటారు. అనగా వ్యాపార ఉద్దేశ్యాన్ని ఏర్పరచుకొని, అవకాశాలను కనుగొని లాభార్జన కోసము ఉత్పత్తి సాధనాలను సమీకరించుకొని సమర్ధవంతముగా నిర్వహించే ప్రక్రియను వ్యవస్థాపన అంటారు. వ్యవస్థాపనలో నాలుగు గశలుంటాయి.

  1. వ్యాపార అవకాశాలను కనుగొనుట
  2. సమగ్రమైన పరిశోధన,
  3. వనరుల సమీకరణ,
  4. ఆర్థిక ప్రతిపాదన.

2) కంపెనీ నమోదు లేదా రిజిస్ట్రేషన్: ఏ కంపెనీ అయినా చట్టబద్ధ.. బాగా గుర్తింపు పొందవలెనంటే నమోదు అవసరము. నమోదు కొరకు కొన్ని ముఖ్యమైన పత్రాలను రిజిస్ట్రారు వద్ద దాఖలుచేసి రిజిస్ట్రేషన్ చేయాలి. కంపెనీ నమోదుకొరకు దాఖలు చేయవలసిన ముఖ్య పత్రాలు.

  1. పేరు అనుమతి కోసము దరఖాస్తు
  2. సంస్థాపనా పత్రము
  3. నియమావళి
  4. క్రింది అదనపు పత్రాలను కూడా రిజిస్ట్రారు వద్ద దాఖలు చేయాలి.
    i) మొదటి డైరెక్టర్ల సమ్మతి పత్రము
    ii) పవర్ ఆఫ్ అటార్నీ
    iii) కంపెనీ రిజిష్టర్డ్ కార్యాలయం తెలిపే నోటీసు
    iv) డైరెక్టర్లు, మేనేజరు, సెక్రటరీ వివరాలు
  5. శాసనాత్మక ప్రకటన
  6. నమోదు రుసుం చెల్లింపు
  7. నమోదు పత్రము

పై పత్రాలను రిజిస్ట్రారు పరిశీలించి సంతృప్తి చెందిన మీదట కంపెనీ నమోదు పత్రాన్ని జారీ చేస్తాడు. నమోదు పత్రము పొందిన వెంటనే ప్రైవేటు కంపెనీ వ్యాపారమును ప్రారంభించవచ్చును. కాని పబ్లిక్ కంపెనీ వ్యాపారమును ప్రారంభించుటకు వ్యాపార ప్రారంభ ధ్రువ పత్రాన్ని పొందవలెను.

TS Inter 1st Year Commerce Study Material Chapter 6 కంపెనీ స్థాపన

3) మూలధన సేకరణ: కంపెనీ వాటాలను జారీచేసి మూలధనాన్ని సేకరిస్తుంది. కంపెనీ నమోదుకు ప్రాథమిక ఖర్చులు, ఆస్తుల కొనుగోలు మొదలైన వాటికి అవసరమయ్యే మొత్తాన్ని కనీసపు చందా అంటారు. కంపెనీ పరిచయ పత్రములో పేర్కొన్న కనీసపు చందా మొత్తాన్ని సేకరించకుండా వ్యాపారమును ప్రారంభించలేదు. కంపెనీ జారీ చేసిన మూలధనములో మొత్తాన్ని, 90% పరిచయ పత్రాన్ని జారీ చేసిన 120 రోజులలోపు సేకరించాలి. అలా సేకరించకపోతే సెబీ సూచనల మేరకు 10 రోజులలోపు దరఖాస్తు దారులకు తిరిగి చెల్లించవలెను.

4) వ్యాపార ప్రారంభము: పబ్లిక్ కంపెనీ వ్యాపార ప్రారంభ ధ్రువపత్రాన్ని పొందుటకు ఈ క్రింది పత్రాలను రిజిస్ట్రారుకు సమర్పించాలి.

  1. పరిచయ పత్రము లేదా ప్రత్యామ్నాయ పరిచయ పత్రము.
  2. డైరెక్టర్ల అర్హత వాటాలు తీసుకొని చెల్లించినట్లు ధృవీకరణ పత్రము.
  3. కనీసపు చందా వసూలైనట్లు, దాని మేరకు వాటాలను కేటాయించినట్లుగా ధృవీకరణ పత్రము.
  4. వ్యాపార ప్రారంభానికి అవసరమైన లాంఛనాలు పాటించినట్లుగా కంపెనీ డైరెక్టరు లేదా సెక్రటరీ ప్రకటన.

పై పత్రాలను రిజిస్ట్రారు పరిశీలించి, సంతృప్తి చెందినట్లయితే వ్యాపార ప్రారంభ ధృవపత్రాన్ని జారీ చేస్తాడు. ఈ పత్రము పొందడముతో కంపెనీ స్థాపన పూర్తి అవుతుంది.

ప్రశ్న 2.
కంపెనీ నమోదులోని దశలను వివరించండి.
జవాబు.
కంపెనీ ఒక కల్పిత వ్యక్తి నమో కంపెనీగాని, పబ్లిక్ కంపెనీగా చేసి, రిజిస్ట్రేషన్ చేయవలెను. ద్వారా దీనికి అస్తిత్వము వస్తుంది. నమోదు అనేది చట్టపరమైన చర్య. ప్రైవేటు కంపెనీ రిజిస్ట్రారు కార్యాలయములో అవసరమైన ముఖ్యమైన పత్రాలు దాఖలు కంపెనీ నమోదు విధానము: కంపెనీ నమోదు కోసము దిగువ ముఖ్య పత్రాలను తయారు చేసి జతపరచాలి.

1) పేరు అనుమతి కోసం దరఖాస్తు: కంపెనీ నమోదుకోసం మొదట పేరు అనుమతి కోరుతూ ఆ రాష్ట్ర కంపెనీల రిజిస్ట్రారుకు దరఖాస్తు చేయాలి. పేర్ల చట్టం 1950 పరిధిలోపు ఏ పేరైనా కంపెనీ పెట్టుకోవచ్చు. కంపెనీ రిజిస్ట్రారు దరఖాస్తు అందిన 14 రోజులలోపు అనుమతిని ఇస్తారు. ఆ తేదీనుంచి 3 నెలల లోపు ఆ పేరును రిజిస్ట్రేషన్ చేయాలి.

2) సంస్థాపనా పత్రము: ఈ పత్రము కంపెనీకి రాజ్యాంగము వంటిది. ఇందులో కంపెనీ ధ్యేయాలు, అధికారాలు, బయటవారితో ఉన్న సంబంధాలను నిర్వచిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన పత్రము దీనిని జాగ్రత్తగా తయారు చేసి తగిన స్టాంపులు అతికించాలి. పబ్లిక్ కంపెనీ అయితే ఏడుగురు, ప్రైవేటు కంపెనీ అయితే ఇద్దరు కొత్త చట్ట సవరణ ప్రకారం ఒకరు ఈ పత్రముపై సంతకాలు చేయాలి.

3) కంపెనీ నియమావళి: ఈ పత్రము కంపెనీ అంతర్గత పరిపాలనకు సంబంధించి నియమ నిబంధనలు ఉంటాయి. సంస్థాపనా పత్రము మీద సంతకాలు చేసినవారు దీని మీద సంతకాలు చేయవలెను. ప్రైవేటు కంపెనీ నియమావళిని తప్పని సరిగా రిజిస్ట్రారుకు దాఖలు చేయాలి. పబ్లిక్ కంపెనీ నియమావళిని తయారుచేయకపోతే కంపెనీ చట్టంలోని షెడ్యూల్ -1, టేబుల్ A ని అనుసరించవచ్చును.

TS Inter 1st Year Commerce Study Material Chapter 6 కంపెనీ స్థాపన

4) అదనపు పత్రాలు: కంపెనీ నమోదుకు మరికొన్ని అదనపు పత్రాలు తయారు చేసి రిజిస్ట్రారుకు దాఖలు చేయాలి.
అవి:
ఎ) డైరెక్టర్ల సమ్మతి పత్రము: డైరెక్టర్లుగా వ్యవహరించడానికి వారి సమ్మతిని తెలియజేస్తూ ఫారం నెం.29 పత్రాన్ని రిజిస్ట్రారుకు దాఖలు చేయవలెను.

బి) పవర్ ఆఫ్ అటార్నీ: కంపెనీ నమోదుకు కావలసిన లాంఛనాలు పూర్తి చేసినట్లు ధృవీకరించడానికి, అవసరమయితే తగిన మార్పులు చేయడానికి ఒక న్యాయవాదిని వ్యవస్థాపకులు నియమించాలి. అతనిని అటార్నీ అంటారు. అతని నియామకపు పత్రాన్ని కూడా రిజిస్ట్రారుకు దాఖలు చేయాలి.

సి) కంపెనీ రిజిష్టర్డ్ కార్యాలయము: కంపెనీ రిజిష్టర్డ్ కార్యాలయము ఎక్కడ ఏర్పాటు చేయవలెనో ముందు నిర్ణయము అయితే, నమోదైన 30 రోజులలోపు రిజిష్టర్డ్ కార్యాలయ వివరాలను రిజిస్ట్రారుకు తెలియజేయాలి.

డి) డైరెక్టర్ల వివరాలు: కంపెనీ డైరెక్టర్లు, మేనేజరు లేదా సెక్రటరీ మొదలైన వారి వివరాలను ఫారంలో పొందుపరిచి నమోదుకు 30 రోజులలోపు రిజిస్ట్రారుకు దాఖలు చేయాలి.

5) శాసనాత్మక ప్రకటన: కంపెనీల చట్టం ప్రకారము నమోదుకు సంబంధించి అన్ని లాంఛనాలు సక్రమముగా నిర్వర్తించినట్లు కంపెనీ న్యాయవాది గాని, ఛార్టర్డ్ అకౌంటెంట్ లేదా సెక్రటరీగాని చట్టపూర్వకమైన ప్రకటన
చేయించాలి.

6) నమోదు రుసుం చెల్లింపు: కంపెనీ నమోదుకు చట్టప్రకారము నిర్దేశించిన రుసుము చెల్లించి రశీదును పొందాలి.

7) నమోదు పత్రం: పైన తెలిపిన పత్రాలన్నింటిని రిజిస్ట్రారు పరిశీలించి సంతృప్తి చెందితే నమోదు పత్రాన్ని జారీ చేస్తాడు. ఈ పత్రాన్ని పొందిన వెంటనే ప్రైవేటు కంపెనీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు కాని పబ్లిక్ కంపెనీ వ్యాపార ప్రారంభ ధృవపత్రము పొందనిదే వ్యాపారాన్ని ప్రారంభించరాదు.

ప్రశ్న 3.
వ్యవస్థాపన అంటే ఏమిటి ? వ్యవస్థాపనని నిర్వచించి దానిలోని దశలను వివరించండి.
జవాబు.
కంపెనీ తనంతట తాను ఉద్భవించదు. ఇది మానవ కృషి ఫలితముగా ఏర్పడుతుంది. ఎవరో ఒకరు పూనుకొని నిధులను, ఆస్తులను, నిర్వహణా సామర్థ్యమును సమీకరించాలి. కంపెనీ ఏర్పాటుకు ముందు జరిగే కార్యక్రమాన్ని అంతటిని వ్యవస్థాపన అంటారు. అంటే వ్యాపార ఉద్దేశాన్ని ఏర్పరచుకొని, అవకాశాన్ని కనుక్కొని, లాభార్జనకై ఉత్పత్తి సాధనాలు సమీకరించి సమర్థవంతముగా నిర్వహించే ప్రక్రియను వ్యవస్థాపన అంటారు. వ్యవస్థాపనను గెస్టిన్ బర్గ్ ఇట్లా నిర్వచించినాడు. “వ్యాపార అవకాశాలు కనుక్కోవడం, ఆ తరువాత లాభార్జనకై నిధులను, ఆస్తులను, నిర్వహణా సామర్ధ్యమును వ్యాపార సంస్థలో వెచ్చించడము”. కంపెనీ వ్యవస్థాపన వ్యయ ప్రయాసలతో కూడినది. వ్యవస్థాపనలోని దశలు:

1) వ్యాపార భావావతరణ: వ్యాపార విజయము సరైన వ్యాపార ఎన్నికపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా కొత్త వ్యాపార అవకాశాలు తటస్థించినపుడు ఆ అవకాశాలను ఎంతవరకు అమలుపరచవచ్చును ? లాభదాయకమా ? కాదా? అనే అంశములు నిశితముగా పరిశీలించి, ఆచరణ యోగ్యము, లాభదాయకమని భావిస్తే వ్యాపార సంస్థ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటాడు. నిర్ణయించిన వ్యాపారంలో ఉండే సమస్యలు, లాభాలను సాంకేతిక నిపుణుల సహాయంతో విశ్లేషించి, లాభసాటి వ్యాపారాన్ని ఎంపిక చేసుకోవాలి. ‘

2) సమగ్ర పరిశోధన: ప్రారంభించవలసిన వ్యాపారాన్ని గురించి సమగ్రమైన పరిశోధన జరపాలి. పెట్టుబడిదారులు మనస్తత్వము, మార్కెట్ పరిస్థితులు, కంపెనీకి అవసరమయ్యే ఆర్థిక వనరులు, శ్రామికులు, ముడిపదార్థాలు, యంత్రాల లభ్యత వస్తువుకు ఉండే డిమాండ్ మొదలైన అంశాలను గురించి సమగ్ర పరిశోధన చేయాలి.

3) వనరుల సమీకరణ: వ్యవస్థాపకుడు తాను ఎంపిక చేసిన వ్యాపారము లాభసాటిగా, ఆమోద యోగ్యముగా ఉందని నిర్థారణ చేసుకున్న తరువాత వ్యాపార సంస్థకు అవసరమయ్యే ముడిపదార్థాలు, ఆస్తులు, యంత్రాలు, నిర్వాహకుల, సాంకేతిక నిపుణుల సేవలు మొదలైనవి సమకూరే లాగా ఒప్పందాలు చేసుకుంటాడు.-

4) ఆర్థిక ప్రతిపాదన: వ్యవస్థాపకుడు కంపెనీకి ఉండవలసిన మూలధన స్వరూపాన్ని నిర్ణయిస్తాడు.
ఏ రకమైన వాటాలు, డిబెంచర్లు జారీ చేయాలి ? ఎంత మొత్తము జారీచేయాలో నిర్ణయిస్తాడు. వివిధ ఆర్థిక సంస్థల నుంచి సేకరించవలసిన దీర్ఘకాలిక ఋణాలను కూడా నిర్ధారణ చేస్తాడు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వ్యవస్థాపకుడి విధులు ఏమిటి ?
జవాబు.
వ్యవస్థాపకుని విధులు:

  1. వ్యవస్థాపకుడు వ్యాపార అవకాశాలను శోధిస్తాడు. ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి వ్యాపారము ప్రారంభించవలెననే విషయములపై పరిశోధనలను జరిపి ఒక నిర్ణయానికి వస్తాడు.
  2. వ్యాపార ఉద్దేశ్యము ఏర్పడగానే ఆ ఉద్దేశాన్ని ఆచరణలో పెట్టడానికి సవిస్తరమైన శోధనలు చేస్తాడు. ఉత్పత్తి వస్తువుల డిమాండు, ముడిపదార్థాల లభ్యత, రవాణా సౌకర్యాలు, అవసరమైన మూలధనము, లాభాలు మొదలైన అంశాల గురించి పరిశీలన చేసి, ఇవి అనుకూలముగా ఉంటే స్థాపనకు ముందంజ వేస్తాడు.
  3. ఫ్యాక్టరీ నిర్మాణానికి స్థలాన్ని సేకరించాలి. భవన నిర్మాణాలు, యంత్రాలు, యంత్ర పరికరాలు సేకరించాలి. నిర్వహణా సామర్థ్యాన్ని సమీకరించుకోవాలి.
  4. వ్యాపార బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడానికి, అవసరమైన వ్యక్తులను (డైరెక్టర్లు, మేనేజర్లు) నియమిస్తాడు.
  5. కంపెనీ బ్యాంకర్లను, ఆడిటర్లను, సొలిసిటర్లను ఎన్నుకోవాలి.
  6. కంపెనీ నమోదుకు కావలసిన ముఖ్య పత్రాలను తయారు చేయాలి.
  7. కంపెనీకి కావలసిన ఆస్తుల కొనుగోలుకు సంబంధించి ఒప్పందాలు చేసుకోవాలి.
  8. కంపెనీని నిర్వహించడానికి కావలసిన మూలధనాన్ని సేకరించాలి.
  9. పరిచయ పత్రాన్ని జారీచేసి, వ్యాపార ప్రారంభ ధ్రువపత్రాన్ని పొందవలెను.

TS Inter 1st Year Commerce Study Material Chapter 6 కంపెనీ స్థాపన

ప్రశ్న 2.
వ్యవస్థాపకుల రకాలను తెలపండి.
జవాబు.
వ్యవస్థాపకుల రకాలు:
1. వృత్తిరీత్యా వ్యవస్థాపకులు: ఈ రకమైన వ్యవస్థాపకులు కంపెనీ స్థాపనకు ప్రత్యేక ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. వ్యవస్థాపన తమ పూర్తికాల వృత్తిగా నిర్వహిస్తారు.

2. యాదృచ్ఛిక వ్యవస్థాపకులు: కంపెనీ వ్యవస్థాపనలో ప్రత్యేక నైపుణ్యత లేకపోయినా, తమ సొంత సంస్థను ఏర్పాటు చేసుకోగల వ్యవస్థాపకులను యాదృచ్ఛిక వ్యవస్థాపకులు అంటారు.

3. ఆర్థిక వ్యవస్థాపకులు: సెక్యూరిటీల మార్కెట్లో అనుకూల పరిస్థితుల ఆధారంగా సంస్థలను స్థాపించే వ్యవస్థాపకు లను ఆర్థిక వ్యవస్థాపకులు అంటారు.

4. సాంకేతిక వ్యవస్థాపకులు: ఈ తరహా వ్యవస్థాపకులు తమకున్న ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ ద్వారా కొత్త కంపెనీలను స్థాపిస్తారు.

5. సంస్థాగత వ్యవస్థాపకులు: కంపెనీ స్థాపనకు కావలసిన సాంకేతిక, నిర్వహణ, ఆర్థిక సహాయాలను అందించడానికి ప్రత్యేకంగా సంస్థలను ఏర్పాటు చేసే వారిని సంస్థాగత వ్యవస్థాపకులు అంటారు.

6. ఔత్సాహిక వ్యవస్థాపకులు: ఈ వ్యవస్థాపకులు కంపెనీ స్థాపన మరియు వ్యవస్థాపన కార్యకలాపాలను పూర్తి చేసి, ఆ తర్వాత కాలంలో కంపెనీ నిర్వహణ బాధ్యతలను కూడా చేపడతారు. వీరు వ్యాపార భావావతరణ నుండి వ్యాపార కార్యకలాపాల ప్రారంభం వరకు అన్ని రకాల వ్యవహారాలను చూసుకుంటారు. కాబట్టి వీరిని ఔత్సాహిక వ్యవస్థాపకులు అంటారు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వ్యవస్థాపన అంటే ఏమిటి ?
జవాబు.

  1. కంపెనీ స్థాపనలో వ్యవస్థాపన మొదటి దశ. వ్యవస్థాపన దశలో వ్యాపార అవకాశాలను గుర్తించడం, వాటి స్వరూప స్వభావాలను విశ్లేషణ చేయడం జరుగుతుంది. వ్యవస్థాపనకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి, వ్యాపార భావనకు రూపకల్పన చేస్తారు.
  2. వ్యవస్థాపన అంటే ఆవిష్కరించిన ఆలోచనను అమలుచేయడం లేదా సాధన చేయడం.
  3. “ఒక వ్యాపారసంస్థ విత్తం గురించి ఆలోచించి, వ్యవస్థీకరించి కంపెనీగా నిలబెట్టడమే వ్యవస్థాపన” అని హేనీ నిర్వచించారు.

ప్రశ్న 2.
వ్యవస్థాపకుడు ఎవరు ?
జవాబు.

  1. వ్యవస్థాపకుడు అనే వ్యక్తి కంపెనీ స్థాపనకు అవసరమైన ప్రాథమిక చర్యలను పూర్తి చేస్తాడు. కంపెనీ కార్యకలాపాలను మొట్టమొదటిగా నియంత్రించే వ్యక్తి వ్యవస్థాపకుడు.
  2. కంపెనీ స్థాపనకు పూనుకునే వ్యక్తిని వ్యవస్థాపకుడు అంటారు. వ్యవస్థాపకుడు ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం “లేదా ఒక సంస్థ కావచ్చు.
  3. వ్యవస్థాపకుడు, ఒక సంస్థ స్థాపనకు కావలసిన డబ్బు, ముడిపదార్థాలు, శ్రామికులు, యంత్రాలను సమీకరించి దాని నిర్మాణానికి మార్గదర్శకుడవుతాడు.

ప్రశ్న 3.
వృత్తిరీత్యా వ్యవస్థాపకుడు అంటే ఏమిటి ?
జవాబు.
కంపెనీ వ్యవస్థాపనలో నైపుణ్యత కలిగిన వ్యవస్థాపకులను వృత్తిరీత్యా వ్యవస్థాపకులు అని అంటారు. కంపెనీల వ్యవస్థాపనయే వీరి వృత్తి.

ప్రశ్న 4.
ఔత్సాహిక వ్యవస్థాపకుడు అంటే ఏమిటి ?
జవాబు.

  1. ఈ వ్యవస్థాపకులు కంపెనీ స్థాపన మరియు వ్యవస్థాపన కార్యకలాపాలను పూర్తి చేసి, ఆ తర్వాత కాలంలో కంపెనీ నిర్వహణ బాధ్యతలను కూడా చేపడతారు.
  2. వీరు వ్యాపార భావావతరణ నుండి వ్యాపార కార్యకలాపాల ప్రారంభం వరకు అన్ని రకాల వ్యవహారాలను చూసుకుంటారు. కాబట్టి వీరిని ఔత్సాహిక వ్యవస్థాపకులు అంటారు.

TS Inter 1st Year Commerce Study Material Chapter 6 కంపెనీ స్థాపన

ప్రశ్న 5.
మూలధన సమీకరణ అంటే ఏమిటి ?
జవాబు.
1. పబ్లిక్ కంపెనీ పరిచయ పత్రంలో పేర్కొన్న కనీసపు చందాను సేకరించకుండా వ్యాపారాన్ని ప్రారంభించలేదు. కంపెనీ నమోదుకు ప్రాథమిక ఖర్చులు, ఆస్తుల కొనుగోలు మొదలైనవాటికి అవసరమయ్యే కనీస మొత్తాన్ని “కనీసపు చందా” అంటారు.

2. పరిచయ పత్రంలో సూచించిన విధంగా ఒక పబ్లిక్ కంపెనీ కనీసపు చందా తప్పకుండా సేకరించాలి. కంపెనీ జారీ చేసిన మూలధనంలో 90% మొత్తాన్ని 120 రోజులలోపు సేకరించాలి. అలా సేకరించని పక్షంలో దరఖాస్తు దారులకు వారి సొమ్మును, సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబి) సూచనల మేరకు 10 రోజుల
లోపల తిరిగి చెల్లించాలి.

TS Inter 1st Year Commerce Study Material Chapter 5 జాయింట్ స్టాక్ కంపెనీ

Telangana TSBIE TS Inter 1st Year Commerce Study Material 5th Lesson జాయింట్ స్టాక్ కంపెనీ Textbook Questions and Answers.

TS Inter 1st Year Commerce Study Material 5th Lesson జాయింట్ స్టాక్ కంపెనీ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జాయింట్ స్టాక్ కంపెనీ నిర్వచించండి. జాయింట్ స్టాక్ కంపెనీ లక్షణాలను వివరించండి.
జవాబు.
జాయింట్ స్టాక్ కంపెనీ – అర్థం: కంపెనీ లేదా జాయింట్ స్టాక్ కంపెనీ అంటే భారీతరహా వాణిజ్య లేదా వ్యాపార కార్యకలాపాలను చేపట్టి, నిర్దిష్ట ధ్యేయాలను సాధించడానికి, కొంతమంది వ్యక్తులచే స్వచ్ఛందంగా ఏర్పడిన సంస్థ. ఇది న్యాయశాస్త్రం ద్వారా సృష్టించబడి, న్యాయస్థానం ద్వారానే రద్దు చేయబడుతుంది. కంపెనీకి ఉన్న ఈ ప్రత్యేక లక్షణం వల్ల కంపెనీ వేరు కంపెనీలోని సభ్యులు వేరు సభ్యుల జీవితాలతో కంపెనీకి ఎలాంటి సంబంధం ఉండదు, ఈ సభ్యులు సమిష్టి ప్రయోజనం కోసం తమవంతు ధనాన్ని మూలధనంగా సమకూర్చుతారు. ఈ మూలధనం చిన్న చిన్న భాగాలుగా (యూనిట్లు) విభజింపబడి ఉంటుంది. ఈ చిన్న చిన్న భాగాలను లేదా యూనిట్లను ‘వాటాలు’ అంటారు. కంపెనీ సభ్యులు ఈ వాటాలను కొనడం ద్వారా పెట్టుబడి పెట్టడం వల్ల వీరిని ‘వాటాదారులు’ అంటారు. కంపెనీ మూలధనాన్ని ‘వాటా మూలధనం’ అంటారు.,

నిర్వచనాలు:
1) ఎల్. హెచ్. హేని ప్రకారం
“బదిలీ చేయుచున్న వారితో ప్రారంభించబడిన మూలధనం కలిగి, లాభార్జన ధ్యేయంగా ఏర్పడ్డ వ్యక్తుల స్వచ్ఛంద సంస్థయే కంపెనీ. ఇందులో సభ్యులైన వారు దానికి యజమానులు అవుతారు”.

2) లార్డ్ జస్టిస్ లిండ్ ప్రకారం – “సమిష్టి ప్రయోజనం కోసం ధనాన్ని లేదా ధనంతో సమానమైన దానిని సమకూర్చే అనేకమంది వ్యక్తుల కలయిక కంపెనీ”.

3) కంపెనీల చట్టం, 2013 ప్రకారం – “ఏదైనా ఒక సంస్థ కంపెనీ చట్టం 2013 లేదా అంతకు పూర్వం ఇతర ఏ కంపెనీ చట్టం క్రింద నమోదు చేయబడిన దానిని కంపెనీ అని అంటారు”.

TS Inter 1st Year Commerce Study Material Chapter 5 జాయింట్ స్టాక్ కంపెనీ

జాయింట్ స్టాక్ కంపెనీ – లక్షణాలు:
కంపెనీ యొక్క విలక్షణమైన లక్షణాలను క్రింది విధంగా గుర్తించవచ్చు.
1) చట్టం సృష్టించిన కల్పిత వ్యక్తి: కంపెనీ అనేది చట్టం ద్వారా సృష్టించబడిన కృత్రిమ వ్యక్తి. న్యాయశాస్త్రమే ప్రాణంగా మనుగడను కొనసాగిస్తుంది. ఇది ఒక అదృశ్యమైన, కంటికి కనిపించని శరీరం, ఆత్మ లేని వ్యక్తి.

2) ప్రత్యేక న్యాయసత్వం: కంపెనీ చట్టం ద్వారా సృష్టించబడిన కల్పిత వ్యక్తి. కంపెనీ నమోదు చేయగానే దానికి ప్రత్యేక మైన వ్యక్తిత్వం లభిస్తుంది. అంటే కంపెనీ వేరు, కంపెనీలోని సభ్యులు వేరు. కంపెనీ స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఒప్పందాన్ని కుదుర్చుకొనవచ్చు. సాధారణ వ్యక్తులలాగా ఆస్తులను కొనడం, అమ్మడం చేయవచ్చు. ఉద్యోగస్తులను -నియంత్రించవచ్చు. స్వతంత్రంగా న్యాయసమ్మతమైన వ్యాపారాన్ని కొనసాగించవచ్చు.

3) స్థాపన: జాయింట్ స్టాక్ కంపెనీ స్థాపనకు ముందు పలు ముఖ్యమైన పత్రాలను తయారు చేయడంతో పాటు అనేక చట్టపరమైన నిబంధనలను, షరతులను పూర్తి చేయవలసి ఉంటుంది. భారత కంపెనీల చట్టం, 2013 కింద తప్పనిసరిగా నమోదు చేయించినప్పుడు మాత్రమే కంపెనీ మనుగడలోకి వస్తుంది.

4) అధికార ముద్ర: కంపెనీకి భౌతికమైన ఆకారం లేదు. అందువల్ల సహజమైన వ్యక్తిలాగా డైరెక్టర్ల బోర్డు ద్వారా వ్యవహరిస్తుంది. కంపెనీ ఒప్పందాలను కుదుర్చుకొన్నప్పుడు లావాదేవీలు జరిగినప్పుడు సంతకాలు చేయడానికి బదులు, తన అధికారముద్రను ఉపయోగిస్తుంది. ఈ అధికార ముద్ర కంపెనీ సంతకంలాగా చలామణి అవుతుంది.. కంపెనీ సంతకానికి బదులు కంపెనీ అధికారముద్రను ముద్రించి, ఇద్దరు డైరెక్టర్లు సాక్షి సంతకాలు చేసినప్పుడు మాత్రమే ఆ పత్రాలలో ఉన్న విషయాల వల్ల కంపెనీకి బాధ్యత ఏర్పడుతుంది. ఈ అధికార ముద్రను తగు జాగ్రత్త మధ్య కంపెనీ కార్యదర్శి వద్ద భద్రపరచవలసి ఉంటుంది.

5) పారంపర్యాధికారం: కంపెనీ వ్యాపార సంస్థకు శాశ్వతమైన మనుగడ ఉంది. అందువల్ల కంపెనీ చిరకాలం
కొనసాగుతుంది. కంపెనీ సభ్యులలో ఎవరైనా మరణించినా, వారి వాటాలను అమ్మివేసినా, ఎవరికైనా మతి భ్రమించినా, ఎవరైనా దివాలా తీసినా, కంపెనీ మాత్రం నిరాటంకంగా కొనసాగే అధికారాన్ని కలిగి ఉంటుంది. కంపెనీ చట్టం ద్వారా సృష్టించబడినందువల్ల దానిని మూసివేయడం చట్టం ద్వారానే సాధ్యమవుతుంది.

6) సభ్యుల రుణబాధ్యత పరిమితం: కంపెనీ వేరు, కంపెనీ సభ్యులు వేరు. అందువల్ల కంపెనీ తాను చేసిన అప్పులకు తానే బాధ్యత వహిస్తుంది. ఈ సందర్భంగా వాటాదారుల రుణబాధ్యత వారు తీసుకున్న వాటా విలువలకు పరిమితమై ఉంటుంది. ఉదాహరణకు శ్రీను అనే వాటాదారుడు 10లు విలువలు కలిగిన వాటాను కొని వాటాకు ఔ 8లు చెల్లిస్తే అతని రుణబాధ్యత వాటాకు 2లకు పరిమితమై ఉంటుంది. దీనికి మించి అతడు కంపెనీకి సంబంధించిన ఎలాంటి రుణాల లేదా నష్టాల చెల్లింపుకు బాధ్యతను కలిగి ఉండదు.

7) వాటాల బదిలీ: పబ్లిక్ కంపెనీలో వాటాదారులు తమ వాటాలను యధేచ్చగా ఇతరులకు తమకు ఇష్టం వచ్చినప్పుడు బదిలీ చేసుకొనవచ్చు. ఈ మేరకు ఇతర వాటాదారుల అంగీకారం అవసరం లేదు. ప్రైవేట్ కంపెనీల విషయంలో వాటాల బదిలీకి సంబంధించి కొన్ని నిబంధనలను విధించడమైంది.

8) సభ్యత్వం: జాయింట్ స్టాక్ కంపెనీ వ్యవస్థలో ప్రధానంగా ప్రైవేట్ కంపెనీలు, పబ్లిక్ కంపెనీలుగా పేర్కొనవచ్చు. ప్రైవేట్ కంపెనీల విషయంలో కనిష్ఠ సభ్యుల సంఖ్య 2, గరిష్ఠ సభ్యుల సంఖ్య 50 గాను పబ్లిక్ కంపెనీల విషయంలో కనిష్ఠ సభ్యుల సంఖ్య 7, గరిష్ఠ సభ్యుల సంఖ్య అపరిమితంగాను ఉంటుంది.

9) ప్రజాస్వామ్య నిర్వహణ: వివిధ వర్గాలకు, ప్రాంతాలకు చెందిన ప్రజలు ఒక కంపెనీకి మూలధనాన్ని సమకూర్చుతారు. అందువల్ల వీరందరూ కంపెనీ రోజు వారి నిర్వహణలో పాల్గొనలేరు. అందువల్ల కంపెనీ పరిపాలన, నిర్వహణను చూడడానికి వాటాదారులు, డైరెక్టర్లను తమ ప్రతినిధులుగా ఎన్నుకొంటారు. ఆ విధంగా కంపెనీ నిర్వహణ ప్రజాస్వామిక సూత్రాలపై ఆధారపడి ఉంది.

10) మహిళ డైరెక్టర్: కంపెనీ చట్టం, 2013 ప్రకారం కొన్ని నిర్దిష్ట పబ్లిక్ కంపెనీలలో కనీసం ఒక మహిళ డైరెక్టర్గా వ్యవహరించాలి.

ప్రశ్న 2.
కంపెనీల వర్గీకరణను వివరించండి.
జవాబు.
జాయింట్ స్టాక్ కంపెనీలు వివిధ అంశాల ప్రాతిపదికపై వర్గీకరించడమైంది.
1. వ్యవస్థాపన ఆధారంగా (నమోదు ఆధారంగా):
ఎ) చార్టెర్డ్ కంపెనీలు: రాజు ఆజ్ఞతో గాని లేదా రాజశాసనం ద్వారా గాని కంపెనీల ఆవిర్భావం జరిగినప్పుడు వాటిని చార్టెర్డ్ కంపెనీలు అంటారు. భారతదేశంలో ప్రస్తుతం ఈ కంపెనీలు ఉనికిలో లేవు. ఉదాహరణకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ (1894), ఈస్ట్ ఇండియా కంపెనీ (1600) మొదలైనవి.

బి) శాసనాత్మక కంపెనీలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేత ప్రత్యేక చట్టం ద్వారా నమోదు చేయబడిన కంపెనీలను  శాసనాత్మక కంపెనీలని అంటారు. సాధారణంగా శాసనాత్మక కంపెనీలు ప్రజా శ్రేయస్సు కోసమే ఏర్పాటు చేయబడతాయి. ఉదాహరణకు రైల్వే, కరెంటు ఉత్పత్తి, నీటి పనులు, భారత రిజర్వు బ్యాంకు మొదలగునవి.

సి) రిజిస్టర్డ్ కంపెనీలు: కంపెనీల చట్టం, 2013 కింద నమోదైన కంపెనీలను రిజిస్టర్డ్ కంపెనీలు అని అంటారు. కంపెనీల చట్టానికి లోబడి నమోదు పత్రం రిజిస్ట్రార్ వద్ద నుండి పొందిన తర్వాత కంపెనీ అస్తిత్వంలోకి వస్తుంది.

2. ప్రజాశక్తి ఆధారంగా:
ఎ) ప్రైవేట్ కంపెనీ: కంపెనీల చట్టం, 2013 సెక్షన్ 2(68) కింద నమోదైన ప్రైవేట్ కంపెనీ, కంపెనీల నియమావళి ప్రకారం వాటాల బదిలీ మరియు ప్రజల నుండి చందా పొందడానికి నిషేధించబడ్డాయి”.
ప్రైవేట్ కంపెనీ లక్షణాలను క్రింది విధంగా గమనించవచ్చు:

  1. కనీసపు చెల్లించిన మూలధనం 1,00,000 రూపాయలు.
  2. కనీస సభ్యుల సంఖ్య 2.
  3. గరిష్ట సభ్యుల సంఖ్య 50.
  4. ప్రజలకు పరిచయపత్రం ద్వారా వాటాలను జారీ చేయరాదు.
  5. వాటాలను బదిలీ చేయరాదు.

పైన పేర్కొన్న నిబంధనలన్నింటిని ప్రైవేట్ కంపెనీలు తప్పక పాటించవలసి ఉంటుంది. అంతేకాక కంపెనీ పేరు చివర “ప్రైవేట్ లిమిటెడ్” అని తప్పక పేర్కొనవలసి ఉంటుంది.

కంపెనీల చట్టం, 2013 ప్రకారం ప్రయివేట్ కంపెనీలను రెండు రకాలుగా పేర్కొనవచ్చు.
i) చిన్న కంపెనీ: కంపెనీల చట్టం, 2013 సెక్షన్-2(85) ప్రకారం, “పబ్లిక్ కంపెనీ కానీ కంపెనీలను చిన్న కంపెనీలుగా పేర్కొనవచ్చు. చిన్న కంపెనీకి క్రింది లక్షణాలు ఉండును.

  1. కంపెనీ వాటా మూలధనం కౌ 50 లక్షలకు మించరాదు. ఒకవేళ పెద్ద మొత్తంలో అయితే (సూచించిన యెడల) 5 కోట్లు మించరాదు.
  2. కంపెనీ టర్నోవర్ 7 2 కోట్లకు మించరాదు. ఒకవేళ పెద్ద మొత్తం అయితే (సూచించిన యెడల) 50 కోట్లు, 20 కోట్లకు మించరాదు.

TS Inter 1st Year Commerce Study Material Chapter 5 జాయింట్ స్టాక్ కంపెనీ

ii) ఏక వ్యక్తి కంపెనీ: కంపెనీల చట్టం, 2013 ప్రకారం, “ఒకే ఒక వ్యక్తి సభ్యుడిగా కంపెనీలో ఉన్నప్పుడు ఆ కంపెనీని ఏక వ్యక్తి కంపెనీగా వ్యవహరిస్తారు. వాస్తవానికి ఈ కంపెనీలలో మొత్తం వాటా మూలధనం ఒక్కరే సమకూరుస్తారు. ఇతని వద్దే మొత్తం వాటాలు ఉంటాయి. నామమాత్రంగా ఒక్కరు లేక ఇద్దరు వ్యక్తులు కుటుంబం నుంచి లేక స్నేహితుల నుంచి కాని సభ్యులుగా వ్యవహరిస్తారు. నామమాత్రపు సభ్యుడు పరిమిత రుణబాధ్యతతో ప్రధాన వాటాదారుడికి వారసత్వంగా వ్యవహరిస్తాడు.
బి) పబ్లిక్ కంపెనీ: భారీ మొత్తంలో మూలధనాన్ని వెచ్చించి పెద్దతరహా వ్యాపార కార్యకలాపాలను చేపట్టదలచిన వ్యాపార సంస్థలకు ఈ పబ్లిక్ కంపెనీ ఎంతో అనుకూలమైంది. కంపెనీల (సవరణ) చట్టం, 2000 ప్రకారం పబ్లిక్ కంపెనీకి ఈ క్రింది లక్షణాలు ఉంటాయి.

  1. కనీసపు చెల్లించిన మూలధనం 35,00,000.
  2. కనీస సభ్యుల సంఖ్య 7.
  3. గరిష్ట సభ్యుల సంఖ్య అపరిమితం.

ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ తన పేరు చివర పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అని గాని లేదా క్లుప్తంగా లిమిటెడ్ అనే పదాన్ని గాని ఉపయోగించాలి. ఉదాహరణ స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మొదలైనవి.

3) యాజమాన్యం ఆధారంగా:
ఎ) ప్రభుత్వ కంపెనీలు: కంపెనీ యొక్క మొత్తం చెల్లించిన వాటా మూలధనంలో 51% వాటాలను కేంద్ర ప్రభుత్వం కాని, రాష్ట్ర ప్రభుత్వం కాని, కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు కాని, లేక రాష్ట్ర ప్రభుత్వాలు కాని సమకూర్చినట్లయితే అట్టి కంపెనీని ప్రభుత్వ కంపెనీ అంటారు. ఉదాహరణకు స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.

బి) ప్రభుత్వేతర కంపెనీలు ప్రభుత్వ కంపెనీల లక్షణాలను కల్గిలేని కంపెనీలన్నీ ప్రభుత్వేతర కంపెనీలుగా గుర్తింపబడతాయి.

4) రుణబాధ్యత ఆధారంగా:
ఎ) వాటా పరిమిత కంపెనీలు: ఏ కంపెనీలో అయితే వాటాదారుల రుణబాధ్యత, వారు తీసుకున్న వాటాల ముఖ విలువలకు పరిమితమై ఉంటుందో ఆ కంపెనీని వాటా పరిమిత కంపెనీ అంటారు.
బి) పూచీ పరిమిత కంపెనీలు: కంపెనీ పరిసమాప్త సమయంలో సభ్యులు సంస్థాపన పత్రంలో సూచించిన విధంగా తమ రుణబాధ్యతను కొంత మొత్తానికే పరిమితమై ఆస్తులను సమకూరుస్తారు. అట్టి పూచీ ఇచ్చిన మొత్తాన్ని పరిసమాప్త దశలో మాత్రమే చెల్లిస్తారు.
సి) అపరిమిత కంపెనీలు: కంపెనీ పరిసమాప్త సమయంలో అపరిమిత కంపెనీ సభ్యులు రుణాలు చెల్లించడానికి తమ సొంత ఆస్తులను కూడా జత చేయవలసి వస్తుంది. ఈ రకమైన కంపెనీలలో కోర్టు అనుమతి లేకుండానే ఒక ప్రత్యేక తీర్మానం ద్వారా సులభంగా మూలధన మార్పులు చేసుకోవచ్చు.

5) అధికారం ఆధారంగా:
ఎ) హోల్డింగ్ కంపెనీలు: ఒక కంపెనీ వేరొక కంపెనీలో సగానికంటే ఎక్కువ వాటా మూలధనంను కల్గి ఉండి, ఆ కంపెనీ యొక్క నిర్వహణను నియంత్రించే విధంగా ఉన్నప్పుడు దానిని ‘హోల్డింగ్ కంపెనీ’ అంటారు. ఉదాహరణకు కంపెనీ A కంపెనీ B చెల్లించిన మూలధనంలో 51% మూలధనాన్ని కలిగి ఉన్నట్లయితే A కంపెనీని ‘హోల్డింగ్ కంపెనీ’ అని అంటారు.

బి) అనుబంధ కంపెనీ: ఒక కంపెనీ వేరొక కంపెనీ నిర్వాహణ, నియంత్రణలో ఉన్నప్పుడు ఆ కంపెనీని అనుబంధ కంపెనీ అంటారు. ఉదాహరణకు A అనే కంపెనీ B కంపెనీ వాటా మూలధనంలో 51% కన్నా ఎక్కువ లేదా 51% వాటా కలిగి ఉన్నప్పుడు B కంపెనీ A కంపెనీకి అనుబంధ కంపెనీ అగును.

6. జాతీయత ఆధారంగా:

  • స్వదేశీ కంపెనీ: ఒక కంపెనీ మన దేశంలోని కంపెనీల చట్టం ప్రకారం నమోదై వ్యాపార కార్యకలాపాలను జరిపినప్పుడు దానిని స్వదేశీ కంపెనీ అని అంటారు.
  • విదేశీ కంపెనీ: విదేశాలలో నమోదై, భారతదేశంలో వ్యాపార కార్యకలాపాలను నిర్వహించినప్పుడు దానిని విదేశీ కంపెనీ అంటారు.

7. ప్రాంతం ఆధారంగా:

  • జాతీయ కంపెనీ: కంపెనీ తమ వ్యాపార కార్యకలాపాలను ఒక దేశపు ఎల్లలను దాటకుండా చేపట్టినప్పుడు
    దానిని జాతీయ కంపెనీ అంటారు.
  • బహుళ జాతి కంపెనీ: నమోదైన దేశంలో కాక దేశపు సరిహద్దులు దాటి ఇతర దేశాలలో కూడా వ్యాపార కార్యకలాపాలను నిర్వర్తించే కంపెనీని బహుళజాతి కంపెనీ అంటారు.

8. వ్యాపారాన్ని ప్రారంభించడం ఆధారంగా:
ఎ) డార్మెంట్ కంపెనీ (నిద్రాణమైన కంపెనీ): ఒక కంపెనీ రెండు సంవత్సరాల కాలవ్యవధిలో ఏలాంటి అకౌంటింగ్ లావాదేవీలను చేయనపుడు దానిని డార్మెంట్ లేదా నిద్రాణమైన కంపెనీ అంటారు. ఒక కంపెనీ, తమ కంపెనీని డార్మెంట్ లేదా నిద్రాణమైన కంపెనీగా గుర్తించమని కంపెనీల రిజిస్ట్రారుకు దరఖాస్తు చేసుకోవచ్చును. బి) డీఫంక్ట్ కంపెనీ: కంపెనీ నమోదు చేసుకున్న సంవత్సరం లోపు వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించడంలో విఫలమై ఎలాంటి ఆస్తులు, అప్పులు లేకుండా ఉన్నప్పుడు దానిని డీఫంక్ట్ కంపెనీగా పిలుస్తారు. ఇలాంటి కంపెనీ బహిరంగంగా లేదా ప్రయివేట్ వ్యాపార కార్యకలాపాలను భవిష్యత్తులో కొనసాగించకుండా నిషేదించబడును. 3. ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ మధ్యగల వ్యత్యాసాలను తెలపండి.
జవాబు.
ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ మధ్య గల వ్యత్యాసాలు
TS Inter 1st Year Commerce Study Material Chapter 5 జాయింట్ స్టాక్ కంపెనీ 1
TS Inter 1st Year Commerce Study Material Chapter 5 జాయింట్ స్టాక్ కంపెనీ 2
TS Inter 1st Year Commerce Study Material Chapter 5 జాయింట్ స్టాక్ కంపెనీ 3

ప్రశ్న 4.
జాయింట్ స్టాక్ కంపెనీ ప్రయోజనాలను సవివరంగా వివరించండి.
జవాబు.
కంపెనీ వ్యవస్థ వలన ఈ క్రింది ప్రయోజనాలు ఉంటాయి.
1. పరిమిత ఋణబాధ్యత: వాటాదారుల ఋణబాధ్యత వారి వాటా విలువకు పరిమితము అవుతుంది. కంపెనీ అప్పులు తీర్చడానికి సొంత ఆస్తులు తనవసరము లేదు. వాటా సొమ్ము మాత్రమే కోల్పోతారు. నష్టభయం తక్కువ. అందువలన కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ప్రజలు ముందుకు వస్తారు.

2. భారీ ఆర్థిక వనరులు: ప్రజల నుంచి విస్తారముగా నిధులు సేకరించడానికి కంపెనీ వ్యవస్థ అనువైనది. కంపెనీ వాటాలను చిన్నచిన్న మొత్తాలుగా విభజించి అమ్మడం వలన స్వల్ప ఆదాయముగల ప్రజలు కూడా వాటాలను సులభముగా కొనగలరు.. అందువలన భారీ మూలధనాన్ని తేలికగా సేకరించవచ్చు.

3. శాశ్వత మనుగడ: కంపెనీల చట్టం ప్రకారము, కంపెనీకి ప్రత్యేక న్యాయసత్వము ఉన్నది. అందువలన కంపెనీ నిరాటంకముగా కొనసాగుతుంది. వాటాదారుల మరణము, దివాలా తీయడం వలన కంపెనీ మనుగడకు ఎటువంటి అంతరాయం కలగదు. అది నిరాటంకముగా కొనసాగుతుంది.

4. పెద్దతరహా కార్యకలాపాల ఆదాలు: అధిక నిధుల వలన కంపెనీలు ఉత్పత్తిని భారీగా చేపడతాయి. అందువలన కొనుగోళ్ళు, మార్కెటింగ్, సిబ్బంది వినియోగం, రవాణా తదితర వ్యవహారాలలో అనేక ఆదాలు లభిస్తాయి. ఖర్చులు తగ్గి, లాభాలు పెరుగుతాయి.

5. ద్రవ్వత్వ లక్షణం: పబ్లిక్ కంపెనీ వాటాలను ఇతరులు అనుమతి లేకుండా సులభముగా బదిలీ చేయవచ్చును. కంపెనీ వాటాలను స్టాక్ ఎక్స్చేంజిలో అమ్ముతారు. బదిలీ సౌకర్యము ద్వారా వీటిని తేలికగా నగదులోనికి మార్చుకొనవచ్చు. కాబట్టి వాటాలకు ద్రవ్యత్వ లక్షణం ఉండటంవలన కంపెనీకి స్థిరత్వము కల్పిస్తుంది.

6. సమర్థవంతమైన నిర్వహణ: కంపెనీకి అపారమైన నిధులు ఉండటం వలన నిర్వహణ నిపుణులను, వ్యయగణకులను, ఛార్టర్డ్ అకౌంటెంట్లు, సాంకేతిక నిపుణులను నియమిస్తే వారు నిర్వహణను సమర్థవంతముగా చేపడతారు.

7. పరిశోధన మరియు అభివృద్ధి: ఒక కంపెనీ ఉత్పత్తి ప్రక్రియను మెరుగుపరచడానికి, నూతన వస్తువుల రూపకల్పనకు, కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టవలసి ఉంటుంది. ఈ విస్తరణ కంపెనీలలోనే సాధ్యము.

8. పన్ను ఆదాలు: కంపెనీలు ఆదాయపు పన్ను ఎక్కువ కట్టవలసి వచ్చినప్పటికి, ఎన్నో పన్ను మినహాయింపులు ఇవ్వడం వలన వీటికి పన్ను చెల్లించే బాధ్యత మొత్తంమీద తగ్గుతుంది.

9. ఉద్యోగ అవకాశాలు: ఒక కంపెనీ పెద్ద మొత్తంలో ఉద్యోగాలను సృష్టిస్తుంది. అందువల్ల ఒక వ్యక్తి మరియు దేశం మొత్తం జీవన ప్రమాణం మెరుగుపడుతుంది.

10. సమతుల్య ప్రాంతీయాభివృద్ధి అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో కంపెనీల యొక్క విస్తరణ మరియు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు, రాయితీల వల్ల ఒక ఔత్సాహిక వ్యవస్థాపకుడు వెనుకబడిన ప్రాంతాలలో మరియు అభివృద్ధి చెందవలసిన ప్రాంతాలలో కంపెనీని స్థాపించడానికి సిద్ధమవుతాడు. ఇలాంటి కంపెనీలు అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందని ప్రాంతాల మధ్య వ్యత్యాసాన్ని తగిస్తుంది.

TS Inter 1st Year Commerce Study Material Chapter 5 జాయింట్ స్టాక్ కంపెనీ

ప్రశ్న 5.
జాయింట్ స్టాక్ కంపెనీ నష్టాలను విశ్లేషించండి.
జవాబు.
1) ఆంక్షలు, నిబంధనలు ఎక్కువ: కంపెనీని ప్రారంభించినప్పటి నుంచి, ముగించేవరకు (రద్దు చేయడం) కంపెనీ మీద ప్రభుత్వం ప్రతి దశలోను, ఎన్నో ఆంక్షలను, నిబంధనలను విధించింది. అంతేకాకుండా కంపెనీ పాటించవలసిన లాంఛనాలు ఎక్కువే. తయారుచేసి సమర్పించవలసిన పత్రాల సంఖ్య కూడా ఎక్కువ. వీటన్నిటిని పూర్తి చేయడం వ్యయప్రయాసలతో కూడుకొంది. వ్యాపారాన్ని తొందరగా ప్రారంభించడానికి ఈ ఆంక్షలు, లాంఛనాలు ప్రతి బంధకాలవుతాయి.

2) ఆసక్తి లోపించడం: వాటాదారులు కంపెనీకి యజమానులు. వీరు దేశవ్యాప్తంగా విస్తరించి ఉంటారు. అందువల్ల కంపెనీ నిర్వహణలో పాల్గొనలేరు. దీనికోసం వీరు డైరెక్టర్లను తమ ప్రతినిధులుగా ఎన్నుకొంటారు. ఆ విధంగా నిర్వహణ, యాజమాన్యం రెండూ వేర్వేరుగా ఉండటం వల్ల శ్రమకు, ఫలితానికి అంతరం ఏర్పడి వ్యక్తిగత శ్రద్ధ, ఆసక్తి సన్నగిల్లుతుంది. వాటాదారులకు ఖాతాదారులతో, ఉద్యోగులతో ప్రత్యక్ష సంబంధం లేకపోవడం కూడా మరొక లోపంగా చెప్పవచ్చు. అందువల్ల ఆశించిన ప్రగతిని సాధించకపోవచ్చు.

3) నిర్ణయాలలో జాప్యం: కంపెనీ వ్యవస్థలో నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరిగే అవకాశం ఎంతో ఉంది. వాటాదార్లు తమ అధికారాన్ని డైరెక్టర్లకు అప్పగిస్తే, డైరెక్టర్ల బోర్డు దానిని తమ ముఖ్య కార్యదర్శికి, అతడు ఈ అధికారాన్ని కింది స్థాయి ఉద్యోగులకు బదిలీ చేయడం ద్వారా నిర్ణయాలను వెంటవెంటనే తీసుకోవడానికి వీలుండదు. వివిధ కారణాల వల్ల కంపెనీ వ్యవస్థలో నిర్ణయాలను వెంటవెంటనే తీసుకోవడం సాధ్యం కాదు.

4) కొద్దిమంది ద్వారా పరిపాలన సిద్ధాంతరీత్యా కంపెనీ నిర్వహణ ప్రజాస్వామిక సూత్రాలను అనుసరించి ఉంటుంది. కాని ఆచరణలో ఇది అల్ప సంఖ్యాకుల నిర్వహణ. ఓటింగ్ హక్కులు, నిర్వహణాధికారులు చేజిక్కించుకున్న కొంతమంది డైరెక్టర్లు లోపలి వృత్తముగా ఏర్పడి సర్వాధికారాలు చెలాయిస్తారు.

5) అవినీతికరమైన నిర్వహణ: కంపెనీ నిర్వహణ నిజాయితీ లేని స్వార్థపరుల చేతిలో ఉంటే కంపెనీ ఆస్తులు దుర్వినియోగమవుతాయి. కొన్ని నకిలీ కంపెనీలు పెట్టుబడిదారులు కష్టార్జితాన్ని దోచుకోవడం కోసమే ఏర్పడవచ్చు. మరికొంతమంది నీతి, నిజాయితీ లేని వ్యక్తులు కంపెనీ వార్షిక ఖాతాలను కృత్రిమ లాభాలను లేదా నష్టాలను చూపడం కోసం తప్పుడు సమాచారాన్ని చూపిస్తారు.

6) అనుచితమైన స్పెక్యులేషన్: పబ్లిక్ కంపెనీల వాటాలను స్టాక్ ఎక్స్చేంజ్ జాబితాలో చేర్చి సులభముగా కొనుగోలు, అమ్మకాలు చేయవచ్చు. వాటా ధరలు కంపెనీ ఆర్థిక పరిస్థితి, డివిడెండ్ల చెల్లింపు, కంపెనీ పేరు ప్రతిష్ట, కంపెనీ అభివృద్ధికి అవకాశాలు మొదలైనవాటి మీద ఆధారపడతాయి. కంపెనీ డైరెక్టర్లు కంపెనీ లెక్కలను తారుమారుచేసి, వాటా విలువను తమకు అనుకూలముగా మార్చుకొని స్పెక్యులేషన్ ద్వారా డైరెక్టర్లు లాభపడతారు.

7) మితిమీరిన ప్రభుత్వ నియంత్రణ: కంపెనీ నిర్వహణలో అనేక నిబంధనలు పాటించాలి. వార్షిక నివేదికలు, తనఖీ చేసిన లెక్కలను విధిగా రిజిస్ట్రారుకు సమర్పించాలి. డైరెక్టర్ల నియామకానికి ప్రభుత్వ అనుమతి పొందాలి. కంపెనీ ధ్యేయాలు మార్పు చేయడానికి అనేక చట్టబద్ధమైన లాంఛనాలు పాటించాలి.

8) వ్యాపార రహస్యాల వెల్లడి: వ్యాపార నిర్వహణ వాటాదారులు, డైరెక్టర్లు, ఉద్యోగుల చేతులలో ఉంటుంది. కాబట్టి కంపెనీ రహస్యాలను కాపాడటానికి వీలులేదు.

9) ఆసక్తుల సంఘర్షణ: ఈ తరహా వ్యాపారములో ఆసక్తులకు సంబంధించి నిరంతరము సంఘర్షణ జరుగుతుంది. సాధారణముగా వాటాదారులు, డైరెక్టర్ల మధ్య లేదా వాటాదారులు, ఋణదాతల మధ్య లేదా మేనేజ్మెంట్, సిబ్బందికి మధ్య ఎప్పుడూ కలహాలు కొనసాగుతూనే ఉంటాయి.

10) గుత్తాధిపత్యము: కంపెనీలు గుత్తాధిపత్య ధోరణులను ప్రోత్సహిస్తుంది. వీరు వినియోగదారులను, శ్రామికులను దోచుకోవడం జరుగును.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జాయింట్ స్టాక్ కంపెనీ యొక్క ఏవైనా ఐదు (5) ప్రయోజనాలను వివరించండి.
జవాబు.
కంపెనీ వ్యవస్థ వలన ఈ క్రింది ప్రయోజనాలు ఉంటాయి.
1. పరిమిత ఋణబాధ్యత: వాటాదారుల ఋణబాధ్యత వారి వాటా విలువకు పరిమితము అవుతుంది. కంపెనీ అప్పులు తీర్చడానికి సొంత ఆస్తులు తేనవసరము లేదు. వాటా సొమ్ము మాత్రమే కోల్పోతారు. నష్టభయం తక్కువ. అందువలన కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ప్రజలు ముందుకు వస్తారు.

2. భారీ ఆర్థిక వనరులు: ప్రజల నుంచి విస్తారముగా నిధులు సేకరించడానికి కంపెనీ వ్యవస్థ అనువైనది. కంపెనీ వాటాలను చిన్నచిన్న మొత్తాలుగా విభజించి అమ్మడం వలన స్వల్ప ఆదాయముగల ప్రజలు కూడా వాటాలను సులభముగా కొనగలరు. అందువలన భారీ మూలధనాన్ని తేలికగా సేకరించవచ్చు.

3. శాశ్వత మనుగడ: కంపెనీల చట్టం ప్రకారము, కంపెనీకి ప్రత్యేక న్యాయసత్వము ఉన్నది. అందువలన కంపెనీ నిరాటంకముగా కొనసాగుతుంది. వాటాదారుల మరణము, దివాలా తీయడం వలన కంపెనీ మనుగడకు ఎటువంటి అంతరాయం కలగదు. అది నిరాటంకముగా కొనసాగుతుంది.

4. పెద్దతరహా కార్యకలాపాల ఆదాలు: అధిక నిధుల వలన కంపెనీలు ఉత్పత్తిని భారీగా చేపడతాయి. అందువలన కొనుగోళ్ళు, మార్కెటింగ్, సిబ్బంది వినియోగం, రవాణా తదితర వ్యవహారాలలో అనేక ఆదాలు లభిస్తాయి. ఖర్చులు తగ్గి, లాభాలు పెరుగుతాయి.

5. ద్రవ్యత్వ లక్షణం: పబ్లిక్ కంపెనీ వాటాలను ఇతరుల అనుమతి లేకుండా సులభముగా బదిలీ చేయవచ్చును. -కంపెనీ వాటాలను స్టాక్ ఎక్స్చేంజిలో అమ్ముతారు. బదిలీ సౌకర్యము ద్వారా వీటిని తేలికగా నగదులోనికి మార్చుకొనవచ్చు. కాబట్టి వాటాలకు ద్రవ్యత్వ లక్షణం ఉండటంవలన కంపెనీకి స్థిరత్వము కల్పిస్తుంది.

6. సమర్థవంతమైన నిర్వహణ కంపెనీకి అపారమైన నిధులు ఉండటం వలన నిర్వహణ నిపుణులను, వ్యయగణకులను, ఛార్టర్డ్ అకౌంటెంట్లు, సాంకేతిక నిపుణులను నియమిస్తే వారు నిర్వహణను సమర్థవంతముగా చేపడతారు.

ప్రశ్న 2.
జాయింట్ స్టాక్ కంపెనీ యొక్క ఏవైనా ఐదు (5) పరిమితులను వివరించండి.
జవాబు.
1) ఆంక్షలు, నిబంధనలు ఎక్కువ: కంపెనీని ప్రారంభించినప్పటి నుంచి, ముగించేవరకు (రద్దు చేయడం) కంపెనీ మీద ప్రభుత్వం ప్రతి దశలోను, ఎన్నో ఆంక్షలను, నిబంధనలను విధించింది. అంతేకాకుండా కంపెనీ పాటించవలసిన లాంఛనాలు ఎక్కువే. తయారుచేసి సమర్పించవలసిన పత్రాల సంఖ్య కూడా ఎక్కువ. వీటన్నిటిని పూర్తి చేయడం వ్యయప్రయాసలతో కూడుకొంది. వ్యాపారాన్ని తొందరగా ప్రారంభించడానికి ఈ ఆంక్షలు, లాంఛనాలు ప్రతి బంధకాలవుతాయి.

2) ఆసక్తి లోపించడం: వాటాదారులు కంపెనీకి యజమానులు. వీరు దేశవ్యాప్తంగా విస్తరించి ఉంటారు. అందువల్ల కంపెనీ నిర్వహణలో పాల్గొనలేరు. దీనికోసం వీరు డైరెక్టర్లను తమ ప్రతినిధులుగా ఎన్నుకొంటారు. ఆ విధంగా నిర్వహణ, యాజమాన్యం రెండూ వేర్వేరుగా ఉండటం వల్ల శ్రమకు, ఫలితానికి అంతరం ఏర్పడి వ్యక్తిగత శ్రద్ధ, ఆసక్తి సన్నగిల్లుతుంది. వాటాదారులకు ఖాతాదారులతో, ఉద్యోగులతో ప్రత్యక్ష సంబంధం లేకపోవడం కూడా మరొక లోపంగా చెప్పవచ్చు. అందువల్ల ఆశించిన ప్రగతిని సాధించకపోవచ్చు.

3) నిర్ణయాలలో జాప్యం: కంపెనీ వ్యవస్థలో నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరిగే అవకాశం ఎంతో ఉంది. వాటాదార్లు తమ అధికారాన్ని డైరెక్టర్లకు అప్పగిస్తే, డైరెక్టర్ల బోర్డు దానిని తమ ముఖ్య కార్యదర్శికి, అతడు ఈ అధికారాన్ని కింది స్థాయి ఉద్యోగులకు బదిలీ చేయడం ద్వారా నిర్ణయాలను వెంటవెంటనే తీసుకోవడానికి వీలుండదు. వివిధ కారణాల వల్ల కంపెనీ వ్యవస్థలో నిర్ణయాలను వెంటవెంటనే తీసుకోవడం సాధ్యం కాదు.

4) కొద్దిమంది ద్వారా పరిపాలన: సిద్ధాంతరీత్యా కంపెనీ నిర్వహణ ప్రజాస్వామిక సూత్రాలను అనుసరించి ఉంటుంది. కాని ఆచరణలో ఇది అల్ప సంఖ్యాకుల నిర్వహణ. ఓటింగ్ హక్కులు, నిర్వహణాధికారులు చేజిక్కించుకున్న కొంతమంది డైరెక్టర్లు లోపలి వృత్తముగా ఏర్పడి సర్వాధికారాలు చెలాయిస్తారు.

5) అవినీతికరమైన నిర్వహణ: కంపెనీ నిర్వహణ నిజాయితీ లేని స్వార్థపరుల చేతిలో ఉంటే కంపెనీ ఆస్తులు దుర్వినియోగమవుతాయి. కొన్ని నకిలీ కంపెనీలు పెట్టుబడిదారుల కష్టార్జితాన్ని దోచుకోవడం కోసమే ఏర్పడవచ్చు. మరికొంతమంది నీతి, నిజాయితీ లేని వ్యక్తులు కంపెనీ వార్షిక ఖాతాలను కృత్రిమ లాభాలను లేదా నష్టాలను చూపడం కోసం తప్పుడు సమాచారాన్ని చూపిస్తారు.

6) వాటాలలో అనుచిత స్పెక్యులేషన్: పబ్లిక్ కంపెనీల వాటాలను స్టాక్ ఎక్స్చేంజ్ జాబితాలో చేర్చి సులభముగా కొనుగోలు, అమ్మకాలు చేయవచ్చు. వాటా ధరలు కంపెనీ ఆర్థిక పరిస్థితి, డివిడెండ్ల చెల్లింపు, కంపెనీ పేరు ప్రతిష్ట, కంపెనీ అభివృద్ధికి అవకాశాలు మొదలైనవాటి మీద ఆధారపడతాయి. కంపెనీ డైరెక్టర్లు కంపెనీ లెక్కలను తారుమారుచేసి, వాటా విలువను తమకు అనుకూలముగా మార్చుకొని స్పెక్యులేషన్ ద్వారా డైరెక్టర్లు లాభపడతారు.

ప్రశ్న 3.
ప్రైవేట్ కంపెనీ లక్షణాలను తెలపండి.
జవాబు.
జాయింట్ స్టాక్ కంపెనీ లక్షణాలు:
కంపెనీ యొక్క విలక్షణమైన లక్షణాలను క్రింది విధంగా గుర్తించవచ్చు.
1) చట్టం సృష్టించిన కల్పిత వ్యక్తి: కంపెనీ అనేది చట్టం ద్వారా సృష్టించబడిన కృత్రిమ వ్యక్తి. న్యాయశాస్త్రమే – ప్రాణంగా మనుగడను కొనసాగిస్తుంది. ఇది ఒక అదృశ్యమైన, కంటికి కనిపించని శరీరం, ఆత్మ లేని వ్యక్తి.

2) ప్రత్యేక న్యాయసత్వం: కంపెనీ చట్టం ద్వారా సృష్టించబడిన కల్పిత వ్యక్తి. కంపెనీ నమోదు చేయగానే దానికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం లభిస్తుంది. అంటే కంపెనీ వేరు, కంపెనీలోని సభ్యులు వేరు. కంపెనీ స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఒప్పందాన్ని కుదుర్చుకొనవచ్చు. సాధారణ వ్యక్తులలాగా ఆస్తులను కొనడం, అమ్మడం చేయవచ్చు. ఉద్యోగస్తులను నియంత్రించవచ్చు. స్వతంత్రంగా న్యాయసమ్మతమైన వ్యాపారాన్ని కొనసాగించవచ్చు.

3) స్థాసన: జాయింట్ స్టాక్ కంపెనీ స్థాపనకు ముందు పలు ముఖ్యమైన పత్రాలను తయారు చేయడంతో పాటు అనేక చట్టపరమైన నిబంధనలను, షరతులను పూర్తి చేయవలసి ఉంటుంది. భారత కంపెనీల చట్టం, 2013 కింద తప్పనిసరిగా నమోదు చేయించినప్పుడు మాత్రమే కంపెనీ మనుగడలోకి వస్తుంది.

4) అధికార ముద్ర: కంపెనీకి భౌతికమైన ఆకారం లేదు. అందువల్ల సహజమైన వ్యక్తిలాగా డైరెక్టర్ల బోర్డు ద్వారా వ్యవహరిస్తుంది. కంపెనీ ఒప్పందాలను కుదుర్చుకొన్నప్పుడు లావాదేవాలు జరిగినప్పుడు సంతకాలు చేయడానికి బదులు, తన అధికారముద్రను ఉపయోగిస్తుంది. ఈ అధికార ముద్ర కంపెనీ సంతకంలాగా చలామణి అవుతుంది. కంపెనీ సంతకానికి బదులు కంపెనీ అధికారముద్రను ముద్రించి, ఇద్దరు డైరెక్టర్లు సాక్షి సంతకాలు చేసినప్పుడు మాత్రమే ఆ పత్రాలలో ఉన్న విషయాల వల్ల కంపెనీకి బాధ్యత ఏర్పడుతుంది. ఈ అధికార ముద్రను తగు జాగ్రత్త మధ్య కంపెనీ కార్యదర్శి వద్ద భద్రపరచవలసి ఉంటుంది.

5) పారంపర్యాధికారం: కంపెనీ వ్యాపార సంస్థకు శాశ్వతమైన మనుగడ ఉంది. అందువల్ల కంపెనీ చిరకాలం కొన సాగుతుంది. కంపెనీ సభ్యులలో ఎవరైనా మరణించినా, వారి వాటాలను అమ్మివేసినా, ఎవరికైనా మతిభ్రమించినా, ఎవరైనా దివాలా తీసినా, కంపెనీ మాత్రం నిరాటంకంగా కొనసాగే అధికారాన్ని కలిగి ఉంటుంది. కంపెనీ చట్టం ద్వారా సృష్టించబడినందువల్ల దానిని మూసివేయడం చట్టం ద్వారానే సాధ్యమవుతుంది.

6) సభ్యుల రుణబాధ్యత పరిమితం: కంపెనీ వేరు, కంపెనీ సభ్యులు వేరు. అందువల్ల కంపెనీ తాను చేసిన అప్పులకు తానే బాధ్యత వహిస్తుంది. ఈ సందర్భంగా వాటాదారులు రుణబాధ్యత వారు తీసుకున్న వాటా విలువలకు పరిమితమైన ఉంటుంది. ఉదాహరణకు శ్రీను అనే వాటాదారుడు కౌ 10లు విలువలు కలిగిన వాటాను కొని వాటాకు ? 8లు చెల్లిస్తే అతని రుణబాధ్యత వాటాకు గౌ2లకు పరిమితమై ఉంటుంది. దీనికి మించి అతడు కంపెనీకి సంబంధించిన ఎలాంటి రుణాల లేదా నష్టాల చెల్లింపుకు బాధ్యతను కలిగి ఉండదు.

TS Inter 1st Year Commerce Study Material Chapter 5 జాయింట్ స్టాక్ కంపెనీ

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కంపెనీ చట్టం, 2013 ప్రకారం కంపెనీని నిర్వచించండి.
జవాబు.
1) కంపెనీల చట్టం, 2013 ప్రకారం – “ఏదైనా ఒక సంస్థ కంపెనీ చట్టం 2013 లేదా అంతకు పూర్వం ఇతర ఏ కంపెనీ చట్టం క్రింద నమోదు చేయబడిన దానిని కంపెనీ అని అంటారు”.
2) లార్డ్ జస్టిస్ లిండ్ ప్రకారం – “సమిష్టి ప్రయోజనం కోసం ధనాన్ని లేదా ధనంతో సమానమైన దానిని సమకూర్చే అనేకమంది వ్యక్తుల కలయిక కంపెనీ”.

ప్రశ్న 2.
శాశ్వత మనుగడ అంటే ఏమిటి ?
జవాబు.

  1. కంపెనీల చట్టం ప్రకారం కంపెనీకి ప్రత్యేక న్యాయసత్వం ఉంటుంది. అందువల్ల కంపెనీ నిరాటంకంగా కొనసాగుతోంది. దీనినే శాశ్వత మనుగడ అంటారు.
  2. కంపెనీ సభ్యుల జీవితాలకు, కంపెనీ జీవితానికి సంబంధం లేదు. వాటాదారుని మరణంగాని, దివాలాగాని, మతిస్థిమితాన్ని కోల్పోవడం గానీ కంపెనీ భవిష్యత్తును మార్చలేవు. అందువల్ల సుదీర్ఘమైన, నిరాటంకమైన వ్యాపారానికి అవకాశం ఉంటుంది.

ప్రశ్న 3.
చిన్న కంపెనీ అంటే ఏమిటి ?
జవాబు.
కంపెనీల చట్టం, 2013 సెక్షన్ – 2(85) ప్రకారం, “పబ్లిక్ కంపెనీ కానీ కంపెనీలను చిన్న కంపెనీలుగా పేర్కొనవచ్చు. చిన్న కంపెనీకి క్రింది లక్షణాలు ఉండును.

  1. కంపెనీ వాటా మూలధనం ? 50 లక్షలకు మించరాదు. ఒకవేళ పెద్ద మొత్తంలో అయితే (సూచించిన యెడల) 5 కోట్లు మించరాదు.
  2. కంపెనీ టర్నోవర్ 7 2 కోట్లకు మించరాదు. ఒకవేళ పెద్ద మొత్తం అయితే (సూచించిన యెడల) 50 కోట్లు, 20 కోట్లకు మించరాదు.

ప్రశ్న 4.
ఏక వ్యక్తి కంపెనీ అంటే ఏమిటి ?
1. కంపెనీల చట్టం, 2013 ప్రకారం, “ఒకే ఒక వ్యక్తి సభ్యుడిగా కంపెనీలో ఉన్నప్పుడు ఆ కంపెనీని ఏక వ్యక్తి కంపెనీగా వ్యవహరిస్తారు. వాస్తవానికి ఈ కంపెనీలలో మొత్తం వాటా మూలధనం ఒక్కరే సమకూరుస్తారు. ఇతని వద్దే మొత్తం వాటాలు ఉంటాయి.

2. నామమాత్రంగా ఒక్కరు లేక ఇద్దరు వ్యక్తులు కుటుంబం నుంచి లేక స్నేహితుల నుంచి కాని సభ్యులుగా వ్యవహరిస్తారు. నామమాత్రపు సభ్యుడు పరిమిత రుణబాధ్యతతో ప్రధాన వాటాదారుడికి వారసత్వంగా వ్యవహరిస్తాడు.

ప్రశ్న 5.
ప్రభుత్వ కంపెనీ అంటే ఏమిటి ?
జవాబు.
కంపెనీ యొక్క మొత్తం చెల్లించిన వాటా మూలధనంలో 51% వాటాలను కేంద్ర ప్రభుత్వం కాని, రాష్ట్ర ప్రభుత్వం కాని, కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు కాని, లేక రాష్ట్ర ప్రభుత్వాలు కాని సమకూర్చినట్లయితే అట్టి కంపెనీని ప్రభుత్వ కంపెనీ అంటారు. ఉదాహరణకు స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మొదలైనవి.

ప్రశ్న 6.
హోల్డింగ్ కంపెనీ అంటే ఏమిటీ ?
జవాబు.

  1. ఒక కంపెనీ వేరొక కంపెనీలో సగానికంటే ఎక్కువ వాటా మూలధనంను కల్గి ఉండి, ఆ కంపెనీ యొక్క నిర్వహణను నియంత్రించే విధంగా ఉన్నప్పుడు దానిని ‘హోల్డింగ్ కంపెనీ’ అంటారు.
  2. ఉదాహరణకు కంపెనీ A కంపెనీ B చెల్లించిన మూలధనంలో 51% మూలధనాన్ని కలిగి ఉన్నట్లయితే A కంపెనీని ‘హోల్డింగ్ కంపెనీ’ అని అంటారు.

TS Inter 1st Year Commerce Study Material Chapter 5 జాయింట్ స్టాక్ కంపెనీ

ప్రశ్న 7.
డార్మెంట్ కంపెనీ అంటే ఏమిటి ?
జవాబు.

  1. ఒక కంపెనీ రెండు సంవత్సరాల కాల వ్యవధిలో ఏలాంటి అకౌంటింగ్ లావాదేవీలను చేయనపుడు దానిని డార్మెంట్ లేదా నిద్రాణమైన కంపెనీ అంటారు.
  2. ఒక కంపెనీ, తమ కంపెనీని డార్మెంట్ లేదా నిద్రాణమైన కంపెనీగా గుర్తించమని కంపెనీల రిజిస్ట్రారుకు దరఖాస్తు చేసుకోవచ్చును

అదనపు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఏవైనా ఓ కంపెనీలను వివరించండి.
జవాబు.
1) చార్టెర్డ్ కంపెనీలు: రాజు ఆజ్ఞతో గాని లేదా రాజశాసనం ద్వారా గాని కంపెనీల ఆవిర్భావం జరిగినప్పుడు వాటిని చార్టెర్డ్ కంపెనీలు అంటారు. భారతదేశంలో ప్రస్తుతం ఈ కంపెనీలు ఉనికిలో లేవు. ఉదాహరణకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ (1894), ఈస్ట్ ఇండియా కంపెనీ (1600) మొదలైనవి.

2) శాసనాత్మక కంపెనీలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేత ప్రత్యేక చట్టం ద్వారా నమోదు చేయబడిన కంపెనీలను శాసనాత్మక కంపెనీలని అంటారు. సాధారణంగా శాసనాత్మక కంపెనీలు ప్రజా శ్రేయస్సు కోసమే ఏర్పాటు చేయబడతాయి. ఉదాహరణకు రైల్వే, కరెంటు ఉత్పత్తి, నీటి పనులు, భారత రిజర్వు బ్యాంకు మొదలగునవి.

3) రిజిస్టర్డ్ కంపెనీలు: కంపెనీల చట్టం, 2013 కింద నమోదైన కంపెనీలను రిజిస్టర్డ్ కంపెనీలు అని అంటారు. కంపెనీల చట్టానికి లోబడి నమోదు పత్రం రిజిస్ట్రార్ వద్ద నుండి పొందిన తర్వాత కంపెనీ అస్తిత్వంలోకి వస్తుంది.

4) ప్రైవేట్ కంపెనీ: కంపెనీల చట్టం, 2013 సెక్షన్ 2(68) కింద నమోదైన ప్రైవేట్ కంపెనీ, కంపెనీల నియమావళి ప్రకారం వాటాల బదిలీ మరియు ప్రజల నుండి చందా పొందడానికి నిషేదించబడ్డాయి”.

ప్రైవేట్ కంపెనీ లక్షణాలను క్రింది విధంగా గమనించవచ్చు:

  1. కనీసపు చెల్లించిన మూలధనం 1,00,000 రూపాయలు.
  2. కనీస సభ్యుల సంఖ్య 2.
  3. గరిష్ట సభ్యుల సంఖ్య 50.
  4. ప్రజలకు పరిచయపత్రం ద్వారా వాటాలను జారీ చేయరాదు.
  5. వాటాలను బదిలీ చేయరాదు.

పైన పేర్కొన్న నిబంధనలన్నింటిని ప్రైవేట్ కంపెనీలు తప్పక పాటించవలసి ఉంటుంది. అంతేకాక కంపెనీ పేరు చివర “ప్రైవేట్ లిమిటెడ్” అని తప్పక పేర్కొనవలసి ఉంటుంది.

ఎ) చిన్న కంపెనీ: కంపెనీల చట్టం, 2013 సెక్షన్ – 2(85) ప్రకారం, “పబ్లిక్ కంపెనీ కానీ కంపెనీలను చిన్న కంపెనీలుగా పేర్కొనవచ్చు. చిన్న కంపెనీకి క్రింది లక్షణాలు ఉండును.

  1. కంపెనీ వాటా మూలధనం 50 లక్షలకు మించరాదు. ఒకవేళ పెద్ద మొత్తంలో అయితే (సూచించిన యెడల) 5 కోట్లు మించరాదు.
  2. కంపెనీ టర్నోవర్ 7 2 కోట్లకు మించరాదు. ఒకవేళ పెద్ద మొత్తం అయితే (సూచించిన యెడల) 50 కోట్లు, 20 కోట్లకు మించరాదు.

బి) ఏక వ్యక్తి కంపెనీ:

1. కంపెనీల చట్టం, 2013 ప్రకారం, “ఒకే ఒక వ్యక్తి సభ్యుడిగా కంపెనీలో ఉన్నప్పుడు ఆ కంపెనీని ఏక వ్యక్తి కంపెనీగా వ్యవహరిస్తారు. వాస్తవానికి ఈ కంపెనీలలో మొత్తం వాటా మూలధనం ఒక్కరే సమకూరుస్తారు. ఇతని వద్దే మొత్తం వాటాలు ఉంటాయి.

2. నామమాత్రంగా ఒక్కరు లేక ఇద్దరు వ్యక్తులు కుటుంబం నుంచి లేక స్నేహితుల నుంచి కాని సభ్య నామమాత్రపు సభ్యుడు పరిమిత రుణబాధ్యతతో ప్రధాన వాటాదారుడికి వారసత్వంగా గా వ్యవహరిస్తారు.

5) పబ్లిక్ కంపెనీ: భారీ మొత్తంలో మూలధనాన్ని వెచ్చించి పెద్దతరహా వ్యాపార కార్యకల వ్యాపార సంస్థలకు ఈ పబ్లిక్ కంపెనీ ఎంతో అనుకూలమైంది. కంపెనీల (సవరణ) చట్టం, 2000 ప్రకారం పబ్లిక్ కంపెనీకి ఈ క్రింది లక్షణాలు ఉంటాయి.

  1. కనీసపు చెల్లించిన మూలధనం 5,00,000.
  2. కనీస సభ్యుల సంఖ్య 7.
  3. గరిష్ట సభ్యుల సంఖ్య అపరిమితం.

ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ తన పేరు చివర పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అని గాని లేదా క్లుప్తంగా లిమిటెడ్ అనే పదాన్ని గాని ఉపయోగించాలి. ఉదాహరణ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మొదలైనవి.

TS Inter 1st Year Commerce Study Material Chapter 5 జాయింట్ స్టాక్ కంపెనీ

ప్రశ్న 2.
పబ్లిక్ కంపెనీ.
జవాబు.
భారీ మొత్తంలో మూలధనాన్ని వెచ్చించి పెద్దతరహా వ్యాపార కార్యకలాపాలను చేపట్టదలచిన వ్యాపార సంస్థలకు ఈ పబ్లిక్ కంపెనీ ఎంతో అనుకూలమైంది. కంపెనీల (సవరణ) చట్టం, 2000 ప్రకారం పబ్లిక్ కంపెనీకి ఈ క్రింది లక్షణాలు ఉంటాయి.

  1. కనీసపు చెల్లించిన మూలధనం 35,00,000.
  2. కనీస సభ్యుల సంఖ్య 7.
  3. గరిష్ట సభ్యుల సంఖ్య అపరిమితం.

ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ తన పేరు చివర పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అని గాని లేదా క్లుప్తంగా లిమిటెడ్ అనే పదాన్ని గాని ఉపయోగించాలి. ఉదాహరణ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మొదలైనవి.

TS Inter 1st Year Political Science Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 1st Lesson రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి Textbook Questions and Answers.

TS Inter 1st Year Political Science Study Material 1st Lesson రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
రాజనీతిశాస్త్రాన్ని నిర్వచించి దాని పరిధిని వివరించండి.
జవాబు.
పరిచయం : సాంఘిక శాస్త్రాలలో రాజనీతి శాస్త్రము ప్రధానమైనది. ప్రాచీన గ్రీకునగర రాజ్యాలైన ఏథెన్స్, స్పార్టా, గ్రీస్, రోమ్లలో క్రీ.పూ. 4వ శాతబ్దంలో ప్రారంభమైంది. ప్రముఖ గ్రీకు రాజనీతి వేత్తలైన సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ రాజనీతిని తత్వశాస్త్రము నుండి వేరు చేసి ప్రత్యేక అధ్యయన శాస్త్రముగా అభివృద్ధిచేసిరి.

అరిస్టాటిల్ రాజనీతి శాస్త్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాడు. అందువలన ఇతను రాజనీతిశాస్త్ర పితామహుడుగా కీర్తింపబడినాడు. అరిస్టాటిల్ తన ప్రఖ్యాత గ్రంథమైన ‘పాలిటిక్స్’ లో రాజ్యము, ప్రభుత్వము గురించి అధ్యయనము చేసే శాస్త్రము రాజనీతి శాస్త్రమని పేర్కొనినాడు.

పదపరిణామము :
రాజకీయాలు (Politics) అనే పదం గ్రీకు పదమైన పోలిస్ (Polis) అనే పదం నుంచి గ్రహించబడింది. పోలిస్ అంటే నగర రాజ్యం (City – State) అని అర్థం. పాలిటి (Polity) అనే పదం గ్రీకు పదమైన పొలిటియా (Poletieia) అనే గ్రీకు పదం నుంచి గ్రహించబడింది. ‘పాలిటి’ అంటే ప్రభుత్వం – లేదా రాజ్యాంగం అని అర్థం.

రాజనీతిశాస్త్రం – నిర్వచనాలు :
జె.డబ్ల్యు. గార్నర్: “రాజనీతిశాస్త్రానికి ఆది అంతాలు రాజ్యమే” అని నిర్వచించారు.
ఆర్.జి. గెటిల్ : “గతకాలపు రాజ్యం యొక్క చారిత్రక వివరణ, వర్తమాన రాజ్యపు విశ్లేషణాత్మక వర్ణన భవిష్యత్లో రాజ్యం ఎలా ఉంటుందనే రాజకీయ చింతన చేసేదే రాజనీతిశాస్త్రం”.
రాబర్ట్ థాల్ : “అధికారాన్ని, శక్తిని, వాటి ప్రభావాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసేదే రాజనీతిశాస్త్రం” నిర్వచించాడు.
డేవిడ్ ఈస్టన్ : “అధికారంతో కూడిన వివిధ చర్యల, పద్ధతుల ద్వారా సమాజానికి మార్గ నిర్దేశం చేసే నియంత్రణా విధానాలను తెలియజేసేదే రాజనీతిశాస్త్రం”గా నిర్వచించినాడు.

రాజనీతిశాస్త్రం-పరిధి :
రాజనీతిశాస్త్రం సైద్ధాంతిక, అనుభవపూర్వక అంశాలకు చెందిన మానవుల రాజకీయ జీవితాన్ని వర్ణించే పరిధిని కలిగి ఉంటుందని చెప్పవచ్చు. రాజకీయ సంస్థల విధుల నిర్వహణకు, రాజకీయ ప్రక్రియలకు సంబంధించి రాజకీయ సమాజాలలో ఏమి జరుగుతుందో ఈ శాస్త్రం వివరిస్తుంది. ఈ కారణంవల్ల రాజనీతిశాస్త్ర పరిధి సమగ్రమైనదిగాను, ఇతర సాంఘికశాస్త్రాలతో అంతర్విభాగీయ సంబంధాలను కలిగి ఉండే శాస్త్రంగాను వివరించబడింది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

రాజనీతిశాస్త్ర పరిధిని అంశాల వారీగా కింది విధంగా చెప్పవచ్చు.

i) వ్యక్తికి సమాజం, రాజ్యం, ప్రభుత్వానికి గల సంబంధం :
రాజనీతిశాస్త్రం ప్రాథమికంగా వ్యక్తికి, సమాజం, రాజ్యం ప్రభుత్వం వంటి వ్యవస్థలకు గల సంబంధాన్ని వివరిస్తుంది. ఈ సందర్భంగా అరిస్టాటిల్ మాటలు ఉటంకించడం సముచితం. ఆయన “మానవుడు సంఘజీవి అదే విధంగా రాజకీయ జీవి కూడా” అని అభివర్ణించాడు.

ii) రాజ్యాన్ని అధ్యయనం చేసే శాస్త్రం :
రాజనీతిశాస్త్రం రాజ్యం పుట్టుక, పరిణామక్రమం, దాని ఆవశ్యకత, పౌరుడికి రాజ్యానికి గల సంబంధాలను గురించి వివరిస్తుంది. అదే విధంగా రాజ్య అవతరణకు సంబంధించిన పలు సిద్ధాంతాలను కూడా తెలియజేస్తుంది. వీటితోపాటు రాజ్య స్వభావం దాని విధుల నిర్వహణను సైతం వివరిస్తుంది.

iii) ప్రభుత్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రం :
రాజనీతిశాస్త్ర పరిధిలో ప్రభుత్వానికి సంబంధించిన అధ్యయనం కూడా ఉంటుంది. ఈ శాస్త్రం రాజ్యానికి ప్రభుత్వానికి గల సంబంధం, రాజ్యం యొక్క ఆశయాలను, లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి ప్రభుత్వం ఏ విధంగా తోడ్పడుతుందో వివరిస్తుంది. అదే విధంగా పలు రకాల ప్రభుత్వ నిర్మాణ రూపాలను వాటి ప్రయోజనాలను, లోపాలను గురించి కూడా వివరిస్తుంది.

iv) సంఘాలను, సంస్థలను అధ్యయనం చేసే శాస్త్రం :
వ్యక్తుల రాజకీయ జీవితాన్ని రాజకీయ సమాజంలోని పలు సంఘాలు, సంస్థలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయో రాజనీతిశాస్త్రం అధ్యయనం చేస్తుంది. రాజ్యానికి, పలు సంఘాలకు, సంస్థలకు గల సంబంధాన్ని వివరిస్తుంది.

ఆయా సంస్థల నిర్మాణం, స్వభావాలు, విధులు, అవి చేపట్టే చర్యలను సైతం రాజనీతిశాస్త్రం తెలియజేస్తుంది. అదే విధంగా రాజకీయ ప్రక్రియలో వివిధ స్వచ్ఛంద సంస్థల పాత్రను కూడా రాజనీతిశాస్త్రం వివరిస్తుంది.

v) హక్కులు, విధుల అధ్యయం :
రాజకీయ సమాజంలోని పౌరుల హక్కులను, విధులను గురించి తెలియజేస్తుంది. ఇటీవలి కాలంలో మానవ హక్కులు, పౌరహక్కులకు సంబంధించిన అనేక అంశాలను రాజనీతిశాస్త్రం సమగ్రంగా విశ్లేషించడం జరుగుతోంది.

vi) జాతీయ – అంతర్జాతీయ పరమైన సమస్యల అధ్యయనం :
రాజనీతిశాస్త్ర పరిధి జాతీయ, అంతర్జాతీయ సమస్యలను వివరించేదిగా ఉంది. జాతీయరాజ్యాలు, భౌగోళిక సమైక్యత, సార్వభౌమాధికారం మొదలైన అంశాలు ఈ శాస్త్ర పరిధిలోకి వస్తాయి. అంతేకాదు ఆయుధీకరణ, నిరాయుధీకరణ, సమతౌల్య ప్రాబల్యం, మిలిటరీ – రక్షణ వ్యవహారాలను సైతం రాజనీతిశాస్త్రం వివరిస్తుంది.

vii) తులనాత్మక రాజకీయాలను అధ్యయనం చేసే శాస్త్రం :
రాజనీతిశాస్త్రం, ప్రపంచంలోని పలు రకాల ప్రభుత్వాలను వాటి నిర్మాణాలను అవి నిర్వహించే విధులను తులనాత్మకంగా వివరిస్తుంది. ప్రపంచంలోని సమకాలీన రాజకీయ వ్యవస్థలను తులనాత్మకంగా విశ్లేషిస్తుంది.

viii) ఆధునిక రాజనీతి విశ్లేషణ అధ్యయనం :
20వ శతాబ్దపు రాజనీతిశాస్త్రం అధికార నిర్మాణం, దాని పంపిణీకి సంబంధించి వివరించే శాస్త్రంగా పరిగణించబడింది. అదే విధంగా ఆధునిక రాజకీయ వ్యవస్థల విశ్లేషణ కోసం ఆయా వ్యవస్థల్లోని రాజకీయ సామాజికీకరణ, రాజకీయ భాగస్వామ్యం, రాజకీయాభివృద్ధి, రాజకీయ సంస్కృతి, రాజకీయ ప్రసరణ వంటి నూతన భావాలను రాజనీతిశాస్త్రం వివరిస్తుంది.

ix) ప్రభుత్వ విధానాల అధ్యయనం :
ఆధునిక రాజనీతిశాస్త్రవేత్తలైన డేవిడ్ ఈస్టర్, గాబ్రియల్, ఎ. ఆల్మండ్ చార్లెస్ మెరియమ్ వంటి వారు ఆధునిక రాజనీతిశాస్త్రం విధానాల అధ్యయనం శాస్త్రంగా రూపాంతరం చెందిందని పేర్కొన్నారు. వారి అభిప్రాయంలో రాజ్యం రూపొందించే సంక్షేమ పథకాలు, చేపట్టే అభివృద్ధి చర్యలను అధ్యయనం చేయడమే. ప్రాథమిక విధిగా రాజనీతిశాస్త్రజ్ఞులు భావించాలన్నారు.

ప్రభుత్వం పథకాలను రూపొందించే సందర్భంగా రాజకీయ పార్టీలు, ప్రభావ వర్గాలు ప్రసార – ప్రచార మాధ్యమాలు ఎటువంటి ప్రభావిత పాత్రలను పోషిస్తున్నాయో రాజనీతిశాస్త్రం వివరిస్తుంది. ఈ నేపథ్యంలో జాతీయాభివృద్ధి కోసం ప్రవేశపెట్టే విధానాలను, ఉదాహరణకు, జాతీయ వ్యవసాయ విధానం పారిశ్రామిక విధానం, పర్యావరణ విధానం, రిజర్వేషన్ విధానం, విద్యావిధానం వంటి జాతీయ ప్రతిష్ఠను నిలబెట్టే విధానాలను కూడా రాజనీతిశాస్త్రం అధ్యయనం చేస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

ప్రశ్న 2.
రాజనీతిశాస్త్ర ప్రాముఖ్యతను గురించి తెలియజేయండి.
జవాబు.
రాజనీతిశాస్త్రం రాజకీయ వ్యవస్థల్లో చోటుచేసుకుంటున్న మార్పులను అధ్యయనం చేయడమేకాకుండా రాజకీయపరమైన సమస్యల పరిష్కారానికి కూడా తగిన సలహాలు, సూచనలు అందిస్తుంది. అంతేకాకుండా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం, బాధ్యతాయుత ప్రభుత్వంగా వ్యవహరించడం, ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యతనివ్వడం వంటి విషయాలను పేర్కొనడం ద్వారా రాజనీతిశాస్త్ర ప్రాముఖ్యత పెరుగుతూ ఉంది.

1. రాజనీతిశాస్త్రం సిద్ధాంతాలను – భావనలను వివరిస్తుంది.
రాజనీతిశాస్త్రం వ్యక్తికి – రాజ్యానికి, సమాజానికి మధ్యగల సంబంధాన్ని వివరిస్తుంది. వ్యక్తుల స్వేచ్ఛా – సమానత్వాల ప్రాముఖ్యతను తెలియజేయడమే కాకుండా అనేక సిద్ధాంతాలను రాజనైతిక భావాలను వివరించడం ద్వారా సమాజాన్ని ప్రగతిశీల సమాజంగా మారుస్తుంది.

2. రాజనీతిశాస్త్రం ప్రభుత్వ రూపాలను, ప్రభుత్వ అంగాలను గురించి వివరిస్తుంది.
రాజనీతి శాస్త్రం ప్రభుత్వ వ్యవస్థలకు సంబంధించిన జ్ఞానాన్ని అందిస్తుంది. ఉదాహరణకు రాజరికం, కులీనపాలన, ప్రజాస్వామ్యం, నియంతృత్వం, ఇతర ప్రభుత్వ రూపాలను గురించి అవగాహనకు ఈ శాస్త్రం కల్పిస్తుంది. అదే విధంగా ఆధునిక ప్రభుత్వాలు కలిగి ఉండే శాసన నిర్మాణ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖల రూపంలో గల అంగాలను, వాటి ప్రాధాన్యతలను, వాటి మధ్యగల సంబంధాలను – భేదాలను తెలియజేయడం ద్వారా శాస్త్ర ప్రాధాన్యత పెరిగింది.

3. రాజనీతిశాస్త్రం హక్కులను – విధులను గురించి వివరిస్తుంది.
రాజకీయ సమాజంలో పౌరులు ఉత్తమ జీవనాన్ని పొందడానికి కావలసిన హక్కులను వారు నిర్వహించాల్సిన విధులను రాజనీతిశాస్త్రం వివరిస్తుంది. అదే విధంగా రాజ్యం పౌరులకు ఎటువంటి హక్కులను కల్పించాలి. ప్రజాభిమతానికి ఏ విధమైన ప్రాధాన్యతలనివ్వాలి అనే విషయం పౌరులకు స్పష్టంగా తెలుస్తుంది.

4. రాజనీతిశాస్త్రం రాజనీతి తత్వవేత్తల భావాలకు సంబంధించిన జ్ఞానాన్ని అందిస్తుంది.
ఆయా కాలాల్లో, పలు సందర్భాల్లో తత్వవేత్తల భావాలు ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయో రాజనీతిశాస్త్రం వివరిస్తుంది. రూసో, వాల్టేరు వంటి వారి తాత్విక భావాలు ఫ్రెంచి విప్లవం సంభవించడానికి ఏ విధంగా దోహదపడ్డాయో ఈ శాస్త్రం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం.

అదే విధంగా కారల్ మార్క్స్ భావాలు రష్యాలో లెనిన్ నాయకత్వంలో విప్లవం సంభవించడానికి మావో నాయకత్వంలో చైనాలో విప్లవం రావడానికి ఏ విధంగా దోహదపడ్డాయో కూడా రాజనీతిశాస్త్రాన్ని అధ్యయనం చేయడంవల్ల మనం తెలుసుకోవచ్చు.

అంతేకాదు మన భారతదేశంలో ‘ప్రజలను శాంతియుతంగా స్వాతంత్ర్యోద్యమంలో భాగస్వాములను చేయడంలో మహాత్మాగాంధీ సిద్ధాంత సూత్రాలు ఏ విధంగా ప్రభావిత పరిచాయో మన గమనంలోనే ఉన్నాయి. ఈ విధంగా రాజనీతిశాస్త్రం రాజనీతి తత్వవేత్తల గురించి సంపూర్ణమైన అవగాహన కల్పిస్తుంది.

5. రాజనీతిశాస్త్రం అంతర్జాతీయ సంబంధాలను తెలియజేస్తుంది.
అంతర్జాతీయంగా సార్వభౌమాధికార రాజ్యాలు ప్రపంచ రాజకీయ వ్యవస్థలో ఎటువంటి భాగస్వామ్యాన్ని కలిగి ఉంటాయో రాజనీతిశాస్త్రం వివరిస్తుంది. ప్రపంచ రాజ్యాల మధ్య పలురకాల సంబంధాలను గురించి ఈ శాస్త్రం తెలియజేస్తుంది. ఆధునిక కాలంలో పారిశ్రామిక విప్లవం సంభవించడంతో ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి దోహదపడిన అంశాలను రాజనీతిశాస్త్రం విశ్లేషిస్తుంది.

శాస్త్ర సాంకేతిక అభివృద్ధి, రోడ్డు రవాణా సౌకర్యాల ఏర్పాటు, ప్రాంతీయ కూటముల ఏర్పాటువల్ల సరిహద్దు రాజ్యాల మధ్య సంబంధాలు మెరుగుపడి అంతర్జాతీయంగా పలు రాజ్యాలు ప్రాధాన్యతను పొందాయి. రాజనీతిశాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఇటువంటి అనేక విషయాలు మనం తెలుసుకోవచ్చు.

6. రాజనీతిశాస్త్రం ప్రపంచ సంస్థలను గురించి వివరిస్తుంది.
రాజనీతిశాస్త్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యత కలిగి ఉన్న సంస్థలకు సంబంధించి అవగాహనను కల్పిస్తుంది. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్న దాని అనుబంధ సంస్థలు, అవి నిర్వహించే కార్యకలాపాలను గురించి అవగాహన రాజనీతిశాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా కలుగుతుంది.

7. రాజనీతిశాస్త్ర అధ్యయన పద్ధతులు.
రాజనీతిశాస్త్రాన్ని అవగాహన చేసుకోవడానికి పలురకాల పద్ధతులున్నాయి. వీటిని ఇతర సాంఘిక శాస్త్రాలలో సైతం పాటించడం జరుగుతుంది. ఈ అధ్యయన పద్ధతులు ముఖ్యంగా చారిత్రక పద్ధతి, పరిశీలనా పద్ధతి, తులనాత్మక పద్ధతి, అనుభవవాద పద్ధతి, తాత్విక పద్ధతి, శాస్త్రీయ పద్ధతి. ఈ పద్ధతులన్నింటిని అవగాహన చేసుకోవడం ద్వారా రాజనీతిశాస్త్ర విశ్లేషణను సంపూర్ణంగా మనం తెలుసుకోవచ్చు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

ప్రశ్న 3.
రాజనీతిశాస్త్రానికి చరిత్ర, అర్థశాస్త్రానికి గల సంబంధాలను తెలపండి.
జవాబు.
రాజనీతిశాస్త్రం – చరిత్ర :
చరిత్ర గతాన్ని వివరిస్తుంది. మానవుడు, సమాజం ఏ విధంగా అభివృద్ధి చెందాయో తెలుసుకోవాలంటే చరిత్ర అధ్యయనం అవసరం. చరిత్ర మానవ అనుభవాల నిధి. మానవగాథ సాంఘికశాస్త్రాలకు ప్రయోగశాలవంటిది. మానవజాతికి సంబంధించిన రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, మత, సాహిత్యరంగాల గురించి చరిత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు.

తొలిమానవుడి నుంచి నేటి వరకూ ఏర్పడ్డ విభిన్న సంస్థల వర్ణనే చరిత్ర. గతకాలంలోని రాజ్యాభివృద్ధిని, నాగరికతను, సంస్కృతిని, మతసిద్ధాంతాలను, ఆర్థిక విషయాలను చరిత్ర నేటి సమాజానికి అందించింది. చారిత్రక సంఘటనలు, ఉద్యమాలు, వాటి కారణాలు, వాటి మధ్యగల అంతర్ సంబంధాలు లిఖితపత్రమే చరిత్ర.

చరిత్ర రాజకీయాల అధ్యయనానికి అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. గతంలో రాజకీయభావాలు, సంస్థలు ఏ విధంగా రూపొందాయో, రాజ్యం ఎట్లా ఆవిర్భవించి అభివృద్ధి చెందిందో తెలుసుకోవడానికీ, సిద్ధాంతీకరించడానికీ చరిత్ర అవసరమైన మౌలిక సమాచారాన్ని సమకూరుస్తుంది. రాజనీతిశాస్త్రానికీ చరిత్రకూ ఉన్న అవినాభావ సంబంధాన్ని ప్రముఖ రాజనీతి శాస్త్రజ్ఞుడు ‘జె.ఆర్.సీలీ’ వివరిస్తూ “రాజనీతిశాస్త్రంలేని చరిత్ర ఫలరహితం, చరిత్రలేని రాజనీతిశాస్త్రం మూలరహితం” అన్నాడు.

రాజకీయ వ్యవస్థలు ప్రాచీనకాలం నుంచి నేటివరకు వివిధ దశలుగా అభివృద్ధి చెందుతున్నాయి. చరిత్ర వివిధ వ్యవస్థల క్రమపరిణామాలను విశదీకరిస్తుంది. రాజనీతిశాస్త్రానికి చరిత్ర పునాది వంటిది. గత రాజకీయ చరిత్రను వర్తమానంతో పోలిస్తే భవిష్యత్తులో పటిష్టవంతమైన ఆదర్శ రాజకీయ వ్యవస్థలు స్థాపించడానికి సాధ్యమవుతుంది. భారత జాతీయ కాంగ్రెస్, ముస్లిమీగ్ ద్విజాతి సిద్ధాంతం, ఫ్రెంచి విప్లవం, రష్యావిప్లవం మొదలైన వాటిని అర్థం చేసుకోవడానికీ, వాటి ప్రభావాన్ని అంచనా వేయడానికీ రాజకీయ పరిజ్ఞానం చాలా అవసరం.

ప్రాచీన యూరప్ చరిత్ర పరిజ్ఞానం ఉన్నప్పుడే ప్లేటో, అరిస్టాటిల్ వంటి తత్త్వవేత్తల భావాలను అధ్యయనం చేయడం సాధ్యమవుతుంది. చారిత్రక సమాచారం ఆధారంగానే మాకియవెల్లి, మాంటెస్క్యూ, లార్డ్ బ్రైస్ వంటి రాజనీతి శాస్త్రజ్ఞులు విభిన్న రాజకీయ సిద్దాంతాలను ప్రతిపాదించారు.

‘రాబ్సన్’ అభిప్రాయపడ్డట్లు ఒక విద్యార్థి తన దేశ రాజ్యాంగాన్ని, విదేశాంగ విధానాన్ని అధ్యయనం చేయాలంటే తన జాతి చారిత్రక క్రమం తెలుసుకోవలసి ఉంటుంది. రాజనీతిశాస్త్ర అభివృద్ధికి చరిత్ర ఎంత అవసరమో రాజనీతిశాస్త్ర పరిజ్ఞానం కూడా చరిత్ర అభివృద్ధికి అంతే అవసరం. చరిత్ర, రాజనీతి శాస్త్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించినప్పుడే నాగరిక సమాజాభివృద్ధికి అవి తోడ్పడతాయి.

చరిత్ర నిర్ధిష్టమైన ఇతివృత్తాలను గురించి చర్చిస్తే, రాజనీతిశాస్త్రం రాజ్యాధికారం, ప్రభుత్వ విధానాలు, రాజ్యాంగాల వర్గీకరణ, వివిధ రాజకీయ పార్టీలు మొదలైనవాటిని గురించి చర్చిస్తుంది. రాజనీతిశాస్త్ర అధ్యయనం, భూత, వర్తమాన పరిణామాలను విశ్లేషించడమే కాకుండా భవిష్యత్తు గురించి ఊహాగానం చేస్తుంది.

రాజనీతిశాస్త్రం – అర్థశాస్త్రం :
అర్థశాస్త్రం సంపద, ఉత్పత్తి పంపిణీ, వస్తు వినిమయం గురించి అధ్యయనం చేస్తుంది. సంపదను ఎట్లా సమకూర్చుకోవాలో అర్థశాస్త్రం చర్చిస్తుంది. సంపద, ఉత్పత్తి, పంపిణీ విషయాలకు సంబంధించిన సామాజిక అధ్యయనమే అర్థశాస్త్రం. సామాజిక వ్యవస్థలు, రాజనీతి సిద్ధాంతాలు మానవజీవితాన్ని క్రమబద్ధం చేయడానికి తోడ్పడుతుంది. మానవుడు ఆదర్శ పౌరుడుగా నియమనిబంధనలతో బతకడానికి స్పష్టమైన రాజకీయ వ్యవస్థ చాలా అవసరం. కాబట్టి అది మానవశ్రేయస్సును అనేక విధాలుగా అభివృద్ధిపర్చడానికి అర్థశాస్త్రం ఉపకరిస్తుంది.

అపరిమితమైన కోరికలను పరిమిత వనరులతో తీర్చుకునే మార్గాలను సమన్వయం చేయడానికి అర్థశాస్త్రం ప్రయత్నిస్తుంది. ఆర్థికావసరాలు తీరని సమాజంలో అశాంతి, అసంతృప్తి ఏర్పడతాయి. ప్రాథమిక అవసరాలైన తిండి, బట్ట, గృహవసతి, విద్య, వైద్యం మొదలైనవి లోపిస్తే మానవజీవితం దుఃఖమయమవుతుంది. కనీసావసరాలు తీరనప్పుడు వ్యక్తి తన మనుగడకోసమే తన శక్తియుక్తులన్నింటిని వినియోగించవలసి వస్తుంది. ‘దారిద్ర్యం విలయతాండవం చేసే సమాజంలో అవినీతి, సంఘవ్యతిరేకశక్తులు భయంకరంగా విజృంభిస్తాయి.

ఆకలితో, అజ్ఞానంతో, అనారోగ్యంతో బాధపడే పౌరుడు తన రాజకీయ లక్ష్యాలను, విలువలను గుర్తించే పరిస్థితిలో ఉండడు. ఆకలి తీర్చుకోవడానికి అతడు అనేక నేరాలకు పాల్పడవచ్చు. సంఘవిద్రోహ చర్యల ద్వారా ప్రగతి సాధించాలనే భావనతో ఉంటాడు. తన హక్కులను, విధులను సరిగ్గా వినియోగించలేడు. బాధ్యతలను నిర్వర్తించలేడు. కనీసావసరాలు తీరని పౌరుడు ఓటుహక్కు విలువను తెలుసుకోలేడు. ఆర్థిక అసమానతలు సామాజిక విప్లవాలకు దారితీస్తాయని ‘అరిస్టాటిల్’ హెచ్చరించాడు.

అర్థశాస్త్రం, రాజనీతిశాస్త్రం వేరైనప్పటికీ ప్రజాసంక్షేమమే ఈ రెండు శాస్త్రాల ప్రధాన లక్ష్యం. ఆధునిక రాజ్యాలు నిర్వర్తించే విధుల్లో ఉత్పత్తి విధానం, వినియోగం మారకద్రవ్య సద్వినియోగం, ధరల పెరుగుదలను అరికట్టడం, జాతిసంపదను పెంచడం, పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడటం ముఖ్యమైనవి. వీటిమీద ఆర్థిక విధానాల ప్రభావం బాగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు రాజకీయ వ్యవస్థల ద్వారానే పరిష్కరించడానికి వీలవుతుంది. ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనడం ద్వారా ప్రభుత్వం ఆర్థిక విధులను నిర్వర్తిస్తుంది.

ఉత్పత్తి – అభివృద్ధి భావనలను వాస్తవికం చేసేందుకు రాజ్యం పన్నులు, మార్కెటింగ్, ఆహారోత్పత్తి, పంపిణీ, ఉపాధి అవకాశాలు, ఎగుమతులు, దిగుమతులు మొదలైన విధులను నిర్వర్తించక తప్పదు. ఆర్థిక ఉత్పత్తి శక్తులే సమాజాలలో మ్కార్సిజం వ్యాప్తికి దోహదం చేశాయి. ఆర్థికపరమైన అంశాలే రెండో ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారణమయ్యాయి. నాజీయిజం, ‘ఫాసం సిద్ధాంతాలకు ఆర్థిక సమస్యలే ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

బ్రిటిష్ ప్రభుత్వం మనదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడంలో జాప్యం చేయడానికి ఆర్థిక కారణాలే ప్రధానమైనవని చాలా మంది భావిస్తారు. ఆధునిక కాలంలో విస్తరిస్తున్న కొత్త కొత్త రాజకీయ సిద్ధాంతాలకూ ఉద్యమాలకూ ఆర్థిక సమస్యలే మూలం. ఆర్థికస్థితిగతులు రాజకీయ నిర్ణయాలను, ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
రాజనీతిశాస్త్రానికి – సమాజశాస్త్రానికి గల సంబంధాలను వివరించండి.
జవాబు.
సమాజశాస్త్రం సాంఘికశాస్త్రాలన్నింటికీ మూలం. సాంఘికవ్యవస్థల పరిణామాలను సమాజశాస్త్రం అధ్యయనం చేస్తుంది. సమాజశాస్త్రం సామాజిక, నైతిక, ఆర్థిక, సాంస్కృతిక వ్యవస్థలన్నింటి గురించి చర్చిస్తుంది. మానవ సంబంధాలు, సాంఘిక పరిస్థితులు, వివిధ వ్యవస్థల ఆవిర్భావం – పరిణామం వికాసం వాటి రూపాలు, చట్టాలు, ఆచార వ్యవహారాలు, జీవనోపాధి, నాగరికత, సంస్కృతి మొదలైన వాటి ప్రభావాల గురించి సమాజశాస్త్రం ప్రస్తావిస్తుంది.

అందువల్ల సమాజశాస్త్ర పరిధి చాలా విస్తృతమైంది. ఇతర సాంఘిక శాస్త్రాలన్నీ దీనిలో నుంచి ప్రత్యేకశాస్త్రాలుగా రూపాంతరం చెందాయి. రాజనీతిశాస్త్రం వీటిలో ఒక భాగం మాత్రమే. ఈ రెండు శాస్త్రాల మధ్య పరస్పర సంబంధం ఉండటమేగాక అవి పరస్పరం ఆధారపడి ఉంటాయి.

రాజనీతిశాస్త్రవేత్తకు సామాజిక శాస్త్రంతో పరిచయం చాలా అవసరం. ఎందుకంటే రాజ్యస్వభావాన్ని అర్థం చేసుకోవాలంటే దాని సామాజిక మూలాలను అధ్యయనం చేయాలి. గ్రీకు తత్త్వవేత్తలు సాంఘిక విధానాన్నే రాజకీయ విధానంగా భావించారు. వారి దృష్టిలో రాజ్యానికీ సంఘానికీ తేడాలేదు.

గ్రీకుల అభిప్రాయంలో రాజ్యం రాజకీయ వ్యవస్థీకాక ఒక ఉన్నతమైన సాంఘిక వ్యవస్థ కూడా. సమాజ జీవనాన్ని క్రమబద్ధం చేయడంలో సమాజంలోని ఆచారాలు కట్టుబాట్లు తోడ్పడతాయి. రాజనీతిశాస్త్రజ్ఞులు వ్యక్తి సమూహ ప్రవర్తనలను నిర్ణయించడంలో సామాజికీకరణ విధానానికి ప్రాధాన్యత ఇస్తారు.

ఇటీవలి కాలంలో రాజకీయ సమాజశాస్త్రం ఒక ప్రత్యేక శాస్త్రంగా రూపొందింది. దీంతో రాజకీయ జీవనం మీద సామాజిక సంస్థల ప్రభావం ఏ మేరకు ఉందో తెలుసుకోవచ్చు. రాజకీయ పార్టీలు, ముఠాలు, ప్రజాభిప్రాయం మొదలైనవి చాలావరకు సామాజిక ప్రభావాలకు లోనవుతున్నాయి.

ఒక దేశంలోని రాజకీయ పరిణామాలను అర్థం చేసుకోవాలంటే, దాని సామాజిక స్థితిగతుల పట్ల అవగాహన ఉండాలి. భారతదేశ రాజకీయాలను చేసుకోవాలంటే కులం, మతం, ప్రాంతం, భాష మొదలైన సామాజిక ప్రక్రియలను తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది.

రాజనీతిశాస్త్రం క్రమబద్ధమైన వ్యక్తుల సముదాయాలకు పరిమితంకాగా సమాజశాస్త్రం క్రమబద్ధం కాని మానవ సముదాయాలను గురించి కూడా వివరిస్తుంది. రాజనీతిశాస్త్రం భూత, వర్తమాన, భవిష్యత్, రాజకీయ వ్యవస్థల గురించి చర్చిస్తే సమాజశాస్త్రం భూత, వర్తమాన కాలాల్లో ఉన్న సంస్థల పుట్టుక, వికాసం గురించి చర్చిస్తుంది.

ప్రశ్న 2.
రాజనీతిశాస్త్రానికి – అర్థశాస్త్రానికి గల సంబంధాలను చర్చించండి.
జవాబు.
అర్థశాస్త్రం సంపద, ఉత్పత్తి, పంపిణీ, వస్తు వినిమయం గురించి అధ్యయనం చేస్తుంది. సంపదను ఎట్లా సమకూర్చుకోవాలో అర్థశాస్త్రం చర్చిస్తుంది. సంపద, ఉత్పత్తి, పంపిణీ విషయాలకు సంబంధించిన సామాజిక అధ్యయనమే అర్థశాస్త్రం.

సామాజిక వ్యవస్థలు, రాజనీతి సిద్ధాంతాలు మానవజీవితాన్ని క్రమబద్ధం చేయడానికి తోడ్పడుతుంది. మానవుడు ఆదర్శపౌరుడుగా నియమనిబంధనలతో బతకడానికి స్పష్టమైన రాజకీయ వ్యవస్థ చాలా అవసరం. కాబట్టి అది మానవశ్రేయస్సును అనేక విధాలుగా అభివృద్ధిపర్చడానికి అర్థశాస్త్రం ఉపకరిస్తుంది.

అపరిమితమైన కోరికలను పరిమిత వనరులతో తీర్చుకునే మార్గాలను సమన్వయం చేయడానికి అర్థశాస్త్రం ప్రయత్నిస్తుంది. ఆర్థికావసరాలు తీరని సమాజంలో అశాంతి, అసంతృప్తి ఏర్పడతాయి.- ప్రాథమిక అవసరాలైన తిండి, బట్ట, గృహవసతి, విద్య, వైద్యం మొదలైనవి లోపిస్తే మానవజీవితం దుఃఖమయమవుతుంది. కనీసావసరాలు తీరనప్పుడు వ్యక్తి తన మనుగడకోసమే తన శక్తియుక్తులన్నింటిని వినియోగించవలసి వస్తుంది. దారిద్య్రం’ విలయతాండవం చేసే సమాజంలో అవినీతి, సంఘవ్యతిరేకశక్తులు భయంకరంగా విజృంభిస్తాయి.

ఆకలితో, అజ్ఞానంతో, అనారోగ్యంతో బాధపడే పౌరుడు తన రాజకీయ లక్ష్యాలను, విలువలను గుర్తించే పరిస్థితిలో ఉండడు. ఆకలి తీర్చుకోవడానికి అతడు అనేక నేరాలకు పాల్పడవచ్చు. సంఘవిద్రోహ చర్యల ద్వారా ప్రగతి సాధించాలనే భావనతో ఉంటాడు.

తన హక్కులను, విధులను సరిగ్గా వినియోగించలేడు. బాధ్యతలను నిర్వర్తించలేడు. కనీసావసరాలు తీరని పౌరుడు ఓటుహక్కు విలువను తెలుసుకోలేడు. ఆర్థిక అసమానతలు సామాజిక విప్లవాలకు దారితీస్తాయని ‘అరిస్టాటిల్’ హెచ్చరించాడు.

అర్థశాస్త్రం, రాజనీతిశాస్త్రం వేరైనప్పటికీ ప్రజాసంక్షేమమే ఈ రెండు శాస్త్రాల ప్రధాన లక్ష్యం. ఆధునిక రాజ్యాలు నిర్వర్తించే విధుల్లో ఉత్పత్తి విధానం, వినియోగం మారకద్రవ్య సద్వినియోగం, ధరల పెరుగుదలను అరికట్టడం, జాతి సంపదను పెంచడం, పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడటం ముఖ్యమైనవి. వీటిమీద ఆర్థిక విధానాల ప్రభావం బాగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు రాజకీయ వ్యవస్థల ద్వారానే పరిష్కరించడానికి వీలవుతుంది.

ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనడం ద్వారా ప్రభుత్వం ఆర్థిక విధులను నిర్వర్తిస్తుంది. ఉత్పత్తి అభివృద్ధి భావనలను వాస్తవికం చేసేందుకు రాజ్యం పన్నులు, మార్కెటింగ్, ఆహారోత్పత్తి, పంపిణీ, ఉపాధి అవకాశాలు, ఎగుమతులు, దిగుమతులు మొదలైన విధులను నిర్వర్తించక తప్పదు.

ఆర్థిక ఉత్పత్తి శక్తులే సమాజాలలో మార్క్సిజం వ్యాప్తికి దోహడం చేశాయి. ఆర్థికపరమైన అంశాలే రెండో ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారణమయ్యాయి. నాజీయిజం, ఫాసిజం సిద్ధాంతాలకు ఆర్థిక సమస్యలే ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

బ్రిటిష్ ప్రభుత్వం మనదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడంలో జాప్యం చేయడానికి ఆర్థిక కారణాలే ప్రధానమైనవని చాలా మంది భావిస్తారు. ఆధునిక కాలంలో విస్తరిస్తున్న కొత్త కొత్త రాజకీయ సిద్ధాంతాలకూ ఉద్యమాలకూ ఆర్థిక సమస్యలే మూలం. ఆర్థికస్థితిగతులు రాజకీయ నిర్ణయాలను, ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

ప్రశ్న 3.
రాజనీతిశాస్త్ర స్వభావం ఏమిటి ?
జవాబు.
రాజకీయాలు (Politics) అనే పదం గ్రీకు పదమైన పోలిస్ (Polis) అనే పదం నుంచి గ్రహించబడింది. ‘పోలిస్’ అంటే నగర – రాజ్యం (City State) అని అర్ధం. ‘పాలిటి (Polity) అనే పదం గ్రీకు పదమైన ‘పొలిటియా’ (Poletieia) అనే గ్రీకు పదం నుంచి గ్రహించబడింది. ‘పాలిటి’ అంటే ‘ప్రభుత్వం – లేదా రాజ్యాంగం’ అని అర్థం.

ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయాలు అంటే రాజ్యం, ప్రభుత్వం, రాజ్యానికి సంబంధించిన సంస్థలకు వివరణగా భావించాలి. ప్రాచీనగ్రీకులు రాజకీయాలను రాజ్యానికి సంబంధించిన సైద్ధాంతిక, పాలనా నిర్వహణకు చెందిన అంశంగా పరిగణించారు.

రాజకీయాలకు – రాజనీతి శాస్త్రానికి సంబంధించిన నిర్వచనాల విషయంలో రాజనీతిశాస్త్రజ్ఞుల మధ్య ఏకాభిప్రాయం లేదు. రాజనీతిశాస్త్రాన్ని సంప్రదాయిక వాదులు, ఆధునిక శాస్త్రవేత్తలు వేరువేరుగా నిర్వచించారు. సంప్రదాయిక రాజనీతిశాస్త్రవేత్తల అభిప్రాయంలో రాజ్యం, ప్రభుత్వం, రాజనీతిశాస్త్ర అధ్యయనానికి కేంద్ర బిందువుగా ఉంటాయి. రాజ్యం లేకుండా ప్రభుత్వం – ప్రభుత్వం లేకుండా రాజ్యం మనుగడకు కొనసాగించలేవని వారు అభిప్రాయపడ్డారు. ఈ కారణం వల్ల రాజ్యం – ప్రభుత్వం రాజనీతిశాస్త్ర అధ్యయనానికి కేంద్ర బిందువులుగా సంప్రదాయ రాజనీతిశాస్త్రవేత్తలు అభివర్ణించారు.

రెండవ ప్రపంచ యుద్ధానంతరం పశ్చిమదేశాలకు చెందిన రాజనీతి శాస్త్రవేత్తలు వివిధ నూతన సిద్ధాంతాలను, అధ్యయన దృక్పథాలను, పద్ధతులను, నమూనాలను రాజనీతిశాస్త్రంలో పొందుపరచి దాన్ని పునఃనిర్వచించి రాజనీతిశాస్త్ర పరిధిని విస్తృత పరిచారు.

1930వ దశకంలో హెరాల్డ్ లాస్వెల్ (Harold Lasswell) అనే రాజనీతి పండితుడు రాజనీతిశాస్త్రాన్ని, ‘రాజకీయ అధికారాన్ని’ (Political Power) అధ్యయనం చేసే శాస్త్రంగాను, అధికారాన్ని ఎవరు, ఎప్పుడు, ఎలా (Who, When and How) చేజిక్కించుకుంటారనే విషయాన్ని ముఖ్య అధ్యయన అంశంగా రాజనీతిశాస్త్రజ్ఞులు ఎంచుకోవాలని నొక్కి వక్కాణించారు. అటు పిమ్మట రెండు దశాబ్దాల తరవాత 1950వ దశకంలో మరికొంతమంది రాజనీతి పండితులు రాజనీతి శాస్త్రాన్ని విధాన నిర్ణయ శాస్త్రంగా పరిగణించాలన్నారు. ఎందుకంటే ?

ఎవరు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నారనే విషయం కంటే ప్రజల సమస్త జీవన రీతులను మెరుగుపర్చటానికి రాజ్యం ఎటువంటి విధానాలను (Policies) రూపొందించి అమలుపరుస్తుందనే అంశం రాజనీతిశాస్త్ర అధ్యయనంగా ఉండాలని వీరు భావించారు. అందువల్ల రాజనీతిశాస్త్రం విధాన నిర్ణయ శాస్త్రంగా స్థిరీకరించబడిన మానవ సమూహాల రాజకీయ చర్యలను, కార్యకలాపాలను విశ్లేషించేదిగా పరిణతి చెందింది.

ఈ క్రమంలో రాజ్యం తీసుకునే విధాన నిర్ణయాల్లో భాగస్వామ్యం కలిగి ఉండే రాజకీయ పార్టీలు, ప్రభావ వర్గాలు, కార్మిక – కర్షక సంఘాలు, ఇతర సంస్థలు, పాలనా యంత్రాంగాలు వాటి పాత్రలను వివరించేదిగా రాజనీతిశాస్త్రం అభివృద్ధి చెందింది.

రాజనీతిశాస్త్రాన్ని విశాల దృక్పథంలో చూసినట్లయితే మనకు రెండు అధ్యయన కోణాలు కనబడతాయి. అవి : ఒకటి సంప్రదాయిక కోణాలు, రెండు ఆధునిక కోణాలు. సంప్రదాయిక కోణంలో రాజనీతిశాస్త్రాన్ని చూసినట్లయితే అది సంప్రదాయాలను, విలువలను, అధ్యయనం చేయడానికి, అదే విధంగా, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం వంటి భావాలను, కొన్ని సంప్రదాయిక సిద్ధాంతాలను వివరించడానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది.

ఆధునిక కోణంలో చూసినట్లయితే, భౌతిక పరిస్థితులకు, వాస్తవిక అంశాలకు, వ్యక్తుల రాజకీయ ప్రవర్తనలకు, రాజ్యం – ప్రభుత్వం రూపొందించే విధానాలకు సమాజంలో సంభవించే సాంఘిక ఉద్యమాలను అధ్యయనం చేయడానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది.

ప్రశ్న 4.
రాజనీతిశాస్త్ర పరిణామ క్రమాన్ని వివరించండి.
జవాబు.
రాజకీయాలను గురించి అధ్యయనం ప్రాచీన గ్రీకు సమాజాలలో ప్రారంభమైంది. సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ వంటి గ్రీకు తాత్వికులు వారి కాలం నాటి సమాజాలలోని రాజకీయాలను గురించి చింతన చేశారు. అయితే, అరిస్టాటిల్ నాటి ప్రభుత్వాలను, రాజకీయ వ్యాసంగాలను హేతుబద్ధంగా తులనాత్మక పద్ధతిలో వివరించినందువల్ల తాను రాజనీతిశాస్త్ర పితామహుడుగా ఆరాధించబడ్డాడు. అరిస్టాటిల్, రాజనీతిశాస్త్రాన్ని “మాస్టరైసైన్స్”గా అభివర్ణించాడు.

అంటే మానవులకు చెందిన సాంఘిక, రాజకీయ సంస్థలను వివరించే శాస్త్రంగా పేర్కొన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయాలను గ్రీకులు ఒక సమగ్రమైన భావనగా చూశారు. కాలక్రమంలో రాజకీయాల పట్ల గ్రీకుల భావన అనేక మార్పులకు చేర్పులకు గురై ప్రాధాన్యతను కోల్పోయింది. ఆధునిక కాలంలో రాజకీయాలు అనే భావన విస్తృతార్థాన్ని సంతరించుకుంది.

వాస్తవానికి, సామాజిక పరిణామక్రమంలో వివిధ దశల వారీగా ఉత్పత్తివిధానంలో చోటు చేసుకున్న మార్పులు (వేటాడే దశ, ఆహార సేకరణ దశ, వ్యవసాయ ఉత్పత్తిదశ, పారిశ్రామిక ఉత్పత్తి దశ) రాజకీయాలను విస్తృత పర్చాయి. వ్యక్తుల చర్యలను సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాలకు చెందినవిగా వివరించబడ్డాయి.

ఈ నేపథ్యంలో రాజనీతిశాస్త్రం వ్యక్తుల రాజకీయ చర్యలకు సంబంధించిన ‘రాజ్యం – ప్రభుత్వం’ లాంటి సంస్థలను వివరించే శాస్త్రంగా వృద్ధి చెందింది. ఈ విధంగా, రాజ్యపరిణామక్రమం, దాని విధులు, ప్రభుత్వం దాని నిర్మాణం – విధులు వంటివి రాజనీతిశాస్త్ర అధ్యయన అంశాలుగా పరిగణించబడ్డాయి.

సామాన్యశాస్త్రాల్లో జీవరాశుల ప్రవర్తనలను అధ్యయనం చేసే తరహాలో సామాజికశాస్త్రాల్లో సైతం వ్యక్తుల ప్రవర్తనలను అధ్యయనం చేయవలసిన ఆవశ్యకతను వివరిస్తూ ప్రవర్తనావాద ఉద్యమం ప్రారంభమైంది. 1920వ దశకంలో గుర్తించబడిన అధ్యయన అంశం రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్రవర్తనావాద ఉద్యమంగా ఒక ఉప్పెనలా సాంఘికశాస్త్రాల అధ్యయనాన్ని అతలాకుతలం చేసింది. 1950వ దశకం నాటికి చార్లెస్ మెరియం, డేవిడ్ ఈస్టన్, గాబ్రియల్ ఆల్మండ్ వంటి రాజనీతిశాస్త్రవేత్తలు ప్రవర్తనావాద ఉద్యమానికి నాయకత్వం వహించారు.

ఈ ఉద్యమం, వ్యక్తుల రాజకీయ ప్రవర్తనల అధ్యయనానికి అధిక ప్రాధాన్యతనిచ్చింది. ఒక రాజకీయ వ్యవస్థలోని పౌరులు ఆ రాజకీయ వ్యవస్థపై ఎటువంటి రాజకీయ పరమైన వైఖరులను కలిగి ఉన్నారో శాస్త్రీయంగా విశ్లేషించాల్సిన ఆవశ్యకతను ప్రవర్తనావాదం నొక్కి చెప్పింది. వ్యవస్థీకృతమైన రాజకీయ సమాజంలో రాజ్యం రూపొందించే విధానాలను, వాటి అమలును, వాటి పట్ల పౌరుల రాజకీయ స్పందనలను వివరించేదిగా రాజనీతిశాస్త్రం పరిణామం చెందింది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
రాజనీతిశాస్త్ర నిర్వచనం.
జవాబు.

  1. జె.డబ్ల్యు. గార్నర్ : “రాజనీతిశాస్త్రనికి ఆది అంతాలు రాజ్యమే”.
  2. పాల్ జానెట్ : “రాజ్య మూలాధారాలను, ప్రభుత్వ సూత్రాలను తెలియజేసే సాంఘికశాస్త్రమే రాజనీతిశాస్త్రం”.
  3. రాబర్ట్ థాల్ : “అధికారాన్ని, శక్తిని, వాటి ప్రభావాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసేదే రాజనీతిశాస్త్రం”.

ప్రశ్న 2.
రాజనీతిశాస్త్ర ప్రాముఖ్యతను నాలుగు మాటల్లో తెలపండి.
జవాబు.
రాజనీతిశాస్త్రం రాజకీయ వ్యవస్థల్లో చోటుచేసుకుంటున్న మార్పులను అధ్యయనం చేయడమే కాకుండా రాజకీయపరమైన సమస్యల పరిష్కారానికి కూడా తగిన సలహాలు, సూచనలు అందిస్తుంది అంతేకాకుండా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం, బాధ్యతాయుత ప్రభుత్వంగా వ్యవహరించడం, ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యతనివ్వడం వంటి విషయాలను పేర్కొంటుంది.

ప్రశ్న 3.
సమాజశాస్త్రం అంటే ఏమిటి ?
జవాబు.
సమాజశాస్త్రం సాంఘికశాస్త్రాలన్నింటికీ మూలం. సాంఘిక వ్యవస్థల పరిణామాలను సమాజశాస్త్రం అధ్యయనం చేస్తుంది. సమాజశాస్త్రం సామాజిక, నైతిక, ఆర్థిక, సాంస్కృతిక వ్యవస్థలన్నింటి గురించి చర్చిస్తుంది.

మానవ సంబంధాలు, సాంఘిక పరిస్థితులు, వివిధ వ్యవస్థల ఆవిర్భావం వాటి రూపాలు, చట్టాలు, ఆచార వ్యవహారాలు, జీవనోపాధి, నాగరికత, సంస్కృతి మొదలైన వాటి ప్రభావాల గురించి సమాజశాస్త్రం ప్రస్తావిస్తుంది. అందువల్ల సమాజశాస్త్రం పరిధి చాలా విస్తృతమైనది. ఇతర సాంఘిక శాస్త్రాలన్నీ దీనిలో నుంచి ప్రత్యేకశాస్త్రాలుగా
రూపాంతరం చెందాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

ప్రశ్న 4.
అర్థశాస్త్రానికి – రాజనీతిశాస్త్రానికి గల భేదం.
జవాబు.

అర్థశాస్త్రం సంపద, ఉత్పత్తి, పంపిణీ, వస్తు వినిమయం గురించి అధ్యయనం చేస్తుంది. సంపదను ఎట్లా సమకూర్చుకోవాలో అర్థశాస్త్రం చర్చిస్తుంది. సంపద, ఉత్పత్తి, పంపిణీ విషయాలకు సంబంధించిన సామాజిక అధ్యయనమే అర్థశాస్త్రం.

సామాజిక వ్యవస్థలు, రాజనీతి సిద్ధాంతాలు మానవజీవితాన్ని క్రమబద్ధం చేయడానికి తోడ్పడుతుంది. మానవుడు ఆదర్శపౌరుడుగా నియమనిబంధనలతో బతకడానికి స్పష్టమైన రాజకీయ వ్యవస్థ చాలా అవసరం. కాబట్టి అది మానవశ్రేయస్సును అనేక విధాలుగా అభివృద్ధిపర్చడానికి అర్థశాస్త్రం ఉపకరిస్తుంది.

అపరిమితమైన కోరికలను పరిమిత వనరులతో తీర్చుకునే మార్గాలను సమన్వయం చేయడానికి అర్థశాస్త్రం ప్రయత్నిస్తుంది. ఆర్థికావసరాలు తీరని సమాజంలో అశాంతి, అసంతృప్తి ఏర్పడతాయి.- ప్రాథమిక అవసరాలైన తిండి, బట్ట, గృహవసతి, విద్య, వైద్యం మొదలైనవి లోపిస్తే మానవజీవితం దుఃఖమయమవుతుంది. కనీసావసరాలు తీరనప్పుడు వ్యక్తి తన మనుగడకోసమే తన శక్తియుక్తులన్నింటిని వినియోగించవలసి వస్తుంది. దారిద్య్రం’ విలయతాండవం చేసే సమాజంలో అవినీతి, సంఘవ్యతిరేకశక్తులు భయంకరంగా విజృంభిస్తాయి.

ఆకలితో, అజ్ఞానంతో, అనారోగ్యంతో బాధపడే పౌరుడు తన రాజకీయ లక్ష్యాలను, విలువలను గుర్తించే పరిస్థితిలో ఉండడు. ఆకలి తీర్చుకోవడానికి అతడు అనేక నేరాలకు పాల్పడవచ్చు. సంఘవిద్రోహ చర్యల ద్వారా ప్రగతి సాధించాలనే భావనతో ఉంటాడు.

తన హక్కులను, విధులను సరిగ్గా వినియోగించలేడు. బాధ్యతలను నిర్వర్తించలేడు. కనీసావసరాలు తీరని పౌరుడు ఓటుహక్కు విలువను తెలుసుకోలేడు. ఆర్థిక అసమానతలు సామాజిక విప్లవాలకు దారితీస్తాయని ‘అరిస్టాటిల్’ హెచ్చరించాడు.

అర్థశాస్త్రం, రాజనీతిశాస్త్రం వేరైనప్పటికీ ప్రజాసంక్షేమమే ఈ రెండు శాస్త్రాల ప్రధాన లక్ష్యం. ఆధునిక రాజ్యాలు నిర్వర్తించే విధుల్లో ఉత్పత్తి విధానం, వినియోగం మారకద్రవ్య సద్వినియోగం, ధరల పెరుగుదలను అరికట్టడం, జాతి సంపదను పెంచడం, పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడటం ముఖ్యమైనవి. వీటిమీద ఆర్థిక విధానాల ప్రభావం బాగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు రాజకీయ వ్యవస్థల ద్వారానే పరిష్కరించడానికి వీలవుతుంది.

ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనడం ద్వారా ప్రభుత్వం ఆర్థిక విధులను నిర్వర్తిస్తుంది. ఉత్పత్తి అభివృద్ధి భావనలను వాస్తవికం చేసేందుకు రాజ్యం పన్నులు, మార్కెటింగ్, ఆహారోత్పత్తి, పంపిణీ, ఉపాధి అవకాశాలు, ఎగుమతులు, దిగుమతులు మొదలైన విధులను నిర్వర్తించక తప్పదు.

ఆర్థిక ఉత్పత్తి శక్తులే సమాజాలలో మార్క్సిజం వ్యాప్తికి దోహడం చేశాయి. ఆర్థికపరమైన అంశాలే రెండో ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారణమయ్యాయి. నాజీయిజం, ఫాసిజం సిద్ధాంతాలకు ఆర్థిక సమస్యలే ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

బ్రిటిష్ ప్రభుత్వం మనదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడంలో జాప్యం చేయడానికి ఆర్థిక కారణాలే ప్రధానమైనవని చాలా మంది భావిస్తారు. ఆధునిక కాలంలో విస్తరిస్తున్న కొత్త కొత్త రాజకీయ సిద్ధాంతాలకూ ఉద్యమాలకూ ఆర్థిక సమస్యలే మూలం. ఆర్థికస్థితిగతులు రాజకీయ నిర్ణయాలను, ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

ప్రశ్న 5.
ప్రవర్తనావాదం.
జవాబు.
సామాన్యశాస్త్రల్లో జీవరాశుల ప్రవర్తనలను అధ్యయనం చేసే తరహాలో సామాజికశాస్త్రాల్లో సైతం వ్యక్తుల ప్రవర్తనలను అధ్యయనం చేయవలసిన ఆవశ్యకతను వివరిస్తూ ప్రవర్తనావాద ఉద్యమం ప్రారంభమైంది. చార్లెస్ మెరియం, డేవిడ్ ఈస్టర్, గాబ్రియల్ ఆల్మండ్ వంటి రాజనీతిశాస్త్రవేత్తలు ప్రవర్తనావాద ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఒక రాజకీయ వ్యవస్థలోని పౌరులు ఆ రాజకీయ వ్యవస్థపై ఎటువంటి రాజకీయపరమైన వైఖరులను కలిగి ఉన్నారో శాస్త్రీయంగా విశ్లేషించాల్సిన ఆవశ్యకతను ప్రవర్తనావాదం నొక్కి చెప్పింది.

ప్రశ్న 6.
ఉత్తర – ప్రవర్తనావాదం.
జవాబు.
రాజనీతిశాస్త్ర అధ్యయన ధృక్పథంలో ప్రవర్తనావాదాన్ని విమర్శిస్తూ ఆవిష్కరించడిన మరో కోణమే ఉత్తర ప్రవర్తనావాదం. ప్రవర్తనావాదం పూర్తి శాస్త్రీయతకు పీటవేయగా, ఉత్తర ప్రవర్తనావాదం విలువలకు – శాస్త్రీయతకు రెండింటికి సమాన ప్రాధాన్యతనిస్తూ రాజకీయ వ్యాసంగాలను విశ్లేషించాలని భావించింది.

ప్రశ్న 7.
మాస్టర్ సైన్స్.
జవాబు.
రాజకీయాలను గురించి అధ్యయనం ప్రాచీన గ్రీకు సమాజాలలో ప్రారంభమైంది. సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ వంటి గ్రీకు తాత్వికులు వారి కాలం నాటి సమాజాలలోని రాజకీయాలను గురించి చింతన చేశారు.

అయితే, అరిస్టాటిల్ నాటి ప్రభుత్వాలను, రాజకీయ వ్యాసంగాలను హేతుబద్ధంగా తులనాత్మక పద్ధతిలో వివరించినందువల్ల తాను రాజనీతి శాస్త్ర పితామహుడుగా ఆరాధించబడ్డాడు. అరిస్టాటిల్, రాజనీతిశాస్త్రాన్ని “మాస్టర్ సైన్స్”గా అభివర్ణించాడు. అంటే మానవులకు చెందిన సాంఘిక, రాజకీయ సంస్థలను వివరించే శాస్త్రంగా పేర్కొన్నాడు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

ప్రశ్న 8.
అరిస్టాటిల్.
జవాబు.
అరిస్టాటిల్ ప్రముఖ గ్రీకు రాజనీతి తత్వవేత్త. ప్లేటో శిష్యుడు. అరిస్టాటిల్ ప్రాచీన గ్రీకు కాలం నాటి ప్రభుత్వాలను, రాజకీయ వ్యాసంగాలను హేతుబద్ధంగా తులనాత్మక పద్ధతిలో వివరించినందువల్ల తాను రాజనీతిశాస్త్ర పితామహుడుగా ఆరాధించబడ్డాడు. అరిస్టాటిల్ రాజనీతిశాస్త్రాన్ని “మాస్టరైసైన్స్”గా అభివర్ణించాడు. అరిస్టాటిల్ తన ప్రఖ్యాత గ్రంధమైన “పాలిటిక్స్”లో రాజ్యము, ప్రభుత్వము గురించి అధ్యయనము చేసే శాస్త్రము రాజనీతిశాస్త్రమని పేర్కొన్నాడు.

TS Inter 1st Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 6th Lesson హక్కులు – విధులు Textbook Questions and Answers.

TS Inter 1st Year Political Science Study Material 6th Lesson హక్కులు – విధులు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
హక్కులను నిర్వచించి పౌర, రాజకీయ హక్కులను వర్ణించండి.
జవాబు.
పరిచయం : రాజనీతిశాస్త్ర అధ్యయనంలో హక్కుల భావనకు చాలా ప్రాముఖ్యత ఉంది. సామాజిక జీవనానికి హక్కులనేవి అత్యంత ఆవశ్యకమైనవి. సామాజిక సంక్షేమ సాధనగా హక్కులు పరిగణించబడినాయి. హక్కులను వినియోగించుకోవటం ద్వారానే రాజ్యంలోని పౌర వ్యక్తిత్వం వికసిస్తుంది.

సమాజంలోనూ, రాజ్యంలోనూ సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి హక్కులు అవసరమవుతాయి. రాజ్యం పౌరులకు ప్రసాధించే హక్కుల ద్వారానే దాని ఔన్నత్యం గుర్తించబడుతుందని హెచ్.జె. లాస్కి పేర్కొన్నాడు. సాధారణంగా ప్రతి రాజ్యం తన పౌరులకు వివిధ రంగాలలో అనేక హక్కులను ప్రసాదిస్తుంది.

హక్కులనేవి రాజ్యం, సమాజం చేత గుర్తించబడే కనీస పరిస్థితులు, అవకాశాలుగా పరిగణించవచ్చు. వాటిని రాజ్యంలోని వివిధ చట్టాలు పరిరక్షిస్తాయి. ఆధునిక రాజ్యాలు తమ రాజ్యాంగం, చట్టాల ద్వారా పౌరుల వికాసానికి అనేక ఏర్పాట్లుగావించాయి. ఇక హక్కులు, బాధ్యతలు అనేవి వ్యక్తుల సంపూర్ణ వికాసానికి అత్యంత ఆవశ్యకమైనవి.

అర్థం :
“హక్కు” అంటే “కలిగి ఉండటము” అని అర్థం. సమాజ సంక్షేమం కోసం, ప్రగతి కోసం వ్యక్తులందరూ పాటించవలసిన బాధ్యతల రూపమే హక్కులు. హక్కులు మానవునకు స్వేచ్ఛను ఇచ్చి, వికాసానికి తోడ్పడతాయి. హక్కుల నిర్వచనాలు : రాజనీతి శాస్త్రవేత్తలు హక్కు అనే పదాన్ని అనేక విధాలుగా నిర్వచించారు. వాటిలో కొన్నింటిని కింద వివరించడమైనది.

  1. ఎర్నెస్ట్ బార్కర్ : “వ్యక్తి మూర్తిమత్వ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన బాహ్యపరమైన పరిస్థితులే ” హక్కులు”.
  2. బొసాంకే : “సమాజం చేత గుర్తించబడి, రాజ్యం చేత అమలులో ఉంచబడే అధికారాలే హక్కులు”.
  3. టి.హెచ్. గ్రీన్ : “ఉమ్మడి శ్రేయస్సుకు దోహదపడే వాటిని కోరేందుకు, గుర్తించేందుకు ఉండే అధికారాలే హక్కులు.” .
  4. హెచ్.జె. లాస్కి : “హక్కులనేవి మానవుల సామాజిక జీవనానికి అవసరమైనవి. అవి లేకుండా ఏ ఒక్కరూ సాధారణంగా, అత్యుత్తమమైన వ్యక్తిగా రూపొందటం సాధ్యం కాదు.”

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

పౌరహక్కులు :
నాగరిక జీవనాన్ని గడపటానికి అవసరమయ్యే హక్కులనే పౌరహక్కులు అంటారు. అన్ని రాజ్యాలు తమ ప్రజలకు ఈ హక్కులను ఇస్తున్నాయి. ఈ హక్కులపై అనేక మినహాయింపులు ఉంటాయి. ముఖ్యమైన పౌర హక్కులు ఏమనగా :

1. జీవించే హక్కు (Right to Life) :
జీవించే హక్కు అనేది పౌరహక్కులలో అత్యంత ముఖ్యమైనదని టి. హెచ్. గ్రీన్ భావించాడు. ఈ హక్కు వ్యక్తుల జీవనానికి భద్రతను కల్పిస్తుంది. ఈ హక్కు లేనట్లయితే వ్యక్తులు తమ జీవనాన్ని గడిపేందుకు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు.

ప్రతి వ్యక్తికీ ఈ హక్కు ఎంతో విలువైనదే కాకుండా, సమాజం, రాజ్యం మొత్తానికి కూడా ఎంత విలువైనదనే ప్రమేయంపై ఈ హక్కు ఆధారపడి ఉంది. అందువల్ల ఈ హక్కు ద్వారా రాజ్యం వ్యక్తుల జీవనానికి ఎంతగానో రక్షణను కల్పిస్తుంది.

అయితే ఈ హక్కును అనుభవించే విషయంలో వ్యక్తులపై రాజ్యం కొన్ని సహేతుకమైన ఆంక్షలను విధించవచ్చు. ఈ సందర్భంలో రాజ్యం ఏ వ్యక్తినైనా జాతి ప్రయోజనం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని ఆజ్ఞాపించవచ్చు. ఈ హక్కులలో ఆత్మరక్షణ హక్కు కూడా ఇమిడి ఉంది.

2. స్వేచ్ఛా హక్కు (Right to Liberty) :
స్వేచ్ఛా హక్కు వ్యక్తులకు అనేక రంగాలలో స్వాతంత్ర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ హక్కు వారి జీవనాన్ని అర్థవంతం చేస్తుంది. వ్యక్తులు అనేక రంగాలలో వారి వ్యక్తిత్వాన్ని వికసింపచేసుకొనేందుకు. వీలు కల్పిస్తుంది. సంచరించే హక్కు, వాక్ స్వాతంత్ర్యపు హక్కు, భావవ్యక్తీకరణ హక్కు, ఆలోచనా హక్కు, నివసించే హక్కు మొదలైనవి ఇందులో ఉన్నాయి.

3. సమానత్వ హక్కు (Right to Equality) :
సమానత్వ హక్కు అంటే చట్టం దృష్టిలో అందరూ సమానులే. అని అర్థంగా చెప్పవచ్చు. వ్యక్తుల మధ్య కులం, వర్ణం, పుట్టుక, మతం, ప్రాంతం, సంపద, విద్యలాంటి పలురకాల విచక్షణలను ఈ హక్కు నిషేధిస్తుంది. అందరినీ ఒకే రకంగా ఆదరిస్తుంది. రాజ్యంలో చట్టాలను ఒకే విధంగా వర్తించుటకు ఈ హక్కు ఉద్దేశించింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో వ్యక్తులందరికీ సమానమైన అవకాశాలను ఈ హక్కు కల్పిస్తుంది.

4. ఆస్తి హక్కు (Right to Property) :
ఈ హక్కు ప్రకారం ప్రతి వ్యక్తి ఆస్తిని సంపాదించేందుకు, అనుభవించేందుకు, దానధర్మాలకు వినియోగించుకొనేందుకు లేదా వారసత్వంగా పొందేందుకు వీలుంటుంది. ప్రతి వ్యక్తి ఉన్నత ప్రమాణాలతో జీవనాన్ని కొనసాగించేందుకు ఈ హక్కు అవసరమవుతుంది. అలాగే వ్యక్తి మూర్తిమత్వ వికాసానికి ఇది ఎంతో కీలకమైనది.

5. కుటుంబ హక్కు (Right to Family) :
కుటుంబం అనేది ఒక ప్రాథమిక, సామాజిక వ్యవస్థ. కుటుంబ హక్కు సమాజంలో వ్యక్తులకు కుటుంబపరమైన సంబంధాలను ఏర్పరచుకొనేందుకు వీలు కల్పిస్తుంది. పర్యవసానంగా ఈ హక్కు ద్వారా వ్యక్తులు తమకు నచ్చినవారిని వివాహం చేసుకొనే స్వేచ్ఛను కలిగి ఉంటారు. అలాగే సంతానాన్ని పొందేందుకు, పిల్లలను పోషించేందుకు వారికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.

అయితే జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ హక్కుపై రాజ్యం కొన్ని నిర్దిష్టమైన ఆంక్షలను విధించవచ్చు. ఉదాహరణకి ఇటీవలి కాలం వరకు చైనా ప్రభుత్వం అక్కడి పౌరుల కుటుంబసభ్యుల సంఖ్యపై కఠిన ఆంక్షలను విధించింది. ఇప్పుడిప్పుడే ఈ రాజ్యం పైన పేర్కొన్న విషయంలో కొన్ని సవరణలు చేస్తున్నది.

6. మత హక్కు (Right to Religion) :
ఈ హక్కు ప్రకారం వ్యక్తులు తమకు ఇష్టమైన మతాన్ని స్వీకరించేందుకు, ప్రచారం చేసేందుకు, ప్రభోదించేందుకు స్వేచ్ఛను కలిగి ఉంటారు. వారు ఈ విషయంలో సంపూర్ణమైన స్వాతంత్ర్యాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా లౌకికరాజ్యాలు తమ పౌరులకు విశేషమైన మత స్వాతంత్ర్యాలను ప్రసాదించాయి.

7. ఒప్పందం హక్కు (Right to Contract) :
ఒప్పందం హక్కు ప్రకారం వ్యక్తులు తమ జీవనం, ఆస్తి, ఉపాధి వంటి విషయాలలో చట్టబద్ధమైన ఏర్పాట్లను చేసుకొనేందుకు లేదా ఒప్పందాలను కుదుర్చుకొనేందుకు స్వాతంత్య్రాన్ని కలిగి ఉంటారు. ఈ విషయంలో ఈ హక్కు ప్రకారం సంబంధిత వ్యక్తులు స్పష్టమైన నియమ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. రాజ్యం వ్యక్తుల శ్రేయస్సును పెంపొందించే ఒప్పందాలను మాత్రమే ఈ సందర్భంలో గుర్తిస్తుంది.

8. విద్యా హక్కు (Right to Education) :
ఆధునిక కాలంలో విద్యా హక్కు అనేది ప్రతి వ్యక్తికి అత్యంత ఆవశ్యకమైనదిగా పరిగణించబడింది. విద్యలేనివారు, అమాయకులు ప్రభుత్వ వ్యవహారాలలో చురుకుగా పాల్గొనలేరు. అలాగే నిరక్షరాస్యులు తమ శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకోలేరు.

అందుచేత విద్య, అక్షరాస్యత అనేవి సమాజంలో వివిధ సామాజిక సమస్యలను అవగాహన చేసుకొనేందుకు, ప్రభుత్వ విధానాలను తెలుసుకొనేందుకు దోహదపడతాయి. ప్రజాస్వామ్య రాజ్యాలలో ఈ హక్కు ప్రతి పౌరుడికి కనీసస్థాయి విద్యను అందించేందుకు హామీ ఇస్తుంది.

9. సంస్థలు, సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు (Right to form Associations and Unions) :
ఈ హక్కు ప్రకారం వ్యక్తులు తమకు ఇష్టమైన సంస్థలు, సంఘాలను నెలకొల్పుకొని, కొన్ని నిర్దిష్ట లక్ష్యాలను నెరవేర్చుకొనేందుకు వీలుంటుంది.

వ్యక్తులు ఈ హక్కును వినియోగించుకోవటం ద్వారా తమ అభీష్టం ప్రకారం వివిధ సంస్థలు, సంఘాలలో సభ్యులుగా చేరేందుకు, కొనసాగేందుకు మరియు సభ్యత్వాలను ఉపసంహరించుకొనేందుకు పూర్తి స్వేచ్ఛను ఉంటారు. అయితే ఒకవేళ వ్యక్తులు జాతి శ్రేయస్సును విస్మరించి సంస్థలను స్థాపించి నిర్వహించినచో, రాజ్యం వారి చర్యలపై కొన్ని ఆంక్షలను విధించవచ్చు.

10. రాజ్యాంగ పరిహారపు హక్కు (Right to Constitutional Remedies) :
వ్యక్తి హక్కుల పరిరక్షణకు ఈ హక్కు అత్యంత ఆవశ్యకమైనది. ఈ హక్కు లేనిచో పౌరహక్కులనేవి అర్థరహితమవుతాయి. ఈ హక్కు ప్రకారం ఇతరుల జోక్యం లేదా దాడి ఫలితంగా నష్టం పొందిన వ్యక్తి తన స్వాతంత్ర్యాన్ని కోల్పోయినచో, తగిన ఉపశమనాన్ని, న్యాయాన్ని న్యాయస్థానాల ద్వారా పొందుతాడు.

ఈ సందర్భంలో ఉన్నత న్యాయస్థానాలు, అనేక ఆజ్ఞలను (writs) జారీ చేస్తాయి. అటువంటి వాటిలో హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, కో వారంటో, సెర్షియోరరి లాంటివి ఉన్నాయి.

రాజకీయ హక్కులు : ప్రజాస్వామ్య దేశాలలో ప్రభుత్వ వ్యవహారాలలో పౌరులు పాల్గొనటానికి అవకాశం కల్పించబడింది. ఈ అవకాశాలనే రాజకీయ హక్కులు అందురు. రాజకీయ హక్కులు ముఖ్యంగా 5 అవి :

1. ఓటు హక్కు (Right to Vote) :
ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలలో పౌరులు అనుభవించే అతి ముఖ్యమైన రాజకీయ హక్కు ఓటు హక్కు. వయోజన పౌరులు ఈ హక్కును వివిధ శాసన నిర్మాణ సంస్థలలో తమ ప్రతినిధులను ఎన్నుకొనేందుకు శక్తివంతమైన ఆయుధంగా వినియోగిస్తారు.

ఈ హక్కు వారిని నిజమైన సార్వభౌములుగా రూపొందిస్తుంది. వయోజన పౌరులందరూ వర్ణం, పుట్టుక, భాష, తెగ, మతం, ప్రాంతం వంటి తారతమ్యాలు లేకుండా ఈ హక్కును కలిగి ఉంటారు. అయితే విదేశీయులు, మైనర్లకు ఈ హక్కు వర్తించదు.

2. ఎన్నికలలో అభ్యర్థిగా పోటీచేసే హక్కు (Right to Contest in Elections) :
రాజ్యంలో పౌరులు వివిధ శాసన నిర్మాణ సంస్థలకు అభ్యర్థులుగా పోటీచేసేందుకు ఈ హక్కు అధికారమిస్తుంది. రాజకీయ సామర్థ్యం ఆసక్తి, శక్తివంతమైన నాయకత్వం వంటి లక్షణాలు గల పౌరులు రాజ్యానికి సంబంధించిన రాజకీయ యంత్రాంగ నిర్వహణలలో చురుకుగా పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. దాంతో ఈ హక్కు పౌరులలో విశేషమైన రాజకీయ పరిజ్ఞానాన్ని, ఆసక్తిని పెంపొందిస్తుంది. ఈ హక్కు ప్రజాస్వామ్య రాజ్యానికి ప్రధాన ప్రాతిపదికగా ఉంటుంది.

3. ప్రభుత్వ పదవులను చేపట్టే హక్కు (Right to Hold Public Offices) :
పౌరులు వివిధ రకాల ప్రభుత్వ పదవులను చేపట్టి, నిర్వహించేందుకు ఈ హక్కు అనేక అవకాశాలను కల్పిస్తుంది ఈ హక్కు ప్రకారం ఏ ఒక్క పౌరుడు ఇతరులతో పోల్చినచో ఎటువంటి ప్రత్యేకమైన సౌకర్యాలను కానీ, మినహాయింపులు కానీ పొందేందుకు వీలులేదు. ప్రభుత్వాధికారాన్ని ఎంతో హుందాగా నిర్వహించేందుకు ఈ హక్కు పౌరులకు సహాయకారిగా ఉంటుంది.

4. విజ్ఞాపన హక్కు (Right to Petition) :
పౌరులు తమ అవసరాలు లేదా సమస్యలను ప్రభుత్వ దృష్టికి విజ్ఞప్తుల ద్వారా తెచ్చేందుకు ఈ హక్కు దోహదపడుతుంది. ఆధునిక రాజ్యంలో ఈ హక్కు ఎంతో ప్రాధాన్యత గల రాజకీయ హక్కుగా పరిగణించబడింది.

ఈ హక్కు ద్వారా పౌరులు ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి, తగిన పరిష్కారాలను పొందుతారు. అలాగే ప్రభుత్వాధికారులు ప్రజా సమస్యలను తెలుసుకొని, వాటిని సకాలంలో పరిష్కరించేటట్లు ఈ హక్కు సహాయపడుతుంది.

5. విమర్శించే హక్కు (Right to Criticism) :
ఈ హక్కు ప్రభుత్వానికి సంబంధించిన అనేక విధానాలు, కార్యక్రమాలను విమర్శించేందుకు పౌరులకు అవకాశం ఇస్తుంది. అలాగే వివిధ స్థాయిలలో నాయకులు, పరిపాలన సిబ్బంది పాల్పడే అవకతవకలను బహిర్గతం చేసేందుకు ఇది తోడ్పడుతుంది.

అంతేకాకుండా కాలానుగుణంగా ప్రభుత్వం అనుసరించే విధానాలపై, పౌరులు సహేతుకమైన, నిర్మాణాత్మకమైన విమర్శలను చేసేందుకు అవకాశమిస్తుంది. ఈ హక్కు అంతిమంగా పరిపాలనాధికారులు, విధాన రూపకర్తలు తమ విద్యుక్త ధర్మాలను ఎంతో అప్రమత్తంగా, జాగ్రత్తగా నిర్వహించేటట్లు చూస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 2.
హక్కుల పరిరక్షణ అంశాలను గుర్తించండి.
జవాబు.
పరిచయం :
రాజనీతిశాస్త్ర అధ్యయనంలో హక్కుల భావనకు చాలా ప్రాముఖ్యత ఉంది. సామాజిక జీవనానికి హక్కులనేవి అత్యంత ఆవశ్యకమైనవి. సామాజిక సంక్షేమ సాధనగా హక్కులు పరిగణించబడినాయి. హక్కులను వినియోగించుకోవటం ద్వారానే రాజ్యంలోని పౌర వ్యక్తిత్వం వికసిస్తుంది.

సమాజంలోనూ, రాజ్యంలోనూ సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి హక్కులు అవసరమవుతాయి. రాజ్యం పౌరులకు ప్రసాదించే హక్కుల ద్వారానే దాని ఔన్నత్యం గుర్తించబడుతుందని హెచ్.జె. లాస్కీ పేర్కొన్నాడు. సాధారణంగా ప్రతి రాజ్యం తన పౌరులకు వివిధ రంగాలలో అనేక హక్కులను ప్రసాదిస్తుంది.

హక్కులనేవి రాజ్యం, సమాజంచేత గుర్తించబడే కనీస పరిస్థితులు, అవకాశాలుగా పరిగణించవచ్చు. వాటిని రాజ్యంలోని వివిధ చట్టాలు పరిరక్షిస్తాయి. ఆధునిక రాజ్యాలు తమ రాజ్యాంగం, చట్టాల ద్వారా పౌరుల వికాసానికి అనేక ఏర్పాట్లుగావించాయి. ఇక హక్కులు, బాధ్యతలు అనేవి వ్యక్తుల సంపూర్ణ వికాసానికి అత్యంత ఆవశ్యకమైనవి.

అర్థం : “హక్కు” అంటే “కలిగి ఉండటము” అని అర్థం. సమాజ సంక్షేమం కోసం, ప్రగతి కోసం వ్యక్తులందరూ పాటించవలసిన బాధ్యతల రూపమే హక్కులు. హక్కులు మానవునకు స్వేచ్ఛను ఇచ్చి, వికాసానికి తోడ్పడతాయి.

హక్కుల నిర్వచనాలు :
రాజనీతి శాస్త్రవేత్తలు హక్కు అనే పదాన్ని అనేక విధాలుగా నిర్వచించారు. వాటిలో కొన్నింటిని కింద వివరించడమైనది.

  1. ఎర్నెస్ట్ బార్కర్ : “వ్యక్తి మూర్తిమత్వ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన బాహ్యపరమైన పరిస్థితులే ” హక్కులు”.
  2. బొసాంకే : “సమాజం చేత గుర్తించబడి, రాజ్యంచేత అమలులో ఉంచబడే అధికారాలే హక్కులు”.
  3. టి.హెచ్. గ్రీన్: “ఉమ్మడి శ్రేయస్సుకు దోహదపడే వాటిని కోరేందుకు, గుర్తించేందుకు ఉండే అధికారాలే హక్కులు.” .
  4. హెచ్.జె. లాస్కి : “హక్కులనేవి మానవుల సామాజిక జీవనానికి అవసరమైనవి. అవి లేకుండా ఏ ఒక్కరూ సాధారణంగా అత్యుత్తమమైన వ్యక్తిగా రూపొందటం సాధ్యం కాదు.”

హక్కుల పరిరక్షణలు (Safeguards of Rights) :
హక్కులను రాజ్యం ప్రతిరక్షించినప్పుడే వ్యక్తులు వాటిని అనుభవించగలుగుతారు. ఈ సందర్భంలో కింది అంశాలు హక్కుల పరిరక్షణకు దోహదపడతాయి.

1. ప్రజాస్వామ్య పాలన (Democratic Rule) :
ప్రజాస్వామ్య పాలన ప్రజల హక్కులను పరిరక్షించుటలో ఎంతగానో కృషిచేస్తుంది. ఒక్క ప్రజాస్వామ్య రాజ్యాలలోనే తమ హక్కులను స్వేచ్ఛగా సంపూర్ణంగా అనుభవిస్తారు. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థ వారి హక్కులకు రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన నియమనిబంధనల ద్వారా రక్షణలు కల్పిస్తుంది.

2. లిఖిత, దృఢ రాజ్యాంగం (Written and Rigid Constitution) :
లిఖిత రాజ్యాంగం ప్రభుత్వ అధికారాలు, కర్తవ్యాలను స్పష్టంగా నిర్వచిస్తుంది. అలాగే ఇది ప్రభుత్వాధికారానికి గల వివిధ పరిమితులను వివరిస్తుంది. అంతేకాకుండా ప్రజల హక్కులకు హామీ ఇస్తుంది. ఈ రాజ్యాంగాన్ని చిన్న కారణాలతో పాలకులు, శాసనసభ్యులు సవరించేందుకు అనుమతించదు.

3. ప్రాథమిక హక్కులను పొందుపరచుట (Incorporation of Fundamental Rights) :
ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరచడం ద్వారా వ్యక్తుల హక్కులను ప్రభుత్వం అతిక్రమించకుండా చూడవచ్చు. ఇటువంటి ఏర్పాటు వ్యక్తుల హక్కులను ఎంతగానో కాపాడుతుంది.

4. అధికారాల వేర్పాటు (Separation of Powers) :
హక్కుల పరిరక్షణకు అధికారాల వేర్పాటు ఎంతో అవసరం. అధికారాలన్నీ ప్రభుత్వంలోని మూడు శాఖల మధ్య ఏర్పాటు చేసినప్పుడే వ్యక్తి స్వేచ్ఛ కాపాడబడుతుంది. అప్పుడు మాత్రమే ఒక శాఖ నియంతృత్వాన్ని వేరొక శాఖ నివారించగలుగుతుంది.

5. అధికారాల వికేంద్రీకరణ (Decentralisation of Powers) :
ప్రభుత్వాధికారాలు వికేంద్రీకృతం అయినప్పుడే వ్యక్తులు హక్కులను అనుభవిస్తారు. అందుకోసం అధికారాలన్నీ జాతీయ, ప్రాంతీయ, స్థానిక స్థాయిలలో వికేంద్రీకరణం కావాలి. అటువంటి ఏర్పాటు ప్రాదేశిక లేదా కర్తవ్యాల ప్రాతిపదికపై జరుగుతుంది.

6. సమన్యాయపాలన (Rule of Law) :
చట్టం ముందు అందరూ సమానులే అనే అర్థాన్ని సమన్యాయపాలన సూచిస్తుంది. అంతేకాకుండా పౌరులందరికీ చట్టాలు సమానంగా వర్తిస్తాయని దీని అర్థం. చట్టం పౌరుల మధ్య ప్రాంతం, కులం, మతం, వర్ణం, తెగ వంటి తారతమ్యాలను చూపదు. అప్పుడు మాత్రమే వ్యక్తులందరూ హక్కులను అనుభవిస్తారు.

7. స్వతంత్ర, నిష్పాక్షిక న్యాయశాఖ (Independent and Impartial Judiciary) :
వ్యక్తుల పరిరక్షణకు తోడ్పడే మరో ముఖ్య అంశమే స్వతంత్ర, నిష్పాక్షిక న్యాయశాఖ. ఉన్నత న్యాయస్థానాలలోని న్యాయమూర్తులు నిష్పక్షపాతంతో, స్వతంత్ర వైఖరితో తీర్పులను అందించాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియలో భాగంగా వారు వ్యక్తుల హక్కులను తక్షణమే పరిరక్షించేందుకై కొన్ని రిట్లను (Writs) మంజూరు చేస్తారు.

8. స్వతంత్ర పత్రికలు (Independent Press) :
వ్యక్తుల హక్కుల పరిరక్షణకు దోహదపడే మరొక అంశమే స్వతంత్ర పత్రికలు. స్వతంత్ర దృక్పథం గల పత్రికలు వార్తలు, అభిప్రాయాలను నిష్పక్షపాతంగా, రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు తెలియజేస్తాయి. ఈ విషయంలో రాజ్యం పత్రికలపై ఎటువంటి ఆంక్షలను విధించేందుకు లేదా పత్రికలను అడ్డుకునేందుకు ప్రయత్నించరాదు. అప్పుడు మాత్రమే వ్యక్తులు తమ హక్కులను సంపూర్ణంగా అనుభవిస్తారు.

9. సాంఘిక, ఆర్థిక సమానత్వాలు (Social and Economic Equalities) :
సాంఘిక, ఆర్థిక సమానత్వాలు అనేవి వ్యక్తులకు హక్కులను అనుభవించేందుకు ఎంతగానో అవసరమవుతాయి. రాజ్యంలో సాంఘిక, ఆర్థిక సమానత్వాలు నెలకొన్నప్పుడే వ్యక్తులు తమ హక్కులను సక్రమంగా, సంవర్థక రీతిలో అనుభవిస్తారు. కులతత్త్వం, మతతత్త్వం, భాషాతత్త్వం వంటి సాంఘిక అనర్థాలు, ఆర్థిక అసమానతలు, దోపిడీని పెంచినప్పుడు సాంఘిక, ఆర్థిక సమానత్వాలను సాధించలేము.

10. నిరంతర అప్రమత్తత (Eternal Vigilance) :
వ్యక్తుల హక్కులను పరిరక్షించటంలో నిరంతర అప్రమత్తత అనేది అత్యంత ముఖ్యమైన అంశంగా చెప్పవచ్చు. వ్యక్తులు ఎప్పటికప్పుడు ప్రభుత్వ విధానాలపట్ల అప్రమత్తతతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రభుత్వం కనక నియంతృత్వ ధోరణులను అనుసరిస్తే, వాటిని ప్రజాస్వామ్య, రాజ్యాంగ పద్ధతుల ద్వారా వ్యతిరేకించాలి.

వారు ఎట్టి పరిస్థితులలోనూ అధికారం కోసం ఆరాటపడే స్వార్థపరులైన నాయకులను ప్రోత్సహించరాదు. అంతేకాకుండా న్యాయసమీక్ష (Judicial Review), పునరాయనం (Recall), దృఢమైన ప్రతిపక్షం లాంటి ఇతర అంశాలు కూడా వ్యక్తుల హక్కులను పరిరక్షించేందుకు దోహదపడతాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 3.
మానవ హక్కులపై ఒక వ్యాసాన్ని రాయండి.
జవాబు.
భావం : మానవుల ప్రాథమిక జీవనానికి అత్యంత ఆవశ్యకమైనవే మానవ హక్కులు. మానవులందరూ ఈ ” హక్కులను కుల, మత, ప్రాంత, వర్ణ, వర్గ తారతమ్యాలు లేకుండా అనుభవిస్తారు. ప్రజాస్వామ్య రాజ్యాలలోని రాజ్యాంగ, సాధారణ చట్టాలు ఇటువంటి హక్కులను గుర్తిస్తాయి. అలాగే ఈ హక్కులను ప్రజలకు అందించేందుకై ప్రజాస్వామ్య రాజ్యాలలోని వివిధ ప్రభుత్వాలు అనేక చర్యలను తీసుకొంటాయి.

మానవ హక్కుల ఆవిర్భావం :
ఒకానొక సమయంలో ప్రాచీన, మధ్యయుగ సమాజాలలో ఎవరో కొన్ని వర్గాలు మాత్రమే మానవ హక్కులను అనుభవించేవారు. దాంతో మెజార్టీ ప్రజలు ఆ హక్కులను నోచుకోలేకపోయారు. వారు హక్కుల సాధనకై అవిశ్రాంతంగా ప్రయత్నించారు.

మానవ హక్కుల సాధనకై ప్రయత్నాలు జరిపిన వారిలో గ్రీకు పాలకులను మొదటిసారిగా పేర్కొనవచ్చు. గ్రీకు పాలకులు మానవ వ్యక్తిత్వ వికాసానికి ఆరోగ్యం, దేహదారుఢ్యం తప్పనిసరిగా ఉండాలని గుర్తించారు. అలాగే జాతి అభివృద్ధిలో మానవ హక్కులు అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తాయనే విషయాన్ని పేర్కొన్నారు. అయితే దురదృష్టం కొద్దీ కొందరు పాలకులు అణచివేత, స్వార్థబుద్ధి కారణంగా ప్రజలలో మతతత్త్వం బాగా వ్యాప్తి చెందింది. ఈ పరిస్థితులలో మానవ హక్కులు కనుమరుగయ్యాయి.

మానవ హక్కుల సాధనలో ఇంగ్లాండులోని మాగ్నా కార్టా (Magna Carta) అనేది మానవ హక్కుల సాధనలో చేసిన మొదటి ప్రయత్నంగా చరిత్రకారులు భావించారు. మాగ్నా కార్టా ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను వీలు కల్పించింది. చరిత్రకారులు దానిని బ్రిటీషు రాజ్యంగపు ‘బైబిల్’గా వర్ణించారు.

మానవ హక్కుల ఆశయాలు :

  1. ప్రజలందరికీ ఎటువంటి వివక్షత లేని స్వాతంత్ర్యాన్ని అందించటం.
  2. పేదరికం నుండి విముక్తి.
  3. వ్యక్తులలో నిబిడీకృతమై ఉన్న సామర్థ్యాలను వినియోగించుకొనే స్వేచ్ఛ.
  4. భయం నుండి విముక్తి.
  5. రక్షణ పొందే స్వేచ్ఛ.
  6. అన్యాయానికి వ్యతిరేకంగా స్వేచ్ఛ.
  7. వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వాతంత్య్రం.
  8. సంస్థలను ఏర్పరచుకొనే స్వేచ్ఛ.
  9. గౌరవప్రదంగా వ్యక్తి తన కార్యకలాపాలు నిర్వర్తించుకొనే స్వేచ్ఛ.
  10. దౌర్జన్యాన్ని నిరోధించి వ్యతిరేకించే స్వేచ్ఛ.

ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 1995 – 2005 దశకాన్ని అంతర్జాతీయ మానవ హక్కుల దశాబ్దిగా ప్రకటించింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా నివసించే ప్రజలందరికీ మానవ హక్కులను ప్రసాదించే ఉద్దేశంతో ఈ కాలంలో అనేక చర్యలను గైకొన్నది.

మానవ హక్కుల వర్గీకరణ :
మానవ హక్కులను స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి (1) పౌర, రాజకీయ హక్కులు (ii) సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక హక్కులు. సమాజంలో పౌరహక్కులు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి. జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు, వ్యక్తుల భద్రత హక్కు, బానిసత్వం లేదా వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందే హక్కు వంటి అనేక హక్కులు పౌరహక్కులలో పేర్కొనడమైంది.

చట్టం నుంచి సమానంగా రక్షణ పొందేహక్కు, బలవంతంగా నిర్భందించడం నుంచి రక్షణ పొందే హక్కు, నిష్పాక్షికంగా విచారణ పొందే హక్కు ఆస్తి హక్కు, వివాహపు హక్కు వంటి ఇతర హక్కులు కూడా పౌరహక్కులలో ఇమిడి ఉన్నాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
హక్కుల లక్షణాలేవి ?
జవాబు.
హక్కులు-నిర్వచనం :
“హక్కులనేవి మానవుల సామాజిక జీవనానికి అవసరమైనవి. అవి లేకుండా ఏ ఒక్కరూ సాధారణంగా అత్యుత్తమమైన వ్యక్తిగా రూపొందటం సాధ్యం కాదు” అని హెచ్.జె. లాస్కి పేర్కొన్నారు.

హక్కుల లక్షణాలు (Features of Rights) : హక్కులు కింద పేర్కొన్న లక్షణాలను కలిగి ఉంటాయి.

1. సమాజంలోనే సాధ్యం (Possible only in Society) :
హక్కులు సమాజంలోనే ఉద్భవిస్తాయి. అవి మానవుల సామాజిక జీవనానికి ప్రతీకగా ఉంటాయి. సమాజం వెలుపల అవి ఉండవు.

2. సామాజిక స్వభావం (Social Nature) :
హక్కులను వ్యక్తుల కోర్కెలుగా భావించవచ్చు. అటువంటి కోర్కెలు సమాజంలోనే నెరవేరుతాయి. రాజ్యం వాటిని గుర్తించి పెంపొందించేందుకు దోహదపడుతుంది. కాబట్టి హక్కులనేవి సామాజిక స్వభావమైనవని చెప్పవచ్చు.

3. ప్రకృతిసిద్ధమైనవి (Natural) :
హక్కులనేవి మానవుల సామాజిక ప్రవృత్తికి నిదర్శనంగా ఉంటాయి. ఈ విషయాన్ని సామాజిక ఒడంబడిక సిద్ధాంతకర్తలు ప్రకటించారు. వారి భావాలను ఆధునిక కాలంలో కొంతమేరకు ఆమోదించడమైనది.

4. రాజ్యంచే అమలై రక్షించబడటం (Enforced and Protected by state) :
హక్కులనేవి రాజ్యంచేత అమలుచేయబడి రక్షించబడతాయి. రాజ్యంలోని వివిధ ఉన్నత న్యాయసంస్థలు వాటికి సంరక్షకులుగా వ్యవహరిస్తాయి. వేరొక రకంగా చెప్పాలంటే ఉన్నత న్యాయస్థానాలు హక్కులను కాపాడతాయి. మరొక విషయం ఏమిటంటే హక్కులను ఒక్క ప్రజాస్వామ్య రాజ్యాలలోని పౌరులు మాత్రమే అనుభవిస్తారు.

5. నిరపేక్షమైనవి కావు (Not Absolute):
హక్కులు నిరపేక్షమైనవి కావు. వాటి వినియోగంపై ‘రాజ్యం, సమాజం కొన్ని ఆంక్షలను విధిస్తుంది. అటువంటి ఆంక్షలు సమాజంలో శాంతి భద్రతల నిర్వహణకు ఉద్దేశించినవి. ‘అంతేకాకుండా హక్కులనేవి సామాజిక శ్రేయస్సు, భద్రతలను పెంపొందించేందుకు దోహదపడతాయని చెప్పవచ్చు.

6. సంబంధిత బాధ్యతలు (Corresponding Responsibilities) :
హక్కులు, బాధ్యతలు ఒకదానికొకటి పరస్పర ఆధారాలుగా ఉంటాయి. ప్రతి హక్కు ఒక బాధ్యతను కలిగి ఉంటుంది. అందుచేత సమాజంలో నివసించే ప్రతి వ్యక్తి తనకు గల హక్కులనే తోటివారు కూడా కలిగి ఉంటారని గ్రహించాలి.

అట్లాగే తోటివారు కూడా వారి హక్కులను వినియోగించుకోవటంలో ప్రతి వ్యక్తికి తగిన సహకారాన్ని అందించాలి. హక్కులు లేని బాధ్యతలు లేదా బాధ్యతలు ‘లేని హక్కులు అనేవి నాగరిక సమాజంలో ఉండవు. హక్కులు, బాధ్యతలు రెండూ వ్యక్తుల ప్రశాంత సామాజిక జీవనానికి ఎంతగానో ఆవశ్యకమైనవి.

7. విశ్వవ్యాప్తమైనవి (Universal) :
హక్కులనేవి విశ్వవ్యాప్తమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి అందరికి వర్తిస్తాయి. వీటిని ప్రజలందరు ఎటువంటి తారతమ్యాలు లేకుండా అనుభవిస్తారు.

8. మార్పులకు అవకాశం (Scope for changes) :
హక్కులనేవి కాలానుగుణంగా ప్రజల అవసరాలను బట్టి మారుతుంటాయి. అట్లాగే దేశ కాలపరిస్థితులలో వచ్చే మార్పులనుబట్టి అభివృద్ధి చెందుతాయి. గతంలో లేని కొన్ని హక్కులు వర్తమాన కాలంలో ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులు వ్యక్తుల హక్కులపై విశేషమైన ప్రభావాన్ని చూపుతాయి.

9. రాజ్యం కంటే ముందుగా ఉండటం (Precede the State) :
చరిత్ర ఫలితాలే హక్కులు. హక్కులు కాలక్రమేణా ఒక క్రమానుగత రీతిలో ఆవిర్భవించాయని విశ్వసించారు. రాజ్యం ఆవిర్భావానికి ముందే హక్కులు ఉన్నాయి. అయితే ఆ తరువాత వాటిని రాజ్యం గుర్తించింది.

10. ఉమ్మడి శ్రేయస్సు (Common Good) :
హక్కులనేవి ఎల్లప్పుడూ ఉమ్మడి శ్రేయస్సును పెంపొందించేందుకై ఏర్పడి వికసించాయి. సమాజం, రాజ్యం చేత గుర్తింపు పొంది, ఉమ్మడి శ్రేయస్సును పెంపొందించే హక్కులను మాత్రమే వ్యక్తులు అనుభవిస్తారు. వ్యక్తులు సుఖ సౌభాగ్యవంతమైన జీవనాన్ని గడిపేందుకు హక్కులు అవసరమవుతాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 2.
రాజకీయ హక్కులను వివరించండి.
జవాబు.
ప్రజాస్వామ్య దేశాలలో ప్రభుత్వ వ్యవహారాలలో పౌరులు పాల్గొనటానికి అవకాశం కల్పించబడింది. ఈ అవకాశాలనే రాజకీయ హక్కులు అందురు. రాజకీయ హక్కులు ముఖ్యంగా 5 అవి :

1. ఓటు హక్కు (Right to Vote) :
ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలలో పౌరులు అనుభవించే అతి ముఖ్యమైన రాజకీయ హక్కు ఓటు హక్కు వయోజన పౌరులు ఈ హక్కును వివిధ శాసన నిర్మాణ సంస్థలలో తమ ప్రతినిధులను ఎన్నుకొనేందుకు శక్తివంతమైన ఆయుధంగా వినియోగిస్తారు.

ఈ హక్కు వారిని నిజమైన సార్వభౌములుగా రూపొందిస్తుంది. వయోజన పౌరులందరూ వర్ణం, పుట్టుక, భాష, తెగ, మతం, ప్రాంతం వంటి తారతమ్యాలు లేకుండా ఈ హక్కును కలిగి ఉంటారు. అయితే విదేశీయులు, మైనర్లకు ఈ హక్కు వర్తించదు.

2. ఎన్నికలలో అభ్యర్థిగా పోటీచేసే హక్కు (Right to Contest in Elections) :
రాజ్యంలో పౌరులు వివిధ శాసన నిర్మాణ సంస్థలకు అభ్యర్థులుగా పోటీచేసేందుకు ఈ హక్కు అధికారమిస్తుంది. రాజకీయ సామర్థ్యం ఆసక్తి, శక్తివంతమైన నాయకత్వం వంటి లక్షణాలు గల పౌరులు రాజ్యానికి సంబంధించిన రాజకీయ యంత్రాంగ నిర్వహణలలో చురుకుగా పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. దాంతో ఈ హక్కు పౌరులలో విశేషమైన రాజకీయ పరిజ్ఞానాన్ని, ఆసక్తిని పెంపొందిస్తుంది. ఈ హక్కు ప్రజాస్వామ్య రాజ్యానికి ప్రధాన ప్రాతిపదికగా ఉంటుంది.

3. ప్రభుత్వ పదవులను చేపట్టే హక్కు (Right to Hold Public Offices) :
పౌరులు వివిధ రకాల ప్రభుత్వ పదవులను చేపట్టి, నిర్వహించేందుకు ఈ హక్కు అనేక అవకాశాలను కల్పిస్తుంది. ఈ హక్కు ప్రకారం ఏ ఒక్క పౌరుడు ఇతరులతో పోల్చినచో ఎటువంటి ప్రత్యేకమైన సౌకర్యాలను కానీ, మినహాయింపులు కానీ పొందేందుకు వీలులేదు. ప్రభుత్వాధికారాన్ని ఎంతో హుందాగా నిర్వహించేందుకు ఈ హక్కు పౌరులకు సహాయకారిగా ఉంటుంది.

4. విజ్ఞాపన హక్కు (Right to Petition) :
పౌరులు తమ అవసరాలు లేదా సమస్యలను ప్రభుత్వ దృష్టికి విజ్ఞప్తుల ద్వారా తెచ్చేందుకు ఈ హక్కు దోహదపడుతుంది. ఆధునిక రాజ్యంలో ఈ హక్కు ఎంతో ప్రాధాన్యత గల రాజకీయ హక్కుగా పరిగణించబడింది.

ఈ హక్కు ద్వారా పౌరులు ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి, తగిన పరిష్కారాలను పొందుతారు. అలాగే ప్రభుత్వాధికారులు ప్రజా సమస్యలను తెలుసుకొని, వాటిని సకాలంలో పరిష్కరించేటట్లు ఈ హక్కు సహాయపడుతుంది.

5. విమర్శించే హక్కు (Right to Criticism) :
ఈ హక్కు ప్రభుత్వానికి సంబంధించిన అనేక విధానాలు, కార్యక్రమాలను విమర్శించేందుకు పౌరులకు అవకాశం ఇస్తుంది. అలాగే వివిధ్య స్థాయిలలో నాయకులు, పరిపాలన సిబ్బంది పాల్పడే అవకతవకలను బహిర్గతం చేసేందుకు ఇది తోడ్పడుతుంది.

అంతేకాకుండా కాలానుగుణంగా ప్రభుత్వం అనుసరించే విధానాలపై పౌరులు సహేతుకమైన, నిర్మాణాత్మకమైన విమర్శలను చేసేందుకు అవకాశమిస్తుంది. ఈ హక్కు అంతిమంగా పరిపాలనాధికారులు, విధాన రూపకర్తలు తమ విద్యుక్త ధర్మాలను ఎంతో అప్రమత్తంగా, జాగ్రత్తగా నిర్వహించేటట్లు చూస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 3.
ముఖ్యమైన కొన్ని పౌర, రాజకీయ హక్కులను వివరించండి.
జవాబు.
1. పౌర హక్కులు :
సామాజిక జీవనాన్ని సంతోషం, హుందాతనంతో గడిపేందుకు వ్యక్తులకు అవసరమైన కనీస పరిస్థితులను కల్పించేందుకు పౌర హక్కులను కల్పించడం జరిగింది. ఈ హక్కులు నాగరిక సమాజానికి అత్యంత ఆవశ్యకమైనవి. పౌరహక్కులు ప్రజాస్వామ్యం కల్పించిన ఒక బహుమతిగా భావించాలి. ఈ హక్కులను పౌరులందరికీ కల్పించడంతోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. పౌరులకు నాగరికమైన సామాజిక జీవనం కొనసాగించడానికి పౌర హక్కులు అవకాశాలను కల్పించాయి.

సమాజంలోని మానవులకు ఈ పౌర హక్కులు కల్పించడంతో మౌలికమైన అవసరాలు తీర్చినట్లవుతుంది. జీవించే హక్కు, స్వాతంత్ర్యపు హక్కు, మతహక్కు, ఆస్తిహక్కు, విద్యాహక్కు, సమానత్వపు హక్కు, కుటుంబ హక్కు వంటివి పౌరహక్కులలో కొన్నింటికి ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.

2. రాజకీయ హక్కులు :
ప్రజాస్వామ్యంలో రాజకీయ హక్కులను మౌలిక అవసరంగా పరిగణించవచ్చు. వాస్తవానికి ఈ హక్కుల సద్వినియోగం తీరుపైనే ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరు, విజయం ఆధారపడి ఉంటుంది. రాజకీయ సమాజం ఏర్పాటులో ఈ హక్కులు కీలకపాత్ర పోషిస్తాయి.

ఎందుకంటే ఈ హక్కులు ప్రభుత్వ వ్యవహారాలలో పౌరులు పాల్గొనేందుకు అనేక అవకాశాలను కల్పిస్తాయి. ఒక్క ప్రజాస్వామ్య రాజ్యంలో మాత్రమే ఈ హక్కులను పౌరులు సంపూర్ణంగా అనుభవిస్తారు. ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీచేసే హక్కు, ప్రభుత్వ పదవులు చేపట్టే హక్కు, విజ్ఞాపన. హక్కు, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మొదలైనవి రాజకీయ హక్కులకు ఉదాహరణలుగా చెప్పవచ్చు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 4.
మానవ హక్కుల వర్గీకరణ, లక్ష్యాలను రాయండి.
జవాబు.
మానవ హక్కుల ఆశయాలు (Objectives of Human Rights): మానవ హక్కుల ఆశయాలను కింది విధంగా పేర్కొనవచ్చు.

  1. ప్రజలందరికీ ఎటువంటి వివక్షత లేని స్వాతంత్ర్యాన్ని అందించటం.
  2. పేదరికం నుండి విముక్తి.
  3. వ్యక్తులలో నిబిడీకృతమై ఉన్న సామర్థ్యాలను వినియోగించుకొనే స్వేచ
  4. భయం నుండి విముక్తి.
  5. రక్షణను పొందే స్వేచ్ఛ.
  6. అన్యాయానికి వ్యతిరేకంగా స్వేచ్ఛ.
  7. వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వాతంత్య్రం.
  8. సంస్థలను ఏర్పరచుకొనే స్వేచ్ఛ.
  9. గౌరవప్రదంగా వ్యక్తి తన కార్యకలాపాలు నిర్వర్తించుకొనే స్వేచ్ఛ.
  10. దౌర్జన్యాన్ని నిరోధించి వ్యతిరేకించే స్వేచ్ఛ.

ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 1995-2005 దశకాన్ని అంతర్జాతీయ మానవ హక్కుల దశాబ్దిగా ప్రకటించింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా నివసించే ప్రజలందరికీ మానవ హక్కులను ప్రసాదించే ఉద్దేశంతో ఈ కాలంలో అనేక చర్యలను గైకొన్నది.

మానవ హక్కుల వర్గీకరణ :
మానవ హక్కులను స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి :

  1. పౌర, రాజకీయ హక్కులు
  2. సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక హక్కులు.

1.A. పౌరహక్కులు : సమాజంలో పౌరహక్కులు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి. పౌరహక్కులకు ఉదాహరణలు.

  1. జీవించే హక్కు
  2. స్వేచ్ఛ హక్కు
  3. వ్యక్తుల భద్రత హక్కు.
  4. వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందే హక్కు
  5. చట్టం నుంచి సమానంగా రక్షణ పొందే హక్కు
  6. బలవంతంగా నిర్భందించడం నుంచి రక్షణ పొందే హక్కు
  7. నిష్పాక్షికంగా విచారణ పొందే హక్కు
  8. ఆస్తి హక్కు
  9. వివాహపు హక్కు
  10.  వాక్ స్వాతంత్య్రపు హక్కు.
  11. భావ ప్రకటన హక్కు
  12. సంస్థలను, సంఘాలను స్థాపించుకునే హక్కు
  13. సభలు, సమావేశాలు నిర్వహించుకునే హక్కు
  14. స్వేచ్ఛగా సంచరించే హక్కు.

1.B. రాజకీయ హక్కులు :

  1. ఓటు హక్కు
  2. ఎన్నికలలో పోటీచేసే హక్కు
  3.  అధికారం పొందే హక్కు
  4. విమర్శించే హక్కు
  5. విజ్ఞాపన హక్కు

2.A. సాంఘిక హక్కులు:

  1.  విద్యా హక్కు
  2. ఆరోగ్య హక్కు
  3. వినోదపు హక్కు మొదలైనవి

2.B. ఆర్థిక హక్కులు :

  1. పని హక్కు
  2. సమానమైన పనికి సమానమైన వేతనం పొందే హక్కు
  3. కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు
  4. సంతృప్తికరమైన జీవనస్థాయిని కలిగి ఉండే హక్కు

2.C. సాంస్కృతిక హక్కులు:

  1. నాగరికత
  2. కళలు
  3. సంస్కృతిని గౌరవించడం వంటి అంశాలు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 5.
వివిధ రకాలైన విధులను చర్చించండి.
జవాబు.
బాధ్యతలు :
సమాజంలో నివశించే వ్యక్తులు ఇతర వ్యక్తుల పట్ల నిర్వర్తించే అంశాలనే బాధ్యతలు అంటారు. బాధ్యతలు అనేవి ‘ఇతరుల పట్ల ఒక వ్యక్తి కలిగి ఉండే కర్తవ్యం, విధి అని అర్థం.

బాధ్యతల రకాలు (Types of Responsibilities) :
బాధ్యతలు స్థూలంగా రెండు రకాలుగా చెప్పవచ్చు. అవి : (i) నైతిక బాధ్యతలు (ii) చట్టబద్ధమైన బాధ్యతలు. ఈ రెండింటిని కింది విధంగా వివరించవచ్చు.

(i) నైతిక బాధ్యతలు (Moral Responsibilities) :
నైతిక బాధ్యతలు అనేవి నైతిక అంశాల ప్రాతిపదికపై వ్యక్తులు నిర్వహించాల్సిన కర్తవ్యాలను సూచిస్తాయి. వీటకి రాజ్యంచేత రూపొందించబడే చట్టాలు మద్దతు ఇవ్వవు, బలపరచవు. ఇవి ప్రజల నైతిక విశ్వాశాలపై ఆధారపడి రూపొందుతాయి.

సమాజంలోని కొన్ని ఆచార సాంప్రదాయాలు వాడుకల ఆధారంగా ఇవి ఏర్పడతాయి. వీటి ఉల్లంఘన ఎటువంటి శిక్షకు దారితీయదు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం, అస్వస్థులకు సహాయపడటంలాంటివి నైతిక బాధ్యతలకు కొన్ని ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.

(ii) చట్టబద్ధమైన బాధ్యతలు (Legal Responsibilities) :
చట్టబద్ధమైన బాధ్యతలనేవి న్యాయస్థానాలు, చట్టాల మద్దతుతో అమలులోకి వస్తాయి. వీటికి శాసనాత్మక ప్రాముఖ్యత ఉంటుంది. ఇవి ఎంతో స్పష్టమైనవి, ఖచ్చితమైనవి. ఇవి నిర్బంధమైన, శిక్షాత్మకమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి.

కాబట్టి వీటిని ఉల్లంఘించినవారు శిక్షకు పాత్రులవుతారు. రాజ్య చట్టాలకు విధేయత చూపటం, పన్నులు చెల్లించటం, శాంతి భద్రతల నిర్వహణలలో అధికారులకు సహాయం అందించటంలాంటివి చట్టబద్దమైన బాధ్యతలలో ముఖ్యమైనవి.

చట్టబద్ధమైన బాధ్యతలు మరలా రెండు రకాలుగా వర్గీకరించబడినాయి. అవి:

  1. సంవర్థక బాధ్యతలు
  2. సంరక్షక బాధ్యతలు.

1. సంవర్థక బాధ్యతలు (Positive Responsibilities) :
సంవర్థక బాధ్యతలనేవి సమాజ ప్రగతి, సంక్షేమాల సాధన, పటిష్టతలకై ఉద్దేశించబడినవి. రాజ్య చట్టాల పట్ల విధేయత, దేశ రక్షణ, పన్నుల చెల్లింపులాంటివి ఈ రకమైన బాధ్యతలకు ఉదాహరణలు చెప్పవచ్చు. ఇటువంటి బాధ్యతలు రాజ్య ఆశయాలను నెరవేర్చడంలో ప్రభుత్వానికి ప్రజలు సహకారాన్ని అందించేందుకు ఉద్దేశించినాయి.

2. సంరక్షక బాధ్యతలు (Negative Responsibilities) :
చట్టం నిషేధించిన కార్యక్రమాలను చేపట్టకుండా వ్యక్తులు దూరంగా ఉండేందుకు పేర్కొన్నవే సంరక్షక బాధ్యతలు. ఈ రకమైన బాధ్యతలు ప్రజలను కొన్ని నిర్ధిష్టమైన కార్యక్రమాలలో పాల్గొనకుండా ఉంచుతాయి. రాజ్యం తరపున ప్రభుత్వం ఈ సందర్భంలో కొన్ని నియమ నిబంధనలను రూపొందించి అమలుచేస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 6.
పౌర, రాజకీయ హక్కుల మధ్య తేడాలను వ్రాయండి.
జవాబు.
1. పౌర హక్కులు :
సామాజిక జీవనాన్ని సంతోషం, హుందాతనంతో గడిపేందుకు వ్యక్తులకు అవసరమైన కనీస పరిస్థితులను కల్పించేందుకు పౌర హక్కులను కల్పించడం జరిగింది. ఈ హక్కులు నాగరిక సమాజానికి అత్యంత ఆవశ్యకమైనవి. పౌరహక్కులు ప్రజాస్వామ్యం కల్పించిన ఒక బహుమతిగా భావించాలి. ఈ హక్కులను పౌరులందరికీ కల్పించడంతోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. పౌరులకు నాగరికమైన సామాజిక జీవనం కొనసాగించడానికి పౌర హక్కులు అవకాశాలను కల్పించాయి.

సమాజంలోని మానవులకు ఈ పౌర హక్కులు కల్పించడంతో మౌలికమైన అవసరాలు తీర్చినట్లవుతుంది. జీవించే హక్కు, స్వాతంత్ర్యపు హక్కు, మతహక్కు, ఆస్తిహక్కు, విద్యాహక్కు, సమానత్వపు హక్కు, కుటుంబ హక్కు వంటివి పౌరహక్కులలో కొన్నింటికి ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.

2. రాజకీయ హక్కులు :
ప్రజాస్వామ్యంలో రాజకీయ హక్కులను మౌలిక అవసరంగా పరిగణించవచ్చు. వాస్తవానికి ఈ హక్కుల సద్వినియోగం తీరుపైనే ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరు, విజయం ఆధారపడి ఉంటుంది. రాజకీయ సమాజం ఏర్పాటులో ఈ హక్కులు కీలకపాత్ర పోషిస్తాయి.

ఎందుకంటే ఈ హక్కులు ప్రభుత్వ వ్యవహారాలలో పౌరులు పాల్గొనేందుకు అనేక అవకాశాలను కల్పిస్తాయి. ఒక్క ప్రజాస్వామ్య రాజ్యంలో మాత్రమే ఈ హక్కులను పౌరులు సంపూర్ణంగా అనుభవిస్తారు. ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీచేసే హక్కు, ప్రభుత్వ పదవులు చేపట్టే హక్కు, విజ్ఞాపన. హక్కు, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మొదలైనవి రాజకీయ హక్కులకు ఉదాహరణలుగా చెప్పవచ్చు.

ప్రశ్న 7.
హక్కులు, విధుల మధ్య సంబంధాన్ని తెల్పండి.
జవాబు.

హక్కులువిధులు
నిర్వచనంరాజ్యం ప్రజలకందించిన అధికారాలు, హక్కులు.ఓ వ్యక్తి అనుభవించే హక్కు ఇతరుల పట్ల అతను నిర్వహించవలసిన విధి అవుతుంది.
చట్టంసాధారణంగా న్యాయస్థానాల ద్వారా హక్కులకు రక్షణ కలిగేలా రాజ్యం చూస్తుంది లేదా సవాలు చేయవచ్చు.పౌర విధులను న్యాయస్థానాల ద్వారా సవాలు చేసే వీలు కాదు.
ఆధారంగావ్యక్తి అనుభవించే అధికారాలు హక్కులు.వ్యక్తిగతంగా విధులు నిర్వర్తించడం, జవాబుదారీతనం ఆధారంగా విధులు ఉంటాయి.

 

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
హక్కులను నిర్వచించండి.
జవాబు.

  1. “వ్యక్తి మూర్తిమత్వ, సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన బాహ్యపరమైన పరిస్థితులే హక్కులు” అని బార్కర్ పేర్కొన్నాడు.
  2. “హక్కులనేవి మానవుల సామాజిక జీవనానికి అవసరమైనవి. అవి లేకుండా… ఏ ఒక్కరూ సాధారణంగా, అత్యుత్తమమైన వ్యక్తిగా రూపొందటం సాధ్యం కాదు” అని హెచ్.జె. లాస్కి పేర్కొన్నాడు.

ప్రశ్న 2.
హక్కులను ‘వర్గీకరించండి.
జవాబు.
హక్కులను విస్తృత ప్రాతిపదికపై మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి :

  1. సహజ హక్కులు
  2. నైతిక హక్కులు
  3. చట్టబద్ధమైన హక్కులు.

చట్టబద్ధమైన హక్కులు మరలా మూడు రకాలుగా వర్గీకరింపబడినాయి. అవి :

  1.  పౌర హక్కులు
  2. రాజకీయ హక్కులు
  3. ఆర్థిక హక్కులు.

ప్రశ్న 3.
పౌర హక్కులేవి ?
జవాబు.
నాగరిక జీవనాన్ని గడపటానికి అవసరమయ్యే హక్కులనే పౌరహక్కులు అంటారు. అన్ని రాజ్యాలు తమ ప్రజలకు ఈ హక్కులను ఇస్తున్నాయి. ఈ హక్కులపై అనేక మినహాయింపులు ఉంటాయి. ముఖ్యమైన పౌరహక్కులు ఏమనగా :

  1. జీవించే హక్కు
  2. స్వేచ్ఛ హక్కు
  3. సమానత్వపు హక్కు
  4. ఆస్తి హక్కు
  5. కుటుంబపు హక్కు
  6. విద్యా హక్కు మొదలైనవి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 4.
సహజ హక్కులు.
జవాబు.
మానవులు జన్మతః అనుభవించే హక్కులే సహజ హక్కులుగా పరిగణించడమైనది. నాగరిక సమాజ ఆవిర్భావానికి ముందే ఈ హక్కులను మానవులు అనుభవించారు. సమాజం, రాజ్యం వీటిని గుర్తించి, గౌరవించాయి. సహజ హక్కులు సిద్ధాంత ప్రతిపాదకుడైన జాన్ లాక్ హక్కులనేవి సమాజం, రాజకీయ వ్యవస్థలు ఏర్పడక ముందే ఉన్నాయన్నాడు.

జీవించే హక్కు, స్వాతంత్ర్యాన్ని అనుభవించే హక్కు, ఆస్తి హక్కు వంటివి ప్రధానమైన సహజ హక్కులకు ఉదాహరణలుగా పేర్కొన్నాడు. మానవులకు గల ఈ హక్కులను రాజ్యం తిరస్కరించరాదన్నాడు.

ప్రశ్న 5.
నైతిక హక్కులు.
జవాబు.
నైతిక హక్కులు సమాజంలోని నైతిక సూత్రాలు ఆధారంగా రూపొందాయి. సమాజంలో నివసించే వ్యక్తులకు నైతికపరమైన అవగాహనను కలిగించేందుకు ఈ రకమైన హక్కులను ఇవ్వటమైనది. సమాజంలోని నైతిక సూత్రాలే ఇటువంటి హక్కులకు ప్రాతిపదికగా ఉన్నాయి.

ప్రజల ఆచారాలు, సాంప్రదాయాలు, వాడుకలు కూడా వీటికి ఆధారంగా ఉంటాయి. ఇవి ప్రజల అంతరాత్మకు సంబంధించినవి. పౌర సమాజంలోని వ్యక్తులు వీటిని అనుభవిస్తారు. వీటికి చట్టపరమైన మద్దతు లేనప్పటికి సమాజం వీటిని బలపరుస్తుంది. అందుచేత వీటి ఉల్లంఘన ఏ రకమైన శిక్షకు దారితీయదు.

ప్రశ్న 6.
రాజకీయ హక్కులేవి ?
జవాబు.
రాజ్యము, ప్రభుత్వము యొక్క కార్యకలాపాలలో పాల్గొనేందుకై ప్రజలకు పూర్తి అవకాశాలను కల్పించే హక్కులనే రాజకీయ హక్కులని అంటారు. ఉదాహరణకు ఓటు హక్కు, ఎన్నికలలో అభ్యర్థిగా పోటీచేసే హక్కు, ప్రభుత్వ పదవులు చేపట్టే హక్కు, విజ్ఞాపన హక్కు, విమర్శించే హక్కు మొదలగునవి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 7.
మానవ హక్కుల లక్ష్యాలను తెల్పండి.
జవాబు.
మానవ హక్కులు కింది ఆశయాలను కలిగి ఉంటాయి.

  1. ప్రజలందరికీ ఎటువంటి వివక్షత లేని స్వాతంత్ర్యాన్ని అందించటం.
  2. పేదరికం నుండి విముక్తి.
  3. వ్యక్తులలో నిబిడీకృతమై ఉన్న సామర్థ్యాలను వినియోగించుకొనే స్వేచ్ఛ.
  4. భయం నుండి విముక్తి.

ప్రశ్న 8.
మానవ హక్కులు ఎన్ని రకాలు, అవి ఏవి ?
జవాబు.
మానవ హక్కులను స్థూలంగా రెండు రకములుగా వర్గీకరించవచ్చు. అవి 1) పౌర, రాజకీయ హక్కులు 2) సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక హక్కులు.

ప్రశ్న 9.
మానవ హక్కుల ప్రాముఖ్యత.
జవాబు.
మానవుల ప్రాథమిక జీవనానికి అత్యంత ఆవశ్యకమైనవే మానవ హక్కులు. మానవులందరూ ఈ హక్కులను కుల, మత, ప్రాంత, వర్గ, వర్ణ తారతమ్యం లేకుండా అనుభవిస్తారు. మానవ హక్కుల సాధనలో ఇంగ్లాండులోని ‘మాగ్నా కార్టా’ అనేది మొదటి ప్రయత్నంగా చెప్పవచ్చు. ఐక్యరాజ్యసమితి కృషి వలన మానవ హక్కులను ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలో ప్రజలు అనుభవిస్తున్నారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 10.
విధులు వర్గీకరణ.
జవాబు.
బాధ్యతలను స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి

  • నైతిక బాధ్యతలు
  • చట్టబద్ధమైన బాధ్యతలు.

చట్టబద్ధమైన బాధ్యతలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి

  • సంవర్థక బాధ్యతలు
  • సంరక్షక బాధ్యతలు.

ప్రశ్న 11.
నైతిక బాధ్యతలు.
జవాబు.
నైతిక బాధ్యతలు నైతిక అంశాల ప్రాతిపదికపై వ్యక్తులు నిర్వహించాల్సిన కర్తవ్యాలను సూచిస్తాయి. వీటికి చట్టపరమైన ఆంక్షలు ఉండవు. ఇవి ప్రజల నైతిక విశ్వాసాలపై ఆధారపడి రూపొందుతాయి. సమాజంలోని ఆచారాలు, సాంప్రదాయాలు, వాడుక పద్ధతుల ఆధారంగా ఇవి ఏర్పడతాయి. వీటికి ఉదాహరణ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం, అస్వస్థులకు సహాయపడటం మొదలైనవి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 12.
కొన్ని ముఖ్య ఆర్థిక హక్కులను పేర్కొనండి.
జవాబు.
ఆర్థిక హక్కులు :
వ్యక్తులు తమ జీవనభృతికి సహేతుకమైన, చట్టబద్ధమైన మార్గాలద్వారా సంపాదించుకొనేందుకు ఈ హక్కులు అవకాశం కల్పిస్తాయి. అట్లాగే ఇవి వ్యక్తుల దైనందిన అవసరాలకు తోడ్పడుతాయి. హక్కులు వ్యక్తులకు ఆర్థిక భద్రత కల్పిస్తాయి. వర్ధమాన శతాబ్దంలోని (21వ శతాబ్దం) ప్రపంచ దేశాలన్నింటిలో ఈ హక్కులకు ప్రాచుర్యం లభించింది.

కనీస వేతనాన్ని పొందే హక్కు, పనిహక్కు, విశ్రాంతిని పొందే హక్కు, పనిచేసే ప్రదేశాలలో కనీస సదుపాయాలను పొందే హక్కు, కార్మిక సంఘాలను ఏర్పరచుకొనే హక్కు, వృద్ధాప్యం మరియు అంగవైకల్యం నుంచి ఉపశమనం పొందే హక్కు మొదలైనవి ఆర్థిక హక్కులకు ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.

TS Inter 1st Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 5th Lesson రాజనీతి భావజాలాలు Textbook Questions and Answers.

TS Inter 1st Year Political Science Study Material 5th Lesson రాజనీతి భావజాలాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
వ్యక్తి శ్రేయోవాదం అంటే ఏమిటి ? వివరించండి.
జవాబు.
అర్థం :
వ్యక్తి శ్రేయోవాదం ప్రకారం రాజ్యం వ్యక్తుల వ్యక్తిగత విషయాలకు సంబంధించి వారి అభీష్టానికే వదిలేయాలంటుంది. ఈ సిద్ధాంతాన్ని జోక్యరహిత సిద్ధాంతం (Laissez Fair theory) అని కూడా అంటారు. Laissez Fair అనేది ఫ్రెంచ్ పదం.

దాని అర్థం ‘ఓంటరిగా వదిలేయ్’ (Leave alone), అంటే సాంఘిక జీవనంలో వ్యక్తే కేంద్ర బిందువు. ఈ సిద్ధాంతాన్ననుసరించి వ్యక్తికి వీలైనంత ఎక్కువ స్వేచ్ఛనివ్వాలి. రాజ్యం వీలైనంత తక్కువ జోక్యం’ కలిగి ఉండాలి. అంటే రాజ్యం వ్యక్తులను సమర్థించాలేగాని నియంత్రించకూడదు.

వ్యక్తి శ్రేయోవాదుల అభిప్రాయంలో “రాజ్యం ఆవశ్యకమైన దయ్యం” లాంటిది. రాజ్యం ఎందుకు అవసరమంటే వ్యక్తులను హింస నుంచి, మోసాల నుంచి కాపాడటానికి అవసరమని వ్యక్తి శ్రేయోవాదుల అభిప్రాయం. ఇది ఎందుకు దయ్యం లాంటిదంటే వ్యక్తుల స్వాతంత్ర్యాన్ని అడ్డుకుంటుంది. కాబట్టి, అందువల్ల వ్యక్తుల వ్యక్తిగత విషయంలో ఎంత తక్కువగా జోక్యం చేసుకుంటే అంతమంచిది.

రాజ్యం కింద తెలిపిన పరిమిత విధులను నిర్వహిస్తుంది.

  1. వ్యక్తులకు రక్షణ కల్పించటం విదేశీ దురాక్రమణల నుంచి కాపాడడం.
  2. ఒక వ్యక్తికి మరో వ్యక్తి నుంచి రక్షణ కల్పించడం.
  3. వ్యక్తుల ఆస్తులకు దోపిడి దొంగల నుంచి, విధ్వంసాల నుంచి రక్షణ కల్పించడం.
  4. తప్పుడు ఒప్పందాల నుంచి ఒప్పంద ఉల్లంఘనల నుంచి వ్యక్తులను కాపాడడం.

సిద్ధాంతం పుట్టుక – అభివృద్ధి:
18వ శతాబ్దం నాటికి యూరప్ లో నిరపేక్ష నియంతృత్వ, రాజరిక ప్రభుత్వాలు ఆచరణలో ఉండేవి. యూరప్కు చెందిన సామాజిక ఒడంబడిక సిద్ధాంతకర్తలు రాజనీతి పండితులైన జాన్లాక్, రూసో వంటి వారు వ్యక్తి స్వేచ్ఛలకు సంబంధించి వివరణలిచ్చారు. ఆ తరువాత 19వ శతాబ్దంలో వ్యక్తి శ్రేయోవాదానికి ఒక సంపూర్ణ రూపం వచ్చింది.

ఈ సిద్ధాంతం ఫ్రాన్స్లో బాగా వేళ్ళూనుకొని అటు పిమ్మట యూరప్ అంతటా విస్తరించింది. దీనిని ఆడమ్ స్మిత్, ఇతర సంప్రదాయ ఆర్థికవేత్తలు అభివృద్ధి చేశారు. అయితే జె.ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్లు దీనిని ఒక విధానంగాను రాజకీయ సిద్ధాంతంగానూ తీర్చిదిద్దారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

వ్యక్తిశ్రేయోవాదాన్ని పలు రకాలుగా వివరించవచ్చు.

నైతిక వాదన :
జె.ఎస్.మిల్ అభిప్రాయం ప్రకారం వ్యక్తుల విషయంలో రాజ్యం జోక్యం వారి అభీష్టాలను, అభివృద్ధిని నిరోధిస్తుంది. వ్యక్తులు స్వతహాగా నిర్వహించే బాధ్యతలను రాజ్యం తన భుజస్కందాల మీద వేసుకోవడం వల్ల వ్యక్తులు తమ బాధ్యతలను మరచిపోవడమే కాకుండా తమకు తామే కాకుండా పోతారు. దాని పర్యవసానంగా వ్యక్తులు నిస్సారంగా, నిస్సత్తువగా తయారౌతారు.

ఆర్థికవాదన :
వ్యక్తి శ్రేయోవాదానికి మద్దతుగా ఆడమస్మిత్ వాదనను లేవనెత్తాడు. ఆయన అభిప్రాయంలో ప్రతి వ్యక్తి తన అభీష్టం మేరకు శక్తివంచన లేకుండా తన అభివృద్ధికై పాటుపడతాడు. ఒకరకంగా ఆడమస్మిత్ వ్యక్తుల స్వప్రయోజనాలను గురించి ప్రజ్ఞావంతమైన వివరణ ఇచ్చాడని చెప్పవచ్చు.

వ్యక్తుల వ్యాపార, వాణిజ్య పరిశ్రమలకు సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలలో రాజ్యం ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోరాదని స్మిత్ గట్టిగా వాదించాడు. వ్యక్తులకు స్వేచ్ఛ ఇవ్వటంవల్ల స్వచ్ఛందంగా తమ స్వంత శక్తి సామర్థ్యాలను వినియోగించి అభివృద్ధి చెందుతారు.

కాబట్టి “జోక్యరహిత” (లేజాఫెయిర్) విధానంలో వ్యక్తుల అవసరంకంటే సమాజ అవసరమే ఎక్కువగా ఉందని వీరి వాదన. ఈ సిద్ధాంతం 18వ శతాబ్దపు చివరిభాగం 19వ శతాబ్దపు మొదటి దశలో ఇంగ్లాండులో పారిశ్రామిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడింది.

జీవైకవాదం :
హార్బర్ట్ స్పెన్సర్ అనే శాస్త్రవేత్త వ్యక్తి శ్రేయోవాదాన్ని సమర్థించే ఉద్దేశంతో జీవైక వాదనను ముందుకు తెచ్చాడు. ఇతని అభిప్రాయంలో ప్రాణికోటిలో ఏదైతే నిదొక్కుకోగలుగుతుందో ఆ జీవి మాత్రమే మనుగడను కొనసాగించగలుగుతుంది. ఆ విధంగా సమాజంలోని వ్యక్తులు స్వేచ్ఛాయుత పోటీలో నిలబడగలిగే వారే తమ మనుగడను కొనసాగించగలరు.

సహజ న్యాయం ప్రకారం మనుగడకు వారు మాత్రమే సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కాగలుగుతారు. రాజ్యం చేయగలిగిందల్లా స్వేచ్ఛాయుత పోటీలో వ్యక్తులకు అనుమతినివ్వటం. పేదలకు, వృద్ధులకు, రోగిష్ఠులకు చేయవలసిన అవసరం రాజ్యానికి ఎంతమాత్రం లేదని వ్యక్తి శ్రేయోవాదుల అభిప్రాయం.

అనుభవిక వాదం :
ఇప్పటివరకు మనం అనుభవంలో చూస్తున్నదేమంటే, ఎక్కడైనా, ఎప్పుడైనా రాజ్యం పరిశ్రమలను పర్యవేక్షించి నియంత్రిస్తుందో అక్కడ ఫలితాలను వెల్లడించడంలో జాప్యం కలుగుతుంది. అదే విధంగా అసమర్ధత, వస్తువులు వ్యర్థంకావటం జరుగుతుంది.

ఎప్పుడైతే రాజ్యం ప్రజాసమూహాల సాంఘిక, ఆర్థిక జీవన విధానాన్ని నియంత్రించటం లేదా పర్యవేక్షించటానికి చేసే ప్రయత్నాలన్నీ ఘోరంగా విఫలమవుతున్నాయి. అంతేకాదు, రాజ్యనిర్వహణ అంటేనే ఉద్యోగుల నిర్లక్ష్యం, అనవసరపు జాప్యం, ప్రతికూల ఆర్థిక విధానం, లంచగొండితనం మొదలైనవి ఉంటాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

ప్రశ్న 2.
ఉదారవాదం అంటే ఏమిటి ? దాని ప్రధాన అంశాలను తెలపండి.
జవాబు.
ఉదారవాదం చాలా విశాలమైన సిద్ధాంతం, వ్యక్తి శ్రేయోవాదం, ఉపయోగితావాదం, సంక్షేమ రాజ్యభావన మొదలైనవి దీనిలో అంతర్భాగమైనవే. వ్యక్తి శ్రేయోవాదాన్ని సాంప్రదాయిక ఉదారవాదంలో భాగంగానే చూస్తారు. వ్యక్తి శ్రేయోవాదం ఉద్దేశంలో వ్యక్తి చాలా హేతుబద్ధమైన జీవి.

తనకు కావల్సినవన్నీ సమకూర్చుకునే సామర్థ్యం ఉన్నవాడు కాబట్టి రాజ్యం కేవలం తనకు రక్షణ కవచంగా ఉంటే చాలు అని భావిస్తాడు. దీన్నే సంప్రదాయ ఉదారవాదం అంటారు. ఉదారవాదం రెండు రకాలు, అవి : సాంప్రదాయిక ఉదారవాదం మొదటిదికాగా ఆధునిక ఉదారవాదం రెండవది.

ఆధునిక ఉదారవాదం 19వ శాతాబ్దపు ఉదారవాదానికి భిన్నమైనది. 20వ శతాబ్దంలో ఉదారవాదం ఎంతో పరిణతి చెందింది. ఎందుకంటే మధ్యతరగతి వర్గ సిద్ధాంతం నుంచి ఒక జన బాహుళ్య సిద్ధాంతంగా మార్పు చెందింది. ముఖ్యంగా టి. హెచ్, గ్రీస్ వివరించిన నైతిక కోణాన్ని తనలో ఇముడ్చుకొని ఆధునిక ఉదారవాదంగా పరిణతి చెందింది.

అదే విధంగా మరికొంత మంది శాస్త్రవేత్తలైన హాబ్ హౌస్, హెచ్.జె. లాస్కీ వంటివారి అభిప్రాయాలతో ప్రభావితమై 20వ శతాబ్దపు అర్ధభాగంలో వ్యక్తుల ప్రయోజనాలను కాపాడేవిధంగా సానుకూల వైఖరిని ఏర్పరచుకొని పాజిటివ్ ఉదారవాదం లేదా ఆధునిక ఉదారవాదంగా గుర్తింపు పొందింది.

అర్థం, నిర్వచనాలు :
ఎంతోమంది అభిప్రాయాలతో అనేక పరిణామాల మధ్య మూడు శతాబ్దాలపాటు పరిణామం చెందిన ఉదారవాదాన్ని నిర్దిష్టంగా నిర్వచించటం చాలా కష్టం. సాంప్రదాయక వైఖరి ప్రకారం ఉదారవాదం వ్యక్తి స్వేచ్ఛలను కాపాడటం, ప్రజాస్వామిక సంస్థల స్థాపన, స్వేచ్ఛా ఆర్థిక విధానం లక్షణాలను కలిగి ఉండేది. ఆధునిక ఉదారవాదం ప్రకారం వ్యక్తి వికాసానికి కావాల్సినంత రక్షణను కల్పిస్తూ సానుకూల వైఖరిని కలిగి ఉంది.

వెబ్స్టర్ నిఘంటువు ప్రకారం వ్యక్తుల హక్కులను, స్వేచ్ఛలను రాజకీయ, ఆర్థిక, ఉద్యోగస్వామ్య ఆధిపత్యాల నుంచి కాపాడే సిద్ధాంతమే ఉదారవాదం. మరో విధంగా చెప్పాలంటే ప్రభుత్వాన్ని ప్రగతిశీలమైన వ్యవస్థగా తీర్చిదిద్దటానికి కావల్సిన సైద్ధాంతిక భూమికయే ఉదారవాద సిద్ధాంతం.

మౌలిక అంశాలు :

  1. వ్యక్తి సహేతుకమైన జీవి, సమాజ శ్రేయస్సుకు కావల్సిన సహాయ సహకారం అందివ్వగలడు. అదేవిధంగా తన అభివృద్ధిని పెంచుకోగలడు. వ్యక్తి పుట్టుకతోనే కొన్ని సహజ హక్కులను కలిగి ఉన్నాడు. వాటిని ఏ అధికార శక్తీ తొలగించలేదు.
  2. వ్యక్తి యొక్క వ్యక్తిగత ప్రయోజనాలకు, సమష్టి ప్రయోజనాలకు మధ్య ఎటువంటి వైరుధ్యం లేదు. నిజానికి, పలుకరాల వ్యక్తి ప్రయోజనాలను సమన్వయం చేయడంవల్లనే సమష్టి ప్రయోజనాలు ఏర్పడతాయి.
  3. పౌర సమాజం, రాజ్యం వ్యక్తుల ద్వారా నిర్మితమైన యాంత్రికమైన సంస్థలు. అవి సమష్టి ప్రయోజనాలను కాపాడతాయి.
  4. ఉదారవాదం ప్రకారం స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, ప్రజాస్వామ్యం వ్యక్తుల సామాజిక జీవనానికి ఎంతో అవసరమైనవి.
  5. ఉదారవాదం, వ్యక్తుల పౌర స్వేచ్ఛలను కాపాడుతుంది. వాటిని పెంపొందించటానికి కావల్సిన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది.
  6. ఉదారవాదం వ్యక్తులు తమ సమ్మతి మేరకు వ్యక్తులతో గాని, సంస్థలతోగాని ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అవకాశం కల్పిస్తుంది.
  7. ఉదారవాదం సమాజంలోని వివిధ సమూహాల సమష్టి ప్రయోజనాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ విధానాలు రూపొందించాలని ఆశిస్తుంది.

ఏది ఏమైనప్పటికీ, ఉదారవాదం మార్కెట్ సమాజాన్ని కోరుకుంటుంది. రాజ్యం వ్యక్తుల ఆస్తులకు, ఒప్పందాలకు, కనీసపు సేవలు అందివ్వటానికి తనవంతు బాధ్యతను నెరవేరుస్తుంది. ఉదారవాదం వ్యక్తి ప్రయోజనాలకు లక్ష్యంగానూ వాటిని కాపాడటానికి కావాల్సిన సాధనంగానూ రాజ్యాన్ని గుర్తిస్తుంది. రాజ్యం యొక్క నిరపేక్ష అధికారాన్ని ఉదారవాదం వ్యతిరేకిస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

ప్రశ్న 3.
సామ్యవాదం అంటే ఏమిటి ? దాని ప్రధాన సూత్రాలను పరిశీలించండి.
జవాబు.
సామ్యవాదం ఫ్రెంచి, పారిశ్రామిక విప్లవ వీరుల తరువాత ప్రచారంలోకి వచ్చింది. ఫ్రెంచి విప్లవం సాంఘిక విప్లవాన్ని లేవదీస్తే, పారిశ్రామిక విప్లవం ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే సమూలంగా మార్చివేసింది. సామ్యవాదాన్ని ప్రచారం చేసిన వారిలో రాబర్ట్ ఓవెన్, సైంట్ సైమన్లు ముఖ్యులు.

రాబర్ట్ ఓవెన్ సామ్యవాదాన్ని కాల్పనిక సామ్యవాదంగా ఇంగ్లండ్లో ప్రచారం చేసాడు. ఈ సామ్యవాదాన్నే మార్క్స్, ఏంజెల్సు అనే తత్త్వవేత్తలు శాస్త్రీయ సామ్యవాదంగా రూపొందించారు.

నిర్వచనం వివరణ :
సామ్యవాదం “సోషియస్” (Socious) అనే పదం నుంచి ఉద్భవించింది. అయితే సామ్యవాదాన్ని నిర్వచించటం చాలా కష్టం. అయినా నిఘంటువు ప్రకారం” ఒక కేంద్ర ప్రజాస్వామ్య ప్రభుత్వం మేలైన పంపిణీ విధానాన్ని, దానికనుగుణంగా ఉత్పత్తి విధానాన్ని ఏర్పరచాలనే ఆశయం గల సిద్ధాంతం సామ్యవాదం”. జార్జి బెర్నాడ్ షా సామ్యవాదమంటే “ఆదాయాలను సమానం చేయటం” అని అన్నాడు.

సామ్యవాదులకు విప్లవం కన్న సంస్కరణల ద్వారా మార్పును తేవటం ఇష్టం. సిద్ధాంతపరమైన సంఘర్షణకన్న నిర్మాణాత్మకమైన కృషిపైన, ఫలితాలపైన వారికి నమ్మకం ఎక్కువ.

ప్రధానసూత్రాలు :
సామ్యవాదపు ప్రధానసూత్రాలను కింది విధంగా చెప్పవచ్చు.

1. సమాజానికి ప్రాముఖ్యత :
సామ్యవాదం వ్యక్తికంటే సమాజానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది. సమాజ ప్రయోజనాలకంటే వ్యక్తి ప్రయోజనాలు తక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ప్రజలందరి అవసరాలకు సంబంధించిన వస్తూత్పత్తికే మిక్కిలి ప్రాధాన్యతనిస్తుంది. సుఖభోగాలకు సంబంధించిన వస్తువుల ఉత్పత్తి అవసరమైనదిగా భావిస్తుంది. లాభాపేక్షగల వస్తూత్పత్తికంటే సహకార సేవలు అందివ్వగలిగే వస్తూత్పత్తి జరగాలని కోరుకుంటుంది.

2. సామాజిక ఐక్యతను కోరుకుంటుంది:
పెట్టుబడిదారీ సమాజంలో శ్రామికులు, కార్మికులు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కోల్పోతారని సామ్యవాదం పేర్కొంది. సామ్యవాద సమాజంలో మాత్రమే ప్రజలందరికీ స్వేచ్ఛాస్వాతంత్ర్యాలతో పాటు సమాన అవకాశాలు కల్పించబడతాయని ఈ సిద్ధాంతం నొక్కి చెబుతుంది.

పెట్టుబడిదారీ సమాజంలో కొంతమంది సంపన్నులు మాత్రమే అన్నిరకాల అవకాశాలను పొందుతారని ఎక్కువమంది అనేక అవకాశాలను కోల్పోతారంటుంది. సామ్యవాద సమాజంలో ప్రజలందరు ఎటువంటి అసమానతలు లేని విధంగా సంపూర్ణప్రయోజనం పొందుతారు.

3. పెట్టుబడిదారీ దారీ వ్యవస్థ నిర్మూలన :
పెట్టుబడిదారీ విధానం సంపూర్ణంగా నిర్మూలించబడాలని సామ్యవాదం కోరుకుంటుంది. పెట్టుబడిదారీవర్గం కార్మికవర్గాన్ని దోపిడీచేస్తూ అధికసంపదను ప్రోగుచేసుకుంటుంది. చట్టం ప్రకారం కార్మిక వర్గానికి చెందాల్సిన సౌకర్యాలనుగాని, ఇతరత్రా ప్రయోజనాలను గాని పెట్టుబడిదారి విధానం కల్పించదు.

దీని పర్యవసానంగా కార్మికవర్గం తీవ్రమైన దుర్భరపరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. వీటన్నింటిరీత్యా పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మూలన కచ్చితంగా జరగాలని సామ్యవాదం అభిప్రాయపడింది.

4. పోటీతత్వాన్ని నిర్మూలించటం:
ఆర్థికరంగంలో ముఖ్యంగా ఉత్పత్తి సంబంధ విషయాలలో పోటీతత్వం సమూలంగా నిర్మూలించబడాలని సామ్యవాద ఆకాంక్ష. పోటీతత్వానికి బదులుగా సహకారం ఉండాలంటుంది. పోటీతత్వం, లంచగొండితనాన్ని, ఏకస్వామ్యాన్ని, అసాంఘిక చర్యలను, విలువలు దిగజారుడుతనాన్ని పెంచిపోషిస్తుందని సామ్యవాదం విమర్శిస్తుంది. అందువల్ల పోటీతత్వం స్థానంలో సహకారం ఎంతో అవసరమని సామ్యవాదం భావిస్తుంది.

5. సమానత్వంపై సంపూర్ణవిశ్వాసం :
సామ్యవాదం సమానత్వ సూత్రాన్ని నమ్ముతుంది. అయితే, సామ్యవాదం సైతం సంపూర్ణ సమానత్వాన్ని సమర్థించదు. వ్యక్తుల ఆలోచనలు, శక్తిసామర్థ్యాలు మరియు నైపుణ్యాల రీత్యా అసమానతలుంటాయని అంగీకరిస్తుంది. అయినంతమాత్రాన ఉద్దేశపూర్వకమైన అసమానతలను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సామ్యవాదం నొక్కి చెబుతుంది.

6. ప్రయివేటు ఆస్తికి వ్యతిరేకం :
సామ్యవాదం ప్రయివేటు ఆస్తి కలిగి ఉండటాన్ని వ్యతిరేకిస్తుంది. భూమిమీద, పరిశ్రమలమీద, ఇతర ఉత్పత్తి సాధనాలమీద ప్రయివేటు యాజమాన్యపు హక్కులను సామ్యవాదం వ్యతిరేకిస్తుంది. పారిశ్రామిక ఉత్పత్తులను ప్రజలందరూ సమానంగా వినియోగించుకోవాలని సామ్యవాదం కోరుకుంటుంది.

7. వస్తూత్పత్తిపై సామూహిక యాజమాన్యం :
సమస్త వస్తూత్పత్తి సామూహిక యాజమాన్య ఆధీనంలో ఉండాలని’ సామ్యవాదం ఆశిస్తుంది. సమాజంలోని సంపదనంతా జాతీయం చేయాలని కోరుకుంటుంది. ప్రయివేటు ఆస్తి సంపాదన అంటే దొంగతనంగా కూడగట్టుకున్నదేనని చెబుతుంది. దీన్ని తొలగించడానికి పరిశ్రమలమీద, మైనింగ్ మీద సమష్టి యాజమాన్యం ఉండాలంటుంది.

8. కేంద్రీకృత ప్రణాళిక వ్యవస్థ ఉండాలి:
కేంద్రీకృత ప్రణాళికా వ్యవస్థ సమగ్ర అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని సామ్యవాద భావన. శీఘ్ర ఆర్థికాభివృద్ధిని సాధించడానికి ప్రణాళికా వ్యవస్థే పట్టుకొమ్మవంటిదని చెబుతుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

ప్రశ్న 4.
గాంధీవాదంపై ఒక వ్యాసం రాయండి.
జవాబు.
మోహన్దాస్ కరంచంద్ గాంధీ గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్ పట్టణంలో 1869 సంవత్సరంలో జన్మించాడు. గాంధీని మొట్టమొదటిసారి రవీంద్రనాథ్ ఠాగూర్ ‘మహాత్మ’ అని సంబోధించాడు. మహాత్ముడు భారతదేశ పితామహుడుగా కూడా విఖ్యాతినొందాడు. ప్రాచీన భరతీయ భావాలైన అహింస సత్యాగ్రహం, సత్యం లాంటివాటిని సాధనాలుగా ఉపయోగించి భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించాడు. తాను ఏదైతే పాటించాడో దాన్నే బోధించాడు.

గాంధీయిజం – ప్రధాన సూత్రాలు :
1. అతిభౌతిక ఆదర్శవాదం:
ఉపనిషత్ భావాలైన ‘దైవికభావన’ సజీవ నిర్జీవ సమస్త ప్రాణికోటిలో నిక్షిప్తమై ఉండే సార్వజనీన ఆత్మ, అన్ని చోట్ల నిరంతరం వెలిగే దైవిక వెలుతురు మొదలైనవి గాంధీ తాత్విక భావాలు. గాంధీ అభౌతిక ఆదర్శవాదం వేదాంత చింతనతో కూడిన నైతికత, ధార్మిక, అభౌతిక జైన, బౌద్ధ, వైష్ణవ సూత్రాలు. వీటన్నింటి సమ్మిళితమే గాంధీయిజం.

2. నైతిక నిరపేక్షత :
గాంధీ నైతిక విలువలకు అధిక ప్రాధాన్యతనిచ్చాడు. గాంధీ నైతిక వేదాంతంలోని ‘రిత’ లో మనం చూడవచ్చు. ‘రిత’ విశ్వజనీనమైది. సర్వాంతర్యామి అయినట్టఁ భగవంతుడికి విధేయులుగా ఉండునట్లు చేస్తుంది.

3. అహింస – సిద్ధాంతం :
అహింస అంటే ‘హింస చేయకుండుటం’. అంటే ఎవరినీ ‘చంపటానికి వీలులేదు’ అనేది విస్తృత అర్థంలో వాడతాం.

గాంధీ ‘అహింసా’ భావాన్ని రాజకీయాలలో తిరుగులేని అస్త్రంగా వాడాడు. సత్యం, భయం లేకుండటం అహింసకు కావల్సిన కారకాలు. గాంధీజీ అహింసను ఒక వ్యక్తి తన ఆత్మకు తాను విధించుకునే స్వకీయ శిక్షవంటిదని పేర్కొన్నాడు. దయ, ప్రేమ, భయంలేకుండుట, అమాయకత్వం, దయార్ద్రత, నిస్వార్థత మొదలైనవి అహింస పాటించటంలో దోహదపడే అంశాలుగా గాంధీ వివరించాడు.

అహింసా విధానాన్ని ఒక్క బ్రిటీష్వారికి మాత్రమే వ్యతిరేకంగా ప్రయోగించిన ఆయుధంకాదు, సమాజంలోని వివిధ రకాల రుగ్మతలను తొలగించటానికి సైతం దీన్ని ఆయుధంగా వాడవచ్చునన్నాడు.

గాంధీజీ అభిప్రాయంలో స్వరాజ్యం లేదా ప్రజాస్వామ్యాన్ని హింస ద్వారా సాధించలేం. ఎందుకంటే హింసతో ఎవరినీ సంపూర్ణంగా ఓడించలేం. వ్యక్తి స్వేచ్ఛ అంటే హింస కాదు. ఒక్క అహింసా విధానంవల్ల మాత్రమే వ్యక్తిస్వేచ్ఛకు వాస్తవ రూపం వస్తుంది.

గాంధీజీ అభిప్రాయంలో హింసకు నాలుగు కారణాలున్నాయి. అవి :

  1. వ్యవస్థీకృతమైన అధికారం లేదా శక్తి
  2. అంతర్గత వైరుధ్యాలు
  3. విదేశీ దురాక్రమణలు
  4. కుటుంబ వ్యవస్థ

గాంధీజీ ప్రకారం సత్యాగ్రహం కేవలం తాత్విక సిద్ధాంతం మాత్రమే కాదు. అది విదేశీపాలనను అంతమొందించి సాంఘిక, ఆర్థిక న్యాయాలు సంపాదించేది. గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు సత్యాగ్రహం అనే భావనను కనిపెట్టాడు.

అతని ఉద్దేశంలో సత్యాగ్రహం అంటే ప్రేమతో కూడిన ఒత్తిడి (Love Force) మరియు ఆత్మ సంబంధమైన ఒత్తిడి (Soul Force). సత్యం ఎన్నడూ హింసను అంగీకరించదు. తప్పు చేసిన వాడిని కూడా ‘హిసా’ పద్ధతిలో శిక్షించకూడదు. ఒకడి దృష్టిలో ”పాపం’ అయినది మరొకరి దృష్టిలో కాకపోవచ్చు.

సత్యాన్ని అన్వేషించటమంటే అహింసావాదాన్ని పాటించడమే అని గాంధీ అభిప్రాయపడ్డాడు. ఒక వ్యక్తికి సంబంధించి అసత్యం అన్యాయం అనే భావనలను తొలగించటానికి తనకు తాను క్షోభను అనుభవించే విధంగా చేయడం ద్వారా మార్పును తీసుకురావాలి. సత్యాగ్రహం అంటే తప్పు చేసినవాడిని క్షోభపెట్టడం కాదు, దాన్ని వ్యతిరేకించేవాడు క్షోభపడి ఎదుటి వాడిలో మార్పు తీసుకురావడం అని గాంధీజీ అభిప్రాయం.

సత్యాగ్రహంపై రాజకీయపరమైన నమ్మకం:
రాజకీయంగా సత్యాగ్రహం మూడు సూత్రాల మీద ఆధారపడింది.

  1. అహింస మీద నిరపేక్షమైన నమ్మకం ఉండాలి.
  2. ఏ ప్రభుత్వం అయినా ప్రజాభీష్టం మేరకు ఏర్పడాలి.
  3. ఏ దేశం కూడా స్వకీయంగా క్షోభను, స్వకీయమైన త్యాగం చేయకుండా అభివృద్ధిని సాధించలేదు.

సత్యాగ్రహం సూత్రాలు:
నిజమైన సత్యాగ్రాహి కింది సూత్రాలను పాటించాల్సి ఉంటుంది.

  1. సత్యం అంటే అబద్ధమాడకుండుట. ఇది దైవికమైనది. చెడు చట్టాలను అహింసా పద్ధతుల ద్వారా ప్రతిఘటించాలి.
  2. అహింస అంటే హింసచేయకుండుట, ప్రేమతో జీవితాంతం బ్రతకటం.
  3. సత్యాగ్రాహి జీవితాంతం బ్రహ్మచర్యం పాటించటం. స్త్రీ గాని, పురుషుడుగాని ఇతరులపట్ల చెడు దృష్టిని కలిగి ఉండకూడదు.
  4. అవసరమైన దాని కంటే ఎక్కువగా భుజించకూడదు.
  5. దొంగతనం చేయరాదు.
  6. ప్రతి వ్యక్తి తన శ్రమ మీదనే ఆధారపడి జీవించాలి.
  7. విదేశీ వస్తువులను కొనుగోలు చేయడంగాని, ధరించడంగాని చేయరాదు.
  8. ప్రతి వ్యక్తి భయంలేని జీవితాన్ని గడపాలి.
  9. అంటరానితనాన్ని పాటించరాదు.
  10. మతపరమైన సహనం ఉండాలి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

సత్యాగ్రహం – వివిధ రూపాలు :

  1. శాసనోల్లంఘనం
  2. అహింస
  3. హర్తా నిరసన
  4. హర్తాల్
  5. హిజరత్

ఈ సూత్రాలను పాటించడం ద్వారా విదేశీ పాలన, పలురకాల అన్యాయాల నుంచి దేశాన్ని, మనల్ని మనం కాపాడుకోగల్గుతాం.

అదే విధంగా, సత్యాగ్రహాన్ని అనేక రూపాలలో ఆచరించవచ్చు. సహాయ – నిరాకరణ అనేది పరోక్షమైన చాలా చిన్నదైన నిరసన. శాసనోల్లంఘనం తీవ్రమైన నిరసన. దీన్ని వ్యక్తిగతంగా గాని, సామూహికంగా గాని తెలియజేయవచ్చు. హర్తాల్, హిజరత్ మరో రకమైన సత్యాగ్రహ నిరసన రూపాలు. సత్యాగ్రహం పద్ధతులు కూడా పలురకాలు. నిరాహారదీక్ష అనేది నిరసన తెలిపే తీవ్రమైన పద్ధతి.

5. మతం రాజకీయాలు :
గాంధీజీ నైతిక భావనలను తరచుగా వ్యక్తపర్చటం చూడవచ్చు. గాంధీజీ అభిప్రాయంలో మతంలేని రాజకీయాలు ప్రభుత్వాన్ని – రాజ్యాన్ని వాటి స్థాయిని తగ్గిస్తాయి. ఎందుకంటే అవి కేవలం భౌతిక అవసరాలు మాత్రమే తీర్చగల్గుతాయి. గాంధీజీ ఉద్దేశంలో అధికారం, నైతికత రెండు సమాంతరంగా రాజకీయాలలో ఉపయోగించబడాలి. అందుకే గాంధీజీ మానవత, మతం, నైతికతను, స్థైర్యాన్ని పెంచినాయన్నాడు.

రాజకీయ కార్యక్రమం కూడా వ్యక్తుల సాంఘిక, నైతిక స్థాయిలను పెంచుతాయన్నాడు. మనిషి జీవితం నుంచి రాజకీయాలను కానీ మతాన్నిగాని విడదీయలేమన్నాడు. గాంధీజీ ఉద్దేశంలో మతమంటే గుడ్డిగా మత విశ్వాసాలను నమ్మటం కాదు, నైతిక విలువలతో మత విశ్వాసాలను సమన్వయం చేసుకోవటంగా పేర్కొన్నాడు. ఏ మతమైనా ఏకపక్ష విధానాన్ని సమర్థించకూడదు. అయితే, గాంధీజీ ఎన్నడూ రాజ్యపరమైన మతాన్ని సమర్థించలేదు. ఆయన ఉద్దేశంలో మతమనేది సమాజంలోని అన్ని రుగ్మతలను తొలగించేదిగా ఉండాలి.

6. లక్షా సాధనాలు :
గాంధీజీ ఉద్దేశంలో సాధనాలు అనేవి ఉదాత్తమైనవి అయి ఉండాలి. అవి అనుకున్న లక్ష్యాలను సాధించేవిగా ఉండాలి. పాశ్చాత్య తత్వవేత్తలు హింసాపూరితమైన సాంఘిక, రాజకీయ విప్లవాలను ప్రతిపాదించారన్నాడు. వాటి ద్వారానే సమాజంలో శాంతి, అభివృద్ధి సాధ్యమౌతాయని వారు పేర్కొన్నారు. అయితే, ఒక్క టాల్ స్టాయ్ మాత్రం హింసను వ్యతిరేకించి “సార్వజనీన ప్రేమ”ను ప్రతిపాదించాడు.

గాంధీజీ, టాల్ స్టాయ్ వీరిరువురు సాంఘిక, రాజకీయ లక్ష్యాలను సాధించటానికి ప్రేమ, కరుణ, దయ వంటి వాటిని ప్రతిపాదించారు. సాధనం అంటే విత్తనం లాంటిది. లక్ష్యం అంటే చెట్టులాంటిది. మంచి విత్తనం నాటితే మంచిదైన చెట్టుపెరిగి మంచి ఫలాన్నిస్తుంది అంటారు గాంధీజీ.

7. ధర్మకర్తృత్వం :
గాంధీజీ, అంతిమ రాజకీయ లక్ష్యం దేశంలో ‘రామరాజ్యం’ ఏర్పాటు చేయటం దాని ద్వారా ప్రజలందరికి సంక్షేమం (సర్వోదయ) కల్పించటం. రామరాజ్యం ఏర్పడిన సమాజంలోని వ్యక్తులు తమ ఆస్తిని పరిశ్రమలను, భూమిని మరియు వ్యాపారాన్ని ధర్మకర్తృత్వంగానే పరిగణిస్తారు. ప్రతి వ్యక్తి తనకు ఎంత కావాలో అంతే ఉంచుకొని మిగిలిన దాన్నంతా ఇతరులకు ఇచ్చివేయాలి. గాంధీజీ ధర్మకర్తృత్వం సిద్ధాంతాన్ని విప్లవ కమ్యూనిస్టు సిద్ధాంతానికి ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించాడు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
వ్యక్తి శ్రేయోవాదాన్ని చర్చించండి.
జవాబు.
అర్థం :
వ్యక్తి శ్రేయోవాదం ప్రకారం రాజ్యం వ్యక్తుల వ్యక్తిగత విషయాలకు సంబంధించి వారి అభీష్టానికే వదిలేయాలంటుంది. ఈ సిద్ధాంతాన్ని జోక్యరహిత సిద్ధాంతం (Laissez Fair Theory) అని కూడా అంటారు. (Laissez Fair) అనేది ఫ్రెంచ్ పదం, దాని అర్థం ‘ఒంటరిగా వదిలేయ్’ (Leave alone), అంటే సాంఘిక జీవనంలో వ్యక్తే కేంద్ర బిందువు. ఈ సిద్ధాంతాన్ననుసరించి వ్యక్తికి వీలైనంత ఎక్కువ స్వేచ్ఛనివ్వాలి. రాజ్యం వీలైనంత తక్కువ జోక్యం కలిగి ఉండాలి. అంటే రాజ్యం వ్యక్తులను సమర్థించాలేగాని నియంత్రించకూడదు.

వ్యక్తి శ్రేయోవాదుల అభిప్రాయంలో “రాజ్యం ఆవశ్యకమైన దయ్యం” లాఁటిది. రాజ్యం ఎందుకు అవసరమంటే వ్యక్తులను హింస నుంచి, మోసాల నుంచి కాపాడటానికి అవసరమని వ్యక్తి శ్రేణి దావాదుల అభిప్రాయం. ఇది ఎందుకు దయ్యం లాంటిదంటే వ్యక్తుల స్వాతంత్ర్యాన్ని అడ్డుకుంటుంది. కాబట్టి, అందువల్ల వ్యక్తుల వ్యక్తిగత విషయంలో ఎంత తక్కువగా జోక్యం చేసుకుంటే అంతమంచిది.

రాజ్యం కింద తెలిపిన పరిమిత విదులను నిర్వహిస్తుంది.

  1. వ్యక్తులకు రక్షణ కల్పించటం విదేశీ దురాక్రమణలనుంచి కాపాడటం.
  2. ఒక వ్యక్తికి మరో వ్యక్తి నుంచి రక్షణ కల్పించడం.
  3. వ్యక్తుల ఆస్తులకు దోపిడి దొంగల నుంచి, విధ్వసాల నుంచి రక్షణ కల్పించడం.
  4. తప్పుడు ఒప్పందాల నుంచి ఒప్పంద ఉల్లంఘనల నుంచి వ్యక్తులను కాపాడడం.

సిద్ధాంతం పుట్టుక – అభివృద్ధి :
18వ శతాబ్దం నాటి యూరప్ లో నిరపేక్ష నియంతృత్వ, రాజరిక ప్రభుత్వాలు ఆచరణలో ఉండేవి. యూరప్కు చెందిన సామాజిక ఒడంబడిక సిద్ధాంతకర్తలు రాజనీతి పండితులైన జాన్లాక్, రూసో వంటి వారు వ్యక్తి స్వేచ్ఛలకు సంబంధించి వివరణలిచ్చారు. ఆ తరువాత 19వ శతాబ్దంలో వ్యక్తి శ్రేయోవాదానికి ఒక సంపూర్ణ రూపం వచ్చింది.

ఆర్థికపరమైన వ్యక్తి శ్రేయోవాదానికి 18వ శతాబ్దంలో ఫిజియోక్రాట్స్ పునాదులు వేశారు. పరిశ్రమలను, వాణిజ్య వ్యాపారాలను పర్యవేక్షిస్తూ వాటికి సంపూర్ణ మద్దతును తెలిపే విధానాలను సమర్థించే మార్కెంటలిజాన్ని ఫిజి.మోక్రాట్స్ వ్యతిరేకించారు. ఈ ఫిజియోక్రాట్సే లేజాఫెయిర్ (జోక్యరహిత) సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.

ఈ సిద్ధాంతం ఫ్రాన్స్లో బాగా వేళ్ళూనుకొని అటు పిమ్మట యూరప్అం తటా విస్తరించింది. దీనిని ఆడమ్స్మిత్, ఇతర సంప్రదాయ ఆర్థికవేత్తలు అభివృద్ధి చేశారు. అయితే జె.ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్లు దీనిని ఒక విధానంగాను రాజకీయ సిద్ధాంతంగానూ తీర్చిదిద్దారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

ప్రశ్న 2.
సామ్యవాదంలోని లోపాలపై ఒక నోట్ రాయండి.
జవాబు.
సామ్యవాదం లోపాలు :
సామ్యవాదం ఎంతో ఉపయోగకరమైన సిద్ధాంతమైనా దాంట్లో కొన్ని లోపాలున్నాయి. వాటిని క్రింది విధంగా చెప్పవచ్చు.

  1. సామ్యవాద సిద్ధాంతం వ్యక్తికిగల సృజనాత్మక శక్తిని అణచివేస్తుంది. ఉత్పత్తి విధానంలో వ్యక్తిపాత్రను తక్కువచేసి చూపుతుంది.
  2. కొన్ని సామ్యవాద సూత్రాలు ఆచరణ సాధ్యంకానివి. ఉదాహరణకు, ఆర్థిక అసమానతలు తొలగించటం, సాంఘిక వివక్షతలు, సమష్టి యాజమాన్యం, ప్రయివేటు ఆస్తి మొదలైనవి.
  3. సామ్యవాదం వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను నిరాకరిస్తుంది. సమాజానికి అధిక ప్రాధాన్యతనిచ్చి వ్యక్తికి తక్కువ ప్రాధాన్యతనిస్తుంది.
  4. ఆర్థిక వ్యవహారాలలో రాజ్యం జోక్యాన్ని సమర్థించడంవల్ల సత్వర ఆర్థికాభివృద్ధి సాధించటం అసాధ్యమౌతుంది.

సామ్యవాదం – ప్రాముఖ్యత:
సామ్యవాదం ఎంతో ప్రాముఖ్యత కలిగిన సిద్ధాంతం. సమకాలీన సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించటానికి ఇది ఏర్పరచుకొన్న లక్ష్యాలు – సాధనాలు ఉదాత్తమైనవి. భౌతిక పరిస్థితులను చక్కదిద్దుకోవటం ద్వారా ప్రజల సంక్షేమాన్ని పెంచుకోవచ్చని సామ్యవాదం భావిస్తుంది. శ్రామికులు, కార్మికుల నిరుద్యోగుల మరియు అన్ని రంగాలలో వెనుకబడిన వర్గాల అభివృద్ధి కేవలం సామ్యవాదం ద్వారానే సాధ్యమౌతుందని ఈ సిద్ధాంతం భావిస్తుంది.

సామ్యవాద సిద్ధాంతం సమసజస్థాపనే ధ్యేయంగా పనిచేస్తుంది. దోపిడీ, అణచివేత, ఆకలి, దారిద్య్రం వంటి వివక్షత రూపుమాపాలంటే సామ్యవాద సిద్ధాంతం ద్వారానే సాధ్యమౌతుందని చెబుతుంది. ప్రయివేటు ఆస్తిని రద్దుచేసి దున్నేవాడిదే భూమి అని నినదించింది.

సామ్యవాద భావాలు భారత రాజకీయాలలో, అమలుచేయబడ్డాయి. రాజ్యాంగ పీఠికలోని అనేక అంశాలలో సామ్యవాదం ఒకటి. ఒకరకంగా చెప్పాలంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్ లాంటిదేశాలు సామ్యవాదం సిద్ధాంతాల ద్వారా ఎంతో స్ఫూర్తిని పొందాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

ప్రశ్న 3.
సత్యాగ్రహ భావనను తెలపండి.
జవాబు.
గాంధీజీ ప్రకారం సత్యాగ్రహం కేవలం తాత్విక సిద్ధాంతం మాత్రమే కాదు, అది విదేశీపాలనను అంతమొందించి సాంఘిక, ఆర్థిక న్యాయాలు సంపాదించేది. గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు సత్యాగ్రహం అనే భావనను కనిపెట్టాడు. అతని ఉద్దేశంలో సత్యాగ్రహం అంటే ప్రేమతో కూడిన ఒత్తిడి (Love Fores) మరియు ఆత్మ సంబంధమైన ఒత్తిడి (Soul Force). సత్యం ఎన్నడూ హింసను అంగీకరించదు. తప్పు చేసిన వాడిని కూడా ‘హింసా’ పద్ధతిలో శిక్షించకూడదు.

ఒకడి దృష్టిలో ‘పాపం’ అయినది మరొకరి దృష్టిలో కాకపోవచ్చు. సత్యాన్ని అన్వేషించటమంటే అహింసా వాదాన్ని పాటించడమే అని గాంధీ అభిప్రాయపడ్డాడు. ఒక వ్యక్తికి సంబంధించి అసత్యం అన్యాయం అనే భావనలను తొలగించటానికి తనకు తాను క్షోభను అనుభవించే విధంగా చేయడం ద్వారా మార్పును తీసుకురావాలి, సత్యాగ్రహం అంటే తప్పు చేసినవాడిని క్షోభపెట్టడం కాదు, దాన్ని వ్యతిరేకించేవాడు క్షోభపడి ఎదుటి వాడిలో మార్పు తీసుకురావడం అని గాంధీజీ అభిప్రాయం.

సత్యాగ్రహంపై రాజకీయపరమైన నమ్మకం :
రాజకీయంగా సత్యాగ్రహం మూడు సూత్రాల మీద ఆధారపడింది.

  1. అహింస మీద నిరపేక్షమైన నమ్మకం ఉండాలి.
  2. ఏ ప్రభుత్వం అయినా ప్రజాభీష్టం మేరకు ఏర్పడాలి.
  3. ఏ దేశం కూడా స్వకీయంగా క్షోభను, స్వకీయమైన త్యాగం చేయకుండా అభివృద్ధిని సాధించలేదు.

సత్యాగ్రహం సూత్రాలు :

  1. సత్యం అంటే అబద్ధమాడకుండుట. ఇది దైవికమైనది. చెడు చట్టాలను అహింసా పద్ధతుల ద్వారా ప్రతిఘటించాలి.
  2. అహింస అంటే హింసచేయకుండుట. ప్రేమతో జీవితాంతం బ్రతకటం.
  3. సత్యాగ్రాహి జీవితాంతం బ్రహ్మచర్యం పాటించటం. స్త్రీ గాని, పురుషుడుగాని, ఇతరులపట్ల చెడు దృష్టిని కలిగి ఉండకూడదు.
  4. అవసరమైన దాని కంటే ఎక్కువగా భుజించకూడదు.
  5. దొంగతనం చేయరాదు.
  6. ప్రతి వ్యక్తి తన శ్రమ మీదనే ఆధారపడి జీవించాలి.
  7. విదేశీ వస్తువులను కొనుగోలు చేయడంగాని, ధరించడంగాని చేయరాదు.
  8. ప్రతి వ్యక్తి భయంలేని జీవితాన్ని గడపాలి.
  9. అంటరానితనాన్ని పాటించరాదు.
  10. మతపరమైన సహనం ఉండాలి.

సత్యాగ్రహం – వివిధ రూపాలు :

  1. శాసనోల్లంఘనం
  2. అహింస
  3. హర్తా నిరసన
  4. హర్తాల్
  5. హిజరత్.

ఈ సూత్రాలను పాటించడం ద్వారా విదేశీ పాలన, పలురకాల అన్యాయాల నుంచి దేశాన్ని మనల్ని మనం కాపాడుకోగల్గుతాం.

అదే విధంగా, సత్యాగ్రహాన్ని అనేక రూపాలలో ఆచరించవచ్చు. సహాయ నిరాకరణ అనేది పరోక్షమైన చాలా చిన్నదైన నిరసన. శాసనోల్లంఘనం తీవ్రమైన నిరసన. దీన్ని వ్యక్తిగతంగా గాని, సామూహికంగా గాని తెలియజేయవచ్చు. హర్తాల్, హిజరత్ మరో రకమైన సత్యాగ్రహ నిరసన రూపాలు. సత్యాగ్రహం పద్ధతులు కూడా పలురకాలు. నిరాహారదీక్ష అనేది నిరసన తెలిపే తీవ్రమైన పద్ధతి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

ప్రశ్న 4.
మతం – రాజకీయాలపై గాంధీజీ భావాలను వివరించండి.
జవాబు.
గాంధీజీ నైతిక భావనలను తరచుగా వ్యక్తపర్చటం చూడవచ్చు. గాంధీజీ అభిప్రాయంలో మతంలేని రాజకీయాలు ప్రభుత్వాన్ని రాజ్యాన్ని వాటి స్థాయిని తగ్గిస్తాయి. ఎందుకంటే అవి కేవలం భౌతిక అవసరాలు మాత్రమే తీర్చగల్గుతాయి. గాంధీజీ ఉద్దేశంలో అధికారం, నైతికత రెండు సమాంతరంగా రాజకీయాలలో ఉపయోగించబడాలి. అందుకే గాంధీజీ మానవత, మతం, నైతికతను, స్థైర్యాన్ని పెంచినాయన్నాడు.

రాజకీయ కార్యక్రమం కూడా వ్యక్తుల సాంఘిక, నైతిక స్థాయిలను పెంచుతాయన్నాడు. మనిషి జీవితం నుంచి రాజకీయాలను కానీ మతాన్నిగాని విడదీయలేమన్నాడు. గాంధీజీ ఉద్దేశంలో మతమంటే గుడ్డిగా, మత విశ్వాసాలను నమ్మటం కాదు, నైతిక విలువలతో మత విశ్వాసాలను సమన్వయం చేసుకోవటంగా పేర్కొన్నాడు. ఏ మతమైనా ఏకపక్ష విధానాన్ని సమర్థించకూడదు. అయితే, గాంధీజీ ఎన్నడూ రాజ్యపరమైన మతాన్ని సమర్థించలేదు. ఆయన ఉద్దేశంలో మతమనేది సమాజంలోని అన్ని రుగ్మతలను తొలగించేదిగా ఉండాలి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
వ్యక్తి శ్రేయోవాదం.
జవాబు.
వ్యక్తి స్వాతంత్ర్యానికి, స్వేచ్ఛకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రచారంలోకి వచ్చిన సిద్ధాంతం వ్యక్తి శ్రేయోవాద సిద్ధాంతం. ఈ సిద్ధాంతం వ్యాప్తికి దోహదం చేసినవారు జాన్ స్టూవర్ట్మిల్, హెర్బర్ట్ స్పెన్సర్. ప్రధమంగా ఈ సిద్ధాంతం లేజాఫేయిర్ (Laissez Fair) సిద్ధాంతంగా పేర్కొనడం జరిగింది. ఫ్రెంచ్ భాషలో లేజాఫేయిర్ అంటే “జోక్యంచేసుకోకు” అని అర్థం. వ్యక్తి శ్రేయోవాద సిద్ధాంత ప్రధాన లక్ష్యం వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు ప్రాధాన్యమిచ్చి, రాజ్యం జోక్యాన్ని అధికారాన్ని పరిమితం చేయటం.

ప్రశ్న 2.
నయా ఉదారవాదం.
జవాబు.
నయా ఉదారవాదాన్ని ఒకరకంగా సమకాలీన సాంప్రదాయ ఉదారవాదంగా చెప్పవచ్చు. జోక్యరహిత (“లేజాఫెయిర్”) వ్యక్తి శ్రేయోవాదంగా కూడా పరిగణించవచ్చు. ఇది సంక్షేమ రాజ్యాన్ని కోరుకుంటుంది. వ్యక్తుల ఆర్థిక కార్యకలాపం మీద ఎటువంటి నియంత్రణలు ఉండకూడదంటుంది.

నయా – ఉదారవాదాన్ని ముఖ్యంగా కింద పేర్కొన్న శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. ఎఫ్.ఎ. ఫెయక్ (1899 – 1922), ఆస్ట్రేలియా తత్వవేత్త మిల్టన్ ఫ్రీడ్మాన్ (1912 – 2006), అమెరికా రాజనీతి తత్త్వవేత్త అయిన రాబర్ట్ నోజిక్ (1938 – 2002) మొదలైనవారు.

ప్రశ్న 3.
లేజాఫేయర్ (జోక్యరహితవాదం).
జవాబు.
వ్యక్తి శ్రేయోవాదం ప్రకారం రాజ్యం వ్యక్తుల వ్యక్తిగత విషయాలకు సంబంధించి వారి అభీష్టానికే వదిలేయా లంటుంది. ఈ సిద్ధాంతాన్ని జోక్యరహిత సిద్ధాంతమని అంటారు.

లేజాఫేయర్ (Laissez Fair) అనేది ఫ్రెంచిపదం. దాని అర్థం “ఒంటరిగా వదిలేయ్” అంటే సాంఘికజీవనంలో వ్యక్తే కేంద్ర బిందువు. ఈ సిద్ధాంతాన్ననుసరించి వ్యక్తికి వీలైనంత ఎక్కువ స్వేచ్ఛనివ్వాలి. రాజ్యం వీలైనంత తక్కువ జోక్యం కలిగివుండాలి. అంటే రాజ్యం వ్యక్తులను సమర్థించాలేగాని నియంత్రించకూడదు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

ప్రశ్న 4.
జె.యస్.మిల్.
జవాబు.
జాన్ స్టువర్ట్ మిల్ 19వ శతాబ్దపు ఆంగ్ల రాజనీతి తత్వవేత్తలలో అగ్రగణ్యుడు. ఇతడు వ్యక్తి శ్రేయోవాది మరియు ప్రజా స్వామ్యవాది. ఇతడు రచించిన “ఆన్ లిబర్టీ” అనే గ్రంథము వ్యక్తి స్వేచ్ఛకు ప్రాధాన్యతనిచ్చింది. వ్యక్తి స్వేచ్ఛకు ఇతడిచ్చినంత ప్రాధాన్యత ఇంతకుముందు ఏ రాజనీతి శాస్త్రవేత్త ఇవ్వలేదు. జె.యస్.మిల్’ వ్యక్తి శారీరక, మానసిక నైతిక వికాసానికి స్వేచ్ఛ చాలా అవసరమని భావించాడు. సమాజ శ్రేయస్సుకోసం వ్యక్తి స్వేచ్ఛ చాలా అవసరమని, అందువలన వ్యక్తి వ్యవహారాలో ప్రభుత్వ జోక్యము పరిమితంగా వుండాలని చెప్పెను.

ప్రశ్న 5.
సామ్యవాదం అర్థం.
జవాబు.
మ్యవాదం వ్యక్తి వాదాన్ని వ్యతిరేకిస్తుంది. ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు సమాజపరంగా నిర్వహించే విధానమే సామ్య దం. ఇది ఒక విప్లవాత్మక సిద్ధాంతం. ఒక రాజకీయ విధానమే గాక, సామ్యవాదం ఒక జీవిత విధానం కూడా. దీనిని అనేక మంది నిర్వచించారు. సి.యి.యమ్. జోడ్ అనే రచయిత సామ్యవాదం ఒక టోపీ వంటిదని, దానిని అందరూ ధరించటం వలన అసలు రూపమే పోయిందని అంటారు.

నిర్వచనాలు :
“ఒక కేంద్ర ప్రజాస్వామ్య ప్రభుత్వం మేలైన పంపిణీ విధానాన్ని, దానికనుగుణంగా ఉత్పత్తి విధానాన్ని ఏర్పరచాలనే ఆశయం గల సిద్ధాంతం సామ్యవాదం”. – ఎన్ సైక్లోపీడియా.
“ఆదాయాలను సమానం చేయడం సామ్యవాదం”. – జార్జ్ బెర్నార్డ్ షా.

ప్రశ్న 6.
పెట్టుబడిదారీ విధానం.
జవాబు.
వ్యక్తివాదం వలన పెట్టుబడిదారీ విధానము పెరిగింది. వ్యక్తులు ఉత్పత్తి సాధనాలను తమ ఆధీనంలో ఉంచుకొని లాభాలను ఆర్జించడము కోసం ఆర్థిక రంగాన్ని నియంత్రణ చేయడము ఇందలి ముఖ్య లక్షణం.

లక్షణాలు :

  1. వ్యక్తుల యాజమాన్యం : ఉత్పత్తి సాధనాలు వ్యక్తి ఆధీనంలో ఉంటాయి. దీని వలన వ్యక్తులు శ్రద్ధతో పనిచేస్తారు.
  2. ఆర్థిక రంగంలో స్వేచ్ఛ: యాజమానులు లాభదాయకమైన వస్తువులను ఉత్పత్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో స్వేచ్ఛ వుంటుంది. లాభ, నష్టాలకు వ్యక్తులే బాధ్యులు.
  3. వినియోగదారునికి స్వేచ్ఛ : వినియోగదారుడు తన ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తాడు.
  4. పోటీ : ఉత్పత్తి వాణిజ్యాలలో తీవ్రమైన పోటీ ఉంటుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

ప్రశ్న 7.
మార్క్సిజం.
జవాబు.
కారల్ మార్క్స్, ఏంజెల్స్ దీనిని ప్రబోధించారు. ఆర్థిక సమానత్వం దీని ప్రధాన లక్ష్యం. ఇది పెట్టుబడిదారీ విధానాన్ని, ఆస్తి హక్కును వ్యతిరేకిస్తుంది. కమ్యూనిజంలో కార్మిక నియంతృత్వం ద్వారా ప్రభుత్వం చేపట్టి, సంపదనంతా జాతీయంచేసి, విప్లవం ద్వారా ఆర్థిక సమానత్వం తేవాలి.

పేదరికం, నిరుద్యోగం కూడా నిర్మూలింపబడాలి. ప్రజలు తమ అవసరాలను బట్టి సంపద వాడుకుంటారు. కమ్యూనిజం లక్ష్యం నెరవేరిన తరువాత రాజ్యం అంతరిస్తుందని కమ్యూనిస్ట్ల వాదన. దీనిని శాస్త్రీయ సామ్యవాదం అని కూడా అంటారు.

ప్రశ్న 8.
అహింసా సిద్ధాంతం.
జవాబు.
అహింస అంటే “హింస చేయకుండటం” అంటే ఎవరినీ “చంపటానికి వీలులేదు” అనేది విస్తృత అర్థంలో వాడతాం. గాంధీ అహింసా భావాన్ని రాజకీయాలలో తిరుగులేని అస్త్రంగా వాడాడు. సత్యం, భయం లేకుండటం అహింసకు కావల్సిన కారకాలు. గాంధీజీ అహింసను ఒక వ్యక్తి తన ఆత్మకు తాను విధించుకునే స్వకీయ శిక్షవంటిదని పేర్కొన్నాడు.

దయ, ప్రేమ, భయం లేకుండుట, అమాయకత్వం, దయార్ద్రత, నిస్వార్థత మొదలైనవి. అహింస పాటించటంలో దోహదపడే అంశాలుగా గాంధీజీ వివరించాడు. అహింసా విధానాన్ని ఒక్క బ్రిటీష్ వారికి మాత్రమే వ్యతిరేకంగా ప్రయోగించిన ఆయుధం కాదు. సమాజంలోని వివిధ రకాల రుగ్మతలను తొలగించటానికి సైతం దీన్ని ఆయుధంగా వాడవచ్చునన్నాడు.

ప్రశ్న 9.
సత్యాగ్రహం.
జవాబు.
గాంధీజీ ప్రకారం సత్యాగ్రహం కేవలం తాత్విక సిద్ధాంతం మాత్రమే కాదు. అది విదేశీ పాలనను అంతమొందించి సాంఘిక, ఆర్థిక న్యాయాలు సంపాదించేది. గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు సత్యాగ్రహం అనే భావనను కనిపెట్టాడు.

అతని ఉద్దేశంలో సత్యాగ్రహం అంటే ప్రేమతో కూడిన ఒత్తిడి మరియు ఆత్మ సంబంధమైన ఒత్తిడి. సత్యాగ్రహం అంటే తప్పుచేసినవాడిని క్షోభపెట్టడం కాదు. దాన్ని వ్యతిరేకించేవాడు క్షోభపడి ఎదుటివాడిలో మార్పు తీసుకురావడం అని గాంధీజీ. అభిప్రాయం.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

ప్రశ్న 10.
ధర్మకర్తృత్వం.
జవాబు.
గాంధీజీ అంతిమ రాజకీయ లక్ష్యం దేశంలో ‘రామరాజ్యం’ ఏర్పాటు చేయటం దాని ద్వారా ప్రజలందరికి సంక్షేమం (సర్వోదయ) కల్పించటం. రామరాజ్యం ఏర్పడిన సమాజంలోని వ్యక్తులు తమ ఆస్తిని పరిశ్రమలను, భూమిని మరియు వ్యాపారాన్ని’ ధర్మకర్తృత్వంగానే పరిగణిస్తారు.

ప్రతి వ్యక్తి తనకు ఎంత కావాలో అంతే ఉంచుకొని మిగిలిన దాన్నంతా ఇతరులకు ఇచ్చివేయాలి. గాంధీజీ ధర్మకర్తృత్వం సిద్ధాంతాన్ని విప్లవ కమ్యూనిస్టు సిద్ధాంతానికి ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించాడు.

ప్రశ్న 11.
సహాయ నిరాకరణ.
జవాబు.
సత్యాగ్రహాన్ని అనేక రూపాలలో ఆచరించవచ్చు. వాటిలో సహాయ నిరాకరణ అనేది పరోక్షమైన చాలా చిన్నదైన నిరసన. దీనిని గాంధీజీ భారతజాతీయోద్యమ చిన్నదైన నిరసన. దీనిని గాంధీజీ భారతజాతీయోద్యమ కాలంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా 1920-22 మధ్యకాలంలో నిర్వహించాడు.

అహింసాయుత సహాయ నిరాకరణోద్యమము ప్రకారం విదేశీ వస్తు బహిష్కరణ, ప్రభుత్వ బిరుదులను పరిత్యజించుట, శాసన సభలను, న్యాయస్థానాలను, విద్యాలయాలను బహిష్కరించుట మొదలగు కార్యకలాపాలను గాంధీజీ నాయకత్వాన విజయవంతంగా చేయడము జరిగింది. అయితే ఈ ఉద్యమము 8, ఫిబ్రవరి 1922న చౌరీ చౌరా సంఘటనతో హింసాయుతమైన మలుపు తీసుకోవడంతో గాంధీజీ కలత చెంది ఉద్యమాన్ని నిలుపుదల చేసినాడు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

ప్రశ్న 12.
శాసనోల్లంఘనం.
జవాబు.
‘సత్యాగ్రహ రూపాలలో శాసనోల్లంఘనం తీవ్రమైన నిరసన. దీన్ని వ్యక్తిగతంగాగాని, సామూహికంగాగాని తెలియజేయవచ్చు. గాంధీజీ 1930వ సంవత్సరంలో శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించెను. గుజరాత్లోని సబర్మతి ఆశ్రమము నుండి “దండి” అనే గుజరాత్ సముద్ర తీరప్రాంత గ్రామానికి తన సహచరులతో పాదయాత్ర నిర్వహించాడు.

సముద్ర తీరంలో ఉప్పు తయారుచేసి, ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా ఆనాటి బ్రిటీష్ ఉప్పు శాసనాన్ని ధిక్కరించెను. ఈ శాసనోల్లంఘన కార్యక్రమములో గాంధీజీతోపాటు 60 వేల మంది ప్రజలు, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొనిరి. అందువలననే దీనిని సామూహిక శాసనోల్లంఘన ఉద్యమంగా అభివర్ణించడం జరిగింది.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements: Group 14

Telangana TSBIE TS Inter 1st Year Chemistry Study Material 11th Lesson p-Block Elements: Group 14 Textbook Questions and Answers.

TS Inter 1st Year Chemistry Study Material 11th Lesson p-Block Elements: Group 14

Very Short Answer Type Questions

Question 1.
Discuss the variation of oxidation states in the group-14 elements.
Answer:
The elements of group-14 exhibit two oxidation states +2 and +4. The stability of +2 oxidation state increases from carbon to lead while the stability of +4 oxidation state decreases from carbon to lead. Carbon also exhibits different oxidation states from -4 to +4.

Question 2.
How the following compounds behave with water?
a) BCl3 b) CCl4
Answer:
a) BCl3 hydrolyses in water
BCl3 + 3H2O → H3BO3 + 3HCl

b) CCl4 do not hydrolyse in water; and in-soluble in water forming separate layer.

Question 3.
Are BCl3 and SiCl4 electron deficient compounds? Explain.
Answer:
BCl3 is an electron deficient molecule since boron does not have octet. It can accept an electron pair Lewis bases and act as Lewis acid.

SiCl4 is not an electron deficient molecule. Silicon has octet in this compound.

Question 4.
Give the hybridization of carbon in
a. CO2-3 b. diamond c. graphite d. fullerene [AP. TS ’16; IPE ’14 Mar. ’18 (TS)]
Answer:
Hybridization of carbon in
a. CO2-3 – sp² hybridisation
b. diamond – sp³ hybridisation
c. graphite – sp² hybridisation
d. fullerene – sp² hybridisation

Question 5.
Why is carbon monoxide poisonous? [Mar. 18 (AP) (AP, TS 16; Mar. 13)]
Answer:
‘CO’ gas is highly poisonous because it has the ability to form a stable complex with haemoglobin.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements Group 14 1
Carboxy haemoglobin is 300 times more stable than oxyhaemoglobin.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements: Group 14

Question 6.
What is allotropy? Give the crystalline allotropes of carbon.
Answer:
The existence of an element in different physical forms but possessing similar chemical properties is known as allotropy.
The three crystalline allotropes of carbon are diamond, graphite and fullerenes.

Question 7.
Classify the following oxides as neutral, acidic, basic or amphoteric.
a. CO b.B2O3 c. SiO2 d. CO2 e. Al2O3 f. PbO2 g. Tl2O3
Answer:
a. CO – neutral
b.B2O3 – acidic
c. SiO2 – acidic
d. CO2 – acidic
e. Al2O3 – amphoteric
f. PbO2 – amphoteric
g. Tl2O3 – basic

Question 8.
Name any two man-made silicates. [AP ’15; IPE ’14]
Answer:

  1. Glass
  2. Cement

Question 9.
Write the outer electron configuration of group -14 elements.
Answer:
The elements of group 14 are Carbon (C); Silicon (Si); Germanium (Ge); Tin (Sn) and Lead (Pb).

Electronic configurations:
Carbon – 1s²2s²2p²
Silicon – 1s² 2s²2p63s²3p²
Germanium – 1s²2s²2p63s²3p63d104s²4p²
Tin – 1s² 2s² 2p63s² 3p63d104s²4p6 4d105s²5p²
Lead – 1s²2s²2p63s²3p63d104s²4p64d10 4f14 5s²5p65d10 6s² 6p²

The general outer electronic configuration of group 14 elements is ns²np².

Question 10.
How does graphite function as a lubricant? [TS Mar. 19; (TS ’ 15; Mar. 11)]
Answer:
Graphite has two – dimensional layer structure and these layers can slide easily one over the other. Hence graphite is used as a lubricant.

Question 11.
Graphite is a good conductor – explain. [AP Mar. ’17, ’15 ’09]
Answer:
Graphite has free p-electrons available. These electrons freely move throughout the crystallattice. Hence graphite acts as a good conductor.
(0r)
In graphite each carbon atom is in sp² hybridised state.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements: Group 14

Question 12.
Explain the structure of silica.
Answer:
Silica is gaint polymeric molecule. Every silicon in silica is in sp³ hybridisation. It is surrounded by 4 oxygen atoms tetrahedrally. Every oxygen is in bond with two silicon atoms.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements Group 14 2

Question 13.
What is ‘synthesis gas’?
Answer:
A mixture of CO and H2 (water gas) is called synthesis gas. Because it is used in the synthesis of compounds such as methyl alcohol. It is obtained by passing steam over red hot coke.
C + H2O → CO + H2

Question 14.
What is ‘producer gas’ [TS ’15]
Answer:
A mixture of CO and N2 obtained by passing air over red hot coke is called producer gas.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements Group 14 3

Question 15.
Diamond has high melting point-explain.
Answer:
Diamond is a three-dimensional giant molecule. The valency electrons of each carbon take part in bonding. The C – C bonds in it are very strong. Hence diamond has a high melting point (MP).

Question 16.
Give the use of CO2 in photosynthesis. [IPE ’14]
Answer:
Plants absorb CO2 from air, water from soil and convert them into carbohydrates in the presence of sunlight and chlorophyll.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements Group 14 4

This is known as photosynthesis in which CO2 changes carbohydrates to glucose.

Question 17.
How does CO2 increase the greenhouse effect?
Answer:
The increase in combustion of fossil fuels and decomposition of lime stone, etc. increases the CO2 content in the atmosphere. This may lead to increase in the greenhouse effect, thus raise the temperature of the atmosphere which might have serious consequences.

Question 18.
What are silicones? [AP ’15]
Answer:
Silicones:
Silicones are organo-silicon compounds. In silicones, silicon is strongly linked to oxygen and carbon. Silicones are polymers. They are formed by the hydrolysis and condensation of chlorosilanes. They bear the following structure.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements Group 14 5

Question 19.
Give the uses of silicones.
Answer:
Uses of silicones :

  1. Used in the preparation of silicone rubbers.
  2. Used in the preparation of water-proof clothes and papers.
  3. Used in the preparation of grease, lubricants in aeroplanes.
  4. Used in electrical motors as insulators.
  5. Used in paints and enamels.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements: Group 14

Question 20.
What is effect of water on tin?
Answer:
Tin decomposes steam to form dioxide and dihydrogen gas.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements Group 14 6

Question 21.
Write an account of SiCl4.
Answer:
Silicon tetra chloride can be prepared by the action of chlorine on silicon.
Si + 2Cl2 → SiCl4

It is a volatile fuming liquid. It hydrolyses in water by accepting lone pair of electrons from water molecules in d – orbitals of Si, finally leading to the formation of Si(OH)4.

Uses:

  1. SiCl4 and NH3 mixture is used to produce smokescreens.
  2. SiO2 prepared from SiCl4 is used in epoxy paints, resins, etc.

Question 22.
SiO2 is a solid while CO2 is a gas – explain.
Answer:
O — C ≡ O+ ↔ O = C = O ↔ +O ≡ C — O

CO2 molecule is linear, carbon dioxide molecules are held together only by weak van der Waal’s forces and hence it exists as a gas at ordinary temperature.

Silicon has a three-dimensional infinite structure, in which silicon atom is tetrahedrally bonded to two silicon atoms by covalent bonds. The whole crystal of silica thus exists as a giant molecule and hence silica is a high melting solid.

Question 23.
Write the use of ZSM-5. [TS Mar. ’19]
Answer:
ZSM-5 is a zeolite used as a catalyst in petro chemical industries to convert alcohols directly into gasoline.

Question 24.
What is the use of dry ice? [AP ’15]
Answer:
Solid CO2 is called “Dry ice”. It is used as a refrigerant for ice cream and frozen food.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements: Group 14

Question 25.
How is water gas prepared?
Answer:
When steam is passed over hot coke a mixture of CO and H2 is produced. This is known as water gas.
C + H2O → CO + H2

Question 26.
How is producer gas prepared?
Answer:
When air is passed over hot coke a mixture of CO and N2 is produced. This mixture of CO and N2 is known as producer gas.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements Group 14 7

Question 27.
C – C bond length in graphite is shorter than C – C bond length in diamond – explain.
Answer:
In graphite each carbon is in sp² hybridisation and makes three sigma bonds with three neighbouring carbon atoms. Fourth electron forms a π bond. The electron is delocalised over the whole sheet. Due to this C – C bond length is shorter in graphite. In diamond each carbon is in sp³ hybridisation. So every carbon forms four C – C single bonds. sp²-sp² bond is stronger than sp³-sp³ bond. Hence C – C bond length in diamond is longer than in graphite.

Question 28.
Diamond is used as precious stone-explain.
Answer:
The refractive index of diamond is maximum 2.45. Due to this high refractive index when light falls on diamond total internal reflection takes place. So diamonds glitter in light. Hence they are used as precious stones.

Question 29.
Carbon never shows coordination number greater than four while other members of carbon family show coordination number as high as six – explain.
Answer:
In carbon the outermost orbit is second orbit which do not contain d-orbitals. So it can form only 4 bonds. In other elements, their atoms contain vacant d-orbitals in their valence shell. So they can accept electron pairs and can show coordination number 6. But carbon cannot exhibit a coordinate number more than 4.

Question 30.
Producer gas is less efficient fuel than water gas – explain.
Answer:
Producer gas contain about 33% CO and 65% N2. Nitrogen is not combustible. So the percent of cotnbustive gas in producer gas is less.

Water gas is a mixture of CO and H2 and both are combustible. So the percent of combustible gases in water gas is more.

Thus producer gas is less efficient than water.

Question 31.
SiF2-6 is known while SiCl2-6 is not-explain. [AP ’16]
Answer:
The main reasons are :

  1. Si+4 is small in size.
  2. It is not possible to accommodate six Cl ions around a small Si+4 ion.
  3. The interaction of lone pairs on Cl ion and Si+4 ion is weak.

Short Answer Questions

Question 1.
Explain the difference in properties of diamond and graphite on the basis of their structure.
Answer:
Differences between diamond and graphite

DiamondGraphite
1. Carbon is in sp³ hybridised state.1. Carbon is in sp² hybridised state.
2. It is a bad conductor of electricity.2. It is a good conductor of electricity.
3. It has a giant three dimensional – polymeric network structure.3. It has a two dimensional layer structure.
4. C-C bond length is 1.54 Å.4. C-C bond length is 1.42Å and distance between two layers is 3.4 Å.
5. It is a hard substance.5. it is a soft substance.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements: Group 14

Question 2.
Explain the following.
a. PbCl2 reacts with Cl2 to give PbCl4.
b. PbCl4 is unstable to heat.
c. Lead is not known to form Pbl4.
Answer:
a. In PbCl2 lead is in +2 oxidation state. Chlorine is a good oxidising agent and can oxidise Pb2+ to Pb4+. So PbCl2 can react with Cl2 forming PbCl4.

b. Pb² is more stable than Pb4+ due to inert pair effect. So PbCl2 is more stable than PbCl4. Thus on heating PbCl4 converts into stable PbCl2 by losing Cl2.

c. Pb4+ is unstable due to inert pair effect and can easily convert into stable Pb2+ So Pb4+ can act as a good oxidising agent. T ion is a good reducing agent and reduces Pb4+ to stable Pb2+. So PbI4 is not formed.

Question 3.
Explain the following.
a. Silicon is heated with methyl chloride at high temperature in the presence of copper.
b. SiO2 is treated with HF
c. Graphite is a lubricant
d. Diamond is an abrasive
Answer:
a. When silicon is heated with methyl chloride at high temperature in the presence of copper various types of methyl substituted chlorosilanes are formed.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements Group 14 8

b. When SiO2 is treated with HF, H2SiF6 is formed
SiO2 + 4HF → SiF4 + 2H2O
SiF4 + 2HF → H2SiF6

c. Graphite has two – dimensional layer structure and these layers can slide easily one over the other. Hence graphite is used as a lubricant.

d. In diamond every carbon is in sp³ hybridisation and is in bond with four other carbon atoms tetrahedrally. The structure extends in space and produce a rigid three dimensional network of carbon atoms. In this structure directional covalent bonds are present throughout the lattice. To break these covalent bonds very high energy is required. Therefore diamond is the hardest substance and thus can be used as abrasive.

Question 4.
What do you understand by [AP Mar. ’19]
a. Allotropy
b. Inert pair effect
c. Catenation
Answer:
a. Allotropy :
The existence of an element in different physical forms but possessing similar chemical properties is known as allotropy.

The three crystalline allotropes of carbon are diamond, graphite and fullerenes.

b. Inert pair effect:
The reluctance of ns electrons to unpaired and take part in bond formation is called inert pair effect. Due to inert pair effect the stability of lower oxidation state increases while the stability of higher oxidation state decreases in a group from top to bottom.

c. Catenation :
Combining capacity of the atoms of same element to form long chains, branched chains and cyclic compounds is called catenation. Of all the elements carbon has maximum catenation power.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements Group 14 9

Question 5.
If the starting material for the manufacture of silicones is R SiCl3, write the structure of the product formed.
Answer:
R SiCl3 + 3H2O → R Si (OH)3

Condensation of the hydrolysed product give three dimensional silicone
TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements Group 14 10

Question 6.
Write a short note on zeolites.
Answer:
Zeolites are three dimensional alumino sili-catesrlf some silicon atoms in three dimensional network silicon dioxide are replaced by aluminium atoms, the alumino silicate formed will have some negative charge. To balance these negative charges some extra cations such as Na+, K+ or Ca2+ will present in these silicates. Examples are ZSM – 5 which is used as a catalyst in direct conversion of alcohols into gasoline. Hydrated zeolites are used as ion exchangers in softening of hard water.

The structure of zeolite permits the formation of cavities of different sizes. Molecules like H2O, NH3, CO2 can be trapped in these cavities. Thus they can serve as molecular sieves.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements: Group 14

Question 7.
Write a short note on silicates.
Answer:
Silicates compounds are formed from the orthosilicic acid. All silicates have the basic structural unit SiO4-4 which has tetrahedral structure.

When discrete SiO4-4 unit is present in silicates they are called orthosilicates. Different silicates are formed by joining a number of SiO4-4 units through the corners of SiO4-4 tetrahedron by sharing 1, 2, 3 or 4 oxygen atoms per silicate unit. Thus chain, ring, sheet or three dimensional silicates are formed depending on the number of oxygen atoms shared. Negative charge on the silicate is neutralised by the positive charged metal ions.

Question 8.
What are silicones? How are they obtained?
Answer:
Silicones are organo silicon compounds containing (R2 Si – O) as repeating unit. First alkyl or aryl substituted chlorosilanes are prepared. These on hydrolysis followed by condensation, polymerisation gives polymeric silicones. Eg.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements Group 14 11

This reaction continue to give chain polymers. If water molecule is eliminated from the terminal OH groups of same chain cyclic, silicones are formed.

Question 9.
Write a short note on fullerene.
Answer:
Fullerene is a crystalline allotrope of carbon. Fullerenes are made by heating graphite in an electrie arc in the presence of inert gas. The soot formed by condensation of vapour of carbon contains mainly C60 fullerene molecules. It is known as Buckminster fullerene. It has soccer ball shape.

C60 fullerene contains 20 six membered rings and 12 five membered rings. A six membered ring is fused with either six membered ring or with five membered ring but a five membered ring is always fused with six membered ring. All carbon atoms in fullerene are in sp² hybridisation and are in bond with three other carbon atoms. The fourth electron of carbon delocalises on all carbon atoms giving aromatic character to fullerene. These are also called bucky balls, in short.

Question 10.
Why SiO2 does not dissolve in water?
Answer:
SiO2 has gaint polymeric network structure. In this structure directional covalent bonds are present throughout the lattice. Due to this structure the molecule is non-polar. Hence it is insoluble in water.

Question 11.
Why is diamond hard?
Answer:
In diamond every carbon is in sp³ hybridisation and is in bond with four other carbon atoms tetrahedrally. The structure extends in space and produce a rigid three dimensional network of carbon atoms. In this structure directional covalent bonds are present throughout the lattice. To break these covalent bonds very high energy is required. Therefore diamond is the hardest substance and thus can be used as abrasive.

Question 12.
What happens when the following are heated?
a. CaCO3
b. CaCO3 and SiO2
c. CaCO3 and excess of coke.
Answer:
a) CaCO3
CaCO3 decomposes to give CaO and CO2
TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements Group 14 12

b) CaCOs and SiO2
CaO formed after the decomposition of CaCO3 combine with SiO2 forming CaSiO3
CaCO3 → CaO + C02 ↑
CaO + SiO2 → CaSiO3

c) CaCO3 and excess of coke
First CaCO3 decomposes forming CaO and CO2. The CaO react with excess of carbon forming calcium carbide.
CaCO3 → CaO + CO2
CaO + 3C → CaC2 + CO

Question 13.
Why does Na2CO3 solution turn into a suspension, when saturated with CO2 gas?
Answer:
Sodium bicarbonate is sparingly soluble in water due to polymerisation of bicarbonate ions through hydrogen bonds. When CO2 is passed into sodium carbonate it converts into less soluble bicarbonate. So a suspension of sodium bicarbonate forms.
Na2CO3 + H2O + CO2 → 2 Na HCO3

TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements: Group 14

Question 14.
What happens when
a. CO2 is passed through slaked lime
b. CaC2 is heated with N2
Answer:
a. CO2 is passed through slaked lime :
When CO2 is passed through slaked lime turns to milky due to the formation of insoluble CaCO3.
Ca(OH)2 + CO2 → CaCO3 + H2O + CO2

If excess CO2 is passed, the milkyness disappears due to the conversion of in-soluble CaCO3 to soluble Ca(HCO3)2.
CaCO3 + H2O + CO2 → Ca(HCO3)2

b. CaC2 is heated with N2:
On heating CaC2 with N2 calcium cynamide will be formed.
CaC2 + N2 → Ca CN2 + C (graphite)

The mixture calcium cynamide and graphite formed in this reaction is called nitrolim.

Question 15.
Write a note on the anomalous behaviour of carbon in the group-14.
Answer:
Carbon differs from its congeners in the following respects :

  1. Carbon occurs in free state whereas other elements are almost not available in free state.
  2. Carbon has no available d-orbitals in its valence shell while other elements have available d – orbitals.
  3. The maximum covalency of carbon is 4 whereas other elements exhibit a maximum covalency of 6.
  4. Carbon has a very high catenating ability.
  5. Carbon alone can form multiple bonds among themselves.
  6. Carbon forms a large number of hydrides known as hydrocarbons, which are thermally very stable. The other elements form limited number of hydrides which are thermally not very stable.
  7. Reducing nature of carbon is very high while the reducing nature of others is less.
  8. The halogen compounds of carbon are not hydrolysed while the other halogen compounds are readily hydrolysed.

Long Answer Questions

Question 1.
What are silicones? How are they pre-pared? Give one example. What are their uses?
Answer:
Silicones are organo silicon compounds containing (R2 Si – O) as repeating unit. First alkyl or aryl substituted chlorosilanes are prepared. These on hydrolysis followed by condensation, polymerisation gives polymeric silicones. Eg.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements Group 14 11

This reaction continue to give chain polymers. If water molecule is eliminated from the terminal OH groups of same chain cyclic, silicones are formed.

Uses of silicones :

  1. Used in the preparation of silicone rubbers.
  2. Used in the preparation of water-proof clothes and papers.
  3. Used in the preparation of grease, lubricants in aeroplanes.
  4. Used in electrical motors as insulators.
  5. Used in paints and enamels.

Question 2.
Explain the structure of silica. How does it react with a. NaOH and b. HF?
Answer:
Silica is gaint polymeric molecule. Every silicon in silica is in sp³ hybridisation. It is surrounded by 4 oxygen atoms tetrahedrally. Every oxygen is in bond with two silicon atoms.
a) Reaction with NaOH :
On heating with NaOH silica forms sodium silicate called water glass.
2 NaOH + SiO2 → Na2 SiO3 + H2O

b) Reaction with HF:
With HF silica forms SiF4 and H2SiF6
SiO2 + 4 HF → SiF4
SiF4 + 2HF → H2SiF6

Question 3.
Write a note on the allotropy of carbon.
Answer:
The existence of an element in different physical forms by possessing similar chemical properties is known as allotropy.

Carbon has many allotropic forms. They are of both crystalline and amorphous. The crystalline allotropes of carbon are diamond, graphite and fullerenes.

Diamond :
In diamond each carbon atom undergoes sp³ hybridisation and is in bond with four other carbon atoms in a tetrahedral form. This structure extends in space and produces a rigid three dimensional network of carbon atoms. These bonds are present throughout the lattice. To break all these extended bonds large amount of energy is required. So diamonds are very hard and have high melting point. They are used as precious stones, abrasives, cutting tools etc.

Graphite :
It has layered lattice structure in which every carbon is in sp² hybridisation and in bond with three carbon atoms. The carbon atoms are arranged in sheets containing hexagonal rings. The fourth electron is in re bond and delocalised on all the carbon atoms in a sheet. The distance between the layers is 340 pm. They are held together by van der Waals forces. They are slippery in nature. Hence graphite can be used as solid lubricant. Due to delocalised electrons graphite act as a good electrical conduction.

Fullerene :
Fullerene is a crystalline allotrope of carbon. Fullerenes are made by heating graphite in an electrie arc in the presence of inert gas. The soot formed by condensation of vapour of carbon contains mainly C60 fullerene molecules. It is known as Buckminster fullerene. It has soccer ball shape.

C60 fullerene contains 20 six membered rings and 12 five membered rings. A six membered ring is fused with either six membered ring or with five membered ring but a five membered ring is always fused with six membered ring. All carbon atoms in fullerene are in sp² hybridisation and are in bond with three other carbon atoms. The fourth electron of carbon delocalises on all carbon atoms giving aromatic character to fullerene. These are also called bucky balls, in short.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements: Group 14

Question 4.
Write a note on
a. Silicates
b. Zeolites
c. Fullerenes
Answer:
a. Silicates:
Silicates compounds are formed from the orthosilicic acid. All silicates have the basic structural unit SiO4-4 which has tetrahedral structure.

When discrete SiO4-4 unit is present in silicates they are called orthosilicates. Different silicates are formed by joining a number of SiO4-4 units through the corners of SiO4-4 tetrahedron by sharing 1, 2, 3 or 4 oxygen atoms per silicate unit. Thus chain, ring, sheet or three dimensional silicates are formed depending on the number of oxygen atoms shared. Negative charge on the silicate is neutralised by the positive charged metal ions.

b. Zeolites:
Zeolites are three dimensional alumino sili-catesrlf some silicon atoms in three dimensional network silicon dioxide are replaced by aluminium atoms, the alumino silicate formed will have some negative charge. To balance these negative charges some extra cations such as Na+, K+ or Ca2+ will present in these silicates. Examples are ZSM – 5 which is used as a catalyst in direct conversion of alcohols into gasoline. Hydrated zeolites are used as ion exchangers in softening of hard water.

The structure of zeolite permits the formation of cavities of different sizes. Molecules like H2O, NH3, CO2 can be trapped in these cavities. Thus they can serve as molecular sieves.

c. Fullerenes :
Fullerene is a crystalline allotrope of carbon. Fullerenes are made by heating graphite in an electrie arc in the presence of inert gas. The soot formed by condensation of vapour of carbon contains mainly C60 fullerene molecules. It is known as Buckminsterfullerene. It has soccer ball shape.

C60 fullerene contains 20 six-membered rings and 12 five-membered rings. A six membered ring is fused with either six membered ring or with five membered ring but a five membered ring is always fused with six-membered ring. All carbon atoms in fullerene are in sp² hybridisation and are in bond with three other carbon atoms. The fourth electron of carbon delocalises on all carbon atoms giving aromatic character to fullerene. These are also called bucky balls, in short.

TS Inter 1st Year Commerce Study Material Chapter 8 వ్యాపార విత్తం

Telangana TSBIE TS Inter 1st Year Commerce Study Material 8th Lesson వ్యాపార విత్తం Textbook Questions and Answers.

TS Inter 1st Year Commerce Study Material 8th Lesson వ్యాపార విత్తం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న1.
వ్యాపార విత్తము అంటే ఏమిటి ? ఒక వ్యాపార సంస్థలో దీని అవసరాన్ని, ప్రాముఖ్యాన్ని వివరించండి.
జవాబు.
వ్యాపార విత్తము: ఒక వ్యాపార సంస్థను స్థాపించి, దాన్ని కొనసాగించడానికి అవసరమైన విత్తాన్ని “వ్యాపార విత్తం” అంటారు.

  1. వ్యాపార సంస్థ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ద్రవ్య వనరుల సేకరణ, వినియోగము, నియంత్రణ, నిర్వహణకు సంబంధించిన ప్రక్రియను “వ్యాపార విత్తము” అంటారు.
  2. గల్మన్, దగల్ ప్రకారము “వ్యాపారములో ఉపయోగించే నిధుల ప్రణాళికీకరణ, సేకరణ, నియంత్రణ, వాడకాన్నే వ్యాపార విత్తము” అంటారు.
  3. ఓస్ బర్న్ “వ్యాపారములో వాడే నిధుల సేకరణ, వాటిని వాడే ప్రక్రియను వ్యాపార విత్తము” గా నిర్వచించినాడు.

వ్యాపార విత్తము – ఆవశ్యకత: సాధారణముగా వ్యాపారములో స్థిరాస్తుల కొనుగోలుకు, దైనందిన కార్యకలాపాల నిర్వహణకు విత్తము అవసరమవుతుంది. లాభార్జనే ప్రధాన లక్ష్యముగా కలిగిన వ్యాపార సంస్థకు ఈ లక్ష్య సాధన నిమిత్తము ఈ దిగువ తెలిపిన కారణాల వలన విత్తము అవసరమవుతుంది.
1) వ్యాపారం యొక్క స్థిర మూలధన అవసరాలను తీర్చడం కోసం వ్యాపార సంస్థ స్థిరాస్థులను అంటే భూమి, భవనాలు, ప్లాంటు, యంత్రాలు, ఫర్నీచర్, బిగింపులు మొదలైనవి కొనుగోలు చేయడం కోసం విత్తం అవసరమవుతుంది.

TS Inter 1st Year Commerce Study Material Chapter 8 వ్యాపార విత్తం

2) నిర్వహణ మూలధన అవసరాల కోసం: ప్రస్తుత ఆస్తులను కలిగి ఉండటానికి అంటే, సరుకు కొనుగోలు, వేతనాల చెల్లింపులు, రవాణా ఖర్చులు మొదలైన అవసరాల కోసం నిర్వహణా మూలధనం ఉపయోగిస్తారు.

3) వ్యాపార వృద్ధి మరియు విస్తరణకు: వ్యాపారాన్ని వృద్ధి చేయటానికి మరియు విస్తరణకు విత్తం అవసరం. ఉత్పత్తి -పెంచటం కోసం, అదనపు యంత్రాల కొనుగోలు కోసం, పరిశోధన, అభివృద్ధి చేపట్టడం కోసం వ్యాపార విత్తం చాలా అవసరం.

4) నూతన రంగంలోకి ప్రవేశించడం కోసం: ప్రస్తుతం ఉన్న వ్యాపారం కాకుండా ఇతర రంగాలలోకి ప్రవేశించడం కోసం విత్తం అవసరం. ఉదాహరణకి, ఐటిసి సంస్థ పొగాకు సంబంధించిన వ్యాపారం కాకుండా హోటల్ రంగంలోకి ప్రవేశించడం, క్లాస్మేట్ అనే సంస్థ పుస్తకాల రంగం నుంచి ఇతర స్టేషనరీ రంగంలోకి ప్రవేశించడం. ఒక వ్యాపార సంస్థ ఇతర వ్యాపారంలోకి అడుగు పెట్టడం, ఇతర కొత్త కార్యకలాపాలను చేపట్టడాన్ని వ్యాపార వైవిధ్యీకరణ లేదా డైవర్సిఫికేషన్ అంటారు. ఇతర రంగాలలో ఉన్న వ్యాపార అవసరాలను అందిపుచ్చుకోవటానికి ఈ తరహా విస్తరణాన్ని సంస్థలు చేపడతాయి. వీటికోసం అధిక మొత్తంలో వ్యాపార విత్తం అవసరం ఉంటుంది.

5) మనుగడ కోసము: సంస్థ తాను చేపట్టిన వివిధ కార్యక్రమాలను కొనసాగించటం కోసం ‘విత్తం’ అవసరం. విత్తం లేకుండా వ్యాపార సంస్థలు మనుగడను కొనసాగించలేవు.

6) అప్పులు చెల్లించడం కోసం సంస్థ తన బాధ్యతలను అనగా దీర్ఘకాలిక, స్వల్పకాలిక అప్పులను చెల్లించటం కోసం విత్తం అవసరం. ఉదాహరణకి, అప్పుల వాయిదాలను చెల్లించటం, ఋణదాతలకు చెల్లించటం మొదలైనవి.

7) ఖర్చులను చెల్లించటం కోసం: వివిధ ఖర్చులు అంటే జీతాలు, వేతనాలు, పన్నులు, వ్యాపార ప్రకటనలు మరియు అద్దె మొదలైన ఖర్చులను చెల్లించటం కోసం సంస్థలకు విత్తం అవసరం.

8) వ్యాపార ప్రారంభానికి: వ్యాపారాన్ని ప్రారంభించడానికి విత్తము అవసరమవుతుంది. వ్యాపార స్వరూపము, స్వభావాన్ని బట్టి, సాంకేతిక పరిజ్ఞానము బట్టి ఎంత విత్తము అవసరమో తెలుస్తుంది. వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రాథమిక కృషికి విత్తము అవసరము.

9) మరొక వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి లేదా స్వాధీనము చేసుకోవడం కోసము: పోటీని నివారించడానికి, మరింత బలపడడానికి ఒక సంస్థ మరొక సంస్థను స్వాధీనము చేసుకోవడానికి విత్తము అవసరమవుతుంది.

10) వ్యాపారాన్ని కొత్త ప్రదేశానికి తరలించవలసినపుడు ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యాపారాన్ని మరొక కొత్త ప్రదేశానికి మార్చవలసినపుడు, ప్రస్తుతము ఉన్న వ్యాపారాన్ని వేరొక ప్రదేశానికి తరలించవలసి వచ్చినపుడు విత్తము అవసరమవుతుంది.

2. వివిధ విత్త మూలాధారాల ఎంపికను ప్రభావితము చేయు కారకాలను పేర్కొనండి. జవాబు. ఒక సంస్థకు ఆర్థికపరమైన అవసరాలు అనేక రకాలుగా ఉంటాయి. అవి దీర్ఘకాలిక, స్వల్పకాలిక, స్థిర మూలధన, నిర్వహణ మూలధన అవసరాలుగా చెప్పవచ్చును. అందువలన వ్యాపార సంస్థలు వివిధ అవసరాలకు వివిధ విత్త మూలాధారాలను అన్వేషించవలసి ఉంటుంది. స్వల్పకాలిక నిధుల సేకరణ వ్యయము తక్కువ. కాని అనేక కారణాల వలన దీర్ఘకాలిక నిధులు అవసరమవుతాయి. వివిధ విత్త మూలాధారాలను ఎంపిక చేయడానికి క్రింది కారకాలను పేర్కొనవచ్చును.
1) వ్యయము: వ్యయం రెండు రకాలుగా ఉంటుంది. నిధుల సేకరణ వ్యయం, నిధులను ఉపయోగించేటపుడు అయ్యే వ్యయము. ఒక సంస్థ విత్త మూలాధారాలను ఎంపిక చేసేటప్పుడు ఈ రెండు వ్యయాలను లెక్కలోకి
తీసుకొనవలెను.

TS Inter 1st Year Commerce Study Material Chapter 8 వ్యాపార విత్తం

2) ఆర్థిక పటిష్టత, కార్య కలాపాల స్థిరత్వం: సంస్థ ఆర్థిక పటిష్టత నిధుల సేకరణలో కీలకమైనది. వ్యాపార సంస్థ ఆర్థికముగా పటిష్టముగా ఉన్నప్పుడే తీసుకున్న ఋణాలను వడ్డీతో సహా చెల్లించగలదు.

3) వ్యాపార సంస్థ రకం, న్యాయాత్మక స్థితి: ఒక వ్యాపార సంస్థ తరహా నిధులను సేకరించే ఎంపికను ప్రభావితం చేస్తుంది.
ఉదా: భాగస్వామ్య సంస్థ వాటాలను జారీ చేయడం ద్వారా నిధులను సేకరించలేదు. కంపెనీలు మాత్రమే వాటాలను జారీ చేస్తాయి.

4) ఆవశ్యకత, కాలపరిమితి: ఒక వ్యాపార సంస్థకు ఎంత కాలానికి నిధులు అవసరము అవుతాయో ముందుగానే అంచనా వేయగలగాలి.
ఉదా: స్వల్పకాలిక నిధులను తక్కువ వడ్డీరేటుకు వర్తక ఋణం, వాణిజ్య పత్రాల ద్వారా సేకరించవచ్చు. దీర్ఘకాలిక విత్తాన్ని వాటాలు, డిబెంచర్ల జారీ ద్వారా సేకరించవచ్చు.

5) నష్టభయము: వ్యాపార సంస్థ తనకు అందుబాటులో ఉన్న ప్రతి విత్త మూలాధారాన్ని నష్టభయం దృష్ట్యా పరిశీలించవలెను.
ఉదా: ఈక్విటీ వాటాల ద్వారా మూలధనాన్ని సేకరిస్తే నష్ట భయం తక్కువ. మూలధనాన్ని, రద్దు అయితే తప్ప, వాపసు చేయనవసరం లేదు. లాభాలు రాకపోతే డివిడెండ్లు చెల్లించనక్కరలేదు. అదే ఋణ సేకరణ ద్వారా నిధులు సమకూర్చుకుంటే అసలు, లాభ నష్టాలతో ప్రమేయం లేకుండా వడ్డీని చెల్లించాలి.

6) నియంత్రణ: ఒక ప్రత్యేక నిధుల మూలాధారము సంస్థ నిర్వహణపై ఉన్న యాజమాన్య అధికారాన్ని ప్రభావితము చేయవచ్చు. ఈక్విటీ వాటాల జారీ సంస్థ నియంత్రణాధికారాన్ని పలుచన చేస్తుంది.

7) ఆర్థిక పటిష్టతపై ప్రభావము: వ్యాపార సంస్థ కొన్ని రకాల విత్త వనరులపై ఆధారపడినపుడు మార్కెట్లో ఆ సంస్థ ఆర్థిక పటిష్టతపై ప్రభావాన్ని చూపుతుంది.
ఉదా: హామీగల డిబెంచర్లను జారీచేస్తే, హామీలేని ఋణదాతలకు కంపెనీ పట్ల ఆసక్తి తగ్గి, పరపతిని పొడిగించడానికి ఇష్టపడకపోవచ్చు.

8) సరళత, సౌలభ్యము: వ్యాపార సంస్థలు ఆర్థిక సహాయక సంస్థల నుంచి ఋణాలు పొందడానికి ఎన్నో నిబంధనలు, లాంఛనాలను పూర్తి చేయవలసి ఉంటుంది.
ఉదా: బ్యాంకుల నుంచి ఋణాలు పొందడానికి ఎన్నో నియమాలు పాటించవలసి ఉంటుంది. ఇతరుల నుంచి ఋణాలను తేలికగా పొందడానికి సౌలభ్యము ఉంటే వాణిజ్య బ్యాంకుల కంటే ఇతర విత్త వనరులను ఎన్నుకోవచ్చు.

9) పన్ను ప్రయోజనాలు: పన్ను ఆదాలను దృష్టిలో ఉంచుకొని నిధులు ఆధారాలను ఎంపిక చేసేటప్పుడు కొన్ని మూలాలు మనకు అందుబాటులో ఉండవచ్చు.
ఉదా: ఆధిక్యపు వాటాలపై డివిడెండు పన్ను నుంచి మినహాయించలేము. కాని డిబెంచర్ల వడ్డీ చెల్లింపును పన్ను నుంచి మినహాయించవచ్చును.

TS Inter 1st Year Commerce Study Material Chapter 8 వ్యాపార విత్తం

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న1.
ఒక వ్యాపార సంస్థకు అవసరమైన వివిధ రకాల మూలధనాన్ని పేర్కొనండి.
జవాబు.
వ్యాపార సంస్థ ప్రారంభించడానికి విత్తము అవసరమవుతుంది. దీనినే మూలధనం అంటారు. మూలధనము ఎంత అవసరము అవుతుంది అనేది వ్యాపార సంస్థ యొక్క స్వభావము, పరిమాణాన్ని బట్టి ఉంటుంది. మూలధనమును రెండు రకాలుగా విభజించవచ్చును. అవి: 1. స్థిర మూలధనము 2. నిర్వహణ మూలధనము.
1) స్థిర మూలధనము:

  1. ఒక వ్యాపార సంస్థ స్థాపనకు స్థలము, భవనాలు, యంత్రాలు, ప్లాంటు మొదలైన స్థిరాస్తులను సేకరించడానికి ఉపయోగించే మూలధనమును స్థిర మూలధనము అంటారు.
  2. ఇలాంటి మూలధనము లేకుండా సంస్థ వ్యాపారాన్ని నిర్వహించలేదు. వ్యాపార సంస్థ తన దీర్ఘకాలిక అవసరాలకు సేకరించే మూలధనమే స్థిర మూలధనము.
  3. స్థిర మూలధన పరిమాణము వ్యాపార సంస్థ స్వభావము, కార్యకలాపాలు, ఉత్పత్తి విధానము మొదలైన వాటిమీద ఆధారపడి ఉంటుంది. భారీ పరిశ్రమలకు స్థిర మూలధనము పెద్ద మొత్తములోను, వ్యాపారము చేసే దుస్తుల పంపిణీ సంస్థలో తక్కువ మొత్తములో అవసరము ఉంటుంది.

2) నిర్వహణ మూలధనము:
1) ఒక వ్యాపార సంస్థ తన రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి అంటే ముడిపదార్థాల కొనుగోలు, వేతనాల చెల్లింపు, ఆఫీసు నిర్వహణ ఖర్చులు, స్వల్పకాలిక పెట్టుబడులు, ఋణగ్రస్తులు, సరుకు నిల్వ, వసూలు బిల్లుల వంటి స్వల్పకాలిక ఆస్తులలో పెట్టుబడి పెట్టిన మూలధనాన్ని నిర్వహణ మూలధనము
అంటారు.

2) ప్రస్తుత ఆస్తులలో పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని సంవత్సరములోపు నగదు రూపములో తిరిగి పొందే అవకాశమున్నది. ఈ నిర్వహణ మూలధన పరిమాణము అన్ని వ్యాపార సంస్థలకు ఒకే మాదిరిగా ఉండదు. ఆయా సంస్థల అమ్మకాల టర్నోవర్, నగదు అమ్మకాలు, అమ్మకాల పరిమాణము వంటి అంశాలనాధారముగా ఎక్కువ లేదా తక్కువ నిర్వహణ మూలధనం అవసరమవుతుంది.

ప్రశ్న 2.
వ్యాపార విత్తమూలాల వర్గీకరణను వివరించండి.
జవాబు.
1) కాల వ్యవధి ఆధారముగా: కాల వ్యవధి ఆధారముగా విత్తాన్ని సేకరించడానికి దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక వ్యవధిగా విభజించవచ్చు.
ఎ) దీర్ఘకాలిక విత్తము: దీర్ఘకాలిక అవసరాలకు వినియోగించే నిధులను దీర్ఘకాలిక మూలధనము అంటారు. దీని కాలపరిమితి 5 సంవత్సరాలకు మించి ఉంటుంది. సేకరించడానికి వనరులు –

  • వాటాలు, డిబెంచర్ల జారీ
  • దీర్ఘకాలిక ఋణాలు
  • ఆర్థిక సంస్థల నుంచి ఋణాలు
  • నిలిపి ఉంచిన ఆర్జనలు, ప్రభుత్వ గ్రాంట్లు.

బి) మధ్యకాలిక విత్తము: ఒక సంవత్సరము నుంచి ఐదు సంవత్సరాల కాలపరిమితితో సేకరించే నిధులను మధ్యకాలిక విత్తము అంటారు. వీటిని ఈ క్రింది వనరుల నుంచి సేకరించవచ్చును.

  • వాణిజ్య బ్యాంకులు
  • పబ్లిక్ డిపాజిట్లు
  • లీజు విత్తము
  • ఆర్థిక సంస్థల నుంచి ఋణాలు

సి) స్వల్పకాలిక విత్తము: ఈ తరహా విత్తాన్ని స్వల్పకాలము అంటే ఒక సంవత్సరములోపు అవసరాల నిమిత్తం సేకరిస్తారు. ఈ విత్తాన్ని సేకరించడానికి వనరులు

  • వాణిజ్య బ్యాంకుల నుంచి ఋణాలు
  • వాయిదా ఋణాలు
  • ఖాతాదారుల నుంచి అడ్వాన్సులు
  • వాణిజ్య పత్రాలు

2. యాజమాన్యము ఆధారముగా: నిధులపై యాజమాన్యపు హక్కు ఆధారము రెండు రకాలు.
ఎ. యాజమాన్యపు నిధులు
బి. ఋణాత్మక నిధులు

ఎ) యాజమాన్యపు నిధులు: దీనిలో యజమానుల మూలధనమే కాకుండా నిలిపి ఉంచిన ఆర్జనలు కూడా చేరి
ఉంటాయి.
బి) ఋణపూర్వక నిధులు: ఋణాల ద్వారా సమకూర్చుకునే నిధులు. వీటికి మూలాలు వాణిజ్య బ్యాంకుల నుంచి, ఆర్థిక ద్రవ్య సహాయక సంస్థల నుంచి ఋణాలు, డిబెంచర్ల జారీ, పబ్లిక్ డిపాజిట్లు, వర్తకపు ఋణాలు.

3. విత్తము ఉత్పన్నమయ్యే మూలాల ఆధారముగా: మూలధన వనరులు అంతర్గత లేదా బహిర్గత మూలాల నుంచి లభించవచ్చు. అంతర్గత మూలాలు అంటే సంస్థలోనే లభ్యమయ్యేవి. లాభాల పునరాకర్షణ, నిలిపి ఉంచిన ఆర్జనలు, వసూలు బిల్లులపై వసూళ్ళు, మిగిలిన సరుకు అమ్మివేయడం, నిధులను వెనుకకు మళ్ళించడం లేదా నిధుల తగ్గింపు.

TS Inter 1st Year Commerce Study Material Chapter 8 వ్యాపార విత్తం

బహిర్గత మూలాలు అంటే సంస్థ వెలుపలి నుంచి లభ్యమయ్యే వనరులు.
ఉదా: వాటాలు, డిబెంచర్లు, పబ్లిక్ డిపాజిట్లు, వాణిజ్య బ్యాంకులు, ద్రవ్య సహాయక సంస్థల నుంచి ఋణాలు, సరుకు సరఫరాదారులు అందించే వర్తక ఋణము, పెట్టుబడిదారులు, ఋణదాతలు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వ్యాపార విత్తము
జవాబు.

  1. ఒక వ్యాపార సంస్థ తన లక్ష్యాలను సాధించడానికి వ్యాపార కార్యకలాపాల నియంత్రణ, నిర్వహణకు అవసరమైన విత్తాన్ని “వ్యాపార విత్తం” అంటారు.
  2. వ్యాపార సంస్థకు అవసరమైన మూలధనాన్ని సేకరించి, భద్రపరిచి, నిర్వహించి తద్వారా లాభార్జన లక్ష్యాన్ని సాధించుటకు సంబంధించిన కార్యకలాపాలను వ్యాపార విత్తము అంటారు.
  3. ఒక వ్యాపారము ప్రారంభించడానికి, విస్తరణకు, మార్కెట్ తన వాటాను పంచుకొనడానికి ప్రతి సంస్థకు విత్తము అవసరము.

ప్రశ్న 2.
స్థిర మూలధనము
జవాబు.

  1. ఒక వ్యాపార సంస్థ స్థాపనకు స్థలము, భవనాలు, యంత్రాలు, ప్లాంటు మొదలైన స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగించే మూలధనమును “స్థిర మూలధనము” అంటారు.
  2. ఇలాంటి మూలధనం లేకుండా సంస్థ వ్యాపారాన్ని నిర్వహించలేదు, మనుగడను సాగించలేదు. వ్యాపార సంస్థ తన దీర్ఘకాలిక అవసరాలకు సేకరించే మూలధనమే స్థిర మూలధనము.
  3. స్థిర మూలధన పరిమాణము వ్యాపార సంస్థ స్వభావము, కార్యకలాపాలు, ఉత్పత్తి విధానము మొదలైన వాటి మీద ఆధారపడి ఉంటుంది. భారీ పరిశ్రమలకు స్థిర మూలధనము పెద్ద మొత్తములోనూ, వ్యాపారము చేసే సంస్థలో తక్కువ మొత్తములో అవసరమవుతుంది.

ప్రశ్న 3.
నిర్వహణ మూలధనము
జవాబు.

  1. వ్యాపార సంస్థ రోజువారీ వివిధ రకాల ఖర్చులను చెల్లించుటకు అవసరమైన మూలధనాన్ని “నిర్వహణ మూలధనం” లేదా “చర మూలధనం” అంటారు.
  2. ఒక వ్యాపార సంస్థ తన రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి అంటే ముడిపదార్థాల కొనుగోలు, వేతనాల చెల్లింపు, ఆఫీసు నిర్వహణ ఖర్చులు, స్వల్పకాలిక పెట్టుబడులు, సరుకు మొదలైన స్వల్పకాలిక ఆస్తులలో పెట్టుబడి పెట్టిన మూలధనాన్ని నిర్వహణ మూలధనము అంటారు.
  3. ఈ నిర్వహణ మూలధన పరిమాణము అన్ని సంస్థలలో ఒకే మాదిరిగా ఉండదు. ఆయా సంస్థల అమ్మకాల టర్నోవర్, నగదు అమ్మకాలు, అమ్మకాల పరిమాణాన్నిబట్టి ఎక్కువ లేదా తక్కువ నిర్వహణ మూలధనము అవసరమవుతుంది.

ప్రశ్న 4.
దీర్ఘకాలిక విత్తము
జవాబు.

  1. దీర్ఘకాలిక అవసరాలకు వినియోగించే నిధులను దీర్ఘకాలిక మూలధనము అంటారు. దీని కాలపరిమితి 5 సంవత్సరాలకు మించి ఉంటుంది.
  2. దీర్ఘకాలిక విత్తమును సేకరించడానికి వనరులు:
    • వాటాలు, డిబెంచర్ల జారీ
    • దీర్ఘకాలిక ఋణాలు
    • ఆర్థిక సంస్థల నుంచి ఋణాలు
    • నిలిపి ఉంచిన ఆర్జనలు
    • ప్రభుత్వ గ్రాంట్లు.

TS Inter 1st Year Commerce Study Material Chapter 8 వ్యాపార విత్తం

ప్రశ్న 5.
స్వల్పకాలిక విత్తము.
జవాబు.

  1. స్వల్ప కాలానికి అంటే ఒక సంవత్సరము లోపు అవసరాల నిమిత్తము సేకరించిన విత్తాన్ని స్వల్పకాలిక విత్తము అంటారు.
  2. ఈ విత్తాన్ని సేకరించడానికి వనరులు:
    • వాణిజ్య బ్యాంకుల నుంచి ఋణాలు
    • వాయిదా పరపతి
    • ఖాతాదారుల నుంచి అడ్వాన్సులు
    • వాణిజ్య పత్రాలు

ప్రశ్న 6.
అంతర్గత విత్త మూలాధారాలు.
జవాబు.

  1. అంతర్గత మూలాలు అంటే సంస్థలోనే లభ్యమయ్యే వనరులు.
  2. అవి:
    • లాభాల పునరాకర్షణ
    • నిలిపి ఉంచిన ఆర్జనలు
    • వసూలు బిల్లులపై వసూళ్ళు
    • మిగిలిన సరుకు అమ్మకాలు
    • నిధులను వెనక్కి మళ్ళించడం లేదా నిధుల తగ్గింపు.

ప్రశ్న 7.
బహిర్గత నిధులకు మూలాలు
జవాబు.

  1. సంస్థ వెలుపలి నుంచి లభించే వనరులను బహిర్గత వనరులు అంటారు.
  2. ఉదాహరణలు:
    • వాటాలు
    • డిబెంచర్లు
    • పబ్లిక్ డిపాజిట్లు
    • వాణిజ్య బ్యాంకులు
    • ద్రవ్య సహాయక సంస్థలు
    • సరుకు సప్లయిదారులకు అందించే ఋణం
    • పెట్టుబడిదారులు
    • ఋణదాతలు

TS Inter 1st Year Commerce Study Material Chapter 8 వ్యాపార విత్తం

అదనపు ప్రశ్న

ప్రశ్న 1.
మధ్యకాలిక విత్తం.
జవాబు.

  1. ఒక సంవత్సరం నుంచి 5 సంవత్సరాలలోపు కాలపరిమితితో సేకరించే నిధులను మధ్యకాలిక విత్తం అంటారు.
  2. ఉదాహరణలు: వాణిజ్య బ్యాంకుల నుండి ఋణాలు, పబ్లిక్ డిపాజిట్లు, కౌలు ద్వారా విత్తాన్ని సమూర్చటం, ఆర్థిక సంస్థల నుండి రుణాలు.

TS Inter 1st Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 11th Lesson ప్రభుత్వాంగాలు Textbook Questions and Answers.

TS Inter 1st Year Political Science Study Material 11th Lesson ప్రభుత్వాంగాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ద్విశాసనసభ నిర్మాణాన్ని వివరిస్తూ, శాసనసభ విధులను తెలపండి.
జవాబు.
శాసన శాఖ ఏకశాసనసభ లేదా ద్విశాసనసభా. విధానాన్ని కలిగి వుండవచ్చు. ఏక శాసనసభా విధానంలో ఒకే. సభ వుంటే ద్విశాసనసభా విధానంలో రెండు సభలుంటాయి. వీటిని దిగువ సభ, ఎగువ సభలుగా పేర్కొనవచ్చు.

దిగువ సభ ప్రజల మనోభావాలకు తార్కాణం కాగా, ఎగువ సభ అన్ని రాష్ట్రాల ప్రయోజనాలకు అద్దం పట్టే విధంగా ఉంటుంది. ఉదాహరణకు భారత పార్లమెంటులో రాజ్యసభ ఎగువ సభ కాగా లోక్సభ దిగువ సభగా వుంది.

శాసనసభ విధులు :
ప్రజల అభిమతాన్ననుసరించి చట్టాలు రూపొందించడమే శాసనసభ ప్రధాన విధి. ఆధునిక సభలు చట్ట నిర్మాణంతోపాటు కొన్ని పాలనా విధులను న్యాయ విధులను కూడా నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ రూపాలను బట్టి కూడా శాసనసభ విధులు ఆధారపడి ఉంటాయి. అధ్యక్ష ప్రభుత్వ వ్యవస్థలో శాసనసభ పాత్ర పరిమితంగా ఉంటుంది.

పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థలో శాసనసభ పాత్ర విస్తృతంగా ఉంటుంది. శాసనసభ విధులను కింది శీర్షికల కింద వివరించవచ్చు. శాసన నిర్మాణం, కార్యనిర్వాహక వర్గంపై నియంత్రణ, ఆర్థిక సంబంధ విధులు, రాజ్యాంగ విధులు, ఇతర విధులు.

శాసన నిర్మాణం :
శాసన నిర్మాణం శాసనసభ ప్రాథమిక విధి. ప్రజల అభిమతాలను గుర్తించి వాటికనుగుణంగా శాసనాలు చేయడమే శాసనసభ ముఖ్య కర్తవ్యం. కొత్త చట్టాలను చేయడానికి, కాలదోషం పట్టిన చట్టాలను మార్పు చేయడానికి, రద్దు చేయడానికి శాసనసభకు అధికారం ఉంది. శాసనాలు చేయడమేకాక వివిధ విషయాల మీద, వివరంగా చర్చలు జరపడం, సమాలోచనలు చేయడం కూడా శాసనసభ విధి. ప్రతి బిల్లు శాసనంగా ఆమోదం పొందే ముందు శాసనసభ దానికి సంబంధించిన అన్ని అంశాలను విపులంగా చర్చిస్తుంది.

కార్య నిర్వాహక వర్గంపై నియంత్రణ :
పార్లమెంటరీ ప్రభుత్వ విధానంలో మంత్రి మండలి శాసనసభకు బాధ్యత వహిస్తుంది. దేశంలో తలెత్తే సమస్యల గురించి, వాటి పరిష్కారాలను గురించి వివిధ తీర్మానాల ద్వారా, ప్రశ్నోత్తరాల సమయం ద్వారా మంత్రి వర్గంపై శాసన సభ అజమాయిషీ చేస్తుంది. అవసరమైతే ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగిస్తుంది.

ఆర్థిక సంబంధం విధులు :
ప్రజాస్వామ్య దేశంలో శాసనసభకు ఉండే ఆర్థిక విధులు ముఖ్యమైనవి. శాసనసభ వివిధ పద్దుల కింద ఆదాయ వ్యయాలను బడ్జెట్ రూపంలో ఆమోదిస్తుంది. ప్రభుత్వం ఎంత ఆదాయాన్ని ఏ పద్దుల కింద ఖర్చుపెట్టాలో శాసనసభ నిర్ణయిస్తుంది. శాసనసభ అనుమతి లేకుండా కొత్త పన్నులను విధించరాదు. ఉన్న పన్నులను రద్దు చేయరాదు.

న్యాయ సంబంధ విధులు :
శాసన సభలు ముఖ్యంగా ఎగువ సభలు న్యాయ సంబంధిత విధులను కూడా. నిర్వహిస్తాయి. ఇంగ్లాండులో ప్రభువుల సభ అత్యున్నత న్యాయ స్థానంగా పనిచేస్తుంది. అమెరికా, ఇండియాలో రాష్ట్రపతిపైన సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయ మూర్తులపై వచ్చే అభియోగాలను జాతీయ శాసనసభలు విచారిస్తాయి. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలను శాసనసభ ప్రత్యేక కమిటీల ద్వారా విచారణ జరుపుతుంది. ప్రత్యేక సభాహక్కులు అతిక్రమించినవారిని దండించడానికి కూడా శాసనసభకు అధికారం ఉంది.

రాజ్యాంగ విధులు :
సాధారణ శాసనాలు చేయడమే కాకుండా శాసనసభలకు రాజ్యాంగాన్ని మార్చే అధికారం కూడా ఉంటుంది. దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా మౌలిక శాసనమైన రాజ్యాంగంలో అవసరమైన మార్పులు చేయడానికి చట్టసభలకు అధికారం ఉంది.

ఇతర విధులు :
పై విధులతోపాటు శాసనసభకు మరొకొన్ని విధులు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని ఇవి :

  1. ప్రభుత్వం ప్రకటించే ఆర్డినెన్సులను ఆమోదించడం లేదా తిరస్కరించడం.
  2. సభాధ్యక్షులను ఎన్నుకోవడం.
  3. ప్రభుత్వ వ్యవహారాలను దర్యాప్తు చేయడానికి అవసరమైన కమిటీలను నియమించడం.
  4. సభా కార్యక్రమాలకు సంబంధించిన నియమాలను రూపొందించడం.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

ప్రశ్న 2.
కార్యనిర్వాహక శాఖ అంటే ఏమిటి ? కార్యనిర్వాహకశాఖ విధులను తెల్పండి.
జవాబు.
పరిచయం :
ప్రభుత్వ నిర్మాణంలో కార్యనిర్వాహకశాఖ అతిముఖ్యమైన రెండవ అంగం. రాజ్య విధానాలను అమలుపరచడంలో కార్యనిర్వాహకశాఖ ముఖ్య సాధనంగా ఉపయోగపడుతుంది. కార్యనిర్వాహకశాఖ అంటే రాజ్యాధిపతులు, వారి మంత్రులు, సలహాదారులు, పరిపాలనాశాఖాధిపతులు కలిసికట్టుగా కార్యనిర్వాహక వర్గంగా ఏర్పడతారు.

కార్యనిర్వాహకశాఖ విధులు (Functions of Executive) :
ఆధునిక రాజ్యాలలో కార్యనిర్వాహకశాఖ పలురకాల విధులు నిర్వహిస్తుంది. సైద్ధాంతికంగా, ఈ శాఖ శాసననిర్మాణశాఖ రూపొందించిన చట్టాలను అమలుపరుస్తుంది. అయితే ఆయా ప్రభుత్వ రూపాలను బట్టి ఈ శాఖ నిర్వహించే విధుల్లో మార్పు ఉంటుంది. సాధారణంగా కార్యనిర్వాహకశాఖ ఈ కింది విధులను నిర్వహిస్తుంది.

1. పాలనాపరమైన విధులు (Administrative Functions) :

  • చట్టాలను, న్యాయశాఖ తీర్పులను అమలుపరచడం,
  •  శాంతిభద్రతలను కాపాడటం,
  • విధివిధానాలను రూపొందించడం,
  • సివిల్ సర్వెంట్స్ నియామకం, పదోన్నతి, తొలగింపు (ఉద్యోగంలో నుండి తొలగించడం) మొదలైన విధులు.

2. దౌత్యపరమైన విధులు (Diplomatic Functions) :
కార్యనిర్వాహకశాఖ విదేశీ సంబంధాలను నెరపడము, విదేశాల్లో దౌత్యాధికారులను నియమించడం, దౌత్య వ్యవహారాలను చక్కబెట్టడం, అదే విధంగా, దేశాల మధ్య జరిగే చర్చా సమాలోచనలను, అంతర్జాతీయ ఒప్పందాలను, సదస్సు తీర్మానాలను అమలుపరచడం. అయితే, ఈ చర్యలన్నింటిని శాసన నిర్మాణశాఖ ధృవపరచవలసి ఉంటుంది.

3. సైనికపరమైన విధులు (Military Functions) :
ప్రపంచ దేశాలలోని అనేక రాజ్యాలలో ముఖ్య కార్యనిర్వహణాధిపతి రక్షణశాఖకు అత్యున్నత దేశాధికారిగా ఉంటాడు. ఇతర దేశాలతో యుద్ధాన్ని గాని, లేదా శాంతి సంధినిగాని కార్యనిర్వాహకశాఖ ప్రకటించవచ్చు. అదే విధంగా అత్యవసర సమయాల్లో ఈ శాఖ దేశవ్యాప్తంగా మార్షల్ లా (Martial Law)ను విధించి పౌరుల హక్కులను సైతం రద్దు చేయవచ్చు.

4. ఆర్థికపరమైన విధులు (Financial Functions):
కార్యనిర్వాహకశాఖ కొన్ని ఆర్థికపరమైన విధులను కూడా నిర్వహిస్తుంది. అవి వరుసగా, ఈ శాఖ వార్షిక ఆదాయ వ్యయపట్టికను ఎంతో జాగరూకతతో తయారుచేస్తుంది. వివిధ రకాల రూపాలలో వచ్చే ప్రభుత్వ రాబడులను గుర్తించేందుకు కృషిచేస్తుంది. పన్నుల వసూళ్ళకు కావలసిన యంత్రాంగాన్ని ఏర్పరుస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

5. న్యాయపరమైన విధులు (Judicial Functions) :
అనేక రాజ్యాలలో కార్యనిర్వాహకశాఖ ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల నియామకంతోపాటు వారిని బదిలీ చేయడం వంటి విధులను నిర్వహిస్తుంది. అదే విధంగా దోషులుగా నిర్ధారించబడ్డ వారి శిక్షలను తగ్గించడం లేదా తొలగించడం, రద్దుచేయడం వంటి విధులను సైతం ఈ శాఖ చేపడుతుంది. అయితే ఇలాంటి అధికారాన్ని కొన్ని ప్రత్యేక సమయాలలో మాత్రమే వినియోగిస్తుంది.

6. రాజ్యాంగపరమైన విధులు (Constitutional Functions) :
చాలా దేశాల్లో కార్యనిర్వాహకశాఖ రాజ్యాంగ సవరణలకు సంబంధించి శాసననిర్మాణశాఖకు సలహాదారుగా వ్యవహరిస్తుంది. రాజ్యాంగ సూత్రాలను అమలుపరిచే క్రమంలో సమస్యలు ఉత్పన్నమైనట్లయితే వాటిని అధిగమించి ప్రగతిని సాధించడానికి రాజ్యాంగ సవరణలు అవసరమని భావించినట్లయితే వాటిని చేయవలసిందిగా శాసననిర్మాణ శాఖకు విన్నవిస్తుంది.

అలాంటి చర్యలు చేపట్టవలసిన ఆవశ్యకతను తెలియజేయడానికి ముందస్తు సర్వేలు నిర్వహించి వాటి నివేదికలను పార్లమెంటుకు సమర్పిస్తుంది. ఈ సందర్భంగా, కార్యనిర్వాహకశాఖ శాసనసభ్యుల మద్దతును కూడగట్టి తగిన రాజ్యాంగ సవరణలను చేస్తుంది.

7. ఆర్డినెన్స్ల జారీ (Promulgation of Ordinances) :
అనేక రాజ్యాలలో కార్యనిర్వాహకశాఖ ఆర్డినెన్స్లను జారీ చేస్తుంది. క్లిష్టమైన సమస్యలను అత్యవసరంగా పరిష్కరించడానికి ఈ తరహా బాధ్యతలను అది నిర్వహిస్తుంది. శాసనసభల సమావేశం జరిగేంతవరకు ఈ ఆర్డినెన్స్లు అమలులో ఉంటాయి.

అంతేకాకుండా నియోజిత శాసనం (delegated legislation) అనేది శాసననిర్మాణశాఖ తరపున చట్టాలను రూపొందించేందుకు కార్యనిర్వాహక శాఖకు వీలు కల్పిస్తుంది. శాసన సభ్యులు కొన్ని బిల్లులను సంపూర్ణమైన వివరాలతో తయారు చేసేందుకు కార్యనిర్వాహకశాఖకు అధికారమిచ్చేందుకు తమ సమ్మతిని తెలియజేస్తారు.

8. సంక్షేమ విధులు (Welfare Functions) :
నేడు అనేక రాజ్యాలు సంక్షేమ దృక్పథాన్ని కలిగి ఉన్నాయి. తద్వారా ప్రజాసంక్షేమంలో వాటి కర్తవ్యాలు నానాటికి విశేషంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా, సంక్షేమంలో పూర్తిగా విస్మరించబడ్డ వర్గాలు, నిరాకరించబడ్డ, కనీస సౌకర్యాలకు కూడా నోచుకోని ప్రజలను ఉద్దేశించి శాసనాలను రూపొందించి అమలుపరుస్తుంది. ఫలితంగా ఈ శాఖ అనేక బహుళ విధులను, చర్యలను చేపడుతుంది.

9. పాలనాపరమైన న్యాయనిర్ణయ విధులు (Administrative Adjudication Functions) :
అనేక సందర్భాలలో పరిపాలనకు సంబంధించిన కేసులలో, వివాదాలలో కార్యనిర్వాహక శాఖ పాలనాపరమైన న్యాయనిర్ణేతగా ప్రముఖపాత్రను నిర్వహిస్తుంది. ఇలాంటి చర్యలను చేపట్టడం ద్వారా ఈ శాఖ కొన్ని న్యాయ సంబంధమైన అధికారాలను సైతం కలిగి ఉందని చెప్పవచ్చు.

10. అత్యవసర కార్యక్రమాలు (Emergency Operations):
శాంతి భద్రతలు క్షీణించడం, ప్రకృతివైపరీత్యాలు, విదేశీ చొరబాట్లు లేదా మరే విధమైన అత్యవసర పరిస్థితులు వివిధ సమయాలలో వివిధ ప్రాంతాలలో ఉత్పన్నమైనట్లయితే వాటిని చక్కబెట్టే బాధ్యతను కార్యనిర్వాహకశాఖ చేపడుతుంది.

గతకొన్ని సంవత్సరాల నుంచి అనేక దేశాలలో తీవ్రవాదం ఒక ప్రధాన సమస్యగా పరిణమించింది. ఇలాంటి సమస్యలను కార్యనిర్వాహకశాఖ సందర్భానుసారంగా, సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. మరే ఇతర ప్రభుత్వ అంగం కూడా ఇలాంటి పరిస్థితులను చక్కబెట్టలేదు.

11. ఇతర విధులు (Miscellaneous Functions) :
ప్రభుత్వానికి కార్యనిర్వాహకశాఖ నాయకత్వాన్ని అందిస్తుంది. శాసననిర్మాణ శాఖ, అధికారంలో ఉన్న పార్టీతోపాటుగా మొత్తం జాతికి నాయకత్వం వహిస్తుంది. ఈ శాఖ రాజ్యానికి నాయకత్వాన్ని అందిస్తూ అంతర్జాతీయ సదస్సులు, సంస్థల కార్యకలాపాలలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

ప్రశ్న 3.
న్యాయశాఖను వివరించి దాని విధులను చర్చించండి.
జవాబు.
ప్రభుత్వాంగాలలో న్యాయశాఖ మూడవది, ఇది శాసనాలను వ్యాఖ్యానిస్తుంది. అవి న్యాయసమ్మతంగా ఉన్నదీ, లేనిదీ నిర్ణయిస్తుంది. “పక్షపాతరహితంగా ప్రజలకు న్యాయం చేకూర్చడంపై దేశ శ్రేయస్సు, ప్రభుత్వ సామర్థ్యం ఆధారపడి ఉంటాయని” లార్డ్ బ్రైస్ అభిప్రాయం. న్యాయస్థానాలు న్యాయశాఖలో భాగం.

న్యాయశాఖ ప్రజాస్వామ్యంలో ప్రజల స్వేచ్ఛను రక్షిస్తుంది. ప్రభుత్వం రాజ్యాంగ పరిధిలో పనిచేసేటట్లు చూస్తుంది. ఆధునిక కాలంలో అనేక విధులను నిర్వహిస్తున్నది. ప్రజల హక్కులను కాపాడి, శాసనాలను వ్యాఖ్యానించి, న్యాయం చేయడమే న్యాయస్థానాల ముఖ్య కర్తవ్యం.

విధులు :
1. శాసనాలను వ్యాఖ్యానించడం :
శాసనశాఖ చేసిన శాసనాలకు అర్థవివరణ ఇవ్వడం న్యాయశాఖ ప్రధాన కర్తవ్యం. న్యాయమూర్తులు చట్టాలను వ్యాఖ్యానించి, వివిధ అంశాలపై తమ నిర్ణయాలు తెలుపుతారు. శాసనాల అభివృద్ధికి న్యాయస్థానాలు పరోక్షంగా దోహదం చేస్తాయి.

2. రాజ్యాంగ రక్షణ :
రాజ్యాంగ రక్షణ చేసి, దాని మౌలిక స్వరూపానికి భంగం లేకుండా చూడవలసిన బాధ్యత న్యాయస్థానాలకు ఉంది. శాసనశాఖ చేసే చట్టాలను రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే వాటిని చెల్లవని కొట్టివేసే “న్యాయసమీక్షాధికారం” న్యాయస్థానాలకు ఉంది.

3. హక్కుల రక్షణ :
న్యాయస్థానాలు ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడతాయి. ప్రజాస్వామ్యంలో పౌరుల హక్కులకు భంగం కలిగితే వారు న్యాయస్థానాల ద్వారా వాటిని రక్షించుకుంటారు. వ్యక్తి స్వేచ్ఛను రక్షించడానికి హెబియస్ కార్పస్ వంటి రిట్లు (writs) జారీచేసే అధికారం న్యాయస్థానాలకు ఉంది.

4. సమాఖ్య సమతౌల్యత:
సమాఖ్యలో న్యాయశాఖ అత్యంత కీలక పాత్రను పోషిస్తుంది. న్యాయశాఖ కేంద్రం రాష్ట్రాల మధ్యగాని, పలు రాష్ట్రాల మధ్యగానీ తలెత్తే వివాదాలను పరిష్కరిస్తుంది. కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ పరిమితులను దాటకుండా ఇది చూస్తుంది.

5. సలహారూపక విధులు :
కార్యనిర్వాహక లేదా శాసననిర్మాణశాఖల కోరిక మేరకు న్యాయశాఖ తగిన సలహాలిస్తుంది.
ఉదా : భారత రాష్ట్రపతి రాజ్యాంగపర చట్టాలకు సంబంధించి ఏదైనా సందేహం ఉత్పన్నమైనట్లయితే, భారత సుప్రీంకోర్టు సలహాను తీసుకోవచ్చు. ఇంగ్లాండులో ఇలాంటి సలహా సంప్రదింపులు జరపడం సర్వసాధారణం. చట్టానికి సంబంధించిన ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు బ్రిటీష్ రాణి ప్రివీకౌన్సిల్ న్యాయ కమిటీల సలహాలను తీసుకుంటుంది.

6. అప్పీళ్ళ విచారణ పరిధి :
కింది కోర్టులు ఇచ్చిన తీర్పులపై అత్యున్నత కోర్టు అప్పీళ్లను స్వీకరిస్తుంది. కింది కోర్టులు వెలువరించిన తీర్పులను అన్నివేళల పునఃసమీక్షిస్తుంది. కొన్ని సందర్భాలలో వాటికి వ్యతిరేకంగా కూడా తీర్పులను వెలువరిస్తుంది.

7. రికార్డుల నిర్వహణ :
న్యాయశాఖ తన తీర్పులకు సంబంధించిన రికార్డులతోపాటు ఇతర కేసులకు సంబంధించిన రికార్డులను సైతం భద్రపరుస్తుంది. సదరు రికార్డులు భవిష్యత్తులో న్యాయవాదులకు, న్యాయమూర్తులకు అదే తరహా కేసులు వాదించడానికి లేదా తీర్పులు వెలువరించడానికి ప్రాతిపదికగా ఉపయోగపడతాయి.

8. రాజ్యాధిపతిగా వ్యవహరించడం :
అత్యున్నత న్యాయస్థానాలలోని ప్రధాన న్యాయమూర్తి కొన్ని ప్రత్యేక సందర్భాలలో కొన్ని దేశాలలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఆయా స్థానాలలో లేనప్పుడు రాజ్యాధిపతిగా వ్యవహరిస్తాడు.

9. పరిపాలనా విధులు :
సుప్రీంకోర్టు, హైకోర్టులు కొన్ని పరిపాలనాపరమైన విధులను నిర్వహిస్తాయి. ఉన్నత న్యాయస్థానాలు కింది న్యాయస్థానాల న్యాయమూర్తుల నియామకంలో కార్యనిర్వాహక అధిపతికి సలహా ఇస్తాయి. అదే విధంగా అవి కింది న్యాయస్థానాల పనితీరును పర్యవేక్షిస్తాయి. ఉదా : భారతదేశంలోని హైకోర్టులు తమ పరిధిలోని అధీన న్యాయస్థానాల కార్యక్రమాలను పర్యవేక్షించే కర్తవ్యాన్ని కలిగి ఉంటాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
శాసనసభల ప్రాముఖ్యం తగ్గుదలకు గల కారణాలు వివరించండి.
జవాబు.
ఆధునిక రాజ్యాల్లో సిద్ధాంత రీత్యా సర్వాధికారాలున్న శాసనసభ ప్రాముఖ్యం క్రమేణా తగ్గిపోతుందని రాజనీతి శాస్త్రజ్ఞుల భావన. దీనికి అనేక కారణాలున్నాయి. కార్యనిర్వాహకశాఖ అనేక అధికారాలు సంతరించుకుంది. ఆర్థిక, సామాజిక రంగాల్లో సర్వతోముఖాభివృద్ధిని సాధించడానికి రాజ్యాంగపరంగా, చట్టరీత్యా కార్యనిర్వాహకశాఖ నూతన అధికారాలను సంపాదించుకుంది.

సాంకేతిక, వైజ్ఞానిక అభివృద్ధి ఫలితంగా కొత్త విషయాలు ప్రభుత్వ విధానాల్లో- చోటు చేసుకోవడంలో వాటిని అర్థం చేసుకునే సాధారణ సామర్థ్యం శాసనసభలకు పూర్తిగా లేకపోవడంవల్ల శాసనసభ కార్యనిర్వాహక శాఖపై ఆధారపడే పరిస్థితి ఏర్పడింది.

ఉన్నత రాజకీయ పదవులన్నీ ఎన్నికల ద్వారా భర్తీ కావడం ప్రారంభమైన తరువాత ప్రభుత్వం ప్రత్యక్షంగా ప్రజలను ప్రభావితం చేసే ప్రాముఖ్యాన్ని పొందింది. దీనితో శాసనసభతో సంబంధం లేకుండా ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను ప్రభుత్వం ఏర్పరచుకుంటుంది.

దాని వల్ల శాసనసభ ప్రాముఖ్యం తగ్గడానికి మరోకారణం శాసనసభ ఒక సాధారణ చట్టాన్ని స్థూలంగా ఆమోదించి దానికి సంబంధించిన వివరాలను భర్తీ చేయడానికి కార్య నిర్వాహకశాఖకు ఇచ్చే అధికారమే ‘నియోజిత శాసనం’ ప్రణాళికలు సంక్షేమ పథకాలు అమలు పరిచేందుకు కార్య నిర్వాహకశాఖ నియోజిత శాసనాధికారాన్ని ఉపయోగిస్తుంది.

బలమైన ప్రతిపక్షం లేకపోవడం, పార్లమెంటు సమావేశాల కాలం తగ్గిపోవడం, అధికార పక్షం బాధ్యతారహితంగా ప్రవర్తించడం, సభ్యులు అనుచితంగా ప్రవర్తించడం శాసనసభ ప్రాముఖ్యాన్ని తగ్గిస్తున్నాయని రాజనీతి శాస్త్రజ్ఞులు ఆందోళన చెందుతున్నారు.

ప్రశ్న 2.
కార్యనిర్వాహక శాఖ ప్రాముఖ్యం పెరగడానికి గల కారణాలు చర్చించండి.
జవాబు.
ఆధునిక కాలంలో కార్యనిర్వాహకవర్గం అధికారాల, విధుల పరిధి నానాటికీ విస్తృతమవుతుంది. ఈ స్థితికి కింది కారణాలు ప్రధానమైనవిగా పేర్కొనవచ్చు.

1. సంక్షేమ రాజ్య భావన:
సమాజ సంక్షేమ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. పరిశ్రమలు, ఉత్పత్తి పంపిణీ, సామాజిక భద్రత, కార్మిక సంక్షేమం, విద్య, వైద్య సేవలు మొదలైనవన్నీ కార్యనిర్వాహకశాఖ పరిధి కిందకు వచ్చాయి. ఈ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడానికి కృషి చేయడం వల్ల కార్యనిర్వాహక వర్గం పరిధి పెరుగుతుంది.

2. పారిశ్రామికీకరణ :
పారిశ్రామిక విస్తరణ కూడా కార్యనిర్వాహకవర్గం పాత్రను పెంచింది. మౌలిక పరిశ్రమలను, భారీ పరిశ్రమలను జాతీయం చేయడంలో కార్యనిర్వాహకవర్గం కీలకపాత్ర వహిస్తుంది. జాతీయం చేసిన పరిశ్రమల నిర్వహణ కూడా కార్యనిర్వాహకశాఖ విధుల పరిధిని పెంచింది.

3. నియోజిత శాసన నిర్మాణం :
కార్యనిర్వాహక వర్గం శాసనసభతో పాటు ఒక రకమైన శాసనాలు చేస్తుంది. ఇట్లాంటి శాసనాలను నియోజిత శాసనాలు అంటారు. శాసన సభ ఆమోదించిన శాసనాలను అమలు చేసే సందర్భంగా కార్యనిర్వాహకవర్గం రకరకాల నిబంధనలు, నియమాలు చెయ్యాలి. ఈ విధంగా రూపొందిన శాసనాలను రెండో తరహా శాసనాలు అని కూడా అంటారు. రానురాను ప్రభుత్వ పరిధి బాగా విస్తరిస్తున్నది.

తత్ఫలితంగా ప్రభుత్వం ఎన్నో రంగాల్లో ఎన్నో శాసనాలు చేయవలసి వస్తుంది. అన్ని శాసనాలు చేయడానికి సమయం శాసనసభలకు ఉండదు. అంతేగాక అన్ని శాసనాల తయారీకి కావలసిన నైపుణ్యం శాసనసభకు వుండదు. ఈ కారణం దృష్ట్యా శాసనాధికారాలు కార్యనిర్వాహకశాఖకు వదిలి పెట్టడం తప్పనిసరైంది.

4. రాజకీయ పార్టీల పనితీరు :
రాజకీయ పార్టీల పనితీరు కూడా కార్యనిర్వాహక వర్గ ప్రాధాన్యం పెరుగుదలకు కారణం. రాజకీయ పార్టీల విస్తృత జాతీయ ప్రయోజనాలకోసం గాక సంకుచిత ప్రయోజనాల కోసం చాలాసార్లు పనిచేయడం మనం చూస్తున్నదే.

5. ప్రణాళికారచన :
నేడు ప్రతి రాజ్యం పెద్ద ఎత్తున ప్రణాళికారచనకు పూనుకుంటున్నది. కార్యనిర్వాహక వర్గం దేశ సర్వతోముఖాభివృద్ధికి ప్రణాళికలను అమలు చేయాల్సి ఉంటుంది. జాతీయ స్థాయి నుంచి స్థానిక స్థాయి వరకు ప్రణాళికలను కార్యసాధకంగా అమలు చేయడం కార్యనిర్వాహక శాఖ విధిగా మారింది. దీనితో కార్యనిర్వాహక శాఖకు విస్తృత అధికారాలు చెలాయించే అవకాశం ఏర్పడుతుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

ప్రశ్న 3.
న్యాయసమీక్షాధికారాన్ని చర్చించండి.
జవాబు.
శాసనసభ చేసిన చట్టాలను రాజ్యాంగ బద్ధంగా ఉన్నాయో లేదా అని సమీక్ష చేసే అధికారమే న్యాయసమీక్షాధికారం. రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యలను లేదా నిర్ణయాలను విచారించి అవి రాజ్యాంగ విరుద్ధమైనట్లయితే వాటిని రద్దుచేసే అధికారం పార్లమెంటు, అసెంబ్లీ మండలిలు, పరిషత్లు మొదలయిన శాసనాలను సమీక్ష చేయడం. రాజ్యాంగ వ్యతిరేకమైన అన్ని చట్టాలను న్యాయస్థానాలు కొట్టివేయడం జరుగుతుంది. దీన్ని న్యాయ సమీక్షాధికారం అంటారు.

చట్టాలకు మాత్రమే న్యాయ సమీక్షాధికారం పరిమితం కాదు. కార్యనిర్వాహకశాఖ చేసే కేంద్ర, రాష్ట్ర తుది స్థానిక సంస్థలపై శాసనసభలో చేసిన చట్టాలు మొదలైన అన్నిటికీ ఇది వర్తిస్తుంది. ప్రతి రాజ్యానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. రాజ్యాంగ పరిమితులకు లోనై మౌలిక శాసనం, చట్టాలు ఉంటాయి. రాజ్యాంగం సమర్థించిన ప్రతీ ప్రక్రియ ‘అన్ని చట్టాలు’, తీర్పులు అన్నీ కూడా రాజ్యాంగ పరిధిలోనే ఉంటాయి. న్యాయసమీక్ష అన్ని దేశాలలో కనిపించదు.

న్యాయ సమీక్ష అనే భావన అమెరికాలో ఆవిర్భవించింది. ఇది 1803లో జస్టిస్ మార్షల్ మార్బరీ వర్సెస్ మాడిసన్ వివాదంలో అప్పటి అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శాసనసభ చేసిన చట్టాలు రాజ్యాంగమౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉన్నందువల్ల అవి చెల్లవనే చారిత్రాత్మక తీర్పునిచ్చాడు.

ఈ తీర్పు ప్రకారం శాససభ రూపొందించే చట్టాలు రాజ్యాంగ చట్టానికి అనుగుణంగా ఉన్నాయా లేవాయని పరీక్షించే అధికారం న్యాయస్థానాలకుందని మొట్టమొదటిసారిగా స్పష్టమైంది. రాజ్యాంగపరిధికి లోబడి చేసే చట్టాలు చేసేముందు వివిధ సిద్ధాంతాలను, సూత్రాలను, భావనలన్నిటిని సమీక్షచేసి మాత్రమే చట్టాలు రూపొందించాలి.

న్యాయ సమీక్షా అధికారం క్రింది సిద్ధాంతాలపై ఆధారపడి ఉంది.

  1. శాసన సామర్థ్య సిద్ధాంతం
  2. అధికార పృథక్కరణ సిద్ధాంతం
  3. రాజ్యాంగ చైతన్యతా సిద్ధాంతం
  4. క్రియాశీల సిద్ధాంతం
  5. అనుభవాత్మక నిర్ణయ సిద్ధాంతం
  6. రాజ్యాంగ పురోభావనా సిద్ధాంతం.

రాజ్యాంగ సవరణ చట్టాలు కూడా శాసనసభలు చేసే చట్టాలే కాబట్టి న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తాయి. కాని న్యాయసమీక్ష పరిధిలోకి రాదు అని ఏ రాజ్యాంగ సవరణ చట్టం చెప్పి ఉంటే ఆ సవరణ చట్టం న్యాయసమీక్ష పరిధిలోకి రాదు. దాన్ని నిర్ణయించేది పార్లమెంట్ అయితే రాజ్యాంగం సవరణ చట్టాలపై న్యాయ సమీక్షాధికారం లేకుండా చేసే శక్తి అధికారం పార్లమెంటుకు ఉందా అనేది ఇటీవల తలెత్తిన ప్రశ్న.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

ప్రశ్న 4.
సమన్యాయపాలనపై చిన్న వ్యాసం రాయండి.
జవాబు. బ్రిటీష్ రాజ్యాంగ విశిష్ఠ లక్షణాలలో సమన్యాయపాలన ఒకటి . సమన్యాయ పాలన తొలుత ఇంగ్లండులో ప్రారంభమైంది. తరువాత ఇండియా అమెరికాలతో సహా అనేక రాజ్యాలు ఈ భావనను అనుసరించాయి. ఎ.వి. డైసీ తన ‘లా ఆఫ్ ది కాన్స్టిట్యూషన్స్’ అనే గ్రంథంలో సమన్యాయపాలన భావన గురించి ఖచ్చితమైన వివరణ ఇవ్వడమైనది. డైసీ ప్రకారం సమన్యాయపాలన అంటే చట్టం ముందు అందరూ సమానులేననే విషయాన్ని సూచిస్తుంది.

చట్టం వ్యక్తుల మధ్య ఏ విధమైన విచక్షణను పాటించదు. ప్రధానమంత్రి మొదలుకొని కార్యాలయంలో నాలుగవ తరగతి ఉద్యోగి వరకు చట్టం ముందు అందరూ సమానులే అని ఈ సందర్భంలో ఎ.వి.డైసీ పేర్కొన్నారు. భారత రాజ్యాంగం కూడా సమన్యాయ పాలనను రాజ్యాంగ మౌలిక లక్షణంగా గుర్తించింది. సమన్యాయపాలన రాజ్యాంగ మౌలిక నిర్మాణంగా భారత సుప్రీంకోర్టు పదేపదే ప్రకటించింది.

భారత రాజ్యాంగం మూడో భాగంలోని 14 నుండి 21 వరకు గల ప్రకరణలు సమన్యాయపాలన భావనను పొందుపరిచాయి. సమన్యాయపాలన భావన అనేది చట్టం ముందు అందరూ సమానులే, ఏ ఒక్కరు విచక్షణారహితంగా శిక్షకు గురికాకూడదు అనే సూత్రంపై ఆధారపడి వున్నది.

ప్రశ్న 5.
న్యాయశాఖ క్రియాశీలత అంటే ఏమిటి ?
జవాబు.
ముఖ్యంగా ఇతర ప్రభుత్వశాఖలు అన్యాయాలను సరిచేయడంలో వైఫల్యం చెందినప్పుడు న్యాయశాఖ క్రియాశీలత ప్రకారం, న్యాయమూర్తులు అన్యాయాలను సరిచేయడానికి తమ అధికారాలను ఉపయోగిస్తారు. పౌరహక్కులు, వ్యక్తిగత హక్కుల రక్షణ, రాజకీయ అన్యాయం, ప్రజానైతికతవంటి అంశాలపై సామాజిక విధానాన్ని రూపొందించడంలో న్యాయస్థానాలు చురుకైన పాత్రను పోషిస్తాయి.

శాసన, కార్యానిర్వాహక శాఖలు విధాన నిర్ణయీకరణ చేయటంలో న్యాయశాఖ క్రియాశీలత అనేది వాటికి పోటీగా ఒక రకమైన విధాన నిర్ణయీకరణే. ఈ అంశం న్యాయ సమీక్షకు సంబంధించినది. అంతిమంగా న్యాయశాఖ క్రియాశీలత స్ఫూర్తి సమకాలీన పరిస్థితులకు అనుకూలంగా న్యాయశాఖ నిర్ణయాలను వేలవరించడంగా భావించాలి.

న్యాయశాఖ ప్రతి నిర్ణయం వెనుక, న్యాయశాఖ క్రియాశీలత, స్వీయ నియంత్రణ, నియంత్రణ అనే రెండు అంశాలు న్యాయ శాఖ త్వాన్ని, ప్రేరణను వివరిస్తాయి. న్యాయశాఖ క్రియాశీలత అనేది పూర్తిగా న్యాయశాఖ స్వీయ నియంత్రణకు వ్యతిరేకం. న్యాయశాఖ క్రియాశీలత చట్ట స్ఫూర్తిని, మారుతున్న కాలాన్ని దృష్టిలో పెట్టుకుంటే, అదే న్యాయశాఖ స్వీయ నియంత్రణ అనేది చట్ట వివరణకు, శాసన ఆనవాయితీకి మాత్రమే ప్రాధాన్యతనిస్తుంది.

న్యాయశాఖ. క్రియాశీలత అనేది మారుతున్న సామాజిక పరిస్థితులనుదృష్టిలో పెట్టుకొనే గతిశీలక ప్రక్రియ. న్యాయశాఖ క్రియాశీలత అనే పదాన్ని 1947లో మొట్టమొదటగా అర్ధర్ క్లెసింగర్ జూనియర్ ప్రతిపాదించాడు. ‘బ్లాక్స్ ‘డిక్షనరీ’ ప్రకారం న్యాయశాఖ క్రియాశీలత అనేది న్యాయమూర్తులను సాంప్రదాయక ఆనవాయితీల నుంచి ప్రగతిశీల, నూతన సామాజిక నిర్ణయాలవైపు ప్రేరేపిస్తుంది.

న్యాయశాఖ క్రియాశీలత ప్రభుత్వాంగాల మధ్య సమతౌల్యతను బంగపరుస్తుందనే విమర్శ ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో శాసన నిర్మాణ ప్రక్రియ అనేది న్యాయశాఖ క్రియాశీలత ద్వారా ఒక కొత్త ఒరవడిని సంతరించుకుంది, మారుతున్న సామాజిక సందర్భంలో న్యాయశాఖ శాసనాన్ని వివరించడంలో ఒక ఆరోగ్యకరమైన ఒరవడిని ప్రారంభించింది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ప్రభుత్వాంగాలు ఎన్ని ? అవి ఏవి ?
జవాబు.
ప్రభుత్వ అంగాలు మూడు. అవి

  1. శాసననిర్మాణశాఖ
  2. కార్యనిర్వాహకశాఖ
  3. న్యాయశాఖ.

శాసననిర్మాణ శాఖ శాసనాలను రూపొందిస్తుంది. కార్యనిర్వాహకశాఖ శాసనాలను అమలుచేస్తుంది. న్యాయశాఖ ఈ రెండు శాఖల మధ్య తలెత్తే సమస్యలను పరిష్కరిస్తూ దేశ ప్రజలందరికి నిష్పక్షపాతంగా న్యాయాన్ని ప్రసాదిస్తుంది.

ప్రశ్న 2.
అధికార పృథక్కరణ సిద్ధాంతం అంటే ఏమిటి ?
జవాబు.
ఫ్రెంచి రచయిత అయిన మాంటెస్క్యూ తాను రచించిన ‘ద స్పిరిట్ ఆఫ్ లాస్’ అనే గ్రంథంలో అధికార వేర్పాటువాద సిద్ధాంతాన్ని పేర్కొనటం జరిగింది. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రభుత్వము యొక్క సర్వాధికారాలను మూడు ప్రభుత్వాంగాలైన శాసననిర్మాణశాఖ, కార్యనిర్వాహకశాఖ మరియు న్యాయశాఖల మధ్య విభజించాలి.

ప్రతి ప్రభుత్వాంగం తన పరిధిలోని అధికారాలపై తిరుగులేని పెత్తనాన్ని కలిగి ఉంటూ, మరొక అంగానికి చెందిన అధికారాల విషయంలో జోక్యం చేసుకోరాదు అని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

ప్రశ్న 3.
బహుసభ్య కార్యనిర్వాహకవర్గం అంటే ఏమిటి ?
జవాబు.
దీనిలో అధికారం అనేకమంది చేతుల్లో వుంటుంది. ఉదాహరణకు మంత్రిమండలి. స్విట్జర్లాండ్లోని ఫెడరల్ కౌన్సిల్, పూర్వపు సోవియట్ యూనియన్లోని ప్రిసీడియం మొదలైనవి. ఈ పద్ధతి పార్లమెంటరీ ప్రభుత్వం వున్న దేశాలలోనూ కొన్ని పూర్వపు సమాఖ్య ప్రభుత్వాలలోనూ కొన్ని మార్పులతో కనిపిస్తుంది.

ప్రశ్న 4.
న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తి అంటే ఏమిటి ?
జవాబు.
న్యాయశాఖ సక్రమంగా, స్వతంత్రంగా పనిచేయాలంటే దానికి శాసన శాఖతో కార్యనిర్వాహక శాఖతో సంబంధం ఉండరాదు. ఆ రెండు శాఖల జోక్యం న్యాయశాఖ విధి నిర్వహణలో ఉండకూడదు.

  1. న్యాయశాఖ స్వతంత్రతతో ఉండాలంటే న్యాయమూర్తుల నియామకం రాజకీయాలకు అతీతంగా జరగాలి.
  2. శక్తి సామర్థ్యాలు ప్రతిభావ్యుత్పత్తులు, స్వతంత్ర ఆలోచనాశక్తి ఉన్నవారిని సమర్థులను, అర్హతలున్నవారినీ న్యాయమూర్తులుగా నియమించాలి.
  3. న్యాయమూర్తులు స్వేచ్ఛగా వ్యవహరించాలంటే వారి ఉద్యోగ పరిస్థితులు ఆకర్షణీయంగా ఉండాలి.
  4. పదవిలో ఉన్నప్పుడు, పదవీ విరమణ చేసినప్పుడు వారికి తగిన రక్షణ ఉండాలి.
  5. పదవీ విరమణ తరువాత వేరే పదవుల కోసం ఎదురు చూడకుండా ఉండాలి. పదవీ విరమణ తరువాత ప్రభుత్వోద్యోగాల్లో చేరకూడదనే నియమం ఉండాలి. అప్పుడే వారు ఏ రకమైన ప్రలోభాలకు లోనుకారు.
  6. న్యాయమూర్తుల తీర్పులపై విమర్శ ఉండకూడదు. పై పద్ధతులు, నియమాలు పాటిస్తే న్యాయమూర్తులు ఎట్లాంటి ప్రలోభాలకు ఒత్తిడిలకు, భయాలకు లోనుకాకుండా స్వతంత్రంగా ఉండి న్యాయపాలన బాగా చేయగలరు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

ప్రశ్న 5.
న్యాయ సమీక్ష అంటే ఏమిటి ?
జవాబు.
ప్రజాస్వామ్య దేశాల్లో న్యాయశాఖ రాజ్యాంగానికి సంరక్షణ కర్త. శాసనసభ, కార్యనిర్వాహక వర్గం తమతమ విధుల నిర్వహణలో రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తే ఆ చర్యలను రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటిస్తుంది. రాజ్యాంగ విరుద్ధమైన అంశాలు అమల్లోకి రాకుండా ఆజ్ఞలను జారీ చేస్తుంది. న్యాయస్థానాలకున్న ఈ అధికారాన్ని న్యాయ సమీక్షాధికారం అంటారు.

ప్రశ్న 6.
సెనేట్.
జవాబు.
అమెరికా సంయుక్త రాష్ట్రాల కేంద్ర శాసనశాఖ అయిన కాంగ్రెస్లోని ఎగువసభను సెనేట్. దీనిలో మొత్తం 100 మంది సభ్యులుంటారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలు మొత్తం 50 కాగా ఒక్కో రాష్ట్రం నుంచి ఇద్దరు సభ్యులు ప్రతినిధులుగా ఎన్నుకోబడతారు.

ప్రశ్న 7.
రాష్ట్రాల కౌన్సిల్.
జవాబు.
భారత పార్లమెంటులోని ఎగువ సభను కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లేదా రాజ్యసభ అంటారు. ఇది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. వీరు పరోక్షంగా నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఏక ఓటు బదిలీ. విధానం ద్వారా ఎన్నుకోబడతారు. దీనిలో మొత్తం 250 సభ్యులుండగా వారిలో 238 సభ్యులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నుకోబడతారు.

మిగిలిన 12 సభ్యులను కళలు, సాహిత్యం, సహకారం, సంఘసేవ, శాస్త్ర, సాంకేతిక రంగాలలోని ప్రముఖులను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ప్రతి రెండు సంవత్సరాలకు మొత్తం సభ్యులలో 1/3 వంతు మంది పదవీ విరమణ చేస్తారు, వారి స్థానంలో కొత్తవారు ఎన్నుకోబడతారు. ఒక్కో సభ్యుడు 6 సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతాడు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

ప్రశ్న 8.
హౌస్ ఆఫ్ లార్డ్స్.
జవాబు.
బ్రిటన్ పార్లమెంట్లోని ఎగువసభను హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటారు. దీనిలో 800 మంది సభ్యులున్నారు. వారిని ప్రధానమంత్రి సిఫారసు మేరకు బ్రిటీష్ రాణి నియమిస్తారు.

ప్రశ్న 9.
పార్లమెంటరీ కార్యనిర్వాహకశాఖ.
జవాబు.
ఈ విధానంలో కార్యనిర్వాహక వర్గం శాసనసభలో సభ్యత్వాన్ని పొంది ఉండటమేకాక భారతదేశంలో వలే పార్లమెంటుకు బాధ్యత వహిస్తుంది.

ప్రశ్న 10.
ఏకశాసనసభ అంటే ఏమిటి ?
జవాబు.
శాసనశాఖ ఒకే సభను కలిగి వుంటే దానిని ఏకసభా విధానమని అంటారు. ఈ విధానంలో ఎగువసభ వుండదు. కేవలం ప్రజలచే ఎన్నుకోబడిన దిగువసభ మాత్రమే వుంటుంది. టర్కీ, స్వీడన్, డెన్మార్క్, బల్గేరియా దేశాలను ఏకసభా విధానానికి ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

ప్రశ్న 11.
ద్విశాసనసభ అంటే ఏమిటి ?
జవాబు.
శాసనశాఖ రెండు సభలను కలిగి వుండటాన్ని ద్విశాసనసభా విధానం అంటారు. ఇందులో ఒకటి ఎగువ సభ కాగా రెండోది దిగువ సభ. ఉదా : బ్రిటన్, భారత్, అమెరికా దేశాలను ద్విసభా విధానానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. భారత పార్లమెంటులో రాజ్యసభ ఎగువసభ గాను లోక్సభ దిగువసభ గాను ఉన్నాయి.

TS Inter 1st Year Political Science Study Material Chapter 10 రాజ్యాంగం

Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 10th Lesson రాజ్యాంగం Textbook Questions and Answers.

TS Inter 1st Year Political Science Study Material 10th Lesson రాజ్యాంగం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
రాజ్యాంగాన్ని నిర్వచించి, రాజ్యాంగం యొక్క లక్షణాలను వివరించండి.
జవాబు.
పరిచయం :
ఆధునిక కాలంలో ప్రతి రాజ్యానికి ఒక రాజ్యాంగముంటుంది. రాజ్యాంగంలో రాజ్యానికి సంబంధించిన అన్ని వ్యవస్థల అధికారాలు, విధులు మొదలైన విషయాలను స్పష్టంగా, నిర్దిష్టంగా, క్లుప్తంగా తెలియజేయడం జరుగుతుంది. రాజ్యానికి సంబంధించిన వ్యవహారాలు క్రమబద్ధంగా జరగడానికి రాజ్యాంగం చాలా ముఖ్యం.

అర్థం :
Constitution అనే ఇంగ్లీషు పదం “Constitutio” అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. లాటిన్ భాషలో కాన్స్టిట్యూషియో. అంటే “స్థాపించు” అని అర్థం.

నిర్వచనాలు :

  1. అరిస్టాటిల్ : “రాజ్యంలో అత్యున్నతమైన పదవులతో సహా అన్నింటిని క్రమబద్ధంగా ఏర్పాటు చేసేదే రాజ్యాంగం”.
  2. లార్డ్ బ్రైస్ : “ప్రభుత్వం పనిచేసే విధానాన్ని తెలిపే నిర్దిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం”.
  3. స్టీఫెన్ లీకాక్ : “రాజ్యాంగం అంటే ప్రభుత్వరూపం”.

“రాజ్యాంగం మౌలిక లక్షణాలు (Essential features of the Constitution) :
సాధారణంగా రాజ్యాంగాన్ని రాజ్యంలోని ప్రముఖ వ్యక్తులు, ప్రజాప్రతినిధులు, విషయ నిపుణులు మొదలైనవారు రూపొందిస్తారు. ప్రతి రాజ్యాంగానికి కొన్ని మౌళిక లక్షణాలు ఉంటాయి. వాటిని క్రింది విధంగా వివరించవచ్చు :

1. పీఠిక (Preamble) :
ప్రతి రాజ్యాంగం ఒక పీఠికను కలిగి ఉంటుంది. ఆ పీఠిక రాజ్యాంగ లక్ష్యాలు, ఆకాంక్షలను వ్యక్తీకరిస్తుంది. పీఠిక రాజ్యాంగానికి ఆత్మగా ఉంటుంది. కాబట్టి రాజ్యాంగపు ఆవశ్యక లక్షణాలలో పీఠిక అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించవచ్చు.

2. స్పష్టత (Clarity) :
స్పష్టత అనేది రాజ్యాంగపు మరొక ఆవశ్యక లక్షణం. రాజ్యపాలన, ప్రభుత్వ విధానాలను రాజ్యాంగం స్పష్టంగా వివరిస్తుంది. రాజ్యాంగం’ ఎంతో సులభశైలిలో, స్పష్టమైన భాషలో లిఖించబడి ఉంటుంది.

కాబట్టి రాజ్యాంగంలోని వివిధ అంశాలను అర్థం చేసుకోవడంలో ఏ రకమైన సందేహాలకు గానీ, అస్పష్టతకు గానీ అవకాశం ఉండదు. సమాజంలోని అన్ని వర్గాలకు ఎంతగానో సంతృప్తిని కలిగిస్తుంది. సుదీర్ఘ చర్చలు, సంప్రదింపులు తరువాతే రాజ్యాంగ రూపకల్పన జరుగుతుంది.

3. ప్రాథమిక హక్కులు (Fundamental Rights) :
ప్రతి రాజ్యాంగం కొన్ని ప్రాథమిక హక్కులను కలిగి ఉంటుంది. ప్రాథమిక హక్కులనేవి పౌరుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను పరిరక్షించుటకు ఉద్దేశించినవి. విభిన్న రంగాలలో పౌరులు తమ వ్యక్తిత్వాలను పెంపొందించుకొనేందుకు ఈ హక్కులు వీలు కల్పిస్తాయి. రాజ్యంలో పౌరులు సంతోషకరమైన, గౌరవప్రదమైన జీవనాన్ని గడిపేందుకు ఇవి సహాయపడతాయి.

4. క్లుప్తత (Brevity) :
క్లుప్తత అనేది రాజ్యాంగపు లక్షణాలలో ముఖ్యమైనది. రాజ్యాంగ అంశాలను అర్థం చేసుకోవడంలోను వాటిని వ్యాఖ్యానించడంలోనూ వ్యక్తులలో గందరగోళాన్ని నివారిస్తుంది. రాజ్యాంగంలో అనవసర అంశాలు చేర్చబడవు. కాబట్టి రాజ్యాంగం అనేది క్లుప్తంగా ఉంటుంది. అందులో మితిమీరిన సంఖ్యలో ప్రకరణలు, అధికరణలు, ఇతర నిబంధనలు ఉండవు. రాజ్యాంగంలో లెక్కకు మించిన వివరణలు ఉంటే వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

5. సరళత్వం (Flexibility) :
ప్రజల ఆకాంక్షలను ఎప్పటికప్పుడు గ్రహించి, వాటిని ఆచరణలో పెట్టేందుకు రాజ్యాంగం సరళమైనదిగా ఉండాలి. అవసరమైనప్పుడు రాజ్యాంగంలోని ప్రకరణలను సవరించే వీలు ఉండాలి. అయితే రాజ్యాంగంలోని అంశాలను పలుసార్లు సవరించకూడదు.

అప్పుడే రాజ్యాంగస్ఫూర్తి పదిలంగా ఉంటుంది. ‘ అలాగే ఆధునిక రాజ్యాలలో రాజ్యాంగంలోని అంశాలను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సవరించేందుకు అవకాశం ఉండాలి. అనుభవజ్ఞులు, మేధావులు రాజ్యాంగంలోని దోషాలను వెల్లడించినప్పుడు, వాటిని రాజ్యాంగం నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి.

6. శాశ్వతత్వం (Permanence) :
రాజ్యాంగం ముఖ్య లక్షణాలలో శాశ్వతత్వం ఒకటి. మొత్తం జాతి సంక్షేమం దృష్ట్యా రాజ్యాంగం సుదీర్ఘకాలంపాటు పనిచేసే విధంగా కొన్ని విలువలు కలిగి ఉండాలి. ఎందుకంటే రాజ్యాంగమనేది రాజ్యంతో సహా అనేక రాజకీయ సంస్థల నిర్మాణానికి – విధులకు ప్రతీకగా ఉంటుంది. ప్రజల ఆచార సంప్రదాయాలను రాజ్యాంగం గౌరవిస్తూ సామాజిక విలువలతో మమేకమై ఉండాలి.

7. రాజ్యాంగ సవరణ పద్ధతి (Mode of Amendment) :
రాజ్యాంగంలోని అంశాలను సవరించే పద్ధతిని ప్రతి రాజ్యాంగం సూచిస్తుంది. రాజ్యాంగం రాజ్యంలో నెలకొనే సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. రాజ్యాంగ అంశాల సవరణ పద్ధతుల గురించి రాజ్యాంగంలో ప్రత్యేక అధ్యాయంలో వివరించటం జరుగుతుంది.

సాధారణంగా రాజ్యాంగ అంశాలను మూడు రకాలుగా సవరించవచ్చు. అవి :

  1. కఠినమైన చర్య పద్ధతి
  2. సరళమైన పద్ధతి
  3. పాక్షిక కఠినమైన, పాక్షిక సరళమైన పద్ధతి.

మొత్తం మీద ప్రతి రాజ్యాంగంలో సరళమైన, కఠినమైన సవరణ పద్ధతులు రెండూ ఉంటాయి. పర్యవసానంగా రాజ్యంలో ప్రభుత్వం స్థిరత్వం కలిగి ఉంటూ అందరి ఆమోదాన్ని పొందగలుగుతుంది. రాజ్యాంగంలోని సరళమైన, కఠినమైన సవరణ పద్ధతులు రెండూ రాజకీయ వ్యవస్థ సాఫీగా, సమర్థవంతంగా పనిచేసేటట్లు దోహదపడతాయని అనేక మంది రాజ్యాంగవేత్తలు వర్ణించారు.

8. వివరణాత్మకమైనది (Explanatory):
రాజ్యాంగం వివరణాత్మకమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. అదే విధంగా ప్రజలకు, ప్రభుత్వానికి, రాజ్యానికి సంబంధించిన అనేక అంశాలను రాజ్యాంగంలో ప్రస్తావించి చర్చించడమవుతుంది. రాజ్యనిర్మాణం, దాని కార్యకలాపాల పరిధి, విధులకు సంబంధించి ప్రత్యేకంగా రాజ్యాంగంలో పేర్కొనడం జరుగుతుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 10 రాజ్యాంగం

ప్రశ్న 2.
రాజ్యాంగాన్ని నిర్వచించి దృఢ – అదృఢ (సరళ) రాజ్యాంగాల మధ్యగల తేడాలను పేర్కొనండి.
జవాబు.
నిర్వచనం :

  1. అరిస్టాటిల్ : “రాజ్యంలో అత్యున్నతమైన పదవులతో సహా అన్నింటిని క్రమబద్ధంగా ఏర్పాటు చేసేదే రాజ్యాంగం”.
  2. లార్డ్ బ్రైస్ : “ప్రభుత్వం పనిచేసే విధానాన్ని తెలిపే నిర్దిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం”.
  3. స్టీఫెన్ లీకాక్ : “రాజ్యాంగం అంటే ప్రభుత్వరూపం”.

దృఢ రాజ్యాంగం (లేదా) పరుష రాజ్యాంగం :
రాజ్యాంగంలోని అంశాలను అంత సులభంగా సవరించడం సాధ్యంకాని రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగం అంటారు. ‘దృఢ రాజ్యాంగం అమలులో ఉన్న రాజ్యాలలో సాధారణ చట్టాల తయారీకి, రాజ్యాంగ చట్టాల రూపకల్పనకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది.

దృఢ రాజ్యాంగంలోని ‘అంశాలను సవరించేందుకు ప్రత్యేకమైన పద్ధతిని అనుసరించడం జరుగుతుంది. రాజ్యాంగ అంశాల సవరణలో దృఢ రాజ్యాంగం ఎంతో కాఠిన్యతను ప్రదర్శిస్తుంది. దృఢ రాజ్యాంగానికి అత్యుత్తమ ఉదాహరణగా అమెరికా రాజ్యాంగాన్ని పేర్కొనవచ్చు. అమెరికాతో పాటుగా ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ వంటి రాజ్యాలలో దృఢ రాజ్యాంగాలు వాడుకలో ఉన్నాయి.

సరళ లేదా అదృఢ రాజ్యాంగం :
రాజ్యాంగంలోని అంశాలను అతిసులభంగా మార్చేందుకు అవకాశం ఉన్నట్లయితే దానిని అదృఢ రాజ్యాంగం అంటారు. అదృఢ రాజ్యాంగంలోని అంశాల సవరణకు ప్రత్యేక రాజ్యాంగ సవరణ పద్ధతిని అనుసరించాల్సిన అవసరం లేదు.

సాధారణ చట్టాల వలె రాజ్యాంగంలోని అంశాలను సైతం సవరించే వీలు ఉంటుంది. అందువల్ల అదృఢ రాజ్యాంగంలో సాధారణ చట్టాలు, రాజ్యాంగ చట్టాల మధ్య ఎటువంటి వ్యత్యాసం ఉండదు. అదృఢ రాజ్యాంగాలనేవి ప్రాచీన కాలంలో వాడుకలో ఉండేవి. అదృఢ రాజ్యాంగానికి బ్రిటన్ మంచి ఉదాహరణ.

సరళ లేదా అదృఢ మరియు దృఢ లేదా పరుష రాజ్యాంగాల మధ్య వ్యత్యాసాలు :

సరళ లేదా అదృఢ రాజ్యాంగం (Flexible constitution)పరుష లేదా దృఢ రాజ్యాంగం (Rigid Constitution)
1. రాజ్యాంగంలోని అంశాలు స్పష్టంగా పేర్కొనడం జరగదు.1. రాజ్యాగంలోని అంశాలు స్పష్టంగా పేర్కొనడం జరుగుతుంది.
2. రాజ్యాంగాన్ని సులభంగా సవరించవచ్చు.2. రాజ్యాంగాన్ని సవరించేందుకు కఠినమైన పద్ధతి ఉంటుంది.
3. ప్రజల హక్కులు, స్వేచ్ఛా స్వాతంత్య్రాలను న్యాయ శాఖ కాపాడగలుగుతుంది.3. ప్రజల హక్కులు, స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను న్యాయశాఖ కాపాడలేకపోవచ్చు.
4. ఇది సమాఖ్య రాజ్యానికి సరైనది కాదు.4. ఇది సమాఖ్య రాజ్యానికి సరైనది.
5. ఇది న్యాయసమీక్షకు అవకాశం ఇవ్వదు.5. ఇది న్యాయసమీక్షకు అవకాశం ఇస్తుంది.
6. ఈ రాజ్యాంగంలో శాసనసభకు అపరిమితమైన అధికారాలు ఉంటాయి.6. శాసనసభ అధికారాలు పరిమితంగా ఉంటాయి.
7. ఇది మిక్కిలి అస్థిరమైనది.7. ఇది ఎంతో స్థిరత్వంతో కూడుకొని ఉంటుంది.
8. రాజ్యాంగ చట్టాలకు, సాధారణ చట్టాలకు మధ్య ఎటువంటి వ్యత్యాసం ఉండదు.8. రాజ్యాంగ చట్టాలు, సాధారణ చట్టాల మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది.
9. రాజ్యంలో ఒకేరకమైన చట్టాలు ఉంటాయి.9. రాజ్యంలో రెండు రకాల చట్టాలు ఉంటాయి. అవి : 1) రాజ్యాంగ చట్టాలు, 2) సాధారణ చట్టాలు. రాజ్యాంగ చట్టాలు సాధారణ చట్టాలపై ఆధిక్యతను కలిగి ఉంటాయి.
10. రాజకీయ పురోగతి సాధించిన రాజ్యాలకు అదృఢ రాజ్యాంగం అనువైనది.10. అభివృద్ధి చెందుతున్న రాజ్యాలకు దృఢ రాజ్యాంగం అనువైనది.
11. విప్లవాలకు వీలు కల్పించదు.11. విప్లవాలకు అవకాశం ఇస్తుంది.
12. చిన్న రాజ్యాలకు తగినది.12. పెద్ద రాజ్యాలకు సరైనది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 10 రాజ్యాంగం

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
రాజ్యాంగాన్ని నిర్వచించి, దాని లక్షణాలను పేర్కొనండి.
జవాబు.
నిర్వచనాలు :

  1. అరిస్టాటిల్ : “రాజ్యంలో అత్యున్నతమైన పదవులతో సహా అన్నింటిని క్రమబద్ధంగా ఏర్పాటు చేసేదే రాజ్యాంగం”.
  2. లార్డ్ బ్రైస్ : “ప్రభుత్వం పనిచేసే విధానాన్ని తెలిపే నిర్దిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం”.
  3. స్టీఫెన్ లీకాక్ : “రాజ్యాంగం అంటే ప్రభుత్వరూపం”.

రాజ్యాంగం మౌలిక లక్షణాలు (Essential features of the Constitution) :
సాధారణంగా రాజ్యాంగాన్ని రాజ్యంలోని ప్రముఖ వ్యక్తులు, ప్రజాప్రతినిధులు, విషయ నిపుణులు మొదలైనవారు రూపొందిస్తారు. ప్రతి రాజ్యాంగానికి కొన్ని మౌళిక లక్షణాలు ఉంటాయి. వాటిని క్రింది విధంగా వివరించవచ్చు :

1. పీఠిక (Preamble) :
ప్రతి రాజ్యాంగం ఒక పీఠికను కలిగి ఉంటుంది. ఆ పీఠిక రాజ్యాంగ లక్ష్యాలు, ఆకాంక్షలను వ్యక్తీకరిస్తుంది. పీఠిక రాజ్యాంగానికి ఆత్మగా ఉంటుంది. కాబట్టి రాజ్యాంగపు ఆవశ్యక లక్షణాలలో పీఠిక అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించవచ్చు.

2. స్పష్టత (Clarity) :
స్పష్టత అనేది రాజ్యాంగపు మరొక ఆవశ్యక లక్షణం. రాజ్యపాలన, ప్రభుత్వ విధానాలను రాజ్యాంగం స్పష్టంగా వివరిస్తుంది. రాజ్యాంగం ఎంతో సులభశైలిలో, స్పష్టమైన భాషలో లిఖించబడి ఉంటుంది. కాబట్టి రాజ్యాంగంలోని వివిధ అంశాలను అర్థం చేసుకోవడంలో ఏ రకమైన సందేహాలకు గానీ, అస్పష్టతకు గానీ అవకాశం ఉండదు. సమాజంలోని అన్ని వర్గాలకు ఎంతగానో సంతృప్తిని కలిగిస్తుంది. సుదీర్ఘ చర్చలు, సంప్రదింపుల తరువాతే రాజ్యాంగ రూపకల్పన జరుగుతుంది.

3. ప్రాథమిక హక్కులు (Fundamental Rights) :
ప్రతి రాజ్యాంగం కొన్ని ప్రాథమిక హక్కులను కలిగి ఉంటుంది. ప్రాథమిక హక్కులనేవి పౌరుల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను పరిరక్షించుటకు ఉద్దేశించినవి. విభిన్న రంగాలలో పౌరులు తమ వ్యక్తిత్వాలను పెంపొందించుకొనేందుకు ఈ హక్కులు వీలు కల్పిస్తాయి. రాజ్యంలో పౌరులు సంతోషకరమైన, | గౌరవప్రదమైన జీవనాన్ని గడిపేందుకు ఇవి సహాయపడతాయి.

4. క్లుప్తత (Brevity) :
క్లుప్తత అనేది రాజ్యాంగపు లక్షణాలలో ముఖ్యమైనది. రాజ్యాంగ అంశాలను అర్థం చేసుకోవడంలోను వాటిని వ్యాఖ్యానించడంలోనూ వ్యక్తులలో గందరగోళాన్ని నివారిస్తుంది. రాజ్యాంగంలో అనవసర అంశాలు చేర్చబడవు. కాబట్టి రాజ్యాంగం అనేది క్లుప్తంగా ఉంటుంది. అందులో మితిమీరిన సంఖ్యలో ప్రకరణలు, అధికరణలు, ఇతర నిబంధనలు ఉండవు. రాజ్యాంగంలో లెక్కకు మించిన వివరణలు ఉంటే వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

5. సరళత్వం (Flexibility):
ప్రజల ఆకాంక్షలను ఎప్పటికప్పుడు గ్రహించి, వాటిని ఆచరణలో పెట్టేందుకు రాజ్యాంగం సరళమైనదిగా ఉండాలి. అవసరమైనప్పుడు రాజ్యాంగంలోని ప్రకరణలను సవరించే వీలు ఉండాలి. అయితే రాజ్యాంగంలోని అంశాలను పలుసార్లు సవరించకూడదు.

అప్పుడే రాజ్యాంగస్ఫూర్తి పదిలంగా ఉంటుంది. అలాగే ఆధునిక రాజ్యాలలో రాజ్యాంగంలోని అంశాలను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సవరించేందుకు అవకాశం ఉండాలి. అనుభవజ్ఞులు, మేధావులు రాజ్యాంగంలోని దోషాలను వెల్లడించినప్పుడు, వాటిని రాజ్యాంగం నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి.

6. శాశ్వతత్వం (Permanence) :
రాజ్యాంగం ముఖ్య లక్షణాలలో శాశ్వతత్వం ఒకటి. మొత్తం జాతి సంక్షేమం దృష్ట్యా రాజ్యాంగం సుదీర్ఘకాలంపాటు పనిచేసే విధంగా కొన్ని విలువలు కలిగి ఉండాలి. ఎందుకంటే రాజ్యాంగమనేది రాజ్యంతో సహా అనేక రాజకీయ సంస్థల నిర్మాణానికి – విధులకు ప్రతీకగా ఉంటుంది. ప్రజల ఆచార సంప్రదాయాలను రాజ్యాంగం గౌరవిస్తూ సామాజిక విలువలతో మమేకమై ఉండాలి.

7. రాజ్యాంగ సవరణ పద్ధతి (Mode of Amendment) :
రాజ్యాంగంలోని అంశాలను సవరించే పద్ధతిని ప్రతి రాజ్యాంగం సూచిస్తుంది. రాజ్యాంగం రాజ్యంలో నెలకొనే సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. రాజ్యాంగ అంశాల సవరణ పద్ధతుల గురించి రాజ్యాంగంలో ప్రత్యేక అధ్యాయంలో వివరించటం జరుగుతుంది. సాధారణంగా రాజ్యాంగ అంశాలను మూడు రకాలుగా సవరించవచ్చు. అవి :

  1. కఠినమైన చర్య పద్ధతి
  2. సరళమైన పద్ధతి
  3. పాక్షిక కఠినమైన, పాక్షిక సరళమైన పద్ధతి.

మొత్తం మీద ప్రతి రాజ్యాంగంలో సరళమైన, కఠినమైన సవరణ పద్ధతులు రెండూ ఉంటాయి. పర్యవసానంగా రాజ్యంలో ప్రభుత్వం స్థిరత్వం కలిగి ఉంటూ అందరి ఆమోదాన్ని పొందగలుగుతుంది. రాజ్యాంగంలోని సరళమైన, కఠినమైన సవరణ పద్ధతులు రెండూ రాజకీయ వ్యవస్థ సాఫీగా, సమర్థవంతంగా పనిచేసేటట్లు దోహదపడతాయని అనేక మంది రాజ్యాంగవేత్తలు వర్ణించారు.

8. వివరణాత్మకమైనది (Explanatory):
రాజ్యాంగం వివరణాత్మకమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. అదే విధంగా ప్రజలకు, ప్రభుత్వానికి, రాజ్యానికి సంబంధించిన అనేక అంశాలను రాజ్యాంగంలో ప్రస్తావించి చర్చించడమవుతుంది. రాజ్యనిర్మాణం, దాని కార్యకలాపాల పరిధి, విధులకు సంబంధించి ప్రత్యేకంగా రాజ్యాంగంలో పేర్కొనడం జరుగుతుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 10 రాజ్యాంగం

ప్రశ్న 2.
లిఖిత రాజ్యాంగం ప్రయోజనాలు, లోపాలు ఏవి ?
జవాబు.
లిఖిత రాజ్యాంగం (Written Constitution) : లిఖిత రాజ్యాంగాన్ని ఒక రాజ్యాంగ పరిషత్తు లేదా ప్రత్యేక సదస్సు రూపొందిస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన అనేక నియమ నిబంధనలు ఈ రాజ్యాంగంలో ఉంటాయి. లిఖిత రాజ్యాంగానికి భారత రాజ్యాంగం ఒక చక్కటి ఉదాహరణగా పేర్కొనవచ్చు. ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగంగా అమెరికా రాజ్యాంగాన్ని పరిగణించడమైనది.

ప్రయోజనాలు (Merits) :

  1. లిఖిత రాజ్యాంగం మిక్కిలి సులభమైనది. రాజ్యంలోని వివిధ సంస్థల నిర్మాణ, నిర్వహణలను అవగాహన చేసుకోవడంలో లిఖిత రాజ్యాంగం ‘ఏ విధమైన గందరగోళానికి, అస్పష్టతలకు అవకాశం ఇవ్వదు.
  2. లిఖిత రాజ్యాంగం కొంతమేరకు కఠిన స్వభావాన్ని కలిగి ఉంటుంది. దాంతో అది రాజకీయ స్థిరత్వాన్ని అందించగలుగుతుంది.
  3. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడుతుంది.
  4. కేంద్ర, రాష్ట్రాల మధ్య న్యాయమైన రీతిలో అధికారాల పంపిణి ద్వారా సమతౌల్యతను పాటిస్తుంది..
  5. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుంది. ప్రజల అవసరాలను తీర్చేందుకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందనే విషయాన్ని ప్రభుత్వానికి గుర్తుచేస్తుంది.
  6. ప్రభుత్వ అధికారాలపై కొన్ని పరిమితులను విధిస్తుంది.
  7. సమాఖ్యవ్యవస్థ పవిత్రతను, స్ఫూర్తిని కాపాడుతుంది.

లోపాలు (Demerits) :

  1. లిఖిత రాజ్యాంగం మెరుగైన ప్రభుత్వాన్ని అందించలేదు. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీలపై ఆ రాజ్యాంగం అనేక ఆంక్షలను విధిస్తుంది..
  2. లిఖిత రాజ్యాంగపు కఠిన స్వభావం రాజ్యం అభివృద్ధికి దోహదపడదు.
  3. ప్రజల ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా ఆ రాజ్యాంగంలోని అంశాలను సవరించడం సాధ్యం కాదు. దాంతో జాతి పురోగతి మందకొడిగా సాగుతుంది.
  4.  న్యాయశాఖ ఆధిపత్యానికి లిఖిత రాజ్యాంగం అవకాశం ఇస్తుంది.
  5. ప్రభుత్వాంగాల మధ్య ఘర్షణలకు వీలు కల్పిస్తుంది.
  6. సంక్షేమ రాజ్యస్థాపనకు అనుకూలం కాదు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 10 రాజ్యాంగం

ప్రశ్న 3.
అలిఖిత రాజ్యాంగం ప్రయోజనాలు, లోపాలను తెలపండి.
జవాబు.
అలిఖిత రాజ్యాంగం (Unwritten Constitution) :
అలిఖిత రాజ్యాంగం అనేది ప్రత్యేక రాతప్రతిలో పేర్కొనబడని రాజ్యాంగం. అలిఖిత రాజ్యాంగం అనేక ఆచారాలు, సంప్రదాయాల ఆధారంగా ఏర్పడినది. వీటినే శాసనాలకు ప్రాతిపదికగా తీసుకుంటారు. ఇటువంటి రాజ్యాంగం అత్యంత ప్రాచీనమైన, చట్టబద్దమైన పాలనకు అవకాశం కల్పిస్తుందని పలువురు భావించారు.

18వ శతాబ్దం వరకు ప్రపంచంలో అనేక రాజ్యాలలో రాజ్యాంగబద్ధమైన పాలనకు ఇటువంటి రాజ్యాంగాలు ఆధారంగా ఉంటూ వచ్చాయి. ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణలో శాసనబద్ధమైన పాలనకు ఈ రాజ్యాంగాలు వీలు కల్పించాయి.

బ్రిటన్ రాజ్యాంగం అలిఖిత రాజ్యాంగానికి అత్యుత్తమ ఉదాహరణ. బ్రిటన్లో చట్టాలన్నీ ఆచారాలు, సంప్రదాయాలు, వాడుకలు, అలవాట్ల ఆధారంగా రూపొందించబడ్డాయి.

ప్రయోజనాలు (Merits) :

  1. ప్రగతిశీలక శాసన నిర్మాణానికి అలిఖిత రాజ్యాంగం దోహదపడుతుంది. ఇటువంటి రాజ్యాంగం అభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది.
  2. అలిఖిత రాజ్యాంగం కాలానుగుణంగా సంభవించిన పరిణామాలకు ప్రతీకగా మార్పు చెందుతూ ఉంటుంది. రాజకీయ వ్యవస్థను ఉత్తమమైందిగా తీర్చిదిద్దేందుకు వీలు కల్పిస్తుంది.
  3. అలిఖిత రాజ్యాంగంలోని అంశాలు వ్యాకోచ స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల ఈ రాజ్యాంగంలో మార్పులను సులభంగా ప్రవేశపెట్టవచ్చు.
  4. ప్రజల అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగంలోని అంశాలను సవరించుకొనే వీలుంటుంది.
  5. అలిఖిత రాజ్యాంగం అవాంఛనీయమైన విప్లవాలు, ఇతర ఆందోళనలకు అవకాశం ఇవ్వదు. ప్రజల డిమాండ్లను పరిష్కరించే వీలు ఈ రాజ్యాంగం కల్పిస్తుంది.

లోపాలు (Demerits) :

  1. అలిఖిత రాజ్యాంగంలోని అంశాలను అధికారంలో ఉన్న పార్టీ స్వీయ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా తరచుగా సవరించే అవకాశం ఉంటుంది. దాంతో రాజ్యంలో రాజకీయ సుస్థిరతకు భంగం వాటిల్లే ప్రమాదం ఏర్పడుతుంది.
  2. అలిఖిత రాజ్యాంగం న్యాయమూర్తుల చేతిలో ఆటబొమ్మగా మారే అవకాశాలు ఎక్కువ. న్యాయమూర్తులు యధేచ్ఛగా రాజ్యాంగంలోని అంశాలను వ్యాఖ్యానించే అవకాశం ఉంటుంది.
  3. ప్రజాస్వామ్య రాజ్యాలకు అలిఖిత రాజ్యాంగం అనుకూలమైనది కాదు.
  4. సమాఖ్య రాజ్యాలకు ఇటువంటి రాజ్యాంగం సరిపోదు.
  5. ప్రజల హక్కులు, స్వాతంత్ర్యాలకు అలిఖిత రాజ్యాంగం రక్షణ కల్పించడంలో విఫలమవుతుంది.
  6. రాజ్యాంగంలోని అంశాలు తరచుగా సవరణలకు లోనవుతాయి.
  7. అలిఖిత రాజ్యాంగం మిక్కిలి లాంఛనప్రాయమైనది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 10 రాజ్యాంగం

ప్రశ్న 4.
లిఖిత, అలిఖిత రాజ్యాంగాల మధ్య తేడాలను తెలపండి.
జవాబు.
లిఖిత రాజ్యాంగం :
లిఖిత రాజ్యాంగాన్ని ఒక రాజ్యాంగ పరిషత్తు లేదా ప్రత్యేక సదస్సు రూపొందిస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన అనేక నియమ నిబంధనలు ఈ రాజ్యాంగంలో ఉంటాయి. లిఖిత రాజ్యాంగానికి భారత రాజ్యాంగం ఒక చక్కటి ఉదాహరణగా పేర్కొనవచ్చు. ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగంగా అమెరికా రాజ్యాంగాన్ని పరిగణించడమైనది.

అలిఖిత రాజ్యాంగం :
అలిఖిత రాజ్యాంగం అనేది ప్రత్యేక రాతప్రతిలో పేర్కొనబడని రాజ్యాంగం. అలిఖిత రాజ్యాంగం అనేక ఆచారాలు, సంప్రదాయాల ఆధారంగా ఏర్పడినది. వీటినే శాసనాలకు ప్రాతిపదికగా తీసుకుంటారు. ఇటువంటి రాజ్యాంగం అత్యంత ప్రాచీనమైన, చట్టబద్ధమైన పాలనకు అవకాశం కల్పిస్తుందని పలువురు భావించారు.

18వ శతాబ్దం వరకు ప్రపంచంలో అనేక రాజ్యాలలో రాజ్యాంగబద్ధమైన పాలనకు ఇటువంటి రాజ్యాంగాలు ఆధారంగా ఉంటూ వచ్చాయి. ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణలో శాసనబద్ధమైన పాలనకు ఈ రాజ్యాంగాలు వీలు కల్పించాయి.

లిఖిత, అలిఖిత రాజ్యాంగాల మధ్య కింద పేర్కొన్న వ్యత్యాసాలను ప్రతి ఒక్కరు అత్యంత సులభంగా గుర్తించవచ్చు.

లిఖిత రాజ్యాంగం (Written Constitution)అలిఖిత రాజ్యాంగం (Unwritten Constitution)
1. లిఖిత రాజ్యాంగం అనేది ఒక రాత ప్రతి లేదా కొన్ని నిర్ణీత రాతప్రతులతో రాయబడి ఉంటుంది. ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను ఈ రాజ్యాంగం నియంత్రించేందుకు కొన్ని నియమ నిబంధనలను సూచిస్తుంది.1. అలిఖిత రాజ్యాంగం అనేది అనేక ఆచారాలు, సంప్రదాయాలు, వేడుకలు, అలవాట్ల సమాహారం. ఈ రాజ్యాంగంలోని అంశాలు క్రమబద్ధంగా ఒకచోట రాయబడి ఉండవు.
2. రాజ్యానికి సంబంధించిన అన్ని ప్రధాన అంశాలు స్పష్టంగా రాయబడి ఉంటాయి.2. రాజ్యానికి సంబంధించిన అంశాలన్నీ ఆచార సంప్రదాయాలు, వాడుకల రూపంలో ఉంటాయి.
3. లిఖిత రాజ్యాంగాన్ని నిర్దిష్ట సమయంలో ప్రత్యేకంగా ఏర్పాటైన శాసనసభ రూపొందించి ఆమోదిస్తుంది.3. అలిఖిత రాజ్యాంగంలోని అంశాలు నిర్దిష్ట సమయంలో రూపొందినవి కావు. అవి కాలాను గుణంగా శాసనాల రూపంలో, ముఖ్యమైన నిబంధనల (Charters) ద్వారా వివిధ కాలాలలో అమల్లోకి వస్తాయి.
4. లిఖిత రాజ్యాంగాన్ని సులభంగా సవరించడం సాధ్యం కాదు.4. అలిఖిత రాజ్యాంగాన్ని సవరించడం ఎంతో సులభం.
5. లిఖిత రాజ్యాంగంలో ఉదహరించబడిన పౌరులు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను న్యాయస్థానాలు పరిరక్షిస్తాయి.5. అలిఖిత రాజ్యాంగాన్ని పౌరుల ప్రాథమిక హక్కులను న్యాయస్థానాలు సులభమైన రీతిలో కాపాడలేవు.
6. లిఖిత రాజ్యాంగం ఒక నిర్ణీత కాలంలో రూపొందించబడింది.6. అలిఖిత రాజ్యాంగం మారుతూ ఉంటుంది.
7. లిఖిత రాజ్యాంగం రాజకీయ సుస్థిరతను ఏర్పరుస్తుంది.7. అలిఖిత రాజ్యాంగం రాజకీయ స్థిరత్వాన్ని అందించకపోవచ్చు.
8. విద్యావంతులు, అక్షరాస్యులు అధికంగా ఉన్న రాజ్యాలకు లిఖిత రాజ్యాంగం సరైంది.8. నిరక్షరాస్యులు, విద్యావంతులైన ప్రజలకు అలిఖిత రాజ్యాంగం సరైనది.
9. లిఖిత రాజ్యాంగం సమాఖ్య రాజ్యాలకు తగినది.9. అలిఖిత రాజ్యాంగం ఏకకేంద్ర రాజ్యాలకు సరైనది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 10 రాజ్యాంగం

ప్రశ్న 5.
దృఢ, అదృఢ (సరళ) రాజ్యాంగాల మధ్య తేడాలను తెలపండి.
జవాబు.
నిర్వచనం :

  1. అరిస్టాటిల్ : “రాజ్యంలో అత్యున్నతమైన పదవులతో సహా అన్నింటిని క్రమబద్ధంగా ఏర్పాటు చేసేదే “రాజ్యాంగం”.
  2. లార్డ్ బ్రైస్ : “ప్రభుత్వం పనిచేసే విధానాన్ని తెలిపే నిర్దిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం”.
  3. స్టీఫెన్ లీకాక్ : “రాజ్యాంగం అంటే ప్రభుత్వరూపం”.

దృఢ రాజ్యాంగం (లేదా) పరుష రాజ్యాంగం :
రాజ్యాంగంలోని అంశాలను అంత సులభంగా సవరించడం సాధ్యంకాని రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగం అంటారు. దృఢ రాజ్యాంగం అమలులో ఉన్న రాజ్యాలలో సాధారణ చట్టాల తయారీకి, రాజ్యాంగ చట్టాల రూపకల్పనకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. దృఢ రాజ్యాంగంలోని అంశాలను సవరించేందుకు ప్రత్యేకమైన పద్ధతిని అనుసరించడం జరుగుతుంది. రాజ్యాంగ అంశాల సవరణలో దృఢ రాజ్యాంగం

ఎంతో కాఠిన్యతను ప్రదర్శిస్తుంది. దృఢ రాజ్యాంగానికి అత్యుత్తమ ఉదాహరణగా అమెరికా రాజ్యాంగాన్ని పేర్కొనవచ్చు. అమెరికాతో పాటుగా ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ వంటి రాజ్యాలలో దృఢ రాజ్యాంగాలు వాడుకలో ఉన్నాయి.

సరళ లేదా అదృఢ రాజ్యాంగం:
రాజ్యాంగంలోని అంశాలను అతిసులభంగా మార్చేందుకు అవకాశం ఉన్నట్లయితే దానిని అదృఢ రాజ్యాంగం అంటారు. అదృఢ రాజ్యాంగంలోని అంశాల సవరణకు ప్రత్యేక రాజ్యాంగ సవరణ పద్ధతిని అనుసరించాల్సిన అవసరం లేదు.

సాధారణ చట్టాల వలె రాజ్యాంగంలోని అంశాలను సైతం సవరించే వీలు ఉంటుంది. అందువల్ల అదృఢ రాజ్యాంగంలో సాధారణ చట్టాలు, రాజ్యాంగ చట్టాల మధ్య ఎటువంటి వ్యత్యాసం ఉండదు. అదృఢ రాజ్యాంగాలనేవి ప్రాచీన కాలంలో వాడుకలో ఉండేవి. అదృఢ రాజ్యాంగానికి బ్రిటన్ మంచి ఉదాహరణ.

సరళ లేదా అదృఢ మరియు దృఢ లేదా పరుష రాజ్యాంగాల మధ్య వ్యత్యాసాలు :

సరళ లేదా అదృఢ రాజ్యాంగం (Flexible constitution)పరుష లేదా దృఢ రాజ్యాంగం (Rigid Constitution)
1. రాజ్యాంగంలోని అంశాలు స్పష్టంగా పేర్కొనడం జరగదు.1. రాజ్యాగంలోని అంశాలు స్పష్టంగా పేర్కొనడం జరుగుతుంది.
2. రాజ్యాంగాన్ని సులభంగా సవరించవచ్చు.2. రాజ్యాంగాన్ని సవరించేందుకు కఠినమైన పద్ధతి ఉంటుంది.
3. ప్రజల హక్కులు, స్వేచ్ఛా స్వాతంత్య్రాలను న్యాయ శాఖ కాపాడగలుగుతుంది.3. ప్రజల హక్కులు, స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను న్యాయశాఖ కాపాడలేకపోవచ్చు.
4. ఇది సమాఖ్య రాజ్యానికి సరైనది కాదు.4. ఇది సమాఖ్య రాజ్యానికి సరైనది.
5. ఇది న్యాయసమీక్షకు అవకాశం ఇవ్వదు.5. ఇది న్యాయసమీక్షకు అవకాశం ఇస్తుంది.
6. ఈ రాజ్యాంగంలో శాసనసభకు అపరిమితమైన అధికారాలు ఉంటాయి.6. శాసనసభ అధికారాలు పరిమితంగా ఉంటాయి.
7. ఇది మిక్కిలి అస్థిరమైనది.7. ఇది ఎంతో స్థిరత్వంతో కూడుకొని ఉంటుంది.
8. రాజ్యాంగ చట్టాలకు, సాధారణ చట్టాలకు మధ్య ఎటువంటి వ్యత్యాసం ఉండదు.8. రాజ్యాంగ చట్టాలు, సాధారణ చట్టాల మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది.
9. రాజ్యంలో ఒకేరకమైన చట్టాలు ఉంటాయి.9. రాజ్యంలో రెండు రకాల చట్టాలు ఉంటాయి. అవి : 1) రాజ్యాంగ చట్టాలు, 2) సాధారణ చట్టాలు. రాజ్యాంగ చట్టాలు సాధారణ చట్టాలపై ఆధిక్యతను కలిగి ఉంటాయి.
10. రాజకీయ పురోగతి సాధించిన రాజ్యాలకు అదృఢ రాజ్యాంగం అనువైనది.10. అభివృద్ధి చెందుతున్న రాజ్యాలకు దృఢ రాజ్యాంగం అనువైనది.
11. విప్లవాలకు వీలు కల్పించదు.11. విప్లవాలకు అవకాశం ఇస్తుంది.
12. చిన్న రాజ్యాలకు తగినది.12. పెద్ద రాజ్యాలకు సరైనది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 10 రాజ్యాంగం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
రాజ్యాంగం అంటే ఏమిటి ?
జవాబు.
ప్రజలు, ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని సూచించే కొన్ని నిర్దిష్ట నియమాల సముదాయాన్ని రాజ్యాంగం అని అంటారు. రాజ్యం, ప్రభుత్వాల అధికారాలు, విధులకు రాజ్యాంగం ముఖ్య ప్రాతిపదికగా ఉంటుంది.

అదే విధంగా పౌరుల హక్కులు, బాధ్యతలకు సంబంధించిన ప్రధాన ప్రామాణికతకు నిదర్శనం రాజ్యాంగమే. అందుకనే “ప్రభుత్వం పనిచేసే విధానాన్ని తెలిపే నిర్దిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం” అని లార్డ్ బ్రైస్ పేర్కొన్నాడు.

ప్రశ్న 2.
అలిఖిత రాజ్యాంగం అంటే ఏమిటి ?
జవాబు.
అలిఖిత రాజ్యాంగం అంటే రాజ్యాంగ నియమాలన్నింటినీ ఒక రాతప్రతిలో పొందుపరచని రాజ్యాంగం. అనేక ఆచార, సంప్రదాయాలు శాసనాల రూపంలో పొందుపరచినదాన్నే అలిఖిత రాజ్యాంగంగా పేర్కొంటారు. అలిఖిత రాజ్యాంగానికి ఖచ్చితమైన ఉదాహరణ బ్రిటన్ రాజ్యాంగం. ఆచార సంప్రదాయాలు, బ్రిటీష్ పార్లమెంట్ రూపొందించిన సాధారణ శాసనాలే ఆ దేశంలో రాజ్యాంగ శాసనాలుగా పని చేస్తాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 10 రాజ్యాంగం

ప్రశ్న 3.
లిఖిత రాజ్యాంగం అంటే ఏమిటి ?
జవాబు.
లిఖిత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ గానీ లేదా ప్రత్యేక రాజ్యాంగ సదస్సుగాని రూపొందిస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన అనేక నియమ, నిబంధనలు లిఖిత పత్రం రూపంలో పొందుపరచబడి ఉంటాయి. భారత రాజ్యాంగాన్ని లిఖిత పూర్వక రాజ్యాంగానికి ముఖ్యమైన ఉదాహరణగా పేర్కొనవచ్చు.

ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం 1789లో ఆమోదించబడిన అమెరికా రాజ్యాంగం. అమెరికా, భారత రాజ్యాంగాలను ప్రస్తుత ప్రపంచంలో ‘లిఖిత రాజ్యాంగాలకు చక్కని ఉదాహరణగా పేర్కొనవచ్చు.

ప్రశ్న 4.
సరళ రాజ్యాంగం అంటే ఏమిటి ?
జవాబు.
రాజ్యాంగంలోని అంశాలను అతి సులభంగా మార్చేందుకు అవకాశం ఉన్నట్లయితే దానిని అదృఢ లేదా సరళ రాజ్యాంగం అంటారు. సరళ రాజ్యాంగంలోని అంశాల సవరణకు ప్రత్యేక రాజ్యాంగ సవరణ పద్ధతిని అనుసరించాల్సిన అవసరం లేదు.

సాధారణ చట్టాలవలె రాజ్యాంగంలోని అంశాలను సైతం సవరించే వీలుంటుంది. అందువలన సరళ రాజ్యాంగంలో సాధారణ చట్టాలు, రాజ్యాంగ చట్టాల మధ్య ఎటువంటి వ్యత్యాసం వుండదు. సరళ రాజ్యాంగాలనేవి ప్రాచీన కాలంలో వాడుకలో ఉండేవి. అదృఢ లేదా సరళ రాజ్యాంగానికి బ్రిటన్ మంచి ఉదాహరణ.

ప్రశ్న 5.
దృఢ రాజ్యాంగం అంటే ఏమిటి ?
జవాబు.
రాజ్యాంగంలోని అంశాలను అంత సులభంగా సవరించడం సాధ్యం కాని రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగం అంటారు. దృఢ రాజ్యాంగం అమలులో వున్న రాజ్యాలలో సాధారణ చిట్టాల తయారీకి, రాజ్యాంగ చట్టాల రూపకల్పనకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది.

దృఢ రాజ్యాంగంలోని అంశాలను సవరించేందుకు ప్రత్యేకమైన పద్ధతిని అనుసరించడం జరుగుతుంది. రాజ్యాంగ అంశాల సవరణలో దృఢ రాజ్యాంగం ఎంతో కాఠిన్యతను ప్రదర్శిస్తుంది. దృఢ రాజ్యాంగానికి అత్యుత్తమ ఉదాహరణగా అమెరికా రాజ్యాంగాన్ని పేర్కొనవచ్చు. అమెరికాతో పాటుగా ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ వంటి రాజ్యాలలో దృఢ రాజ్యాంగాలు వాడుకలో ఉన్నాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 10 రాజ్యాంగం

ప్రశ్న 6.
రాజ్యాంగ ప్రవేశిక అంటే ఏమిటి ?
జవాబు.
ప్రతి రాజ్యాంగం ఒక ప్రవేశిక లేదా పీఠికను కలిగి ఉంటుంది. ఆ ప్రవేశిక రాజ్యాంగ లక్ష్యాలు, ఆకాంక్షలను వ్యక్తీకరిస్తుంది. ప్రవేశిక రాజ్యాంగానికి ఆత్మగా ఉంటుంది. కాబట్టి రాజ్యాంగపు ఆవశ్యక లక్షణాలలో ప్రవేశిక అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించవచ్చు. ఉదాహరణకు భారత రాజ్యాంగంలోని ప్రవేశిక భారతదేశాన్ని ఒక సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా పేర్కొంది.

TS Inter 1st Year Commerce Study Material Chapter 2 వ్యాపార కార్యకలాపాలు

Telangana TSBIE TS Inter 1st Year Commerce Study Material 2nd Lesson వ్యాపార కార్యకలాపాలు Textbook Questions and Answers.

TS Inter 1st Year Commerce Study Material 2nd Lesson వ్యాపార కార్యకలాపాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పరిశ్రమ అంటే ఏమిటి ? వివిధ రకాలైన పరిశ్రమలను సోదాహరణంగా వివరించండి.
జవాబు.
వ్యాపారము తాలూకు ఉత్పాదనాంశమే పరిశ్రమ. వస్తువుల ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాల సమూహాన్ని పరిశ్రమగా పేర్కొనవచ్చు. వస్తువుల సేకరణ, ఉత్పత్తి, ప్రాసెసింగ్ నిర్మాణము మొదలైన వాటికి సంబంధించిన కార్యకలాపాలనే పరిశ్రమగా నిర్వచించవచ్చు.

మూలధన తయారయ్యే వస్తువులు వినియోగ వస్తువులు లేదా మూలధన వస్తువులు కావచ్చు. వినియోగదారులు ఉపయోగించే వస్తువులు అనగా ఆహార పదార్థాలు, నూలు మొదలైనవి వినియోగిత వస్తువులు. మూలధన వస్తువులు అనగా ఉత్పత్తిదారులు వాటిని మరల ఉత్పత్తికి ఉపయోగించేవి. ఉదా: యంత్రాలు, పరికరాలు, ఎక్విప్మెంట్
మొ||నవి.

పరిశ్రమలను సాధారణముగా దిగువ విధాలుగా వర్గీకరించవచ్చును.
1) ప్రాథమిక పరిశ్రమ: ఈ పరిశ్రమ ప్రకృతి సహాయంతో వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో మానవుని శ్రమ చాలా తక్కువ. ఇది ప్రకృతిపై ఆధారపడినది. ఉదా: వ్యవసాయము, చేపలు పట్టుట, అటవీకరణ మొ||నవి.

2) ప్రజనన పరిశ్రమలు: ఈ పరిశ్రమలు వంశక్రమానికి చెందుతాయి. కొన్ని జాతి మొక్కలను, పశువులను, పక్షులను పునరుత్పత్తి చేసి, వాటిని అమ్మడం ద్వారా లాభాన్ని ఆర్జించే కార్యకలాపాన్ని ప్రజనన పరిశ్రమలు అంటారు. నర్సరీలు, కోళ్ళ పరిశ్రమ, పట్టు పురుగుల పెంపకము మొ||నవి ఈ పరిశ్రమల క్రిందకు వస్తాయి.

TS Inter 1st Year Commerce Study Material Chapter 2 వ్యాపార కార్యకలాపాలు

3) ఉద్గ్రహణ పరిశ్రమలు: ప్రకృతి వనరుల నుంచి వస్తువులను వెలికితీసే కార్యకలాపాలతో ముడిపడివున్న పరిశ్రమలను ఉద్గ్రహణ పరిశ్రమలు అంటారు. ఖనిజాల త్రవ్వకము, బొగ్గు ఖనిజము, నూనె, ఇనుప ఖనిజము, అడవుల నుంచి కలప, రబ్బరు వెలికితీయడము ఉద్గ్రహణ పరిశ్రమకు ఉదాహరణలు.

4) వస్తు తయారీ పరిశ్రమలు: ముడి పదార్థాలు లేదా సగము తయారైన వస్తువుల నుంచి పూర్తిగా తయారైన వస్తువులను ఉత్పత్తి చేసేవాటిని వస్తు తయారీ పరిశ్రమలు అంటారు. ఈ వస్తు తయారీ పరిశ్రమ ప్రధానముగా కర్మాగారాలలో సాగుతూ ఉంటుంది. ఇనుము-ఉక్కు, యంత్ర పరికరాలు, సిమెంటు, వస్త్రాలు మొదలైనవాటికి సంబంధించిన పరిశ్రమలను వస్తు తయారీ పరిశ్రమలకు ఉదాహరణలుగా చెప్పవచ్చును. వస్తు తయారీ పరిశ్రమలను మరల వర్గీకరించవచ్చును.

  1. విశ్లేషణాత్మక పరిశ్రమలు
  2. ప్రక్రియాత్మక పరిశ్రమలు
  3. మిశ్రమ పరిశ్రమలు
  4. జోడింపు పరిశ్రమలు.

5) వస్తు నిర్మాణ పరిశ్రమలు: రోడ్లు, వంతెనలు, భవనాలు, కాలువలు, ప్రాజెక్టులు మొదలైన నిర్మాణాలను చేపట్టేవాటిని వస్తు నిర్మాణ పరిశ్రమలుగా పేర్కొనవచ్చును. ఉద్గ్రహణ మరియు వస్తు తయారీ పరిశ్రమలలో తయారైన వస్తువులలో అధిక భాగము ఈ రకమైన పరిశ్రమలలో ముడిపదార్థముగా వాడతారు.

6) సేవారంగ పరిశ్రమలు: ప్రస్తుతము సేవారంగము ఒక దేశ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నది కాబట్టి దీనిని సేవారంగ పరిశ్రమగా పేర్కొంటారు. సేవారంగ పరిశ్రమలకు చెందిన ఉదాహరణలు – హోటల్ పరిశ్రమ, టూరిజం పరిశ్రమ, వినోద పరిశ్రమ, ఆసుపత్రులు, కళాశాలలు మొదలైనవి.

ప్రశ్న 2.
వాణిజ్యం అంటే ఏమిటి ? వాణిజ్యంలోని వివిధ భాగాలను వివరించండి.
జవాబు.
వాణిజ్యం – శాఖలు లేదా వాణిజ్య భాగాలు:
వాణిజ్యంలో చోటుచేసుకునే వ్యవహారాలను క్రింది రెండు శాఖలుగా విభజించవచ్చు. అవి:

  1. వర్తకం.
  2. వర్తక సదుపాయాలు.

1. వర్తకం: వాణిజ్యంలో ఒక ప్రధాన భాగం వర్తకం. ఇది కొనుగోలుదారులను, అమ్మకందారులను కలుపుతుంది.
ఈ వర్తకం చేసే వ్యక్తిని వర్తకుడు అంటారు. ఈ వర్తకుడు ఉత్పత్తిదారుల నుంచి వస్తువులను సేకరించి వినియోగదారులకు బదలాయింపు చేస్తాడు. ఈ వర్తకాన్ని

  1. స్వదేశీ వర్తకం,
  2. విదేశీ వర్తకం అని రెండు విధాలుగా విభజించవచ్చు.

1. స్వదేశీ వర్తకం:
1) ఒక దేశం యొక్క సరిహద్దుల లోపల జరిగే వర్తకాన్ని స్వదేశీ వర్తకం అంటారు. దీన్ని అంతర్గత వర్తకం అని కూడా పిలుస్తారు.

2) ఇందులో కొనుగోలుదారులు, అమ్మకందారులు ఇద్దరూ ఒకే దేశానికి చెంది ఉంటారు. ఈ స్వదేశీ వర్తకం తిరిగి రెండు రకాలు: అవి a) టోకు వర్తకం b) చిల్లర వర్తకం.
a) టోకు వర్తకం: పెద్ద పెద్ద పరిమాణాలలో వస్తువులను కొనుగోలు, అమ్మకం చేయడాన్ని టోకు వర్తకం అంటారు. ఈ వర్తకాన్ని చేసే వ్యక్తిని ‘టోకు వర్తకుడు’ అంటారు.
b) చిల్లర వర్తకులు: చిన్న, చిన్న పరిమాణాలలో వస్తువులను కొనుగోలు, అమ్మకం చేయడాన్ని చిల్లర వర్తకం అంటారు. ఈ వర్తకాన్ని చేసే వ్యక్తిని ‘చిల్లర వర్తకుడు’ అంటారు. ఈ చిల్లర వర్తకులు టోకు వర్తకులకు వినియోగదారులకు మధ్య వారధిగా ఉంటారు.

2. విదేశీ వర్తకం: అంతర్జాతీయ విమానాశ్రయాల ద్వారా, సముద్ర రవాణాల ద్వారా రెండు లేదా అంతకంటే ఎక్కువ · దేశాల మధ్య వస్తుసేవల క్రయ, విక్రయాలు జరిగితే దానిని ‘విదేశీ వర్తకం’ అంటారు. దీనిని బహిర్గత వర్తకం లేదా అంతర్జాతీయ వర్తకం అని కూడా అంటారు. ఈ విదేశీ వర్తకాన్ని తిరిగి మూడు విభాగాలుగా క్రింద పేర్కొన్న విధంగా ఉపవిభజన చేయవచ్చు.

ఎ) ఎగుమతి వర్తకం: విదేశాలకు సరుకులను అమ్మకం చేయడాన్ని ఎగుమతి వర్తకం అంటారు. ఉదాహరణకు భారతదేశం యునైటెడ్ కింగ్డమ్కు తేయాకు ఎగుమతి చేస్తుంది.
బి) దిగుమతి వర్తకం: ఇతర దేశాల నుంచి సరుకులను కొనుగోలు చేయడాన్ని దిగుమతి వర్తకం అంటారు. ఉదాహరణకు భారతదేశం ఇరాన్ నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకుంటుంది.
సి) ఎంట్రిపో వర్తకం: ఒక దేశం నుంచి సరుకులను దిగుమతి చేసుకొని వేరొక దేశానికి ఎగుమతి చేసే వ్యాపారాన్ని ఎంట్రిపో వర్తకం అంటారు. దీన్ని ‘మారు వర్తకం’ అని కూడా పిలుస్తారు. అలాగే తిరిగి ఎగుమతి చేసే వర్తకం అని కూడా అంటారు.

TS Inter 1st Year Commerce Study Material Chapter 2 వ్యాపార కార్యకలాపాలు

2. వర్తక సదుపాయాలు: వర్తకం లేదా వస్తుసేవల పంపిణీ అనేక రకాల ఇబ్బందులను ఎదురుకొంటుంది. వాటిని తొలగించడానికి సహాయపడే అంశాలను వర్తక సదుపాయాలు అంటారు. ఇవి వస్తువులు, ఉత్పత్తిదారులు నుంచి వినియోగదారులకు సులభంగా చేరడానికి దోహదపడతాయి. కాబట్టి వర్తకం ఎటువంటి అవరోధాలు, అడ్డంకులు లేకుండా నిరాటంకంగా కొనసాగడానికి సహాయపడు సదుపాయాలను వర్తక సదుపాయాలు అంటారు.

ఈ వర్తక సదుపాయాలలో రవాణా, బీమా, గిడ్డంగులు, బాంకింగ్, వ్యాపార ప్రకటనలు మరియు సమాచారం ప్రధానమైనవి.
1. రవాణా: వస్తువుల ఉత్పత్తి కేంద్రాలకు మరియు వస్తువుల వినియోగ కేంద్రాలకు మధ్య దూరం ఎక్కువగా ఉన్నప్పుడు వస్తుసేవల పంపిణీలో చాలా ఇబ్బందులు ఏర్పడుతాయి. ఈ ఇబ్బందులను అధిగమించడానికి దోహదపడే వర్తక సదుపాయమే రవాణా. ఇది వస్తు-సేవలకు స్థల ప్రయోజనాన్ని కల్పిస్తుంది. ఈ రవాణాలో ముఖ్యమైనవి భూమార్గ రవాణా, జలమార్గ రవాణా మరియు వాయు మార్గం.

2. కమ్యూనికేషన్: ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సమాచారాన్ని పంపడం లేదా వినిమయం చేయడాన్ని కమ్యూనికేషన్ అంటారు. ఇది మౌఖికంగా గాని, లిఖితపూర్వకంగా గాని ఉండవచ్చు. ఆధునిక కమ్యూనికేషన్ పరిస్థితుల్లో టెలిఫోన్, టెలీ కాన్ఫరెన్స్, ఈ-మెయిల్, వీడియో కాన్ఫరెన్స్ మొదలైనవి ప్రముఖ పాత్రను పోషిస్తూ, ఉత్పత్తిదారులకు వినియోగ దారులకు మధ్య మంచి అనుబంధం ఏర్పడడానికి ఎంతో దోహదపడుతున్నాయి.

3. గిడ్డంగులు: ఉత్పత్తికీ, వినియోగానికీ మధ్య కాలవ్యవధి ఉంటుంది. ఒక సమయంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు అదే సమయంలో వినియోగింపబడవు. కాబట్టి నిల్వ ఉంచే సదుపాయాల అవసరం ఏర్పడింది. ఉదా: వ్యవసాయ వస్తువులైన గోధుమలు, బియ్యం ఒక కాలంలోనే ఉత్పత్తి అవుతాయి, కానీ సంవత్సరం పొడవునా వినియోగించబడతాయి. వినియోగదారులకు సకాలంలో వస్తువులను అందించడం ద్వారా గిడ్డంగులు ఆ వస్తువుకు ‘కాలప్రయోజనాన్ని’ సృష్టిస్తాయి.

4. బాంకింగ్: సరుకుల ఉత్పత్తి లేదా కొనుగోలుకూ, అమ్మకానికి మధ్య సామాన్యంగా కాలవ్యవధి ఉంటుంది. అరువుపై సరుకులను అమ్మకం చేసినప్పుడు నగదు వసూలు కావడానికి సమయం పడుతుంది. ఈ వ్యవధిలో వ్యాపారస్తునికి ఆర్థిక అవసరాలు ఉంటాయి. ఇలాంటి ఆర్థిక అవరోధాన్ని బాంకులు తొలగిస్తాయి. ద్రవ్య సహాయక సంస్థలు, రుణాలు మంజూరు లేదా ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం ద్వారా నిధులను కల్పిస్తాయి.

5. బీమా: నష్ట భయాలను బీమా తగ్గిస్తుంది. ఇది ముఖ్యమైన వర్తక సదుపాయం. ప్రతి వ్యాపారంలోను అనిశ్చిత పరిస్థితి ఉంటుంది. భారీ నష్టాలు రాకుండా హామీలాగా ఇది పనిచేస్తుంది. నష్ట భయాలు, అగ్ని ప్రమాదం, దొంగతనం ఇతర ప్రకృతి వైపరీత్యాలకు చెందినవి కావచ్చు. బీమా అనేక మందిపై విస్తరింపచేయడం ద్వారా నష్ట భయాలను బీమా సంస్థ తగ్గించే ప్రయత్నం చేస్తుంది.

6. ప్రకటనలు: మార్కెట్లోని వివిధ వస్తువుల ఉపయోగాలు, లభించే ప్రదేశాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రకటనలు అందజేస్తాయి. సమాచార లోపం అనే అవరోధాన్ని తొలగించడానికి ప్రకటనలు తోడ్పడతాయి. గెగియో, న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లు, టి.వి., ఇంటర్నెట్ మొదలైన వాటి ద్వారా ప్రకటనలు జారీ అవుతాయి.

ప్రశ్న 3.
ప్రస్తుత తరుణంలో వాణిజ్యం యొక్క ప్రాముఖ్యతను చర్చించండి.
జవాబు.
1. వస్తుసేవల వినిమయాన్ని వాణిజ్యం అంటారు. వస్తువులను అవి ఉత్పత్తి అయ్యే ప్రదేశాల నుంచి అంతిమంగా వినియోగించే ప్రదేశాలకు చేర్చే ప్రక్రియలో చేపట్టే కార్యకలాపాలన్నింటిని స్థూలంగా ‘వాణిజ్యం’ అని పిలుస్తారు. వినియోగదారుల అవసరాలు తీర్చడం కోసం సకాలంలో సక్రమంగా వస్తుసేవలను పంపిణీ చేయడమే వాణిజ్యం యొక్క ప్రధాన అంశం.

2. ‘వాణిజ్యం’ అనే పదం పరిధిలోకి వర్తకం, వర్తక సదుపాయాలు చేరుతాయి. వాణిజ్యం అనేది చాలా విస్తృతమైన పదం. వస్తువుల కొనుగోలు, అమ్మకానికి మధ్య ఉండే అన్ని పనులు దీని పరిధిలోకి వస్తాయి.

3. జేమ్స్ స్టీఫెన్సన్ అభిప్రాయం ప్రకారం “వస్తువుల వినియోగంలో వ్యక్తులకు, ప్రదేశానికి, కాలానికి సంబంధించిన అవరోధాలను తొలగించడం కోసం చేసే పనుల సముదాయమే వాణిజ్యం”. పారిశ్రామిక ప్రపంచంలోని సభ్యుల మధ్య వస్తువుల వినియోగ నిమిత్తం ఏర్పాటు చేసే వ్యవస్థీకృత విధానాన్నే వాణిజ్యం అంటారు.

వాణిజ్యం – ప్రాముఖ్యత:
వాణిజ్యం యొక్క ప్రాధాన్యతను క్రింది పేర్కొన్న అంశాల ద్వారా వివరించవచ్చు.
1. పెరుగుతూ ఉండే మానవ కోర్కెలను వాణిజ్యం సంతృప్తిపరచే ప్రయత్నం చేస్తుంది: మానవుల యొక్క కోరికలకు అంతులేదు. వాణిజ్యంలో ఉండే పంపిణీ ప్రక్రియ వల్ల ప్రపంచంలో ఒక మూల నుంచి వస్తువులు వేరొక చోటికి ప్రయాణం అవుతున్నాయి. కావున వాణిజ్యం తనతో ఇమిడివున్న వివిధ అంశాల సహాయంతో మానవ కొర్కెలను సంతృప్తిపరిచే ప్రయత్నం చేస్తుంది.

2. జీవన ప్రమాణాల పెరుగుదలకు వాణిజ్యం సహాయపడుతుంది: సమాజంలోని వ్యక్తులు పొందే నాణ్యమైన జీవన తీరుతెన్నులను జీవన ప్రమాణం అంటారు. ఒకప్పటి కంటే ఎక్కువ వస్తువులను మానవుడు వినియోగిస్తుంటే అతని జీవన ప్రమాణం వృద్ధి చెందినట్లే. సరైన సమయంలో, సరైన ప్రదేశంలో, సరైన ధరకు మనం కోరుకొనేవాటిని అందజేయడం ద్వారా వాణిజ్యం మన జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది.

TS Inter 1st Year Commerce Study Material Chapter 2 వ్యాపార కార్యకలాపాలు

3. ఉత్పిత్తిదారులను, వినియోగదారులను అనుసంధానం చేస్తుంది: తుది వినియోగం కోసమే ఉత్పత్తి జరుగుతుంది. చిల్లర వర్తకులు, టోకు వర్తకులు, వర్తక సదుపాయాల ద్వారా వాణిజ్యం, ఉత్పత్తిదారులను, వినియోగదారులను కలుపుతుంది. తద్వారా ఉత్పత్తి కేంద్రాలకు, వినియోగానికి మధ్య సంబంధాలను సృష్టించి వాణిజ్యం వాటిని నిరంతరం కొనసాగేటట్లు చేస్తుంది.

4. ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది: వాణిజ్యం, పరిశ్రమ, వర్తకం ప్రగతి చెందితే దాని ప్రభావం వర్తక ఏజెన్సీలలోని బాంకింగ్, రవాణా, గిడ్డంగులు, బీమా, ప్రకటనల లాంటి వాటిపై పడుతుంది. ఇవన్నీ సరిగా పనిచేయాలంటే వ్యక్తులు అవసరం. అందువల్ల వాణిజ్యం ఉద్యోగ అవకాశాలను మెండుగా సృష్టిస్తుంది.

5. జాతీయాదాయాన్ని, సంపదను పెంచుతుంది: ఉత్పత్తి పెరిగితే జాతీయాదాయం కూడా పెరుగుతుంది. ఎగుమతుల వల్ల సుంకాల రూపంలో విదేశీమారక ద్రవ్యం లభిస్తుంది.

6. వర్తక సదుపాయాల విస్తరణకు తోడ్పడుతుంది: వర్తక, వాణిజ్యాలు అభివృద్ధి చెందినప్పుడు, వర్తక సదుపాయాల విస్తరణ, ఆధునీకరణ అనివార్యం. వాణిజ్యం మెరుగైనప్పుడు వర్తక సదుపాయాలైన బాంకింగ్, కమ్యూనికేషన్, రవాణా, ప్రకటనలు, బీమా మొదలైనవి విస్తరిస్తాయి మరియు ఆధునీకరించబడుతాయి.

7. అంతర్జాతీయ వర్తకాన్ని ప్రోత్సహిస్తుంది: రవాణా, సమాచార రంగాలు అభివృద్ధి చెందడం వల్ల వివిధ దేశాలు తమ మిగులు వస్తువులను ఎగుమతి చేసి తద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని పొందగలుగుతాయి. ఆ విధంగా వాణిజ్యం దేశ సత్వర ఆర్థిక ప్రగతికి కారణమవుతుంది.

8. వెనుకబడిన దేశాలకు ఇది ప్రయోజనకారి: తక్కువగా అభివృద్ధి చెందిన దేశాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని, నైపుణ్యం ఉన్న కార్మికులను ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాల నుంచి దిగుమతి చేసుకోవచ్చు. అలాగే అభివృద్ధి చెందిన దేశాలు అవసరమైన ముడిపదార్థాలను వెనుకబడిన దేశాల నుంచి దిగుమతి చేసుకోవచ్చు. ఈ విధమైన పరిణామాలు తక్కువగా అభివృద్ధి చెందిన దేశాల పారిశ్రామికీకరణకు తోడ్పడుతాయి.

9. అత్యవసర సమయాలలో సహాయపడుతుంది: వరదలు, భూకంపాలు, యుద్ధాలు లాంటి అత్యవసర సమయాలలో అవసరమైన ప్రాంతాలకు అవసరమైన ఆహార పదార్థాలు, మందులు, ఇతర సహాయక చర్యలు అందించడంలో వాణిజ్యం సహాయపడుతుంది.

ప్రశ్న 4.
వర్తకాన్ని నిర్వచించి, వివిధ రకాల వర్తక సదుపాయాల గురించి వివరించండి.
జవాబు.
వస్తువుల కొనుగోలు, అమ్మకాల ప్రక్రియను వర్తకము అంటారు. వర్తకము వాణిజ్యములో ప్రధాన భాగము. వస్తుసేవల ఉత్పత్తిదారులు వాటిని వినియోగించే వినియోగదారుల వద్దకు చేర్చి, వారిమధ్య సంబంధాలను నెలకొల్పేటట్లు చేస్తుంది.’ అనగా ఉత్పత్తిని వినియోగములోనికి తేవటమే వర్తకము. వాణిజ్య కార్యకలాపాలన్నీ వర్తకము చుట్టూ
తిరుగుతాయి.

వర్తక సదుపాయాలు: వర్తకము అనేక సాధక బాధకాలతో కూడిన ప్రక్రియ. దీనిలో అనేక అడ్డంకులు ఉంటాయి. వీటిని తొలగించి వస్తు సరఫరాను సులభతరము చేయడానికి ఉన్న సదుపాయాలే వర్తక సదుపాయాలు. వర్తక సదుపాయాలలో రవాణా, సమాచారము, గిడ్డంగులు, బ్యాంకులు, బీమా, వ్యాపార ప్రకటనలు ఉంటాయి.

1) రవాణా: ఉత్పత్తి, వినియోగ కేంద్రాలకు మధ్యదూరము పెరుగుచున్నది. ఈ అడ్డంకిని రవాణా సౌకర్యాలు తొలగిస్తున్నవి. రవాణా వస్తువులకు స్థల ప్రయోజనాన్ని కల్గిస్తుంది. ఉత్పత్తి అయిన సరుకు వినియోగదారుల వద్దకు చేర్చడానికి రవాణా తోడ్పడుచున్నది. ఆధునిక రోడ్డు, రైలు, విమాన, సముద్రయాన రవాణా సౌకర్యాల వలన వస్తు పంపిణీ వేగముగా, భద్రముగా జరుగుతున్నది.

2) కమ్యూనికేషన్: కమ్యూనికేషన్ అనగా ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య సమాచార మార్పిడి. ఇది నోటిమాటల రూపములో లేదా వ్రాతపూర్వకముగా ఉండవచ్చు. వ్యాపారములో ఉన్న షరతులు పరిష్కరించుకోవడానికి, సమాచారం ఒకరి నుండి మరొకరికి స్పష్టంగా చేరాలి. ఉదా: వస్తువుల ధర, డిస్కౌంట్, పరపతి సౌకర్యము మొదలైన సమాచారమును కమ్యూనికేట్ చేయవలసి ఉంటుంది. టెలిఫోన్, టెలెక్స్, టెలిగ్రాం, ఈ-మెయిల్, టెలీకాన్ఫరెన్స్ మొదలైనవి వ్యాపారస్తులు, వినియోగదారుల మధ్య సంబంధాలు నెలకొల్పడానికి తోడ్పడుచున్నవి.

3) గిడ్డంగులు: ఉత్పత్తి అయిన వస్తువులన్నీ వెంటనే అమ్ముడు కాకపోవచ్చు. వస్తూత్పత్తికి, వినియోగానికి మధ్య కాలవ్యవధి ఉంటుంది. ఈ కాలవ్యవధిలో అమ్మకము జరిగేంతవరకు వస్తువులను గిడ్డంగులలో నిల్వచేయాలి. బియ్యము, గోధుమ మొదలైన వ్యవసాయ ఉత్పత్తులు కొన్ని మాసములలోనే జరుగుతుంది. కాని వాటి డిమాండు సంవత్సరము పొడవునా ఉంటాయి. గొడుగులు, ఉన్ని వస్తువులను సంవత్సరమంతా ఉత్పత్తి చేసినా వాటి డిమాండు కొన్ని కాలములలోనే ఉంటుంది. కాబట్టి వస్తువులకు డిమాండు వచ్చేవరకు గిడ్డంగులలో నిల్వచేయవలసి ఉంటుంది. గిడ్డంగులు కాలప్రయోజనాన్ని కల్గిస్తాయి.

4) బీమా: సరుకులు గిడ్డంగులలో ఉన్నప్పుడు, రవాణా చేస్తున్నప్పుడు అనేక కారణాల వలన సరుకు చెడిపోవడం, ప్రమాదానికి గురికావడము జరుగుతుంది. వర్తకులకు ఇలాంటి నష్టములు కలిగినపుడు బీమా సంస్థలు రక్షణ కల్పించి, వర్తకాభివృద్ధికి తోడ్పడతాయి.

5) బ్యాంకింగ్: వాణిజ్యము అభివృద్ధి చెందేటందుకు అవసరమైన ద్రవ్యము, పరపతి, అడ్వాన్సులను అందించే ఒక వర్తక సదుపాయమే బ్యాంకింగ్. ఆర్థికపరమైన ఇబ్బందులను తొలగించుటలో బ్యాంకులు ముఖ్యమైన పాత్రను వహిస్తున్నవి. ఇది ప్రధానమైన వాణిజ్య కార్యకలాపము.

6) ప్రకటనలు: ఉత్పత్తిదారులు తాము ఉత్పత్తిచేసిన వస్తువులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రకటనల ద్వారా వినియోగదారులకు తెలియజేస్తారు. ప్రకటనలు వస్తువులను కొనుగోలు చేయాలి అనే భావనను వినియోగ దారులలో కలుగజేస్తుంది. టి.వి., రేడియో, వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, హోర్డింగులు, ఇంటర్ నెట్ ద్వారా ప్రకటనలను అందజేయడం జరుగుతుంది.

ప్రశ్న 5.
వర్తకం, వాణిజ్యం మరియు పరిశ్రమల మధ్య గల అంతర్గత సంబంధాన్ని వివరించండి.
జవాబు.
1. వ్యాపారం, పరిశ్రమ మరియు వాణిజ్యం అని రెండు రకాలుగా విభజించబడుతుంది. వాణిజ్యం తిరిగి వర్తకం మరియు వర్తక సదుపాయాలుగా ఉపవిభజన చేయడం జరుగుతుంది. వాస్తవానికి అవన్నీ ఒకదానితో ఒకటి సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటాయి. వాటిని వేరువేరుగా విభజించలేము. అవన్నీ కూడా స్థూలంగా వ్యాపార వ్యవస్థలోని భాగాలే. పరిశ్రమ లేకుండా వాణిజ్యం, వాణిజ్యం లేకుండా పరిశ్రమకు మనుగడలేదు. ఎందుకంటే ప్రతి ఉత్పత్తిదారుకు తాను ఉత్పత్తి చేసిన వస్తువులను అమ్మడానికి మార్కెట్ కావాలి. కానీ ఉత్పత్తిదారు నేరుగా కొనుగోలుదారులతోగాని, వినియోగదారులతో కానీ సంబంధం కలిగి ఉండకపోవచ్చు. కాబట్టి పరిశ్రమకు ఎల్లప్పుడు వాణిజ్యం అవసరం.

2. వాణిజ్యం వస్తు – సేవల అమ్మకం, బదిలీ మరియు వినిమయానికి చెందినది. కాబట్టి ఈ వస్తు – సేవల ఉత్పత్తికి పరిశ్రమ అవసరం. అలాగే వాణిజ్యం ఉత్పత్తిదారులకు మరియు తుది వినియోగదారులకు మధ్య బంధంను ఏర్పాటు చేయడానికి కావలసిన యంత్రాంగాన్ని రూపొందిస్తుంది. ఇందులో కొనుగోలు, అమ్మకాలు, రవాణా చేయడం, బాంకింగ్ సరుకులను బీమా చేయడం, గిడ్డంగులలో ఉంచడం లాంటివి ఇమిడి ఉంటాయి.

3. వర్తకం అనేది వస్తు – సేవల యొక్క కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన కార్యకలాపం. ఇది పరిశ్రమకు కావలసిన మద్దతును అందిస్తూ, వాణిజ్యం ఎటువంటి అడ్డంకులు లేకుండా సాగడానికి దోహదపడుతుంది. అలాగే వర్తక సదుపాయాలు లేకుండా కూడా వర్తకం కొనసాగలేదు.

4. కాబట్టి పరిశ్రమ, వాణిజ్యం, వర్తకం చాలా దగ్గరి సంబంధాన్ని కలిగి ఉండటంతో పాటు వాటి విజయానికి గాను ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. పరిశ్రమ వస్తుసేవలను ఉత్పత్తి చేస్తే వాణిజ్యం వాటి అమ్మకాలకు కావాల్సిన పరిస్థితులను కల్పిస్తుంది. కాగా వర్తకం వాస్తవ అమ్మకాలను చేపడుతుంది.

5. ఈ మూడు అంశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడడమే కాకుండా, ఒకదానితో ఒకటి పరస్పరంగా ఆధారపడి ఉండును. క్లుప్తంగా వాటి మధ్య ఉండే అంతర్గత సంబంధాన్ని క్రింది పటం ద్వారా చక్కగ అర్థం చేసుకోవచ్చు.

TS Inter 1st Year Commerce Study Material Chapter 2 వ్యాపార కార్యకలాపాలు 1

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పరిశ్రమను నిర్వచించండి.
జవాబు.
వస్తుసేవల ఉత్పత్తికి చెందిన కార్యకలాపాల సమూహాన్ని స్థూలముగా పరిశ్రమ అని నిర్వచించవచ్చును. అందుబాటులో ఉన్న భౌతిక వనరులను వివిధ ప్రక్రియల ద్వారా తుది వినియోగదారుల కోర్కెలను సంతృప్తిపరచడానికి గాను వస్తు సేవల రూపములో ఉత్పత్తి చేయడం జరుగుతుంది. వస్తుసేవలను ఉత్పత్తి చేసి వినియోగదారులకు సౌకర్యవంతముగా ఆమోదయోగ్యముగా అందించడమే పారిశ్రామిక ప్రక్రియలో ఇమిడివున్న అంశము. ఫ్యాక్టరీలు, పారిశ్రామిక సంస్థలు, ప్రజోపయోగ సంస్థలు, వ్యవసాయ క్షేత్రాలు మొదలైనవి ఎన్నో వస్తుసేవలను అందిస్తున్నవి.

TS Inter 1st Year Commerce Study Material Chapter 2 వ్యాపార కార్యకలాపాలు

పరిశ్రమ ఆకార ప్రయోజనాన్ని సృష్టిస్తుంది. అంటే ఉత్పత్తి కారకాల ద్వారా తుది వినియోగదారునకు పనికివచ్చేటట్లు లభ్యమైన వనరులను వివిధ రూపాలలో అందజేస్తుంది.
పారిశ్రామిక సంస్థలు వివిధ ప్రయోజనాల నిమిత్తము రకరకాల వస్తువులను ఉత్పత్తిచేస్తాయి. వాటిని స్థూలముగా ప్రాథమిక వస్తువులు, తయారీలో ఉన్న వస్తువులు, తయారైన వస్తువులు అని విభజించవచ్చును. తయారైన వస్తువులను ఉత్పత్తి వస్తువులు, వినియోగదారు వస్తువులని కూడా విభజించవచ్చును.

ప్రశ్న 2.
వాణిజ్యం అంటే ఏమిటి ?
జవాబు.
వాణిజ్యము వస్తువుల మారకానికి సంబంధించినది. వస్తువులు ఉత్పత్తి అయ్యే స్థానము నుంచి తుది వినియోగదారునకు చేరడానికి సంబంధించిన అన్ని కార్యకలాపాలతోను వాణిజ్యానికి సంబంధము ఉంటుంది. వస్తుసేవల పంపిణీ విధానాన్ని వాణిజ్యము అంటారు. పారిశ్రామిక ప్రపంచములో వ్యక్తుల మధ్య వస్తువుల పంపిణీ కోసం ఏర్పరచిన క్రమబద్ధమైన వ్యవస్థే వాణిజ్యమని జేమ్స్ స్టీఫెన్ సన్ నిర్వచించినాడు. వాణిజ్యము ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు మధ్య సత్సంబంధాలు ఏర్పరచి వస్తువుల సరఫరా సరళముగా, సులువుగా జరగడానికి సౌకర్యాలను వాణిజ్యము ఏర్పరుస్తుంది. సులభముగా వస్తుసేవలు ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు చేరవేసే ప్రక్రియలో ఉన్న అవరోధాలను తొలగించి, వస్తుసేవల ప్రవాహాన్ని సులభతరము చేస్తుంది.

ప్రశ్న 3.
వర్తకం అంటే ఏమిటి ?
జవాబు.
వస్తువుల కొనుగోలు, అమ్మకాల ప్రక్రియను వర్తకము అని అంటారు. వర్తకము వాణిజ్యములో ప్రధాన భాగము. వస్తుసేవల ఉత్పత్తిదారులు వాటిని వినియోగించే వినియోగదారుల వద్దకు చేర్చి, వారి మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు తోడ్పడుతుంది. అంటే ఉత్పత్తిని వినియోగములోనికి తేవటమే వర్తకము. వాణిజ్య కార్యకలాపాలన్నీ వర్తకము చుట్టూ తిరుగుతాయి. వాణిజ్య కార్యకలాపాల వ్యాప్తికి, విజయానికి వర్తకము తోడ్పడుతుంది. వర్తకమును రెండు విధాలుగా విభజించవచ్చును.

  1. స్వదేశీ వర్తకము
  2. విదేశీ వర్తకము.

1) స్వదేశీ వర్తకము: ఒక దేశ సరిహద్దులలో జరిగే వర్తకాన్ని స్వదేశీ వర్తకము అంటారు. అమ్మకం, కొనుగోలు ఒకే దేశములో జరుగుతాయి. స్వదేశీ వర్తకాన్ని అది చేపట్టే కార్యకలాపాల ప్రాతిపదికతనుబట్టి టోకు వర్తకమని, చిల్లర వర్తకమని విభజించవచ్చును.

2) విదేశీ వర్తకము: ఇతర దేశాలతో వర్తకాన్ని కొనసాగించడాన్ని విదేశీ వర్తకము అని అంటారు. దేశ సరిహద్దులు దాటి కొనసాగించే వర్తకమే విదేశీ వర్తకము. విదేశీ వర్తకాన్ని మరల మూడు విధాలుగా విభజించవచ్చును.

  • దిగుమతి వర్తకము
  • ఎగుమతి వర్తకము
  • మారు వర్తకము.

ప్రశ్న 4.
విదేశీ వర్తకంలోని రకాలను వివరించండి.
జవాబు.
ఇతర దేశాలతో వర్తకమును కొనసాగించడాన్ని విదేశీ వర్తకము అంటారు. దేశ సరిహద్దులు దాటే వర్తకమును విదేశీ వర్తకము అనవచ్చు. అనగా అమ్మకపుదారు ఒక దేశములోను, కొనుగోలుదారు మరొక దేశములోను ఉంటారు.

కొనుగోలుదారు విదేశీ మారకపు ద్రవ్యాన్ని పొంది, అమ్మకపుదారుకు పంపవలెను. విదేశీ వర్తకాన్ని అంతర్జాతీయ వర్తకము అని కూడా వ్యవహరిస్తారు. విదేశీ వర్తకాన్ని మూడు రకాలుగా వర్గీకరించవచ్చును.

  • దిగుమతి వర్తకము
  • ఎగుమతి వర్తకము
  • మారు వర్తకము.

a) దిగుమతి వర్తకము: ఒక దేశము మరొక దేశము నుంచి సరుకు కొనుగోలు చేయడాన్ని లేదా తెప్పించుకోవడాన్ని దిగుమతి వర్తకము అని అంటారు. ఇండియా అమెరికా నుంచి యంత్రాలను కొనుగోలు చేస్తే అది ఇండియా దృష్ట్యా దిగుమతి వర్తకము అవుతుంది.

b) ఎగుమతి వర్తకము: ఒక దేశము ఇంకొక దేశానికి సరుకును అమ్మడాన్ని ఎగుమతి వర్తకము అంటారు. ఈ రకమైన వర్తకములో వస్తువులను విదేశీయుల అవసరాలకు సరఫరా చేయడం జరుగుతుంది. ఇండియా అమెరికాకు తేయాకును అమ్మితే అది మనదేశము దృష్ట్యా ఎగుమతి వర్తకము అవుతుంది.

c) మారు వర్తకము: దీనినే ఎంట్రిపోట్ వర్తకము అంటారు. ఏదైనా ఒక దేశము తన సొంత ఉపయోగానికి కాక వేరొక దేశానికి ఎగుమతి చేసే ఉద్దేశ్యముతో మరొక దేశము నుండి సరుకును దిగుమతి చేసుకున్నట్లయితే దానిని ఎంట్రిపోట్ వర్తకము అంటారు.

ప్రశ్న 5.
పరిశ్రమల వర్గీకరణ వివరించండి.
జవాబు.
పరిశ్రమలను సాధారణముగా దిగువ విధాలుగా వర్గీకరించవచ్చు.
1) ప్రాథమిక పరిశ్రమలు: ఈ పరిశ్రమ ప్రకృతిపై ఆధారపడి, ప్రకృతి సహాయముతో వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. ఉదా: వ్యవసాయము, చేపలు పట్టుట, అటవీకరణ మొదలైనవి.

2) ప్రజనన పరిశ్రమలు: ఈ పరిశ్రమలు వంశక్రమానికి చెందిన కొన్ని జాతి మొక్కలను, పశువులను, పక్షులను పునరుత్పత్తి చేసి, వాటిని అమ్మడం ద్వారా లాభాన్ని ఆర్జిస్తాయి. ఉదా: నర్సరీలు, కోళ్ళ పరిశ్రమ, పట్టు పురుగుల పరిశ్రమ.

3) ఉద్గ్రహణ పరిశ్రమలు: ప్రకృతి వనరుల నుంచి వస్తువులను వెలికితీసే కార్యకలాపాలతో ముడిపడివున్న పరిశ్రమలను ఉద్గ్రహణ పరిశ్రమలు అంటారు. ఉదా: ఖనిజాల త్రవ్వకము, బొగ్గు, ఇనుప ఖనిజము మొదలైనవి గనుల నుంచి వెలికితీయడము మొదలైనవి.

4) వస్తు తయారీ పరిశ్రమలు: ముడిపదార్థాలు లేదా సగం తయారైన వస్తువుల నుంచి పూర్తిగా తయారైన వస్తువులుగా ఉత్పత్తిచేసే వాటిని వస్తు తయారీ పరిశ్రమలు అంటారు. ఉదా: ఇనుము -, ఉక్కు, యంత్ర పరికరాలు, సిమెంటు మొదలైనవి.

5) వస్తు నిర్మాణ పరిశ్రమలు: రోడ్లు, వంతెనలు, భవనాలు, ప్రాజెక్టులు మొదలైనవాటి నిర్మాణాన్ని చేపట్టే పరిశ్రమలను వస్తు నిర్మాణ పరిశ్రమలుగా చెప్పవచ్చును.

6) సేవారంగ పరిశ్రమలు: ప్రత్యక్షముగా గాని, పరోక్షముగా గాని ప్రజలకు ఆవశ్యకమైన సేవలను అందజేసే ప్రజోపయోగ సంస్థలను సేవా పరిశ్రమలు అంటారు. ఉదా: హోటల్ పరిశ్రమ, టూరిజమ్ పరిశ్రమ మొదలైనవి.

ప్రశ్న 6.
ఎంట్రిపో వర్తకంను సోదాహరణగా నిర్వచించండి.
జవాబు.
1. ఇంకో దేశానికి ఎగుమతి చేయాలనే ఉద్దేశంతో మరో దేశం నుండి సరుకులను దిగుమతి చేసుకోవడాన్ని ‘ఎంట్రిపో వర్తకం’ అంటారు. దీనినే మారువర్తకం అని కూడా అంటారు.
2. ఇందులో సరుకులను దిగుమతి చేసుకునే దేశం ఇతర రెండు దేశాల మధ్య ‘మధ్యవర్తిగా’ వ్యవహరిస్తుంది.
3. ఉదా: భారతదేశం ఇరాన్ దేశం నుంచి పెట్రోలియం దిగుమతి చేసుకొని నేపాల్ దేశానికి ఎగుమతి చేస్తుంది.

TS Inter 1st Year Commerce Study Material Chapter 2 వ్యాపార కార్యకలాపాలు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పరిశ్రమ.
జవాబు.
1. సహజ, మానవ, వనరులను ఉపయోగించి, వస్తుసేవలను ఉత్పత్తి చేయడం మరియు తయారు చేయడాన్ని “పరిశ్రమ” అంటారు.
2. వ్యాపారము తాలూకు ఉత్పాదనాంశమే పరిశ్రమ. వస్తువుల ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాల సమూహాన్ని పరిశ్రమగా పేర్కొనవచ్చు. వస్తువుల సేకరణ, ఉత్పత్తి, ప్రాసెసింగ్, నిర్మాణము మొదలైనవాటికి సంబంధించిన కార్యకలాపాలను పరిశ్రమగా నిర్వచించవచ్చును.

ప్రశ్న 2.
వాణిజ్యం.
జవాబు. వాణిజ్యము వస్తువుల మారకానికి సంబంధించినది. వస్తువులు ఉత్పత్తి జరిగే ప్రదేశము నుంచి తుది వినియోగదారునకు చేరే వరకు జరిగే అన్ని కార్యకలాపాలతోను వాణిజ్యానికి సంబంధము ఉంటుంది. జేమ్స్ ఫెన్సన్ అభిప్రాయం ప్రకారము, వాణిజ్యము అనగా “వస్తుసేవల మార్పిడిలో వ్యక్తులకు, స్థలానికి, కాలానికి సంబంధించి తలెత్తే అవరోధాలను తొలగించడానికి సహాయపడే కార్యకలాపాల సముదాయమే వాణిజ్యము”.

ప్రశ్న 3.
వర్తకం.
జవాబు.

  1. లాభోద్దేశంతో వస్తుసేవలను కొనుగోలు చేసి తిరిగి అమ్మే నిరంతర ప్రక్రియను వర్తకం అంటారు.
  2. ఇది వాణిజ్యంలోని ఒక భాగం. వర్తకంను నిర్వహించే వ్యక్తిని ‘వర్తకుడు’ అంటారు.
  3. వర్తకాన్ని స్వదేశీ వర్తకం మరియు విదేశీ వర్తకంగా వర్గీకరించవచ్చు.

ప్రశ్న 4.
స్వదేశీ వర్తకం.
జవాబు.

  1. ఒక దేశ సరిహద్దులకు లోబడి జరిపే వస్తువుల కొనుగోలు, అమ్మకాల ప్రక్రియను స్వదేశీ వర్తకము అంటారు.
  2. స్వదేశీ వర్తకాన్ని “అంతర్గత వర్తకం” అని కూడా అంటారు.
  3. స్వదేశీ వర్తకాన్ని టోకు వర్తకం మరియు చిల్లర వర్తకంగా వర్గీకరించవచ్చు.

ప్రశ్న 5.
ఎంట్రిపో వర్తకం.
జవాబు.
1. ఒక దేశము నుంచి వస్తువులను దిగుమతి చేసుకొని వాటిని మరొక దేశానికి ఎగుమతి చేయడాన్ని ఎంట్రిపోట్ వర్తకము లేదా మారు వర్తకము అంటారు.

2. ఉదా: తైవాన్లో తయారైన కాలిక్యులేటర్లను భారతదేశము దిగుమతి చేసుకొని, వాటిని ఆఫ్రికా దేశాలకు మళ్ళీ ఎగుమతి చేయడాన్ని ఎంట్రిపోట్ వర్తకము అంటారు.

3. ఈ వర్తకమును ఆయా దేశాల మధ్య మంచి సంబంధాలు లేనప్పుడు, కొన్ని రవాణా తదితర సౌలభ్యాల వలన కూడా జరుగుతుంది.

ప్రశ్న 6.
రవాణా.
జవాబు.

  1. వస్తు సేవలను రెండు ప్రాంతాల మధ్య ఎలాంటి అడ్డంకులు లేకుండా చేరవేయడానికి సహాయపడే వర్తక సదుపాయమే రవాణా.
  2. రవాణా వస్తువులకు స్థల ప్రయోజనాన్ని కల్గిస్తుంది. ఉత్పత్తి అయిన సరుకు వినియోగదారుల వద్దకు చేర్చడానికి రవాణా తోడ్పడుతున్నది.
  3. ఆధునిక రోడ్లు, రైలు, విమాన, సముద్రయాన రవాణా సౌకర్యాల వలన వస్తు పంపిణీ వేగముగాను, భద్రముగా
    జరుగుతుంది.

ప్రశ్న 7.
గిడ్డంగులు.
జవాబు.
1. వస్తూత్పత్తికి, వినియోగానికి మధ్య కాలవ్యవధి ఉంటుంది. ఈ కాలవ్యవధిలో అమ్మకము జరిగేంతవరకు వస్తువులను గిడ్డంగులలో నిల్వ చేయాలి. గిడ్డంగులు కాలప్రయోజనాన్ని కల్గిస్తాయి.

2. బియ్యము, గోధుమ మొదలైన వ్యవసాయ ఉత్పత్తులు కొన్ని మాసాలలోనే జరుగుతుంది. కాని వాటి డిమాండు సంవత్సరమంతా ఉంటుంది. గొడుగులు, ఉన్ని వస్తువులను సంవత్సరమంతా ఉత్పత్తి చేసినా వాటి డిమాండు కొన్ని కాలాలలోనే ఉంటుంది. కాబట్టి వస్తువులకు డిమాండు వచ్చే వరకు గిడ్డంగులలో నిల్వ చేయాలి.

TS Inter 1st Year Commerce Study Material Chapter 2 వ్యాపార కార్యకలాపాలు

ప్రశ్న 6.
ప్రజనన పరిశ్రమలు.
జవాబు.

  1. ఈ పరిశ్రమలు వంశక్రమానికి చెందుతాయి. కొన్ని జాతుల మొక్కలను, పశువులను, పక్షులను పునరుత్పత్తి చేసి, వాటిని అమ్మడం ద్వారా లాభాన్ని ఆర్జించే కార్యకలాపాన్ని ప్రజనన పరిశ్రమ అంటారు.
  2. నర్సరీలు, చేపల పెంపకము, కోళ్ళ పరిశ్రమ ఇందుకు ఉదాహరణలు.

ప్రశ్న 7.
ఉద్గ్రహణ పరిశ్రమలు.
జవాబు.

  1. ప్రకృతి వనరుల నుంచి వస్తువులను వెలికితీసే కార్యకలాపాలతో ముడిపడివున్న పరిశ్రమలను ఉద్గ్రహణ పరిశ్రమలు అంటారు.
  2. ఖనిజాల త్రవ్వకము, బొగ్గు, నూనె, అడవుల నుంచి కలప, రబ్బరు వెలికితీయడం ఉద్గ్రహణ పరిశ్రమలకు
    ఉదాహరణలు.

అదనపు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వస్తు తయారీ పరిశ్రమలలో గల రకాలను తెల్పండి.
జవాబు.
ముడిపదార్థాలు, సగం తయారైన వస్తువుల నుంచి పూర్తిగా తయారైన వస్తువులను ఉత్పత్తిచేసే వాటిని వస్తు తయారీ పరిశ్రమలు అంటారు. ఇనుము-ఉక్కు, యంత్రపరికరాలు, సిమెంటు, వస్త్రాలు మొదలైనవి ఈ పరిశ్రమలకు ఉదాహరణలుగా చెప్పవచ్చును.

వస్తు తయారీ పరిశ్రమలో గల రకాలు:
1) విశ్లేషణాత్మక పరిశ్రమ: ముఖ్యమైన ముడిపదార్థాలను వివిధ ప్రక్రియల ద్వారా విశ్లేషణ చేసి, విడదీసి వివిధ వస్తువులను ఈ పరిశ్రమలు తయారుచేస్తాయి.
ఉదా: ముడిచమురును నూనె బావుల నుంచి తీసి, శుభ్రపరిచి, పెట్రోలు, డీజిల్, కిరోసిన్ మొదలైనవి తయారు చేయుట.

2) ప్రక్రియాత్మక పరిశ్రమలు: ముడిపదార్థాలను వివిధ దశలలో, వివిధ ప్రక్రియలను జరపడం ద్వారా నూతన వస్తువులను తయారుచేయడం ఈ పరిశ్రమల ద్వారా జరుగుతుంది.
ఉదా: వస్త్రపరిశ్రమ, కాగితం, పంచదార పరిశ్రమలు.

3) మిశ్రమ పరిశ్రమలు: వివిధ రకాల ముడిపదార్థాలను శాస్త్రీయ పద్ధతిలో వివిధ నిష్పత్తులలో మిశ్రమము చేసి కొత్త వస్తువులను తయారుచేసే పరిశ్రమలను మిశ్రమ పరిశ్రమలు అంటారు.
ఉదా: కాంక్రీట్, జిప్సమ్, బొగ్గు కలిపి సిమెంటు తయారుచేయుట.

4) జోడింపు పరిశ్రమలు: వివిధ పరిశ్రమలలో తయారైన వస్తువులను నిర్దిష్ట పద్ధతిలో, క్రమములో జతపరిచి కొత్త వస్తువులను తయారుచేసే పరిశ్రమలను జోడింపు పరిశ్రమలు తయారుచేస్తాయి.
ఉదా: టెలివిజన్, స్కూటర్, సైకిల్ మొదలైన వస్తువులను తయారుచేసే పరిశ్రమలు.

ప్రశ్న 2.
వాణిజ్యం యొక్క అవరోధాలను వివరించండి.
జవాబు.
1) వ్యక్తులకు సంబంధించిన అవరోధాలు: ఉత్పత్తిదారులు దేశము నలుమూలలా వ్యాపించివున్న వినియోగదారులతో ప్రత్యక్ష సంబంధాలను ఏర్పరచుకొనలేరు. ఉత్పత్తిదారునకు, వినియోగదారునకు మధ్య అనేకమంది మధ్యవర్తులు ఉండి వాణిజ్య కార్యకలాపాలు సులభముగా జరగడానికి సహాయపడతారు. వారు ఉత్పత్తిదారుల నుంచి సరుకును కొని, వినియోగదారులకు అమ్ముతారు.

2) స్థలానికి సంబంధించిన అవరోధాలు: వస్తువులు ఒక ప్రదేశములో ఉత్పత్తి అయితే వాటిని వివిధ ప్రదేశాలకు, ఇతర దేశాలకు పంపిణీ చేయవలెను. ఉత్పత్తి ప్రదేశాలకు, వినియోగ కేంద్రాలకు దూరము పెరుగుచున్నది. ఉత్పత్తి అయిన సరుకు వినియోగదారునకు చేరవేయడానికి రవాణా తోడ్పడుతుంది.

3) కాలానికి సంబంధించిన అవరోధాలు ఉత్పత్తిదారులు వస్తువుల ఉత్పత్తిని డిమాండునుబట్టి చేస్తారు. కొన్ని వస్తువులను డిమాండు లేని కాలములో ఉత్పత్తిచేసి, డిమాండును అనుసరించి అమ్ముతారు. కాబట్టి అవి వినియోగమయ్యే వరకు నిల్వ చేయవలసి ఉంటుంది. గిడ్డంగుల సౌకర్యాల ద్వారా ఈ అవరోధాన్ని అధిగమించ వచ్చును.

4) ద్రవ్యమునకు సంబంధించిన అవరోధాలు: వస్తూత్పత్తికి, వినియోగానికి మధ్య కాలవ్యవధి ఉంటుంది. కొన్ని వస్తువులను సంవత్సరమంతా ఉత్పత్తి చేయవలసి ఉంటుంది. వీటికి ద్రవ్యము అవసరము. వాణిజ్య బ్యాంకులు వీరికి ఋణాలిచ్చి ద్రవ్యానికి సంబంధించిన అవరోధాలను తొలగిస్తాయి.

5) రిస్కుకు సంబంధించిన అవరోధాలు: ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశానికి సరుకును రవాణా చేసేటప్పుడు నష్టభయము ఉంటుంది. దొంగతనాలు, అగ్నిప్రమాదాలు సంభవించవచ్చును. ఈ నష్టాలను, ఆస్తులను సంరక్షించు కోవడానికి బీమా కంపెనీలు తోడ్పడతాయి.

6) సమాచారానికి సంబంధించిన అవరోధాలు: వినియోగదారులకు తమకు కావలసిన వస్తువులు ఎక్కడ ఏ విధముగా లభిస్తాయో తెలియకపోవచ్చు. వస్తువుల సమాచారాన్ని ప్రజలకు తెలియజేయటానికి వ్యాపార ప్రకటనలు ఉత్తమ సాధనాలు. వస్తువుల విక్రయానికి వ్యాపార ప్రకటనలు దోహదము చేస్తాయి.

ప్రశ్న 3.
పరిశ్రమ, వాణిజ్యము, వర్తకముల మధ్య గల తేడాలను రాయండి.
జవాబు.
పరిశ్రమ, వాణిజ్యము, వర్తకముల మధ్యగల తేడాలు:
TS Inter 1st Year Commerce Study Material Chapter 2 వ్యాపార కార్యకలాపాలు 2

TS Inter 1st Year Commerce Study Material Chapter 2 వ్యాపార కార్యకలాపాలు

ప్రశ్న 4.
బ్యాంకింగ్.
జవాబు.

  1. వాణిజ్యము అభివృద్ధి చెందేందుకు అవసరమైన ద్రవ్యము, పరపతి అడ్వాన్సులను అందజేసే ఒక వర్తక సదుపాయమే బ్యాంకింగ్.
  2. ఆర్థికపరమైన ఇబ్బందులను తొలగించడములో బ్యాంకులు ముఖ్యపాత్ర వహిస్తున్నవి. బ్యాంకింగ్ ఒక ప్రధానమైన వాణిజ్య కార్యకలాపము.

ప్రశ్న 5.
టోకు వర్తకం.
జవాబు.

  1. వస్తు, సేవల కొనుగోళ్ళు, అమ్మకాలు పెద్ద మొత్తములో జరిగితే దానిని టోకు వర్తకము అంటారు.
  2. టోకు వర్తకుడు ఉత్పత్తిదారుల నుంచి పెద్ద మొత్తాలలో సరుకును కొనుగోలు చేసి చిన్న మొత్తాలలో చిల్లర వర్తకులకు అమ్ముతారు.

TS Inter 1st Year Political Science Study Material Chapter 3 జాతి – జాతీయత, జాతీయ వాదం

Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 3rd Lesson జాతి – జాతీయత, జాతీయ వాదం Textbook Questions and Answers.

TS Inter 1st Year Political Science Study Material 3rd Lesson జాతి – జాతీయత, జాతీయ వాదం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
జాతీయత నిర్వచించి, జాతీయతకు అవసరం అయిన లక్షణాలను తెలపండి.
జవాబు.
జాతీయతను ఆంగ్లంలో ‘నేషనాలిటీ” (Nationality) అంటారు. ఈ ఆంగ్ల పదం ‘నేషియో’ (Natio) అనే లాటిన్ భాష నుండి గ్రహించబడినది. దీనికి “పుట్టుక” లేదా “జన్మ” అని అర్థము. సంస్కృతంలో ‘జా’ అంటే ‘పుట్టుక’ అని అర్థం కలదు.

నిర్వచనం :

  1. బర్జెస్ : “మొత్తం జనాభాలో మెజారిటీ సభ్యులతో కూడిన సామాజిక, సాంస్కృతిక సముదాయమే జాతీయత”.
  2. జె.డబ్ల్యు. గార్నర్ : “తెగవంటి అనేక ప్రజాబంధాలతో ఐక్యమైన ప్రజా సముదాయంలో భాగమే జాతీయత”.
  3. ఆర్.జి.గెటిల్ : “ఒకే తెగ, భాష, మతం, ఆచారాలు, చరిత్ర వంటి ఉమ్మడి అంశాలు గల ప్రజానీకమే జాతీయత”.

జాతీయత లక్షణాలు :
1. స్వచ్ఛమైన తెగ (Purity of Race) :
దీనిని ఏకజాతి లేదా వారసత్వము అనవచ్చు. ఒకే తెగ మనుషుల మధ్య రక్తసంబంధం ఉంటుంది. ఒకే సంతతికి చెందినవారమనే భావంతో ఒకే తెగ ప్రజలు ఐకమత్య భావంతో ఉంటారు. అది దృఢమైన జాతీయత, జాతీని పెంపొందిస్తుంది.
ఉదా : హిట్లర్ కాలంలో జర్మనులు, తమిళనాడులో డి.యం.కె. పార్టీ తమ జాతీయతలను ప్రత్యేకమైనవిగా చెప్పుకున్నాయి. అయితే ఈ కాలంలో ఒక తెగవారే ఒక రాజ్యంలో ఉండటం సాధ్యం కాదు.

2. ఉమ్మడి మతము (Common Religion) :
ఒకే మతస్థుల మధ్య ఐకమత్య భావం ఏర్పడుతుంది. జాతులను సమైక్యపరచడంలో మతం ప్రముఖ పాత్ర వహించింది.’ అయితే ఆధునిక కాలంలో జాతీయతా భావానికి ఒకే మతం ఉండాలనే నియమం లేదు.
ఉదా : 1947లో ముస్లిమ్లంతా మత ప్రాతిపదికన పాకిస్థాన్ రాజ్యం ఏర్పరచుకున్నారు. అది 1972లో రెండుగా చీలిపోయి బంగ్లాదేశ్ ఏర్పడింది.

3. ఉమ్మడి భాష (Common Language) :
ప్రజల మధ్య భావ వ్యక్తీకరణకు, సంప్రదింపులకు భాష అనేది ఒక సాధనం. ఒకే భాషను మాట్లాడే ప్రజలు ఎంతో సులభమైన రీతిలో ఒక జాతిగా రూపొందుతారు. ఉమ్మడి భాష, ఉమ్మడి సాన్నిహిత్యానికి దోహదపడుతుంది. ఒకే రకమైన భావాలు గల వ్యక్తులు సన్నిహితంగా మెలిగేందుకు భాష ముఖ్య సాధనంగా ఉంటుంది.
ఉదా : స్విట్జర్లాండ్లో భాషాపరమైన వైవిధ్యాలు గల ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్ జాతులకు చెందిన ప్రజలు నివసిస్తున్నప్పటికీ, వారందరి మధ్య ఉమ్మడి జాతీయత భావాలు నెలకొన్నాయి. అటువంటి పరిస్థితియే కెనడా, ఇండియా వంటి రాజ్యాలలో గోచరిస్తున్నది.

4. భౌగోళిక ఐక్యత (Geographical Unity) :
జాతీయత, జాతి భావనలో భౌగోళిక ఐక్యత అనేది మరొక ముఖ్య అంశం. భౌగోళిక ఐక్యత అనేది ప్రకృతిలోనే ఇమిడి ఉంది. ఒక దేశపు సమైక్యతకు భౌగోళిక ఐక్యత చిహ్నంగా ఉంటుంది. అంతేకాకుండా, ఒకే రకమైన వాతావరణ పరిస్థితులలో ప్రజలందరూ కలిసికట్టుగా జీవించేందుకు భౌగోళిక ఐక్యత దోహదపడుతుంది. ఒక నిర్ణీత ప్రదేశంలో నివసించే ప్రజల మనసులు, శరీరాలపై భౌగోళిక ఐక్యత అంశం ప్రకృతి సహజమైన ప్రభావాన్ని చూపుతుంది.

అటువంటి ప్రజలు ఒకే రకమైన భావాలతో కూడిన మానసిక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటారు. అయితే భౌగోళిక ఐక్యత ఒక్కటే జాతీయ భావాన్ని పెంపొందిస్తుందని చెప్పలేం.
ఉదా : పాలస్తీనా రాజ్యం ఏర్పాటు జరుగకముందే యూదు జాతికి చెందిన ప్రజలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో నివాస స్థావరాలు ఏర్పరచుకొన్నారు.

5. ఉమ్మడి చరిత్ర (Common History) :
జాతీయతాభావ ఆవిర్భావంలో ఉమ్మడి చరిత్రను ఇంకొక ప్రధాన అంశంగా పరిగణించవచ్చు. ఉమ్మడి చరిత్ర ప్రజానీకంలో ఎంతో ఉత్తేజాన్ని నింపి, వారిని కలిపి ఉంచుతుంది. కొన్నిసార్లు, చారిత్రక సంఘటనలు ప్రజలలో జాతీయతాభావాల వ్యాప్తికి దోహదపడతాయి. ఉదా : బ్రిటిష్ పాలన నుంచి భారతీయులు జాతీయతకు సంబంధించిన అనేక పాఠాలను నేర్చుకున్నారు.

6. ఉమ్మడి సంస్కృతి (Common Culture) :
సంస్కృతి అంటే విస్తృతార్థంలో జీవనవిధానం. సంస్కృతి అనేది కొన్ని ఉమ్మడి అంశాలైన దుస్తులు, ఆచారాలు, ఆహారపు అలవాట్లు, మత విశ్వాసాలు, నైతిక విలువలు మొదలైన వాటి ద్వారా వెల్లడించబడుతుంది. ఈ ఉమ్మడి అంశాలు ప్రజలను ఒక త్రాటిపైకి తెచ్చి కలిపి ఉంచుతాయి.

7. ఉమ్మడి రాజకీయ ఆకాంక్షలు (Common Political Aspirations) :
ఒక ప్రదేశంలో నివసించే ప్రజలు ఉమ్మడి రాజకీయ ఆర్థిక ఆకాంక్షలచే ప్రేరణ పొందుతారు. అటువంటి ఆకాంక్షలు జాతి అవతరణలో శక్తివంతమైన పాత్రను పోషిస్తాయి. ప్రత్యేక రాజ్యాంగం ఏర్పాటై రాజ్యాన్ని నిర్వహించే సామర్థ్యం గల ప్రజలు తగినంత మంది ఉంటే, అటువంటివారు స్వతంత్ర రాజకీయ వ్యవస్థగా రూపొందాలనే ఆకాంక్షను కలిగి ఉంటారు.

విభిన్నమైన అంశాలతో కూడిన ప్రజానీకం కూడా ఉమ్మడి జాతీయతగా ఏర్పడే అవకాశం ఉంటుంది. జర్మనీ, ఇటలీలలోని ఏకీకరణ ఉద్యమాలు, అమెరికా స్వాతంత్య్ర పోరాటం, భారత జాతీయోద్యమాల మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయి. ఇవన్నీ ఆయా దేశాల ప్రజల రాజకీయ ఆకాంక్షలకు ప్రతీకలుగా నిలిచాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 3 జాతి – జాతీయత, జాతీయ వాదం

ప్రశ్న 2.
జాతి – జాతీయవాదం మధ్య సంబంధాన్ని చర్చించండి.
జవాబు.
ఆధునిక ప్రపంచ వ్యవహారాలలో జాతి, జాతీయవాదం అనేవి చాలా శక్తివంతమైన అంశాలు. ఈ రెండు భావనలు ప్రపంచవ్యాప్తంగా సర్వసత్తాక, సార్వభౌమాధికార రాజ్యవ్యవస్థలు ఏర్పరచుకొనేలా ప్రజలను ఉత్తేజపరిచాయి.

అర్థం :
జాతి, జాతీయవాదం అనే ఈ రెండు పదాలు ఒకదానికొకటి పర్యాయపదాలుగా వాడబడతాయి. “ఈ రెండు పదాలు లాటిన్ భాషలోని “నేషియో” (Natio) అనే పదం నుండి ఉద్భవించాయి. లాటిన్ భాషలో ఆ పదానికి జన్మతః పుట్టుక అనే అర్థం ఉంది.

జాతి (Nation) :
ఈ ఆంగ్ల పదం ‘నేటస్’ (Nates), నేషియో (Natio) అనే లాటిన్ పదాల నుండి గ్రహించబడెను. దీనికి ‘పుట్టుక’ అని అర్థము కలదు. లార్డ్స్ ప్రకారము “స్వాతంత్ర్యం పొందిన లేదా స్వాతంత్ర్యం పొందాలని కోరుకుంటూ, రాజకీయంగా వ్యవస్థీకృతమైన ప్రజలనే” జాతి అంటారు. బర్జెస్ ప్రకారం “భౌగోళిక ఐక్యత కలిగి ఉంటూ ఒక నిర్దిష్ట ప్రదేశములో నివసించే తెగకు సంబంధించిన జాతీయతయే జాతి”.

జాతీయవాదం (Nationalism) :
జాతీయవాదం ఆధునిక రాజ్యానికి ఒక లక్షణం. ఇది ఒక మానసిక భావన. ‘అంతర్గతంగా తమ హక్కులను పరిరక్షించుకునేందుకు, విదేశీ దండయాత్రల నుండి తమ దేశ స్వాతంత్య్రాన్ని రక్షించుకునేందుకు దేశ ప్రజలలో ఐకమత్యాన్ని ప్రేరేపించే మానసిక శక్తి ‘జాతీయవాదం’. దీనిని సంక్షిప్తంగా ‘ఐకమత్య ‘భావన’ అనవచ్చు. జాతుల స్వతంత్రానికి, దేశ అభివృద్ధికి ఇది అవసరం. కానీ సంకుచిత, మితిమీరిన జాతీయతా భావం, హానికరము.

జాతి, జాతీయవాదం మధ్య సంబంధం :

  1. జాతీయవాదం ఒక మానసిక భావన. ఒక ప్రజా సమూహం స్వతంత్రంగా వేరుపడి, ప్రత్యేక రాజ్యం కలిగి ఉండటం అనే అంశం ఇందులో ఇమిడి ఉంటుంది.
  2. ఈ భావం ప్రజలలో బలంగా నాటుకుపోవటంతో ప్రజలు తమ జాతి మనుగడ కోసం వారి సమస్త ప్రయోజనాలను పణంగా పెడతారు. వాదం.
  3. జాతీయత అనేది ప్రజల యొక్క ప్రగాఢమైన ఆకాంక్ష. జాతిరాజ్య ఆవిర్భావానికి దోహదపడుటయే జాతీయ
  4. 16వ శతాబ్దంలో ఐరోపాలో ఆవిర్భవించిన సాంస్కృతిక పునరుజ్జీవనం జాతీయవాదానికి బీజాలు వేసింది.
  5. 1789లో సంభవించిన ఫ్రెంచ్ విప్లవం జాతీయవాదాన్ని ఐరోపాలో మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్ళింది. దాని నినాదాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఐరోపా జాతీయులలో తీవ్రమైన రాజకీయ చైతన్యాన్ని కలుగజేశాయి.
  6. వియన్నా సమావేశం (1815) ఐరోపాలో జాతీయవాదాన్ని మరింత బలపరచింది.
  7. ఇటలీ ఏకీకరణ మరియు జర్మనీ ఏకీకరణ జాతీయవాదానికి మరింత బలాన్నిచ్చాయి.
  8. 1774లో సంభవించిన అమెరికా స్వాతంత్ర్య యుద్ధం ప్రజలలో జాతీయవాద వ్యాప్తికి బాగా తోడ్పడింది.
  9. 1917లో నాటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్ ప్రతిపాదించిన “జాతుల స్వయం నిర్ణయహక్కు” ప్రపంచ ప్రజలలో ప్రతి జాతీయ సముదాయం ఒక ప్రత్యేక రాజ్యంగా ఏర్పడాలనే భావాన్ని బలంగా నాటింది.
  10. రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఆసియా, ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికాలలోని దేశాలలో జాతిరాజ్య ఆవిర్భావం కోసం స్వాతంత్ర్యోద్యమాలు ఊపందుకున్నాయి.
  11. 1885 నుండి 1947 మధ్య సాగిన భారత జాతీయోద్యమం భారత్, పాకిస్థాన్లు స్వతంత్ర రాజ్యాలుగా ఆవిర్భవించటానికి దోహదం చేసింది.

దీనిని బట్టి మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే జాతీయవాదం అనే భావం ఎప్పుడైతే ఐక్యతను, స్వాతంత్ర్యాన్ని సాధిస్తుందో, అప్పుడు అది సార్వభౌమాధికార జాతిగా రూపొందుతుంది.
కొంతమంది రాజనీతి శాస్త్రవేత్తలు ఈ రెండింటిని పర్యాయపదాలుగా పరిగణించారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 3 జాతి – జాతీయత, జాతీయ వాదం

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
జాతీయతకు అవసరం అయిన లక్షణాలను సంక్షిప్తంగా వివరించండి.
జవాబు.
జాతీయత లక్షణాలు :
1. స్వచ్ఛమైన తెగ (Purity of Race) :
దీనిని ఏకజాతి లేదా వారసత్వము అనవచ్చు. ఒకే తెగ మనుషుల మధ్య రక్తసంబంధం ఉంటుంది. ఒకే సంతతికి చెందినవారమనే భావంతో ఒకే తెగ ప్రజలు ఐకమత్యభావంతో ఉంటారు. అది దృఢమైన జాతీయత, జాతిని పెంపొందిస్తుంది.
ఉదా : హిట్లర్ కాలంలో జర్మనులు, తమిళనాడులో డి.యం.కె. పార్టీ తమ జాతీయతలను ప్రత్యేకమైనవిగా చెప్పుకున్నాయి. అయితే ఈ కాలంలో ఒకే తెగవారే ఒక రాజ్యంలో ఉండటం సాధ్యం కాదు.

2. ఉమ్మడి మతము (Common Religion) :
ఒకే మతస్థుల మధ్య ఐకమత్య భావం ఏర్పడుతుంది. జాతులను సమైక్యపరచడంలో మతం ప్రముఖ పాత్ర వహించింది. అయితే ఆధునిక కాలంలో జాతీయతా భావానికి ఒకే మతం ఉండాలనే నియమం లేదు.
ఉదా : 1947లో ముస్లిమ్లంతా మత ప్రాతిపదికన పాకిస్థాన్ రాజ్యం ఏర్పరచుకున్నారు. అది 1972లో రెండుగా చీలిపోయి బంగ్లాదేశ్ ఏర్పడింది.

3. ఉమ్మడి భాష (Common Language) :
ప్రజల మధ్య భావ వ్యక్తీకరణకు, సంప్రదింపులకు భాష అనేది ఒక సాధనం. ఒకే భాషను మాట్లాడే ప్రజలు ఎంతో సులభమైన రీతిలో ఒక జాతిగా రూపొందుతారు. ఉమ్మడి భాష, ఉమ్మడి సాన్నిహిత్యానికి దోహదపడుతుంది. ఒకే రకమైన భావాలు గల వ్యక్తులు సన్నిహితంగా మెలిగేందుకు భాష ముఖ్య సాధనంగా ఉంటుంది.
ఉదా : స్విట్జర్లాండ్లో భాషాపరమైన వైవిధ్యాలు గల ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్ జాతులకు చెందిన ప్రజలు నివసిస్తున్నప్పటికీ, వారందరి మధ్య ఉమ్మడి జాతీయత భావాలు నెలకొన్నాయి. అటువంటి పరిస్థితియే కెనడా, ఇండియా వంటి రాజ్యాలలో గోచరిస్తున్నది.

4. భౌగోళిక ఐక్యత (Geographical Unity) :
జాతీయత, జాతి భావనలో భౌగోళిక ఐక్యత అనేది మరొక ముఖ్య అంశం. భౌగోళిక ఐక్యత అనేది ప్రకృతిలోనే ఇమిడి ఉంది. ఒక దేశపు సమైక్యతకు భౌగోళిక ఐక్యత చిహ్నంగా ఉంటుంది. అంతేకాకుండా, ఒకే రకమైన వాతావరణ పరిస్థితులలో ప్రజలందరూ కలిసికట్టుగా జీవించేందుకు భౌగోళిక ఐక్యత దోహదపడుతుంది.

ఒక నిర్ణీత ప్రదేశంలో నివసించే ప్రజల మనసులు, శరీరాలపై భౌగోళిక ఐక్యత అంశం -ప్రకృతి సహజమైన ప్రభావాన్ని చూపుతుంది. అటువంటి ప్రజలు ఒకేరకమైన భావాలతో కూడిన మానసిక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటారు. అయితే భౌగోళిక ఐక్యత ఒక్కటే జాతీయ భావాన్ని పెంపొందిస్తుందని చెప్పలేం.
ఉదా : పాలస్తీనా రాజ్యం ఏర్పాటు జరుగకముందే యూదు జాతికి చెందిన ప్రజలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో నివాస స్థావరాలు ఏర్పరచుకొన్నారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 3 జాతి – జాతీయత, జాతీయ వాదం

ప్రశ్న 2.
జాతీయవాదం ప్రయోజనాలను తెలపండి ?
జవాబు.
జాతీయవాద లక్షణాలను కలిగిన ఆధునిక రాజ్యాలలో కింద పేర్కొన్న సుగుణాలు కనిపిస్తాయి :

  1. జాతీయ వాదం ప్రజల మధ్య నెలకొన్న పరస్పర వైరుధ్యాలు, వ్యక్తిగత విద్వేషాలు, అంతర్గతమైన ఘర్షణలను నిలువరించగలిగింది. ఒక జాతికి సంబంధించిన ప్రజలలో ఐక్యత, సమగ్రత, సంఘీభావాన్ని పెంపొందించింది. ఇరుగు పొరుగు ప్రజల ఉద్దేశ్యాలను తెలుసుకొనేందుకు వీలు కల్పించింది. కాబట్టి ప్రజల మధ్య చక్కని అవగాహనను పెంపొందించింది.
  2. ప్రజలు ప్రభుత్వం పట్ల విధేయత చూపించేలా జాతీయవాదం దోహదపడింది.
  3. అతిస్వల్ప వ్యవధిలో జాతి అన్ని రంగాలలో ప్రగతిని సాధించేందుకు సహాయపడింది.
  4. రాజ్యంలో అభివృద్ధి వేగం పుంజుకొనేలా చూసింది. ప్రభుత్వానికి ప్రజాస్వామ్య పునాదిని ఏర్పాటు చేసింది. తద్వారా పాలన వ్యవస్థకు బలం చేకూర్చింది.
  5. సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించింది. ఆర్థిక దోపిడిని ఖండించింది.
  6. రాజకీయస్థిరత్వాన్ని చేకూర్చింది. ప్రశాంతమైన సామాజిక వాతావరణాన్ని సృష్టించింది.
  7. ప్రజలలో సాంస్కృతిక వికాసానికి దోహదపడింది. అందుకొరకై ప్రజల భాష, సంస్కృతి, సాహిత్యం వేష ధారణలలో సాన్నిహిత్యాన్ని పెంచింది.

ప్రశ్న 3.
జాతి, రాజ్యం ఏ విధంగా వ్యత్యాసాలను కలిగి ఉంటాయి ?
జవాబు.
‘జాతి, రాజ్యం ఒక్కటే అన్న భావాన్ని చాలామంది వ్యక్తపరిచారు. హేస్ అనే శాస్త్రజ్ఞుడి దృష్టిలో రాజకీయ ఐక్యత, సార్వభౌమత్వంతో కూడిన స్వాతంత్ర్యాన్ని పొందిన ఒక జాతీయ సముదాయం జాతి అవుతుంది. అలా ఏర్పడిన జాతినే జాతిరాజ్యం లేదా జాతీయరాజ్యం అని అనవచ్చునని హేస్ పేర్కొన్నాడు.

అందువలన జాతి, రాజ్యం రెండు సమానార్థకాలుగా భావించవచ్చు. ఐక్యరాజ్యసమితి అనే అంతర్జాతీయ సంస్థను ఇంగ్లీషులో United Nations Organisation అంటారు. ఇక్కడ జాతి (Nation) అనే పదానికి రాజ్యం అనే అర్థం.

జాతి : లార్డ్ బ్రైస్ ప్రకారం, “స్వాతంత్ర్యం పొందిన లేదా స్వాతంత్ర్యం పొందాలని కోరుకుంటూ, రాజకీయంగా వ్యవస్థీకృతమైన ప్రజలే జాతి”.
రాజ్యం : ఉడ్రోవిల్సన్ ప్రకారం, “నిర్ణీత భూభాగంలో శాసనబద్ధులై నివసించే ప్రజలే రాజ్యం”

జాతి – రాజ్యం మధ్య వ్యత్యాసాలు (Differences between Nation and State) :

జాతి (Nation)రాజ్యం (State)
1. జాతి అనేది స్వతంత్ర రాజకీయ సముదాయం’ లేదా ఒకానొక బహుళజాతి రాజ్యంలో అంతర్భాగమైందిగా పరిగణించవచ్చు.1. రాజ్యం ఒక జాతి లేదా అనేక జాతుల ప్రజా సముదాయాన్ని కలిగి ఉండవచ్చు.
2. రాజ్యం కంటే జాతి ముందుగా ఆవిర్భవించింది.2. రాజ్యం జాతి తరువాత ఉద్భవించింది. రాజ్యత్వ హోదాను కలిగి ఉండటమే జాతి అంతిమ లక్షణంగా పేర్కొనవచ్చు.
3. ఒకే రకమైన మానసిక భావాలను కలిగి ఉమ్మడి లక్ష్యంతో నివసించే ప్రజా సముదాయమే జాతి.3. ఒక నిర్దిష్ట ప్రదేశంలో శాసనబద్ధులైన ప్రజా సముదాయమే రాజ్యం.
4. జాతి అనేది చారిత్రక, సాంస్కృతిక పరిణామాన్ని కలిగి ఉంటుంది.4. రాజ్యమనేది ఒకే రకమైన రాజకీయ, చట్టబద్ధమైన నిర్మితిని కలిగి ఉంటుంది.
5. జాతి అనే భావన సుదీర్ఘకాలం పాటు జీవనం సాగించిన ప్రజలతో కూడిన సముదాయం.5. రాజ్యం పరిణామాత్మక స్వభావాన్ని కలిగి ఉండక పోవచ్చు. స్వాతంత్ర్యం గల కొన్ని చిన్న రాజకీయ సమాజాలు లేదా విభజన కారణంగా ఏర్పడిన రాజకీయ సమాజాల ఏకీకరణ ఫలితంగా రాజ్యం ఏర్పడుతుంది.

 

TS Board Inter First Year Political Science Study Material Chapter 3 జాతి – జాతీయత, జాతీయ వాదం

ప్రశ్న 4.
జాతి, జాతీయతల మధ్య వ్యత్యాసాలు ఏవి ?
జవాబు.
జాతి, జాతీయతల మధ్య కింద అంశాలలో వ్యత్యాసాలు.

జాతి (Nation)జాతీయత (Nationality)
1. జాతి అనేది రాజకీయ భావన.1. జాతీయత అనేది మానసిక భావన.
2. జాతి అనేది ఎల్లప్పుడూ రాజకీయంగా సంఘటితమైన రాజ్యాన్ని సూచిస్తుంది.2. జాతీయత అనేది ఎల్లప్పుడూ అసంఘటితమైన, అతి సులభమైన భావన.
3. జాతి అనే భావన ఎల్లప్పుడూ స్వతంత్రతను కలిగి ఉంటుంది.3. జాతీయత అనే భావన స్వతంత్రతను కలిగి ఉండదు.
4. జాతీయత లేకుండా జాతి అనేది ఉండదు.4. జాతి లేకుండా జాతీయత ఉంటుంది.
5. జాతిగా ఏర్పడిన ప్రజలు రాజ్య శాసనాలకు విధేయులుగా ఉంటారు.5. జాతీయతగల ప్రజలు జాతిగా రూపొందేవరకు, రాజ్యాంగ చట్టాలు ఉండవు. అయితే స్వీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రజలు కొన్ని ఉమ్మడి నియమాలను అనుసరిస్తారు.

 

ప్రశ్న 5.
జాతుల స్వయం నిర్ణయాధికారం సంక్షిప్త సమాధానం రాయండి.
జవాబు.
ప్రతి జాతీయ సముదాయానికి స్వతంత్రంగా ఉండటానికి, అంటే రాజ్యంగా ఏర్పడటానికి సొంతహక్కు ఉన్నది అని చెప్పేదే జాతి స్వయం నిర్ణయాధికార సిద్ధాంతం. వియన్నా కాంగ్రెసు (1815) కాలం నుంచి 19వ శతాబ్దం చివరి వరకు ‘ఒకే జాతీయ సముదాయం ఒకే జాతి రాజ్యం’ అనే సిద్ధాంతం యూరప్ రాజకీయాలను ప్రభావితం చేస్తూ వచ్చింది.

ఈ సిద్ధాంతాన్ని కారల్మార్క్స్, ఏంజల్స్, లెనిన్ మొదలగువారు బలపరిచారు. అలాగే అమెరికా అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్ మొదటి ప్రపంచ యుద్ధకాలంలో తాను ప్రతిపాదించిన ’14 అంశాల కార్యక్రమంలో ఈ సిద్ధాంతాన్ని చేర్చాడు. 1945లో స్థాపించబడిన ఐక్యరాజ్యసమితి రాజ్యాంగం ఈ సిద్ధాంతానికి మరింత బలాన్ని చేకూర్చింది.

ధర్మకర్తృత్వ మండలి ఉద్దేశ్యం జాతీయ సముదాయాలకు క్రమంగా స్వయం పాలన కలుగజేయటమే. ఒక్కొక్క జాతీయ సముదాయం ఒక్కొక్క జాతీయ రాజ్యంగా అవతరించినందువల్ల పెక్కు ప్రయోజనాలు ఉన్నమాట నిజమే.

అయితే దానివలన కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ భావాన్ని ఖండిస్తూ దానిని మొత్తం ప్రజల వ్యవస్థీకృతమైన స్వార్థ ప్రయోజనంగా (organised self interest of whole people) అభివర్ణించాడు. ఆధునిక కాలంలో జాతీయ భావం ఒక మత భావనకు దారితీస్తున్నదని షిలిటో (Schillito) హెచ్చరించాడు. లార్డ్ యాక్టన్ అభిప్రాయంలో ఏకజాతి రాజ్యం కన్నా బహుళ జాతిరాజ్యమే అన్ని విధాల మెరుగైనది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 3 జాతి – జాతీయత, జాతీయ వాదం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
జాతీయత అంటే ఏమిటి ?
జవాబు.
జాతీయతను ఆంగ్లంలో ‘నేషనాలిటీ’ (Nationality) అంటారు. ఇది ‘నేషియో’ (Natio) అనే లాటిన్ పదం నుంచి గ్రహించబడింది. దీనికి “పుట్టుక” అని అర్థము. ఒక రాజకీయ వ్యవస్థగా రూపొందే జాతీయత జాతి అనబడుతుంది. అంటే రాజ్యము, జాతీయతల కలయిక జాతి అవుతుంది. “ఒకే రక్త సంబంధం, ఒకే భాష, సాహిత్యం, సంప్రదాయాలు, ఉండి కొన్ని కట్టుబాట్లకు లోనై ఉన్న జనసమూహం” జాతీయత అని ‘లార్డ్ బ్రైస్’ నిర్వచించాడు.

ప్రశ్న 2.
జాతిని నిర్వచించండి.
జవాబు.
జాతిని ఆంగ్లంలో ‘నేషన్’ (Nation) అంటారు. ఈ ఆంగ్ల పదం ‘నేటస్’ (Nates), నేషియో (Natio) అనే లాటిన్ పదాల నుండి గ్రహించబడెను. దీనికి ‘పుట్టుక’ అని అర్థము కలదు. లార్డ్స్ ప్రకారము “స్వాతంత్య్రం పొందిన లేదా స్వాతంత్ర్యం పొందాలని కోరుకుంటూ, రాజకీయంగా వ్యవస్థీకృతమైన ప్రజలనే” జాతి అంటారు. బర్జెస్ ప్రకారం “భౌగోళిక ఐక్యత కలిగిఉంటూ ఒక నిర్దిష్ట ప్రదేశంలో నివసించే తెగకు సంబంధించిన జాతీయతయే జాతి”.

TS Board Inter First Year Political Science Study Material Chapter 3 జాతి – జాతీయత, జాతీయ వాదం

ప్రశ్న 3.
జాతీయవాదం ప్రాధాన్యతను వివరించండి.
జవాబు.
జాతీయవాదాన్ని సూక్ష్మంగా పరిశీలించినచో ప్రపంచ వ్యవహారాలలో ఈ భావన కీలకపాత్ర పోషించినదని చెప్పవచ్చు. గత రెండు శతాబ్దాలుగా జాతీయవాదం అత్యంత ప్రాముఖ్యత గల రాజకీయ సిద్ధాంతంగా ప్రాచుర్యం పొంది ప్రపంచ చరిత్రలో కీలక అంశంగా పరిణమించింది.

అయితే జాతీయవాదం ఒకవైపు ప్రపంచ ప్రజలను ప్రభావితం చేయగా మరొకవైపు ప్రపంచ ప్రజానీకం మధ్య విద్వేషాలను కూడా సృష్టించింది. నియంతృత్వ పాలకుల ప్రతిఘటనల నుంచి ప్రజలకు విముక్తి గావించి అనేక సామ్రాజ్యాలు, పలు రాజ్యాల విభజనలలో నిర్ణయాత్మక పాత్రను పోషించింది. అనేక రాజ్యాల సరిహద్దులను నిర్ణయించడంలో సైతం కీలకపాత్ర పోషించింది.

ప్రశ్న 4.
జాతీయవాదానికి సంబంధించి ఏవైనా రెండు ప్రయోజనాలు తెలపండి.
జవాబు.

  1. దేశాన్ని ప్రేమించడం అనే భావాన్ని ప్రజల్లో ఉత్పన్నం చేయడం జాతీయవాదం యొక్క అత్యంత ప్రధాన ప్రయోజనం ప్రజలు ఎప్పుడైతే దేశాన్ని ప్రేమించడం ఆరంభిస్తారో, ఆ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందగలదని ఆశించవచ్చు.
  2. జాతి సంస్కృతులలో గల భిన్నత్వాన్ని జాతీయవాదం పరిరక్షిస్తుంది. తమ సంస్కృతులను కాపాడుకుంటూ ప్రపంచంలోని అన్ని సంస్కృతుల సహజీవనం వల్ల విశ్వమానవత్వ భావన పరిఢవిల్లుతుంది.
  3. ఇతర జాతులకంటే ముందుండాలని లేదా అభివృద్ధి చెందాలని ప్రతి జాతి ప్రయత్నం చేస్తుండటం వల్ల వారి మధ్య ఆరోగ్యకరమైన పోటి ఏర్పడి మానవ జాతి మొత్తం లాభపడే అవకాశం ఉండేలా జాతీయవాదం దేశాల మధ్య జాతీయ దృక్పథంతో కూడిన జాతుల మధ్య పోటీ ఏర్పడుతుంది.
  4. అనేక మంది కవులు, వక్తలు, చిత్రకారులు జాతీయవాదం వల్ల ప్రేరణ పొంది మరపురాని రచనలు, చిత్రాలను ప్రపంచానికి అందించారు.
  5. ప్రతి దేశానికి విముక్తి స్వతంత్ర దేశంగా కొనసాగించాలని జాతీయవాదం కోరుకుంటుంది. అన్ని దేశాలకు స్వాతంత్య్రం లభించినప్పుడు ప్రపంచంలో తక్కువ సంఘర్షణలు, ఉద్రిక్తతలు, కఠినత్వాలు తగ్గే అవకాశం ఉంటుంది.
  6. జాతీయవాదం శక్తుల ఆధారంగా సామ్రాజ్య వాదాన్ని అదుపు చేయవచ్చు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 3 జాతి – జాతీయత, జాతీయ వాదం

ప్రశ్న 5.
జాతీయవాదానికి సంబంధించిన రెండు దుష్పరిణామాలు వివరించండి.
జవాబు.
జాతీయవాదం విమర్శలకు అతీతం ఏమీ కాదు. జాతీయవాదంలో క్రింది దుష్పరిణామాలు ఉన్నాయి.

  1. తమ దేశాన్ని ప్రేమించడం ఎన్నడూ తప్పుకాదు. కాని అది సంకుచితంగా మారి ఇతర దేశాల ప్రయోజనాలకు భంగకరంగా మారకూడదు. ఉదా : జర్మని – ఫ్రెంచ్ల మధ్య జరిగిన యుద్ధం.
  2. సంకుచిత జాతీయవాదం సైనిక సమీకరణకు దారితీస్తుంది. ఈ సమీకరణ దీర్ఘకాలంలో యుద్ధంగా మారే
    అవకాశం ఉంటుంది.
  3. ప్రతి జాతీయవాదం తన వైభవం ఇతరులకంటే అధికంగా ఉండాలని నిరంతరంగా కృషిచేస్తుంది. ఈ వైభవం లేదా ఇతరులకంటే ముందుండాలనే లక్ష్యం ఇతరుల భూభాగాలను చేర్చుకోవడం ద్వారా నెరవేర్చుకోవాలని కోరుకుంటారు. ఇదే జరిగితే ప్రపంచంలో సంఘర్షణలు తలెత్తుతాయి.
  4. తీవ్ర జాతీయవాదం ఆ జాతి ప్రజలలో అసహనాన్ని ఏర్పరుస్తుంది. తమ జాతి అత్యున్నతమైందని భావించి, ఇతర జాతులు పనికిరావని భావించే అవకాశం ఉంది..
  5. జాతీయవాదం సామ్రాజ్య వాదానికి దారి తీస్తుంది. సామ్రాజ్యవాదం మైనారిటి జాతుల సమస్యను తీసుకువస్తుంది.
  6. పెద్ద దేశాలు అనేక జాతీయతలతో కూడుకుని ఉంటాయి. ఆ దేశాలలోని మైనారిటి జాతీయులు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసే అవకాశం ఉంటుంది. అదే జరిగితే జాతీయవాదం విభజన శక్తిగా, ఐక్యత శక్తిగా ` కూడ పనిచేస్తుంది.
  7. దూకుడుతో కూడిన జాతీయవాదం ఇతర దేశాల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తుంది. ఇతరుల బాధలను అసలు పట్టించుకోదు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 3 జాతి – జాతీయత, జాతీయ వాదం

ప్రశ్న 6.
జాతీయత మౌలిక అంశాలలో రెండింటిని తెలపండి.
జవాబు.
జాతీయత లక్షణాలు :
1. స్వచ్ఛమైన తెగ (Purity of Race) :
దీనిని ఏకజాతి లేదా వారసత్వము అనవచ్చు. ఒకే తెగ మనుషుల మధ్య రక్తసంబంధం ఉంటుంది. ఒకే సంతతికి చెందినవారమనే భావంతో ఒకే తెగ ప్రజలు ఐకమత్యభావంతో ఉంటారు. అది ధృఢమైన జాతీయత, జాతిని పెంపొందిస్తుంది.
ఉదా : హిట్లర్ కాలంలో జర్మనులు, తమిళనాడులో డి. యం.కె. పార్టీ తమ జాతీయతలను ప్రత్యేకమైనవిగా చెప్పుకున్నాయి. అయితే ఈ కాలంలో ఒక తెగవారే ఒక రాజ్యంలో ఉండటం సాధ్యం కాదు.

2. ఉమ్మడి మతము (Common Religion) :
ఒకే మతస్థుల మధ్య ఐకమత్య భావం ఏర్పడుతుంది. జాతులను సమైక్యపరచడంలో మతం ప్రముఖ పాత్ర వహించింది. అయితే ఆధునిక కాలంలో జాతీయతా భావానికి ఒకే మతం ఉండాలనే నియమం లేదు.
ఉదా : 1947లో ముస్లిమ్లంతా మత ప్రాతిపదికన పాకిస్థాన్ రాజ్యం ఏర్పరచుకున్నారు. అది 1972లో రెండుగా చీలిపోయి బంగ్లాదేశ్ ఏర్పడింది.