TS Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

Telangana TSBIE TS Inter 1st Year Economics Study Material 6th Lesson పంపిణీ సిద్ధాంతాలు Textbook Questions and Answers.

TS Inter 1st Year Economics Study Material 6th Lesson పంపిణీ సిద్ధాంతాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతాన్ని విమర్శనాత్మకంగా వివరించండి.
జవాబు.
ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలాలు ఏ విధంగా నిర్ణయించబడతాయో ఉపాంత ఉత్పాదకతా సిద్ధాంతం తెలియజేయును.

ఒక ఉత్పత్తి కారకం అదనపు యూనిట్ ఉత్పత్తిలో పాల్గొన్నప్పుడు మొత్తం ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను కారకం యొక్క ఉపాంత ఉత్పాదకత అంటారు. దీనిని అనుసరించి ఉత్పత్తిదారుడు కారకానికి ఇచ్చే ప్రతిఫలాన్ని నిర్ణయిస్తాడు. డేవిడ్ రికార్డో ఈ సిద్ధాంతాన్ని భూమికి మాత్రమే అన్వయించాడు. జె.బి. క్లార్క్ ఈ సిద్ధాంతానికి ఒక రూపాన్ని కల్పించి దానిని అభివృద్ధిపరిచారు. ఉపాంత ఉత్పాదకతను వస్తురూపంలో గాని, ద్రవ్యరూపంలో గాని లెక్కించవచ్చు.

ఒక కారకం యొక్క ఉపాంత ఉత్పాదకతను ఈ క్రింది విధంగా వివరించవచ్చు.
ఉదా : నలుగురు టైలర్లు రోజుకు పది చొక్కాలు కుట్టగలరని అనుకుందాం. అదే ఐదుగురు టైలర్లు 13 చొక్కాలు కుట్టగలరు. 5వ టైలర్ ఉపాంత భౌతిక ఉత్పత్తి మూడు చొక్కాలు. ఒక్క చొక్కా కుట్టినందుకు వేతనం 100/- అనుకుంటే 5వ శ్రామికునికి 3 చొక్కాలు కుట్టినందుకు 300/- వేతనం ఇవ్వవలసి వస్తుంది. ఈ కౌ 300/-ను ఉపాంత ఉత్పత్తి రాబడి అంటారు.

ఉపాంత భౌతిక ఉత్పత్తి సిద్ధాంతం సంపూర్ణ పోటీ మార్కెట్ ప్రమేయంపై ఆధారపడటం వల్ల ఒక ఉత్పత్తి కారకం సగటు వ్యయం దాని ఉపాంత వ్యయంకు సమానంగా ఉంటుంది. ఉత్పత్తి మొదటి దశలో శ్రామికుల సంఖ్య పెంచుతూపోతే తరహాననుసరించి పెరుగుతున్న ప్రతిఫలాల వల్ల అదనపు ఉత్పత్తి రాబడి పెరుగుతుంది.

తరువాత ఇంకా శ్రామికులను పెంచితే క్షీణ ప్రతిఫలాలు వస్తాయి. అందువల్ల ఉపాంత ఉత్పత్తి రాబడి, సగటు ఉత్పత్తి రాబడి ఒక స్థాయి వరకు పెరిగి క్షీణిస్తాయి. దీనిని ఈ క్రింది రేఖాపటం ద్వారా వివరించవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 6th Lesson పంపిణీ సిద్ధాంతాలు 1

పై రేఖాపటంలో ‘E’ బిందువు వద్ద ఉపాంత కారక వ్యయం (MFC), ఉపాంత కారక రాబడి (MRP) సమానంగా ఉండి సంస్థ సమతౌల్యంలో ఉంటుంది. AFC, ARP ఇక్కడ సమానంగా ఉండటం వల్ల సాధారణ లాభాలు పొందుతుంది. శ్రామికులను OL యూనిట్లకు తగ్గిస్తే ‘E’ బిందువు వద్ద MFC, MRP సమానమైనాయి. ఈ బిందువు వద్ద ARP కంటే AFC తక్కువగా ఉండటం వల్ల లాభాలు వస్తాయి.

అందువల్ల శ్రామికులను OL వరకు పెంచవచ్చు. కాని శ్రామికులను OLకు పెంచితే ‘E’ బిందువు వద్ద MFC, MRP సమానమైనాయి. ARP కంటే AFC ఎక్కువగా ఉండటం వల్ల సంస్థకు నష్టాలు వస్తాయి. అందువల్ల శ్రామికులను OL యూనిట్లకు తగ్గించడం జరిగింది. ఇక్కడ శ్రామికుల ఉపాంత ఉత్పత్తికి సమానంగా వేతనం ఉంటుంది.

ప్రమేయాలు :

  1. ఉత్పత్తి కారకాల మార్కెట్ లో పరిపూర్ణ పోటీ ఉంటుంది.
  2. ఉత్పత్తి కారకాలు అన్ని సజాతీయాలు.
  3. ఉత్పత్తి కారకాలకు పూర్తి గమనశీలత ఉంటుంది.
  4. సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది.
  5.  ఒక ఉత్పత్తి కారకం ఉపాంత ఉత్పత్తిని కొలవవచ్చు.

TS Board Inter First Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

ప్రశ్న 2.
భాటకాన్ని నిర్వచించి, రికార్డో భాటక సిద్ధాంతాన్ని విమర్శనాత్మకంగా వివరించండి.
జవాబు.
ఉత్పత్తి కారకంగా భూమి వస్తూత్పత్తి ప్రక్రియలో అందించే సేవలకు లభించే ప్రతిఫలం భాటకము. “డేవిడ్ రికార్డో భాటకాన్ని ఈ విధంగా నిర్వచించారు. “భూమికి ఉన్న సహజమైన, నశింపు కాని ఉత్పాదక శక్తులను ఉపయోగించుకొన్నందుకు పొందే ఫలసాయంలో భూస్వామికి చెల్లించే భాగమే భాటకము”.

రికార్డో భాటక సిద్ధాంతము :
డేవిడ్ రికార్డో భాటకాన్ని వైవిధ్యం వల్ల ఏర్పడే మిగులుగా భావించాడు. భూసారాలలోని వైవిధ్యం వల్ల భాటకం జనిస్తుంది. ఈ భాటకం ఏ విధంగా ఉత్పన్నమవుతుందో రికార్డో ఈ విధంగా వివరించాడు. ఒక ఆర్థిక వ్యవస్థలోని భూములను వాటి సారాన్నిబట్టి 3 రకాలైన భూములున్నాయి అనుకుంటే భాటకం లేదా వైవిధ్యం మిగులు ఏ విధంగా ఏర్పడుతుందో ఈ విధంగా వివరించాడు.

ఒక కొత్త దేశానికి కొంతమంది వలస వెళ్లారనుకుందాం. వాళ్లు అతిసారవంతమైన భూములను సాగు చేస్తారనుకుంటే ముందుగా ‘A’ గ్రేడ్ భూములను సాగుచేస్తారు. ఈ భూమిపై 20 క్వింటాళ్ళు పండించటానికి ఉత్పత్తి వ్యయం ₹ 300 అనుకుందాం.

అంటే యూనిట్ వ్యయం ₹ 15. ప్రతి వ్యవసాయదారుడు కనీసం ఉత్పత్తి వ్యయాన్ని రాబట్టుకోవటానికి యూనిట్ ధరను కూడా ₹ 15గా నిర్ణయించాల్సి ఉంటుంది. అప్పుడు ‘A’ గ్రేడ్ భూములపై మిగులు ఉండదు. కాని ఇంకా కొంతమంది ఆ దేశానికి వలస వస్తే లేదా ఆ దేశ జనాభా పెరిగి ధాన్యానికి డిమాండ్ పెరుగుతుంది.

‘A’ గ్రేడ్ భూములన్నీ సాగు చేశారనుకుంటే ‘B’ గ్రేడ్ ₹ 300 ఖర్చు చేస్తే 15 క్వింటాళ్ళ ధాన్యాన్ని మాత్రమే పండించగలుగుతారు. ‘B’ గ్రేడ్ భూమిపై చేసిన వ్యయాన్ని రాబట్టటానికి ధాన్యం యూనిట్ ధరను ₹ 20గా నిర్ణయించాల్సి ఉంటుంది. ఇప్పుడు ‘B’ గ్రేడ్ భూమిపై మిగులుండదు.

కాని ‘A’ గ్రేడ్ భూమిపై భౌతిక రూపంలో భాటకం 5 క్వింటాళ్ళు. విలువ రూపంలో ₹ 100 ఇంకా జనాభా పెరిగితే ఆహారధాన్యాలకు డిమాండ్ పెరిగి ‘C’ గ్రేడ్ భూములను కూడా సాగుచేయవలసి ఉంటుంది.

‘C’ గ్రేడ్ భూములు, ‘B’ గ్రేడ్ భూముల కంటే ఇంకా తక్కువ సారవంతమైనవి కనుక ₹ 300 ‘C’ గ్రేడ్ భూములపై వ్యయం చేస్తే 10 క్వింటాళ్ళు మాత్రమే పండించటం జరుగుతుంది. వ్యయాన్ని రాబట్టుకోవటానికి యూనిట్ ధాన్యం ధరను ₹ 30గా నిర్ణయించాలి.

అప్పుడు ‘C’ గ్రేడ్ భూమిపై మిగులు ఉండదు. ‘B’ గ్రేడ్ భూమిపై భౌతికంగా 5 క్వింటాళ్ళు మిగులుంటుంది. దాని విలువ ₹ 150. ‘A’ గ్రేడ్ భూమిపై భాటకం పెరుగుతుంది. ‘A’ గ్రేడ్ భూమిపై భౌతికంగా భాటకం 10 క్వింటాళ్ళు దాని విలువ ₹ 300. దీనిని ఈ క్రింది పట్టిక ద్వారా పరిశీలించవచ్చును.

పై పట్టికలో భాటకం లేని భూమిని ఉపాంత భూమి అంటారు. భాటకం భూసారంలోని వైవిధ్యం వల్ల ఏర్పడుతుంది. అన్ని ‘A’ గ్రేడ్ భూములైతే భాటకం ఉండదు.’B’ గ్రేడ్ భూములను సాగుచేస్తే ‘A’ గ్రేడ్ భూమిపై భాటకం ఏర్పడుతుంది. ‘C’ గ్రేడ్ భూములను సాగుచేస్తే ‘B’ గ్రేడ్ భూములపై భాటకం ఏర్పడుతుంది. అందువల్ల వ్యవసాయ ఉత్పత్తిలో క్షీణప్రతిఫలాలు ఏర్పడతాయి.

TS Inter 1st Year Economics Study Material 6th Lesson పంపిణీ సిద్ధాంతాలు 3

పై రేఖాపటంలో షేడెడ్ ఏరియా వివిధ గ్రేడు భూములలో భాటకం లేదా మిగులును తెలియజేస్తుంది. ‘C’ గ్రేడ్ భూమి ఉపాంత భూమి. కాబట్టి ఈ భూమిలో భాటకం లేదు.

TS Board Inter First Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

ప్రశ్న 3.
వాస్తవిక వేతనాలు అంటే ఏమిటి ? వాస్తవిక వేతనాలను నిర్ణయించు అంశాలు ఏమిటి ?
జవాబు.
శ్రామికులు వివిధ రంగాలలో వస్తూత్పత్తి ప్రక్రియలో తన సేవలను అందించారు. అందుకు ప్రతిఫలంగా ఉత్పత్తిదారులిచ్చే ప్రతిఫలం లేదా ధరను వేతనం అంటారు. శ్రామికులకు ప్రతిఫలం లేదా ధరను ద్రవ్య రూపంలో చెల్లిస్తారు. ద్రవ్య రూపంలో ఇచ్చిన వేతనం కొనుగోలు శక్తిని వాస్తవిక వేతనం అంటారు. ఇది ద్రవ్యం కొనుగోలు శక్తిపై ఆధారపడుతుంది.

ఈ కొనుగోలు శక్తి సాధారణ ధర సూచికపై ఆధారపడి ఉంటుంది.
ధరల స్థాయి మారుతున్నప్పుడు ద్రవ్యవేతనంలో మార్పులు లేకపోయినా వాస్తవిక వేతనంలో మార్పు వస్తుంది. వాస్తవిక వేతనమే శ్రామికుని జీవన ప్రమాణస్థాయిని నిర్ణయిస్తుంది. ప్రజలు వినియోగిస్తున్న వస్తువులు, వాటి పరిమాణాలు, నాణ్యతను అనుసరించి వారి జీవన ప్రమాణాలు నిర్ణయించబడతాయి.

వాస్తవిక వేతనాన్ని నిర్ణయించే అంశాలు :

1. ద్రవ్యం కొనుగోలు శక్తి :
సాధారణంగా ద్రవ్యానికుండే కొనుగోలు శక్తిపై వాస్తవిక వేతనాలు ఆధారపడి ఉంటాయి. ద్రవ్యానికి కొనుగోలు శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు శ్రామికులు తమ వేతనంలో ఎక్కువ సౌకర్యాలను సమకూర్చుకోగలరు. ద్రవ్యం కొనుగోలు శక్తి తగ్గినప్పుడు శ్రామికుల వాస్తవిక వేతనం తగ్గుతుంది.

2. వేతనమిచ్చే విధానము :
శ్రామికులకు ఇచ్చే ద్రవ్య వేతనంతోపాటు యాజమాన్యం కొన్ని సదుపాయాలను కూడా కల్పిస్తుంది. ఉదా : ఉచిత వసతి సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు మొదలైనవాటివల్ల వారి వాస్తవిక వేతనాలు అధికమవుతాయి.

3. ఉద్యోగ స్వభావము :
చేసే పని స్వభావం మీద కూడా వాస్తవిక వేతనాలు ఆధారపడతాయి. కొన్ని వృత్తులలో పని దుర్భరంగా ఉంటుంది. కొన్ని వృత్తులు ఆపదతో కూడినవిగా ఉంటాయి. అటువంటి వృత్తులలో ద్రవ్యవేతనాలు ఎక్కువగా ఉన్నా వాస్తవిక వేతనాలు తక్కువ.

ఆహ్లాదకరమైన వృత్తులలో ద్రవ్యవేతనాలు తక్కువైనా వాస్తవిక వేతనాలు ఎక్కువని ఉద్యోగ స్వభావాన్నిబట్టి చెప్పవచ్చును. ఉదా : గనులలో పనిచేసేవారి వృత్తి దుర్భరంగా ఉంటుంది. కనుక ద్రవ్య వేతనాలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాస్తవిక వేతనం తక్కువగా ఉంటుంది.

4. పనిచేసే పరిస్థితులు :
అనారోగ్యకరమైన పరిసరాలలో పనిచేసే శ్రామికుల వేతనం ఎక్కువగా ఉన్నా వారి వాస్తవిక వేతనం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ గంటలు పనిచేసేవారి ద్రవ్యవేతనం ఎక్కువగా ఉన్నా వారి వాస్తవిక వేతనం రేటు తక్కువగా ఉంటుంది.

5. ఆకస్మిక లాభాలు :
యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు, పోటీ సంస్థలు మూతపడుట మొదలైన కారణాల వల్ల ధరలు పెరిగి లభించే ఆకస్మిక లాభాలు నికరలాభంలో అంతర్భాగంగా ఉంటాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

ప్రశ్న 4.
స్థూల వడ్డీ, నికర వడ్డీలను గురించి వివరించండి.
జవాబు.
సాధారణంగా అప్పు తీసుకొన్న వ్యక్తి, అప్పు ఇచ్చిన వ్యక్తికి చెల్లించవలసిన సొమ్మును వడ్డీ అని అంటారు. దీనిని సాధారణంగా సంవత్సరానికి వంద రూపాయలకు ఇంత రేటు అని నిర్ణయిస్తారు. కానీ అర్థశాస్త్రంలో మూలధన సేవలకు చెల్లించే దానిని వడ్డీ అని పిలుస్తారు.

జాతీయాదాయంతో తన వాటాగా పెట్టుబడిదారుడు తన మూలధనానికి పొందే ధరను వడ్డీ అంటారు. మూలధన యజమానికి అందే ఆదాయమే వడ్డీ అని కార్వర్ అన్నాడు.

వడ్డీ భావనలు:

వడ్డీ భావనలు రెండు రకాలు అవి :

  1. స్థూల వడ్డీ
  2. నికర వడ్డీ.

1. స్థూల వడ్డీ :
రుణం ఇచ్చిన వ్యక్తి రుణం తీసుకున్న వ్యక్తి నుంచి అసలు మొత్తం కాకుండా అదనంగా పొందే దాన్ని స్థూల వడ్డీ అంటారు. స్థూల వడ్డీలో కింద వివరించిన చెల్లింపులు ఉంటాయి.

2. నికర వడ్డీ :
నికర వడ్డీ అంటే కేవలం మూలధనం లేదా ద్రవ్య సేవకు మాత్రమే ఇచ్చే ప్రతిఫలం. ఆర్థిక పరిభాషలో ఇదే వడ్డీ రేటు.

కీన్స్ ద్రవ్యత్వాభిరుచి సిద్ధాతం (Liquidity Preference Theory of JM Keynes):

కీన్స్ వడ్డీ రేటుకు ద్రవ్యపరమైన వివరణను ఇచ్చాడు. ద్రవ్యానికున్న డిమాండ్, సప్లయ్ ను బట్టి వడ్డీ రేటు నిర్ణయించబడుతుందని కీన్స్ అన్నాడు. కీన్స్ ప్రకారం ‘ద్రవ్యత్వాన్ని కొంతకాలం వదులుకున్నందుకు చెల్లించే ప్రతిఫలం వడ్డీ.

ద్రవ్య సప్లయ్ :
ద్రవ్య సరఫరా అంటే చలామణిలో ఉన్న మొత్తం ద్రవ్య పరిమాణం. వడ్డీ రేటు కొంత మేరకు ద్రవ్య సప్లయ్న ప్రభావితం చేసినప్పటికీ, ద్రవ్య సప్లయ్ ఒక నిర్ణీత కాలానికి స్థిరంగా లేదా సంపూర్ణ అవ్యాకోచంగా ఉంటుంది. ద్రవ్య సరఫరా దేశంలోని కేంద్ర బ్యాంకు వల్ల నిర్ణయించబడుతుంది.

ద్రవ్య డిమాండ్ :
కీన్స్ ద్రవ్యత్వాభిరుచి అను నూతన భావనను ఉపయోగించాడు. ద్రవ్యానికి ఉన్న ద్రవ్యత్వం వల్ల ప్రజలు ద్రవ్యాన్ని డిమాండ్ చేస్తారు. ద్రవ్యాన్ని ద్రవ్య రూపంలో తమవద్ద ఉంచుకోవాలనే కోరికే ద్రవ్యత్వాభిరుచి.

ద్రవ్యత్వాభిరుచి ఎక్కువగా ఉన్నప్పుడు ద్రవ్యత్వ ఆస్తులను వదులుకోవడానికి ప్రేరేపించాలంటే అధిక వడ్డీ రేటును చెల్లించాలి. ద్రవ్యత్వాభిరుచి తక్కువగా ఉన్నప్పుడు ద్రవ్యాన్ని కలిగి ఉన్న వ్యక్తులకు తక్కువ వడ్డీ రేటు చెల్లించడం జరుగుతుంది. ప్రజలు ప్రాథమికంగా మూడు కారణాలు వల్ల ద్రవ్యాన్ని డిమాండ్ చేస్తారు. అవి :

  • వ్యాపార వ్యవహారాల కోసం (transaction motive)
  • ముందు జాగ్రత్త కోసం (precautionary motive)
  • అంచనా వ్యాపారం కోసం (speculative motive).

i) వ్యాపార వ్యవహారాల కోసం :
వ్యక్తులు, వ్యాపార సంస్థలు తమ రోజువారి కార్యకలాపాల కోసం ద్రవ్యాన్ని డిమాండ్ చేస్తారు. వ్యక్తులు వినియోగ అవసరాల కోసం, వ్యాపార సంస్థలు వ్యాపార అవసరాల కోసం ద్రవ్యాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ అవసరాల కోసం ఉంచుకొనే మొత్తం ఆదాయంపైన, వ్యాపార లక్ష్యాలపైన ఆధారపడుతుంది.

ii) ముందు జాగ్రత్త కోసం :
అనారోగ్యం, ప్రమాదం, నిరుద్యోగం మొదలైన వాటికి అనుకోకుండా ఎదురయ్యే వ్యయాల కోసం ప్రజలు కొంత ద్రవ్యాన్ని తమ వద్ద ఉంచుకొంటారు. వ్యాపార సంస్థలు భవిష్యత్తులో ఊహించని వ్యాపార వ్యవహారాలవల్ల లాభాన్ని పొందడానికి కొంత ద్రవ్యాన్ని తమ వద్ద ఉంచుకోవాలనుకుంటాయి. వ్యక్తులు, వ్యాపారస్తులు ఊహించని అవసరాల కోసం ద్రవ్యాన్ని తమ వద్ద అట్టిపెట్టుకుంటారు.

iii) అంచనా వ్యాపారం కోసం :
భవిష్యత్లో వడ్డీ రేట్లు, బాండ్ల ధరలలో వచ్చే మార్పుల వల్ల ప్రయోజనాన్ని పొందడానికి వ్యక్తులు, సంస్థలు తమ వద్ద కొంత ద్రవ్యాన్ని ఉంచుకోవాలనుకుంటారు. దీనినే అంచనా వ్యాపారం కోసం డిమాండ్ అంటారు. బాండ్ల ధరలు, వడ్డీ రేట్లు విలోమ సంబంధాన్ని కలిగి ఉంటాయి.

బాండ్ల ధరలు పెరుగుతాయనుకుంటే వడ్డీ రేటు తగ్గుతుంది. కాబట్టి వ్యాపారస్తులు బాండ్లను కొని భవిష్యత్తులో వాటి ధరలు పెరిగినప్పుడు అమ్ముతారు. అలాగే బాండ్ల ధరలు తగ్గుతాయనుకుంటే వడ్డీ రేటు పెరిగి వ్యాపారస్తులు బాండ్లను అమ్ముతారు.

బాండ్ల ధరలు తక్కువగా ఉండే వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నట్లు. అలాగే బాండ్ల ధరలు ఎక్కువ ఉండే వడ్డీ రేటు తక్కువ ఉన్నట్లు. వడ్డీ రేటుకు, ద్రవ్యానికున్న డిమాండ్కు విలోమ సంబంధం ఉంది.

వ్యాపార వ్యవహారాల కోసం, ముందు జాగ్రత్త కోసం ద్రవ్యాన్నికున్న డిమాండ్కు వడ్డీ రేటుకున్న సంబంధం సాపేక్ష అవ్యాకోచంగా ఉంటుంది. అయితే ఆదాయంలో మాత్రం అధిక వ్యాకోచత్వ సంబంధాన్ని కలిగి ఉంటుంది. వడ్డీ రేటును నిర్ణయించడంలో ఈ రెండు రకాల డిమాండుకు ఎలాంటి పాత్ర లేదు.

అంచనా వ్యాపారం కోసం ఉన్న డిమాండ్లకు వడ్డీకున్న సంబంధం వ్యాకోచంగా ఉండి ద్రవ్య సరఫరా స్థిరంగా ఉన్నప్పుడు వడ్డీ రేటును నిర్ణయించడంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఎప్పుడైతే ద్రవ్యాన్నికున్న డిమాండ్, ద్రవ్య సప్లయ్ సమానం అవుతాయో అప్పుడు సమతౌల్యంతో పాటుగా వడ్డీ రేటు కూడా నిర్ణయించబడుతుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

ప్రశ్న 5.
లాభం అంటే ఏమిటి ? వివిధ లాభ భావనలను వివరించండి.
జవాబు.
సాధారణ అర్థంలో ఉత్పత్తి వ్యయానికంటే అధికంగా ఉన్న మిగులు ఆదాయాన్ని లాభం అంటారు. ఉత్పత్తి ప్రక్రియలో ఉద్యమదారుడు వ్యవస్థాపకుడు అందించే సేవలకు పొందే ప్రతిఫలాన్ని లాభం అంటారు. రాబడి నుంచి మిగిలిన ఉత్పత్తి కారకాలకు భాటకం, వేతనం, వడ్డీ రూపంలో ప్రతిఫలాలు చెల్లించిన తరువాత మిగిలిన ఆదాయాన్ని ఉద్యమదారుడు ప్రతిఫలంగా అంటే లాభం రూపంలో పొందుతాడు.

లాభాల సిద్ధాంతాలు:
లాభం ఏ విధంగా నిర్ణయించబడుతుందో వివరించడానికి ఆర్థికవేత్తలు చాలా సిద్ధాంతాలను రూపొందించారు. ఈ యూనిట్ లో మూడు లాభ సిద్ధాంతాలను మాత్రమే చర్చించుకుంటాం.

1. నవకల్పనల సిద్ధాంతం (Innovation Theory) :
ఈ సిద్ధాంతాన్ని జోసెఫ్ షుంపీటర్ అనే ఆర్థికవేత్త ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం ఉద్యమదారుని నవకల్పనా నైపుణ్యాలకు పారితోషికంగా లాభం చెల్లించబడుతుంది. ఉద్యమదారుడు ఉత్పత్తి కార్యక్రమంలో ప్రవేశపెట్టే నవకల్పనల వల్ల ధర కంటే ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉండి లాభం వస్తుంది.

షుంపీటర్ ప్రకారం ఉద్యమదారుని విధి ఏమిటంటే చక్రీయ ప్రవాహాన్ని లేదా స్థిర సమతౌల్యాన్ని చేదించడానికి నవకల్పనలు ప్రవేశపెట్టడం. అవి :

  1. నూతన వస్తువులను ప్రవేశపెట్టడం
  2. నూతన ఉత్పత్తి పద్ధతులను ప్రవేశపెట్టడం
  3. నూతన మార్కెట్లను తెరవడం
  4. నూతన ముడి సరుకులను కనుగొనడం
  5.  పరిశ్రమ పునర్వ్యవస్థీకరణ, ఈ నవకల్పనలు ప్రవేశపెట్టినందువల్ల ధరల కంటే ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉండి లాభాలు వస్తాయి.

2. హాలే నష్ట భయ లాభ సిద్ధాంతం (The Risk Theory of Profit) :
ప్రొఫెసర్ ఎఫ్.బి. హాలే ఈ సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఉద్యమదారుడు నష్ట భయాన్ని భరించినందుకు వచ్చే ప్రతిఫలం లాభం. ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యమదారుడు తప్ప మిగిలిన ఏ ఉత్పత్తి కారకం నష్ట భయాన్ని భరించదు.

అందువల్ల ఇతర ఉత్పత్తి కారకాలకు పంచగా మిగిలిన ఆదాయం ఉద్యమదారునికి చెందుతుందనేది ఈ సిద్ధాంత సారాంశం. వస్తువుల ధర, డిమాండ్లలో ఏర్పడే ప్రతికూల మార్పుల వల్ల, అనూహ్య ఉపద్రవాల వల్ల నష్టభయాన్ని ఎదుర్కొవలసి ఉంటుంది.

అందువల్ల ఉద్యమదారునికి నష్ట భయానికి మించి వచ్చే ఆదాయమే లాభం. హాలే ప్రకారం ఉద్యమదారుడు కొన్ని రకాల నష్ట భయాన్ని బీమా చేసి నష్ట భయాన్ని తొలగించుకోవచ్చు. అయితే అన్ని రకాలు కాదు. ఒకవేళ మొత్తం నష్ట భయాన్ని బీమా చేస్తే వచ్చే లాభాలను బీమా కంపెనీ తీసుకుంటుంది.

కాబట్టి ఉద్యమదారుడు కేవలం వేతనం మాత్రమే తీసుకుంటాడు. ఈ విదంగా వ్యాపారంలో నష్ట భయాన్ని భరించేవారే నష్టం భయం వాస్తవిక విలువకంటే అధిక మొత్తాన్ని లాభం రూపంలో ఆర్జిస్తారు. అందువల్ల ఉద్యమదారుడు తెలివిగా ఎంపిక చేసుకున్న నష్ట భయాలను భరించినందుకు లభించేదే లాభం.

3. అనిశ్చితత్వ లాభ సిద్ధాంతం (Uncertainty Theory of Profit) :
ప్రొఫెసర్ ఎఫ్. హెచ్. నైట్ అనిశ్చితత్వ లాభ సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఇది మెరుగుపరచబడిన నష్ట భయ సిద్ధాంతం. బీమా చేయలేని నష్ట భయాన్ని అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొన్నందుకు చెల్లించే ప్రతిఫలమే లాభం అని నైట్ పరిగణించాడు.

అతను నష్ట భయాలను రెండు రకాలుగా వర్గీకరించాడు. అవి :

  1. ఊహించి బీమా చేయగలిగిన నష్ట భయాలు. ఉదా : అగ్నిప్రమాదాలు, దొంగతనాలు, ప్రకృతి వైపరీత్యాలు మొదలైనవి.
  2. ఊహకందని, బీమా చేయలేని నష్ట భయాలు. ఉదా : ధర, డిమాండ్, సప్లయ్లో మార్పులు మొదలైనవి. ఈ భీమా చేయలేని నష్ట భయాలను లెక్కించలేం.

TS Board Inter First Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఆదాయ పంపిణీలో రకాలను వివరించండి.
జవాబు.
అర్థశాస్త్రంలో పంపిణీ భావనను రెండు అర్థాలలో ఉపయోగించడం జరుగుతుంది. అంటే జాతీయాదాయ పంపిణీని రెండు విధాలుగా పరిశీలించవచ్చు.

  1. విధులననుసరించి పంపిణీ
  2. వైయక్తిక పంపిణీ

1. విధులననుసరించి పంపిణీ :
ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్న ఉత్పత్తి కారకాలైన భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనలు సేవలందించినందుకు గాను, అవి ప్రతిఫలాలుగా భాటకం, వేతనం, వడ్డీ, లాభాల రూపంలో పొందుతాయి. ఒక ఉత్పత్తి కారకం ఏవిధంగా ఎంత మొత్తంలో ప్రతిఫలం పొందుతుందో విధులననుసరించి పంపిణీ తెలియజేస్తుంది.

కొంతమంది ఒకటికంటే ఎక్కువ ఉత్పత్తి కారకాలకు యజమానులుగా ప్రతిఫలాలను పొందవచ్చు. ఒక ఉత్పత్తి కారకం ఏవిధంగా ఎంత మొత్తంలో ప్రతిఫలం పొందుతుందో విధులననుసరించి పంపిణీ తెలుపుతుంది. విధులననుసరించి జరిగే పంపిణీని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.

a) సూక్ష్మ పంపిణీ :
సూక్ష్మ పంపిణీ ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నందుకు ఒక ఉత్పత్తి కారకం ధర ఏవిధంగా ఎంత నిర్ణయించబడుతుందో వివరిస్తుంది.
ఉదా : శ్రామికుల వేతన రేటు నిర్ణయం. వివరిస్తుంది.

b) స్థూల పంపిణీ :
జాతీయాదాయంలో వివిధ ఉత్పత్తి కారకాల వాటా ఎంత ఉందో స్థూల పంపిణీ
ఉదా : మొత్తం జాతీయాదాయంలో వేతనాల వాటా ఎంత ఉంది అనే విషయాన్ని స్థూల పంపిణీ తెలియజేస్తుంది.

2. వైయక్తిక పంపిణీ :
దేశంలోని వ్యక్తుల మధ్య జాతీయాదాయాన్ని పంపిణీ చేయడాన్ని వైయక్తిక పంపిణీ అంటారు. ఇక్కడ వ్యక్తులు ఎంత ఆదాయం పొందుతున్నారు అనే విషయాన్ని పరిశీలిస్తారు. అంతేగాని ఏవిధంగా లేదా ఎన్ని విధాలుగా పొందారు అనే విషయ పరిశీలన ప్రధానం కాదు. వైయక్తిక పంపిణీ పరిశీలన ద్వారా ఆదాయ అసమానతలను అందుకు గల కారణాలను తెలుసుకోవచ్చు.

TS Board Inter First Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

ప్రశ్న 2.
ఉత్పత్తి కారకాల ధరను నిర్ణయించే అంశాలు ఏమిటి ?
జవాబు.
ఉత్పత్తి కారకాల ధరలను వాటి డిమాండ్, సప్లయ్లు కలసి నిర్ణయిస్తాయి.
ఉత్పత్తి కారకాల డిమాండ్ను నిర్ణయించే అంశాలు :

  1. ఉత్పత్తి కారకాల డిమాండ్ ఉత్పన్న డిమాండ్ లేదా పరోక్ష డిమాండ్ అంటే ఉత్పత్తి కారకం డిమాండ్ అది ఉత్పత్తి చేసే వస్తువు డిమాండ్పై ఆధారపడి ఉంటుంది.
  2. ఒక ఉత్పత్తి కారకం డిమాండ్ దాని ధరపై ఆధారపడి ఉంటుంది.
  3. ఒక ఉత్పత్తి కారకం డిమాండ్ ఉత్పత్తి తనకు సహకరించే ఇతర ఉత్పత్తి కారకాల ధరలపై ఆధారపడి ఉంటుంది.
  4. సాంకేతిక విజ్ఞానం ఉత్పత్తి కారకాల డిమాండ్ను నిర్ణయిస్తుంది.
    ఉదా : కంప్యూటరీకరణ వల్ల శ్రామికుల డిమాండ్ గణనీయంగా తగ్గింది.
  5. తరహాననుసరించి ప్రతిఫలాలు ఉత్పత్తి కారకం డిమాండ్ను నిర్ణయిస్తాయి. ఉత్పత్తిలో పెరుగుతున్న ప్రతిఫలాలు వస్తుంటే ఉత్పత్తి కారకాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
  6. ఉత్పత్తి కారకాల సప్లయ్ ని నిర్ణయించే అంశాలు. ఉదా : శ్రామికుల సప్లయ్.

ప్రశ్న 3.
ఉపాంత ఉత్పాదకతా సిద్ధాంతపు ప్రమేయాలను, పరిమితులను పేర్కొనండి.
జవాబు.
ఒక యూనిట్ ఉత్పత్తి కారకాన్ని అదనంగా నియమిస్తే మొత్తం ఉత్పత్తిలో వచ్చే మార్పును ఉపాంత భౌతిక ఉత్పత్తి (marginal physical product) అని అంటారు. అదనపు ఉత్పత్తిని మార్కెట్ ధరతో గుణిస్తే, ఉపాంత ఉత్పత్తి విలువ (marginal value product) లేదా ఉపాంత ఉత్పత్తి రాబడి (marginal revenue product) వస్తుంది.

అదనంగా ఒక ఉత్పత్తి కారకపు యూనిట్ను ఉపయోగించినప్పుడు మొత్తం రాబడిలో వచ్చిన మార్పునే ఉపాంత ఉత్పత్తి రాబడి అంటారు. ఉత్పత్తి కారకాల యూనిట్లను పెంచుతుంటే ప్రారంభంలో ఉపాంత ఉత్పాదక రాబడి పెరిగి తరవాత గరిష్ఠ స్థాయికి చేరుతుంది.

ఆ తరవాత ఇది తగ్గుతూ ఉత్పత్తి కారకం ధరకు (సగటు కారక వ్యయంకు) సమానమవుతుంది. చరానుపాతాల సూత్రం ప్రమేయాన్ని బట్టి ఉపాంత ఉత్పాదక రాబడి తగ్గుతుంది. సంపూర్ణ పోటీలో పరిశ్రమలో ఉత్పత్తి కారకానికి ఉన్న ధరనే సంస్థ కూడా చెల్లించాలి. గరిష్ఠ లాభార్జనకు సంస్థ ప్రతిస్థాపన సూత్రాన్ని పాటిస్తుంది.

ఉత్పత్తి కారకం ధర అంటే సగటు కారక వ్యయంకు (average factor cost) ఉపాంత ఉత్పాదక రాబడి (MRP) సమానమయ్యేంత వరకు అధిక ధరలున్న ఉత్పత్తి కారకాలకు బదులుగా తక్కువ ధరలున్న ఉత్పత్తి కారకాలను ప్రతిస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ఈ స్థితిలో ఉత్పత్తి కారకాల సమ్మేళనం సమర్థవంతంగా ఉండటంతోపాటుగా సంస్థ లాభాలు గరిష్ఠంగా ఉంటాయి.

సిద్ధాంతానికున్న ప్రమేయాలు : సిద్ధాంతం కింది ప్రమేయాలపై ఆధారపడి ఉంటుంది.

  1. ఉత్పత్తి కారకాల మార్కెట్లో వస్తువు మార్కెట్లో పరిపూర్ణ పోటీ ఉంటుంది.
  2. ఉత్పత్తి కారకాలు అన్నీ సజాతీయాలు.
  3. ఉత్పత్తి కారకాలకు సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది.
  4. ఉత్పత్తి కారకాలకు పూర్తి గమనశీలత ఉంటుంది.
  5. ఉత్పత్తి కారకాలు ఒక దానికి బదులు మరొకటి పూర్తి ప్రత్యామ్నాయాలు.
  6. ఉద్యమదారులు లాభాలవల్ల ప్రేరితమవుతారు.
  7.  వివిధ కారకాల యూనిట్లు విభాజ్యం.
  8. ఈ సిద్దాంతం దీర్ఘ కాలానికి వర్తిస్తుంది.
  9.  ఇది చరానుపాతాల సూత్రంపై ఆధారపడింది.
  10. ఒక ఉత్పత్తి కారకం ఉపాంత ఉత్పత్తిని కొలవవచ్చు.

సిద్ధాంతం పై విమర్శ : ఉపాంత ఉత్పాదక పంపిణీ సిద్ధాంతం అవాస్తవిక ప్రమేయాలపై ఆధారపడింది. అందుచేత ఇది విమర్శంపబడింది.

  1. కారకాల మార్కెట్లో, వస్తువు మార్కెట్లో సంపూర్ణ పోటీ లేదు.
  2. కారక యూనిట్లన్నీ సజాతీయం కాదు.
  3. కారకాలన్నీ ఉపయోగింపబడవు.
  4. కారకాలకు పూర్తి గమనశీలత లేదు.
  5. కారకాల మధ్య అన్ని వేళలా ప్రతిస్థాపన సాధ్యం కాదు.
  6. లాభం పొందడం ముఖ్య ఉద్దేశం కాదు.
  7. కారకాలన్నీ విభాజ్యం కావు.
  8. స్వల్ప కాలంలో ఈ సిద్ధాంతం వర్తించదు.
  9. ఉత్పత్తి కేవలం ఒక కారకం యొక్క ఫలితం కాదు.
  10. కారకాల చెల్లింపు మొత్తం విలువకు సమానం కాదు.

TS Board Inter First Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

ప్రశ్న 4.
నిజ వేతనాలను నిర్ణయించే కారకాలు ఏమిటి ?
జవాబు.
శ్రామికులు వివిధ రంగాలలో వస్తూత్పత్తి ప్రక్రియలో తన సేవలను అందించారు. అందుకు ప్రతిఫలంగా ఉత్పత్తిదారులిచ్చే ప్రతిఫలం లేదా ధరను వేతనం అంటారు. శ్రామికులకు ప్రతిఫలం లేదా ధరను ద్రవ్య రూపంలో చెల్లిస్తారు. ద్రవ్య రూపంలో ఇచ్చిన వేతనం కొనుగోలు శక్తిని వాస్తవిక వేతనం అంటారు. ఇది ద్రవ్యం కొనుగోలు శక్తిపై ఆధారపడుతుంది. ఈ కొనుగోలు శక్తి సాధారణ ధర సూచికపై ఆధారపడి ఉంటుంది.

ధరల స్థాయి మారుతున్నప్పుడు ద్రవ్యవేతనంలో మార్పులు లేకపోయినా వాస్తవిక వేతనంలో మార్పు వస్తుంది. వాస్తవిక వేతనమే శ్రామికుని జీవన ప్రమాణస్థాయిని నిర్ణయిస్తుంది. ప్రజలు వినియోగిస్తున్న వస్తువులు, వాటి పరిమాణాలు, నాణ్యతను అనుసరించి వారి జీవన ప్రమాణాలు నిర్ణయించబడతాయి.

వాస్తవిక వేతనాన్ని నిర్ణయించే అంశాలు :

1. ద్రవ్యం కొనుగోలు శక్తి :
సాధారణంగా ద్రవ్యానికుండే కొనుగోలు శక్తిపై వాస్తవిక వేతనాలు ఆధారపడి ఉంటాయి. ద్రవ్యానికి కొనుగోలు శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు శ్రామికులు తమ వేతనంలో ఎక్కువ సౌకర్యాలను సమకూర్చుకోగలరు. ద్రవ్యం కొనుగోలు శక్తి తగ్గినప్పుడు శ్రామికుల వాస్తవిక వేతనం తగ్గుతుంది.

2. వేతనమిచ్చే విధానము :
శ్రామికులకు ఇచ్చే ద్రవ్య వేతనంతోపాటు యాజమాన్యం కొన్ని సదుపాయాలను కూడా కల్పిస్తుంది. ఉదా : ఉచిత వసతి సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు మొదలైనవాటివల్ల వారి వాస్తవిక వేతనాలు అధికమవుతాయి.

3. ఉద్యోగ స్వభావము :
చేసే పని స్వభావం మీద కూడా వాస్తవిక వేతనాలు ఆధారపడతాయి. కొన్ని వృత్తులలో పని దుర్భరంగా ఉంటుంది. కొన్ని వృత్తులు ఆపదతో కూడినవిగా ఉంటాయి. అటువంటి వృత్తులలో ద్రవ్యవేతనాలు ఎక్కువగా ఉన్నా వాస్తవిక వేతనాలు తక్కువ.

ఆహ్లాదకరమైన వృత్తులలో ద్రవ్యవేతనాలు తక్కువైనా వాస్తవిక వేతనాలు ఎక్కువని ఉద్యోగ స్వభావాన్నిబట్టి చెప్పవచ్చును. ఉదా : గనులలో పనిచేసేవారి వృత్తి దుర్భరంగా ఉంటుంది. కనుక ద్రవ్య వేతనాలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాస్తవిక వేతనం తక్కువగా ఉంటుంది.

4. పనిచేసే పరిస్థితులు :
అనారోగ్యకరమైన పరిసరాలలో పనిచేసే శ్రామికుల వేతనం ఎక్కువగా ఉన్నా వారి వాస్తవిక వేతనం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ గంటలు పనిచేసేవారి ద్రవ్యవేతనం ఎక్కువగా ఉన్నా వారి వాస్తవిక వేతనం రేటు తక్కువగా ఉంటుంది.

5. ఆకస్మిక లాభాలు :
యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు, పోటీ సంస్థలు మూతపడుట మొదలైన కారణాల వల్ల ధరలు పెరిగి లభించే ఆకస్మిక లాభాలు నికరలాభంలో అంతర్భాగంగా ఉంటాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

ప్రశ్న 5.
స్థూల లాభాల భావనలను వివరించండి.
జవాబు.
మొత్తం రాబడి నుండి మొత్తం వ్యయం తీసివేయగా మిగిలినదానిని స్థూలలాభం అని అంటారు.
స్థూలలాభంలో ఉన్న అంశాలు :

1. ఉద్యమదారుని సొంత మూలధనం మీద వడ్డీ :
వ్యవస్థాపకుడు ఉత్పత్తి ప్రక్రియలో సొంత మూలధనం ఉపయోగిస్తే దానిమీద చెల్లించే వడ్డీని లెక్కలోకి తీసుకోవాలి.

2. సొంత భూమి మీద భాటకం :
ఉత్పత్తి ప్రక్రియలో తన సొంత భూమిని ఉపయోగిస్తే దానికి భాటకం లెక్కగట్టాలి. దానిని లాభంగా అన్వయించకూడదు.

3. నిర్వహణ వేతనాలు :
వ్యవస్థాపకుడే వ్యాపారాన్ని నిర్వహించి, అజమాయిషీ చేస్తే అతని సేవలకు వేతనం ఇవ్వాలి. అది స్థూలలాభంలో తీసివేయాలి.

4. బీమా ఖర్చులు :
యంత్రాల తరుగుదల, బీమా వ్యయాలు మొదలైనవాటిని స్థూలలాభాల నుండి తీసివేయాలి.

5. నికరలాభం :
వ్యవస్థాపనకు ఉత్పత్తికరమైన సేవలకు మాత్రమే వచ్చే ప్రతిఫలం నికరలాభం.

6. భవిష్యదవకాశాలు :
భవిష్యత్తులో పదోన్నతి జరిగి ఎక్కువ సంపాదించుకునే అవకాశమున్న వృత్తులలో ద్రవ్యవేతనం తక్కువగా ఉన్నప్పటికీ, వాస్తవిక వేతనం ఎక్కువగా ఉంటుంది.

7. వృత్తి స్థిరత్వం : ప్రతి శ్రామికుడు ద్రవ్యవేతనం తక్కువగా ఉన్నప్పటికీ శాశ్వతమైన ఉద్యోగం కోరుకుంటాడు. కాని తాత్కాలికమైన ఉద్యోగంలో ద్రవ్యవేతనం ఎక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో నిరుద్యోగిగా ఉండిపోవలసి వస్తుంది. కనుక వాస్తవిక వేతనం తక్కువగా ఉంటుంది.

8. అదనపు రాబడి : అదనపు రాబడి ఆర్జించటానికి అవకాశమున్న వృత్తులలో ద్రవ్యవేతనం తక్కువగా ఉన్నప్పటికీ వారి వాస్తవిక వేతనం ఎక్కువగా ఉంటుంది. ఉదా : అధ్యాపకులు, టైపిస్టులు మొదలైనవారు అదనపు రాబడిని ఆర్జించగలరు.

నికరలాభంలో ఉన్న అంశాలు : స్థూలలాభంలో అంతర్భాగంగా ఉన్న వ్యవస్థాపక సేవలకు వచ్చే ప్రతిఫలాన్ని మాత్రమే నికర లాభం అంటారు.

ఎ) నష్టభయాన్ని భరించడం:
వ్యాపారంలో బీమా చేయలేని నష్టభయాలను, అనిశ్చితాలను భరించినందుకు వచ్చే ప్రతిఫలం నికర లాభంలో అంతర్భాగంగా ఉంటుంది.

బి) ఉత్పత్తి కారకాల సమన్వయం:
ఉత్పత్తి కారకాలను ఒకచోట చేర్చి అభిలషణీయ అనుపాతంలో కూర్చి, సమన్వయపరిచినందుకు వచ్చే ప్రతిఫలాలు నికరలాభంలో ఇమిడి ఉంటాయి.

సి) మార్కెటింగ్ సేవలు :
ఉత్పత్తి కారకాలను కొనుగోలుచేసి తయారైన వస్తువులను విక్రయించటంలో వ్యవస్థాపకుని మార్కెటింగ్ సమర్థతకు ప్రతిఫలం నికరలాభంలో అంతర్భాగం.

డి) నవకల్పనలు ప్రవేశపెట్టడం :
నూతన ఉత్పత్తి పద్ధతులు ప్రవేశపెట్టడం, నూతన మార్కెట్లు కనుక్కోవడం, నూతన వస్తువులను తయారుచేయడంలాంటి నవకల్పనలు ప్రవేశపెట్టినందుకు చెల్లించే పారితోషికం నికరలాభంలో అంతర్భాగం.

TS Board Inter First Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
కారక డిమాండ్ను నిర్ణయించే అంశాలు ఏమిటి ?
జవాబు.
ఉత్పత్తికి ధర నిర్ణయించబడినట్లుగానే ఉత్పత్తి కారకాల ధరలను వాటి డిమాండ్, సప్లయ్ లు కలిసి నిర్ణయిస్తాయి. అయితే రెండింటికి తేడాలున్నాయి. ఉత్పత్తి కారకానికి డిమాండ్ను నిర్ణయించే అంశాలు (కారకాలు) :

  1. ఉత్పత్తి కారకాల డిమండ్ ఉత్పన్న డిమాండ్. అంటే ఉత్పత్తి కారకం డిమాండ్ అది ఉత్పత్తి చేసే వస్తువు మాండ్ పై ఆధారపడి ఉంటుంది.
  2. ఒక ఉత్పత్తి కారకం డిమాండ్ దాని ధరపై ఆధారపడి ఉంటుంది.
  3. ఒక ఉత్పత్తి కారకం డిమాండ్ ఉత్పత్తిలో దానికి సహకరించే ఇతర ఉత్పత్తి కారకాల ధరలపై ఆధారపడి ఉంటుంది.
  4. సాంకేతిక విజ్ఞానం ఉత్పత్తి కారకాల డిమాండ్ను నిర్ణయిస్తుంది. ఉదా : సాంకేతిక పరిజ్ఞానం పెరిగితే శ్రామికుల డిమాండ్ తగ్గుతుంది.
  5. తరహాననుసరించి ప్రతిఫలాలు ఉత్పత్తి కారకాల డిమాండ్ను నిర్ణయిస్తాయి. ఉత్పత్తిలో పెరుగుతున్న ప్రతిఫలాలు వస్తుంటే ఉత్పత్తి కారకాలను డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.

ప్రశ్న 2.
శ్రమ సరఫరాను నిర్ణయించే అంశాలు ఏమిటి ?
జవాబు.

  1. ధరల స్థాయి
  2. చెల్లింపు విధానం
  3. ఉద్యోగ క్రమబద్ధత
  4. పని స్వభావం
  5. పనిచేసే పరిస్థితులు.

TS Board Inter First Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

ప్రశ్న 3.
ఒప్పంద భాటకం అంటే ఏమిటి ?
జవాబు.
ఒప్పంద భాటకం అంటే నిర్ణీతకాలానికి భూమి సేవలకు, గృహాలకు ముందుగా నిర్ణయించిన ఒప్పందం ప్రకారం చెల్లించే ప్రతిఫలం.

ప్రశ్న 4.
ఆర్థిక భాటకం అంటే ఏమిటి ?
జవాబు.
ఆర్థిక భాటకం కేవలం భూమికే పరిమితం కాకుండా మిగతా మూడు ఉత్పత్తి కారకాలైన శ్రమ, మూలధనం, వ్యవస్థాపనకు వర్తిస్తుంది. ఇది మూడు రకాలు.

  1. కొరత భాటకం
  2. కృత్రిమ భాటకం
  3. బదిలీ సంపాదన

ప్రశ్న 5.
ద్రవ్య వేతనాలు అంటే ఏమిటి ?
జవాబు.
ద్రవ్య వేతనం అంటే శ్రామికుని శ్రమకు నగదు రూపంలో చెల్లించే ధర లేదా ప్రతిఫలం.

TS Board Inter First Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

ప్రశ్న 6.
వాస్తవిక వేతనాలు అంటే ఏమిటి ?
జవాబు.
వాస్తవిక వేతనాన్ని అభివృద్ధి పరిచినది ఆడమస్మిత్, వాస్తవిక వేతనం అంటే శ్రామికుడి శ్రమకు ప్రతిఫలంగా పొందిన ద్రవ్యవేతనం కొనుగోలుశక్తి.

ప్రశ్న 7.
కాలాన్ని బట్టి వేతనాలు అంటే ఏమిటి ?
జవాబు.
కాలాన్ని బట్టి వేతనం అంటే శ్రామికుల ఉత్పాదకతతో సంబంధం లేకుండా నిర్ణీత కాలానికి ఒక వృత్తిలో పనిచేసే వారందరికి ఒకే వేతనం చెల్లించడం.

ప్రశ్న 8.
పనిని బట్టి వేతనాలు అంటే ఏమిటి ?
జవాబు.
శ్రామికుల ఉత్పాదకత, నైపుణ్యం బట్టి చెల్లించే వేతనంను పనిని బట్టి వేతనం అంటారు.

TS Board Inter First Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

ప్రశ్న 9.
స్థూల వడ్డీ అంటే ఏమిటి ?
జవాబు.
ఋణం తీసుకున్న వ్యక్తి తాను తీసుకొన్న మొత్తంతో పాటు అదనంగా ఋణదాతకు ఎంత చెల్లిస్తున్నాడో, మొత్తాన్ని స్థూల వడ్డీ అంటారు.

ప్రశ్న 10.
నికర వడ్డీ అంటే ఏమిటి ?
జవాబు.
మూలధన సేవలకు మాత్రమే ఇచ్చే ప్రతిఫలం.
ఉదా : ప్రభుత్వ బాండ్లు, ప్రభుత్వ ఋణాలపై వడ్డీ.

ప్రశ్న 11.
స్థూల లాభం అంటే ఏమిటి ?
జవాబు.
రాబడి నుండి ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలు, తరుగుదల తీసివేయగా మిగిలినది స్థూల లాభం. స్థూల లాభం = నికర లాభం + అప్రకటిత భాటకం + అప్రకటిత వేతనం + అప్రకటిత వడ్డీ + తరుగుదల + భీమా చెల్లింపులు.

TS Board Inter First Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

ప్రశ్న 12.
నికర లాభం అంటే ఏమిటి ?
జవాబు.
వ్యవస్థాపకుని సేవలకు మాత్రమే వచ్చే ప్రతిఫలం నికర లాభం.
నికర లాభం = స్థూల లాభం – అప్రకటిత భాటకం + అప్రకటిత వేతనం + అప్రకటిత వడ్డీ + తరుగుదల + భీమా చెల్లింపులు.

TS Inter 1st Year Telugu Study Material Poem 6 మహైక

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 6th Poem మహైక Textbook Questions and Answers.

TS Inter 1st Year Telugu Study Material 6th Poem మహైక

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు – సమాధానములు

ప్రశ్న 1.
‘మహైక’ పాఠ్యభాగ సారాంశాన్ని వివరించండి?
జవాబు:
‘మహైక’ అనుపాఠ్యభాగం “తిరుగుబాటు సాహిత్యంలో ధ్రువతారగ’ పేరుపొంది న కవిరాజుమూర్తిచే రచించబడిన ‘మహైక’ అను దీర్ఘకవిత నుండి గ్రహించబడింది. తెలంగాణలో నియంతృత్వ, భూస్వామ్య అధికారుల పీడనలకు వ్యతిరేకంగా కవిరాజుమూర్తి పోరాడాడు.

మహైక దీర్ఘకవిత సమాజంలో ఆధునికతను కోరుకుంటూ ప్రయోగాత్మకంగా నడచిన కవిత. ఇది సామాన్య మానవుడు, కవి, కార్మికుడు, పతతి పాత్రల పరస్పర సంభాషణలతో కూడి ఉన్నది. నేటి నాగరిక సమాజంలో తాను అనుభవిస్తున్న కష్టాలను, వేదనలను, నిరాశతో నిట్టూర్పుతో కవి చెప్పటం ఈ కవిత లోని ప్రధానాంశం. సమాజానికి ప్రాతినిథ్యం వహిస్తున్నవారిని ఓదారుస్తూ మనిషిపై మనిషికి విశ్వాసం తగ్గకుండా ప్రోత్సహించే విప్లవ రచన ఇది.

భవిష్యత్తుపై ఆశలను నిలుపుతూ మానవీయ లక్షణాలను పెంపొందిస్తూ అసమానతలు లేని సోషలిజానికి దారులు వేసిందీ కవిత. దీర్ఘకవితను చదివినపుడు ఏడో నూతన లోకాన్ని చూసినట్లుంది అంటారు. ఈ కావ్యానికి ముందుమాట రాసిన బెల్లకొండ రామదాసు, రెంటాల గోపాలకృష్ణులు. ‘మహైకా’ను చదువుతుంటే టి.ఎస్. ఇలియట్ వేస్టాండ్ జ్ఞాపకం వస్తుంది. చిలి దేశ మహాకవి ‘పోబ్లో నెరుడా’ ఎలాంటి కవో తెలుగులో మూర్తి అలాంటివాడు.

తోటమాలి తనని తాను బలిదానంగా సమర్పించుకుంటేనే పువ్వులు పరిమళాలను వెదజల్లుతాయి. మనిషి మనిషి కలిస్తేనే దేశం వృద్ధి చెందుతుంది. యుగ యుగాల నైరాశ్యం మన బతుకులను నాశనం చేస్తున్నది. చేయి చేయి కలిపి సోమరితనాన్ని వదలిపెట్టి ఆనందంతో శ్రమ చేస్తే అందరికి సంతోషం భూగోళానికి నూతనత్వం వస్తాయి.

అన్నలూ, అక్కలూ మీకు తెలియనిదేమున్నది. సముద్రపు నీరంతా ఉప్పే. త్రాగటానికి పనికిరాదు. మండే మంటంతా నిప్పే ప్రక్కనున్న వాటిని కూడా దహిస్తుంది. ఆకలితో ఆహారాన్ని కోరటం తప్పుకాదు. నిస్సత్తువ ప్రాణానికే ప్రమాదకరం.

కుండలు వేరైనా మట్టి ఒక్కటే, రంగులు వేరైనా మానవులంతా ఒక్కటే. కొమ్మలు రెమ్మలు వేరైనా అవి వృక్షంలో భాగాలే. ఎన్ని దేశాలున్నా మానవులంతా ఒక్కటే. మానవులలో భేదాలు సృష్టి మానవ వినాశనానికి దారి తీస్తుంది. అందరం ఒకటిగా నడిస్తే ప్రమాదాలను దాటగలం అని ఐకమత్యాన్ని గూర్చి ‘మహైక’ కవిత వివరిస్తుంది.

TS Inter 1st Year Telugu Study Material Poem 6 మహైక

ప్రశ్న 2.
‘మహైక’ కవితలో కవి ఆశయాన్ని విశ్లేషించండి?
జవాబు:
‘మహైక’ అను పాఠ్యభాగం కవిరాజుమూర్తి చే రచించబడిన ‘మహైక ‘ దీర్ఘ కవిత నుండి గ్రహించబడింది. ఈ కవితలో అభ్యుదయ భావాలే కాదు. ఆధునికతను అడుగడుగునా కవి చూపించాడు. సంక్షిప్తత సాంద్రత ఈ రచనా ప్రధాన లక్షణం.

‘మహైక’’ దీర్ఘకవిత సామాన్య మానవుడు, కవి, కార్మికుడు పతితల పాత్రల పరస్పర సంభాషణలతో నడుస్తుంది. నాగరిక సమాజంలో తాను అనుభవిస్తున్న కష్టాలను, వేదనలను, నిరాశతో నిట్టూర్పులతో నివేదించటం ఈ రచనలోని విశేషం. ఈ రచనలోని ప్రధానాంశం. సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని ఓదారుస్తూ మనిషి తనపై తాను విశ్వాసాన్ని కోల్పోకుండా ఒక విముక్తిని విప్లవాత్మక ధోరణిలో చూపించాడు మూర్తి. భవిష్యత్తుపై ఆశలను పెంచుతూ, మానవీయ విలువల ప్రాధాన్యతను ఈ కవిత ద్వారా తెలియచేశాడు.

మనిషి శ్రమిస్తేనే జీవితంలో విజయాలను అందుకోగలడు. ఐకమత్యంతో మెలగితేనే అభివృద్ధి సాధించగలుగుతాడు.

“చరిత్రలు మన ఉనికికి కావు ప్రమాణం
ధరిత్రిని వెనక్కి నెట్టి చేయాలి ప్రయాణం” అంటాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 6 మహైక

రంగులు, వర్ణాలు మానవులను విడదీయకూడదు. ప్రతి ఒక్కరూ చేయీ, చేయీ కలిపి నడిస్తేనే విజయం అన్నాడు. మనిషి ఎప్పుడూ సోమరి పోతుగా మారకూడదు. నిత్య చైతన్యంతో బతకాలి.

“మనలో మన చీలిక
మన పతనానికి ఏలిక
మలోమన చీలిక
మత్యుదేవతకు నాలిక”

కాబట్టి నూతన భావాలతో ఐకమత్యంగా జీవించి జగత్తును శాసిద్ధాం అఅని ‘మహైక’ కవిత ద్వారా మూర్తి తన ఆశయాలను వివరించాడు.

II. సంగ్రహరూప ప్రశ్నలు- సమాధానాలు

ప్రశ్న 1.
కవిరాజు మూర్తి రచనలను పేర్కొనండి?
జవాబు:
‘మహైక’ అను పాఠ్య భాగము కవిరాజు మూర్తిచే రచించబడిన ‘మహైక’ ‘దీర్ఘ కవిత’ నుండి గ్రహించబడింది. మూర్తిగారు ఉన్నత కుటుంబంలో పుట్టినా ఆనాటి నియంతృత్వ, భూస్వామ్య అధికారులు పీడనకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. రైతుల పక్షాన, అణగారిన పీడిత ప్రజల పక్షాన మధ్యతరగతి జీవుల కోసం రచనలు చేశాడు.

మూర్తిగారు దీర్ఘకవితలు రాసిన తొలితరం కవులలో అగ్రగణ్యులు. మహైక, ప్రణుతి, మానవ సంగీతం దీర్ఘకవితా సంపుటాలను వ్రాసారు. “మైఁగరీబ్ హుఁ” ఉర్దూనవలలను రాసి జవహర్లాల్ నెహ్రూకు అంకితం చేశాడు. గిడుతూరి సూర్యం తెలుగులోకి అనువదించాడు. హీరాలాల్ మోరియా ఉర్దూలో రాసిన కావ్యాన్ని మహాపథంగా తెలుగులోకి అనువదించారు.

గాంధీజీ దివ్య చరితను జముకుల కథగా రాసాడు. ఉర్దూలో ‘లాహుకే లఖీర్’ అంగారే. తెలుగులో చివరి రాత్రి, మొదటి రాత్రి జారుడు బండ నవలలను రచించాడు. నవయుగ శ్రీ పేరుతో గేయాలు, ఉర్దూ పారశీకవుల గజళ్ళు “మధుధారలు” పేరుతో ముక్త కాలుగా రాశాడు” తిరుగుబాటు సాహిత్యంలో ధ్రువతారగా దాశరథి చేత ప్రశంసించబడ్డాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 6 మహైక

ప్రశ్న 2.
‘మహైక’లోని ఐకమత్య భావనలను వివరించండి.
జవాబు:
‘మహైక’ అను పాఠ్యభాగము ‘కవిరాజు మూర్తి’చే రచించబడిన ‘మహైక’ దీర్ఘకవిత నుండి గ్రహించబడింది.

“మానవుడు కలవాలి మానవుణ్ణి
తిడితే ఏం లాభం కనిపించని దేవుణ్ణి”

మానవులు ఐకమత్యంతో మెలగాలని లేనిపక్షాన మానవజాతికి విముక్తి లేదన్నాడు. అన్నదమ్ములుగా జాతివర్ణ భేదం లేకుండా చేయి చేయి కలిపి ముందుకు నడవాలి. అందుకు అక్క చెల్లెళ్ళు ఆనందగీతికలను ఆలపిస్తూ చైతన్యంతో అందరిని ఏకతాటిపైకి తీసుకురావాలి. అదే భూమికి నూతనత్వం అన్నాడు.

“రంగులు జాతులు
కావు మనకు జ్ఞాతులు
మనమంతా మానవులం
కలయికలో ఉంది జయం”

రంగులు, జాతులు అని చూడకుండా మనమంతా మానవులం అనే భావనతో ఐకమత్యంగా ఉండాలని లేని యెడల

“మనలో మన చీలిక
మన పతనానికి ఏలిక”.

అని ఐకమత్యాన్ని గురించి ‘మహైక’ కవితలో మూర్తిగారు వివరించారు.

TS Inter 1st Year Telugu Study Material Poem 6 మహైక

ప్రశ్న 3.
కవిరాజుముర్తి దృక్పథాన్ని తెలపండి.
జవాబు:
‘మహైక’ అను పాఠ్యభాగము ‘కవిరాజమూర్తి’ చే రచించబడిన ‘మహైక’ అను దీర్ఘకవిత నుండి గ్రహించబడింది. మూర్తిగారు నాగరిక సమాజంలో తాను అనుభవిస్తున్న కష్టాలను వేదనలను నిరాశతో, నిట్టూర్పులతో నివేదించటం జరిగింది. సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని ఓదార్చుతూ విశ్వాసం కోల్పోకుండా విప్లవాత్మక ధోరణిలో ఊతాన్నివ్వాలని చూశాడు. భవిష్యత్తుపై ఆశను ప్రేరేపిస్తూ మానవీయ విలువలను -పెంపొందిస్తూ అసమానతలు లేని సోషలిజాన్ని కోరుకున్నాడు.

ఈ ‘మహైక’ కావ్యాన్ని చూసిన్పుడు ‘ఏదో నూతన లోకాన్ని చూసినట్లుంది’ అన్న బెల్లంకొండరామదాసు, రెంటాల గోపాల కృష్ణ మాటలను బట్టి కవి నూతన దృష్టి ఎంతటిదో మనకు అర్థమౌతుంది. ఈ కావ్యాన్ని తెలంగాణ యోధుడు “సర్దార్జమలాపురం కేశవరావుకు అంకితం ఇవ్వడంలోనే కవి అభ్యుదయ విప్లవాత్మక దృక్పధాలు మనకు తెలుస్తున్నాయి.

ప్రశ్న 4.
‘మహైక’ కావ్య విశిష్టతను వర్ణించండి?
జవాబు:
‘మహైక కావ్యం ‘కవిరాజుమూర్తి’చే రచించబడిన ‘మహైక’ దీర్ఘకవిత కావ్యం నుండి గ్రహించబడింది. వచన కవితా ప్రక్రియలో వచ్చిన దీర్ఘకావ్యం ‘మహైక’, ఇది సెప్టెంబరు 1953లో ప్రచురించబడింది. ఇది సామాన్య మానవుడు, కవి, కార్మికుడు, పతితల పాత్రల పరస్పర సంభాషణలతో సాగింది. నాగరిక సమాజంలో తాను అనుభవిస్తున్నకష్టాలను, వేదనలను, నిరాశతో నిట్టూర్పులతో నిర్వేదంగా నివేదించుట ఈ కావ్యంలోని ముఖ్య అంశం.

TS Inter 1st Year Telugu Study Material Poem 6 మహైక

భవిష్యత్తుపై ఆశలను ప్రేరేపిస్తూ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నవారిని రక్షిస్తూ మానవ విలువలను తెలియచేస్తూ అసమానతలు లేని సోషలిజానికి ‘మహైక కావ్యం బాటలు వేసింది. దీనికి ముందు మాటలు రాసిన బెల్లంకొండ రామదాసు, రెంటాల గోపాలకృష్ణ మాటలలో “మహోజ్వలమైన ఈ ‘మహైకా’ కావ్యం చదివినపుడు ఏదో నూతనలోకాన్ని చూసినట్టుంది” అన్న మాటలే ఈ కావ్యం యొక్క విశిష్టతను తెలియజేస్తున్నాయి. ఈ కావ్యాన్ని తెలంగాణ పోరాటయోధుడు ‘జమలాపురం కేశవరావుకు అంకితం ఇచ్చినపుడే కవి అభ్యుదయ విప్లవాలు తెలుస్తున్నాయి. దీర్ఘ కవితలలో ‘మహైక’ అత్యంత విశిష్ట కావ్యంగా పేర్కొనవచ్చు.

III. ఏకపద/వాక్య సమాధాన ప్రశ్నలు- సమాధానాలు

ప్రశ్న 1. కవిరాజు మూర్తి నెలకొల్పిన సాహిత్య సంస్థ పేరు ఏమిటి?
జవాబు:
‘ప్రజాసాహిత్య పరిషత్తు’ను ఖమ్మంజిల్లాలో స్థాపించాడు.

ప్రశ్న 2.
‘మై గరీబు’ నవలనను ఎవరికి అంకితమిచ్చాడు?
జవాబు:
భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూకి అంకితమిచ్చాడు.

ప్రశ్న 3.
‘మహైక’ కావ్యాన్ని ఎవరు అంకితంగా స్వీకరించారు?
జవాబు:
తెలంగాణ యోధుడు ‘సర్దార్ జమలాపురం కేశవరావుకు అంకితమిచ్చాడు.

ప్రశ్న 4.
కవిరాజుమూర్తిని ఏ మహాకవితతో పోల్చవచ్చు?
జవాబు:
చిలీ దేశ మహాకవి! బ్లో నెరుడాపాతో పోల్చవచ్చు.

ప్రశ్న 5.
పువ్వులు పరిమళాన్ని ఎప్పుడు వ్యాపింపచేస్తాయి?
జవాబు:
తోటమాలి బలిదానం చేసినపుడు

TS Inter 1st Year Telugu Study Material Poem 6 మహైక

ప్రశ్న 6.
మానవజాతికి ఎప్పుడు మేలు కలుగుతుంది?
జవాబు:
మానవత్వంతో మెలగినపుడు

ప్రశ్న 7.
మనలో మన చీలిక వల్ల కలిగే నష్టాలు ఏమిటి?
asn:
మనలో మన చీలిక మన పతనానికి దారి తీస్తుంది. మృత్యువు దరికి చేరుస్తుంది.

ప్రశ్న 8.
మనిషి ఏవిధంగా బ్రతకాలి ?
జవాబు:
మనిషి మనిషిగా మానవత్వంతో బ్రతకాలి.

IV. సందర్భ సహిత వాఖ్యలు

ప్రశ్న 1.
చరిత్రలు మన ఉనికిని కావు ప్రమాణం
జవాబు:
పరిచయం :
ఈ వాక్యము కవిరాజు మూర్తిచే రచించబడిన ‘మ హైక’ దీర్ఘకవితా గ్రంథము నుండి గ్రహించబడింది.

సందర్భము :-
మానవజాతి చరిత్రలను వివరిస్తున్న సందర్భం లోనిది.

భావము :
మానవత్వమొక్కటే మానవజాతికి శ్రేయస్కరమైనది. చరిత్రలు మన ఉనికి ప్రమాణం కాదని ఇందలి భావం.

TS Inter 1st Year Telugu Study Material Poem 6 మహైక

ప్రశ్న 2.
రంగులు వేరైనా నరజాతి నరంగు మానవత్వమే.
జవాబు:
పరిచయము :-
ఈ వాక్యము కవిరాజుమూర్తిచే రచించబడిన ‘మహైక’ అను దీర్ఘ కవితా సంపుటి నుండి గ్రహించబడింది.

సందర్భము :-
కవి మానవతను గూర్చి వివరించిన సందర్భంలోనిది.

భావము :
ఏడురంగుల సమ్మేళనం ఇంద్రధనస్సు. కాని దాని ఛాయ ఒకటే. ఏడు రంగుల సమ్మేళం అయినా చంద్రుని కాంతి తెలుపే. ఎన్ని వర్ణాలవారున్నా మానవులు నందరిని నడిపించే సరంగు మానవత్వమే అని ఇందలి భావము.

ప్రశ్న 3.
మనలోమన చీలిక మృత్యుదేవకి నాలుక.
జవాబు:
పరిచయం :-
ఈ వాక్యము కవిరాజు మూర్తిచే రచించబడిన ‘మహైక’ దీర్ఘ కావ్య సంపుటి నుండి గ్రహించబడింది.

సందర్భము : :-
కవి మానవులలో ఐకమత్యము యొక్క ఆవశ్యకతను వివరించిన సందర్భం లోనిది.

భావము :-
మనమంతా మానవులం. రంగు రూపు వేరైనా మానవజాతి ఒక్కటే. అందుకే మానవజాతి అంతా ఐకమత్యంతో మెలగాలి. లేని ఎడల, మానవుల మధ్య చీలికలు వచ్చిన ఎడల అది జాతి పతనావస్థకు దారి తీస్తుంది. మఋత్యువుకు దగ్గర చేస్తుందని ఇందలి భావం.

TS Inter 1st Year Telugu Study Material Poem 6 మహైక

ప్రశ్న 4.
అంబరాన్ని చుంబించాలి మనం
జవాబు:
పరిచయం :-
ఈ వాక్యము కవిరాజు మూర్తిచే రచించబడిన ‘మహైక ‘ దీర్ఘకవితా సంపుటి గ్రంథం నుండి గ్రహిబచబడినది.

సందర్భము :-
మానవుడు అభ్యుదయ భావనలతో భవిష్యుత్తుపై ఆశలతో బ్రతకాలని చెప్పిన సందర్భము లోనిది.

భావము :-
మానవులంతా ఆశాపాశాలతో బ్రతకాలి. ఆకాశమంత ఎత్తుకు ఎదిగి అనంతమైన ఈ ప్రపంచాన్ని శాసించాలి. ప్రపంచ మానవులంతా సోదర భావంతో మెలగాలని ఇందలి భావం.

V. సంధులు

1. భానోదయము = భాను+ఉదయము = సవర్ణదీర్ఘ సంధి
సూత్రము :- అ, ఇ, ఉ, ఋ వర్ణములకు సవర్ణములైన అచ్చులు పరమైనచో వానికి దీర్ఘములు ఏకాదేశమగును.

2. లేదెన్నటికి = లేదు+ఎన్నటికి – లేదెన్నటికి – ఉకారసంధి/ఉత్వసంధి
సూత్రము :- ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధియగు

3. సంగమమైనా = సంగమము +ఐన – సంగమమైనా – ఉ.కార సంధి/ఉత్వసంధి
సూత్రము :- ఉత్తనకచ్చు పరంబగునపుడు సంధియగు

4. వేరైనా = వేరు+ఐన – వేరైన – ఉత్వసంధి /ఉ. కార సంధి
సూత్రము :- ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు.

TS Inter 1st Year Telugu Study Material Poem 6 మహైక

5. క్షణమాగాలి = క్షణము + ఆగాలి – క్షణమాగాలి – ఉకార సంధి/ఉత్వసంధి
సూత్రము ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగును.

6. నలుపైన = నలుపు +ఐన = నలుపైన – ఉకార సంధి/ఉత్వసంధి

VI. సమాసాలు

1. సప్తరంగులు – వైరి సమాసం
2. నరజాతి – నరుల యొక్క జాతి – షష్ఠీతత్పురుష సమాసం
3. యమపాశము – యముని యొక్క పాశము – షష్ఠీతత్పురుష సమాసం
4. ఆహ్లాదగీతిక – ఆహ్లాదమైన గీతిక – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
5. భానుకాంతి – భానుని యొక్క కాంతి – షష్ఠీతత్పురుష సమాసం
6. ఉదధి నీరు – ఉదధి యందలి నీరు – సప్తమీ తత్పురుష సమాసం

అర్థతాత్పర్యాలు

1వ పద్యం :

తోటమాలి బలిదానం చేస్తేనే
పువ్వులు పరిమళాల నీపగలవు.
మానవుడు కలవాలి మానవుణ్ణి
తిడితే ఏం లాభం కన్పించని దేవుణ్ణి

అర్థాలు :-
తోటమాలి = తోటకు కాపలాదారు
బలిదానం = జీవితాన్ని బలిచేస్తేనే
పరిమళాలన్ = సువాసనలను
ఈవగలవు = ఇస్తాయి

భావము :
తోటమాలి తన జీవితాన్ని బలిదానంగా చేస్తేనే పువ్వులు సువాసనలను వెదజల్లుతాయి. మానవులు ఒకరితో ఒకరు కలిసి పోవాలి. మనం చేయాల్సింది చేయకుండా దేవుని తిడితే ప్రయోజనం ఏమిటి?

TS Inter 1st Year Telugu Study Material Poem 6 మహైక

2వ పద్యం :

అకాశానికి శోభ చందమామ.
మిణుగురుతో విద్యుత్ కాంతులు ప్రసరించవు.
ఘరాలి నేటి నాటు వ్యక్తి
కాకుంటే లేదెన్నటికి విముక్తి

అర్థాలు :
శోభ = అందం
ప్రసరించవ = సోకవు
విముక్తి = విడుదల

భావం :
చందమామ ఆకాశానికి అందాన్నిస్తుంది. మిణుగురు పురుగుకాంతితో విద్యుత్ కాంతులు వ్యాప్తించవు. మనిషికి మార్పు తప్పనిసరి. అలా మారకపోతే విముక్తే లేదు మనిషికి.

3వ పద్యం :

మానవునికి మానవుడే ధ్యేయం
మానవత్వమే మానవతానికి శ్రేయం
చరిత్రలు మన ఉనికికి కావు ప్రమాణం
చరిత్రిని వెనక్కి నెట్టి చేయాలి ప్రయాణం

అర్థాలు :
ధ్యేయం = లక్ష్యము
మానవత్వము = మంచి చెడులను తెలుసుకుని ప్రవర్తించటం
శ్రేయం = మంచిది
ఉనికి = జాడ
ధరిత్రి = భూమి
ప్రమాణం = కొలత

భావం :
మానవునకు మానవుడే లక్ష్యంకావాలి. మానవత్వము మానవజాతికి మేలును చేకూరు స్తుంది. చరిత్రకు ఉనికికి కొలబద్దకాదు. ధరిత్రిని గెలిపించటానికి మనందరం ప్రమాణం చేయాలి.

TS Inter 1st Year Telugu Study Material Poem 6 మహైక

4వ పద్యం :

మనం కోరే క్షణం శాంతి
జగత్కల్యాణానికి కాదు క్రాంతి
మన కాళ్ళల్లోని బొబ్బలు
దౌర్జన్యానికి చావుదెబ్బలు

అర్ధాలు :
శాంతి = ప్రశాంతత
జగత్ = భూమియొక్క
కళ్యాణానికి = శుభానికి
క్రాంతి = వెలుగు

భావం :
మనం కోరుకునే క్షణం ప్రశాంతత ఈలోకాలకు శుభాల నివ్వాలి. మన కాళ్ళలోని బొబ్బలు దౌర్జన్యానికి నిజంగా చావు దెబ్బలే!

5వ పద్యం :

ఆకాశంలో ఎగిరే కీరం
ఎల్లప్పుడు తిరిగే గోళం
మధురగీతికలు పాడే గోళం
విశ్రాంతిని కోరవు నిజం

అర్థాలు :
కీరం = చిలుక
మధుర = మధురమైన
గీతికలు = గేయాలు
గళం = గొంతుక

భావం :
ఆకాశాన ఎగిరే చిలుక ఎల్లవేళల పరిభ్రమిస్తూనే ఉంటుంది. అందమైన గీతాలను ఆలపించే గొంతుక విశ్రాంతిని ఎరుగదు.

TS Inter 1st Year Telugu Study Material Poem 6 మహైక

6వ పద్యం :

యుగయుగాల నైరాశ్యం
మన బ్రతుక్కియమపాశం
తరతరాల ఈ శాంతం
మనజీవిత ఆసాంతం

అర్ధాలు :
నైరాశ్యం = నిరాశ
యమపాశ = ముగింపు
ఆసాంతం = చివరి వరకు

భావం:
యుగయుగాలుగా మానవులలో గూడుకట్టుకున్న నిరాశ నిస్పృహలు మన బ్రతుకులకు. యమపాశాలు. తరతరాల ప్రశాంతతను జీవితాంతం కావాలని ఆశించాలి.

7వ పద్యం :

అడుగడుగు కదలికలో
అవవీగర్భం కంపించాలి.
మనకన్నుల కాంతి ప్రసరణతో
కాలగమనం క్షణమాగాలి.

అర్ధాలు :
అడుగడుగున = ప్రతి అడుగులో
అవని = భూమి
కంపించాలి = కదలిపోవాలి
ప్రసరణ = అలముకొను వ్యాపించు
గమనం = ప్రయాణం

భావము:
మన ప్రతి అడుగు కదలికలో భూమి కంపించి పోవాలి. మన కన్నుల కాంతి అలముకొని కాలగమనం క్షణకాలం ఆగిపోవాలి.

TS Inter 1st Year Telugu Study Material Poem 6 మహైక

8వ పద్యం :

అన్నలూ
చేతులో చేతులు కలపండి.
విశ్రాంతిని విసర్జించి నడవండి.
అక్కలూ
” ఆహ్లాదగీతిక లాలాపించండి.
ఆనందంతో కందళిస్తూ కదలండి.
మనందరి ఏకత్వం
పృథ్వీకి నవ్యత్వం

అర్ధాలు :
విసర్జించు = వదలివేయు
ఆహ్లాదగీతికలు = సంతోష గేయాలు
ఆలపించండి = పాడండి
కందళిస్తూ = వికసిస్తూ
పృథ్వీ = భూమి
నవ్యత్వం = నూతనత్వం

భావము :
అన్నా తమ్ములు చేతిలో చేయివేసి ముందుకు కదలండి. బద్దకాన్ని వదలివేసి ముందుకు నడవండి. అక్కా చెల్లెళ్ళు మీరు ఆనందకర గీతాలను పాడండి. ఆనందంతో అంకురంలా వికసిస్తూ కదలండి. మనమధ్య ఏకత్వం కావాలి. ఐకమత్యంగా ముందుకు నడవాలి. అపుడే ఈ భూమిపై నూతనత్వం వెల్లివిరుస్తుంది.

9వ పద్యం :

అన్నలూ విన్నారా ?
అక్కలూ విన్నారా ?
ఉదధి నీరు అంతటా ఉప్పే ?
మందే మంట అంతా నిప్పే ?
ఆకలికి అన్నం కోరడం ఒప్పే ?
దౌర్జన్యం ప్రతి దేశంలో తప్పే
నిర్వీర్యత ప్రాణానికి ముప్పే

అర్ధాలు :
ఉదధి = సముద్రము
నిర్వీర = పౌరుషము లేని తత్వం
ముప్పే = ప్రమాదమే!

భావము :
అన్నలూ అక్కలూ విన్నారా! సముద్రపునీరు అంతా ఉప్పే. త్రాగటానికి పనికిరాదు. మండుతున్న మంట అంతా నిప్పుతో కూడి ఉంటుంది. అది తన దగ్గరకు వచ్చిన వాటిని కూడా మండిస్తుంది. ఆకలి వేసినపుడు అన్నాన్ని కోరటం తప్పేమీకాదు. దౌర్జన్యం ఈ లోకానికి అపరాధమే! పౌరుషం లేకపోతే మనల్నిం మనం కాపాడుకోలేం!

TS Inter 1st Year Telugu Study Material Poem 6 మహైక

10వ పద్యం :

సప్తరంగుల సంగమమైనా.
ఇంద్ర ధనస్సు ఛాయ ఒకటే
ఏడు రంగుల కూడికఐనా
భానుకాంతి తెలుపే
రంగులు వేరైనా నరజాతి.
స రంగు మానవత్వమే
చంద్రికలను వెదజల్లే చందమామ నలుపైనా
చంద్రుడు నలుపని మనమనగలమా!

అర్ధాలు :
సప్తరంగులు = ఏడురంగులు
ఛాయ = నీడ
కూడిక = కలయిక.
సరగు = మనలను నడిపించేది
మానవత్వమే = మానవతే
చంద్రికలు = వెన్నెల
వెదజల్లే = వ్యాపింపచేయు

భావము :
ఏడురంగులను కలిగియున్నా ఇంద్రధనస్సునీడ ఒకటే ఏడు రంగులతో ఉన్నా చంద్రుని కాంతి తెలుపే! మానవులలో వివిధ వర్ణాల వారు ఉన్నా అందరిని నడిపించేది. మానవత్వమే.

TS Inter 1st Year Telugu Study Material Poem 6 మహైక

11వ పద్యం :

రంగులు జాతులు
కావు మనకు – జ్ఞాతులు
కుండలు చేరైనా
మృత్తిక ఒకటే
కొమ్మలు, రెమ్మలు వేరైనా
ఏక వృక్ష భాగాలే!
మనమంతా మానవులం
కలయికలో ఉంది బలం.
మనలో మన చీలిక
మన పతనానికి ఏలిక
మనలో మన చీలిక
మృత్యుదేవికి నాలుక

అర్ధాలు :
జ్ఞాతులు = పినతండ్రి, పెదతండ్రి
మృత్తిక = మట్టి
చీలిక = వేరు బడుట

భావము :
రంగులు జాతులు మనకి జ్ఞాతులు. కుండలను ఎన్ని రకాలుగా మలచినా వాటికి మూలం మట్టే. కొమ్మలు రెమ్మలు వేరుగా కన్పిస్తున్నా అవన్నీ ఒక చెట్టు భాగాలే! మానవులంతా కలిసి బతకాలి ఐకమత్యంలోనే బలం ఉంది. ఐకమత్యాన్ని కోల్పోతే మనల్ని మనం కోల్పోయినట్లే.

TS Inter 1st Year Telugu Study Material Poem 6 మహైక

12వ పద్యం :

ఆశాపాశాలతో
బ్రతకాలి మనం
అంబరాన్ని ముంచించాలి మనం
అనంత విశ్వాన్ని శాసించాలి మనం
అఖిల జగత్పాదరుల
కలవాలి మనం

అర్థాలు :
ఆశాపాశాలు = కోరికలనే భావనలు
అంబరాన్ని = ఆకాశాన్ని
చుంబించాలి = ముద్దు పెట్టుకోవాలి
అనంతం = అంతమనేది లేని
శాసించు = నియంత్రించు
జగత్ + సోదరులం = ప్రపంచ సోదరులము

భావము :
ఆశలను చిగురింపచేసుకుని మనం బతకాలి. ఆకాశమంత ఎత్తుకు ఎదిగి మనం పరిధులు లేని ప్రపంచాన్ని నియంత్రించాలి. ప్రపంచం మొత్తంలో ఉన్న అందరికి స్నేహస్తం అందించాలి.

TS Inter 1st Year Telugu Study Material Poem 6 మహైక

13వ పద్యం :

భానూదయం కాకపోడు.
నేటి చీకటి రేపురాదు.
చేతికి చేయి కలిస్తే
రెండవక మానవు
మానవుడు మానవుణ్ణి కలిస్తే
బాధలు తీరకపోవు.

అర్థాలు :
భానూదయం = సూర్యోదయం

భావము :
సూర్యోదయం రాకపోదు. నేడు ఉన్న చీకటి రేపు ఉండకపోవచ్చు. చేయికి చేయి కలిస్తే మరింత బలం చేకూరుతుంది. మానవులంతా కలిసిమెలసి ఉంటే బాధలన్నీ మానవు.

మహైక Summary in Telugu

కవి పరిచయం

కవి : కవిరాజుమూర్తి (సర్వదేవభట్ల నరసింహమూర్తి)

పుట్టిన తేదీ : అక్టోబరు 1926

పుట్టిన ఊరు : ఖమ్మం జిల్లా పిండిప్రోలు గ్రామం

రచనలు :

  • మహైక
  • ప్రణుతి
  • మానవ సంగీతం

ఉర్దూ అనువాదాలు : –

  • మైగరీబ్ హు
  • హీరాలాల్ మోరియా రాసిన ఉర్దూ కావ్యం మహాపధంగా తెలుగుకు అనువాదించారు.
  • జముకుల కథ, నవలలు
  • గాంధీజీ జీవిత చరిత్ర
  • లాహుకే, లభీర్, నవలలను ఉర్దూలోను, చివరిరాత్రి, మొదటిరాత్రి, జారుడు బండ నవలలను వ్రాశాడు

గేయాలు :

  • నవయుగ శ్రీ పేరుతో రాశాడు.
  • ఉర్దూ పారశీకవుల గజళ్ళను ‘మధురధారలుగా’ ముక్తకాలుగా తెచ్చారు.

TS Inter 1st Year Telugu Study Material Poem 6 మహైక

దాశరథి కృష్ణమాచార్యుల చేత “తిరుగుబాటు సాహిత్య ధ్రువతార” ప్రశంసలు అందుకున్న కవిరాజుమూర్తి అసలు పేరు ‘దేవభట్ల నరసింహమూర్తి’. వీరు అక్టోబరు 1926న ఖమ్మం జిల్లా పిండిప్రోలు గ్రామంలో జన్మించారు. బాల్యం విద్యాభ్యాసం అంతా ఖమ్మంజిల్లా మామిళ్ళ గూడెంలో సాగింది. ఉన్నత కుటుంబంలో పుట్టినా నాటి నియంతృత్వ భూస్వాముల అధికార పీడనకు వ్యతిరేకంగా పోరాడారు. స్వాతంత్య్ర సమయంలోను పాల్గొని జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. ఖమ్మం జిల్లాలో “ప్రజాసాహిత్య పరిషత్తును” స్థాపించారు.

తెలుగు వచన కవితారంగంలో దీర్ఘకవితలు రాసిన తొలి తరం కవులలో మూర్తి ముఖ్యుడు. వీరి ‘మహైకా’ మానవ సంగీతం, పణుతి దీర్ఘ కవితలు ప్రశంసలను అందుకున్నాయి. ‘మైగరీబు’ అన్న ఉర్దూ నవల మంచి గుర్తింపు పొందింది. దీనిని జవ హర్లాల్ నెహ్రూకు అంకితం చేశారు. దీనిని గిడుతూరి సూర్యం తెలుగులోకి అనువదించాడు.

ఉర్దూలో హీరాలాల్ మోరియా రాసిన కావ్యాన్ని ‘మహాపథం’ పేరుతో తెలుగులోకి మూర్తి అనువదించారు. గాంధీ దివ్య చరిత్రను ‘జముకుల’ కథా రూపంలో రచించాడు. ఉర్దూలో ‘లాహుకే, లఖీర్, అంగారే నవలలను తెలుగులో ‘చివరి రాత్రి’ ‘మొదటిరాత్రి’ జారుడుబండ నవలలను రాశాడు. తెలుగులో, నవయుగశ్రీ, పేరుతో గేయాలను, ఉర్దూ పారశీకవుల గజళ్ళను ముక్తకాలుగా రాశాడు.

పాఠ్యాంశ సందర్భం

వచన దీర్ఘకవితా రూపంలో వెలువడిన కావ్యం ‘మహైక’. దీనిలో సామాన్య మానవుడు, కవి కార్మికుడు, పతితల పాత్రల సంభాషణతో కూడి ఉంటుంది. నాగరిక సమాజంలో సామాన్యులు అనుభవిస్తున్న కష్టాలను, వేదనలను, నిరాశలో నిట్టూర్పులతో కవి నివేదించటం ఈ కవిత లోని ప్రధానాంశం. ఆనాటి నియంతృత్వ భూస్వామ్య, అధికారుల పీడనలను నేటి తరానికి తెయలిజేయాలనే ఈ రచన మూర్తి చేశారు.

పాఠ్యభాగ సారాంశం

‘మహైక’ అనుపాఠ్యభాగం “తిరుగుబాటు సాహిత్యంలో ధ్రువతారగ’ పేరు పొందిన కవిరాజు మూర్తిచే రచించబడిన ‘మహైక’ అను దీర్ఘకవిత నుండి గ్రహించబడింది. తెలంగాణ లో నియంతృత్వ, భూస్వామ్య అధికారుల పీడనలకు వ్యతిరేకంగా కవిరాజుమూర్తి పోరాడాడు.

మహైక దీర్ఘకవిత సమాజంలో ఆధునికతను కోరుకుంటూ ప్రయోగాత్మకంగా నడచిన కవిత. ఇది సామాన్య మానవుడు, కవి, కార్మికుడు, పతతి పాత్రల పరస్పర సంభాషణలతో కూడి ఉన్నది. నేటి నాగరిక సమాజంలో తాను అనుభవిస్తున్న కష్టాలను, వేదనలను, నిరాశతో నిట్టూర్పుతో కవి చెప్పటం ఈ కవిత లోని ప్రధానాంశం. సమాజానికి ప్రాతినిథ్యం వహిస్తున్నవారిని ఓదారుస్తూ మనిషిపై మనిషికి విశ్వాసం తగ్గకుండా ప్రోత్సహించే విప్లవ రచన ఇది.

TS Inter 1st Year Telugu Study Material Poem 6 మహైక

భవిష్యత్తుపై ఆశలను నిలుపుతూ మానవీయ లక్షణాలను పెంపొందిస్తూ అసమానతలు లేని సోషలిజానికి దారులు వేసిందీ కవిత. ఈ దీర్ఘకవితను చదివినపుడు ఏదో నూతన లోకాన్ని చూసినట్లుంది అంటారు. ఈ కావ్యానికి ముందుమాట రాసిన బెల్లకొండ రామదాసు, రెంటాల గోపాలకృష్ణులు. ‘మహైకా’ను చదువుతుంటే టి.ఎస్. ఇలియట్ వేస్టాండ్ జ్ఞాపకం వస్తుంది. చిలి దేశ మహాకవి ‘పోబ్లో నెరుడా’ ఎలాంటి కవో తెలుగులో మూర్తి అలాంటివాడు.

తోటమాలి తనని తాను బలిదానంగా సమర్పించుకుంటేనే పువ్వులు పరిమళాలను వెదజల్లుతాయి. మనిషి మనిషి కలిస్తేనే దేశం వృద్ధి చెందుతుంది. యుగ యుగాల నైరాశ్యం మన బతుకులను నాశనం చేస్తున్నది. చేయి చేయి కలిపి సోమరితనాన్ని వదలిపెట్టి ఆనందంతో శ్రమ చేస్తే అందరికి సంతోషం భూగోళానికి నూతనత్వం వస్తాయి.

అన్నలూ, అక్కలూ మీకు తెలియనిదేమున్నది. సముద్రపు నీరంతా ఉప్పే. త్రాగటానికి పనికిరాదు. మండే మంటంతా నిప్పే ప్రక్కనున్న వాటిని కూడా దహిస్తుంది. ఆకలితో ఆహారాన్ని కోరటం తప్పుకాదు. నిస్సత్తువ ప్రాణానికే ప్రమాదకరం.

కుండలు వేరైనా మట్టి ఒక్కటే, రంగులు వేరైనా మానవులంతా ఒక్కటే. కొమ్మలు రెమ్మలు వేరైనా అవి వృక్షంలో భాగాలే. ఎన్ని దేశాలున్నా మానవులంతా ఒక్కటే. మానవులలో భేదాల సృష్టి మానవ వినాశనానికి దారి తీస్తుంది. అందరం ఒకటిగా నడిస్తే ప్రమాదాలను దాటగలం అని ఐకమత్యాన్ని గూర్చి ‘మహైక’ కవిత వివరిస్తుంది.

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 5th Poem నాపేరు ప్రజాకోటి Textbook Questions and Answers.

TS Inter 1st Year Telugu Study Material 5th Poem నాపేరు ప్రజాకోటి

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు – సమాధానములు

ప్రశ్న 1.
‘నా పేరు ప్రజాకోటి’ కవితలో దాశరథి అందించిన సందేశాన్ని తెలియచేయండి?
జవాబు:
‘నాపేరు ప్రజా కోటి’ అను పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యులచే రచించిబడిన “పున్నవం” అను కవితాఖండిక నుండి గ్రహించబడింది. “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని తెలంగాణ వైభవాన్ని వివరించిన కవి దారశథి. ఆయన పీడిత ప్రజల వాణికి తన కవిత్వాన్ని ‘మైక్’గా అమర్చాడు.

కవి అయిన వానికి మానవత ఉండాలి. మంచి చెడులకు స్పందించే మనసుండాలి. అన్ని దృక్పధాలకు కేంద్ర బిందువుమానవుడే! తోటి మానవుని ప్రేమించ లేనివాడు దేనినీ ప్రేమించలేడు. గతాన్ని వర్తమానాన్ని నిశితంగా పరిశీలించి భవిషత్తుకు బాటలు వేయాలన్నాడు. మన దేశం అనాది నుండి శాంతి అహింసలకు ఉపాసించిందన్నాడు. విశ్వశ్రేయస్సును కోరేవారు భారతీయులని అభివర్ణించాడు. తనతో అందరిని కలుపుకోవటం అందరిలో తాను ఒకడిగా కలిసిపోవటమే భారతీయత. చెడు నుండి మంచి వైపుకు ప్రయాణం చేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.

అహింసను అలవరచుకోవాలి. హింసద్వారా విజయాన్ని పొందినవారు ఈ. ప్రపంచంలో ఎవరూ ఉండరు. అహింసే జీవిత పరమావధి కావాలని ఈ కవిత ద్వారా దాశరథి ప్రబోధించాడు.

గతమంతా బూది కుప్పకాదు. వర్తమానం అద్భుతమూ కాదు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుని నడిస్తేనే ప్రజా విజయ మౌతుందన్నాడు. ఎన్ని శక్తులను సాధించినా మానవత ముందు దిగదుడుపే. ఏ జెండా పట్టుకున్నా మైత్రీ బంధం కూర్చేనేరు అహింసకు మాత్రమే ఉంది. ప్రపంచంలో ఎక్కడ మానవున్నాడ వాడు మానవుడే. రంగు రూపు భేదమున్నా స్నేహం చేయటం నేర్చుకోవాలన్నాడు. హింసాత్మక ధోరణులను వదలి హాయిగా జీవనం గడపమని దాశరథి ఈ కవిత ద్వారా ప్రబోధించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

ప్రశ్న 2.
అహింస ఆవస్యకతను పాఠ్యాంశం ఆధారంగా వివరించండి?
జవాబు:
‘నాపేరు ప్రజాకోటి’ అను పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యులు రచించిన ‘పునర్నవం’ అను కవితా సంపుటి నుండి గ్రహించబడింది. భారతదేశం అనాది నుండి శాంతి అహింసలను ఉపాసించింది. విశ్వశ్రేయస్సును కోరుకుంది. తనలో అందరిని కలుపుకోవటం, అందరిలో తానై పర్యవసించటమే భారతీయత. హింసను ఆధారంగా చేసుకుని ప్రపంచంలో ఎవరూ విజయాన్ని సాధించ లేదు. అహింస జీవన పరమావధి కావాలని దాశరథి కోరుకున్నాడు.

“నిజం ఏమిటోగాని వట్టి చేతితో శత్రువు పైకి దుమికే శక్తి ఉంది”.

వట్టి చేతితో శత్రువుపైకి దూకేశక్తి అహింస సొంతం. మాటలనే ఈటెలుగా చేసుకుని ఎదిరించే బలం అహింసకున్నది. వీరశైనికుని కూడా చూసి భయపడని ఈ లోకం నన్ను చూసి భయపడుతుంది. నేను కోతల రాయుణ్ణిని భావించవద్దు. ఎర్రజెండా పట్టుకున్న వారిని పచ్చజెండా పట్టుకున్న వారిని కలిపే శక్తిఅహింసకున్నది. రాక్షసులతో కూడ స్నేహం చేయగల సత్తా అహింసా మార్గనికున్నది.

“హృదయం వినా నా దగ్గర ఏ వస్తువు లభింపదు
ఉదయం వినా నాకంటికి ఏ వస్తువూ రుచించదు”.

హృదయం నా ఆయుధం. ఉషోదయం తప్ప నాకు ఏదీ నచ్చదు. అణ్వస్రా లను అఘాతంలో పడవేసిన శక్తినాది. ప్రజల సుఖశాంతులే నాకు పరమావధి. ఘర్షణలో ఏనాటికీ ఆనందం లభించదు. కనుక లోకాలకు అహింస పరమావధికావాలి. అదే ప్రపంచానికి అవస్యం కావలసిన నీతి.

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

II. సంగ్రహరూప ప్రశ్నలు- సమాధానాలు

ప్రశ్న 1.
దాశరథి కవితా సంపుటాలను తెలియచేయండి?
జవాబు:
‘నాపేరు ప్రజాకోటి’ అన్న పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యులుచే రచించబడిన “పునర్నవం” కవితా సంపుటి నుండి గ్రహించ బడింది.

ఆధునికాంధ్ర సాహిత్యంలో దాశరథిది విశిష్ట స్థానం. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించిన దాశరథి పీడిత ప్రజల వాణికి తన కవిత్వాన్ని ‘మైక్’ గా అమర్చాడు. ఉర్దూ, తెలుగు సంస్కృం, ఆంగ్లభాషా సాహిత్యాలను అధ్యయనం చేశాడు.

వీరి కవితా సంపుటాలు అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, అమృతాభిషేకం, కవితాపుష్పకం ఆలోచనా లోచనలు, తిమిరంతో సమరం. మహాబోధి కథాకావ్య రచన చేశాడు. నవ మంజరి, దాశరథి బాలగేయాలు, ఖబడ్డార్ చైనా అన్న గేయ రచనలు చేసాడు. వీటితో పాటుగా ‘నవిమి’ నాటికల సంపుటిని వెలువరించాడు. దాశరథి శతకంతోపాటు గాలిబుగీతాలను తెలుగునకు అనువదించారు.

ప్రశ్న 2.
యుద్ధానికి సంబంధించి దాశరథి అభిప్రాయాలను తెలపండి?
జవాబు:’
నా పేరు ప్రజాకోటి’ అన్న పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యులుచే రచించబడిన “పునర్నవం” కవితా సంపుటి నుండి గ్రహించబడింది.

‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని నినదించిన దాశరథి తాడిత పీడితుల కోసం తన కవితను ‘మైక్’గా అమర్చాడు. ఒకరినొకరు ద్వేషించటం తగదని రాక్షస స్వభావం గల వారితో కూడా మైత్రిని చేయాలని అంటారు దాశరథి. ఆయన దృష్టిలో యుద్ధం రాక్షసక్రీడ. నవ సమాజానికి పనికిరానిది.

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

అందరికంటే ముందే
అణ్వస్త్రము గొనిపోయి
అఖాతాన పడవేసితి
సుఖపడగా ప్రజాకోటి”
అని అణ్వస్త్ర ప్రయోగాన్ని నిరసించాడు.
కత్తి పట్టి గెలిచినట్టి
ఘనుడగు వీరుండెవ్వడు
మెత్తని హృదయం దాటికి
తుత్తునియలు కానిదెవరు?
ఘర్షణలో ఏనాటికి
హర్షం లభియింపబోదు”

అని నవసమాజానికి యుద్ధం పనికిరాదని మెత్తని హృదయంతో అహింసా యుతంగా విజయాలను పొందాలని దాశరథి భావన.

ప్రశ్న 3.
పాఠ్యాంశంలోని కవి ప్రతిపాదించిన త్రికాల దృష్టిని వివరించండి ?
జవాబు:
‘నా పేరు ప్రజాకోటి’ అను పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన “పునర్నవం” అను కవితా సంపుటి నుండి గ్రహించబడింది. కవి అనేవాడు. మొదట మానవతా వాది కావాలి. కన్పించే మంచికి చెడుకు స్పందించే మనసుండాలి. గతాన్ని వర్తమానాన్ని భవిష్యత్తును తెలుసుకోగలగాలి.

గతకాలాన్ని మంచి కాలంగా భావించి జీవితాలను గడిపే వ్యక్తులను వెక్కిరించే మనస్తత్వ దృష్టి ఉండకూడదంటాడు.

“గతమే జీవిత మనుకుని
వర్తమానమె వలదని
వెనక్కు నడిచేవారిని
వెక్కిరించు కోర్కిలేదంటాడు”

అలాగే గతమంతా శూన్యం జ్ఞాన ప్రదమైన వర్తమానాన్ని మాత్రమే మంచిగా భావించాలను తలపొగరు గలవారిని నిందించే ఆలోచనా చేయకూడదు. గతము వర్తమానము కత్తికి రెండు వైపులా ఉండే పదును. రెండింటిని సమర్థిస్తానన్నాడు.

“గతాన్ని కాదనలేను
వర్తమానం వద్దనుబోను భవిష్యత్తు వదులుకోను”

అని గతాన్ని, వర్తమాన్ని భవిష్యత్తును ఒకటిగా చూసే దృష్టి కలవాడు దాశరథి.

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

ప్రశ్న 4.
పాఠ్యాంశం ఆధారంగా కవి వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి ?
జవాబు:
‘నా పేరు ప్రజాకోటి’ అను పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన “పునర్నవం” కవితాసంపుటి నుండి గ్రహించబడింది. ఆధునిక ఆంధ్రసాహిత్యంలో దాశరథి కృష్ణమాచార్యులు ఒక విశిష్ట స్థానాన్ని పొంది ఉన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని నినదించి పీడిత తాడిత ప్రజల వాణికి తన కవిత్వాన్ని ‘మైక్’ గా అమర్చాడు.

కృష్ణమార్యుల గారి దృష్టిలో కవి అయినవాడు మానవతా వాది కావాలన్నాడు కనిపించే మంచికిచెడుకి స్పందించాలన్నాడు. అన్ని దృక్పథాలకు కేంద్ర బిందువు మానవుడే. మనిషిని ప్రేమించలేనివాడు దేనినీ ప్రేమించలేడన్నాడు. గతాన్ని వర్తమానాన్ని నిశితంగా పరీక్షించి భవిష్యత్తులోకి ప్రయాణం చేయాలన్నాడు. శాంతి అహింసలు తోడుగా విశ్వశ్రేయస్సును కోరుకున్నాడు. అహింసనే జీవిత పరమావధిగా అందరూ తలచాలని అందుకు కవులు తమ రచనల ద్వారా దోహదకారులవ్వాలని భావించాడు.

III. ఏకపద/వాక్య సమాధాన ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
దాశరథి తల్లిదండ్రులెవరు?
జవాబు:
దాశరథి తల్లిదండ్రులు వేంకటమ్మ, వేంకటచార్యులు

ప్రశ్న 2.
దాశరథి ఏ గ్రామంలో జన్మించాడు?
జవాబు:
వరంగల్లు జిల్లా మానుకోట తాలూకా చిన గూడూరు గ్రామంలో జన్మించాడు

ప్రశ్న 3.
దాశరథి ప్రసిద్ధ నినాదమేది?
జవాబు:
“నా తెలంగాణ కోటి రతనాల వీణ” అన్నది దాశరథి ప్రసిద్ధనినాదం.

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

ప్రశ్న 4.
దాశరథి తన పేరు ఏమని చెప్పకున్నాడు?
జవాబు:
నా పేరు ప్రజాకోటి అని చెప్పుకున్నాడు.

ప్రశ్న 5.
అజ్ఞానాన్ని కవి దేనితో పోల్చాడు.
జవాబు:
అజ్ఞానాన్ని “అడుసు”తో పోల్చాడు

ప్రశ్న 6.
దాశరథి అణ్వస్త్రాలను ఎక్కడ పారేయాలని ఆకాంక్షించాడు?
జవాబు:
“అఖాదం”లో పడవేయాలని ఆకాంక్షించాడు.

ప్రశ్న 7.
కవి కంటికి రుచించేదేమిటి?
జవాబు:
హృదయం, ఉదయాలు కవి కంటికి రుచించేవి

ప్రశ్న 8.
కాలాన్ని కవి దేనితో పోల్చాడు?
జవాబు:
కంఠ మాలతో పోల్చాడు.

IV. సందర్భ సహిత వాఖ్యలు

ప్రశ్న 1.
వెనక్కు నడిచేవారిని వెక్కిరించే కోర్కిలేదు.
జవాబు:
పరిచయం :
ఈ వాక్యము దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన, నా పేరు ప్రజాకోటి అను పాఠ్యభాగం నుండి గ్రహించబడింది. ‘పునర్నవం’ అను కవితా ఖండికలోనిది.

సందర్భము :-
ప్రతికాలాలను గురించి కవి తెలియచేయు సందర్భంలోనిది

భావము :-
గతించిన కాలమే జీవితం అనుకుని వర్తమానాన్ని నిందిస్తూన్న వారిని పరిహాసం చేసే కోరిక తనకు లేదని ఇందలి భావం.

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

ప్రశ్న 2.
వట్టిచేతితో శత్రువుపై దుమికే శక్తి ఉంది
జవాబు:
పరిచయము :-
ఈ వాక్యము దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన “నా పేరు ప్రజాకోటి” అని పాఠ్యభాగం నుండి గ్రహించబడింది. “పునర్నవం” అన్న కవితాఖండికలోనిది.

సందర్భము :-
కవి “అహింసా” శక్తిని గురించి వివరించే సందర్భములోనిది.

భావము :
చిన్నపాటి అంకుశంతో గున్న ఏనుగు బంధించే కొత్త శక్తిని కనుగొన్నాను. అలాగే వట్టి చేతులతో ‘అహింస’నే ఆయుధంగా చేసుకుని శత్రువుపై దూకే శక్తిని తెలుసుకున్నాని ఇందలి భావం.

ప్రశ్న 3.
రాక్షసినైనా మైత్రికి రానిత్తును భయం లేదు
జవాబు:
పరిచయం :-
ఈ వాక్యము దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన ‘నాపేరు ప్రజాకోటి’ అన్న పాఠ్యభాగం నుండి గ్రహించబడింది. ‘పునర్నవం’ అను ఖండకావ్యం లోనిది.

సందర్భము :
మానవులంతా ఒక్కటే అన్న భావాన్ని వివరించిన సందర్భము

భావము :-
అందరం మానవులమే. ఒకరినొకరు ద్వేషించు కోవటం ఎందుకు. రాక్షస స్వభావం ఉన్న వారిని కూడా నేను ఆహ్వానిస్తాను అని ఇందలి భావం.

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

ప్రశ్న 4.
ఘర్షణలో ఏనాటికి హర్షం లభియింపబోదు.
జవాబు:
పరిచయం :
ఈ వాక్యము దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన, ‘నా పేరు ప్రజాకోటి’ అన్న పాఠ్యభాగం నుండి గ్రహించబడింది. ‘పునర్నవం’ అన్న కవితా ఖండికలోనిది.

సందర్భము :-
మనలోని అజ్ఞానాన్ని తొలగించుకుని అసలు విషయాన్ని తెలుసుకోమని చెప్పిన సందర్భంలోనిది.

భావము :-
కత్తిపట్టి గెలిచిన వీరుడెవ్వరూ లేడు. కాని మెత్తని హృదయంతో లొంగనివారు ఉండరు. హింస అనే అజ్ఞానాన్ని వదలి అహింస మార్గాన్ని ఎంచుకోవాలి. హింస ద్వారా సంతోషం ఏనాటికి లభించదని ఇందలి భావం.

V. సంధులు

1. గతమంత
గతము + అంత = గతమంత సూత్రము – ఉత్వసంధి/ ఉకారసంథి
సూత్రము :- ఉత్తున కచ్చు పరంబగునపుడు సంథియగు

2. అణ్వస్త్రము:
అణు+అస్త్రము = అణ్వస్త్రము – యణాదేశ సంధి
సూత్రము :- ఇ.డి.ఋ అనువానికి అసవర్ణములైన అచ్చులు పరమైనచో క్రమముగా య,వ,ర,ల అనునవి ఆదేశముగా వచ్చును.

3. అణువంత
అణువు+అంత = అణువంత – ఉకార సంధి/ఉ. త్వసంధి
సూత్రము :- ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

4. చేతులెత్తి
చేతులు + ఎత్తి = చేతెలెత్తి – ఉకారసంధి/ఉత్వసంథి
సూత్రము :- ఉత్తన ‘కచ్చు పరంబగునపుడు సంథియగు.

5. రెండంచులు
రెండు + అంచులు = రెండంచులు – ఉకారసంథి/ఉత్వసంథి
సూత్రము :- ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధియగు.

6. కానిదెవడు
కానిది + ఎవడు = కానిదెవడు – ఇత్వసంధి/ఇకారసంథి
సూత్రము :- ఏ మ్యాదులయిత్తనకు సంధి వైకల్పికముగానగు. ఏమ్యాదులనగా ఏమి, మరి,కి,షష్ఠి, అది, అవి, ఇది, ఇవి, ఏది, ఏవి ఇత్తు అంటే హ్రస్వమైన ఇకారము.

VI. సమాసాలు

1. ఎర్రజెండా :
ఎర్రనైన జెండా – విశేషణ పూర్వపద కర్మధారయము.

2. గున్నయేనుగు :
గున్నదైన ఏనుగు – విశేషణ పూర్వపద కర్మధారయము

3. మహాశక్తి:
మహాతైన శక్తి – విశేషణ పూర్వపద కర్మధారయము

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

4. మనోజ్ఞభావి :
మనోజ్ఞమైన భావి – విశేషణ పూర్వపద కర్మధారయము

5. శబ్దధాటి:
శబ్దము యొక్క ధాటి – విశేషణ పూర్వపద కర్మధారయము

6. అజ్ఞానం :
జ్ఞానము కానిది – నైత్పురుష సమాసము

7. భరతభూమి :
భరత అనుపేరుగు భూమి – సంభావనా పూర్వపద కర్మధారయము

8. ఇలాగోళము :
భూమి యొక్క గోళము – షష్ఠీతత్పురుష సమాసం

9. మైత్రే బంధము :
మైత్రి చేత బంధము – తృతీయా తత్పురుష సమాసం
మైత్రి వలన బంధము – పంచమీ తత్పురుష సమాసం

10. కంఠమాల :
కంఠమునందలి మాల – సప్తమీ తత్పురుష సమాసం

ప్రతిపదార్థ తాత్పర్యాలు

1వ పద్యం :

తెలంగాణలో కోటిధీరులు గళధ్వనినేగాక
ఇలా గోళమందుండెడి ఎల్లరి శబ్దాన్ని నేను
నా పేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాటి

అర్థాలు :
ధీరులు = ధైర్య వంతుల
గళధ్వని = కంఠధ్వని
ఇలాగోళము = భూగోళము
ఎల్లరి = అందరి

భావము :
కోట్ల ప్రజల తెలంగాణ వీరుల (గళాన్ని) గొంతుకను నేను అంతేకాదు ఈ భూమిపై ఉండే ప్రజలందరి ఊపిరిని నేను నా పేరు ప్రజా కోటి, నా ఊరు ప్రజావాటి అని కవి పేర్కొన్నాడని ఇందలి భావం.

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

2వ పద్యం :

అయినా అణువంతవాణ్ణి
అసలే కనరాని వాణ్ణి
కోట్ల కొలది జనుల మనసు
కొద్దో గొప్పో ఎరుగుదు

అర్థాలు :
అణువంత = అణువంత చిన్నరూపం
కనరాని = కన్పించనటువంటి
ఎరుగుదు = తెలుసుకున్నవాడిన

భావం:
కోట్లకొలది ప్రజలలో నేను అణువంతటివాడిని. అయినా వారందరి మనస్సులను కొద్దోగొప్పో తెలిసినవాడిని.

3వ పద్యం :

గతమే జీవితమనుకొని
వర్తమానమే వలదని
వెనక్కు నడిచేవారిని
వెక్కిరించు కోర్కిలేదు.

అర్థాలు :
గతము = గడిచిన కాలం
వర్తమానము = ప్రస్తుతము
వలదని = వద్దని
నడచేవారిని = పయనించేవారిని
వెక్కిరించ = ఎగతాళి గేళి చేసే
కోర్కెలేదు = ఆలోచన కోరిక లేదు.

భావం :
గతించిన కాలమే అసలైన జీవితమనుకొని వర్తమానం వద్దని గతకాలాన్ని గుర్తుకుతెచ్చుకొని బ్రతికేవారిని ఎగతాళి చేసే కోరిక ఏ మాత్రం నాకులేదు.

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

4వ పద్యం :

గతమంతా బూదికుప్ప
కావాలి మనోజ్ఞభావి
తిరగబడండని అరచే
బిరుసువారి నిందింపను

అర్ధాలు :
గతమంతా = గడిచిన కాలమంతా
బూదికుప్ప = శూన్యం
మనోజ్ఞభావి = ఆనందాన్నిచ్చే భవిష్యత్తు
తిరగబడండి+అని = ఎదురు తిరగమని
అరచే = గొంతెత్తే
బిరుసువారి = తలపొగరు వారిని
నిందింపను = తిట్టను

భావం :
గడిచిన కాలమంతా పనికిరానిది సుందరమైన భవిష్యత్తు కావాలని తిరగబడండి అని అరచే తలబిరుసుగాళ్ళను నేనేమి అనగలను.

5వ పద్యం :

ఇవి రెండూ ఒక కత్తికి
అటూ ఇటూ రెండంచులు.
నే మాత్రం రెండంచులు
సాము చేయగలను లెండి!

అర్థాలు :
ఇవి రెండూ = పూర్వాపరాలు రెండూ
రెండంచులు = రెండువైపులా
నే మాత్రం = నేను మాత్రం
సాము = పరిశ్రమ

భావం :
భూత వర్తమాన కాలాలు రెండూ కత్తికున్న రెండంచులు. నేను మాత్రం రెండింటిని సమంగా చూస్తాను అని ఇందలి భావం.

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

6వ పద్యం :

గతాన్ని కాదనలేను
వర్తమానం వద్దనబోను
భవిష్యత్తు వదులుకోను
కాలం నా కంఠమాల
నా పేరు ప్రజాకోటి
నా ఊరు ప్రజావాటి

అర్ధాలు :
గతము = గడచిన కాలము
వర్తమానం = గడుస్తున్న కాలం
కంఠమాల = కంఠమందు ధరించేమాల
ప్రజాకోటి = ప్రజలయొక్క సమూహం
ప్రజావాటి = ప్రజల నివాసం

భావం:
గతించిన కాలాన్ని కాదనలేను. వర్తమానాన్ని వద్దనను కాలం నా కంఠమాల నాపేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాటి.

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

7వ పద్యం :

బాంబుల బలం వచ్చి.
పాములలో విషం చచ్చి
ప్రేమములో బలం హెచ్చి
స్నేహములో శక్తి హెచ్చి
చిన్నపాటి అంకుశమున
గున్నయేనుగును వంచే
కొత్తరకం పద్ధతికను
“గొన్నానండో రండో!
భరతభూమి నేర్చినదో.
ప్రజాకోటీ నేర్పినదో
నిజం ఏమిటోగాని
వట్టి చేతితో శత్రువు
పై దుమికే శక్తి ఉంది.

అర్ధాలు :
బాంబులు = మారణాయుధాలు
బలంచచ్చి = బలం నశించి
పాములలో = విషసర్పాలలో
విషం చచ్చి = విషంపోయి
ప్రేమములో = ప్రేమభావంలో
బలం హెచ్చి = బలము పెరిగి
స్నేహంలో = మిత్రత్వంలో
అంకుశము = త్రిశూలంవలె ఉండే ఆయుధం

భావము:
మారణాయుధాలలో బలం నశించి పాములలో విషం పోయి, ప్రేమ భావంలో బలం పెరిగి స్నేహానికున్న శక్తి పెరిగి చిన్న పాటి అంకుశముతో గున్న ఏనుగును దారికి తెచ్చుకునే కొత్త పద్ధతిని కనుగొన్నాను. నా భారతభూమి నేర్చినదో, ప్రజాసమూహాలు నేర్పాయో వట్టి చేతులతో అహింస భావనతో శత్రువుపై దూకే శక్తి నాకు లభించింది.

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

8వ పద్యం :

మాటలనే ఈటెలతో
పోటుపెట్టు బలంవుంది.
సైనికుడిని చూచివెరువ
బోని జగం నన్ను జూచి
భీతిజెంది భక్తి పొంది
చేతులెత్తి దండమిడును.

అర్ధాలు :
మాటలనే = మాటలు అనే
ఈటెలతో = ఆయుధాలతో
పోటు పెట్టు = గాయపరచు
వెరువు = భయం
భీతిజెంది = భయపడి

భావము :
మాటలనే ఈటెలతో ఎదుర్కొనే బలం ఉంది. సైనికుడిని చూసి భయపడని జగతి నన్ను చూసి భయాన్ని భక్తిని పొంది చేతులెత్తి నమస్కరిస్తున్నది. నేనెవరినో తెలుసా అహింసను ప్రేమను

9వ పద్యం :

వినుడీ నా శబ్దధాటి
నా పేరు ప్రజాకోటి
ఒక్క కోటి కాదండో
కోటికోట్ల ప్రాణులకు
మాట బలంతో ఆశా
పాటవమును కలిగిస్తా

అర్ధాలు :
శబ్ధదాటి = మాటల యొక్క శక్తి
ఆశాపాటవము = ఆశతో కూడిన నేర్పు

భావము :
నా శబ్దం యొక్క ప్రతాపాన్ని వినండి. నా పేరు ప్రజాకోటి. ఒక్క కోటి కాదండి. కోటానుకోట్ల ప్రాణులకు మాటలనే బలాన్నిచ్చి నైపుణ్యాన్ని కలిగిస్తాను.

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

10వ పద్యం :

అయితే గప్పాలకోరు.
అనుకోబోకండి మీరు

అర్ధాలు :
గప్పాకోరు = కోతలరాయుడు

భావము :
అలాగని నేను గొప్పలు చెప్పుకునే వాడిని కాదండి.

11వ పద్యం :

మీ గొప్పయే నా గొప్ప మీరు లేకనే చొప్ప

అర్ధాలు :
చొప్ప = నిరుపయోగం

భావము :
మీ గొప్పేనా గొప్పకూడా. మీరు లేకపోతే నేను శూన్యం. నేను లేనేలేను.

12వ పద్యం :

ఎర్రజెండా పట్టుకోని
ఎగసిపోవువాడితోటి
పచ్చజెండా పట్టుకోని
పరుగు తీయువాని తోటి
మైత్రి బంధం కూర్చే
మహాశక్తినాకున్నది

అర్థాలు:
ఎర్రజెండా = కమ్యూనిష్టులు
పచ్చజెండా = జనతావారు
మైత్రిబంధ = స్నేహసంబంధాన్ని
కూర్చే = కలిపే

భావము :
ఎర్రజెండా పట్టుకుని నినదించే కమ్యూనిష్టులను, పచ్చజెండా పట్టుకుని పరుగులు తీసే ప్రజాస్వామ్యవాదులను మైత్రీ బంధంతో ఒకచోటికి ఒక దారికి తెచ్చే శక్తి నాకున్నది. నేను ప్రేమను అహింసను అని ఇందలి భావం.

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

13వ పద్యం :

ఎవడైనా మానవుడే
ఎందుకు ద్వేషించడాలు?
రాక్షసి మైత్రికి
రాత్తును భయం లేదు

అర్థాలు:
ద్వేషించ = అయిష్టంగాచూచు

భావము :
ఈ భూమిమీద ఎక్కడ నివశించినా మానవుడే! అతనిని ద్వేషించటం ఎందుకు? రాక్షస స్వభావం ఉన్న వారినైనా స్నేహహస్తాన్ని అందిస్తాను. నాకు భయం లేదు.

14వ పద్యం :

దేవతనైనాతోడ్కొని
తెత్తును, భేదమ్మురాదు
నాపేరు ప్రజాకోటి
నా ఊరు ప్రజావాటి

భావము :
అహింసతో ప్రేమతో దేవతలనైనా నాతోపాటు తీసుకుని వస్తాను. నా పేరు ప్రజాకోటి ఊరు ప్రజావాటి.

15వ పద్యం :

హృదయం వినా నా దగ్గర
ఏ వస్తువు లభింపదు
ఉదయం వినా నా కంటికి
ఏ వస్తువు రుచింపడు.

అర్థాలు :
ఉదయం = సూర్యోదయకాలం
వినా = తప్ప

భావము :
మంచి హృదయం తప్ప నా దగ్గర ఏ వస్తువూ లభించదు. ఉషోదయం తప్ప నా కంటికి ఏ వస్తువు ఆనందాన్ని కలుగచేయదు.

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

16వ పద్యం :

అందరికంటే ముందే
అణ్వస్త్రముగొనిపోయి
అభాతాన పడవేసితి
సుఖపడగా ప్రజాకోటి

అర్థాలు :
అణ్వస్త్రము = అణుబాంబు
కొనిపోయి = తీసికొనిపోయి
అతఖాన = భూమిలోపల
పడవేసితి = కప్పేశాను.
ప్రజాకోటి = ప్రజా సమూహాలు
సుఖపడగా = సుఖపడటం కోసం

భావము :
ప్రజలు సుఖపడాలన్న భావనతో అందరికంటే ముందుగా అణ్వస్త్రాన్ని అఘాతంలో

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

17వ పద్యం :

కత్తిపట్టి గెలిచినట్టి
ఘనుడగు వీరుండెవ్వడు?
మెత్తని హృదయం దాడికి
తుత్తునియలు కానిదెవరు?
అజ్ఞానపు అడుసు కడిగి
అసలు విషయమెరుంగుడీ
ఘర్షణలో ఏనాటికి
హర్షం లభియింపబోదు

అర్థాలు :
ఘనుడు + అడు = గొప్పవాడైన
మెత్తని హృదయం = మెత్తని మనసు
ధాటికి = దెబ్బకు
తుత్తునియలు = ముక్కలు ముక్కలు
అజ్ఞానపు = తెలివితక్కువ తనపు
అడుసు = మలినము
కడిగి = శుభ్రపరచి
ఘర్షణలో = పోరులో
హర్షం = ఆనందం

భావము :
కత్తి పట్టి విజయం సాధించినవాడు ఒక్కడు కూడా లేడు. మెత్తని ప్రేమ అహింసలను గల హృదయానికి లొంగనివాడు ఈ లోకంలో ఎవరూ ఉండరు. హింస అనే అజ్ఞానాన్ని వదలి సత్యాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. ఘర్షణ వలన సంతోషం ఏనాటికీ లభించదని తెలుసుకోండి. నాపేరు ప్రజా కోటి, నా ఊరు ప్రజావాటి.

నాపేరు ప్రజాకోటి Summary in Telugu

కవి పరిచయం

కవి : దాశరథి కృష్ణమాచార్యులు

పుట్టిన తేదీ : జూలై 22, 1925

పుట్టిన ఊరు : వరంగల్లు జిల్లా, మానుకోట తాలూకా చినగూడూరు గ్రామం

తల్లిదండ్రులు : వెంకటమ్మ, వెంకటాచార్యులు

విధ్యాభ్యాసం : ఖమ్మంలో హైస్కూలు చదువు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యంలో బి.ఏ

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

రచనలు :

  1. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, అమృతాభిషేకం, కవతాపుష్పకం, ఆలోచనాలోచనలు, తిమిరంతో సమరం మొదలగునవి.
  2. “మహాబోధి” కథాకావ్యం
  3. నవమంజరి, దాశరథి బాలగేయాలు, ఖబడ్డార్ చైనా గేయరచనలు
  4. గాలీబు గీతాలను ఊర్దూ నుండి తెలుగునకు అనువాదం
  5. “నవమి” నాటికలసంపుటి
  6. దాశరథి శతకం
  7. వందలకొలది సినిమాపాటలు

పురస్కారాలు, బిరుదులు :

  1. ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవడాక్టరేట్ కళా ప్రపూర్ణబిరుదులు
  2. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవడాక్టరేట్ను
  3. కేంద్ర రాష్ట్ర సాహిత్య అకాడమీలు పురస్కారాలు
  4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా పనిచేశారు.

మరణం : నవంబరు 5, 1987

“నా తెలంగాణ కోటిరతనాల వీణ” అని నినదించిన కవి దాశరథి. పీడిత ప్రజల వాణికి తన కవిత్వాన్ని “మైగ్”గా అమర్చిన కవి. జూలై 22, 1925న వరంగల్లు జిల్లా మానుకోట తాలూకా చినగూడూరు గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు వేంకటమ్మ వేంకటాచార్యులు. తల్లిదండ్రులు ఇద్దరూ సాహిత్యాభి రుచి గలవారే! ఉర్దూ, తెలుగు, సంస్కృతం, ఆంగ్లభాషా సాహిత్యాలను అధ్యయం చేశారు. ఖమ్మంలో హైస్కూలు విద్యను, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ ఆంగ్లం చదివారు.

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం అమృతాభిషేకం, కవితాపుష్పం, ఆలోచనాలోచనలు, తిమిరంతో సమరం, వంటి పద్య వచన రచనలు చేశారు. “మహాబోధి” వీరి కథాకావ్యం నవమంజరి, దాశరథి బాలగేయాలు, ఖబడ్డార్ చైనా వంటి గేయాలు రచించారు. గాలీబు గీతాలను తెలుగులోనికి తీసుకువచ్చారు. నవమి నాటి కల సంపుటి, దాశరథి శతకం, వందలాది సినిమా పాటలు దాశరథి కలం నుండి జాలువారాయి.

దాశరథి తెలుగు సాహిత్యానికి చేసిన సేవను గుర్తించి ఆంధ్ర, వేంకటేశ్వర విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ను ఇచ్చాయి. ఆంధ్రవిశ్వవిద్యాలయం, “కళాప్రపూర్ణ” బిరుదుతో సత్కరించింది. కేంద్ర సాహిత్య అకాడమీ, రాష్ట్ర సాహిత్య అకాడమీలు పురస్కారాలను అందించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థానకవిగా కొంతకాలం పనిచేశారు. నవంబరు 5, 1987న దాశరథికాలం చేశారు.

పాఠ్యాంశ సందర్భం

కవి అయినవాడు మొదట మానవతావాది కావాలి. కన్పించే మంచికి చెడుకు స్పందించే మనసుండాలి. అన్ని దృక్పథాలకు కేంద్ర బిందువు మానవుడే! మనిషిని ప్రేమించలేనివాడు దేనినీ ప్రేమించలేడు. గతం వర్తమానం నిశితంగా పరిశీలించి ముందుకు సాగాలి.

మన దేశం అనాది నుండి శాంతి, అహింసలను అసురించింది. విశ్వశ్రేయస్సును కోరుకుంది. తనలో అందరిని అందరిలో తనను కలుపుకోవటం భారతీయుల నైజం.

చెడునుండి మంచికి చేరుకుని జీవితాలను సార్థకం చేసుకోవాలన్నది ఈ కవిత ద్వారా దాశరథి ప్రబోధించాడు. హింసను ఆధారంగా చేసుకొని ప్రపంచంపై ఎవరూ విజయం సాధించలేరు. అహింస జీవితపరమావధి కావాలని దాశరథి భావించారు.

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

ప్రస్తుత పాఠ్యభాగం నాపేరు ప్రజాకోటి దాశరథి కవితా ఖండిక “పునర్నవం” నుండి గ్రహించబడింది.

పాఠ్యభాగ సారాంశం

భారతదేశం అనాది నుండి శాంతి అహింసలను ఉపాసించింది. విశ్వశ్రేయస్సును కోరుతూ అహింసే జీవిత పరమావధిగా భారతజాతి జీవనం సాగిస్తున్నది. హింసతో ప్రపంచంలో ఎవరూ విజయాన్ని సాధించలేరు. అహింస పరమావధికావాలని దాశరధి ఆకాంక్ష.

కోట్ల ప్రజల తెలంగాణ వీరుల గొంతుకనునేను. అంతేకాదు ఈ భూమిపై నివసించే కోటాను కోట్ల ప్రజల ఊపిరిని నేను నా పేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాణి. వారందరిలో నేను అణువంతవాడిని. అయినా వారందరి మనసు కొద్దో గొప్పో తెలిసినవాడిని నేను.

గతించిన కాలమే మంచిదన్న భావన పనికి రాదని గతించిన కాలాన్ని, గుర్తుకు తెచ్చుకుని, ఆనందించే వారిని ఎగతాళిచేసే కోరిక కూడా ఏ మాత్రం వర్తమాన ప్రజలకు ఉండకూడదన్నాడు. గతాన్ని వర్తమానాన్ని నిశితంగా పరిశీలించి భవిష్యత్తులోకి ప్రయాణం చేయాలని అన్నాడు”.

అనాది నుండి భారతదేశం శాంతి అహింసలను ఉపాసించిందని, విశ్వశ్రేయస్సును కోరుకున్నదని తనలో అందరిని కలుపుకోవటం అందరిలో తానై కలసిపోవటం భారతీయ తాత్వికతకు నిదర్శనంగా భావించాలన్నాడు.

ఎర్రజెండా పట్టుకుని ఎగసిపడుతున్నవారిని పచ్చజెండా పట్టుకుని పరుగులు తీస్తున్నవారిని ఏకం చేయగలసత్తా అహింసకు ప్రేమకు సొంతమన్నాడు.

ఈ ప్రపంచంలో జీవించేవారంతా మానవులే! వారిలో కొందరిని ప్రేమించటం ద్వేషించటం తగదు. రాక్షసస్వభావం గల వారితో కూడా స్నేహం చేయగలగాలి. ఉదయము హృదయము తప్పనాకు ఏదీ ఏదీ రుచింపదు. యుద్ధం వర్తమానానికి ఔట్ టెట్. శాంతి అహింస ప్రేమలు వర్తమాన భవిషత్తులకు ఆదర్శప్రాయాలు.

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

అణ్వస్త్రాలను అందరికంటే ముందుగా అగాధాన పడవేయాలి. అది ప్రజలకు సుఖ సంతోషాలనిస్తుంది. ఈ లోకంలో కత్తిపట్టి నిజమైన విజయాన్ని సాధించనవాడు ఒక్కడూ లేడు. మెత్తని హృదయంతో ప్రేమతో, అహింసతో శత్రువులోని అజ్ఞానాన్ని తొలగించి ఆదర్శభావాలను పెంపొందించాలి. ఘర్షణ వలన ఏనాటికీ ఆనందానుభూతులు లభించవు. ఇది నామాట కాదు ప్రజలమాట అని దాశరథి కృష్ణమాచార్యులు నా పేరు ప్రజాకోటిలో వివరించాడు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 6 రాజాబహద్దుర్ వేంకట రామారెడ్డి సేవాతత్పరత

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 6th Lesson రాజాబహద్దుర్ వేంకట రామారెడ్డి సేవాతత్పరత Textbook Questions and Answers.

TS Inter 1st Year Telugu Study Material 6th Lesson రాజాబహద్దుర్ వేంకట రామారెడ్డి సేవాతత్పరత

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి స్థాపించిన విద్యావ్యవస్థలను వివరించండి?
జవాబు:
‘రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి సేవా తత్పరత’ అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డిచే రచించబడిన రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి జీవిత చరిత్ర నుండి గ్రహించబడింది. వెంకట రామారెడ్డి అందరి మన్ననలను పొందిన వ్యక్తి. బహుభాషావేత్త. తన జీవితాన్ని -ప్రజాసేవకే అంకితం చేసిన వ్యక్తి. ఆయనకు విద్యపట్ల శ్రద్ధగలవారు. పలు విద్యాసంస్థలను స్థాపించి ప్రజాసేవ చేశారు.

1. బాలికల ఉన్నత పాఠశాల :
మొత్తం హైదరాబాదు రాష్ట్రంలో మన బాలికలకు మాతృభాషా బోధనకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల లేకపోవటం దురదృష్టకరమని రెడ్డిగారు భావించారు. ఉన్నత పాఠశాలల్లో కూడా ఉర్దూ, ఆంగ్ల మాధ్యమ బోధన జరుగుతుంది. కావున హైదరాబాదులో ఒక మాతృభాషా పాఠశాలను బాలికల కోసం నిర్మించాలని తలచి స్త్రీ విద్యా ప్రోత్సాహకులు మాడపాటి హనుమంతరావుగారిని కలిసి బాలికల పాఠశాలను నిర్మించారు. ఇది బొంబాయిలో ‘కార్వే’ మహాశయులు స్థాపించిన మహిళావిద్యాపీఠంతో జత చేశారు. దీనికి అధ్యక్షులుగా రామారెడ్డి ఉన్నారు.

2. పరోపకారిణీ బాలికా పాఠశాల :
హైదరాబాద్ రామారెడ్డిగారు స్థాపించిన మరొక పాఠశాల పరోపకారిణీ బాలికా పాఠశాల. ఇది ప్రైమరీ తరగతి వరకు ఉన్నది. దీనికి అధ్యక్షులుగా రామారెడ్డి న్నారు.

3. ఎక్సెల్ సియర్ మిడిల్ పాఠశాల:
ఈ పాఠశాలను 1945లో స్థాపించారు. దీని పాలక వర్గ అధ్యక్షులు రామారెడ్డిగారే! దీనిలో తెలుగు బాలురకే ప్రవేశముంది. ఆంగ్ల, ఉర్దూ మాధ్యమాలు లేకపోవటంతో అంతగా విద్యార్థులు ఆసక్తి చూపలేదు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 6 రాజాబహద్దుర్ వేంకట రామారెడ్డి సేవాతత్పరత

4. బాలికా పాఠశాల (గొల్లబిడ్కి) :
హైదరాబాదు గొల్లఖిడ్కిలో ఒక ఆంధ్రబాలికా పాఠశాలను ప్రజాసేవకులు కొందరు స్థాపించారు. దీని బాధ్యతను కూడా రెడ్డిగారే స్వీకరించారు.

5. పరోపకారిణీ బాలికా పాఠశాల :
సికిందరాబాదు నగరంలో కీ॥శే॥ సీతమ్మగారు ఆ కాలంలో ఉండేవారు. ఆమె తన జీవితాన్ని ధారపోసి ఒక మాధ్యమిక పాఠశాలను స్థాపించారు. ఆ పాఠశాల అభివృద్ధికి రెడ్డిగారు సహాయ పడ్డారు.

6. ఆంధ్రవిద్యాలయం :
హైదరాబాదు నగరంలో తెలుగు పిల్లలకు మాతృభాష ద్వారా చదువు చెప్పుటకు ఒక్క మాధ్యమిక పాఠశాల కూడా లేదు. 1931లో దేవరకొండ సభలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. రాజాబహద్దూర్ వెంకట రామరెడ్డిగారు ఆ సభకు అధ్యక్షత వహించారు. ఎలాగైనా ఒక పాఠశాలను నిర్మించాలని తీర్మానం చేశారు. అది చివరకు సెప్టెంబరు1, 1944కు కానీ సానుకూలం కాలేదు. ఆ తరువాత అది 1947 నాటికి రెడ్డిగారి చలవతో ఉ న్నత పాఠశాలగా ఎదిగింది.

ఇలా రాజాబహద్దూర్ రామారెడ్డిగారు విద్యపట్ల మిక్కిలి ఆసక్తిని కనపరచి, తెలుగు మాధ్యమంలో బాలికలు చదువు కోవటానికి పాఠశాలలను స్థాపించటానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారకులయ్యారు.

ప్రశ్న 2.
రాజాబహద్దూర్ సంఘసేవా తత్పరతను పరిచయం చేయండి?
జవాబు:
రాజాబహద్దూర్ వెంకటరామారెడ్డి సేవతత్పరత అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డిచే రచించబడిన “వెంకటరామారెడ్డి జీవిత చరిత్ర” అన్న గ్రంథం నుండి గ్రహించబడింది.

వెంకటరామారెడ్డి గొప్ప సంఘ సేవా తత్పరులు. విద్యార్థుల కోసం, బాలికల విద్య కోసం, వితంతు వివాహాలు, బాల్య వివాహల నిరసన, అనాధల వేశ్యల రక్షణ మొదలగు అంశాలపై ఆయన చేసిన సేవ మెచ్చతగింది. హైదరాబాద్లో చదువుకునే రెడ్డి విద్యార్థులకు (హాస్టల్) వసతి గృహం, నిర్మించటం, మాతృభాషలో విద్యాభ్యాసం చేసే విద్యార్థినులకు పాఠశాలలను నిర్మించటం వారి సేవలో ప్రధాన భాగాలు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 6 రాజాబహద్దుర్ వేంకట రామారెడ్డి సేవాతత్పరత

సంఘ సంస్కారం :
గోల్కొండ పత్రికను స్థాపించి దాని ద్వారా యువతలో చైతన్యాన్ని నింపారు. రెడ్డిగారు పూర్వకాలం వారు అయినప్పటికి సంఘసంస్కారం కలవారు. బాల్య వివాహాలను నిరసించారు. వితంతు వివాహాలను ప్రోత్సహించారు. కీ॥శే॥ పండిత కేశవరావుగారు వీటిపై రెండు చిత్తు శాసనాలను చేస్తే వాటికి రెడ్డిగారు మద్దతు నిచ్చారు. దీనిపై శాసనసభవారు ఒక ఉప సంఘాన్ని నియమించారు. ఆ ఉపసంఘంలో రెడ్డిగారు ముఖ్యపాత్ర వహించారు. ఒక రెడ్డి హాస్టల్ విద్యార్థి వితంతు వివాహం చేసుకుంటే అతనిని ప్రోత్సహించి ఉపాధిని కల్పించారు. వీరికి కులభేధ పట్టింపులు లేవు. మూఢాచారాలను నిరసించారు. అన్ని కులాల మతాల వారితో కలిసి జీవించారు.

అనాధలపై ప్రేమ :
రెడ్డిగారికి అనాధలపై, వృద్ధులపై, రోగ గ్రస్తులపై, చివరకు జంతువులపై కూడా ప్రేమ ఉండేది. జంతు హింస నివారణ సంఘంలో ముఖ్యులుగా పనిచేశారు. అనాధ బాలికలను ధనవంతులు, నవాబులు ఉంచుకొనుట ఆచారంగా ఆ రోజులలో ఉండేది. నాటి పోలీసు అధికారి ‘సర్ ట్రెంచ్’ గానిని సంప్రదించి “శిశువుల సంరక్షక శాసనము’ను చేయించి అనాధ బాలికలను రక్షించారు.

సికిందరాబాద్ లో రెండు వృద్ధాశ్రమాలుండేవి. వాటికి ద్రవ్యసహాయాన్ని రెడ్డిగారు పలుమార్లు చేశారు. హైదారాబాద్ లో కుష్ఠిరోగుల చికిత్సాలయం ఉండేది. అక్కడి రోగుల పట్ల సేవాభావంతో చాలాసార్లు ఆర్థిక సహాయం చేశారు. అనాధలపై వీరికి ఎంతటి సేవాభావం ఉండేదో అలాగే హరిజనులపై ఉండేది. హిందువుల దురాచారాలలో అస్పృశ్యత ఒకటి. దీనితో పాటుగా మరొక కుసంస్కారం ఉండేది.

TS Inter 1st Year Telugu Study Material Chapter 6 రాజాబహద్దుర్ వేంకట రామారెడ్డి సేవాతత్పరత

హరిజన బాలికలను చిన్నతనంలోనే “మురళీలు”గను, బసివిరాండ్రు”గను తయారుచేసి అగ్రవర్ణాలవారు వారితో వ్యభిచారం చేసేవారు. వారికిక వివాహం అంటూ ఉండేదికాదు. జీవితాంతం వ్యభిచారులుగానే గడపవలసి వచ్చేది. రెడ్డిగారు దీనిని నిరసించి వారిని ఆదుకున్నారు. సర్వజనులకు పరోపకారి, కరుణా సముద్రులు, ప్రజానురంజకులు, రాష్ట్రసేవాపరాయణులుగా ప్రజా సేవచేస్తూ కీర్తి ప్రతిష్టలను పొందారు రామారెడ్డిగారు.

II. సంగ్రహ రూప ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
ధనవంతులు తమ అధికార బలాన్ని దేనికి ఉపయోగించాలి?
జవాబు:
రాజాబహద్దూర్ వెంటకరామారెడ్డి సేవాతత్పరత అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డిచే రచించబడిన “వేంకట రామారెడ్డి జీవిత చరిత్ర” నుండి గ్రహించబడింది.

భారతదేశంలోను, మన రాష్ట్రంలోను అధికారులు, గొప్ప గొప్ప ఉద్యోగులు ఎందరో ఉన్నారు. వారందరూ ధనమును బాగా సంపాదించినవారే! గొప్ప గొప్ప బిరుదులను పొందినవారే! కాని వారిని లోకం గుర్తించలేదు. దానికి కారణం వారిలో సామాజిక సంఘసేవా తత్పరత లేకపోవటమే! ఎంతటి గొప్పవారైనా ఎంతటి ధనికులైనా సంఘ సేవ చేయని ఎడల గుర్తింపు పొందరు.

తాము సంపాదించిన ధనములో ఎంతో కొంత సమాజ శ్రేయస్సుకు వినియోగించాలి. దేశాభివృద్ధికి ప్రజలలో మంచిని ప్రబోధించటానికి తప్పక వినియోగించాలి. అలా చేయనిఎడల గుర్తింపును కోల్పోతారు. రామారెడ్డిగారు ఇతరుల వలే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ పనిచేసినా మంచిపలుకుబడిని ప్రజానురాగాన్ని పొందారు. దానికి కారణం ఆయన తన ధనాన్ని శక్తిని, పలుకుబడిని ప్రజాభ్యుదయానికి ఉపయోగించారు.

కాబట్టి ధనవంతులు అధికారులు తమ అధికారాన్ని ధనాన్ని ఇతరుల కోసం, సమాజాభివృద్ధికి ఉపయోగించాలి.

TS Inter 1st Year Telugu Study Material Chapter 6 రాజాబహద్దుర్ వేంకట రామారెడ్డి సేవాతత్పరత

ప్రశ్న 2.
సురవరం ప్రతాపరెడ్డి ‘సాహితీసేవ’ను వివరించండి?
జవాబు:
‘రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి సేవాతత్పరత’ అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డిచే రచించబడిన “రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి జీవిత చరిత్ర నుండి గ్రహించబడింది.

సురవరం ప్రతాపరెడ్డి మహబూబ్ నగర్ జిల్లా గద్వాల సంస్థాన కేంద్రమైన ‘బోరవెల్లి’ గ్రామంలో మే 28, 1896న జన్మించారు. వీరి స్వస్థలం ‘ఇటిక్యాలపాడు’ తల్లిదండ్రులు రంగమ్మ, నారాయణరెడ్డిలు. వీరు సంస్కృత సాహిత్యంతోపాటు ఎఫ్ఎ, బి.ఏ,బి.ఎల్ చదివారు. తొలుత న్యాయవాదిగా ఉన్నా తరువాత సాహిత్య కారునిగా మారారు.

సురవరం వారు గోల్కొండ పత్రికను స్తాపించారు. 1926 నుండి 20 సం॥ల పాటు ఆయనే సంపాదకత్వం వహించారు. “తెలంగాణలో కవులు పూజ్యుం” అన్న విమర్శకు తుడిచివేసి 354 మంది తెలంగాణ కవుల జీవిత చరిత్రలను రాశారు. గోల్కొండ కవుల చరిత్రను వెలువరించారు. 1931 నుండి 1953 వరకు తెలంగాణ సామాజిక పరిస్థితులు ప్రతిబింబించేలా మొగలాయి కథలను రాశారు.

1948లో “ఆంధ్రుల సాహిత్య చరిత్రను” వెలువరించారు. “ప్రజావాణి” పత్రికను నడిపారు. భక్తతుకారాం. డచ్చల విషాదము” అన్న నాటకాలను రచించారు. హిందువుల పండుగలు హైందవధర్మవీరులు, రామాయణ విశేషాలు వంటి 40 గ్రంథాలను సురవరం వారు రాశారు.

ప్రశ్న 3.
‘గోల్కొండ’ పత్రిక అభివృద్ధికి రాజాబహద్దూర్ ఎలా తోడ్పడ్డారు?
జవాబు:
రాజా బహద్దూర్ వెంకటరామారెడ్డి సేవతత్పరత అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డిచే రచించబడిన రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి జీవిత చరిత్ర నుండి గ్రహించబడింది.

సురవరం ప్రతాపరెడ్డిగారు 1926లో తెలంగాణలో గోల్కోండ పత్రికను స్థాపించారు. అప్పటి వరకు తెలంగాణలో పత్రికలకు పాత్రినిద్యంలేదు. ఆయనే 20స||లపాటు దానికి ప్రధాన సంపాదకులుగా వ్యవహించారు. పత్రికారంగంలో ఒక నూతన ఒరవడిని గోల్కొండ పత్రిక సృష్టించింది. సురవరం వారిలో రాజా బహద్దార్ రామారెడ్డి గారికి అనుబంధం ఏర్పడింది. అది గోల్కోండ పత్రికతో వారిద్దరికి ఉన్న అనుబంధం

గోల్కొండ పత్రిక తొలుత హైదరాబాద్ నుండి వెలువడుటకు కావలసిన ముద్రణా లయము స్థాపించటానికి యంత్రాలకు కావలసిన ధన సహాయం. రూ. 7,300 రాజా బహద్దూర్ వెంకటరామారెడ్డి గారే సమకూర్చారు. గోల్కొండ పత్రిక ఒకటి తెలంగాణా నుండి రావటానికి ప్రధాన కారకుడిగా రాజాబహద్దూర్ గారు నిలిచారు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 6 రాజాబహద్దుర్ వేంకట రామారెడ్డి సేవాతత్పరత

ప్రశ్న 4.
రాజా బహద్దూర్’ హరిజనుల పట్ల దృష్టి తెలుపండి?
జవాబు:
శ్రీ రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి సేవాతత్పరత అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డి గారిచే రచించబడిన ‘రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి’ జీవిత చరిత్ర నుండి గ్రహించబడింది. వీరు తన బలమును, ధనమును, అధికారమును, ప్రజాభ్యుదయానికి వినియోగించారు. మంచి సంఘసంస్కరణాభిలాషి, అనాధలపై వీరికి ఎంతటి అనురాగమో హరిజనులపై కూడా అంతటి ప్రేమాదరణలను కలిగియున్నారు.

హిందూ దురాచారాలలో అగ్రస్థానం వహించిన అస్పృస్యతా నివారణను పెద్దదోషము గా రామారెడ్డిగారు భావించారు. వారిని కూడా హిందూ సోదరులుగా భావించి వారికి సమానత్వాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. హరిజనులలో ఒక దుష్ట సంప్రదాయం ఉండేది. హరిజనులు తమ ఆడపిల్లలను ‘మురళీలుగా’ ‘బసివిరాండ్రుగా’ తయారు చేసేవారు.

బాల్యంలోనే ఇలా తయారుచేయబడిన హరిజన బాలికలు వారి జీవితాతంతం వ్యభిచారులుగా బ్రతుకవలసి వచ్చేది. సమాజంలోని అగ్రవర్ణాలవారు వీరితో వ్యభిచారం చేసేవారు. ఈ దుష్ట సంప్రదాయాన్ని రూపుమాపటానికి రాజాబహద్దూర్ వెంకటరామారెడ్డి గారు తీవ్రమైన కృషి చేశారు. ఈయన సర్వజన ప్రియులై అఖండకీర్తి ప్రతిష్టలనందుకున్నారు.

III. ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
సురవరం ప్రతాపరెడ్డి ఎపుడు జన్మించారు?
జవాబు:
సురవరం ప్రతాపరెడ్డి మే 28. 1896న జన్మించారు.

ప్రశ్న 2.
సురవరం ప్రతాపరెడ్డి రాసిన ఏ గ్రంథం కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం పొందింది.
జవాబు:
1948లో రాసిన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ అనే గ్రంధానికి .

TS Inter 1st Year Telugu Study Material Chapter 6 రాజాబహద్దుర్ వేంకట రామారెడ్డి సేవాతత్పరత

ప్రశ్న 3.
అనాధభాల బాలికల సంరకక్షణ కోసం ఎలాంటి శాసనం వచ్చింది?
జవాబు:
అనాథ బాలబాలికల కోసం “శిశువుల సంరక్షక శాసనము వచ్చింది.

ప్రశ్న 4.
బొంబాయిలో మహిళావిద్యాపీఠాన్ని ఎవరు స్థాపించారు?
జవాబు:
బొంబాయిలో మహిళా విద్యా పీఠాన్ని స్థాపించినవారు ‘కార్వే’ మహాశయుడు.

ప్రశ్న 5.
స్త్రీల క్లబ్ భవన నిర్మాణానికి ఎవరు సాయం చేశారు?
జవాబు:
స్త్రీల క్లబ్ భవన నిర్మాణానికి సాయం చేసింది సర్ బన్సీలాల్గారు 15,000 రూ॥ ఇచ్చారు.

ప్రశ్న 6.
స్వార్థం లేకుండా పరోపకారిణీ బాలికల పాఠశాల నడిపినదెవరు?
జవాబు:
కీ॥శే॥ సీతమ్మగారు.

ప్రశ్న 7.
రాజాబహద్దూర్ కాలంలో వృద్ధాశ్రమాలు ఎక్కడెక్కడా కలవు?
జవాబు:
హైదరాబాద్ లో ఒకటి, సికిందరాబాద్లో ఒకటి కలవు.

ప్రశ్న 8.
‘సర్ంచ్’ ఎవరు.
జవాబు:
‘సంచ్’ ఆ కాలంలో ఉన్న పోలీసు శాఖామంత్రి.

TS Inter 1st Year Telugu Study Material Chapter 6 రాజాబహద్దుర్ వేంకట రామారెడ్డి సేవాతత్పరత

రాజాబహద్దుర్ వేంకట రామారెడ్డి సేవాతత్పరత Summary in Telugu

రచయిత పరిచయం

రచయిత : సురవరం ప్రతాపరెడ్డి

పుట్టిన తేదీ : మే 28, 1896

పుట్టిన ఊరు : మహబూబ్ నగర్ జిల్లా, గద్వాల సంస్థానంలోని బోరవెల్లి గ్రామం ఇటిక్యాలపాడు స్వగ్రామం

తల్లిదండ్రులు : రంగమ్మ, నారాయణరెడ్డి

విద్యాభ్యాసం : సంస్కృత సాహిత్య వ్యాకరణాలతో పాటు ఎఫ్. ఎ. బి.ఎ. బి.ఎల్

వృత్తి : కొంతకాలం న్యాయవాది, సంపాదకుడు, సాహిత్య కారుడు, సామాజిక కార్యకర్త

రచనలు :

  1. ‘గోల్కొండ పత్రిక’
  2. గోల్కొండ కవుల సంచిక 354 మందితో
  3. మొగలాయి కథలు
  4. ఆంధ్రుల సాంఘిక చరిత్ర
  5. భక్తతుకారం నాటిక
  6. డచ్చల విషాదము నాటిక
  7. హిందూ పండుగలు
  8. హైందవధర్మ వీరులు
  9. రామాయణ విశేషాలు
    మొత్తం 40 గ్రంథాలను రచించారు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 6 రాజాబహద్దుర్ వేంకట రామారెడ్డి సేవాతత్పరత

మరణం : ఆగస్టు 25 1953

కవి పరిచయం

తెలంగాణ, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. ఈయన మే 28, 1896లో మహబూబ్ నగర్ జిల్లా గద్వాల సంస్థానానికి కేంద్రమైన బోరవెల్లి గ్రామంలో జన్మించారు. వీరి స్వగ్రామం. ఇటిక్యాలపాటు. వీరి తల్లిదండ్రులు రంగమ్మ, నారాయణరెడ్డిలు.

సంస్కృత వ్యాకరణంతోపాటు ఎఫ్.ఎ., బి.ఏ.బి.ఎల్ చదివారు. తొలుత న్యాయవాది గా తరువాత పత్రికా సంపాదకుడిగా, సామాజిక కార్యకర్తగా సాహిత్య కారునిగా మారాడు. తెలుగుభాష, తెలంగాణ భారతీయ సంస్కృత జీవనంపై పరిశోధనాత్మక వ్యాసాలు రాశారు.

1926లో తెలంగాణలో పత్రికలకు ప్రాతినిధ్యం లేని కాలంలో గోల్కొండ పత్రికను స్థాపించారు. ఆ పత్రికకు 20 సం॥ల కాలం సంపాదకునిగా పనిచేశారు. తన అమూల్యమైన సంపాదకీయాలతో సృజనాత్మక రచనలతో సామాజిక చైతన్యాన్ని పెంపొందించారు. ‘తెలంగాణలో కవులు పూజ్యం’ అన్న విమర్శకు జవాబుగా 1935లో 354 మంది తెలంగాణ కవులను పరిచయం చేస్తూ “గోల్కొండ కవుల సంచికను వెలువరించాడు.

1931, 1953 వరకు జరిగిన సామాజిక పరిస్థితులు ప్రతి బింబించేలా మొగలాయికథలను రచించారు. 1948లో సురవరంవారు రాసిన “ఆంధ్రుల సాంఘిక చరిత” పరిశోధన గ్రంథానికి 1955లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి గ్రంథమిది.

ఆంధ్ర విద్యాలయం, ఆంధ్రసారస్వత పరిషత్ వంటి సంస్థల స్థాపనకు విశేషకృషి చేశారు. ఆంధ్రమహాసభకు తొలి అధ్యక్షుడు సురవరం. శాసనసభ్యునిగా పనిచేశారు. “ప్రజావాణి”. పత్రికను కూడా నడిపారు. గ్రంథాలయం ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ప్రజల చైతన్యానికి దోహపదపడ్డారు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 6 రాజాబహద్దుర్ వేంకట రామారెడ్డి సేవాతత్పరత

భక్త తుకారం, డచ్చల విషాదము అన్న నాటకాలు. హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, రామాయణ విశేషాలు మొదలైన 40 గ్రంథాలు రచించారు. తెలుగు సామాజిక సాహిత్య రంగాలలో విశేషమైన కృషి చేసిన సురవరం ఆగస్టు 25, 1953న కన్నుమూశారు.

పాఠ్యభాగ సందర్భం

రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి తెలంగాణ ప్రాంతంలో మంచి పలుకుబడి గలవారు. ఆయన సంఘసేవాతత్పరులు. వీరు తమ శక్తియులతో మంచి ఉద్యోగము ను సంపాదించి రాష్ట్రంలోని అన్ని జిల్లాలో పనిచేశారు. పలు భాషలతో పరిచయం ఉన్నవారు. ప్రజాభ్యుదయం కోసం తన ధనమును శక్తిని, బలమును, పలుకుబడిని వినియోగించారు. వీరి ప్రజాసేవలో రెడ్డి విద్యార్థులకు వసతి గృహం నిర్మించటం ముఖ్యమైనది.

20వ శతాబ్దానికి పూర్వం హైదరాబాదు నగరంలో ఒకే హిందూ హెూటలుండేది. ఎంతో మంది ధనుకులుండి కూడా రెడ్డి విద్యార్థులకు విద్యాసౌకర్యం చేయలేక పోయారని బాధపడ్డారు. ఈ విషయంపై ఒక కార్యక్రమంలో ప్రస్తావించగా “ఎవరైనా బాధ్యత తీసుకున్న ఎడల సహాయం చేస్తామన్నారు. వెంకటరామారెడ్డి ఆ బాధ్యతను తీసుకున్నారు. హైదరాబాద్లో రెడ్డి హాస్టల్ స్థాపించబడింది.

బాలికల ఉన్నత పాఠశాల :
హైదరాబాద్ లో బాలికలు చదువుటకు తెలుగు బోధన పాఠశాల లేకపోయింది. ఉన్నత పాఠశాలల్లో, ఉర్దూ, ఇంగ్లీషు బోధించేవారు. మాడపాటి హనుమంతరావు వంటివారు పూనుకుని మాతృభాషలో బాలికల పాఠశాలను స్థాపించారు. దీనికి వెంకటరమారెడ్డి అధ్యక్షులుగా వ్యవహరించారు. బొంబాయి రాజధానిలోని పూనా నగరంలో “కార్వే” మహాశయులు నిర్మించిన మహిళా విద్యాపీఠానికి అనుబంధంగా ఉండి బి.ఏ డిగ్రీ చదువు అవకాశాన్ని బాలికలకు ప్రసాదించేలా అభివృద్ధిచేశారు. తరువాత హైదరాబాద్లోనే పరోపకారిణీ పాఠశాలను స్థాపించారు. దీని అధ్యక్షులు కూడా రెడ్డిగారే!

స్త్రీల క్లబ్ (కాస్మాపాలిటన్ క్లబ్):
హైదరాబాద్ నగరంలోని బొగ్గుల కుంటలో మహిళా సంఘం పేరున ఒక క్లబ్ నిర్మాణం చేశారు.

బాలికా పాఠశాల :
హైదరాబాద్ నగరంలో గొల్లఖిడ్కిలో ఆంధ్రబాలికా ప్రాథమిక పాఠశాలను కొందరు ప్రజాసేవకులు స్థాపించారు. దీని అధ్యక్షులు రెడ్డిగారే!

TS Inter 1st Year Telugu Study Material Chapter 6 రాజాబహద్దుర్ వేంకట రామారెడ్డి సేవాతత్పరత

పరోపకారిణీ పాఠశాల :
సికిందరాబాదు నగరంలో కీ.శే. సీతమ్మగారు బాలికా మాధ్యమిక పాఠశాలను నడిపేవారు. దీనికి రెడ్డిగారు చాలసాయం చేశారు.

ఆంధ్ర విద్యాలయము :
హైదరాబాదు నగరంలో తెలుగు పిల్లలకు మాతృభాషలో బోధించుటకు ఒక మాధ్యమిక పాఠశాలను నిర్మించాలనుకున్నారు. 1931న ‘దేవరకొండ’ సభలో తీర్మాన చేసినా 1944లోకి గాని అది స్థాపించబడలేదు.

గోల్కోండ పత్రిక :
గోల్కొండ పత్రిక సురవరం వారిపై రామారెడ్డికి ప్రత్యేక అభిమానం. సురవరం వారికి ముద్రణాయంత్ర నిర్మాణంకొరకు 3,500 రూ. సహాయంగా అందించారు.

సంఘ సంస్కారం :
రామారెడ్డిగారు గొప్ప సంఘ సంక్కర్త కీ॥శే॥ పండిత కేశవరావు బాల్య వివాహములు తప్పని, వితంతు వివాహాలు జరుపాలని రెండు చిత్తూ శాసనాలను చేస్తే వాటికి మద్దతు ఇచ్చినవారు రామారెడ్డి – రెడ్డి హాస్టల్లోని ఒక విద్యార్థి వితంతు వివాహం చేసుకుంటే అతనిని ప్రోత్సహించారు. రామారెడ్డిగారికి కుల, బేధ పట్టింపులు లేవు. అందరితో కలసి ఉండేవారు.

అనాథలపై ప్రేమ :
రాజాబహద్దూర్ రామారెడ్డిగారికి అనాథలపై మిక్కిలి ప్రేమ ఉ ౦డేది. బాలికలను, వృద్ధులను, రోగపీడితులను చివరకు జంతువులపై కూడా ప్రేమ ఎక్కువే! జంతు హింసా నివారణ సంఘంలో ప్రముఖంగా సేవచేశారు. అనాధశిశువులకు పెంపుడు పిల్లలకు విశేష సేవలందించారు.

సంచ్ ఆకాలంలో పోలీసు శాఖా మంత్రిగా ఉ ండేవారు. వారితో చెప్పి “శిశు సంరక్షక శాసనాన్ని చేయించి అనాథలను బానిస బతుకుల ‘నుండి బయటపడవేశారు. అప్పటికి హైదరాబాద్లో రెండు వృద్ధాశ్రమాలుండేవి. కుష్ఠు రోగులకు చికిత్సాలయాన్ని ‘డిచ్పల్లిలో’ స్థాపించి సేవలందించారు.

అస్పృశ్యతా నివారణపై వెంకటరామారెడ్డిగారు ప్రత్యేక శ్రద్ధ చూపించారు. హరిజన ‘బాలికలను ‘ఆరోజులలో చిన్న వయసులోనే “మురళీలు, బసివిరాండ్రుగా మార్చేవారు. వారు జీవితాంతం వ్యభిచారిణులుగా ఉండవలసి వచ్చేది. ఈ పద్ధతికి స్వస్తి చెప్పి ఆ కళంకాన్ని తుడిచి వేయటానికి వెంకటరామిరెడ్డి కృషిచేశారు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 6 రాజాబహద్దుర్ వేంకట రామారెడ్డి సేవాతత్పరత

రాజాబహద్దూర్ రామారెడ్డి సర్వజన ప్రియులు, పరోపకారులు, కరుణాసముద్రులు, ప్రజారంజకులు. సేవా పరత్వంతో అఖండకీర్తిని గడించారు.

కఠిన పదాలకు అర్థాలు

ద్రవ్యము = ధనము
విస్మృతులు = గుర్తింపు లేనివారు
సర్వదా = ఎప్పుడు
బాడుగ = ಅದ್ದ
ప్రముఖులు = ముఖ్యమైనవారు
ద్రవ్యసహాయ = ధన సహాయం
వితంతు ద్వహములు = భర్తచనిపోయిన స్త్రీలకు తిరిగి వివాహం జరిపించుట
కళంకము = మరక

TS Inter 1st Year Economics Study Material Chapter 5 మార్కెట్ విశ్లేషణ

Telangana TSBIE TS Inter 1st Year Economics Study Material 5th Lesson మార్కెట్ విశ్లేషణ Textbook Questions and Answers.

TS Inter 1st Year Economics Study Material 5th Lesson మార్కెట్ విశ్లేషణ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
మార్కెట్ల వర్గీకరణను విశదీకరించండి.
జవాబు.
వాడుక భాషలో మార్కెట్ అంటే వస్తువుల అమ్మకాలు, కొనుగోళ్ళు జరిపే ఒక ప్రత్యేక స్థలం. మూడు అంశాల ఆధారంగా మార్కెట్ వర్గీకరణ జరుగుతుంది.

  1. కాలానుసారం మార్కెట్లు లేదా కాలవ్యవధి మార్కెట్లు
  2. స్థలానుసారం మార్కెట్లు
  3. పోటీ ఆధార మార్కెట్లుదీనిని ఈ క్రింది పట్టిక ద్వారా చూపించవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 5th Lesson మార్కెట్ విశ్లేషణ 1

I. కాలానుసారం మార్కెట్లు : కాలవ్యవధి ఆధారంగా మార్కెట్లు మూడు రకాలుగా విభజించవచ్చు.

1. అతిస్వల్పకాలం :
ఉత్పత్తిదారుడు అతిస్వల్పకాలంలో ఉత్పత్తిలో ఎలాంటి మార్పుచేయలేదు. సప్లయ్ మార్పులు తేవడానికి ఉత్పాదకాలను మార్చవలసి ఉంటుంది. ఉత్పాదకాలను అతిస్వల్పకాలంలో మార్చడం సాధ్యం కాదు. అందువల్ల సప్లయ్ స్థిరంగా ఉంటుంది.
ఉదా : నశ్వర వస్తువులయిన పూలు, పాలు మొదలగునవి.

2. స్వల్పకాలం :
స్వల్ప కాలంలో సప్లయ్ని కొంతమేరకు మార్చవచ్చు. కొన్ని ఉత్పాదకాలను మార్చడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. చర ఉత్పాదకాలను మార్చడం వల్ల ఇది సాధ్యం.

3. దీర్ఘకాలం :
మార్కెట్లో వస్తువులుండే డిమాండ్ను బట్టి ఉత్పత్తిదారుడు దీర్ఘకాలంలో అన్ని ఉత్పాదకాల్లో మార్పులు చేస్తాడు. దీర్ఘకాలంలో సప్లయ్లో కావలసిన మార్పులు చేయవచ్చు.

మార్కెట్ల వర్గీకరణను విశదీకరించండి.

II. స్థలానుసారం మార్కెట్లు : స్థలాన్ని బట్టి స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లుగా వర్గీకరించబడ్డాయి.

1. స్థానిక మార్కెట్ :
ఒక వస్తువు అమ్మకాలు అది ఉత్పత్తి అయిన ప్రాంతంలోనే జరిగితే దానిని స్థానిక మార్కెట్ అంటారు..
ఉదా : కూరగాయలు, పండ్లు మొదలగునవి.

2. జాతీయ మార్కెట్లు :
ఒక వస్తువుకు దేశంలోని వివిధ ప్రాంతాలలో డిమాండ్ సప్లయి ఉన్నట్లయితే ఆ వస్తువుకు జాతీయ మార్కెట్ ఉన్నట్లుగా చెప్పవచ్చు.
ఉదా : గోధుమ, పంచదార, పత్తి మొదలగునవి.

3. అంతర్జాతీయ మార్కెట్లు :
ఒక వస్తువును ఇతర దేశాల్లో అమ్మకాలు, కొనుగోళ్ళు జరిపినట్లయితే ఆ వస్తువుకు అంతర్జాతీయ మార్కెట్ ఉంటుంది.
ఉదా : బంగారం, వెండి, పెట్రోలు మొదలగునవి.

III. పోటీని బట్టి మార్కెట్లు : పోటీని బట్టి మార్కెట్లు రెండు రకాలు

  1. సంపూర్ణ పోటీ మార్కెట్
  2. అసంపూర్ణ పోటీ మార్కెట్.

1. సంపూర్ణ పోటీ మార్కెట్ :
అధిక సంఖ్యలో కొనుగోలుదార్లు, అమ్మకందార్లు ఉండేదే సంపూర్ణ పోటీ మార్కెట్. కృత్రిమ అడ్డంకులు లేకుండా అందరు సజాతీయ వస్తువునే కొనడం, అమ్మడం జరుగుతుంది.

2. అసంపూర్ణ పోటీ మార్కెట్:
కొనుగోలుదార్ల మధ్యకాని, అమ్మకందార్ల మధ్యకాని సంపూర్ణ పోటీ లేనటువంటి దానిని అసంపూర్ణ పోటీ మార్కెట్ అంటారు. అందువల్ల వస్తువుకు వేరువేరు ధరలు ఉంటాయి. ఈ అసంపూర్ణ పోటీ మార్కెట్లు నాలుగు రకాలు.

  1. ఏకస్వామ్యం
  2. ద్విస్వామ్యం
  3. పరిమితస్వామ్యం
  4. ఏకస్వామ్య పోటీ మార్కెట్.

TS Board Inter First Year Economics Study Material Chapter 5 మార్కెట్ విశ్లేషణ

ప్రశ్న 2.
సంపూర్ణ పోటీ లక్షణాలు ఏవి ?
జవాబు.
అత్యధిక సంఖ్యలో ఉత్పత్తిదార్లు, వినియోగదార్లుండే మార్కెట్ను సంపూర్ణ పోటీ మార్కెట్ అంటారు. మార్కెట్ అంతట ఒకే ధర ఉంటుంది.

1. అధిక సంఖ్యలో కొనుగోలుదార్లు, అమ్మకందార్లు:
ఈ మార్కెట్లో అధిక సంఖ్యలో కొనుగోలుదార్లు, అమ్మకందార్లు ఉంటారు. ఏ ఒక్క అమ్మకందారుడు కాని, కొనుగోలుదారుడు కాని మార్కెట్ ధరను ప్రభావితం చేయలేడు. ఒక వస్తువు ధర దానికుండే డిమాండ్, సప్లయ్లు నిర్ణయిస్తాయి. ఈ ధరను కొనుగోలుదారుడు, అమ్మకందారుడు అంగీకరించాలి. సంస్థ మార్కెట్ ధరను అనుసరించాలి.

2. సజాతీయ వస్తువులు :
ఈ మార్కెట్లో వస్తువులన్నీ సజాతీయంగా ఉంటాయి. ఈ వస్తువులకుండే జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం సంపూర్ణం. అందువల్ల మార్కెట్ అంతటా ఒకే ధర ఉంటుంది.

3. ప్రవేశించడానికి, నిష్క్రమించడానికి స్వేచ్ఛ:
ఈ మార్కెట్లో నూతన పరిశ్రమలు ప్రవేశించడానికి, నిష్క్రమించడానికి స్వేచ్ఛ ఉంటుంది. సంస్థ గరిష్ట లాభాలు పొందుతున్నప్పుడు నూతన సంస్థలు ప్రవేశించుటకు, నష్టాలు వచ్చేటప్పుడు నిష్క్రమించుటకు స్వేచ్ఛ కలదు.

4. సంస్థ, పరిశ్రమ వేరువేరు :
ఈ మార్కెట్లో సంస్థ, పరిశ్రమ వేరువేరుగా ఉంటాయి. సంస్థ అంటే వస్తువులను ఉత్పత్తి చేసే యూనిట్. పరిశ్రమ అనగా సంస్థల సముదాయం.

5. రవాణా ఖర్చులు ఉండవు :
రవాణా ఖర్చు ఉండనందువల్ల మార్కెట్ అంతటా వస్తువుకు ఒకే ధర ఉంటుంది.

6. ఉత్పత్తి కారకాలకు, వస్తువులకు సంపూర్ణ గమనశీలత :
ఈ మార్కెట్లో ఉత్పత్తి కారకాలు ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు వెళ్ళవచ్చు. అదే విధంగా వస్తు మార్కెట్లో పూర్తి గమనశీలత ఉంటుంది.

7. మార్కెట్ సంపూర్ణ పరిజ్ఞానం:
ఈ మార్కెట్లో మార్కెట్ను గురించి సంపూర్ణ పరిజ్ఞానం కొనుగోలుదార్లకు, అమ్మకందార్లకు ఉంటుంది. ప్రతి కొనుగోలుదారుకు, అమ్మకందారుకు ధర తెలుస్తుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 5 మార్కెట్ విశ్లేషణ

ప్రశ్న 3.
సంపూర్ణ పోటీ అర్థాన్ని వివరించండి. సంపూర్ణ పోటీ మార్కెట్లో ధర నిర్ణయ విధానాన్ని చిత్రీకరించండి.
జవాబు.
సంపూర్ణ పోటీ మార్కెట్ వ్యవస్థలో వైయక్తిక సంస్థల మధ్య ప్రతిస్పర్థ ఉండదు. నిత్యం వాడుకలో ఉన్న అర్థానికి భిన్నంగా ఆర్థిక సిద్ధాంతంలో సంపూర్ణ పోటీ పదాన్ని వాడుతున్నాం. వర్తకులు ‘పోటీ’, ‘ప్రతిస్పర్థ’ అనే పదాలను పర్యాయ పదాలుగా ఉపయోగిస్తారు.

సిద్ధాంతరీత్యా సంపూర్ణపోటీలో సంస్థల మధ్య ప్రతిస్పర్ధ ఉండదు. సజాతీయ వస్తువులను తయారుచేసే సంస్థలు అధికసంఖ్యలో ఉండి, పరిశ్రమలోనికి సంస్థలు ప్రవేశించడానికి, పరిశ్రమ నుంచి నిష్క్రమించడానికి స్వేచ్ఛ, కొనుగోలుదారునికి సంపూర్ణ పరిజ్ఞానం, ఉత్పత్తికారకాలకు పూర్తి గమనశీలత, రవాణా వ్యయాలు లేకుండటం అనే లక్షణాలుంటే దానిని సంపూర్ణ పోటీ మార్కెట్ అంటారు.

ధర నిర్ణయం :
మార్కెట్లో సప్లయ్, డిమాండ్ ను బట్టి వస్తువు ధరను నిర్ణయిస్తారు. మార్కెట్లోనికి అమ్మకానికి వచ్చే వస్తువులకు, కొనుగోలుదార్లు డిమాండ్ చేసే వస్తువులకు మధ్య సమతౌల్యాన్ని తెస్తుంది. సప్లయ్, డిమాండ్ సమానంగా ఉన్నచోట మార్కెట్ సమతౌల్య ధరను నిర్ణయిస్తుంది. మార్కెట్ నిర్ణయించిన ధరను ఉత్పత్తిదారులు అనుసరిస్తారు.

ధరడిమాండ్ పరిమాణంసప్లయ్ పరిమాణం
11050
22040
33030
44020
55010

పై పట్టికలో ధరలో మార్పులు జరిగినప్పుడు వస్తువు సప్లయ్, డిమాండ్లో కూడా మార్పులు జరిగాయి. వస్తువు ధర పెరిగినప్పుడు డిమాండ్ పరిమాణం తగ్గింది. అంటే ధరకు, డిమాండ్కు విలోమ సంబంధం ఉంది. అయితే ధర పెరిగితే సప్లయ్ పరిమాణం పెరిగింది. అనగా సప్లయ్కి, ధరకు ప్రత్యక్ష సంబంధం ఉంది. ₹ 3/- వద్ద సప్లయ్ డిమాండ్ సమానం అయినాయి. దీనిని సమతౌల్య ధర అంటారు. దీనిని ఈ క్రింది రేఖాపటం ద్వారా తెలియజేయవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 5th Lesson మార్కెట్ విశ్లేషణ 2

పై రేఖాపటంలో DD డిమాండ్ రేఖ, SS సప్లయేఖలు. ఈ రెండు ‘e’ బిందువు ఖండించుకున్నప్పుడు ధర OP గా, సప్లయ్, డిమాండ్ 0Q గా ఉన్నాయి. అందువల్ల OP సమతౌల్యపు ధర.

TS Board Inter First Year Economics Study Material Chapter 5 మార్కెట్ విశ్లేషణ

ప్రశ్న 4.
సంపూర్ణ పోటీలో సంస్థ సమతౌల్యాన్ని వివరించండి.
జవాబు.
సంస్థ సమతౌల్యం :
సంపూర్ణ పోటీలో వస్తువు ధరను మార్కెట్ను నిర్ణయిస్తుంది. ఉత్పత్తిదారుడు ఈ ధరను స్వీకరించి తన ఉత్పత్తిని నిర్ణయించుకుంటాడు. ఒక సంస్థ అధిక లాభాలను పొందాలనుకుంటుంది. కాబట్టి ఎక్కువ లాభాలనిచ్చే ఉత్పత్తిని ఎంపిక చేస్తుంది. అధిక లాభాలనిచ్చే ఉత్పత్తిని చేసినప్పుడు సంస్థ సమతౌల్య స్థితిలో ఉంటుంది.

సమతౌల్య ఉత్పత్తి చేసే సంస్థ తన ఉత్పత్తిని మార్చుకోవడానికి ఇష్టపడడు. ఈ స్థితి నుంచి ఉత్పత్తిని పెంచుకోవడానికి, తగ్గించడానికి ఇష్టపడదు. సంస్థ సమతౌల్య స్థితిని రెండు కాలాల్లో వివరిస్తారు. అవి

  1. స్వల్పకాలం
  2. దీర్ఘకాలం.

1. స్వల్పకాల సమతౌల్యం :
స్వల్పకాలంలో సంస్థ స్థిర ఉత్పత్తి కారకాలు అంటే యంత్రాలు, భవనాలు మొదలగునవి మార్చలేదు. చరకారకాలు మాత్రమే మార్చి ఉత్పత్తిని పెంచుకుంటుంది. స్వల్పకాలంలో ఉపాంత వ్యయం, ఉపాంత రాబడికి సమానమైనప్పుడు స్వల్పకాలిక సమతౌల్య ఉత్పత్తి జరుగుతుంది. స్వల్పకాలంలో సంస్థ గరిష్ట లాభాన్ని లేదా సాధారణ లాభాన్ని లేదా నష్టాన్ని పొందుతుంది. దీనిని ఈ క్రింది రేఖాపటాల ద్వారా తెలియజేయవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 5th Lesson మార్కెట్ విశ్లేషణ 3

A రేఖాపటంలో ‘OX’ అక్షంమీద ఉత్పత్తి పరిమాణంను, ‘OY’ అక్షం మీద ధరను చూపినాము.

B రేఖాపటంలో OX అక్షంపై ఉత్పత్తి పరిమాణాన్ని, OY పై వ్యయం, రాబడిని కొలుస్తాం. A రేఖాపటంలో ‘E’ బిందువు వద్ద డిమాండ్, సప్లయ్ సమానమయినాయి. అందువల్ల పరిశ్రమలో OP సమతౌల్యపు ధర నిర్ణయించబడుతుంది. ఇదే ధరను సంస్థ అంగీకరిస్తుంది. దీనికి సమతౌల్య ధర నిర్ణయించబడుతుంది. ఇదే ధరను సంస్థ అంగీకరిస్తుంది. దీనిని సంస్థలో క్షితిజరేఖ ద్వారా చూపించడం జరిగింది. దీనినే ‘ధర రేఖ’ అంటారు.

సంస్థలో ఉపాంత వ్యయం = ఉపాంత రాబడి అయినప్పుడు ఉండే ఉత్పత్తి వల్ల లాభాలు గరిష్టంగా ఉంటాయి. రేఖాపటంలో 0Q ఉత్పత్తి దగ్గర లాభాలు గరిష్టంగా ఉంటాయి. సమతౌల్య బిందువు ‘E’ దగ్గర ధర P; సగటు వ్యయం QB సగటు లాభం BA.

∴ మొత్తం లాభం PABC కి సమానం. అనగా OQ వస్తుపరిమాణంను ఉత్పత్తి చేయటానికి అయిన వ్యయం OCBQ; రాబడి OPAQ.

2. దీర్ఘకాలిక సమతౌల్యం :
దీర్ఘకాలంలో సంస్థ ఉత్పాదకాలు అన్నింటికి మార్చడం ద్వారా ఉత్పత్తిలో మార్పులు చేస్తుంది. సంస్థ దీర్ఘకాలంలో కూడా ఉపాంత వ్యయం, ఉపాంత రాబడికి సమానమైనచోట సమతౌల్యం ఉత్పత్తి చేస్తుంది. దీర్ఘకాలంలో ఒక ముఖ్యమైన అంశం సంస్థల ప్రవేశం, నిష్క్రమణ ఈ కాలంలో జరుగుతుంది. ఈ  కారణం వల్ల ప్రతి సంస్థ దీర్ఘకాలంలో సాధారణ లాభాలు మాత్రమే పొందుతుంది. దీర్ఘకాలిక సమతౌల్యాన్ని ఈ ప్రక్క రేఖాపటం ద్వారా వివరించవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 5th Lesson మార్కెట్ విశ్లేషణ 4

పై రేఖాపటంలో ‘OX’ అక్షంపై వస్తుపరిమాణాన్ని, ‘OY’ అక్షంపై ధర వ్యయం, రాబడులను కొలుస్తాము. పై రేఖాపటంలో ‘E’ బిందువు వద్ద AR = MR = LMC LAC గా ఉంది. అప్పుడు ధర OP గా, పరిమాణం 0Q గా ఉండును.

TS Board Inter First Year Economics Study Material Chapter 5 మార్కెట్ విశ్లేషణ

ప్రశ్న 5.
ఏకస్వామ్యం అంటే ఏమిటి ? ఏకస్వామ్యంలో ధర ఏ విధంగా నిర్ణయించబడుతుందో వివరించండి.
జవాబు.
అసంపూర్ణ పోటీ మార్కెట్లో ఏకస్వామ్యం ఒకటి. దీనినే గుత్తాధిపత్యం అంటారు. ఒక వస్తువుకు ఒకే అమ్మకం దారుడుండి, ఆ వస్తువుకు సన్నిహిత ప్రత్యామ్నాయాలు లేని మార్కెట్ను ఏకస్వామ్య మార్కెట్ అంటారు. కనుక ఏకస్వామ్యదారుడు వస్తువు సప్లైని, వస్తువు ధరను నియంత్రించగలడు.

కాని రెండింటినీ ఒకే సమయంలో నియంత్రించలేడు. ఉత్పత్తిని నియంత్రిస్తే మార్కెట్ ధరను స్వీకరిస్తాడు. మార్కెట్ ధరను నిర్ణయిస్తే ఉత్పత్తిని మార్కెటు వదిలివేస్తాడు.

లక్షణాలు :

  1. మార్కెట్లో ఒక సంస్థ మాత్రమే వస్తూత్పత్తిని చేస్తుంది.
  2. ఈ మార్కెట్లో వస్తువులకు సమీప ప్రత్యామ్నాయాలుండవు.
  3. ఈ మార్కెట్లో సంస్థ, పరిశ్రమ ఒక్కటే.
  4. మార్కెట్లోనికి నూతన సంస్థలు ప్రవేశించడానికి వీలులేని నిబంధనలుంటాయి.
  5. ఏకస్వామ్యదారుడే వస్తుధరను, వస్తు సప్లయ్న నియంత్రిస్తాడు.

ధర నిర్ణయం :
గరిష్ట లాభాలను ఆర్జించటం ఏకస్వామ్య సంస్థ ధ్యేయం. ఏకస్వామ్యంలో ఉత్పత్తిదారుడు వస్తూత్పత్తిని తగ్గిస్తూ ధరను పెంచగలడు. వస్తూత్పత్తిని పెంచుతూ ధరను తగ్గించగలడు. ఈ విధమైన ధర నిర్ణయం వల్ల ఏకస్వామ్యదారుడు గరిష్ట లాభాలను ఆర్జిస్తాడు.

ఏకస్వామ్యంలో కూడా ఉపాంత వ్యయం, ఉపాంత రాబడికి సమానమైన పరిస్థితిలో ఏకస్వామ్య సంస్థ సమతౌల్యంలో ఉంటుంది. ఏకస్వామ్యంలో ధర నిర్ణయాలు క్రింది రేఖాపటం ద్వారా తెలుసుకోవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 5th Lesson మార్కెట్ విశ్లేషణ 5

పై రేఖాపటంలో ‘X’ అక్షంపై ఉత్పత్తి పరిమాణంను, Y అక్షంపై వ్యయం రాబడిని చూపాము. AR సగటు రాబడి రేఖ, MR ఉపాంత రాబడిరేఖ, AC సగటు వ్యయరేఖ, MC ఉపాంత వ్యయరేఖ. MR రేఖ MC ని ‘E’ బిందువు వద్ద ఖండించడం వల్ల, MC MR అవుతుంది. కనుక OM ఉత్పత్తి వద్ద సంస్థ సమతౌల్యంలో ఉంది.

E నుండి గీయబడిన రేఖ ‘X’ అక్షంపైన ఉత్పత్తి పరిమాణంను, AR రేఖపై వస్తువు ధరను తెలియజేయును. AR, ACల మధ్య తేడా సంస్థ లాభనష్టాలను సూచించును. AC కంటే AR ఎక్కువగా ఉంటే అసాధారణ లాభాలు వచ్చును. పై రేఖాపటంలో OM వస్తురాశిని ఉత్పత్తి చేయడానికి అయ్యే వ్యయం OCBM వచ్చే ఆదాయం OPAM.

మొత్తం లాభం = మొత్తం రాబడి – మొత్తం వ్యయం
= OCBM – OPAM = CPAB
∴ CPAB పై రేఖాపటంలో సంస్థ ఆర్జించే లాభాలు.

TS Board Inter First Year Economics Study Material Chapter 5 మార్కెట్ విశ్లేషణ

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
కాలాన్నిబట్టి మార్కెట్ వర్గీకరణపై ఒక వ్యాఖ్యను రాయండి.
జవాబు.
సాధారణంగా వస్తుసేవల అమ్మకాలు, కొనుగోళ్ళు జరిగే ప్రదేశాన్ని మార్కెట్గా పరిగణిస్తాం. ఆధునిక కాలంలో మార్కెట్ భావనలో గొప్ప మార్పులు ఏర్పడ్డాయి. మార్కెట్ అనే పదాన్ని కూరగాయల మార్కెట్, పండ్ల మార్కెట్, బంగారం, వెండి మార్కెట్, షేర్ మార్కెట్ మొదలైనవాటిని తెలియజేయడానికి ఉపయోగిస్తారు.

ఆధునిక కాలంలో ఒక “వ్యక్తి ఒక వస్తువును కొనడానికి, అమ్మడానికి మార్కెట్కు వెళ్ళవలసిన అవసరం లేదు. ప్రస్తుతం వస్తు సేవల అమ్మకాలు, కొనుగోళ్ళు మార్కెట్కు వెళ్ళకుండానే సమాచార సౌకర్యాల ద్వారా జరపవచ్చు.

ప్రజలు టెలిఫోన్, మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ (అంతర్జాలం) సదుపాయాల ద్వారా దూర ప్రాంతాల నుండి వస్తు సేవల కొనుగోళ్ళు, అమ్మకాలు జరపడాన్ని మనం గమనించవచ్చు. అమ్మకందార్లకు, కొనుగోలుదార్లను ఒక దగ్గరికి చేర్చే యంత్రాంగమే మార్కెట్ అని ఎడ్వర్డ్స్ (Edwards) నిర్వచించాడు.

కాలానుసార మార్కెట్లు (Time Based Markets) :
కాలానుసారం వస్తు సప్లయ్ లో సర్దుబాట్లు జరుగుతాయి. కాలవ్యవధి ఆధారంగా మార్కెట్లు మూడు రకాలుగా ఉంటాయి. అవి : అతిస్వల్పకాలిక మార్కెట్, స్వల్పకాలిక మార్కెట్, దీర్ఘకాలిక మార్కెట్.

a) మార్కెట్ కాలం లేదా అతిస్వల్ప కాలం (Market Period or Very Short Period) :
ఉత్పత్తిదారుడు అతిస్వల్ప కాలంలో ఉత్పత్తిలో ఎలాంటి మార్పు చేయలేడు. అందువల్ల సప్లయ్ స్థిరంగా ఉంటుంది. ఉత్పాదకాలను మార్చడం వల్ల సప్లయ్లో మార్పులు తీసుకురావచ్చు. ఉత్పాదకాలను అతిస్వల్ప కాలంలో మార్చలేం. నశ్వర వస్తువులకు (perishable goods) ఈ మార్కెట్ వర్తిస్తుంది.

b) స్వల్పకాలం (Short Period) :
స్వల్పకాలంలో సప్లయ్ను కొంతవరకు మార్చవచ్చు. కొన్ని ఉత్పాదకాలను మార్చడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. శ్రమలాంటి చర ఉత్పాదకాలను మార్చడం వల్ల ఇది సాధ్యం.

c) దీర్ఘకాలం (Long Period) :
పెరిగే డిమాండు తీర్చడానికి తగినట్లుగా దీర్ఘకాలంలో సప్లయ్లో మార్పు చేయవచ్చు. దీర్ఘకాలంలో వస్తువుకుండే డిమాండ్ ఆధారంగా ఉత్పత్తిదారుడు అన్ని ఉత్పాదకాల్లో మార్పులు చేస్తాడు. దీర్ఘ కాలంలో సప్లయ్లో కావాల్సిన సర్దుబాట్లు చేయవచ్చు.

TS Board Inter First Year Economics Study Material Chapter 5 మార్కెట్ విశ్లేషణ

ప్రశ్న 2.
సంపూర్ణ పోటీలో స్వల్పకాలంలో సంస్థ సమతౌల్యాన్ని వివరించండి.
జవాబు.
సంస్థ సమతౌల్యం :
సంపూర్ణ పోటీలో వస్తువు ధరను మార్కెట్ను నిర్ణయిస్తుంది. ఉత్పత్తిదారుడు ఈ ధరను స్వీకరించి తన ఉత్పత్తిని నిర్ణయించుకుంటాడు. ఒక సంస్థ అధిక లాభాలను పొందాలనుకుంటుంది. కాబట్టి ఎక్కువ లాభాలనిచ్చే ఉత్పత్తిని ఎంపిక చేస్తుంది. అధిక లాభాలనిచ్చే ఉత్పత్తిని చేసినప్పుడు సంస్థ సమతౌల్య స్థితిలో ఉంటుంది. సమతౌల్య ఉత్పత్తి చేసే సంస్థ తన ఉత్పత్తిని మార్చుకోవడానికి ఇష్టపడడు.

ఈ స్థితి నుంచి ఉత్పత్తిని పెంచుకోవడానికి, తగ్గించడానికి ఇష్టపడదు. సంస్థ సమతౌల్య స్థితిని రెండు కాలాల్లో వివరిస్తారు. అవి

  1. స్వల్పకాలం
  2. దీర్ఘకాలం.

1. స్వల్పకాల సమతౌల్యం :
స్వల్పకాలంలో సంస్థ స్థిర ఉత్పత్తి కారకాలు అంటే యంత్రాలు, భవనాలు మొదలగునవి మార్చలేదు. చరకారకాలు మాత్రమే మార్చి ఉత్పత్తిని పెంచుకుంటుంది. స్వల్పకాలంలో ఉపాంత వ్యయం, ఉపాంత రాబడికి సమానమైనప్పుడు స్వల్పకాలిక సమతౌల్య ఉత్పత్తి జరుగుతుంది.

స్వల్పకాలంలో సంస్థ గరిష్ట లాభాన్ని లేదా సాధారణ లాభాన్ని లేదా నష్టాన్ని పొందుతుంది. దీనిని ఈ క్రింది రేఖాపటాల ద్వారా తెలియజేయవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 5th Lesson మార్కెట్ విశ్లేషణ 3

A రేఖాపటంలో ‘OX’ అక్షంమీద ఉత్పత్తి పరిమాణంను, ‘OY’ అక్షం మీద ధరను చూపినాము.

B రేఖాపటంలో OX అక్షంపై ఉత్పత్తి పరిమాణాన్ని, OY పై వ్యయం, రాబడిని కొలుస్తాం. A రేఖాపటంలో ‘E’ బిందువు వద్ద డిమాండ్, సప్లయ్ సమానమయినాయి. అందువల్ల పరిశ్రమలో OP సమతౌల్యపు ధర నిర్ణయించబడుతుంది. ఇదే ధరను సంస్థ అంగీకరిస్తుంది.

దీనికి సమతౌల్య ధర నిర్ణయించబడుతుంది. ఇదే ధరను సంస్థ అంగీకరిస్తుంది. దీనిని సంస్థలో క్షితిజరేఖ ద్వారా చూపించడం జరిగింది. దీనినే ‘ధర రేఖ’ అంటారు.

సంస్థలో ఉపాంత వ్యయం = ఉపాంత రాబడి అయినప్పుడు ఉండే ఉత్పత్తి వల్ల లాభాలు గరిష్టంగా ఉంటాయి. రేఖాపటంలో 0Q ఉత్పత్తి దగ్గర లాభాలు గరిష్టంగా ఉంటాయి. సమతౌల్య బిందువు ‘E’ దగ్గర ధర P; సగటు వ్యయం QB సగటు లాభం BA.

∴ మొత్తం లాభం PABC కి సమానం. అనగా OQ వస్తుపరిమాణంను ఉత్పత్తి చేయటానికి అయిన వ్యయం OCBQ; రాబడి OPAQ.

2. దీర్ఘకాలిక సమతౌల్యం :
దీర్ఘకాలంలో సంస్థ ఉత్పాదకాలు అన్నింటికి మార్చడం ద్వారా ఉత్పత్తిలో మార్పులు చేస్తుంది. సంస్థ దీర్ఘకాలంలో కూడా ఉపాంత వ్యయం, ఉపాంత రాబడికి సమానమైనచోట సమతౌల్యం ఉత్పత్తి చేస్తుంది. దీర్ఘకాలంలో ఒక ముఖ్యమైన అంశం సంస్థల ప్రవేశం, నిష్క్రమణ ఈ కాలంలో జరుగుతుంది.

ఈ ఈ కారణం వల్ల ప్రతి సంస్థ దీర్ఘకాలంలో సాధారణ లాభాలు మాత్రమే పొందుతుంది. దీర్ఘకాలిక సమతౌల్యాన్ని ఈ ప్రక్క రేఖాపటం ద్వారా వివరించవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 5th Lesson మార్కెట్ విశ్లేషణ 4

పై రేఖాపటంలో ‘OX’ అక్షంపై వస్తుపరిమాణాన్ని, ‘OY’ అక్షంపై ధర వ్యయం, రాబడులను కొలుస్తాము. పై రేఖాపటంలో ‘E’ బిందువు వద్ద AR = MR = LMC LAC గా ఉంది. అప్పుడు ధర OP గా, పరిమాణం 0Q గా ఉండును.

TS Board Inter First Year Economics Study Material Chapter 5 మార్కెట్ విశ్లేషణ

ప్రశ్న 3.
సంపూర్ణ పోటీలో, దీర్ఘకాలంలో సంస్థ సమతౌల్యాన్ని వివరించండి.
జవాబు.
సంస్థ సమతౌల్యం :
సంపూర్ణ పోటీలో వస్తువు ధరను మార్కెట్ను నిర్ణయిస్తుంది. ఉత్పత్తిదారుడు ఈ ధరను స్వీకరించి తన ఉత్పత్తిని నిర్ణయించుకుంటాడు. ఒక సంస్థ అధిక లాభాలను పొందాలనుకుంటుంది. కాబట్టి ఎక్కువ లాభాలనిచ్చే ఉత్పత్తిని ఎంపిక చేస్తుంది.

అధిక లాభాలనిచ్చే ఉత్పత్తిని చేసినప్పుడు సంస్థ సమతౌల్య స్థితిలో ఉంటుంది. సమతౌల్య ఉత్పత్తి చేసే సంస్థ తన ఉత్పత్తిని మార్చుకోవడానికి ఇష్టపడడు. ఈ స్థితి నుంచి ఉత్పత్తిని పెంచుకోవడానికి, తగ్గించడానికి ఇష్టపడదు. సంస్థ సమతౌల్య స్థితిని రెండు కాలాల్లో వివరిస్తారు. అవి

  1. స్వల్పకాలం
  2. దీర్ఘకాలం.

1. స్వల్పకాల సమతౌల్యం :
స్వల్పకాలంలో సంస్థ స్థిర ఉత్పత్తి కారకాలు అంటే యంత్రాలు, భవనాలు మొదలగునవి మార్చలేదు. చరకారకాలు మాత్రమే మార్చి ఉత్పత్తిని పెంచుకుంటుంది. స్వల్పకాలంలో ఉపాంత వ్యయం, ఉపాంత రాబడికి సమానమైనప్పుడు స్వల్పకాలిక సమతౌల్య ఉత్పత్తి జరుగుతుంది. స్వల్పకాలంలో సంస్థ గరిష్ట లాభాన్ని లేదా సాధారణ లాభాన్ని లేదా నష్టాన్ని పొందుతుంది. దీనిని ఈ క్రింది రేఖాపటాల ద్వారా తెలియజేయవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 5th Lesson మార్కెట్ విశ్లేషణ 3

A రేఖాపటంలో ‘OX’ అక్షంమీద ఉత్పత్తి పరిమాణంను, ‘OY’ అక్షం మీద ధరను చూపినాము.

B రేఖాపటంలో OX అక్షంపై ఉత్పత్తి పరిమాణాన్ని, OY పై వ్యయం, రాబడిని కొలుస్తాం. A రేఖాపటంలో ‘E’ బిందువు వద్ద డిమాండ్, సప్లయ్ సమానమయినాయి. అందువల్ల పరిశ్రమలో OP సమతౌల్యపు ధర నిర్ణయించబడుతుంది. ఇదే ధరను సంస్థ అంగీకరిస్తుంది. దీనికి సమతౌల్య ధర నిర్ణయించబడుతుంది. ఇదే ధరను సంస్థ అంగీకరిస్తుంది. దీనిని సంస్థలో క్షితిజరేఖ ద్వారా చూపించడం జరిగింది. దీనినే ‘ధర రేఖ’ అంటారు.

సంస్థలో ఉపాంత వ్యయం = ఉపాంత రాబడి అయినప్పుడు ఉండే ఉత్పత్తి వల్ల లాభాలు గరిష్టంగా ఉంటాయి. రేఖాపటంలో 0Q ఉత్పత్తి దగ్గర లాభాలు గరిష్టంగా ఉంటాయి. సమతౌల్య బిందువు ‘E’ దగ్గర ధర P; సగటు వ్యయం QB సగటు లాభం BA.

∴ మొత్తం లాభం PABC కి సమానం. అనగా OQ వస్తుపరిమాణంను ఉత్పత్తి చేయటానికి అయిన వ్యయం OCBQ; రాబడి OPAQ.

2. దీర్ఘకాలిక సమతౌల్యం :
దీర్ఘకాలంలో సంస్థ ఉత్పాదకాలు అన్నింటికి మార్చడం ద్వారా ఉత్పత్తిలో మార్పులు చేస్తుంది. సంస్థ దీర్ఘకాలంలో కూడా ఉపాంత వ్యయం, ఉపాంత రాబడికి సమానమైనచోట సమతౌల్యం ఉత్పత్తి చేస్తుంది. దీర్ఘకాలంలో ఒక ముఖ్యమైన అంశం సంస్థల ప్రవేశం, నిష్క్రమణ ఈ కాలంలో జరుగుతుంది. ఈ ఈ కారణం వల్ల ప్రతి సంస్థ దీర్ఘకాలంలో సాధారణ లాభాలు మాత్రమే పొందుతుంది. దీర్ఘకాలిక సమతౌల్యాన్ని ఈ ప్రక్క రేఖాపటం ద్వారా వివరించవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 5th Lesson మార్కెట్ విశ్లేషణ 4

పై రేఖాపటంలో ‘OX’ అక్షంపై వస్తుపరిమాణాన్ని, ‘OY’ అక్షంపై ధర వ్యయం, రాబడులను కొలుస్తాము. పై రేఖాపటంలో ‘E’ బిందువు వద్ద AR = MR = LMC LAC గా ఉంది. అప్పుడు ధర OP గా, పరిమాణం OQ గా ఉండును.

TS Board Inter First Year Economics Study Material Chapter 5 మార్కెట్ విశ్లేషణ

ప్రశ్న 4.
ఏకస్వామ్యం అంటే ఏమిటి ? దాని లక్షణాలు ఏవి ?
జవాబు.
సంపూర్ణ పోటీతో పోల్చినప్పుడు ఏకస్వామ్యం పూర్తిగా భిన్నమైన మార్కెట్. ఏకస్వామ్యం అంటే ఒకే ఉత్పత్తిదారుడు ఉన్న మార్కెట్ అని అర్థం. మార్కెట్లో సమీప ప్రత్యామ్నాయ వస్తువులు లేని వస్తువును ఒకే సంస్థ సప్లయ్ చేసినప్పుడు ఏకస్వామ్య మార్కెట్ ఉన్నట్లు.
‘బిలాస్’ మాటల్లో సమీప ప్రత్యామ్నాయ వస్తువులు లేని వస్తూత్పత్తిని చేసే ఒకే అమ్మకందారుడు ప్రాతినిధ్యం వహించే మార్కెట్ను ఏకస్వామ్యమంటారు. మార్కెట్లో అమ్మబడే ఇతర వస్తువులు, వాటి ధరల వల్ల ఏకస్వామ్యదారుడు ప్రభావితం కాడు, వాటిని ప్రభావితం చేయలేడు.

ఏకస్వామ్యం ముఖ్య లక్షణాలు :

  • మార్కెట్లో ఒక్క సంస్థ మాత్రమే వస్తూత్పత్తిని చేస్తుంది.
  • ఏకస్వామ్యంలో తయారయ్యే వస్తువుకు సమీప ప్రత్యామ్నాయాలుండవు.
  • మార్కెట్లోనికి నూతన సంస్థలు ప్రవేశించడానికి వీలులేని నిబంధనలుంటాయి.
  • పరిశ్రమ, సంస్థ రెండూ ఒక్కటే.
  • ఉత్పత్తిదారుడు వస్తువు ధరను, వస్తు సప్లయ్ను నియంత్రిస్తాడు. అయితే ఒక సమయంలో వస్తువు ధరను లేదా వస్తువు సప్లయ్ను ఏదో ఒకదాన్ని మాత్రమే నియంత్రించగలడు.

ఏకస్వామ్యంలో సమతౌల్యం – ధర నిర్ణయం :
ఏకస్వామ్యంలో వస్తువు డిమాండ్, సప్లయ్ ఆధారంగా దాని ధర, వస్తూత్పత్తి, లాభాలు నిర్ణయించబడతాయి. ఏకస్వామ్యదారుడు వస్తువు సరఫరాపై పూర్తి నియంత్రణను కలిగిఉంటాడు. అంతేకాకుండా గరిష్ఠ లాభం వచ్చే విధంగా ధరను నిర్ణయించగలడు. అయితే రెండింటిని ఒకేసారి నిర్ణయించలేడు.

ఏకస్వామ్యదారుడు వస్తువు ధరను నిర్ణయించితే, ఆ ధరకు మార్కెట్లోని వినియోగదారుని డిమాండ్ వల్ల సప్లయ్ నిర్ణయించబడుతుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 5 మార్కెట్ విశ్లేషణ

ప్రశ్న 5.
ఏకస్వామ్య పోటీ లక్షణాలు ఏవి ?
జవాబు.
సంపూర్ణ పోటీ లేదా నిరపేక్ష ఏకస్వామ్యం లేనటువంటి ఏకస్వామ్య పోటీ మాత్రమే వాస్తవంగా ఉంటుంది. ఈ. హెచ్. చాంబర్లిన్ (E.H. Chamberlin), జోన్ రాబిన్సన్ (Joan Robinson) ఈ రకమైన మార్కెట్ విశ్లేషణను ప్రతిపాదించారు.

ఏకస్వామ్య పోటీ లక్షణాలు (Characteristics of Monopolistic Competition) :
చాంబర్లిన్ ప్రకారం ఏకస్వామ్య పోటీకి కింది ముఖ్య లక్షణాలు ఉంటాయి.

a) తక్కువ సంఖ్యలో సంస్థలు :
సంపూర్ణ పోటీలోని సంస్థల కంటే ఏకస్వామ్య పోటీలో సంస్థల సంఖ్య తక్కువ. సంస్థలకు ఈ పోటీలో కొంతమేరకు ఏకస్వామ్య అధికారం ఉంటుంది. వస్తూత్పత్తి ప్రక్రియలో తగినంత పరిమాణంలో ఉత్పత్తిదారులు పాల్గొంటారు. మార్కెట్లో తీవ్రమైన పోటీ ఉన్నందువల్ల ఏ ఒక్క ఉత్పత్తిదారుడు మార్కెట్కు సంబంధించిన మొత్తం ఉత్పత్తిని ప్రభావితం చేయలేడు.

b) వస్తు వైవిధ్యం (Product Differentiation) :
ఏకస్వామ్య పోటీ లక్షణాలలో ముఖ్యమైంది వస్తు వైవిధ్యం. అనేక సంస్థలు వస్తువులను తయారుచేసినా, ఒక సంస్థ ఉత్పత్తి చేసిన వస్తువును మార్కెట్లోని ఇతర సంస్థలు ఉత్పత్తి చేసిన వస్తువులతో పోల్చినప్పుడు కొన్ని తేడాలుంటాయి. ఈ పోటీలో సజాతీయ వస్తువులు కాకుండా విజాతీయ వస్తువులే ఉంటాయి.

వస్తువు వైవిధ్యమనేది బ్రాండ్ నేమ్, ట్రేడ్ మార్క్ మొదలైన రూపాల్లో ఉంటుంది. అంటే సంస్థ ఉత్పత్తికి సమీప ప్రత్యామ్నాయాలుంటాయి. వీటికుండే జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం అధికం.

c) నూతన సంస్థలు ప్రవేశించే, నిష్క్రమించే స్వేచ్ఛ:
ప్రతీ సంస్థ తన వస్తూత్పత్తిపై ఏకస్వామ్య అధికారాన్ని కలిగి ఉంటుంది. అయితే ఇదే పోలికలున్న వస్తువులను తయారుచేసే ఇతర సంస్థల నుంచి పోటీని ఎదుర్కొంటుంది. కాబట్టి పరిశ్రమలోకి వీలుంది. అలాగే పరిశ్రమ నుంచి నిష్క్రమించే స్వేచ్ఛ ఉంది.

d) పోటీతో కూడుకున్న ప్రకటనలు లేదా అమ్మకం వ్యయాలు :
వస్తువుల వైవిధ్యం వల్ల తమ అమ్మకాల్లో పెరుగుదల కోసం పోటీ ప్రకటనలను సంస్థలు అనుసరిస్తాయి. వినియోగదారుల మనస్సులో బ్రాండ్ ‘ఏ’, బ్రాండ్ ‘బి’ మధ్యగల తేడాలు ఏర్పడటానికి వ్యాపార ప్రకటనలు ఇస్తారు.

అమ్మకాల పెంపుదల కోసం ప్రకటన వ్యయాలను ఒక సాధనంగా ఉపయోగించుకోవడమనేది ఏకస్వామ్య పోటీ ముఖ్య లక్షణం. ఈ వ్యయాలను ‘అమ్మకం వ్యయాలంటారు.’ అమ్మకం వ్యయాలు, ఉత్పత్తి వ్యయాలు వేరువేరుగా ఉంటాయి.

e) అధిక డిమాండ్ వ్యాకోచత్వం :
ఏకస్వామ్య పోటీలోని సంస్థకుండే డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి కిందకు వాలుతుంది. ఈ డిమాండ్ రేఖ అధిక వ్యాకోచత్వాన్ని కలిగి ఉంటుంది. అయితే సంపూర్ణ పోటీ మాదిరిగా సంపూర్ణ వ్యాకోచత్వాన్ని మాత్రం కలిగివుండదు.

f) సంస్థ పరిశ్రమ :
ఈ పోటీలో సంస్థ, పరిశ్రమ రెండూ ఉంటాయి. అయితే పరిశ్రమ గ్రూప్ గా ఉంటుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 5 మార్కెట్ విశ్లేషణ

ప్రశ్న 6.
పరిమితస్వామ్యం అంటే ఏమిటి ? దాని లక్షణాలను వివరించండి.
జవాబు.
Oligopoly అనే పదం గ్రీకు పదాలయిన ‘Oligos’, ‘Pollein’ అనే పదాల నుండి గ్రహించడమైంది. ‘Oligos’ అంటే కొద్దిమంది అని, Pollein అంటే అమ్మడం అని అర్థం. పరిమిత స్వామ్యంలో కొద్దిమంది అమ్మకపుదార్లు నుండి వారు సజాతీయమైన వస్తూత్పత్తిని గాని లేదా వైవిధ్యం ఉన్న వస్తూత్పత్తిని గాని చేస్తూ ఉంటారు. ఈ కొద్దిమంది అమ్మకందారుల మధ్య పోటీ ఉంటుంది. పరిశ్రమలోని ఇతర సంస్థలపై ప్రతి సంస్థ ప్రత్యక్షంగా చెప్పుకోదగ్గ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

లక్షణాలు :

  1. వస్తువును అమ్మే సంస్థలు చాలా కొద్ది సంఖ్యలో ఉంటాయి.
  2. దీనిలో డిమాండ్ రేఖ అనిశ్చితత్వంగా ఉంటుంది.
  3. ధరల దృఢత్వం ఉంటుంది.
  4. ప్రకటనలపై అధిక వ్యయాన్ని చేస్తారు.
  5. సంస్థల మధ్య పరస్పర ఆధార సంబంధం ఉంటుంది.

ప్రశ్న 7.
ద్విదాధిపత్యం భావనను దాని లక్షణాలను వివరించండి.
జవాబు.
గ్రీకు భాషలో ‘duo’ అంటే ఇద్దరు అని, ‘poly’ అంటే అమ్మకందారులు అని అర్థం. ఈ రకమగు వ్యవస్థలో ఇద్దరు ఉత్పత్తిదారులు మాత్రమే వస్తూత్పత్తిని కొనసాగిస్తారు. వీరు మార్కెట్పై పూర్తి ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు.

పరిమితస్వామ్యంలోని భాగమే ద్విదాధిపత్యం. ఇద్దరు అమ్మకందార్లే వస్తూత్పత్తిని చేస్తారు. ద్విదాధిపత్యం సూక్ష్మ ” రూపంలో ఉండే పరిమితస్వామ్యం. ఉత్పత్తిదారులు ఉత్పత్తి చేసే వస్తువులు సజాతీయాలు కాని లేదా భిన్నమైన వస్తువులుగా కాని ఉండొచ్చు. ఇద్దరు ఉత్పత్తిదారులు ఉన్నందువల్ల ఒకరి నిర్ణయాలు మరొకరి నిర్ణయాలను ప్రభావితం చేస్తాయని ఇద్దరికీ తెలుసు.

ఉత్పత్తిదారుల మధ్య పోటీ ఉండవచ్చు లేదా ఇద్దరు కలిసి ఒక ఒప్పందానికి రావచ్చు. మార్కెట్లో ఈ రెండు సంస్థలు చెప్పుకోదగ్గ నియంత్రణను కలిగి ఉంటాయి. ప్రస్తుతం పారిశ్రామిక వ్యవస్థలో సులభంగా అధ్యయనం చేయబడుతున్న మార్కెట్ వ్యవస్థ ఇదే.

1838లో ఫ్రెంచి ఆర్థికవేత్త ఆగస్టిన్ కూర్నాట్ ద్విదాధిపత్యం నమూనాను అభివృద్ధి చేసాడు. రెండు సంస్థల ఉదాహరణతో కూర్నాట్ తన నమూనాను వివరించాడు. అమ్మకందారులు పోటీదారుని పూర్వపు ప్రతిచర్యలను పరిగణించకుండానే తన చర్యకు ఉపక్రమించు ప్రవర్తనను కలిగి ఉంటారు.

ఫలితంగా ప్రతీ సంస్థ మొత్తం ఉత్పత్తిలో 1/3వ వంతు, రెండు సంస్థలు కలిసి 2/3వ వంతు మాత్రమే ఉత్పత్తిని చేస్తాయి. ప్రతి సంస్థ లాభాలను గరిష్ఠం చేసుకొంటుంది. పరిశ్రమలో మాత్రం లాభాలు గరిష్ఠం కావు. సంస్థలు పరస్పరం ఆధారపడడాన్ని గుర్తించకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతుంది.

ద్విదాధిపత్యం లక్షణాలు :

  •  ఇద్దరు అమ్మకందార్లు ఉంటారు.
  • సజాతీయ ఉత్పత్తి.
  • ఉత్పత్తి వ్యయం శూన్యం
  • అమ్మకందార్లు పరస్పరం ఆధారపడడాన్ని గుర్తించరు.

TS Board Inter First Year Economics Study Material Chapter 5 మార్కెట్ విశ్లేషణ

ప్రశ్న 8.
సంపూర్ణ పోటీని, ఏకస్వామ్యాన్ని పోల్చండి.
జవాబు.
సంపూర్ణ పోటీలో అనేకమంది అమ్మకందారులు, కొనుగోలుదారులు ఉండి సజాతీయమైన వస్తువుల ఉత్పత్తి జరుగుతుంది. మార్కెట్లో నిర్ణయమైన ధరను సంస్థ అంగీకరిస్తుంది. కాని సంస్థకు ధర నిర్ణయంలో ప్రాధాన్యత ఉండదు. సంస్థ గరిష్ట లాభాలనైతే గరిష్ట స్థాయికి పెంచటానికి, నష్టాలనైతే కనిష్ట స్థాయికి తగ్గించటానికి ప్రయత్నిస్తుంది. అందువల్ల ఉపాంత వ్యయం, ఉపాంత రాబడికి సమానమయ్యేట్లు సంస్థ ప్రయత్నిస్తుంది.

ఏకస్వామ్యంలో ఒక వస్తువుకు ఒకే ఉత్పత్తిదారుడుంటాడు. మార్కెట్లో తన వస్తువుకు ఎటువంటి సన్నిహిత ప్రత్యామ్నాయాలు లభించవు. సంస్థ వస్తువు ధరను, వస్తురాశిని నిర్ణయించగలదు. కాని ఒకే సమయంలో రెండు నిర్ణయాలను చేయలేదు. సంస్థ సమతౌల్యంలో ఉండటానికి ఉపాంత వ్యయం, ఉపాంత రాబడికి సమానం అవ్వాలి.
సంపూర్ణ పోటీ, ఏకస్వామ్యాల మధ్య పోలిక :

సంపూర్ణ పోటీఏకస్వామ్యం
1. అత్యధిక సంఖ్యలో అమ్మకందార్లు ఉంటారు.1. ఒకే ఒక్క ఉత్పత్తిదారుడు ఉంటాడు.
2. సంస్థలకు ప్రవేశానికి, నిష్క్రమించటానికి స్వేచ్ఛ ఉంటుంది.2. నూతన సంస్థల ప్రవేశాలకు స్వేచ్ఛ ఉండదు.
3. ఇక్కడ వస్తువులన్నీ సజాతీయాలు.3. ఇక్కడ సజాతీయత ఉండదు. ఉత్పత్తికి సమీప ప్రత్యామ్నాయాలు ఉండవు.
4. ఈ మార్కెట్లో సంస్థ, పరిశ్రమకు తేడా ఉంది.4. ఈ మార్కెట్లో సంస్థ, పరిశ్రమ రెండు ఒక్కటే.
5. మార్కెట్ వస్తువు ధరను నిర్ణయిస్తుంది. ఉత్పత్తి దారుడు ధరను స్వీకరిస్తాడు.5. ఉత్పత్తిదారుడే ధరను నిర్ణయిస్తాడు.
6. మార్కెట్లో ఒకే ధర ఉంటుంది.6. మార్కెట్లో ధర విచక్షణ చేస్తాడు.
7. సగటు, ఉపాంత రాబడులు సమానం. ఇవి ‘X’ అక్షంకు సమాంతరంగా ఉంటాయి.7. సగటు రాబడి, ఉపాంత రాబడి కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు రేఖలు ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 5 మార్కెట్ విశ్లేషణ  

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
మార్కెట్ని నిర్వచించండి.
జవాబు.
సాధారణంగా మార్కెట్ అంటే వస్తువుల క్రయ, విక్రయాలు జరిగే ప్రదేశం అని భావిస్తాం. కాని అర్థశాస్త్రంలో మార్కెట్ అంటే అమ్మకందార్లు, కొనుగోలుదార్లు కలిసి ధరలు నిర్ణయించుకోవటానికి ఉపయోగపడే యంత్రాంగం.

ప్రశ్న 2.
కాలాన్నిబట్టి మార్కెట్లపై ఒక వాక్యం వ్రాయండి.
జవాబు.
కాలాన్ని ఆధారంగా చేసుకుని మార్కెట్లో వస్తు సప్లయ్లో సర్దుబాట్లు జరుగుతాయి. కాల వ్యవధి ఆధారంగా మార్కెట్ను నాలుగు రకాలుగా విభజిస్తారు. అవి :

  1. మార్కెట్ కాలం లేదా అతిస్వల్ప కాలం
  2. స్వల్ప కాలం
  3. దీర్ఘకాలం
  4. అతిదీర్ఘ కాలం.

ప్రశ్న 3.
ప్రదేశాన్ని బట్టి మార్కెట్లు.
జవాబు.
ఒక వస్తువుకు ఉండే మార్కెట్ విస్తీర్ణం దానికుండే డిమాండ్, రవాణా సౌకర్యాలు, వస్తువు మన్నికపై ఆధారపడి ఉంటుంది. కాలం ఆధారంగా మార్కెట్ను క్రింది విధంగా వర్గీకరిస్తారు.

  1. స్థానిక మార్కెట్
  2. జాతీయ మార్కెట్
  3. ప్రాంతీయ మార్కెట్
  4. అంతర్జాతీయ మార్కెట్ లేదా విదేశీ మార్కెట్.

TS Board Inter First Year Economics Study Material Chapter 5 మార్కెట్ విశ్లేషణ

ప్రశ్న 4.
పోటీని బట్టి మార్కెట్లు.
జవాబు.
మార్కెట్లోని పోటీ ఆధారంగా మార్కెట్ను క్రింది విధంగా వర్గీకరిస్తారు.

(a) సంపూర్ణ పోటీ మార్కెట్ :
ఈ మార్కెట్లో అధిక సంఖ్యలో అమ్మకందార్లు, కొనుగోలుదార్లు ఉండి, అందరూ సజాతీయ వస్తువులను అమ్మడం, కొనడం చేస్తారు. ఒకే ధర మార్కెట్లో ఉంటుంది.

(b) అసంపూర్ణ పోటీ మార్కెట్ :
ఈ మార్కెట్లో వివిధ సంఖ్యలలో అమ్మకందార్లు, అధిక సంఖ్యలో కొనుగోలుదార్లు ఉండి, వైవిధ్యం గల వస్తువులు వేరువేరు ధరల వద్ద అమ్మటం జరుగుతుంది. ఉదా : ఏకస్వామ్యం, ద్విస్వామ్యం, ఏకస్వామ్య పోటీ.

ప్రశ్న 5.
సంపూర్ణ పోటీ అంటే ఏమిటి ?
జవాబు.
సంపూర్ణ పోటీ మార్కెట్ వ్యవస్థలో వైయక్తిక సంస్థల మధ్య ప్రతిస్పర్థ ఉండదు. నిత్యం వాడుకలో ఉన్న అర్థానికి భిన్నంగా ఆర్థిక సిద్ధాంతంలో సంపూర్ణ పోటీ పదాన్ని వాడుతున్నాం. వర్తకులు ‘పోటీ’, ‘ప్రతిస్పర్ధ’ అనే పదాలను పర్యాయ పదాలుగా ఉపయోగిస్తారు. సిద్ధాంతరీత్యా సంపూర్ణ పోటీలో సంస్థల మధ్య ప్రతిస్పర్థ ఉండదు.

సజాతీయ వస్తువులను తయారుచేసే సంస్థలు అధిక సంఖ్యలో ఉండి, పరిశ్రమలోనికి సంస్థలు ప్రవేశించడానికి, పరిశ్రమ నుంచి నిష్క్రమించడానికి స్వేచ్ఛ, కొనుగోలుదారునికి సంపూర్ణ పరిజ్ఞానం, ఉత్పత్తి కారకాలకు పూర్తి గమనశీలత, రవాణా వ్యయాలు లేకుండటం అనే లక్షణాలుంటే దానిని సంపూర్ణ పోటీ మార్కెట్ అంటారు.

ప్రశ్న 6.
ఏకస్వామ్యం నిర్వచించండి.
జవాబు.
అసంపూర్ణ పోటీలో ఏకస్వామ్యం ఒకటి. దీనినే గుత్తాధిపత్యం అంటారు. మార్కెట్లో ఒకే ఒక అమ్మకందారుడుండి, సమీప ప్రత్యామ్నాయ వస్తువులు లభ్యంకాని మార్కెట్ని ఏకస్వామ్యం అంటారు. ఈ మార్కెట్లో ధర విచక్షణకు అవకాశం ఉంటుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 5 మార్కెట్ విశ్లేషణ

ప్రశ్న 7.
ఏకస్వామ్యపు పోటీ అంటే ఏమిటి ?
జవాబు.
ఈ మార్కెట్లో వస్తు వైవిధ్యం ఉంటుంది. అనగా అనేక సంస్థలు కొంత భేదంతో ఒకే రకమైన వస్తువులను ఉత్పత్తి చేస్తాయి. అవన్నీ సన్నిహిత ప్రత్యామ్నాయాలు. ఉదా : బూస్ట్, బోర్నవిటా మొదలగునవి.

ప్రశ్న 8.
పరిమితస్వామ్యంని నిర్వచించండి.
జవాబు.
ఈ మార్కెట్లో ఉత్పత్తిదారులు పరిమితంగా ఉంటారు. సంస్థలు స్వతంత్రంగా లేదా ఉమ్మడి అంగీకారంతో సంస్థలు వస్తువుల ధరలను నిర్ణయిస్తాయి.

ప్రశ్న 9.
ద్విదాధిపత్యం అంటే ఏమిటి ?
జవాబు.
ఈ మార్కెట్లో ఉత్పత్తిదారులు ఇద్దరుంటారు. వీరి మధ్య పోటీ అధికంగా ఉంటుంది. ఒక సంస్థ తన మార్కెట్ విధాన రూపకల్పనలో తనకు పోటీగా ఉన్న సంస్థ ప్రవర్తనను కూడా పరిగణనలోనికి తీసుకోవలసి ఉంది.

ప్రశ్న 10.
సమతౌల్యపు ధరను వివరింపుము.
జవాబు.
ఒక సంస్థ తన తరహాని లేదా పరిమాణాన్ని ఏవిధంగాను మార్చటానికి ఇష్టపడని పరిస్థితిని సమతౌల్యస్థితి అంటారు. ఏ ధర వద్ద సప్లయ్, డిమాండ్ సమానంగా ఉంటాయో దానిని సమతౌల్యపు ధర అని అంటారు.

TS Board Inter First Year Economics Study Material Chapter 5 మార్కెట్ విశ్లేషణ

ప్రశ్న 11.
వస్తు వైవిధ్యం / ఉత్పాదనా భిన్నత్వం అంటే ఏమిటి ?
జవాబు.
ఏకస్వామ్య పోటీ మార్కెట్లో అనేక సంస్థలు వస్తువులను తయారుచేసినా, ఒక సంస్థ ఉత్పత్తి చేసిన వస్తువును మార్కెట్లోని ఇతర సంస్థలు ఉత్పత్తి చేసిన వస్తువులతో పోల్చినపుడు బ్రాండ్నేమ్, ట్రేడ్మార్క్, వస్తువు లక్షణాలు మొదలైన వాటి విషయంలో భేదం ఉంటుంది. అంతేగాక వస్తువుకు సమీప ప్రత్యామ్నాయాలు ఉంటాయి. అలాగే | జాత్యంతర డిమాండ్ వ్యాకోచత ఎక్కువ.

ప్రశ్న 12.
అమ్మకపు వ్యయాలు.
జవాబు.
సంస్థలు ఉత్పత్తి చేసిన వస్తువుల అమ్మకాలను మార్కెట్లో పెంచుకోవడానికి చేసే ఖర్చులను అమ్మకపు వ్యయాలు అని అంటారు. పత్రికలు, టెలివిజన్, ప్రదర్శనలు మొదలగునవి వాటి కోసం సంస్థ అధిక మొత్తంలో అమ్మకాల అభివృద్ధికి ఖర్చు చేస్తుంది.

TS Inter 1st Year History Study Material Chapter 1 చరిత్ర, భౌగోళిక పరిస్థితులు

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 1st Lesson చరిత్ర, భౌగోళిక పరిస్థితులు Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 1st Lesson చరిత్ర, భౌగోళిక పరిస్థితులు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశపు భౌగోళిక లక్షణాలను చర్చించండి ?
జవాబు.
చరిత్రకూ భూగోళ విజ్ఞానానికి అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. ఒక దేశ చరిత్రను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ఆ దేశ భౌగోళిక స్వరూపం గురించి తెలుసుకోవడం అవసరం. భారతదేశం భౌగోళిక వైవిధ్యం కలిగిన పురాతన భూభాగం. ఎన్నో నాగరికతలు, సామ్రాజ్యాలు ఈ భూభాగంలో ఏర్పడి, అంతరించిపోయినప్పటికీ, ఒక అవిచ్ఛిన్న సంస్కృతి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. ప్రాచీన కాలంలో భారతదేశాన్ని ‘భరతవర్షం’గా పిలిచేవారు. భరతుని భూమిగా, దేశప్రజలను భరతసంతతిగా అభివర్ణించారు. భారతదేశాన్ని పురాణాల్లో జంబూద్వీపం అనేవారు. ఈ దేశానికి ‘ఇండియా’ అనేది మరొక పేరు. సింధూనది ప్రవహిస్తున్న దేశం కాబట్టి దీన్ని సింధూదేశంగా గ్రీకులు, పారశీకులు వ్యవహరించారు. క్రమంగా ‘సింధు’ పారశీకుల ఉచ్చారణలో ‘హిందు’గా, గ్రీకుల ఉచ్చారణలో ‘ఇండ్’గా మారింది. కాలగమనంలో హిండ్గా, హిందూస్తాన్ గా ఈ దేశం వ్యవహరింపబడింది.

TS Inter 1st Year History Study Material Chapter 1 చరిత్ర, భౌగోళిక పరిస్థితులు

భారత ఉపఖండానికి భౌగోళిక పరిస్థితులు సహజ రక్షణను కల్పిస్తున్నాయి. ఉత్తరాన హిమాలయ పర్వతశ్రేణి, తూర్పువైపు బంగాళాఖాతం, దక్షిణం వైపు హిందూమహాసముద్రం, పడమటివైపు అరేబియా సముద్రం సహజమైన ఎల్లలుగా ఉన్నాయి. దేశంలోని పర్వతాలు, మైదానాలు, పీఠభూములు, తీర ప్రాంతాలు దేశచరిత్ర గతిని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించాయి.

హిమాలయ పర్వత శ్రేణి పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ నుంచి తూర్పున మయన్మార్ (బర్మా) వరకు వ్యాపించి ఉంది. దాదాపు 2400 కి.మీ. పొడవు, 300 కి.మీ ఎత్తులో ఇవి ఉత్తరాన పెట్టని గోడ వలే ఉన్నాయి. వీటి విస్తీర్ణం దాదాపు ఐదు లక్షల చదరపు కిలోమీటర్లు. ఎవరెస్టు లేదా గౌరీశంకర్ (ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం). కాంచనగంగ, దౌళగిరి, నంగప్రభాత్, నందాదేవి లాంటి పర్వతశ్రేణులు హిమాలయాల్లోనే ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత పురాతన పర్వతాలుగా చెప్పబడే ఆరావళి పర్వతాలు దేశంలో వాయవ్య ప్రాంతంలో ఉన్నాయి.

దేశంలోని పీఠభూములను మాళ్వా, ఛోటానాగపూర్, దక్కన్ పీఠభూములుగా వర్గీకరించారు. మాళ్వా పీఠభూమి, దక్కన్ పీఠభూములను వింధ్య, సాత్పూరా పర్వతాలు వేరు చేస్తున్నాయి. దక్కన్ పీఠభూమికి మూడువైపులా సముద్రం ఆవరించి ఉండటం వల్ల ఇది ద్వీపకల్పంగా ఏర్పడింది.

మైదానాల్లో గంగా-సింధూ మైదానాలు ముఖ్యమైనవి. హిమాలయాలనుంచి ప్రవహించే జీవనదులు తీసుకొచ్చిన ఒండ్రుమట్టితో ఈ సారవంతమైన మైదానాలు ఏర్పడ్డాయి. సింధు, గంగ వాటి ఉపనదుల పరీవాహక ప్రాంతాలు ఈ మైదానాల్లో అంతర్భాగాలు. మరోవైపు తూర్పు, పశ్చిమ కనుమల్లో జన్మించే కృష్ణ, గోదావరి లాంటి నదులు, వాటి ఉపనదుల వల్ల దక్షిణ భారతదేశంలో కూడా మైదానాలు ఏర్పడ్డాయి. నదీపరీవాహక ప్రాంతాలతో పాటుగా దేశ వాయువ్య ప్రాంతంలో ఉన్న థార్ ఎడారిని ఒక ప్రత్యేక భౌగోళిక లక్షణంగా చెప్పవచ్చు. ఈ ప్రాంతం భారత, పాకిస్తాన్ దేశాలకు సహజ సరిహద్దుగా ఉంది.

తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన హిందూమహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రాలు భారతదేశానికి చాలా పొడవైన తీర రేఖను ఏర్పరుస్తున్నాయి. ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన దేశాలలో భారత్ ఒకటిగా నిలిచింది. ద్వీపకల్ప పశ్చిమ భాగం వైపు డామన్ నుంచి తిరువనంతపురం వరకు పశ్చిమ కనుమలు(సహ్యాద్రి) వ్యాపించి ఉన్నాయి. ఉత్తర తీరాన్ని కొంకణ తీరమని, దక్షిణాన భాగాన్ని మలబార్ తీరంగా వ్యవహరిస్తున్నారు. పశ్చిమ కనుమలు దాదాపు 1600 కిలోమీటర్ల పొడవు మేర వ్యాపించి ఉన్నాయి. వీటి సరాసరి ఎత్తు 900 నుంచి 1100 మీటర్లు. వీటికి భిన్నంగా తూర్పు కనుమలు అవిచ్ఛిన్నంగా బంగాళాఖాతం వైపు ఉన్నాయి. ఇవి ఒరిస్సాలోని మహేంద్రగిరి (గంజాం జిల్లా) నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు వ్యాపించి ఉన్నాయి. ఈ కనుమలు ఎన్నో చిన్న, పెద్ద నదులకు జన్మస్థానాలుగా ఉన్నాయి.

ప్రశ్న 2.
భారతదేశ చరిత్ర, సంస్కృతిపై భౌగోళిక పరిస్థితుల ప్రభావాన్ని వివరించండి.
జవాబు.
భారత ఉపఖండం భౌగోళిక పరిస్థితుల్లో గొప్ప వైవిధ్యం ఉంది. ఇవి భారతదేశ చరిత్రను ఎంతగానో ప్రభావితం చేశాయి. రాజకీయ సరిహద్దుల్ని, సామాజిక స్థితిగతుల్ని, జాతి విస్తరణను ఈ భౌగోళిక పరిస్థితులే నిర్దేశించాయి. ఉత్తరాన హిమాలయాలు, మిగిలిన మూడువైపులా సముద్రాలు సువిశాల భారతదేశానికి సహజ సరిహద్దులుగా ఉండటంతో ఇది ఒక ప్రత్యేక భౌగోళిక ప్రాంతంగా ఏర్పడింది. ఈ భౌగోళిక పరిధిలో ఉండటం వల్ల తామంతా ఒకటనే భావన, ఇది తమ మాతృదేశమని ప్రజలు భావించారు. భారతీయుల్లో ఐక్యతకు దోహదం చేశాయి. ఇవి భారతీయ సంస్కృతికి ఒక ప్రత్యేక స్వరూపాన్ని ఇవ్వగలిగాయి.

హిమాలయాలు దేశానికి పెట్టని కోటవలె రక్షణ సమకూర్చటమేగాక, ఉత్తర ఆర్కిటిక్ నుంచి వచ్చే అతి శీతల పవనాల తీవ్రత నుంచి దేశానికి రక్షణను కల్పిస్తున్నాయి. హిమాలయాలు లేనట్లయితే, ఉత్తర భారతదేశం ఒక శీతల ఎడారిగా మారి ఉండేది. భారతీయ మత, సారస్వతాల్లో ఈ పర్వతాలు ఒక ప్రత్యేక స్థానాన్ని పొందాయి. కాబట్టి ఇవి జాతీయ పర్వతశ్రేణిగా భారతీయుల మనస్సుల్లో ప్రత్యేక స్థానాన్ని పొందాయి. ఉత్తరాన పెట్టనిగోడ వలే ఉండి విదేశీ దండయాత్రల నుంచి దేశానికి రక్షణ కల్పిస్తున్నాయి. అయితే ఇవి బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా చేయలేదు. కైబర్, బోలాన్ లాంటి కనుమల ద్వారా పశ్చిమ, మధ్య ఆసియా దేశాలతో మనదేశానికి అనేక వేల సంవత్సరాల ద్వారా సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటి ద్వారానే విదేశీ ఆక్రమణదార్లు భారతదేశాన్ని జయించాలని చూశారు. అలెగ్జాండర్ దండయాత్ర దీనికొక ఉదాహరణ. విదేశీయులు వచ్చిన ఈ రహదార్ల ద్వారా వర్తక వ్యాపారాలు జరిగాయి. సాంస్కృతిక మార్పిడికి, ప్రభావాలకు కూడా ఇవి కారణమయ్యాయి. దీనివల్ల రహదార్ల ప్రాముఖ్యత హెచ్చి, ప్రముఖ వర్తక కేంద్రాలు ఏర్పడ్డాయి. ఈ ప్రాంతంలోని వివిధ సంస్కృతులు ఒకటయ్యాయి. భారతీయ, గ్రీకు శిల్పకళల సమ్మేళనంగా ఏర్పడిన గాంధార శిల్పకళలు దీనికి ఉదాహరణగా పేర్కొవచ్చు. ఇది కళాచరిత్ర జగత్తులో ఒక అద్భుతాన్ని సృష్టించగలిగింది.

భారతదేశ చరిత్రను ప్రభావితం చేసిన భౌగోళిక అంశాల్లో గంగా సింధూ మైదానాలు ముఖ్యమైనవి. ఈ ప్రాంతంలో అనేక సంస్కృతులు ఆవిర్భవించాయి. వైదిక, వైదికేతర మతోద్యమాలు, పట్టణీకరణ మూలాలన్నీ కూడా ఈ మైదానాల్లోనే చూడవచ్చు. మౌర్యులు, గుప్తులు లాంటి ఎన్నో సామ్రాజ్యాల విజృంభణకు ఈ ప్రాంతం నిలయమైంది. వ్యవసాయ సంపదకు ఆధారనిలయమైంది. ఈ ప్రాంతంపై ఆధిపత్యం కోసం ఎన్నో యుద్ధాలు జరిగాయి.

ప్రపంచంలోనే అత్యంత పురాతన భూభాగమైన దక్కన్ పీఠభూమి ప్రాక్ చరిత్రకు సంబంధించిన సంస్కృతులకు నిలయం. ఈ ప్రాంతం కూడా ఎన్నో సంస్కృతులకు, సంప్రదాయాలకు, భాషలకు పుట్టినిల్లు. శాతవాహనులు, కాకతీయులు, విజయనగర, బహమనీ లాంటి రాజకీయ శక్తులు ఈ ప్రాంతం నుంచే విజృంభించాయి. ఈ ప్రాంతంలో నిక్షిప్తమైన బంగారు, వజ్రాలు ఇతర అమూల్యమైన సంపదల కోసం అనేక రాజవంశాలు యుద్ధాలు చేశాయి. వింధ్య పర్వతశ్రేణి దక్షిణ, ఉత్తర భారతదేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు ఏర్పడేందుకు కారణమైంది. అందుకే దక్కన్ పీఠభూమి దక్షిణ, ఉత్తర దేశ సంస్కృతుల కలయిక ప్రదేశంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. పశ్చిమ

కనుమలు మహారాష్ట్రులకు సహజ సిద్ధమైన రక్షణ సదుపాయం కలగజేశాయి. పశ్చిమ కనుమల ఉపరితలాలు కోటల నిర్మాణానికి అనుకూలంగా ఉండి మహారాష్ట్రుల విజృంభణకు దోహదం చేశాయి. రాజస్థాన్లోని ఆరావళీ పర్వతాలు రాజపుత్రుల చరిత్రలో ప్రముఖపాత్రను నిర్వహించాయి. ఇవి రాజపుత్రులకు సహజసిద్ధమైన రక్షణ సౌకర్యాలు కలగజేయడమే కాకుండా వారిని వీరులుగా తీర్చిదిద్దాయి.

హిమాలయాల నుంచి ప్రవహించే జీవనదులు వ్యవసాయరంగ సంపద వృద్ధి చెందడానికి, రవాణా సౌకర్యాలు మెరుగుపడడానికి ఉపయోగపడ్డాయి. ఈ నదీ పరీవాహక ప్రాంతాల్లోనే నాగరికతా కేంద్రాలు వికసించాయి. అంతర్గతంగా మహానదులన్నీ సంస్కృతీ, వర్తక వ్యాపారాలు పెంపొందడానికి కారణమైతే, మూడువైపులా ఉన్న మహాసముద్రాలు మనదేశానికి మిగిలిన ప్రపంచంతో సంబంధం ఏర్పడటానికి కారణమయ్యాయి.

భారతదేశ వాతావరణ పరిస్థితుల్లో చాలా తేడాలున్నాయి. భారతదేశ దక్షిణ భాగం ఉష్ణమండలంలోను, ఉత్తర ప్రాంతం సమశీతోష్ణ మండలంలో ఉంది. ఈ ఉష్ణోగ్రతా వ్యత్యాసాలు వర్షపాతాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఉష్ణ వాతావరణం కంటే శీతల, సమశీతోష్ణ వాతావరణంలోనే దేశవాసులు ఎక్కువ సమయం శ్రమించగలుగుతారు. దీని కారణంగానే రాజపుత్రులు, శిక్కులు, మరాఠాలు తమ పరాక్రమాన్ని, ధైర్యసాహసాల్ని చూపగలిగారు.

దేశానికి సుదీర్ఘమైన సముద్రతీరం ఉండటం వల్ల దక్షిణంలో పరిపాలించిన ఆంధ్రులు, కళింగులు, చోళులు మొదలైన వారు ఆగ్నేయాసియా దేశాలతో సముద్రం మీదగా వ్యాపార సంబంధాలు ఏర్పరచుకున్నారు. కంబోడియా, థాయ్లాండ్, జావా, సుమిత్రా, బోర్నియో, బర్మా, నేపాల్ దేశాల్లో భారతీయులు స్థిరనివాసాలేర్పరచుకొని వర్తక వ్యాపారాలను పెంపొందించారు. ఈ విధంగా ఏర్పడిన వ్యాపార సంబంధాలు క్రమంగా భారతీయ సంస్కృతి వ్యాప్తికి తోడ్పడ్డాయి. ఈ విధంగానే బౌద్ధమతం ఆగ్నేయాసియాలో వ్యాపించగలిగింది. అట్లాగే హిందూమతం కూడా విస్తరించింది. సుదీర్ఘమైన తీరప్రాంతం భారతదేశానికి ఉంది కనుకనే పోర్చుగీసు, డచ్చి, ఫ్రెంచి, ఆంగ్లేయ వ్యాపారులు సముద్రం మీదుగా ఈ దేశానికి వచ్చి క్రమంగా తమ వలసలను ఇక్కడ విస్తరించుకోగలిగారు.

TS Inter 1st Year History Study Material Chapter 1 చరిత్ర, భౌగోళిక పరిస్థితులు

ప్రశ్న 3.
భారతదేశ చరిత్ర నిర్మాణంలో సాహిత్య ఆధారాల ప్రాముఖ్యత గురించి రాయండి.
జవాబు.
చారిత్రక ఆధారాలలో సాహిత్య ఆధారాలు ముఖ్యమైనవి. ఇవి సమకాలీన సమాజపు పరిస్థితులను ప్రతిబింబిస్తాయి. సాహిత్య ఆధారాలను స్థూలంగా దేశీయ సాహిత్య ఆధారాలు మరియు విదేశీ సాహిత్య ఆధారాలు అనీ రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.

A) దేశీయ సాహిత్య ఆధారాలు (Native Literary Sources): దేశీయ సాహిత్య ఆధారాలు అంటే అవి ఇక్కడే రూపుదిద్దుకొన్న ఆధారాలని అర్థం. ఈ ఆధారాలు చరిత్ర రచనకు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. ప్రాచీన భారతదేశ సాహిత్యం చాలావరకు మతపరమైన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో బాటుగా లౌకిక రచనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్రాచీన భారత దేశ చరిత్ర పునర్నిర్మాణానికి ఎంతగానో దోహదపడుతున్నాయి.

మతపరమైన సాహిత్యం: ప్రాచీన భారతదేశంలో రచనలన్నీ దాదాపుగా మతపరమైనవి. అయినప్పటికీ వీటిలో చారిత్రక వ్యక్తులు మరియు చారిత్రక సంఘటనల గురించి కూడా రాయబడ్డాయి.

బ్రాహ్మణీక గ్రంథాలు: బ్రాహ్మణీక గ్రంథాలు లేదా వేద సాహిత్యం ప్రాచీన భారతదేశ చరిత్ర పునర్నిర్మాణానికి ముఖ్యమైన ఆధారంగా ఉంది. వీటిని సంస్కృత భాషలో రాశారు. వాటిలో పేర్కొనదగ్గవి వేదాలు, వేదాంగాలు, ఉపవేదాలు, ఉపనిషత్లు, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు. ఈ సాహిత్యం అంతా కూడా నాటి సమాజాన్ని ప్రతిబింబించింది. భారతదేశంలోనే అత్యంత ప్రాచీన సాహిత్యమైన ఋగ్వేదం తొలి ఆర్యుల రాజకీయ, సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులను తెలియచేస్తోంది. మిగిలిన మూడు వేదాలైన యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం మలివేద కాలం నాటి ఆర్యుల జీవన విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఉపనిషత్లు భారతీయ తాత్విక ధోరణుల గురించి వివరిస్తాయి. ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలు మలివేద ఆర్యుల కాలం నాటి రాజ్య విస్తరణ, భౌగోళిక, సాంఘిక, ఆర్థిక మత, పరిస్థితులను తెలియచేస్తాయి. అలాగే అష్టాదశ పురాణాలు కూడా ముఖ్యమైన ఆధారాలుగా పరిగణింపబడుతున్నాయి. వీటిలో మత్స్య, వాయు, భవిష్య, విష్ణు, భాగవత పురాణాలు చారిత్రకంగా ముఖ్యమైనవి. ఈ పురాణాల వల్ల ముఖ్యంగా హర్యంక, శిశునాగ, నంద, మౌర్య, శాతవాహన మొదలగు రాజవంశాల చరిత్ర తెలుసుకోవచ్చు.

బౌద్ధ గ్రంథాలు: ఇవి బౌద్ధుల తాత్విక, మతపరమైన గ్రంథాలు. పాళీ, సంస్కృత, మిశ్రమ సంస్కృత భాషల్లో ఈ గ్రంథాలు ఉన్నాయి.

పాళీ గ్రంథాలు: హీనయాన బౌద్ధం పాళీ గ్రంథాలను అనుసరించింది. బుద్ధుడి జ్ఞాన సముపార్జనానంతరం త్రిపిటకాలు ఏర్పడ్డాయి. అవి: 1. సుత్తపీటకం, 2. వినయపీటకం, 3. అభిదమ్మ పీటకం. ఇవి బౌద్ధమత ధర్మం గురించి, ఆచార వ్యవహారాల గురించి, బౌద్ధతత్వాన్ని గురించి చెబుతాయి.

బౌద్ధ సంస్కృత గ్రంథాలు: మహాయాన బౌద్ధం సంస్కృత గ్రంథాలను అనుసరించినట్లు తెలుస్తున్నది. మహాయానంలో బుద్ధుణ్ణి దేవునిగా కొలిచారు. “వైపుల్య సూత్రం” మహాయాన బౌద్ధానికి ముఖ్య గ్రంథం. “లలిత విస్తరం” బుద్ధుని చరిత్రను, బౌద్ధ ప్రపంచాన్ని తెలియజేస్తుంది. “సధర్మ పుండరీక” మహాయానుల మరో పవిత్ర గ్రంథం.

జైనగ్రంథాలు: జైనుల మత గ్రంథాలు అర్థమాగధి, ప్రాకృత భాషల్లో రాశారు. వీటిని పన్నెండు అంగాలు, పన్నెండు ఉపాంగాలు, పరి ప్రకీర్ణాలు, ఆరు చేదసూత్రాలు, నాలుగు మూల సూత్రాలు, నాలుగు వివిధ రకాలైన గ్రంథాలుగా విభజించారు. పన్నెండు అంగాలు జైన భిక్షువులు ఉపాసించవలసిన విధానాలను, జైనమతి తత్వాన్ని, మత జ్ఞానాన్ని, కథలను, జైన గురువులను, స్వర్గ నరకాల వివరణను తెలియజేస్తున్నాయి.

చారిత్రక గ్రంథాలు (Historical Texts): పాళీభాషలో రచించిన ‘దీపవంశ’, ‘మహావంశలు’ శ్రీలంక చరిత్రను వివరిస్తాయి. భారతదేశంలోని బౌద్ధమత వ్యాప్తిని, శ్రీలంకలోని బౌద్ధమత వ్యాప్తిని ఈ గ్రంథాలు వివరిస్తాయి. ఇవి దక్షిణ భారతదేశ చరిత్రను, రాజకీయ పరిస్థితులను కూడా తెలుపుతాయి. దీపవంశం నాలుగు లేదా ఐదో శతాబ్దిలో విరచితమైనట్లు తెలుస్తున్నది. మహావంశ ఐదో శతాబ్ది చివర్లో మహానాముడు రచించాడు. సంస్కృతంలో వెలువడిన మరొక చారిత్రక గ్రంథం కల్హణుడు రచించిన “రాజతరంగిణి” (క్రీ.శ. 1148). ఇది కాశ్మీర్ దేశ రాజుల వంశావళిని వివరిస్తుంది. దీనిలోని కథల్లో చారిత్రక వాస్తవాలు కూడా ఉన్నాయి.

జీవితచరిత్రలు (Biographies): గురువుల, రాజుల జీవిత చరిత్రలను గురించి రాసిన సాహిత్యం మనకు ప్రాచీన కాలంలో చాలా కనిపిస్తుంది. వాటిలో ముఖ్యమైనవి అశ్వఘోషుడు రచించిన “బుద్ధచరితం”, బాణభట్టు రచించిన “హర్షచరితం”, ప్రాకృతభాషలో ముంజరాజు (వాక్పతి) రచించిన “గౌడవహూ” చాంద్ బర్దాయ్ రచించిన “పృధ్వీరాజ్ సో”. బుద్ధచరితం కనిష్కుని కాలానికి సంబంధించింది. హర్షచరితం హర్షుని చరిత్రను, గౌడవూ కనోజ్ రాజైన యశోవర్మని కాలానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తున్నాయి.

శాస్త్రీయ, సాంకేతిక గ్రంథాలు (Scientific and Technical Books): ఈ గ్రంథాలు ప్రాచీన భారతదేశంలోని శాస్త్ర, సాంకేతిక ప్రగతితో పాటుగా చారిత్రక విషయాలను వివరిస్తాయి. ఆనాటి ప్రపంచంలో భారతదేశం ఖగోళం, గణితం వైద్య రంగాలలో, ఏవిధమైన ప్రగతి సాధించిందనే విషయాన్ని ఇవి తెలియచేస్తాయి. వరాహమిహురుడు రాసిన ‘పంచసిద్ధాంతిక’ భారతీయ ఖగోళ శాస్త్రానికి బైబిల్ లాంటిది. అలాగే ఆర్యభట్టు దశగీతికసూత్ర, సూర్యసిద్ధాంత, రోమక సిద్ధాంత, ఆర్యభట్టీయం అనేవి రచించాడు. చరక సంహిత అనేది వైద్య రంగానికి సంబంధించిన గ్రంథం. సంగం సాహిత్యం: ప్రాచీన భారత చరిత్ర రాయడానికి మరో ముఖ్యమైన ఆధారంగా తమిళంలో విరచితమైన “సంగమ సాహిత్యం”ను చెప్పవచ్చు. సంగం సాహిత్యమనేది తమిళ కవుల సృష్టి. ఈ సాహిత్యం చేర, చోళ, పాండ్య రాజుల వంశావళిని పేర్కొంది. వీటిలో తమిళదేశ సంస్కృతి, సమకాలీన స్థితిగతులు స్పష్టంగా ప్రతిఫలిస్తున్నాయి

B) విదేశీ వాఙ్మయాధారాలు (Foreign Literary Sources): అనాది కాలం నుంచి విదేశీ యాత్రికులు భారతదేశాన్ని సందర్శించి, తమ అనుభవాలను గ్రంథస్తం చేశారు. ఈ విధంగా గ్రీకులు, చైనీయులు, ముస్లింలు, ఐరోపా వారి రచనలు మన దేశానికి సంబంధించిన ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. వీటి సహాయంలో చరిత్రను పునర్నిర్మించవచ్చు.

గ్రీక్ ఆధారాలు: ప్రాచీన భారత చరిత్ర రాయడానికి గ్రీక్ ఆధారాలు చాలా ముఖ్యమైనవి. స్కైలాక్స్ రాసిన “ది అకౌంట్ ఆఫ్ ది జర్ని ఆఫ్ స్కైలాక్స్” మనకు లభించలేదు. హెరోడోటస్ (క్రీ.పూ. 483-430) భారతదేశాన్ని గురించి తన గ్రంథంలో రాశాడు. డేరియస్ ద్వారా వాయవ్య భారతదేశం గురించి తెలుసుకొన్న సమాచారాన్ని హెరోడోటస్ గ్రంథ రూపంలో రాశాడు, ఇది మన చరిత్రకు ఆధారం అయింది.

మెగస్తనీస్ అనే గ్రీస్ దేశస్థుడు సెల్యూకస్ నికేటర్ రాయబారిగా చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి విచ్చేసి, ఆ కాలపు పరిస్థితులను వివరంగా “ఇండికా” అనే గ్రంథంలో రాశాడు. అయితే ఆ గ్రంథం ఇప్పుడు లభ్యం కావడం లేదు. ఆ గ్రంథంలోని కొన్ని ముఖ్యాంశాలను స్ట్రాబో, డియోరస్, ఆరియన్ తమ గ్రంథాల్లో పేర్కొన్నారు. అలాగే టాలమీ రాసిన “భూగోళం” (Ptolemy’s Geography), ఒక అజ్ఞాత రచయిత రాసిన “ది పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియక్ సి” (The Periplus of the Erythraean Sea)లు భారతదేశంలోని తీర ప్రాంతాల గురించి వివరించాయి. చైనా ఆధారాలు: బౌద్ధ పవిత్ర స్థలాలను చూడటానికి, బౌద్ధమత గ్రంథాలను సేకరించడానికి చైనా బౌద్ధబిక్షువులు భారతదేశం వచ్చారు. వారు తమ గ్రంథాల్లో ఆనాటి భారతదేశాన్ని గురించి వివరంగా రాస్తూ, తాము చూసిన సందర్శించిన ప్రదేశాల గురించి వివరంగా తెలిపారు. వారిలో ప్రముఖుడు ఫాహియాన్. అతను ఐదో శతాబ్దంలో “ఫో-కో-కి” (Fa kosuoki) అనే గ్రంథంలో మధ్య ఆసియా గురించి, వాయవ్య భారతదేశం, గంగాలోయ గురించి, శ్రీలంక, జావాలను గురించి వివరంగా రాశాడు. హ్యూయాన్ త్సాంగ్ అనే మరో చైనా దేశస్థుడైన బౌద్ధభిక్షువు హర్షుని కాలంలో భారతదేశానికి వచ్చి, హర్షుడి ఆస్థానాన్ని దర్శించాడు. అతడు “సి-యూ-కి” అనే గ్రంథంలో విశిష్టమైన విలువలు ఉన్న చారిత్రక విషయాలను స్పష్టంగా వివరించాడు. ఇత్సింగ్ (Itsing) అనే మరో యాత్రికుడు ఇండోనేషియా నుంచి సముద్రయానం చేసి భారతదేశాన్ని చేరాడు. సంస్కృత గ్రంథాలు, బౌద్ధుల ఆచార వ్యవహారాల గురించి తన గ్రంథంలో స్పష్టంగా తెలిపాడు.

ముస్లిం ఆధారాలు: మహ్మదీయ చరిత్రకు సంబంధించిన ఆధారాలు క్రీ.శ. 7 లేదా 8 శతాబ్దాల నుంచి లభ్యమవు తున్నాయి. అల్బెరూనీ ఇబ్బతూత, బరౌనీ, అమీర్ ఖుస్రూ, ఫెరిష్టా మొదలైనవారి రచనలు మధ్యయుగ భారతదేశ చరిత్రకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.

ప్రశ్న 4.
ప్రాచీన భారతదేశ చరిత్ర పునర్నిర్మాణానికి పురావస్తు ఆధారాలు ఏవిధంగా దోహదపడతాయో చర్చించండి ?
జవాబు.
ప్రాచీన కాలపు అవశేషాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పురాతత్త్వశాస్త్రం అని అంటారు. ఇది ప్రాచీన భారతదేశ చరిత్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోంది. తవ్వకాలు, అన్వేషణలో లభించిన శిథిలాలు, అవశేషాలు, కట్టడాలు (వాస్తు), శిల్పాలు, చిత్రాలు, శాసనాలు, నాణేలు, మట్టి పాత్రలను పురావస్తు ఆధారాలుగా పేర్కొంటారు.
భారతదేశంలో పురావస్తు పరిశోధనకు, జాతీయ స్మారక భవనాల పరిరక్షణకు, సంరక్షణకు భారత పురావస్తు శాఖ (ASI) బాధ్యత వహిస్తుంది.

భౌతిక అవశేషాలు (Material remains): భౌతిక అవశేషాలలో భాగంగా వివిధ రకాలైన మానవ, జంతు అవశేషాలు, రాతి, ఎముక పరికరాలు, ఇనుము, మృణ్యయ పాత్రలు, భవన శిధిలాలు ఉంటాయి. సింధులోయ, నర్మదాలోయ, కృష్ణ, గోదావరి తీరప్రాంతాల్లో, మధ్య భారతదేశంలోని జొహల్ పూర్, బళ్ళారి, ఛోటానాగపూర్, అస్సాం, పాండిచ్చేరి, పరిసర ప్రాంతాల్లో వీటిని కనుక్కోగలిగారు. ఇవి భారతదేశ ప్రాక్ చరిత్ర పునర్నిర్మాణానికి దోహదం చేశాయి.

కట్టడాలు (Monuments): భారతదేశం ప్రాచీనకాలం నుంచి వాస్తు సంపదకు పెట్టింది పేరు. దీన్ని హిందూ, బౌద్ధ, జైనఇండో-ఇస్లామిక్, ఆధునిక వాస్తుగా పేర్కోవచ్చు. ఈ కట్టడాలు ప్రాచీన, మధ్య, ఆధునిక కాలాలకు సంబంధించినవి. ఉపయోగించిన విధానాన్ని బట్టి వాస్తును మతపరమైన, లౌకికమైన వాస్తుగా కూడా గుర్తించవచ్చు. (Religious and Secular Architecture) ఇందుకు ముఖ్య కారణం వీటిని నిర్మించిన విధానాలే. ఇవి కూడా ఆ కాలపరిస్థితుల ప్రతిబింబాలే. వీటిని క్షుణ్ణంగా పరీక్షిస్తే వాటి లక్షణాలను బట్టి అవి ఏకాలానికి చెందినవో మనకు తెలుస్తుంది.

శిల్పాలు (Sculptures): సింధులోయ నాగరికత కాలం నుంచి నేటి వరకు, మనకు అనేక రకాలైన శిల్పాలు లభ్యమయ్యాయి. వీటిని వివిధ రకాలైన పదార్థాలతో తయారుచేశారు. శిల్పాల తయారీ విధానం, లక్షణాలు, ఆకాల పరిస్థితులను ప్రతిబింబిస్తాయి.

చిత్రాలు (Paintings): మొదటి నుంచి భారతదేశంలో చిత్రకళ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రాక్ చరిత్రకు సంబంధించిన ప్రాక్ చారిత్రక చిత్రాలు (Pre-Historic Paintings) మనకు లభించాయి. అలాగే, క్రీ.పూ. రెండో శతాబ్దం నుంచి నేటివరకు, అనేక ప్రదేశాల్లో కుడ్య చిత్రాలు, లఘుచిత్రాలు, వస్త్రంపై చిత్రాలు (Canvas paintings) మొదలైనవి లభ్యమయ్యాయి.

మట్టిపాత్రలు: మట్టిపాత్రలు కూడా తవ్వకాల్లో సింధులోయ నాగరికత నుంచి నేటి వరకు లభ్యమౌతున్నాయి. వీటిని అనేక రకాల మట్టితో చేసినట్లు తెలుస్తున్నది. కాల్చని మట్టి పాత్రలతోపాటు కాల్చిన మట్టి పాత్రలు కూడా తవ్వకాల్లో లభించాయి. వీటిపై మెరుగులు (Polish) పెట్టేవారు. కొన్ని రకాలైన మట్టిపాత్రల పై బొమ్మలను కూడా చిత్రించారు. వీటిలో కొన్నింటిమీద విదేశీ ప్రభావం కూడా కనిపిస్తున్నది. దీనికి నాగార్జున కొండ, పాండిచ్చేరిలో దొరికిన మట్టిపాత్రలే నిదర్శనం. భారతదేశంలో లభ్యమైన మట్టి పాత్రలు అనేక రూపాల్లో, పరిమాణాల్లో (చిన్న, పెద్ద) ఉన్నాయి. ఇలాగే రకరకాలైన మట్టి పూసలు అనేక రంగుల్లో, పరిమాణాల్లో లభించాయి. వీటివల్ల ఆ కాలంలో అలంకరణకు ఉన్న ప్రాముఖ్యం అర్థమౌతుంది.

శాసనాలు (Inscriptions): పురావస్తు ఆధారాల్లో అత్యంత విశ్వసనీయమైనవి మరియు ముఖ్యమైనవి శాసనాలు. ఇవి చరిత్రకు సంబంధించిన వాస్తవాలను అందిస్తాయి. శాసనాల అధ్యయనాన్ని ఎపిగ్రఫీ అని అంటారు. శాసనాలను రాళ్లపైన, స్తంభాలపైన, భవనాల గోడలపైన, దేవాలయ గోడలపైనా గమనించవచ్చు. ఇవే కాకుండా ముద్రికలపైనా, రాగి రేకులపైనా (తామ్ర శాసనాలు) కూడా శాసనాలను లిఖించడం జరుగుతుంది. వివిధ ప్రయోజనాల కోసం శాసనాలు రాయబడుతాయి. శాసనాల్లో తెలిపిన సమాచారం ఆధారంగా వాటిని వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. కొన్ని శాసనాలు వంశ వృక్షాలను, రాజ ఉత్తర్వులను, రాజులు సాధించిన ఘనతను, వారి దిగ్విజయాలను (ప్రశస్తి), మతపరంగా ఇచ్చిన దాన విశేషాలను తెలియచేస్తాయి. భారతదేశంలో సంస్కృతం, పాళీ, తమిళం, కన్నడం, తెలుగు మొదలైన వివిధ భాషల్లో శాసనాలు లభించాయి. అలాగే పురాతన లిపులైన ఖరోష్టి, బ్రహ్మీల్లో రాయబడిన శాసనాలు కూడా లభించాయి. వీటిలో కనిపించే భాషాశైలి, విషయాలు, మనకు ఆ కాలపు పరిస్థితులను స్పష్టంగా తెలియజేస్తాయి.

భారతదేశంలో మొదటిసారిగా అధికసంఖ్యలో లభ్యమైన శాసనాలు అశోకునివి. అతడు చక్రవర్తి అయినప్పటినుంచి వేయించిన రాతి శాసనాలు నేటి వరకు కూడా పదిలంగా ఉన్నాయి.

తాళపత్ర గ్రంథాలు కూడా చరిత్ర నిర్మాణానికి తోడ్పడతాయి. గుజరాత్లోని జైనతాళపత్ర గ్రంథాల్లో చిత్రాలను కూడా గీశారు. అలాగే మొగలుల కాలానికి చెందిన “అక్బర్ నామా” “బాబర్ నామా”లు గుడ్డపై రాసినవి. ముస్లిమ్ రాజులు కూడా అనేక శాసనాలను వేయించారు. ఈ విధంగా వంశ చరిత్రలను, రాజకీయ, పరిపాలన, సామాజిక, ఆర్థిక, మత విషయాలను శాసనాలు తెలియజేస్తున్నాయి.

నాణేలు (Coins): చారిత్రక ఆధారాల్లో నాణేలు ముఖ్యమైనవి. నాణేలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘న్యూమిస్మాటిక్స్’ అని అంటారు. నాణేలను భూమిలోనుంచి తవ్వకాల ద్వారా కానీ భూఉపరితలం పైనుంచి కానీ సేకరిస్తారు. నాణేలను సాధారణంగా బంగారు, వెండి, కంచు, మిశ్రమ లోహాలతో తయారుచేస్తారు. నాణేలపై అనేక రకాలైన బొమ్మలు, దేవతాప్రతిమలు, రాజుల ప్రతిమలు, వారి పేర్లు, తేదీలను కూడా ముద్రించేవారు. అవి దొరికిన ప్రదేశాన్ని ‘ బట్టి, అవి చలామణీలో ఉన్న ప్రాంతంను, పరోక్షంగా ఆ రాజ్య సరిహద్దులను కూడా సూచిస్తాయి. అవి ఏ కాలానికి చెందినవో, ఏ రాజువో అవి దొరికిన ప్రదేశాన్ని బట్టి కూడా చెప్పవచ్చు. నాణేల ముద్రణలో, వాటిపై ముద్రించిన భాష, లిపి, ప్రతిమల విషయంలో ప్రతి రాజవంశం కూడా తనదైన శైలిని అనుసరించింది. ప్రజల ఆర్థిక స్థితిగతులను తెలియచేయడంలో కూడా నాణేల ప్రాధాన్యత ఉంది. వ్యాపార, వాణిజ్య విషయాలను తెలియచేస్తూ, అనేక రాజవంశాల చరిత్రను పునర్నిర్మించడానికి నాణేలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇవే కాకుండా ఇతర ఎన్నో చారిత్రక విషయాలను వెలుగులోకి తేవడంలో నాణేలు ముఖ్యమైన పాత్ర పోషించాయి.

TS Inter 1st Year History Study Material Chapter 1 చరిత్ర, భౌగోళిక పరిస్థితులు 1
మొత్తం మీద నాణేల ద్వారా ఆ కాలంనాటి రాజకీయ, ఆర్థిక సామాజిక మరియు మత పరిస్థితులను తెలుసుకోవచ్చు.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న1.
చరిత్ర ప్రాముఖ్యతను గురించి రాయండి.
జవాబు.
చరిత్ర సామాజిక శాస్త్రాలకు తల్లి లాంటిది. చరిత్ర అంటే రాజ్యాలు, రాజవంశాలకు చెందిన సంఘటనలు, తేదీల వర్ణన మాత్రమేకాదు. అంతకన్నా సమాజం, మానవ పరిణామ క్రమాన్ని తీర్చిదిద్దిన అన్నీ అంశాలను సమగ్రంగా వివరించేదే చరిత్ర. దీని అధ్యయనం అంటే లక్షల సంవత్సరాల మానవుల గత చిహ్నాలను తెలుసుకోవడమే. ప్రజలు ఎక్కడ, ఎప్పుడు, ఏవిధంగా తమ సంస్కృతులను అభివృద్ధి పరచుకున్నారనే విషయాన్ని చరిత్ర తెలియచేస్తుంది. అనేక కారణాల దృష్ట్యా చరిత్ర అధ్యయనం అనేది ప్రాముఖ్యత కలిగిన అంశంగా చెప్పవచ్చు. ప్రస్తుత మన సాంస్కృతిక మూలాలను చరిత్ర తెలియచేస్తుంది. ఆలోచించడం, అర్థం చేసుకోవడం, పరిశోధనా వైఖరిని అలవరుచుకోవడం లాంటి జీవన నైపుణ్యాలను చరిత్ర మనకు అందిస్తుంది.

TS Inter 1st Year History Study Material Chapter 1 చరిత్ర, భౌగోళిక పరిస్థితులు

ప్రశ్న 2.
భారతదేశ భౌగోళిక లక్షణాలు.
జవాబు.
ప్రాచీన కాలంలో భారతదేశాన్ని ‘భరతవర్షం’గా పిలిచేవారు. భరతుని భూమిగా, దేశప్రజలను భరతసంతతిగా అభివర్ణించారు. భారతదేశాన్ని పురాణాల్లో జంబూద్వీపం అనేవారు. ఈ దేశానికి ‘ఇండియా’ అనేది మరొక పేరు.

సింధూనది ప్రవహిస్తున్న దేశం కాబట్టి దీన్ని సింధూదేశంగా గ్రీకులు, పారశీకులు వ్యవహరించారు. క్రమంగా ‘సింధు’ పారశీకుల ఉచ్చారణలో ‘హిందు’గా, గ్రీకుల ఉచ్చారణలో ‘ఇండ్’గా మారింది. కాలగమనంలో హిందా, హిందూస్తాన్ ఈ దేశం వ్యవహరింపబడింది.

భారత ఉపఖండానికి భౌగోళిక పరిస్థితులు సహజ రక్షణను కల్పిస్తున్నాయి. ఉత్తరాన హిమాలయ పర్వతశ్రేణికి, తూర్పువైపు బంగాళాఖాతం, దక్షిణం వైపు హిందూమహాసముద్రం, పడమటివైపు అరేబియా సముద్రం సహజమైన ఎల్లలుగా ఉన్నాయి. దేశంలోని పర్వతాలు, మైదానాలు, పీఠభూములు, తీర ప్రాంతాలు దేశచరిత్ర గతిని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించాయి.

ప్రశ్న3.
బ్రాహ్మణీక గ్రంథాలు.
జవాబు.
బ్రాహ్మణీక గ్రంథాలు లేదా వేద సాహిత్యం ప్రాచీన భారతదేశ చరిత్ర పునర్నిర్మాణానికి ముఖ్యమైన ఆధారంగా ఉంది. వీటిని సంస్కృత భాషలో రాశారు. వాటిలో పేర్కొనదగ్గవి వేదాలు, వేదాంగాలు, ఉపవేదాలు, ఉపనిషత్లు, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు. ఈ సాహిత్యం అంతా కూడా నాటి సమాజాన్ని ప్రతిబింబించింది. భారతదేశంలోనే అత్యంత ప్రాచీన సాహిత్యమైన ‘ఋగ్వేదం తొలి ఆర్యుల రాజకీయ, సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులను తెలియచేస్తోంది. మిగిలిన మూడు వేదాలైన యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం, మలివేద కాలం నాటి ఆర్యుల జీవన విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఉపనిషత్లు భారతీయ తాత్విక ధోరణుల గురించి వివరిస్తాయి. ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలు మలివేద ఆర్యుల కాలం నాటి రాజ్య విస్తరణ, భౌగోళిక, సాంఘిక, ఆర్థిక మత, పరిస్థితులను తెలియచేస్తాయి. అలాగే అష్టాదశ పురాణాలు కూడా ముఖ్యమైన ఆధారాలుగా పరిగణింపబడుతున్నాయి. వీటిలో మత్స్య, వాయు, భవిష్య, విష్ణు, భాగవత పురాణాలు చారిత్రకంగా ముఖ్యమైనవి. ఈ పురాణాల వల్ల ముఖ్యంగా హర్యంక, శిశునాగ, నంద, మౌర్య, శాతవాహన మొదలగు రాజవంశాల చరిత్ర తెలుసుకోవచ్చు.

ప్రశ్న4.
బౌద్ధ సాహిత్యం.
జవాబు.
బౌద్ధగ్రంథాలు: ఇవి బౌద్ధుల తాత్విక, మతపరమైన గ్రంథాలు. పాళీ, సంస్కృత, మిశ్రమ సంస్కృత భాషల్లో ఈ గ్రంథాలు ఉన్నాయి.
పాళీ గ్రంథాలు: హీనయాన బౌద్ధం పాళీ గ్రంథాలను అనుసరించింది. బుద్దుడి జ్ఞాన సముపార్జనానంతరం త్రిపిటకాలు ఏర్పడ్డాయి. అవి: 1. సుత్తపీటకం, 2. వినయపీటకం, 3. అభిదమ్మ పీటకం. ఇవి బౌద్ధమత ధర్మం గురించి, ఆచార వ్యవహారాల గురించి, బౌద్ధతత్వాన్ని గురించి చెబుతాయి.

సంస్కృత గ్రంథాలు: మహాయాన బౌద్ధం సంస్కృత గ్రంథాలను అనుసరించినట్లు తెలుస్తున్నది. మహాయానంలో బుద్ధుణ్ణి దేవునిగా కొలిచారు. “వైపుల్య సూత్రం” మహాయాన బౌద్ధానికి ముఖ్య గ్రంథం. “లలిత విస్తరం” బుద్ధుని చరిత్రను, బౌద్ధ ప్రపంచాన్ని తెలియజేస్తుంది. “సద్ధర్మ పుండరీక” మహాయానుల మరో పవిత్ర గ్రంథం.

ప్రశ్న5.
జైన సాహిత్యం.
జవాబు.
జైనుల మత గ్రంథాలు అర్థమాగధీ, ప్రాకృత భాషల్లో రాశారు. వీటిని పన్నెండు అంగాలు, పన్నెండు ఉపాంగాలు, పరి ప్రకీర్ణాలు, ఆరు చేదసూత్రాలు, నాలుగు మూల సూత్రాలు, నాలుగు వివిధ రకాలైన గ్రంథాలుగా విభజించారు. పన్నెండు అంగాలు జైన భిక్షువులు ఉపాసించవలసిన విధానాలను, జైనమతి తత్వాన్ని, మత జ్ఞానాన్ని, కథలను, జైన గురువులను, స్వర్గ నరకాల వివరణను తెలియజేస్తున్నాయి.

ప్రశ్న6.
సంగం సాహిత్యం.
జవాబు.
ప్రాచీన భారత చరిత్ర రాయడానికి మరో ముఖ్యమైన ఆధారంగా తమిళంలో విరచితమైన “సంగమ సాహిత్యం”ను చెప్పవచ్చు. సంగం సాహిత్యమనేది తమిళ కవుల సృష్టి. ఈ సాహిత్యం చేర, చోళ, పాండ్య రాజుల వంశావళిని పేర్కొంది. వీటిలో తమిళదేశ సంస్కృతి, సమకాలీన స్థితిగతులు స్పష్టంగా ప్రతిఫలిస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనవి “కురల్”, “శిలప్పాధికారం”, “ఎట్టుతోగై”, “పట్టుపట్టు”, “పదినెన్ కిల్ కణక్కు మొదలైనవి. ఇవి క్రీ.శ నాలుగో శతాబ్దం వరకు గల విషయాలను అందిస్తున్నాయి.

TS Inter 1st Year History Study Material Chapter 1 చరిత్ర, భౌగోళిక పరిస్థితులు

ప్రశ్న7.
గ్రీకు రచనలు.
జవాబు.
ప్రాచీన భారత చరిత్ర రాయడానికి గ్రీక్ ఆధారాలు చాలా ముఖ్యమైనవి. స్కైలాక్స్ రాసిన “ది అకౌంట్ ఆఫ్ ది జర్ని ఆఫ్ స్కైలాక్స్” మనకు లభించలేదు. హెరోడోటస్ (క్రీ.పూ. 483-430) భారతదేశాన్ని గురించి తన గ్రంథంలో. రాశాడు. డేరియస్ ద్వారా వాయవ్య భారతదేశం గురించి తెలుసుకొన్న సమాచారాన్ని హెరోడోటస్ గ్రంథ రూపంలో
రాశాడు, ఇది మన చరిత్రకు ఆధారం అయింది.

మెగస్తనీస్ అనే గ్రీస్ దేశస్థుడు ‘సెల్యూకస్ నికేటర్ రాయబారిగా చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి విచ్చేసి, ఆ కాలపు పరిస్థితులను వివరంగా “ఇండికా” అనే గ్రంథంలో రాశాడు. అయితే ఆ గ్రంథం ఇప్పుడు లభ్యం కావడం లేదు. ఆ గ్రంథంలోని కొన్ని ముఖ్యాంశాలను స్ట్రాబో, డియోరస్, ఆరియన్ తమ గ్రంథాల్లో పేర్కొన్నారు. అలాగే టాలమీ రాసిన “భూగోళం” (Ptolemy’s Geography), ఒక అజ్ఞాత రచయిత రాసిన “ది పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సి” (The Periplus of the Erythraean Sea) లు భారతదేశంలోని తీర ప్రాంతాల గురించి వివరించాయి. టాలమీ గ్రంథం ద్వారా భారతదేశంలోని నౌకాశ్రయాలు మరియు రేవు పట్టణాల సమాచారం లభ్యమవుతోంది. అయితే గ్రీకులకు ఇక్కడి భాషా, సంప్రదాయాలపై పూర్తి అవగాహన లేకపోవడం వల్ల వారి రచనల్లో కొన్ని అవాస్తవాలు, వివాదాస్పదాంశాలు చోటుచేసుకొన్నాయి.

ప్రశ్న 8.
చైనా రచనలు.
జవాబు.
బౌద్ధ పవిత్ర స్థలాలను చూడటానికి, బౌద్ధమత గ్రంథాలను సేకరించడానికి చైనా బౌద్ధబిక్షువులు భారతదేశం వచ్చారు. వారు తమ గ్రంథాల్లో ఆనాటి భారతదేశాన్ని గురించి వివరంగా రాస్తూ, తాము చూసిన సందర్శించిన ప్రదేశాల గురించి వివరంగా తెలిపారు. వారిలో ప్రముఖుడు. ఫాహియాన్. అతను ఐదో శతాబ్దంలో “ఫో-కో-కి” (Fa kosuoki) అనే గ్రంథంలో మధ్య ఆసియా గురించి, వాయవ్య భారతదేశం, గంగాలోయ గురించి, శ్రీలంక, జావాలను గురించి వివరంగా రాశాడు. హ్యూయాన్ త్సాంగ్ అనే మరో చైనా దేశస్థుడైన బౌద్ధభిక్షువు హర్షుని కాలంలో భారతదేశానికి వచ్చి, హర్షుడి ఆస్థానాన్ని దర్శించాడు. అతడు “సి-యూ-కి” అనే గ్రంథంలో విశిష్టమైన విలువలు ఉన్న చారిత్రక విషయాలను స్పష్టంగా వివరించాడు. ఇత్సింగ్ (Itsing) అనే మరో యాత్రికుడు ఇండోనేషియా నుంచి సముద్రయానం చేసి భారతదేశాన్ని చేరాడు. సంస్కృత గ్రంథాలు, బౌద్ధుల ఆచార వ్యవహారాల గురించి తన గ్రంథంలో స్పష్టంగా తెలిపాడు.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
చరిత్ర రచనాశాస్త్రం.
జవాబు.
చరిత్ర రచన గురించి తెలిపే శాస్త్రమే చరిత్ర రచనా శాస్త్రం. అంటే ఇది చారిత్రక ఆలోచనల చరిత్ర. చరిత్ర ఏ విధంగా రాయబడింది అనే విషయాన్ని తెలియజేస్తుంది. చరిత్రకారుడు యదార్థ సంఘటనలను ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ద్వారా విషయనిష్ఠత సాధించవలెను.

ప్రశ్న 2.
చరిత్ర పరిధి.
జవాబు.
క్రీ.శ. 18వ శతాబ్దం ప్రారంభం వరకు గత సంఘటనలను వివరించేందుకే చరిత్ర పరిమితమై ఉండేది. అయితే నేడు కాలం, ప్రాంతాలను ఆధారంగా చేసుకొని మానవుని కార్యక్రమాలను అధ్యయనం చేయడం వల్ల చరిత్ర పరిధి విస్తృతమైంది. మానవ ఆవిర్భావం నుంచి నేటి దాకా దీని పరిధి విస్తరించి ఉంది. యుద్ధాలు, విప్లవాలు, సామ్రాజ్య ఔన్నత్య పతనాలు, చక్రవర్తుల అదృష్ట దురదృష్టాలు, సామాజిక వ్యవస్థ పరిణామం, సామాన్యుల జీవితాలు చరిత్రకు ప్రధాన విషయాలు. చరిత్ర అన్ని విజ్ఞాన శాస్త్రాలు, పాఠ్యాంశాలను కలుపుకొని ఉన్న చరిత్ర పరిధికి హద్దులు నిర్దేశించలేం.

ప్రశ్న 3.
హిమాలయాలు.
జవాబు.
హిమాలయ పర్వత శ్రేణి పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ నుంచి తూర్పున మయన్మార్ (బర్మా) వరకు వ్యాపించి ఉంది. దాదాపు 2400 కి.మీ. పొడవు, 300 కి.మీ ఎత్తులో ఇవి ఉత్తరాన పెట్టని గోడ వలే ఉన్నాయి. వీటి విస్తీర్ణం దాదాపు ఐదు లక్షల చదరపు కిలోమీటర్లు. ఎవరెస్టు లేదా గౌరీశంకర్ (ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం). కాంచనగంగ, దౌళగిరి, నంగప్రభాత్, నందాదేవి లాంటి పర్వతశ్రేణులు హిమాలయాల్లోనే ఉన్నాయి.

ప్రశ్న 4.
ఎపిగ్రఫి.
జవాబు.
పురావస్తు ఆధారాల్లో అత్యంత విశ్వసనీయమైనవి మరియు ముఖ్యమైనవి శాసనాలు. ఇవి చరిత్రకు సంబంధించిన వాస్తవాలను అందిస్తాయి. శాసనాల అధ్యయనాన్ని ఎపిగ్రఫీ అని అంటారు. శాసనాలను రాళ్లపైన, స్తంభాలపైన, భవనాల గోడలపైన, దేవాలయ గోడలపైనా గమనించవచ్చు. ఇవే కాకుండా ముద్రికలపైనా, రాగి రేకులపైనా (తామ్ర శాసనాలు) కూడా శాసనాలను లిఖించడం జరుగుతుంది.

ప్రశ్న 5.
భారత పురావస్తుశాఖ.
జవాబు.
ప్రాచీన కాలపు అవశేషాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పురాతత్త్వశాస్త్రం అని అంటారు. ఇది ప్రాచీన భారతదేశ చరిత్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోంది. తవ్వకాలు, అన్వేషణలో లభించిన శిథిలాలు, అవశేషాలు, కట్టడాలు(వాస్తు), శిల్పాలు, చిత్రాలు, శాసనాలు, నాణేలు, మట్టి పాత్రలను పురావస్తు ఆధారాలుగా పేర్కొంటారు. భారతదేశంలో పురావస్తు పరిశోధనకు, జాతీయ స్మారక భవనాల పరిరక్షణకు, సంరక్షణకు భారత పురావస్తు శాఖ (ASI) బాధ్యత వహిస్తుంది.

ప్రశ్న 6.
న్యూమిస్ మాటిక్స్.
జవాబు.
చారిత్రక ఆధారాల్లో నాణేలు ముఖ్యమైనవి. నాణేలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘న్యూమిస్మాటిక్స్’ అని అంటారు. నాణేలను భూమిలోనుంచి తవ్వకాల ద్వారా కానీ భూఉపరితలం పైనుంచి కానీ సేకరిస్తారు. నాణేలను సాధారణంగా బంగారు, వెండి, కంచు, మిశ్రమ లోహాలతో తయారుచేస్తారు.

TS Inter 1st Year History Study Material Chapter 1 చరిత్ర, భౌగోళిక పరిస్థితులు

ప్రశ్న 7.
జీవితచరిత్రలు.
జవాబు.
గురువుల, రాజుల జీవిత చరిత్రలను గురించి రాసిన సాహిత్యం మనకు ప్రాచీన కాలంలో చాలా కనిపిస్తుంది. వాటిలో ముఖ్యమైనవి అశ్వఘోషుడు రచించిన “బుద్ధచరితం”, బాణభట్టు రచించిన “హర్షచరితం”, ప్రాకృతభాషలో ముంజరాజు (వాక్పతి) రచించిన “గౌడవ హెూ”, చాంద్బర్దాయ్ రచించిన “పృధ్వీరాజ్ సో”. బుద్ధచరితం కనిష్కుని కాలానికి సంబంధించింది. హర్షచరితం హర్షుని చరిత్రను, గౌడవ హెూ కనోజ్ రాజైన యశోవర్మని కాలానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తున్నాయి.

TS Inter 1st Year Telugu Study Material Chapter 4 బతుకమ్మ పండుగ

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 4th Lesson బతుకమ్మ పండుగ Textbook Questions and Answers.

TS Inter 1st Year Telugu Study Material 4th Lesson బతుకమ్మ పండుగ

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు- సమాధానాలు

ప్రశ్న 1.
‘బతుకమ్మ’ పండుగ వెనుక ఉన్న ఆచారసంప్రదాయాలను వివరించండి?
జవాబు:
బతుకమ్మ పండుగ అను పాఠ్యభాగం డా. రావి ప్రేమలతచే రచించబడిన ‘జానపద విజ్ఞాన పరిశీలనం’ అనే గ్రంథం నుండి గ్రహించబడింది. దీనిలో బతుకమ్మ పండుగ వెనుక దాగియున్న ఆచార సంప్రదాయాలు వివరించబడ్డాయి.

తెలంగాణా జానపద స్త్రీల ఆచార సంప్రదాయాలలో ఆనందోత్సాహాలతో వెల్లివిరిసేత పండుగ బతుకమ్మ పండుగ. ఈ పండుగ జానపదుల సాహిత్య, సంగీత, నృత్య కళారూపాలకు ప్రతీక. స్త్రీలకు సౌభాగ్యాలనిచ్చే తల్లి గౌరమ్మ ఆమె బతుకమ్మ. భయాన్ని గొలిపే స్వరూపం గౌరమ్మది. నవరాత్రుల సమయంలో తెలంగాణ స్త్రీలు సుకుమారమైన అందమైన రూపంగా భావించి అమ్మవారిని కొలుస్తారు.

బతుకమ్మ పండుగ నాటికి ప్రకృతి అంతా పూలమయం అవుతుంది. స్త్రీల సౌందర్యారాధన, అలంకరణ నైపుణ్యం కళాత్మక దృష్టి పూల బతుకమ్మను పూలతో అలంకరించటంతోనే ఉంటుంది. మహాలయ అమావాస్యనాడు ఎంగిలి బతుకమ్మను పేర్చటంతో బతుకమ్మ పండుగ ప్రారంభమై మహార్నవమి వరకు సాగుతుంది.

ముత్తైదువుల తెల్లవారుజాముననే లేచి అభ్యంగనం స్నానంచేసి అలికి ముగ్గువేసి పూలతో అలంకరిస్తారు. ఉదయం బతుకమ్మను అలంకరించిన సాయంకాలం ఇంటిముందే ఆడతారు. ఆ తరువాత మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొనివెళ్ళి ఊరి మధ్యలోగాని, చెరువుగట్టుపైగాని ఉంచి స్త్రీలందరూ వలయాకారంలో నిలబడి ఒంగి ఒగురుతూ చేతులను తడుతూ పాటలు పాడతారు. చీకటి పడేవరకు ఆడి బతుకమ్మను కాలువలోగాని, చెరువులోగాని,భావిలోగాని వదిలిపెడతారు. బతుకమ్మకు వీడ్కోలు చెపుతారు.

నిద్రపోగౌరమ్మా నిద్రపోవమ్మా
నిద్రకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు
నిను గన్న తల్లికి నిండునూరేండ్లు

TS Inter 1st Year Telugu Study Material Chapter 4 బతుకమ్మ పండుగ

అని పాటలు పాడుతారు. ప్రకృతి నుండి సేకరించిన పూలను మళ్ళీ ప్రకృతికే సమర్పించుకోవటం బతుకమ్మను నీటిలో విడిచిపెట్టడానికి కావచ్చు.

ఎర్రమట్టిని త్రిభుజాకారంలోకి మలచి దానిపై వెంపలిచెట్టు కొమ్మనుంచి పసుపుకుంకుమలతో పూజిస్తారు. ఇలా చేయటం భూమిని స్త్రీ దేవతగా భావించి అర్చించటమే! బతుకమ్మను ఆడేటపనుడు స్త్రీలు పౌరాణిక, నీతిభోధాత్మక, కథా గేయాలను పాడుకుంటారు. బతుకమ్మపండుగలో పాడే పాటల్లో స్త్రీల మనోభావాలు, జీవిత విధానాలు ఒదిగి ఉంటాయి.

“గౌరమ్మ వెనుకను ఉయ్యాలో- గౌరీశ్వరుడు ఉయ్యాలో
భక్తులు పాలించ ఉయ్యాలో- వచ్చేరిసతిగూడి ఉయ్యాలో ‘

ఈ గేయంలో పనిలోనే పరమాత్మను దర్శించమనే బోధ స్త్రీలశ్రమైక జీవనానికి దర్పణం. పనిలోని అలసటను పాటల ద్వారా సులభతరం చేసుకొన్న పరమాత్మ స్వరూపులు స్త్రీలు. పసితనంలో పెళ్ళిళ్ళు చేసి బరువు దింపుకున్న తల్లిదండ్రుతు అల్లారుముద్దుగా తమవద్ద పెరిగిన కూతురిని వియ్యాలవారికి అప్పగిస్తూన్న పాటలో వారి ఆవేదన అర్థమౌతుంది.

“పెరుగు అన్నము పెట్టి ఉయ్యాలో- పెంచుకోండి సీతను ఉయ్యాలో
సద్ది అన్నము పెట్టి ఉయ్యాలో సాదుకోండి సీతను ఉయ్యాలో”

ఈ విధంగా అద్దంలోని కొండ ప్రతిబింబంలాగా బతుకమ్మ పండుగలో తెలంగాణా జానపద స్త్రీల జీవన విధానం, మనస్తత్వం కళలు ప్రతిబింబిస్తాయి.

ప్రశ్న 2.
బతుకమ్మ పండుగలోని సంగీత, సాహిత్య కళాంశాలను పేర్కొనండి?
జవాబు:
బతుతకమ్మ పండుగ అను పాఠ్యభాగం డా. రావి ప్రేమలతచే రచించబడిన ‘జ్ఞానపద విజ్ఞానం పరిశీలనం’ అనే గ్రంథం నుండి గ్రహించబడింది. తెలంగాణా జానపద స్త్రీల ఆచార సంప్రదాయాలు వారి సాహిత్య సంగీత, నృత్య కళారూపాల త్రివేణి సంగమం. సౌభాగ్యదాయిని అయిన గౌరీదేవిని అందమైన పూలతో అలంకరించి పాటలు పాడుతూ ఆడుతూ పూజించటం వారి కళాభిలాషకు ఉదాహరణం.

సుఖదుఃఖాలతో ఉత్సాహ ఉల్లాసాలతో మనసు ఉద్వేగం చెందినపుడే కళారూపాలు ఆవిర్భవిస్తాయి. బతుకమ్మ పండుగ నాటికి ప్రకృతి అంతా పూల మయంగా ఉంటుంది. పంటచేలు నిండు గర్భిణులుగా దర్శనమిస్తాయి. పప్పుధాన్యాలు ఇళ్ళకు చేరతాయి. అలాంటి సంతోష సమయంలో పల్లెపడుచులు తమ మనోభావాలను పాటల ద్వారా నాట్యం చేస్తూ తమ ఆనందపాఠవశ్యాలను సంగీత రూపంలో ప్రకటించుకుంటారు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 4 బతుకమ్మ పండుగ

అలంకరణ:
బతుకమ్మను అలంకరించటమే ఒక కళ. ఉదయాన్నే ఇంటిముందు అలికి రంగు రంగుల ముగ్గులేయటం మరొక కళ. ఒక ఇత్తడి పళ్ళెంలో గుమ్మడి ఆకులను పరచి దానిపై తంగేడు పూలను పేర్చటం, పొడవైన గునుగుపూల చివరలను కత్తిరించి వాటికి రంగులను పూసి ముత్యాలపూలను గుత్తులు గుత్తులుగా అమర్చటం, స్త్రీల కళాభిరుచికి ఒక ఉదాహరణం.

పూవులు ఎక్కువగా దొరికితే మనిషంత ఎత్తుగా బతుకమ్మను అలంకరిస్తారు. పెద్ద బతుకమ్మ లేదా తల్లి బతుకమ్మ ప్రక్కల పిల్ల బతుకమ్మను అమర్చుతారు. ఉదయం బతుకమ్మను పేర్చిన ముత్తయిదువలు సాయంత్రం తమని తాము అలంకరించుకొని ఇంటిముందు ఆటపాటలతో కొంతసేపు కాలక్షేపంచేసి ఆ తర్వాత మేళతాళాలతో ఊరేగింపుగా బతుకమ్మను సాగనంపుతారు.

పాట- నాట్యం : జానపద స్త్రీలు వలయాకారంలో తిరుగుతూ నాట్యం చేస్తూ పాటలు పాడుకుంటారు.

నిద్రపోగౌరమ్మా నిద్రపోవమ్మా
నిద్రకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు
నిను గన్న తల్లికి నిండునూరేండ్లు

అని రాగయుక్తంగా పాడటం వారి కళాసక్తికి నిదర్శనం. జానపదస్త్రీల బొడ్డెమ్మ బతుకమ్మ ఆటలకు మూలం. ఆటవికులు పండుగ సమయాలలో చేసే బృంద నృత్యాలే! పార్వతీపరమేశ్వరులు సాయంత్రం వేళల్లోనే నృత్య పోటీని పెట్టుకునేవారని అందులో ఈశ్వరుడే విజయం సాధించేవాడని ఒక కథనం. తెలంగాణ ప్రాంతంలో ఉంది. అందుకే బతుకమ్మను సాయంత్ర సమయంలో ఆడతారు.

బతుకమ్మ పండుగ ఆటపాటల మేలు కలయిక. స్త్రీల పాటలన్నీ ఒడుదుడుకులు లేకుండా ఒకే స్వరంలో సాగిపోతాయి. వీరు పాడే పాటలకు సంగీత శాస్త్రనియమాలుండవు. అవి చతురస్రగతిలో ‘కిటతక, కిటతకిట అను మాత్రలతో ఉంటాయి.

స్త్రీలు పౌరాణిక గీతాలు, నీతిబోధాత్మక గీతాలు కథాగేయాలను పడుతుంటారు. పాటలోని ప్రతి చరణాంతంలో ఉయ్యాలో, వలలో, చందమామ అని పునరావృతమౌతుం టుంది. ఆ పాటల్లో ప్రతి వనిత యొక్క మనోభావాలు, జీవిత విధానాలు ఒదిగి ఉంటాయి.

“గౌరమ్మ వెనుకను ఉయ్యాలో- గౌరీశ్వరుడు ఉయ్యాలో
భక్తులు పాలించ ఉయ్యాలో- వచ్చేరి సతిగూడి ఉయ్యాలో

వారు పనిచేసే పనిలోని శ్రమను మరచి పోవటం ఈ పాటలలోని అసలు రహస్యం. పనిపాటలు పరమాత్మ స్వరూపాలుగా భావించటం ప్రజల సంప్రదాయం. ఇలా బతుకమ్మ పండుగలో సంగీత సాహిత్య నాట్యాలు కళాంశాలుగా రూపుదిద్దుకుంటాయి.

TS Inter 1st Year Telugu Study Material Chapter 4 బతుకమ్మ పండుగ

II. సంగ్రహరూప ప్రశ్నలు- సమాధానాలు

ప్రశ్న 1.
రావిప్రేమలత రచనలను తెలుపండి?
జవాబు:
బతుకమ్మ పండుగ అను పాఠ్యభాగం రావిప్రేమలతచే రచించబడిన, జానపదవిజ్ఞానం పరిశీలనం అన్న గ్రంథం నుండి గ్రహించబడింది.
రావిప్రేమలత సిద్ధాంత వ్యాసం తెలుగు జానపదసాహిత్యం – పురాగాథలు తొలిరచన. జానపద విజ్ఞానంలో స్త్రీ ప్రేమలత వ్యాససంపుటి. తెలుగు స్త్రీల ముగ్గులపై పరిశోధన చేసి ‘తెలుగు స్త్రీల చిత్రలిపి’ అనే వైవిధ్య భరితమైన గ్రంథాన్ని రాశారు. ఇది బిరుదురాజు రామరాజు జానపదవిజ్ఞాన బహుమతిని, తెలుగు విశ్వవిద్యాలయ ఉత్తమ గ్రంథ పురస్కారాన్ని అందుకున్నది.

ఈమె రాసిన ‘వ్యాసలతిక’ తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ విమర్శ గ్రంథంగా బహుమతినందుకున్నది. డా. కురుగంటి శ్రీలక్ష్మితో కలిసి ‘జానపదవిజ్ఞాన పరిశీలనం’ అన్న వ్యాస సంపుటిని వెలువరించారు. Folk Tales of South India- Andhra Pradesh అన్న కథా సంకలనానికి సంపాదకత్వం వహించారు. ఈమె రచనలన్నీ జానపద సాహిత్యం తోనే ముడిపడి ఉండటం ముదావహం.

ప్రశ్న 2.
బతుకమ్మను పేర్చే విదాధాన్ని వర్ణించండి?
జవాబు:
బతుకమ్మ పండుగ అను పాఠ్యభాగం రావి ప్రేమలతచే రచించబడిన ‘జానపదవిజ్ఞాన పరిశీలనం’ అన్న గ్రంథం నుండి గ్రహించబడింది.

తెలంగాణా జానపదస్త్రీల ఆచార సాంప్రదాయాలతో ఆనందోత్సాహాలతో వెల్లివిరిసేది బతుకమ్మ పండుగ అదే పూలపండుగ. బతుకమ్మ పండుగనాటికి ప్రకృతి పూలమయంగా ఉంటుంది. బతుకమ్మను ఆ పూలతో అందంగా అలంకరిస్తారు. ముందుగా ఇత్తడి పళ్ళెంలో మొదట గుమ్మడి ఆకులను పరచి దానిపై తంగేడు పూలను పరుస్తారు. పొడవైన గునుగు పూలను చివర కత్తిరించి వాటికి పలురంగులు పూస్తారు. ఆ తరువాత ముత్యాల పువ్వులను గుత్తులు గుత్తులుగా అమరుస్తారు.

ఇళ్ళలో ఉండే గన్నేరు, రుద్రాక్ష, గోరింట, బీర పూలను గూడా గుండ్రంగా శిఖరాలలో పేరుస్తారు. శిఖరంపై గుమ్మడి పూలను అలంకరిస్తారు. పసుపుతో త్రికోణాకృతిలో బతుకమ్మను పెట్టడంతో బతుకమ్మను పేర్చే కార్యక్రమం పూర్తి అవుతుంది. బతుకమ్మ ప్రక్కనే పిల్ల బతుకమ్మలను ఉంచుతారు. బతుకమ్మలను కూరాటికుండ వద్దగాని, దేవుడి వద్దగాని పెట్టి నువ్వులు, సెనగపప్పు, పెసరపప్పు, పొడులతో చద్దుల పులిహోర దద్యోన్నంను నైవేద్యంగా అమర్చుతారు. పూలు ఎక్కువగా లభిస్తే మనిషంత ఎత్తు బతుకమ్మలను అమర్చుతారు. త్రికోణం స్త్రీకి సంకేతం. త్రికోణాకారంలో పసుపు ముద్దనుంచటం గౌరీదేవిని ప్రతిష్టించటంగా భావిస్తారు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 4 బతుకమ్మ పండుగ

ప్రశ్న 3.
బొడ్డెమ్మ ఆటను గురించి రాయండి?
జవాబు:
‘బతుకమ్మపండుగ’ అను పాఠ్యభాగం డా. రావి ప్రేమలతచే రచించబడిన ‘జానపద విజ్ఞాన పరిశీలనం’ అను గ్రంథం నుండి స్వీకరించబడింది.

బొడ్డెమ్మఆట బతుకమ్మ ఆటకు పూర్వరంగం బతుకమ్మతోపాటు ఎర్రమట్టిముద్దను త్రిభుజాకారంలో తయారుచేసి దానిపై వెంపలిచెట్టు కొమ్మను పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించి పూజచేస్తారు. దీనిని కూడా నీటిలో నిమజ్జనం చేస్తారు. ఈ బొడ్డెమ్మ ఆట వినాయక చవితి నుండి ప్రారంభమై మహాలయ అమావాస్య నాటికి పూర్తవుతుంది.

బొడ్డెమ్మ ఆటలో ఎర్రమట్టి ముద్దను త్రిభుజాకారంలో మలచటం, పూజించటం భూమిని స్త్రీ మూర్తిగా భావించి అర్చింటమే! ఇది ఆటవికులు భూదేవిని పూజిస్తూ చేసే నాట్యాలలో వలే విందులు వినోదాలతో పాటలతో జరుపబడుతుంది. భూదేవికి ప్రతిరూపమైన బొడ్డెమ్మను పూజించటం, అడవిపూలైన తంగేడు, ముత్యాలపూలతో పూజించటం ఆటవికుల నమ్మకాల ప్రభావంగా భావించాలి.

ప్రశ్న 4.
బతుకమ్మ పాటలోని విశేషాలు ఏమిటి?
జవాబు:
బతుకమ్మ పండుగ అను పాఠ్యభాగం డా. రావి ప్రేమలతచే రచించబడిన ‘జానపద విజ్ఞాన పరిశీలనం’ అను గ్రంథం నుండి గ్రహించబడింది. బతుకమ్మ పండుగ ఆట పాటల మేలు కలయిక. స్త్రీల పాటలన్నీ ఒడిదుడుకులు లేక క్రమగతిలో ఒకే స్వరంలో సాగిపోతాయి. కంఠస్వరంనాళాలకు, గర్భాశయానికి హానికలుగని మధ్యమస్థాయిలో స్త్రీలు పాటలు పాడుతుంటారు.

సహజ సంగీతంతో సాగిపోయే బతుకమ్మ పాటలను సంగీత శాస్త్ర నియమాలు, లక్షణాలతో పనిలేదు. వీరి పాట నాట్యాన్ని అనుసరించి ఉంటుంది. బతుకమ్మ ఆటకు అనుగుణంగా ఉంటాయి. వీరి పాటలు పౌరాణిక గీతాలుగా, నీతి బోధకాలుగా, కథాగేయాలుగా ఉంటాయి. వారి పాటలలో ఉయ్యాలో, వలలో, చందమామ అన్న పల్లవులు ఆవృతాలవుతుంటాయి. సూర్యాస్త సమయంలో బతుకమ్మ పాటలు పాడతారు కాబట్టి “చందమామ” అని, గౌరమ్మను నీటిలో ఓలలాడిస్తారు కావున “వలలో” అని ‘ఊయలవలె’ ఊగుతూ పాడతారు కావున “ఊయాలో” అన్న పదాలుంటాయి.

బతుకమ్మకు వీడ్కోలు చెప్తున్న ఈ పాటలో
“నిద్రపో గౌరమ్మ నిద్రపోవమ్మా
నిద్రకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు…..”

ఈ పాటలో జగజ్జననికి జనని జానపదయువతి. స్త్రీది మాతృ హృదయం. చిన్నారి పాపను జో కొడుతూ పాడే పాటలను బతుకమ్మ పాటగా పాడుతుంది.

TS Inter 1st Year Telugu Study Material Chapter 4 బతుకమ్మ పండుగ

బతుకమ్మ పాటలలో స్త్రీల మనోభావాలు, జీవిత విధానాలు ఒదిగి ఉంటాయి. ఉదాహరణకు.

“గౌరమ్మ వెనుకను ఉయ్యాలో గౌరీశ్వరుడు ఉయ్యాలో
భక్తులు పాలించ ఉయ్యాలో- వచ్చేరిసతిగూడి ఉయ్యాలో ‘

పనులలో అలుపు సొలుపు తెలియకుండా పాడే ఈ పాటలు పరమాత్మ స్వరూపాలు.

III. ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు- సమాధానాలు

ప్రశ్న 1.
రావిప్రేమలత పిహెచ్.డి పరిశోధనాంశం పేరేమిటి?
జవాబు:
“తెలుగు జానపద సాహిత్యం – పురాగాథలు” రావిప్రేమలత పిహెచ్. డి పరిశోధనాంశం.

ప్రశ్న 2.
తెలుగు స్త్రీల ముగ్గులపై రావిప్రేమలత రాసిన గ్రంథం పేరేమిటి?
జవాబు:
“తెలుగు స్త్రీల చిత్రలిపి” రావిప్రేమలత స్త్రీల ముగ్గులపై వ్రాసిన గ్రంథం.

ప్రశ్న 3.
రావిప్రేమలత “వ్యాసలతిక”కు లభించిన పురస్కారం ఏది?
జవాబు:
ఉత్తమ విమర్శన గ్రంథంగా తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం లభించింది.

ప్రశ్న 4.
బతుకమ్మ పండుగలో ఏ పూలకు అగ్రస్థానం ఇస్తారు?
జవాబు:
‘తంగేడు’ పూలకు బతుకమ్మ పండుగలలో అగ్రస్థానం ఇస్తారు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 4 బతుకమ్మ పండుగ

ప్రశ్న 5.
గుమ్మడికాయ, గుమ్మడిపూలు దేనికి సంకేతం?
జవాబు:
గుమ్మడికాయ, గుమ్మడిపూలు ‘సఫలతాశక్తికి’ సంకేతం.

ప్రశ్న 6.
బతుకమ్మ పాటలలోని పల్లవులు ఏవి?
జవాబు:
ఉయ్యాలో, వలలో, చందమామ అనునవి బతుకమ్మ పాటలలో పల్లవులు.

ప్రశ్న 7.
బతుకమ్మ పాటల్లో ఏవి ఒదిగి ఉంటాయి?
జవాబు:
బతుకమ్మ పాటల్లో స్త్రీల మనోభావాలు జీవన విధానాలు ఒదిగి ఉంటాయి.

ప్రశ్న 8.
పప్పుధాన్యాలను పొడిచేసి పెట్టే నైవేద్యాన్ని ఏమంటారు?
జవాబు:
‘సద్దులు’ అంటారు.

బతుకమ్మ పండుగ Summary in Telugu

రచయిత్రి పరిచయం

రచయిత్రి పేరు : డా. రావి ప్రేమలత

పుట్టినతేది : జూన్ 10, 1945

పుట్టిన ఊరు : నల్గొండజిల్లా, నాగిరెడ్డి పల్లె

తల్లితండ్రులు : మనోహరమ్మ, నాగిరెడ్డి

విద్యార్హతలు : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ, పిహెచ్.డి

పిహెచ్ సిద్ధాంత గ్రంథం : తెలుగు జానపద సాహిత్యం – పురాణగాథలు

TS Inter 1st Year Telugu Study Material Chapter 4 బతుకమ్మ పండుగ

రచనలు :

  1. జానపద విజ్ఞానంలో స్త్రీ (వ్యాససంపుటి)
  2. తెలుగు స్త్రీల చిత్రలిపి
  3. వ్యాస లతిక

పురస్కారాలు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ అధ్యాపకురాలిగా తంగిరాల సాహిత్యపీఠం, ఉత్తమ పరిశోధకురాలు’ గా సత్కరించారు.

డా. రావిప్రేమలత జూన్ 10, 1945 ఉమ్మడి నల్గొండ జిల్లా నాగిరెడ్డిపల్లెలో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు మనోహరమ్మ, నాగిరెడ్డిలు, భువనగిరి కళాశాలలో చదివి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ తెలుగు, పిహెచ్.డి పూర్తి చేశారు. నాయని కృష్ణకుమారిగారి పర్యవేక్షణలో “తెలుగు జానపద సాహిత్యం- పురాగాథలు అన్న అంశంపై పరిశోధనచేసి పిహెచ్.డి సాధించారు.

రావి ప్రేమలత జానపద విజ్ఞానం సిద్ధాంతాలనేపధ్యంలో ‘జానపద విజ్ఞానంలో స్త్రీ’ అనే వ్యాససంపుటిని ప్రచురించారు. తెలుగు స్త్రీల ముగ్గులపై పరిశోధన చేసి “తెలుగు స్త్రీల చిత్రలిపి” అన్న వైవిధ్య గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథం బిరుదురాజు రామ రాజు జానపదవిజ్ఞాన బహుమతి, తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమగ్రంథ పురస్కారాన్ని అందుకుంది.

ఈమె ‘వ్యాసలతిక’ సంపుటి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమవిమర్శ గ్రంథంగా పురస్కారం అందుకుంది. డా॥ కురుగంటి లక్ష్మీతో కలిసి ‘జానపదవిజ్ఞాన పరిశీలనం’ అన్న వ్యాససంపుటిని వెలువరించారు. Folk Tales of South India- Andhra Pradesh అనే సంకలనానికి సంపాదకత్వం వహించారు. రావిప్రేమలత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉ త్తమ అధ్యాపకురాలు, తంగిరాల సాహిత్యపీఠం ఉత్తమ పరిశోధకురాలిగా పురస్కారం అందుకున్నారు.

పాఠ్యభాగ సారాంశం

తెలంగాణా జానపద స్త్రీల ఆచారసంప్రదాయాలతో ఆనందోత్సాహాలతో వెల్లివెరిసే పండుగ బతుకమ్మ పండుగ, అదే పూల పండుగ. ఇది జానపద స్త్రీల సాహిత్య, సంగీత, నృత్యకళారూపాల త్రివేణీ సంగమం. స్త్రీల సౌభాగ్య ప్రదాయిని అయిన గౌరీదేవిని బతుకమ్మగా భావించి అందమైన పూలతో మరింత అందంగా అలం కరించుకొని పూజిస్తుంటారు. బతుకమ్మ పండుగనాటికి ప్రకృతి అంతా పూలమయంగా ఉంటుంది. తంగేడు, గునుగు, ముత్యాలపూలు, ప్రకృతికి అందాన్నిస్తాయి. పంట పొలాలు సస్యస్యామలంగా ఉంటాయి.

TS Inter 1st Year Telugu Study Material Chapter 4 బతుకమ్మ పండుగ

మొదటి ఎనిమిది రోజులు బతుకమ్మను నెమ్మదిగా పేరుస్తారు. తొమ్మిదోరోజు పెద్ద పండుగ జరుపుతారు. దానినే ‘సద్దుల’ పండుగ అంటారు. ముత్తైదువలు తెల్లవారుజామున లేని అభ్యంగన స్నానాదికాలు ఆచరించి, అలికి ముగ్గువేసి మగపిల్లలు సేకరించిన పూలతో అలంకరణ ప్రారంభిస్తారు.

ఇత్తడి పళ్ళెంలో మొదట గుమ్మడి ఆకులను పరచి దానిపై తంగేడు పూలను అలంకరిస్తారు. పొడవైన గునుగు పూలను కత్తిరించి వరుసగా పైకి పేరుస్తూ వివిధ రంగులను పూస్తారు. తరువాత ఇళ్ళలో ఉండే గన్నేరు, రుద్రాక్ష, గోరింట పూలను అలంకరించి శిఖరంపై గుమ్మడి పూలనుంచుతారు. త్రికోణ ఆకారంలో పసుపు ముద్దను పెట్టడంతో బతుకమ్మ అలంకరణ పూర్తవుతుంది.

పెద్ద బతుకమ్మ లేదా తల్లి బతుకమ్మ చుట్టురా పిల్ల బతుకమ్మలను పెడతారు. ఇది స్త్రీ మాతృహృదయానికి సంకేతం ఇలా ఉదయం బతుకమ్మను పెట్టిన ముత్తైదువులను సాయంత్రం అలంకరించుకొని ఇంటి ముందే కొంచెంసేపు ఆడుకుంటారు.

ఆ తరువాత మేళ తాళాలతో ఊరేగిస్తూ ఊరి మధ్యలోగాని చెరువు గట్టుపైగాని ఉంచి స్త్రీలంతా వంగి చేతులతో చప్పట్లు కొడుతూ అందరూ కలిసి పాటలు పాడుకుంటారు. చీకటి పడుతుండగా కాలువలోగాని, చెరువులోగాని బావిలోగాని వదిలివేస్తారు. ఆ దృశ్యం ఈశ్వరుని కోసం వెళ్తున్న పార్వతిని తలపిస్తుంది.

నిద్రపో గౌరమ్మ నిద్రపోవమ్మా
నిద్రకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు

పాడుతుంతారు. బతుకమ్మను ఎర్రమట్టి ముద్దతో త్రిభుజాకారంలో చేసి దానిపై వెంపలి చెట్టుకొమ్మను పెట్టి పసుపు కుంకుమలతో పూజించి నీటిలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మకు పూర్వ రంగమైన బొడ్డెమ్మ ఆట వినాయక చవితి నుండి ప్రారంభమై మహాలయ అమావాస్య నాటికి పూర్తవుతుంది.

బతుకమ్మను ఆడేటపుడు స్త్రీలు పౌరాణిక గీతాలను, నీతిబోధాత్మక గీతాలను, కథాగేయాలను పాడుతుంటారు. ఈ పాటలలో ఉయ్యాలో, వలలో, చందమామ పల్లవులుగా ఉంటాయి.

“గౌరమ్మ వెనుకను ఉయ్యాలో- గౌరీశ్వరుడు ఉయ్యాలో
భక్తుల పాలించి ఉయ్యాలో వచ్చిరి సతిగూడి ఉయా అని పాడతారు.

ఈ పాటలు మత విశ్వాసానికి ప్రతీక.
అలాగే పసితనంలో పెళ్ళిళ్ళు చేసి బరువు దిగిపోయిందని తృప్తిచెందే వ్యవస్థ మనది. ఆ పిల్ల అత్తవారికి అప్పగిస్తూ ఎలా చూసుకోవాలో పాటగా విన్పిస్తారు.

“పెరుగు అన్నము పెట్టి – ఉయ్యాలో పెంచుకోండి సీతను ఉయ్యాలో
సద్ది అన్నము పెట్టి- ఉయ్యాలో సాదుకోండి సీతను ఉయ్యాలో ఈ గేయాలతో జానపద స్త్రీల జీవిత విధానాల, మనస్తత్వం- కళలు మనకు కన్పిస్తాయి.

TS Inter 1st Year Telugu Study Material Chapter 4 బతుకమ్మ పండుగ

కఠినపదాలకు అర్థాలు

భీకరస్వరూపం = భయమును గొలిపే రూపము
ఏపుగా = బాగా
మనోరంజకంగా = మనసుకు ఆనందాన్నిచేకూర్చేదిగా
దద్యోన్నం – దధి+అన్నం = పెరుగు అన్నం
విస్తరించు = వ్యాపించ
ముత్తైదువల = మూడు తరాలపాటు భర్తతోడుగా ఉన్న స్త్రీ
వలయాకారం = గుండ్రంగా
ఒడిదుడుకులు = కష్టనష్టాలు
మందలిస్తూ = కోప్పడుతూ
పరిణామం = మార్పు
అతివలు = స్త్రీలు

TS Inter 1st Year Commerce Study Material Chapter 8 Business Finance

Telangana TSBIE TS Inter 1st Year Commerce Study Material 8th Lesson Business Finance Textbook Questions and Answers.

TS Inter 1st Year Commerce Study Material Chapter 8 Business Finance

Long Answer Questions

Question 1.
What is business Finance? Explain its need and significance in the business organizations.
Answer:
Meaning: The requirement of funds by business firm to carryout its various activities is called ‘business finance’.

Finance is considered as the life blood of any organization. The success of an industry depends on the availability of adequate finance. Finance is a vital functional area of business. It deals with procurement of funds and their effective utilisation. A business fundamentally requires identifying its sources of finance from where it can procure funds.

Definition:
According to B.O. Wheeler, “Finance is that business activity which is concerned with the acquisition and conservation of capital funds in meeting the financial needs and overall objectives of a business enterprise”.

Nature and Need:
The financial needs of a business organization can be categorized as follows:
A) Fixed capital requirements:
In order to start business, funds are required to purchase fixed assets like “land and building, plant and machinery and furniture and fixtures”. This is known as fixed capital requirements of the business enterprise. The funds required in fixed assets remain, invested in the business for a long period of time. Different business units need varying amount of fixed capital depending on various factors such as “the nature of business”.

For Example: A trading concern, may require small amount of fixed capital as compared to a manufacturing concern and the need for fixed capital investment would be greater for a large business enterprise, as compared to that of a small enterprise.

B) Working capital requirements:
A business may be small or large, it needs funds for its day-to-day operations. This is known as “Working Capital” of an Enterprise. It is used for holding current assets such as stock of material, bills receivables and for meeting expenses like salaries, wages, taxes and rent. The amount of working capital required varies from one business enterprises to another depending on various factors.

For Example: A business unit selling goods on credit, or having a slow sales turnover, would require more working capital as compared to a concern selling its goods and services on cash basis or having a high turnover.

Significance of Business Finance:
Business needs finance mainly for acquiring various types of assets and to meet various expenses on day to day basis. The significance and need of business finance is explained below:

1. To meet fixed capital requirement of business: To purchase fixed assets like land and building, plant and machinery, furniture and fixtures etc., business requires finance.

2. To meet Working Capital Requirements: Working capital is used for holding current assets such as stock of material, payment of wages, transportation expenses, etc.

3. For growth and expansion: For growth and expansion activities, a business requires finance. It may be required to increase production, to install more machines, to set up a R & D centre etc.

4. For diversification: Entering into new businesses and new lines of activities is known as diversification.

For Example: ITC dealing with tobacco started ITC kakatiya (hotels), Vivel (shampoos & cosmetics), classmate (note books & stationery) etc. So, Business finance is needed to start any new activity in business.

5. For Survival: To carry out the various business operations in continuity, business finance is needed. Without the required finance, organizations cannot survive for longtime.

6. Liabilities: To meet liabilities of business, be it long-term or short, a business requires sufficient finance, e.g, for payment of loan installments, creditors, etc.

7. For payment of Expenses: For paying salaries, wages, taxes, advertisements and rent, finance is needed.

Therefore, to Execute the various plans of the business, finance is needed.

Question 2.
What are the Various factors that determine the selection of sources of finance?
Answer:
Factors determining the choice of sources of finance: Financial needs of a business are of different types; long term, short term, fixed and fluctuating. Therefore, business firms resort to different types of source for raising funds. The following are the Various factors determining the choice of source of finance:

i) Cost: There are two types of cost viz, the cost of procurement of funds and cost of utilizing the funds. Both these costs should be taken into account while deciding about the source of funds that will be used by an organisation.

TS Inter 1st Year Commerce Study Material Chapter 8 Business Finance

ii) Financial strength and stability of operations: The financial strength of a business is also a key determinant. In the choice of source of funds for business should be in a sound financial position. It should be able to repay the principal amount and interest on the borrowed amount.

iii) Form of organisation and legal status: The form of business organisation and status influences the choice of a source for raising money.

For Example: A partnership firm, cannot rise money by issue of equity shares as these can be issued only by a joint stock company.

iv) Purpose and time period: Business should plan according to the time period for which the funds are required. A short-term need can be met through borrowing funds of low rate of interest, through trade credit, commercial paper etc. For long term finance, sources such as issue of shares and debentures are more appropriate.

v) Risk profile: Business should Evaluate each of the source of finance in terms of the risk involved.

For Example: There is a least risk in equity as the share capital has to be repaid only at the time of winding up and dividends need not be paid if no profits are available.

On the other hand A loan has a repayment schedule for both the principal and the interest. The interest is required to be paid, irrespective of the firm earning a profit or incurring a loss.

vi) Control: A particular source of fund may affect the control and power of the owners on the management of a firm.

For Example: As equity share holders enjoy voting rights, financial institutions may take control of the assets or impose conditions as part of the loan agreement. Thus, business firm should choose a source keeping in mind the extent to which they are willing to share their control over business.

vii) Effect on credit Worthiness: The dependance of business on certain sources may affect its credit worthiness in the market. For example, issue of secured debentures may affect the interest of unsecured creditors of the company and may adversely affect their willingness to extend further loans as credit to the company.

viii) Flexibility and ease: Another aspect affecting the choice of a source of finance is the flexibility and ease of obtaining funds. Restrictive provisions, detailed investigation and documentation. In case of borrowings from banks and financial institutions business organisations may not prefer it, if other options are readily available.

ix) Tax benefits: Various sources may also be weighed in terms tax benefits.

For Example: While the dividend on preference shares is not tax deductible, interest paid on debentures and loan is tax deductible. Therefore, be preferred by organisations seeking tax advantage.

TS Inter 1st Year Commerce Study Material Chapter 8 Business Finance

Short Answer Questions

Question 1.
Explain the need and nature of business finance?
(or)
Question 2.
What are the various types of capitals required for business enterprises?
Answer:
The financial needs of a business organization can be categorized as follows:
A) Fixed capital requirements:
In order to start business, funds are required to purchase fixed assets like land and building, plant and machinery, furniture and fixtures. This is known as fixed capital requirements of the business enterprise. The funds required in fixed assets remain invested in the business for a long period of time. Different business units need varying amount of fixed capital depending on various factors such as the Nature of business etc.

For Example: A trading concern may require small amount of fixed capital as compared to a manufacturing concern and the Need for fixed capital investment would be greater for a large business enterprise, as compared to that of a small enterprise.

B) Working Capital requirements: A business may be small or large it needs funds for its day-to-day operations. This is known as ‘Working Capital” of an enterprise, it is used for holding current assets such as stock of material, bills receivables and for meeting expenses like salaries, wages, taxes, and rent.

The amount of working capital required varies from one business enterprises to another depending on various factors.

For Example: A business unit selling goods on credit, or having a slow sales turnover, would require more working capital as compared to a concern selling its goods and services on cash basis or having a high turnover.

The requirement for fixed and working capital increases with the growth and expansion of business. Sometimes, additional funds are required for upgrading the technology employed so that the cost of production can be reduced.

Question 3.
Explain the classification of sources of finance.
Answer:
The sources of funds can be categorized using different basis viz, On the basis of the period, on the basis of the ownership and on the basis of source of generation. The brief explanation about classification of sources is given below.

A) On the Basis of period: On the basis of period, sources of funds can be categorized into three ways. They are:

  • Long-term finance,
  • Medium-term finance and
  • Short-term finance.

1) Long-term finance: The long-term sources fulfill the requirements of an enterprise for a period exceeding five years and include sources such as:

  • Shares and debentures
  • Long-term borrowings, and
  • Loans from financial institution.

Such financing is generally for the acquisition of fixed assets such as Land and buildings, equipment, plant and machinery etc.

2) Medium-term-finance: Where the funds are required for a period of more than one year but less than five years, medium-term sources of finance are used. These sources include:

  • borrowing from commercial banks,
  • public deposits,
  • lease financing and
  • loans from financial institutions.

3) Short-term sources of finance: Short-term funds are those which are required for short duration i.e., a period not exceeding one year.

Trade credit, loans from commercial banks, indigenous Bankers, installment credit, advances, bank over drafts, cash credits and commercial papers are some of the example of short-term sources.

B) On the basis of Ownership: On the basis of ownership, the sources can be classified into 2 types of funds. They are 1) owner’s funds 2) Borrowed funds.

1) Owners funds: It means funds that are provided by the owners of an enterprise, which may be a sole trader or partners or shareholders of a company. It also includes profits reinvested in the business.
Issue of Equity shares and retained earnings are the two important sources from where owner’s funds can be obtained.

2) Borrowed funds: It refers to the funds raised through loans or borrowings. The sources for raising borrowed funds include loans from commercial banks, loans from financial institutions, issue of debentures, public deposits & Trade credit.

C) On the basis of Generation: On the basis of Generation the sources of finances can be generated from 1) Internal source of funds; 2) External source of funds.

1) Internal Sources of funds are those which are generated from within the business. Such as ploughing back of profits, retained earnings, collection of receivables, disposing of surplus inventories and depreciation of funds etc.

2) External Sources of funds include those sources that lie outside an organization, such as shares, debentures, public deposits, borrowing from commercial banks and financial institutions, suppliers, lenders and investors.

TS Inter 1st Year Commerce Study Material Chapter 8 Business Finance

Very Short Answer Questions

Question 1.
Business finance.
Answer:
1) The requirement of funds by business firm to carryout its activities is called “Business finance”. Business finance is viewed as “the business activity which is concerned with the acquisition and conservation of capital funds in meeting the financial needs and overall objectives of a business enterprise”.

2) Finance is considered as the life blood of the organization. A business fundamentally require to identifying its sources of finance from where it can procure funds.

Question 2.
Fixed capital.
Answer:
1. The capital which is used to acquire fixed assets such as land and buildings, plant and machinery etc., is called fixed capital. Capital used by the business organisations to meet the long term requirements is called fixed capital or block capital.

2. The amount of fixed capital required by the business concern depends on the size and nature of business. A trader concern may required small amount of fixed capital than a manufacturing concern.

Question 3.
Working capital.
Answer:
1. The capital required by a business enterprise to run its day-to-day operations such as purchase of raw materials, payment of wages and holding current assets like stock of raw materials, bills receivable is called working capital.

2. The amount of working capital required varies from business to business Generally trading concerns require more working capital as compared to manufacturing concerns.

Question 4.
Long-term finance.
Answer:
1. The funds raised for a period of exceeding five years is known as long-term finance. Long-term finance is essential for investing funds in fixed assets like land and buildings, plant and machinery etc.

2. Requirement of the long-term finance depends on size, nature of business and level of technology used. Sources of long-term finance are issue of shares and debentures, long term loans from financial institutions, retained earnings etc.

TS Inter 1st Year Commerce Study Material Chapter 8 Business Finance

Question 5.
Short term finance.
Answer:
1. The finance required for a period of not exceeding one year is called short-term finance. Short-term finance is utilised for meeting working capital requirements of the business.

2. The amount required for short-term funds depends on nature of business order and delivery time, volume of business and operating cycle. The sources of short-term finance are trade credit, bank credit, installment credit, customer advance etc.

Question 6.
Internal sources of finance.
Answer:
1. Internal sources of funds are those which are generated from within the business.
2. The sources ploughing back of profits, retained earnings, collection of receivables, disposing of surplus inventories and depreciation of funds etc.

Question 7.
External sources of finance.
Answer:
1. External sources of funds are those sources that lie outside the business organization.
2. The sources include shares, debentures, borrowings from commercial banks, financial institutions, suppliers, lenders, and investors.

TS Inter 1st Year English Study Material Chapter 3 The Beggar

Telangana TSBIE TS Inter 1st Year English Study Material 3rd Lesson The Beggar Textbook Questions and Answers.

TS Inter 1st Year English Study Material 3rd Lesson The Beggar

Annotations (Section – A, Q. No. 2, Marks : 4)

Question 1.
Have you sighted anyone.
With shadows in his dusky eyes?
Answer:
Introduction :
These are the opening lines of the poem, “The Beggar” written by Dr. Ammangi Venugopal, a popular Telugu poet. He has written in Telugu as Bichchagadu. It is translated into English by Elanaaga, (Dr. Surendra).

Context & Explanation:
The poem projects the intense grief and suffering of the farmers. A farmer today is misery incarnate. His eyes speak volumes about farmers’ sorrow. The poet minces no words in highlighting their woes. He opens the poem with a question. It identifies farmers with dark eyes that are filled with the shadows of their struggles. The reader, addressed as ‘you’, is forced to understand and sympathise with farmers. Therefore the lines play an important role in initiating the thought process effectively.

Critical Comment:
The poet portrays the pathetic plight of farmers. He is questioning the reader to make him to think about the farmers.

కవి పరిచయం :
ఈ ప్రారంభ వాక్యాలు, ప్రముఖ తెలుగు కవి డా. అమ్మంగి వేణుగోపాల్ గారు వ్రాసిన The Beggar’ అను పద్యం లోనివి. ఇతను తెలుగులో ‘Bichchagadu’ అను పేరుతో వ్రాశాడు. దీన్ని Elanaaga ఇంగ్లీషులోకి తర్జుమా చేశాడు.

సందర్భం :
రైతుల దయనీయ స్థితిని కవి చిత్రీకరిస్తున్నాడు ఇక్కడ.

వివరణ :
రైతుల యొక్క తీవ్రమైన బాధను మరియు దుఃఖాన్ని ఈ పద్యం మన ముందుకు తెస్తుంది. రైతు ఈ రోజు దుఃఖావతారమెత్తాడు. వారి కళ్ళు వారి దుఃఖాన్ని గురించి పుంకాను పుంకాలుగా చెప్తున్నాయి. తడుముకోకుండా, వెతుక్కోకుండా కవి పదాలను ఉపయోగించి రైతుల బాధలను తెలియజేస్తున్నాడు. తన పద్యాన్ని ప్రశ్నతో ప్రారంభించాడు. బాధ జాడలతో నిండిన రైతుల కన్నీళ్ళను గురించి తెలియజేస్తుంది. పాఠకులను రైతుల బాధలను అర్థంచేసుకొని, దయచూపమని కోరుకుంటుంది. కాబట్టి ఈ వాక్యాలు మన ఆలోచనా విధానాన్ని ప్రారంభించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

TS Inter 1st Year English Study Material Chapter 3 The Beggar

Question 2.
A food giver he is, With ability to mitigate the sky’s hunger. *(Imp, Model Paper)
Answer:
Introduction:
These lines are taken from the thought provoking poem, ‘The Beggar’, penned by Dr. Ammangi Venugopal, a prolific Telugu poet. Actually, it is written in Telugu as Bichchagadu. Later, it is translated into English by Elanaaga as ‘The Beggar’.

Context & Explanation:
The poet describes the struggles and sufferings of the farmers in a touching way. They are the food providers to all. They produce food and satisfy other’s hunger. Their ability remains fully active. They are able to reduce the hunger of even skies. They work hard and help others. But, the irony is that they struggle to survive. Their stomachs get no food. So the reader is forced to understand their problems and own up them.

Critical Comment:
Here the poet depicts the difficulties of farmers and their capacity to produce food for us.

కవి పరిచయం :
ఈ వాక్యాలు డా. అమ్మంగి వేణుగోపాల్ గారు వ్రాసిన ‘బిచ్చగాడు’ అను పద్యం లోనివి. ఈ పద్యాన్ని తెలుగులో వ్రాశాడు. దీన్ని Elanaaga ఇంగ్లీషులోకి తర్జుమా చేశాడు.

సందర్భం :
కవి ఇక్కడ రైతుల యొక్క బాధలను మరియు మనకు ఆహారం అందించే వారి శక్తిని గురించి వివరిస్తున్నాడు.

వివరణ :
రైతుల బాధలను మరియు దుఃఖాన్ని మన మనస్సును కదిలించే విధంగా వివరిస్తున్నాడు. రైతులు మనందరికి ఆహారాన్ని అందిస్తారు. ఆహారోత్పత్తి చేసి ఇతరులు ఆకలిని తీర్చుతారు. వారి శక్తి అమితం. వారు ఆకాశం ఆకలిని సహితం తీర్చగల సమర్థులు. ఎప్పుడూ కష్టపడతారు. ఇతరులకు సహాయం చేస్తారు. అయితే ఇప్పుడు ఆ రైతే జీవన పోరాటం చేస్తున్నాడు. ఆకలి తీర్చే రైతే ఆకలితో అలమటిస్తున్నాడు. కాబట్టి పాఠకులు రైతుల బాధలను అర్థంచేసుకొని, రైతులంటే ఎవరో కాదు, వారు మన ప్రాణదాతలు అని గుర్తించాలి.

TS Inter 1st Year English Study Material Chapter 3 The Beggar

Question 3.
His stomach is full of infinite void.
Answer:
Introduction:
This heart touching line is taken from the thought provoking poem, ‘The Beggar’, penned by Dr. Ammangi Venugopal, a famous Telugu poet. His original Telugu poem, Bichchagadu is rendered into English by Elanaaga (Dr. Surendra).

Context & Explanation:
The poet tries to draw the attention of readers to the gravity of farmers’ problems. It is because farmers work hard. They help others. They are the food providers to all yet the irony is that they struggle to survive. They starve. They don’t find food for themselves, even a morsel! Their stomachs get no food. They suffer from empty stomachs. Their emptiness is infinite. Thus, the poet highlights farmers’ woes and worries in a touching way. He also compels the readers to ponder over possible solutions.

Critical Comment:
Here the poet depicts the pathetic condition of farmers in a touching way.

కవి పరిచయం :
మనస్సును కదిలించే ఈ పదాలను Dr. అమ్మంగి వేణుగోపాల్ రచించిన ‘బిచ్చగాడు” అను పద్యం నుండి గ్రహించబడినవి. ఈ పద్యంను, ఇతడు తెలుగులో వ్రాయటం జరిగింది. Elanaaga దీన్ని ఇంగ్లీషులోకి తర్జుమా చేశాడు.

సందర్భం :
రైతుల యొక్క దయనీయ స్థితిని మన మనస్సును కదిలించే విధంగా వివరిస్తున్నాడు.

వివరణ :
రైతుల బాధలను, పాఠకులు గ్రహించే విధంగా వివరిస్తున్నాడు. ఎందుకంటే, రైతులు కష్టపడతారు. ఇతరులకు సాయం చేస్తారు. మనందరికీ, ఆహారం అందిస్తున్నారు. అయితే, అన్నదాతలు నేడు జీవన పోరాటం చేస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. వారికి అన్నం మెతుకు కరువైంది.

వారి పొట్టలకు పట్టెడన్నం పెట్టే వారేలేరు. తిండి లేక ఖాళీ కడుపులతో బాధపడుతున్నారు. అంతులేని ఆకలితో అలమటిస్తున్నారు. అలా రైతుల దుఃఖాలను, బాధలను గురించి మన మనస్సులను కదిలించేలా వర్ణిస్తున్నాడు. అదేవిధంగా, సాధ్యమైన పరిష్కారాలను గురించి ఆలోచించాలని పాఠకులను కోరుతున్నాడు.

TS Inter 1st Year English Study Material Chapter 3 The Beggar

Question 4.
Have you seen a beggar at your threshold with severed hands?
Brother, he is my farmer !
Answer:
Introduction:
These are the concluding lines of the poignant poem ‘The Beggar’ penned by Dr. Ammangi Venugopal, a popular Telugu poet. He has written it in Telugu as Bichchagadu. Later, it is translated into English by Elanaaga as The Beggar.

Context & Explanation:
The poet describes the struggles and sufferings of the farmers. They are capable of feeding millions, but those millions are not including farmers in them. Food providing farmers are forced to become food – seeking beggars. Farmers struggling to survive. They are suffering from lack of food.

They are at thresholds for food. So, the poet tells the reader that the man who is at his threshold is none other than the farmer. The poet talks about the farmer as ‘My Farmer’. The reader is forced to understand and sympathise with farmers. He questions the reader, to make reader to think about the problem.

Critical Comment:
These lines are descibes present pathetic condition of the farmers.

కవి పరిచయం :
మనస్సును కదిలించే ఈ పదాలను Dr. అమ్మంగి వేణుగోపాల్ రచించిన ‘బిచ్చగాడు’ అను పద్యం నుండి గ్రహించబడినది. ఈ పద్యంను ఇతడు, తెలుగులో వ్రాయటం జరిగింది. Elanaaga దీన్ని ఇంగ్లీషులోకి తర్జుమా చేశాడు.

సందర్భం :
ఆహారాన్ని అందించే రైతు అన్నం అడుక్కునే భిక్షగాడిగా బలవంతంగా మార్చబడ్డాడు. రైతులు 24 గంటలూ, సంవత్సరం పొడుగునా శ్రమిస్తారు. టన్నుల కొద్ది ఆహార ధాన్యాలను పండిస్తారు. ఆ ఆహార ధాన్యాలు లక్షలాది మంది ఆకలిని తీరుస్తాయి. మీరు అలా ఆహారం తీసుకుంటుంటే, మీ ఇంటి ముందు ఓ భిక్షగాడు కనిపిస్తాడు. అతను గాయాలతో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు తింటున్న ఆహారాన్ని పండించింది ఆయనే నా రైతు! వివరణ : ఈ పంక్తులు ప్రస్తుత సమయంలోని రైతుల దయనీయ స్థితిని వివరిస్తున్నాయి.

Paragraph Questions & Answers (Section – A, Q.No. 4, Marks : 4)

Question 1.
“Dr. Ammangi Venugopal’s creativity is rooted deeply in the complexities and contradictions of modern life”, say observers.
Explain the statement, taking The Beggar’ as a reference point.
Answer:
The poem, The Beggar is written by Dr. Ammangi Venugopal. He is a creative genius. Actually, he has penned it in Telugu as Bichchagadu. It is translated into English by Elanaaga (Dr. Surendra). Dr. Ammangi is well aware of the complexities and contradictions of modern life. The complex problems farmers today face form the central idea of his moving poem.

TS Inter 1st Year English Study Material Chapter 3 The Beggar

Farmers are the food providers to all. They struggle to survive. They starve, yet, they toil. Their feet bleed. Their eyes are full of shadows of their sad stories. Their hunched backs tell us how hard they work. Yet, their stomachs get no food. They are capable of feeding millions. And those millions do not include in them those farmers. How cruel the modern society responsible for this irony is! Thus, the poem shows the complexities of current times.
TS Inter 1st Year English Study Material Chapter 3 The Beggar 2
బిచ్చగాడు అను పద్యం అమ్మంగి వేణుగోపాల్ వ్రాశాడు. ఇతను ఒక సృజనాత్మక మేధావి. ఇతను ఈ పద్యంను తెలుగులో వ్రాశాడు. దీన్ని Elanaaga ఇంగ్లీషులోకి తర్జుమా చేశాడు. ఆధునిక జీవన సంక్లిష్టతలు మరియు విరుద్ధాలు గురించి డా॥ అమ్మంగికి బాగా తెలుసు. నాడు రైతులు ఎదుర్కొంటున్న క్లిష్ట సమస్యలు ఈ పద్యం యొక్క ప్రధానమైన విషయం. అందరికీ ఆహారం అందించేది రైతులు.

నాడు వారు జీవన పోరాటం చేస్తున్నారు. వారు ఆకలితో ఉన్నారు. అయితే, వారు కష్టపడతారు. వారి పాదాలు రక్తం ఒడ్డుతున్నాయి. వారి కళ్ళు వారి విషాద కథల ఛాయలతో నిండి ఉన్నాయి. వారి వంగిన నడుములు వారు ఎంత కష్టపడతారో తెలియజేస్తాయి. అంత కష్టపడినప్పటికీ, వారి కడుపుకి తిండిలేదు. లక్షల మందిని పోషిస్తున్నారు, ఆ లక్షల మంది ఈ రైతులను వారిలో వారుగా గుర్తించటం లేదు. ఆధునిక సమాజం ఎంత క్రూరమైందో ఈ వ్యత్యాసం తెలుపుతుంది. అలా ఈ పద్యం ప్రస్తుత రైతుల క్లిష్ట పరిస్థితులను తెలియపరుస్తుంది.

Question 2.
How does the poem, The Beggar’ describe the farmer’s pathetic physical condition?
Answer:
The poem, The Beggar, by Dr. Ammangi Venugopal portrays the pathetic condition of farmers. It depicts the difficulties farmers face in a touching way. The poet talks about, the farmer as ‘my farmer’. It shows that the poet also belongs to the family of a farmer. So, he describes the pitiable physical position of farmers.
TS Inter 1st Year English Study Material Chapter 3 The Beggar 3
It forms an important part of the poem. It identifies farmers with dark eyes that are filled with the shadows of their struggles and sufferings. Their backs are bent with burden. Their hands are soiled and severed. Their feet bleed. Yet, their ability to produce food and satisfy other’s hunger remains fully active. They work hard and help others. Yet, they struggle to survive. They starve. Their stomachs get no food. They suffer from empty stomachs. Their faces are filled with wretchedness. Thus the reader is forced to understand and sympathise with farmers.

డా॥ అమ్మంగి వేణుగోపాల్ రచించిన ‘బిచ్చగాడు’ రైతుల దయనీయ పరిస్థితిని చిత్రీకరిస్తుంది. రైతులు నాడు ఎదుర్కొంటున్న కష్టాలను ఈ పద్యం వివరించి మనల్ని కదిలిస్తుంది. కవి రైతును నా రైతు అని సంబోధిస్తున్నారు. కవి కూడా రైతు మీ కుటుంబానికి సంబంధించినవాడే అని తెలియజేస్తున్నాడు. లేదా తన వాడుగా భావిస్తున్నాడు. కావున, రైతుల దయనీయమైన భౌతికస్థితిని వివరిస్తున్నాడు. రైతు యొక్క ప్రస్తుత స్థితియే ఈ పద్యం యొక్క ముఖ్య విషయం.

TS Inter 1st Year English Study Material Chapter 3 The Beggar

బాధలు మరియు కష్టాలతో నిండిన నల్లటి ఛాయలు ఏర్పడిన కళ్ళతో ఉంటారు. వారు శ్రమ భారంతో నడుములు వంగి గూనివారిగా తయారయ్యారు. వారి చేతులు మట్టిమయమై దారుణంగా ఉన్నాయి. పాదాలు రక్త మోడుతున్నాయి. అయినప్పటికీ ఆహారోత్పత్తి శక్తి మరియు ఇతరుల ఆకలి తీర్చాలనే సంకల్పం వారిలో సజీవంగా ఉంది. కష్టపడతారు మరియు ఇతరులకు సహాయపడతారు. అయితే, ప్రస్తుతం వారు జీవన పోరాటం చేస్తున్నారు. ఆకలితో ఉన్నారు. అన్నదాతలకు అన్నం కరువైంది. ఖాళీ కడుపులతో ఉన్నారు. వారి మొఖాలు దౌర్భాగ్యంతో, దయనీయ స్థితిలో నిండి ఉన్నాయి. ఆ విధంగా, రైతులను అర్థంచేసుకొని వారిపట్ల దయచూపమని పాఠకులను కోరుతున్నాడు ఈ పద్యం ద్వారా.

Question 3.
List the abilities a farmer is endowed with, according to the poem.
Answer:
Dr. Ammangi Venugopal is a creative genius. He is well aware of the abilities of a farmer. In his poem, The Beggar, the poet minces no words in depicting farmers’ abilities. They are the food providers to all. Their eyes are dark with shadows of their struggles and sufferings. Their backs are bent with burden.

Their hands are soiled and severed. Their feet bleed. Yet, their ability to produce food and satisfy others’ hunger remains fully active. They work hard and help others. They are capable of feeding millions. They reduce and satisfy the hunger of even skies. Thus, the poem is endowed with the abilities of a farmer.

డా॥ అమ్మంగి వేణుగోపాల్ గారు ఒక సృజనాత్మక మేధావి. రైతు యొక్క శక్తి గురించి ఇతనికి బాగా తెలుసు. తన బిచ్చగాడు అను పద్యంలో, రైతుల సామర్థ్యంలు గురించి వివరించటానికి పదాలు వెతుక్కోకుండా వర్ణిస్తున్నాడు. రైతులు మనందరికి ఆహారప్రదాతలు. అన్నదాతల కళ్ళు కష్టాలు మరియు బాధలతో నల్ల ఛాయలు నిండి ఉన్నాయి. కష్టం వల్ల, వారి నడుములు వంగి గూని వచ్చింది.

చేతులు మట్టితో నిండి దయనీయంగా ఉన్నాయి. పాదాలు రక్తం కక్కుతున్నాయి. అయినప్పటికీ, ఇతరులు ఆకలి తీర్చుటకు మరియు ఆహార ఉత్పత్తికి వారి సామర్థ్యం అదే చురుగ్గా ఉంది. వారు కష్టపడతారు మరియు ఇతరులకు సహాయం చేస్తారు. వారు లక్షల మందిని పోషించగలరు. వారు ఆకాశంల ఆకలి సహితం తీర్చగలరు. ఈ విధంగా, రైతుల సామర్థ్యం గురించి ఈ పద్యం వివరిస్తుంది.

TS Inter 1st Year English Study Material Chapter 3 The Beggar

Question 4.
The poet addresses the reader as you and talks about the farmer as my farmer. Explain the significance in a paragraph.
Answer:
Dr. Ammangi Venugopal has written the poem in Telugu as Bichchagadu. It is translated into English as the ‘The Beggar’ by Elanaga, (Dr. Surendra) the poem portrays the pitiable condition of the farmers. In the last stanza the poet describes the farmer as a beggar. It is due to his condition at present society.

The farmers are suffering from lack of food. They become beggars. They are at the thresholds for food. So, the poet tells the reader that the beggar at the threshold of the reader is none other than the farmer. The reader is addressed as ‘you’ to understand and sympathise with farmers. The poet tells about the farmer as ‘My farmer’. The reader is moved to ponder over the problem and find away out.
TS Inter 1st Year English Study Material Chapter 3 The Beggar 4
ఈ పద్యాన్ని తెలుగులో బిచ్చగాడుగా డా॥ అమ్మంగి వేణుగోపాల్ వ్రాశాడు. దీన్ని ‘The Beggar’ గా ఆంగ్లంలోకి ‘ఏలనాగ’ అను కలంపేరుతో డా॥ సురేంద్ర అనువదించాడు. రైతుల దయనీయ స్థితిని ఈ పద్యం చిత్రీకరిస్తుంది. చివరి చరణంలో రైతుని బిచ్చగాడిగా వివరిస్తున్నాడు. ప్రస్తుతం సమాజంలో అతని స్థితి వల్ల అలాగ వివరించాడు. రైతులు ఆకలితో అలమటిస్తున్నారు. వారు బిచ్చగాళ్ళు అయ్యారు.

వారు ఆహారం కోసం గుమ్మాల వద్ద ఉన్నారు. కావున పాఠకుడి గుమ్మం ముందు ఉన్నది ఎవరో కాదు రైతన్నే అని కవి చెపుతున్నాడు. రైతులను అర్థం చేసుకొని దయచూపమని పాఠకుడిని ‘నీవు’ అని సంభోదిస్తున్నాడు కవి. రైతన్నను నా రైతు అంటున్నాడు. సమస్య గురించి ఆలోచించి, మార్గాన్ని కనుగొనమని, పాఠకుడిని నిలదీస్తున్నాడు.

TS Inter 1st Year English Study Material Chapter 3 The Beggar

The Beggar Summary in English

TS Inter 1st Year English Study Material Chapter 3 The Beggar 1

Dr. Ammangi Venugopal is a creative genius. He is well aware of the complexities and contradictions of modern life. This poem is penned by him in Telugu as Bichchagadu. It is translated into English by Elanaago (Dr. Surendra) as The Beggar. The poem portrays the pathetic plight of farmers.

The pitiable physical position of farmers forms an important part of the poem. Farmers’ dusky eyes are dark with shadows of their struggles and sufferings their backs are bent with burden. Their hands are soiled and severed and their feet bleed. Yet their ability to produce food and satisfy other’s hunger remains fully active.

Here the poet owns up the farmer. So, he says that he is his farmer. He is a food giver. He is able to reduce and satisfy the hunger of even skies. He works hard. He helps others by producing tons of crops. Yet, the irony is that they don’t find food for themselves, even a morsel their stomachs are full of empty. Their faces are filled with wretchedness.

But, the seeds the farmer sows sprout as if they are his hands. He toils hard to produce food we eat. Here, the reader is addressed as you. It is because the reader is forced to under stand and sympathise with farmers. The poet asks the reader if he/she has seen a beggar at their threshold with severed hands when they want to eat hastily hot rice meal.

TS Inter 1st Year English Study Material Chapter 3 The Beggar

He is none other than the farmers who produced the food, they (readers) are going to eat. Owing to the circumstances, the farmer becomes a beggar the poet says “He is my farmer”. Question forms set the readers to think about the problem. The reader is moved to ponder over the problem and find a way out. Thus, the poem depicts the difficulties farmers face in a touching way.

The Beggar Summary in Telugu

సామాజిక స్పృహ, మానవతా దృక్పథం మెండుగా ఉన్న మన కాల, మన ప్రాంత ఆలోచనాపరుడు, విద్యావేత్త అయిన డా॥ అమ్మంగి వేణుగోపాల్ విస్తృతంగా వివిధ రకాల రచనలు చేసిన కవి. వారి కదిలించే కవిత ‘బిచ్చగాడు’. ఆ తెలుగు కవితను ఆంగ్లంలోకి అనువదించినవారు ఎలనాగ అనే కలం పేరు కల డా॥ ఎన్. సురేంద్ర.

‘The Beggar’ పేరుతో ఉన్న ఈ పద్యము, రైతుల బాధలను చిత్రిస్తుంది. అన్నదాతగా, దేశానికి వెన్నెముకగా, జై కిసాన్ స్తుతించబడే రైతన్న గుక్కెడు మెతుకుల కోసం ‘అన్నమో రామచంద్రా’ అని ఆక్రందనలు వినిపించే దైన్యస్థితిలోకి నెట్టబడ్డాడు ఆధునిక సమాజపు స్వార్థ, క్రూర కోరలతో ! అత్యంత దయనీయ స్థితిలో ఉన్న రైతన్న దైన్యతకు అక్షరీకరణ ఈ పద్యం. వారి మాటలకు సరళ సారాంశం :

కంటి నిండా బాధల నీడలతో మేఘాల మసకలు నిండిన వారిని మీరు చూశారా ? పని భారంతో కృంగి, వంగిన వీపుతో, చేతి నిండా భూమాతకు జీవంపోసే మట్టిపొరలు కల వ్యక్తిని గమనించారా ? నెత్తురు ఓడే పాదాలతో, భూమాతకు రక్తాభిషేకం చేస్తూ అడుగులు వేస్తున్న వారిని గుర్తించారా మీరు ? సోదరా, అతనే నా రైతన్న. అన్నదాత, ఆహార ప్రదాత అతను ! ఆకాశపు అంతం లేని ఆకలిని కూడా తీర్చగల శక్తిశాలి ఆ రైతన్న ! కానీ, విధి విచిత్రమా, క్రూరలీలనా కానీ, అందరి ఆకలిని తీర్చే ఆ రైతన్న కడుపు మాత్రం నిత్యం ఖాళీనే, ఆకలి మంటలే! అతని ముఖం నిండా తాండవిస్తున్నది శ్రమ తాలూకు, బాధల తాలూకు ముడతలు, చింతలూ ! ఆయన నాటిన గింజలు మొలకెత్తుతాయి, ఆయన చేతుల చెమటను, రక్తాన్ని తేమగా గ్రహించి, చేతులే మొలిచాయా అన్నట్లు ! వేడి, వేడి అన్నాన్ని ఆవురావురంటూ తినే సమయంలో, చేతినిండా గాయాలతో ‘అమ్మా, ఒక్క ముద్ద అన్నం’ అని మీ ఇంటి ముంగిట కేకలు వేసే భిక్షగాడిని ఒకడిని చూశారా ? సోదరా, అతనే నా రైతన్న! మనందరి ఆకలిని తీర్చడానికి, కర్పూరంలా తను కరుగుతూ మూర్తీభవించిన శ్రమ రూపం, త్యాగరూపం, దైన్యరూపం ఇంకా ….

TS Inter 1st Year English Study Material Chapter 3 The Beggar

The Beggar Summary in Hindi

वर्तमान समय के हमारे प्रांत के आलोचक एवं विविध विधाओं के लेखक एंव कवि हैं, डॉ. अम्मंगि वेणुगेपाल जिनमें सामाजिक जिम्मेदारी और मानवता के दृष्टि कोण से ओत प्रोत है । ‘भिक्षुक’ ‘The Beggar’ उनकी मार्मिक कविता है, जो तेलुगु में लिखी गई है। ‘एलनामा’ उपनाम विख्यात् डॉ. एन. सुरेंद्र ने इसका अँग्रेजी में अनुवाद किया है। इस कविता में किसान की व्यथा – बाधाओं का चितण है । अन्नदाता, देश की रीढ़ की हड्ड़ी, जय किसान के रुप में स्तुत्य किसान भैया आधुनिक समाज के स्वार्थपूरित, क्रूर दंशों से मुद्ध भर दाने के लिए तरसने की दीन हीन स्थिति में भोंक दिया गया। एसे किसान – भैए की दीनता अक्षर – बद्ध की गई इस कविता में –

क्या आपने उन्हें देखा है, जिनकी आँखें बाधाओं की छायाओं से और बादनों के धुंधलेपन से भरी हुई हैं ? क्या काम के बोझ से झुके हुए कुबड़े को जो अपने पूरे हाध्यें से भूमाता को जीवित रखते हुए मिहरी – परतों वाले को ध्यान से देखा ? क्या खून बहाते हुए भूमाता को अभिबिकत करते हुए कदम बढ़ाते हुए आदमी को पहचान लिया ? भैया, वही मेरा किसान भाई, अन्नदाता और आहार प्रदाता । आसीमित भूख को भी मिटा सकनेवला है वह किसांन भैया।

किंतु क्या वह किस्मत का खेल है या क्रूर लीला है कि सब की भूख मिटानेवाले किसान भैया का पेट तो हमेशा खाली है, क्षुदा ज्वालाओं से भरा होता है । उसके चहरे पर श्रभ एवं व्यथाओं के वलय प्रतिबिंबित हैं । उस से बोए हुए बीन अंकुरित होते हैं। मानो उसके हाथों के पसीने और खून का गीलेपन पाकर हाथ ही अंकुरित हुए हो । आप गरम-गरम खाना भकोसते समय, क्या घायल हाथों से ‘माता भिक्षांदेही’ कहकर आपके दरवाजे पर पुकारनेवाले एक भिक्षार्थी को देखा ? भैया, वही है मेरा किसान भैथा । हम सब की भूख मिटाने कपूर – सा जलता हुआ, गलता हुआ, वह साक्षात् श्रम का साकार रूप है, त्यागमूर्ति है, दरिद्र नारायण है, और
…….

Meanings and Explanations

sight (v) / sait / (సైట్) (monosyllabic): seen, చూచుట , देखना, अवलोकन करना

dusky (adj) / ‘dëski / (డస్కి) (disyllabic) : having a dark shade (indicating intense pain) దుఃఖం, బాధలో నలుపెక్కిన, धुँधला, मतमैला

hunchback (n) / ‘hantsbæk / (హంచ్ బ్యాంక్) (disyllabic) : a bent, curled forward back, గూని గల, వంగిపోయిన , कुबड़ा, मुकना

blood-tinged (adj) / blåd-tınd3d / (బ్లడ్ టీంజ్ డ్) (disyllabic) : showing / having marks of blood, రక్తపు మరకలతో, खून के धश्बो के साथ

TS Inter 1st Year English Study Material Chapter 3 The Beggar

footprints (ఫుట్ ప్రింట్): outlines of the foot, కాలి జాడలు, पांव, पैर

mitigate (v) / mitigeit / (మితిగెఇట్) (trisyllabic) : reduce, lessen, (here) satisfy, nowo, (ఇక్కడ సంతృప్తి చెందించటం, తీర్చటం, घटाना, कमकरना

hunger (హుంగెర్) : desire for food, ఆకలి, भूक

infinite (adj) / infinət / (ఇన్ ఫినెట్ ) (trisyllabic): very great in amount, without limits, అంతులేని, అపారమైన, अनंत

void (n) / vɔd / (వో ఇద్) (monosyllabic) : emptiness, ఖాళీ, (ఆకలితో) వట్టి, ఏమియులేని , रिकित

replete (adj) / ripli:t / (రిప్లిట్) (disyllabic) : filled to full, పూర్తిగా నిండియున్న , भरापूरा, परिपूर्ण

wretchedness (n) / retsidnǝs / (రేచిద్ వస్) (trisyllabic) : unhappiness, sorrow, దుః ఖం, దౌర్భాగ్యం, दुःख, कमबख्ती, मानसिक – शारीरिक बाधा की रथिति

seeds (సీడ్స్) : విత్తనాలు, बीज

sow (సో): plant, విత్తు, నాటుట, सुअरी

sprout (v) / spraut / (స్ప్రౌట్ ) (monosyllabic) : to grow from a seed, germinate, మొలచు అంకురించు, अंकुरित होना

gobble (v) / gobl / (గోబ్ల్) (disyllabic) : eat hastily, వేగంగా, ఆబగా తినుట, బొక్కుట, भकोसना

threshold (n) / Orefǝuld / (తైషఉల్డ్ ) (disyllabic) : entrance, the door or gate of a house, గడప, గుమ్మం, दरवाजा, प्रवेश द्वार, दरवाजा, प्रवेश – दूर

severed (adj) / sıvıǝ(r)d / (సివిఅ(ర్)డ్) (disyllabic) : causing great discomfort by being extreme, ఇష్టం కలిగించని , काटना, घायल

TS Inter 1st Year Telugu Study Material Chapter 3 ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 3rd Lesson ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం Textbook Questions and Answers.

TS Inter 1st Year Telugu Study Material 3rd Lesson ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
ప్రాచీన సాహిత్యంలో మానవతావాదాన్ని వివరించండి?
జవాబు:
ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం అన్న పాఠ్యభాగం ఆచార్య రవ్వా శ్రీహరిచే రచించబడిన సాహితీ నీరాజనం అన్న వ్యాస సంకలనం లోనిది. ఇందులో ఆయన మానవతా వాదాన్ని గురించి చక్కగా వివరించారు.

మానవతావాదం అంటే మానవ సంక్షేమాన్ని, మానవ ప్రగతిని, లక్ష్యంగా పెట్టుకుని ఒక మానవుడు తోటి మానవుని గురించి శుభకామనతో చేసే ఆలోచనా రీతి. దీనిని మావనతా వాదం అనే కన్నా మానవతా దృక్పధం అనటం సబబని రవ్వాహరి అభిప్రాయం. ఈ మానవతా దృక్పధానికి మూలం ప్రేమ. మానవుడు తోటి మానవుని పట్ల ప్రేమ భావాన్ని స్నేహభావాన్ని చూపించగలిగితే సమాజం ఆనందమయం అవుతుంది.

ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాసానికి, మానవతా వాదానికి సంబంధించిన అంశాలు ఎన్నో ఉన్నాయి. సంస్కృతంలో వేద వాఙ్మయం అతి ప్రాచీనమైంది. ఆ వేదాలలో ఋగ్వేదం మొదటిది. దానిలోని ‘పదవ మండలంలో అన్నదాన మహాత్మ్యాన్ని చెప్పే శ్లోకం ఒకటి ఉంది. ప్రాచీన సాహిత్యంలో కన్పించే అన్నదాన ఘట్టాలన్నీ మానవతా వాద ప్రతిపాదకాలే! ఆకలితో బాధపడేవానికి అన్నం పెట్టనివాడు చనిపోయన వానితో సమానుడుట.

వాల్మీకి రామాయణం ఆరంభమే మానవతావాదంతో ప్రారంభమయింది. “మానిషాద ప్రతిష్ఠాం….” అన్న ఆది కావ్యా రామాయణ వాక్యాలు పరమ కారుణ్య భావానికి ప్రతీకలు. ప్రేమ భావాన్ని దయాభావాన్ని మానవులపైనే కాక సకల జీవరాశిపై చూపించాలన్నది నిజమైన మానవతావాదం. బోయవాడు క్రౌంచ పక్షులలో మగపక్షిని భాణంతో కొట్టాడు. ఆడపక్షి దుఃఖం – వాల్మీకిని కదిలించిందట. ఇది అసలైన కారుణ్యభావం కదా!-

TS Inter 1st Year Telugu Study Material Chapter 3 ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం

ఇక ‘మహాభారతంలో ఉన్నదే మరొక చోట కూడా ఉంటుంది. మహాభారతంలో లేనిది మరెక్కగా ఉండదు. ధర్మప్రతిపాదన మహాభారత లక్షణం. దధీచి, శిబి, రంతి దేవుని కథలు మానవతా వాదానికి మచ్చుతునకలు. రంతిదేవుడు నోట వ్యాసుడు “న త్వహం కామయే రాజ్యం…” అన్న శ్లోకం ద్వారా” నాకు రాజ్యము వద్దు, స్వర్గము వద్దు, మోక్షం అసలే వద్దు. దుఃఖంతో బాధపడుతున్న జీవుల ఆర్తిని తొలగించటమే కావాలంటాడు. దీనికి మించిన మానవతా వాదం ఇంకా ఎక్కడున్నది.

ఇక దానాలన్నింటిలో అన్నదానం గొప్పదంటారు. ఎందుకంటే అది క్షుద్బాధను తీరుస్తుంది కాబట్టి. తాను కడుపునిండా తింటూ కొందరు ఆకలితో అలమటిస్తుంటే ఉ దాసీనంగా పట్టనట్లుగా ఉంటే అది మానవత్వం అన్పించుకోదు. ప్రాచీన సాహిత్యమంతటిలో దానమైన నిత్యం చేస్తే అది మానన్తవం అనిపించుకుంటుంని చెప్పబడింది.

భాగవతంలోని సప్తమ అధ్యాయంలో గృహస్థ ధర్మాలను వ్యాసులవారు వివరించారు. ఏ మానవునికైనా తన కడుపునింపుకునే ధనం మీద మాత్రమే అధికారం ఉంది. అంతకంటే ఎక్కువ ఉంచుకుంటే అది పాపమే అవుతుంది అన్నాడు. చరకుడు తన చరకసంహితలో సమస్త ప్రాణుల సంతోషాన్ని కోరుకున్నాడు. అష్టాంగ హృదయంలో ‘బాల వృద్ధేభ్యః అన్నమదత్వాన భుజంతీ” అని చెప్పబడింది. అంటే బాలలకు వృద్ధులకు అన్నంపెట్టిన తరువాతే మనం భుజించాలని అర్థం.

మానవులందరూ సుఖంగా ఉండాలి. సర్వజీవులు ఆనందంగా జీవించాలని అన్నది మన ప్రాచీనుల ఆదర్శమని రవ్వాశ్రీహరి పేర్కొన్నారు.

ప్రశ్న 2.
వ్రాచీన సాహిత్యంలో జీవకారుణ్య భావాలను తెలపండి?
జవాబు:
ప్రాచీన సాహిత్యంలో మానవతావాదము అన్న పాఠ్యభాగం ఆచార్య రవ్వా శ్రీహరిచే రచించబడిన “సాహితీ నీరాజనం” అన్న వ్యాస సంకలనం నుండి గ్రహించబడింది. ఇందులో ప్రాచీన సాహిత్యంలో జీవకారుణ్య భావం చక్కగా వివరించబడింది.

జీవ కారుణ్యం అంటే సృష్టిలోని సకల జీవులపట్ల కరుణ, జాలి కలిగి ఉండటం. ఋగ్వేదంలో అన్నదానం గురించి వివరిస్తూ ఆకలితో బాధపడేవారికి అన్నం పెట్టనివాడు మృత ప్రాయుడని చెప్పబడింది. రామాయణ రచన జీవకారుణ్యాన్ని చెప్పడంతోనే ప్రారంభమయింది. “మానిషాద ప్రతిష్టాం”… అన్న శ్లోకం జీవకారుణ్యాన్ని చూపమనిచెప్పింది.

TS Inter 1st Year Telugu Study Material Chapter 3 ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం

కఠిన మనస్సుగల బోయవాడు సుఖంగా కలిసి ఉన్న క్రౌంచ పక్షులలో మగపక్షిని కొట్టాడు. ఆడపక్షి కరుణ స్వరాన్ని విన్న వాల్మీకి మనసులో కారుణ్యం చోటు చేసుకుంది. ప్రేమ భావాన్ని కరుణ భావాన్ని మానవులపైనే గాక పశుపక్ష్యాదులపైన కూడా చూపించడం భారతీయ సంస్కృతిలో కన్పించే ముఖ్యలక్షణం. దీనినే ప్రాచీన కావ్యాలు కూడా ప్రభోదించాయి. “ఆత్మవత్ సతతం పశ్యేదపికీటపిపీలికామ్” అంటే చీమ మొదలైన కీటకాలను కూడా తమలానే భావించాలి అని అష్టాంగ హృదయం చెప్తుంది.

మహాభారతంలోని దధీచి, శిబి, రంతి దేవుడు మొదలుగు కథలలో జీవకారుణ్యం గురించి వివరించబడింది. రంతిదేవుని కథలో “నత్వహంకామయే రాజ్యం….” అన్న శ్లోకంలో వ్యాసుడు రంతిదేవుని మనసులో ఉన్న జీవకారుణ్యాన్ని వివరించాడు. “నాకు రాజ్యము వద్దు, స్వర్గము వద్దు, మోక్షం అసలు వద్దు. దుఃఖంతో బాధపడుతున్న జీవుల ఆర్తి తొలగటమే నాకు కావాలి” అంటాడు. దీనికి మించిన జీవకారుణ్యం ఏముంటుంది. ఇలా ప్రాచీనమైన ప్రతి కావ్యంలో కూడా జీవ కారుణ్యాన్ని కవులు తెలియచేశారు.

II. సంగ్రహ రూప ప్రశ్నలు సమాధానాలు

ప్రశ్న 1.
అన్నదాన ప్రాముఖ్యతను తెలియచేయండి?
జవాబు:
ప్రాచీన సాహిత్యంలో మానవతా వాదం అన్న పాఠ్యభాగం ఆచార్య రవ్వా శ్రీహరిచే రచించబడిన ‘సాహితీ నీరాజం’ అన్న వ్యాస సంకలనం నుండి గ్రహించబడింది. ఇందులో అన్నదాన మహిమను వర్ణించారు.

దానాలన్నింటిలోకి అన్నదానం గొప్పది. అది మానవుల ఆకలి బాధను తీరుస్తుంది. తాను కడుపునిండా తింటూ కొందరు ఆకలితో అలమటిస్తూంటే చూసి చూడ నట్లుండటం. 1212 ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం మానవత్వం కాదు అని మన ప్రాచీన గ్రంథాలలో వివరించబడింది. తైత్తిరీయ ఉపనిషత్తులో, అన్నాన్ని ఎక్కువగా వండాలని ఆకలితో అలమటించే దీనులకు అన్నం పెట్టాలని అలా పెట్టనివాడు నరకానికి పోతాడని వివరించబడింది. అలా అన్నార్తులకు అన్నం పెట్టనివాడు కేవలం పాపాన్నే భుజిస్తాడని చెప్పింది.

ఎవరు తనకోసం మాత్రమే వండుకుంటాడో అంటే ఎవరు అన్నార్తుల బాధను పట్టించుకోకుండా తన పొట్టమాత్రమే చూసుకుంటాడో వాడు నరకాన్ని పొందుతాడని పాపాన్ని ప్రోగుచేసుకుంటాడని స్మృతులు వివరించాయి. భాగవతంలో కూడా గృహస్థ ధర్మాన్ని వివరిస్తూ తన కడుపు నింపుకోవడానికి అవసరమైన ధనం మీదే మానవునకు అధికారం ఉంటుంది. మిగిలినది అన్నార్తులకు వినియోగించాలని చెప్పింది. ఇలా అన్నదాన ప్రాముఖ్యాన్ని మన ప్రాచీన గ్రంథాలు వివరించాయి.

TS Inter 1st Year Telugu Study Material Chapter 3 ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం

ప్రశ్న 2.
అష్టాంగ హృదయం ఏమని ప్రబోధిస్తుంది?
జవాబు:
ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం ‘అన్నపాఠభాగ్యం ఆచార్య రవ్వా శ్రీహరిచే రచించబడిన ‘సాహితీ నీరాజనం’ అన్న వ్యాస సంకలనం నుండి గ్రహించబడింది.
దుఃఖితులపట్ల మానవులు ఎలా ప్రవర్తించాలో అష్టాంగ హృదయకర్త చక్కగా వివరించాడు. ఏ జీవనాధారము లేనివాణ్ణి, వ్యాధితో బాధపడుతున్నవాణ్ణి, దుఃఖంలో న్నవాణ్ణి వారి వారి శక్తిని బట్టి ఆదుకోవాలని అష్టాంగ హృదయం చెప్తుంది. మానవుని సంక్షేమాన్ని, మానవ ప్రగతిని లక్ష్యంగా పెట్టుకుని ఏ జీవనాధారం లేని వారికి వ్యాధిగ్రస్తులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని అదే మనవత్వం అనిపించుకుంటుందని అష్టాంగ హృదయంబోధించింది.

ప్రశ్న 3.
రంతిదేవుని ద్వారా వ్యాసుడు పలికించిన ధర్మం ఏమిటి?
జవాబు:
ప్రాచీన సాహిత్యంలో మానవతా వాదం అన్న ‘పాఠ్యభాగం ఆచార్య రవ్వా శ్రీహరిచే రచించబడిన ‘సాహితీ నీరాజనం’ అను వ్యాస సంకలనం నుండి గ్రహించబడింది. మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాసానికి ఉపకరించే అంశాలు కోకొల్లలు. వేదముల నుండి పురాణాల వరకు అన్నింటిలోనూ ఈ ప్రస్తావన ఉంది. మహాభారతం లో దధీచి, శిబి, రంతిదేవుని పాత్రల ద్వారా ఈ విషయాన్ని వ్యాసుల వారు వివ రించారు. మానవతావాది, త్యాగశీలి, దయాశీలి రంతిదేవుని మాటల్లో

“నత్వహం కామయే రాజ్యం”…..

అన్న శ్లోకం ద్వారా “నాకు రాజ్యము వద్దు, నాకు స్వర్గమూ వద్దు, నాకు మోక్షము వద్దు దుఃఖంతో బాధపడుతున్న జీవుల ఆర్తి తొలగి పోవటమేకావాలి” అని చెప్పబడింది. భాగవతంలో కూడా “న కామయే హం గతి మీశ్వరాత్…..” అన్న శ్లోకంలో కూడా దుఃఖపీడితుల హృదయాల్లో తానుడంటూ వాళ్ళ బాధలను తాను అనుభవించైనా వారి దుఃఖాలను పోగొట్టాలి అని రంతిదేవుడు చెప్పిన మాటలు నిజంగా మానవతకు సంబంధించినది.

TS Inter 1st Year Telugu Study Material Chapter 3 ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం

ప్రశ్న 4.
పురాణాలు ఎవరిపైన దయచూపాలని చెప్పాయి?
జవాబు:
ప్రాచీన సాహిత్యంలో మానవతా విలువలు’ అను పాఠ్యభాగం ఆచార్య రవ్వా శ్రీహరిచే రచించబడిన ‘సాహితీ నీరాజనం’ అన్న వ్యాస సంపుటి నుండి గ్రహించ బడింది. దీనిలో మానవతా వాదం ప్రాచీన సాహిత్యంలో ఎలా వివరించబడిందో రవ్వావారు వివరించారు.

మన పురాణాలు వట్టి పురాణాలు కావు. వాటిలో మానవులందరూ సుఖంగా ండాలి. ఆరోగ్యంగా ఉండాలి. అందరూ ప్రగతిని సాధించాలి. ఏ ఒక్కరూ దుఃఖంతో జీవించరాదు అని వివరించాయి. కేవలం మానవులందేకాకుండా పశుపక్ష్యాదులపైన కూడా దయ, జాలి కరుణలను చూపించాలని ప్రబోధించాయి.

క్రిమికీటకాదులు పైన, పశు పక్ష్యాదులపైన, ఏ కులం వారిపై నైనా, పతితుతలపైన వర్ణసాంకర్యం గల వారిపైన దయాగుణాన్ని చూపాలని పురాణాలు వివరించాయి. చివరికి తృణ వృక్షాదులను కూడా జీవంగల వానిగా భావించి వాటికి ఏ విధమైన హానిని కలిగించకుండా కాపాడుకోవాలని మన పురాణాలు వివరించాయి.

III. ఏకపద వాక్య సమాధాన ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
ఆచార్య రవ్వా శ్రీహరి తల్లిదండ్రులెవరు?
జవాబు:
ఆచార్య రవ్వా శ్రీహరి తల్లిదండ్రులు వెంటకనరసమ్మ, నరసయ్యలు.

ప్రశ్న 2.
ఆచార్య రవ్వా శ్రీహరి రచనలు తెలియచేయండి?
జవాబు:
తెలుగు కవుల సంస్కృతానుకరణలు, తెలంగాణ మాండలికాలు కావ్యప్రయోగాలు, అన్నమయ్య భాషా వైభవం వంటి 40 గ్రంథాలను రచించారు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 3 ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం

ప్రశ్న 3.
ఆచార్య రవ్వాశ్రీహరి సంస్కృతానువాద రచనలేవి?
జవాబు:
డా. సి. నారాయణరెడ్డి ప్రపంచపదులు, జాషువా గబ్బిలం, ఫిరదౌసి, వేమన శతకం, నృసింహ శతకాలు శ్రీహరి సంస్కృతాలనువాదాలు

ప్రశ్న 4.
ఆచార్య రవ్వాశ్రీహరికి ‘మహా మహాపాధ్యాయ’ బిరుదును ప్రదానం చేసిన సంస్థ ఏది ?
జవాబు: తిరుపతిలోని కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం వీరికి ‘మహా మహెూపాధ్యాయ బిరుదును ఇచ్చింది.

ప్రశ్న 5.
మానవతా దృక్పధానికి మూలమేమి?
జవాబు:
మానవతా దృక్పధానికి మూలం ‘ప్రేమ’

ప్రశ్న 6.
సంస్కృత సాహిత్యంలో ఆదికావ్యమేది?
జవాబు:
సంస్కృత సాహిత్యంలో ఆదికావ్యం వాల్మీకి రచించిన ‘రామాయణం’.

TS Inter 1st Year Telugu Study Material Chapter 3 ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం

ప్రశ్న 7.
ధర్మసింధువు ఏమని ప్రబోధిస్తుంది?
జవాబు:
బాలురకు వృద్ధులకు అన్నంపెట్టందే భుజింపరాదని ప్రబోధిస్తుంది.

ప్రశ్న 8.
చరక సంహితలో చరకాచార్యుడు ఏమని శాసించాడు?
జవాబు:
మానవుడు నిత్యమూ సమస్త ప్రాణుల కళ్యానాన్ని కోరుకోవాలని శాసించాడు.

ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం Summary in Telugu

రచయిత పరిచయం

రచయిత : రవ్వా శ్రీహరి (ఆచార్యలు)

పుట్టిన తేదీ : మే 5, 1943

పుట్టిన ఊర : నల్గొండ జిల్లా వలిగొండ మండలం వెలువర్తి గ్రామం

తల్లిదండ్రులు : వేంకట నరసమ్మ, నరసయ్యలు

విద్యాభ్యాసం :

  1. శ్రీహరి వేదాంత వర్థిని సంస్కృత కళాశాలలో బి.ఓ.ఎల్
  2. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ తెలుగు, సంస్కృతం, (సంస్కృతంలో బంగారు పతకం సాధించారు)

పరిశోధనలు : భాస్కర రామాయణం, విమర్శనాత్మక పరిశీలన, పి.హెచ్.డి చేశారు

TS Inter 1st Year Telugu Study Material Chapter 3 ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం

ఉద్యోగం :

  1. ఉస్మానియా, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో ఆచార్యులుగా
  2. ద్రవిడ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా పనిచేశారు.

రచనలు :

  1. తెలుగు కవుల సంస్కృతాను – కరణములు
  2. సంకేత పదకోశం
  3. తెలంగాణ మాండలికాలు – కావ్యప్రయోగాలు
  4. తెలుగులో అలబ్ద వాఙ్మయం
  5. ఉభయ భారతి
  6. సంస్కృత వైజయంతి
  7. సంస్కృత సూక్తి రత్నావళి
  8. అన్నమయ్య భాషా వైభవం వంటి 40 గ్రంథాలు ప్రచురించారు.
  9. డా. సి. నారాయణరెడ్డి పంచపదులు, జాషువా, గబ్బిలం, పిరదౌసి వేమన శతకం, నరసింహ శతకాలను సంస్కృతంలోకి అనువదించారు.
  10. సూర్యరాయాంధ్ర నిఘంటువులోలేని 35వేల కొత్త పదాలను సేకరించి శ్రీహరి నిఘంటువును తయారుచేశారు.
  11. సంస్కృత, వ్యాకరణ గ్రంథం పాణినీయ అష్టాధ్యాయినిని రెండు భాగాలుగా తెలుగులోనికి అనువదించాడు.

అవార్డులు :

  1. తిరుపతి కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం మహా మహెూపాధ్యాయ బిరుదునిచ్చింది.
  2. తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ సంస్కృత పండిత బిరుదు
  3. ప్రపంచ పదీయ సంస్కృత అనువాదానికి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు
  4. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉగాది పురస్కారం
  5. గణపతి సచ్చిదానంద స్వామిచే స్వర్ణకంకణం
  6. పరవస్తు చిన్నయసూరి జాతీయ పురస్కారం
  7. తెలంగాణా ఎస్.ఆర్.పి చే జీవన సాఫల్య పురస్కారం

TS Inter 1st Year Telugu Study Material Chapter 3 ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం

మహా మహెూపాధ్యాయ రవ్వా శ్రీహరి దక్షిణ భారతంలో విశిష్ట సంస్కృత పండితునిగా పేరు పొందారు. వీరు మే 5 1943న నల్గొండ జిల్లా వలిగొండ మండలం వెల్దుర్తి గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు వెంకట నరసమ్మ, సరసయ్యలు. ఎం.ఏ. తెలుగు, ఎం. ఏ సంస్కృతం. సంస్కృతంలో బంగారు పతకాన్ని పొందారు.

“భాస్కర రామాయణం- విమర్శనాత్మక పరిశీలన” అన్న అంశంపై పరిశోధన చేశారు. ఉస్మానియా హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో ఆచార్యునిగా పని చేశారు. ద్రవిడ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా సేవలందించారు.

రచనలు

తెలుగు కవుల సంస్కృతానుకరణలు, సంకేత పదకోశం, తెలంగాణ మాండలికాలు, కావ్యప్రయోగాలు, తెలుగులో అబద్దవాఙ్మయం, ఉభయ భారతి, సంస్కృత వైజయంతి, సంస్కృత సూక్తి రత్నాకరం, అన్నమయ్య భాషా వైభవం, వంటి 40 గ్రంథాలను వెలువరించారు.

డా.సి.నారాయణరెడ్డి పంచపదులు, జాషువా గబ్బిలం, ఫిరదౌసి కావ్యాలను, వేమన శతకం, నరసింహ శతకాలను సంస్కృతం లోకి అనువదించారు. సూర్యరాయాంధ్ర నిఘంటువులో లేని 35 వేల కొత్త పదాలను సేకరించి శ్రీహరి నిఘంటువును వెలువరించారు. సంస్కృత వ్యాకరణ గ్రంథం పాణినీయం అష్టాధ్యాయినిని రెండు భాగాలు తెలుగునకు అనువాదంచేశారు. వీరు రచించిన సంకేత పదకోశం ఉపయుక్త గ్రంథం.

అవార్డులు – బిరుదులు – పురస్కారాలు

రవ్వా శ్రీహరి గార్కి తిరుపతి కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం మహా మహోూపాధ్యాయ బిరుదునిచ్చింది. తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ సంస్కృత పండితునిగా పురస్కారం అందించింది.

ప్రపంచ పదీ సంస్కృత అనువాదానికి కేంద్ర ‘సాహిత్య అకాడమీ పురస్కారం 2001 లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉగాది పురస్కారం, గణపతి సచ్చిదానంద స్వామిచే స్వర్ణకంకణ పురస్కారం, పరవస్తు చిన్నయసూరి జాతీయ పురస్కారం, తెలంగాణ ఎన్.ఆర్.ఐ అసోషియేషన్ జీవన సాఫల్య పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గురజాడ ప్రతిభా పురస్కారాలను అందుకున్నారు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 3 ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం

ప్రస్తుత పాఠ్యభాగం శ్రీహరి గారు రచించిన “సాహితీ నీరాజనం” అన్న వ్యాస సంకలనం నుండి గ్రహించబడింది.

పాఠ్యభాగ సందర్భం

ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశాలెన్నో ఉన్నాయి. ప్రాచీన రచయితలు కవులు జీవితంలో ఆచరించదగిన మానవీయ విలువలను సందర్భాను సారంగా వివరించారు. ఆకలిచే అలమటించే దీనులను, బాలలను, వృద్ధులను, రోగులను, పశుపక్ష్యాదులను ఆదరించాలని తెలిపారు.

సంపద కొంత మందికే కాకుండా అందరికి అందాలని చెప్పారు. రాజ్యం, మోక్షం, స్వర్గాలకంటే దుఃఖితులకు దుఃఖాన్ని పోగొట్టటం ముఖ్యమన్నారు. వ్యక్తిత్వ వికాసాన్ని విద్యార్థులకు బోధించుటకు ఈ పాఠ్యభాగం ఇవ్వబడింది.

పాఠ్యాభాగ సారాంశం

మానవతా వాదం అంటే మానవ సంక్షేమాన్ని, మానవ ప్రగతిని లక్ష్యంగా చేసుకుని తోటి మానవుని గురించి శుభకామనతో చేసే ఆలోచనగా చెప్పవచ్చు. దీనిని మానవతావాదం అనటం కన్నా మానవతా దృక్పథం అనటం సరైనది. దీనికి మూలం ప్రేమ, మానవుడు తోటి మానువునిపై ప్రేమ, కరుణ, సౌహార్థాలను చూపిస్తూ ఉండాలి.

సంస్కృతంలో వేదవాఙ్మయం అతి ప్రాచీనమైనది. ఆ వేదాలలో ఋగ్వేదం మొదటిది. ఋగ్వేదంలోని 10వ మండలంలో అన్నదాన మహాత్మ్యం చెప్పబడింది. ఆకలితో బాధపడే వానికి అన్నంపెట్టనివాడు మృతి చెందిన వానితో సమానమని అలాంటి వారికి అన్నదానం చేస్తే పుణ్యలోకాలను పొందుతాడని ఆ సూక్త తాత్పర్యం. ఇది మానవతా లక్షణం.

వాల్మీకి రామాయణంలో జీవకారుణ్య భావం మనకు కన్పిస్తుంది.

“మానిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః యత్రాంచ మిథునా దీక్ష మవధీః కామమోహితం” ఇందులో కఠినాత్ముడైన బోయవాడు సరసల్లాపాలు ఆడుకుంటున్న క్రౌంచ పక్షులలో ఒకదానిని కొట్టాడు. మరొక పక్షి దుఃఖం ఆ దృశ్యాన్ని చూసిన వాల్మీకి హృదయం ద్రవించింది. ఈ ఘట్టం జీవకారుణ్యాన్ని తెలియచేస్తుంది. అలాగే అష్టాంగ హృదయంలో “ఆత్మవత్సతతం పశ్యేదపి కీటపిపీలికామ్” సృష్టిలో ఉన్న పిపీలికాది జీవరాశులను మనవలెనే భావించాలని దీని భావం.

TS Inter 1st Year Telugu Study Material Chapter 3 ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం

“వృద్ధబాల వాధితక్షీణాన్ పుశూన్ బాంధవానివపోషయేత్” అన్నది నీతి వాక్యం. వృద్ధులను, బాలలను, రోగ పీడితులను, పశుపక్ష్యాదులను ఆదరణతో చూడాలి అని నీతి -వాక్యాలు చెపుతున్నాయి.

ఇక మహాభారతంలో చెప్పని విషయాలుంటూ ఏమీ లేవు. మానవతా దృక్పధం కల అంశాలు అడుగడుగునా కన్పిస్తాయి. దదీచి, శిబి, రంటిదేవుడు వంటి వారి కథలు త్యాగానికి మానవత్వానికి దయకు నిదర్శనాలుగా నిలుస్తాయి.

“నత్వహం కామయే రాజ్యం న స్వర్గం నా పునర్భవమ్
కామయే దుఃఖతప్తానాం ప్రాణినా మూర్తినాశనమ్”

నాకు రాజ్యము వద్దు, స్వర్గమూ వద్దూ, మోక్షము అసలేవద్దు. దుఃఖంతో బాధపడుతున్న జీవుల ఆర్తిని తొలగించటమే నాకు కావాలని ఇందలి భావం. దీనిలో ఎంతటి మానవతా దృక్పథం దాగి ఉందో చూడండి. రంతిదేవుని కథాఘట్టంలో కూడా ఇదే చెప్పబడింది.

“నకామయేల హం గతి మీశ్వరాత్ పరాం
అష్టయుక్తా మపునర్భవం నా
ఆర్తిం ప్రపద్యే ఖిల దేహబాజం
అంతఃస్థితో యేన భవంత్యుడుఃఖాః ”

దానాలన్నింటిలో అన్నదానం గొప్పదని సకల శాస్త్రాలు చెప్తున్నాయి. తాను కడుపునిండా తింటూ కొందరు ఆకలితో అలమటిస్తూ ఉంటే చూసి చూడనట్లుండటం మానవత్వం అనిపించుకోదు. ఏ దానమైన ఒక్కసారి చేయటం కాకుండా నిత్యం చేస్తూనే ఉండాలట

“అదత్వా యత్కించిదపి న నయే ద్దివీసం బుధః”

శుక్రనీతిలో చెప్పబడిన ఈ శ్లోకానికి తెలివిగలవారు రోజూ ఏదో ఒక దానం చేస్తూనే ఉండాలట.

“అహన్వహ జాతవ్యం అదీ నేనాంతదాత్మనా”

ప్రతిరోజూ ఆనందంగా ఏదో ఒకటి దానం చేయాలి. ఇది మానవతావాదం.

TS Inter 1st Year Telugu Study Material Chapter 3 ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం

భాగవతంలో గృహస్థ ధర్మాలను వివరించే ఘట్టంలో ధర్మాన్ని గురించి వివరించాడు. ప్రాచీనుల ఆలోచనలలో మానవులందరూ సుఖంగా ఉండాలి. వారితో పాటు సకల జీవరాశులు సుఖంగా ఉండాలని భావించారు. ఇక ధర్మసింధువులో బాలురకు, వృద్ధులకు పెట్టిన తరువాతే ఇతరులు భోజనం చేయాలని చెప్పబడింది.

సంస్కృత నాటక కర్తల్లో భవభూతి ఎంతో మానవతా దృక్పథం కలవాడుగా కన్పిస్తాడు. సీతను అడవులకు పంపేటప్పుడు శంబూకుని సంహరించేటప్పుడు రాముడు పశ్చాత్తాపం చెందినట్లు వర్ణించాడు. వేదవ్యాసుడు “ఊర్థ్యబాహుర్విరామ్యేష న చ కశ్చిచ్చణోతిమాన్” గొంతెత్తి గట్టిగా ధర్మాన్ని గురించి ఎంత చెప్పినా వినేవాడు ఒక్కడే లేడని అనడం శోచనీయం.

కఠిన పదాలకు అర్థాలు

అలమటించు = బాధపడు
హితం = మేలు
హితవు = మంచిమాట
సమున్నత = గొప్పవైన
ప్రగతి = అభివృద్ధి
శుభకామన = మంచి ఆలోచన
మృతప్రాయుడు = మరణించిన వానితో సమానుడు
క్షుధార్తి = ఆకలిబాధ
ఆవిర్భావం = పుట్టుక
ద్రవించిపోవు = కరిగిపోవు
ప్రశంసించు = మెచ్చుకొను
దృష్టాంతం = ఉదాహరణ
ఘట్టము = సందర్భము
అధ్యయనం చేయు = చదువు
అలమటించు = బాధపడు
ఆర్తులు = బాధతో ఉన్నవార
కాంక్ష = కోరిక

TS Inter 1st Year Telugu Study Material Chapter 2 తెలంగాణ తెలుగుపదాలు – ఉర్దూ మూలాలు

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 2nd Lesson తెలంగాణ తెలుగుపదాలు – ఉర్దూ మూలాలు Textbook Questions and Answers.

TS Inter 1st Year Telugu Study Material 2nd Lesson తెలంగాణ తెలుగుపదాలు – ఉర్దూ మూలాలు

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు : జవాబులు

ప్రశ్న 1.
ఉర్దూ నుంచి తెలుగులోకి చేరినప్పుడు పదాలలో జరిగిల మార్పును వివరించండి?
జవాబు:
తెలంగాణా తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అను పాఠ్యభాగం సామల సదాశివ చే రచించ బడింది. డా.సి. నారాయణరెడ్డి సంపాదకీయంలో వెలువడిన “వ్యాస గుళుచ్ఛం”, రెండవ భాగం నుండి గ్రహించబడింది. ఇందులో తెలంగాణా తెలుగులో ఉ ర్దూ పదాల మూలాలను చక్కగా వివరించారు.

ఉర్దూ ఒక ప్రత్యేక భాషకాదు, పారసీ, అరబ్బీ, తర్కీ శబ్దాల కలగాపులగం ఉర్దూ భాష. దీనిని ఇది మన దేశంలో 14వ శతాబ్దంలో రూపుదిద్దుకున్నది. దీనిని తొలుత హిందుయి జబానే హిందూస్థాన్ అన్న పేర్లతో పిలువబడింది. 18వ శతాబ్దానికి కాని అది ఉర్దూ అని పిలువబడలేదు.

తెలుగులో కొన్ని ఉర్దూ పదాలు యథాతదంగానే చేరాయి. కమలము, కలందాన్, ఖజానా, జమీందారు, జాగీర్దారు, ఖుషీ, గులాము రోజు, కూలీ, బాకీ, బజారు, దుకాణం మొదలగు పదాలు ఇందుకు ఉదాహరణము. హలంతమైన ఉర్దూ భాషలోని పదాలు అజంతమైన తెలుగు భాషలో చేరినప్పుడు ఆ పదాలు అజంతమవటం సహజం. ఉదాహరణకు కలమ్-కలము అయింది. జమీందార్ – జమీందారు అయింది. బజార్- బజారు అయింది.

కొన్ని పదాలు ఉర్దూ నుండి తెలుగులోకి వచ్చేటప్పుడు తమ రూపాన్ని మార్చు. కున్నాయి. ఉదాహరణకు బాఖీ అనే ఉర్దూ పదం తెలుగులో బాకీ అయింది. అలాగే ‘నఖద్’ నగదుగా మారింది.

TS Inter 1st Year Telugu Study Material Chapter 2 తెలంగాణ తెలుగుపదాలు - ఉర్దూ మూలాలు

ఉర్దూపదం – తెలుగు పదం
ఉదార్ – ఉద్దర
సొహబత్ – సొబతి
మస్జిద్ – మసీదు
కుర్చీ= కుర్చీ
ఘిలాప్ – గలిబు/గలేబు
జుర్మానా – జుర్మానా
నక్స్ – నగిషీ
అబ్రూ – ఆబోరు

ఇలా ఉర్దూపదాలు తెలుగులో మార్పుచెందాయి.

కొన్ని ఉర్దూపదాలు తెలుగులోకి వచ్చి అర్థాన్ని కూడా మార్చుకున్నాయి. ఉదాహరణకు ‘ముదామ్’ అనే పారసీ పదానికి ‘ఎల్లప్పుడూ అనే అర్థం ఉంది. ఇది తెలుగులో ‘ముద్దాముగా’ మారి ‘ప్రత్యేకించి’ అనే అర్థంలో వాడబడుతుంది. ఇలా పలు మార్పులతో అనేక పదాలు ఉర్దూ నుండి తెలుగు భాషలోకి ప్రవేశించాయి.

ప్రశ్న 2.
భాషల మధ్య జరిగే ఆధానప్రదానాలను చర్చించండి?
జవాబు:
తెలంగాణా తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అను పాఠ్యభాగం సామల సదాశివచే రచించబడింది. డా.సి. నారాయణరెడ్డి సంపాదకీయంలో వెలువబడిన “వ్యాసగుళు చ్ఛం” రెండవ భాగం నుండి గ్రహంచ బడింది. ఇందులో భాషల మధ్య ఆదాన ప్రదానాలు సహజంగానే జరుగుతాయని సదాశివ వివరించారు.

ఒక భాషా పదాన్ని మరొక భాష స్వీకరించడం కొత్తేమీకాదు. పలు భాషలు మాట్లాడే ప్రజలు ఒక చోట కలిసి మెలసి ఉన్నప్పుడు భాషలలో ఆదాన ప్రదానాలు సహజంగా జరుగుతుంటాయి. ఒక భాషా పదాన్ని వేరొక భాష స్వీకరించేటప్పుడు ఏదో ఒక విభక్తి ప్రత్యయాన్ని చేర్చి ఆ భాషా పదాన్ని మరొక భాషాపదం స్వీకరిస్తుంది. ఒక్కొక్కసారి యథాతదంగాను లేదా ఒక అక్షరాన్ని చేర్చి, ఒక అక్షరాన్ని తీసేసి, లేదా ఒక అక్షరాన్ని మార్చి స్వీకరించటం జరుగుతుంది.

TS Inter 1st Year Telugu Study Material Chapter 2 తెలంగాణ తెలుగుపదాలు - ఉర్దూ మూలాలు

స్వీకరించిన భాష తాను స్వీకరించిన మూల భాషా పద అర్థాన్నే స్వీకరిస్తుంది. కొన్ని సందర్భాలలో వేరే భాషా పదాన్ని స్వీకరించిన భాష మూల భాష యొక్క అర్థాన్ని కాక కొత్త అర్థంలో కూడ స్వీకరించడం జరుగుతుంది. ఇలా భారతీయ భాషలన్నింటిలోనూ సంస్కృత భాషా ప్రభావం అధికంగా ఉంది. అలాగే ఆంగ్లభాషా ప్రభావం కూడా! అన్య భాషా పదాలను స్వీకరించడంలో వర్ణాగమ, వర్ణాలోప, వర్ణవ్యత్యయాల ద్వారా ఆదాన ప్రదానాలు జరుగుతుంటాయి.

ఉదాహరణకు :-
లార్డ్ అనే ఆంగ్లపదం ఉర్దూలోకి ‘లాట్సాహెబ్’గా మారటం. ఫిలాసఫీ అనే ఆంగ్లపదం ఫల్సఫాగా ఉర్దూలోకి రావటం సొహబత్ అనే ఉర్దూపదం తెలుగులో ‘సోబతి’ అవటం. ఉర్దూలో ఆబ్రూ అనే పదం తెలుగులో ఆబోరుగా మారటం వర్ణలోప వర్ణాగమ. వర్ణవ్యత్యయాలకు ఉదాహరణులుగా చెప్పవచ్చు.

II. సంగ్రహ రూప ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
ఉర్దూ వానా పదాన్ని వివరించండి?
జవాబు:
తెలంగాణా తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అను పాఠ్యభాగం సామల సదాశివచే రచించబడినది. డా.సి. నారాయణరెడ్డి సంపాదకీయంలో వెలువబడిన ‘వ్యాసగుళు చ్ఛం’, రెండవ భాగం నుండి గ్రహించబడింది.

మన దేశంలోని భాషలన్నింటిపై సంస్కృత భాషా ప్రభావం ఎలా ఉందో అలాగే ఆంగ్లభాషా ప్రభావం ఉర్దూ భాషపై ఉంది. ఉర్దూ భాషా శాస్త్రవేత్తలు, ‘ఉర్దువానా’ అనే పదాన్ని తరుచుగా వాడుతుంటారు. ఉర్దూ, పండితులు పలు ఆంగ్లపదాలను పద బంధాలను ఉర్దూలోకి అనువదించుకున్నారు. అవిగాక ఒక భాష అన్యభాషా పదాలను స్వీకరించే వర్ణాగమ, వర్ణలోప వర్ణవ్యత్యయ పద్దతులలో ఎన్నో ఆంగ్లపదాలను ఉర్దూభాషలోకి మార్చుకున్నారు. ఆభాషా రూపమే ‘ఉర్దూవానా’.

ఉదా : లార్డ్ అనే ఆంగ్లపదం లాట్ సాహెబ్ ను
కమాండ్ అనే ఆంగ్లపదం కమాన్ ను
ఫిలాసఫీ అనే పదం ఫల్సపా గాను

ఇలా పలు ఆంగ్లపదాలు ఉర్దూలోకి వచ్చాయి. ఆ పదాల సమూహంతో వచ్చిన దానిని ‘ఉర్దూవానా’ అన్నారు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 2 తెలంగాణ తెలుగుపదాలు - ఉర్దూ మూలాలు

ప్రశ్న 2.
తెలంగాణ తెలుగు మిగతా ప్రాంతాల తెలుగు కంటే భిన్నమైనది ఎందుకు?
జవాబు:
తెలంగాణ తెలుగు పదాలు ఉర్దూమూలాలు అను పాఠ్యభాగం సామల సదాశివచే రచించబడింది. డా.సి. నారాయణరెడ్డి, సంపాదకీయంలో వెలువబడిన ‘వ్యాస గుళుచ్చం’, రెండవ భాగం నుండి ఈ పాఠ్యభాగం గ్రహించబడింది.

ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ, ప్రజలు మాట్లాడుకునే భాష తెలుగు, తెలుగు గ్రాంథిక రూపంలో ఈ నాలుగు ప్రాంతాలలో ఒకటిగానే ఉంటుంది. వ్యవహారికంలోకి వచ్చేటప్పటికి నాలుగు ప్రాంతాలలోనూ వేరు వేరుగా ఉంటుంది. తెలుంగాణా తెలుగు భాష మిగిలిన మూడు ప్రాంతాల భాష కంటే భిన్నంగా ఉంటుంది. దానికి కారణం లేకపోలేదు. తెలంగాణ ప్రాంతం తెలుగు భాషలో ఉర్దూ, హిందీ మరాఠీ భాషా పదాలు అధికంగా ఉండటం వలన మిగిలిన ప్రాంతాల తెలుగు భాషకన్నా తెలంగాణ తెలుగు భిన్నంగా ఉంటుంది.

ప్రశ్న 3.
తెలంగాణా తెలుగులో యథాతదంగా చేరిన ఉర్దూ పదాలను తెలపండి?
జవాబు:
‘తెలంగాణా తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అను పాఠ్యభాగం సామన సదాశివచే రచించబడింది. డా. సి. నారాయణరెడ్డి సంపాదకీయంలో వెలువబడి. ‘వ్యాస గుళు చ్చం’ రెండవ భాగం నుండి గ్రహించబడింది.

ఒక భాషలోని పదాలు మరొక భాషలోకి చేరేటప్పుడు వాటి రూపు రేఖలు మారటమో లేకఅర్థం మారటమో జరుగుతుంది. అలా కాకుండా తెలంగాణ తెలుగు భాషలో ఉర్దూ పదాలు యథాతదంగా చేరాయి. అలాంటి పదాలలో కలము, కలందాన్, ఖజానా, జమీందారు, జాగీర్దారు, ఖుషీ, గులాము, రోజు, కూలీ, బాకీ, గురుజు, బజారు, దుకాణం, మాలు, జబర్దస్తీ, జోరు, మొదలగు పదాలున్నాయి. ఇవన్నీ యథాతదంగా ఎలాంటి మార్పును పొందకుండా తెలుగులోకి వచ్చిన ఉర్దూపదాలు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 2 తెలంగాణ తెలుగుపదాలు - ఉర్దూ మూలాలు

ప్రశ్న 4.
సామల సదాశివ రచనలను సంగ్రహంగా తెలుపండి ?
జవాబు:
సామల సదాశివ ఆదిలాబాద్ జిల్లా దహగాం మండలంలోని తెలుగు పల్లెలో మే 11, 1928న జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు సామల చిన్నమ్మ, నాగయ్యలు. సదాశివ విభిన్న భాషా సంస్కృతుల కళావారధి, వీరు సంస్కృతం, హిందీ, ఉర్దూ, ఆంగ్లం, ఫార్సీ, మరాఠీ తెలుగు భాషలలో పండితుడు. వీరి తొలి రచనలలో ప్రభాతము అనే లఘు కావ్యం, సాంబశివ శతకం, నిరీక్షణము, అంబపాలి, సర్వస్య దానము, విశ్వామిత్ర మొదలుగునవి ఉన్నాయి.

హిందూస్థానీ సంగీత కళాకారుల ప్రతిభపై, ‘మలయమారుతాలు’ ప్రముఖుల జ్ఞాపకాలు, ఉర్దూ, భాషా కవిత్వ సౌందర్య ఉర్దూకవుల కవితా సామాగ్రి మొదలగునవి ప్రసిద్ధ గ్రంథాలు.

అన్జద్ రుబాయిలు తెలుగు అనువాదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ అనువాద పురస్కారాన్ని ఇచ్చింది. వీరి ‘స్వరలయలు’ గ్రంథానికి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కాకతీయ, తెలుగు విశ్వవిద్యాలయాలు వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. వీరి రచనలపై విశ్వవిద్యాలయాలలో పలు పరిశోధనలు జరిగాయి.

III. ఏక పద/వాక్య సమాధాన ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
ఉర్దూ భాషను పూర్వం ఏ పేర్లతో పిలిచేవారు ?
జవాబు:
ఉర్దూ భాషను పూర్వం హిందుయి-జబానె-హిందుస్థాన్ అనే పేర్లతో 18వ శతాబ్దం వరకు పిలిచేవారు.

ప్రశ్న 2.
‘లాట్ సాహెబ్’ పదానికి మూల పదం ఏది?
జవాబు:
‘లాట్ సాహెబ్’ అనే పదానికి మూల పదం ‘లార్డ్’ అనే ఆంగ్లపదం

ప్రశ్న 3.
‘జుర్మానా’ అనే ఉర్దూపదం తెలుగులో ఏ విధంగా మారింది?
జవాబు:
జుర్మానా అనే ఉర్దూపదం తెలుగులో ‘జుల్మానా’గా మారింది.

TS Inter 1st Year Telugu Study Material Chapter 2 తెలంగాణ తెలుగుపదాలు - ఉర్దూ మూలాలు

ప్రశ్న 4.
‘ముహ్జుబాణీ’ అనే ఉర్దూపదానికి అర్థం?
జవాబు:
‘ముహ్ జుబాణీ అనే ఉర్దూపదానికి’ ‘నోటితో’ అని అర్థం.

ప్రశ్న 5.
‘కులాసా’ తెలుగు పదానికి ఉర్దూరూపం?
జవాబు:
కులాసా తెలుగు పదానికి ఉర్దూరూపం ‘ఖులాసా’

ప్రశ్న 6.
‘ఉర్దూ’ భాషకు ‘ఉర్దూ’ అనుపేరు ఏ శతాబ్దంలో వచ్చింది
జవాబు:
18వ శతాబ్దంలో

ప్రశ్న 7.
‘సామల సదాశివ’ రాసిన శతకం?
జవాబు:
‘సాంబశివ’ శతకం

TS Inter 1st Year Telugu Study Material Chapter 2 తెలంగాణ తెలుగుపదాలు - ఉర్దూ మూలాలు

ప్రశ్న 8.
ఏ గ్రంథానికి సామల సదాశివకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది?
జవాబు:
స్వరలయలు అనే గ్రంథానికి

తెలంగాణ తెలుగుపదాలు – ఉర్దూ మూలాలు Summary in Telugu

రచయిత పరిచయం

రచయిత : డా॥ సామల సదాశివ

పుట్టిన తేదీ : మే 11, 1928

పుట్టిన ఊరు : ఆదిలాబాద్ జిల్లా దహగాం మండలం తెనుగుపల్లె

తల్లిదండ్రులు : సామల చిన్నమ్మ, నాగయ్యలు

భాషాప్రావీణ్యం : తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, ఫార్సీ మరాఠీ భాషలు

రచనలు :

  1. ఏ భాతము, సాంబశివ శతకం, నిరీక్షణము, అంబపాలి, సర్వస్వదానం నవలలు, కథలు చిన్ననాటి రచనలు
  2. హిందూస్థానీ సంగీత కళాకారులపై మలయ మారుతాలు, ప్రముఖుల జ్ఞాపకాలు, అనుభవాలు గల ‘యాది’ సంగీత శిఖరాలు, ఉర్దూ భాషాకవిత్వ సౌందర్యం, ఉర్దూకవుల కవితాసామాగ్రి గ్రంథాలు ప్రసిద్ధమైనవి.
  3. అన్జద్ రుబాయిలు అనువాదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ అనువాద రచన పురస్కారం అందుకున్నారు.
  4. స్వరలయలు గ్రంథానికి 2011లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 2 తెలంగాణ తెలుగుపదాలు - ఉర్దూ మూలాలు

అవార్డులు :

  1. కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు
  2. తెలుగు విశ్వవిద్యాలయంచే గౌరవ డాక్టరేట్

మరణం : ఆగస్టు 7, 2012

కవి పరిచయం

డా॥ సామల సదాశివ భిన్న భాషా సంస్కృతులకు వారధి ఈయన మే 11, 1928 న ఆదిలాబాద్ జిల్లా దహగాం మండలం తెలుగు పల్లె గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు సామల చిన్నమ్మ, నాగయ్యలు. అధ్యాపక వృత్తిని చేపట్టి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా రిటైరయ్యారు. సంస్కృతం, హిందీ, ఉర్దూ, ఆంగ్లం, ఫార్సీ, మరాఠీ, తెలుగు భాషలలో పాండిత్యాన్ని సంపాదించారు. ప్రభాతము అనే లఘు కావ్యాన్ని సాంబశివ శతకం, నిరీక్షణ, అంబపాలి, సర్వస్వదానం, విశ్వామిత్రము వీరి తొలి రచనలు.

హిందూస్థానీ సంగీత కళాకారులపై మలయ మారుతాలు ప్రముఖులు జ్ఞాపకాలు, అనుభవాలు గల ‘యాది’ సంగీత శిఖరాలు, వీరి రచనలే. అమాన్ రుబాయిలు’ అనువాదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘స్వరలయలు’ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2011లో లభించింది. కాకతీయ, తెలుగు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సన్మానించాయి. ఈయన రచనలపై పరిశోధనలు జరిగాయి. ఆగస్టు 7, 2012న పరమపదించారు.

ప్రస్తుత పాఠ్యభాగ్యం డా॥సి. నారాయణరెడ్డి సంపాదకత్వంలో వెలువడిన ‘వ్యాసగు ళచ్ఛం’ రెండవ భాగం నుండి గ్రహించబడింది.

పాఠ్యభాగ సందర్భము

తెలంగాణ తెలుగు పదాలు ఉర్దూమూలాలను విద్యార్థులకు తెలియజేయు సందర్భంలోనిది.

పాఠ్యభాగ సారాంశం

తెలంగాణ తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అను పాఠ్యభాగం సామల సదాశివచే వ్రాయబడింది. డా.సి. నారాయణరెడ్డి సంపాదకత్వంలో వెలువడిన “వ్యాస గుళుచ్ఛం” రెండవ భాగం నుండి గ్రహించబడింది. ఇందులో తెలంగాణా తెలుగు భాషలో ఉర్దూ పదాలు ఎలా మిళితమైనాయో చెప్పబడ్డాయి.

TS Inter 1st Year Telugu Study Material Chapter 2 తెలంగాణ తెలుగుపదాలు - ఉర్దూ మూలాలు

ఆంధ్రదేశంలో దక్షిణ కోస్తా ఆంధ్ర రాయలసీమ తెలంగాణ ప్రజలు మట్లాడుకునే భాష తెలుగు. గ్రంథికంలో ఉన్నప్పుడు ఈ నాలుగు ప్రాంతాలలో తెలుగు ఒకే విధంగా ఉంటుంది. వ్యవహారికం దగ్గరకు వచ్చేసరికి నాలుగు ప్రాంతాల భాష వేరు వేరుగా ఉంటుంది. తెలంగాణ భాష మిగిలిన మూడు ప్రాంతాల భాషల కన్నా భిన్నంగా ఉంటుంది. దానికి కారణం తెలంగాణ తెలుగులో ఉర్దూ, హిందీ, మరాఠీ పదాలు ఎక్కువగా ఉండటం.

ఉర్దూ ఒక ప్రత్యేక భాషకాదు. ఉత్తరాన పలుకృత అపభ్రంశాల శబ్దాలతో పారసీ, అరబ్బీ, తుర్కీ శబ్దాలు కలిసి కలగా పులగంగా ఏర్పడిన భాష ఉర్దూ. ఇది 14వ శతాబ్దాంలో రూపుదిద్దుకొని హిందూయి, జబానె – హిందూస్తాన్ అన్న పేర్లతో పిలవబడి 18వ శతాబ్దానికి ఉర్దూ భాషగా పేరు పొందింది.

దక్కన్ ప్రాంతంలో ముస్లిం పాలకులకు ప్రజలకు వారధిగా ఒక భాష అవసరం ఏర్పడింది. దానిని దక్కనీ ఉర్దూ అన్నారు. ఇది మహారాష్ట్ర ప్రాంతంలో తెలుగు ప్రాంతంలో ఏర్పడింది. తెలుంగాణా జిల్లాలు పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతంలో ఉండడం వలన కన్నడ పదాలు తెలుగులో కలిశాయి. కనుక తెలంగాణ తెలుగు ప్రత్యేకతను పొందింది.

ఒక భాషా పదాన్ని మరొక భాష స్వీకరించడం సర్వసాధారణం. పలు భాషలు మట్లాడే ప్రజలు ఒకచోట ఉండటంతో భాషలలో ఆధాన ప్రదానాలు సహజమే. భారతదేశ భాషలపై సంస్కృతం ఎంతటి ప్రభావాన్ని చూపించిందో ఉర్దూ బోధనా మాధ్యం గల ప్రాంతాలలో ఆంగ్ల భాష అంతగా ప్రభావాన్ని చూపించింది. అలా ఆంగ్ల పదాలను ఉర్దూ భాషలోకి అనువదించుకుని దానిని ఉర్దూ వానా అని పిలుచుకున్నారు.

ఒక భాష నుండి. మరొక భాషకు పదాలు వర్ణగమ, వర్ణలోప, వర్ణ వ్యత్యయ పద్ధతుల ద్వారా వెళ్తుంటాయి.. ఒక్కోసారి యధాతదంగా కూడా వస్తుంటాయి. ఉదాహరణకు. లార్డ్ అనే ఆంగ్లపదం ఉ ర్దూలో లాట్సాహెబాను, ఫిలాసఫీ అనే పదం ఫల్సఫా గాను మార్పు చెందింది. కొన్ని పదాలు అర్థాన్ని మార్చుకుని కూడా ప్రవేశిస్తుంటాయి. ఉదాహరణకు ఉపన్యాసమంటే తెలుగులో ప్రసంగం హిందీలో నవల అన్న అర్థాన్ని స్తుంది.

TS Inter 1st Year Telugu Study Material Chapter 2 తెలంగాణ తెలుగుపదాలు - ఉర్దూ మూలాలు

తెలుగులోకి యధాతథంగా వచ్చిన ఉర్దూపదాలు కలము, జమీందారు, ఖుషీ, మొదలగునవి. కొన్ని ఉర్దూ పదాలు హలంలూలు తెలుగులో అజంతాలుగా మార్పుచెందాయి. ఉదాహరణకు రోజ్ రోజు అయింది. బజార్ .. బజారు అయింది. కొన్ని ఉర్దూ పదాలు తమ రూపాన్ని మార్చుకుని తెలుగులోకి వచ్చాయి. ఉదాహరణకు అబ్రు ఆబూరుగను, జర్మానా, జుల్మాన్గాను మార్పుచెందాయి.

కొన్ని ఉర్దూపదాలు తెలుగులోకి అర్థమార్పిడితో వచ్చాయి. ముదామ్ అన్న పదానికి ఉర్దూలో ఎల్లప్పుడు అని అర్థం. అది తెలుగులో ముద్దాముగా మారి ప్రత్యేకించి అను అర్థాన్ని పొందింది. ఇలా ఉర్దూ పదాలు తెలుగు భాషలోకి వచ్చి చేరాయి.

కఠిన పదాలకు అర్థాలు

ఖరారు = నిర్థారణ
అన్యభాష = ఇతర భాష
యథాతథంగా = ఉన్నది ఉన్నట్లుగా
విద్వాంసులు = పండితులు
భీతిగొల్పేది = భయాన్ని కలిగించేది
సావభావికమే = సర్వసాధారణమే
తరుచుగా = అప్పుడప్పుడు
హలంత పదాలు = హల్లులు అంతంగా గల పదాలు
అజంతపదాలు = అచ్చులు అంతంగా గల పదాలు
భూషణము = అలంకారము
మేజువాణి = పాటకచ్చేరి
గలాభా = గొడవ
రూపుదిద్దుకున్న = తయారైన
భిన్నంగా = వేరుగా