TS 6th Class Telugu 1st Lesson Questions and Answers Telangana అభినందన

Telangana SCERT 6th Class Telugu Guide Telangana 1st Lesson అభినందన Textbook Questions and Answers.

అభినందన TS 6th Class Telugu 1st Lesson Questions and Answers Telangana

బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి

TS 6th Class Telugu 1st Lesson Questions and Answers Telangana అభినందన 1

ప్రశ్నలు

ప్రశ్న 1.
పై బొమ్మలో ఏం జరుగుతున్నది ?
జవాబు.
పై బొమ్మలో సైనిక దినోత్సవం సందర్భంగా పిల్లల ఊరేగింపు జరుగుతోంది.

ప్రశ్న 2.
పిల్లలు ఏమని నినాదాలు ఇస్తున్నారు ?
జవాబు.
జై జవాన్, సైనికులకు వందనం, వీరులకు వందనం అంటూ పిల్లలు నినాదాలు ఇస్తున్నారు.

TS 6th Class Telugu 1st Lesson Questions and Answers Telangana అభినందన

ప్రశ్న 3.
జై జవాన్! అని ఎందుకంటున్నారు ?
జవాబు.
జవాన్ అంటే సైనికుడు. సైనికులు ప్రతి నిమిషం దేశాన్ని శత్రువుల నుండి రక్షిస్తూ ఉంటారు అందుకే సైనికులకు జయం కలగాలి అనే అర్థం వచ్చేలా జై జవాన్ అని అంటున్నారు.

ప్రశ్న 4.
జవాను దేశానికి సేవ చేస్తాడు కదా! ఇతనివలె దేశం కోసం పాటుపడేవాళ్ళు ఎవరు ?
జవాబు.
జవానుల వలె పోలీసులు కూడా దేశ సేవ చేస్తారు. ఇలాగే రైతులు వ్యవసాయంచేసి ప్రజలకు అన్నసేవ చేస్తున్నారు. ఇంకా వైద్యులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు దేశానికి సేవ చేస్తున్నారు.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.4)

ప్రశ్న 1.
రైతులను “శ్రమ దాచని హాలికులని” ఎందుకన్నారు ?
జవాబు.
రైతులు శ్రమదాచని హాలికులు. ఎందుకంటే ఏడాది పొడవునా కష్టపడి పొలంలో పనిచేస్తారు. తమ నెత్తురును చెమటలాగా ధారపోస్తూ కాయకష్టం చేసి బంగారు పంటలు పండిస్తాడు.

ప్రశ్న 2.
“భరతమాత పురోగతికి ప్రాతిపదికలగు ఘనులు” అనే వాక్యం ద్వారా మీకేమర్థమయింది ?
జవాబు.
రైతులు, సైనికులు రాత్రింబవళ్ళు కష్టపడుతూ ప్రజాసేవ చేస్తున్నారు. రైతులు పంటలు పండించి ప్రజల ఆకలి తీర్చి దేశాభివృద్ధికి తోడ్పడుతున్నారు. సైనికులు సరిహద్దుల్లో కాపలా కాస్తూ శత్రు సైనికుల నుండి దేశాన్ని రక్షిస్తున్నారు. దేశాభివృద్ధికి పాటుపడుతున్నారు. అలా రైతులూ, సైనికులూ భరతమాత పురోగతికి మూల స్తంభాలైన వారు.

ప్రశ్న 3.
“రుధిరం స్వేదమ్ము కాగ పసిడిని పండించునట్టి” అంటే మీకేం అర్థమయింది ?
జవాబు.
రుధిరం అంటే రక్తం; స్వేదము అంటే చెమట; పసిడి అంటే బంగారం. రైతు పగలు రాత్రీ తేడా లేకుండా తన శ్రమను దాచుకోకుండా కష్టపడతాడు. తన రక్తాన్ని చెమటగా మార్చి పొలందున్ని బంగారం లాంటి పంటలు పండిస్తాడు. ప్రజల ఆకలి తీరుస్తాడు అని అర్ధమయింది.

ప్రశ్న 4.
కంటికి కనురెప్ప, చేనుకు కంచె. ఇట్లా దేనికి ఎవరు రక్ష ? ఇటువంటివే మరికొన్ని చెప్పండి.
జవాబు.
బిడ్డకు తల్లి, తలకు టోపీ, కోటకు గోడ, చెరువుకు కట్ట, నదులకు తీరం, ఎండా వానలకు గొడుగు, కాలికి చెప్పు రక్షణగా ఉంటాయి. భూమికి ఓజోన్ పొర రక్షణ.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.5)

ప్రశ్న 1.
“జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులు” అని కవి ఎందుకన్నాడు ?
జవాబు.
జవానులు అంటే సైనికులు. వాళ్ళెప్పుడూ సరిహద్దులో కాపలా కాస్తూ ఉంటారు. శత్రు సైనికులు దండెత్తి వస్తే వెంటనే తరిమి కొడతారు. ఒక కవచం మనిషికి దెబ్బ తగలకుండా ఎలా రక్షిస్తుందో ఒక సైనికుడు మాతృభూమికి శత్రువుల దెబ్బ తగలకుండా అలాగే రక్షిస్తాడు కనుక కవి అలా వర్ణించాడు.

TS 6th Class Telugu 1st Lesson Questions and Answers Telangana అభినందన

ప్రశ్న 2.
“నీతికర్మ శీలురు” అని ఎవరిని అంటారు ?
జవాబు.
ఎప్పుడూ నీతిని తప్పకుండా న్యాయమార్గంలో నడిచేవారు, తమ పనులను సకాలంలో బాధ్యతతో నిర్వర్తించేవారు మంచి ప్రవర్తన గలవారౌతారు. వారినే నీతికర్మ శీలురు అంటారు.

ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. గేయాన్ని పాడుతూ అభినయించండి.
జవాబు.
విద్యార్థుల పని.

2. ప్రగతి మార్గదర్శకులని ఎవరినంటారు ? ఇట్లాంటివారి పేర్లు కొన్ని చెప్పండి. సమాజానికి వీరి అవసరం ఏమిటి?
జవాబు.
ప్రగతి మార్గదర్శకులంటే ప్రజలను అభివృద్ధి బాటలో నడిపించేవారు. మంచి విషయాలు నేర్పి మంచి మార్గంలో నడిపి అభివృద్ధిలోకి తెచ్చేవారు. మహాత్మగాంధీ, బాలగంగాధరతిలక్ వంటి దేశ నాయకులు ప్రజలలో దేశభక్తి రేకెత్తించి స్వరాజ్య ఉద్యమం వైపు నడిపించారు. రాజారామమోహన్రాయ్, కందుకూరి వీరేశలింగం వంటివారు సాంఘిక దురాచారాలను రూపుమాపి ప్రజలను అభివృద్ధిమార్గంలో నడిపించారు. అలా ప్రజలను చైతన్యవంతులను చేయడానికి వీరి అవసరం ఎప్పుడూ ఉంటుంది.

II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం

1. పాఠాన్ని చదవండి. రైతుల, సైనికుల గొప్పదనాన్ని తెలిపే ముఖ్యమైన పదాలను గుర్తించి రాయండి.

జవాబు.
రైతులు : శ్రమదాచనివారు. పసిడిని పండించువారు. ప్రగతి మార్గదర్శకులు. అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్పుతారు.
సైనికులు: తలవంచనివారు. భరతమాత పురోగతికి ప్రాతిపదికలు. ఘనవీరులు. నిర్మలురు. నీతికర్మ శీలురు. ఘనజనులు.

2. కింది గేయాన్ని చదవండి. ఖాళీలను పూరించండి.

జవాబు.
పల్లెలు మనపాలిటి కల్పతరువులూ – నవభారత గృహసీమకు మణిదీపాలూ
మానవతకు మందిరాలు మమతలకవి పుట్టినిళ్ళు – మన సంపద నిలయాలు భరతమాత నయనాలు
ప్రగతికి సోపానాలూ సుగతికి తార్కాణాలు – మనిషి మనిషిగా బ్రతికే మనుగడ మణిదీపాలు

అ) భరతమాతకు నయనాలు ___________
జవాబు.
పల్లెలు

ఆ) పల్లెలు నవభారత గృహసీమకు ___________
జవాబు.
మణిదీపాలు

ఇ) “ప్రగతికి సోపానాలు”లో సోపానాలు అంటే ___________
జవాబు.
మెట్లు

TS 6th Class Telugu 1st Lesson Questions and Answers Telangana అభినందన

ఈ) నివాసం అనే అర్థం వచ్చే పదాలు ___________
జవాబు.
మందిరాలు, నిలయాలు, ఇళ్ళు

III. స్వీయ రచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. “దేశపురోగతి” అంటే ఏమిటి ? దేశపురోగతికి తోడ్పడిన వారిలో మీకు తెలిసినవారి పేర్లు రాయండి.
జవాబు. దేశపురోగతి అంటే దేశం అభివృద్ధి చెందటం, పంచవర్ష ప్రణాళిక రచించిన పండిట్నెహ్రూ, ఆయన ఆశయ సాధనకు కృషిచేసి ప్రాజెక్టులు నిర్మించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కె.ఎల్.రావు వంటి ఇంజనీర్లు, వ్యవసాయంలో విప్లవం తెచ్చిన స్వామినాథన్, పాల ఉత్పత్తిలో విప్లవం తెచ్చిన కురియన్ మొదలైన వారంతా దేశ పురోగతికి తోడ్పడినవారే.

ఆ. దేశానికి నీతి కర్మశీలుర ఆవశ్యకత ఏమిటి ?
జవాబు.
నీతిశీలురు అంటే న్యాయమార్గంలో నడిచేవారు. మోసపు మార్గంలో నడవనివారు. న్యాయంగా ప్రవర్తిస్తే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఎదుటివారు కూడా సంతృప్తిగా ఉంటారు. అవినీతి వల్ల ఎవ్వరికీ సుఖశాంతులుండవు. అందువల్ల ప్రతివారు నీతిమంతులై ఉండాలి. కర్మశీలురు అంటే తమ విధులను సక్రమంగా నెరవేర్చేవారు. ఎవరి పనులు వారు సకాలంలో చక్కగా నిర్వర్తిస్తే అన్నీ చక్కగా నెరవేరుతాయి. అలా ఎవరి పనులను వారు పద్ధతి ప్రకారం నెరవేరిస్తే దేశంతప్పకుండా ప్రగతి సాధిస్తుంది.

ఇ. అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలు ఆర్పటం అంటే ఏమిటి ?
జవాబు.
అవిశ్రాంత సేద్యం అంటే కొంచెం కూడా విశ్రాంతి తీసుకోకుండా పొలంలో పనిచేసి పంటలు పండించటం. రైతు ఏ మాత్రం విరామం లేకుండా పంటలు పండిస్తూ ఉంటే కూడా సమయం చాలటం లేదు. ప్రజల అవసరానికి తగినంత పంట పండించి ఎవరూ ఆకలితో బాధపడకుండా చూస్తాడు రైతు. ఇదే ఆకలి మంటలు ఆర్పటం అంటే.

ఈ. ఈ గేయ రచయిత గురించి సొంతమాటల్లో రాయండి.
జవాబు.
(సూచన: ముందు పేజీల్లో ఇచ్చిన కవి పరిచయం రాయాలి.)

2. కింది ప్రశ్నకు 10 వాక్యాల్లో జవాబు రాయండి.

1. ‘అభినందన’ గేయ సారాంశాన్ని మీ సొంతమాటల్లో రాయండి.
(లేదా)
రైతులు, సైనికులు దేశానికి ఎలా సేవ చేస్తున్నారో తెలుపండి ?
(లేదా)
జన్మభూమికి ఎవరెవరు ఎట్లా సేవ చేస్తున్నారో వివరించండి.
జవాబు.
రైతులకు, సైనికులకు వందనాలు. మెచ్చుకోవడం అనే చల్లని చందనాలను వాళ్ళకు సమర్పిస్తున్నాం. కష్టాన్ని దాచుకోని రైతులకు, ఎవరికీ తలవంచని సైనికులకు దేశాభివృద్ధికి మూలాలైన ఈ గొప్పవారికి వందనాలు. అభినందనలు. నేలతల్లి సంతోషపడేటట్లుగా, నెత్తురు చెమటగా మారుతుండగా, బంగారాన్ని పండిస్తూ, అభివృద్ధికి బాటలు చూపే రైతులకు వందనాలు. కంటికి రెప్పవలె, చేనుచుట్టూ కంచెవలె, ఈ జన్మభూమికి కవచంవలె ఉండి కాపాడుతున్న గొప్ప వీరులైన జవానులకు వందనాలు.

TS 6th Class Telugu 1st Lesson Questions and Answers Telangana అభినందన

దురాశ అనే మాయకు లోబడకుండా మంచి మనసుగలవారై నిమిషం కూడా తమ విధిని మరువకుండా నీతితో ప్రవర్తించే జవానులకు వందనాలు. విరామం లేకుండా పంటలను పండిస్తూ, ఇతరుల ఆకలి మంటలను చల్లారుస్తూ కష్టించి పనిచేసే రైతులకు వందనాలు. దేశభక్తినే ఖడ్గంగా ధరించి, శత్రుసైన్యాలను చంపి, దేశ కీర్తి పతాకాన్ని ఎగరేసిన గొప్ప వీరులగు జవానులకు అభినందనలు.

IV. సృజనాత్మకత/ప్రశంస

1. “వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే” అని రైతులు, సైనికుల గురించి గేయం పాడుకున్నారు కదా! అట్లాగే తల్లి, తండ్రి, గురువు, మంచిమిత్రులు, గొప్పవాళ్ళు… ఇట్లా ఎవరి గురించైనా వందనాలు వందనాలు… అని అభినందనలు తెలుపుతూ ఒక చిన్న గేయాన్ని రాయండి.
జవాబు.
వందనం అభివందనం హరి చందనాలతో వందనం
మంచి చెడులు నేర్పించే మా దైవములు – తల్లిదండ్రులకు గురువులకు మా వందనం ॥వందనం॥
పలుకునేర్పి నడకనేర్పి – అడుగుఅడుగున తోడునిలిచి
నన్ను కాచిన ప్రేమమూర్తి – కన్నతల్లికి వందనం ॥వందనం॥
తప్పటడుగుల నాటి నుంచి – తప్పు అడుగులు వేయకుండా
ముందకడుగేయించినట్టి – కన్నతండ్రికి వందనం ॥వందనం॥
అక్షరాలను దిద్దబెట్టి – జ్ఞాన దీపము చేతికిచ్చి
మనిషిగా నను తీర్చిదిద్దిన – గురువుకు నా వందనం ॥వందనం॥

V. పదజాల వినియోగం:

1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలను ఖాళీలలో రాయండి.

అ) స్వాతంత్ర్యోద్యమంలో ఎందరో వీరులు తమ రుధిరం చిందించారు. ___________
జవాబు.
నెత్తురు

ఆ) పసిడి ఆభరణాలకు విలువ ఎక్కువ. ___________
జవాబు.
బంగారం

ఇ) వర్షం పడగానే హాలికులు పొలాలు దున్నుతారు. ___________
జవాబు.
రైతులు

ఈ) కార్మికులు తమ స్వేదం చిందించి కర్మాగారాల్లో వస్తువులను తయారుచేస్తారు. ___________
జవాబు.
చెమట

2. కింది వాక్యాలు చదువండి. ప్రతి వాక్యంలో ఒక పదానికి అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలున్నాయి. వాటి కింద గీత గీయండి.

అ) భారతదేశానికి రైతు వెన్నెముక. కర్షకుడు కష్టపడి పంట పండిస్తేనే ప్రజల ఆకలి తీరుతుంది. హాలికుల శ్రమకు
దేశం ఋణపడి ఉన్నది.
జవాబు.
రైతు, కర్షకుడు, హాలికుడు.

ఆ) భారతీయులు స్వాతంత్య్రం సాధించి విజయ బావుటా ఎగుర వేశారు. నాటినుండి జాతీయ పండుగలకు పతాకాన్ని ఎగురవేసి ఆ జెండాకు వందనం చేస్తున్నారు.
జవాబు.
బావుటా, పతాకం, జెండా.

ఇ) పూర్వకాలంలో రాజులు ఖడ్గం ధరించేవారు. అసికి పదును పెట్టి యుద్ధరంగంలోకి వెళ్ళేవారు. ఆ కత్తితోనే యుద్ధం
చేసేవారు.
జవాబు.
ఖడ్గం, అసి, కత్తి.

VI. భాషను గురించి తెలుసుకుందాం.

ధ్వని అనే మాటకు చప్పుడు, శబ్దం అని అర్థం. భాషా విషయంలో మాత్రం ధ్వని అంటే నోటితో పలికేది అని అర్థం. భాషాధ్వనులకు చెందిన అక్షరపు గుర్తుల పట్టికను ‘వర్ణమాల’ లేదా ‘అక్షరమాల’ అని అంటారు.
ఉదా : ‘అ’ అనేది ఒక ధ్వనిని తెలిపే గుర్తు. అంటే అక్షరం.

  • అ, ఆ, ఇ, ఈ వంటి వర్ణాలను అచ్చులు అంటారు.
  • క, ఖ, గ, ఘ వంటి వర్ణాలను హల్లులు అంటారు.
  • అక్షరమాలలో ఎట్లా ఉన్నా ‘హల్లు’ అనేది పొల్లుగా పలికే ధ్వని. ‘మ్’, ‘అ’ అనే ధ్వనులు కలిసి ‘మ’ అయింది. మొదటిది హల్లు, రెండోది అచ్చు.
  • కొన్ని అక్షరాల్లో రెండేసిగాని, మూడేసిగాని హల్లులు కలిసి ఉండవచ్చు. ఇవి మూడు రకాలు.
    1. ద్విత్వాక్షరం
    2. సంయుక్తాక్షరం
    3. సంశ్లేషాక్షరం

TS 6th Class Telugu 1st Lesson Questions and Answers Telangana అభినందన

1. ద్విత్వాక్షరం : ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని “ద్విత్వాక్షరం” అంటారు.
ఉదా : ‘క్క’ = క్ +్క (క్) + అ = క్క – ఇక్కడ కకారం రెండుసార్లు వచ్చింది.

2. సంయుక్తాక్షరం : ఒక హల్లుకు వేరొక హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని ‘సంయుక్తాక్షరం‘ అంటారు.
ఉదా : ‘న్య’ = న్ + య్ + అ – ఇక్కడ నకార, యకారాలనే రెండు హల్లులు వచ్చాయి.

3. సంశ్లేషాక్షరం : ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులకు చెందిన ఒత్తులు చేరితే దాన్ని “సంశ్లేషాక్షరం” అంటారు.
ఉదా : క్ష్మి = క్ + ష్ + మ్ + ఇ – ఇక్కడ కకార, షకార, మకారాలనే హల్లులు మూడు కలిశాయి.

1. కింది అక్షరాల్లో రెండేసి వర్ణాలున్నాయి. వాటిని గుర్తించండి.

ఉదా : గా = గ్ + ఆ = (రెండు ధ్వనులు)

అ) య = య్ + అ = (రెండు ధ్వనులు)
ఆ) కా = క + ఆ (రెండు ధ్వనులు)
ఇ) వొ = వ్ + ఒ (రెండు ధ్వనులు)

2. కింది పదాల్లోని సంయుక్త, ద్విత్వాక్షరాల్లోని ధ్వనులు రాయండి.

ఉదా : పద్మ = ద్ + మ్ + అ (మూడు ధ్వనులు)

అ) ఎత్తండి = త్ + త్ + అ = త్త (మూడు ధ్వనులు)
ఆ) దుర్గతి = ర్ + గ్ + అ = ర్గ (మూడు ధ్వనులు)
ఇ) సాధ్వి = ధ్ + వ్ + ఇ = ధ్వి (మూడు ధ్వనులు)

వర్గాక్షరాలు: ‘క’ నుండి ‘మ’ వరకు ఉన్న అక్షరాలను ఐదు వర్గాలుగా విభజించారు. అవి :

  • క-వర్గం : క – ఖ – గ – ఘ – ఙ్ఞ
  • చ-వర్గం : చ – ఛ – జ – ఝ – ఞ
  • టవర్గం : ట – ఠ – డ – ఢ – ణ
  • త-వర్గం : త – థ – ద – ధ – న
  • ప-వర్గం : ప – ఫ – బ – భ – మ

3. కింది వాక్యాల్లో ఒక వర్గపు అక్షరాలు దాగి ఉన్నాయి. వాటిని గీతగీసి గుర్తించండి.

1. “బలరాం మంచి లాల కోసం ల్లెలో తోటకు పోయాడు. తోటలో పామును చూసి యపడ్డాడు”
జవాబు.
“బలరాం మంచి ఫలాల కోసం పల్లెలో తోటకు పోయాడు. తోటలో పామును చూసి భయపడ్డాడు”.
ప-వర్గం : ప, ఫ, బ, భ, మ

ప్రాజెక్టు పని

మీ సమీపంలోని రైతులు/విశ్రాంత సైనికులను కలవండి. వారు చేస్తున్న సేవలను గురించి తెలుసుకొని నివేదిక రాయండి.

1. ప్రాజెక్టు శీర్షిక : విశ్రాంత సైనికులను కలిసి, వారు దేశానికి చేస్తున్న సేవలను గురించి తెలుసుకొని నివేదిక రాయడం.

2. సమాచార సేకరణ : సమాచారం సేకరించిన తేది: x x x x x సమాచార వనరు: గ్రామంలోని పరిసరాలు.

3. సేకరించిన విధానం : నేను ఈ మధ్య మా గ్రామంలో నివసించే ఒక విశ్రాంత సైనికుని కలిసి సమాచారం సేకరించాను.

4. నివేదక : ఈ మధ్య నేనొక విశ్రాంత సైనికుణ్ణి కలిశాను. ఆయన పేరు నరసింహరాజు. ఆయన సైన్యంలో మేజర్ ఇరవై ఏళ్ళు పనిచేసి స్వచ్ఛందంగా విశ్రాంతత తీసుకున్నాడు. కారణం ఏమిటని అడిగాను. ఇంతకాలం సైనికుడిగా దేశానికి సేవ చేశాను. కొంతకాలం పౌరుడిగా నా ఊరికి, చుట్టుపక్కల గ్రామాలలోను ప్రజలకు సేవ చేయాలనుకున్నాను. అందుకే రిటైరయ్యాను అని చెప్పాడు. ఆయన తనతోబాటు మరికొంతమంది యువకులను కూడగట్టుకొని ముందుగా పిల్లలు పనిలోకి కాదు బడిలోకి పోవాలి అనే విషయంపై అందరికీ అవగాహన కలిగిస్తూ పిల్లలను బడికి పోయేలా ప్రోత్సహిస్తున్నాడు.

TS 6th Class Telugu 1st Lesson Questions and Answers Telangana అభినందన

అమాయకులైన ప్రజలకు కాలుష్యం గురించి తెలియజెప్పి పరిసరాల పరిశుభ్రత గురించి బోధించి చైతన్యవంతులను చేస్తున్నాడు. రాత్రిపూట బడికి వెళ్ళి చదువుకోమని పెద్దలను ప్రోత్సహిస్తున్నాడు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటించమని ప్రోత్సహిస్తున్నాడు. ఇలా విశ్రాంతుడై యుండి అవిశ్రాంతంగా సమాజ అభివృద్ధికి పాటుపడుతూ ఆ రకంగా దేశసేవ చేస్తున్నాడు. అటువంటి వారి జన్మ ధన్యం.

5. ముగింపు : సైనికులు దేశానికి ఏవిధంగా సేవ చేస్తున్నారో తెలుసుకున్నాను.

TS 6th Class Telugu 1st Lesson Important Questions అభినందన

ప్రశ్న 1.
మన రైతులు ఎటువంటి వారు ?
(లేదా)
రైతులు ఏవిధంగా కష్టపడుతున్నారు ? ప్రజలకు వారేమి చేస్తున్నారు?
జవాబు.
మన రైతులు శ్రమ దాచుకోకుండా కాయకష్టం చేస్తారు. పగలూ రాత్రీ అనకుండా పొలంలో పని చేస్తారు. తమ రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమటతో నేలను తడిపి బంగారు పంటను పండిస్తారు. సమాజ అభివృద్ధికి బాటలు వేస్తారు. తమ సేద్యంతో ప్రజలందరికి ఆకలి తీరుస్తారు.

ప్రశ్న 2.
రైతు ఆత్మకథ రాయండి.
జవాబు.
నేను రైతును. ఎండ-వాన, రాత్రి పగలూ తేడా లేకుండా ప్రతి నిత్యం కష్టపడి వ్యవసాయం చేస్తాను. దుక్కిదున్ని, నీరుపెట్టి, విత్తనాలు చల్లి ఆ మొలకలను పశువులు, పక్షులనుండి రక్షిస్తాను. పొలంలో కావలసిన ఎరువులు వేస్తూ, కలుపు మొక్కలను ఏరివేస్తూ ఉంటాను. చీడ పీడలనుండి కాపాడుతాను. నా నెత్తురును చెమటగా మార్చి, బంగారం లాంటి పంటలను పండిస్తాను.

దేశంలో ఆకలితో ఉన్నవారి ఆకలి మంటలను చల్లార్చడం కోసం నా ఆకలిని సైతం మరచిపోతాను. నాకు విరామం లేదు. విశ్రాంతి లేదు, విరమణ కూడా లేదు. రైతే రాజు అన్నవారు సహితం మా గొప్పదనాన్ని, వ్యవసాయం యొక్క అవసరాన్ని గుర్తించడం లేదు. ఎద్దు ఏడ్చిన ఎవుసం (వ్యవసాయం) రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడవని గుర్తించండి. వ్యవసాయాన్ని పోత్సహించండి.

I. అ) క్రింది పద్యము చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుటె గాదు
చచ్చిగూడ చీల్చియిచ్చు తనువు
త్యాగ భావమునకు తరువులే గురువులు
లలిత సుగుణజాల తెలుగు బాల.

ప్రశ్నలు: –

1. ‘తరువులు’ అంటే ఏమిటి ?
జవాబు.
తరువులు అంటే చెట్లు

2. చెట్లు మనకు ఏమేమి ఇస్తాయి ?
జవాబు.
చెట్లు మనకు పూలు, పండ్లు ఇస్తాయి.

3. తనువును చీల్చి ఇచ్చేవి ఏవి ?
జవాబు.
చెట్లు తనువును చీల్చి ఇస్తాయి.

4. త్యాగం అంటే ఏమిటి ?
జవాబు.
స్వార్థము లేకుండా సర్వస్వము సమర్పించుట

5. ఈ పద్యానికి శీర్షిక పెట్టండి.
జవాబు.
త్యాగ భావం

II. పదజాలం:

కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు సరైన అర్థాలను రాయండి.

1. కార్మికులు స్వేదం చిందించి, పనిచేస్తారు.
a) రక్తం
b) చెమట
c) కన్నీరు
d) శ్రమ
జవాబు.
b) చెమట

TS 6th Class Telugu 1st Lesson Questions and Answers Telangana అభినందన

2. వానచినుకులకు పుడమి పులకరించింది.
a) శరీరం
b) మేఘం
c) భూమి
d) ఆమె
జవాబు.
c) భూమి

3. బిడ్డను చూసి తల్లి పులకించింది.
a) దుఃఖించింది
b) పాటపాడింది
c) గగుర్పాటు చెందింది
d) బాధపడింది
జవాబు.
c) గగుర్పాటు చెందింది

4. పసిబిడ్డల మనసులు నిర్మలమైనవి.
a) స్వచ్ఛం
b) సుందరం
c) చిన్నవి
d) పెద్దవి
జవాబు.
a) స్వచ్ఛం

5. మనమందరం దేశ ప్రగతికి పాటుపడాలి.
a) పేరు
b) సుఖం
c) మంచి
d) అభివృద్ధి
జవాబు.
d) అభివృద్ధి

III. కింది వాక్యాల్లో ఒకే అర్థంగల పదాలను గుర్తించి రాయండి.

1. పుడమిని దున్నిన రైతు ఆ భూమిలో విత్తనాలు చల్లితే ఆ ధరణి బంగారం లాంటి పంటనిస్తుంది.
a) భూమి, విత్తనాలు, బంగారం
b)పుడమి, విత్తనాలు, దున్నడం
c) రైతు, పుడమి, పంట
d) పుడమి, భూమి, ధరణి
జవాబు.
d) పుడమి, భూమి, ధరణి

2. మనం చేయవలసిన పని చక్కగా చేస్తే మన విధి నిర్వహణ బాగున్నదని మన కర్తవ్య నిర్వహణను అందరూ మెచ్చుకుంటారు.
d) పుడమి, భూమి, ధరణి
b) మెప్పు, కర్తవ్యం, పని
c) చేయవలసిన, నిర్వహణ, మెప్పు
d) మనం, విధి, అందరం
జవాబు.
d) పుడమి, భూమి, ధరణి

IV. వ్యాకరణం:

1. ‘అభినందన చందనాలివే’ – గీతగీసిన అక్షరంలోని వర్ణాలు
a) అ + భి
b) భ్ + ఇ
c) బ + హ + ఇ
d) భి + ఇ
జవాబు.
b) భ్ + ఇ

TS 6th Class Telugu 1st Lesson Questions and Answers Telangana అభినందన

2. ‘నిర్మలమైన మనస్సుతో జన్మభూమిని ప్రేమించాలి’ – ఈ వాక్యంలోని సంయుక్తాక్షరాలు
a) ర్మ, మై, న్మ, స్సు
b) స్సు
c) ర్మ, న్మ, ప్రే
d) మై, స్సు, ప్రే
జవాబు.
c) ర్మ, న్మ, ప్రే

15. ‘తల్లి’ – గీతగీసిన అక్షరంలోని ధ్వనులు
a)త + ల్ + లి
b) ల్ + ల + ఇ
c) ల్ + ల్ + అ
d) ల్ + ల్ + ఇ
జవాబు.
d) ల్ + ల్ + ఇ

3. ‘తలపులలోని కథలు చెప్పే విధం గొప్పది’ ఈ వాక్యంలోని త వర్గాక్షరాలు
a) థ, ధ, ది
b) త. థ. ధ, ది
c) క, చె, త, ప్పే, ప్ప
d) తలపు, కథ, చెప్పే, విధం
జవాబు.
b) త. థ. ధ, ది

4. కింది వానిలో చ వర్గాక్షరాలేవి ?
a) క చ ట త ప
b) గ జ డ ద బ
c) చ-ఛ-జ-ఝ-ఞ
d) చ – ఛ -ఝ
జవాబు.
c) చ-ఛ-జ-ఝ-ఞ

1. పల్లవి:

వందనాలు వందనాలు అభినందన చందనాలివే
అభినందన చందనాలివే
శ్రమదాచని హాలికులకు
తలవంచని సైనికులకు
భరతమాత పురోగతికి
ప్రాతిపదికలగు ఘనులకు ॥వంద ॥
పుడమి తల్లి పులకింపగ
రుధిరం స్వేదమ్ము కాగ
పసిడిని పండించునట్టి
ప్రగతి మార్గదర్శకులకు ॥వంద ॥

అర్థాలు :
వందనాలు వందనాలు = ఎన్నెన్నో నమస్కారాలు
అభినందన = మెచ్చుకోలు, ప్రోత్సాహం
చందనాలు = మంచి గంధాలు
ఇవి + ఏ = ఇవిగో
శ్రమదాచని = కష్టం దాచుకోని
హాలికులకు = రైతులకు
తలవంచని = శత్రువులముందు ఓడిపోని
సైనికులకు = జవానులకు
భరతమాత = భారతమాత యొక్క
పురోగతికి = అభివృద్ధికి
ప్రాతిపదికలగు = పునాదులవంటివారైన
ఘనులకు = గొప్పవారికి
పుడమితల్లి = తల్లి
పులకింపగ = పులకరించేటట్లు
రుధిరం = రక్తం
స్వేదము కాగ = చెమటగా చేసి
పసిడిని = బంగారాన్ని
పండించునట్టి = పంటల రూపంలో పండించే
ప్రగతి = అభివృద్ధి
మార్గదర్శకులకు = మార్గాన్ని చూపించేవారికి
వందనాలు = నమస్కారాలు

భావం : రైతులకు, సైనికులకు వందనాలు. మెచ్చుకోవడం అనే చల్లని చందనాలను వాళ్ళకు సమర్పిస్తున్నాం. కష్టాన్ని దాచుకోని రైతులకు, ఎవరికీ తలవంచని సైనికులకు దేశాభివృద్ధికి మూలాలైన ఈ గొప్పవారికి వందనాలు. నేలతల్లి సంతోషపడేట్టు నెత్తురు చెమటగా మార్చి బంగారాన్ని పండిస్తూ అభివృద్ధికి బాటలు చూపే రైతులకు వందనాలు.

2. పల్లవి:

కంటికి కనురెప్పలాగ
చేనుచుట్టు కంచెలాగ
జన్మభూమి కవచమైన
ఘనవీరులు జవానులకు ॥వంద॥
ప్రలోభాల మాయలోన
పడిపోవని నిర్మలురకు
నిమిషమేని విధిమరువని
నీతి కర్మశీలురకు
అవిశ్రాంత సేద్యంతో ॥వంద॥
ఆకలి మంటలను ఆర్పి
దేశభక్తి ఖడ్గంగా, శత్రుమూకలను దున్మి
దేశకీర్తి బావుటాను ఎగరేసిన ఘనజనులకు ॥వంద॥

అర్థాలు :
కంటికి = కన్నులకు
కనురెప్పలాగ = కప్పిఉంచే రెప్పల్లాగా
చేనుచుట్టు = పొలంచుట్టూ
కంచెలాగ = రక్షణకోసం వేసే కంచెవలె
జన్మభూమి = మాతృభూమికి
కవచమైన = రక్షణకవచం వంటి
ఘనవీరులు = గొప్ప వీరులైన
జవానులకు = సైనికులకు
ప్రలోభాల = ఆశలు అనే
మాయలోన = భ్రమలో
పడిపోవని = లోనుకాకుండా ఉండే
నిర్మల = స్వచ్ఛమైన మనసుకలవారికి
నిమిషము + ఏని = ఒక్క క్షణం కూడా
విధి మరువని = తమ కర్తవ్యం మరిచిపోని
నీతి = న్యాయము
కర్మ = కర్తవ్యము
శీలురకు = స్వభావముగా గలవారికి
అవిశ్రాంత = విరామం లేకుండా
సేద్యంతో = వ్యవసాయంతో
ఆకలి మంటలను = ప్రజల ఆకలిని
ఆర్ప = తీర్చి
దేశభక్తి = దేశంమీద భక్తిని
ఖడ్గంగా = కత్తిగా చేసుకొని
శత్రుమూకలను = శత్రు సమూహాన్ని
దున్మి = నాశనంచేసి
దేశ కీర్తి = దేశము యొక్క గొప్పతనం అనే
బావుటాను = జెండాను
ఎగరేసిన = ఎగురవేసిన
ఘనజనులకు = గొప్పవారికి
వందనాలు = నమస్కారాలు

భావం: కంటికి రెప్పవలె, చేనుచుట్టూ కంచెవలె, జన్మభూమికి కవచంవలె ఉంటూ కాపాడుతున్న గొప్పవీరులైన జవానులకు వందనాలు. దురాశ అనే మాయకు లోనుకాకుండా మంచి మనసుకలవారై నిమిషం కూడా తమ విధిని మర్చిపోకుండా నీతితో ప్రవర్తించే జవానులకు వందనాలు. విరామం లేకుండా పంటలు పండిస్తూ, ఇతరుల ఆకలి మంటలను చల్లారుస్తూ కష్టించి పనిచేసే రైతులకు వందనాలు. దేశభక్తినే ఖడ్గంగా ధరించి శత్రు సైన్యాలను చంపి దేశ కీర్తి పతాకాన్ని ఎగరేసిన గొప్పవీరులగు జవానులకు అభినందనలు.

TS 6th Class Telugu 1st Lesson Questions and Answers Telangana అభినందన

పాఠం ఉద్దేశం
ఈ దేశం బాగోగులు కోరుతూ, అందుకోసం నిరంతరం శ్రమించే కర్మవీరులు ఎంతోమంది ఉన్నారు. అట్లాంటి వారిలో ముందుండేది రైతులు, సైనికులు. వారిని స్మరించుకుంటూ వారి శ్రమను, గొప్పతనాన్ని తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. గేయం అనగా పాడగలిగేది అని అర్థం. ఈ గేయం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన “స్వరభారతి” అనే గేయసంకలనం నుండి తీసుకోబడింది.

కవి పరిచయం

ప్రశ్న.
అభినందన పాఠం రచించిన కవిని గురించి రాయండి.
జవాబు.
శేషం లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూర్. కనకమ్మ, నరహరిస్వామి దంపతులకు జన్మించిన ఈయన చాలాకాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు. ఈయన అనేక పద్య, వచన, గేయ కవితలను రచించాడు. అవి వివిధ పత్రికల్లో ప్రచురింప బడ్డాయి. టీవీ, రేడియోల్లో కూడా ప్రసారమయ్యాయి. అనేకమంది శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఈయన రాసిన విమర్శనావ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచారసభ వారి ‘స్రవంతి పత్రిక’లో ప్రచురింపబడ్డాయి. లలిత మనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందెవేసిన చేయి.

ప్రవేశిక

దేశానికి వెన్నెముక రైతు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడువాడు సైనికుడు. వారిద్దరూ లేకపోతే దేశ ప్రజలకు తిండి, దేశానికి రక్షణా ఉండదు. దేశం కోసం వాళ్ళిద్దరూ పడే శ్రమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపోవు. అందుకే లాల్ బహదూర్శాస్త్రి “జై జవాన్ జై కిసాన్” అన్నాడు. అదే భావనను ప్రతిఫలింపజేస్తూ రచయిత సరళమైన మాటలతో వారిని ఎట్లా అభినందించాడో ఈ పాఠం చదివి తెలుసుకోండి.

నేనివి చేయగలనా?

  • గేయాన్ని అభినయంతో పాడగలను. ప్రగతి మార్గదర్శకులను గురించి చెప్పగలను. – అవును/ కాదు
  • అపరిచిత గేయాన్ని చదివి అర్థం చేసుకొని, ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తించగలను. – అవును/ కాదు
  • గేయ సారాంశాన్ని సొంతమాటల్లో రాయగలను. – అవును/ కాదు
  • పాఠం ఆధారంగా కొత్త గేయాన్ని రాయగలను. – అవును/ కాదు

TS 6th Class Hindi Guide 12th Lesson बच्चे चले क्रिकेट खेलने

Telangana SCERT 6th Class Hindi Study Material Telangana Pdf 12th Lesson बच्चे चले क्रिकेट खेलने Textbook Questions and Answers.

TS 6th Class Hindi 12th Lesson Questions and Answers Telangana बच्चे चले क्रिकेट खेलने

सुनो-बोलो :

TS 6th Class Hindi Guide 12th Lesson बच्चे चले क्रिकेट खेलने 1

प्रश्न 1.
कहानी में आगे क्या हुआ होगा ?
उत्तर :
बारिश के काग्ण खेल बंद हुआ होगा और बच्चे-अपने घर चले गए होंगे ।

प्रश्न 2.
विजय रमेश को क्या समझा रहा था ?
उत्तर :
विजय रमेश को समझा रहा था कि जीत के लिए दस रन चाहिए। समझदारी से खेलना है। महेश की बालिंग में खेलना मुश्किल है और अब तक उसने चार विकट ले लिए हैं।

TS 6th Class Hindi Guide 12th Lesson बच्चे चले क्रिकेट खेलने

प्रश्न 3.
अगर तुम टीम के कप्तान होते तो क्या करते ?
उत्तर :
अगर मैं टीम के कप्तान हो तो मैं टीम के अन्य खिलाडियों से मित्रता का व्यवहार करूँगा । सबको समान रूप से देखता । जीतने के लिए जो अभ्यास चाहिए और उत्साह, प्रोत्साहन चाहिए मैं उन्हें दूँगा । मैच जीतने के लिए मैं अपनी ओर से जी जान से कोशिश करूँगा।

पढ़ो :

अ. पढ़ो-बताओ।

प्रश्न 1.
किसने चार विकेट लिए ?
उत्तर :
विजय ने चार विकेट लिए।

प्रश्न 2.
किसने चार रन किए ?
उत्तर :
रमेश ने चार रन किए।

प्रश्न 3.
रमेश के टीम का कप्तान कौन था ?
उत्तर :
रमेश के टीम का कप्तान विजय था।

TS 6th Class Hindi Guide 12th Lesson बच्चे चले क्रिकेट खेलने

आ. इसमें क्रिकेट से संबंधित शब्द कौन-से हैं? पहचानकर ‘◯’ लगाइए।

TS 6th Class Hindi Guide 12th Lesson बच्चे चले क्रिकेट खेलने 2

उत्तर :
TS 6th Class Hindi Guide 12th Lesson बच्चे चले क्रिकेट खेलने 3

इ. नीचे कुछ खेलों के चित्र दिये गये हैं।

TS 6th Class Hindi Guide 12th Lesson बच्चे चले क्रिकेट खेलने 4

अब बताओ

TS 6th Class Hindi Guide 12th Lesson बच्चे चले क्रिकेट खेलने 5
उत्तर :
TS 6th Class Hindi Guide 12th Lesson बच्चे चले क्रिकेट खेलने 12

ई. इन्हें भी जानिए।

TS 6th Class Hindi Guide 12th Lesson बच्चे चले क्रिकेट खेलने 7

उत्तर :
TS 6th Class Hindi Guide 12th Lesson बच्चे चले क्रिकेट खेलने 13

लिखो :

अ. खिलाड़ी में क्या – क्या गुण होने चाहिए ? आप अपने में किन अच्छा गुणों का विकास करना चाहेंगे? लिखिए।

TS 6th Class Hindi Guide 12th Lesson बच्चे चले क्रिकेट खेलने 8

उत्तर :
TS 6th Class Hindi Guide 12th Lesson बच्चे चले क्रिकेट खेलने 9

आ. नीचे दिये गये संकेतों के आधार पर वाक्य बनाइए।

TS 6th Class Hindi Guide 12th Lesson बच्चे चले क्रिकेट खेलने 10
उत्तर :

  1. क्रिकेट मैंच खेलने के लिए दो टीम है ।
  2. एक एक टीम मे ग्यारह खिल्नाडी है ।
  3. एक टीम का कप्तान उदय है और दूस टीम का कप्तान संजय है ।
  4. मैच मे उदय टीम जीत गया ।
  5. टीम के हर एक खिलाडी को पाँच-पाँच हजार रूपये पुरस्कार में मिले ।

TS 6th Class Hindi Guide 12th Lesson बच्चे चले क्रिकेट खेलने

इ. गेंद और बल्ला आपस में क्या बातचीत कर रहे हैं? सोचकर लिखिए।

TS 6th Class Hindi Guide 12th Lesson बच्चे चले क्रिकेट खेलने 11
उत्तर :
गेंद : बल्ला भैया, कैसे हो?
बल्ला : मैं ठीक हूँ। तुम कैसी हो ?
गेंद : बल्ला भैया, मुझे जोर से मत मारो।
बल्ला : ठीक है ! जोर से नही मारूँगा ।

ई. अपने दोर्त के बारे में लिखिए। उसके कौन – से गुण तुम्हें अच्छे लगते हैं?
उत्तर :
साइना नेह्बाल मेरीप्रिय खिलाड़ी है।
बैडमिंटन में चीन, कोरिया, इंडोनेशिया
और जापान के धुरंधरों के बीच कोई भारतीय
इस कदर छा जाएगा, किसी ने सोचा नहीं होगा।
सायन औरों से कहीं अल्गग, कही ज्यादा दमदार, प्रतिभाशाली और आत्मविश्वास से लबरेज ऐसी ‘खास’ खिलाड़ी हैं जो जीत हासिल करने के लिए किसी भी हद तक जा सकती हैं। तीन अंतर्गाष्ट्रीय खिताब जीतना कोई मामूली बात नहीं है।

TS 6th Class Hindi Guide 12th Lesson बच्चे चले क्रिकेट खेलने

अभ्यासकार्य :

1. निम्नलिखित गद्यांश का वाचन कीजिए। प्रश्नों के जवाब दीजिए।
క్రింది గద్యభాగాన్ని చదవండి. ఫ్రశ్నలకు జవాబులు వ్రాయండి.
एक चिडिया और एक चिरींटा एक घर में रहते थे। एक दिन चिडिया लाई दाल के दाने, चिरौंटा लाया चाबल। दोनों ने मिलकर खिचडी बनाई। खिचडी गरम थी। चिरींटा बोला – चलो, थोडी देर सो जाते हैं। बाद में खाएँगे। दोनों सो गए। चिरौंटा चुपके से उठा और सारी खिचडी खाकर फिर सो गया। धोडी देर बाद चिडिया उठी तो देखा कि पतीले में खिचडी नहीं हैं।

प्रश्न 1.
चिडिया और चिरोंटा कहाँ रहते थे?
1) घर में
2) पेड में
3) नदी में
उत्तर :
1) घर में

प्रश्न 2.
एक दिन चिडिया क्या लाया?
1) चावल्न के दाने
2) दाल के दाने
3) गेहूं के दाने
उत्तर :
2) दाल के दाने

प्रश्न 3.
चिरोंटा क्या लाया?
1) चावल के दाने
2) दाल के दाने
3) गेहूँ के दाने
उत्तर :
1) चावल के दाने

TS 6th Class Hindi Guide 12th Lesson बच्चे चले क्रिकेट खेलने

प्रश्न 4.
दोनों ने मिलकर क्या बनायी?
1) खाना
2) खिचडी
3) खीर
उत्तर :
2) खिचडी

प्रश्न 5.
दोनों ने क्या किया?
1) खले
2) खाये
3) सो गए
उत्तर :
3) सो गए

सारांश-సారాంశం :

बच्चे मैच देख रहे थे । वे बहुत खुश थे। टीम का कप्तान बोला, “’गमेश अब तुम्हारी बैटिंग है, जीत के लिए और दस रन चाहिए। इसलिए समझदारी से खेलना। महेश की बौलिंग में खेलना मुश्किल है। उसने अब तक चार विकेट लिए हैं।”
रमेश हाँ-हाँ कहते हुए खड़ा हो गया। ग्लोज्ज पहना। बैट पकड़ा और क्रीज पर पहुँचा।
श्रीनु, वासु, रवि, अली, जानी सब महेश के पास पहुँचे। सब महेश को कुछ बता रहे थे। महेश ने तेजी से बौंसर गेंद फेंकी। ग्मेश ने बल्ला घुमाया।

భావం : పిల్లలు మాచ్ చూస్తున్నారు. వారు చాలా ఆనందంగా ఉన్నారు. టీమ్ కెప్టెన్ అన్నాడు. ‘రమేష్ ఇప్పుడు నీ బాటింగ్, గెలవడానికి పది పరుగులు కావాలి. అందుకని తెలివిగా ఆడాలి. మహెష్ బౌలింగ్లో ఆడటం కష్టం. అతడు ఇప్పటిదాకా నాలుగు వికెట్లు తీసుకున్నాడు.

Children were watching match. They were very happy. Team captain said, “Ramesh now it in your bating. We need ten runs to win the match. So you must play carefully (intelligently). It is very difficult to play in Mahesh bowling. Till now he has taken 4 wickets.”

और गेंद हवा में। गेंद बौंडड्र्री लाइन के पार। सबने तालियाँ बजायीं। रमेश का हौंसला कुछ और बढ़ा। वह अगली गेंद का सामना करने के लिए तैयार था। लेकिन यह क्या….। गेंद रमेश के पैर पर ही आ लगी। महेश जोर से चिल्लाया- “अम्पायर…!” अम्पायर ने इशारे से ना कहा।
महेश ने अगली गेंद डाली। रमेश ने बल्ला भी घुमाया। लेकिन गेंद बल्ले पर नहीं आयी। रमेश के स्टंप्स उखड़ गये। महेश खुशी से उछलने लगा।
अगला बैट्समैन खुद कप्तान विजय था। वह क्रीज पर पहुँचा। अपनी नज़ आगे. पीछे, दायें, बायें दौड़ायी। विजय बैटिंग कग्ने के लिए दौड़ा। तभी जोग्टाग बागिश शुरू हुई। बागिश इतनी हुई, इतनी हुई, इतनी हुई कि………..

భావం : బాలు గాలిలోకి లేచింది. బాలు బౌండ్రీలైన్ దాటింది. అందరూ చప్పట్లు కొట్టారు. రమేష్కి కొంచెం ధైర్యం పెరిగింది. ఇంకో బంతిని ఎదుర్కోవటానికి సిద్ధపడ్డాడు. కానీ ఇదేంటి…. బాలు రమేష్ కాలికి తగిలింది. మహేష్ పెద్దగా అంపైర్, అంపైర్ అని అరిచాడు. అంపైర్ కాదని సౌంజ్ఞ చేసాడు.
మహేష్ తర్వాతి బంతి వేసాడు. రమేష్ బాట్ని ఊపాడు. కాని బాల్ బాట్ మీదకు రాలేదు. రమేష్. స్టంపులు ఎగిరి పడ్డాయి. మహేష్ సంతోషంతో గంతులేసాడు.
తర్వాతి బేటింగ్ కొచ్చింది స్వయంగా కేప్టెన్ విజయ్. అతను క్రీజ్ వద్దకు వచ్చాడు. దృష్టిని వెనక్కి, ముందుకు, కుడి, ఎడమలకు పరిగెత్తించాడు. విజయ్ బాటింగ్ చేయడానికి పరిగెత్తాడు. అప్పుడే పెద్దగా వర్షం మొదలైంది. వర్షం ఎంత పడిందంటే, ఎంత పడిదంటే, ఎంత పడిందంటే ………….

Ball was in the air, crossed boundary line. All to face next ball. But what was this …… ball touched Ramesh leg. Mahesh shouted loudly ‘Umpire – Umpire’. Umpire indicated ‘No’.
Mahesh started bowling. Ramesh moved the bat. But could not hit the ball. Stumps jumped and fell down. Mahesh jumped happily.

Next captain Vijay himself came for bating. He came to creeze. He looked in all directions. Vijay ran for bating. Then suddenly it started raining. It rained so heavily, so heavily that ……

TS 6th Class Hindi Guide 12th Lesson बच्चे चले क्रिकेट खेलने

शब्दार्थ (అర్ధములు) (Meanings) :

TS 6th Class Hindi Guide 12th Lesson बच्चे चले क्रिकेट खेलने 14

विलोम शब्द – వ్యతిరేక పదాలు – Opposites :

TS 6th Class Hindi Guide 12th Lesson बच्चे चले क्रिकेट खेलने 15

TS 6th Class Hindi Guide 11th Lesson उद्यान

Telangana SCERT 6th Class Hindi Study Material Telangana Pdf 11th Lesson उद्यान Textbook Questions and Answers.

TS 6th Class Hindi 11th Lesson Questions and Answers Telangana उद्यान

सुनो-बोलो :

प्रश्न 1.
पेड़-पैधों से हमें क्या-क्या मिलते हैं ?
उत्तर :
पेड-पौधों से हमें कई प्रकार के फूल-फल मिलते हैं। पेड हमें छाया देते हैं। ठंडी हवा देते हैं। वर्षा देते हैं। इंधन मिलता है। अनेक उद्योगों के लिए कच्चा माल मिलता है। पर्यावरण प्रदूषण को दूर करने में सहायता कग्ते हैं।

प्रश्न 2.
अपने मनपसंद पेड़ के बारे में बताओ।
उत्तर :
मुझे नारियल का पेड पसंद है। वह बहुत बडा होता है। नारियल का पानी स्वास्थ्य के लिए अच्छा है। कई पकवानों में नारियल का उपयोग करते हैं। केरल में यह बहुत मिलता है।

TS 6th Class Hindi Guide 11th Lesson उद्यान

प्रश्न 3.
उद्यान की सुंदरता के बारे में बताओ।
उत्तर :
उद्यान का मुख्य द्वार बहुत सुन्दर है। यहाँ रंग – बिरंगे फूल हैं। कई प्रकार के वृक्ष हैं। इन पेडों पर तोते, मैना और कई पक्षी आकर बैठते हैं। उद्यान के बीच में एक फव्वारा भी है।

पढो :

अ. पढ़िए और समझिए।

TS 6th Class Hindi Guide 11th Lesson उद्यान 1

आ. शब्दों का उच्चारण करो।

TS 6th Class Hindi Guide 11th Lesson उद्यान 2

इ. नीचे दिये गये शब्द पढ़ो और सही शब्द के नीचे रेखा खींचिए।

TS 6th Class Hindi Guide 11th Lesson उद्यान 3
उत्तर :
TS 6th Class Hindi Guide 11th Lesson उद्यान 4

ई. शब्द पढ़ो। संयुक्ताक्षर वाले शब्दों पर ‘◯’ लगाओ। द्वित्वाक्षर वाले शब्दों पर ‘▢’ लगाओ।

TS 6th Class Hindi Guide 11th Lesson उद्यान 5
उत्तर :
TS 6th Class Hindi Guide 11th Lesson उद्यान 6

लिखो :

अ. नीचे दिये गये वाक्यों में रेखांकित शब्दों को सही करके लिखिए।

TS 6th Class Hindi Guide 11th Lesson उद्यान 7

उदयान हरा – भरा होता है।
उत्तर :
उद्यान

भारत महान राषटर है।
उत्तर :
राष्ट्र

TS 6th Class Hindi Guide 11th Lesson उद्यान

वह हवाई अडडा है।
उत्तर :
अड्डा

आ. नीचे दिये गये अक्षरों से बननेवाले संयुक्ताक्षर शब्द लिखिए।

TS 6th Class Hindi Guide 11th Lesson उद्यान 8
उत्तर :
TS 6th Class Hindi Guide 11th Lesson उद्यान 9

इ. अपने बारे में कुछ वाक्य लिखिए।
उत्तर :
मेरा नाम गोपाल है। मैं छटी कक्षा पढ़ रहा हूँ। मेरे पिताजी सरकारी दफ़्तर में नोकरी करते हैं। मेरी माँ अध्यापिका है। मेरे घर के पीछे एक बगीचा है। मैं रोज़ अपने दोस्तों के साथ उस बगीचे में खेलता हूँ।

ई. अपनी पाठशाला के बारे में लिखिए।
उत्तर :
हमारी पाठशात्ना का नाम महात्मा गाँधी हाईस्कूल है। इसमें पाँच सौ लडके और लडकियाॅ पढ़ती हैं। पाठशाला के पीछे बड़ा मैदान है। वहाँ हमें खेलते हैं। हमारे प्रथानाध्यापक बड़े अच्छे आदमी हैं। वे हमें प्यार करते हैं। हम भी उनके प्रति श्रद्धा रखते हैं।

TS 6th Class Hindi Guide 11th Lesson उद्यान

अभ्यासकार्य :

1. निम्नलिखित गद्यांश का वाचन कीजिए। प्रश्नों के जवाब दीजिए।
క్రింది గద్యభాగాన్ని చదవండి. ఫ్రశ్నలకు జవాబులు వ్రాయండి.
एक लोमडी थी। एक दिन उसको बहुत भूख लगी थी। वह खाने के लिए कुछ ढूँढ रही थी। उसने एक बाग में अंगूर देखे। वाह! कितने बढिया अंगूर हैं। चलूँ, आज ये अंगूर खाकर भूख मिटाऊँ। ऐसा सोचकर लोमडी बाग में गयी। वह अंगूर तोडने के लिए उछली।

प्रश्न 1.
किसको बहुत भूख लगी थी?
1) शेर
2) कौआ
3) लोमडी
उत्तर :
3) लोमडी

प्रश्न 2.
वह खाने के लिए क्या कर रही थी?
1) ढूँढ
2) खोज
3) खोना
उत्तर :
1) ढूँढ

TS 6th Class Hindi Guide 11th Lesson उद्यान

प्रश्न 3.
उसको बाग में एक दिखाई पडी?
1) आम
2) अंगूर
3) केला
उत्तर :
2) अंगूर

प्रश्न 4.
अंगूर कैसे हैं?
1) अच्छा
2) बढिया
3) ताजा
उत्तर :
2) बढिया

प्रश्न 5.
ऐसा सोचकर लोमडी कहाँ गयी?
1) बाजाए में
2) घर में
3) बाग में
उत्तर :
3) बाग में

2. शब्द पढ़ो । संयुक्ताक्षर वाले शब्द पहचानकर गोला लगाओ ।

TS 6th Class Hindi Guide 11th Lesson उद्यान 11
उत्तर :
TS 6th Class Hindi Guide 11th Lesson उद्यान 12

3. नीचे दिये गये शब्दों में अंतर समझकर पढ़ो । सही शब्द का चयन करो ।

दवार – द्वार उदयान – उद्यान गडढ़े – गड्ढे परकार – प्रकार सुनदर – सुन्दर
उत्तर :

TS 6th Class Hindi Guide 11th Lesson उद्यान 13

सारांश-సారాంశం :

TS 6th Class Hindi Guide 11th Lesson उद्यान 14

शब्दार्थ (అర్ధములు) (Meanings) :

TS 6th Class Hindi Guide 11th Lesson उद्यान 15

वचन :

एकवचन – बहुवचन

  1. पत्ती – पत्तियाँ
  2. डाली – डालियाँ
  3. गड़ढा – गड़ढे
  4. तोता – तोते
  5. पौधा – पौधे

TS 6th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వర్షం

Telangana SCERT 6th Class Telugu Guide Telangana 3rd Lesson వర్షం Textbook Questions and Answers.

వర్షం TS 6th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana

బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి

TS 6th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వర్షం 1

ప్రశ్నలు

ప్రశ్న 1.
బొమ్మలో ఎవరెవరున్నారు? ఏం చేస్తున్నారు ?
జవాబు.
బొమ్మలో ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. వాళ్ళు వాన చినుకులతో ఆడుకుంటున్నారు.

ప్రశ్న 2.
బాలిక మబ్బును చూస్తూ ఏం పాట పాడుతున్నదో ఊహించండి.
జవాబు.
బాలిక మబ్బును చూస్తూ
వానావానా వల్లప్పా వానలు కురిసే వల్లప్పా
బావులు నిండే చెరువులు నిండే
వాగులు పొంగి పరుగులు తీసే ॥ వానావానా వల్లప్పా||
అనే పాట పాడుతున్నది.

TS 6th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వర్షం

ప్రశ్న 3.
వానపడుతుంటే మీరేం చేస్తారు ? మీకేం చేయాలనిపిస్తుంది ?
జవాబు.
వానపడుతుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. శరీరానికి ఎంతో చల్లగా ఉంటుంది. అప్పుడు నాకు పాటలు పాడాలనిపిస్తుంది చురుక్కుమంటూ మీదపడే చినుకులతో ఆడుకోవాలని అనిపిస్తుంది.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.22)

ప్రశ్న 1.
మేఘాన్ని నడుమంతరపు సిరికి మిడిసిపడే వారితో కవి ఎందుకు పోల్చి ఉంటాడు?
జవాబు.
నడుమంతరపు సరి అంటే మొదటి నుంచీ లేకుండా మధ్యలో అనుకోకుండా వచ్చి చేరిన సంపద అని అర్థం. మేఘాలు వర్షాకాలంలో మాత్రమే నీటితో నిండి ఉంటాయి. వర్షాకాలం పూర్తి కాగానే తేలికైపోతాయి. అందువల్ల అన్నివేళల్లోనూ లేకుండా మధ్యలో వచ్చి మధ్యలో పోయే మేఘాన్ని నడుమంతరపు సిరికి మిడిసిపడే వారితో కవి పోల్చాడు.

ప్రశ్న 2.
వర్షం పడడాన్ని కవి వర్ణించాడు కదా! జోరువాన పడుతుంటే మీకెట్లా అనిపిస్తుంది ?
జవాబు.
మొదట హాయిగా అనిపిస్తుంది. వినసొంపైన లయతో పడే వాన చినుకుల శబ్దాలకు అనుగుణంగా పాటలు పాడాలని అనిపిస్తుంది. వాన చినుకులతో ఆడుకోవాలని కూడా అనిపిస్తుంది. కానీ అదేపనిగా ఎండ రాకుండా ఎడతెరపి లేకుండా రోజూ వర్షం పడుతూనే ఉంటే విసుగొస్తుంది. వర్షానికి ఇళ్ళ మట్టిగోడలు పడిపోయి, పై కప్పులు ఎగిరిపోయి బాధలుపడే పేదలను చూస్తే బాధేస్తుంది.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.23)

ప్రశ్న 1.
ప్రజలందరు ఛత్రపతులైనారని కవి ఎందుకన్నాడు ?
జవాబు.
ఛత్రం అంటే గొడుగు. ఛత్రపతి అంటే గొడుగు కలిగినవాడు. వర్షంలో తడవకుండా జాగ్రత్త కోసం గొడుగును ఉపయోగిస్తున్నారు. జోరుగా కురిసే వానలో తడవకుండా ప్రజలందరూ గొడుగులు పట్టుకున్నారు అని చెప్పడం కోసం కవి ఈ మాటలు అన్నాడు.

ప్రశ్న 2.
‘భూసతి రామచిలుకయయ్యె’ అని కవి ఎందుకన్నాడు ?
జవాబు.
భూసతి అంటే ‘భూమి’ అనే స్త్రీ. రామచిలుక ఆకుపచ్చగా ఉంటుంది. రామచిలుకయయ్యె అంటే రామచిలుక రంగులాగా ఆకుపచ్చగా మారింది అని తాత్పర్యం. వర్షానికి పులకరించిన నేలంతా పచ్చదనంతో రామచిలుక వలె కనిపిస్తున్నది అని చెప్పడానికి కవి ఈ మాటలు అన్నాడు.

ప్రశ్న 3.
వానలు పడడం వల్ల వాతావరణం ఎట్లా మారుతుంది ? ఏమేం జరుగుతుంది ?
జవాబు.
వానలు పడడం వల్ల వాతావరణం చల్లబడుతుంది. కారుమబ్బులతో అంతా చీకటైపోతుంది. నేలంతా ఎటుచూసినా వాన నీళ్ళే కనిపిస్తాయి. అజాగ్రత్తగా నడిస్తే కాలు జర్రున జారుతుంది. వానల వల్ల బావులు, చెరువులు నిండుతాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తాయి. జలాశయాలు కళకళలాడతాయి. వర్షానికి పులకరించి నేలంతా పచ్చదనంతో రామచిలుకవలె కనిపిస్తుంది. రైతులు నాగలిపట్టి వ్యవసాయానికి సిద్ధపడతారు.

ప్రశ్న 4.
మబ్బులను చూసి గుడిసెల కప్పులు, గుంజలు ఎందుకు గడగడలాడినాయి?
జవాబు.
గుడిసెల కప్పులు ఎండలకు వాడిపోయి వేగంగా వీచే గాలులకు పట్టుతప్పిపోయాయి. వాటి గుంజలు ఊగులాడుతున్నాయి. ఆకాశంలో నల్లని మబ్బులను చూడగానే వాటికి భయమేసింది. వాన అప్పటికే వాడిపోయిన, పట్టుతప్పిన తమను కూల్చేస్తుందేమోనని గుడిసెల కప్పులూ, వాటి గుంజలు గడగడలాడినాయి.

ప్రశ్న 5.
“శరీరములను రిపులకు అప్పజెప్పడం” అంటే నీకేమి అర్థమయింది ?
జవాబు.
రిపులు అంటే శత్రువులు. అంటే దోమలు, తేళ్ళు, పాములు మొదలైనవి అని భావం. పేదలు పూరిగుడిసెల్లో నేలమీద పడుకొని నిద్రపోతారు. వర్షంపడినప్పుడు కలుగుల్లోకి, పుట్టల్లోకి నీరు చేరడం వల్ల తేళ్ళు, పాములు బయటికి వస్తాయి. అలాగే అనుకూలమైన వాతావరణం వల్ల దోమలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి. ఇటువంటి ప్రమాదకర పరిస్థితులలో కూడా పేదలు వాటినుంచి రక్షణకోసం తగిన జాగ్రత్తలు తీసుకోలేరు. వారి ప్రాణాలు దైవాధీనాలు అని అర్థమైంది.

TS 6th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వర్షం

ప్రశ్న 6.
పుడిసెడు పేదకాపురము అని కవి అన్నాడు కదా! పేదల కాపురాలు ఎట్లా ఉంటాయి ?
జవాబు.
కూడు, గూడు, గుడ్డ అనే కనీసావసరాల కోసం ప్రతిరోజూ తిప్పలు పడేవారు పేదవారు. ఏరోజుకారోజు కష్టించి పనిచేస్తేనే గానీ వారి కాపురాలు గడవవు. వారు నివసించే గుడిసెలు ఎండకూ, వానకూ, గాలికీ తట్టుకొని నిలబడేటంత బలంగా ఉండవు. చేతినిండా పని దొరకక, కంటినిండా నిద్రలేక, వంటినిండా కప్పుకునే గుడ్డలేక పేదల కాపురాలు అంతంతమాత్రంగా అతుకుల బొంతలా ఉంటాయి.

ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. నీకు ఏ కాలం అంటే చాలా ఇష్టం ? ఎందుకు ?
జవాబు.
నాకు వర్షాకాలం అంటే చాలా ఇష్టం. వర్షం పడుతున్నప్పుడు వాన ధారలను మా కిటికీలోనుంచి చూస్తే బలే సరదాగా ఉంటుంది. వాన చినుకులలో తడిస్తే జలుబు చేసి జ్వరం వస్తుందని భయమే గానీ చిరుజల్లుల్లో ఆడుకుంటే ఎంత బాగుంటుందో. మా పాఠశాల ఆటస్థలంలో మేం ఆడుకుంటున్నప్పుడు అప్పుడప్పుడూ అనుకోకుండా వానజల్లు పడుతుంది. అప్పుడు చురుకు చురుకుమంటూ చెంపలను కొడుతున్నట్లు పడే చిరుజల్లు ఎంతో బాగుంటుంది. అందుకే నాకు వానాకాలం అంటే చాలా ఇష్టం.

2. పాఠం చదివారు కదా! కవికి వర్షం గురించి ఉన్న అభిప్రాయాన్ని మీరు సమర్థిస్తారా ? విభేదిస్తారా ? ఎందుకు ?
జవాబు.
పరిచయం : కవికి వర్షం గురించి ఉన్న అభిప్రాయాన్ని సమర్థిస్తాను. కవి వర్షం గురించి చెప్పిన విషయాలు అన్నీ సరైనవే.

అ) మేఘం గర్వం : వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర అనే ఆరు ఋతువులలో వర్ష ఋతువు మధ్యలో
వస్తుంది మధ్యలోనే పోతుంది. ఎండాకాలంలో భూమిమీద నీరే ఆవిరి రూపంలో ఆకాశంలోకి వెళ్ళి మేఘాలై కురుస్తాయి. అందువల్ల మేఘం హఠాత్తుగా ఏర్పడినట్లు అనిపిస్తుంది. నల్లని మబ్బు మీసాలు దువ్విన ఆకారంలో కనిపిస్తుంది. ఇంత మిడిసిపడిన మేఘం కూడా నీరైపోయి చివరకి సముద్రం పాలౌతుంది.

ఆ) వర్షధార : చిన్నచిన్న చినుకులతో మొదలయ్యే వాన ఒక్కసారిగా ఉరుములతో, వడగండ్లతో కుండపోతగా మారడం మనం నిత్యం చూస్తున్నదే.

ఇ) ప్రజలు – ఛత్రపతులు : వానలో నేలపై అజాగ్రత్తగా నడిస్తే కాలు జారుతుంది. వానకు తడవకుండా ప్రతి ఒక్కరూ గొడుగు పట్టుకుంటారు. నేలంతా ఎటుచూసిన వాననీళ్ళే. భూమి అంతా వాననీళ్ళవల్ల పచ్చదనంతో నిండిపోయింది. వర్షం పడ్డాక రైతులు వ్యవసాయం మొదలుపెడతారు.

ఈ) వానదాడి: వాన తన ప్రతాపాన్ని భవంతులమీద కాక పేదల గుడిసెల మీద చూపుతుంది. మేడలు, మిద్దెలు వానకు తట్టుకుంటాయి. కానీ ఎండకు ఎండి, గాలికి పట్టుతప్పి ఉన్న పేదల గుడిసెలే వానకు తేలికగా కూలిపోతాయి. ముగింపు : ఈ పాఠంలో కవి వర్షం గురించి చెప్పిన విషయాలు అన్నీ ప్రతిసారీ మన అందరి అనుభవంలోకి వచ్చేవే. చక్కని పరిశీలన దృష్టి కలిగిన కవి కనుక పల్లా దుర్గయ్య ఈ అంశాలను మనోహరంగా వర్ణించారు.

II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం

1. కింది భావం వచ్చే వాక్యాలను పాఠంలో వెతికి రాయండి.

అ. నడుమంత్రపు సిరికి గర్వపడే వారి గర్వం నీరై సముద్రంలో కలిసిపోతుంది.
జవాబు.
“నడుమంతరపున్ సిరి కుబ్బు వారి గ
ర్వోన్నతి నిల్వునీరయి మహెూదధి పాలయి పోదె”

ఆ. నెర్రెలిచ్చిన నేలంతా అద్దంవలె మారి నీడలు కనిపిస్తున్నాయి.
జవాబు.
“నెఱియలు వాఱిన నేలనంతట నద్ద
ములు దాపినట్లు నీడలు కనబడె”

ఇ. పటపటమని వడగండ్లు నేలమీద పడినాయి.
జవాబు.
“పటపట వడగండ్లు పుడమిపై బడె”

ఈ. సంపన్నులు మేడల్లో హాయిగా గుర్రుపెట్టి నిద్రపోతున్నారు.
జవాబు.
“ఉన్నత సౌధ గోపురపు టుయ్యెల మంచములందు తిన్నగా
కన్నులు మూసి గుఱ్ఱుమని గాఢసుషుప్తిని మునియుండు సంపన్నుల”

ఉ. నల్లని మబ్బులను చూడగానే గుడిసెలు, గుంజలు గడగడలాడుతున్నాయి.
జవాబు.
“గుడిసెల కప్పులొప్పెడలె, గుంజలు పాదుల నూగులాడెడిన్,
గడగడలాడుచున్నయవి కారుమొగుళ్లను గాంచినంత”

TS 6th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వర్షం

2. కింది కవితను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

చిటపట చినుకుల వాన – చిరుజల్లై కురిసేనా
నేలంతా తడిపే వాన – హరివిల్లై విరిసేనా
జలజల గలగల పారే – సవ్వడి ఈ వాన
చెరువులు బావులు నిండుగ – నింపే ఈ వాన
పసిడి పంటలను ఇవ్వగా పరుగెత్తే ఈ వాన
పరిసరాలను పచ్చదనంతో నింపేటి ఈ వాన.

ప్రశ్నలు:

అ. వాన ఎట్లా కురిసింది ?
జవాబు.
చిటపట చినుకుల వాన చిరుజల్లై కురిసింది.

ఆ. వాన వేటిని నింపడానికి కురిసింది ?
జవాబు.
వాన చెరువులు, బావులు నింపడానికి కురిసింది.

ఇ. వానవల్ల కలిగే లాభమేమిటి?
జవాబు.
పసిడి పంటలను ఇవ్వడం, పరిసరాలను పచ్చదనంతో నింపడం అనే రెండూ వాన వల్ల కలిగే లాభాలు.

ఈ. “పసిడి పంటలు” అనే పదంలో పసిడి అనే పదానికి సమానార్థక పదం ఏది?
జవాబు.
పసిడి అనే పదానికి సమానార్థక పదం బంగారం.

ఉ. పై కవితలో ఉన్న జంటపదాలు ఏవి ?
జవాబు.
జలజల, గలగల అనేవి పై కవితలో ఉన్న జంట పదాలు.

III. స్వీయ రచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. వర్షాల వల్ల ఏం జరుగుతుందో తెలుసుకున్నారు కదా! మరి శీతకాలంలో ఎట్లా ఉంటుంది ?
జవాబు.
శీతకాలంలో చలి ఎముకలు కొరికేస్తుంది. ఈ చలి బాధ కూడా భవనాలలో ఉండే వారికంటే సౌకర్యవంతంగా లేని గుడిసెలలో ఉండే వారికి ఎక్కువ. ఈ కాలంలో కూడా ఉన్నవారు ముసుగుదన్ని పడుకుంటే, లేని వారు, నిరుపేదలు కడుపు నింపుకోడానికి కష్టపడుతూనే ఉంటారు. శీతాకాలంలో పగటి పొద్దు తక్కువ. రాత్రిపొద్దు ఎక్కువ. సాయంత్రం తొందరగా చీకటిపడుతుంది. అంతకు ముందునుంచే మంచు కురవడం మొదలవుతుంది. రాత్రంతా కురుస్తూనే ఉంటుంది. తెల్లవారిన చాలాసేపటికి గానీ సూర్యుడు కనబడడు. పొగమంచు తొలగే వరకూ ప్రజలు చలికి వణుకుతూనే ఉంటారు.

ఆ. “చిన్ని చొప్ప కప్పు గుడిసెల్ వడికూలగ దాడిచేతువా ?” అని కవి ఎందుకు అని ఉంటాడు ?
జవాబు.
సాధారణంగా వర్షం పడినప్పుడు బలమైన పునాదులతో, ఇనుము, సిమెంటులతో నిర్మించిన భవనాలకు పెద్ద ప్రమాదం ఉండదు. కానీ తాటాకులతోనో, జొన్న చొప్పతోనో కప్పిన గుడిసెలకు మాత్రం ప్రమాదమే. అవి వర్షం జల్లులకు నానిపోయి కూలిపోతాయి కూడా. అందువల్లనే కవి ఓ వానదేవుడా! ఎత్తైన మేడలలో ఉండేవారి ఇళ్లను ఏమీ చేయలేక జొన్నచొప్పతో కప్పిన పేదల ఇళ్ళపై దాడి చేస్తావా ? చేయవద్దు సుమా! అని కవి అని ఉంటాడు

ఇ. వర్షాల కోసం ఎవరెవరు ఎదురుచూస్తారు ? ఎందుకు ?
జవాబు.
వర్షాల కోసం భూమిపై ఉండే ప్రతి జీవి ఎదురుచూస్తుంది. మండే ఎండలతో బాధలు పడుతూ తాగడానికి గుక్కెడు నీళ్ళైనా లేని పరిస్థితులలో దాహం తీర్చుకోవడానికి ప్రతి జీవి ఎదురుచూస్తుంది. వర్షంపడితే బావులు, చెరువులూ నిండుతాయి. వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తాయి. పశువులకూ, పక్షులకూ, మనుషులకూ మంచినీరు బాగా లభిస్తుంది. ఆబోతులైతే హుంకారంతో రంకెలు వేస్తాయి. వర్షం వస్తేనే రైతులు నాగలిపట్టి వ్యవసాయపు పనులు మొదలుపెడతారు. వర్షం వల్లనే నేలంతా పులకరించి పచ్చని పైర్లతో సస్యశ్యామలమవుతుంది.

ఈ. డా॥ పల్లా దుర్గయ్య గురించి రాయండి.
జవాబు.
పల్లా దుర్గయ్య వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు నర్సమ్మ, పాపయ్యశాస్త్రి. ఈయనకు ‘సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషలలో పాండిత్యం ఉన్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎం.ఎ. పట్టా అందుకున్నాడు. ’16 వ శతాబ్దియందలి ప్రబంధ వాఙ్మయం-తద్వికాసం’ అనే అంశంపైన పరిశోధన చేశాడు. పాలవెల్లి, గంగిరెద్దు మొదలైనవి ఈయన రచనలు. ఈయన శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది. ప్రస్తుత పాఠ్యభాగమైన ‘వర్షం’ ఆయన రచించిన ‘పాలవెల్లి’ అనే ఖండకావ్యంలోది.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ. పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
జవాబు.
1. పరిచయం : ‘వర్షం’ అనే పాఠ్యభాగం డా॥ పల్లా దుర్గయ్య రచించిన ‘పాలవెల్లి’ అనే ఖండకావ్యం నుంచి గ్రహించబడింది. ఇందులో కవి మేఘం యొక్క గర్వం, వర్ష విజృంభణ, నేలపులకింత, విన్నపం అనే అంశాలను మనోహరంగా వర్ణించారు.

2. మేఘం గర్వం : మేఘం పుట్టీ పుట్టకుండానే ఆకాశంలోకి ఎగబాకింది. నల్లమేఘాలకొసలు మీసాలు దువ్వుతూ నవ్వుతున్నట్టున్నాయి. మధ్యలో వచ్చి మధ్యలోనేపోయే నీరు అనే సంపదతో మిడిసిపడినా మేఘం కరిగి నీరయి నేలపైపడి చివరికి సముద్రం పాలు కావలసిందే.

3. వర్ష విజృంభణ: చిటపట చినుకులతో వాన మొదలైంది. పటపటమని వడగండ్లు భూమిమీద పడ్డాయి. చూస్తుండగానే కుండలతో ధారలు పోసినట్టుగా పెద్ద పెద్ద శబ్దాలతో వర్షం విజృంభించింది.

4. నేల పులకింత : వేసవి ఎండలకు నెర్రెలిచ్చిన నేలంతా నీటితో నిండి అద్దాలు తాపినట్టయి నీడలు కనిపిస్తున్నాయి. ప్రజలందరూ గొడుగులు అంటే ఛత్రాలు పట్టుకొని ఛత్రపతులు అయ్యారు. వర్షం అన్ని జీవుల్లో

5. ఆశలు నింపింది. విన్నపం : వానతో పూరిగుడిసెలలో ఉండే పేదలను ఇబ్బంది పెట్టవద్దని కవి వానదేవుణ్ణి ప్రార్థించాడు.

TS 6th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వర్షం

IV. సృజనాత్మకత/ప్రశంస

1. మీకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని వర్ణిస్తూ వ్యాసం రాయండి.
జవాబు.
ప్రకృతిలోని ప్రతి దృశ్యమూ మనసుకు ఎంతో ఆనందాన్నిచ్చేదే. పున్నమి వెన్నెల, ఇంద్రధనుస్సు, లేగదూడల పరుగులు, నదిలో తిరిగే పడవులు, పక్షుల కిలకిలరావాలు, సెలయేళ్ళ, జలపాతాల చప్పుడు ఇలా ప్రకృతి దృశ్యాలు మనలను ఎక్కడికో తీసికొని వెళతాయి. ముఖ్యంగా సూర్యాస్తమయ సమయంలో పక్షులు గూళ్ళకు చేరేటప్పుడు చేసే కూతల గురించి ఎంతైనా చెప్పవచ్చు. అది కూడా ఏదైనా ప్రశాంత వాతావరణంలో ఏ మామిడి తోటలోనో, నది ఒడ్డున కూర్చుని వింటే, ఆ పక్షుల కిలకిల రావాలు ఎంత కాలమైనా మరచిపోలేము. కోకిల కుహూ కుహూ రావాలు, పిచ్చుకమ్మల కిచకిచలు, చిలుకమ్మల, కాకమ్మల కూతలు భాషకందని అనుభూతులు.

2. ఎండాకాలంలో వాతావరణాన్ని, ప్రజల స్థితిగతులను వర్ణిస్తూ వ్యాసం రాయండి.
జవాబు.
1. పరిచయం : గ్రీష్మఋతువులో ఎండలు మెండుగా ఉంటాయి. అంటే ఏప్రిల్, మే నెలల్లో కాసే ఎండలను తట్టుకోవడానికి ప్రజలు ఎన్నో ముందుజాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలో ఎండలు, ఉక్కపోత, తీరని దాహం, వడగాలులు ముఖ్య లక్షణాలు.

2. ఎండలు : ఎండాకాలంలో పగటి పొద్దు ఎక్కువగా ఉంటుంది. తెలతెలవారుతూనే సూర్యుడు పరుగులు తీస్తూ పైపైకి వస్తూంటాడు. పొద్దున్నుంచే ఎండతీవ్రత పెరుగుతూ ఉంటుంది. మిట్టమధ్యాహ్నం తలపైన గొడుగు లేకుండా కాలికి చెప్పులు లేకుండా నడవలేం.

3. ఉక్కపోత: ఎండాకాలంలో విపరీతంగా చెమట పడుతుంది. ప్రతి ఒక్కరూ విసనకర్రలతోనో, పంకాలతోనో, చలిమరలతోనో సేదతీరవలసిందే.

4. తీరని దాహం : విపరీతమైన చెమట వల్లనే గొంతు తడి ఆరిపోయి ఎక్కువ దాహం వేస్తుంది. ఎన్ని నీళ్ళు తాగినా ఆ దాహం తీరదు. అందువల్ల ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి.

5. వడగాలులు : సాయంత్రం పూట మొదలై అర్ధరాత్రి వరకూ వీచే వడగాలులు చాలా ప్రమాదకరమైనవి. ఈ గాలులు వడదెబ్బకూ, ప్రాణాపాయానికీ ముఖ్యకారణాలు. అందుకోసం చల్లని నీడలో సేదతీరాలి.

6. ముగింపు : ప్రజలు ఎక్కువ ద్రవపదార్థాలు తీసుకోవడం, ఎక్కువగా ఎండలో తిరగకపోవడం, చల్లని నీడలో సేదదీరడం వంటి జాగ్రత్తలతో ఎండాకాలంలో ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు.

V. పదజాల వినియోగం:

1. ముందు చదివిన పాఠాల నుండి కింది గుణింతాలతో కూడిన పదాలను వెతికి పట్టిక ఆధారంగా రాయండి.

TS 6th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వర్షం 2
జవాబు.
TS 6th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వర్షం 3

2. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.

అ. సోమనాద్రిరాజు కిరీటం వజ్రాలతో తాపడం చేయబడి ఉండేది.
జవాబు.
అతికించడం

ఆ. కృషికులు పొద్దస్తమానం కష్టపడి పంటలు పండిస్తారు.
జవాబు.
రైతులు

ఇ. ఎండాకాలం మిద్దెపై పడుకుంటే పయ్యెర హాయిగా వీస్తుంది.
జవాబు.
గాలి

ఈ. తొందరగా చేరుకోవాలంటే వడిగా నడవాలి.
జవాబు.
వేగం

3. కింది వాక్యాలు చదువండి. ఒకే అర్థం వచ్చే పదాల కింద గీత గీయండి.

అ. సముద్రం నీరు ఉప్పగా ఉంటుంది. కాని ఆ ఉదధి రత్నాలకు నిలయం. పయోధి దాటాలంటే ఓడ కావాలి.
జవాబు.
సముద్రం,ఉదధి, పయోధి

ఆ. నింగిలోని చంద్రుడు వెన్నెల కురిపిస్తున్నాడు. అంబరమంతా నక్షత్రాలు పరుచుకున్నాయి.
జవాబు.
నింగి ,అంబరం

ఇ. మనం భూమిని తల్లిగా భావిస్తాం. ఎందుకంటే అవని మనం పుట్టడానికి, నివసించడానికి ఆధారం కనుక. అటువంటి పుడమిని మన స్వార్థం కోసం కలుషితం చేయకూడదు.
జవాబు.
భూమి , అవని, పుడమి

TS 6th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వర్షం

4. కింది పదాలతో సొంతవాక్యాలు రాయండి.

అ. బొబ్బలెక్కు : ___________
జవాబు.
శరీరం కాలి బొబ్బలెక్కినప్పుడు బర్నాల్ గానీ, తేనెగానీ రాసి ప్రథమ చికిత్స చేయాలి.

ఆ. అశ్రద్ధ : ___________
జవాబు.
ఒక్కోసారి చిన్నపాటి అశ్రద్ధ వల్ల పెద్ద అవకాశాన్ని కోల్పోతాం.

ఇ. పటపట : ___________
జవాబు.
కోపంలో కొంతమంది పళ్ళు పటపటలాడిస్తారు. దీనివల్ల పళ్ళు దెబ్బతింటాయి.

ఈ. ఆశలుప్పొంగు : ___________
జవాబు.
భవిష్యత్తుపై ఎన్నో ఆశలుప్పొంగే లేత వయసులో ఏ నిర్ణయానికైనా పెద్దల సలహాలు తీసుకోవాలి.

ఉ. పులకరించు : ___________
జవాబు.
రామాయణంలో హనుమంతుడి సాహస ఘట్టాలు వింటూ ఉంటే ఒడలు పులకరిస్తుంది.

VI. భాషను గురించి తెలుసుకుందాం

1. నాల్గవ పద్యాన్ని చదివి అందులో ఉన్న సరళాక్షరాలను, పరుషాక్షరాలను, మహాప్రాణాలను, అనునాసికాలను గుర్తించి రాయండి.

నాల్గవ పద్యం :
ఉన్నత సౌధ గోపురపు టుయ్యెలమంచములందు తిన్నగా
కన్నులు మూసి గుఱ్ఱుమని గాఢ సుషుప్తిని మునియుండు సం
పన్నుల మీదికిన్ జనగ వాటము కామిని వానదేవుడా!
చిన్నని చొప్పకప్పు గుడిసెల్ వడి కూలగ దాడిచేతువా !”

సరళాక్షరాలు (గ, జ, డ, ద, బ అనే అక్షరాలతో వచ్చేవి) : ధ, గో, గా, గు, గా, ఢ, (న్)గి, డు, ది, జ, గ, దే, డా, గు, డి, డి, గ, దా, డి.
పరుషాక్షరాలు (క, చ, ట, త, ప అనే అక్షరాలతో వచ్చేవి) : త, పు, పు, టు, చ, తి, క, ప్ (తి), ప, కి, ట, కా, చి, చొ, ప్ప, క, ప్పు, కూ, చే, తు.
మహాప్రాణాలు : ధ, ఢ
అనునాసికాలు (ముక్కుతో పలికేవి న, మలు) : న్న, మ, ము, న్న, న్ను, మూ, ను, ని, ని, మున్ (గి), న్ను, మీ, (కి) న్, న, ము, మి, ని, న, న్న, ని.

లలింగములు :

కింది వాక్యాలను చదువండి.

గీత, లత కూరగాయలు తేవడానికి అంగడికి బయలుదేరారు.
ప్రదీప్, సందీప్ లు వాళ్ళ నాన్నతో కలిసి పట్నం వెళ్ళారు.
పిల్లి, ఎలుకను వెంబడించింది.
చెట్టు మీద కోతులు దుంకుతున్నాయి.

పై వాక్యాలలో గీత, లత, ప్రదీప్, సందీప్, నాన్న, పిల్లి, ఎలుక, చెట్టు, కోతులు మొదలైన పదాలను పరిశీలించండి. గీత, లత – అనేవి స్త్రీలకు చెందిన పదాలు. ఇట్లాంటి పదాలను స్త్రీలింగ పదాలు అంటారు.
ప్రదీప్, సందీప్, నాన్న – అనేవి పురుషులకు (మగవారికి) చెందిన పదాలు. ఇట్లాంటి పదాలను ‘పుంలింగ పదాలు’ అంటారు.
పిల్లి, ఎలుక, చెట్టు, కోతులు మొదలైన పదాలు పురుషులను కానీ, స్త్రీలను కానీ సూచించవు. ఇట్లాంటి పదాలను నపుంసక లింగ పదాలు అంటారు.

దీని ప్రకారం పురుష వాచక శబ్దాలను పుంలింగాలనీ స్త్రీ వాచక శబ్దాలను స్త్రీలింగాలనీ పై రెండు కానటువంటి (మానవ సంబంధం కాని) వాటిని అనగా వస్తు, పక్షి, జంతు వాచక శబ్దాలను నపుంసకలింగ పదాలని చెప్పవచ్చు.

2. కింది పేరాలోని పుంలింగ, స్త్రీ లింగ, నపుంసకలింగ పదాలను గుర్తించి రాయండి.

సునీత ఉదయాన్నే నిద్రలేచి బడికి వెళ్ళింది. బడిలో సురేష్ తాను రాసిన కథను సునీతకు వినిపించాడు. ఆ కథలో కుందేలు చెట్టు తొర్రలో తన పిల్లలతో ఆడుకునే సన్నివేశం సునీతకు బాగా నచ్చింది. కుందేలు, ముంగీసతో స్నేహం చేయడం కూడ బాగా నచ్చిందని, సునీత పూజితతో చెప్పింది. కథను గోపాల్కు కూడ వినిపించింది. అందరూ బాగుందని సురేశ్ను మెచ్చుకున్నారు.

స్త్రీ లింగ పదాలు:
1) సునీత
2) పూజిత

పుంలింగ పదాలు:
1) సురేష్
2) గోపాల్

నపుంసకలింగ పదాలు :
1) కథ
2) కుందేలు
3) ముంగీస

TS 6th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వర్షం

ప్రాజెక్టు పని

వానాకాలాన్ని వర్ణించే రెండు మూడు పాటలు లేదా కవితలు సేకరించండి. వాటిని రాసి, చదివి వినిపించండి.

1. ప్రాజెక్టు శీర్షిక : : వానా కాలాన్ని వర్ణించే రెండు పాటలు / కవితలు సేకరించడం, నివేదిక రాయడం.
2. సమాచార సేకరణ : అ) సమాచారం సేకరించిన తేది: ఆ) సమాచార వనరు : అంతర్జాలం
3. సేకరించిన విధానం : నేను అంతర్జాలం నుండి ఈ క్రింది పాటలను సేకరించాను.
4. నివేదిక :

పాట 1 :
వచ్చెను వచ్చెను వర్షాలు మా వసుధారాణికి తలబ్రాలు
విచ్చిన పూలై ప్రజాముఖమ్మున వెల్లివిరిసెను మురిపాలు
కత్తులు కత్తులు కలిసిన యట్టుల
ఉత్తర దిక్కున ఉరిమింది, కనుపాపల చెక్కని మెరిసింది.
గడగడ గడగడ దివి ఉరిమింది.
చకచక చకచక దిశ మెరిసింది
చలిగాడుపు రివరివ విసిరింది.
పాడు కరవులకు బాణాలు మా
పంట చేలకివి ప్రాణాలు మా ॥ వచ్చెను ॥
కాపు కన్నులకు ముత్యాలు వరి
కర్రల నోళ్ళకు చనుబాలు ॥ వచ్చెను ॥
కోడెనాగులై ఉరికే వాగులు
క్షీరధారలై పారే తోగులు
భూసతి వానల తానములాడి
పచ్చిక కోకల పైట సవరించె ॥ వచ్చెను ॥

పాట 2:
వానల్లు కురువాలె వానదేవుడా!
వరిచేలు పండాలె వానదేవుడా!!
నల్లాని మేఘాలు వానదేవుడా!
సల్లంగ కురువాలె వానదేవుడా!!
తూరుపు దిక్కున వానదేవుడా!
తుళ్ళితుళ్ళి కురువాలె వానదేవుడా!!
చాటంత మబ్బుపట్టి వానదేవుడా!
వర్షంగా మారాలె వానదేవుడా!!
చుక్కచుక్క నీరు చేరి వానదేవుడా!
మాకు ఆసరవ్వాలె వానదేవుడా!!
మావూరి కుంటల్లు వానదేవుడా!
మత్తడై దుంకాలె వానదేవుడా!!
చెరువులన్ని నిండాలె వానదేవుడా!
అలుగులై పారాలె వానదేవుడా!!

పాట 3 :
వానలు జోరుగ కురవాలోయ్
బాగా పంటలు పండాలోయ్
బిడ్డల బొజ్జలు నిండాలోయ్
రైతుల రాజ్యం రావాలోయ్
అందరి మిత్రత అల్లాలోయ్
స్వతంత్ర పాలన కావాలోయ్
స్వర్ణయుగమని చాటాలోయ్
భారత్ జగతిలో వెలగాలోయ్

5. ముగింపు : వర్షాలు కురవడం వల్ల సమస్త ప్రాణి కోటికి నీరు లభిస్తుంది. పంటలు బాగా పండుతాయి. పశుపక్ష్యాదులకు మేత దొరుకుతుంది. ప్రజలు సుఖంగా, సంతోషంగా ఉంటారని తెలుసుకున్నాను.

TS 6th Class Telugu 3rd Lesson Important Questions వర్షం

ప్రశ్న 1.
మేఘం గర్వం గురించి కవి చేసిన వర్ణనను వివరించండి.
జవాబు.
గ్రీష్మ ఋతువులో కాసిన మండుటెండల తరువాత ఆకాశంలో మబ్బులు పట్టి వర్షాలు కురుస్తాయి. ఎండ నుండి జీవులకు ఈ వర్షాలు కొంత ఉపశమనం కలిగిస్తాయి. ఎండవేడికి నేలమీద ఉన్న నీరు ఆకాశంలోకి వెళ్ళి వాతావరణం చల్లబడ్డాక వర్షంగా కురుస్తుంది. అందువల్లనే మేఘం పుట్టుకను మనం గమనించలేం. ఆవిరిరూపంలో ఆకాశంలోకి వెళ్ళి మేఘం రూపంగా మనకు కనబడుతుంది. వర్షించే మేఘం నల్లగా ఉంటుంది.

దాని రూపం దువ్విన మీసాల ఆకారంలో ఉంటుంది. వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిరం అనే ఆరు ఋతువులలో వర్షఋతువు మధ్యలో వస్తుంది. మళ్ళీ మధ్యలోనే పోతుంది. అలాగే మేఘాలకు సాధారణంగా వర్షించే సామర్థ్యం వర్షాకాలంలోనే ఉంటుంది. ఇంత మిడిసిపడే మేఘమైనా కరిగి నీరై నేలమీద పడి చివరికి సముద్రం పాలుకావలసిందే అంటూ కవి మేఘం గర్వం గురించి వివరించాడు.

TS 6th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వర్షం

ప్రశ్న 2.
వర్షం వలన ప్రజలు ఎలా ఇబ్బందులు పడతారో వివరించండి.
(లేదా)
పేదలపై ప్రతాపాన్ని చూపించకు వానదేవుడా ? అని కవి ఎందుకన్నాడు ?
జవాబు.
పేదల ఇళ్ళు చిన్నవిగా ఉంటాయి. వాటిని వారు జొన్న చొప్పతో కప్పుకుంటారు. అవి ఎండలకు ఎండిపోయి ఉంటాయి. అంతేగాక వేగమైన గాలులకు పట్టుతప్పి ఉంటాయి. ఆ ఇళ్ళ గుంజలు పాదుల నుంచి ఊగిసలాడుతూ ఉంటాయి. అటువంటి ఆ కప్పులూ, గుంజలూ ఆకాశంలో కనిపించే కారుమబ్బులను చూసి గజగజలాడతాయి. అసలే అంతంతమాత్రంగా బలహీనంగా ఉన్న తమ మీద వాన పడితే ఎక్కడ నాశనమైపోతామో అని అవి భయపడతాయి. అటువంటి పూరిగుడిసెలలో పేదలు నేలమీదే పడుకుంటారు. కలుగుల్లోనూ, పుట్టల్లోనూ వాన నీరు చేరడం వల్ల బయటకు వచ్చే పాములు, తేళ్ళు వంటి శత్రువులనుంచి వారికి ప్రమాదం పొంచి ఉంటుంది.

ప్రశ్న 3.
‘వర్షం’ ను వర్ణిస్తూ గేయం/కవిత రాయండి.
జవాబు.
వర్షాలు కురవాలి వానదేవుడా
వాగులు పారాలి వానదేవుడా
వంకలు సాగాలి వానదేవుడా
చెరువులు నిండాలి వానదేవుడా
కరువంతా పోవాలి వానదేవుడా
పుడమి పులకించాలి వానదేవుడా
చిగురులే తొడగాలి వానదేవుడా
పువ్వులే పూయాలి వానదేవుడా
పంటలు పండాలి వానదేవుడా
కష్టాలు తొలగాలి వానదేవుడా
ప్రజలంతా మురవాలి వానదేవుడా

అర్థాలు

  • మిన్ను = ఆకాశం
  • ఉబ్బు = పొంగిపోవు
  • ఉదధి = సముద్రం
  • వడగండ్లు = వానరాళ్లు
  • పుడమి = నేల
  • పాలితులు = పాలింపబడేవారు (ప్రజలు)
  • ఛత్రపతి = రాజలాంఛనంగా గొడుగును ధరించిన వాడు (రారాజు)
  • నెఱియలు = నేల పగుళ్ళు
  • సౌధం = భవనం, మేడ
  • గోపురం = దేవాలయ వాకిలి ద్వారం
  • సుషుప్తి = ఒళ్ళు మరచిన గాఢనిద్ర
  • వాటము = వీలు
  • వడ = ఎండ
  • కారు మొగుళ్ళు = నల్ల మబ్బులు
    రిపులు = శత్రువులు

I. క్రింది పద్యానికి భావం రాయండి.

1. వడలకు వాడిపోయి వడి పయ్యెర యూపుకు పట్టువీడి యీ
గుడిసెల కప్పు లొప్పెడలె, గుంజలు పాదులు నూగులాడెడిన్,
గడగడలాడుచున్నయవి కారుమొగుళ్లను గాంచినంత, నీ
పుడిసెడు పేదకాపురము పొల్లొనరింపకు వానదేవుడా!
జవాబు.
గుడిసెల కప్పులు ఎండలకు వాడిపోయి, వేగంగా వీచే గాలులకు పట్టుతప్పిపోయాయి. వాటి గుంజలు ఊగులాడుతున్నాయి. నల్లని మబ్బులను చూడగానే అవి భయంతో గడగడలాడుతున్నాయి. ఓ వానదేవుడా! ఈ పేద సంసారాన్ని నాశనం చేయకు.

II. ఈ క్రింది పద్యాన్ని పాదభంగం లేకుండా పూరించండి.

2. ఉన్నత సౌధ గోపురపు ………….. దాడి చేతువా!
జవాబు.
ఉన్నత సౌధ గోపురపు టుయ్యెల మంచములందు తిన్నగా
కన్నులు మూసి గుఱ్ఱుమని గాఢసుషుప్తిని మున్గియుండు సం
పన్నుల మీదికిన్ జనగ వాటముకామిని వానదేవుడా !
చిన్నవి చొప్పుకప్పు గుడిసెల్ వడి కూలగ దాడి చేతువా !

III. ఈ క్రింది గద్యాన్ని చదివి 5 ప్రశ్నలు తయారు చేయండి.

చిత్ర లేఖనం, సంగీతం, శిల్పం, నృత్యం, కవిత్వం వంటివి లలితకళలు. భావం మనస్సుకు హత్తుకునే విధంగా బొమ్మలు గీయడం చిత్రలేఖనం. వీనుల విందుగా ఉండే గాన కళ సంగీతం. మనలను కదలకుండా అనేక భావాలను మనస్సుకు అందించే కళ శిల్పకళ. రాగ, తాళ, లయలకు తగినవిధంగా అభినయం చేయడం నృత్యకళ. ఒక భావాన్ని సూటిగా చెప్పకుండా మాటల వెనుక మరుగుపరచి మనసుకు ఉల్లాసం కలిగించే విధంగా పదాలను కూర్చి చెప్పేదే కవిత్వం.

ప్రశ్నలు:

1. వేటిని లలిత కళలు అంటారు ?
2. మనస్సుకు హత్తుకునే విధంగా బొమ్మలు గీయడం ఏ కళ ?
3. సంగీతం ఏ విధంగా ఉంటుంది ?
4. ఏ కళలో రాగ, తాళ, లయలకు అనుగుణంగా అభినయం ఉంటుంది ?
5. పదాలను అందంగా కూర్చి చెప్పేది ఏది ?

TS 6th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వర్షం

IV. పదజాలం/వ్యాకరణం:

సరైన సమాధానాన్ని గుర్తించండి.

8. ఎండాకాలం మిద్దెపై పడుకుంటే ‘పయ్యెర హాయిగా వీస్తుంది. గీతగీసిన పదానికి అర్థం ?
a) గాలి
b) నీరు
c) విసనకర్ర
d) వింజామర
జవాబు.
a) గాలి

9. వేసవికాలంలో వడగాలులలో తిరగకూడదు. గీతగీసిన పదానికి అర్థం.
a)వాన
b) దుమ్ము
c) వేడి
d) ఆవిరి
జవాబు.
c) వేడి

10. వాతావరణ కాలుష్యం పెరగడం వల్లనే పుడమిపై ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. గీత గీసిన పదానికి అర్థం
a) సముద్రం
b) భూమి
c) ఆకాశం
d) గాలి
జవాబు.
b) భూమి

11. పాలితులే పాలకులు కావడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న గొప్పదనం. – గీత గీసిన పదానికి అర్థం
a) పాలించేవారు
b) అణగదొక్కేవారు
c) రాజులు
d) పాలింపబడేవారు
జవాబు.
d) పాలింపబడేవారు

12. మబ్బులు ఎంతగా కురిసినా ఆకాశం మాత్రం తడవదు. గీత గీసిన పదానికి పర్యాయపదాలు
a) నింగి, గగనం
b) నీరు, జాలరి
c) నిప్పు, మంట
d) నేల, ధరణి
జవాబు.
a) నింగి, గగనం

13. ప్రాణికోటికి మంచినీటికి వారిదమే ఆధారం. – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
a) కొళాయి, పంపు
b) నది, ఏరు
c) సముద్రం, కడలి
d) మేఘం, మబ్బు
జవాబు.
d) మేఘం, మబ్బు

14. ‘వసుధ’ అను పదానికి పర్యాయ పదాలు
a) పుృధ్వి, జలధి
b) అవని, పుడమి
c) ముత్యము, ముక్తి
d) అడవి, వనము
జవాబు.
b) అవని, పుడమి

15. వర్షం పదానికి నానార్థాలు
a) బాష్పం, నీరు
b) వాన, వృష్టి
c) సృష్టి, హర్షం
d) వాన, సంవత్సరం
జవాబు.
d) వాన, సంవత్సరం

16. ఇందులో ద్విత్వాక్షరాన్ని గుర్తించండి.
a) ట్లో
b) క్క
c) ద్యు
d) ంటే
జవాబు.
b) క్క

TS 6th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వర్షం

17. వడలకు వాడిపోయి వడి పయ్యెర యూపుకు పట్టువీడి – ఇందులో ఉన్న అంతస్థాలను గుర్తించండి.
a) య్యె, ర, ల, వ
b) శ, ష, స, హ
c) క, చ, ట, త, ప
d) అ, ఆ, ఇ, ఈ
జవాబు.
a) య్యె, ర, ల, వ

18. రాముడు సీతకోసం వానరులతో కలిసి లంకకుచేరి రావణుణ్ణి జయించాడు. ఇందులో పుంలింగ పదాలను గుర్తించండి.
a) వానరులు, లంక
b) సీత, రాముడు
c) రాముడు, రావణుడు
d) సీత, లంక
జవాబు.
c) రాముడు, రావణుడు

19. సంపన్నుల మీదికిన్ జనగ వాటము కామిని – గీతగీసినది ఏ విభక్తికి చెందింది ?
a) ప్రథమా
b) ద్వితీయా
c) చతుర్థీ
d) షష్టీ
జవాబు.
d) షష్టీ

20. అర్జునుడు విలువిద్యలో శ్రీరాముడంతటివాడు. గీతగీసిన పదం ఏ భాషా భాగం ?
a) నామవాచకం
b) సర్వనామం
c) విశేషణ
d) క్రియ
జవాబు.
a) నామవాచకం

21. శ, ష, స, హ లను ఏమంటారు ?
a) ఊష్మాలు
b) అంతస్థాలు
c) సరళాలు
d) అనునాసికాలు
జవాబు.
a) ఊష్మాలు

22. క, చ, ట, త, ప లను ఏమంటారు ?
a) సరళాలు
b) వర్గయుక్కులు
c) పరుషాలు
d) అంతస్థాలు
జవాబు.
c) పరుషాలు

23. ‘అంతస్థాలు’ అని వేటినంటారు ?
a) అ, ఆ, ఇ, ఈ
b) ‘అ’ నుండి ‘ఔ’ వరకు గల అక్షరాలు
c) ‘క-ఱ’ మధ్యగల అక్షరాలు
d) య, ర, ల, వ
జవాబు.
d) య, ర, ల, వ

24. గ, జ, డ, ద, బ లకు గల పేరు
a) సరళాలు
b) పరుషాలు
c) అంతస్థాలు
d) అచ్చులు
జవాబు.
a) సరళాలు

పద్యాలు – ప్రతిపదార్థాలు – తాత్పర్యాలు

1వ పద్యం :

ఉ. నిన్నటిదాక లేవుకద నింగిని, పుట్టియు పుట్టకుండనే
మిన్నెగ బ్రాకినాననుచు మీసలు దువ్వుచు నవ్వుచుంటివే
మన్న! యిదేమినీతి, నడుమంతరపున్ సిరి కుబ్బువారి గ
ర్వోన్నతి నిల్వునీరయి మహెూదధి పాలయి పోదె మేఘమా?

ప్రతిపదార్థం:

మేఘమా = ఓ మేఘమా!
నిన్నటిదాక = నిన్నటివరకు
నింగిని = ఆకాశంలో
లేవుకద = లేవు కదా!
పుట్టియు పుట్టకుండనే = పుట్టీ పుట్టకుండానే
మిన్న = ఆకాశానికి
ఎగబ్రాకినానను + అనుచు = ఎగబాకానని (అంత ఎత్తుకు చేరుకున్నానని)
మీసలు = మీసాలు
దువ్వుచు = దువ్వుకుంటూ
నవ్వుచు + ఉంటివి = నవ్వుతున్నావు
ఏమి + అన్న = ఎందుకన్నా!
ఇది + ఏమి = ఇది ఎక్కడి
నీతి = నీతి (నీతికాదు అని భావం)
నడుమంతరపు = మొదటి నుంచీ లేకుండా
సిరికిన్ = సంపదను చూసుకొని
ఉబ్బువారి = మిడిసిపడేవారి
గర్వ + ఉన్నతి = గొప్ప గర్వం
నిల్వు = నిలువునా
నీరు + అయి = నీరై
మహా + ఉదధి = సముద్రం
పాలు + అయిపోదె = పాలు + అయిపోదు + ఎ = పాలైపోదా ? (అవుతుందని భావం)

తాత్పర్యం :
ఓ మేఘమా! నిన్నటివరకు ఆకాశంలో లేనేలేవు కదా! పుట్టీ పుట్టకుండానే ఆకాశానికి ఎగబాకినానని మీసాలు దువ్వుతూ గర్వంతో నవ్వుతున్నావెందుకు? ఇది నీతి కాదు. నడుమంత్రపు సిరికి మిడిసిపడేవారి గర్వం నిలువునా నీరై సముద్రం పాలౌతుందని తెలుసుకో!

TS 6th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వర్షం

2వ పద్యం :

కం. చిటపట చినుకులు రాలెను
పటపట వడగండ్లు పుడమిపై బడె, ధారల్
పుటపుటనై కుండలతో
నటునిటు దొరలించినట్టులై కనుపట్టెన్.

ప్రతిపదార్థం:

చిటపట = చిటపట అనే శబ్దాలతో
చినుకులు = చినుకులు
రాలెను = రాలాయి
పటపట = పటపట అనే శబ్దాలతో
వడగండ్లు = వానరాళ్ళు
పుడమిపై = నేలమీద
పడె = పడ్డాయి
పుటపుట = చూస్తుండగానే (తక్కువ వ్యవధిలోనే)
ధారల్ = పెద్ద ధారలను
కుండలతోన్ = కుండలతో
అటునిటు = అన్ని వైపులలోనూ
దొరిలించినట్టులు + ఐ = గుమ్మరించి నాట్లుగా అయి
కనుపట్టెన్ = కనపడింది

తాత్పర్యం :
చిటపట చినుకులతో వాన మొదలైంది. పటపటమని వడగండ్లు భూమిమీద పడ్డాయి. చూస్తుండగానే కుండలతో ధారలు పోసినట్టుగా పెద్దపెద్ద శబ్దాలతో వర్షం విజృంభించింది.

3వ పద్యం :

సీ. నేలపై మోపిన కాలు చుఱుక్కని
బొబ్బ లెక్కెడి దినమ్ములు గతించె,
నించుక యశ్రద్ధ నుంచిన పాదమ్ము
జఱుకుజఱుక్కని జాఱదొడగె
పగలు రాత్రి యనక ప్రభు పాలితులనక
ప్రజలందఱును ఛత్రపతులె యైరి
నెఱియలు వాఱిన నేలనంతట నద్ద
ములు దాపినట్లు నీడలు కనబడె

తే.గీ. పులకరించి భూసతి రామచిలుకయయ్యె
హుంకరించి యాబోతులు అంకెవేసె
నాగలిని బట్టి కృషికుడు నడుముగట్టె
నాశ లుప్పొంగి పాతె వర్షాగమమున

ప్రతిపదార్థం:

నేలపై = నేలమీద
కాలు మోపిన = కాలుపెట్టగానే
చుఱుక్కని = చుఱుక్కుమని కాలి
బొబ్బలు + ఎక్కెడి = బొబ్బలు ఎక్కించే (వేసవి)
దినమ్ములు = రోజులు
గతించెన్ = వెళ్ళిపోయాయి
ఇంచుక = కొంచెం (ఏ మాత్రం)
అశ్రద్ద నుంచిన = అజాగ్రత్తగా నడిచినా
జఱుకు జఱుక్కని =
పాదమ్ము = కాలు
జర్రున = జారుతున్నది
పగలు రాత్రి+అనక = పగలు రాత్రి తేడా లేకుండా ఎడతెరిపి లేకుండా కురిసే వర్షంలో
ప్రభుపాలితులు + అనక = ప్రభువులు, పాలితులు (ధనికులు, పేదలు) అనే తేడా లేకుండా
ప్రజలు + అందరూ = ప్రజలందరూ
ఛత్రపతులు + ఎ = గొడుగులు ధరించిన వారే
ఐరి = అయ్యారు.
నెఱియలు + పాఱిన = వేసవికాలంలో బీటలువారిన
నేలనంతటన్ = నేలమొత్తము
అద్దము + తాపిన + అట్లు = అద్దాలు అతికించినట్లుగా
నీడలు = ఛాయలు
కనన్ + పడె = కనిపిస్తున్నాయి
భూసతి = భూమి అనెడి స్త్రీ (నేలంతా)
పులకరించి = వర్షానికి గగుర్పాటుచెంది
రామచిలుక + అయ్యె = పచ్చదనంతో రామచిలుకవలె కనిపిస్తున్నది
ఆబోతులు = ఎద్దులు
హుంకరించి = కృషికుడు
ఱంకెవేసే = కేక వేస్తున్నాయి, అఱుపు
హుంకరించి = హుంకారంతో
కృషికుడు = రైతు
నాగలిని + పట్టి = నాగలి చేతబట్టి
నడుము + కట్టె = వ్యవసాయానికి సిద్ధపడ్డాడు.
వర్ష + ఆగమమున = ఇట్లా వర్షం రావడంతో
ఆశలు = కోరికలు
ఉప్పొంగి = ఉబికి
పాఱే = పరుగుతీశాయి (ఉరకలెత్తాయి)

తాత్పర్యం: కాళ్ళు నేలపై పెట్టినంతనే బొబ్బలెక్కించే ఎండాకాలం వెళ్ళిపోయింది. అజాగ్రత్తగా నడిస్తే జర్రున కాలు జారుతున్నది. ఎడతెరిపి లేకుండా కురిసే వర్షంలో తడువకుండా ఉండేందుకు అందరు ఛత్రీలు పట్టు కోవడంతో ప్రభువులు పాలితులు (రాజు-పేద) అనే తేడా లేకుండా అందరూ ఛత్రపతులే అయ్యారు. వేసవికాలంలో నెర్రెలిచ్చిన నేలంతా నీటితో నిండి అద్దాలు తాపినట్టయి నీడలు కనిపిస్తున్నాయి.

వర్షానికి పులకరించిన నేలంతా పచ్చదనంతో రామచిలుకవలె కనిపిస్తున్నది. ఆబోతులు హుంకారంతో రంకెలు వేస్తున్నాయి. రైతులు నాగలిపట్టి వ్యవసాయానికి సిద్ధపడ్డారు. ఇట్లా అన్ని జీవుల్లో ఆశలు నింపుతూ వర్షాకాలం వచ్చింది.

TS 6th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వర్షం

4వ పద్యం : 

ఉ. ఉన్నత సౌధ గోపురపు టుయ్యెలమంచములందు తిన్నగా
కన్నులు మూసి గుఱ్ఱుమని గాఢసుషుప్తిని మున్గియుండు సం||
పన్నుల మీదికిన్ జనగ వాటముకామిని వానదేవుడా!
చిన్నని చొప్పకప్పు గుడిసెల్ వడి కూలగ దాడిచేతువా!

ప్రతిపదార్థం :

వానదేవుడా! = ఓ వానదేవుడా!
ఉన్నత = ఎత్తైన
సౌధ = మేడల యొక్క
గోపురపు = శిఖరాల మీద
ఉయ్యెలమంచములు + అందు = ఉయ్యాల మంచాలలో
తిన్నగా = హాయిగా
కన్నులు మూసి = కళ్ళు మూసుకొని
గుఱ్ఱుమని = గురకలు పెడుతూ
గాఢ = గాఢమైన (ఒళ్ళు మరచిన)
సుషుప్తిని = నిద్రలో
మున్గి+ ఉండ = మునిగి ఉన్న
సంపన్నుల మీదికిన్ = ధనవంతుల మీదికి
చనగ = పోవడం
వాటము కామిని = వీలు కాదని
చిన్నని = పేదవారిపైన
చొప్పకప్పు = జొన్నచొప్పుతో కప్పుకున్న
గుడిసెల్ = గుడిసెలను
వడి = గభాలున (వేగంగా)
కూలగ = కూలిపోయేటట్లుగా
దాడిచేతువా! = దాడి చేస్తావా! (చేయవద్దని భావం)

తాత్పర్యం : ఓ వానదేవుడా! ఎత్తైన మేడలమీద, ఉయ్యాల మంచాలలో, గుఱకలు పెడుతూ, గాఢనిద్రలో ఉన్న ధనవంతుల మీదికి పోవడం వీలుకాదని, పేద వాళ్ళు జొన్నచొప్పతో కప్పులు వేసుకున్న గుడిసెలు గభాలున కూలిపోయేటట్లుగా దాడిచేస్తావా ? వద్దు అట్లా చేయకు.

5వ పద్యం : 

చం. వడలకు వాడిపోయి వడి పయ్యెర యూపుకు పట్టువీడి
గుడిసెల కప్పు లొప్పెడలె, గుంజలు పాదుల నూగులాడెడిన్,
గడగడలాడుచున్నయవి కారుమొగుళ్లను గాంచినంత, నీ
పుడిసెడు పేదకాపురము పొల్లొనరింపకు వానదేవుడా!

ప్రతిపదార్థం :

వానదేవుడా! = ఓ వానదేవుడా!
గుడిసెల = గుడిసెల యొక్క
కప్పులు = కప్పులు
వడలకు = ఎండలకు
వాడిపోయి = ఎండిపోయి
వడి = వేగంగా వీచే
పయ్యెర = గాలుల
ఊపుకు = కదలికకు
పట్టు = పట్టుతప్పి
ఒప్పు + ఎడలె = పోయాయి
గుంజలు = వాటి స్తంభాలు
పాదులన్ = పాదాల దగ్గర నుంచీ
ఊగులాడెడిన్ = ఊగిసలాడుతున్నాయి
కారు మొగుళ్ళను = నల్లని మబ్బులను
కాంచిన + అంత = చూడగానే
గడగడలాడుచున్న + అవి = అవి భయపడుతున్నాయి.
ఈ = అటువంటి
పుడిసెడు = అల్పమైన (చిన్నదైన)
పేద కాపురము = పేద సంసారాన్ని
పొల్లు+ఒనరింపకు = నాశనం చేయకు

తాత్పర్యం: గుడిసెల కప్పులు ఎండలకు వాడిపోయి, వేగంగా వీచే గాలులకు పట్టుతప్పిపోయాయి. వాటి గుంజలు ఊగులాడుతున్నాయి. నల్లని మబ్బులను చూడగానే అవి భయంతో గడగడలాడుతున్నాయి. ఓ వానదేవుడా! ఈ పేద సంసారాన్ని నాశనం చేయకు.

6వ పద్యం :

చం. గపగప చొచ్చివచ్చు చలిగాలికి కప్పులు లేని దీపముల్
ఱేపఱేపలాడిపోయెన, చెలరేగిన చీకటిలో శరీరముల్
రిపులకు నప్పజెప్పిన దరిద్రులు నిద్రలుపోయినారు, నీ
విపుడె సవారిచేసి యలయింపకు వారిని వానదేవుడా!

ప్రతిపదార్థం :

వానదేవుడా! = ఓ వానదేవుడా!
గపగప = వేగంగా
చొచ్చివచ్చు = చొచ్చుకొని వచ్చే
చలిగాలికి = చల్లని గాలికి
కప్పులు లేని = పైకప్పులు సరిగ్గా లేని
దీపముల్ = దీపాలు
ఱేపఱేపలాడిపోయెను = రెపరెపలాడి ఆరిపోయాయి
చెలరేగిన = దట్టంగా కమ్ముకున్న
చీకటిలో = చీకట్లో
శరీరముల్ = తమ శరీరాలను
రిపులకు = శత్రువులకు (దోమలు, తేళ్ళు, పాములు మొదలైన శత్రువులకు)
అప్పన్ + చెప్పిన = అప్పజెప్పిన (తగిన రక్షణ లేకుండా)
నిద్రలు పోయినారు = నిద్రపోయారు.
నీవు = నువ్వు
ఇప్పుడు + ఎ = ఈ సమయంలోనే
సవారి చేసి = నీ ప్రతాపాన్ని చూపించి
వారిని = వారిని
అలయింపకు = బాధపెట్టకు

తాత్పర్యం : పై కప్పులు సరిగ్గాలేని గుడిసెలలోనికి హఠాత్తుగా గాలి చొరబడగానే దీపాలు రెపరెపలాడి ఆరిపోయాయి. పేదలు ఆ చీకట్లోనే శత్రువులకు (దోమలు, తేళ్ళు, పాములు మొదలైనవాటికి) శరీరాలు అప్పగించి పడుకున్నారు. ఓ వానదేవుడా! ఇక నీవు కూడా ప్రతాపాన్ని చూపించి వారిని బాధపెట్టకు.

పాఠం/ఉద్దేశం

పొగలు సెగలు కక్కే వేసవికాలం వెళ్ళిపోయింది. అంతవరకు వేడెక్కిన భూమిని చల్లబరుస్తూ వర్షాకాలం ప్రవేశించింది. అటువంటి వర్షాకాలపు సొగసును, సామాన్యులపై ఆ వర్ష ప్రభావాన్ని తెలియజేయడం ఈ పాఠ్యభాగం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠ్యభాగం ‘ఖండకావ్యం’ ప్రక్రియకు చెందినది. వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం. ఈ పాఠ్యభాగం డా॥ పల్లా దుర్గయ్య రచించిన “పాలవెల్లి” అనే ఖండకావ్యం నుంచి తీసుకోబడింది.

TS 6th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వర్షం

కవి పరిచయం

ప్రశ్న
‘వర్షం’ పాఠం రచించిన కవిని గురించి రాయండి.
జవాబు.
డా॥ పల్లా దుర్గయ్య వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు నర్సమ్మ, పాపయ్యశాస్త్రి. ఈయనకు సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషలలో పాండిత్యం ఉన్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎం.ఎ. పట్టా అందుకున్నాడు. పాలవెల్లి, గంగిరెద్దు మొదలైనవి ఈయన రచనలు. ’16 వ శతాబ్దియందలి ప్రబంధ వాఙ్మయం-తద్వికాసం’ అనే అంశంపైన పరిశోధన చేశాడు. ఈయన శైలి తెలంగాణ పదజాలంతో, సున్నితమైన హాస్యంతో సాగుతుంది.

ప్రవేశిక

వర్షాకాలం వచ్చిందంటే, వర్షాలు పడుతుంటే ఆబాలగోపాలం సంతోషిస్తారు. పశుపక్ష్యాదులు ఆనందపడుతాయి. ప్రకృతి పులకరిస్తుంది. అందరికీ మేలు జరుగుతుంది. అయితే ఆ వర్షాలు కొంతమందికి కొన్ని ఇబ్బందులనూ కలిగించవచ్చు. అట్లాంటి ఇబ్బందులను కలిగించవద్దని వర్షాన్ని కోరుకుంటూ పల్లా దుర్గయ్య రాసిన పాఠాన్ని ఇప్పుడు చదువుదాం.

నేనివి చేయగలనా?

  • నాకు ఇష్టమైన కాలం గురించి చెప్పగలను. – అవును/ కాదు
  • అపరిచితమైన కవితను చదివి ప్రశ్నలకు జవాబులు రాయగలను. – అవును/ కాదు
  • పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో రాయగలను. – అవును/ కాదు
  • నాకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని వర్ణిస్తూ వ్యాసం రాయగలను. – అవును/ కాదు

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

Telangana SCERT 7th Class Telugu Guide Telangana 6th Lesson ప్రేరణ Textbook Questions and Answers.

ప్రేరణ TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana

చదవండి ఆలోచించండి చెప్పండి

ప్రజ్ఞ చాలా తెలివి కలది. ఆమెకు శాస్త్రవేత్త కావాలని బలమైన కోరిక ఉంది. ప్రతీదాన్ని పరిశీలన దృష్టితో చూస్తుంది. విద్యావైజ్ఞానిక ప్రదర్శనలో బహుమతులు కూడా గెల్చుకుంది. శాస్త్రవేత్తలకు సంబంధించిన పుస్తకాలను చదువుతుంది. సందేహనివృత్తికై ఉపాధ్యాయులను, పెద్దలను, సంప్రదిస్తుంది. ఒకరోజు విజ్ఞానశాస్త్ర కార్యక్రమంలో పాల్గొనడానికి వారి గ్రామానికి ఒక శాస్త్రవేత్త రాగా, ప్రజ్ఞ వెళ్ళి కలుసుకున్నది.

ప్రశ్న 1.
ప్రజ్ఞ శాస్త్రవేత్తను ఏమడిగి ఉంటుంది?
జవాబు.
ప్రజ్ఞకు అనేక సందేహాలున్నాయి. పక్షుల్లా మనుష్యులు ఎందుకు ఆకాశంలో ఎగరలేకపోతున్నారు అనీ, గబ్బిలాలు రాత్రిపూటే ఎందుకు తిరుగుతాయి అనీ ఇలా … చాలా సందేహాలున్నాయి. వాటినన్నింటినీ శాస్త్రవేత్తను అడిగి ఉంటుంది.

ప్రశ్న 2.
శాస్త్రవేత్త ప్రజ్ఞకు ఏమి చెప్పి ఉంటాడు?
జవాబు.
ప్రజ్ఞకు వచ్చిన సందేహాలన్నింటికి శాస్త్రవేత్త విసుగుకోకుండా జవాబులు చెప్పి ఉంటాడు.

ప్రశ్న 3.
ప్రజ్ఞ శాస్త్రవేత్త కావాలనుకుంది కదా! మీరేం కావాలనుకుంటున్నారు? ఇందుకోసం మీరేం చేస్తారు?
జవాబు.
నేను కూడా శాస్త్రవేత్త కావాలనుకుంటున్నాను. శాస్త్రవేత్త కావడానికి బాగా చదువుకోవడమేగాక పరిసరాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటాను. నేను చదివిన విషయాలను పరిసరాలతో అన్వయించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. దీక్షతో, కృషితో, శ్రద్ధతో బాగా చదువుకొని శాస్త్రవేత్తను అవుతాను. ప్రతి విషయాన్ని ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను.

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

ప్రశ్న 4.
అతిసామాన్య కుటుంబంలో జన్మించి, పరిశోధన సంస్థలకు ప్రాణంపోసి ‘భారతరత్న’ బిరుదు పొందిన శాస్త్రవేత్త ఎవరో తెలుసా?
జవాబు.
తెలుసు. ఆయనే డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం. మన మాజీ రాష్ట్రపతి.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
‘నువ్వు నీ విధిని కూడా తిరిగి రాయగలవు’ అంటే మీకేమర్థమైంది?
జవాబు.
నా విధిని నేనే వ్రాయగలను అనే పదానికి నా భవిష్యత్తును నేనే నిర్ణయించుకోగలను అనే విషయం అర్థమైంది. నేను భవిష్యత్తులో నా జీవితంలో సాధించాలనుకొనే లక్ష్యాలను నేను చిన్నప్పుడే నిర్ణయించుకొని ఆ దిశగా కష్టపడితే తప్పక గమ్యాన్ని చేరుకుంటాను అని తెలుసుకున్నాను.

ప్రశ్న 2.
మీరు మీ కుటుంబసభ్యులకెప్పుడైనా సహాయం చేశారా? ఏ సందర్భంలో ఏం చేశారు?
జవాబు.
నేను నా కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ సహాయం చేస్తుంటాను. ఒకసారి నా సోదరుడు, నేను ఆటలు ఆడుకొని ఇంటికి వస్తున్నాము. దారిలో నా తమ్ముడు గుంటలో పడిపోయాడు. లేపడం నావల్ల కావడం లేదు. ఒక ప్రక్క అతనిని వదలకుండానే గట్టిగా చాలాసేపు కేకలు వేశాను. చివరికి ఎవరో వచ్చి అతడిని బయటకు తీశారు. నాకెంతో భయం వేసింది. కాని నా తమ్ముడు నాకు దక్కాడని ఆనందం కల్గింది.

ప్రశ్న 3.
ఆ కోరిక, నమ్మకం, ఆశపెట్టుకోవడం అనేవి విజయాన్నిస్తాయి కదా! వీటిపై మీ అభిప్రాయమేమిటి?
జవాబు.
మనకు ఏమి కావాలో వాటిని నిర్ణయించుకొని కోరుకోవాలి. కోరికలు తీరాలంటే అదే పనిగా సాధన చేయాలి. నమ్మకం అనేది ఒకరిపై ఒకరికి కలిగే అభిప్రాయం. ఇతరులకు నమ్మకం కలగాలంటే ప్రతివారు నిజాయితీ కలిగి ఉండాలి. నిజాయితీ లేకపోతే ఎవరూ ఎవరినీ నమ్మరు. ఆశపెట్టుకోవడం అంటే మనకు భవిష్యత్తులో జరుగబోయే వాటిపై ఆశగా ఊహించడం. ప్రతివారు మంచి జరుగుతుందని ఆశగా ఊహించాలే కాని నిరాశగా ఉండకూడదు. అపుడే విజయాలు సాధించగలం.

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

ప్రశ్న 4.
మీ జీవిత లక్ష్యం ఏమిటి? అది సాధించడానికి ఏం చేస్తారు?
జవాబు.
అబ్దుల్కాలాం స్ఫూర్తితో నేను శాస్త్రవేత్త కావాలని లక్ష్యం నిర్దేశించుకున్నాను. ఆ గమ్యాన్ని చేరుకోవడానికి నేను పాఠశాల స్థాయి నుండే పాఠ్యపుస్తకాలతోపాటు ఇతర విషయాలను కూడా నేర్చుకుంటున్నాను. నిరంతరం నా జీవిత లక్ష్యాన్ని మనసులోనే తలచుకొని దానిని సాధించడానికి ఏఏ చదువులు, ఎలా చదవాలో ఆలోచిస్తాను. కలాం జీవితంలో ఎలా కష్టపడ్డారో పాఠంలో తెలుసుకొన్న వాటిని నా జీవితంలో నేను కూడా అవలంబించి నా గమ్యాన్ని తప్పక చేరుతాను.

ప్రశ్న 5.
‘తనను తాను తెలుసుకోవడం’ అంటే మీకేమర్థమైంది?
జవాబు.
తనను తాను తెలుసుకోవడం అంటే ప్రతివ్యక్తి తనలోని ఆలోచనలు, బలమైన అంశాలు, బలహీన విషయాలు గుర్తించడం. తను ఎలా జీవిస్తున్నాడు. ఇంకా మెరుగ్గా ఎలా ఉండగలడు, అనే అంశాలు గమనించడం. ఆయా వ్యక్తులు తన గురించి తాను తెలుసుకోవాలి! అపుడే వారి భవిష్యత్తును గూర్చి ఆలోచించే శక్తి వారికి ఏర్పడుతుందని అర్థమైంది.

ప్రశ్న 6.
మిమ్మల్ని మీ ఉపాధ్యాయులెట్లా ప్రోత్సహిస్తారో చెప్పండి.
జవాబు.
మమ్మల్ని మా ఉపాధ్యాయులు అన్ని అంశాలు నేర్చుకోవడానికి ప్రోత్సహిస్తారు. తెలియని విషయాలు తెలుపుతారు. మాలోని చీకటి అనే తెలియని దానిని పోగొట్టి వెలుగు అనే జ్ఞానాన్ని మాలో నింపుతారు. విద్యార్థుల శక్తిసామర్థ్యాలను అనుసరించి ఉపాధ్యాయులు మా జీవిత లక్ష్యాలను, గమ్యాలను నిర్దేశిస్తారు.

ప్రశ్న 7.
మా అందరికీ ప్రేరణ మా ఉపాధ్యాయులే. ఆ ‘స్కాలర్షిప్పే నా జీవనభాగ్యరేఖ’ అని కలాం అనడంలో ఆంతర్యమేమిటి?
జవాబు.
కలాంగారు ఇంజనీరింగ్ కోర్సు చదివే రోజులలో వారి డైరెక్టర్ ఏరోడైనమిక్ డిజైన్ బాధ్యత కలాంగారికి అప్పగించడం జరిగింది. ఆ పని నిరాశాజనకంగా ఉండడంతో ప్రొఫెసర్ గారు కలాంగారికి 3 రోజుల సమయమిచ్చి పూర్తిచెయ్యకపోతే స్కాలర్షిప్పు ఆపి వేస్తానన్నారు. కలాంగారు అప్పుడు ఆ స్కాలర్ షిప్పే తన జీవన భాగ్యరేఖ అని, ఆ పని పూర్తి చెయ్యకపోతే తన చదువు ఇబ్బందుల్లో పడుతుందని, తప్పక డిజైన్ పూర్తిచేయాలని భావించాడు. రాత్రింబవళ్ళు కష్టపడి ఆ పనిపూర్తి చేసి ఆ ప్రొఫెసర్ గారి మన్నన పొందాడు. తను కష్టపడకపోతే తాను ఇబ్బందులు పడతానని భావించడంపై వాక్యంలోని ఆంతర్యం.

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

ప్రశ్న 8.
‘దారిచూపే దీపం’ అనే మాటను ఏయే సందర్భాలలో ఉపయోగిస్తారు?
జవాబు.
చీకటిలో వెలుగు చూపేది దీపం. దీపపు కాంతులు లేనిదే చీకటిలో వేటినీ చూడలేము. జీవితంలో కూడా అనేక కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సాయం చేస్తే వారిని దారిచూపే దీపంగా భావిస్తాం. తల్లిదండ్రులు, స్నేహితులు ప్రతివారికి దారిచూపే దీపాలు అని చెప్పవచ్చు.

ప్రశ్న 9.
ప్రొఫెసర్ కలాంను ముందువరుసలో కూర్చోమన్నాడుకదా! కలాం స్థానంలో మీరుంటే ఏ విధంగా అనుభూతి చెందేవారు?
జవాబు.
కలాంగారు మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్య పూర్తి అయిన తర్వాత గ్రూప్ ఫోటో సమయంలో ప్రొఫెసర్ స్పాండర్ కలాంను తనతోపాటు ముందు వరుసలో కూర్చోమన్నారు. కలాం స్థానంలో నేనుంటే చాలా గర్వంగా, ఆనందంగా భావించే వాడిని. నన్ను అందరిముందు గుర్తించి, ప్రత్యేకంగా విలువ ఇవ్వడంగా భావిస్తాను. ఆ ప్రత్యేకత నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది.

ఇవి చేయండి

1. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

ప్రశ్న 1.
‘ప్రేరణ’ అనే పాఠం పేరు వినగానే నీకేమనిపిస్తుంది?
జవాబు.
‘ప్రేరణ’ అంటే కదిలించే వ్యక్తి. ఎవరి మనసునైనా ఆకర్షించి ఆలోచనా విధానంలో మార్పు తెచ్చి వారికి కొత్త స్ఫూర్తినిచ్చి కొత్తవిషయాల వైపు నడిపించి, కొత్తవిషయాలు కనుక్కోగలిగేటట్లు ప్రోత్సహించేటట్లు ప్రోత్సహించే శక్తిప్రేరణ.
ఈ పాఠం పేరు వినగానే తప్పకుండా ఇది ఒక గొప్ప వ్యక్తికి సంబంధించిన చరిత్ర అని నాకనిపించింది. ఆ వ్యక్తి క్రీడారంగంలో ప్రసిద్ధుడైన వ్యక్తి కానీ, కళాసాహిత్యరంగాలలో ప్రసిద్ధుడైన వ్యక్తికానీ, విద్యావైజ్ఞానిక రంగాలలో ప్రసిద్ధుడైన వ్యక్తికానీ, శాస్త్రసాంకేతిక రంగాలలో ప్రసిద్ధుడైన వ్యక్తి కానీ అయి ఉంటాడనిపించింది. ఆ వ్యక్తి గురించి త్వరగా చదివి తెలుసుకోవాలని అనిపించింది.

ప్రశ్న 2.
అబ్దుల్ కలాం చదువుకున్న రోజుల్లోని విద్యావిధానం గూర్చి మీ మిత్రులతో చర్చించండి. :
జవాబు.
ప్రవీణ్, లక్ష్మణ్ : మణి! అబ్దుల్ కలాం ఏ కాలంలో చదువుకున్నాడంటావ్?

మణి : బ్రిటిష్వారు మనదేశాన్ని పాలించే రోజులలోనే. అప్పటికింకా మనకు స్వరాజ్యం లేదు.

అంజలి, జయంత్ : అవును. ఆయన హైస్కూల్ చదువు రామనాథపురంలో జరిగింది.

శంకర్ : ఆయన పుట్టింది ధనుష్కోటిలో కదా! మరి రామనాథపురంలో చదవడమేమిటి?

అంజలి : ఇప్పటిలాగా అప్పుడు ఇన్నిన్ని పాఠశాలలు, కళాశాలలు లేవు. ఎలిమెంటరీ పాఠశాలలు కూడా చాలా తక్కువ ప్రదేశాలలో ఉండేవి. పై

చదువులు చదవాలంటే పొరుగూరుగాని, దగ్గరలో ఎక్కడ విద్యాలయం ఉంటే అక్కడికి వెళ్ళి చదువుకోవలసిందే.

మహేష్ : ఔను గాంధీగారు, పటేల్, చిలకమర్తివారు ఇలా అందరూ ఉన్న ఊరు విడిచి వెళ్ళి చదువుకున్నవారే.

రమణ : ఇప్పటిలాగా అప్పుడు కిండర్ గార్టెన్ చదువులు, ఇంగ్లీషుమీడియం చదువులు ఉండేవి కాదు. ప్రాంతీయ పాఠశాలలో ప్రాంతీయ భాషలోనే
విద్యాభ్యాసం జరిగేది.

శంకర్ : ఆంగ్లేయుల పాఠశాలలు, కళాశాలలో మాత్రం తప్పకుండా ఆంగ్లంలో చదవాల్సిందే. అంతేకాదు హయ్యర్ సెకండరీ క్లాసులలో కూడా ప్రాంతీయ భాష ఒక్కటిమాత్రం ఆ భాషలో చదవవచ్చు. తక్కిన సబ్జక్టులన్నీ ఆంగ్లంలోనే చదవాలి.

ప్రవీణ్ : అందుకనేనా ఎ.పి.జె. అబ్దుల్కాలాం అన్నిచోట్ల చదువవలసి వచ్చింది.

అంజలి : చూశారా! విద్యావిధానంలో ఆరోజుకీ ఈరోజుకీ ఎన్ని మార్పులు చోటు చేసుకున్నాయో!

II. ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

1. కింది వాక్యాలు పాఠంలో ఏ పేరాల్లో ఉన్నాయో గుర్తించండి. ఆ వాక్యాలను పూర్తిగా రాయండి.

(అ) కలామ్ తత్త్వశాస్త్ర గ్రంథాలు చదవడం
జవాబు.
నేను సెంటోసెఫ్ నా చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు ఇంగ్లీషు సాహిత్యంపట్ల మక్కువ పెంచుకున్నాను. ఇంగ్లీషులోని సర్వశ్రేష్ఠ కృతుల్ని చదువుతుండేవాణ్ణి. టాల్స్టాయ్, స్కాట్, హార్డీల పట్ల ప్రత్యేక ఆసక్తి ఉండేది. అప్పుడప్పుడు తత్త్వశాస్త్ర గ్రంథాలు చదువుతుండేవాణ్ణి. దాదాపుగా ఆ సమయంలోనే భౌతికశాస్త్రం పట్ల నాకు అమితమైన ఆసక్తి ఏర్పడింది.

(ఆ) విజయానికి సూత్రాలు మూడు
జవాబు.
నేను రామనాథపురంలో ఉన్న కాలంలో మా అనుబంధం గురుశిష్యబంధాన్ని దాటి వికసించింది. ఆయన సాహచర్యంలో ఒకరి జీవితగమనాన్ని ఎవరైనా ఏ మేరకు ప్రభావితం చేయగలరో తెలుసుకున్నాను. ఇయదురై సోలోమోన్ అంటూండేవారు, జీవితంలో విజయం పొందడానికీ ఫలితాలు సాధించడానికీ నువ్వు మూడు అంశాల మీద పట్టు సాధించాల్సి ఉంటుంది- అవి “కోరిక”, “నమ్మకం”, “ఆశపెట్టుకోవడమూ”ను.

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

(ఇ) సోదరి సహాయం
జవాబు.
ప్రవేశానికి ఎంపికైతే అయ్యానుగానీ అటువంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో చదవడమంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. దాదాపు వెయ్యి రూపాయలన్నా అవసరమవుతాయి. కానీ అది నా తండ్రికి తలకు మించిన విషయం. అప్పుడు నా సోదరి జొహారా నాకు తోడు నిలబడింది. తన బంగారుగాజులు, గొలుసు కుదువపెట్టి ఆమె నాకు సహాయం చేసింది. నేను చదువుకోవాలన్న ఆమె ఆకాంక్ష, నా సామర్థ్యంలో ఆమె నమ్మకం నన్ను గాఢంగా చలింపచేశాయి. నేను నా సొంత సంపాదన మీదనే ఆమె గాజుల్ని విడిపిస్తానని ఒట్టు పెట్టుకున్నాను. అప్పుడు నాకు డబ్బు సంపాదించడానికున్న ఏకైన మార్గం కష్టపడి చదువుకుని స్కాలర్షిప్ సంపాదించుకోవడమే.

(ఈ) ప్రొఫెసర్ పక్కన కూర్చుని ఫోటో దిగడం
జవాబు.
ఎమ్.ఐ.టికి. సంబంధించి నా ఆత్మీయమైన జ్ఞాపకం ప్రొ. స్పాండర్కి సంబంధించిందే. వీడ్కోలు సమావేశంలో భాగంగా మేము గ్రూప్ ఫోటో కోసం నిలబడ్డాము. ప్రొఫెసర్లు ముందుకూర్చొని ఉండగా గ్రాడ్యుయేట్ విద్యార్థులంతా మూడు వరుసల్లో నిల్చొన్నాము. హఠాత్తుగా ప్రొ. స్పాండర్ లేచి నిల్చొని నా కోసం కలియచూశాడు. నేను మూడో వరుసలో వెనుక నిల్చున్నాను. ‘రా నాతోపాటు ముందుకూర్చో’ అన్నాడు. నేను ప్రొ. స్పాండర్ ఆహ్వానానికి నిర్ఘాంతపోయాను. ‘నువ్వు నా బెస్టు స్టూడెంట్వి. నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకి భవిష్యత్తులో మంచి పేరు తేవడానికి ఉపకరిస్తుంది’ అన్నాడు. ఆ ప్రశంసకి సిగ్గుపడ్డాను. అదే సమయంలో నాకు లభించిన గుర్తింపుకు గర్విస్తూ నేను ప్రొ.స్పాండర్తో కలసి ఫోటోగ్రాఫ్ కోసం కూర్చున్నాను. ‘దేవుడే నీ ఆశా, ఆశ్రయమూ, మార్గదర్శి కాగలడు. భవిష్యత్తులోకి నీ ప్రయాణానికి ఆయనే దారి చూపే దీపం కాగలడు’ అన్నాడు ఆ మహామేధావి నాకు వీడ్కోలు పలుకుతూ.

2. కింది పేరా చదవండి. తప్పు ఒప్పులను గుర్తించండి.

భారతీయ జాతీయోద్యమ నాయకులలో బిపిన్చంద్రపాల్ ఒకడు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న సైచెల్లో జన్మించాడు. సహాయనిరాకరణోద్యమానికి పిలుపునిచ్చాడు. దేశ స్వాతంత్ర్యం కోసం, అభ్యుదయం కోసం పాటుపడ్డాడు. కవులనూ పండితులను, తత్త్వవేత్తలను, ప్రవక్తలను, నాయకులను, సాధారణ ప్రజలనూ అందరినీ ఆహ్వానించాడు. ఈ విధంగా దేశానికి సేవ చేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రంగాన్ని ఎంచుకొని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

(అ) బిపిన్ చంద్రపాల్ జాతీయోద్యమ నాయకుడు (ఒప్పు)
(ఆ) బిపిన్ చంద్రపాల్ సహాయ నిరాకరణోద్యమానికి వ్యతిరేకి (తప్పు)
(పై పేరాలో బిపిన్ చంద్రపాల్ సహాయ నిరాకరణోద్యమానికి పిలుపు నిచ్చాడు అని ఉన్నది. అంటే ఆయన దానిని సమర్థిస్తున్నాడు. ప్రశ్నలో వ్యతిరేకిస్తున్నాడు అని ఉన్నది కనుక ఇది (తప్పు)
(ఇ) బిపిన్ చంద్రపాల్ కవులను, పండితులను స్వాతంత్ర్యోద్యమంలోకి ఆహ్వానించాడు (ఒప్పు)
(ఈ) బిపిన్ చంద్రపాలికి స్వాతంత్రోద్యమ కాంక్ష ఉంది. (ఒప్పు)
(ఉ) బిపిన్ చంద్రపాల్ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జాతీయ నాయకుడు. (ఒప్పు)

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

(అ) ‘ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు జ్ఞాని’ ఈ వాక్యంపై మీ అభిప్రాయం రాయండి.
జవాబు.
అబ్దుల్ కలాం తండ్రి తన కుమారునితో అన్న మాటలివి. విజ్ఞానం కలిగి ఉంటేనే మనిషి అనిపించుకుంటాడు. విజ్ఞానం అంటే ఇతరులను గురించి తెలుసుకోగలిగే శక్తి. మనం అందరితోనూ స్నేహంగా సత్సంబంధాలు కలిగి ఉండాలంటే వారిని అర్థం చేసుకోగలిగి ఉండాలి. అలాగే చెడ్డవారి నుంచి దూరంగా ఉంటే ప్రమాదాలను తప్పించుకోగలుగుతాం. విజ్ఞానం కలవాడు ఇతరులను గురించి ఆలోచించగలిగినట్లే తనను గురించి తాను ఆలోచించగలుగుతాడు. అదే వివేకమంటే. వివేకవంతుడు తప్పక విజ్ఞానియై ఉంటాడు. కాని విజ్ఞానమున్నంత మాత్రాన వివేకి కావాలని లేదు. కాబట్టి తప్పకుండా వివేకం కలిగి ఉండాలని నా అభిప్రాయం.

(ఆ) ‘కోరిక, నమ్మకం, ఆశపెట్టుకోవడం’ అనే మూడు అంశాల మీద ఎందుకు పట్టు సాధించాలి ?
జవాబు.
కోరిక అనేది ప్రతివ్యక్తికీ ఉంటుంది. ఐతే కోరిక బలంగా ఉంటేనే మనిషి దాన్ని తీర్చుకోడానికి ప్రయత్నిస్తాడు. అందుకే కోరిక గట్టిదై ఉండాలి. నమ్మకం అంటే ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం. కోరికను సాధించుకోగలను అనే గట్టి పట్టుదలతో తన మీద తను నమ్మకం కలిగి ఉంటే కోరికను సాధించుకోగలడు. ఆశ పెట్టుకోవడం అంటే చేసే ప్రయత్నాలలో ఒక్కొక్కసారి విఫలమైనా నిరాశపడకుండా తప్పక సాధిస్తాను అనే ఆశతో ముందుకు సాగడం. మనిషి ఎప్పుడూ ఆశాజీవిగానే ఉండాలి. కాబట్టి ఎవరైనా తన ప్రయత్నాలలో సఫలీకృతులు కావాలంటే పై మూడు అంశాల మీద పట్టు సాధించాలి.

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

(ఇ) “తమ విద్యార్థుల జ్ఞానతృష్ణను తమ చైతన్యంతో, అకుంఠిత సంకల్పంతో సంతృప్తి పరచడమే!” ఈ మాటలు ఎవరినుద్దేశించినవి? దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
(లేదా)
కలాం ఉపాధ్యాయుల గొప్పదనాన్ని చెప్పిన సందర్భం వివరించండి.
జవాబు.
తనను ప్రోత్సహించిన ఎమ్.ఐ.టి. ఉపాధ్యాయులను ఉద్దేశించి అబ్దుల్కాలాం చెప్పిన మాటలివి. ఎమ్.ఐ.టి. లో చదివేటప్పుడు అబ్దులలాం ఆలోచనలను తీర్చిదిద్ది, కలాం సాంకేతిక ప్రతిభను ప్రోత్సహించిన ఉపాధ్యాయులు ముగ్గురు. వారు ప్రొఫెసర్ స్పాండర్, ప్రొఫెసర్ కే.ఏ.వి. పండలై, ప్రొఫెసర్ నరసింగరావుగారు. వారిలో ప్రతి ఒక్కరిదీ ఒక ప్రత్యేక వ్యక్తిత్వం. కానీ వారి ఆశయం మాత్రం ఒక్కటే. అది- తమ చైతన్యంతోనూ, అకుంఠిత సంకల్పంతోనూ, విద్యార్థుల జ్ఞాన తృష్ణని సంతృప్తిపరచడం ఒక్కటే వారందరి ఆశయం. ఇది ఆ ఉపాధ్యాయుల గొప్పదనాన్ని తెలియచేస్తోంది. తనను తీర్చిదిద్దిన అలాంటి గురువులను గుర్తుపెట్టుకొని కృతజ్ఞత చూపిన కలాం వ్యక్తిత్వం గొప్పదని తెలుస్తుంది.

(ఈ) ప్రొ. శ్రీనివాసన్ అప్పగించిన పనిని పూర్తిచేసే సమయంలో కలాం స్థానంలో మీరుంటే ఏం చేసేవారు?
జవాబు.
ప్రొ. శ్రీనివాసన్ అబ్దుల్ కలాంకు యుద్ధవిమానం మోడల్ తయారుచేసే పని అప్పగించారు. అది ఆయన స్నేహితులతో కలిసి పూర్తిచేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన వంతు పని తొందరగానే జరిగినా స్నేహితులవైపు నుండి ఆలస్యం జరిగిందని నా కనిపిస్తుంది. నేనైతే పనిచేయడానికి ముందు స్నేహితులతో పనితీరు గురించి ఎంత సమయంలో ఏ పని పూర్తిచేయాలి అనే విషయం గురించి క్షుణ్ణంగా చర్చిస్తాను. అందరూ ఒకరి పనిని మరొకరు పరిశీలిస్తూ, సమిష్టి బాధ్యతతో పని పూర్తయ్యేలా బాధ్యత తీసుకుంటాము.

ప్రతివారిని వారు చేయవలసిన పనిలోని భాగాలను ముందుగానే ప్రణాళిక తయారుచేసి సమయనిర్దేశంతో సహా సిద్ధం చేయిస్తాను. ఆ ప్రణాళికను బట్టి మొత్తం పని పూర్తికావడానికి ఎంత సమయం కావాలో ఆలోచించుకుని ఆ ప్రకారంగా పనులు జరుగుతున్నవో లేదో పర్యవేక్షిస్తూ ముందుగానే నావంతుగా ఎక్కువ సమయం పనిచేసి అనుకున్న దానికన్న ముందుగానే పని పూర్తిచేసి స్నేహితులకు ఆదర్శంగా నిలుస్తాను. వారిని ప్రోత్సహిస్తూ వారికి సాయం చేస్తూ నిర్ణీత సమయంకంటె ముందుగానే పనిపూర్తిచేసి ఉపాధ్యాయునికి అప్పగిస్తాను.

 

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

1. కలాం తన ఆశయసాధనలో ఎలా కృతకృత్యుడయ్యాడు? మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు.
అబ్దుల్ కలాం చిన్నతనంలో కొంగలూ, సముద్రపు గువ్వలూ ఎగురుతుండడం చూసి తను కూడా అలా ఎగరాలనుకొనేవాడు. ఆకాశంలోని రహస్యాలు తెలుసుకోవాలని ఆయనకు ఆసక్తి. కోరిక, నమ్మకం, ఆశపెట్టుకోవడం అనే మూడు అంశాలపై పట్టు సాధించమని గురువు ఇయదురై సోలోమోన్ ఇచ్చిన ఉపదేశం మనసులో కుదుర్చుకున్నాడు. తన ఆశయం నెరవేర్చుకోడానికి ఎంతో కష్టపడి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివాడు. ఆ రోజుల్లో కాలేజీలో ప్రదర్శన కోసం పెట్టిన రెండు పాత విమానాలను చూస్తూ ఎక్కువ కాలం గడుపుతూ తన ఆశయాన్ని బలపరచుకున్నాడు. కోర్సు పూర్తి కాగానే సహచరులతో కలిసి యుద్ధవిమానం మోడల్ తయారుచేశాడు. ప్రొఫెసర్ ఇచ్చిన అతి తక్కువ సమయంలో పూర్తిచేసి అందరి మన్ననలు పొందాడు. వ్యాసరచన పోటీలో ‘మన విమానాన్ని మనమే తయారుచేసుకుందాం’ అనే వ్యాసాన్ని తమిళంలో రాసి మొదటి బహుమతి పొందాడు. ఆ విధంగా కలాఁ తన ఆశయసాధనలో కృతకృత్యుడయ్యాడు.

(లేదా)

కలాం విద్యాభ్యాసం ఏ విధంగా కొనసాగిందో మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు.
కలాం రామనాథపురంలోని హైస్కూలులో విద్యాభ్యాసం చేశాడు. ఆ రోజుల్లో అతనిలో ఎన్నో విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగింది. ముందుముందు జీవితంలో రాబోయే అవకాశాల గురించి, ప్రత్యామ్నాయాల గురించి ఆయనకేమీ తెలియదు. అక్కడి ఉపాధ్యాయుడు ఇయదురై సోలోమోన్ ఆయనకు మార్గదర్శకుడైనాడు. కలాంకు ఆకాశపు రహస్యాలన్నా, పక్షుల ప్రయాణమన్నా చిన్నప్పటినుండి ఎంతో ఆసక్తి. పై చదువుల గురించి, ప్రొఫెషనల్ చదువులగురించి ఆయనకేమీ తెలియదు. అందుకే తిరుచినాపల్లిలో ఉన్న సెంట్ జోసఫ్ కాలేజీలో ఇంటర్మీడియెట్, బి.ఎస్.సి. చదివాడు. చివరి సంవత్సరంలో ఇంగ్లీషు సాహిత్యం మీద ఇష్టం కలిగి మంచి మంచి పుస్తకాలు, తత్త్వశాస్త్ర గ్రంథాలు చదివేవాడు. టాల్స్టాయ్, స్కాట్, హార్డీ అంటే ప్రత్యేకమైన ఆసక్తి. ఆ సమయంలోనే ఆయనకు భౌతికశాస్త్రం పట్ల ఇష్టం ఏర్పడింది.

కానీ తన కలలు నిజం చేసుకోవాలంటే ఫిజిక్స్ కాదు ఇంజనీరింగ్ చదవాలని అర్థం చేసుకున్నాడు. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో దరఖాస్తు చేసుకున్నాడు. ప్రవేశం లభించింది. కాని డబ్బు సమస్య ఎదురైంది. సుమారు 10వేల రూపాయలు కావలసి వచ్చింది. తండ్రికి శక్తి లేదు. సోదరి జొహారా తన బంగారు గొలుసు, గాజులు తాకట్టుపెట్టి డబ్బు ఇచ్చింది. ఎం.ఐ.టిలో చేరిన తరువాత స్కాలర్షిప్ సంపాదించుకొని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివాడు. చిన్నతరహా యుద్ధ విమానాన్ని చాలా తక్కువ సమయంలో తయారుచేసి ప్రొఫెసరు మన్ననలు పొందాడు. తరువాత బెంగుళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ గ్రాడ్యుయేట్ ఏరోనాటికల్ ఇంజనీర్ పనిచేశాడు. ఈ విధంగా అబ్దుల్ కలాం విద్యాభ్యాసం సాగింది.

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

2. ‘మనమే విమానాన్ని తయారుచేసుకుందాం’ అన్న వ్యాసంలో అబ్దుల్కలాం ఏమి రాసి ఉంటారు? (అదనపు ప్రశ్న)
అబ్దుల్ కలాం ప్రాజెక్టు పని పూర్తిచేస్తున్న కాలంలో ఎం.ఐ.టి. తమిళ సంఘం వారు వ్యాసరచన పోటీ నిర్వహించారు. కలాం ఆ పోటీలో పాల్గొన్నారు. “మన విమానాన్ని మనమే చేసుకుందాం” అనే అంశం మీద వ్యాసం రాశారు. ఆ వ్యాసం గొప్ప ఆసక్తిని రేకెత్తించింది. కలాం ఆ పోటీలో గెలిచి ప్రఖ్యాత తమిళ వారపత్రిక ‘ఆనంద వికటన్’కు సంపాదకుడైన దివాన్ చేతులమీదుగా మొదటి బహుమతి అందుకున్నారు. ఆ వ్యాసంలో కలాం ఇలా రాసి ఉండవచ్చు “ఆకాశంలో విహరించడమంటే ఇష్టంలేని వాళ్ళుండరు.

పక్షులైతే రెక్కలతో ఎగురుతాయి. మనిషికి రెక్కలు లేవు గనుక పక్షి ఆకారం కలిగి రెక్కలున్న వాహనంలో అదే విమానంలో కూర్చుని ఆకాశంలో ప్రయాణించవచ్చు. ఈ విమానాన్ని ఎలా తయారుచెయ్యాలంటే ఏరోనాటిక్స్ క్షుణ్ణంగా అభ్యసించాలి. స్వేచ్ఛకు – తప్పించుకోడానికీ, చలనానికీ-గమనానికీ, పక్కకి జారడానికీ – ప్రవహించడానికీ మధ్యగల తేడా తెలుసుకోవడంలోనే విజ్ఞానశాస్త్ర రహస్యాలన్నీ దాగి ఉన్నాయి. యుద్ధ విమానం తయారు చెయ్యాలంటే ఏరో డైనమిక్ డిజైనింగ్, చోదనం, నిర్మాణం, అదుపు, ఉపకరణ సామగ్రి మొదలైన అంశాలమీద దృష్టి పెట్టి తయారు చేయాలి………..” ఈ విధంగా వ్యాసం సాగి ఉండవచ్చునని నా భావన.

IV. సృజనాత్మకత/ప్రశంస

1. కలాం తన కోరికను గురించి చెప్పాడు కదా! అట్లాగే మీరు కూడా మీ కోరికను చిన్న కవిత రూపంలో రాయండి. గోపాలరావు తాతగారు మంచి మనస్సున్న వైద్యుడు
జవాబు.
బాధతో మూలుగుతూ వచ్చే ప్రతి రోగికి ఆయన ఒక సోదరుడు
నవ్వుతూ, ప్రేమతో మాట్లాడుతూ ఉంటే
వారిబాధ తెలుసుకొని, ధైర్యం చెబుతూ ఉంటే
నేను కూడా పెద్దయ్యాక డాక్టరు నవుదామనుకుంటున్నా
రోగులకు, పేదలకు సేవచేసి తరించాలనుకుంటున్నా!

(లేదా)

ఈ పాఠం స్ఫూర్తితో మీరే అబ్దుల్ కలాం అయితే నేటి విద్యార్థులకు ఏం చెపుతారు? సందేశమివ్వండి. ఏకపాత్రాభినయం
చేయండి.
మిత్రులారా! గురువు ఉత్తముడైనంత మాత్రాన సరిపోదు. గురువెట్లా ఉన్నా శిష్యుడు చురుగ్గా ఉండాలి. వీలైనంత ఎక్కువ నేర్చుకోవాలి. ఏదైనా చెయ్యాలనుకుంటే ఆ కోరిక బలంగా ఉండాలి. చెయ్యగలనన్న నమ్మకంతో సాధిస్తానన్న ఆశతో పనిచేస్తే తప్పక సాధించగలరు. మీలో విశ్వాసం గట్టిగా ఉంటే మీ భవిష్యత్తును మీరే నిర్దేశించుకోగలరు. అన్ని విషయాల మీద దృష్టి పెట్టి తెలుసుకుంటూ ఉండండి. విజ్ఞానం పొందండి. విజ్ఞానంతోపాటు వివేకం కూడా చాలా అవసరం. వివేకం లేకపోతే విజ్ఞానం వ్యర్థం. ఎప్పుడూ సకాలంలో పనులు పూర్తిచేసుకోవాలి. ఉపాధ్యాయుల మన్ననలు పొందాలి. మీరు సాధించదలచిన లక్ష్యాన్ని మనసులో చక్కగా కుదుర్చుకొని తగినంత కృషి చేసి దాన్ని చేరుకోవాలి. ఎన్ని అవాంతరాలు వచ్చినా, వైఫల్యాలు ఎదురైనా నిరాశపడకుండా లక్ష్యాన్ని చేరుకోవాలి. మీ అందరికీ నా ఆశీస్సులు, శుభాకాంక్షలు.

పదజాల వినియోగం

1. కింద గీతగీసిన పదాలకు అర్థాలను రాయండి.
(అ) ఔత్సాహికుడైన వ్యక్తి ఏ రంగంలోనైనా రాణిస్తాడు.
ఔత్సాహికుడైన = ఉత్సాహవంతుడైన
ఉత్సాహవంతుడైన వాడు మొదలు పెట్టిన పనిని తప్పక పూర్తి చేస్తాడు.

(ఆ) జిజ్ఞాసువు కొత్త విషయాలను తెలుసుకుంటాడు.
జిజ్ఞాసువు = తెలుసుకోవాలనే కోరిక కలవాడు.
దేవుని గురించి తెలుసుకోవాలనే కోరిక గల నరేంద్రుడు రామకృష్ణ పరమహంసను చేరాడు.

(ఇ) సుస్మితకు డాక్టరుగా ఎదగాలని ఆకాంక్ష
ఆకాంక్ష = కోరిక
సుజాతకు మదర్ థెరిసాలాగా సంఘసేవ చేయాలని కోరిక.

(ఈ) అభ్యర్థులు ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేస్తారు.
వాగ్దానం : మాట యివ్వడం
రోజూ ఆలస్యంగా నిద్రలేచే గౌతమి ఇకపై త్వరగా లేస్తానని తల్లికి మాట ఇచ్చింది.

(ఉ) బందు కారణంగా పనులు నిలిచిపోకుండా యాజమాన్యం ప్రత్యామ్నాయపు ఏర్పాట్లు చేసింది.
ప్రత్యామ్నాయం = బదులు / మాఱు
వరద సమయాలలో ప్రజలకు తలదాచుకోవడానికి ప్రభుత్వం సురక్షితమైన బదులు (మాఱు) ఏర్పాట్లు చేస్తుంది.

(ఊ) వివేకానందుని ఉపన్యాసాలు ఎందరినో ప్రభావితం చేశాయి.
ప్రభావితం చేయు = స్ఫూర్తి కలిగించు
గొప్పగొప్ప వ్యక్తుల బోధనల వలన స్ఫూర్తి కలవారమైన మనం కూడా గొప్పవాళ్ళం కాగలుగుతాం.

2 ఈ పాఠంలో శాస్త్ర సంబంధ పదాలున్నాయి. వాటిని పట్టికగా రాయండి.

ఉదా: ఏరోనాటికల్ ఇంజనీర్
ఈ పాఠంలోని శాస్త్ర సంబంధమైన పదాలు :

సైన్సువాయుపదార్థాలునిర్మాణం
విజ్ఞానశాస్త్రంగతిశీలత
ఫిజిక్స్ఏరోప్లేన్
ఇంజనీరింగ్యుద్ధవిమానం
సాంకేతిక విద్యఏరోడైనమిక్ డిజైన్అణుధార్మికనశ్వరత
విమానయంత్రాలుచోదనంఅర్థజీవకాలం
ఏరోనాటికల్ ఇంజనీర్

3. కింది వాక్యాలలో సమానార్థకాన్నిచ్చే పదాలున్నాయి. వాటిని గుర్తించి రాయండి.

(అ) ఆకాశంలో చుక్కలు మెరుస్తున్నాయి. ఆ గగనంలోనే చంద్రుడు కాంతులీనుతున్నాడు. అందుకే నింగి అంటే నాకెంతో ఇష్టం.
జవాబు.
ఆకాశం, గగనం, నింగి

(ఆ) భూమి మీద ఎన్నో జీవరాశులున్నాయి. వసుధలో నిధి నిక్షేపాలుంటాయి. ధరణికి వృక్షాలు అందాన్నిస్తాయి.
జవాబు.
భూమి, వసుధ, ధరణి

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

(ఇ) ఆయనకు సుమారు ముప్పై ఏళ్ళు. ఉద్యోగంలో చేరి ఇంచుమించు ఆరు సంవత్సరాలైంది. నెలకు దాదాపు పదివేలు సంపాదిస్తున్నాడు.
జవాబు.
ఇంచుమించు, సుమారు, దాదాపు

(ఈ) కిరణ్ు కలెక్టర్ కావాలని కోరిక. తన ఆకాంక్ష నెరవేరడానికి నిరంతరం శ్రమిస్తాడు. పరీక్షఫలితాలు రాగానే తన కాంక్ష ఫలించిందని సంతోషించాడు.
జవాబు.
కోరిక, ఆకాంక్ష, కాంక్ష.

VI. భాషను గురించి తెలుసుకుందాం.

1. కింది పదాలను విడదీయండి. సంధులను గుర్తించండి.
(అ) మొదలయ్యింది = మొదలు + అయింది (ఉత్వసంధి)
(ఆ) మేల్కొల్పాడంటే = మేల్కొల్పాడు + అంటే (ఉత్వసంధి)
(ఇ) ఉంటుందని = ఉంటుంది + అని (ఇత్వసంధి)
(ఈ) నాకిప్పటికీ = నాకున్ + ఇప్పటికీ (ఉత్వసంధి)
(ఉ) నైపుణ్యముందో = నైపుణ్యము + ఉందో (ఉత్వసంధి)

2. కింది వాక్యాలు చదవండి. గీతగీసిన ప్రత్యయాలు ఏ విభక్తికి చెందినవో గుర్తించండి. రాయండి.
ఉదా : (అ) ఆదిత్య మంచి బాలుడు. (ప్రథమావిభక్తి)
(ఆ) సూర్యనారాయణశాస్త్రిగారితో నడిచాను. (తృతీయావిభక్తి)
(ఇ) ఆయనను ఒప్పించలేకపోయాను. (ద్వితీయావిభక్తి)
(ఈ) ఆహారం కొరకు పక్షులు బయలుదేరుతాయి. (చతుర్థీవిభక్తి)
(ఉ) గురువుల యొక్క ప్రభావం కలాంపై బాగా ఉన్నది. (షష్ఠీవిభక్తి)
(ఊ) చెరువులయందు ఉన్న తామరలు సౌందర్యాన్నిస్తాయి. (సప్తమీవిభక్తి)
(ఋ) బాలలారా! కలలు కనండి.

ప్రాజెక్టు పని:

1. మీకు నచ్చిన శాస్త్రవేత్తను గురించి వారెట్లా ప్రేరణ పొందారో, ఏ కొత్త విషయాలు కనుక్కొన్నారో వివరాలు సేకరించి వ్యాసం రాయండి.
జవాబు.
నాకు నచ్చిన శాస్త్రవేత్త, కనుక్కొన్న విషయాలు : వ్యాసం ఢిల్లీలో జంతర్మంతర్ గురించి తెలియని వాళ్ళుండరు. ఇది అద్భుతమైన నిర్మాణం. దీని నిర్మాణం 17వ శతాబ్దిలో జరిగింది. దీని సృష్టికర్త రాజపుత్రరాజు జయసింహుడు. మొగల్ రాజు ఔరంగజేబుకు పరమ మిత్రుడు. జయసింహుడికి శాస్త్రీయ దృక్పథం ఏర్పడడానికి కారణం ఒక మహమ్మదీయ వనిత అని చెబుతారు.

ఆమె ఒక వెన్నెల రాత్రి కోట పై భాగన ఆయనతో విహారం చేస్తూ “చంద్రుడికీ మనకూ ఎంత దూరం? చంద్రుడు, సూర్యుడు, భూమి, నక్షత్రాలు- వీటి మధ్య గల సంబంధం ఎలాంటిది?” అని అడిగిందట. ఏదో ఉబుసుపోకకు అడిగిన ప్రశ్నే అయినా జయసింహుడిలో ఆలోచన రేకెత్తించింది. ఆయనలో నిద్రపోతున్న శాస్త్రజ్ఞుణ్ణి మేలు కొలిపింది.

పర్షియన్ అరబిక్ యూరోపియన్ భాషలలో ఉన్న ఖగోళ గణిత గ్రంథాలన్నీ సమగ్రంగా చదివాడు. యూరప్ న్నుంచి టెలిస్కోప్ తెప్పించాడు. స్వయంగా వాటిని రూపొందించడం మొదలుపెట్టాడు. భూభ్రమణ విధానం, భూమి వాలి ఉన్న స్థితి- వాటి కారణాలుగా దొర్లిన లోపాలు సరిచేసి మహమ్మదీయ, హిందూ పర్వదినాలను కచ్చితంగా నిర్ణయించాడు. ఈ పరిశీలనలన్నీ ‘బిజ్ మహమ్మద్ షాహి’ అనే గ్రంథంగా వెలువరించాడు.

ఖగోళ నిర్మాణాలను నిశితంగా పరిశీలించడానికే ఈయన జంతర్ మంతర్లను ఢిల్లీ, జైపూర్, వారణాసి, ఉజ్జయినీ నగరాల్లో నిర్మించాడు. ఈ జంతర్ మంతర్ల గురించి ఇప్పటికీ శాస్త్రజ్ఞులు చర్చించుకుంటూనే ఉన్నారంటే జయసింహుని శాస్త్రపరిజ్ఞానం లోతేమిటో మనకు అర్థమౌతుంది. ఆయన రూపొందించిన యంత్రాలలో సమ్రాట్ంత్ర, రాయతంత్ర, జయప్రకాశ్ చెప్పుకోదగ్గవి.

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

2. వివిధ శాస్త్రవేత్తల గురించి పత్రికల్లో వచ్చిన అంశాలను సేకరించి నివేదిక రాసి ప్రదర్శించండి.
జవాబు.
అల్జీమర్స్ గుట్టువిప్పే సరికొత్త రక్తపరీక్ష :
బెర్లిన్ (8-4-2018) : లక్షణాలు పైకి కనిపించకముందే అల్జీమర్స్ను కనిపెట్టే కొత్త రక్తపరీక్షను శాస్త్రజ్ఞులు అభివృద్ధి చేశారు. దీంతో అల్జీమర్స్ వ్యాధి ముప్పు ఎక్కువగా ఉండేవారిని గుర్తించే వీలుంది. అంతేకాదు కొత్త ఔషధాల తయారీకీ ఇది బాటలు పరుస్తోంది. అల్జీమర్స్ రోగుల మెదడులో అమిలోయిడ్-బీటా సమ్మేళనాల స్థాయిలు పెరుగుతాయి.

రక్తంలో వీటిని గుర్తించేలా తాజా పరీక్షను అభివృద్ధి చేశారు. దీనికోసం ఇమ్యునో ఇన్ఫ్రారెడ్ సెన్సర్ల సాంకేతికతను ఉపయోగించారు. అంటే భిన్న పౌనఃపున్యాల్లో పరారుణ కిరణాలను ప్రయోగించి రక్తంలో అమిలోయిడ్ బీటా స్థాయిలను గుర్తిస్తారన్నమాట. ఈ పరిజ్ఞానాన్ని 65 మంది రక్తనమూనాలపై విజయవంతంగా పరీక్షించినట్లు పరిశోధకులు తెలిపారు. మెదడు స్కానింగ్ ఫలితాలతో ఇవి చక్కగా సరిపోయాయని వివరించారు. ఇతర మేథో లోపాల నిర్ధారణకూ ఈ పరీక్ష ఉపయోగపడే అవకాశముందని చెప్పారు.

జబ్బుల బాక్టీరియా గుట్టురట్టు:
కొత్త యాంటీబయాటిక్స్ తయారీకి ఊతం! : వాషింగ్టన్, ఏప్రిల్ 9, 2018 : మనిషి శరీరంలో చాలా బాక్టీరియా ఉంటుంది… అవి రకరకాల ప్రొటీన్లను స్రవిస్తూంటాయి. అయితే జబ్బుతో బాధ పడుతున్న ఓ వ్యక్తి శరీరంలో ఆ జబ్బుకు కారకమైన బాక్టీరియా.. ఆ వ్యక్తి కణజాలాలకు అంటిపెట్టుకుని ఉండేలా చేసే ఓ విభిన్నమైన ప్రొటీన్ ను స్రవిస్తుందన్న విషయాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

“ఒక పెద్ద మాల్లో మిగిలిన అన్ని సరుకుల చేరవేతకు వివిధ దార్లున్నప్పటికీ, ఆ మాల్ సొంత అవసరాలకు ఒక ప్రత్యేక దారి ఉన్నట్లుగా శరీరంలోని మిగిలిన అన్ని రకాల పనులకూ వేరువేరు రకాల ప్రొటీన్లను స్రవించే బాక్టీరియా కేవలం జబ్బు కారకమైన బాక్టీరియా కోసం ఓ ప్రొటీన్ ను వెలువరిస్తుంది. అంటే ఈ ప్రొటీన్ ఓ రకంగా ఆ జబ్బు నయంకాకుండా యాంటీబయాటిక్స్లో పోరాటం చేస్తుంది” అని పరిశోధన జరిపిన అమెరికా హార్వర్డ్ మెడిక్ స్కూల్ ప్రొఫెసర్ టామ్ రాపోపోర్ట్ చెప్పారు. కొత్త రకాల యాంటీ బయోటిక్స్ తయారీ పరిశోధనలకు ఇది అత్యంత కీలకం కానుంది.

డీఆర్డీవో శాస్త్రవేత్తకు ప్రతిష్ఠాత్మక పురస్కారం :
హైదరాబాద్ : రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)కు చెందిన శాస్త్రవేత్త బ్రజ్నిష్ సైతరా…. ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్కు చెందిన ప్రతిష్ఠాత్మక యంగ్ ఇంజినీర్ అవార్డును అందుకున్నారు. రూర్కిలో జరిగిన ఐఎన్ఏఈ వార్షిక సమావేశంలో ఈ అవార్డుతోపాటు నగదును ఆయనకు అందజేశారు.

నిలువుగీతల చిహ్నం సృష్టికర్త ఉర్ల్యాండ్ మృతి
న్యూయార్క్ : నిలువుగీతల చిహ్నం (బార్ కోడ్) సృష్టికర్త నార్మన్ జోసెఫ్ ఉర్ల్యాండ్ 9-12-2012న మృతి చెందారు. ఈ మేరకు ఆయన కుమార్తె సుసాన్ ఉర్ల్యాండ్ ప్రకటించారు. 91 ఏళ్ళ ఈయన కొంతకాలంగా అల్జీమర్స్తో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ఈయన డిగ్రీ చదువుతున్న రోజుల్లో తన సహ విద్యార్థి బెర్నాడ్ సిల్వర్తో కలిసి ఈ చిహ్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు.

దీనికి 1940లో మేధోహక్కుల (పేటెంట్) సాధించారు. ప్రస్తుతం ఈ విధానాన్ని అన్ని ప్రముఖ ఉత్పత్తుల్లోనూ వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఒక ఉత్పత్తికి సంబంధించిన కీలక సమాచారాన్ని నిలువు గీతల సంకేత రూపంలో చెప్పడాన్ని బార్ కోడింగ్ అంటారు. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో ఉర్ల్యాండ్, సిల్వర్ కేవలం 15000 డాలర్లు మాత్రమే సంపాదించారు.

విశేషాంశాలు

ఏరోనాటికల్ ఇంజనీరింగ్ : విమానాల తయారీకి సంబంధించిన ఇంజనీరింగ్ విభాగం.
హెచ్.ఏ.యల్. : హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (భారతీయ విమానయాన నిర్మాణ సంబంధిత సంస్థ)

సైన్సువాయుపదార్థాలునిర్మాణం
విజ్ఞానశాస్త్రంగతిశీలత
ఫిజిక్స్ఏరోప్లేన్
ఇంజనీరింగ్యుద్ధవిమానం
సాంకేతిక విద్యఏరోడైనమిక్ డిజైన్అణుధార్మికనశ్వరత
విమానయంత్రాలుచోదనంఅర్థజీవకాలం
ఏరోనాటికల్ ఇంజనీర్


సమానార్ధక పదాలు

1.  గత రెండేళ్ళుగా వరదలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే పొరపాట్లు జరుగుతుంటాయి.
జవాబు.
సంభవించు, జరుగు

2. ఉదయం పూట కొంతసేపు బయట గాలిలో విహరించడం ఆరోగ్యానికి మంచిది. పిల్లలు చదువుకోకుండా అస్తమానం తిరగడం మంచిది కాదు.
జవాబు.
విహరించడం, తిరగడం

3. ఎవరేం చెప్పినా వినాలి కానీ వెంటనే విశ్వసించకూడదు. నేనింత చెప్పినా నువ్వు నా మాటలు నమ్మడం లేదెందుకని?
జవాబు.
విశ్వసించు, నమ్ము

TS 7th Class Telugu 6th Lesson Important Questions ప్రేరణ

ప్రశ్న 1.
అబ్దుల్ కలాం దారితప్పినప్పుడు ఆయన తండ్రి మాటలు అతణ్ణి దారిలో పెట్టేవికదా! ఆ మాటలు ఏవి?
(లేదా)
తండ్రి మాటలు అబ్దుల్కలాం జీవితంలో ఎలాంటి మార్పు తెచ్చాయి?
జవాబు.
మనం ఏ పనిచేసినా కొన్నిసార్లు ఆనందాలు కలుగుతాయి. కొన్నిసార్లు ఆటంకాలు కలుగుతాయి. వైఫల్యాలు కూడా ఒక్కోసారి తప్పవు. అలాగే అబ్దుల్కలాంకు గూడా అన్ని అనుభవాలూ ఎదురైనాయి. ఆశాభంగం కలిగినప్పుడు, దారితప్పినప్పుడు తన తండ్రిచెప్పిన మంచిమాటలు గుర్తుకొచ్చేవి. అవేమంటే “ఇతరుల్ని తెలుసుకున్నవాడు విజ్ఞాని. తనను తాను తెలుసుకున్నవాడు వివేకి. వివేకం లేకపోతే విజ్ఞానం ప్రయోజన శూన్యం”. అంటే ఆత్మవిమర్శ చేసుకోగలిగినప్పుడే అనుకున్న పని చక్కగా పూర్తిచెయ్యగలం. అలా ఆత్మవిమర్శ చేసుకుని కలాం తన లక్ష్యాన్ని చేరుకోగలిగాడు.

ప్రశ్న 2.
కలాం బాల్యంలో వేటిని పరిశీలించేవాడు? వాటి ద్వారా ఏ స్ఫూర్తిని పొందాడు?
(లేదా)
కలాం ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కావడానికి బాల్యంలో ఏది స్ఫూర్తినిచ్చింది?
జవాబు.
కలాం ఎం.ఐ.టి.లో చదివేటప్పుడు అక్కడ ప్రదర్శనకోసం పెట్టిన రెండు పాత విమానాలు ఆయన్ని బాగా ఆకర్షించాయి. విద్యార్థులంతా హాస్టలుకు వెళ్ళిపోయాక చాలాసేపు అక్కడే కూర్చుని పరిశీలిస్తూ ఉండేవాడు. అలా చూస్తూ చూస్తూ ఆయనకు పక్షిలాగా ఆకాశంలో ఎగరాలన్న కోరిక దృఢపడింది. ఆ స్ఫూర్తితోనే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ను ఎంచుకున్నాడు. తన లక్ష్యాన్ని పట్టుదలతో సాధించుకున్నాడు.

ప్రశ్న 3.
మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశానికి కలాంకు ఆర్థిక సహాయం చేసిందెవరు?
జవాబు.
కలాంకు ఇంజనీరింగ్ చదవటానికి మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశానికి అర్హత లభించింది. ఖర్చు దాదాపు వెయ్యి రూపాయల దాకా ఉంటుంది. కాని తండ్రి దగ్గర అంత సొమ్ములేదు. అవకాశం వదులు కోవడం కలాంకు ఇష్టంలేదు. ఆ సమయంలో ఆయన సోదరి జొహారా ఆయనకు సహాయం చేసింది. తనకున్న బంగారు గాజులు, గొలుసు కుదువబెట్టి డబ్బు అందించింది. అలా కలాం ఎం.ఐ.టి.లో చేరాడు. బాగా చదివి స్కాలర్షిప్ సంపాదించుకొని చదువు కొనసాగించాడు.

ప్రశ్న 4.
వీడ్కోలు సమావేశంలో ఏం జరిగింది?
(లేదా)
ప్రొఫెసర్ స్పాండర్ కలాంని అభినందించిన సన్నివేశం రాయండి.
జవాబు.
వీడ్కోలు సమావేశంలో భాగంగా అందరూ గ్రూప్ ఫోటో కోసం నిలబడ్డారు. ప్రొఫెసర్లు ముందు కూర్చున్నారు. గ్రాడ్యుయేట్ విద్యార్థులంతా మూడు వరుసల్లో వెనుక నుంచున్నారు. హఠాత్తుగా ప్రొ. స్పాండర్ లేచి నుంచొని కలాంను పిలిచి పక్కన కూర్చోబెట్టుకున్నారు. “నువ్వు నా బెస్ట్ స్టూడెంట్వి. నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకు భవిష్యత్తులో మంచి పేరు తెస్తుంది” అని మెచ్చుకున్నారు. ఆ గుర్తింపునకు కలాం పొంగిపోయారు.

ప్రశ్న 5.
ప్రొఫెసర్ శ్రీనివాసన్ అప్పగించిన పనిని కలాం ఎలా పూర్తి చేశాడు?
(లేదా)
ప్రొఫెసర్ శ్రీనివాసన్ కలాంలో పట్టుదలకు ఎలా కారణమయ్యాడు?
జవాబు.
ఎం.ఐ.టిలో కోర్సు పూర్తికాగానే నలుగురు సహచరులతో కలిసి ఒక చిన్న తరహా యుద్ధ విమానాన్ని డిజైన్ చేసే బాధ్యత తీసుకున్నాడు కలాం. అందులో ఏరోడైనమిక్ డిజైన్ చేయడం కలాం వంతు. చోదనం, నిర్మాణం అదుపు, ఉపకరణ సామగ్రి-వీటి తయారీ స్నేహితుల బాధ్యత. ప్రొ. శ్రీనివాసన్ వారికి డిజైనింగ్ ఉపాధ్యాయుడు. పని నెమ్మదిగా సాగుతున్నదని ప్రొ. శ్రీనివాసన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కలాం నెలరోజులు సమయం కోరారు. శుక్రవారం నుంచి సోమవారం వరకు మూడురోజులు గడువిచ్చి ఆలోగా పూర్తిచేయకపోతే స్కాలర్షిప్ ఆపేస్తానన్నారు. కలాం పట్టుదలతో నిద్రాహారాలు మాని అనుకున్న సమయానికి పని పూర్తిచేశాడు. ప్రొఫెసర్ మనసారా అభినందించారు.

పర్యాయ పదాలు:

  • మాత = తల్లి, జనని, అమ్మ
  • ఆశ = కోరిక, వాంఛ, ఇచ్ఛ
  • అకాశము = గగనము, నింగి, దివి
  • పురము = పట్టణము, నగరము, పురి
  • జీవితము = బ్రతుకు, జీవనము, మనుగడ
  • ఉపాధ్యాయుడు = గురువు, ఒజ్జ, అధ్యాపకుడు

నానార్థాలు:

  • ఆశ = కోరిక, దిక్కు
  • భగవంతుడు = దేవుడు, వష్టు, శవుడు
  • మీతుడు = స్నేహితుడు, సూర్యుడు
  • శౌఖ = చెట్టుకొమ్మ, చేయి, వేదభాగము
  • హృదయము = మనస్సు, [పేమ, అభిప్రాయము
  • కాలము = సమయము, నలుపు, చావు

వ్యుత్పత్త్యర్థాలు:

ఉపాధ్యాయడుసమీపమును పొంది ఈతని వలన అధ్యయనము చేయుదురుగురువు
గురువుఅజ్ఞానాంధకారమును ఛేదించుహాడుఉపాధ్యాయుడు
పక్షిపక్షములు (ఱెక్కలు) గలదిపిట్ట
మానవుడుమనువు సంబంధమైనవాడునరుడు
మిత్రుడు(1) సర్వభూతములయందుసూర్యుడు
(2) స్నేహయుక్తుడుస్నేహితుడు


ప్రకృతి – వికృతులు:

  • స్థిరము – తిరము
  • పంక్తి – పది, బంతి
  • విద్య – విద్దె, విద్దియ
  • బుద్ది – బుద్ది
  • శిఘ్యడు – సిసువుడు
  • గురువు – గులబవ, గుర్వు
  • కాలము – కారు
  • బంధము – బందము
  • ఆశ – ఆస
  • గాఢము – గాటము
  • అకాశము – ఆకసము
  • పక్షి – పక్కి
  • (ప్రయాణము – పయనము
  • సముద్రము – సంద్రము
  • విశ్వాసము – విసువాసము

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

సంధులు:

1. ఉత్వసంధి : సూత్రం : ఉత్తునకు అచ్చుపరమైనపుడు సంధి అవుతుంది.

  • మొదలయ్యింది = మొదలు + అయ్యింది
  • మొదలైంది = మొదలు + ఐంది
  • నువ్వింత = నువ్వు + ఇంత
  • ఆత్మీయమైన = ఆత్మీయము+ ఐన
  • రైలెక్కాడు = రైలు + ఎక్కాడు
  • పదిహేనేళ్ళు = పదిహేను + ఏళ్ళు
  • అమితమైన = అమితము + దన

2. ఉత్వసంధి : సూత్రం : ప్రథమేతర విభక్తి శత్రర్థ చు వర్ణాల్లే ఉన్న ఉకారానికి సంధి వైకల్పికముగా వస్తుంది.

  • నాకప్పుడే = నాకున్ + అప్పుడే
  • నాకేమి = నాకున్ + ఏమి
  • నేనేమి = నినున్ + ఏమి

3. ఇత్వసంధి : సూత్రం : ఏమి మొదలైన పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.

  • ఏమంత – ఏమి + అంత
  • ఇదంతా – ఇది + అంతా
  • ఒకటేమిటి – ఒకటి + ఏమిటి
  • పూర్తయ్యాక – పూర్తి + అయ్యాక

4. ఇత్వసంధి : సూత్రం : క్రియాపదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.

  • నేర్పిందిదే – నేర్పింది + ఇదే
  • కావాలనుకుంటే – కావాలి + అనుకుంటే
  • ఉందని – ఉంది + అని
  • కావాలంటే – కావాలి + అంటే

5. అత్వసంధి : సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.

  • అయినప్పటికీ = అయిన + అప్పటికీ
  • చిన్నప్పటి = చిన్న + అప్పటి
  • అన్నట్టు = అన్న + అట్టు
  • వెళ్ళినప్బండు = వెళ్ళిన + అప్పుడు

6. సవర్ణదీర్ఘసంధి : సూత్రం : అ,ఇ,ఉ,ఋులకు సవర్ణాలైన అచ్చులు పరమైనపుడు వాని దీర్లాలు ఏకాదేశమవుతాయి.

  • జీవితావకాశాలు = జీవిత + అవకాశాలు
  • అమితాసక్తి = అమిత + ఆసక్తి
  • విద్యార్థులు = విద్యా + అర్థులు
  • పరమాచార్య = పరమ + ఆచార్య

7. గుణసంధి : సూత్రం : అకారానికి ఇ,ఉ,ఋలు పరమైనప్పుడు క్రరమంగా ఏ,ఓ,అర్లు ఏకాదేశవుతాయి.

  • రామేశ్వరం = రామ + ఈశ్వరం
  • బలోపేం = బల + ఉపేతం
  • ప్రోత్సాహము = ప్ర + ఉత్సాహము
  • స్వేచ్ఛ) = స్ప + ఇచ్ఛ

8. గసడదవాదేశ సంధి సూత్రం:

(1) ద్వంద్వ సమాసంలో పదం మీది పరుషాలకు గసడదవలు వస్తాయి.
తల్లీతండ్రులు – తల్లి + తండ్రి

(2) ప్రథమమీది పరుషాలకు గసడదవలు బహుళంగా వస్తాయి.
అదిగాని – అది + కాని
అక్కడే గడపు – అక్కడే + కడపు
పసిగట్టు – పసి + కట్టు

సమాసాలు:

“సమాసములు,
1. షష్ఠీతత్పురుష సమాసం

జీవిత లక్ష్యం – జీవితం యొక్క లక్ష్యం
పనితీరు – పని యొక్క తీరు
కుటుంబ నేపథ్యం – కుటుంబం యొక్క నేపథ్యం
విద్యాభ్యాసం – విద్య యొక్క అభ్యాసం
మాతృభూమి – మాత యొక్క భూమి

2. సప్తమీతత్పురుష సమాసం
ఆకాశ రహస్యాలు – ఆకాశమందలి రహస్యాలు
త్యాగనిరతి – త్యాగమందు నిరతి

3. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
నిశిత బోధన – నిశితమైన బోధన
సాంకేతిక విద్య – సాంకేతికమైన విద్య
సూక్ష్మబుద్ధి – సూక్ష్మమైన బుద్ధి
అమితాసక్తి – అమితమైన ఆసక్తి
మహామేధావి – గొప్పవాడైన మేధావి

4. ద్విగు సమాసం
పదిహేనేళ్ళు – పదిహేను సంఖ్యగల ఏళ్ళు
మూడు అంశాలు – మూడైన అంశాలు

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

5. తృతీయా తత్పురుష సమాసం
కష్టార్జితం – కష్టము చేత ఆర్జితం
ఉద్వేగ భరితుడు – ఉద్వేగముతో భరితుడు

6. ద్వితీయా తత్పురుష సమాసం
విద్యార్థులు – విద్యను అర్థించువారు

7. ద్వంద్వ సమాసం

గురుశిష్యులు – గురువును, శిష్యుడును
తల్లీతండ్రులు – తల్లియు, తండ్రియు

8. నఞ తత్పురుష సమాసం
అనివార్యం – నివార్యం కానిది
అస్థిరం – స్థిరం కానిది / స్థిరం లేనిది
అసాధ్యం – సాధ్యం కానిది
అమితం – మితం లేనిది

9. సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
భారతదేశం – భారతము అను పేరుగల దేశం

10. బహువ్రీహి సమాసం
మందబుద్ధి – మందమైన బుద్ధి కలవాడు

11. ప్రథమా తత్పురుష సమాసం
మధ్యాహ్నము – అహ్నము యొక్క మధ్యభాగము

I. పదజాలం, వ్యాకరణాంశాలు:

అన్ని ప్రశ్నలకు సమాధానమివ్వండి.

1. జిజ్ఞాసి కొత్త విషయాలను తెలుసుకుంటాడు. గీతగీసిన పదానికి అర్థం
(అ) పరిగెత్తేవాడు
(ఆ) తెలుసుకోవాలనే కోరిక కలవాడు
(ఇ) సామాన్యుడు
జవాబు.
(ఆ) తెలుసుకోవాలనే కోరిక కలవాడు

2. ఆకాంక్ష అనే మాటకు పర్యాయపదాలు
జవాబు.
కోరిక అభిమతం, ఇచ్ఛ

3. కష్టార్జితంతో బ్రతికేవాడు గొప్పవాడు. గీతగీసిన మాటకు అర్థం రాసి ఆ పదంతో సొంతవాక్యం రాయండి.
జవాబు.
కష్టార్జితం = కష్టం చేత సంపాదించబడింది. వ్యాపారంలో నష్టం రావడంతో రవి కష్టార్జితమంతా కోల్పోయాడు.

4. అభ్యర్థులు ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేస్తారు. గీతగీసిన మాటకు అర్థం
జవాబు.
(అ) మాట ఇవ్వడం
(ఆ) చెప్పినట్లు వినడం
(ఇ) డబ్బు ఇవ్వటం
జవాబు.
(అ) మాట ఇవ్వడం

5. అది ఏమంత పెద్దది కాదు. గీతగీసిన పదం ఏ సంధి?
(అ) ఉత్వసంధి
(ఆ) గుణసంధి
(ఇ) ఇత్వసంధి
జవాబు.
(ఇత్వసంధి)

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

6. జవాబు తెలిసిన ఏకైక విద్యార్థి అతడే. గీతగీసిన మాటను విడదీయండి.
(అ) ఏ + కైక
(ఆ) ఏక + ఏక
(ఇ) ఏక + ఐక
జవాబు.
(ఆ) ఏక + ఏక

7. అతని పనితీరు బాగుంది. గీతగీసినది ఏ సమాసం?
(అ) తృతీయాతత్పురుష
(ఆ) ద్వంద్వ సమాసం
(ఇ) షష్ఠీ తత్పురుష సమాసం
జవాబు.
(ఇ) షష్ఠీ తత్పురుష సమాసం

8. ద్రోణుడు, అర్జునుడు గురుశిష్యులు, గీతగీసినది ఏ సమాసం ?
(అ) ద్వంద్వ సమాసం
(ఆ) ద్వితీయాతత్పురుష
(ఇ) బహువ్రీహి
జవాబు.
(అ) ద్వంద్వ సమాసం

9. సమాసంలోని పూర్వపదం సంఖ్య అయితే అది ఏ సమాసం?
(అ) షష్ఠీ తత్పురుష
(ఆ) ద్విగుసమాసం
(ఇ) నఇత్పురుష
జవాబు.
(ఆ) ద్విగుసమాసం

10. గొప్పవాళ్ళ జీవిత చరిత్రలు ఎంతో మందిని ప్రభావితం చేస్తాయి – ఇందులో గీతగీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
(అ) స్ఫూర్తి కలిగిస్తాయి
(ఆ) నాశనం చేస్తాయి
(ఇ) అనిశ్చితిలోకి నెడతాయి
జవాబు.
(అ) స్ఫూర్తి కలిగిస్తాయి

11. కిందివాటిలో ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలనే తీవ్రమైన కోరిక అనే అర్థం ఇచ్చే పదం ఏది?
(అ) మృగతృష్ణ
(ఆ) విరహవేదన
(ఇ) జ్ఞానతృష్ణ
జవాబు.
(ఇ) జ్ఞానతృష్ణ

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

12. ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. గగనంలో సూర్యుడి జాడలేదు. నింగి నేల కలిసిపోయినట్లు చీకటి ముసురుకొన్నది.
ఇందులో సమానార్థక పదాలు గుర్తించండి.
జవాబు.
ఆకాశం, గగనం, నింగి

13. సముద్రంలో గవ్వలు ఉంటాయి. సంద్రంలో అలలు ఎగిరెగిరి పడుతూంటాయి. – ఇందులో ఉన్న ప్రకృతి వికృతులను గుర్తించండి.
జవాబు.
సముద్రం- ప్రకృతి; సంద్రం – వికృతి

14. “విశ్వాసంతో నువ్వు విధిని కూడా తిరిగి రాయగలవు” అనే వారాయన. – దీనిని పరోక్ష కథనంలోకి మార్చండి.
జవాబు.
విశ్వాసంతో వ్యక్తి తన విధిని కూడా తిరిగి రాయ గలడు అనే వారాయన

15. పుస్తక రచనను పూర్తిచేయడానికి నెలరోజుల వ్యవధి కావాలి – దీనికి వ్యతిరేక వాక్యం రాయండి.
జవాబు.
పుస్తక రచనను పూర్తి చేయడానికి నెలరోజుల వ్యవధి అక్కరలేదు.

16. రాజు భారతాన్ని చదివాడు. – దీనికి కర్మణి వాక్యాన్ని గుర్తించండి.
(అ) రాజు భారతాన్ని చదివించాడు.
(ఆ) రాజుచే భారతం చదవబడింది
(ఇ) భారతాన్ని చదివినవాడు రాజు
జవాబు.
ఆ (రాజుచే భారతం చదవబడింది)

17. ప్రతి మనిషికీ తల్లి తొలి గురువు. గీతగీసిన పదానికి పర్యాయ పదాలు రాయండి.
జవాబు.
మాత, జనని, అమ్మ

18. అకారానికి ఇ, ఉ, ఋలు పరమైనప్పుడు క్రమంగా ఏవి ఆదేశంగా వస్తాయి?
జవాబు.
(అ) ఆ, ఈ, ఏ
(ఆ) అ, ఇ, ఉ
(ఇ) ఏ, ఓ, అర్
జవాబు.
(ఇ) ఏ, ఓ, అర్

19. వివేకం లేని విజ్ఞానం ప్రయోజన శూన్యమని కలాంతో తండ్రి అనేవారు ఈ వాక్యాన్ని ప్రత్యక్ష కథనంలోకి మార్చండి.
జవాబు.
ప్రత్యక్ష కథనం : కలాంతో తండ్రి “వివేకం లేని విజ్ఞానం ప్రయోజన శూన్యం.” అని అనేవారు.

II. పరిచిత గద్యభాగాలు

1. క్రింది పేరాను చదివి ఇచ్చిన ప్రశ్నలకు తగిన జవాబులు రాయండి.

ఒక రోజు మా డైరెక్టర్, మాకు డిజైనింగ్ ఉపాధ్యాయుడు అయిన ప్రొఫెసర్ శ్రీనివాసన్ మా పనిలో ప్రగతిని సమీక్షించి, ఏమీ పురోగతి లేదని, చాలా నిరాశాజనకంగా ఉందని తేల్చేశారు. నేను పనిలో జాప్యానికి ఓ డజను సాకులు చెప్పినా ఆయన్ని ఒప్పించలేకపోయాను. ఆ పనిని పూర్తి చెయ్యడానికి చివరికి ఒక నెలరోజుల వ్యవధి కోరాను. ఆ ప్రొఫెసర్ నా వంక కొంత సేపు చూసి, “చూడు యంగ్మేన్, ఈ రోజు శుక్రవారం మధ్యాహ్నం. నేను నీకు మూడు రోజుల టైమిస్తున్నాను. సోమవారం ఉదయానికి గానీ విమాన నిర్మాణం డ్రాయింగ్ పూర్తికాకపోతే మీ స్కాలర్షిప్ని ఆపెయ్యవలసి ఉంటుంది” అన్నాడు. నాకు నోట మాట రాలేదు. ఆ స్కాలర్షిప్పే నా జీవన భాగ్యరేఖ. అదిగాని లేకపోతే ఇక ఏ దిక్కూలేదు. చెప్పినట్టు ఆ పని పూర్తి చెయడ్యం తప్ప మరో మార్గం కనిపించలేదు.

(అ) ఈ మాటలు ఎవరివి?
జవాబు.
ఈ మాటలు ఎ.పి.జె. అబ్దుల్ కలాంగారివి

(ఆ) ప్రొఫెసర్ శ్రీనివాసన్ ఎవరు?
జవాబు.
ప్రొఫెసర్ శ్రీనివాసన్ కలాం చదువుకునే కళాశాల డైరెక్టరు, డిజైనింగ్ ఉపాధ్యాయుడు

(ఇ) రచయితకు ప్రొఫెసర్ ఎంత సమయం ఇచ్చారు?
జవాబు.
రచయితకు ప్రొఫెసర్ మూడు రోజుల సమయం ఇచ్చారు.

(ఈ) రచయితకు జీవన భాగ్యరేఖ ఏది?
జవాబు.
రచయితకు స్కాలర్షిప్పే అతని జీవనభాగ్యరేఖ

(ఉ) రచయిత ఏ పని కోసం ప్రొఫెసర్ శ్రీనివాసనన్ను నెలరోజుల వ్యవధి కోరాడు?
జవాబు.
రచయిత విమాన నిర్మాణం డ్రాయింగ్ పని పూర్తి చేయడం కోసం ప్రొఫెసర్ శ్రీనివాసన నన్ను నెలరోజుల వ్యవధి కోరాడు.

2. మా అన్నయ్య ముస్తఫా కమల్కి స్టేషన్లోడ్లో ఒక కిరాణా దుకాణముండేది. హైస్కూల్లో చదువుకునేటప్పుడు నేను రామేశ్వరం వెళ్ళినప్పుడల్లా నన్ను సాయం చెయ్యమంటూ పిలిచి, షాపులో కూచోబెట్టి ఇంక గంటలతరబడి అతను అదృశ్యమైపోయేవాడు. నేను అక్కడ ఆ షాపుని కనిపెట్టుకు కూచొని బియ్యం, నూనె, ఉల్లిపాయలు ఒకటేమిటి అన్నీ అమ్ముతూండేవాణ్ణి. వాటిలో తొందరగా చెల్లిపోయేవి సిగరెట్లూ, బీడీలూను. బీదవాళ్ళు తమ కష్టార్జితాన్ని ఎందుకట్లా పొగపీల్చేస్తుంటారని ఆశ్చర్యం కలిగేది నాకు. మా అన్నయ్య ముస్తాఫా నన్ను వదిలిపెట్టగానే మా తమ్ముడు కాశిం మహమ్మద్ నన్ను తన ఫ్యాన్సీ షాపులో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉండేవాడు. అక్కడ నత్తగుల్లలతోను, శంఖాలతోను చేసిన రకరకాల అలంకార సామగ్రి అమ్మేవారు.

(అ) రచయిత అన్నయ్యకు స్టేషన్లోడ్లో ఏమి ఉండేది?
జవాబు.
రచయిత అన్నయ్యకు స్టేషన్లోడ్లో ఒక కిరాణా దుకాణం ఉండేది.

(ఆ) ముస్తఫా కమల్ షాపులో సాయంచేసే రోజుల్లో రచయిత ఏం చేస్తుండేవాడు?
జవాబు.
ముస్తఫా కమల్షాపులో సాయం చేసే రోజుల్లో రచయిత హైస్కూల్లో చదువుకునేవాడు.

(ఇ) దుకాణంలో ఏవి తొందరగా అమ్ముడుపోయేవి?
జవాబు.
దుకాణంలో సిగరెట్లు, బీడీలూ తొందరగా అమ్ముడు పోయేవి.

(ఈ) ఫ్యాన్సీషాపు నడుపుతున్న రచయిత తమ్ముడి పేరేమిటి?
జవాబు.
ఫ్యాన్సీషాపు నడుపుతున్న రచయిత తమ్ముడి పేరు కాశీమహమ్మద్.

(ఉ) ఫ్యాన్సీషాపులో ఏవేవి అమ్మేవారు?
జవాబు.
ఫ్యాన్సీషాపులో నత్తగుల్లలతోనూ, శంఖాలతోనూ చేసిన రకరకాల అలంకార సామగ్రి అమ్మేవారు.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠం ఆత్మకథ ప్రక్రియకు చెందినది. ఒక వ్యక్తి తన జీవిత విశేషాల్ని తానే గ్రంథస్థం చేసుకుంటే అది ఆత్మకథ. ఆత్మకథనే స్వీయచరిత్ర అని కూడా అంటారు. ఇందులో సమకాలీన విశేషాలు ప్రతిబింబిస్తాయి. రచయిత అనుభవాలే కాక ఆ కాలంనాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు తెలుస్తాయి. ఇతరులకు ప్రేరణ కలిగిస్తుంది. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది.

కవి పరిచయం:

కవి : డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలామ్. పూర్తి పేరు అవుల్ ఫకీర్ జైనులాబీన్ అబ్దుల్ కలామ్.
కాలం : ఈయన 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటిలో పుట్టాడు.
రచనలు : “ఒక విజేత ఆత్మకథ” (ఇగ్నీటెడ్ మైండ్స్, ది వింగ్స్ ఆఫ్ ఫైర్ – యాన్ ఆటోబయోగ్రఫీ)
బిరుదులు : పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న
విశేషాంశాలు : సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన పట్టుదల, క్రమశిక్షణ, అధిక జిజ్ఞాసతో ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా తన సేవలను జాతికి అందించారు. దేశ, విదేశాలలోని విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో ఆయనను గౌరవించాయి.
గ్రంథము : ఈ పాఠ్యభాగం డా॥ అబ్దుల్ కలామ్, అరుణ్ తివారీతో కలిసి రాసిన “ఒక విజేత ఆత్మకథ”లోనిది.

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

ప్రవేశిక:

ఆయన అందరిలా అతి సామాన్య కుటుంబంలో జన్మించాడు. బాల్యంలో అనేక ఒడిదుడుకులు, కష్టాలను ఎదుర్కొన్నాడు. మొక్కవోని దీక్షతో ఆత్మవిశ్వాసంతో విద్యాభ్యాసం కొనసాగించాడు. చిన్నప్పుడే స్థిరమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నాడు. ఆ లక్ష్యం చేరాలని కలలు కన్నాడు. నిరంతర కఠోర సాధనతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. భారతదేశ కీర్తిని విశ్వవ్యాప్తంచేసి అందరి మన్ననలు అందుకున్న ఆ మహానుభావుడు చిన్నారులకు ప్రీతిపాత్రుడు. ఆయన జీవితమే నవతరానికి ప్రేరణ. ఆయన విద్యాభ్యాసం, లక్ష్యసాధన ఎట్లా జరిగిందో చూద్దాం.

పాఠ్యభాగ సారాంశం:

డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్కలాం రామనాథపురంలో హైస్కూలులో విద్యాభ్యాసం చేశాడు. అప్పుడే అతనికి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవాలనే కోరిక కలిగింది. అక్కడి ఉపాధ్యాయుడైన ఇయదురై సోలోమోన్ మార్గదర్శకత్వంలో కోరిక, నమ్మకం, ఆశపెట్టుకోవడం అనే అంశాలమీద పట్టు సాధిస్తే ఏ పనైనా చేయగలననే నమ్మకం కలిగింది.

కలాంకు చిన్నప్పటి నుండి ఆకాశంలో రహస్యాలన్నా, పక్షుల ప్రయాణమన్నా ఎంతో ఆసక్తి. కొంగలూ, సముద్రపు గువ్వలూ ఎగురుతున్నట్లే తానూ ఎగరాలని కోరుకొనేవాడు. హైస్కూలు చదువు పూర్తి చేసుకుని ట్రిచి సెంట్ జోసెఫ్ కాలేజీలో చేరి ఇంటర్మీడియెట్ చదివాడు. సెలవుల్లో ఇంటికొచ్చినప్పుడు అన్నదమ్ములకు వ్యాపారం, పనుల్లో సాయంచేసేవాడు.

డిగ్రీ చివరి సంవత్సరం చదివేటప్పుడు మంచి పుస్తకాలన్నీ చదివాడు. భౌతిక శాస్త్రం మీద అతనికి ఆసక్తి ఏర్పడింది. కాని తాను చదవవలసింది ఇంజనీరింగ్ అని అర్థం చేసుకున్నాడు. తన కలలు నిజం చేసుకోవడానికి మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరాడు. చదువుకు కావలసిన డబ్బు అతని సోదరి జొహారా తన నగలమ్మి ఏర్పాటు చేసింది. ఏరోనాటిక్ ఇంజనీరింగ్ చదివాడు.

కాలేజీలో ప్రదర్శనకోసం ఉంచిన పాత విమానాన్ని పరిశీలిస్తూ ఉండేవాడు. కోర్సు పూర్తికాగానే నలుగురు సహచరులతో కలిసి యుద్ధవిమానం మోడల్ తయారుచేసి ప్రొ. శ్రీనివాసన్ ప్రశంసలు పొందాడు. బెస్ట్ స్టూడెంట్ అనిపించుకున్నాడు. తరువాత బెంగుళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ట్రైనీగా చేరాడు. ఇంజన్ ఓవర్ హాలింగ్లో పనిచేశాడు.

వాయుపదార్థాల డైనమిక్స్ క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. వైమానికదళంలోను, రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేసే సాంకేతిక అభివృద్ధి ఉత్పాదక డైరెక్టరేట్ లోనూ కూడా ఉద్యోగాలకు పిలుపు వచ్చింది. అలా తమిళనాడు నుండి ఉత్తరదేశానికి వెళ్ళిపోయాడు.

కఠిన పదాలు – అర్ధలు

  • జిజ్ఞాసి = తెలుసుకోవాలనే కోరిక కలవాడు
  • ఇదమిత్థం = ఇది ఇలా
  • ప్రత్యామ్నాయం = బదులు
  • ఉదారం = ఉన్నతం
  • దృక్పథం = ఆలోచనావిధానం, దృష్టి మార్గం, చూపుమేర
  • మందబుద్ధి = తెలివితక్కువవాడు, అవివేకి
  • సంభవించటం = జరగటం
  • ఆకాంక్ష = కోరిక
  • ప్రగాఢంగా = దృఢంగా, అధికంగా
  • విశ్వసించటం = నమ్మటం
  • ఆసక్తి = కోరిక
  • విహరించటం = తిరగడం
  • కష్టార్జితం = కష్టం చేత సంపాదింపబడినది (కష్టపడి సంపాదించినది)
  • త్యాగనిరతి = దానం చేయడంలో మిక్కిలి ఆసక్తి
  • మక్కువ = ఇష్టం
  • సూక్ష్మబుద్ధి = చుఱుకైన తెలివి, కుశాగ్రబుద్ధి
  • తృష్ణ = కోరిక
  • సమగ్రవంతం = సంపూర్ణం
  • బలోపేతం = దృఢం (బలంతో కూడుకున్నది)
  • ప్రగతి = అభివృద్ధి
  • వ్యవధి = గడువు
  • జాపన్యం = ఆలస్యం
  • విరామం = విశ్రాంతి
  • మసలటం = కదలడం, విహరించడం
  • నిర్ఘాంతపోవటం = అచేతనమై పోవడం
  • ఉపాధి = ఉద్యోగం, కారణం

నేనివి చేయగలనా ?

  • కలాం విద్యాభ్యాసం గురించి మాట్లాడగలను. అవును/ కాదు
  • అపరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన వాక్యాల్లో తప్పొప్పులను గుర్తించగలను. అవును/ కాదు
  • కలాం ఆశయసాధన గూర్చి సొంతమాటలలో రాయగలను. అవును/ కాదు
  • నాలోని కోరికలను చిన్న కవిత రూపంలో రాయగలను. అవును/ కాదు

TS 6th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana స్నేహబంధం

Telangana SCERT 6th Class Telugu Guide Telangana 2nd Lesson స్నేహబంధం Textbook Questions and Answers.

స్నేహబంధం TS 6th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana

బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి

TS 6th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana స్నేహబంధం 1

ప్రశ్నలు

ప్రశ్న 1.
బొమ్మలో ఎవరెవరున్నారు ?
జవాబు.
ఉపాధ్యాయురాలు, విద్యార్థులు ఉన్నారు.

ప్రశ్న 2.
ఆ పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు ?
జవాబు.
ఉపాధ్యాయిని చెప్పే మాటలు వింటూ, స్నేహం విలువను తెలుసుకున్నారు. టీచరు గారు ముగ్గురు పిల్లలకు నచ్చజెప్పగా ఆ ముగ్గురు నాలుగో విద్యార్థికి తమ దగ్గరున్న డబ్బులలో వాటా ఇచ్చారు.

TS 6th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana స్నేహబంధం

ప్రశ్న 3.
పై బొమ్మ చూస్తే మీకే భావన కలిగింది ?
జవాబు.
అందరూ స్నేహంగా ఉండాలని, కష్టాల్లో పాలు పంచుకోవాలనే భావన కలిగింది.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.12)

ప్రశ్న 1.
తాబేలు కొత్తగా వచ్చిన జింకతో మాట్లాడిన మాటలు విన్నారుకదా. మీరు మీతో కలిసిన కొత్త స్నేహితులతో ఎట్లా మాట్లాడుతారో చెప్పండి.
జవాబు.
మేము మాతో కలిసిన కొత్త స్నేహితులతో మాట్లాడేటప్పుడు వారిని జాగ్రత్తగా పరిశీలిస్తాము. వారు మంచివారా ? చెడ్డవారా ? అని గమనిస్తాము. వారి పనులు, మాటలు, ఆలోచనలు మంచివి అని నిర్ణయించుకున్నాకే వారితో మాటలు కొనసాగిస్తాము.

ప్రశ్న 2.
కలిసిమెలిసి ఉండడం వలన కలిగే లాభం ఏమిటి ?
జవాబు.
కలిసిమెలిసి ఉండడం వలన చాలా లాభాలు ఉన్నాయి. ఒకరి అవసరాలకు మరొకరు సాయం చేసుకొనవచ్చు. ఆనందంలో, కష్టాల్లో తోడునీడగా నిలువవచ్చు. కలిసి ఉంటే కలదు సుఖం.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.14)

ప్రశ్న 1.
కన్నవాళ్ళకు, స్నేహితులకు దూరంగా ఉంటే కలిగే బాధ ఎట్లాంటిదో చెప్పండి.
జవాబు.
కన్న తల్లిదండ్రులకు, ఇష్టమైన స్నేహితులకు దూరంగా ఉంటే ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఏదో పోగొట్టుకున్నట్లు, బెంగగా ఉంటుంది. తన కష్టసుఖాలు, సుఖసంతోషాలు చెప్పుకొనడానికి ఎవరూ లేరని బాధతో గడుపుతాము.

ప్రశ్న 2.
రాజకుమారుడు చేసిన పని మంచిదా ? చెడ్డదా ? వివరించండి.
జవాబు.
జింక తనలో తాను తన వాళ్ళతో కలిసి ఉంటే బాగుండును అనుకొన్న మాటలు రాజకుమారుడు విన్నాడు. జింకను మళ్ళీ అడవిలో విడిచిపెట్టాడు. రాజకుమారుడు చేసిన పని మంచిదే! మూగ జంతువులు కూడా తన వాళ్ళకు దగ్గరగా ఉండాలనే ఆలోచనతో ఉంటాయని దీనినిబట్టి అర్థమైంది.

ప్రశ్న 3.
ఎలుక తాబేలును ఎందుకు కోప్పడి ఉండవచ్చు?
జవాబు.
తాబేలు వెంటనే ఎటుపడితే అటు వెళ్ళలేదు. స్నేహితులు కాకి, ఎలుక, జింకల లాగ ఆపద వస్తే తాబేలు తప్పించుకోలేదు. అందుకే ఎలుక తాబేలును కోప్పడి ఉండవచ్చు.

ప్రశ్న 4.
ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు. ఎట్లాగో చెప్పండి.
జవాబు.
అడవిలో వేటగాడికి తాబేలు చిక్కింది. చిత్రాంగుడు, హిరణ్యకం, లఘుపతనకం వెంటనే ఒక ఆలోచన చేశాయి. వేటగాడి మార్గంలో చెరువు వద్ద జింక చచ్చినదానిలా పడి ఉండగా కాకి దాని మీద వాలి కళ్ళు పొడుచుకొని తింటున్నట్లు నటించింది. వేటగాడు తాబేలును క్రింద పెట్టి జింకకోసం వెళ్ళినంతలో ఎలుక తాళ్ళను కొరగ్గానే తాబేలు మడుగులోకి, జింక అడవిలోకి, కాకి ఆకాశంలోకి, ఎలుక కన్నంలోకి పారిపోయి తమను తాము రక్షించుకున్నాయి. దీనివలన ఉపాయంతో ఎలాంటి అపాయాన్నైనా తప్పించుకోవచ్చని అర్థమైంది.

ఇవి చేయండి

1. విని అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. ఈ కథను సొంతమాటల్లో చెప్పండి.
జవాబు.
ఒక అడవిలో స్నేహంగా ఉంటున్న ఎలుక, తాబేలు, కాకి దగ్గరకు ఒక జింక వచ్చింది. భయంతో వణికిపోతోంది. ఏమైందని అడిగితే బోయవాడు తరుముకొచ్చాడని చెప్పింది. ఆ ముగ్గురూ జింకను కూడా స్నేహితునిగా చేసుకున్నారు. ఒకసారి జింక ఎంతకూ రాకపోయేసరికి కాకి ఎగురుతూ పోయి అది వలలో చిక్కుకోడం చూసింది. ఎలుకను తన రెక్కలపై ఎక్కించుకొని తెచ్చింది. ఎలుక వల తాళ్ళు కొరికి జింకను విడిపించింది. అంతలో తాబేలు కూడా వచ్చింది. నలుగురూ కలిసి నివాసానికి పోతుంటే వేటగాడు కనిపించాడు.

TS 6th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana స్నేహబంధం

తాబేలు తప్ప తక్కిన ముగ్గురూ తప్పించుకున్నారు. వేటగాడు తాబేలును వింటికి కట్టేసి తీసుకుపోతున్నాడు. మిగిలిన ముగ్గురు స్నేహితులూ వెంటనే ఉపాయం ఆలోచించారు. ఆ ఉపాయం ప్రకారం వేటగాడు వెళ్ళేదారిలో ఒక మడుగు దగ్గర జింక చచ్చినట్లు పడి ఉంది. దాన్ని పట్టుకుందామని వేటగాడు విల్లుకింద పెట్టి పోగానే ఎలుక వింటితాడు కొరికి తాబేలును విడిపించింది. తాబేలు మడుగులోకి, ఎలుక కన్నంలోకి పారిపోయాయి. కాకి ఎగిరిపోయింది. వేటగాడు రాకముందే జింక దూకుతూ పారిపోయింది.

2. మీరు మీ స్నేహితులకు ఎప్పుడైనా సాయపడ్డారా ? ఏ విధంగా సాయం చేశారు ?
జవాబు.
ఒకసారి నా స్నేహితుడి తల్లికి జబ్బు చేసింది. అప్పుడు ఇంట్లో అతని దగ్గర ఎవరూ తోడులేరు. అమ్మను ఆసుపత్రికి ఎలా తీసుకెళ్ళాలో తెలియక భయంతో ఏడుస్తూ కూర్చున్నాడు. బడికి వెళుతూ కలిసిపోదామని నేను వాళ్ళింటికి వచ్చాను. వెంటనే ఒక ఆటో పిలిచి నేను నా స్నేహితుడికి సాయంపట్టి వాళ్ళమ్మను ఆసుపత్రికి చేర్చాను. అతడెంత ఆనందించాడో! నాకు కూడా అలా సాయం చేసినందుకు ఎంతో తృప్తి కలిగింది.

II. ధారాళంగా చదవడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం

1. కింది పదాలు చదవండి. అవి పాఠంలో ఎక్కడున్నాయో వెతికి వాటికింద గీత గీయండి.

అ. మడుగు
ఆ. రొప్పుతూనె
ఇ. ఉరుక్కుంటూ
ఈ. గబగబ
ఉ. కానుక
ఊ. గబుక్కున
ఋ. కంచె
ౠ. అంతఃపురం
ఎ. కుండపోత
ఏ. ఊపిరిపీల్చుకుంది
ఐ. వడివడిగా
ఒ. నివ్వెరపోయారు
జవాబు.

1.  ఒక అడవిలో ఒక కాకి, ఎలుక, తాబేలు స్నేహంగా ఉండేవి. కాకి పేరు లఘుపతనకం, ఎలుక పేరు హిరణ్యకం, తాబేలు పేరు మంథరకం. ఇవి ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవి. ఒకరోజు ఒక జింక భయంతో పరుగెత్తుతూ ఈ స్నేహితుల దగ్గరికి వచ్చింది. ఆ జింక ఎవరో, ఎందుకు పరుగెత్తుకుంటూ వచ్చిందో ఈ స్నేహితులకు అర్థం కాలేదు. ఎందుకైనా మంచిదని తాబేలు నీటి మడుగులోకి జారుకుంది. ఎలుక కలుగులోకి దూరింది. కాకి చెట్టుమీది కెగిరింది. ఒక కొమ్మమీద వాలి చుట్టూరా చూసింది. భయపడవలసిన పరిస్థితి ఏదీ లేదని నిశ్చయించుకొని, స్నేహితులను బయటకు రమ్మని పిలిచింది కాకి. మడుగులోనుంచి వచ్చిన తాబేలుజింక దగ్గరకు పాకుతూ వెళ్ళింది. ఎలుక కలుగులో నుండి బయటికి వచ్చింది. కాకి నేలపైకి వచ్చి వాలింది. “నువ్వువరివి ? ఎందుకు పరుగెత్తుకుంటూ వచ్చావు ? ఎందుకు భయపడుతున్నావు ?” అని తాబేలు జింకను అడిగింది. జింక ఇంకా రొప్పుతూనే ఉన్నది.

జింక మెల్లగా గొంతు సవరించుకొని “నేను చిత్రాంగుణ్ణి,” అన్నది. “ఒక వేటగాడు నన్ను తరుముకుంటూ రాగా, నేను భయపడి ఇటువైపు వచ్చాను. దారి తప్పాను. మీరిక్కడ దేవుడిలా కనిపించారు. మీరే నన్ను కాపాడాలి. మీతో కలిసి ఇక్కడే ఉంటాను. మీ స్నేహం నాకు కావాలి. కాదనకండి” అని వేడుకొన్నది. అప్పుడు తాబేలు, “చిత్రాంగా! భయపడకు, ఇప్పటి వరకు మేము ముగ్గురం స్నేహితులం. ఇప్పుడు నువ్వు కూడా కలిశావు. నువ్వు కూడా మాతోనే ఉండు. ఒకరికొకరం సహాయపడుతూ కలిసిమెలిసి ఉందాం. ఈ పక్కన్ను పొదే నీ ఇల్లనుకో! నీకు కావలసినంత పచ్చిక ఈ చుట్టుపక్కల ఉన్నది. తియ్యటి మడుగు నీళ్లు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ నీకు ఏలోటూ ఉండదు. అందరం హాయిగా ఉందాం,” అన్నది.
ఎలుక, కాకి, “ఔనౌను,” అని అన్నాయి. చిత్రాంగుడు ఎంతో సంతోషించాడు. అప్పటి నుండి అవన్నీ స్నేహంగా ఉన్నాయి.

2.  ఒకనాడు పొద్దు వాలుతున్న వేళకు, తాబేలు, కాకి, ఎలుక ఒక చోటికి చేరాయి. కాని, మేతకు వెళ్లిన జింక ఇంకా రాలేదు. ఎందుకు రాలేదో తెలియక మిత్రుడి కోసం కలతపడుతున్నాయి. ఏం చేయాలో తెలియలేదు. త్వరత్వరగా చీకటి ముసురుతూ ఉన్నది. తాబేలు గబగబాపాకి వెళ్ళలేదు. చిత్రాంగుణ్ణి ఎటుపోయి వెదకాలో ఎలుకకు తెలియడం లేదు. కాకి మనసులో తళుక్కున ఒక ఉపాయం మెరిసింది. అప్పుడది రెక్కలు విప్పింది. చటుక్కున లేచింది. గబుక్కున పైకి చూసింది. రివ్వున ఎగిరింది. ఎగురుతూ, కళు ఎ) విప్పార్చి ఇటూ, అటూ చూస్తూనే ఉన్నది. ఒక చోట దాని చూపు నిలిచింది. హఠాత్తుగా కిందికి దిగింది. వలలో చిక్కుకున్న జింకను చూసింది. బయటకు రాలేక అల్లాడిపోతున్న నేస్తాన్ని చూసి దుఃఖించింది. చిత్రాంగుడి దగ్గరకు వెళ్ళింది.

“ఎంత ప్రమాదం జరిగింది చిత్రాంగా! నీలాంటి మంచివాడికి రావలసిన అపాయం కాదిది. కానీ, ముందుగా నువ్వు ఈ ఆపద నుంచి బయటపడాలి” అన్నది. వెంటనే జింక, “ఎలుక ఇక్కడికి వచ్చి ఈ వలను కొరికేస్తే నేను బయటపడతాను,” అన్నది. “ఔను! వేటగాడు రాకముందే ఎలుకను తీసుకురావాలి. నువ్వు బయటపడాలి. నేనిప్పుడే పోయి ఎలుక నేస్తాన్ని తీసుకొస్తాను” అని వెంటనే ఎగిరిపోయింది. చిత్రాంగుడు ఎక్కువ సేపు ఎదురుచూసే అవసరం లేకుండానే లఘుపతనకం తిరిగి వచ్చి వలదగ్గర వాలింది. దాని వీపుమీది నుండి హిరణ్యకం గబుక్కున కిందికి ఉరికి వలతాళ్ళు కొరికింది. ఒక వైపు తాళ్ళు కొరకగానే జింక బయటికి వచ్చింది.

TS 6th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana స్నేహబంధం

సంతోషంగా స్నేహితులు ముగ్గురూ తిరుగు ప్రయాణం సాగించారు” ఇంత పెద్ద ఆపదలో నువ్వెందుకు చిక్కుకున్నావు? కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా!” అని అన్నది ఎలుక. ఆ మాటకు జింక, “ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కప్పుడు అపాయం తప్పదు మిత్రమా! నా జీవితంలో ఇంతవరకు ఎన్నో అపాయాలు వచ్చాయి. నాకు ఆరునెలలు వయస్సున్నప్పుడు ఒక వేటగాడి ఉచ్చులో చిక్కుకున్నాను. వాడు నన్ను ఆ దేశు రాజకుమారునికి కానుకగా ఇచ్చాడు. రాజుగారి కోటలో నన్నందరూ ముద్దుచేసేవారు. నాకెంతో స్వేచ్ఛనిచ్చారు. నేను నా ఇష్టం వచ్చినచోటికి తిరిగేదాన్ని, నలుగురు కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు పక్కన కూర్చొని వినేదాన్ని. నేను కూడా వాళ్ళలాగే ‘ మాట్లాడడానికి ప్రయత్నం చేసేదాన్ని.

“ఒకనాడు నేను రాజభవనంలో నుంచి బయటకు వచ్చి వీథిలో తిరుగుతూ ఉంటే, కొంతమంది పిల్లలు నా వెంటపడి నన్ను ముందుకు తరిమారు. నేనెంతో భయపడ్డాను. ఒక పూలతోట కంచెమీది నుంచి లోపలికి దూకాను. ఆ తోటలో ఆ సమయంలో అంతఃపుర స్త్రీలు విహరిస్తున్నారు. వాళ్లు నన్ను పట్టుకొని రాజకుమారుని పడకటింటికి దగ్గరగా స్తంభానికి కట్టేశారు. ఆనాటి రాత్రి కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపులతో చెవులు బద్దలయ్యేటంత ఉరుములతో కుండపోత వాన కురిసింది. నా మీద కూడా వాన చినుకులు పడ్డాయి. చల్లని గాలి వీస్తూ ఉన్నది. అప్పుడు నా చిన్నప్పుడు పరుగులు తీసిన అడవి గుర్తుకు వచ్చింది. నన్ను కన్నవాళ్ళు, నా స్నేహితులు గుర్తుకు వచ్చారు. ఇలాంటప్పుడు నేను వాళ్ళతో కలసి ఉంటే ఎంత బాగుండునో అనుకున్నాను.

ఆ మాట నేను నేర్చిన మానవ భాషలో అన్నాను. నన్ను పెంచుకున్న రాజకుమారుడు నా మాటలు విన్నాడు. ఆశ్చర్యపోయాడు. ఈ వింతను కొలువు కూటంలో చెప్పాడు. పెద్దల సూచన ప్రకారంగా నన్ను అడవిలో విడిచిపెట్టమని తన సేవకులకు చెప్పాడు. ఈ విధంగా మళ్ళీ నేను పుట్టిన అడవికి వచ్చాను. స్వేచ్ఛగా బతికాను. ఒక వేటగాడు తరుముతుండగా బెదిరి మీ దగ్గరికి వచ్చాను. తరువాత సంగతి అంతా మీకు తెలిసింది”.

3. చిత్రాంగుడు, హిరణ్యకం, లఘుపతనకం మాట్లాడుకుంటూ మెల్లగా తిరిగివస్తూ ఉండగా మంథరకం ఎదురుపడింది. స్నేహితులను చూసి ఊపిరి పీల్చుకుంది. కానీ ఎలుక మాత్రం తాబేలును కోప్పడింది. “ఏం కొంప మునిగిపోయిందని వచ్చావు. నువ్వు ? మేం వస్తూనే ఉన్నాం గదా?” అన్నది. వీళ్ళ సంభాషణ ఇట్లా సాగుతుండగానే వేటగాడు అటువైపు రావడం కాకి చూసింది. వేటగాడు వస్తున్నాడు, వడివడిగా నడువండని స్నేహితులను కాకి తొందరపెట్టింది. ఇంతలో వేటగాడు రానే వచ్చాడు. ఎలుక కలుగులోకి దూరింది. జింక దాక్కున్నది. తాబేలు మాత్రం భయంతో నిలిచిపోయింది. వేటగాడు దగ్గరకు వచ్చాడు. దాని పట్టుకొని వింటికి కట్టుకున్నాడు. ఉ న్నట్టుండి ఇంకో ఉపద్రవం వచ్చినందుకు స్నేహితులంతా నివ్వెరపోయారు.

మిగిలిన ముగ్గురు స్నేహితులు వెంటనే చురుగ్గా ఆలోచించారు. ఎలుక ఒక ఉపాయం చెప్పింది. ఆ ఉపాయం ప్రకారం కొంతదూరంలో, వేటగాడు వెళ్ళే దారిలో ఒక చెరువు దగ్గర జింక చచ్చినదానిలా పడి ఉంటే కాకి జింకమీద వాలి దాని కళ్ళు పొడుచుకొని తింటున్నట్టు నటిస్తూ ఉన్నది. వేటగాడది చూసి ఎదురుగా జింక దొరికినందుకు మురిశాడు. జింకను భుజానికెత్తుకుందామని తాబేలును కింద పెట్టి జింకవైపు నడిచాడు. అది చూసి ఎలుక తాళ్ళను కొరికింది. తాబేలు మడుగులోకి జారింది. ఎలుక కలుగులో దూరింది. కాకి కావ్ మంటూ ఎగిరింది. జింక చెంగున ఉరికింది.

2. కింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

హెలెన్ హృదయం కరుణరసభరితమయినది. దీనులను, దుఃఖితులను తలచుకొంటేనే ఆమె మనసు కరిగిపోయేది. ప్రకృతిలోని ప్రతి అణువూ ఆమెను పరవశింపజేసేది. మామూలు మనుషులకు కళ్ళు రెండే కాని ఆమె శరీరమంతటా స్పర్శరూప నేత్రాలున్నాయి. ప్రతి స్పర్శకూ ఆమె మనసారా అనుభూతిపొంది, తన భావాల్ని అనర్గళంగా ప్రకటించేది. తనలాంటివాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపేందుకే జీవితాన్ని అంకితం చేసిన ఉన్నత వ్యక్తిత్వం హెలెన్ కెల్లర్. ప్రపంచమంతా తిరిగి ‘ప్రత్యేకావసరాలున్న’ పిల్లలను కలిసి, వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండు, అమెరికా, ఆఫ్రికా దేశాలు పర్యటిస్తూ భారతదేశానికి కూడా వచ్చింది. ఆమె జీవితం, సాహిత్యం అందరికీ ఆదర్శప్రాయమైనాయి.

ప్రశ్నలు:

అ. హెలెన్ ఎటువంటిది ?
జవాబు.
హెలెన్ కరుణరసభరితమైన హృదయం కలది.

ఆ. హెలెన్ ను పరవశింపజేసేది ఏది ?
జవాబు.
ప్రకృతిలోని ప్రతి అణువూ ఆమెను పరవశింపజేసేది.

ఇ. ఎవరి జీవితాల్లో ఆమె ఆత్మవిశ్వాసాన్ని నింపింది ?
జవాబు.
ప్రత్యేకావసరాలున్న పిల్లలను కలిసి వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది.

ఈ. హెలెన్ ఏయే దేశాలను పర్యటించింది ?
జవాబు.
హెలెన్ ఇంగ్లండు, అమెరికా, ఆఫ్రికా దేశాలను పర్యటించింది.

III. స్వీయ రచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. ఎలుక, తాబేలు, కాకి మంచి మిత్రులని ఎలా చెప్పగలరు ? వివరించండి.
జవాబు.
ఒక అడవిలో ఎలుక, తాబేలు, కాకి స్నేహంగా జీవిస్తుండేవి. ఎవరికి ఆపద కలిగినా తక్కినవి ఆలోచన చేసి వాటిని రక్షిస్తుండేవి. పరిచయం లేని జింకను సైతం ఆపద నుండి రక్షించి మంచి మిత్రులుగా నిలిచాయి.

ఆ. ఈ కథవల్ల మీరు గ్రహించిన మంచి విషయాలు ఏవి ?
జవాబు.
మంచివారితో స్నేహం చేయాలి. స్నేహితులు ఆపదలలో ఉంటే ప్రాణానికి తెగించైనా కాపాడాలి. జంతువుల పట్ల స్నేహం, ప్రేమ, దయ కలిగి ఉండాలి. జంతువులను హింసించకూడదు, వేటాడకూడదు. ఆపద వచ్చినపుడు ధైర్యంగా ఉపాయం ఆలోచించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా మిత్రులను వదులుకోకూడదు.

TS 6th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana స్నేహబంధం

ఇ. సాధారణంగా పిల్లలు ఎలాంటి అపాయాలు / ఆపదలు ఎదుర్కొంటారు ? ఇందుకోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
జవాబు.
సాధారణంగా పిల్లలు ఆరుబయట, పాఠశాల వాతావరణంలో ఆడుకునే సందర్భాల్లో అపాయాలను ఎదుర్కొంటారు. వీధుల్లో వెళ్ళేటప్పుడు కుక్కల బారినపడే అవకాశముంటుంది. అలాగే దీపావళి వంటి పండుగ దినాల్లో చేతులు కాల్చుకునే ప్రమాదం ఉంటుంది. అందుకోసం పెద్దల సంరక్షణలో వారు ఆడుకునేలా చూడాలి. ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారికి తెలియజేయాలి.

ఈ. ఈ కథకు ఇంకే పేరు పెట్టవచ్చు? ఎందుకు ?
జవాబు.
ఈ కథకు మిత్రలాభం అని పేరు బాగుంటుంది. ఎందుకంటే ఇందులోని మిత్రులందరూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఒకరి వలన మరొకరు లాభం పొందారు. మిత్రుల వలన లాభం కనుక మిత్రలాభం అనే పేరు పెట్టవచ్చు.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ. ‘స్నేహబంధం’ కథను క్లుప్తంగా సొంతమాటల్లో రాయండి.
జవాబు.
ఒక అడవిలో స్నేహంగా ఉంటున్న ఎలుక, తాబేలు, కాకి దగ్గరకు ఒక జింక వచ్చింది. భయంతో వణికిపోతోంది. ఏమైందని అడిగితే బోయవాడు తరుముకొచ్చాడని చెప్పింది. ఆ ముగ్గురూ జింకను కూడా స్నేహితునిగా చేసుకున్నారు. ఒకసారి జింక ఎంతకూ రాకపోయేసరికి కాకి ఎగురుతూ పోయి అది వలలో చిక్కుకోడం చూసింది. ఎలుకను తన రెక్కలపై ఎక్కించుకొని తెచ్చింది. ఎలుక వల తాళ్ళు కొరికి జింకను విడిపించింది.

అంతలో తాబేలు కూడా వచ్చింది. నలుగురూ కలిసి నివాసానికి పోతుంటే వేటగాడు కనిపించాడు. తాబేలు తప్ప తక్కిన ముగ్గురూ తప్పించుకున్నారు. వేటగాడు తాబేలును వింటికి కట్టేసి తీసుకుపోతున్నాడు. మిగిలిన ముగ్గురు స్నేహితులూ వెంటనే ఉపాయం ఆలోచించారు. ఆ ఉపాయం ప్రకారం వేటగాడు వెళ్ళే దారిలో ఒక మడుగు దగ్గర జింక చచ్చినట్లు పడిఉంది. దాన్ని పట్టుకుందామని వేటగాడు విల్లుకింద పెట్టి పోగానే ఎలుక వింటితాడు కొరికి తాబేలును విడిపించింది. తాబేలు మడుగులోకి, ఎలుక కన్నంలోకి పారిపోయాయి. కాకి ఎగిరిపోయింది. వేటగాడు రాకముందే జింక దూకుతూ పారిపోయింది.

IV. సృజనాత్మకత/ప్రశంస

1. జంతువులను, పక్షులను పాత్రలుగా ఉపయోగించి సొంతంగా ఒక కథ రాయండి.
జవాబు.
పూర్వం ఒక అడవిలో ఒక చెరువు గట్టుమీద పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు కొమ్మలలో ఒక దానిమీద హంస, మరొక దానిమీద కాకి ఉండేవి. ఒకరోజు ఒక బాటసారి ఆ దారినపోతూ తన అలసట తీర్చుకోవడానికి వచ్చి ఆ చెట్టుక్రింద నిద్రపోయాడు. కొద్దిసేపటికి సూర్యుని ఎండ ఆ బాటసారిపై పడింది. అది చూసి హంస బాటసారిపై జాలిపడి, సూర్యునికి ఎదురుగా రెక్కలు పరచి బాటసారిమీద ఎండపడకుండా చేసింది. ఇంతలో కాకి వచ్చి ఆ బాటసారి ముఖంపైన రెట్టవేసి పోయింది. బాటసారి ఉలిక్కిపడి లేచి, ఎవరు రెట్టవేసిరా అని కోపంతో చుట్టుప్రక్కల చూశాడు. హంస కనబడింది. ఆ హంసే తనపై రెట్ట వేసిందనుకొని ఆ హంసను చంపాడు.
నీతి: చెడ్డవారితో స్నేహం చేటు తెస్తుంది. .

(లేదా)

2. కథలో జింక మానవ భాషలో మాట్లాడింది కదా! ఇలాగే అడవిలోని జంతువులు మనలాగే మాట్లాడితే మన గురించి అవి ఏం మాట్లాడుకుంటాయో ఊహించి రాయండి.
జవాబు.
జింక : ఇది వరకు పచ్చని గడ్డిమేస్తూ తియ్యటి నీళ్ళు తాగుతూ చెట్ల నీడలలో ఆడుకుంటూ ఉండేవాళ్లం. ఇప్పుడు ఎక్కడా కాస్త నీడ కూడా కనబడటం లేదు.
పావురం : నీకు నీడా లేదు. మాకు గూడూ లేదు.
కోతి : చెట్లన్నీ మనిషి నరికి పారేస్తుంటే నీడా గూడూ ఎక్కడి నుంచి వస్తాయి ? ఎంచక్కా కొమ్మలు పట్టుకు దూకేవాళ్ళం. చెట్టే లేకపోతే కొమ్మలెక్కడ ?
కాకి : మాకేమో మెతుకు విసిరెయ్యటం చేతకాదు గాని మన సుఖాలన్నీ లాక్కోడానికి ఈ మనిషికెట్లా మనసొప్పుతుందో!
నక్క : ఏదో ఉపాయం పన్ని ఈ మనిషి ఆగడాలు ఆపాలి.

V. పదజాల వినియోగం

1. కింద గీత గీసిన పదాలకు సమానమయిన అర్థాలతో ఉన్న పదాలను పాఠం ఆధారంగా రాయండి.

అ కృష్ణకుచేలుర చెలిమి గొప్పది.
జవాబు.
స్నేహం

ఆ. తామరలు కొలనులో పూస్తాయి.
జవాబు.
మడుగు

ఇ. ఎలుక కన్నంలో నివసిస్తుంది.
జవాబు.
కలుగు

TS 6th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana స్నేహబంధం

ఈ. మహావిష్ణువు ఎత్తిన అవతారాలలో కూర్మ అవతారం ఒకటి.
జవాబు.
తాబేలు

ఉ. నిప్పుతో చెలగాటం అపాయకరం.
జవాబు.
ప్రమాదం

2. కింది పట్టికలోని ప్రకృతి – వికృతి పదాలను జతపరుచండి. అలా జతపరిచిన ప్రకృతి, వికృతులను పట్టిక రూపంలో రాయండి.

అ. అటవి 1. ఆకాశం
ఆ. స్నేహం 2. సాయం
ఇ. సహాయం 3. రాత్రి
ఈ. రాతిరి 4. నెయ్యం
ఉ. ఆకసం 5. అడవి

జవాబు.

ప్రకృతివికృతి
అటవిఅడవి
స్నేహంనెయ్యం
సహాయంసాయం
రాత్రిరాతిరి
ఆకాశంఆకసం

 

3. కింది వాక్యాలను చదువండి. ప్రతి వాక్యంలోను ఒక పదానికి అదే అర్థంవచ్చే మరొక పదం ఉన్నది. ఆ పదాలకింద గీత గీయండి.

అ. ఎలుక కన్నం నుంచి బయటకు వచ్చి, రంధ్రం వైపు తొంగిచూసి, బిలంలో దూరింది.
జవాబు.
కన్నం, బిలం

ఆ. కొలనులో కమలం వికసించింది. తాబేలు సరస్సు నుంచి పైకి వచ్చింది.
జవాబు.
కొలను, సరస్సు.

ఇ. కాకి చెట్టుపై నుంచి చుట్టూ చూసింది. భయమేమీ లేదని వాయసం మిత్రులకు చెప్పింది.
జవాబు.
కాకి, వాయసం

ఈ. కాకి, తాబేలు, ఎలుకల సఖ్యం గొప్పది. ఇప్పుడు వాటికి జింకతో నెయ్యం కుదిరింది.
జవాబు.
సఖ్యం, నెయ్యం.

4. కింది పదాలు చదువండి. వీటిని ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

అ. గబుక్కున : ____________
జవాబు.
కుక్కను చూసి పిల్లి గబుక్కున పారిపోయింది.

ఆ. తళుక్కున : ____________
జవాబు.
“ఆకాశంలో మెరుపు తళుక్కున మెరిసింది.

ఇ. చటుక్కున : ____________
జవాబు.
పిల్లిని చూసి ఎలుక చటుక్కున పారిపోయింది.

TS 6th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana స్నేహబంధం

ఈ. మిరుమిట్లు గొలిపే : ____________
జవాబు.
మిరుమిట్లు గొలిపే మెరుపులతో పెద్ద గాలివాన వచ్చింది.

ఉ. మురిసిపోవడం : ____________
జవాబు.
చిన్న పిల్లలు చిన్న చిన్న బహుమతులకే మురిసిపోవడం జరుగుతుంది.

ఊ. వడివడిగా : ____________
జవాబు.
కొందరు నెమ్మదిగాను, మరికొందరు వడివడిగాను నడుస్తారు.

ఋ. నివ్వెరపోయి : ____________
జవాబు.
బాగా చదివే నా మిత్రుడు పరీక్షలో తప్పినందుకు నివ్వెరపోయాను.

VI. భాషను గురించి తెలుసుకుందాం.

తెలుగుభాషలోని వర్ణాలను మూడు విధాలుగా విభజించారు.
అవి : 1. అచ్చులు 2. హల్లులు 3. ఉభయాక్షరాలు

అచ్చులు:
అ – ఆ – ఇ – ఈ – ఉ – ఊ – ఋ – ౠ – ఎ – ఏ – ఐ – ఒ – ఓ – ఔ
ఈ అచ్చులు హ్రస్వాలు, దీర్ఘాలు అని రెండు విధాలు.

అ) హ్రస్వాలు : ఒక మాత్రకాలంలో ఉచ్చరించే అచ్చులను ‘హ్రస్వాలు’ అంటారు.
అవి : అ – ఇ – ఉ – ఋ – ఎ – ఒ (మాత్ర అంటే కనురెప్ప పాటు కాలం)

ఆ) దీర్ఘాలు : రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే అచ్చులను ‘దీర్ఘాలు’ అంటారు.
అవి : ఆ – ఈ – ఊ – ౠ – ఏ – ఐ – ఓ

హల్లులు :
క ఖ గ ఘ ఙ
చ చ ఛ జ జ ఝ ఞ
ట ఠ డ ఢ ణ
త థ ద ధ న
ప ఫ బ భ మ
య ర ల
శ ష స హ ళ ఱ

ఉచ్చారణ విధానాన్ని బట్టి హల్లులను ఈ కింది విభాగాలు చేశారు.
అ) క, చ, ట, త, ప – పరుషాలు } వీటిని అల్పప్రాణాలు అని కూడా అంటారు.
ఆ) గ, జ, డ, ద, బ – సరళాలు }

ఇ) ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ లు మహాప్రాణాలు, వర్గయుక్కులు అని అంటారు.
ఈ) ఙ, ఞ, ణ, న, మ – అనునాసికాలు.
ఉ) య, ర, ల, వ – అంతస్థాలు.
ఊ) శ, ష, స, హ – ఊష్మాలు.

సూచన : “ఱ” అక్షరాన్ని ఆధునిక వ్యవహార భాషలో ఉపయోగించడం లేదు. దీనికి బదులు ఇప్పుడు ‘ర’ను వాడుతున్నారు. అట్లే చ, జే లు వాడుకలో లేవు. వీటికి బదులుగా చ, జ లను వాడుతున్నారు.

ఉభయాక్షరాలు : మూడు. అవి సున్న ‘మ్’ (పూర్ణబిందువు), అరసున్న ‘C’, విసర్గ ”. ఈ మూడింటిని అచ్చులతోను, హల్లులతోనూ ఉపయోగించడంవల్ల వీటిని ‘ఉభయాక్షరాలు’ అని వ్యవహరిస్తారు.
సూచన : అరసున్నకు గ్రాంథికభాషలో ప్రాధాన్యమున్నది. విసర్గ సంస్కృతపదాలకు మాత్రమే చేరుతుంది.

1. కింది వాక్యంలో పరుషాలను గుర్తించి, వాటి కింద గీత గీయండి.

కష్టపడి చదివితే ఫలితం తప్పక ఉంటుంది.
జవాబు.
ష్టడి దివితే ఫలితం ప్పక ఉంటుంది.
పరుషాలు : క, చ, ట, త, ప

2. కింది మాటల్లో సరళాలతో మొదలయిన మాటలను గుర్తించండి.

బలం, కలం, గాలి, జలం, దళం, తళుకు, కాలు, డబ్బు, గళం
జవాబు.
బలం, కలం, గాలి, జలం, దళం, తళుకు, కాలు, డబ్బు, గళం
బలం, గాలి, జలం, దళం, డబ్బు, గళం
సరళాలు : గ, జ, డ, ద, బ

3. కింది మాటల్లో అంతస్థాలను గుర్తించండి.

యమున, కారం, పాలు, వంకర, వేళ, కల
జవాబు.
మున, కారం, పాలు, వం, వేళ, క
అంతస్థాలు : య, ర, ల, ళ, వ

4. కింది వాక్యంలో ఊష్మాలను గుర్తించండి.

భాష మనిషికి సహజమైన శక్తి.
జవాబు.
భా మనిషికి సహజమైన క్తి.
ఊష్మాలు : శ, ష, స, హ

TS 6th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana స్నేహబంధం

ప్రాజెక్టు పని

పాఠశాల గ్రంథాలయంలోని పంచతంత్రం కథల పుస్తకం చదవండి. దాంట్లో మీకు నచ్చిన కథను రాసి, తరగతిగదిలో ప్రదర్శించండి.

1. ప్రాజెక్టు శీర్షిక : పాఠశాల గ్రంథాలయంలోని పంచతంత్రం కథల పుస్తకం లో నచ్చిన కథ రాసి ప్రదర్శించడం.

2. సమాచార సేకరణ :

  • సమాచారం సేకరించిన తేదిః
  • సమాచార వనరు : గ్రంధాలయం
  • చదివిన పుస్తకం : పంచతంత్రం

3. సేకరించిన విధానర: మా పాఠశాల గ్రంథాలయంలో పంచతంత్రం కథల పుస్తకం నుండి నాకు నచ్చిన కథను సేకరించాను

4. నివేదిక : ఒక చెరువులో ఒక తాబేలు ఉంది. అది రోజూ ఒడ్డుకు వచ్చి అటూ ఇటూ తిరిగి మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళిపోయేది. ఎక్కడి నుంచో రెండు హంసలు అక్కడికి వచ్చి చేరాయి. తాబేలుతో వాటికి మంచి స్నేహంకుదిరింది. రోజూ ఆ రెండు హంసలు వచ్చి తాబేలుతో కబుర్లు చెబుతూ ఉండేవి. అలా ఆ మూడు బాగా స్నేహంగా ఉండేవి. ఒకసారి వానలు లేక చెరువు ఎండిపోసాగింది. తాబేలుకు ఏం చెయ్యాలో తెలియక దిగులుగా కూర్చుంది.

హంసలు తాబేలును వేరొక చెరువులోకి చేరుస్తామన్నాయి. ఒక పెద్దకర్ర తెచ్చి హంసలు వాటి ముక్కుతో పట్టుకున్నాయి. తాబేలును గట్టిగా కరిచి పట్టుకోమన్నాయి. తాబేలు అలాగే చేసింది. హంసలు ఎగురుతూ ఒక ఊరిలో నుండి పోతూ ఉంటే ఊళ్ళోని వారు తాబేలును చూసి నవ్వసాగారు. అది చూసి తాబేలు “ఎందుకీ మూర్ఖులు ఇలా నవ్వుతారు?” అంటూ నోరు తెరిచింది. అంతే కర్ర నుంచి జారి నేలమీద పడిపోయింది. అంత ఎత్తు నుంచి పడడం వల్ల చనిపోయింది.

నీతి :

  •  చేసే పనిమీద ధ్యాస ఉండాలి.
  • కోపం వల్ల ప్రమాదం కలుగుతుంది.

5. ముగింపు : పంచతంత్రం కథల్లో చిన్న చిన్న జంతువులు, పక్షులు పాత్రలుగా ఉండి అనేక నీతులను మనకు బోధిస్తాయి.

TS 6th Class Telugu 2nd Lesson Important Questions స్నేహబంధం

ప్రశ్న 1.
ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కసారి అపాయంలో పడతామని జింక ఎందుకు అన్నది ?
జవాబు.
ఎంత జాగ్రత్తగా ఉన్నా అపాయాలు ఎదురౌతాయి. చిన్నప్పటి నుంచి జింకకు అలా అపాయాలు కలుగుతూనే ఉన్నాయి. ఆర్నెల్ల వయసులో వేటగాడి ఉచ్చులో చిక్కుకొని రాజభవనానికి చేరింది. వీధుల్లో తిరుగుతూ పిల్లలు తరిమితే ఉద్యానవనంలోకి దూకి కట్టివేయబడింది. రాజకుమారుడు విడిచి పెట్టగా అడవిలోకి చేరుకుని తన వారితో కలిసుందామనుకుంటే వేటగాడు తరిమాడు. ఎలాగో తప్పించుకొని కాకి, ఎలుక, తాబేలుతో స్నేహం సంపాదిస్తే మళ్ళీ వేటగాడి వలలో చిక్కుకుంది.

TS 6th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana స్నేహబంధం

ప్రశ్న 2.
స్నేహానికున్న గొప్పతనాన్ని వివరించే సంఘటనలు మీ పాఠంలో ఏమేమి ఉన్నాయి ?
జవాబు.

  • జింక భయంతో వచ్చినపుడు స్నేహితులు ముగ్గురూ ఒక మాటపై నిలబడి జింకను తమ మిత్రునిగా చేసుకున్నాయి. ఆపదలో ఉన్న జింక రక్షింపబడటం స్నేహానికున్న గొప్పతనాన్ని తెలుపుతోంది.
  • జింకను వేటగాడి నుండి రక్షించటానికి కాకి, ఎలుక కలిసి ప్రయత్నించటం స్నేహం గొప్పదని తెలుపుతోంది.
  • తాబేలు వేటగాడికి చిక్కగానే తక్కిన ముగ్గురూ ఉపాయం ఆలోచించి విడిపించడం కూడా స్నేహం యొక్క గొప్పతనమే.

ప్రశ్న 3.
“తిరిగి అడవికి వచ్చాను. స్వేచ్ఛగా బతికాను” అని జింక అన్నది కదా! దీనివల్ల మీరేం తెలుసుకున్నారు ?
జవాబు.
జంతువులు గాని, పక్షులుగాని తమ జాతి వారితో కలిసి ఉంటేనే ఆనందంగా ఉంటాయి. మనుషులు తమ స్వార్థం కోసం, సంతోషం కోసం వాటిని ఇళ్ళలో బంధించి ఉంచటం తప్పు. వాటిని ఎంత ప్రేమగా చూసినా కూడా అవి స్వేచ్ఛను కోరుకుంటాయని తెలుసుకున్నాను.

ప్రశ్న 4.
చిత్రాంగుడి వృత్తాంతాన్ని పది వాక్యాల్లో రాయండి.
జవాబు.
చిత్రాంగుడు ఒక జింక. దాని ఆర్నెల్ల వయసులో ఒక వేటగాడి ఉచ్చులో చిక్కుకుంది. వాడు దానిని ఒక రాకుమారుడికి uగా ఇచ్చాడు. రాకుమారుడు దాన్ని తన ఇంట్లో స్వేచ్ఛగా తిరగనిస్తూ ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఒకనాడు జింక వీథుల్లో తిరుగుతుంటే పిల్లలు వెంటపడ్డారు. భయంతో పక్కనున్న గోడ దూకగానే అంతఃపుర స్త్రీలు పట్టుకొని రాకుమారుడి పడక గది బయట కట్టేశారు.

అంతలో ఉరుములు మెరుపులతో పెద్దవాన రాగానే దానికి తనవారు, తానుండే అడవి గుర్తుకొచ్చాయి. మళ్ళీ అడవిలోకెళితే ఎంత బాగుంటుందో అని మానవ భాషలో అనుకొన్నది. వెంటనే అది విన్న రాకుమారుడు దానిని అడవికి పంపివేశాడు. కొన్నాళ్ళకు ఒక వేటగాడు తరుముతుంటే పారిపోయి కాకి, ఎలుక, తాబేలు ఉన్న చోటికి వచ్చింది. వారితో స్నేహం కలిసింది. ఒకనాడు అడవిలో వేటగాడి వలలో చిక్కుకుంది. ఎలుక వలను కొరికి చిత్రాంగుడిని రక్షించింది.

ప్రశ్న 5.
జింకను స్నేహితులు రక్షించిన తీరును సొంత మాటల్లో రాయండి?
(లేదా)
వలలో చిక్కుకున్న జింకను వేటగాడి నుండి మిత్రులు ఎలా రక్షించాయి ?
జవాబు.
ఒక నాడు పొద్దు వాలుతున్న వేళ స్నేహితులు ఒక చోటికి చేరాయి. కాని మేతకు వెళ్ళిన జింక రాలేదు. ఎందుకు రాలేదో తెలియలేదు. ఏం చేయాలో అర్ధం కాలేదు. కాకి మనసులో ఒక ఉపాయం మెరిసింది. అది గాలిలో ఎగురుతూ అడవిలో అటు ఇటూ చూస్తున్నది. అంతలో ఒక చోట వలలో చిక్కుకున్న జింకను చూసింది. స్నేహితున్ని చూసి దుఃఖించింది. ఎంత ప్రమాదం జరిగింది చిత్రాంగా! నీవు ఈ ఆపదనుండి బయట పడాలి అన్నది కాకి. వెంటనే జింక, ఎలుక వచ్చి వలను కొరికేస్తే నేను బయటపడతను అన్నది. కాకి వెంటనే గాలిలో ఎగిరి హిరణ్యకం (ఎలుకు) ను వీపు మీద తీసుకొచ్చింది. వెంటనే ఎలుక వల తాళ్ళను కొరికింది. జింక బయటికి వచ్చింది. ఈ విధంగా స్నేహితులు జింకను రక్షించారు

పర్యాయపదాలు

  • అడవి = వనం, అరణ్యం, కాననం
  • కాకి = వాయసము, బలిభుక్కు, కరటం
  • ఎలుక = మూషికము, ఆఖువు, ఆఖనికం
  • తాబేలు = కమఠము, కూర్మము, కచ్ఛపం
  • నేల = ధరణి, భూమి
  • వేటగాడు = మృగయుడు, వేటరి, షికారి
  • వేడుకొను = ప్రార్థించు, బ్రతిమాలు
  • గాలి = వాయువు, పవనము
  • నారి = స్త్రీ ,ఇంతి, వనిత
  • విల్లు = ధనుస్సు, శరాసనం, చాపం
  • జింక = హరిణము, లేడి
  • స్నేహితులు = మిత్రులు, నేస్తాలు
  • చెట్టు = వృక్షము, తరువు
  • కలుగు = కన్నము, బిలము, రంధ్రము
  • ప్రమాదం = అపాయం, ఉపద్రవం, ఆపద
  • స్నేహం = మైత్రి, చెలిమి, నేస్తం
  • మడుగు = కొలను, సరస్సు
  • వింత = చోద్యం, విచిత్రం
  • కళ్ళు = నయనాలు, నేత్రాలు

TS 6th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana స్నేహబంధం

ప్రకృతులు – వికృతులు

ప్రకృతి- వికృతి

  • స్తంభము – కంబము
  • ప్రయాణం – పయనం, పైనం
  • రాజు – రాయలు (ఱేడు కాదు)
  • అంతఃపురం – అంతిపురం
  • ఆశ్చర్యము – అచ్చెరువు
  • స్త్రీ – ఇంతి
  • భాష – బాస
  • భుజం – బుజం
  • బ్రధ్నడు – పొద్దు
  • దవీయము – దవ్వు
  • గ్రా సము – గ్రా సము

సంధులు

పదాలు – విడదీసిన రూపాలు:

  • ఎందుకైనా = ఎందుకు + ఐనా
  • లేదని = లేదు + అని
  • రమ్మని = రమ్ము + అని
  • నువ్వెవరివి – నువ్వు + ఎవరివి
  • మీరిక్కడ = మీరు + ఇక్కడ
  • మంచిదని = మంచిది + అని
  • మీదికెగిరింది = మీదికిన్ + ఎగిరింది
  • అవన్నీ = అవి + అన్నీ
  • పక్కనున్న = పక్క + ఉన్న
  • కావలసినంత = కావలసిన + అంత
  • ఒక్కొక్కప్పుడు = ఒక్కొక్క + అప్పుడు
  • చిన్నప్పుడు = చిన్న + అప్పుడు

I. అ) కింది ఆహ్వాన పత్రికను చదివి దిగువ ప్రశ్నలకు సమాధానములు రాయండి.

ఆహ్వానం
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చర్లపల్లి, వరంగల్ గ్రామీణ
క్రీడా దినోత్సవము.

x x ఫిబ్రవరి x x x x బుధవారం సాయంత్రం 5 గం॥ 30 ని॥ లకు మా పాఠశాల ప్రాంగణంలో నిర్వహించబడే “క్రీడాదినోత్సవ” కార్యక్రమానికి రావలసిందిగా మనవి.

అధ్యక్షులు : గౌ|| ప్రకాశరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు
ముఖ్య అతిధి : శ్రీమతి గద్దల పద్మ గారు, జడ్పి చైర్పర్సన్
ఆత్మీయ అతిధి : గౌ|| నారాయణరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి
ప్రత్యేక ఆహ్వానము కార్యక్రమం : శ్రీ వెంకటనారాయణ, వాలీబాల్ క్రీడాకారులు

కార్యక్రమం :
జ్యోతి ప్రజ్వలన
అతిధుల సందేశాలు
విద్యార్థులకు బహుమతి
సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన
వందన సమర్పణ

సూచన : దూరప్రాంతం వెళ్లవలసిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు రాత్రి భోజనం, వసతి ఏర్పాటు ఉంది. గమనించగలరు

ఇట్లు
ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు,
పాఠశాల యాజమాన్య కమిటీ,
జి.ప.ఉ.పా. చర్లపల్లి, వరంగల్

ప్రశ్నలు:

పై ఆహ్వాన పత్రికను చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. పై ఆహ్వాన పత్రిక ఏ వేడుకకు సంబంధించినది ?
జవాబు.
క్రీడాదినోత్సవ వేడుకకు సంబంధించినది

2. పై వేడుకకు ముఖ్య అతిధి ఎవరు ?
జవాబు.
శ్రీమతి గద్దల పద్మగారు (జడ్పి చైర్పర్సన్)

3. పై కార్యక్రమానికి అధ్యక్షత వహించినదెవరు ?
జవాబు.
గౌ|| ప్రకాశరావు గారు (పాఠశాల ప్రధానోపాధ్యాయులు)

4. వేడుకకు ఆహ్వానించు వారెవరు ?
జవాబు.
ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల యాజమాన్య కమిటీ.

5. వేడుక నిర్వహించు స్థలం ఏది ?
జవాబు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చర్లపల్లి, వరంగల్ గ్రామీణం

TS 6th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana స్నేహబంధం

ఆ) కింది అపరిచిత గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.

తోలుబొమ్మల ఆట వలెనే బహుళ ప్రచారము పొందినవి యక్షగానాలు అనే వీథి నాటకాలు. ఈ నాటకాలను ఆడేవారిని జక్కులు అని పిలుస్తారు. భాగవతములోని కృష్ణలీలలు మొదలైన వాటిని ఆడేవారిని భాగోతులని పిలుస్తారు. కొన్ని సంవత్సరముల క్రిందటి వరకు మన పల్లెటూళ్ళలో ఈ భాగోతుల ఆటలు విరివిగా జరుగుతూ ఉండేవి. చాలాకాలం నుండి యక్షగానాలు, తోలుబొమ్మలాటలతో పాటు భాగోతాలు మన పల్లెటూళ్ళ ప్రజలను రంజింపచేస్తున్న వినోదాలు, వేడుకలు.

ప్రశ్నలు

1. వీధినాటకాలను ఆడేవారిని ఏమని పిలుస్తారు ?
జవాబు.
వీథి నాటకాలు ఆడేవారిని జక్కులు అని పిలుస్తారు.

2. భాగోతులని ఎవరిని పిలుస్తారు ?
జవాబు.
భాగవతంలోని కృష్ణలీలలు మొదలైన వాటిని ఆడేవారిని భాగోతులు అని పిలుస్తారు.

3. తోలుబొమ్మల ఆట వలెనే బహుళ ప్రచారము పొందినవి ఏవి ?
జవాబు.
తోలుబొమ్మలాట వలెనే బహుళ ప్రచారం పొందినవి యక్షగానాలు.

4. పల్లెటూళ్ళలో విరివిగా జరిగేవి ఏవి ?
జవాబు.
పల్లెటూళ్ళలో విరివిగా జరిగేవి భాగోతుల ఆటలు.

5. యక్షగానాలకు మరొక పేరు ?
జవాబు.
యక్షగానాలకు మరొక పేరు వీథి నాటకాలు.

II. పదజాలం:

సరైన సమాధానాన్ని గుర్తించండి.

1. ‘ఒక అడవిలో ఒక కాకి, ఎలుక ఉండేవి. అదే వనంలో జింక కూడా ఉంది.’
ఈ వాక్యాల్లో ఒకే అర్థానిచ్చే పదాలు
a) ఎలుక, జింక
b) అడవి, వనం
c) వనం, ఎలుక
d) అడవి, జింక
జవాబు.
b) అడవి, వనం

2. మిత్రుని కోసం కాకి, ఎలుక కలత పడ్డాయి. నేస్తం కనిపించింది వాటికి.
ఈ వాక్యాల్లో సమానమైన అర్థాన్నిచ్చే పదాలు
a) మిత్రుడు, నేస్తం
b) ఎలుక, నేస్తం
c) మిత్రుడు, కాకి
d) కాకి, ఎలుక
జవాబు.
a) మిత్రుడు, నేస్తం

3. ఎవరికైనా ఆపద వస్తుంటుంది. అపాయాన్ని ఉపాయంతో తప్పించుకోవాలి.
ఈ వాక్యాల్లోని పర్యాయ పదాలు
a) ఆపద, ఉపాయం
b) ఆపద, అపాయం
c) ఉపాయం, తప్పించుకోవడం
d) ఎవరు, తప్పించుకొను
జవాబు.
b) ఆపద, అపాయం

4. ‘ఆకాశం’ అనే పదానికి వికృతి
a) ఆకాష
b) ఆశాకం
c) ఆకసం
d) అక్షం
జవాబు.
c) ఆకసం

TS 6th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana స్నేహబంధం

5. ‘సహాయం’ అనే పదానికి వికృతి
a) సాయం
b) సహనం
c) సమం
d) సహ్యం
జవాబు.
a) సాయం

6. ‘నెయ్యం’ అనే వికృతి పదానికి తగిన ప్రకృతి పదం
a) నెయ్యి
b) నేహ
c) నయం
d) స్నేహం
జవాబు.
d) స్నేహం

7. ‘ఆశ్చర్యం’ అనే పదానికి వికృతి
a) అచ్చెరువు
b) అచ్చరము
c) అచ్చర
d) ఆసరము
జవాబు.
a) అచ్చెరువు

8. ‘బాస’ అనే వికృతి పదానికి ప్రకృతి
a) బాస్
b) భాస
c) భాష
d) 20
జవాబు.
c) భాష

III. వ్యాకరణం :

1. ‘నీకు కావలసినంత పచ్చిక ఇక్కడ ఉంది’.
a)వ, ది, త
b) నీ, సి, ఇ, ఉ
c) న, క, ఉ, ల
d)కు, కా, త, ప, చ్చి, క, క్క
జవాబు.
d)కు, కా, త, ప, చ్చి, క, క్క

2. కింది వాటిలో సరళంతో మొదలైన పదం
ఈ వాక్యంలో ఉన్న పరుషాలు
a) బయటకు
b) రాలేని
c) చిత్రాంగుడు
d) కలవరపడ్డాడు
జవాబు.
a) బయటకు

3. కింది వానిలో అంతస్థాలు
a) శ, ష, స, హ
b) క, చ, ట, త, ప
c) య, ర, ల, వ
d) గ, జ, డ, ద, బ
జవాబు.
c) య, ర, ల, వ

4. కింది వానిలో ఊష్మాలు
a) హ, స, శ, ష
b) య, వ, ర, ల
c) ళ, క్ష, ఱ
d) ఞ, న, ఙ, ణ, మ
జవాబు.
a) హ, స, శ, ష

5. కింది వానిలో వేటిని అనునాసికాలంటారు ?
a)న, మ, హ
b) ఙ, ఞ, ణ, న, మ
c) గ, జ, ద, డ, బ
d)క, చ, ట, త, ప
జవాబు.
b) ఙ, ఞ, ణ, న, మ

అర్దాలు

  • అంతఃపురస్త్రీలు = రాణులూ వారి పరివారము
  • అపాయం = ప్రమాదం, ఆపద
  • మడుగు = కొలను
  • కలుగు = కన్నం, బొర్రె/బొరియ
  • ఉరుకు = పరుగెత్తు, దూకు
  • రొప్పు = ఆయాసపడు, కేకవేయు, అరచు
  • కలత = బాధ, ఆందోళన, కలవరం
  • వీధి = రెండు ఇళ్ళ వరుసల మధ్య నుంచి సాగేదారి
  • లఘుపతనకం = లఘుపతనకం అంటే సులువుగా వాలేది అని అర్థం. పాఠంలోని కాకి పేరు.
  • హిరణ్య = హిరణ్యకం అంటే బంగారం కోసం ఆశ అని అర్థం పాఠంలో ఎలుక పేరు
  • గబుక్కున = వెంటనే, ఉన్నట్టుండి
  • విహరించు = ఆనందంగా తిరుగు
  • కొలువుకూటం = రాజ దర్బారు
  • బెదరు = భయపడు, భయము
  • ఉపద్రవం = ఆపద, కష్టం

TS 6th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana స్నేహబంధం

పాఠం ఉద్దేశం

స్నేహమమనేది చాలా విలువైనది. మంచి మిత్రులతో స్నేహం చేయడం చాలా అవసరం. స్నేహం యొక్క గొప్పదనాన్ని తెలియజేయడం, విద్యార్థులలో స్నేహభావాన్ని పెంపొందింపజేయడం ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం ‘కథ’ అనే ప్రక్రియకు చెందినది. ఆకట్టు కొనే కథనం, సరళత, పాత్రలకు తగిన సంభాషణలతో కూడుకొని ఉన్నదే కథ. విష్ణుశర్మ ‘పంచతంత్రం’ ఆధారంగా చిన్నయసూరి తెలుగులోనికి అనువదించిన ‘మిత్రలాభం’లోని కథకు సరళ వచన రూపమే ఈ పాఠ్యభాగం.

ప్రవేశిక

“చిత్రాంగా! భయపడకు, ఇప్పటివరకు మేము ముగ్గురం స్నేహితులం. ఇప్పుడు నువ్వుకూడ కలిశావు. నువ్వు కూడా మాతోనే ఉండు. ఒకరికొకరం సహాయపడుతూ కలిసిమెలిసి ఉందాం” అంటూ మంథరకం అన్నది. ఈ మంథరకం ఎవరు ? చిత్రాంగుడు ఎవరు ? ఈ మాటలను మంథరకం ఎందుకు అనాల్సి వచ్చింది ? మొదలైన విషయాలను ఈ పాఠం చదివి తెలుసుకుందాం.

“చిత్రాంగా! భయపడకు, ఇప్పటివరకు మేము ముగ్గురం స్నేహితులం. ఇప్పుడు నువ్వుకూడ కలిశావు. నువ్వు కూడా మాతోనే ఉండు. ఒకరికొకరం సహాయపడుతూ కలిసిమెలిసి ఉందాం” అంటూ మంథరకం అన్నది. ఈ మంథరకం ఎవరు ? చిత్రాంగుడు ఎవరు ? ఈ మాటలను మంథరకం ఎందుకు అనాల్సి వచ్చింది ? మొదలైన విషయాలను ఈ పాఠం చదివి తెలుసుకుందాం.

నేనివి చేయగలనా?

  • కథను సొంతమాటలలో చెప్పగలను. అవును/ కాదు
  • పాఠం చదివి పాఠంలోని కీలకాంశాలను గుర్తించగలను. అవును/ కాదు.
  • కథను సొంతమాటలలో రాయగలను. అవును/ కాదు.
  • జంతువులు, పక్షులను పాత్రలుగా ఉపయోగించి సొంతంగా కథ రాయగలను. అవును/ కాదు.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson Telangana జానపద కళలు

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download ఉపవాచకం 5th Lesson జానపద కళలు Textbook Questions and Answers.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson జానపద కళలు

కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

1. జానపద కళలు అంటే ఏమిటి ? వాటి ప్రయోజనమేమి ?
జవాబు.
జానపదులు అంటే పల్లె ప్రజలు. పల్లెల్లో అలరారు కళలను జానపదకళలు అంటారు. ఒగ్గుకథ, బుర్రకథ, యక్షగానం, కోలాటం, భజన, పిట్టల దొర మొదలైనవి జానపదకళలు. భారత భాగవత రామాయణాలు, వీరుల కథలు లాంటివి ఈ కళల ద్వారానే ప్రచారంలోకి వచ్చాయి. చదువురాని పల్లె ప్రజలకు వినోదంతోపాటు విజ్ఞానం కూడా అందించేందుకు
ఈ జానపదకళలు ఉపయోగపడతాయి.

2. యక్షగానాలు అంటే ఏమిటి ?
జవాబు.
యక్షగానాలను కొన్ని చోట్ల బాగోతాలని, నాటకాలని కూడా అంటారు. పాటలు, పద్యాలు, దరువు, ఆదితాళం మొదలైన ప్రక్రియలతో ఇది సాగుతుంది. వీటిని రాత్రిపూట ప్రదర్శిస్తారు. నృత్య, నాటక, సంగీత గాత్రాల కలబోత యక్షగానం. ఆయా పాత్రల్లో నటులు నవరసాలు ఒలికిస్తుంటే ప్రేక్షకులు పరవశించిపోతారు. యక్షగానాలు కర్ణాటక రాష్ట్రం నుండి తెలంగాణకు వచ్చిన ఒక ప్రక్రియ.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson Telangana జానపద కళలు

3. యక్షగానాలకు వేదిక ఎలా ఏరా
జవాబు.
యక్షగానం ఆట ఆడే రోజు దగ్గరనో నాలుగు వైపుల ను రంగురంగుల చీరలుగా త్రం ఈ వేదికను ఏర్పాటు చేస్తారు. నాలుగు బజార్ల కూడలి దగ్గరనో, కచేరు ఓంజలు పాతి బొంగులతోనో కర్రలతోనో పందిరేస్తారు. ఎదురుగా తెల్లటి బట్టగాని .తారు. వీలైతే ప్రక్కలకు పరదాలు వేలాడదీస్తారు. ఒక్కోసారి గ్రామంలో నుంచి నాలుగు పెద్దబల్లలు తెచ్చివేస్తారు. లేదంటే నేల మీదనే వేదికకు రెండు వైపులా కరెంటు బల్బులు గాని, పెట్రొమాక్సు లైట్లుగాని, ఏవీ లేకుంటే దివిటీలుగాని పెడతారు. అలా వేదిక ఏర్పాటు చేస్తారు.

4. జానపద కళలు మన జీవితంలో ఎలా కలిసిపోయాయి?
జవాబు.
కొన్ని వందల సంవత్సరాల నుండి వర్థిల్లుతున్న ప్రజాకళలు పల్లె జీవనంతో సంస్కృతితో కలిసిపోయినవి ఈ జానపదకళలు.
ప్రజల సంతోషాన్ని దుఃఖాన్ని పంచుకొని ఓదార్పునిచ్చిన కళలు. తరతరానికి రూపు మార్చుకుని ప్రజల ఆలోచనా విధానానికి పదును పెట్టిన కళలు. జీవితంలో ఒక భాగంగా సాగి కదిలి కదిలించిన కళలు ఈ జానపదకళలు. వీటిని కాపాడు కోవడం మనందరి బాధ్యత.

5. గొల్ల సుద్దుల వల్ల సమాజానికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది ?
జవాబు.
గొల్లసుద్దులు కళారూపం సామాజిక చైతన్యం కలిగిస్తుంది. ఈ ప్రక్రియలో చెబితే సామాన్యులకు చక్కగా అర్థమౌతుంది. గొల్లసుద్దులు పాటల్లో సమాజంలో చెడును తొలగించే ప్రయత్నం కనబడుతుంది. వినోదాన్నే కాకుండా విజ్ఞానాన్ని కూడా అందిస్తుంది. ఇటీవలి కాలంలో ప్రజా ఉద్యమాల్లోనూ, అక్షరాస్యత, ఆరోగ్యం, పర్యావరణం, ఎయిడ్స్ నిర్మూలన, కుటుంబ నియంత్రణ, వ్యవసాయం మొదలైన ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళడానికి మంచి మార్గంగా ఉంది. ఎన్నో కళాబృందాలు తెలంగాణా సాధన కోసం చేసిన ప్రదర్శనలు విజయానికి కారణమైనాయి.

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

1. గొల్ల సుద్దులు అంటే ఏమిటి ?
జవాబు.
గొల్ల సుద్దులు అంటే గొల్లలు చెప్పే సుద్దులు. అంటే మంచి మాటలు. ఇందులో ప్రధానకథకుడు ఆటపాటలతో ప్రేక్షకులను అలరిస్తాడు. అటూ ఇటూ ఉన్న ఇద్దరు చెవికి చెయి కప్పి సాగదీసి వంతపాడుతారు. ఈ ప్రదర్శనలో వీరణాలు, కొమ్ములనుపయోగిస్తారు. ఈ ప్రదర్శనలో కథకుడు ప్రేక్షకుల మధ్య నుండి రంగస్థలం మీది కొస్తాడు. తప్పిపోయిన గొర్రెలను వెతుకుతున్నట్లు వంతలు ఆ మూలనుంచి ఒకరు ఈ మూలనుంచి ఒకరూ వస్తారు.

వీళ్ళ వేషధారణ మోకాళ్ళ వరకు మడిచి కట్టిన పెద్ద అంచు పంచె, నెత్తికి రుమాలు, చెవులకు దుద్దులు ముంజేతికి కడియాలు, వెండి బిళ్ళల మొలతాడు, భుజం మీద గొంగడి, కాళ్ళకు గజ్జెలు, చేతిలో కర్రతో గమ్మత్తుగా ఉంటారు. రకరకాల యాసభాషతో ఆద్యంతం నవ్విస్తుంటారు. కథను ఎటంటే అటు మలుపుతిప్పుతూ అందరినీ ఆకట్టుకుంటారు. సామాజిక చైతన్యం కలిగించాలంటే ఈ ప్రక్రియలో చెప్తే సామాన్యులు తేలికగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఈ ప్రదర్శనకు డప్పు, డోలక్ ఉపయోగిస్తున్నారు. సమస్యలను పరిష్కారాలను సుద్దుల రూపంలో చెబుతారు. సమాజంలోని చెడును తొలగించే ప్రయత్నం ఈ కళారూపంలో కనబడుతుంది.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson Telangana జానపద కళలు

2. పిట్టల దొర ప్రదర్శన గురించి రాయండి.
జవాబు.
పిట్టల దొర వేషం చూస్తేనే నవ్వొస్తుంది. మాటలు వింటుంటే పగలబడి నవ్వాలనిపిస్తుంది. గమ్మత్తైన వేషం, చిత్రవిచిత్రమైన మాటలు మాట్లాడుతూ పైకి డాంబికాలు చెప్తూనే తన వెనుక నున్న కష్టాన్ని గుర్తించక అందర్నీ నవ్విస్తూ ఇంటింటికీ తిరిగి యాచిస్తుంటాడు. పిట్టల దొర. ఒక పక్క పైకి మడిచిన ఖాకీప్యాంటు, చినిగిన అంగి, తెల్ల ఈకతో కూడిన ఇంగ్లీషు దొరల టోపి, మెడలో రుమాలు, సన్నటి మీసం, కాళ్ళకు బూట్లు, భుజానికి కట్టెతుపాకి, ముఖానికి తెల్లరంగు ఇదీ పిట్టల దొర వేషం. “మా తాత తట్టల్గొర.

మానాన్న బుట్టల్గొర. నేను పిట్టల్గొర. నన్నందరూ లత్కోర్ సాబంటరు. మారాజా! నాకేం తక్కువ లేదు. తీసుకు తింటే తరుక్కపోద్దని అడుక్కతింటున్న. నా పెళ్ళికి అమెరికా, సింగపూర్, చైనా, జర్మనీ, జపాన్ అన్ని దేశాల నుండి అందరచ్చిండ్రు. అందరికి తిండి సరిపోవాలని పేర్ల బియ్యం పోసిన తూంకింద మంట బెట్టిన చింతాకిస్తర్లేసి ఇద్దరికిత్తు సొప్పున మస్తుగ వడ్డిస్తే బద్దం తిన్నరు బాంచెను. మీ అందర్ని సూత్తంటే పెండ్లి కొచ్చినట్లే ఉన్నరు. కాని కట్నాల బుక్కులో ఒక్కరి పేరూ లేదు.” ఇలాంటి హాస్య సంభాషణలకు నవ్వని వారుంటారా ? ఇదీ పిట్టల దొర ప్రదర్శన.

పరిచిత గద్యభాగాలు

1. కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఈ కళలు ఇప్పటివి కావు. వందల సంవత్సరాలుగా వర్ధిలుతున్న ప్రజా కళలు పల్లె జీవనంతో, సంస్కృతితో కలిసిపోయిన కళలు. ప్రజల సంతోషాన్ని, దుఃఖాన్ని పంచుకొని ఓదార్పునిచ్చిన కళలు. తరతరానికి రూపాన్ని మార్చుకుని ప్రజల ఆలోచనా విధానానికి పదును పెట్టిన కళలు, జీవితంలో ఓ భాగంగా సాగి కదిలి కదిలించిన ఈ ప్రజాకళలు ఆదరణ లేక కనుమరుగై పోతున్నాయి. వీటిని సంరక్షించుకునే బాధ్యత మనందరిది.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
ఈ కళలు ఎప్పటివి ?
జవాబు.
వందల సంవత్సరాల నాటివి.

ప్రశ్న 2.
ఇవి ఎవరి కళలు ?
జవాబు.
పజల కళలు

ప్రశ్న 3.
ఇవి వేటికి పదును పెట్టాయి ?
జవాబు.
ప్రజల ఆలోచనలకు

ప్రశ్న 4.
జీవితంలో ఈ కళల స్థానమేమిటి ?
జవాబు.
ఇవి జీవితంలో ఒక భాగం

ప్రశ్న 5.
వీటిని మనం ఏం చేయాలి ?
జవాబు.
సంరక్షించుకోవాలి.

2. కింది పేరాను చదివి ఐదు ప్రశ్నలు రాయండి.

జానపదులు అనగా పల్లె ప్రజలు. పల్లెల్లో అలరారు కళలను జానపద కళలు అంటారు. ఒగ్గుకథ, బుర్రకథ, యక్షగానం, సిందుబాగోతాలు, చిడుతలరామాయణం, కోలాటం, భజన, తుపాకిరాముడు, పిట్టలదొర మొదలగునవి. జానపద కళలకు ఉదాహరణలు. భాగవతం, రామాయణం, భారతం, గ్రామదేవత కథలు, గొల్లసుద్దులు, తుపాకిరాముడు, వీరుల కథలు లాంటివి ఏండ్లకేండ్లుగా ఈ జానపద కళల ద్వారానే ప్రచారంలోకి వచ్చినాయి. పల్లె ప్రజలు నిరక్షరాస్యులు. అట్లాంటి కాలంలో వాళ్లకు వినోదంతో పాటు నీతిసూత్రాల ఆలోచనను కలిగించేందుకు జానపద కళలు ఉపయోగపడేవి. వీటిలో యక్షగానాలు, గొల్లసుద్దులు, తుపాకిరాముడు గురించి తెలుసుకుందాం.
జవాబు.
1. జానపదులు అంటే ఎవరు ?
2. పల్లెల్లో అలరారు కళలను ఏమంటారు ?
3. పల్లె ప్రజలు ఎటువంటివారు ?
4. జానపద కళలకు ఒక ఉదాహరణ రాయండి.
5. జానపదకళలు పల్లె ఏ్రజలకు ఏమి కలిగిస్తాయి ?

TS 8th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson Telangana జానపద కళలు

3. కింది పేరాను చదివి వాక్యాలలోని ఖాళీలు పూర్తిచేయండి.

తబల, తాళం, హార్మోనియంలను ఇందులో వాయిద్యాలుగా వాడతారు. వేషకాడు పాట పాడుతుంటే పాటకు అనుగుణంగా తబల తాళం మోగుతుంది. హార్మోనియం వీటితో జతకడుతుంది. తబల తాళం కొట్టేవాళ్లు మ్యాల్లంలో సభ్యులై ఉంటారు. వీరు కూడా వేషం వేస్తారు. వీరు స్టేజిమీదికి వెళ్లినప్పుడు ఆ బాధ్యతను మరొకరు తీసుకుంటారు.

1. తబల, ……………….., …………….. లను ఇందులో వాయిద్యాలుగా వాడతారు.
2. ……………….. పాట పాడుతుంటే తబల తాళం మోగుతుంది.
3. హార్మోనియం వీటితో ……………………
4. తబల తాళం కొట్టేవాళ్ళూ …………………. లో సభ్యులై ఉంటారు.
5. వీరు స్టేజి మీదికి వెళ్ళినప్పుడు ఆ …………………. ను మరొకరు తీసుకుంటారు.
జవాబు.
1. తబల, తాళం, హార్మోనియం లను ఇందులో వాయిద్యాలుగా వాడతారు.
2.వేషకాడు పాట పాడుతుంటే తబల తాళం మోగుతుంది.
3. హార్మోనియం వీటితో జతకడుతుంది
4. తబల తాళం కొట్టేవాళ్ళూ మ్యాల్లం లో సభ్యులై ఉంటారు.
5. వీరు స్టేజి మీదికి వెళ్ళినప్పుడు ఆ జాథ్త ను మరొకరు తీసుకుంటారు.

TS 8th Class Hindi Guide 2nd Lesson राजा बदल गया

Telangana SCERT 8th Class Hindi Study Material Telangana Pdf 2nd Lesson राजा बदल गया Textbook Questions and Answers.

TS 8th Class Hindi 2nd Lesson Questions and Answers Telangana राजा बदल गया

प्रश्न :

प्रश्न 1.
चित्र में क्या – क्या दिखायी दे रहे हैं ?
उत्तर :
चित्र में एक लडका, लडके के दाये हाथ में ग्लोब, बाये हाथ में किताब दिखायी दे रहे हैं।

प्रश्न 2.
लडका क्या कर रहा है ?
उत्तर :
लडका खुशी से ग्लोब के देशों को दिखाने के लिए दौड कर आ रहा है।

TS 8th Class Hindi Guide 2nd Lesson राजा बदल गया

प्रश्न 3.
यह लडका हमें क्या बताना चाहता है ?
उत्तर :
यह लडका हमें बताना चाहता है कि ज्ञान से दुनिया बदल सकते हैं।

सुनो – बोलो :

प्रश्न 1.
पाठ में दिये गये चित्रों के बारे में बातचीत कीजिए।
उत्तर :
पाठ में दिये गये चित्रों में पहले चित्र में जंगल का वातावरण दिखायी देता है। रास्ते में एक सोने का सिक्का पडा रहता है। एक लडका जाता रहता है। वह सोने का सिक्का देखकर लेता है। और वह एक साधु से मिलता है।
दूसरे चित्र में राजा सैनिकों के साथ आ रहे हैं। लडका राजा को सिक्षा दे रहा है।

प्रश्न 2.
इस पाठ का कोई दूसरा नाम क्या हो सकता है?
उत्तर :
इस पाठ का दूसरा नाम ‘परिवर्तन’ हो सकता है।

पढ़ो :

अ. ‘भाई ! आपके राजा इतनी बड़ी सेना लिये कहाँ जा रहे हैं?”‘ यह वाक्य जिस अनुच्छेद में है, उसे पढ़ो और बताओ कि राजेश ने यह वाक्य किस उद्देश्य से कहा ?
उत्तर :
राजेश ने इस वाक्य को इस उद्देश्य से कहा कि “ज़रूर कोई बात रही होगी, जो राजा अपनी सेना को लिये जा रहे हैं, वह् बात क्या है? उसे जान लें।”

आ. नीचे दिये गये वाक्य पढ़कर पाठ के आधार पर सही क्रम में लिखिए।
1. “लीजिए महाराज! आप इसे रख लीजिए।”
2. “में राजा हूँ, राजा! में तुझे गरीब लगता हूँ?”
3. “बेटा! मुझे क्यों देना चाहते हो?”
4. “भाई ! आपके राजा इतनी बड़ी सेना लिये कहाँ जा रहे हैं?”
5. “इसे तो किसी गरीब को दे दो ताकि वह अपना पेट भर सके।”
उत्तर :
1. “इसे तो किसी गरीब को दे दो ताकि वह अपना पेट भर सके।”
2. “भाई ! आपके राजा इतनी बड़ी सेना लिये कहाँ जा रहे हैं?”
3. “लीजिए महाराज! आप इसे रख लीजिए।”
4. “बेटा! मुझे क्यों देना चाहते हो?”
5. “में राजा हूँ, राजा! मैं तुझे गरीब लगता हूँ?”

TS 8th Class Hindi Guide 2nd Lesson राजा बदल गया

लिखो :

अ. नीचे दिये गये प्रश्नों के उत्तर लिखिए।

प्रश्न 1.
कभी – कभी लोग किसी व्यक्ति को चिढ़ाकर या ताने कसकर तंग करते हैं? क्या तुमने या तुम पर किसी ने इस तरह का व्यवहार किया है ?
उत्तर :
समाज में विभिन्न गुणों के लोग रहते हैं। हर आदमी को अपने कुछ अधिकार और कर्तव्य होते हैं। अपने जन्म सिद्ध गुणों के अनुरूप कुछ लोग सदा चिढाते या ताने कसते तंग करते हैं। यह तो बहुत बुरी बात है। अधर्म आचरणवाले, कामचोर, आलसी लोग ही सदा ऐसा करते हैं। इससे उनके मन को शंति मिलती है।

मैं तो सबका आदर करनेवाला हुँ। अपना काम स्वयं करते हुए सबसे मिलजुलकर रहनेवाला हूँ। में ने तो अब तक किसी व्यक्ति को चिढ़ाना, ताने कसकर तंग करना नहीं किया है। साथ ही ऐसे बुरे बरताव करनेवालों से दूर ही रहता हूँ। इसीलिए किसी ने भी अब तक मुझ पर ऐसा बुरा व्यवहार नहीं किया है।

प्रश्न 2.
हमारे व्यवहार से हमारे स्वभाव का पता चलता है। राजा का स्वभाव कैसा था ? अपने शब्दों में लिखिए।
उत्तर :
हम सब मानव हैं। सब विचारशील हैं। सर्व जीव व प्राणियों में श्रेष्ठ हैं मानवा हम में अच्छे और बुरे स्वभाववाले लोग ज़रूर हैं। लोग अपने-अपने स्वभावों के अनुसार व्यवहार करते रहते हैं। स्वार्थी और निष्ठुर लोगों के व्यवहार से सभी को दुःख और दर्द मिलते हैं।

अपने साथी जनों की चिंता करना हमारा धर्म और कर्तव्य है। सबकी यथा शक्ति भलाई करना ही मानवता है। अपने व्यवहार से ही हमारे स्वभाव का पता चलता है। सदा सद्व्यवहार करते हुए अच्छा आचरण करना हमारा लक्ष्य होना चाहिए।

राजा तो दयालू, ईमानदार और बुद्धिमान था। अपनी जनता की सुख, समृद्धि और हित ही चाहनेवाला था। लेकिन अज्ञानता के वशीभूत होकर दूसरे देश पर आक्रमण करने निकल पडा। राजेश की बातों से सच्चाई जानकर अपने को बदल दिया। अपनी सारी संपत्ति जनता की सेवा में खर्च करना आरंभ किया।

आ. ‘राजा बदल गया’ कहानी अपने शब्दों में लिखिए।
उत्तर :
एक लड़का था। उसका नाम था राजेश। वह बड़ा ईमानदार तथा बुद्धिमान था। वह एक बार जंगल से जा रहा था। उसे एक सोने का सिक्का मिला। वह उसका नहीं था। इसलिए वह उसे खोये हुए व्यक्ति को ही पहुँचाना चाहा।
उसे रास्ते में एक साधु महाराज मिला। राजेश ने उस सिक्के को उसे दिखाया तो उसने कहा कि वह मुझे नहीं चाहिए। उसको किसी गरीब को दे दो। ताकि वह अपना पेट भर सके।
इतने में उसे एक राजा की बड़ी सेना आती दिखायी दी। राजा भी उसमें था । तो राजेश ने यह पता जान लिया कि वह राजा शूरसिंह था और पडोसी देश पर आक्रमण करके उसे लूटने जा रहा था।

तो सीधे राजेश राजा के पास गया। उसे उस सोने के सिक्के को देने लगा। तो राजा ने उससे पूछा कि “यह मुझे क्यों दे रहे हो?” तब लडका राजेश ने उत्तर दिया कि मुझे साधु ने बताया कि किसी गरीब को दे दो। तब राजा क्रोध में आकर कहा कि क्या मैं तुझे गरीब लगता हुँ? यह सुनकर राजेश ने कहा कि महाराज यदि आप अमीर है तो लूटने, दूसरे देश पर क्यों आक्रमण करना चाहते हैं? तब राजा को उसका अहसास हुआ। राजा ने लड़के राजेश की प्रशंसा की और वह अपनी भारी सेना को वापस लेकर अपना राज्य लौट गया।
उस दिन से राजा ने अपनी संपत्ति गरीबों के सेवा में ही खर्च करना आरंभ कर दिया।

TS 8th Class Hindi Guide 2nd Lesson राजा बदल गया

शब्द अंडार :

अ. उदाहरण देखिए और समझिए । इसी तरह आगे कुछ शब्द लिखिए ।
उदाहरण : सैनिक – कम – मन – नल – लगन
TS 8th Class Hindi Guide 2nd Lesson राजा बदल गया 3
उत्तर :
TS 8th Class Hindi Guide 2nd Lesson राजा बदल गया 2

आ. नीचे दिये गये शब्द पढ़िए । नीचे दिये गये शब्दों के विलोम शब्द लिखकर वाक्यों में प्रयोग कीजिए।
TS 8th Class Hindi Guide 2nd Lesson राजा बदल गया 4
उदाहरण : पास × दूर
मक्का मसजिद, चारमीनार के पास है। बिरला मंदिर दूर है।
उत्तर :
बडा × छोटा; खजूर पेड़ बडा होता है। नीबू का पेड़ छोटा होता है।
गरीब × अमीर ; वह गरीब आदमी है। उसका भाई अमीर है।
देश × विदेश ; हम अपने ही देश में रहते हैं। कभी-कभी विदेश भी जाते हैं।

सृजनात्मक अभिव्यक्ति :

इस कहानी की किसी एक घटना को संवाद रूप में लिखिए ।
उत्तर :
जंगल में राजेश और साधु के बीच में घटी घटना :
राजेश : (अपने आप में) अरे वाह! इतने घने जंगल में चमकता हुआ सोने का सिक्का! किसका होगा? (इतने में एक साधु आ रहे थे ।)
राजेश : प्रणाम साधु महाराज!
साधु : आयुष्मान भव! बेटा! तुम कौन हो ?
राजेश : मेरा नाम राजेश है। मुझे रास्ते में यह सिक्का मिला। यह मेरा नहीं है। आप ले लीजिए।
साधु : अरे बेटा ? मैं तो साधु हूँ। मैं यह सिक्का ले कर क्या करूँगा? तुम ही रास्ते में कोई गरीब आदमी को दे दो। उनके लिए बहुत उपयोग होता है।
राजेश : ठीक है साधु महाराज। में वैसा ही करूँगा। प्रणाम !
राजा : जीते रहो बेटा।

TS 8th Class Hindi Guide 2nd Lesson राजा बदल गया

पशंसा :

अपने मित्र के व्यवहार या स्वभाव की प्रशंसा करते हुए एक घटना के बारे में बताइए। जिसमें मित्र का गुण या कौशल सामने आया हो।
उत्तर :
अच्छा मित्र मिलना दुर्लभ है। आजकल अच्छा और सहदयी मित्र पाना एक वरदान जैसा ही है। इस विषय में मैं बडा भाग्यशाली हुँ। मेरे कई मित्र हैं, उनमें सबसे सहददयी सदाचारी और परिश्रमी है गोपाल।
गोपाल एक होनहार छात्र है। कक्षा में सदा प्रथम आता है। उसकी स्मरण शक्ति तेज है। उसे लेश मात्र भी अभिमान नहीं है। पढने – लिखने में वह सदा मेरी और मेरे मित्रों की सहायता करता है। शिक्षा संबंधी विष्ों पर ही हमारी बातचीत होती रहती है। मुझे और उसे बागवानी का शौक है। अपने घरों के आसपास सदा हरियाली बनाये रखने का प्रथल हम करते हैं। हम दोनों खूब जानते हैं कि पर्यावरण ही हमारा रक्षा कवच है। अपने खाली समय में हम नये पेड – पौधों को लगाते उनका संरक्षण करते रहते हैं।

गोपाल का बडा दयालू स्वभाव था। वह सदा दूसरों का कष्ट दूर करना चाहता था। एक बार हमारी पाठशाला में एक अंधा और विकलांग लडका सहायता के लिए आया। गोपाल उसे देखकर दुःखी हुआ। उसकी हालत जानकर भरोसा देते हुए, परीक्षा शुल्क भरने लाये पूरे पैसे उसे दे दिया। इतना ही नहीं सब छात्रों को उसकी सहायता करने बाध्य किया। इससे उस विकलांग लडके को थोडा सा धन मिला। गोपाल की सहायता पर वह रो बैठा। गोपाल उसे धीरज देते हुए बिदा किया। वास्तव में गोपाल के अच्छे गुण और शालीनता से ही यह सत्कार्य संपन्न हुआ।

भाषा की बात :

अ. इस वाक्य को पढ़िए।
इतनी बडी सेना को देखकर वह सोचने लगा कि ज़रूर कोई बात रही होगी, जो राजा अपनी सेना को लिए जा रहे हैं। उसने एक सैनिक से पूछा – ‘भाई ! आपके राजा इतनी बड़ी सेना लिये कहाँ जा रहे हैं?”
ऊपर दिये अनुच्छेद में कुछ चिहन आये हैं, जैसे – (,), (।), (-), (” “), (!), (?) इन चिहनों को ‘विराम चिह्न’ (Punctuation) कहते हैं। बोलते अथवा पढ़ते समय अपनी बात को ठीक ढ़ग से कहने के लिए कुछ देर रुकना पड़ता है। रुकने की यह क्रिया व्याकरण की भाषा में “विराम” कहलाती है। कहानी, लेख, निबंध आदि लिखते समय इस प्रकार के रुकने के स्थलों की स्पष्टता के लिए जिन चिहनों का प्रयोग किया जाता है, उन्हें विराम चिहन कहते हैं। विराम चिहनों के उचित प्रयोग से ही भावों में स्पष्टता आती है।

आ. अव इनमें से जो चिहन पाठ में आये हैं, उन्हें ढूँढकर रेखांकित कीजिए।
उत्तर :
एक बार एक जंगल में राजेश नामक लड़का जा रहा था। रास्ते में उसे एक सोने का सिक्का मिला। वह सोचने लगा – ‘यह सिक्का मेरा तो है ही नहीं, इसें क्या करूँ लेकर … जाने किस बेचारे का सिक्का यहाँ गिर गया है। अब न तो इसे रख ही सकता हूँ और न फेंक सकता हूँ, आखिर सोना जो है’‘!
यही सब सोचते हुए वह आगे बढ़ा चला जा रहा था! रास्ते में माला जपते हुए एक साधु महाराज से मिले! उसने सोचा, क्यों न यह सिक्का साधु को ही दे दूँ।
राजेश ने जब वह सिक्का साधु को दिया तो सोने के सिक्के को देखकर साधु ने आश्चर्य से कहा – “बेटा ! यह सिक्का हमारे जैसे साधुओं के लिए नहीं है। इसे तो किसी गरीब को दे दो ताकि वह अपना पेट भर सके ”
साधु की बात मानकर राजेश आगे चला तो उसने देखा कि किसी राजा की सेना चली जा रही है। लिये जा रहे हैं। उसने एक सैनिक से पूछा-“भाई ! आपके राजा इतनी बड़ी सेना लिये कहाँ जा रहे हैं”
“यह हमारे राजा शूरसिंह हैं, जो पड़ोसी देश पर आक्रमण कर उसे लूटने जा रहे हैं”- उसने जवाब दिया।
राजेश राजा के पास गया! सोने का सिक्का उनकी ओर बढ़ाते हुए कहा – “लीजिए महाराज! आप इसे रख लीजिए। ”
“बेटा ! मुझे क्यों देना चाहते हो।” – राजा ने आश्चर्य के साथ पूछा।
“महाराज! एक साधु ने कहा था कि जो सबसे गरीब दिखे उसे यह सिक्का दे देना”- राजेश करुण स्वर
में बोला।
“मैं राजा हूँ, राजा ! मैं तुझे गरीब लगता हूँ?”- राजा क्रोध में बोला।
„महाराज! यदि आप अमीर होते तो दूसरे देश को लूटने के लिए इतनी बड़ी सेना लेकर क्यों जाते ?”
राजेश की बात राजा की समझ में आ गयी। उन्हें अपनी ग़लती का अहसास हुआ! राजेश की प्रशंसा करते हुए उन्होंने सेना को वापस लौटने का आदेश दिया।
उस दिन से राजा ने अपनी संपत्ति गरीबों की सेवा में खर्च करना आरंभ कर दिया।

TS 8th Class Hindi Guide 2nd Lesson राजा बदल गया

परियोजना कार्य :

अपनी मनपसंद कहानी कागज पर लिखकर दीवार पत्रिका पर चिपकाइए।
उत्तर :
एक गडरिया रहता था। वह भेडों को चराकर जीवन यापन करता था। वह हर दिन सुबह भेडों को चराने एक जंगल में जाता था।
एक दिन अपने भेडों के साथ जा रहा था। उसे रास्ते में एक अंगूठी दिखायी दी। उस पर कुछ लिखा हुआ था। उसने सोचा कि शायद यह अंगूठी राजा की होगी। इस प्रकार सोचकर वह तुरंत राजा अमृत सेन के यहाँ गया।
वह सचमुच राजा अमृत सेन का ही था। राजा जब शिकार के लिए जंगल आया तब इसे खो दिया था। इसे देखते ही राजा को बहुत संतोष लगा।
वह गडरिये की ईमानादारी से बहुत मुग्ध हो गया। उसे इनाम के रूप में पाँच गाँव दे दिया। सब ने गडरिये की ईमानदारी की प्रशंसा की।

विचार – विमर्श :

अपना दुःख, दर्द, निराशा,समस्या अपने माता – पिता, अध्यापक या दोस्त को बताने से कम हो जाता है और कई बार समस्या का समाधान भी मिल जाता है।

Additional Questions :

1. पढ़ो :

पठित – गद्यांश :
नीचे दिये गये गद्यांश को पढ़कर प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए।

1. एक बार एक जंगल में राजेश नामक लड़का जा रहा था। रास्ते में उसे एक सोने का सिक्का मिला। बह सोचने लगा “यह सिक्छा मेरा तो है ही नहीं इसे क्या करुँ लेकर …. जाने किस बेचारे का सिक्का यहाँ गिर गया है। अब न तो इसे रख सकता हूं और न फेंक सकता हूँ आखिर सोना जो हैं“ ‘ रास्ते में माला जपते हुए एक साधुु महाराज उसे मिले । उसने सोचा क्यों न यह सिका साधु को ही दे दूँ।

प्रश्न :
1. अनुच्छेद में लडके का नाम क्या है ?
2. राजेश एक बार कहाँ पर जा रहा था ?
3. राजेश को रास्ते में क्या मिला ?
4. रास्ते में उसे कौन मिला ?
5. राजेश ने क्या सोचा ?
उत्तर:
1. अनुच्छेद में लड़के का नाम राजेश है।
2. राजेश एक बार जंगल से जा रहा था।
3. राजेश को रास्ते में सोने का सिक्का मिला।
4. रास्ते में उसे साधु मिला।
5. राजेश ने सोचा कि क्यों न यह सिक्का साधु को दे दूँ।

TS 8th Class Hindi Guide 2nd Lesson राजा बदल गया

II. साधु की बात मानकर राजेश आगे चला तो उसने देखा कि किसी राजा की सेना चली जा रही है। इतनी बड़ी सेना को देखकर बह सोचने लगा की ज़रुर कोई बात रही होगी, जो राजा अपनी सेना लिये जा रहे हैं। उसने एक सैनिक से पूछा – “भाई ! आपके राजा इतनी बड़ी सेना लिये कहाँ जा रहे हैं?”
“ये हमारे राजा शूर सिंह हैं, जो पड़ोसी देश पर आक्रमण कर उसे लूटने जा रहे हैं।

प्रश्न :
1. साधु ने सिक्का किसे देने को कहा ?
2. राजेश किसकी बात मानकर आगे चला ?
3. राजा का नाम क्या था ?
4. राजा कहाँ जा रहा था ?
5. यह गद्यांश किस पाठ का है?
उत्तर:
1. साधु ने सिक्का गरीव को देने को कहा ।
2. राजेश साधु की बात मानकर आगे चला।
3. राजा का नाम शूर सिंह था।
4. राजा पड़ोसी राज्य पर आक्रमण करने जा रहा था।
5. यह गद्यांश ‘राजा बदल गया’ पाठ का है।

III. राजेश राजा के पास गया। सोने का सिक्का उनकी ओर बढ़ाते हुए कहा – “लीजिए महाराज आप इसे रख लीजिए। ”
“बेटा मुझे क्यों देना चाहते हो ?”‘ – राजा ने आश्चर्य के साथ पूछा
“महाराज एक साधु ने कहा था कि जो सबसे ग़रीब दिखे उसे यह सिका दे देना।” – राजेश करुण स्वर में बोला ।

प्रश्न :
1. राजेश ने सिक्का किसे देना चाहा ?
2. सिक्का किस धातु से बना था ?
3. राजेश ने सबसे गरीब किसे समझा ?
4. ‘राजा’ का विलोम शब्द क्या है?
5. राजेश को सिक्का गरीब को देने के लिए किसने कहा था ?
उत्तर:
1. राजेश ने सिक्का राजा को देना चाहा।
2. सिक्षा सोने धातु से बना था।
3. राजेश ने सबसे गरीब राजा को समझा।
4. ‘राजा’ का विलोम शब्द रंक है।
5. राजेश को सिक्का गरीब को देने के लिए साधु ने कहा था।

TS 8th Class Hindi Guide 2nd Lesson राजा बदल गया

IV. “ममें राजा हूँ, राजा ! मैं तुझे गरीब लगता हूँ?” – राजा क्रोध में बोला।
“महाराज ! यदि आप अमीर होते तो दूसरे देश को लूटने के लिए इतनी बड़ी सेना लेकर क्यों जाते ?”,
राजेश की बात राजा की समझ में आ गयी। उन्हें अपनी गलती का अहसास हुआ। राजेश की प्रशंसा करते हुए उन्होंने सेना को बापस लौटने का आदेश दिया।
उस् दिन से राजा ने अपनी संपत्ति जनता की सेबा में खर्च करना आरंभ कर दिया।

प्रश्न :
1. ‘गरीब’ का उल्टा शब्द क्या है?
2. किसे अपनी गलती का अहसास हुआ ?
3. राजा ने अपनी संपत्ति किसके लिए खर्च की ?
4. राजा ने किसकी प्रशंसा की ?
5. सेना को वापस लौटने का आदेश किसने दिया ?
उत्तर :
1. ‘गरीब’ का उल्टा शब्द अमीर है।
2. राजा को अपनी गलती का अहसास हुआ।
3. राजा ने अपनी संपत्ति जनता की सेवा के लिए खर्च की।
4. राजा ने राजेश की प्रशंसा की।
5. सेना को वापस लौटने का आदेश राजा ने दिया।

अपठित – गद्यांश :

नीचे दिये गये गद्यांश को पढ़कर प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए।

I. मनुष्य के लिए स्वस्थ रहना अत्यंत आवश्यक है। तंदुस्त्त रहने से मन प्रसन्न रहता है। मनुष्य दुगुने उत्साह के साथ अपने काम में लग सकता है। इसके विपरीत अस्वस्थ रहने से बह उदास हो जाता है। मन नीरस रहता है। इसलिए कहा गया है कि स्वस्थ तन में स्वस्थ मन और मस्तिष्क का निवास होता है।

प्रश्न:
1. मनुष्य के लिए क्या आवश्यक है?
2. मन प्रसन्न कैसे रहता है?
3. तंदुरुस्त मनुष्य अपने काम में कैसे लग सकता है ?
4. किस कारण से मनुष्य उदास हो जाता है ?
5. स्वस्थ तन में किसका निवास होता है ?
उत्तर :
1. मनुष्य के लिए स्वस्थ रहना अत्यंत आवश्यक है।
2. तंदुरुस्त रहने से मन प्रसन्न रहता है।
3. तंदुरुस्त मनुष्य अपने काम में दुगुने उत्साह के साथ लग सकता है।
4. अस्वस्थ रहने से मनुष्य उदास हो जाता है।
5. स्वस्थ तन में स्वस्थ मन और मस्तिष्क का निवास होता है।

TS 8th Class Hindi Guide 2nd Lesson राजा बदल गया

II. “प्राचीन काल के गाँव स्वावलंबी और धन – धान्य संपन्न हुआ करते थे। गाँव के लोग प्रेम से मिल – जुलकर रहते थे और अतिथियों का सत्कार करते थे। नगरों के कोलाहल से दूर शांत वातावरण में रहते थे। गाँब में मुख्य रूप से किसान रहते थे। उनकी सहायता करने के लिए बढई, कुम्हार, सुनार, लोहार, नाई, जुलाहे वैद्य, पुजारी आदि रहते थे। पैसे का लेन देन कम था। किसान की सभी ब्यवसायी सहायता करते थे।

प्रश्न :
1. प्राचीन काल में गाँव कैसे रहते थे ?
2. गाँव के लोग कैसे रहते थे ?
3. शहर का वातावरण कैसा होता था ?
4. गाँव में किसका लेन देन कम था ?
5. किसान की सहायता कौन करते थे ?
उत्तर :
1. प्राचीन काल में गाँव स्वावलंबी और धनधान्य संपन्न हुआ करते थे।
2. गाँव के लोग प्रेम से मिलजुलकर रहते थे और अतिथियों का सत्कार करते थे।
3. शहर का वातावरण कोलाहल युक्त होता था।
4. गाँव में पैसे का लेन – देन कम था।
5. किसान की सभी व्यवसायी सहायता करते थे ।

II. लिखो :

लघु प्रश्न :

प्रश्न 1.
साधु ने सिक्का गरीब को देने के लिए क्यों कहा ?
उत्तर :
साधु लोग भिक्षा माँगकर अपने जीवन यापन करते हैं। उनको किरी (दूसरों के) चीज़ पर आशा नहीं होती वे सब कुछ त्यागने से ही साधु बन जाते है। साधु परोपकारी हाते हैं। इसलिए साधु ने सिक्का गरीब को देने के लिए कहा।

प्रश्न 2.
अगर हमें किसी की कोई चीज़ मिलती है, तो हम क्या करेंगे?
उत्तर :
अभर हमें पाठशाला में कोई चीज़ मिलती है, तो हम उसे कार्यालय में दे देंगे। सडक पर को चीज़ मिली तो हम उसके बारे में पूछ-ताछ करके वह जिसका है उसे दे देंगे।

प्रश्न 3.
राजेश ने सोने के सिक्के का क्या किया ?
उत्तर :
राजेश ने सोने के सिक्के को पहले साधु को दिया । साधु ने कहा कि इसे किसी गरीब को दे दो ताकि वह अपना पेट भर सके। तब राजेश ने दूसरी बार उसे राजा को दिया।

प्रश्न 4.
राजा का नाम क्या था? वह कैसा था ?
उत्तर :
राजा का नाम शूरसिंह था। वह वीर और शूर था। लेकिन वह बहुत लालची था। वह क्रूर भी था। वह धन के लिए दूसरे राज्यों को लूटता था।

TS 8th Class Hindi Guide 2nd Lesson राजा बदल गया

प्रश्न 5.
राजेश को जगंल में क्या – क्या दिखायी दिये होंगे ?
उत्तर :
राजेश को जंगल में पेड – पौधे, पशु – पक्षी, जानवर, झरने आदि दिखायी दिये होंगे।

II. सृजनात्मक अभिव्टति

प्रश्न 1.
अपने यहाँ के किसी पर्व का वर्णन करते हुए अपने मित्र को एक पत्र लिखिए।
उत्तर :

वरंगल,
ता. ×××

प्रिय मित्र रवि,
तुम्हारा पत्र अभी मिला। पढ़कर खुश हुआ । दशहरे की छुट्टियाँ समाप्त हो गयी। यहाँ कल दीपावली भी खूब मनायी गयी। दीपावली हिन्दुओं का मुख्य त्योहार है। इसे सभी लोग मनाते हैं। प्राचीन काल में श्रीकृष्ण ने सत्यभामा समेत जाकर दुष्ट नरकासुर का वध किया। तब से उसके उपलक्ष्य में लोग दीपावली खुशी से मनाते आ रहे हैं। उस दिन घर की सफ़ाई की जाती है। अभ्यंगन स्नान करते है। बन्धु लोग आते हैं। पकवान खाते है। बच्चे फुलझडियाँ और पटाखे जलाते हैं। लक्ष्मी की पूजा करते हैं। ब्यापारी लोग अपने पुराने हिसाब ठीक करके नये हिसाब शुरू करते हैं। तुम्हारे माँ-बाप को मेरे प्रणाम कहना।

तुम्हारा,
के. मणि कुमार,
आठर्वी कक्षा।

पता :
वि. रवि कुमार,
हिन्दू हाईस्कूल,
आठवी कक्षा,
कोत्तपक्ळि, करीमनगर।

TS 8th Class Hindi Guide 2nd Lesson राजा बदल गया

సారాంశము :

ఒకసారి ఒక అడవి గుండా రాజేష్ అను ఒక పిల్లవాడు వెళుతూ ఉండెను. దారిలో అతనికి ఒక బంగారు నాణెము లభించినది. అప్పుడు ఆ బాలుడు ఈ నాణెం నాది కానేకాదు కదా ! దీనిని తీసుకుని నేను ఏమి చేసుకోను ? పాపం ఎవరి నాణెం పడిపోయిందో తెలుసుకుందాం. ఇప్పుడు దీన్ని నేను ఉంచుకోనూ. లేను, పారవేయనూ లేను. ఇది బంగారు నాణెం కదా! అని ఆలోచించుచుండెను.

ఈ విధంగా ఆలోచిస్తూ అతడు ముందుకు నడవసాగెను. దారిలో జపమాల తిప్పుకుంటూ అతడికి ఒక సాధువు ఎదురు వచ్చెను. అతడు ఈ నాణెమును ఈ సాధువుకు ఎందుకు ఇవ్వకూడదు ? అని ఆలోచించెను.

రాజేష్ ఆ నాణెమును సాధువుకు ఇవ్వగా ఆ సాధువు ఆశ్చర్యంతో “కుమారా ! ఈ నాణెము మా లాంటి సాధువులకు అవసరం లేదు. దీనిని ఎవరైనా పేదవారికి ఇచ్చినట్లయితే వారు దీంతో పొట్ట నింపుకుంటారు.” అని చెప్పెను.

సాధువు మాటలు విని రాజేష్ ముందుకు నడిచెను. అతనికి ఎవరిదో ఒక రాజసైన్యం వెళ్ళడం కన్పించినది. ఇంత పెద్ద సైన్యాన్ని చూసిన అతడు బహుశ ఏదో ఒక కారణం ఉండే ఉండి ఉంటుంది, అందుకే రాజుగారు తన సైన్యాన్ని తీసుకుని వెళ్ళుచున్నారు అని ఆలోచించెను. అతడు ఒక సైనికుడిని “సోదరా ! ఇంత పెద్ద సైన్యం తీసుకుని (వెంట పెట్టుకుని మీ రాజుగారు ఎక్కడికి వెళ్ళుచున్నారు ?” అని అడిగెను.

ఇతడు మా రాజుగారైన “శూరసింహుడు”. ఆయన “పొరుగు రాజ్యంపై దాడిచేసి ఆ రాజ్యాన్ని దోచుకోవడం కోసం వెళ్ళుచున్నారు” అని అతడు సమాధానం చెప్పెను.

రాజేష్ ఆ రాజుగారి వద్దకు వెళ్ళెను. బంగారు నాణెమును రాజుగారికి అందిస్తూ “తీసుకోండి మహారాజా, దీనిని మీరు ఉంచుకోండి” – అని చెప్పెను.

దానికి ఆ రాజుగారు “కుమారా! దీన్ని నాకు ఎందుకు ఇవ్వకోరితివి?” అని ఆశ్చర్యంగా అడిగిరి.

“మహారాజా ! ఒక సాధువు నీకు ఎవరైనా అందరికంటే పేదవాడు కనిపిస్తే అతనికి ఈ నాణెమును ఇవ్వమని చెప్పిరి” అని రాజేష్ కరుణ స్వరంతో రాజుగారితో చెప్పెను.

“నేను రాజును. నేను నీకు పేదవాడిగా అనిపిస్తున్నానా?” – అని రాజు కోపంతో అన్నాడు..

“మహారాజా ! మీరు ధనవంతులైతే రెండవ రాజ్యాన్ని (పొరుగు/వేరొక/మరొక) దోచుకోవడానికి ఇంత పెద్ద సైన్యం తీసుకొని ఎందుకు వెళతారు ?”

రాజేష్ మాటలు రాజుగారికి అర్థమైనవి. వారికి తన తప్పు తెలిసినది. రాజేషన్ను ప్రశంసిస్తూ తన సైన్యాన్ని వెనుకకు మళ్ళించుటకు ఆజ్ఞాపించెను.

ఆ రోజు నుండి రాజు తన సంపదనంతా పేదవారి సేవలో ఖర్చుపెట్టడం ప్రారంభించెను.

वचन :

  • जंगल – जंगल
  • सिक्का – सिक्षे
  • बेटा – बेटे
  • राजा – राजा लोग
  • सेवा – सेवाएँ
  • लडका – लडके
  • बेचारा – बेचारे
  • साधु – साधु लोग
  • बात – बातें
  • बस्ती – बस्तियाँ
  • रास्ता – रास्ते
  • माला – मालाएँ
  • सेना – सेनाएँ
  • गलती – गलतियाँ
  • रुपया – रुपये

TS 8th Class Hindi Guide 2nd Lesson राजा बदल गया

लिंग :

  • बालक – बालिका
  • लडका – लडकी
  • महाराज – महारानी
  • पडोसी – पडोसिन
  • सेवक – सेविका
  • बचा – बची
  • गरीब – गरीबिनी
  • देवर – देवरानी
  • राजा – रानी
  • बेटा – बेटी
  • भाई – बहन
  • युवक – युवती

उल्टे शब्द :

  • लेना × देना
  • साधु × क्रूर
  • बड़ी × छोटी
  • क्रोध × शांत
  • आरंभ × अंत
  • रखना × फेंकना
  • गरीब × अमीर
  • जवाब × प्रश्न
  • समझ × ना समझ
  • खर्च × बचत
  • आखिर × शुरू
  • आगे × पीछे
  • पास × दूर
  • प्रशंसा × निंदा

पर्यायवाची शब्द :

  • लडका – बालक, बच्चा
  • सोना – हेम, कंचन
  • जवाब – उत्तर
  • राजा – नृप, शासक
  • रास्ता – मार्ग, पथ
  • प्रश्न – सवाल
  • जंगल – वन
  • साधु – संत
  • प्रशंसा – स्तुति

TS 8th Class Hindi Guide 2nd Lesson राजा बदल गया

प्रत्यय :

  • महाराज – राज
  • गरीबी – ई
  • खुशी – ई
  • पडोसी – ई
  • दुखी – ई
  • ग़लती – ई
  • सुखी – ई

संधि विच्छेद :

  • महाराज = महा + राज
  • संग्रहालय = संग्रह + आलय
  • सचिवालय = सचिव + आलय
  • राजेश = राजा + ईश
  • ग्रंथालय = ग्रंथ + आलय
  • मंत्रालय = मंत्र + आलय

उपसर्ग :

  • महाराज – महा
  • सुविशाल – सु
  • अहसास – अह
  • सक्रिय – स
  • सुस्वागत – सु
  • सप्रेम – स
  • कुसंग – कु

वाक्य प्रयोग :

  1. आश्चर्य – इसमें आश्चर्य क्या है?
  2. ज़रूर – मुझे एक ज़रूरी काम पर आज हैदराबाद जाना है।
  3. पडोसी – पडोसी देश वालों से भी दोस्ती करनी चाहिए।
  4. आक्रमण – भारत पर कई विदेशी राजाओं का आक्रमण हुआ।
  5. अमीर – क्या अमीर लोगों को दिल नहीं होता ?
  6. आरंभ – उसने चित्र खींचना आरंभ किया।

TS 8th Class Hindi Guide 2nd Lesson राजा बदल गया

मुहावरे वाले शब्द :

1. आश्चर्य में पडना = विस्मय में पडना, विस्मित होना
राजा आश्चर्य में पड गये।
2. आश्चर्य में डालना = चकित करना
छात्रों के प्रश्न अध्यापक जी को आश्चर्य में डाल दिये।
3. आश्चर्य का टिकाना न रहना = अत्यधिक आश्चर्य चकित होना
इस वैज्ञानिक चित्र को देखकर छात्रों का आश्चर्य का कोई
ठिकाना न रहा।
4. समझ लेना = निश्चय या निर्णय कर लेना।
अंत में राजा को समझ लेने में अधिक समय नहीं लगा।
5. समझा जाना = निपटना
बालकों से इस बात को समझा जाना है।
6. समझ में आना = निश्चय में आना
बात मेरी समझ में आयी।
7. आगे बढ़ जाना = उत्रत और समृद्ध हो जाना
राजा की सेना आगे बढ़ गयी।
8. पेट भरना = दाल रोटी मिलना, खाना मिलना
रुपयों से कोई पेट भर सकता है?
9. लूटने जाना = सब कुछ छीनने जाना
राजा किसी देश को लूटने जा रहा है।
10. प्रशंसा करना = तारीफ़ करना
अध्यापक जी ने रामू की प्रशंसा की ।

शब्दार्थ (అర్ధములు) (Meanings) :

TS 8th Class Hindi Guide 2nd Lesson राजा बदल गया 1

TS 8th Class Hindi Guide 3rd Lesson प्यारा गाँव

Telangana SCERT 8th Class Hindi Study Material Telangana Pdf 3rd Lesson प्यारा गाँव Textbook Questions and Answers.

TS 8th Class Hindi 3rd Lesson Questions and Answers Telangana प्यारा गाँव

प्रश्न :

प्रश्न 1.
इस चित्र में क्या – क्या दिखायी दे रहे हैं ?
उत्तर :
इस चित्र में पर्वत, पेड, घर, खेत, पक्षियाँ, गाय, बैलगाडी, बस, हल, साइकिल, बैल, आदमी, किसान आदि दिखायी दे रहे हैं।

प्रश्न 2.
कौन क्या कर रहे हैं ?
उत्तर :
किसान खेत जोत रहा है। एक आदमी साइकिल चला रहा है। एक आदमी हल लेकर जा रहा है। और एक आदमी बैल गाडी चला रहा है। पक्षियाँ उड रहे हैं। गाय घास चर रही हैं।

TS 8th Class Hindi Guide 3rd Lesson प्यारा गाँव

प्रश्न 3.
इस चित्र में आपको कौन – सा दृश्य सबसे अच्छा लगा और क्यों ?
उत्तर :
इस चित्र में मुझे दूर के पर्वत और आसमान में छा गये बादल और आसमान में उडने वाली पक्षी आदि दृश्य सब से अच्छे लगे। क्योंकि ये प्राकृतिक दृश्य हैं।

सुनो – बोलो :

प्रश्न 1.
चित्र में क्या – क्या दिखायी दे रहे हैं?
उत्तर :
चित्र में दादाजी खडे हुए हैं। उनके सामने रानी और रमेश खडे हुए हैं। दूसरे चित्र में एक लुहार लोहे का काम कर रहा है। तीसरे चित्र में एक कुम्हार, कुम्हार के चक्र पर मिट्टी के बर्तन बना रहा है। चौथे चित्र में एक जुलाहा/हथकरघे पर कपडे बुन रहा है। पाँचवे चित्र में दो बढ़ई लकडी का काम कर रहे हैं। छठवे चित्र में एक सुनार सोने का काम कर रहा है। सातवे चित्र में एक बँसोर टोकरी बना रहा है। आखिरी चित्र में एक किसान हल और बैलों की सहायता से खेत जोत रहा है।

प्रश्न 2.
आपके गाँव में क्या – क्या देखने को मिलते हैं?
उत्तर :
हमारे गाँव में तो गाँव की हरियाली देखने को मिलती है। घाटों पर धोबी कपडे धोते दिखायी देते हैं। किसान खेतों में काम करते दिखायी देते हैं। हमारे गाँव के प्राथमिक आरोग्य केंद्रों में डॉक्टरों को भी देख सकते हैं। कई उद्योग धंधे वाले भी देखने को मिलते हैं। जैसे – बढ़ई, कुम्हार, लुहार, सुनार और बँसोर आदि। जुलाहे और चमार भी देखने को मिलते हैं।

पढ़ो :

अ. नीचे दिये गये वाक्यों के अर्थ बतलाने वाले शब्द पाठ्य – पुस्तक में से ढूँढ़िए और लिखिए।।

TS 8th Class Hindi Guide 3rd Lesson प्यारा गाँव 2
उत्तर :
TS 8th Class Hindi Guide 3rd Lesson प्यारा गाँव 3.1

आ. नीचे अधूरे वाक्य दिये गये हैं, उन्हें पूरा कीजिए।

अ. सामने कमलेश काका आ रहे हैं। इन्हें ………… (प्रणाम करो।)
आ. दामोदर दादा गाँववालों के लिए ……….. (मिट्टी के बरतन जैसे घडे, मटके, हँडी, मिट्टी के खिलौने आदि बनाते हैं।)

लिखो :

अ. नीचे दिये गये प्रश्नों के उत्तर लिखिए।

प्रश्न 1.
हर किसी में कला, कौशल, प्रतिभा होती है, जिससे हम व्यवसाय कर सकते हैं। तुम्हें कौन-सा व्यवसाय पसंद है और क्यों?
उत्तर :
मुझे बढ़ई का काम पसंद है। क्योंकि लकडी से कई प्रकार के खिलौने और कलाकृतियाँ बना सकते हैं। लकडी से नाजूक कलाखंड का काम भी कर सकते हैं।

TS 8th Class Hindi Guide 3rd Lesson प्यारा गाँव

प्रश्न 2.
अपने गाँव के बारे में लिखिए।
उत्तर :
मेरा गाँव सुंदर गाँव है। मेरे गाँव में मंदिर, तालाब, बरगद के पेड, खेत, सुंदर पशु – पक्षी, बगीचे आदि हैं। गाँव की हरियाली देखने लायक है। यहाँ सभी तरह के काम करने वाले रहते हैं। यहाँ के लोग एक दूसरे की सहायता करते हैं और मिलजुलकर रहते हैं।

शब्द भंडार :

निम्न लिखित शब्दों को वाक्यों में प्रयोग कीजिए।
लुहार, कुम्हार, जुलाहा, सुनार, बंसोर
उत्तर :
1. लुहार : लोहे का काम करनेवाले को लुहार कहते हैं।
2. कुम्हार : मिट्टी के बर्तन बनानेवाले को कुम्हार कहते हैं।
3. जुलाहा : कपड़ा बनाने वाले को जुलाहा कहते है।
4. सुनार : सुनार का काम बडा नाजुक होता है।
5. बंसोर : बाँस से कई चीजों बनानेवाले को बंसोर कहते हैं।

सृजनात्मक अभिव्यक्ति :

कल्पना कीजिए कि दादाजी शहर आते हे। दादाजी और आप के बीच हुई बातचीत को वार्तालाप के रूप में लिखिए।
उत्तर :
(दादाजी घर आते हैं)

TS 8th Class Hindi Guide 3rd Lesson प्यारा गाँव 4

 

 

प्रशंसा :

अपनी कला-कौशल और प्रतिभा को देखते हुए आप कौनसा काम करना पसंद करोंगे? अपने पसंदीदा क्षेत्र में आगे बढ़ने के लिए क्या करोंगे ?
उत्तर :
मैं एक परिश्रमी छात्र हूँ। हर काम मैं लगन से करता हूँ। मन में विश्वास रखकर सुख या दु:ख का परवाह न करते हुए अपने लक्ष्य तक पहुँचना चाहता हूँ। हर एक व्यक्ति में अपने – अपने कौशल होते हैं। मैं भी अपने मन चाहे कला – कौशल में प्रतिभा दिखाने की आशा रखता हूँ।

बचपन से ही कम्प्यूटर्स मेरा सबसे प्रिय विषय है। इस विषय में मेरी बडी रुचि है। इसे चाव व लगन से पढता हूँ। और अपना बहुत सा समय कम्प्यूटर पर बिताता हूँ घर पर मेरा अपना एक मल्टी मीडिया कम्प्यूटर है। इस पर मैं इंटरनेट का प्रयोग भी करता हूँ। स्कूल में इस विषय की विस्तृत पढायी करायी जाती है।

एक बडे कम्प्यूटर विशेषज्ञ बनने की मेरी अभिलाषा है। मुझ में ऐसा होने की तीव्र इच्छा शक्ति और योग्यता भी है। मेरे अध्यापक गण भी इस क्षेत्र में मुझे प्रोत्साहन देकर बडे संतुष्ट है। घर पर माता पिता भी मुझे प्रोत्साहन देते हुए मेरी आकांक्षा को सफल बना रहे हैं।

पढाई के बाद मैं कम्प्यूटर संबंधी अनेक प्रामाणिक संस्थाओं से विशेष ज्ञान प्राप्त करूँगा। इस विषय संबंधी महत्वपूर्ण विषयों की पुस्तकें भी मेरे घर में हैं। जेब खर्च के लिए दिये पैसों का भी मैं इसी विषय सीखने खर्च करता हूँ। इस क्षेत्र में अनेक बडी – बडी संभावनाएँ हैं। मैं अपनी प्रतिभा से कम्प्यूटर विषय में एक विशेषज्ञ बनना चाहता हूँ। इसके लिए सतत प्रयत्नशील रहूँगा।

TS 8th Class Hindi Guide 3rd Lesson प्यारा गाँव

परियोजना कार्य :

विभिन्न बुद्धिमत्ताओं के व्यवसायों के चित्र इकट्ठा कर कक्षा में प्रदर्शित कीजिए।
उत्तर :
TS 8th Class Hindi Guide 3rd Lesson प्यारा गाँव 5

भाषा की बात :

अ. नीचे दिया गया अनुच्छेद पढ़िए।

रानी और रमेश आठवीं कक्षा में पढ़ते हैं। गर्मी की छुट्टियों में दादाजी उन्हें अपने गाँव ले जाने के लिए आये। सब मिलकर सबेरे रेले से निकले। गाड़ी में बड़ी भीड़ थी। फिर भी जैसे-तैसे बैठने की जगह मिल गयी। शाम तक गाँव पहुँच गये। वहाँ स्टेशन के पास चाचाजी बैलगाड़ी लेकर तैयार थे। बैलगाड़ी खेंतों के किनारे-किनारे चलने लगी। खेतों में किसान काम कर रहे थे। पशु चर रहे थे। गाँव की हरियाली देखने लायक थी। बातों -बातों में घर आ गया। दादीजी से मिले। दादीजी ने बहुत लाड़प्यार किया। सबेरे दोनों दूध पीकर दादाजी के साथ गाँव घूमने निकले।
ऊपर दिये अनुच्छेद में रानी, गाँव, भीड, पशु, हरियाली और दूध शब्द किसी व्यक्ति, प्राणी, वस्तु, स्थान अथवा भाव का बोध कराते हैं। ऐसे शब्दों को संज्ञा कहते हैं। संज्ञा के पाँच भेद हैं। वे हैं –

1. जातिवाचक संज्ञा : जिस संज्ञा शब्द से किसी संपूर्ण जाति का बोध हो, वह जातिवाचक संज़ा कहलाता है।
उदा : लडका खेलता है।
2. व्यक्तिवाचक संझा : किसी विशेष व्यक्ति, वस्तु, स्थान का बोध कराने वाले शब्द व्यक्तिवाचक संज्ञा कहलाते हैं।
उदा : राम खेलता है।
3. भाववाचक संज्ञा : जिन शब्दों से किसी गुण, स्वभाव, दशा का बोध हो, वे भाववाचक संज्ञा कहलाते हैं।
उदा : खुख – दुख आते जाते रहते है।
4. समुदायवाचक संज्ञा : ऐसे शब्द, जो किसी विशेष समुदाय या समूह का बोध कराते है, वे समुदायवाचक संज्ञा कहलाते है।
उदा : सेना देश की रक्षा करती है।
5. द्रव्यवाचक संज्ञा : जो शब्द द्रव्य या विभित्र धातुओं का बोध कराते हैं, वे द्रव्यवाचक संज्ञा कहलाते हैं।
उदा : स्वच्छ जल पीना चाहिए।

TS 8th Class Hindi Guide 3rd Lesson प्यारा गाँव

आ. नीचे दिये गये वाक्य में आये संज्ञा शब्द ढूँढ़कर रेखांकित करो।

1. रानी पढ़ती है।
2. बालक खा रहा है।
3. हरियाली अच्छी होती है।
उत्तर :
1. रानी पढ़ती है।
2. बालक खा रहा है।
3. हरियाली अच्छी होती है।

विचार – विमर्श

वैजानिकों के अनुसार हम सबमें नौ तरह की बुद्धधिमता होती हैं। भाषा वुद्धिमत्ता, तर्क गणित वुद्धिमत्ता, शारीरिक गतिबोधक बुद्धिमत्ता, संगीत वुद्धिमत्ता, स्थान विषयक वुद्धिमत्ता, अपने से जुडी अंतरवैयक्तिक वुद्धिमत्ता, पारस्परिक बुद्धिमत्ता, प्रकृतिवादी बुद्धिमत्ता और आध्यात्मिक बुद्धिमत्ता। इनका विकास अलग – अलग अनुपात में होता है। इनकी कोई सीमा नहीं होती। अभ्यास से इन्हें विकसित कर सकते हैं।

Essential Material for Examination Purpose :

I. पढ़ :

पठित – गद्यांश :
नीचे दिये गये गध्यांश को पढ़कर प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए।

I. रानी और रमेश आटबीं कक्षा में पढ़ते हैं। गर्मी की छुट्रटियों में दादाजी उन्हें अपने गाँब ले जाने के लिए आये। सब मिलकर सबेरे रेल से निकले। गाड़ी में बड़ी भीड़ थी। फिर भी जैसेतैसे बेटने की जगह मिल गयी। शाम तक गाँच पहुँच गये। वहाँ स्टेशन के पास चाचाजी बैलगाड़ी लेकर तैयार थे।
बैलगाड़ी खेतों के किनारे-किनारे चलने लगी। खेतों में किसान काम कर रहे थे। पशु चर रहे थे। गाँव की हरियाली देखने लायक़ थी। बातों – बातों में घर आ गया। दादीजी से मिले। दादीजी ने बहुत लाड़-प्यार किया।

प्रश्न :
1. रानी किस कक्षा में पढ़ती है ?
2. रानी और रमेश को लाने के लिए शहर कौन आया?
3. बैलगाड़ी लेकर कौन आया था ?
4. किसने रानी और रमेश को बहुत लाड़ – प्यार किया ?
5. खेतों में कौन काम कर रहे थे ?
उत्तर :
1. रानी आठवीं कक्षा में पढ़ती है।
2. रानी और रमेश को लाने के लिए शहर दादा जी आये।
3. बैलगाड़ी लेकर चाचाजी तैयार थे।
4. दादाजी ने रानी और रमेश को बहुत लाड़ – प्यार किया।
5. खेतों में किसान काम कर रहे थे।

TS 8th Class Hindi Guide 3rd Lesson प्यारा गाँव

II. रमेश : दादा जी! आपका गाँब बड़ा प्यारा है। यहाँ तो सभी तरह के काम करने वाले रहते हैं।
दादाजी : हाँ बेटा! यहाँ सभी तरह के काम करने वाले रहते हैं। ये एक-दूसरे की सहायता करते हैं और मिलजुलकर रहते हैं। बे अपने-अपने घरेलू उद्योगों से देश के विकास में भाग लेते हैं।
रानी : दादा जी! ये देखो कितने हरे-भरे खेत हैं।
दादाजी : हाँ बेटी! इन खेतों को हरा-भरा बनाने के लिए किसान दिन-रात मेहनत करते हैं। अन्न उगाते हैं। हमारी भूख मिटाते हैं। इसीलिए महात्मा गांधी जी ने कहा था “वास्तव में भारत गाँबों में ही बसता है।”
रमेश-रानी : हाँ दादा जी! आपने सही कहा। सच में गाँच बहुत प्यारे होते हैं।

प्रश्न :
1. रमेश ने किसे प्यारा कहा ?
2. गाँव वाले देश के विकास में भाग कैसे लेते हैं ?
3. ‘दादाजी ! ये देखो कितने हरे भरे खेत हैं?’ यह वाक्य किसने कहा ?
4. भारत कहाँ बसता है ?
5. उपर्युक्त पंक्तियाँ किस पाठ से है ?
उत्तर :
1. रमेश ने गाँव को प्यारा कहा।
2. गाँव वाले अपने – अपने घरेलू उद्योगों से देश के विकास में भाग लेते हैं।
3. यह् वाक्य रानी ने कहा।
4. भारत गाँवों में बसता है।
5. उपर्युक्त पंक्तियाँ ‘प्यारा गाँव’ पाठ से है।

अपठित – गद्यांश :
नीचे दिये गये गद्यांश को पढ़कर प्रश्नों के उत्तर एक वाक्य कें लिखिए।

I. श्रीकृष्ण देवराय विजयनगर के प्रतापी राजा थे। बे शूर, बीर ही नहीं बल्कि एक महान साहित्यकार भी बे। उन्होंने दरबार में अनेक दिग्गज कबियों को स्थान दिया। बे स्वयं भी महाकवि थे, तेनालि रामकृष्ण उनके दरबारी कवियों में से एक थे। कहा जाता है कि रामकृष्ण कवि पर काली माता की अपार कृपा थी। बे बडे बुद्विमान और चतुर थे।

प्रश्न :
1. विजयनगर के प्रतापी राजा कौन थे?
2. राजा कृष्णदेवराय की विशेषता क्या थी ?
3. अनेक दिग्गज कवियों को स्थान किन्होंने दिया ?
4. तेनालि रामकृष्ण कैसे व्यक्ति थे ?
5. कालीमाता की अपार कृपा प्राप्त व्यक्ति कौन थे ?
उत्तर:
1. विजयनगर के प्रतापी राजा श्रीकृष्णदेवराय थे।
2. श्रीकृष्णदेवराय शूर, वीर ही नहीं एक महान साहित्यकार भी थे।
3. अनेक दिग्गज कवियों को स्थान श्रीकृष्णदेवराय ने दिया।
4. तेनालिरामकृष्ण बडे बुद्धिमान और चतुर थे।
5. कालीमाता की अपार कृपा प्राप्त व्यक्ति तेनालिरामकृष्ण थे।

TS 8th Class Hindi Guide 3rd Lesson प्यारा गाँव

II. विजयदशमी एक्ता का प्रतीक है। दुर्गा प्रतिमा के विसर्जनावसर पर जगह – जगह मेले लगते हैं। जहाँ सभी लोग आपसी वेमनस्य भूलकर एकता की भाबना से परस्पर मिलते हैं। इस दिन चारों ओर आनंद के ही बादल छाये रहते हैं। हम सभी का यह पवित्र कर्त्यव्य होता है कि बिजयदशमी को देश और समाज के उत्थान के लिए अधिक से अधिक महत्यपूर्ण समझें। इसके आदर्श को अपनाना जीवन को सफल बनाना है।

प्रश्न :
1. दुर्गा प्रतिमा के विसर्जनावसर पर क्या होता है?
2. उस समय लोग कैसे मिलते हैं?
3. चारों ओर क्या छाये रहते हैं?
4. हम सभी का पवित्र कर्तव्य क्या है ?
5. विजयदशमी किसका प्रतीक है?
उत्तर :
1. दुर्गा प्रतिमा के विसर्जनावसर पर जगह – जगह मेले लगते हैं।
2. सभी लोग आपसी वैमनस्य भूलकर एकता की भावना से परस्पर मिलते हैं।
3. चारों ओर आनंद के ही बादल छाये रहते हैं।
4. विजयदशमी को देश और समाज के उत्थांन के लिए अधिक महत्वपूर्ण समझें।
5. विजयदशमी एकता का प्रतीक है।

III. कुछ दिनों में दोनों मदुर पहुँच गए। भोजन और रहने की समस्या थी । उन्होंने एक घर किराए पर ले लिया। एक दो दिन अपना लाया खाना खाया । फिर बह भी समाप्त हो गया । ‘कोबलन’ के पास एक पैसा भी न था। ‘कत्रकी’ ने कहा – मेरे पास कुछ गहने हैं। आप उन्हें बेचकर भोजन सामग्री ले आएँ। बाकी बचे पैसों से कोई ब्यापार शुरू करें।

प्रश्न :
1. दोनों कहाँ पहुँचे ?
2. कौन – कौन मदुरै पहुँच गये ?
3. ‘कोवलन’ और ‘कन्नकी’ को मदुरे में क्या समस्या थी ?
4. दोनों ने रहने के लिए और भोजन के लिए क्या किये?
5. इस गद्यांश को शीर्षक दीजिए।
उत्तर :
1. दोनों मदुरै पहुँचे।
2. कोवलन और कत्रकी मदुरै पहुँच गए।
3. कोवलन और कन्नकी को मदुरै में भोजन की समस्या थी, क्योंकि उनके पास पैसे नहीं थे।
4. दोनों ने रहने और भोजन के लिए गहना बेचकर व्यापार शुरू किया।
5. ‘कोवलन और कन्नकी की मदुरै यात्रा’।

TS 8th Class Hindi Guide 3rd Lesson प्यारा गाँव

I. लिखो :

लघु प्रश्न :

प्रश्न 1.
खेती के लिए किन – किन सामानों का उपयोग करते हैं?
उत्तर :
खेती के लिए हल, बैलगाडी, कुल्हाडी, फावडा, हथौडा आदि सामानों का उपयोग करते हैं। आजकल आधुनिक साधन भी आ गये हैं। जैसे – ट्रेक्टर, श्रेशर आदि।

प्रश्न 2.
मिट्टी से तुम क्या – क्या बना सकते हो ?
उत्तर :
मिट्टी से घडे, मटके, हँडी, खिलौने, भगवान की प्रतिमाएँ और कई प्रकार के बर्तन बना सकते हैं। लोग मिट्टी से घर भी बनाते हैं।

प्रश्न 3.
तुम दादाजी के गाँव के बारे में क्या कहना चाहोगे ?
उत्तर :
दादाजी का गाँव बहुत सुंदर और प्यारा गाँव है। यहाँ सभी. प्रकार के पेशेवर के लोग जैसे लुहार, कुम्हार, जुलाहा, बढ़ई, बंसोर रहते हैं। गाँव में एक – दूसरे की सहायता करते हैं और मिलजुलकर रहते हैं। खेतों को हरा-भरा रखने के लिए किसान दिन – रात मेहनत करते हैं।

लघु निबंध प्रश्न :

प्रश्न 1.
निम्नलिखित संवाद को ध्यान से पढ़कर नीचे दिये गये प्रश्नों के उत्तर लिखिए।
रानी : दादाजी ! वहाँ देखिए। वे कौन हैं? वे क्या कर रहे हैं?
दादाजी : हाँ बेटा ! वे सोने – चाँदी का काम करते है। वे सोने-चाँदी से तरह-तरह के आभूषण जैसे-अंगूठी, हार, चूड़ी आदि बनाते हैं।
रामेश : दादाजी ! उस गली में देखिए लंबे-लंबे बाँस हैं। बाँस से क्या-क्या बनाते हैं?
दादाजी : देखो बेटा ! बाँस से टोकरी, झूले, खिलौने आदि बनाते हैं। बनानेवाले को बंसोर कहते हैं।

अब इन प्रश्नों के उत्तर दीजिए।

i. बंसोर किसे कहते हैं?
उत्तर : बाँस से वस्तुएँ बनानेवाले को बंसोर कहते हैं।
ii. सोने – चाँदी से क्या – क्या बनाते हैं?
उत्तर : सोने -चाँदी से तरह-तरह के आभूषण जैसे-अंगूठी, हार, चूड़ी आदि बनाते हैं।
iii. बढ़ई क्या – क्या सामान बनाते हैं?
उत्तर : बढ़ई लकड़ी से हल, खिडकी, दरवाजे, बैलगाडी और तरह-तरह के सामान बनाते हैं।
iv. बाँस से क्या – क्या बनाते हैं?
उत्तर : बाँस से टोकरी, झूले और खिलौने आदि बनाते हैं।

TS 8th Class Hindi Guide 3rd Lesson प्यारा गाँव

III. सुजनात्मक अभिव्यत्ति :

प्रश्न 1.
आवश्यक किताबें खरीदने धन माँगते हुए पिताजी के नाम एक पत्र लिखिए।
उत्तर :

हैदराबाद,
ता. ××××

पूज्य पिताजी,
सादर प्रंणाम।
मैं यहाँ कुशल हूं। सोचता हूँ कि आप सब वहाँ सकुशल हैं। में अच्छी तरह पढ रहा हूँ। परीक्षाओं के लिए खूब तैयारी कर रहा हूँ। मुझे यहाँ कुछ आवश्यक किताबें खरीदनी हैं। इसलिए ₹ 300 एम.ओ द्वारा भेजने की कृपा करें। माताजी को मेरा प्रणाम कहना।

आपका आज्ञाकारी पुत्र,
××××

पता :
के. रवि,
घ.नं. 3-6-31/3,
मेंइन बाजार,
खम्मम।

సారాంశము :

(రాణి మరియు రమేష్ ద్దరూ ఎనిమిదవ తరగతి చదువుతున్నారు. వేసవి సెలవుల్లో తాతగారు తమ గ్రామం తీసుకుని వెళ్ళడానికి వచ్చిరి. అందరూ కలసి ఉదయాన్నే రైలులో బయలుదేరిరి. బండి చాలా రద్దీగా ఉన్నది. కానీ ఎలాగోలా కూర్చోడానికి చోటు లభించినది. సాయంత్రానికి గ్రామం చేరిరి. అక్కడ రైల్వేస్టేషన్ దగ్గర పినతండ్రిగారు ఎడ్లబండి తీసుకుని వచ్చి సిద్ధముగా ఉండిరి.
ఎడ్లబండి పొలాల గట్టు మీదుగా వెళ్ళుచున్నది. పొలాల్లో రైతులు పనులు చేసుకుంటూ ఉన్నారు. పశువులు మేత మేస్తూ ఉన్నాయి. గ్రామంలోని పచ్చదనం చూడదగినది. మాటల్లోనే ఇల్లు వచ్చేసింది. నానమ్మను కలిశాము. నాయనమ్మ బాగా ప్రేమగా, గారాబంగా చూసింది.
ఉదయాన్నే పాలు త్రాగి తాతగారితో గ్రామం తిరగడానికి వెళ్ళాము. దారిలో మాట్లాడుకుంటూ ………)

తాతగారు : చూడు ! ఎదురుగా కమలేశ్ పెద్దనాన్న వస్తూ ఉన్నారు. వీరికి నమస్కరించు. (ఇరువురు కమలేశ్ పెద్దనాన్నకు నమస్కరించారు. ఆయన పిల్లలను చూసి చాలా సంతోషించిరి.)
రాణి : కమలేశ్ పెద్దనాన్న ఏమి పని చేస్తారు ?
తాతగారు : వారు కమ్మరి. వారు లోహపు సామాన్లు తవ్వుకోల, పార, సుత్తి, చక్రము, గొడ్డలి మొ||నవి తయారు చేస్తారు.
అటు చూడు. అది దామోదర్ తాత ఇల్లు.
రమేష్ : దామోదర్ తాత ఏం పని చేస్తారు ?
తాతగారు : దామోదర్ తాత గ్రామంలోని వారికి కావలసిన మట్టి పాత్రలను, కుండలు, చిన్న కుండలు, చిన్న మట్టి పాత్రలు, మట్టి బొమ్మలు మొ||న వాటిని తయారుచేయును. పిల్లలూ, మీకు తెలుసా ? మట్టి పాత్రలను తయారు చేయు వారిని ఏమంటారో ?
రాణి : కుమ్మరి అంటారు కదు తాతయ్యా !
తాతగారు : శభాష్. నా ప్రియమైన రాణికి అన్నీ తెలుసు. అటు చూడు చంద్రయ్య బాబాయి ఇల్లు. ఆయన బట్టలు నేస్తున్నారు.
రాణి : మంచిది. తాతయ్యా ! బట్టలు నేయువారిని ఏమంటారు ?
తాతగారు : బట్టలు నేయువారిని సాలీలు (సాలెవారు) అంటారు. బట్టలను చేతిమగ్గం మరియు మిషన్ (యంత్రాలు) రెండింటితోను తయారు చేస్తారు. చేతితో తయారు చేయు దానిని చేతిమగ్గం అంటారు. చంద్రయ్య బాబాయి ఇంటి దగ్గరే రామయ్య ఇల్లు కూడా ఉంది. ఆయన వడ్రంగి పని చేస్తారు.
రమేష్ : తాతయ్యా! వడ్రంగివారు ఇంకా ఏఏ పనులు చేస్తారు ?
తాతగారు : వడ్రంగివారు కర్ర (కలప) తో నాగలి, కిటికీలు, తలుపులు, ఎడ్లబండ్లు మరియు రకరకాల సామాన్లు తయారు చేస్తారు.
రాణి : తాతగారు అక్కడ చూడండి. వారెవ్వరు ? వారు ఏమి చేయుచూ ఉన్నారు ?
తాతగారు : అవును నాయనా! వారు బంగారం- వెండి పనులు చేస్తారు. వారు బంగారం వెండితో రకరకాల ఆభూషణాలు ఉదాహరణకు ఉంగరం, హారం, గాజు మొ||నవి తయారు చేస్తారు
రమేష్ : తాతగారు ! ఆ వీధిలోకి చూడండి పొడవైన వెదురు ఉన్నది. వెదురుతో ఏమేమి తయారు చేస్తారు?
తాతగారు : చూడు నాయనా! వెదురుతో గంపలు, ఊయలలు, ఆటబొమ్మలు మొ||నవి తయారుచేస్తారు. వీటిని తయారు చేయువారిని మేదర్లు అని అంటారు.
రమేష్ : తాతగారు. మీ గ్రామం చాలా బాగుంది. ఇక్కడ అన్ని రకాల పనులు చేసేవారు నివశిస్తున్నారు.
తాతగారు : అవును నాయనా ! ఇక్కడ అన్ని రకాల పనులు చేసేవారు ఉన్నారు. వీరు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటారు. కలిసిమెలిసి ఉంటారు.
రాణి : తాతగారు. ఇటు చూడండి. ఎంత పచ్చపచ్చని చేలో,
తాతగారు : అవునమ్మా. ఈ పొలాలను పచ్చగా తయారు చేయుటకు రైతులు రాత్రి – పగలు పరిశ్రమిస్తున్నారు. ఆహారాన్ని పండిస్తున్నారు. మన ఆకలిని తీరుస్తున్నారు. అందుకే మహాత్మాగాంధీ గారు “వాస్తవంగా భారతదేశం గ్రామాల్లోనే నివశిస్తుంది” అని అనేవారు.
రమేష్ & రాణి : అవును తాతగారు. మీరు సరిగ్గా చెప్పారు. నిజంగా గ్రామాలు ఎంతో అందంగా ఉంటాయి.

TS 8th Class Hindi Guide 3rd Lesson प्यारा गाँव

प्रत्यय :

  • प्यारा – आ
  • टोकरी – ई
  • हथ करघा – करघा
  • सहायता – ता
  • अंगूठी – ई
  • प्यारी – ई
  • मिलजुल – जुल
  • बैलगाडी – गाडी

पर्यायवाची शब्द :

  • गाँव – देहात
  • किसान – कृषक
  • दूध – क्षीर, पय
  • सामान – वस्तु
  • गली – वीधि
  • रात – यामिनी
  • सबेरे – प्रातःकाल
  • पशु – जानवर
  • बचा – लडका
  • बेटी – लडकी, पुत्री
  • सहायता – मदद
  • सही – ठीक
  • शाम – सायंकाल
  • घर – मकान
  • काम – कार्य
  • हाथ – कर
  • दिन – रोज
  • सच – सत्य

मुहावरे वाले शब्द :

1. निकल जाना = अपने रंथान से आगे बढ़ जाना। ; वे दोनों आगे निकल गये।
2. मिलजुलकर रहना = प्रेम तथा सद्भावना के साथ रहना।
आपस में सबको मिलजुलकर रहना चाहिए।
3. चलना = गतिशील होना ; हमेशा लक्ष्य की ओर चलना चाहिए।

TS 8th Class Hindi Guide 3rd Lesson प्यारा गाँव

शब्दार्थ (అర్ధములు) (Meanings) :

TS 8th Class Hindi Guide 3rd Lesson प्यारा गाँव 1

TS 7th Class Telugu 12th Lesson Questions and Answers Telangana రాణి శంకరమ్మ

Telangana SCERT 7th Class Telugu Guide Telangana 12th Lesson రాణి శంకరమ్మ Textbook Questions and Answers.

రాణి శంకరమ్మ TS 7th Class Telugu 12th Lesson Questions and Answers Telangana

బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి.

TS 7th Class Telugu 12th Lesson Questions and Answers Telangana రాణి శంకరమ్మ 1

ప్రశ్నలు

ప్రశ్న 1.
బొమ్మలో కనిపిస్తున్నదెవరు?
జవాబు.
బొమ్మలో ఒక వీర వనిత, సైనికులు యుద్ధం చేస్తూ కనబడుతున్నారు.

ప్రశ్న 2.
ఆమె ఏం చేస్తున్నది? ఎవరితో పోరాడుతున్నది? ఎందుకు పోరాడి ఉండవచ్చు?
జవాబు.
ఆమె తన కోటపై దాడికి వచ్చిన శత్రువులతో యుద్ధం చేస్తూ ఉండవచ్చు. తన కోటను ఆక్రమించాలనుకొన్న వారికి తన వీరత్వం, పోరాటం రుచి చూపి ఉండవచ్చు.

TS 7th Class Telugu 12th Lesson Questions and Answers Telangana రాణి శంకరమ్మ

ప్రశ్న 3.
యుద్ధంలో శౌర్యాన్ని చూపిన స్త్రీలను ఏమంటారు?
జవాబు.
యుద్ధంలో శౌర్యాన్ని చూపే స్త్రీలను వీరవనిత, వీరనారీమణులు అంటారు.

ప్రశ్న 4.
మీకు తెలిసిన వీరనారీమణుల పేర్లు చెప్పండి.
జవాబు.
రాణి రుద్రమదేవి, రాణిశంకరమ్మ, ఝాన్సీలక్ష్మీబాయి, నేటికాలంలో చాకలి ఐలమ్మ మొదలైనవారు.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.120)

ప్రశ్న 1.
“త్యాగాలకు, వీరత్వానికి మారుపేరు తెలంగాణ” దీన్ని మీరెట్లా సమర్థిస్తారు?
జవాబు.
తెలంగాణా వీరత్వానికి, త్యాగాలకు మారుపేరు. నిజాం ప్రభుత్వానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన పోరాటగడ్డ మన తెలంగాణ. దేశస్వాతంత్య్ర ఉద్యమంలో రావి నారాయణరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, మాడపాటి హనుమంతరావు మొ॥వారు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రసాధనలో ప్రాణత్యాగం చేసినవారు ఎంతో మంది. అందుకే తెలంగాణా త్యాగానికి, వీరత్వానికి పేరు.

ప్రశ్న 2.
ఏఏ గుణాలు కల్గి ఉంటే “సుగుణాల పట్టి” అంటారు?
జవాబు.
మంచి గుణాలు కలిగి ఉండడాన్ని సుగుణాలరాశి అంటాం. చిన్న పిల్లలను గారాబంగా పట్టి అంటారు. సుగుణాల పట్టి అంటే అనేక మంచి గుణాలతో నిండి ఉండడం. వినయం, విధేయత, సంస్కారం, చదువు, అణుకువ, నిజాయితీ, అందం మొదలైన గుణాలతో ఉన్న పిల్లలను సుగుణాల పట్టి అంటారు.

ప్రశ్న 3.
శంకరమ్మ పులితో కలబడి చంపింది కదా! మీరు కూడా ధైర్యం చూపిన సంఘటనలు చెప్పండి.
జవాబు.
నా స్నేహితుడు, నేను ఆడుకుంటున్నాము. ఇంతలో నా స్నేహితునికి కరెంటు వైరు తగిలి, షాకుకు గురయ్యాడు. వెంటనే నాకు ఒక ఆలోచన కలిగింది. చెక్కతో అతనిని కరెంటు వైరునుండి వేరుచేశాను. అతన్ని ప్రమాదం నుండి రక్షించాను. నాకు తృప్తి, ఆనందం కలిగాయి.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.122)

ప్రశ్న 1.
శంకరమ్మ యుద్ధరంగంలో ధైర్యం చూపింది. మరి స్త్రీలు ఏయే సందర్భాలలో ధైర్యం చూపాలో చర్చించండి.
జవాబు.
ఈ రోజుల్లో స్త్రీలు అన్ని రంగాల్లో ప్రవేశించారు. తన రక్షణకై తాను అన్ని సందర్భాలలో ధైర్యంగా ఉండాలి. బ్యాంకు కార్యాలయం, మార్కెట్ వంటి ప్రదేశాలలో దుర్మార్గుల బారి నుండి ఆపద వచ్చినపుడు ధైర్యంతో ఎదుర్కోవాలి. గృహహింస ఎదురైనప్పుడు, ఒంటరిగా ప్రయాణాలు చేసేటప్పుడు, ఎవరైనా దౌర్జన్యానికి దిగినప్పుడు, తమ స్వేచ్ఛకు భంగం కలిగినప్పుడు స్త్రీలు ధైర్యం చూపాలి.

ప్రశ్న 2.
శంకరమ్మ చేసిన మంచి పనికి ఉంగరం ఇస్తే తీసుకోలేదు కదా! దీనిని బట్టి మీరేం గ్రహించారు?
జవాబు.
నారసింహారెడ్డి శంకరమ్మ చేసిన మంచిపనికి ఆమెకు ఉంగరం ఇస్తే తీసుకోలేదు. నేను కూడా దీనినిబట్టి మనం ఇతరుల నుండి ప్రతిఫలం ఆశించకుండా ఉపకారం చేయాలని గ్రహించాను. మనము మంచి చేస్తే మనకూ మంచి జరుగుతుందని తలుస్తాను.

ప్రశ్న 3.
కండ్లలో సముద్రం నింపుకోవడం’ అన్న జాతీయాన్ని ఏయే సందర్భాల్లో వాడుతారు?
జవాబు.
విపరీతమైన బాధ లేక దుఃఖం కలిగినపుడు కండ్లలో సముద్రం నింపుకోవడం అన్న జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఎక్కువ దుఃఖం కలిగినపుడు ఏడుపు వస్తుంది. కన్నీరు ధారగా కారుతునే ఉంటుందని అని చెప్పే సందర్భంలో పై జాతీయాన్ని వాడతారు.

TS 7th Class Telugu 12th Lesson Questions and Answers Telangana రాణి శంకరమ్మ

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.123)

ప్రశ్న 1.
“చీకట్లో చిరుదీపం” అనడంలో ఆంతర్యమేమిటి?
జవాబు.
చీకటిలో చిరుదీపం అంటే చిమ్మచీకటిలో కాంతిరేఖవలే ఏదో ఒక ఆధారం దొరకడం అని అర్థం. బాగా కష్టాల్లో లేక ఆపదలలో చిక్కినపుడు ఎవరో ఒకరు ఆసరాగా దొరికితే ఎంతో ఊరట చెందుతాము అనేది ఆంతర్యం.

ప్రశ్న 2.
ఈ ప్రజలను కన్న బిడ్డలుగా పాలించడం అంటే మీకేమర్దమైంది?
జవాబు.
ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలను చాలా గారాబంగా, ప్రేమగా పెంచుకుంటారు. వారికి ఎలాంటి కష్టం, బాధ, విచారం కలుగనివ్వరు. అలాగే రాజు ప్రజలను తన కన్నబిడ్డలుగా చూసుకున్నాడని, ప్రజలు సుఖంగా జీవించారని అర్థమైంది.

ప్రశ్న 3.
రాణి శంకరమ్మ కథ ద్వారా మీకేమర్దమైంది?
జవాబు.
రాణి శంకరమ్మ ధైర్యం గల ఆడది. పరోపకారం కలది. ప్రజలను కన్నబిడ్డలవలే పాలించింది. భర్తకు రాజధర్మం నేర్పింది. కత్తిపట్టి యుద్ధరంగంలోకి దిగి శత్రువులను చీల్చి చెండాడింది. రాణి శంకరమ్మ వలే జీవితంలో కష్టాలెదురైతే పోరాడాలి, గెలవాలి కాని పారిపోరాదని అర్థమైంది.

ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. రాణి శంకరమ్మ కథలో మీకు నచ్చిన / ఆశ్చర్యం కలిగించిన సంఘటన ఏది? దాని గురించి మాట్లాడండి.
జవాబు.
రాణి శంకరమ్మ కథలో శంకరమ్మ గౌడిచర్ల ప్రాంతంలో చిరుతపులితో తలపడింది. గాండ్రిస్తూ పులి పంజా విసిరినా భయపడలేదు. కట్టెతో పులిని కొడ్తూ ధైర్యంగా ఎదుర్కొంది. కాళ్ళతో తొక్కింది. దానిని చంపివేసింది. ఇదీ ఆశ్చర్యం కలిగించిన సంఘటన. వీరవనిత పరాక్రమం. వేసవిలో గుర్రంమీద తిరుగుతూ ఉన్నప్పుడు ఎదురుపడ్డ నారసింహారెడ్డికి అంబలినీరు, సంకటి ఇచ్చి ఆకలి తీర్చింది.

అతడిచ్చిన ఉంగరాన్ని కూడా తీసుకోలేదు. ఇది నాకు నచ్చింది. ఇది ఆమె నిజాయితీకి నిదర్శనం. రాణి అయినా ప్రజలను కన్నబిడ్డల్లా సాకింది. శత్రువులు తనపై మత్తుమందు చల్లినా అడవిలో కోయవాడి ద్వారా నైజాం రాజు వద్దకు వెళ్ళి కుట్ర ఛేదించి మరలా అందోలుకు రాణి అయింది. రాణిశంకరమ్మ తన వీరత్వంతో, ఎన్ని ఇబ్బందులెదురైనా ఎదురొడ్డి పోరాటం చేయడం నాకు నచ్చిన అంశం.

II. ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

1. పాఠం చదవండి. రాణి శంకరమ్మ పరాక్రమాన్ని తెలిపే పదాలను గుర్తించండి.

ఉదా : బండరాళ్ళను పిండిగా జేయడం.
జవాబు.
కర్రతిప్పడం, నాగల్ని పట్టడం, బండి తోలడం, కుత్తుకలు తెగగోయడం, రక్తం పారించడం.

2. కింది గద్యాన్ని చదవండి. కింద ఇచ్చిన ప్రశ్నలకు సరైన జవాబును ఎన్నుకొని కుండలీకరణంలో రాయండి.

స్త్రీని మాతృదేవతగా భావించి, పూజించి, ఆరాధించేవారు భారతీయులు. “యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః” అన్నది ఆర్యోక్తి. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ఒక తరం నుండి మరోతరానికి వారసత్వంగా అందిస్తూ ఉంటారు మహిళలు. సభ్యత, సంస్కారాల రూపంలో జాతి జీవన శక్తిని మరింత వేళ్ళూనుకునేటట్లు చేసింది భారతీయ మహిళే. ఇటు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ, అటు సమాజ ఉన్నతికై పరిశ్రమిస్తూ తమవంతు పాత్రను పరిపూర్ణం చేసుకుంటూ, అవసరమైనప్పుడు సంస్కృతి రక్షణకై పూనుకుంటారు. అవసరమైతే మహిళలు మాతృభూమి రక్షణకోసం ప్రాణత్యాగాలు చేస్తుంటారు.

1) స్త్రీలను – భారతీయులు ఎట్లా పూజిస్తారు?
క) మాతృదేవతగా
గ) పితృదేవతగా
చ) అతిథి దేవతగా
జవాబు.
క) మాతృదేవతగా

2) మహిళలు ఒక తరం నుండి మరో తరానికి దేనిని అందిస్తూ ఉంటారు?
క) భారతీయ ఆర్థిక వ్యవస్థను
గ) భారతీయ సంస్కృతిని
చ) భారతీయ వ్యవహారాలను
జవాబు.
గ) భారతీయ సంస్కృతిని

3) జాతి జీవనశక్తి దేనివలన వేళ్ళూనుకొని ఉంటుంది?
క) సభ్యత, సంస్కారాలు
గ) కుళ్ళు కుతంత్రాలు
చ) ఎత్తుకు పై ఎత్తులు
జవాబు.
క) సభ్యత, సంస్కారాలు

TS 7th Class Telugu 12th Lesson Questions and Answers Telangana రాణి శంకరమ్మ

4) వేటి ఉన్నతికై స్త్రీలు పరిశ్రమిస్తారు?
క) సిరిసంపదలు
గ) కుటుంబం-సమాజం
చ) తమకోసం తాము
జవాబు.
గ) కుటుంబం-సమాజం

5) దేని కోసం ప్రాణత్యాగం చేయవచ్చు?
క) సంపదలకై
గ) ఆచారాలకై
చ) మాతృభూమి రక్షణకై
జవాబు.
చ) మాతృభూమి రక్షణకై

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

అ) శంకరమ్మ ధైర్యంగా పులితో పోరాడిన సంఘటనను వర్ణించండి.
జవాబు.
శంకరమ్మ ఒకసారి గౌడిచర్ల ప్రాంతంలో ఒక చిరుతపులితో కలబడింది. చిరుత పెద్దగా అరుస్తూ తన పంజా విసురుతున్నా భయపడలేదు. కట్టెతో పులిని కొడుతూ ధైర్యంగా ఎదుర్కొన్నది. కాళ్ళతో తొక్కింది. దానిని చంపివేసింది. తాను అలసిపోయినా పోరాటం వీడలేదు. అదే వీరవనిత సాహసం. తెలంగాణా పౌరుషం.

ఆ) మీరు తప్పిపోతే ధైర్యంగా ఏ విధంగా ఇంటికి చేరుకుంటారో రాయండి.
జవాబు.
నేను దారిలో తప్పిపోతే, నా తల్లిదండ్రుల పేర్లు, ఊరిపేరు, జిల్లా పేరు గుర్తుకు తెచ్చుకుంటాను. నా కుటుంబసభ్యుల చరవాణి (సెల్) నెంబర్లు నాకు ఎప్పుడూ గుర్తులో ఉంటాయి. ఆ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్కు వెళ్ళి నా విషయాన్ని వారికి తెలిపి సహాయాన్ని కోరుతాను. పోలీసు స్టేషన్లోని ప్రాంతంలో అయితే ఆ గ్రామంలో ఊరిపెద్ద ఎవరో అడిగి తెలుసుకొని వారి వద్దకు వెళతాను. వారి సాయం తీసుకొని నా యింటికి సమాచారం ఇస్తాను. ఆయా వ్యక్తుల ద్వారా ఇంటికి సుఖంగా చేరుకుంటాను. నాకు సాయం చేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాను.

ఇ) రాణి శంకరమ్మ మంచి పాలనాదక్షురాలు అనడానికి ఉదాహరణలు రాయండి.
జవాబు.
రాణి శంకరమ్మ రాజ్యపాలన బాగా చేసింది. ప్రజలను కన్నబిడ్డలవలే చూచుకొన్నది. శత్రువుల పట్ల కఠినంగా ఉండేది. తనకు సాయం చేసిన వారిని మరచిపోయేదికాదు. నారసింహారెడ్డితో పెండ్లి అయిన తర్వాత సిద్ధిఖీ సోదరులు కుట్రలు, కుతంత్రాలు పన్నారు. ప్రజలను పీడించి పన్నులు లాగారు. భర్తకు ఉలుకూ పలుకూ లేకపోతే, తనను పట్టించుకోని రాజ్యం మరచిపోవడం సరికాదని చెప్పింది. ప్రజల హితం చూడమని రాజ్యం పనులు సరిగా చేయాలని తనభర్తకు రాజధర్మం చెప్పిన ధైర్యవంతురాలు. తాను రాణి అయిన తర్వాత ప్రజలకు పన్నుల భారం తగ్గించింది. దీనిని బట్టి రాణిశంకరమ్మ మంచి పాలనాదక్షురాలు అని చెప్పవచ్చును.

ఈ) రాణి శంకరమ్మ గొప్పతనం గురించి నేటికీ పాటల రూపంలో పాడుకోవటానికి కారణాలు ఏమిటో రాయండి.
జవాబు.
రాణి శంకరమ్మ గురించి నేటికీ పాటలరూపంలో పాడుకోవడానికి కారణాలు :
అ) రాణి శంకరమ్మ ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంది.
ఆ) శంకరమ్మ ఎటువంటి ప్రయోజనమూ ఆశించకుండా ఇతరులకు సాయం చేసింది.
ఇ) శంకరమ్మ వీరవనిత. పిరికితనం తెలియదు.
ఈ) తల్లిదండ్రులంటే గౌరవం.
ఉ) శంకరమ్మ నలుగురికీ ఉపయోగపడేలా గుళ్ళు, పట్టణాలు కట్టించింది.
ఊ) శంకరమ్మ తాను జన్మించిన గడ్డ కీర్తిని అజరామరం చేసింది.

ఇలా ఎవరైతే ప్రజలకోసం జీవిస్తారో వారిని ప్రజలు ప్రేమిస్తారు. వారు మరణించినా పాటల రూపంలో, కథల రూపంలో గుర్తు చేసుకుంటూనే ఉంటారు.

2. కింది ప్రశ్నకు పది వాక్యాలలో జవాబు రాయండి.

రాణి శంకరమ్మ పరాక్రమాన్ని సొంతమాటల్లో రాయండి.
జవాబు.
1. జననం : మెదక్ జిల్లాలోని గౌడిచర్లలో సంగారెడ్డి, రాజమ్మ దంపతుల బిడ్డ శంకరమ్మ. చిన్నప్పటి నుండి ఈమె ఎంతో ధైర్యవంతురాలు.

2. పులిని ఎదిరించిన శంకరమ్మ : గౌడిచర్ల ప్రాంతంలో చిరుతపులి పంజా విసరినా కట్టెతో పోరాడి ఎదిరించి కాళ్ళతో తొక్కి చంపింది.

3. మరాఠీలను మట్టి కరిపించిన శంకరమ్మ : నైజాం రాజు కోరిక మేరకు మరాఠీలపై యుద్ధానికి వెళ్ళింది. కాళికారూపం ఎత్తి, ఎక్కడచూసినా తానే అయి, ఎత్తుకు పై ఎత్తుతో శత్రువుల పీకలు తెగగోసింది. వేలకు వేలు సైనికుల రక్తాన్ని పారించింది. పీష్వాల తోకలు కత్తిరించింది. విజయగర్వంతో నైజాం వద్దకు వెళ్ళింది. నైజాం నవాబు శంకరమ్మకు ‘రాయబాగిన్’ అనే బిరుదు ఇచ్చాడు. అందోలు రాజ్యానికి రాణిగా ప్రకటించాడు.

IV. సృజనాత్మకత / ప్రశంస

రాణి శంకరమ్మ చరిత్రను ఏకపాత్రాభినయం చేయడానికి వీలుగా తగిన అంశాలతో రచన చేయండి. ప్రదర్శించండి.

రగిలించే పౌరుషాగ్ని తెలంగాణా
వీరులకు పుట్టినిల్లు తెలంగాణా

ఇలాంటి తెలంగాణ గడ్డలోని ఒక చిన్న పల్లె గౌడిచర్లలో పుట్టిన నేను నేడు అందోలు రాజ్యానికి రాణినయ్యాను. తెలంగాణ ఆడబిడ్డల పౌరుషానికి నన్ను చెప్పుకుంటారంటారు. నిజమే. చిరుతపులి గాండ్రిస్తూ పంజా విసిరినా నేను భయపడలేదు. ధైర్యంగా ఎదుర్కొన్నా. చిరుతపులిని కట్టెతోకొట్టి, కాళ్ళతో తొక్కి చంపినా. అదీ తెలంగాణా పౌరుషం. నా మంచి గుణాలు, నా అందము చూసి అందోలు రాజు నరసింహారెడ్డి నన్ను పెళ్ళి చేసుకున్నాడు. నేను తప్ప లోకమే లేదన్నట్లు ప్రజల మంచిచెడ్డలు పట్టించుకోవడం మానేశాడు.

TS 7th Class Telugu 12th Lesson Questions and Answers Telangana రాణి శంకరమ్మ

నాకోసం కాదు, ప్రజలకోసం జీవించాలని రాజధర్మాలు చెప్పా. రాజ్యపాలన చేయించా. దురదృష్టం. విషప్రయోగంచేసి నా భర్తను చంపారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న నన్ను మరాఠా రాజుల మీదకు యుద్ధానికి వెళ్లమన్నాడు నైజాం రాజు. నేను భయపడతానా! అది నా రక్తంలోనే లేదు. కాళికలా మరాఠా పీష్వాల తోకలు కత్తిరించా.

రక్తం పారించా. విజయగర్వంతో నైజాం నవాబు దగ్గరకు వెళ్ళా. రాయబగిన్ బిరుదునిచ్చి మెచ్చుకున్నాడు. అందోలు రాజ్యానికి రాణిని చేశాడు. నేనేకాదు, ప్రతితెలంగాణా బిడ్డా పులిలాంటిదే. అన్యాయాన్ని ఎదిరించేదే. నాలా మీరు కూడా ఇతరులకు సాయం చేయండి. పిరికితనం వదలండి. మన తెలంగాణా కోసం మీ వంతు సాయం చేయండి.

జై తెలంగాణా!

V. పదజాల వినియోగం

1. గీతగీసిన పదాలకు అర్థాలు రాసి, వాటితో సొంతవాక్యాలు రాయండి.

అ) నిర్మల్ కొయ్య బొమ్మల తయారీకి ప్రసిద్ధి.
జవాబు.
ప్రసిద్ధి – పేరు పొందుట, ఖ్యాతి
హైదరాబాద్ మత సహనానికి పేరు పొందిన నగరం.

ఆ) బాగా చదువుకొని స్వప్నం నెరవేర్చుకోవాలి.
జవాబు.
స్వప్నం = కల
నా అద్భుతమైన కలలు సాధించడానికి నేనెంతో శ్రమపడతాను.

ఇ) మహాభారత సమరంలో ధర్మం గెలిచింది.
జవాబు.
సమరం = యుద్ధం
యుద్ధాల వలన ధననష్టం, జననష్టం కలుగుతుంది.

ఈ) అపాయకర సంఘటనలు ఎదురైనపుడు శౌర్యం చూపాలి.
జవాబు.
శౌర్యం = పరాక్రమం
భారత సైనికులు కార్గిల్ యుద్ధంలో పరాక్రమాన్ని చూపారు.

ఉ) సూర్యుని దీప్తి లేకపోతే లోకమంతా చీకటిమయం.
జవాబు.
దీప్తి = కాంతి
విజ్ఞానము అనే కాంతి అన్నిచోట్ల వెలగాలి.

2. కింది పదాలను వివరించండి.

అ) సాహితీ జ్యోతులు
జవాబు.
సాహితి అనే కాంతులు అని అర్థం. సాహిత్యం అంటే భాషలోని రచనలు.

ఆ) శౌర్యచంద్రికలు
జవాబు.
పరాక్రమము అనే వెన్నెలలు.

ఇ) అపరంజి బొమ్మ
జవాబు.
చాలా అందమైన బొమ్మ. అందమైన వ్యక్తులను అపరంజి బొమ్మలతో పోలుస్తారు. అపరంజి అంటే బంగారం.

ఈ) అజరామరం
జవాబు.
ముసలితనం, మరణం లేనిది.

VI. భాషను గురించి తెలుసుకుందాం.

1. కింది పదాలను విడదీయండి. సంధిని గుర్తించి సంధిపేరు రాయండి.

అ) రంగనాథాలయం = ____________
జవాబు.
రంగనాథ + ఆలయం – సవర్ణదీర్ఘ సంధి

ఆ) అమృతాన్నం = ____________
జవాబు.
అమృత + అన్నం – సవర్ణదీర్ఘ సంధి

ఇ) అజరామరం = ____________
జవాబు.
అజర + అమరం – సవర్ణదీర్ఘ సంధి

ఈ) కవీంద్రుడు = ____________
జవాబు.
కవి + ఇంద్రుడు – సవర్ణదీర్ఘ సంధి

2. కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి.

అ) చదువుసంధ్యలు : ____________
జవాబు.
చదువును మరియు సంధ్య – ద్వంద్వ సమాసం

ఆ) పామూముంగిసలు : ____________
జవాబు.
పాముయు మరియు ముంగీస – ద్వంద్వ సమాసం

TS 7th Class Telugu 12th Lesson Questions and Answers Telangana రాణి శంకరమ్మ

ఇ) ఎండావానలు : ____________
జవాబు.
ఎండ మరియు వాన – ద్వంద్వ సమాసం

ఈ) కొండాకోనలు : ____________
జవాబు.
కొండ మరియు కోన – ద్వంద్వ సమాసం

ఉ) మంత్రతంత్రాలు : ____________
జవాబు.
మంత్రం మరియు తంత్రం – ద్వంద్వ సమాసం

ఊ) తల్లిదండ్రులు : ____________
జవాబు.
తల్లియును, తండ్రియును – ద్వంద్వ సమాసం

ఋ) రామకృష్ణులు : ____________
జవాబు.
రాముడు మరియు కృష్ణుడు – ద్వంద్వ సమాసం

ౠ) కూరగాయలు : ____________
జవాబు.
కూర మరియు కాయ – ద్వంద్వ సమాసం

ద్విగు సమాసం:

ఈ పదాలను పరిశీలించండి.

  • నవరసాలు
  • చతుర్వేదములు
  • షట్చక్రవర్తులు
  • దశ దిశలు
  • పంచపాండవులు
  • ఎనిమిది బొమ్మలు

ఈ పదాలలో మొదటి (పూర్వ)పదం సంఖ్యా వాచకంగా ఉండి, రెండవపదం (పర) నామవాచకంగా ఉంది. వీటికి విగ్రహవాక్యాలు ఇట్లా ఉంటాయి.

  • నవరసాలు – తొమ్మిది సంఖ్యగల రసాలు
  • చతుర్వేదములు – నాలుగు సంఖ్య గల వేదములు
  • షట్చక్రవర్తులు – ఆరు సంఖ్యగల చక్రవర్తులు
  • పంచపాండవులు – ఐదు సంఖ్యగల పాండవులు
  • దశదిశలు – పది సంఖ్యగల దిక్కులు
  • ఎనిమిది బొమ్మలు – ఎనిమిది సంఖ్యగల బొమ్మలు

మొదటి (పూర్వ) పదం సంఖ్య అయితే తర్వాత (ఫర) పదం ఆ సంఖ్యను సూచించే నామవాచకం అయివుంటుంది.
పూర్వపదం సంఖ్యావాచకమైతే అది ‘ద్విగు సమాసం’.

3. కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి.

ఉదా : శతాబ్దం వందసంఖ్యగల – అబ్దం – ద్విగు సమాసం

అ) ముక్కుచెవులు : ____________
జవాబు.
ముక్కు మరియు చెవులు – ద్వంద్వ సమాసం

ఆ) ఏడేండ్ల : ____________
జవాబు.
ఏడు సంఖ్యగల ఏండ్లు – ద్విగు సమాసం

ఇ) ఆరువేల ఆశ్వికదళం: ____________
జవాబు.
ఆరువేల సంఖ్యగల ఆశ్వికదళం – ద్విగు సమాసం

ఈ) శౌర్యధైర్యాలు : ____________
జవాబు.
శౌర్యము మరియు ధైర్యము – ద్వంద్వ సమాసం

ప్రాజెక్టు పని

మీ ప్రాంతంలో బతుకమ్మ పాటలుగా పాడుకునే వీరగాథలను సేకరించండి. రాయండి. ప్రదర్శించండి.

వస్తాడె ఒక సర్వాయె పాపడు ఉయ్యాలో
తల్లి కొలువుకు వడిగా వెళ్ళేను ఉయ్యాలో
తల్లికి దండముగా నిలిచేను ఉయ్యాలో
కొట్టుదును గోల్కొండ పట్నము ఉయ్యాలో
ఢిల్లీకి మోజూరు నౌదును ఉయ్యాలో
మూడు గడియల బందరు కొట్టుదును ఉయ్యాలో
మూలకోట కందనూరు సూచి ఉయ్యాలో
బంగారు కడియాలు పెట్టుదును ఉయ్యాలో
మనకంతా బంట్రోతు తనమేలు ఉయ్యాలో
అడుగో పాపడు వస్తాన్నంటే ఉయ్యాలో
మన కులకాయి మానవద్దురా సర్వాయిపాప ఉయ్యాలో
కుందేళ్లు కూర్చుండపడెను ఉయ్యాలో
లేడిపిల్లలు లేవ లేవు ఉయ్యాలో
పసిబిడ్డలు పాలుతాగరు ఉయ్యాలో
నక్కలు సింహాలు తొక్కబడును ఉయ్యాలో
పావురం కోటకట్టెను ఉయ్యాలో

TS 7th Class Telugu 12th Lesson Questions and Answers Telangana రాణి శంకరమ్మ

మొగలు రాజులకు ఉయ్యాలో
పక్కలో బల్లెమై ఉయ్యాలో
కునుకులేకుండ చెసె ఉయ్యాలో
రుస్తుందిల్ ఖాన్ ఉయ్యాలో
పాపన్న నెదిరించె ఉయ్యాలో
రుస్తుందిల్ ఖాన్ను ఉయ్యాలో
నుగ్గునుగ్గుచేసె ఉయ్యాలో
ఓరుగల్లు కోటను ఉయ్యాలో
పాపన్న ముట్టడించె ఉయ్యాలో
బందీలు విడిపించె ఉయ్యాలో
గోల్కొండ కోట చేరె ఉయ్యాలో
మొగలు సైన్యాన్ని ఉయ్యాలో
మూడుచెర్ల నీళ్ళు తాగించె…ఉయ్యాలో

విశేషాంశాలు

మెతుకు సీమ : నేటి మెదక్ జిల్లా. ఒకప్పుడు ఇక్కడ (వరి అధికంగా పండించేవారు) మెతుకులు అధికంగా దొరికేవి కాబట్టి మెతుకుసీమ అన్నారు. మంజీరకదేశం, గుల్షనాబాద్ అని కూడ గతంలో పిలిచేవారు.

రాయబాగిన్ : రాయబాగిన్ అంటే రాజసహోదరి అని అర్థం. నిజాం పాలకుడు రాణీశంకరమ్మకు ఇచ్చిన బిరుదు ఇది.

అన్నపూర్ణ : కాశీలోని విశ్వనాథుని ఇల్లాలిపేరు అన్నపూర్ణ. అందరికీ ఆహారం(అన్నం) పెట్టేదే అన్నపూర్ణ.

అందోలు : గతంలో ఒక సంస్థానం. ప్రస్తుతం మెదక్ జిల్లాలో ఉన్నది.

నైజాం రాజులు : తెలంగాణను గతంలో పరిపాలించిన నిజాం వంశీయులైన మహ్మదీయ రాజులు పీష్వాలు : ఒకప్పుడు మహారాష్ట్రను పరిపాలించిన రాజులు

TS 7th Class Telugu 12th Lesson Important Questions రాణి శంకరమ్మ

ప్రశ్న 1.
పాఠం ఆధారంగా స్త్రీలను గూర్చి మీ అభిప్రాయం తెలుపండి.
జవాబు.
స్త్రీలు అబలలుకాదు సబలలే! వారు కూడా తగిన అవకాశాలు లభిస్తే వీరవనితలుగా రాణిస్తారు. చదువులలో, ఆటలలో, రాజకీయాలలో, పాలనలో ఇలా ఏ రంగంలోనైనా రాణిస్తారు. అన్ని అవకాశాలు లభించాలే కాని స్త్రీలు ముందుంటారు అనే అభిప్రాయం ఏర్పడింది.

అర్ధాలు

  • వాణి = వాక్కు
  • బాణి = పద్ధతి
  • దీప్తి = వెలుగు / కాంతి
  • స్వప్నం = కల
  • నారీమణి = వనితలలో మేటి
  • వనిత = స్త్రీ
  • సరళము = తేలిక
  • ఆరితేరు = నైపుణ్యం సంపాదించు
  • కాడికి = దగ్గరకు
  • దప్పు = దాహం
  • దిగ్గున = వెంటనే
  • కుతంత్రం = చెడు ఆలోచన
  • పెనిమిటి = భర్త
  • హితము = మేలు
  • చెంత = దిగులు / బాధ
  • సమరం = యుద్ధము
  • కుత్తుక = పీక
  • శూరత్వ = పరాక్రమం

పర్యాయపదాలు

  • వాణి = వాక్కు, పలుకు, ఉక్తి
  • పులి = శార్దూలం, వ్యాఘ్రం
  • లక్ష్మి= లచ్చి, సంపద, శ్రీ
  • అతి = మిక్కిలి, ఎక్కువ, చాలా
  • తండ్రి = పిత, జనకుడు
  • నీర = పానీయము, జలము
  • దండము = నమస్కారము, వందనము
  • దిగ్గున = వెంటనే, తటాలున
  • హితము = మేలు, మంచి
  • చెంత = దగ్గర, సమీపము
  • సముద్రము = సాగరము, కడలి, సంద్రము
  • పోరు = యుద్ధము, జగడము, తగాదా, కదనము
  • కొండ = అద్రి, గిరి, పర్వతము
  • భర్త = పతి, పెనిమిటి, నాథుడు, మగడు, మొగుడు
  • అడవి = అరణ్యము, వనము
  • పల్లె =గ్రామం, ఊరు, జనపదం

నానార్థాలు

  • దేవత = వేలుపు, దేవభావము, జ్ఞానేంద్రియము
  • దుఃఖము = బాధ, మనోవ్యధ, నొప్పించునది
  • చీకటి = అంధకారము, దుఃఖము, చీకటిగల రాత్రి
  • కాళి = పార్వతి, పాలపురుగు, బొగ్గు, రాత్రి
  • కేసరి = సింహము, గుర్రము, ఆంజనేయుని తండ్రి, శ్రేష్ఠుడు
  • గురువు = ఉపాధ్యాయుడు, తండ్రి, రాజు, బృహస్పతి
  • రాజు = ప్రభువు, ఇంద్రుడు, చంద్రుడు
  • రూపు = ఆకారము, అందము, రీతి
  • లోకము = భూలోకము, జనము, సమూహము
  • సమయము = కాలము, సిద్ధాంతము, ఒప్పుదల

TS 7th Class Telugu 12th Lesson Questions and Answers Telangana రాణి శంకరమ్మ

ప్రకృతి – వికృతులు

ప్రకృతి – వికృతి

  • భాష – బాస
  • విద్య – విద్దె
  • హృదయము – ఎద
  • లక్ష్మి – లచ్చి
  • విద్య – విద్దె
  • రోషము – రోసము
  • సంతోషము – సంతసము
  • రాజు – రాయలు
  • బాధ – బాద
  • భక్తి – బత్తి
  • బంధము – బందము
  • రూపము – రూపు
  • గర్వము – గరువము

సంధులు

  • లయాత్మకత – లయ + ఆత్మకత – సవర్ణదీర్ఘ సంధి
  • చరితార్థం – చరిత + అర్ధం – సవర్ణదీర్ఘ సంధి
  • అమృతాన్నం – అమృత + అన్న- సవర్ణదీర్ఘ సంధి
  • అజరామరం – అజర +అమరం – సవర్ణదీర్ఘ సంధి
  • గరుడాద్రి – గరుడ + అద్రి – సవర్ణదీర్ఘ సంధి
  • రంగనాథాలయం – రంగనాథ + ఆలయం – సవర్ణదీర్ఘ సంధి
  • పోరాడుతున్నది – పోరాడుతు + ఉన్న – ఉత్వ సంధి
  • నాకొద్దు – నాకు + ఒద్దు – ఉత్వ సంధి
  • పరుగెత్తె – పరుగు + ఎత్తు – ఉత్వ సంధి
  • భయమింత – భయము + ఇంత – ఉత్వ సంధి
  • ఇంతైన – ఇంత + ఐన – అత్వ సంధి

సమాసములు

  • శక్తి సామర్థ్యాలు – శక్తి మరియు సామర్థ్యం – ద్వంద్వ సమాసం
  • సంస్కృతీ సంప్రదాయాలు- సంస్కృతి మరియు సంప్రదాయం – ద్వంద్వ సమాసం
  • దారితెన్నులు – దారి మరియు తెన్ను – ద్వంద్వ సమాసం
  • కొండాకోనలు – కొండ మరియు కోన – ద్వంద్వ సమాసం
  • ధైర్యసాహసాలు – ధైర్యం మరియు సాహసం – ద్వంద్వ సమాసం
  • పాడిపంటలు – పాడి మరియు పంట – ద్వంద్వ సమాసం
  • ఆట పాటలు – ఆట మరియు పాట – ద్వంద్వ సమాసం
  • చదువు సందెలు – చదువు మరియు సందె – ద్వంద్వ సమాసం
  • అమ్మలక్కలు – అమ్మలు మరియు అక్కలు – ద్వంద్వ సమాసం

I. కింది వాక్యాలలోని పర్యాయ పదాలు గుర్తించి వేరుగా వ్రాయండి.

అ) శంకరమ్మపై పులి పంజా విసిరింది. ఆ శార్దూలాన్ని ఎదిరించింది. శంకరమ్మ కట్టెతో కొట్టి కాళ్ళతో తొక్కి ఆ వ్యాఘ్రాన్ని చంపింది.
జవాబు.
అ) పులి, శార్దూలం, వ్యాఘ్రం

ఆ) ఇతరుల హితము కోరువారికి మేలు జరుగును.
జవాబు.
ఆ) హితము, మేలు

ఇ) పోరు నష్టము పొందు లాభము. జగడమాడితే ప్రశాంతత ఉండదు.
జవాబు.
ఇ) పోరు, జగడము

ఈ) గౌడిచర్ల అనే పల్లెలో శంకరమ్మ పుట్టింది. ఆ జనపదంలో ఎదిగింది. నేడు ఆ గ్రామానికి ఎంతో పేరు తెచ్చింది.
జవాబు.
ఈ) పల్లె, జనపదం, గ్రామం

II. కింది వాక్యములలోని నానార్ధపదాలను గుర్తించి రాయండి.

అ) గురువులను గౌరవించాలి. రాజు తన ప్రజలను కన్నబిడ్డలవలే పాలించాలి.
జవాబు.
అ) గురువు – రాజు

ఆ) ఈ లోకంలో అనేక జంతురాశులున్నాయి. ఆయా రాశుల సమూహమే ఈ ప్రపంచం.
జవాబు.
ఆ) లోకం – సమూహము

ఇ) దేవతలకు రాజు ఇంద్రుడు. ఆకాశంలో చంద్రుడు వెన్నెలను కురిపిస్తాడు.
జవాబు.
ఇ) రాజు – ఇంద్రుడు, చంద్రుడు

III. కింది వాక్యాల్లోని ప్రకృతి వికృతులను గుర్తించండి.

అ) విద్యలేని వాడు వింత పశువు. విద్దె ఉన్నవాణ్ణి అందరూ గౌరవిస్తారు.
జవాబు.
విద్య (ప్ర) – విద్దె (వి)

ఆ) లక్ష్మి అంటే సంపద. చదువే నిజమైన లచ్చి. లేనివారిని ఎవరూ గౌరవించరు.
జవాబు.
లక్ష్మి (ప్ర) – లచ్చి (వి)

TS 7th Class Telugu 12th Lesson Questions and Answers Telangana రాణి శంకరమ్మ

ఇ) భక్తి లేని శివ పూజలు అనవసరం. బత్తితో చేసే పని ఆనందాన్నిస్తుంది.
జవాబు.
భక్తి (ప్ర) – బత్తి (వి)

ఈ) సంతోషమే సగం బలం. సంతసం లేనివాడు సుఖంగా ఉండడు.
జవాబు.
సంతోషము (ప్ర) – సంతసము (వి)

ఉ) రాజు చేతికత్తి రక్తం వర్షిస్తుంది. రాయలు తన ప్రజలను సుఖంగా పాలించాలి.
జవాబు.
రాజు (ప్ర) – రాయలు (వి)

IV. కింది పదాలను విడదీసి సంధులను గుర్తించండి.

అ) సువర్ణాక్షరములు
జవాబు.
సువర్ణ+అక్షరములు – సవర్ణదీర్ఘసంధి

ఆ) కాళ్ళరగ
జవాబు.
కాళ్ళు + అరగ – ఉత్వసంధి

ఇ) రాజంతట
జవాబు.
రాజు + అంతట – ఉత్వసంధి

ఈ) వాననక
జవాబు.
వాన + అనక – అత్వసంధి

ఉ) ఏడేండ్లు
జవాబు.
ఏడు + ఏండ్లు- ఉత్వసంధి

V. కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసాల పేర్లు గుర్తించండి.

అ) వాలి సుగ్రీవులు
జవాబు.
వాలి మరియు సుగ్రీవుడు – ద్వంద్వ సమాసం

ఆ) పంచపాండవులు
జవాబు.
ఐదు సంఖ్యగల పాండవులు – ద్విగు సమాసం

ఇ) టక్కుటెక్కులు
జవాబు.
టక్కు మరియు టెక్కు – ద్వంద్వసమాసం

ఈ) దశ దిశలు
జవాబు.
పది సంఖ్యగల దిశలు – ద్విగు సమాసం

ఉ) తల్లీ పిల్లలు
జవాబు.
తల్లి మరియు పిల్ల – ద్వంద్వ సమాసం

VI. కింది గద్యాన్ని చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.

“శ్రీరామునిశోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు. సీతాదేవిని తీసుకొని రావడంలో తాను తగిన సాయం చేస్తానన్నాడు. పరివారంతో సహా రావణుని చంపడానికి తన ఆలోచనలను అన్నిటిని ఉపయోగిస్తానన్నాడు. దుఃఖం మంచిదికాదు కావున ఎపుడూ విలపించవద్దన్నాడు. ఎల్లప్పుడూ దుఃఖించే వారికి సుఖము ఉండదు. తేజస్సు పోతుంది. చివరకు ప్రాణాలు కూడా పోవచ్చు. కనుక ఈ విచారస్థితి నుండి బయటపడమని ధైర్యం నూరి పోశాడు. ప్రశ్నలు :

అ) శ్రీరాముని శోకం పోగొట్టడానికి ప్రయత్నించింది ఎవరు?
జవాబు.
సుగ్రీవుడు

ఆ) శ్రీరాముడు ఎవరికోసం దుఃఖిస్తున్నాడు ?
జవాబు.
సీతకోసం

ఇ) ‘సహాయం’ అనే పదానికి పై గద్యంలో ఉపయోగించిన వికృతి పదం ఏది?
జవాబు.
సాయం

ఈ) దుఃఖము వలన ఏమేమి జరగవచ్చు ?
జవాబు.
దుఃఖం వలన తేజస్సు పోతుంది. ప్రాణాలు కూడా పోవచ్చు.

ఉ) శోకానికి పై గద్యంలో వాడిన పర్యాయ పదాలేవి?
జవాబు.
దుఃఖము, విచారము

TS 7th Class Telugu 12th Lesson Questions and Answers Telangana రాణి శంకరమ్మ

VII. కింది వచనం చదివి అయిదు ప్రశ్నలు తయారు చేయండి.

సమాజంలో మతం అంతర్భాగం. మన సమాజంలో ఎన్నో మతాలున్నాయి. ఏ మతమైనా అందరికి ప్రయోజనాన్ని చేకూర్చే సిద్ధాంతాలనే కలిగి ఉంటుంది. ఇతరుల మతం కంటే తమ మతం గొప్పదని చెప్పుకొనేవారు అవివేకులు. వారు తమ స్వార్థానికే ఇతర మతాలను దూషించుటకు ప్రయత్నిస్తారు. సర్వమతాలను సమానంగా భావించి మంచిని స్వీకరించు వారే ఉత్తములు.

ప్రశ్నలు :

అ) సమాజంలో అంతర్భాగమైనదేది?
ఆ) ప్రతి మతంలోని ప్రధాన సిద్ధాంతమేమి?
ఇ) ఎవరు అవివేకులు?
ఈ) ఉత్తములు ఎవరు?
ఉ) స్వార్థపరులు ఏం చేస్తారు?

పాఠం నేపథ్యం

తెలంగాణలో వీరనారీమణులకు కొదువలేదు. అటువంటి నారీమణులలో అందోలు సంస్థానాన్ని పాలించి, శత్రువులను గడగడలాడించిన రాణి శంకరమ్మ ధైర్యసాహసాలు కలిగిన వీరవనిత. ఈమె సంగారెడ్డి సమీపంలోని గౌడిచర్లలో 1702లో పుట్టింది. రాజమ్మ, సంగారెడ్డి దంపతులకు జన్మించిన శంకరమ్మ బాల్యం నుంచి నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్నది. ప్రజల్ని కన్నబిడ్డలుగా పరిపాలించిన రాణిశంకరమ్మ శత్రువుల పాలిట అపరకాళికవలె ధైర్యసాహసాలు ప్రదర్శించింది. చరిత్రలో తనకంటూ చెరగని స్థానం సంపాదించుకున్నది. మెదకు ప్రాంతాన్ని చరితార్థం చేసిన రాణి శంకరమ్మ గూర్చి ఈ పాఠం తెలియజేస్తుంది.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం గేయకథ ప్రక్రియకు చెందినది. కథతో కూడి, గేయరూపంలో ఉంటుంది. లయాత్మకత, ప్రాసలతోకూడి పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. సరళమైన భాషలో అలవోకగా సాగుతుంది.
సంపన్ముడుంబై రంగకృష్ణమాచార్యులు రచించిన “మెదక్ జిల్లాంతర్గత అందవోలు శౌర్య వీర్యరెడ్డి త్రయం” (వీరుల గాథలు) పుస్తకం ఆధారంగా రూపొందించిన పాఠ్యాంశమిది.

ప్రవేశిక

అవకాశం లభిస్తే మహిళలు ఏపనినైనా సాధించగలరు. తమ శక్తిసామర్థ్యాలను పదునుపెట్టుకొని, ఆత్మవిశ్వాసంతో ముందడుగువేస్తారు. ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తారు. అటువంటి కోవకు చెందిన మహిళ శంకరమ్మ. ఆమె యుద్ధరంగంలో చూపిన ప్రతిభను, ఆమె జీవిత చరిత్రను ప్రజలు పాటలుగా పాడుకుంటారు. ఇంత కీర్తిపొందిన రాణిశంకరమ్మ చరిత్రను బతుకమ్మ పాట రూపంలో తెలుసుకుందాం.

నేనివి చేయగలనా?

TS 7th Class Telugu 12th Lesson Questions and Answers Telangana రాణి శంకరమ్మ 2

TS 8th Class Telugu 11th Lesson Questions and Answers Telangana కాపుబిడ్డ

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 11th Lesson కాపుబిడ్డ Textbook Questions and Answers.

TS 8th Class Telugu 10th Lesson Questions and Answers Telangana కాపుబిడ్డ

TS-8th-Class-Telugu-Guide-11th-Lesson-కాపుబిడ్డ-1

ప్రశ్న 1.
తొలివానకురిసే కాలాన్ని ఏమంటారు ?
జవాబు.
తొలివాన కురిసే కాలాన్ని తొలకరి అంటారు.

ప్రశ్న 2.
ఈ గేయం ఎవరి గురించి చెపుతుంది ?
జవాబు.
ఈ గేయం రైతును గురించి చెబుతుంది.

TS 8th Class Telugu 11th Lesson Questions and Answers Telangana కాపుబిడ్డ

ప్రశ్న 3.
గేయానికి బొమ్మకి మధ్య గల సంబంధం ఏమిటి ?
జవాబు.
“గేయంలో హలమె మన సౌభాగ్య బలమనుచు చాటి పొలము దున్నాలోయి” అని ఉన్నది. బొమ్మలో హలం పట్టుకొని రైతు పొలం దున్నుతున్నాడు. గేయంలోను, బొమ్మలోనూ ఉన్నభావం ఒక్కటే.

ప్రశ్న 4.
బంగారు పంటలను పండించే రైతుల గురించి మీకేం తెలుసు ?
జవాబు.
రైతు ఎండ, వాన లెక్క చెయ్యకుండా పగలు, రాత్రి తేడా లేకుండా పొలంలో శ్రమపడతాడు. తన సుఖాన్ని త్యాగం చేసి తన చెమటతో నేలను తడిపి బంగారు పంటలను పండిస్తాడు. ప్రపంచానికి ఆకలి తీరుస్తాడు.

ఆలోచించండి – చెప్పండి 

ప్రశ్న 1.
రైతులవలె, ఇతర వృత్తులవారు పడే బాధలను తెల్పండి.
జవాబు.
కుండలు చేసే కుమ్మరి మన్ను తీసి మెత్తగా తొక్కి మృదువైన ముద్దగా చేసి ఎంతో జాగ్రత్తగా సారె మీద పెట్టి రకరకాల ఆకారాలలో కుండలు చేస్తాడు. అతడు పడే కష్టానికి మనం కుండల కిచ్చే ధర ఏపాటి ? కమ్మరి కొలిమి దగ్గర ఆ వేడిని భరిస్తూ ఇనుము కాల్చి రకరకాల పనిముట్లు తయారు చేస్తాడు. కత్తి, కొడవలి వంటివి వేడి మీదనే సాగకొడతాడు. సాలెవారు పత్తి నుంచి నూలు తీసి మగ్గం మీద రకరకాల కళాకృతులతో వస్త్రాలు నేస్తారు. ఇలాగే ఎంతో మంది. వారెంత కష్టపడినా ఆ శ్రమకు తగిన ఫలితం లభించక పేదరికంతో క్రుంగిపోతున్నారు.

ప్రశ్న 2.
మూడు కాలాల్లో రైతులు చేపట్టే పనులేవి?
జవాబు.
రైతులు వేసవి కాలం, వానాకాలం, చలికాలం అనే మూడు కాలాల్లోనూ ఎండనక, వాననక పొలాల్లో పనులు చేస్తూనే ఉంటారు. దానికోసం ప్రతిరోజూ పొలం పనులు చేయవలసి ఉంటుంది. దుక్కిదున్నటం, చదును చేయటం, విత్తనాలు చల్లటం, నీరు పెట్టటం, కలుపు తీయటం, క్రిమికీటకాల నుండి పంటను రక్షించుకోవటం, కోతలు, నూర్పిళ్ళు, ధాన్యాన్ని బస్తాలకెత్తి గమ్యం చేర్చటం – ఇలా ఏడాది పొడుగునా రైతులకు పనులుంటూనే ఉంటాయి.

TS 8th Class Telugu 11th Lesson Questions and Answers Telangana కాపుబిడ్డ

ప్రశ్న 3.
పేదరైతు కష్టాలు ఎట్లాంటివి?
జవాబు.
పేదరైతు తిండికి బట్టకు కరువై ఎంతో భారంగా బ్రతుకు గడుపుతూ ఉంటాడు. పంట పండించడానికి భూస్వాముల దగ్గర ఎక్కువ వడ్డీలకు అప్పుచేసి తీర్చలేక బాధపడుతూ మరింత పేదవాడై పోతాడు. ఎండ, వాన, చలి, పగలు-రాత్రి అనే తేడాలు లేకుండా ఎంతో కష్టపడి పనిచేసి పంట పండించినా గిట్టుబాటు ధర రాదు. దళారులు ఎంతో తక్కువ ధరకు కొనేసి మరింత లాభాలకు అమ్ముకొని ధనవంతులైపోతూ పేదవారిని మరింత పేదవారుగా మారుస్తారు. ఇలా పేదరైతు అనేక కష్టాలు పడుతున్నాడు.

ప్రశ్న 4.
సద్వర్తనకు దోహదం చేసే గుణాలు ఏవి?
జవాబు.
సద్వర్తన అంటే మంచి ప్రవర్తన. సద్వర్తనకు సహాయం చేసే గుణాలు : తెల్లవారు జామున నిద్రలేవాలి. ప్రతినిత్యం స్నానం చేయాలి. ఎవరితోనూ పోట్లాడకూడదు. అతిగా మాట్లాడకూడదు. మితభాషిగా ఉండాలి. ఇతరుల మేలు కోరాలి. ప్రకృతిలోని ఎండ, వాన, చలి వంటి ధర్మాలను ఓర్చుకోగలగాలి. ధనము, పదవులు మొదలైన వాటిపై ఆశపడరాదు. ఇవన్నీ సద్వర్తనకు దోహదం చేసే గుణాలు.

ప్రశ్న 5.
రైతుకు భగవంతుడు ఇంద్రపదవిని ఇస్తున్నాడని ఎట్లా చెప్తారు?
జవాబు.
ఇంద్రుడు అమృతం తాగుతాడు. స్వర్గం అతని నివాసస్థానం. పట్టువస్త్రాలు, వజ్రాల కవచం ధరిస్తాడు. అతని చుట్టూ సేవకులు ఉంటారు. రైతు తినే జొన్నకూడు పరమాన్నమై, చల్లనీరు అమృత మౌతుంది. నేత వస్త్రాలే జరీ, పట్టు వస్త్రాలై కంబళి వజ్రాల కవచమౌతుంది. అతని చేతిలోని ముల్లుకర్ర వజ్రాయుధమై చుట్టూ వున్న పశువులే సేవకులౌతారు. అందమైన పైరులు నందన వనాలౌతాయి. రైతు పండించిన పంట భూమిలోని నిధులౌతాయి. ఇలా భగవంతుడు రైతు చుట్టూ ఉన్న పరిస్థితులను స్వర్గంతో సమానంగా మార్చి రైతును దేవేంద్రుని చేశాడు అని కవి వర్ణించాడు.

ప్రశ్న 6.
రైతుకు, మునికి గల పోలికలు ఏమిటి?
జవాబు.
ముని బ్రాహ్మీ ముహూర్తంలో అంటే తెల్లవారు జామున లేస్తాడు. ఉత్తమమైన, స్వచ్ఛమైన ఆహారం తీసుకుంటాడు. వదరుబోతు కాకుండా మితభాషిగా ఉంటాడు. మోసాలు చేయడం, నాటకాలాడటం, ఆడంబరాలకు పోవడం మునుల విషయంలో జరగదు. ఈ గుణాలు అన్నీ రైతులో కూడా ఉన్నాయి.

ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

ప్రశ్న 1.
“రైతే దేశానికి వెన్నెముక” అంటారు కదా! నేడు రైతుల పరిస్థితి ఎట్లా ఉన్నది ? చర్చించండి.
జవాబు.
శరీరాన్ని నిలబెట్టే ముఖ్య భాగం వెన్నెముక. అలాగే దేశంలోని ప్రజలకు అన్నంపెట్టి, దేశాన్ని నిలబెట్టేది రైతు. రైతు లేనిదే రాజ్యంలేదు… అంటూ ఉంటారు. రాత్రనక పగలనక రైతులు ఆరుగాలాలు కష్టపడి పండిస్తుంటే మనం కాలి మీద కాలేసుక్కూర్చుని ఆనందంగా ఆ ఫలాన్ని అనుభవిస్తున్నాం. ఆనందాన్నిచ్చిన రైతు పరిస్థితి ఏమిటని మనం ఆలోచించటం లేదు.

పేదరైతుకు సామాన్యుడైన వినియోగదారుకు మధ్య ఉన్న దళారులు మేడల మీద మేడలు కడుతూ కోట్లు కూడబెడుతూ ఉంటే రైతుకు గిట్టుబాటు ధరలేక రెండు పూటలా గంజి కూడ లేక పస్తులుంటున్నాడు. పంటకోసం తెచ్చిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకొంటున్నాడు. ఇదీ ఈనాడు రైతు పరిస్థితి. ఉత్పత్తిదారులకు తమ ఉత్పత్తులకు తగినధర తామే నిర్ణయించుకొనే అవకాశం ఇస్తే వారి బతుకు కొంచెమైనా మెరుగుపడుతుందని నా అభిప్రాయం.

TS 8th Class Telugu 11th Lesson Questions and Answers Telangana కాపుబిడ్డ

ప్రశ్న 2.
రైతు యొక్క జీవనవిధానం గురించి, కవికి ఉన్న అభిప్రాయం గురించి మాట్లాడండి.
జవాబు.
రైతు యొక్క జీవన విధానాన్ని కవి ముని జీవితంతో పోల్చాడు. మునుల వలె రైతు ఎండ, వాన, చలి, లెక్కచేయడు. చీకటి, వెలుగు, పగలు, రాత్రి అనే తేడాలు లేకుండా పనిచేస్తాడు. మౌనంగా ఉంటాడు. ఎవరినీ మోసం చేయడు. రైతు దినచర్య ముని దినచర్యలాగే ఉంటుంది. మంచి ప్రవర్తన కలిగి ఉంటాడు. ఇంద్రభోగాలనైనా లెక్కచేయకుండా తిరస్కరిస్తాడు. ఈ లక్షణాలన్నీ మునుల జీవిత విధానాన్ని పోలి ఉంటాయని కవి అభిప్రాయపడ్డాడు.

ప్రశ్న 3.
“రైతులు కష్టసుఖాలను సమానంగా స్వీకరిస్తారు” – అని ఎందుకంటారు?
జవాబు.
ఎండల తాకిడికి తట్టుకోడానికి ఎత్తుమేడలు లేకపోతే చెట్ల నీడల్లో ఉంటాడు. ఇల్లంతా వాన చినుకులతో తడిసిపోతే పొదరిళ్ళలో కాలక్షేపం చేస్తాడు. వణికించే చలి నుండి కాపాడుకోడానికి గడ్డివాములలో దూరతాడు. రాత్రి పూట చీకటిలో ఏ పుట్టల మీదో మిట్టల మీదో కాలం గడుపుతాడు. మునుల్లాగా కారడవుల్లో పాములు, తేళ్ళు, పులులు మొదలైన వాటి మధ్య తిరుగుతూ ఉంటాడు. ఇలా కష్టాలను కూడా సుఖాలుగానే భావిస్తాడు రైతు.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

1. కింది పద్యమును చదివి ఖాళీలను పూరించండి.
‘కష్టసుఖముల నొకరీతి గడుపువారు
శత్రు మిత్రుల సమముగా సైచువారు
సైరికులు దప్ప నంతటి శాంతులెవరు ?
కాన చేమోడ్చి వారినే గౌరవింతు.

భావం : సైరికులు అనగా రైతులు వారు లను మిత్రులను. శత్రువు సహిస్తారు. వారి శాంత స్వభావం వల్లనే వారిని నేను చేతులు జోడించి గౌరవిస్తాను.

2. కింది పద్యాన్ని చదివి దానికింద ఉన్న ప్రశ్నలకు సరియైన సమాధానాన్ని గుర్తించండి.

“ఎండకాలము గుడిసెల నెగరజిమ్మ
తొలకరించిన వర్షము తొట్రుపరుప
ముసురుపెట్టగా రొంపిలో మూల్గుచున్న
కర్షకా! నీదు పల్లెను గాంతురెవరు.”

(అ) ‘రొంపి’కి సరియైన అర్థాన్ని గుర్తించండి.
(ఎ) నీరు
(బి) వరద
(సి) గాలి
(డి) బురద
జవాబు:
(డి) బురద

(ఆ) ‘ఎగురజిమ్ముట’ అనగా
(ఎ) కాలిపోవుట
(బి) గాలికి పైకి విసురు
(సి) కూలిపోవుట
(డి) కిందపడుట
జవాబు:
(బి) గాలికి పైకి విసురు

TS 8th Class Telugu 11th Lesson Questions and Answers Telangana కాపుబిడ్డ

ఇ. ‘తొలకరించుట’ అంటే నీకు ఏమి తెలుస్తున్నది ?
(ఎ) పలకరించుట
(బి) పులకరించుట
(సి) వర్షాకాలం మొదలు
(డి) ఎండాకాలం మొదలు
జవాబు:
సి) వర్షాకాలం మొదలు

ఈ. కాంతురెవరు అనడంలోని ఉద్దేశం
(ఎ) ఎవరు చూస్తారు?
(బి) ఎవరు పట్టించుకుంటారు?
(సి) ఎవరు అంటారు?
(డి) ఎవరు వింటారు?
జవాబు:
(ఎ) ఎవరు చూస్తారు?

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. “ఇంద్రపదవి కన్నా రైతు జన్మ గొప్పది” ఎందుకు ? (లేదా) ఇంద్రుని కంటె రైతు గొప్పవాడని ఎలా చెప్పగలవు ?
జవాబు.
ఇంద్ర పదవిలో ఉన్నవాడు భోగభాగ్యాలు కోరతాడు. స్వర్గసుఖాలు, అప్సరసలు, అమృతపానం లేకుండా ఉండలేడు. నందనవనంలో విహారాలు వారి కెంతో ప్రీతి. ఈ విధంగా విలాసాల్లో మునిగిపోతాడు ఇంద్రుడు. కాని తనరక్షణ తను చేసుకోలేక ఇతరులపై ఆధారపడతాడు. రైతుకు పైన చెప్పిన సుఖాలన్నీ నీచమైనవి. తన చుట్టూ ఉన్నవాటినే స్వర్గ సౌఖ్యాలుగా భావిస్తాడు. తన అవసరానికి మించి ఏమీ కోరడు. తానే అందరి ఆకలి తీరుస్తాడు. అంతేగాక తన రక్షణ తానే చూసుకోగలడు. ఎవరి మీదా ఆధారపడడు. అందుకే ఇంద్రుని కన్న రైతు జన్మ గొప్పది.

ఆ. “జై జవాన్! జై కిసాన్!!” అంటారు కదా! రైతుకు, సైనికునికి గల పోలికలు ఏమిటి?
జవాబు.
జవాను అంటే సైనికుడు. రాత్రింబవళ్ళు ఆరుబయట సరిహద్దుల్లో కాపలా కాస్తాడు. శత్రువులను తన మాతృభూమిలోనికి అడుగుపెట్టనివ్వడు. భూమాతను సదా కాపాడుతాడు. ఎండ, వాన, చలి, రాత్రి, పగలు అనే తేడాలు లేకుండా అన్ని ప్రకృతి ధర్మాలనూ ఓర్పుతో భరిస్తాడు. క్రూరమృగాలను కూడా లెక్కచేయడు. కిసాను అంటే రైతు కూడా రాత్రింబవళ్ళు ఆరుబయట తన పొలాలకు కాపలాకాస్తాడు. ఈతి బాధల నుండి పంటను రక్షించుకుంటాడు. నేల తల్లిని సదా గౌరవిస్తాడు. ఎండ, వాన, చలి, రాత్రి, పగలు అనే తేడాలు లేకుండా అన్ని ప్రకృతి ధర్మాలను ఓర్పుతో భరిస్తాడు. క్రూరమృగాలను కూడా లెక్కచేయడు.

TS 8th Class Telugu 11th Lesson Questions and Answers Telangana కాపుబిడ్డ

ఇ. రైతులకు గల ఐదు సమస్యలను చెప్పండి.
జవాబు.
రైతు ఎండ, వాన, చలి, చీకటి అన్నీ భరిస్తూ ఏడాది పొడుగునా విశ్రాంతి లేకుండా పనిచేస్తూనే ఉంటాడు. అతనికి ఉండడానికి సౌకర్యవంతమైన ఇల్లులేదు. ఇంత కష్టపడినా భార్యాబిడ్డలకు తృప్తిగా తిండిపెట్టలేడు. తన ఆకలి దప్పికలు తీరవు. చలి వణికిస్తున్నా చల్లని నేలపై పండుకోవలసిందే. ఎర్రటి ఎండలో, రాళ్ళల్లో, ముళ్ళలో నడుస్తున్నా కాళ్ళకు చెప్పులుండవు. వడగళ్ళు రాలుతున్నా, పెనుగాలికి దుమ్ము కళ్ళలో పడుతున్నా ఉరుముల్లో మెరుపుల్లో తిరగవలసిందే. ఇవన్నీ రైతుకు గల సమస్యలే.

ఈ. “రైతు ప్రకృతితో మమైకమై ఉంటాడు” దీనిని సమర్థించండి.
జవాబు.
రైతు అహర్నిశలు ప్రకృతితో మమైకమై ఉంటాడు. వేసవి కాలపు మండు టెండలో కూడా తన పని పూర్తి చేస్తాడు. వానలో నానిపోతూ, చలిలో వణికి పోతూ కూడా నేలను దున్నుతాడు. రాత్రనక, పగలనక రాళ్ళలోను అడవిలోను తడబడకుండా తిరుగుతుంటాడు. నిద్రవస్తే తలకింద చేయి పెట్టుకొని ఏ చింతా లేకుండా గులకరాళ్ళపై నిద్రపోతాడు. ఇలా ప్రకృతిలోని ప్రతిమార్పునూ గమనించుకుంటూ ఉండేవాడు రైతు మాత్రమే అనిపిస్తుంది.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ. “రైతు సంతోషంగా ఉంటే సమాజం బాగుంటుంది” సమర్థిస్తూ రాయండి.
జవాబు.
రైతు కష్టం : రైతు ఏడాది పొడుగునా కష్ట పడి పంటలు పండించాలి అంటే అతనికి ఎంతో శక్తికావాలి. ఆ శక్తి కావాలంటే కడుపునిండా తినాలి. కడుపునిండా తింటేనే గదా కష్టపడగలిగేది! అలాగే అతడి భార్యాబిడ్డలు సుఖంగా ఉంటే అతడు సంతోషించగలడు. వాళ్ళు సుఖంగా ఉండాలంటే రైతుపడ్డ కష్టానికి తగినంత ఫలితం చేతికందాలి. మనం రైతును సుఖపడనిస్తున్నామా? లేదే! అతను చేసిన కష్టానికి తగిన వెలకట్టకుండా కష్టాల ఊబిలో ముంచేస్తున్నాం.

మన సుఖం : రైతు శ్రమఫలాన్ని ఆనందంగా అనుభవిస్తున్నాం. రైతు ఆరుగాలం కష్టపడి పండిస్తున్న ఆహారాన్ని తింటూ, రైతును పట్టించుకోవడం లేదు. రైతును చిన్న చూపుచూస్తున్నాం.

పరిస్థితి మారాలి : సమాజంలో ఈ పరిస్థితి మారాలి. రైతుకు తన శ్రమఫలానికి గిట్టుబాటు ధర నిర్ణయించుకునే అవకాశం కల్పించాలి. దళారులను, స్వార్థ పరులనూ పక్కన పెట్టి వినియోగదారునికీ రైతుకూ సరాసరి సంబంధాన్ని ఏర్పరిస్తే ఇద్దరూ సుఖపడతారు. ఆకాశానికి రెక్కలు కట్టుకొని ఎగిరిన ధరలు నేలకు దిగుతాయి. రైతు కూడా సమాజంలో పదిమందితో బాటు తాను కూడా ఆనందంగా జీవించగలుగుతాడు. అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది.

TS 8th Class Telugu 11th Lesson Questions and Answers Telangana కాపుబిడ్డ

ఆ. కర్షకా ! నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను అని కవి అన్నాడు కదా ! అలా నమస్కరించదగిన రైతులు చేస్తున్న కృషిని వివరించండి.
జవాబు.
దేశంలోని ప్రజలకు అన్నం పెట్టి, దేశాన్ని నిలబెట్టేది రైతు. రాత్రినక, పగలనక రైతులు ఎల్లవేళలా, ఆరుకాలాలు కష్టపడి పనిచేసి, పంట పండిస్తుంటే, అతని కష్టఫలాన్ని మనం అనుభవిస్తున్నాం. కానీ రైతు పరిస్థితి ఏమిటని ఆలోచించము. రైతుకి, వినియోగదారుడికి మధ్యనుండే దళారులు లక్షలకొద్దీ ధనం సంపాదిస్తుంటే, రైతులకు గిట్టుబాటు ధరలేక, రెండుపూటలా తీసుకోవడానికి గంజీ కూడా లేక పస్తులుంటాడు.

పంట కోసం తెచ్చిన అప్పులు తీర్చలేక ఒక్కొక్కసారి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటాడు. ఎండ, వాన, చలి లెక్కచేయడు. నిరంతరం తనువేసిన పంటను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటాడు. ఎవరినీ మోసం చేయడు. కష్టసుఖాలు ఏవి వచ్చినా మునిలాగా ఒకే విధంగా ఉంటాడు. సుఖాలకు పొంగిపోవడం, కష్టాలకు కుంగిపోవడం ఉండదు. అందుకే కవి కర్షకా ! నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను అని అన్నాడు.

IV. సృజనాత్మకత/ప్రశంస

1. కింది వానిలో ఒకదానికి జవాబు రాయండి.

అ. పాఠం ఆధారంగా రైతు ఆత్మకథను రాయండి.
రైతు ఆత్మకథ
జవాబు.
నేనొక రైతును. ఆరుగాలాలు శ్రమించి పంటలు పండిస్తాను. ప్రపంచానికి ఆకలి తీరుస్తాను.మండు వేసవి ఎండలలో ఆ వేడికి కాలిపోతూ పనిచేస్తాను. వానలో నానుతూ చలికి వణుకుతూ నాగలితో పొలం దున్నుతాను. అడవులలోనైనా రాళ్ళలోనైనా రాత్రిగాని పగలుగాని ఎలా అవసరమైతే అలా వెళుతుంటాను. అలిసిపోతే గులకరాళ్ళను కూడా పట్టించుకోకుండా తలకింద చేయి పెట్టుకొని పడుకుంటాను.

నాకు శత్రువులు, మిత్రులు, కష్టసుఖాలు అన్నీ సమానమే. కార్చిచ్చును, ముళ్ళను, వడగళ్ళను, పెనుగాలి దుమ్మును, ఉరుములు మెరుపులను అన్నింటినీ భరిస్తాను. మంచు కురుస్తున్నా పచ్చిక మీద పడుకుంటాను. ఒక్కొక్కసారి కటిక చీకట్లో దారితప్పిపోతే ఆకలి దప్పికలకు బాధ పడతాను. ఇన్ని కష్టాలు పడినా నా భార్యాబిడ్డలకు కడుపు నిండా తిండి పెట్టలేకపోతున్నాను.

ఎండలకు వానలకు చలికి తట్టుకోడానికి నాకు మంచి ఇల్లు లేదు. చెట్ల నీడల్లోనూ పొదరిళ్ళ బురదలోనూ గడ్డివాములలోనూ తలదాచుకుంటాను. ఒక్కొక్కసారి క్రూరమృగాల మధ్య తిరగవలసి వచ్చినా ధైర్యం కూడగట్టుకొని ఉంటాను. తెల్లవారు జామునే లేచి స్నానం చేయటం, సాత్వికమైన ఆహారం తినటం నా పద్ధతి. ఎవరితోనూ వాదాలు పెట్టుకోను. మాయమాటలు, మోసాలు, ఆడంబరాలు నాకు అక్కరలేదు. నాకున్నంతలో ఇతరులకు పంచి పెడతాను.

ఈశ్వరుడిచ్చే ఇంద్రపదవిగాని, ప్రకృతి కాంత వలపులుగాని నాకవసరంలేదు. నేను తినే జొన్న సంకటే నాకు పరమాన్నం. నేను కట్టే నూలు బట్టలే చీనాంబరాలు. నా చేతికర్ర నా వజ్రాయుధం. నా కంబళి నాకు వజ్రకవచం. నా పంటపొలాలే నందనవనాలు, నిధి నిక్షేపాలు. నాకున్నంతలో తృప్తిపడతాను. పరుల కోసం పాటుపడతాను. నేను కోరేదొక్కటే. నా శ్రమను గుర్తించండి. తగిన విలువ నివ్వండి.

(లేదా)

అందరికి అన్నం పెట్టే రైతు కృషిని అభినందిస్తూ అభినందన పత్రం రాయండి.

అభినందన పత్రం

కృషీవలా!
ఆరుగాలాలు శ్రమించి అమృతం లాంటి పంటలు పండించి ప్రజలకు పంచుతున్నావు. ఒక్కదినమైనా విశ్రాంతి ఎరుగక కృషిచేస్తావు. నీ కృషికి మా కైమోడ్పులు.

అన్నదాతా!
అన్నంలేనిదే ఏప్రాణీ బ్రతకలేదు. అటువంటి ప్రాణాధారమైన అన్నాన్ని ఉత్పత్తి చేసి మనుషులను బ్రతికిస్తున్నావు. గడ్డీగాదంతో పశువులను బ్రతికిస్తున్నావు. అటువంటి నీకు మా జోతలివే.

హాలికా!
పచ్చని పైరులతో చెట్లతో కాలుష్యాన్ని రూపు మాపి అందరికీ ప్రాణవాయువు నందిస్తున్నావు. ఏ వైద్యుడూ ప్రసాదించలేని ఆరోగ్యాన్ని నీవు ప్రసాదిస్తున్నావు. నీకివే మా కృతజ్ఞతాంజలులు.

అట్టహాసాలు, ఆర్భాటాలు లేకుండా ఉన్నంతలో సంతృప్తి పడిపోతూ సత్ప్రవర్తనతో జీవిస్తావు. తగువులు నీ దరి దాపులకు రావు. మితభాషివై అందరి మేలు కోరుతూ అందరి ప్రేమను చూరగొన్నావు. నీ ఆదర్శ జీవనానికి మా అభినందనలందుకో.

V. పదజాల వినియోగం

1. కింది పదాలతో సొంతవాక్యాలు రాయండి.

(అ) హలం : నాగలి : హలం బలరాముని ఆయుధం.
(ఆ) సైరికులు : రైతులు : సైరికులు అహోరాత్రాలు కష్టపడి పంటలు పండిస్తారు.

2. కింది పట్టికలోని ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి.

రాత్రి, గరువము, బ్రహ్మ, పసరము, పసువు, చిచ్చు, చందురుడు, పశువు, చంద్రుడు, శుచి, గర్వము, రాతిరి, బొమ్మ

ప్రకృతివికృతి
రాత్రిరాతిరి
బ్రహ్మబొమ్మ
శుచిచిచ్చు
గర్వముగరువము
పశువుపసరము, పసువు
చంద్రుడుచందురుడు


3. కింది వాక్యాలలోని ఒకే అర్థం గల మాటలను గుర్తించి రాయండి.

(అ) మౌనంగా ఉన్నంత మాత్రాన మునికాలేడు. తాపసికి దీక్ష ఎక్కువ.
జవాబు.
ముని, తాపసి

(ఆ) వానరులు రాళ్ళు తీసుకొనిరాగా, ఆ శిలలతో నలుడు సముద్రంపై వారధిని నిర్మించాడు.
జవాబు.
రాయి, శిల

(ఇ) మాపువేళ పక్షులు గూటికి చేరుతాయి. సాయంకాలం ఆవులమందలు ఇళ్ళకు చేరుతాయి.
జవాబు.
మాపువేళ – సాయంకాలం

VI. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది పదాలను విడదీసి, సంధిపేరు రాయండి.

(అ) తాపసేంద్ర = తాపస + ఇంద్ర = గుణసంధి
(ఆ) పరమాన్నము = పరమ + అన్నము = సవర్ణదీర్ఘ సంధి
(ఇ) కేలెత్తి = కేలు + ఎత్తి = ఉత్వ సంధి
(ఈ) గాఢాంధకారము = గాఢ + అంధకారము = సవర్ణదీర్ఘ సంధి
(ఉ) కొంపంత = కొంప + అంత = అత్వసంధి

2. కింది వాక్యాల్లోని అలంకారాన్ని గుర్తించండి. దానిని గురించి వివరించండి.

(అ) రైతు మునివలె తెల్లవారు జామునే లేస్తాడు.
జవాబు.
ఈ వాక్యంలో ఉపమాలంకారం ఉన్నది. ఒక విషయాన్ని మరొక విషయంతో అందంగా పోల్చి చెప్పటం ఉపమాలంకారం. వర్ణించే విషయం ఉపమేయం. పోలిక చెప్పే విషయం ఉపమానం. పోలిక తెలిపేపదం ఉపమావాచకం. ఉపమాన ఉపమేయాలకు గల పోలిక సమాన ధర్మం. ఇక్కడ రైతును మునితో పోల్చి వర్ణించారు. రైతు-ఉపమేయం. ముని ఉపమానం. వలె ఉపమావాచకం. తెల్లవారు జామున లేవడం సమానధర్మం. కనుక ఇది ఉపమాలంకారం.

(ఆ) వంగిన చెట్టు కొమ్మ గొడుగు పట్టినట్లుందా! అన్నట్లు ఉన్నది.
జవాబు.
ఈ వాక్యంలో ఉత్ప్రేక్షాలంకారం ఉన్నది. ఉత్ప్రేక్ష అంటే ఊహించటం. పోలికను ఊహించటం ఉత్ప్రేక్షాలంకారం. ఇక్కడ చెట్టుకొమ్మను గొడుగువలె ఊహించారు. కనుక ఉత్ప్రేక్షాలంకారం.

TS 8th Class Telugu 11th Lesson Questions and Answers Telangana కాపుబిడ్డ

(ఇ) అక్కడ లేక ఇక్కడ లేక మరెక్కడ ఉన్నట్లు ?
జవాబు.
ఈ వాక్యంలో వృత్త్యనుప్రాస అనే శబ్దాలంకారం ఉన్నది. ఒకే హల్లు ఒక వాక్యంలో చాలాసార్లు వస్తే దానిని వృత్త్యనుప్రాస అంటారు. ఈ వాక్యంలో ‘క్క’ అనే అక్షరం ఆవృత్తమైంది.

3. ఛందస్సులో గణవిభజన తెలుసుకున్నారు కదా! ఇప్పుడు గణాల ఆధారంగా పద్య లక్షణాలను తెలుసుకుందాం.

TS-8th-Class-Telugu-Guide-11th-Lesson-కాపుబిడ్డ-2

పై పాదాల్లో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలున్నాయి.
మొదటి అక్షరానికి లె (ఎ) – రీ ( ఈ) యు ( ఉ) – చుం ( ఉ)
10వ అక్షరానికి యతి చెల్లింది.
పై పాదాలలో ప్రాసగా క్క-క్కి-అనే హల్లు వచ్చింది.
పై పాదాల్లో 20 అక్షరాలున్నాయి.
పై పద్య పాదాలు “ఉత్పలమాల” వృత్త పద్యానివి.

నాలుగు పాదాల్లో ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉండే పద్యాన్ని వృత్త పద్యం అంటారు.
పద్య పాదాల్లో మొదటి అక్షరాన్ని యతి అంటారు. ఈ యతి అక్షరానికి అదే అక్షరంగానీ, వర్ణమైతి కలిగిన మరో అక్షరంగానీ అదే పాదంలో నియమిత స్థానంలో రావడాన్ని ‘యతి నియమం’ అంటారు.
పద్య పాదాలలో రెండవ అక్షరానికి ‘ప్రాస’ అని పేరు. పద్యపాదాల్లో రెండో అక్షరంగా ఒకే హల్లు రావడాన్ని “ప్రాస నియమం” అంటారు.

పై ఉదాహరణ ననుసరించి ‘ఉత్పలమాల’ పద్య లక్షణాలను ఈ విధంగా పేర్కొనవచ్చు.

ఉత్పలమాల :
(1) ఇది వృత్త పద్యం.
(2) పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
(3) ప్రతి పాదంలో వరుసగా భ-ర-న-భ-భ-ర-వ అనే గణాలు వస్తాయి.
(4) ప్రతి పాదంలో 10వ అక్షరం యతి స్థానం.
(5) ప్రాస నియమం వుంటుంది.
(6) ప్రతి పాదంలోను 20 అక్షరాలుంటాయి.

4. ఈ కింది పద్య పాదాలను పరిశీలించండి.
TS-8th-Class-Telugu-Guide-11th-Lesson-కాపుబిడ్డ-3
పై పద్యపాదాలలోని గణాలను పరిశీలిస్తే…
ప్రతి పాదంలోను న-జ-భ-జ-జ-జ-ర అనే గణాలు ఉన్నాయని తెలుస్తున్నది. ఇట్లా ప్రతి పాదంలోను పై గణాలు రావడం చంపకమాల పద్య లక్షణం. పై పద్యపాదాల్లో ‘అ’కు ‘త్త’తో, ‘బు’ కు “పుతో యతిమైత్రి చెల్లింది. ప్రాసగా ని – న్ అనే హల్లులు ఉన్నవి. పై పాదాల్లో 21 అక్షరాలున్నాయి.

చంపకమాల:
(1) ఇది వృత్త పద్యం.
(2) పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
(3) (పతి పాదంలో వరుసగా న-జ-భ-జ-జ-జ-ర అనే గణాలు వస్తాయి.
(4) (పతి పాదంలో 11వ అక్షరం యతి స్థానం.
(5) (ప్రాస నియమం వుంటుంది.
(6) (పత్రి పాదంలోను 21 అక్షరాలుంటాయి.

TS 8th Class Telugu 11th Lesson Questions and Answers Telangana కాపుబిడ్డ

5. కింది పద్యపాదాలకు గణ విభజన చేసి ఏ పద్యపాదాలో గుర్తించి రాయుండి.
(అ) తనకు ఫలంబలేదని యెదం దలపోయడు క్ర్తిగోరు నా
జవాబు.
TS-8th-Class-Telugu-Guide-11th-Lesson-కాపుబిడ్డ-2
ఇది చంపకమాల పద్య పాదం. ఇందులో ప్రతి పాదంలోను నజభజజజర అనే గణాలు ఉన్నాయి. పై పాదంలో మొదటి అక్షరమైన ‘త’ కు 11వ అక్షరమైన ‘దం’తో యతిమైత్రి. పాదానికి 21 అక్షరాలుంటాయి.

(ఆ) ఆకలి దప్పులన్ వనట నందిన వారికి పట్టెడన్నమో
జవాబు.
TS-8th-Class-Telugu-Guide-11th-Lesson-కాపుబిడ్డ-3
ఇది ఉత్పలమాల పద్యపాదము. ఇందులో (ప్రతి పాదంలోను భరనభభరవ అనే గణాలుంటాయి. మొదటి అక్షరమైన ‘ఆ’ కు 10వ అక్షరమైన ‘నం’ తో యతిమైత్రి.

(ఇ) బలయుతుడైన వేళ నిజబంధుడు తోడ్పడుగాని యాతడే
జవాబు.
TS-8th-Class-Telugu-Guide-11th-Lesson-కాపుబిడ్డ-4
ఇది చంపకమాల పద్య పాదము. ఇందులో (ప్రతి పాదానికి నజభజజజర అనే గణాలుంటాయి. మొదటి అక్షరమైన ‘బ’కు 11వ అక్షరమైన ‘బ’తో యతిమైత్రి.

(ఈ) హర్తకుఁ గాదుగోచరమహర్నిశమున్ సుఖ పుష్టిసేయుస
జవాబు.
TS-8th-Class-Telugu-Guide-11th-Lesson-కాపుబిడ్డ-5
ఇది ఉత్పలమాల పద్యపాదము. ఇందులో ప్రతి పాదంలోను భరనభభరవ అనే గణాలుంటాయి. మొదటి అక్షరమైన ‘హ’ కు 10వ అక్షరమైన ‘హతో యతిమైత్తి.

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని

శ్రీ ప్రసార మాద్యమాల్లో (టి.వి./రేడియో) వచ్చే వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలను చూడండి. వాటి వివరాలను వాటి వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను గురించి నివేదిక రాయండి.
జవాబు.
పరిచయం :
టీవీలో నేను చూసిన వ్యవసాయదారుల కార్యక్రమంలో డా॥ వి. ప్రవీణ్ రావుగారితో శిరీష చేసిన ఇంటర్వ్యూ నాకు బాగా నచ్చింది.

సేకరణ :
డా॥ ప్రవీణ్ రావు గారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈనాడు సేంద్రియ వ్యవసాయం గురించిన ప్రయత్నాలకు సంబంధించి ఎన్నో విషయాలు చెప్పారు. మన దేశంలో సేంద్రియ వ్యవసాయ స్థితిగతులపై శిరీష అడిగిన ప్రశ్నలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. 25 ని॥ పాటు సాగిన ఈ ఇంటర్వ్యూలో సేంద్రియ వ్యవసాయ విధానం, లాభాలు, శిక్షణ, రైతు విద్య, మార్కెటింగ్, వివిధ వ్యక్తులు, సంస్థల సహకారాలు తదితర విషయాలెన్నో చోటుచేసుకున్నాయి. నాకు అర్థమైన విషయాలను నివేదికలో పొందుపరుస్తున్నాను.

నివేదిక :

ప్రపంచమంతటా వాతావరణ కాలుష్యం అధికమై మానవ జీవనం ప్రమాదంలో పడిపోయిన ఈ తరుణంలో జీవవైవిధ్య రక్షణకు, పర్యావరణ పరిరక్షణకు, మానవారోగ్యాన్ని కాపాడుకునేందుకు, తక్కువ ఖర్చుతో రైతులకు అన్ని విధాల మేలు చేకూరుస్తూ లాభాలను అందించగల వ్యవసాయ విధానం “సేంద్రియ సేద్యం”. ప్రకృతిలో సహజంగా లభించే ఆకులు, బెరళ్ళు, పశువుల పేడ, నూనెలు, రసాలు ఉపయోగించి పంటలకు అవసరమైన ఎరువును, క్రిమిసంహాయరక మందులను తయారు చేయడం, విత్తనశుద్ధి, పంటల పెంపకం, కలుపు తీయడం వంటి వ్యవసాయ పద్ధతుల్లో రసాయనిక పదార్థాలను నియంత్రించడం సేంద్రియ సేద్యం యొక్క ప్రత్యేకతలు.

ఈ విధానంలో వ్యవసాయం చేయడంలో పశుపోషణ కూడా ఒక భాగం. పశువులను శ్రద్ధగా, పద్ధతి ప్రకారం పోషించడం వల్ల వాటి నుంచి లభించే మలమూత్రాలు సస్యరక్షణకు, పోషణకు ఎంతగానో ఉపకరిస్తాయి. మంచి వాతావరణం, కావలసిన పోషక పదార్థాలు తగినంతగా లభించడం వల్ల పశుపక్ష్యాదులు వృద్ధి పొంది, పంట నష్టాన్ని చాలా వరకు నివారిస్తాయి. దిగుబడి పెరుగుతుంది. ఉత్పత్తుల్లో నాణ్యత, స్వచ్ఛత కారణంగా మార్కెట్లో అధిక ధరలు పలికి, రైతుకు లాభం చేకూరుస్తాయి. ఈనాడు మార్కెట్లో దొరికే అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులూ రసాయనాల బారిన పడి ప్రజారోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయి.

సేంద్రియ సేద్యంలో అది పూర్తిగా నివారింపబడటం వల్ల అందరూ వాటిని ఇష్టపడతారు. యాపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లకు కూడా రసాయనాల బాధ తప్పని ఈ కాలంలో ఇటువంటి వ్యవసాయం ఎంతో శ్రేష్ఠమని, భారతదేశంలో పరిస్థితులు, జీవన విధానం ఈ పద్ధతికి బాగా నప్పుతుందని డా॥ వి. ప్రవీణ్ రావుగారు చెప్పడం ఎంతో ఆనందదాయకం. ఇటువంటి వ్యవసాయ పద్ధతుల్ని రైతులందరూ అనుసరించాలని, ప్రజలు బాగా ఆదరించాలని, ప్రభుత్వం సరైన తోడ్పాటును అందించాలని, వ్యవసాయాధికారులు చక్కగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను.

TS 8th Class Telugu 11th Lesson Important Questions కాపుబిడ్డ

పర్యాయపదాలు:

  • నటనము = నర్తనము, నాట్యము
  • పశువులు = జంతువులు, మృగములు
  • ఉడుపులు = వస్త్రములు, దుస్తులు
  • కన్ను = అక్షి, నయనం, నేత్తం
  • కర్షకుడు = హాలికుడు, కృషీవలుడు, సైరికుడు, రైతు
  • కేలు = చేయి, కరయు
  • హలము = సీరము, సాగలి
  • ఆకలి = క్షుత్తు, బుభుక్ష
  • సంయమి = తాపసి, యోగి, ముని
  • చీకటి = తమస్సు, అంధకారము
  • ఆహారము = భోజనము, అన్నము, కూడు
  • బురద = అడుసు, కర్దమము

నానార్థాలు:

  • కాన – కాబట్టి, అడవి
  • మాపు – సాయంత్రం, మాసిపోవుట
  • జంతువు – ప్రాణి, మృగము
  • ప్రొద్దు – ఉదయము, సూర్యుడు
  • సుధ – అమ్తము, సున్నము
  • మిత్రుడు – స్నేహితుడు, సూర్యుడు

వ్యుత్పత్త్యర్థాలు:

  • కర్షకుడు – కృషి (వ్యవసాయము) చేయువాడు – రైతు
  • హాలికుడు – హలము చేత పట్టినవాడు – రైతు
  • సైరికులు – సీరము (నాగలి) ధరించినవారు – రైతులు
  • వేత్త – బాగా తెలిసినవాడు – జ్ఞాని
  • సంయమి – యమ నియమాదులను పాటించువాడు – ఋుషి

ప్రకృతిలు – వికృతిలు:

  • గౌరవము – గారవము
  • సర్పము – సప్పయ
  • బ్రధ్న – ప్రొద్దు
  • స్నానము – తానము
  • ఆహారము – ఓగిరము
  • వర్ణము – వన్నె
  • చిహ్నము – చిన్నె
  • కష్టము – కస్తి
  • వ్యథ – వెత

సంధులు:

మానులెవరు = మౌనులు + ఎవరు – ఉత్వసంధి
హలమూని = హలము + ఊని – ఉత్వసంధి
పండుదీవు = పడుదువు + ఈవు – ఉత్వసంధి
నీవిల్లు = పండుదు + ఈవు – ఉత్వసంధి
పొదరిండ్లు = నీవు + ఇల్లు – ఉత్వసంధి
ఉనికిపట్టగు = ఉనికిపట్టు + అగు – ఉత్వసంధి
చేతులెత్తి = చేతులు + ఎతి – ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి అవుతుంది.

కూటికై = కూటికి + ఐ = ఇత్వ సంధి
చేయిడి = చేయి + ఇడి = ఇత్వ సంధ
లేనట్టి = లేని + అట్టి = ఇత్వ సంధి

సూత్రం : ఏమి మొదలైన పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.

ఇంతైన = ఇంత + ఐన = అత్వసంధి
లేకున్న = లేక + ఉన్న = అత్వసంధి
సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.

సంయమీంద్ర = సంయమి + ఇంద్ర = సవర్ణదీర్ఘసంధి
వ్యాఘాది = వ్యాఘ్ + ఆది = సవర్ణదీర్ఘసంధి
ఉత్తమాహారము = ఉత్తమ + ఆహారము = సవర్ణదీర్ఘసంధి
వజ్రాయుధము = వజ్ర + ఆయుధము = సవర్ణదీర్ఘసంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.

సమాసాలు:

  • కష్టసుఖాలు = కష్టమును, సుఖమును – ద్వంద్వ సమాసం
  • శతుమితులు = శత్రువును, మిత్రుడును – ద్వంద్వ సమాసం
  • వన్నెచిన్నెలు = వన్నెయు, చిన్నెయు – ద్వంద్వ సమాసం
  • వడగండ్ల దెబ్బలు = వడగండ్ల చేత దెబ్బలు – తృతీయా తత్పురుష సమాసం
  • సమ్యమేంద్రుడు = సమ్యములలో (శేష్ఠుడు – షష్ఠీ తత్పురుష సమాసం
  • ఎండల వేడి = ఎండల యొక్క వేడి – షష్ఠీ తత్పురుష సమాసం
  • తాపసేంద్ర = తాపసులలో ఇందుడా – షష్ఠీ తత్పురుష సమాసం
  • చే ఈర్ర = చేతి యందలి కర్ర – సప్తమీ తత్పురుష సమాసం

పద్యాలు – ప్రతిపదార్థాలు- భావాలు:

1. సీ. మండువేసవియెండ, మంటలోఁ(గ్రాగుచు
బూనిన పనిసేయు మౌనులెవరు?
వానలో నానుచు, వణకుచు హలమూని
చలియందు దున్నెడి సాధులెవరు?
ఱాళ్లో నడవిలో, రాతిరింబవలును
తడబాటు లేనట్టి, తపసులెవరు?
తలక్రింద చేయిడి, గులకశిలల పైన
వెత లేక నారిగిన వేత్తలెవరు?
గీ. కష్ట సుఖముల నొకరీతి గడుపువారు
శత్రుమిత్రుల సమముగా సైచువారు
సైరికులుదప్ప నంతటి శాంతులెవరు?
కాన చేమోడ్చి వారినే గౌరవింతు.

(పతిపదార్థం:

మండు వేసవి ఎండన్ – మండిపోయే వేసవికాలపు ఎండలో
మంటలోన్ – వేడిలో
(క్రాగుచు – కాలిపోతూ
పూనిన – దీక్షవహించిన (తాను చేయాలనుకొన్న)
పని + చేయు – పనిని పూర్తి చేసే
మౌనులు – మహర్షులు
ఎవరు = ఎవ్వరు ?
వానలో నానుచు = వర్షంలో తడిసిపోతూ
వణకుచు = గజగజ వణుకుతూ
హలము + ఊని = నాగలి ధరించి
చలి + అందు = చలిలో కూడా
దున్నెడి = పొలందున్నే
సాధులు + ఎవరు = సత్పురుషులు ఎవరు
ఱాళ్ళలోన్ = రాళ్ళలోనూ
అడవిలోన్ = అడవిదారిలోనూ
రాతిరిన్ = రాత్రివేళ
పవలున్ = పగటివేళ
తడబాటు = ఏవిధమైన భయము
లేని + అట్టి = లేనటువంటి
తపసులు + ఎవరు = తాపసులు ఎవరు
తలకింద = తల కింద
చేయి + ఇడి = చేయిపెట్టుకొని
గులక శిలలపైన = గులక రాళ్ళ మీద
వెతలేకన్ = ఏ బాధాలేకుండా
ఒరిగిన = పడుకున్న
వేత్తలు + ఎవరు = పండితులెవరు
కష్ట సుఖములన్ = కష్టములోను, సుఖములోను
ఒకరీతిన్ = ఒకేవిధముగా
గడుపువారు = కాలం గడిపే వారు
శత్రుమిత్రులన్ = విరోధులను, స్నేహితులను
సమముగా = సమాసంగా
సైచువారు = ఆదరించువారు
సైరికులు + తప్ప = రైతులు తప్ప
అంతటి = అంత గొప్ప
శాంత మూర్తులు = ఓర్పుగలవారు
ఎవరు = ఇంకెవరున్నరు ?
కాన = అందుకే
చేయి + మోడ్చి = చేతులు ముడిచి
వారిని + ఏ = ఆ రైతులనే
గౌరవింతు = సన్మానిస్తాను

తాత్పర్యం :
మంటలు మండే ఎండకాలపు ఎండలలో మగ్గిపోతూ కూడా చేపట్టిన పని కొనసాగించే ఋషు లెవరు ? వానలో నానుతు చలిలో వణుకుతు నేలను దున్నే సాధువు లెవరు ? రాత్రనక, పగలనక, రాతి నేలల్లో, అడవుల్లో తడబడకుండ తిరిగే తాపసులెవరు? ఎన్ని బాధలున్నా లెక్కచేయక, గులకరాతి నేలమీదనే తలకింద చేయి పెట్టుకొని విశశమించే విజ్ఞులెవరు ? కష్టసుఖాలను ఒకే విధంగా, శత్రు, మిత్రులను ఒకే మాదిరిగా సహించే శాంత స్వభావులెవరు ? రైతులుగాక! అందుకే చేతులు జోడించి వారికి మొక్కి గౌరవిస్తాను.

2. సీ. కార్చిచ్చులోబడి వంటకమ్ముల ద్రొక్కి
వడగండ్ల దెబ్బల వడుదువీవు
పెనుగాలి చే దుమ్ము కనులందుఁబడుచుండ
నుఱుము మెఱుములలో నుందువీవు
మంచుపైఁబడుచుండ మాపుశీతంబులో
పచ్చికనేలపై పండుదీవు
కటిక చీకటి గప్పి యెటుదారిగానక
నాఁకలి డప్పిచే నడల దీవు
గీ. ఇన్నియిడుముల గుడిచి నీ విల్లుజేర
నాలుపిల్లలు కూటికై యంగలార్చ
చలనమింతైన లేని యో సంయమీంద్ర
కర్షకా! నిన్ను చేమోడ్చి గౌరవింతు.

(ప్రతిపదార్థం :

కర్షకా = ఓ రైతన్నా!
కార్చిచ్చులోన్ + పడి = మంటలలో మండిపోతూ
కంటకమ్ములన్ = ముళ్ళను
పెనుగాలిచే = పెద్దగాలులు వీచినప్పుడు
దుమ్ము = ధూళి
కనులందున్ = కాళ్ళలో
పడుచుండన్ = పడిపోతూ ఉండగా
ఉఱుము మెఱుములలో = ఉరుములూ మెరుపుల మధ్య
ఉందువు + ఈవు = నీవుంటావు
మంచు = మంచు
పైన్ + పడుచు + ఉండ = మీద కురుస్తూ ఉంటే
మాపు = రాల్రిపూట
శీతంబులో = చలిలో
పచ్చికనేలపై = గడ్డి భూముల మీద
పండుదు + ఈవు = పడుకుంటావు
కటిక చీకటి + కప్పి = దట్టమైన చీకటి వ్యాపించి
ఎటుదారి + కానకన్ = ఏ దారియు కనిపించక
ఆకల దప్పిచే = ఆకలితో, దాహంతో
అడలుదు + ఈవు = సీవు బాధపడుతుంటావు
అన్న + ఇడుములన్ = అన్ని కష్టాలనూ
కుడిచి = అనుభవించి
నీవు = రైతువైన నీవు
ఇల్లున్ + చేరన్ = ఇంటికి చేరేసరికి
ఆలుపిల్లలు = భార్యయు, బిడ్డలును
కూటిక + ఐ = తిండికోసం
అంగలు + ఆర్చ = ఎదురు చూస్తుండగా
ఇంత + ఐన = కొంచెము కూడా వారి గురించి
చలనము లేని = కదలిక లేని
ఓ సంయమి + ఇంద్రా = ఓ మునివర్యా
నిన్ను = నిన్ను
చేయి + మోడ్చి = రెండు చేతులు జోడించి
గౌరవింతు = గౌరవిస్తాను

తాత్పర్యం : ఓ కర్షకుడా! మిక్కిలి వేడిమిని సహించి, ముండ్లమీద నడిచి, వడగండ్ల వాన పాలవుతావు. గాలి దుమ్ములు కమ్మినా, ఉరుములు మెరుపులతో ఉన్నా చలించవు. మంచుకురిసే రాత్రి వేళల్లో, చలిలో, పచ్చిక నేలమీదనే నిద్రపోతావు. ఎటూ దారి కానరాని కటిక చీకటి రాత్తులలో అప్పుడప్పుడు ఆకలిదప్పికలతోనే కాలం గడపవలసి వస్తుంది. ఇన్ని కష్టాలను భరించి నీవు ఇంటికి చేరినప్పుడు భార్య, పిల్లలు ఆకలితో అన్నానికై అంగలారుస్తూ, నీ కోసం ఎదురు చూస్తూ ఉంటే నీవు యతీశ్వరుని వలె ఏ మాత్రమూ చలనం లేకుండా ఉంటావు. అలాంటి నీకు చేతులు జోడించి నేను నమస్కరిస్తాను.

3. సీ. ఎండల వేడికి నెత్తుమేడలు లేక
చెట్టుల నీడకుఁ జేరినావు
కొలది చినుకులకే కొంపంత తడియగా
పొదరిండ్ల బురదలో మెదలినావు
గడగడ వడకుచు గడ్డివాముల దూఱి
చలికాలమెట్టులో జరిపినావు
పుట్టలొల్కిల మిట్ట బట్టిమాపటివేళ
గాఢాంధకారము గడపినావు
గీ. సర్పవృశ్చిక వ్యాఘాది జంతువులకు
నునికి పట్టగుచోట్లలో మునులభంగి
తిరిగి యేప్రొద్దు నుందువో దివ్యమూర్తి
కర్షకా! చేతులెత్తి నే గౌరవింతు।

ప్రతిపదార్థం :
దివ్యమూర్తి = ఓ దేవతామూర్తీ!
కర్షకా = రైతన్నా!
ఎండల వేడికి = ఎండలవలన కలిగిన వేడికి తట్టుకోటానికి
ఎత్తు మేడలు లేక = ఎత్తెన భవనాలు లేక
చెట్టుల నీడకు = చెట్ల నీడలలోకి
చేరినావు = వచ్చియున్నావు
కొలది = కొద్దిపాటి
చినుకులకే = వానచినుకులకే
కొంప + అంత = ఇల్లంతా
తడియగా = తడిసిపోగా
పొదరు + ఇండ్ల బురదలో = పొదరిళ్ళ దగ్గరున్న బురదలో
మెదలినావు = తిరిగినావు
గడగడ వడకుచు = చలికి వణికిపోతూ
గడ్డివాములన్ + దూరి = గడ్డి కుప్పలలో దూరి
చలికాలము = శీతాకాలము
ఎట్టులు + ఓ = ఎలాగో అతి కష్టం మీద
జరిపినావు = గడిపేశావు
పుట్టలొల్కుల = పుట్టదగ్గర గుట్టల దగ్గర
మిట్టన్ + పట్టి = ఎత్తు ప్రదేశాలలోను తిరిగి
మాపటివేళ = రాత్తిపూట
గాఢ + అంధ కారము = దట్టమైన చీకటిలో
గడిపినావు = కాలం గడిపావు
సర్ప = పాములు
వృశ్చిక = తేళ్ళు
వ్యాఘ్ర = పులులు
ఆది = మొదలైన
జంతువులకు = మృగములకు
ఉనికి పట్టు = సివాసము
అగుచోట్లలో = ఐన ప్రదేశములలో
మునులభంగి = రుషుల వలె
ఏప్రోద్దు = ఏవేళనైనా
తిరిగి = తిరుగుతూ
ఉందువు + ఓ = ఉంటావుగదా
చేతులు + ఎత్తి = రెండు చేతులు పైకెత్తి
నే = నేను
గౌరవింతు = నిన్ను గౌరవిస్తాను

తాత్పర్యం : ఓ రైతన్నా! ఎత్తైన మేడలు లేని నీవు ఎండ వేడిమి నుండి కాపాడుకోవటానికి చెట్టు నీడకు చేరావు. కొద్దిపాటి వానకే కురిసే నీ ఇంటిని వదిలి బురదనిండిన గుబురుల్లోనే తలదాచుకుంటావు. చలిబారి నుండి తప్పించుకోవటానికి గడ్డివాములను ఆశ్యస్తావు. పనిమీదపడి కటికచీకటి రాత్రులందు కూడ పుట్టలు, మిట్టలపై సంచరిస్తుంటావు. పాములు, తేళ్ళు, పులుల వంటి కక్రర జంతువులకు నిలయమైన తావులలో మునులవలె ఎల్లవేళలా తిరుగాడే నీవు దివ్యమూర్తివే. అట్లాంటి నీకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను.

4. సీ. పనియున్న లేకున్న బ్రాహ్మీముహూర్తాన
తప్పక లేచెడి తాపసేంద్ర!
తెలిసియో తెలియకో దినమున కొకసారి
తానంబు చేసెడి మానిచంద్ర!
ఉండియో లేకనో యుత్తమాహారంబు
చక్కగా గుడిచెడి సంయమీంద్ర
వచ్చియో రాకనో వదరు టోతువుగాక
మితభాషితము సేయు యతికులేంద్ర.
గీ. కుటిల నటనము, గర్వము, కొంటెతనము
వన్నె చిన్నెలు లేని సద్వర్తనుడవు
ఈగియందనురాగివో, యోగిచంద్ర!
కర్షకా! చేతులెత్తి నే గౌరవింతు.

ప్రతిపదార్థం :

యోగిచంద్రా = యోగీశ్వరుడా!
కర్షకా = ఓ రైతన్నా!
పన + ఉన్న = పని ఉన్నప్పుడైనా
లేక + ఉన్న = లేకపోయినా
(బహ్మీ ముహూర్తము + న = తెల్లవారుజామున
తప్పక లేచెడ = తప్పనిసరిగా నిద్రలేచే
తాపస + ఇంద్ర = మునీంద్రుడా!
తెలిసి + ఓ = ఎరుక ఉండియో
తెలూయక + ఓ = ఎరుకలేకయో
దనయునకు = రోజుకు
ఓకసారి = ఒక పర్యాయము
తానంబు చేసెడి = స్నానం చేసి
ఉండి + ఓ = కలిగియుండినా
లేకను + ఓ = ఏమీ లేకపోయినా
ఉత్తమ + ఆహారంబు = మంచి భోజనమును
చక్కగా కుడిచెడి = చక్కగా ఆరగించే
సంయమి + ఇంద్ర = యతులలో గొప్పవాడా!
వచ్చి + ఓ = మాట్లాడటం వచ్చినా
రాకను + ఓ = చేతకాక పోయినా
వదరుబోతువు + కాక = వాగుడు కాయవు కాకుండా
మితభాషితము + చేయు = తక్కువగా మాట్లాడే
యతికుల + ఇంద్ర = యతి[శేష్దడా!
కుటిల నటనము = కుత్సితమైన నాటకాలు
గర్వము = పొగరుబోతు తనము
కొంటెతనము = మోసపు స్వభావము
వన్నె చిన్నెలు = అనవసరపు ఆడంబరాలు
లేని = లేనటువంటి
సత్ + వర్తనుండవు = మంచి ప్రవర్తన కలవాడివి
ఈగి + అందు = దానము చేయుట యందు
అనురాగివి + ఓ = ఆసక్తి కలవాడవు
నేను = నేను
చేతులు + ఎత్తి = రెండు చేతులు జోడించి
గౌరవింతు = నమస్కరిస్తాను

తాత్పర్యం : హాలికుడా! పని ఉన్నా, లేకున్నా నియమంగా తెల్లవారు జాము లేచే నీవు గొప్ప తాపసివే. తెలిసో తెలియకనో రోజుకొక్క సారైనా స్నానమాచరించే నీవు మునిగ్రేష్ఠునివే. ఉండో, లేకనో ఎల్లప్పుడూ సాత్వికాహారమే గ్రహించే నీవు ఋష్శ్వరునివే. తెలిసీ తెలియనితనంవల్ల తక్కువగా మాట్లాడే స్వభావం గల నీవు యతిరాజువే. కుటిల ప్రవర్తన, గర్వం, కొంటె పనులు, ఆడంబరాలు లేని మంచి నడవడి నీది. నీవాక యోగివి. (్రేష్ఠుడవు. దానగుణంపై మక్కువ గలవాడవు. అన్ని సుగుణాలున్న నీకు నా వందనాలు.

5. సీ. పచ్చజొన్న గటక, పరమాన్నమును గాగ
చల్లనీరే సుథా సారమగును
వడుకుడుపులు జరి పట్టుబట్టలు గాగ
కంబళే వఱ్రంపు కవచమగును
వలపలి చే కఱ్ఱ, వఱ్రాయుధముగాగ
పరిజనమే నీకు పశువులగును
అందమౌపైరులే, నందనములుగాగ
నేప్రొద్దుపంటనిక్షేపమగును.
గీ. ఇచ్చుచుండును నీశ్వరుఁడింద్ర పదవి
వచ్చుచుండును ఫ్రకృతి బల్వలపు చేత
దాని జూడవు కన్నెత్తి తాపసేంద్ర!
కర్షకా! నిన్నుకేలెత్తి, గౌరవింతు.

ప్రతిపదార్థం :

కర్షకా = ఓ రైతన్నా!
పచ్చజొన్న గటక = పచ్చలు జొన్నలతో చేసిన సంకటి
పరమ + అన్నము + కాగ = పాయసాన్నం అయితే
చల్లనీరు + ఏ = చల్లని మంచినీళ్ళే
సుధాసారము + అగును =
వడుకు + ఉడుపులు =
జరీపట్టు బట్టలు + కాగా = జరీ వ[స్తాలు,, పట్టు వస్తాలు అయితే
కంబళి + ఏ = గొంగళే
వజ్రము + కవచము + అగును = వజ్రాల కవచం అవుతుంది
వలపలి చే కర్ర = కుడి చేతిలో ఉన్న ఈర్ర
వజ + ఆయుధము + కాగా = ఇంద్రుని వజ్రాయుధము వంటిదయితే
నీకు = రైతువైన నీకు
పశువులు = ఎడ్లు, ఆవులు మొదలైనవి
పరిజనము + ఏ = పరివారముగా
అగును = అవుతాయి
అందము + ఔ = అందంగా ఉన్న
పైరులు + ఏ = పొలాలే
నందనములు + కాగన్ = నందనవనాలైతే
ఏ ప్రొద్దు పంట = ఏ పూట పండించిన పంటైనా
నిక్షేపము + అగును = నిధులుగా ఔతాయి
ఈశ్వరుడు = భగవంతుడు
ఇంద్రపదవి = ఇంద్రుడి సింహాసనమును
ఇచ్చుచు + ఉండును = నీకిస్తూ ఉంటాడు
ప్రకృతి = ప్రకృతి కాంత
బల్వలపు చేత = మిక్కిలి [పేమతో
వచ్చుచు + ఉండును = నీ దగ్గరకు వస్తుంటుంది
తాపస + ఇంద్ర = తాపసులలో [శేష్ఠుడా
దానిని = ఆ వరాలను
కన్ను + ఎత్తి = కళ్ళు తెరిచి
చూడవు = గమనించవు
నిన్ను = అటువంటి నీకు
కేలు + ఎత్తి = చేతులెత్తి
గౌరవింతు = నమస్కరిస్తాను

తాత్పర్యం : ఓ కృషీవలుడా! నీకు పచ్చజొన్న సంకటే పరమాన్నం. చల్లని మంచినీళ్ళే అమృతం. చేతితో వడకిన నూలు బట్టలే పట్టు వ[్త్లాలు. కప్పుకునే గొంగడే నీకు చెక్కుచెదరని కవచం. కుడి చేతిలోని ముల్లుగర్ర నీకు వజ్రాయుధం. పశుసంపదే నీకు పరివారం. నీవు పెంపు చేసిన పంటచేనులే నందనవనాలు. పండించే పంటనే నిధి నిక్షేపాలు. ఓ ముని ఈ విధంగా భగవంతుడు నీకు ఇంద్ర పదవిని ఇస్తున్నాడు. ప్రకృతి కాంతయే నిన్ను వలచి వచ్చినా ఆమెను నువ్వు కన్నెత్తైనా చూడక నీ వృత్తినే మిన్నగా భావిస్తావు. అందుకే నీకు చేతులెత్తి నమస్కరిస్తాను.

పాఠ్యభాగ ఉద్దేశం:

ప్రశ్న. 1.
జవాబు.
ఏ ఏ్రాణికైనా బతకటానికి ఆహారం అవసరం. ఆ అవసరాన్ని తీర్చేది వ్యవసాయం. వ్యవసాయం చేసేవారు రైతులు. వారిని కష్టాలు నిత్యం వెంటాడుతుంటాయి. ఏడాదిలోని మూడు కాలాల్లో ఎప్పటి పనులు అప్పుడే కాచుకొని ఉండి రైతులను తీరికగా ఉండనీయవు. ఆరుగాలం కష్టించి పని చేసినా హాయిగా బతకలేరు. దిన దిన గండం, అమాయకత్వం, అహింసా తత్త్వం రూపుకట్టిన రైతుల కడగండ్లను వివరించడం, (్రామిక జీవనం పట్ల గౌరవాన్ని పెంపొందించడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం.

ఈ పాఠం కావ్య (ప్రక్రియకు చెందినది. వర్ణనతో కూడినది కావ్యం. (ప్రస్తుత పాఠ్యాంశం గంగుల శాయిరెడ్డి రచించిన ‘కాపుబిడ్డ’ కావ్యంలోని ‘కర్షక ప్రశంస’ అనే భాగంలోనిది. రైతు జీవన విధానం, జీవకారుణ్యం, త్యాగబుద్ధి, విరామం ఎరుగని (శమ ఇందులో వర్ణించబడ్డాయి.

కవి పరిచయం:

రచయిత : గంగుల శాయిరెడ్డి
జననం : 08-06-1890
మరణం : 04-09-1975
జన్మస్థలం : జనగామ జిల్లాలోని ‘జీడికల్లు’ గ్రామం.
రచనలు : ‘కాపుబిడ్డ’ కావ్యంతో పాటు ‘తెలుగుపలుకు’, ‘వర్షయోగము’, ‘మద్యపాన నిరోధము’. ఇంకా గణితరహస్యము, ఆరోగ్యరహస్యం అనే అముద్రిత రచనలు కూడా ఉన్నాయి.
ప్రత్యేకతలు : శైలి సరళంగా, సులభంగా గ్రహించ గలిగినది. సహజకవిగా పేరు పొందిన ‘పోతన’ పట్ల ఆరాధనాభావం గల శాయిరెడ్డి, ఆయననే ఆదర్శంగా తీసుకొని అటు హలంతో, ఇటు కలంతో సమానంగా కృషి సాగించాడు.

ప్రవేశిక:

ప్ర. 1.
కాపుబిడ్డ పాఠ్యభాగ ప్రవేశిక తెల్పండి.
జవాబు.
భారతదేశం పూర్వం నుండి వ్యవసాయ ప్రధాన దేశం. గ్రామాలు పూర్వం కన్నా నేడు ఎంతో కొంత ఆధునికమైనవి. అయినా గ్రామాల్లో వ్యవసాయమే ప్రధానవృత్తిగా కొనసాగుతున్నది. స్వయంగా హాలికుడే హాలికుల బాధలను ఏకరువు పెడితే ఆ ఆర్రత ఎంతటి వారికైనా హృదయాన్ని కదిలిస్తుంది కదా! సత్కవుల్ హాలికులైన నేమి’ అని చెప్పిన పోతన వాక్యానికి ఆధునిక కాలంలో ఒక ఉదాహరణ శాయిరెడ్డి. ఇక ఆ రైతు కవి రచనలోకి ప్రవేశిద్దాం.

కఠినపదాలకు అర్థాలు:

  • పూను = దీక్షవహించు
  • క్రాగుచు = ఎండలో కాలిపోతూ
  • హలము = నాగలి
  • సాధులు = సత్పురుషులు
  • వెత = బాధ
  • సైచువారు = సహించువారు
  • సైరికులు = రైతులు
  • చేయిమోడ్చి = చేతులు జోడించి, సమస్కరించి
  • ఈవు = నీవు
  • శీతంబు = చలి
  • చీకటి కప్పి = చీకటి వ్యాపించ
  • ఇడుములు = కష్టాలు
  • అడలుదు = బాధపడుతుంటావు
  • అంగలార్చు = ఎదురుచూచు
  • సంయమి = ముని
  • కుడిచ = అనుభవించి
  • కొంపంతా = ఇల్లంతా
  • మెదులుట = కదులుట, తిరుగుట
  • మాపటివేళ = రాత్రివేళ
  • వృశ్ఛకం = తేలు
  • ఆలు = భార్య
  • వ్యాఘం = పుల
  • బాహ్మీముహూర్తం = తెల్లవారుజాము
  • తానం = స్నానం
  • వదరుటోతు =వాగుడుకాయ
  • కుటిలం = మోసం
  • ఈగి = దానం
  • మంతభాషి = తక్కువగా మాట్లాడు
  • జొన్నగటక = జొన్నసంకటి
  • సుధ = అమృతం
  • వలపలిచేయి = కుడిచేయి
  • వడుకు ఉడుపులు = చేతితో నేసిన నేత వస్స్త్రాలు
  • కంబళి = గొంగళి, రగ్గు
  • పరిజనం = పరివారం
  • సిక్షేపములు = సిధులు
  • బల్ + వలపు = బల్వలపు = మిక్కిలి [పేమ
  • కేలు = చేయి

నేనివి చేయగలనా?

TS 8th Class Telugu 11th Lesson Questions and Answers Telangana కాపుబిడ్డ 1