TS Inter 1st Year History Study Material Chapter 13 భారతదేశంలో సాంఘిక, మతసంస్కరణోద్యమాలు

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 13th Lesson భారతదేశంలో సాంఘిక, మతసంస్కరణోద్యమాలు Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 13th Lesson భారతదేశంలో సాంఘిక, మతసంస్కరణోద్యమాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతీయ పునరుజ్జీవనానికి గల కారణాలను వివరించండి.
జవాబు.
భారతదేశంలో 19వ శతాబ్దంలో భారతీయ పునరుజ్జీవనం ఒక ముఖ్యఘట్టం. 19వ శతాబ్దం ప్రారంభం నాటికి భారతీయ సంస్కృతి పై పాశ్చాత్య సంస్కృతి ప్రభావం ఎక్కువగా ఉండేది. భారతీయులు పాశ్చాత్యులు వేషభాషలు, అలవాట్లతోపాటు సాహిత్యం, ఆలోచనలను అనుకరించడం ఆరంభించారు. ఇదే సమయంలో విద్యాధికులైన భారతీయులు కొత్త ఆలోచనలచేత ప్రభావితులయ్యారు. ఈ ఆలోచనలే భారతీయుల సాంఘిక, మత, సాంస్కృతిక జీవనాన్ని ప్రభావితం చేశాయి. ఈ కొత్త ఆలోచనా విధానం, ప్రేరణ, భావోద్రేకం ఫలితమే భారతీయ పునరుజ్జీవనం. 16వ శతాబ్దం నాటి ఐరోపా పునరుజ్జీవనం లాగానే భారతీయ పునరుజ్జీవనం కూడా భారతీయుల జీవనంలోని అన్ని రంగాలను ప్రభావితం చేసింది.

భారతీయ పునరుజ్జీవనానికి కారణాలు: కింద పేర్కొన్న అనేక కారకాల మూలంగా భారతీయ పునరుజ్జీవనం
1) రాజకీయ ఐక్యత : బ్రిటీష్ పాలనలో భారతదేశం రాజకీయంగా, పాలనాపరంగా ఏకీకరణ సాధించింది. దేశంలో శాంతిభద్రతలు నెలకొనడం వల్ల భారతీయులకు తమ గురించి ఆలోచించడానికి కావలసిన సమయం దొరికింది. అంతేకాకుండా బ్రిటీష్ పాలనలో తమ పేదరికానికి, దైన్యస్థితికి కారణాలను నిశితంగా పరిశీలించడం ఆరంభించారు.

2) విదేశాలతో సంబంధాలు: భారతదేశానికి ఇంగ్లాండ్, అమెరికా, రష్యా, చైనా, జపాన్ లాంటి యూరప్, ఇతర దేశాలతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ దేశాలు పారిశ్రామిక, సాంఘిక, రాజకీయ రంగాలలో అద్భుతమైన ప్రగతిని సాధించాయి. ఇది భారతీయులను ఎంతగానో ప్రభావితం చేసింది. తమ మాతృదేశాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన వారిలో కలిగింది.

TS Inter 1st Year History Study Material Chapter 13 భారతదేశంలో సాంఘిక, మతసంస్కరణోద్యమాలు

3) క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు : 1813 నుంచి క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి ప్రవేశించడం ప్రారంభమైంది. విద్యాసంస్థలు, ఆస్పత్రులు లాంటివి స్థాపించి అన్ని రకాలైన మార్గాల ద్వారా భారతీయులను క్రైస్తవులుగా మార్చడానికి ప్రయత్నించారు. దీనికి ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా ఉండేవి. ఇది భారతీయుల్లో అశాంతిని కలిగించింది. ఫలితంగా భారతదేశంలో అనేక సాంఘిక, మత సంస్కరణోద్యమాలు వచ్చాయి.

4) విదేశీ పండితుల రచనలు : మాక్స్ ముల్లర్, విలియం జోన్స్ వంటి విదేశీ పండితులు అనేక భారతీయ సాహిత్య, మత గ్రంథాలను అనువదించారు. దీని మూలంగా భారతీయులు తమ దేశ సంస్కృతి, వారసత్వం, గత కీర్తిని తెలుసుకోవడానికి వీలైంది. విదేశీయులు మన దేశ సంస్కృతి గొప్పతనాన్ని ప్రశంసించడంతో, భారతీయులకు కూడా గత వైభవం పట్ల ఆత్మవిశ్వాసం కలిగి దాన్ని పునరుద్ధరించడానికి కృషి చేశారు. ఇవన్నీ భారతీయులకు నైతిక బలాన్ని ఇచ్చాయి. పాశ్చాత్య సంస్కృతిపై భారతీయ సంస్కృతి ఆధిపత్యాన్ని నెలకొల్పాలని భారతీయులు భావించారు.

5) భారతీయ పత్రికలు : ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడంలో భారతదేశ పత్రికలు కూడా కృషిచేశాయి. వివిధ దేశీయ భాషల్లో అనేకమైన వార్తా పత్రికలు, గ్రంథాలు ముద్రితమయ్యాయి. పత్రికలు బ్రిటీష్ వారిని విమర్శిస్తూ భారతీయులకు అనుకూలంగా రాసాయి. భారతదేశంలో నెలకొన్న పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి ఈ పత్రికలు తోడ్పడ్డాయి. ఈ జాతి గౌరవాన్ని, కీర్తిని పునరుద్ధరించుకోవడానికి తోడ్పడ్డాయి.

6) పాశ్చాత్య విద్య : ప్రభుత్వం ఆంగ్లాన్ని బోధనాభాషగా ప్రవేశపెట్టింది. భారతీయులకు పాశ్చాత్య భావాలైన ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం మొదలైన సిద్ధాంతాలతో పరిచయమైంది. విద్యాధికులైన భారతీయులు విదేశాలకు వెళ్ళి అక్కడ అమలవుతున్న సిద్ధాంతాల పనితీరును గమనించారు. ఈ సిద్ధాంతాలను భారతదేశంలో ప్రవేశపెట్టాలని కోరుకున్నారు.

7) పాశ్చాత్య సంస్కృతి : బ్రిటిష్ పాలనలో భారతీయులకు పాశ్చాత్య సంస్కృతితో పరిచయమైంది. వారి వస్త్రధారణ, అలవాట్లు, సమాజం లాంటి వాటినెన్నింటినో భారతీయులు గమనించారు. విద్యావంతులైన భారతీయులు కొందరు పాశ్చాత్య సంస్కృతికి ప్రభావితమయ్యారు. మరొక వర్గం దీన్ని వ్యతిరేకించి మన సంస్కృతిని, కీర్తిని పునర్విమర్శ చేశారు. ఈ విధంగా పాశ్చాత్య సంస్కృతి స్థానంలో భారతీయ సంస్కృతిని పునరుద్ధరించడానికి కృషి చేశారు. 2. సాంఘిక, మత సంస్కరణోద్యమానికి రాజా రామ్మోహన్ రాయ్ చేసిన కృషిని గురించి రాయండి. 19వ శతాబ్దంనాటి సంఘ సంస్కరణోద్యమంలో రాజా రామ్మోహన్రాయ్ అగ్రగణ్యుడు. ఇతడు పాశ్చాత్య భావాల ద్వారా ప్రభావితుడయ్యాడు. ఇతడిని భారతదేశంలో “మొదటి ఆధునిక మానవుడు” అఁ.. పశ్చిమ బెంగాల్లోని భరద్వాన్ జిల్లాలో రాధానగర్ గ్రామంలో జన్మించాడు. 16వ ఏట నుం తం, అరబిక్ భాషల్లో పాండిత్యం సాధించాడు. ఇతనిపై సూఫీమతం, ఖురాన్ సిద్ధాంతాల ప్రభావం కూడా ఉంది. హిబ్రూ, గ్రీకు, ఇంగ్లీష్ భాషలను నేర్చుకోవడం వల్ల క్రైస్తవ మత సిద్ధాంతాలను ఆకలింపు చేసుకోవడానికి వీలైంది. రాయ్ ఏకేశ్వరోపాసనను సమర్థించి విగ్రహారాధనను వ్యతిరేకించాడు. రాయ్ 1803లో పర్షియన్ భాషలో “ఏకదేవతా రాధకులకు ఒక కానుక” అనే గ్రంథం (A Gift to Monothiests) ప్రచురించాడు.

ఇతడు 1772లో రాజా రామ్మోహన్రాయ్ 1815లో కలకత్తాలో “ఆత్మీయ సభ” అనే సంస్థను స్థాపించాడు. ఏకేశ్వరోపాసనను సమర్థించడం, హిందూమతంలోని చెడుసంప్రదాయాలను, ఆచారాలను వ్యతిరేకించడం దీని లక్ష్యాలు. మానవతావాదిగా, సంస్కర్తగా రాయ్ మూఢవిశ్వాసాల బురదనుంచి, నిరాశ నుంచి హిందూ సమాజాన్ని విముక్తి చేసి ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాడు.

ఈ లక్ష్యసాధనకోసమే రాయ్ ‘బ్రహ్మసమాజాన్ని’ స్థాపించాడు. కులం, మతం, వంటి వివక్ష లేకుండా అందరికీ ఇందులో ప్రవేశం ఉంది. ఈ సంస్థ విద్యావ్యాప్తికి, ఇతర సంస్కరణలకు ఒక వేదికగా మారింది.

రాజా రామ్మోహన్రాయ్ గొప్ప సంఘసంస్కర్త. ఆధునిక భారతదేశంలో రాయ్ మొదటి స్త్రీవాది. ఇతడు మహిళలపై నిర్బంధాలను వ్యతిరేకించాడు. సతీసహగమన దురాచారాన్ని నిర్మూలించడానికి రాయ్ గొప్ప పోరాటాన్ని నిర్వహించాడు. చివరకు, గవర్నర్-జనరల్ విలియం బెంటింక్ సహాయంతో సతీసహగమనాన్ని నిర్మూలించడంలో విజయం సాధించాడు. సతీ సహగమనాన్ని పాటించేవారు శిక్షార్హులని అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం 1829లో చట్టం చేసింది. స్త్రీలకు వారసత్వ హక్కుల కృషి చేశాడు. దేశంలోని అజ్ఞానం, మూఢవిశ్వాసాలు, సాంఘిక, సాంస్కృతిక పతనానికి వ్యతిరేకంగా పోరాడాడు. ఈ విధంగా రాయ్ను సార్వత్రికవాదానికి ప్రవక్తగా, స్వేచ్ఛాపిపాసిగా, రాజకీయ ఉద్యమకారుడిగా పేర్కొనవచ్చు. రాయ్ పత్రికా స్వేచ్ఛకోసం, రైతుల హక్కుల కోసం పోరాడాడు.

రామ్మోహన్రాయ్ ప్రారంభించిన కృషిని అతని మరణానంతరం దేవేంద్రనాథ్ టాగూర్ (రవీంద్రనాథ్ టాగూర్ తండ్రి), కేశవ చంద్రసేన్ కొనసాగించారు. కేశవ చంద్రసేన్ శ్రద్ధ, వాగ్ధాటి, మిషనరీ ఉత్సాహం మూలంగా బ్రహ్మ సమాజం బెంగాల్ రాష్ట్ర సరిహద్దులు దాటి ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించింది.

ప్రశ్న 3.
సాంఘిక సంస్కరణోద్యమానికి కందుకూరి వీరేశలింగం చేసిన కృషిని వివరించండి.
జవాబు.
ఆంధ్రదేశంలోని బ్రహ్మసమాజ నాయకులలో వీరేశలింగం అగ్రగణ్యుడు. ఇతడు స్త్రీవిద్య, వితంతు పునర్వివాహాల కోసం తన జీవితమంతా కృషి చేశాడు. ఇతడు 1848లో రాజమండ్రిలో జన్మించాడు. మెట్రిక్యులేషన్ వరకు విద్యాభ్యాసం చేసి తరువాత తెలుగు పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. రాజమండ్రి, ధవళేశ్వరంలో ఉపాధ్యాయుడిగా తరువాత మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు ఉపన్యాసకుడిగా పనిచేశాడు. వీరేశలింగం విద్యార్థి దశ నుంచి కూడా హేతువాది. ఇతడు ఉపాధ్యాయ ఉద్యోగంలో నిండు పున్నమి రోజున చేరాడు. ఆ రోజును శుభప్రదమైందిగా భావించేవారు కాదు. వీరేశలింగం సంఘ సంస్కరణోద్యమం స్త్రీల అభ్యున్నతి కోసం “వివేకవర్ధిని” పత్రికను స్థాపించడంతో ప్రారంభమైంది. ఈ పత్రికను సంఘ సంస్కరణను ప్రచారం చేయడానికి, సనాతనులను ఎదుర్కోవడానికి స్థాపించాడు. వివేకవర్ధిని పత్రికకు పూర్వమే కొన్ని పత్రికలున్నప్పటికీ, ఆంధ్రలో పునరుజ్జీవనానికి కృషి చేసిన మొదటి పత్రిక ఇదే. వీరేశలింగం 1874లో ధవళేశ్వరంలో బాలికా పాఠశాలను స్థాపించాడు. 1878లో రాజమండ్రిలో “సంఘసంస్కరణ సంఘం” స్థాపించాడు. ఇతడు డిసెంబర్ 11, 1881న రాజమండ్రిలో మొదటి వితంతు వివాహాన్ని జరిపించాడు. నాలుగు రోజుల తరువాత ఇక్కడే రెండవ వితంతు పునర్వివాహం జరిపించాడు. సనాతనులు వీరేశలింగం కార్యక్రమాలను వ్యతిరేకించి ఇందులో పాల్గొన్న వారందరినీ సాంఘిక బహిష్కరణ చేశారు. వీరేశలింగం రాజమండ్రిలో 1904లో వితంతు శరణాలయాన్ని, 1908లో ‘హితకారిణి’ సమాజాన్ని స్థాపించాడు. ఈ రెండు సంస్థల నిర్వహణ కోసం తన మొత్తం ఆస్తిని విరాళంగా ఇచ్చాడు. ఇతడి సంఘసంస్కరణోద్యమ కార్యక్రమాలకు వీరేశలింగం భార్య రాజ్యలక్ష్మి సహాయ సహాకారాలు అందించింది.

TS Inter 1st Year History Study Material Chapter 13 భారతదేశంలో సాంఘిక, మతసంస్కరణోద్యమాలు

వీరేశలింగం సంఘసంస్కరణకు తన సాహిత్యాన్ని ఒక సాధనంగా ఉపయోగించాడు. తెలుగు సాహిత్యంలో అనేక రకమైన ప్రక్రియల్లో వీరేశలింగం మొదటివాడు. తెలుగులో మొదటి నవల ‘రాజశేఖర చరిత్ర’ను రాశాడు. ఆంధ్రకవుల చరిత్రను సంకలనం చేశాడు. తన ఆత్మకథను ‘స్వీయ చరిత్రం’ అనే పేరుతో రాశాడు. సంఘంలోని మూఢవిశ్వాసాలను విమర్శిస్తూ అనేక ప్రహసనాలు (skits) రచించాడు. ఇతడికి “గద్య తిక్కన” అనే బిరుదు ఉంది. తన జీవితాన్ని సమాజం కోసం ధారపోసిన వీరేశలింగం మే 27, 1919న తుదిశ్వాస విడిచారు. “తన శరీరాన్ని, తన కాలాన్ని, తన ధనాన్ని, తన మేధస్సును సమాజం కోసం త్యాగం చేసిన ఘనుడు వీరేశలింగం” అని చిలకమర్తి లక్ష్మీనర్సింహం పంతులు శ్లాషించాడు.

ప్రశ్న 4.
దళితుల కోసం డా॥ బి.ఆర్. అంబేద్కర్ చేసిన కృషిని వివరించండి.
జవాబు.
డా॥ బి.ఆర్. అంబేద్కర్ భారతదేశంలోని దళితుల నాయకుడు. దళితులకు మెస్సయ్య లాంటివాడు. ఇతడి పూర్తి పేరు భీమ్రావు రాంజీ అంబేద్కర్. ఇతడు ఏప్రిల్ 14, 1891న మహారాష్ట్రలోని మహావ్ గ్రామంలో మహర్ కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి రాంజీ భారతసైన్యంలో సుబేదార్గా మహావ్ కంటోన్మెంట్లో పనిచేసేవాడు. విద్యార్థిదశలో కులవివక్షను స్వయంగా అనుభవించాడు. మెట్రిక్యులేషన్ పూర్తికాగానే బరోడ మహారాజు ఉపకార వేతనంతో ఉన్నత విద్యనభ్యసించాడు. ఇతడు అమెరికా వెళ్ళి కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరి ఎం.ఎ. పూర్తి చేశాడు. తర్వాత పిహెచ్.డి (డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ) పట్టాను పొందాడు.

విదేశాల నుంచి తిరిగివచ్చిన అంబేద్కర్ న్యాయవాదిగా బొంబాయిలో స్థిరపడ్డాడు. ఇతడు సంఘసంస్కర్తగా, దళితులనాయకుడిగా ఆవిర్భవించాడు. దళితులు సాంఘిక, రాజకీయ, ఆర్థిక సమానత్వం సాధించేటట్లు కృషి చేయడం ఇతని లక్ష్యం. ఇతడు దళితులకోసం అనేక గ్రంథాలను రాశాడు, పత్రికలను నడిపాడు. అనేక సంస్థలను స్థాపించాడు. 1920లో “మూక్ నాయక్” అనే పత్రికను ప్రారంభించాడు. దళితుల విద్య, సాంఘిక, ఆర్థికాభివృద్ధి కోసం 1924లో “భహిష్కృత్ హితకారిణి సభ” అనే సంస్థను స్థాపించాడు. మరాఠీలో “బహిష్కృత్ భారత్” అనే మరొక పత్రికను ప్రారంభించాడు.

డా॥ బి.ఆర్. అంబేద్కర్ 1927లో మహద్ సత్యగ్రహం చేసి మహర్ కు చెరువునీటిని వాడుకునే హక్కును సాధించాడు. 1930లో కాలరామ్ సత్యాగ్రహం చేసి దళితులకు దేవాలయ ప్రవేశం కల్పించాడు. అస్పృస్యులకు సమాన హక్కులున్నాయని చాటాడు. డా॥ బి.ఆర్. అంబేద్కర్ లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలకు దళితుల ప్రతినిధిగా హజరై దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలుండాలని డిమాండ్ చేశాడు. బ్రాహ్మణవాద, పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా అంబేద్కర్ 1936లో “ఇండిపెండెంట్ లేబర్ పార్టీ” (ILP) ని ప్రారంభించాడు. 1942లో దళితులకోసం ‘షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్’ అనే మరో పార్టీని స్థాపించాడు. ఇతడు దళితుల్లో విద్యావ్యాప్తికై ‘పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీని’ ఏర్పాటుచేసి 1945 నుంచి అనేక పాఠశాలలు, కళాశాలలు, లైబ్రరీలు, హాస్టళ్ళు నెలకొల్పి దళితుల్లో విద్యావ్యాప్తికి తద్వారా వారిలో చైతన్యానికి కారణమయ్యాడు. 1950లలో అంబేద్కర్ హిందూమతాన్ని విడిచి బౌద్ధమతాన్ని స్వీకరించాడు. ఆధునిక యుగంలో భారత సమాజాన్ని పునర్నిర్మించాలంటే బౌద్ధధర్మం ఒక్కటే మార్గమని తలచాడు. ‘నూతన’ బౌద్ధమతంలో ప్రధానంగా కులనిర్మూలనను అంబేద్కర్ ప్రతిపాదించాడు. దళితులను బౌద్ధమతం స్వీకరించాలని ప్రోత్సహించాడు.

అంబేద్కర్ గొప్ప జాతీయవాది. భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత పండిట్ నెహ్రూ మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేశాడు. రాజ్యాంగ నిర్మాణపరిషత్తులో, రాజ్యాంగరచనా సంఘానికి అంబేద్కర్ ఛైర్మన్ గా రాజ్యాంగరచన చేశారు. దళితులకోసం అస్పృశ్యత నిషేధం, దేవదాసీ నిర్మూలన వంటి నిబంధనలు.. రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి.

ప్రశ్న 5.
అలీఘర్ ఉద్యమం గురించి రాయండి.
జవాబు.
సయ్యద్ అహ్మద్ ఖాన్ మహమ్మదీయులలో సంఘ సంస్కరణ బీజాలు నాటాడు. ఇతడు ఆధునిక శాస్త్రీయ ఆలోచనల ఆధారంగా ఇస్లాం మతాన్ని వ్యాఖ్యానించాలని, సంస్కరించాలని అన్నాడు. కాలానుగుణంగా మతాన్ని సంస్కరించుకో నట్లయితే మతం పురోగమించదన్నాడు. కాబట్టి మహమ్మదీయులు గుడ్డిగా సంప్రదాయాలను ఆచరించకుండా ఆలోచనా స్వేచ్ఛ, విమర్శనాత్మకవైఖరిని అలవర్చుకోవాలని కోరాడు. కేవలం పాశ్చాత్య శాస్త్రీయ విజ్ఞానం, సంస్కృతిని అలవర్చుకోవడం ద్వారానే మహమ్మదీయుల మత, సాంఘిక జీవనంలో మార్పులు సాధ్యమని అహ్మదాఖాన్ పేర్కొన్నాడు. ఒక అధికారిగా ఇతడు అనేక పట్టణాలలో పాఠశాలలను స్థాపించాడు. పాశ్చాత్యగ్రంథాలను ఉర్దూలోకి అనువదింప చేశాడు. 1875లో అహ్మద్ ఖాన్ అలీఘర్లో మహ్మదన్-ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించాడు. 1920 నాటికి ఇది అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందింది. ఎందరో మహమ్మదీయ విద్యార్థులు అలీఘర్లో ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యాభ్యాసం చేసి ఆధునిక ఆలోచనా విధానానికి మూలమయ్యారు. అహ్మదాన్ తన సంస్కరణోద్యమానికి అలీఘర్ను కేంద్రంగా చేసుకోవడంవల్ల ఈ ఉద్యమానికి అలీఘర్ ఉద్యమం అనే పేరొచ్చింది.

అహ్మదాన్ సంఘ సంస్కరణోద్యమంలో భాగంగా మహమ్మదీయులలో పర్దాపద్ధతిని, బహుభార్యత్వాన్ని, విడాకులను ఖండించి స్త్రీలు కూడా పాశ్చాత్య విద్యను అభ్యసించాలన్నాడు. అహ్మద్ ఖాన్ కృషి ఫలితంగా మహమ్మదీయులలో ఆధునిక ఆలోచనా విధానం ఆవిర్భవించింది. అహ్మద్ ఖాన్ మొదట హిందూ ముస్లిం ఐక్యతను బోధించినప్పటికీ తరువాత కాలంలో అధిక సంఖ్యలో హిందువులున్న భారతదేశంలో మహమ్మదీయులు తమ ప్రయోజనాలు కాపాడుకోవాలని ప్రకటించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 13 భారతదేశంలో సాంఘిక, మతసంస్కరణోద్యమాలు

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రార్థనా సమాజం కృషిని పేర్కొనండి.
జవాబు.
మహారాష్ట్ర ప్రాంతంలో బ్రహ్మ సమాజం ప్రభావం ఎక్కువగా ఉండేది. 1867లో ప్రార్థనా సమాజాన్ని డా॥ ఆత్మారాం పాండురంగ్, కేశవ చంద్రసేన్ ప్రోద్బలంతో స్థాపించాడు. దీని ప్రధాన కేంద్ర కార్యాలయం బొంబాయిలో ఉండేది. ప్రార్థనా సమాజంలో జస్టిస్ మహాదేవ గోవింద రానడే (1842-1901), సర్ ఆర్.జి. భండార్కర్లు ప్రముఖ పాత్ర పోషించారు. ప్రార్థనా సమాజం మత సంస్కరణ కంటే సంఘ సంస్కరణకు అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. ప్రార్థనా . సమాజం జస్టిస్ రానడే నాయకత్వంలో పశ్చిమ భారతదేశ సంఘ సంస్కరణోద్యమానికి కేంద్రం అయింది. రానడే 1861లో వితంతు వివాహ సంఘాన్ని (Widow Marriage Association) స్థాపించాడు. విద్యావ్యాప్తి కోసం ‘దక్కన్ విద్యాసంఘం (Deccan Education Society) స్థాపించిన వారిలో ముఖ్యుడు. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకులలో రానడే ఒకరు. రానడే కృషి వల్ల ప్రతి సంవత్సరం జరిగే జాతీయ కాంగ్రెస్ సమావేశంతోపాటు, అఖిల భారత సంఘ సంస్కరణ సమావేశం కూడా జరిగేది.

ప్రశ్న 2.
స్వామి వివేకానందుని కృషిని గురించి రాయండి.
జవాబు.
భారతదేశ సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వారిలో వివేకానందుడు ప్రముఖుడు. ఇతడు 1863లో కలకత్తాలో జన్మించాడు. వివేకానందుని అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. తండ్రి మరణానంతరం ఇతడు కడుపేదరికంలో జీవించాడు. అసలు భగవంతుడున్నాడా లేదా అనే సందేహం వివేకానందునిలో కలిగింది. ఈ దశలోనే ఆయనకు రామకృష్ణ పరమహంసతో పరిచయమేర్పడింది. వివేకానందుడి జీవితాన్ని రామకృష్ణుడు ప్రభావితం చేశాడు. వివేకానందుడు ఆస్తికుడుగా, తర్వాత గొప్ప వేదాంతిగా మారిపోయాడు. రామకృష్ణుడిని వివేకానందుడు తన ఆధ్యాత్మిక గురువుగా భావించాడు. నరేంద్రుడు వివేకానందుడిగా పేరుపొందాడు. తన జీవితమంతా రామకృష్ణ పరమహంస తత్త్వాన్ని ప్రపంచమంతా వ్యాపింప చేయడానికి వినియోగించాడు. వివేకానందుడు 1893లో చికాగో ప్రపంచ మత సమావేశానికి (Parliament of World Religions) భారతదేశ ఆధ్యాత్మిక ప్రతినిధిగా హాజరయ్యారు. సుమారు 5000 మంది ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో హిందూమత తాత్విక దృక్పథాన్ని, అన్ని మతాలను సమానంగా చూసే హిందూమత ఔన్నత్యాన్ని గురించి ప్రసంగించాడు. వివేకానందుని ఉపన్యాసం పాశ్చాత్య, తూర్పుదేశాల వారిని దిగ్భ్రాంతులకు గురిచేసింది. తమ దేశాల్లో ప్రసంగించమని వివేకానందుడిని అనేక దేశాలవారు ఆహ్వానించారు. మూడు సంవత్సరాలు విదేశాలలో పర్యటించి మన జాతి ఆధ్యాత్మిక గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు.

ప్రశ్న 3.
19వ శతాబ్దం సంస్కరణోద్యమం ఫలితాలను వివరించండి.
జవాబు.
సాంఘిక, మత సంస్కరణోద్యమం వల్ల కింద పేర్కొన్న ముఖ్యమైన ఫలితాలు సంభవించాయి.
1) పాతకాలంనాటి సంప్రదాయాలు, మూఢ విశ్వాసాల్లో నమ్మకం సన్నగిల్లింది. విద్యావ్యాప్తి మూలంగా ప్రజలు చైతన్యవంతమయ్యారు. విద్యాధికులైన భారతీయులు సంఘంలోని అనవసరమైన కర్మకాండలను, మూఢ విశ్వాసాలను తొలగించుకోవడానికి కృషి చేశారు.

2) సంఘసంస్కర్తలందరూ మానవుల సంక్షేమం కోసం కృషి చేశారు. అన్ని మతాలు మానవ సంక్షేమం కోసం కృషి చేయాలని చెప్పాయి. సంస్కర్తలందరూ మానవతా వాదాన్ని సమర్థించారు.

3) సంస్కర్తలందరూ సతీసహగమనం, బాల్యవివాహాలు వంటి మహిళా సమస్యలను, అంటరానితనం, సాంఘిక వివక్షత మొదలైన అణగారిన వర్గాల సమస్యలను ఖండించారు. ప్రభుత్వం ఈ దురాచారాలను రద్దుచేయడానికి సంస్కర్తల సహాయ సహకారాలను తీసుకొన్నది.

4) స్త్రీ విద్యావ్యాప్తి జరిగింది. మహిళలకోసం పాఠశాలలు, కళాశాలలు స్థాపించబడ్డాయి. సమాజంలోని సంప్రదాయాలు, వివక్షలను తొలగించడానికి విద్య ఒక్కటే సాధనమని గుర్తించారు.

5) ప్రజల్లో త్యాగగుణం, సేవాభావం, హేతువాదం కలిగాయి.

6) తమ ప్రాచీన భారతదేశ సంస్కృతి, వైభవాన్ని గురించి తెలుసుకోవడంవల్ల తాము పాశ్చాత్యులకు ఏవిధంగా తీసిపోమనే ఆత్మస్థైర్యం భారతీయులలో కలిగింది.

7) సాంఘిక సమానత్వభావనను, వివిధ సంస్కృతులు, మతాలమధ్య సహజీవనం అవసరాన్ని గుర్తించేటట్లు చేశాయి. ఈ సంఘసంస్కరణోద్యమాలు సమాజంలో చాలా మార్పులను కలిగించాయి. సంఘంలోని దురాచారాలను రూపుమాపడానికి, విద్యావంతులు వీటికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి వీలైంది. ప్రజల్లో సార్వజనీన సోదరభావాన్ని తామంతా ఒక్కటే అనే భావనను కలిగించడం వల్ల భారతీయుల్లో జాతీయ భావం ఏర్పడింది.

ప్రశ్న 4.
అనీబిసెంట్ కృషిని అంచనా వేయండి.
జవాబు.
దివ్యజ్ఞాన సమాజాన్ని 1875లో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మేడమ్ బ్లావట్స్కీ, కల్నల్ ఆల్కాట్ స్థాపించారు. థియోసఫీ అనే పదం ‘థియోస్’ మరియు ‘సోఫియా’ అనే రెండు గ్రీకు పదాల నుంచి పుట్టింది. థియోస్ అంటే ‘దైవం’. సోఫియా అంటే ‘జ్ఞానం’ మత, తత్వవిజ్ఞానం అధ్యయనాన్ని ప్రోత్సహించడం, అవ్యక్తంగా ఉన్న ప్రకృతి అని అర్థం. విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడం, సర్వమత సామరస్యాన్ని కల్పించడం, ధర్మాలను, మానవులలో నిగూఢంగా ఉన్న శక్తులను పరిశోధించడం దివ్యజ్ఞాన సమాజం లక్ష్యాలు.

1879లో బ్లావట్క్సీ ఆల్కట్లు భారతదేశం పర్యటించి ఈ దేశ ఆధ్యాత్మిక శక్తిని చూసి ఆశ్చర్యపోయారు. తమ సంస్థ కార్యకలాపాలకు భారతదేశమే అనువైందని గ్రహించి 1886లో ఈ సంస్థ ప్రధాన కేంద్రకార్యాలయాన్ని మద్రాస్ సమీపంలోని అడయార్కు మార్చారు. అనీబిసెంట్ దివ్యజ్ఞాన సమాజ శాఖలను భారతదేశమంతటా విస్తరించింది. ఈమె ఐరిష్ వనిత. 1893లో ఈమె భారతదేశానికి వచ్చి 1907లో ఆల్కాట్ మరణించిన తర్వాత దానికి అధ్యక్షురాలై ఇక్కడే స్థిరపడింది. హిందూమత పునరుజ్జీవనం కోసం అనీబిసెంట్ కృషి చేసింది. భారతదేశంలో జాతీయ విద్యవ్యాప్తికోసం బెనారస్, అడయార్, మదనపల్లిలో పాఠశాలలను, కళాశాలలను స్థాపించింది. అనీబిసెంట్ బెనారస్లో స్థాపించిన కేంద్ర హిందూపాఠశాల తరువాత కాలంలో ‘బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం’గా అభివృద్ధి చెందింది. అనీబిసెంట్ భారత జాతీయ కాంగ్రెస్లో, జాతీయోద్యమంలో ప్రముఖ పాత్రను నిర్వహించింది.

TS Inter 1st Year History Study Material Chapter 13 భారతదేశంలో సాంఘిక, మతసంస్కరణోద్యమాలు

ప్రశ్న 5.
పార్శీ సంస్కరణోద్యమాన్ని వివరించండి.
జవాబు.
హిందువులు, మహమ్మదీయులలాగానే పార్శీలలోకూడా మతచైతన్యం కలిగింది. పార్శీలు తమ మతాన్ని ప్రక్షాళనచేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1851లో పార్శీలలో మేధావులైన దాదాభాయి నౌరోజి, యస్.యస్. బెంగాలీ మొదలైనవారు “రెహ్నుమాయి మల్దయాసన్ సభ” అనే సంఘాన్ని స్థాపించారు. ఈ సంస్థ తమ మతాన్ని, సంఘాన్ని సంస్కరించుకోవడానికి కృషిచేసింది. పార్శీలలో సంఘ, మత సంస్కరణలను ప్రచారం చేయడానికి ‘రాస్తఫర్’ అనే వారపత్రికను ప్రారంభించారు. పార్శీ సంస్కర్తలలో దాదాభాయి నౌరోజి, యస్. యస్. బెంగాలీ ముఖ్యమైనవారు. జొరాస్టర్ బోధనల ప్రాధాన్యతను పార్శీలకు వివరించడానికి ప్రయత్నించారు. కె.ఆర్. కామా పార్శీల మత గ్రంథం ‘అవెస్తా’ను శాస్త్రీయపద్దతిలో వ్యాఖ్యానించడం జరిగింది. పార్శీలు ఆంగ్లో-బ్రిటీష్ జీవన విధానాన్ని, అలవాట్లను, విద్యను అనుకరించనారంభించారు. తమ మతాన్ని, సంఘాన్ని సంస్కరించుకొంటూనే భారతీయపునరుజ్జీవనానికి పాటుబడ్డారు. బి.యం. మలబారి అనే ప్రముఖ పార్శీ సంస్కర్త స్త్రీలకు, పిల్లలకు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకై ‘సేవాసదన్’ను ప్రారంభించాడు. దాదాభాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, శ్రీదినా ఇదుల్జీలు భారతదేశం సాంఘిక, ఆర్థిక, రాజకీయాభివృద్ధికి ఎంతో కృషిచేశారు.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రామకృష్ణ మిషన్ కృషిని గురించి రాయండి.
జవాబు.
స్వామి వివేకానందుడు తన ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస పేరు మీద 1897లో ‘రామకృష్ణ మిషన్’ అనే సంస్థను బేలూరు (పశ్చిమ బెంగాల్)లో స్థాపించాడు. వివేకానందుడు అంటరానితనాన్ని, కులవ్యవస్థను ఖండించాడు. తన బోధనలతో భారతీయుల్లో జాతీయ భావాన్ని కలిగించాడు. పేదల కోసం దేశంలోని పలు ప్రాంతాల్లో, విద్యాసంస్థలు, ఆస్పత్రులు, అనాథ శరణాలయాలు, ఉచిత వైద్యశాలలు వంటి వాటిని నెలకొల్పాడు. మానవుడు దేవుని ప్రతిరూపం. కాబట్టి “మానవ సేవే మాధవ సేవ” అనేది దీని లక్ష్యం. అణగారిన వర్గాల, పేదల సర్వతోముఖాభివృద్ధికి రామకృష్ణ మిషన్ సభ్యులు ఎంతో కృషిచేశారు. భూకంపాలు, వరదలు, తుఫానులు సంభవించినప్పుడు అహోరాత్రులు సేవ చేశారు. వివేకానందుడు వ్యక్తి శీల నిర్మాణానికి, క్రమశిక్షణకు, మాతృదేశాభిమానం మొదలైన వాటికి అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. భారతీయులలో జాతీయ భావం పెంపొందించడంలో రామకృష్ణ మిషన్ గణనీయమైన పాత్ర పోషించింది.

ప్రశ్న 2.
జోతిబాఫూలే కృషిని గురించి రాయండి.
జవాబు.
మహిళా విమోచనకు, అంటరానితనం నిర్మూలనకు, దళితుల పునరుద్ధరణకై ఫూలే బ్రాహ్మణేతర ఉద్యమం నిర్వహించాడు. భారత జాతీయ కాంగ్రెస్, దాని నాయకులు అణగారిన వర్గాల ప్రయోజనాలను నిర్లక్ష్యం చేయడాన్ని పూలే తీవ్రంగా విమర్శించాడు. 1873లో పూలే సత్యశోధన సమాజం (సత్యాన్ని శోధించే సమాజం) స్థాపించాడు. దళితులకు, బలహీన వర్గాలవారికి సామాజిక న్యాయం సాధించే లక్ష్యంతో ఈ సంస్థను స్థాపించాడు. ఫూలే అన్ని కులాల పిల్లలకు పాఠశాలలను, అనాథ శరణాలయాలను స్థాపించాడు. స్త్రీలకోసం పూనేలో,ఒక ప్రత్యేక పాఠశాలను నెలకొల్పాడు.

ప్రశ్న 3.
దేవాలయ ప్రవేశ ఉద్యమంలో నారాయణగురు పాత్రను తెలియజేయండి.
జవాబు.
శ్రీనారాయణ గురు దేవాలయ ప్రవేశ ఉద్యమ నాయకుడు. ఇతడు 1854లో ఎజవ కుటుంబంలో జన్మించాడు. కేరళలో ఎజవలతో పాటు మరికొన్ని కులాలను ఉన్నతకులాలకు చెందిన హిందువులు అంటరానివారిగా చూసేవారు.

దక్షిణభారతదేశంలో, ముఖ్యంగా కేరళలో వీరిని అనేక అవమానాలకు గురిచేశారు. వీరికి దేవాలయ ప్రవేశంలేదు. దళితులకు 1924లో దేవాలయ ప్రవేశం అవకాశం దక్కింది. 1924 తరువాత గాంధీజీ నిర్మాణాత్మక కార్యక్రమాల్లో ఓకటిగా అస్పృస్యతా వ్యతిరేక ఉద్యమం ప్రారంభమై ప్రజా ఉద్యమంగా మారింది. దీని ఫలితంగా నవంబర్ 1936లో ట్రావెంకోర్ మహారాజు ప్రభుత్వ నియంత్రణలో ఉన్న దేవాలయాలన్నింటిలోకి ఎటువంటి వివక్ష చూపకుండా హిందువులందరిని అనుమతించడం జరుగుతుందని ఒక ప్రకటన చేశాడు.

ప్రశ్న 4.
పెరియార్ ఇ.వి. రామస్వామి నాయకర్ కృషిపై సంక్షిప్త సమాధానం రాయండి.
జవాబు.
ఇ.వి. రామస్వామి నాయకర్ కులవ్యతిరేక, మతవ్యతిరేక, ఆత్మగౌరవ ఉద్యమాన్ని నిర్వహించాడు. ఇతడు ‘పెరియార్’ (గొప్పఋషి)గా ప్రసిద్ధుడయ్యాడు. ఇతడు తమిళనాడులోని ఈరోడ్ వద్ద ఒక బలిజకుటుంబంలో జన్మించాడు. ఇతడు కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. నాయకర్ మొదట కాంగ్రెస్ పార్టీలో చేరి 1924లో బ్రాహ్మణేతరులకు దేవాలయం ప్రవేశం కోసం వైక్కోం సత్యాగ్రహం చేశాడు. మహాత్మాగాంధీతో విభేదాలకారణంగా కాంగ్రెస్ను వీడి జస్టిస్ పార్టీలో చేరాడు. 1938లో జస్టిస్పార్టీకి అధ్యక్షుడయ్యాడు. 1925లో నాయకర్ ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించి మనుస్మృతిని తగలబెట్టే కార్యక్రమం చేపట్టాడు. ఇతడు అనేక ఆత్మగౌరవ వివాహాలు జరిపించాడు. ఈ వివాహాల్లో పురోహితుడు, కులం, మతం, మంత్రతంత్రాలకు తావులేదు. నాయకర్ సామాజిక న్యాయం కోసం, అస్పృశ్యతకు వ్యతిరేకంగా పోరాడాడు. నాయకర్ బ్రాహ్మణుల ఆధిపత్యం ఉండే హిందూమతాన్ని త్యజించాడు. ఇతడు హిందూ దేవుళ్ళను, దేవతలను అపహాస్యం చేశాడు. నాయకర్ నాస్తికుడు, హేతువాది. తమిళనాడులో “దేవుడులేడు” అనే ఉద్యమాన్ని నిర్వహించాడు. హోటళ్ళముందు బోర్డులపై ఉన్న కులాల పేర్లను చెరిపే ఉద్యమం లేవదీశాడు.

TS Inter 1st Year History Study Material Chapter 13 భారతదేశంలో సాంఘిక, మతసంస్కరణోద్యమాలు

ప్రశ్న 5.
దియోబండ్ ఉద్యమం గురించి రాయండి ?
జవాబు.
దియోబండ్లో దార్-ఉల్-ఇస్లాం స్థాపనతో ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఇది వహాబీ ఉద్యమంలో ఒక శాఖ. ఇది ప్రపంచంలోని చాలా దేశాల విద్యార్థుల దృష్టిని ఆకర్షించింది. 1867లో ఇద్దరు మతనాయకులు మహమ్మద్ ఖాసిం నానౌతరి, రషీద్ అహ్మద్ గంగోలి ప్రారంభించారు. దియోబండ్ ఉద్యమం ఒక పేదవాడి విద్యాలయం. దీని విద్యార్థులు, ఉపాధ్యాయులు బీదరికంలో జీవించేవారు. దియోబండ్ ఉద్యమం ప్రారంభించినప్పుడు భారతదేశ మహమ్మదీయు లందరూ కాంగ్రెస్ చేపట్టే కార్యక్రమాలన్నింటిలో పాల్గొని సహకరించాలని రషీద్ అహ్మద్ గంగోలి విజ్ఞప్తి చేశాడు. వివిధ మతాల ఐక్యతపైనే జాతీయత ఏర్పడుతుందని దియోబండ్ ఉద్యమం ప్రకటించింది.

ప్రశ్న 6.
ఆర్యసమాజం ముఖ్య సిద్ధాంతాలను రాయండి.
జవాబు.
స్వామి దయానంద సరస్వతి 1875లో ఆర్యసమాజాన్ని స్థాపించాడు. ఇతడు వేదాలను అధ్యయనం చేసి, వాటిని ప్రచారం చేయడానికి కృషి చేశాడు. ఆర్యసమాజం కులవ్యవస్థ, అంటరానితనం, విగ్రహారాధన, జంతుబలి, బహుభార్యత్వం, బాల్య వివాహాలను ఖండించింది. దయానందుని అనుచరులు భారతదేశంలోని పలు ప్రాంతాల్లో దయానంద – ఆంగ్లో వేదిక్ (DAV) పాఠశాలలను స్థాపించారు. ఆర్యసమాజం దురాచారాలు, మూఢవిశ్వాసాల నుంచి హిందూ మతాన్ని విముక్తి చేసింది. వారి మత విలువను వారే గుర్తించేటట్లు చేసింది. భారతదేశాన్ని మతపరంగా, సాంఘికంగా, జాతిపరంగా ఏకం చేయడమే దీని ప్రధాన లక్ష్యం. ‘స్వదేశీ’ అనే పదాన్ని ఉపయోగించిన మొదటి భారతీయుడు దయానందుడు. దయానందుని అనుచరులు దేశ ప్రజల్లో ఆత్మగౌరవాన్ని, స్వావలంభనను, ఆత్మాభిమానాన్ని కలిగించారు.

TS Inter 1st Year History Study Material Chapter 12 బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా తొలి తిరుగుబాట్లు

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 12th Lesson బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా తొలి తిరుగుబాట్లు Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 12th Lesson బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా తొలి తిరుగుబాట్లు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
గిరిజనులు, రైతుల తొలి తిరుగుబాట్లపై ఒక వ్యాసం రాయండి.
జవాబు.
గిరిజనుల తిరుగుబాట్లు : గిరిజనులు దేశంలోని అన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్నారు. బ్రిటీష్ వారు తమ పాలనను క్రమంగా గిరిజన ప్రాంతాలకు కూడా విస్తరించి, వారి భూములను, అధికారాన్ని స్వాధీన పరచుకొన్నారు. దీంతో 19వ శతాబ్దంలో గిరిజనులు లెక్కలేనన్ని తిరుగుబాట్లు చేశారు. ఈ తిరుగుబాట్లు సాయుధపోరాట స్వభావం కలిగి ఉన్నాయి.

వలస పాలన వల్ల గిరిజనుల ఏకాంత జీవనం అంతమైంది. వారు పూర్తిగా వలసపాలన నియంత్రణలోకి వచ్చారు. వారికి భూములపై, అడవిపై గల సమిష్టి యాజమాన్య సంప్రదాయం తుడిచిపెట్టుకు పోయింది. గిరిజనుల సామాజిక జీవనంలో గుణాత్మక మార్పులు వచ్చాయి. గిరిజన ప్రాంతాల్లోకి క్రైస్తవ మిషనరీల ప్రవేశాన్ని బ్రిటీష్ ప్రభుత్వం ప్రోత్సహించింది. దీన్ని గిరిజనులు వ్యతిరేకించారు. బ్రిటీష్ పాలన వడ్డీ వ్యాపారస్థులు, రెవెన్యూ రైతులు లాంటి దళారులను ఏర్పరచింది. ఈ దళారులు గిరిజనుల భూములను స్వాధీనం చేసుకున్నారు. క్రమంగా గిరిజనులు తమ భూములను కోల్పోయి వ్యవసాయ కూలీలుగా మారారు.

TS Inter 1st Year History Study Material Chapter 12 బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా తొలి తిరుగుబాట్లు

భిల్లుల తిరుగుబాటు : పశ్చిమ కనుమల్లోని ఖాందేశ్ ప్రాంతంలో జీవించే ఆదివాసి తెగకు చెందిన వారు బిల్లులు. వీరు ఉత్తర, దక్కన్ మధ్యగల కొండ ప్రాంతంలోని మార్గాలను తమ ఆధీనంలోకి తెచ్చుకొన్నారు. ఆర్థిక ఇబ్బందులు, కరువు పరిస్థితులు, దుష్పరిపాలన మూలంగా అసంతృప్తితో 1817 – 1819 మధ్య తిరుగుబాటు చేశారు. బ్రిటీష్ ప్రభుత్వం అతి పాశవికంగా ఈ తిరుగుబాటును అణచివేసింది.

కోలుల తిరుగుబాటు : ఛోటా నాగపూర్ లోని గిరిజన నివాస స్థలాల్లో కోలులు, భిల్లులు, హౌస్లు, ముండాలు, ఓరాన్లు అనే గిరిజన తెగలుండేవి. 1820లో పొర్హత్ రాజు ప్రతి సంవత్సరం శిస్తును చెల్లిస్తూ బ్రిటీష్వారికి విధేయుడిగా ఉండడానికి ఒప్పందం చేసుకొన్నాడు. తన సరిహద్దులో గల కోల్ ప్రాంతం కూడా తనకే చెందుతుందని, అందువల్ల కోలులు తనకు పన్నులు చెల్లించాలని ప్రకటించాడు. దీన్ని వ్యతిరేకించి కోలులు 1831-1832లో తిరుగుబాటు చేశారు.

అహోమ్ల తిరుగుబాటు : అహోమ్లు అస్సాంలో నివసించే గిరిజనులు. బర్మా యుద్ధం తరువాత తమ భూభాగం నుంచి సైన్యాలను ఉపసంహరించుకొంటామని ఇచ్చిన హామీని బ్రిటీష్ వారు నిలబెట్టుకోలేదు. అహోమ్ల భూభాగాన్ని ఆక్రమించడానికి కంపెనీ ప్రయత్నించడంతో అహోమ్ల తిరుగుబాటు ప్రారంభమైంది. 1828లో అహోమ్లు గోంధార్ కోన్వరు తమ పాలకునిగా ప్రకటించుకొని రంగపూర్పై దాడికి ఉపక్రమించారు. కాని బ్రిటీష్ ప్రభుత్వం తిరుగుబాటును అణచి వేసింది.

ఖాసీల తిరుగుబాటు : బర్మా యుద్ధం తరువాత అస్సోంలోని సిల్హట్ను ఖాసీ ప్రాంతం నుంచి వెళ్ళే మార్గం గుండా ఆక్రమించాలనే దురాలోచన బ్రిటీష్ వారిలో కలిగింది. ఖాసీల రాజు ఉటిరాట్సింగ్ ఆదేశాలను కంపెనీ రక్షక దళాలు బేఖాతరు చేయడంతో ఘర్షణ మొదలైంది. ఈ పోరాటం 1829లో ప్రారంభమై బ్రిటీష్ వారు ఖాసీలను 1833లో ఓడించే వరకు కొనసాగింది.

గోండుల తిరుగుబాటు : 1857 – 60 మధ్యలో నిర్మల్, ఉట్నూర్, చెన్నూర్, అసిఫాబాద్ ప్రాంతం రాంజీగోండు ఆధీనంలోకి వచ్చింది. బ్రిటీష్వారు గోండు రాజ్యాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించడంతో 1860లో రాంజీ పోరాటాన్ని ప్రారంభించాడు. ఇతడి సైన్యంలో రోహిల్లాలు, గోండులున్నారు. నిజాం, బ్రిటీష్ సైన్యాలను రాంజీ ఓడించి పారదోలాడు. బ్రిటీష్ వారిని తమ భూభాగంలోకి రాకుండా బలంగా ప్రతిఘటించాడు. కాని రాంజీ చివరకు పట్టుబడ్డాడు. అతనితో పాటు వెయ్యిమంది సైనికులను నిర్మల్లో ఉరితీశారు.

రైతుల తిరుగుబాట్లు : బ్రిటీష్ వారి భూమిశిస్తు విధానాలు, అధిక పన్నుల విధింపు మూలంగా రైతుల్లో అశాంతి ఏర్పడింది. భూయజమానులైన రైతులు చాలామంది కౌలుదారులుగా మారారు. తమ ప్రాంతంలోని రైతులను కూడగట్టుకొని బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేశారు. ఈ క్రింది తిరుగుబాట్లు వీటిలో ప్రధానమైనవి.

రంగపూర్లో తిరుగుబాటు : 1783లో బెంగాల్లోని రంగపూర్, దింగపూర్ జిల్లాల్లో రైతులు రెవెన్యూ కాంట్రాక్టర్ దేవిసింగ్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. దేవిసింగ్ రైతుల పట్ల కఠోరంగా వ్యవహరించాడు. కొరడాలతో కొట్టడం లాంటి భయానక పరిస్థితులను సృష్టించాడు. రైతులు ఎన్ని విజ్ఞప్తులు చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దినజ్ఞారిన్ నాయకత్వంలో రైతులు బ్రిటీష్ వారిపై తిరగబడ్డారు.

మోప్లా తిరుగుబాటు (మలబార్ ప్రాంతం) : అక్రమ పన్నులు, బలవంతంగా తమ భూముల నుంచి వెళ్ళగొట్టడం, రైతుల పట్ల బ్రిటీష్ వ్యతిరేక వైఖరి మోప్లా తిరుగుబాటుకు కారణాలు.

TS Inter 1st Year History Study Material Chapter 12 బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా తొలి తిరుగుబాట్లు

పాగల్పంథీల తిరుగుబాటు : తూర్పు బెంగాల్లోని షెర్పూర్ పరగణాలో జమిందారులు అక్రమ పన్నులకు, శాశ్వత భూశిస్తు విధానానికి వ్యతిరేకంగా కరషా తరువాత అతని వారసుడు టిపూషా నాయకత్వంలో పాగల్పంథీలనే రైతులు తిరుగుబాటు చేశారు. రైతులు ధైర్య సాహసాలతో తిరుగుబాటు చేసినప్పటికి ప్రభుత్వం 1833లో దీన్ని అణచివేసింది.

మైసూర్ తిరుగుబాటు : మైసూర్ పాలకుడు ఒడయార్పై కంపెనీ ఆర్థిక ఒత్తిడి ఎక్కువైంది. పరోక్షంగా ఈ భారం రైతులపై పడింది. స్థానిక ఉద్యోగులు అవినీతితో అక్రమ పన్నుల వసూళ్ళకు పూనుకొన్నారు. రైతుల జీవితం దుర్భరం అయింది. నగర్ రాష్ట్రంలోని సర్దార్ మల్ల నాయకత్వంలో రైతులు 1800, 1831లలో తిరుగుబాటు చేశారు. ప్రభుత్వం ఈ తిరుగుబాటును అణచివేసింది.

ప్రశ్న 2.
1857 తిరుగుబాటుకు గల కారణాలను పేర్కొనండి.
జవాబు.
ఆధునిక భారతదేశ చరిత్రలో సిపాయిల తిరుగుబాటు విశిష్ట ఘట్టం. ఈస్ట్ ఇండియా కంపెనీ వారి యొక్క ప్రజా వ్యతిరేక విధానాల వలన అన్ని వర్గాలలో వచ్చిన అసంతృప్తి సిపాయిల తిరుగుబాటు రూపంలో ప్రతిఫలించింది. తిరుగుబాటు కారణాలను రాజకీయ, ఆర్థిక, సాంఘిక, మత, సైనిక కారణాలుగా విభజించవచ్చు.

1) రాజకీయ కారణాలు : భారతదేశంలో బ్రిటిష్ రాజ్యవిస్తరణకై ఆంగ్లేయులు యుద్ధాలు చేయటం, కుట్రలు, కుతంత్రాలు, సైన్య సహకార పద్ధతి డల్హౌసి రాజ్యసంక్రమణ సిద్ధాంతం ద్వారా అయోధ్య, సతారా, నాగపూర్, ఝాన్సీ సంస్థానాలు విలీనం చేసుకున్నాడు. పీష్వా దత్తకుమారుడైన నానాసాహెబు ‘భరణాన్ని నిరాకరించాడు. రాజుల బిరుదులు రద్దు చేశారు. దీనితో స్వదేశీ రాజులు అసంతృప్తికి లోనై తిరుగుబాటులో పాల్గొన్నారు.

2) ఆర్థిక కారణాలు : బ్రిటీష్ వారి రాజ్యసంక్రమణ విధానం వలన అనేక రాజ్యాలలోని ప్రభుత్వ ఉద్యోగులు, కవులు, గాయకులు, విద్వాంసులు నిరుద్యోగులయ్యారు. వారి విధానాలతో దేశంలోని చేతివృత్తులవారు, రైతులు దెబ్బతిన్నారు. కుటీర పరిశ్రమలు క్షీణించాయి. ఎందరో ప్రజలు తిండిలేక, పనిలేక అలమటించారు. వారికి తిరుగుబాటు తప్ప వేరే మార్గం లేకపోయింది.

3) సాంఘిక కారణాలు : బ్రిటీష్ వారు లార్డ్ బెంటింక్ కాలం నుంచి డల్హౌసీ కాలం వరకు ప్రవేశపెట్టిన సాంఘిక సంస్కరణలైన సతీసహగమన నిషేధ చట్టం, మత మార్పిడి చేసుకున్న వారికి ఆస్తిహక్కు, బాల్య వివాహాల నిషేధచట్టం, వితంతు పునర్వివాహ చట్టం వంటివి డల్హౌసి హయాంలో ప్రవేశపెట్టిన తంతి, తపాల, రైల్వేలు, పాశ్చాత్య తరహా న్యాయవ్యవస్థ ఇంగ్లీష్ విద్య సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికనే అపోహ ప్రజలలో వ్యాపించింది.

4) మత కారణాలు : కంపెనీ ప్రభుత్వ కాలంలో క్రైస్తవ మిషనరీలు మత ప్రచారాన్ని ఉధృతం చేశారు. క్రైస్తవులైన ‘ఆంగ్లేయులు అందరినీ క్రైస్తవులుగా మార్చుతారనే భయం ప్రజల్లో ఏర్పడింది. మిషనరీవారు హిందూ, ముస్లిం సంప్రదాయాలను అవహేళన చేస్తూ ప్రచారం చేసేవారు. భారతీయ ఆచారాలను నిషేధించి కొత్త చట్టాలు చేయడం, పాఠశాలలో మత బోధన చేయడం వంటివి ప్రజల్లో భయాందోళలనలకు తావిచ్చాయి.

5) సైనిక కారణాలు : బ్రిటీష్ సైన్యంలో బ్రతుకు తెరువుకు పనిచేసే భారతీయ సిపాయిలకు, ఆంగ్ల సైనికులకు జీతాలలో తేడా ఉండేది. భారతీయ సిపాయిలకు ప్రమోషన్లు కూడా లభించేవి కావు. కుల మత చిహ్నాలను సూచించే గుర్తులు తీసివేయమనడం, సముద్ర ప్రయాణం వీరిని మరింత కష్టపెట్టాయి.

6) తక్షణ కారణం : 1856లో కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్ఫీల్డ్ తుపాకులలో ఉపయోగించే తూటాలకు ఆవు కొవ్వు, పంది కొవ్వు పూశారనే వదంతితో హిందూ, ముస్లిం సైనికులలో అప్పటికే ఉన్న అసంతృప్తికి ఆజ్యం పోసినట్లయి తిరుగుబాటు ఆరంభమయింది. ఇది బ్రిటీష్ సామ్రాజ్య పునాదులనే కదిపివేసింది.

ప్రశ్న 3.
1857 తిరుగుబాటు గమనం గురించి రాయండి.
జవాబు.
తిరుగుబాటు గమనం : బారక్పూర్ రెజిమెంటుకు చెందిన మంగళ్పాండే 29 మార్చి 1857న కోపంతో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి సార్జంట్ మేజర్ న్ను కాల్చి చంపాడు. మంగళ్పాండేను ఉరితీశారు. ఏప్రిల్ నెలలో మీరట్ బెటాలియన్కు చెందిన సిపాయిలు తూటాలను ఉపయోగించడానికి నిరాకరించారు. ప్రభుత్వం వారికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. మే 10న మీరట్లో మూడు రెజిమెంట్లు తిరుగుబాటు చేసి బ్రిటీష్ అధికార్లను కాల్చి చంపారు. జైల్లోని ఖైదీలను విడుదల చేసి ఢిల్లీకి వెళ్ళారు. మే 12న మొఘల్ చక్రవర్తి రెండవ బహదూర్గాను భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు. ఈ తిరుగుబాటు కొద్ది సమయంలోనే ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. ఢిల్లీ నుంచి తూర్పున బీహారు వ్యాపించింది. జూన్ నెలలో లక్నో, ఝాన్సీ, కాన్పూర్లకు వ్యాపించింది. కాన్పూర్లో పీష్వా దత్తపుత్రుడైన నానాసాహెబ్ నాయకత్వంలో తిరుగుబాటు జరిగింది. నానాసాహెబ్ బ్రిటీష్ వారిని తీవ్రంగా ప్రతిఘటించాడు. కాన్పూర్ను ఆక్రమించి బ్రిటీష్ వాళ్ళను తరిమేశాడు. ఝాన్సీలో తాంతియాతోపే, లక్ష్మీబాయి బ్రిటీష్ వారిని తీవ్రంగా ప్రతిఘటించి యుద్ధం సాగించారు. బీహార్లో కున్వర్ సింగ్ తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. అవధ్ తొలగించబడిన నవాబు భార్య బేగం హజ్రత్ .. మహల్ నాయకత్వంలో సిపాయిలు తిరుగుబాటు చేశారు. అవధ్ను బ్రిటీష్వారు ఆక్రమించడాన్ని సిపాయిలు వ్యతిరేకించారు. అందుకే వారు భీకరమైన పోరాటం చేశారు. దక్షిణ భారతదేశంలో తిరుగుబాటు ప్రభావం లేదు. స్వదేశీ పాలకులెవ్వరూ ఈ తిరుగుబాటులో పాల్గొనలేదు. రాజస్థాన్, దక్షిణ భారతదేశంలో స్వదేశీ పాలకులు తిరుగుబాటును అణచడంలో బ్రిటీష్ వారికి సహకరించారు.

TS Inter 1st Year History Study Material Chapter 12 బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా తొలి తిరుగుబాట్లు

ఈ విధంగా తిరుగుబాటు మొత్తం ఉత్తర భారతదేశానికి వ్యాపించింది. ప్రారంభంలో తిరుగుబాటు కొంతవరకు విజయం సాధించింది. ఢిల్లీ, కాన్పూర్, ఆగ్రా, అలీఘర్, ఝాన్సీ, బీహార్ మొదలైన ప్రాంతాల్లో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు తిరుగుబాటులో పాల్గొన్నారు. మహమ్మదీయ నాయకులు, మౌల్వీలు మొఘల్ పాలనను పునఃస్థాపన చేయడానికి ఇదే మంచి అవకాశమని భావించారు.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
1857 తిరుగుబాటు విఫలం కావడానికి కారణాలు ఏవి ?
జవాబు.

  1. తిరుగుబాటు కేవలం ఉత్తర, మధ్య భారతదేశానికి మాత్రమే పరిమితమైంది. ఇతర ప్రాంతాలకు వ్యాపించకపోవడం.
  2. తిరుగుబాటు ప్రభావం పంజాబ్, సింధ్, రాజస్తాన్, దక్షిణ భారతదేశంలో లేకపోవడం.
  3. గ్వాలియర్, సింథియా, హైద్రాబాద్ నిజాం, కాశ్మీర్ గులాబ్సింగ్ మొదలైనవారు బ్రిటీష్ వారికి విధేయులుగా
    మారడం.
  4. తిరుగుబాటుదారుల్లో నాయకత్వలోపం, అవగాహన రాహిత్యం, ప్రణాళిక ప్రకారం తిరుగుబాటు చేయకపోవడం, దేశం అంతా ఒకేసారి తిరుగుబాటు జరపకపోవడం, సైనికులలో క్రమశిక్షణ లేకపోవడం ఓటమికి ప్రధాన కారణాలు.
  5. బ్రిటీష్ వారికి సమర్ధులైన సైనిక అధికారులున్నారు. కాంబెల్, లారెన్, హ్యురోస్, హమ్లాన్ మొదలైనవారు తిరుగుబాటును సమర్థవంతంగా అణచివేసారు. తిరుగుబాటుదారులు బ్రిటీష్ వారి ఆధునిక ఆయుధాలను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవడం కూడా తిరుగుబాటు విఫలానికి కారణం అయింది.
  6. ఆధునిక సాధనాలైన టెలిగ్రాఫ్, పోస్టల్ విధానాలు, రైళ్ళు తిరుగుబాటును సులభంగా అణచివేయడానికి బ్రిటీష్వారికి తోడ్పడ్డాయి. సైన్యాన్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి త్వరగా తరలించి త్వరితగతిన తిరుగుబాటును అణచివేయడం జరిగింది.

ఈ కారణాల వలన ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం అనబడిన సిపాయిల తిరుగుబాటును బ్రిటీష్వారు అతికష్టంమీద అణచివేయగలిగారు.

ప్రశ్న 2.
1857 తిరుగుబాటు ఫలితాలను వివరించండి.
జవాబు.
సుమారు ఒక సంవత్సర కాలంపాటు విభిన్న ప్రాంతాలలో జరిగిన సిపాయిల తిరుగుబాటును బ్రిటీషువారు అతికష్టం మీద అణచగలిగారు. ఈ యుద్ధ ఫలితంగా బ్రిటీష్ ఈస్ట్ ఇండియా పాలనలో కొన్ని మార్పులు చేయబడ్డాయి. తీవ్ర అసహనంగా ఉన్న భారతీయులను బుజ్జగించేందుకు కొన్ని చర్యలు చేపట్టారు.

ఫలితాలు :

  1. 1858లో విక్టోరియా రాణి ప్రకటనతో భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు చేయబడింది. అధికారం ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటీష్ రాణికి బదిలీ చేయబడింది.
  2. గవర్నర్ జనరల్ రద్దు చేయబడి, భారతదేశ ప్రాంతాలకు బ్రిటిష్ రాజప్రతినిధులు నియమించబడ్డారు. గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ తొలి రాజప్రతినిధిగా నియమించబడ్డాడు. 1858 నుంచి 1947 వరకు రాజప్రతినిధుల యుగంగా నడిచింది.
  3. రాణి ప్రకటన ప్రకారం కంపెనీ స్వదేశీ సంస్థానాలతో చేసుకున్న సంధి షరతుల ప్రకారం సంస్థానాధీశుల హక్కులను, మర్యాదలను కాపాడడానికి హామీ ఇచ్చింది. రాజ్య సంక్రమణ సిద్ధాంతం రద్దు చేయబడింది. దత్త స్వీకరణకు వారికి అనుమతి హక్కు ఇవ్వబడింది.
  4. రైతుల సంక్షేమం కోసం వారికి కొన్ని అనుకూలమైన చట్టాలు చేయబడ్డాయి.
  5. తిరుగుబాటు తర్వాత మూడు దశాబ్దాలలోపే బ్రిటిష్ పాలకుల వైఖరి వలన ప్రజలలో రేగుతున్న అసంతృప్తిని చల్లార్చేందుకు 1885లో బ్రిటీషు వారిచే “సేఫ్టీ వాల్వ్”గా భావించబడి స్థాపించబడిన భారత జాతీయ కాంగ్రెస్ తరువాత భారత స్వాతంత్రోద్యమానికి పోరాటం చేసింది.

ఈ విధంగా సిపాయి తిరుగుబాటు రాబోయే కాలంలోని జాతీయోద్యమానికి కావలసిన బీజాలు దేశ ప్రజలలో నాటింది.

ప్రశ్న 3.
1857 తిరుగుబాటు స్వభావాన్ని పరిశీలించండి.
జవాబు.
తిరుగుబాటు స్వభావం: 1857 తిరుగుబాటు స్వభావం గురించి చరిత్రకారుల్లో పరస్పర విరుద్ధ అభిప్రాయాలున్నాయి. 1857 సంఘటనను ఒక వర్గం చరిత్రకారులు ‘సిపాయిల పితూరి’ లేదా కొద్దిమంది సిపాయిల, సామాన్య ప్రజల అసంతృప్తిగా పేర్కొన్నారు. ఇంకొక వర్గం చరిత్రకారులు, దేశభక్తులు దీనిని “భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం” అని వర్ణించారు. మొదట సిపాయిల పితూరిగా ప్రారంభమై మెల్లమెల్లగా ప్రజా తిరుగుబాటు స్వభావం సంతరించుకుంది. లార్డ్కనింగ్ దీన్ని “జాతీయ సమరం” గా వర్ణించాడు. కొందరు దీన్ని మత భావాలను కాపాడుకునే ప్రయత్నంగా అభిప్రాయపడ్డారు. ఇంకొందరు దీన్ని బ్రిటీష్వారి జాతి విక్షతకు వారి ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటుగా పేర్కొన్నారు. 1857 తిరుగుబాటు ఒక సిపాయిల పితూరికాదు, ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం కాదు. ఇది భారతదేశ చరిత్రలో ఒక ముఖ్య సంఘటన మాత్రమే. అన్ని వర్గాల ప్రజలు ఏకమై పోరాడేటట్లు చేసింది.

TS Inter 1st Year History Study Material Chapter 12 బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా తొలి తిరుగుబాట్లు

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
1857 తిరుగుబాటుకు తక్షణ కారణం ఏది ?
జవాబు.
తక్షణ కారణం : 1856లో కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్ఫీల్డ్ తుపాకులలో ఉపయోగించే తూటాలకు ఆవు కొవ్వు, పంది కొవ్వు పూశారనే వదంతితో హిందూ, ముస్లిం సైనికులలో అప్పటికే ఉన్న అసంతృప్తికి ఆజ్యం పోసినట్లయి తిరుగుబాటు ఆరంభమయింది. ఇది బ్రిటిష్ సామ్రాజ్య పునాదులనే కదిపివేసింది.

ప్రశ్న 2.
ఝాన్సీ లక్ష్మీబాయి తిరుగుబాటులో పాల్గొనడానికి కారణం ఏమిటి ?
జవాబు.
లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఈమె ఝాన్సీ పాలకుడు గంగాధరరావు రెండో భార్య. 1857 సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న ప్రముఖులలో ఒకరు. తన దత్త కుమారుడు ఝాన్సీ రాజుగా గుర్తించడానికి నిరాకరించడంతో, మహారాష్ట్రకు చెందిన తాంతియాతోపేతో కలిసి బ్రిటీషు వారిని గడగడలాడించింది.

1858లో సర్ హ్యూరీస్ సేనాని ఝాన్సీని ఆక్రమించినపుడు లక్ష్మీబాయి కోట నుండి తన దత్త కుమారునితో బయటపడి తాంతియాతోపేతో కలిసి గ్వాలియర్ కోటను ఆక్రమించి, బ్రిటిష్వారితో యుద్ధాన్ని సాగించింది. 1858 జూన్ 17న యుద్ధంలో వీరమరణం పొందింది.

ప్రశ్న 3.
విక్టోరియా మహారాణి ప్రకటనపై స్వల్ప సమాధానం రాయండి.
జవాబు.
నవంబర్ 1858లో మొదటి వైస్రాయ్ చివరి గవర్నర్ జనరల్ అయిన లార్డ్కనింగ్ అలహాబాద్లో ఒక దర్బార్ను నిర్వహించి మహారాణి ప్రకటనను చదివి వినిపించాడు.

  1. 1858 చట్టం భారతదేశంలో కంపెనీ పాలనను రద్దు చేసింది. భారతదేశం ప్రత్యక్షంగా బ్రిటీష్ రాజరికంలోకి మారింది. భారతదేశ వ్యవహారాలను చూడటానికి లండన్లో భారత రాజ్యకార్యదర్శి, ఇండియా కౌన్సిల్న ఏర్పాటు
    చేసింది.
  2. సంతానంలేని స్వదేశీ పాలకులు ఇక నుంచి దత్తత తీసుకోవచ్చు. బ్రిటీష్వారు రాజ్య విస్తరణ విధానానికి స్వస్తి పలికారు.
  3. బ్రిటీష్వారిని హత్య చేసిన నేరస్థులకు లేదా హత్యతో ప్రత్యక్ష సంబంధమున్న వారిని మినహాయించి తిరుగుబాటుదారులు అందరికి క్షమాభిక్ష పెట్టింది. ప్రజల మత, సాంఘిక విషయాల్లో జోక్యం చేసుకోమని హామీ ఇచ్చారు. తిరుగుబాటును అణచడంలో సహాయమందించిన పాలకులకు రక్షణ కల్పించడం జరుగుతుందని హామీ ఇచ్చారు.

ప్రశ్న 4.
1857 తిరుగుబాటులో బహదూర్షా – II పాత్రను రాయండి.
జవాబు.
భారతదేశాన్ని పాలించిన మొగల్ చక్రవర్తులలో రెండో బహదూర్గా చివరివాడు. 1857 మే లో మీరట్లో తిరుగుబాటు చేసిన సిపాయిలు ఢిల్లీ చేరి, రెండో బహదూర్షాను భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు. 1857 సెప్టెంబరులో ఢిల్లీని వశపరచుకొన్న బ్రిటిష్వారు, బహదూరాను బందీగా చేసి, విచారణ జరిపి, ఖైదీగా రంగూన్ పంపించారు. అతని కుమారులను, మనుమల్ని పరాభవించి, చంపేశారు. 1862లో బహదూర్గా రంగూన్ జైలులో మరణించాడు. దీనితో మొగల్ వంశం అంతరించింది.

ప్రశ్న 5.
1857 తిరుగుబాటులో మంగళ్పాండే పాత్రను విశదీకరించండి.
జవాబు.
మంగళ్పండే ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ రెజిమెంట్ ని సిపాయి. కలకత్తా దగ్గర బారక్పూర్లో మార్చి 29, 1857న బ్రిటీష్ అధికారిని కాల్చి చంపాడు. కారణం బ్రిటీష్ వారు ఆవుకొవ్వు, పందికొవ్వుతో చేసిన తూటాలు వాడమని ఇవ్వడమే. ఈ తిరుగుబాటు చేసినందుకు పాండేని ఉరితీసారు. అవమానాలను మౌనంగా భరించిన భారతీయుల ఆలోచనలను స్వేచ్ఛా స్వాతంత్య్రం వైపు మళ్ళించిన ఘనత మంగళ్ పాండేదే.

TS Inter 1st Year History Study Material Chapter 12 బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా తొలి తిరుగుబాట్లు

ప్రశ్న 6.
బేగం హజ్రత్ మహల్ గురించి రాయండి.
జవాబు.
బేగం హజ్రత్ మహల్ అవద్ నవాబు వాజిత్ అలీషా యొక్క భార్య. అవద్ నవాబును పదవి నుండి తొలగించడాన్ని అక్కడి సిపాయిలు వ్యతిరేకించారు. 1857 సైనిక తిరుగుబాటులో ఈస్ట్ ఇండియా కంపెనీపై తిరుగుబాటు చేసి స్వాతంత్రోద్యమంలో కీలకపాత్ర వహించింది.

TS Inter 1st Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 2nd Lesson రాజ్యం, సార్వభౌమాధికారం Textbook Questions and Answers.

TS Inter 1st Year Political Science Study Material 2nd Lesson రాజ్యం, సార్వభౌమాధికారం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
రాజ్యాన్ని నిర్వచించి, దానికి గల మౌలిక లక్షణాలను చర్చించండి.
జవాబు.
పరిచయం :
రాజ్యం అనేది ఒక రాజకీయ సంస్థ. ఇది సార్వభౌమాధికారం గల అతిశక్తివంతమైన సంస్థ. అందువల్ల రాజ్యానికి రాజనీతి శాస్త్ర అధ్యయనంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. రాజ్యం సమాజంలోని అన్ని సాంఘిక, రాజకీయ సంస్థలన్నింటికంటే ఉన్నతమైనది.

అర్థం :
రాజ్యం అనే పదం మొట్టమొదటిసారిగా 16వ శతాబ్దంలో వాడుకలోకి వచ్చింది. ఇటలీ రాజనీతి తత్వవేత్త నికోలో మాకియవెల్లి 1513లో తన గ్రంథమైన “ప్రిన్స్”లో “లా స్టాటో” అనే ఇటలీ పరిభాషను ‘స్టేట్’కు పర్యాయపదంగా వాడాడు. అతని ఉద్దేశంలో స్టేట్ అంటే రాజకీయ శక్తి అని అర్థం.

ఆ తరువాత ఆంగ్లపదం ‘స్టేట్’ విరివిగా వాడుకలోకి వచ్చి విస్తృతంగా చర్చించారు. 18వ శతాబ్దం నాటికి రాజ్యం ఒక మానవ నిర్మిత వ్యవస్థగా బహుళ ఆదరణ పొంది విశ్వజనీన సంస్థగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

నిర్వచనాలు :
రాజ్యం అత్యంత ఆవశ్యకమైన విశ్వజనీన సంస్థ. అందువల్ల రాజనీతిశాస్త్ర అధ్యయనంలో దాని ప్రాధాన్యత మరింత పెరిగింది. అయితే, అనేక మంది రాజనీతి శాస్త్రవేత్తల మధ్య నిర్వచనాలపై ఏకాభిప్రాయం లేదు. ఎందుకంటే గాణ్య స్వభావానికి సంబంధించి భిన్న అభిప్రాయాలుండడం వల్ల దాని నిర్వచనంపై ఏకాభిప్రాయంలేదు. ప్రతి రాజనీతి శాస్త్రవేత్త తనదైన దృక్కోణంలో నిర్వచించడానికి ప్రయత్నించారు.

గార్నర్ :
“ఒక నిర్దిష్ట ప్రదేశంలో స్థిరనివాసులై, స్వతంత్రులుగా, వ్యవస్థాపూర్వక ప్రభుత్వానికి విధేయులుగా ఉండే ప్రజా సముదాయమే రాజ్యం”గా ‘నిర్వచించారు.

బ్లంట్ షిల్లీ :
“నిర్ణీత భూభాగంలో రాజకీయంగా వ్యవస్థాపితమైన ప్రజలే రాజ్యం” అని వర్ణించారు.

ఉడ్రో విల్సన్ :
“నిర్ణీత భూభాగంలో శాసన బద్ధమైన జీవితానికి సంఘటితం కాబడిన ప్రజలే” రాజ్యమని నిర్వచించారు.

హెచ్.జె. లాస్కీ:
“ఒక నియమిత భౌగోళిక ప్రాంతంలో ప్రభుత్వంగా, పాలితులుగా విభజితమై ఇతర సంస్థలన్నింటి మీద ఆధిక్యం కలిగి ఉండే ప్రాదేశిక సంఘమే రాజ్యం” అని నిర్వచించారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

రాజ్యం-మౌలిక లక్షణాలు :
పైన ఉదహరించిన నిర్వచనాలను నిశితంగా పరిశీలించినట్లయితే రాజ్యానికి నాలుగు ప్రధాన లక్షణాలున్నట్లు మనకు బోధపడుతుంది. అవి : 1. ప్రజలు, 2. ప్రదేశం, 3. ప్రభుత్వం, 4. సార్వభౌమాధికారం. ఈ నాలుగు లక్షణాలతోపాటు ఇటీవల కాలంలో రాజ్యానికి అంతర్జాతీయ గుర్తింపు కూడా అవసరమని భావించటం జరిగింది.

1. ప్రజలు :
రాజ్యం ఒక మానవ సంస్థ కాబట్టి ప్రజలులేనిదే రాజ్యంలేదు. ప్రజలు రాజ్యానికి గల మౌలిక లక్షణాలలో మొట్టమొదటిది. ప్రజలులేని రాజ్యం మనుగడను కలిగి ఉండదు. అందువల్ల కొందరు పాలించడానికి మరికొందరు పరిపాలించబడటానికి రాజ్యంలో ఉండాలి.

మానవ సముదాయంలేని ఎడారి ప్రాంతాన్ని మనం రాజ్యంగా భావించలే. రాజ్యంలోని ప్రజలు పలురకాల వర్గాలకు, తెగలకు చెందినవారై భిన్న ఆచార సంప్రదాయాలను అలవాట్లను, అదే విధంగా, అనేక దృక్పథాలను, అభిప్రాయాలను కలిగి ఉంటారు.

రాజ్యంలో ఎంత జనాభా ఉండాలనే దానిపై రాజనీతి శాస్త్రవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. గ్రీకు తత్త్వవేత్త ప్లేటో తన గ్రంథమైన “దిలాస్”లో 5040 మంది జనాభా కలిగి ఉన్న రాజ్యం ఆదర్శ రాజ్యమన్నాడు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యవాది, చిన్న చిన్న గణతంత్ర రాజ్యాలు ఉండాలని భావించిన ఫ్రెంచి తత్త్వవేత్త రూసో, రాజ్యంలో పదివేల జనాభా ఉండవచ్చునన్నాడు.

స్వయం పోషకత్వానికి, సమర్థపాలనకు సరిపడా జనాభా మాత్రమే ఉండాలని అరిస్టాటిల్ పేర్కొన్నాడు. ఏది ఏమైనప్పటికీ, రాజ్యవనరులకు, విస్తీర్ణతకు మించిన జనాభా ఉండకూడదు అనేది అందరి అభిప్రాయం.

2. ప్రదేశం :
ప్రదేశం లేదా భూభాగం అనేది రాజ్యానికి గల రెండవ లక్షణం. ఒక నిర్దిష్ట ప్రదేశంలో ప్రజలు నివసించనట్లయితే దాన్ని రాజ్యంగా పరిగణించలేం: నోమడ్స్, జిప్సీలు వంటి తెగలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి నిరంతరం వలస వెళుతున్నందున వారు ఒక రాజ్యపరిధిలో నివసించినట్లు భావించలేం. ప్రదేశం అనేది రాజ్యానికి సంబంధించిన ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాన్ని సూచిస్తుంది.

ఆ ప్రదేశం ప్రభుత్వ అధీనంలో ఉండి దానిపై సార్వభౌమాధికారంతో కూడిన నియంత్రణాధికారం ఉంటుంది. ప్రదేశం రాజ్యం నుంచి విడదీయలేనటువంటిది. -ప్రదేశం ప్రజల మధ్య సహోదర భావాన్ని సమైక్యతను ఏర్పర్చి రాజ్యానికి తిరుగులేని అధికారాన్ని అందిస్తుంది.

ప్రదేశం ఒక నిర్దిష్ట భూభాగమే కాకుండా దాని పరిధిలో సారవంతమైన నేలను, పర్వతాలను, నదులను, సరస్సులను అనేక ఇతర వనరులను కలిగి ఉంటుంది.

అదే విధంగా, ఆకాశంలో కొంత భాగాన్ని ఆ రాజ్య ప్రాదేశిక వియత్తలంగాను, అట్లాగే ఆ రాజ్యానికి సముద్రతీరం ఉన్నట్లయితే కొంత దూరాన్ని ప్రాదేశిక జలాలుగాను భూభాగంతోపాటు రాజ్యానికి హద్దులుగా నిర్ణయిస్తారు. గతంలో ప్రాదేశిక జలాల దూరం 3 నాటికల్ మైళ్ళుగా ఉండేది నేడు అది 12 నాటికల్ మైళ్ళదూరంగా గుర్తించబడింది.

3. ప్రభుత్వం :
రాజ్యానికి ప్రభుత్వం మూడవ మౌలిక లక్షణం. ప్రభుత్వమనేది ఒక రాజకీయ సంస్థగా ప్రజల కార్యకలాపాలను నియంత్రిస్తూ మార్గనిర్దేశకం చేస్తూ వారి మధ్య ఉత్పన్నమయ్యే అనేక రకాల సమస్యలకు పరిష్కారాలను చూపుతుంది.

రాజ్యం తన విధివిధానాలను, అభిప్రాయాన్ని ప్రభుత్వం ద్వారా అమలుపరుస్తుంది. ప్రభుత్వం ద్వారా రాజ్యం తన ఉనికిని కొనసాగిస్తుంది. గార్నర్ అనే రాజనీతి పండితుడు “ప్రభుత్వం రాజ్యానికి ఒక సాధనంగా ప్రజలందరిని ఉద్దేశించి రూపొందించిన విధానాలను, పథకాలను అమలుపరుస్తూ ప్రజలందరి ప్రయోజనాలను కాపాడే వ్యవస్థ”గా అభివర్ణించాడు.

ప్రభుత్వం, ఒక సాధనంగా రాజ్య అభీష్టాన్ని అమలుపర్చే కార్యంలో నిమగ్నమౌతుంది. అందువల్ల ప్రభుత్వంలేని రాజ్యాన్ని ఊహించలేం. ప్రభుత్వంలేని రాజ్యంలో ప్రజలు అసంఘటితంగా, అశాంతి అభద్రతా భావంతో అరాచకస్థితిలో నివసిస్తారు.

సమష్టి ఆలోచనలుగాని, సమిష్టి నిర్ణయాలు గాని, సమష్టి ప్రయోజనాల సాధనకై ప్రయత్నాలుగాని చేయలేని పరిస్థితిలో శాంతి భద్రతలు లోపించి చట్టాలను అతిక్రమించటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రజాసంక్షేమం దృష్ట్యా నిర్దిష్ట ప్రభుత్వ యంత్రాంగం అత్యంత ఆవశ్యకమైంది.

4. సార్వభౌమాధికారం :
సార్వభౌమాధికారం రాజ్యానికి గల నాలుగవ అతిముఖ్యమైన మౌలిక లక్షణం. ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం ఉన్నా సార్వభౌమాధికారం లేనట్లయితే రాజ్యం ఏర్పడదు. రాజ్యానికి గల ఈ మౌలిక లక్షణమే ఇతర సంస్థలన్నింటికంటే రాజ్యానికి ఉన్నతమైనదిగా గుర్తింపును కలిగిస్తుంది. సార్వభౌమాధికారం ఒక్క రాజ్యానికి మాత్రమే ఉండే లక్షణం.

సార్వభౌమాధికారం రాజ్యానికి గల సర్వాధికారాలకు నిదర్శనం. రాజ్యానికి గల తిరుగులేని అధికారమే సార్వభౌమాధికారం. ఇది ఒక్క రాజ్యానికి మాత్రమే గల అధికారం. ఈ అధికారం వల్లనే సర్వస్వతంత్రత కలిగిన వ్యవస్థగా రాజ్యం గుర్తించబడింది.

సార్వభౌఉకారం, రాజ్యంపై విదేశీపరమైన నియంత్రణలు లేని స్వతంత్ర వ్యవస్థగా, రాజ్యంలోని వ్యక్తులపై సంస్థలపై నళిక ప్రదేశంపై తిరుగులేని అధికారాన్ని చలాయించే శాసనాధికారాన్ని కల్పిస్తుంది. అంతేకాదు.

రాజ్యం అమలుపరచదలుచుకున్న అన్ని రకాల కార్యకలాపాలు యథేచ్ఛగా కొనసాగేటట్లుగాని, ప్రజలు రాజ్యానికి విధేయులుగా ఉండేటట్లుగాని చేయడంలో సార్వభౌమాధికారానికి మించినదేదీలేదు. రాజ్యానికి మాత్రమే ఉన్న ఈ సార్వభౌమాధికారం రాజ్యాన్ని ఇతర సంస్థలన్నింటికంటే ఉన్నతమైన, విశిష్టమైనదిగా నిలబెడుతుంది.

మరోవిధంగా చెప్పాలంటే, సార్వభౌమాధికారం రెండు రకాల రూపాలను కలిగి ఉంటుంది. ఒకటి, రాజ్యపరిధిలోని వ్యక్తులపై, సంస్థలపై చలాయించే శాసనాధికారం అంతర్గత సార్వభౌమత్వం కాగా, విదేశీ విధానంలో రాజ్యం ప్రదర్శించే స్వతంత్రత బాహ్య సార్వభౌమత్వం రెండవది అవుతుంది.

అంతర్జాతీయ గుర్తింపు :
అంతర్జాతీయ గుర్తింపు అనేది ఇటీవల కాలంలో రాజ్య మౌలిక లక్షణాలలో ఒకటిగా గుర్తించబడింది. ఆధునిక కాలంలో అనేక జాతీయ రాజ్యాలు, అంతర్జాతీయ సంస్థలు ఉనికిలోకి వచ్చాయి. అందువల్ల కొంతమంది రాజనీతి పండితులు అంతర్జాతీయ గుర్తింపు అత్యంత ఆవశ్యకమైనదిగా భావించాలన్నారు. ఎందుకంటే

ఏ రాజ్యమైనా ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం, సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటుంది. కాని అది అంతర్జాతీయ స్థాయిలో గుర్తించబడినప్పుడే దానికి గల అధికారాలు చెల్లుబాటు అవుతాయి. ఒక సార్వభౌమాధికార రాజ్యాన్ని మరో సార్వభౌమాధికార రాజ్యం గుర్తించిననాడే దాని మనుగడ కొనసాగుతుంది. అంతర్జాతీయ గుర్తింపు అనేది ప్రపంచ సంస్థయైన ఐక్యరాజ్యసమితి ద్వారా లభిస్తుంది.

ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశంగా గుర్తింపు పొందడం ద్వారా ఆ రాజ్యానికి సంబంధించిన సార్వభౌమాధికారం ఇతర రాజ్యాల చేత ఆమోదం పొందుతుంది. ఈ విధంగానే నూతన రాజ్యాలు ఏర్పడతాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

ప్రశ్న 2.
ఏకత్వ సార్వభౌమాధికారాన్ని వివరించండి.
జవాబు.
జాన్ ఆస్టిన్ ఏకత్వ సార్వభౌమాధికార సిద్ధాంతం : 18వ శతాబ్దంలో ఏకత్వ సార్వభౌమాధికార సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఇంగ్లాండ్ దేశ న్యాయకోవిదుడు జాన్ ఆస్టిన్. ఇతను తన గ్రంథమైన “లెక్చర్స్ ఆన్ జ్యూరిస్ట్రుడెన్స్” (1832)లో ఈ సిద్ధాంత ప్రతిపాదన చేశాడు.

తన కంటే ముందున్న థామస్ హాబ్స్, జెర్మి బెంథామ్ల సిద్ధాంతాలను తన సిద్ధాంతానికి ఆధారంగా తీసుకున్నాడు. ఆస్టిన్ సిద్దాంతాన్ని “నిరపేక్ష లేదా న్యాయబద్ధ సార్వభౌమాధికార సిద్ధాంతమని” కూడా పేర్కొంటారు. ఇతని అభిప్రాయంలో శాసనమనేది సార్వభౌముడు ప్రజలకిచ్చిన ఆజ్ఞగా పేర్కొన్నాడు.

ఆస్టిన్ సార్వభౌమాధికారం – ముఖ్య లక్షణాలు :
1. ఇది నిశ్చయాధికారం :
ప్రతి స్వతంత్ర రాజకీయ సమాజంలో ఒక నిర్ణీత మానవ అధికారి లేదా వ్యక్తుల సముదాయానికి సార్వభౌమాధికారం ఉంటుంది. వ్యక్తికి లేదా వ్యక్తుల సముదాయానికి గల అధికారం నిశ్చయ సార్వభౌమాధికారం.

2. సార్వభౌమాధికారి ప్రజలు అలవాటు ప్రకారం విధేయులై ఉంటారు :
సమాజంలోని ప్రజలందరు తమ అలవాటు ప్రకారం సార్వభౌమాధికారికి విధేయులై ఉంటారు. ప్రజలపై ఎటువంటి ఒత్తిడిగాని, ప్రలోభంగాని ఉండదు. ప్రజలు యథాలాపంగా సార్వభౌముడికి విధేయులై ఉంటారు.

3. సార్వభౌమత్వం అవిభాజ్యం:
సార్వభౌమాధికారం విభజించడానికి లులేనటువంటిది. ఎందుకంటే అది ఒకే దగ్గర కేంద్రీకరించబడి ఉంటుంది. సార్వభౌముడి అధికారానికి ఎటువంటి పరిమితులుండవు. శాసనాలకు మూలాధారం సార్వభౌముడు.

4. సార్వభౌమాధికారం ఆవశ్యకమైంది :
రాజకీయ సమాజానికి సార్వభౌమాధికారం అల్మ ‘అవసరమైంది. సార్వభౌమత్వం లేని సమాజం, రాజకీయంగాని స్వతంత్రతగాని లేని సమాజమౌతుంది.

5. చట్టమే తుది ఆజ్ఞ :
సార్వభౌముని ఆజ్ఞే చట్టం. చట్టాన్ని ఉల్లంఘించిన వారు శిక్షార్హులు అవుతారు. ఎందుకంటే సార్వభౌమాధికారం ‘ నిరపేక్షమైంది, నిర్దిష్టమైంది, స్పష్టమైంది, అపరిమితమైంది కాబట్టి.

6. రాజ్యానికి వ్యతిరేకమైన ఎటువంటి హక్కులు ప్రజలకు ఉండవు :
రాజకీయ సమాజంలోని ప్రజలకు సార్వభౌముడు ప్రసాదించిన హక్కులు మినహా ఏ ఇతర హక్కులు ఉండవు. ప్రజలు రాజ్యాన్ని వ్యతిరేకించే హక్కులను కలిగి ఉండరు.

ఆస్టిన్ సార్వభౌమాధికారం విమర్శ:
ఆస్టిన్ ప్రతిపాదించిన ఏకత్వ సార్వభౌమాధికారాన్ని ఎంతో మంది రాజనీతి పండితులు విమర్శించారు. ముఖ్యంగా ప్రజాస్వామికవాదులు, బహుతావాదులు విమర్శించారు.

వారిలో ప్రముఖంగా ఎ.వి.డైసీ, హెచ్.జె. లాస్కీ, జె.సి. గ్రే, హెన్రీమెయిన్, సివిక్ మొదలైన వారు ముఖ్యులు. కింది అంశాల ఆధారంగా వారు విమర్శించారు.

1. ఇది చారిత్రికమైంది కాదు :
హెన్రీమొయిన్ అభిప్రాయంలో ఆస్టిన్ ఏకత్వ సార్వభౌమాధికారానికి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు.

2. ప్రజాస్వామ్య వ్యతిరేకం:
ఆస్టిన్ సిద్దాంతం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైంది. ఇది ప్రజాస్వామ్య విలువలకు, జీవనానికి పూర్తి విరుద్ధమైనటువంటిది.

3. నిరపేక్ష సార్వభౌమాధికారం హానికరం :
ఆధునిక ప్రజాస్వామ్యదేశాలలో నిరపేక్ష, అపరిమిత సార్వభౌమాధి కారమనేది ఏ రూపంలో ఉన్నా హానికరమైనటువంటిది. ఎందుకంటే, నిరపేక్ష సార్వభౌమాధికారి బాధ్యతారహితంగా పాలించే అవకాశముంది.

4. సార్వభౌమత్వ ఉనికిని గుర్తించడం కష్టం:
ఆస్టిన్ అభిప్రాయంలో సార్వభౌమాధికారం అవిభాజ్యం. ఈ అభిప్రాయాన్ని బహుతావాదులు అంగీకరించలేదు. అమెరికా, భారతదేశం వంటి సమాఖ్య రాజ్యాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాన్ని విభజించడం జరుగుతుంది. కాబట్టి సమాఖ్య రాజ్యాలలో సార్వభౌమాధికారం ఎక్కడుందో గుర్తించడం కష్టమని లాస్కీ వ్యాఖ్యానించాడు.

5. రాజ్యం సర్వోన్నతమైంది కాదు :
ఆస్టిన్ రాజ్యాన్ని సర్వోన్నతమైన సంస్థగా పరిగణించాడు. కానీ వాస్తవంగా సమాజంలో రాజ్యంతో పాటు వివిధ రకాల సంఘాలు కూడా ఎన్నో రకాల సేవలను ప్రజలకు అందిస్తున్నాయని బహుతావాదుల వాదన. వీరి అభిప్రాయంలో వ్యక్తి వికాసానికి రాజ్యమెంత అవసరమో ఇతర సంఘాలు కూడా అంతే అవసరం.

6. ఆచార, సంప్రదాయాల ప్రాధాన్యతను విస్మరించడం :
ఆస్టిన్ సిద్ధాంతం ప్రకారం శాసనాలకు సార్వభౌముడి అధికారం మూలం. అయితే శాసన నిర్మాణంలో ప్రజల ఆచార, సంప్రదాయాలు ప్రాచీనకాలం నుంచి ప్రభావితం చేస్తున్నాయనే విషయాన్ని ఆస్టిన్ విస్మరించాడు.

పైన వివరించిన విమర్శలు ఎన్ని ఉన్నప్పటికీ ఆస్టిన్ ఏకత్వ సార్వభౌమాధికార సిద్ధాంతానికి రాజనీతిశాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

ప్రశ్న 3.
బహుత్వ సార్వభౌమాధికారాన్ని వివరించండి.
జవాబు.
బహుతావాద (బహుత్వవాద) సార్వభౌమాధికార సిద్ధాంతం ఆస్టిన్ ప్రతిపాదించిన ఏకత్వ నిరపేక్ష సార్వభౌమాధికార సిద్ధాంతానికి వ్యతిరేకంగా ప్రచారంలోకి వచ్చింది. ప్రజాస్వామ్యం, సమాఖ్య సిద్దాంత స్ఫూర్తి. వ్యక్తిగత స్వేచ్ఛ, అధికారాల విభజన వంటి అనేక అంశాలు బహుతావాద సార్వభౌమాధికారం బహుళ ప్రాచుర్యం పొందడానికి దోహదపడ్డాయి.

వాన్ గిర్కే (1844 – 1925) : మొట్టమొదటిసారి బహుతావాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆ తరువాత మెట్లాంగ్, బార్కర్, జి.డి.హెచ్. కోల్, హెచ్.జె. లాస్కీ, లిండ్సే, మైకేవర్, ఫాలెట్ వంటి వారు బహుతావాద సార్వభౌమాధికార సిద్ధాంతాన్ని బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు.

వీరందరూ ఏకత్వ సార్వభౌమాధికారం చాలా ప్రమాదకరమైందని ఆధునిక ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలి పెట్టులాంటిదని అభిప్రాయపడ్డారు. బహుతావాదుల అభిప్రాయంలో రాజకీయ సమాజంలోని అనేక సంస్థలలో రాజ్యం ఒకటని అందువల్ల అధికారమంతా ఒక్క రాజ్య అధీనంలోనే ఉండదని వీరు పేర్కొన్నారు.

బహుతావాద సార్వభౌమాధికారం – ప్రధాన అంశాలు :

  1. సమాజంలోని అనేక సంస్థల్లో రాజ్యం ఒకటి. రాజ్యం ఒక్కటే అధికారాన్ని కలిగి ఉండదు. సమాజంలోని వివిధ సంఘాలు కూడా సమాజానికి ఉపయోగకరమైన పనులు చేస్తాయి. అందువల్ల సార్వభౌమాధికారాన్ని రాజ్యానికి వివిధ సంఘాల మధ్య పంచడమే సమంజసమని వీరి అభిప్రాయం.
  2. రాజ్యం సమాజాన్నిగాని మరే ఇతర సంస్థను గాని నిర్మించలేదు. అదే విధంగా సమాజంలోని సాంస్కృతిక, ఆర్థిక, మతపరమైన, రాజకీయపరమైన సంస్థలను కూడా రాజ్యం సృష్టించలేదు. ఈ కారణం చేత రాజ్యం ఈ సంస్థలను రద్దు చేయజాలదు. రాజ్యానికి ఆ అధికారం కూడా లేదు.
  3. సమాజం సమాఖ్య రూపాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి రాజ్యం దాని అధికారాలను అన్ని సంస్థలకు పంపిణీ చేయవలసి ఉంటుంది.
  4. సార్వభౌమాధికారం ఒక్క రాజ్యానికి మాత్రమే చెందింది కాదు. కాబట్టి మిగతా సంస్థలన్నింటి మీద దాని అధికారం ఉండదు.
  5.  సార్వభౌమాధికారం నిరపేక్షంకాదు. అది అపరిమితమైంది, ప్రశ్నించలేనిది కాదు. దానికి కొన్ని అంతర్గత – బాహ్య పరిమితులున్నాయి. అంతర్జాతీయ వేదికలు సార్వభౌమాధికారంపై కొన్ని పరిమితులు విధించవచ్చు.
  6. సార్వభౌమాధికారం ఏకపక్ష స్వభావం కలిగి ఉండదు. సమాజంలో రాజ్యాంగపరమైన, సంప్రదాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకొని సార్వభౌమాధికారం అమలుపర్చవలసి ఉంటుంది. సార్వభౌమాధికారం ఒక్క రాజ్యం చేతిలోనే ఉండదు.
  7. సార్వభౌముడి ఆజ్ఞలే చట్టాలు, శాసనాలు అనుకోవడానికి వీలులేదు. సమాజంలోని అనేక అంశాలను దృష్టిలో ఉంచుకొని దాన్ని అమలుచేయాలి.
  8. ఆస్టిన్ రాజ్యానికి తిరుగులేని అధికారాన్ని కట్టబెట్టాడని బహుతావాదులు విమర్శించారు. దీని పర్యవసానంగా మానవ సమాజంలోని అనేక ఇతర సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

ప్రశ్న 4.
సార్వభౌమాధికారం అంటే ఏమిటి ? దాని ముఖ్య లక్షణాలను పేర్కొనండి.
జవాబు.
ఆధునిక రాజ్యానికి గల అతి ముఖ్యమైన లక్షణం సార్వభౌమాధికారం. నేడు అన్ని ఆధునిక రాజ్యాలు జాతీయ రాజ్యాలే. సార్వభౌమాధికారం వాటి ప్రధాన లక్షణం. సార్వభౌమాధికార లక్షణం వల్లనే రాజ్యం ఇతర సంస్థల సంఘాల కంటే భిన్నమైనదిగా గుర్తించబడింది. సార్వభౌమాధికారం రాజ్యానికి ఉండటం వల్లనే అది అన్ని రకాల అధికారాలను నిర్వహించగలుగుతుంది.

ఆధునిక రచయితల్లో ముఖ్యమైన ఫ్రెంచితత్వవేత్త 16వ శతాబ్దానికి చెందిన జీనో బోడిన్ మొట్ట మొదటి సారి “సార్వభౌమాధికారం” అనే పదాన్ని వాడారు. ఈ భావనను తన గ్రంథమైన “Six Books on the Republic”లో -1576లో పేర్కొన్నాడు.

నిర్వచనాలు : సార్వభౌమాధికారం అనే భావనను అనేక మంది పలు విధాలుగా నిర్వచించారు. కొన్ని నిర్వచనాలను కింది విధంగా తెలుసుకుందాము :
విల్లోభి : “రాజ్యం యొక్క అత్యున్నతా అభీష్టమే సార్వభౌమాధికారం” అన్నాడు.
బ్లాక్న్ : “ఎటువంటి పరిమితులు, నియంత్రణలేని నిరపేక్షమైన, శాసనబద్ధమైన అతి ఉన్నత అధికారమే సార్వభౌమాధికారం”.
జీన్ బోడిన్ : “పౌరులపై పాలితులపై శాసనాతీతమైన అత్యున్నత రాజ్యాధికారమే సార్వభౌమాధికారం”గా నిర్వచించాడు.
హ్యుగో గ్రోషియస్ : “ఎవరు అతిక్రమించలేని, విస్మరించలేని రాజ్యాధికారమే సార్వభౌమాధికారం” అన్నాడు. జెంక్స్ : “సమాజంలోని ప్రతి వ్యక్తి చర్యలను సంపూర్ణంగా నియంత్రించే అధికారమే సార్వభౌమాధికారం.”
ఉడ్రోవిల్సన్ : “శాసనాల తయారీ, అమలు దైనందిన శక్తి వ్యవహారం.”

సార్వభౌమాధికారం లక్షణాలు: సార్వభౌమాధికార లక్షణాలను కింది విధంగా వివరించవచ్చు.

  1. నిరపేక్షత (Absoluteness)
  2. సార్వజనీనత (Universality)
  3. శాశ్వతత్వం (Permanence)
  4. అనన్యసంక్రామకత్వం (Inalienability)
  5. అవిభాజ్యత (Indivisibility)

1. నిరపేక్షత :
రాజ్యానికి గల నిరపేక్షాధికారమే సార్వభౌమాధికారం. రాజ్యపరిధిలో సార్వభౌమాధికారాన్ని మించిన మరే అధికారం ఉండదు. సార్వభౌమాధికారాన్ని శాసించే అధికారం ఏ వ్యక్తికిగాని, సంస్థకుగాని ఉండదు. సార్వభౌమాధికారంపై ఎలాంటి ఆంక్షలను వ్యక్తులుగాని, సముదాయాలుగాని సాధించలేవు. అదేవిధంగా ఒక సార్వభౌ మాధికారం గల రాజ్యం సరిహద్దులలో మరో రాజ్యం జోక్యం చేసుకోవడం తగదు.

అయితే, మెట్లాండ్ వంటి రచయితలు సార్వభౌమాధికార నిరపేక్షతపై కొన్ని పరిమితులున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా, ప్రజాస్వామ్య రాజ్యాలు, ప్రజల ఆచార సంప్రదాయాలలోగాని, వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు వ్యతిరేకంగా తన అధికారాన్ని ఉపయోగించవు. అదే విధంగా, అంతర్జాతీయ న్యాయస్థానం ఏర్పడిన తరువాత అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు లోబడి మాత్రమే రాజ్యాలు ప్రవర్తిస్తున్నాయని చెప్పవచ్చు.

2. సార్వజనీనత :
సార్వభౌమాధికారం దాని స్వభావ రీత్యా సార్వజనీనమైంది. రాజ్య పరిధిలో గల ప్రజలందరి సంస్థలన్నింటికీ, సంఘాలన్నింటికీ సార్వభౌమాధికారం వర్తిస్తుంది. సార్వభౌమాధికారం ఏ వ్యక్తికి గాని, సంస్థకు గాని, సంఘానికి గాని ఎటువంటి మినహాయింపు ఇవ్వదు.

అయితే, విదేశీ రాయబారులు, రాయబార కార్యాలయ సిబ్బందికి మినహాయింపులుంటాయి. కొన్ని ప్రత్యేక సందర్భాలలో వారికి గల ప్రత్యేక అధికారాలను తొలగించవచ్చు. కాబట్టి వారు సైతం ప్రత్యేక సందర్భాలలో సార్వభౌమాధికారానికి లోబడి తమ వ్యవహారశైలిని మార్చుకోవలసి ఉంటుంది.

3. శాశ్వతత్వం :
సార్వభౌమాధికారం రాజ్యానికి గల శాశ్వత అధికారం. రాజ్యం తన మనుగడను కొనసాగించినంత కాలం సార్వభౌమాధికారం కూడా కొనసాగుతూనే ఉంటుంది. ప్రభుత్వం కాలపరిమితిలో మారుతుంది. కాని రాజ్యం మాత్రం మారదు. ఎందుకంటే రాజ్యం శాశ్వతమైంది. ప్రభుత్వం అశాశ్వతమైంది. గార్నర్ అభిప్రాయం ప్రకారం “మరణం లేదా తాత్కాలికంగా గుణములలో సంబంధించిన మార్పులవల్ల గాని, రాజ్యపునఃనిర్మాణం వల్లగాని సార్వభౌమాధికారం మారదు.”

4. అనన్యసంక్రామకత్వం :
రాజ్యానికి గల సార్వభౌమాధికారాన్ని మరొక రాజ్యానికి గాని, సంస్థకుగాని బదిలీ చేయడానికి వీలుపడదు. దాన్ని ఇతరులకు బదిలీ చేసినట్లయితే అది నాశనమౌతుంది. ఒకవేళ రాజ్యం తన భూభాగంలో కొంత భాగాన్ని స్వతహాగా వదులుకుంటే ఆ రాజ్యం సార్వభౌమాధికారాన్ని కోల్పోయినట్లు కాదు. కేవలం ఆ ప్రాంతంపై మాత్రమే తన అధికారం కోల్పోతుంది.

రాజ్యపాలకుణ్ణి ఆ రాజ్యంలోని తిరుగుబాటుదారులు అధికారం నుంచి తొలగించినట్లయితే అది కేవలం ప్రభుత్వంలో మార్పు సంభవించినట్లుగా భావించాలి గాని సార్వభౌమాధికారం మారినట్లు కాదు. సార్వభౌమాధికారం, రాజ్యం సమాంతరంగా కొనసాగుతాయి. ఎందుకంటే శరీరం నుంచి ఆత్మను ఏ విధంగా విడదీయడం సాధ్యం కాదో అదే మాదిరి రాజ్యం నుంచి సార్వభౌమాధికారాన్ని విడదీయలేం.

5. అవిభాజ్యత :
సార్వభౌమాధికారం విడదీయరానిది, దాన్ని విడదీయడం సాధ్యం కాదు. ఒకవేళ దాన్ని విభజించినట్లయితే అది మనుగడను కొనసాగించలేదు. ప్రతి రాజ్యం ఒకే ఒక అభీష్టాన్ని కలిగి ఉంటుంది. సార్వభౌమాధికారాన్ని విడదీయడమనేది సార్వభౌమాధికార సిద్ధాంతానికే వ్యతిరేకం.

బహుతావాదులు సార్వభౌమాధికారం అవిభాజ్యతను వ్యతిరేకించారు. వీరిలో ప్రముఖంగా లోవెల్, బ్రైస్ లాంటి వారు సార్వభౌమాధికార విభజన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.

వీరి ఉద్దేశంలో ఒక రాజ్యంలో రెండు స్థాయిలు గల సార్వభౌమాధికారం ఉంటుంది. దీనికి వీరిచ్చే ఉదాహరణ సమాఖ్య వ్యవస్థలో రాజ్యానికి గల అధికారాలు కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజించబడతాయి. అయితే, వీరి వాదనను వ్యతిరేకించే వారు కేంద్ర – రాష్ట్రాల మధ్య అధికారాల విభజన మాత్రమే జరుగుతుంది గాని సార్వభౌమాధికారం విభజించబడదని అభిప్రాయపడ్డారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఏవైనా నాలుగు రకాల స్వాభౌమాధికారాలను పేర్కొనండి.
జవాబు.
1. నామమాత్రపు సార్వభౌమా కారం :
ఒక వ్యక్తి లేదా సంస్థ రాజ్యం అధికారాలన్నీ పేరుకు మాత్రమే కలిగి ఉండటాన్ని నామమాత్రపు సార్వభౌమాధికారమంటారు. సంప్రదాయానుసారం మాత్రమే సదరు వ్యక్తి లేదా సంస్థ అధికారాలను కలిగి ఉంటారు. వాస్తవానికి ఏ అధికారం ఉండదు.

బ్రిటన్ రాణి, భారత రాష్ట్రపతి నామమాత్రపు సార్వభౌమాధికారానికి చక్కటి ఉదాహరణలు. ఈ రెండు దేశాలలో ఆచరణలో వారి పేరుతో అధికారాన్ని కేబినెట్ చెలాయిస్తుంది.

2. వాస్తవిక సార్వభౌమాధికారం:
సార్వభౌమాధికారాన్ని నామమాత్రపు అధిపతి పేరుతో వేరొక వ్యక్తి లేదా సంస్థ చెలాయించడాన్ని వాస్తవ సార్వభౌమాధికారం అంటారు. వాస్తవ సార్వభౌమాధికారి సహాయ సహకారాలతోనే నామమాత్రపు సార్వభౌమాధికారి ప్రభుత్వ అధికారాలను వినియోగిస్తాడు.

ఉదాహరణకు, పార్లమెంటరీ ప్రభుత్వ విధానం అమల్లో ఉన్న భారతదేశం వంటి రాజ్యాల్లో ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని మంత్రిమండలి సూచనల ప్రకారం నామమాత్రపు సార్వభౌమాధికారి అయిన రాష్ట్రపతి తన అధికారాన్ని వినియోగిస్తారు.

3. న్యాయబద్ధ సార్వభౌమాధికారం:
న్యాయబద్ధ సార్వభౌమాధికారంలో శాసనాలకు, చట్టాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. న్యాయబద్ధ సార్వభౌమాధికారి మాత్రమే అన్ని రకాల ఆజ్ఞలను జారీ చేస్తారు. వీటిని అందరూ తప్పనిసరిగా గౌరవించాలి. దైవిక న్యాయాన్ని లేదా సాధారణ న్యాయాన్ని, ప్రజాభిప్రాయాన్ని చట్ట రూపంలో తీసుకొచ్చే అధికారం కేవలం న్యాయబద్ధ సార్వభౌమాధికారికి మాత్రమే ఉంటుంది. ఇతను జారీ చేసిన కోర్ట్ ఆఫ్ లా కూడా అంగీకరిస్తుంది.

ఈ రకమైన సార్వభౌమాధికారానికి బ్రిటన్ రాజు, రాణి, జపాన్ రాజు, భారతదేశపు రాష్ట్రపతి చక్కటి ఉదాహరణలు. న్యాయబద్ధ సార్వభౌమాధికారం స్పష్టమైంది. వ్యవస్థీకృతమైంది. నిర్బంధమైంది. దాన్ని అతిక్రమించిన వారు శిక్షార్హులు.

4. రాజకీయ సార్వభౌమాధికారం :
ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాల్లో రాజకీయ సార్వభౌమాధికారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. రాజ్యంలోని అందరి చర్యలను రాజకీయ సార్వభౌమాధికారం ప్రభావితం చేస్తుంది. ఎ.వి.డైసీ అనే రాజకీయ పండితుడి దృష్టిలో అందరూ ఆమోదించి ఆచరణలో ఉండే ఒక ఉన్నతాధికారి చర్యయే రాజకీయ సార్వభౌమాధికారం.

అయితే, రాజకీయ సార్వభౌమాధికారం ఎవరెవరికి ఉంటుందో గుర్తించడం సాధ్యం కాదు. సమాజం, సంస్థలు, ప్రజలు, ప్రజాభిప్రాయం వంటి వివిధ రూపాలలో అది నెలకొని ఉంటుంది. ప్రజాభిప్రాయం సాధనాలవల్ల ప్రభావితమై వెల్లడౌతుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

ప్రశ్న 2.
రాజ్యానికి, ప్రభుత్వానికి మధ్యగల వ్యత్యాసాలను వివరించండి.
జవాబు.
రాజ్యానికి – ప్రభుత్వానికి మధ్యగల వ్యత్యాసాలు :

రాజ్యంప్రభుత్వం
1. రాజ్యం చాలా విశాలమైనది. దీనిలో ప్రజలందరూ భాగస్వాములు.1. ప్రభుత్వం చాలా పరిమితమైనది. ఇది కొద్దిమంది పౌరులకు చెందిన సంస్థ.
2. రాజ్యం శాశ్వతమైనది.2. ప్రభుత్వం నిరంతరం మారుతూ ఉంటుంది. ప్రభుత్వం కాలపరిమితికి తగ్గట్టుగా ఏర్పడుతుంది. ఉదాహరణకు భారతదేశంలో ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే మరోసారి బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుంది.
3. రాజ్యానికి సార్వభౌమాధికారం ఉంటుంది.3. ప్రభుత్వానికి సార్వభౌమాధికారం ఉండదు. అయితే, పేరు మీదుగా ప్రభుత్వం సార్వ భౌమాధికారాన్ని చెలాయిస్తుంది.
4. రాజ్యం అమూర్త రూపం4. ప్రభుత్వం నిర్దిష్ట రూపాన్ని కలిగి ఉంటుంది. ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకతను కలిగి ఉండవచ్చు. కాని రాజ్యానికి వ్యతిరేకంగా ఉండలేరు.
5. రాజ్యాలన్నీ విశ్వజనీనమైనవి, స్వభావరీత్యా లక్షణాల రీత్యా పోలికలను కలిగి ఉంటాయి.5. ప్రభుత్వాలు మాత్రం ఆయా రాజ్యాలను బట్టి ఏర్పడతాయి. ఉదాహరణకు, పార్లమెంటరీ, అధ్యక్షతరహా ప్రభుత్వాలు.
6. రాజ్యానికి దాని పౌరులు తప్పనిసరిగా విధేయతను కలిగి ఉండాలి.6. ప్రజాస్వామ్యంలో పౌరులు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కును కలిగి ఉంటారు.
7. రాజ్యం సర్వోన్నతమైనది. అది కొన్ని మౌలిక లక్షణాలను కలిగి ఉంటుంది. అవి ప్రజలు, ప్రభుత్వం, ప్రదేశం, సార్వభౌమాధికారం.7. ప్రభుత్వం రాజ్యానికి గల మౌలిక లక్షణాలలో ఒకటి మాత్రమే. ఈ విధంగా ప్రభుత్వం రాజ్యంలో అంతర్భాగమైనది.
8. రాజ్యానికి గల అధికారాలు వాస్తవమైనవి.8. ప్రభుత్వం చాలా పరిమిత అధికారాలను కలిగి ఉంటుంది. అవి కూడా రాజ్యం ప్రసాదించినవే.
9. రాజ్యం యజమాని వంటిది. అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు.9. ప్రభుత్వ రాజ్యానికి సాధనం వంటిది. ఈ రెండు యజమాని – సేవకుడు సంబంధాలను కలిగి ఉంటాయి. ప్రభుత్వ మనుగడ రాజ్య అభీష్టం మీద ఆధారపడి ఉంటుంది.
10. రాజ్యానికి నిర్దిష్ట భౌగోళిక ప్రదేశం ఉంటుంది. ఇది లేకుండా రాజ్యం మనుగడను కొనసాగించలేదు.10.  భౌగోళిక ప్రదేశం ప్రభుత్వానికి అవసరం లేదు. ఎందుకంటే, ఉదాహరణకు బ్రిటన్ ప్రభుత్వం భారతదేశాన్ని చాలా సంవత్సరాలు పరిపాలించింది.
11. రాజ్యంలో వ్యక్తులకు సభ్యత్వం తప్పనిసరి. ఏ ఒక వ్యక్తి సభ్యత్వం నుంచి తప్పించుకోలేడు.11. ప్రభుత్వంలో వ్యక్తులకు సభ్యత్వం తప్పనిసరికాదు. వ్యక్తి ఇష్టాయిష్టాల మీద సభ్యత్వం ఆధారపడి ఉంటుంది.
12. రాజ్యానికి గల అధికారం నిరపేక్షం, యథార్థం.12. ప్రభుత్వ అధికారాలు పరిమితం, ఆపాదించబడినవి.

 

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

ప్రశ్న 3.
రాజ్యానికి ఇతర సంస్థలకు గల తేడాలు ఏమిటి ?
జవాబు.
రాజ్యానికి – సంస్థలకు / సంఘాలకు మధ్యగల వ్యత్యాసాలు :

రాజ్యంసంస్థలు / సంఘాలు
1. రాజ్యం శాశ్వతమైంది.1. సంస్థలు/సంఘాలు అశాశ్వతమైనవి.
2. రాజ్యానికి సార్వభౌమాధికారం ఉంది.2. సంస్థలు/సంఘాలకు సార్వభౌమాధికారం ఉండదు.
3. రాజ్యానికి నిర్దిష్ట సరిహద్దులు ఉంటాయి. ఏ రాజ్యం విశ్వవ్యాప్తం కాదు లేదా ప్రపంచ వ్యాప్తం కాదు.3. ఇవి నిర్దిష్ట సరిహద్దులను కలిగి ఉండవు. అయితే కొన్ని సంస్థలు అంతర్జాతీయమైవి కూడా ఉంటాయి. ఉదాహరణకు ఐక్యరాజ్యసమితి, రెడ్ క్రాస్ సొసైటీ, ది లైన్స్ క్లబ్ మొదలైనవి.
4. రాజ్యంలో పౌరులకు సభ్యత్వం తప్పనిసరి. ప్రతి పౌరుడు రాజ్యంలో సభ్యుడుగా ఉండాలి.4. సంస్థల/సంఘాలలో సభ్యత్వం అనేది ఐచ్ఛికం. వ్యక్తుల ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది.
5. ఒక వ్యక్తికి ఒక్క సభ్యత్వం మాత్రమే ఉంటుంది.5. వీటిలో ఒక వ్యక్తి ఎన్నింటిలోనైనా సభ్యత్వం పొందవచ్చు.
6. రాజ్యం బహుళ విధులను నిర్వహిస్తుంది.6. సంస్థల విధులు ఒక్కటిగానే ఉండి కేవలం సభ్యులకు మాత్రమే చెందుతాయి.
7. రాజ్యం చట్టాలను, శాసనాలను చేస్తుంది. వాటిని అతిక్రమించినవారికి శిక్ష విధిస్తుంది.7. సంస్థలు/సంఘాలు శాసనాలను, చట్టాలను చేయవు. కాని వాటికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలను ఏర్పర్చుకుంటాయి.
8. ప్రజల మీద రాజ్యం పన్నును విధిస్తుంది.8. సంస్థలు/సంఘాలు ఎటువంటి పన్నులను విధించ లేవు. అయితే స్వచ్ఛందంగా సభ్యత్వ రుసుం చెల్లించుకోవచ్చు.
9. రాజ్యం లక్ష్యాలు విశాలమైనవి.9. సంస్థలు/సంఘాల లక్ష్యాలు ఆశయాలు చాలా పరిమితమైనవి.
10. రాజ్యం తన నిర్ణయాలను ప్రజలపై రుద్దవచ్చు. వాటిని పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవచ్చు.10. సంస్థలు, సంఘాలు తమ నిర్ణయాలను బలవంతంగా ప్రజలపై రుద్దలేవు. పాటించనివారిపై చర్యలు తీసుకోలేవు.
11. సంస్థలన్నింటికంటే రాజ్యం శ్రేష్ఠమైనది.11. సంస్థలన్నీ రాజ్యం పరిధిలో ఉండి రాజ్యం దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి కొనసాగుతూ ఉంటాయి.

 

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

ప్రశ్న 4.
జాన్ ఆస్టిన్ ఏకత్వసార్వభౌమాధికారం అంటే ఏమిటి ?
జవాబు.
18వ శతాబ్దంలో ఏకత్వ సార్వభౌమాధికార సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఇంగ్లాండ్ దేశ న్యాయకోవిదుడు జాన్.ఆస్టిన్. ఇతను తన గ్రంథమైన “లెక్చర్స్ ఆన్ జ్యూరిస్ ప్రుడెన్స్” (1832)లో ఈ సిద్ధాంత ప్రతిపాదన చేశాడు. తన కంటే ముందున్న థామస్ హాబ్స్, జెర్మి బెంథామ్ల సిద్ధాంతాలను తన సిద్ధాంతానికి ఆధారంగా తీసుకున్నాడు.

ఆస్టిన్ సిద్ధాంతాన్ని “నిరపేక్ష లేదా న్యాయబద్ధ సార్వభౌమాధికార సిద్ధాంతమని” కూడా పేర్కొంటారు. ఇతని అభిప్రాయంలో శాసనమనేది సార్వభౌముడు ప్రజలకిచ్చిన ఆజ్ఞగా పేర్కొన్నాడు.

ఆస్టిన్ సార్వభౌమాధికారం – ముఖ్య లక్షణాలు :
1. ఇది నిశ్చయాధికారం :
ప్రతి స్వతంత్ర రాజకీయ సమాజంలో ఒక నిర్ణీత మానవ అధికారి లేదా వ్యక్తుల సముదాయానికి సార్వభౌమాధికారం ఉంటుంది. వ్యక్తికీ లేదా వ్యక్తుల సముదాయానికి గల అధికారం నిశ్చయ సార్వభౌమాధికారం.

2. సార్వభౌమాధికారి ప్రజలు అలవాటు ప్రకారం విధేయులై ఉంటారు :
సమాజంలోని ప్రజలందరు తమ అలవాటు ప్రకారం సార్వభౌమాధికారికి విధేయులై ఉంటారు. ప్రజలపై ఎటువంటి ఒత్తిడిగాని, ప్రలోభంగాని ఉండదు. ప్రజలు యథాలాపంగా సార్వభౌముడికి విధేయులై ఉంటారు.

3. సార్వభౌమత్వం అవిభాజ్యం:
సార్వభౌమాధికారం విభజించడానికి వీలులేనటువంటిది. ఎందుకంటే అది ఒకే దగ్గర కేంద్రీకరించబడి ఉంటుంది. సార్వభౌముడి అధికారానికి ఎటువంటి పరిమితులుండవు. శాసనాలకు మూలాధారం, సార్వభౌముడు.

4. సార్వభౌమాధికారం ఆవశ్యకమైంది :
రాజకీయ సమాజానికి సార్వభౌమాధికారం అత్యంత అవసరమైంది. సార్వభౌమత్వం లేని సమాజం, రాజకీయంగాని స్వతంత్రతగాని లేని సమాజమౌతుంది.

5. చట్టమే తుది ఆజ్ఞ :
సార్వభౌముని ఆజ్ఞే చట్టం. చట్టాన్ని ఉల్లంఘించిన వారు శిక్షార్హులు అవుతారు. ఎందుకంటే సార్వభౌమాధికారం నిరపేక్షమైంది, నిర్దిష్టమైంది, స్పష్టమైంది, అపరిమితమైంది కాబట్టి.

6. రాజ్యానికి వ్యతిరేకమైన ఎటువంటి హక్కులు ప్రజలకు ఉండవు :
రాజకీయ సమాజంలోని ప్రజలకు సార్వభౌముడు ప్రసాదించిన హక్కులు మినహా ఏ ఇతర హక్కులు ఉండవు. ప్రజలు రాజ్యాన్ని వ్యతిరేకించే హక్కులను కలిగి ఉండరు.

ప్రశ్న 5.
బహుతావాద సార్వభౌమాధికారం అంటే ఏమిటి ?
జవాబు.
బహుతావాద (బహుత్వవాద) సార్వభౌమాధికార సిద్ధాంతం ఆస్టిన్ ప్రతిపాదించిన ఏకత్వ నిరపేక్ష సార్వభౌమాధికార సిద్ధాంతానికి వ్యతిరేకంగా ప్రచారంలోకి వచ్చింది. ప్రజాస్వామ్యం, సమాఖ్య సిద్ధాంత స్ఫూర్తి. వ్యక్తిగత స్వేచ్ఛ, అధికారాల విభజన వంటి అనేక అంశాలు బహుతావాద సార్వభౌమాధికారం బహుళ ప్రాచుర్యం పొందడానికి దోహదపడ్డాయి.

వాన్ గిర్కే (1844 – 1925) :
మొట్టమొదటిసారి బహుతావాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆ తరువాత మెట్లాంగ్, బార్కర్, జి.డి. హెచ్. కోల్, హెచ్.జె. లాస్కీ, లిండ్సే, మైకేవర్, ఫాలెట్ వంటి వారు బహుతావాద సార్వభౌమాధికార సిద్ధాంతాన్ని బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు.

వీరందరూ ఏకత్వ సార్వభౌమాధికారం చాలా ప్రమాదకరమైందని ఆధునిక ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలి పెట్టులాంటిదని అభిప్రాయపడ్డారు. బహుత్తావాదుల అభిప్రాయంలో రాజకీయ సమాజంలోని అనేక సంస్థలలో రాజ్యం ఒకటని అందువల్ల అధికారమంతా ఒక్క రాజ్య అధీనంలోనే ఉండదని వీరు పేర్కొన్నారు.

బహుతావాద సార్వభౌమాధికారం – ప్రధాన అంశాలు :

  1. సమాజంలోని అనేక సంస్థల్లో రాజ్యం ఒకటి. రాజ్యం ఒక్కటే అధికారాన్ని కలిగి ఉండదు. సమాజంలోని వివిధ సంఘాలు కూడా సమాజానికి ఉపయోగకరమైన పనులు చేస్తాయి. అందువల్ల సార్వభౌమాధికారాన్ని రాజ్యానికి వివిధ సంఘాల మధ్య పంచడమే సమంజసమని వీరి అభిప్రాయం.
  2. రాజ్యం సమాజాన్ని గాని మరే ఇతర సంస్థను గాని నిర్మించలేదు. అదేవిధంగా సమాజంలోని సాంస్కృతిక, ఆర్థిక, మతపరమైన, రాజకీయపరమైన సంస్థలను కూడా రాజ్యం సృష్టించలేదు. ఈ కారణం చేత రాజ్యం ఈ సంస్థలను చేయజాలదు. రాజ్యానికి ఆ అధికారం కూడా లేదు.
  3. .సమాజం సమాఖ్య రూపాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి రాజ్యం దాని అధికారాలను అన్ని సంస్థలకు పంపిణీ చేయవలసి ఉంటుంది.
  4. సార్వభౌమాధికారం ఒక్క రాజ్యానికి మాత్రమే చెందింది కాదు. కాబట్టి మిగతా సంస్థలన్నింటి మీద దాని అధికారం ఉండదు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

ప్రశ్న 6.
సమాజానికి, రాజ్యానికి గల తేడాలు ఏమిటి ?
జవాబు.
రాజ్యానికి – సమాజానికి మధ్యగల వ్యత్యాసాలు :

రాజ్యంసమాజం
1. రాజ్యం రాజకీయ సంస్థ.1. సమాజం సాంఘిక సంస్థ.
2. రాజ్యానికి నిర్ణీత నిర్దిష్ట భౌగోళిక సరిహద్దులుంటాయి.2. సమాజానికి నిర్దిష్ట భౌగోళిక సరిహద్దులుండవు.
3. రాజ్యం శాసనబద్ధంగా నిర్మితమైన ప్రభుత్వాన్ని కలిగి ఉంటుంది.3. సమాజం శాసనబద్ధంగా నిర్మితమైన సంస్థను కలిగి ఉండదు.
4. రాజ్యానికి అధికారం ఒక అలంకారంగా ఉంటుంది. రాజ్యాధికారాన్ని ధిక్కరించిన వారిని శిక్షించే శాసనం చట్టం చేతిలో ఉంటుంది.4. సమాజం ఎటువంటి అధికారాన్ని కలిగి ఉండదు. సమాజంలోని వ్యక్తుల నిరసనను శిక్షించే భౌతిక అధికారం దీనికి ఉండదు.
5. రాజ్యానికి మాత్రమే సార్వభౌమాధికారం ఉంటుంది. ఆ అధికారాన్ని దానికి గల సాధనాల ద్వారా శాసనాలను చట్టాలను, పథకాలను అమలు పరుస్తూ ఉంటుంది.5. సమాజానికి ఎటువంటి సార్వభౌమాధికారం ఉండదు. కాని ఆచారాలు, సంప్రదాయాలు, నైతిక విలువలు దీనికి అలంకార నియమాలుగా ఉంటాయి. అధికారంతో కూడిన శక్తి మాత్రం దీనికి ఉండదు.
6. రాజ్యం సహజ సంస్థ కాదు. మానవ ప్రయోజనాలకై నిర్మించిన సంస్థ. దీనిలో వ్యక్తులకు సభ్యత్వం తప్పనిసరి.6. సమాజం సహజ స్వచ్ఛందమైన సంస్థ. దీనిలో సభ్యత్వం ఇష్టపూర్వకంగా లభిస్తుంది.
7. రాజ్యం సమాజంలో అతి ముఖ్యమైన సంస్థ. రాజకీయంగా వ్యవస్థీకృతమైన సమాజంలో రాజ్యం అంతర్భాగం.7. సమాజం రాజ్యం కంటే విశాలమైనది. సమాజం అనేక గుంపుల సంఘాలకు నిలయం అయినందున దీనిలోని సంబంధాలు సైతం సంక్లిష్టంగా ఉంటాయి.
8. రాజ్యానికి బలం అది రూపొందించుకొనే శాసనం, చట్టం, రాజ్యాంగం.8. సమాజానికి బలం, అది కలిగి ఉన్న ఆచారం, సంప్రదాయాలు విలువలు, కట్టుబాట్లు మొదలైనవి.
9. రాజ్యం, వ్యక్తుల బహిర్గత కార్యకలాపాలను మాత్రమే పర్యవేక్షిస్తుంది. దాని నిమిత్తం కొన్ని నియమ నిబంధనలను రూపొందిస్తుంది.9. సమాజం వ్యక్తుల అంతర్గత బహిర్గత కార్యకలాపాలను నియంత్రిస్తుంది. సమాజం అన్ని రకాల సాంఘిక రూపాలను పర్యవేక్షిస్తుంది.
10. రాజ్యం ఒక అభివృద్ధి చేసిన సాంఘిక సంస్థ. ఇది సమాజం నుంచి ఆవిర్భవించింది.10. సమాజం మొట్టమొదటిగా ఏర్పడిన సంస్థ, అతి విశాలమైనది. మానవులు స్వభావరీత్యా సంఘ జీవులు.
11. రాజ్యం శాశ్వతమైనది కాకపోవచ్చు. కాలక్రమంలో అది అంతరించిపోవచ్చు లేదా మరో బలవంతమైన రాజ్యం ద్వారా ఆక్రమణకు గురికావచ్చు.11. సమాజం శాశ్వతమైనది. అది ఎల్లవేళలా కొనసాగేది.

 

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం 

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
రాజ్యం అంటే ఏమిటి ?
జవాబు.
‘రాజ్యం’ అనే పదాన్ని అనేకమంది రాజనీతిశాస్త్ర పండితులు అనేక రకాలుగా నిర్వచించారు. వారిలో కొందరు ఇచ్చిన నిర్వచనాలను కింది విధంగా పేర్కొనడమైంది.

  1. అరిస్టాటిల్ : “మానవునికి సుఖప్రదమైన, గౌరవప్రదమైన జీవనాన్ని ప్రసాదించడమే లక్ష్యంగా కలిగిన కుటుంబాలు, గ్రామాల సముదాయమే రాజ్యం”.
  2. బ్లంట్లీ : “ఒక నిర్ణీత ప్రదేశంలో నివసిస్తూ రాజకీయంగా వ్యవస్థీకృతమైన ప్రజల సముదాయమే రాజ్యం”.

ప్రశ్న 2.
ప్రభుత్వం అంటే ఏమిటి ?
జవాబు.
రాజ్యం యొక్క ఆశయాలను, లక్ష్యాలను నెరవేర్చే సాధనమే ప్రభుత్వం. ప్రభుత్వం మూడు అంగాలను కలిగి ఉంటుంది. అవి :

  1. శాసనశాఖ
  2. కార్యనిర్వాహక శాఖ
  3. న్యాయశాఖ.

ప్రశ్న 3.
సమాజం అంటే ఏమిటి ?
జవాబు.
సమాజం ప్రాచీనమైనది. రాజ్యం కంటే ముందు ఏర్పడినది. మానవుడు సంఘజీవి. సమాజంలో మాత్రమే వ్యక్తి సంపూర్ణ వికాసాన్ని, సుఖవంతమైన జీవితాన్ని గడపగలడు. “సమిష్టి జీవనాన్ని గడుపుతున్న మానవ సముదాయమే” సమాజము. సమాజంలో సభ్యత్వం లేని మానవుడిని ఊహించలేము.

వలలాగా అల్లబడిన వివిధ రకాల మానవ సంబంధాలను ‘సమాజం’ అని చెప్పవచ్చు. అయితే రాజ్యంలాగా సార్వభౌమాధికారము, దండనాధికారం ఉండదు. సాంఘిక ఆచార సంప్రదాయాల ఆధారముగా శిక్షలు ఉంటాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

ప్రశ్న 4.
ఏకత్వ సార్వభౌమాధికార సిద్దాంతం.
జవాబు.
18వ శతాబ్దంలో ఏకత్వ సార్వభౌమాధికార సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఇంగ్లాండ్ దేశ న్యాయకోవిదుడు జాన్ ఆస్టిన్. ఇతను తన గ్రంథమైన “లెక్చర్స్ ఆన్ జ్యూరిస్ప్రుడెన్స్”లో ఈ సిద్ధాంత ప్రతిపాదన చేశాడు. ఆస్టిన్ సిద్ధాంతాన్ని నిరపేక్ష లేదా న్యాయబద్ధ సార్వభౌమాధికార సిద్ధాంతమని కూడా పేర్కొంటారు. ఇతని అభిప్రాయంలో శాసనమనేది సార్వభౌముడు ప్రజలకిచ్చిన ఆజ్ఞగా పేర్కొన్నాడు.

ప్రశ్న 5.
బహుత్వ సార్వభౌమాధికార సిద్ధాంతం.
జవాబు.
బహుతావాద సార్వభౌమాధికార సిద్ధాంతం ఆస్టిన్ ప్రతిపాదించిన ఏకత్వ నిరపేక్ష సార్వభౌమాధికార సిద్ధాంతానికి వ్యతిరేకంగా ప్రచారంలోకి వచ్చింది. వాన్ గిర్కే మెట్లా లాండ్, బార్కర్, జి.డి. హెచ్. కోల్, లస్కీ, మెకైవర్, ఫాలెట్ వంటివారు బహుతావాద సార్వభౌమాధికార సిద్ధాంతాన్ని బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. సమాజంలోని అనేక సంస్థల్లో రాజ్యం ఒకటి.

రాజ్యం ఒక్కటే అధికారాన్ని కలిగివుండదు. సమాజంలోని వివిధ సంఘాలు కూడా సమాజానికి ఉపయోగకరమైన పనులు చేస్తాయి. అందువల్ల సార్వభౌమాధికారాన్ని రాజ్యానికి, వివిధ సంఘాల మధ్య పంచడమే సమంజసమని బహుతావాదుల అభిప్రాయం.

ప్రశ్న 6.
అంతర్గత సార్వభౌమాధికారం.
జవాబు.
అంతర్గత సార్వభౌమాధికారం : దేశంలోని ఆంతరంగిక వ్యవహారాలతో ఆ రాజ్యానికున్న అత్యున్నత అధికారాన్ని అంతర్గత సార్వభౌమాధికారంగా చెప్పవచ్చు. ఒక రాజ్య ప్రాదేశిక పరిధిలో నివసిస్తున్న వ్యక్తులు, సంస్థలు, సంఘాలన్నింటికి సంబంధించిన విషయాలలో శాసనాలు రూపొందించి అమలు చేసే అధికారాన్ని అంతర్గత సార్వభౌమాధికారం అంటారు. ప్రజలకు సంబంధించిన అన్ని రకాల స్వేచ్ఛలు హక్కులు రాజ్యానికి గల సార్వభౌమాధికారం ద్వారా మాత్రమే సంక్రమిస్తాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

ప్రశ్న 7.
బహిర్గత సార్వభౌమాధికారం.
జవాబు.
బాహ్య సార్వభౌమాధికారం :
ఒక రాజ్యం తన జాతి ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా అంతర్జాతీయ సమాజంలో ఇతర దేశాలలో చేసుకొనే ఒప్పందాలు, సంప్రదింపులు, దౌత్యనీతి, యుద్ధం వంటి అంశాలలో ఏ ఇతర రాజ్యాల ప్రభావానికి లోబడక సర్వస్వతంత్రంగా వ్యవహరించడాన్ని ఆ రాజ్యానికి ఉన్న బాహ్య సార్వభౌమాధికారంగా చెప్పవచ్చు. మరో విధంగా చెప్పాలంటే ఇటువంటి అధికారం గల రాజ్యంలో విదేశీ వ్యవహారాలలో ఇతర రాజ్యాల జోక్యానికి తావుండదు.

ప్రశ్న 8.
చట్టబద్ధ సార్వభౌమాధికారం.
జవాబు.
‘డి జ్యూర్’ అనేది ఫ్రెంచి పదం. డిజ్యూర్ అంటే చట్టబద్ధమైన అధికారం అని అర్థం. ఒక ప్రాదేశిక రాజ్యంలోని ప్రజలు, సంస్థలన్నింటికీ ఆజ్ఞలను జారీ చేసే చట్టబద్ధమైన అధికారం కలిగి ఉండటాన్ని డిజ్యూర్ సార్వభౌమాధికారమంటారు.

డిజ్యూర్ సార్వభౌమాధికారం రాజ్యాంగం, శాసనాల ద్వారా సంక్రమిస్తుంది. రాజ్యంలోని న్యాయస్థానాలు ఈ సార్వభౌమాధికారాన్ని గుర్తిస్తాయి. బ్రిటన్ రాణి, భారత రాష్ట్రపతి ఇటువంటి సార్వభౌమాధికారానికి ఉదాహరణలు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

ప్రశ్న 9.
యథార్థ సార్వభౌమాధికారం.
జవాబు.
‘డిఫాక్టో’ అనేది ఫ్రెంచిపదం. డిఫాక్టో అంటే ఫ్రెంచి భాషలో యథార్థమైందని అర్థం. రాజ్యంలో సార్వభౌమాధికారాన్ని ‘ఎవరైతే వాస్తవంగా చెలాయిస్తారో వారికి ‘డిఫాక్టో’ సార్వభౌమాధికారం ఉంటుంది. ఈ విధమైన సార్వభౌమాధికారం ఒత్తిడి, నిర్బంధం, బలప్రయోగం వంటి అంశాలపట్ల నియంత్రించబడుతుంది. అటువంటి అధికారాన్ని చట్టం గుర్తించదు. కాని యథార్థానికి వారి యథార్థానికి వారి మాటే చెల్లుతుంది. ఈ విధంగా అధికారంలోకి వచ్చినవారు సైనికాధికారులు కావచ్చు. నియంతలు కావచ్చు లేదా మతాధికారులు కావచ్చు.

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 4 ఇన్సానియత్

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 4th Lesson ఇన్సానియత్ Textbook Questions and Answers.

TS Inter 1st Year Non-Detailed 4th Lesson ఇన్సానియత్

ప్రశ్నలు- సమాధానాలు

ప్రశ్న 1.
ఇన్సానియత్ కథలోని సందేశాన్ని చర్చించండి?
జవాబు:
‘ఇన్సానియత్’ కథ డా. దిలావర్ చే రచించిన “మచ్చుబొమ్మ” కథా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ కథ తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్న ఆత్మీయ మానవ సంబంధాలను చిత్రిస్తుంది. కులమత బేధం లేకుండా ప్రజలందరి మధ్య నెలకొన్న స్నేహాలు, వరుసలు పరస్పర సహకారాలు సహజీవన సంస్కృతిని తెలియచేస్తుంది.

కాలక్రమేణ నగరాల్లోని స్వార్థం, కులాభిమానం, మతోన్మాదం శ్రీ వికృతరూపం దాల్చి గ్రామీణ ప్రాంతంలోకి వ్యాపించ టం ప్రారంభమౌతుంది. ఈ నేపథ్యంలో గ్రామీణ హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్న ఉన్న ఉన్నత మానవీయ సంబంధాలను ఈ కథ తెలియచేస్తుంది. వర్తమాన సమాజంలో లుప్త మౌతున్న ఆదర్శాలను విలువలను తెలుపుతూ కులమత దురభిమానంపై ఆత్మవిమర్శ చేసుకోవాలని ఈ కథ సూచిస్తుంది.

రాంరెడ్డి సుబానీలు పేకాడుతున్నారు. సుబాని చేతిలో రాంరెడ్డి ఓడిపోతున్నాడు, అతడు పేకాటలో ఓడిపోతున్నట్టు లేదు. తన దర్జా దర్పం ఒక్కొక్క మెట్టు దిగ జారిపోతున్నట్టుగా ఉంది. అంతవరకు పేకాటలో రాంరెడ్డిని ఓడించినవాడు లేడని ప్రతీతి పొందాడు. సుబాని ఈనాడు రాంరెడ్డిని బట్టలూడదీసి నడిబజార్లో నిలబెట్టినట్టుంది. తట్టుకోలేక ఎన్నెన్నో అన్నాడు దానికి ఎంకన్న వంతు పాడాడు.

“ఒక్క పేకాటే కాదు మల్ల ఇంకే ఆటైనా గంతే. కిర్కెట్లో పాకిస్తాన్ అగరబాగెలిస్తే పండగచేస్కుంటారు”

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 4 ఇన్సానియత్

“నువ్వెన్ని జెప్పు… వీళ్ళంతా గంతే…. తినేది ఇండియా సొమ్ము… పాడేది పాకిస్తాన్పట” కసిగా అన్నాడు రాంరెడ్డి. సుబానీకి “కండ్లపొంటి నీల్లు గిర్రున తిర్గుతాంటి. సుబాని దిగులుగా ఇంటికి చేరిండు. తల్లి అతని దిగులు గమనించి ఏమయిందని అడిగింది. రాంరెడ్డి అన్న మాటలన్నీ చెప్పిండు సుబాని. ఆ తరువాత సంఘటనలో సుబానీకి యాక్సిడెంట్ అయింది. రాంరెడ్డి కొడుక్కి కిడ్నీఫెయిలయింది. రాంరెడ్డి అడగలేక అడగలేక సుబానీ తల్లిని తన కుమారునికి ప్రాణభిక్ష పెట్టమని కోరాడు.

సుబానీ తల్లి రాంరెడ్డిని “మర్ది కడుపుకోత ఎట్ల అగులు గుబులుగా ఉంటుందో అనుభవిస్తున్న. నా కడుపు కాలినట్లు ఇంకొకల్లకు ఎందుక్కొవాలె. నా కొడుకును మట్టెల గల్పుకుంటున్న, గా మట్టిల్నుంచి ఒక చిన్న మొక్క పానం బోస్కానికి మోక ఉంటే ఎందుకడ్డంబడాలె” అన్నది.

అపుడు రాంరెడ్డి! “సుబానీ! నీ తోని నేనొక్క పేకాటల్నే వోడిపోయిన అనుకున్న. గనినీ సావుసుత నన్ను ఓడిచ్చింది. మనిషికి కావల్సింది. ఇన్సానియత్ గని కులాలు మతాలూ కావని సుత సాటి చెప్పినవ్” అన్నాడు. మానవత ముందు ఏదైనా తలవంచాల్సిందేని ఇన్సానియత్ కథ చెప్తుంది.

ప్రశ్న 2.
పాతిమా గొప్ప మనసును వివరించండి ?
జవాబు:
ఇన్సానియత్ కథ ‘డా. దిలావర్’ చే రచించబడిన “మచ్చుబొమ్మ” కథా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ కథ తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్ని ఆత్మీయ మానవ సంబంధాలను చిత్రించింది. వాటికి ‘ఫాతిమా’ గొప్ప మనసు ఒక, నిధర్శంగా నిలుస్తుంది.

ఫాతిమా సుబానీ తల్లీ, సుబాని, రాంరెడ్డి, కాపోల్ల ఎంకన్నలు పేకాడుకుంటారు. సుబాని చేతిలో వారు ప్రతి ఆట ఓడిపోయారు. రాంరెడ్డి ఇజ్ఞత దెబ్బతింది. సుబానీని నానా మాటలూ అన్నాడు. ఆ దిగులుతో ఇంఇకి వచ్చిన సుబానీని తల్లి ఫాతిమా ఏం జరిగిందని అడిగింది. రాంరెడ్డి అన్నమాటలన్నీ సుబాని తల్లికి చెప్పాడు. రోజులు మారిపోయాయి అనుకుంది ఫాతిమా!

పల్లెకు రజాకార్లోత్తే ఊరోల్ల స్థానానికి తన పానం అడ్డమేసుండు మీ బాపు. ఊరోల్ల మీ బాబును పానానికిపానంగా చూసుకునేటోల్లు. ఇప్పుడు మనిషికి మనిషికి మధ్య ఎడం పెరుగుతుంది. మనమే మనకు పరాయిల్లెక్క కండ్ల బడన్నమ్” గీ దుష్మనీ, కచ్చలు, నరుక్కోటం సంపుకోటం, మత పిచ్చిగాల్లు రామ్ .రహీమ్ల నడ్మ చిచ్చుపెట్టడం· గియన్ని ఎన్నటి జమానలమేం ఎరగంబిడ్డా! ఒకలకు ఆసకొత్తే ఒకల్లు ఆదుకునే టోల్లు.

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 4 ఇన్సానియత్

సుబానీకు యాక్సిడెంటైనా సమయాన తన కొడుకు ఎలానూ బ్రతకడు. ‘రాంరెడ్డి కొడుకన్నా బతికితే అంతేచాలు అని అనున్నది పాతిమా!

“మర్దీ సీమకు సుత అపకారం చెయ్యాలి. నా కొడుకుని చూసి ఓర్వలేక తీస్కపోతన్నడు” అని తన బాధను రాంరెడ్డి వద్ద వెళ్ళపోసుకుంది.

అప్పుడు రాంరెడ్డి ఫాతిమా!” గిసుంటి ఆపతిల తల్లి మనసు ఎంత తండ్లాడ్తదో నాకెర్క లేదు కాదు. జర అటు ఇటు నేను సుత నీవోల్లెనె ఉన్న. ఎంకెట్రెడ్డి సావు బతుకుల్ల ఉన్నాడు. గాని పానాలు గిప్పుడు మీ చేతుల్లవున్నయ్” నా కొడుకు కిడ్నీలు పూరాగా పాడైపోయినయ్. పన్నెండు గంటల్లో ఏరే కిడ్నీలు దొరక్కుంటే నా ఒక్కగానొక్క కొడుకు నాకు దక్కడు. ఫాతిమా! నీకు చేతులెత్తి మొక్కుత! సుబాని కిడ్నీలు…. అని రాంరెడ్డి గొంతుక పూడిపోయి మాట రాలేదు.

ఫాతిమా ఒక్కసారి షాక్ అయింది. సుడిగాలికి ఎండు టాకులా వణికింది.

“మర్షీ! కడుపుకోత ఎట్లు అగులు బుగులుగ ఉంటుందో అనుబగిత్తన్నా! నా కడుపు కాలినట్లు ఇంకొకల్లకు ఎందుకు కావాలె? నా కొడుకును మట్టిలో గల్పుకుంటన్నగా మట్టిల్నుంచి ఒక చిన్న మొక్క పానం బోస్కోనికి మోక వుంటే ఎందుకడ్డబడాలె! నాకొడుకు పానం అసుమంటిదే నీ కొడుకు పానం. నా కొడుకు హయత్సుత బోస్కోని నీ కొడుకు నిండు నూరేండ్లు బత్కొలె! గందుకునన్నే జెయ్యమంటే గజేస్త…. అన్నది ఫాతిమా!

ఫాతిమా మనసు…. మనిషికి కావలసింది. ఇన్సానియత్ గాని కులాల మతాలు కావని” చెప్పకనే చెప్పింది. ఇంతటి గొప్ప మనసు ఫాతిమావంటి తల్లులకు ఎప్పుడూ ఉంటుంది.

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 4 ఇన్సానియత్

ప్రశ్న 3.
ఈ కథ ఆధారంగా హిందూ ముస్లిం మతస్థుల మధ్య నెలకొన్న ఆత్మీయ అనుబంధాలను చర్చించండి?
జవాబు:
‘ఇన్సానియత్’ అను పాఠ్యభాగం డా. దిలావర్ చే రచించబడిన “మచ్చుబొమ్మ” కథా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ కథ గ్రామీణ ప్రాంతాలలోని హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్న ఆత్మీయ మానవ సంబంధాలను తెలియ చేస్తుంది. కులాలు మతాలు అనే భేదం లేకుండా ప్రజలందరి మధ్య నెలకొన్న స్నేహాలు, వరుసలు, పరస్పర సహకారాలు, సహజీవన సంస్కృతిని తెలియపరస్తుంది.

కాలక్రమేణ నగరాల్లోని స్వార్థం, కులాభిమానం, మతోన్మాదం వికృతరూపం దాల్చి గ్రామీణ ప్రాంతాలలోకి వ్యాపించడం ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో గ్రామీణ హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్న ఉన్నతమైన మానవీయ అనుబంధాలను ఈ కథ వివరిస్తుంది. వర్తమాన సమాజంలో లుప్తమవుతున్న ఆదర్శాలను విలువలను తెలుపుతూ కులమత దురభిమానాలపై ఆత్మవిమర్శ చేసుకోమని తెలియచేస్తుంది.

పూర్వం గ్రామాలలోని ప్రజలంతా కుల మత భేదం లేకుండా అందరూ అందర్నీ అత్తా, అక్కడ, బావా, అత్తా,మద్దీ, మామ అని పిలుచుకునేవారు. వారి మధ్య ప్రేమాభిమానాలకు కుల మతాలు అడ్డు వచ్చేవికావు. ఎంతపెద్ద కులంలో పుట్టినా వారిలో కూడా మిగిలిన వారి పట్ల ఆత్మీయానురాగాలు ఉండేవి. ఒకరినొకరు చక్కగా గౌరవించుకునేవారు. దీనికి నిదర్శనం, ఈ కథలోని రాధమ్మత్త, సోందుబాబుల మధ్య జరిగిన సంభాషణలే!

ముస్లిం అయిన సోందుబాబు హిందువైన రాధమ్మను అత్తమ్మా అని పిలవడం ఉదాహరణ..

“ఏం! రాధత్తమ్మా! అంత మంచేనా!” అని సోందుబాబు అంటే

“బానే ఉన్న పోరగా! మీరంతా మంచేనా” అని రాధమ్మ అనటంలో వారి మధ్య ఉన్న ఆప్యాయత అను రాగాలు మనకు అర్థమౌతాయి.

అలాగే పాతిమా రాంరెడ్డిని “మర్దీ! సీమకు సుత అపకారం చెయ్యని నా కొడుకుని చూసి ఓర్వలేక అల్లా తీస్కపోతన్నడు” అనడం ముస్లిం హిందూ కుటుంబాల మధ్య ఉన్న. ఆత్మీయతా, అనుబంధాలకు ఒక నిదర్శనంగా భావించాల్సి ఉంటుంది”.

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 4 ఇన్సానియత్

“మర్షీ! కడుపుకోత ఎట్ల అగులు బుగులుగ ఉంటదో అనుబగిత్తన్నా! నా కొడుకును మట్టిల గల్పుకుంటున్నా. నా కొడుకు పానం వంటిదే నీ కొడుకుపానం” నా కొడుకు హయత్ సుత బోస్కొని నీ కొడుకు నిండు నూరేళ్ళు బత్కాలే” అనటం “మనిషికి కావల్సింది. ఇన్సానియత్ గాని కులము మతము కాదన్న మానవతను, ఆత్మీయ అనుబంధాలను తెలియచెప్తుంది.

ఇన్సానియత్ Summary in Telugu

రచయిత పరిచయం

రచయిత పేరు : డా॥ దిలావర్

పుట్టిన తేదీ : జూన్ 5, 1942

పుట్టిన ఊర : ఖమ్మం జిల్లా, కారేపల్లి మండలం కమలాపురం

తల్లిదండ్రుల : మహబూబీ, మహమ్మద్ నిజాముద్దీన్ –

చదువు : ఎం.ఏ., బి, పిహెచ్.డి.

పరిశోధన : దాశరథి కవితావ్యక్తిత్వం పరిశీలన, – తెలుగు విశ్వవిద్యాలయం నుండి

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 4 ఇన్సానియత్

రచనలు :

  1. వెలుగుపూలు, వెన్నెల కుప్పలు, జీవన తీరాలు, కర్బలా, కవిత సంపుటాలను రాశారు.
  2. ‘ప్రణయాంజలి’ పద్యకావ్యం
  3. ‘రేష్మా ఓ రేష్మా’ పేరుతో వచన కావ్యం
  4. ‘గ్రౌండ్ జీరో’ సామ్రాజ్యవాద వ్యతిరేక దీర్ఘకవిత.
  5. సమిధలు, ముగింపు నవలలు
  6. ‘దూరాల చేరువులో’ వ్యాస సంపుటి
  7. మచ్చుబొమ్మ, చంద్రుడుగీయని చిత్రాలు కథా సంపుటాలు

ప్రస్తుత పాఠ్యభాగం : “మచ్చుబొమ్మ” కథా సంపుటి నుండి గ్రహించబడింది.

TS Inter 1st Year History Study Material Chapter 14 జాతీయ ఉద్యమం – తొలిదశ

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 14th Lesson జాతీయ ఉద్యమం – తొలిదశ Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 14th Lesson జాతీయ ఉద్యమం – తొలిదశ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశంలో జాతీయోద్యమానికి దారితీసిన పరిస్థితులను వివరించండి.
జవాబు.
అనేక కారణాల ఫలితంగా భారతదేశంలో జాతీయోద్యమం వచ్చింది. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ మొదలయినప్పటి నుంచి 1947లో స్వాతంత్య్రం సిద్ధించే వరకు ఈ అరవై సంవత్సరాలను పరివర్తన కాలంగా చెప్పవచ్చు. ఈ కాలంలో జాతీయత ఉద్భవించి, అభివృద్ధి చెందడమే గాక రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో కూడా దాని
ఉనికి కనిపించింది.

TS Inter 1st Year History Study Material Chapter 14 జాతీయ ఉద్యమం – తొలిదశ

1. బ్రిటీష్ సామ్రాజ్యవాదం:
జాతీయోద్యమం అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణం బ్రిటీష్ సామ్రాజ్యకాంక్ష. బ్రిటీష్ వారు దాదాపు భారతదేశాన్నంతటిని తమ సార్వభౌమాధికారం కిందకి తెచ్చుకున్నారు. వీరి సామ్రాజ్యవాదం పరోక్షంగా భారతదేశాన్ని ఏకంచేసింది.

2. బ్రిటీష్ వారి ఆర్థిక దోపిడి:
బ్రిటీష్వారి పాలనలో భారతదేశంలోని అన్ని వర్గాలవారు ఆర్థిక దోపిడికి గురయ్యారు. భారతదేశ సంపద ఎందరో యూరోపియన్లు ముఖ్యంగా బ్రిటీష్ వారిచే దోపిడి చేయ్యబడింది. ఇది భారతీయులకు ఎక్కువ నష్టం చేసింది. భారతదేశంలోని హస్తకళలు, కుటీర పరిశ్రమలు మూతబడ్డాయి. వ్యవసాయం పైన విపరీతమైన ఒత్తిడి పేదరికానికి దారితీసింది. బ్రిటీష్ వారు అనుసరించిన ఆర్థిక విధానాల వల్ల భారత వ్యవసాయం, పరిశ్రమలు దెబ్బతిన్నాయి. ఫలితంగా నిరుద్యోగిత పెరిగింది. ఫలితంగా భారతదేశం జీవనవిధాన స్థితి దిగజారిపోయింది.

3. పాశ్చాత్య విద్య:
పాశ్చాత్య విద్య భారతజాతీయోద్యమాన్ని చాలావరకు పెంచి పెద్దచేసిందని చెప్పవచ్చు. మెకాలే చేత సమర్థింపబడి, ప్రవేశపెట్టబడిన ఆంగ్లవిద్య భారతదేశంలో ఉన్నత విద్యకు వాహకంగా పనిచేసింది. 1835లో ఆంగ్లాన్ని బోధనా మాద్యమంగా చేయడం జరిగింది. అనంతరం ఇది విద్యావంతుల భాషగా మారింది. ఆంగ్లవిద్య జాతీయ ఉద్యమాన్ని ప్రారంభించి నడిపించే నాయకులను తయారు చేసింది.

4. 19వ శతాబ్దంలో జరిగిన సాంఘిక మతసంస్కరణ ఉద్యమాలు:
19వ శతాబ్దంలో జరిగిన సాంఘిక, మత సంస్కరణ ఉద్యమాలు జాతీయ ఉద్యమానికి ఎంతో దోహదపడ్డాయి. జాతీయ చైతన్యం మొదట రాజారామ్మోహన్యతో వచ్చిందని చెప్పవచ్చు. 19వ శతాబ్దం నాటి సంస్కర్తలు రామ్మోహన్రాయ్, దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, అనీబిసెంట్ వీరంతా ప్రాచీన భారత సంస్కృతిని పునరుద్ధరించారు. దయానంద సరస్వతి, ‘స్వరాజ్’ అనే పదాన్ని మొదటి సారిగా వాడారు. అతను హిందీని జాతీయ భాషగా ప్రకటించాడు.

5. ప్రాచీన భారత సంస్కృతి పునరుజ్జీవనం పట్ల ఆసక్తత:
ఈస్టిండియా కంపెనీ అధికారులలో ఒకరైన సర్ విలియమ్ జోన్స్ బెంగాల్ ఆసియాటిక్ సొసైటీ” ని స్థాపించాడు. ఈ సంస్థ ప్రాచీన భారతదేశచరిత్ర, పురావస్తువులపై పరిశోధన చేపట్టింది. విలియంజోన్స్, మాక్స్ ముల్లర్, మొనియర్ విలియమ్స్ ప్రయత్నాల ఫలితంగా ఘనమైన భారత చరిత్ర పునరుజ్జీవనం చేయబడింది. ఫలితంగా సాంస్కృతిక పునరుజ్జీవనం జరిగింది. అది జాతీయోద్యమానికి ప్రేరణ కలిగించింది.

6. రవాణా, సమాచార వ్యవస్థల అభివృద్ధి:
రవాణాసమాచార వ్యవస్థల అభివృద్ధి జాతీయోద్యమాన్ని త్వరితంగా తీవ్రతరం చేసింది. రైల్వేలు, టెలిగ్రాఫ్, తంతి, తపాలా వ్యవస్థలు, నిర్మించబడిన రోడ్లు, కాలువలు ప్రజలమధ్య ఐక్యతను పెంచాయి. మరొకవైపు ఈ వ్యవస్థలు జాతీయోద్యమాన్ని దేశంలోని అన్ని ప్రాంతాలకు వ్యాప్తి చేయడానికి నాయకులకు ఎంతో ఉపయోగపడ్డాయి.

7. విదేశాలతో పరిచయం:
విదేశాలతో భారతీయుల పరిచయం వలన వారు ఆయా దేశాలలో జరిగిన ఉద్యమాలను, ఆర్థిక అభివృద్ధిని, వారి సమస్యలను, విభేదాలను మొదటి, రెండవ ప్రపంచయుద్ధాల వాటి ప్రభావం గురించి తెలుసుకున్నారు. 1905లో జరిగిన రష్యా – జపాన్ యుద్ధంలో రష్యా ఓటమి ఆసియావాసులలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించింది.

8. వార్తాపత్రికలు:
ఆంగ్ల మరియు ప్రాంతీయ భాషలలో వెలువడిన వార్తాపత్రికలు, జాతీయ ఉద్యమాన్ని ప్రేరేపించాయి. ‘ఇండియన్ మిర్రర్’, ‘బాంబే సమాచార్’, ‘ద హిందూ పేట్రియాట్’, ‘అమృత్బజార్ పత్రిక’, ‘ద హిందూ’, ‘కేసరి’, ‘బెంగాలీ’ మొదలైన పత్రికలు అమిత ప్రభావాన్ని చూపించాయి.

9. లిట్టన్ ప్రభువు పరిపాలన:
భారతదేశంలో కరువు ఏర్పడినా పట్టించుకోకుండా విపరీత ధోరణిలో లిట్టన్ విక్టోరియా మహారాణిని భారతదేశపు సామ్రాజ్ఞిగా ప్రకటించాడు. అంతేగాక అతను ప్రవేశపెట్టిన ప్రాంతీయ భాషా పత్రికల చట్టం, పత్రికల స్వేచ్ఛను హరించివేసింది. భారతీయుల వద్ద ఆయుధాలు లేకుండా చేయడం కోసం ఆయుధ చట్టాన్ని ప్రవేశపెట్టాడు. ఇవన్నీ కూడా భారతీయులలో తీవ్ర అసంతృప్తిని కలిగించాయి.

10. ఇల్బర్ట్ బిల్లు వివాదం:
1883 లో జరిగిన ఇల్బర్టు బిల్లుపై ఆంగ్లేయులు చేసిన వివాదం భారత జాతీయోద్యమానికి ఎంతో ప్రేరణనిచ్చింది. భారతీయులను జిల్లా మాజిస్ట్రేట్లుగా నియమించడం ద్వారా జాతి అసమానతలను తొలగించడానికి ఈ బిల్లు ప్రయత్నం చేసింది. ఈ మాజిస్ట్రేట్ యూరోపియన్లు వివాదాలను కూడా చూస్తాడు. ఇటువంటి అవకాశం భారతీయులకీయడం పట్ల బ్రిటీష్ వారి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా వారు బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఫలితంగా బిల్లును ప్రవేశపెట్టిన రిప్పన్ బలవంతగా దానిని రద్దు చేయవలసి వచ్చింది. ఈ ఆందోళనలో బ్రిటీష్వారు గెలవడం వారు చూపిస్తున్న జాతి వివక్షత భారతీయులకొక గుణపాఠం అయ్యింది. ఫలితంగా వారు కూడా బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఒక వ్యవస్థీకృత ఆందోళనను చేపట్టాలని దాని ద్వారా స్వాతంత్య్రం సాధించవలసిన ఆవశ్యకత ఉందని గుర్తించారు. ఈ బిల్లు ద్వారా బ్రిటీష్వారికి భారతీయులపై గల జాతివివక్షత కూడా తెలిసివచ్చింది. ఈ కారణాలన్నీ కూడా జాతీయోద్యమాన్ని బలోపేతం చేశాయి.

TS Inter 1st Year History Study Material Chapter 14 జాతీయ ఉద్యమం – తొలిదశ

ప్రశ్న 2.
మితవాదుల పాత్రను అంచనా వేయండి.
జవాబు.
1885-1905 మధ్య కాలాన్ని ఉదార జాతీయవాద కాలమని చెప్పవచ్చు. ఈ కాలం కాంగ్రెస్ మితవాదుల నాయకత్వంలో నడిచింది. ఈ నాయకులకు బ్రిటీష్వారి న్యాయ భావంపై పరిపాలనపై నమ్మకం ఉండేది. ఉదారవాద నాయకులలో ముఖ్యులు ఫిరోజ్ మెహతా, గోపాలకృష్ణ గోఖలే, ఉమేష్ చంద్ర బెనర్జీ, సురేంద్రనాథ బెనర్జీ, దాదాబాయ్ నౌరోజీ, రస్ బహారీబోస్, బద్రుద్దీన్ త్యాబ్ది మొదలైనవారు. దాదాబాయ్ నౌరోజి, రానడే సురేంద్రనాథ్ బెనర్జీ భారతదేశంలో పెరిగిపోతున్న పేదరికంపై అవగాహన కలిగి ఉండేవారు. భారతదేశంలో ఉన్న పేదరికం యొక్క ప్రభావం బాధాకరమైన రాజకీయ పరిస్థితులపై ప్రబలంగా ఉందని దాదాబాయ్, రానడే సురేంద్రనాథ్ బెనర్జీ నమ్మేవారు. భారత జాతీయవాదం ఆర్థిక పునాదుల సిద్ధాంతాన్ని దాదాబాయ్ నౌరోజీ రూపొందించారు. భారత ఆర్థిక వ్యవస్థ భారీ హరణకు గురి అవుతుందని ఆయన గుర్తించారు. భారత వనరుల హరణ ఫలితంగా దేశం దోపిడికి గురయ్యింది. దాదాబాయ్ తన గ్రంథం “పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా”లో ‘సంపద హరణ సిద్ధాంతాన్ని’ రాజకీయ ఆర్థిక దృష్టితో చూపించారు.

భారత రాజకీయ, ఆర్థిక రంగాలలో వచ్చిన సహజ హక్కుల భావన మితవాద నాయకుల సహకారం వల్లనే వచ్చింది. దాదాబాయ్ తన ‘సంపద హరణ సిద్ధాంతం’లో బ్రిటీష్వారు భారతదేశం నుంచి విస్తారమైన సంపదను తరలిస్తున్నారని సూచించాడు. ఈ ఆర్థిక హరణ భారతదేశంలో ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించింది. అధికమైన పన్నులు, పరిశ్రమల క్షయం దీని ఫలితమే.. ఈ సిద్ధాంత వివరణలో తమ స్వంత వనరుల ద్వారా తమకు తాము అభివృద్ధి చెందించుకునే సహకారాన్ని అందించమని ఆయన బ్రిటీష్ వారిని ప్రాధేయపడ్డాడు. ఇదే సమయంలో భారత వనరుల అభివృద్ధి కోసం అతనిని లండన్కు ఆహ్వానించారు.

ఉద్యమ మొదటి దశకాలంలో కాంగ్రెస్ తమ సమస్యలను ప్రభుత్వానికి నివేదించడానికి రాజ్యాంగబద్ధయుతమైన పద్ధతులనే ఎంచుకుంది. వారు ప్రార్ధన, అభ్యర్థన, నివేదన పద్ధతులను నమ్మారు. కాంగ్రెస్ అభ్యర్థన ఈ కింది విషయాలపై ఉండేది.

  • ప్రతినిధి సంస్థల ఏర్పాటు ఇండియన్ కౌన్సిల్ రద్దు
  • వ్యక్తిగత స్వేచ్ఛ యొక్క భద్రత
  • భారతీయులను ఉన్నత పదవులలో నియమించడం
  • పౌర, సైనిక వ్యయాన్ని తగ్గించడం
  • కార్యనిర్వాహక, న్యాయశాఖలను వేరు చేయడం
  • జాతి వివక్షతను నిర్మూలించి భారతీయులకు ఉద్యోగ అవకాశాలు అధికం చేయడం.
  • ఇంగ్లండుకు సంపద చేరవేతను ఆపడం
  • ఆధునిక పరిశ్రమలను ఏర్పాటు చేయడం
  • కరువు సమయాలలో ఉపశమన చర్యలు చేపట్టడమేగాక రుణాలను ఏర్పాటు చేయడం.
  • జాతీయ విద్యావిదానాన్ని అమలు చేయడం

పై అంశాలన్నింటిని ఒక అభ్యర్ధన రూపంలో కాంగ్రెస్ బ్రిటీష్ ప్రభుత్వం ముందు ఉంచింది. కానీ దానివల్ల వచ్చిన ఫలితం ఏమీలేదు. ఏదేమైన కాంగ్రెస్ ప్రయత్నాల ఫలితంగా 1892 భారతకౌన్సిల్ చట్టం ఏర్పాటు చేయబడింది. ఈ చట్టం ప్రాంతీయ సంస్థల ఏర్పాటుకు, సభ్యులకు బడ్జెట్ పైన చర్చించడం, ప్రజోపయోగ విషయాలపై ప్రశ్నించే అధికారాన్ని కల్పించింది. అంతేగాక ఈ చట్టం యూనివర్శిటీ సెనేట్, మున్సిపాలిటీలు, జిల్లా బోర్డుల ఏర్పాటును, అభ్యుర్థులను నామినేట్ చేసే అధికారాన్ని ప్రధానం చేసింది. శాసనసభ విస్తరింపబడింది. ఈ చట్టం కాంగ్రెస్ను ఏమాత్రం సంతృప్తి పర్చలేదు. కాంగ్రెస్ తన విన్నపాలన్నింటిని ప్రభుత్వం ముందు నివేదించింది. కానీ అది సఫలం కాలేదు. అందువల్ల కాంగ్రెస్ విధానాలను ‘రాజకీయ సూచన’గా వర్ణించడం జరిగింది. ఈ విధానాన్ని అతివాద నాయకులైన లాలాలజపతి రాయ్ వంటి వారు తీవ్రంగా విమర్శించారు.

మితవాదులు తాము అనుకున్నవి సాధించడంలో విఫలమయ్యారు. కేవలం కొన్ని డిమాండ్లను మాత్రమే ప్రభుత్వం తీర్చింది. ఫలితంగా ప్రజల ఆతృతలను, ఆకాంక్షలను తీర్చి వారిని శాంతింప జేయడంలో విఫలమయ్యింది. కానీ ప్రజలలో ప్రజాస్వామ్యం పౌరస్వేచ్ఛ పట్ల చైతన్యాన్ని తీసుకొని రావడంలో సఫలమయ్యింది. నిజానికి రెండవసారి భారత జాతీయోద్యమంలో ఈ మితవాద దశ వచ్చిందని చెప్పవచ్చు. మితవాదులు తమ విధానాలలో గొప్ప విజయాన్ని సాధించకపోయినా భారత రాజకీయాలలో నిర్ణయాత్మక మార్పులను సుసాధ్యం చేశారు.

ప్రశ్న 3.
అతివాద ఉద్యమంలో బాలగంగాధర్ తిలక్ పాత్రను వివరించండి.
జవాబు.
భారతజాతీయోద్యమ పితగా పేర్కొంటారు. ఆయనకు ముందు జాతీయోద్యమం లేదని కాదు. కానీ ఆయన జాతీయోద్యమాన్ని కొత్తదారులు పట్టించాడు. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజల్ని ఆ ఉద్యమంలో పాల్గొనేటట్లు చేయడంలో ఆయన పాత్ర అద్వితీయమైనది. అందుకే ఆయన్ను భారతదేశంలో బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేగిన అశాంతికి మూలకారకుడు (Father of India’s unrest) గా భావిస్తారు. ఈయనకు ‘లోకమాన్య’ అనే బిరుదు కూడా ఉంది. చిన్నప్పటి నుంచి అన్యాయం ఎక్కడ జరిగినా సహించని గుణమాయనది. నిజాయితీతో బాటు ముక్కుసూటి తనం ఆయనకు సహజం. కళాశాలకు వెళ్ళి ఆధునిక విద్యనభ్యసించిన తొలితరం భారతీయ యువకుల్లో ఆయనొకడు. తిలక్ 1890లో కాంగ్రెస్లో సభ్యుడుగా చేరాడు. కానీ త్వరలోనే ఆయనకు కాంగ్రెస్ మితవాద రాజకీయాలపై నమ్మకం పోయింది. స్వరాజ్యం కోసం పోరాటమే సరైన మార్గమని ఆయన నమ్మాడు. అప్పటివరకు కాంగ్రెస్ ప్రతి సంవత్సరం డిసెంబరు చివరివారంలో మూడు రోజులపాటు సమావేశమై బ్రిటీషు ప్రభుత్వాన్ని, ప్రభుత్వవిధానాలను “Pray, Petition, Protest” చెయ్యడానికే పరిమితమైంది. తిలక్ దాని గురించి చాలా ఘాటైన విమర్శలు చేశాడు. “మీరు సంవత్సరానికొకసారి మూడు రోజులపాటు సమావేశమై కప్పల మాదిరి బెకబెకలాడడం వల్ల ప్రయోజనం లేదు” అని అసలు కాంగ్రెస్ సంస్థ అడుక్కునే వాళ్ళ సంఘం (బెగ్గర్స్ ఇన్స్టిట్యూషన్)” అన్నాడు. కాంగ్రెస్ సమావేశాలను 3-డే తమాషాగా అభివర్ణించాడు. “స్వరాజ్యం నా జన్మహక్కు” దాన్ని నేను పొంది తీరుతాను అని గర్జించాడు. 1907లో మహారాష్ట్రలోని సూరత్లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ చీలిపోయింది. మితవాదులు కాంగ్రెస్ పై తమ పట్టును నిలబెట్టుకున్నారు. అతివాదులుగా పిలవబడే తిలక్, ఆయన మద్దతుదారులు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారు. తిరిగి 1916లో లక్నోలో జరిగిన సమావేశంలో అంతా ఒకటయ్యారు. అదే సమావేశంలో కాంగ్రెసు, ముస్లింలీగుకు మధ్య లక్నో ఒప్పందం కుదిరింది. ఆయన పాశ్చాత్య విద్యా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. అది భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని అగౌరవపరచి భారతీయ విద్యార్థులను చిన్నబుచ్చే విధంగా ఉందని, ప్రజలకు మంచి విద్యను అందించడం ద్వారానే వాళ్ళను మంచి పౌరులుగా మార్చవచ్చనే ఉద్దేశం ఆయనది. ప్రతి భారతీయుడికి/ భారతీయురాలికి భారతీయ సంస్కృతి గురించి, భారతదేశపు ఔన్నత్యాన్ని గురించి బోధించాలన్నది ఆయన ఆశయం. అందుకే అగార్కర్, విష్ణుశాస్త్రి చిప్లుంకర్లతో కలిసి “దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటి” ని స్థాపించాడు. పాత్రికేయవృత్తిలో ఆ తర్వాత తాను నడిపిన పత్రికలు “మరాఠా (ఆంగ్ల పత్రిక)”, “కేసరి (మరాఠా పత్రిక)” లలో మొద్దు నిద్రపోతున్న భారతీయులను మేల్కొల్పడానికి పదునైన భాషలో బ్రిటీషు పాలనలోని వాస్తవ పరిస్థితులు గురించి వివరంగా రాశాడు. బాల్యవివాహాలను నిరసించి వితంతు వివాహాలను స్వాగతించాడు. ఇతర కార్యక్రమాలు జాతీయస్ఫూర్తిని రగల్చడానికి వీలున్న ఏ అవకాశాన్ని ఆయన వదిలిపెట్టలేదు. మొట్టమొదటిసారిగా శివాజీ ఉత్సవాలను, గణపతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా ప్రజలను సమీకరించడం, వారిని జాతీయోద్యమం వైపు నడిపించడం ఆయనే మొదలుపెట్టాడు. తన పత్రికల్లో ప్రజలను రెచ్చగొట్టే రాతలు రాసినందుకు 1897లో ఆయనకు ఒకటిన్నరేళ్ళు కారాగార శిక్ష పడింది. విడుదలయ్యాక ఆయన స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించాడు. 1906లో దేశద్రోహం నేరం క్రింద ఆయనకు ఆరేళ్ళు ప్రవాస శిక్ష విధించారు. కారాగారంలో ఉన్నప్పుడే ఆయన “గీతారహస్యం” అనే పుస్తకం రాశాడు. ఆయన చరిత్రకారుడు కూడా. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని ఆయన అభిప్రాయం. హోంరూల్ లీగ్: 1916 ఏప్రిల్లో హోంరూల్ లీగ్ ను స్థాపించి దాని లక్ష్యాలను వివరిస్తూ మధ్య భారతదేశంలో గ్రామగ్రామానా తిరిగాడు. అనీబిసెంట్ అదే సంవత్సరం సెప్టెంబర్లో మొదలుపెట్టి హోంరూల్ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసింది. ఆ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో ఒక కోర్టుకేసులో ఆయన లండన్కు వెళ్ళవలసి వచ్చింది. అప్పుడే, అంటే 1917 ఆగస్టులో అప్పటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ మాంటేగు “బ్రిటిషు సామ్రాజ్యంలో భాగమైన భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి వీలుగా అన్ని పాలనాంశాల్లో భారతీయులకు అధిక ప్రాధాన్యాన్నివ్యడమే ప్రభుత్వ విధానమని” బ్రిటీషు ప్రభుత్వం తరపున ప్రకటించాడు. బాధ్యతాయుత ప్రభుత్వమంటే ఎవరికి బాధ్యత వహించే ప్రభుత్వమో, అధిక ప్రాధాన్యమంటే ఎంత ప్రాధాన్యమో, అసలు అది ఎప్పుడిస్తారో ఏదీ స్పష్టంగా లేదు. కానీ బ్రిటిషు ప్రభుత్వ నిజాయితీని నమ్మిన అనీబిసెంట్ ఆ ప్రకటనతో ఉద్యమాన్ని ఆపేసి ప్రభుత్వానికి తన మద్దతు ప్రకటించింది. అలా ఇద్దరు నాయకులదీ చెరొకదారి కావడంతో హోంరూల్ ఉద్యమం చల్లబడిపోయింది. కానీ ప్రజల్లో తిలక్ రగిలించిన స్ఫూర్తి మాత్రం కొనసాగింది. అందుకే 1920లో (ఆగస్టు 1వ తేదీ) తిలక్ చనిపోయినప్పుడు జాతీయోద్యమం చుక్కాని లేని నావ అవుతుందని చాలామంది భయపడ్డారు.

TS Inter 1st Year History Study Material Chapter 14 జాతీయ ఉద్యమం – తొలిదశ

“గాంధీ అని ఇంకొకాయన ఉన్నాడు గానీ అబ్బే ! ‘తిలక్ ముందర ఏపాటి?” అనుకున్నారు. కానీ “నాయకులు చరిత్రను సృష్టించరు. చరిత్రే నాయకులను సృష్టిస్తుంది”, అనే మాటను నిజం చేస్తూ అతి సామాన్యుడిగా జీవితం ప్రారంభించిన గాంధీ తిలక్ మరణంతో ఏర్పడ్డ శూన్యాన్ని అసామాన్యంగా భర్తీ చెయ్యడమే గాక మహాత్ముడి స్థాయికి ఎదిగాడు.

ప్రశ్న 4.
హోంరూల్ ఉద్యమంపై ఒక వ్యాసం రాయండి.
జవాబు.
బ్రిటీషు సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉంటూనే భారతదేశానికి స్వపరిపాలనను సాధించాలన్న లక్ష్యంతో ప్రారంభమైన ఉద్యమాన్ని హోంరూల్ ఉద్యమం అంటారు. మొదటి ప్రపంచయుద్ధ కాలంలో 1916లో హోంరూల్ ఉద్యమం ఒక ప్రజా ఉద్యమంగా ప్రారంభమైంది. ఆ ఉద్యమానికి నాయకులు బాలగంగాధర్ తిలక్, అనీబిసెంట్లు. బాలగంగాధర్ తిలక్: హోంరూల్ ఉద్యమాన్ని ప్రారంభించటానికి తిలక్ 1916ఏప్రియల్లో బొంబాయిలో ఒక హోంరూల్ లీగు స్థాపించాడు. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యభారత్ ప్రాంతాలలో తిలక్ తన ప్రచారాన్ని సాగించాడు. తన “మరాఠా”, “కేసరి” పత్రికల ద్వారా హోం రూల్ భావాన్ని ప్రచారం చేశాడు. తిలక్ హోంరూల్ ఉద్యమ ప్రచారం ప్రజలను చైతన్యవంతుల్ని చేసి, వారిలో స్వీయపాలనాభావాన్ని పటిష్టపరిచింది.

అనీబిసెంట్: హోంరూల్ ఉద్యమం కోసం అనీబిసెంట్ 1916 సెప్టెంబర్ నెలలో మద్రాసులో ఒక హోంరూల్ లీగ్ను స్థాపించింది. మద్రాసు పరిసర ప్రాంతాల్లో పర్యటించి ఉద్యమాన్ని అక్కడ ప్రచారం చేసింది. తన “న్యూ ఇండియా”, “కామన్వీల్” అనే పత్రికల ద్వారా అనీబిసెంట్ తన ప్రచారాన్ని సాగించింది.

హోంరూల్ ఉద్యమ వ్యాప్తి: తిలక్, అనీబిసెంట్ల కృషి వలన హోంరూల్ ఉద్యమం దేశవ్యాప్తమైంది. ఈ ఉద్యమం గురించి ప్రజలకు వివరించడానికి అనేక భాషల్లో అనేక కరపత్రాలను కూడా ప్రచురించారు. హోంరూల్ను సమర్థిస్తూ అనేక నగరాల్లో, గ్రామాల్లో కూడా సభలు ఏర్పాటు చేసి తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమాలలో ఎక్కువగా యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. హోంరూల్ ఉద్యమ కాలంలో అనీబిసెంట్ జాతీయవిద్యకు చాలా ప్రాముఖ్యం ఇచ్చింది. విద్యార్థుల్లో జాతీయ భావాలు పెంపొందించడం జాతీయ విద్య లక్ష్యం. ఈ లక్ష్యంతోనే ఆమె మదనపల్లిలో ఒక కళాశాల నెలకొల్పింది. వారణాసిలో హిందూ విద్యాలయాన్ని నెలకొల్పడానికి కూడా ఆమె కృషి చేసింది. ప్రభుత్వ చర్యలు: 1917 నాటికి అనీబిసెంట్ చేస్తున్న ఉద్యమ ప్రచారానికి బ్రిటీష్ ప్రభుత్వం ఆందోళన చెంది, ఆమెను నిర్బంధించింది. ఆమె నిర్బంధాన్ని నిరసిస్తూ అనేక ప్రాంతాలలో సభలు, ప్రదర్శనలు జరిగాయి. తిలక్ దేశ ఉత్తర ప్రాంతాల్లో పర్యటించడాన్ని కూడా ప్రభుత్వం నిషేధించింది. దీనిని కూడా ప్రజలు వ్యతిరేకించారు. ప్రజా ఆందోళనకు తలవగ్గి, అనీబిసెంట్ను మద్రాస్ ప్రభుత్వం 1917 సెప్టెంబరు నెలలో విడుదల చేసింది. ఆమె దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా కాంగ్రెస్ ప్రతినిధులు ఆమెను 1917లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అలంకరించిన తొలి మహిళ అనీబిసెంట్.

ఉద్యమవ్యాప్తికి కారణాలు: బ్రిటీష్ ప్రభుత్వం ఉద్యమ నాయకులను నిర్భందించి ఉద్యమ వ్యాప్తిని అరికట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఉద్యమం దేశవ్యాప్తమైంది. హోంరూల్ ఉద్యమ వ్యాప్తికి కొన్ని కారణాలున్నాయి.

  1. 1907 సూరత్ సమావేశంలో చీలిపోయిన కాంగ్రెస్ 1916లో సమైక్యమై సంయుక్తంగా ఉద్యమించింది.
  2. బెంగాల్ విభజన రద్దు కావటంతో వందేమాతరం ఉద్యమాన్ని నిర్వహించిన ఉద్యమకారులంతా తమ దృష్టిని హోంరూల్ ఉద్యమం వైపుకు మళ్లించి ఉద్యమానికి బలాన్ని చేకూర్చారు.
  3. మొదటి ప్రపంచయుద్ధంలో బ్రిటన్ ముస్లిం రాజ్యాల యెడల అవలంబించిన వైఖరి భారతదేశంలో ముస్లింలకు కోపాన్ని కలిగించింది. అందువల్ల వారు కాంగ్రెస్తో 1916లో లక్నో ఒడంబడికను కుదుర్చుకొని స్వీయ పాలనోద్యమంలో పాల్గొన్నారు.

ఉద్యమ ముగింపు: హోంరూల్ ఉద్యమ ఫలితంగా ప్రజలలో నెలకొన్న రాజకీయ చైతన్యాన్ని, బ్రిటీషుపాలన యెడల వారిలో నెలకొన్న అసంతృప్తిని తొలగించటానికి 1917 ఆగస్టు 20వ తేదీన భారతరాజ్య వ్యవహారాల మంత్రి మాంటేగ్ ఒక ప్రకటన చేశాడు. ఈ ప్రకటన ప్రకారం క్రమక్రమంగా భారతీయులకు బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పరచబడుతుంది. ఈ ప్రకటన తరువాత బ్రిటీషు ప్రభుత్వం అనీబిసెంట్ను విడుదల చేయగా ఆమె హోంరూల్ ఉద్యమాన్ని నిలిపివేసింది. తిలక్ ఉద్యమాన్ని మరికొన్నాళ్లు కొనసాగించాడు.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన గురించి రాయండి.
జవాబు.
1885లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన భారత జాతీయోద్యమ చరిత్రలో నూతన ఒరవడిని సృష్టించింది. దీని నిర్మాణం, ఉనికి అలన్ అక్టేనియన్ హ్యుమ్ చొరవతో జరిగింది. ఇతను ఒక విశ్రాంత ఇండియన్ సివిల్ సర్వీస్ ఉద్యోగి. భారతీయుల కోసం ఈ సంస్థ ఏర్పాటు అవసరం గురించి చెపుతూ ఏ.ఒ. హ్యూమ్ “మన చర్యల వల్ల భారతీయులలో తీవ్రంగా అభివృద్ధి చెందుతున్న అసంతృప్తిని తొలగించడానికి మన భద్రతకు ఒక సంస్థ స్థాపన అత్యవసరం” అన్నాడు. ఫలితంగా అఖిల భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది. అప్పటి భారత వైస్రాయ్ కూడా ఈ సంస్థ ఆవిర్భావంతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు. అతను ఈ కాంగ్రెస్ ఇంగ్లాండులో ఘనత వహించిన సామ్రాజ్ఞికి ప్రతిపక్షంగా ఉండాలనుకున్నాడు. ఈ రెండు కారణాల ఫలితంగా 1885లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన జరిగింది. దీని మొదటి సమావేశం బొంబాయిలో డబ్ల్యూ.సి. బెనర్జీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి కేవలం 72 మంది సభ్యులు హాజరయ్యారు.

ప్రశ్న 2.
సూరత్ కాంగ్రెస్ సమావేశం గురించి రాయండి.
జవాబు.
మితవాదులు, అతివాదుల మధ్య బేధాభిప్రాయాలు పెరుగుతున్న సమయంలో 1907లో సూరత్ సమావేశం జరిగింది. 1905లో బెనారస్లో జరిగిన సమావేశం మితవాది అయిన గోపాలకృష్ణ గోఖలే ఆధ్వరంలో నడిచింది. 1906లో కలకత్తాలో జరిగిన సమావేశంలో అధ్యక్షపదవిని అతివాదులు పొందాలని ప్రయత్నించారు. కానీ మితవాదులు దౌత్యం చేసి దాదాబాయ్ నౌరోజీ ‘గ్రాండ్ ఓల్డ్మన్ ఆఫ్ ఇండియా’ పేరు ప్రతిపాదించడంతో అతివాదులు ఏమీ చేయలేకపోయారు. దాంతో వారు 1907లో ఆ పదవిని ఆశించారు. ఆ సమావేశంలో మితవాదులు రసి బిహారీ బోస్ పేరును ప్రతిపాదించగా అతివాదులు లజపతిరాయ్ పేరును ప్రతిపాదించారు. స్వపరిపాలన, విదేశీ వస్తుబహిష్కరణ, జాతీయ విద్యావిధానం మొదలైన వాటిని ఎజెండాలో చేర్చలేదని అతివాదులు కోపగించారు. దాంతో లజపతిరాయ్ పోటీ నుంచి తప్పుకున్నాడు. సమావేశంలో తిలక్ ప్రసంగించాలని అనుకున్నాడు. కానీ అతనికి అనుమతి ఇవ్వలేదు. దాంతో సమావేశంలో ఆందోళన, కల్లోలం ఏర్పడ్డాయి. మితవాదులు అతివాదులను సమావేశం నుంచి బహిష్కరించారు.

TS Inter 1st Year History Study Material Chapter 14 జాతీయ ఉద్యమం – తొలిదశ

ప్రశ్న 3.
1905లో జరిగిన బెంగాల్ విభజనను విమర్శనాత్మకంగా వివరించండి.
జవాబు.
అతివాద దశలో మొదటి పరిణామం, బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం. దీనినే వందేమాతరం ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం అంటారు. ఈ ఉద్యమానికి కారణం బెంగాల్ విభజన. 1905లో కర్జన్ పరిపాలనా సౌలభ్యాన్ని సాకుగా చూపి బెంగాల్ను రెండుగా విభజించాడు. కానీ నిజానికి ‘విభజించు పాలించు’ అన్న సిద్ధాంతాన్ని అమలుపరుస్తూ హిందూ, ముస్లింలు అధికంగా ఉన్న తూర్పు పశ్చిమ బెంగాల్లను రెండుగా విభజించినాడు. హిందూ ముస్లింలను వేరుచేయడం ద్వారా జాతీయ ఉద్యమాన్ని దెబ్బతీయాలని భావించాడు. అతని చర్యను అతివాదులే గాక మితవాదులు కూడా విమర్శించారు.

బెంగాల్ విభజనను అధికారికంగా 1905, జులై 4న ప్రకటించారు. కానీ అమలులోకి వచ్చింది 16 అక్టోబర్ 1905న. బెంగాల్ ప్రజలు 16 అక్టోబరు సంతాపదినంగా ప్రకటించారు. ఆ రోజున ఉపవాస దీక్షలు చేశారు. కలకత్తాలో ప్రజలు అర్ధనగ్నంగా తిరిగారు. గంగలో స్నానం చేసి వందేమాతర గీతాన్ని ఆలపించారు. హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నంగా రాఖీలు కట్టుకున్నారు. ఈ ఉద్యమాన్ని మొదట మితవాద నాయకులైన సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద మోహన్ బోస్లు నడిపించారు. అనంతరం ఇది అతివాదులు, తీవ్రవాదులు చేతిలలోకి వెళ్ళిపోయింది.

ప్రశ్న 4.
ముస్లింలీగు ఏర్పడటానికి దారితీసిన పరిస్థితులను వివరించండి.
జవాబు.
ముస్లిం మైనారిటీలకు సంబంధించిన విషయాలను కాపాడటం కోసం ముస్లింలీగ్ స్థాపించబడింది. నిజానికి ముస్లింలపై జరుగుతున్న అణచివేత కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఏర్పడింది. ఈ సంస్థ స్థాపనకు దారితీసిన పరిస్థితులు తెలుసుకోవాలంటే ముందు హిందూ, ముస్లిం సంబంధాలు, ఆంగ్లో- ముస్లింల సంబంధాలు తెలుసుకోవాలి. 18వ శతాబ్దంలో బ్రిటీష్వారు భారతదేశంలో అధికార స్థాపన చేస్తున్న కాలంలో ముస్లింలను తమ బలీయమైన శత్రువులుగా భావించారు. ఇదే ద్వేష భావన 1857 అనంతరం కూడా కొనసాగుతూ వచ్చింది. అయితే 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడటం, హిందువులు దానిలో ముఖ్య భూమికను పోషించడంతో దానిని బలహీనం చేయడం కోసం ఆ ద్వేషాన్ని హిందువులపైకి మరల్చారు. కాంగ్రెస్లో నిర్లక్ష్యం చేయబడిన ముస్లింలను బ్రిటీష్వారు దగ్గరికి తీశారు. భారతదేశంలో ముస్లింల అవసరాలను బ్రిటీష్ వారు గుర్తించారు. ఇది వారిపైన ప్రేమతో ‘విభజించు, పాలించు’ అన్న వారి సిద్ధాంతాల ప్రకారం కొనసాగించారు.

కొందరు ముస్లింలు బెంగాల్ విభజనను స్వాగతించారు. ఎందుకంటే ఇది ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలను వేరు చేసింది. అందుకే వారు విభజన ఆందోళనలను వ్యతిరేకించారు. భారత జాతీయోద్యమాన్ని అణచడానికి ముస్లింలను వాడుకొన్నారు. 1906లో ముస్లింలను వేరు చేయడానికి వైస్రాయ్ మింటో బ్రిటీష్ అధికారులను నియమించి ముస్లిం ప్రతినిధి వర్గాన్ని, హిందూ ముస్లింల వేర్పాటుకు ప్రయత్నించాడు. ముస్లింల ఈ విజయంతో ఢాకా నవాబు సలీముల్లాఖాన్ 1906లో ముస్లింలీగ్ స్థాపించాడు. దీనికి ఆగాఖాన్ మొదటి అధ్యక్షుడు. బ్రిటీష్ వారికి విశ్వాసంగా ఉంటూ ముస్లింల రాజకీయ ఇతర హక్కులను కాపాడటం దీని లక్ష్యం. ఇది ఏ మాత్రం భేదభావం లేకుండా ముస్లింలు మరియు ఇతర సంఘాలతో స్నేహభావాన్ని పెంపొందించే ప్రయత్నం చేసింది. మార్లే కాంగ్రెస్కు వ్యతిరేకమైన ముస్లిం లీగును స్వాగతించాడు.

ప్రశ్న 5.
1909 మింటో – మార్లే చట్టంలోని నిబంధనలను తెలపండి.
జవాబు.
వందేమాతర ఉద్యమం బలహీనపడిన తరువాత బ్రిటీష్ ప్రభుత్వం మితవాదులను సంతృప్తి పరచడానికి 1909లో ఇండియన్ కౌన్సిల్ చట్టాన్ని రాజ్యాంగ సంస్కరణల పేరుతో ప్రవేశపెట్టింది. ఈ సంస్కరణలను మింటో మార్లే సంస్కరణ అంటారు. మింటో వైశ్రాయ్ కాగా, మార్లే భారత కార్యదర్శి.

ఈ చట్టం కేంద్ర, ప్రాంతీయ శాసనసభలను విస్తృతపరచింది. కేంద్రశాసనసభ సభ్యుల సంఖ్య 16 నుంచి 60కి పెంచబడింది. అందులో 37 మంది అధికారిక, 23 మంది అనధికార సభ్యులు. పెద్ద ప్రాంతీయ శాసనసభ సభ్యుల సంఖ్య 50 వరకు, చిన్న శాసనసభ సభ్యుల సంఖ్య 30వరకు పెంచబడింది. కేంద్ర శాసనసభలో సభ్యులకు తీర్మానాలను ప్రతిపాదించడం ప్రశ్నలను సంధించే హక్కు ఇవ్వబడింది. బడ్జెట్పైన చర్చించే హక్కు ఇవ్వబడింది. ఈ చట్టంలోని మరొక ముఖ్య అంశం ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయబడ్డాయి. మింటోమార్లే చట్టాలు భారతీయులను సంతృప్తి పరచలేకపోయాయి. బాధ్యతాయుత ప్రభుత్వ ఏర్పాటు అనే కాంగ్రెస్ డిమాండ్ విస్మరించ బడింది. అంతేకాక ముస్లింలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక నియోజకవర్గాలు హిందూ, ముస్లిం ఐక్యత మీద పెద్ద దెబ్బకొట్టాయి. ఈ విధానం సిక్కులకు క్రిస్టియన్లకు ఇతరులకు ప్రత్యేక నియోజక వర్గాల ఏర్పాటుకు మార్గం వేసింది.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అరవిందోఘోష్. జవాబు. అరవిందో సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు. కవి, జాతీయవాది, యోగి మరియు గురువు. ఈయన భారత స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. ఈయన ఆధ్యాత్మిక విలువలతో నాయకులని ప్రభావితం చేసారు. వందేమాతరం గేయాన్ని ఆంగ్లభాషలోకి అనువాదం చేసారు. అరవిందో రాజకీయం నుంచి క్రమంగా ఆధ్యాత్మికత వైపుగా ప్రవేశించారు. పుదుచ్చేరిలో నాలుగేళ్ళ ఏకగ్రతతో యోగసాధన చేసి 1914లో ఆర్య అనే మాసపత్రికను వెలువర్చారు. దీని ద్వార తన భావాలు ప్రకటించేవారు.

ప్రశ్న 2.
సంపద హరణ సిద్ధాంతం.
జవాబు.
భారత రాజకీయ, ఆర్థిక రంగాలలో వచ్చిన సహజ హక్కుల భావన మితవాద నాయకుల సహకారం వల్లనే వచ్చింది. దాదాబాయ్ తన ‘సంపద హరణ సిద్ధాంతం’లో బ్రిటీష్వారు భారతదేశం నుంచి విస్తారమైన సంపదను తరలిస్తున్నారని సూచించాడు. ఈ ఆర్థిక హరణ భారతదేశంలో ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించింది. అధికమైన పన్నులు, పరిశ్రమల క్షయం దీనిఫలితమే. ఈ సిద్ధాంత వివరణలో తమ స్వంత వనురుల ద్వారా తమకు తాము అభివృద్ధి చెందించుకునే సహకారాన్ని అందించమని ఆయన బ్రిటిష్ వారిని ప్రాధేయపడ్డాడు.

TS Inter 1st Year History Study Material Chapter 14 జాతీయ ఉద్యమం – తొలిదశ

ప్రశ్న 3.
అనుశీలన సమితి.
జవాబు.
1902లో బెంగాల్లో ‘అనుశీలన సమితి’ అనే రహస్య విప్లవ సంఘం ఏర్పాటు అయ్యింది. దీని వ్యవస్థాపకులలో బరీంద్రకుమార్ ఘోష్, జతీంద్రనాథ్ బెనర్జీ మరియు ప్రమోద్ మిత్తర్ ఉన్నారు. అరవింద్ ఘోష్, మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్లు (అనంతకాలంలో ఈమె సిస్టర్ నివేదితగా పేరుగాంచింది) దీనిని ప్రోత్సహించారు. బరీంద్రకుమార్ ఘోష్ ‘యుగాంతర్’ అనే విప్లవ పత్రికను నడిపి దానిలో విప్లవ భావాలను ప్రచురించాడు. బరీంద్రకుమార్ ఘోష్, భూపేంద్రనాథత్లు 1906లో తూర్పు బెంగాల్ డిప్యూటి గవర్నర్ ఫుల్లర్ను చంపే ప్రయత్నం చేశారు. కానీ అది నిష్పలమయింది. 1908లో ఖుదీరాంబోస్, ప్రఫుల్లచాకీలు జనులచేత విమర్శింపబడిన ముజఫర్పూర్ జడ్జి కింగ్స్ఫర్డ్ను చంపే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనలో ప్రఫుల్లచాకీ తనను తాను కాల్చుకుని చనిపోయాడు. ఖుదీరాంబోసు పట్టుకొని ఉరితీశారు.

ప్రశ్న 4.
అభినవ భారతి.
జవాబు.
1897లో మహారాష్ట్రలోని పూనాలో ప్లేగువ్యాధి ప్రబలింది. బ్రిటీష్ అధికారులు రాండ్ మరియు ఐరెస్ట్లు అమానవీయ పద్ధతులలో దీని నిర్మూలన చేపట్టారు. వీరిని దామోదర చాపేకర్, బాలకృష్ణ చాపేకర్లు చంపారు. 1904లో ప్రభుత్వం చాపేకర్ సోదరులను ఉరితీసింది. ఈ కాలంలో ‘అభినవ భారత్’ అనే రహస్య సంఘం ఏర్పడింది. దీని స్థాపకులలో వినాయక దామోదర సావర్కార్, గణేష్ సావర్కార్ ఉన్నారు. గణేష్ సావర్కార్ తన రాతల ద్వారా విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాడని నాసిక్ జడ్జి జాక్సన్ అతనికి దేశబహిష్కరణ శిక్ష విధించాడు. దీనికి ప్రతీకారంగా అభినవ భారతి సభ్యుడైన అనంతలక్ష్మణ్ కార్కర్ జాక్సన్ న్ను చంపాడు. దీనినే నాసిక్ కుట్రకేసు అంటారు. ఇందులో 27 మందిని దోషులుగా తేల్చారు. ఈ కేసులో దామోదర సావర్కరు జీవితఖైదు శిక్షవేసి అండమాన్ జైలుకు పంపారు.

ప్రశ్న 5.
గదర్పార్టీ.
జవాబు.
గదర్పార్టీని భారత విప్లవకారులు అమెరికాలో స్థాపించారు. ‘గదర్’ అనగా విప్లవం. ‘గదర్’ అనే పత్రికను కూడా ప్రారంభించారు. ఈ పత్రిక ఇంగ్లీష్, ఉర్దూ, మరాఠీ, గురుముఖి నాలుగు భాషలలో వెలువడింది. ఈ పత్రిక భారతదేశం మరియు విదేశాలలో విప్లవ భావాలను ప్రచారం చేసింది. ఈ పార్టీ లాలాహరదయాళ్ నాయకత్వంలో నడిచింది. ఆంధ్రప్రాంతానికి చెందిన దర్శి చెంచయ్య ఈ పార్టీ సభ్యుడు. ఈ పార్టీ మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ఒక విప్లవాన్ని తీసుకొని రావాలని ప్రయత్నం చేసింది గానీ అది విఫలమయ్యింది. ఈ విప్లవకారులందరూ భారతదేశ స్వతంత్రోద్యమ చరిత్రలో తగిన గుర్తింపును పొందారు. వారి దేశభక్తి, త్యాగనిరతిని ప్రజలు ఎంతగానో మెచ్చుకున్నారు.

TS Inter 1st Year Telugu Grammar సమాసాలు

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material Grammar సమాసాలు Questions and Answers.

TS Inter 1st Year Telugu Grammar సమాసాలు

‘సమర్థంబులగు పదంబులేకపదంబగుట సమాసంబు’ అని చిన్నయసూరి బాల వ్యాకరణంలో సమాస లక్షణాన్ని వివరించాడు.

రెండు లేదా అంతకంటే ఎక్కువపదాలు కలసి ఒకే పదంగా ఏర్పడితే అది సమాసమవుతుంది.

సమాసంలోని మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండవ పదాన్ని ఉత్తరపదం అని అంటారు. ఈ రెండు పదాల మధ్య వివిధ విభక్తి ప్రత్యయాలను అవసరానికి తగినట్లు చేరిస్తే అది విగ్రహవాక్యం అవుతుంది. ఇది సమాసాన్ని వివరించి, విడమర్చి చెబుతుంది.

ఉదా:
‘సూర్య కిరణాలు’ అనే సమాసపదంలో
పూర్వపదం – సూర్య
ఉత్తరపదం కిరణాలు
విగ్రహ వాక్యం – సూర్యుని యొక్క కిరణాలు.

అర్థపరంగా సమాసాన్ని నాలుగు విధాలుగా విభజిస్తారు. అవి

  1. తత్పురుష
  2. బహుజొహి
  3. ద్వంద్వం
  4. అవ్యయీ భావం

1. తత్పురుష సమాసం:
తత్పురుష సమాసం వ్యధికరణమని, సమానాధికరణమని రెండు విధాలు.

(ఎ) వ్యధికరణ తత్పురుష సమాసం:
‘ద్వితీయాదులకు మీది పదంబు తోడ సమాసంబు వ్యధికరణంబునాబడు’ అని బాలవ్యాకరణంలో చెప్పబడింది. వ్యధికరణం అంటే విభక్తుల ఆధారంగా తయారు చేసే సమాసం. పూర్వపదం ద్వితీయాది విభక్తుల్లో ఉండి, ఉత్తర పదం ప్రథమావిభక్తిలో ఉంటుంది. ఇది ద్వితీయా తత్పురుష నుండి సప్తమీ తత్పురుష వరకు.

TS Inter 1st Year Telugu Grammar సమాసాలు

  1. ద్వితీయా తత్పురుషం: పూర్వపదం ద్వితీయా విభక్తిలో ఉండాలి.
    ఉదా: వేషధారి = వేషమును ధరించినవాడు
  2. తృతీయా తత్పురుషం: పూర్వపదం తృతీయా విభక్తిలో ఉండాలి.
    ఉదా: విద్యాధికుడు = విద్యచేత అధికుడు
  3. చతుర్థీ తత్పురుషం: పూర్వపదం చతుర్థి విభక్తిలో ఉండాలి.
    ఉదా: యజ్ఞవేదిక = యజ్ఞం కొరకు వేదిక
  4. పంచమీ తత్పురుషం: పూర్వపదం పంచమీ విభక్తిలో ఉండాలి.
    ఉదా: పాపభీతి = పాపము వలన భీతి
  5. షష్ఠీ తత్పురుషం: పూర్వపదం షష్ఠీ విభక్తిలో ఉండాలి.
    ఉదా: మాటతీరు = మాట యొక్క తీరు
  6. సప్తమీ తత్పురుషం: పూర్వపదం సప్తమీ విభక్తిలో ఉండాలి.
    ఉదా: మనోవేదన మనసు నందలి వేదన
  7. నజ్ తత్పురుష: వ్యతిరేకార్థాన్ని బోధించేది.
    ఉదా: అనంతం = అంతం లేనిది

(బి) సమానాధికరణం:
‘విశేషణంబునకు విశేష్యంబు తోడ సమానంబు సమానాధికరణంబు నాబడు” అని బాలవ్యాకరణంలో చెప్పబడింది. తత్పురుషలోని సమానాధి కరణ సమాసానికే కర్మధారయ సమాసమని పేరు. సమానాధికరణంలో సమాసంలోని రెండు పదాలలో ఒకటి విశేషణం, మరొకటి విశేష్యం (నామవాచకం) అవుతుంది. మరికొన్ని సార్లు ఒకపదం ఉపమానం మరోపదం ఉపమేయం అవుతుంది. ఇలా రెండు పదాలు సమానమైన ఆధారంతో ఉండటం సమానాధికరణం.

(i) విశేషణ పూర్వపద కర్మాధారయం:
ఈ సమాసంలోని రెండు పదాలలో మొదటి పదం విశేషణం. రెండవ పదం విశేష్యంగా ఉంటుంది.
ఉదా:

  • మధురోక్తులు = మధురమైన ఉక్తులు
  • ఎర్రగులాబి = ఎర్రనైన గులాబి
  • దివ్యాత్మ = దివ్యమైన ఆత్మ

పై ఉదాహరణల్లో పూర్వపదం విశేషణం. అందుకే ఈ సమాసానికి విశేషణ పూర్వపద సమాసమని పేరు.

TS Inter 1st Year Telugu Grammar సమాసాలు

(రిరి) విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం:
విశేషణం ఉత్తరపదంలో ఉండి, విశేష్యం (నామవాచకం) పూర్వపదంలో ఉంటే అది విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అవుతుంది.
ఉదా:

  • పురుషోత్తముడు = ఉత్తముడైన పురుషుడు
  • కపోతవృద్ధము = వృద్ధమైన కపోతము
  • పండిత శ్రేష్ఠుడు = శ్రేష్ఠుడైన పండితుడు

ఈ సమాసంలో విశేషణం ఉత్తరపదంగా ఉన్నా, విగ్రహవాక్యంలో మాత్రం విశేషణం ముందు రాయాలి. విశేష్యం తరువాత రాయాలి.

(iii) విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం:
ఈ సమాసంలో పూర్వపదం, ఉత్తర పదం రెండూ విశేషణాలుగా ఉంటాయి.
ఉదా:

  • మృదుమధురం = మృదువైనది, మధురమైనది
  • ధీరోదాత్తుడు = ధీరుడును, ఉదాత్తుడును
  • శీతోష్ణములు = శీతమును, ఉష్ణమును

(iv) ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం:
సమాసంలోని పూర్వపదం ఉపమానంగాను, ఉత్తర పదం ఉపమేయంగాను ఉంటుంది.
ఉదా:

  • తేనెపలుకులు = తేనె వంటి పలుకులు
  • బంగారుమాట = బంగారము వంటి మాట
  • హంసనడక = హంస వంటి నడక

TS Inter 1st Year Telugu Grammar సమాసాలు

(v) ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం:
సమాసంలోని ఉత్తరపదం ఉపమానం, పూర్వపదం ఉపమేయం అవుతుంది.
ఉదా:

  • పాదపద్మాలు = పద్మాల వంటి పాదాలు
  • ముఖారవిందము = అరవిందం వంటి ముఖము
  • ముఖచంద్రుము = చంద్రుని వంటి ముఖము

(vi) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం:
సంభావన అనగా సంజ్ఞ. సంజ్ఞా వాచకం పూర్వపదంగా గల కర్మధారయ సమాసాన్ని సంభావనా పూర్వపద కర్మధారయ సమాసమంటారు.
ఉదా:

  • ద్వారకానగరం = ద్వారక అనే పేరుగల నగరం
  • గంగానది = గంగ అనే పేరుగల నది
  • మామిడి చెట్టు = మామిడి అనే పేరుగల చెట్టు

(vii) అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం:
దీనికే రూపక సమాసం అని పేరు. ఇందులో ఉపమేయం పూర్వపదంగా, ఉపమానం ఉత్తరపదంగా ఉంటుంది. ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పబడుతుంది.
ఉదా:

  • కవితాసుధ = కవిత అనెడి సుధ
  • ఆశాసౌధం = ఆశయనెడి సౌధం
  • కాలచక్రం = కాలమనెడి చక్రం

TS Inter 1st Year Telugu Grammar సమాసాలు

(viii) ద్విగు సమాసం:
సంఖ్యాపూర్వక కర్మధారయం ద్విగువు. సంఖ్యాపూర్వక విశేషణం ముందుగా వున్న సమాసం ద్విగు సమాసం.
ఉదా:

  • ముల్లోకములు = మూడైన లోకములు
  • అష్టదిగ్గజాలు = అష్ట సంఖ్య గల దిగ్గజాలు
  • పంచభూతాలు = పంచ సంఖ్య గల భూతాలు

2. బహువ్రీహి సమాసం:
‘అన్యపదార్థ ప్రధానో బహుబ్లి హిః’. ‘అన్యపదార్థం’ అంటే సమాసంలోని పూర్వపదం, ఉత్తరపదాల అర్థాలు కాకుండా ఈ రెండు పదాలు కలిసి ఇచ్చే మరో అర్థం. దానికి ప్రాధాన్యత ఉంటుంది.
ఉదా:

  • ముక్కంటి = మూడు కన్నులు కలవాడు
  • మధురవాణి = మధురమైన వాక్కు కలది
  • మహాత్ములు = గొప్ప ఆత్మ కలవారు

3. ద్వంద్వ సమాసం:
ఉభయ పదార్థ ప్రాధాన్యం కలది ద్వంద్వ సమాసం. అంటే సమాసం లోని పూర్వపదం, ఉత్తరపదం రెండు పదాల అర్థాలకు సమ ప్రాధాన్యం ఉంటుంది.
ఉదా:

  • సీతారాములు = సీతయును, రాముడును
  • భయభక్తులు = భయమును, భక్తియును
  • తల్లిదండ్రులు = తల్లియును, తండ్రియును

TS Inter 1st Year Telugu Grammar సమాసాలు

4. అవ్యయీభావ సమాసం:
‘అవ్యయం’ అంటే లింగ, వచన, విభక్తుల వల్ల ఎటు వంటి మార్పుకు గురికాని పదం. అటువంటి పదాలు పూర్వపదంలో ఉంటే అది అవ్యయీభావ ‘సమాసం అవుతుంది.
ఉదా:

  • యథాశక్తి = శక్తి ననుసరించి
  • ప్రతి దినము = దినము దినము

TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 5th Lesson తెలంగాణ జాతీయాలు Textbook Questions and Answers.

TS Inter 1st Year Telugu Study Material 5th Lesson తెలంగాణ జాతీయాలు

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
పాఠ్యాంశంలో ఏవేని ఐదు జాతీయాలను సోదాహరణంగా వివరించండి?
జవాబు:
తెలంగాణ జాతీయాలు అను పాఠ్యభాగం వేముల పెరుమాళ్ళు రచించిన “తెలంగాణ జాతీయాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది. ఈ పాఠ్యభాగంలో తెలంగాణ జాతీయాలు వివరించబడ్డాయి.

1. వరిగడ్డిపంట :
ఎండుగడ్డి అంటిందే తడువుగా కాలుతుంది. వాముగా ఉన్నప్పుడు కుమ్ముగా కాలుతుంది. ‘మంచివాళ్ళకు వచ్చే కోపాన్ని వరిగడ్డి మంటతో పోలుస్తారు. వారి కోపం . వరిగడ్డి మంటలాంటిదంటారు. వరిగడ్డిమంటలాంటి కోపం ఆకాసేపు భరించలేనిదిగా ఉ న్నా దానికి ప్రమాదం లేదు. అదే అర్థంలో “వరిగడ్డిమంట” అను జాతీయాన్ని వాడతారు.

2. కుక్కిన పేను : రాకాసిబల్లుల లాంటి మహామహా జంతుజాలం నాశనం అయింది. కాని పేను జాతి మాత్రం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతూనే ఉంది. పేనును కుక్కితే చిటుక్కుమన్న శబ్ధం వస్తుంది. కొన్ని ఈడ్డులాంటి పేలు చిటుక్కుమనవు గోరువత్తిడికి తలకు అంటుకుపోతాయి. చచ్చినట్లుపడి ఉంటాయి. అలా కుక్కితే చచ్చిపోకుండా చచ్చినట్లు పడిఉండే పేలు కుక్కిన పేలు. “ఒక్క మాట అనకుండా వాడు పొద్దంతా అక్కడే కుక్కి పేనువలె పడున్నాడు” అనటానికి ఈ జాతీయాన్ని వాడతారు.

3. గద్ద తన్నుక పోయినట్లు ఏ కాస్త సందు దొరికినా, తల్లి నుండి కొద్ది ఎడబాసినట్లున్నా, ఏ చింతచెట్టు చాటారు కొమ్మనుండి కనిపెడుతుందో గాని గద్ద కోడిపిల్లను ఎత్తుకుపోతుంది. అలాగే ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ తిరుగుతూ ఉన్న వ్యక్తి ప్రమాదంలో చనిపోతాడు. ఇలా హఠాన్మరణం సంభవించినప్పుడు ఆ పరిస్థితిని అంచనా వేసి గద్ద తన్నుకుపోవటంతో పోలుస్తారు. “గంట క్రితం బజార్లకు ఆడుకొనపోయిన పిల్లలాడ్ని గద్ద తన్నుక పోయినట్లు బస్సుకిందపడి చచ్చిపోయే” అని జాతీయ ప్రయోగం.

TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు

4. చుక్కి టెగి పట్టట్లు :
ఆకాశం నుండి అప్పుడప్పుడు అకస్మాత్తుగా ఉల్కలు ఆకాశం నుండి వాతావరణంలోకి రాలిపడుతుంటాయి. ఇది దూరం నుండి చూసిన వారికి ఆకాశం నుండి చుక్కలు రాలిపడినట్లు భ్రాంతి కలుగుతుంది. దీనినే పల్లె భాషలో చుక్క తెగిపడినట్లు అని అంటుంటారు. మనం ఊహించని అతిథిగాని, వ్యక్తిగాని అనుకోని సందర్భంలో అకస్మాత్తుగా వస్తే “చుక్క తెగిపడినట్లు వచ్చావేమిటిరా అని ప్రశ్నిస్తాం. చుక్క తెగిపడటంచాల అరుదుగా జరుగుతుంది. ఎప్పుడు పడుతుందో తెలియదు. అర్థరాత్రి అదరాబాదరా వచ్చిన పాలేరుతో “ఈ సమయంలో వచ్చావు చుక్క తెగిపడినట్లు” అని ఇల్లాలు ప్రశ్నిస్తుంది.

5. రామ చక్కని : చక్కదనం అంటే అందం. రాముని చక్కని అందగాడిగా తెలుగువారు భావిస్తారు. మంచి గుణానికి అందానికి నాణ్యతకు చాలా సందర్భాలలో రామచక్కని బంధం ఉపయోగించబడుతుంది. “రామ చక్కని అద్దం పగుల గొడితివి గదరా” “రంగయ్య రామచక్కని మనిషి”, “రామ చక్కని పిల్ల అది” అని ప్రయోగం మన సమాజంలో ఉన్నదే కదా!

ప్రశ్న 2.
పాఠ్యాంశంలోని జంతువులు పక్షుల ఆధారంగా రూపొందిన ఏ వేని ఐదు జాతీయాలను వివరించండి?
జవాబు:
“తెలంగాణ జాతీయాలు” అను పాఠ్యభాగం వేముల పెరుమాళ్ళుచే రచింంచబడిన ‘తెలంగాణ జాతీయాలు’ అన్న గ్రంథం నుండి గ్రహించబడింది. ఇందులో జంతువుల పక్షులు ఆధారంగా కొన్ని జాతీయాలున్నాయి.

1. కోతికి పుండు పుట్టినట్లు ఒక కోతికి పుండయ్యింది. విచిత్రంగా కన్పించింది. మరొక కోతి వచ్చి ఆపుండును గిల్లి చూసి వెళ్ళిపోయింది. అలాగే మరొక కోతి కూడా అలా చేసింది. ఆకోతి కూడా పుండు బాధ పడలేక గోక్కున్నది. పుండు మరింత నెత్తురుకారి పెద్దదయింది. ఏ కోతికి పుండు పెద్దది కావాలని ఉండదు. అయినా తెలియని తనం వలన ఈ కోతి పుండు మానదు “అత్తా! ఈ పోరగాని కాలుకు దెబ్బ తాకిందని పట్టేసి బడికితోలేస్తే మళ్ళీ దెబ్బతాకించుకున్నాడు. కోతికి పుండు పుట్టించుకున్నట్లున్నది” అన్న కోడలి మాటల్లో ఈ జాతీయం పలుకబడింది.

TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు

2. ఎద్దును చూసి మేతెయ్యాలి : ఏనుగుకు చీమకు ఒకే విధంగా మేత వేస్తే కుదురుతుందా? విచక్షణతో దేనికేంత వేయాలో తెలుసుకోవాలి. ఎద్దుల్లో కొన్ని పెద్ద ఎద్దులుంటాయి. వాటికి తగ్గమేత వాటికి వేయాలి. కొన్ని బొండలుంటాయి. వాటి పుట్టుకే చిన్నది. కడుపు కూడా అంతకు తగ్గట్టుగానే ఉంటుంది. వాటికి మేత ఎక్కువ వేస్తే తొక్కి పాడుచేస్తాయి. ‘దసరా మామూళ్ళని అందరికి పదిరూపాలే ఇస్తిరి. ఎద్దును చూసి మేతెయ్యాలి. మే ఎల్లకాలం పనికచ్చేటోల్లం. మాది మా కుండాల” అని జాతీయం ప్రయోగించబడుతుంది.

3. ఊరుగొడ్డుపోలేదు : ఊరిలో ఎక్కడో ఒకచోట దొరకుండా పోదు అనుట ఒక కుటుంబంలో ఒక వస్తువు దొరకకుండా పోవచ్చు. ఊరిలో దొరకకుండా పోదు. గొడ్డు పోవుట అంటే వంధత్వం, అలభ్యం. ఒక కుటుంబంలో దొరకకపోతే వేరే కుటుంబంలో దొరుకుతుందని భావం” “అయ్యో! నీవు యియ్యకపోతే మాయె. ఊరుగొడ్డుపోయిందా? ఎక్కడో ఒకచోట ఎవరన్నా ఇస్తారు. అందరూ ఒకే తీరు ఉంటారా? అని ఈ జాతీయం ప్రయోగించబడుతుంది

4. కోడి మెదడు : అల్పత్వం మతిమాలిన తనం అని అర్థం. కోడి చిన్న ప్రాణి. దాని మెదడు కూడా చిన్నదే! చెపితే అర్థం చేసుకోకుండా తనకు తెలిసిందే గొప్ప అనుకునే వాడిని కోడిమెడవాడు అంటారు. “వానిది కోడి మెదడు. వానికి తోచదు. ఒకరు చెప్తే వినడు” అంటారు.

5. బుడుబుంగ : నీటిలో తిరిగే పక్షి, బాతు జాతికి చెందింది. నల్లగా ఉంటుంది. ఒక చోట బుడుక్కున మునుగుతుంది. కూత పెట్టు దూరంలో తేలుతుంది. మళ్ళీ మళ్ళీ మునిగినా అలాగే తేలుతుంది. లోపల చేపలను వేటాడుతుంది. ఇప్పుడు ఈ ఇంట్లో, వెంటనే మరో ఇంట్లో ఇలా కాలాగకుండా తిరిగే వాడిని బుడుబుంగ అని అంటారు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు

II. సంగ్రహ రూప ప్రశ్నలు – సమాధానాలు.

ప్రశ్న 1.
‘తాత జాగీరు’ జాతీయంలోని చారిత్రక విశేషాలను తెలపండి?
జవాబు:
కష్టార్జితం కాని సంపద, అనువంశికంగా సంక్రమించిన ఆస్తి, నైజాం ప్రభువులు తమ రాజరికాన్ని కాపాడు కోవటానికి జీతం లేని కొలువులు ఎన్నో ఏర్పాటు చేశారు. పటీలు, మావిపటీలు, పట్వారీ, కొత్వాలి వంటివి అనువంశికంగా సంక్రమించేవి. ఈ పనికి జీతం లేకపోయినా ప్రజలను వీళ్ళు ఎంత దోచుకున్నా తమ సొమ్ము ముట్టచెపితే చాలు.

ఆ విధంగా జమీందారులు, జాగీరుదారులు, ముక్తాదారులు, దేశాయిలు, సర్దేశాయిలుండేవారు. జమీందారుకు కొన్ని గ్రామాల్లో వేలాది ఎకరాల భూములు ఉండేవి. ముక్తాదారులంటే ఆ గ్రామమంతా ఆయనదే! ప్రజల వద్ద ఎంత దోచుకున్నా ప్రభుత్వం పట్టించుకోదు. కప్పం చెల్లిస్తే చాలు. తాత గారి జాగీరును మనమడు అనుభవిస్తున్నట్లు” ఇదేమన్నా నీ తాతగారి జాగీరనుకున్నావా” అన్న జాతీయాలు ప్రయోగించడం జరుగుతుంది.

ప్రశ్న 2.
ఇంటింటికి మంటి పొయ్యి జాతీయంలోని సామాజిక న్యాయాన్ని వివరించండి?
జవాబు:
తెలంగాణ జాతీయాలు అను పాఠ్యభాగం వేముల పెరుమాళ్ళుచే రచించబడిన “తెలంగాణ జాతీయాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.
కట్టెలతో వంటలు చేసేటప్పుడు ఏ ఇంటిలోనైనా మన్నుతో చేసిన పొయ్యి ఉండేది. నాకు ధనమున్నదికదా అని బంగారు పొయ్యి లాడరు కదా! సామాజిక న్యాయం అందరికి ఒక్కటే సమస్యలు లేని ఇల్లుండదు “మాకోడలు కొడుకు మొన్న నలుగురిలో నానామాటలన్నందుకు నల్ల మొఖం అనిపించింది.

బజారుకే రాబుద్ధికావడం లేదు” అంది పొరుగింటావిడ. “ఇంటింటికి మట్టి పొయ్యే ఈ కష్టాలు అందరికీ వచ్చేవే. నీ ఒక్కదానికని ఏముంది. నీ కొడుకు కోడలు ఏదో అంటే నీకెందుకు నల్లమొఖం. ముందటమాకురావా” అని ఓదార్చింది పొరుగింటి ఆవిడ. ఇలాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగించబడుతుంది.

TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు

ప్రశ్న 3.
బట్టకాల్చి మీద వేయడం అంటే ఏమిటి?
జవాబు:
తెలంగాణ జాతీయాలు అను పాఠ్యభాగం వేముల పెరుమాళ్ళుచే రచించబడిన తెలంగాణ జాతీయాలు” అనుగ్రంథం నుండి గ్రహించబడింది.

బట్టకాల్చి మీద వేయటమంటే నిందలు మోపటం అని అర్థం. ఒకరిని అన్యాయంగా వ్యాజ్యంలో ఇరికించడం. పరులను దోషులుగా చిత్రించడం “వాడు దొంగ తనం చేశాడు. నేను నా సొంత బంగామని వాడు చెప్పినందున ఆ సొమ్ము దాచాను. బట్టకాల్చి మీదేసినట్లు ఆ నింద వాడు నా మీద వేసి నన్ను కూడా వానితోపాటు కేసులో ఇరికించాడు అనటంతో ఈ జాతీయం ప్రస్తావించబడుతుంది.

ప్రశ్న 4.
వరిగడ్డిమంట :
జవాబు:
తెలంగాణ జాతీయాలు అను పాఠ్యభాగం వేముల పెరుమాళ్ళుచే రచించబడిన “తెలంగాణ జాతీయాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.

వరిగడ్డి ఎండినదైతే అగ్ని అంటిందే తడవుగా మంటలంటుకుని కాలుతుంది. వాముగా ఉంటే మాత్రం కమ్ముకుని పొగలేచి కుమ్ముగా కాలుతుంది. వంట చెరుకు అంటుకోవటానికి, పొయ్యి రాజుకోవటానికి, చలిమంటలకు బగ్గున లేచే మంటల కోసం వరిగడ్డినే వాడతారు. ఏదైనా వరిగడ్డి బగ్గున మండి బుగ్గయిపోతుంది. మంచివాళ్ళకు వచ్చే కోపం వరిగడ్డి. మంటతో పోలుస్తారు. వారి కోపం వరిగడ్డి మంటాలాంటిది. కొద్దిసేపటిలో మాయపై పోతుంది. అలాంటప్పుడు వరిగడ్డిమంటతో పోలుస్తారు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు

III. ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
వేముల పెరుమాళ్ళు విద్యాభాసం ఎక్కడ జరిగింది ?
జవాబు:
రాయికల్, కోరుట్ల, జగిత్యాలలో జరిగింది.

ప్రశ్న 2.
వేముల పెరుమాళ్ళు రాసిన త్రిశతి పేరేమిటి?
జవాబు:
వేముల పెరుమాళ్ళు వ్రాసిన త్రిశతి పేరు ‘గాంధీమార్గం’

ప్రశ్న 3.
వేముల పెరుమాళ్ళు ప్రసంగాల సంకలనం పేరేమిటి ?
జవాబు:
మానవతా పరిమళాలు

ప్రశ్న 4.
జాతీయాలలో ఏ చరిత్ర కళ్ళకు కట్టినట్లుంటుంది?
జవాబు:
జాతీయాలలో తరతరాల తెలంగాణ సామాజిక చరిత్ర కళ్ళకు కట్టినట్లుంటుంది

ప్రశ్న 5.
జానపదుల నోటి నుండి వెలువడ్డ జాతీయం సామెత ఎలాంటిది?
జవాబు:
గంగలో రాయివంటిది

TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు

ప్రశ్న 6.
“చుక్క తెగిపడ్డట్టు” అనే జాతీయంతో ఒక వాక్యం నిర్మించండి.
జవాబు:
చుక్కమ్మ చుక్క తెగిపడినట్లు చెప్పాపెట్టకుండా మా ఇంటికి వచ్చింది.

ప్రశ్న 7.
“రామచక్కని” అనే జాతీయాన్ని ఉపయోగించి ఒక వాక్యం తయారు చేయండి.
జవాబు:
శ్రీరాముడు రామచక్కనోడు

ప్రశ్న 8.
“లొల్లిలో లొల్లి” జాతీయం ఆధారంగా ఒక వాక్యం రాయండి?
జవాబు:
రాజకీయ పార్టీలు అవినీతిని గురించి ఇప్పుడు లొల్లిలో లొల్లి చేస్తున్నాయి.

తెలంగాణ జాతీయాలు Summary in Telugu

రచయిత పరిచయం

రచయిత : వేముల పెరుమాళ్ళు

పుట్టిన తేదీ : ఆగష్టు 8, 1943

పుట్టిన ఊరు : కరీంనగర్ జిల్లా రాయికల్

తల్లిదండ్రులు : వేముల ఆండాళ్ళమ్మ – రాజయ్యలు

విద్యాభ్యాసం : రాయకల్, కోరుట్ల, జగిత్యాలలో

వృత్తి : గ్రామాభివృద్ధి అధికారి

TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు

రచనలు :

  1. శ్రీరాజ రాజేశ్వర శతకం
  2. ధర్మపురి నృకేసరి శతకం

బాలసాహిత్యంలో

  1. ‘కిట్టు’ బాలనీతి శతకం
  2. ‘నిమ్మ’ పర్యావరణ శతకం
  3. ‘గాంధీమార్గం’ త్రిశతి
  4. ‘లోగుట్టు’ రాజనీతి చతుశ్శతి

ఆకాశవాణి ప్రసంగాలు

  1. మానవతా పరిమళాలు

మరణం : సెప్టెంబరు 17, 2005

కవి పరిచయం

వేముల పెరుమాళ్ళు కరీంనగర్ జిల్లా రాయికల్ గ్రామంలో ఆగష్టు 5, 1943 జన్మించారు. ఈయన తల్లిదండ్రులు వేముల ఆండాళ్ళమ్మ రాజయ్యలు. మాతా మహుడు కైరం భూమదాసు వరకవి గాయకుడు. వీరి విద్యాభ్యాసం రాయకల్ కోరుట్ల జగిత్యాలల్లో జరిగింది. గ్రామాభివృద్ధి అధికారిగా 18 సం॥లు పనిచేశారు. తరువాత రాజకీయ రంగంలో ప్రవేశించి రాయికల్ మండల అధ్యక్షునిగా పనిచేశాడు. సహకార రంగంలో గీత, పారిశ్రామిక కాంట్రాక్ట్ లేబర్, వినియోగ, గృహనిర్మాణ సంఘాలను స్థాపించాడు.

పెరుమాళ్ళు శ్రీరాజరాజేశ్వర, శ్రీధర్మపురి, నృకేసరి శతకాలను ప్రచురించారు. బాల సాహిత్యంలో వీరు బాలనీతి శతకం. ‘కిట్టూ’, పర్యావరణ శతకం ‘నిమ్ము’లు రాశారు. మహాత్ముని మహానీయ సూక్తులను “గాంధీమార్గం” త్రిశతిగా రచించాడు. రాజనీతి చతుశ్శతిగా వీరు “లోగుట్టు” రాశాడు.

1958 నుండి 1968 వరకు సమాజంలో జాతీయ పరిణామాలను పద్యాలుగా రాశాడు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా ఈయన “మానవతా పరిమళాలు” ప్రసంగాలుగా వెలువడ్డాయి. జీర్ణదేవాలయ పునరుద్ధరణ చేశారు. వీరు సెప్టెంబరు 17, 2005న కాలం చేశారు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు

ప్రస్తుత పాఠ్యభాగం “తెలంగాణ జాతీయాలు” గ్రంథం నుండి గ్రహించబడింది.

పాఠ్యభాగ సందర్భం

వేముల పెరుమాళ్ళు తన తల్లి నోటి నుండి వెలువడే జాతీయాలను విని ప్రేరణ పొంది తెలంగాణ వివిధ ప్రాంతాల నుండి వాటిని సేకరించారు. జానపద సాహిత్యం గురించి చెపుతూ “జానపద సాహిత్యం కూరాడుకుండలాంటిది. దానిని మైలపరచ కుండా చేసే బాధ్యత మనందరిది. జానపదుడు ఋషి వంటివాడు. జానపదుల నోట వెలువడిన జాతీయం సామెత గంగలో రాయిలాంటిది. తెలంగాణ భాషయాస అర్థం చేసుకుని చదివితే ఆసక్తికరమైన అంశాలు లభిస్తాయి” అంటారు.

తెలంగాణ జాతీయాలను విద్యార్థులకు తెలియచేసే సందర్భంలో ఈపాఠ్యభాగం ఇవ్వబడింది.

పాఠ్యాభాగ సారాంశం

“వేముల పెరుమాళ్ళు జాతీయాలను వివరిస్తూ “జానపద సాహిత్యం” కూరాడు కుండలాంటిది. దానిని మైల పరచకుండా చూసే బాధ్యత మనందరిది. జానపదుడు ఋషసోంటోడు. జానపదుల నోట వెలువడ్డ జాతీయం, సామెత గంగలో రాయివంటిది.

ఎన్నో వందల సంవత్సరాలు అది ప్రజల నోళ్ళలో నాని రగిడిల్లింది. ఒక్క మాటలో చెప్పాలంటే వీటిలో తరతరాల తెలంగాణా సామాజిక చరిత్ర కళ్ళకు కట్టినట్లుంటుంది. తెలంగాణ భాష, యాస, అర్థం చేసుకుని కొంచెం ఓపికగా చదివేవాళ్ళకు ఇందులో ఎన్నో ఆసక్తి కరమైన అంశాలు లభిస్తాయి.

TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు

జాతీయాలలో వరిగడ్డిమంట, లొల్లిలో లొల్లి, కోటిపండు పుట్టినట్లు, తాతజాగీరు, కుక్కిన పేను, ఏనుగెల్లింది తోకచిక్కింది, వెయ్యికాళ్ళజర్రి, గద్దతన్నుకు పోయినట్లు, పిల్లికి రొయ్యిల మొలతాడు, చుక్కతెగిపడినట్లు, ఎద్దును చూసిమేత వెయ్యాలి, ఊరుగొడ్డుపోలేదు. తూముకాడిపొలం, మొలదారం తెగ, పేర్నాల పెట్టుట మొదలగు ముఖ్యమైన నిత్య వాడుకలో ఉన్న వాటిని వివరించారు.

TS Inter 1st Year Telugu Grammar అనువాదం

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material Grammar అనువాదం Questions and Answers.

TS Inter 1st Year Telugu Grammar అనువాదం

ఒక భాష నందలి భావాన్ని మరొక భాషలోకి వ్యక్తీకరించే ప్రక్రియ అనువాదం. దీనినే ఆంగ్లంలో Translation అంటారు. అనువాదం చేయదలచుకున్న భాషను మూల భాష (Source Language) అని, అనువాదం ఏ భాషలోకి చేయదలచుకున్నారో భాషను లక్ష్య భాష (Target Language) అని అంటారు. ఒక భాషలోని చారిత్రక, శాస్త్ర, సాంకేతిక, సాహిత్యాంశాలను అనువాదం చేయటం ద్వారా మూల భాషా ప్రాంతం లోని విషయాలను, సంస్కృతీ విశేషాలను ఇతర భాషీయులు తెలుసుకోవచ్చు. ఇది ప్రాంతాల మధ్య, సంస్కృతుల మధ్య ఐక్యతకు తోడ్పడుతుంది.

భారతీయ భాషలలో ఒక భాషనుంచి మరొక భాషలోకి, విదేశీ భాషలలోకి, విశ్వసాహిత్యం నుంచి భారతీయ భాషలలోకి ఆదాన ప్రదానాలు జరిగాయి. తెలుగు భాషలోకి సంస్కృత, బెంగాలి, హిందీ, ఉర్దూ, తమిళ, మళయాళ, కన్నడ ఇత్యాది భారతీయ భాషల సాహిత్యం, ఆంగ్ల, ఫ్రెంచ్, రష్యన్, చైనీస్ భాషల సాహిత్యం అనువాదం అయింది.

మూలరచనను యథాతథంగా తెలుగులోకి తర్జుమా చేయడం ఒక పద్ధతి అయితే, మూల రచనకు భంగం వాటిల్లకుండా స్వేచ్ఛానుసరణ చేయడం మరొక పద్ధతి.

అనువాద విధానంలో పాటించాల్సిన మెలకువలు
అనువాదంలో సాంస్కృతికపరమైన సమస్యలు ఎదురవుతాయి. భాషాసంబంధమైన సమస్యలు కూడా ఎదురవుతాయి.

భిన్న సంస్కృతులు భిన్న భాషా పదాలను సృష్టించుకున్నప్పుడు, ఆ సాంస్కృతిక అంశాల పారిభాషిక పదాలను అనువాదం చేసే భాషలో ఉండే సామీప్య పద బంధా లను ముందుగా క్రోడీకరించుకోవాలి. ఇంగ్లీషులో ice, snow, dew లాంటి పదాల అనువాదంలో మంచు, చలిమంచు, పొగమంచు పదాలు అనువాదా నికి పనికి వస్తాయో లేదో ఆలోచించాలి.

TS Inter 1st Year Telugu Grammar అనువాదం

ఒక భాషా సమాజంలో ఒక పదం పుట్టుక ఆ భాషా సమాజంలోని సాంస్కృతిక అనుబంధం మీద, దాని పరిసర ప్రభావాల మీద ఆధారపడుతుంది. దానిని అనువాదం చేసేటప్పుడు దాని పరిసరానుబంధానికి విఘాతం జరగకుండా పదాలను ఎంపిక చేసుకోవాలి.

సాధారణంగా ఒక భౌగోళిక ప్రాంతంలో నివసించే ప్రజలంతా ఒకే భాషను మాట్లాడుతారు. అట్లాగే, ఒక భాషా ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు, అంటే -జాతికి, ఒక నిర్దిష్టమైన భౌతిక జీవనం ఉంటుంది. సాంఘిక జీవితం ఉంటుంది. మత విశ్వాసాలు ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే వీటన్నిటి ప్రభావాల వల్ల జాతిభావాలు, భావాల తీరును బట్టి భాషలుంటాయని గమనించాలి.

భౌగోళిక శీతోష్ణ పరిస్థితులను బట్టి పండే పంటల్లో తేడాలుంటాయి. ఆ తేడాలు ఆహారపు అలవాట్లను కూడా మారుస్తాయి. ఇంగ్లీషులో bread, soup, sandwich లాంటి మాటలను గమనించండి. తెలుగు అన్నంలోనూ, కూరల్లోనూ చాలా రకాలున్నాయి. వరి అన్నం వేరు, కొర్రన్నం వేరు, సంగటి వేరు.

ఇంగ్లీషులో Rice అంటే అన్నం కావచ్చు. బియ్యమూ కావచ్చు. అంటే, ఇంగ్లీషువారికి Rice అనే పదంతో వాళ్ళ అవసరాలు తీరుతున్నాయి. కాబట్టి కొత్తపదాల సృష్టి వాళ్ళకు అవసరం లేకుండా పోయింది. అంటే భిన్న భిన్న సంస్కృతులు భిన్న భిన్న పదాలకు ఆలవాలంగా ఉంటాయని గమనించాలి. కాబట్టి అనువాదం చేసేటప్పుడు సాంస్కృతిక ప్రభావం ప్రధానపాత్ర వహిస్తుందన్న సత్యాన్ని గమనించాలి.

అనువాదంలో భాషా సమస్యలు కూడా ప్రధాన అంశమే. మూలభాషా నిర్మాణానికి, లక్ష్య భాషా నిర్మాణానికి మధ్య తేడా ఉండటం వల్ల అనువాదంలో సమస్యలు ఏర్పడతాయి. ఇందులో కొన్ని……… 1. రాసే అలవాట్లు, 2. పదాలు, నుడికారాలు వాటి అర్థ విశేషాలు 3. పదనిర్మాణం 4. వాక్య భేదాలు, ప్రయోగాలు ఇవన్నీ భాషా నిర్మాణ సంబంధమైన సమస్యలుగా గుర్తించాలి.

మూలభాషలోని నుడికారం తెలియకపోతే, తప్పుడు అనువాదం చేసే అవకాశం ఉంది. కాబట్టి అనువాదం చేసేటప్పుడు స్థూలంగా పైన చెప్పిన సమస్యలను గుర్తించి అనువాదం చేస్తే ఆ అనువాదం సరైన విషయ సమగ్రతను కలిగి అనువాదం చేసుకున్న భాషా సమాజానికి కూడా మంచి సమాచారాన్ని అందిస్తుంది.

TS Inter 1st Year Telugu Grammar అనువాదం

అనువాదం అభ్యాసానికి కొన్ని ఆంగ్ల వాక్యాలు

ప్రశ్న 1.
A journey of thousand miles begins with a single step
జవాబు:
వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది.

ప్రశ్న 2.
There is plenty of water in that region.
జవాబు:
ఆ ప్రాంతంలో నీరు పుష్కలంగా ఉంది.

ప్రశ్న 3.
There is no substitute for hard work.
జవాబు:
కృషికి ప్రత్యామ్నాయం లేదు.

ప్రశ్న 4.
Imagination rules the world.
జవాబు:
ఊహాశక్తి ప్రపంచాన్ని శాసిస్తుంది.

ప్రశ్న 5.
Maturity comes with experience not age.
జవాబు:
పరిణతి, వయసుతో కాదు, అనుభవంతో వస్తుంది.

ప్రశ్న 6.
Language is the dress of the thought.
జవాబు:
ఆలోచనకి తొడిగిన ఆహార్యమే భాష.

TS Inter 1st Year Telugu Grammar అనువాదం

ప్రశ్న 7.
A picture is a poem without words.
జవాబు:
పదాలు లేని పద్యమే చిత్రం

ప్రశ్న 8.
The best way to predict the future is to create it.
జవాబు:
భవిష్యత్తును అంచనావేయటానికి ఉత్తమ మార్గం, దానిని సృష్టించటమే.

ప్రశ్న 9.
Learn as if you live forever.
జవాబు:
ఎప్పటికీ జీవిస్తావన్నట్లుగానే నేర్చుకోవాలి.

ప్రశ్న 10.
By failing to prepare you are preparing to fail.
జవాబు:
మీరు సంసిద్ధులు కావటంలో విఫలమవుతున్నారంటే, విఫలమవ్వటానికి సిద్ధపడుతున్నారని అర్థం.

ప్రశ్న 11.
Reading is to the mind what exercise is to the body.
జవాబు:
శరీరానికి వ్యాయామం ఎలాగో మెదడుకి పుస్తక పఠనం అలాంటిది.

ప్రశ్న 12.
Sometimes, later becomes never do it now.
జవాబు:
కొన్నిసార్లు, తరువాత అనుకున్నది ఎప్పటికీ కాదు, అందుకే ఇప్పుడే చెయ్యాలి.

TS Inter 1st Year Telugu Grammar అనువాదం

ప్రశ్న 13.
Don’t stop when you’re tired stop when you are done.
జవాబు:
అలసిపోయినప్పుడు కాదు, పనిపూర్తయినప్పుడే విశ్రమించాలి.

ప్రశ్న 14.
Education is the most powerful weapon which can change the world.
జవాబు:
ప్రపంచాన్ని మార్చగలిగే అత్యంత శక్తివంతమైన సాధనం విద్య మాత్రమే.

ప్రశ్న 15.
What you do is more important than what you say.
జవాబు:
నువ్వు చెప్పే మాటలకంటే నువ్వు చేసే పనులే నీ గురించి మాట్లాడతాయి.

ప్రశ్న 16.
Don’t judge book by its cover.
జవాబు:
ముఖ చిత్రాన్ని చూసి పుస్తకాన్ని అంచనా వెయ్యద్దు.

ప్రశ్న 17.
A poor workman blames his tools.
జవాబు:
పని చేతకానివాడు పనిముట్లని నిందిస్తాడు.

ప్రశ్న 18.
What time is our meeting on Wednesday?
జవాబు:
బుధవారం మన సమావేశం ఎన్ని గంటలకు?

ప్రశ్న 19.
I completed reading the book yesterday.
జవాబు:
నేను పుస్తకం చదవటం నిన్న పూర్తి చేశాను.

TS Inter 1st Year Telugu Grammar అనువాదం

ప్రశ్న 20.
Ours is a joint family.
జవాబు:
మాది ఉమ్మడి కుటుంబం.

TS Inter 1st Year Political Science Study Material Chapter 9 లౌకికవాదం

Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 9th Lesson లౌకికవాదం Textbook Questions and Answers.

TS Inter 1st Year Political Science Study Material 9th Lesson లౌకికవాదం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
లౌకికవాదమంటే ఏమిటో నిర్వచించి, లౌకికవాద భావనలను వివరించండి.
జవాబు.
పరిచయం :
లౌకికవాదమనేది ఒక ప్రధానమైన సామాజిక, రాజకీయ దృగ్విషయం. అనేక సమకాలీన ప్రపంచదేశాలు తమ ప్రభుత్వ వ్యవహారాలలో లౌకికతను అనుసరిస్తున్నాయి. లౌకికవాదం ప్రత్యేకంగా మతంతో సంబంధంలేని, స్వతంత్ర ఆదర్శాలను ప్రభోదిస్తుంది. ప్రభుత్వాలు మతంతో నిమిత్తం లేకుండా నైతికత, విద్యలాంటి సూత్రంపై ఆధారపడతాయనే దృక్పథమే లౌకికవాదం.

వర్తమాన ప్రాపంచిక జీవనం దైవికమైనది కాకుండా కొన్ని నైతిక ప్రమాణాలు, పాలనా నియమాలు మానవ కార్యకలాపాలను నిర్ణయిస్తాయని లౌకికవాదం పేర్కొంటుంది. లౌకికవాదానికి మతాన్ని దూషించే ఉద్దేశం లేదు. మతం, రాజ్యం అనేవి రెండు ప్రత్యేక విభాగాలని అది గట్టిగా ఉద్ఘాటించింది.

అర్థం :
Secular అనే ఆంగ్ల పదానికి లాటిన్ భాషలో అర్థం “ఇహలోకం” (This World) ఈ పదం మతానికి వ్యతిరేకమనే అర్థాన్ని ఇస్తుంది.

నిర్వచనం :
1. జి. జె. హోల్యోక్ :
“లౌకికవాదం అంటే మతవిశ్వాసాలను విమర్శించకుండా లేదా తిరస్కరించకుండా మతంతో సంబంధంలేని ఒకానొక సామాజిక వ్యవస్థను ప్రోత్సహించటమనే భావన” గా నిర్వచించారు.

2. ఎరిక్ ఎస్. వాటర్ హౌస్ :
“మతంలో పేర్కొన్న దానికంటే భిన్నమైన జీవనం, ప్రవర్తనలకు సంబంధించిన సిద్దాంతాన్ని ప్రతిపాదించే ఒకానొక ఆదర్శమే లౌకికవాదం” అని అభిప్రాయపడ్డారు.

లౌకికవాద భావనలు (Concepts of secularism) : లౌకికవాదం ప్రధానంగా నాలుగు భావనలను కలిగి ఉంది. అవి

  1. మానవతాపాదం, హేతువాద భావన
  2. రాజకీయ, సామాజిక దృక్కోణం
  3. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం
  4. మతం పట్ల వ్యతిరేకత

ఈ నాలుగు భావనలను గురించి ఈ దిగువ పేర్కొన్న విధంగా వివరించవచ్చు.
1. మానవతావాదం, హేతువాద భావన (Humanistic and Atheistic philosophy) :
లౌకికవాదం అనేక వ్యక్తిగత, సాంస్కృతిక, రాజకీయ, సామాజిక అంతరార్థాలను కలిగి ఉంటుంది. మానవుల శ్రేయస్సును కోరుకొనుట చేత అది మానవతా స్వభావాన్ని కలిగి ఉంటుంది.

మానవుడు అన్ని విషయాలకు కొలమానం అనే సామెతకు అది ప్రాముఖ్యతను ఇస్తుంది. ఇది మతాన్ని సమర్థించదు లేదా వ్యతిరేకించదు. వ్యక్తులు తమకు ఇష్టమైన మతాన్ని ఎంపిక చేసుకొని, అనుసరించేందుకు వీలు కల్పిస్తుంది.

2. రాజకీయ, సామాజిక దృక్కోణం (Political and Social dimension) :
లౌకిక వాదానికి నిర్దిష్టమైన రాజకీయ, సామాజిక దృక్కోణాలున్నాయి. అది సహజసిద్ధమైన, భౌతిక దృక్పథాలతోనూ, రాజకీయ, ఆర్థిక స్వావలంబనలతో కూడిన వ్యవస్థాపనకు ప్రతీకగా ఉంటుంది. కుటుంబానికి, సంస్థలకు మరియు సమాజానికి మత స్వాతంత్య్రానికి ఇది వీలు కల్పిస్తుంది.

3. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం (Liberty and Democracy) :
స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి లౌకికవాదం ప్రయోజనకరమైనది. అలాగే ఉదార ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికగా ఉంటుంది. లౌకికవాదం అధికారిక మత నాయకత్వాన్ని మత సంస్థల ఉనికి, కొనసాగింపు, మనుగడలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రజాసామ్యం, ప్రభుత్వాధికారాల వికేంద్రీకరణను సమర్థిస్తుంది.

4. మతం పట్ల వ్యతిరేకత (Opposition to Religion) :
లౌకికవాదం ప్రజా వ్యవహారాలను మతం సమర్థించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మతాధికారుల ప్రాబల్యతలను ఖండిస్తుంది. మానవజీవనానికి సంబంధించిన అప్రధాన అంశాలలో మతం ఒకటిగా పేర్కొంటూ, మత ప్రాధాన్యాన్ని తగ్గిస్తుంది. సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలగని రీతిలో ప్రజలు వారి మత విశ్వాసాలను, ఆచారాలను అనుసరించవచ్చని పేర్కొంటుంది.

ఇతర మతాలకు చెందిన వారికి ఏ విధమైన అపకారం, ద్వేషం, అసూయలు కలిగించకుండా వ్యక్తులు వారి మత కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని స్పష్టీకరించింది. రాజ్యాంగపు మహోన్నత ఆశయాలు, ఆకాంక్షలను ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుందని ఉద్ఘాటించింది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 9 లౌకికవాదం

ప్రశ్న 2.
లౌకికవాద సుగుణాల గురించి రాయండి.
జవాబు.
అర్థం :
Secular అనే ఆంగ్ల పదానికి లాటిన్ భాషలో అర్థం “ఇహలోకం” (This World) ఈ పదం మతానికి వ్యతిరేకమనే అర్థాన్ని ఇస్తుంది.

నిర్వచనం :
“మతంలో పేర్కొన్న దానికంటే భిన్నమైన జీవనం, ప్రవర్తనలకు సంబంధించిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించే ఒకానొక ఆదర్శమే లౌకికవాదం” అని ఎరిక్. ఎస్. వాటర్ హౌస్ పేర్కొన్నాడు.

లౌకికవాదం – సుగుణాలు (Merits of Secularism) :

1. సమత (Equity) :
లౌకికవాదం సమసమాజానికి ప్రాతిపదిక. అన్ని మతాల వారిని సమానంగా పరిగణిస్తుంది. మానవులు సృష్టించిన అసమానతలను గుర్తించదు. అలాగే కుల, మత, వర్ణ, వర్గ, ప్రాంతీయ భాషాపరమైన వివక్షతలకు తావు ఇవ్వదు. దాంతో ప్రజలు జాతిపట్ల ఎంతో దృఢమైన సానుకూలమైన భావాన్ని కలిగి ఉంటారు.

2. మత స్వాతంత్ర్యం (Religious Freedom) :
లౌకికవాదం, మత స్వాతంత్ర్యాన్ని ప్రజలు సంపూర్ణంగా అనుభవించుటకు దోహదపడుతుంది. రాజ్యం వ్యక్తుల మత వ్యవహారాలలో జోక్యం చేసుకోదు. లౌకిక రాజ్యంలో రాజ్యాంగం, వివిధ చట్టాలు, వ్యక్తులకు తమ ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించుటకు, ప్రబోధించుటకు, ప్రచారం చేసుకొనేందుకు, సంపూర్ణమైన స్వాతంత్య్రాన్ని ప్రసాదిస్తాయి.

3. శాంతి భద్రతలు (Law and Order) :
వర్తమాన కాలంలో రాజ్యం, ప్రభుత్వం, ఇతర సంస్థలు ఎంతో విచారకరమైన, దుఃఖదాయకమైన మతానుకూల ఉద్యమాలను ప్రోత్సహించడం లేదా ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు.

దాంతో విభిన్న మతసముదాయాలకు చెందిన ప్రజల మధ్య సామరస్యం సాధించడం అనేది పెద్ద సవాలుగా పరిణమించింది. అటువంటి సందర్భాలలో లౌకికవాదం మతపరమైన ఘర్షణలను, విద్వేషాలను నివారించగలుగుతుంది. అంతిమంగా, ప్రజల మధ్య మత సామరస్యాన్ని లౌకికవాదం పెంపొందించడం జరుగుతుంది.

4. సమన్యాయ పాలన (Rule of Law) :
లౌకికవాదం సమన్యాయపాలన అనే భావనకు ప్రాధాన్యతనిస్తుంది. లౌకికవాదాన్ని అనుసరించే రాజ్యం ఏ ఒక్క మతానికి కాకుండా అన్ని మతాలకు చెందిన ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చట్టాలను రూపొందించి అమలు చేస్తుంది. చట్ట నిర్మాణ సమయంలో ప్రజలకు మత ఛాందస భావాలను పరిగణనలోనికి తీసుకోదు. అలాగే చట్ట నిర్మాణం, చట్టాల అమలు, చట్టాల వ్యాఖ్యానంలో ప్రజలకు ఏ మతంతో సంబంధం లేకుండా లౌకిక రాజ్యం వ్యవహరిస్తుంది.

5. సహనం (Tolerance) :
లౌకికవాదం సహనం, దయార్ద్ర గుణాన్ని ప్రబోధిస్తుంది. విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని, భగవంతుడి పితృత్వంల (Fatherhood) పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటుంది. దాతృత్వం, జాలి, ప్రేమ, ఔదార్యం, అహింస వంటి మహోన్నత గుణాలను ప్రబోధించి, ప్రచారం గావించి ఆచరణలో ఉంచుతుంది.

6. జాతీయ సమైక్యత . (National Integration) :
లౌకికవాదం, ప్రజలలో జాతీయ సమైక్యత, సమగ్రత భావాలను పెంపొందించే ఉత్తమ సాధనంగా దోహదపడుతుంది. భిన్నత్వంలో ఏకత్వ సాధనకు ఉత్తమ కారకంగా భావించబడుతుంది. విభిన్న మతాలు, వాడుకలు అనుసరించే ప్రజల మధ్య ఐక్యతను సాధిస్తుంది.

7. మైనారిటీల రక్షణ (Protection to the Minorities) :
లౌకికవాద రాజ్యం అందరినీ ఒకే రకంగా ఆదరిస్తుంది. సమాజంలో మెజారిటీ వర్గం ఇతర వర్గాల మధ్య ఎటువంటి వివక్షతను చూపదు. అదే సమయంలో మతపరమైన మెజారిటీ వర్గం ఆధిపత్యాల నుంచి మైనారిటీ వర్గాల ప్రయోజనాలను పరిరక్షించి, వారికి ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తుంది. మైనారిటీ వర్గాల వారి పట్ల మతసహనాన్ని పాటించాల్సిందిగా ప్రజలకు బోధిస్తుంది.

8. అన్ని రంగాల ప్రగతి (Allround Progress) : లౌకికవాదంలోని అత్యంత గొప్ప సుగుణం ఏమిటంటే ప్రజలు అన్ని రంగాలలో ప్రగతిని సాధించేందుకు దోహదపడుతుంది. సమాన్యాయ పాలన, మత సహనం, ప్రభుత్వ తటస్థ వైఖరి వంటి అంశాలు లౌకికవాదంలో ఉండుట చేత ఆ రకమైన ప్రగతి సాధ్యమవుతుంది. ప్రత్యేకంగా సంక్షేమం, సామాజిక న్యాయం, అసౌకర్యానికి గురైన వర్గాల ప్రయోజనాల పరిరక్షణ వంటి విషయాలకు సంబంధించి అన్ని మతాలకు చెందిన ప్రజల ప్రగతికి లౌకిక వాదం కృషి చేస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 9 లౌకికవాదం

ప్రశ్న 3.
భారతదేశంలో లౌకికవాదంపై ఒక వ్యాసం రాయండి.
జవాబు.
బ్రిటిష్ ప్రభుత్వపాలన భారతదేశంలో అనేక విద్యా సంస్కరణలను ప్రారంభించింది. శాస్త్రవిజ్ఞానానికి ప్రాముఖ్యతను ఇచ్చింది. అదే సమయంలో భారతదేశంలోని రెండు ప్రధాన మతాలైన హిందువులు, మహమ్మదీయుల మధ్య మతపరమైన విషబీజాలను నాటింది.

అందులో భాగంగా చట్టసభలలో మహమ్మదీయులకు ప్రత్యేక స్థానాలను కేటాయించింది. దాంతో భారత రాజకీయాలలో మతపరమైన ఘర్షణలు ఎడతెగని లక్షణంగా పరిణమించాయి. ఈ పరిస్థితి పట్ల చరిత్రకారులు కూడా తీవ్ర విచారాన్ని వెలిబుచ్చారు.

ఈ సందర్భంలో వారు భిన్నమైన వివరణలను అందించారు. స్వాతంత్ర్యానికి పూర్వం భారతదేశంలో నెలకొన్న విచారకరమైన మత పరిస్థితులకు బ్రిటిష్ పాలకులను వారు నిందించారు. జనాభా పరిమాణం ఆధారంగా బ్రిటిష్ పాలకులు హిందువులు, మహమ్మదీయుల మధ్య ప్రాధాన్యత ఇవ్వటంతో మత అంశాల ప్రాతిపదికపై భారతీయుల మధ్య ఆవేశాలను ప్రోవు చేశారు.

దాంతో భారతదేశంలో నివసించే విషయంలో మైనారిటీలలో అభద్రతా భావం నెలకొంది. కాలక్రమేణా మతఘర్షణలు, మతవిద్వేషాలు అనేవి భారతదేశంలో దైనందిన చర్యలుగా పరిణమించాయి.

ఈ రకమైన పరిస్థితి అంతిమంగా మహమ్మదాలీ జిన్నా వంటి నాయకులు ‘ద్విజాతి సిద్ధాంతం’ (Two Nations Theory) ప్రతిపాదించేందుకు దారితీసింది. మరొకవైపు హిందూ మహాసభ వంటివి మత ప్రయోజనాలకు ప్రతీకగా నిలిచాయి. ఈ సంస్థలు భారతదేశాన్ని హిందూ ఆధిక్య ప్రధానమైన దేశంగా పరిగణించాయి.

1947 ఆగస్టులో భారత యూనియన్ ఇండియా, పాకిస్థాన్లుగా విడిపోవుటకు రాజకీయ పరిస్థితుల తీవ్రతయే కారణంగా పేర్కొనవచ్చు. దేశ విభజన తరువాత కూడా మతపరమైన విబేధాలు కొనసాగడం మతతత్వానికి పరాకాష్టగా భావించవచ్చు. స్వాతంత్య్రం సిద్ధించి ఆరు దశాబ్దాలు గడిచినప్పటికీ భారతదేశంలో ఏదో ఒక ప్రాంతంలో మత ఘర్షణలు సంభవించడం లౌకిక వాదానికి సవాలుగా పరిణమించిందని చెప్పవచ్చు.

భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత ఆమోదించబడిన భారత రాజ్యాంగం లౌకిక వాదాన్ని భారతదేశ గణతంత్ర వ్యవస్థకు ప్రధాన ఆలంబనగా పేర్కొన్నది. దాని ప్రకారం భారతరాజ్యాంగం భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా ప్రకటించింది.

భారతదేశంలోని కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు లౌకిక వాదాన్ని సిద్ధాంతపరమైన ఆచరణాత్మక భావనగా అనుసరించసాగాయి. చట్ట నిర్మాణం, దాని అమలు, రాజ్య పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలలో ఆ ప్రభుత్వాలేవీ మతాన్ని అనుసరించరాదని భారత రాజ్యాంగం పేర్కొంది.

భారతీయులు తమకు ఇష్టమైన మతవిశ్వాసాలను ప్రబోధించుకొనేందుకు, ప్రచారం గావించేందుకు సంపూర్ణమైన మతస్వాతంత్ర్యాన్ని కలిగి ఉండేందుకు భారత రాజ్యాంగం వీలు కల్పించింది. భారతదేశంలో రాజ్యం మతానుకూలమైనది, మత వ్యతిరేకమైనది కాదు. అందుకు బదులుగా అది రాజ్య వ్యవహారాలలో తటస్థ వైఖరిని అనుసరిస్తుంది. భారతరాజ్యాంగం మతం ఆధారంగా ప్రజలపై పన్నులు విధించి, వసూలు చేసేందుకు వీలు కల్పించలేదు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిధులతో సంపూర్ణంగా గానీ, పాక్షికంగా గానీ నిర్వహించబడే విద్యాసంస్థలలో మతం ఆధారంగా ప్రవేశాలను నిషేదించమని పేర్కొంది. అలాగే పైన పేర్కొన్న సంస్థలలో మత బోధనలను నిషేధించడమైంది. కాబట్టి రాజ్యాంగ పరమైన అంశాల ప్రకారం లౌకిక వాదానికి ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పవచ్చు.

భారత రాజ్యాంగ పీఠికలో ‘లౌకిక’ అనే పదాన్ని (42వ సవరణ) చట్టం ద్వారా 1976 లో చేర్చడమైంది. పార్లమెంటులో భారత రాజ్యాంగం (42వ సవరణ) ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా భారతదేశ తృతీయ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ కింది విధంగా ప్రకటించారు. “లౌకికవాదం అనేది మతానికి మతానికి మధ్య అభిమానాన్ని, వివక్షతను చూపడం కాదు.

అన్ని మతాల ప్రజల పట్ల సమానమైన గౌరవాన్ని ప్రదర్శించడమే లౌకిక వాదం. కేవలం మతసహనాన్ని ప్రదర్శించడం ద్వారానే ఏ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉండదు. ప్రతి మత సముదాయానికి చెందిన వారు ఇతర మతాల సముదాయాలకు చెందిన వారి పట్ల సానుకూల గౌరవాన్ని చూపడమనేది అందరి కర్తవ్యం”.

TS Board Inter First Year Political Science Study Material Chapter 9 లౌకికవాదం

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
లౌకికవాదం ఆవిర్భావం గురించి రాయండి.
జవాబు.
ప్రాచీన, మధ్యయుగాలలో మతపరమైన రాజ్యాలుండేవి. ఆ యుగాలలో రాజ్య వ్యవహారాలలో మతం ఎంతో ప్రాధాన్యమైన పాత్రను పోషించింది. పాలకులు, ప్రజల మతవిశ్వాసాలను గుర్తించి, గౌరవించి పరిపాలించేవారు. మతం సమాజంలో శాంతి భద్రత, స్థిరత్వాలను అందించి వ్యక్తుల మధ్య సంబంధాలను నియంత్రించింది. దేశ పరిపాలన సాఫీగా కొనసాగేందుకు అవసరమైన రాజకీయ విధేయతను అందించేందుకు మతం దోహదకారి అయింది.

అయినప్పటికీ మతాచార్యులకు, సంస్కరణవాదులకు మధ్య ఘర్షణలు ఏర్పడి సమాజంలో అరాచకం ప్రబలింది. మతం పేరుతో ప్రజల మీద అత్యున్నతాధికారం చెలాయించేందుకు ఆధ్యాత్మికవాదులు, మత పెద్దలు ప్రయత్నిస్తే లౌకిక పాలకులు వారి వ్యూహాలను నిర్వీర్యపరచారు. రాజ్య వ్యవహారాల నుంచి మతాన్ని వేరు చేసారు. ప్రాచీన రోమన్ చక్రవర్తులు క్రైస్తవ మతాన్ని గుర్తించేందుకు నిరాకరించారు.

మధ్యయుగంలో మార్టిన్ లూథర్, కాల్విన్ జ్వింగిల్ లాంటి సాంఘిక, మత సంస్కరణవాదులు మత పెద్దల ఆధ్యాత్మిక గుత్తాధిపత్యాన్ని సవాలు చేశారు. మత, ఆధ్యాత్మిక విషయాలన్ని కూడా పూర్తిగా వ్యక్తిగత, స్వీయ వ్యవహారాలుగా వీరు భావించారు. మతపరమైన విషయాలపై వారి ప్రసంగాలు విశేషమైన ప్రభావాన్ని చూపాయి. ఆధునిక కాలంలో మాకియవెల్లి, జీనో బోడిన్ వంటి రాజనీతి తత్వవేత్తలు రాజకీయాల నుంచి మతాన్ని వేరుచేయాలని గట్టిగా పేర్కొన్నారు.

జాన్లాక్ వంటి ఉదారవాద తత్వవేత్తలు మత సహనాన్ని ప్రజలు అనుసరించాలని సూచించారు. పైన పేర్కొన్న తాత్వికుల రచనలు కాలక్రమేణ ప్రజలపై ప్రభావాన్ని చూపటంతో, మతమనేది ఒక వైయుక్తిక, స్వీయ వ్యవహారంగా భావించటం మొదలైంది. అమెరికా దేశాధ్యక్షుడైన థామస్ జఫర్సన్ లౌకికవాదపు నిజమైన అర్థాన్ని వివరిస్తూ రాజ్యం, మతం మధ్య స్పష్టమైన హద్దులు ఉన్నాయని ప్రకటించారు.

కాబట్టి ఆధునిక కాలంలో లౌకికవాదాన్ని పైన పేర్కొన్న కారణాలు ప్రగాఢంగా ప్రభావితం చేసాయని పేర్కొనవచ్చు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 9 లౌకికవాదం

ప్రశ్న 2.
లౌకికవాదం ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఏమిటి ?
జవాబు.
నిర్వచనాలు :
1. జి. జె. హోల్యోక్ :
“లౌకికవాదం అంటే మతవిశ్వాసాలను విమర్శించకుండా లేదా తిరస్కరించకుండా మతంతో సంబంధంలేని ఒకానొక సామాజిక వ్యవస్థను ప్రోత్సహించటమనే భావన” గా నిర్వచించారు.

‘2. ఎరిక్ ఎస్. వాటర్ హౌస్ :
“మతంలో పేర్కొన్న దానికంటే భిన్నమైన జీవనం, ప్రవర్తనలకు సంబంధించిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించే ఒకానొక ఆదర్శమే లౌకికవాదం” అని అభిప్రాయపడ్డారు.

లక్షణాలు : లౌకిక రాజ్యం కింది లక్షణాలను కలిగి ఉంటుంది.

1. మతానికి తావు లేదు (No place for religion) :
లౌకిక రాజ్యం ఏ ఒక్క మతం పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపదు. మతపరమైన అంశాల ప్రాతిపదికపై చట్టాలను రూపొందించదు, అమలు చేయదు.

2. సమాన హోదా (Equal status) :
లౌకికరాజ్యం ప్రజలందరికీ సమాన హోదాను కల్పిస్తుంది. వ్యక్తుల మధ్య కులం, వర్ణం, మతం, తెగ, ప్రాంతం, భాషలవారీగా ఎటువంటి వివక్షతను చూపదు. దాంతో ప్రజలు సంతృప్తి చెంది, వివిధ విధానాలు, కార్యక్రమాల అమలులో ప్రభుత్వానికి సహకారాన్ని అందిస్తారు. విభిన్న మత సముదాయాలకు చెందిన వారందరూ ఇరుగు పొరుగు వారితో సామరస్యంతో కలసిమెలసి నివసిస్తారు.

3. అధికారిక మతం లేకుండుట (No State reglion) :
లౌకిక రాజ్యం ఏ ఒక్క మతాన్ని అధికార మతంగా గుర్తించదు. మత వ్యవహారాలలో తటస్థ వైఖరిని అవలంభిస్తుంది. ప్రజల మతపరమైన భావాలతో సంబంధం లేకుండా వివిధ చట్టాలను, సామాజిక సంక్షేమ కార్యకలాపాలను అమలు చేస్తుంది. ప్రభుత్వ వ్యవహారాలలో ఏ ఒక్క మతానికి ప్రత్యేకమైన ప్రాధాన్యతను ఇవ్వదు. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయ సంస్థలు వంటి అన్ని ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను ఏ ఒక్క మతంతో సంబంధం లేకుండా నిర్వహిస్తుంది.

లౌకికరాజ్యం ప్రాముఖ్యత (Importance of Secular State) :
ఇటీవల కాలంలో లౌకిక రాజ్య భావన ఎంతగానో ప్రాముఖ్యతను సంతరించుకొంది. ప్రజాస్వామిక స్ఫూర్తి, శాస్త్ర సాంకేతికత, రవాణా సదుపాయాల అభివృద్ధి, హేతుబద్ధమైన చింతన, శ్రేయోవాదం వంటి అంశాల ప్రభావం చేత లౌకిక రాజ్య ప్రాముఖ్యత పెరిగింది. మొత్తం మీద లౌకిక రాజ్య ప్రాముఖ్యతను కింది అంశాల ద్వారా వివరించవచ్చు.

  1. లౌకిక రాజ్యం దేశంలోని వివిధ రంగాలలోని మతేతర శక్తులను బలపరుస్తుంది.
  2. ప్రజల హృదయాలలో పాతుకుపోయిన దురాచారాలను, మూఢ విశ్వాసాలను పారద్రోలుతుంది.
  3. మత పరమైన విద్వేషం, మతమౌఢ్యాలను పారద్రోలడం ద్వారా సామాజిక సంస్కరణలకు దోహదపడుతుంది.
  4. ప్రజలలో శాస్త్రీయ చింతనను పెంపొందించి, వారి మేధోపరమైన వికాసానికి తోడ్పడుతుంది.
  5. విశ్వాసంపై హేతువుకు, కాల్పనికతపై తర్కానికి, కట్టుకథలపై వాస్తవికతలకు ఆధిక్యతనిస్తుంది.
  6. మతపరమైన మైనారిటీ వర్గాలకు భద్రతను కల్పించి వారి రక్షణకు హామీనిస్తుంది.
  7. ప్రతి వ్యక్తి మతపరమైన విశ్వాసాలను గౌరవిస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 9 లౌకికవాదం

ప్రశ్న 3.
లౌకికవాదంలోని నాలుగు సుగుణాలను వివరించండి.
జవాబు.
లౌకికవాదం – సుగుణాలు (Merits of Secularism) :

1. సమత (Equity) :
లౌకికవాదం సమసమాజానికి ప్రాతిపదిక. అన్ని మతాల వారిని సమానంగా పరిగణిస్తుంది. మానవులు సృష్టించిన అసమానతలను గుర్తించదు. అలాగే కుల, మత, వర్ణ, వర్గ, ప్రాంతీయ భాషాపరమైన వివక్షతలకు తావు ఇవ్వదు. దాంతో ప్రజలు జాతిపట్ల ఎంతో దృఢమైన సానుకూలమైన భావాన్ని కలిగి ఉంటారు.

2. మత స్వాతంత్ర్యం (Religious Freedom) :
లౌకికవాదం, మత స్వాతంత్ర్యాన్ని ప్రజలు సంపూర్ణంగా అనుభవించుటకు దోహదపడుతుంది. రాజ్యం వ్యక్తుల మత వ్యవహారాలలో జోక్యం చేసుకోదు. లౌకిక రాజ్యంలో రాజ్యాంగం, వివిధ చట్టాలు, వ్యక్తులకు తమ ఇష్టం వచ్చిన’ మతాన్ని స్వీకరించుటకు, ప్రబోధించుటకు, ప్రచారం చేసుకొనేందుకు, సంపూర్ణమైన స్వాతంత్ర్యాన్ని ప్రసాదిస్తాయి.

3. శాంతి భద్రతలు (Law and Order) :
వర్తమాన కాలంలో రాజ్యం, ప్రభుత్వం, ఇతర సంస్థలు ఎంతో విచారకరమైన, దుఃఖదాయకమైన మతానుకూల ఉద్యమాలను ప్రోత్సహించడం లేదా ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు. దాంతో విభిన్న మతసముదాయాలకు చెందిన ప్రజల మధ్య సామరస్యం సాధించడం అనేది పెద్ద సవాలుగా పరిణమించింది.

అటువంటి సందర్భాలలో లౌకికవాదం మతపరమైన ఘర్షణలను, విద్వేషాలను నివారించగలుగుతుంది. అంతిమంగా, ప్రజల మధ్య మత సామరస్యాన్ని లౌకికవాదం పెంపొందించడం జరుగుతుంది.

4. సమన్యాయ పాలన (Rule of Law) :
లౌకికవాదం సమన్యాయ పాలన అనే భావనకు ప్రాధాన్యతనిస్తుంది. లౌకికవాదాన్ని అనుసరించే రాజ్యం ఏ ఒక్క మతానికి కాకుండా అన్ని మతాలకు చెందిన ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చట్టాలను రూపొందించి అమలు చేస్తుంది.

చట్ట నిర్మాణ సమయంలో ప్రజలకు మత ఛాందస భావాలను పరిగణనలోనికి తీసుకోదు. అలాగే చట్ట నిర్మాణం, చట్టాల అమలు, చట్టాల వ్యాఖ్యానంలో ప్రజలకు ఏ మతంతో సంబంధం లేకుండా లౌకిక రాజ్యం వ్యవహరిస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 9 లౌకికవాదం

ప్రశ్న 4.
భారతదేశ లౌకికవాదం అంటే ఏమిటి ?.
“జవాబు. లౌకికవాదం అనే పదం ఉపయోగించడంలో భారతదేశ విధానం పాశ్చాత్య దేశాలలో ఉపయోగించిన దానికి భిన్నమైనది. భారతదేశంలో సాంస్కృతిక సహజీవనం కొత్త దృగ్విషయం కాదు. ఇది చాలా కాలం నుంచి భారతదేశంలో ఉంది. ఇది మధ్యయుగ ప్రారంభకాలంలో ముస్లింల దండయాత్రల నుంచి ప్రారంభమైంది. భారతదేశంలో బ్రిటిష్ పాలన క్రైస్తవ మతాన్ని పరిచయం చేసింది. అనేక క్రిష్టియన్ మిషనరీలు భారతదేశంలో పాఠశాలలు, ప్రార్థనాలయాలను ఏర్పాటు చేశాయి.

బ్రిటిష్ ప్రభుత్వపాలన భారతదేశంలో అనేక విద్యా సంస్కరణలు ప్రారంభానికి, శాస్త్ర విజ్ఞానానికి ప్రాముఖ్యతను కల్పించింది. అదే సమయంలో భారతదేశంలోని రెండు ప్రధాన మతాలైన హిందువులు, మహమ్మదీయుల మధ్య మతపరమైన విషబీజాలని నాటింది. అందులో భాగంగా చట్టసభలలో మహమ్మదీయులకు ప్రత్యేక స్థానాలను కేటాయించి జనాభా పరిమాణం ఆధారంగా బ్రిటిష్ పాలకులు హిందువులకు, మహమ్మదీయులకు ప్రాధాన్యతనివ్వటంతో మత అంశాల ప్రాతిపదికపై భారతీయుల మధ్య పొరపొచ్చాలు వచ్చాయి.

భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తరవాత ఆమోదించబడిన భారత రాజ్యాంగం లైకిక వాదాన్ని భారతదేశ గణతంత్ర వ్యవస్థకు ప్రధాన ఆలంబనగా పేర్కొన్నది. దాని ప్రకారం భారత రాజ్యాంగం భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా ప్రకటించింది. భారతదేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లౌకికవాదాన్ని సిద్ధాంతపరమైన ఆచరణాత్మక భావనగా అనుసరించసాగాయి.

చట్ట నిర్మాణం, దాని అమలు రాజ్య పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలలో ఆ ప్రభుత్వాలు ఏ మతాన్నీ అనుసరించరాదని భారతరాజ్యాంగం పేర్కొంది. భారతీయులు తమకు ఇష్టమైన మత విశ్వాసాలను ప్రబోధించుకొనేందుకు, ప్రచారం గావించేందుకు, సంపూర్ణమైన మతస్వాతంత్ర్యాన్ని కలిగి ఉండేందుకు భారత రాజ్యాంగం వీలుకల్పించింది.

భారతదేశంలో రాజ్యం మతానుకూలమైనది కాదు. మత వ్యతిరేకమైనది కాదు. అందుకు బదులుగా అది రాజ్య వ్యవహారాలలో తటస్థ వైఖరిని అనుసరిస్తుంది. భారత రాజ్యాంగం మతం ఆధారంగా ప్రజలపై పన్నులు విధించి వసూలు చేసేందుకు వీలు కల్పించలేదు.

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక నిధులతో సంపూర్ణంగా గాని, పాక్షికంగా గాని నిర్వహించబడే విద్యాసంస్థలలో మతం ఆధారంగా ప్రవేశాలను నిషేధించమని పేర్కొంది. అలాగే పైన పేర్కొన్న సంస్థలలో మత బోధలను నిషేధించింది. కాబట్టి రాజ్యాంగపరమైన అంశాల ప్రకారం లౌకికవాదానికి ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పవచ్చు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 9 లౌకికవాదం

ప్రశ్న 5.
లౌకికరాజ్యం ముఖ్య లక్షణాలు ఏమిటి ?
జవాబు.
లౌకికరాజ్యం కింది లక్షణాలను కలిగి ఉంటుంది.
1. మతానికి తావు లేదు (No place for religion) :
లౌకిక రాజ్యం ఏ ఒక్క మతం పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపదు. మతపరమైన అంశాల ప్రాతిపదికపై చట్టాలను రూపొందించదు, అమలు చేయదు.

2. సమాన హోదా (Equal status) :
లౌకికరాజ్యం ప్రజలందరికీ సమాన హోదాను కల్పిస్తుంది. వ్యక్తుల మధ్య కులం, వర్ణం, మతం. తెగ, ప్రాంతం, భాషలవారీగా ఎటువంటి వివక్షతను చూపదు. దాంతో ప్రజలు సంతృప్తి చెంది, వివిధ విధానాలు, కార్యక్రమాల అమలులో ప్రభుత్వానికి సహకారాన్ని అందిస్తారు. విభిన్న మత సముదాయాలకు చెందిన వారందరూ ఇరుగు పొరుగు వారితో సామరస్యంతో కలసిమెలసి నివసిస్తారు.

3. అధికారిక మతం లేకుండుట (No State region) :
లౌకిక రాజ్యం ఏ ఒక్క మతాన్ని అధికార మతంగా గుర్తించదు. మత వ్యవహారాలలో తటస్థ వైఖరిని అవలంబిస్తుంది. ప్రజల మతపరమైన భావాలతో సంబంధం లేకుండా వివిధ చట్టాలను, సామాజిక సంక్షేమ కార్యకలాపాలను అమలు చేస్తుంది. ప్రభుత్వ వ్యవహారాలలో ఏ ఒక్క మతానికి ప్రత్యేకమైన ప్రాధాన్యతను ఇవ్వదు. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయ సంస్థల వంటి అన్ని ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను ఏ ఒక్క మతంతో సంబంధం లేకుండా నిర్వహిస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 9 లౌకికవాదం

ప్రశ్న 6.
లౌకికవాదం, లౌకిక రాజ్యం గురించి వర్ణించండి.
జవాబు.
లౌకికవాదం :
లౌకికవాదమనేది ఒక ప్రధానమైన సామాజిక, రాజకీయ దృగ్విషయం. అనేక సమకాలీన ప్రపంచదేశాలు తమ ప్రభుత్వ వ్యవహారాలలో లౌకికతను అనుసరిస్తున్నాయి. లౌకికవాదం ప్రత్యేకంగా మతంతో సంబంధంలేని, స్వతంత్ర ఆదర్శాలను ప్రబోధిస్తుంది. ప్రభుత్వాలు మతంతో నిమిత్తం లేకుండా నైతికత, విద్య లాంటి సూత్రంపై ఆధారపడతాయనే ధృక్పధమే లౌకికవాదం.

వర్తమాన ప్రాపంచిక జీవనం దైవికమైనది కాకుండా కొన్ని నైతిక ప్రమాణాలు, పాలనా నియమాలు మానవ కార్యకలాపాలను నిర్ణయిస్తాయని లైకికవాదం పేర్కొంటుంది. లౌకికవాదానికి మతాన్ని దూషించే ఉద్దేశం లేదు. మతం, రాజ్యం అనేవి రెండు ప్రత్యేక విభాగాలని అది గట్టిగా ఉద్ఘాటించింది.

Secular అనే ఆంగ్ల పదానికి లాటిన్ భాషలో అర్థం “ఇహలోకం” (This World) ఈ పదం మతానికి వ్యతిరేకమనే అర్థాన్ని సూచిస్తుంది. ఆధునిక కాలంలో ఆ పదాన్ని మొదటి సారిగా 1851 లో బ్రిటిష్ రచయిత జార్జి జాకబ్ హోల్యోక్ (George Jacob Holyoke) ఉపయోగించాడు. లౌకికవాదం అనే పదాన్ని అనేక మంది రచయితలు మరియు ప్రముఖులు వివిధ రకాలుగా నిర్వచించారు.

1. జి.జె. హోల్యోక్ : “లౌకికవాదం అంటే మత విశ్వాసాలను విమర్శించకుండా లేదా తిరస్కరించకుండా. మతంతో సంబంధం లేని ఒకానొక సామాజిక వ్యవస్థను ప్రోత్సహించటమనే భావన”గా నిర్వచించారు.
2. ఎరిక్.ఎస్. – వాటర్ హౌస్ : “మతంలో పేర్కొన్నదానికంటే భిన్నమైన జీవనం, ప్రవర్తనలకు సంబంధించిన సిద్దాంతాన్ని ప్రతిపాదించే ఒకానొక ఆదర్శమే లౌకికవాదం” అని అభిప్రాయపడ్డారు.

లౌకికరాజ్యం :
ఆధునిక రాజ్యాలు, లౌకిక రాజ్యాలు అని రెండు రకాలుగా వర్గీకరించబడినాయి. రాజకీయ మేధావులు రజ్యంలో మతం, రాజకీయాలకు మధ్య ఉండే సంబంధం ఆధారంగా ఆరకమైన వర్గీకరణ చేశారు. గతంలో అనేక రాజ్యాలలో మతపరమైన ప్రభుత్వాలు వాడుకలో వున్నాయి. మతపరమైన రాజ్యాలు మతం ఆధారంగా పరిపాలనా వ్యవహారాలను నిర్వహిస్తుంటే, లౌకికరాజ్యం పరిపాలనలో మత సూత్రాలను ఏ మాత్రం పట్టించుకోదు.

డి.ఇ. స్మిత్ లౌకికరాజ్యాన్ని “వ్యక్తులకు స్వీయ, సమిష్టి మత స్వాతంత్ర్యాన్ని హామీ ఇస్తూ వ్యక్తులకు వారి మతంతో సంబంధం లేకుండా పౌరులుగా గుర్తించే రాజ్యం” గా నిర్వచించాడు. అంతే కాకుండ లౌకిక రాజ్యమంటే, రాజ్యాంగరీత్యా ఏ ఒక్క ప్రత్యేక మతాన్ని పోషించటంగాని, పెంపొందించటంగాని జరగదు. అదే విధంగా మత వ్యవహారాలలో జోక్యం చేసుకోదు. పైన పేర్కొన్న నిర్వచనాన్ని నిశితంగా పరిశీలించి లౌకిక రాజ్య స్వభావాన్ని తెలుసుకోవచ్చు.

లౌకిక రాజ్యం అనేది పూర్తిగా మత వ్యతిరేకం కాదు లేదా మత విరుద్ధమైనది కాదు. అలాగే అది పూర్తిగా మతానుకూలమైనది కాదూ ఏ ఒక్క మతం పట్ల ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శించదు. లౌకిక రాజ్యంలో ప్రభుత్వం ఒకానొక ప్రత్యేక మతానికి అనుకూలతను లేదా ప్రతికూలతను ప్రదర్శిస్తూ చట్టాలను రూపొందించదు.
ఉదా : భారతదేశం.

TS Board Inter First Year Political Science Study Material Chapter 9 లౌకికవాదం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
లౌకికవాదాన్ని నిర్వచించండి.
జవాబు.

  1. “లౌకికవాదం అంటే మతవిశ్వాసాలను విమర్శించకుండా లేదా తిరస్కరించకుండా మతంతో సంబంధం లేని ఒకానొక సామాజిక వ్యవస్థను ప్రోత్సహించటమనే భావన” అని జి.జె. హోల్యోక్ నిర్వచించాడు.
  2. “మతంలో పేర్కొన్న దానికంటే భిన్నమైన జీవనం, ప్రవర్తనలకు సంబంధించిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించే ఒకానొక ఆదర్శమే లౌకికవాదం” అని వాటర్ హౌస్ పేర్కొన్నాడు.

ప్రశ్న 2.
లౌకికవాదం అంటే ఏమిటి ?
జవాబు.
Secular అనే ఆంగ్ల పదంనకు లాటిన్ భాషలో అర్థం ఇహలోకం (This World) ఈ పదం మతానికి వ్యతిరేకమనే అర్థాన్ని సూచిస్తుంది. లౌకికవాదం అనే పదాన్ని అనేక మంది రచయితలు వివిధ రకాలుగా నిర్వచించారు.

  1. జి.జె. హోల్యోక్ : “లౌకికవాదం అంటే మత విశ్వాసాలను విమర్శించకుండా లేదా తిరస్కరించకుండా మతంతో సంబంధంలేని ఒకానొక సామాజిక వ్యవస్థను ప్రోత్సహించటమనే భావన” గా నిర్వచించారు.
  2. ఎరిక్.ఎస్.వాటర్ హౌస్ : “మతంలో పేర్కొన్న దానికంటే భిన్నమైన జీవనం, ప్రవర్తనలకు సంబంధించిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించే ఒకానొక ఆదర్శమే లౌకికవాదం” అని అభిప్రాయపడినారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 9 లౌకికవాదం

ప్రశ్న 3.
మత రాజ్యం అంటే ఏమిటి ?
జవాబు.
మత రాజ్యంలో రాజకీయాలు మతంతో మిళితమై ఉంటాయి. మతం రాజకీయాలను శాసిస్తుంది. ఇలాంటి రాజ్యాలలో ఒకే మతం ప్రబలంగా ఉంటుంది.
ఉదా : ఏక మత రాజ్యం.

పురాతన మత్త రాజ్యాలలో మతాధికారులే పరిపాలకులుగా ఉండేవారు. ప్రాచీన ఈజిప్టులో ఫారోస్, బైజాంటెన్ సామ్రాజ్యంలో చర్చి అధిపతే రాజుగా చిలామణి అయ్యేవారు. మధ్యయుగంలో, ముఖ్యంగా ఇటలీ సరిహద్దుల్లో కాథలిక్ చర్చి అధిపతి పోప్ దీర్ఘకాలంగా పరిపాలించాడు.

మత రాజ్యంలో మానవుల చేత రూపొందించబడే చట్టాలు దైవిక న్యాయం ఆధారంగా ఉంటాయి. మతపరమైన చట్టాలే ఆ దేశపు పాలనా చట్టాలుగా చెలామణి అవుతాయి. అదే విధంగా దేవుని ప్రతినిధిగా భావించే వ్యక్తే ఆ దేశపు మతానికి, రాజ్యానికి అధిపతిగా పరిగణించబడుతాడు.

ప్రశ్న 4.
లౌకికవాదం ఏ విధంగా వ్యక్తుల మత స్వేచ్ఛ, స్వాతంత్య్రతలకు దోహదపడుతుంది ?
జవాబు.
లౌకిక వ్యవస్థ అమలులో ఉన్న రాజ్యాలలో వ్యక్తులంతా సంపూర్ణ మత, స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను కలిగి ఉంటారు. ప్రతి వ్యక్తి తన కర్మ ప్రబోధం ప్రకారం తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు లేదా మతరహితంగా, హేతువాదిగా ఉండిపోవచ్చు. తను నమ్మిన మత సిద్ధాంతాలను వ్యాప్తి చేసుకోవచ్చు. మతవ్యాప్తికై వెచ్చించే ధనంపై ఎటువంటి పన్ను చెల్లించనవసరం లేదు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 9 లౌకికవాదం

ప్రశ్న 5.
సమన్యాయపాలన లౌకికవాదాన్ని ఏ విధంగా పెంపొందిస్తుంది.
జవాబు.
లౌకికవాదం సమన్యాయ పాలన అనే భావానికి ప్రాధాన్యతనిస్తుంది. రాజ్యం ఏ ఒక్క మతానికి కాకుండా అన్ని మతాలకు చెందిన ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చట్టాలను రూపొందించి అమలు చేస్తుంది. చట్ట నిర్మాణ సమయంలో ప్రజల మతఛాందస భావాలను పరిగణనలోకి తీసుకోదు. అందువలన లౌకిక రాజ్యాలలో ప్రజలు సంతృప్తిని, సంతోషాన్ని పొందుతారు.

ప్రశ్న 6.
లౌకిక రాజ్యాన్ని నిర్వచించండి.
జవాబు.
“వ్యక్తులకు స్వీయ, సమిష్టి మత స్వాతంత్ర్యాన్ని హామీ ఇస్తూ వ్యక్తులకు వారి మతంతో సంబంధం లేకుండా పౌరులుగా గుర్తించే రాజ్యమే లౌకిక రాజ్యం” అని డి.ఇ. స్మిత్ పేర్కొన్నాడు.

ప్రశ్న 7.
లౌకిక రాజ్యం రెండు లక్షణాలను తెలపండి.
జవాబు.

  1. మతానికి తావులేదు : లౌకిక రాజ్యం ఏ ఒక్క మతం పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపదు. మతపరమైన అంశాల ప్రాతిపదికపై చట్టాలను రూపొందించదు, అమలు చేయదు.
  2. సమాన హోదా : లౌకిక రాజ్యం ప్రజలందరికి సమాన హోదాను కల్పిస్తుంది. వ్యక్తుల మధ్య కులం, వర్ణం, మతం, తెగ, ప్రాంతం భాషల వారీగా ఎటువంటి వివక్షతను చూపదు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 9 లౌకికవాదం

ప్రశ్న 8.
లౌకిక రాజ్యం అర్థాన్ని వివరించండి.
జవాబు.
డి.ఇ. స్మిత్ లౌకిక రాజ్యాన్ని “వ్యక్తులకు స్వీయ, సమిష్టి మత స్వాతంత్య్రాన్ని హామీ ఇస్తూ వ్యక్తులకు వారి మతంతో సంబంధం లేకుండా పౌరులుగా గుర్తించే రాజ్యం”గా నిర్వచించాడు.

అంతేకాకుండ లౌకిక రాజ్యమంటే, రాజ్యాంగరీత్యా ఏ ఒక్క ప్రత్యేక మతాన్ని పోషించటంగాని, పెంపొందించటం గాని జరగదు. అదే విధంగా మత వ్యవహారాలలో జోక్యం చేసుకోదు. లౌకిక రాజ్యంలో ప్రభుత్వం ఒకానొక ప్రత్యేక మతానికి అనుకూలతను లేదా ప్రతికూలతను ప్రదర్శిస్తూ చట్టాలను రూపొందించదు.

TS Inter 1st Year Political Science Study Material Chapter 8 ప్రజాస్వామ్యం

Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 8th Lesson ప్రజాస్వామ్యం Textbook Questions and Answers.

TS Inter 1st Year Political Science Study Material 8th Lesson ప్రజాస్వామ్యం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ప్రజాస్వామ్యాన్ని నిర్వచించి దాని లక్షణాలను వివరించండి.
జవాబు.
నిర్వచనాలు :

  1. అబ్రహాం లింకన్ : “ప్రజలచేత, ప్రజలకొరకు, ప్రజలే నిర్వహించుకొనే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం”.
  2. లార్డ్ బ్రైస్ : “ఏ సమాజంలో ప్రభుత్వాధికారం చట్టరీత్యా ఏదో ఒక వర్గం లేదా వర్గాల చేతుల్లోగాక మొత్తం సభ్యులకు చెందుతుందో అదే ప్రజాస్వామ్యమవుతుంది”.

ప్రజాస్వామ్యం – లక్షణాలు :

1. స్వేచ్ఛ :
ప్రజాస్వామ్యం స్వేచ్ఛ, సమానత్వం అనే పునాదులపైనే ఆధారపడి ఉంది. ప్రజాస్వామ్య ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రజలకు సాధ్యమైనంత ఎక్కువ స్వేచ్ఛను అందించడమే. ప్రజలకు రాజ్యాంగపరమైన స్వేచ్ఛను అందించడంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఒక్కటే హామీ ఇవ్వగలదు అని చెప్పవచ్చు.

2. సమానత్వం :
ప్రొ. సీలీ అభిప్రాయంలో ప్రజాస్వామ్యం అనేది “ప్రతీ ఒక్కరికీ భాగస్వామ్యం ఉండే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం” అంటాడు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రతీ ఒక్కరికీ రాజకీయ వ్యవహారాలలో పాల్గొనే అవకాశం వస్తుంది. ఈ విధానంలో ప్రతి పౌరుడికి ఓటు వేసే హక్కు, ఎన్నికలలో పోటీ చేసే హక్కు ఉంటుంది.

3. స్వతంత్ర న్యాయశాఖ:
ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కచ్చితంగా న్యాయశాఖ స్వతంత్రంగా పని చేస్తుంది.

4. పౌరప్రభుత్వం :
ప్రజలచేత ఓటు హక్కు ద్వారా స్వచ్ఛందంగా ఎవరి ప్రలోభానికి లొంగకుండా ఎన్నుకునే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం. “ప్రజాస్వామ్యం బాలెట్ ప్రభుత్వమేగానీ బుల్లెట్ ప్రభుత్వం కాదు”.

5. అధిక సంఖ్యాకుల పాలన :
ప్రజాస్వామ్యం అధిక సంఖ్యాకుల మద్దతుతో అల్పసంఖ్యాకులకు రక్షణ కల్పించే ప్రభుత్వం. ప్రతీ ప్రజాస్వామ్య దేశంలో ఏ పార్టీకైతే మెజారిటీ శాసనసభ సీట్లు దక్కుతాయో ఆ పార్టీయే అధికారంలోకి వస్తుంది. అంటే ప్రజాస్వామ్యం “అధిక సంఖ్యాకుల మద్దతు ప్రభుత్వం” అని చెప్పవచ్చు.

6. రాజ్యాంగ నిబంధనల అమలు :
ప్రజాస్వామ్యం కచ్చితంగా రాజ్యాంగ నిబంధనలపైనే పని చేస్తుంది. అది లిఖిత పూర్వక రాజ్యాంగం కావచ్చు లేదా అలిఖితరాజ్యాంగం కావచ్చు.

7. సామ్రాజ్యవాదానికి, యుద్ధానికి వ్యతిరేకం:
ప్రజాస్వామ్యం, అంతర్జాతీయశాంతి, సమానత్వం, న్యాయం, సహకారం అనే అంశాలకు విలువిస్తుంది. ప్రజాస్వామ్యం తీవ్ర జాతీయ వాదానికి, సామ్రాజ్యవాదానికి, యుద్ధానికి వ్యతిరేకం.

8. బలప్రయోగాలకు అవకాశం లేదు :
ప్రజాస్వామ్యంలో బలప్రయోగానికి అవకాశం లేదు. ప్రజాసంక్షేమం పేరిట కూడా బలవంతపు విధానాలు, చట్టాలు ప్రజలపై రుద్దడానికి ప్రజాస్వామ్యంలో అవకాశం లేదు.

9. మానవ హక్కులకు ప్రాధాన్యత :
ప్రజాస్వామ్య ప్రభుత్వంలో వ్యక్తుల ఔన్నత్యానికి మానవహక్కులకు, ప్రాధాన్యత లభిస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే రాజ్యాంగపరంగా హక్కులు కల్పించడం ప్రజాస్వామ్య ప్రాథమిక బాధ్యతగా చెప్పవచ్చు.

10. వాక్ స్వాతంత్ర్యం (భావప్రకటన స్వేచ్ఛ) :
ప్రజాస్వామ్యంలో ప్రతీ ఒక్కరికీ తమ అభిప్రాయాలను వెలిబుచ్చే హక్కు ఉంది. తమ భావాలను వ్యక్తం చేయడంలో ఎవరి బలప్రయోగం ఉండదు.

11. ఆదర్శాలకు, సిద్ధాంతాలకు ప్రోత్సాహం :
ప్రజాస్వామ్యంలో విభిన్న ఆదర్శాలకు, భావాలకు, సిద్ధాంతాలు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. శాసనసభల్లో కూడా అనేక అంశాలపై నిరంతరం చర్చ జరుగుతూనే ఉంటుంది.

12. హింసకు, విప్లవాలకు వ్యతిరేకం :
ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం రాజ్యాంగ ప్రక్రియ ద్వారా మాత్రమే జరుగుతుంది తప్ప హింస ద్వారా, విప్లవాల ద్వారా అవకాశం లేదు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 8 ప్రజాస్వామ్యం

ప్రశ్న 2.
ప్రజాస్వామ్య రకాలను వివరించండి.
జవాబు.
ప్రజాస్వామ్యాన్ని ముఖ్యంగా రెండు రకాలుగా విభజించవచ్చు. అవి:

  • ప్రత్యక్ష ప్రజాస్వామ్యం
  • పరోక్ష ప్రజాస్వామ్యం.

1. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం :
ఏ ప్రభుత్వంలోనైతే ప్రజలు ప్రత్యక్షంగా ప్రభుత్వ వ్యవహారాలలో పాల్గొంటారో ఆ ప్రభుత్వమే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో పౌరులు ప్రభుత్వ విధానాలను, శాసనాలను ప్రభుత్వ కార్యక్రమాలను రూపొందించడంలో ముందుంటారు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రజాభీష్టం ప్రత్యక్షంగా వ్యక్తీకరించ బడుతుంది. కాని వారు ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా కాదు.

ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలు:

  • ప్రజాభిప్రాయసేకరణ
  • ప్రజాభిప్రాయ నివేదన
  • పునరాయనం
  • ప్రజానిర్ణయం.

ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతులు ప్రస్తుతం స్విట్జర్లాండ్లోను, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలలో అమలులో ఉంది. స్విట్జర్లాండ్లోని కొన్ని చిన్న కాంటన్స్ (స్థానిక ప్రాంతాలు)లలో ఏప్రిల్ లేదా మే నెలలోని ఏదైనా ఒక ఆదివారం రోజు సమావేశమై వారికి అవసరమైన ప్రతినిధులను ఎన్నుకొని పనులు చేయించుకుంటారు.

2. పరోక్ష ప్రజాస్వామ్యం :
పరోక్ష ప్రజాస్వామ్యాన్ని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ విధమైన ప్రజాస్వామ్యంలో తక్షణ సార్వభౌమాధికారానికి, అంతిమ సార్వభౌమాధికారానికి చాలా స్పష్టమైన తేడా ఉంటుంది.

ప్రజల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కూడిన శాసనసభ రాజ్య ఆశయాలను రూపొందిస్తుంది. కాబట్టి శాసనసభ అనేది తక్షణ సార్వభౌమాధికారిగా చెప్పవచ్చు. కాబట్టి అంతిమ సార్వభౌమాధికార ప్రభుత్వంలో ప్రజలు తమ ప్రతినిధులను ప్రత్యేక కాలపరిమితికి ప్రతినిధులను ఎన్నుకుంటారు.

ఆ కాల పరిమితికి వారు ఎన్నుకున్న ప్రతినిధుల కార్యకలాపాలను సమీక్ష చేస్తారు. ఒకవేళ ఈ కాలపరిమితిలో వీరితో సంతృప్తి చెందకపోతే వచ్చే ఎన్నికల్లో వీరిని ఎన్నుకోరు. ఎన్నికల్లో తిరస్కరిస్తారు. ప్రాతినిధ్య ప్రభుత్వం ప్రజాసార్వభౌమాధికారంచేత సమర్థవంతంగా నడుస్తుంది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ప్రజాభిప్రాయాన్ని నెరవేర్చడంలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తుంది. ఈ ప్రాతినిధ్య ప్రభుత్వంలో అధికారం ప్రజలదే.

TS Board Inter First Year Political Science Study Material Chapter 8 ప్రజాస్వామ్యం

ప్రశ్న 3.
ప్రజాస్వామ్యం అంటే ఏమిటి ? ప్రజాస్వామ్య ప్రయోజనాలు, లోపాలు వివరించండి.
జవాబు.
అర్థం :
Democracy అనే ఇంగ్లీషు పదం Demos మరియు Kratos అనే రెండు గ్రీకు పదాల కలయిక నుంచి ఆవిర్భవించింది. డెమోస్ అంటే ప్రజలు క్రటోస్ అంటే అధికారం లేదా ‘పాలన’ అని అర్థం.

నిర్వచనం :
ప్రజాస్వామ్యమంటే “ప్రజలచేత, ప్రజల కొరకు, ప్రజలే నిర్వహించుకొనే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం”. – అబ్రహాం లింకన్

ప్రజాస్వామ్య ప్రయోజనాలు :
ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో దాదాపు ప్రతి దేశం ప్రజాస్వామ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని ఎంచుకుంటున్నాయి. ప్రజాస్వామ్య ప్రయోజనాలను క్రింద వివరించడమైంది. అవి :

1. సమర్థవంతమైన ప్రభుత్వం (Efficient form of Government) :
ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ప్రజల అభీష్టం మేరకు పరిపాలన నిర్వహిస్తారు. ప్రజా ప్రతినిధులు ప్రజలకు ఎప్పుడూ బాధ్యత వహిస్తూ అనుభవజ్ఞులైన, సమర్థులైన నాయకులను సంప్రదిస్తూ వారి సలహాలు సూచనలతో ప్రజలకు సంబంధించిన శాసనాలను రూపొందిస్తారు. శాసనాల రూపకల్పనలో, వ్యయపరిమితులు, ఆర్థికపర సూత్రాలను పాటిస్తారు.

ప్రజాస్వామ్యంలో అనుభవజ్ఞులైన అధికారులు, ఇతర కార్యనిర్వాహక అధికారులు వారి ప్రతిభ మీద, సమర్థత మీద, అనుభవం మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటారు. వీరి అనుభవాన్ని, వీరి తెలివితేటలను, సమర్థతను ప్రజాసంక్షేమ కార్యక్రమాల్లో ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు.

2. వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ (Upholds Individual Liberties) :
ఒక్క ప్రజాస్వామ్య ప్రభుత్వంలోనే వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు హామీ ఉంటుందని చెప్పవచ్చు. ప్రజాస్వామ్యంలో నివసించే ప్రజలు మాత్రమే నిజంగా స్వేచ్ఛను అనుభవిస్తారు. ప్రజల హక్కులు, స్వాతంత్య్రం, స్వేచ్ఛ అన్నీ కూడా లిఖిత రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంటాయి.

3. సమానత్వానికి ప్రాధాన్యత (Importance to Equality) :
ప్రజాస్వామ్యం సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తుంది. ప్రజాస్వామ్యం ప్రజలందరికీ రాజకీయ ఆర్థిక, సామాజిక స్వేచ్ఛను, హక్కులను అందిస్తుంది. ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటరానితనం కట్టుబానిసత్వం, వెట్టిచాకిరి, మతం, భాష, ప్రాంతం, పుట్టుక పేరు మీద విచక్షణ చూపడాన్ని వ్యతిరేకిస్తుంది.

4. రాజకీయ చైతన్యం (Political Awareness) :
నిజానికి ప్రజాస్వామ్యం ప్రజలకు రాజకీయ చైతన్యవేదిక అని చెప్పవచ్చు. ఎన్నికల ప్రచారం ప్రజలకు చైతన్యాన్ని అందిస్తుంది. ఎన్నికల సమయంలో ప్రచారం ద్వారా, పత్రికల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తారు.

5. దేశభక్తిని పెంపొందిస్తుంది (Promotes Patriotism) :
ప్రజాస్వామ్యం ప్రజల మధ్య దేశభక్తిని పెంపొందిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు తరచు ఎన్నికల్లో పాల్గొని ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడాన్ని బాధ్యతగా భావిస్తారు.” రాజకీయ ప్రతినిధులు తమ విధులను నిర్వహించడంలో ప్రజలు తమవంతు సహకారం అందిస్తారు.

చాలా సందర్భాల్లో ప్రజలు దేశం సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు తమవంతు బాధ్యతను నిర్వహిస్తూ సంయమనం పాటించారు. ఉదాహరణకు భారతదేశంతో చైనా, పాకిస్తాన్ యుద్ధ సమయంలో ప్రజలు నిర్వహించిన పాత్ర శ్లాఘనీయం.

6. పౌరసత్వ శిక్షణ (School of Citizenship) :
ప్రజాస్వామ్య ప్రభుత్వపు మరొక ప్రయోజనం ఏమిటంటే, ప్రజలకు పౌరసత్వ శిక్షణ ఇస్తుంది. ప్రజాస్వామ్యంలో ఓటు వేసే హక్కు, పోటీ చేసే హక్కు, ప్రభుత్వాన్ని సద్విమర్శ చేసే హక్కు, ఇంకా ఇతర రాజకీయ హక్కులను పౌరులుగా వినియోగించుకుంటారు.

7. నైతిక విలువలకు ప్రాధాన్యత (Inculcates Moral Values) :
ప్రజాస్వామ్యంలో ప్రజలకు నైతిక విలువలు అలవడుతాయి.’ ప్రజాస్వామ్యం ప్రజలకు సహకారాలను, బాధ్యతను, సహనాన్ని, త్యాగాన్ని బోధిస్తుంది. లోవెల్ అభిప్రాయంలో “భవిష్యత్తు కాలంలో ప్రజలకు దృఢమైన మానసిక స్థైర్యాన్ని, సమైక్యతను, ఆత్మాభిమానాన్ని అందించే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ప్రజాస్వామ్య ప్రభుత్వం మాత్రమే”.

8. ప్రజాస్వామ్యం ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తుంది (Democracy gives Preference to Public Opinion) :
వాస్తవంగా ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి నిజమైన ప్రతినిధి. బర్నార్డ్ ప్రకారం “ప్రజాస్వామ్యం ప్రజలందరి మధ్య సంబంధాన్ని కలుపుతూ కాపాడుతుంది”.

TS Board Inter First Year Political Science Study Material Chapter 8 ప్రజాస్వామ్యం

9. విప్లవాన్ని నివారిస్తుంది (Reduces the Danger of Revolution) :
ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ తమ అభిప్రాయాలను విన్నవించుకొనే, పంచుకొనే అవకాశం ఉంది. కాబట్టి విప్లవం అనే ప్రసక్తే రాదు. ఒకవేళ ప్రభుత్వాన్ని మార్చాల్సివస్తే ఓటు ద్వారా మాత్రమే మారుస్తారు.

10. ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తుంది (Symbol of Progress and Welfare Programmes) :
ప్రజాసంక్షేమాన్ని సాధించడంలో ప్రజాస్వామ్యాన్ని మాత్రమే నిజమైన ప్రభుత్వంగా చెప్పవచ్చు. ప్రజాసంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం.

11. ప్రపంచ శాంతికి మద్దతు (Support to World Peace) :
ప్రజాస్వామ్యం ప్రపంచ శాంతికి మద్దతు ఇస్తుంది. హింసకు వ్యతిరేకి. ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో మార్పు రావాలంటే రాజ్యాంగపర ప్రక్రియద్వారా, శాంతి, సహకార పూర్వకమైన పద్ధతుల ద్వారా మాత్రమే సాధ్యమౌతుంది. బర్నార్డ్ ప్రకారం : “ప్రజాస్వామ్య ఉద్యమాలన్ని శాంతికోసం జరిగినవే”.

ప్రజాస్వామ్య ప్రభుత్వం – లోపాలు :

1. వ్యయంతో కూడుకున్న ప్రభుత్వం :
ప్రజాస్వామ్య ప్రభుత్వం చాలా ఖర్చుతో కూడుకున్న ప్రభుత్వం. ఎన్నికల ప్రచారంపై చాలా ధనం వెచ్చిస్తారు. శాసనసభలను నడపడానికి, కేంద్ర, రాష్ట్ర శాసనసభ సమావేశాల కోసం చాలా ఖర్చు చేయవలసి వస్తుంది. ఇటలీకి చెందిన పార్లమెంటు వట్టి “మాటల దుకాణం”. నియంత ముస్సోలిని మాటల్లో చెప్పాలంటే “కార్లే” మాటల్లో చెప్పాలంటే ప్రజాస్వామ్యం పేదదేశాలకు పనికిరాదు.

2. బలహీనమైన అస్థిర ప్రభుత్వం :
ప్రజాస్వామ్యం ఆచరణలో బలహీనమైన అస్థిర ప్రభుత్వం అని చెప్పవచ్చు. ఏ దేశంలోనైతే బహుళపార్టీ వ్యవస్థ ఉంటుందో అక్కడ ప్రభుత్వాలు తరచుగా మారుతుంటాయి.
ఉదా : భారతదేశంలో 1977 నుంచి 1979, 1989 నుంచి 1991, 1996 నుంచి 1999 వరకు సంకీర్ణ ప్రభుత్వాల వల్ల స్థిరమైన ప్రభుత్వాలు నడపడంలో విఫలమయ్యాయి.

3. అల్పసంఖ్యాక ప్రభుత్వం :
వాస్తవంగా గమనిస్తే ప్రజాస్వామ్య ప్రభుత్వం అధిక సంఖ్యాకుల అభిప్రాయాన్ని ప్రతిబింబించదు. ప్రజాస్వామ్యమంటే అత్యధిక సంఖ్యాకుల మద్దతుగల ప్రభుత్వం అని అంటారు. కాని వాస్తవంగా అదికాదు. చాలా దేశాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు వారి ఓటుహక్కును వినియోగించుకోరు. చాలా దేశాల్లో ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే ఎన్నికవుతారు.

ఓట్ల శాతంతో సంబంధం లేదు. అంతే కాకుండా తిరస్కరించిన వారి సంఖ్యతో కూడా సంబంధం లేదు. ఈ లెక్క ప్రకారం అధికారంలోకి వచ్చిన పార్టీకి వచ్చిన ఓట్లు వ్యతిరేకించిన వారి కంటే తక్కువ ఉంటాయి. కాబట్టి ప్రజాస్వామ్యం అధిక సంఖ్యాకుల ప్రభుత్వం అనడం వాస్తవం కాదు.

4. సంస్కృతికి, నాగరికతకు, మేధావుల విజ్ఞానానికి నిరోధకం:
ప్రజాస్వామ్యం మందిస్వామ్యంగా పేరుపడి సంప్రదాయకంగా పని చేస్తుంది. కళలు, సంస్కృతి, నాగరికతలలో సాధారణంగా శ్రద్ధ చూపరు. ప్రజాస్వామ్యంలో మేధావులు సాధారణంగా ఎన్నికలకు దూరంగా ఉంటారు. ప్రజాస్వామ్య ఎన్నికలలో ఓడిపోయిన మేధావులు ఎందరో ఉన్నారు.

5. నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం :
ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం ప్రమాదకరం. త్వరిత నిర్ణయాలు సాధ్యం కాదు. తద్వారా జరగవలసిన పనులు జాప్యంగా జరుగుతాయి. శాసనసభా వ్యవహారాలు, రాజకీయపార్టీలు, ప్రతిపక్షపార్టీలు, సంకీర్ణ ప్రభుత్వాలు మొదలైన విధాన్నాలు నిర్ణయంతో జోక్యం చేసుకోవడం వల్ల కూడా నిర్ణయాలు ఆలస్యం కావచ్చు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 8 ప్రజాస్వామ్యం

ప్రశ్న 4.
ప్రజాస్వామ్య విజయానికి అవసరమైన నిబంధనలను వివరించండి.
జవాబు.
అన్ని ప్రభుత్వాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వం అతిముఖ్యమైనది. కాని అదే సమయంలో క్లిష్టమైన ప్రభుత్వంగా చెప్ప్చ. ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే తప్పనిసరిగా కొన్ని అనుకూల పరిస్థితులు ఉండాలి. కొన్ని దేశాల్లో ప్రజాస్వామ్యం చాలా విజయవంతమైంది. మరికొన్ని దేశాల్లో అపజయం పొందింది.

1. నిష్పక్షపాతమైన, స్వతంత్ర పత్రికలు :
స్వతంత్ర, నిష్పక్షపాతమైన పత్రికలు అనేవి ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి అతిముఖ్యమైన సాధనాలు. స్వతంత్రమైన పత్రికలు ప్రజాసంబంధమైన జాతీయ సమస్యలపైన స్పందిస్తాయి.

పత్రికలు ప్రభుత్వం రూపొందించిన అనేక విధానాలపైన నిష్పక్షపాతమైన విమర్శను, సహేతుకమైన విమర్శలను చేస్తూ బాధ్యతగా వ్యవహరిస్తాయి. జాతీయ ప్రాముఖ్యమైన అనేక అంశాలపై ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానంగా పత్రికలు పని చేస్తాయి.

ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్ర్య పరిరక్షణలో రక్షణకర్తగా వ్యవహరిస్తాయి. అప్రజాస్వామికమైన, రాజ్యాంగ వ్యతిరేకమైన, ప్రజావ్యతిరేకమైన చర్యలపైన ప్రజలను అప్రమత్తం చేస్తుంది. నిజానికి నిష్పక్షపాతమైన పత్రికలు ఉంటేనే ప్రజాస్వామ్యం విజయం సాధ్యమౌతుంది.

2. లిఖితరాజ్యాంగం :
ప్రజాస్వామ్య విజయానికి లిఖితరాజ్యాంగం కూడా అతిముఖ్యమైన సాధనం. ఎందుకంటే లిఖిత రాజ్యాంగం పౌరులకు రాజకీయ హక్కుల గురించి, విధుల గురించి అవగాహన, నమ్మకాన్ని కలిగిస్తుంది.

3. ప్రజాస్వామ్యంపై కోరిక :
ప్రజలలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే కోరిక, ఇష్టం, స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను కాపాడుకోవాలనే కోరిక ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి తోడ్పడతాయి.

4. నిర్దంతర అప్రమత్తత (జాగరూకత) :
ప్రజల నిరంతర అప్రమత్తతనే ప్రజాస్వామ్య విజయానికి ముఖ్యమైన సాధనం. ప్రజలు, ప్రభుత్వ రాజకీయ కార్యకలాపాలను, రాజకీయ నాయకుల చర్యలను నిశ్శబ్దంగా గమనిస్తూ అప్రమత్తతతో వ్యవహరించాలి. కాబట్టి ప్రజాస్వామ్య విజయంలో ప్రజల నిరంతర అప్రమత్తతను (జాగరూకతను) మించింది ఏదీ లేదు. ప్రజలు వారి హక్కులను, విధులను కాపాడుకోవడంలో మేల్కొని ఉండాలి.

5. స్వతంత్ర న్యాయశాఖ:
నిష్పక్షపాతమైన, నిజాయితీతో కూడిన, భయాందోళనలకు అతీతమైన స్వతంత్ర న్యాయశాఖ ప్రజాస్వామ్య విజయానికి అతిముఖ్యమైంది. స్వతంత్ర న్యాయశాఖ ప్రజలకు ధైర్యాన్ని, నమ్మకాన్ని న్యాయం అందించడంలో హామీ ఇస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 8 ప్రజాస్వామ్యం

6. బలమైన ప్రతిపక్షం :
పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి బలమైన ప్రతిపక్షం అవసరం. ప్రతిపక్షం ప్రభుత్వం చేసే పనులకు నిరంతర చెక్ పెడుతూ అప్రమత్తం చేస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలైన ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికాలో ప్రతిపక్షాలు చాలా సమర్థంగా పని చేస్తాయి. భారతదేశంలో కూడా ప్రతిపక్షపార్టీలు చాలాసార్లు విజయవంతమైన గొప్ప పాత్ర వహించాయి.

7. క్రమం తప్పకుండా జరిగే ఎన్నికలు :
క్రమం తప్పకుండా జరిగే ఎన్నికలు ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని పెంచుతాయి. ఎన్నికలు అధికారంలో ఉన్న పార్టీ పని తీరుపై తీర్పుగా వ్యవహరిస్తాయి. స్వతంత్ర, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛావాతావరణంలో జరిగే ఎన్నికలు ప్రజాస్వామ్య విజయానికి సహకరిస్తాయి.

8. స్థానిక ప్రభుత్వాల చురుకైన పాత్ర :
ప్రజాస్వామ్యంలో స్థానిక ప్రభుత్వాలు చురుకైన పాత్ర వహిస్తాయి. స్థానిక ప్రభుత్వాలు ప్రజలకు రాజకీయ చైతన్యాన్ని, రాజకీయ భాగస్వామ్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి ప్రజల భాగస్వామ్యంతో ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే కచ్చితంగా స్థానిక ప్రభుత్వాలను ప్రోత్సహించాలి. జె. ఎస్. మిల్ ప్రజాస్వామ్యంలో స్థానిక ప్రభుత్వాలపై ప్రేమ ఉండడం మొట్టమొదటి నిబంధనగా పేర్కొంటాడు.

9. అధికారం వికేంద్రీకరణ :
ప్రజాస్వామ్య విజయానికి అధికార వికేంద్రీకరణ తప్పనిసరి. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు అధికారాలను పంచుకొని పరిపాలిస్తాయి. కాబట్టి ప్రజాస్వామ్యంలో అధికార కేంద్రీకరణకు, నియంతృత్వ ప్రభుత్వం ఏర్పడడానికి అసలు అవకాశం లేదు.

10. రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం :
ప్రజాస్వామ్య విజయానికి రాజకీయ స్వేచ్ఛ, ఆర్థిక సమానత్వం, సాంఘిక న్యాయం తప్పనిసరి.

11. మెరుగైన విద్యావ్యవస్థ :
ప్రజాస్వామ్య విజయంలో విద్యావ్యవస్థ చాలా ప్రభావాన్ని చూపుతుంది. నిరక్షరాస్యత, పట్టించుకోకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రధాన అడ్డంకి. విద్య మేధావులను అందిస్తుంది. అనేక అంశాలు అర్థం చేసుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని అందిస్తుంది. ఓటు వేసే హక్కును వినియోగించుకొనేలా చేయడంలో విద్య పౌరులను చైతన్య పరుస్తుంది.

12. ప్రజాస్వామ్యం పై నమ్మకం :
ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం ఉండాలి. ప్రజల మధ్య వ్యక్తిగత సామర్థ్యానికి, ప్రజల మధ్య పరస్పర సహకారానికి చర్చల ద్వారా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రజల మధ్య సహకార పూర్వక స్ఫూర్తి, రాజీపడే ధోరణి, ఎదుటి వారి అభిప్రాయాలకు కూడా విలువిచ్చే వ్యవస్థ ఉంటే ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 8 ప్రజాస్వామ్యం

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ప్రజాస్వామ్యాన్ని నిర్వచించి ప్రయోజనాలు పేర్కొనండి.
జవాబు.
నిర్వచనం :
“ప్రజాస్వామ్యమంటే ప్రజలచేత, ప్రజల కొరకు ప్రజలే నిర్వహించుకొనే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం” – అబ్రహాం లింకన్ ప్రజాస్వామ్య ప్రయోజనాలు : ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో దాదాపు ప్రతి దేశం ప్రజాస్వామ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని ఎంచుకుంటున్నాయి. ప్రజాస్వామ్య ప్రయోజనాలను క్రింద వివరించడమైంది. అవి :

1. సమర్థవంతమైన ప్రభుత్వం (Efficient form of Government) :
ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ప్రజల అభీష్టం మేరకు పరిపాలన నిర్వహిస్తారు. ప్రజా ప్రతినిధులు ప్రజలకు ఎప్పుడూ బాధ్యత వహిస్తూ అనుభవజ్ఞులైన, సమర్థులైన నాయకులను సంప్రదిస్తూ వారి సలహాలు సూచనలతో ప్రజలకు సంబంధించిన శాసనాలను రూపొందిస్తారు. శాసనాల రూపకల్పనలో వ్యయపరిమితులు, ఆర్థికపర సూత్రాలను పాటిస్తారు.

ప్రజాస్వామ్యంలో అనుభవజ్ఞులైన అధికారులు, ఇతర కార్యనిర్వాహక అధికారులు వారి ప్రతిభ మీద, సమర్థత మీద, అనుభవం మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటారు. వీరి అనుభవాన్ని, ‘వీరి తెలివితేటలను, సమర్థతను ప్రజాసంక్షేమ కార్యక్రమాల్లో ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు.

2. వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ (Upholds Individual Liberties) :
ఒక్క ప్రజాస్వామ్య ప్రభుత్వంలోనే వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు హామీ ఉంటుందని చెప్పవచ్చు. ప్రజాస్వామ్యంలో నివసించే ప్రజలు మాత్రమే నిజంగా స్వేచ్ఛను అనుభవిస్తారు. ప్రజల హక్కులు, స్వాతంత్ర్యం, స్వేచ్ఛ అన్నీ కూడా లిఖిత రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంటాయి.

3. సమానత్వానికి ప్రాధాన్యత (Importance to Equality) :
ప్రజాస్వామ్యం సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తుంది. ప్రజాస్వామ్యం ప్రజలందరికీ రాజకీయ ఆర్థిక, సామాజిక స్వేచ్ఛను, హక్కులను అందిస్తుంది. ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటరానితనం కట్టుబానిసత్వం, వెట్టిచాకిరి, మతం, భాష, ప్రాంతం, పుట్టుక పేరు మీద విచక్షణ చూపడాన్ని వ్యతిరేకిస్తుంది.

4. రాజకీయ చైతన్యం (Political Awareness) :
నిజానికి ప్రజాస్వామ్యం ప్రజలకు రాజకీయ చైతన్యవేదిక అని చెప్పవచ్చు. ఎన్నికల ప్రచారం ప్రజలకు చైతన్యాన్ని అందిస్తుంది. ఎన్నికల సమయంలో ప్రచారం ద్వారా, పత్రికల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తారు.

5. దేశభక్తిని పెంపొందిస్తుంది (Promotes Patriotism) :
ప్రజాస్వామ్యం ప్రజల మధ్య దేశభక్తిని పెంపొందిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు తరచు ఎన్నికల్లో పాల్గొని ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడాన్ని బాధ్యతగా భావిస్తారు. రాజకీయ ప్రతినిధులు తమ విధులను నిర్వహించడంలో ప్రజలు తమవంతు సహకారం అందిస్తారు.

చాలా సందర్భాల్లో ప్రజలు దేశం సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు తమవంతు బాధ్యతను నిర్వహిస్తూ సంయమనం పాటించారు. ఉదాహరణకు భారతదేశంతో చైనా, పాకిస్తాన్ యుద్ధ సమయంలో ప్రజలు నిర్వహించిన పాత్ర శ్లాఘనీయం.

TS Board Inter First Year Political Science Study Material Chapter 8 ప్రజాస్వామ్యం

6. పౌరసత్వ శిక్షణ (School of Citizenship) :
ప్రజాస్వామ్య ప్రభుత్వపు మరొక ప్రయోజనం ఏమిటంటే, ప్రజల పౌరసత్వ శిక్షణ ఇస్తుంది. ప్రజాస్వామ్యంలో ఓటు వేసే హక్కు, పోటీ చేసే హక్కు, ప్రభుత్వాన్ని సద్విమర్శ చేసే హక్కు, ఎకా ఇతర రాజకీయ హక్కులను పౌరులుగా వినియోగించుకుంటారు.

7. నైతిక విలువలకు ప్రాధాన్యత (Inculcates Moral Values) :
ప్రజాస్వామ్యంలో ప్రజలకు నైతిక విలువలు అలవడుతాయి. ప్రజాస్వామ్యం ప్రజలకు సహకారాలను, బాధ్యతను, సహనాన్ని, త్యాగాన్ని బోధిస్తుంది. లోవెల్ అభిప్రాయంలో “భవిష్యత్తు కాలంలో ప్రజలకు దృఢమైన మానసిక స్థైర్యాన్ని, సమైక్యతను, ఆత్మాభిమానాన్ని అందించే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ప్రజాస్వామ్య ప్రభుత్వం మాత్రమే”.

8. ప్రజాస్వామ్యం ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తుంది (Democracy gives Preference to Public Opinion) :
వాస్తవంగా ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి నిజమైన ప్రతినిధి. బర్నార్డ్ ప్రకారం “ప్రజాస్వామ్యం ప్రజలందరి మధ్య సంబంధాన్ని కలుపుతూ కాపాడుతుంది”.

9. విప్లవాన్ని నివారిస్తుంది (Reduces the Danger of Revolution) :
ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ తమ అభిప్రాయాలను విన్నవించుకొనే, పంచుకొనే అవకాశం ఉంది. కాబట్టి విప్లవం అనే ప్రసక్తే రాదు. ఒకవేళ ప్రభుత్వాన్ని మార్చాల్సివస్తే ఓటు ద్వారా మాత్రమే మారుస్తారు.

10. ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తుంది (Symbol of Progress and Welfare Programmes) :
ప్రజాసంక్షేమాన్ని సాధించడంలో ప్రజాస్వామ్యాన్ని మాత్రమే నిజమైన ప్రభుత్వంగా చెప్పవచ్చు. ప్రజాసంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం.

11. ప్రపంచ శాంతికి మద్దతు (Support to World peace) :
ప్రజాస్వామ్యం ప్రపంచ శాంతికి మద్దతు ఇస్తుంది. హింసకు వ్యతిరేకి. ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో మార్పు రావాలంటే రాజ్యాంగపర ప్రక్రియద్వారా, శాంతి, సహకార పూర్వకమైన పద్ధతుల ద్వారా మాత్రమే సాధ్యమౌతుంది. బర్నార్డో ప్రకారం : “ప్రజాస్వామ్య ఉద్యమాలన్ని శాంతికోసం జరిగినవే”.

TS Board Inter First Year Political Science Study Material Chapter 8 ప్రజాస్వామ్యం

ప్రశ్న 2.
ప్రజాస్వామ్యం అంటే ఏమిటి ? దోషాలు వివరించండి.
జవాబు.
ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ప్రజాస్వామ్య ఏర్పాటు అనేది ప్రజలకు ప్రభుత్వాలకు తప్పనిసరి లక్ష్యంగా మారింది. ప్రపంచ దేశాలలో ప్రజాసంక్షేమాన్ని సాధించడానికి అత్యున్నతమైన సాధనంగా ప్రజాస్వామ్యాన్ని భావిస్తున్నారు.

అర్థం : గ్రీక్ భాషా పదాలైన “డెమోస్” “క్రెటియా” అనే పదాల కలయికగా ఆంగ్లభాషలో ‘డెమోక్రసీ’ అనే పదం పుట్టింది. డెమోస్ అంటే ప్రజలు క్రెటియా అంటే అధికారం అని అర్థం.

నిర్వచనం : “ప్రజాస్వామ్యమంటే ప్రజలచేత, ప్రజల కొరకు ప్రజలే నిర్వహించుకొనే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం”. – అబ్రహం లింకన్.

ప్రజాస్వామ్య దోషాలు :
1. వ్యయంతో కూడుకున్న ప్రభుత్వం :
ప్రజాస్వామ్య ప్రభుత్వం చాలా ఖర్చుతో కూడుకున్న ప్రభుత్వం. ఎన్నికల ప్రచారంపై చాలా ధనం వెచ్చిస్తారు. శాసనసభలను నడపడానికి, కేంద్ర, రాష్ట్ర శాసనసభ సమావేశాల కోసం చాలా ఖర్చు చేయవలసి వస్తుంది. ఇటలీకి చెందిన పార్లమెంటు వట్టి “మాటల దుకాణం”: నియంత ముస్సోలిని మాటల్లో చెప్పాలంటే. “కార్లే” మాటల్లో చెప్పాలంటే ప్రజాస్వామ్యం పేదదేశాలకు పనికిరాదు.

2. బలహీనమైన అస్థిర ప్రభుత్వం :
ప్రజాస్వామ్యం ఆచరణలో బలహీనమైన అస్థిర ప్రభుత్వం అని చెప్పవచ్చు. ఏ దేశంలోనైతే బహుళపార్టీ వ్యవస్థ ఉంటుందో అక్కడ ప్రభుత్వాలు తరచుగా మారుతుంటాయి.
ఉదా : భారతదేశంలో 1977 నుంచి 1979, 1989 నుంచి 1991, 1996 నుంచి 1999 వరకు సంకీర్ణ ప్రభుత్వాల వల్ల స్థిరమైన ప్రభుత్వాలు నడపడంలో విఫలమయ్యాయి.

3. అల్పసంఖ్యాక ప్రభుత్వం:
వాస్తవంగా గమనిస్తే ప్రజాస్వామ్య ప్రభుత్వం అధిక సంఖ్యాకుల అభిప్రాయాన్ని ప్రతిబింబించదు. ప్రజాస్వామ్యమంటే అత్యధిక సంఖ్యాకుల మద్దతుగల ప్రభుత్వం అని అంటారు. కాని వాస్తవంగా అదికాదు. చాలా దేశాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు వారి ఓటుహక్కును వినియోగించుకోరు. చాలా దేశాల్లో ఎన్నికల్లో, ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే ఎన్నికవుతారు.

ఓట్ల శాతంతో సంబంధం లేదు. అంతే కాకుండా తిరస్కరించిన వారి సంఖ్యతో కూడా సంబంధం లేదు. ఈ లెక్క ప్రకారం అధికారంలోకి వచ్చిన పార్టీకి వచ్చిన ఓట్లు వ్యతిరేకించిన వారి కంటే తక్కువ ఉంటాయి. కాబట్టి ప్రజాస్వామ్యం అధిక సంఖ్యాకుల ప్రభుత్వం అనడం వాస్తవం కాదు.

4. సంస్కృతికి, నాగరికతకు, మేధావుల విజ్ఞానానికి నిరోధకం :
ప్రజాస్వామ్యం మందిస్వామ్యంగా పేరుపడి సంప్రదాయకంగా పని చేస్తుంది. కళలు, సంస్కృతి, నాగరికతలలో సాధారణంగా శ్రద్ధ చూపరు. ప్రజాస్వామ్యంలో మేధావులు సాధారణంగా ఎన్నికలకు దూరంగా ఉంటారు. ప్రజాస్వామ్య ఎన్నికలలో ఓడిపోయిన మేధావులు ఎందరో ఉన్నారు.

5. నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం :
ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం ప్రమాదకరం. త్వరిత నిర్ణయాలు సాధ్యం కాదు. తద్వారా జరగవలసిన పనులు జాప్యంగా జరుగుతాయి. శాసనసభా వ్యవహారాలు, రాజకీయపార్టీలు, ప్రతిపక్షపార్టీలు, సంకీర్ణ ప్రభుత్వాలు మొదలైన విధానాల నిర్ణయంతో జోక్యం చేసుకోవడం వల్ల కూడా నిర్ణయాలు ఆలస్యం కావచ్చు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 8 ప్రజాస్వామ్యం

ప్రశ్న 3.
ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ఏమిటి ? ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలు వివరించండి.
జవాబు.
ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతులు :
ప్రభుత్వ విధానాల నిర్ణయాలలో ప్రజలు ప్రత్యక్షంగా ప్రజాప్రతినిధులతో సంబంధం లేకుండా పాల్గొనే ప్రభుత్వమే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ప్రాచీనకాలంలో గ్రీక్, రోమ్ దేశాలలోని నగర రాజ్యాలలో ఉండేది. ప్రస్తుతం స్విజ్జర్లాండ్లో కొన్ని మార్పులతో అమలులో ఉంది.

ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలను క్రింది విధంగా చెప్పవచ్చు.

1. ప్రజాభిప్రాయ సేకరణ (Referendum) :
ప్రజాభిప్రాయ సేకరణను ఆంగ్లంలో referendum అని అంటారు. ఇది (refer) రిఫర్ అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. రిఫర్ అంటే “సూచించడం” అని అర్థం. ప్రజాభిప్రాయ సేకరణ అనేది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అతిముఖ్యమైన సాధనంగా చెప్పవచ్చు. ఒక ప్రత్యేక అంశం మీద గాని లేదా జాతీయ ప్రాధాన్యత ఉన్న అంశం మీద కాని ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని (రూఢి చేసుకుంటుంది) సేకరిస్తుంది.

ఇది రెండు రకాలు.
a) నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణ (Compulsory Referendum) :
నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణ అంటే కొన్ని రకాల బిల్లుల విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపి వారి ఆమోదం పొందితేనే ఆ బిల్లులు శాసనాలు అవుతాయి. ఈ బిల్లులను ఒకవేళ ప్రజలు ఆమోదించకపోతే శాసనాలుగా రూపొంది అమలులోకి రావు. నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణ మూలంగా ప్రజలు తమ ప్రయోజనాలకు విరుద్ధమైన శాసనాలను అడ్డుకోగలుగుతారు.

ఇది స్విట్జర్లాండ్లో అన్ని ముఖ్యమైన రాజ్యాంగ సవరణలకు సంబంధించి అమలులో ఉంది. అంతేగాక స్విట్జర్లాండ్లోని కొన్ని కాంటన్స్లలో సాధారణ బిల్లులను కూడా ప్రజాభిప్రాయ సేకరణకు పంపవలసి వస్తుంది. ఆస్ట్రేలియా, ఫ్రాన్సు దేశాలలో కూడా రాజ్యాంగ సవరణకు సంబంధించి నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణకు పంపుతారు.

b) ఐచ్ఛిక ప్రజాభిప్రాయ సేకరణ (Optional Referendum) :
కొన్ని రకాల బిల్లులను ప్రజల కోరిక మీద మాత్రమే ప్రజాభిప్రాయ సేకరణకు పంపడం జరుగుతుంది. అధిక సంఖ్యాక ప్రజల కోరికమేరకు వారి మద్దతుతో బిల్లులు శాసనాలుగా రూపొంది అమలులోకి వస్తాయి. ముఖ్యంగా స్విట్జర్లాండ్ లో 30 వేల మంది స్విస్ పౌరులు ప్రజాభిప్రాయ సేకరణకు పంపాల్సిందని కోరినట్లైతే ప్రజామోదానికి బిల్లును పంపుతారు. ఐచ్ఛిక ప్రజాభిప్రాయ సేకరణలో బిల్లు మీద ప్రజాభిప్రాయ సేకరణ జరపడం అనేది ప్రజల ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది.

2. ప్రజాభిప్రాయ నివేదన (చొరవ) (Initiative) :
చొరవ అనేది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం మరొక అతిముఖ్యమైన సాధనం. ఒక నిర్ణీత సంఖ్యలో ప్రజలకు సంబంధించిన ఏదైనా ఒక అంశంపై శాసనం చేయమని శాసనసభకు ప్రతిపాదిస్తే దానిని ప్రజాభిప్రాయ నివేధన అంటారు. ఇందులో ప్రజల చొరవతో లిఖితపూర్వకమైన ప్రతిపాదనతో ప్రభుత్వంచేత శాసనాలు రూపొందించబడుతాయి. ఇది ప్రస్తుతం స్విట్జర్లాండ్లో అమలులో ఉంది.

చొరవ రెండు రకాలు. అవి :
a) బిల్లు రూపంలో ప్రజాభిప్రాయ నివేదన.
b) బిల్లు రూపంలో లేని ప్రజాభిప్రాయ నివేదన.

a) బిల్లు రూపంలో ప్రజాభిప్రాయ నివేదన :
ఈ పద్ధతిలో ప్రజలే స్వయంగా ప్రజాప్రయోజనం దృష్ట్యా అవసరమని భావిస్తే ఆ అంశంపై తామే స్వయంగా లిఖితరూపంలో బిల్లు ముసాయిదా తయారుచేసి ప్రభుత్వానికి సమర్పిస్తూ కచ్చితంగా అమలుపరచమని కోరవచ్చు. అనంతరం ఆ అంశాన్ని శాసనసభ తప్పనిసరిగా చట్టంగా అనుమతించవలసి ఉంటుంది.

b) బిల్లు రూపంలో లేని ప్రజాభిప్రాయ నివేదన :
ఈ పద్ధతిలో ఏదైనా ఒక ప్రత్యేక అంశంపై ప్రజాప్రయోజనం కోసం శాసనం అవసరమని భావిస్తే సంక్షిప్త రూపంలో 50 వేల మంది ప్రజలు సంతకాలు చేసి శాసనసభకు నివేదించవచ్చు. అనంతరం శాసనసభ ఆ అంశంపై శాసనం రూపొందించి ప్రజామోదంతో అమలుపరుస్తుంది.

3. పునరాయనం (Recall) :
పునరాయనం అనేది ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతిలో అతిముఖ్యమైన సాధనం. ఈ పద్ధతిలో ప్రజలు తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు సంతృప్తికరంగా పనిచేయకపోతే వారిని వెనక్కి పిలిచే అవకాశం ఉంది. అధిక సంఖ్యాకులు ఈ ప్రతిపాదనకు మద్దతిస్తే ఆ ప్రతినిధి రాజీనామా చేయడానికి అవకాశం ఉంది. అంటే తాము ఎన్నుకున్న ప్రతినిధులు అసమర్థులు, అప్రయోజకులు అని భావిస్తే వారిని పదవి నుంచి తొలగించివేస్తారు.

4. ప్రజానిర్ణయం (Plebiscite) :
ప్లెబిసైట్ అనే పదం ఫ్రెంచిపదం. ఇది ఫ్రెంచి పదాలైన “ప్లెబిస్”, “సిస్లిమ్” నుంచి వచ్చింది. అంటే ప్రజల అభిలాష అని అర్థం. ప్రజానిర్ణయం ప్రజాభిప్రాయ సేకరణకు దగ్గరగా ఉంటుంది. ప్రజానిర్ణయంలో కేవలం రాజకీయ ప్రాధాన్యతగల సమస్యలపై ప్రజానిర్ణయాన్ని సేకరిస్తారు.

తద్వారా ప్రజల నిర్ణయంతో శాశ్వతమైన రాజకీయ పరిష్కారం సాధించే ప్రయత్నం జరుగుతుంది.
ఉదా : సరిహద్దులను మార్చడం, రాజ్య స్వాతంత్య్రం (స్వేచ్ఛ) దేశాల విభజన మొదలైనవి. ప్రజాభిప్రాయ సేకరణ ఒక శాసనప్రక్రియ, కాని ప్లెబిసైట్కు శాసనప్రక్రియతో సంబంధం లేదు. ప్రజానిర్ణయం అతిముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రజల నిర్ణయమే అంతిమ తీర్పు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 8 ప్రజాస్వామ్యం

ప్రశ్న 4.
ప్రజాస్వామ్యంలో “ప్రజాభిప్రాయం పాత్ర” ఏమిటి ?
జవాబు.
‘ప్రజాభిప్రాయం’ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా 17వ శతాబ్దంలో జాన్లాక్ ఉపయోగించాడు. అయినప్పటికీ జాన్ లాక్ కంటే ముందే ఈ భావన ఉంది. లాటిన్ భాషలో ‘వాక్స్ పాపులీ’ ‘Vo populi’ లేదా ‘ప్రజల గొంతుక’ ‘Voice of the People’ అనే పదాలు వాడుకలో ఉన్నాయి. ప్రజాభిప్రాయాన్ని ఈ విధంగా నిర్వచించారు – “రాజకీయ సంఘటనలు, ప్రభుత్వ విధానాలు, వివిధ సంస్థలు, వ్యక్తులకు సంబంధించిన అంశాలపై ప్రజల మూల్యాంకనం లేదా అభిప్రాయాల సారమే ప్రజాభిప్రాయం”.

ప్రజాస్వామ్యంలో రాజకీయ అధికారానికీ అంతిమంగా ప్రజలే మూలం కాబట్టి ప్రజాభిప్రాయానికీ చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రభుత్వ విధానంలో మార్పులు తీసుకొని రావడానికి, నిష్క్రియాత్మకమైన పరిశీలన ద్వారా పౌరులను ఏకం చేయటానికి ప్రజాభిప్రాయం తోడ్పడుతుంది.

సిద్ధాంతపరంగా ప్రభుత్వాధికారులు భవిష్యత్ చర్యలను ప్రజాభిప్రాయం నిర్ణయిస్తుంది. రాజకీయ నాయకులు ప్రజల కోరికలను ఎప్పుడూ నెరవేరుస్తారని దీని అర్థం కాదు. దేశంలో మెజారిటీ ప్రజలు పడుతున్న బాధలను తొలగించటానికి రాజకీయ నాయకులు చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.

వివిధ సమాచార సాధనాల ద్వారా, ఇతర వనరుల ద్వారా రాజకీయ పార్టీలు ప్రజాభిప్రాయాన్ని సేకరించి వాటి పరిష్కారానికి కృషి చేయాలి. ప్రఖ్యాత అమెరికా జర్నలిస్ట్ గ్రాంట్లాండ్ రైస్ ప్రకారం “ఒక తెలివైన వ్యక్తి స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటాడు. ఒక అజ్ఞాని మాత్రం ప్రజాభిప్రాయాన్ని అనుసరిస్తాడు.”

ప్రజాభిప్రాయానికి ఒక రూపత కల్పించడానికి గల కారకాలను అవగాహన చేసుకోవడం అవసరం. అవి సామాజిక వర్గం, విద్య, మతం, వయస్సు, లింగం, జాతి సమూహం మొత్తానికి సమాజం సజాతీయమైనది కాదు. అది వివిధ ఆలోచనల లేదా వర్గాల కలయికగా అవతరించింది. ప్రతీ విభాగం తమ విధుల నిర్వహణలో విభిన్న సవాళ్ళను ఎదుర్కొంటుంది. అందువల్ల ప్రతి విభాగంలోని సభ్యులు ప్రపంచాన్ని విభిన్న రకాలుగా భావిస్తారు.

ఈ విభిన్న అంశాలు అభిప్రాయాల ఘర్షణకు దారి తీసి రాజకీయ విస్తరణను చూరకొంటాయి. సమాజంలో సభ్యుల సమ్మతిపైనే రాజ్యం నిర్మించబడింది. ప్రజల సమష్టి ఆమోదంతోనే రాజ్యాంగం రచించబడింది. రాజ్యం, రాజ్యాంగం నిర్మాణంలో వ్యక్తులు ప్రాథమిక పద్ధతిలో తమ అభిప్రాయం చెప్పారో అదే ప్రజాభిప్రాయం.

అనేక ప్రభుత్వాలు తమ విధానాలు లేదా చర్యలు ప్రజలపై ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో సమాచార సాధనాల ద్వారా తెలుసుకుంటాయి.

ప్రజాస్వామ్య సమాజంలో ప్రజాభిప్రాయం ప్రత్యేక పాత్రను పోషిస్తుంది. ప్రజాభిప్రాయానికి ప్రభుత్వం స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. ప్రజాభిప్రాయం ద్వారా ప్రజల నుంచి డిమాండ్, మద్ధతుల పట్ల ప్రజాస్వామ్య సమాజం అప్రమత్తంగా ఉండాలి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 8 ప్రజాస్వామ్యం

ప్రశ్న 5.
ప్రజాస్వామ్య విజయానికి కావలసిన ఏవైనా నాలుగు పరిస్థితులను వివరించండి.
జవాబు.
1. సరైన విద్య (Sound system of Education) :
ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే పౌరులకు సరైన విద్య ఎంతో అవసరం. అజ్ఞానం, అమాయకత్వం, అవిద్య గల పౌరులు సరైన దృక్పథాన్ని కలిగి ఉండక, భారీ సంస్కరణల పట్ల విముఖత ప్రదర్శిస్తారు. విద్య అనేది వ్యక్తుల వివేకానికి పదును పెడుతుంది. అనేక విషయాల పట్ల సరియైన అవగాహనను పెంపొందిస్తుంది. పౌరులను అప్రమత్తులుగా చేస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వ విధానాలను అంచనా వేయడంలో, విమర్శించడంలో విద్య దోహదపడుతుంది.

2. వికాసవంతమైన పౌరసత్వం (Enlightened Citizenship) :
ప్రజాస్వామ్య రాజ్యానికి వికాసవంతమైన పౌరులు విలువైన ఆస్థిగా పరిగణించబడతారు. వారు ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు. వీరు ప్రభుత్వ వ్యవహారాలలో. చురుకుగా పాల్గొని, హక్కులు, విధుల సక్రమ నిర్వహణలో తోటి పౌరులకు సహాయంగా ఉంటారు. ప్రభుత్వం అమలుచేసే అన్ని మంచి కార్యక్రమాలకు సహకారాన్ని అందిస్తారు.

3. స్వతంత్ర పత్రికలు (Independent Press) :
ప్రజాస్వామ్యానికి స్వతంత్రమైన పత్రికలు ఎంతో ఆవశ్యకమైనవి. పత్రికలు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని ఖచ్చితంగానూ, నిష్పక్షపాతంగానూ ప్రజలకు తెలుపుతాయి. ప్రభుత్వ కార్యకలాపాల పట్ల ప్రజలకు సంబంధం కలిగి ఉండేటట్లు చూస్తాయి. ప్రజల ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతాయి. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సామరస్యపూర్వక సంబంధాలను పెంపొందించేందుకు కృషి చేస్తాయి.

4. దృఢమైన ప్రతిపక్షం (Strong Opposition) :
పార్లమెంటరీ ప్రజాస్వామ్య విజయం దృఢమైన, సమర్థవంతమైన ప్రతిపక్షంపై చాలా వరకు ఆధారపడుతుంది. అటువంటి ప్రతిపక్షం ప్రభుత్వ విధానాల లోపాలను వెల్లడించి, వాటి నివారణకు కృషి చేస్తుంది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి కొన్ని అభివృద్ధి చెందిన దేశాలలో ప్రతిపక్షాలు ప్రశంసనీయమైన పాత్రను పోషిస్తున్నాయనే విషయాన్ని ఈ సందర్భంలో మనం ప్రస్తావించవచ్చు.

భారతదేశంలో కూడా ఇటీవలి కాలంలో అధికారంలో కొనసాగిన అధికార పార్టీలకు చెందిన వ్యక్తులు పాల్పడిన కుంభకోణాలను వెలికి తీయడంలో ప్రతిపక్షం బృహత్తరమైన పాత్రను పోషించింది. పైన ఉదహరించిన దేశాలలోని అధికార పార్టీలు అనేక అంశాలలో ఎదురైన చిక్కుముడులను పరిష్కరించడంలో ప్రతిపక్షాల సలహాలను తీసుకోవడమైనది. ఇటువంటి పరిస్థితి అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాలు రెండింటిలో ప్రజాస్వామ్యపు ఆరోగ్యకర చిహ్నంగా పరిగణించవచ్చు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 8 ప్రజాస్వామ్యం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ప్రజాస్వామ్యాన్ని నిర్వచించండి.
జవాబు.
ప్రజాస్వామ్యాన్ని ఆంగ్లంలో ‘డెమోక్రసీ’ అంటారు. ఈ పదము రెండు గ్రీకు పదాలైన ‘డెమోస్’ మరియు ‘క్రటోస్’ ల నుండి గ్రహించబడింది. డెమోస్ అంటే ప్రజలు, క్రటోస్ అంటే అధికారం లేదా పాలన అని అర్థం. అంటే డెమోక్రసీ అంటే ప్రజల అధికారం లేదా ప్రజల పాలన.

  1. “ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క ప్రజల చేత, ప్రజల కొరకు పరిపాలించే, నిర్వహించబడే ప్రభుత్వం” అని అబ్రహాం లింకన్ పేర్కొన్నాడు.
  2. “ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వమే ప్రజాస్వామ్యం” అని జె.ఆర్.సీలీ పేర్కొన్నాడు.

ప్రశ్న 2.
పరోక్ష ప్రజాస్వామ్యం అంటే ఏమిటి ?
జవాబు.
ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధుల ద్వారా ప్రభుత్వ పాలన నిర్వహించబడటాన్ని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం లేదా పరోక్ష ప్రజాస్వామ్యం అని అంటారు. నిర్ణీత సమయానికి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు తమ అధికార, విధుల నిర్వహణలో ప్రజలకు బాధ్యత వహిస్తారు. ప్రజా ప్రతినిధులు తమ అధికార విధుల నిర్వహణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించటంలో విఫలమైతే వారిని ప్రజలు ఎన్నికల సమయంలో పదవుల నుండి తొలగిస్తారు.

ప్రశ్న 3.
ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ఏమిటి ?
జవాబు.
ఈ పద్ధతిలో ప్రజలు ప్రభుత్వ పాలన వ్యవహారాలలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. శాసన సంబంధమైన అధికారాలన్నీ వారు చెలాయిస్తారు. ప్రజలే చట్ట సభలలో పాల్గొని చట్టాలను రూపొందిస్తారు. రాజ్య వ్యవహారాలలో ప్రజలు ప్రత్యక్షంగా భాగస్వామ్యం వహిస్తారు.

ప్రత్యక్ష ప్రజాస్వామ్య విధానం ప్రస్తుతం స్విట్జర్లాండ్లో కొన్ని కాంటన్ల (Cantons) లోనూ; అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలోనూ నెలకొని ఉంది.

ప్రశ్న 4.
పునరాయనం అంటే ఏమిటి ?
జవాబు.
పునరాయనం అనేది ఒక ముఖ్యమైన ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనం. ఈ పద్ధతిలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు లేదా అధికారులు ఉద్దేశ్యపూర్వకంగా తమ కర్తవ్యాలను నిర్వహించడంలో విఫలమైతే వారిని ఓటర్లు వెనుకకు పిలిచేందుకు వీలుంటుంది. దీనినే పునరాయనం అంటారు. ఈ రకమైన పద్ధతి అమెరికాలోని అలెజోనా, మోంటానా, లూసియానా, కాన్సాస్, కాలిఫోర్నియా, నెవెడా, ఓరెగాన్ మొదలగు రాష్ట్రాలలో అమలులో ఉంది.

ప్రశ్న 5.
ప్రజానిర్ణయం అంటే ఏమిటి ?
జవాబు. ప్రజాభిప్రాయ నిర్ణయాన్ని ఆంగ్లంలో ‘ప్లెబిసైట్’ అంటారు. ఈ పదం లాటిన్ భాషలోని ‘ప్లెబిస్’ మరియు ‘సెటమ్’ అనే రెండు పదాల నుండి గ్రహించబడింది. ప్లెబిస్ అంటే ప్రజలు, సెటమ్ అంటే నిర్ణయం లేదా తీర్పు అని అర్థం. అంటే దీని అర్థం ప్రజా నిర్ణయం లేదా ప్రజాతీర్పు. ఒక ప్రభుత్వ విధానంపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు అనుసరించే ప్రజాస్వామ్య సాధనమే ప్రజాభిప్రాయ నిర్ణయమని భావించవచ్చు.

ప్రశ్న 6.
ప్రజాభిప్రాయ సేకరణ అంటే ఏమిటి ?
జవాబు.
‘ప్రజాభిప్రాయ సేకరణ’ని ఆంగ్లంలో ‘రిఫరెండమ్ ‘(Referendum)’ అంటారు. ఒకానొక అంశంపై ప్రజల అభిప్రాయాన్ని ప్రత్యక్షంగా తెలుసుకొనే ప్రక్రియనే ప్రజాభిప్రాయ సేకరణ అంటారు. ఇటువంటి అంశం సాధారణమైనది కావచ్చు లేదా రాజ్యాంగపరమైనది కావచ్చు. ఆర్.సి. బ్రూక్స్ ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ అనేది శాసనసభ ఇప్పటికే ఆమోదించిన బిల్లు లేదా చట్టంపై నియోజకుల అభిప్రాయాన్ని తెలుసుకొనేందుకు ఉద్దేశించింది.

ప్రశ్న 7.
ప్రజాభిప్రాయ నివేదన అంటే ఏమిటి ?
జవాబు.
శాసన నిర్మాణ ప్రక్రియలో ప్రజలు, పాల్గొనేందుకు తోడ్పడే ప్రక్రియనే ప్రజాభిప్రాయ నివేదన అని అంటారు.
ఉదా : స్విట్జర్లాండ్ లో 50,000 మంది పౌరులు ఏదైనా ఒక అంశంపై చట్టాన్ని రూపొందించాల్సిందిగా శాసనసభను కోరుతూ ఒక అర్జీపై సంతకం చేసినట్లయితే, వారి ప్రతిపాదనను ప్రజల అభిప్రాయానికి పంపబడుతుంది.

మెజారిటీ ప్రజలు ఆ ప్రతిపాదనను ఆమోదించినట్లయితే ఆ అంశం చట్టంగా ఆమోదితమై అమల్లోకి వస్తుంది. ఇది రెండు రకాలు :

  • విధాయక రూపంలో ఉన్న ప్రజాభిప్రాయ నివేదన.
  • విధాయక రూపంలో లేని ప్రజాభిప్రాయ నివేదన.

ప్రశ్న 8.
ప్రజాభిప్రాయం అంటే ఏమిటి ?
జవాబు.
లాటిన్ భాషలో ‘వాక్స్పాపులీ’ ‘Vox populi’ లేదా ప్రజల గొంతుక Voice of the People అనే పదాలు వాడుకలో ఉన్నాయి. ప్రజాభిప్రాయాన్ని ఈ విధంగా నిర్వచించారు – “రాజకీయ సంఘటనలు, ప్రభుత్వ విధానాలు, వివిధ సంస్థలు, వ్యక్తులకు సంబంధించిన అంశాలపై ప్రజల మూల్యాంకనం లేదా అభిప్రాయాల సారమే ప్రజాభిప్రాయం”.

ప్రజాస్వామ్యంలో రాజకీయ అధికారానికి అంతిమంగా ప్రజలే మూలం కాబట్టి ప్రజాభిప్రాయానికి చాలా ప్రాముఖ్యత వుంది. రాజకీయ పక్షాలు, పత్రికలు, వేదికలు, విద్యాసంస్థలు, శాసనసభ, రేడియో, టెలివిజన్, చలన చిత్రాలు ద్వారా ప్రజాభిప్రాయం వ్యక్తమవుతుంది.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds

Telangana TSBIE TS Inter 1st Year Chemistry Study Material 8th Lesson Hydrogen and its Compounds Textbook Questions and Answers.

TS Inter 1st Year Chemistry Study Material 8th Lesson Hydrogen and its Compounds

Very Short Answer Type Questions

Question 1.
The three isotopes of hydrogen differ in their rates of reaction. Give the reasons.
Answer:
Due to the difference in the bond dissociation enthalpies of the H2, D2 and T2 molecules differ in their rates of reaction. The reactivity order is H2 > D2 > T2.

Question 2.
Why is dihydrogen used in weldipg of high melting metals?
Answer:
Atomic hydrogen and oxy-hydrogen torches generate very high temperature of 4000K. So dihydrogen is used in welding of high-melting metals.

Question 3.
Describe one method of producing high-purity hydrogen.
Answer:
High purity (> 99.95%) dihydrogen can be obtained by electrolysing warm aqueous barium hydroxide solution using nickel electrodes.

Question 4.
Explain the term “SYNGAS”.
Answer:
The mixture of CO and H2 is called as water gas or SYNGAS because it is used in the synthesis of methanol and a number of hydrocarbons.

Question 5.
What is meant by coal gasification? Explain with relevant, balanced equation.
Answer:
The process of producing SYNGAS from coal is called coal gasification.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 1

TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds

Question 6.
Define the term Hydride. How many categories of hydrides are known? Name them.
Answer:
The binary compounds of hydrogen with other elements are called hydrides.
The hydrides are classified into three categories.

  1.  Ionic or saline or salt like hydrides.
  2. Covalent or molecular hydrides.
  3. Metallic or non-stoichiometric hydrides.

Question 7.
The unusual property of water in condensed phase leads to its high heat of vapourization. What is that property?
Answer:
The unusual property of water in condensed phase that leading to its high heat of vapourisation is due to the presence of extensive hydrogen bonding between water molecules.

Question 8.
During photosynthesis, water is oxidized to O2. Which element is reduced?
Answer:
The photosynthesis reaction is
6 CO2 + 6 H2O → C6 H12 O6 + 6 O2

The oxidation number of carbon in CO2 is + 4 but in carbohydrate formed the oxidation number of carbon is O. Thus carbon is reduced.

Question 9.
What do you mean by autoprotolysis? Give the equation to represent the auto-protolysis of water.
Answer:
Self – ionisation of water is known as autoprotolysis.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 2

Because of this property, water acts as Bronsted acid when dissolved in alkalis and also acts as Bronsted base when dissolved in acids.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds

Question 10.
Water behaves as an amphoteric substance in the Bronsted sense. How do you explain?
Answer:
Water can donate a proton and also can accept a proton. So it can act as both acid and base in bronsted sense. A substance which can act both as an acid and a base is called amphoteric substance. Hence, we can say that water is an amphoteric oxide.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 3

Short Answer Questions

Question 1.
The boiling points of NH3 H2O and HF are higher than those of the, hydrides of the subsequent members of the group. Give your reasons.
Answer:
Hydrogen is covalently bonded with more electronegative atoms such as F, O and N. The weak electrostatic attractive force is called hydrogen bond.

Because of the association of molecules through hydrogen bonds these hydrides have high boiling points. This is because some extra energy is required to break the hydrogen bond.

The electronegativities of the higher members of N, O, F groups are less. So their hydrides are less polar and cannot form hydrogen bonds. Hence the boiling points of the hydrides of the subsequent members of the N, O, F groups have low boiling points.

Question 2.
Discuss the position of hydrogen in the periodic table on the basis of its electronic configuration.
Answer:
Basing on its electronic configuration (1s¹), hydrogen has to be placed in the 1st period in group I along with alkali metals. Hydrogen resembles the alkali metals in its ability to form hydrated uni + ve ion (H+aq).

Hydrogen can also form uni -ve ion (H). Hence, it can be clubbed with VILA group elements.

However, the position of hydrogen in the periodic table is not satisfactory. It is a matter of choice of the individual to place it in group I along with alkali metals or with group VII along with halogens. Some prefer to place hydrogen separately at the top of the periodic table.

Question 3.
How is the electronic configuration of hydrogen suitable for its chemical reactions?
Answer:
The electronic configuration of hydrogen is 1s¹. It can participate in reactions (i) by losing one electron, (ii) by gaining one electron and (iii) by sharing its electrons.
eg : 1. By losing electron :
In the reaction with fluorine it gives electron but H+ ion cannot exist independently but in water it exist by combining with water.
HF + H2O → H3O+ + F

2. By gaining electron :
With highly electropositive metals it form hydrides by gaining electron.
Na+ + H → NaH

3. By sharing electrons. It forms sev¬eral compounds by sharing electrons.
H : Cl

Question 4.
What happens when dihydrogen reacts with a) Chlorine and b) Sodium metal? Explain.
Answer:
a) When chlorine react with hydrogen hydrogen chloride is formed.
H2 + Cl2 → 2HCl

In HCl, hydrogen shares its electron with chlorine. Hydrogen reduces chlorine to HCl.

b) When sodium reacts with hydrogen, sodium hydride is formed.
2Na + H2 → 2NaH

In this reaction, sodium loses electron while hydrogen gains electron forming Na+ and H ions. Here sodium is oxidised while hydrogen is reduced.

Question 5.
Write a note on heavy water.
Answer:
Heavy water is deuterium oxide. Its formula is D2O. It contains heavier deuterium atoms in the place of normal, hydrogen atoms of water molecule. It is prepared by the prolonged repeated electrolysis of \(\frac{M}{2}\) NaOH solution. The electrolytic cell consists of a steel tank which acts as cathode. A perforated nickel sheet acts as anode and 0.5M NaOH solution acts as electrolyte. The electrolysis is carried in 7 stages. At the end of seventh stage 99% heavy water is obtained.

Properties:
1) It reacts with CaC2 and liberates heavy acetylene.
CaC2 + 2D2O → C2D2 + Ca (OD)2

2) It reacts with S03 and produce heavy sulphuric acid.
SO3 + D2O → D2SO4

Hydrolysis reactions of salts with heavy water are called deuterolysis reactions.
Ex : AlCl3 + 3D2O → Al(OD)3 + 3DCl

Uses :
It is extensively used in nuclear reactors as a moderator and in exchange reactions for the study of reaction mechanism.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds

Question 6.
Name the isotopes of hydrogen. What is the ratio of the masses of these isotopes?
Answer:
Hydrogen 1¹H
Deuterium 1²H or 1²D
Tritium : 1³H or 1³T

The masses of these isotopes are H = 1.008,
D = 2.014 and T = 3.016.

Question 7.
What is water – gas shift reaction? How can the production of dihydrogen be increased by this reaction?
Answer:
Generally water gas produced by passing steam over red hot coke contain less percentage of H2.
C + H2O → CO + H2

The amount of H2 in water gas can be increased by reacting CO of syngas with steam in the presence of Iron chromate catalyst.

CO (g) + H2O (g) → CO2 + H2. This is called water gas shift reaction.

The CO2 formed is removed by scrubbing with sodium arsenite solution.

Question 8.
Complete and balance the following reactions :
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 4
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 5

Question 9.
What is the nature of the hydrides formed by elements of 13 group?
Answer:
Group 13 elements form covalent hydrides. These are mainly electron deficient hydrides. They act as Lewis acids.

Boron form large number of hydrides called boranes. Aluminium form a single polymeric hydride called allane. Gallium forms a dimerichydride and indium forms a polymeric hydride which are not stable. Thallium does not from any hydride.

Question 10.
Discuss the principle and the method of softening of hard water by synthetic, ion-exchange resins.
Answer:
The water which is free from all the dissolved mineral salts is called deionised water.

Deionised water can be prepared in two steps.
1) Removal of cations :
Hard water is passed through a tank containing cation exchange resin. Then the Ca+2 and Mg+2 ions present in the water are replaced by H+ ions from the resin.
2R COOH + Ca+2 → [R (COO)]2 Ca + 2H+

2) Removal of anions:
Now the water coming from the cation tank is passed through a tank containing anion exchange resin. This resin absorbs anions like Cl, SO-24 etc. from the hard water and OH ions are released.
RNH+3 OH + Cl → RNH+3 Cl + OH
2RNH+3 OH + SO-24 → (R – NH+3)2 SO-24 + 2OH

The H+ and OH ions unite to form Deionised water.

After some time the cation resin and the anion resin lose their capacities to remove the cations and anions from the hard water. Then the resins are said to be exhausted. Then they are to be regenerated. The cation resin is regenerated by passing a solution of H2SO4. Anion resin is regenerated by passing a moderately concentrated solution of NaOH.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds

Question 11.
Write a few lines on the utility of hydrogen as a fule. [Mar. ;13]
Answer:
Hydrogen releases large quantity of heat energy on combustion. Hence it is widely used as industrial fuel. Moreover, the pollutants released in the combustion of hydrogen will be less. Atomic hydrogen and oxy-hydrogen torches are used for welding and cutting metals. Hydrogen is also used as rocket fuel. It is also used in fuel cells for generating electric energy. On combination with carbon monoxide (water gas) it is used as industrial fuel.

Question 12.
A 1% solution of H2O2 is provided to you. What steps do you take to prepare pure H2O2 from it?
Answer:
The concentration of H2O2 involves three stages.
Stage (1) :
The dilute solution of H2O2 is carefully evaporated on a water bath under reduced pressure. Then 30% H2O2 solution is obtained.

Stage (2):
The 30% H2O2 solution is heated in a distillation flask under reduced pressure. Then 90% H2O2 is obtained.

Stage (3) :
The 90% H2O2 solution is subjected to crystallisation using solid CO2 and ether. Then 100% H2O2 separates out.

Question 13.
Mention any three uses of H2O2 in modern times.
Answer:

  1. Used as antiseptic in medicine and surgery.
  2. Used to bleach silk, wool, ivory, hair etc.
  3. Used to restore the colour of old and spoiled lead paintings.
  4. Used as an oxidising agent in the labo¬ratory.

Long Answer Questions

Question 1.
White an essay on the commercial preparation of dihydrogen. Give balanced equations.
Answer:
Commercially hydrogen is prepared by the following methods.

1) Electrolysis method :
Electrolysis of . acidified or alkaline water gives hydrogen.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 6

2) It is obtained as a byproduct during the manufacture of sodium hydroxide.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 7

3) By passing a mixture of steam and hydrocarbons over a catalyst gives a mixture of CO and H2.
CH4 + H2O → CO + 3H2
CnH2n+2 + nH2 → nCO + (2n + 1) H2

4) When steam is passed over red hot coke water gas is formed.
C + H2O → CO + H2

The hydrogen present in water gas obtained from hydrocarbons and steam or coke and steam is separated by water gas shift reaction. The water gas is mixed with steam and passed over iron chromate catalyst. Then CO converts into CO2 which is removed by scrubbing with sodium arsenate.
CO + H2O → CO2 + H2

Question 2.
Illustrate the chemistry of dihydrogen by its reaction with
i) N2
ii) Metal ions and metal oxides and
iii) Organic compounds
How is dihydrogen used in the manufac-ture of chemicals?
Answer:
i) Reaction with N2:
Hydrogen react with nitrogen in the presence of iron powder as catalyst forming ammonia.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 8

This reaction is used for the manufacture of ammonia by Haler’s process.

ii) Reaction with metal ions, metal oxides:
Hydrogen is a good reducing agent and reduces several metal oxides and metal ions to their corresponding metals.
Pd2+ + H2 → Pd + 2H+
CuO + H2 → CU + H2O

iii) Organic compounds :
Hydrogen will be added to the double bonds and triple bonds present in the unsaturated organic compounds in the presence of catalyst.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 9

A mixture of H2 and CO is added to 1 – alk- ene to give aldehydes which are further reduced to alcohols. This reaction is known as hydroformylation.
R CH = CH2 + H2 + CO → R CH2 – CH2 CHO
R CH2 CH2 CHO + H2 → R CH2 CH2 CH2OH

In the manufacture of chemicals:
a) HCl is manufactured by burning H2 in Cl2.
H2 + Cl2 → 2HCl

b) Ammonia is manufactured by Haber’s process.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 10

c) Methyl alcohol is manufactured by passing a mixture of CO and H2 over catalyst.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 11

Question 3.
Explain, with suitable examples, the following ; [AP Mar. ’19; (AP ’16; IPE ’14)]
i) electron-deficient
ii) electron-precise and
iii) electron-rich hydrides
Answer:
Dihydrogen forms molecular compounds with most of the p – block elements. These are three types.
i) Electron-deficient hydrides:
These are formed by elements of 13 group (Boron family). In these hydrides the electrons available are not sufficient for making the bonds. They do not have octet around the central atom. So they act as Lewis acids. Eg Diborane B2H6.

For writing the Lewis structure the number of available electrons are 12 but required are 14.

ii) Electron precise hydrides :
The hydrides whose central atom is having octet and all the electron pairs around the central are bond pairs are called electron precise hydrides. Eg: CH4, SiH4, CeH4, SnH4. Electron precise hydrides have required number of electrons for writing the Lewis diagrams.

iii) Electron rich hydrides :
The hydrides whose central atom is having octet and among the electron pairs around the central atom if some are bond pairs and some are lone pairs are called electron rich molecule. Eg NH3, H2O. These contain excess electrons which are present as lone pairs.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds

Question 4.
Write in brief on [AP Mar. ’19]
i) ionic hydrides
ii) interstitial hydrides.
Answer:
i) Ionic hydrides :
These are formed by the highly electropositive s – block metals. In s- block metal hydrides LiH, BeH2 and MgH2 have some covalent character. The ionic hydrides are crystalline. They are non-volatile compounds. They are non-conducting in solid state. But in molten condition, if electrolysed they give metal at cathode and hydrogen at anode.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 12

This reaction confirms that ionic hydrides contain H ion.

Ionic hydrides liberate hydrogen forming alkaline solution when dissolved in water.
NaH + H2O → NaOH + H2

So ionic hydrides are used as a source of hydrogen.

ii) Interstitial hydrides:
These are formed by many of d – and f – block elements. But metals of 7, 8 and 9 groups do not form hydride. This part of the periodic table is called hydride gap. These are non-stoichiometric compounds. Earlier it was thought the hydrogen atoms occupy the interstitial voids of metal crystals. So they are as interstitial compounds. This is correct only in the case of Ni, Pd, Ce and Ac. In most of other cases the crystal structure of metals is changing during the formation of these hydrides.

Some metals like Pd and Pt absorb large amounts of hydrogen. This property is known as occlusion. This property is also used as a storage of H2 and purification of H2. Also used in catalytic reduction / hydrogenation reactions.

Question 5.
Explain any four of the chemical properties of water.
Answer:
1. Amphoteric nature:
Water can act both as acid and base. In the Bronsted sense it acts as an acid with NH3 and a base with H2S.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 13

2. Reaction with Metals:
Water react with metals liberating hydrogen. Here water is reduced to hydrogen and metals is oxidised.
2Na + 2H2O → 2NaOH + H2

3. Hydrolysis reaction :
Several ionic and covalent compounds hydrolyse in water.
P4O10 + 6H2O → 4H3PO4
SiCl4 + 2H2O → SiO2 + 4HCl

4. Hydrates formation:
When several salts crystalysed as hydrated salts
Eg : i) [Cr (H2O)6] Cl3 – Coordinated water
ii) BaCl2.2H2O – Lattice water
iii) [Cu (H2O)4] SO4 . H2O. The H2O molecule outside the coordination sphere is hydrogen bonded water.

Question 6.
Explain the terms hard water and soft water. Write a note on the [Mar. ’18 (AP)]
i) ion-exchange method and
ii) Calgon method for the removal of hardness of water. [AP ’16; TS ’15 TS Mar. ’19]
Answer:
Water which gives ready and permanent lather with soap is called soft water.

Water which do not give ready and permanent lather with soap is called hard water.

Hardness of water is due to the presence of soluble chloride, sulphate and bicarbonate compounds of magnesium and calcium such as MgCl2, MgSO4, Mg(HCO3)2, CaCl2, CaSO4, Ca(HCO3)2.

1) Ion exchange method :
The water which is free from all the dissolved mineral salts is called deionised water.

Deionised water can be prepared in two steps.
1) Removal of cations :
Hard water is passed through a tank containing cation exchange resin. Then the Ca+2 and Mg+2 ions present in the water are replaced by H+ ions from the resin.
2R COOH + Ca+2 → [R (COO)]2 Ca + 2H+

2) Removal of anions:
Now the water coming from the cation tank is passed through a tank containing anion exchange resin. This resin absorbs anions like Cl, SO-224 etc. from the hard water and OH ions are released.
RNH33 OH + Cl → RNH+3 Cl + OH
2RNH+3 OH + SO-224 → (R – NH+3)2 SO-224 + 2OH

The H+ and OH ions unite to form Deionised water.

After sometime the cation resin and the anion resin lose their capacities to remove the cations and anions from the hard water. Then the resins are said to be exhausted. Then they are to be regenerated. The cation resin is regenerated by passing a solution of H2SO4. Anion resin is regenerated by passing a moderately concentrated solution of NaOH.

2) Calgon method :
Sodium hexametaphos- phate is commercially called as calgon.
When calgon is added to hard water it reacts with calcium and magnesium ions forming complex anions.
Na2 [Na4 (PO3)6] + 2Mg2+ → Na2 [Mg2 (PO3)6] + 4Na+
Na2 [Na4 (PO3)6] + 2Ca2+ → Na2 [Ca2 (PO3)6] + 4Na+

Due to the formation of the complex the Mg2+ and Ca2+ become inactive and cannot react with soap. So the water can give good lather. This method is used only for laundry process.

Question 7.
Write the chemical reaction to justify that hydrogen peroxide can function as an oxidizing as well as reducing agent. [TS Mar. ’18, (TS ’16; AP ’15]
Answer:
Hydrogen peroxide can act as both oxidising and reducing agent in both acid and basic medium.

Oxidation properties:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 14
Eg : H2O2 oxidises PbS to PbSO4 in acid medium
PbS + 4H2O2 → PbSO4 + 4H2O.

H2O2 oxidises formaldehyde to formic acid in basic medium.
2HCHO + H2O2 → 2HCOOH + H2

Reduction properties:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 15
Eg : H2O2 reduces acidified potassium per-manganate in acid medium.
2KMnO4 + 3H2SO4 + 5H2O2 → K2SO4 + 2MnSO4 + 8H2O + 5O2

H2O2 reduces potassium ferrycyanide in basic medium.
2K3 [Fe (CN)6] + 2KOH + H2O2 → 2K4[Fe (CN)6] + 2H2O + O2

Question 8.
Complete and balance the following chemical reactions:
i) PhS (s) + H2O2(aq) →
ii) MnO4 (aq) + H2O2 (aq) →
iii) CaO (s) + H2O (g) →
iv) Ca3 N2 (s) + H2O (l) →
Classify the above into (a) hydrolysis (b) redox and (c) hydration reactions.
Answer:
i) PbS + 4H2O2(aq) → PbSO4 + 4H2O
This reaction is redox reaction. Pbs is oxidised, H2O2 is reduced.

ii) 2MnO4 (aq) + 6H+ + 5H2O2 (aq) → 2Mn2+ + 8H2O + 5O2
This reaction is redox reaction. Here MnO4 is reduced while H202 is oxidised.

iii) CaO (s) + H2O (g) → Ca (OH)2
This reaction is hydration.

iv) Ca3 N2 (s) + 6H2O → 3Ca(OH)2 + 2NH3
This is hydrolysis reaction.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds

Question 9.
Discuss, with relevant chemical equations, various methods of preparing hydrogen peroxide. Which of these methods is useful to prepare D2 O2?
Answer:
Hydrogen peroxide can be prepared by the following methods.
1) By adding ice cold dilute sulphuric acid to barium peroxide gives hydrogen peroxide.
BaO2.8H2O (s) + H2SO4 (aq) → BaSO4 + H2O2 + 8 H2O

BaSO4 can be removed by filtration. Excess water can be removed by evaporation under reduced pressure.

2) Electrolysis of 50% H2SO4 using platinum anode and lead cathode gives H2O2.
2H2SO4 → 2H+ + 2HSO4
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 16

Hydrolysis of perdisulphuric acid gives hydrogen peroxide.
H2S2O8 + 2H2O → 2H2SO4 + H2O2.

3) Industrially it is prepared by the auto oxidation of 2 – alkylanthraquinols.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 17
K2S2O8 is used for the preparation of D2O2.
D2O2 can be prepared by dissolving K2S2O6 in heavy water.
K2S2O8 + 2D2O → 2KDSO4 + D2O2

Question 10.
In how many ways can you express the strength of H2O2? Calculate the strength of 15 volume solution of H2O2.in g/l. Express this strength in normality and molarity.
Answer:
i) Strength of H2O2 expressed in volumes:
Eg : 10 vol. H2O2, 20 vol. H2O2 and 100 vol. H2O2
20 vol. H2O2 means 1 ml of this solution liberates 20 ml of O2 gas at STP.
∴ 10 ml of 20 vol liberates 200 ml of oxygen at STP.
10 vol. H2O2 solution means 1 ml of this solution liberates 10 ml of O2 gas at STP.

ii) To express the strength in % (W/V) :
H2O2 decomposes, as shown below
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 18
1 mole of O2 gas is liberated from 2 notes of H2O2.
i.e., 22.4 lit of O2 is given by 2 × 34 g of H2O2.
∴ 10 lit of O2 gas at STP can be given by?
Weight of H2O2 in 1 lit of solution \(\frac{2\times34\times10}{22.4}\) = 30.36 g

30.36g (W/V) refers to the weight of H2O, in 1000 ml of solution.
∴ Strength of H2O2 = 3.036 % (W/V)
(Wt. of H2O2 in 100 ml solution is called its strength.)

iii) Molarity of H2O2 solution = \(\frac{30.36}{34}\) = 0.893 M

iv) Normality of solution is the number of gram equivalents of solute present in 1 lit of solution.
Equivalent weight of H2O2

TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 19

Strength of 15 vol H2O2 :
10 volume H2O2 is 3% W/V
15 volume H202 is
\(\frac{15\times3}{10}\) = 4.5 gm/100ml

∴ The wt. of H202 in 1 litre = 45 g/L
Normality of 10 vol. H2O2 is 1.786
Normality of 15 vol. H2O2 is
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 20

TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds

Question 11.
Explain the structure of the Hydrogen peroxide molecule.
Answer:
H2O2 has an open book structure. It is non-linear and non-polar. The two oxygen atoms are considered to be present on the spine of an open book. The two hydrogen atoms can be considered to be present on the two covers. H-O-O bond angle is 94° 48¹. O-O bond length is 1.48 A.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 Hydrogen and its Compounds 21