TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం

Telangana SCERT 10th Class Telugu Guide Telangana 5th Lesson నగరగీతం Textbook Questions and Answers.

TS 10th Class Telugu 5th Lesson Questions and Answers Telangana నగరగీతం

చదవండి – ఆలోచించి చెప్పండి (T.B. P.No. 47)

చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్ళు చెరుగుతున్నప్పుడు
సంసారం బరువెంతో సమీక్షించగలిగినవాణ్ణి
ఆకుపచ్చని చెట్టు, ఆహ్లాదభరితమైన వాతావరణమేమి
లేకుండానే
పగలూరాత్రి ఆస్బెస్టాస్ రేకులకింద పడి ఎంత వేడెక్కినా
మాడిపోకుండా ఉండగల్గిన మానవాతీతుణ్ణి
నరకప్రాయమైన నగర నాగరికతను నరనరానా
జీర్ణించుకున్నవాణ్ణి
రోజుకో రెండు కవితా వాక్యాల్ని రాయలేనా…
అది మనకు పెన్నుతో పెట్టిన విద్య… అఫ్ కోర్సు…
కవిత్వం ఎంత నిత్యనూతనంగా వెలికి వచ్చినా
రాసిన ప్రతిదీ ఆణిముత్యం కాదని అందరికి తెలుసు
– అలిశెట్టి ప్రభాకర్

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
“చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్ళు చెరుగు తున్నప్పుడు” వాక్యం ద్వారా మీరేం గ్రహించారు ?
జవాబు:
అర్ధాంగి ఇంట్లో సరుకులన్నీ ఉన్నప్పుడు సంతోషంగా వంటావార్పులు చేస్తుంది. ఇంట్లో సరుకులు లేనప్పుడు కన్నీళ్ళతో ఖాళీ చేటనే చెరుగుతుంది. చూచేవారికి ఇంట్లో అన్నీ ఉన్నట్లు అనుకుంటారు. దీనిద్వారా సంసారాన్ని నిర్వహించడం ఎంత కష్టమో తెలుసుకోవాలని కవి సూచించాడు.

ప్రశ్న 2.
కవి నివాసం ఎట్లా ఉన్నది ?
జవాబు:
పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం లేనటు వంటి పగలూ, రాత్రి ఆస్బెస్టాస్ రేకుల షెడ్లో రచయిత నివాసం ఉంటున్నాడు. ఆ ఇంట్లో సకల కష్టాలను అనుభవిస్తున్నాడు.

TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం

ప్రశ్న 3.
నగర నాగరికతను నరకప్రాయమని కవి ఎందుకు అని ఉంటాడు ? దానిపై మీ అభిప్రాయాలు చెప్పండి.
జవాబు:
నగర నాగరికత నరకప్రాయమని కవి చెప్పాడు. ఇది యదార్థమే. నగరంలో ప్రశాంత వాతావరణం ఉండదు. కలుషితమైన వాతావరణం ఉంటుంది. శబ్ద కాలుష్యం, ధ్వని కాలుష్యం, నీటి కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. మానవీయ సంబంధాలు అంతగా ఉండవు. జీవితం ఉరుకులుపరుగులతో కూడి ఉంటుంది. అందువల్ల నగర నాగరికతను నరకప్రాయమని కవి చెప్పాడు.

ప్రశ్న 4.
కవితాత్మక వాక్యాలు చదివారు కదా! ఈ కవి గురించి మీకు ఏమర్థమైంది ?
జవాబు:
జీవితాన్ని నిరాశానిస్పృహలతో గడపకూడదని, సాధించాల్సిన దానిని సాధించాలని, నరకప్రాయమైన నగర నాగరికతను కూడా జీర్ణించుకోవాలనే సత్యాన్ని చెప్పినట్లుగా అర్థమవుతుంది.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 50)

ప్రశ్న 1.
పల్లెసీమల్ని కవి తల్లిఒడితో ఎందుకు పోల్చాడు ?
జవాబు:
పల్లెసీమలు ప్రకృతి అందాలకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ప్రశాంత వాతావరణం పల్లెల్లో ఉంటుంది. మరువలేని, మరుపురాని ఆత్మీయతాను బంధాలు పల్లెల్లో ఉంటాయి. అక్కడి ప్రజలు ఒకరి కష్టసుఖాల్లో మరొకరు పాలుపంచుకుంటారు. తల్లి ఒడిలోని పిల్లవానికి ఎంత రక్షణ ఉంటుందో, పల్లెసీమలో ఉండే మనిషికి కూడా అంతటి రక్షణ ఉంటుందనే ఉద్దేశ్యంతో పల్లెసీమల్ని తల్లిఒడితో పోల్చాడు.

ప్రశ్న 2.
పట్టణాలను ‘ఇనప్పెట్టెలు’ అని అనడంలో కవి ఉద్దేశం ఏమై ఉంటుంది ?
జవాబు:
ఇనప్పెట్టెలను డబ్బు దాచుకోవడానికి వాడతారు. అవి చిన్నవిగా, ఇరుకుగా ఉంటాయి. ఇన ప్పెట్టెలో ఊపిరి పీల్చుకోడానికి కూడా గాలి రాదు. నగరాల లోని ఇళ్లలో కూడా తగినంత ఖాళీ ప్రదేశం లేక ఇరుకుగా ఉంటుంది. ఆ దృష్టితోనే కవి నగరాలను ఇనప్పెట్టెలతో పోల్చాడు.

ప్రశ్న 3.
‘నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే’ అనే వాక్యం గురించి మీకు ఏమర్థమైంది ?
జవాబు:
పఠనీయ గ్రంథంలో ఎన్నో విషయాలు చదివి తెలుసు కోవలసినవి ఉంటాయి. వాటిలో ఎంతో సమాచారం దాగి ఉంటుంది. అలాగే నగరంలో నివసించే ప్రతి మనిషికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. అక్కడ ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా జీవనం సాగిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తుల జీవన చరిత్రలు తప్పక తెలుసుకోతగ్గట్టుగా ఉంటాయి. అందుకే నగరంలో ప్రతి మనిషిని పఠనీయ గ్రంథం అని కవి చెప్పాడు.

TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం

ప్రశ్న 4.
“పేవ్మెంట్లపై విరబూసిన కాన్వెంటు పువ్వుల సందడి” అని కవి ఎవరి గురించి అన్నాడు ? దీని గురించి మీ అభిప్రాయం తెలుపండి.
జవాబు:
నగరంలో ఉదయాన్నే సిటీబస్సుల్లో, ఆటోల్లో, పేవ్మెంట్లపై విరబూసిన పువ్వుల్లాంటి స్కూల్ పిల్లలు సందడి చేస్తుంటారు. వారి మాటల్లో చదువుల పుప్పొడి రాలుతుంది. విరబూసిన పువ్వులతో పిల్లలను పోల్చాడు. పిల్లలు సుకుమార మనస్కులు. వారి నవ్వులు ఆహ్లాదంగా ఉంటాయి.

ఆలోచించండి – చెప్పండి. (T.B. P.No. 50)

ప్రశ్న 1.
“సిటీ అంటే అన్నీ బ్యూటీ బిల్డింగ్లు కావు!” ఇది వాస్తవమేనా ? ఎందుకు ?
జవాబు:
సిటీ అంటే అన్నీ బ్యూటీ బిల్డింగ్లు కావు. ఇది వాస్తవమే. ఎందుకంటే ఒకవైపు ఖరీదైన భవంతులు పక్క పక్కనే చిన్న చిన్న పూరిపాకలు సమాంతర గీతలుగా కనిపిస్తాయి. నగరం వైవిధ్యమైన సమస్యల తో, విభిన్న మనస్తత్వాలతో కనిపిస్తుంది. అనగా నగరంలో అందమైన భవనాలేకాదు, మురికివాడలు కూడా ఉంటాయని చెప్పడమే కవి ఉద్దేశ్యం.

ప్రశ్న 2.
రెండు కాళ్ళు, మూడు కాళ్ళు, నాలుగు కాళ్ళు అని కవి అనడంలో ఉద్దేశం ఏమిటి ?
జవాబు:
రెండుకాళ్ళు అంటే కాలినడక, మూడుకాళ్ళంటే రిక్షా, నాలుగుకాళ్ళంటే కారు అని అర్థం. అనగా వారివారి ఆర్థిక స్తోమతనుబట్టి మానవులు ప్రయాణం సాగిస్తారని భావం.

ప్రశ్న 3.
“మహానగరాల రోడ్లకి మరణం నాలుగువైపులు” అంటే ఏమిటి ?
జవాబు:
నగరంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. నగరంలో అన్నివైపులా ప్రమాదాలు పొంచి ఉంటాయి. నగరంలో నాలుగుదిక్కుల్లోని రోడ్లలో మృత్యువు పొంచి ఉంటుందని కవి హెచ్చరిస్తున్నాడు.

ప్రశ్న 4.
నగరాన్ని రసాయనశాల అనీ, పద్మవ్యూహం అనీ కవి అనడంలో ఉద్దేశం ఏమై ఉంటుంది ?
జవాబు:
రసాయనశాల అంటే రసాయనద్రవ్యాలు, ఆమ్లాలు ఉన్న ప్రయోగశాల అని అర్థం. ప్రయోగశాలలో ఏవేవో తెలియని రసాయన ద్రవాలూ, ఆమ్లాలు ఉంటాయి. ఆ ద్రవాలకు వేర్వేరు చర్యలు ఉంటాయి. వాటి చర్యలు అందరికీ అర్థం కావు. నగరం కూడా ఎవరికీ అర్థం కాదు. అందుకే నగరాన్ని కవి “రసాయనశాల” అన్నాడు.

ఇక పద్మవ్యూహం సంగతి. పద్మవ్యూహంలో ప్రవేశించినవాడు తిరిగి తేలికగా బయటకు రాలేడు. అక్కడే జీవనపోరాటం చేస్తూ మరణిస్తాడు.

నగరం కూడా ఇటువంటిదే, బతుకు కోసం నగరానికి వచ్చిన సామాన్యులకు ఉపాధి దొరకక పోయినా వారు ఏదో ఒక రోజున దొరుకుతుందనే ఆశతో, నగరంలోనే ఉండి దానికై ఎదురుచూస్తూ ఉంటారు. నగరంలోని సౌకర్యాలకూ, వినోద విలాసాలకూ, పైపై మెరుగులకూ వారు లొంగిపోతారు. మరోవైపు నిరుద్యోగం, అధిక ధరలు భయపెడుతున్నా నగరాన్ని విడిచి వారు వెళ్ళలేరు. వారిని కాలుష్యం కలవరపెట్టినా, వింత వింత జబ్బులు పీడిస్తున్నా, ట్రాఫికామ్లలో చిక్కుకుంటున్నా వారు నగరాన్ని విడిచి ప్రశాంతమైన తమ పల్లెలకు వెళ్ళలేరు. అందుకే కవి నగరాన్ని “పద్మవ్యూహం” అని పిలిచాడు.

TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
క్రింది అంశాలలో ఒకదాని గురించి చర్చించండి.

అ) మీరు ఇప్పటివరకు ఏయే నగరాలను చూశారు ? మీరు చూసిన నగరాల్లో మీకు నచ్చిన, నచ్చని అంశాలు తెలుపండి.
జవాబు:
నేను ఇప్పటి వరకు ఎన్నో నగరాలు చూశాను. వాటిలో నాకు నచ్చిన అంశాలు ఉన్నాయి, నచ్చని అంశాలు కూడా ఉన్నాయి. వాటిని ఈ పట్టిక ద్వారా తెలియజేస్తున్నాను.
TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం 1
TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం 2

ఆ) మీ ఊరి నుండి ఎవరైనా నగరాలకు వలస వెళ్ళారా ? ఎందుకు వెళ్ళవలసి వచ్చింది ? వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు ?
జవాబు:
మా ఊరు నుండి ఎంతోమంది యువతీయువకులూ, వివిధమైన చేతివృత్తులవారూ, బ్రాహ్మణులూ హైదరాబాద్ నగరానికి వలస వెళ్ళారు.

వలస వెళ్ళడానికి కారణం : మా గ్రామంలో వారికి సరైన ఉపాధి సౌకర్యాలు లేవు. విద్యా వైద్య సదుపాయాలు లేవు. ఇక్కడ వారికి ఉద్యోగాలు దొరకలేదు. అందువల్ల వారు నగరానికి వలస పోయారు. మా గ్రామంలో వ్యవసాయం వారికి గిట్టుబాటు కానందున, చిన్న చిన్న ఉద్యోగాల కోసం, కూలిపనుల కోసం, తాపీ, వడ్రంగం వంటి వృత్తుల వారు సైతం నగరాలకు వలసవెళ్ళారు. మరికొందరు యువకులు, సినీమా పరిశ్రమలో చేరి, తమ నైపుణ్యాన్ని పెంపొందించుకొని, నటులుగా కళాకారులుగా అభివృద్ధి చెందాలని. నగరానికి వలస వెళ్ళారు.

కొందరు యువకులు అక్కడ కూలీ పనులు చేస్తున్నారు. కొందరు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు. కొందరు లఘుపరిశ్రమలు పెట్టారు. కొందరు బ్రాహ్మణులు గుళ్ళలో పూజారులుగా, పురోహితులుగా పనిచేస్తున్నారు. కొందరు తమకు తెలిసిన చేతివృత్తులు చేసుకుంటూ అపార్ట్మెంట్ల వద్ద కాపలాదార్లుగా పనిచేస్తున్నారు.

ఇంజనీరింగ్ చదివిన యువతీ యువకులు నగరంలో శిక్షణ పొంది, చిన్న పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారిలో కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా, ప్రభుత్వంలో ఉద్యోగులుగా, ప్రైవేటు పరిశ్రమల్లో కార్మికులుగా, కొందరు నిరుద్యోగులుగా ఉంటున్నారు. కొందరు వైద్యశాలల్లో నర్సులుగా పనిచేస్తున్నారు.

ప్రశ్న 2.
పాఠం ఆధారంగా కింది కవితా పంక్తుల్లో దాగిన అంతరార్థాన్ని గుర్తించి రాయండి.

అ) నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే.
జవాబు:
పట్టణాల్లో నివసిస్తున్న ప్రతిమనిషి వెనుక ఎంతో చరిత్ర ఉంటుంది. వారంతా ఏదో వృత్తిని అన్వేషిస్తూ అక్కడకు వచ్చినవారే అయి ఉంటారు. వారిలో కొందరు నిరుద్యోగులు, కొందరు చిరుద్యోగులు, కొందరు విద్యార్థులుగా, బీదవారుగా, కొందరు మధ్యతరగతి వారుగా ఉంటారు. వారు ఎన్నో రకాల సమస్యలలో చిక్కుపడి ఉంటారు. వారందరిని గూర్చి పూర్తిగా తెలుసుకోవలసిన అవసరం ఉందని పై వాక్య సారాంశము.

గ్రంథం అట్ట చూసినంత మాత్రాన ఆ గ్రంథంలోని విషయం ఏమిటో తెలియదు. అలాగే నగరవాసి పై వేషభాషల్ని బట్టి అతడి చరిత్రను గ్రహించలేము. నగరవాసిని అడిగి తెలుసు కోవాలి. అతడు చదివి తెలుసుకోవలసిన పుస్తకం వంటి వాడని భావం.

ఆ) నగరం మహావృక్షంమీద ఎవరికి వారే ఏకాకి.
జవాబు:
వృక్షాలమీద ఉండే పక్షులు పరస్పరం కలిసిపోయి కలివిడిగా ఉంటాయి. నగరమనే మహావృక్షంమీద నివసించే ఈ మనుషులు సాటిమనిషితో ఎటువంటి ఆత్మీయ పలకరింపులు లేకుండా ఇరుగూ పొరుగనే భావన లేకుండా ఎవరికి వారే ఏకాకిగా బతుకు తుంటారు. ఈ యాంత్రిక మానసిక స్థితిని కవి నిరసిస్తున్నాడు.

ఇ) మహానగరాల రోడ్లకు మరణం నాలుగు వైపులు.
జవాబు:
నగరంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. నగరంలో అన్నివైపులా ప్రమాదాలు పొంచి ఉంటాయి. నగరంలో నాలుగు దిక్కుల్లోని రోడ్లలో మృత్యువు పొంచి ఉంటుందని కవి హెచ్చరిస్తున్నాడు. కావున రోడ్లపై జాగ్రత్తగా వెళ్ళాలని కవి స్పష్టం చేయదలచుకున్నాడు.

TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం

ప్రశ్న 3.
క్రింది వచన కవితను చదవండి.

నా జ్ఞాపకాల్లో గూడు కట్టుకొన్న మమతల ముల్లె
మలిన మెరుగని మట్టి మనుషుల ఎదమల్లె నా పల్లె!

చుట్టూ బాంధవ్యాల పాతాళ గరిగె నా పల్లె
అనుబంధాల పెరుగు గురిగి నా పల్లె!
తనువంతా తంగేడు పూలు పేర్చుకొన్న బతుకమ్మ
కాపురాజయ్య గీతల్లో బోనాలెత్తిన పల్లెపడతి బొమ్మ

అసోయ్ దూలాల పీరీల పండుగ
అలాయ్ బలాయ్లా దసరా పండుగ
ఆటల అల్లిబిల్లి జూలా నా పల్లె!
నా పల్లెలో మా ఇళ్ళు
ఊరంతటికి ఆనందాల్ని పంచే లోగిళ్ళు!

కవిత చదివారు కదా! కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) కవితలోని ప్రాస పదాలను గుర్తించి రాయండి.
జవాబు:
మమతల ముల్లె
ఎదమల్లె నా పల్లె
పాతాళగరిగె నా పల్లె

గురిగి నా పల్లె
పేర్చుకొన్న బతుకమ్మ
పల్లెపడతి బొమ్మ

పీరీల పండుగ
దసరా పండుగ
నా పల్లె
మా ఇళ్ళు
పంచే లోగిళ్ళు !

ఆ) కవితలో కవి ఏయే పండుగలు ప్రస్తావించాడు ?
జవాబు:
బతుకమ్మ, బోనాలు, పీరీల పండుగ, అలాయ్, బలాయ్, దసరా పండుగ.

ఇ) మనుషుల నడుమ బాంధవ్యాలను కవి వేటితో పోల్చాడు ?
జవాబు:
పాతాళ గరిగె, అనుబంధాల పెరుగు గురిగితో పోల్చాడు.

ఈ) కవితకు శీర్షిక పెట్టండి. ఎందుకు ఆ శీర్షిక పెట్టారో వివరించండి.
జవాబు:
ఈ కవిత కు శీర్షిక “నా పల్లె”. ఈ వచన కవితలో అంతా చక్కని పల్లె గురించి రాసాడు. కాబట్టి “నా పల్లె” అనే శీర్షిక పెట్టాను.

TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) అలిశెట్టి ప్రభాకర్ గురించి వ్రాయండి.
జవాబు:
కరీంనగర్ జిల్లా జగిత్యాల అలిశెట్టి ప్రభాకర్ జన్మస్థలం. మొదట చిత్రకారుడుగా జీవితం ప్రారంభించాడు. ప్రారంభంలో పండుగల, ప్రకృతి దృశ్యాల, సినీనటుల బొమ్మలను పత్రికలకు వేశాడు. తరువాత జగిత్యాలలో సాహితీ మిత్రదీప్తి’ సంస్థ పరిచయంతో కవిత్వ రంగంలోకి ప్రవేశించాడు. 1974 లో ఆంధ్రసచిత్ర వార్తాపత్రికలో వచ్చిన ‘పరిష్కారం’ అచ్చయిన ఆయన మొదటి కవిత. ఎర్ర పావురాలు (1978) మొదటి కవితా సంకలనం.

మంటల జెండాలు, చురకలు (1979), రక్తరేఖ (1985), ఎన్నికల ఎండమావి (1989), సంక్షోభగీతం (1990), సిటీలైఫ్ (1992) అచ్చయిన కవిత్వ సంకలనాలు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్ళపాటు సీరియల్గా ‘సిటీలైఫ్’ పేరుతో హైదరాబాదు నగరంపై రాసిన మినీ కవితలతో ప్రఖ్యాతిపొందాడు. తన కవిత్వంతో పాఠకుల్లో ఆలోచనాదృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన కవి అలిశెట్టి ప్రభాకర్.

ఆ) ‘నగరజీవికి తీరిక దక్కదు, కోరిక చిక్కదు’ అనే కవితా పంక్తుల్లోని వాస్తవాన్ని వివరించండి.
జవాబు:
నగరవాసులకు తీరిక ఉండదు. నగరంలో ఉద్యోగాలు చేసేవారు ఉదయమే బయలుదేరి దూరంగా ఉన్న తమ కార్యాలయాలకు ఉరుకులు పరుగులు పెడుతూ వెళ్లాలి. ట్రాఫిక్ఆమ్లు ఉంటాయి. కాబట్టి ఆఫీసు వేళకు చాలా ముందుగానే వారు బయలుదేరాలి. తిరిగి వచ్చేటప్పటికి పొద్దుపోతుంది.

అలాగే కూలిపనులు చేసి జీవించే వారికి కూడా వారికి పని దొరికే ప్రాంతానికి రావడానికీ, పోవడానికీ ఎంతో సమయం పడుతుంది. అందుచేత వారికి కూడా తీరిక దక్కదు.

ఎంత కష్టపడినా నగరజీవి చిరుసంపాదనతో వారి కోరికలు తీరవు. తిండికి, బట్టకూ, ప్రయాణాలకూ వారికి ఖర్చయిపోతుంది. అందువల్ల నగరవాసులకు తీరిక దక్కదు, కోరిక చిక్కదు అని కవి నిజం చెప్పాడు.

ఇ) నగర జీవితంలోని ప్రతికూల అంశాలను ఇంత కఠినంగా వర్ణించడంలో కవి ఆంతర్యం ఏమిటి ?
జవాబు:
‘నగరగీతం’ అనే పాఠ్యభాగం ద్వారా కవి నగర జీవన చిత్రాన్ని చక్కగా ఆవిష్కరించాడు. నగరంలోని కష్టాలను వివరించాడు. ప్రమాదాల గురించి, అసమానతల గురించి కూడా కవి చక్కగా తెలియజేశాడు.

కవి ఇంత కఠినంగా నగర జీవన చిత్రాన్ని ఆవిష్కరించడంలో ఆంతర్యం లేకపోలేదు. ముఖ్యంగా నగర జీవన విధానంలో మార్పు రావాలని, ప్రజలమధ్య అసమానతలు తొలిగి, ఐకమత్యం వర్థిల్లాలని, మురికి వాడలులేని సుందర నగరం ఉండాలని కవి ఆకాంక్షించాడు. అందుకోసమే నగర ప్రజలను జాగృతం చేయదలిచాడు.

ఈ) నగరంలో మనిషి జీవన విధానం గురించి పాఠం ఆధారంగా వివరించండి.
జవాబు:
‘నగరగీతం’ అనే పాఠ్యభాగంలో అలిశెట్టి ప్రభాకర్ నగర జీవన చిత్రాన్ని చక్కగా ఆవిష్కరించారు. నగరంలో జీవించే ప్రజల కష్టసుఖాలను వివరించిన తీరు అద్భుతంగా ఉంది. నగర ప్రజలు ఎప్పుడూ రణగొణ ధ్వనులతో ఇబ్బందులు పడతారు. ఇరుకైన ఇండ్లలోను, మురికివాడల్లోను జీవనం సాగిస్తారు. నగరంలోని మనిషి వెనుక ఆసక్తికరమైన ఆనంద, విషాద గాథలు ఉంటాయి. నగర ప్రజలకు ఏనాడు విశ్రాంతి దొరకదు. సంపాదించిన ధనంతో కోరికలను తీర్చుకోలేరు. రోడ్డు ప్రమాదాలతో ప్రజలు అవస్థలుపడతారు. చిక్కు విడదీయలేని పద్మవ్యూహంలాంటి నగరంలో ప్రజల దుస్థితి హృదయ విదారకంగా ఉంటుంది.

ప్రశ్న 2.
క్రింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ)
నేడు నగర జీవనం ఎందుకు సంక్లిష్టంగా మారిందో విశ్లేషించండి.
(లేదా)
నేడు నగర జీవితం ఎలా ఉన్నదో తెలుపండి.
(లేదా)
‘నగర జీవనం’ పాఠ్యాంశం ఆధారంగా నగరం ఎంత సంక్లిష్టంగా మారిందో వివరించండి.
జవాబు:
ప్రజలు వలసపోవటం : బ్రతుకు తెరువుకోసం, ఉపాధి కోసం ఎక్కువమంది పల్లె ప్రజలు నగరాలకు వలస పోవటం.
జనాభా పెరుగుదల : విద్యా, ఉద్యోగ అవకాశాలు, వైద్య సదుపాయాలు నగరాల్లో ఎక్కువగా ఉంటాయని ప్రజలు నగరాలకు వెళ్ళడంతో విపరీతంగా జనాభా పెరగటం.
రద్దీ పెరగటం : ప్రమాదాలు జరగటం, ఎప్పుడూ రోడ్లు రద్దీగా ఉండడంతో ప్రతిరోజు ప్రమాదాలు ఎక్కువగా జరగటం.

నీటి సమస్య : చెరువుల భూమి ఆక్రమణలకు గురియై భూగర్భ జలాలు తగ్గి త్రాగునీటికి, వాడుక నీటికీ కొరత ఏర్పడటం, ఉన్న చెరువులు, బావులు అవసరాలకు చాలకపోవటం.
కాలుష్యం పెరగటం : వాహనాలు, కర్మాగారాల్లో ఇంధనం ఎక్కువగా వాడటం, మురుగునీటి సౌకర్యాలు లేకపోవటంతో జల కాలుష్యం, వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం పెరగటం.

ధరల పెరుగుదల : జనాభా పెరగటంతో వస్తువులకు గిరాకీ పెరిగి ధరలు విపరీతంగా పెరిగిపోవటం. విదేశీ సంస్కృతి ప్రభావం : భిన్న సంస్కృతులు ప్రజలు ఒక్కచోట ఉండటంతో ప్రజలు విదేశీ వ్యామోహానికి గురికావటం.

సగటు మనిషి పడేపాట్లు : ఇరుకు ఇళ్ళల్లో, అధిక ధరలతో, రణగొణ ధ్వనులతో, నీటి వసతులు లేక, నిరంతరం జీవనపోరాటం చేస్తూ పద్మవ్యూహం లాంటి నగరంలో సగటు మనిషి ఎన్నో అగచాట్లు పడు తున్నాడు. క్లిష్ట సమస్యలను మానసిక సంఘర్షణతో ఎదుర్కోవటంతో నేడు నగర జీవితం నరకప్రాయంగా మారుతుంది.

TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం

ప్రశ్న 3.
క్రింది అంశాల గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

అ) మన పరిసరాల పరిశుభ్రత కోసం అందరూ కృషి చేయాలని తెలిపేటట్లు కరపత్రం రాసి ప్రదర్శించండి.
జవాబు:
పర్యావరణ పరిరక్షణ – పర్యావరణ స్పృహ

ఉపోద్ఘాతము :

మనము నివసించు భూమిపై మానవులే గాక గాలి, నీరు, చెట్లు, పర్వతాలు మొదలైనవి ఉంటాయి. ఈ మొత్తాన్నే వాతావరణం లేదా పర్యావరణం అంటారు. మనము ఎల్లప్పుడూ చక్కని ఆరోగ్యంతో ఉండాలంటే వీటిపై చక్కని అవగాహన కలిగి ఉండాలి. ఇట్లు అవగాహన కలిగి ఉండుటనే “పర్యావరణ స్పృహ” అని అంటారు. ప్రస్తుతం ఈ ఆధునిక యుగంలో మనం పీల్చేగాలి, త్రాగేనీరు, నివసించు స్థలం ఇవన్నీ కలుషితమే. రోజురోజుకీ మన ఆరోగ్యాన్ని హరిస్తూ ఆయుష్షును తగ్గిస్తున్నాయి. ఈ కాలుష్యం అనేది ప్రధానంగా 4 రకాలుగా ఉంటుంది.

1. వాయు కాలుష్యం
2. జల కాలుష్యం
3. ధ్వని కాలుష్యం
4. భూమి కాలుష్యం

1) వాయు కాలుష్యం : మనం ఎంతటి సౌకర్య వంతమైన జీవితం గడుపుతున్నా మనం ఉదయం పూట పీల్చే రెండు గంటల గాలి తప్ప మిగిలిన గాలంతా విషతుల్యమే. ఫ్యాక్టరీలు, వాహనాలు వదిలే పొగతో పాటు బొగ్గు, వంటచెరకు, చెత్తా చెదారం వంటివి కాల్చడం వలన మన ఎముకలకు, మూత్ర పిండాలకు, ఊపిరితిత్తులకు హాని జరిగి, అనేక రకాల భయంకరమైన రోగాలు వచ్చు ప్రమాదం ఉంది.

2) జలకాలుష్యం : నేడు మన భారతదేశంలోని ముఖ్యమైన 14 నదులతో పాటు అనేక ఉపనదులు, సరస్సులు, చెరువులు, తీవ్రమైన కాలుష్యానికి గురి అవుతున్నాయి. ఫ్యాక్టరీల నుండి వెలువడు మలినాలు, విషపదార్థాలు అనేకం నీటిలో కలవడం వలన జలకాలుష్యం జరుగుతున్నది. ప్రస్తుతం ప్రజలలో చాలా ఎక్కువ మంది ఈ నీటి కాలుష్యం వల్లనే బాధలు అనుభవిస్తున్నారు. దీని వలన మనకు కలరా, టైఫాయిడ్, మలేరియా మరియు డయేరియా వంటి వ్యాధులు వస్తాయి.

3) ధ్వని కాలుష్యం : ధ్వని కాలుష్యం నేడు పెద్ద పెద్ద పట్టణాలలో తీవ్రతరం అగుచున్నది. మోటారు వాహనాలు, ఫ్యాక్టరీలు, విమానాలు, రైల్వేలు, లౌడుస్పీకర్లు మొదలైనవి ధ్వని కాలుష్యానికి కారణాలు. దీని వలన మనకు చెవుడు, జ్ఞాపకశక్తి తగ్గిపోవుట, ఏకాగ్రత లోపించుట, తలనొప్పి, జీర్ణశక్తి తగ్గుట, రక్తపోటు గుండెదడ వంటి జబ్బులు వస్తాయి.

4) భూమి కాలుష్యం : ప్రాణులన్నీ భూమిపైనే నివసిస్తాయి. మనం జీవించడానికి కావలసిన ఆహారం భూమిపైనే లభిస్తుంది. అటువంటి భూమి రసాయన ఎరువుల వాడకం వల్ల నిస్సారమై పోతోంది. చెత్త, చెదారం, ప్లాస్టిక్ సంచుల వాడకం మొదలైన కారణాల వల్ల భూమి సమతౌల్యం దెబ్బతింటోంది.

కాలుష్య నివారణ మార్గాలు : వాతావరణం మనకు రక్షణ కవచం వంటిది. కాబట్టి చక్కని ఆరోగ్యం అందరికి కావలెనన్న ఈ పర్యావరణ పరిరక్షణ బాధ్యతను మనం మనందరి బాధ్యతగా గుర్తించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కాలుష్య నివారణకు తగిన చర్యలు చేపట్టాలి. వాహనాలు పొగను తగ్గించాలి.

నీరు కలుషితం కాకుండా చెరువులు, బావుల యందలి నీటిలో క్లోరిన్ వంటి క్రిమి సంహారక మందులు కలపాలి. మొక్కలు విస్తారంగా నాటి, సాధ్యమైనంత విశాల భూమిని పచ్చపచ్చగా ఉంచాలి. దంపతులైన వారు విధిగా కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించాలి. ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని నిషేధించాలి. ఎల్లరూ కూడ “వన రక్షణే జన రక్షణ” అన్న సూక్తిని మరువరాదు. “వృక్షో రక్షతి రక్షితః” “చెట్లు పెంచితే క్షేమం – నరికితే క్షామం”.

III. భాషాంశాలు

పదజాలం

1. క్రింది పదాలకు అర్థాలు రాయండి.

అ) నగారా
ఆ) సందడి
ఇ) ఘోష
ఈ) పఠనీయ గ్రంథం
జవాబు:
అ) నగారా : పెద్ద ఢంకా
ఆ) సందడి : జన సమూహధ్వని
ఇ) ఘోష : ఉరుము, ఆవులమంద, కంచు
ఈ) పఠనీయ గ్రంథం : చదువదగిన గ్రంథము

TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం

2. క్రింది పదాలకు పర్యాయపదాలు రాసి వాటితో వాక్యాలు రాయండి.

అ) నరుడు
ఆ) అరణ్యం
ఇ) రైతు
ఈ) పువ్వు
ఉ) మరణం
ఊ) వాంఛ
ఎ) వృక్షం

ఉదా ॥ పల్లె – గ్రామం, జనపదం

పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అని గ్రామస్వరాజ్యం కోసం గాంధీజీ కలలు కన్నాడు. జనపదాలను బాగుజేసుడే దేశ సౌభాగ్యమనుకున్నాడు.

అ) నరుడు – మానవుడు, మనిషి
నరుడు జ్ఞానవంతుడని, లోకంలో మానవుడు సాధించ లేనిది ఏదీలేదన్నారు. మనిషి తన శక్తి సామర్థ్యాలను వినియోగించుకోవాలి.

ఆ) అరణ్యం – విపినం, అడవి
అరణ్యంలో ప్రకృతి సౌందర్యం ఉట్టిపడుతుండటం వల్ల సింహాలు విపినంలో నివసిస్తాయి. అడవి జంతువులకు రక్షణ కావాలి.

ఇ) రైతు – కర్షకుడు, కృషీవలుడు

రైతు లేనిదే రాజ్యం లేదు. కర్షకుడు పండిస్తే పంటలు పండుతాయి అందువల్ల మనమంతా కృషీవలునికి ఋణపడియున్నాము.

ఈ) పువ్వు – కుసుమం, పుష్పం
ఉద్యానవనంలో గులాబీపువ్వు, మందార కుసుమం, మల్లెపుష్పం ఉన్నాయి.

ఉ) మరణం – మృత్యువు, చావు
పుట్టినవానికి మరణం తప్పదని తెలిసినా మానవుడు మృత్యువుకు భయపడతాడు. చావును ధైర్యంగా ఎదుర్కొనాలి.

ఊ) వాంఛ – కోరిక, ఇచ్ఛ
రవి తీరని వాంఛలను పొందలేక, వేరొక కోరిక కోరాడు. తన ఇచ్ఛ నెరవేరలేదని దిగులు చెందాడు.

ఎ) వృక్షం – చెట్టు, తరువు
ఇంటి ముందు వృక్షం ఉంటే ఆ చెట్టు గాలికి పరవశిస్తాము. తరువులపై జీవనం నిలిచియుంది.

వ్యాకరణాంశాలు

ప్రశ్న 1.
క్రింది కవితా భాగాల్లోని అలంకారాన్ని గుర్తించండి.

అ)నగారా మోగిందా
నయాగరా దుమికిందా
జవాబు:
ఇది అంత్యానుప్రాసాలంకారానికి చెందినది. ఇందులో ‘దా’ అనే హల్లు రెండు పదాల్లోను అంత్యంలో ప్రయోగించబడింది. అందువల్ల ఇది అంత్యానుప్రాసాలంకారం.

లక్షణం : ప్రాస పాదం చివర ఒక అక్షరంగాని, అక్షర సముదాయంగాని ఉండేటట్లు రచన చేయడాన్ని ‘అంత్యానుప్రాసం’ అని అంటారు.

ఆ)కొందరికి రెండు కాళ్ళు
రిక్షావాళ్ళకి మూడు కాళ్ళు
ఉన్నవాళ్ళకి నాలుక్కాళ్ళు
జవాబు:
ఇక్కడ అంత్యానుప్రాసాలంకారం ఉంది. ఈ ఉదాహరణలోని పాదాల్లో చివరగా ‘కాళ్ళు’ అనే హల్లుల జంట అంత్యప్రాసగా వాడబడింది. అందువల్ల ఇక్కడ అంత్యానుప్రాసాలంకారం ఉంది. లక్షణం : ప్రాస పాదం చివర ఒక అక్షరంగాని, అక్షర సముదాయంగాని ఉండేటట్లు రచన చేయడాన్ని ‘అంత్యానుప్రాసం’ అని అంటారు.

TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం

ప్రశ్న 2.
క్రింది పద్యాలలోని అలంకారాలను గుర్తించండి.

అ) అడిగెద నని కడువడిఁ జను
నడిగినఁదను మగుడ నుడుగఁడని నడ
యుడుగున్
వెడవెడ చిడిముడి తడఁబడ
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్
జవాబు:
ఇది వృత్త్యనుప్రాసాలంకారం.
లక్షణము : ఒకే హల్లు పలుమార్లు ఆవృత్తము చెందినది. కావున దీనిని వృత్త్యనుప్రాసాలంకారం అంటారు.

ఆ) రంగదరాతిభంగ; ఖగరాజతురంగ, విపత్పరంపరో
త్తుంగ తమఃపతంగ; పరితోషితరంగ, దయాంతరంగ; స
త్సంగ; ధరాత్మజా హృదయ సారస భృంగ; నిశాచరాబ్జ మా
తంగ; శుభాంగ ! భద్రగరి దాశరథీ! కరుణా పయోనిధీ !
జవాబు:
ఇందులో అంత్యానుప్రాసాలంకారం ఉంది. ఇక్కడ అంత్యప్రాసగా ‘గ’ అనే ఒకే హల్లు, రంగ అనే హల్లుల జంట వాడబడినాయి. అందువల్ల ఇక్కడ అంత్యాను ప్రాసాలంకారం ఉంది.

లక్షణం : ప్రాస పాదం చివర ఒక అక్షరంగాని, అక్షర సముదాయంగాని ఉండేటట్లు రచన చేయడాన్ని ‘అంత్యానుప్రాసం’ అని అంటారు.

రూపకాలంకారము

క్రింది వాక్యాలను పరిశీలించండి.

  1. ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేస్తాడు.
  2. బతుకాటలో గెలుపు ఓటములు సహజం.
  3. వానజాణ చినుకుపూలను చల్లింది.
  4. నవ్వులనావలో తుళ్ళుతూ పయనిస్తున్నాం..

పై వాక్యాలను గమనించారు కదా ! ఏం అర్థమయ్యింది. మొదటి వాక్యంలో జ్ఞానమే జ్యోతిగా చెప్పబడింది. ఇందులో జ్ఞానం ఉపమేయం.
జ్యోతి ఉపమానం. ఈ రెండింటికి భేదం లేనట్లు (అభేదం)గా చెప్పబడింది. ఇట్లా అభేదం చెప్పడాన్నే ‘రూపకాలంకారం’ అంటారు.
ఉదా :నగరారణ్య హోరు నరుడి జీవనఘోష.

సమన్వయం:ఇందులో నగరం ఉపమేయం. అరణ్యం ఉపమానం. ఇక్కడ ఉపమేయమైన నగరానికి, ఉపమానమైన అరణ్యానికి భేదం ఉన్నా, లేనట్లే చెప్పబడింది. కాబట్టి ఇది రూపకాలంకారం.
(ii) (iii) (iv) లలో ఒక వాక్యానికి సమన్వయం రాయండి.
జవాబు:
ii) బతుకాటలో గెలుపు ఓటములు సహజం.
సమన్వయం : ఈ వాక్యంలో బతుకు, ఆట వేరువేరు కాదు. బతుకు ఉపమేయం, ఆట ఉపమానం. ఈ రెండింటికి భేదం ఉన్నా లేనట్లు చెప్పబడింది. కాబట్టి ఇది రూపకాలంకారం.

iii) వానజాణ చినుకుపూలను చల్లింది.

సమన్వయం : వాన ఉపమేయం – జాణ ఉపమానం
చినుకు ఉపమేయం – పూలను
ఉపమానం.వాన, జాణ వేరైనప్పటికి అభేదం (భేదం లేనట్లు) చెపితే అది రూపకాలంకారం.

iv) ‘నవ్వులవానలో తుళ్ళుతూ పయనిస్తున్నాం’.

సమన్వయం : నవ్వులు అనేది ఉపమేయం వాన అనేది ఉపమానం భేదం లేనట్లు చెప్పటం.

పై ఉదాహరణలలో ఉపమేయమునకు, ఉపమాన మునకు భేదం ఉన్నా లేనట్లు చెప్పబడింది. కావున `ఇది రూపకాలంకారం.

ఇలాంటివి పాఠంలో వెతికి రాయండి. సమన్వయం చేయండి.
1. చదువుల పుప్పొడి
2. నగరం మహావృక్షం

1 వ వాక్యం : చదువుల పుప్పొడి
సమన్వయం : ఇందులో ‘చదువులు’ అనేది ఉపమేయం. ‘పుప్పొడి’ అనేది ఉపమానం. ఇక్కడ ఉపమేయమైన చదువులకు, ఉపమానమైన పుప్పొడికి, భేదం ఉన్నా, లేనట్లే చెప్పబడింది. కాబట్టి ఈ వాక్యంలో రూపకాలంకారం ఉంది.
2 వ వాక్యం : నగరం మహావృక్షం.
సమన్వయం: ఇందులో ‘నగరం’ అనేది ఉపమేయం. ‘మహావృక్షం’ అనేది ఉపమానం. ఇక్కడ ఉపమేయమైన నగరానికీ, ఉపమానమైన మహావృక్షానికీ భేదం ఉన్నా, లేనట్లే చెప్పబడింది. కాబట్టి ఈ వాక్యంలో రూపకాలంకారం ఉంది.

ప్రాజెక్టు పని

పల్లెలు / పట్నాలలోని జీవన విధానానికి గల తేడాలు పట్టికగా రాయండి. నివేదిక రాసి ప్రదర్శించండి.
జవాబు:
TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం 3

మీకు తెలుసా ?

పట్టణ వీధుల్లో విద్యుత్తు వాడకం తక్కువగా ఉండటానికి నియాన్ దీపాలను వాడుతారు. అయితే ఈ నియాన్ దీపాల వెలుగు ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నదని ‘ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సస్టైనబుల్’ అనే సంస్థ ప్రకటించింది. ముంబయి నగరంలో నియాన్ దీపాల వాడకాన్ని నిషేధించాలని ముంబయి నగరపాలక సంస్థ మీద కోర్టులో కేసు వేసింది. ముంబయి కోర్టు ఒక కమిటీని ఏర్పరచింది.

కమిటీ నివేదిక ప్రకారం నియాన్ దీపాల వెలుగు చాలా ఎక్కువగా ఉంటే మూర్ఛరోగం వచ్చే అవకాశం ఉంటుంది. కళ్ళు, మెదడుకు హాని కలిగిస్తుంది. అధికరక్తపీడనం, నరాలక్షీణత, అల్సరు వంటి రోగాలకు కారణమవుతుంది. అందువలన రాత్రి పదకొండు గంటలనుండి నియాన్ దీపాలను వాడరాదని హైకోర్టు తీర్పునిచ్చింది.

విశేషాంశాలు :

1.పద్మవ్యూహం : మహాభారతంలో ఈ మాట ఉంది. బయటకు వెళ్ళడానికి వీలు లేకుండా కట్టుదిట్టంగా శత్రువును బంధించే యుద్ధ వ్యూహం ఇది. భారతంలో అభిమన్యుడు ఈ పద్మవ్యూహంలో చిక్కుకొని వీర మరణాన్ని పొందాడు. ఎవరైనా తమ శత్రువులు పన్నిన, సంక్లిష్టమైన ఉచ్చులో పడినట్టయితే “అతడు పద్మ వ్యూహంలో చిక్కుకున్నాడు” అంటారు.

సూక్తి : సహజమైన పర్యావరణ పరిసరాలవల్ల జీవనానందం పునరుత్తేజం పొందుతుంది.
జీవించాలనే తపన నిరంతరం పునరావృత్తమవుతుంది.

TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం

అర్థ తాత్పర్యాలు

I

నగారా మోగిందా
నయాగరా దుమికిందా
నాలుగురోడ్ల కూడలిలో ఏమది ?
అదే, నగరారణ్యహోరు నరుడి జీవనఘోష

తల్లి ఒడివంటి
పల్లెసీమల్నొదిలి
తరలివచ్చిన పేదరైతులూ
ఇనప్పెట్టెల్లాంటి
ఈ పట్టణాల్లో
ఊపిరాడని మీ బతుకులూ

నగరంలో ప్రతిమనిషి
పఠనీయ గ్రంథమే
మరి నీ బతుకు
పేజీలు తిరగేసేదెవరో!

ఉదయమే
బస్సుల్లో రిక్షాల్లో
పేవ్మెంట్లపై విరబూసిన
కాన్వెంటు పువ్వుల సందడి
రాలే చదువుల పుప్పొడి!

అర్ధాలు

మినీ కవిత = గొప్ప ప్రాధాన్యం కల విషయాన్ని కొద్దిమాటలలో చెప్పడం (Mini Poetry)
నగారా, మోగిందా = పెద్ద ఢంకా, చేసిందా శబ్దం
నయాగరా దుమికిందా = ‘నయాగరా’ అనేది అమెరికాలోని పెద్ద జలపాతం. అది కిందికి దుమికిందా ? (దుమికినపుడు పెద్ద ధ్వని వస్తుంది.)
నాలుగురోడ్ల కూడలిలో = నాలుగు రోడ్లూ కలిసే చోటులో (Four Roads Junction)
ఏమది (ఏమి + అది) = ఏమిటి అది ?

అదే = ఆ ధ్వని
నగరారణ్యహోరు
(నగర +అరణ్య, హోరు) = పట్టణం అనే అరణ్యంలో వినిపించే ధ్వని, గాలి వీచేటప్పుడు వచ్చే ధ్వనిని “హోరు” అంటారు.
నరుడి, జీవనఘోష = మానవుడి బ్రతుకు పోరాటం లోంచి వచ్చిన ఉరుము వంటి శబ్దం.
తల్లి ఒడివంటి = అమ్మ ఒడిలాంటి
పల్లెసీమల్నొదిలి
(పల్లె సీమలన్+వొదిలి) = గ్రామ సీమలను వదలి (గ్రామసీమలను విడిచిపెట్టి)
తరలివచ్చిన పేదరైతులు = బయలుదేరి వచ్చిన బీద రైతులూ
ఇనప్పెట్టెల్లాంటి = ఇనుముతో చేసిన పెట్టెలవలె ఇరుకుగా ఉన్న

ఈ పట్టణాల్లో = ఈ నగరాలలోని ఇళ్ళలో
ఊపిరాడని
(ఊపిరి+అడని) = శ్వాస పీల్చుకోవడానికి కూడా గాలి దొరకని
మీ బతుకులూ = మీ జీవితాలు
నగరంలో ప్రతిమనిషి = పట్టణంలో నివసించే ప్రతి మనిషి కూడా
పఠనీయ గ్రంథమే = చదువదగిన పుస్తకం వంటి వాడే, (చదువదగిన పుస్తకం లాంటి వాడే పుస్తకం చదివితే, ఎన్నో విషయాలు తెలుస్తాయి. అలాగే నగరజీవి యొక్క చరిత్రను పరిశీలిస్తే, ఎన్నో జీవన సత్యాలు వెల్లడి అవుతాయని భావం. )

మరి నీ బతుకు = మరి నీ జీవితం అనే పుస్తకం యొక్క
పేజీలు తిరగేసేదెవరో = పుటలు ఎవరు తెరచి చదువుతారో ! (ఎవ్వరూ నగరజీవి చరిత్రను పట్టించుకోరని భావం. నగర జీవుల చరిత్రలలో ఆసక్తికరమైన, దుఃఖభరితమైన సంగతులు ఎన్నో ఉంటాయి. కాని ఎవ్వరూ అతడి వివరాలు జీవన విధానాలు పట్టించుకోరని కవి చెప్పారు)
ఉదయమే = ప్రొద్దున్నే
బస్సుల్లో, రిక్షాల్లో = స్కూలు వారు తీసుకెళ్ళే బస్సులలోనూ, సిటీబస్సుల్లోనూ, ఆటోరిక్షాల వారు తీసుకువెళ్ళే రిక్షాల్లోనూ.
పేవ్మెంట్లపై (Pavements) = రోడ్లు ప్రక్కన రాళ్ళు పరచి చదును చేసిన నడకదారుల పైన
విరబూసిన
(విరియబూసిన) = సమృద్ధిగా పూసిన
కాన్వెంటు పువ్వుల
సందడి = (convent) కాన్వెంటు బడులలో చదువుకొనే పువ్వుల వంటి పిల్లల గోల
రాలే చదువుల పుప్పొడి = ఆ పిల్లల మాటలు, ఆ పిల్లలనే పువ్వుల నుండి రాలిపడే పుప్పొడి లాంటివి.

తాత్పర్యము

అనేక వాహనాల శబ్దాలు, మనుషుల మాటలు, చిరు వ్యాపారుల అరుపులతో నగరంలోని నాలుగు రోడ్ల కూడలిలో వినిపించే రణగొణ ధ్వనులు గుండెలదిరిపోయేలా మోగిస్తున్న ఢంకానాదంలా, ఉధృతమైన వేగంతో దూకే నయాగరా జలపాతం హోరులా అనిపిస్తుంది. నిజానికది అరణ్యంలాంటి నగరం చేస్తున్న ధ్వనిలా, నగరజీవి బతుకు పోరాటంలోంచి వచ్చిన ఉఱుములాంటి శబ్దంలా ఉన్నాయని కవి వర్ణిస్తున్నాడు.

అమ్మఒడిలాంటి పుట్టిన ఊరిని వదిలి ఉపాధికోసం నగరం తరలివచ్చిన వారికి ఇంత పెద్ద పట్నంలో తలదాచు కోవడానికి కాసింత స్థలం కూడా దొరకదు. పేదరైతులు ఇనప్పెట్టెల్లాంటి ఇరుకిరుకు మురికి ప్రదేశంలో ఊపిరాడని స్థితిని అనుభవిస్తూ బతుకుతుంటారు.

నగరంలో ప్రతిమనిషీ చదువవలసిన ఒక పుస్తకం లాంటివాడు. అయితే ఎవరూ అతని బతుకు పుస్తకములోని పేజీలను చదివేవారు ఉండరు. నగరంలోని మనిషివెనక అనేక ఆసక్తికరమైన ఆనంద, విషాదగాథలుంటాయి. ఒక్క రైనా అతని బాగోగులు పట్టించుకునేవారే ఉండరనే చేదునిజాన్ని చెపుతున్నాడు కవి.

నగరంలో ఉదయాన్నే సిటీబస్సుల్లో, ఆటోల్లో, పేవ్మెంట్లపై విరబూసిన పువ్వుల్లాంటి స్కూల్పిల్లలు సందడి చేస్తుంటారు. వారి మాటల్లోంచి చదువుల పుప్పొడి రాలుతుంది.

TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం

II

సిటీ అంటే అన్నీ
బ్యూటీ బిల్డింగ్లు కావు
అటు భవంతులూ ఇటు పూరిళ్ళూ
దారిద్ర్యం, సౌభాగ్యం సమాంతర రేఖలు!

ఇది వెరైటీ సమస్యల మనుష్యుల
సమ్మేళన కోలాహలం!
ఎంతచేసినా ఎవరికీ
తీరిక దక్కదు కోరిక చిక్కదు

మెర్క్యూరీ నవ్వులు, పాదరసం నడకలు
కొందరికి రెండు కాళ్ళు
రిక్షావాళ్ళకి మూడుకాళ్ళు
ఉన్నవాళ్ళకి నాలుక్కాళ్ళు!

నగరంలో అన్నిపక్కలా
సారించాలి మన చూపులు
మహానగరాల రోడ్లకి
‘మరణం నాలుగువైపులు!

నగరం మహావృక్షంమీద
ఎవరికి వారే ఏకాకి!
నగరం అర్ధంకాని రసాయనశాల!
నగరం చిక్కు వీడని పద్మవ్యూహం!!

అర్ధాలు

సిటీ (City) = నగరం, పట్టణం
అంటే = అన్నట్లయితే
అన్నీ = అక్కడ ఉన్నవన్నీ
(Beauty Buildings) కావు = కావు
ఇటు పూరిళ్ళూ = మరింకోపక్క, గడ్డితో నేసిన ఇళ్ళు
దారిద్య్రం = బీదతనం
సౌభాగ్యం = ధనవైభవం (అదృష్టం)
సమాంతర రేఖలు = సమానమైన మధ్యదూరం గల రేఖలు (సమాంతర రేఖలు ఎంత దూరం పొడిగించినా కలిసికోవు)
ఇది = ఈ పట్టణం
వెరైటీ సమస్యలు
(Variety) = నానావిధాలయిన చిక్కులు గల
మనుష్యుల = మానవుల

సమ్మేళన కోలాహలం = కలయికల పెద్ద రొద (చప్పుడు)
ఎంతచేసినా = ఎంత కష్టపడి పనిచేసినా (ప్రొద్దుస్తమానం పనిచేసినా)
ఎవరికీ = నగరవాసులు ఎవరికీ
తీరిక = విశ్రాంతి
దక్కదు = లభించదు (అక్కడ మనిషికి విశ్రాంతి తీసుకోడానికి సమయం దొరకదు)
కోరిక = కోరిన కోరిక
చిక్కదు = దొరకదు (సంపాదించిన ధనం తో వారి కోరికలు తీరవు)

మెర్క్యురీ నవ్వులు (Mercury) = పాదరసం నవ్వులు (కృత్రిమపు నవ్వులు) (తెచ్చి పెట్టుకొన్న అసహజపు నవ్వులు)
పాదరసం నడకలు = పాదరసం దొర్లిపోయేలా, వేగంగా పరుగువంటి నడకలు
కొందరికి రెండు కాళ్ళు= నగరంలో ప్రయాణాలు చేసే వాళ్ళలో కొందరికి రెండు కాళ్ళు, అంటే వారు కాలి నడకన ప్రయాణాలు సాగిస్తారు. వారికి, వారి రెండు కాళ్ళే ప్రయాణ సాధనాలు

రిక్షావాళ్ళకి మూడుకాళ్ళు = రిక్షాల్లో తిరిగేవాళ్ళకు మూడు కాళ్ళు, అంటే మూడుచక్రాల రిక్షాలూ, ఆటో రిక్షాలూ వారి ప్రయాణ సాధనాలు.
ఉన్నవాళ్ళకి నాలుక్కాళ్ళు = డబ్బు ఉన్నవారికి నాల్గు కాళ్ళు అనగా నాల్గుచక్రాలు గల కార్లలో వారు తిరుగుతారు. అంటే వారి ప్రయాణసాధనాలు కార్లు.
నగరంలో = పట్టణంలో
అన్నిపక్కలా = అన్నివైపులకూ
సారించాలి = ప్రసరింపచేయాలి.(అన్నివైపులకూ చూస్తూ ప్రయాణం సాగించాలి)
మన చూపులు = మన చూపులను
మహానగరాల రోడ్లకి = పెద్ద పట్టణాలలోని రోడ్లకు

మరణం నాలుగువైపులు = నాలుగు వైపుల నుండి చావు రావడానికి సావకాశం ఉంటుంది. (ఏ వైపు నుండైనా, ఎవరైనా వచ్చి తమ వాహనంతో పొర పాటున గుద్దుతారు. అందువల్ల రోడ్డుపై నడిచేటప్పుడు నాలుగు వైపులకూ చూసుకుంటూ ఉండాలి. లేకపోతే ఏ వైపు నుంచైనా మరణం సంభవిస్తుంది,)

నగరం మహావృక్షంమీద = పట్టణం అనే ఒక పెద్ద చెట్టు మీద
ఎవరికి వారే ఏకాకి = ఎవరికి వారే ఒంటరిగా ఉంటారు.
నగరం = పట్టణం
అర్థంకాని = అది ఏమిటో తెలియని
రసాయనశాల = ప్రయోగశాల (Laboratory)
నగరం చిక్కువీడని
పద్మవ్యూహం = పట్టణం చిక్కులో తగిలిన నగరవాసులు, దాని నుండి తప్పించు కొని బయటకు రాలేని పద్మవ్యూహం వంటిది

తాత్పర్యము

నగరం నిండా అన్నివైపులా అందమైన ఎత్తైన భవనాలు ఉంటాయనుకోవద్దు. ఒకవైపు ఖరీదైన భవంతుల పక్కనే చిన్న చిన్న పూరిపాకలూ ఉంటాయి. ఇక్కడ ఐశ్వర్యం దారిద్ర్యం పక్కపక్కనే సమాంతర రేఖలుగా కనిపిస్తాయి. నగరం వైవిధ్యమైన సమస్యలతో, విభిన్న మనస్తత్వాలతో కలిసిపోయి కలకలంతో నిండి ఉంటుంది.

ఎంత నిరంత రాయంగా పనిచేసినా నగరంలోని మనిషికి విశ్రాంతి తీసుకోవడానికి అనువైన సమయం దొరకదు. సంపాదించిన ధనంతో కోరికను తీర్చుకునే తీరిక దొరకదు. కృత్రిమమైన వెలుగుల్లాంటి అసహజపు నవ్వులతో, స్థిరత్వంలేని హడావుడి నడకలతో వెళ్ళేవారు, ఆటోరిక్షాల్లో తిరిగేవాళ్ళు, కార్లలో ప్రయాణించే ధనవంతులూ ఉంటారు.

నగరంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. నగరంలో అన్నివైపులా ప్రమాదాలు పొంచి ఉంటాయి. నగరంలో నాలుగు దిక్కుల్లోని రోడ్లలో మృత్యువు పొంచి ఉంటుందని కవి హెచ్చరిస్తున్నాడు.

వృక్షాలమీద ఉండే పక్షులు పరస్పరం కలిసిపోయి కలివిడిగా ఉంటాయి. నగరమనే మహావృక్షంమీద నివసించే ఈ మనుషులు సాటిమనిషితో ఎటువంటి ఆత్మీయ పలకరింపులు లేకుండా ఇరుగూ పొరుగనే భావన లేకుండా ఎవరికి వారే ఏకాకిగా బతుకుతుంటారు. ఈ యాంత్రిక మానసిక స్థితిని నిరసిస్తున్నాడు కవి.

ప్రయోగశాలలో ఏవేవో రసాయన ద్రవాలు, ఆమ్లాలు ఉంటాయి. వాటి చర్యలు అందరికీ అర్థం కావు. నగరం అంతకంటే అర్థంకాని రసాయనశాలలా ఉంటుంది. నగరంలో బతుకుదామని వచ్చినవారు, ఉపాధి దొరకక పోయినా ఏదో ఒకరోజు దొరుకుతుందని ఆశగా వేచి చూస్తుంటారు. ఇక్కడి సౌకర్యాలు, విలాసాలు, వినోదాలు పైపై మెరుగులు బలంగా ఆకర్షిస్తాయి.

మరోవైపు నిరుద్యోగం, జీవనవ్యయం భయపెడుతున్నా నగరం విడిచి వెళ్ళబుద్ధికాదు. కాలుష్యం కలవరపెట్టినా, ట్రాఫిక్ జామ్ జీవితం ఇరుక్కు పోయినా నగరం విడిచి ప్రశాంతంగా మన పల్లెలకు వెళ్ళనివ్వని, చిక్కువిడదీయలేని పద్మవ్యూహం లాంటిది నగరం.

పాఠం నేపథ్యం / ఉద్దేశం

ఆధునిక కాలంలో మనుషులంతా నగరాల్లో జీవించాలని కోరుకుంటున్నారు. మరోవైపు పల్లెల్లో ఉపాధి అవకాశాలు తగ్గడంతో బతుకుతెరువుకోసం నగరాలకు వలసలు పెరిగాయి. నగరంలోని అనుకూలాంశాలన్నింటిని వినియోగించుకోవాలనే కోరికతో మనుషులు నగరంలో ఉండడానికి తాపత్రయపడుతున్నారు. దీనితో అనేక నగరాలు అత్యధిక జనాభాతో కిక్కిరిసిపోతున్నాయి. చాలా సమస్యలు పెరిగిపోయాయి.

ప్రపంచీకరణ ప్రభావంతో నగరం శర వేగంగా తన రూపం మార్చుకుంటున్నది. సామాన్యుడికి అంద నంత దూరంగా కదిలిపోతున్నది. మధ్యతరగతికి అంతుచిక్కని ప్రాంతంగా మారిపోయింది. మనిషి యాంత్రిక స్థితిలోకి మారిపోతున్నాడు. తనకుతానే పరాయీకరణకు గురవు తున్నాడు.

ఈ నేపథ్యంలో నగరజీవితంలోని యథార్థదృశ్యాల్ని మన కళ్ళముందు నిలుపుతూ, నగరపు మరో పార్శ్వాన్ని చూపుతూ, వాస్తవాల్ని కఠినంగా నిర్వచించిన తీరును తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం “మినీ కవిత” అనే ప్రక్రియకు చెందినది. ఏదైనా ఒక అంశాన్ని కొసమెరుపుతో, వ్యంగ్యంగా, చురకల తో తక్కువ పంక్తుల్లో చెప్పడమే మినీ కవిత.
‘అలిశెట్టి ప్రభాకర్ కవిత’ అనే గ్రంథంలోని ‘సిటీలైఫ్’ అనే మినీ కవితలలో కొన్నిటిని ‘నగరగీతం’ గా కూర్చడమైనది.

కవి పరిచయం

కవి పేరు : అలిశెట్టి ప్రభాకర్

జననం : 12-01-1954 వ సం॥

మరణం : 12-01-1993 వ సం॥

జన్మస్థలం : పూర్వపు కరీంనగర్ జిల్లా నేటి జగిత్యాల జిల్లా

తల్లిదండ్రులు : వీరి తండ్రి “అలిశెట్టి చినరాజం”, తల్లి “లక్ష్మి”.

వ్యాసంగం : మొదట ఆర్టిస్ట్గా ఎదిగాడు. ప్రారంభం లో పత్రికలకు పండగలు, ప్రకృతి, సినీనటుల బొమ్మలు వేసేవాడు. తరువాత జగిత్యాలలో ‘సాహితీ మిత్రదీప్తి’ సంస్థ పరిచయంతో కవిత్వ రంగంలోకి ప్రవేశించాడు. 1974లో ఆంధ్రసచిత్ర వారపత్రికలో వచ్చిన ‘పరిష్కారం’ అచ్చయిన మొదటి కవిత. జగిత్యాలలో ‘స్టూడియో పూర్ణిమ’ (1976), కరీంనగర్లో స్టూడియో శిల్పి’ (1979) హైదరాబాద్లో ‘స్టూడియో చిత్రలేఖ’ (1983) ఏర్పాటు చేసుకొని జీవిక కోసం ఫోటోగ్రాఫర్గా, జీవిత పోరాటంలో కవిగా ఎదిగాడు.

మొదటి కవిత : ‘పరిష్కారం’ అన్న వీరి కవిత, మొదటగా ఆంధ్రసచిత్ర వార్త పత్రిక లో అచ్చయ్యింది.

రచనలు :

  1. ఎర్ర పావురాలు (1978) మొదటి కవితా సంకలనం,
  2. మంటల జెండాలు, చురకలు (1979),
  3. రక్తరేఖ (1985),
  4. ఎన్నికల ఎండమావి (1989),
  5. సంక్షోభ గీతం (1990),
  6. సిటీలైఫ్ (1992)

అచ్చయిన కవిత్వ సంకలనాలు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్ళ పాటు సీరియల్గా ‘సిటీలైఫ్” పేరుతో హైదరాబాదు నగరంపై వ్రాసిన మినీ కవితలతో ప్రఖ్యాతి పొందాడు.

శైలి : కవిత్వాన్ని ఆయుధంగా మలచుకొని పాఠకుల్లో ప్రగతిని, ఆలోచనా దృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన కవి అలిశెట్టి ప్రభాకర్.

ప్రవేశిక

దృష్టిని బట్టి సృష్టి గోచరిస్తుంది.
కొందరిని కొన్ని సన్నివేశాలు విశేషంగా ఆకర్షిస్తాయి. సహృదయుడు ప్రతి కదలిక నుంచీ ప్రేరణ పొందుతాడు. అతనికి భాష ఆయుధమైతే, భావం కవితారూపం సంతరించుకుంటుంది.

నగరంలోని మూలలను, మూలాలనూ ఓ కవి హృదయం ఎట్లా దర్శించిందో- ‘అలిశెట్టి’ మినీ కవిత(లు) మన కళ్ళకు గడుతుంది. మనసు కిటికీ తెరిచి చూస్తే అక్షరాల వెనుక అనంత దృశ్యాలు కనిపిస్తాయి ……………

TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం

విద్యార్థులకు సూచనలు

  • పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠం లోని విషయాన్ని ఊహించండి.
  • పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత గీయండి..
  • వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పదవిజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకోండి

ప్రక్రియ -వచన కవిత

ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియలలో ‘వచన కవిత’ అనే ప్రక్రియ ముఖ్యమైనది. ఇది పద్య, గేయాల్లో ఉండే ఛందస్సు. మాత్రాగణాలతో సంబంధం లేకుండా, వ్యావహారిక భాషలో రాసే కవితను వచనకవితగా పేర్కొనవచ్చు. చిన్న చిన్న పద్యాలు, వాక్యాలతో ధ్వని గర్భితంగా ఉండే కవిత వచన కవిత.

పాఠ్యభాగ సారాంశము

అనేకరకాల వాహనాల శబ్దాలు, మనుషుల మాటలు, చిన్న వ్యాపారుల అరుపులతో నాలుగురోడ్ల కూడలి దద్దరిల్లిపోతుంది. నిజానికి ఆ శబ్దం నయాగరా జలపాతం హోరులా, నగరజీవి బతుకు పోరాటంలోంచి వచ్చిన ఉరుము లాంటి శబ్దంలా ఉంది. అమ్మఒడిలాంటి పుట్టిన ఊరును వదిలి ఉపాధికోసం కొందరు పట్టణాలకు వలసవెళ్తున్నారు. పేద రైతులు నగరంలో ఇనుప పెట్టెలవంటి ఇళ్ళల్లోను, మురికివాడల్లోను నివసిస్తుంటారు. నగరంలో ప్రతి మనిషి చదువవలసిన ఒక పుస్తకంలాంటివాడు. నగరంలోని మనిషి వెనుక ఆసక్తిదాయకమైన ఆనంద, విషాదగాథలు ఉంటాయి. పిల్లలు చదువులతో సందడిచేస్తుంటారు.

నగరంలో అందమైన ఎత్తైన భవనాలు ఒకపక్క ఉన్నా, మరొకపక్క మురికివాడలు కూడా ఉంటాయి. నగరంలోని మనిషికి విశ్రాంతి తీసుకోవడానికి అనువైన సమయం దొరకదు. కొందరు కాలినడకతో, మరికొందరు ఆటోరిక్షాల్లో, ధనవంతులు కార్లలో ప్రయాణంచేస్తూ ఉంటారు. నగరంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

నగరంలో ప్రమాదాలు అన్ని వైపులా పొంచిఉన్నాయి. నగర ప్రజలు పరస్పరం పలకరించుకోకుండా ఏకాకిగా బతుకు తారు. నగరం అర్థంకాని రసాయనశాలలా ఉంటుంది. ఇక్కడి సౌకర్యాలు, విలాసాలు, వినోదాలు, పైపై మెరుగులు బలంగా ఆకర్షిస్తాయి. మరోవైపు నిరుద్యోగం, జీవన వ్యయం భయపెడుతున్నా నగరం విడిచి వెళ్ళబుద్ధికాదు.

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

Telangana SCERT 10th Class Telugu Guide Telangana 12th Lesson భూమిక Textbook Questions and Answers.

TS 10th Class Telugu 12th Lesson Questions and Answers Telangana భూమిక

చదువండి – ఆలోచించి చెప్పండి (T.B. P.No. 120)

పుస్తకాలకు రెక్కలుండవు. కాని వాటిని చదివితే మనకు రెక్కలు మొలిచినట్లుగా ఉంటుంది. ఆ రెక్కలు జ్ఞానాన్ని, ఆలోచనాశక్తిని, సృజనాత్మకతా నైపుణ్యాన్ని, లోకపరిశీలనా దృష్టిని, జిజ్ఞాసను, ఉత్సాహాన్ని అందిస్తాయి. మంచిపుస్తకం ఉత్తమమిత్రునితో సమానం. శరీరానికి వ్యాయామం ఎట్లాంటి శక్తినిస్తుందో మంచిపుస్తకం చదవడంవల్ల మనసుకు అలాంటి ఉత్తేజం కలుగుతుంది. ఏది మంచిపుస్తకం, ఏ పుస్తకాన్ని చదువాలనే ఎంపికలో పుస్తక పరిచయవాక్యాలు మార్గదర్శనం చేస్తాయి.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
పుస్తకాలు చదువడంవల్ల కలిగే ప్రయోజనాలు ఏవి ?
జవాబు:
పుస్తకాలు జ్ఞానాన్ని, ఆలోచనా శక్తిని, సృజనాత్మక శక్తిని, లోకపరిశీలనా దృష్టిని, జిజ్ఞాసను, ఉత్సాహాన్ని అందిస్తాయి.

ప్రశ్న 2.
ఎటువంటి పుస్తకాలను చదువాలి ?
జవాబు:
మనకు స్ఫూర్తినిచ్చే, జ్ఞానాన్ని ఇచ్చే పుస్తకాలను చదువాలి.

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

ప్రశ్న 3.
‘ఏదైనా పుస్తకాన్ని చదువాలి’ అనే ఆసక్తిని కలిగించే అంశమేది ?
జవాబు:
పుస్తక పరిచయ వాక్యాలు మనకు ఏదైనా పుస్తకాన్ని చదువాలనే ఆసక్తిని కలిగిస్తాయి.

ప్రశ్న 4.
మీరు చదివిన కొన్ని పుస్తకాల పేర్లు చెప్పండి.
జవాబు:
మహాప్రస్థానం, మహాభారతం, రామాయణం, దేవరకొండ, అమృతం కురిసిన రాత్రి.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 124)

నెల్లూరి కేశవస్వామితో స్నేహం ………. సాహిత్యంలో ఈ కథలకు విశిష్ట స్థానం ఉంది.

ప్రశ్న 1.
కథలకు, కవిత్వానికి గల భేదం ఏమిటి ? మీకు ఏవంటే ఇష్టం ? ఎందుకు ?
జవాబు:
కథలు సరళభాషలో సాగే వచన రచన. విశిష్టమైన వస్తు, శిల్పంతో సాగే రచన కథలు. ఛందస్సుతో ముడిపడి సాగే రచన కవిత్వం. ప్రాసలతో, అలంకారములతో కూడిన రచన కవిత్వం. నాకు కవిత్వం అంటే ఇష్టం. వినసొంపుగా, పాడుకోవటానికి వీలుగా ఉంటుంది. అందుకని కవిత్వం అంటే నాకు ఇష్టం.

ప్రశ్న 2.
నాటి హైదరాబాదు రాజ్యంలో హక్కుల కోసం, స్వాతంత్య్రం కోసం ప్రజలు ఎందుకు ఉద్యమించి ఉండవచ్చు?
జవాబు:
తెలంగాణ రైతు పోరాటం జరిగింది. ఈ సాయుధ పోరాటంలో 4 వేల మంది చనిపోయారు. మరోవైపు రజాకార్లు విజృంభించి రైతాంగ పోరాటంపై దాడులు చేశారు. ఈ కారణాల వల్ల హక్కుల కోసం, స్వాతంత్ర్య కోసం ప్రజలు ఉద్యమించి ఉండవచ్చు.

ప్రశ్న 3.
హైదరాబాదు నగర జీవితాన్ని, సంస్కృతిని తెలుగులో చిత్రించడం అంటే మీకేమి అర్థమైంది ?
జవాబు:
హైదరాబాదు నగరంలోని ప్రజల జీవితాలను, సంస్కృతిని బాగా పరిశీలించాలి, విశ్లేషించాలి. ఆ పట్టణ ప్రజల మానసిక స్థితిని కూడా అవగాహన చేసుకోవాలి. సమాజంలో నానాటికి వస్తున్న మార్పులను ఆకళింపు చేసుకోవాలి.

ఫ్యూడల్ సమాజంలో ఉండే బాధలు, వ్యతిరేకతలు పరిశీలించాలి. ప్రజాస్వామ్యంలోని స్వేచ్ఛా వాయువుల హాయిని కూడా పరిశీలించాలి. రకరకాల కులవృత్తులను పరిశీలించాలి.

ఉద్యమాలు, రాజకీయ మార్పులు, సంస్కృతి, గ్రామీణ జీవితం ఇలా అన్ని కోణాలలోనూ హైదరాబాదు నగరాన్ని పరిశీలించాలి. పై వాటి నన్నింటినీ కళ్ళకు కట్టినట్లు వివరించడమే చిత్రించడం. అది తెలుగుభాషలో చేస్తే తెలుగులో చిత్రించడం అంటారని మాకర్థమైంది.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 125)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, …….. కేశవస్వామి హృదయం ఉంది.

ప్రశ్న 1.
అపార్థాలు ఎందుకు వస్తాయి ?
జవాబు:
అవగాహనా లోపం వలన అపార్థాలు వస్తాయి. ఎదుటి వ్యక్తిని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వలన, వారి ఆలోచనా విధానం నచ్చకపోయినా అపార్థాలు తలెత్తుతాయి. మరియు ఇద్దరి వ్యక్తుల మధ్య అభిప్రాయాలు విభిన్నంగా ఉండటం వలన అపార్థాలు ఏర్పడతాయి. అపార్థాలు మనిషిలోని ఆలోచనా శక్తిని వక్రమార్గంలో నడిపిస్తాయి. మనిషిని భ్రమకు లోనుచేసి వ్యక్తుల మధ్య సంబంధాలను దూరం చేస్తాయి.

ప్రశాంతంగా ఉండనివ్వదు. మనిషి ఆలోచనా శక్తిని, జ్ఞానాన్ని క్రమంగా క్షీణింప చేస్తుంది. ఆప్తులను, స్నేహితులను దూరం చేస్తుంది. గౌరవ మర్యాదలు తగ్గిస్తుంది. కనుక మనిషి కోపాన్ని దూరం చేసుకోవాలి. అపుడే అందరికీ ఆదర్శంగా ఉండగలము అనే విషయాన్ని గ్రహించాలి. మనిషికి కేవలం శాస్త్రజ్ఞానం మాత్రమే ఉంటే సరిపోదనీ, ఆత్మజ్ఞానం మరియు ఇంద్రియ నిగ్రహం ఉండాలని వ్యాసుని పాత్ర ద్వారా గ్రహింపవచ్చు.

ప్రశ్న 2.
‘చార్మినార్’ కథలను ఎందుకు చదువాలి ?
జవాబు:
చార్మినార్ కథలు కేవలం కథలు కావు. వాస్తవ జీవితంలో సామాజిక పరిణామాల సామాజిక చరిత్రను నిక్షిప్తం చేసుకున్న చారిత్రాత్మక కథలు. కాబట్టి తప్పక చదువాలి.

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

ప్రశ్న 3.
రెండు మతాల మధ్య ఆలోచనలు, సంస్కృతిలో ఆదాన ప్రదానాలు జరగడం అంటే ఏమిటి ?
జవాబు:
11వ శతాబ్దం నుండి ఇండియాలో సాగిన ముస్లింల వలసలు, రాజ్యాలు, అవి తెచ్చిన పరిపాలనా విధానాలు, జీవనవిధానం, సంస్కృతి, భారతీయ సంస్కృతిపై, జీవన విధానంపై చెరగని ముద్ర వేసాయి. భారతీయ సంస్కృతిలో, జీవితంలో అంతర్భాగమైనాయి. అవి హిందూ ప్రజల జీవితంలోకి కూడా ప్రవేశిస్తూ రెండు మతాల మధ్య ఆలోచనల్లో, సంస్కృతిలో, జీవితంలో ఆదానప్రదానాలు జరిగాయి. అలా ఒక నూతన సమన్వయ సంస్కృతి విస్తరించిందని దాని అర్థం.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 127)

అందులో భాగంగా చూసినప్పుడు …………. వజ్రాల వంటివే స్వర్గీయ నెల్లూరి కేశవస్వామి కథలు

ప్రశ్న 1.
హృదయ సంస్కారం అంటే ఏమిటి ? కొన్ని ఉదాహరణలు చెప్పండి.
జవాబు:
హృదయ సంస్కారం అంటే మనసులో ఉండే మంచి భావన. నాకు మా తాతగారు, అమ్మా, నాన్నలు మంచి ప్రవర్తన అలవర్చుకోవాలని చాలా విషయాలు, కథలు చెబుతుంటారు.

ఉదాహరణకు మా తాతగారు మా గ్రామంలో జరిగిన ఒక సంఘటన చెప్పారు. మా తాతగారి చిన్నతనంలో బాల్యవివాహాలు జరిగేవిట. ఒకసారి మా గ్రామంలో ఒక 12 సం॥ల అమ్మాయిని పెళ్ళిచూపులు చూసుకొందుకు 60 సం॥ల వృద్ధుడు వచ్చేడుట. ఆ అమ్మాయిది చాలా పేద కుటుంబం. డబ్బుకు ఆశపడి వృద్ధుడికి పెళ్ళి చేద్దామనుకొన్నారు. వృద్ధుడు అమ్మాయి నచ్చిందన్నాడు.

వాళ్ళడిగిన డబ్బిచ్చాడు. ఆ అమ్మాయిని వృద్ధుడు ‘నేను నీకు నచ్చానా?’ అన్నాడుట. భయం, భయంగా ‘ఊ’ అందిట. ‘మరి, నేను చెప్పినట్లు వింటావా ?’ అన్నాడట, ‘ఊ’ అంది. ‘నీకేమిష్టం ?” అన్నాడు. ‘చదువు’ అంది అమ్మాయి.

అంతే వృద్ధుడు పకపకానవ్వాడుట. ‘పెళ్ళి ముహూర్తం పెట్టించమంటారా ? బాబూ అని అమ్మాయి తండ్రి అడిగాడుట.

‘పెట్టించండి. కానీ, పెళ్ళికి కాదు. దత్తతకు, ఈ రోజు నుండి మీ బంగారుతల్లి నాకు బంగారు తల్లి అయింది. బాగా చదివిస్తాను. మంచి కుర్రాడికిచ్చి పెళ్ళిచేస్తాను. రామ్మా ! మనింటికి వెడదాం’ అన్నాడట. ‘అదీ హృదయ సంస్కారం’ అన్నారు మా తాతగారు. ఆ అమ్మాయి తర్వాత బాగా చదువుకొని జిల్లా కలెక్టరైందిట. ఎంతోమంది పేదల జీవితాలలో వెలుగులు నింపిందట.

ప్రశ్న 2.
“స్నేహం మతాల సరిహద్దులను చెరిపివేస్తుంది”? – సమర్థించండి.
జవాబు:
అవును. “స్నేహాని కన్న మిన్న లోకాన లేదు కన్నా” అని కదా ! ఇది మతం, కులం, ప్రాంతం, భాషలను చూడదు. స్నేహం త్యాగాన్ని కోరుతుంది. “కేవలం మనుషులం” కథలో హుస్సేన్మీర్జా, మహబూబ్ సక్సేనా దశాబ్దాల స్నేహితులు. వారి స్నేహానికి మతం అడ్డు రాలేదు. ఇది చక్కని కథ. నేను స్నేహం మతాల సరిహద్దులను
చెరిపివేస్తుందని నమ్ముతాను.

ప్రశ్న 3.
పేదల కష్టాలు ఎట్లా ఉంటాయి ? పేదల జీవితాల్లో మార్పులు రావడానికి ఏం చేస్తే బాగుంటుంది ?
జవాబు:
పేదల కష్టాలు వర్ణించటానికి కూడా వీలుకానివి. ఆర్థికం, సామాజికం అనే సమస్యలతో అతలాకుతలం అవుతారు. వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలంటే ప్రభుత్వం వారికి ఆర్థిక స్వావలంబన కల్పించాలి. రాయితీలు ఇవ్వాలి. సబ్సిడీలు ఇవ్వాలి. వారికి ప్రభుత్వం విశ్వాసం, భరోసా కల్పించాలి.

కూడు, గుడ్డా, నీడ కల్పిస్తే చాలావరకు వారి జీవితాల్లో వెలుగులు (మార్పులు) వచ్చినట్లే.

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
కవులు, రచయితలు రాసిన పుస్తకాలను అందరికీ పరిచయం చేయడానికి పుస్తకావిష్కరణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇటువంటి కార్యక్రమాలలో ఏమేం చేస్తారో చెప్పండి.
జవాబు:

  1. సభా నిర్వహణ : అతిథులను, పుస్తక రచయితనూ, సమీక్షకున్నీ వేదికపైకి పిలిచి సభ నిర్వహిస్తారు.
  2. పుస్తకావిష్కరణ : ముఖ్య అతిధి చేతుల మీదుగా పుస్తకాన్ని ఆవిష్కరింపజేస్తారు.
  3. పుస్తక సమీక్ష : సమీక్షకుడు పుస్తకంలోని అంశాలను రేఖా మాత్రంగా స్పృశిస్తూ పుస్తకాన్ని పరిచయం చేస్తారు.
  4. ప్రసంగాలు : అతిథులు పుస్తకం గురించి, రచయిత గురించి ప్రశంసిస్తూ మాట్లాడతారు.
  5. కవి సత్కారం : పుస్తక రచయితను అందరూ సన్మానిస్తారు.
  6. కవి స్పందన : ఈ కార్యక్రమ నిర్వహణపై కవి లేదా రచయిత తన స్పందనను తెలియజేస్తారు.

ప్రశ్న 2.
నేటి సమాజానికి ఎటువంటి రచయితల అవసరం ఉందో చెప్పండి.
జవాబు:
మానవ మనస్తత్వాన్ని, సమాజంలోని కుళ్ళునూ, సమాజపు స్థితిగతులను కళ్ళకు కట్టినట్లు చూపించే రచయితలు అవసరం. సమాజానికి ప్రతినిధిగా రచయిత ఉండాలి. నిజాన్ని నిర్భయంగా చెప్పగలగాలి. ఒక సమస్యను చూపి, దానికి పరిష్కారాన్ని కూడా చెప్పగలిగే రచయితలు అవసరం.

సమాజంలోని రుగ్మతలను, మూఢనమ్మకాలను, దురాచారాలను ఖండించగలిగే నిర్భయత్వం గల రచయితలు కావాలి. ఉదాహరణకు వేమన, శ్రీశ్రీలాంటి వారు నేటి సమాజానికి చాలా అవసరం.

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

ప్రశ్న 3.
ఈ పాఠం ఆధారంగా కింది పట్టికను పూరించండి.
జవాబు:
TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక 1

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) ‘ఒక భాషలోని సాహిత్యం చదవడం ద్వారా నాటి పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు’ దీనిపై మీ అభిప్రాయం చెప్పండి.
(లేదా)
‘ఒక భాషలోని సాహిత్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా అప్పటి సమాజ స్థితిగతులను గ్రహించవచ్చు’ దీన్ని విశ్లేషించండి.
జవాబు:
నెల్లూరి కేశవస్వామి గారి ‘చార్మినార్ కథలు’ చదివితే ఆనాటి నవాబుల గురించి తెలుసుకోవచ్చు. ఆనాటి డేవిడీల గురించి తెలుసుకోవచ్చు. ఆనాటి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు తెలుస్తాయి. అలాగే ఆ రోజులలో కల్మషం ఎరుగని స్నేహాలు, ఆత్మీయతలు, కులమతాలకు అతీతమైన వారి మమతలు తెలుస్తాయి.

అలాగే ఆంగ్లసాహిత్యం చదివితే, ఆంగ్ల దేశాల ఆచార వ్యవహారాలు తెలుస్తాయి. బ్రిటిషుకాలంనాటి ఇంగ్లాండు పరిస్థితులు తెలియాలంటే ఆనాటి బ్రిటన్ సాహిత్యం చదవాలి. ప్రేమచంద్, కిషన్చందర్ సాహిత్యం చదివితే ఆనాటి ఉర్దూ, హిందీ భాషా ప్రాంతాల ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు తెలుస్తాయి.

రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలు చదివితే ఆనాటి బెంగాల్ పరిస్థితులు తెలుస్తాయి. వారి సంప్రదాయాలు తెలుస్తాయి.

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

ఆ) తెలంగాణ పలుకుబడులంటే ఏమిటి ? కొన్ని ఉదాహరణలు రాయండి.
(లేదా)
తెలంగాణ భాషలోని పలుకుబడులను గురించి విశ్లేషించండి.
జవాబు:
పలుకుబడి అంటే ఉచ్ఛారణము, వచో నిబంధనము, ఒడంబడిక, మాటచెల్లుబడి అని నిఘంటువులో చెప్పబడింది. తెలంగాణ ప్రాంతంలోని మాట చెల్లుబడి, మాటల ఉచ్ఛారణము అని అర్థం. ఏ భాషకైనా పలుకుబడులు, జాతీయాలు, గుండెకాయ (ముఖ్యమైనవి) వంటివి. అవి భాషను పదికాలాల పాటు నిలిపి ఉంచుతాయి.

ఉదాహరణలు :

సామెతలు :

  1. అతి రహస్యం బట్టబయలు.
  2. నక్క నదిలో కొట్టుకుపోతూ ప్రపంచమంత మునుగు- తుందన్నదట.
  3. మావోనికి ముప్ఫైరెండు గుణాలు మంచియే రెండే రెండు పాడు తనకు దెలది ఒకడు చెపితే వినడు.
  4. చెరువుల పడ్డాన్ని తీసి బావిలేసినట్లు.

జాతీయాలు :

జాతీయం – సందర్భం

  1. అగ్గిబుక్కుట – కోపంతో ఉడికిపోవుట
  2. ఉడుంపట్టు – గట్టి పట్టుదల
  3. ఒంటికోతి – ఏకాకి, ఒంటరివాడు
  4. కడుపు కుటుకుట – ఓర్వలేనితనం

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

ఇ) “తెలంగాణ కథ పుట్టుక నుండి సామాజిక చైతన్యం తోనే కొనసాగుతూ వచ్చింది” అనే వాక్యం ద్వారా మీకేమర్థ మయిందో తెలుపండి.
(లేదా)
తెలంగాణ కథల పుట్టుక గురించి, సామాజిక చైతన్యం గురించి రాయండి.
జవాబు:
కథ, వస్తు, శిల్ప నైపుణ్యంతో ఉంటుంది. తెలంగాణ కథ మొదటి నుండి సామాజిక పరిణామాలను చిత్రిస్తూ వచ్చింది. 1902 నుండి తెలంగాణ కథ ప్రారంభమైంది. పుట్టుకనుండి సామాజిక చైతన్యంతోనే కొనసాగుతూ వచ్చింది. ఉద్యమాలు, పోరాటాలు మున్నగునవి పలు కోణాల్లో చిత్రించబడ్డాయి. 1918లో స్థాపించబడిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇందుకు తోడ్పడింది. ఈ విధంగా తెలంగాణ కథ పుట్టుక నుండి సామాజిక చైతన్యం, ఉద్యమాలు, పోరాటాలను చూపిస్తూ వచ్చిందని నాకర్థమయింది.

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

ప్రశ్న 2.
కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబులు రాయండి. “మెతుకును చూసి అన్నం ఉడికిందో లేదో చెప్పవచ్చు”. అట్లే “పుస్తక పరిచయ వ్యాసాన్ని లేదా సమీక్షను చదివితే కూడా ఆ పుస్తకం గురించి ఆమూలా గ్రంగా అర్థం చేసుకోవచ్చు” ఎట్లాగో రాయండి.
(లేదా)
పుస్తక సమీక్ష ద్వారా ఆ పుస్తకము యొక్క విశేషాలను తెలుసుకోవచ్చు. దీన్ని సమీక్షించండి.
జవాబు:

  1. పీఠిక లేదా సమీక్షను చదివితే చాలా విషయాలు తెలుస్తాయి.
  2. పుస్తకం యొక్క ఆశయాన్ని, అంతస్సారాన్ని, తాత్త్వికతను, రచయిత దృక్పథాన్ని సవివరంగా వివరిస్తుంది పుస్తక సమీక్ష.
  3. ఇది విశ్లేషణాత్మకంగా ఉంటుంది.
  4. నైతిక విలువలను వివరిస్తుంది.
  5. సామాజిక బాధ్యతను తెలియజేస్తుంది.
  6. మానవుల మనస్తత్వాన్ని, సంఘర్షణను తెలుపుతుంది.
  7. చార్మినార్ కథలు సామాజిక పరిణామాలకు సాహిత్య రూపం ఇచ్చిన సామాజిక చరిత్ర అని చెప్పవచ్చును.
  8. పాఠకుడు మూలగ్రంథాన్ని చదివే తీరిక లేనప్పుడు పుస్తకం సమీక్ష కొంతవరకు విషయాన్ని మనకు తేటతెల్లం చేస్తుంది.
  9. పుస్తక సమీక్షలు ఆధారం ఒక్కొక్కసారి ఒక గ్రంథంతో ప్రజాదరణ పొందిన సందర్భాలూ ఉన్నాయి.
  10. నిష్పక్షపాతంగా, నిర్భయంగా రచనలను సమీక్ష చెయ్యాలి. అప్పుడు మాత్రమే ఆ పుస్తకం ఆమూలాగ్రంగా అర్థంచేసుకోటానికి వీలు కలుగుతుంది.
  11. పుస్తక సమీక్షను చదివితే ఆ గ్రంథాన్ని ఆమూలాగ్రం చదువాలనే ఉత్సాహం, ఉత్సుకత కల్గించేలా సమీక్ష ఉండాలి.

(లేదా)

ఆ) కేశవస్వామి కథల గురించి గూడూరి సీతారాం రాసిన వ్యాసం ఆధారంగా కేశవస్వామి రచనల గురించి రాయండి. (Mar. ’15)
(లేదా)
కేశవస్వామి రచనల విశిష్టతలను విశ్లేషించండి.
జవాబు:
విశిష్టమైన వస్తు, శిల్ప నైపుణ్యంతో మహోన్నతమైన కథలు రాసిన నెల్లూరి కేశవస్వామి భారతీయ కథా సాహిత్యంలో సుప్రసిద్ధమైన ప్రేమ్చంద్, కిషన్ చందర్ లతో పోల్చదగిన వారు.

  1. తొలి కథల సంపుటి “పసిడి బొమ్మ”. ఇది 1969 ఆగస్టులో వెలువడింది.
  2. రెండవ కథా సంకలనం “చార్మినార్ కథలు”. ఇవి కేవలం ఊహాజనిత కథలు కావు. సామాజిక పరిణామాలకు సాహిత్యరూపం ఇచ్చిన సామాజిక చరిత్ర రచన ఇది. దీనిలో హైదరాబాద్ రాజ్య చరిత్ర, సంస్కృతిని, మానవ సంబంధాలను, ఇక్కడి ముస్లిం జీవితాలను అపూర్వంగా చిత్రించారు.
  3. “యుగాంతం” కథలో హైదరాబాద్ గురించి వివరించారు. ఇండియా రెండు దేశాలుగా విడిపోయి నాటి పరిస్థితులు, సంక్షోభాలు, హత్యాకాండ ఎట్లా జీవనాన్ని కుదిపేసాయో అట్లే హైదరాబాద్ రాజ్యంలో 1946 – 50ల మధ్య పరిస్థితులు ఎలా కొనసాగాయో వివరించబడింది. సమాజం, మానవ సంబంధాల గురించి వివరించబడింది.
  4. “వంశాకురం” కథలో ముస్లిం పెళ్ళి సంబంధాలు ఎలా ఉంటాయో, కొడుకు పుట్టాలనే ఆశ ఆడపిల్లల జీవితాలను ఎలా అతలాకుతలం చేసి ఆత్మహత్యకు పురికొల్పుతాయో హృదయ విదారకంగా చిత్రించింది.
  5. “కేవలం మనుషులం’ కథలో హుస్సేన్ మిర్జా, మహబూబ్రాయ్ సక్సేనాల మతాల సరిహద్దులను చెరిపివేసిన స్నేహం గురించిన చక్కని కథ.
  6. “భరోసా కథ” నమ్మిన పేదలను నట్టేట ఎలా ముంచుతారో భరోసాను భగ్నం చేసిన యదార్థ కథ.
  7. “ఆఖరి కానుక” కథ రోజు రోజుకు పేదరికంలోకి ఈడ్వబడుతున్న ముస్లిం కుటుంబాలు అరబ్బు దేశాల షేక్లకు తమ కూతుళ్ళను ఇచ్చి పెళ్ళిచేసి తద్వారా కాస్త ఆర్థిక సౌలభ్యం పొందాలనుకునే దుస్థితిని తెలియచేస్తుంది.

ఈ విధంగా కేశవస్వామి కథల గురించి గూడూరి సీతారాం గారు అద్భుతంగా, సజీవంగా, సప్రమాణకంగా వ్యాసం రాశారు.

ప్రశ్న 3.
కింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

అ) మీ పాఠశాల గ్రంథాలయంలోని ఏదైనా ఒక కథల పుస్తకం తీసుకొని చదువండి. దీనికి పుస్తక పరిచయం (పీఠిక) రాయండి.
జవాబు:
వివిధ రంగాల్లో కృషిచేసిన మహిళామూర్తుల సేవలను స్మరిస్తూ ‘మహిళావరణం’ అనే గ్రంథాన్ని కొందరు రచించారు. దీనికి ముందుమాటను ప్రముఖ వ్యాసకర్తలు రచించారు. సమాజంలో వివిధరంగాల్లో రమణీయమైన సేవలను చేసిన వారి త్యాగాలను, సాహసాలను చక్కగా వివరించారు.

ఎందరో స్త్రీలు ఉద్యమాలు చేశారు. చదువులు చదివారు. రాజకీయ నాయకులైనారు. డాక్టర్లు అయ్యారు. నాటక, క్రీడ మొదలైన రంగాల్లో రాణించారు. అయినా వారికి తగిన గౌరవం చరిత్రలో దొరకలేదు. పురుషాధిక్యంతో స్త్రీల సేవలను చరిత్ర గుర్తించడం లేదు. స్త్రీలందరు అద్భుతమైన చరిత్ర నిర్మాణానికి ఎంతో మూల్యం చెల్లించారు. ఎన్నో త్యాగాలు చేశారు.

వివిధ రంగాలలో ప్రసిద్ధి చెందిన మహిళలను ఎంపిక చేసి, వారి వివరాలు, వారి ఇంటర్వ్యూలను కలిపి ‘మహిళావరణం’ అనే పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఆర్థికపరమైన భారాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక వందమంది మహిళల గురించి మాత్రమే ఇందులో ప్రస్తావించారు.

వారికి సంబంధించిన వివరాలను ఈ పుస్తకంలో పొందుపరచారు. ఈ పుస్తక నిర్మాణంలో ఎందరో తమ సహాయసహకారాలను అందించారు. వారందరి సేవలు చిరస్మరణీయంగా ఉంటాయి. రచయితలు వారందరికి కృతజ్ఞతలు తెలియజేశారు.

III. భాషాంశాలు

పదజాలం

ప్రశ్న 1.
గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి.

అ) రాజు ధ్యాస అంతా క్రికెట్ ఆటపైనే ఉన్నది.
జవాబు:
దృష్టి (ఆలోచన)

ఆ) ప్రజ్ఞ, మనోజ్ఞ ఇద్దరూ సఖ్యత తో మెలుగుతారు.
జవాబు:
స్నేహం

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

ఇ) ఫల్గుణ్ హస్తవాసి చాలా మంచిది.
జవాబు:
చేతిచలువ

ఈ) తెలంగాణలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రఖ్యాతి చెందింది.
జవాబు:
మిక్కిలి ప్రసిద్ధి.

ఉ) పూర్వం జమీందారులు దేవిడీలలో చర్చాగోష్ఠులు జరిగేవి.
జవాబు:
సంపన్నులు నివసించే పెద్ద భవంతి

ప్రశ్న 2.
కింది పదాలను వివరించి రాయండి.
జవాబు:
అ) హృదయసంస్కారం : మనసుకు సంబంధించిన సంస్కారం. ఇది ఎంతో విలువ కలిగినది. సొంత కూతురులా నవాబు, నవాబు కొడుకు ఒక ముజ్రాల రమణిని గౌరవించిన తీరును చిత్రించడం ద్వారా ముస్లిం నవాబుల్లో కొనసాగిన హృదయ సంస్కారాన్ని రచయిత ఒడిసిపట్టారు.

ఆ) సామాజిక పరిణామం : సమాజపరంగా జరిగే మార్పు యుగాంతం కథలో వివరించబడింది. మానవ సంబంధాలు, మారుతున్న పరిణామాలను చిత్రించడం వల్ల కథకు “యుగాంతం” అనే పేరు సార్ధకతను చేకూర్చింది.

ఇ) భారతీయ సంస్కృతి : ఇది ఎంతో విశిష్ఠమైంది. 11వ శతాబ్దం నుండి ఇండియాలో సాగిన ముస్లిం వలసలు, రాజ్యాలు, అవి తెచ్చిన పరిపాలనా విధానాలు, జీవన విధానం, సంస్కృతి భారతీయ సంస్కృతిపై జీవన విధానంపై చెరగని ముద్ర వేసారు.

ఈ) అతలాకుతలం : విపరీతంగా శ్రమపడడం లేదా క్రింది లోకం, పైలోకం అల్లకల్లోలమైనంత శ్రమ అనే అర్థంలో దీన్ని వాడతారు. అతలము అనగా ‘పాతాళము’. కుతలము అనగా భూమి అని అర్థం.

వ్యాకరణాంశాలు

1. కింది పదాలకు విగ్రహవాక్యాలురాసి, సమాసాలు గుర్తించండి.

అ) దశకంఠుడు = దశ కంఠములు కలవాడు – బహువ్రీహి సమాసము
ఆ) పీతాంబరుడు = పీతము అంబరముగా కలవాడు – బహువ్రీహి సమాసము
ఇ) అరవిందానన = అరవిందము ఆననముగా కలది – బహువ్రీహి సమాసము
ఈ) మృగనేత్ర = మృగము వంటి నేత్రములు కలది – బహువ్రీహి సమాసము
ఉ) చంచలాక్షి = చంచలమైన అక్షములు కలది – బహువ్రీహి సమాసము
ఊ) మానధనులు = మానమే ధనముగా కలవారు – బహువ్రీహి సమాసము
ఋ) రాజవదన = రాజు యొక్క వదనం కలవాడు – బహువ్రీహి సమాసము
ౠ) నీరజభవుడు = నీరజము నుండి పుట్టినవాడు – బహువ్రీహి సమాసము

2. కింది ప్రత్యక్ష వాక్యాలను పరోక్ష వాక్యాలుగా మార్చండి.

అ) “హైదరాబాదు రాజ్యం ఇండియన్ యూనియన్లో విలీనమైంది” అని సర్దార్ వల్లభభాయ్ పటేల్ ప్రకటించాడు. (ప్రత్యక్షం)
జవాబు:
హైదరాబాదు రాజ్యం ఇండియన్ యూనియన్లో విలీనమైందని సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రకటించాడు. (పరోక్షం)

ఆ) “తెలుగు కథాసాహిత్యంలో రమణీయమైన పోకడలు కల్పించిన ప్రసిద్ధ కథకుల్లో ఒకరు నెల్లూరి కేశవ స్వామి” అని గూడూరి సీతారాం అన్నాడు. (ప్రత్యక్షం)
జవాబు:
తెలుగు కథాసాహిత్యంలో రమణీయమైన పోకడలు కల్పించిన ప్రసిద్ధ కథకుల్లో ఒకరు నెల్లూరి కేశవస్వామియని గూడూరి సీతారాం అన్నాడు. (పరోక్షం)

ఇ) “చార్మినార్ అనే పేరును బట్టే ఈ కథల విశిష్టత వ్యక్తమవుతుంది” అని డి. రామలింగం పేర్కొన్నాడు. (ప్రత్యక్షం)
జవాబు:
చార్మినార్ అనే పేరును బట్టే ఈ కథల విశిష్టత వ్యక్తమవుతుందని డి. రామలింగం పేర్కొన్నాడు. (పరోక్షం)

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

3. కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా మార్చండి.

అ) పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితుల గురించి భీష్మ సహాని “తమస్” నవలలో చిత్రించాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితుల గురించి భీష్మసహాని చేత తమస్ నవలలో చిత్రించబడింది. (కర్మణి వాక్యం)

ఆ) హైదరాబాద్ రాష్ట్ర చరిత్రను ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత మూలకు నెట్టివేశారు. (కర్తరి వాక్యం)
జవాబు:
హైదరాబాద్ రాష్ట్ర చరిత్ర ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత మూలకు నెట్టివేయబడింది. (కర్మణి వాక్యం)

ఇ) నెల్లూరి కేశవస్వామిని భారతదేశం గర్వించ దగిన గొప్ప కథకుల్లో ఒకడిగా కీర్తించారు. (కర్తరి వాక్యం)
జవాబు:
నెల్లూరి కేశవస్వామి భారతదేశం గర్వించదగిన గొప్ప కథకుల్లో ఒకడిగా కీర్తించబడ్డారు. (కర్మణి వాక్యం)

శ్లేషాలంకారం

కింది వాక్యాలను పరిశీలించండి.

అ) మిమ్ముమాధవుడు రక్షించుగాక !
అర్థం :

  1. మిమ్ము మాధవుడు (విష్ణువు) రక్షించుగాక !
  2. మిమ్ము ఉమాధవుడు (శివుడు) రక్షించుగాక !

ఆ) మానవ జీవనం సుకుమారం.
అర్థం :

  1. మానవ (ఆధునిక) జీవనం సుకుమారమైంది.
  2. మానవ (మనిషి) జీవనం సుకుమారమైంది.

పై అర్థాలను గమనించినారు కదా ! ఒకే శబ్దం రెండు వేర్వేరు అర్థాలనందిస్తున్నది. (విభిన్న అర్థాలు ఆశ్రయించి ఉన్నాయి.) ఇట్లా విభిన్న అర్థాలను కలిగి ఉండే పదాలుంటే దానిని ‘శ్లేషాలంకారం’ అని అంటారు.

లక్షణం : నానార్థాలను కలిగి ఉండే అలంకారం శ్లేష.

4. కింది లక్ష్యాలలో ఉన్న అలంకారాన్ని గుర్తించి సమన్వయం చేయండి.

1. రాజు కువలయానందకరుడు :
రాజు = ప్రభువు, చంద్రుడు
కువలయం = భూమి, కలువపూవు
ఆనందకరుడు = ఆనందింప చేసేవాడు
1వ అర్ధములో = ప్రభువు భూమిని ఆనందింప చేసేవాడు.
2వ అర్థములో = చంద్రుడు కలువ పూవులను ఆనందింపచేసేవాడు.
అనేకమైన అర్థాలు గల శబ్దాలను ఉపయోగించి చెబితే దాన్ని శ్లేషాలంకారం అని అంటారు.

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

2. నీవేల వచ్చెదవు.

  1. నీవు ఏల వచ్చెదవు = నీవు ఏల వచ్చెదవు.
  2. నీవేల వచ్చెదవు = నీవు ఏ సమయంలో వచ్చెదవు.
    ఇట్లా ఒకే వాక్యంలో రెండు కానీ అంతకుమించి అర్థాలను కానీ కూర్చడమే శ్లేషాలంకారం.

5. క్రింది వాక్యాల్లోని అలంకారాలను గుర్తించండి.

అ) మావిడాకులు తెచ్చివ్వండి.

  1. మామిడి ఆకులను తెచ్చి ఇవ్వమని ఒకటి.
  2. మా ‘విడాకులను’ తెచ్చి ఇవ్వమని ఒకటి అర్థం స్ఫురిస్తుంది. ఇది శ్లేషాలంకారం.

ఆ) వాడి కత్తి తీసుకోండి.

  1. వాడి యొక్క కత్తిని తీసుకోమని
  2. వాడియైన (పదును గల) కత్తిని తీసుకోమని ‘అర్థం’ వాడబడింది.
    ఇది శ్లేషాలంకారం.

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

ఇ) “ఆమె లత పక్కన నిలుచున్నది”.

  1. ఆమె లత అనే ఆమె ప్రక్కన నిలుచున్నది (ఒక అర్థం)
  2. ఆ, మెలత (స్త్రీ), ప్రక్కన నిలుచున్నది (రెండవ అర్థం) ఇది శ్లేషాలంకారం.

ప్రాజెక్టు పని

వార్తా పత్రికలు లేదా మ్యాగజైన్లలో వచ్చిన పుస్తకం పరిచయాలను / సమీక్షా వ్యాసాలను సేకరించండి. నివేదిక రాసి తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:
బతుకు పుస్తకం అనేది సావిత్రి సమగ్ర రచనా సంపుటిలోనిది. బతుకు పుస్తకం లక్ష్మణరావుగారి జీవితచరిత్ర. ఇది ఆంధ్రజ్యోతి వారి వారపత్రికలో ధారావాహికంగా వెలువడింది.

‘బతుకు పుస్తకం’ రచయిత లక్ష్మణరావుగారు నిజాయితీ గల సాహితీమూర్తి అని రచయిత్రి నమ్మకం. బతుకు పుస్తకం చదవడానికి ముందే లక్ష్మణరావు గారు రచించిన ‘అతడు-ఆమె’ పుస్తకాన్ని రచయిత్రి చదివిందట. లక్ష్మణరావుగారి మీదా, ఆయన జీవితభాగస్వామి మెల్లీ మీదా రచయిత్రికి మంచి అభిమానం ఉంది.

లక్ష్మణరావుగారు మంచి సహృదయుడైన రచయిత అనడానికి ఉదాహరణలు ఇచ్చింది. మెల్లీ కరుణ గల విజ్ఞాని అని, మహా సాహసి అని, పట్టుపట్టి తాను అనుకున్నది సాధించే గుణం కలదని, అనడానికి సబర్మతి జైలులో ఆమె చేసిన సత్యాగ్రహం సంఘటనను పేర్కొంది.

లక్ష్మణరావుగారు కరుణ గల విజ్ఞాని అని, ఆయన చూపిన విజ్ఞత, ప్రపంచం పట్ల ఆయన చూపిన బాధ్యత మరచిపోరానివని గుర్తు చేసింది. మన దేశానికి ఉపయోగించని పరిశోధనలు అనవసరం అని పరిశోధనలకు స్వస్తి చెప్పి అనువాదక వృత్తిని ఆయన చేపట్టిన విషయాన్ని రచయిత్రి గుర్తు చేసింది.
మొత్తముపై లక్ష్మణరావుగారి జీవితంలోని ముఖ్య సంఘటనలను, బతుకు పుస్తకం నుండి రచయిత్రి ఎత్తి చూపింది.

విశేషాంశాలు

1. హైదరాబాద్ రాజ్యం : 1724లో అసఫ్ జాహీ వంశీయుడైన నిజం ఉల్ముల్క్ ఈ రాజ్య స్థాపకుడు. ఇతడు మొగలాయీ చక్రవర్తులకు అత్యంత విశ్వాసపాత్రుడు. హైదరాబాద్ రాజ్యాన్నే ‘హైదరాబాద్ సంస్థానం’ అనే పేరుతో వ్యవహరించేవారు. ఏడుగురు నిజాం వంశీయులు ఈ రాజ్యాన్ని పరిపాలించారు. రాజ్యంలో ప్రస్తుత తెలంగాణతో పాటు నేటి కర్ణాటకలోని మూడు, మహారాష్ట్రలోని ఐదు జిల్లాలు కలిసి ఉండేవి.

2. తెలంగాణ రైతాంగపోరాటం: వందలాది ఎకరాలు కలిగిన భూస్వాములు, వారికి అండదండలు అందించిన నిజాం ప్రభుత్వంపై రైతులు చేసిన పోరాటం ఇది. చారిత్రాత్మకమైన ఈ పోరాటం 1946-51 సంవత్సరాల మధ్య కొనసాగింది. భూమికోసం – భుక్తి కోసం – బానిసత్వ విముక్తికోసం పేదరైతులు చేసిన ఈ సాయుధ పోరాటం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది.

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

3. దేవిడి : నిజాం పాలనా కాలంలో నిర్మించిన పెద్ద పెద్ద భవనాలను ‘దేవిడీ’ లు అనే పేరుతో పిలిచేవారు. ఇవి పెద్ద భవంతులు. వీటిలో సంస్థానాలకు చెందిన సంపన్నులు నివసించేవారు. హైదరాబాద్ పాతనగరం తోపాటు తెలంగాణలోని పలు పట్టణాలలోనూ పాతబడిన దేవిడీలు కనబడతాయి.

4. పాన్దాన్ : తాంబూలాన్ని వేసుకునేవారు. తమలపాకులతోపాటు సున్నం, కాచు, పోకలు, ఇతర సుగంధ ద్రవ్యాలను ఒక చిన్న పెట్టెలో సర్దిపెట్టుకునేవారు. దానిని ‘పాన్దాన్’ అనే పేరుతో వ్యవహరించేవారు. ఇది ఉర్దూపదం.

5. కోహినూర్ : కుతుబ్షాహిల ఖజానాలో ఉండేది ఈ కోహినూర్ వజ్రం. ఈ వజ్రం బరువు 750 ఇంగ్లీషు కారెట్లుగా నిర్థారించారు. కోహినూర్ వజ్రం ప్రపంచంలోని వజ్రాల చరిత్రలోనే అత్యంత విలువైనది, విశిష్టమైనది.

సూక్తి : మంచిపుస్తకం మంచిమనసుకు మరోపేరు సొంతపుస్తకం మంచి మనిషికి మరోతోడు.

చదువండి – తెలుసుకొండి

విశ్వకవి ‘గీతాంజలి’

సాహిత్య సృజనలో అంతర్జాతీయ కీర్తినందుకొన్న మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్. కవిగా రచయితగా తత్త్వవేత్తగా సంగీతజ్ఞుడిగా చిత్రకారుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించాడు. రవీంద్రునిపేరు వినగానే చప్పున స్ఫురించేవి. ‘జనగణమన’ గీతం, ‘గీతాంజలి’. ‘జనగణమన’ గీతం భారత జాతీయగీతంగా గుర్తింపబడింది.

బంగ్లాదేశ్ జాతీయగీతం కూడా ఇతని లేఖిని నుండి వెలువడినదే. ఇలా రెండు జాతీయగీతాలనందించిన కవిగా అపూర్వ చరిత్రను సృష్టించాడు. ‘శాంతినికేతన్’ పేరున ఆదర్శవిద్యాలయాన్ని స్థాపించి ‘గురుదేవుడు’గా కీర్తింపబడ్డాడు. ఈ సంస్థద్వారా సంస్కారయుక్తమైన విద్యనందించాడు.

కవిగా ఇతనికి ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చిన రచన ‘గీతాంజలి’. 1913లో దీనికి ‘నోబెల్ సాహిత్య పురస్కారం’ దక్కింది. నోబెల్ బహుమతిని అందుకున్న తొలి భారతీయుడిగా ఠాగూర్ అరుదైన గౌరవాన్ని పొందాడు. ‘గీతాంజలి’ భారతీయ భాషల్లోకి మాత్రమేకాక ఎన్నో విదేశీ భాషలలోకి అనువదింపబడింది. ఒక్క తెలుగు భాషలోనే దాదాపు 50 దాకా అనువాదాలొచ్చాయంటే దీని గొప్పదనమేమిటో ఊహించవచ్చు. తాత్త్విక, సామాజిక అంశాలను స్పృశిస్తూ సాగిన ఈ రచన పాఠకుని హృదయాన్ని కదిలిస్తుంది.

‘గీతాంజలి’లోని రెండు అనువాద కవితా ఖండికలను ఇప్పుడు చూద్దాం.

1. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో
ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో
ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో
సంసారపు గోడలమధ్య ఎక్కడ భాగాల కింద ప్రపంచం విడిపోలేదో

ఎక్కడ సత్యాంతరాళంలోంచి పలుకులు బైలు వెడలతాయో
ఎక్కడ అలసటనెరగని శ్రమ తన బహువుల్ని పరిపూర్ణతవైపు జాస్తుందో
ఎక్కడ నిర్జీవమైన ఆచారపుటెడారిలో స్వచ్ఛమైన బుద్ధిప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో
ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకీ, కార్యాలలోకీ నీచే నడపబడుతుందో
ఆ స్వేచ్ఛా స్వర్గానికి, తండ్రీ! నా దేశాన్ని మేల్కొలుపు. – చలం

2. నా హృదయంలోని పేదరికాన్ని సమూలంగా తొలగించు ప్రభూ – ఇదే నా ప్రార్థన.
నా సుఖదుఃఖాలను తేలికగా భరించ గలిగే శక్తిని నాకు ప్రసాదించు.
సేవలోనే నా ప్రేమను ఫలింపజేసుకొనే శక్తిని అందజేయి,
పేదలను కాదనకుండా, అధికారదర్పానికి దాసోహమనకుండా ఉండే శక్తిని ప్రసాదించు.
దైనందిన అల్పవిషయాలకు అతీతంగా బుద్ధిని నిలుపుకోగల శక్తిని ప్రసాదించు.
నీ అభీష్టానికి ప్రేమతో నా శక్తిని అర్పించుకోగలిగే శక్తి నివ్వు. – డా॥ జె. భాగ్యలక్ష్మి

పదాలు – అర్థాలు

I

భూమిక = ప్రదేశము
సాయుధ = ఆయుధాలతో
విరివిగా = ఎక్కువగా
ధ్యాస = ఆలోచన, దృష్టి
విశ్లేషణ = వివరణ
చిత్రించబడ్డాయి = వివరించబడ్డాయి
విజృంభించి = అతిసయించి
దివాన్ = మంత్రి
జనాభా = పరివారము
కోఠీ = వేశ్యావాటిక
అంతర్యుద్ధం = లోలోపల వారిలో జరిగే
ఒప్పందం = ఒడంబడిక
రిటైర = పదవీ విరమణ
విశిష్ట స్థానం = ప్రత్యేక స్థానం
సంక్షుభిత = చిన్నాభిన్నమైన

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

II

నిర్దిష్టం = నిర్దేశించబడిన
వెలువడింది = వచ్చింది
అంకితం = ఒక గ్రంథమును వ్రాసి మఱి యొకరి పేర కృతి ఇచ్చుట
అపూర్వము = అపురూపము, క్రొత్తది, కారణం లేనిది
ఆదానప్రదానాలు = ఇచ్చిపుచ్చుకొనుట
నేపథ్యం = వస్త్రాద్యలంకారం, వేషము నాట్య స్థానము, నాట్య రంగమందు తెర లోపలి ప్రదేశం
తమస్ = చీకటి
పరిణామాలు = మార్పులు

III

ప్రోగ్రాం = కార్యక్రమము
మహోన్నతము = గొప్పదైన
అతీతంగా = అతిక్రాంతము, కడచినది
పొడసూపితే = కలిగితే
సున్నితమైన = మృదువైన
అతలాకుతలం = నలుగుట, శ్రమము, చెదరిపోవుట
సౌలభ్యం = సులభత్వం
దేవిడీ = సంపన్నులు నివసించే పెద్ద భవంతి

పాఠం ఉద్దేశం

ముందుమాట వల్ల పుస్తకంపై ప్రాథమిక అవగాహన ఎలా కలుగుతుందో, పుస్తకాన్ని చదవాలనే ఆసక్తి, ఆతురత ఎట్లా ఏర్పడుతాయో తెలియజేస్తూ దాని స్వరూప స్వభావాలను పరిచయం చేయడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

నేషనల్ బుక్స్ట్ ప్రచురించిన ‘నెల్లూరి కేశవస్వామి ఉత్తమకథలు’ సంపుటికి గూడూరి సీతారాం రాసిన పీఠిక ప్రస్తుత పాఠ్యాంశం.

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

కవి పరిచయం

రచయిత : గూడూరి సీతారాం
నివాసం : రాజన్న సిరిసిల్ల జిల్లా దగ్గర గల హనుమాజీ పేట
జననం : 18.07.1936
మరణం : 25.09.2011
రచనలు : 1953 నుండి 1965 వరకు సుమారు 80 కథలు రాశారు. కొన్ని మాత్రమే ప్రస్తుతం దొరుకు తున్నాయి.
ప్రత్యేకత : తెలంగాణ భాషను, యాసను ఒలికించడం ఈయన కలానికున్న ప్రత్యేకత.
ఇతర అంశాలు : తెలంగాణ కథా సాహిత్యంలో పేద కులాల జీవితాలను, అట్టడుగు వర్గాల భాషను అక్షరబద్ధం చేసిన రచయిత. తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేశాడు.
ఇతర రచనలు : మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజీరికం మొదలగునవి.

ప్రవేశిక

కథలు ఒకప్పుడు మానసికానందాన్ని, నైతిక విలువలను చెప్పడానికి పరిమితమై ఉండేవి. 20వ శతాబ్దంలో ఆధునిక కథానిక సాహితీరంగ ప్రవేశం చేయడంతో కథ స్వరూప స్వభావాల్లో స్పష్టమైన మార్పులు చోటుచేసుకున్నాయి. కథానిక సామాజిక బాధ్యతను తలకెత్తుకున్నది. మానవ మనస్తత్త్వాన్ని, సంఘర్షణను భిన్న సంస్కృతులను తన జీవ లక్షణాలుగా చేసుకున్నది. తెలుగు కథానిక అంతర్జాతీయ వేదికల మీద గర్వంగా తలెత్తుకొని నిలబడింది. అటువంటి గొప్ప కథానికా రచయితల్లో నెల్లూరి కేశవస్వామి ఒకరు.

విశిష్టమైన వస్తు, శిల్ప నైపుణ్యంతో మహోన్నతమైన కథలు రాసిన నెల్లూరి కేశవస్వామి భారతీయ కథా సాహిత్యంలో సుప్రసిద్ధులైన ప్రేమ్చంద్, కిషన్ చందర్ తో పోల్చదగిన వాడు. ఆయన ఉత్తమ కథల గురించి కొంతైనా తెలుసు కోవడం ఎంతైనా అవసరం.

విద్యార్థులకు సూచనలు

  • పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
  • పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత గీయండి.
  • వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పద విజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకోండి.

ప్రక్రియ – పీఠిక

ఈ పాఠం ‘పీఠిక’ ప్రక్రియకు చెందినది. ఒక పుస్తకం ఆశయాన్ని, అంతస్సారాన్ని, తాత్త్వికతను, రచయిత దృక్పథాన్ని, ప్రచురణకర్త వ్యయప్రయాసలను తెలియజేసేదే పీఠిక. ఒక గ్రంథ నేపథ్యాన్ని, లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయితగాని, మరొకరుగాని, విమర్శకుడుగాని రాసే విశ్లేషణాత్మక పరిచయవాక్యాలను పీఠిక అంటారు. దీనికే ముందుమాట, భూమిక, ప్రస్తావన, తొలిపలుకు, మున్నుడి, ఆముఖం మొదలైన పేర్లెన్నో ఉన్నాయి.

TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి

Telangana SCERT 10th Class Telugu Guide Telangana 8th Lesson లక్ష్యసిద్ధి Textbook Questions and Answers.

TS 10th Class Telugu 8th Lesson Questions and Answers Telangana లక్ష్యసిద్ధి

ప్రశ్నలు – జవాబులు (T.B. P.No. 77)

ప్రశ్న 1.
పైనున్న సంపాదకీయ శీర్షికలు ఏ విషయాన్ని తెలుపుతున్నాయి ?
జవాబు:
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని గురించి.

ప్రశ్న 2.
ఆ వార్తకున్న ప్రాధాన్యమేమిటి ?
జవాబు:
తెలంగాణ ప్రజలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తాము నష్టపోతున్నామనీ, ప్రత్యేకంగా తెలంగాణగా విడిపోతే, తమ ప్రాంతాన్ని తాము అభివృద్ధి చేసుకోవచ్చనీ, చాలాకాలంగా తమ ప్రాంతాన్ని వేరు రాష్ట్రంగా ప్రకటించమనీ కోరుతున్నారు. ఆ ప్రజల అభి మతమూ, వారి లక్ష్యమూ సిద్ధించాయని ఆ వార్త తెలుపుతోంది.

TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 3.
మీరెప్పుడైనా సంపాదకీయాలు చదివారా ? సంపాదకీయమంటే ఏమిటి ?
జవాబు:
సినిమా వార్తలు, క్రీడావార్తలు తప్ప సంపాదకీయాలను పెద్దగా చదువం. కాని, సంపాదకీయమంటే తెలుసు. ప్రతిరోజూ వార్తలు దినపత్రికలలో ప్రచురిస్తారు. ఒక్కొక్క రోజున ఒక్కొక్క వార్త చాలా ప్రాధాన్యం కలిగి ఉంటుంది. ఆ విధంగా ప్రాధాన్యం కలిగిన వార్తలోని విషయాన్ని పత్రికా సంపాదకులు విశ్లేషిస్తారు. అదే సంపాదకీయం. అంటే సమకాలీన వార్తలపైన పత్రికల విశ్లేషణ.

ప్రశ్న 4.
సంపాదకీయాల ద్వారా ఆయా పత్రికల గూర్చి మనం ఏం తెలుసుకోవచ్చు?
జవాబు:
సంపాదకీయాల ద్వారా ఆయా పత్రికల మనో భావాలు తెలుస్తాయి. ఆ పత్రిక ఎవరికి అను కూలమో కూడా తెలుసుకోవచ్చు. పత్రికల యొక్క విశ్లేషణా సామర్థ్యం తెలుసుకోవచ్చు. సమకాలీన సమస్యలపై పత్రికకు ఉన్న అవగాహన తెలుస్తుంది.

TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 79)

“అర్థరాత్రి వేళ ప్రపంచమంతా నిద్రిస్తున్నప్పుడు ………… హృదయాలను ఆర్ద్రంగా మార్చాయి.

ప్రశ్న 1.
“సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది.” ఈ మాటలన్నది ఏ సందర్భంలో ? ఎవరన్నారు?
జవాబు:
పాతదనంలోంచి కొత్తదనంలోకి అడుగుపెడుతాం. ఒక శకం ముగుస్తుంది. సుదీర్ఘకాలం అణచివేయ బడిన తెలంగాణ జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుం దని” దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు నెహ్రూ గారు ఈ మాటలన్నారు.

ప్రశ్న 2.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటంలోని ఏయే ఘట్టాలు ఈ ప్రాంత ప్రజల హృదయాలను ఆర్ద్రంగా మార్చాయి?
జవాబు:
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన వేళ మూడు తరాల తెలంగాణ బిడ్డల నుండి భావోద్వేగంతో భాష్పాలు రాలాయి. 1969 ఉద్యమం, మలిదశ పోరాటం, పతాకస్థాయి ఘట్టాలు, లాఠీలు ….. తూటాలు ….. గాయాలు ఇట్లా ఎవరి జ్ఞాపకాలు, అనుభూతులు వారివి. ఆనందోత్సాహాలతో పాటు పోరాట జ్ఞాపకాలు కూడా ముసురుకొని హృదయాలను ఆర్థంగా మార్చాయి.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 80)

తెలంగాణలోని ప్రతి అడుగడుగూ ఉద్యమ చరిత్రతో ………. అమరవీరులకు నివాళులు

ప్రశ్న 1.
‘జై తెలంగాణ’ నినాదం బలపడడానికి దారితీసిన సంఘటనలేవి ? వాటి పర్యవసానాలేవి ?
జవాబు:
తెలంగాణ ప్రతి విషయం ఉద్యమంతో ముడిపడి ఉన్నదే. ప్రతి ప్రదేశం ఉద్యమంతో ముడిపడిన పవిత్ర ప్రదేశమే. సచివాలయంలో ‘నల్లపోచమ్మ’ గుడి ఉండేది. అది మనకు పరమ పవిత్రమైన దేవాలయం కదా ! అక్కడ ‘నల్లపోచమ్మ’ను మాయం చేసి ‘బెజవాడ కనకదుర్గ’ ను పెట్టారు.

దాంతో తెలంగాణ ఉద్యోగులు పోరాటానికి దిగారు. మళ్ళీ ‘నల్లపోచమ్మ’ వెలిసింది. ఇది ‘జై తెలంగాణ’ నినాదాన్ని బలపరిచింది. పర్యవసానంగా మన తొలి ముఖ్యమంత్రి కె.సి.ఆర్. గారు ఆ గుడిలోనే పూజలు చేశారు.

ఉద్యమం చివరిదశలో ‘పరేడ్ గ్రౌండ్’ లో సభ పెట్టుకోవడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. దానితో ‘జై తెలంగాణ’ నినాదం మిన్నంటింది. తెలంగాణ మొత్తం ‘జై తెలంగాణ’ నినాదంతో దద్దరిల్లి పోయింది. పర్యవసానంగా మన బంగారు ‘తెలంగాణ’ మనకేర్పడింది. మన ప్రియతమ ముఖ్యమంత్రిగారు అదే ‘పరేడ్ గ్రౌండ్’ లో గౌరవ వందనం స్వీకరించారు.

ప్రశ్న 2.
ఉద్యమకాలంలో హైదరాబాదు వీధులు, మైదానాల ప్రత్యేకతలు ఏమిటి ?
జవాబు:
ఉస్మానియా క్యాంపస్లో లాఠీచార్జీ, గస్పార్క్ అమర వీరుల స్తూపం దగ్గర చర్చలు, ముళ్ళతీగలను ఛేదించుకొని అమర వీరుల స్తూపం దగ్గరకు ఉరకడం ‘ఇవన్నీ’ ఉద్యమకాలంలో జరిగిన ప్రత్యేకతలు.

ప్రశ్న 3.
“గన్పార్క్ అమరవీరుల స్తూపంతో ముడిపడిన సంఘటన లెన్నో……….. ఆ సంఘటనలను గురించి చర్చించండి.
జవాబు:
తెలంగాణ ఉద్యమం గస్పార్క్ అమరవీరుల స్తూపంతో విడదీయలేని సంబంధం కలిగి ఉంది. ఉద్యమం ప్రతి దశలో, ప్రతి మలుపులోనూ, ప్రతి సంఘటనలోనూ ‘గస్పార్క్’ ససాక్ష్యంగా నిలిచింది. తెలంగాణ బిడ్డలు ‘గస్పార్క్’ దగ్గర కలుసుకొని చర్చించుకొనేవారు. వలసపాలకులు ఆంక్షలను ఉద్యమకారులు ధిక్కరించేవారు.

లాఠీ దెబ్బలకు జంకలేదు. ముళ్ళతీగలను ఛేదించేవారు. అమర వీరుల స్తూపం దగ్గరకు ఉరికేవారు. జూన్ రెండున అనేకమంది అక్కడ చేరి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. ‘గన్పార్క్’ చూస్తే అమరవీరుల త్యాగాలు గుర్తుకు వస్తాయి. కళ్ళు చెమ్మగిల్లుతాయి.

TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 81)

స్వీయరాష్ట్రం సిద్ధించింది గనుక ఇక జాతి ……..
…………. ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది.

ప్రశ్న 1.
తెలంగాణ పునర్నిర్మాణంలో ఎట్లాంటి చర్యలు వెంటనే చేపట్టాలని సంపాదకుడు భావిస్తున్నాడు ? దీన్ని మీరు సమర్థిస్తారా ?
జవాబు:
తెలంగాణ పునర్నిర్మాణం జరగాలి. తెలంగాణ ప్రజలకు కావలసింది ప్రశాంతత. పచ్చని బతుకు. తెలంగాణ పునర్నిర్మాణానికి శక్తియుక్తులన్నీ కూడ గట్టాలని సంపాదకీయం పేర్కొంది. మా అభిప్రాయం కూడా ఇదే. మూడు తరాల నుండి ఉద్యమాలతో ప్రశాంతత లేదు. ఎటు చూసినా బాధలే. ఎటు చూసినా కన్నీరే. ఎటు చూసినా ఉద్రిక్తతలే. ఇంక మంచిరోజులు వచ్చాయి. ఇంక కావలసినది ప్రశాంతత.

ఉద్యమాలతో చాలామంది తమ ప్రాణాలను కోల్పోయారు. ప్రాణప్రదమైన వారిని కోల్పోయేరు. ఇక పచ్చని బతుకులు కావాలనేదే మా అందరి కోరిక. తెలంగాణ ప్రజలందరికీ కావలసినది కడుపు నిండా తిండి. కంటినిండా నిద్ర. రేపటి గురించి గుబులు లేని జీవితం అని కూడా సంపాదకీయం పేర్కొంది. మా కోరిక కూడా అదే.

ప్రశ్న 2.
నవ తెలంగాణ నిర్మాణంలో ప్రభుత్వ వ్యూహాలు ఏమిటి
జవాబు:
మూడు తరాల నుండి అణచివేతలో మగ్గిన సమాజాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం వ్యూహాలు తయారుచేసుకొంది.

  1. సంక్షేమ పథకాలు కచ్చితంగా అమలు జరిగేలా చూడాలి. అణచివేతకు గురైన మన సమాజాన్ని ఆదుకోవాలి.
  2. రుణమాఫీ – రైతులు అప్పులపాలై అప్పులు తీర్చే దారిలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆ పరిస్థితి నివారించాలంటే ‘రుణమాఫీ’ తప్పనిసరిగా అమలు జరగాలి.
  3. నీటి పారుదల – నీటి విషయంలో కూడా వివక్షకు గురయ్యాం. గురవుతున్నాం. ఈ పరిస్థితి నివారించక పోతే పంట పొలాలు ఎండిపోతాయి. విద్యుత్తు తగ్గిపోతుంది. అందుచేత ‘నీటి పారుదల’ అనేది చాలా పెద్ద పని.
  4. పరిపాలనా సంస్కరణలు – పాలనాపరమైన సంస్కరణలు కూడా చేపట్టాలి. మన పరిపాలన మనమే చేసుకొనే బంగారు రోజులు వచ్చాయి. కనుక మనకు అనుకూలమైన సంస్కరణలు పరిపాలనలో తీసుకొని రావాలి.

ప్రశ్న 3.
తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మీరెట్లాంటి పాత్ర పోషిస్తారు?
జవాబు:

  1. సంక్షేమ పథకాలు అమలయ్యేటట్లు చూస్తాను.
  2. రుణాలు మాఫీ, 2 పడకల గదుల ఇల్లు. ఇలాంటి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చుతాను.
  3. వ్యక్తిగా ప్రభుత్వపు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల నిర్వహణలో ప్రభుత్వానికి అండగా ఉంటాను.
  4. గౌరవానికి భంగం కలుగకుండా నవతెలంగాణ నిర్మాణానికి సహకరిస్తాను.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కృషిచేసిన వారిని అభినందించడానికి మీ పాఠశాలలో సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఏదైనా ఒక అంశం గురించి మాట్లాడాలి. మీరైతే కింది అంశాలలో దేని గురించి మాట్లాడుతారు ?
అ) రాష్ట్రసాధనలో కవులు, కళాకారుల పాత్ర.
ఆ) ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల పాత్ర.
ఇ) ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల పాత్ర.
ఈ) సకలజనుల పాత్ర.
జవాబు:
అ) రాష్ట్ర సాధనలో కవులు, కళాకారుల పాత్ర :

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కవులు, కళాకారుల పాత్ర ఎంతో ముఖ్యమయినది. 1969 తెలంగాణ తొలి ఉద్యమం కంటే ముందే 1925లో తెలంగాణ ఔన్నత్యాన్ని నిజాం రాష్ట్ర ప్రశంస పేరుతో శేశాద్రి రమణ కవులు ప్రచురించారు. ఆ తర్వాత 1934లో గోల్కొండ కవుల సంచిక ప్రచురితమైంది. దానికి కొనసాగింపుగా వట్టికోట అళ్వారుస్వామి సంపాద కత్వంతో “ఉదయ ఘంటలు” వెలువడింది.

1950లో ‘ప్రత్యూష’ కవితా సంకలనం హైద్రాబాదు కవులు తెచ్చారు. ‘తొలి కారు’ పేరుతో 1957లో వరంగల్ నుంచి కవిత్వ సంకలనం దాశరథి సంకిరెడ్డి నారాయణరెడ్డి గారి “మత్తడి”, “పొక్కిలి” తరువాత జాగో జగావో, దిమ్మెస, క్విట్ తెలంగాణ, ‘గాయాలే గేయాలై’, ‘మునుం’ వంటి కవితా సంకలనాలు వెలువడినాయి. అంతేకాక అనేక జిల్లాల నుండి కవితా సంపుటులు వెలువడ్డాయి.

అందెశ్రీ, గద్దర్, గోరెటి వెంకన్న, జయరాజ్ యస్పాల్ ధూంధాంలు నిర్వహించారు. తొలితరం ఉద్యమంలోనే గూడ అంజయ్య, మిత్ర, దరువు ఎల్లన్న, విమలక్క వంటి గాయకులు, కవులు ఎందరో 1949-1950లో చిత్తలూరి వీరస్వామి, రావెళ్ళ వెంకట్రామారావు మొదలయిన వారితో రసమయి బాలకిషన్, దేశపతి శ్రీనివాస్ వంటి గాయకులు, ఘంటాచక్రపాణి, ఎన్. వేణుగోపాల్, అన్నవరం దేవేందర్, ఘనపురం దేవేందర్, జ్వలిత, జూపాక సుభద్ర, షాజహానా వంటి కవయిత్రులు ఎందరో తెలంగాణ ఉద్యమంలో తమ పాత్ర పోషించారు.

TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి

ఆ) ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల పాత్ర :

ఉద్యోగులు, ఉపాధ్యాయులు తెలంగాణ రాష్ట్ర సాధనకు వెనుదిరగని ఉద్యమాలు చేశారు. సచివాలయంలో రోజూ ఉద్యమాలే. తెలంగాణ ఉద్యోగులు తమ ఉద్యోగాలకంటే ఆత్మాభిమానానికే విలువనిచ్చారు. బెదిరింపులకు భయపడలేదు. నాల్గవ తరగతి ఉద్యోగి నుండి అత్యున్నత అధికారి వరకు ఒకేమాట. ఒకేబాట. అదే ప్రత్యేక రాష్ట్ర సాధన. అవసరమైతే తమ ఉద్యోగాలు వదులుకునేందుకు కూడా సిద్ధపడ్డారు.

ఉపాధ్యాయులదీ అదే బాట. అందుకే అన్నమాట ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ‘స్పెషల్ ఇంక్రి మెంట్’ ఇచ్చి గౌరవించింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా 43 శాతం ఫిట్మెంట్ కూడా ఇచ్చింది.

ఇక విద్యార్థుల ఆవేశం కట్టలు తెచ్చుకొంది. చాలామంది ప్రాణాలను కూడా తృణప్రాయంగా విడిచిపెట్టారు. ఉస్మానియా క్యాంపస్ లో పోలీసు ఆంక్షలను లెక్క చేయకుండా ఉద్యమించారు. తెలంగాణలోని అన్ని యూనివర్శిటీలు, కళాశాలలది ఇదే పరిస్థితి. కేజీ నుండి పీ.జీ వరకు ఒకటేమాట. ఒకేబాట. అదే ‘ జై తెలంగాణ’. తెలంగాణ రాష్ట్రం కావాలి’. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎక్కువ కష్టాలను ఎదుర్కొన్నది విద్యార్థి లోకం.

ఇ) ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల పాత్ర :

ఒక రాష్ట్ర సాధన కోసమే ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డల ఆత్మగౌరవంకు నినాదంగా రూపుదిద్దుకున్నది. ‘తెలంగాణా రాష్ట్ర సమితి టి.ఆర్.యస్.పార్టీ. రాష్ట్ర సాధనకోసం గ్రామ స్థాయి నుంచి ఉద్యమ పార్టీగా, ఉద్యమమే ధ్యేయంగా రూపుదిద్దుకున్నది. ఇతర పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం, కమ్యూనిస్టు పార్టీలు తమ వంతు కృషిచేసినా. వేరు స్థాయినుంచి పటిష్టమైన నిర్మాణం చేయగలిగింది తెరాసే.

ప్రజాప్రతినిధులుగా ప్రజల ఆశలను, ఆలోచన లనూ ప్రతిబింబించే బాధ్యతలను నెత్తికెత్తుకున్న ప్రజాప్రతినిధులు రాష్ట్ర సాధనకై పలుమార్లు తమ పదవులకు రాజీనామాలు చేసి తిరిగి ఎన్నిక కావటం ద్వారా ఈ ప్రాంతపు ప్రజల మనోభావాలను ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేశారు.

రాజకీయ నాయకులుగా రాష్ట్రశ్రేయస్సుకోసం పనిచేస్తూనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషిచేసి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి ప్రత్యేక రాష్ట్ర సాధనకు కృషిచేసిన వాళ్ళందరకీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

ఈ) సకలజనుల పాత్ర :

సకలజనుల సమ్మె ఉద్యమ ఘట్టంలో ప్రధాన భూమిక పోషించింది. అందరూ ‘చేయి చేయి కలిపి’ ముందుకు సాగారు. నాటి ప్రభుత్వానికి వణుకు పుట్టించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సకల జనుల సమ్మెకు దిగి వచ్చాయి. ఈ విధంగా అనేక రకాల ఉద్యమాలు, ఎందరో వీరుల త్యాగఫలమే మన నేటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం.

ప్రశ్న 2.
కింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

1926 మే 19న గోలకొండ పత్రిక ప్రారంభ మైంది. నేడు ఉన్న సదుపాయాలు నాడు పత్రికా నిర్వహణకు ఏమాత్రం లేకుండె. సంపాదకుడే అన్ని పనులు నిర్వహించుకొనేవాడు. విలేఖరిపని, వ్యాస రచయితలపని, గుమాస్తాపని, ప్రూఫ్ రీడర్ పని ఇట్లా దాదాపు అన్ని పనులను ఒక్కరే చేయవలసి వచ్చేది. ఈ పరిస్థితుల్లో గోలకొండ పత్రిక ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొన్నది. బంధుమిత్రుల సహకారంతో సురవరం ప్రతాపరెడ్డి పట్టుదలతో పత్రిక నిర్వహించాడు. 1939 ఆగస్టు 3వ తేదీ నుండి గోలకొండ పత్రికకు సంపాదకుడిగా ప్రతాపరెడ్డి నియమితుడయ్యాడు. గోలకొండ పత్రిక ప్రతాపరెడ్డి ప్రతిభకు అద్దం పట్టింది. తెలంగాణ ప్రజానీకాన్ని జాగృతపరిచింది.

ఆయన రాసిన వ్యాసాలు, విమర్శలు, సంపాద కీయాలు వెయ్యికిపైగా ఉంటాయి. పత్రికలో చర్చా వేదికను నిర్వహించి సత్యాలను నిగ్గుతేల్చే అవకాశాలను విమర్శకులకు కలిగించే వాడు. వ్యక్తి స్వాతంత్ర్యం, పౌరహక్కులు, ప్రాంతీయ భాషలకు, పత్రికా స్వాతంత్ర్యానికి గడ్డురోజులు ఉన్నప్పటికీ కూడా నిజాం ప్రభుత్వం ఆంక్షల నెదుర్కొంటూ గోలకొండ పత్రిక తెలంగాణ ప్రజల్లో కొత్త భావాలను, ఆలోచనలను, చైతన్యాన్ని రగిల్చింది.

అ) గోలకొండ పత్రిక సంపాదకుడెవరు ?
జవాబు:
గోలకొండ పత్రిక సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి గారు.

ఆ) నాటి పత్రికాసంపాదకులు ఏయే పనులు చేసేవారు ?
జవాబు:
నాటి పత్రికాసంపాదకుడే, అన్ని పనులూ నిర్వహించే వాడు. విలేఖరులపని, వ్యాసరచయితలపని, గుమాస్తాపని, ప్రూఫ్ రీడర్పని ఇట్లా అన్ని పనులు చేసేవారు.

TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి

ఇ) ప్రతాపరెడ్డి గోలకొండపత్రిక ద్వారా ఏం చేశాడు?
జవాబు:
సురవరం ప్రతాపరెడ్డిగారు గోలకొండ పత్రిక ద్వారా తెలంగాణా ప్రజానీకాన్ని జాగృతపరచాడు. పత్రికలో చర్చావేదికను నిర్వహించి సత్యాలను నిగ్గు తేల్చేవారు.

ఈ) గోలకొండ పత్రిక వల్ల తెలంగాణ ప్రజలకు కలిగిన ప్రయోజనమేమిటి ?
జవాబు:
వ్యక్తి స్వాతంత్య్రం, పౌరహక్కులు, ప్రాంతీయ భాషలకు పత్రికా స్వాతంత్ర్యానికి గడ్డు రోజులు ఉన్నప్పటికీ కూడా నిజాం ప్రభుత్వం ఆంక్షల నెదుర్కొంటూ గోలకొండ పత్రిక ప్రజల్లో కొత్త భావాలను, ఆలోచనను, చైతన్యాన్ని రగిల్చింది. గోలకొండ పత్రిక వల్ల తెలంగాణ ప్రజలకు నిగ్గు తేల్చే నిజాలను తెలుసుకునే అవకాశం కలిగింది. ప్రజలను ప్రభుత్వంపై ధైర్యంగా పోరాడే ఆత్మస్థైర్యం, సంకల్పబలం కలిగింది. ప్రజల్లో నూతన ఆలోచనల ఆవిష్కరణకు అవకాశం కల్పించింది.

ఉ) పై పేరాకు పేరు పెట్టండి.
జవాబు:
శీర్షిక “గోలకొండ పత్రిక” – ప్రతాపరెడ్డి సంపాదకత్వం.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జాతి చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టంగా ఎందుకు అనుకుంటున్నారు?
జవాబు:
1969 నుండి జూన్, 2014 వరకు సాగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సఫలమై, తెలంగాణ సకల జనుల స్వప్నం సాకారమైన వేళ, భారతదేశ పటంపై 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఇది అద్భుతమైన ఘట్టం. చరిత్రలో అరుదుగా కన్పిస్తుంది. పాతదనం లోంచి కొత్త దనంలోకి అడుగుపెట్టడం.

ఒక శకం ముగుస్తుంది. సుదీర్ఘ కాలం అణచివేయబడిన జాతి తన గొంతు విన్పించింది. ఇది తెలంగాణ సమాజం చేసిన సమిష్టి ప్రకటన. తెలంగాణ పోరాటం గమ్యాన్ని ముద్దాడిన క్షణమది. జాతి చరిత్రలో అరుదైనక్షణం. అత్యద్భుతమైన క్షణం.

ఆ) తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మీరు ఎట్లాంటి పాత్ర పోషిస్తారు?
జవాబు:
తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మేము మా సర్వ శక్తులు ధారపోస్తాము. తెలంగాణా జాతి సర్వతో ముఖాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటాము. తెలంగాణా ఉద్యమకాలంలో ప్రాణాలర్పించిన అమర వీరుల ఆశయాల సాధనకు ఊపిరి ఉన్నంతవరకూ పోరాడుతాము. తెలంగాణా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలూ శ్రమించి వారి కలలను సాకారం చేస్తాము.

తెలంగాణ భాష సంస్కృతులకు మళ్ళీ ప్రాణం పోసి, ఉత్కృష్టమైన తెలంగాణ జీవన విధానాన్ని పునరుద్ధరింపజేసే విధంగా యువతను జాగురూకులను చేస్తాము. రాష్ట్ర ప్రజల మధ్య సామాజిక సంబంధాలు బలపడే విధంగా సామాజిక చర్యలు చేపడతాము. ప్రభుత్వ వ్యూహాలను ప్రజలకు తెలియజేసి, వాటి అమలుకు కృషి చేస్తాము.

  • ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు అన్ని సకాలంలో అమలయ్యే విధంగా చూస్తాము.
  • పరిపాలనా రంగంలో నూతన సంస్కరణలు ప్రవేశ పెట్టి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతాము.
  • తెలంగాణా పునర్నిర్మాణానికి మా శక్తియుక్తులన్ని కూడదీసుకుని కార్యాచరణ దిశగా పయనిస్తాము.
  • నవతెలంగాణ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తామని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తాము.

TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి

ఇ) సంపాదకీయాలు పత్రికల్లో ఎందుకు రాస్తారు ?
జవాబు:
ఒక్కొక్క పత్రికకు కొన్ని విశిష్ఠ లక్షణాలుంటాయి. ఆ పత్రిక ద్వారా చాలా విషయాలు వెలుగు చూస్తాయి. నార్ల వేంకటేశ్వరరావు, తాపీ ధర్మారావు, విద్వాన్ విశ్వం, పింగళి వెంకటకృష్ణారావు, బూదరాజు రాధాకృష్ణ, సురవరం ప్రతాపరెడ్డి లాంటి వ్యక్తులు తమ తమ జ్ఞానంతో, మేధస్సుతో రచనలు చేశారు.

పత్రికలు సమాజానికి ప్రతిబింబాలు. అసంఖ్యాకంగా పాఠకులు చదువుతారు. కాబట్టి సంపాదకీయాలు పత్రికల్లోనే రాస్తారు. అవి ప్రజాదరణ పొందుతాయి.

ఈ) పత్రికలలోని సంపాదకీయాలకు, సాధారణ వార్తాంశాలకు మధ్యనున్న భేదాలేవి ?
జవాబు:
పత్రికకు ప్రాణం సంపాదకీయం. సంపాదకీయం మొత్తం పత్రికకు ప్రతిబింబం. ఆ రోజు జరిగిన ముఖ్యమైన సంఘటనపై సంపాదకుని వ్యాఖ్యానం, విశ్లేషణల సమాహారమే సంపాదకీయం. ఇది వార్తాంశం కాదు. వార్తాంశంపై సమగ్ర విశ్లేషణ. పూర్వాపరాల పరామర్శ, అవసరమైతే తర్వాత కాలానికి కూడా వర్తిస్తుంది. ఇది ప్రధాన సంపాదకుడు రాస్తాడు. సాధారణ వార్తాంశం అంటే ఒక వార్తగా ప్రచురిస్తారు.

ఆయా ప్రాంతాలలోని విలేఖరులు వార్తలు పంపుతారు. వాటి ప్రాధాన్యతాక్రమాన్ని బట్టి పత్రికలో ఏ పేజీలో వెయ్యాలో నిర్ణయిస్తారు. వార్తకు ఆ రోజుకు మాత్రమే విలువ ఉంటుంది. మరునాటికది మామూలు విషయమే. వార్తాంశంలో పెద్దగా విశ్లేషణలు, వ్యాఖ్యానాలు ఉండవు. కేవలం జరిగిన సంఘటన, ప్రజాభిప్రాయం మాత్రమే పాఠకుల దృష్టికి వస్తుంది.

ప్రశ్న 2.
క్రింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) “సంపాదకీయాలు సమకాలీన అంశాలను ప్రతి బింబిస్తాయి” – దీనిని సమర్థిస్తూ వ్రాయండి.
(లేదా)
సంపాదకీయాలు సమకాలీన అంశాలను స్పృశిస్తాయి. దీనిని నీవు ఎలా సమీక్షిస్తావు ?
జవాబు:
ఆధునిక తెలుగు సాహిత్యంలో సంపాదకీయాలకు సమున్నతమైన స్థానం ఉంది. సంపాదకుడిచేత, లేదా సంపాదకుడి తరపున రాయబడేవి సంపాదకీయాలు. ఈ సంపాదకీయాలు దిన పత్రికలకు, ఇతర మాస, వార, సాంవత్సరిక పత్రికలకు తేడాగా ఉంటాయి.

దిన పత్రికల్లోని సంపాదకీయాలు సమకాలీన అంశాలపై స్పందిస్తాయి. ప్రజలను చైతన్యవంతులనుగా చేస్తాయి. ఈ సంపాదకీయాలు పత్రికలకు గుండెకాయ వంటివి. ఇవి ప్రజాశ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని రాయబడతాయి.

ఈ సంపాదకీయాలు సమకాలీన అంశాలపై తీవ్రంగా స్పందిస్తాయి. ముఖ్యంగా స్వాతంత్రపోరాట సమయంలోను, తెలంగాణా ఉద్యమకాలంలోను వ్రాసిన సంపాదకీయాలు ప్రజలను చైతన్యవంతులనుగా మార్చాయి. సంపాదకీయాల్లోని అక్షరాలు ఒక్కోసారి ఫిరంగుల్లా పనిచేస్తాయి. పాలకుల గుండెల్లో దిగిపోతాయి.

తెలంగాణ పోరాటసమయంలో పత్రికలు సంధించిన సంపాదకీయాలు ప్రత్యేకరాష్ట్ర ఆవశ్యకతను తెలియ జేశాయి. తెలంగాణ ప్రాంత ప్రజల్లో వీరత్వం నింపాయి. అందువల్లనే సంపాదకీయాలు సమకాలీన అంశాలను ప్రతిబింబిస్తాయని చక్కగా తెలుస్తోంది.

ప్రశ్న 3.
క్రింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ వ్రాయండి.

అ) ఈ మధ్యకాలంలో చోటుచేసుకున్న ఏదైనా ఒక ప్రధాన సామాజికాంశం / సంఘటనల ఆధారంగా సంపాద కీయ వ్యాసం రాయండి. మీ తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:
సంపాదకీయ వ్యాసం
అవ్యవస్థను చక్కదిద్దిన ఏడాది !
‘ఆరంభం బాగుంటే సగం పని పూర్తి అయినట్లే’ అన్నది ఆంగ్లేయుల నానుడి. ‘నేను ప్రధానమంత్రిని కాను, ప్రధాన సేవకుణ్ణి’ అని ఎర్రకోట బురుజులనుంచి ప్రకటించిన నరేంద్రమోదీ ఏలుబడికి నేటితో ఏడాది పూర్తి అవుతోంది.

పదేళ్ళ యూపీఏ అన్ని రంగాల్లోనూ దేశాన్ని సర్వభ్రష్టం చేసి, అవినీతిలో మాత్రం కొత్త రికార్డులు నెలకొల్పి చరిత్రపుటల్లో కలిసిపోగా, ‘అచ్ఛేదిన్’ కోసం మోదీ సారథ్యంపై ఆమ్ ఆద్మీ పెట్టుకొన్న కొండంత ఆశ ఎన్డీఏకు దక్కిన బంపర్ మెజారిటీల్లోనే ప్రస్ఫుటమైంది.

యూపీఏ నిర్వాకాల వల్ల దేశపాలనకు సంబంధించిన సకల వ్యవస్థలనూ నిష్క్రియాపరత్వం కమ్మేసి, అంతర్జాతీయ పెట్టుబడిదారులు దృష్టిపథంలో ఇండియా లేకుండాపోయిన నేపథ్యంలో అధికారానికి వచ్చిన మోదీ ప్రభుత్వానికి – ఇంటాబయటా ఆ ప్రమాద కర స్తబ్ధతను బదాబదలు చెయ్యడమే ప్రాధాన్య అంశంగా మారింది. విధానాల రూపకల్పన, అమలులో మంత్రివర్గ సచివాలయం (క్యాబినెట్ సెక్రటేరియట్) ద్వారా ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) నిర్ణాయక పాత్ర పోషించేలా వ్యవస్థాగత మార్పులు తెచ్చి, ప్రణాళిక సంఘానికి కొరత వేసిన మోదీ ప్రభుత్వం – పాలనను కొత్త పుంతలు తొక్కించింది.

అవినీతికి ఆస్కారంలేని అవకాశాల స్వర్గంగా ఇండియాను ఆవిష్కరించి, దేశ విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడం ద్వారా మౌలిక సదుపాయాల్ని పెంపొందించి, పారిశ్రామికీకరణకు కొత్త ఊపుతో ఉపాధి అవకాశాలను విస్తారం చేసి, ప్రజల జీవన ప్రమాణాలను పెంచే వ్యూహానికి అనుగుణంగా మోదీ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.

అవినీతి నిరోధక శాసనాలు, భారత్లో తయారీ, స్వచ్ఛభారత్, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి పథకాలు, పెట్టుబడులపై గురిపెట్టి విస్తృతంగా విదేశీ యాత్రలు …. ఇవన్నీ శ్రేష్ఠ భారత్ లక్ష్య సాధనకు ప్రాతిపదికలే. అదే సమయంలో, 128 కోట్ల జనావళి అభివృద్ధి కాంక్షలకు గొడుగు పట్టే విధంగా మోదీ ప్రభుత్వం మరెంతో చెయ్యాల్సి ఉందన్నదీ నిజమే !

III. భాషాంశాలు

పదజాలం

ప్రశ్న 1.
క్రింది పదాలు ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

అ) ముసురుకొను = మూగు, కమ్ము
జవాబు:
మధ్య తరగతి మానవుడిని అనేక సమస్యలు ముసురుకుంటున్నాయి.

ఆ) ప్రాణం పోయు = జీవాన్ని ఇవ్వడం
జవాబు:
మానవత్వంతో చేయు మంచిపనులు సమాజానికి ప్రాణం పోయుచున్నాయి.

ఇ) గొంతు వినిపించు = సమస్యపై స్పందించు, గొంతు విప్పి మాట్లాడుట
జవాబు:
అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు “తమ గొంతును వినిపించుట” లేదు.

ఈ) యజ్ఞం = దీక్షగా చేయు
జవాబు:
విద్యార్థులు విద్యను యజ్ఞంగా చేయాలి.

ప్రశ్న 2.
కింది పదాలకు పర్యాయపదాలు రాసి, వాటితో వాక్యాలు రాయండి.
ఉదా : తారలు = చుక్కలు, నక్షత్రాలు
ఆకాశంలో నక్షత్రాలు మల్లెలు విరబూసినట్లుగా ఎంతో అద్భుతంగా ఉన్నాయి.

అ) జ్ఞాపకం = గుర్తు, లక్ష్యము, లెక్క, జ్ఞప్తి, స్మృతి తెలంగాణ లక్ష్యంగా ప్రజాఉద్యమాలు జరిగాయి.
ఆ) పోరాటం = సమరం, యుద్ధం, కయ్యం, రణం కాకతీయ వీరులు యుద్ధపటిమ కల్గినవారు.
ఇ) విషాదం = భేదం, బాధ, దుఃఖం, వ్యధ భూకంపం వల్ల నేపాల్లో దుఃఖం అలుముకుంది.
ఈ) సంస్కరణ = మార్పుతీసుకొచ్చుట, బాగు చేయుట, సత్కర్మము
కందుకూరి వీరేశలింగంగారు సంఘంలో మార్పు తీసుకువచ్చారు.

TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 3.
దిన పత్రికలకు సంబంధించిన పదజాలం ఆధారంగా భావనా చిత్రాన్ని గీయండి.
జవాబు:
TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి 1

  1. కాశ్మీర్లో తొలి మహిళ ఐపీయస్
  2. మధుమేహం
  3. వారెవ్వా అనార్కలీ
  4. ఇష్టపడి చదివా. నెంబర్వనయ్యా

వ్యాకరణాంశాలు

ప్రశ్న 1.
కింది ప్రత్యక్ష కథన వాక్యాలను పరోక్ష కథనంలోకి మార్చండి.

అ) రాజకీయపార్టీలవారు “జనానికి తక్షణం కావల్సింది కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర” అని ఎన్నికల ప్రకటించారు.
జవాబు:
రాజకీయపార్టీలవారు జనానికి తక్షణం కావల్సింది కడుపునిండా తిండి, కంటినిండా నిద్రాయని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటించారు.

ఆ) “సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది” అని నెహ్రూ అన్నాడు.
జవాబు:
సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుందని నెహ్రూ అన్నాడు.

ప్రశ్న 2.
క్రింది పరోక్ష కథన వాక్యాలను ప్రత్యక్ష కథనంలోకి మార్చండి.

అ) పరిపాలనారంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం అవసరమని ముఖ్యమంత్రి ప్రకటించాడు.
జవాబు:
“పరిపాలనారంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం అవసరం” అని ముఖ్యమంత్రి ప్రకటించాడు.

ఆ) సమాజాన్ని సంక్షేమపథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరని మేధావులు నిర్ణయించారు.
జవాబు:
“సమాజాన్ని సంక్షేమపథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరి” అని మేధావులు నిర్ణయించారు.

ఇ) తెలుగులోనే రాయండని, తెలుగే మాట్లాడండని టివి ఛానల్లో ప్రసారం చేశారు.
జవాబు:
“తెలుగులోనే రాయండి. తెలుగే మాట్లాడండి” అని టివి. ఛానల్లో ప్రసారం చేశారు.

ప్రశ్న 3.
క్రింది పదాలను విడదీసి, సంధులను గుర్తించి, సూత్రాలను రాయండి.

అ) ప్రపంచమంతా = ప్రపంచము + అంతా – ఉకారసంధి
సూత్రం: ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు.

ఆ) అత్యద్భుతం = అతి + అద్భుతం = యణాదేశసంధి
సూత్రం: ఇ, ఉ, ఋ లకు అసవర్ణములైన అచ్చులు పరమగునప్పుడు క్రమముగా య, వ, ర లు ఆదేశంగా వస్తాయి.

ఇ) సచివాలయం = సచివ + ఆలయం = సవర్ణదీర్ఘసంధి
సూత్రం: అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమగునప్పుడు వాని దీర్ఘము ఏకాదేశమగును.

ప్రశ్న 4.
క్రింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి.
సమాసపదం – విగ్రహవాక్యం – సమాసం పేరు
అ) బృహత్కార్యం – బృహత్ అయిన కార్యం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఆ) శక్తియుక్తులు – శక్తియును, యుక్తియును – ద్వంద్వ సమాసం
ఇ) సంక్షేమ పథకాలు – సంక్షేమము కొరకు పథకాలు – చతుర్థీతత్పురుష సమాసం

TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి

అతిశయోక్తి అలంకారం

III. కింది ఉదాహరణను పరిశీలించండి.

ఉదా : హిమాలయ శిఖరాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

హిమాలయ పర్వతాలు చాలా ఎత్తుగా ఉంటాయి. కాని అవి నిజంగా ఆకాశాన్ని తాకవు. కాని వాటిని ఎక్కువచేసి చెప్పడంవల్ల ‘ఆకాశాన్ని తాకుతున్నాయి” అని అంటున్నాము.

ఏదైనా ఒక వస్తువుని గాని, విషయాన్ని గాని ఉన్న దాని కంటే ఎక్కువ చేసి చెప్పడం ‘అతిశయోక్తి’ అలంకారం

కింది లక్ష్యాలను పరిశీలించండి. అలంకారం గుర్తించండి.
(కింది పద్యం సీతాదేవి, అశోకవనంలో హనుమంతుని విరాడ్రూప దర్శన సందర్భంలోనిది)

అ) కం. చుక్కలు తల పూవులుగా
నక్కజముగ మేను పెంచి యంబరవీథిన్
వెక్కసమై చూపట్టిన
నక్కోమలి ముదము నొందె నాత్మస్థితిలోన్.
– మొల్ల రామాయణం

పై పద్యపాదం అతిశయోక్తి అలంకారానికి చెందినది.

సమన్వయం : పై పద్యంలో హనుమంతుడు శరీరాన్ని పెంచితే ఆకాశంలోని నక్షత్రాలు కనబడ్డాయని అనగా బాగా ఎత్తు పెరిగాడని చెప్పడానికి ఉన్న దాని కన్నా ఎక్కువ చేసి చెప్పబడినది కావున ఇది అతిశయోక్తి అలంకారం.

ఆ) మా ఊర్లో సముద్రమంత చెరువు ఉన్నది.
జవాబు:
వివరణ : చెరువును వర్ణించుట ప్రధానం. దానిని ఎక్కువ చేసి సముద్రమంత అని చెప్పడం అతిశయోక్తి.

ఇ) అభిరాం తాటి చెట్టంత పొడవు ఉన్నాడు.
జవాబు:
సమన్వయం / వివరణ / = అభిరాం యొక్క పొడవును చెప్పటాన్కి తాటిచెట్టంత అని చెప్పడం అతిశయోక్తి కావున దీనిలో అతిశయోక్తి అలంకారం ఉంది.

స్వభావోక్తి అలంకారం

క్రింది ఉదాహరణను పరిశీలించండి.
శివాజీ ఎర్రబడిన కన్నులతో అదిరిపడే పై పెదవితో ఘనహుంకారముతో కదలాడే కనుబొమ్మ ముడితో గర్జిస్తూ “గౌరవించదగిన, పూజించదగిన స్త్రీని బంధించి అవమానిస్తావా ? అని సోన్దేవుని మంద లించాడు.

పై వాక్యంలో కన్నులు ఎర్రబడటం, పై పెదవి అదరడం, గట్టిగా హుంకరించడం, కనుబొమ్మ ముడి కదలాడటం కోపంగా ఉన్నప్పుడు కలిగే స్వభావాలు. ఇట్లా ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడం కూడా ఒక అలంకారమె. దీన్ని ‘స్వభా వోక్తి’ అలంకారం అంటారు.

స్వభావోక్తి అలంకారం : విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడమే ‘స్వభావోక్తి అలంకారం’. “జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు నిగిడ్చి చెంగు చెంగున గెంతుతున్నాయి”.
పై వాక్యంలోని అలంకారాన్ని గుర్తించండి.

సమన్వయం : జింకలు సహజంగానే బిత్తర చూపులు చూడటం, చెవులు నిగిడ్చిటం, చెంగు చెంగున గెంతడం సహజ సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం.

ప్రాజెక్టు పని

వివిధ దిన పత్రికల ఆధారంగా 5 సంపాదకీయ వ్యాసాలు సేకరించండి. చదివి అర్థం చేసుకొండి. కీలకాంశాలను గుర్తించండి. పట్టికలో నమోదు చేయండి. నివేదిక రాసి ప్రదర్శించండి.
TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి 2
జవాబు:
TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి 3
TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి 4

TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి

విశేషాంశాలు:

1969 – ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం :
తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన కొన్ని రక్షణలు, షరతులు ప్రాతిపదికపై ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. పెద్దమనుషుల ఒప్పందం కుదుర్చుకొనబడింది. ప్రభుత్వానికి తగు సిఫార్సులు చేసేటందుకు ఒక ప్రాంతీయ సంఘం ఉండేది. పెద్దమనుషుల ఒప్పందం తూ.చ. తప్పకుండ అమలవు తుందని కేంద్ర ప్రభుత్వం వారు హామీ ఇచ్చారు. కాని విఫలమయ్యారు. ప్రజల నమ్మకానికి ద్రోహం జరిగింది.

ప్రజల్లో పెద్దపెట్టున అసంతృప్తి చెలరేగింది. తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరు కున్నారు. స్వల్ప వ్యవధిలోనే ఇది స్వచ్ఛందమైన, ఉద్ధృత మైన ప్రజోద్యమంగా మారింది. గ్రామం మొదలుకొని నగరం వరకు అన్ని రంగాలకు చెందిన యువకులు, మహిళలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరు ఉద్యమంలో పాల్గొన్నారు.

నాటి పత్రికలైన ‘జై తెలంగాణ’, ‘తెలుగుగడ్డ’, ‘తెలుగువాణి’ కూడ వీటికి తమ మద్దతును ప్రకటించాయి. ఈ సందర్భంలోనే తెలంగాణ ప్రజాసమితి, తెలంగాణ విమోచనోద్యమ సమితి వంటి సంస్థలు ఆవిర్భవించాయి.

సూక్తి : సత్యాన్ని త్రికరణశుద్ధిగా నమ్మితే విజయం తథ్యం. నెమ్మదిగానైనా సరే మనం జయించక తప్పదు.
– స్వామి వివేకానంద

ముఖ్య పదాలు – అర్థాలు.

I
అరుదుగా = అపూర్వము, ఆశ్చర్యము
శకము = ఒకదేశము, ఒకజాతి, ఒకని పరిపాలనతో చేరిన సంవత్సరం
సంబురాలు = వేడుకలు
ఆవిర్భవించు = పుట్టు, జన్మము, కలుగు
పతాకస్థాయి = చివరి దశ
స్వతంత్రము = స్వచ్ఛందము, సొంతము
భాష్పాలు = కళ్ళనీళ్ళు
అనుభూతి = అనుభవము, అనుభవించు
సుదీర్ఘకాలం = ఎక్కువ సంవత్సరాలు / ఎక్కువ కాలంపాటు

II

ఉద్రిక్తత = అతిశయించినది
రాచఠీవి = దర్జా, రాజదర్పం
ముడిపడు = కూడుకొని, కలిసి
సచివాలయం = మంత్రులు ఉండుచోటు, పరిపాలనా భవనం
ధిక్కరించడం = వ్యతిరేకించడం, లెక్కచేయకపోవడం
ఘట్టం = సంఘటన
ఆంక్ష = వెలివేయుట, బహిష్కారము
అమరుడు = చావనివాడు
జడుపు = జంకు, భయం

TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి

III

అస్తిత్వం = ఉనికి
స్వీయరాష్ట్రం = సొంతరాష్ట్రం
సిద్ధించింది = లభించింది
సంక్షోభం = ఎక్కువ వ్యాకులత
ఛిద్రము = ముక్కలు
పునర్నిర్మాణ = తిరిగి నిర్మించుకోవడం
విషాదం = దుఃఖం
సర్వతోముఖాభివృద్ధి = అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించుట
పాటుపడు = చేయుట
ఋగులు = కలత
అనుగుణం = తగినది
తక్షణం = వెంటనే
క్షోభ = కలత

పాఠం ఉద్దేశం

దిన పత్రికల్లోని సంపాదకీయాలు, వ్యాఖ్యలు సమాజ చైతన్యానికి తోడ్పడుతాయి. కాబట్టి విద్యార్థుల్లో సంపాదకీయ వ్యాసాలు, వ్యాఖ్యల పట్ల అభిరుచిని కలిగిస్తూ, ఆసక్తిని పెంపొందింపజేయడం, సాధారణ వార్తలకు, సంపాద కీయాలకు మధ్య ఉండే తేడాను, వాటి ప్రాధాన్యాన్ని అర్థం చేసుకొనేందుకు ఉద్దేశించినదే ఈ పాఠం.

పాఠ్యభాగ వివరాలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా 2వ జూన్, 2014 నాడు “నమస్తే తెలంగాణ” దినపత్రికలో వెలువడిన సంపాదకీయ వ్యాసం ఇది.

ప్రవేశిక

‘సంపాదకీయం’ సమకాలీన ప్రపంచంలో జరిగిన స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంఘటనలను గాని, దాని పరిణామాలనుగాని, అద్భుత విశేషాలనుగాని వివరిస్తుంది. జాతిపిత మహాత్మాగాంధీ మృతి చెంది నప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పత్రికలన్నీ సంతాపం తెలియజేస్తూ గాంధీ గొప్పతనాన్ని కీర్తిస్తూ ప్రత్యేక సంపాదకీయాలు రాశాయి. అదే విధంగా మన భారతీయ క్రీడాకారులు, శాస్త్రవేత్తలు ఆయా రంగాల్లో అద్భుత విజయాలు ఆవిష్కరించినప్పుడు (ఆనాటి) దినపత్రికలన్నీ వారిని ప్రశంసిస్తూ సంపాదకీయాలు రాశాయి.

అట్లాగే 1969 నుండి 2 జూన్, 2014 వరకు సాగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సఫలమై, తెలంగాణ సకల జనుల స్వప్నం సాకారమైన వేళ, భారతదేశ పటంపై 29వ రాష్ట్రంగా ‘తెలంగాణ’ అవతరించింది. ఈ సందర్భంగా పత్రికలన్నీ పతాక శీర్షికలతో ఈ వార్తను ప్రచురించి, ప్రత్యేక సంపాదకీయాలు రాశాయి. అట్లాంటి సంపాదకీయాల్లో ఒకటి ప్రస్తుత పాఠ్యాంశం. తెలంగాణ ఉద్యమ మహా ప్రస్థానంలోని మైలురాళ్ళను మనకు పరిచయం చేస్తున్నదీ వ్యాసం.

విద్యార్థులకు సూచనలు

  • పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
  • పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత గీయండి.
  • వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పదవిజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకొండి.

ప్రక్రియ – సంపాదకీయ వ్యాసం

ఈ పాఠం సంపాదకీయ వ్యాస ప్రక్రియకు చెందినది. సమకాలీన సంఘటనలలో ముఖ్యమైన వాటిని తీసుకొని పత్రికల్లో వ్యాఖ్యాన రూపంతో పూర్వా పరాలను పరామర్శిస్తూ సాగే రచన సంపాదకీయ వ్యాసం. తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకుంటూ, ఆలోచింపచేయగలగడం మంచి సంపాదకీయ లక్షణం. ఇవి తత్కాలానికి సంబంధించినవే అయినా ఒక్కొక్క సందర్భంలో విభిన్న కాలాలకూ అనువర్తింప జేసుకోవచ్చు.

TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం

Telangana SCERT 10th Class Telugu Guide Telangana 9th Lesson జీవనభాష్యం Textbook Questions and Answers.

TS 10th Class Telugu 9th Lesson Questions and Answers Telangana జీవనభాష్యం

చదువండి – ఆలోచించి చెప్పండి (T.B. P.No. 87)

పరులకోసం పాటుపడని
నరునిబతుకు దేనికని ?
మూగనేలకు నీరందివ్వని
వాగుపరుగు దేనికని ?
జల్లుకు నిలవని ఎండకు ఆగని
చిల్లులగొడుగు దేనికని ?
పదపదమంటూ పదములేగాని
కదలని అడుగు దేనికని ?
– సినారె

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
పరుల కోసం పాటుపడటం అంటే ఏమిటి ?
జవాబు:
పాటుపడటం అంటే కష్టపడడం, పనిచేయడం. ఎవరైనా తమ గురించి, తమ కుటుంబం గురించి, తమ వాళ్ళ గురించి పాటుపడడం సహజం. పరులు అంటే ఇతరులు. అంటే మనకు సంబంధం లేనివాళ్ళు. వాళ్ళ గురించి కష్టపడడం గొప్పవారి లక్షణం. ఇతరులకు ఉపకారం చేయడానికి దేనినీ లెక్క చేయకూడదు. అంటే సమాజం కోసం కష్టపడాలి. సమాజ అభివృద్ధి కోసం
పాటు పడాలని కవి సందేశం.

ప్రశ్న 2.
కవి ప్రశ్నల్లోని ఆంతర్యం ఏమిటి ?
జవాబు:
ప్రతిదానికీ ఒక ఉపయోగం ఉంటుంది. కొన్ని ఖచ్చితంగా కొన్ని పనులకు ఉపయోగపడాలి. ఆయా పనులకు ఉపయోగపడనపుడు అవి ఉన్నా లేక పోయినా ఒకటే అని కవిగారి ఉద్దేశం.

  1. సమాజం కోసం పాటుపడని మనిషి ఉన్నా లేకపోయినా ఒకటే.
  2. చేలకు నీరివ్వని ఏరు వలన ప్రయోజనం లేదు.
  3. ఎండా, వానలనుండి కాపాడలేని గొడుగు వృథా.
  4. మాటలే తప్ప కదలని అడుగులు వలన ఏమీ సాధించలేము.

TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం

ప్రశ్న 3.
దీనిని రాసిందెవరు ?
జవాబు:
ఈ కవితను డా॥ సి. నారాయణరెడ్డి గారు (సినారె) రచించారు.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 89)

ప్రశ్న 1.
‘మనసుకు మబ్బుముసరడం’ అనడంలో ఆంతర్యంమేమిటి?
జవాబు:
నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కితే వర్షమై అవి భూమి మీద కురుస్తాయి. అలాగే మనసుకు ఆందోళనలు, బాధలు, చింతలు అనే దిగులు మబ్బులు కమ్ముకుంటే దుఃఖస్థితి వస్తుంది. అది కన్నీరుగా మారుతుంది.

ప్రశ్న 2.
‘జంకని అడుగులు కదిలితే అది దారవుతుం’దనడాన్ని మీరెట్లా సమర్థిస్తారు ?
జవాబు:
లోకం భయపెడుతుంది. ఆ మాటలకు జంకకుండా, అడుగులు ముందుకు వేస్తే, అనగా భయపడకుండా, నిరుత్సాహపడకుండా ముందుకు నడిస్తే నీకు విజయం లభిస్తుంది. ఆ స్ఫూర్తే నలుగురూ అనుసరించేందుకు ఒక దారిగా మారుతుందని దీని అర్థం. నేను కూడా ఇది సరైనదేనని సమర్థిస్తాను.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 90)

ప్రశ్న 1.
మనిషి మృగము ఒకటేనా ? కాదా ? చర్చించండి .
జవాబు:
మనిషీ, మృగమూ ఒక్కటికానేకాదు. మనిషికి ఆలోచనాశక్తి వుంది. భావాలను తెలుపగలిగే భాష ఉంది. కానీ మృగానికి ఆలోచనాశక్తీ, భావాలను తెలిపే భాష లేవు. కనుక మనిషి మృగమూ ఒకటికాదు. ఆలోచనాశక్తి నశించి మానవత్వం మరిచిపోతే మనిషినే మృగం అనవచ్చు.

ప్రశ్న 2.
హిమగిరి శిరసు మాడటం అంటే మీకేమర్థమయింది ?
జవాబు:
హిమాలయ పర్వతం ప్రపంచంలోనే ఎత్తైనది. అయినా దాని నెత్తిని కూడా సూర్యుడు తన వేడి కిరణాలతో మాడుస్తాడు. అంత ఎత్తు ఉన్నా హిమగిరికీ సూర్యుని తాపం తప్పలేదు కదా ! ఎండవేడికి అది కరిగి ఏఱుగా, అనగా నదిగా ప్రవహించవలసిందే. అలాగే ఎంతటి మనిషైనా అతని గర్వం, సమస్యలకు వేడెక్కి నీరుగా కారిపోవలసిందే అని నాకు అర్థమయింది.

ప్రశ్న 3.
‘చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుం’దనడాన్ని మీరు సమర్థిస్తారా ? ఎట్లా?
జవాబు:
త్యాగం అంటే మనకున్నది ఇతరులకు ఇవ్వడం. స్వార్థం చూసుకోకుండా ఇవ్వడం. ప్రతిఫలం ఆశించకుండా ఇవ్వడం. మనకోసం ఎవరైనా ఏదైనా త్యాగం చేస్తే మనం వారిని జీవితాంతం మరచిపోలేము.

అలాగే తమకున్న డబ్బుతో గుడి, బడి, ఆసుపత్రి, అన్నదాన సత్రము మొదలైనవి కట్టిస్తే వారి పేరును సమాజం గుర్తు పెట్టుకొంటుంది. ఉదాహరణకు రంగయ్యగారు బడి కట్టిస్తే, దానిని రంగయ్య బడి అంటాం. బిర్లా టెంపుల్ మొదలైనవి. అంటే అవి ఉన్నంతకాలం వారి పేరు కూడా ఉంటుంది. అందుకే ఇది సమర్థించతగినది.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
క్రింది అంశాన్ని గురించి చర్చించండి.

అ) ‘జీవనభాష్యం’ అనే శీర్షిక ఈ గజల్కు ఎలా సరి పోయిందో చెప్పండి..
జవాబు:
ఈ పాఠానికి ‘జీవన భాష్యం’ అనే పేరు తగినదిగా ఉంది. ఎందుకంటే ఈ పాఠ్యభాగంలో మానవుడు తన జీవితంలో ఎప్పుడు గౌరవం పొందుతాడు. ఎలా జీవించాలి అనే విషయాలను లోతుగా పరిశీలించి కవి మనకు అందించారు. మానవ జీవిత పరమార్థాన్ని ఈ చిన్న గజల్ ద్వారా అందించడం జరిగింది.

మానవుడు దుఃఖాలన్నింటిని సమర్థవంతంగా తట్టుకుంటూ, కష్టాలను సాహసంతో ఎదుర్కొంటూ ఉండాలని, తనంతట తాను ఉన్నతంగా ఎదుగుతూ, తోటి వారి కోసం పాటుపడుతూ జీవించాలనే జీవిత సత్యం ఇందులో ఉంది. అందువల్ల ఈ పాఠానికి ‘జీవన భాష్యం’ అనేపేరు తగినదిగా చెప్పవచ్చు.

TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం

ప్రశ్న 2.
పాఠం చదివి ప్రాస పదాలను గుర్తించండి. రాయండి.
జవాబు:
TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం 1

ప్రశ్న 3.
క్రింది అపరిచిత గేయ పాదాలను చదువండి.

భీతి లేక మనిషి ఎచట శిరమునెత్తి నిలుచునో
తనివి తీర జనులకెల్ల జ్ఞానసుధలు దొరుకునో
అడ్డుగోడ లేని సమసమాజమెచట నుండునో
హృదంతరాళ జనితమౌ సత్యమెచట వరలునో
ఆ స్వతంత్ర స్వర్గసీమ నిర్మింపగ తరలి రమ్ము
లెమ్ము లెమ్ము లెమ్ము లెమ్ము లెమ్ము సోదరా !

గేయం చదివి క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) ‘శిరమునెత్తి నిలుచునో’ అంటే మీకేమి అర్థమైంది?
జవాబు:
భీతి లేకుండా (భయం) ఉంటే మనిషి తలఎత్తుకొని నిలబడతాడని అర్థమైంది.

ఆ) జ్ఞానసుధలు ఎట్లా ఉండాలని గేయంలో ఉన్నది ?
జవాబు:
జ్ఞానసుధలతో తృప్తి కలగాలి. అంటే జ్ఞానతృష్ణ తీరాలి.

ఇ) సమసమాజం ఎట్లా ఏర్పడుతుంది ?
జవాబు:
సమసమాజం అడ్డుగోడలు లేకుండా ఏర్పడుతుంది.

ఈ) సత్యం విలసిల్లడం అంటే ఏమిటి ?
జవాబు:
మనస్సులో నుండి వచ్చే నిజమే విలసిల్లుతుంది.

ఉ) ‘స్వర్గసీమ’ అనడంలో అంతరార్థం ఏమిటి ?
జవాబు:
స్వర్గసీమలో భయం ఉండదు. తృప్తి కలిగించే జ్ఞానం దొరుకుతుంది. కుల, మతాలు, ధనిక, పేద అనే అడ్డుగోడలుండవు. నిజమైన మాట, ఆలోచన, ప్రవర్తన ఉంటుంది. పూర్తిగా స్వతంత్రం ఉంటుంది. అటువంటి ప్రదేశం కావాలి కనుక స్వర్గసీమ అన్నారు.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) ‘చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది’ అంటే త్యాగం చేసేవారి, మంచిపనులు చేసే వారి పేర్లు చరిత్రలో శాశ్వతంగా నిలుస్తాయి అని అర్థం. అందుకోసం ఎట్లాంటి మంచిపనులు చేయాలి?’
జవాబు:

  1. దశదానాలు, షోడశమహాదానాలు చేయాలి.
  2. గ్రామంలో దేవాలయము కట్టించాలి.
  3. పేద బ్రాహ్మణుడికి పెళ్ళి చేయించాలి.
  4. ఒక కవి రాసిన కావ్యాన్ని అంకితం తీసుకోవాలి.
  5. గ్రామంలో అందరికీ త్రాగేందుకు నీటి కోసం చెరువు తవ్వించాలి.
  6. ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయాలి. పైన చెప్పినవి అన్నీ “సప్త సంతానములు” అనే వాటిలోని మంచి పనులు.

ఇవిగాక పాఠశాలలూ, కళాశాలలూ ఏర్పాటు చేయించడం, పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వడం, చదువులు చెప్పించడం, పేదవారికి వైద్య ఖర్చులు భరించడం, గ్రామాలకు మంచినీటి సదుపాయాలు, రోడ్లు వేయించడం, దైవపూజలు చేయించడం, పేదల కోసం పెళ్ళి ఖర్చులు భరించడం, మంగళసూత్రాలు దానం చేయడం వంటి మంచి పనులు చేస్తే వారి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుంది.

ఆ) “ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు” అనే వాక్యం ద్వారా విద్యార్థులకు ‘సినారె’ ఇచ్చే సందేశం ఏమై ఉండవచ్చు?
జవాబు:
జీవన భాష్యం’ అనే పాఠ్యభాగంలో “ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు” అనే వాక్యం ద్వారా సినారె విద్యార్థులకు అద్భుతమైన సందేశాన్ని ఇచ్చాడు. విద్యార్థులు చదువులో ఒక్కోసారి వెనుకబడతారు. చదువుకునేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. అయినప్పటికీ విద్యార్థులు తమకు ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి. కష్టాలను ఓర్పుతో సహించాలి.

అవాంతరాలను అధిగమించాలి. అప్పుడే విద్యార్థులు చదువులో రాణిస్తారు. ప్రగతి పథంలో పయనించ గలుగుతారు. ఉత్తమ ఫలితాలను పొంద గలుగుతారు. తమకు డబ్బులేదని, చదువు సరిగా రావడం లేదని నిరాశపడవద్దని, అధైర్యంతో ఆత్మహత్యలకు పాల్పడ కుండా ధైర్యంతో ముందుకు వెళ్ళాలనే ఉపదేశాన్ని నారాయణరెడ్డి గారు విద్యార్థులకు అందించారని భావిస్తున్నాను.

TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం

ఇ) ‘మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది” అని ‘సినారె’ ఎందుకు అని ఉంటాడు ?
జవాబు:
“జీవన భాష్యం” అనే పాఠ్యభాగంలో మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది” అని నారాయణ రెడ్డి గారు ఉపదేశించారు. సమాజంలో మానవులంతా కలిసిమెలిసి జీవించాలి. పరస్పర సహకారాన్ని పొందాలి. వర్గ వైషమ్యాలను విడనాడాలి. కులమతాల అడ్డు గోడలను తొలగించుకోవాలి. ఒకరినొకరు గౌరవించు కోవాలి. ఆపదల్లో ఉన్న తోటివారిని ఆదుకోవాలి.

అప్పుడే సమాజంలోని వారందరూ సుఖశాంతులతో వర్ధిల్లుతారని, అటువంటి ప్రశాంతతో కూడిన గ్రామీణ వాతావరణం రావాలని కవి కోరుతున్నారు. పరస్పర సహకారంతో జీవించడమే ఉత్తమ సాంఘిక జీవనం. సాటి మనుషుల పట్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పరచు కోవాలి. అప్పుడే అందరు కలిసి ఆనందంగా జీవించ గలుగుతారని, అలాంటి మనుషులంతా ఏకమైతేనే చల్లని ఊరు ఏర్పడుతుందని కవి భావించాడు.

ప్రశ్న 2.
క్రింది ప్రశ్నలలో ఒకదానికి పది వాక్యాల్లో జవాబు వ్రాయండి.

అ) ‘జీవనభాష్యం’ అందించే సందేశాన్ని వివరించండి.
జవాబు:
జీవనభాష్యం ద్వారా ఇతరుల కోసం పాటుపడుతూ జీవించే మనిషి సమాజంలో గౌరవం పొందుతాడనీ మరియు వ్యక్తులు మాత్రమే కాకుండా ప్రకృతిలో ఇటువంటి పరోపకార గుణం గల ఎన్నో విషయాలు ఉన్నాయని తెలుస్తుంది. అంతేగాకుండా పరోపకార గుణం గల నదులు, మేఘాలు, వృక్షాలు మనకు ఎంతో సహకారం అందిస్తాయి. జీవనభాష్యం ద్వారా చింతలు, బాధలు, ఆందోళనలు అనేవి మనసును కుంగదీసినపుడు అవి కన్నీరు రూపంలో బయటకు వస్తాయి.

ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ఎన్నో అడ్డంకులు ఎదురైతే వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు నడిచినపుడే మనకు విజయం చేకూరుతుంది. అదే విధంగా బీడు భూమిలో ఏ పంటలూ పండవని నిరాశపడకుండా అదే నేలను కష్టపడి దున్నితే, విశ్వాసంతో విత్తనాలు నాటితే మంచి పంటలు పండుతాయి.

సాటి మనుషుల పట్ల ప్రేమ ఆప్యాయత, సంబంధాలు కలిగి ఉండాలని నేర్పుతుంది జీవనభాష్యం. అటువంటి మనుషులు కలిస్తేనే ఒక ఊరు ఏర్పడుతుందని కవి భావన.

అలాగే “కష్టం వెనుక సుఖం, సుఖం వెనుక కష్టం” ఒకదాని తరువాత మానవ జీవితంలో పరిపాటి అని తెలుస్తుంది. ఏమి ఆలోచించకుండా మబ్బు వర్షాన్ని ఇస్తుంది. నదులు నీటిని అందిస్తాయి. అలాగే రైతు మనందరి కోసం రేయింబవళ్ళు కష్టపడి మనకు ఆహారాన్ని అందించి “అన్నదాత” గా మారాడు.

అటువంటి రైతు చేసే గొప్ప పని, నిస్వార్థ త్యాగం మనం మరచిపోరాదు. మన పేరు ప్రపంచానికంతా తెలిసేలా ప్రఖ్యాతి పొందే పనులు చేసి, నిజమైన విలువ, గుర్తింపు పొందాలని ఈ పాఠం ద్వారా తెలుస్తుంది. అప్పుడే మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుందని జీవనభాష్యం మనకు సందేశం ఇస్తుంది.

ప్రశ్న 3.
క్రింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ వ్రాయండి.

అ) “జీవన భాష్యం” గజల్లోని అంత్యప్రాసల ఆధారంగా సొంతగా ఒక వచన కవితను రాయండి.
జవాబు:

1) మంచు కరిగితే నీరవుతుంది.
2) మంచి నడకనడిస్తే దారవుతుంది.
3) వర్షం కురిస్తే పంట పైరవుతుంది.
4) మంచి వ్యక్తులు కూడితే ఊరవుతుంది.
5) నదులు పారితే అది ఏరవుతుంది.
6) త్యాగధనులుంటే పేరవుతుంది.

(లేదా)

ఆ) ఆచార్య సి. నారాయణ రెడ్డి గారు ఒకవేళ మీ పాఠశాలకు వస్తే మీరు వారి నుండి ఏం తెలుసుకోవాలనుకొంటున్నారో ప్రశ్నలు వ్రాయండి.
జవాబు:

  1. మీ రచనలలో మీకు బాగా నచ్చిన కావ్యం ఏది ?
  2. ‘ప్రపంచ పదులు’ దీన్ని మీరు ఎలా సృష్టించారు ?
  3. మీ సినీగేయాలలో మీకు నచ్చిన గేయం ఏది ?
  4. మిమ్ములను కవిత్వం వైపు నడిపించినది ఎవరు ?
  5. మీ రచనలకు ప్రేరణనందించిన అంశాలు ఏవి ?
  6. మధ్యతరగతి మందహాసంలోని ప్రధానమైన అంశం ఏమిటి ?
  7. ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతన్నలకు, మీరిచ్చే సందేశం ఏమిటి ?
  8. విద్యార్థులు మానసిక వత్తిడి నుండి ఎలా బయట పడగలుగుతారు ?
  9. నేటి యువ రచయితలకు మీరిచ్చే సలహాలు ఏమి ?
  10. ప్రస్తుతం మీరు ఎందుకు సినిమా పాటలు రాయడం లేదు ?

III. భాషాంశాలు

పదజాలం

1. క్రింది పదాలకు పర్యాయపదాలు రాయండి.

అ) మబ్బు: మేఘం, చీకటి, అజ్ఞానము, అంబుదం, జలదం
ఆ) గుండె : హృదయము, మనస్సు, ధైర్యము, ఎద, ఎడద
ఇ) శిరసు : తల, శిఖరము, సీనాగ్రము, ప్రధానము, మస్తకం

2. క్రింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

అ) వ్యాప్తి : తెలంగాణా సంగీతాన్ని రాష్ట్ర ప్రభుత్వం దేశం అంతట వ్యాప్తి చేసింది.
ఆ) జంకని అడుగులు: గుండె బలం కలవాడు జంకని అడుగులు వేస్తూ ముందుకు వెళ్తాడు.
ఇ) ఎడారి దిబ్బలు : ప్రయోజనంలేని ఎడారి దిబ్బలపై కూడా కష్టపడితే పంటలు పండించవచ్చు.
ఈ) చెరగని త్యాగం : పరోపకార పరాయణులు చెరగని త్యాగగుణం కలవారుగా ఉంటారు.

TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం

వ్యాకరణాంశాలు

1. క్రింది పదాలను కలిపి, సంధిని గుర్తించి వ్రాయండి.

అ) నీరు + అవుతుంది – నీరవుతుంది – ఉకార సంధి
ఆ) ఎత్తులకు + ఎదిగిన = ఎత్తులకెదిగిన – ఉకార సంధి
ఇ) పేరు + అవుతుంది = పేరవుతుంది – ఉకార సంధి

2. క్రింది పంక్తులలోని సమాస పదాలు గుర్తించి, విగ్రహ వాక్యాలు రాసి, అవి ఏ సమాసాలో తెలియజేయండి.

అ) ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు.
జవాబు:
ఎడారి దిబ్బలు – ఎడారి యొక్క దిబ్బలు (షష్ఠీ తత్పురుష సమాసం)

ఆ) ఇసుకగుండెలు పగిలితే అది పైరవుతుంది.
జవాబు:
ఇసుకగుండెలు – ఇసుక అనెడి గుండెలు (రూపక సమాసం)

3. క్రింది వాటిని చదివి ఏ అలంకారాలో గుర్తించండి.

అ) నీకు వంద వందనాలు
జవాబు:
పై వాక్యంలో వంద అనే హల్లుల జంట, వెంటవెంటనే అర్థ భేదంతో వచ్చింది. ఇక్కడ మొదట వచ్చిన ‘వంద’ నూరు సంఖ్యను తెలుపుతుంది. రెండోసారి వచ్చిన ‘వంద’ వందనాలు అంటే నమస్కారాలు అని తెలుపుతోంది. కావున ఇది ఛేకానుప్రాసాలంకారం.

ఛేకానుప్రాసాలంకారం : హల్లుల జంట, అర్థభేదంతో వెంటవెంటనే వస్తే దానిని ‘ఛేకానుప్రాస’ అలంకారం అంటారు.

ఆ) తెలుగు జాతికి అభ్యుదయం
నవ భారతికే నవోదయం
జవాబు:
పై గేయంనందు ప్రాసపదాలు అంత్యములో ఉన్నాయి కాబట్టి ఇది అంత్యానుప్రాసాలంకారం.

ఇ) రాజు రివాజులు బూజు పట్టగన్
జవాబు:
ఇది వృత్త్యానుప్రాసాలంకారం. పదం మధ్యలో జ అనే అక్షరం పలుమార్లు వచ్చింది. కాబట్టి ఇది వృత్త్యానుప్రాసాలంకారం.

ఈ) అజ్ఞానాంధకారం తొలిగితే మంచిది.
జవాబు:
ఇది రూపకాలంకారం
అజ్ఞానము – ఉపమేయం
అంధకారం – ఉపమానం

ఇక్కడ ఉపమేయమైన అజ్ఞానమునందు ఉపమానమైన అంధకార ధర్మం ఆరోపించబడింది. కావున ఇది రూపకాలంకారం.

ప్రాజెక్టు పని

డా|| సి. నారాయణ రెడ్డి రాసిన ఏవైనా రెండు గేయాలు/ గజల్లను సేకరించండి. నివేదిక రాసి ప్రదర్శించండి.
జవాబు:
కొన్ని (సినారె) గేయాలు :

1) “నా పేరు కవి
ఇంటి పేరు చైతన్యం
ఊరు సహజీవనం
తీరు సమభావనం”

TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం

2) “నా వచనం బహువచనం
నా వాదం సామ్యవాదం
కవిత్వం నా మాతృభాష
ఇతివృత్తం మానవత్వం”

3) “ఊపిరాడడం లేదు
ఉక్కపోస్తుంది. ఎ.సి గదిలో
కారణం తెలిసిపోయింది.
కవిత రాయలేదు ఇవాళ”

నివేదిక

డా॥ సి. నారాయణరెడ్డి గారు తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధ కవులుగా కీర్తి పొందారు. వీరి గేయాలు భావస్ఫోరకంగా ఉంటాయి. తేటతెలుగు పదాలతో అలరారుతుంటాయి. అంత్యప్రాసలు పాటలకు మరింత అందాన్ని ఇస్తాయి. చిన్న పదాలతో విస్తృతమైన భావాన్ని గేయాల ద్వారా అందించడం నారాయణరెడ్డి గారి ప్రత్యేకత.

సన్నివేశానికి అనుగుణంగా పదాలను గేయంలో చూపించడం నారాయణరెడ్డి గారికే చెల్లుతుంది. జాతీయాలను, తెలుగు నుడికారాలను చక్కగా చెప్పగల విశిష్ట కవి. పదలాలిత్యం, అంతకుమించిన గుణాత్మకశైలి గేయాలకు వన్నె చేకూరుస్తాయి. అందుకే తరాలు మారినా తెలుగువాడి మదిలో నారాయణరెడ్డి గారి గేయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. గేయరచనలో వీరు చూపిన దారి అందరికి ఆదర్శంగా నిలుస్తుంది.

విశేషాంశాలు

ఆచార్య సింగిరెడ్డి నారాయణరెడ్డిగారి రచనలు

1) ఆధునికాంధ్ర కవిత్వము

  • సంప్రదాయములు
  • ప్రయోగములు

2) ‘విశ్వంభర’ – (జ్ఞానపీఠ అవార్డు వచ్చిన కావ్యం)
3) నాగార్జున సాగరం
4) కర్పూర వసంతరాయలు
5) మధ్యతరగతి మందహాసం
6) ప్రపంచపదులు

7) విశ్వనాథనాయకుడు
8) నారాయణరెడ్డి గేయాలు
9) దివ్వెల మువ్వలు
10) అజంతా సుందరి
11) రామప్ప
12) నవ్వని పువ్వు
13) వెన్నెలవాడ
14) ఋతుచిత్రం
15) స్వప్నభంగం
16) విశ్వగీతి

17) జలపాతం
18) సినీగేయాలు
19) జాతిరత్నం
20) తరతరాల వెలుగు (గేయ రూపకాలు)
21) అక్షరాల గవాక్షాలు
22) మంటలు – మానవుడు
23) ఉదయం నా హృదయం
24) మార్పు నా తీర్పు
25) ఇంటి పేరు చైతన్యం

TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం

26) రెక్కలు
27) నడక నా తల్లి
28) కాలం అంచుమీద
29) కవిత నా చిరునామా
30) కలం సాక్షిగా
31) భూమిక, మట్టీ – మనిషి (దీర్ఘ కావ్యాలు)
32) తెలుగు గజళ్ళు
33) వ్యాసవాహిని, సమీక్షణం
34) పాశ్చాత్యదేశాల్లో 50 రోజులు (యాత్రా సాహిత్యం)
35) పాటలో ఏముంది – నా మాటలో ఏముంది (సినిమా పాటల విశ్లేషణ)

సూక్తి : మనిషిలో ఏ గుణం సన్నగిల్లినా మానవత్వం మృతి చెందకుండా ఉంటే చాలు. ఆ మానవత్వమే మనిషిని మహనీయుడిని చేస్తుంది.

అర్థాలు – భావాలు

I

మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది
మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది
వంకలు డొంకలు కలవనీ జడిపించకు నేస్తం !
జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది.

అర్థాలు

నేస్తం = స్నేహితుడా !
మబ్బుకు = మేఘానికి
మనసే = హృదయమే
కరిగితే = కరిగినట్లయితే
అది = ఆ మేఘం
నీరు + అవుతుంది = నీరుగా మారుతుంది
ముసిరితే = ముసిరినట్లయితే
కన్నీరు + అవుతుంది = కన్నీళ్ళుగా అవుతుంది
వంకలు డొంకలు = వంకలు, సందులు
కలవనీ = కలిసిపోవని
జడిపించకు = భయపెట్టకు
నేస్తం = మిత్రమా
జంకని = భయపడని
అడుగులు = అడుగులు
కదిలితే = కదిలినట్లయితే
అది = ఆ నడిచిన ప్రదేశం
దారి + అవుతుంది = మార్గం అవుతుంది

భావం:
నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కితే వర్షమై అవి భూమి మీద కురుస్తాయి. అలాగే మనసుకు ఆందోళనలు, బాధలు, చింతలు అనే దిగులు మబ్బులు కమ్ముకుంటే దుఃఖస్థితి వస్తుంది. అది కన్నీరుగా మారుతుంది.

ఒక లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరినపుడు అడుగడుగునా ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదురవుతాయని లోకం భయపెడుతుంది. కాని ఆ మాటలకు భయపడకుండా, నిరుత్సాహపడకుండా ముందుకు నడిస్తేనే విజయం లభిస్తుంది. ఆ స్ఫూర్తే నలుగురు అనుసరించే దారిగా మారుతుంది.

TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం

II

ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు
ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది
మనిషీ మృగమూ ఒకటనీ అనుకుంటే వ్యర్థం
మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది
ఎంతటి ఎత్తుల కెదిగినా ఉంటుంది పరీక్ష
హిమగిరి శిరసే మాడితే అది యేరవుతుంది
బిరుదులు పొందే వ్యాప్తికీ విలువేమి “సినారె”
చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది.

అర్థాలు

ఎడారి దిబ్బలు = బీడుగా ఉన్న ప్రాంతాలు
దున్నితే = దున్నినట్లయితే
ఫలము = ప్రయోజనం
ఏముంది + అనకు = ఏముంటుందని అనవద్దు
ఇసుక గుండెలు = ఇసుకతో ఉన్న హృదయాలు
పగిలితే = పగిలినట్లయితే
అది = ఆ భూమి
పైరు + అవుతుంది = పంటలు పండుతుంది
మనిషి = మానవుడు
మృగము = మృగము
ఒకటని = ఒక్కటే అని
అనుకుంటే = భావిస్తే
వ్యర్థం = అనవసరము
మనుషులు = మానవులు
పదుగురు = అనేకమంది
కూడితే = కలిసినట్లయితే
ఒక ఊరవుతుంది = ఒక గ్రామం అవుతుంది
ఎంతటి ఎత్తులకు = ఎంతటి ఎత్తుకైనా
ఎదిగినా = ఎదిగినప్పటికీ
ఉంటుంది = ఉండును
పరీక్ష = పరీక్ష
హిమగిరి = హిమాలయ
శిరసే = శిఖరమే
మాడితే = ఎండితే
ఏ + అవుతుంది = నది అవుతుంది
బిరుదులు = పురస్కారాలు
పొందే = పొందేటటువంటి
వ్యాప్తికే = కీర్తికే
చెరగని = చెదిరిపోని
విలువేమి = విలువ ఏమిటి ?
సినారె = సి. నారాయణరెడ్డి
త్యాగం = త్యాగము
ఒక పేరు + అవుతుంది = ఒక పేరుగా నిలుస్తుంది

భావం
బీడుపడి, పనికిరాకుండా ఉన్న నేలలో ఏ పంటలూ పండవని ఏ ప్రయత్నాలూ చేయకుండానే నిరాశపడవద్దు. కష్టపడి ఆ నేలను దున్నితే విశ్వాసంతో విత్తనాలు నాటితే మంచి పంటలు పండుతాయి.

నలుగురు మనుషులు కలిసి పరస్పర సహకారంతో జీవించడమే ఉత్తమ సాంఘిక జీవనం. సాటి మనుషుల పట్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోవాలి. అప్పుడే అందరు కలిసి ఆనందంగా జీవించగలుగుతారు. అటువంటి మనుషులు కలిస్తేనే ఒక ఊరు ఏర్పడుతుంది.

ఎంత సామర్థ్యమున్నా, అధికారం, సంపదలు ఉన్నా, ఎన్నో విజయాలు సాధించినా, ఇక నాకు ఏ కష్టాలూ, బాధలు రావని ధీమాగా ఉండలేం. విధి ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో, సమస్యల పరీక్షలు పెడుతుందో ఎవరూ ఊహించలేరు. దాని శక్తి ముందు ఎవరైనా తలవంచవలసిందే. ఉన్నతమైన హిమాలయ పర్వత శిఖరం కూడా ఎండ వేడికి కరిగిపోయి నదిగా ప్రవహించవలసిందే ! అలాగే ఎంతటి మనిషైనా గర్వం నీరు కారిపోవలసిందే.

మనపేరు ప్రపంచానికంతా తెలిసేలా ప్రఖ్యాతి పొందామని, ప్రతిష్టాత్మక బిరుదులు, సత్కారాలు పొందామని అనుకోవడంలో నిజమైనవిలువ, గుర్తింపు లేదు. మానవాళికి పనికివచ్చే గొప్పపని, నిస్వార్థ త్యాగం చేస్తేనే ఆ మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది.

పాఠం ఉద్దేశం

మనిషి దేన్ని గురించి నిరుత్సాహపడకూడదు. దేన్నైనా ప్రయత్నం ద్వారా సాధించవచ్చు. దుఃఖాన్ని తట్టుకుంటూ, కష్టాలను ఎదుర్కొంటూ, తనంతటతాను ఎదుగుతూ, ఇతరుల కోసం పాటుపడుతూ జీవించే మనిషి సమాజంలో గౌరవం పొందుతాడని చెప్పడం, తెలుగులో గజల్ ప్రక్రియను పరిచయం చేయడం ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ప్రస్తుత పాఠ్యభాగం డాక్టర్ సి. నారాయణరెడ్డి సమగ్ర సాహిత్యం “ఆరవ సంపుటిలోని తెలుగు గజళ్ళు” లోనిది.

కవి పరిచయం

కవి పేరు : డా॥ సింగిరెడ్డి నారాయణరెడ్డి (సి.నా.రె)
జన్మస్థలం : రాజన్న సిరిసిల్లాజిల్లా హనుమాజీ పేట గ్రామం.
దేనినుండి గ్రహింపబడినది : నారాయణరెడ్డి సమగ్ర సాహిత్యం ఆరవ సంపుటిలోని ‘తెలుగు గజళ్ళు’ నుండి.
జననం : 1931, జులై 29

కవి విశేషాలు : ప్రముఖ ఆధునిక కవి, వక్త, పరిశోధకుడు, బహుభాషావేత్త, ప్రయోగశీలి, సినీగేయ రచయిత
ఇతర రచనలు : నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మంద హాసం, విశ్వంభర, ప్రపంచపదులు మొదలైనవి. నలభైకి పైగా కావ్యాలు, అద్భుతమైన సినీ గేయాలు, గజల్స్ రచించారు.

ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయ ములు – ప్రయోగములు, వీరి ప్రామాణిక సిద్ధాంత గ్రంథం.
బిరుదులు : పద్మభూషణ్, జ్ఞానపీఠ అవార్డు.
పురస్కారాలు : ‘విశ్వంభర’ కావ్యానికి జాతీయ స్థాయిలో అత్యున్నత జ్ఞానపీఠ పురస్కారం.

ఉద్యోగ నిర్వహణ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖలో ఆచార్యులుగా, అధికార భాషాసంఘం అధ్యక్షులుగా, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికీ,
తెలుగు విశ్వ విద్యాలయానికీ ఉపకులపతి, రాజ్యసభ సభ్యులు.

సారస్వత సేవ : ఆంధ్ర సారస్వత (వైస్ ఛాన్స్లర్) సేవలు అందించారు.
కవితాశైలి : శబ్దశక్తి, అర్థయుక్తి సినారె కలానికీ, గళానికీ ఉన్న ప్రత్యేకత. వీరి రచన సరళంగాను, మనోహరంగాను ఉంటుంది.
మరణం : 2017, జూన్ 12

TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం

ప్రవేశిక

ఏ ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగే ప్రయాణానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉండదు. అనేక రకాల అవరోధాలను, ఆటుపోట్లను అనుభవిస్తూ విజయాన్ని సాధించడంలోనే ఆనందం, సంతృప్తితోపాటు నిజమైన గుర్తింపు లభిస్తుంది. అటువంటి అనేక జీవన విలువలను ఉద్బోధించే మానవ వికాస భాష్యాన్ని విందాం.

విద్యార్థులకు సూచనలు

  • పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
  • పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత గీయండి.
  • వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పద విజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకోండి.

ప్రక్రియ – గజల్

ఈ పాఠం ‘గజల్’ ప్రక్రియకు చెందినది. గజల్లో పల్లవిని “మత్లా” అని, చివరి చరణాన్ని “మక్తా” అని, కవి నామముద్రను “తఖల్లుస్” అని అంటారు. పల్లవి చివర ఉన్న పదం, ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది. సరస భావన, చమత్కార ఖేలన, ఇంపూ, కుదింపూ గజల్ జీవగుణాలు.

పాఠ్యభాగ సారాంశం

నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కితే వర్షమై అవి భూమి మీద కురుస్తాయి. అలాగే మనసుకు ఆందోళనలు, బాధలు, చింతలు అనే దిగులుమబ్బులు కమ్ముకుంటే దుఃఖస్థితి వస్తుంది. అది కన్నీరుగా మారుతుంది.

ఒక లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరినపుడు అడుగడుగునా ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదురవుతాయని లోకం భయపెడుతుంది. కాని ఆ మాటలకు భయపడకుండా నిరుత్సాహపడకుండా ముందుకు నడిస్తేనే విజయం లభిస్తుంది. ఆ స్ఫూర్తే నలుగురు అనుసరించే దారిగా మారుతుంది. బీడుపడి, పనికిరాకుండా ఉన్న నేలలో ఏ పంటలూ పండవని ఏ ప్రయత్నాలూ చేయకుండానే నిరాశపడవద్దు. కష్టపడి ఆ నేలను దున్నితే, విశ్వాసంతో విత్తనాలు నాటితే మంచి పంటలు పండుతాయి.

నలుగురు మనుషులు కలిసి పరస్పర సహకారంతో జీవించడమే ఉత్తమ సాంఘిక జీవనం. సాటి మనుషులు పట్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పరుచుకోవాలి. అప్పుడే అందరు కలిసి ఆనందంగా జీవించగలుగుతారు. అటువంటి మనుషులు కలిస్తేనే ఒక ఊరు ఏర్పడుతుంది.

ఎంత సామర్థ్యమున్నా, అధికారం, సంపదలు ఉన్నా ఎన్నో విజయాలు సాధించినా ఇక నాకు ఏ కష్టాలూ బాధలూ రావని ధీమాగా ఉండలేం. విధి ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో సమస్యల పరీక్షలు పెడుతుందో ఎవరూ ఊహించలేరు. దాని శక్తిముందు ఎవరైనా తలవంచ వలసిందే. ఉన్నతమైన హిమాలయ పర్వత శిఖరం కూడా ఎండ వేడికి కరిగిపోయి నదిగా ప్రవహించవలసిందే ! అలాగే ఎంతటి మనిషి గర్వమైనా నీరుకారిపోవలసిందే.

మనపేరు ప్రపంచానికంతా తెలిసేలా ప్రఖ్యాతి పొందామని, ప్రతిష్ఠాత్మక బిరుదులు, సత్కారాలు పొందామని అనుకోవడంలో నిజమైనవిలువ, గుర్తింపు లేదు. మానవాళికి పనికివచ్చే గొప్పపని, చెరగని త్యాగం చేస్తేనే ఆ మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచి పోతుంది.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

Telangana SCERT 10th Class Telugu Guide Telangana 7th Lesson శతక మధురిమ Textbook Questions and Answers.

TS 10th Class Telugu 7th Lesson Questions and Answers Telangana శతక మధురిమ

చదవండి – ఆలోచించి చెప్పండి. (T.B. P.No. 66)

నల్లగొంగడిదెచ్చి చల్లనద్దినగాని
మల్లెపూల విధంబు తెల్లఁబడునె

వేపాకు పసరెంతసేపు గాచిన గాని
తేనెతో సమముగ తియ్యఁబడునె

వెల్లిపాయలు దెచ్చి వే గంధమునఁ గూర్చ
పరిమళించునె మొల్ల విరులవలెను

కుక్కతోకకు రాతిగుండు గట్టిన గాని
వంకబోయిన కొన చక్కనగునె

కొంటెలను సజ్జనులతోను గూర్చితేమి
ఆత్మపరిశుద్ధులై భక్తులౌదురెట్లు
చక్రధర ! ధర్మపురిధామ ! సార్వభౌమ !
నరహరీ ! భక్తజనకల్ప ! నాగతల్ప !

– నరహరి శతకము, కాకుత్థ్సం శేషప్పకవి

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ఈ పద్యం ఎవరు రాశారు ? ఏ శతకంలో ఉన్నది ?
జవాబు:
కాకుత్థ్సం శేషప్పకవి. నరహరి శతకములోనిది.

ప్రశ్న 2.
ఈ పద్యం ద్వారా మీరేమి గ్రహించారు ?
జవాబు:
చెడ్డవారిని సజ్జనులుగా మార్చుట కష్టమని గ్రహించాను.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

ప్రశ్న 3.
ఇట్లాంటి పద్యాలు మీకింకా ఏమి తెలుసు ?
జవాబు:

  1. గంగిగోవుపాలు గరిటెడైనచాలు ….. వినుర వేమ ||
  2. గాజుం బూస యనర్ఘ రత్నమగునా …….. పార్వతీ వల్లభా |

ఈ పద్యాలు చదివాను.

ప్రశ్న 4.
వీటిని ఎందుకు నేర్చుకోవాలి ?
జవాబు:
ఇటువంటి మంచి మంచి పద్యాలు నేర్చుకోవడం వలన నీతులు తెలుస్తాయి. మానవ స్వభావాలు అంచనా వేయవచ్చు. మంచి ప్రవర్తన అలవాటు అవుతుంది. చక్కగా మాట్లాడడం తెలుస్తుంది. ఏ సమస్యనైనా పరిష్కరించుకోగల నేర్పు వస్తుంది. జీవితంలో జరిగే సంఘటనలను ముందుగానే ఊహించవచ్చు.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 69)

ప్రశ్న 1.
దైవాన్ని పూజించే విధానాలు ఎట్లా ఉండాలి ? ఎందుకు ?
జవాబు:
సత్యం, దయ, విశిష్టమైన ఏకాగ్రత (భక్తియోగ విధానం) ఈ విధానాల ద్వారా దైవాన్ని పూజించాలి ఎందుకంటే ఇవి మనిషికి అత్యంత అవసరం.

ప్రశ్న 2.
ప్రజలు రాజులను ఆశ్రయించ వచ్చునా ? ఎందుకు ?
జవాబు:
ఆశ్రయించరాదు. తినడానికి భిక్షం పెడతారు. నివాసానికి గుహలున్నాయి. వస్త్రాలు వీథుల్లో దొరుకు తాయి. తాగడానికి నదుల్లో చల్లని నీరు దొరుకుతుంది. తపస్సు చేసే మునులను రక్షించటానికి శ్రీకాళ హస్తీశ్వరుడు ఉన్నాడు. ఇంకా ఎందుకు రాజులను ఆశ్రయించాలి (ఆశ్రయించరాదు).

ప్రశ్న 3.
సిరిలేకున్నా పండితుడు ఏయే గుణాలవల్ల శోభిస్తాడు ?
జవాబు:
తలవంచి గురువు పాదాలకు నమస్కరించేవాడు, దానగుణం కలిగినవాడు, చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినేవాడు. సత్యవ్రతుడైనవాడు. భుజబలంతో విజయా లను పొందేవాడు. మనస్సునిండా మంచితనం కల వాడయిన పండితుడు సంపదలు లేకున్నా ప్రకాశిస్తాడు.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 70)

ప్రశ్న 1.
రాముని గొప్పదనాన్ని ఏ విధంగా చాటిచెప్పవచ్చు?.
జవాబు:
దశరథుని కుమారుడు, దయాసముద్రుడైన శ్రీరాముడు యుద్ధరంగంలో శత్రుభయంకరుడని, దుఃఖాలు పొందేవారి పాలిట బంధువువని, కాంతిమంతమైన అమ్ములపొది, బాణాలు, కోదండముల నుపయోగించే నేర్పులో ప్రచండమైన భుజతాండనం చూపి, కీర్తి పొందిన నీకు సాటివచ్చే దైవం మరొకరులేరని, మదించిన ఏనుగు నెక్కి ఢంకా మ్రోగిస్తూ, భూమండల మంతా వినబడేటట్లు చాటి చెప్పవచ్చు.

ప్రశ్న 2.
సత్ప్రవర్తన వల్ల పొందే ఫలితాలు ఏమిటి ?
జవాబు:
విష్ణుభక్తులను నిందించకుండా ఉంటే అనేక గ్రంథాలను చదివినట్లే, భిక్షమిచ్చేవారిని ఆపకుంటేచాలు, అది దానము చేసినట్లే. సజ్జనులను మోసం చేయకుండా ఉంటే గొప్ప బహుమతినిచ్చినట్లే, దేవతా మాన్యములను ఆక్రమించకుండా ఉంటే అది బంగారు ధ్వజస్తంభంతో కూడిన గుడి కట్టించినట్లే. ఇంకొకరి ‘వర్షాశనం’ (ఒక ఏడాదికి సరిపడే భోజనాన్ని) రాకుండా చేయకుంటే చాలు. తన పేరుతో సత్రాలు కట్టించినట్లే అవుతుంది.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

ప్రశ్న 3.
మోసం ఎందుకు చేయకూడదు ?
జవాబు:
అనేక దుర్గుణాల్లో మోసం ఒకటి. మోసం ఎన్నడూ, ఎవరికీ చేయకూడదు. దీనివల్ల విశ్వాసం కోల్పోతారు. మానవీయ సంబంధాలు దెబ్బతింటాయి. గౌరవం అంతరించిపోతుంది. మానసిక స్పర్థలు కలుగుతాయి. అందువల్ల మోసం అనేది చేయకుండా ఉండాలి.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 71)

ప్రశ్న 1.
కవి దృష్టిలో నిజమైన ఘనుడెవరు ?
జవాబు:
స్వార్ధం లేనివాడు, త్యాగంతో కూడిన దీక్షను పూని జను లందరి దీనస్థితిని రూపుమాపి, అందరికి సుకుమారమైన, ఆనందకర జీవితసుఖాన్ని పంచి, మాతృదేశపు గొప్పతనాన్ని ఎవరయితే విశదపరుస్తారో వారే గొప్ప వారవుతారు. అపూర్వమైన కీర్తిమంతులవుతారు.

ప్రశ్న 2.
మిత్రుని సహాయం ఎన్ని విధాలుగా ఉంటుంది ?
జవాబు:
మిత్రుని సహాయం చాలా రకాలుగా ఉంటుంది. మంచి పుస్తకంలాగా మంచిని బోధిస్తాడు. కార్యసాధనంలో సంపదలా సహాయపడతాడు. స్వాధీనమైన కత్తిలాగ శత్రుసంహారం చేసేవాడు. రక్షించే మనసులాగ సౌఖ్యాలను ఇచ్చేవాడు నిజమైన మిత్రుడు.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

ప్రశ్న 3.
నరరూప రాక్షసులంటే ఎవరు ?
జవాబు:
కలలో కూడా సత్యాన్ని పలకడానికి ఇష్టపడనివాడు, మాయమాటలు చెప్పి ఇతరుల సొమ్ము అపహరించే వాడు, కులగర్వంతోటి పేదవాండ్ల ఇండ్లను నాశనం చేసేవాడు, లంచాలకు విలువను పెంచేవాడు, చెడు ప్రవర్తనతో తిరిగేవాడు, వావివరుసలను పాటించని వాడు, నవ్వుతూ ముచ్చటాడుతూనే ఎదుటివాడిని నాశనం చేయాలనుకునేవాడు, తల్లిదండ్రులను ఇంటినుంచి వెళ్ళగొట్టేవాడు ఈ భూమిమీద మానవ రూపంలో ఉన్న రాక్షసుడే.

ఇవి చేయండి

1. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
శతక ప్రక్రియ శతాబ్దాల తరబడి కొనసాగుతూ ఉన్నది. పాఠంలోని శతక పద్యాల భావాలు నేటి కాలానికి కూడా తోడ్పడుతాయని భావిస్తున్నారా ? ఎందుకు ? చర్చించండి.
జవాబు:
తెలుగు సాహిత్యంలో శతకాలకు ప్రత్యేక స్థానం ఉంది. వందల సంవత్సరాల నుండి శతకాలు మానవులలో నైతికతను, సద్గుణాలను, మానవీయ విలువలను, భక్తితత్త్వాన్ని పెంపొందించడానికి తోడ్పడుతున్నాయి. పూర్వపు విద్యావిధానంతో ప్రతి ఒక్క విద్యార్థి శతక పద్యాలను కంఠస్థం చేసేవారు.

శతక పద్యాలు రాని విద్యార్థి ఉండేవాడు కాదు. నేడు అన్ని రంగాలలో మార్పులు వచ్చినట్లే భాషను నేర్చుకొనే విధానంలో కూడా మార్పులు వచ్చాయి. అందువల్ల కొందరు మాత్రమే శతకాలు చదువుతున్నారు. అయితే కాలం ఎంత మారినా నేటి సమాజానికి కూడా శతకాలు చదవడం ముఖ్యావసరం అని చెప్పవచ్చు.

ప్రస్తుత పాఠంలోని సర్వేశ్వర శతక పద్యం ద్వారా దేవుని అనుగ్రహం పొందాలంటే కోట్లాది రూపాయలు అవసరం లేదని సత్యం, దయ, ఏకాగ్రత అనే పుష్పాలు ఉంటే చాలని తెలుసుకున్నాం. దీని వల్ల నేడు భక్తి పేర జరుగుతున్న వృథా ఖర్చులను తగ్గించు కునే అవకాశం కల్గుతుంది.

కాళహస్తీశ్వర శతకం రాజుల నాశ్రయించవద్దని తెలిపింది. ఇప్పుడు రాజులు లేనప్పటికీ వారి స్థానంలో వచ్చిన ఎమ్.ఎల్.ఏలు, ఎమ్.పి.ల దగ్గరికి చేరకూడదని గ్రహించవచ్చు.

లోకంలో సంపద లేకపోయినా గురువులకు నమస్కరించడం, సత్యం పలకడం, దానం చేయటం అనే గుణాల వల్ల పండితుడు ప్రకాశిస్తాడు అని చెప్పటం వల్ల డబ్బు కంటే సత్యం, దానం, గురువందనం గొప్పవని మల్ల భూపాలీయ శతకం వల్ల తెలుస్తున్నది. దాశరథీ శతకం వలన శ్రీ రాముని వైభవాన్ని తెలుసు కున్నాం. నృసింహ శతకం ద్వారా ఏయే పనులు చేయకూడదో గ్రహించవచ్చు.

అందులో చెప్పిన విషయాలు నేటి సమాజంలో కూడా జరుగుతున్నవే. విశ్వనాథేశ్వర శతకం గొప్పవారు కావాలంటే త్యాగం చెయ్యాలని చెప్పుటయేగాక విద్యార్థులు కూడా దేశం కోసం త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలని బోధిస్తున్నది.

లొంకరామేశ్వర శతకం మిత్రుడు పుస్తకం లాంటి వాడని తెలిపి ఈ నాటికి కూడా స్నేహితుల విలువను మనకు గుర్తుకు తెస్తుంది. ఇక వేణుగోపాల శతకంలో చెప్పిన విషయాలు నేడు కూడా జరుగుతున్నా వాటిని చేయకుండా ఉండటానికి ప్రతివిద్యార్థి ప్రయత్నించాలి.

ప్రశ్న 2.
కింది భావమున్న పద్య పాదాలను పాఠంలో గుర్తించండి.

అ) మిత్రుడు యుద్ధరంగంలో కత్తివలె ఉపయోగపడుతాడు.
జవాబు:
7వ పద్యం – పొత్తంబై కడునేర్పుతో ………. స్వాయత్తంబైన కృపాణమై యరుల నాహరించు మిత్రుండు

ఆ) రాముని మించిన దైవం లేడని చాటుతాను.
జవాబు:
4వ పద్యం – భండన భీమ ….. రెండవ సాటి దైవమిక లేఁడనుచున్ కరుణాపయోనిథీ” ||

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

ప్రశ్న 3.
విద్వాన్ కలువకుంట కృష్ణమాచార్య రాసిన కింది పద్యాన్ని చదువండి. భావాన్ని సొంతమాటల్లో రాయండి.

పద్యానికి తగిన శీర్షికను పెట్టండి.
అనుభవమ్మున నేర్చిన యట్టి చదువు
తండ్రివలె కాపునిచ్చును తాను ముందు
పడిన కష్టాలచే గుణపాఠమయ్యి
తగిన ప్రేరణ – కాపాడు తల్లివోలె

భావం : అనుభవముతో నేర్చుకొన్న చదువు తండ్రిలాగా -రక్షించును. ముందు పడిన కష్టాలు, గుణ పాఠాలుగా పొంది తగిన ప్రేరణను ఇస్తుంది. అమ్మలాగా చదువు కాపాడుతుంది అని అర్థం.
శీర్షిక : “చదువు గొప్పతనం”, “చదువు వల్ల ప్రయోజనం”.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) మీ దృష్టిలో అపూర్వ కీర్తిమంతుడంటే ఎట్లా ఉండాలి?
(లేదా)
కీర్తివంతుని లక్షణాలను పాఠం ఆధారంగా వివరించండి.
జవాబు:
త్యాగం గుణం కల్గి జనులందరి దీనస్థితిని రూపు మాపి, అందరికి సుఖమయమైన, ఆనందకర జీవిత సుఖాన్ని పంచి, మాతృదేశపు గొప్పతనాన్ని ఎవరయితే విశదపరుస్తారో వారే గొప్పవారవుతారు. అపూర్వమైన కీర్తిమంతులవుతారు. ఈ పై లక్షణాలన్ని అపూర్వ కీర్తిమంతునికి ఉండాలని నా అభిప్రాయం.

ఆ) త్యాగి లక్షణాలెట్లా ఉంటాయి ?
(లేదా)
త్యాగి లక్షణాలను వివరించండి.
జవాబు:
నిజమైన త్యాగి తన సర్వస్వాన్ని ధారపోయటానికి కూడా ఇష్టపడతాడు. అడిగితే కాదనకుండా ఇస్తాడు. తనకిష్టమైనా సరే తృణప్రాయంగా భావించి ఇస్తాడు. ఇది చాలా గొప్ప విషయం.

  1. అతడు తన ప్రాణాలు కూడా లెక్కచేయడు.
  2. గొప్ప కోసం చూడడు.
  3. కీర్తి ప్రతిష్ఠలను కూడా లెక్కచేయడు.
  4. తన సర్వసాన్ని ఇచ్చివేస్తాడు. ఇవి త్యాగి లక్షణాలు.
    ఉదా : కర్ణుడు, బలిచక్రవర్తి, శిబి చక్రవర్తి మొదలగువారు.

ఇ) మిత్రుడు పుస్తకంవలె మంచి దారి చూపుతాడని ఎట్లా చెప్పగలరు ?
జవాబు:
మంచి పుస్తకాన్ని మించిన స్నేహితుడు లేడు. మంచి స్నేహితుని మించిన పుస్తకం లేదు. పుస్తకం అంటే విజ్ఞానం. ఒక విషయం తెలుసుకోవాలంటే పుస్తకంలో చూసుకొంటాం లేదా స్నేహితులను అడుగుతాం. పుస్తకం మనకు కథల రూపంలో మంచి మంచి నీతులను చెబుతుంది. జీవితంలో ఉపయోగించే ఎన్నో మంచి విషయాలను చక్కటి పదాలతో చెబుతుంది.

అలాగే స్నేహితుడు కూడా ఎన్నో మంచి విషయాలు చెబుతాడు. తప్పు చేస్తుంటే చేయవద్దు అంటాడు. మనకు వినసొంపైన మాటలతో మంచిని చెబుతాడు. కష్టకాలంలో తోడుగా నిలబడతాడు. తప్పుచేస్తే పరిహారం కూడా చెబుతాడు. అందుకే స్నేహితుడు మంచి పుస్తకం వలె మంచి మార్గం చూపిస్తాడు అంటారు.

ఈ) పూజకు సత్యం, దయ, ఏకాగ్రత అనే పుష్పాలు అవసరమని పాఠంలో తెలుసుకున్నారు కదా ! మరి చదువు విషయంలో ఏవేవి అవసరమనుకుంటున్నారు?
జవాబు:
ఏకాగ్రత అవసరం. శ్రద్ధ చాలా అవసరం. ఉత్సుకత, కార్యదీక్ష కూడా అవసరం “శ్రద్ధయా వర్థతే విద్య”. విద్యార్థికి అలసత్వం పనికిరాదు. “అలసతకూడదు ఇంచుక అధ్యయనంబున, బోధనంబునన్” అని ఒక ప్రసిద్ధ కవి అన్నాడు. వినయం, విధేయత, క్రమశిక్షణ కూడా చాలా అవసరం. పట్టుదల సాధించాలనే తపన ఉండాలి. వీటితోపాటుగా శారీరక, మానసిక దృఢత్వం ఎంతో అవసరం.

ప్రశ్న 2.
క్రింది ప్రశ్నకు పది వాక్యాలలో జవాబు రాయండి.

అ) శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా ఉపయోగపడుతాయో విశ్లేషించి రాయండి.
(లేదా)
శతక పద్యాల్లోని నీతులు జగతికి మార్గదర్శకాలు ఎలా అవుతాయో విశ్లేషించండి.
జవాబు:
శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో చాలా ఉపయోగ పడతాయి. ఎలాగంటే ……. సర్వేశ్వర శతకంలోని ‘భవదీయార్చన……….` అనే పద్యంలో దేవుని పూజించడానికి సత్యం, దయ, ఏకాగ్రత అనే లక్షణాలు ఉండాలన్నారు.

సత్యం మాట్లాడే లక్షణం అలవాటైతే మోసంచేసే ఆలోచన రాదు. అందుచేత గౌరవం పెరుగుతుంది. దయ కలిగి ఉంటే, కష్టాలలో ఉన్నవారికి సహాయం చేస్తాము. దాని వలన సమాజంలో స్నేహభావం పెరుగు తుంది. కక్షలు కార్పణ్యాలూ ఉండవు.

ఏకాగ్రత కలిగి ఉంటే ఏ పనినైనా సాధించవచ్చు. ఏ విషయమైనా అర్థమవుతుంది. తెలివి పెరుగుతుంది. తెలివైన సమాజం సంపదలను అభివృద్ధి చేస్తుంది. దరిద్రం ఉండదు. కరవుకాటకాలు ఉండవు.

శ్రీకాళహస్తీశ్వర శతకంలోని ‘ఊరూరం జనులెల్ల ……….’ అనే పద్యంలో చక్కటి నీతులు ఉన్నాయి. అవి అర్థం చేసుకొంటే ‘నేను, నావాళ్ళు’ అనే స్వార్థం పోతుంది. సంపాదన మాత్రమే జీవితం కాదని తెలుస్తుంది. భగవంతునిపైన నమ్మకం పెరుగుతుంది. ఉత్తమమైన సంస్కారం కలుగుతుంది.

‘సిరిలేకైన విభూషితుండె’ అనే పద్యంలో గురువులను గౌరవించాలని చెప్పారు. ఈ రోజులలో గురువులంటే గౌరవం తగ్గుతోంది. దానగుణం కావాలన్నారు. దానగుణం ఉంటే దొంగతనాలు, దోపిడీలు ఉండవు. మంచి విషయాలను వినాలన్నారు. మంచి విషయాలను వింటే మంచి ఆలోచనలు వస్తాయి. మంచిపనులు చేస్తాం. మంచి సమాజం ఏర్పడుతుంది. మనసులో సౌజన్యం ఉండాలన్నారు. మనసులో సౌజన్యం ఉంటే ఎవ్వరిపైనా కోపం, ద్వేషం ఉండవు. అందరూ నావాళ్ళే అనే భావం కలుగుతుంది. గొడవలకు అవకాశం లేదు. అందుచేత శతక పద్యాలలో చెప్పిన నీతుల వలన అనేక ప్రయోజనాలున్నాయి.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

ప్రశ్న 3.
క్రింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

అ) ఈ పాఠం ఆధారంగా మనం అలవర్చుకోవాల్సిన మంచి గుణాలు, అలవర్చుకోకూడని గుణాలను వివరిస్తూ మిత్రునికి ఒక లేఖ రాయండి.
జవాబు:
వరంగల్,
9.6.2018.
ప్రియమైన మిత్రునకు,
ఉభయకుశలోపరి. నేను 10వ తరగతి చదువు చున్నాను. మన 10వ తరగతిలోని 7వ పాఠం “శతక మధురిమ” చాలా బాగుంది. ఈ పాఠంలో మంచి గుణాలు, ఉండకూడని గుణాలు మా పంతులుగారి ద్వారా తెలుసుకున్నాను. వాటిని ఇక్కడ రాస్తున్నాను.

అలవర్చుకోవాల్సిన మంచి గుణాలు :

  1. పూజకు సత్యం, దయ, ఏకాగ్రత ఉండాలి. ఇవి లేని పూజ వ్యర్ధం.
  2. రాజులను ఆశ్రయించరాదు. అది నరకంతో సమానం.
  3. శ్రద్ధ, దానగుణం గల సత్యవ్రతుడు సంపదలు లేకపోయినా ప్రకాశిస్తాడు.
  4. మిత్రుడు మంచి పుస్తకంలాగా, ధనంలాగా, సహాయపడతాడు నిండు మనస్సుతో సుఖాన్ని ఇస్తాడు.

అలవర్చుకోకూడని గుణాలు :

  1. విష్ణు భక్తులను నిందించరాదు.
  2. భిక్షం ఇచ్చేవారిని ఆపకూడదు.
  3. సజ్జనులను మోసం చేయరాదు.
  4. దేవతామాన్యములను ఆక్రమించరాదు.
  5. అసత్యాన్ని పలకరాదు.
  6. మాయమాటలు చెప్పరాదు. లంచాలకు విలువ ఇవ్వరాదు. చెడు ప్రవర్తనతో తిరగరాదు.
    మీ పాఠంలో నీవు తెలుసుకున్న విషయాలు తెలియపరచగలవు.

ఇట్లు,
నీ మిత్రుడు,
X X X X X.

చిరునామా :

యం. యుగంధర్,
10వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూల్,
బాసర,
ఆదిలాబాద్ (జిల్లా.)

(లేదా)

ఆ) ఏదైనా ఒక పద్యభావం ఆధారంగా నీతికథ రాసి ప్రదర్శించండి.
జవాబు:
6వ పద్య భావం ఆధారంగా నీతి కథ

త్యాగం : అన్ని సద్గుణాల్లోను ‘త్యాగం’ ఎంతో గొప్పది. ఇది మానవుడికి అజరామరమైన కీర్తిని సంపాదించిపెడుతుంది. మనం కన్న సంతానం కన్నా, మనం సంపాదించిన ధనం కన్నా, మనం చేసిన మంచి పనుల కన్నా, శాశ్వతత్వాన్ని సమకూర్చి పెట్టేది త్యాగం ఒక్కటే! అందుకనే “నకర్మణా నప్రజయా ధనేన, త్యాగేనైకేన అమృతత్వమానసు” అని వేదం ఘోషిస్తుంది. దానం – త్యాగం ఈ రెండూ దగ్గర లక్షణాలు కలవిగానే కనిపించినా రెండింటిలో చాలా తేడా ఉంది. తన దగ్గరవున్న దానిలో ఇతరు లకు ఇవ్వడం దానం.

తనకు మిక్కిలి అవసరమైనదని తెలిసికూడా, దానిని లెక్కపెట్ట కుండా ఇతరు లకు ఇచ్చేయడం త్యాగం. భారతీయ సంస్కృతి ఈ త్యాగానికి పెద్దపీట వేసింది. త్యాగధనుల్ని ప్రాతః స్మరణీయులుగా భావించి నిత్యం ఆరాధించింది. అలాంటి త్యాగానికి సంబంధించిన ఎన్నో కథల్లో భాగవతంలోని ‘రంతిదేవుని” చరిత్ర వినదగ్గది. రంతిదేవుడు గొప్ప మహారాజు. తన దగ్గర వున్న సంపదనంతా ప్రజలకు దానం చేశాడు.

చివరకు ఏమీలేని నిర్ధన స్థితిలో భార్యాబిడ్డలతో మిగిలి పోయాడు. తినడానికి, తాగడానికి ఏమీ లభించని పరిస్థితిలో 48 రోజులు గడిపాడు. అప్పుడు ఆయన ముందు ఆకస్మాత్తుగా పంచభక్ష్య పరమాన్నాలు ప్రత్యక్షమయ్యాయి. నకనకలాడే భార్యాబిడ్డలతో ఆ ఆహారాన్ని తీసుకోడానికి సిద్ధపడ్డాడు.

అంతలో ఒక బ్రాహ్మణుడు వచ్చి ‘అయ్యా ! ఆకలితో బాధ పడుతున్నాను. నాకేమైనా పెట్టండి’ అని దీనంగా అడిగాడు. రంతిదేవుడు ఆ పరిస్థితిలో కూడా అతడికి సగభాగం యిచ్చేశాడు. ఆ తరువాత మరొక అతిథి వచ్చాడు. అతడికి తన దగ్గరవున్న సగభాగం యిచ్చాడు.

వరుసగా వచ్చి అడిగే ఆర్తులతో ఆహారం అయిపోయింది. చివరకు పానీయం మాత్రమే మిగిలింది. కనీసం ఆ నీరైనా తాగి ఆకలిని తీర్చుకుందామని అనుకున్నాడు. సరిగ్గా ఆ సమ యంలోనే ఓ దాహార్తుడు వచ్చి మంచినీరు యివ్వమని కోరాడు. రంతిదేవుడు ఎంతో ఆప్యాయతతో “అన్నా ! కష్టాలు ఎవరికైనా వస్తాయి.

రా అన్నా. ఈ నీరు త్రాగు” అని తనవద్ద మిగిలివున్న మధుర పానీయాలను కూడా యిచ్చివేశాడు. ఇదీ అసలైన త్యాగం. త్యాగం చేసిన మహానుభావుడు రంతి దేవుడు. అతని త్యాగానికి అంతటి విలువ ఉంది.

III. భాషాంశాలు

పదజాలం

ప్రశ్న 1.
క్రింది పదాలతో సొంతవాక్యాలు రాయండి.

అ) భాసిల్లు = ప్రకాశించు
జవాబు:
వినయ విధేయలతో విద్యార్థులు భాసిల్లాలి.

ఆ) ఉద్బోధించు = మేలుకొల్పుట, రగుల్చు
జవాబు:
యువకులకు వివేకానందస్వామి ఉద్బోధించాడు.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

ఇ) దైన్యస్థితి = దారిద్ర్యం చేత కలుగు దురవస్థ, దీనత్వం
జవాబు:
కుచేలుడు దైన్యస్థితిలో జీవనం సాగించాడు.

ఈ) నరరూప రాక్షసుడు = మనుష్య రూపంలోని రాక్షసుడు
జవాబు:
నేడు సమాజంలో నరరూప రాక్షసులు ఎక్కువగా ఉన్నారు.

ప్రశ్న 2.
క్రింది వాక్యాలలోని పర్యాయపదాలు గుర్తించండి. రాయండి.

అ) అడవిలో ఏనుగుల గుంపు ఉన్నది. ఆ గుంపుకు ఒక గజము నాయకత్వం వహిస్తున్నది. ఆ కరి తన గుంపులోని నాగములను రక్షిస్తుంది.
జవాబు:
ఏనుగు, గజము, కరి, నాగము.

ఆ) స్నేహితులతో నిజాయితీగా ఉండాలి. ఆ నిజాయితీ ఎందరో మిత్రులను సంపాదిస్తుంది. ఆ నెచ్చెలులే మనకు నిజమైన సంపద.
జవాబు:
స్నేహితులు, మిత్రులు, నెచ్చెలులు.

ఇ) రాజుల వీరత్వానికి చిహ్నం కృపాణం. వారు కత్తి సాములో నైపుణ్యానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఆ అసితోనే రాజులు శత్రువులపై విజయం సాధిస్తారు.
జవాబు:
కృపాణం, కత్తి, అసి.

ఈ) బంగారం అంటే అందరికీ ఇష్టం. అందుకే కనకం కొనడానికి అందరూ ఆసక్తి చూపుతారు. ఆ స్వర్ణంతో స్వర్ణకారుల దగ్గరకు వెళ్ళి తమకు నచ్చిన పసిడి ఆభరణాలను తయారు చేయించుకుంటారు.
జవాబు:
కనకం, బంగారం, స్వర్ణం, పసిడి.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

ప్రశ్న 3.
క్రింది వాక్యాలలోని ప్రకృతి, వికృతులను గుర్తించండి. వేరు చేసి రాయండి.

అ) తూరుపు దెస ఎర్రబడింది. దక్షిణ దిశవైపున్న నేను ఒక్కసారిగా అటు తిరిగాను.
జవాబు:
దిశ (ప్రకృతి) – దెస (వికృతి)

ఆ) సముద్రంలోని కెరటాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. ఆ సమయంలో సంద్రం భయాన్ని కలిగిస్తుంది.
జవాబు:
సముద్రం (ప్రకృతి) – సంద్రం (వికృతి)

ఇ) రాయడు తలుచుకుంటే అన్నీ సాధ్యం. రాజు మనసును పసిగట్టడం కష్టం.
జవాబు:
రాజు (ప్రకృతి) – రాయడు (వికృతి)

వ్యాకరణాంశాలు

1. క్రింది వాక్యాలు చదివి సంధి పదాలు గుర్తించి, విడదీసి సంధుల పేర్లు రాయండి.

అ) సీతను అందరూ బుద్ధిమంతురాలు అంటారు.
జవాబు:
బుద్ధిమంత + ఆలు = బుద్ధిమంతురాలు
– రుగాగమ సంధి

ఆ) అచ్చోట ఆ గులాబి మొక్కకు ఎన్ని పూలు పూచినాయో !
జవాబు:
ఆ + చోట = అచ్చోట = త్రిక సంధి

ఇ) రోగికి వైద్యుడు దివ్యౌషధం ఇచ్చాడు.
జవాబు:
దివ్య + ఔషధం = దివ్యౌషధం = వృద్ధి సంధి

ఈ) ఎవరెస్టు నధిరోహించిన పూర్ణ సాహసవంతురాలు.
జవాబు:
సాహసవంత + ఆలు = సాహసవంతురాలు – రుగాగమ సంధి

ఉ) సమాజం అభివృద్ధి చెందాలంటే సమైక్యత అవసరం.
జవాబు:
సమ + ఐక్యత = సమైక్యత = వృద్ధి సంధి

ఊ) విద్యావంతులే ఎక్కాలంలోనైనా కీర్తించబడతారు.
జవాబు:
ఏ + కాలము = ఎక్కాలం = త్రిక సంధి

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

2. క్రింది పద్యపాదానికి గణవిభజన చేసి, గురు లఘువులను గుర్తించి, ఏ పద్యపాదమో తెలుపండి. (T.S) June ’16 ; Mar. ’16

అ) భండనభీముఁ డార్తజన బాంధవుఁ డుజ్జ్వల బాణతూణ కో
జవాబు:
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 11

ఇది ఉత్పలమాల పద్యపాదము.

  1. ప్రతి పాదంలోను నాలుగు పాదాలుంటాయి.
  2. భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు వచ్చాయి.
  3. యతి 1 – 10వ అక్షరం (భ – బా)
  4. ప్రాస నియమం కలదు (౦డ)

ఆటవెలది

క్రింది పద్యపాదాలను గమనించండి.

అ)
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 12
జవాబు:
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 13

ఆ)
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 15
జవాబు:
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 14

ఇ)
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 16
జవాబు:
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 17

ఈ)
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 19
జవాబు:
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 18

  1. పై పద్యంలో 4 పాదాలున్నాయి.
  2. ప్రతి పాదానికి ఐదు గణాలు ఉన్నాయి.
  3. 1, 3 పాదాల్లో వరుసగా మూడు సూర్యగణాలు, రెండు ఇంద్రగణాలు ఉన్నాయి.
  4. 2, 4 పాదాల్లో ఐదు సూర్యగణాలు ఉన్నాయి.
  5. ప్రతి పాదంలో 4వ గణంలోని మొదటి అక్షరం యతి చెల్లింది.
    (బ్ర – బ, వ – వ, జే – జె, మా – మా)
  6. ప్రాసనియమం పాటించలేదు.

ఇట్లాంటి లక్షణాలున్న పద్యాన్ని ‘ఆటవెలది’ పద్యం అని అంటారు.
సూర్యగణాలు : నగణం (| | |), హగణం – U |

ఇంద్రగణాలు :
నల (| | |), నగ (| | | U) సల (| | UI), భ (U | |) ర (U | U), త (U U |) లు.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

క్రింది పద్యపాదాన్ని గణవిభజన చేసి ఏ పద్య పాదమో గుర్తించండి.

ఆ)
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 20
1 సూర్యగణము + 2 ఇంద్రగణాలు + 2 సూర్యగణాలు ఉన్న పద్యంను తేటగీతి పద్యం అంటారు.

ప్రాజెక్టు పని

6 నుండి 10 వ తరగతి వరకు చదువుకొన్న శతకాల పేర్లు, శతక కవుల వివరాలు కింది పట్టికలో రాసి ప్రదర్శించండి. వాటిలో ఎన్ని పద్యాలు మీరు కంఠస్థం చేశారో తెలుపండి.
జవాబు:
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 21

విశేషాంశాలు

  1. శతకం శతకం అనగా ముక్తకం. ముక్తకం స్వతంత్ర భావంతో ఉంటుంది. ఏ పద్యానికి ఆ పద్యం ప్రత్యేక భావాన్ని ప్రకటించడానికి అనువుగా ఉంటుంది. శతకం మకుట నియమం కలిగి ఉంటుంది. సంఖ్యా నియమం కల్గి ఉంటుంది. శతకాల్లో సమకాలీన సామాజికాంశాల విమర్శ సాధారణంగా కనిపించే లక్షణం. ఇది విద్యార్థులను ఆకట్టుకుంటుంది. తన చుట్టూ ఉన్న సమాజాన్ని విమర్శనాత్మకంగా చూస్తుంది.
  2. బృహస్పతి దేవతల గురువు. అంగీరసుడి కొడుకు. ఉతధ్యుడు, సంవర్తనుడు ఇతడి సోదరులు. బృహస్పతి భార్య తార. ఇతనికి శంయుడు అనే కొడుకున్నాడు. శుక్రనీతి, కణికనీతి లాగా బృహస్పతి నీతిసూత్రాలు ప్రసిద్ధి చెందాయి.
  3. శైవ కవిత్రయం నన్నె చోడుడు, మల్లిఖార్జున పండితారాధ్యుడు, పాల్కురికి సోమన. ఈ ముగ్గురిని శైవ కవిత్రయం అంటారు.
  4. శైవ పండిత త్రయం శ్రీపతి పండితుడు, మల్లిఖార్జున పండితారాధ్యుడు. శివలెంక మంచన. ఈ ముగ్గురిని శైవ పండిత త్రయం అంటారు.
  5. చింతామణి కోరిన కోర్కెలను తీర్చే మణి. నాగరాజు శిరస్సు నుంచి ఈ మణిని పొందవచ్చని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి.
  6. భాగీరథి గంగ, భగీరథుని ప్రయత్నం చేత భూమి మీదకు తీసుకురాబడినది. అందువల్ల భాగీరథి అయ్యింది.
  7. జాహ్నవి సగరులకు ఉత్తమ లోకాలు కల్గించడానికి భగీరథుడు తెచ్చిన గంగ జహ్నుమహర్షి యాగాన్ని పాడుచేసింది. జహ్నుమహర్షి కోపించి ఆ గంగను త్రాగివేసాడు. భగీరథుని కోరిక మేరకు (అభ్యర్థన వల్ల) తిరిగి ఎంగిలి కాకుండా తన చెవుల ద్వారా విడిచి పెడతాడు. కాబట్టి జహ్నుమహర్షి చేత త్రాగి విడువబడినది కాబట్టి దానికి జాహ్నవి అనే పేరు వచ్చింది.
  8. అంతరింద్రియాలు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ నాల్గింటిని అంతరింద్రియాలు అంటారు.
  9. బాహ్య ఇంద్రియాలు కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం ఈ ఐదింటిని బాహ్య ఇంద్రియాలు అంటారు.

సూక్తి : తన తోటి వారితో స్నేహంగా ఉంటూ ఇతరులకు మంచిని పంచుతూ, గురువులకు విధేయుడై ఉంటూ అభ్యసించే విద్య మంచి ఫలితాన్నిస్తుంది.

ప్రతిపదార్థ తాత్పర్యాలు

I.

1. మ.
భవదీయార్చన సేయుచోఁ బ్రథమ పుష్పంబెన్న సత్యంబు, రెం
డవ పుష్పంబు దయాగుణం, బతివిశిష్టం బేకనిష్ఠా సమో
త్సవ సంపత్తి తృతీయ పుష్పమది భాస్వద్భక్తి సంయుక్తి యో
గవిధానం బవి లేని పూజల మదింగైకోవు సర్వేశ్వరా.

కవి పరిచయం
ఈ పద్యము యధావాక్కుల అన్నమయ్యచే రచింపబడిన సర్వేశ్వర శతకము నుండి గ్రహింపబడినది.

ప్రతిపదార్థము (June 2017)

సర్వ + ఈశ్వరా = లోకాలన్నిటికీ ప్రభువైన ఓ ఈశ్వరా!
భవదీయ + ఆర్చన = నీ పూజ
చేయుచో = చేసేటప్పుడు
ప్రథమ పుష్పంబు + ఎన్నన్ = మొదటి పుష్పం
సత్యంబు = సత్యం
రెండవ పుష్పం = రెండవ పుష్పం
దయాగుణం = కారుణ్యమనే గుణం (దయ)
తృతీయ పుష్పము +
అది = మూడో పుష్పం
అతి = మిక్కిలి
విశిష్ట = విశిష్టమైన
ఏకనిష్టా = ఏకాగ్రతతో
సమోత్సవ సంపత్తి = సమానమైనది
అది = ఆ విధంగా మూడు పువ్వులు సమర్పించడం
భాస్వద్భక్తిసంయుక్తి విధానం = భక్తియోగ విధానం
అవి = ఈ మూడు పుష్పాలు
లేని = లేని
పూజలను = పూజలను
మదిన్ = మనస్సులో
గైకోవు = అంగీకరించవు కదా ! (అంగీకరించవు అని అర్థం)

తాత్పర్యము ఓ సర్వేశ్వరా ! నీ పూజ చేసేటప్పుడు మొదటి పుష్పం సత్యం. రెండవ పుష్పం దయ. మూడో పుష్పం మిక్కిలి విశిష్టమైన ఏకాగ్రత. ఇది భక్తియోగ విధానం. ఈ మూడు పుష్పాలు లేని పూజలను నీవు అంగీకరించవు కదా !

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

2. శా.
ఊరూరం జనులెల్ల భిక్షమిడరో, యుండంగుహల్గల్గవో
చీరానీకము వీథులందొరకదో, శీతామృత స్వచ్ఛవాః
పూరం బేరుల బారదో, తపసులం బ్రోవంగ నీ వోపవో
చేరం బోవుదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వరా !

కవి పరిచయం
ఈ పద్యము ధూర్జటిచే రచింపబడిన శ్రీకాళహస్తీశ్వర శతకము నుండి గ్రహింపబడినది.

ప్రతిపదార్థము

శ్రీకాళహస్తీశ్వరా = శ్రీకాళహస్తిలో వెలసిన ఓ ఈశ్వరా !
ఊరూరన్ = ప్రతి గ్రామములోనూ
జనులు + ఎల్లన్ = ప్రజలందరూ
భిక్షము + ఇడరో = అడిగితే భిక్షము పెట్టరా ?
ఉండన్ = నివసించడానికి
గుహల్ = గుహలు
కల్గవో చీరానీకము = లేవా ?
(చీర + అనీకము) = వస్త్రముల గుంపు
వీథులన్ = వీధులలో (అంగళ్ళలో)
దొరకదో = దొరకవా ?
శీతామృత స్వచ్ఛవాః పూరంబు ; శీత = చల్లని
అమృత = అమృతము వంటి తియ్యని
స్వచ్ఛ = నిర్మలమైన
వాఃపూరంబు = జలప్రవాహము
ఏఱులన్ = సెలయేళ్ళలో పాఱదో
(పాఱదు + ఓ) = ప్రవహించడం లేదా ?
తపసులన్ = తపశ్శాలులను
బ్రోవంగన్ = రక్షించడానికి
నీవు = నీవు
ఓపవో (ఓపవు + ఓ) = సమర్థుడవు కాదా ?
జనుల్ = ప్రజలు
రాజులన్ = రాజులను
చేరన్ = సమీపించడానికి
పోవుదురు + ఏల = ఎందుకు పోతారో !

తాత్పర్యము
శ్రీకాళహస్తీశ్వరా ! తినడానికి అడిగితే ఎవరయినా ఇంత భిక్షం పెడతారు. నివసించడానికి గుహలు ఉన్నాయి. వస్త్రాలు వీధుల్లో దొరుకుతాయి. తాగడానికి నదుల్లో చల్లని అమృతంవంటి స్వచ్ఛమైన నీరు దొరుకుతుంది. తాపసులను కాపాడటానికి నీవున్నావు. అయినా ఈ ప్రజలు రాజులను ఎందుకు ఆశ్రయిస్తారో తెలియదు.

3. మ.
సిరి లేకైన విభూషితుండె యయి భాసిల్లున్ బుధుండౌదలన్
గురుపాదానతి కేలనీగి చెవులందున్విన్కి వక్త్రంబునన్
స్థిర సత్యోక్తి భుజంబులన్విజయమున్ చిత్తంబునన్ సన్మనో
హర సౌజన్యము గల్గినన్ సురభిమల్లా ! నీతివాచస్పతీ !

కవి పరిచయం
ఈ పద్యము ఎలకూచి బాలసరస్వతీచే రచింపబడినది.

ప్రతిపదార్థము

సురభిమల్లా = ఓ “సురభిమల్ల” భూపాలుడా !
నీతివాచస్పతీ = నీతిశాస్త్రమునందు దేవతల గురువైన బృహస్పతి వంటివాడా !
ఔదలన్ = శిరస్సునందు
గురుపాదానతి
(గురుపాద + ఆనతి)
గురుపాద = గురువుగారి పాదాలకు
ఆనతి = మ్రొక్కుటయు (నమస్కరించడము)
కేలన్ = చేతియందు
ఈగి = దానగుణమునూ
చెవులందున్ = చెవులయందు
విన్కి = శాస్త్ర శ్రవణమునూ (శాస్త్రములు వినుటయూ)
వక్త్రంబునన్ స్థిరసత్యోక్తి ; = ముఖమునందు
స్థిర = స్థిరమైన
సత్యోక్తి (సత్య + ఉక్తి) = సత్యమైన వాక్కునూ
భుజంబులన్ = భుజములందు
విజయమున్ = విజయమునూ
చిత్తంబునన్ = మనస్సు నందు సన్మనోహర సౌజన్యము ;
సత్ = చక్కని
మనోహర = ఇంపైన
సౌజన్యము = మంచితనమునూ
కల్గినన్ = కల్గి ఉన్నట్లయితే
బుధుండు = పండితుడు
సిరి = ఐశ్వర్య౦
లేకైనన్
(లేక + ఐనన్) = లేకుండా ఉన్నా (లేకపోయినా)
విభూషితుండె ;
(విభూషితుండు + ఎ) = అలంకరింపబడినవాడే
అయి = అయి
భాసిల్లున్ = ప్రకాశిస్తాడు

తాత్పర్యము
నీతిలో బృహస్పతి అంతటి వాడవయిన ఓ సురభిమల్లా ! తలవంచి గురువు పాదాలకు నమస్కరించే వాడు, దానగుణం కలిగినవాడు, చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినేవాడు, సత్యవ్రతుడైనవాడు, భుజబలంతో విజయాలను పొందేవాడు, మనస్సునిండా మంచితనం కలవాడయిన పండితుడు సంపదలు లేకున్నా ప్రకాశిస్తాడు.

II

4. ఉ.
భండనభీముఁ డార్తజన బాంధవుఁ డుజ్జ్వల బాణతూణ కో
దండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్
రెండవ సాటి దైవమిక లేఁడనుచున్ గడగట్టి భేరికా
దాండ దడాండదాండ నినదంబులజాండము నిండ మత్తవే
దండము నెక్కి చాటెదను దాశరథీ ! కరుణా పయోనిధీ !!

కవి పరిచయం
ఈ పద్యము కంచర్ల గోపన్నచే రచింపబడిన దాశరథి శతకము నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్దము

దాశరథీ = దశరథుని కుమారా !
కరుణాపయోనిథీ = దయాసముద్రునివైన ఓ రామా !
భండన భీముడు = నీవు యుద్ధరంగంలో శత్రు భయంకరునివని
ఆర్తజన = దుఃఖాలు పొందేవారి పాలిట
బాంధవుడు = బంధువువని
ఉజ్వల = కాంతిమంతమైన
తూణ = అమ్ములపొది
బాణ = బాణాలు
కోదండ = కోదండములు
కళాప్రచండ = ఉపయోగించే నేర్పులో ప్రచండమైన
భుజతాండవ = భుజతాండవం చూపి
కీర్తికి = కీర్తిపొందిన
రామమూర్తికిన్ = శ్రీరామచంద్రునకు
రెండవసాటి దైవము = సాటివచ్చే మరియొక దైవం
ఇకన్ = ఇంక
లేడనుచున్ = లేరని
గడగట్టి = స్తంభము నాటి
భేరికా = ఢంకా యొక్క
దాండడ, డాండ, డాండ = డాం డాం డాం అనే
నినదంబులు = ధ్వనులు
అజాండము = బ్రహ్మండం
నిండన్ = వ్యాపించే విధంగా
మత్త = మదించిన
వేదండమునెక్కి = ఏనుగునెక్కి
చాటెదను = చాటుతాను

తాత్పర్యము
దశరథుని కుమారా ! దయాసముద్రునివైన ఓ శ్రీరామా ! నీవు యుద్ధరంగంలో శత్రుభయంకరుడవు, దుఃఖాలు పొందేవారి పాలిట బంధువువు, కాంతిమంతమైన అమ్ములపొది, బాణాలు, కోదండమును కలిగి ప్రచండ భుజతాండవంతో, ధనుర్విద్యాకళలో కీర్తి పొందిన నీకు సాటివచ్చే దైవం మరొకరు లేరని, మదించిన ఏనుగు నెక్కి ఢంకా మ్రోగిస్తూ, భూమండలమంతా వినబడేటట్లు చాటుతాను !

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

5. సీ. హరిదాసులను నిందలాడకుండినఁ జాలుఁ
సకల గ్రంథమ్ములు చదివినట్లు
భిక్షమియ్యంగఁ దప్పింపకుండినఁ జాలుఁ
జేముట్టి దానంబు చేసినట్లు
మించి సజ్జనుల వంచింపకుండినఁ జాలుఁ
నింపుగా బహుమాన మిచ్చినట్లు
దేవాగ్రహారముల్ దీయకుండినఁ జాలు
గనకకంబపుగుళ్ళు గట్టినట్లు

తే.గీ. ఒకరి వర్షాశనము ముంచకున్నఁ జాలు
బేరు కీర్తిగ సత్రముల్ పెట్టినట్లు
భూషణవికాస! శ్రీధర్మపురి నివాస !
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

కవి పరిచయం
ఈ పద్యం కాకుత్థ్సం శేషప్ప కవిచే రచింపబడిన నరసింహ శతకం నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థము

భూషణవికాస = అలంకారాల చేత శోభిల్లేవాడా !
శ్రీ ధర్మపుర నివాస = ధర్మపురి క్షేత్రంలో వెలసినవాడా !
దుష్టసంహార = దుష్టులను సంహరించేవాడా !
దురితదూర = పాపాలను పోగొట్టేవాడా !
నరసింహా = నరసింహా
హరిదాసులను = విష్ణుభక్తులను
నిందలాడకుండిన + చాలు = నిందించకుండా ఉంటే చాలు
సకల గ్రంథాలను = అనేక గ్రంథాలను
చదివినట్లు = చదివినట్లే
భిక్షము + ఇయ్యంగ = భిక్షమిచ్చేవారిని
తప్పింపకుండినచాలు = ఆపకుంటేచాలు
చేముట్టిదానము = అది దానము
చేసినట్లే = చేసినట్లే
మించి = అతిసయించి, ఉప్పొంగి
సజ్జనుల = సజ్జనులను
వంచింపకుండిన = మోసం చేయకుండా ఉంటే
చాలు = చాలు
ఇంపుగా = చక్కగా
చాలు = చాలు
బహుమానమిచ్చినట్లు = బహుమతినిచ్చినట్లే
దేవ = దేవతా
అగ్రహారముల్ = మాన్యములను
తీయకుండిన = ఆక్రమించకుండా ఉంటే
చాలు = చాలు
కనకకంబపు = అది ధ్వజస్తంభంతో కూడిన
గుళ్ళు + కట్టినట్లు = గుళ్ళు కట్టించినట్లే
ఒకరి = ఇంకొకరి
వర్షాశనము = వర్షాసనం (ఒక ఏడాదికి సరిపడే భోజనాన్ని)
మంచుకున్న = పాడు చేయకుండునట్లైతే
చాలు = చేయకుంటేచాలు
పేరు = తన పేరుతో
కీర్తిగ = కీర్తితో
సత్రముల్ = సత్రాలు
పెట్టినట్లు = కట్టించినట్లే అవుతుంది

తాత్పర్యము
అలంకారాల చేత శోభిల్లేవాడా ! ధర్మపురి క్షేత్రంలో వెలసినవాడా ! దుష్టులను సంహరించేవాడా ! పాపాలను పోగొట్టేవాడా! నరసింహా ! విష్ణుభక్తులను నిందించకుండా ఉంటే చాలు, అనేక గ్రంథాలను చదివినట్లే. భిక్షమిచ్చేవారిని ఆపకుంటేచాలు, అది దానము చేసినట్లే. సజ్జనులను మోసం చేయకుండా ఉంటే చాలు, గొప్ప బహుమతినిచ్చినట్లే. దేవతా మాన్యములను ఆక్రమించకుండా ఉంటే చాలు, అది బంగారు ధ్వజ స్తంభంతో కూడిన గుడికట్టించినట్లే. ఇంకొకరి ‘వర్షా శనాన్ని’ (ఒక ఏడాదికి సరిపడే భోజనాన్ని) ముంచకుంటే చాలు, తన పేరుతో సత్రాలు కట్టించినట్లే అవుతుంది.

III

6. మ.
ఘనుడవ్వాడగు, వేడు త్యాగమయ దీక్షంబూని సర్వంసహా
జన ధైన్యస్థితి బోనడంచి సకలాశాపేశలానంద జీ
వన సంరంభము పెంచి, దేశజననీ ప్రాశస్త్యమున్ పంచునో
అనిదంపూర్వ యశస్వి యాతడగు నన్నా ! విశ్వనాథేశ్వరా !

కవి పరిచయం
ఈ పద్యము గుమ్మన్నగారి లక్ష్మీ నరసింహ శర్మచే రచింపబడిన విశ్వనాథేశ్వర శతకము నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థము

విశ్వనాథేశ్వరా ! = విశ్వనాథేశ్వరా !
వేడు = ఎవడు
త్యాగమయ = త్యాగంతో కూడిన
దీక్షన్ + పూని = దీక్షను పూని
సర్వంసహాజన = జనులందరి
దైన్యస్థితి + పోనడంచి = దీనస్థితిని రూపుమాపి
సకల = అందరికి (సమస్తమైన, అన్ని)
ఆశాపేశ = కోరికలతో అలంకరింపబడిన
ఆనంద = ఆనందకర
జీవన సంరంభము = జీవిత సుఖాన్ని
పెంచి = పెంచి
దేశ జననీ = మాతృదేశపు
ప్రాశస్త్యమున్ = గొప్పతనాన్ని
పంచునో = ఎవరయితే విశదపరుస్తారో
అవ్వాడు (అ+వాడు) = అటువంటివాడే
అనిందపూర్వ = నిందించుటకు వీలులేని
ఘనుడు + అగున్ = గొప్పవారవుతారు
యశస్వి + ఆతడగు = అపూర్వమైన కీర్తిమంతులవుతారు

తాత్పర్యము
విశ్వనాథేశ్వరా! త్యాగంతో కూడిన దీక్షను పూని జనులందరి దీనస్థితిని రూపుమాపి, అందరికి సుకుమారమైన, ఆనందకర జీవితసుఖాన్ని పంచి, మాతృదేశపు గొప్పతనాన్ని ఎవరయితే విశదపరుస్తారో వారే గొప్ప వారవుతారు. అపూర్వమైన కీర్తిమంతులు అవుతారు.

7. శా.
పొత్తంబై కడునేర్పుతో హితము నుద్బోధించు మిత్రుండు, సం
విత్తంబై యొక కార్యసాధనమునన్ వెల్గొందు మిత్రుండు, స్వా
యంబైన కృపాణమై యరుల నాహారించు మిత్రుండు, ప్రో
చ్చిత్తంబై సుఖమిచ్చు మిత్రుడు దగన్ శ్రీలొంకరామేశ్వరా !

కవి పరిచయం
ఈ పద్యం నంబి శ్రీధరరావుగారిచే రచింప బడిన శ్రీలొంక రామేశ్వర శతకము నుండి గ్రహించ బడినది.

ప్రతిపదార్థము (Mar. ’17)

శ్రీలొంకరామేశ్వరా ! = ఓ లొంకరామేశ్వరా !
మిత్రుండు = మిత్రుడైనవాడు
పొత్తంబు + ఐ = పుస్తకం మాదిరిగా
కడున్ = మిక్కిలి
నేర్పుతో = నేర్పుతో
హితమున్ = మంచిని
ఉద్బోధించు = బోధిస్తాడు
ఒక = ఒకానొక
కార్య = కార్య
సాధనమునన్ = సఫలతలో
మిత్రుండు = మిత్రుడైనవాడు
కార్య = కార్య
సాధనమునన్ = సఫలతతో
వెల్గొందు = విలువైన
సంవిత్తంబు + ఐ = ధనం వలె
వెల్గొందు = ఉపకరిస్తాడు
అరులన్ = శత్రు నాశనంలో
మిత్రుండు = మిత్రుడైనవాడు
స్వాయత్తంబు + ఐన = స్వాధీనమైన
కృపాణము + ఐ = కత్తి వలె
ప్రోచు = రక్షించెడు
తగన్ = తగినవిధంగా
ఆహారించు = సహాయపడతాడు
ప్రోచిత్తంబు + ఐ = నిండు మనస్సై
సుఖమిచ్చు = సుఖాన్నిస్తాడు.

తాత్పర్యము
ఓ లొంకరామేశ్వరా ! మిత్రుడైనవాడు పుస్తకం మాదిరిగా మిక్కిలి నేర్పుతో మంచిని బోధిస్తాడు. కార్య సఫలతలో విలువైన ధనం వలె ఉపకరిస్తాడు. శత్రు నాశనంలో స్వాధీనమైన కత్తివలె సహాయపడుతాడు. నిండు మనస్సై సుఖాన్నిస్తాడు.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

8. సీ. కలనైన సత్యంబు బలుకనొల్లనివాడు (June 2018)
మాయమాటల సొమ్ము దీయువాడు
కులగర్వమున పేద కొంపలార్చెడివాడు
లంచంబులకు వెల బెంచువాడు
చెడు ప్రవర్తనలందు జెలగి తిరుగువాడు
వరుసవానికి నీళ్ళు వదులువాడు
ముచ్చటాడుచు కొంప ముంచజూచెడివాడు
కన్నవారల గెంటుచున్నవాడు

గీ. పుడమిలో నరరూపుడై పుట్టియున్న
రాక్షసుడు గాక వేరౌన రామచంద్ర
కృపనిధీ ధరనాగరకుంటపారి
వేణుగోపాలకృష్ణ మద్వేల్పు శౌరి

కవి పరిచయం
ఈ పద్యము గడిగె భీమ కవిచే రచింప బడిన వేణుగోపాల శతకము నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్దము

“కృపనిధీ = దయకు నిధివంటివాడా !
రామచంద్ర = ఓ శ్రీ రామచంద్రా !
ధర నాగరకుంటపౌరి = నాగరకుంటపురమునందు కొలువైన వాడా !
వేణుగోపాలకృష్ణ = ఓ వేణుగోపాలకృష్ణా
మత్ + వేల్పు = నా దైవమా !
శౌరి ! = శ్రీ కృష్ణా !
కలన్ + ఐన = కలలో కూడా
సత్యంబున్ = సత్యాన్ని
పలుకన్ + = పలకడానికి
ఒల్లనివాడు = ఇష్టపడనివాడు
మాయమాటలు = మాయమాటలు చెప్పి
సొమ్మున్ = ఇతరుల సొమ్మును
తీయువాడు = అపహరించేవాడు
కులగర్వమున = కుల గర్వంతోటి
పేద = పేదవాండ్ల
కొంపల్ = ఇండ్లను
ఆర్చెడివాడు = నాశనం చేసేవాడు
లంచంబులకు = లంచాలకు
వెలన్ = విలువను
పెంచువాడు = పెంచేవాడు
చెడు ప్రవర్తనలందు = చెడు ప్రవర్తనతో
చెలగితిరుగువాడు = తిరిగేవాడు
వరుసవావికి = వావివరుసలను
నీళ్ళు వదలువాడు = పాటించనివాడు
ముచ్చటన్ + ఆడుచూ = నవ్వుతూ ముచ్చటాడుతూనే
కొంప = ఎదుటివాడిని
ముంచ = నాశనం
చూచెడివాడు = చేయాలనుకునేవాడు
కన్నవారల = తల్లిదండ్రులను
గెంటువాడు = ఇంటి నుంచి వెళ్ళగొట్టేవాడు
పుడమిలో = ఈ భూమిమీద
నరరూపుడై = మానవరూపంలో ఉన్న
పుట్టియున్న = పుట్టినట్టి
రాక్షసుడుగాక = రాక్షసుడుగాని
(వేరు + ఔన) వేరౌన = వేరొకరు గారు కదా !

తాత్పర్యము
దయకు నిధివంటివాడా ! శ్రీ రామచంద్రా ! నాగరకుంట పురమునందు కొలువైనవాడా! ఓ వేణు గోపాల- కృష్ణా ! నా దైవమా ! శ్రీ కృష్ణా ! కలలో కూడా సత్యాన్ని పలకడానికి ఇష్టపడనివాడు, మాయమాటలు చెప్పి ఇతరుల సొమ్మును అపహరించేవాడు, కులగర్వంతోటి పేదవాండ్ల ఇండ్లను నాశనం చేసేవాడు, లంచాలకు విలువను పెంచేవాడు, చెడు ప్రవర్తనతో తిరిగేవాడు, వావి వరుసలను పాటించనివాడు, నవ్వుతూ ముచ్చటాడుతూనే ఎదుటివాడిని నాశనం చేయాలనుకునేవాడు. తల్లి తండ్రులను ఇంటినుంచి వెళ్ళగొట్టేవాడు ఈ భూమిమీద మానవరూపంలో ఉన్న రాక్షసుడే.

పాఠం ఉద్దేశం

సమాజహితాన్ని కోరి కవులు శతక రచనలు చేశారు. సమాజంలోని పరిస్థితులను తెలుపుతూ మానవులలో నైతిక, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుటకు శతక కవులు కృషిచేశారు. అట్లాంటి వివిధ శతక పద్యాల్లోని విలువలను తెలియజేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతకాలలోని పద్యాలను ‘ముక్తకాలు’ అంటారు. ముక్తక పద్యం దేనికదే స్వతంత్ర భావంతో ఉంటుంది. శతకాల్లో మకుటం సాధారణంగా పద్యపాదం చివర ఉంటుంది. అయితే మకుట రహితంగా కూడా కొన్ని శతకాలు ఉన్నాయి. ఈ పాఠ్యభాగంలో సర్వేశ్వర, శ్రీకాళహస్తీశ్వర, మల్లభూపాలీయ, దాశరథి, నరసింహ, విశ్వనాథేశ్వర, లొంక రామేశ్వర, వేణుగోపాల శతకాల పద్యాలు ఉన్నాయి.

కవుల పరిచయం

1. కవి : యథావాక్కుల అన్నమయ్య
కాలం : 13వ శతాబ్దం
శైలి : ధారాళమైనది
శతకం పేరు : సర్వేశ్వర శతకం.
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 1

2. కవి : ధూర్జటి
కాలం : 16వ శతాబ్దం
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 2
ఇతర అంశాలు :
శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యమనే గ్రంథం రాశాడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాల్లో ఒకరు. రాజుల ఆస్థానంలో ఉండి కూడా “రాజుల్ మత్తులు, వారి సేవ నరకప్రాయం” అని చెప్పిన ధీశాలి.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

3. కవి : ఎలకూచి బాలసరస్వతి
కాలం : 17వ శతాబ్దం
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 3
ఇతర అంశాలు : నాగర్ కర్నూల్ జిల్లా జటప్రోలు సంస్థానాధీశుడైన సురభి మాధవ రాయల ఆస్థానకవి.

రచనలు :

  1. తెలుగులో మొదటి త్ర్యర్థి కావ్యం “రాఘవ యాదవ పాండ వీయం” ను రాశాడు.
  2. భర్తృహరి సంస్కృతంలో రాసిన “సుభాషిత త్రిశతి”ని తెలుగులో అనువదించిన తొలికవి.

విశేషాంశం : ఈయన రచన పాండిత్య స్ఫోరకంగా, ధారాళంగా ఉంటుంది.

4. కవి : కంచెర్ల గోపన్న
కాలం : 17వ శతాబ్దం
జన్మస్థలం : ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి
రచన : దాశరథి శతకం
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 4
ఇతర అంశాలు : భద్రాచలంలో శ్రీరామాలయాన్ని నిర్మించిన భక్తాగ్రేసరుడు. శ్రీరాముని పేర దాశరథి శతకాన్ని రాసాడు. ఎన్నో కీర్తనలు రచించాడు. అందమైన శబ్దాలంకారాలు ఈయన కవిత్వంలో
జాలువారాయి.

5. కవి : కాకుత్సం శేషప్ప కవి
కాలం : 18వ శతాబ్దం
జన్మస్థలం : జగిత్యాల జిల్లా, ధర్మపురి నివాసి
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 5
శతకం : నరహరి శతకంతోపాటు, నృకేసరి శతకం, ధర్మపురి రామాయణం (యక్షగానం) రాశాడు.
ఇతర అంశాలు : ఇతని రచనల్లో భక్తి తత్పరతతోపాటు తాత్త్వికచింతన, సామాజిక స్పృహ కనిపిస్తుంది. తెలంగాణ ప్రాంతంలోని జానపదులు కూడా నరసింహ శతక పద్యాలను పాడుకుంటారు.

6. కవి : గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ
కాలం : 1934 – 2011
జన్మస్థలం : సిద్ధిపేట జిల్లా, పోతారెడ్డి పేట
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 6
(1934-2011)
ఇతర అంశాలు : 300 పైగా అష్టావధానాలు చేసాడు. హిందోళ రాగంలో ఈయన పద్యపఠన విన్యాసం ప్రత్యేకమైనది.
బిరుదులు : అవధాని శశాంక, ఆశు కవితాకేసరి.
ఇతర రచనలు : కవితా కళ్యాణి, అవధాన సరస్వతి, వాగీశ్వరీస్తుతి, ఆద్యమాతృక, పద్యోద్యానము మొదలైనవి.

7. కవి : నంబి శ్రీధరరావు
కాలం : 1934 – 2000
జన్మస్థలం : నిజామాబాద్ జిల్లా, భీమ్ గల్ (వేముగల్లు) నివాసి
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 7
(1934-2000)
రచన : శ్రీలొంక రామేశ్వర శతకం
ఇతర రచనలు : శ్రీమన్నింబాచల మాహాత్మ్యము, శ్రీమన్నింబగిరి నరసింహశతకం
బిరుద : కవిరాజ

8. కవి : గడిగె భీమకవి
జననం : 14.1.1920
మరణం : 3.4.2010
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 8
(14-01-1920
03-04-2010)
రచన : వేణుగోపాల శతకం
జన్మస్థలం : రంగారెడ్డి జిల్లా, షాబాద్ మండలం, నాగరకుంట గ్రామం
ఇతర విషయాలు : వీధిబడి వరకు విద్యాభ్యాసం చేసిన ఈయనకు పద్యరచనలో నైపుణ్యం అబ్బడం విశేషం.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

ప్రవేశిక

మానవుల ప్రవర్తన ఎట్లా ఉండాలి ? ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి ? స్నేహితులు ఎట్లా ఉంటారు ? భగవంతుని గుణగణాలు, భక్తులతో ఎట్లా ఉండాలి ? కీర్తిమంతులు ఎవరు? మనుషుల్లోని రాక్షసగుణాలు ఏవి ? అని తెలుపుతూ వివిధ శతకకర్తలు రాసిన పద్యాలను పాఠం చదివి తెలుసుకోండి. వీటి ఆవశ్యకతను అర్థం చేసుకోండి. ఆచరించే ప్రయత్నం చేయండి.

విద్యార్థులకు సూచనలు

  • పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
  • పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత
    గీయండి.
  • వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పదవిజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకోండి.

ప్రక్రియ శతకం

ప్రాచీన తెలుగు సాహిత్య ప్రక్రియలలో ‘శతకం’ ఒకటి. ఇందులో వంద పద్యాలు ఉంటాయి. కొన్నింటిలో వందకు పైగా పద్యాలు ఉంటాయి. శతకాల్లో మకుటం ప్రధానంగా ఉంటుంది. కొన్ని శతకాల్లో మకుటం లేకుండా పద్యాలు ఉంటాయి. ఏ పద్యానికాపద్యమే స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటుంది. శతకాలు నీతి, ధర్మం, సత్యం, భక్తి, వైరాగ్యం మొదలైన విషయాలను బోధిస్తాయి. సుమతీ శతకం, వేమన శతకం మొదలైనవి శతక గ్రంథాలుగా పేర్కొనవచ్చు.

TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం

Telangana SCERT 10th Class Telugu Guide Telangana 6th Lesson భాగ్యోదయం Textbook Questions and Answers.

TS 10th Class Telugu 6th Lesson Questions and Answers Telangana భాగ్యోదయం

చదవండి – ఆలోచించి చెప్పండి (T.B. P.No. 56)

నవభారత రాజ్యాంగ నిర్మాత, చరిత్రకారుడు, జాతీయతావాది, తత్త్వశాస్త్రవేత్త, దళిత నాయకుడు డా॥ బి.ఆర్. అంబేద్కర్. దేశంలోని అస్పృశ్యతను నివారించడానికి, దళితుల అభ్యున్నతికి ఎంత గానో కృషి చేశాడు. నిమ్న వర్గాలలో ‘అందరిలాగ మనమూ అన్నీ చేయగలం’ అన్న ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం అతని లక్ష్యం. దేశప్రజలు అందరికీ సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని రూపొందించాడు. దేశ విదేశాలలో విద్యను అభ్యసించి ప్రపంచంలోనే మహామేధావిగా గుర్తింపు పొందాడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
పై పేరా ఎవరిని గురించి తెలుపుతున్నది?
జవాబు:
డా॥ బి.ఆర్. అంబేద్కర్ గురించి తెలుపుతున్నది.

ప్రశ్న 2.
ఆయన ఎవరి గురించి కృషి చేశాడు ? ఎందుకు ?
జవాబు:
నిమ్న వర్గాల గురించి కృషి చేశాడు. వారిలో ఆత్మ విశ్వాసాన్ని నెలకొల్పటానికి కృషిచేశాడు. వారు వెనుకబడి ఉన్నారు కాబట్టి.

TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం

ప్రశ్న 3.
మన రాష్ట్రంలో దళితులు, నిమ్నజాతుల వారి కోసం కృషి చేసిన వ్యక్తులు ఎవరు ? వాళ్ళ గురించి చెప్పండి.
జవాబు:
కృష్ణస్వామి ముదిరాజ్ : తన మిత్రుడు భాగ్యరెడ్డి వర్మతో కలిసి దళితుల అభ్యున్నతి కోసం కృషిచేశాడు. 1948లో ఉర్దూలో ‘హైదరాబాద్ – కి తీస్ సాలా సియాసి జదు జిహిద్’ పేరుతో హైదరాబాద్ లోని రాజకీయోద్యమాలపై గ్రంథాన్ని రాశాడు.

భాగ్యరెడ్డి వర్మ : దళితులు తమ పరిస్థితిని గుర్తించి హక్కుల కోసం పోరాడటానికి కృషి చేశారు. అలాగే దళితులను ‘అది ఆంధ్రులు’ గా పిలుచుకోవాలని, దళిత బాలికలను దేవదాసీలుగా, జోగినులుగా చేయడాన్ని వ్యతిరేకించెను.

జ్యోతిబాపూలే : 1848 వ సం||లో ‘అంటరాని’ కులాల బాలికల కోసం జ్యోతిబా ఒక పాఠశాల స్థాపించి సావిత్రిబాయికి శిక్షణనిచ్చి మొదటి మహిళా ఉపాధ్యాయినిగా చేశాడు.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No.59)

తన జాతి జనుల ………………..
అనుచరులలో కలిగేటట్టు చేయగలిగాడు.

ప్రశ్న 1.
కుల వ్యవస్థ వలన, సమాజంలో ఏం జరుగుతున్నది ?
జవాబు:
కుల వ్యవస్థ వలన ఒక వర్గం వారు అంటరాని వారిగా చూడబడ్డారు. ఒక వర్గం తక్కువ, మరో వర్గం ఎక్కువ అనే భావం ప్రజల్లో ఉండేది. సామాజిక, ఆర్థిక అసమానతలు చోటుచేసుకున్నాయి. కొన్ని కులాల వారు అణగారిన వర్గాలుగా దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నారు. కులవ్యవస్థ వలన సమాజానికి ఏమీ ఉపయోగం లేదు. ఒకరిపై ఒకరికి స్నేహభావం తగ్గుతోంది.

ప్రశ్న 2.
చిత్తశుద్ధి, నిజాయితీ అంటే మీకు ఏమి అర్థమయింది ?
జవాబు:
చిత్తము అంటే మనస్సు. కొంతమంది మనసులో ఇష్టం లేకపోయినా పది మంది మెప్పుకోసం మంచి పనులు చేస్తారు. పేదలకు సహాయం చేస్తారు. పూర్తిగా వారు బాగుపడాలంటే మనసులో ఆ భావాలు బలంగా ఉండాలి. మనసులో బలమైన సంకల్పం కలగాలి. ఆ విధంగా మనసులో బలమైన సంకల్పం కలగడమే చిత్తశుద్ధి అంటారు. అంటే మనసులోని వ్యతిరేక భావాలను తొలగించుకోవడమే చిత్తశుద్ధి అంటారు.

నిజాయితీ : నిజమును అనుసరించి ప్రవర్తించడం అంటే సత్యవర్తన కలిగి ఉండడం. చేసే పనిలో తన స్వార్థం చూసుకోకుండా ఉండడం, చేసే పనిని కచ్చితంగా చేయడం. ఎదురుగా ఒక విధంగా వెనుక ఒక విధంగా ప్రవర్తించకుండా ఉండడం. నిజాయితీగా చేసే ఏ పని అయినా సాధ్యమే.

ప్రశ్న 3.
అజ్ఞానం, ఉదాసీనత వలన నష్టాలేమిటి? చర్చించండి.
జవాబు:
జ్ఞానం అంటే తెలివి. ఒక విషయం గురించి పూర్తిగా తెలుసుకోవడం, ఏదైనా సమస్యను సులువుగా పరిష్కరించగల శక్తిని కూడా జ్ఞానం అంటారు. అజ్ఞానం అంటే సరిపడ తెలివిలేకపోవడం. ఒక సమస్య యొక్క మూల స్వభావాన్ని తెలుసుకోలేక పోవడం కూడా అజ్ఞానమే. అసలు దానిని సమస్యగా గుర్తించలేకపోవడం కూడా అజ్ఞానమే.

ఉదాసీనత అంటే దేనినీ పట్టించుకోకపోవడం. తమకు ఉపకారం జరుగుతున్నా, అపకారం జరుగు తున్నా పట్టించుకోకపోవడం, మంచికానీ, చెడుకానీ పట్టించుకోకపోవడం కూడా ఉదాసీనతే. తెలిసినా తెలియనట్లు ఉండడం కూడా ఉదాసీనతే.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No.59)

మనుషులంతా ……………… రాణిస్తారని నిరూపించాడు.

ప్రశ్న 1.
మూఢనమ్మకాలు అంటే మీకేం అర్థమయ్యింది ?
జవాబు:
శాస్త్రీయత లేకుండా గుడ్డిగా ఆచరించేవి అని అర్థం. అయితే పెరిగిన వాతావరణం, సంప్రదాయాలు, అజ్ఞానం వల్ల మూఢనమ్మకాలు మనిషిని పతనం (పడిపోయేటట్లు) చేస్తున్నాయి.
ఉదా : పిల్లి వస్తే వెనుకకు రావటం, విధవ (భర్త చనిపోయిన స్త్రీ) వస్తే వెనుకకు రావటం, తుమ్మితే ఆగిపోవటం మొదలగునవి.

ప్రశ్న 2.
వర్మ తన జాతి జనుల్లో ఏ విధమైన మార్పును తీసుకురాగలిగాడు ?
జవాబు:
మనుష్యులంతా పుట్టుకతో సమానమని, ఎవరూ ఎక్కువ ఎవరూ తక్కువ కాదన్న సత్యాన్ని తెలుసు కునేటట్లు చేశాడు. నమ్మకాల అజ్ఞానాన్ని తొలగించాడు. అంటరాని వర్గాలు చదువుకునేటట్లు ప్రోత్సహించాడు. తన జాతి జనుల్లో చైతన్యాన్ని తీసుకువచ్చాడు. దేవదాసి, ముర్లీ, వేశ్యా సంప్రదాయాలు అడ్డుకున్నాడు. నిమ్న వర్గాల్లో తాగుడు అలవాటును మాన్పించాడు.

TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం

ప్రశ్న 3.
మంచివక్త అని ఎవరిని అనవచ్చు ?
జవాబు:
ప్రతీ విషయాన్ని కూలంకషంగా (విస్తృతంగా, వివరంగా) చెప్పుట, తన అభిప్రాయాన్ని సశాస్త్రీయంగా నిరూపించుట, సమయం, సందర్భం పరిస్థితులనుబట్టి బాగా మాట్లాడేవాణ్ణి మంచి వక్త అని అనవచ్చును. అణగారిన వర్గాలలో చైతన్యాన్ని, సమాజాన్ని ప్రభావితం చెయ్యగలిగేటట్లు ప్రసంగించగలిగితే అతడిని మంచి వక్త అంటారు.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No.60)

ఆదిహిందువుల మేలుకోసం ……….. కాకుండా రక్షించగలిగాడు.

ప్రశ్న 1.
చదువుకోవడం వల్ల సమాజం ఏవిధంగా చైతన్యవంత మవుతుంది ?
జవాబు:
సొంతకాళ్ళ మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గం. మంచీ చెడు, కష్టం – సుఖం, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనేది, జ్ఞానం – అజ్ఞానం తెలియాలంటే తప్పనిసరిగా చైతన్యవంతమైన, జ్ఞానాత్మకమైన చదువును చదువుకోవల్సిందే. ఇంతకంటే వేరొక మార్గమే లేదు.

ప్రశ్న 2.
నాయకత్వ పటిమను ఏవిధంగా అంచనా వేయ వచ్చు?
జవాబు:
ఒక నాయకుడు, ఒక వ్యక్తి తను చెప్పిన అంశాలు ప్రజామోదం పొందినప్పుడు, అందరినీ మెప్పించ, గలిగినప్పుడు, అతని పలుకులే (మాటలే) శిరోధార్య మవుతాయి. దానినే నాయకత్వ పటిమ అని అంటారు. పైన చెప్పిన ప్రకారం ప్రజలలో నాయకునికి ఉన్న ఆదరణ బట్టే నాయకత్వ పటిమను మనం అంచనా వేయవచ్చు.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
నిమ్న వర్గాలలో భాగ్యరెడ్డి వర్మ తెచ్చిన మార్పులు చెప్పండి.
జవాబు:

  1. దళితుల అభ్యున్నతి కొరకు కృషి చేశాడు.
  2. అనేక బహిరంగ సభలు నిర్వహించాడు.
  3. సామాజిక స్వచ్ఛత గురించి చెప్పాడు.
  4. తనజాతి జనులను (నిమ్న వర్గాలను) ఏకతాటిపై నడిపాడు.
  5. దేవదాసి, ముర్లీ, వేశ్యా సంప్రదాయాలను అడ్డు కున్నారు.
  6. ఆడ, మగ పిల్లలను దేవునికి వదలివేయడాన్ని తీవ్రంగా నిరసించాడు.
  7. కులవ్యవస్థ నిర్మూలన కొరకు శ్రమించాడు.
  8. మనుషులంతా పుట్టుకతో సమానం అనే భావం కలిగించాడు.
  9. చదువుపై శ్రద్ధ కల్గించాడు.
  10. సాంఘిక దురాచారాలను నిర్మూలించాడు.

ఈ పై పనుల వల్ల నిమ్న వర్గాలలో సామాజిక భాగస్వామ్యం, స్వయంకృషి, ఆత్మవిశ్వాసం, నిస్వార్థసేవ వంటి మంచి విషయాలలో మార్పులు తీసుకువచ్చారు.

ప్రశ్న 2.
భాగ్యరెడ్డి వర్మ, అంబేద్కర్ ల మధ్య పోలికలను తెలుపండి.
జవాబు:
TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం 1
TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం 2

TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం

ప్రశ్న 3.
క్రింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

మహారాష్ట్రలో పుట్టిన జ్యోతిబాఫూలె బహు జనుల అభివృద్ధికి విశేషకృషి చేశాడు. దొరల దోపిడీ దౌర్జన్యాలను ధైర్యంతో ఎదుర్కొన్నాడు. పేదలందరికీ విద్య అందుబాటులోకి రావాలని ఉద్యమాలు చేశాడు. సత్యశోధక సమాజం ఏర్పాటుచేశాడు. బి.యస్. వెంకటరావు హైదరాబాద్లోని ఘాసండిలో పుట్టాడు.

హైదరాబాదు అంబేద్కర్గా ప్రసిద్ధిచెందాడు. హైదరాబాదులో అంబేద్కరిజానికి పాదులు తీసి, దారులు వేశాడు. సమరోత్సాహంతో దళిత ఉద్యమా లను నడిపిన ధీశాలి. హైదరాబాద్లో దేవదాసీ దురాచార నిర్మూలనకు, దళితులలో విద్యాభివృద్ధికి కృషి చేశాడు. 1926 లో ఆదిహిందూ మహాసభను స్థాపించాడు.

సరైన జవాబు గుర్తించి కుండలీకరణం (బ్రాకెట్)లో రాయండి.

అ) జ్యోతిబాఫూలె స్థాపించిన సమాజం పేరు ఏమిటి ?
అ) సత్యశోధక
ఆ) సమసమాజం
ఇ) నవసమాజం
జవాబు:
అ) సత్యశోధక

ఆ) పేదలందరికీ అందుబాటులోనికి రావలిసింది.
అ) డబ్బు
ఆ) చదువు
ఇ) న్యాయం
జవాబు:
ఆ) చదువు

ఇ) దేవదాసీ దురాచార నిర్మూలనకు కృషిచేసింది.
అ) జ్యోతిబాఫూలె
ఆ) అంబేద్కర్
ఇ) బి.ఎస్. వెంకటరావు
జవాబు:
ఇ) బి.ఎస్. వెంకటరావు

ఈ) ఆదిహిందూ మహాసభను స్థాపించిన సంవత్సరం
అ) 1936
ఆ) 1926
ఇ) 1916
జవాబు:
ఆ) 1926

II. వ్యక్తీకరణ సృజనాత్మకత

ప్రశ్న 1.
క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) చదువుకుంటే కలిగే లాభాలను తెలుపండి.
జవాబు:
విద్యలేనివాడు వింత పశువు అని పెద్దలు అంటారు. చదవటం, రాయడం లెక్కలు నేర్చుకోవడమే అక్షరాస్యత. చదువుకుంటే ఎవరిమీద ఆధారపడకుండా జీవితాన్ని సాగించవచ్చు.

  1. విద్య వల్ల మనకు జ్ఞానం కలుగుతుంది.
  2. మంచి కీర్తిని తెచ్చిపెడుతుంది.
  3. భోగములను ఇస్తుంది.
  4. దొంగలు దొంగిలించలేని విద్య సొంతమైతే అజ్ఞానాన్ని పోగొడుతుంది.
  5. సక్రమ మార్గంలో నడిపిస్తుంది.
  6. ఆర్థిక భద్రత, సామాజిక భద్రత కల్పిస్తుంది.
  7. విచక్షణా జ్ఞానం కలుగుతుంది. ఇంకా ఎన్నో, ఎన్నెన్నో లాభాలు ఉన్నాయి.

ఆ) అసమానతలు తొలగి సమానత్వం రావాలంటే ఏం జరగాలి ?
జవాబు:

  1. విద్యను నేర్చుకోవాలి / నేర్పాలి.
  2. నిమ్న వర్గాలు “అందరిలాగా మనము అన్నీ చేయగలం” అన్న ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి.
  3. దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలి.
  4. స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు విలసిల్లాలి (వెల్లివిరియాలి).
  5. జాతీయ జీవన స్రవంతిలో అందరూ కలవాలి. కులతత్వం, మతతత్వం, అంటరానితనం రూపు మాసిపోవాలి.
  6. మూఢనమ్మకాలను పారద్రోలాలి.

ఇవన్నీ సాధించితే అసమానతలు తొలగి సమానత్వం ఏర్పడుతుంది.

ఇ) అంకితభావంతో పనిచేయడం అంటే ఏమిటి ?
జవాబు:
ఒక లక్ష్యం కోసం దీక్షతో పనిచేయడాన్ని అంకిత భావంతో పనిచేయడం అంటారు. ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా లక్ష్యాన్ని విడిచి పెట్టకూడదు. లక్ష్య సాధన దిశగా మనపని మనం చేసుకుంటూ పోవాలి.

డా॥ బి.ఆర్. అంబేద్కర్. మహాత్మాగాంధీ లాంటి వారు అంకిత భావంతో కృషి చేయడం వల్లనే సమాజంలో ఎన్నో సంస్కరణలు చోటుచేసుకున్నాయి. సమాజాభివృద్ధిని కృషి చేయాలనుకునే నాయకులను అంకితభావం, చిత్తశుద్ధి, నిజాయితీ అవసరం.

ఈ) వ్యసనాల వలన ఎట్లాంటి నష్టాలు కలుగుతాయి ?
(లేదా)
దుర్వ్యసనాల వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి ?
జవాబు:
వ్యసనం అంటే అలవాటు. అది మంచి అలవాటు అయితే సద్వ్యసనం అంటారు. చెడు అలవాటైతే దుర్వ్యసనం అంటారు. సాధారణంగా ‘వ్యసనం’ అనే మాట “చెడు అలవాటు” అనే అర్థంలోనే ఉపయోగి స్తాము.

  1. మనిషి జీవనం పతనమవుతుంది.
  2. చెదపురుగు వృక్షాన్ని నాశనం చేసినట్లు వ్యసనాలు మనిషిని సమూలంగా నాశనం చేస్తాయి.
  3. ధర్మరాజు వ్యసనం వల్లనే కదా రాజ్యాన్ని పోగొట్టుకుంది.
  4. వ్యసనాల వల్ల మనిషి తన ఉనికిని కోల్పోతాడు.
  5. త్రాగుడు (మద్యపానం), జూదం, వ్యభిచారం, లంచ గొండితనం మొదలైనవి సమాజంలో వ్యసనాలుగా చెప్పవచ్చును.
  6. వ్యక్తి నాశనమే కాక సమాజానికి హాని జరుగుతుంది.
  7. సమాజంలో గౌరవ మర్యాదలను కోల్పోతాడు.

ప్రశ్న 2.
క్రింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) మీ చుట్టూ ఉన్న సమాజంలో నెలకొన్న మూఢ నమ్మకాలను పారదోలడానికి మీరు ఏం చేయగలరు?
(లేదా)
మీ పరిసరాల్లో మీకు కన్పించే మూఢనమ్మకాల నిర్మూలనకు ఎలాంటి చర్యలను తీసుకుంటారు ?
జవాబు:
మన చుట్టూ ఉన్న సమాజాన్ని అనేక మూఢనమ్మకాలు ప్రభావితం చేస్తున్నాయి. వాటిని పారద్రోలడానికి నేను చేసే పనులను వివరిస్తాను.

  1. ముందుగా నిరక్షరాస్యులకు విద్య నేర్పుతాను.
  2. వయోజనులకు మంచిగా నచ్చచెపుతాను.
  3. స్వచ్ఛత, స్వేచ్ఛ, సమానత్వం గురించి వివరించి చెపుతాను. అప్పటికీ మార్పు రాకపోతే సామాజిక సేవా కార్యకర్తలు, సంస్కర్తలచే చెప్పిస్తాను.
  4. మూఢనమ్మకాల వల్ల కలిగే నష్టాలను చిన్నచిన్న నాటికల ద్వారా మా వాడలో ప్రదర్శిస్తాను.
  5. మూఢనమ్మకాలను పారద్రోలటానికి, ర్యాలీలు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేయిస్తాను.
  6. మూఢనమ్మకాల వల్ల కలిగే నష్టాలను, కరపత్రాల ద్వారా మౌఖికంగా వివరిస్తాను.
  7. వయోజనులతో సత్సంబంధాలను కల్గి, వారికి నచ్చచెప్పి మూఢనమ్మకాలపై వారికి అవగాహన కల్పిస్తాను.
  8. నా మిత్ర బృందంతో కల్సి వారి జీవితాలలో మార్పు కొరకు కృషిచేస్తాను.

(లేదా)

ఆ) భాగ్యరెడ్డివర్మ ఆదిహిందువుల కోసం చేసిన కృషిని వివరించండి.
(లేదా)
ఆదిహిందువుల కోసం భాగ్యరెడ్డి వర్మ చేసిన కృషిని సొంత మాటల్లో వ్రాయండి.
జవాబు:
ఆదిహిందువుల మేలుకోసం వర్మ నిరంతరం చేపట్టిన కార్యాచరణ ఎంతోమంది ప్రముఖుల మనసులను చూరగొని వారు ఆదిహిందువులకు దగ్గరయ్యేలా చేసింది. భాగ్యరెడ్డివర్మ నిరంతర కార్యాచరణ సభల వలన ఆదిహిందూ సమాజం జాగరూకమయ్యింది. ఆది హిందువులు సొంతకాళ్ళ మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గమని వర్మ బలమయిన నమ్మకం. ఈ విషయంలో ఆయన ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తన బాధ్యతను గుర్తించేలా చేశాడు.

కృషి, పోరాటం ఫలితంగా ప్రభుత్వం ఆది హిందువుల కోసం ఎన్నో పాఠశాలలు నెలకొల్పింది. 1931 జనాభా లెక్కల సేకరణ సందర్భంగా వర్మ ఎంతగానో శ్రమపడి అంటరాని వర్గాలను ఆది హిందువులుగా నమోదు చేయించాడు. మానవులలలో ఎక్కువ, తక్కువలు లేవని ఆది హిందువులు తెలుసుకొనేలా చేశాడు.

3,348 ఉపన్యాసాలు ఇచ్చి ఆదిహిందువులను చైతన్య పరిచాడు. ఇది ఆయన నాయకత్వ పటిమకు మచ్చుతునక. హిందూ సమాజం మొత్తంగా ఆయనకు రుణపడి ఉండాలె. ఆ చర్యతో హిందూ సమాజాన్ని ఆయన చీలికలు, పేలికలు కాకుండా రక్షించగలిగాడు.

ప్రశ్న 3.
క్రింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

అ) భాగ్యరెడ్డి వర్మ గురించి తెలుసుకున్నారు కదా ! ఇట్లాగే సమాజం కోసం పాటుపడిన వాళ్ళలో ఎవరి గురించైనా “అభినందన” వ్యాసం రాయండి.
జవాబు:
మలాలా యూసుఫ్ జాయ్
మలాలా యూసుఫయ్ ఈ తరం బాలికల నూతన స్ఫూర్తికి ప్రతినిధి. మలాలా పాకిస్థాన్లోని స్వాత్ లోయ మింగోరా పట్టణంలో 12 జూలై, 1997లో జన్మించింది.

చిన్నప్పటి నుంచి చదువంటే చాలా ఆసక్తిగల మలాలాకు తమ ప్రాంతంలోని ప్రతికూల పరిస్థితులకు ఎదురు నిలిచి పోరాడింది. అక్కడి ప్రభుత్వంపై ఆధిపత్యం వహిస్తున్న తాలిబాన్ ఛాందసవాదులు బాలికలు పాఠశాలకు వెళ్ళడం, చదువుకోవడంపై నిషేధం విధించారు. మలాలా ఏ మాత్రం భయ పడకుండా చదువుకుంటూనే తన తోటి బాలికలకు చదువుపై ఆసక్తిని పెంచి పాఠశాలకు వెళ్ళేటట్లుగా ప్రోత్సహించింది.

దీంతో ఆగ్రహించిన తాలిబాన్లు మలాలాపై 9, అక్టోబర్ 2012 న కాల్పులు జరిపారు. ఆమె తీవ్రంగా గాయపడింది. ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా మలాలాపై సానుభూతి వెల్లువెత్తింది. అందరూ ఆమె కోలు కోవాలని కోరుకున్నారు.

ఆమె ప్రాణాపాయ స్థితి నుండి బయటికి వచ్చింది. మలాలా చైతన్యానికి, సాహసానికి, ఆత్మస్థైర్యానికి ముగ్ధులైన ఐక్యరాజ్య సమితి ఆమె జన్మదినాన్ని (జూలై 12ను) ‘మలాలా రోజు’ (Malala Day) గా ప్రకటించింది. ప్రతీ బాలిక చదువుకోవడం ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించింది. మలాలాను ‘ఇంటర్నేషనల్ చిల్డ్రన్ పీస్ ప్రైజ్’ కు నామినీగా స్వీకరించింది.

ఈ విధంగా తన ప్రాణాలను లెక్కచేయకుండా మలాలా యూసఫ్ జాయ్ ఎదుర్కొంది. ఇది నాకు స్ఫూర్తినిచ్చిన అంశం.

III. భాషాంశాలు

పదజాలం

1. క్రింది పదాలకు పర్యాయపదాలను రాయండి.

అ) అండ = ఆసరా, తోడు, ఆలంబనం, ఆశ్రయం
ఆ) ఉన్నతి = వికాసం, అభివృద్ధి, ప్రగతి, ప్రవృద్ధి, ఘనత
ఇ) స్వేచ్ఛ = స్వతంత్రత, సొంతం, అలవోక, విచ్చలవిడి
ఈ) వికాసం = వికసనము, తెలివి, అభివృద్ధి, ప్రగతి

TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం

2. క్రింది పదాలను ఉపయోగిస్తూ సొంతవాక్యాలు రాయండి.

అ) ఏకతాటిపై = ఒక మాటమీద నిలబెట్టడం
జవాబు:
గాంధీగారు స్వాతంత్య్ర పోరాటాన్ని ఏకతాటి పై నిలారు.

ఆ) మచ్చుతునక = ఉదాహరణ
జవాబు:
ఆమ్లవర్షాలు పడటం పర్యావరణం దెబ్బతినటానికి మచ్చుతునక.

ఇ) మహమ్మారి = వ్యాధి
జవాబు:
నేడు అవినీతి అనే మహమ్మారి ఎక్కువయింది.

ఈ) నిరంతరం = ఎల్లప్పుడు
జవాబు:
1) జీవన పోరాటం నిరంతరం జరుగుతూనే ఉంటుంది.
2) విద్యార్థులు నిరంతరం అధ్యయనంపై దృష్టిపెట్టాలి.

3. కింది పదాలు / పదబంధాలను వివరించి రాయండి.

అ) అంకితం కావడం = సమర్పించడం / లీనం కావడం
జవాబు:
ఒక పనిని శ్రద్ధగా చేయడం, ఇచ్చిన పనిని త్రికరణ శుద్ధిగా చేయడం అని అర్థం.
మహాత్మాగాంధీ జాతికి స్వాతంత్ర్యం కోసం అంకిత మయ్యారు.

ఆ) నైతిక మద్దతు = నీతికి ఓటు వేయడం, నీతిని సమర్థించడం
జవాబు:
ఒక మంచి పనికి నైతిక మద్దతు చాలా అవసరం. అది లేనిదే విజయం లభించదు.
మంచిచేసేవారికి / సంఘసంస్కర్తలకు నైతిక మద్దతు ఇవ్వాలి.

ఇ) చిత్తశుద్ధి = మనస్పూర్తిగా, మనస్సు దోషం లేకుండా
జవాబు:
“చిత్తశుద్ధి కల్గి చేసిన పుణ్యము వృథా కాదు” అని వేమన చెప్పాడు.
నేడు ఎక్కడచూసినా చిత్తశుద్ధి లేకుండా పనిని చేస్తున్నారు. తర్వాత బాధపడుతున్నారు. ఇది పనికిరాదు.

ఈ) సాంఘిక దురాచారాలు = సంఘమునందలి చెడ్డ ఆచారములు
జవాబు:
సాంఘిక దురాచారాలు ప్రగతికి ఆటంకం కల్గిస్తాయి. సమాజం అభివృద్ధి సాధించాలంటే తప్పనిసరిగా సాంఘిక దురాచారాలకు దూరంగా ఉండాలి.
సాంఘిక దురాచారాలను రూపుమాపటానికి ఎందరో సంస్కర్తలు నడుంబిగించారు.

ఉ) సొంతకాళ్ళపై నిలబడడం అంటే స్వతంత్ర భావనతో జీవించడం అని అర్థం.
జవాబు:
ఒకరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడరాదని భావం. శ్రమ పడకుండా డబ్బు సంపాదించటం నేడు సరదాగా మారింది. పరుల సొమ్ము పాము వంటిది. కాబట్టి తన కాళ్ళపై తను నిలబడి స్వతంత్రంగా జీవించడం అని దీని అర్థం.

TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం

వ్యాకరణాంశాలు

క్రింది వాక్యాలను పరిశీలించండి.

ప్రత్యక్ష కథనం :
అ)“అక్కా! ఆ చెరువు జూడు”.
ఆ)”నేను రాన్రా తమ్ముడు”.
ఇ) “పిల్లలూ ! రేపు బీర్పూరు జాతరకు వెళుతున్నాను”.
ఈ) “మేమూ వస్తాం సర్”.

పై వాక్యాలను పరిశీలించారు గదా !
పై వాక్యాలు నేను, మేము మొదలైనవారు చెబు తున్నట్లుగా ఉన్నాయి కదా !

ఇట్లా ఉత్తమపురుషలోని వాక్యాలు సాధారణంగా ప్రత్యక్షంగా చెపుతున్నట్లు ఉంటాయి. కాబట్టి ఇవి “ప్రత్యక్ష” కథనంలో ఉన్న వాక్యాలు. – ప్రత్యక్ష కథనానికి ఉద్ధరణ చిహ్నాలు (“ ” ఉండాలి. కింది ఉదాహరణలను పరిశీలించండి.

అ)“మనుషులంతా పుట్టుకతో సమానం, ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు” అన్నాడు. భాగ్యరెడ్డి వర్మ.
ఆ)రుద్రమదేవితో తల్లి నారాంబ “నువ్వు నేను మామూలు స్త్రీలం కాదు. నువ్వు పట్టమహిషివి, నేను భావిచక్రవర్తిని, మనకు కండ్లు మటుకే ఉండాలి. కాని కన్నీళ్ళు ఉండకూడదు” అన్నది.

పై ఉదాహరణలను పరిశీలిస్తే ప్రత్యక్ష కథనంలో రాసేటప్పుడు కింది నియమాలను గుర్తుంచు కోవాలని తెలుస్తున్నది.

  • ఒకరు చెప్పిన మాటలు / వాక్యాలను చెప్పింది చెప్పినట్లే రాయాలి.
  • ఆ మాటలకు / వాక్యాలకు ఉద్ధరణ చిహ్నాలు ఉండాలి.
  • ప్రథమపురుషలో ఉన్న పదాలు (అనగా తమను, తమ, తాను, తాము వంటి పదాలు) ఉత్తమ పురుషలోనికి నేను, మేముగా మారుతాయి.

పరోక్ష కథనం :

క్రింది వాక్యాలు చదువండి.

అ) హర్షవర్ధన్ తాను రానని హర్షిణితో అన్నాడు.
ఆ) ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లు చేస్తామని పిల్లలు అన్నారు.
ఇ) తనను క్షమించమని రాజు తన మిత్రునితో అన్నాడు. పైనున్న వాక్యాలు చదివారు కదా !

ఇవి సూటిగా వాళ్లే చెప్తునట్లుకాకుండా ! ఇంకొకళ్ళు చెప్తున్నట్లున్నాయి కదా !
ఇలాంటి వాక్యాలను “పరోక్ష కథనం” లో ఉన్న వాక్యాలు అంటారు. వీటిలో ఉద్ధరణ చిహ్నాలు ఉపయోగించవలసిన అవసరం లేదు.

క్రింది వాక్యాలను చదువండి. ఏం మార్పు జరిగిందో చెప్పండి.

అ)“నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను” అన్నాడు శ్రీనివాస్. (ప్రత్యక్ష కథనం)
ఆ) తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నానని శ్రీనివాస్ అన్నాడు.
(పరోక్ష కథనం)

మొదటి వాక్యంలో శ్రీనివాస్ మాటలకు ఉద్ధరణ చిహ్నాలు పెట్టారు.
రెండవ వాక్యంలో శ్రీనివాస్ మాటలను ఇంకొకరు చెప్పినట్లు రాశారు.
ఇందుకోసం ఉద్ధరణ చిహ్నాలు తీసేసి “అని” చేర్చి వాక్యం రాశారు.
మొదటిది ప్రత్యక్ష కథనం. రెండవది పరోక్ష కథనం.

పై ఉదాహరణల పరిశీలన ద్వారా పరోక్ష కథన వాక్యాలు రాసేటప్పుడు కింది నియమాలను గుర్తుంచుకోవాలని తెలుస్తున్నది.

పరోక్ష కథనంలో ఉద్ధరణ చిహ్నాలు తొలగించి “అని” చేరుస్తారు.
ఉత్తమ పురుష పదాలు నేను, మేము, నా, మా వంటివి. ప్రథమ పురుష పదాలుగా తాను, తాము, తన, తమ లుగా మారుతాయి.

పాఠంలోని పరోక్ష కథన వాక్యాలను గుర్తించండి. వాటిని ప్రత్యక్ష కథన వాక్యాలుగా మార్చండి.

1. పరోక్ష కథనం : తన జాతి జనులను ఏకతాటి పై నడుప గలనని ఆయన అన్నారు.
ప్రత్యక్ష కథనం: “నా జాతి జనులను ఏకతాటిపై నడుప గలను” అని ఆయన అన్నారు.

2. పరోక్ష కథనం : ఆది హిందువులు సొంతకాళ్ళ మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గమని భాగ్యరెడ్డి వర్మ అన్నారు.
ప్రత్యక్ష కథనం: “ఆది హిందువులు సొంతకాళ్ళ మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గము” అని భాగ్యరెడ్డి వర్మ అన్నారు.

ప్రాజెక్టు పని

బడుగు వర్గాల కోసం కృషిచేసిన జ్యోతిబాఫూలె, అంబేద్కర్, సావిత్రీబాయి ఫూలె జీవితాల్లోని ఏదైనా ముఖ్యమైన ఘట్టాన్ని మీ మాటల్లో రాయండి. నివేదిక రాసి తరగతిలో చదివి వినిపించండి.
జవాబు:
జ్యోతిబాఫూలె జీవితంలోని ముఖ్యమైన ఘటన :

ఒకరోజు రాత్రి ఇద్దరు మనుషులు జ్యోతిబాఫూలె చంపడానికి వచ్చారు. సావిత్రి బాఫూలె వాళ్ళకు, సేరీకి మధ్యలో నిలబడింది. ‘అన్నలారా – ఆగండి, దయచేసి వెళ్ళిపొండి’ అని వారిని భయంతో ప్రార్థించింది. వాళ్ళలో ఒకడు సావిత్రిపై గర్జించాడు. ‘మేం ఆగటానికి రాలేదు’. “అయితే మీరిక్కడకు ఎందుకొచ్చారు” అని అడిగాడు సేబీ నెమ్మదిగా. “కొందరు పెద్దలు నిన్ను చంపే కాంట్రాక్టు మాకిచ్చారు.

నువ్వు ఈ బడులు నడపటం, ఈ యవ్వారమంతా మానేస్తేగాని సంఘం బాగుపడదని వాళ్ళు చెప్పారు” అని వాళ్ళు అనగా తన చావు వాళ్ళకు లాభం అయితే చంపమని, బీదవాళ్ళకు సాయం చేయడమే తన జీవితాశయం అని సేరీ మెడవంచి చంపమని శాంతంగా చావుకు సిద్ధమయ్యాడు.
TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం 3
ఆ ఇద్దరు మనుషులు గొడ్డళ్ళు క్రింద పారేసి, సేరీ కాళ్ళమీద పడ్డారు. “మేం మిమ్మల్ని చంపం. మీరు మాకు తండ్రి లాంటివారు. ఇప్పుడే వెళ్ళి మమ్మల్ని పంపిన వాళ్ళని చంపివస్తాం” అని అనగానే సేరీ వాళ్ళను ఆపి వాళ్ళ ఆలోచన మారే దాకా వాళ్ళతో మాట్లాడాడు. ఆ ఇద్దరు హంతకుల పేర్లు దోండిరామ్, నామ్రేవ్ కుంబార్డే.

వాళ్ళు ఇద్దరూ రాత్రి బడిలో చేరారు. తర్వాత రోడే సేరీ బాడీగార్డుగా తయారయ్యాడు. కుంబార్ ‘వేదాచార్’ అనే పుస్తకం వ్రాసి ఫూలే దంపతులకు సహకరించాడు. చంపటానికి వచ్చిన వాళ్ళ హృదయం ఆ విధంగా పరివర్తన చెందిందంటే ఆ రోజుల్లో మనుషులు అలా ఆలోచించేవారని తెలుస్తోంది.

అంబేద్కర్ జీవితంలో ముఖ్యఘటన:

1931 రెండవ రౌండు టేబుల్ సమావేశం తర్వాత బ్రిటిషు ప్రభుత్వం కమ్యూనల్ అవార్డు ద్వారా హరిజనులకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించింది. కాని అంబేద్కర్ గాంధీజీ పూనా ఒడంబడి చేసుకొని ప్రత్యేక నియోజకవర్గాలకు బదులుగా కాంగ్రెస్ అభ్యర్థులను నిలిపేటట్లుగా అంగీకరింపచేశాడు. ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పరచటం సాధ్యం చేశారు.
అంబేద్కర్ సాంఘిక దురాచారాలకు లొంగక వాటిని ఎదిరిస్తూ జీవితమంతా ఏటికి ఎదురీదాడు.
TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం 4

విశేషాంశాలు

1. దేవదాసి : ఆలయాలలో నృత్యం చేస్తూ ఆలయ సేవకే అంకితమయిన వాళ్ళను దేవదాసీలుగా పిలిచేవాళ్ళు. ఈ దేవదాసి వ్యవస్థ చాళుక్యకాలంనుండే ఉన్నట్లు తెలుస్తున్నది. కాలక్రమంలో దేవదాసీలు చిన్న చూపుకు గురయినారు. అనేక ఉద్యమాలు నిరసనల కారణంగా ఈ వ్యవస్థ లేకుండపోయింది.

సూక్తి : మంచి సమాజం మనిషి శరీరం వంటిది. అందుకే శరీరమైనా, సమాజమైనా – అందులో ఏ ఒక్క భాగానికి బాధ కలిగినా, నివారణకు అందరూ నడుం బిగించాలి.
-వినోబాభావే

పదాలు – అర్థాలు

I

గమనం = ప్రయాణం
నిర్దేశించు = చూపు
అవస్థ = కాలకృతమైన స్థితి, సంకటం, దశ
గట్టెక్కడం = ఒడ్డుకు చేరడం (కష్టాలుతీరడం)
అంకితభావం = వేరే ఆలోచన లేకపోవడం
వికాసం = వికసించడం, ప్రకాశం
అణగారిన = అణచి వేయబడిన
చిత్తసుద్ది = చెప్పింది చేసే నిజాయితీ
నివసించు = తిరస్కరించు
ఏకతాటి పై = ఐక్యంగా
ఎరుక = తెలివి, జ్ఞానం
అవగతము = తెలియబడినది, పొందుట
కడగండ్లు = కష్టములు, విపత్తులు
ఉదాసీనత = నిర్లిప్తత
అండ = ఆసరా
మహమ్మారి = మశూచి, అమ్మతల్లి (ఓ పెద్ద అంటురోగం)

TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం

II

జీర్ణించుకుపోవడం = బాగా అర్థం కావడం
అజ్ఞానం = చీకటి
నిరంతరం = ఎల్లప్పుడు
మటుమాయం = కన్పించకుండా
ఏకతాటి = ఒకే మాటపై నిలబెట్టడం
స్వచ్ఛత = నిర్మలత్వం
దుర్భరం = భరింపరాని
మార్గదర్శి = మార్గమును చూపువాడు
ఆదిగా = మొదలుగా
కృషి = ప్రయత్నం

III

జాగరూకమయ్యింది = అప్రమత్తమయింది
నెలకొల్పుట = ఏర్పాటుచేయుట
పటిమ = నేర్పు, ఓపిక, బిగువు
మచ్చుతునక = ఉదాహరణ
మేలుకోసం = మంచికోసం
నమ్మకం = విశ్వాస

పాఠం ఉద్దేశం

స్వయంకృషి, ఆత్మవిశ్వాసం ఉంటే ప్రతి ఒక్కరూ ఏమైనా సాధించగలరు. అన్ని వర్గాల వాళ్ళలో సామాజిక భాగస్వామ్యం, చైతన్యం అవసరం. స్వార్ధం పెరిగిపోతున్న ప్రస్తుత సమాజంలో ఇతరుల గురించి ఆలోచించి, వాళ్ళ ప్రగతికి తోడ్పడే వ్యక్తులు అరుదు. అటువంటి వ్యక్తిత్వం నుండి స్ఫూర్తి పొందడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

భాగ్యరెడ్డివర్మ కుమారుడైన ఎం.బి. గౌతమ్ రచించిన ‘భాగ్యరెడ్డివర్మ జీవితచరిత్ర’ గ్రంథంలోని కృష్ణస్వామి ముదిరాజ్ రాసిన వ్యాసంలోనిది ఈ పాఠ్యభాగం.

రచయిత పరిచయం

రచయిత : కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్
జననం : 25.8.1893
మరణం : 15.12.1967
వృత్తి / ఇతర

అంశాలు : స్వాతంత్య్ర సమర యోధుడు, రచయిత, జర్నలిస్టు, విద్యాసంస్థల స్థాపకుడు, బహుజన సమాజ సంస్కర్త, విద్యావేత్త, హైదరాబాద్ మేయర్, ఆంధ్ర మహాసభ నిర్వాహకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి.

ఇతర రచనలు / పనులు :

  1. 1957 లో హైదరాబాద్ మేయర్గా “మాస్టర్గాన్” ను తయారుచేసిన దార్శనికుడు.
  2. దక్కన్లోర్లో సంపాదకీయాలు, వ్యాసాలు రాసారు.
  3. హైదరాబాద్ నగరంపై “పిక్టో రియల్ హైదరాబాద్” అనే అద్భుత గ్రంథాన్ని రాశారు.
  4. దళితుల అభ్యున్నతి కొరకు కృషి చేశాడు.
  5. 1948 లో ఉర్దూలో “హైదరాబాద్ – కి – తీస్ సాలాసియాసి జదు జిహిద్” పేరుతో రాజకీయోద్య మాలపై గ్రంథాన్ని రాశాడు.
  6. “భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర” రాసే సంఘంలో ప్యానల్ సభ్యుడిగా పనిచేశారు.

ప్రవేశిక

ఆయన అనేక బహిరంగ సభలు నిర్వహించాడు. సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి, తన జాతి జనులను ఏకతాటిపై నడుపగలిగాడు. ఆయన చేపట్టిన పనులలోకెల్లా మరపురానిది దేవదాసి, ముర్లీ, వేశ్యా సంప్రదాయాలను అడ్డుకోవడం. ఆడ, మగ పిల్లలను దేవునికి వదిలి వేయడాన్ని తీవ్రంగా నిరసించాడు. తాగుడును మానిపించాడు. ఈ విధంగా సామాజిక బాధ్యతను నెరవేర్చడానికి తన జీవితాన్నంతా ధారపోసే మహోన్నత వ్యక్తులు కొందరే ఉంటారు. ఆ కొందరిలోనూ ముందు వరుసలో ఉండే భాగ్యరెడ్డి వర్మ గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం కదా !

TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం

విద్యార్థులకు సూచనలు

  • పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
  • పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత గీయండి.
  • వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పదవిజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకొండి.

ప్రక్రియ – జీవిత చరిత్ర

ఈ పాఠ్యాంశం ‘జీవిత చరిత్ర’ ప్రక్రియకు చెందినది. విభిన్న రంగాలలో పనిచేస్తూ సమాజంమీద ప్రభావం చూపిన వ్యక్తుల విశిష్టతలను తెలుపుతూ రాసే గ్రంథమే ‘జీవిత చరిత్ర’.

TS 10th Class Telugu Guide 10th Lesson గోలకొండ పట్టణము

Telangana SCERT 10th Class Telugu Guide Telangana 10th Lesson గోలకొండ పట్టణము Textbook Questions and Answers.

TS 10th Class Telugu 10th Lesson Questions and Answers Telangana గోలకొండ పట్టణము

చిత్రాన్ని చూడండి – ఆలోచించి చెప్పండి (T.B. P.No. 95)

TS 10th Class Telugu Guide 10th Lesson గోలకొండ పట్టణము 1

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
పై చిత్రంలో ఏం కనిపిస్తున్నది ?
జవాబు:
పై చిత్రంలో జెండా వందనం జరుగుచున్నది. జెండా ఎగురవేయుచున్నారు.

ప్రశ్న 2.
జెండా ఎగురవేస్తున్నవారు ఎవరు ?
జవాబు:
జెండా ఎగురవేస్తున్నది తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు.

TS 10th Class Telugu Guide 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 3.
జెండాను ఎక్కడ ఎగురవేశారు ? ఎందుకు ?
జవాబు:
జెండాను గోలకొండ కోట దగ్గర ఎగురవేశారు. చారిత్రాత్మక కట్టడమైన గోలకొండ దగ్గర ఎగురవేస్తే ప్రజలకు పాలన దగ్గరవుతుందని అక్కడ ఎగుర వేశారు.

ప్రశ్న 4.
గోలకొండ కోట ప్రత్యేకతలు మీకేమైనా తెలుసా ?
జవాబు:
తెలుసు. కోటకు చుట్టూ పెద్దపెద్ద పటిష్టమైన గోడలు ఉన్నాయి. వీటినే బురుజులు అంటారు. శత్రువుల దాడి నుండి రక్షణ కల్పిస్తాయి ఈ బురుజులు.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 98)

పట్టణమనగా గోలకొండ పట్టణమనియే ………..
విహారభూమిగా నుండెను.

ప్రశ్న 1.
ఆజంఖాను ఎవరు ? ఆయన గొప్పతనం ఏమిటి ?
జవాబు:
గోలకొండ పట్టణ నిర్మాణ పథకమునకు కర్త. గొప్ప ఇంజనీరు. ఆయన పట్టణం యొక్క రూపురేఖలను దిద్దినారు. పట్టణాన్ని పెక్కుభాగాలుగా విభజించారు.

ప్రశ్న 2.
పట్టణం అలంకార భూయిష్టంగా ఉండడం అంటే ఏమిటి?
జవాబు:
ఇబ్రహీం కుతుబ్షా సరదార్లను, భాగ్యవంతులను కోట లోపల మేడలు కట్టవలసినదిగా ఆజ్ఞాపించాడు. అందరూ ఉత్సాహంతో ఈ పనిచేసిరి. అంటే పట్టణం అంతా అందంగా అలంకారముతో కూడి ఉన్నదని అర్థం.

ప్రశ్న 3.
గోలకొండ కోట ఎందుకు అచ్చెరువు గొల్పుతున్నది?
జవాబు:
గోలకొండ పట్టణములో ఉద్యానవన నిర్మాణము నందు విలక్షణమయి, ఆకర్షణీయమైనట్టివి మిద్దెల మీది తోటలు (Roof gardens) భవనముల పైభాగం ఎంతో నైపుణ్యంతో రూపురేఖలు దిద్ది, తీర్చి, రమ్యోద్యానములను మనోహరంగా నిర్మించారు. ఈ ఉద్యానవనమునకు నీటిని సప్లయిచేయు విధానము, అందులో నీటి కాలువలు, జలాశయములు, కేళా కూళులు, జలపాతములు అచ్చెరువు గొల్పుచుండెను.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 101)

హైదరాబాదునగరము…. ఓడలవ్యాపారము చేయుచుండెను.

ప్రశ్న 1.
గోలకొండ వదిలి సామాన్యజనం హైదరాబాదుకు ఎందుకు వెళ్ళి ఉంటారు ?
జవాబు:
గోలకొండ పట్టణంలో జనాభా ఒత్తిడి ఎక్కువ అయ్యింది. ప్రజలకు కావలసిన నీటివసతి కూడా చాలలేదు. అందువల్ల కొందరు పాదుషాలు, గొప్పవారు, కొందరు వర్తకులు, హైదరాబాదులో నివసించేవారు. హైదరాబాదు నిర్మాణం క్రమంగా అభివృద్ధి చెందడంతో గోలకొండ ప్రాధాన్యం తగ్గింది.

అందువల్ల గోలకొండలోని వర్తకులు, సర్దారులు సామాన్యజనం గోలకొండను వదలి, హైదరాబాదులో నివసించేవారు. పట్టణంలోకి రాడానికి పోడానికి, కొత్తవారికి అధికారుల అనుమతి కావలసి వచ్చేది. కొత్తవారు కోటలోకివస్తే అధికారులు వారి శరీరాన్ని అంతా వెతికేవారు. దానితో సామాన్యులు గోలకొండ వదలి, హైదరాబాదుకు వెళ్ళి ఉంటారు.

TS 10th Class Telugu Guide 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 2.
గోలకొండ పట్టణంలో వర్తక వాణిజ్యాలు ఎట్లా సాగాయి ?
జవాబు:
పట్టణములోని బజార్లలో చిల్లర వస్తువులు, తిను బండారములు, విలాస వస్తువులు, నగలు, నాణెములు విరివిగా అమ్మబడుచుండెను. వ్యాపారులు విదేశములతో వర్తకము చేయుచు కుబేరులతో సములయి ఉండిరి. అప్పుడీ పట్టణములో దొరకని వస్తువే లేదు. వజ్రాలకు గోలకొండ పుట్టినిల్లే గదా !

భారతభూమి నలుమూలల నుండి వర్తకం సాగు చుండెను. విదేశముల నుండి వచ్చెడి సరుకులు మచిలీపట్టణము నుండి నేరుగా గోలకొండకు వచ్చు చుండెను. ఇది కేంద్రంగా తెలంగాణమునంతకును ప్రాకుచుండెను. ఇబ్రహీం కులీకుతుబ్షా కాలములో తెలంగాణ ఈజిప్టు వలె ప్రపంచపు అంగడిగా నుండెను.

ప్రశ్న 3.
గోలకొండ పట్టణంలోకి రాకపోకల విషయంలో ఎందుకు జాగ్రత్తలు తీసుకునేవారు ?
జవాబు:
గోలకొండ పట్టణంలోనికి రాకపోకల విషయంలో జాగ్రత్తలు వహించేవారు. క్రొత్తవారు వచ్చినచో వానికి ప్రవేశం దుర్లభం.వానికి దారోగా యొద్ది నుండి అనుమతిపత్రం ఉండాలి. లేదా రాజోద్యోగులలో ఎవ్వని పరిచయమయినా ఉండాలి.

క్రొత్తవారు రాగానే వానివద్ద ఉప్పుగాని, పొగాకుగాని ఉన్నదే మోనని వళ్ళు, బట్టలు బాగా తడవి చూచెదరు. దీనివల్ల రెవిన్యూ బాగా వచ్చేది. రెండు మూడు రోజుల వరకు అనుమతి వచ్చేది కాదు. సాకులు చెప్పి ద్వారరక్షకులు వానినుండి లాభం పొందటానికి ప్రయత్నించేవారు.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 103)

గోలకొండ పాదుషాలలో ………. వైభవములు, ఠీవి పరిసమాప్తి జెందెను.

ప్రశ్న 1.
గోలకొండ పాదుషాలు జీవకారుణ్యం గలవారని, ప్రకృతి ప్రేమికులని ఎట్లా చెప్పగలవు ?
జవాబు:
గోలకొండ లోపలి కోటలో ఉత్తర భాగమునందు జింకల వనము ఒకటి ఉండెను. ఈ జింకల గుంపును ఎవరునూ కొట్టకూడదు. బాధింపకూడదు అని రాజాజ్ఞ ఉండెను. పట్టణములో ద్రాక్షతోటలు ఉండెను. ద్రాక్ష నుండి ద్రాక్షాసవము తయారుచేసి త్రాగుచుండిరి. ఈ విషయములను బట్టి గోలకొండ పాదుషాలు జీవకారుణ్యం కలవారని, ప్రకృతి ప్రేమికులని చెప్పవచ్చును.

ప్రశ్న 2.
పట్టణాల్లో జనాభా ఎందుకు పెరుగుతుంది ?
జవాబు:
మంచి వసతులు, సౌకర్యాలు ఉంటాయి. మనిషి భోగజీవి. సుఖాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ఇవన్నీ పట్టణాలలో ఉంటాయి. అందుకని పల్లెల నుండి పట్టణాలకు తరలివెళ్ళడం వలన పట్టణాలలో జనాభా పెరుగుతుంది.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
గోలకొండ పట్టణము పాఠం ఆధారంగా నాటి చరిత్ర, సంస్కృతికి సంబంధించిన అంశాలు ఎట్లా ఉండేవని భావిస్తున్నారు ? చర్చించండి.
జవాబు:
పట్టణమనగా గోలకొండ పట్టణమనియే దక్షిణాపథమున ప్రసిద్ధి. గోలకొండ దుర్గమనగా ఒక్క కోట కాదు. మూడు కోటలు. గోలకొండ పట్టణ నిర్మాణ పథక మునకు కర్త ఆజంఖాన్ అను ఇంజనీరు అని తెలియుచున్నది. ఇతడే పట్టణము యొక్క రూపు రేఖలను దిద్దినవాడు. గోలకొండ పట్టణములో ఏనుగులు, ఒంటెలు, గుఱ్ఱాలు అధిక సంఖ్యలో నుండి పట్టణములో సందడిగా సంచరించుచుండెను.

గోలకొండ పట్టణం అలంకార భూయిష్టముగా ఉంటుంది. గోలకొండ పట్టణములో ఉద్యానవన నిర్మాణమునందు విలక్షణమయి, ఆకర్షణీయమైనట్టివి మిద్దెల మీది తోటలు భవనముల పైభాగము ఎంతో మనోహరంగా నిర్మించినారు. ఈ విధంగా ఆనాటి చరిత్ర, సంస్కృతి మనకు తెలుస్తోంది.

ప్రశ్న 2.
క్రింద ఇచ్చిన పదాలు ఏయే పేరాల్లో ఉన్నాయో గుర్తించి, పట్టికలో వివరించి రాయండి.
జవాబు:
TS 10th Class Telugu Guide 10th Lesson గోలకొండ పట్టణము 2

TS 10th Class Telugu Guide 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 3.
క్రింది పేరా చదవండి. పట్టిక రాయండి.

భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన కోటల్లో దేవరకొండ కోట ఒకటి. రేచర్ల నాయకరాజుల పరిపాలనలో ఈ కోట ఎంతో గొప్పగా విరాజిల్లినది. రెండవ మాదా నాయకుడు ఈ కోటను నిర్మించారు. ఎత్తైన ఏడు కొండలను కలుపుతూ ఈ దుర్గాన్ని అత్యద్భుతంగా నిర్మించాడు. ఐదువందల ఎకరాల పైగా విస్తీర్ణంగల ఈ కోటలో పంట భూములు, కాలువలు, ధాన్యాగారాలు, సెలయేళ్ళు, సైనిక శిబిరాలు, గుర్రపుశాలలు, ఆలయాలు ఉన్నాయి.

ఈ కోటకు 360 బురుజులు ఉన్నాయి. 9 ప్రధానద్వారాలు, 23 పెద్దబావులు, 53 దిగుడు బావులు, 6 కోనేర్లు ఉన్నాయి. అత్యంత కళాకృతమైన సింహద్వారాలు ఉన్నాయి. మన పాఠ్యపుస్తకాల మొదటి పేజీలో కనిపించే విశిష్టమైన ‘పూర్ణకుంభ’ చిహ్నం ఇక్కడే లభించింది. ఈ కోటయొక్క విశేషం ఏమిటంటే ఏ శత్రురాజు దీన్ని ఆక్రమించుకోలేకపోయాడు. నాయకరాజుల కాలంలో ఇది స్వయంప్రతిపత్తిగల దుర్గంగా వెలిగింది. దీనికి దగ్గరలో కల రాచకొండ సమీపంలోని నాగసముద్రం చెరువులను ఈ రాజులే తవ్వించారు.
TS 10th Class Telugu Guide 10th Lesson గోలకొండ పట్టణము 3
జవాబు:
TS 10th Class Telugu Guide 10th Lesson గోలకొండ పట్టణము 4

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) “గోలకొండ పాదుషాలు సాహిత్య పోషకులు” అనడానికి ఉదాహరణలు తెలుపండి. (Mar. ’15)
(లేదా)
గోలకొండ నవాబుల సాహిత్య సేవ ఎట్టిది ? (Mar. ’18)
(లేదా)
ఇబ్రహీం కుతుబ్షా సాహిత్య పిపాస గూర్చి వివరించండి. (June ’18)
జవాబు:
“గోలకొండ పాదుషాలలో ఇబ్రాహీం కుతుబుషా విద్యా ప్రియుడు. ఈతని ఆస్థానములో కవులు, పండితులు హిందువులలో, మహ్మదీయులలో ఉండిరి. విద్యాగోష్ఠి సదా సాగుచుండెను. పాదుషా వారు పండితులను బాగుగా సన్మానించుచుండిరి. ఇబ్రాహీం కుతుబ్షా చాలాకాలము విజయనగరము నందు రాజాదరణమున పెరిగినవాడగుటచే ఆంధ్ర భాషా మాధుర్యమును గ్రోలినవాడు ఆంధ్రభాష యందు అభిమానము గలిగి, ఆంధ్ర కవులను సత్కరించుచుండెను. అద్దంకి గంగాధర కవి “తపతీ సంవరణోపాఖ్యాన” కావ్యమును రచించి ఈ పాదుషాకు అంకితమిచ్చియున్నాడు.

ఇబ్రాహీం పాదుషా మహబూబునగరు జిల్లాలో నివశించు చుండిన ఆసూరి మరింగంటి సింగరాచార్య మహాకవికి “మత్తగంధేభసితఛత్ర ముత్తమాశ్వ హాటకాంబర చతురంతయాన యగ్రహారములను” ఇచ్చి సత్కరించినాడు. సుల్తాన్ ఇబ్రాహీం పాదుషా సేనానియగు అమీర్ ఖాన్ మొట్టమొదటి అచ్చతెనుగు కబ్బమగు “యయాతిచరిత్ర”కు కృతిభర్తయయి, ఆ కావ్యమును రచించిన పొన్నగంటి తెలగనార్యుని సత్కరించినాడు.

TS 10th Class Telugu Guide 10th Lesson గోలకొండ పట్టణము

ఆ) నాటి తెలంగాణలో కూడా తెలుగు భాష ఉచ్చ స్థితిలో ఉందని ఎట్లా చెప్పగలరు ?
జవాబు:
ఇబ్రహీం కుతుబ్షా తెలుగుభాష తియ్యదనం తెలిసినవాడు. తెలుగు భాషయందు అభిమానంతో తెలుగు కవులను, పండితులను సత్కరించేవాడు. అద్దంకి గంగాధర కవి రచించిన ‘తపతీ సంవరణో పాఖ్యాన కావ్యము’ వీరికి అంకితమివ్వబడినది. వీరు మహాకవి ఆసూరి మరింగంటి సింగరాచార్యను చతురంతయాన అగ్రహారాలను ఇచ్చి సత్కరించారు.

మొట్టమొదటి అచ్చ తెనుగు కావ్యం ‘యయాతి చరిత్ర’ దీనిని పొన్నగంటి తెలగనార్యులు రచించారు. ఈ కావ్యానికి కృతిభర్త ఇబ్రహీం పాదుషా సేనాని అమీర్ ఖాన్. దీనిని రచించిన కవిని ఘనంగా సత్కరించారు. దీనిని బట్టి నాటి తెలంగాణలో కూడా తెలుగు భాష ఉచ్చస్థితిలో ఉందని చెప్పవచ్చు.

ఇ) “తెలంగాణము ఈజిప్టువలె ప్రపంచపు అంగడి” అనడానికి కారణాలు రాయండి.
జవాబు:
పట్టణములోని బజార్లలో చిల్లర వస్తువులు, తిను బండారములు, విలాస వస్తువులు, నగలు, నాణెములు విరివిగా అమ్మబడుచుండెను. వ్యాపారులు విదేశములతో వర్తకము చేయుచు కుబేరులతో సములయి ఉండిరి. అప్పుడీ పట్టణములో దొరకని వస్తువే లేదు. వజ్రాలకు గోలకొండ పుట్టినిల్లే గదా ! భారతభూమి నలుమూలల నుండి వర్తకం సాగు చుండెను.

విదేశముల నుండి వచ్చెడి సరుకులు మచిలీపట్టణం నుండి నేరుగా గోలకొండకు వచ్చు చుండెను.ఇది కేంద్రంగా తెలంగాణమునంతకును ప్రాకుచుండెను. ఇబ్రహీం కులీకుతుబ్షా కాలములో తెలంగాణము ఈజిప్టు వలె ప్రపంచపు అంగడిగా నుండెను.

ఈ) ఈనాడు పట్టణాలలో జనాభా అధికమవడం వలన కలిగే ఇబ్బందులు ఏమిటి ?
జవాబు:
ప్రజలు వలసపోవటం : బ్రతుకు తెరువుకోసం, ఉపాధి కోసం ఎక్కువమంది పల్లె ప్రజలు నగరాలకు వలస పోవటం.

జనాభా పెరుగుదల : విద్యా, ఉద్యోగ అవకాశాలు, వైద్య సదుపాయాలు నగరాల్లో ఎక్కువగా ఉంటాయని ప్రజలు నగరాలకు వెళ్ళడంతో విపరీతంగా జనాభా పెరగటం.
రద్దీ పెరగటం : ప్రమాదాలు జరగటం, ఎప్పుడూ రోడ్లు రద్దీగా ఉండడంతో ప్రతిరోజు ప్రమాదాలు ఎక్కువగా జరగటం.

నీటి సమస్య : చెరువులు భూమి ఆక్రమణలకు గురియై భూగర్భ జలాలు తగ్గి త్రాగునీటికి, వాడుక నీటికీ కొరత ఏర్పడటం, ఉన్న చెరువులు, బావులు అవసరాలకు చాలకపోవటం.
కాలుష్యం పెరగటం : వాహనాలు, కర్మాగారాల్లో ఇంధనం ఎక్కువగా వాడటం, మురుగునీటి సౌకర్యాలు లేకపోవటంతో జల కాలుష్యం, వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం పెరగటం.

ధరల పెరుగుదల : జనాభా పెరగటంతో వస్తువులకు గిరాకీ పెరిగి ధరలు విపరీతంగా పెరిగిపోవటం.
విదేశీ సంస్కృతి ప్రభావం : భిన్న సంస్కృతుల ప్రజలు ఒక్కచోట ఉండటంతో ప్రజలు విదేశీ వ్యామోహానికి గురికావటం.
సగటు మనిషి పడేపాట్లు : ఇరుకు ఇళ్ళల్లో, అధిక ధరలతో, రణగొణ ధ్వనులతో, నీటి వసతులు లేక, నిరంతరం జీవనపోరాటం చేస్తూ పద్మవ్యూహం లాంటి నగరంలో సగటు మనిషి, ఎన్నో అగచాట్లు పడుతున్నాడు. క్లిష్ట సమస్యలను మానసిక సంఘర్షణ తో ఎదుర్కోవటంతో నేడు నగర జీవితం నరక ప్రాయంగా మారుతుంది.

ప్రశ్న 2.
క్రింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) గోలకొండ పట్టణము విశిష్టతను తెలుపండి.
జవాబు:
పట్టణమంటే గోలకొండ పట్టణమే అనే ప్రఖ్యాతి పొందింది. అందుకు కారణం గోలకొండ యొక్క అందచందాలు, వైభవం, విశిష్టతలు.

అందచందాలు : గోలకొండ పట్టణ నిర్మాణ పథకకర్త ఆజంఖాన్, పట్టణాన్ని మొహల్లాలుగా విభజించారు. వీధులు విశాలంగా ఉంటాయి. భాగ్యవంతులు, సరదార్ల మేడలు కోట లోపల ఉంటాయి. పట్టణానికి ఆ భవనాలన్నీ అలంకారాలుగా ఉంటాయి. నగీనాబాగ్ ఒక అందాలకుప్ప అయిన ఉద్యానవనం.

షాహిమహలులు అనే రాజహర్మ్యములు చాలా అందమైనవి. దిల్కుషా భవన సౌందర్యం వర్ణనాతీతం. ఉద్యానవన నిర్మాణాలు గోలకొండ పట్టణం అందచందాలను చాలా పెంచాయి. మిద్దెలమీది తోటలు శిల్పకళా నిపుణత్వానికి గీటు రాళ్ళు. ఈ ఉద్యానవనాలకు నీరు సరఫరా చేసే కాలువలు, జలాశయాలు, కేళాకూళులు, జలపాతాలు చూసి ఆశ్చర్యపడని వారుండరు. బాల్బోవా వృక్షం పట్టణం అందాలను పెంచింది.

వైభవం : గోలకొండ పట్టణం వజ్రాలకు పుట్టినిల్లు. అక్కడి వ్యాపారులు మహాధనవంతులు. దేశవిదేశాలతో ఎగుమతి దిగుమతి వాణిజ్యం చేసేవారు. అప్పుడా పట్టణంలో దొరకని వస్తువు లేదు. వజ్రాల వ్యాపారం, ఓడల వ్యాపారం కూడా జోరుగా సాగేది.

విశిష్టత : కవులు, పండితులను పోషించేవారు. అనేక గ్రంథాలను రచింపచేసి, అంకితం పుచ్చు కొనేవారు. కవులను ఘనంగా సన్మానించేవారు. అగ్రహారాలిచ్చేవారు. జంతు ప్రేమికులు. ద్రాక్ష తోటలు పెంచేవారు. ఉమ్రావులు విలాసవంతంగా జీవించే వారు. శిక్షలు కఠినం.

TS 10th Class Telugu Guide 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 3.
క్రింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

అ) ఏదైనా ఒక పట్టణం లేదా ఊరి చారిత్రక/సాంస్కృతిక విశేషాలతో వ్యాసం రాయండి.
జవాబు:
పర్యాటక క్షేత్రం – ఆదిలాబాద్ జిల్లా బాసర
పవిత్ర గోదావరీ నదికి సుమారు అరవై మైళ్ళ దూరంలో ఒక ఋష్యాశ్రమం ఉండేది. దానిని వ్యాస మహర్షి స్థాపించడం చేత దానికి “వ్యాసపురి” అని పేరు వచ్చింది. తరువాత ‘వాసర’ అని పిలువబడుతుండేది.

కాలక్రమంలో అదే ‘బాసర’ అని ప్రసిద్ధిపొందింది. ఇక్కడ సరస్వతీ దేవి దేవాలయం ఉంది. ఉత్తర భారతదేశంలో కాశ్మీరంలో, దక్షిణ భారతదేశంలో తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న బాసరలో మాత్రమే సరస్వతీ దేవి దేవాలయాలు ఉన్నాయి. సాక్షాత్ నారాయణాంశతో జన్మించిన వేదవ్యాస మహర్షి మహాభారత భాగవతాది అష్టాదశ పురాణాలు, వ్యాఖ్యాన గ్రంథాలు రచించి, నాలుగు వేదాలను పరిష్కరించి మానవాళికి అందించిన మహోన్నతుడు.

అటువంటి వేదవ్యాసునికే ఒకసారి మనశ్శాంతి లేక సకల మునిగణ సేవితుడై ఉత్తరభారతదేశ యాత్రచేసి, దండకారణ్యానికి వచ్చాడట. కలిదోష నివారణ చేయగలిగిన గౌతమీ నదిలో స్నానం చేసి, సంధ్యా వందనము వంటి అనుష్ఠానాలను పూర్తిచేసుకుని, అమ్మను ప్రార్థించి సాకారముగా ఇక్కడనే నెలకొని ఉండమని శ్రీ సరస్వతీ దేవిని ప్రార్థించాడు. ప్రతిరోజూ గౌతమీ నదిలో స్నానము చేసి మూడు గుప్పెడులతో ఇసుక ను తెచ్చి ఒక చోట ఉంచేవాడు.
TS 10th Class Telugu Guide 10th Lesson గోలకొండ పట్టణము 5
క్రమంగా అది మూడు మూర్తు లుగా మారి శ్రీ మహాసరస్వతీ, శ్రీ మహాలక్ష్మీ, శ్రీ మహాకాళి రూపాలతో ఆవిర్భ వించింది. అందులో శ్రీ మహా సరస్వతిని అధి దేవతగా మిగిలిన దేవతలను పరివార దేవతలుగా ఆరాధించేవాడు. తరువాతి కాలంలో తురుష్కులు దండయాత్రలలో ఈ మందిరాన్ని నాశనం చేయటం జరిగింది.
TS 10th Class Telugu Guide 10th Lesson గోలకొండ పట్టణము 6

వీరశైవులైన ‘మాక్కజీ పటేలు’ సమూహము వాళ్ళను ఎదిరించారు. శిథిలమైన దేవాలయం పునరుద్ధరించబడింది. శృంగేరి పీఠాధిపతి శ్రీ జగద్గురు శ్రీ విద్యారణ్య భారతీ స్వామి వారు శ్రీ సరస్వతీ దేవిని పునఃప్రతిష్ఠ చేసి పునరుద్ధరించారు. ఇక్కడ దత్తమందిరము, గణేశ మందిరము, ఏకవీర మందిరము, పాతాళేశ్వర మందిరము,

ఆంజనేయ మందిరము’ ఉన్నాయి. శ్రీ సరస్వతీదేవి ఆలయము కేంద్రంగా ఇంద్రేశ్వరము, సూర్యేశ్వరము, నారాయణేశ్వరము మొదలైన ఆలయ సముదాయ ముతో కూడిన మహాక్షేత్రము బాసర. ఇక్కడ ప్రతి సంవత్సరము విజయదశమికి, శివరాత్రికి ఉత్సవాలు జరుగుతాయి. అనేకమంది భక్తులు ఇక్కడకు వచ్చి శ్రీ సరస్వతీదేవిని దర్శించి, ఆమె అనుగ్రహంతో పిల్లలకు విద్యాభ్యాసాలు జరుపుకుంటారు. పల్లె వాసుల జాతరలు, శుభకార్యాలు కూడా జరుగు తుంటాయి.

III. భాషాంశాలు

పదజాలం

1. క్రింది వాటిని సొంతవాక్యాల్లో ప్రయోగించండి.

అ) పుట్టినిల్లు
జవాబు:
భారతదేశం కళలకు పుట్టినిల్లు.

ఆ) పాటుపడడం
జవాబు:
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎందరో వీరులు పాటుపడ్డారు.

ఇ) పీడవదలడం
జవాబు:
కంసుని వధతో ఆ రాజ్యానికి పీడవదిలింది.

ఈ) తలదాచుకోవడం
జవాబు:
కాశ్మీరీ పండిట్లు ఢిల్లీ పురవీధుల్లో తలదాచుకున్నారు.

2. క్రింది పదాలను వివరించి రాయండి.

అ) పటాటోపము : మితిమీరిన వస్త్రాలంకారణాన్ని పటాటోపం అని అంటారు. ‘పటము’ అనగా వస్త్రము అని అర్థం అనగా బాగా అలంకరించుకొని హడా వుడిగా తిరుగు అని భావం.

ఆ) అగ్రహారం : ఇబ్రహీం పాదుషా మహబూబునగరు జిల్లాలో నివసించుచుండిన ఆసూరి మరింగంటి సింగరాచార్య మహాకవికి “మత్తగంధేభసితఛత్ర ముత్త మాశ్వ హాటకాంబర చతురంతయాన అగ్రహార ములను” ఇచ్చి సత్కరించినాడు.

ఇ) బంజారాదర్వాజా : పట్టణంలోనికి సరుకంతయు బంజారాదర్వాజా ద్వారానే వచ్చుచుండును. బంజారాలు అనబడు లంబాడీలు ధాన్యము, ఉప్పు మొదలగునవి తెచ్చుచుండుటచే ప్రవేశద్వారమునకు బంజారా దర్వాజా అను పేరు వచ్చినది.

TS 10th Class Telugu Guide 10th Lesson గోలకొండ పట్టణము

ఈ) ధర్మశాల : పుణ్యాన్ని పొందదలచి యాత్రికులకు, బాటసారులకు, అనాథలకు ఆశ్రయాన్ని కల్పించేందుకు నిర్మించబడిన వసతి గృహాలను ధర్మశాలలు అని అంటారు. ఇవి ఎక్కువగా పుణ్యక్షేత్రాల్లో కనిపిస్తాయి. వీటిలో కులమతాలకు అతీతంగా జనులు ఆశ్రయం పొందుతారు.

వ్యాకరణాంశాలు

1. క్రింది వాక్యాలలో సంధి పదాలను విడదీసి అవి ఏ సంధులో రాయండి.

అ) పండుగ దినాలలో దేవాలయాలు భక్తులతో కిట కిటలాడుతాయి.
జవాబు:
దేవ + ఆలయాలు = దేవాలయాలు (సవర్ణదీర్ఘ సంధి)

ఆ) మధురలోని రమ్యోద్యానములు చూపరుల మనస్సు లను ఆకట్టుకుంటాయి.
జవాబు:
రమ్య + ఉద్యానములు = రమ్యోద్యానములు (గుణ సంధి)

ఇ) ఛత్రపతి శివాజీ అశ్వారూఢుడు అయి శత్రువులను సంహరించాడు.
జవాబు:
‘అశ్వ + ఆరూఢుడు = అశ్వారూఢుడు (సవర్ణదీర్ఘ సంధి)

ఈ) రాజాజ్ఞ లేనిదే ఏ కార్యక్రమాలు జరుపరు.
జవాబు:
రాజ + రాజాజ్ఞ (సవర్ణదీర్ఘ సంధి)

బహువ్రీహి సమాసము

క్రింది సమాసపదాలను వాటి విగ్రహవాక్యాలను పరిశీలించండి.

అ) ఆజానుబాహుడు – జానువుల వరకు బాహువులు కలవాడు.
ఆ) ముక్కంటి – మూడు కన్నులు కలవాడు.
ఇ) గరుడ వాహనుడు – గరుడుడు వాహనముగా కలవాడు.
ఈ) చతుర్ముఖుడు – నాలుగు ముఖాలు కలవాడు.
ఉ) పద్మాక్షి – పద్మం వంటి కన్నులు కలది.

పై పదాలలో మొదటి పదానికి గాని రెండవ పదానికి గాని ప్రాధాన్యం లేదు. రెండు పదాలు మరో పదం యొక్క అర్థాన్ని స్ఫురింపజేస్తున్నాయి. ఇలా మరో పదం యొక్క అర్థానికి ప్రాధాన్యం ఉన్న సమాసాన్ని “బహువ్రీహి” సమాసం అంటారు.

ఉదా : ‘చక్రపాణి’ అనే సమాసపదంలో ‘చక్రము’ అనే పదానికి ప్రాధాన్యం లేదు. ‘పాణి’ (చేయి) అనే పదానికి కూడా ప్రాధాన్యం లేదు. చక్రము పాణియందు కలిగిన వానికి ప్రాధాన్యం ఉన్నది. ఇట్లా సమాసంలో పదాల ద్వారా వచ్చే మరో పదము యొక్క అర్థానికి ప్రాధాన్యం ఉన్నది కాబట్టి ఇది బహువ్రీహి సమాసం.
అన్యపదార్థ ప్రాధాన్యం బహువ్రీహి.

2. క్రింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసాలను రాయండి.

ఉదా : యయాతిచరిత్ర – యయాతి యొక్క చరిత్ర – షష్ఠీ తత్పురుష సమాసం.

TS 10th Class Telugu Guide 10th Lesson గోలకొండ పట్టణము 7

3. క్రింది వాక్యాలను వ్యవహారభాషలోనికి మార్చండి.

ఉదా : పట్టణము అలంకారముగానుండుటకు
అందరును ఉత్సాహముతో పాటుపడిరి.
పట్టణం అలంకారంగా ఉండడానికి అందరూ
ఉత్సాహంతో పాటుపడ్డారు.

అ) ఈ మందిరము నందే పారశీకపు రాయబారికిని, అతని అనుచరవర్గమునకును బస ఏర్పాటు చేసిరి.
జవాబు:
ఈ మందిరము నందే పారశీకపు రాయబారికి, అతని అనుచర వర్గానికి బస ఏర్పాటు చేసిరి.

ఆ) నీటి కాలువలు, జలాశయములు, జలపాతములు అచ్చెరువు గొల్పుచుండెను.
జవాబు:
నీటి కాలువలు, జలాశయాలు, జలపాతాలు ఆశ్చర్యం గొల్పుతాయి.

ఇ) పెద్ద అధికారుల యొక్కయు మందిరములన్నియు లోపలి కోటలో నుండుచుండును.
జవాబు:
పెద్ద అధికారుల మందిరాలన్నీ కోటలో ఉండేవి.

ఈ) వజ్రములకు గోలకొండ పుట్టినిల్లే గదా !
జవాబు:
“వజ్రాలకు గోలకొండ పుట్టిల్లు” కదా !

TS 10th Class Telugu Guide 10th Lesson గోలకొండ పట్టణము

ఉ) పట్టణములోనికి సరుకంతయు బంజారాదర్వాజా ద్వారానే వచ్చుచుండును.
జవాబు:
పట్టణంలోనికి సరుకంతా బంజారాదర్వాజా ద్వారా వచ్చును.

ప్రాజెక్టు పని

మీ జిల్లాలోని వివిధ కోటల చిత్రాలు లేదా మీరు చూసిన కోట/ప్రాచీన గుడి / కట్టడం ఆధారంగా నివేదిక రాయండి. ప్రదర్శించండి.
జవాబు:
నివేదిక

నేను చూసిన ప్రాచీన కట్టడం వరంగల్లు నగరం. వరంగల్లును ఓరుగల్లు అని, ఏకశిలా నగరం అని పిలిచేవారు. హైదరాబాద్కు 80 కి.మీ. దూరంలో ఉన్నది. వరంగల్లు, హనుమకొండ, ఖాజీపేటలు కలిసే ఉంటాయి.

వరంగల్లు 42 గ్రామ పంచాయితీలతో 1 మిలియన్ జనాభాను మించిపోయింది. కాకతీయులు 1195 నుండి 1323 వరకు పరిపాలన సాగించారు.
స్వయంభూ దేవాలయం ఇక్కడ ఉంది. రెండవ ప్రతాప రుద్రుని తర్వాత ముసునూరి నాయకులు పరి పాలించారు. వేయిస్తంభాల గుడి ప్రసిద్ధమైన గుడి. ఇక్కడ NIIT వరంగల్, కాకతీయ యూనివర్శిటీ, కాకతీయ మెడికల్ కాలేజి (కాళోజి హెల్త్ యూని వర్శిటీ) ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. గ్రానైట్ క్వారీలు ఎక్కువగా ఉన్నాయి.

బతుకమ్మ పండుగ ఘనంగా జరుపుతారు. 9 రోజులపాటు రకరకాల పూలతో అలంకారం చేస్తారు. భద్రకాళి గుడి, కాకతీయ శిల్పాలు, ఏకశిలా గుట్ట, రామప్ప దేవాలయం మొదలైనవి ప్రసిద్ధమైనవి. కాక తీయుల కోట ఎంతో గొప్పది. ఇటీవల మా పాఠశాల వారు వరంగల్లు జిల్లాలోని ముఖ్యమైన ప్రదేశములను మాకు చూపారు. అందరూ గర్వించ దగ్గ నగరం వరంగల్లు.

సూక్తి : చరిత్ర స్వదేశాభిమానాన్ని నేర్పే చక్కనైన సాధనం

మీకు తెలుసా ?

గోల్కొండ కోటను బండరాళ్ళతో కట్టారు. గోల్కొండ కైవారము నాలుగు మైళ్ళను మించి ఉంటుంది. దీనికి ఎనిమిది బురుజులున్నవి. ఈ బురుజులన్నియు శతఘ్నుల స్థావరములు. మొగలు సైన్యం సర్వశక్తియుక్తులను కూడ దీసుకొని తొమ్మిది నెలలు శ్రమించి ఒక్క బురుజును మాత్రమే కూల్చగలిగిరి. ఐతే ఆ బురుజు స్థానమున ఒక్క రాత్రిలో మరొక బురుజును కుతుబ్షాహీ సైనికాధికారులు కట్ట గలిగిరి. గోల్కొండ కోటలో కొండశిఖరమున ‘బాలహిస్సారు’ అను ప్రాసాదమున్నది.

దానికి పోవు మార్గమునకు, కోట ప్రాకారమునకు అమర్చిన ద్వారముకడ ఒక రాతి గుండున్నది. ఆ రాతిపై నిలచి చప్పట్లు కొట్టిన ఆ శబ్దము బాలహిస్సారు లోనికి స్పష్టంగ వినిపించును. అట్లు ప్రతిధ్వనించు ఏర్పాటును నిర్మాణములోనే కల్పించిరి. ఇవి అన్నియు మానవుని ప్రజ్ఞ వలన నెలకొన్న అమర్పులు.

మూలం : కె.వి. భూపాల్రావు రాసిన ‘మహామంత్రి మాదన్న కథ’లోనిది.

విశేషాంశములు

1. బురుజులు : కోటగోడయందుండు దిబ్బ. శత్రురక్షణ దృష్టిలో ప్రత్యేకంగా చేపట్టిన నిర్మాణం. ఇక్కడి నుండి శత్రువుల కదలికలను గమనించవచ్చు. శత్రువులపై దాడిచేసే సందర్భంలో ఇక్కడ ఫిరంగులను పెట్టి కాలుస్తారు.

2. ఇబ్రహీం కుతుబ్షా : 1550 – 1580 సంవత్సరాల మధ్య గోలకొండ రాజ్యాన్ని పరిపాలించిన మాలిక్ ఇబ్రాహీం కుతుబ్షాహీ రాజు. జనవ్యవహారంలో ‘మల్కిభరాం’ గా ప్రసిద్ధుడు. పరిపాలనాదక్షుడు. తెలుగు భాష పట్ల మమకారాన్ని ప్రకటించాడు. తెలుగు కావ్యాన్ని అంకితం పొందిన ముస్లింరాజు ఇతడే. గోలకొండ రాజ్యంలో ఉద్యోగి సారంగు తమ్మయ తన తపతీ సంవరణోపాఖ్యానాన్ని ఇబ్రహీం కుతుబ్షాకు అంకితం ఇచ్చాడు. ఈ రాజు 1578 లో పురానా పూలు నిర్మించాడు.

3. కులీకుతుబ్షా : 1580 – 1612 సంవత్సరాల మధ్య గోలకొండ రాజ్యాన్ని పరిపాలించిన కులీ కుతుబ్షా హైదరాబాద్ నగర నిర్మాత. చక్కని కవి. హైదరాబాద్ ప్రాంతానికి ప్రత్యేకమైన ‘దక్కనీ ఉర్దూ’ ను ప్రోత్సహించాడు.ఈ మాండలికంలో దాదాపు 1800 పుటల కవిత్వాన్ని రచించాడు. తెలుగులోనూ కవిత్వాన్ని రచించినట్టు చెబుతారు. అవి లభ్యంకాలేదు.

4. మేనా : పెళ్ళి ఉరేగింపు వాహనాలలో ఒకటి, ఇది పల్లకి వలెనే ఉంటుంది కానీ పల్లకి అంత సున్నిత మైనది కాదు. మోటారు వాహనాలు లేని రోజుల్లో వధూవరులను ఇందులో కూర్చుండబెట్టి మనుషులు మోసేవారు.
5. హోన్ను : గోలకొండ కుతుబ్షాహి రాజ్యంలో ప్రధానమైన నాణెం హోన్ను. ఇది బంగారు నాణెం. విదేశీయులు దీన్నే పెగోడా అనేవారు.

ముఖ్య పదాలు – అర్థాలు

I

కైవారము = చుట్టూరా, వందిస్తోత్రము
అధికసంఖ్య = ఎక్కువ సంఖ్య
జనసమ్మర్ధం = ఎక్కువ జనాభా కలిగి ఉండటం
సొంపు = ఆనందం
రమ్యోద్యానములు = అందమైన ఉద్యానవనములు
మున్నగునవి = మొదలగునవి
హర్మ్యము = ఎత్తైన మేడ
ఉపాహారము = అల్పాహారము (టిఫిన్)
కేళాకూళులు = క్రీడా సరస్సులు

TS 10th Class Telugu Guide 10th Lesson గోలకొండ పట్టణము

II

హూను = సుమారు 4 రూపాయిల విలువగల బంగారు నాణెం
సర్ధారు = శూరుడు
పానీయ జలము = త్రాగునీరు
హవుజు = భవనం
అంగడి = దుకాణము
పైఠన్ = జలతారు
దారోగా = పై అధికారి
పుట్టి = 20 మణుగులు
తటాకము = చెరువు
వణికుంగవులు = శ్రేష్ఠులైన వ్యాపారులు
కౌశల్యము = నేర్పు
పణం = పందెం
దుర్లభము = కష్టము

III

పాదుషా = చక్రవర్తి
ఇభము = ఏనుగు
హాలకము = బంగారము
శస్త్రము = విసరకుండా యుద్ధం చేసే ఆయుధం – గద, కత్తి మొదలైనవి.
ఠీవి = దర్జా
అంబరము = ఆకాశము
వాఙ్మయము = భాష
సురటీ = విసనకర్ర
బోయీ = పల్లకి మోసేవాడు
భీతి = భయము
మాధుర్యము = తియ్యదనము, మధురత్వము
సత్కరించుట = గౌరవించట
కావ్యము = కబ్బము
పెక్కు = చాలా
పక్వము = పంట
ధ్వజము = జెండా
అశ్వము = గుఱ్ఱము
పదాతివర్గం = కాలి బలగం
యుద్ధభీతి = యుద్ధ భయం
పానుపు = పరుపు, పడక
మనోజ్ఞము = అందము
ఆకర్షణీయము = అందము
పరిసమాప్తి = ముగింపు, అంతము

పాఠం ఉద్దేశం

తెలంగాణలో చారిత్రక కట్టడాలకు కొదువ లేదు. వీటిలో గోలకొండ ఘనమైన చారిత్రకప్రాధాన్యం సంతరించు కొన్నది. ఈ పట్టణం యొక్క ప్రాశస్త్యం… నాటి కోటల నిర్మాణం… మంచి నీటి వసతుల కల్పన… అద్భుత సాంకేతిక నిర్మాణాలు… పట్టణంలో జరిగిన ప్రపంచస్థాయి వర్తక, వ్యాపారాలు… ఆహారపుటలవాట్లు, కోటలో జరిగిన కార్య కలాపాలు, స్థాపించిన పరిశ్రమలు, గోలకొండ పట్టణ ప్రాముఖ్యతతోపాటు 1940ల నాటి తెలంగాణ వచన రచనా శైలిని తెలుపడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ వ్యాసం ఆదిరాజు వీరభద్రరావు రాసిన ‘మన తెలంగాణము’ అనే వ్యాససంపుటి లోనిది.

రచయిత పరిచయం

రచయిత : ఆదిరాజు వీరభద్రరావు
జననం : 16.11.1890
మరణం : 28.9.1973
జన్మస్థలం : ఖమ్మంజిల్లా మధిర తాలూకా

ఇతర రచనలు : ప్రాచీనాంధ్ర నగరములు, లలిత కథావళి, రత్నప్రభ, జీవిత చరితావళి, జీవిత చరిత్రలు, నవ్వుల పువ్వులు, మిఠాయిచెట్టు, షితాబ్ ఖాన్. సంగ్రహాంధ్ర విజ్ఞానకోశంలో యాభైవ్యాసాలు రాశాడు. హైదరాబాద్ రేడియోలో తొలి ప్రసంగం చేశాడు.

వృత్తి : చాదర్ ఘాట్ హైస్కూల్ హైదరాబాదులో ప్రధాన తెలుగుపండితుడిగా పనిచేశాడు.
ప్రవృత్తి : “లక్ష్మణరాయ పరిశోధక మండలి” కి కార్యదర్శిగా వ్యవహరించాడు. తన పాండిత్యం, పరిశోధనలతో “తెలంగాణ భీష్ముడి” గా పేరు తెచ్చుకున్నాడు.

TS 10th Class Telugu Guide 10th Lesson గోలకొండ పట్టణము

ప్రవేశిక

ఏ జాతికైనా, ఏ ప్రాంతానికైనా తమ చరిత్రను మరచిపోవడమంత దురదృష్టం మరొకటి ఉండదు. తెలంగాణలోనే ఎంతో విశిష్టతను సంతరించుకున్న గోలకొండ పట్టణ వైభవాన్ని, నాటి అద్భుత నిర్మాణాలను వర్ణించడానికి మాటలు చాలవు. చిరస్మరణీయమైన ఈ కట్టడంలోని సాంకేతిక నైపుణ్యాన్ని ఎందరో చరిత్రకారులు అభివర్ణించే ప్రయత్నం చేశారు.

గోలకొండ వైభవాన్ని కళ్ళతో చూడవలసిందేకాని మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. ఆదిరాజు వీరభద్రరావు ఆ ప్రయత్నం చేశాడు. ఆయన మాటల్లోనే గోలకొండ పట్టణ విశేషాలను, ఆనాటి పరిస్థితులను ఈ పాఠం చదివి తెలుసుకోండి. ప్రత్యక్షంగా చూసిన అనుభూతిని పొందండి.

విద్యార్థులకు సూచనలు

  • పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
  • పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత గీయండి.
  • వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పదవిజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకోండి.

ప్రక్రియ – చారిత్రక వ్యాసం

ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. వ్యాసం అంటే వివరించి చెప్పడం. చరిత్రను తెలిపే వ్యాసాన్ని చారిత్రక వ్యాసం అంటారు. తెలంగాణ ప్రాంతంలోని కోటల నిర్మాణ వైభవాన్ని, విశిష్టతను తెలుపుతూ రాసిన వ్యాసమే ఈ పాఠం.

TS 10th Class Maths Bits Chapter 5 Quadratic Equations

Solving these TS 10th Class Maths Bits with Answers Chapter 5 Quadratic Equations Bits for 10th Class will help students to build their problem-solving skills.

Quadratic Equations Bits for 10th Class

Question 1.
The roots of the equation 3x2 – 2 \(\sqrt{6}\)x + 2 = 0 are
A) \(\frac{2}{\sqrt{3}}\), \(\frac{-2}{\sqrt{3}}\)
B) \(\frac{1}{\sqrt{3}}\), \(\frac{-1}{\sqrt{3}}\)
C) \(\sqrt{\frac{2}{3}}\), \(\sqrt{\frac{2}{3}}\)
D) \(\frac{1}{\sqrt{3}}\), \(\frac{5}{\sqrt{3}}\)
Answer:
C) \(\sqrt{\frac{2}{3}}\), \(\sqrt{\frac{2}{3}}\)

Question 2.
One solution of the Q.E. 2x2 – 5x
A) x = 2
B) x = – 1
C) x = -3
D) x = 3
Answer:
D) x = 3

TS 10th Class Maths Bits Chapter 5 Quadratic Equations

Question 3.
The positive root of \(\sqrt{3 x^2+6}\) = 9 is
A) 3
B) 5
C) 4
D) \(\frac{2}{5}\)
Answer:
B) 5

Question 4.
Which of the following Q.E. has real and equal roots ?
A) x2 – 4x + 4 = 0
B) 2x2 – 4x + 3 = 0
C) 3x2 – 5x + 2 = 0
D) x2 – 2\(\sqrt{2}\)x – 6 = 0
Answer:
A) x2 – 4x + 4 = 0

Question 5.
Which of the following is a Q.E. ?
A) (x + 1)2 = 3(x + 7)
B) (x – 1) (x + 3) = (x – 2) (x + 1)
C) x2 + 5x – 7 = (x – 4)2
D) x3 – 9 = 0
Answer:
A) (x + 1)2 = 3(x + 7)

Question 6.
The sum of a number and its reciprocal is \(\frac{5}{2}\) then the number is
A) 2 or \(\frac{1}{3}\)
B) 3 or \(\frac{1}{2}\)
C) 2 or \(\frac{1}{2}\)
D) 5 and \(\frac{1}{5}\)
Answer:
C) 2 or \(\frac{1}{2}\)

Question 7.
If the equation x2 – kx + 1 = 0 has equal roots, then
A) k = 1
B) k = – 1
C) k = 2
D) k = – 4
Answer:
C) k = 2

Question 8.
The Q.E. whose one root is 2 – \(\sqrt{3}\) is
A) x2 – 4x + 1 = 0
B) x2 + 4x – 1 = 0
C) x2 – 4x – 1 = 0
D) x2 – 2x – 3 = 0
Answer:
A) x2 – 4x + 1 = 0

Question 9.
The roots of a quadratic equation \(\frac{x}{p}\) = \(\frac{p}{x}\)
A) ± p
B) p, 2p
C) -p, 2p
D) -p, -2p
Answer:
A) ± p

Question 10.
\(\sqrt{2}\)x2 – 3x + 5\(\sqrt{2}\) = 0, sum of the root is ……….
A) \(\sqrt{2}\)
B) \(\frac{-3}{\sqrt{2}}\)
C) 3
D) 5
Answer:
A) \(\sqrt{2}\)

TS 10th Class Maths Bits Chapter 5 Quadratic Equations

Question 11.
The quadratic equation whose roots are -3 and -4 is ……..
A) 7x2 + x + 1 = 0
B) x2 + 7x + 12 = 0
C) x2 – 3x + 1 = 0
D) none
Answer:
B) x2 + 7x + 12 = 0

Question 12.
The nature of the roots of a quadratic equation 4x2 – 12x + 9 = 0 is ……….
A) real and equal
B) real and distinct
C) imaginary
D) none
Answer:
A) real and equal

Question 13.
The roots of the quadratic equation \(\frac{x^2-8}{x^2+20}\) = \(\frac{1}{2}\) are….
A) ±2
B) ±6
C) ±13
D) ±7
Answer:
B) ±6

Question 14.
If b2 – 4ac = 0 then the roots of the quadratic equations are
A) real and distinct
B) real and equal
C) imaginary
D) none
Answer:
B) real and equal

Question 15.
The nature of roots of 3x2 + 6x – 2 = 0 is
A) real and distinct
B) real and equal
C) complex
D) none
Answer:
A) real and distinct

Question 16.
Product of the roots of ax2 + bx + c = 0 is
A) \(\frac{c}{a}\)
B) \(\frac{-b}{a}\)
C) \(\frac{-c}{a}\)
D) none
Answer:
A) \(\frac{c}{a}\)

Question 17.
The quadratic equation whose roots are 2, 3 is …………
A) x2 – 5x + 1 = 0
B) x2 – 5x – 6 = 0
C) x2 – 3x + 1 = 0
D) x2 – 5x + 6 = 0
Answer:
D) x2 – 5x + 6 = 0

Question 18.
\(\frac{2 a^2+a-1}{a+1}\) + \(\frac{3 a^2+5 a+2}{3 a+2}\) + \(\frac{4-a^2}{a+2}\) + ……..
A) \(\frac{\mathrm{a}}{2}\)
B) \(\frac{a+1}{2}\)
C) 2(a + 1)
D) none
Answer:
C) 2(a + 1)

Question 19.
TS 10th Class Maths Bits Chapter 5 Quadratic Equations 1
A) 1
B) x2
C) x
D) 0
Answer:
C) x

Question 20.
Sum of the roots of bx2 + ax + c = 0 is ………
A) \(\frac{-b}{a}\)
B) \(\frac{c}{a}\)
C) \(\frac{c}{a}\)
D) \(\frac{-a}{b}\)
Answer:
D) \(\frac{-a}{b}\)

Question 21.
The nature of roots of 3x2 + 13x – 2 = 0 is ……..
A) real and unequal
B) real and equal
C) complex
D) none
Answer:
A) real and unequal

Question 22.
Product of the roots of x2 + 7x = 0 is ………
A) 1
B) -7
C) -3
D) 0
Answer:
D) 0

Question 23.
If α and β are the roots of x2 – 2x + 3 = 0 then α2 + β2 = ………
A) 1
B) 4
C) 8
D) none
Answer:
D) none

TS 10th Class Maths Bits Chapter 5 Quadratic Equations

Question 24.
If α and β are the roots of x2 – 5x + 6 = 0 then the value of α – β = ……….
A) ±1
B) ±2
C) -3
D) none
Answer:
A) ±1

Question 25.
Form a quadratic equation from x3 – 4x2 – x + 1 = (x – 2)3 = …….
A) 2x2 – x + 1 = 0
B) 2x2 – 13x + 9 = 0
C) x2 + x + 1 = 0
D) none
Answer:
B) 2x2 – 13x + 9 = 0

Question 26.
The product of two consecutive positive in¬teger is 306 then the smallest number is
A) 16
B) 13
C) 19
D) 17
Answer:
D) 17

Question 27.
x(x + 4) = 12 then x = …….
A) – 6 or 2
B) 6 or 7
C) 8 or – 9
D) none
Answer:
A) – 6 or 2

Question 28.
9 and 1 are the roots of ……
A) x2 – 10x + 9 = 0
B) x2 – x + 1 = 0
C) x2 + 3x + 4 = 0
D) none
Answer:
A) x2 – 10x + 9 = 0

Question 29.
The discriminant of 3x2 – 2x = \(\frac{-1}{3}\) is ……..
A) 1
B) –\(\frac{-1}{3}\)
C) 8
D) 0
Answer:
D) 0

Question 30.
Which of the following is a quadratic equation ?
A) x2 – 3x + 1
B) 8x3 + 7x2 + 1
C) x2 – x + 1 = 0
D) all
Answer:
C) x2 – x + 1 = 0

Question 31.
(α + β)2 – 2αβ = ………..
A) α2 + β2 + 1
B) α2 + β2
C) α2 + β2
D) αβ
Answer:
C) α2 + β2

Question 32.
If α, β are the roots of x2 – px + q = 0 then α3 + β3 = ………
A) p + q3
B) p – 3p3q
C) p3 – 3pq
D) p2 – 3pq
Answer:
C) p3 – 3pq

Question 33.
(1 – 5x) (9x + 1) = …….
A) 3x2 + 1 + x
B) 8x2 – 5x + 1
C) 1 – 4x + 5x2
D) 1 + 4x – 45x2
Answer:
D) 1 + 4x – 45x2

Question 34.
The roots of x = \(\frac{1}{x}\) are ……..
A) 2 or -2
B) 2 or \(\frac{1}{2}\)
C) 1 or – 1
D) all
Answer:
C) 1 or – 1

Question 35.
If \(\frac{-7}{3}\) is a root of 6x2 – 13x – 63 = 0 then other root is ……..
A) 8
B) \(\frac{1}{3}\)
C) \(\frac{2}{9}\)
D) \(\frac{9}{2}\)
Answer:
D) \(\frac{9}{2}\)

TS 10th Class Maths Bits Chapter 5 Quadratic Equations

Question 36.
\(\sqrt{a \sqrt{a \sqrt{a \ldots \ldots \infty}}}\) = ………
A) a1/2
B) a
C) a3
D) a/2
Answer:
B) a

Question 37.
If one root of x2 – x – k = 0 is square of other then k =
A) 2
B) 3
C) -4
D) none
Answer:
D) none

Question 38.
The roots of 2x2 + x – 4 = 0 are ………
A) \(\frac{-1 \pm \sqrt{33}}{4}\)
B) \(\frac{-1 \pm \sqrt{31}}{2}\)
C) \(\frac{-1 \pm \sqrt{29}}{2}\)
D) none
Answer:
A) \(\frac{-1 \pm \sqrt{33}}{4}\)

Question 39.
If b2 < 4ac then shape of graph is …….
TS 10th Class Maths Bits Chapter 5 Quadratic Equations 2
Answer:
A)
TS 10th Class Maths Bits Chapter 5 Quadratic Equations 6

Question 40.
One of the root of the Q.E. 6x2 – x – 2 = 0 is
A) \(\frac{1}{3}\)
B) \(\frac{-1}{3}\)
C) \(\frac{-2}{3}\)
D) \(\frac{2}{3}\)
Answer:
D) \(\frac{2}{3}\)

Question 41.
The sum of a number and its reciprocal is \(\frac{50}{7}\), then the number is
A) \(\frac{1}{7}\)
B) 5
C) \(\frac{2}{7}\)
D) \(\frac{3}{7}\)
Answer:
A) \(\frac{1}{7}\)

Question 42.
If 5x2 – kx + 11 = 0 has a root x = 3 then k =
A) \(\frac{16}{3}\)
B) \(\frac{56}{3}\)
C) \(\frac{-17}{3}\)
D) 15
Answer:
B) \(\frac{56}{3}\)

Question 43.
The value of p for which 4x2 – 2px + 7 = 0 has a real root is
A) p > 2\(\sqrt{7}\)
B) p > \(\sqrt{7}\)
C) p > \(\sqrt{5}\)
D) p > \(\sqrt{3}\)
Answer:
A) p > 2\(\sqrt{7}\)

Question 44.
The standard form of a Q.E. is
A) ax + b = 0
B) ax2 + bx + c = 0; a ≠ o
C) ax3 + bx2 + cx + d = 0
D) a2 x + b2 y = c2
Answer:
B) ax2 + bx + c = 0; a ≠ o

Question 45.
The roots of the Q.E. \(\frac{9}{x^2-27}\) = \(\frac{25}{x^2-11}\)
A) ±11
B) ± 3
C) ± 9
D) ± 6
Answer:
D) ± 6

Question 46.
The Q.E. whose roots are -2, -3 is
A) x2 – 5x + 6 = 0
B) x2 + 5x + 6 = 0
C) x2 – 5x – 6 = 0
D) x2 + 5x – 6 = 0
Answer:
B) x2 + 5x + 6 = 0

Question 47.
Form a quadratic equation whose roots are k and \(\frac{1}{\mathbf{k}}\)
A) x2 + (k + \(\frac{1}{\mathbf{k}}\)) x + 1 = 0
B) xk2 – kx + 1 = 0
C) x2 – (k + k) + 1 = 0
D) x2 – (k + \(\frac{1}{\mathbf{k}}\)) x + 1 = 0
Answer:
D) x2 – (k + \(\frac{1}{\mathbf{k}}\)) x + 1 = 0

Question 48.
The sum of the roots of the quadratic equation 5x2 + 4 \(\sqrt{3}\)x – 11 = o is
A) \(\frac{-11}{5}\)
B) \(\frac{11}{4}\)
C) \(\frac{-4}{3}\)
D) \(\frac{-4}{5} \sqrt{3}\)
Answer:
D) \(\frac{-4}{5} \sqrt{3}\)

Question 49.
If one root of a quadratic equation is 7 – \(\sqrt{3}\) then the quadratic equation is ……..
A) x2 – 7x + 3 = 0
B) x2 – 4x + 6 = 0
C) x2 – 7x + 1 = 0
D) x2 – 14x + 46 = 0
Answer:
D) x2 – 14x + 46 = 0

Question 50.
The roots of a quadratic equation (\(\sqrt{2}\)x + 3) (5x – \(\sqrt{3}\)) = 0 are ….
A) \(\frac{1}{3}\), \(\frac{1}{\sqrt{2}}\)
B) \(\frac{1}{2}\), \(\frac{3}{\sqrt{5}}\)
C) \(\frac{-3}{\sqrt{2}}\), \(\frac{1}{5}\)
D) \(\frac{-3}{\sqrt{2}}\), \(\frac{\sqrt{3}}{5}\)
Answer:
D) \(\frac{-3}{\sqrt{2}}\), \(\frac{\sqrt{3}}{5}\)

Question 51.
If b2 – 4ac > 0 then the roots of the quadratic equations are ……..
A) real and distinct
B) real and equal
C) imaginary
D) none
Answer:
A) real and distinct

Question 52.
The roots of 7x2 + 3x + 8 = 0 are
A) real
B) not real
C) real and equal
D) none
Answer:
B) not real

TS 10th Class Maths Bits Chapter 5 Quadratic Equations

Question 53.
The quadratic equation whose roots are – 2 and -3 is
A) x2 + 6x + 1 = 0
B) x2 + 5x + 6 = 0
C) x2 – 5x + 1 = 0
D) none
Answer:
B) x2 + 5x + 6 = 0

Question 54.
\(\frac{1}{a+3}\) + \(\frac{1}{a-3}\) + \(\frac{6}{9-a^2}\) = ……….
A) \(\frac{1}{a+2}\)
B) \(\frac{3}{a+2}\)
C) \(\frac{2}{a+3}\)
D) \(\frac{2}{a+3}\)
Answer:
D) \(\frac{2}{a+3}\)

Question 55.
If (2x – 1) (2x + 3) = 0 then x = ……….
A) \(\frac{1}{2}\) or \(\frac{-1}{2}\)
B) \(\frac{1}{2}\) or \(\frac{-3}{2}\)
C) \(\frac{1}{2}\) or \(\frac{2}{3}\)
D) none
Answer:
B) \(\frac{1}{2}\) or \(\frac{-3}{2}\)

Question 56.
If α and β are the roots of the quadratic equation 2x2 + 3x – 7 = 0 then \(\frac{a^2+b^2}{a b}\) = …………
A) \(\frac{-37}{16}\)
B) \(\frac{-37}{4}\)
C) \(\frac{-37}{14}\)
D) \(\frac{37}{8}\)
Answer:
C) \(\frac{-37}{14}\)

Question 57.
The degree of any quadratic equation is …………
A) 4
B) 1
C) 2
D) 3
Answer:
C) 2

Question 58.
The product of two consecutive positive integer is 306 then the largest number is ………..
A) 12
B) 16
C) 18
D) 10
Answer:
C) 18

Question 59.
3(x – 4)2 – 5(x – 4) = 12 then x = ……….
A) 6, \(\frac{-1}{17}\)
B) 8, \(\frac{-1}{2}\)
C) 3, 4
D) 3, \(\frac{-4}{3}\)
Answer:
D) 3, \(\frac{-4}{3}\)

Question 60.
Discriminant of the quadratic equation
px2 + qx + r = 0 is…… ( )
A) q2 – pr
B) q – 4pr
C) q2 – 4pr
D) none
Answer:
C) q2 – 4pr

Question 61.
If a is a root of ax2 + bx + c = 0 then aα2 + bα + c = ………
A) -c
B) 0
C) 8
D) 1
Answer:
B) 0

Question 62.
Discriminant of the quadratic equation x + \(\frac{1}{x}\) = 3 is ………..
A) -10
B) 9
C) 6
D) 5
Answer:
D) 5

Question 63.
If the sum of the roots of kx2 – 3x + 1 = 0 is \(\frac{-4}{3}\) then k = …………
A) \(\frac{-4}{9}\)
B) \(\frac{9}{5}\)
C) \(\frac{-9}{4}\)
D) none
Answer:
C) \(\frac{-9}{4}\)

Question 64.
If ax2 – 4x + 3 = 1 then x = ………., a ≠ 0
A) 1 or 3
B) 2 or 7
C) 8 or \(\frac{1}{2}\)
D) 2 or -3
Answer:
A) 1 or 3

Question 65.
TS 10th Class Maths Bits Chapter 5 Quadratic Equations 3
A) \(\frac{1+\sqrt{1+4 a}}{2}\)
B) \(\frac{1-\sqrt{4 a-2}}{3}\)
C) \(\frac{1+\sqrt{2}}{2}\)
D) none
Answer:
A) \(\frac{1+\sqrt{1+4 a}}{2}\)

TS 10th Class Maths Bits Chapter 5 Quadratic Equations

Question 66.
If \(\frac{1}{x-2}\) + \(\frac{2}{x-1}\) = \(\frac{6}{x}\) then x = ………
A) 3 or \(\frac{4}{3}\)
B) 3 or \(\frac{-1}{3}\)
C) 1 or \(\frac{2}{3}\)
D) 8 or \(\frac{7}{2}\)
Answer:
A) 3 or \(\frac{4}{3}\)

Question 67.
Sum of the roots of a pure quadratic equation is ……..
A) -13
B) 12
C) -9
D) 0
Answer:
D) 0

Question 68.
If the sum of the squares of two consecutive odd numbers is 74; then the smaller number is
A) 11
B) 3
C) 7
D) 5
Answer:
D) 5

Question 69.
The roots of the Q.E. \(\sqrt{3}\)x2 – 2x – \(\sqrt{3}\) = 0 are
A) Real and distinct
B) Real and equal
C) Not real
D) Can’t be determined
Answer:
A) Real and distinct

Question 70.
The roots of 5x2 – x + 1 = 0 are
A) Real and equal
B) Real and unequal
C) Imaginary
D) None
Answer:
C) Imaginary

Question 71.
The roots of the Q.E. (7x – 1) (2x + 3) = 0 are
A) 1, 3
B) \(\frac{1}{7}\), \(\frac{3}{2}\)
C) \(\frac{1}{7}\), \(\frac{-3}{2}\)
D) \(\frac{-1}{7}\), \(\frac{-3}{2}\)
Answer:
C) \(\frac{1}{7}\), \(\frac{-3}{2}\)

Question 72.
The roots of the Q.E. (x – \(\frac{1}{3}\))2 = 9 are
A) 10, 8
B) \(\frac{-10}{8}\), \(\frac{8}{3}\)
C) \(\frac{10}{3}\), \(\frac{-8}{3}\)
D) (-3, 3)
Answer:
C) \(\frac{10}{3}\), \(\frac{-8}{3}\)

Question 73.
If(x – 3) (x + 3) = 16 then the value of x is
A) ± 4
B) ± 3
C) ± 6
D) ± 5
Answer:
D) ± 5

Question 74.
The product of the roots of the quadratic equation \(\sqrt{2}\)x2 – 3x + 5\(\sqrt{2}\) = 0 is ………
A) \(\frac{-5}{3}\)
B) \(\sqrt{2}\)
C) 5
D) 3
Answer:
C) 5

Question 75.
The nature of the roots of quadratic equation 3x2 + x + 8 = 0 is ……….
A) real and distinct
B) real and equal
C) Imaginary
D) none
Answer:
C) Imaginary

Question 76.
If b2 – 4ac < 0 then the roots of the quadratic equations are ………..
A) distinct
B) equal
C) imaginary
D) none
Answer:
C) imaginary

Question 77.
Sum of the roots of ax2 + bx + c = 0 is ………….
A) \(\frac{c}{a}\)
B) \(\frac{b}{a}\)
C) \(\frac{a}{b}\)
D) none
Answer:
D) none

Question 78.
\(\frac{x}{x-y}\) – \(\frac{y}{x+y}\) = …………
A) \(\frac{x^2+y^2}{x^2-y^2}\)
B) \(\frac{x^2+y^2}{x+y}\)
C) \(\frac{x^2 y^2}{x+y}\)
D) none
Answer:
A) \(\frac{x^2+y^2}{x^2-y^2}\)

Question 79.
(x + \(\frac{1}{x}\))2 – (y + \(\frac{1}{y}\))2 – (xy – \(\frac{1}{x y}\)) . (\(\frac{x}{y}\) – \(\frac{y}{x}\)) = ………..
A) 0
B) 1
C) xy
D) \(\frac{1}{x y}\)
Answer:
A) 0

Question 80.
The roots of (x – a) (x – b) = b2 are ……….
A) real
B) not real
C) complex
D) none
Answer:
A) real

Question 81.
Form a quadratic equation from
x(2x + 3) = x2 + 1
A) x2 + 3x – 1 = 0
B) x2 – 3x – 2 = 0
C) x2 + x + 1 = 0
D) none
Answer:
A) x2 + 3x – 1 = 0

TS 10th Class Maths Bits Chapter 5 Quadratic Equations

Question 82.
The roots of \(\sqrt{2}\)x2 + 7x + 5\(\sqrt{2}\) = 0 are
A) \(\frac{-5}{\sqrt{2}}\) or 7
B) -1 or -5
C) –\(\sqrt{2}\) or \(\frac{5}{\sqrt{3}}\)
D) all
Answer:
B) -1 or -5

Question 83.
On solving x2 + 5 = -6x we get x = …………….
A) 5 or – 2
B) -1 or – 5
C) -3 or – 7
D) none
Answer:
B) -1 or – 5

Question 84.
If kx(x – 2) + 6 = 0 has equal roots then k = ………..
A) 3
B) -6
C) 7
D) 6
Answer:
D) 6

Question 85.
If one root of x2 – (p – 1) x + 10 = 0 is 5 then p = ……..
A) 8
B) 7
C) -3
D) none
Answer:
A) 8

Question 86.
\(\sqrt{k+1}\) = 3 then k = ………
A) 24
B) 16
C) 19
D) none
Answer:
D) none

Question 87.
The quadratic inequation with 2 < x < 3 is
A) x2 + 6x + 5 < 0
B) x2 – 5x + 6 > 0
C) x2 – 5x + 6 < 0
D) none
Answer:
C) x2 – 5x + 6 < 0

Question 88.
\(\frac{1}{x+4}\) – \(\frac{1}{x-7}\) = \(\frac{11}{30}\), x ≠ -4 or 7 then x = ………
A) -2 or 1
B) 2 or 1
C) -1 or 3
D) 7 or \(\frac{1}{2}\)
Answer:
B) 2 or 1

Question 89.
The roots of the equation 4x2 + 4\(\sqrt{\mathbf{3}}\) x + 3 = 0 are
A) \(\frac{\sqrt{3}}{2}\)
B) \(\frac{-\sqrt{3}}{2}\)
C) -4
D) -2
Answer:
B) \(\frac{-\sqrt{3}}{2}\)

Question 90.
The sum of the roots of the equation 3x2 – 7x + 11 = 0
A) \(\frac{11}{3}\)
B) \(\frac{-7}{3}\)
C) \(\frac{7}{3}\)
D) \(\frac{3}{7}\)
Answer:
C) \(\frac{7}{3}\)

Question 91.
The roots of the Q.E. (\(\sqrt{5} x\)x – 3)(\(\sqrt{5} x\)x – 3) = 0 are
A) \(\frac{3}{\sqrt{5}}\), \(\frac{3}{\sqrt{5}}\)
B) \(\frac{-3}{\sqrt{5}}\), \(\frac{-3}{\sqrt{5}}\)
C) \(\frac{3}{\sqrt{5}}\), \(\frac{-3}{\sqrt{5}}\)
D) \(\frac{\sqrt{3}}{\sqrt{5}}\), \(\frac{\sqrt{3}}{\sqrt{5}}\)
Answer:
A) \(\frac{3}{\sqrt{5}}\), \(\frac{3}{\sqrt{5}}\)

Question 92.
The roots of the Q.E. (3x + 4)2 – 49 = 0 are
A) 1, \(\frac{-11}{3}\)
C) \(\frac{-1}{3}\), \(\frac{-11}{3}\)
D) 1, -11
Answer:
A) 1, \(\frac{-11}{3}\)

Question 93.
If the sum of the roots of the Q.E. 3x2 + (2k + 1)x – (k + 5) = 0 is equal to the product of the roots, then the value of k is
A) 3
B) 4
C) 2
D) 6
Answer:
B) 4

Question 94.
The product of roots of the quadratic equation 5x2 + 4\(\sqrt{3}\)x – 11 = 0 is
A) \(\frac{5}{-11}\)
B) \(\frac{1}{5}\)
C) \(\frac{-11}{5}\)
D) \(\frac{1}{5}\)
Answer:
C) \(\frac{-11}{5}\)

Question 95.
The discriminant of 5x2 – 3x – 2 = 0 is …………
A) 49
B) 89
C) 20
D) none
Answer:
A) 49

Question 96.
The roots of 4x2 – 20x + 25 = 0 are ….
A) real and equal
B) imaginary
C) real and distinct
D) none
Answer:
A) real and equal

TS 10th Class Maths Bits Chapter 5 Quadratic Equations

Question 97.
4x2 + kx – 2 = 0 has no real roots if ………….
A) k > – \(\sqrt{32}\)
B) k = 10
C) k < – \(\sqrt{32}\)
D) none
Answer:
C) k < – \(\sqrt{32}\)

Question 98.
(x – α)(x – β) = 0 then …….
A) x2 – (α)x + βα = 0
B) x2 – (α + β)x + αβ = 0
C) ax2 – xβ + αβ = 0
D) none
Answer:
B) x2 – (α + β)x + αβ = 0

Question 99.
For what values of m are the roots of the equation mx2 + (m + 3) x + 4 = 0 are equal ?
A) 1 or 5
B) -1 or 2
C) 8 of 1
D) 9 or -7
Answer:
A) 1 or 5

Question 100.
If x + \(\frac{1}{x}\) = 2 then x2 + \(\frac{1}{x^2}\) = …………
A) 8
B) 0
C) 4
D) 2
Answer:
D) 2

Question 101.
1 and \(\frac{3}{2}\) are the roots of ………..
A) 2x2 – 5x + 3 = 0
B) x2 – 5x + 1 = 0
C) 2x2 – x + 3 = 0
D) all
Answer:
A) 2x2 – 5x + 3 = 0

Question 102.
The equation 5x2 + 2x + 8 = 0 has ……….
A) no real roots
B) real roots
C) equal roots
D) none
Answer:
A) no real roots

Question 103.
Diagonal of a rectangle is …….
A) \(\sqrt{l}\) + b2
B) \(\sqrt{l}\) + b
C) \(\sqrt{l \mathrm{~b}}\)
D) \(\sqrt{l^2+\mathrm{b}^2}\)
Answer:
D) \(\sqrt{l^2+\mathrm{b}^2}\)

Question 104.
The coefficient of x in a pure quadratic equation is…
A) 2
B) 0
C) 8
D) none
Answer:
B) 0

Question 105.
If 2 is a root of x2 + 5x + r = 0 then r = ……..
A) -4
B) -14
C) 16
D) 8
Answer:
B) -14

Question 106.
x2 + (x + 2)2 = 290 then x = ………
A) 9 or -13
B) 8 or -12
C) 11 or -13
D) all
Answer:
C) 11 or -13

Question 107.
If 3y2 = 192 then y = ……..
A) 12
B) 6
C) 8
D) none
Answer:
D) none

Question 108.
If x2 – 2x + 1 = 0, then x + \(\frac{1}{x}\) =
A) 0
B) 2
C) 1
D) None
Answer:
B) 2

Question 109.
Product of the roots of the Q.E.
3x2 – 6x + 11 = 0 is
A) -2
B) \(\frac{-11}{3}\)
C) \(\frac{-11}{6}\)
D) \(\frac{11}{3}\)
Answer:
D) \(\frac{11}{3}\)

Question 110.
The roots of a quadratic equation ax2 + bx + c = 0 is….
TS 10th Class Maths Bits Chapter 5 Quadratic Equations 4
Answer:
\(\frac{-b \pm \sqrt{b^2-4 a c}}{2 a}\)

Question 111.
The nature of the roots of a quadratic equation 4x2 + 5x + 1 = 0 is ……
A) real and distinct
B) real and equal
C) imaginary
D) none
Answer:
A) real and distinct

Question 112.
If the roots of a quadratic equation ax2 + bx + c = 0 are real and equal then b2 = …………….
A) 4ab
B) 4ac
C) \(\frac{\mathrm{ac}}{4}\)
D) a2 c2
Answer:
B) 4ac

TS 10th Class Maths Bits Chapter 5 Quadratic Equations

Question 113.
3x2 + (-kx) + 8 = 0 has real roots of ………..
A) k < 4\(\sqrt{6}\) B) k > 4\(\sqrt{6}\)
C) k = 6
D) k = 0
Answer:
B) k > 4\(\sqrt{6}\)

Question 114.
If k2 – 8k + 16 = 0 has equal roots then ………
A) k = ±\(\sqrt{2}\)
B) k = ±7
C) k = + 1
D) none
Answer:
C) k = + 1

Question 115.
Sum of the roots of -7x + 3x2 – 1 = 0 ………..
A) \(\frac{3}{4}\)
B) \(\frac{1}{7}\)
C) \(\frac{7}{3}\)
D) \(\frac{1}{2}\)
Answer:
C) \(\frac{7}{3}\)

Question 116.
If α and β are the roots of x2 – 2x + 3 = 0 the value of α3 + β3 = …….
A) -10
B) 10
C) 8
D) 12
Answer:
A) -10

Question 117.
In the quadratic equation x2 + x – 2 = 0, a + b + c = …………
A) 7
B) 0
C) 8
D) 1
Answer:
B) 0

Question 118.
The roots of 2x2 – x + \(\frac{1}{8}\) = 0 are……..
A) \(\frac{1}{4}\), \(\frac{1}{2}\)
B) \(\frac{1}{3}\), \(\frac{1}{7}\)
C) \(\frac{1}{2}\), \(\frac{1}{8}\)
D) \(\frac{1}{4}\), \(\frac{1}{4}\)
Answer:
D) \(\frac{1}{4}\), \(\frac{1}{4}\)

Question 119.
Number of distinct line segments that can be formed out of n – points is….
A) \(\frac{\mathrm{n}(\mathrm{n}-1)}{2}\)
B) \(\frac{\mathrm{n}}{2}\)
C) \(\frac{\mathrm{n}+1}{2}\)
D) \(\frac{n^2(n-1)}{2}\)
Answer:
A) \(\frac{\mathrm{n}(\mathrm{n}-1)}{2}\)

Question 120.
From the figure, x = ………
A) 7
B) 3
C) 10
D) none
TS 10th Class Maths Bits Chapter 5 Quadratic Equations 5
Answer:
C) 10

Question 121.
P(x) = x2 + 2x + 1 then P(x2) = …….
A) x4 + 2x2 + 1
B) x4 + 2x + 1
C) x3 + 2x + 1
D) none
Answer:
A) x4 + 2x2 + 1

Question 122.
If α and β are the roots of the quadratic equation x2 – 3x + 1 = 0 then \(\frac{1}{\alpha^2}\) + \(\frac{1}{\beta^2}\) = …………
A) 7
B) 8
C) -3
D) none
Answer:
A) 7

Question 123.
\(\sqrt{x}\) = \(\sqrt{2 x-1}\) then x =
A) 1
B) 4
C) 2
D) none
Answer:
A) 1

TS 10th Class Maths Bits Chapter 5 Quadratic Equations

Question 124.
A pentagon has ……… diagonals.
A) 6
B) 7
C) 9
D) none
Answer:
D) none

Question 125.
Product of the roots of 1 = x2 is ……..
A) -1
B) 7
C) 0
D) 1
Answer:
A) -1

Question 126.
If α and β are the roots of
x2 + x + 1 = 0 then α2 and β2 = ………
A) 8
B) -1
C) 12
D) 0
Answer:
B) -1

Question 127.
\(\frac{x}{a-b}\) = \(\frac{\mathbf{a}}{\mathbf{x}-\mathbf{b}}\) then x = ……….
A) b – a or \(\frac{\mathrm{a}}{2}\)
B) b – a or -a
C) b + a or -a
D) all
Answer:
B) b – a or -a

Question 128.
\(\frac{n(n+1)}{2}\) = 55 then n = ……….
A) 13
B) 16
C) 10
D) 12
Answer:
C) 10

Question 129.
If α and β are the roots of x2 – 2x + 3 = 0 then α2β + β2α = ……..
A) -3
B) 8
C) 6
D) none
Answer:
C) 6

Question 130.
x2 – 7x – 60 = 0 the x = …….. (A.P.Mar. 15)
A) 12, 17
B) 12, -5
C) 8, 11
D) 12, 16
Answer:
B) 12, -5

Question 131.
The general form of a quadratic equation in variable x is ……. (A.P. Mar. 15)
A) ax2 + bx + c = 0 (a ≠ 0)
B) ax + bx2 + c = 0 (b ≠ 0)
C) ax2 + bx = 0 (a ≠ 0)
D) a2x + bx + c = 0 (b ≠ 0)
Answer:
A) ax2 + bx + c = 0 (a ≠ 0)

Question 132.
The possible numbers of roots to a quadratic equation are …….. (A.P. Mar.15)
A) At a maximum of 3
B) At a maximum of 2
C) Infinite
D) At a maximum of 5
Answer:
B) At a maximum of 2

Question 133.
If the roots of a quadratic equation px2 + qx + r = 0 are imaginary then ……… (A.P. June 15)
A) q2 > 4pr
B) q2 < 4pr
C) q2 = 4pr
D) p = q + r
Answer:
B) q2 < 4pr

TS 10th Class Maths Bits Chapter 5 Quadratic Equations

Question 134.
The discriminant of quadratic equation 2x2 + x – 4 = 0 is ………. (A.P.June’15)
A) 35
B) 36
C) 33
D) 38
Answer:
C) 33

Question 135.
The product of roots of quadratic equation ax2 + bx + c = 0 is (A.P. June’15)
A) \(\frac{c}{a}\)
B) \(\frac{-b}{a}\)
C) \(\frac{-c}{a}\)
D) \(\frac{b}{c}\)
Answer:
A) \(\frac{c}{a}\)

Question 136.
For what positive value of x the quadratic equation 4x2 – 9 = 0 (A.P. June’15)
A) \(\frac{2}{3}\)
B) \(\frac{-2}{3}\)
C) \(\frac{-3}{2}\)
D) \(\frac{3}{2}\)
Answer:
D) \(\frac{3}{2}\)

Question 137.
Which of the following quadratic equations the roots are equal? (A.P.Mar.16)
A) x2 – 5 =0
B) x2 – 10x + 25 = 0
C) x2 + 5x + 6 = 0
D) x2 – 1 = 0
Answer:
B) x2 – 10x + 25 = 0

Question 138.
If x2 + ax + b = 0; x2 + bx + a = 0 have a common roots then
A) a + b = 0
B) ab = 1
C) a + b = 1
D) a + b + 1 = 0
Answer:
D) a + b + 1 = 0

Question 139.
A metal cuboid of dimensions 22 cm × 15 cm × 7.5 cm was melted and cast into a cylinder of height 14 cm. Its radius is …………
A) 15 cm
B) 7.5 cm
C) 22.5 cm
D) 7 cm
Answer:
B) 7.5 cm

Question 140.
Solution of x – y = 2; x + y = 0 lies in quadratic. (AP-SA-I:2016)
A) I
B) IV
C) II
D) III
Answer:
B) IV

TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

Telangana SCERT 10th Class Telugu Guide Telangana 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు Textbook Questions and Answers.

TS 10th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

చదువండి – ఆలోచించి చెప్పండి (T.B. P.No. 13)

తెలంగాణ భాషంతా ‘తౌరక్యాంధ్ర’మని ఎవడో అన్నడు. అంత అగ్వకున్నదా తెలంగాణ భాష ? ఇక సహించవద్దు. అందుకనే నేను గిట్లనే మాట్లాడ, గిట్లనే రాస్త అని జిద్దుకు రాయాలె. జిద్దేంది అసలు మన యాసల్నే మన బతుకున్నది. నీ భాషల్నే నీ బతుకున్నది. నీ యాసల్నే నీ సంస్కృతున్నది. ఆ యాసలున్న పలుకుబళ్ళల్లనే తెలంగాణ జీవితం ఉన్నది. కమస్కం నీ భాషల్నన్న నువ్వు రాసే ధైర్నం జేయి.

మనం పోగొట్టుకుంటున్న మన బతుకును బతికించుకోవాలె, దానికి, బాస చాన ముఖ్య మయింది. ఎవని యాసల, ఎవని భాషల వాడు రాయాలె. తెలుస్తదా అన్నది లేనే లేదు. మన కవులను రచయితలను మనం గుర్తించి గౌరవించు కోవాలె. ఇట్లరాస్తే అవతలోనికి తెలుస్తదా అని ముందర్నే మనమనుకునుడు, మనను మనం తక్కువ చేసుకున్నట్లె. ఈ బానిస భావన పోవాలె. నేనెన్నో సార్లు చెప్పిన. భాష రెండు తీర్లు – ఒకటి బడిపలుకుల భాష రెండోది పలుకుబడుల భాష పలుకుబడుల భాషగావాలె.
– కాళోజి నారాయణరావు

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
పై పేరాలోని మాటలు ఎవరన్నారు?
జవాబు:
కాళోజి నారాయణరావు గారు అన్నారు.

TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ప్రశ్న 2.
ఇట్లా ఎందుకు అని ఉంటాడు ?
జవాబు:
తెలంగాణ భాషను ఎవరో ‘తౌరక్యాంధ్ర’మని అన్నారు. దానితో కాళోజీగారికి చాలా కోపం వచ్చింది. ఎవరైనా తమ భాషను, యాసను, పలుకుబడిని చాలా ఇష్టపడతారు. తాము ఉగ్గుపాలతో నేర్చిన భాషను ఎవరైనా హేళన చేసినా, కించపరిచినా, విమర్శించినా సహించలేరు. అందునా కవులకు, రచయితలకు భాషాభిమానం, ఆత్మాభిమానం చాలా ఎక్కువ. అందుకే కాళోజీగారు అలా అని ఉంటారు.

ప్రశ్న 3.
ఎవరి భాషలో వాళ్ళు మాట్లాడడం, రాయడం అంటే ఏమిటి ?
జవాబు:
ఎవరి భాషలో వాళ్లు మాట్లాడడం, రాయడం అంటే తమ మాతృభాషలో వ్యవహరించడం. తల్లి నుండి ఉగ్గుపాలతో నేర్చుకొన్న భాషను మాతృభాష అంటారు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, పరిసరాల వారూ, స్నేహితులు మొదలైన వారు ఉపయోగించే భాష, యాస, పదజాలం, మాండలి కాలు మొదలైనవి ఎవరికైనా ఇష్టంగా ఉంటాయి. అంటే అది వారి వ్యవహారభాష. ఎవరి వ్యవహార భాషలో వారు మాట్లాడడం, రాయడం చేస్తే ఆనందంగా ఉంటుంది. ఉత్సాహంగా ఉంటుంది.

ప్రశ్న 4.
ఎవరి భాష వాళ్ళకు ఎట్లా అనిపిస్తుంది ?
జవాబు:
ఎవరి భాష వాళ్లకు చాలా మధురంగా ఉంటుంది. హాయిగా ఉంటుంది. తియ్యగా ఉంటుంది. పద ప్రయోగంలో సౌఖ్యంగా ఉంటుంది. ఎవరి భాష వాళ్లకు తల్లిలా అనిపిస్తుంది. తమ మాండలిక పదజాలానికి తాము గర్వంగా అనుభూతి చెందుతారు.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 17)

“తాతా ! ఇగపటు నీ పాను, జర్దా డబ్బీ” అని ……… ఉద్యోగ విరమణ చేసినారు.

ప్రశ్న 1.
“ఏ ప్రాంతపు వాళ్ల తెలుగు ఆ ప్రాంతపు వాళ్లకు ఇంకా మంచిగా ఉంటుంది” సమర్థించండి.
జవాబు:
ఎవరి ప్రాంతంలో వారు అయినా, ఆయా ప్రాంతాలలో ఉపయోగించే పదాలు, జాతీయాలు, నుడికారాలు, పలుకుబడులు తాము ఉపయోగించే భాషలో ప్రయోగిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలలోనూ తెలుగు భాషనే మాట్లాడతారు. కాని, రెండు రాష్ట్రాలలోని ప్రతి జిల్లాకు ‘యాస’ మారి పోతుంది. ఉపయోగించే మాండలికాలు మారి పోతాయి. ఇతర ప్రాంతాల మాండలికాలు, కొన్ని పదాలు అర్థం కావు.

అందుచేత అవి కొత్తగా ఉంటాయి. తమ ప్రాంతపు మాండలికాలపైనా, భాషపైనా, యాసపైనా పట్టు ఉంటుంది. అందుచేత ఏ ప్రాంతపు వాళ్ళ తెలుగు ఆ ప్రాంతపు వాళ్ళకు ఇంకా మంచిగా ఉంటుంది.

ప్రశ్న 2.
రచయిత కొందరు పండితులను గురు స్థానీయులని చెప్పాడు. గురువులనగానే వాళ్ళలో ఏయే ప్రత్యేకత లుండాలని మీరు ఆశిస్తున్నారో తెలుపండి.
జవాబు:
‘మాతృదేవోభవ – పితృదేవోభవ – ఆచార్యదేవోభవ’ అని గురువుకు తల్లిదండ్రులతో సమాన స్థానం ఇచ్చారు. గురువును దైవంగా భావించే సంప్రదాయం మనది.

అటువంటి గురువు ఆదర్శవంతంగా ఉండాలి. సమయానికి పాఠశాలకు రావాలి. విద్యార్థులకు అర్థం అయ్యేలా ప్రతి పాఠం చెప్పాలి. అబద్ధం ఆడకూడదు. కోప్పడకూడదు. మంచి మంచి కథలు చెప్పాలి. మా గురువుగారిలా ఉండాలి.

TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ప్రశ్న 3.
‘పసందైన ప్రాంతీయ భాష’ – దీనిని ఎట్లా అర్థం చేసుకున్నారో వివరించండి.
జవాబు:
కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారు సంస్కృతాంధ్ర భాషల్లో మహాపండితులు. వారు కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితులు. అటువంటి శాస్త్రిగారు, తిరుమల రామచంద్రగార్కి తిరుపతి లడ్డు ఇస్తూ, “వారీ రామచంద్రా” అని సంబోధించి ‘ఇగపటు’ అనటం వింతగా అనిపిస్తుంది. అయితే ‘ఇగపటు’ అనగా ‘ఇదిగో తీసుకో” అని అనడం, వారీ రామచంద్రా అని పిలవడం, లక్ష్మణశాస్త్రిగార్కి పసందైన వారి ప్రాంతీయ భాషపై, వారికి గల అభిమానాన్ని తెలియపరుస్తాయి.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 17)

మహబూబ్ నగర్ వాళ్ళ భాష తెలుగుతనం ……….. ప్రభుత్వం జప్తు చేస్తుంది.

ప్రశ్న 1.
“వారి రాతలోను, మాటలోను ప్రాంతీయత కనిపించేది” దీని గురించి చర్చించండి.
జవాబు:
మహబూబ్ నగర్ వాళ్ళ భాష తెలుగుతనం కల్గి ఉంటుంది. సురవరం ప్రతాపరెడ్డిగారిది కూడా మహబూబ్నగర్ జిల్లానే. వారి రాతలోనూ, మాటలోనూ మహబూబ్నగర్ జిల్లా ప్రాంతీయత కన్పించేది. వారి స్వగ్రామం నీళ్ళులేని ఇటిక్యాలపాడు.

ప్రశ్న 2.
‘ఏకలవ్య శిష్యుడ’నే పదంలోని అంతరార్థాన్ని వివరించండి.
జవాబు:
కౌరవ పాండవులకు ద్రోణాచార్యుడు విలువిద్యలు నేర్పాడు. కాని, ఆయనకు పాండవులంటే ఇష్టం. అందులోను తను చెప్పినది చెప్పినట్లు చేర్చుకొనే అర్జునుడు అంటే చాలా ఇష్టం. అర్జునుడిని మహావీరుడిగా తయారుచేయాలని విలువిద్యలు నేర్పుతున్నాడు.

ఇంతలో ‘ఏకలవ్యుడు’ అనే గిరిజన బాలుడు తనకూ విలువిద్యలు నేర్పమన్నాడు. కాని, ద్రోణుడు నేర్పను అన్నాడు. అయినా ఏకలవ్యుడు తన పంతం విడిచి పెట్టలేదు. ద్రోణుని బొమ్మను తయారు చేసుకొన్నాడు. దానిని గురువుగా చేసుకొని విలువిద్యలు తనకు తానే సొంతంగా నేర్చుకొన్నాడు. అర్జునునితో సమానమైన వీరుడయ్యాడు. అందుచేత గురువు దగ్గర ప్రత్యక్షంగా నేర్చుకోకపోయినా, ఆయనపై గురుత్వ భావన ఉంచి నేర్చుకొనే వారిని ఏకలవ్య శిష్యులు అంటారు.

ప్రశ్న 3.
“పలుకుబడి, నుడికారం, జాతీయాలు ఒక భాషకు అలంకారాలవంటివి “ఈ అభిప్రాయాన్ని సమర్థిస్తూ మాట్లాడండి.
జవాబు:
పలుకుబడి : పలుకుబడి అంటే ‘నుడి’, అంటే మాట్లాడబడేది. మాట్లాడబడేది భాష, భాషకు ‘యాస’ ప్రధానం. మాండలికాలు, ఆయా ప్రాంతాలలో ఉపయోగించే స్థానిక పదజాలం పలుకుబడి అనవచ్చు. ఈ పలుకుబడి వలన భాషకు చాలా అందం వస్తుంది. వినసొంపుగా ఉంటుంది. ఇది వినగానే ఆనందం కలుగుతుంది.

నుడికారం : చమత్కారాన్ని నుడికారం అంటారు. ఎవరి భాషలోని చమత్కారాలు వారికే బాగా తెలుస్తాయి. చమత్కారం వలన కూడా భాషకు చాలా అందం వస్తుంది. చమత్కారంగా మాట్లాడే వారంటే ఎవరికైనా ఇష్టమే కదా ! ఇది కొద్దిగా ఆలోచిస్తేనే ఆనందం కలుగుతుంది.

జాతీయం : ఒక భాషను ఉపయోగించే వారందరికీ ఆనందాన్ని కలిగించేవి జాతీయాలు. వాటి పూర్వకథలు తెలియకపోతే ఆనందం కలగదు. అంటే బాగా పరిజ్ఞానం ఉంటేనే ఆనందం కలుగుతుంది. ఉదాహరణకు భగీరథ ప్రయత్నం, శ్రీరామరక్ష . మొదలైనవి.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 18)

ఆడవాళ్ళ నోట అసలైన భాష
మా ఊరిలో పూజలు చేయించే మరాఠీ ……… విశేషమే కదా !

ప్రశ్న 1.
“మొదలు మీకళ్లకు నీళ్లు పెట్టుకోండి” అని మరాఠీ పురోహితుడు అన్నాడు గదా! మీ నిత్యజీవితంలోని ఇట్లాంటి సంఘటనలను వివరించండి.
జవాబు:
భాష చాలా విలువైనది. పద ప్రయోగాలు చాలా జాగ్రత్తగా చెయ్యాలి. నేను అందర్ని ఒక సభలో రండి, రండి అని పిలుస్తున్నాను. (అనగా రమ్మని అర్థం) అది రండలాగా ఒక ముస్లింకు వినబడింది. అతను వెంటనే కోపంతో ఎగిరాడు. “రండ” అంటే ఉర్దూలో తప్పు అర్థం అని తెల్సింది. అతను నా స్నేహితుడే అవ్వటం వల్ల సమస్య సమసిపోయింది.

ప్రశ్న 2.
“ఏ ప్రాంతంలోనైనా అసలైన భాష ఆడవాళ్ళ నోటనే వినగలం” దీన్ని సమర్థిస్తూ చర్చించండి.
జవాబు:
సాధారణంగా పిల్లలంతా ‘అమ్మ’ నుండే మాట్లాడడం నేర్చుకొంటారు. స్త్రీలు ఇంటి వద్ద ఉండి ఎక్కువ మందితో మాట్లాడతారు. మగవారి కంటే స్త్రీలు నుడికారాలు, పలుకుబళ్ళు ఎక్కువ ఉపయోగిస్తారు. ప్రాంతీయమైన మాండలికాలు ఎక్కువ ఉపయోగిస్తారు. అందుకే అసలైన భాషను ఆడవాళ్ళ నోటనే వినగలం.

TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ప్రశ్న 3.
కవిసమ్మేళనం అంటే మీకు తెలుసా ? ఎపుడైనా కవి సమ్మేళన సభలో పాల్గొన్నారా ? మీ అనుభవాన్ని తెలుపండి.
జవాబు:
కవులయొక్క కూడిక, తమ అభిప్రాయాలను, తమ రచనలను చర్చించే వేదిక “కవి సమ్మేళనం”. నాకు తెలుసు. నేను “రవీంద్ర భారతి”లో చూశాను. స్నేహితులందరం కలిసి కవి సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాం. మా తెలుగు పంతులుగారి ఆధ్వర్యంలో దానిని నిర్వహించాము. చాలా బాగుంది.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 20)

“ఇంతకాలం తెలంగాణా సీమోల్లంఘనం చేసి ……… సామాన్య ప్రజలతోనే” అని.

ప్రశ్న 1.
“నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసందు చేస్తున్నారు. కాని నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే” అని రచయిత అనడంలో ఆంతర్య మేమిటి?
జవాబు:
ఒక షేర్లో “ఖాస్ – ఆమ్ అనే రెండు మాటలున్నాయి. ఖాస్ అంటే ప్రత్యేకమయినది. దాని బహువచనం ఖవాస్. అంటే విద్వత్తులోనో, సంపద లోనో, హోదా లోనో ప్రత్యేకమైనవాళ్లు. ఆమ్ అంటే సామాన్యం. ఆవామ్ అంటే బహువచనంలో సామాన్య ప్రజలు. కవి ఏమంటున్నాడంటే “నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసంద్ చేస్తున్నారు -కాని నేను మాట్లాడు తున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే” అని దీని అర్థం.

ప్రశ్న 2.
“పిల్లలు ఇంట్లో మాట్లాడే భాషవేరు. బళ్లో చదివే భాషవేరు.” అనడం నిజమా ? కాదా ? కారణాలు చర్చించండి.
(లేదా)
తెలుగు “పిల్లలు ఇంట్లో మాట్లాడే భాషవేరు. బళ్లో చదివే భాషవేరు.” అనే వాక్యాలు మీరు సమర్థిస్తారా ? ఎందుకు ? (June 2017)
జవాబు:
వ్యావహారిక భాష వ్యాప్తిలోకి వచ్చిన తర్వాతనే ఈ ప్రాంతీయ భాషలు, మాండలిక భాషలు వచ్చాయి. గ్రాంథిక భాష రాసేకాలంలోనూ పిల్లలకు తెలుగు చెప్పే పంతులు కాబట్టి వ్యావహారికం గూర్చి మాట్లాడేవారు. ఉర్దూ, మరాఠీ పిల్లలు తమ ఇంట్లో మాట్లాడే భాషనే బళ్ళో చదువుతుంటే, తెలుగు పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు, బళ్ళో చదివే భాషవేరు. ఇది చాలా ఘోరం. వ్యావహారిక భాషావాదం వచ్చాక ఇది సమసిపోయింది. ఇది వాస్తవం.

ప్రశ్న 3.
ప్రాంతీయ భాషా భేదాలను ఎట్లా సరిచేసుకోవాలి ? మాట్లాడండి.
జవాబు:
మాండలిక భేదాలటుంచి, ప్రాంతీయ భేదాలను సరిచేసుకోలేకపోతున్నాం. సరిచేసుకోవాలంటే తొలగించటమూ కాదు. దిద్దుకోవటం కాదు. అన్ని ప్రాంతాల పలుకుబళ్లను ఇప్పుడు తెలుగనుకుంటున్న భాషలో కలుపుకోవటం. ప్రాంతీయ భాష ప్రజల వ్యవహారంలో ఉన్నది. ఉంటుంది.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
కింది అంశాలను గూర్చి చర్చించండి.

అ) మన తెలుగు భాష గొప్పతనం గురించి మాట్లాడండి. ఐతే ఒక్క ఆంగ్లపదం కానీ, హిందీ, ఉర్దూ ….. ఇలా ఇతర భాషాపదాలు వాడకుండా మాట్లాడాలి. ప్రయత్నం చేయండి. ఎవరు బాగా మాట్లాడుతారో చూద్దాం.
జవాబు:
నేను లంగర్ హౌజ్ పాఠశాలలో చదువుచున్నాను. ఒకసారి మా పాఠశాలలో “ఒక నిమిషం” అనే కార్యక్రమం నిర్వహించారు. మా తరగతిలో అందరూ మాట్లాడటానికి ప్రయత్నించారు. నేను బాగా మాట్లాడానని నాకు బహుమతి ఇచ్చారు. ఆ కార్యక్రమానికి పోలీస్ కమీషనర్గారు వచ్చారు. ఒక్క ఆంగ్ల, ఉర్దూ, హిందీ పదం రాకుండా అచ్చ తెలుగులో మాట్లాడాను. మీరూ
ప్రయత్నించండి.

ప్రశ్న 2.
క్రింది గద్యాన్ని చదువండి. ప్రశ్నలకు సరైన జవాబును గుర్తించండి.

గో మెరే షేర్ హైఁ ఖవాస్ పసంద్
పర్ మెరీ గుప్తగూ అవామ్ సేహై
“ఖాస్ – ఆమ్ అనే రెండు మాటలున్నాయి. ఖాన్ అంటే ప్రత్యేకమైనది. (స్పెషల్) దాని బహువచనం ఖవాస్. అంటే విద్వత్తులోనో, సంపదలోనో, హోదాలోనో ప్రత్యేకమైనవాళ్లు. ఆమ్ అంటే సామాన్యం. ఆవామ్ అంటే బహువచనంలో సామాన్య ప్రజలు (కామన్ పీపుల్), కవి ఏమంటున్నాడంటే, “నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసంద్ చేస్తున్నారు కాని నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే” అని.

ప్రశ్నలు

అ) ‘ఖాస్ అనే ఉర్దూ పదానికి అర్థం
ఎ) కవిత
బి) ప్రత్యేకమైన
సి) సాధారణమైన
డి) సామాన్యం
జవాబు:
బి) ప్రత్యేకమైన

ఆ) సామాన్య ప్రజలను ఉర్దూలో ఏమంటారు ?
ఎ) అవామ్
బి) ఆమ్
సి) ఖాస్
డి) ఖవాస్
జవాబు:
బి) ఆమ్

ఇ) నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసంద్ జేస్తున్నారు. క్రింద గీత గీసిన పదానికి సమానార్థక ఉర్దూపదం.
ఎ) సంబంద్
బి) అవామ్
సి) ఖవాస్
డి) పసంద్
జవాబు:
సి) ఖవాస్

ఈ) పై కవితలో కవి ఎవరి భాషను ఉపయోగించాడు ?
ఎ) గ్రాంథికభాష
బి) ఉర్దూభాష
సి) ప్రజలభాష
డి) ఏవీకాదు
జవాబు:
సి) ప్రజలభాష

TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ప్రశ్న 3.
క్రింది గద్యాన్ని చదవండి. ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
ఉర్దూ మన దేశీయుల ఉమ్మడి భాష. కాని ఏదో ఒక కులానికో, మతానికో చెందిన భాష కాదన్నారు ప్రొఫెసర్ రఫియా సుల్తానా. ఆ తరం వాళ్లందరూ అట్లాగే అనుకున్నారు. ఇప్పటికీ ఉన్న ఆ తరం వాళ్లు అట్లాగే అనుకుంటున్నారు. అందుకే నా ముచ్చట్లలో ఉర్దూతో మాకు గల సంబంధాన్ని యాది చేసుకుంటున్నాను.

మా చదువు ఉర్దూ మీడియంలో జరిగింది. హెడ్మాస్టర్ అన్వరుద్దీన్ సాహెబు. ఉర్దూ చెప్పే మౌల్వీ సాహెబులు ఇద్దరో, ముగ్గురో ఉండేవాళ్లు. అయితే, పై తరగతిలో చదివే మాకు రామనాథరావుసార్ ఉర్దూ చెప్పేవారు. వారు మంథెన బ్రాహ్మణులు. ఎఫ్.ఎ. (ఇంటర్మీడియట్) చదివిన ఆ సారుకు తెలుగు, సంస్కృతం, మరాఠీ, ఇంగ్లీషు భాషల్లో మంచి పాండిత్యం వుండేదనేవాళ్లు.

ఉర్దూలో ఏదో పెద్ద పరీక్ష పాసయినారు. వారు పెద్ద తరగతికి ఉర్దూ చెప్తుంటే ఉర్దూ డిగ్రీలు గల మౌల్వీ – సాహెబులెవరూ అభ్యంతరం లేవదీయలేదు. పైగా తమకు సరిగా అర్ధం కుదరని ఉర్దూ పేర్ల తాత్పర్యం మా ముందరే రామనాథరావుసార్తో చెప్పించుకునేవాళ్లు.

ప్రశ్నలు

అ) రఫియా సుల్తానా తరంవాళ్ళు ఏమని అను కున్నారు ?
జవాబు:
ఉర్దూ మన దేశీయుల ఉమ్మడి భాషని, ఏదో ఒక కులానికో, మతానికో చెందిన భాష కాదన్నారు.

ఆ) రచయిత తన ముచ్చట్లలో ఏ భాషా సంబంధాన్ని యాది చేసుకున్నాడు ?
జవాబు:
ఉర్దూతో గల సంబంధాన్ని యాది చేసు కున్నాడు.

ఇ) రామనాథరావుసార్ ఎక్కడివారు ? ఏ విషయాన్ని బోధించేవారు ?
జవాబు:
రామనాథరావు సార్ మంథెన బ్రాహ్మణులు. ఉర్దూ బోధించేవారు.

ఈ) ఉర్దూ డిగ్రీలున్న మౌల్వీలు రామనాథరావు సార్న ఏ విషయమై సంప్రదించేవాళ్లు ?
జవాబు:
అర్థం కుదరని ఉర్దూ పేర్ల తాత్పర్యంపై సంప్రదించేవాళ్లు.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) మనుమరాలి మాటలు విని తాతయ్య ఎందుకు అబ్బురపడ్డాడు ?
(లేదా)
మనుమరాలి మాటలు తాతయ్యకు ఎందుకు ఆశ్చర్యం కలిగించాయి ?
జవాబు:
మనుమరాలు లావణ్య 4 సంవత్సరాల అమ్మాయి. ఇంకొక మనుమరాలు కావ్య. సెలవుల్లో అమ్మమ్మ గారింటికి వచ్చారు. వాళ్ళు హిందీ మాట్లాడుతారు. తెలుగురాదు. హిందీలోంచి అనువదించుకొని మాట్లాడుతారు. కాని తెలుగు పలుకుబడి, నుడి కారము వాళ్ళకు తెలియదు. 4 సంవత్సరాల లావణ్య “తాతా ఇగపటు నీ పాను, జర్దా డబ్బీ” అని తాత చేతికిచ్చింది. లావణ్య ఇగపటు అనగానే ఆమెకు ఈ ప్రాంతపు తీయని తెలుగు పట్టుపడ్డందుకు తాత అబ్బురపడ్డాడు.

TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ఆ) కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారిని రచయిత గురుస్థానీయులుగ ఎందుకు భావించారో వివరిం
జవాబు:
సంస్కృతాంధ్ర భాషల్లో, కావ్యవ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండపండితులు, సంస్కృతంలో బిల్హణ మహాకవి రాసిన విక్రమాంకదేవ చరిత్ర అనే ప్రౌఢకావ్యాన్ని తెలుగులో ఇంకా ప్రౌఢంగా అనువదించిన గొప్పకవి శ్రీ కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారు. ఆయన రాసిన అనేక కావ్యాలకు మహాపండితుల ప్రశంసా పూర్వకాలయిన అభిప్రాయాలు డా॥ సామల సదాశివగారు చదివారు. వారిదగ్గర (లక్ష్మణశాస్త్రి) శిష్యరికం చేయకపోయినా, ఆయన సన్నిధానంలో కూర్చొని తరుచుగా జాబులు రాసేవారు. అప్పుడు అనేక సాహిత్య విషయాలు తెలుసుకున్నారు. కాబట్టి శాస్త్రిగారిని సదాశివగారు గురుస్థానీయులుగా భావించారు.

ఇ) “అందరు యూనివర్సిటీ ఆచార్యులుండగా ఒక రిటైర్డ్ రెవిన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించడమేమిటి ?” అని రచయిత అనుకోవడంలో ఉద్దేశమేమై ఉంటుంది ?
జవాబు:
వరంగల్లు తెలుగు గురించి చెప్పిన విషయం ఇది. పెద్ద కాళోజీ వర్ధంతి సభ జరుగుతోంది. రచయిత కాళోజీ ఇంట జరిగే వర్ధంతి, జయంతి సభల్లో పాల్గొనేవారు. ఆ సభల్లో చిన్నపాటి కవిసమ్మేళనం, చిన్నపాటి ముషాయిరా ఉండేవి. కొన్ని ప్రసంగాలు జరిగేవి. షాద్ గజల్లు వినిపించేవారు. పెద్ద కాళోజీ ఉర్దూకవి. కలం పేరు ఫాద్. రచయిత వెళ్ళేటప్పటికి సాహితీ మిత్రమండలి కవులు, కవితలు వినిపిస్తున్నారు.

ఆ సాహిత్యసభకు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ అధ్యక్షులై ఉన్నారు. వారు రచయితకు తెలియదు. అక్కడ అందరూ తెలుగు విద్వాంసులుండగా అందరు యూనివర్సిటీ ఆచార్యులుండగా ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించటమేమిటీ అని రచయిత అనుకున్నారు. కాళోజీకి ఆప్తుడనుకున్నారు రచయిత. రెవెన్యూవాళ్ళకు తెలుగుసాహిత్య సభల్లో అధ్యక్షత వహించే అర్హత లేదనుకునేవారు కాని అలా ఉత్తమ కవితలూ, కథలు రాసిన రెవెన్యూ, పోలీస్ శాఖల ఆఫీసర్లను ఈ యాది శీర్షిక కిందే ప్రస్తావించారు.

ఈ) రచయిత రచనా శైలిని ప్రశంసిస్తూ వ్రాయండి.
జవాబు:
రచయిత డా॥సామల సదాశివగారు సంస్కృతం, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, ఫార్సీ, మరాఠీ భాషల్లో పండితులు. అనేక భాషలు రచయితల, కవుల సాహిత్యాన్ని తెలుగులోకి అనువాదం చేశారు.

TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ఉర్దూ సాహిత్య చరిత్ర, అన్జద్ రుబాయీలు, మలయమారుతాలు, యాది, సంగీత శిఖరాలు మొదలైనవి వీరి ఇతర రచనలు. అన్జద్ రుబాయీలు అనువాదానికి ‘ఉత్తమ అనువాద రచనా పురస్కారం, “స్వరలయల” గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు లభించింది. కాకతీయ, తెలుగు విశ్వ విద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి. సదాశివను హిందుస్థానీ – కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా విద్వాంసులు గుర్తించారు. సహృదయ విమర్శకుడైన ఇతని రచనల్లో భాష సహజ సుందరంగా, సరళంగా, ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకుపోయేటట్లు ఉంటుంది.

ప్రశ్న 2.
క్రింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) ఈ పాఠం ద్వారా సామల సదాశివ గురించి మీకేమర్థమయిందో రాయండి.
(లేదా)
ఎవరి భాష వాళ్ళకు వినసొంపు పాఠ్యభాగం ద్వారా కవి ఏమి చెప్పదలచుకున్నారు ?
జవాబు:
ఈ పాఠం ద్వారా సామల సదాశివగారి వ్యక్తిత్వం, పాండిత్యం, వినయం మొదలైన ఎన్నో విషయాలు తెలిశాయి.

1. వ్యక్తిత్వం : సామల సదాశివగారు అల్పసంతోషి, ప్రాంతీయ భాషాభిమానం ఎక్కువ కలవారు. అందుకే తమ మనుమరాలు ‘ఇగపటు’ అనగానే చాలా ఆనందించారు. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని యాది చేసుకొన్నారు. ఎంత గొప్ప పండితుడైనా తమ ప్రాంతీయతను, ప్రాంతీయ భాషను విడిచిపెట్ట కూడదని సామల సదాశివగారి అభిప్రాయంగా తెలిసింది.

2. పాండిత్యం : మరాఠీ పురోహితుని గురించి చెప్పిన సందర్భంలో ‘మాకూ మరాఠీ వచ్చు కదా” అనే రచయిత మాటలను బట్టి, ఆయన మరాఠీలో మంచి పండితుడని తెలిసింది.
“పెద్ద కాళోజీ వర్ధంతి సభలో ఊర్దూలో ప్రసంగించాన”న్నాడు. అందుచేత ఉర్దూలో కూడా గొప్ప పండితుడని తెలిసింది.

“నేనూ ఒకప్పుడు పుస్తకాలూ, వ్యాసాలూ గ్రాంథిక భాషలో రాసినవాడినే” అని రచయిత అన్నాడు. దీనిని బట్టి సదాశివగారు ప్రాచీన తెలుగు సాహిత్యంలో మంచి పండితులని తెలిసింది.

3. వినయం : తను బహు భాషాపండితుడైనా గర్వం లేనివాడు. కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారి వద్ద తను ఎన్నో సాహిత్య విషయాలు తెలుసుకొన్నానని వినయంగా చెప్పారు. లక్ష్మణశాస్త్రిగారికి తను ఏకలవ్య శిష్యుడినని వినయంగా ప్రకటించు కొన్నారు. పండితుల గురించి చెప్పవలసి వచ్చినపుడు గొప్ప గొప్ప మాటలలో చెప్పారు. వీటన్నిటినీ బట్టి సదాశివగారి దగ్గర పాండిత్యంతో బాటు వినయం కూడా ఎక్కువ ఉందని చెప్పవచ్చు. “తెలుగులోను, ఉర్దూలోనూ,ఎందరెందరి దగ్గర ఏమేమి నేర్చుకొన్నానో అదంతా రాయాలంటే ఒక పుస్తకమవుతుంది” అనడంలో ఆయన వినయం తెలిసింది.

ప్రశ్న 3.
క్రింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

అ) మీ ప్రాథమిక విద్యాభ్యాస జీవితంలో మీరు మరిచి పోలేని జ్ఞాపకాలను ఒక వ్యాసంగా వ్రాయండి.
జవాబు:
నా ప్రాథమిక విద్యాభ్యాసం నల్గొండ జిల్లాలోని మునగాల మండలం ఆకుపాముల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. మాకు తెలుగుకు వేమూరి విజయశ్రీగారు వచ్చేవారు. ఆమె చక్కటి వేషధారణ, భాషపై పట్టుకల వ్యక్తి. వారు తెలుగు పద్యాలను ధారాళంగా చెప్పేవారు.

ఒకసారి వేమన సుమతీ శతక పద్యాలకు కంఠస్థ పోటీ నిర్వహించారు. దానిలో నేను ప్రథమ బహుమతిని పొందాను. మునగాల మండల విద్యాశాఖాధిగారు, నల్గొండ జిల్లా కలెక్టర్ గారు ఆ సభలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. బహుమతి పొందిన ప్రథమ ద్వితీయ, తృతీయ పోటీదారులను సత్కరించారు. నాకు తెలుగు నిఘంటువు ఇచ్చారు. ఇది నా ప్రాథమిక విద్యాభ్యాస జీవితంలో మరచిపోలేని సంఘటన.

(లేదా)

ఆ) మీ పరిసరాల్లో జరిగిన ఏదైనా సంఘటనను వాడుక భాషలో సంభాషణగా వ్రాయండి.
జవాబు:
(మేము ఖమ్మం జిల్లా మధిరలో ఉండేవారము. మా ఇంటి ప్రక్కనవారు, మేము బాగా కలిసి ఉండేవారం. భార్యాభర్తలు చిన్న చిన్న పనులు చేసుకొని జీవించేవారు. వాళ్ళకు ముగ్గురు ఆడపిల్లలు. మా నాన్నగారు, అమ్మగారు టీచర్లుగా పనిచేసేవారు. వారు ఎంతో నచ్చచెప్పిన వినకుండా ముగ్గురు పిల్లల్ని కన్నారు.

కిరణ్కు తాగుడు అలవాటు అయింది. ఆసుపత్రిలో చేర్చారు. మా నాన్నగారు రక్తదానం చేసారు. అయినా కిరణ్ గారు బతుకలేదు. వాళ్ళ పిల్లలు అనాథలు అయ్యారు. తాగుడుకు బానిసై ఆ కుటుంబం ఇంటి యజమానిని కోల్పోయింది. ఈ సంఘటన నాకు ఎంతో బాధ కల్గించింది.) (ఇది సంభాషణగా రాస్తాను.)

శ్రావ్య : అన్నయ్య ప్రక్క ఇంటిలో ఏదో జనం గోలగా ఉన్నారు ? ఏమయింది ?
రవి : అవును శ్రావ్య ! చూసివస్తాను ఉండు – (చూసి వస్తాడు).
శ్రావ్య : ఏం జరిగిందన్నయ్యా ?
రవి : : ప్రక్క ఇంటిలో కిరణ్ గారు పడిపోయారు. అందరూ గుమిగూడారు. నేను ఆసుపత్రికి వెళ్ళి వస్తాను ………? సరేనా …….. ?
శ్రావ్య : సరే ! నేను వస్తాను పద ! (ఇద్దరు) కలిసి ఆసుపత్రికి వెళతారు.) (డాక్టర్గారు పరీక్షించి రక్తం అవసరం అన్నారు.)
డాక్టర్ : రవి, శ్రావ్య మీరు వెళ్ళి “రక్తదానం” చేసేవారిని తీసుకురండి. (రవి, శ్రావ్య వెళతారు) (రవి వాళ్ళ నాన్నగారితో చెపుతాడు).
రవి : నాన్న ! కిరణ్ గారికి రక్తం ఎక్కించా లని అన్నారు. నీవు ఇస్తావా నాన్నా!
రాజు : ఓ! అలాగే ! నేను ఇస్తాను. ఇప్పుడే వెళ్ళి రక్తదానం చేసి వస్తాను. (ఆసుపత్రికి వెళతాడు)
డాక్టర్ : పేషెంట్కి రక్తదానం చేయటానికి ఎవరు వచ్చారు ?
రాజు : నేను సార్ ! నేను స్కూల్ మాష్టార్ని. ఇంతకు పూర్వం చాలాసార్లు ఇచ్చాను.
డాక్టర్ : సరే పదండి (రాజు రక్తం ఇస్తాడు).
రాజు : డాక్టర్గారు ఇక నేను వెళ్ళవచ్చా!
డాక్టర్ : ఓ వెళ్ళవచ్చు.
రాజు : పేషెంటు పరిస్థితి (కిరణ్కి) ఎలా ఉంది ?
డాక్టర్ : చాలా దారుణంగా ఉంది. కొద్ది సేపటిలో అతను చనిపోవచ్చు.
రాజు : అయ్యో ! పోవచ్చా ! (అంటూ బాధ పడుతూ ఇంటికి వెళతాడు)
శ్రావ్య, రవి : నాన్నా ! రక్తం ఇచ్చావా ?
రాజు : ఇచ్చానమ్మా ! కానీ కిరణ్ పరిస్థితి బాగోలేదని చెప్పారు ?
(కిరణ్ చనిపోయాడని ఇంటికి తీసుకు వస్తారు. అందరూ ప్రక్క ఇంటికి వెళతారు.
శ్రావ్య : నాన్నగారు ! కిరణ్ ఎందుకు చనిపోయారు ?
రవి : త్రాగుడుకు బానిసలైతే జీవితం ఇలా అవుతుందా ?
రాజు : తాగుడు వల్ల చనిపోయాడు.
రాజు : అవును రవి ! ఫలితం ఇలా దారుణంగా ఉంటుంది. మీ స్నేహితులకు చెప్పండి. “మద్య పానం మనిషికి శత్రువు” అని.
శ్రావ్య, రవి : సరే నాన్నగారు! మా స్నేహితులకు చెబుతాం (ముగింపు).

III. భాషాంశాలు

పదజాలం

ప్రశ్న 1.
క్రింది పదాలను సొంతవాక్యాలలో ప్రయోగించండి.
ఉదా : యాదిచేసుకొను = గుర్తు చేసుకొను

నేను, నా స్నేహితుడు చిన్నప్పటి సంగతులు యాది చేసుకొని బాగా నవ్వుకున్నాం.

అ) పసందు = ఇష్టం
జవాబు:
పసందైన మామిడి పండ్లను మేము ఇష్టపడతాం.

ఆ) రమ్యం = అందమైన
జవాబు:
రమ్యమైన ప్రకృతి, సుందర జలపాతాలకు కేరళ రాష్ట్రం ప్రసిద్ది చెందినది.

ఇ) క్షేత్రం = చోట
జవాబు:
నా తెలంగాణ క్షేత్రం ఉద్యమాలకు ఆలవాలమైంది.

TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ప్రశ్న 2.
నిఘంటువు సాయంతో క్రింది పదాలకు నానార్థాలు వ్రాయండి.

అ) కవి = కవిత్వం చెప్పేవాడు, పండితుడు, శుక్రుడు, జలపక్షి, ఋషి, నీటికాకి
ఆ) క్షేత్రం = చోటు, పుణ్యస్థానం, భూమి, శరీరం

ప్రశ్న 3.
క్రింది పర్యాయపదాలకు పాఠం ఆధారంగా సరియైన పదాన్ని వ్రాయండి.

అ) ఇల్లు, గృహం = ఆలయం
ఆ) పొగడ్త, స్తోత్రం = ప్రశంస

ప్రశ్న 4.
క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు ప్రకృతి – వికృతులను వ్రాయండి.

అ) మీ వ్యాసాల్లో తెలంగాణ ప్రాంతీయ భాష కనిపిస్తూ వున్నది.
జవాబు:
భాష బాస

ఆ) నాది ప్రజా కవిత కద !
జవాబు:
కవిత – కైత

ఇ) మా అమ్మమ్మ రోజూ కత చెప్పుతుంది.
జవాబు:
కత – కథ

ఈ) కూరగాయలు అమ్మే ఇంతి మాటల్లో తెలుగు నుడి కనిపిస్తుంది.
జవాబు:
ఇంతి – స్త్రీ

ప్రశ్న 5.
క్రింది వ్యుత్పత్త్యర్థాలకు తగిన పదాలు వ్రాయండి.

అ) అజ్ఞానమనెడు అంధకారాన్ని తొలగించువాడు: గురువు
ఆ) భాషింపబడునది : భాష

వ్యాకరణాంశాలు

ప్రశ్న 1.
క్రింది వాక్యాలను సామాన్య వాక్యాలుగా మార్చండి.

అ) తిరుమల రామచంద్రగారు సంస్కృత, ఆంధ్ర భాషలలో పండితుడు.
జవాబు:
సామాన్య వాక్యాలు :

  1. తిరుమల రామచంద్రగారు సంస్కృత భాషలో పండితుడు.
  2. తిరుమల రామచంద్ర గారు ఆంధ్రభాషలో పండితుడు.

ఆ) నేనొకప్పుడు పుస్తకాలు, వ్యాసాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని.
జవాబు:
సామాన్య వాక్యాలు :

  1. నేనొకప్పుడు పుస్తకాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని.
  2. నేనొకప్పుడు వ్యాసాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని.

ఇ) ఇంట్లో మాట్లాడే భాష, బడిలో చదివే భాష వేరువేరు.
జవాబు:
సామాన్య వాక్యాలు :

  1. ఇంట్లో మాట్లాడే భాష వేరు.
  2. బడిలో చదివే భాష వేరు.

ప్రశ్న 2.
క్రింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి.

అ) తెలుగువాళ్ళ పలుకుబడి, నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి. వాటిని మనం భద్రపరుచు కోవడం లేదు.
జవాబు:
తెలుగువాళ్ళ పలుకుబడి, నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి. కానీ వాటిని మనం భద్రపరుచుకోవడం లేదు.

ఆ) నల్గొండ జిల్లాలో ఎందరో కవులు ఉన్నారు. నల్గొండ జిల్లాలో కథకులూ ఉన్నారు. నల్గొండ జిల్లాలో పత్రికా విలేకరులు ఉన్నారు.
జవాబు:
నల్గొండ జిల్లాలో ఎందరో కవులు, కథకులూ, పత్రికా విలేకరులు ఉన్నారు.

ఇ) నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు. నమాజు చదివి ఎందరో పోతుంటారు.
జవాబు:
నమాజు (చేయడానికి) చదవడానికి ఎందరో వచ్చిపోతుంటారు.

TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ప్రశ్న 3.
క్రింది వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చండి.

అ) అంబటిపూడి వెంకటరత్నం కావ్యం రాశాడు. అంబటిపూడి వెంకటరత్నం అచ్చు వేయించాడు.
జవాబు:
అంబటిపూడి వెంకటరత్నం కావ్యం రాసి, అచ్చు వేయించాడు.

ఆ) గడియారం రామకృష్ణశర్మ మంచి పాండిత్యం సంపాదించాడు. గడియారం రామకృష్ణశర్మ అనేక సన్మానాలు పొందాడు.
జవాబు:
గడియారం రామకృష్ణశర్మ మంచి పాండిత్యం సంపాదించి, అనేక సన్మానాలు పొందాడు.

ఇ) కప్పగంతుల లక్ష్మణశాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించాడు. కర్ణనుందరి నాటకాన్ని ప్రచురించాడు.
జవాబు:
కప్పగంతుల లక్ష్మణశాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించి, ప్రచురించాడు.

రుగాగమ సంధి 

ఈ క్రింది పదాలను గమనించి విడదీయండి.

అ) పేదరాలు
ఆ) బీదరాలు
ఇ) బాలింతరాలు
పై పదాలను విడదీస్తే ఎట్లా ఉంటాయో గమనిద్దాం.
ఎట్లా మారాయో పరిశీలిద్దాం.
అ) పేద + ఆలు → పేదరాలు
ఆ) బీద + ఆలు → బీదరాలు
ఇ) బాలింత + ఆలు → బాలింతరాలు
పేద + ఆలు → పేద + ర్ + ఆలు → పేదరాలు
బీద + ఆలు → బీద + ర్ + ఆలు → బీదరాలు
బాలింత + ఆలు → బాలింత + ర్ + ఆలు → బాలింతరాలు

  • పై మూడు సందర్భాలలో పర పదం ‘ఆలు’
  • ఒక వర్ణం మిత్రుడివలె అదనంగా చేరడమే ‘ఆగమం’.
  • పేద, బీద, బాలింత పదాలకు ‘ఆలు’ పరమైంది.
  • పేద, బీద, బాలింత మొదలైన శబ్దాలను ‘పేదాదులు’ అంటారు.
  • పేదాదిపదాలకు ‘ఆలు’ అనే పదం కలిసినప్పుడు ‘ర్’ అనే అక్షరం అదనంగా వచ్చింది.
  • ‘ర్’ అనేది అదనంగా రావడాన్ని ‘రుగాగమం’ అంటారు.
  • దీన్నే ఇట్లా కూడా చెప్పవచ్చు.
    పేదాది శబ్దాలకు ‘ఆలు’ శబ్దం పరమైనప్పుడు రుగాగమమవుతుంది.

పైన చెప్పిన మూడు పదాలలో పూర్వపదం విశేషణం, ఉత్తరపదం విశేష్యం (నామవాచకం) ఇలా విశేషణ విశేష్యాలతో కూడిన పదాన్ని కర్మ ధారయమంటారు.

కర్మధారయమందు పేదాది శబ్దాలకు “ఆలు” శబ్దం పరమైతే రుగాగమమౌతుంది.

పై పద్ధతి ప్రకారం క్రింది పదాలను విడదీసి గమనించండి. విశ్లేషించండి.

అ) ముద్దరాలు = ముద్ద + ఆలు = రుగాగమసంధి
ఆ) జవరాలు = జవ్వని + ఆలు = రుగాగమసంధి
ఇ) మనుమరాలు = మనుమ + ఆలు = రుగాగమసంధి
ఈ) కొమరాలు = కొమ + ఆలు = రుగాగమసంధి

పైన చెప్పిన పేదాది పదాలు తెలుగుపదాలు. ఇప్పుడు సంస్కృతానికి సమానమైన (తత్సమ) పదాలకు ఆలు శబ్దం పరమైతే ఏం జరుగుతుందో పరిశీలిద్దాం.

గుణవంత + ఆలు → గుణవంతురాలు
బుద్ధిమంత + ఆలు → బుద్ధిమంతురాలు
శ్రీమంత + ఆలు → శ్రీమంతురాలు

ఈ సందర్భాలలో కూడా ‘ర్’ వస్తుంది. కానీ స్వల్పమైన తేడా వచ్చింది గమనించారా ? అదేమిటో పరిశీలిద్దాం !
గుణవంత + ఆలు → గుణవంత + ఉ + ఆలు
→ గుణవంతు + ఆలు → గుణవంతు + ర్ + ఆలు → గుణవంతురాలు
శ్రీమంత + ఆలు → శ్రీమంత + ఉ + ఆలు → శ్రీమంతు + ఆలు → శ్రీమంతు + ర్ + ఆలు →
అలాగే
శ్రీమంతురాలు
బుద్ధిమంత + ఆలు → బుద్ధిమంత + ఉ + ఆలు → బుద్ధిమంతు + ఆలు → బుద్ధిమంతు + ర్ + ఆలు → బుద్ధిమంతురాలు

పై మూడుచోట్ల తత్సమపదాలకు ‘ఆలు’ కలిస్తే మొదటిపదం చివర ఉన్న అచ్చు ‘అకారానికి బదులు ‘ఉ’ కారము వచ్చి తరువాత రుగాగమమయింది, దీన్ని ఇట్లా చెప్పవచ్చు.

కర్మధారయమందు తత్సమ శబ్దములకు ‘ఆలు’ శబ్దము పరమైనప్పుడు పూర్వపదం చివర ఉన్న ‘అకారానికి’ ఉకారము వచ్చి రుగాగమం అయింది.

TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ప్రాజెక్టు పని

గాంధీజీ “సత్యశోధన”, సామల సదాశివ “యాది”, కాళోజి “నా గొడవ”, దాశరథి రంగాచార్య “జీవనయానం”, గడియారం రామకృష్ణశర్మ “శతపత్రము” మొదలగు వాటిలో వారివారి జ్ఞాపకాలు, అనుభవాలు గ్రంథస్థమై ఉన్నాయి. వీటిలో ఏదైనా ఒక గ్రంథాన్ని సేకరించి అందులోని విషయాలను చదువండి. వాటిలో మీకు నచ్చిన ఒక సంఘటనను పేర్కొంటూ ఎందుకు నచ్చిందో తెలుపుతూ నివేదిక వ్రాయండి.
జవాబు:
కాళోజి నారాయణరావు రచించిన ‘నా గొడవ’ కావ్యం నాకు నచ్చింది. దానిలో కోరిక అను గేయం (ఈప్స) నాకు నచ్చింది. దానిని రాస్తున్నాను.

నివేదిక

నాకున్నది ఒక కోరిక. నేను రాసే కవిత నా మనసులోని భావాల అలజడిని మిత్రుడికి రాసిన ఆత్మీయ ఉత్తరంగా ఉండాలి. పుస్తక ప్రియులను ఆహ్లాదపరిచే కవిత్వంగా, సౌందర్యారాధకులను ఆలోచింపజేసేదిగా, మేధావుల మనసులను కదిలించేదిగా, తార్కికుల్లో సైతం భావోద్వేగాలు పుట్టించేలా, అమాయకులు ప్రమాదాల్లో పడిపోకుండా కాపాడేదిగా ఉండాలనేది నా కోరిక. సాహిత్యవిలువలు, రస సౌందర్యం, కవి సమయాల గురించి తెలియనివారి వెక్కిరింతలు ఆగిపోయే విధంగా భావగాఢతగల కవితగా ఉండాలని, ఆడంబర మనస్తత్వాల్ని సైతం ఆకర్షించేదిగా ఉండాలని, జడత్వం ఆవరించిన స్నేహరాహిత్య హృదయాలకు ప్రాణం పోసే సంజీవనిగా ఉండాలని, కోపంతో నిండిన కనులను శాంతపరచేదిగా, విచ్చలవిడిగా వీధుల్లో తిరుగుతూ అమాయకులను గాయపరిచే ఆంబోతుల్లాంటి మనుష్యుల అకృత్యాలకు కళ్ళెం వేసేలా నా కవిత ఉండాలి.

కవిత్వం గాలిలో తేలివచ్చే సువాసనలాగా, మధురమైన భావాలను మోసుకు రావాలి. పొదుగుల నుండి కారుతున్న పాలధారలా కవిత ఉపయోగకరంగా ఉండాలి. అమ్మ కంటి చూపుల్లోంచి కురిసే మమతానురాగాలు, పంటను సంరక్షించే రైతు చూపుల్లోని జాగ్రదావస్థ కవిత్వంలో నిక్షిప్తమై ఉండాలి.

నిరాశతో కుంగిపోయిన మనసుకు ఆనందాన్ని కలిగించి, జీవితంలోని అభద్రతాభావాన్ని తొలగించి జీవనానికి ఆధారంగా కవిత ఉండాలి. అనవసరపు మృత్యుభయాల్ని తొలగిస్తూ యమునికే మృత్యుభీతి కలిగించే విశ్వాసాన్ని కవిత్వం అందించాలి.

దాహంతో గొంతెండిపోయిన వారికి చెలిమనీరులా, చలికి వణికిపోయేవారికి ఆరిపోని కుంపటి వెచ్చదనంలా నిత్యం అందుబాటులో ఉండి ప్రజల కష్టనష్టాలలో ఆదుకునేలా కవిత్వం ఉండాలి.

పక్షిప్రాణాన్ని కాపాడటం కోసం తన శరీరంలోని మాంసాన్ని కోసి ఇచ్చిన శిబి దాతృత్వాన్ని, ఆడిన మాట నిలబెట్టుకోవడానికి ప్రాణాన్నే ఇచ్చిన బలిచక్రవర్తి త్యాగాన్ని ప్రబోధించేలా కవిత ఉండాలి. దేశ సరిహద్దుల్ని నిరంతరం పరిశీలిస్తూ పహారాకాసే సైనికుడిలా, చావంటే భయం వదలిపెట్టి పోరాడే వీరుడిలా, అమరవీరుడి మెడలో మెరిసే పూలదండలా కవిత ఉండాలి.

పవిత్రమైన వేదం చదివితే కలిగే బహుళ ప్రయోజనాల్లా కవితలోని వేదన పఠితలో గుణాత్మకమయిన మార్పుల్ని కలిగించాలి. జీవనదిలా ప్రవహించే నిర్మల గంగానదిలా మనిషి జీవనం నిత్యచైతన్యంతో ముందుకు కదలాలని, నదిలో కొట్టుకుపోతున్న వాడికి తీరం తగిలినట్లుగా, కష్టాల్లో, బాధల్లో మునిగిపోయిన వారికి ఒక ఓదార్పు, ఉపశమనం కలిగించే తీరంలా కవిత్వపుతీరు ఉండాలి.

పాతాళాన్ని పైకి లాగేదిగా, ఆకాశాన్ని భూమ్మీదికి దించేదిగా అసాధ్యాలను సుసాధ్యాలు చేయగలిగే ఉత్తేజాన్ని కవిత్వం కలిగించాలి. అనేక సహజ వనరులతో, ప్రకృతి సౌందర్యంతో, విభిన్న ప్రాణుల జీవనానికి అనుగుణంగా ఉన్న అమూల్యమైన భూమిని, ఈ పర్యావరణాన్ని కాపాడుకునేలా కవిత్వం స్ఫూర్తి కలిగించాలి. మనిషి మానవీయ విలువలతో మంచి మనిషిగా ఎదిగేలా కవిత్వం నేర్పాలని కవి గాఢంగా కోరుకుంటున్న కోరిక ఈ కవిత.

విశేషాంశాలు

  1. పలుకుబడి : మాటతీరు ఉచ్ఛారణలో ఉండే విలక్షణత. దీన్నే ‘యాస’ అంటారు.
  2. నుడికారం : మాటయందలి చమత్కారం. ఏ భాష నుడికారం ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిలోంచి, భౌగోళిక పరిస్థితుల లోంచి, ఆప్రాంత ప్రజల ఆచార వ్యవహారాలలోంచి ఉద్భవిస్తుంది.
  3. జాతీయం : జాతివాడుకలో రూపుదిద్దుకున్న భాషా విశేషం. జాతీయంలోని పదాల అర్థాన్ని ఉన్నదున్నట్లుగా పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు. ఆ పదాల పొందికతో వచ్చే అర్థం వేరు.
    ఉదా : ‘చేతికి ఎముకలేదు’ అన్న జాతీయంలోని పదాలకు నిఘంటుపరంగా ఎముకలేని చేయంటే కేవలం

కండరాలు మాత్రమే ఉండాలె. కాని ఈ జాతీయానికి ధారాళంగా దానమిచ్చే మనిషి’ అని
అర్థం వస్తుంది. ఈ విధంగా పదాలకున్న వాక్యార్ధం పోయి లక్ష్యార్థం రావడాన్నే ‘జాతీయం’ అంటారు.
కొట్టినపిండి, తలపండిన, వీనుల విందైన, కబంధహస్తాలు, అగస్త్య భ్రాత మొదలైనవి మరికొన్ని జాతీయాలు.

సూక్తి : ఆత్మలను పలికించేదే అసలైన భాష
ఆ విలువ కరువైపోతే అది కంఠశోష
-డా|| సి. నారాయణరెడ్డి

పదాలు – అర్థాలు

I

అబ్బురపడు = ఆశ్చర్యపడు
పలుకుబడి = ఉచ్ఛారణము, మాట చెల్లుబడి
నుడికారము = మాట చమత్కారము, మాట, పలుకుబడి
పట్టుబడుట = నేర్చుకొనుట, అలవాటగుట
స్మరించుట = గుర్తుకు తెచ్చుకొనుట
యాదిచేసుకొనుట = గుర్తుకు తెచ్చుకొనుట
బాల్యమిత్రులు = చిన్నప్పటి (మిత్రులు) స్నేహితులు
ఉద్దండము = పొడవైనది, ఎక్కువైనది, మిక్కిలి
ప్రౌఢ = గంభీరమైనది
సన్నిధానము = సమీపము, ఆశ్రయము

II

పునరుద్ధరించుట = బాగుచేయుట
గురువు = ఉపాధ్యాయుడు, బృహస్పతి
సొంపు = అందం
రమ్యమైన = అందమైన
ప్రాముఖ్య = ప్రముఖమైనవి
టక్సాలా = టంకసాల
ప్రాముఖ్యం = ప్రాధాన్యత

III

పొల్యూట్ = కలుషితమైన
వర్దంతి = చనిపోయిన రోజు
జయంతి = పుట్టినరోజు
సమ్మేళనం = కలయిక, కలుపుట, కలియుట
విద్వాంసుడు = పండితుడు
ఆశ్రయించకుండా = తీసుకొనకుండా
వెల్లడించుట = వ్యక్తం చేయుట
జాబులు = లేఖలు, జవాబులు
అడ్వకేటు = వకీలు, న్యాయవాది

TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

IV

రుచించవు = ఇష్టపడవు, నచ్చవు
ఘోరము = దారుణము
గ్రాంథికం = గ్రంథములలో ఉండే భాష (గ్రాంథికం)
అగ్రగణ్యుడు = మొదటివాడు
వ్యవహారికం = మాటలలో మనంఉచ్చరించేది (వ్యవహారిక మాట)

పాఠం ఉద్దేశం

ఒక భాషలోని నుడికారపుసొంపు, పలుకుబడులు, జాతీయాలవల్ల భాష ఎంతో పరిపూర్ణంగా, సౌందర్య వంతంగా విలసిల్లుతుందో చెబుతూ, ఇతర భాషల్లో గొప్పతనాన్ని కూడా బేరీజువేస్తూ తెలుగు భాష గొప్పతనాన్ని, ప్రాంతీయ భాషలోని మాధుర్యాన్ని తెలియజేయడమే ఈ పాఠం ప్రధానోద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ప్రస్తుత పాఠ్యభాగం డా॥ సామల సదాశివ తన స్వీయ అనుభూతులతో రాసిన ‘యాది’ అనే వ్యాస సంపుటిలోనిది.

కవి పరిచయం

రచయిత : డా॥ సామల సదాశివ

జననం : 11.05.1928

మరణం : 07.08.2012

జన్మస్థలం : కుంరం భీమ్ జిల్లాలో భాగమైన దహెగామ్ మండలం తెనుగుపల్లె

ఇతర రచనలు :

  1. ఉర్దూ సాహిత్య చరిత్ర
  2. అన్జద్ రుబాయీలు
  3. మలయమారుతాలు
  4. యాది.
  5. సంగీత శిఖరాలు

పురస్కారాలు :

  1. 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ అనువాద రచనా పురస్కారం (అన్జద్ రుబాయీలకు)
  2. 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (స్వర్ణలయలు గ్రంథానికి)
  3. కాకతీయ,తెలుగు విశ్వ విద్యాలయాల గౌరవ డాక్టరేట్.

విశేషాంశాలు : ఉత్తమ అనువాదకుడు, విమర్శకుడు.

శైలి : భాష సహజ సుందరం, సరళం

ప్రవేశిక

సంస్కృతాంధ్ర భాషల్లో, కావ్యవ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితుడు; ‘ఆంధ్రబిల్హణ’ బిరుదాంకితుడూ అయిన కప్పగంతుల లక్ష్మణశాస్త్రి “వారీ! రామచంద్రా ! ఇగపటు” అన్నాడు.
గుడిపూజారి “మొదలు మీ కండ్లకు నీళ్ళు పెట్టుకోండి” అని ఆశ్చర్యపరచాడు.
“మసీదు మెట్లమీద కూర్చొని ఫకీర్లు, బిచ్చగాళ్ళు, బిచ్చగత్తెలు మాట్లాడుకునే మాటలు శ్రద్ధగా విని ప్రజల పలుకుబడిని, జాతీయాలను నేర్చుకున్నాను” అన్నాడు. భేషజం లేకుండా ప్రముఖ కవి మీర్ తఖీమీర్.
ఈ అనుభవాలన్నీ ప్రముఖ సాహితీవేత్త సామల సదాశివ ‘యాది’ లోనివి. ఇటువంటి మరెన్నో ఆశ్చర్యకర సంఘటనల గురించి తెలుసుకోవాలంటే ఈ పాఠం చదువవలసిందే!

విద్యార్థులకు సూచనలు

  • పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
  • పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత గీయండి.
  • వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పదవిజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకొండి.

ప్రక్రియ -వ్యాసం

ఈ పాఠం వ్యాసప్రక్రియకు చెందినది. ఏదైనా ఒక అంశాన్ని గురించి సంగ్రహంగా, ఆకట్టుకునేటట్లు వివరించేది వ్యాసం, సూటిగా, స్పష్టంగా, నిర్దిష్టంగా, సులభంగా అర్థమయ్యే విధంగా ఉండటం వ్యాసలక్షణం.

TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట

Telangana SCERT 10th Class Telugu Guide Telangana 4th Lesson కొత్తబాట Textbook Questions and Answers.

TS 10th Class Telugu 4th Lesson Questions and Answers Telangana కొత్తబాట

చదవండి – ఆలోచించి చెప్పండి (T.B. P.No. 36)

మార్కెట్కు వెళ్ళే మార్గం పక్కన ఇళ్ళున్నాయి. వాటిలో కొన్ని గట్టి ఇటుకలతో నిర్మింపబడ్డాయి. గోడలకు వెల్లవేసి ఉన్నది. వసారా గోడలపై ఆకర్షణీయమైన పూలు చిత్రించబడి ఉన్నాయి. మరికొన్ని ఇళ్ళు మట్టితో నిర్మింపబడ్డాయి. ఆ ఇళ్ళకు చిరిగిన తాటియాకుల కప్పు ఉన్నది. చిన్న, పెద్ద ఇళ్ళలోను, పేదల, ధనికుల ఇళ్ళలోను, అన్ని ఇళ్ళలోను ప్రవేశద్వారం ప్రక్క కుండీలో తులసి మొక్క ఉన్నది. పసిపిల్లలు, ఊరకుక్కలతో పాటు దుమ్ములో ఆడుతున్నారు. స్త్రీలు బియ్యం కడుగుతూ, ఆ కడిగిన నీటిని సందులో పోస్తున్నారు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
పై పేరాలో దేనిని గురించి ఉన్నది ?
జవాబు:
ఒక ప్రాంతం గురించి ఉన్నది (ఒక పేద బస్తీ గురించి).

ప్రశ్న 2.
ఇటువంటి వాతావరణం ఎక్కడ ఉంటుంది ?
జవాబు:
అపరిశుభ్ర కాలనీలో ఉంటుంది.

TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట

ప్రశ్న 3.
మీరు చూసిన పల్లె గురించి మాట్లాడండి.
జవాబు:
నేను చూసిన పల్లె రామాపురం. పచ్చని పొలాలతో కళకళలాడుతూ ఉంది. స్వచ్ఛమైన పైరు గాలి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఊరి పక్కన గలగల పారే సెలయేరు నా మనస్సును ఆకట్టుకుంది. కల్మషం లేని పల్లె ప్రజల శ్రమ జీవన సౌందర్యం ఆదర్శ నీయం.

ప్రశ్న 4.
పల్లెల్లో నాటితో పోలిస్తే నేడు ఏయే మార్పులు చోటుచేసుకున్నాయి ?
జవాబు:
ఆనాడు పల్లెలు దరిద్రానికి, అనారోగ్యానికి, అవిద్యకు ప్రతిరూపాలుగా ఉండేవి. ఇప్పుడు పల్లెల్లో కూడా సౌభాగ్యం ఉంది. ప్రతి ఇంటికీ విద్యుత్తు, టివి ఉన్నాయి. ఇంచుమించు చాలామందికి మోటారు బైకులున్నాయి. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. బాగా చదువుకొంటున్నారు. కొన్ని విషయాలలో కొంత వెనుకబడి ఉన్నారు.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 39)

నేను రాన్రా తమ్ముడు! ………….. గండ్లవడ్తనె ఉంది.

ప్రశ్న 1.
“సెవ్వు మీద పేను వార్తెనా?” అంటే మీకేమి అర్థమైంది ?
జవాబు:
‘పేను’ తలలో ఉంటుంది. పేను పాకుతుంటే దురద పెడుతుంది. అందుచేత తెలుస్తుంది. అంటే చెవి మీద పేనుపాకితే తెలుస్తుంది. కాని, అక్క చెప్పే మాటలను తమ్ముడు అస్సలు పట్టించుకోవటం లేదు. అందుకే కనీసం చెవి మీద పేను పాకినట్లు కూడా లేదతనికి. ఇంక చెవిలోకి ఆ మాటలు వెళ్ళే అవకాశం లేదు. వాటి గురించి ఆలోచించే ప్రశ్నే లేదు. అందుచేత అక్క చెప్పే మాటలను కనీసం పట్టించుకోవట్లేదని అర్థమయింది.

ప్రశ్న 2.
మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా నడుచుకుంటూ పోతారా ? పోయేటప్పుడు ఏమేం గమనిస్తారో చెప్పండి.
జవాబు:
మేము ఎప్పుడైనా ఎక్కడికైనా దగ్గర్లో ఉన్న చోట్లకు నడుచుకొంటూనే పోతాము. పోయేటప్పుడు గోడలపై రాతలు, సినిమా పోస్టర్లు మొదలైనవి గమనిస్తాం. పక్షులు, జంతువులు, వాహనాలు, ఇళ్ళను చూస్తాం.

TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట

ప్రశ్న 3.
మీ ఊరి పొలిమేరల్లో ప్రకృతి ఎట్లా ఉంటుందో చెప్పండి.
జవాబు:
మా ఊరి పొలిమేర పచ్చని పంటపొలాలు, పచ్చని చేలు పావడకట్టి, పంట కాలువలతో ప్రకృతి రమణీయం, వాగులూ, వంకలతో, పక్షుల కిలకిలారావాలతో చూడముచ్చటగా ఉంటుంది.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 40)

మరి! మా తిక్క సన్నాసి…………. సంబురాన ముందుకు సాగిన

ప్రశ్న 1.
“తన కాళ్ళమీద తను నిలబడటం” అంటే ఏమిటి ? చర్చించండి.
జవాబు:
తన కాళ్ళమీద తను నిలబడటం అంటే ఎవ్వరి మీద ఆధారపడకుండా తిండికి, బట్టకూ లోటు లేకుండా స్వశక్తితో సంపాదించుకోవడం. అంటే తన ప్రతిభకు తగిన ఉపాధిని పొందుతూ జీవనాన్ని సాగించటం.

ప్రశ్న 2.
నాటి నేటి ఆచార వ్యవహారాల్లో తేడాలు ఉన్నాయా ?
జవాబు:
పూర్వం పెండ్లిళ్లు, పండుగలు మొదలైనవి వస్తే అందరూ కలిసి పనులు చేసుకొనేవారు. సాయంత్రం అందరూ కూర్చొని మాట్లాడుకొనేవారు. ఏ వ్యవహారం లోనూ మోసం, దగా ఉండేవి కావు. ఆడంబరాలు లేవు.

ఈనాడు ఆడంబరాలు ఎక్కువ. మోసం చేసే లక్షణాలు పెరిగిపోయాయి. ఎవరింట్లో వాళ్ళు టివిలు చూస్తూ గడుపుతున్నారు. పిలిచినా పెళ్ళిళ్ళకు, పండుగలకు వచ్చేవారు తగ్గిపోయారు. వచ్చినా ఒక పూటకు మించి ఎవ్వరూ ఉండటం లేదు.

ప్రశ్న 3.
మీ ఊర్లో రచ్చబండ / గ్రామ సచివాలయం ఉన్నదా ? అక్కడ ఎవరెవరు ఏయే విషయాల గురించి మాట్లాడతారు ?
జవాబు:
మా ఊర్లో ఒకప్పుడు రచ్చబండ ఉండేదట. ఇప్పుడు గ్రామ సచివాలయం ఉంది. అక్కడ గ్రామ సర్పంచ్, పంచాయితీ వార్డు సభ్యులు గ్రామ అభివృద్ధికి సంబంధించిన అంశాలను చర్చించి ప్రణాళికలు రూపొందిస్తారు.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 41)

బండి సాగిపోతనే ఉండది ……… అడుక్కు తిండ్లు లేవు.

ప్రశ్న 1.
‘కడ్పుల ఇసం నాల్కెన తీపి’ అంటే మీరేం అర్థం చేసుకున్నారు?
జవాబు:
కడ్పుల ఇసం నాల్కలతీపి – అంటే కడుపులో విషం. నాలుక చివర తీపి, కడుపులో అన్నీ చెడు ఆలోచనలు విషపూరితమైన భావాలు ఉన్నా పైకి మాత్రం తియ్యగా మాట్లాడడం. కొంతమందికి లోపల చాలా కోపం ఉంటుంది. ఉదాహరణకు ధృతరాష్ట్రుడికి భీముడంటే చాలా కోపం. భీముడిని ఎప్పుడు చంపేద్దామా అని ఉండేది. భీముడు చచ్చిపోవాలని నిరంతరం కోరుకొనేవాడు. కాని, ఎదురుపడితే మాత్రం “నాయనా ! భీమసేనా ! అన్నం తిన్నావా బాబూ ?” అంటూ ప్రేమగా అమృతం కురిపిస్తూ మాట్లాడేవాడు. అందుచేత ధృతరాష్ట్రుడి వంటి వారికి కడ్పుల ఇసం నాల్కల తీపి ఉంటుంది.

ప్రశ్న 2.
పంచాయితీలు చెప్పడం అంటే ఏమిటి ? పంచా యితీలను ఎట్లా జరుపుతారు ?
జవాబు:
న్యాయం చెప్పడం అని అర్థం. తగవులు తీర్చడం అని అర్థం. ఒకరు, ఇద్దరు పెద్దలు రచ్చబండపై కూర్చొని ఫిర్యాదీదారుడు, ఇతర వ్యక్తులను వేర్వేరుగా పిలిచి మాట్లాడి పరిష్కారం చూపుతారు. దొంగతనాలు మున్న గునవి పరిష్కరింపబడతాయి.
పంచాయితీని గ్రామసచివాలయం లేదా రచ్చ బండ లేదా ఒక పెద్దమనిషి ఇంట్లోనూ నిర్వహిస్తారు. పంచాయితీకి గ్రామపెద్దలంతా వస్తారు.

TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట

ప్రశ్న 3.
“కళదప్పిన ఇల్లు” ఎట్లా ఉంటుంది ?
జవాబు:
కళదప్పిన ఇల్లు అనగా దానికి జీవం లేదు. జీవకళ లేదు. ఆ ఇంట్లో సుఖసంతోషాలు లేవు. నిత్యం కష్టాల మయం అని అర్థం.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 42)

బండి మా ఇంటి దిక్కు మూలమల్పు ……….. నల్గురు నడిసిందె బాట.

ప్రశ్న 1.
రాత్రిబడి అంటే ఏమిటి ? రాత్రి బళ్ళను ఎందుకు నడుపుతారు ?
జవాబు:
పగలంతా పొలం పనులు, ఇతర పనులు చేసుకొని, రాత్రిపూట చదువుకోవాలనుకునే వారికి ప్రభుత్వం కల్పించిన సదుపాయమే రాత్రి బడి. రాత్రి బళ్ళను ప్రతి ఊరిలో నిర్వహిస్తారు. (వ్యవసాయదారులకు) నిరక్షరాస్యులకు విద్యను నేర్పి, వారి వారి వృత్తులలో నైపుణ్యం పొందటానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

ప్రశ్న 2.
“నల్గురు నడిసిందె బాట”లోని అంతరార్థం ఏమిటి ? చర్చించండి.
జవాబు:
“పదుగురు ఆడు మాట పాడియై ధరచెల్లు” అని వేమన ఎప్పుడో చెప్పారు. అట్లే నలుగురు నడిచినదే బాట. ఒక్కడి మార్గాన్ని ఎవరూ అనుసరించరని దీని అర్థం.

ప్రశ్న 3.
మీ పరిసర ప్రాంతాల్లో పిల్లల రూపురేఖలు, వేష ధారణ ఎట్లా ఉంటాయి?
జవాబు:
మా పరిసర ప్రాంతంలో పిల్లలు పరిశుభ్రంగా, దృఢంగా ఉంటారు. ఉన్నంతలో పరిశుభ్రమైన దుస్తులు ధరిస్తారు. తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం, క్రమశిక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
ఈ కథకు ‘కొత్తబాట’ అనే పేరు తగినదని భావిస్తున్నారా ? ఎందుకు ? చర్చించండి. (T.S Mar. ’16)
జవాబు:
పాకాల యశోదారెడ్డి తన గ్రామంలో వచ్చిన మార్పుల గురించి చెప్పిన కథకు ‘కొత్తబాట’ అని పేరు పెట్టారు.

‘కొత్తబాట’ అంటే కొత్తదారి అని అర్థము. యశోదారెడ్డి ఊరిలో ప్రజలు పాత ఆచారాలను వదలి కొత్తదారి పట్టారు. అందువల్ల ఈ కథకు ఆ పేరు సరిపోతుంది. ఆ గ్రామ ప్రజలు పట్టిన కొత్తదారి ఇది.

  1. గ్రామంలో పెద్ద ఇళ్ళ ఆడవాళ్ళు సామాన్యుల కంటికి కనబడకుండా బండ్లకు తెరలు కట్టే ఆచారం, నేడు పోయింది.
  2. రచ్చబండపై గ్రామపెద్దతో కలిసి గ్రామస్థులు అందరూ నేడు కూర్చుంటున్నారు.
  3. గ్రామపెద్ద రంగరాయడి వంటి పెత్తనాన్ని నేడు గ్రామాల్లో ప్రజలు ధిక్కరిస్తున్నారు.
  4. పోలీసు పటేళ్ళ పెత్తనం, ప్రజలు పోలీసులకు లంచా లివ్వడం, పోయింది.
  5. ప్రజలు చీటికిమాటికీ తగవులు, కొట్లాటలు మానారు. పంచాయితీలు, జరిమానాలు నేడు లేవు. ఏ గ్రామానికి ఆ గ్రామంలో తీర్పులు ఇస్తున్నారు.
  6. రాత్రి దొంగతనాలు లేవు. ప్రజలకు శిక్షలు లేవు. ప్రజలు ముష్టి ఎత్తుకోడం మానివేశారు. వారు మంచి వేషాలు వేసుకుంటున్నారు.
  7. పెళ్ళిళ్ళలో కూడా మేనాలు, పల్లకీలు, ప్రజలు నేడు మోయడం లేదు.
  8. పనిమనుషులను తమతోడి వారుగా చూస్తున్నారు.

ఈ విధంగా గ్రామాల్లో ప్రజలు కొత్తబాట పట్టారు. అందువల్ల ఈ కథకు ఈ పేరు బాగా సరిపడింది.

TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట

ప్రశ్న 2.
పాఠం చదువండి. క్రింది పేరాల ఆధారంగా పట్టిక నింపండి.
TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట 1
జవాబు:
TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట 2
TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట 3

ప్రశ్న 3.
క్రింది పేరా చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
జవాబు:
పల్లెసీమకు పట్టుకొమ్మలాగ మారుమూల గిరిజన గ్రామమైన కొండాపూర్ ఆదర్శంగా నిలిచింది. వరంగల్ (రూరల్) కాకతీయ జిల్లా నల్లబెల్లి మండలానికి 18 కిలోమీటర్ల దూరాన ఉన్న కొండాపూర్ చుట్టూ దట్టమైన అడవిమధ్య నిలిచిన అటవీ గ్రామం. ఇక్కడ 1945లో ప్రత్యేక గ్రామపంచాయితీ ఏర్పడింది. 2007 డిసెంబర్ 5న సర్పంచ్ వాసం కన్నయ్య అధ్యక్షతన జరిగిన గ్రామసభలో గ్రామ సమస్యల పరిష్కారానికి, గ్రామాభివృద్ధికి 8 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు లోడిసంస్థ సహకారంతో, గ్రామస్థుల శ్రమదానంతో మేడివాగుపై పక్కారోడ్డు నిర్మించాయి. అధికారుల సహకారంతో మద్యపాన నిషేధం అమలులో ఉన్నది.

వందశాతం అక్షరాస్యత సాధించారు. గ్రామ జనాభాకు సరిపడా మినరల్ ప్లాంట్ ఏర్పాటు చేసు కున్నారు. గ్రామంలో బాలకార్మికులు లేకుండా చేశారు. పిల్లలందరిని బళ్ళలో చేర్చారు. గిరిజనులు సాధించిన ఈ అభివృద్ధిని చూసి అంతర్జాతీయ గూగుల్ ఆర్గ్ సంస్థ ఈ గ్రామాన్ని ఉత్తమగ్రామ పురస్కార్కు ఎంపిక చేసింది.

ప్రశ్నలు

అ) కొండాపూర్ ఎక్కడ ఉన్నది ?
జవాబు:
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలానికి 18 కి.మీ. దూరంలో కొండాపూర్ ఉన్నది.

ఆ) గ్రామపంచాయితీ ఎప్పుడు ఏర్పడింది ?
జవాబు:
1945లో ప్రత్యేక గ్రామపంచాయితీ ఏర్పడింది.

ఇ) గ్రామసర్పంచ్ ఎవరు ?
జవాబు:
గ్రామసర్పంచ్ వాసం కన్నయ్య.

ఈ) పక్కా రోడ్డు ఎవరి సహకారంతో, ఎవరు నిర్మించారు?
జవాబు:
లోడి సంస్థ సహకారంతో, గ్రామస్తుల శ్రమదానంతో. మేడివాగుపై పక్కారోడ్డు నిర్మించారు.

ఉ) గ్రామ ప్రజలు సాధించిన విజయాలేవి ?
జవాబు:
పక్కా రోడ్డు నిర్మాణం, వందశాతం అక్షరాస్యత సాధించటం, గ్రామజనాభాకు సరిపడా మినరల్ ప్లాంటు ఏర్పాటు, గ్రామంలో బాలకార్మికులు లేకుండా చేయటం, పిల్ల లందరిని బళ్ళలో చేర్చటం మొదలగునవి గ్రామ ప్రజలు సాధించిన విజయాలు.

ఊ) ఈ పేరాకు శీర్షిక ఏం పెట్టవచ్చు? ఎందుకు ?
జవాబు:
ఉత్తమ గ్రామం, నల్లబెల్లి (లేదా) ఉత్తమ గ్రామ పురస్కార్కు ఎంపికైన నల్లబెల్లి.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) “ఎంత చెడ్డగని, ఎంత బాగా బతికిన గని ఇంకోణి ఆసరతోటి మంది భుజాలెక్కి నడువకుండ పయినం సాగితే సాలు” అన్న అక్కమాటల్లో ఆంతర్యం ఏమై ఉంటుంది?
జవాబు:
స్వతంత్ర్య ప్రవృత్తి గురించి రచయిత్రి చెప్పిన మాటలివి. రెండుకళ్ళు తెరిచి నిదానంగా ఆలోచించాలి. మర్చిపో కూడదు. బాట మారింది. కాళ్ళకు బురద అంటు కునేది. మనిషికి మనం చూడవలసిందే స్వతంత్రంగా జీవించడం. అంతేగాని ఒకరిమీద ఆధారపడి జీవించ కూడదు.

ఇంకొకరి మీద ఆధారపడటం దారుణం. ఒకళ్ళ భుజాల మీద ఎక్కి ప్రయాణించడం అనే లక్షణం మంచిది కాదని అర్థం.

ఆ) “అక్కడక్కడ నక్కలు అదునుగాస్తున్న జాడలు కన బడ్తున్నవి” అంటే మీకేం అర్థమైంది ?
జవాబు:
నక్కలు మోసానికి ప్రతి రూపాలు. మోసం చేయడానికి అదను కోసం చూస్తుంటాయి. ఎంతసేపైనా నిరీక్షిస్తాయి. వేటాడకుండా ఆహారాన్ని సంపాదించగల దిట్టలు. పొదల్లో నక్కి ఉంటాయి. బలహీనమైన కోడి, మేకపిల్ల వంటి వాటిని చంపి తింటాయి. బలమైన ఏనుగు వంటి వాటిని ఏ సింహమో వేటాడేదాకా చూస్తుంది.

వేటాడి, అది తినగా మిగిలిన మాంసం తినేస్తుంది. గ్రామంలో రంగారాయుడు లాంటి మనుషులు లాగానే జంతులోకంలో నక్కలూ ఉంటాయని అక్క ఆంతర్యం అయి ఉంటుందని మాకు అర్థమైంది.

ఇ) మీ గ్రామంలోని ప్రకృతిని లేదా మీ ఊరి ప్రత్యేకతలను గురించి రాయండి.
జవాబు:
మా ఊరు చాలా బాగుంటుంది. పొలాలు, మామిడి తోటలతో, చక్కని వరిపొలాలతో, గోదావరి (పోలవరం) కాలువతో చూడముచ్చటైన ఊరు మా ఊరు. ఊరి చివర బడి, ఊరి మధ్యలో గుడి, మడులు, పిల్లల అరుపులు, పక్షుల కిలకిలారావాలతో, నీళ్ళతో నిండిన చెరువులు, చక్కని రోడ్లు, మా ఊరికే సొంతం.

అందుకే “పల్లె తల్లిలాంటిది, పట్టణం ప్రియురాలి వంటిదని” దేవులపల్లి కృష్ణశాస్త్రి అంటారు. మా గ్రామం ఆదర్శగ్రామంగా ఎంపిక కాబడింది. మా ఊరి ప్రత్యేకత ఏమిటంటే, మా ఊరు ఎవరు వచ్చినా మా ఊరి అందాలను ఫోటో తీయందే వెళ్లరు. చాలా సినిమాల షూటింగులు మా ఊళ్ళో జరిగాయి. మా ఊళ్ళో గోదావరి అందాలు మా ఊరికే వన్నెతెస్తున్నాయి.

ఈ) చెరువుల ప్రాముఖ్యత ఏమిటి ?
జవాబు:
తెలంగాణ ప్రాంతంలో చెరువుల నిర్మాణం శాత వాహనుల కాలం కంటే ముందునుంచే ఉన్నప్పటికీ కాకతీయుల కాలంలో ఉన్నతదశకు చేరుకుంది. ఆ తర్వాత తెలంగాణను పాలించిన కుతుబ్షాహీలు, అసఫ్జాహీలు, సంస్థానాధీశులు, తెలంగాణలో చెరువుల నిర్మాణాన్ని అభివృద్ధిపరిచి, వ్యవసాయా భివృద్ధికి తోడ్పడ్డారు. తర్వాత కాలంలో ఈ చెరువుల వ్యవస్థ సరైన నిర్మాణానికి నోచుకోక విధ్వంసానికి గురి అయ్యింది. దీనివలన స్వయంపోషక గ్రామాలుగా ఉన్న తెలంగాణ గ్రామాలు కరువుపీడిత గ్రామాలుగా మారాయి.

ఈ పరిణామం కూడా వలసలకు కారణమైంది. లక్షలాది మంది తెలంగాణ ప్రజలు పొట్టచేత పట్టుకొని ఇతర రాష్ట్రాలకు, గల్ఫ్ దేశాలకు వలస పోయారు. తెలంగాణలో చెరువుల పునర్మిర్మాణం ద్వారా వ్యవసాయాభివృద్ధి సాధిస్తే, ప్రజలకు ఉపాధి దొరికి, వలసలు ఆగిపోతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరువులను పునరుద్ధరించ డానికి ‘మిషన్ కాకతీయ’ అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది.

TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట

ప్రశ్న 2.
క్రింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) పాఠం ఆధారంగా పల్లెల్లో వచ్చిన మార్పులను విశ్లేషిస్తూ (T.S June ’16)
జవాబు:
“కొత్తబాట” అనే ఈ పాఠంలో “అక్కా తమ్ముళ్ళిద్దరూ” బస్సు దిగి అక్కడ నుండి ఎద్దులబండిలో వాళ్ళ ఊరి వరకు ప్రయాణం చేస్తారు. పల్లెలో అనేకరకాల మార్పు లను చూస్తారు. అవి ఈ విధంగా ఉన్నాయి.

  1. కొత్తబాట (రోడ్లు) నిర్మించారు.
  2. మోరుగవనం వేశారు. అందమైన ప్రకృతికి మారు పేరది.
  3. రోడ్డుకిరువైపులా చెట్లు నాటారు. పూల తోటలు వేశారు. పొంటిమాన్లు చిగురించాయి.
  4. చెరువును పూడిక తీసి అందంగా చేశారు. దానికి ఆయకట్టు కట్టడం వల్ల అందరికి ఆదరువైంది.
  5. జారుడు బండలు ఏర్పాటు చేశారు.
  6. మెచ్చుకొని తీరవలసినట్లుగా నిర్మాణం జరిగింది ఆ రోడ్డు.
  7. ఇదివరకు కాళ్ళకు బురద అంటుకునేది.
  8. స్వతంత్ర జీవనం సాగించాలి ప్రజలు.
  9. కొట్టాల గడ్డివాములన్నీ కుదురుగా మట్టసంగా ఉన్నాయి.
  10. ఎల్లమ్మ గుడిని బాగుచేయించారు.
  11. ఆ ఊరిని చూసి అక్క ఊపిరి పీల్చుకుంది.
  12. దొంగతనాలు, దోపిడీలు, పంచాయితీ శిక్షలు పోయాయి.
  13. పని మనిషులు కూడా ఇంట్లో మనుషులతో సమానంగా గౌరవం అందుకుంటున్నారు.
  14. మిత్తి పూజ పేరుతో ప్రజల మూఢనమ్మకాల్ని సొమ్ము చేసుకున్న వారిని ప్రజలు ఊరొదిలి పోయేలా తరిమికొట్టారు.

ఈ విధంగా ఈ పాఠంలో అనేక మార్పులను రచయిత్రి తెలిపింది.

ప్రశ్న 3.
క్రింది ప్రశ్నకు సృజనాత్మకంగా సమాధానం రాయండి.

అ) పల్లె సౌందర్యాన్ని వర్ణిస్తూ పది పంక్తుల వచన కవిత రాయండి.
జవాబు:
పల్లె తాకనంటా (వచన కవిత)
– కృష్ణప్రసాద్

కోడికూతతోనే కళ్ళుతెరచి
పల్లె ఒళ్ళు విరుచుకుంది
చల్లగాలుల్లోనే స్నానమాడి
చక్కగా కూర్చుంది
చూడచక్కగా తానుంది

చిట్టి గువ్వలన్నీ గూటిని వీడి గంతులు వేయగా యేటిలో చేపలే గువ్వల సాటిగా ఎగరగా చూడంగా చిన్నారి పాదాలు సందులలోన పరుగులు తీయంగా
ఆ చప్పుడు వింటూ
బంతులు – చేమంతులూ
మల్లెలు – మందారాలు
ముద్దుముద్దుగా విచ్చుకుంటున్నాయా
మొద్దు నిదురవీడి
– కోడి కూతతోనే

పల్లె తనదంటూ వదిలెల్లనంటూ మొండికేసే చంద్రుడే
కాదు నాదంటూ నువ్వెళ్ళి పొమ్మంటూ ఎర్రబారే సూరీడే
తగవు తీర్చలేక మబ్బు చల్లంగచేరి ఝల్లె కురిసింది
నే పల్లెన తాకానంటూ
ఆ సూరీడుకు, చంద్రుడుకు
ఆకాశాన చుక్కలకు
కన్నెగరేసిందీ
– కోడి కూతతోనే

III. భాషాంశాలు

పదజాలం

1. క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలను సొంతవాక్యాల్లో ఉపయోగించండి.

అ) ఉపాధ్యాయుడు చెప్పే పాఠాన్ని చెవివారిచ్చి వినాలి.
అర్థం : శ్రద్ధగావిను
జవాబు:
ప్రహ్లాదుడు చండామార్కులు (గురువు గారు) చెప్పిన పాఠాలను చెవివారిచ్చి వినేవాడు.

ఆ) చిరుతపులులు గవిన్లలో నివసిస్తాయి. అర్థం : గుహలు
జవాబు:
అజంతా, ఎల్లోరా గవిన్లలో చిత్రకళా సంపద దాగి ఉన్నది.

TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట

ఇ) కుటిలవాజితనం పనికిరాదు.
అర్థం : కపట బుద్ధికలవాడు, మోసగాడు
జవాబు:
నక్క కుటిలవాజితనం కలిగి ఉంటుంది.

ఈ) మా ఊరి పొలిమేర లో పంటపొలాలున్నాయి.
అర్థం : ఊరిచివర (ఊరిచివర హద్దు)
జవాబు:
మా ఊరి పొలిమేర ఇప్పుడు చెరిగిపోయి నగరం కలిసి పోయింది.

2. క్రింది వాక్యాల్లో పర్యాయపదాల క్రింద గీత గీయండి.

అ) రోజూ పెయి కడుక్కోవాలి. లేకపోతే మేను వాసన వస్తుంది. దేహం నిండా ఈగలు ముసురుతాయి.
జవాబు:
రోజూ పెయి కడుక్కోవాలి. లేకపోతే మేను వాసన వస్తుంది. దేహం నిండా ఈగలు ముసురుతాయి.

ఆ) మనుషులు నీళ్ళు దొరికె తావుల్ల నివసిస్తారు. సరుకులు అమ్మే చోటులకు దగ్గరుంటారు. అందమైన ప్రదేశాలను ఇష్టపడతారు.
జవాబు:
మనుషులు నీళ్ళు దొరికె తావుల్ల నివసిస్తారు. సరుకులు అమ్మే చోటులకు దగ్గరుంటారు. అందమైన ప్రదేశాలను ఇష్టపడతారు.

3. క్రింది పట్టిక నుండి ప్రకృతి, వికృతులను వేరుచేసి రాయండి.

TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట 4
జవాబు:
1) సముద్రం – సంద్రం
2) ఆధారం – అదెరువు
3) శిఖ – సిగ
4) విద్య – విద్దె
5) ప్రయాణం – పైన

4. క్రింది జాతీయాలను ఏ అర్థంలో వాడుతారో తెలపండి.

TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట 5
జవాబు:
TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట 6

వ్యాకరణాంశాలు

1. క్రింది పదాలను విడదీసి సంధులను గుర్తించండి.

అ) ప్రాణాలు గోల్పోవు = ప్రాణాలు + కోల్పోవు (గసడదవాదేశ సంధి)
ఆ) మూటఁగట్టు = మూటన్ + కట్టు (సరళాదేశ సంధి)
ఇ) ఆసువోయుట = ఆసు + పోయుట (గసడదవాదేశ సంధి)
ఈ) కాలుసేతులు = కాలు + చేతులు (గసడదవాదేశ సంధి)
ఉ) పూచెనుగలువలు = పూచెను + కలువలు (సరళాదేశ సంధి)

వృద్ధి సంధి :

క్రింది పదాలను విడదీయండి.

ఉదా : రసైక = రస + ఏక = (అ + ఏ = ఐ)

అ) ఏకైక = ఏక + ఏక = (అ + ఏ = ఐ)
ఆ) వసుధైక = వసుధ + ఏక = (అ + ఏ = ఐ)
ఉదా : దివ్యైరావతం = దివ్య + ఐరావతం (అ + ఐ = ఐ)

అ) దేశైశ్వర్యం = దేశ + ఐశ్వర్యం = (అ + ఐ = ఐ)
ఆ) అప్లైశ్వర్యాలు = అష్ట + ఐశ్వర్యాలు = (అ + ఐ = ఐ)
ఉదా : ఘనౌషధి = ఘన + ఓషధి = (అ + ఓ = ఔ)

అ) వనౌషధి = వన + ఓషధి (అ + ఓ = ఔ)
ఆ) మహౌషధి = మహా + ఓషధి (అ + ఓ = ఔ)
ఉదా : రసౌచిత్యం = రస + ఔచిత్యం = (అ + ఔ అ)

అ) దివ్యౌషధం = దివ్య + ఔషధం: (అ + ఔ = ఔ)
ఆ) నాటకౌచిత్యం = నాటక + ఔచిత్యం = (అ + ఔ = ఔ)

పైన ఇచ్చిన పదాలను విడదీసినప్పుడు మీరు గమనించిన విషయాలు సరిచూడండి.

అ) ఈ సంధి ఏర్పడేటప్పుడు ప్రతిసారి పూర్వస్వరంగా ‘అ, ఆ’ లలో ఒకటి వచ్చింది.
(ఐ,ఔ లను ‘వృద్ధులు’ అంటారు.)
ఆ) పరస్వరం స్థానంలో వరుసగా ఏ, ఐ, ఓ, ఔ లున్నాయి.
ఇ) ‘అ’ కారానికి ఏ, ఐ లు కలిసినప్పుడు ‘ఐ’ వచ్చింది.
ఈ) ‘అ’ కారానికి ఓ, ఔ లు కలిసినప్పుడు ‘ఔ’ వచ్చింది.
అంటే ….

i) ‘అ’ కారానికి ఏ, ఐ లు పరమైతే ‘ఐ’ వస్తుంది.
ii) ‘అ’ కారానికి ఓ, ఔ లు పరమైతే ‘ఔ’ వస్తుంది.
‘వృద్ధుల’ వల్ల ఏర్పడిన సంధి కనుక ఇది వృద్ధి సంధి.

సూత్రం : అకారానికి (అ, ఆ లకు) ఏ, ఐలు పరమైతే ‘ఐ’ కారం, ఓ, ఔ లు పరమైతే ‘ఔ’ కారం ఏకాదేశంగా వస్తాయి.

TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట

ప్రాజెక్టు పని

అందమైన పల్లెటూరు చిత్రాలను సేకరించండి. పల్లెకు సంబంధించిన కవిత / పాట సేకరించి ప్రదర్శించండి. మీ మిత్రులు రాసినవన్నీ ఒక చోట చేర్చి సంకలనం తయారు చేయండి.
జవాబు:
పల్లెకు సంబంధించిన తెలంగాణ గీతం
(అత్యంత ప్రజాదరణ పొందిన గీతం)

పల్లెపల్లెనా పల్లేరు మొలచె పాలమూరులోన నా తెలంగాలోన
పాతగోడలు పందిరిగుంజలు సిన్నబోయినాయి
ఇండల్ల దుమ్మురేపినాయి ||పాత||

చెట్టుమీద ఆ పిట్టలెగురగా సేదబావిలో ఊటలూరుగా
పచ్చా పచ్చా నూళ్ళు పలుగురాళ్ళు తేలినాయి
అయ్యో పనిపాట లేక ప్రజలు తల్లడిల్లినారో ||పల్లె పల్లెనా||

దండీ గడాలు వెండి గాజులు మొలతాడులు కొనగ పోగులు
ఉన్నాదంతా నమ్మి కనిపెంచి నూరు విడిచి
పొట్టచేతపట్టి బతుకు బయలెల్లినాడో ||పల్లె పల్లె||

విశేషాంశాలు

1. నక్షత్రకుడు : విశ్వామిత్రుని శిష్యుడు. హరిశ్చంద్రుని వద్ద అప్పు వసూలు చేయడానికి విశ్వామిత్రునిచే నియమింపబడ్డాడు. ఈ విషయమై హరిశ్చంద్రుణ్ణి ముప్పుతిప్పలు పెట్టాడు. ఎదుటివారి కష్టాలను పట్టించుకోకుండా పీడించేవాడి విషయంలో ఈ జాతీయాన్ని వాడుతారు. మూలంలోలేని ఈ పాత్రను తెలంగాణ కవి అయిన గౌరన తన హరిశ్చంద్రోపాఖ్యానంలో మొదటిసారి ప్రవేశపెట్టాడు. ఈ పాత్ర తెలుగునాట చాలా ఆదరణ పొందింది.

2. వసతాగిన పిట్ట : ‘వస’ ఒక మొక్క. చిన్న పిల్లలకు మాటలు చక్కగా రావడానికి కొంచెం మోతాదులో దీని రసాన్ని తాగిస్తారు. మోతాదు ఎక్కువైతే మాటలెక్కువైతాయి. ఎక్కువగా మాట్లాడేవారి గురించి ఈ పదబంధాన్నివాడుతారు.

3. వెన్నెల మాసం : శరదృతువు విశేషంగా వెన్నెలను కురిపించే కాలం. ఆశ్వీయుజ, కార్తీక మాసాలు ఈ ఋతువుకు చెందినవి. ప్రత్యేకంగా కార్తీక మాసానికి వెన్నెల మాసంగా పేరుంది.

4. ఆసుపోయు : బట్టలు నేసేవారు వొడికిన దారాన్ని కుదురుకు చుట్టి ఆ తరువాత నేయవలసిన బట్ట పొడుగును అనుసరించి దారాలన్నీ వరుసలుగా అమర్చవలసి ఉంటుంది. అట్లా చేసేటప్పుడు ఆ పని చేసేవాడు ఒక కొన నుండి మరో కొనకు తప్పక తిరగవలసి ఉంటుంది. ఈ పనికి ‘ఆసుపోయడం’ అని పేరు. ఇట్లా విరామం లేకుండా తిరిగిన తోవనే మళ్ళీ మళ్ళీ తిరగడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు.

5. అలుగు : చెరువు నిండిన తరువాత మత్తడి అవుతుంది. ఆ తరువాత ఉబికి బయటికి వచ్చే నీళ్ళు కాలువ అవుతుంది. దీనిని ‘అలుగు’ అంటారు. ఈ క్రమాన్నే చెరువు నిండింది, మత్తడి దూకింది, అలుగు పారుతుంది అని అంటారు. అలుగు చెరువుకట్టకు రక్షణ. ఎక్కువైన నీళ్ళు దీని గుండా బయటికి పోవడంవల్ల చెరువుకట్ట తెగకుండా రక్షింపబడుతుంది.

సూక్తి : పరిస్థితులు మారాలంటే నువ్వు మారాలి. అవి బాగుపడాలంటే, నువ్వు బాగుపడాలి. మారుతున్న ప్రపంచంతో పాటు మనమూ మారాలి.

పదాలు – అర్ధాలు

I

నక్షత్రకుడు = హరిశ్చంద్రుని బాకీ కోసం వెంట పడినవాడు, విశ్వామిత్రుని శిష్యుడు
ఊకున్నాడా ? = ఊరుకొన్నాడా ?
ఈగకాలం = ఆషాఢమాసం
జనిగెపట్టు = మూర్ఖత్వపు పట్టుదల
సోద = గొడవ, వాగుడు
కయ్య = చిన్న కాలువ
పొంటి = దారివెంట
పేను వారైనా = పేను పాకితే
గండ్లు = నీళ్ళు ఎక్కువగా వచ్చుటచేత తెగిన గట్టులు
పట్టు = పంతం
నడుములిర్గె = నడుములు విరుగుతున్నాయి
మెచ్చిందాక = మెచ్చుకొనేదాక
బంక = జిగురు
వార్రెలు = బీటలు, పగుళ్ళు
పూలకాలం = వసంతకాలం
గని = కాని
ఎన్నెల మాసం = వెన్నెల రోజులు
సోకు = అందం
పెయి = శరీరం
సాళ్ళు = వరుసలు
ముత్తైదలోలె = ముత్తైదువుల వలె
కొటారి కొమ్మల్లల్ల = చిట్టచివరి కొమ్మలు
శికె = చివర
పోషాకులు = వేషధారణ
వస = వాక్కును శుద్ధి చేసే ఔషధమూలిక
రొద = చప్పుడు
ఏరు = నది, ప్రవాహం
సెవ్వు = చెవ్వు
బాట = దారి
ఇడిస్తెన = విడిస్తేనా !
మాసం = నెల
సొంపు = అందం
పాలిపేర = గుర్తు, చిహ్నం, జాడ

TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట

II

పదం = పాట
బాడ్తండేంది = పాడుతున్నాడేమిటి
ఇందుట్ల = ఇందులో
పురాగ = పూర్తిగ
గని = కాని
పచ్చరం = బట్ట, వస్త్రం
రొండు = రెండు
దెర్సి = తెరిచి
తావు = చోటు
సంబురం = సంతోషం, సంబరం
యోగం = అదృష్టం
ఒగరో = ఒకరో
వాళ్ళల్ల = వాళ్ళలో
బండారి = కుంకుమ
మత్తడి = రేగడిపొలం
బంగుల = బంగ్లా
ఇగి = ప్రవేశం, అతిశయం
యావి = ఏ
ఆడ = అక్కడ
రచ్చకట్ట = రచ్చబండ
మణుసులు = మనుషులు
ఇంగోటి = ఇంకొకటి
తీర్గ = తీరుగా
వోరగ = చివరగ
గూ సండె = కూర్చొనే
కాన్రాలేదు = కనబడలేదు
పయినం = ప్రయాణం
రాగిచెట్టు = రావిచెట్టు
తొక్కుడువడ్డ = అలవాటు పడ్డ
ఎలుతురు = వెలుతురు
రొంపి = బురద
ఆసరా = తోడు, సహాయం, అండ
యాదికి = గుర్తుకు
మోతెబరి = ఊరి పెద్ద
సూడిగములు = గాజులు, కడియములు
చిత్రము = సిత్రము
సంబురాము = వేడుకలు

III

పొద్దుమాపు పూట = రాత్రిపూట
మళ్ళెపడి = తిరగబడి
పచ్చపూస గన్కనా ? = సత్యవంతుడు కనుకనా ?
పాడు గొట్లాడినట్లు = పాడుపడినట్లు
పంగనామం బెట్టిన్రు = మోసం చేసారు
కుటిలవాజి = మోసగాడు
మిత్తి = మృత్యుదేవత, పీడ
సాగువాటు = ఇల్లు గడవడం
గత్తరిచ్చే = కత్తిరించే
పొలండ్ల = పాలివాళ్ళు, వాటాదార్లు
అయిన = ఆయన
దోసక = తోచక
ఇంగ = ఇంక
వాడ = వీధి
దీస్కొని = తీసుకొని
పసికారు = కుర్రాళ్ళు
లొగులతొండలు = చిత్రవధలు
సాగిపోతనే ఉండది = సాగిపోతూనే ఉంది
నక్కతంతుల సింగోటం = నక్క వ్యవహారంలాంటి ఎత్తులు
దప్తురం = పద్దు పుస్తకం
గట్టుకం = కట్టడం, చెల్లించడం
మిత్తి = మృత్యువు (చావు), వడ్డీ
సుట్టాల = చుట్టాల
ఉద్ది = జత, జట్టు
ఇసం = విషం
జూస్కోని = చూస్కొని

IV

ఇంగ = ఇక
మగ్దూరు = నియమం
నడుత = ప్రవర్తన
తామసం = కోపం
పణమీది = మెడమీది
నడ్సిన = నడిచేను
బంకులు = సందులు
సింపులు = పీలికలు(చింపులు)
బద్ధురం = భద్రంగ
సవారి = పల్లకి, ప్రయాణసాధనం
మెరిచ్చిన మెరియ్యని = మెరిపించి మెరియ్య
ఇంది = అయ్యింది
ఇనిపిచ్చింది = వినిపించింది
పొత్తువిల్లు = ఉమ్మడి ఇల్లు
మెరిమెణ = ఊరేగించు (మెరిచ్చు)
ముంగల = ముందు
సప్పుడు = చప్పుడు
సెంబు = చెంబు
అమాంతం = ఒక్కసారిగా
వొల్లనంటదా ? = ఒప్పుకోనంటుందా
బాయికాడి = బావికాడి
పేకల లేదు = పెగలలేదు

పాఠం ఉద్దేశం

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వేగంగా చోటుచేసుకున్న మార్పులు, క్రమానుసారంగా రాబోయే కొత్త మార్పులు, ఊహించని పరిణామాలు, పర్యవసానాలు, స్థానిక ఆధిపత్యశక్తుల మీద సామాన్యుడి కొత్త విజయాలను సంకేతాత్మకంగా చిత్రిస్తుందీ కథ. ప్రాంతీయ, భాషాపరమైన దృక్పథంలో తెలంగాణ అస్తిత్వచైతన్యానికి నిదర్శనంగా నిలబడి కొత్తబాటలో నడిచిన కథను పరిచయం చేయడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందినది. రెండు తరాలకు సంబంధించిన వివరాలు, తరాలమధ్య కాలాను గుణంగా వచ్చిన మార్పులు మొదలైన విషయాలను డా॥ పి. యశోదారెడ్డి తమ ‘కొత్తబాట’లో తెలియపరిచింది. నేషనల్ బుక్స్ట్ ప్రచురించిన ‘యశోదారెడ్డి ఉత్తమ కథలు’ గ్రంథంలోనిది ఈ పాఠ్యభాగం.

రచయిత్రి పరిచయం

రచయిత్రి : డా॥ పాకాల యశోదారెడ్డి
జననం : 8.8.1929
మరణం : 7.10.2007
జన్మస్థలం : నాగర్ కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి గ్రామం.
పరిశోధనాంశం : “తెలుగులో హరివంశాలు”
నిర్వహించిన పదవులు : తెలుగు ప్రొఫెసర్గా ‘ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేశారు. రాష్ట్ర అధికారభాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన తొలి మహిళ.
రచనలు : ఆంధ్ర సాహిత్య వికాసము, పారి జాతాపహరణ పర్యాలోచనము, ఎర్రాప్రెగడ, కథాచరిత్ర వంటి పరిశోధనా గ్రంథాలను రచించారు. మావూరిముచ్చట్లు, ఎచ్చమ్మకథలు, ధర్మశాల వంటి కథా సంపుటాలను రాశారు.
ఇతర అంశాలు : వీరి రేడియో ధారావాహిక కార్యక్రమం “మహాలక్ష్మి ముచ్చట్లు” ఎంతో ప్రజాదరణ పొందింది.
శైలి : అందమైన తెలంగాణా మాండలికంలో కథలు రాసి తెలంగాణ భాషా సౌందర్యాన్ని, నాటి తెలంగాణ సామాజిక, సాంస్కృతిక జనజీవన వైవిధ్యాన్ని తమ కథల ద్వారా తెలియజేశారు.

TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట

ప్రవేశిక

ఈ ‘కొత్తబాట’ గురించి డా|| పి. యశోదారెడ్డి మాట్లాడుతూ “ఈ కథ తెలంగాణ మాండలికంలో వ్రాయబడింది. అక్కాతమ్ముళ్ళిద్దరూ బస్సుదిగి అక్కడి నుండి ఎద్దుల బండిలో వాళ్ళ ఊరి వరకు ప్రయాణం చేసిన రెండు గంటల్లో రెండు తరాలకు జరిగిన ఘర్షణ, సాధించిన విజయాలు సప్రమాణంగా ప్రదర్శింపబడ్డాయి. ఈ సంభాషణలో ఎన్నో సాంఘిక దురాచారాలు తడమ బడ్డాయి. భాష తెలంగాణ మాండలికాన్ని జీర్ణించుకొని, ఆ జాతీయాన్ని, జీవనరీతిని, నుడికారాన్ని ప్రదర్శిస్తుందని” చెప్పింది. ఆ కొత్తబాటలో మనం నడక మొదలు పెడుదాం.

విద్యార్థులకు సూచనలు

  • పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
  • పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత గీయండి.
  • వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పదవిజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకొండి.

ప్రక్రియ -కథానిక

ప్రాచీన తెలుగు సాహిత్య ప్రక్రియల్లో కథానిక ఒకటి. నేడు కథ, కథానిక అనే పదాలను పర్యాయ పదాలుగా వాడుతున్నాము. ఇది ఒక వచన సాహిత్య ప్రక్రియ. వ్యక్తి జీవితంలోని ఒక ముఖ్య సన్నివేశాన్నిగాని, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. క్లుప్తత దీని ప్రధాన లక్షణం. పాత్రలు, నేపథ్యము కథనము, జీవిత వాస్తవిక చిత్రణ కథానిక ప్రక్రియలోని ముఖ్య బాణీలు.

TS 10th Class Telugu Guide 3rd Lesson వీర తెలంగాణ

Telangana SCERT 10th Class Telugu Guide Telangana 3rd Lesson వీర తెలంగాణ Textbook Questions and Answers.

TS 10th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వీర తెలంగాణ

చదవండి – ఆలోచించి చెప్పండి (T.B. P.No. 26)

తెలుగు గుండెల బిగువు
తెలిపింది తెలగాణ
తెలుగు జోదుల తెగువ
చూపించి తెలగాణ

దేశానికే ముందు నిల్చిందిరా తెలగాణ
దేశానికే పేరు తెచ్చిందిరా !
పరాన్నభుక్కులకు
పక్కలో బల్లెమై
దేశద్రోహుల కింక
తావులేదని చాటి

ఢంకా బజాయించెరా తెలగాణ
దౌర్జన్య మెదిరించెరా !
జయభేరి మోగించెరా తెలగాణ
జయము రైతుల కందెరా !
– (కొత్తపల్లి రంగారావు తెలంగాణ పోరాట పాటలు)

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ఈ గేయాన్ని రాసిందెవరు ?
జవాబు:
ఈ గేయాన్ని కొత్తపల్లి రంగారావుగారు రాశారు.

ప్రశ్న 2.
ఈ గేయం దేని గురించి తెలియజేస్తున్నది ?
జవాబు:
ఈ గేయం తెలంగాణ పోరాటం గురించి తెలియజేస్తున్నది.

TS 10th Class Telugu Guide 3rd Lesson వీర తెలంగాణ

ప్రశ్న 3.
ఈ గేయాన్ని ఎందుకు రాసి ఉంటాడు ?
జవాబు:
ఈ గేయాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాసిఉంటాడు.

ప్రశ్న 4.
ఇట్లా తెలంగాణ గురించి రాసిన కవులు, రచయితలు ఎవరు ? ఎందుకు రచనలు చేసి ఉంటారు ?
జవాబు:
తెలంగాణ గురించి రాసిన కవులు, రచయితలు కాళోజి, డా॥ సినారె, సామల సదాశివ, అలిశెట్టి ప్రభాకర్, డా॥ దాశరథి కృష్ణమాచార్య మొదలగు వారు. వీరంతా తెలంగాణ సాధన కోసం రచనలు చేసారు.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 28)

ప్రశ్న 1.
ఈ భూమండలమంతా ఎందుకు ప్రతిధ్వనించింది ?
జవాబు :
తెలంగాణలో రజాకార్ల దుర్మార్గాలు మితిమీరి పోయాయి. మొత్తం తెలంగాణ ప్రజానీకమంతా ఏకమైంది. తన శత్రువులైన రజాకార్లపై ఎదురు తిరిగింది. పొలికేకలు పెట్టింది. ఆ బొబ్బలు ఎలా ఉన్నాయంటే తెలంగాణ మొత్తం ఒకేసారి యుద్ధ శంఖం పూరించినట్లుగా ఉంది. ఈ భూమండలంలో ప్రతిచోటా తెలంగాణ వాళ్ళు ఉన్నారు. ఎక్కడి వాళ్ళు అక్కడి నుండే సమరశంఖం పూరించారు. అందుకే అది భూమండలమంతా ధ్వనించిందని కవి చెప్పాడు.

ప్రశ్న 2.
బ్రతుకుతోవ చూపే కాలం రావడం అంటే ఏమిటి ?
జవాబు :
రజాకార్లు తెలంగాణను అభివృద్ధి చెందనివ్వలేదు. తర తరాల నుండి తెలంగాణ దోపిడీకి గురయ్యింది. తెలంగాణ ప్రజలు జీవనోపాధులను కోల్పోయారు. దెయ్యాలు, పిశాచాల వంటి దోపిడీదారుల ఉక్కుపాదాల కింద నలిగిపోయారు.

ఇప్పుడు క్రొత్త బ్రతుకు తోవ ఏర్పడే కాలం వచ్చింది. అంటే స్వేచ్ఛగా తమ బ్రతుకు నిర్ణయాలు తామే తీసుకొనే మంచి సమయం వచ్చిందని అర్థం.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 29)

ప్రశ్న 1.
“తెలంగాణ నేలలో ఎంత బలం ఉన్నదో కదా !” అని కవి ఎందుకన్నాడు ?
జవాబు:
కోటిమంది తెలుగు పిల్లలను తెలంగాణ ఒడిలో పెంచింది. కత్తులనిచ్చి, వజ్రాయుధమంతటి కఠినమైన భుజ పరాక్రమాలను చూపేటట్లు రాజుతో తలపడు తుంది. కావున ఈ తెలుగునేలలో ఎంత బలం (కాంతి) ఉన్నదని అర్థం.

ప్రశ్న 2.
‘గడ్డి పోచకూడా కత్తిలా మారటం’ అంటే ఏమిటి ?
జవాబు:
సాధారణంగా గడ్డి మనం నడిస్తే పాదాల కింద పడినలిగి తలవంచి నిలబడుతుంది. కానీ కొన్నిసార్లు ఆ గడ్డి పోచలే బిరుసెక్కి అరికాళ్ళలో ముళ్ళలా గుచ్చుకుంటున్నప్పుడు ఒక్క అడుగు కూడా సరిగా వేయలేం. అట్లాగే పిల్లలుగా పుట్టిన తెలంగాణ బిడ్డలు యుక్తవయసు రాగానే కత్తి చేపట్టి నిర్దయుడైన రాజుతో యుద్ధం చేయటానికి సిద్ధమవటాన్ని కవి అలా పోల్చాడు.

TS 10th Class Telugu Guide 3rd Lesson వీర తెలంగాణ

ప్రశ్న 3.
నవోదయం రావడమంటే మీరేమని అనుకొంటున్నారు ?
జవాబు:
ఉదయం అనేది రోజుకు మొదలు. ఉదయంతో రోజు ప్రారంభం అవుతుంది. అంటే ఉదయం అనేది రోజు మొత్తానికి తొలి అడుగు.

ప్రతిరోజూ ఉదయం జరుగుతూనే ఉంటుంది. రోజులు గడుస్తూనే ఉంటాయి. కాని, నవోదయం అంటే క్రొత్త ఉదయం. అంతవరకూ జరిగిన దానికి భిన్నంగా రోజు ప్రారంభమవడం. పాత రోజులలో ఉండే కష్టాలు, బాధలు లేకుండా క్రొత్త ఉత్సాహం, అభివృద్ధి చెందే ఆలోచనలకు అవకాశం కల్పించేది నవోదయం. అటువంటి అభివృద్ధే నవోదయం రావడమంటే అని అనుకొంటున్నాము.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
తెలంగాణ వీరుల ప్రత్యేకత ఏమిటి ? (T.B. P.No. 29)
జవాబు:
తెలంగాణా వీరులు భూమండలాన్నంతా సవరించి ఉజ్జ్వలమైన, కాంతిమంతమైన సూర్యుడిని పిలిచి దేశమంతా కొత్తకాంతి సముద్రాలు నింపారు. వీరులు, యోధులు మరియు న్యాయం తెలిసిన పరోపకారులైన తెలుగు వీరులు తెలంగాణ వీరులు.

ప్రశ్న 2.
బ్రతుకు ఎప్పుడు దుర్భరం అవుతుంది ?
జవాబు:
మత పిశాచం విజృంభిస్తే బ్రతుకులు దుర్భరం అవుతాయి. స్వేచ్ఛ లేకపోతే బ్రతుకు భరించలేము మతకల్లోలాలు జరిగితే చాలామంది బ్రతుకులు నాశనం అవుతాయి. ఏ దిక్కూ మొక్కూ లేకపోయినా బ్రతకడం కష్టం. నీతి, న్యాయం, ధర్మం, విద్య లేని సమాజంలో బ్రతుకు దుర్భరం.

ప్రశ్న 3.
ఆకాశాన జెండాలు రెపరెపలాడటం దేనికి సంకేతం ?
జవాబు:
రుద్రమదేవి పరాక్రమించినపుడు తెలుగు జెండాలు ఆకాశాన రెపరెపలాడాయి. ఇది రుద్రమదేవి పరా క్రమానికి నిదర్శనం. తెలంగాణ విజయానికి సంకేతం.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పంద – ప్రతిస్పందన

ప్రశ్న 1.
కింది అంశాలను గూర్చి చర్చించండి.

అ) ‘వీర తెలంగాణ’ అనే పాఠం పేరు వినగానే మీకు ఎటువంటి అనుభూతి కలిగింది ? దాశరథి తెలంగాణను వీర తెలంగాణ అనడాన్ని తగిన ఉదాహరణలతో సమర్థించండి.
జవాబు:
‘వీర తెలంగాణ’ పేరు వినగానే గొప్ప పోరాటాలు కనుల ముందు మెదిలి వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. గడచిన బాధల మబ్బులు ఒక్కసారిగా తొలిగి వెలుతురు వచ్చినట్లు అయింది. తెలంగాణ పేరు ముందు ఉన్న ‘వీర’ అను పదం తెలంగాణలో ఉన్న పోరాటాల చరిత్రను గుర్తు చేసి ఆలోచింపచేసింది.

దాశరథి రాసిన ‘రుద్రవీణ’ అనే పేరుతోనే ఆవేశము, పోరాటము, ఉద్యమము వినిపిస్తాయి. అందులోనూ ఈ పాఠంలో ప్రతి పద్యపాదంలోని పదాలు చరిత్ర చెబుతూ స్ఫూర్తిని ఇస్తాయి. తెలంగాణ పెదవుల మీది నుంచి వచ్చిన శంఖపు చప్పుడు నాలుగు చెరగులా ప్రతిధ్వనించింది అనటం వల్ల తెలంగాణ పోరాటం ఎంత ఉద్వేగభరితంగా జరిగిందో చెప్పవచ్చు.

కోటిమంది తెలుగు పిల్లలు తెలంగాణ యోధులై కత్తులు దూసే వజ్రాయుధమంతటి భుజ పరాక్రమం కలిగి నిజాం రాజుతో తలపడమని తెలంగాణ నేల చెప్పినదన్నప్పుడు తెలంగాణ వీరుల పరాక్రమం అక్షరాల్లో కనిపించి ‘వీర తెలంగాణ’ అనటం సరియైనదే అనిపిస్తుంది.

తెలంగాణలో మొలచిన గడ్డిపోచ కూడా కత్తిపడుతుందని, తెలంగాణ స్వాతంత్ర్య పోరాటం సముద్రంలాగా ఉప్పొంగుతున్నదని, నవాబుల ఆజ్ఞలకు కాలం చెల్లించిందనీ అనటం కూడా ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.

కాకతీయుల పోరాటాలు గుర్తుకు తెస్తూ రుద్రమనూ, కాపయ నాయకుడినీ గుర్తు చేసినపుడు, దొంగ దెబ్బలకు భయపడకుండా శత్రురాజుల గుండెలు ఆగేలా ఉరిమిన తెలంగాణ మేఘపు గర్జనలను గుర్తుచేసినపుడు, దాశరథి ఈ పాఠాన్ని ‘వీర తెలంగాణ’ అనటం సబబే అనిపించి తీరుతుంది.

ప్రశ్న 2.
కింది అపరిచిత కవితను చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

తోటమాలి బలిదానం చేస్తేనే
పువ్వులు పరిమళాల నీనగలవు
మానవుడు కలవాలి మానవుణ్ణి
తిడితే ఏం లాభం కనిపించని దేవుణ్ణి
ఆకాశానికి శోభ చందమామ
మిణుగురుతో విద్యుత్కాంతులు ప్రసరించవు
మారాలి నేటి నాటువ్యక్తి
కాకుంటే లే దెన్నటికి విముక్తి
మానవునికి మానవుడే ధ్యేయం
మానవత్వమే మానవజాతికి శ్రేయం
చరిత్రలు మన ఉనికికి కావు ప్రమాణం
ధరిత్రిని వెనక్కి నెట్టి చేయాలి ప్రయాణం
(కవిరాజ మూర్తి)

ప్రశ్నలు

అ) పూలు ఎప్పుడు తమ పరిమళాలను వెదజల్లగల్గుతాయి ?
జవాబు:
తోటమాలి బలిదానం చేస్తే పువ్వులు పరిమళాలను వెదజల్లగల్గుతాయి.

ఆ) ఎవరిని తిట్టగూడదు ?
జవాబు:
దేవుడ్ని (కనిపించని) తిట్టకూడదు.

TS 10th Class Telugu Guide 3rd Lesson వీర తెలంగాణ

ఇ) ఎవరు మారాలి ? ఎందుకు మారాలి ?
జవాబు:
నేటి నాటువ్యక్తి (సామాన్యుడు) మారాలి. ఎందుకంటే మారకపోతే మానవునకు అజ్ఞానం నుండి, బాధల నుండి విముక్తి కలగదు.

ఈ) మానవుడు ఏవిధంగా ప్రయాణం చేయాలి ?
జవాబు:
ఈ భూమిని (ధరిత్రిని) వెనక్కి నెట్టి ప్రయాణం చేయాలి. అంటే భూమికంటే వేగంగా అభివృద్ధి మార్గంలో మానవుడు ప్రయాణించాలి.

ఉ) పై కవితకు శీర్షిక నిర్ణయించండి.
జవాబు:
పై కవితకు శీర్షిక “మానవత్వం”.

ఊ) పై కవితను రాసింది ఎవరు ?
జవాబు:
కవిరాజ మూర్తిగారు రచించారు.

ప్రశ్న 3.
రెండో పద్యానికి ప్రతిపదార్థం క్రింద ఉంది. ఇదే విధంగా 3, 4, 6 సంఖ్య గల పద్యాలకు ప్రతిపదార్థాలు రాయండి.
2వ పద్యం ప్రతిపదార్ధము
తల్లీ = అమ్మా !
నీ = నీ యొక్క
ప్రతిభా విశేషములు = ప్రజ్ఞా విశేషాలు
కొన్ని తరాలదాక = కొన్ని తరాల వరకు
భూతప్రేత = చెడు శక్తుల (భూతప్రేతాల)
హస్తమ్ములన్ = చేతులలో
డుల్లెన్ = పడిపోయినవి (చిక్కుకున్నవి)
ఇపుడు = ఇప్పుడు
అడ్డుల్ + పోయెన్ = అడ్డంకులు తొలగిపోయాయి
సౌదామనీవల్లీ = మెరుపుతీగల
ఫుల్ల = విచ్చుకున్న
విభా + ఆవళుల్ = కాంతులవరుసలు
బ్రతుకుత్రోవల్ = బ్రతుకు దారులను
చూపు = చూపే
కాలమ్ములున్ = సమయములు
మళ్ళెన్ = తిరిగివచ్చినవి (అదిగో)
స్వచ్ఛతర = అత్యంత స్వచ్ఛమైన
ఉజ్జల = ప్రకాశవంతమైన
ప్రథమ సంధ్యా = తొలి పొద్దు
భానువు = సూర్యుడు
ఏతెంచెడిన్ = వస్తున్నాడు (ఉదయిస్తున్నాడు)

జవాబు:
ప్రతిపదార్థ తాత్పర్యాలలో 3, 4, 6 పద్యాలు చూడుము.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) “తెలంగాణ గొప్పతనపు విశేషాలు కొన్ని తరాలవరకు దుర్మార్గుల చేతిలో చిక్కుకొన్నాయి” అన్న కవి మాటలను మీరెట్లా సమర్థిస్తారు ?
జవాబు:
తెలంగాణ ఎంతో సాంస్కృతిక వికాసం కలది. భాషా సంస్కృతులు ఎంతో గొప్పవి. కానీ ఇవన్నీ చరిత్రలో ఇనుప పద ఘట్టనల కింద నలిగిపోయాయి. తెలంగాణ నేలమీద విముక్తి ఉద్యమాలు, సాయుధ పోరాటాలు, ప్రత్యేక రాష్ట్ర మహోద్యమాలు సముద్రంలో అలల మాదిరిగా పొంగాయి.

తెలంగాణ గొప్పతన విశేషాలు అన్నీ కొన్ని తరాల వరకు దుర్మార్గుల చేతిలో చిక్కుకున్నాయి. ఇప్పుడు ఆ రోజులు పోయినాయి. అడ్డంకులు తొలగి పోయాయి అన్నాడు దాశరథి. కవి మాటలను నేను సమర్థిస్తున్నాను. “నేను నా తెలంగాణ నిగళాలు తెగద్రొచ్చి ఆకాశమంత ఎత్తు అరచినాను” అన్నాడు కవి. ఈ విధంగా ఎందరో వీరుల త్యాగఫలమే నేటి తెలంగాణ. ఎన్నో పోరాటాల ఫలితంగా 2014 జూన్ రెండవ తేదీన పరిపూర్ణ స్వాతంత్య్రం పొందింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దానితో తెలంగాణ ఆశలు నెరవేరాయి.

ఆ) “తెలగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము” అని దాశరథి ఎందుకన్నాడు ?
జవాబు:
ఈ తెలంగాణలో గడ్డిపోచ కూడా కత్తి బట్టి ఎదిరించింది. గొప్ప రాజుగా పేరొందినవాని గర్వాన్ని అణచేటట్లుగా యుద్ధం సాగించింది. ఏమి జరుగు తుందో తెలియక జగమంతా భయపడిపోయింది. దిగంతాలన్నీ ఆకాశంలో ఇంద్రధనుస్సుల పరంపరలచేత సయ్యాటలాడాయి.

కాబట్టి “ఇక్కడ పుట్టిన చిగురు కొమ్మైనా చేవగలది”. “తెలంగాణలో చాలా చిన్నదయిన గడ్డి పోచకు కూడా కత్తిబట్టి యుద్ధం చేయగల సత్తా ఉందని” కవి చెప్పాడు.

ఇ) తెలంగాణలో సంధ్యాభానువు మొదటిసారి ఉదయించాడని కవి ఎందుకన్నాడు ?
జవాబు:
అమ్మా తెలంగాణమా ! నీ గొప్పతనపు విశేషాలు కొన్ని తరాల వరకు దుర్మార్గుల చేతులలో చిక్కుకొన్నాయి. ఇప్పుడు ఆ రోజులు గతించాయి. అడ్డంకులు తొలిగాయి. విచ్చుకున్న మెరుపు తీగల కాంతిరేఖలు బతుకుతోవ చూపే కాలం వచ్చింది. స్వచ్ఛమైన కాంతవంతమైన సంధ్యాసూర్యుడు మొదటి సారి ఉదయించాడు.
కాబట్టి కాంతి జ్ఞానానికి సంకేతం – విముక్తికి సంకేతం. కాంతివంతము, స్వచ్ఛమయిన సూర్యకాంతి తెలంగాణకు వచ్చిందని కవి భావన.

ప్రశ్న 2.
క్రింది ప్రశ్నకు పది వాక్యాలలో జవాబు రాయండి.

TS 10th Class Telugu Guide 3rd Lesson వీర తెలంగాణ

అ) వీర తెలంగాణ పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటలలో రాయండి.
(లేదా)
వీర తెలంగాణ పాఠం ఆధారంగా తెలంగాణ వీరుల ఘనతను వర్ణించండి. (June ’16)
జవాబు:
ఓ తెలంగాణమా ! నీ పెదవులతో ఊదిన శంఖధ్వనులు ఈ భూమండలమంతా ఒక్కమారుగా బొబ్బలు పెట్టినట్లుగా ప్రతిధ్వనించాయి. ఆహా ! ఉదయించిన సూర్యుని కిరణాలచేత ప్రీతిపొందిన పద్మాలచే, చలించిన ఆకాశగంగా తరంగాలు అన్ని దిక్కులను తెలవారేటట్లు చేశాయి. అమ్మా తెలంగాణమా ! నీ గొప్పతనపు విశేషాలు కొన్ని తరాల వరకు దుర్మార్గుల చేతులలో చిక్కుకొన్నాయి. ఇప్పుడు ఆ రోజులు గతించాయి. అడ్డంకులు తొలిగాయి. విచ్చుకున్న మెరుపు తీగల కాంతిరేఖలు బతుకుతోవ చూపే కాలం వచ్చింది. స్వచ్ఛమైన, కాంతిమంతమైన సంధ్యా సూర్యుడు
మొదటిసారి ఉదయించాడు.

అమ్మా ! కోటిమంది తెలుగు పిల్లలను నీ ఒడిలో పెంచావు. వారికి వయసురాగానే చేతులకు కత్తులనిచ్చి, వజ్రాయుధమంతటి కఠినమైన భుజపరాక్రమాలను చూపేటట్లు రాజుతో తలపడమన్నావు. అమ్మా ! ఈ తెలుగు నేలలో ఎంత బలం ఉన్నదో కదా ! ఈ తెలంగాణలో గడ్డిపోచకూడా కత్తి బట్టి ఎదిరించింది. గొప్ప రాజుగా పేరొందినవాని గర్వాన్ని అణచేటట్లుగా యుద్ధం సాగించింది. ఏమి జరుగుతుందో తెలియక జగమంతా భయపడిపోయింది. దిగంతాలన్నీ ఆకాశంలో ఇంద్ర ధనుస్సుల పరంపరలచేత సయ్యాట లాడాయి.

తెలంగాణా స్వాతంత్ర్య పోరాటం సముద్రం మాదిరిగా ఉప్పొంగుతున్నది. నాలుగువైపుల నుండి సముద్రానికి గండికొట్టి తెలంగాణ నేలనంతా స్వాతంత్ర్యపు నీటితో తడుపుతున్నారు. ఉద్రిక్తత కలిగించిన నవాబుల ఆజ్ఞలకు కాలం చెల్లిపోయింది. అమ్మా తెలంగాణా ! నీ పిల్లలలో ప్రకాశించే విప్ల వాత్మకమైన కదలిక ఊరికే పోలేదు. భూమండ లాన్నంతా సవరించి ఉజ్జ్వలమైన కాంతిమంతమైన సూర్యుడిని పిలిచి దేశమంతా కొత్త కాంతి సముద్రాలు నింపారు. వారంతా వీరులు, యోధులేకాదు. న్యాయం తెలిసిన పరోపకారులైన తెలుగువీరులు సుమా !

అమ్మా ! మతం అనే పిశాచి తన క్రూరమైన కోరలతో మా నేలను ఆక్రమించి మా గొంతులు కోస్తున్నప్పుడు, ఏ దిక్కూ తోచనప్పుడు, బ్రతకడమే భారమైనప్పుడు తెలుగుదనాన్ని కోల్పోలేదు. యుద్ధ రంగంలో రుద్రాదులు మెచ్చేటట్లు చివరికి విజయాన్ని సాధించాం. ఇక్కడ కాకతీయ రాజుల కంచుగంట మ్రోగినప్పుడు దుర్మార్గులైన శత్రురాజులు కలవర పడ్డారు. రుద్రమదేవి పరాక్రమించినప్పుడు తెలుగు జెండాలు ఆకాశాన రెపరెపలాడాయి. కాపయ్య నాయకుడు తన విజృంభణం చూపినప్పుడు శత్రు రాజులకు గుండెలు ఆగిపోయాయి.

చాళుక్య రాజులు పశ్చిమ దిక్కున పరిపాలన చేసేటప్పుడు మంగళకరమైన జయధ్వనులు మోగాయి. నాటి నుండి నేటి వరకు తెలంగాణం శత్రువుల దొంగ దెబ్బలకు ఓడిపోలేదు. శ్రావణ మాసంలోని మేఘం మాదిరిగా గంభీరమైన గర్జనలు అలరారుతుండగా నా తెలంగాణం ముందుకు సాగుతూనే ఉన్నది.

ప్రశ్న 3.
కింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

అ) ‘తెలంగాణ తల్లి’ తన గొప్పదనాన్ని వివరిస్తున్నట్లుగా ఏకపాత్రా భినయం రాసి ప్రదర్శించండి. లేదా ఆత్మకథ రాయండి.
జవాబు:
ఏకపాత్ర
ఏంది అట్టా సూత్తుండ్రి ? నేనే మీ యమ్మను. అదే బిడ్డా ! మీ తెలంగాణా తల్లిని. ఏందట్లో నవ్వుతుండావే ఎన్నేళ్ళయింది బిడ్డల్లారా ! మీ మొగాన నగవు చూసి, మీరు నా కోసం ఎన్ని బాదలు పడ్డారో ? ఎంతమంది నా బిడ్డల ఉసురు కోల్పోయేరో ? వాళ్ళందర్నీ తల్చుకొంటే కడుపు చెరువయ్యేను. ఒకటే పట్టు, మొండి పట్టు, జనిగె పట్టు పట్టారు, సాధించారు.

ఇదిగో ఇయ్యేల నాకు పూలకాలం తియ్యటి తీపులదినం. ఏమనుకున్నవో ? ఓ బిడ్డా ! ఇయ్యేల నా తెలంగాణాలో అదేనో మనింట్లో ఎక్కడ జూసిన కమ్మటి వాసన. ఇను సొంపైన రొద. అదో ! అక్కడి దిక్కు జెర నా చెవు వారిచ్చి ఇను, ఎడవాసిన ఎదలను ఏకంజేయ పేరుపెట్టి పిలుస్తున్నట్లు ఆ కోయిల కూతలు.

మంగళార్తులు ఈయడానికి ముత్తైదలొత్తన్నారు. జర ఆనందంగా ఉండండి. ఇగ మనకు కష్టాలు లేవు. సల్లగా నవ్వాలి నా వోళ్ళంతా.

ఆత్మకథ

ఎన్నో కష్టాలు పడ్డాను. నా కళ్ళ ముందే నా బిడ్డలు పిట్టల్లా రాలిపోతుంటే వెక్కి వెక్కి ఏడ్చాను. పరాయి పాలనలో ఎన్ని బాధలు పడ్డానో ? తలుచు కొంటే ఒళ్ళు జలదరిస్తుంది. పాల్కురికి సోమన, బమ్మెర పోతన వంటి భక్త కవులను తలచుకొంటే భక్తి భావంతో పరవశించి పోతాను. యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహస్వామిని చూసినప్పుడల్లా అనుకొంటాను కష్టాలు అశాశ్వతమని. ఆయన హిరణ్య కశిపుడిని చంపాక ప్రహ్లాదుడిని కాపాడాడు కదా !

అలాగే ఏదో రోజు పరాయి పాలన అనే హిరణ్య కశిపుడు అంతమౌతాడు. ప్రహ్లాదుడు లాంటి నా తెలంగాణా బిడ్డలు రక్షించబడతారు అని నా నమ్మకం. అది నెరవేరింది.

దాశరథిలాంటి విప్లవ కవులు పుట్టడం నా అదృష్టం. తెలంగాణ పోరాటాలలో నా ‘కవి కుమారుల’ గొప్పతనాన్ని మరిచిపోగలనా? ఎంతోమంది కళా కారులను కన్నాను. మీకెవ్వరికీ అన్నానికి లోటులేదు. ఇది తెలుగు మాగాణి. నేనెప్పుడూ పదిమందికి పెట్టాను. అందుకే మీకూ నా లక్షణాలే వచ్చాయి.

ఇది మన ఇల్లు. మనం అభివృద్ధి చేసుకోవాలి. మీరంతా బాగా చదువండి. నా పేరు ప్రఖ్యాతులు పెంచండి. తెలంగాణ తల్లి దీవెనలు మీ అందరికీ ఎప్పుడూ ఉంటాయి. ఇంకోసారి కలిసినప్పుడు ఇంకా మాట్లాడుకొందాం.

III. భాషాంశాలు

పదజాలం

ప్రశ్న 1.
క్రింది వాక్యాలు చదువండి. గీత గీసిన పదాల అర్థాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

అ) గాలికి ఊగుతున్న పువ్వులు చిగురుటాకులతో సయ్యాటలాడుతున్నాయి.
అర్థం = పరిహాసాలాడు
జవాబు:
సొంతవాక్యం : రవి తన స్నేహితులతో పరిహాసాలాడాడు.

ఆ) స్వాతంత్ర్యోద్యమం బ్రిటిష్ వారి గుండెల్లో కల్లోలం రేపింది.
అర్థం = అలజడి
జవాబు:
సొంతవాక్యం : పరీక్షా ఫలితాల రోజున మా విద్యార్థుల మనస్సులో అలజడి రేగుతుంది.

ఇ) వీరులెప్పుడూ ప్రాణాలను అర్పించడానికి వెనుకాడరు.
అర్థం = ఆగిపోరు
జవాబు:
సొంతవాక్యం : దేశభక్తులైన భారతీయ సైనికులు యుద్ధంలో శత్రువుల బలాన్ని చూసి ఆగిపోరు.

TS 10th Class Telugu Guide 3rd Lesson వీర తెలంగాణ

ఈ) దిక్కు తోచనప్పుడు అయోమయంలో పడుతాం.
అర్థం = ఏమీ పాలుపోనప్పుడు
జవాబు:
సొంతవాక్యం : విశాఖలో ప్రజలకు హుదూద్ తుఫాను వచ్చినప్పుడు ఏమీ పాలుపోలేదు.

ప్రశ్న 2.
క్రింది పదాలకు నానార్థాలు రాయండి.

అ) ఉదయము = పుట్టుక, తూర్పుకొండ, ప్రాతకాలం, వడ్డి, సృష్టి, సూర్యోదయం
ఆ) ఆశ = కోరిక, దిక్కు
ఇ) అభ్రము = ఆశ్చర్యము, అపురూపం, అచ్చెరువు, మేఘం, స్వర్గం

ప్రశ్న 3.
క్రింది వాక్యాల్లో గీతగీసిన పదాలకు పర్యాయపదాలు రాయండి.

అ) మురళీరవము మానసిక ఆహ్లాదాన్నిస్తుంది.
జవాబు:
ధ్వని, కంఠధ్వని, శబ్దం, రవళి

ఆ) రుద్రమదేవి కృపాణముతో శత్రువులను చెండాడింది.
జవాబు:
ఖడ్గము, కత్తి, అసి

ఇ) జలధి అనేక జీవరాశులకు నిలయం.
జవాబు:
వార్థి, సముద్రం, అంబుధి, పయోధి

ఈ) జాతీయ జెండాను గౌరవించాలి.
జవాబు:
పతాకం, టెక్కెం, కేతనం, పతాక

ఉ) హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు.
జవాబు:
దూకుడు, దాటుట, తరించాడు, పరిస్థుతం

వ్యాకరణాంశాలు

1. కింది పదాలను విడదీసి రాసి, సంధిపేరు రాయండి. 

అ) జగమెల్ల = జగము + ಎల్ల – ఉకార సంధి
ఆ) సయ్యాటలాడెన్ = సయ్యాటలు + ఆడెన్ – ఉకార సంధి
ఇ) దారినిచ్చిరి = దారిని + ఇచ్చిరి – ఇకార సంధి
ఈ) ధరాతలమెల్ల = ధరాతలము + ఎల్లన్ – ఉత్వసంధి
ఉ) దిశాంచలము = దిశ + అచలము – సవర్ణదీర్ఘ సంధి
ఊ) శ్రావణాభ్రము = శ్రావణ + అభ్రము – సవర్ణదీర్ఘ సంధి
ఋ) మేనత్త = మేన + అత్త – అకార సంధి

2. క్రింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు వ్రాయండి. 

సమాసపదం – విగ్రహవాక్యం – సమాసం పేరు

అ) కాకతీయుల కంచుగంట – కాకతీయుల యొక్క కంచుగంట – షష్ఠీ తత్పురుష సమాసము
ఆ) కళ్యాణ ఘంటలు – కళ్యాణ ప్రదమైన ఘంటలు – విశేషణ పూర్వపద కర్మధారయం
ఇ) బ్రతుకుత్రోవ – బ్రతుకు యొక్క త్రోవ – షష్ఠీ తత్పురుష సమాసము
ఈ) మహారవము – మహాయైన (గొప్పదైన) రవము – విశేషణ పూర్వపద కర్మధారయం
ఉ) వికారదంష్ట్రలు – వికారమైన దంష్ట్రలు – విశేషణ పూర్వపద కర్మధారయం
ఊ) కాంతివార్డులు – కాంతి అనెడి వార్థులు – రూపకం
ఋ) తెలంగాణ రాష్ట్రం – తెలంగాణ అను పేరుగల రాష్ట్రం – సంభావనాపూర్వపద కర్మధారయం
ౠ) మతపిశాచి – మతమనెడు పిశాచి – రూపక సమాసం

చీకానుప్రాసాలంకారం :

ఈ వాక్యాన్ని పరిశీలించండి.

నీటిలో పడిన తేలు తేలుతదా !
ఈ వాక్యంలో తేలు, తేలు అనే పదాలకు అర్థాలకు వేరు వేరుగా ఉన్నాయి. ఆ పదాలు వెంట వెంటనే ప్రయోగించబడ్డాయి. హల్లుల జంట అర్థభేదంతో వెంటవెంటనే వాడబడితే దానిని ‘ఛేకానుప్రాసాలంకారం’ అంటారు.
మరికొన్ని వాక్యాలు చూడండి. సమన్వయం చేయండి.

హల్లుల జంట అర్థభేదంతో
అవ్యవధానంగా వస్తే
ఛేకానుప్రాసం.

అ) అరటితొక్క తొక్కరాదు.
ఆ) నిప్పులో పడితే కాలు కాలుతుంది.
ఇ) తమ్మునికి చెప్పు ! చెప్పు తెగిపోకుండా నడువుమని.

ఇట్లాంటివి పాఠంలో వెతకండి. కొన్ని సొంతంగా తయారు చేయండి.

ప్రాజెక్టు పని

తెలంగాణా పోరాట నేపథ్యంలో వచ్చిన ఏవైనా రెండు మూడు పాటలు సేకరించండి. వాటిని పాడి వినిపించండి.
(లేదా)
దాశరథి రాసిన ఏదైనా ఒక పుస్తకం / పాట / కవిత చదువండి. దాని ఆధారంగా నివేదిక రాసి చదివి వినిపించండి.
జవాబు:
గద్దర్ తం
1. బండెనక బండి కట్టి
పదహారు బండ్లు కట్టి
ఏ బండ్లో పోతావ్ కొడకో
నైజాము సర్కరోడా
నాజీల మించినవురో
నైజాము సర్కారోడా
పోలీసు మిల్టీ రెండు
బలవంతులా అనుకోని
నువ్వు పల్లెలు దోస్తివి కొడుకో
నువ్వు పల్లెలు దోస్తివి కొడుకో
మా పల్లెలు దోస్తివి కొడుకో
నైజాము సర్కారోడా

2. పల్లె పల్లెను లేపి
గుండె గుండెను ఊపి
నిండుశక్తిని జూపి, నింగినేలను దాచే
దుంకో దుంకర దుంకో ॥ దుర్గ దుంకిన
దుంకో !
కాశ్మీర్ చూడరో ! కథ మారిపోయరా
అస్సామీ నాడురో ! నెత్తురు మడుగాయరా
ఖలిస్తాన్ మాటరో ! కడుపున చిచ్చాయరో
ముడుచుకు కూర్చుంటెరో ! ముక్కలేను
దేశమ్మురో || పల్లె ||

TS 10th Class Telugu Guide 3rd Lesson వీర తెలంగాణ

3. పహరాహుషార్ పహరా హుషార్ పహరా ॥ హుషార్ ॥
నీవు లేచిఉండాలిరా కాపు కాచి ఉండాలిరా || హుషార్ ॥
స్వార్థబుద్ధి రాజ్యమేల ప్రగతి శూన్య మాయరా!
అన్యాయం అక్రమాలు పెచ్చుమీరిపోయరా ! ॥ పహరా ॥
నీతికి న్యాయానికీ నేతవునీవై
జాతికి నవశక్తి దాతవు కాగా ॥ నీవులేచి ॥
దాశరథి కవిత :
ఆ చల్లని సముద్రగర్భం
దాచిన బడబానల మెంతో ?
ఆ నల్లని ఆకాశంలో
కానరాని భాస్కరు లెందరో ?
భూగోళం పుట్టుకకోసం
కూలిన సురగోళాలెన్నో ?
ఈ మానవరూపంకోసం
జరిగిన పరిణామాలెన్నో ?

ఒక రాజును గెలిపించుటలో
ఒరిగిన నరకంఠాలెన్నో ?
శ్రమజీవులు పచ్చినెత్తురులు
త్రాగని ధనవంతులెందరో ?

అన్నార్తులు అనాథలుండని
ఆ నవయుగ మదెంత దూరమో ?
కరువంటూ కాటకమంటూ
కనుపించని కాలాలెపుడో ?

అణగారి అగ్నిపర్వతం
కని పెంచిన “లావా” యెంతో ?
ఆకలితో చచ్చే పేదల
శోకంలో కోపం యెంతో ?

పసిపాపల నిదుర కనులలో
ముసిరిన భవితవ్యం యెంతో ?
గాయపడిన కవి గుండెల్లో
రాయబడని కావ్యాలెన్నో ?

కులమతాల సుడిగండాలకు
బలియైన పవిత్రులెందరో ?
భరతావని బలపరాక్రమం
చెర వీడే దింకెన్నాళ్ళకో ?

నివేదిక

ప్రశ్నల రూపంలో కొనసాగుతూ అసంఖ్యాకమైన ఆలోచనలను రేకెత్తించే గేయం ఇది. ఇరవై నాలుగు చరణాల్లో సమస్త మానవ ప్రపంచాన్ని, విశ్వవిజ్ఞానశాస్త్ర విషయాల సారాన్ని కవిత్వంలో సంక్షిప్తీకరించాడు. మొదటి చరణం సముద్రం, ఖగోళశాస్త్రాల సమ్మేళనం. రెండో చరణం భూమి, మనిషి పుట్టుకల తీరుని వివరిస్తుంది. ఇందులో విశ్వ ఆవిర్భావం, మానవ పరిణామక్రమం కనిపిస్తుంది.

మిగిలిన చరణాలు కవి లోకానుభవంనుండి వచ్చిన చారిత్రక వాస్తవాలు. కవి కలలు, అందమైన ఊహలు, మరో కొత్త ప్రపంచపు ఆశలు, ఆశయాలు, ఆవేదనలు, ఆగ్రహాలతో ఉద్వేగంగా నడుస్తుంది. కవి సున్నితమైన భావాలు మనల్ని ఆనందానికి, ఆగ్రహానికి గురిచేస్తాయి. కవి అన్నీ ప్రశ్నలే వేశాడు. ఇవి మానవాళికి సంబంధించిన ఆత్మవిమర్శనాత్మక అస్త్రాలు. ప్రపంచాన్ని చుట్టుముట్టిన ఈ ప్రశ్నలకు సమాధానం, సమస్యలకు పరిష్కారం మనలోనే, మన దగ్గరే ఉంది. కవి వేసే ప్రశ్న మనకు గుచ్చుకుంటుంది. ఇలాంటి ప్రశ్నలకు చోటులేని ‘నవయుగం’ కోసం కవి చేసిన అక్షరయాగమే ఈ గేయం.

మీకు తెలుసా ?…

1. దాశరథి 1952లో డా॥ సి. నారాయణ రెడ్డి, వట్టికోట ఆళ్వారు స్వామి, డా॥ బిరుదురాజు రామరాజు మొదలగువారితో కలిసి తెలంగాణా రచయితల సంఘాన్ని స్థాపించాడు. ఈయన వట్టికోట ఆళ్వారుస్వామితో కలిసి నిజామాబాద్లో జైలుశిక్ష అనుభవించాడు. తెలంగాణ ఉద్యమ కావ్యాలలోకెల్ల అగ్రగణ్యమైనది దాశరథి ‘అగ్నిధార’. ఇది పీడిత ప్రజల మనోభావాలకు ప్రతీక. ‘అగ్నిధార’ను నిజామాబాద్లో జైలు సహవాసి వట్టికోట అళ్వారుస్వామికి అంకితమిచ్చాడు. అట్లే ‘రుద్రవీణ’ అనే కవితాసంపుటిని తెలంగాణ ప్రజానీకానికి అంకితమిచ్చాడు.

విశేషాంశాలు :

1. కాపయనాయకుడు: క్రీ॥శ॥ 1328 నుండి 1369 వరకు ఓరుగల్లు కోటను కేంద్రంగా చేసుకొని స్వాతంత్య్ర పోరాటం చేసినవాడు. మహా బలవంతుడైన ఢిల్లీ చక్రవర్తి మహమ్మద్ బీన్ తుగ్లక్ అధికారమును ధిక్కరించి స్వాతంత్య్రోద్యమమును లేవదీసిన ఘనత కాపయప్రోలయ నాయకులది. కాపానీడు లేక కాపయనాయకుడు ముసు నూరి నాయకుల వంశమునకు చెందినవాడు. కాపయనాయకుడు తెలంగాణను మ్లేచ్ఛ పాలన నుండి విముక్తి చేశాడు. కాకతీయుల తరువాత ఓరుగల్లును రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. ముసునూరి యుగం చరిత్రలో సువర్ణ ఘట్టం.

సూక్తి : సంకల్పమే సకల విజయాలకు మూలం సాధించాలనే తపనే విజయంవైపు వేసే తొలి అడుగు

ప్రతిపదార్థ తాత్పర్యాలు

I

1. ఉ.
ఓ తెలంగాణ ! నీ పెదవులొత్తిన శంఖ మహారవమ్ములీ
భూతలమెల్ల నొక్కమొగి బొబ్బలు పెట్టినయట్లు తోచె, ఓ
హో ! తెలవార్చివేసినవి ఒక్కొక దిక్కు నవోదయార్క రుక్
ప్రీత జలేజ సూన తరళీకృత దేవనదీతరంగముల్

కవి పరిచయం
ఈ పద్యం డా॥ దాశరథి కృష్ణమాచార్య రచించిన దాశరథి సాహిత్యం ఒకటవ సంపుటి “రుద్రవీణ” లోనిది.

ప్రతిపదార్థము (June 2017)

ఓ తెలంగాణ = ఓ తెలంగాణమా !
నీ పెదవుల = నీ పెదవులతో
ఒత్తిన = ఊదిన
శంఖమహారవమ్ములు = శంఖధ్వనులు
ఈ భూతలము = ఈ భూమండలము
ఎల్లన్ = అంతా
ఒక్కమొగి = ఒక్కమారుగా
బొబ్బలు = బొబ్బలు
పెట్టిన + అట్లు = పెట్టినట్లుగా
తోచే = అనిపించింది.
ఓహో ! = ఆహా !
తెల్లవార్చి = తెల్లవారేటట్లు
వేసినవి = చేశాయి
ఒక్కొక్క = అన్ని
దిక్కు = దిక్కులను
నవోదయ + అర్క = ఉదయించిన సూర్యుని
రుక్ = కిరణాలచేత
ప్రీత = ప్రీతి పొందిన
జలేజసూన = పద్మాలచే
తరళీకృత = చలించిన
దేవనదీతరంగముల్ = ఆకాశగంగా తరంగాలు

తాత్పర్యము:
ఓ తెలంగాణమా ! నీ పెదవులతో ఊదిన శంఖ ధ్వనులు ఈ భూమండలమంతా ఒక్కమారుగా బొబ్బలు పెట్టినట్లుగా అనిపించింది. ఆహా ! ఉదయించిన సూర్యుని కిరణాలచేత ప్రీతిపొందిన పద్మాలతో, చలించిన ఆకాశ గంగా తరంగాలు అన్ని దిక్కులను తెలవారేటట్లు చేశాయి.

TS 10th Class Telugu Guide 3rd Lesson వీర తెలంగాణ

2. శా.
తల్లీ ! నీ ప్రతిభా విశేషములు భూతప్రేత హస్తమ్ములన్
డుల్లెన్ కొన్ని తరాలదాక ! ఇపుడడ్డుల్ వోయె; సౌదామనీ
వల్లీ పుల్లవిభావళుల్ బ్రతుకుత్రోవల్ జూపు కాలమ్ములున్
మళ్ళెన్ ! స్వచ్ఛతరోజ్జ్వల ప్రథమ సంధ్యాభానువేతెంచెడిన్

కవి పరిచయం

ఈ పద్యం డా॥ దాశరథి కృష్ణమాచార్య రచించిన దాశరథి సాహిత్యం ఒకటవ సంపుటి “రుద్రవీణ” లోనిది.

ప్రతిపదార్ధము (June 2017)

తల్లీ = అమ్మా (తెలంగాణమా)
నీ = నీ యొక్క
ప్రతిభా = గొప్పతనపు
విశేషములు = విశేషాలు
భూతప్రేత = దుర్మార్గుల (చెడుశక్తుల)
హస్తమ్ములన్ = చేతులలో
డుల్లెన్ = చిక్కుకున్నాయి
కొన్ని = కొన్ని
తరాలదాక = తరాలవరకు
ఇపుడు = ఇప్పుడు (ఆ రోజులు గతించాయి)
అడ్డుల్ = అడ్డంకులు
పోయెన్ = తొలిగాయి (తొలగిపోయాయి)
సౌదామనీ వల్లీ = మెరుపు తీగల
ఫుల్ల = విచ్చుకున్న
విభా + ఆవళుల్
(విభావళుల్) = (కాంతి రేఖల) కాంతుల వరుసలు
బ్రతుకుత్రోవల్ = బతుకు దారులను
చూపు = చూపే
కాలమ్ములన్ + మళ్ళెన్ = కాలం వచ్చింది (సమయం వచ్చింది)
స్వచ్ఛతర = స్వచ్ఛమైన
ఉజ్జ్వల = కాంతివంతమైన
ప్రథమసంధ్యా = తొలిపొద్ద
భానువు = సూర్యుడు
ఏతెంచిడిన్ = ఉదయించాడు (వస్తున్నాడు)

తాత్పర్యము
అమ్మా తెలంగాణమా ! నీ గొప్పతనపు విశేషాలు కొన్ని తరాల వరకు దుర్మార్గుల చేతులలో చిక్కుకొన్నాయి. ఇప్పుడు అడ్డంకులు తొలిగాయి. విచ్చుకున్న మెరుపు తీగల కాంతి రేఖలు బతుకుతోవ చూపే కాలం వచ్చింది. స్వచ్ఛమైన కాంతిమంతమైన సంధ్యాసూర్యుడు ఉదయించాడు.

II

3. ఉ.
నీ యొడిలోన పెంచితివి నిండుగ కోటి తెలుంగు కుర్రలన్ !
ప్రాయము వచ్చినంతనె కృపాణములిచ్చితి, యుద్ధమాడి వా
శ్రేయ భుజాబలమ్ము దరిసింప జగమ్ము, నవాబుతో సవాల్
చేయుమటంటి; వీ తెలుగు రేగడిలో జిగి మెండు మాతరో !

కవి పరిచయం
ఈ పద్యం డా॥ దాశరథి కృష్ణమాచార్య రచించిన దాశరథి సాహిత్యం ఒకటవ సంపుటి “రుద్రవీణ” లోనిది.

ప్రతిపదార్థము

మాతరో = అమ్మా !
కోటి = కోటి మంది
తెలుంగు కుర్రలన్ = తెలుగు పిల్లలను
నీ = నీ
ఒడిలోన = ఒడిలో
పెంచితివి = పోషించావు
ప్రాయము వచ్చినంతనే = వయసురాగానే
కృపాణములు ఇచ్చితి = చేతులకు కత్తులనిచ్చి
వాత్రేయ = వజ్రాయుధము అంతటి కఠినమైన
భుజాబలమ్ము = భుజపరాక్రమాలను
దరిసింప = చూపేటట్లు
జగమ్ము = లోకం
నవాబుతో = నిజాం నవాబుతో
సవాల్ =ఎదురొడ్డి ప్రశ్నించుట
చేయుము + అట + అంటివి = చేయమన్నావు
యుద్ధము + ఆడి = తలపడమన్నావు
ఈ తెలుగు రేగడిలో = సారవంతమైన ఈ తెలంగాణ భూమిలో
జిగి = ఎంత బలం
మెండు = ఉన్నదో కదా !

తాత్పర్యము
అమ్మా ! కోటిమంది తెలుగు పిల్లలను నీ ఒడిలో పెంచావు. వారికి వయసురాగానే చేతులకు కత్తులనిచ్చి, వజ్ర సమానమైన భుజపరాక్రమాలను లోకం చూసేటట్లు నిజాం రాజుతో తలపడమన్నావు. ఈ తెలుగు నేలలో ఎంత బలం ఉన్నదో కదా !

4. మ.
తెలగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము ! రా
జలలాముం డనువాని పీచమడచన్ సాగించె యుద్ధమ్ము ! భీ
తిలిపోయెన్ జగమెల్ల యేమియగునో తెల్యంగరాకన్ ! దిశాం
చలముల్ శక్రధనుఃపరంపరలతో సయ్యాటలాడెన్ దివిన్

కవి పరిచయం
ఈ పద్యం డా॥ దాశరథి కృష్ణమాచార్య రచించిన దాశరథి సాహిత్యం ఒకటవ సంపుటి “రుద్రవీణ” లోనిది.

ప్రతిపదార్ధము
తెలగాణమ్మున గడ్డిపోచయును కృపాణమ్ము సంధించెన్

తెలగాణమ్మున = తెలంగాణలో
గడ్డిపోచయును = గడ్డిపోచకూడా
కృపాణమ్ము = కత్తి బట్టి
సంధించెన్ = ఎదిరించింది
రాజలలాముండు = గొప్ప రాజుగా
అనువాని = పేరొందినవాని
పీచమున్ = గర్వాన్ని
అడచన్ = అణచేటట్లుగా
యుద్ధమ్ము = యుద్ధం
సాగించె = సాగించింది
ఏమి + అగునో = ఏమి జరుగుతుందో
తెల్యంగరాకన్ = తెలియక
జగము + ఎల్లన్ = జగమంతా
భీతిలిపోయెన్ = భయపడిపోయింది
దిశ + అంచలమున్ = దిగంతాలన్నీ
దివిన్ = ఆకాశంలో
శక్తధనుః = ఇంద్రధనుస్సుల
పరంపరలతో = పరంపరలచేత
సయ్యాటలు + ఆడెన్ = సయ్యాటలాడాయి

తాత్పర్యము
ఈ తెలంగాణలో గడ్డిపోచకూడా కత్తి బట్టి ఎదిరించింది. గొప్ప రాజునని అనుకొనేవాని గర్వాన్ని అణచేటట్లుగా యుద్ధం సాగించింది. ఏమి జరుగుతుందో తెలియక జగమంతా భయపడిపోయింది. దిగంతాలన్నీ ఆకాశంలో ఇంద్రధనుస్సుల వరుసలతో సయ్యాటలాడాయి.

TS 10th Class Telugu Guide 3rd Lesson వీర తెలంగాణ

5. ఉ.
నాలుగు వైపులన్ జలధి నాల్కలు సాచుచు కూరుచుండె ! క
ల్లోలము రేపినారు భువిలో ! నలుదిక్కుల గండికొట్టి సం
డ్రాలకు దారినిచ్చిరి ! ధరాతలమెల్ల స్వతంత్ర వారి ధా
రాలులితమ్ము కాదొడగె, రాజు రివాజులు బూజు పట్టగన్

కవి పరిచయం
ఈ పద్యం డా॥ దాశరథి కృష్ణమాచార్య రచించిన దాశరథి సాహిత్యం ఒకటవ సంపుటి “రుద్రవీణ” లోనిది.

ప్రతిపదార్థము

నాలుగువైపులన్ = నాలుగు వైపుల నుండి
జలధి = సముద్రం
నాల్కలుసాచుచు = నోరు తెరచినట్లుగా
కూరుచుండె = ఉప్పొంగుతున్నది
కల్లోలం = అలజడి
భువిలో = భూమిలో
రేపినారు = కలిగించినారు
నలుదిక్కులు = నాలుగు దిక్కులు
గండికొట్టి = గండికొట్టి
సంద్రాలకు = సముద్రాలకు
దారినిచ్చిరి = దారిని ఇచ్చారు.
స్వతంత్ర వారి ధారా = స్వాతంత్ర్యపు నీటిలో
లులితమ్ము = తడుపుతున్నారు.
రాజు = నవాబుల
రివాజులు = ఆజ్ఞలకు
బూజుపట్టగన్ = కాలం చెల్లిపోయింది

తాత్పర్యము
తెలంగాణా స్వాతంత్య్ర పోరాటం సముద్రం మాదిరిగా ఉప్పొంగుతున్నది. నాలుగు వైపుల నుండి సముద్రానికి ‘గండికొట్టి తెలంగాణ నేలనంతా స్వాతంత్య్రపు నీటితో తడుపుతున్నారు. ఉద్రిక్తత కలిగించిన నవాబుల ఆజ్ఞలకు కాలం చెల్లిపోయింది.

III

6. మ.
తెలగాణా ! భవదీయ పుత్రకులలో తీండ్రించు వైప్లవ్య సం
చలనమ్మూరక పోవలేదు ! వసుధా చక్రమ్ము సారించి ఉ
జ్జ్వల వైభాతిక భానునిన్ పిలిచి దేశంబంతటన్ కాంతి వా
ర్ధులు నిండించిరి, వీరు వీరులు పరార్థుల్ తెల్గుజోదుల్ బళా !

కవి పరిచయం
ఈ పద్యం డా॥ దాశరథి కృష్ణమాచార్య రచించిన దాశరథి సాహిత్యం ఒకటవ సంపుటి “రుద్రవీణ” లోనిది.

ప్రతిపదార్దము

తెలంగాణా = అమ్మా తెలంగాణ !
భవదీయ + పుత్రకులలో = నీ పిల్లలలో
తీండ్రించు = ప్రకాశించే
వైప్లవ్య = విప్లవాత్మకమైన
సంచలనమ్ము = కదలిక
ఊరకపోవలేదు = ఊరికే పోలేదు
వసుధా చక్రము = భూమండలాన్నంతా
సారించి = సవరించి
ఉజ్జ్వల = ఉజ్జ్వలమైన
వైభౌతిక = కాంతివంతమైన
భానునిన్ = సూర్యుడిని
పిలిచి = పిలిచి
దేశంబు + అంతటన్ = దేశమంతా
కాంతి = క్రొత్తకాంతి
వార్ధులు = సముద్రాలు
నిండించిరి = నింపారు
వీరు = వారంతా
వీరులు = యోధులేకాదు
పరార్థుల్ = న్యాయం తెలిసిన పరోపకారులైన
తెల్గుజోదుల్ = తెలుగువీరులు
బళా ! = సుమా !

అమ్మా తెలంగాణా ! నీ పిల్లలలో ప్రకాశించే విప్లవాత్మకమైన కదలిక ఊరికే పోలేదు. వీరు భూ మండలాన్నంతా సవరించి ఉజ్జ్వలమైన కాంతివంతమైన సూర్యుడిని పిలిచి దేశమంతా కొత్త కాంతి సముద్రాలు నింపారు. వారంతా వీరులు, యోధులేకాదు. పరోపకారులు కూడా.

7. మ.
మతపైశాచి వికార దంష్ఠికలతో మా భూమి లంఘించి మా
కుతుకల్ గోసెడి వేళ గూడ, యెటు దిక్కున్ తోచకున్నప్పుడున్
బ్రతుకే దుర్భరమైన యప్పుడును ఆంధ్రత్వమ్ము పోనాడ లే
దు, తుదిన్ గెల్చితిమమ్మ యుద్ధమున రుద్రుల్ మెచ్చనాంధ్రాంబికా!

కవి పరిచయం
ఈ పద్యం డా॥ దాశరథి కృష్ణమాచార్య రచించిన దాశరథి సాహిత్యం ఒకటవ సంపుటి “రుద్రవీణ” లోనిది.

ప్రతిపదార్థము

ఆంధ్రాంబికా ! = అమ్మా !
మతం = మతం అనే
పైశాచి = పిశాచి
వికార = తన క్రూరమైన
దంష్ట్రికలతో = కోరలతో
మా భూమి = మా నేలను
లంఘించి = ఆక్రమించి
మాకుతుకల్ = మా గొంతులు
గోసెడివేళ కూడా = కోస్తున్నప్పుడు కూడా
యెటుదిక్కున్ = ఏ దిక్కూ
తోచకున్నప్పుడున్ = తోచనప్పుడు
బ్రతుకే = బ్రతకడమే
దుర్భరమైన + అప్పుడును = భారమైనప్పుడు
ఆంధ్రత్వమ్ము = తెలుగుదనాన్ని
పోనాడలేదు = కోల్పోలేదు
యుద్ధమున = యుద్ధరంగంలో
రుద్రుల్ = రుద్రాదులు
మెచ్చున్ = మెచ్చేటట్లు
తుదిన్ = చివరికి
గెల్చితిమమ్మ = విజయాన్ని సాధించాం

తాత్పర్యము
అమ్మా ! మతం అనే పిశాచి తన క్రూరమైన కోరలతో మా నేలను ఆక్రమించి మా గొంతులు కోస్తున్నప్పుడు, ఏ దిక్కూ తోచనప్పుడు, బ్రతకడమే భారమైనప్పుడు కూడా తెలుగుదనాన్ని కోల్పోలేదు. రుద్రాదులు మెచ్చేటట్లు చివరికి విజయాన్ని సాధించాం.

8. సీ.
కాకతీయుల కంచు గంట మ్రోగిననాడు
కరకు రాజులకు తత్తరలు పుట్టె
వీర రుద్రమదేవి విక్రమించిన నాడు
తెలుగు జెండాలు నర్తించే మింట
కాపయ్య నాయకుండేపు సూపిన నాడు
పరరాజులకు గుండె పట్టుకొనియె
చాళుక్య పశ్చిమాశా పాలనమ్మున
కళ్యాణ ఘంటలు గణగణమనె

తే.గీ॥ నాడు నేడును తెలగాణ మోడలేదు.
శత్రువుల దొంగదాడికి; శ్రావణాభ్ర
మటుల గంభీర గర్ణాట్టహాసమలర
నా తెలంగాణ పోవుచున్నది పథాన

కవి పరిచయం
ఈ పద్యం డా॥ దాశరథి కృష్ణమాచార్య రచించిన దాశరథి సాహిత్యం ఒకటవ సంపుటి “రుద్రవీణ” లోనిది.

ప్రతిపదార్ధము

కాకతీయులు = కాకతీయరాజుల
కంచు గంట = కంచుగంట
మ్రోగిననాడు = మ్రోగినప్పుడు
కరకురాజులకు = దుర్మార్గులైన శత్రురాజులు
తత్తరలు + పుట్టె = కలవర పడ్డారు
వీరరుద్రమదేవి = రుద్రమదేవి
విక్రమించిననాడు = పరాక్రమించినప్పుడు
తెలుగు జెండాలు = తెలుగు జెండాలు
మింటన్ = ఆకాశాన
నర్తించె = రెపరెపలాడాయి
కాపయ్యనాయకుడు = కాపయ్య నాయకుడు
ఏపు + సూపిననాడు = విజృంభణం చూపినప్పుడు
పరరాజులకు = శత్రురాజులకు
గుండెపట్టుకొనియె = గుండెలు ఆగిపోయాయి
చాళుక్య = చాళుక్య రాజులు
పశ్చిమ + ఆశా = పశ్చిమ దిక్కున
పాలనమ్మున్ = పరిపాలన చేసేటప్పుడు
కళ్యాణఘంటలు = మంగళకరమైన జయధ్వనులు
గణగణమనె = గణగణమంటూ మోగాయి
నాడు = నాటినుండి
నేడును = నేటివరకు
తెలగాణము = తెలంగాణం
శత్రువుల = శత్రువుల
దొంగదాడికి = దొంగదెబ్బలకు
ఓడలేదు = ఓడిపోలేదు
శ్రావణాభ్రము = శ్రావణ మాసంలోని మేఘం
అటుల = మాదిరిగా
గంభీర = గంభీరమైన
గర్జాట్టహాస = గర్జనలు
అలర = అలరారుతుండగా
నా తెలంగాణ = నా తెలంగాణం
పథాన = ముందుకు
పోవుచున్నది = సాగుతూనే ఉన్నది

తాత్పర్యము

ఇక్కడ కాకతీయ రాజుల కంచుగంట మ్రోగినప్పుడు దుర్మార్గులైన శత్రురాజులు కలవరపడ్డారు. రుద్రమదేవి పరాక్రమించినప్పుడు తెలుగు జెండాలు ఆకాశాన రెపరెప లాడాయి. కాపయ్య నాయకుడు తన విజృంభణం చూపినప్పుడు శత్రురాజులకు గుండెలు ఆగిపోయాయి. చాళుక్య రాజులు పశ్చిమ దిక్కున పరిపాలన చేసేటప్పుడు మంగళకరమైన జయధ్వనులు గణగణమంటు మోగాయి. నాటి నుండి నేటి వరకు శత్రువుల దొంగ దెబ్బలకు తెలంగాణం ఓడిపోలేదు. శ్రావణ మాసంలోని మేఘం మాదిరిగా గంభీరమైన గర్జనలు అలరారుతుండగా నా తెలంగాణం ముందుకు సాగుతూనే ఉన్నది.

పాఠం నేపథ్యం / ఉద్దేశ్యం

తెలంగాణ వీరుల పురిటిగడ్డ. ఎందరో యోధులు తెలంగాణ విముక్తి కోసం తుదిశ్వాస వరకు పోరాడారు. దుర్మార్గులైన రజాకార్ల అరాచకత్వాన్ని ఎదిరించిన రణక్షేత్రం తెలంగాణ. అటువంటి నేల అస్తిత్వ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రజాసమూహం తమదైన పద్ధతుల్లో ధిక్కారస్వరం వినిపించింది. ఆయుధం ధరించి పోరాడినవారు కొందరైతే, అక్షరాయుధంతో పోరాడినవారు మరికొందరు. సాహితీ యోధుడు డా॥ దాశరథి కృష్ణమాచార్య ప్రత్యక్షంగా పోరాటంలో మమైకమౌతూనే ధైర్య సాహసాలను పద్యాలలో ప్రశంసించాడు.

వీరుల త్యాగాలను స్మరించడం, తెలంగాణ తల్లి ఔన్నత్యాన్ని కీర్తించడం, స్వస్థానాభిమానాన్ని ప్రేరేపించడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం.

TS 10th Class Telugu Guide 3rd Lesson వీర తెలంగాణ

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం పద్య ప్రక్రియకు చెందినది. చారిత్రక అంశాలను వస్తువుగా తీసుకొని రాసిన పద్యాలివి. డా॥ దాశరథి కృష్ణమాచార్య రచించిన “దాశరథి సాహిత్యం” ఒకటవ సంపుటి ‘రుద్రవీణ’ లోనిది.

కవి పరిచయం

కవి : డా॥ దాశరథి కృష్ణమాచార్య
జననం : 22.7.1925
మరణం : 05.11.1987
జన్మస్థలం : మహబూబాబాద్ జిల్లా, చిన్నగూడూరు.

ఇతర రచనలు :

  1. అగ్నిధార,
  2. రుద్రవీణ,
  3. మహాంధ్రోదయం,
  4. పునర్నవం
  5. కవితాపుష్పకం,
  6. తిమిరంతో సమరం,
  7. అమృతాభిషేకం
  8. ఆలోచనాలోచనాలు మొదలగు నవి. నవమి (నాటికలు), యాత్రాస్మృతి (స్వీయచరిత్ర) వంటి పలు గ్రంథాలను రచించారు. సినిమాలకు చక్కని పాటలు రాశారు. గాలిబ్ గజళ్ళను అనువదించారు.

కవితారీతి :

నాటి పాలకులపై వ్యతిరేకంగా ప్రజా పోరాటాలలో పాల్గొన్నారు. ఆచరణాత్మక వైఖరి ప్రదర్శించారు. తన కవిత్వంతో ప్రజలను చైతన్యపరిచారు. దాశరథి ఉద్యమ కవి. ‘నా గీతావళి ఎంత దూరము ప్రయాణం బౌనొ అందాక ఈ భూగోళంబున కగ్గి పెట్టెద’నన్నారు.

నిజాంకు వ్యతిరేకంగా పద్యాలను జైలు గోడలపై రాసిన ధీరుడు. ఆయన కవిత లలో అక్షరాలకు ఆవేశం ఎక్కువ. ఆయన కవిత్వం అభ్యుదయ మార్గంలో నడు స్తుంది. సున్నితమైన భావుకతతో ఉంటుంది. ప్రాచీన పద్యశైలిలో ఉంటుంది. ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచే కవితా రీతుల ప్రదర్శనలో తలపండిన మహాకవి దాశరథి. ఆయన ప్రజాకవి, మహాకవి.

సన్మానాలు-సత్కారాలు : తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోసినవాడు దాశరథి. 1961లో గాలిబ్ గజళ్ళను అనువదించాడు. ప్రసిద్ధులైన ఉర్దూ కవుల కవిత్వాన్ని అనువదించాడు. విమర్శకుల ప్రశంసలను అందుకొన్నాడు.

పురస్కారాలు :

  1. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు (1967)
  2. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (1974)

శైలి : సున్నితమైన భావుకత, ప్రాచీన పద్య శైలి.
విశేషాంశములు : సినీగేయ కవి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవి.

ప్రవేశిక

సముద్రం ఉప్పొంగుతుండగా చూసేవారు అరుదుగా ఉంటారు. సముద్రం చెలియలికట్ట దాటడం ఎవరూ ఊహించలేరు. కాని తెలంగాణ నేల ఈ అరుదైన పరిణామా లను, అద్భుతాలను ప్రపంచానికి చూపెట్టింది. తెలంగాణ నేలమీద జరిగిన విముక్తి ఉద్యమంలో తెలంగాణ ప్రజలు సముద్రంలో అలల మాదిరిగా ఉవ్వెత్తున ఉప్పొంగి ఎగిశారు. ఆ హోరును, తెలంగాణ వీరుల తిరుగుబాటు జోరును, మహోన్నత త్యాగాల తీరును దాశరథి పద్యాల్లో విని ఉత్తేజితులం కావడానికి… ఈ పాఠంలోకి పయనిద్దాం.

విద్యార్థులకు సూచనలు

  • పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
  • పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత గీయండి.
  • వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పదవిజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకోండి.

ప్రక్రియ – ఆధునిక పద్యం

ఈ పాఠం పద్య ప్రక్రియకు చెందినది. ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియల్లో ఆధునిక పద్యం ఒకటి. చారిత్రక, వాస్తవిక అంశాలను వస్తువుగా తీసుకొని ఆధునిక భావ వ్యక్తీకరణతో రాసిన పద్యాలివి. గ్రాంథిక భాషకు దూరంగా ఉంటాయి. ఆధునిక భాష పద్యాలలో ఎక్కువగా ఉంటుంది. సమాజాభ్యుదయం ప్రధానాంశంగా ఉంటుంది.