TS Board 6th Class Science Important Questions 15th Lesson Light, Shadows and Images

These TS 6th Class Science Important Questions 15th Lesson Light, Shadows and Images are crafted to align with the curriculum, ensuring students are well-prepared for assessments.

TS 6th Class Science Important Questions 15th Lesson Light, Shadows and Images

Question 1.
Why am I (are we) not able to see the objects clearly when it gets dark?
(or)
Why am I (are we) not able to see the objects when power went off?
Answer:
We see the objects only when the light falls on them and bounces back.
That is why we can’t see the object clearly when it gets dark.

TS Board 6th Class Science Important Questions 15th Lesson Light, Shadows and Images

Question 2.
How are we able to see the objects in the presence of light?
Answer:
When light falls on the object it gets reflected on our eyes. Therefore the reflection of light from the exposed object makes us to see it clearly.

Question 3.
Where does light come from?
Answer:
Light comes from objects that are called sources of light.
Eg: Sun, candle, stars, moon, fire, oil lamps, bulbs etc.

Question 4.
Is moon a source of light? Can you give some more examples for source of light?
Answer:
Moon is a source of light. Other sources of light are candle, the sun, oil lamps, fire, tube lights, bulbs etc…

TS Board 6th Class Science Important Questions 15th Lesson Light, Shadows and Images

Question 5.
Define source of light? Give example.
Answer:
A substance which gives light is known as a light source.
Eg : Sun, glowing bulb, candle etc.

Question 6.
How can we see an object?
Answer:
We can see an object only when light falls on it, bounces back and reaches our eye.

Question 7.
Which objects give us light?
Answer:
Sun, stars, a glowing bulb, lightened candle, kerosene lamp etc. give light.
They are known as ‘sources of light’.

Question 8.
When did you see your shadow ? Is it during day time or at night?
Answer:
I saw my shadow during the day time.

TS Board 6th Class Science Important Questions 15th Lesson Light, Shadows and Images

Question 9.
What do we need to form a shadow?
Answer:
We need light source to get the shadow of any object.

Question 10.
What is shadow puppetry ?
Answer:

  • Shadow puppetry is one of our traditional recreational activities.
  • In this, some puppets are used to form shadows on a screen and a story is narrated with the help of these shadows.

Question 11.
Why do we get an ‘inverted image’ in a pinhole camera?
Answer:
Reason of inversion of image:
Light from the candle travels straight in all directions from each point of the flame of the candle.
But only the light coming in some particular directions can enter into the camera through its pinhole.
Light which comes from the point at the top of the flame goes straight towards the bottom of the screen.
Light which comes from the point at the bottom of the flame goes straight towards the top of the screen.
TS-6th-Class-Science-Important-Questions-15th-Lesson-Light-Shadows-and-Images-8
In this way, the light coming in a particular direction from each point of the flame will be able to enter into the pinhole. Light going in other directions is filled out due to the pinhole.This leads to the formation of an inverted image.

TS Board 6th Class Science Important Questions 15th Lesson Light, Shadows and Images

Question 12.
What difference do you notice between the images formed through the pin-hole camera and through a magnifying glass?
Answer:
The image formed through the magnifying lens is clearer than that formed with a pinhole camera.

Question 13.
What is ‘reflection’?
Answer:
When light falls on any object, it rehounces back. This is called reflection.

Question 14.
Can you see the light reflected by an object?
Answer:
We can see the reflected light only when light falls on the objects like mirror.

Question 15.
How does mirror differ from a glass sheet?
Answer:
A mirror reflects light falling on it. A glass sheet transmits the light falling on it.

Question 16.
Predict what would happen if we make two pinholes in the camera.
Answer:
Two inverted images form. They overlap each other. They are not so clear.

TS Board 6th Class Science Important Questions 15th Lesson Light, Shadows and Images

Question 17.
What is the object that emits light of its own, called?
Answer:
Luminous object.

Question 18.
What do you call, a brilliantly polished reflecting surface?
Answer:
A mirror.

Question 19.
What is the dark patch of an object cast on the screen, called?
Answer:
Its shadow.

Question 20.
What is throwing back of light rays by a surface called?
Answer:
Reflection.

Question 21.
To which class these belong?
(a) a piece of red hot iron
(b) sun
(c) firefly
Answer:
Luminous objects.

TS Board 6th Class Science Important Questions 15th Lesson Light, Shadows and Images

Question 22.
What type image forms in a pinhole camera?
Answer:
An inverted image.

Question 23.
Why are the shapes of the shadows of the same object different when you change the position of the object?
Answer:
The shapes of the shadows are guessed only when we consider that light travel as rays along a straight path.

Question 24.
Read the following paragraph and frame at/east two questions.
We know that shadows are not coloured but an ¡mage has colours that are same as
that of the object. Also, a shadow shows only the outline of the object but an image
shows the complete object as it is, just like a photograph.
Answer:

  • What is the difference between a shadow and an image?
  • How can we make shadows?
  • How can we make an image?

TS Board 6th Class Science Important Questions 15th Lesson Light, Shadows and Images

Question 25.
Can you guess the object by observing its shadow ?
Answer:
It is not always possible to guess the object by observing its shadow.

Question 26.
Is it possible to guess the colour of the object by observing its shadow?
Answer:
No. Shadow is always colourless irrespective of the colour of the object.

Question 27.
Can you guess the shape of the shadow that would be formed by an object?
Answer:
Yes. We can get different shaped shadows for a single object by changing its position.

Question 28.
Write the required apparatus or material for making pinhole camera.
Answer:
Requirements:

  • A PVC pipe of about 8cm in diameter and 30cm in length.
  • Another PVC pipe of about 7cm in diameter and 20cm in length.
  • One black drawing sheet.
  • Oil – 1ml.
  • Two rubber bands
  • A pin and
  • A4 sheet.

Question 29.
You are provided with a book, a pen, a duster, a polythene cover and a glass plate. Answer the following questions.

(i) Which objects form shadows ? Why?
Answer:
(a) Book, pen and duster form clear shadows.
Reason: They are opaque objects.

(b) Polythene cover forms an unclear shadow.
Reason: It is a translucent substance.

(ii) Which objects do not form shadows?
Answer:
Glass
Reason : Glass (also air) is a transparent substance.

TS Board 6th Class Science Important Questions 15th Lesson Light, Shadows and Images

Question 30.
How can you make a pinhole camera?
Answer:
Making a pinhole camera.
Requirements:

  • A PVC pipe of about 8 cm in diameter and 30 cm in length.
  • Another PVC pipe of about 7 cm in diameter and 20 cm in length.
  • One black drawing sheet.
  • Oil -1 ml
  • Two rubber bands
  • A pin and
  • A 4 sheet

Method:

  • A piece of black paper is cut and put like a cap at one end of the big PVC pipe. It is fixed with a rubber band.
  • The white paper is put like a cap at one end of the thinner PVC pipe. It is also fixed with a rubber band.
  • A hole is made in the middle of black paper cap with the pin.
  • 2 to 3 drops of oil is put on the white paper cap so that it becomes translucent.
  • The thin pipe is slide into the big pipe. Now the pinhole camera is ready.

Question 31.
See the picture given below.
Answer the following questions:

(i) Is the object visible to her even after holding the plank infront of the girl face, there is light?
(ii) What happens when you hold a plank between the object and girl?
TS-6th-Class-Science-Important-Questions-15th-Lesson-Light-Shadows-and-Images-3
Answer:
(i) The object is not visible, though there is light.
(ii) The plank that is held between girl and object obstructs the reflection of light that bounces back from it.

Question 32.
Read the para and answer the questions.
The objects which form shadow are called opaque substances.
Eg: stone, book, stick etc.
The substances which allow light to pass through them are called transparent substances. Eg: glass
1. Give the examples of opaque substances.
2. If a student playing with polythene cover, does he see shadow through that ? Why?
3. What are transparent substances?
4. If light falls on book how does the shadow appear?
Answer:

  1. Stone, hook, stick etc.
  2. He doesn’t see the shadow. Because polythene cover is a transparent substance.
  3. The substances which allow light to pass through them are transparent substances.
  4. If light falls on one side of the book the shadow appears on other side.

TS Board 6th Class Science Important Questions 15th Lesson Light, Shadows and Images

Question 33.
Draw the diagram of pinhole camera.
Answer:
TS-6th-Class-Science-Important-Questions-15th-Lesson-Light-Shadows-and-Images-8

Question 34.
Observe the figures given below.
Write whether the sheet held by the boy is transparent, translucent or opaque below each of the pictures.
TS-6th-Class-Science-Important-Questions-15th-Lesson-Light-Shadows-and-Images-5
Answer:

  • Sheet 1 is opaque
  • Sheet 2 is transparent
  • Sheet 3 is translucent

Question 35.
Based on the above given pictures A, B, C guess the types of objects regarding shadow formation. Classify and name them according to light passing through them.
TS-6th-Class-Science-Important-Questions-15th-Lesson-Light-Shadows-and-Images-7
Answer:
The given pictures show the types of objects which allow the light to form shades. As per the observations the pictures of objects are classified these substances.
(A) Opaque substances: The form shades when light falls on them.
(B) Transparent substances: They allow light to pass through them.
(C) Translucent substances: They form unclear shadows.

TS Board 6th Class Science Important Questions 15th Lesson Light, Shadows and Images

Question 36.
How do you feel when you see object that form different shapes of shades?
Answer:
We must have wondered when we compared our guesses and the actual objects of which shadows are formed.
Eg : We may notice that the shadows that look like bird and animals are actually formed by hands.

TS 8th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సింగరేణి

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 10th Lesson సింగరేణి Textbook Questions and Answers.

TS 8th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సింగరేణి

బొమ్మను చూడండి ఆలోచించి చెప్పండి
TS-8th-Class-Telugu-Guide-10th-Lesson-సింగరేణి-1

ప్రశ్న 1.
చిత్రంలో కనపడుతున్నవాళ్ళు ఏం పనులు చేస్తున్నారు ?
జవాబు.
చిత్రంలో కనపడుతున్నవాళ్ళు బొగ్గు గనుల నుండి బొగ్గును బయటకు తెస్తున్నారు.

ప్రశ్న 2.
చిత్రంలో ఏయే వస్తువులు కనపడుతున్నాయి ?
జవాబు.
చిత్రంలో బ్యాటరీలైట్లు, బొగ్గుతో నిండిన గంపలు, తలలకు హెల్మెట్లు కన్పిస్తున్నాయి.

TS 8th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సింగరేణి

ప్రశ్న 3.
చిత్రం దేనికి సంబంధించిందని మీరు అనుకొంటున్నారు ?
జవాబు.
ఈ చిత్రం బొగ్గు గనులకు సంబంధించిందని అనుకుంటున్నాను.

ప్రశ్న 4.
తెలంగాణలో బొగ్గు గనులు ఏ ఏ జిల్లాలలో ఉన్నాయి ?
జవాబు.
తెలంగాణలో కరీంనగర్, వరంగల్లు, ఖమ్మం జిల్లాలలో బొగ్గు గనులున్నాయి.

ప్రశ్న 5.
నేలబొగ్గు వల్ల ఉపయోగాలేవి ?
జవాబు.
నేలబొగ్గు పరిశ్రమలకు ఇంధనంగా, విద్యుత్ ఉత్పత్తికి, రోడ్లు వేయటానికి తారుగా, ప్లాస్టిక్ను తయారు చేయటానికి, తలకు రాసే సువాసన నూనెలను తయారు చేయటానికి, బట్టలకు వేసే అద్దకాల రంగులను తయారుచేయటానికి ఉపయోగపడుతుంది.

ఆలోచించండి – చెప్పండి

1. “శ్రమజీవే జగతికి మూలం … చెమటోడ్చక జరుగదు కాలం’ అన్న వాక్యాన్ని ఏవిధంగా అర్థం చేసుకున్నారు?
జవాబు.
మానవ జీవితం సుఖమయం కావాలంటే అందరి అవసరాలు తీరాలి. అందరి అవసరాలు తీరాలంటే జాతీయోత్పత్తులు పెరగాలి. జాతీయోత్పత్తులు పెరగాలంటే అందరూ కష్టపడి పని చేయాలి. అందుకే శ్రమజీవే జగతికి మూలం అని అర్థం చేసుకున్నాం.

2. ఈ నేల బొగ్గును ‘నల్ల బంగారం’ అని ఎందుకంటారు ?
జవాబు.
బంగారం ఎన్ని రకాలుగా ఉపయోగపడుతూ మన విలువను పెంచుతుందో అన్నివిధాలుగా బొగ్గుకూడా ఉపయోగపడుతున్నది. కావున బొగ్గును బంగారంతో పోల్చి ‘నల్ల బంగారం’ అని అంటున్నాం.

TS 8th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సింగరేణి

3. ‘సహజ సంపదను వినియోగించుకొనే విజ్ఞానం పైననే మానవ నాగరికత నిర్మించబడుతున్నది’ చర్చించండి.
జవాబు.
ఒకదేశం తనకున్న సహజవనరులను ఎంత విరివిగా ఉపయోగించుకుంటే అంత అభివృద్ధిని సాధిస్తుంది. ఉదాహరణకు ప్రకృతి ప్రసాదించిన సహజ సంపద బొగ్గు. దానిని పలు పరిశ్రమలు పలురకాలుగా వాడుకుంటున్నాయి. అలాగే అటవీ సంపద, జల సంపద వీటిని పూర్తి వినియోగంలోనికి తేవటం ద్వారా సామాజిక ఎదుగుదలకు అవకాశాలుంటాయి.

4. ఈ ‘దేశంలో మరే ఇతర బొగ్గు సంస్థకు లేని ప్రత్యేకత సింగరేణి గనులకు ఉన్నది’ ఎందుకో చర్చించండి.
జవాబు.
సింగరేణి గనుల్లో అపారంగా, తరిగిపోనన్ని బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఈ గనుల్లోని బొగ్గు నాణ్యమైంది. ఇవి తెలంగాణా గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పిస్తూ, సామాజిక, ఆర్థిక స్థితులను మెరుగుపరిచాయి.

5.”బొగ్గు ఉత్పత్తిలో కార్మికుడే అత్యంత కీలకమైన పనిముట్టు” అని ఎందుకన్నారు?
జవాబు.
సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషించేది కార్మికులే! వారందరూ తెలంగాణ గ్రామీణ ప్రాంత వాసులు. గనులలోకి వెళ్ళి బొగ్గును త్రవ్వి పోగుచేసి తట్టల్లో ఎత్తి వెలుపలికి పంపిస్తారు. ఆ నైపుణ్యం గని కార్మికులకే ఉంటుంది. అందుకే బొగ్గు ఉత్పత్తిలో కార్మికుడే అత్యంత కీలకమైన పనిముట్టు అని అన్నారు.

6. ‘గడియారం ముండ్లవలె పనిచేస్తున్న కార్మికులు’ అన్న వాక్యాన్ని మీరెట్లా అర్థం చేసుకున్నారు?
జవాబు.
శ్రమకు ప్రతినిధిగా గడియారం ముల్లును సూచిస్తాం. అట్లాగే బొగ్గుగనిలో పనిచేసే కార్మికులు కోడికూత కంటే ముందే లేచి గనులలోకి వెళ్ళేవారు వెళ్తుంటారు, వచ్చేవారు వస్తుంటారు. ఇలా గడియారం ముల్లులు తిరిగినట్లు కార్మికులు కూడా విరామం లేకుండా మూడు షిఫ్టుల్లో పనిచేస్తూనే ఉంటారని అర్థమయింది.

TS 8th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సింగరేణి

7. ప్రమాదాల అంచున నిలబడి పని చేయటం అంటే ఏమిటి?
జవాబు.
ప్రమాదాల అంచున నిలబడి పనిచేయట మంటే గనిలోకి వెళ్ళిన కార్మికులకు ఎపుడు ఏవిధంగా ప్రమాదం ఏర్పడుతుందో తెలియదు. గనులు విరిగిపడి, గనులలోకి నీరువచ్చి, గాలి వెలుతురులు లేక ఊపిరితిత్తుల సమస్యలు తరచు వారి ఆరోగ్యాన్ని పాడుచేస్తుంటాయి. అందుకే వారు ప్రమాదాల అంచున పనిచేసే కార్మికులని అర్థమౌతుంది. ఏ ప్రమాదం ఎక్కడ పొంచి వున్నదో చెప్పలేని పరిస్థితి..

ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. సింగరేణి కార్మికులు కాయకష్టం చేసి బొగ్గు తీస్తున్నారు కదా! కార్మికుల జీవితాల గురించి మీకేం అర్థమయిందో చెప్పండి.
జవాబు.
తెలంగాణ ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనులు దేశంలోనే ప్రసిద్ధి వహించినవి. దానికి కారకులు సింగరేణి గనులలో పనిచేసే గని కార్మికులే! ఆ కార్మికులందరూ తెలంగాణ గ్రామీణ ప్రాంతంలోని పేద ప్రజలే! వారి సామాజిక ఆర్థిక స్థితిగతులు సింగరేణికి ఊపిరులయ్యాయి. బ్రతుకు భారాన్ని మోయటానికి కష్టం చేయక తప్పిందికాదు. ప్రారంభంలో వారి శ్రమకు తగిన ఫలితం కూడా వచ్చేది కాదు.

తరువాత కార్మిక సంఘాల చైతన్యంతో తగిన కూలీ రెట్లతో వారి జీవితాలు కొంతలో కొంత మెరుగు పడ్డాయి. బొగ్గు గనుల్లో పనిచేయట మంటే ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవటమే! ఏ బతుకుదెరువు లేకపోతే ఈ పనిలో చేరేవారు. కార్మికులు రాత్రి పగలు అను భేదం లేకుండా కష్టపడి పనిచేస్తుంటారు. గడియారంలో ముల్లు విరామం లేకుండా ఎట్లా తిరుగుతుందో సింగరేణి కార్మికులు కూడా నిరంతరం కృషికి ప్రతినిధులని అర్థమౌతుంది.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం చదువడం-అర్థం

1. కింది గేయాన్ని చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఇష్టదేవతకు దండం పెట్టి
గనిలోనికి నువు అడుగుబెట్టి
బళ్ళున బొగ్గు కూలుత ఉంటే
ప్రాణాలకు వెనుకాడక నువ్వు
రక్తమాంసాలు చెమటగ మార్చి
టబ్బుల్లోన బొగ్గు నింపుతవ్
జాతికి వెలుగులు అందిస్తుంటవు
“నల్లసూర్యుని”వై వెలుగొందుతవు.

ప్రశ్నలు :

అ. గేయం ఎవరిని గురించి తెలుపుతుంది?
జవాబు.
ఈ గేయం బొగ్గు కార్మికుని గురించి తెలుపుతుంది.

ఆ. ఇష్టదేవతకు ఎందుకు దండం పెడతారు ?
జవాబు.
ఇష్టదేవతకు తమకు కష్టం రానీయవద్దని దండం పెడతారు.

ఇ. కార్మికుడిని ‘నల్లసూర్యుడు’ అని ఎందుకన్నారు?
జవాబు.
సూర్యుడు లోకాలకు వెలుగులను పంచినట్లు, నల్లసూర్యునిగా పిలువబడుతున్న గని కార్మికుడు ప్రపంచానికి కరెంటు కాంతిని అందిస్తున్నాడు. అందుకే బొగ్గుగని కార్మికుడిని నల్లసూర్యుడని అన్నారు.

TS 8th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సింగరేణి

ఈ. జాతికి వెలుగు అందించడమంటే ఏమిటి?
జవాబు.
జాతికి వెలుగు అందించట మంటే జాతి పురోభివృద్ధికి పాటుపడటమని అర్థం.

ఉ. తెలంగాణలో బొగ్గుగనులు ఎక్కడున్నాయి?
జవాబు.
తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఇల్లందులోను, అదిలాబాద్ జిల్లా తాండూరులోను, కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోను, తెలంగాణలోని గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో బొగ్గుగనులు విస్తరించి ఉన్నాయి.

2. కింది పేరా చదువండి. అయిదు ప్రశ్నలను తయారు చేయండి.

తెలంగాణ బట్టల అద్దకం విషయంలో అనాదిగా ప్రాముఖ్యత వహించిన ప్రదేశం. ఒకప్పుడు ఆ పరిశ్రమ ఉన్నతదశలో ఉండేది. కాని దేశంలో వచ్చిన ఆర్థిక చిక్కులు ఈ పరిశ్రమను కష్టనష్టాలకు గురిచేశాయి. విదేశాలలో యంత్రాలపై తయారైన బట్టలకు అలవాటుపడిన ఈ నాటి వారికి మన చేతి పనుల వలన తయారయ్యే సుందర వస్త్రాల గురించి నేటికైనా కనువిప్పు కలిగింది.

అ. ఈ పేరా మనకు దేనిని గురించి వివరిస్తుంది?
ఆ. ఒకప్పుడు తెలంగాణ దేనికి ప్రాముఖ్యత వహించిన ప్రదేశం?
ఇ. ఒకప్పుడు ఏ కుటీర పరిశ్రమ తెలంగాణలో ఉన్నతస్థితిలో ఉండేది?
ఈ. బట్టల అద్దకం పరిశ్రమ ఎందుకు కష్టనష్టాలకు గురి అయింది?
ఉ. విదేశాలలోని యంత్రాలపై ఎట్లాంటి వస్తువులు తయారయ్యేవి?
ఊ. చేతి పనులపై తయారయ్యే వస్తువులు ఎలా ఉంటాయి?
ఎ. నేటికి ప్రజలలో ఏ విషయంలో కనువిప్పు కలిగింది?

III. స్వీయరచన:

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. సహజ సంపదలను వినియోగించుకునే విజ్ఞానం పైన మానవ నాగరికత నిర్మించబడుతుందని ఎట్లా చెప్పగలవు?
జవాబు.
ఒక దేశం తనకున్న సహజ వనరులను చక్కగా వినియోగించుకుంటేనే మంచి అభివృద్ధిని సాధించగలుగుతుంది. ప్రపంచదేశాలన్నీ పారిశ్రామికంగా ముందంజలో ఉన్నాయి. భారతదేశం కూడా వాటితో పోటీ పడాలంటే పారిశ్రామిక అభివృద్ధిని సాధించాలంటే సహజ సంపదలను వినియోగించుకోక తప్పదు. అప్పుడే నిజమైన మానవ నాగరికత నిర్మించబడుతుంది. ఉదాహరణకు జలవనరులను, ఖనిజ సంపదను ఉపయోగించుకోవటం ద్వారా మనం దేశాభివృద్ధిని చేసుకోగలిగాం. అట్లాగే పలు పరిశ్రమలకు, విద్యుదుత్పత్తికి, రంగుల తయారీకి, రోడ్లకు మూలమైన నేలబొగ్గును ఒక సహజవనరుగా ఉపయోగించటం వలన అభివృద్ధికి రాచబాటలు వేసుకోగలమని చెప్పగలను.

ఆ. “బుక్కెడు బువ్వకోసం బతుకు పోరాటానికి సిద్ధమైనారు” దీనిని మీరెట్లా అర్థం చేసుకున్నారో తెల్పండి.
జవాబు.
తెలంగాణా పోరాటగడ్డ. వారు జీవితంలో తిండికి గుడ్డకు, స్వాతంత్ర్యానికి పోరాటం అనాదిగా సాగిస్తూనే ఉన్నారు. శ్రమలేకుండా సుఖం లేదన్నది వారి సిద్ధాంతం. శ్రమజీవే జగతికి మూలం. చెమటోడ్చక జరుగదు కాలం. అందుకే శ్రమజీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని శ్రీశ్రీ అని ఉంటారు. తెలంగాణ గ్రామీణులు మిక్కిలి పేదవారు. నీటికి కటకట పడుతున్న ప్రాంతమది. నీటి సదుపాయం లేకపోవటం వలన వర్షం మీద ఆధారపడి పంటలు పండిస్తారు. వర్షం పడకపోతే క్షామం తప్పనిసరి. అందుకే ‘బుక్కెడు బువ్వకోసం బతుకు పోరాటానికి సిద్దమై ప్రమాదం పొంచి ఉన్నా బొగ్గు గనులలో పనిచేయుటకు సిద్ధమయ్యారు. బొగ్గుగనులు వారికి జీవన భృతినిస్తున్నాయి.

TS 8th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సింగరేణి

ఇ. పగలు, రేయి తేడా లేకుండా గడియారం ముండ్లవలె పని చేయటం అంటే ఏమిటి ? కార్మికుల పనితో అన్వయించి రాయండి.
జవాబు.
సింగరేణి కార్మికులు పగలు రేయి తేడా లేకుండా గడియారం ముండ్లవలే పనిచేస్తుంటారు. కోడి కూతకు ముందే లేచి తయారై గనిలోకి పోయేవారు కొందరైతే, పగలు మూడు గంటలకు గనులలోకి పోయేవారు మరికొందరు. అర్ధరాత్రి పనికి పోయేవారు ఇంకొందరు. ఇట్లా ప్రొద్దున నుండి అర్ధరాత్రి వరకు మూడు షిఫ్టుల్లో గనుల్లో పని చేస్తూనే ఉంటారు. ఇలా గడియారం ముళ్ళు విసుగు విరామం లేకుండా ఎట్లా పనిచేస్తాయో అట్లానే సింగరేణి కార్మికులు కూడా పనిచేస్తున్నారని తెలుస్తుంది.

ఈ. డాక్టర్ కింగ్ పరిశోధనల వల్ల కల్గిన మేలు ఏమిటి?
జవాబు.
సింగరేణి గనుల విశిష్టతలను లోకానికి తెలియజేసిన వాడు డాక్టర్ కింగ్. ఆయన పరిశోధనల వలన దేశంలోని ఏ ఇతర బొగ్గు గనులకు లేని విశిష్టత వీటికి వచ్చింది. 1841లో ఖమ్మం జిల్లా ఇల్లందు గ్రామానికి చెందిన కొందరు గ్రామస్థులు భూమిని త్రవ్వుతుండగా బొగ్గు విషయం లోకానికి తెలిసింది. ఈ సంఘటన ఆధారంతో 1871లో డాక్టర్ కింగ్ ఇల్లందు గ్రామ పరిసరాలలో శ్రేష్టమైన బొగ్గు ఉన్నదని తన పరిశోధనలో గుర్తించాడు. ఈ బొగ్గు భూమి లోపల ఆరు పొరల్లో నిక్షిప్తమై ఉన్నదని కనుగొన్నాడు. గనిలోని క్రింది బొగ్గుపొరకు ‘కింగ్ సీమ్’ అని, పై బొగ్గు పొరకు ‘క్వీన్ సీమ్’ అని పేరు పెట్టారు. కింగ్ పరిశోధనల వలన వేలాది కార్మికులకు ఉపాధి, ప్రకృతి వనరులను ఉపయోగించుకోగలిగిన అవకాశం మనకు లభించింది.

ఉ. బొగ్గు గనులలో కార్మికులను ఎలా ఎంపిక చేసేవారు?
జవాబు.
తెలంగాణ గ్రామీణ ప్రజలు బతుకు పోరాటానికి అలవాటు పడినవారు. బుక్కెడు బువ్వకోసం తెలంగాణ పల్లెల నుండి గనులలో కూలీలుగా తరలి వచ్చేవారు. చదువురాకపోయినా, బరువులు మోయటం, గుంజీలు తీయటం, పరుగు పోటీలు వంటి వాటిద్వారా అర్హులను ఎంపిక చేసి వారిని బొగ్గు గని కార్మికులుగా తీసుకొనేవారు. వారు మూడు షిఫ్టులలో పనిచేయాల్సి వచ్చేది. గనుల్లో పనిచేయటం ప్రాణాలకు ముప్పు అని తెలిసినా గత్యంతరం లేక వారు పెట్టే పరీక్షలలో నెగ్గి గని కార్మికులుగా చేరిపోయేవారు. తరువాత తరువాత గనుల యజమానులు కార్మికుల రక్షణకు శ్రద్ధ చూపించటంతో ఎక్కువ మంది గనులలో పనిచేయటానికి ముందుకు వచ్చారు. యూనియన్ల ద్వారా ప్రస్తుతం మంచి జీవన భృతిని అందుకుంటున్నారు.

ఊ. సింగరేణి గని కార్మికుడు వ్రాసిన పాటకు అర్థాన్ని తెలుపండి.
జవాబు.
ఆలోచనలను ప్రక్కనపెట్టి హాయిగా కష్టపడు. అరవై ఐదు అంగుళాల సమతలంలో నలభై అంగుళాల లోతు వరకు రంధ్రం చేసి ఆ రంధ్రంలో మందుకూరి మందుపాతరను పేల్చమని షార్టు ఫైరన్నకు వివరిస్తున్నాడు. పైకప్పు కూలకుండా బోల్టులు వేసి ప్రమాదాలను జరుగకుండా చూడమంటున్నాడు. బొగ్గు జారిపోకుండా దిమ్మలను సరిచేయమంటున్నాడు. టబ్బు తరువాత టబ్బును పెట్టి మెల్ల మెల్లగా టబ్బును నింపమని ఫిల్లరన్నకు చెప్తున్నాడు.

చక్కగా ఆ బొగ్గుతో నిండిన టబ్బులను రోప్తో పైకి నడిపించమని హాలరన్నను కోరుతున్నాడు. బాధ లెన్నో పడి చక్కని కష్టం చేసి బొగ్గును పైకి చేర్చాము. దానికి తగిన ఫలితాన్ని బ్యాంకు ద్వారా మాకు అందించమని సింగరేణి గని కార్మికుడు పాట ద్వారా తన కష్టాన్ని మరచి పోతున్నాడు అని దీని అర్థం.

ఎ. బొగ్గు గనులు ఎలా ఏర్పడి ఉంటాయి ? అవి సహజ వనరులు ఎలా అయ్యాయి?
జవాబు.
బొగ్గు గనులు గోదావరి నది పరీవాహక ప్రాంతమంతా వ్యాపించి ఉన్నాయి. పూర్వం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిండి ఉండేది. రెండు వందల మిలియన్ సంవత్సరాలకు పూర్వం ఆ అడవులు తగలబడి భూమి మీదున్న ఆ వృక్షముల అవశేషాలు క్రమ క్రమంగా భూమిలోకి కూరుకుపోయాయి.

అట్లా కూరుకుపోయిన వాటి మీద మట్టి, రాళ్ళు పడి లోపలికి చేరి పొరలు పొరలుగా బొగ్గు ఏర్పడిందని శాస్త్రజ్ఞుల భావన. అట్లా ఏర్పడిన బొగ్గు మనకు ఇపుడు పలు అవసరాలకు ఉపయోగపడుతోంది. ప్రకృతి ప్రసాదించిన సహజవనరుల్లో ఇది కూడా ఒకటి అయింది. సహజంగా ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా భూమి నుండి తీసుకొని వాడుకుంటున్నాం కాబట్టి ఇది ఒక సహజ వనరు అయింది.

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. సింగరేణి కార్మికులతో ప్రత్యక్ష సంబంధం మనకు లేకపోవచ్చు. కానీ పరోక్ష సంబంధం ఉన్నది. ఎట్లాగో వివరించండి.
జవాబు.
సింగరేణి కార్మికులతో ప్రత్యక్ష సంబంధం మనకు లేకపోయినా ఆ కార్మికులు ఉత్పత్తి చేసిన బొగ్గు మన అవసరాల నెన్నింటినో తీరుస్తున్నది కావున మనకు వారితో పరోక్ష సంబంధం ఉన్నట్లే. వారు తయారుగా ఉంచిన బొగ్గు యంత్రాలు నడపటానికి ఉపకరిస్తుంది. దానివలన ఎందరికో ఉపాధి కలుగుతున్నది. బొగ్గుతో విద్యుచ్ఛక్తి తయారవుతుంది. అది లేనిదే ఈ మన దైనందిన జీవితం చాలా కష్టతరమౌతుంది.

బొగ్గుతో ఎన్నో పరిశ్రమలు నడుస్తున్నాయి. ఆ పరిశ్రమలలో పనిచేసేవారికి ఉపాధికారి అవుతుంది. మనం నడవటానికి సరైన రహదారులు కావాలి. రహదారుల నిర్మాణంలో బొగ్గు నుండి ఉత్పత్తి చేసే తారు ప్రధానపాత్ర వహిస్తుంది. పంట పొలాలకు వేస్తున్న రసాయనిక ఎరువులు బొగ్గుతో తయారవుతున్నాయి. బట్టలకు అద్దకం పనిచేయటానికి రంగులను బొగ్గుతోనే తయారు చేస్తున్నారు. మనదేశంలో విరివిగా అందుబాటులో ఉన్న సహజవనరు బొగ్గు, ఆ బొగ్గును అందించే కార్మికుడితో మన సమాజంలో బతుకుతున్న వారందరికి పరోక్ష సంబంధం ఉన్నది.

చివరకు బట్టలను ఇస్త్రీ చేయటానికి కూడా ఈ బొగ్గు ఉపయోగింప బడుతున్నది కదా! కాబట్టి సింగరేణి కార్మికులు అక్కడ బొగ్గు గనులలో పనిచేస్తున్నా వారితో మనకు పరోక్ష సంబంధం తప్పనిసరి అవుతుంది. ఎంతో మందికి జీవనోపాధిని కల్పించి, ఎన్నెన్నో అవసరాలు తీర్చే సింగరేణి తెలంగాణ ప్రాంతానికి తలమానికం అని చెప్పవచ్చు.

TS 8th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సింగరేణి

ఆ. ఆ సింగరేణి గనుల పూర్వాపరాలను తెలియజేయండి. (లేదా) సింగరేణి తెలంగాణాకు తలమానికం వంటిదని ఎలా చెప్పగలవు ?
జవాబు.
ఏ దేశం తన సహజ సంపదను సమర్థవంతంగా వినియోగించుకుంటుందో ఆ దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. మన నేలల్లో అపారమైన ఖనిజ సంపద ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనులు చెప్పుకోదగినవి.
గోదావరి నదీ పరీవాహక ప్రాంతమంతా ఒకప్పుడు దట్టమైన అడవులతో నిండి ఉండేది. రెండు మిలియన్ సంవత్సరాలకు పూర్వం ఆ అడవులు తగలబడి ఆ చెట్ల అవశేషాలు భూమిలోపలకు చేరి పొరలు పొరలుగా ఏర్పడ్డాయి. అవే బొగ్గుగనులు. దానినే నేలబొగ్గు అని, నల్ల బంగారం అని పిలుస్తున్నాం.

మొట్టమొదటిగా ఖమ్మం జిల్లా ఇల్లందు గ్రామస్తుల త్రవ్వకాలలో ఈ బొగ్గు గనుల చరిత్ర బయటపడింది. భారత ప్రభుత్వానికి చెందిన భూగర్భ పరిశోధన శాఖ పరిశోధనలు చేసి ఇది అంత మంచిది కాదని తేల్చింది. ఆ తరువాత 1871లో డాక్టర్ కింగ్ అనే శాస్త్రజ్ఞుడు ఇల్లందు గ్రామ పరిసరాలలో శ్రేష్టమైన బొగ్గును గుర్తించాడు. ఇది భూమి అడుగు పొరలలో ఉందని అన్నాడు. 1886లో హైదరాబాద్ దక్కన్ కంపెనీవారు తొలి భూగర్భ గనిని ఇల్లందులో ప్రారంభించారు.

దీనిలోని క్రింది బొగ్గుపొరకు ‘కింగ్సీమ్’ అని పైపొరకు ‘క్వీన్ సీమ్’ అని పేరుపెట్టారు. బొగ్గును రవాణా చేయటానికి డోర్నకల్ నుండి ఖాజీపేట వరకు రైల్వేలైను వేసి దానికి ‘సింగరేణి కాలరీస్’ అను పేరు పెట్టారు. హైదరాబాద్ దక్కన్ కంపెనీ, సింగరేణి కాలరీస్ కంపెనీగా మారిపోయింది. ఎంతోమందికి జీవనోపాధిని కల్పించి, ఎన్నెన్నో అవసరాలు తీర్చే సింగరేణి తెలంగాణ ప్రాంతానికి తలమానికం అని చెప్పవచ్చు.

ఇ. బొగ్గు గనులలో పనిచేసే విభాగాలు, వాటి పేర్లు, కార్మికుల హోదాలను రాయండి.
జవాబు.
బొగ్గుగనులలో పనిచేసేవారు గడియారం ముళ్ళవలే శ్రమజీవులు. మూడు షిఫ్ట్లలో పనిచేస్తారు. గనిలోకి పోయేముందు హాజరు వేయించుకుంటారు. ‘ఓర్మెన్’ పనిని విభజించి ఎవరెవరు ఏం చేయాలో చెప్తాడు. పొట్టినిక్కరు, కాళ్ళకు బూట్లు, తలపై లైటుతో ఉన్న టోపి, నడుముకు బాటరీ కట్టుకొని కార్మికులు గనిలోకి ప్రవేశిస్తారు. సర్దార్ పని ప్రదేశాన్ని పరిశీలించి టింబర్మెన్ చేయవలసిన పనిని నిర్దేశిస్తాడు. ‘కోల్ కట్టర్’ ఉళ్ళు కోసి మందుపాతరలను పెడతాడు. ‘షార్ట్ ఫైర్మెన్’ వాటిని పేలుస్తాడు. తర్వాత ‘సర్దార్’ ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తాడు.

ఇతడు పైకప్పు కూలకుండా ప్రమాదాలను పసికడుతుంటాడు. ‘కోల్ ఫిల్లర్’లు చెమ్మత్తో బొగ్గును తట్టల్లోకి ఎత్తి టబ్బులు నింపుతారు. ‘హాలర్’ టబ్బులన్నీ నిండిన తరువాత రోప్ సాయంతో పైకి చేరుస్తాడు. ఇట్లా సేఫ్టీ అధికారి, అండర్మెన్, సర్వేయర్, చైర్మెన్, ఓర్మెన్, సర్దార్ (మొకద్దం) షార్ట్ఫర్, కోల్కట్టర్, టింబర్మెన్, లైన్మెన్, ట్రామర్, హాలర్, కోల్ ఫిల్లర్, జనరల్ మద్దూర్లు, బొగ్గును వెలికి తీసే పనిలో భాగస్వాములు అవుతారు. వీరందరూ కలసికట్టుగా పనిచేస్తేనే బొగ్గు త్రవ్వి తీయటం సాధ్యమౌతుంది. అపుడే దేశ పురోభివృద్ధి సాధ్యమౌతుంది.

TS 8th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సింగరేణి

ఈ. “సింగరేణిని వెలుగులు విరజిమ్మే సింగరేణి” అని ఎందుకు అన్నారు ?
జవాబు.
సింగరేణిని “సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం” అని అంటారు. ఎందుకంటే మొత్తం దక్షిణ భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి చేసే ఏకైక కంపెనీ; వేల మందికి ముఖ్యంగా గ్రామీణ పేద ప్రజలకి జీవనోపాధిని, పనిని కల్పించిన కంపెనీ అయిన సింగరేణికి తెలంగాణలో ఎంతో విశిష్టత ఉంది. సామాజిక జీవితంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పరిశ్రమల్లో సింగరేణి ఒకటి. దేశ ప్రగతికి తోడ్పడే సింగరేణి గనులు, బొగ్గు, థర్మల్ స్టేషన్ గొప్పతనం చెప్పారు.

బొగ్గును అందించి పరిశ్రమలు పనిచేసేలా భగభగమండి వెలుగులు విరజిమ్ముతుంది. ఆ గనుల్లో, కర్మాగారాలలో పనిచేసే కార్మికుల జీవితాలలో వెలుగును నింపుతుంది. అక్కడ పనిచేసే వారి జీవితాలకు సిరిసంపదలనిస్తుంది. ఎంతో సహజ ఖనిజ సంపద అణువణువున కల్గి ఉంది. అక్కడి బొగ్గుతో విద్యుచ్ఛక్తి తయారుచేసి వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తారు. ఆ విద్యుత్ వెలుగులను సింగరేణి ఇస్తుంది. కనుక సింగరేణిని “వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం” అని, “అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం” అని అంటారు.

IV. సృజనాత్మకత/ప్రశంస:

1. సింగరేణి కార్మికులు గనిలో తీసుకోవలసిన జాగ్రత్తలను తెలుపుతూ ఒక పోస్టరు తయారుచేయండి.

గనిలో పాటించవలసిన జాగ్రత్తలు.

  1. గనులలోకి పోయే కార్మికులు ‘మస్టర్’ (హాజరు) తప్పనిసరిగా వేయించుకోవాలి.
  2. తన పనేదో దానికే పరిమితం కావాలి.
  3. సులువుగా నడవటానికి, పరిగెత్తటానికి వీలయ్యే పొట్టి నిక్కరునే ధరించాలి.
  4. కాళ్ళకు దెబ్బలు తగలకుండా బూట్లు వేసుకోవాలి.
  5. తలపై టోపీకున్న లైటు సరిగా వెలుగుతుందో లేదో పరీక్షించుకోవాలి.
  6. నడుముకున్న బాటరీ సరిగా ఉన్నదో లేదో చూసుకోవాలి.
  7. మందు పాతరలు పెట్టేటప్పుడు, పేల్చేటప్పుడు అందరినీ అప్రమత్తం చేయాలి.
  8. గనులలోకి నీరు ప్రవేశించినపుడు వెంటనే బయటకు వచ్చేయాలి.
  9. గనులు కూలిపోతాయన్న అనుమానం వచ్చినపుడు వేగంగా బయటకు రావాలి.
  10. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి.
  11. మత్తుపానీయాలు సేవించి గనులలోకి ప్రవేశించరాదు.
  12. నిప్పుపట్ల జాగ్రత్త వహించాలి.
  13. బొగ్గును పైకి చేర్చే రోప్ ను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండాలి.
  14. ఆరోగ్య విషయంలో తరచుగా డాక్టర్ను సంప్రదించాలి.
  15. ఒంటికి శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి.

(లేదా)

2. సింగరేణి గనులు / కార్మికుల గురించి ఒకపాట రాయండి.

పల్లవి: చీకటిలో కష్టపడే శ్రమ జీవన సాంద్రుడు
పరుల బతుకులకు వెలుగులు పంచు నల్ల చంద్రుడు. ॥

అనుపల్లవి: శ్రేష్ఠుడురా మాయన్న సింగరేణి కార్మికుడు
నిష్ఠాయుతుడైన నల్ల బంగారం ప్రేమికుడు. ॥

1 చరణం: ఫ్యాక్టరీ కూత విని పరుగెత్తే సైనికుడు
పగలు రేయి పని వీణను మోగించే వైణికుడు
ఊపిరాడలేని గనుల లోపల ఒక యాత్రికుడు
చెమటను బంగారంగా చేయగలుగు మాంత్రికుడు.

2 చరణం: చావుకు వెరువక పోరే ఒక సాహస వీరుడు
కఠిన పరిస్థితులనైన కరిగించే ధీరుడు
తన వాళ్ళ సుఖం కోసం తపియించు ఋషీంద్రుడు
పెనుసవాళ్ళు ఎదురైనా వెరవని గంభీరుడు.

3 చరణం: జీవితమొక పోరాటంగా సాగే యోధుడు
త్యాగ జీవనానికే నిదర్శనమౌ ధన్యుడు
కడలివంటి కన్నీళ్ళను దాచుకునే సాగరుడు
జనతకు ప్రభుతకు జాతికి నిజమైన సేవకుడు.

V. పదజాల వినియోగం:

1. కింద ఇచ్చిన జాతీయాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

ఉదా : కోడికూత = తెల్లవారు సమయం
పల్లె ప్రజలు కోడికూత కు ముందే లేచి పనులు మొదలు పెడతారు.

(అ) చెమటోడ్చు = కష్టపడు
తెలంగాణ ప్రజలందరు చెమటోడ్చి పనిచేస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమౌతుంది.

(ఆ) మూలస్తంభం = ముఖ్యమైనది
దేశ అభివృద్ధిలో కార్మికులే మూలస్తంభాలు

(ఇ) బతుకుపోరు = కష్టపడి పనిచేసేవారే బతుకు పోరులో విజయం సాధిస్తారు.

(ఈ) మసిబారు = చేతి వృత్తుల వారి జీవితాలు రోజురోజుకు మసిబారుతున్నాయి.

(ఉ) తలమానికం = శ్రేష్ఠము – గొప్పది
సింగరేణి గనులు మనదేశానికి తలమానికం

2. కింద ఇవ్వబడిన పదాలకు పట్టికలోని పదాల సహాయంతో పర్యాయపదాలు రాయండి.

శరీరంపుడమినిశీథినిసుగంధం
సౌరభంరాత్రివసుధమేను
ధరణిదేహంయామినిపరిమళం

(అ) తనువు = శరీరము మేను దేహం
(ఆ) భూమి = పుడమి, వసుధ, ధరణి
(ఇ) రేయి = నిశీథిని, రాత్రి, యామిని
(ఈ) సువాసన = సుగంధం, పరిమళం, సౌరభం

కింది పదాలకు పాఠం ఆధారంగా ప్రకృతి, వికృతులను రాయండి.

(అ) అచ్చెరువు అచ్చెరువు
(ఆ) ఖని
(ఇ) జంత్రము
(ఈ) ప్రాణం

(అ) అచ్చెరువు – ఆశ్చర్యము (ప్ర)
(ఆ) ఖని (ప్ర) – గని (వి)
(ఇ) జంత్రము (వి) – యంత్రము (ప్ర)
(ఈ) ప్రాణం (ప్ర) – పానం (వి)

TS 8th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సింగరేణి

VI. భాషను గురించి తెలుసుకుందాం:

1. కింది విడదీసిన పదాలను కలిపి రాయండి. సంధిపేరు రాయండి.

(అ) కావాలి + అంటే = కావాలంటే – ఇత్వ సంధి
సూత్రం : ఏమి మొదలైన పదాలలోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.

(ఆ) మూల + ఆధారం = మూలాధారం – సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋలకు సవర్ణాలైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.

(ఇ) ప్రాంతము + అంతా = ప్రాంతమంతా – ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.

(ఈ) ఎప్పుడు + ఎప్పుడు = ఎప్పుడ్సండు – ఆమ్రేడితసంధి
సూత్రం : అచ్చునకు ఆమ్రేడితం పరమైనపుడు సంధి తరచుగా అవుతుంది.

(ఉ) మహా + ఉద్యమం = మహోద్యమం – గుణసంధి
సూత్రం : అకారానికి ఇ, ఉ, ఋలు పరమైనపుడు క్రమంగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమవుతాయి.

2. కింది విగ్రహ వాక్యాలకు సమాసపదం రాయండి. సమాసం పేరు రాయండి.

(అ) మానవుని యొక్క నాగరికత = మానవ నాగరికత – షష్ఠీతత్పురుష సమాసము
(ఆ) సాధ్యం కానిది = అసాధ్యము -నఞ తత్పురుష సమాసము
(ఇ) రక్తమును, మాంసమును = రక్తమాంసాలు – ద్వంద్వ సమాసము
(ఈ) నేలలోని బొగ్గు = నేలబొగ్గు – షష్ఠీతత్పురుష సమాసము
(ఉ) మూడైన పూటలు = మూడు పూటలు – ద్విగు సమాసము

3. కింది వాక్యం చదువండి.

“ఈ మేఘాలు గున్న ఏనుగులా! అన్నట్టు ఉన్నాయి.”
దేన్ని దేనితో పోల్చారు ?
పై వాక్యంలో కనిపిస్తున్న పోలిక ఊహించి చెప్పబడింది. పై వాక్యంలో
ఉపమేయం : మేఘాలు
ఉపమానం : గున్న ఏనుగులు
అంటే మేఘాలను ఏనుగు పిల్లలవలె ఊహిస్తున్నామన్న మాట
దీనిని బట్టి పోలికను ఊహించి చెబితే అది “ఉత్ప్రేక్ష” అలంకారం.

4. కింది వాక్యాల్లో దేనిని దేనిగా ఊహించి చెప్పారో రాయండి.

(అ) మండే ఎండ నిప్పుల కొలిమా! అన్నట్లు ఉన్నది.
జవాబు.
మండే ఎండను నిప్పుల కొలిమితో ఊహించి చెప్పారు. ఇలా ఊహించి పోలిక చెప్తే దానిని ఉత్ప్రేక్షాలంకారం అంటారు. దీనిలో ఉపమేయం మండే ఎండలు. ఉపమానం నిప్పుల కొలిమి.

(ఆ) ఆకాశంలో నక్షత్రాలు కొలనులోని పువ్వులా! అన్నట్లు ఉన్నాయి.
జవాబు.
ఆకాశంలోని నక్షత్రాలను కొలనులోని పువ్వులుగా ఊహించి చెప్పారు. ఇలా ఊహించి పోలిక చెప్తే దానిని ఉత్ప్రేక్షాలంకారమంటారు. దీనిలో ఉపమేయం ఆకాశంలోని నక్షత్రాలు. ఉపమానం కొలనులోని పువ్వులు.

TS 8th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సింగరేణి

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని:

1. మీ ప్రాంతంలోని కార్మికులను / శ్రామికులను కలిసి, పనిలో వారు పొందిన అనుభవాలను, అనుభూతులను తెలుసుకొని, ఆ వివరాలను నివేదిక రూపంలో వ్రాసి తరగతిలో ప్రదర్శించండి.
జవాబు.

(అ) ప్రాథమిక సమాచారం :
(1) ప్రాజెక్టు పని పేరు : : కార్మికులు/శ్రామికులు పనిలో వారు పొందిన అనుభవాలు, అనుభూతులు
2) సమాచారాన్ని సేకరించిన విధానం : ఆయా కార్మికులు/శ్రామికులను కలువడం ద్వారా

(ఆ) నివేదిక :

విషయ వివరణ :
ఇటీవలే నేను మా ఊరికి దగ్గరలో ఉన్న సిరిసిల్లకు బంధువుల ఇంటికి వెళ్ళాను. సిరిసిల్ల ప్రముఖ వస్త్ర ఉత్పత్తి కేంద్రం. అందులో మరమగ్గాలపై ఆధారపడి వందలాది మంది నేతన్నలు జీవిస్తున్నారు. పనిలో వారి అనుభవాలు, అనుభూతులు తెలిసికోవడానికై వారి పని గూర్చి, ఆ పని పట్ల వారి అభిప్రాయం అడిగాను. చాలా మంది వారి వృత్తి పట్ల అసంతృప్తితో ఉన్నట్లు వారి మాటల ద్వారా నాకు అర్థమైంది. సొంత ఊరు విడిచి, పొట్ట చేత పట్టుకుని వచ్చిన నేతన్నలకు ఈ వస్త్ర పరిశ్రమ తగిన ఉపాధి కల్పించడం లేదనే చెప్పాలి.

ఇంటి అద్దె, పిల్లల చదువులు, జీవనయానంకై అయ్యే కిరాణ సామాను ఖర్చు, కూరగాయల ఖర్చు .. ఇలా ఎన్నో ఉన్నాయి. వారికి ఈ పనిలో లభించే డబ్బు సరిపోవడం లేదు … కుటుంబాన్ని నెట్టుకు రావడానికో, పిల్లల చదువులకో, పిల్లల పెళ్ళిళ్ళకో చేసిన అప్పు తీర్చే మార్గం కన్పించక కొందరు నేతన్నలు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. తాగుడుకు బానిసలై తమ ఇంటిని, ఒంటిని గుల్ల చేసుకొంటున్నారు.

  1. రోజుకు 12 గంటలు పనిచేయాలి. కార్మిక చట్టం 8 గంటలు పనే అని చెబుతున్నా పట్టించుకొనే నాథుడే లేడు.
  2. డే & నైట్ రెండు షిఫ్టులలో పనిచేయాలి. నైట్ షిఫ్ట్లో పనిచేసేప్పుడు నిద్రలేక …. అనారోగ్యం బారిన పడుతున్నారు.
  3. విపరీతమైన శబ్దం మధ్య పనిచేయడంవల్ల వినికిడి శక్తి తగ్గడం, తలనొప్పి, రోజంతా చికాకుగా ఉండడం లాంటి లక్షణాలు వేధిస్తున్నాయి.
  4. ఒక్కసారి 8 మరమగ్గాలను పర్యవేక్షించాలి … ఎంతో ఒత్తిడి మధ్య నిలబడే పని చేయాల్సి వస్తుంది.
  5. చిన్న చిన్న దారపు పోగులు గాలిలో కలిసి, శ్వాస వ్యవస్థలో ప్రవేశించి శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉదా ॥ ఆస్త్మా లాంటివి వస్తున్నాయి.
  6. 12 గంటల పనిలో కనీసం 300 రూ॥లు సంపాదించ లేకపోతున్నారు. ఇంకా స్త్రీలకు ఈ రంగంలో మరీ అన్యాయం జరుగుతోంది. 12 గంటల పాటు కండెలు చుడితే 50-60 రూ॥లే వస్తున్నాయి. ఈ విధంగా వృత్తిలో వారెదుర్కొంటున్న సాదక బాధకాలు వివరించారు.

(ఇ) ముగింపు :
నేత కార్మికుల సాదక బాధకాలు వింటుంటే చాలా బాధనిపించింది. 8 గంటల పని అమలు చేస్తే బాగుండు ననిపించింది. పెరిగిన రేట్ల కనుగుణంగా వారి కూలీ రేట్లు కూడా పెంచితే బాగుండు ననిపించింది. వారి నెల జీతంలో కొంత డబ్బు మినహాయించుకొని వారిని, వారి కుటుంబాలను Health scheme లో చేర్పిస్తే బాగుండు ననిపించింది.

TS 8th Class Telugu 10th Lesson Important Questions సింగరేణి

పర్యాయపదాలు:

  • వ్యవసాయం – సేద్యము, కృషి
  • ప్రపంచము – లోకము, జగత్తు
  • సిరి – సంపదలు, ఐశ్వర్యము
  • నీరు – జలము, ఉదకము
  • బంగారము – స్వర్ణము, పసిడి

నానార్థాలు:

  • కాలము – సమయము, నలుపు
  • కార్యము – పని, పయోజనము
  • కుప్స – ధాన్యరాళ, ప్రోగు
  • కులము – వంశము, జాతి
  • కృషి. – ప్రయత్నము, వ్యవసాయం
  • గుహ – కొండ యందలి బిల్వము, హ్దయము
  • చరణము – పాదము, పద్యపాదము
  • చీకటి – అంధకారము, దుఃఖము

ప్రకృతిలు – వికృతిలు:

  • భూమి = బూమి
  • శక్తి = సత్తి
  • బంగారము = బంగరము
  • స్థిరము = తిరము
  • శ్రద్ధ = సడ్డ
  • భారము = బరువు
  • నిద్ర = నిదుర

సంధులు:

నడవాలంటే = నడవాలి + అంటే = ఇత్వసంధి
సూత్రం : క్రియా పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.

విస్తారమైన = విస్తారము + ఐన = ఉత్వసంధి
నిలయమై = సిలయము + ఐన = ఉత్వసంధి
అద్భుతమైన = అద్భుతము + ఐన = ఉత్వసంధి
కష్టమైన = కష్టము + ఐన = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చుపరమైనపుడు సంధి అవుతుంది.

దశాబ్దము = దశ + అబ్దము = సవర్ణదీర్ఘసంధి
దేశాభివృధద్ధి = దేశ + అభివృద్ధి = సవర్ణదీర్ఘసంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.

TS 8th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సింగరేణి

సమాసాలు:

  • నల్ల బంగారము = నల్లనైన బంగారము – విశేషణ పూర్వపద కర్మధారయము
  • శ్రద్ధాసక్తులు = శ్రద్ధయును, ఆసక్తియును – ద్వంద్వ సమాసము
  • కష్టనష్టాలు = కష్టమును నష్టమును – ద్వంద్వ సమాసము
  • జీతభత్యాలు = జీతమును భత్యమును – ద్వంద్వ సమాసము
  • కార్మికలోకము = కార్మికుల యొక్క లోకము – షష్ఠీ తత్పురుష సమాసం
  • ఊపిరితిత్తుల సమస్యలు = ఊపిరితిత్తుల యొక్క సమస్యలు – షష్ఠీ తత్పురుష సమాసం
  • దేశాభివృద్ధ = దేశము యొక్క అభివృద్ధి – షష్ఠీ. తత్పురుష సమాసం
  • ఆరు పొరలు = ఆరు సంఖ్య గల పొరలు – ద్విగు సమాసము
  • భారతదేశము = భారతమను పేరుగల దేశము – సంభావనా పూర్వపద కర్మధారయము
  • గోదావరినది = గోదావరి అను పేరు గల నది – సంభావనా పూర్వపద కర్మధారయము

పాఠం ఉద్దేశం:

ఏ దేశం తన సహజ సంపదను సమర్థంగా వినియోగించుకోగలుగుతుందో ఆ దేశం అభివృద్ధి దిశలో పయనిస్తుంది. మన దేశం సకల సంపదలకు నిలయం. ఇక్కడి నేలల్లో అపారమైన ఖనిజ సంపద దాగి ఉన్నది. ప్రత్యేకంగా మన తెలంగాణ ప్రాంతంలోని సింగరేణి దొగ్గుగనులు దేశంలోనే ప్రసిద్దిపొందాయి. దేశ ప్రగతికి దోహదపడే ‘సింగరేణి గనుల’ గురించి తెలియజేయటమే ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. సింగరేణి దాగ్గు గనులు, దాగ్గు ఉత్పత్తి గురించి సమాచారాన్ని తెలిపే వ్యాసం.

ప్రవేశిక:

ఒక దేశ పారిశ్రామిక పురోగమనానికి, ఆర్థిక పుష్టికి అతి ప్రధానమైన వనరుల్లో దొగ్గు ఒకటి. తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తిలో ‘సింగరేణి కాలరీస్’ ప్రధాన భూమికను పోషిస్తున్నది. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని శ్రీశ్రీ అన్నాడు. ఆధునిక ప్రపంచంలో కార్మికుల పాత్ర అమోఘమైనది. ఉాగ్గు ఉత్పత్తిలో కార్మికుల శ్రమ వెలకట్టలేనిది. ప్రతి రోజూ పొంచివున్న ప్రమాదాలను కూడా లెక్క చేయకుండా…. గనుల్లో పనిచేస్తూ…. తమ స్వేదాన్ని శక్తిగా మార్చి నేల బొగ్గును వెలికి తీస్తున్న సింగరేణి కార్మికుల జీవితాలను ఆవిష్కరించే విషయాన్ని ఈ పాఠంలో చదువుదాం.

కఠినపదాలకు అర్థాలు:

  • సిరి – సంపద
  • విశిష్టత – గొప్పతనం
  • విరివిగా – ఎక్కుయగా
  • అనూహ్యంగా – ఊహించనివిధంగా
  • (శేష్ఠము – మేలైన / ప్రసిద్ధి చెందిన
  • సిక్షిప్తము – దాచిన
  • మస్టర్ – హాజరు
  • రంగరించు – కలిపినా
  • దుర్ఖరంగ – ఈష్టంగా, భారంగా
  • సౌకర్యాలు – వసతులు
  • జగతి – లోకం
  • పరీవాహకం – ప్రవహించే పరిసర ప్రాంతం
  • డాంబరు – తారు
  • తనువు – శరీరం
  • సింగారం – అలంకారం
  • ఖ్యాతి – ప్రసిద్ధి
  • గని – ఖని
  • బదిలీ – షిఫ్ట్ట = విధి పూర్తి అయిన తర్వాత వ్యక్తులు మూరే సమయం
  • తెరువు – మార్గం
  • సాదాసీదాగా – అతిసామాన్యంగా
  • మజ్దూర్ – కార్మికుడు
  • ఎన్. టి. పి. సి – నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్
  • సల్ల బంగారం – బొగ్గు
  • ప్రగతి – పురోగతి, అభివృద్ధి
  • సీదీ – సమానంగా

TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu

Telangana TSBIE TS Inter 1st Year English Study Material 14th Lesson Sanghala Panthulu Textbook Questions and Answers.

TS Inter 1st Year English Study Material 14th Lesson Sanghala Panthulu

Paragraph Answer Questions (Section – A, Q.No. 5, Marks : 4)

Question 1.
Is the title, SANGHALA PANTHULU apt to the story ? Explain.
Answer:
Suravaram Pratapa Reddy’s thought provoking Telugu story, SANGHALA PANTHULU is a social and historical narration. It was rendered into English by Elanaaga (Dr. N. Surendra). The story pictures the struggles and sufferings of innocent and ignorant villagers. Ramasagaram village is just a representative of any village in Nizam’s rule. Timidity and lack of unity and awareness among the masses helped a handful of people to exploit the poor. A well-informed and good-intentioned gentleman (Panthulu) came to their rescue. He explained to the villagers about their rights. He helped them pick up courage and form into associations (SANGHALU). That ultimately solved their problems. Hence, the title perfectly suits the story.

సురవరం ప్రతాపరెడ్డి ఆలోచనాత్మక తెలుగు కథ “సంఘాల పంతులు” ఒక సాంఘిక మరియు చారిత్రక కథనము. అది ఎలనాగ (డా॥ ఎన్. సురేంద్ర) గారి చేత ఆంగ్లంలోకి అనువదించబడింది. ఈ కథ అమాయక, అజ్ఞాన గ్రామీణుల బాధలను, పోరాటాలను చిత్రిస్తుంది. రామసాగరం అనే గ్రామం నిజాల పాలనలోని ఏ గ్రామానికైనా ఒక ప్రతీక. ప్రజల అధైర్యము, అనైక్యత, అవగాహనా రాహిత్యము ఆ బీదలను దోచుకోవడానికి కొద్దిమంది దోపిడీదారులకు ఉపయోగపడింది. ఒక మంచి పరిజ్ఞానము, సదుద్దేశము కల పెద్ద మనిషి (పంతులు) వారి రక్షణకై వచ్చాడు. ఆ గ్రామీణులకు వారి హక్కుల గురించి చక్కగా వివరించారు. వారికి ధైర్యము కూడగట్టుకునేలాగా, సంఘాలుగా ఏర్పడేలా సహాయపడ్డారు ఆయన. అది చివరిగా వారికి సమస్యలను పరిష్కరించింది. అందువలన ఆ పేరు కథకు సంపూర్ణంగా సమంజసము. సరిగ్గా సరిపోతుంది.

TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu

Question 2.
“With all these atrocities, we cannot live”, cries a woman of Ramasagaram. Explain the atrocities the villagers were subjected to.
Answer:
“Sanghala Panthulu”, an insightful Telugu story by Suravaram Pratapa Reddy, portrays the plight of the innocent poor. English rendering of the story by Elanaaga (Dr. N. Surendra) captures its spirit well. The story lists the atrocities Ramasagaram villagers were subjected to by the police. They (atrocities) were innumerable and unjust.

They (villagers) were forced to supply to the police fowls, eggs, groceries, todday and nuts and fruits. The police demanded drudgery. The poor had to clean their toilets, press their legs, get for them firewood, etc. The wages the poor got for their services or supplies were beatings and scoldings. They were branded on the cheeks. An old, tired and hungry woman was beaten to death. The list is Pendless.

“సంఘాల పంతులు” అనే నిశిత దృష్టితో రాయబడిన సురవరం ప్రతాపరెడ్డి గారి తెలుగు కథ అమాయక బీదల దీనగాథను చిత్రిస్తుంది. ఎలనాగ (డా॥ ఎన్. సురేంద్ర) గారి ఆంగ్లానువాదము కథ స్ఫూర్తిని చక్కగా పట్టుకోగలిగింది. పోలీసుల చేతిలో రామసాగరం గ్రామీణులు అనుభవించిన దురాగతాల జాబితాను అందిస్తుంది ఆ కథ. ఆ అరాచకాలు అసంఖ్యాకము, అన్యాయము.

ఆ గ్రామీణుల చేత బలవంతంగా పోలీసులు కోళ్ళను, గుడ్లను, సరుకులను, కల్లును, గింజలను, పండ్లను తెప్పించుకొనేవారు. పోలీసులు వారి నుండి గాడిద చాకిరీని “చేయించుకునేవారు. బీదవారి చేత మరుగుదొడ్లను శుభ్రం చేయించుకోవడము, కాళ్ళు వత్తించుకోవడం, కట్టెలు తెప్పించుకోవడం లాంటివి చేయించుకొనేవారు. వారి సేవలకు, సరఫరాలకు ఆ బీదలు పొందే ప్రతిఫలం తిట్లు, తన్నులు మాత్రమే. బుగ్గల మీద కాల్చిన ఇనుప కడ్డీలతో వాతలు పెట్టేవారు. ఒక వృద్ధ, అలిసిపోయి ఆకలితో ఉన్న స్త్రీని ఊపిరిపోయేదాకా కొట్టారు. ఈ జాబితాకు ముగింపు లేదు.

TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu

Question 3.
They realized that the lack of unity had been the cause for their plight. What followed this realisation? How did it help the people of Ramasagaram? * (Imp) (Model Paper)
Answer:
“Sanghala Panthulu”, a social story by Suravaram Pratapa Reddy, presents us valuable life lessons. Its English translation by Elanaaga (Dr. N. Surendra) impresses the readers. The story describes the problems the villagers faced. Then it analyses the reasons. And finally it offers a practicable solution.

So, the crisis was resolved. The police were the exploiters. Ramasagaram villagers were the victims. The causes were the lack of unity among them, their timidity, ignorance, etc. With the help of Sanghala Panthulu, the villagers understood the problem. They stood united. They formed themselves into associations. They proved their strength and courage. Their problems ended. Joy pervaded the village. Celebrations started.

సురవరం ప్రతాపరెడ్డి గారి సాంఘిక కథ ‘సంఘాల పంతులు’ మనకు విలువైన జీవన పాఠాలను అందిస్తుంది. ఎలనాగ (డా|| ఎన్.సురేంద్ర గారి ఇంగ్లీషు అనువాదం పాఠకులను ఆకట్టుకుంటుంది. కథ, ఆ గ్రామస్థులు ఎదుర్కొన్న సమస్యను వర్ణిస్తుంది. తరువాత అది అందుకు కారణాలను విశ్లేషిస్తుంది. అంతిమంగా, ఒక ఆచరణాత్మక పరిష్కార మార్గాన్ని అందిస్తుంది.

తద్వారా, ఆ క్లిష్ట సమస్య పరిష్కరించబడుతుంది. దోపిడీదారులు పోలీసులు. బాధితులు రామసాగరం గ్రామ ప్రజలు. కారణాలు వారి మధ్య ఐక్యతా లోపం, పిరికితనం, అమాయకత్వం మొదలైనవి. సంఘాల పంతులు సహాయంతో వారు సమస్యను అర్థం చేసుకున్నారు. వారు కలిసికట్టుగా నిలబడ్డారు. తమ సంఘాలను ఏర్పరచుకున్నారు. తమ ధైర్యాన్ని, బలాన్ని నిరూపించుకున్నారు. వారి కష్టాలు గట్టెక్కాయి. గ్రామంలో ఆనందం వెల్లివిరిసింది. ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu

Question 4.
Describe the result of the declaration by the “Mohathemeem”.
Answer:
Suravaram’s social story, “Sanghala Panthulu”, presents the pathetic plight of Ramasagaram villagers. Elanaaga translated this moving Telugu story into English. The police went on exploiting the innocent villagers ruthlessly. Sandhala Panthulu came to the rescue of the poor. The police were angry with Panthulu.

When they tried to arrest Panthulu, a good number of youth revolted against the police. The police complained against them. The Mohathemeem came to enquire into the incident. He found the police were guilty. He declared the dismissal, suspension and scaling down of different police personnel. The villagers felt happy. Their joy knew no bounds. Feasts followed. Justice prevailed.

సురవరం వారి సాంఘిక కథ, ‘సంఘాల పంతులు’ రామసాగరం గ్రామ ప్రజల దీనగాథను సమర్పిస్తుంది. ఎలనాగ (డా॥ ఎన్. సురేంద్ర ఈ కదిలించే తెలుగు కథను ఆంగ్లంలోకి అనువదించారు. పోలీసులు అమాయక పల్లె ప్రజల నిర్దయగా దోపిడీ చేస్తూ అణచసాగారు. ఆ బీదలను కాపాడేందుకు సంఘాల పంతులు వస్తారు. పోలీసులకు సంఘాల పంతులుపై అంతులేని కోపం. అతనిని నిర్బంధించ ప్రయత్నించినప్పుడు, పెద్ద సంఖ్యలో యువకులు పోలీసులపై తిరుగుబాటు చేస్తారు.

పోలీసులు వారిపై ఫిర్యాదు చేస్తారు. మొహతిమీమ్ విచారణ నిమిత్తం వస్తారు. పోలీసులదే తప్పు అని వారు నిర్ధారించుకుంటారు. వివిధ స్థాయిలలోని పోలీసు సిబ్బందిని ఉద్యోగంలోంచి తొలగించడం, విధి నిర్వహణ నుండి కొంత కాలం పక్కకు పెట్టడం, క్రింది స్థాయికి పంపడం లాంటి చర్యలను ప్రకటించారు ఆ మొహతిమీమ్. గ్రామస్థులు చాలా సంతోషించారు. వారి ఆనందానికి అవధులు లేకపోయాయి. విందు వినోదాలు కొనసాగాయి. న్యాయం గెలిచి నిలబడింది.

TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu

Sanghala Panthulu Summary in English

TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu 1
Suravaram Pratapa Reddy is multifaceted personality. His writings mainly reflect local history and local people’s sufferings. The story Sanghala Panthulu crafted by Suravaram Pratapa Reddy is a caustic comment on contemporary complex problems. It is translated into English by Elanaaga (Dr. N. Surendra). Like other works of Suravaram, this story also reflects local history and local masses struggles and suffering. Gripping narration moves readers into those periods and places. It offers interesting insights into the then social, economic, political and cultural conditions.

The story takes place in a tiny river side village known as Ramasagaram, ruled by the Nizams. The village Ramasagaram is just a symbol. The time of the story is pre-1940. Most of the villagers are either illiterate or not well-informed. Atrocities witnessed in that village are common all over the Nizam’s state.

It is because people are timid and unorganized. Lack of unity among people, their ignorance about their rights comes in handy to the exploiters. The police are exploiting them to the core. In fact, the village needs no police station. Their only duty is to demand. drudgery, fowls and required grocery without any payment.

They have madigas for drudgery and komatis for supplying commodities. Thus, things are moving happily. But the farmers are perturbed. They observe the lives of people on the other side of the river Krishna ruled by the British. They find that the people are happy there.

TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu

Sanghala Panthulu Summary in Telugu

“సంఘాల పంతులు” ఒక అరుదైన బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డి గారి తెలుగు కథ. వారు గొప్ప సంఘసేవకులు, పరిశోధకులు, పత్రికా సంపాదకులు, రచయిత, బహు భాషాకోవిదులు. 1940 కు ముందున్న దారుణ సాంఘిక, ఆర్థిక పరిస్థితులను, అణగారిన వర్గాల ఆవేదనను అద్దంలో చూపినంత స్పష్టంగా చిత్రించారు.

ఈ కథలో. కదిలించే ఈ తెలుగు కథను ఆంగ్లంలోకి అనువదించినవారు ఎలనాగ (ఎలనాగ గారి అసలు పేరు డా.ఎన్. సురేంద్ర). కథా స్థలం కృష్ణా నదీతీర పల్లె రామసాగరం. కథాకాలం 1940 కి ముందు. ప్రభువులు నిజాములు. దోపిడీదారులు పోలీసు సిబ్బంది. బాధితులు గ్రామస్థులు అందరూ. కారణం గ్రామీణుల అజ్ఞానం, అనైక్యత, నిరక్షరాస్యత.

పరిష్కారం : అవగాహన, ఐకమత్యం. సాధించినవారు : సంఘాల పంతులు. ఫలితం : సమస్య అంతం వాతావరణం సంతోషభరితం. ఇదీ సంక్షిప్త చిత్రణ. అత్యంత ఆసక్తికరంగా సాగే కదిలించి వేసే, కట్టిపడవేసే కథనంతో రచయిత నాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చిత్రిస్తారు. అస్సలు అవసరం లేని ఊరిలో ఏర్పాటు చేయబడిన పోలీసు స్టేషన్లోని సిబ్బంది అందరూ.

ఊరి ప్రజలందరినీ పీల్చి పిప్పిచేసి పీడించడమే కార్యక్రమంగా పెట్టుకొన్నారు. పొయ్యిలో కట్టెల నుండి, తినడానికి కోళ్ళు, తాగడానికి కల్లు – సర్వస్వం ఊరి ప్రజలు ఉచితంగా వారి అందరికీ సమకూర్చాలి. గాడిద చాకిరీ చేయాలి. ఫలితం తిట్లు, తన్నులు, ఒంటి మీద వాతలు. చెప్పనలవి కాని బాధలు. నదికి ఆవలి వైపు పల్లెలో ఆంగ్లేయుల పాలన. ఈ రకమైన బాధలు లేవు. అక్కడికి వలస పోదామనుకున్న వారికీ ఆ అవకాశం లేదు.

జీవితం దుర్భరంగా ఉన్న స్థితిలో సంఘాల పంతులు ఆ ఊరికి వస్తారు. జనులను ఐక్యపరిచి, అవగాహన కల్పించి, వారి హక్కులను వివరించి, పోలీసులకు ఏదీ ఉచితంగా ఇవ్వవలసిన పనిలేదని చెబుతారు. అందరూ పాటిస్తారు. గత సాగిబాటు నడవని పోలీసులు అసలు కారణం సంఘాల పంతులు అని, అతనిని నిర్బంధిస్తారు. అంతే పల్లెయువకులు లాఠీలతో దాడిచేసి పోలీసులను చితకబాది పంతులును విడిపించుక వెళతారు.

పోలీసులు పై అధికారులకు తప్పుడు ఫిర్యాదు చేస్తారు. విచారణాధికారి గ్రామ ప్రజల ద్వారా వాస్తవాలు గ్రహించి, పోలీసులకు తగిన శిక్ష విధిస్తారు. గ్రామంలో పండుగ వాతావరణం. దానిని ప్రసాదించిన సంఘాల పంతులను అందరూ ‘దేవుడు’ అని పిలుచుకుంటారు.

TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu

Sanghala Panthulu Summary in Hindi

“संघाला पंतुलु’ विश्लित एवं बहुमुखी प्रज्ञाशाली सुरवरं प्रतापरेड्डी जी की तेलुगु कहानी हैं । वे सामाजिक सुधारक, शोधकर्ता, संपादक, लेखक और बहुभाषी कोविद थे । सन् 1940 के पूर्व प्रचलित दारुण सामाजिक, आर्थिक स्थितियों और दलित वर्गों की व्यथाओं का दर्पण है, यह कहानी ।

इस प्रभावपूर्ण कहानी का अनुवाद पुलनागा ( असली नाम डॉ. एन. सुरेंद्र) ने किया । क्या स्थल कृष्णा नही के तीर स्थित रामसागरम नामक देहात है । 1940 के पूर्व देहाती लोगों के अज्ञान, अनेकता, निरक्षरता आदि हो बादशाह, निजाम, लुटेरे, पुलीस कारक हैं । बाधित लोग : ग्रामीण, हल : समझदारी और एकता । कार्यसिद्धि करनेवाले : संघाला पंतुलु । परिणाम : समस्या का अंत | ग्रामीण वातावरण : संतोष भरित । यही है संक्षिप्त चित्र । गाँव में स्थापित पुलिस स्टेशन अनावश्यक है । पुलिसस्टेशन के सभी स्टाफ़ सभी गाँववालों को पीड़ित करते हैं ।

उन्हें जलाऊ लकड़ी, खाने के लिए मुर्गी-मुर्गे, पीने के लिए दारु आदि सर्वस्व ग्रामीणों द्वारा देना पडता है । संघाला पंतुल उस गाँव आते हैं । वे लोगों को समेकता कर, उन्हें उनके अधिकारों की जानकारी देकर कहते हैं कि पुलिस को मुफत से किसी चीज देने की जरुरत नहीं है । सभी पालन करते हैं। मुफ्त की सुविधाएँ बंद होने के कारण संघाला पंतुलु है, यह सझक कर उसे बंदी बनाती हैं । पुलीस । तुरंत ग्रामीण युवक पुलिसवालों को घेरा डालकर, अँधाधुंध मारपीट करके पंतुलु छुड़कर ले जाते हैं। पूछताछ – अधिकारी वास्तविकता जानकर पुलिसों को सजा देते हैं । गाँव पर्व का वतावरण है। इसके कारक व्यक्ति संघाल पंतुलु को भगवान के नाम से पुकारते हैं ।

Meanings and Explanations

frontier (n) /frantıə(r)/ (ఫ్రన్ టీఅ(ర్)) (disyllabic) = border: సరిహద్దు, सीमांत

the rest (noun phrase) = the others; remaining: మిగిలినవి, रहना

sundry (adj)/sandri/ (సన్ డ్రి) (disyllabic) = several: చాలా various; వివిధ, विभिन्न

jawan, jamedar, Ameen: terms denoting police personnel : పొలిసు సిబ్బందిని, వారి హోదాను సూచించే పదములు, जमींदार

drudgery (n) /dradzəri/ (డ్రజరి) (trisyllabic) hard and boring work : కఠోర శ్రమ; వెట్టిచాకిరి

commodities (n-pl) /kamodati:z/ (కమొడటీజ్) = useful goods : సరుకులు, దైనందిన వాడుక వస్తువులు

splinters (n-pl) /splıntə(r)z/ (కమొడటీజ్ ) (disyllabic) = pieces of wood used as firewood; పోయిల్లా కట్టెలు, किरच, छिपटी

TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu

perturbed (adj) /pǝ(r)t3:(r)bd/ (ప(ర్)ట(ర్)బ్ డ్) (disyllabic) = troubled; angered: ఇబ్బందులకు ; కోపమునకు గురిచేయబడిన, व्याकुल करना

seethe (v) /si:ð/ (సీడ్ ) (monosyllabic) = boil (with anger) : (కోపంతో) మరిగిపోవు, उबलना

hew (v) /hju:/ (హ్యూ) (monosyllabic) = cut : ముక్కలు చేయు, నరుకు, कुल्हाड़ी से काटना

Rela; Cassia = = names of plants and trees in forests : అడవి చెట్ల పేర్లు, जंगल का पेड़

fume (v) /fju:m/ (ఫ్యూమ్) (monosyllabic) = express great anger : తీవ్ర కోపము వెలిబుచ్చు, गड़बड़ कर देना

corpse (n) /ko:(r)ps/ (కో(ర్)ప్ స్) (monosyllabic) = a dead body : శవము , सव

summon (v) /sɅmən/ (సమన్) (disyllabic) = call : పిలుచు, बुलाव

badam, akhrot, pista = names of nuts: పప్పులు, గింజలు పేర్లు दाल

treacherous (adj) /tretsǝrǝs/ (ట్రెచరస్ ) (trisyllabic) = deceitful: మోసపూరిత, विस्वसघाती

quiet (adj) /kwalǝt/ (క్వ్తెఅట్ ) (disyllabic) = calm : ప్రశాంతంగా, शांति, स्थिरता

persuade (v) /pɔ(r)sweid/ (ప(ర్)స్వేఇడ్ ) (disyllabic) = make someone agee to : ఒప్పించు, నచ్చచెప్పు, पुसलना

station (v) /steisǝn/ (స్టెఇషన్) (disyllabic) = to place to do a duty : ఏదైనా పని చేయు నిమ్మిత్తం ఒకరిని ఒక చోట ఉంచు, स्टेशन

fowls, cocks = birds; chickens: పక్షులు; కోళ్ళు, मुर्गा

storeyed (adj) /stɔ:rid/ (స్టోరిడ్) (disyllabic) = with floors : అంతస్తులు కల

Note: story = కథ; storey = floor = అంతస్తు

sport (v)/spɔ:(r)t/ (స్పో(ర్)ట్) (monosyllabic) = display : ప్రదర్శించు; ధరించి చూపు, मन बहलाना

do away with (idiom) = put an end to : ముగింపు పలుకు ; పరిష్కరించు

TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu

abound (v) /ǝbaund/ (అబౌండ్ ) (disyllabic) = fill to full : నిండుగా నింపు

timid (adj) /tımıd/ (టీమిడ్) (disyllabic) = lacking in courage: ధైర్యము లేని cowardly : పిరికి, डरपोक

instill (v) /instil/ (ఇన్ స్టిల్) (disyllabic) = to cause a quality to become part of someone’s nature : ఒక లక్షణమును ఒక వ్యక్తి స్వభావములో భాగము చేయు

plight (n) /plait/ (ప్లైట్) (monosyllabic) = a difficult situation : కష్టము, दुर्दशा

consensus (n) /kǝnsensǝs/ (కన్ సెస్ సస్ ) = agreement among many : ఏకాభిప్రాయము , अनुकूलता

emerge (v) /imз:(r)dz/(ఇమ(ర్)జ్) (disyllabic) = come into view : కనిపించు; ప్రవేశించు, प्रकट होना

alert (v) /ǝl3:(r)t/ (అల(ర్)ట్) (disyllabic) = warn : హెచ్చరించు, चेतावनी देना

fetch (v) /fets/ (ఫెచ్) (monosyllabic) = get; obtain: పొందు; వేలకు బదులుగా దేనికైనా గ్రహించు

are (అరె), khabardar (కబడ్డార్) = కోపాన్ని, హెచ్చరికలను వ్యక్తీకరించే పదాలు

snarl (v)/sna:(r)// (స్నా(ర్)ల్) (monosyllabic) = say very angrily : చాలా కోపంగా అరచు, गुरहिट

prostrate (v) /prostreit/ (ప్రోస్ట్రేఇట్) (disyllabic) = lying flat with face down as a token of respect : సాష్టా౦గపడుदंडवत पड़ा हुआ

brand (v) /brænd/ (బ్య్రా౦డ్ ) (monosyllabic) = a burn flesh with hot iron : వాతపెట్టు; కాల్చిన ఇనుముతో , व्यापारिक चिन्ह

flank (n) /flænk/(ష్ణ్యానిక్) (monosyllabic) = the body part between the last rib and the hip: తొంటి భాగము

atrocities (n-pl)/ǝtrasətiz/(ఆట్రోసటీజ్ ) (polysyllabic-4 syllables) = very cruel acts: అరాచకములు క్రూర చర్యలు

peepul (n) = name of a tree: రావిచెట్టు

insist (v) /Insist/ (ఇన్ సిస్ ట్) (disyllabic) = demand : గట్టిగా కోరు

pompously (adv) /pompǝsli/ (పోమ్ పస్ లి) (trisyllabic) = in an affectedly grand way : ఆడంబరముగ; పైకి తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో, గొప్పగా

patrol (v) /pǝtrǝul/ (పత్రఉల్) (disyllabic) = go round as a guard : రక్షకుడి వలె పహారా తిరుగు

pertaining to (phrase) = connected to: సంబంధించిన

TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu

enraged (v-pt)/inreidzd/ (ఇన్ రెఇజ్ డ్) (disyllabic) = became very angry : బాగా కోపగించుకొనెను

tipsy (adj) /tipsi/ (టిప్సి) (disyllabic) = drunk : త్రాగిన మైకంలో ఉన్న

hail from (phrase) = come from ; belong to (a place) (ఏ ప్రాంతానికి చెందిన; నుండి వచ్చిన

deprive (v) /diprarv/ (డిప్రైవ్) (disyllabic) prevent someone from having something : వచ్చేది రాకుండా చేయు

shriek (v) /fri:k/ (ప్రీక్) (monosyllabic) = cry : అరచు; ఏడ్చు

beseech (v) /brsi:tf/ (బిసీచ్) (disyllabic) = request : విన్నవించు; beg

to no avail (phrase) = to no use : ఉపయోగం లేకుండా; ఫలితం లేకుండా

thrash (v) /9ræf/ (త్ర్యాష్) (monosyllabic) beat mercilessly : నిర్దయగా కొట్టు

rotund (adj) /routAnd/ (రఉటన్) (disyllabic) = having a fat round body : కొవ్వుపట్టి బలిసిన శరీరం కల

divulge (v) /darvAld3/ (డైవల్) (disyllabic) = reveal : తెలియచెప్పు; బహిర్గతము చేయు

instigate (v) /instagert/ (ఇన్టగెట్) (trisyllabic) = to incite : రెచ్చగొట్టు, भड़काना

TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu

looming large (idiom) = seeming hard to avoid something dangerous : ఏదో ప్రమాదము ఆప వీలుకాకుండా జరుగబోతున్నట్లున్నది.

scale down (phrase) = reduce : తగ్గించు, काम करना

delight (n) /dilart (డిలైట్) (disyllabic) joy; pleasure : ఆనందము, खुश

feasts (n-pl) /fi:sts/ (ఫీస్) (monosyllabic) = large, ceremonial meals : భారీ విందు భోజనములు; daavat, दावत देना

TS 8th Class Hindi Guide 10th Lesson अनमोल रत्न

Telangana SCERT TS 8th Class Hindi Guide Pdf 10th Lesson अनमोल रत्न Textbook Questions and Answers.

TS 8th Class Hindi 10th Lesson Questions and Answers Telangana अनमोल रत्न

प्रश्न :

प्रश्न 1.
चित्र में क्या – क्या दिखाई दे रहे हैं?
उत्तर :
चित्र में अध्यापिका और छात्र – छात्राएँ दिखाई दे रहे हैं।

प्रश्न 2.
वे क्या कर रहे हैं ?
उत्तर :
अध्यापिका हिन्दी पाठ पढ़ा रही हैं। छात्र ध्यान से सुन रहे हैं।

TS 8th Class Hindi Guide 10th Lesson अनमोल रत्न

प्रश्न 3.
श्यामपट पर लिखे सुवचन से आप क्या समझते हो ?
उत्तर :
हर एक अच्छी बात अधिक मूल्यवान होती है। अर्थात अच्छी बातों का अधिक मह्त्व होता है।

सुनो – बोलो :

प्रश्न 1.
पाठ में दिये गये चित्र के बारे में बातचीत कीजिए।
उत्तर :
इस चित्र में एक हीरा है। इसके बारे में दो मित्रों के बीच में बातचीत इस प्रकार चल रहा है।
अशोक : यह क्या है ? इसे क्या कहते हैं ?
कुमार : यह हीरा है।
अशोक : मैं ने सुना था कि हीरा बहुत मूल्यवान होता है।
कुमार : हाँ, तुमने सच ही सुना । हीरा बहुत मूल्यवान होता है। इसका मूल्य लाखों या करोडों रुपये होता है।
अशोक : इसके बारे में एक कहावत भी है। उसे मैं भूल गया। एक बार याद करो।
कुमार : हीरे का परख जौहरी ही जानते हैं।

प्रश्न 2.
पाठ का शीर्षक आपको कैसा लगा और क्यों ?
उत्तर :
पाठ का शीर्षक अनमोल रव्भ मुझे अच्छा लगा। क्योंकि ये दोहे नीति से युक्त हैं। नीतिपरक हैं। सचमुच अनमोल रन्न हैं।

पढ़ो :

अ. नीचे दिये गये वाक्यों के भाव बतलाने वाले अंश दोहों में पहचानकर उत्तर – पुस्तिका में लिखिए।

प्रश्न 1.
हमारा शरीर खेत के समान है।
उत्तर :
तुलसी काया खेत है, मनसा भयो किसान।

प्रश्न 2.
लाख प्रयन्न करने पर भी बात नहीं बनती है।
उत्तर :
बिगरी बात बनै नहि, लाख करो किन कोय।

TS 8th Class Hindi Guide 10th Lesson अनमोल रत्न

आ. नीचे दी गयी पंक्तियों के बाद आनेवाली पंक्ति लिखिए।

1. तुलसी साथी विपत्ति- विदया – विनय – विवेक।
2. रहीमन हीरा कब कहै – लाख टका मेरो मोल।

लिखो :

अनीचे दिये गये प्रश्नों के उत्तर लिखिए।

प्रश्न 1.
तुलसीदास ने शरीर की खेत व मन की किसान से तुलना क्यों की होगी ?
उत्तर :
तुलसीदास ने शरीर की तुलना खेत से और मन की तुलना किसान से की है। क्योंकि पाप और पुण्य दो बीजों में मन रूपी किसान, शरीर रूपी खेत में जो बोये जाते हैं, उसीके फल को हम प्राप्त करते हैं।

प्रश्न 2.
रहीम के दोहों के भाव अपने शब्दों में लिखिए।
रहीम के अनुसार जब बात बिगड जाती है तो किसी के लाख प्रयद्न करने पर भी बनती नहीं हैं। इसके लिए रहीम यह उदाहरण दिये कि एक बार दूध फट जाता है तो उसे कितने बार मथने पर भी मक्खन नहीं बनता।
रहीम के दूसरे दोहे के अनुसार जो सचमुच बडे होते हैं वे अपनी बंडाई कभी नहीं किया करते। बडे – बडे बोल बोला नहीं करते। इसके लिए रहीम यह उदाहरण दिये कि हीरा कभी भी अपने बारे में स्वयं नहीं कहता कि उसका मोल लाख टके का है। इस प्रकार तुलसी और रहीम अपने – अपने दोहों के माध्यम से अमूल्य रत्नों को दिये।

आ. “अनमोल रव्न” दोहों का भाव अपने शब्दों में लिखिए।
तुलसीदास जी के अनुसार शरीर खेत के समान है। और मन किसान के समान। पाप और पुण्य दो बीउत्तर – हैं, जो बोया जाता है, उसी को प्राप्त करना पडता है।
तुलसीदास जी के अनुसार विपति के समय शिक्षा, विनय, विवेक, साहस अच्छे कार्य और सच्चाई ही साथ देते हैं।
रहीम जी के अनुसार जब बात बिगड जाती है तो किसी के लाख प्रयन्न करने पर भी बनती नहीं है। जिस तरह एक बार दूध फट जाते हैं तो उसे मथने पर भी मकखन नहीं बनता।
रहीम जी के अनुसार जो सचमुच बडे होते हैं। वे अपनी बडाई नहीं किया करते। बडे-बडे बोल नही बोला करते । हीरा स्वयं कभी नहीं कहता कि उसका मोल ताख टके का है।

TS 8th Class Hindi Guide 10th Lesson अनमोल रत्न

शब्द भंडार :

अ. दोहे में आये कुछ शब्द नीचे दिये गये हैं। इन शब्दों से एक – एक वाक्य बनाइए।
उत्तर :

खेतकिसान खेत में काम करते हैं।
विपत्तिविपत्ति में धीरज के साथ रहना चाहिए।
विनयसदा विनय से बडों से बातें करना चाहिए।
दूधबच्चा दूध पीता है।
हीरावस्तु संग्रहालय में कई हीरे हैं।

आ. नीचे दी गयी पंक्ति पढ़िए। समझिए।
‘लाख टका मेरो मोल।’
इस पंक्ति में ‘टका’ शब्द का प्रयोग विशेष अर्थ के लिए हुआ है। पुराने समय में टके का बड़ा महत्व था। अंग्रेजों के समय यह भारत की मुद्रा थी, जिसका मूल्य दो आना था। इसी शब्द पर कई मुहावरे भी हैं, जैसे –
1. टका-सा मुँह लेकर रह जाना। (उदास होना)
2. टके-टके को मोहताज होना। (गरीब होना)
3. टका पास न होना। (धन की कमी होना)
अब तुम पता लगाइए कि टका को इन भाषाओं में क्या कहते हैं?
TS 8th Class Hindi Guide 10th Lesson अनमोल रत्न 2
उत्तर :
1. तेलुगु – बेडा
2. कन्नड़ – टका
3. तमिल – बेडा
4. मराठी – बेडा

सृजनात्मक अभिव्यत्ति :

अ. पाठ में बताई गयी नीतियों के आधार पर नारे बनाइए।
उत्तर :
1. जैसी करनी वैसी भरनी।
2. विद्या विपत्ति में साथ रहती है।
3. लाख प्रयत्न से भी बिगडी बात नहीं बनती।
4. बडे लोग अपने बडप्पन की प्रशंसा कभी नही करते।

TS 8th Class Hindi Guide 10th Lesson अनमोल रत्न

प्रशंसा :

अ. तुलसीदास और रहीम के दोहों का हमारे जीवन में क्या महत्व है ?
उत्तर :
तुलसीदास जी के दोहे भगवान श्रीराम से संबंधित और नीतिपरक होते हैं। रहीम के दोहे नीतिपरक और उपदेशात्मक होते हैं। उनकी कविता में कल्पना की प्रचुरता के साथ – साथ भावुकता की अधिकता भी है।

भवा की बात :

अ. पढ़िए – समझिए।
उत्तर :
TS 8th Class Hindi Guide 10th Lesson अनमोल रत्न 3

आ. ऊपर दिये गये शब्दों में से किन्हीं दो शब्दों से वाक्य प्रयोग कीजिए।

किसान – गाँवों में किसान रहते हैं।
विवेक – नायक को विवेक से रहना चाहिए।
बोल – बच्चों के बोल में मिठास होती है।

परियोजना कार्य :

तुलसी और रहीम के अन्य दोहे ढूँढ़ए। उन्हें लिखिए और कक्षा में लगाइए।

तुलसीदास :
1. तुलसी रा के कहत ही, निकसत पाप पहार।
फिरि भीतर आवत नहीं, देत मकार विकार॥
2. जड़ चेतन गुन दोषमय, विस्व कीन्ह करतार।
संत हंस गुन गहहि पय, परिहरि वारि विकार।।

रहीम :
1. सर सूखे पंछी उड़ै, और सरन समाहि।
दीनमीन बिन पच्छ के, कहु रहीम कहँ जाहि॥
2. रहिमन देखि बड़ेन को, लघु न दीजिये डारि।
जहाँ काम आवै सुई, कहा करे तरवारि।।

TS 8th Class Hindi Guide 10th Lesson अनमोल रत्न

Essential Material For Examination Purpose :

I. पढ़ो :
पठित – पद्यांश

नीचे दिये गये पद्यांश को पढ़कट प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए।

I. तुलसी काया खेत है, मनसा भयो किसान।
पाप – पुण्य दोक बीज है, बुवै सो लुनै निदान।

प्रश्न :
1. शरीर किसके समान है?
2. मन किसके समान है ?
3. दो बीज क्या है?
4. अनमोल रत्न कैसा पाठ है?
उत्तर :
1. शरीर संत के समान है।
2. मन किसान की समान है।
3. पाप और पुण्य दो बीज हैं।
4. कविता पाठ है।

II. तुलसी साथी विपत्ति, विद्या – विनय – विवेक।
साहस, सुकृति, सुसत्य व्रत, राम भरोसे एक।।

प्रश्न :
1. तुलसी के अनुसार विपत्ति के समय हमारे साथ कौन देते हैं?
2. “सुकृति” का अर्थ क्या है?
3. विवेक का उल्टा शब्द क्या है ?
4. इस दोहे के कवि कौन है?
उत्तर :
1. शिक्षा, विनय, विवेक, साहस, अच्छे कार्य और सचाई हमारे साथ देते हैं।
2. अच्छे कार्य
3. अविवेक
4. तुलसीदास

TS 8th Class Hindi Guide 10th Lesson अनमोल रत्न

III. बिगरी बात बनै नहि, लाख करो किन कोय।
रहिमन फाटे दूध को, मथे न माखन होया।

प्रश्न :
1. रहीम के अनुसार फटे दूध से क्या नहीं बनता है?
2. लाख करो किन कोय। इसका भाव क्या है?
3. “कोय” का अर्थ क्या है?
4. रहीम का पूरा नाम क्या है?
उत्तर :
1. माखन नहीं बनता।
2. लाख प्रयत्न करने पर भी बात नहीं बनती है।
3. कोय का अर्थ ‘कोई’ है।
4. रहीम का पूरा नाम अब्दुल रहीम खानखाना है।

IV. बडे बड़ाई न करैं, बड़ो न बोलैं बोल।
रहीमन हीरा कब कहै, लाख टका मेरो मोल।।

प्रश्न :
1. बडे क्या नहीं करते हैं?
2. बडे क्या नहीं बोलते हैं?
3. लाख टका मेरो मोल का अर्थ लिखिए।
4. कौन अपना मोल स्वयं नहीं कहता ?
उत्तर :
1. बडे बड़ाई नहीं करते हैं।
2. बडे बडे – बडे बोल नहीं बोलते हैं।
3. मेरा मोल लाख टके का है।
4. हीरा अपना मोल स्वयं नही कहता।

TS 8th Class Hindi Guide 10th Lesson अनमोल रत्न

अपठित – पद्यांश :
नीचे दिये गये पद्यांश को पढ़कर प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए।

1. श्रमर छूटकर पंकज दल से,
करने लगे विहार।
आनुकरों ने खोल दिया है,
कारावृह का द्वार।
कल किरणें हैं शयन सदन की,
मंजुल बंदनवार।
सजनी। रजनी की सुख स्मृति ही।
बस अब है आधार।

प्रश्न :
1. भ्रमर छूटकर क्या करने लगे हैं?
2. भानुकरों ने क्या किया है?
3. शयन सदन की बंदनवार क्या है?
4. सजनी ! अब आधार क्या है?
5. बंदनवार की क्या विशेषता है?
उत्तर :
1. भ्रमर छूटकर विहार करने लगे हैं।
2. भानुकरों ने कारागृह का द्वार खोल दिया।
3. कल किरणें शयन सदन की बंदनवार है।
4. सजनी ! रजनी की सुख स्मृति ही अब आधार है।
5. बंदनवार की विशेषता है कि वे मंजुल हैं।

TS 8th Class Hindi Guide 10th Lesson अनमोल रत्न

II. बह वाई उस काल एक ऐसी हवा।
बूँद समुंदर की ओर आई अनमनी।
एक सुंदर सीप का मुँह था खुला।
वह उसी में जा पडी मोती बनी।
लोग यों ही हैं इिझकते सोचते।
जब कि उनको छोडना पडता है घर।
किन्तु घर को छोडना अकसर उन्हें।
बूँद सा कुछ और हीं देता है कर।

प्रश्न :
1. बूँद समुंदर की ओर कैसी आयी ?
2. किसका मुँह खुला हुआ था ?
3. बूँद किसके मुँह में जा पडी और क्या बनी ?
4. लोग घर छोडते समय क्या करते हैं?
5. घर को छोडने से उनको क्या मिलता है?
उत्तर :
1. बूँद समुंदर की ओर अनमनी आयी।
2. एक सीप का मुँह खुला हुआ था।
3. बूँद सीप के मुँह में जा पडी और मोती बनी।
4. लोग घर छोडते समय सोचते हैं।
5. घर को छोडने से उनको बूँद सा कुछ और ही मिलता है।

III. मेरे घर के पास लठा है
पेड नीम का हरा – भरा,
उसकी डाली झुक – झुक छूतीं
मेरे रहले का कमरा।
अभी – अभी निकली फुनगी में,
नयी – नयी प्यारी कोंपल,
लाल, बैंगनी रंग देखकर
मेरा मन बनता शीतल।

प्रश्न :
1. नीम का पेड कैसा है?
2. नीम की डाली क्या करती है?
3. नयी – नयी प्यारी कोंपल कहाँ निकल पडी है?
4. कोंपल किस रंग में हैं?
5. लाल, बैंगनी रंग देखकर मन कैसे बनता है?
उत्तर :
1. नीम का पेड हरा – भरा है।
2. नीम की डाली झुकती कवि के कमरे को छूती है।
3. नयी – नयी प्यारी कोंपल फुनगी में निकल पडी है।
4. कोंपल लाल और बैंगनी रंग में हैं।
5. लाल, बैंगनी रंग देखकर मन शीतल बनता है।

TS 8th Class Hindi Guide 10th Lesson अनमोल रत्न

IV. मेरा भारत है महान
चाँद सितारों से शोभित है आसमान
यह रहा नदियों का संगम पुण्य स्थान
मन्दिर, मसजिद, विरजाघर एक समान
रंग, बिरंगो, फूलों से है विराजमान
लोगों का है विविध परिधान
होता है सब धर्मों का सम्मान
मेरा भारत है महान।

प्रश्न :
1. आसमान किस प्रकार शोभित है ?
2. नदियों का संगम पुण्य स्थान क्या है?
3. भारत किस तरह विराजमान है?
4. लोगों का विविध परिधान कहाँ होता है?
5. भारत में किसका सम्मान होता है?
उत्तर :
1. आसमान चाँद, सितारों से शोभित है।
2. नदियों का संगम पुण्य स्थान भारत है।
3. भारत रंगबिरंगे फूलों से विराजमान है।
4. लोगों का विविध परिधान भारत में होता है।
5. भारत में सब धर्मो का सम्मान होता है।

I. लिखो :

लघु प्रश्न :

प्रश्न 1.
तुलसी और रहीम के समय की स्थिति कैसी रही होगी ?
उत्तर :
तुलसीदास और रहीम भक्ति काल के प्रमुख कवि थे। आचार्य रामचंद्र शुक्ल के अनुसार भक्ति काल का समय सन् 1375 से 1700 तक माना है। तत्कालीन भारतीय समाज में हिंदु – मुर्लिम दो संस्कृतियों व विचार धाराओं का पारस्परिक संघर्ष हो रहा था। साहित्य की दृष्टि से हिंदी साहित्य के भक्ति काल को उसका स्वर्णयुग मानते हैं। ज्ञानाश्रयी – प्रेमाश्रयी, सगुण – निर्गुण, राम भक्ति – कृष्ण भक्ति, संत – सूफ़ी इस प्रकार के तरह तरह की भक्ति धाराओं से समाज प्रभावित होने लगा।

प्रश्न 2.
तुलसीदास ने शरीर और मन की तुलना किसके साथ की है?
उत्तर :
तुलसीदास ने शरीर की तुलना खेत से और मन की तुलना किसान से की है।

प्रश्न 3.
रहीम के अनुसार फटे दूध से क्या नहीं बनता है?
उत्तर :
रहीम के अनुसार फटे दूध से मक्खन नहीं बनता है।

TS 8th Class Hindi Guide 10th Lesson अनमोल रत्न

प्रश्न 4.
हीरा अपने बारे में क्या नहीं कहता ?
उत्तर :
हीरा अपने बारे में स्वयं कभी नहीं कहता कि उसका मोल लाख टके का है।

प्रश्न 5.
विपत्ति के समय हमारा साथ कौन देता है ?
उत्तर :
वेपत्ति के समय शिक्षा, विनय, विवेक, साहस, अच्छे कार्य और सच्चाई ही हमारा साथ देते हैं।

प्रश्न 6.
तुम विपत्ति का सामना कैसे करोगे ? क्यों ?
उत्तर :
में विपत्ति का सामना विद्या, विनय, विवेक, साहस, अच्छे कार्य और सच्चाई से करूँगा। क्योंकि ये सभी विपत्ति का सामना करने के लिए आवश्यक हैं।

लघु निबंध प्रश्न :

प्रश्न 1.
तुलसीदास जी के बारे में लिखो।
उत्तर :
तुलसीदास जी का जन्म सन् 1532 में राजापुर नामक गाँव में हुआ था। उनकी मृत्यु सन् 1623 में काशी में हुयी। माता का नाम हुलसी तथा पिता का नाम आत्माराम दुबे था। गुरु का नाम नरहरिदास था। उनकी पन्नी का नाम रत्नावली था। तुलसीदास भक्तिकाल के कवि थे।
तुलसीदास राम भक्त थे। अवधी और ब्रज भाषा दोनों में उन्होंने काव्य रचना की। उन्होंने दर्जनों काव्य ग्रंथ लिखें। उनका सुप्रसिद्ध ग्रंथ का नाम था रामचरितमानस।
उनके अन्य ग्रंथ थे – कवितावली, दोहावली, विनय-पत्रिका, बरवै रामायण, पार्वती मंगल और जानकी मंगल आदि।

TS 8th Class Hindi Guide 10th Lesson अनमोल रत्न

సారాంశము :

तुलसीदास (తులసీదాస్) :

ఈ పద్యంలో కవి తులసీదాస్ శరీరమును వ్యవసాయ క్షేత్రం (పొలము)తో, మనస్సును రైతుతో పోల్చుచున్నాడు. పాపం పుణ్యం అనునవి రెండు విత్తనములు. మనం ఈ రెండు విత్తనాలలో దేనిని నాటితే వాటినే పొందుతాము.
తులసీదాస్ గారు ఈ పద్యంలో ఆపదల వేళ మనల్ని రక్షించే సాధనములను గురించి పేర్కొనుచుండెను. మనల్ని ఆపదల నుండి విద్య, వినయము, వివేకము (మంచి, చెడు విచక్షణాగుణము) సాహసము, మంచి పనులు, నీతి-నిజాయితీ అనునవి రక్షించును. ఇవన్నియు ఆపదల వేళలలో మనకు తోడుగా ఉండును.

रहीम (రహీమ్) :

ఈ పద్యంలో కవి రహీమ్ చెడిపోయిన (పాడైపోయిన) పనుల స్వభావాన్ని గురించి వివరించుచుండెను. ఏదైనా పని చెడిపోయి (పాడైపోయి)నప్పుడు మనం లక్షలకొలది ప్రయత్నాలు చేసినా ఆ పనిని చేయలేము. అదెట్లనగా ఒకసారి పాలు విరిగిపోయినట్లయిన వాటిని చిలికి వెన్నతీయలేము కదా !
కవి రహీమ్ గారు ఈ పద్యంలో పెద్దవారి (గొప్పవారి) యొక్క లక్షణాలను తెలియజేయుచున్నారు.
ఎవరైతే గొప్పవారో వారు తమ గొప్పతనాన్ని గురించి గొప్పలు చెప్పుకోరు. (పెద్దవారు గొప్పవారు కానివారే గొప్పలు చెప్పుకుంటారు) అదెట్లనగా వజ్రం ఎప్పుడూ తన విలువ లక్ష టంకములు ఉంటుందని స్వయంగా మనతో చెప్పదు కదా!

वचन :

  • खेत – खेत
  • किसान – किसान
  • पाप – पाप
  • पुण्य – पुण्य
  • बीज – बीज
  • साथी – साथी
  • विपत्ति – विपत्तियाँ
  • कृति – कृतियाँ
  • व्रत – व्रत
  • बात – बातें
  • हीरा – हीरे

TS 8th Class Hindi Guide 10th Lesson अनमोल रत्न

उल्टे शब्द :

  • पाप × पुण्य
  • साहसी × डरपोक
  • बनना × बिगडना
  • विनय × घमंड
  • सुकृति × दुष्कृति
  • बडा × छोटा
  • विवेक × अविवेक
  • सत्य × असत्य/झूठ
  • साथी × शत्रु

उपसर्ग :

  • निदान – नि
  • सुसत्य – सु
  • सज्जन – सत्
  • विविध – वि
  • सुसंगति – सु
  • अनुसार – अनु
  • सुकृति – सु
  • दुर्जन – दुर

प्रत्यय :

  • मनसा – सा
  • बिगरी – ई
  • महात्मा – आत्मा
  • सुकृति – कृति
  • बड़ाई – आई
  • सुसत्य – सत्य
  • दुर्जन – जन

TS 8th Class Hindi Guide 10th Lesson अनमोल रत्न

पर्यायवाची शब्द :

  • काया – शरीर
  • विद्या – शिक्षा
  • मोल – मूल्य, दाम, भाव
  • किसान – कृषक
  • साहस – धैर्य
  • बड़ाई – बडप्पन
  • साथी – मित्र
  • दूध – क्षीर

वाक्य प्रयोग :

1. किसान – किसान खेतीबारी करके जीते हैं।
2. विवेक – सदा विवेक के साथ रहना चाहिए।
3. माखन – माखन में विटमिन ए मिलता है।
4. बड़ाई – बडे लोग जो होते कभी बडाई बातें नहीं करते।

मुहावरे वाले शब्द :

1. बात बनाना = प्रयोजन सिद्ध होना ; उसने टेलीफ़ोन से बात बनायी।
2. बात आना = चर्चा होना ; वहाँ इसी विषय पर बात आयी।
3. बड़े आदमी = प्रतिष्ठावान ; बड़े आदमी ऐसी बातें नहीं करते।
4. बडी – बडी बातें करना = बडाई करना, बढ-चढकर बातें करना
वह हमेशा बडी – बडी बातें करता रहता है।

TS 8th Class Hindi Guide 10th Lesson अनमोल रत्न

शब्दार्थ (అర్ధములు) (Meanings) :

TS 8th Class Hindi Guide 10th Lesson अनमोल रत्न 1

TS 6th Class Telugu 10th Lesson Questions and Answers Telangana బాలనాగమ్మ

Telangana SCERT 6th Class Telugu Guide Telangana 10th Lesson బాలనాగమ్మ Textbook Questions and Answers.

బాలనాగమ్మ TS 6th Class Telugu 10th Lesson Questions and Answers Telangana

బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి

TS 6th Class Telugu 10th Lesson Questions and Answers Telangana బాలనాగమ్మ 1
ప్రశ్న 1.
బొమ్మలో ఎవరెవరున్నారు ? ఏం జరుగుతున్నది ?
జవాబు.
బొమ్మలో ఒక బాలుడు, సీసాలో నుంచి బయటికి వచ్చిన ఒక భూతం ఉన్నారు. చేతులు కట్టుకొని వినయంగా ఉన్న భూతం బాలుడి ఆజ్ఞకోసం చూస్తున్నది. ఆ బాలుడు తనకు చేయవలసిన పనులను గురించి ఆ భూతానికి చెబుతున్నాడు.

ప్రశ్న 2.
బొమ్మ ద్వారా కథను ఊహించండి.
జవాబు.
ఒక పిల్లవాడు తన మిత్రులతో తన ఇంటి దగ్గర ఉన్న ఆటస్థలంలో క్రికెట్ ఆడుకుంటున్నాడు. ఆటలో` ఆ పిల్లవాడు కొట్టిన బంతి దూరంగా చెట్ల మధ్యలో పడ్డది. బంతి తేవడానికి వెళ్ళిన ఆ పిల్లవానికి అక్కడ ఏవో పారేసిన సంచులు, డబ్బాలు, సీసాలు కనబడ్డాయి. వాటిలో ఒక సీసా అతనికి ప్రత్యేకంగా కనిపించింది. అందులో ఏమున్నదో తెలుసుకుందామని ఆ సీసా బిరడా గట్టిగా ఊడబీకాడు.

అంతే! ఒక్కసారిగా అందులో నుండి సుడిగాలి వేగంతో ఒక పెద్ద ఆకారం బయటికి వచ్చి గాలిలో నిలబడింది. ‘దండాలు మహారాజా’ అన్నది. హఠాత్తుగా జరిగిన ఆ ఘటనకు కంగారు పడిన పిల్లవాడు ‘ఎవరు నువ్వు’ ? అన్నాడు. ‘నేను తమ సేవకుణ్ణి మహారాజా! మీకు ఏమి సేవలు చేయాలో ఆజ్ఞ ఇవ్వండి’ అని అంది ఆ ఆకారం.

TS 6th Class Telugu 10th Lesson Questions and Answers Telangana బాలనాగమ్మ

ప్రశ్న 3.
ఇటువంటి కథలు మీకు తెలుసా ? వీటిని ఏమంటారు ?
జవాబు.
ఇటువంటి కథలు నాకు తెలుసు. ఇట్లా మానవులకు సాధ్యంకాని శక్తులు, మంత్రాలు, తంత్రాలు, సాహసాలను తెలిపే కథలను జానపద కథలు అంటారు.

ప్రశ్న 4.
మన తెలంగాణా ప్రాంతంలోని జానపదకథలు మీకేమైనా తెలుసా ? ఏమిటవి ?
జవాబు.
తెలంగాణా ప్రాంతంలో సోమనాద్రి కథ, రామేశ్వరరావు కథ, రాణి శంకరమ్మ కథ, సలై వెంకట రెడ్డి కథ, సర్వాయి పాపని కథ, బిల్లూరి కొండల్రాయుని కథ వంటి జానపద కథలు తెలుసు. అందులో రాణి శంకరమ్మ కథ ఇది. రాణి శంకరమ్మ మెదక్ జిల్లాలో గౌడిచర్ల గ్రామంలో సంగారెడ్డి, రాజమ్మ దంపతులకు పుట్టింది.

చిన్నప్పటి నుంచి కర్రసాము, కత్తి సాము, గుఱ్ఱపు స్వారీ వంటి విద్యలు నేర్చుకుంది. నాగలి పట్టడం, బండి తోలడం వంటి వ్యవసాయ పనులు నేర్చుకొంది. ఒకరోజు ఒక చిరుత పులి మీదికి వచ్చినా భయపడక, కట్టెతో పులిని కొడుతూ, కాళ్ళతో తొక్కి చంపివేసింది. అంతటి ధైర్యవంతురాలు ఆమె.

ఇతరులకు సాయం చేసే ఆమె మంచిగుణం నచ్చి, అందోలు రాజు నారసింహారెడ్డి ఆమెను పెండ్లి చేసుకున్నాడు. ప్రజల్ని కనబిడ్డల్లా చూడాలని, మొదట రాజ్యం పనులు, తర్వాతే ఇంటి సుఖాలు అని రాజుకు రాజధర్మాలు గురించి చెప్పింది. నారసింహారెడ్డి మరణం తర్వాత శంకరమ్మ నైజాం రాజు ఆజ్ఞమేరకు మరాఠీల మీదకు కాళికలా యుద్ధానికి వెళ్ళి, వారిని ఓడించింది.

1764 లో అందోలు రాజ్యానికి శంకరమ్మ రాణి అయింది. చక్కగా రాజ్యపాలన చేసింది. తన తండ్రి పేరిట సంగారెడ్డి, తల్లి పేర రాజంపేట అనే పట్టణాలు నిర్మించింది. చివరికి 1774 సం॥లో రాచపుండుతో బాధపడుతూ చనిపోయింది. ప్రజలను కన్నబిడ్డల్లా, పాలించిన శంకరమ్మ ఆదర్శ రాణి.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
‘కంటికి రెప్పలా కాపాడుకోవడం’ అంటే ఏమనుకుంటున్నారు?
జవాబు.
కంట్లో దుమ్మూ ధూళీ మొదలైనవి పడి హాని కలిగించకుండా రెప్పలు కంటిని ప్రతిక్షణం కాపాడుతూ ఉంటాయి.ఏదైనా దెబ్బ తగిలేటప్పుడైనా రెప్పలు కంటిని కాపాడేటందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాయి. అందువల్ల ‘కంటికి రెప్పలా కాపాడుకోవడం’ అంటే ఎదుటి వారిని తమ ప్రాణం కంటే మిన్నగా కాపాడుకోవటం అని అనుకుంటున్నాను.

ప్రశ్న 2.
‘మాట నిలబెట్టుకోవడం’ అనే మాటను ఎట్లా అర్థం చేసుకున్నారు?
జవాబు.
ఇక్కడ మాట అంటే ఆడిన మాట. ‘నిలబెట్టుకోవడం అంటే తప్పకపోవడం. ఏదైనా చేస్తానని లేక ఇస్తానని ఒకసారి చెబితే ఆ పని చేసి తీరడం, ఆ వస్తువు ఇచ్చి తీరడం. అది ఎంత కష్టమైనదైనా, ఎంత నష్టమైనదైనా ఆడిన మాట తప్పక పోవడాన్నే “మాట నిలబెట్టుకోవడం” అంటారు అని అర్థం చేసుకున్నాను.

TS 6th Class Telugu 10th Lesson Questions and Answers Telangana బాలనాగమ్మ

ప్రశ్న 3.
తల్లిదండ్రులు లేని పిల్లలు’ ఎట్లా ఆగమై పోతారు ?
జవాబు.
తల్లిదండ్రులులేని పిల్లలను పట్టించుకునేవారు ఎవరూ ఉండరు. ఒకవేళ జాలి చూపి ఎవరైనా పట్టించుకున్నా అది ఎంత కాలం ఉంటుందో చెప్పలేం. తల్లిదండ్రులు లేని పిల్లలు సరైన క్రమశిక్షణ లేక, సరిగా మంచీ చెడు చెప్పేవాళ్ళు లేక, మానసికంగా ఎంతో బాధ అనుభవిస్తారు.

ప్రశ్న 4.
కష్టాల్లో ఉన్న పిల్లలను తల్లిదండ్రులు ఎట్లా చూసుకుంటారు ?
జవాబు.
కష్టాల్లో ఉన్న పిల్లలను తల్లిదండ్రులు కంటికి రెప్పలాగా చూసుకుంటారు. వారి కష్టాలను తమ కష్టాలుగా భావిస్తారు. వాటిని తొలగించడానికి రాత్రనకా పగలనకా కృషి చేస్తారు. వారి కష్టాలు తొలగే వరకూ కంటిమీద కునుకు లేకుండా శ్రమిస్తారు.

ప్రశ్న 5.
ముఖ్యమైన పనులను అసమర్థులకు అప్పగిస్తే ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయి?
జవాబు.
ముఖ్యమైన పనులను అసమర్థులకు అప్పగిస్తే ఆ పనులు చక్కగా నెరవేరవు. పైగా వారి అసమర్థత కారణంగా కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.

ప్రశ్న 6.
పెద్దలు చెప్పిన మాట వినకపోవడం వల్ల ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయి ?
జవాబు.
పెద్దలకు జీవితకాలంలో ఎన్నో అనుభవాలు ఉంటాయి. వారి పెద్దలు చెప్పగా విని గానీ, స్వయంగా చూసి గానీ వారు ఎంతో విజ్ఞానం, అనుభవం గడించి ఉంటారు. ముందుచూపుతో పెద్దలు చెప్పే మాటలు వినాలి. లేకపోతే ఎన్నో కష్టాలు నష్టాలు ఎదురవుతాయి. వాటిని తీర్చుకోవడానికి ఎంతో విలువైన జీవిత సమయం వృథా అవుతుంది.

TS 6th Class Telugu 10th Lesson Questions and Answers Telangana బాలనాగమ్మ

ప్రశ్న 7.
మాయల ఫకీరు బాలనాగమ్మను ఎత్తుకుపోయిన సంఘటన వల్ల మీకు ఇతర కథలలోని ఇట్లాంటి సంఘటనలు గుర్తుకు వస్తున్నాయా ? చెప్పండి.
జవాబు.
అవును. రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకుపోయిన రామాయణంలోని సంఘటన గుర్తుకు వస్తున్నది. అందులో కూడా రావణాసురుడు భిక్షకుడి వేషంతో వచ్చి సీతాదేవితో లక్ష్మణుడు గీసిన గీతను దాటించి తన మాయతో ఆమెను ఎత్తుకుపోతాడు.

ప్రశ్న 8.
‘కర్కోటకుడు’ అంటే ఎట్లా ఉంటాడని అనుకుంటున్నావు?
జవాబు.
కర్కోటకుడు అంటే చూడడానికి భయంకరంగా ఉంటాడని అనుకుంటున్నాను.

ప్రశ్న 9.
దుర్మార్గుల వల్ల ఎట్లాంటి నష్టాలుంటాయని భావిస్తున్నావు ?
జవాబు.
దుర్మార్గులు తాము కోరుకున్నది సాధించడానికి ఎదుటివారిని ఎన్నో ఇబ్బందులు పెడతారు. చివరికి ఇతరుల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు. దుర్మార్గుల వల్ల ప్రజలు ధనాన్ని, మానాన్ని, చివరకు ప్రాణాలను కూడా కోల్పోతారు. దుర్మార్గుల పనుల వల్ల ప్రజలు భయపడిపోతారు. వాళ్ళు ఎప్పుడు ఎవరికి హాని తలపెడతారోనని నిద్ర ఆహారం లేకుండా బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతారు.

TS 6th Class Telugu 10th Lesson Questions and Answers Telangana బాలనాగమ్మ

ప్రశ్న 10.
గండభేరుండ పక్షులు బాలవద్దిరాజుకు సహాయం చేశాయి కదా! అట్లాగే మనం కూడా ఇతరులకు ఎందుకు సహాయం చేయాలి ?
జవాబు.
ఆపదలో ఉన్న వారికి, అవసరం ఉన్న వారికి మనకు తోచిన, మనం చేయగలిగిన సహాయం చేయాలి. ఇతరులకు మనం సాయంచేస్తే ఇతరులు కూడా మనకు అవసరమైనప్పుడు సాయం చేస్తారు. మనిషి సంఘజీవి. అంటే ఒక సమూహంలో బతికేవాడు. ఏ మనిషైనా ఇతరుల సాయం పొందకుండా జీవించలేడు. అందువల్ల మనం ఇతరులకు సాయం చేయాలి.

ఇవి చేయండి

1. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

ప్రశ్న 1.
‘బాలనాగమ్మ’ కథను విన్నారు కదా! ఈ కథలో మీకు ఆసక్తి కలిగించిన సంఘటన ఏదో చెప్పండి.
జవాబు.
ఈ కథలో బాలవద్దిరాజు వజ్రాల చిలుకను సాధించి తెచ్చి మాయల ఫకీరు ప్రాణాలు తీసే సంఘటన నాకు ఎంతో ఆసక్తి కలిగించింది. అందులో సప్తసముద్రాలు దాటడానికి బాలవద్దిరాజుకు గండభేరుండ పక్షి సాయం చేయడం ఎంతో బాగుంది. ఫకీరు ప్రాణం చిలుకలో ఉండడం ఆశ్చర్యం కలిగించింది. బాలవద్దిరాజు తన తల్లిదండ్రులనూ, తన సైన్యాన్ని బతికించుకొని చిలుక కంఠంలో ఉన్న దుర్మార్గుడైన ఫకీరు ప్రాణాలను తీసివేయడం సంతోషం కలిగించింది.

ప్రశ్న 2.
మీకు తెలిసిన జానపద కథను చెప్పండి.
జవాబు.
తెలంగాణా ప్రాంతంలో సోమనాద్రి కథ, రామేశ్వరరావు కథ, రాణి శంకరమ్మ కథ, సలై వెంకట రెడ్డి కథ, సర్వాయి పాపని కథ, బిల్లూరి కొండల్రాయుని కథ వంటి జానపద కథలు తెలుసు. అందులో రాణి శంకరమ్మ కథ ఇది. రాణి శంకరమ్మ మెదక్ జిల్లాలో గౌడిచర్ల గ్రామంలో సంగారెడ్డి, రాజమ్మ దంపతులకు పుట్టింది. చిన్నప్పటి నుంచి కర్రసాము, కత్తి సాము, గుఱ్ఱపు స్వారీ వంటి విద్యలు నేర్చుకుంది. నాగలి పట్టడం, బండి తోలడం వంటి వ్యవసాయ పనులు నేర్చుకొంది. ఒకరోజు ఒక చిరుత పులి మీదికి వచ్చినా భయపడక, కట్టెతో పులిని కొడుతూ, కాళ్ళతో తొక్కి చంపివేసింది. అంతటి ధైర్యవంతురాలు ఆమె. ఇతరులకు సాయం చేసే ఆమె మంచిగుణం నచ్చి, అందోలురాజు నారసింహారెడ్డి ఆమెను పెండ్లి చేసుకున్నాడు.

ప్రజల్ని కనబిడ్డల్లా చూడాలని, మొదటరాజ్యం పనులు, తర్వాతే ఇంటి సుఖాలు అని రాజునకు రాజధర్మాలు గురించి చెప్పింది. నారసింహారెడ్డి మరణం తర్వాత శంకరమ్మ నైజాం రాజు ఆజ్ఞమేరకు మరాఠీల మీదకు యుద్ధానికి వెళ్ళి, కాళికై వారిని ఓడించింది. 1764 లో అందోలు రాజ్యానికి శంకరమ్మ రాణి అయింది. చక్కగా రాజ్యపాలన చేసింది. తన తండ్రి పేరిట సంగారెడ్డి, తల్లిపేర రాజంపేట అనే పట్టణాలు నిర్మించింది. చివరికి 1774 సం॥లతో రాచపుండుతో బాధపడుతూ చనిపోయింది. ప్రజలను కన్నబిడ్డల్లా పాలించిన శంకరమ్మ ఆదర్శ రాణి.

II. ధారాళంగా చదవడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం

1. కింది జాతీయాలను పాఠంలో ఏ సందర్భంలో ఉపయోగించారో రాయండి.

(అ) అల్లారు ముద్దుగా : లక్ష్మీదేవమ్మ తన ఏడుగురు కుమార్తెలను అపురూపంగా పెంచే సందర్భంలో.
(ఆ) కడుపుల పెట్టుకొని కాపాడుట : లక్ష్మీదేవమ్మ తన బిడ్డలను భర్తకు అప్పజెప్పే సందర్భంలో.
(ఇ) చిలుకపలుకులు : పిల్లల్ని కాపాడతానని నవాంభోజరాజుకు మాణిక్యాల దేవి మాయ మాటలు చెప్పిన సందర్భంలో.
(ఈ) కాలం చేయుట : నవాంభోజరాజు చనిపోయిన సందర్భంలో.
(ఉ) ఆరునూరైనా : తన తల్లిదండ్రులను ఫకీరు ఖైదునుంచి విడిపిస్తానని బాలవద్దిరాజు చెప్పిన సందర్భంలో

2. పాఠం ఆధారంగా ఎవరు ఎటువంటివారో కింది పట్టికలో రాయండి.

పాత్రలుపాత్రల స్వభావం తెలిపే పదాలు
(అ) నవాంభోజరాజుభార్య చేతిలో కీలుబొమ్మ. అటు పిల్లల్ని, ఇటు రాజ్యాన్ని పోగొట్టుకున్న దురదృష్టవంతుడు.
(ఆ) బాలనాగమ్మభయస్తురాలు, భక్తురాలు, అమాయకురాలు
(ఇ) మాయల ఫకీరుదుర్మార్గుడు, పరస్త్రీని కోరిన దుష్టుడు, మాయగాడు
(ఈ) బాలవద్దిరాజువిద్యావంతుడు, వీరుడు, కార్యసాధకుడు
(ఉ) గండభేరుండ పక్షికృతజ్ఞతాభావం, స్నేహగుణం, పరోపకార గుణం కలిగినది.
(ఊ) లక్ష్మీదేవమ్మభక్తురాలు, అన్నమాట తప్పదు, పతివ్రత, బిడ్డలంటే ప్రాణం
(ఋ) మాణిక్యాలదేవిస్వార్థపరురాలు, సవతి పిల్లలను చంపాలనుకొన్న రాక్షసి


III. స్వీయ రచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

(అ) నవాంభోజరాజు మారుమనువుకు ఒప్పుకోలేదు కదా! ఐనా బంధువులు, మంత్రులు మొదలైన వారు ఏమని నచ్చజెప్పి ఒప్పించి ఉంటారు ?
జవాబు.
నవాంభోజరాజు భార్య అయిన లక్ష్మీదేవమ్మ ఒకే కాన్పులో ఏడుమంది ఆడపిల్లలను కన్నది. ఇచ్చిన మాట ప్రకారం బిడ్డలు పుట్టిన తొమ్మిది నెలలకే నాగేంద్రుణ్ణి చేరుకున్నది. వెడుతూ వెడుతూ రాజు అయిన భర్తను బిడ్డల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకోమనీ, మళ్ళీ పెళ్ళి చేసుకోవద్దనీ చెప్పింది. కానీ బంధువులు, మంత్రులు మొదలైనవారు నచ్చజెప్పి రాజును ఒప్పించి మళ్ళీ పెళ్ళి చేశారు. బిడ్డలు తొమ్మిది నెలల పసివాళ్ళనీ, వారి ఆలనాపాలనా చూసుకోవడానికి ఒక తల్లిలాంటి స్త్రీ కావాలని చెప్పి ఉంటారు. అంతేకాక వయసులో ఉన్న రాజుకు తోడుకావాలని, రాజ్యానికి వారసుడు కావాలనీ వారు ఇట్లా రకరకాలుగా నచ్చజెప్పి ఉంటారు.

(ఆ) అడవిలో దిక్కులేని పక్షుల తీరుగ తిరుగుతున్న లక్ష్మీదేవమ్మ పిల్లలను మేనమామ వద్దిరాజు ఇంటికి తీసుకొని పోయాడు కదా! అతడు ఆ పిల్లలను ఇంటికి తీసుకొని పోకపోతే ఏం జరిగి ఉండేదో ఊహించి రాయండి.
జవాబు.
ఆ పిల్లలను మేనమామ తీసుకొనిపోకపోతే ఆ పిల్లలు అడవిలోనే పెరిగి ఉండేవారు. అక్కడి పక్షులు, లేళ్ళు, కుందేళ్ళు మొదలైన సాధుజంతువులు వారిని పెంచి పోషించేవి. చిలుకలు వాటికి పలుకులు నేర్పేవి. కోయిలలు పాటలు నేర్పేవి. హంసలు నడకలు నేర్పేవి. ఏనుగులు తమ తొండాలతో వారిని ఉయ్యాలలు ఊపేవి. వారు జలపాతాలలో జలక్రీడలు ఆడుకొనేవారు. ఆకులు అలములూ, పండ్లూ దుంపలూ తిని బతికేవారు. చెట్ల నీడల్లో, గుబురు పొదల్లో తలదాచుకొనేవారు. పక్షుల, మృగాల భాష నేర్చుకొనేవారు. మనుషుల భాష మాత్రం వచ్చేది కాదు.

TS 6th Class Telugu 10th Lesson Questions and Answers Telangana బాలనాగమ్మ

(ఇ) బాల వద్దిరాజుకు కట్టెసాము, కత్తిసాము, విలువిద్య మొదలైన విద్యలు వస్తాయి కదా! మీకు చదువుతోపాటు ఏయే విద్యలు వస్తాయి ? అందులో మీకు బాగా ఇష్టమైన విద్య ఏది ?
జవాబు.
చదువుతో పాటుగా నాకు సంస్కృతం, సంగీతం అనే విద్యలు వచ్చు. సంస్కృతంలో శబ్దాలు, ధాతువులు, అమరకోశం నేర్చుకున్నాను. సంస్కృతం రాయడం, మాట్లాడటం నేర్చుకుంటున్నాను. ఈ రెండింటిలో నాకు సంగీతం అంటే చాలా యిష్టం. కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో త్యాగరాజస్వామి, రామదాసు కీర్తనలు నేర్చుకున్నాను. లలిత సంగీతంలో అన్నమయ్య కీర్తనలు పాడతాను గూడా. నాకు మా వూరి జాతరలో పాడే జానపద గీతాలంటే చాలా ఇష్టం. అవకాశం వచ్చినప్పుడు నేను కూడా వేదిక మీద మైకు పట్టుకుని చిందులేస్తూ పాడతాను కూడా. అప్పుడు మా స్నేహితులుకూడా నాతో కలిసి అడుగులేస్తారు.

(ఈ) లక్ష్మీదేవమ్మ పడిన కష్టాలను గురించి రాయండి.
జవాబు.
లక్ష్మీదేవమ్మ నవాంభోజరాజుకు భార్య. ఆమెకు ముని ఇచ్చిన వరం వల్ల ఏడుగురు ఆడపిల్లలు జన్మించారు. నాగేంద్రునికి ఇచ్చిన మాట వల్ల ఆ పిల్లల తల్లి వారికి తొమ్మిది నెలలురాగానే వెళ్ళిపోయింది. భార్యకు ఇచ్చిన మాట వల్ల రాజు అయిన భర్త మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా రాజ్యపరిపాలన కూడా మరచిపోయి బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. కానీ మంత్రులు, బంధువులు నచ్చజెప్పి రాజుకు మాణిక్యాల దేవితో మళ్ళీ పెళ్ళి చేశారు. రాచకార్యం మీద రాజు ఢిల్లీ వెళ్ళగా సవతి తల్లి పిల్లలకు అన్నం, నీళ్ళు ఇవ్వకుండా నానా కష్టాలు పెట్టింది. అంతేగాక విషం పెట్టి చీకటింట్లో పడేసింది. అపుడు వారిని వారి తల్లి ఆత్మ కాపాడింది.

అపుడు సవతి తల్లి వారిని అడవిలో పాడుపడ్డ గుడిలో పడేసి తాళమేసి వచ్చింది. ఈసారి గూడా లక్ష్మీదేవమ్మ ఆత్మ వారిని కాపాడింది. ఆ ఆత్మ ద్వారా జరిగింది తెలుసుకున్న రాజు ఢిల్లీ నుంచి వెంటనే వచ్చి బిడ్డలను కాపాడుకున్నాడు. పట్టువదలని సవతి తల్లి రాజుకు మరుగు మందు పెట్టింది. ఆ మందువల్ల రాజు తన బిడ్డలను చంపడానికి తానే వారిని అడవికి తీసుకొని వెళ్ళాడు. కన్నబిడ్డలను చంపడానికి చేతులురాక వారిని అక్కడే నిద్రపుచ్చి చెప్పకుండా ఇంటికొచ్చాడు. అపుడు ఆ పిల్లలను వారి మేనమామ అయిన వద్దిరాజు వచ్చి రక్షించాడు.

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.

(అ) బాలనాగమ్మ కథను సొంతమాటల్లో రాయండి.
జవాబు.
పరిచయం : తెలంగాణాలో ప్రసిద్ధమైన జానపద కథలలో బాలనాగమ్మ కథ ఒకటి. చిన్నవాడైన బాలవద్దిరాజు తన తల్లిదండ్రులైన బాలనాగమ్మ, కార్యవద్దిరాజులకు వచ్చిన ఆపదను తొలగించేటందుకు చేసిన సాహస కథ ఇది. బాలనాగమ్మ : బాలనాగమ్మ నవాంభోజరాజు, లక్ష్మీదేవమ్మలకు పుట్టిన 7గురు సంతానంలో చివరిది. కార్యవద్దిరాజు భార్య. బాలనాగమ్మ గర్భవతిగా ఉండగా కార్యవద్దిరాజు లేని సమయం చూసి మాయల ఫకీరు బాలనాగమ్మను పట్టితేవాలని పానుగంటిలోని ఆమె మేడలోకి వెళ్ళాడు. అప్పటికి బాలనాగమ్మ పిల్లవాణ్ణి కన్నది. మాయల ఫకీరు బాలనాగమ్మను కుక్కగా మార్చి తన వెంట తీసుకొని పోయాడు.

ఆ బాలుడి పేరు బాలవద్దిరాజు. బాలనాగమ్మను రక్షించడానికి వెళ్ళిన వద్దిరాజులను ఫకీరు రాళ్ళలా మార్చేశాడు. బాలవద్దిరాజు : బాలనాగమ్మ కొడుకు పానుగంటిలో పెరిగి పెద్దవాడయ్యాడు. చాలా ధైర్యవంతుడు. ఫకీరున్న కోటలోకి పోయి తల్లిని కలిశాడు. ఫకీరు పీడ విరగడ : ఫకీరు ప్రాణం ఏడు సముద్రాల అవతల మామిడిచెట్టు తొర్రలో వున్న వజ్రాల చిలుకలో ఉ న్నదని తెలుసుకున్నాడు. ఆఖరుకు ఆ వజ్రాల చిలుకను పట్టుకొని ఫకీరు కోటకు చేరాడు. వజ్రాల చిలుక మెడ విరిచేసి, మాయల ఫకీరు పీడ వదిలించాడు. తన తల్లిదండ్రులను, సైన్యాన్ని రక్షించుకున్నాడు. ముగింపు ఈ విధంగా బాలవద్దిరాజు ధైర్యసాహసాలతో తన తల్లిదండ్రులను రక్షించుకోవడమే కాక దుర్మార్గుడైన మాయల ఫకీరును అంతమొందించాడు.

IV. సృజనాత్మకత/ప్రశంస:

1. “సాయంత్రం గండభేరుండ పక్షి రాంగనే………………………… ‘అనే పేరా నుంచి చివరి వరకు పాఠం చదవండి. దీని ఆధారంగా గండభేరుండ పక్ష్మి, బాలవద్దిరాజు, మాయల ఫకీరుల మధ్య జరిగిన సంభాషణలను ఊహించి, రాయండి.
జవాబు.
గండభేరుండ పక్షి : : బాలకా! నువ్వు ఎవరివి ? ఇక్కడికి ఎందుకు వచ్చావు ? ఎక్కడికి పోవాలి ? ఏమి కావాలో చెప్పు.
బాలవద్దిరాజు : నేనొక రాజకుమారుణ్ణి, నా తల్లిదండ్రులను కాపాడుకోవడానికి వచ్చాను, నాకు సప్త సముద్రాల అవతల పంజరంలో ఉన్న వజ్రాల చిలుక కావాలి.

గండభేరుండ పక్షి : నా బిడ్డల్ని కాపాడావు. నాకు ఎంతో మేలు చేశావు. కనుక నీకు నేను సాయం చేస్తా. నిన్ను నా రెక్కల మీద కూర్చోబెట్టుకొని సప్తసముద్రాలు దాటించి మళ్ళీ తీసుకు వస్తా. సరేనా?

బాలవద్దిరాజు : ఆహా! ఎంత అదృష్టవంతుణ్ణి. ఈ సమయంలో నీ సాయం నాకు ఎంతో అవసరం. (బాలవద్దిరాజు చిలుకను పట్టుకోగానే మాయల ఫకీరుకు చలి జ్వరం మొదలైంది).

మాయల ఫకీరు : ఏమిటి ! నాకింత చలి జ్వరంగా ఉన్నది. ఎందుకో నాకేమిటో అయిపోతున్నది.

బాలవద్దిరాజు : ఇదిగో ఫకీరూ! చూడు. నీ ప్రాణం చిలుక కంఠంలో. ఆ చిలుక కంఠం నా చేతిలో.

మాయల ఫకీరు : ఆఁఁ (కోపంతో) ఎంత ధైర్యం రా నీకు ? ఇప్పుడే నిన్ను బూడిద చేసేస్తాను చూడు. (అంటూ కుడిచెయ్యి పైకెత్తుతాడు) వెంటనే బాలవద్దిరాజు చిలుక కుడి రెక్క విరిచేస్తాడు.

మాయల ఫకీరు : అబ్బా … నన్నేమీ చెయ్యకు. నువ్వు ఏమి చెబితే అది చేస్తా.

బాలవద్దిరాజు : అట్లాగా! అయితే నా తల్లిని విడుదల చెయ్యి. నా తండ్రుల్ని, సైన్యాన్ని తిరిగి బతికించు. (ఫకీరు అట్లాగే చేస్తాడు.)

బాలవద్దిరాజు : ‘నీ వంటి దుర్మార్గుడు బతికుంటే ఈ లోకానికి నష్టం (అంటూ ఆ వజ్రాల చిలుక చానా మెడ విరిచేస్తాడు)

మాయల ఫకీరు : అయ్యో, అమ్మో, అబ్బా …………….. అనుకుంటూ అరుస్తూ గిలగిలా కొట్టుకుంటూ చనిపోతాడు.)

ముగింపు : ఈ విధంగా బాలవద్దిరాజు తన తల్లిదండ్రులనూ, సైన్యాన్ని కాపాడుకోవడమే కాకుండా దుర్మార్గుడైన మాయల ఫకీరును అంతంచేసి, రాజ్యాన్ని, ప్రజల్ని రక్షించాడు.

V. పదజాల వినియోగం

1. కింది వాక్యాల్లోని గీతగీసిన పదాలకు వ్యతిరేకార్థక పదాలను ఖాళీలలో రాయండి.
(అ) కొడుకు పుట్టినందుకు సంతోషపడ్డారు. కాని అతడు ప్రయోజకుడు కానందుకు (బాధపడ్డారు)
(ఆ) సుఖము కోరుకంటే దేన్నీ సాధించలేము. కాని …………… దేన్నైనా సాధించవచ్చు. (కష్టముతో)
(ఇ) మంచివాళ్ళు మేలు చేయాలని చూస్తే, చెడ్డవాళ్ళు …………………. చేయాలని చూస్తారు.
(ఈ) సీత జాడ తెలియక విషాదంలో ఉన్న రాముడికి ఆమె జాడ చెప్పి హనుమంతుడు ………………. కలిగించాడు. (ఆనందం)
(ఉ) దుర్మార్గుల వల్ల సమాజానికి చెడు జరుగుతుంది. ఐతే మంచివాళ్ళవల్ల సమాజానికి ……………. జరుగుతుంది. (మంచి)

2. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలను రాయండి.
ఉదా: (అ) కొంతమంది చిన్నతనం నుండే యోగాసనాలు సాధన చేస్తారు
జవాబు.
అభ్యాసం

(ఆ) మా బడి మా ఇంటికి తూర్పు దిక్కున ఉంది.
జవాబు.
దిశ

(ఆ) మా తాత పులిహోర ఆరగించాడు.
జవాబు.
తిన్నాడు.

TS 6th Class Telugu 10th Lesson Questions and Answers Telangana బాలనాగమ్మ

(ఇ) అప్పు కట్టలేదని రాజయ్య భూమిని బ్యాంక్ వాళ్ళు జప్తు చేశారు.
జవాబు.
స్వాధీనం

(ఈ) ప్రజల సేవకై తపించిన రాజులు చరిత్రకెక్కారు
జవాబు.
ప్రభువులు

(ఉ) నా శిరస్సు వంచి నీకు నమస్కారం చేస్తున్నాను.
జవాబు.
తల

3. కింది జాతీయాలతో సొంత వాక్యాలు రాయండి.

(అ) అల్లారుముద్దుగా – చిన్న పిల్లలను అల్లారుముద్దుగా పెంచుతారు.
(ఆ) చిలుకపలుకులు – పసిపిల్లల తప్పటడుగులు, చిలుక పలుకులు ముచ్చటగా ఉంటాయి.
(ఇ) ఆరునూరైనా – ఆరునూరైనా అబద్దమాడకూడదు.

VI. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది ద్వంద్వ సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాయండి.

(అ) తల్లిదండ్రులు : తల్లియునూ తండ్రియునూ
(ఆ) తోడునీడలు : తోడు మరియు నీడ
(ఇ) భీమార్జునులు : భీముడు మరియు అర్జునుడు
(ఈ) కాయగూరలు : కాయయును, కూరయును
(ఉ) ఆటపాటలు : ఆట మరియు పాట

కలిపి రాయడం కింది వాటిని పరిశీలించండి.

1. వారు + ఉండిరి = వారుండిరి
2. ఎవరికి + ఎంత = ఎవరికెంత
3. ఇంక + ఒకరు = ఇంకొకరు

పై ఉదాహరణల్లో రెండేసి పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడటం గమనించారు కదా! ఇట్లా రాయడాన్ని కలిపిరాయడం అంటారు. దీనికే ‘సంధి’ అని పేరు.

2. కింది పదాలను కలిపి రాయండి.

ఉదా : సెలవు + ఇచ్చి = సెలవిచ్చి
(అ) మీరు + ఎవరు = మీరెవరు
(ఆ) పది + ఇంతలు = పదింతలు
(ఇ) ఏది + ఐనా = ఏదైనా
(ఈ) పట్టిన + అంత = పట్టినంత

ప్రాజెక్టు పని:

గ్రంథాలయం నుంచి గాని, వార్తాపత్రికల నుంచి గాని ఏదైనా జానపద కథను సేకరించి, రాసి తరగతిలో చెప్పండి.
1. ప్రాజెక్టు శీర్షిక : గ్రంథాలయం నుండి గాని, వార్తా పత్రికల నుంచి గాని ఏదైనా జానపద కథను సేకరించడం.

2. సమాచార సేకరణ : (అ) సమాచారం సేకరించిన తేది : XXX (ఆ) సమాచార వనరు : గ్రంథాలయం

3. సేకరించిన విధానం : నేను మా గ్రామ గ్రంథాలయానికి వెళ్ళి వార్తా పత్రికలను చదివి, ఒకనాటి వార్తా పత్రికలో వచ్చిన సర్వాయి పాపన్న కథను సేకరించాను.

4. నివేదిక :

సర్వాయి పాపడు

క్రీ.శ. 1650 ప్రాంతంలో అణిచివేతకు గురి అవుతున్న గౌడ్ కులంలో పుట్టిన పాపన్న బాల్యంలో పశువులను కాస్తూ, జీవించాడు. ఒక్క కొడుకు కావడంతో తల్లి సర్వమ్మ పాపన్నను గారాబంగా పెంచింది. స్వతంత్ర ఆలోచనలు కలిగిన పాపన్న కల్లు గీస్తూ, పశువులను కాసేవాడు. తన స్నేహితులను సమీకరించి చిన్న సైన్యాన్ని తయారు చేశాడు. సంప్రదాయ ఆయుధాలను సమకూర్చుకున్నాడు. తన అనుచరులతో కలిసి బల్లెం, బాణం, కర్ర వంటి ఆయుధాలను ఉపయోగించే పద్ధతులను సాధన చేశాడు. క్రమంగా తాను పెరిగిన తాటికొండ చుట్టుప్రక్కల గ్రామాలలో వున్న ధనవంతులను, జమీందారులను రహస్య పద్ధతుల ద్వారా కొల్లగొడుతూ ధనాన్ని సేకరించడం మొదలుపెట్టాడు.

పాపన్న సాహసాలకు ఆకర్షితులై ప్రజలు సైన్యంలో చేరడం ప్రారంభించారు. దొరల పీడనవల్ల బాధలు పడుతున్న అణగారిన కులాలకు చెందిన ప్రజలకు పాపన్న రక్షణ యిచ్చాడు. పాపన్న సైన్యం రోజురోజుకు పెరగసాగింది. మొదట సర్వాయిపేటలో బలిష్ఠమైన కోటను నిర్మించాడు. పాపన్న స్వతంత్రంగా ప్రకటించుకొని కేంద్రంగా పాలించాడు. క్రమక్రమంగా తన రాజ్యాన్ని విస్తరించుకొంటూ హుస్నాబాద్, కరీంనగర్ ప్రాంతాలను జయించి అధీనంలోకి తెచ్చుకున్నాడు. భవిష్యత్తులో గోల్కొండను జయించడానికి ముందే వ్యూహరచన చేసి తాటికొండలో మరొక కోటను నిర్మించాడు.

ప్రజల మన్ననలు అందుకొంటూ తగినంత సైన్యాన్ని వృద్ధి చేసుకొని ప్రజల సహకారంతో నల్లగొండ పరగణా భోనగిరి సర్కారులోని ‘షాపురం’ వద్ద గుట్టమీద పెద్ద మట్టి కోటను నిర్మించాడు. ఈ కోటను తన కేంద్రంగా చేసుకొని నల్లగొండ పరగణాలో వున్న జమీందారులను దోచుకుంటూ పెద్ద మొత్తంలో ధనాన్ని కూడగట్టాడు. పాపన్నను నిలువరించే వారు లేకపోవడంతో జమీందారులు, భూస్వాములంతా కలిసి ఢిల్లీ పాదుషాకు విన్నవించుకున్నారు. ఔరంగజేబు ఈ పరిస్థితిని గమనించి పాపన్నను శిక్షించేందుకు కొలనుపాక సర్దారగు రుస్తుందిల్ ఖాన్ను ఆదేశించాడు.

రుస్తుందిల్ ఖాన్ స్వయంగా పెద్ద సైన్యంతో వచ్చి షాపురం వద్ద పాపన్నతో తలపడ్డాడు. పాపన్న సైన్యం వీరోచితమైన పోరాటం సాగించింది. మూడు నెలల సుదీర్ఘ పోరాటం అనంతరం రుస్తుందిలాఖాన్ పాపన్న చేతిలో ఓడిపోయాడు. పాపన్న విజయాలు స్థానిక దొరలు, భూస్వాములకు మింగుడు పడలేదు. ఈ పరిస్థితులను ఆసరాగా తీసుకొని క్రీ.శ. 1708 ఏప్రిల్1 తేదీన పాపన్న వరంగల్ కోటను ముట్టడించాడు. అక్కడ మొగల్ ఆధీనంలో వున్న వేలమంది బందీలను విడుదల చేశాడు. అనంతరం తన సైన్యాన్ని పటిష్ఠ పరచుకొని క్రీ.శ. 1709 ఆరంభంలో పాపన్న గోల్కొండపైకి దండెత్తాడు. భీకర పోరాటం తర్వాత అంతిమంగా గోల్కొండ పాపన్న వశమైంది.

మొగలు నాయకత్వం అపజయంతో రగిలిపోయింది. తన ధైర్య సాహసాలు, వరుస విజయాలతో యెంతో ధీమాగా వున్న పాపన్న మొగలుల కుట్రలను, మోసపూరిత చర్యలను గమనించలేకపోయాడు. ప్రజలకు రక్షణ, పరిపాలనా సంస్కరణలలో మునిగిన పాపన్న యీ ద్రోహాన్ని పసిగట్టలేకపోయాడు. దీనితో మొగలు సైన్యం మూకుమ్మడిగా స్థానిక దొరలు, భూస్వాముల అండతో గోల్కొండ మీదికి దాడిచేసింది. యీ దాడిలో పాపన్న సైన్యం చాలా వరకు నష్టపోయింది. చివరి దాకా పోరాడిన పాపన్న శత్రువు చేతిలో మరణించడం తన స్వభావానికి విరుద్ధమని తలచి బాకుతో పొడుచుకొని ఈ లోకాన్ని విడిచివెళ్ళాడు.

5. ముగింపు : ఈ జానపద కథ వల్ల సర్వాయి పాపన్న గురించి తెలుసుకున్నాను. పాపన్న ధైర్య సాహసాలను గురించి తెలుసుకున్నాను.

TS 6th Class Telugu 10th Lesson Important Questions బాలనాగమ్మ

ప్రశ్న 1.
బాలవద్దిరాజు చేసిన సాహసాలను వివరించండి.
జవాబు.
పరిచయం : పానగల్లును పరిపాలించే వద్దిరాజు కుమారుడు కార్యవద్దిరాజు. బాలనాగమ్మ, కార్యవద్దిరాజుల కుమారుడే బాలవద్దిరాజు. ఈ బాలుడు ఏడు రోజుల పసికందుగా ఉన్నప్పుడు మాయల ఫకీరు బాల నాగమ్మను ఎత్తుకుపోయాడు. తన తల్లిదండ్రుల గురించి తెలిసిన పన్నెండేళ్ళ బాలవద్దిరాజు వారిని కాపాడతానని బయలుదేరాడు. పులిని చంపడం : తల్లిని వెతుకుతూ వెళుతున్న బాలవద్దిరాజు దారిలో పులిరాజు పట్టణం చేరాడు. అక్కడ ఒక పులి మంచినీళ్ళ బావి దగ్గర అందరినీ మింగుతోంది. ఇది తెలిసి బాలవద్దిరాజు పులిని వెతుక్కుంటూ గుహదగ్గరకే వెళ్ళి దాన్ని చంపాడు.

రాజకుమారిని రక్షించడం: గుడిమీద మొలచిన సంజీవని మొక్క ఆకుల రసం పిండి, చిలుకవాదిపట్నం రాజు కూతురు రాచపుండును నయం చేసి బతికించాడు.

శక్తిని ఓడించడం : నాగిళ్ళపూడి మొదట్లో ఉన్న నయవాది పట్టణం చేరుకోగానే అక్కడ ఫకీరు ఏర్పాటుచేసిన శక్తి బాలవద్దిరాజును అడ్డుకున్నది. దాన్ని చంపబోగా అది భయపడి ఆ బాలుడిని ఫకీరు ఎక్కడ ఉన్నాడో రహస్యం చెప్పి, ఒక మాయల బెత్తం కూడా ఇచ్చింది. అట్టా అతడు ఫకీరుకోటలోకి పోయి తల్లిని కలిశాడు. తల్లిద్వారా ఫకీరు ప్రాణ రహస్యం తెలుసుకొన్నాడు.

సప్త సముద్రాలు దాటడం: గండభేరుండ పక్షిసాయంతో సప్త సముద్రాలు దాటి ఆ బాలుడు పంజరంలో ఉన్న చిలుకను పట్టి తెచ్చాడు.

మాయల ఫకీరు సంహారం : చిలుకను ఫకీరు దగ్గరకు తీసుకు వచ్చాడు. ఫకీరు భయంతో బాలనాగమ్మను విడుదల చేశాడు. ఫకీరు వంటి దుర్మార్గుడు బతికుంటే ఈ లోకానికి చాలా నష్టం అని వజ్రాల చిలుక మెడ విరిచేశాడు బాలరాజు. మాయల ఫకీరు ప్రాణం విడిచాడు.

TS 6th Class Telugu 10th Lesson Questions and Answers Telangana బాలనాగమ్మ

ప్రశ్న 2.
బాలవద్దిరాజు సప్తసముద్రాలు దాటి మాయల ఫకీరు ప్రాణాలున్న చిలుకను పట్టుకున్నాడు కదా! ఆ చిలుకను దొరికిన చోటనే చంపకుండా ఫకీరు దగ్గరకు ఎందుకు తీసుకొని పోయి ఉంటాడో రాయండి.
జవాబు.
ఆ చిలుకను దొరికిన చోటనే చంపితే మాయల ఫకీరుకు తాను ఎందుకు చనిపోతున్నాడో తెలిసేది కాదు. అంతటి దుర్మార్గుణ్ణి దుర్మార్గంగానే చంపాలని బాలవద్దిరాజు ఆ పని చేసి ఉంటాడు. అంతేకాక మాయల ఫకీరు తన మాయలతో తన తల్లిని బందీగా చేశాడు. తన తాత తండ్రులను రాళ్ళుగా, సైనికులను బూడిదగా మార్చాడు. తన తల్లి విడుదల కావాలన్నా, తన తండ్రి, సైనికులు తిరిగి మనుషులుగా మారాలన్నా అది ఫకీరు వల్లనే సాధ్యపడుతుంది. ఆ చిలుకను దొరికిన చోటనే చంపేస్తే తన తల్లిదండ్రులు గానీ, సైనికులుగానీ విడుదల అయ్యే అవకాశం ఉండదు. అందువల్ల బాలవద్దిరాజు ఆ చిలుకను దొరికిన చోటనే చంపకుండా ఫకీరు దగ్గరకు తీసుకొని పోయి ఉంటాడు.

అర్థాలు

  • నూరు = వంద
  • ఎకాఎకిన = అకస్మాత్తుగా, తొందరగా, వెంటనే
  • కంఠం = మెడ
  • నాగేంద్రుడు = నాగుపాము

పర్యాయ పదాలు

  • దిక్కు = దిశ వైపు
  • తల = శిరస్సు, మూర్ఖం
  • తల్లి = అమ్మ, అంబ, జనని, మాత
  • తండ్రి = నాన్న, జనకుడు, అయ్య
  • రాజు = ప్రభువు, నరపాలుడు, పాలకుడు
  • భర్త = పతి, మగడు, నాథుడు
  • భార్య = సతి, పెండ్లాము, కళత్రం
  • పెండ్లి = వివాహం, కళ్యాణం, పాణిగ్రహణం
  • పట్టణం = పురం, నగరం
  • అడవి = వనం, కాన, అరణ్యం
  • గుడి = కోవెల, దేవాలయం
  • సముద్రం = వనధి, వార్ధి, అంబుధి
  • పాము = సర్పం, ఉరగం, ఫణి
  • పక్షి = విహంగం, ఖగం, అండజం

నానార్థాలు

  • దిక్కు = దిశ, శరణం, వైపు
  • రాజు = చంద్రుడు, భూపాలుడు
  • పన్ను = కప్పం, దంతం

ప్రకృతులు – వికృతులు

  • ప్రకృతి – వికృతి
  • అటవి – అడవి
  • అంబ – అమ్మ
  • కథ – కత
  • నిద్ర – నిదుర
  • రాత్రి – రేతిరి
  • రాజు – రేడు
  • విద్య – విద్దె
  • శక్తి – సత్తి, సత్తువ
  • సముద్రం – సంద్రం
  • సంతోషం – సంతసం

TS 6th Class Telugu 10th Lesson Questions and Answers Telangana బాలనాగమ్మ

సంధులు

  • రాజ్యమున్నది = రాజ్యము + ఉన్నది
  • పడగలెత్తిండు = పడగలు + ఎత్తిండు
  • చేతులెత్తి = చేతులు + ఎత్తి
  • కావస్తుండగనే = కావస్తు + + ఉండగనే
  • తాకీదొచ్చింది = తాకీదు + ఒచ్చింది
  • ఇట్లుండగ = ఇట్లు + ఉండగ
  • తాళమేసి = తాళము + ఏసి
  • చెప్పినట్లు = చెప్పిన + అట్లు
  • పెట్టకుంటే = పెట్టాక + ఉంటే
  • అయిపోతుందని = అయిపోతది + అని
  • చేతికిస్తనని = చేతికి + ఇస్తనని
  • ఉన్నదని = ఉన్నది + అని
  • బేరానికొచ్చిండు = బేరానికి + ఒచ్చిండు

కలపడం

  • నేను + ఆపని = నేనాపని
  • వాళ్ళు + అందరు = వాళ్ళందరు
  • వాడు + అయ్యిండు = వాడయ్యిండు
  • ఇట్లు + ఉండంగా = ఇట్లుండగా
  • ముక్కలు + అయింది = ముక్కలయింది
  • అయిపోతది + అని = అయిపోతదని
  • చేతికి + ఇస్తనని = చేతికిస్తనని
  • రహస్యము + అంత = రహస్యమంత
  • పొమ్ము + అని = పొమ్మని
  • ఉన్నది + అని = ఉన్నదని
  • మొదలు + అయ్యింది = మొదలయ్యింది
  • బతికించుము + అన్నడు = బతికించుమన్నడు
  • విడిచిపెట్టుము + అన్నడు = విడిచి పెట్టుమన్నడు.

1. క్రింది పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు తగిన సమాధానాలు రాయండి.

కష్ట పెట్టబోకు కన్నతల్లి మనసు
నష్ట పెట్టబోకు నాన్న పనులు
తల్లిదండ్రులన్న దైవసన్నిభులురా
లలిత సుగుణజాల తెలుగుబాల

ప్రశ్నలు:
1. వేనికి నష్టం కలిగించకూడదు ?
జవాబు.
నాన్న పనులకు

2. కష్టపెట్టకూడనిది ఏమిటి ?
జవాబు.
కన్న తల్లి మనసు

3. ఎవరు దైవ సమానులు ?
జవాబు.
తల్లిదండ్రులు

TS 6th Class Telugu 10th Lesson Questions and Answers Telangana బాలనాగమ్మ

4. ఈ పద్యం రాసిన కవి పేరేమిటి ?
జవాబు.
కరుణశ్రీ

5. ఈ పద్యానికి మకుటం ఏమిటి ?
జవాబు.
లలిత సుగుణజాల తెలుగుబాల

II. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

అక్షరంబు వలయు కుక్షిజీవనులకు
నక్షరంబు జిహ్వ కిక్షురసము
అక్షరంబు తన్ను రక్షిచు గావున
నక్షరంబు లోక రక్షితంబు.

ప్రశ్నలు:

1. మానవులకు అవసరమైనది ఏది ?
జవాబు.
అక్షరం కొని

2. అక్షరం జిహ్వకు ఎటువంటిది ?
జవాబు.
చెరుకు రసం వంటిది.

3. అక్షరం దేనిని రక్షిస్తుంది ?
జవాబు.
చదువుకున్న వారిని (తన్ను) రక్షిస్తుంది.

TS 6th Class Telugu 10th Lesson Questions and Answers Telangana బాలనాగమ్మ

4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు.
‘అక్షరం’ అవసరం.

5. ‘జిహ్వ’ అను పదానికి అర్థం రాయండి.
జవాబు.
జిహ్వ అనగా ‘నాలుక’ అని అర్థం.

III. ఈ క్రింది గద్యాన్ని చదివి, ఏవేని ఐదు ప్రశ్నలు తయారు చేయండి.

“సాహితి సృజనలో అంతర్జాతీయ కీర్తి నందుకొన్న మహాకవి రవీద్రనాథ్ ఠాగూర్. కవిగా, రచయితగా, తత్త్వవేత్తగా, సంగీతజ్ఞుడిగా, చిత్రకారుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. వీరి పేరు వినగానే చప్పున స్ఫురించేవి ‘జనగణమన గీతం’, ‘గీతాంజలి’. జనగణమన గీతం భారత జాతీయ గీతంగా గుర్తింపబడింది. బంగ్లాదేశ్ జాతీయ గీతం కూడా వీరి లేఖిని నుండి వెలువడినదే. ఇలా రెండు జాతీయ గీతాలనందించిన కవిగా, అపూర్వ చరిత్రను సృష్టించారు. “శాంతినికేతన్” పేరున విద్యాలయాన్ని స్థాపించి ‘గురుదేవుడు’గా కీర్తింపబడ్డారు.

ప్రశ్నలు:

1. సాహిత్య సృజనలో అంతర్జాతీయ కీర్తిని అందుకున్న వారు ఎవరు ?
2. బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని రాసింది ఎవరు ?
3. రవీంద్రుడు స్థాపించిన విద్యాలయం ఏది ?
4. రవీంద్రుని బిరుదు ఏమి ?
5. ఠాగూర్ రచించిన ఏవేని రెండు ప్రసిద్ధ రచనలు ఏవి ?

IV. పర్యాయపదాలు

గీత గీసిన పదాల ‘పర్యాయపదాలు గుర్తించండి.

11. ఏ దిక్కూ లేని వారికి భగవంతుడే రక్ష.
(A) చోటు, స్థలం
(B) ఇల్లు, గృహం
(C) దిశ, వైపు
(D) నీరు, జలం
జవాబు.
(C) దిశ, వైపు

12. తల్లి, తండ్రి, గురువు – వీరి ముగ్గురి ఋణమూ ఎప్పటికీ తీర్చుకోలేము.
(A) జనకుడు, పిత
(B) వృద్ధుడు,ముదుసలి
(C) తాత, నాయన
(D) ఉపాధ్యాయుడు, గురువు
జవాబు.
(A) జనకుడు, పిత

13. మన భారతీయుల వివాహం అనే సంప్రదాయం ప్రపంచ ప్రజలకు ఆదర్శప్రాయం.
(A) ఇల్లు, గృహం
(B) కులం, గుణం
(C) మతం, గౌరవం
(D) పెండ్లి, కళ్యాణం
జవాబు.
(D) పెండ్లి, కళ్యాణం

TS 6th Class Telugu 10th Lesson Questions and Answers Telangana బాలనాగమ్మ

14. దేహాన్ని దేవాలయం గానూ, అందులో ఉండే జీవుణ్ణి దేవుడిగానూ విజ్ఞులు పోలుస్తారు.
(A) విద్యాలయం, బడి
(B) గుడి, కోవెల
(C) ఒడి, మడి
(D) మడి, ఆయకట్టు
జవాబు.
(B) గుడి, కోవెల

V. ప్రకృతి – వికృతులు

గీత గీసిన వాటికి ప్రకృతి/వికృతులను గుర్తించండి.

15. అమ్మను మించిన దైవం లేదు.
(A) కొమ్మ
(B) గుమ్మ
(C) బొమ్మ
(D) అంబ
జవాబు.
(D) అంబ

16. పగటికి రాజు సూర్యుడైతే రాత్రికి రాజు చంద్రుడు.
(A) నక్తం
(B) రాతిరి
(C) చీకటి
(D) అంధకారం
జవాబు.
(B) రాతిరి

17. విద్య లేని వాడు వింత పశువు.
(A) చదువు
(B) సంధ్య
(C) విద్దె
(D) కూలి
జవాబు.
(C) విద్దె

TS 6th Class Telugu 10th Lesson Questions and Answers Telangana బాలనాగమ్మ

18. ఎంత కొండలమీద ప్రవహించినా నదులు అన్నీ చివరికి సముద్రంలో కలిసేవే.
(A) సంద్రం
(B) వారధి
(C) వారిధి
(D) కడలి
జవాబు.
(A) సంద్రం

VI. వ్యాకరణాంశాలు

19. తెలంగాణలో బాలనాగమ్మ కథ బాగా పేరు పొందిన కథ – ఇందులో ద్విత్వాక్షరం ఏది ?
(A) థ
(B) మ్మ
(C) రా
(D) పొం
జవాబు.
(B) మ్మ

20. కింది వాటిలో పరుషాక్షరం ఏది ?
(A) ప
(B) య
(C) మ
(D) గ
జవాబు.
(A) ప

21. బాలవద్దిరాజు తన తల్లిదండ్రులను రక్షించడం కొఱకు ఎన్నో సాహసాలు చేశాడు. గీత గీసినది ఏ విభక్తి ?
(A) ప్రథమ
(B) ద్వితీయా
(C) తృతీయా
(D) చతుర్థి
జవాబు.
(D) చతుర్థి

22. ఓ, ఓరి, ఓయి, ఓసి అనే ప్రత్యయాలకు ఏమని పేరు ?
(A) ప్రథమా
(B) ద్వితీయా
(C) సంబోధన ప్రథమా
(D) షష్ఠీ
జవాబు.
(C) సంబోధన ప్రథమా

VII. సంధులు

విడదీయడం – కింద గీత గీసిన పదాలను విడదీయండి.

23. పరోపకారులైన మానవులకు చేతులెత్తి మొక్కవచ్చు.
(A) చేయి + ఎత్తి
(B) చేతి + ఎత్తి
(C) చేతులు + ఎత్తి
(D) చేతులను + ఎత్తి
జవాబు.
(C) చేతులు + ఎత్తి

24. ప్రతిదీ ఎదుటి వాళ్ళు చెప్పినట్లు చేయడం వ్యక్తిత్వం అనిపించుకోదు.
(A) చెప్పిన + అట్లు
(B) చెప్పు + అట్లు
(C) చెబుతాను + ఇట్లు
(D) చెప్పిన + ట్లు
జవాబు.
(A) చెప్పిన + అట్లు

TS 6th Class Telugu 10th Lesson Questions and Answers Telangana బాలనాగమ్మ

25. సంపద ఉన్నదని మిడిసిపడటం గొప్ప వారి లక్షణం కాదు.
(A) ఉన్నది + ని
(B) ఉన్నది + అని
(C) ఉన్న + అని
(D) ఉంది + అని
జవాబు.
(B) ఉన్నది + అని

కలపడం – కింది పదాలను కలపండి.

26. వాళ్ళు + అందరు
(A) వాళ్ళందర
(B) వాళ్ళందరు
(C) వాళ్ళే అందరు
(D) వాళ్ళందరితోనూ
జవాబు.
(B) వాళ్ళందరు

27. ఉన్నది + అని
(A) ఉందని
(B) ఉన్నదంటూ
(C) ఉంటే ఉంది
(D) ఉన్నదని
జవాబు.
(D) ఉన్నదని

28. మీద + ఎక్కి
(A) మీదెక్కి
(B) మీద మీద
(C) పైపైన
(D) మీద కాక
జవాబు.
(A) మీదెక్కి

పాఠం ఉద్దేశం:

జానపద కథలను విని లేదా చదివి ఆబాలగోపాలం ఆనందిస్తారు. తెలంగాణాలో అనేకమైన ప్రసిద్ధిచెందిన జానపద కథలున్నాయి. వాటిలో బహుళ ప్రజాదరణ పొందిన జానపదకథ ‘బాలనాగమ్మ కథ’. ఈ అద్భుత కథ అనేక జానపద కళారూపాల్లో ప్రదర్శింపబడి ప్రజల మనస్సుల్లో స్థిరంగా నాటుకొని పోయింది. దాని గురించి తెలపడమే ఈ పాఠం ఉ ద్దేశం.

ప్రవేశిక:

కథలలో జానపద కథలు ప్రత్యేకమైనవి. మానవాతీత శక్తులు, తంత్రాలు, సాహస కథనాలు ఈ కథలను నడిపిస్తాయి. అందుకే పిల్లలు ఆ కథలంటే చెవికోసుకుంటారు. చిన్నవాడైన బాలవద్ది రాజు తన తల్లిదండ్రులైన బాలనాగమ్మ, కార్యవద్దిరాజులకు వచ్చిన ఆపదను తొలగించేటందుకు చేసిన సాహసమే ఈ కథ. ఆ జానపదకథను ఇప్పుడు మనం
తెలుసుకుందాం.

నేనివి చేయగలనా ?

  • నాకు తెలిసిన ఒక జానపదకథను సొంతమాటల్లో చెప్పగలను. అవును / కాదు
  • పాఠం ఆధారంగా పాత్రల స్వభావాన్ని గురించి పట్టికలో రాయగలను. అవును / కాదు
  • బాలనాగమ్మ కథను సొంత మాటల్లో రాయగలను. అవును / కాదు
  • పాఠం ఆధారంగా సంభాషణలు రాయగలను. అవును / కాదు

TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature

Telangana TSBIE TS Inter 1st Year English Study Material 4th Lesson The Nobel Nature Textbook Questions and Answers.

TS Inter 1st Year English Study Material 4th Lesson The Nobel Nature

Annotations (Section A, Q.No. 2, Marks: 4)

Question 1.
It is not growing like a tree.
In bulk, doth make Man better be;
Answer:
Introduction:
These are the opening lines of the impressive poem, ‘The Noble Nature’ written by Ben Jonson. He is regarded as the second most popular of English dramatists, after Shakespeare.

Context & Explanation:
The poet employs examples from flora to drive home his point. He straight away introduces the main idea how to become a better man. But, mere bulk doesn’t make one great. Smartness, even in small measure, impresses and impacts everyone. Neither long life nor large size can help one attain nobility. Quality counts more than quantity. Motherwords, matter matters, not the magnitude!. To explain this, the poet compares man to both an Oak tree and a Lily.

Critical Comment:
The poem seeks to explain what makes Man noble in his life.

కవి పరిచయం :
ఈ వాక్యాలు బెన్ జాన్సన్ గారు రచించిన మనస్సుకి ఆకర్షవంతమైన పద్యం The Noble Nature’ లోని ప్రారంభ వాక్యాలు. షేక్స్పియర్ తర్వాత, రెండవ ప్రసిద్ధిగాంచిన ఆంగ్ల నాటకకర్తగా గుర్తింపు
పొందాడు.

సందర్భం :
మనిషి జీవితంలో గొప్పగా ఎలా అవుతాడో వివరించటానికి ప్రయత్నిస్తున్నాడు.

వివరణ :
తన అభిప్రాయాన్ని చెప్పటానికి పుష్పాలను ఉదాహరణగా వినియోగిస్తున్నాడు. ఉన్నతమైన వ్యక్తిగా ఎలా గుర్తింపు పొందుతాడో మనిషి వివరిస్తున్నాడు. అయితే కేవలం పెద్ద పరిమాణం ఒకరిని గొప్పవారుగా చేయదు. చక్కటి చురుకుదనం, చిన్నపాటిగా అయినా, అందర్నీ ఆకర్షిస్తుంది. సుదీర్ఘ జీవితం కానీ పెద్ద ఎదుగుదల కానీ, ఒక వ్యక్తి గొప్పగా ఎదగటానికి సహాయపడుతుంది. పరిమాణం కాదు మనిషికి గుణం ముఖ్యం. ఇంకా చెప్పాలంటే విషయం ముఖ్యం. పరిమాణం కాదు. ఈ విషయం వివరించటానికి, కవి మనిషిని సింధూర మ్రానుతో మరియు కలువపువ్వుతో పోల్చుతాడు.

TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature

Question 2.
A lily of a day
Is fairer far in May.
Answer:
Introduction :
These beautiful lines are taken from the poem, ‘The Noble Nature’ written by Ben Jonson. He is regarded as the second most popular of English dramatists, after Shakespeare. As a poet, he proved his expertise with his lyrics.

Context & Explanation :
Leading a meaningful life makes it noble, Jonson asserts. He employs analogies from nature. The lily flowers in May, flourishes for a day and shines for a short while, Yet, it pleases many. Beauty-even in little measures fills hearts with thrills. It’s life is meaningful. Similarly, a person’s life is meaningful only if he does some acts of benefaction.

Critical Comment:
The poet highlighs the qualities that a man must possess to be considered as noble. To explain this, he compares man to both an oak tree and a lily.

కవి పరిచయం :
ఈ అందమైన వాక్యాలు బెన్ జాన్సన్ గారు రచించిన మనస్సుకి ఆకర్షవంతమైన పద్యం The Noble Nature’ అను పద్యం నుండి గ్రహించబడినవి. షేక్స్పియర్ తరువాత మరొక గొప్ప ఆంగ్ల నాటక కర్తగా పేరుగాంచాడు. కవిగా తన పద్యాల ద్వారా తన గొప్పతనాన్ని చాటుకున్నాడు.

సందర్భం :
గొప్ప వ్యక్తిగా చెప్పుకోవటాన్ని మనిషికి ఉండవలసిన లక్షణాలు గురించి వివరిస్తున్నాడు. ఈ విషయాన్ని విశదీకరించటానికి మనిషిని సింధూర మ్రానుతో మరియు చిన్న కలువపుష్పంతో పోల్చుతున్నాడు. వివరణ : అర్థవంతమైన జీవితాన్ని కొనసాగించడమే గొప్పతనం అని స్థిరంగా చెప్తున్నాడు.

ప్రకృతిలోని సాదృశ్యాలను ఉపయోగిస్తున్నాడు. కలువ పుష్పం ‘మే’ నెలలో పూస్తుంది. ఒక రోజే ఉంటుంది. క్షణకాలం వికసిస్తుంది. అయినప్పటికీ, చాలామందిని ఆనందింపజేస్తుంది. అందం క్షణికమైనదైనా, తాత్కాలికమైనదైనా మనస్సులను రంజింపజేస్తుంది. అలా దాని జీవితం అర్థవంతమైంది. అదేవిధంగా, మనిషి జీవితం కూడా సార్థకమౌతుంది, మనిషి కొంత మంచి చేసినప్పటికీ తన జీవితంలో. కావున ఎంతకాలం బ్రతికామన్నదికాదు. ఎలా బ్రతికామన్నది ముఖ్యం.

TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature

Question 3.
It was the plant and flower of light.
Answer:
Introduction:
This line is taken from the poem, The Noble Nature penned by Ben Jonson. He is regarded as one of the major dramatists and poets of the Seventeenth Century.

Context & Explanation:
The poem says leading a meaningful life even for a short while is worthier than leading a long life with neither charm nor value. The core meaning of the poem centres round this single idea. The lily plant has a short life. It blooms in May and is very beautiful. Although the flower has the life span of a day and falls and dies by nightfall, it spreads beauty and delight in that short period. The poet feels, that a meaningful life like a lily flower though short is what makes a man noble. Even though a man’s life is short, it can be a perfect life.

Critical Comment:
The poet advises one to lead a meaningful life-of light-like that of a lily.

కవి పరిచయం :
ఈ వాక్యం బెన్ జాన్సన్ వ్రాసిన ‘The Noble Nature’ అను కావ్యం నుండి గ్రహించబడింది. 17వ శతాబ్దంలో ఒక ప్రధాన నాటకకర్తగా మరియు కవిగా పేరుగాంచాడు.

సందర్భం :
కలువ పుష్పంలాంటి కాంతివంతమైన, సార్థకమైన జీవితాన్ని గడపమని ప్రతిఒక్కరికి కవి సలహా ఇస్తున్నాడు.

వివరణ :
ఎలాంటి విలువ, గుర్తింపులేని సుదీర్ఘ జీవితంకంటే సార్ధకమైన జీవితం కొంతకాలం గడిపినా అది విలువైందని కవి చెప్తున్నాడు. ఈ ఆలోచనతోనే పద్యం అంతా నిండియుంది. కలువ పుష్పం చాలా తక్కువ కాలం జీవిస్తుంది. ‘మే’ నెలలో వికసిస్తుంది. ఇది చాలా అందమైంది. ఇది ఒక్కరోజులోనే వాడిపోయినా, క్షణంలోనే అందాన్ని మరియు కాంతిని వెదజల్లుతుంది. అలాంటి సార్థకమైన జీవితం క్షణికమైనా, మనిషికి గొప్పవాడుగా గుర్తింపు తెస్తుంది అంటాడు. అలా కలువ పువ్వులాంటి జీవితం క్షణికమైనా, అది పరిపూర్ణ జీవిత.

TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature

Question 4.
And in short measures life may perfect be.
Answer:
Introduction:
This is the concluding line of the beautiful lyric, The Noble Nature written by Ben Jonson. He is very well known for his comedy of humours like Every Man in His Humour.

Context & Explanation:
The poet talks about what makes a man noble. He compares man to a sturdy oak and to a delicate lily in order to do this. He says that a person doesn’t become great or honourable by having long life or huge body. His greatest is analysed by his deeds. And to make man better or life perfect, the poet advises one to dead a meaningful life of light-like that of a lily. Thus, the focus of the poem is clearly on making man better. A person’s life is meaningful only if he does some acts of benefaction. Otherwise life is meaningless.

Critical Comment:
Leading a meaningful life makes it noble, Jonson asserts. He employs analogies from nature.

కవి పరిచయం :
ఇది బెన్ జాన్సన్ వ్రాసిన అందమైన గేయం The Noble Nature’ లోని ముగింపు వాక్యం. ఇతని Every Man in His Humour అను comedy of humours లో ప్రసిద్ధిగాంచాడు.

సందర్భం :
సార్థకమైన జీవితం వ్యక్తిని గొప్పవాడిని చేస్తుంది అంటున్నాడు. ప్రకృతిలోని సాదృశ్యాలను ఉపయోగించి తన భావాన్ని చెప్తున్నాడు. ఏది మనిషిని గొప్ప పరిపూర్ణున్ని చేస్తుందో కవి చెప్తున్నాడు. దృఢమైన పెద్ద సింధూర వృక్షంతోను మరియు మృదువైన కలువ పుష్పంతో మనిషిని పోల్చుతున్నాడు. సుదీర్ఘకాలం జీవించడం లేదా భారీ శరీర ఆకారం కలిగి ఉండడం వల్ల మనిషి గొప్పవాడు లేదా గౌరవనీయుడు కాలేడు అంటున్నాడు.

అతని కార్యాల వలన అతని గొప్పతనం విశ్లేషించబడుతుంది. ఒక మనిషి గొప్పవాడు లేదా గొప్ప పరిపూర్ణ జీవితం కొరకు కలువ పుష్పం లాంటి సార్థకమైన అందమైన జీవితంను కొనసాగించాలని కవి సలహా ఇస్తున్నాడు. అలా మనిషిని గొప్ప గౌరవవంతుడిని చేయటం మీదనే కావ్యం దృష్టంతా ఉంది. ఎంతోకొంత ఉపకారం చేస్తేనే మనిషి జీవితం సార్థకమౌతుంది. లేదంటే మనిషి జీవితానికి అర్థంలేదు.

TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature

వివరణ :
అర్థవంతమైన జీవితమే ఆదర్శవంతమైందని నేచర్ ద్వారా జాన్సన్ వివరిస్తున్నాడు.

Paragraph Questions & Answers (Section – A, Q.No. 4, Marks: 4)

Question 1.
Discuss the aptness of the title “The Noble Nature” to the poem. *(Imp, Model Paper)
Answer:
The Noble Nature is one of the most popular lyrics of Ben Jonson. He is regarded as one of the major dramatists and poets of the Seventeenth Century. In this poem, he seeks to explain what makes man’s life noble. The core meaning of the poem centres around this single idea. In just ten lines of the poem, the poet says twice. Man better be; and life perfect be.
TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature 2
And to make Man better or life perfect, he advises one to lead a meaningful life of light-like that of a lily. Thus, the focus of the poem is clearly on making Man better. To explain this point, examples of the oak and the lily are used. Hence, the title, The Noble Nature, suits the poem well. The poem says leading meaningful life even for a short while is worthier than leading a long life with neither charm nor value.

బెన్ జాన్సన్ గారి ప్రసిద్ధిచెందిన గేయాలలో ‘The Noble Nature’ గేయం ఒకటి. ఇతడు 17వ శతాబ్దంలో ప్రసిద్ధిగాంచిన నాటకకర్త మరియు కవి. ప్రస్తుత పద్యంలో, మనిషి జీవితం గొప్పదిగా చేసేది ఏమిటో వివరించటానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ ఒక్క విషయం చుట్టూనే ప్రధాన అర్థం కేంద్రీకృతమైంది. పది లైన్లులో కవి రెండు సార్లు ‘Man better be; and life perfect be’ అని చెప్తున్నాడు. మనిషి గొప్పవాడు లేదా పరిపూర్ణ జీవితం కావాలంటే వ్యక్తి కలువ పుష్పం లాంటి వెలుగుతో, అందరితో సార్థకమైన జీవితాన్ని కొనసాగించాలని కవి సలహా ఇస్తున్నాడు.

అలా, మనిషిని గౌరవనీయుడిని చేయటంపైన ఈ పద్యం దృష్టి ఉంది. ఈ విషయాన్ని వివరించటానికి, పెద్ద సింధూర వృక్షం మరియు సుకుమారమైన కలువ పుష్పాలు ఉదాహరణకు ఉపయోగించాడు. కావున ‘The Nobel Nature’ అను పేరు ఈ పద్యానికి సరిగ్గా సరిపోతుంది. క్షణకాలమైనా, సార్థకమైన జీవితం గడపటం అనేది ఎలాంటి విలువ మరియు గుర్తింపు లేని సుదీర్ఘ జీవితం కంటే విలువైంది అని కవి చెప్తున్నాడు.

TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature

Question 2.
Bulk does not make man better be. How does the Oak support this stand ?
Answer:
Ben Jonson’s poem, The Noble Nature is one of his most popular lyrics. This short poem discusses a noble thought in simple style. That profound message is expressed clearly with the help of example and images from nature. It highlights the point that equality counts more than quantity.

Growing physically like a bulky tree or living long like a sturdy Oak does not make a man noble being. The huge, strong a and aged Oak will soon become a lifelesss, ‘dry’ and withered piece of log. So too will be the fate of a man who is only blessed with long life and physical and material well being. Therefore, mere bulk doesn’t make Man better be. Matter matters, not the magnitude.

బెన్ జాన్సన్ ప్రసిద్ధిగాంచిన గేయాలలో ‘The Noble Nature’ కూడా ఒకటి ఈ చిన్న పద్యం గొప్ప ఆలోచనను చక్కటి శైలిలో వివరిస్తుంది. చక్కటి గూఢమైన సందేశాన్ని ప్రకృతిలోని చెట్లను, పుష్పములను ఉదాహరణలుగా చూపించి తెలియజేస్తుంది. పరిమాణం కాదు మనిషికి గుణం గొప్పదని తెలియజేస్తుంది. సింధూర వృక్షంలాగా పెద్ద మానులాగా పెరిగి 300 సం||లు నివసించితే మనిషి గొప్ప వ్యక్తి కాడు.

బలమైన, ఎత్తైన మరియు తరాల సింధూర మ్రాను ఎండిపోతుంది ఎలాంటి గుర్తింపు లేకుండా. అలానే, మనిషి కూడా కనుమరుగౌతాడు కేవలం సంపద, శరీర సౌష్టవం, సుదీర్ఘ జీవితం కలిగి ఉంటే. ఎలా బ్రతికామన్నది ముఖ్యం ఎంతకాలం కాదు. కావున, పరిమాణం మనిషిని గుణవంతుణ్ణి చేయదు. అతని వ్యక్తిత్వం అతన్ని గొప్పవాడ్ని చేస్తుంది.

Question 3.
Explain with example of the Lily that size matters not but beauty counts a lot.
Answer:
Ben Jonson, in the poem, The Noble Nature talks about what makes a man noble. He compares man to a sturdy Oak and to a delicate Lily in order to explain this point. The Lily plant has a short life. It blooms in May and is very beautiful.

Although, the flower has the span of a day and dies by nightfall it spreads beauty and delight in that short period the poet feels that a meaningful life like the Lily flower, though short, is what makes a man noble and even though a man’s life is short it can be perfect life. People will continue to talk good about him even after he is gone. This is what actually makes a man noble, thus, beauty counts a lot.
TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature 3
ఒక వ్యక్తిని ఏ విషయం గొప్పవాడిగా కీర్తింపజేస్తుంది ఈ పద్యంలో చెప్తున్నాడు. ఈ విషయాన్ని వివరించడానికి మనిషిని సింధూర మ్రానుతో మరియు సుకుమార కలువ పుష్పంతో పోల్చుతున్నాడు. కలువ జీవితం క్షణికమైంది. ఇది ‘మే’ నెలలో వికసించుతుంది. ఇది చాలా అందమైంది. ఒక్కరోజు మాత్రమే వికసించి అస్తమించినప్పటికీ, ఇది అందాన్ని మరియు ఆనందాన్ని అందిస్తుంది.

TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature

క్షణకాలమైనప్పటికీ కలువ పువ్వు లాంటి సార్థకమైన జీవితం వ్యక్తిని గొప్పవాడిని చేస్తుంది. మనిషి జీవితం కొంతకాలమైన అలాంటి సార్థకమైన జీవితం అతడిని పరిపూర్ణుడిని చేస్తుంది. అతని మరణానంతరం సహితం జనం అతని మంచి గుణాన్ని గురించి చెప్పుకుంటారు. ఈలాంటి మంచి పనుల వలన, వ్యక్తిత్వం వలన మనిషి గొప్పవాడౌతాడు. కావున అందమైన పనులు చిన్నవైనా చాలా గొప్పవి.

The Nobel Nature Summary in English

TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature 1

Ben Jonson is regarded as one of the major dramatists and poets of the Seventeenth Century. His poem The Noble Nature, one of his most popular lyrics. This poem is about the importance of noble nature in one’s life. The core meaning of the poem centres around this single idea. He compares man to a sturdy oak and to a delicate lily in order to explain this point.

Growing physically like a bulky tree or living long like a sturdy oak does not make a man noble being. The huge, strong and aged oak will soon become a lifeless, ‘dry’ and withered piece of log. So too will be the fate of a man who is only blessed with physical and material assets and long life. He will not remain for long in the minds of people around him.

However, the lily plant has a short life. It blooms in May and is very beautiful and perfect. It gives us light and happiness. It’s life is meaningful. Although it has the span of a day and withers by the night, it is appreciated for its beauty and delight in that short period.

Similarly if man does good during the short period he lives people will continue to talk good about him even after he is gone. This is what actually makes a man noble. The poet feels that a meaningful life like the lily flower, though short, is what makes a man noble. If means that a person’s life is meaningful only if he does some acts of benefaction. Otherwise his life is meaningless.

The Nobel Nature Summary in Telugu

17వ శతాబ్దపు నాటక కర్తలు మరియు కథలలో ఒక ప్రముఖుడిగా బెన్ జాన్సన్ పేరుగాంచాడు. ఇతని “The Noble Nature” అను గేయం ఇతని ప్రముఖ కావ్యాల్లో ఒకటి. వ్యక్తి జీవితంలోని గొప్పతనం యొక్క ప్రాముఖ్యాన్ని గురించి ఈ పద్యం తెలుపుతుంది. ఈ పద్యం యొక్క ప్రధాన అర్థం ఈ ఒక్క విషయంలో కేంద్రీకృతమైంది. ఈ విషయాన్ని ‘వివరించటానికి మనిషిని పెద్ద సింధూర వృక్షంతోను మరియు నాజూకైన కలువ పువ్వుతోను కవి పోల్చుతున్నాడు.

సింధూర మ్రాను లాగ ఎత్తుగా పెరగటం లేదా సుదీర్ఘకాలం జీవించటం వలన మనిషి గొప్ప గౌరవంతుడు కాడు. పెద్ద పరిమాణం, బలం మరియు ఎక్కువకాలం జీవించిన సింధూరమ్రాను చివరికి ఎండిపోయి, శుష్కించి పోతుంది. ఒక నరికివేసిన మొద్దులాగా అవుతుంది. అలాగే భౌతిక రూపం, సంపద, మరియు సుదీర్ఘ జీవనం కలిగి మనిషి పాత్ర కూడా అంతే. తన చుట్టూ ఉన్న జనం అతన్ని గుర్తుంచుకోరు.

TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature

ఏదిఏమైనప్పటికీ, కలువపువ్వు క్షణకాలం బ్రతుకుతుంది. ఇది మే నెలలో వికసిస్తుంది. ఇది చాలా అందమైంది. మనకు కాంతిని మరియు ఆనందాన్నిస్తుంది. అలా దీని జీవితం సార్ధకమైంది. ఒక్క రోజు ఆయుష్షు కలిగినప్పటికీ దీని అందం మరియు ఆనందింపజేయటం వలన ఇది మెచ్చుకోబడుతుంది.

అదే విధంగా, మనిషి కూడా తన జీవితంలో మంచి పనులు చేస్తే, జనం అతని మంచి గురించి అతని మరణానంతరం సహితం మాట్లాడుకుంటారు. ఈ లక్షణమే మనిషిని గొప్పవాణ్ణిచేస్తుంది. కలువ పువ్వులాంటి సార్థకమైన జీవితం క్షణకాలమైనా సరే మనిషిని గొప్ప గౌరవనీయుణ్ణి చేస్తుంది. మనిషి జీవితం సార్థకమయ్యేది అతను ఏదైనా మంచి పనులు చేస్తేనే. లేదంటే మనిషి జీవితానికి అర్థంలేదు.

The Nobel Nature Summary in Hindi

सोलवीं सदी के विख्यात् नाटककार एंव कवि थे, बेन जानसन । प्रस्तुत पाठथांश ‘महोन्नत उदार स्वभाव’ ‘The Noble Nature’ लयेबरध गीत है, जिसमें अल्प शष्टों में अनल्प अर्थ निहित है । इसमें केवल 10 पंक्तियों में 72 शब्द रात्र हैं । लेकिन इसमें जो संदेश है । वह विश्वमानव की पुरोगति को दूसरी तरफ़ मोड़कर नए स्वर्ण लोक में ले जा सकाता है। सार्थकता, अच्छाई और खुशी को बढ़ानेवाला जीवन चाहे जितना अल्प, कालिक है, वह महोन्नत – उदात्त जीवन ही है । इसके लिए प्रथत्न करना चाहिए । नाम में महानता नहीं होती, काम में होती है । नाटककार बक बक नहीं कर रहे हैं, अपनी इस राम कहानी को संक्षेप में ‘बाँधना – मासा- ‘लाना’ कहकर समाप्त कर रहे हैं । वे पाठकों को वृक्ष – जगत् में ले जाकर अपना संदेश दे रहे हैं ।

जन सज्जन होने का मतलब पेड़ की तरह बढ़ना या मोटा होना नही है, बलूत (ओक) वृक्ष की तरह बढ़ता हुआ आसमान को छूना, तीन सौ साल जीना, सूखकर मुरझाना, मृतकाष्ठ (लॉग) झोना नही है ।

अच्छा जीवन माने लिली फूल की तरह मई में फूलकर चमकर, रात को मुरझाकर झड़ना है । फिरभी सभी जन लिली पौधे को फूल को प्रकाश और आनंद का प्रतीक मानते हैं। छोटे – छोटे परिमाणों में सौंदर्य देखते हैं । लघु विषयों में भी परिपक्व परिपूर्ष जीवन को और जीव को देखते हैं | सार्थकठा से रहना ही आदर्श है। अपरिमितता मे रहना आदर्श नही होता। आनंद देना ही महोन्नत उदार स्वभाव है ।

Meanings and Explanations

bulk (n) / balk / (బల్క) (monosyllabic) : size, quantity (usually large), mass, పరిమాణం, అధికభాగం , आकार
doth (v) / dp0 / (డోత్) (monosyllabic) : old form of ‘does’, ముగించుట , आदि की मादा
long (లాగ్) : measuring a great distance from end to end, పొడవైన , लंभा
oak (n) / Juk / (అఉక్) (monosyllabic) : a large tree with hard wood, పెద్ద సింధుర మ్రాను, शाहबलूत
log (n) / log / (లోగ్) (monosyllabic) : the trunk of a dead tree, మొద్దు నరికిన దుంగ , लड्डा

TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature

dry : not wet or moist, ఎండిన, తడిలేని , सूखना
bald (adj) / bo:ld / (బోల్డ్) (monosyllabic) : the trunk of a dead tree : without leaves, flowers etc : ఆకులు, పూలు లేని మోడు, पुष्य
sere (adj) / sla(r) / (సిఅ(ర్)) (monosyllabic) : without moisture, dry : ఎండిపోయిన, सूखना
proportions / pro’po:fnz / (ప్రపో(ర్)షన్) (trisyllabic) : quantities; measures : భాగాలు, పరిమాణాలు, परिमाण
measures (n) / mey (r) / (మెజ(ర్)) (disyllabic): sizes ; కొలతలు, పరిమాణాలు, नापना
short : not tall ; not long : పొట్టి, చిన్నది, छोटा
perfect : complete, faultless : పరిపూర్ణమైన, లోపంలేని, पूर्ण करना

TS 6th Class Science 10th Lesson Questions and Answers Telangana – Changes Around Us

TS Board 6th Class Science Guide Telangana 10th Lesson Changes Around Us Textbook Questions and Answers.

Changes Around Us – TS 6th Class Science 10th Lesson Questions and Answers Telangana

Improve Your Learning

Question 1.
Is the change of ice into water a temporary or permanent change ? Explain. (Conceptual Understanding) 4 M
Answer:
Explanation : The change of ice into water is a temporary change. It is not a permanent change. It is only a physical change.

Reason: Here, the cause of change is ‘heat’. When we remove the cause of change (heat) the process gets reversed. It means, when we cool water (or remove heat from water), it changes again to ice. So it is a temporary change.
TS 6th Class Science 10th Lesson Questions and Answers Telangana - Changes Around Us 1

Question 2.
How do you know that rusting of iron is a change ?
Answer:
When iron rusts (Conceptual Understanding) 4 M

  1. its colour changes. The dull greyish iron changes to reddish brown
  2. the smooth metal surface becomes quite rough
  3. particles of rusted metal detach from the metal surface. These are all the physical changes we observe, when iron rusts.

TS 6th Class Science 10th Lesson Questions and Answers Telangana - Changes Around Us

Question 3.
If a raw egg is boiled in water, what changes do you notice in it ? If you are given two eggs, can you determine which one is boiled and which one is not ? Explain. (Conceptual Understanding) 2 M
Answer:
Raw egg possesses more density than boiled egg. When raw egg is boiled, naturally its density decreases. When we shake a raw egg, we feel the fluid moving inside.

Question 4.
Name five changes you notice in your surroundings. Classify them as natural or man-made changes. (Conceptual Understanding) 2 M
Answer:

ChangeType of change
1) Fall off leaves from a treeNatural change
2) Colour of sky changesNatural change
3) Flowers bloom and wither awayNatural change
4) Colour of leaves changesNatural change
5) Curdling of milkMan -made change

Question 5.
Choose incorrect statements from the following and rewrite them correctly: (Conceptual Understanding) 4 M
Answer:

Given statementCorrected statements
a) The coldness in air during winter is a permanent changeThe coldness in air during winter is a temporary change.
b) Boiled egg is a temporary change.Boiled egg is a permanent change
c) There is a cause for every change.The statement is correct.
d) An electric bulb going ON and OFF is a permanent change.An electric bulb going on and off is a temporary change.
e) There is a change in state when ice-cream melts.The statement is correct. It is a temporary change in its physical state. Solid state   liquid state.

Question 6.
Some changes are listed below, classify them as temporary and permanent. (Conceptual Understanding) 4 M
Answer:

Given changeType of change
a) Souring of curdPermanent change
b) Ripening of orangesPermanent change
c) The sawing of a piece of wood into twoPermanent change
d) Cooking of foodPermanent change
e) Heating of milkPermanent change

TS 6th Class Science 10th Lesson Questions and Answers Telangana - Changes Around Us

Question 7.
We use clay to make idols. Can we get back clay from the idol ? What type of change is it ? Explain. (Conceptual Understanding) 2 M
Answer:
If only clay is used to make idols, we can get back clay from the idol. The idol is soaked in water for sometime. Again we get back the clay. So it is a temporary change.
Eg : Ganapathi idol is made from clay.

Question 8.
Carpenter made a chair using wood, what type of change is it ? (Conceptual Understanding) 2 M
Answer:
From a raw wood, carpenter makes a chair. The raw wood is often cut, chiselled and polished for the purpose. So from this finished wood, we cannot get back the original raw wood. So the change is a permanent change.

Question 9.
Rafi said that “Flour from Rice / Wheat is a man made change.” He wants to make a list of examples of this kind of change, help him to expand his (Asking questions and making hypothesis) 2M
Answer:
Some man-made changes:

  1. Flour from rice
  2. Juice from lemons
  3. Cream from milk
  4. Butter milk from curd.
  5. Tea from tea leaves.
  6. To peel an orange.

TS 6th Class Science 10th Lesson Questions and Answers Telangana - Changes Around Us

Question 10.
Select a plant in your house / school observe and record changes keeping in view height of plant, number and size of leaves and flowers etc., over a period of 2 months. Display your observations. (Experimentation and Field investigation) 2M
Answer:
I have observed the guava plant. It grew in size and height. The number of leaves increased in the period of two months and their size also increased.

Question 11.
What will happen if a decorative colour paper is dipped in water ? Predict the possible changes. Verify your predictions by doing experiments and write down the steps of the process. (Experimentation and Field investigation)2 M
Answer:

  1. The paper is dipped in water.
  2. The colour fades.
  3. The paper loses stiffness and turns to a pulp.
  4. The paper becomes useless.

Question 12.
Write various steps involved in making ghee from milk, what changes do you find, during this process ? (Experimentation andfield investigation) 8M
Answer:
Production of ghee from milk involves various stages.
Stage 1 : Milk changing to curd: (Curdling of milk) : Milk is heated gently to boiling temperature and allowed to cool. To the warm milk, a very small quantity of curd is added and stirred well. The vessel is kept undisturbed for a few hours. Then a white semi-solid mass appears in the vessel. It is curd.

Observed change:
There is a slight difference in colour from milk to curd. Milk is slightly sweet and curd is slightly sour in taste.

Stage 2 : Butter from curd: Sufficient water is added to the curd. It is well churned. Butter forms and floats over the liquid. The butter is hand-picked.

Observed change : Butter is a semi-solid mass. It separates from the butter milk.

Stage 3 : Butter to ghee: The butter is heated on a low flame for sometime. When we notice the smell of ghee we stop further heating. Ghee is formed.

Change observed : Semi solid butter is changed into ghee in liquid state which has a characteristic fragrance on heating.

Stage 4 : Separation of ghee from the residue: The mass is allowed to cool. Then it is filtered using a clean cloth. Residue is left over in the cloth. Ghee is collected in the vessel. All the changes involved in making ghee from milk are ermanent changes. They are all irreversible.

TS 6th Class Science 10th Lesson Questions and Answers Telangana - Changes Around Us

Question 13.
Observe the following table and answer the questions given below. (Information skills and projects) 8 M
Answer:

PlaceMonthTemperatureRainfallSunriseSunset
RentachinatalaMin.Max.
January21°C27°C2.41 mm6.5017.12
April39°C47°C0.01 mm6.1117.47
August24°C34°C39.12 mm6.3717.31

i) Which month had maximum rainfall ?
Answer:
August.

ii) Which season occurs in the month of August ? How can you support your answer ?
Ans.
Rainy season. The rainfall is heavy (39.12 mm) in the month of August.

iii) In which month is the duration of day minimum ? What could be the reason for this ?
Answer:
In the month of January, the duration of day is minimum (17.12 – 6.50 = 10.22 hrs.) It is winter season. The sun rises late and sets earlier.

iv) Do you find any relation between sunrise and seasons ?
Answer:
Summer (April): Sun rises quite early.
Rainy season (August): Sun rises early.
Winter season (January): Sun rises quite late

v) What changes can you identify from January to August ?
Answer:
The following changes are identified from January to August.

  1. Day temperature : Minimum in January, maximum in April and again fall in August to a lower value.
  2. Rainfall: Very very poor in January, almost nil in April and maximum in August.
  3. Length of the day : Increases from January to April and then decreases in August. It is minimum in January and maximum in April.
  4. Change of seasons:
    January – Winter season
    April – Summer season
    August – Rainy season
    Thus the seasons change from January to August.

Question 14.
Farha wondered “How could it be possible for the nature to bring changes in seasons periodically”. Can you add some changes like this. How will you explain them ? (Appreciation and Aesthetic sense / values) 2 M
Answer:
It is wonderful to see so many periodic changes in nature. A few of them are :

  1. A day returns periodically after 24 hours.
  2. The week returns periodically after 7 days.
  3. A month returns periodically after 30 days.
  4. A year returns periodically after 365 days and so on.
  5. Trees getting new leaves, shedding off ripen leaves, flowering, fruiting is another seasonal change.

TS 6th Class Science 10th Lesson Questions and Answers Telangana - Changes Around Us

Question 15.
Sita wondered and felt very happy to see the beauty of the fields and insects like twinkling beetles (Arudra) during rainy season in their village. Can you list some such changes which make you wonder and feel happy? (Application to daily life concern to biodiversity) 2M
Answer:
In rainy season, the lakes and ponds overflow with water. There is plenty of water every where. The fields are green and trees are loaded with fruits. Everywhere there is plenty of food available. The buffaloes, oxes, goats find enough grass to fill their bellies. Every living being feels satisfied. There is no dearth of food.

TS 6th Class Science 10th Lesson Notes – Changes Around Us

  • Some changes take place naturally and some changes are initiated by human beings.
  • Some of the naturally occurring changes are : Change of seasons, sunrise and sunset, ripening of fruits, blooming of flowers, sprouting of seeds, withering of trees etc.
  • Many natural changes take place in our body. Nails grow, hair grows, body – weight changes, etc.
  • Classification of changes is also made based on various indicators of change like the change in state, change in colour, change in size, change in taste etc.
  • Changes : In our daily life we notice many changes around us.
  • Change in state : A change that occurs physically is called change in state.
    TS 6th Class Science 10th Lesson Questions and Answers Telangana - Changes Around Us 1
  • Duration of day : Duration of day changes from season to season. Eg: In winter duration of the days shorter and in summer duration of days are longer.
  • Indicators of change : There will be many indicators of changes to show that a change takes place.
  • Slow/fast change : Changes can be classified in many ways. Slow change. Eg: Rusting of iron Fast change : Electric bulb ON and OFF
  • Temporary/ Permanent Change : A change that can easily be reversed is a temporary change. : Eg : water ⇌ice,
    A change which can not be reversed is a permanent change. Eg : milk → curd
  • Natural / man – made change : A change that takes place naturally is called natural change. Eg : change of seasons, growth of plant. A change which is initiated by human beings is called man-made change. Eg: rice to cooked rice.

TS 6th Class Hindi Guide 10th Lesson चुक्की और जब्बार

Telangana SCERT 6th Class Hindi Study Material Telangana Pdf 10th Lesson चुक्की और जब्बार Textbook Questions and Answers.

TS 6th Class Hindi 10th Lesson Questions and Answers Telangana चुक्की और जब्बार

सुनो-बोलो :

प्रश्न 1.
छुट्टी के दिन तुम क्या-क्या करते हो ?
उत्तर :
छुट्टी के दिन मैं देर से उठता हूँ। कुछ देर के लिए पढता हूँ। टी.वी. देखता हूँ। माँ की सहायता करता हूँ और खूब खेलता हूँ।

प्रश्न 2.
रामू काका ने रस्सी से झूला बाँधा। रस्सी से और क्या-क्या कर सकते हैं ?
उत्तर :
रस्सी पर कपडे सुखा सकते हैं। पर्वत पर चढ़ सकते हैं। लकडियों को बाँध सकते हैं। कुएँ से पानी निकाल सकते हैं।

TS 6th Class Hindi Guide 10th Lesson चुक्की और जब्बार

प्रश्न 3.
खेलते समय यदि तुम्हारे साथी को चोट लग जाये, तो तुम क्या करोगे ?
उत्तर :
खेलते समय यदि मेंरे साथी को चोट लगी तो पहले मैं चोट के स्थान पर कपडा बाँध दूँगा फिर डाँक्टर के पास ले जाऊँगा।

पढ़ो :

प्रश्न 1.
बच्चे क्या खाना चाहते थे ?
उत्तर :
बच्चे आम खाना चाहते थे ।

प्रश्न 2.
झूले से कौन गिर गयी ?
उत्तर :
चुक्की झूले से गिर गई ।

अ. नीचे दिये गये द्वित्वाक्षर पाठ में पहचानिए और उन पर ‘◯’ चुक्की और जब्बार लगाइए।

TS 6th Class Hindi Guide 10th Lesson चुक्की और जब्बार 1
उत्तर :
TS 6th Class Hindi Guide 10th Lesson चुक्की और जब्बार 2

आ. पाठ में आये द्वित्वाक्षर वाले शब्द तालिका में सही जगह लिखो।

TS 6th Class Hindi Guide 10th Lesson चुक्की और जब्बार 3
उत्तर :
TS 6th Class Hindi Guide 10th Lesson चुक्की और जब्बार 4
TS 6th Class Hindi Guide 10th Lesson चुक्की और जब्बार 10

इ. नीचे दिये गये शब्द पढ़ो।

TS 6th Class Hindi Guide 10th Lesson चुक्की और जब्बार 5

जानते हो! ये सारे शब्द एक जैसे दो वेणों के मेल से बने हैं। इन्हें दुवित्वाक्षर कहते हैं।

TS 6th Class Hindi Guide 10th Lesson चुक्की और जब्बार

ई. वाक्य पढ़ो। कक्षा सें सुनाओ।

बच्चे दिल के सच्चे। दिल के सच्चे बच्चे। सच्चे दिल के बच्चे।

लिखो :

अ. सुंदर अक्षरों में लिखो।

TS 6th Class Hindi Guide 10th Lesson चुक्की और जब्बार 6

आ. इन प्रश्नों के उत्तर लिखो।

प्रश्न 1.
रामू काका ने क्या किया?
उत्तर :
रम् काका आम के पेड पर चढकर डाली जोर से हिलाने लगे।

प्रश्न 2.
जब्बार ने चुक्की को क्या समझाया ?
उत्तर :
जब्दार ने चुक्की को समझाया कि खेल में चोट लगती ही रहती है। बहाटुग बच्चे गेते नहीं।

TS 6th Class Hindi Guide 10th Lesson चुक्की और जब्बार

प्रश्न 3.
तुम किस दिन ज़्यादा खेलते हो ?
उत्तर :
मैं हर दिन शाम को पाठशाला से आने के बाद खेलता हूँ।

इ. नीचे दिये गये वर्ण मिलाकर नये शब्द बनाओ। लिखो।

TS 6th Class Hindi Guide 10th Lesson चुक्की और जब्बार 7

उत्तर :
TS 6th Class Hindi Guide 10th Lesson चुक्की और जब्बार 8

ई. चित्र देखकर अपने विचार लिखो।

TS 6th Class Hindi Guide 10th Lesson चुक्की और जब्बार 9
उत्तर :
सुबह हुआ। गवि उठकर बिस्तर पर बैठ गया। वह खिडकी से बाहर टेखने लगा। बाहर सूग्ज और पेडे को देखने लगा ।

TS 6th Class Hindi Guide 10th Lesson चुक्की और जब्बार

अभ्यासकार्य :

1. निम्नलिखित गद्यांश का वाचन कीजिए। प्रश्नों के जवाब दीजिए।
క్రింది కవిత్వం చదవండి. ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
कल हम मेला देखने जाएँगे। मेले में क्या होता है? इसमें दुकानें लगती हैं। दुकानों में क्या मिलता है? दुकानों में खिलौने मिलते हैं। गुब्बारे मिलते हैं। मिठाईयाँ मिलती हैं। मेले में बडे-बडे झूले होते हैं। मेले में हाथी, ऊँट, भालू और बंदर भी होते हैं।

प्रश्न 1.
कल हम क्या देखने जाएँगे?
1) मेला
2) उत्सव
3) सिनेमा
उत्तर :
1) मेला

प्रश्न 2.
इसमें क्या लगती हैं?
1) सिनेमा
2) भीड
3) दुकानें
उत्तर :
3) दुकानें

TS 6th Class Hindi Guide 10th Lesson चुक्की और जब्बार

प्रश्न 3.
दुकानों में क्या मिलता है?
1) चीजें
2) खिलौन
3) पैसे
उत्तर :
2) खिलौन

प्रश्न 4.
मेले में बडे-बडे क्या होते हैं?
1) झूले
2) भीड
3) लोग
उत्तर :
1) झूले

प्रश्न 5.
मेले में हाथी, ऊँट, भालू और क्या होते हैं?
1) मिठाईयाँ
2) बंदर
3) पानी
उत्तर :
2) बंदर

TS 6th Class Hindi Guide 10th Lesson चुक्की और जब्बार

सारांश-సారాంశం :

छुट्टी का दिन था।
बच्चे आम खाना चाहते थे।
मुन्नी सभी बच्चों के साथ
अपने रामू काका के घर गयी।
बे बच्चों को बहुत चाहते थे।

భావం : అది సెలవుదినం. ఏిల్లలు మామిడి పండ్లు తినాలనుకున్నారు. మున్ని అందరు పిల్లలతో తన బాబాయి రాము ఇంటికి వెళ్ళింది. అతన్కి పిల్లలంటే చాలా ఇష్టం.

It was a holiday. Children planned to eat mangoes. Munni went to her uncle Ramu’s place with her friends. He likes children very much.

रामू काका आम के पेड़ पर चढ गया।
डाली जोर से हिलाने लगा।
टप-टप आम गिर पड़े।
बच्चे खुशी से चिल्ला उटे –
“बाह! बाह! कितने सारे आम गिरे हैं।”

భావం : రాము బాబాయి మామిడి చెట్లుపైకి ఎక్కాడు. కొమ్మ వేగంగా ఊగుతోంది. టపటపమని మామిడి పళ్ళర రాలి పడాయి. పిల్లలు సంతోషంతో అరిచారు. బలే! బలే ! ఎన్ని మామిడిపళ్ళు పడ్డాయో.

Uncle Ram climbed mango tree. Branch was moving very fast. Magoes (fell down) dropped one after another. Children shouted with happiness. ‘Oh’ so many mangoes fell down.

TS 6th Class Hindi Guide 10th Lesson चुक्की और जब्बार

निम्मी ने छप्पर से रस्सी उतारी।
रामू काका ने रस्सी पेड़ की डाली
से बाँध दी।
बच्चे झूला झूलने लगे। चुक्की झूले से
गिर गयी और रोने लगी।
ज्ब्बार बोला
‘खेल में चोट तो लगती ही रहती है।
बहादुर बच्चे रोते नहीं।

భావం : నిమ్మి చూరు నుండి తాడు దింపింది. రాము బాబాయి తాడును చెట్టు కొమ్మకు కట్టాడు. పిల్లలు ఊయల ఊగడం మొదలు పెట్టారు. చుక్కీ ఊయలలోంచి కింద పడిపోయి ఏడవసాగింది. జబ్బ్ర అన్నాడు ఆటల్లో దెబ్బలు తగులుతూనే ఉంటాయి. ధైర్యం గల పిల్లలు ఏడవరు.

Nimmi brought rope from thatched roof. Ram tied this rope to branch of a tree. Children started swinging. Chukki fell down from the swing started crying. Zabbar consoled her saying that it is very common to get hurt while playing. So brave children never cry for such things.

शब्दार्थ (అర్ధములు) (Meanings) :

TS 6th Class Hindi Guide 10th Lesson चुक्की और जब्बार 11

वचन :

एक बचन :
छुटटी – సెలవు
बच्चा – పిల్లవాడు –
पेड़ – చెట్ట
ग्सी – తాడు
आम – మామిడిపండు

बहुबचन :
छुटिटयाँ – సెలవులు
बच्चे – పిల్లలు
पेड़ – చెట్లు
रस्सियाँ – తాళ్ళు
आम – మామిడి పళ్ళు

TS 6th Class Hindi Guide 10th Lesson चुक्की और जब्बार

विलोम शब्द :

बहुत – ఎక్కువ × कम – తక్కువ
गोना – ఏడ్చుట × हँसना – నవ్వుట
चढ़ना – ఎక్కుట × उतर्ना – దిగుట
गिग्ना – పడుట × उठना – లేచుట
खुशी – సంతోషం × गम / दु:ख – దుఃఖం
बहादुर – ధైర్యవంతుడు × कायर / डरपोंक – పిరికివాడు

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 1st Poem The Dinner Party Textbook Questions and Answers.

TS Inter 1st Year Telugu Study Material 1st Poem విద్యాలక్ష్యం

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
ద్రోణార్జునుల గురుశిష్య సంబంధాన్ని చర్చించండి?
జవాబు:
భరద్వాజ మహర్షి పుత్రుడైన ద్రోణాచార్యుడు గొప్ప అస్త్ర విద్యా నిపుణుడు. కౌరవులకు, పాండవులకు విలువద్య నేర్పడానికి భీష్ముడు ద్రోణాచార్యుడిని రాజగురువు గా నియమించాడు. దివ్యాస్త్రాలతో సహా అన్నిరకాల అస్త్ర, శస్త్ర యుద్ధ విద్యలలో ఆరితేరినవాడు ద్రోణుడు. అర్జునుడు అతని ప్రియ విద్యార్ధి. ద్రోణుడికి అర్జునుని కన్నా ప్రియమైనవారు ఎవరన్నా ఉంటే అది అతని కుమారుడు అశ్వత్థామ మాత్రమే.

మహాభారత ఇతిహాసంలో ఉత్తమ గురువుగా ద్రోణాచార్యుడు, మరియు ఉత్తమ విద్యార్ధిగా అర్జునుడు గురుశిష్య బంధానికి తార్కాణంగా నిలిచి పోయారు. రాజకుమారులందరికీ గురువుగా ఉన్న ద్రోణుడు అర్జునుడు ఒక అసాధారణ విద్యార్ధి అని గమనించాడు. విద్యార్ధులందరికీ పెట్టిన తొలి పరీక్షలోనే అర్జునుడిలోని అపారమైన సంకల్పం మరియు ఏకాగ్రతను గమనించాడు ద్రోణుడు. ఒక రోజు గొప్ప యోధుడవుతాడని గ్రహించాడు. ద్రోణాచార్యుడు పెట్టిన అన్ని పరీక్షలలోను అర్జునుడు అందరినీ మించిపోయాడు.

అర్జునుడు అపారమైన “గురుభక్తితో ద్రోణుడిని సేవించాడు. భీష్మునిచే ఆచార్యునిగా నియమింపబడగానే రాకుమారులందరినీ చూసి నా దగ్గర అస్త్ర విద్యలు నేర్చి నా కోరికమీలో ఎవ్వడు తీర్చగలడు? అని అడుగగా కౌరవులందరూ పెడమొగం పెట్టగా, అర్జునుడు నేను తీరుస్తానని ముందుకు వచ్చాడు. అలా ముందుకు వచ్చిన అర్జునుని అపారప్రేమతో కౌగలించుకున్నాడు. అలాగే ద్రోణుని సరస్సులో మొసలి పట్టుకున్న సమయంలో అర్జునుడే ద్రోణుని మొసలి నుంచి విడిపించి తన ప్రతిభను చాటుకున్నాడు.

చీకటిలో బాణాలు వేయడం అభ్యసిస్తున్నా అర్జునుని చూసి, అస్త్రవిద్యలోని అతని పట్టుదలకి శ్రద్ధకు సంతోషించి నీకంటే విలువిద్యలో అధికులు లేనట్లుగా నేర్పిస్తానన్నాడు ద్రోణుడు అన్నట్లుగానే సకల విద్యాయుద్ధకౌశలాన్ని, అస్త్ర, శస్త్రాలను, దివ్యాస్త్రాలను యుద్ధవ్యూహాలను సంపూర్ణంగా బోధించి ఒకనాటి పరశురాముడు కూడా విలువిద్యలో ఇంతటి వాడు కాడు అనేట్లుగా, అర్జునుని తీర్చిదిద్దాడు.

అర్జునునికన్నా విద్యపట్ల శ్రద్ధ, ఆసక్తి, గురుభక్తి, వినయ కారణంగా ద్రోణుడి ప్రియ శిష్యుడయ్యాడు. బ్రహ్మాస్త్రాన్ని అర్జునునికి ఇచ్చి సాధారణ యోధులకి వ్యతిరేకంగా వాడవద్దని, చెప్పాడు. విలువిద్య కళను నేర్చుకోవటంతో ఉన్న అంకిత భావం అచంచల ఏకాగ్రత కారణంగా గురువు హృదయంలో స్థానం సంపాదించాడు. ద్రోణుడు కూడా తనకున్న విద్యాజ్ఞానాన్నంతటినీ శిష్యులకు ధారపోసాడు. గురుద్రోణాచార్య, శిష్యుడు అర్జునుడు పంచుకున్న బంధం భారత ఇతిహాసంలో ప్రత్యేకంగా నిలిచి పోయింది.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

ప్రశ్న 2.
‘విద్యాలక్ష్యం’ పాఠ్యభాగ సారాంశాన్ని వివరించండి?
జవాబు:
ద్రోణుడు అగ్నివేశుడనే మహాముని వద్ద ధనుర్విద్యా పాఠంగతుడయ్యాడు. అనేక దివ్యాస్త్రాలు పొందాడు. తండ్రి ఆజ్ఞతో కృపాచార్యుని చెల్లెలైన కృపిని వివాహమాడాడు. అశ్వత్థామ అనే కుమారుడిని పొందాడు. ద్రోణుడు పరశురాముని వద్దకు వెళ్ళి వినయంతో తన్న తాను పరిచయం చేసుకుని ధనాన్ని ఆశించి మీ వద్దకు వచ్చాను అని అనగా పరశురాముడు తన వద్దనున్న ధనాన్నంతటినీ వేదజ్ఞానంగల బ్రాహ్మణులకు ఇచ్చివేసానని, తన దగ్గర శరీరం, శస్త్రాస్త్రాలు మాత్రమే ఉన్నాయి అన్నాడు. అప్పుడు ద్రోణుడు ధనాలలో మిక్కిలి శ్రేష్ఠమైనవి శస్త్రాస్త్రములు కాబట్టి వాటిని ప్రసాదించ మనగా పరశురాముడు అనేక దివ్యాస్త్రాలను బోధించాడు.

ఆ విధంగా పరశురాముని వద్ద నుండి యుద్ధవిద్యలు అభ్యసించి ధనాన్ని కోరి తన చిన్ననాటి మిత్రుడయిన ద్రుపదుని వద్దకు వెళ్ళగా ద్రుపదుడు ధన, అధికార గర్వంతో పేదవాడైన ద్రోణుని తీవ్రంగా అవమానపరచాడు. అవమాన భారంతో, కలత చెందిన మనసు కలవాడై, తన భార్య, కుమారుడు, అగ్రిహోత్రం, శిష్యసమేతంగా హస్తినాపురానికి బయలుదేరాడు. ఆ పట్టణం బయట కౌరవ, పాండవులు చెండాట ఆడుతుండగా వాళ్ళాడుతున్న బంగారు బంతి బావిలో పడింది.

ఆకాశంలోని నక్షత్రంలా మెరుస్తున్న ఆ బంతిని బయటకు తీయలేక రాకురులం అలా చూస్తూ ఉన్నారు. ఇంతలో అటువచ్చిన ద్రోణుడు ఆ బంతిని తన బాణము లతో తాడులాగా చేసి బంతిని బయటకు లాగి ఇచ్చాడు. అది చూసిన రాజకుమారు లందరూ ఆశ్చర్యపడి ద్రోణుడిని తీసుకుని వెళ్ళి భీష్మునికి జరిగినదంతా చెప్పారు. భీష్ముడు ద్రోణుడి వివరములడుగగా ద్రోణుడు తన వివరాలన్నీ తెలిపి ద్రుపదుని వలన కలిగిన అవమానం, కుమారుని ఆకలి బాధలు అన్నీ తెలిపాడు.

అది విన్న భీష్ముడు వెదకబోయిన తీగ కాళ్ళకు చుట్టుకున్నట్లు సంతోషించి ద్రోణుని గౌరవించి, ధనదానాలిచ్చి సంతోషపరచాడు. అంతేకాక తన మనమళ్ళ నందరినీ ద్రోణునికి చూపించి, వీరికి గురుత్వం వహించి వీరులుగా తీర్చిదిద్దుమని కోరాడు ద్రోణుడు వారందరినీ శిష్యులుగా స్వీకరించాడు.

అర్జునుడు శస్త్రాస్త్ర విద్యలలో అధికుడై వినయంతో ఎప్పుడూ గురుపూజ చేస్తూ ద్రోణుణ్ణి సంతోషపరచాడు. అస్త్రవిద్యలో అర్జునునికి గల పట్టుదలకి సంతోషించి అతనికంటే విలువిద్యలే అధికులు లేరు అన్నట్లుగా విద్య నేర్పిస్తానని వాగ్దానం చేసాడు. ద్రోణుడు కూడా అర్జునునికి అన్ని రకాల యుద్ధవ్యూహాలు, అస్త్ర, శస్త్రాలు సర్వము బోధించాడు. ఒకనాటి పరశురాముడు కూడా ఇంటివాడు కాదు అన్నట్లుగా అర్జునునికి విద్య నేర్పించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

ద్రోణుని వలన శస్త్రాస్త్ర విద్యాబోధనను పొందటంలో రాజకుమారులు అంతా సమానమే అయినా అర్జునుడు విశేషంగా సాధన చేసి సర్వశ్రేష్ఠుడయ్యాడు. రాజకుమారుల నైపుణ్యం తెలుసుకోవటం కోసం చెట్టు చివరన పక్షిబొమ్మను ఉంచి విద్యార్ధుల ఏకాగ్రతను ద్రోణుడు పరీక్షించగా అందరూ విఫలమవ్వగా అర్జునుడు తన ఏకాగ్రతతో లక్ష్యాన్ని భేదించాడు.

తరువాత మరొకసారి ద్రోణుడు సరస్సులో స్నానం చేస్తుండగా ఒక మొసలి వచ్చి ద్రోణుని కాలును పట్టుకోగా తాను సమర్థుడై ఉండి కూడా శిష్యుల నైపుణ్యం పరీక్షించదలచి రాకుమారులను కాపాడమని కోరాడు. వారంతా విడిపించలేక దిక్కుతోచని స్థితిలో ఉండగా మహాపరాక్రమంతో ఐదు బాణాలతో ఆ మొసలిని సంహరించి గురువును కాపాడుకున్నాడు. అర్జునుడు. సంతోషించిన ద్రోణుడు అర్జునునికి అనేక దివ్యాస్త్రాలు ప్రసాదించాడు అని వైశంపాయనుడు జనమేజయునికి చెప్పాడు.

II. సంగ్రహరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
నన్నయభట్టు గురించి తెలపండి?
జవాబు:
నన్నయ 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థానకవి. ఉభయభాషా కావ్యరచనా శోభితుడు. ఆదికవి, శబ్ధశాసనుడు అనే బిరుదులు కలిగినవాడు. రాజరాజు కోరికపై వ్యాస భారతాన్ని తెలుగులోకి అనువదించాడు. రెండున్నర పర్వముల వరకే నన్నయ్య భారతరచన సాగింది. ఆంధ్రశబ్ధ చింతామణి, ఇంద్రవిజయం, లక్షణసార వంటి ఇతర గ్రంథాలు రచించాడు.

ప్రశ్న 2.
ద్రుపదుడి చేతిలో ద్రోణుడు ఏ విధంగా భంగపడ్డాడు?
జవాబు:
ఆ విధంగా పరశురాముని వద్ద నుండి దివ్యాస్త్రాలను మంత్ర, ప్రయోగ రహస్యాలతో సహాపొంది, విలువిద్యను అభ్యసించి, ధనాన్ని కోరి తన చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదుని వద్దకు వెళ్ళి, నేను నీ బాల్యమిత్రుడిని, నీతో కలిసి చదువుకున్న వాడిని, తెలుసుకదా అని స్నేహపూర్వకంగా మాట్లాడగా, ద్రుపదుడా మాటలను సహించలేక కోపంతో ఇలా అన్నాడు.

ధనవంతునితో పేదవానికి, తత్వజ్ఞానికి మూర్ఖునితో, శాంతమూర్తికి క్రూరునితో, యుద్ధరంగంలో వీరునికి, పిరికితనంతో పారిపోయే, పిరికివాడికి కవచం కలిగిన వీరునికి, కవచం లేని వానితో, సజ్జనునికి దుర్మార్గునితో స్నేహం ఏ విధంగా కలుగుతుంది. కలగదు అని తనని తాను ప్రశంసించుకుంటూ, అకారణంగా ద్రుపదుని నిందించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

ప్రశ్న 3.
ఎవరెవరి మధ్య సఖ్యత కుదరదని ద్రుపదుడు చెప్పాడు?
జవాబు:
ధనవంతునితో పేదవానికి, తత్వజ్ఞానికి మూర్ఖునితో, శాంతమూర్తికి క్రూరునితో, యుద్ధరంగంలో వీరునికి, పిరికితనంతో పారిపోయే, పిరికివాడికి కవచం కలిగిన వీరునికి, కవచం లేని వానితో, సజ్జనునికి దుర్మార్గునితో స్నేహం ఏ విధంగా కలుగుతుంది. కలగదు అని తనని తాను ప్రశంసించుకుంటూ, అకారణంగా ద్రుపదుని నిందించాడు. సమానమైన స్వభావం, విద్య కలవాళ్ళకు, సమానమైన సంపద కలవాళ్ళకు, సమానమైన మంచి నడవికలవాళ్ళకు స్నేహం, వివాహం ఏర్పడతాయి. కాని సమానులు కానివాళ్ళకు అవి ఏర్పడతాయా? (ఏర్పడవని భావం)

ప్రశ్న 4.
కల్పిత పక్షిని ఛేదించే సమయంలో కురుకుమారుల ప్రతిభను తెలుండి?
జవాబు:
ఆ కురుకుమారుల విలువిద్యా నైపుణ్యాన్ని తెలిసికొనగోరి ఒకనాడు ద్రోణుడు భాసమనే పక్షిని రూపొందించి, ఒక చెట్టు కొమ్మ చివరన కట్టి దానిని అందరికీ చూపి నేను చెప్పినప్పుడు, మీమీ ధనువులు ఎక్కుపెట్టి, ఆ పక్షితలను తెగ కొట్టండి. నేను ఒక్కొక్కరినే ఆజ్ఞాపిస్తాను అని, ముందుగా ధర్మరాజును పిలిచి ఈ చెట్టు కొమ్మ కొసన ఉండే పక్షిని చక్కగా చూచి, నేను చెప్పినప్పుడు బాణంతో కొట్టుము అనగా అతడు సర్ అని గురువు మాట ప్రకారం సిద్ధంగా ఉండగా, ద్రోణుడు ఇట్లా అన్నాడు.

ఓ ధర్మరాజా! చెట్టుకొమ్మ చివర ఉన్న పక్షితలను స్పష్టంగా చూచావా అని అడుగగా, చక్కగా చూచానని అతడు చెప్పగా, మరల ద్రోణుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. జనులచేత పొగడబడే ఓ ధర్మరాజా! ఆ మానును, నన్ను, నీ తమ్ముళ్ళను చూశావా? అని ద్రోణుడు అడుగగానే పుణ్యాత్మ! చెట్టు మీదనున్న ఆ పక్షితో పాటు అన్నిటినీ చూచానని ధర్మరాజు అన్నాడు.

అనగా విని ద్రోణుడు ధర్మరాజును మందలించి నీ దృష్టి చెదిరింది, నీవుదానిని కొట్టలేవు. పక్కకు తప్పుకొమ్ము అన్నాడు. అదే విధంగా దుర్యోధనుడు మొదలైన కౌరవులను, భీమునకుల, సహదేవులను వివిధ దేశాల నుండి వచ్చిన రాకుమారులను వరుసగా అడుగగా వాళ్ళంతా ధర్మరాజు ఇచ్చిన సమాధానమే ఇచ్చారు. ద్రోణుడు అందరినీ మందలించి తరువాత అర్జునుని పిలిచి వాళ్ళను అడిగినట్లే అడుగగా అతడిట్లా అన్నాడు. పక్షితలను చక్కగా చూచాను. ఇంకేదీ నాకు కనిపించడం లేదు అని అర్జునుని అనగా ద్రోణుడు గురిచూసి కొట్టుము అని సూక్ష్మదృష్టిగల అర్జునుని ఆజ్ఞాపించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

గురువు చెప్పిన తర్వాత అర్జునుడు బాణాన్ని వదిలాడు. ఆ పక్షితల తత్క్షణమే తెగి చెట్టుకొమ్మ నుండి నేలమీద పడింది.

III. ఏక పద/వాక్య సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
నన్నయ్యకు భారత రచనలో ఎవరు సహాయపడ్డారు.
జవాబు:
నారాయణభట్టు

ప్రశ్న 2.
నన్నయ ఎవరి ఆస్థానకవి?
జవాబు:
రాజరాజ నరేంద్రుడు

ప్రశ్న 3.
ద్రోణుడి మిత్రుడి పేరేమిటి?
జవాబు:
ద్రుపదుడు

ప్రశ్న 4.
అశ్వత్థామ ఎవరి కుమారుడు?
జవాబు:
ద్రోణుడు-

ప్రశ్న 5.
ద్రోణాచార్యుడికి ఎవరెవరు అస్త్రశస్త్రాలు ప్రసాదించారు?
జవాబు:
అగ్నివేశుడు, పరశురాముడు

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

ప్రశ్న 6.
‘పక్షికున్ను’ లక్ష్యంగా ఎవరు బాణం వేశారు.
జవాబు:
అర్జునుడు

ప్రశ్న 7.
పరశురాముడు తన ధనాన్ని ఎవరికి ఇచ్చాడు?
జవాబు:
విప్రులకు దానం చేసాడు.

ప్రశ్న 8.
ద్రోణుడిని ధనుర్విద్యాచార్యుడిగా ఎవరు నియమించారు?
జవాబు:
భీష్ముడు

IV. సందర్భసహిత వ్యాఖ్యలు

ప్రశ్న 1.
సఖ్యము దానొడఁ గూడ నేర్చునే !
జవాబు:
కవి పరిచయం :
ఈ వాక్యం నన్నయభట్టుచే రచింపబడిన శ్రీమదాంధ్ర మహాభారతం ఆదిపర్వం, పంచమాస్వాశం నుండి గ్రహించబడిన విద్యాలక్ష్యం అనే పాఠం నుంచి గ్రహించబడింది.

సందర్భం :
స్నేహపూర్వకంగా తనతో మాట్లాడిన ద్రోణుడిని అవమానిస్తూ ద్రుపదుడు పలికి సందర్భంలోనిది.

భావం :
ధనవంతునితో పేదవానికి, తత్వజ్ఞానికి మూర్ఖునితో, శాంతమూర్తికి క్రూరునితో, యుద్ధరంగంలో వీరునికి, పిరికితనంతో పారిపోయే, పిరికివాడికి కవచం కలిగిన వీరునికి, కవచం లేని వానితో, సజ్జనునికి దుర్మార్గునితో స్నేహం ఏ విధంగా కలుగుతుంది. కలగదు అని తనని తాను ప్రశంసించుకుంటూ, అకారణంగా ద్రుపదుని నిందించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

ప్రశ్న 2.
అత్యుత్తమ ధనములు శస్త్రాస్త్రములు.
జవాబు:
కవి పరిచయం :
ఈ వాక్యం నన్నయభట్టు చే రచింపబడిన శ్రీమదాంధ్ర మహా భారతం ఆదిపర్వం, పంచమాస్వాశం నుండి గ్రహించబడిన విద్యాలక్ష్యం అనే పాఠం నుంచి గ్రహించబడింది.

భావం :
జనులచేత ప్రశంసించబడే ఓ పరశురామా! ధనాలలో మిక్కిలి శ్రేష్ఠమైనవి. శస్త్రాస్త్రములు. కాబట్టి సంతోషంతో వాటిని తీసుకుని కృతార్థుడనవుతాను. శస్త్రాస్త్ర సమూహాన్ని నాకు ఇవ్వవలసింది అని ద్రోణుడన్నాడు.

ప్రశ్న 3.
నారాజ్యభోగంబులు నీవు ననుభవింపనర్హుండ
జవాబు:
కవి పరిచయం :
ఈ వాక్యం నన్నయభట్టు చే రచింపబడిన శ్రీమదాంధ్ర మహా భారతం ఆదిపర్వం, పంచమాస్వాశం నుండి గ్రహించబడిన విద్యాలక్ష్యం అనే పాఠం నుంచి గ్రహించబడింది.

సందర్భం :
ఎక్కడ నుంచి వస్తున్నారు అని భీష్ముడు అడిగినప్పుడు ద్రోణుడు తన వఋత్తాంతాన్ని తెలియచేసిన సందర్భంలోనిది

భావం :
నా పేరు ద్రోణుడు, భరద్వాజుని కుమారుడను. అగ్నివేశ్యుడనే గొప్ప మునిశ్రేష్ఠుని దగ్గర బ్రహ్మచర్య దశలో వేదాద్యయనం చేసి, ధనుర్వేదం నేర్చుకుంటున్న కాలంలో, పాంచాలరాజైన పృషతుని కుమారుడు ద్రుపదుడనేవాడు నాకు ప్రియమిత్రుడై అన్ని విద్యలూ గురువు దగ్గర నేర్చి, నేను పాంచాల దేశానికి రాజైనప్పుడు నీవు నా దగ్గరికి రావాలి సుమా! నా రాజ్యభోగాలు నీవు కూడా అనుభవించడానికి అర్హుడవని నన్ను ప్రార్థించి వెళ్ళాడు. పృషతుని తర్వాత ద్రుపదుడు ఆ దేశానికి రాజయ్యాడు నేను తండ్రి ఆజ్ఞచేత కృషిని వివాహమాడి, తేజశ్శాలి అయిన బాలుడు అశ్వత్థామను కొడుకుగా పొంది, ధనం లేమి చేత సంసారాన్ని భరించలేని వాడై ఉండి కూడా,

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

ప్రశ్న 4.
దారిద్య్రంబున కంటెఁగష్టంబొందెద్దియులేదు.
జవాబు:
కవి పరిచయం :
ఈ వాక్యం నన్నయభట్టు చే రచింపబడిన శ్రీమదాంధ్ర మహా భారతం ఆదిపర్వం, పంచమాస్వాశం నుండి గ్రహించబడిన విద్యాలక్ష్యం అనే పాఠం నుంచి గ్రహించబడింది.

సందర్భం :
తనకుమారుని ఆకలి బాధను ద్రోణుడు భీష్మునికి చెప్పిన సందర్భంలోనిది.

భావం :
ధనవంతుల బిడ్డలు ప్రతిదినం సంతోషంతో పాలు తాగుతుండగా నా కుమారుడు వీడు బాల్యంలో నాకు కూడా పాలు పోయడని ఏడ్చాడు. దానిని చూచి దారిద్య్రం కంటే కష్టం మరొకటి లేదని భావించి ఈ దారిద్ర్యాన్ని నా బాల్యమిత్రుడైన పాంచాలరాజు ద్రుపదుని దగ్గరకు పోయి తొలగించుకుంటాను. అతడు తన దేశానికి రాజు కావటానికి వెళ్తూ నన్ను ఆహ్వానించి వెళ్ళాడు.

V. సంధులు

1. వేదాధ్యయనంబు = వేద + అధ్యయనంబు = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం:

2. నిఖిలోర్వి = నిఖిల + ఉర్వి = గుణసంధి
సూత్రం:

3. విద్యోపదేశం = విద్య + ఉపదేశ = గుణసంధి
సూత్రం:

4. నాటనేసి = నాటన్ + ఏసి = ద్రుతప్రకృతిక సంధి
సూత్రం: ఇకాదులకు దక్క ద్రుత ప్రకృతికంబులకు సంధిలేదు

5. పాలికిఁబోవ = పాలికిన్ + పోవన్ = సరళాదేశ సంధి
సూత్రం : ద్రుతము మీది పరుషములకు సరళములాదేశమును ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషం విభాషనగు

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

6. తెగనేసిన = తెగన్ = ఏసిన = ద్రుఁత ప్రకృతిక సంధి
సూత్రం : ఇకాదులకు దక్క ద్రుత ప్రకృతిందికంబులకు సంధిలేదు

7. అవ్విహగము = ఆ+ విహగము = త్రిక సంధి
సూత్రం:

8. మహోగ్ర = మహా+ఉగ్ర = గుణసంధి

9. శాఖాగ్ర = శాఖ + అగ్ర = సవర్ణదీర్ఘసంధి

VI. సమాసాలు

1. అస్త్రశస్త్రాలు – అస్త్రములు మరియు శస్త్రములు = ద్వంద్వసమాసం
2. దివ్యబాణం – దివ్యమైన బాణం – విశేషణపూర్వపదకర్మధారయం
3. గుణసంపద – గుణములనెడి సంపద – రూపక సమాసం
4. విపులతేజుడు – విపులమైన తేజం కలవాడు – బహువ్రీహిసమాసం
5. గురువచనం – గురువు యొక్క వచనం – షష్ఠీ తత్పురుష సమాసం
6. తపోవృత్తి – తపస్సు అనెడి వృత్తి – రూపక సమాసం
7. పుత్రలాభం – – పుత్రుని వలన లాభం – పంచమీ తత్పురుష సమాసం
8. ధనుర్విద్యాకౌశలం – ధనుర్విద్యయందుకౌశలం-సప్తమీ తత్పురుష సమాసం
9. ధనపతి – ధనమునకు మతి – షష్ఠీతత్పురుష సమాసం
10. ఇష్టసఖుడు – ఇష్టమైన సఖుడు – విశేషణ పూర్వపద కర్మధాయసమాసం

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

ప్రతిపదార్థ, తాత్పర్యములు.

1వ పద్యం :

ద్రోణుండును, నగ్నివేశ్యుంటను మహామునివలన్న
నాగ్నేయాస్త్రంచారిగానే కనిప్యబాంబులు వల్లా, భరదాంతో వియోగంబునం
బుత్రలాభారంబు కృష్ణుని చెలియలిం గృమమేదాని వివాహంభయి
దావియందశ తాఘయను కొడుతుంటదని.

అర్ధాలు :
పారగుండు + ఐ = విలువిద్య అంతాన్ని ముట్టినవాడై (విద్యను సంపూర్ణంగా నేర్చుకొనుట)
తద + ప్రసాదంబున = అగ్నివేశ్యుని దయచేత
ఆగ్నేయ + అస్త్రంబు = ఆగ్నేయాస్త్రము (దివ్యాస్త్రములలో ఒకటి)
ఆదిగా = మొదటగా
దివ్యబాణంబులు = దేవతా సంబంధమైన అస్త్రములు
పడసి = పొందు
భరద్వాజనియోగంబునన్ = భరధ్వాజుని ఆజ్ఞచే
పుత్రలాభార్థంబు = కుమారుని పొందుటకు
కృపుని చెలియలి = కృపాచార్యుని చెల్లెలైన
కృపి అనుదానిన్ = కృపి అనుపేరుగల స్త్రీతో
వివాహంబు + అయి = పెండ్లికాగా
దానియందు = ఆమెయందు
అశ్వత్థామ = అశ్వత్థామ
అనుకొడుకును = అనబడే కుమారుడిని
పడసి = పొందెను

భావము :
ద్రోణుడు అగ్నివేశ్యుడనే మహాముని వద్ద ధనుర్విద్యాపారంగతుడై, అతని అనుగ్రహం చేత ఆగ్నేయాస్త్రం మొదటగా, అనేక దివ్యాస్త్రాలు పొంది, భరద్వాజుని ఆజ్ఞచేత పుత్రులను పొందటానికి కృపుని చెల్లెలైన ‘కృపి’ని వివాహమాడాడు. ఆమె వలన అశ్వత్థామ అనే కొడుకును కన్నాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

2వ పద్యం :

అరిగి మహేంద్రాచలనం సద్వినయముపస్
బీరమ తపోవృత్తి నున్న భారవు లోకా
త్తరు భూరి కర్మ నిర్మల
చరకుని ద్రోణుండు గాంచి

ప్రతిపదార్థం :
అరిగి = వెళ్ళి
మహేంద్ర + అచలమున్ = మహేంద్ర పర్వతం వద్ద
పరమ = గొప్ప
తపోవృత్తి = తపస్సు అనే పనిలో
ఉన్న = నిమగ్నుడైన
భూరి = గొప్ప
కర్మ = పనులలే
నిర్మల చరితుడు = పరిశుద్ధుడైన చరిత్రగల
భార్గవు = భృగువంశపువాడైన పరశురాముడిని
ద్రోణుండు = ద్రోణుడు
కాంచి = చూచి
సత్ + వినయంబున = మంచి వినయంతో

భావం :
మహేంద్ర పర్వతం వద్దకు వెళ్ళి ఘోర తపస్సు చేస్తున్నవాడు, లోకంలో శ్రేష్ఠుడూ, గొప్పపనులు చేయడంతో పరిశుద్ధుడైన నడవడిక గలవాడు భృగువంశ పరశురాముని ద్రోణుని చూచి మంచి వినయంతో

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

3వ పద్యం :

వ. ‘ఏను భారద్వాజుండ, ద్రోణుండనువాఁడ సర్ధార్థి నై నీ కడకు వచ్చితి ననినఁ బరశు
రాముం డిట్లనియె.

ప్రతిపదార్థం :
ఏను = నేను
భరధ్వాజుండు = భరద్వాజుని కుమారుడును
ద్రోణుండు + అనువాడన్ = ్రోణుడు అనేవాడిని
అర్థ + అర్థిని + ఐ = ధనాన్ని కోరినవాడై
నీ కడకు = నీ దగ్గరకు
వచ్చితి = వచ్చాను.
అనినం = అనగా
పరశురాముడు = పరశురాముడు
ఇట్లనియె = ఈ విధంగా బదులు పలికాడు

భావం:
నేను భరధ్వాజుని కుమారుడనైన ద్రోణుడిని. ధనాన్ని ఆశించి మీ దగ్గరకు వచ్చాను అని అనగా పరశురాముడు ఈ విధంగా బదులు పలికాడు.

4వ పద్యం :

చ. కల ధన మెల్ల ముందఱ జగన్నుత! విప్రుల కిచ్చి, వారిమే
ఖలనిఖిలోర్వి యంతయును గశ్యపుఁ డన్ముని కిచ్చితిన్, శరం
బులును శరీరశస్త్రములుఁ బొల్పుగ నున్నవి; వీనిలోన నీ
వలసిన వస్తువుల్ గొను ధ్రువంబుగ నిచ్చెద నీకు నావుడున్.

ప్రతిపదార్థం :
జగత్ + నుత = లోకంచే కీర్తించబడేవాడా !
కలధనము + ఎల్లన్ = ఉన్న ధనాన్నంతటినీ
ముందర = ముందుగానే
విప్రులకిచ్చి = వేదజ్ఞానం గల బ్రహ్మణులకిచ్చి
వార్థి = సముద్రం అనే
మేఖల = ఒడ్డాణం గల
విభాల + ఉర్వి = సమస్త భూమండలాన్ని
కశ్యపుడు = కశ్యపుడు
అన్ + మునికిన్ = అనే మునికి
ఇచ్చితిన్ = ఇచ్చాను.
శరంబులు = బాణాలు
శరీరం = శరీరం
శస్త్రములు = దివ్యాస్త్రములు
పొట్టిగన్ =ఒప్పగా (చాలా)
ఉన్నని = ఉన్నా
వినిలోన = వీటిలో
నీవలసిన = నీకు కావలసిన
వస్తువుల్ = శస్త్రాస్త్రములు
కొను = తీసుకో
నీకున్ = నీకు
ధ్రువంబుగ = తప్పకుండా
ఇచ్చెదన్ = ఇస్తాను
నావుడును = అని పరశురాముడు అనగా

భావం :
లోకం చేత పొగడ్తలందుకున్న ఓ ద్రోణా! నీకు ఉన్నా ధనం అంతా ముందే వేదజ్ఞానం గల బ్రాహ్మణులకు ఇచ్చివేసాను. సముద్రం ఒడ్డాణంగా చుట్టిన భూమినందటినీ కశ్యపమహర్షికి ఇచ్చివేశాను. ఇక శస్త్రాస్త్రాలు, శరీరం మిగిలి ఉన్నాయి. వీటిలో నీకు కావలసింది తీసుకోవలసింది, నీకు తప్పక ఇస్తాను అని పరశురాముడు అనగా,

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

5వ పద్యం :

ధనములలో సత్యుత్తమ
ధనములు శస్త్రాస్త్రములు, ముదంబున వీనిం
గౌని కృతకృత్యుఁడ నగుదును
జవనుత! నా కొసఁగు మప్రశస్త్రచయంబుల్,

ప్రతిపదార్థం :
జననుత = జనుల చేత స్తుతింపబడేవాడా! ఓ పరశురామా!
ధనములలో = సంపదలలో
అత్యుత్తమ = మిక్కిలి శ్రేష్ఠమైన
ధనము = ధనాలు
శస్త్ర + అస్త్రములు = శస్త్రాలు, ఆయుధాలు
ముదంబున = సంతోషంతో
వీనిన్ = వీటిని
కొని = తీసుకొని
కృతకృత్యుఁడను = వచ్చినపని పూర్తిచేసుకున్నవాడిని
అగుదును = అవుతాను
నాకున్ = నాకు
అస్త్ర, శస్త్రచయంబుల్ = అస్త్ర, శాస్త్ర సమూహాల
ఒసగుము = ఇవ్వవలసింది

తాత్పర్యం :
జనులచేత ప్రశంసించబడే ఓ పరశురామా! ధనాలలో మిక్కిలి శ్రేష్ఠమైనవి శస్త్రాస్త్రములు. కాబట్టి సంతోషంతో వాటిని తీసుకుని కృతార్థుడనవుతాను. శస్త్రాస్త్ర సమూహాన్ని నాకు ఇవ్వవలసింది అని ద్రోణుడన్నాడు.

6వ పద్యం :

అని పరశురాముచేత దివ్యాస్త్రంబులు ప్రయోగ రహస్య మంత్రంబులతోడంబడపి,
ధనుర్విద్యాయునభ్యసించి, ధనార్ధియయి తనబాలసఖుండైన ద్రుపదు పాలికింజని ‘యేసు
ద్రోణుంద, నీ బాలసబుండి, సహాధ్యాయుంద నన్నెఱుంగుదే యని ప్రణయపూర్వకంబుగా
బలికిన విని యప్పలుకులు విన సహింపక ద్రుపడుండలిగి యిట్లనియె.

ప్రతిపదార్థం :
అని = ఆ విధంగా
పరశురాముచేత = పరశురాముని వలన
దివ్య + అస్త్రంబులు = దేవతా సంబంధ అస్త్రాలు
ప్రయోగ = ప్రయోగించడం
రహస్య = దాని యొక్క రహస్యం (మర్మం)
మంత్రంబులతోడన్ = దివ్యమంత్రాలతో సహా
ధనుర్విద్యయు = విలువిద్యనుకూడా
అభ్యసించి = నేర్చుకుని
ధనార్థియయి = ధనాన్ని కోరినవాడై
తన = తన
బాలసుడైన = బాల్యస్నేహితుడైన
ద్రుపదు = ద్రుపదుము
పాలకిన్ + చని = దగ్గరకు వెళ్ళి
యోను = నేను
ద్రోణుండు = ద్రోణుడవు
నీ బాలసఖుండు = నీ బాల్య స్నేహితుడుని
సహ + అధ్యాయుడన్ = నీతో కలిసి చదివిన వాడిని
నన్ను + ఎఱుంగదే = నన్ను గుర్తుపట్టావు కదా!
అని = అని పలికి
ప్రణయపూర్వకంగా = స్నేహభావం ఉట్టి పడగా
పలికినన్ = మాట్లాడగా
ఆ పలుకులు = ఆ మాటలు
వినసహింపక = వినటానికి ఇష్టపడక
ద్రుపదుడు = ద్రుపద మహారాజు
అలిగి = కోపంతో
ఇట్లనియె = ఇలా అన్నాడు.

భావం :
ఆ విధంగా పరశురాముని వద్ద నుండి దివ్యాస్త్రాలను మంత్ర, ప్రయోగ రహస్యాలతో సహాపొంది, విలువిద్యను అభ్యసించి, ధనాన్ని కోరి తన చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదుని వద్దకు వెళ్ళి, నేను నీ బాల్యమిత్రుడిని, నీతో కలిసి చదువుకున్న వాడిని, తెలుసుకదా అని స్నేహపూర్వకంగా మాట్లాడగా, ద్రుపదుడా మాటలను సహించలేక కోపంతో ఇలా అన్నాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

7వ పద్యం :

చ. ధనపతితో దరిద్రునకుఁ, దత్త్వవిదుండగు వానితోడ మూ
ర్జునకుఁ బ్రశాంతుతోడఁ గడుఁ గ్రూరునకున్, రణశూరుతోడ భీ
రునకు, వరూథితోడ నవరూఢికి, సజ్జనుతోడఁ గష్టదు
ర్ధనునకు నెవ్విధంబునను సఖ్యము దా నొడఁ గూడ నేర్చునే

ప్రతిపదార్థం :
ధనపతితో = ధనానికి ప్రభువైనవానితో (ధనవంతునితో)
దరిద్రునకు = పేదవానికి
తత్త్వవిదుండు = తత్వపడతడు
అగువనితోడ = అయినవాడితో
మూర్ఖునకుఁ = తెలివితక్కువ వాడికి
ప్రశాంతుతోడున్ = మిక్కిలి శాంతం కలిగినవానితో
కడున్ + క్రూరునకున్ = మిక్కిలి క్రూరుడైనవానికి
రణశూరుతోడన్ = యుద్ధంతో పరాక్రమవంతుడైన వానితో
భీరునకు = పిరికివానికి
వరూధితోడన్ = కవచం కలిగినవానితో
అవరూధికిన్ = కవచం లేనివానికి
సజ్జనుతోడన్ = సన్మార్గునితో
కష్టదుర్జవునకు = పాపి అయిన దుర్మార్గునితో
సఖ్యము = స్నేహం
ఏ + విధంబునన్ = ఏ విధంబుగా
ఒడగూడన్ + నేర్చున్ = కలుగుతుంది ? (కలుగదు అని భావం)

విశేషం :
నన్నయ నానారుచిరార్థ సూక్తినిధికి ఈ పద్యం ఒక తార్కాణం

భావం :
ధనవంతునితో పేదవానికి, తత్వజ్ఞానికి మూర్ఖునితో, శాంతమూర్తికి క్రూరునితో, యుద్ధరంగంలో వీరునికి, పిరికితనంతో పారిపోయే, పిరికివాడికి కవచం కలిగిన వీరునికి, కవచం లేని వానితో, సజ్జనునికి దుర్మార్గునితో స్నేహం ఏ విధంగా కలుగుతుంది. కలగదు అని తనని తాను ప్రశంసించుకుంటూ, అకారణంగా ద్రుపదుని నిందించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

8వ పద్యం :

సమశీలశ్రుతయుతులకు
సమధనవంతులకు సమసుచారిత్రులకుం
దమలో సఖ్యమును వివా
హము నగుఁ గా, కగునె రెండు నసమానులకున్?

అర్ధాలు :
సమ = సమానమైన
శీలం = స్వభావం
శ్రుత = విద్య
యుతులకు = కూడినవారికి
సమధనవంతులకు = సమానమైన ధనవంతులకు
సమచారిత్రులకున్ =సమానమైన మంచి నడవడిక కలిగిన వారికి
తమలో = వారికి వారిలో
సఖ్యము = స్నేహము
వివాహము = వివాహ బంధం
అగ్రిన కాక = ఏర్పడతాయిగాని
రెండు = స్నేహం, వివాహం అనే రెండు
అసమానులకున్ = సమానులు లేని వాళ్ళకి
అగునె = ఔతాయా? (లేవు అని భావం)

భావం :
సమానమైన స్వభావం, విద్య కలవాళ్ళకు, సమానమైన సంపద కలవాళ్ళకు, సమానమైన మంచి నడవికలవాళ్ళకు స్నేహం, వివాహం ఏర్పడతాయి. కాని సమానులు కానివాళ్ళకు అవి ఏర్పడతాయా? (ఏర్పడవని భావం)

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

9వ పద్యం :

‘ మణి యట్లుంగాక రాజులకుఁ గార్యవశంబునంజేసి మిత్రామిత్ర సంబంధంబులు
సంభవించుం గావున మా యట్టి రాజులకు మీ యట్టి పేద పాబువారలతోఁ గార్య
కారణం బైన సఖ్యం బెన్నందును గానేర’ దని ద్రుపదుండైశ్వర్యగర్వంబున మెచ్చక పలికిన
విని, ద్రోణుం ధవమానజనిత మన్యుమూర్ణమాన మానసుండయి యెద్దియుం జేయునది
నేరక పుత్రకళత్రాగ్నిహోత్ర శిష్యగణంబులతో హస్తిపురంబునకు వచ్చే నంత నప్పుర
బహిరంగణంబున దృతరాష్ట్ర పాండునందనులందఱుఁ గందుక క్రీడాపరులయి వేడుకతో
శ్రీ నాడుచున్నంత కాంచనకందుకం బొక్కనూతం బడిన

ప్రతిపదార్థం :
మఱి = ఇంకా
అట్లు కాక = ఆ విధంగా కాకుండా
రాజులకు = రాజులకు
కార్యవశంబునంజేసి = అవసరం చేత
మిత్ర + అమిత్ర = స్నేహం, వైరం
సంబంధంబులు = సంబంధాలు
సంభవించు = కలుగుతాయి
కావున = కాబట్టి
మీయట్టి = మీవంట
పేదపావిఱురలతో = పేదబ్రాహ్మణులతో
కార్యకారణంబు + ఐన = ప్రయోజనకరమైన (ఉపయోగకరమైన)
సఖ్యంబు = మైత్రి
ఎన్నండును = ఎన్నటికీ
కానేరదు = కలుగదు
అని = ఆ విధంగా
ద్రుపదుడు = ద్రుపద మహారాజు
ఐశ్వర్యగర్వంబునన్ = సంపద వలన కలిగిన పొగరులో
మెచ్చక = నిర్లక్ష్యంగా
పలికినవిని = మాట్లాడగా విని
ద్రోణుండు = ద్రోణుడు
అవమానజనిత = అవమానం వలన పుట్టిన
మన్యుఘార్ణమాన = కోపంతో తిరుగుడు బడుతున్న
మానసండయి = మనసు కలవాడై
ఎద్దియున్ = ఏమి
చేయునది నేరక = చేయాలో తెలియక
పుత్ర = కుమారుడు
కళత్ర = భార్య
అగ్నిహోత్ర = నిత్యాగ్నిహోత్రంతో
శిష్యగణంబులతో = శిష్యసమూహంతో
హస్తిపురంబునకున్ = హస్తినాపురానికి
వచ్చె = వచ్చెను
అంతన్ = అప్పుడు
ఆ + పుర = ఆ నగరం
బహిరంగణంబున్ = వెలుపల
ధృతరాష్ట్ర, పాండునందనులు = కౌరవులు, పాండవులు
అందఱన్ = అంతా
కందుక క్రీడాపరులు+అయి = చెండాట ఆడటంలో ఆసక్తి కలవారై
వేడుకతోనే = సంతోషంతో
ఆడుచు+ఉన్నంత = ఆడుతుండగా
కందుకంబు = ఆ బంగారు బంతి
నూతన్ = పడగా

భావం :
అంతేకాదు, రాజులకు అవసరాన్ని బట్టి మిత్రత్వ శత్రుత్వాలు ఏర్పడతాయి. అందుచేత మా వంటి రాజులకు, మీ వంటి పేద బ్రాహ్మణులతో ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి స్నేహం ఎప్పుడూ ఏర్పడదు అని ద్రుపదరాజు ఐశ్వర్యగర్వంతో తిరస్కరించి మాట్లాడగా ద్రోణుడు అవమానం వలన కలిగిన కోపంతో కలత చెందిన మనసుకలవాడై ఏమీ చేయటానికి తోచక, భార్యా, కొడుకు, అగ్నిహోత్రంతో, శిష్య సమూహాలతో హస్తినాపురానికి వచ్చాడు. అప్పుడు ఆ పట్టణం బయట ధృతరాష్ట్రుని కుమారులు పాండురాజు కుమారులు చెండాట ఆడుతుండగా విళ్ళాడుతున్న బంగారు బంతి బావిలో పడింది. అప్పుడు

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

10వ పద్యం :

నీరిలోనఁ దోఁచు తారక ప్రతిబింబ
మొక్కొ యనఁగ వెలుఁగుచున్నదాని
రాచకొడుకులెల్లఁ జూచుచునుండిరి
దానిఁ బుచ్చుకొను విధంబు లేక.

ప్రతిపదార్థం :
నీరిలోన = నీటిలో
తోఁచు= కనిపిస్తున్న
తారక = నక్షత్రం
ప్రతిబింబము+ఒక్కొ = ప్రతిబింబమా?
అనఁగ = అనేట్లుగా
వెలుగుచున్నా = ప్రకాశిస్తున్నా
దానిన్ = ఆ బంతిని
రాచకొడుకులెల్లఁ = రాకుమారులంతా
పుచ్చుకొను = తీసే
విధంబు = విధానం
లేక = తెలియక
చూచుమనుండిరి = చూస్తూ ఉన్నారు.

భావం :
నీటిలో ప్రతిసలిస్తున్న నక్షత్రమా అన్నట్లుగా వెలుగుతున్నా ఆ బంగారు బంతిని తీసుకునే మార్గం లేక రాకుమారులంతా ఊరకే చూస్తున్నారు.

విశేషం :
ఉత్ప్రేక్షాలంకారము

11వ పద్యం :

అట్టి యవసరంబున

ప్రతిపదార్థం :
అట్టయవసరంబున = ఆ సమయంలో

“దీని బాణపరంపరం జేసి పుచ్చి యిచ్చెదం జూడుఁ డీ విద్య యొరు లెవ్వరు నేర’ రని
ద్రోణుం డొక్కబాణంబభిమంత్రించి దృష్టి ముష్టి సౌష్ఠవంబు లొప్ప నక్కందుకంబు
నాటనేసి దాని పుంఖంబు మఱియొక బాణంబున నేసి తత్పుంఖంబొండొకబాణంబున
నేసి వరుసన బాణరజ్జువు గావించి దానిందిగిచికొని యిచ్చిన జూచి రాజకుమారులెల్ల
విస్మయంబంది ద్రోణుందోడ్కొనిచని భీష్మునకంతయు నెఱింగించిన నాతండును.

ప్రతిపదార్ధం :
దీనిన్ = ఈ బంతిని
బాణ = బాణముల
పరంపరం + చేసి = వరసతో
పుచ్చి = తీసుకొని
ఇచ్చెదన్ = మీకు ఇస్తాను.
చూడుఁడు = చూస్తూ ఉండండి
ఈ విద్య = ఈ విలువిద్యను
ఒరులు + ఎవ్వరున్ = ఇతరులెవ్వరూ
నేరరు = నేర్వలేదు
అని = ఆ విధంగా
ద్రోణుండు = ద్రోణుడు
ఒక్క బాణంబు = ఒక్క బాణాన్ని
అభిమాత్రించి = మంత్రంతో పిలిచి
దృష్టి = చూపు
ముష్టి = పిడికిలి
సౌష్టవంబులు = చక్కదనాలు
ఒప్పన్ = ఒప్పునట్లుగా
ఆ + కందకంబు = ఆ బంతిని
నాసిన్ + ఏట = గుచ్చుకునేట్లుగా కొట్టి
దాని = ఆ బాణం యొక్క
ప్రంఖలంబు = క్రింది చివర
మరియొక బాణంబున్ = ఇంకొక బాణంతో
ఏసి = కొట్టి
తద్ + పుంఖంబు = దాని యొక్క చివరి అంచును
బండు + ఒక = యేరొక
బాణంబునన్ = బాణ చేత
ఏసి = కొట్టి
వరుసన = వరుసగా
బాణ రజ్జువు = బాణాలు తాడును
కావించి = వచ్చునట్లుచేసి
దానిన్ = ఆ బంతిని
ఇచ్చినన్ = ఈయగా
చూచి = చూసిన
రాజకుమారులు + ఎల్లన్ = రాజకుమారులందరూ
విస్మయంబు+అంతి = ఆశ్చర్యపడి
ద్రోణుని = ద్రోణుణ్ణి
తోడ్కొని = తీసుకొని
చని = వెళ్ళి
భీష్మునకున్ = భీష్మునకు
అంతయున్ = విషయమంతా
ఎఱించినన్ = తెలుపగా
అతండున్ = అతను కూడా

భావం :
ఈ బంతిని బాణపరంపరతో తీసి ఇస్తాను చూడండి. ఈ విద్య ఇతరులెవ్వరికీ రాదు అని ద్రోణుడు ఒక బాణాన్ని అభిమంత్రించి చూపును పిడికిలిని చక్కగా నిలిపి, ఆ బంతిని నాటుకునే విధంగా ఆ బాణాన్ని కొట్టి ఆ బాణం చివరకి మరో బాణాన్ని దాని చివరకు ఇంకో బాణాన్ని కొట్టి, వరుసగా బాణాల తాడు చేసి బంతిని లాగి వారికి ఇచ్చాడు. అది చూసి రాకుమారులందరూ ఆశ్చర్యపడి ద్రోణుడుని తీసుకుని వెళ్ళి, భీష్మునికి జరిగినదంతా తెలిపారు. ఆయనకూడా,

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

12వ పద్యం :

ఈ. ఎండుంది వచ్చి అందుల
కేందుండఁగ నీకు నిష్ట మేఱిఁగింపుము న
‘ద్వందిత యనియదగిన నా
నందుఁడు ద్రోణజుండు భీష్మునకు నిట్లనియెన్

ప్రతిపదార్థం :
ఎందు + ఉండి = ఎక్కడ నుండి
ఇందులకున్ = ఇక్కడికి
వచ్చితివి = వచ్చాను?
నీకున్ = నీకు
ఎందు+ఉండఁగన్ = ఎక్కడ ఉండటానికి
ఇష్టమ = అభిలాష
ఎఱిఁగింపుము = తెలియజేయుము
సద్ + వందిత = సజ్జనులచే కీర్తింపబడేవాడా
అని = ఆ విధంగా
అదిగినన్ = అడుగగా
స + ఆనందుడు = ఆనందంతో
ఇట్ల + అని = ఇలా అన్నాడు.

భావం :
సజ్జనులచే కీర్తిపండే ఓ ద్రోణాచార్య నీవు ఎక్కడ నుండి ఇక్కడకు వచ్చావు? ఎక్కడ ఉండటం నీకిష్టం ? చెప్పుము అని అడుగగానే ద్రోణుడు సంతోషించి భీష్మునితో ఈ విధంగా అన్నాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

13వ పద్యం :

వ. ఏను ద్రోణుండనువాఁడ, భరద్వాజపుత్రుండ సగ్నివేశ్యుందను మహామునివరుగొద్ద
బ్రహ్మచర్యాశ్రమంబున వేదాద్యయనంబు సేసి ధనుర్వేదంబభ్యసించుచున్న రెండు
పాంచాలపతియైన పృషతుపుత్రుండు ద్రుపదుందనువాఁడు నా క్లిష్టనుండయి
యెల్లవిద్యలు గలచి యెము పొందాల విషయంబునకు రాజయనన్యాకు

యొద్దకు వచ్చునది; నా రాజ్యభోగంబులు నీవు ననుభవింప నర్హుండవని నన్నుఁ
బ్రార్థించి చని, సృషతు పరోక్షంబునఁ దద్దేశంబునకు రాజయియున్న, నేను గురుని
యుక్తుండనై గౌతమిం బాణి గ్రహణంబు సేసి యిక్కుమారు నశ్వత్థామ నధిక
తేజస్వినాత్మజులబడసి, ధనంబు లేమిం గుటుంబ భరణంబునంద సమర్థుందనయి.
యుండియు

ప్రతిపదార్థం :
ఏను = నేను
ద్రోణుండు + అనువాఁడన్ = ద్రోణుడు అనువాడిని
భరద్వాజ పుత్రుండన్ = భరద్వాజుని కుమారుడను
అగ్నివేశ్యుండు = అగ్నివేశ్యుడనే
మహామునినరున్ + ఒద్ద = గొప్ప మునిశ్రేష్ఠుని వద్ద
బ్రహ్మచర్య + ఆశ్రమంబున్ = బ్రహ్మచర్చాశ్రమంలో (విద్యార్థిగా)
వేద + అధ్యయనంబు = వేదాలు చదవటం
చేసి = చేసాను
ధనుర్వేదంబు = విలువిద్యను
అభ్యసించుచున్ = నేర్చుకుంటూ
ఉన్ననాడు = ఉన్నప్పుడు
పాంబాపతి + ఐన = పాంచాల రాజైన
పృషమ పుత్రుండు = పృషతుడనే వాని కుమారుడు
ద్రుపదుండు + అనువాడు = ద్రుపదుడనేవాడు
నాకు = నాకు
ఇష్టసఖండ + ఐ = ప్రియ స్నేహితుడై
ఎల్ల విద్యలు = అన్ని విద్యలు
కఱచి = నేర్చుకుని
ఏను = నేను
పాంచాల విషయమునకు = పాంచాల రాజ్యమునకు
రాజు + అయినాఁడు = రాజైనప్పుడు
నా ఒద్దకున్ = నా దగ్గరికి
వచ్చునది = రమ్ము
నారాజ్యభోగంబులు = నా యొక్క రాజ్య భోగాలు
నీవున్ = నీవుకూడా
అనుభవింపన్ = అనుభవించడానికి
అర్హుండవు = తగినవాడివి
చని = వెళ్ళి
పృషతు పరోక్షంబునన్ = పృషతుని తర్వాత
తద్ + దేశంబునకున్ = ఆ దేశానికి
రాజు + అయి ఉన్నాన్ = ప్రభువై ఉండగా
నేను = నేను
గురు నియుక్తుండను + ఐ = తండ్రి ఆజ్ఞచే
గౌతమిన్ = కృపిని
పాణిగ్రహణంబు + చేసి = వివాహమాడి
ఈ + కుమారున్ = అశ్వత్థామను
అధిక తేజస్విని = మిక్కిలి తేజశ్శాలిని
అత్మజక్ =కుమారునిగా
పడసి = పొంది
ధనంబులేమిన్ = ధనం లేకపోవడంతో
కుటుంబభరణంబు+అందు = కుటుంబ భారాన్ని మోయడంతో
అసమర్థుండనయి = అసమర్ధడనయ్యాను
ఉండియు = అలా ఉండి కూడా

భావం :
నా పేరు ద్రోణుడు, భరద్వాజుని కుమారుడను. అగ్నివేశ్యుడనే గొప్ప మునిశ్రేష్ఠుని దగ్గర బ్రహ్మచర్య దశలో వేదాద్యయనం చేసి, ధనుర్వేదం నేర్చుకుంటున్న కాలంలో, పాంచాలరాజైన పృషతుని కుమారుడు ద్రుపదుడనేవాడు నాకు ప్రియమిత్రుడై అన్ని విద్యలూ గురువు దగ్గర నేర్చి, నేను పాంచాల దేశానికి రాజైనప్పుడు నీవు నా దగ్గరికి రావాలి సుమా!

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

14వ పద్యం :

నా రాజ్యభోగాలు నీవు కూడా అనుభవించడానికి అర్హుడవని నన్ను ప్రార్థించి వెళ్ళాడు. పృషతుని తర్వాత ద్రుపదుడు ఆ దేశానికి రాజయ్యాడు నేను తండ్రి ఆజ్ఞచేత కృషిని వివాహమాడి, తేజశ్శాలి అయిన బాలుడు అశ్వత్థామను కొడుకుగా పొంది, ధనం లేమి చేత సంసారాన్ని భరించలేని వాడై ఉండి కూడా,

పురుషావిశేశావివేక
పరిచయులగు ధరణీపతులు పాలికిం
ఖరులందు దుష్ప్రతిగ్రహ
భర మదలో రోసి ధర్మపధమున నున్నన్

ప్రతిపదార్థం :
పురుష = పురుషుని యొక్క
వివేక యాలు+అగు = గొప్పతనాన్ని గుర్తించిన ఆలోచనబందు పరిచయం లేని
ధరణిపతుల పాలికిన్ = రాజుల దగ్గరికి
పోవన్ = వెళ్ళటం
పరులందు = ఇతరుల దగ్గర
దుష్ప్రతిగ్రహభారము = చెడుదానాలను తీసుకునే కష్టాన్ని
ఎదలో = మనసులో
రోసి = అసహ్యించుకుని
ధర్మపథమునన్ = ధర్మమార్గంలో
ఉన్నన్ = ఉండగా

భావం :
“వ్యక్తుల యోగ్యత గుర్తించలేని రాజులు దగ్గరికి వెళ్ళటానికి, ఇతరుల నుండి చెడుదానాలు తీసుకొనడానికి ఇష్టపడక, ధర్మమార్గంలో జీవితం గడుపుతుండగా,

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

15వ పద్యం :

క. ధనపతుల బాలురు ముదం
బున నిత్యముఁ బాలు ద్రావంబ యిన సస్మ
తనయుందు వీఁదు బాల్యం
బుననేర్పెను బాలు నాకుఁ బోయుండనుచున్,

ప్రతిపదార్థం :
ధనపతులు = ధనవంతుల
బాలరు = పిల్లలు
వలుదంబునన్ = సంతోషంతో
నిత్యమున్ = ప్రతిదినం
పాలుత్రావన్పోయినన్ = పాలుత్రాగుచుండగా
అస్మద్ + తనయుండు = నా కుమారుడు
వీఁదు = ఈ బాలుడు
బాల్యంబునన్ = బాల్యంలో
నాకున్ = నాకూ
పాలు = పాలు
పోయుండని = తాగటానికి ఇవ్వమని
అనుచున్ = అంటూ
ఏడెన్ = రోధించాడు

భావం :
ధనవంతుల బిడ్డలు ప్రతిదినం సంతోషంతో పాలు తాగుతుండగా నా కుమారుడు వీడు బాల్యంలో నాకు కూడా పాలు పోయడని ఏడ్చాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

16వ పద్యం :

ధు ; దానించి దారిద్య్ర లయిన కంటెఁ గష్టం బొందెద్దియు లేదు. దీని నా బాలసుఖంచ
ధ ; పొందాలు పాలికిం బోయి పాలికొండ్రు నాతందు తన దేశంబున కలిసికుండు గా
బోవుచుండి సన్ను రాం బనిచిపోయే!”

ప్రతిపదార్థం :
దానిన్ + చూచి = ఆ సన్నివేశాన్ని చూచి
దారిద్ర్యంబునకంటెన్ =దరిద్రం కంటే
కష్టంబు = కష్టము
ఒండు+ ఎద్దియున్ = మరొకటి ఏదీలేదు.
దీనిన్ = ఈ పేదరికాన్ని
నాబాలసఖుండు = నా చిన్ననాటి స్నేహితుడు
అగు = అయినట్టి
పాంచాల పాలకిన్ = పాంచాలదేశపురాజైన ద్రుపదుని దగ్గరికి
పోయి = వెళ్ళి
పాచికొందున్ = పొగొట్టుకుంటాను
అతండు = ఆ ద్రుపదుడు
తన దేశంబునకు = తన రాజ్యమునకు
అభిషిక్తుండు+కాన్ = రాజు కావడానికి
పోవుచుండి = పోతూ ఉండి
నన్నున్ = నన్ను
రాన్+పనిచి = రమ్మని చెప్పి
పోయేన్ = వెళ్ళిపోయాడు

భావం :
దానిని చూచి దారిద్ర్యం కంటే కష్టం మరొకటి లేదని భావించి ఈ దారిద్ర్యాన్ని నా బాల్యమిత్రుడైన పాంచాలరాజు ద్రుపదుని దగ్గరకు పోయి తొలగించుకుంటాను. అతడు తన దేశానికి రాజు కావటానికి వెళ్తూ నన్ను ఆహ్వానించి వెళ్ళాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

17వ పద్యం :

మ. కో. వేఁడు టెంతయుఁ గష్టమైనను వేఱులేని సుహృజ్జనున్
వేఁడికో లుచితంబ కావున వేడ్కతోఁ జని సోమకున్
వేఁడినన్ ధనమోపఁడేనియు వీని మాత్రకు నాలుగేన్
పాఁడి కుట్టుల నీఁదే వీనికిఁ బాలు ద్రావుచునుండఁగన్.

ప్రతిపదార్థం :
ఎంతయున్ = మిక్కిలి
కష్టము + ఐనన్ = కష్టమైన పని అయినప్పటికి
వేఱులేని = బేధంలేని
సుహృత్+జనున్ = మిత్రుడిని
వేడికోలు = వేడుకోవటం
ఉచితంబు + అ = సరైనదే
కావునన్ = కావున
వేడ్కతోన్ = సంతోషంతో
చని = వెళ్ళి
సోమకున్ = ద్రుపదుడిని
వేఁడినన్ = ప్రార్దింపగా
ధనము+ఓపడు+ఏనియున్ =ధనం ఇవ్వకపోయినప్పటికీ
వీని మాత్రమే = వీడికి (అశ్వత్థామ) సరిపోయేంతగా
నాలుగు + ఏన్ = నాలుగైనా
పాఁడి కుఱ్ఱులన్ = పాడి ఆవులను
వీనికిన్ = ఈ అశ్వత్థామకు
పాలు త్రావుచున్ = పాలు తాగడానికి
ఉండగన్ = ఉండటానికి
ఈడే = ఇవ్వడా !

భావం :
యాచించటం ఎంతో కష్టమైన పని అయినప్పటికీ భేదం లేని మిత్రుడిని యాచించటం ఉచితమే. అందుచేత సంతోషంగా వెళ్ళి ద్రుపదుడిని అడిగినట్లయితే ధనం ఇవ్వలేకపోయినా, అశ్వత్థామ పాలు తాగడానికి సరిపోయేటట్లుగా నాలుగుపాడి ఆవులనైనా ఇవ్వడా?

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

18వ పద్యం :

వ. అని నిశ్చయించి ధ్రుపడునొద్దకుంబోయి నన్నెఱింగించిన, నాతండు ధన రాజ్యమదంబున
నన్నును దన్నును నెఱుంగక ‘యేసు రాజను నీవు పేద పాలుండవు; నాకును
నీకును నెక్కడి సఖ్యం బని పలికిన వానిచేత నవమానితుండనయి వచ్చితి’ నని
ద్రోణుండు దనవృత్తాంతంబంతయుఁ జెప్పిన.

ప్రతిపదార్థం :
అని = ఆ ప్రకారం
నిశ్చయించి = నిర్ణయించుకుని
ద్రుపదు + ఒద్దుకున్ = ద్రుపదుని దగ్గరికి
పోయి = వెళ్ళి
నన్నున్ + ఎఁరింగించినన్ = నన్ను నేను పరిచయం చేసుకొనగా
అతండు = ఆ ద్రుపదుడు
తన రాజ్య మదంబునన్ = తన రాజ్యం వలన కలిగిన పొగరుతో
నన్నువు = నన్ను
తన్నును = తనను
ఎఱుంగక = తెలియక
ఏను = నేను
రాజును = రాజువు
నీవు = నీవు
వేదపాండవు = పేదబ్రాహ్మణుడు
నాకున్నీకున్ = నాకు, నీకూ
ఎక్కడి = ఎక్కడ
సఖ్యంబు = స్నేహం
అని పలికినన్ = అనగా
వాని చెతన్ = ఆ ద్రుపదునితో
అవమానితుండున+ అయి = అవమానింపబడిన వాడినై
వచ్చితిని = వచ్చావు
తోన + వృత్తాంతము + అంతయు = తన వృత్తాంతం అంతా చెప్పగా

తాత్పర్యం :
అని నిర్ణయించుకొని ద్రుపదుని దగ్గరకు వెళ్ళి నన్ను నేను పరిచయం చేసికొనగా, అతడు రాజ్యమదం చేత నన్ను తననూ ఎరుగకుండా నేను రాజును, నీవు బీద బ్రాహ్మణుడివి, నాకూ నీకూ స్నేహం ఎక్కడిది? అని పలికాడు. ఆ విధంగా అతని చేత అవమానం పొంది వచ్చానని ద్రోణుడు తన వృత్తాంతం అంతా తెలిపాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

19వ పద్యం :

సిని రోయా తింగ గాళం
……………………………
……………………………
……………… దనిపెస్

ప్రతిపదార్థం :
విని = ద్రోణుడి వృత్తాంతాన్ని విన్న భీష్ముడు
రోయు తీఁగ = వెదుకుతున్న తీగ
తాన్ = తానే
కాళ్ళన్ పెనఁగన్ = కాళ్ళకు చుట్టుకొన్నాడు
అనుచున్ = అంటూ
పొంగి = సంతోషించి
ఘనభుజున్ = గొప్పభుజాలు కలిగినవాడు అయిన
ద్రోణున్ = ద్రోణుణ్ణి
అభీష్టపూజ = ఇష్టమైన గౌరవాలు
ధనదాన విద్యాములన్ = ధన దానాలిచ్చుట ద్వార
ముదంబున = సంతోషంతో
తనిపెన్ = తృప్తి పరచాడు.

భావం :
అది విన్న భీష్ముడు వెదకబోయిన తీగ కాళ్ళకు చుట్టుకున్నట్లు సంతోషించి, ద్రోణునికి ఇష్టమైన పూజలు చేసి, ధనదానాలిచ్చి ద్రోణుని సంతృప్తి పరచాడు.

20వ పద్యం :

మనుమలనెల్లఁ జూపి మతిమంతుఁడు శాంతనవుండు ‘వీరింజే’
కొని గురువృత్తిమైఁ గఱపు ఘోరకరాసిన విద్యలెల్లఁ బెం
పున జమదగ్నిసూనుఁడును బోలందు నిన్నని విందు విల్లునే
ర్పున నయనైపుణంబునను భూరిపరాక్రమ గర్వసంపదన్

ప్రతిపదార్థం
ముతిమంతుడు = గొప్ప బుద్ధిగలవాడు
శాంతనవుండు = భీష్ముడు
మనుములను = మనుమలను
ఎల్ల + చూపి = అందరినీ చూపించి
వీరిని = వీరందరినీ
చేకొని = గ్రహించి
ఘోర + శర + ఆసన = భయంకర ధనుర్విద్య
విద్యలు + ఎల్లన్ = అన్నింటినీ
పెంపున = అతిశయంగా (బాగా
గురువృత్తిమైన్ = గురుత్వం చేత
కఱపు = నేర్పుము
నిన్నున్ = నీకు
విల్లునేర్చునన్ = విలువిద్యలో
నయనైపుణ్యంబునన్ = నీతి నేర్పులో
భూరి పరాక్రమ = గొప్పబలంకలిగిన
గర్వసంపదన్ = గర్వయనే కలిమిలో
జమదగ్నిసూనఁడును = జమదగ్ని కుమారుడైన పరశురాముడుకూడా
పోలడు = సరిపోలడు
అని విందున్ = అని విన్నాను

భావం :
మతిమంతుడైన భీష్ముడు తన మనమళ్ళనందరినీ ద్రోణునికి చూపించి, వీరికి గురుత్వం వహించి గొప్పగా విలువిద్యలన్నింటినీ నేర్పుము. విలువిద్యలో నీతిలో, పరాక్రమం లో పరశురాముడు కూడా నిన్ను పోలడని విన్నాను.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

21వ పద్యం :

అని కుమారుల నెల్లంజూపి ద్రోణునకు శిష్యులంగా సమర్పించిన

ప్రతిపదార్థం :
అని = ఆ విధంగా పలికి
కుమారులను + ఎల్లన్ = కుమారులందరినీ చూసి
ద్రోణునకు = ద్రోణునికి
శిష్యులన్ +కాన్ = శిష్యులయ్యేట్లుగా
సమర్పించినన్ = అప్పగించగా

భావం :
ఆ విధంగా పలికి కుమారులందరినీ చూపి, వాళ్ళను ద్రోణునికి శిష్యులుగా సమర్పించాడు.

22వ పద్యం :

క. నరుఁడస్త్ర శస్త్ర విద్యా
పరిణతి నధికుఁడయి వినయవరుఁడయి శశ్వ
ద్గురుపూజాయత్నంబునం
బరఁగుచు సంప్రీతుఁ జేసె భారద్వాజున్.

ప్రతిపదార్థం :
నరుడు = అర్జునుడు
అణ, శస్త్ర, విద్యాపరితిన్ = అస్త్రశస్త్ర విద్యాదులలో పక్వతలో
అధికుడు + అయి = గొప్పవాడై
వినయపరుడు + అయి = అణుకువ ప్రధానంగా కలవాడై
శశ్వత్ + గురుపుజాయాత్మంబునన్ = నిరంతరం గురువును పూజించే ప్రయత్నంతో
పరఁగుచున్ = ప్రవర్తిస్తూ
భారద్వాజున్ = భరద్వాజుని కుమారుడైన ద్రోణుణ్ణి
సంప్రీతు = సంతోషించిన వాడిగా
చేసెన్ = చేసెన్

భావం :
అర్జునుడు శస్త్రాస్త్ర విద్యానైపుణ్యంలో అధికుడై వినయంతో ఎప్పుడూ గురుపూజ చేస్తూ ద్రోణుణ్ణి సంతోషపరిచాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

23వ పద్యం :

సీ. ఆతని యస్త్రవిద్యాభియోగమునకుఁ
బ్రియశిష్యవృత్తికిఁ బెద్ద మెచ్చి
‘యన్న! ధనుర్ధరు లన్యులు నీకంటె
నధికులు గాకుండునట్లు గాఁగఁ
గఱపుడు విలువిద్య ఘనముగా’ నని పల్కి
ద్వంద్వ సంకీర్ణ యుద్ధముల తెఱఁగు
రథ మహీ వాజి వారణములపై నుండి
దృఢచిత్ర సౌష్ఠవస్థితుల నేయ

తే. బహువిధ వ్యూహ లేదనోపాయములను
“సంప్రయోగ రహస్యాతిశయము గాఁగం
గలప నర్జునుఁ దొంటి భార్గవుఁడు వింట
నిష్టం చేయని పొగడంగ నెల్ల జనులు.

అర్థాలు :
అతని = ఆ అర్జునుని
అస్త్రవిద్య + అభియోగమునకున్ = అస్త్ర విద్యలందలి ఆసక్తికి
ప్రియ శిష్యవృత్తికిన్ = ప్రియమైన శిష్యుడి నడవడికకి
పెద్ద మెచ్చి = మిక్కిలి సంతోషించి
అన్న = అన్న అని ప్రేమపుర్వకంగా పిలిచి
అన్యులు = ఇతరులైన
ధనుర్థరులు = విలువిద్యను చేపట్టినవాళ్ళు
నీకంటెన్ = నీకన్నా
అధికులు = గొప్పవారు
కాకుండునట్లు = అవ్వకుండా
ఘనముగాన్ = గొప్పగా
విలువిద్యకఱపుదున్ = ధనుర్విద్యనేర్పుతాను
అని = అని పలికి
ద్వంద్వ = ఇద్దరి మధ్య యుద్ధం
సంకీర్ణ యుద్ధము = అనేకులతో చేయుయుద్ధం
తెఱగు = పద్ధతులు
రథ = రథం మీద
మహి = నేలమీద
వాజి = గుర్రం మీద
వారణముల పైన్ = ఏనుగుమీద ఉండే
ధృఢ, చిత్ర = గట్టిగా, చిత్రంగా
సౌస్టివ = చక్కగా ఉన్న
స్థితులన్ = స్థితులలో
ఏయన్ = బాణములు వేయుట
బహువిధ = అనేకమైన
వ్యూహ = వ్యూహములను
భేదన + ఉపాయములను = అనేక విధాలైన వ్యూహాలను భేధించే ఉపాయాలను
సంప్రయోగ = ప్రయోగవిధాన
రహస్య + అతిశయము = రహస్య అతిశయంతో
కాఁగన్ = కూడినట్లుగా
తొంటి = ఒకనాటి
భార్గవుడు = పరశురాముడు
మిటన్ = విలువిద్యలో
అని = అని
పొగడంగ = ఇటువంటివాడా
కఱపెన్ = నేర్పాడ

భావం :
అస్త్రవిద్యలో అర్జునునికి గల పట్టుదలకు, అతని గురుభక్తికి ద్రోణుడు ఎంతో సంతోషించాడు. అన్నా! నీకంటే వేరెవ్వరూ అధికులు కానట్లుగా విలువిద్య నేర్పిస్తానన్నాడు. ద్వంద్వయుద్ధ, సంకులయుద్ధ పద్ధతులను, రథం మీద నేలమీద, గుర్రాల మీద, ఏనుగులమీద ఉండి దృఢం చిత్రం, సౌష్ఠవం అయిన స్థితులలో బాణాలు వేయటాన్ని, బహువిధాలైన వ్యూహాలను ఛేదించే ఉపాయాలను, బాణ ప్రయోగ రహస్యాలను ఇది వరకటి ఆ పరశురాముడు కూడా విలువిద్యలో ఇంతటివాడుకాడని ప్రజలు అర్జునుని పొగిడేటట్లుగా అతనికి నేర్పాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

24వ పద్యం :

మ.కో. భూపనందము లివ్విధంబున భూరి శస్త్రమహాస్త్రవి
ద్యోపదేశపరిగ్రహస్థితి నున్న సందఱయందు వి
ద్యోపదేశము దుల్యమైనను నుత్తమోత్తముఁ డయ్యె వి
పరిశ్రమకౌశలంబున దండితారి నరుండిలన్.

అర్థాలు :
భూపనందనులు = రాకుమారులు
ఈ + విధంబునన్ = ఈ విధంగా
భూరి = గొప్ప
శస్త్ర = శస్త్రాలు
మహా+అస్త్ర = మహాస్త్రాలు
విద్య + ఉపదేశ = విద్యయొక్క బోధన
పరిగ్రహస్థితి = గ్రహించటం అనే స్థితిలో
ఉన్నాన్ = ఉండగా
అందున్ = అందరిలో
విద్య + ఉపదేశము = విద్యాబోధన
తుల్యము = సమానం
అయినను = అయినప్పటికినీ
దండిత + అ = శిక్షించబడిన శత్రువులు కలవాడు
నరుండు = అర్జునుడు
విద్యాపరిశ్రమ = విద్యాభ్యాసపు నేర్పు చేత
ఇలన్ = భూమిలో
ఉత్తమ + ఉత్తములు = శ్రేష్ఠులలో శ్రేష్ఠుడు అయ్యెను

భావము :
రాజకుమారులు ద్రోణుని వలన గొప్ప వస్త్రాస్త్ర విద్యాబోధనను పొందటంలో అంతా సమానమే అయినా, అర్జునుడు విశేషంగా సాధన చేసి సర్వశ్రేష్ఠుడయ్యాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

25వ పద్యం :

వ. అక్కుమారులు ధనుర్విద్యాకౌశలంబెఱుంగ వేఁడి యొక్కనాఁడు ద్రోణుండు
కృత్రిమంబయిన భాసంబను పక్షి నొక్క వృక్షశాఖాగ్రంబున లక్ష్యంబుగా రచియించి,
దాని నందఱకుఁ జూపి ‘మీమీ ధనువులు బాణంబులు సంధించి నా పంచిన
యప్పుడ యిప్పక్షి తలఁ దెగ నేయుం; డే నొకళ్ళి ? కళ్ళన పంచెద’ నని ముందఱ
ధర్మనందనుఁ బిలిచి ‘యీ వృక్షశాఖాగ్రంబున నున్న పక్షి నిమ్ముగా నీక్షించి
మద్వచనానంతరంబున శరమోక్షణంబు సేయు’ మనిన నతండును వల్లె యని
గురువచనంబు సేసియున్న నయ్యుధిష్ఠిరునకు ద్రోణుండిట్లనియె.

ప్రతిపదార్థం :
ఆ+ కుమారులు = ఆ కురు కుమారుల యొక్క
ధనుర్విద్యా కౌశలంబు = విలువద్యలో నేర్పు
ఎఱుంగన్ = తెలిసికొనాలని
వేఁడి = కోరి
ఒక్కనాడు = ఒక్కరోజు
ద్రోణుండు = ద్రోణాచార్యుడు
కృత్రివుంబు+అయిన = కల్పించబడిన
భాసంబు = గద్ద
అనుపక్షిన్ = అనే పక్షిని
ఒక్క. = ఒక
వృక్షశాఖ = చెట్టుకొమ్మ
అగ్రంబున = చివరన
లక్ష్యంబుగాన్ = గురిగా
రచియించి = కూర్చి
దానివి = దాన్ని
అందఱకున్ = అందరికీ చూపి
సంధించి = ఎక్కుపెట్టి
నాపంచిన అప్పుడు+అ = నేను ఆజ్ఞాపించిన సమయంలో
ఈ పక్షి తలన్ = ఈ పక్షి తలను
తెగెన్ = తెగేటట్టుగా
ఏయుండు = కొట్టండి
ఏన్ = నేను .
ఒకళ్లు + ఒకళ్ళన = ఒక్కొక్కరిని
పంచెదన్ = ఆజ్ఞాపిస్తాను
అని = ఆ ప్రకారంగా
ముందఱ = మొదటి
ధర్మనందనుని పిలిచి = ధర్మరాజును పిలిచి
యీవృక్షశాఖా గ్రంబున = ఈ చెట్టుకొమ్మకొనలో
ఉన్న = ఉండిన
పక్షిని = పక్షిని
ఇమ్ముగాన్ = తగిన విధంగా
ఈక్షించి = చూచి
మద్ + వచన = నామాట
అనంతర = తర్వాత
శరమోక్షణంబు = బాణాన్ని వదులుము
అనినన్ = అనగా
అతండును = ఆ ధర్మరాజును
వల్లె అని = సరే అని
గురువచనంబు = గురువుగారి వనిను
చేసి = సిద్ధము గావించి
ఉన్నాన్ = ఉండగా
ఆ+యుధిష్ఠిరునకున్ = ఆ ధర్మరాజుతో
ద్రోణుండు = ద్రోణాచార్యుడు
ఇట్లు + అనియన్ = ఇట్లున్నాడు.

భావం :
ఆ కురుకుమారులు విలువిద్యా నైపుణ్యాన్ని తెలిసికొనగోరి ఒకనాడు ద్రోణుడు భాసమనే పక్షిని రూపొందించి, ఒక చెట్టు కొమ్మ చివరన కట్టి దానిని అందరికీ చూపి నేను చెప్పినప్పుడు, మీమీ ధనువులు ఎక్కుపెట్టి, ఆ పక్షితలను తెగకొట్టండి. నేను ఒక్కొక్కరినే ఆజ్ఞాపిస్తాను అని, ముందుగా ధర్మరాజును పిలిచి ఈ చెట్టు కొమ్మ కొసన ఉండే పక్షిని చక్కగా చూచి, నేను చెప్పినప్పుడు బాణంతో కొట్టుము అనగా అతడు సర్ అని గురువు మాట ప్రకారం సిద్ధంగా ఉండగా, ద్రోణుడు ఇట్లా అన్నాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

26వ పద్యం :

శే. వృక్షశాఖాగ్రమున నున్న పక్షిశిరము
బెల్లముగఁ జూచితే మహీవల్లభుండ!”
యనిన నిమ్ముగఁ జూచితి ననిన, వెండి
యును గురుఁడు ధర్మజున కిట్టు అనియెఁ బ్రీతి.

ప్రతిపదార్థం :
మహీవల్లభుండు = ఓ రాజా
వృక్షశాఖాగ్రమునన్ = చెట్టుకొమ్మ చివరన
పక్షి శిరము = పక్షి తల
తెల్లముగన్ = స్పష్టంగా
చూచితే = చూచావా
అనినన్ = అనగా
ఇమ్ముగాన్ = చక్కగా
వెండియును = మఱియును
గురుఁడు = ద్రోణుడు
ప్రీతిన్ = ప్రీతిలో
ఇట్టలు = ఇలా
అనియున్ = అన్నాడు.

తాత్పర్యం
ఓ ధర్మరాజా! చెట్టుకొమ్మ చివర ఉన్న పక్షితలను స్పష్టంగా చూచావా అని అడుగగా, చక్కగా చూచానని అతడు చెప్పగా, మరల ద్రోణుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు.

27వ పద్యం :

క. ‘జననుత! యా మ్రానిని న
న్నును మణి- నీ భ్రాతృవరులనుం జూచితే నీ?”
వనవుడుఁ జూచితి నన్నిటి
ననఘా! వృక్షమున సున్న యవ్విహగముతోన్.

ప్రతిపదార్థం :
జననుత = జనులచేత పొగడబడేవాడా ఓ ధర్మరాజా!
ఆ మ్రునిని = ఆ చెట్టును
పద్యభాగం 141-420
నన్నున్ = నన్ను
ముఱి = ఇంకా
నీ భ్రాతృనమున్ = నీ తమ్ములను
చూచితె = చూసావా
అనవుడు = అని అనగా
అనఘా = పాపంలేని వాడా! ఓ ద్రోణాచార్య !
వృక్షముననున్న = చెట్టుపైనున్నా
ఆ+విహంగములోన్ = ఆపక్షితో సహ
అన్నిటి = అన్నిటినీ
చూచితి = చూసాను

భావం :
జనులచేత పొగడబడే ఓ ధర్మరాజా! ఆ మానును, నన్ను, నీ తమ్ముళ్ళను చూశావా? అని ద్రోణుడు అడుగగానే పుణాత్మ! చెట్టు మీదనున్న ఆ పక్షితో పాటు అన్నిటినీ చూచానని ధర్మరాజు అన్నాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

28వ పద్యం :

వ. అనిన విని ద్రోణుండు ధర్మజుం బదరి ‘నీ దృష్టి చెదరె; నీవు దీని నేయనోపవు
పాయు’ మని యివ్విధంబున దుర్యోధనాదులైన ధార్తరాష్ట్రులను భీమసేన నకుల
సహదేవులను నానాదేశాగతులైన రాజపుత్రులను గ్రమంబున నడిగిన వారలు
ధర్మనం దను చెప్పినట్ల చెప్పిన, నందఱనిందించి, పురందరనందనుంబిలిచి
వారినడిగిన యట్ల యడిగిన నాచార్యునకు నర్జునుండిట్లనియె.

ప్రతిపదార్థం :
అనినన్ = అనగా
విని = విని
పదరి = మందలించి
నీ దృష్టి = నీ చూపు
చెదరెన్ = చెదరింది
దీనిన్ = ఈ పక్షిని
ఏయన్ ఓపవు = కొట్టలేవు
పాయుము = తప్పుకో
ఈ + విధంబునన్ = ఈ రీతిగా
దుర్యోధనాదులు = దుర్యోధనుడు మొదలైనవారు
దార్తరాష్ట్రులను = ధృతరాష్ట్ర పుత్రులను
నానాదేశగతులైన = వివిధ దేశాల నుండి వచ్చిన రాకుమారులను
క్రమంబంనన్ = వరుసగా
అడిగినన్ = అడుగగా
వారలు = వాళ్ళు
ధర్మనందను చెప్పినట్లే = ధర్మరాజు చెప్పినట్లే
చెప్పినన్ = చెప్పగా
అందఱన్ = అందరినీ
నిందించి = మందలించి
పురందర నందనున్ = దేవేంద్రుని కుమారుడైన అర్జునుని
పిలిచి = చెంతకు పిలిచి
వారిన్ = వాళ్ళను
అడిగిన అట్లు = అడిగిన విధంగానే
అడిగినన్ = అడుగగా
ఆచార్యనకున్ = ద్రోణునకు
అర్జునుడు = అర్జునుడు
ఇట్లు + అనియె = ఇలా అన్నాడు.

భావం :
అనగా విని ద్రోణుడు ధర్మరాజును మందలించి నీ దృష్టి చెదిరింది, నీవుదానిని కొట్టలేవు. పక్కకు తప్పుకొమ్ము అన్నాడు. అదే విధంగా దుర్యోధనుడు మొదలైన కౌరవులను, భీమునకుల, సహదేవులను వివిధ దేశాల నుండి వచ్చిన రాకుమారులను వరుసగా అడుగగా వాళ్ళంతా ధర్మరాజు ఇచ్చిన సమాధానమే ఇచ్చారు. ద్రోణుడు అందరినీ మందలించి తరువాత అర్జునుని పిలిచి వాళ్ళను అడిగినట్లే అడుగగా అతడిట్లా అన్నాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

29వ పద్యం :

క. “పక్షిశిరంబు దిరంబుగ
నిక్షించితి; నొండు గాన నెద్దియు” ననినస్
లక్షించి యేయు మని సూ
కేక్షలు ద్రోణుండు పనిచె నింద్రతనూజున్.

ప్రతిపదార్థం :
పక్షిశిరంబు = పక్షివలన
తిరంబుగన్ = చక్కగా
ఈక్షించితిన్ = చూచాను
ఒండు = ఇతరం
ఎద్దియున్ = ఏదీ కూడా
కానన్ = చూడటం లేదు
అనినన్ = అని తెల్పగా
లక్షించి = గురి పెట్టి
ఏయుము = కొట్టుము
అని = ఆ ప్రకారం
ద్రోణుండు = ద్రోణుడు
సూక్ష్మ + ఈక్షణున్ = సునిశిత దృష్టిగల
ఇంద్రతనూజున్ = అర్జునుని
పనిచెన్ = ఆజ్ఞాపించెను

భావం :
పక్షితలను చక్కగా చూచాను. ఇంకేదీ నాకు కనిపించడం లేదు అని అర్జుడు అనగా ద్రోణుడు గురిచూసి కొట్టుము అని సూక్ష్మదృష్టిగల అర్జునుని ఆజ్ఞాపించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

30వ పద్యం :

క. గురువచనానంతరమున
నరుఁ డప్పుడు శరవిమోక్షణము సేయుఁడుఁ జె
చ్చెరం బక్షిశిరము దెగి త
రుహశాఖనుండి ధారుణిఁ బడియెన్.

ప్రతిపదార్థం :
గురువచన + అనందరములన్. = గురువు మాట తర్వాత
నరుఁడు = అర్జునుడు
శరమోక్షణము = బాణాన్ని విడవటం
చేయుఁడున్ = చేయగా
చెరన్ + చెరన్ = తత్క్షణమే
పక్షి శిరము = పక్షితల
తద్ + ధరుణీరూహశాఖ నుండి = ఆ చెట్టుకొమ్మ నుండి
ధారుణిన్ = భూమిమీద
పడియెన్ = పడింది

భావం :
గురువు చెప్పిన తర్వాత అర్జునుడు బాణాన్ని వదిలాడు. ఆ పక్షితల తత్క్షణమే తెగి చెట్టుకొమ్మ నుండి నేలమీద పడింది.

31వ పద్యం :

ప. ఇట్లశ్రమంబునఁ గృత్రిమ పక్షితలఁ దెగనేసిన యర్జును నచలిత దృష్టికి
లక్ష్యవేధిత్వంబునకు మెచ్చి ద్రోణుందాతనికి ధనుర్వేద రహస్యంబు లుపదేశించె;
నంత.

ప్రతిపదార్థం :
ఆశ్రమంబునన్ = సులువుగా
కృత్రిమ పక్షితలన్ = కల్పింపబడిన పక్షియొక్క తలను
తెగన్ ఏసిన = తెగునట్లు కొట్టిన
అర్జున = అర్జునుని యొక్క
అచలిత దృష్టికి = చెదిరిపోయిన దృష్టికి
లక్ష్యవేధిత్వంబునకున్ = గురిని కొట్టగలిగినందుకు
మెచ్చి = పొగిడి
ద్రోణుండు = ద్రోణాచార్యుడు
అతనికి = అర్జునునికి
ధనుర్వేద రహస్యంబులు = విలువిద్యలోని రహస్యాలు
ఉపదేశించెన్ = ఉపదేశించాడు.
అంతన్ = తర్వాత

భావం :
ఈ విధంగా సులువుగా ఆ కల్పిత పక్షి తలను తెగగొట్టిన అర్జునుని నిశ్చిలదృష్టికీ, గురిని కొట్టే సామర్ధ్యానికీ ద్రోణుడు మెచ్చి, అతనికి విలువిద్యా రహస్యాలు ఉపదేశించాడు. తరువాత

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

32వ పద్యం :

క. మానుగ రాజకుమారులు
తో నొక్కట నొక్కనాఁడు ద్రోణుఁడు గంగా
స్నానార్థం మరిగి యందు మ
హా నియమస్థుఁడయి నీళ్ళనాడుచునున్నన్.

ప్రతిపదార్థం :
మానుగన్ = ఒప్పుగ
రాజకుమారులతోన్ = కురు రాకుమారులన
ఒక్కటన్ = ఒక్కటిగా
గంగాస్నాన+అర్థము = గంగానదిలో స్నానం చేయుటకు
అరిగి = వెళ్ళి
అందున్ = ఆ నదిలో
మహానియస్థుఁడు+అయి = గొప్ప నియమంగలిగినవాడై
నీళ్ళన్ ఆడుచున్ = నీళ్ళలో స్నానం చేస్తూ
ఉన్నాన్ = ఉండగా

భావం :
ఒకనాడు రాకుమారులందరితో కలిసి ద్రోణుడు గంగాస్నానం చేయటానికై వెళ్లి, ఎంతోనిష్ఠతో నీటిలో స్నానం చేస్తుండగా

33వ పద్యం :

క. వెఱచఱవ నీరిలో నా
క్కె నొక మొసలి చూడ్కికి నగోచర మై
పఱతెంచి కుంభసంభవు
చిఱుతొడ వడిఁ బట్టిఁ కొనియె శిష్యులు బెదరన్.

ప్రతిపదార్థం :
వెఱచఱవ = భయపడేటట్లుగా
నీరిలోన = నీరిలో
ఒక్కెఱగాన్ = భయంకరంగా
చూడ్కికిన్ = చూడటానికి
అగోచరము +ఐ = కనిపించనిదై
పఱతెంచి = వచ్చి
కుంభసంభవుడు = ద్రోణుడు
చిఱుతొడ = ద్రోణుని పిక్కను
శిష్యులుబెదరన్ = శిష్యులంతా బెదురునట్లు
వడిన్ = వేగంగా
పట్టుకొనియొక = పట్టుకొన్నది

భావం :
చూసేవారు భయపడేటట్లుగా నీటిలో భయంకరంగా ఒక మొసలి కంటికి కనపడకుండా వచ్చి శిష్యులంతా బెదిరేటట్లుగా ద్రోణుని పిక్కను వెంటనే పట్టుకుంది.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

34వ పద్యం :

క. దాని విడిపింప ద్రోణుఁడు
దానపుడు సమర్థుఁడయ్యుఁ దడయక పనిచెన్
“దీని విడిపింపు” డని నృప
సూనులు శరసజ్యచాపశోభితకరులన్.

ప్రతిపదార్థం :
దానిన్ = ఆ మొసలిని
విడిపింపన్ = విడిపించటానికి
ద్రోణుకడు = ద్రోణాచార్యుడు
తాన్ = తాను
అపుడు = ఆ సమయంలో
సమర్థుఁడయ్యున్ = సమర్ధుడై ఉండికూడా
తడయక = ఆలస్యం చేయకుండా
దీనిన్ = ఈ మొసలిని
శర = బాణములు
సజ్య = అథ్లె త్రాళ్లుచే
చాప = కూడిన ధనస్సులలో
శోభితకరుల = ప్రకాశిస్తున్నా చేతులు కలవారిని
నృపసూనులన్ = రాజకుమారులను
పనిచెన్ = ఆజ్ఞాపించాడు.

భావం :
ఆ మొసలిని విడిపించటానికి ద్రోణుడపుడు తాను సమర్థుడై కూడా ఆలస్యం లేకుండా దీన్ని విడిపించండని ధనుర్భాణా చేత ధరించి ఉన్న రాకుమారులను ఆజ్ఞాపించాడు

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

35వ పద్యం :

తా. దానిష్ నేరక యందటున్ వివశులై తా రున్న, నన్నిరిలోం
గానంగాని శరీరముంగల మహోగ్ర గ్రాహమున్ గోత్ర బి.
సహనం నేను ధరంబులన్ విపుల రిజుండేసి శక్తిన్ మహా
సేన ప్రభ్యుఁడు ద్రోణుణంఘ విడిపించిన విక్రమం చొప్పఁగన్.

ప్రతిపదార్థం :
దానిన్ = ఆ మొసలిని విడిపించటం
నేరక = చేతకాక
అందయిన్ = అందరూ
వివశులు + ఐ = మైమరచిన వాళ్ళయి
తారు = తాము
ఉన్నాన్ = ఉండగా
ఆ + వీరిలోన్ = ఆ నీటిలో
కానన్ + కాని = చూడటానికి సాధ్యపడని
శరీరమున్ + కల = దేహం ఉండే
మహా + ఉగ్ర+గ్రాహమున్ = మిక్కిలి భయంకరమైన మొసలిని
విపులతేజుండు = ఎంతో పరాక్రమం కలవాడు.
శక్తి = బలంలో
మహాసేన ప్రఖ్యుడు = కుమారస్వామితో సమానుడు
గోత్రభిత్+సూనుండు = కొండలను చీల్చిన ఇంద్రుని కుమారుడు
ఏను = ఐదు
విక్రమంబు = పరాక్రమం
ఒప్పఁగన్ = ప్రకాశించేటట్లు
ద్రోణు జంఘన్ = ద్రోణాచార్యుని యొక్క పిక్కను విడిపించెను

భావం :
ఆ రాజకుమారులంతా మొసలిని విడిపించటం చేతకాక దిక్కు తెలియని స్థితిలో ఉండగా, మహాపరాక్రమశాలి శక్తిలో కుమారస్వామి, వంటివాడు పర్వతాలు రెక్కలు నరికిన దేవేంద్రుని పుత్రుడు అయిన అర్జునుడు, నీటిలో కనిపించకుండా ఉన్న ఆ భయంకరమైన మొసలిని అయిదు బాణాలతో కొట్టి ద్రోణాచార్యుని విడిపించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

36వ పద్యం :

…………………………………..
జూచి, ద్రోణుందర్లును ధనుః కౌశలంబునకుఁ దనయందని స్వేగ మారడు గుచ్చి,
దీనిచే ద్రుపమందు బంధుసహితంబు పడతుందగునని తన దిములు
సంతోషించి, దానికి అనేక దివ్యబాణంబు లిచ్చేను) ఎరుకు కొంద కనాంటి పరాక్రమ
గుణకంపదలు వైశంపాయనుందు జనను జయనమం జెప్ప

ప్రతిపదార్థం :
అ + మహా + ఉగ్ర = ఆ గొప్ప భయంకరమైన
గ్రాహంబు = మొసలి
పార్థ బాణ పంచక = అర్జునుని ఐదు బాణాలతో
విభిన్న దేహంబయి = చీల్చబడిన శరీరం కలదై
పంచత్వంబున = మరణాన్ని
పొందినన్ = పొందగా
చూచి = కనుగొని
ధనుస్+కౌశలంబునకున్ = విలువిద్యా నైపుణ్యానికి
తనయందు = తనపై గల
అతిస్నేహంబునకున్ = మిక్కిలి ప్రీతికి
మెచ్చి = పొగిడి
వీనిచే = వీనివల్ల
బంధుసహితంబు = బంధువులతో సహా
పరాజితుండు = ఓడగొట్టబడినవాడు
అగున్ = కాగలడు
మనంబున = మనసులో
వానికిన్ = అర్జునునకు
దివ్యబాణంబులు = దేవతాసంబంధమైన బాణాలు
ఇచ్చేన్ = ఇచ్చాడు.
కొండుకనాటి = అర్జునుని యొక్క చిన్ననాటి
పరాక్రమ గుణసంపదలు = పరాక్రమ గుణాల యొక్క గొప్పలు
వైశంపాయనకలు = వైశంపాయన మహర్షి
జనమేజయునకు = అర్జునుని మనమడికి చెప్పెను

భావం :
అతి భయంకరమైన మొసలి అర్జునుని అయిదు బాణాల చేత శరీరం చలీ మరణించింది. అది చూసి ద్రోణుడు అర్జునుని విలువిద్యా నైపుణ్యానికి, తనపట్ల గల ప్రేమకు మెచ్చి అతనిచేత ద్రుపదుడు బంధువులతో సహా ఓడిపోగలడని సంతోషించి అనేక దివ్యబాణాలు అతనికిచ్చాడు, అని అర్జునుని చిన్ననాటి పరాక్రమ గుణ విశేషాలు వైశంపాయనుడు జనమేజయునికి చెప్పాడు.

విద్యాలక్ష్యం Summary in Telugu

కవి పరిచయం

నన్నయ 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన రాజరాజనరేంద్రుని ఆస్థానకవి. ఉభయభాషా కావ్యరచనాభి శోభితుడు, లోకజ్ఞుడు, ఉచితజ్ఞుడు, రసజ్ఞుడు అయిన నన్నయ సాగించిన భారతానువాదం అనన్య సామాన్యం. వేదవ్యాస విరచితమై పంచమ వేదంగా చెప్పుకొనే సంస్కృత మహాభారతాన్ని రాజరాజు కోరిక మేరకు తెలుగులోకి అను వాదం చేసాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

నన్నయ ‘శ్రీవాణీ గిరిజాశ్చిరాయ’ అంటూ సంస్కృత శ్లోకంతో మహా భారతాన్ని మొదలుపెట్టి ఆనాటి ప్రాచీన విద్వాంసుల మెప్పు పొందాడు. బహుభాషా విజ్ఞుడు, ఉద్దండపండితుడు అయిన నన్నయ మహాభారతంలో ఆది, సభా, అరణ్యపర్వంలోని నాల్గవ ఆశ్వాసంలోని 142వ పద్యం వరకు రచించాడు. వాటితోపాటు ఆంధ్ర శబ్దచింతామణి, చాముండికా విలాసం, ఇంద్ర విజయం, లక్షణసారం అనే గ్రంథాలు రచించాడు.

మిత్రుడైన నారాయణభట్టు సహాయంతో నన్నయ భారతానువాదానికి ఉపక్రమించాడు. మహాభారతాన్ని చంపూ పద్ధతిలో అనువదించిన నన్నయ భారత రచన ఒక స్వతంత్ర రచనలాగా సాగింది. నన్నయ తదనంతర కవులెందరికో మార్గదర్శకుడై “ఆదికవి” అనిపించుకున్నాడు.

రచనా విధానం

నన్నయ కథా నిర్వహణలో, భాషలో, శైలిలో, దృక్పథంలో మూలంలోకన్నా స్వతంత్రంగా వ్యవహరించాడు. మార్గ పద్ధతిలో సాగిన నన్నయ రచనలో అక్షర రమ్యత, నానారుచిరార్థ సూక్తి నిధిత్వము, ప్రసన్న కథా కలితార్థయుక్తి అనే లక్షణాలు కనిపిస్తాయి. నన్నయ వచనం కూడా పద్యంలా సొగసుతో ప్రౌఢ సమాసాలతో రసభరితంగా సాగింది.

నన్నయభట్టు తెలుగులో భాషాసంస్కరణల్ని ప్రవేశపెట్టి ‘శబ్దశాసనుడు’గా పేరు గాంచాడు. వ్యాసభారతంలోని ధర్మాన్ని నన్నయ కావ్యశైలిలోకి మార్చి తెలుగు సాహిత్యంలో కావ్య రచనకు మార్గం సుగమం చేశాడు. ఆధ్యాత్మిక ధర్మప్రబోధం, లోకజ్ఞత, రాజనీతి, లౌకిక నీతులు, శాస్త్ర వైదుష్యం నన్నయ రచనలో గాఢంగా కనిపిస్తాయి.

ప్రస్తుత పాఠ్యభాగం ‘విద్యాలక్ష్యం’ నన్నయ భట్టు విరచితమైన ‘శ్రీమదాంధ్ర మహాభారతం’ లోని ఆదిపర్వం, పంచమ ఆశ్వాసం నుంచి గ్రహించబడింది.

పాఠ్యాంశ సందర్భం

భరద్వాజ మహర్షి పుత్రుడైన ద్రోణాచార్యుడు గొప్ప అస్త్రవిద్యా నిపుణుడు. కౌరవ పాండవులకు విలువిద్యను నేర్పడానికి భీష్ముడు ద్రోణాచార్యుడిని నియమించాడు. కురు పాండవులు ద్రోణాచార్యుని వద్ద గురుకులంలో విద్యను అభ్యసిస్తున్నారు. ద్రోణాచార్యుడు తన అస్త్రవిద్యా నైపుణ్యాలను వేటినీ దాచుకోకుండా తన శిష్యులకు నేర్పించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

అందులో తన ప్రియశిష్యుడైన అర్జునుడికి అనేక ధనుర్విద్యా రహస్యాలను బోధించాడు. గురుకులంలో శిక్షితులందరినీ పరీక్షించడానికి, వాళ్ళ నైపుణ్యం తెలుసుకొనేందుకు ఒక పరీక్షను ఏర్పాటు చేసాడు. గురువు పెట్టే పరీక్షలను అర్థం చేసుకుని లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విద్యార్థికి ఉండవలసిన లక్షణాలను తెలుపుతుంది ఈ పాఠ్యాంశం.

TS Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

Telangana TSBIE TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ Textbook Questions and Answers.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
చరానుపాతాల సూత్రాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించండి.
జవాబు.
చరానుపాత సూత్రం స్వల్పకాలానికి చెందినది. ఈ సూత్రాన్ని రికార్డో, మాల్టస్, మార్షల్ వంటి సంప్రదాయ ఆర్థికవేత్తలు విశేష ప్రాముఖ్యమిచ్చారు. సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఈ సూత్రాన్ని వ్యవసాయ రంగానికే పరిమితం చేశారు. స్టిగ్లర్ అనే ఆర్థికవేత్త ఒక ఉత్పాదకాన్ని సమాన పరిమాణంలో పెంచుతూ మిగతా కారకాలను స్థిరంగా ఉంచితే ఒక స్థాయి తరువాత ఉపాంత ఉత్పాదకత క్షీణిస్తుంది.

ఈ సిద్ధాంతం కొన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి, ఒక ఉత్పత్తి సాధనం పరిమాణంలో మార్పులు చేస్తూ ఉన్నప్పుడు ఏ అనుపాతంలో మారుతుందో తెలియజేయును.

చరానుపాత సూత్రం ప్రకారం మొత్తం ఉత్పత్తి, సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తులు ప్రారంభంలో పెరిగి ఆ తరువాత అవి వివిధ ఉత్పత్తి స్థాయిల వద్ద గరిష్ట స్థాయికి చేరతాయి. మొదటగా ఉపాంత ఉత్పత్తి తరువాత సగటు ఉత్పత్తి, ఆ తరువాత మొత్తం ఉత్పత్తి క్షీణిస్తాయి.

ప్రమేయాలు :

  1. ఈ సూత్రం స్వల్పకాలానికి వర్తిస్తుంది.
  2. సాంకేతిక విజ్ఞానంలో మార్పు ఉండదు.
  3. ఉత్పత్తి కారకాల సమ్మేళనం మార్చడం సాధ్యమవుతుంది.
  4. శ్రమ మాత్రమే చర ఉత్పత్తి కారకం, మిగతా ఉత్పత్తి కారకాలన్నీ స్థిరం.
  5. ఉత్పత్తిని భౌతిక యూనిట్ల రూపంలో కొలవవచ్చు.
  6. శ్రమ సజాతీయంగా ఉంటుంది.

క్షీణ ప్రతిఫల సూత్రాన్ని ఈ క్రింది ఉదాహరణ ద్వారా వివరించవచ్చు. భూమిని స్థిరంగా ఉంచి మరొక సాధనం (శ్రమ)ను పెంచుకుంటూ పోతే, ఉత్పత్తిలో వచ్చే మార్పును మూడు దశలుగా వర్గీకరించవచ్చు. ఈ మూడు దశలలో మొత్తం ఉత్పత్తి, ఉపాంత, సగటు ఉత్పత్తుల మార్పులను పరిశీలించవచ్చు. దీనిని ఈ క్రింది పట్టిక ద్వారా వివరించవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 1

పై పట్టికలో మొత్తం ఉత్పత్తి ప్రారంభంలో పెరుగు తున్న రేటులో, తరువాత తగ్గుతున్న రేటులో పెరుగుతుంది. 7వ శ్రామికుని ఉపయోగించినప్పుడు మొత్తం ఉత్పత్తి గరిష్టమై తరువాత క్షీణిస్తుంది. సగటు ఉత్పత్తి 3వ శ్రామికుడు వరకు పెరిగి 4వ శ్రామికుని దగ్గర గరిష్ట స్థాయికి చేరి తరువాత క్షీణిస్తుంది.

7వ శ్రామికుని దగ్గర మొత్తం ఉత్పత్తి గరిష్టమైనప్పుడు ఉపాంత ఉత్పత్తి శూన్య మైంది. 8వ శ్రామికుని వద్ద మొత్తం ఉత్పత్తి క్షీణించగా ఉపాంత ఉత్పత్తి ఋణాత్మకమైంది. దీనిని ఈ ప్రక్క రేఖా పటం ద్వారా వివరించవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 2

రేఖాపటంలో TP రేఖ A బిందువు వరకు వేగంగా పెరుగుతూ C బిందువు వద్ద గరిష్టమై తరువాత క్షీణిస్తుంది. ‘E’ బిందువు వద్ద AP, MP రేఖలు ఖండించుకోవడం జరిగింది. మొత్తం ఉత్పత్తి C వద్ద గరిష్టంకాగా AP క్షీణించగా, MP శూన్యమైనది. TP క్షీణించగా, MP ఋణాత్మకమైంది. చరానుపాత సూత్రంలోని ఉత్పత్తి దశలను మూడు దశలుగా విభజించవచ్చు.

  1. పెరుగుతున్న ప్రతిఫలాలు
  2. క్షీణ ప్రతిఫలాలు
  3. రుణాత్మక ప్రతిఫలాలు

1. పెరుగుతున్న ప్రతిఫలాలు :
ఈ దశలో మొత్తం ఉత్పత్తి ఉపాంత ఉత్పత్తి కంటే అధికంగాను, ఉపాంత ఉత్పత్తి సగటు కంటే ఎక్కువగాను ఉండును.

2. క్షీణ ప్రతిఫలాలు :
ఈ దశలో మొత్తం ఉత్పత్తి తగ్గుతున్న రేటులో పెరుగుతుంది. సగటు, ఉపాంత ఉత్పత్తులు క్షీణిస్తాయి.

3. రుణాత్మక ప్రతిఫలాలు :
ఈ దశలో మొత్తం, సగటు ఉత్పత్తులు క్షీణించగా ఉపాంత ఉత్పత్తి ఋణాత్మకం అవుతుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 2.
తరహాననుసరించిన ప్రతిఫలాల సూత్రాన్ని వివరించండి.
జవాబు.
దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి సాధనాలను ఒక అనుపాతంలో మార్చినప్పుడు ఉత్పత్తి ఏ అనుపాతంలో మార్పు చెందుతుందో తెలియజేసే దానిని తరహాననుసరించి ప్రతిఫలాలు అంటారు. మొత్తం ఉత్పత్తి కారకాలను మారిస్తే ఉత్పత్తిలో మూడు దశలు కనిపిస్తాయి.

  1. తరహాననుసరించి పెరుగుతున్న ప్రతిఫలాలు,
  2. తరహాననుసరించి స్థిర ప్రతిఫలాలు,
  3. తరహాననుసరించి క్షీణ ప్రతిఫలాలు.

ప్రమేయాలు :

  1. ఉత్పత్తి కారకాలన్నీ చరం.
  2. సాంకేతిక పరిజ్ఞానం స్థిరం.
  3. ఉత్పత్తిని భౌతికరూపంలో కొలవవచ్చు.
  4. సంపూర్ణ పోటీ ఉంటుంది.
  5. శ్రామికులకు లభించే పనిముట్లు, సాధనాలు ఇవ్వబడ్డాయి.

పై ప్రమేయాలకు లోబడి అన్ని ఉత్పత్తి కారకాలను ఒకే నిష్పత్తిలో పెంచినప్పుడు ఉత్పత్తి తరహా విస్తరిస్తుంది.
దీనిని ఈ క్రింది పట్టిక ద్వారా వివరించవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 3

పట్టికలో 1, 2వ శ్రామికులను వాడినప్పుడు మొత్తం ప్రతిఫలాలు రెండు రెట్లకంటే ఎక్కువగా ఉన్నాయి. ఇది పెరుగుతున్న ప్రతిఫలాలను తెలుపును. అంటే ఉత్పత్తిలో పెరుగుదల కన్నా ఉత్పాదకతలో పెరుగుదల ఎక్కువ. 3, 4 శ్రామికులను వినియోగిస్తే ఉపాంత ఉత్పత్తి 11 యూనిట్లుగా ఉంది.

దీనిని స్థిర ప్రతిఫలాల దశ అంటారు. అంటే ఉత్పత్తిలో పెరుగుదల, ఉత్పాదకత పెరుగుదల రెండు సమానం. ఇక 5, 6 శ్రామికులను వాడినప్పుడు మొత్తం ప్రతిఫలాలు తగ్గగా ఉపాంత ప్రతిఫలాలు క్షీణించాయి. దీనిని క్షీణ ప్రతిఫలాల దశ అంటారు. అనగా ఉత్పత్తిలో పెరుగుదల రేటు ఉత్పాదకత పెరుగుదల రేటు కన్నా తక్కువ.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 4

పై రేఖాపటంలో AD రేఖ తరహాననుసరించిన ప్రతిఫలాలు A నుండి B వరకు పెరుగుతున్న ప్రతిఫలాలు, B నుంచి C కి స్థిర ప్రతిఫలాలు, C నుంచి D కి క్షీణ ప్రతిఫలాలు ఉన్నాయి.

ఉత్పత్తిదారుడు వివిధ ప్రతిఫలాలు పొందడానికి కారణాలు :

  1. శ్రమ విభజన, ప్రత్యేకీకరణ వల్ల పెరుగుతున్న ప్రతిఫలాలు ఏర్పడతాయి..
  2. సంస్థ విస్తరించడం వల్ల ఉత్పత్తి కారకాల అసమర్థత; అజమాయిషీ లోపం వల్ల క్షీణ ప్రతిఫలాలు ఏర్పడతాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 3.
అంతర్గత ఆదాలను, బహిర్గత ఆదాలను విశదీకరించండి.
జవాబు.
పరిశ్రమ విస్తరణ వల్ల పరిశ్రమలో ఉత్పత్తి పరిమాణం పెరిగి ఈ ఆదాలు సంస్థలకు లభిస్తాయి. పరిశ్రమలో ఉత్పత్తి తరహా పెరిగినప్పుడు ఏర్పడే ఆదాలను బహిర్గత ఆదాలంటారు.

అంతర్గత ఆదాలు :
1. సాంకేతిక ఆదాలు :
మూలధన పరికరాలు ఇవ్వబడినవిగా భావిస్తే స్వల్ప కాలంలో సాంకేతిక ఆదాలను పొందవచ్చు. సంస్థ ఎక్కువ సామర్థ్యం కలిగిన మంచి, పెద్ద యంత్రాలను, అధునాతన ఉత్పత్తి పద్ధతులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల ఉత్పత్తి బాగా పెరుగుతుంది.

2. మార్కెటింగ్ ఆదాలు :
పెద్ద సంస్థలు అధిక మొత్తంలో ముడిపదార్థాలు కొనడం వల్ల తమకు అనుకూల షరతుల ప్రకారం నాణ్యతగల ముడిసరుకులను సమయానికి పొందడం, తక్కువ రవాణా ఖర్చులు లాంటి ప్రయోజనాలు ఏర్పడతాయి.

3. నిర్వహణ ఆదాలు :
పెద్ద సంస్థలు ప్రత్యేక నైపుణ్యం కలిగిన వ్యక్తులను నియమించుకుంటున్నందువల్ల విధి సంబంధిత ప్రత్యేకీకరణ పెరిగి సంస్థలో ఉత్పాదక సామర్థ్యం పెరిగి, ఉత్పత్తి పెరిగి సగటు యాజమాన్యపు వ్యయం తగ్గుతుంది.

4. విత్తపరమైన ఆదాలు :
పెద్ద సంస్థకు ఉన్న మంచి పేరు, అధిక ఆస్తులవల్ల రుణాలను, సులభంగా తక్కువ వడ్డీ రేటుకు సకాలంలో పొందుతుంది. సంస్థ మూలధనాన్ని మార్కెట్లో షేర్లు, డిబెంచర్లు అమ్మడం వల్ల కూడా సేకరిస్తుంది.

5. నష్టాన్ని భరించే ఆదాలు:
పెద్ద సంస్థలు చిన్న సంస్థల కంటే సులభంగా నష్టాన్ని విస్తరించుకోగలవు. ఒకరకం వస్తూత్పత్తిలో వచ్చిన నష్టాన్ని ఇతర రకాల వస్తూత్పత్తిలో వచ్చే లాభాలతో భర్తీ చేసుకోవచ్చు. మార్కెట్లను విస్తరించుకోవడం వల్ల ఒక మార్కెట్లో ఉన్న తక్కువ డిమాండ్ను ఇతర మార్కెట్లో ఉన్న అధిక డిమాండ్తో భర్తీ చేసుకోవచ్చు.

6. పరిశోధన ఆదాలు :
చిన్న సంస్థ కంటే పెద్ద సంస్థకు అధిక వనరులుంటాయి. అందువల్ల స్వంతంగా పరిశోధన ప్రయోగశాలను కలిగి శిక్షణ పొందిన పరిశోధకులను నియమించుకుంటుంది. వారు కనుగొనే కొత్త విషయాలు సంస్థ ఆస్తి. సంస్థ వీటిని ఉపయోగించుకొని వ్యయాన్ని తగ్గించుకొని ఉత్పత్తిని పెంచుకుంటుంది.

7. సంక్షేమ ఆదాలు :
సంస్థలు శ్రామికులకు సంక్షేమ సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. పెద్ద సంస్థలు పనిచేయడానికి మంచి పరిస్థితులను, సంస్థ లోపల, బయట కల్పిస్తాయి. సంక్షేమ సౌకర్యాలకయ్యే వ్యయం ఎక్కువగా ఉన్నా దానివల్ల శ్రామికుల సామర్థ్యం పెరిగి, మొత్తం ఉత్పత్తి పెరగడానికి, ఉత్పత్తి వ్యయం తగ్గడానికి అవకాశం ఉంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

బహిర్గత ఆదాలు :
పరిశ్రమను ఒక ప్రాంతంలో స్థాపించినప్పుడు నవకల్పనలను ప్రవేశపెట్టడం వల్ల, ప్రత్యేకీకరణను ప్రవేశపెట్టడం వల్ల ఏర్పడే ఆదాలే బహిర్గత ఆదాలు. వీటిని పరిశ్రమలోని సంస్థలన్నీ అనుభవిస్తాయి..

1. కేంద్రీకరణ ఆదాలు :
ఒక పరిశ్రమ ఒక ప్రాంతంలో కేంద్రీకరణ జరిగితే కొన్ని సౌకర్యాలు ఏర్పడతాయి. వీటిని సంస్థలన్నీ అనుభవిస్తాయి.

నైపుణ్యం కలిగిన శ్రామికులు లభించటం, రవాణా, సమాచార సౌకర్యాలు ఏర్పరచడం, మెరుగుపరచటం, బ్యాంకులు, విత్త సంస్థలు, బీమా సంస్థలు తమ శాఖలను ఏర్పాటు చేసి సకాలంలో ఋణాలను తక్కువ వడ్డీ రేటుకు అందించడం, బీమా సౌకర్యాన్ని ఏర్పరచడం, సంస్థలకు విద్యుచ్ఛక్తిని సరిపడే పరిమాణంలో తక్కువ రేట్లకు సరఫరా చేయడం, ఇతర అవస్థాపనా సౌకర్యాలు ఏర్పరచడం, అనుషంగిక పరిశ్రమలు ఏర్పడి, కేంద్రీకృతమై పరిశ్రమకు కావలసిన వస్తువులను సరఫరా చేస్తాయి.

2. సమాచార ఆదాలు :
ఒక సంస్థ కంటే పరిశ్రమలో ఎక్కువ వనరులు ఉన్నందువల్ల పరిశోధనా ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తుంది. పరిశ్రమకు చెందిన సమాచార కేంద్రం తమ ప్రచురణ ద్వారా ముడి సరుకుల లభ్యత, ఆధునిక యంత్రాలు, ఎగుమతి అవకాశాలు మొదలైన ఇతర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సంస్థలకు అందిస్తుంది.

3. ప్రత్యేకీకరణ ఆదాలు :
పరిశ్రమ పరిమాణం పెరిగితే సంస్థలు వివిధ ప్రక్రియలలో ప్రత్యేకీకరణను సాధిస్తాయి. ఫలితంగా పరిశ్రమ మొత్తానికి లాభం చేకూరుతుంది. ఉత్పత్తి పెరిగి, ఉత్పత్తి వ్యయాలు తగ్గుతాయి.

4. సంక్షేమ ఆదాలు :
సంస్థ కంటే పరిశ్రమే శ్రామికులకు, సంక్షేమ సౌకర్యాలు కల్పించడంలో ముందు ఉంటుంది. ఫలితంగా శ్రామికుల సామర్థ్యం పెరిగి, పరిశ్రమలో ఉత్పత్తి పరిమాణాన్ని, నాణ్యతను పెంచవచ్చు. వీటివల్ల సంస్థ ఉత్పాదక సామర్థ్యం పెరిగి సగటు ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది.

ప్రశ్న 4.
సంస్థలోని స్వల్ప కాలిక వ్యయాలను తగిన పటాల సహాయంతో సోదాహరణంగా వివరించండి.
జవాబు.
ఒక ఉత్పత్తిదారుడు ఉత్పత్తికి సంబంధించిన నిర్ణయాలు రెండు కాలాల ఆధారంగా చేస్తాడు.
అవి : 1. స్వల్పకాలం
2. దీర్ఘకాలం.

స్వల్పకాలంలో కొన్ని ఉత్పత్తి కారకాలు అనగా శ్రామికులు,ముడి పదార్థాలను మార్చవచ్చు. అందువల్ల ఉత్పత్తిదారునికి స్వల్పకాలంలో స్థిర వ్యయాలు, చర వ్యయాలు ఉంటాయి.
1. స్థిర వ్యయాలు :
ఉత్పత్తిదారుడు భవనాలు, యంత్రాలు, శాశ్వత కార్మికుల జీతాలు, బీమా మొదలైన వాటిపై చేసే వ్యయాలను స్థిర వ్యయాలు అంటారు. వస్తూత్పత్తిని పెంచినా, తగ్గించినా ఈ వ్యయాలు మారవు. వీటిని అనుబంధ వ్యయాలని, వ్యవస్థాపరమైన వ్యయాలని అంటారు.

2. చర వ్యయాలు :
శ్రామికులు, ముడి పదార్థాలు మొదలైన వాటిపై చేసే వ్యయాలను చర వ్యయాలు అంటారు. ఈ వ్యయాలు ఉత్పత్తితో పాటు మారతాయి. దీనిలో ముడి పదార్థాలకు చెల్లించే ధర, శ్రామికుల వేతనాలు, రవాణా మొదలైన చెల్లింపులు ఉంటాయి. వీటిని ప్రత్యక్ష వ్యయాలని లేదా ప్రధాన వ్యయాలని అంటారు.

మొత్తం వ్యయం :
స్వల్పకాలంలో స్థిర మరియు చర వ్యయాలను కలుపగా మొత్తం వ్యయం వస్తుంది. మొత్తం వ్యయం = స్థిర వ్యయం + చర వ్యయం
TC = FC + VC
వాటిని ఈ క్రింది పట్టిక ద్వారా చూపవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 5

పై పట్టికలో ఉత్పత్తిని క్రమంగా పెంచుతూ పోయినపుడు స్థిర వ్యయాలు మారకుండా ఉన్నాయి. చర వ్యయాలు | ఉత్పత్తితో పాటు మారుతున్నాయి. స్థిర, చర వ్యయాలను కలుపగా మొత్తం వ్యయం వస్తుంది. దీనిని క్రింది రేఖాపటం ద్వారా వివరించవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 6

ప్రక్క రేఖాపటంలో ‘X’ అక్షంపై ఉత్పత్తి యూనిట్లని, Y’ అక్షంపై వ్యయాన్ని తీసుకోవడం జరిగింది. వివిధ వ్యయ రేఖల ఆకారం ఉత్పత్తికీ, వివిధ వ్యయాలకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేయును. స్థిర వ్యయరేఖ (TFC). ‘X’ అక్షానికి సమాంతరంగా ఉంది.

స్వల్పకాలంలో ఉత్పత్తి పెరగటం వల్ల స్థిర వ్యయంలో ఎలాంటి మార్పు ఉండదు. చర వ్యయరేఖ మూలబిందువు దగ్గర మొదలవుతుంది. దీనికి కారణం ఉత్పత్తి శూన్యమయితే చర వ్యయం కూడా శూన్య మౌతుంది. ఉత్పత్తి పెరిగేకొద్ది చర వ్యయం కూడా పెరుగుతుంది.

సగటు వ్యయం :
మొత్తం వ్యయాన్ని మొత్తం ఉత్పత్తితో భాగిస్తే వచ్చేది సగటు వ్యయం. AC TC/Q ఉపాంత వ్యయం : ఉత్పత్తి ప్రక్రియలో అదనంగా ఒక యూనిట్ని పెంచినప్పుడు ఆ అదనపు యూనిట్ వల్ల మొత్తం వ్యయంలో వచ్చే మార్పు.
MC = ∆TC/∆Q

ఈ క్రింది రేఖాపటం ద్వారా MC మరియు AC సంబంధాన్ని తెలియజేయవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 7

పై రేఖాపటంలో ‘X’ అక్షంపైన ఉత్పత్తిని, Y అక్షంపైన వ్యయాన్ని చూపినాము. SAC స్వల్పకాలిక వ్యయరేఖ, యూనిట్లు SMC స్వల్పకాలిక ఉపాంత వ్యయరేఖ. ఉత్పత్తి పెరుగుతుంటే మొదట సగటు వ్యయం తగ్గుతుంది. సగటు వ్యయం తగ్గు తున్నంత వరకు ఉపాంత వ్యయం, సగటు వ్యయంకన్నా తక్కువగా ఉంటుంది.

ఉత్పత్తిని కొనసాగిస్తే సగటు వ్యయం కనిష్ట స్థాయికి వస్తుంది. ఉపాంత వ్యయం, సగటు వ్యయంతో సమానమౌతుంది. SAC మరియు SMC ఖండించుకున్న ‘A’ బిందువు వద్ద ఉత్పత్తి వ్యయం కనిష్టంగా ఉంటుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 5.
రాబడి విశ్లేషణపై ఒక వ్యాసాన్ని రాయండి.
జవాబు.
రాబడి అంటే ఒక సంస్థ వివిధ ధరలకు వస్తువును అమ్మగా పొందిన ఆదాయం. అమ్మకం చేసిన వస్తువు పరిమాణాన్ని దాని ధరతో హెచ్చించడం ద్వారా మొత్తం రాబడిని లెక్కించవచ్చు. అంటే TR = P.Q. రాబడికి సంబంధించి మూడు భావనలున్నాయి. అవి :

  • మొత్తం రాబడి
  • సగటు రాబడి
  • ఉపాంత రాబడి.

(i) మొత్తం రాబడి (Total Revenue – TR) :
సంస్థ మార్కెట్లో ఉన్న ధరకు అమ్మిన వస్తు రాశి వల్ల పొందే ఆదాయాన్ని మొత్తం రాబడి అంటారు.
మొత్తం రాబడి = వస్తువు ధర × ఉత్పత్తి (అమ్మిన వస్తువుల పరిమాణం).
Total Revenue (TR) = Price (P) × Quantity sold (Q)
TR = P.Q.
వినియోగదారులు వస్తువుపై చేసిన మొత్తం వ్యయం సంస్థకు మొత్తం రాబడి అవుతుంది.

(ii) సగటు రాబడి (Average Revenue – AR) :
సగటున ఒక యూనిట్ వస్తువుకు లభించే రాబడిని. సగటు రాబడి అంటారు. అమ్మిన వస్తువు యూనిట్లతో రాబడిని భాగిస్తే సగటు రాబడి తెలుస్తుంది. అసలు ధరే సగటు రాబడి.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 8

అంటే సగటు రాబడి ధరకు సమానంగా ఉంటుంది. ‘డిమాండ్ లేదా ధర రేఖను సగటు రాబడి రేఖ అంటారు.

(iii) ఉపాంత రాబడి (Marginal Revenue – MR) :
మరొక యూనిట్ వస్తువును అదనంగా అమ్మడం వల్ల మొత్తం రాబడిలో వచ్చే పెరుగుదలను అంటే అదనపు రాబడిని ఉపాంత రాబడి అంటారు.
MRn = TRn – TRn-1 లేదా MR = \(\frac{\mathrm{dTR}}{\mathrm{dQ}}\), d అనేది మార్పు.

సంపూర్ణ పోటీలో AR, MR రేఖలు (AR and MR Curves under Perfect Competition) :
సంపూర్ణ పోటీ మార్కెట్లో కొనుగోలుదార్ల సంఖ్య, అమ్మకందార్ల సంఖ్య చాలా అధికం. ఏ ఒక్కరూ వస్తువు ధరను నిర్ణయించలేరు. సజాతీయ వస్తువులుంటాయి. వస్తువు ధర దాని సప్లయ్, డిమాండ్లను బట్టి నిర్ణయించబడుతుంది.

పరిశ్రమలో ఒకే ధర ఉంటుంది. సంస్థలన్నీ ఈ ధరను అంగీకరించి ఎంత పరిమాణంలోనైనా వస్తువులను అమ్ముకోవచ్చు. కాబట్టి సంస్థ ఉత్పత్తికుండే డిమాండ్ రేఖ సంపూర్ణ వ్యాకోచాన్ని కలిగి ఉంటుంది. సంస్థ ఉత్పత్తికున్న డిమాండ్ రేఖే దాని సగటు రాబడి రేఖ. ఈ సగటు రాబడి రేఖ OX – అక్షానికి సమాంతరంగా ఉంటుంది.

సంపూర్ణ పోటీలో ధర స్థిరం. అందువల్ల సగటు రాబడి (AR) ఉపాంత రాబడి (MR) కి సమానంగా ఉండటమే కాకుండా వస్తువు ధర కూడా సమానంగా ఉంటాయి. అంటే P = AR = MR. ఉపాంత రాబడి రేఖ కూడా OX అక్షానికి సమాంతరంగా ఉండటమే కాకుండా సగటు రాబడి రేఖతో కలిసిపోతుంది. అందువల్ల AR రేఖ MR రేఖగా ఉంటుంది. పట్టిక, పటంల ద్వారా AR, MRల మధ్య ఉన్న సంబంధం తెలుపుతుంది.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 9

సంపూర్ణ పోటీ మార్కెట్ అయినందువల్ల వస్తువు ధర స్థిరంగా ఉంటుంది. ₹ 10 ధర ఉన్నప్పుడు సంస్థ ఎంత పరిమాణాన్ని అయినా అమ్ముకోవచ్చు. మొత్తం రాబడి స్థిరమైన రేటులో పెరుగుతుంది. ధర మారనందువల్ల సగటు రాబడి, ఉపాంత రాబడులు కూడా 3 10గా ఉన్నాయి.

అంటే P = AR = MR. ధర, సగటు రాబడి, ఉపాంత రాబడులు సమానంగా ఉండటంతోపాటుగా స్థిరంగా ఉన్నాయి. ఈ కారణంగా P, AR, MR రేఖ పటంలో చూపిన విధంగా OX అక్షానికి సమాంతరంగా ఉంటుంది.

ఏకస్వామ్యంలో AR, MR రేఖలు (AR and MR Curves under Monopoly): ఏకస్వామ్యంలో ఒకే అమ్మకందారు డుంటాడు. సమీప ప్రత్యామ్నాయాలు ఉండవు. జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం చాలా అల్పంగా ఉంటుంది. ధరను లేదా వస్తురాశిని ఏదో ఒక్కదానిని ఏకస్వామ్యదారుడు నిర్ణయిస్తే మరొకటి మార్కెట్లో ఉండే డిమాండ్ను బట్టి నిర్ణయించబడుతుంది. అంతేగాని రెండింటిని ఒకేసారి నిర్ణయించలేడు.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 10

ఏకస్వామ్యదారుడు అమ్మకాలను పెంచుకోవడానికి ధరను తగ్గిస్తాడు. ధరే సగటు రాబడి కాబట్టి, సగటు రాబడి కూడా క్రమేణ క్షీణిస్తుంది. అందువల్ల డిమాండ్ రేఖ అంటే సగటు రాబడి రేఖ ఎడమ నుంచి కుడి వైపుకు కిందికి వాలుతుంది. ఉపాంత రాబడి కూడా తగ్గుతుంది.

సగటు రాబడి కంటే ఉపాంత రాబడి తక్కువగా ఉంటుంది. అందువల్ల సగటు రాబడి రేఖకు ఉపాంత రాబడి రేఖ కింద ఉంటుంది. సగటు రాబడిలోని తగ్గుదల రేటుకంటే ఉపాంత రాబడిలోని తగ్గుదల రేటు ఎక్కువగా ఉంటుంది.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 11

పట్టికలో ధర లేదా సగటు రాబడి ప్రతిసారి గౌ 1 చొప్పున తగ్గుతుంటే ఉపాంత రాబడి ప్రతిసారి 32 చొప్పున తగ్గుతుంది. ధర, సగటు రాబడులు సమానంగా ఉన్నాయి. ఇవి ఉపాంత రాబడి కంటే ఎక్కువగా ఉన్నాయి. అంటే P = AR > MR.

ధర తగ్గినప్పుడు అమ్మకాలు పెరిగి మొత్తం రాబడి పెరుగుతున్నట్లుగా పట్టికలో చూడవచ్చు. సగటు రాబడి, ఉపాంత రాబడి రేఖలను పటంలో పరిశీలించవచ్చు. OX – అక్షంపైన వస్తువు పరిమాణాన్ని, OY అక్షంపైన రాబడులను కొలుస్తున్నాం.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 12

పటంలో AR – సగటు రాబడి రేఖ, MR – ఉపాంత రాబడి రేఖ రెండూ సరళ రేఖలుగా ఉండి ఎడమ నుంచి కుడికి కిందకు వాలుతున్నాయి. AR రేఖకు MR రేఖ కింద ఉంటుంది. ఏకస్వామ్య పోటీలో AR, MR రేఖలు మిగతా మార్కెట్లలో కంటే అధిక వ్యాకోచంగా ఉంటాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భూమి, శ్రమ అనే ఉత్పత్తి కారకాల ప్రధాన లక్షణాలను విశదీకరించండి.
జవాబు.
భూమి : భూమి అంటే కేవలం నేల లేదా ఉపరితలం మాత్రమే కాకుండా అడవులు, నీరు, వాతావరణం, ఖనిజాలు, ఇంధనం, మొదలైన ప్రకృతి వనరులన్నీ భూమిలో భాగమే.

భూమి లక్షణాలు : ఒక ఉత్పత్తి కారకంగా భూమికి ఉండే లక్షణాలు కింద పేర్కొన్న విధంగా ఉంటాయి :

  1. భూమి ప్రకృతి వల్ల లభించిన ఉచిత కానుక.
  2. భూమి సప్లయ్ పరిమితం. ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుంటే భూమి సప్లయ్ స్థిరం. అంటే భూమి సప్లయ్ సంపూర్ణ అవ్యాకోచంగా ఉంటుంది.
  3. భూమికి గమనశీలత లేదు. భూమిని ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించలేం.
  4. భూమిని ఇతర కారకాలతో కలిపి ఉపయోగిస్తూ పోతే క్షీణ ప్రతిఫలాలు ఏర్పడతాయి.
  5. భూమి సారంలో తేడాలుంటాయి.
  6. భూమి తనంతట తానుగా దేనినీ ఉత్పత్తి చేయదు. మానవ ప్రయత్నం తోడైతేనే ఉత్పత్తి జరుగుతుంది.

శ్రమ (Labour – L) :
అర్థశాస్త్రంలో శ్రమ అంటే ఆదాయాన్ని సంపాందించడానికి వస్తుసేవల ఉత్పత్తిలో అందించే భౌతిక, మానసిక కారకం. శ్రమ చురుకైన ఉత్పత్తి కారకం. శ్రమతో కలిసినప్పుడే భూమి, మూలధనం ఉపయోగంలోకి వస్తాయి.

శ్రమ లక్షణాలు : శ్రమకు కింది లక్షణాలుంటాయి.

  1. శ్రమను శ్రామికుడి నుంచి విడదీయలేం. శ్రామికుడు శ్రమనే అమ్ముతాడు తప్ప తానుగా అమ్ముడుపోడు.
  2. శ్రమ నశ్వరం (perishable), అంటే శ్రామికుడు ఒక రోజు పనిచేయకపోతే ఆ రోజు శ్రమ వృథా అయినట్లు. శ్రమను నిల్వచేయలేం. శ్రమకు రిజర్వు ధర (reserve price) లేదు.
  3. శ్రమకు ప్రారంభంలో బేరమాడే శక్తి తక్కువగా ఉంటుంది.
  4. శ్రామికుల సామర్థ్యం వేరు వేరుగా ఉంటుంది. శ్రమను (a) నైపుణ్యంలేని శ్రమ, (b) పాక్షిక నైపుణ్యం ఉన్న శ్రమ, (c) నైపుణ్యం ఉన్న శ్రమ అని విభజిస్తారు.
  5. శ్రమ సప్లయ్ రేఖ ప్రారంభంలో ఎడమ నుంచి కుడికి పైకి వాలి అత్యధిక వేతనాల వద్ద వెనుకకు వాలుతుంది (backward bending).

ప్రశ్న 2.
శ్రమ విభజన వల్ల ఉండే లాభాలు, నష్టాలు ఏమిటి ?
జవాబు.
శ్రమ విభజన (Division of Labour) :
ఆధునిక పారిశ్రామిక వ్యవస్థలో శ్రమ విభజన ముఖ్యమైంది. ఒక వస్తూత్పత్తి ప్రక్రియను వివిధ భాగాలుగా విభజించి వీటిని శ్రామికులకు కేటాయించడాన్నే శ్రమ విభజన అంటారు. ఏ శ్రామికుడు ఒక వస్తువును పూర్తిగా తయారు చేయడు. ప్రతి శ్రామికుడు వస్తువులోని ఒక భాగాన్ని మాత్రమే తయారు చేస్తాడు.

ఈ శ్రమ విభజనను ఆడమ్స్మత్ గుర్తించి వివరించాడు. అధిక సామర్థ్యపు స్థాయి మరియు ప్రత్యేక నైపుణ్యం వల్ల శ్రమ విభజన తలసరి శ్రామిక ఉత్పత్తిలో పెరుగుదలకు దారి తీస్తుంది.

శ్రమ విభజన వల్ల లాభాలు :

  1. ఒక పనిని నిర్విరామంగా శ్రామికుడు చేస్తున్నందువల్ల అతని నైపుణ్యం, సామర్థ్యం పెరిగి ఉత్పత్తి పెరుగుతుంది.
  2. నవకల్పనలకు, ఆవిష్కరణలకు (discovery) దోహదపడుతుంది.
  3. కాలం ఆదా అవుతుంది.
  4. యాంత్రికీకరణకు అవకాశం ఏర్పడుతుంది.
  5. వివిధ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
  6. శ్రామికుల నైపుణ్యం ఆధారంగా తగిన పని లభిస్తుంది.
  7. పెద్ద తరహాలో ఉత్పత్తికి వీలు కలుగుతుంది.

శ్రమ విభజన వల్ల నష్టాలు :

  1. ఒకే రకం పని వల్ల శ్రామికులు ఆసక్తిని కోల్పోతారు.
  2. మానవాభివృద్ధికి నిరోధకం.
  3. నైపుణ్యాన్ని కోల్పోతాడు.
  4. నిరుద్యోగత ఏర్పడవచ్చు.
  5. శ్రామికుల గమనశీలతకు అవరోధం ఏర్పడుతుంది.
  6. TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 3.
క్షీణ ప్రతిఫలాలను వివరించండి.
జవాబు.
పెరుగుతున్న ప్రతిఫలాల దశ అనంతరం క్షీణ ప్రతిఫలాల దశ ఏర్పడుతుంది. దీనినే క్షీణ ప్రతిఫలాల సూత్రమని అంటాం. క్షీణ ప్రతిఫలాల దశ సగటు ఉత్పత్తి గరిష్ఠమైనప్పుడు ప్రారంభమై ఉపాంత ఉత్పత్తి శూన్యం. మొత్తం ఉత్పత్తి గరిష్ఠమయ్యేంత వరకు ఉంటుంది. పట్టిక ప్రకారం శ్రామికుల సంఖ్య 4 నుంచి 7 వరకున్నప్పుడు క్షీణ ప్రతిఫలాల దశ ఏర్పడుతుంది.

OX – అక్షంపై Q నుంచి Q1 వరకు ఉన్న దశే క్షీణ ప్రతిఫలాల దశ. ఈ దశలో మొత్తం ఉత్పత్తి తగ్గుతున్న రేటులో పెరుగుతుంది. సగటు, ఉపాంత ఉత్పత్తులు క్షీణిస్తుంటాయి. ఈ దశలో సగటు ఉత్పత్తి కంటే మొత్తం ఉత్పత్తి అధికంగాను, ఉపాంత ఉత్పత్తికంటే సగటు ఉత్పత్తి అధికంగాను ఉంటాయి. TP > AP > MP. క్షీణ ప్రతిఫలాల దశలోనే ఉత్పత్తి లాభదాయకంగా ఉంటుంది.

ప్రశ్న 4.
తరహాననుసరించి ప్రతిఫలాల భావనను వివరించండి.
జవాబు.
తరహాననుసరించి ప్రతిఫలాల సూత్రం దీర్ఘకాలిక ఉత్పత్తి ఫలానికి సంబంధించింది. ఉత్పత్తి తరహాలో వచ్చే మార్పు వల్ల మొత్తం ఉత్పత్తిలో వచ్చే మార్పును ఇది తెలుపుతుంది. దీర్ఘకాలంలోని (చర) ఉత్పత్తి కారకాలన్నిటినీ ఒకే అనుపాతంలో పెంచినప్పుడు ఉత్పత్తి కారకాల తరహాలో వచ్చే అనుపాతపు మార్పును ఈ ప్రతిఫలాల సూత్రం వివరిస్తుంది. ఉత్పత్తి కారకాల అనుపాతపు మార్పు వల్ల ఉత్పత్తిలో వచ్చే మార్పు మూడు రకాలుగా ఉండే అవకాశం ఉంది. అవి :

  • పెరుగుతున్న ప్రతిఫలాలు
  • స్థిర ప్రతిఫలాలు
  • తగ్గుతున్న ప్రతిఫలాలు.

ప్రమేయాలు : ఈ సూత్రం కింది ప్రమేయాలపై ఆధారపడి ఉంది :

  1. ఉత్పత్తి కారకాలన్నీ చరం అయితే ఉద్యమిత్వం మాత్రం స్థిరం.
  2. సాంకేతిక ప్రగతి స్థిరం.
  3. మార్కెట్లో సంపూర్ణ పోటీ ఉంటుంది.
  4. ఉత్పత్తిని భౌతిక రూపంలో కొలుస్తాం.
  5. శ్రామికునికి లభించే పనిముట్లు, సాధనాలు ఇవ్వడమైంది.

తరహాననుసరించి ప్రతిఫలాల సూత్రం :
పై ప్రమేయాలకు లోబడి అన్ని ఉత్పత్తి కారకాలను ఒకే నిష్పత్తిలో పెంచినప్పుడు ఉత్పత్తి తరహా విస్తరిస్తుంది. పైన వివరించిన విధంగా ఉత్పత్తిపై ఉండే ప్రభావాన్ని మూడు దశలుగా చూడవచ్చు. మొదటి దశ పెరుగుతున్న ప్రతిఫలాలు లేదా క్షీణ వ్యయాలు.

ఈ దశలో ఉత్పాదకాల పెరుగుదల రేటు కంటే ఉత్పత్తిలోని’ పెరుగుదల రేటు ఎక్కువ. రెండవ దశ స్థిర ప్రతిఫలాలు లేదా స్థిర వ్యయాలు. ఈ దశలో ఉత్పత్తిలోని పెరుగుదల రేటు, ఉత్పత్తి కారకాలలోని పెరుగుదల రేటు సమానంగా ఉంటాయి. మూడవ దశ క్షీణ ప్రతిఫలాలు లేదా పెరుగుతున్న వ్యయాలు. ఈ దశలో ఉత్పత్తి కారకాలలోని పెరుగుదల రేటు కంటే ఉత్పత్తిలోని పెరుగుదల రేటు తక్కువగా ఉంటుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 5.
మూలధనంను గురించి ఒక వ్యాఖ్యను వ్రాయండి.
జవాబు.
సాధారణంగా మూలధనం అంటే ద్రవ్యం అనే భావిస్తాం. యంత్ర పరికరాలు, ముడి పదార్థాలు, భవనాలు మొదలైన వాటి పై వెచ్చించే ద్రవ్యాన్ని మూలధనం అంటారు. ప్రస్తుత సంపదలోని కొంత భాగాన్ని భవిష్యత్తులో సంపదను సృష్టించుకోవడానికి ఉపయోగిస్తే అదే మూలధనం.

మూలధనాన్ని (నిల్వ భావన) ఉపయోగించి ఆదాయాన్ని (ప్రవాహం భావన) పొందుతారు. మూలధనాన్ని మానవ నిర్మిత ఉత్పత్తి కారకమని కూడా అంటారు. మూలధనం సప్లయ్లో మార్పులుంటాయి. దీనికి గమనశీలత ఉంటుంది.

మూలధన వర్గీకరణ :
మూలధనాన్ని ఈ కింద పేర్కొన్న రకాలుగా విభజించవచ్చు.

(i) నిజ మూలధనం – మానవ మూలధనం :
భవనాలు, యంత్రాలు, ఫ్యాక్టరీలు మొదలైన భౌతికమైన వాటిని నిజ లేదా వాస్తవిక మూలధనం. (real capital) అంటారు. మానవుల నైపుణ్యం, వారి సామర్థ్యం మొదలైన వాటిని మానవ మూలధనంగా (human capital) పిలుస్తారు.

(ii) వైయక్తిక, సామాజిక మూలధనం :
వైయక్తిక మూలధనం ఒక వ్యక్తికి లేదా సంస్థకు చెందింది. సామాజిక మూలధనం మొత్తం సమాజానికి చెందుతుంది. ఉదా : రోడ్లు, వంతెనలు మొదలైనవి.

(iii) స్థిర మూలధనం, చర మూలధనం :
మన్నిక కలిగి ఉత్పత్తిలో ఎక్కువ కాలం ఉపయోగపడే యంత్రాలు, భవనాలలాంటివి స్థిర మూలధనం (fixed capital). ఉత్పత్తి ప్రక్రియకు సంబంధించిన శ్రామికుల రోజువారీ వేతనాలు, ముడి పదార్థాలు, విద్యుచ్ఛక్తి చార్జీలు చర మూలధనం (variable capital).

(iv) స్పర్శనీయ మూలధనం, అస్పర్శనీయ మూలధనం (Tangible Capital and Intangible Capital) :
భౌతిక రూపంలో ఉండే మూలధనం స్పర్శనీయం. గుడ్విల్, పేటెంట్ రైట్స్ లాంటి వాటిని అస్పర్శనీయ మూలధనంగా పరిగణిస్తారు.

మూలధన ప్రాధాన్యత :
మూలధన ప్రాధాన్యత గురించి క్లుప్తంగా తెలుసుకొందాం.

  1. మూలధనం లేకుండా ఉత్పత్తి జరగదు. ఆర్థికాభివృద్ధిలో దీని పాత్ర ముఖ్యం.
  2. మూలధనం శ్రామికులకు అవసరమైన యంత్రాలు, పనిముట్లు, అందించి వారి సామర్థ్యాన్ని, ఉత్పాదక శక్తిని పెంచడానికి దోహదపడుతుంది. ఇది మొత్తం ఉత్పత్తిని పెంచుతుంది.
  3. మూలధన సంచయనం వల్ల సాంకేతిక ప్రగతి ఏర్పడుతుంది.
  4. ఉద్యోగ అవకాశాలను పెంచడానికి దోహదపడుతుంది.

ప్రశ్న 6.
అంతర్గత ఆదాలు అంటే ఏమిటి ?
జవాబు.
పరిశ్రమ విస్తరణ వల్ల పరిశ్రమలో ఉత్పత్తి పరిమాణం పెరిగి ఈ ఆదాలు సంస్థలకు లభిస్తాయి. పరిశ్రమలో ఉత్పత్తి తరహా పెరిగినప్పుడు ఏర్పడే ఆదాలను బహిర్గత ఆదాలంటారు.

1. సాంకేతిక ఆదాలు :
మూలధన పరికరాలు ఇవ్వబడినవిగా భావిస్తే స్వల్ప కాలంలో సాంకేతిక ఆదాలను పొందవచ్చు. సంస్థ ఎక్కువ సామర్థ్యం కలిగిన మంచి, పెద్ద యంత్రాలను, అధునాతన ఉత్పత్తి పద్ధతులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల ఉత్పత్తి బాగా పెరుగుతుంది.

2. మార్కెటింగ్ ఆదాలు :
పెద్ద సంస్థలు అధిక మొత్తంలో ముడిపదార్థాలు కొనడం వల్ల తమకు అనుకూల షరతుల ప్రకారం నాణ్యతగల ముడిసరుకులను సమయానికి పొందడం, తక్కువ రవాణా ఖర్చులు లాంటి ప్రయోజనాలు ఏర్పడతాయి.

3. నిర్వహణ ఆదాలు :
పెద్ద సంస్థలు ప్రత్యేక నైపుణ్యం కలిగిన వ్యక్తులను నియమించుకుంటున్నందువల్ల విధి సంబంధిత ప్రత్యేకీకరణ పెరిగి సంస్థలో ఉత్పాదక సామర్థ్యం పెరిగి, ఉత్పత్తి పెరిగి సగటు యాజమాన్యపు వ్యయం తగ్గుతుంది.

4. విత్తపరమైన ఆదాలు :
పెద్ద సంస్థకు ఉన్న మంచి పేరు, అధిక ఆస్తులవల్ల రుణాలను, సులభంగా తక్కువ వడ్డీ రేటుకు సకాలంలో పొందుతుంది. సంస్థ మూలధనాన్ని మార్కెట్లో షేర్లు, డిబెంచర్లు అమ్మడం వల్ల కూడా సేకరిస్తుంది.

5. నష్టాన్ని భరించే ఆదాలు :
పెద్ద సంస్థలు చిన్న సంస్థల కంటే సులభంగా నష్టాన్ని విస్తరించుకోగలవు. ‘ఒకరకం’ వస్తూత్పత్తిలో వచ్చిన నష్టాన్ని ఇతర రకాల వస్తూత్పత్తిలో వచ్చే లాభాలతో భర్తీ చేసుకోవచ్చు. మార్కెట్లను విస్తరించుకోవడం వల్ల ఒక మార్కెట్లో ఉన్న తక్కువ డిమాండ్ను ఇతర మార్కెట్లో ఉన్న అధిక డిమాండ్తో భర్తీ చేసుకోవచ్చు.

6. పరిశోధన ఆదాలు :
చిన్న సంస్థ కంటే పెద్ద సంస్థకు అధిక వనరులుంటాయి. అందువల్ల స్వంతంగా పరిశోధన ప్రయోగశాలను కలిగి శిక్షణ పొందిన పరిశోధకులను నియమించుకుంటుంది. వారు కనుగొనే కొత్త విషయాలు సంస్థ ఆస్తి. సంస్థ వీటిని ఉపయోగించుకొని వ్యయాన్ని తగ్గించుకొని ఉత్పత్తిని పెంచుకుంటుంది.

7. సంక్షేమ ఆదాలు :
సంస్థలు శ్రామికులకు సంక్షేమ సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. పెద్ద సంస్థలు పనిచేయడానికి మంచి పరిస్థితులను, సంస్థ లోపల, బయట కల్పిస్తాయి. సంక్షేమ సౌకర్యాలకయ్యే వ్యయం ఎక్కువగా ఉన్నా దానివల్ల శ్రామికుల సామర్థ్యం పెరిగి, మొత్తం ఉత్పత్తి పెరగడానికి, ఉత్పత్తి వ్యయం తగ్గడానికి అవకాశం ఉంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 7.
సప్లయ్ అంటే ఏమిటి ? సప్లయ్ నిర్ణాయకాలను వివరించండి.
జవాబు.
మార్కెట్లో అమ్మకందారుడు ఒక నిర్ణీత సమయంలో, ఒక నిర్ణీత ధరకు ఎంత పరిమాణం వస్తువులను అమ్మడానికి సిద్ధపడతాడో దానిని వస్తువు సప్లయ్ గా నిర్వచించవచ్చు. మొత్తం వస్తూత్పత్తిని స్టాక్ గాను, అమ్మడానికి ఇష్టపడే మొత్తాన్ని సప్లయను చూడాలి.

నిశితంగా పరిశీలిస్తే సప్లయ్క, నిలువ (stock) కు తేడా ఉంటుంది. ఉత్పత్తి చేయబడిన మొత్తాన్ని మార్కెట్కు తరలించడాన్ని నిలువ తెలుపగా వివిధ ధరల వద్ద అమ్మకందారుడు అమ్మజూపే వస్తువు పరిమాణాన్ని సప్లయ్ తెలుపుతుంది.

సప్లయ్ని నిర్ణయించే అంశాలు (Determinants of Supply) :
ఒక వస్తువు సప్లయికి దాని సప్లయ్ నిర్ణయకాలకు మధ్యగల భౌతిక సంబంధాన్ని సప్లయ్ ఫలం తెలుపుతుంది. అయితే సప్లయ్ని నిర్ణయించే అంశాలను ఇప్పుడు తెలుసుకొందాం.

(i) వస్తు ధర :
ఉత్పత్తిదారుడు వస్తువు సప్లయ్న నిర్ణయించడంలో ఆ వస్తువు ధరే ప్రధాన పాత్రను పోషిస్తుంది. వస్తువు ధర వల్ల సంస్థ లాభం నిర్ణయమవుతుంది. వస్తువు ధర పెరిగితే వస్తువుల పరిమాణాన్ని ఎక్కువగా సప్లయ్ చేస్తాడు. వస్తువు ధర తగ్గితే వస్తువు సప్లయ్ తగ్గుతుంది.

(ii) ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలు :
ప్రత్యామ్నాయ వస్తువుల ధరలు ఎక్కువగా ఉంటే వాటిని ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తిదారుడు ప్రయత్నం చేయవచ్చు. లేదా అధిక ధర ఉన్న ప్రత్యామ్నాయ వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది. అందువల్ల ఉత్పత్తిదారుడు తాను ఉత్పత్తి చేస్తున్న వస్తువు సప్లయ్ పెంచవచ్చు.

అలాగే పూరక వస్తువుల ధరలు, వాటికి ఉండే డిమాండ్ ఆధారంగా కూడా ఉత్పత్తిదారుడు తాను చేసే వస్తువు సప్లయ్న నిర్ణయించుకుంటాడు.

(iii) ఉత్పత్తి కారకాల ధరలు :
ఉత్పత్తి కారకాల ధరలు ఎక్కువగా ఉంటే ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. అదే కారకాల ధరలు తక్కువగా ఉంటే ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. అందువల్ల కారకాల ధరలు ఎక్కువగా ఉంటే వస్తువు సప్లయ్ తక్కువగాను, కారకాల ధరలు తక్కువగా ఉంటే వస్తువు సప్లయ్ ఎక్కువగాను ఉంటుంది.

(iv) సాంకేతిక పరిజ్ఞానపు స్థాయి:
సాంకేతిక పరిజ్ఞానం పెరుగుదల వల్ల ఉత్పత్తి పద్ధతుల్లో మార్పులు వస్తే, వస్తువు సప్లయ్లో మార్పులుంటాయి. నవ్యకల్పనలు (discoveries), నవకల్పనల (innovations) వల్ల కారకాలను పొదుపు చేయడంతో పాటుగా వ్యయాన్ని, సమయాన్ని తగ్గించుకోవచ్చు. అందుకే సాంకేతిక పరిజ్ఞానంలోని మార్పులవల్ల వస్తువు సప్లయ్ పెరుగుతుంది.

(v) ప్రభుత్వ విధానాలు :
ప్రభుత్వం అధిక పన్నులను వస్తువులపై విధిస్తే వస్తు సప్లయ్ తక్కువగా ఉంటుంది. తక్కువగా పన్నులు విధిస్తే వస్తువు సప్లయ్ ఎక్కువగా ఉంటుంది. వస్తూత్పత్తి రాయితీలను ఇస్తే వస్తువుల సప్లయ్ ఎక్కువగా ఉంటుంది.

(vi) ఇతర అంశాలు :
సంస్థ లక్ష్యం రవాణా, కమ్యూనికేషన్, సహజ వనరుల లభ్యత మొదలైనటువంటి అంశాలు కూడా వస్తువు సప్లయ్ ప్రభావితం చేస్తాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 8.
సప్లయ్ లోని మార్పులను గురించి చర్చించండి.
జవాబు.
మార్కెట్లో అమ్మకందారుడు ఒక నిర్ణీత సమయంలో, ఒక నిర్ణీత ధరకు ఎంత పరిమాణం వస్తువులను అమ్మడానికి సిద్ధపడతాడో దానిని వస్తువు సప్లయ్ గా నిర్వచించవచ్చు. మొత్తం వస్తూత్పత్తిని స్టాక్ గాను, అమ్మడానికి ఇష్టపడే మొత్తాన్ని సప్లయ్గాను చూడాలి.

నిశితంగా పరిశీలిస్తే సప్లయ్క, నిలువ Stock కు తేడా ఉంటుంది. ఉత్పత్తి చేయబడిన మొత్తాన్ని మార్కెట్కు తరలించడాన్ని నిలువ తెలుపగా వివిధ ధరల వద్ద అమ్మకందారుడు అమ్మజూపే వస్తువు పరిమాణాన్ని సప్లయ్ తెలుపుతుంది.

సప్లయ్ పెరుగుదల, తగ్గుదల :
వస్తువు ధర కాకుండా, ఇతర చలాంకాలలో మార్పు వస్తే సప్లయ్లో వచ్చే మార్పులను పెరుగుదల లేదా తగ్గుదల అంటారు. అంటే సప్లయ్ రేఖ పూర్తిగా బదిలీ అవుతుంది. దీనిని పటంలో చూడవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 13

OX – అక్షంపై వస్తువు సప్లయ్ పరిమాణం, OY – అక్షంపై వస్తువు ధరను కొలుస్తున్నాం. ప్రారంభంలో ‘SS’ సప్లయ్ రేఖ ఉంటే OP ధరకు 0Q వస్తు పరిమాణాన్ని అమ్మకందారుడు సప్లయ్ చేస్తాడు. ఇతర పరిస్థితులలో (వస్తువు ధర మినహా) మార్పు వచ్చి ఈ సప్లయ్ పెరిగితే సప్లయ్ రేఖ కిందకు లేదా కుడికి S1S1 గా బగిలీ అవుతుంది. అప్పుడు పూర్వపు OP ధరకే అధిక సప్లయ్ని అంటే OQ ని సప్లయ్ చేయడం లేదా పూర్వపు సప్లయ్ OQ1 ని తక్కువ ధరకు OP, కి అమ్మకం చేయడం జరుగుతుంది.

ఇతర పరిస్థితులు మారి సప్లయ్ తగ్గితే సప్లయ్ రేఖ పైకి లేదా ఎడమ వైపుకు S2S2 గా బదిలీ అవుతుంది. అప్పుడు పూర్వపు ధర OP దగ్గర OQ2 సప్లయ్ చేయడం లేదా, పూర్వపు సప్లయ్ OQ2 ని OP2 ధరకు అమ్మకం చేయడం జరుగుతుంది. అంటే సప్లయ్ పెరిగితే పూర్వపు ధరకు అధిక సప్లయ్ లేదా పూర్వపు సప్లయ్ను తక్కువ ధరకు చేస్తారు. అదే సప్లయ్ తగ్గితే పూర్వపు తక్కువ సప్లయ్ లేదా పూర్వపు సప్లయ్ను అధిక ధరకు చేస్తారు.

ప్రశ్న 9.
వ్యయాల రకాలను చర్చించండి.
జవాబు.
ఉత్పత్తి పరిమాణం, ఉత్పత్తి తరహా, ఉత్పత్తి కారకాల ధరలు మొదలైనటువంటి ఆర్థిక చలాంకాలలో వచ్చే మార్పువల్ల ఉత్పత్తి వ్యయంలో మార్పులు చోటు చేసుకొంటాయి. ఈ విధంగా ఉత్పత్తి వ్యయాలు ద్రవ్యపరమైన అంశాలను తెలుపగా, ఉత్పత్తి ఫలం భౌతిక పరమైన అంశాలను తెలుపుతుంది.

ఒక సంస్థలో వస్తువు సప్లయ్ వ్యయాలపై ఆధారపడుతుంది. ఒక వస్తువుకున్న డిమాండ్, దాని సప్లయ్లు కలిపి దాని ధరను నిర్ణయిస్తాయి. ధరల ప్రక్రియను, సప్లయ్ వెనక ఉన్న శక్తులను తెలుసుకోవడానికి వ్యయాల స్వభావాన్ని తెలుసుకోవాలి. వస్తూత్పత్తికయ్యే ఖర్చే ఉత్పత్తి వ్యయం.

వ్యయాలలోని రకాలు :
1. ద్రవ్య వ్యయాలు (Money Costs) :
ఉత్పత్తిదారుడు వివిధ ఉత్పాదకాలకు చెల్లించే ద్రవ్య రూపంలోని ప్రతిఫలాలైన భవనాలకున్న అద్దె, వేతనాలు, మూలధనానికి చెల్లించే వడ్డీ, ముడి సరుకులు, యంత్రాలు పరికరాలపై అయ్యే వ్యయాలు, యంత్రాలు, భవనాలు, ఇతర మూలధన వస్తువులపై జరిగే తరుగుదల వ్యయం, విద్యుచ్ఛక్తి, ప్రకటనలు, రవాణా, బీమా ప్రీమియం, పన్నుల కోసం చేసే చెల్లింపులు మొదలైన వాటిని ద్రవ్య వ్యయాలు అంటారు. అంటే వస్తూత్పత్తి కోసం ఒక సంస్థ చేసే ద్రవ్య ఖర్చులను ద్రవ్య వ్యయాలు అంటారు.

ఈ ద్రవ్య వ్యయాలను ప్రకటిత వ్యయాలు (explicit costs), అప్రకటిత వ్యయాలు (implicit costs) అని విభజిస్తారు. వివిధ ఉత్పత్తి కారకాలకు ఉత్పత్తి దారుడు’ చెల్లించే ద్రవ్య వ్యయాలను ప్రకటిత వ్యయాలంటారు. ఉత్పత్తి ప్రక్రియలో ఉత్పత్తి దారుడు తన సొంత వనరులను లేదా సేవలను ఉపయోగిస్తే వాటి విలువను అప్రకటిత వ్యయాలు అంటారు.

2. వాస్తవ వ్యయాలు (Real Costs) :
ఆల్ ఫ్రెడ్ మార్షల్ ప్రకారం వస్తువును తయారుచేయడానికి ఉత్పత్తి కారకాల యజమానులు చేసిన త్యాగాలను ఉత్పత్తికయ్యే వాస్తవిక వ్యయాలంటారు. భూస్వామి భూమి ఇచ్చినప్పుడు తాను కోల్పోయిన పంటే అతని త్యాగం.

శ్రామికుడు పని చేసే శ్రమలో ఇమిడి ఉన్న శారీరక శ్రమ, బాధ, అతడు కోల్పోయే విశ్రాంతి అతని త్యాగం. పెట్టుబడిదారులు తాము పొదుపు చేసి పెట్టుబడి పెట్టాలంటే వినియోగాన్ని కోల్పోతారు. అది వారి త్యాగం.

వ్యవస్థాపకులు వ్యాపారాన్ని నిర్వహించేటప్పుడు అనిశ్చితను, నష్ట భయాన్ని భరించడం, విశ్రాంతిని కోల్పోవడం జరుగుతుంది. అది వారి త్యాగం. వీటినన్నిటిని వాస్తవిక వ్యయాలంటారు. ద్రవ్య వ్యయాలు, వాస్తవిక వ్యయాలు ఒకదానితో ఒకటి సమానం కావు.

3. అవకాశ వ్యయాలు (Opportunity Costs) :
ప్రత్యామ్నాయ ప్రయోజనాలు కలిగి, కొరతగా ఉన్న వనరులను ఒకే సమయంలో అనేక రకాల వస్తూత్పత్తికి ఉపయోగించలేరు. ఒక రకం వస్తూత్పత్తికి సాధనాలను వినియోగించాలంటే వాటిని ఇతర ఉపయోగాల నుంచి ఉపసంహరించవలసి ఉంటుంది. ఒక వస్తూత్పత్తికి బదులుగా మరొక వస్తూత్పత్తిని చేయడానికి కారకాన్ని వాడితే కోల్పోయిన ప్రత్యామ్నాయ ఉత్పత్తి విలువే అవకాశ వ్యయం.

Y వస్తువులకు బదులుగా X వస్తువును తయారు చేయడానికి వనరులను వాడితే ఒక యూనిట్ X వస్తూత్పత్తికి త్యాగం చేయాల్సిన Y వస్తూత్పత్తి పరిమాణమే ప్రత్యామ్నాయ లేదా అవకాశ వ్యయం. ఒక ఉత్పత్తి కారకం అవకాశ వ్యయం ప్రస్తుత ఉపయోగంలో కాకుండా దాని తరువాత అత్యుత్తమ ఉపయోగంలో వాడితే ఆర్జించగలిగే మొత్తానికి సమానం. భూమిని గోధుమ పంట పండించడానికి విడితే అదే భూమిలో పండించగలిగి ఉండే వేరొక పంట విలువే అవకాశ వ్యయం.

4. స్థిర వ్యయాలు (Supplementary Costs) :
ఉత్పత్తిలోని మార్పులతోపాటు మారకుండా స్థిరంగా ఉండే వ్యయాలను మొత్తం. స్థిర వ్యయాలంటారు. స్థిర కారకాలకు చెల్లించే భాటకం, వడ్డీ, తరుగుదల వ్యయం, శాశ్వత సిబ్బందికి చెల్లించే వేతనాలు మొదలైన రూపంలో ఉంటాయి. సంస్థ ఉత్పత్తిని ఆపినా స్థిర వ్యయాలను భరించవలసి ఉంటుంది. మార్షల్ స్థిర వ్యయాలను అనుబంధ వ్యయాలని (supplementary costs) లేదా వ్యవస్థాపరమైన వ్యయాలని (overhead costs) అన్నాడు.

5. చర వ్యయాలు (Direct Costs) :
అధిక మొత్తంలో ఉత్పత్తికి ఎక్కువ మొత్తంలో చర ఉత్పత్తి కారకాలైన శ్రమ, ముడి సరుకులు, విద్యుచ్ఛక్తి, ఇంధనం మొదలైనవి కావాలి. అందువల్ల ఈ ఉత్పత్తి వ్యయాలను చర వ్యయాలు అంటారు. ఉ పెంచినప్పుడు ఇవి పెరుగుతాయి. అలాగే ఉత్పత్తిని తగ్గించినప్పుడు చర వ్యయాలు కూడా క్షీణిస్తాయి.

ఉత్పత్తి ఏ వాతే చర వ్యయాలు కూడా ఉండవు. చర వ్యయాలనే ప్రత్యక్ష వ్యయాలు (direct costs) అంటారు. వీటిని మార్షల్ ప్రధాన వ్యయాలు (prime costs) అన్నాడు.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 10.
మొత్తం వ్యయం, మొత్తం చర వ్యయం, మొత్తం స్థిర వ్యయాల సంబంధాన్ని వివరించండి.
జవాబు.
ఉత్పత్తి పరిమాణం, ఉత్పత్తి తరహా, ఉత్పత్తి కారకాల ధరలు మొదలైనటువంటి ఆర్థిక చలాంకాలలో వచ్చే మార్పువల్ల ఉత్పత్తి వ్యయంలో మార్పులు చోటు చేసుకొంటాయి. ఈ విధంగా ఉత్పత్తి వ్యయాలు ద్రవ్యపరమైన అంశాలను తెలుపగా, ఉత్పత్తి ఫలం భౌతిక పరమైన అంశాలను తెలుపుతుంది. ఒక సంస్థలో వస్తువు సప్లయ్ వ్యయాలపై ఆధారపడుతుంది. ఒక వస్తువుకున్న డిమాండ్, దాని సప్లయ్లు కలిపి దాని ధరను నిర్ణయిస్తాయి.

ధరల ప్రక్రియను, సప్లయ్ వెనుక ఉన్న శక్తులను తెలుసుకోవడానికి వ్యయాల స్వభావాన్ని తెలుసుకోవాలి. వస్తూత్పత్తికయ్యే ఖర్చే ఉత్పత్తి వ్యయం.
స్వల్ప కాలంలో ఒక సంస్థ చేసే వ్యయాలు రెండు రకాలుగా ఉంటాయి. వీటిని స్థిర వ్యయాలు, చర వ్యయాలుగా వర్గీకరించవచ్చు.

స్థిర వ్యయాలు, చర వ్యయాలు :
అధిక మొత్తంలో ఉత్పత్తికి ఎక్కువ మొత్తంలో చర ఉత్పత్తి కారకాలైన శ్రమ, ముడి సరుకులు, విద్యుచ్ఛక్తి, ఇంధనం మొదలైనవి కావాలి. అందువల్ల ఈ ఉత్పత్తి వ్యయాలను చర వ్యయాలు అంటారు. ఉత్పత్తి పెంచినప్పుడు ఇవి పెరుగుతాయి.

అలాగే ఉత్పత్తిని తగ్గించినప్పుడు చర వ్యయాలు కూడా క్షీణిస్తాయి. ఉత్పత్తి ఏమీ ఉండకపోతే చర వ్యయాలు కూడా ఉండవు. చర వ్యయాలనే ప్రత్యక్ష వ్యయాలు (direct costs) అంటారు. వీటిని మార్షల్ ప్రధాన వ్యయాలు (prime costs) అన్నాడు.

ఉత్పత్తిలోని మార్పులతోపాటు మారకుండా స్థిరంగా ఉండే వ్యయాలను మొత్తం స్థిర వ్యయాలంటారు. స్థిర కారకాలకు చెల్లించే భాటకం, వడ్డీ, తరుగుదల వ్యయం, శాశ్వత సిబ్బందికి చెల్లించే వేతనాలు మొదలైన రూపంలో ఉంటాయి. సంస్థ ఉత్పత్తిని ఆపినా స్థిర వ్యయాలను భరించవలసి ఉంటుంది. మార్షల్ స్థిర వ్యయాలను అనుబంధ వ్యయాలని (supplementary costs) లేదా వ్యవస్థాపరమైన వ్యయాలని (overhead costs) అన్నాడు.

మొత్తం ఉత్పత్తి (TP)మొత్తం స్థిర వ్యయం (TFC)మొత్తం చర వ్యయం (TVC)మొత్తం వ్యయం (TC)
03000300
1300300600
2300400700
3300450750
4300500800
5300600900
63007201020
73008901090
830011001400
930013501650
1030020002300

పైన తెలిపిన విధంగా, స్వల్ప కాలంలో ఉత్పత్తిదారుడు చర ఉత్పత్తి కారకాలను మార్చడం ద్వారా మాత్రమే వస్పూత్పత్తిని పెంచగలడు. స్థిర కారకాలైనటువంటి భవనాలు, మూలధనం, శాశ్వత ఉద్యోగులు వంటి వాటిని మార్చుటకు వీలుకాదు.

అందువల్ల స్వల్ప కాలంలో స్థిర, చర వ్యయాలు ఉంటాయి. ఇవి మొత్తం వ్యయం (TC), మొత్తం చర వ్యయం (TVC), మొత్తం స్థిర వ్యయం (TFC), మొత్తం చర, స్థిర వ్యయాలకు మొత్తం వ్యయం సమానం కాబట్టి (TC = TFC + TVC).

పట్టికలో మొత్తం స్థిర వ్యయం, మొత్తం చర వ్యయం, మొత్తం వ్యయాల మధ్య ఉన్న సంబంధాన్ని వివరించడం జరిగింది. ఉత్పత్తి పరిమాణం శూన్యమైనా, పెరిగినా, తగ్గినా, ఎంత ఉన్నా మొత్తం స్థిర వ్యయం ? 300 లుగా ఉంది. ఉత్పత్తి శూన్యమైతే మొత్తం చర వ్యయం శూన్యం.

ఉత్పత్తి పెరుగుతుంటే చర వ్యయం ప్రారంభంలో తరహాననుసరించిన ఆదాల వల్ల తగ్గుతున్న రేటులో పెరుగుతుంది. ఆ తరువాత నష్టదాయకాల కారణంగా మొత్తం చర వ్యయం స్థిర రేటులో పెరిగి చివరగా అది పెరుగుతున్న రేటులో పెరుగుతుంది.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 14

పై పటంలో మొత్తం స్థిర వ్యయం, మొత్తం చర వ్యయం, మొత్తం వ్యయాలకు ఉన్న సంబంధం వివరించబడింది. TFC క్షితిజ రేఖ (horizontal) మొత్తం స్థిర వ్యయాన్ని, TVC రేఖ మొత్తం చర వ్యయాన్ని, TC రేఖ మొత్తం వ్యయాన్ని చూపిస్తున్నాయి. ఉత్పత్తి ఎంత ఉన్నా మొత్తం స్థిర వ్యయం మారదు. అందువల్ల TFC రేఖ OX – అక్షానికి సమాంతరంగా ఉంది. TVC రేఖ మూల బిందువు ‘0’ దగ్గర ప్రారంభమౌతుంది. ఎందుకంటే ఉత్పత్తి శూన్యమైతే TVC కూడా శూన్యం. తరువాత ఉత్పత్తి పెరుగుతుంటే TVC కూడా పెరుగుతుంది.

స్థిర కారకాలతో పోల్చినప్పుడు తక్కువ పరిమాణంలో చర ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకొన్నంత కాలం మొత్తం చర వ్యయం తగ్గుతున్న రేటులో పెరుగుతుంది. కారణం తరహా ఆదాలు ఉండటమే. ఒక స్థాయి దాటిన తరువాత స్థిర కారకాలతో పోల్చినప్పుడు చర కారకాలను అధికంగా వాడటం జరుగుతుంది.

అప్పుడు TVC నష్టదాయకాల కారణంగా పెరుగుతున్న రేటులో పెరుగుతుంది. ఉత్పత్తి పెరుగుతుంటే మొత్తం వ్యయం నిర్విరామంగా పెరుగుతుంది. మొత్తం వ్యయ రేఖ OY – అక్షంపై మూల బిందువుకు పైన TFC రేఖ ప్రారంభమైన బిందువు దగ్గర ప్రారంభమై ఎడమ నుంచి కుడికి పైకి పోతుంది.

ఉత్పత్తి శూన్యమైనా TFC ఉంటుంది. ఈ కారణంగా TFC = TC అవుతుంది. అందువల్ల TC రేఖ TFC రేఖ ప్రారంభమైన బిందువు దగ్గరే ప్రారంభమౌతుంది. TFC రేఖ క్షితిజ సరళ రేఖ. అందుకే TC రేఖ TVC రేఖలాగానే ఉండి TVC రేఖకు పైన సమాంతరంగా ఉంటుంది. TC రేఖకు TFC రేఖకు మధ్య ఉన్న తేడానే TVC కాబట్టి TVC = TC – TFC.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 11.
సగటు వ్యయం, ఉపాంత వ్యయ సంబంధాన్ని తెలపండి.
జవాబు.
వస్తువు ఉత్పత్తికై ప్రక్రియలో చేసే వ్యయాన్ని ఉత్పత్తి వ్యయం అంటారు. ఉత్పత్తి మొత్తం మీద జరిగే వ్యయం మొత్తం వ్యయము. ఉత్పత్తి పెరిగితే మొత్తం వ్యయం పెరుగుతుంది. ఉత్పత్తి తగ్గితే మొత్తం వ్యయం తగ్గుతుంది.
సగటు వ్యయము :
మొత్తం వ్యయాన్ని మొత్తం వస్తురాశితో భాగిస్తే సగటు వ్యయం వస్తుంది. ఇది వస్తువు ఒక యూనిట్కి అయ్యే వ్యయాన్ని తెలియజేస్తుంది.
సగటు వ్యయము = మొత్తం వ్యయం / వస్తురాశి

ఉపాంత వ్యయము :
మొత్తం వ్యయము (TC) నుండి ఉపాంత వ్యయం (MC) లభిస్తుంది. మొత్తం వ్యయంలో తేడాను, వస్తు పరిమాణంలో వచ్చే తేడాతో భాగిస్తే ఉపాంత వ్యయం వస్తుంది.
ఉపాంత వ్యయం = మొత్తం వ్యయంలో మార్పు / వస్తు పరిమాణంలో మార్పు

ఈ క్రింది రేఖాపటం ద్వారా సగటు, ఉపాంత వ్యయాల సంబంధాన్ని పరిశీలించవచ్చు.
రేఖాపటములో X – అక్షముపై ఉత్పత్తి యూనిట్లని, Y- అక్షముపై వ్యయాన్ని చూపాము. AC సగటు వ్యయరేఖ, MC ఉపాంత వ్యయరేఖ.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 15

SAC స్వల్పకాలిక వ్యయరేఖ, SMC స్వల్పకాలిక ఉపాంత రేఖ. ఉత్పత్తి పెరుగుతుంటే మొదట సగటు వ్యయం తగ్గుతుంది. సగటు వ్యయం తగ్గుతున్నంత వరకు ఉపాంత వ్యయం, సగటు వ్యయం కన్నా తక్కువగా ఉంటుంది.

ఉత్పత్తిని కొనసాగిస్తే సగటు వ్యయం కనిష్ట స్థాయికి వస్తుంది. ఉపాంత వ్యయం, సగటు వ్యయంతో సమానమౌతుంది. SAC మరియు SMC ఖండించుకున్న ‘A’ బిందువు వద్ద ఉత్పత్తి వ్యయం కనిష్టంగా ఉంటుంది.

  1. సగటు వ్యయం తగ్గుతూ ఉంటే ఉపాంత వ్యయం, సగటు వ్యయం కంటే ఎక్కువ తగ్గుతుంది. అందువల్ల సగటు వ్యయరేఖకు క్రిందివైపు ఉపాంత వ్యయరేఖ ఉంది.
  2. సగటు వ్యయం కనిష్టంగా ఉన్నప్పుడు ఉపాంత వ్యయం సగటు వ్యయానికి సమానమైంది. కనుక సగటు వ్యయరేఖ కనిష్ట బిందువు వద్ద ఉపాంత వ్యయరేఖ క్రింద నుండి ‘N’ బిందువు వద్ద ఖండించింది.
  3. సగటు వ్యయం పెరుగుతూ ఉంటే ఉపాంత వ్యయం, సగటు వ్యయం కంటే ఎక్కువగా పెరుగుతోంది. అందువల్ల ఉపాంత వ్యయరేఖ సగటు వ్యయరేఖకు పైన ఉంది. ఈ విషయాలను పట్టిక, పటములో పరిశీలించవచ్చును. చరానుపాత సూత్రాల ప్రభావం, తరహాననుసరించి ప్రతిఫలాల ప్రభావము వలననే వ్యయరేఖలు ‘U’ ఆకారంలో ఉన్నాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 12.
సంపూర్ణ పోటీ, ఏకస్వామ్యంలలో సగటు, ఉపాంత రాబడుల స్వభావాన్ని పటాల సహాయంతో వివరించండి.
జవాబు.
పరిపూర్ణ పోటీ మార్కెట్లో అనేకమంది అమ్మకందార్లు, కొనుగోలుదార్లు ఉంటారు. ఈ మార్కెట్లో వస్తువులు సజాతీయాలు. రవాణా ఛార్జీలు, అమ్మకపు వ్యయాలు ఉండవు. కాబట్టి మార్కెట్ అంతటా ఒకే ధర ఉంటుంది. ఈ మార్కెట్లో రాబడుల యొక్క స్వభావాన్ని ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 16

పై పట్టికలో ఉత్పత్తి పరిమాణం ఎంత ఉన్నా ఒకే ధరకు కౌ 10 అమ్మటం జరిగింది. ఉత్పత్తి ధరతో గుణించగా మొత్తం రాబడి వస్తుంది. మొత్తం రాబడి ఒకే మొత్తంలో పెరుగుతూ ఉంది. పట్టికలో సగటు, ఉపాంత రాబడి ఒకే సంఖ్యను కలిగి ఉన్నాయి. ఈ మార్కెట్లో వస్తువు ధర, సగటు, ఉపాంత రాబడులు ఒకటిగానే ఉన్నాయి. దీనిని ఈ క్రింది రేఖాపటాల ద్వారా చెప్పవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 17

పటంలో (A), (B) లో X- అక్షంపైన వస్తు పరిమాణాన్ని, Y- అక్షంపైన ధరను, రాబడులను కొలుస్తున్నాం. పటం (A) లో DD -డిమాండ్ రేఖ, SS – సప్లయ్ రేఖ రెండు E దగ్గర ఖండించి కున్నప్పుడు పరిశ్రమలో సమలతౌల్యం ఏర్పడి OP ధర నిర్ణయించడింది. ఈ OP ధరకే సంస్థ వస్తువులను అమ్ముతుంది. అందుకే పటం (B) లో OP ధర | ఉన్నప్పుడు AR రేఖ MR రేఖ కలిసిపోయి X – అక్షానికి సమాంతరంగా రేఖ ఉంది.

ఏకస్వామ్యంలో AR, MR రేఖలు (AR and MR Curves under Monopoly) :
ఏకస్వామ్యంలో ఒకే అమ్మకందారుడుంటాడు. సమీప ప్రత్యామ్నాయాలు ఉండవు. జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం చాలా అల్పంగా ఉంటుంది. ధరను లేదా వస్తురాశిని ఏదో ఒక్కదానిని ఏకస్వామ్యదారుడు నిర్ణయిస్తే మరొకటి మార్కెట్లో ఉండే డిమాండ్ను బట్టి నిర్ణయించబడుతుంది. అంతేగాని రెండింటిని ఒకేసారి నిర్ణయించలేడు.

ఏకస్వామ్యదారుడు అమ్మకాలను పెంచుకోవడానికి ధరను తగ్గిస్తాడు. ధరే సగటు రాబడి కాబట్టి, సగటు రాబడి కూడా క్రమేణ క్షీణిస్తుంది. అందువల్ల డిమాండ్ రేఖ అంటే సగటు రాబడి రేఖ ఎడమ నుంచి కుడి వైపుకు కిందికి వాలుతుంది. ఉపాంత రాబడి కూడా తగ్గుతుంది. సగటు రాబడి కంటే ఉపాంత రాబడి తక్కువగా ఉంటుంది. అందువల్ల సగటు రాబడి రేఖకు ఉపాంత రాబడి రేఖ కింద ఉంటుంది. సగటు రాబడిలో తగ్గుదల రేటుకంటే ఉపాంత రాబడిలోని తగ్గుదల రేటు ఎక్కువగా ఉంటుంది.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 18

పట్టికలో ధర లేదా సగటు రాబడి ప్రతిసారి ₹ 1 చొప్పున తగ్గుతుంటే ఉపాంత రాబడి ప్రతిసారి ₹ 2 చొప్పున తగ్గుతుంది. ధర, సగటు రాబడులు సమానంగా ఉన్నాయి. ఇవి ఉపాంత రాబడి కంటే ఎక్కువగా ఉన్నాయి. అంటే P = AR > MR. ధర తగ్గినప్పుడు అమ్మకాలు పెరిగి మొత్తం రాబడి పెరుగుతున్నట్లుగా పట్టికలో చూడవచ్చు. సగటు రాబడి, ఉపాంత రాబడి రేఖలను పటంలో పరిశీలించవచ్చు.

OX – అక్షంపైన వస్తువు పరిమాణాన్ని, OY అక్షంపైన రాబడులను P కొలుస్తున్నాం.

పటంలో AR – సగటు రాబడి రేఖ, MR – ఉపాంత రాబడి రేఖ రెండూ సరళ రేఖలుగా ఉండి ఎడమ నుంచి కుడికి కిందకు వాలుతున్నాయి. AR రేఖకు MR రేఖ కింద ఉంటుంది. ఏకస్వామ్య పోటీలో AR, MR రేఖలు మిగతా మార్కెట్లలో కంటే అధిక వ్యాకోచంగా ఉంటాయి.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 19

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భూమి లక్షణాలను వివరించండి.
జవాబు.
అర్థశాస్త్రంలో భూమి అనగా భూమి ఉపరితలంతో పాటు అడవులు, నీరు, వాతావరణం, ఖనిజాలు, ఇంధనం మొదలగునవి. భూమికి క్రింది లక్షణాలు ఉన్నాయి :

  1. భూమి ప్రకృతి ప్రసాదితం.
  2. భూమి సప్లయ్ పూర్తి అవ్యాకోచం.
  3. భూమికి సప్లయ్ ధర లేదు.
  4. భూమికి గమనశీలత లేదు.
  5. భూమి సారాలలో తేడాలు ఉంటాయి.

ప్రశ్న 2.
శ్రమ విభజన అంటే ఏమిటి ?
జవాబు.
ఒక వస్తువు ఉత్పత్తి ప్రక్రియ వివిధ భాగాలుగా విభజించి వీటిని వివిధ నైపుణ్యం గల శ్రామికులకు కేటాయించడాన్ని శ్రమ విభజన అని అంటారు. ఏ శ్రామికుడు ఒక వస్తువును పూర్తిగా తయారుచేయడు. ప్రతి శ్రామికుడు వస్తువులోని ఒక భాగాన్ని మాత్రమే తయారు చేస్తాడు. ఈ భావనను ఆడమ్ స్మిత్ వివరించినాడు. అధిక సామర్థ్యం, ప్రత్యేక నైపుణ్యం వలన శ్రమ విభజన ఉత్పత్తిలో పెరుగుదలకు దారి తీస్తుంది.

ప్రశ్న 3.
ఉత్పత్తి ఫలం నిర్వచించండి.
జవాబు.
ఉత్పాదకాలకు, ఉత్పత్తికి మధ్య ఉండే భౌతిక సంబంధాన్ని తెలుపుతుంది. ఉత్పత్తి కారకాల రేటుకు, ఉత్పత్తి రేటుకు మధ్య ఉండే సంబంధాన్ని ఉత్పత్తి ఫలంగా స్టిగ్లర్ వర్ణించాడు. దీనిని ఈ క్రింది సమీకరణం ద్వారా తెలియజేయవచ్చు :
Q = f (N, L, C, O, T)
ఇక్కడ Q = ఉత్పత్తి; N, L, C, O, T వరుసగా భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, సాంకేతిక ప్రగతి.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 4.
సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తి భావనలను వివరించండి.
జవాబు.
ఉపాంత ఉత్పత్తి (Marginal Product – MP) : చర సాధనాన్ని L అదనంగా ఉపయోగించినందువల్ల మొత్తం ఉత్పత్తిలో వచ్చిన అదనపు పెరుగుదలను ఉపాంత ఉత్పత్తి అంటారు. అంటే
MPn = TPn – TPn-1 లేదా MP = \(\frac{\mathrm{dTP}}{\mathrm{dL}}\)
ఇక్కడ, MPn = nవ కారక ఉపాంత ఉత్పత్తి
TPn = ప్రస్తుత మొత్తం ఉత్పత్తి
TPn – 1 = పూర్వపు మొత్తం ఉత్పత్తి
dTP = మొత్తం ఉత్పత్తిలో మార్పు
dL = చర కారకం ఉపయోగంలో మార్పు
సగటు ఉత్పత్తి (Average Product – AP) :
మొత్తం ఉత్పత్తిని చర ఉత్పత్తి కారకాల సంఖ్యచే భాగించగా ‘సగటు ఉత్పత్తి’ లభిస్తుంది. అంటే
AP = \(\frac{\mathrm{TP}}{\mathrm{L}}\)
= మొత్తం ఉత్పత్తి / శ్రామికుల సంఖ్య

ప్రశ్న 5.
ఉత్పత్తి కారకాలు వర్గీకరణను వివరించండి.
జవాబు.
ఆధునిక ఆర్థిక వ్యవస్థలో వస్తూత్పత్తి ప్రక్రియ చాలా క్లిష్టతరంగా మారింది. ఒక వస్తువు అనేక దశలు దాటి అంతిమ రూపంలో వినియోగదారునికి చేరుతుంది. వస్తుసేవల ఉత్పత్తికి ఉత్పత్తి కారకాలు కావాలి. ఈ ఉత్పత్తి కారకాలు సహజ కారకాలు కావచ్చు లేదా మానవ నిర్మిత కారకాలైనా కావచ్చు.

ఉత్పత్తి కారకాలు నాలుగు రకాలు అవి : భూమి (land), శ్రమ (labour), మూలధనం (capital), వ్యవస్థాపన (organization). ఒక దేశంలో జరిగే మొత్తం ఉత్పత్తి అనేది ఉత్పత్తి కారకాల పరిమాణం, వాటి నాణ్యతపై ఆధారపడుతుంది.

ప్రశ్న 6.
సాంకేతిక ఆదాలు వివరించండి.
జవాబు.
శ్రమ విభజన వలన ఉత్పత్తి పెరిగినపుడు ఉత్పత్తికి అయ్యే సగటు శ్రమ వ్యయం తగ్గుతుంది. సామర్థ్యం పెరుగుతుంది. పెద్ద సంస్థ ఎక్కువ సామర్థ్యం గల మంచి, పెద్ద యంత్రాలను, అధునాతన ఉత్పత్తి పద్ధతులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వలన ఉత్పత్తి బాగా పెరుగుతుంది.

సాంకేతిక ఆదాలను, కెర్న్ క్రాస్ మేలు రకం పద్ధతులు, విస్తారం, అనుసంధాన ప్రక్రియ, ఉప ఉత్పత్తులు, ప్రత్యేకీకరణ అని విభజించారు.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 7.
మూలధన ప్రాధాన్యత ఏమిటి ?
జవాబు.
మూలధన ప్రాధాన్యత గురించి క్లుప్తంగా తెలుసుకొందాం :

  1. మూలధనం లేకుండా ఉత్పత్తి జరగదు. ఆర్థికాభివృద్ధిలో దీని పాత్ర ముఖ్యం.
  2. మూలధనం శ్రామికులకు అవసరమైన యంత్రాలు, పనిముట్లు అందించి వారి సామర్థ్యాన్ని, ఉత్పాదక శక్తిని పెంచడానికి దోహదపడుతుంది. ఇది మొత్తం ఉత్పత్తిని పెంచుతుంది.
  3. మూలధన సంచయనం వల్ల సాంకేతిక ప్రగతి ఏర్పడుతుంది.
  4.  ఉద్యోగ అవకాశాలను పెంచడానికి దోహదపడుతుంది.

ప్రశ్న 8.
బహిర్గత ఆదాలు వివరించండి.
జవాబు.
ఒక పరిశ్రమలోని సంస్థల సంఖ్య లేదా ఆ పరిశ్రమ పరిమాణం పెరిగినపుడు వచ్చే ఆదాలను బహిర్గత ఆదాలు అంటారు. పరిశ్రమను ఒక ప్రాంతంలో స్థాపించినపుడు నవ కల్పనలు ప్రవేశపెట్టడం వలన, ప్రత్యేకీకరణను ప్రవేశ పెట్టడం వలన ఏర్పడే ఆదాలను బహిర్గత ఆదాలు అంటారు. అవి :

  1. (a) కేంద్రీకరణ ఆదాలు
  2. సమాచార ఆదాలు
  3. ప్రత్యేకీకరణ ఆదాలు
  4. శ్రేయస్సు సంబంధించి ఆదాలు

ప్రశ్న 9.
మూలధన సంచయనం అంటే ఏమిటి ?
జవాబు.
మూలధన సంచయనం (Capital Formation) : దేశంలో వాస్తవిక మూలధనం పెరిగితే, అంటే వస్తువులను ఇంకా ఉత్పత్తి చేయడానికి వాడే మూలధన వస్తువులైన యంత్రాలు, యంత్ర పరికరాలు, రవాణా పనిముట్లు, శక్తి వనరులు వంటివి పెరిగితే మూలధన సంచయనం జరిగినట్లు. మూలధన సంచయనం జరగాలంటే పొదుపు చేయాలి. ఈ పొదుపును పెట్టుబడిగా మార్చాలి.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 10.
సప్లయ్ ఫలంను నిర్వచించండి.
జవాబు.
ఒక వస్తువు ధరకు, సప్లయ్కు, సప్లయ్న నిర్ణయించే అంశాలకు మధ్య గల సంబంధాన్ని సప్లయ్ ఫలం తెలియచేస్తుంది. దీనిని క్రింది విధంగా వివరించవచ్చు: ..
Sx = f (Px, Py, Pf, T, Gp, Gf)
Sx = X వస్తువు సప్లయ్
f = ప్రమేయ సంబంధం
Px = X వస్తువు ధర
Py = ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలు
T = సాంకేతిక స్థాయి
Gf = సంస్థ లక్ష్యాలు
Gp = ప్రభుత్వ విధానాలు

ప్రశ్న 11.
సప్లయ్ సూత్రం నిర్వచించండి.
జవాబు.
ఇది వస్తువు ధరకు, వస్తు సప్లయ్కి గల సంబంధాన్ని తెలియజేయును. ఇతర అంశాలు మారకుండా ఉంటే వస్తు ధర పెరిగితే వస్తు సప్లయ్ పెరుగును. ధర తగ్గితే వస్తు సప్లయ్ తగ్గుతుందని సప్లయ్ సూత్రం తెలియజేయును. అనగా సప్లయ్కి, ధరకు మధ్య అనులోమ సంబంధం ఉంటుంది.

ప్రశ్న 12.
సప్లయ్ పట్టిక, సప్లయ్ రేఖలను వివరించండి.
జవాబు.
ఒక మార్కెట్లో అమ్మకందారుడు, ఒక నిర్ణీత సమయంలో, ఒక నిర్ణీత ధరకు ఎంత పరిమాణం వస్తువులను అమ్మడానికి సిద్ధంగా ఉంటాడో దానిని ఆ వస్తువు సప్లయ్ అంటారు. దీనిని ఒక పట్టిక రూపంలో చెబితే అది సప్లయ్ పట్టిక అవుతుంది. సప్లయ్ పట్టిక ఆధారంగా సప్లయ్ రేఖను గీయవచ్చు.

పట్టిక ప్రకారం ధర పెరిగితే సప్లయ్ పెరుగుతుంది. ధర తగ్గితే సప్లయ్ తగ్గుతుంది. సప్లయ్ రేఖ పటం ప్రకారం, ఎడమ నుండి కుడికి పైకి వాలుతూ, ధనాత్మక సంబంధాన్ని చూపుతుంది.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 20

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 13.
ద్రవ్య వ్యయాలు అంటే ఏమిటి ?
జవాబు.
ఉత్పత్తిదారుడు వివిధ ఉత్పాదకాలకు చెల్లించే ద్రవ్య రూపంలోని ప్రతిఫలాలైన భవనాలకున్న అద్దె, వేతనాలు, మూలధనానికి చెల్లించే వడ్డీ, ముడి సరుకులు, యంత్రాలు, పరికరాలపై అయ్యే వ్యయాలు, యంత్రాలు, భవనాలు, ఇతర మూలధన వస్తువులపై జరిగే తరుగుదల వ్యయం, విద్యుచ్ఛక్తి, ప్రకటనలు, రవాణా, బీమా ప్రీమియం, పన్నుల కోసం చేసే చెల్లింపులు మొదలైన వాటిని ద్రవ్య వ్యయాలు అంటారు.

అంటే వస్తూత్పత్తి కోసం ఒక సంస్థ చేసే ద్రవ్య ఖర్చులను ద్రవ్య వ్యయాలను ప్రకటిత వ్యయాలు (explicit costs), అప్రకటిత వ్యయాలు (implicit costs) అని విభజిస్తారు. వివిధ ఉత్పత్తి కారకాలకు ఉత్పత్తి దారుడు చెల్లించే ద్రవ్య వ్యయాలను ప్రకటిత వ్యయాలంటారు. ఉత్పత్తి ప్రక్రియలో ఉత్పత్తి దారుడు తన సొంత వనరులను లేదా సేవలను ఉపయోగిస్తే వాటి విలువను అప్రకటిత వ్యయాలు అంటారు.

ప్రశ్న 14.
అవకాశ వ్యయం అంటే ఏమిటి ?
జవాబు.
ఒక ఉత్పాదకాన్ని ఒక ప్రయోజనానికి బదులుగా మరొక ప్రయోజనానికి వాడితే కోల్పోయిన ఉత్పత్తిని అవకాశవ్యయం అంటారు.

ప్రశ్న 15.
మొత్తం స్థిర వ్యయరేఖను విశదీకరించండి.
జవాబు.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 21

ఉత్పత్తితో పాటు మారకుండా స్థిరంగా ఉండే వ్యయాలను మొత్తం స్థిర వ్యయాలు అంటారు. సంస్థ ఉత్పత్తిని ఆపినా స్థిర వ్యయాలు భరించవలసి ఉంటుంది. మొత్తం స్థిర వ్యయరేఖ X – అక్షానికి సమాంతరంగా ఉంటుంది. ఉత్పత్తి ఎంత ఉన్నా స్థిర వ్యయం మారదు. పటంలో వ్యయాన్ని Y- అక్షంపైనా, ఉత్పత్తిని X – అక్షంపైనా చూపినాము.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 16.
సగటు ఉపాంత వ్యయాల మధ్య సంబంధంను వివరించండి.
జవాబు.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 22

సగటు ఉపాంత వ్యయ రేఖలు రెండూ ‘U’ ఆకారంలో ఉంటాయి. ఉత్పత్తి స్థాయి పెరుగుతున్నపుడు ప్రారంభంలో సగటు వ్యయం, ఉపాంత వ్యయం రెండూ తగ్గుతూ ఉంటాయి. సగటు వ్యయరేఖ కనిష్ట బిందువు వద్ద ఉపాంత వ్యయరేఖ ఖండిస్తుంది. ఉత్పత్తిలో పెరుగుదల ఒక దశ దాటిన తరువాత సగటు, ఉపాంత వ్యయాలు రెండూ కూడా పెరుగుతాయి. దీనిని ఇచ్చిన రేఖా పటంలో చూపవచ్చు.

ప్రశ్న 17.
సంపూర్ణ పోటీలో AR, MR రేఖల స్వభావాన్ని వివరించండి.
జవాబు.
ఒక సంస్థ వివిధ ధరల వద్ద వస్తువులను అమ్మగా పొందిన ఆదాయంను రాబడి అంటారు. అనగా TR = Price × Quantity sold. సంపూర్ణ పోటిలో అమ్మకందార్లు, కొనుగోలుదారులు అధిక సంఖ్యలో ఉంటారు. వస్తువులు సజాతీయంగా ఉంటాయి. పరిశ్రమలో ఒకే ధర ఉంటుంది.

ఈ ధర వద్ద సంస్థలన్ని ఎంత పరిమాణ్ణానైనా అమ్ముతాయి. సంస్థ డిమాండు రేఖయే, ధర రేఖ లేదా సగటు రాబడి రేఖ. లేదా ఉపాంత రాబడి రేఖ. ఈ రేఖ (P = AR = MR) X – అక్షానికి సమాంతరంగా ఉంటుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 18.
ఏకస్వామ్యంలో AR, MR రేఖల స్వభావాన్ని వివరించండి.
జవాబు.
ఏకస్వామ్యంలో ఒకే ఒక అమ్మకందారుడు ఉంటాడు. సమీప ప్రత్యామ్నాయాలు ఉండవు. ఏకస్వామ్యదారుడు అమ్మకాలను పెంచుకోవటానికి ధరను తగ్గిస్తాడు. ‘ధరే సగటు రాబడి, కాబట్టి సగటు రాబడి రేఖ క్రమేణా క్షీణిస్తుంది.

అందువలన ధర రేఖ లేదా డిమాండు రేఖ లేదా సగటు రాబడి (AR) రేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. ఉపాంత రాబడి (MR) కూడా తగ్గుతుంది. AR కంటే MR తక్కువగా ఉంటుంది. అందువలన సగటు రాబడి రేఖకు దిగువన ఉపాంత రాబడి రేఖ ఉంటుంది. AR లోని తగ్గుదల కంటే MR లోని తగ్గుదల ఎక్కువ.

TS Inter 1st Year English Study Material Chapter 15 The Dinner Party

Telangana TSBIE TS Inter 1st Year English Study Material 15th Lesson The Dinner Party Textbook Questions and Answers.

TS Inter 1st Year English Study Material 15th Lesson The Dinner Party

Paragraph Answer Questions (Section – A, Q.No. 5, Marks : 4)

Question 1.
Describe the role of the American naturalist in the short story, “The Dinner Party”.
Answer:
Mona Gardner’s short story “The Dinner Party” offers us an interesting reading. It highlights women’s nerve control. The American naturalist is a special guest at the dinner party. All others are government officials or military personnel. Others are involved in a discussion. He alone stays silent and observes others keenly. He notices strange changes in the features on the face of the hostess. He watches a servant placing a bowl of milk in the veranda. He understands there is a snake. He thinks fast. He plans a strategy. It works out. He manages to make all the guests stay cool and calm till the snake creeps out. When the host appreciates his nerve control, he proves that it is the hostess who has real nerve control.

మోనా గార్డ్నర్ చిన్న కథ ‘విందు’ ఆసక్తికర పఠనాన్ని అందిస్తుంది మనకు. అది స్త్రీ యొక్క భావోద్వేగ నిగ్రహశక్తిని నొక్కి చెబుతుంది. ఆ ‘విందు’లో అమెరికా జీవశాస్త్రవేత్త ఒక ప్రత్యేక అతిథి. మిగిలిన వారందరూ ప్రభుత్వ లేదా సైనిక అధికారులు. ఇతరులు ఒక చర్చలో లీనమయ్యారు. అతనొక్కడే నిశ్శబ్దంగా ఉండి ఇతరులను నిశితంగా పరిశీలిస్తారు. యజమానురాలి ముఖ కవళికలలో ఆశ్చర్యకర మార్పును వారొక్కరే గమనిస్తారు. వరండాలో పాలపాత్రను ఒక సేవకుడు ఉంచడం గమనిస్తారు. వారికి అక్కడ ఒక పాము ఉందని అర్థం అయింది. వేగంగా ఆలోచిస్తారు. ఒక ఎత్తుగడను సిద్ధం చేశారు. అది పని చేసింది. పాము బయటకు పాకిపోయేదాకా అందరినీ నిశ్శబ్దంగా, నిశ్చలంగా నిబ్బరంగా, ఉంచడంలో కృతకృత్యులయ్యారు వారు. యజమాని వారి మనోనిబ్బరాన్ని అభినందిస్తారు. కాదు, అసలు మనో నిబ్బరం యజమానురాలిది అని నిరూపించి చూపుతారు ఆయన.

TS Inter 1st Year English Study Material Chapter 15 The Dinner Party

Question 2.
Describe the scene of the dinner party..
Answer:
“The Dinner Party”, by Mona Gardner, is a gripping narration of an interesting incident. A colonial officer and his wife host a large dinner party. It is in their spacious dining hall. The hall has a bare marble floor. The rafters are open and glass doors are wide. Government, army and embassy officials with their wives are the guests.

A visiting American naturalist is the special invitee there. Twenty guests take part in that party. There is a spirited discussion about the nerve contral a woman has. A snake is there. The American naturalist takes control of the situation. He succeeds in making everyone stay calm till the snake crawls out.

“విందు”, మోనా గార్డనర్ రచన, ఒక ఆసక్తికర సంఘటనకు కట్టిపడవేసే కథనం. ఒక భారతీయ అధికారి, ఆయన భార్య, ఒక పెద్ద ‘విందు’ ను ఆతిథ్యంగా ఇస్తారు. అది వారి విశాల భోజనశాలలోనే. అక్కడి నేల వేరే ఆచ్ఛాదనలు ఏమీ లేని చలువ రాతి పరుపు. కప్పు వాసాలు కూడా కనిపించేలా ఉంటాయి. విశాలమైన అద్దం తలుపులు.

ప్రభుత్వ, సైనిక మరియు రాయబార కార్యాలయ అధికారులు, వారి భార్యలు అతిథులు. దేశ సందర్శనలో ఉన్న ఒక అమెరికన్ జీవశాస్త్రవేత్త ప్రత్యేక ఆహ్వానితులు. ఇరువయి మంది ఆ ‘విందు’లో భాగస్వాములవుతున్న అతిథులు. స్త్రీ యొక్క భావోద్వేగ నిబ్బర శక్తి గురించిన రసవత్తర చర్చ ఒకటి నడుస్తుంది అక్కడ. ఒక పాము ఉంది అక్కడ. ఆ అమెరికన్ జీవశాస్త్రవేత్త పరిస్థితిని తన అదుపులోకి తీసుకుంటారు. పాము బయటకు ప్రాకి పోయేదాకా ప్రతి ఒక్కరిని నిబ్బరంగా, ప్రశాంతంగా ఉంచటంలో వారు విజయులవుతారు.

TS Inter 1st Year English Study Material Chapter 15 The Dinner Party

Question 3.
“A spirited discussion springs up between a young girl and a colonel”. Discuss.
Answer:
“The Dinner Party”, by Mona Gardner, showcases the emotional strength of women. Deeds, not empty words, prove this point beyond anyone’s doubt. A colonial officer hosts the dinner party. The guests are just twenty. During the party, an animated discussion arises between a young girl and a colonel.

The girl says women have advanced a lot from their earlier era of screaming at the sight of a mouse. The colonel contradicts her stand. He asserts men have an extra ounce of nerve control in a crisis. And he adds that ounce counts a lot. But the girl is right. The story proves at the end how strong a woman is in crises!

“విందు”, మోనా గార్డ్నర్ రచన, స్త్రీ యొక్క మనో నిబ్బర శక్తిని చక్కగా చిత్రిస్తుంది. చేతలు-వట్టి మాటలు కాదు-ఈ విషయాన్ని ఎవ్వరికీ సందేహం లేకుండా నిరూపిస్తాయి. ఒక భారతీయ అధికారి ‘విందు’ ను ఏర్పాటు చేశారు. అతిథులు రెండు పదులు. విందు సమయంలో ఒక యువతికి, ఒక కనల్ (కల్నల్-కాదు) కు మధ్య అమిత ఉత్సాహభరిత చర్చ ప్రారంభమవుతుంది.

ఎలుకను చూస్తే కెవ్వుమని అరిచే గతకాలపు స్థితి నుండి స్త్రీ చాలా ఎత్తుకు ఎదిగింది అని ఆ యువతి వాదన. ఆ అభిప్రాయాన్ని ఖండిస్తారు కనల్గారు. క్లిష్ట సమయాలలో పురుషులు ఒక ఔన్స్ అధిక మనో నిబ్బరం కలిగి ఉంటారు అని ఆయన ఉవాచ. ఇంకా ఆయన అంటారు ఆ ఔన్స్ అధిక నిబ్బరం చాలా ప్రాధాన్యత కలది అని. కానీ ఆ అమ్మాయి అభిప్రాయమే సరిఅయినది. ఆ కథ చివరలో కూడా సంక్లిష్ట సమస్యల సమయంలో స్త్రీ ఎంత నిబ్బరంగా ఉంటుందో నిరూపించబడింది.

TS Inter 1st Year English Study Material Chapter 15 The Dinner Party

The Dinner Party Summary in English

TS Inter 1st Year English Study Material Chapter 15 The Dinner Party 1
Mona Gardner is an American author. She had her story The Dinner Party published in The Saturday Review of Literature in 1941. Her story is a gripping narration with a stuning end. The story takes places in India during the British colonial time. In the story a colonel and a girl argue about how women act in a crisis.

In India, a colonial officer and his wife host a dinner party and invite army officers and government officials along with their wives and an American naturalist. A spirited discussion sparks up between a young girl and the colonel in which the girl believes that women have out grown the fright-from-seeing-a mouse era.

But the colonel denies that and says that men have more control than women in every situation. However, the hostess of the party proves him wrong there is a cobra in the room and the hostess stops it. The hostess decides to solve the problem and advises a plan to get rid of it. She gestures for a bowl of milk to the put outside the door.

An American naturalist at the party is watching the argument and observes the hostess. He understands that there is a cobra in the room, so to calm down everyone he plays a game of control where they cannot move or they would lose money. He told them that he would count three hundred that was five minutes and not one of them is to move a muscle.

Those who move will forfeit fifty rupees. When restarts counting down the last twenty seconds to finish the game. The cobra emerges from under the table and goes towards the bowl of milk outside. He locks it out of the room. The colonel appreciates the American who has just shown them an example of perfect control.

TS Inter 1st Year English Study Material Chapter 15 The Dinner Party

The American asks the hostess, Mrs. Wynnes, how she knew that the cobra was in the room and she replies; “Because it was crawling across her foot.” The colonel is proved wrong by Mrs. Wynnes’s action. The American naturalist was used to show gender does not support your self control.

The writer uses Mrs. Wynnes to prover her them that gender doesn’t support your self control. Throughout the story, Mrs. Wynnes displays perfect self control, proving that women can act bravely in a crisis. Ever though a snake crawled over her foot, she still kept calm. Thus, it justifies that gender does not support.

The Dinner Party Summary in Telugu

మోనా గార్డ్నర్ అనే ప్రఖ్యాత అమెరికన్ రచయిత్రి సృష్టి ఈ “విందు భోజనము” (The Dinner Party). అత్యంత ఆసక్తికరంగా కొనసాగుతూ, ఎవ్వరి ఊహకు అందని మలుపుతో ముగిసే కథనం. చిన్న సంఘటన వర్ణన. కానీ విలువైన పాఠం ప్రతి ఒక్కరికి. ఎందరు, ఏ విధమైన తప్పుడు అభిప్రాయాలలో ఉంటూ, తామే సరియైన అభిప్రాయంలో ఉన్నట్లు భ్రమపడేవారికి కనువిప్పు ఈ కథనం.

ఆంగ్లేయుల పాలనలోని భారతంలో జరిగిన కథ. ఒక సైనికాధికారి, వారి భార్య పెద్ద విందు (భోజనం) ఏర్పాటు చేశారు. సైనిక, ప్రభుత్వ, రాయబార కార్యాలయ సిబ్బంది ప్రత్యేక ఆహ్వానితులు. అమెరికాకు చెందిన ఒక జీవశాస్త్రవేత్త, ప్రకృతి ప్రేమికుడు అతిథులలో విశిష్టమైనవారు. మొత్తం ఇరువయి మంది, ఆతిథ్యం ఇచ్చేవారి విశాలమైన భోజనశాలలోని బల్ల మందు సుఖాసీనులై ఉన్నారు. పెద్ద హాలు, చలువరాతి నేల, చుట్టూ ఉన్న వరండాలకు భోజనశాలకు మధ్య అద్దాల తలుపులు, చక్కని భోజన పదార్థాలు ఒకదాని తరువాత ఒకటి వడ్డించటానికి ఎదురుచూస్తూ వినయంగా నిలుచున్న సిబ్బంది.

తింటూ మాట్లాడటం పశ్చిమ సంస్కృతి ప్రత్యేకం (మన ప్రాచీన సాంప్రదాయం నిశ్శబ్దంగా భగవత్ ప్రసాద, పరబ్రహ్మ స్వరూపం అన్నాన్ని భక్తి, కృతజ్ఞతా భావాలతో స్వీకరించడం !) కదా ! ఒక యువతికి ఒక కనల్ (కల్నల్ అని కొందరు, కర్నల్ అని కొందరు అంటారు. ఈ colonel అనే సైనికాధికారిని సూచించే పదాన్ని) కు మధ్య ఒక రసవత్తర సంభాషణ కొనసాగుతుంది.

ఎలుక పిల్లను చూసి కెవ్వుమని అరిచి గెంతులు వేసే నాటి స్త్రీ నుండి, నేటి స్త్రీ ఎంతో ఎదిగింది అనేది ఆ యువతి వాదన. అలా కాదు, ఎంత చిన్న సమస్యను చూసినా కెవ్వుమని అరిచే స్థాయినుంచి ఒక్క అడుగు కూడా ముందుకు ఎదగలేదు స్త్రీ అని ఆ కనల్ (కల్నల్) నిశ్చితాభిప్రాయం. కష్టాలు ఎదురయినప్పుడు, పురుషులు చూపే నిబ్బరం స్త్రీ చూపలేదు అని ఆయన వాదన. అమెరికన్ జీవశాస్త్రవేత్త ఈ చర్చలో అస్సలు పాల్గొనలేదు.

TS Inter 1st Year English Study Material Chapter 15 The Dinner Party

నిజమైన శాస్త్రవేత్తలా అందరిని పరిశీలిస్తున్నారు. ఇంటి యజమానురాలు శ్రీమతి వైన్స్ ముఖంలో ఆకస్మిక మార్పులు గమనించాడు. కండరాలు బిగుసుకుంటున్నాయి. నిశ్శబ్దంగా, నెమ్మదిగా ఒక సేవక బాలుడి చెవిలో ఏదో చెప్పింది. ఆ బాలుడు ఒక గిన్నెలో పాలు పోసి భోజనశాల బయట వరండాలో పెట్టాడు. ఆ ప్రకృతి పరిశీలకుడికి విషయం అర్థమైంది. భారతీయులు పాలగిన్నె పెట్టారు అంటే అక్కడ ఉన్న పాముకు ఎర (ఆశ) వేయడం. వేగంగా ఆలోచించాడు.

నిశితంగా పరిశీలించాడు, పాము ఉనికికై. వాసాల మీద లేదు. గదిమూలల్లో లేదు. ఇక అది ఉండే ఏకైక స్థానం భోజన బల్ల కింద. అలజడి చేస్తే, ఆ పాము ఎవరినైనా కాటువేయగలదు. అందుకే మంచి ఉపాయం పన్నాడు. అందరిని ఆకట్టుకోగల కంఠస్వరంతో ఇలా అన్నాడు. “నిబ్బరం గురించి కదా చర్చ. ఇప్పుడు నేను 1 నుండి 300 వరకు లెక్కపెడతాను.

5 నిముషాలు పట్టవచ్చు. అంతసేపు ప్రతి ఒక్కరు శిలాప్రతిమ వలె నిశ్చలంగా ఉండాలి. కదిలిన వారు 50 రూపాయలు జరిమానా కట్టాలి’. లెక్కించటం మొదలు. నిజంగా 20 శిలా ప్రతిమలు వెలిశాయి అక్కడ. 286 అంటుండగా బల్ల కింద నుండి పెద్ద పాము గబ గబా పాలగిన్నె వైపు పాకింది. అంతే, వేగంగా ఆ శాస్త్రవేత్త పాము వెనకాలే భోజనశాల తలుపులు మూశాడు.

చూశారా, ఒక పురుషుడి నిబ్బరాన్ని, ఆ శాస్త్రవేత్త నిరూపించారు ఆచరణ ద్వారా అని ఆ ఇంటి యజమాని (పురుషుడు) అన్నారు. ‘ఆగండి’ అని ఆ శాస్త్రవేత్త, అమ్మా శ్రీమతి వైన్స్ గారూ, పాము ఇక్కడ ఉంది అని మీకు ఎలా తెలిసింది అని అడిగారు. బలవంతపు చిరునవ్వుతో, అది నా పాదాల మీదుగా పాకుతుంది కదా అంది ! అంతే అంతా నిశ్శబ్దం. పాఠకులతో సహా ! ఎవరిది అసలు నిబ్బరము ?

The Dinner Party Summary in Hindi

मोना गारडनर नामक प्रमुख अमरीकी लेखिका की रचना है, The Dinner Party’ ‘दावत’ | अति उत्सकता से जारी होता हुआ अप्रत्याशित मोड़ों से समाप्त होनेवाला कथन है । यह एक छोटी घटना पन आधारित रचना है । यह कथन उन लोगों की आँखें खुलवानेवाला है । जो लोग गलतफ़हमी में रहकर अपना विचार हो ठीक कहकर भ्रम में रहते हैं । अंग्रेजी शासनकाल में भारत में घटित कहानी है ।

TS Inter 1st Year English Study Material Chapter 15 The Dinner Party

एक सेनाधिकारी और उसकी पत्नी दावत आयोजित करते हैं । सेना, सरकार और राजदूत कार्योंलयों के कर्मचारी-वर्ग विशेष आमंत्रित हैं । अमरीकी जैव वैज्ञानिक और प्रकृति प्रेमी विशिष्ट अतिथि हैं । कुल बीस लोग विशाल डाइनिंग टेबुल के आगे सुखासीन रहे । बड़ा हॉल, संगमरपरी पहर का फर्श, शीशे के दरवाज़े, स्वादिष्ट भोजन-पदार्थ, एक-एक करके पदार्थ परोसनेवालों की सविनय तैयारी आदि सब कुछ सुव्यवस्थित है । भोजन करते हुए बातचीत करना पश्चिन की संस्कृति है ।

बातचीत मे अंग्रेजी शब्द ‘colonel’ का उच्चरण कुछ लोग कनल और कुछ लोग कर्नल करते हैं । इसके बीच सरस वाग्विवाद होता रहता है । एक युवती कहती है कि चूहे के बच्चे को देखकर भयभीत होनेवाली गतकाल की स्त्री आधुनिक काल में बहुत आगे बढ़ी है । सैन्याधिकारी दृष्टि है कि आदमी जो हिम्मत करता है, ऐसा, औरत नहीं करती है । अमरीकी जैव इस चर्चा में भाग नहीं लेता है। असली वैज्ञानिक की तरह सब का अवलोकन करता है।

घर की मालिकिन श्रीमती वाइन्स के मुख पर आकस्मिक परिवर्तन ध्यन से देखता है । उसकी मांस-पेशियाँ जकड़ रही है | वह बाल- सेवक के कान में आहिस्ते खामोशी से कुछ कहती है । वह बालक एक कटोरे में दूध रखकर भोजनशाला के बाहर बरामदे में रखता है । प्रकृति शोधकर्ता को मालूम हुआ कि उस दूध का कटोरा सांप के लिए अहेर है । वह छत की ओर, घर के कोनों में देखता लेकिन दिखाई नहीं देता है । उसका एक मात्र स्थान डाइंनिग टेबल के नीचे होगा । कुछ भी शोर मचाए तो सांप काटेगा ।

इसलिए प्रकृति प्रेमी एक अच्छा उपाय सोचता है । वह सबसे कहता है कि अब हिम्मत की चर्चा है न ! मैं अब 1 से 300 तक गिनता हूँ । पाँच मिनट लग सकता है । तब तक हरेक को शिला प्रतिमा की तरह निश्चल, न हिले- डुले रहना है । हिलनेवाले को 50 रु. जुर्माना देना पड़ता है। 28 गिनते समय बड़ा सांप मेज के नीचे | से जल्दी-जल्दी दूध के कटोरे की ओर रेंगता है। शीघ्र ही शोधकर्ता साँप के पीछे जाकर भोजनशाला के दरवाजे बंद करता है। क्या देखा है, वह आदमी की हिम्मत और सहनीयता को सिद्ध करता है ।

घर का मालिक (पुरुष) कहता है कि आचरण द्वारा सिद्ध हुआ । शोधकर्ता कहता है कि जरा रुकिए और आगे पूछता है कि श्रीमती वाइन्स जी, आपको कैसे मालूम हुआ कि साँप यहीं है । मुस्कराते हुई वह कहती है कि वह साँप मेरे पैरों ही रेंगा न ! सब खामोश पाठकों के साथ ! असल में किसकी है | हिम्मत और सहनीयता ?

Meanings and Explanations

colonial (n/adj) /kələʊniǝl/ (కలఉనిఅల్) (polysyllabic-4 syllables) = pertaining to a colony : పాలిత దేశానికి సంబంధించిన, औपनिवेशक

attaches (n-pl) /ǝtætseiz/ (అత్యచెఇజ్) (trisyllabic) = persons who work in embassies : రాయబార కార్యాలయంలో పనిచేయు అధికారులు, अधिकारी, अफसर

naturalist (n) /nætsurəlist/(న్యాచురలిస్ట్) (polysyllabic-4) = biologist : జీవశాస్త్రవేత్త, जीव विज्ञानी

TS Inter 1st Year English Study Material Chapter 15 The Dinner Party

spacious (adj) /sperfǝs/ (స్పెఇషస్) (disyllabic) = vast; huge, big : విశాల, विस्तृत

bare (adj) /beǝ(r)/ (బెఅ(ర్)) (monosyllabic) = uncovered; minimal : ఆచ్ఛాదన లేని; కనీస అవసరాల స్థాయిలో ఉన్న, अभाव में

rafters (n-pl) /ra:ftǝ(r)z/ (రాఫ్ ట(ర్)జ్) (disyllabic) = wooden, sloped beams that support the roof : వాసాలు; కప్పును నిలిపి ఉంచే దూలాలు

spirited (adj) /spiritid/ (స్ప్రిరిటిడ్) (trisyllabic) = enthusiastic : ఉత్సాహభరిత , उत्साही

spring up (phrase) = start with a bang : ఆడంబరంగా ప్రారంభమవు

outgrow (v) /outgrǝʊ/ (ఔట్ గ్రఉ) (disyllabic) = grow beyond: దాటి పెరుగు

jumping-on-a-chair-at-the-sight-of-a-mouse = 10 పదాలకు హైషన్ లతో బంధించి ఒక్క adjective గా సృష్టించి ఉపయోగించిన రచయిత్రి సృజనాత్మకత; ఎలుకను చూడగానే కుర్చీ మీదికి గెంతే

era (n) /ǝrǝ/ (ఇఅర) (disyllabic) = a particular period of time: కాలము ; యుగము

colonel (n) /kз:nǝl/ (కనల్) (disyllabic) = an army officer : ఒక సైనికాధికారి

scream (v) /skri:m/ (స్క్రీమ్) (monosyllabic) = cry out in a shrill voice : కీచుగొంతుకతో అరచు; ఆకస్మికంగా గావుకేకపెట్టు

bait (n) /beit/ (బెఇట్) (monosyllabic) = anything that allures : ఆకర్షించునది; ఎర, प्रलोभन

course (n) /ko: (r)s/ (కో(ర్)స్) (monosyllabic) = a stage of a meal : భోజన వడ్డనలో ఒక దశ; ఒక భాగము, पाठयम

impulse (n) /impals/ (ఇమ్ పల్ స్) (disyllabic) = sudden feeling, desire: ఆకస్మిక అనుభూతి; కోరిక, अतः प्रेरणा

commotion (n) /kǝmeusən/ (కమఉషన్) (trisyllabic) = disturbance; noise: అలజడి ; ఆందోళన ; శబ్దము, शोर

arresting (v + ing : adj) /ǝrestin/ (అరెస్ టింగ్) (trisyllabic) = captivating: ఆకట్టుకునేలా ఉన్న

sober (v) /sǝubə(r)/ (సఉబ(ర్) ) (disyllabic) = moderate one’s feelings : భావోద్వేగములను శాంతపరచు; తగ్గించు, अमत

TS Inter 1st Year English Study Material Chapter 15 The Dinner Party

forfeit (v) /fo:(r)frt/ (ఫో(ర్)పిట్) (disyllabic) = lose as fine : జరిమానాగా కోల్పోవు

emerge (v) /im3:(r)dy/ (ఇమ(ర్)జ్) (disyllabic) = come out : బయటకు వచ్చు

make for (phrase) = move towards : వైపుగా వెళ్ళు

ring out (phrase) = echo : ప్రతిధ్వనించు, घंटी बजाना

slam (v) /slæm/ (స్లామ్) (monosyllabic) = shut suddenly with force and noise : ఆకస్మికంగా, పెద్ద శబ్దం వచ్చేలా ధడేల్మని మూయు, धाम

faint (adj) /fernt/ (ఫెఇన్) (monosyllabic) = weak : బలహీన; నీరస, मूर्छत होना

crawl (adj) /kral/ (క్రొల్) (monosyllabic) = creep : ప్రాకు, रेंगना