TS Inter 1st Year English Study Material Chapter 3 The Beggar

Telangana TSBIE TS Inter 1st Year English Study Material 3rd Lesson The Beggar Textbook Questions and Answers.

TS Inter 1st Year English Study Material 3rd Lesson The Beggar

Annotations (Section – A, Q. No. 2, Marks : 4)

Question 1.
Have you sighted anyone.
With shadows in his dusky eyes?
Answer:
Introduction :
These are the opening lines of the poem, “The Beggar” written by Dr. Ammangi Venugopal, a popular Telugu poet. He has written in Telugu as Bichchagadu. It is translated into English by Elanaaga, (Dr. Surendra).

Context & Explanation:
The poem projects the intense grief and suffering of the farmers. A farmer today is misery incarnate. His eyes speak volumes about farmers’ sorrow. The poet minces no words in highlighting their woes. He opens the poem with a question. It identifies farmers with dark eyes that are filled with the shadows of their struggles. The reader, addressed as ‘you’, is forced to understand and sympathise with farmers. Therefore the lines play an important role in initiating the thought process effectively.

Critical Comment:
The poet portrays the pathetic plight of farmers. He is questioning the reader to make him to think about the farmers.

కవి పరిచయం :
ఈ ప్రారంభ వాక్యాలు, ప్రముఖ తెలుగు కవి డా. అమ్మంగి వేణుగోపాల్ గారు వ్రాసిన The Beggar’ అను పద్యం లోనివి. ఇతను తెలుగులో ‘Bichchagadu’ అను పేరుతో వ్రాశాడు. దీన్ని Elanaaga ఇంగ్లీషులోకి తర్జుమా చేశాడు.

సందర్భం :
రైతుల దయనీయ స్థితిని కవి చిత్రీకరిస్తున్నాడు ఇక్కడ.

వివరణ :
రైతుల యొక్క తీవ్రమైన బాధను మరియు దుఃఖాన్ని ఈ పద్యం మన ముందుకు తెస్తుంది. రైతు ఈ రోజు దుఃఖావతారమెత్తాడు. వారి కళ్ళు వారి దుఃఖాన్ని గురించి పుంకాను పుంకాలుగా చెప్తున్నాయి. తడుముకోకుండా, వెతుక్కోకుండా కవి పదాలను ఉపయోగించి రైతుల బాధలను తెలియజేస్తున్నాడు. తన పద్యాన్ని ప్రశ్నతో ప్రారంభించాడు. బాధ జాడలతో నిండిన రైతుల కన్నీళ్ళను గురించి తెలియజేస్తుంది. పాఠకులను రైతుల బాధలను అర్థంచేసుకొని, దయచూపమని కోరుకుంటుంది. కాబట్టి ఈ వాక్యాలు మన ఆలోచనా విధానాన్ని ప్రారంభించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

TS Inter 1st Year English Study Material Chapter 3 The Beggar

Question 2.
A food giver he is, With ability to mitigate the sky’s hunger. *(Imp, Model Paper)
Answer:
Introduction:
These lines are taken from the thought provoking poem, ‘The Beggar’, penned by Dr. Ammangi Venugopal, a prolific Telugu poet. Actually, it is written in Telugu as Bichchagadu. Later, it is translated into English by Elanaaga as ‘The Beggar’.

Context & Explanation:
The poet describes the struggles and sufferings of the farmers in a touching way. They are the food providers to all. They produce food and satisfy other’s hunger. Their ability remains fully active. They are able to reduce the hunger of even skies. They work hard and help others. But, the irony is that they struggle to survive. Their stomachs get no food. So the reader is forced to understand their problems and own up them.

Critical Comment:
Here the poet depicts the difficulties of farmers and their capacity to produce food for us.

కవి పరిచయం :
ఈ వాక్యాలు డా. అమ్మంగి వేణుగోపాల్ గారు వ్రాసిన ‘బిచ్చగాడు’ అను పద్యం లోనివి. ఈ పద్యాన్ని తెలుగులో వ్రాశాడు. దీన్ని Elanaaga ఇంగ్లీషులోకి తర్జుమా చేశాడు.

సందర్భం :
కవి ఇక్కడ రైతుల యొక్క బాధలను మరియు మనకు ఆహారం అందించే వారి శక్తిని గురించి వివరిస్తున్నాడు.

వివరణ :
రైతుల బాధలను మరియు దుఃఖాన్ని మన మనస్సును కదిలించే విధంగా వివరిస్తున్నాడు. రైతులు మనందరికి ఆహారాన్ని అందిస్తారు. ఆహారోత్పత్తి చేసి ఇతరులు ఆకలిని తీర్చుతారు. వారి శక్తి అమితం. వారు ఆకాశం ఆకలిని సహితం తీర్చగల సమర్థులు. ఎప్పుడూ కష్టపడతారు. ఇతరులకు సహాయం చేస్తారు. అయితే ఇప్పుడు ఆ రైతే జీవన పోరాటం చేస్తున్నాడు. ఆకలి తీర్చే రైతే ఆకలితో అలమటిస్తున్నాడు. కాబట్టి పాఠకులు రైతుల బాధలను అర్థంచేసుకొని, రైతులంటే ఎవరో కాదు, వారు మన ప్రాణదాతలు అని గుర్తించాలి.

TS Inter 1st Year English Study Material Chapter 3 The Beggar

Question 3.
His stomach is full of infinite void.
Answer:
Introduction:
This heart touching line is taken from the thought provoking poem, ‘The Beggar’, penned by Dr. Ammangi Venugopal, a famous Telugu poet. His original Telugu poem, Bichchagadu is rendered into English by Elanaaga (Dr. Surendra).

Context & Explanation:
The poet tries to draw the attention of readers to the gravity of farmers’ problems. It is because farmers work hard. They help others. They are the food providers to all yet the irony is that they struggle to survive. They starve. They don’t find food for themselves, even a morsel! Their stomachs get no food. They suffer from empty stomachs. Their emptiness is infinite. Thus, the poet highlights farmers’ woes and worries in a touching way. He also compels the readers to ponder over possible solutions.

Critical Comment:
Here the poet depicts the pathetic condition of farmers in a touching way.

కవి పరిచయం :
మనస్సును కదిలించే ఈ పదాలను Dr. అమ్మంగి వేణుగోపాల్ రచించిన ‘బిచ్చగాడు” అను పద్యం నుండి గ్రహించబడినవి. ఈ పద్యంను, ఇతడు తెలుగులో వ్రాయటం జరిగింది. Elanaaga దీన్ని ఇంగ్లీషులోకి తర్జుమా చేశాడు.

సందర్భం :
రైతుల యొక్క దయనీయ స్థితిని మన మనస్సును కదిలించే విధంగా వివరిస్తున్నాడు.

వివరణ :
రైతుల బాధలను, పాఠకులు గ్రహించే విధంగా వివరిస్తున్నాడు. ఎందుకంటే, రైతులు కష్టపడతారు. ఇతరులకు సాయం చేస్తారు. మనందరికీ, ఆహారం అందిస్తున్నారు. అయితే, అన్నదాతలు నేడు జీవన పోరాటం చేస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. వారికి అన్నం మెతుకు కరువైంది.

వారి పొట్టలకు పట్టెడన్నం పెట్టే వారేలేరు. తిండి లేక ఖాళీ కడుపులతో బాధపడుతున్నారు. అంతులేని ఆకలితో అలమటిస్తున్నారు. అలా రైతుల దుఃఖాలను, బాధలను గురించి మన మనస్సులను కదిలించేలా వర్ణిస్తున్నాడు. అదేవిధంగా, సాధ్యమైన పరిష్కారాలను గురించి ఆలోచించాలని పాఠకులను కోరుతున్నాడు.

TS Inter 1st Year English Study Material Chapter 3 The Beggar

Question 4.
Have you seen a beggar at your threshold with severed hands?
Brother, he is my farmer !
Answer:
Introduction:
These are the concluding lines of the poignant poem ‘The Beggar’ penned by Dr. Ammangi Venugopal, a popular Telugu poet. He has written it in Telugu as Bichchagadu. Later, it is translated into English by Elanaaga as The Beggar.

Context & Explanation:
The poet describes the struggles and sufferings of the farmers. They are capable of feeding millions, but those millions are not including farmers in them. Food providing farmers are forced to become food – seeking beggars. Farmers struggling to survive. They are suffering from lack of food.

They are at thresholds for food. So, the poet tells the reader that the man who is at his threshold is none other than the farmer. The poet talks about the farmer as ‘My Farmer’. The reader is forced to understand and sympathise with farmers. He questions the reader, to make reader to think about the problem.

Critical Comment:
These lines are descibes present pathetic condition of the farmers.

కవి పరిచయం :
మనస్సును కదిలించే ఈ పదాలను Dr. అమ్మంగి వేణుగోపాల్ రచించిన ‘బిచ్చగాడు’ అను పద్యం నుండి గ్రహించబడినది. ఈ పద్యంను ఇతడు, తెలుగులో వ్రాయటం జరిగింది. Elanaaga దీన్ని ఇంగ్లీషులోకి తర్జుమా చేశాడు.

సందర్భం :
ఆహారాన్ని అందించే రైతు అన్నం అడుక్కునే భిక్షగాడిగా బలవంతంగా మార్చబడ్డాడు. రైతులు 24 గంటలూ, సంవత్సరం పొడుగునా శ్రమిస్తారు. టన్నుల కొద్ది ఆహార ధాన్యాలను పండిస్తారు. ఆ ఆహార ధాన్యాలు లక్షలాది మంది ఆకలిని తీరుస్తాయి. మీరు అలా ఆహారం తీసుకుంటుంటే, మీ ఇంటి ముందు ఓ భిక్షగాడు కనిపిస్తాడు. అతను గాయాలతో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు తింటున్న ఆహారాన్ని పండించింది ఆయనే నా రైతు! వివరణ : ఈ పంక్తులు ప్రస్తుత సమయంలోని రైతుల దయనీయ స్థితిని వివరిస్తున్నాయి.

Paragraph Questions & Answers (Section – A, Q.No. 4, Marks : 4)

Question 1.
“Dr. Ammangi Venugopal’s creativity is rooted deeply in the complexities and contradictions of modern life”, say observers.
Explain the statement, taking The Beggar’ as a reference point.
Answer:
The poem, The Beggar is written by Dr. Ammangi Venugopal. He is a creative genius. Actually, he has penned it in Telugu as Bichchagadu. It is translated into English by Elanaaga (Dr. Surendra). Dr. Ammangi is well aware of the complexities and contradictions of modern life. The complex problems farmers today face form the central idea of his moving poem.

TS Inter 1st Year English Study Material Chapter 3 The Beggar

Farmers are the food providers to all. They struggle to survive. They starve, yet, they toil. Their feet bleed. Their eyes are full of shadows of their sad stories. Their hunched backs tell us how hard they work. Yet, their stomachs get no food. They are capable of feeding millions. And those millions do not include in them those farmers. How cruel the modern society responsible for this irony is! Thus, the poem shows the complexities of current times.
TS Inter 1st Year English Study Material Chapter 3 The Beggar 2
బిచ్చగాడు అను పద్యం అమ్మంగి వేణుగోపాల్ వ్రాశాడు. ఇతను ఒక సృజనాత్మక మేధావి. ఇతను ఈ పద్యంను తెలుగులో వ్రాశాడు. దీన్ని Elanaaga ఇంగ్లీషులోకి తర్జుమా చేశాడు. ఆధునిక జీవన సంక్లిష్టతలు మరియు విరుద్ధాలు గురించి డా॥ అమ్మంగికి బాగా తెలుసు. నాడు రైతులు ఎదుర్కొంటున్న క్లిష్ట సమస్యలు ఈ పద్యం యొక్క ప్రధానమైన విషయం. అందరికీ ఆహారం అందించేది రైతులు.

నాడు వారు జీవన పోరాటం చేస్తున్నారు. వారు ఆకలితో ఉన్నారు. అయితే, వారు కష్టపడతారు. వారి పాదాలు రక్తం ఒడ్డుతున్నాయి. వారి కళ్ళు వారి విషాద కథల ఛాయలతో నిండి ఉన్నాయి. వారి వంగిన నడుములు వారు ఎంత కష్టపడతారో తెలియజేస్తాయి. అంత కష్టపడినప్పటికీ, వారి కడుపుకి తిండిలేదు. లక్షల మందిని పోషిస్తున్నారు, ఆ లక్షల మంది ఈ రైతులను వారిలో వారుగా గుర్తించటం లేదు. ఆధునిక సమాజం ఎంత క్రూరమైందో ఈ వ్యత్యాసం తెలుపుతుంది. అలా ఈ పద్యం ప్రస్తుత రైతుల క్లిష్ట పరిస్థితులను తెలియపరుస్తుంది.

Question 2.
How does the poem, The Beggar’ describe the farmer’s pathetic physical condition?
Answer:
The poem, The Beggar, by Dr. Ammangi Venugopal portrays the pathetic condition of farmers. It depicts the difficulties farmers face in a touching way. The poet talks about, the farmer as ‘my farmer’. It shows that the poet also belongs to the family of a farmer. So, he describes the pitiable physical position of farmers.
TS Inter 1st Year English Study Material Chapter 3 The Beggar 3
It forms an important part of the poem. It identifies farmers with dark eyes that are filled with the shadows of their struggles and sufferings. Their backs are bent with burden. Their hands are soiled and severed. Their feet bleed. Yet, their ability to produce food and satisfy other’s hunger remains fully active. They work hard and help others. Yet, they struggle to survive. They starve. Their stomachs get no food. They suffer from empty stomachs. Their faces are filled with wretchedness. Thus the reader is forced to understand and sympathise with farmers.

డా॥ అమ్మంగి వేణుగోపాల్ రచించిన ‘బిచ్చగాడు’ రైతుల దయనీయ పరిస్థితిని చిత్రీకరిస్తుంది. రైతులు నాడు ఎదుర్కొంటున్న కష్టాలను ఈ పద్యం వివరించి మనల్ని కదిలిస్తుంది. కవి రైతును నా రైతు అని సంబోధిస్తున్నారు. కవి కూడా రైతు మీ కుటుంబానికి సంబంధించినవాడే అని తెలియజేస్తున్నాడు. లేదా తన వాడుగా భావిస్తున్నాడు. కావున, రైతుల దయనీయమైన భౌతికస్థితిని వివరిస్తున్నాడు. రైతు యొక్క ప్రస్తుత స్థితియే ఈ పద్యం యొక్క ముఖ్య విషయం.

TS Inter 1st Year English Study Material Chapter 3 The Beggar

బాధలు మరియు కష్టాలతో నిండిన నల్లటి ఛాయలు ఏర్పడిన కళ్ళతో ఉంటారు. వారు శ్రమ భారంతో నడుములు వంగి గూనివారిగా తయారయ్యారు. వారి చేతులు మట్టిమయమై దారుణంగా ఉన్నాయి. పాదాలు రక్త మోడుతున్నాయి. అయినప్పటికీ ఆహారోత్పత్తి శక్తి మరియు ఇతరుల ఆకలి తీర్చాలనే సంకల్పం వారిలో సజీవంగా ఉంది. కష్టపడతారు మరియు ఇతరులకు సహాయపడతారు. అయితే, ప్రస్తుతం వారు జీవన పోరాటం చేస్తున్నారు. ఆకలితో ఉన్నారు. అన్నదాతలకు అన్నం కరువైంది. ఖాళీ కడుపులతో ఉన్నారు. వారి మొఖాలు దౌర్భాగ్యంతో, దయనీయ స్థితిలో నిండి ఉన్నాయి. ఆ విధంగా, రైతులను అర్థంచేసుకొని వారిపట్ల దయచూపమని పాఠకులను కోరుతున్నాడు ఈ పద్యం ద్వారా.

Question 3.
List the abilities a farmer is endowed with, according to the poem.
Answer:
Dr. Ammangi Venugopal is a creative genius. He is well aware of the abilities of a farmer. In his poem, The Beggar, the poet minces no words in depicting farmers’ abilities. They are the food providers to all. Their eyes are dark with shadows of their struggles and sufferings. Their backs are bent with burden.

Their hands are soiled and severed. Their feet bleed. Yet, their ability to produce food and satisfy others’ hunger remains fully active. They work hard and help others. They are capable of feeding millions. They reduce and satisfy the hunger of even skies. Thus, the poem is endowed with the abilities of a farmer.

డా॥ అమ్మంగి వేణుగోపాల్ గారు ఒక సృజనాత్మక మేధావి. రైతు యొక్క శక్తి గురించి ఇతనికి బాగా తెలుసు. తన బిచ్చగాడు అను పద్యంలో, రైతుల సామర్థ్యంలు గురించి వివరించటానికి పదాలు వెతుక్కోకుండా వర్ణిస్తున్నాడు. రైతులు మనందరికి ఆహారప్రదాతలు. అన్నదాతల కళ్ళు కష్టాలు మరియు బాధలతో నల్ల ఛాయలు నిండి ఉన్నాయి. కష్టం వల్ల, వారి నడుములు వంగి గూని వచ్చింది.

చేతులు మట్టితో నిండి దయనీయంగా ఉన్నాయి. పాదాలు రక్తం కక్కుతున్నాయి. అయినప్పటికీ, ఇతరులు ఆకలి తీర్చుటకు మరియు ఆహార ఉత్పత్తికి వారి సామర్థ్యం అదే చురుగ్గా ఉంది. వారు కష్టపడతారు మరియు ఇతరులకు సహాయం చేస్తారు. వారు లక్షల మందిని పోషించగలరు. వారు ఆకాశంల ఆకలి సహితం తీర్చగలరు. ఈ విధంగా, రైతుల సామర్థ్యం గురించి ఈ పద్యం వివరిస్తుంది.

TS Inter 1st Year English Study Material Chapter 3 The Beggar

Question 4.
The poet addresses the reader as you and talks about the farmer as my farmer. Explain the significance in a paragraph.
Answer:
Dr. Ammangi Venugopal has written the poem in Telugu as Bichchagadu. It is translated into English as the ‘The Beggar’ by Elanaga, (Dr. Surendra) the poem portrays the pitiable condition of the farmers. In the last stanza the poet describes the farmer as a beggar. It is due to his condition at present society.

The farmers are suffering from lack of food. They become beggars. They are at the thresholds for food. So, the poet tells the reader that the beggar at the threshold of the reader is none other than the farmer. The reader is addressed as ‘you’ to understand and sympathise with farmers. The poet tells about the farmer as ‘My farmer’. The reader is moved to ponder over the problem and find away out.
TS Inter 1st Year English Study Material Chapter 3 The Beggar 4
ఈ పద్యాన్ని తెలుగులో బిచ్చగాడుగా డా॥ అమ్మంగి వేణుగోపాల్ వ్రాశాడు. దీన్ని ‘The Beggar’ గా ఆంగ్లంలోకి ‘ఏలనాగ’ అను కలంపేరుతో డా॥ సురేంద్ర అనువదించాడు. రైతుల దయనీయ స్థితిని ఈ పద్యం చిత్రీకరిస్తుంది. చివరి చరణంలో రైతుని బిచ్చగాడిగా వివరిస్తున్నాడు. ప్రస్తుతం సమాజంలో అతని స్థితి వల్ల అలాగ వివరించాడు. రైతులు ఆకలితో అలమటిస్తున్నారు. వారు బిచ్చగాళ్ళు అయ్యారు.

వారు ఆహారం కోసం గుమ్మాల వద్ద ఉన్నారు. కావున పాఠకుడి గుమ్మం ముందు ఉన్నది ఎవరో కాదు రైతన్నే అని కవి చెపుతున్నాడు. రైతులను అర్థం చేసుకొని దయచూపమని పాఠకుడిని ‘నీవు’ అని సంభోదిస్తున్నాడు కవి. రైతన్నను నా రైతు అంటున్నాడు. సమస్య గురించి ఆలోచించి, మార్గాన్ని కనుగొనమని, పాఠకుడిని నిలదీస్తున్నాడు.

TS Inter 1st Year English Study Material Chapter 3 The Beggar

The Beggar Summary in English

TS Inter 1st Year English Study Material Chapter 3 The Beggar 1

Dr. Ammangi Venugopal is a creative genius. He is well aware of the complexities and contradictions of modern life. This poem is penned by him in Telugu as Bichchagadu. It is translated into English by Elanaago (Dr. Surendra) as The Beggar. The poem portrays the pathetic plight of farmers.

The pitiable physical position of farmers forms an important part of the poem. Farmers’ dusky eyes are dark with shadows of their struggles and sufferings their backs are bent with burden. Their hands are soiled and severed and their feet bleed. Yet their ability to produce food and satisfy other’s hunger remains fully active.

Here the poet owns up the farmer. So, he says that he is his farmer. He is a food giver. He is able to reduce and satisfy the hunger of even skies. He works hard. He helps others by producing tons of crops. Yet, the irony is that they don’t find food for themselves, even a morsel their stomachs are full of empty. Their faces are filled with wretchedness.

But, the seeds the farmer sows sprout as if they are his hands. He toils hard to produce food we eat. Here, the reader is addressed as you. It is because the reader is forced to under stand and sympathise with farmers. The poet asks the reader if he/she has seen a beggar at their threshold with severed hands when they want to eat hastily hot rice meal.

TS Inter 1st Year English Study Material Chapter 3 The Beggar

He is none other than the farmers who produced the food, they (readers) are going to eat. Owing to the circumstances, the farmer becomes a beggar the poet says “He is my farmer”. Question forms set the readers to think about the problem. The reader is moved to ponder over the problem and find a way out. Thus, the poem depicts the difficulties farmers face in a touching way.

The Beggar Summary in Telugu

సామాజిక స్పృహ, మానవతా దృక్పథం మెండుగా ఉన్న మన కాల, మన ప్రాంత ఆలోచనాపరుడు, విద్యావేత్త అయిన డా॥ అమ్మంగి వేణుగోపాల్ విస్తృతంగా వివిధ రకాల రచనలు చేసిన కవి. వారి కదిలించే కవిత ‘బిచ్చగాడు’. ఆ తెలుగు కవితను ఆంగ్లంలోకి అనువదించినవారు ఎలనాగ అనే కలం పేరు కల డా॥ ఎన్. సురేంద్ర.

‘The Beggar’ పేరుతో ఉన్న ఈ పద్యము, రైతుల బాధలను చిత్రిస్తుంది. అన్నదాతగా, దేశానికి వెన్నెముకగా, జై కిసాన్ స్తుతించబడే రైతన్న గుక్కెడు మెతుకుల కోసం ‘అన్నమో రామచంద్రా’ అని ఆక్రందనలు వినిపించే దైన్యస్థితిలోకి నెట్టబడ్డాడు ఆధునిక సమాజపు స్వార్థ, క్రూర కోరలతో ! అత్యంత దయనీయ స్థితిలో ఉన్న రైతన్న దైన్యతకు అక్షరీకరణ ఈ పద్యం. వారి మాటలకు సరళ సారాంశం :

కంటి నిండా బాధల నీడలతో మేఘాల మసకలు నిండిన వారిని మీరు చూశారా ? పని భారంతో కృంగి, వంగిన వీపుతో, చేతి నిండా భూమాతకు జీవంపోసే మట్టిపొరలు కల వ్యక్తిని గమనించారా ? నెత్తురు ఓడే పాదాలతో, భూమాతకు రక్తాభిషేకం చేస్తూ అడుగులు వేస్తున్న వారిని గుర్తించారా మీరు ? సోదరా, అతనే నా రైతన్న. అన్నదాత, ఆహార ప్రదాత అతను ! ఆకాశపు అంతం లేని ఆకలిని కూడా తీర్చగల శక్తిశాలి ఆ రైతన్న ! కానీ, విధి విచిత్రమా, క్రూరలీలనా కానీ, అందరి ఆకలిని తీర్చే ఆ రైతన్న కడుపు మాత్రం నిత్యం ఖాళీనే, ఆకలి మంటలే! అతని ముఖం నిండా తాండవిస్తున్నది శ్రమ తాలూకు, బాధల తాలూకు ముడతలు, చింతలూ ! ఆయన నాటిన గింజలు మొలకెత్తుతాయి, ఆయన చేతుల చెమటను, రక్తాన్ని తేమగా గ్రహించి, చేతులే మొలిచాయా అన్నట్లు ! వేడి, వేడి అన్నాన్ని ఆవురావురంటూ తినే సమయంలో, చేతినిండా గాయాలతో ‘అమ్మా, ఒక్క ముద్ద అన్నం’ అని మీ ఇంటి ముంగిట కేకలు వేసే భిక్షగాడిని ఒకడిని చూశారా ? సోదరా, అతనే నా రైతన్న! మనందరి ఆకలిని తీర్చడానికి, కర్పూరంలా తను కరుగుతూ మూర్తీభవించిన శ్రమ రూపం, త్యాగరూపం, దైన్యరూపం ఇంకా ….

TS Inter 1st Year English Study Material Chapter 3 The Beggar

The Beggar Summary in Hindi

वर्तमान समय के हमारे प्रांत के आलोचक एवं विविध विधाओं के लेखक एंव कवि हैं, डॉ. अम्मंगि वेणुगेपाल जिनमें सामाजिक जिम्मेदारी और मानवता के दृष्टि कोण से ओत प्रोत है । ‘भिक्षुक’ ‘The Beggar’ उनकी मार्मिक कविता है, जो तेलुगु में लिखी गई है। ‘एलनामा’ उपनाम विख्यात् डॉ. एन. सुरेंद्र ने इसका अँग्रेजी में अनुवाद किया है। इस कविता में किसान की व्यथा – बाधाओं का चितण है । अन्नदाता, देश की रीढ़ की हड्ड़ी, जय किसान के रुप में स्तुत्य किसान भैया आधुनिक समाज के स्वार्थपूरित, क्रूर दंशों से मुद्ध भर दाने के लिए तरसने की दीन हीन स्थिति में भोंक दिया गया। एसे किसान – भैए की दीनता अक्षर – बद्ध की गई इस कविता में –

क्या आपने उन्हें देखा है, जिनकी आँखें बाधाओं की छायाओं से और बादनों के धुंधलेपन से भरी हुई हैं ? क्या काम के बोझ से झुके हुए कुबड़े को जो अपने पूरे हाध्यें से भूमाता को जीवित रखते हुए मिहरी – परतों वाले को ध्यान से देखा ? क्या खून बहाते हुए भूमाता को अभिबिकत करते हुए कदम बढ़ाते हुए आदमी को पहचान लिया ? भैया, वही मेरा किसान भाई, अन्नदाता और आहार प्रदाता । आसीमित भूख को भी मिटा सकनेवला है वह किसांन भैया।

किंतु क्या वह किस्मत का खेल है या क्रूर लीला है कि सब की भूख मिटानेवाले किसान भैया का पेट तो हमेशा खाली है, क्षुदा ज्वालाओं से भरा होता है । उसके चहरे पर श्रभ एवं व्यथाओं के वलय प्रतिबिंबित हैं । उस से बोए हुए बीन अंकुरित होते हैं। मानो उसके हाथों के पसीने और खून का गीलेपन पाकर हाथ ही अंकुरित हुए हो । आप गरम-गरम खाना भकोसते समय, क्या घायल हाथों से ‘माता भिक्षांदेही’ कहकर आपके दरवाजे पर पुकारनेवाले एक भिक्षार्थी को देखा ? भैया, वही है मेरा किसान भैथा । हम सब की भूख मिटाने कपूर – सा जलता हुआ, गलता हुआ, वह साक्षात् श्रम का साकार रूप है, त्यागमूर्ति है, दरिद्र नारायण है, और
…….

Meanings and Explanations

sight (v) / sait / (సైట్) (monosyllabic): seen, చూచుట , देखना, अवलोकन करना

dusky (adj) / ‘dëski / (డస్కి) (disyllabic) : having a dark shade (indicating intense pain) దుఃఖం, బాధలో నలుపెక్కిన, धुँधला, मतमैला

hunchback (n) / ‘hantsbæk / (హంచ్ బ్యాంక్) (disyllabic) : a bent, curled forward back, గూని గల, వంగిపోయిన , कुबड़ा, मुकना

blood-tinged (adj) / blåd-tınd3d / (బ్లడ్ టీంజ్ డ్) (disyllabic) : showing / having marks of blood, రక్తపు మరకలతో, खून के धश्बो के साथ

TS Inter 1st Year English Study Material Chapter 3 The Beggar

footprints (ఫుట్ ప్రింట్): outlines of the foot, కాలి జాడలు, पांव, पैर

mitigate (v) / mitigeit / (మితిగెఇట్) (trisyllabic) : reduce, lessen, (here) satisfy, nowo, (ఇక్కడ సంతృప్తి చెందించటం, తీర్చటం, घटाना, कमकरना

hunger (హుంగెర్) : desire for food, ఆకలి, भूक

infinite (adj) / infinət / (ఇన్ ఫినెట్ ) (trisyllabic): very great in amount, without limits, అంతులేని, అపారమైన, अनंत

void (n) / vɔd / (వో ఇద్) (monosyllabic) : emptiness, ఖాళీ, (ఆకలితో) వట్టి, ఏమియులేని , रिकित

replete (adj) / ripli:t / (రిప్లిట్) (disyllabic) : filled to full, పూర్తిగా నిండియున్న , भरापूरा, परिपूर्ण

wretchedness (n) / retsidnǝs / (రేచిద్ వస్) (trisyllabic) : unhappiness, sorrow, దుః ఖం, దౌర్భాగ్యం, दुःख, कमबख्ती, मानसिक – शारीरिक बाधा की रथिति

seeds (సీడ్స్) : విత్తనాలు, बीज

sow (సో): plant, విత్తు, నాటుట, सुअरी

sprout (v) / spraut / (స్ప్రౌట్ ) (monosyllabic) : to grow from a seed, germinate, మొలచు అంకురించు, अंकुरित होना

gobble (v) / gobl / (గోబ్ల్) (disyllabic) : eat hastily, వేగంగా, ఆబగా తినుట, బొక్కుట, भकोसना

threshold (n) / Orefǝuld / (తైషఉల్డ్ ) (disyllabic) : entrance, the door or gate of a house, గడప, గుమ్మం, दरवाजा, प्रवेश द्वार, दरवाजा, प्रवेश – दूर

severed (adj) / sıvıǝ(r)d / (సివిఅ(ర్)డ్) (disyllabic) : causing great discomfort by being extreme, ఇష్టం కలిగించని , काटना, घायल

TS Inter 1st Year Telugu Study Material Chapter 3 ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 3rd Lesson ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం Textbook Questions and Answers.

TS Inter 1st Year Telugu Study Material 3rd Lesson ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
ప్రాచీన సాహిత్యంలో మానవతావాదాన్ని వివరించండి?
జవాబు:
ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం అన్న పాఠ్యభాగం ఆచార్య రవ్వా శ్రీహరిచే రచించబడిన సాహితీ నీరాజనం అన్న వ్యాస సంకలనం లోనిది. ఇందులో ఆయన మానవతా వాదాన్ని గురించి చక్కగా వివరించారు.

మానవతావాదం అంటే మానవ సంక్షేమాన్ని, మానవ ప్రగతిని, లక్ష్యంగా పెట్టుకుని ఒక మానవుడు తోటి మానవుని గురించి శుభకామనతో చేసే ఆలోచనా రీతి. దీనిని మావనతా వాదం అనే కన్నా మానవతా దృక్పధం అనటం సబబని రవ్వాహరి అభిప్రాయం. ఈ మానవతా దృక్పధానికి మూలం ప్రేమ. మానవుడు తోటి మానవుని పట్ల ప్రేమ భావాన్ని స్నేహభావాన్ని చూపించగలిగితే సమాజం ఆనందమయం అవుతుంది.

ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాసానికి, మానవతా వాదానికి సంబంధించిన అంశాలు ఎన్నో ఉన్నాయి. సంస్కృతంలో వేద వాఙ్మయం అతి ప్రాచీనమైంది. ఆ వేదాలలో ఋగ్వేదం మొదటిది. దానిలోని ‘పదవ మండలంలో అన్నదాన మహాత్మ్యాన్ని చెప్పే శ్లోకం ఒకటి ఉంది. ప్రాచీన సాహిత్యంలో కన్పించే అన్నదాన ఘట్టాలన్నీ మానవతా వాద ప్రతిపాదకాలే! ఆకలితో బాధపడేవానికి అన్నం పెట్టనివాడు చనిపోయన వానితో సమానుడుట.

వాల్మీకి రామాయణం ఆరంభమే మానవతావాదంతో ప్రారంభమయింది. “మానిషాద ప్రతిష్ఠాం….” అన్న ఆది కావ్యా రామాయణ వాక్యాలు పరమ కారుణ్య భావానికి ప్రతీకలు. ప్రేమ భావాన్ని దయాభావాన్ని మానవులపైనే కాక సకల జీవరాశిపై చూపించాలన్నది నిజమైన మానవతావాదం. బోయవాడు క్రౌంచ పక్షులలో మగపక్షిని భాణంతో కొట్టాడు. ఆడపక్షి దుఃఖం – వాల్మీకిని కదిలించిందట. ఇది అసలైన కారుణ్యభావం కదా!-

TS Inter 1st Year Telugu Study Material Chapter 3 ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం

ఇక ‘మహాభారతంలో ఉన్నదే మరొక చోట కూడా ఉంటుంది. మహాభారతంలో లేనిది మరెక్కగా ఉండదు. ధర్మప్రతిపాదన మహాభారత లక్షణం. దధీచి, శిబి, రంతి దేవుని కథలు మానవతా వాదానికి మచ్చుతునకలు. రంతిదేవుడు నోట వ్యాసుడు “న త్వహం కామయే రాజ్యం…” అన్న శ్లోకం ద్వారా” నాకు రాజ్యము వద్దు, స్వర్గము వద్దు, మోక్షం అసలే వద్దు. దుఃఖంతో బాధపడుతున్న జీవుల ఆర్తిని తొలగించటమే కావాలంటాడు. దీనికి మించిన మానవతా వాదం ఇంకా ఎక్కడున్నది.

ఇక దానాలన్నింటిలో అన్నదానం గొప్పదంటారు. ఎందుకంటే అది క్షుద్బాధను తీరుస్తుంది కాబట్టి. తాను కడుపునిండా తింటూ కొందరు ఆకలితో అలమటిస్తుంటే ఉ దాసీనంగా పట్టనట్లుగా ఉంటే అది మానవత్వం అన్పించుకోదు. ప్రాచీన సాహిత్యమంతటిలో దానమైన నిత్యం చేస్తే అది మానన్తవం అనిపించుకుంటుంని చెప్పబడింది.

భాగవతంలోని సప్తమ అధ్యాయంలో గృహస్థ ధర్మాలను వ్యాసులవారు వివరించారు. ఏ మానవునికైనా తన కడుపునింపుకునే ధనం మీద మాత్రమే అధికారం ఉంది. అంతకంటే ఎక్కువ ఉంచుకుంటే అది పాపమే అవుతుంది అన్నాడు. చరకుడు తన చరకసంహితలో సమస్త ప్రాణుల సంతోషాన్ని కోరుకున్నాడు. అష్టాంగ హృదయంలో ‘బాల వృద్ధేభ్యః అన్నమదత్వాన భుజంతీ” అని చెప్పబడింది. అంటే బాలలకు వృద్ధులకు అన్నంపెట్టిన తరువాతే మనం భుజించాలని అర్థం.

మానవులందరూ సుఖంగా ఉండాలి. సర్వజీవులు ఆనందంగా జీవించాలని అన్నది మన ప్రాచీనుల ఆదర్శమని రవ్వాశ్రీహరి పేర్కొన్నారు.

ప్రశ్న 2.
వ్రాచీన సాహిత్యంలో జీవకారుణ్య భావాలను తెలపండి?
జవాబు:
ప్రాచీన సాహిత్యంలో మానవతావాదము అన్న పాఠ్యభాగం ఆచార్య రవ్వా శ్రీహరిచే రచించబడిన “సాహితీ నీరాజనం” అన్న వ్యాస సంకలనం నుండి గ్రహించబడింది. ఇందులో ప్రాచీన సాహిత్యంలో జీవకారుణ్య భావం చక్కగా వివరించబడింది.

జీవ కారుణ్యం అంటే సృష్టిలోని సకల జీవులపట్ల కరుణ, జాలి కలిగి ఉండటం. ఋగ్వేదంలో అన్నదానం గురించి వివరిస్తూ ఆకలితో బాధపడేవారికి అన్నం పెట్టనివాడు మృత ప్రాయుడని చెప్పబడింది. రామాయణ రచన జీవకారుణ్యాన్ని చెప్పడంతోనే ప్రారంభమయింది. “మానిషాద ప్రతిష్టాం”… అన్న శ్లోకం జీవకారుణ్యాన్ని చూపమనిచెప్పింది.

TS Inter 1st Year Telugu Study Material Chapter 3 ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం

కఠిన మనస్సుగల బోయవాడు సుఖంగా కలిసి ఉన్న క్రౌంచ పక్షులలో మగపక్షిని కొట్టాడు. ఆడపక్షి కరుణ స్వరాన్ని విన్న వాల్మీకి మనసులో కారుణ్యం చోటు చేసుకుంది. ప్రేమ భావాన్ని కరుణ భావాన్ని మానవులపైనే గాక పశుపక్ష్యాదులపైన కూడా చూపించడం భారతీయ సంస్కృతిలో కన్పించే ముఖ్యలక్షణం. దీనినే ప్రాచీన కావ్యాలు కూడా ప్రభోదించాయి. “ఆత్మవత్ సతతం పశ్యేదపికీటపిపీలికామ్” అంటే చీమ మొదలైన కీటకాలను కూడా తమలానే భావించాలి అని అష్టాంగ హృదయం చెప్తుంది.

మహాభారతంలోని దధీచి, శిబి, రంతి దేవుడు మొదలుగు కథలలో జీవకారుణ్యం గురించి వివరించబడింది. రంతిదేవుని కథలో “నత్వహంకామయే రాజ్యం….” అన్న శ్లోకంలో వ్యాసుడు రంతిదేవుని మనసులో ఉన్న జీవకారుణ్యాన్ని వివరించాడు. “నాకు రాజ్యము వద్దు, స్వర్గము వద్దు, మోక్షం అసలు వద్దు. దుఃఖంతో బాధపడుతున్న జీవుల ఆర్తి తొలగటమే నాకు కావాలి” అంటాడు. దీనికి మించిన జీవకారుణ్యం ఏముంటుంది. ఇలా ప్రాచీనమైన ప్రతి కావ్యంలో కూడా జీవ కారుణ్యాన్ని కవులు తెలియచేశారు.

II. సంగ్రహ రూప ప్రశ్నలు సమాధానాలు

ప్రశ్న 1.
అన్నదాన ప్రాముఖ్యతను తెలియచేయండి?
జవాబు:
ప్రాచీన సాహిత్యంలో మానవతా వాదం అన్న పాఠ్యభాగం ఆచార్య రవ్వా శ్రీహరిచే రచించబడిన ‘సాహితీ నీరాజం’ అన్న వ్యాస సంకలనం నుండి గ్రహించబడింది. ఇందులో అన్నదాన మహిమను వర్ణించారు.

దానాలన్నింటిలోకి అన్నదానం గొప్పది. అది మానవుల ఆకలి బాధను తీరుస్తుంది. తాను కడుపునిండా తింటూ కొందరు ఆకలితో అలమటిస్తూంటే చూసి చూడ నట్లుండటం. 1212 ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం మానవత్వం కాదు అని మన ప్రాచీన గ్రంథాలలో వివరించబడింది. తైత్తిరీయ ఉపనిషత్తులో, అన్నాన్ని ఎక్కువగా వండాలని ఆకలితో అలమటించే దీనులకు అన్నం పెట్టాలని అలా పెట్టనివాడు నరకానికి పోతాడని వివరించబడింది. అలా అన్నార్తులకు అన్నం పెట్టనివాడు కేవలం పాపాన్నే భుజిస్తాడని చెప్పింది.

ఎవరు తనకోసం మాత్రమే వండుకుంటాడో అంటే ఎవరు అన్నార్తుల బాధను పట్టించుకోకుండా తన పొట్టమాత్రమే చూసుకుంటాడో వాడు నరకాన్ని పొందుతాడని పాపాన్ని ప్రోగుచేసుకుంటాడని స్మృతులు వివరించాయి. భాగవతంలో కూడా గృహస్థ ధర్మాన్ని వివరిస్తూ తన కడుపు నింపుకోవడానికి అవసరమైన ధనం మీదే మానవునకు అధికారం ఉంటుంది. మిగిలినది అన్నార్తులకు వినియోగించాలని చెప్పింది. ఇలా అన్నదాన ప్రాముఖ్యాన్ని మన ప్రాచీన గ్రంథాలు వివరించాయి.

TS Inter 1st Year Telugu Study Material Chapter 3 ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం

ప్రశ్న 2.
అష్టాంగ హృదయం ఏమని ప్రబోధిస్తుంది?
జవాబు:
ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం ‘అన్నపాఠభాగ్యం ఆచార్య రవ్వా శ్రీహరిచే రచించబడిన ‘సాహితీ నీరాజనం’ అన్న వ్యాస సంకలనం నుండి గ్రహించబడింది.
దుఃఖితులపట్ల మానవులు ఎలా ప్రవర్తించాలో అష్టాంగ హృదయకర్త చక్కగా వివరించాడు. ఏ జీవనాధారము లేనివాణ్ణి, వ్యాధితో బాధపడుతున్నవాణ్ణి, దుఃఖంలో న్నవాణ్ణి వారి వారి శక్తిని బట్టి ఆదుకోవాలని అష్టాంగ హృదయం చెప్తుంది. మానవుని సంక్షేమాన్ని, మానవ ప్రగతిని లక్ష్యంగా పెట్టుకుని ఏ జీవనాధారం లేని వారికి వ్యాధిగ్రస్తులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని అదే మనవత్వం అనిపించుకుంటుందని అష్టాంగ హృదయంబోధించింది.

ప్రశ్న 3.
రంతిదేవుని ద్వారా వ్యాసుడు పలికించిన ధర్మం ఏమిటి?
జవాబు:
ప్రాచీన సాహిత్యంలో మానవతా వాదం అన్న ‘పాఠ్యభాగం ఆచార్య రవ్వా శ్రీహరిచే రచించబడిన ‘సాహితీ నీరాజనం’ అను వ్యాస సంకలనం నుండి గ్రహించబడింది. మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాసానికి ఉపకరించే అంశాలు కోకొల్లలు. వేదముల నుండి పురాణాల వరకు అన్నింటిలోనూ ఈ ప్రస్తావన ఉంది. మహాభారతం లో దధీచి, శిబి, రంతిదేవుని పాత్రల ద్వారా ఈ విషయాన్ని వ్యాసుల వారు వివ రించారు. మానవతావాది, త్యాగశీలి, దయాశీలి రంతిదేవుని మాటల్లో

“నత్వహం కామయే రాజ్యం”…..

అన్న శ్లోకం ద్వారా “నాకు రాజ్యము వద్దు, నాకు స్వర్గమూ వద్దు, నాకు మోక్షము వద్దు దుఃఖంతో బాధపడుతున్న జీవుల ఆర్తి తొలగి పోవటమేకావాలి” అని చెప్పబడింది. భాగవతంలో కూడా “న కామయే హం గతి మీశ్వరాత్…..” అన్న శ్లోకంలో కూడా దుఃఖపీడితుల హృదయాల్లో తానుడంటూ వాళ్ళ బాధలను తాను అనుభవించైనా వారి దుఃఖాలను పోగొట్టాలి అని రంతిదేవుడు చెప్పిన మాటలు నిజంగా మానవతకు సంబంధించినది.

TS Inter 1st Year Telugu Study Material Chapter 3 ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం

ప్రశ్న 4.
పురాణాలు ఎవరిపైన దయచూపాలని చెప్పాయి?
జవాబు:
ప్రాచీన సాహిత్యంలో మానవతా విలువలు’ అను పాఠ్యభాగం ఆచార్య రవ్వా శ్రీహరిచే రచించబడిన ‘సాహితీ నీరాజనం’ అన్న వ్యాస సంపుటి నుండి గ్రహించ బడింది. దీనిలో మానవతా వాదం ప్రాచీన సాహిత్యంలో ఎలా వివరించబడిందో రవ్వావారు వివరించారు.

మన పురాణాలు వట్టి పురాణాలు కావు. వాటిలో మానవులందరూ సుఖంగా ండాలి. ఆరోగ్యంగా ఉండాలి. అందరూ ప్రగతిని సాధించాలి. ఏ ఒక్కరూ దుఃఖంతో జీవించరాదు అని వివరించాయి. కేవలం మానవులందేకాకుండా పశుపక్ష్యాదులపైన కూడా దయ, జాలి కరుణలను చూపించాలని ప్రబోధించాయి.

క్రిమికీటకాదులు పైన, పశు పక్ష్యాదులపైన, ఏ కులం వారిపై నైనా, పతితుతలపైన వర్ణసాంకర్యం గల వారిపైన దయాగుణాన్ని చూపాలని పురాణాలు వివరించాయి. చివరికి తృణ వృక్షాదులను కూడా జీవంగల వానిగా భావించి వాటికి ఏ విధమైన హానిని కలిగించకుండా కాపాడుకోవాలని మన పురాణాలు వివరించాయి.

III. ఏకపద వాక్య సమాధాన ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
ఆచార్య రవ్వా శ్రీహరి తల్లిదండ్రులెవరు?
జవాబు:
ఆచార్య రవ్వా శ్రీహరి తల్లిదండ్రులు వెంటకనరసమ్మ, నరసయ్యలు.

ప్రశ్న 2.
ఆచార్య రవ్వా శ్రీహరి రచనలు తెలియచేయండి?
జవాబు:
తెలుగు కవుల సంస్కృతానుకరణలు, తెలంగాణ మాండలికాలు కావ్యప్రయోగాలు, అన్నమయ్య భాషా వైభవం వంటి 40 గ్రంథాలను రచించారు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 3 ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం

ప్రశ్న 3.
ఆచార్య రవ్వాశ్రీహరి సంస్కృతానువాద రచనలేవి?
జవాబు:
డా. సి. నారాయణరెడ్డి ప్రపంచపదులు, జాషువా గబ్బిలం, ఫిరదౌసి, వేమన శతకం, నృసింహ శతకాలు శ్రీహరి సంస్కృతాలనువాదాలు

ప్రశ్న 4.
ఆచార్య రవ్వాశ్రీహరికి ‘మహా మహాపాధ్యాయ’ బిరుదును ప్రదానం చేసిన సంస్థ ఏది ?
జవాబు: తిరుపతిలోని కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం వీరికి ‘మహా మహెూపాధ్యాయ బిరుదును ఇచ్చింది.

ప్రశ్న 5.
మానవతా దృక్పధానికి మూలమేమి?
జవాబు:
మానవతా దృక్పధానికి మూలం ‘ప్రేమ’

ప్రశ్న 6.
సంస్కృత సాహిత్యంలో ఆదికావ్యమేది?
జవాబు:
సంస్కృత సాహిత్యంలో ఆదికావ్యం వాల్మీకి రచించిన ‘రామాయణం’.

TS Inter 1st Year Telugu Study Material Chapter 3 ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం

ప్రశ్న 7.
ధర్మసింధువు ఏమని ప్రబోధిస్తుంది?
జవాబు:
బాలురకు వృద్ధులకు అన్నంపెట్టందే భుజింపరాదని ప్రబోధిస్తుంది.

ప్రశ్న 8.
చరక సంహితలో చరకాచార్యుడు ఏమని శాసించాడు?
జవాబు:
మానవుడు నిత్యమూ సమస్త ప్రాణుల కళ్యానాన్ని కోరుకోవాలని శాసించాడు.

ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం Summary in Telugu

రచయిత పరిచయం

రచయిత : రవ్వా శ్రీహరి (ఆచార్యలు)

పుట్టిన తేదీ : మే 5, 1943

పుట్టిన ఊర : నల్గొండ జిల్లా వలిగొండ మండలం వెలువర్తి గ్రామం

తల్లిదండ్రులు : వేంకట నరసమ్మ, నరసయ్యలు

విద్యాభ్యాసం :

  1. శ్రీహరి వేదాంత వర్థిని సంస్కృత కళాశాలలో బి.ఓ.ఎల్
  2. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ తెలుగు, సంస్కృతం, (సంస్కృతంలో బంగారు పతకం సాధించారు)

పరిశోధనలు : భాస్కర రామాయణం, విమర్శనాత్మక పరిశీలన, పి.హెచ్.డి చేశారు

TS Inter 1st Year Telugu Study Material Chapter 3 ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం

ఉద్యోగం :

  1. ఉస్మానియా, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో ఆచార్యులుగా
  2. ద్రవిడ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా పనిచేశారు.

రచనలు :

  1. తెలుగు కవుల సంస్కృతాను – కరణములు
  2. సంకేత పదకోశం
  3. తెలంగాణ మాండలికాలు – కావ్యప్రయోగాలు
  4. తెలుగులో అలబ్ద వాఙ్మయం
  5. ఉభయ భారతి
  6. సంస్కృత వైజయంతి
  7. సంస్కృత సూక్తి రత్నావళి
  8. అన్నమయ్య భాషా వైభవం వంటి 40 గ్రంథాలు ప్రచురించారు.
  9. డా. సి. నారాయణరెడ్డి పంచపదులు, జాషువా, గబ్బిలం, పిరదౌసి వేమన శతకం, నరసింహ శతకాలను సంస్కృతంలోకి అనువదించారు.
  10. సూర్యరాయాంధ్ర నిఘంటువులోలేని 35వేల కొత్త పదాలను సేకరించి శ్రీహరి నిఘంటువును తయారుచేశారు.
  11. సంస్కృత, వ్యాకరణ గ్రంథం పాణినీయ అష్టాధ్యాయినిని రెండు భాగాలుగా తెలుగులోనికి అనువదించాడు.

అవార్డులు :

  1. తిరుపతి కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం మహా మహెూపాధ్యాయ బిరుదునిచ్చింది.
  2. తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ సంస్కృత పండిత బిరుదు
  3. ప్రపంచ పదీయ సంస్కృత అనువాదానికి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు
  4. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉగాది పురస్కారం
  5. గణపతి సచ్చిదానంద స్వామిచే స్వర్ణకంకణం
  6. పరవస్తు చిన్నయసూరి జాతీయ పురస్కారం
  7. తెలంగాణా ఎస్.ఆర్.పి చే జీవన సాఫల్య పురస్కారం

TS Inter 1st Year Telugu Study Material Chapter 3 ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం

మహా మహెూపాధ్యాయ రవ్వా శ్రీహరి దక్షిణ భారతంలో విశిష్ట సంస్కృత పండితునిగా పేరు పొందారు. వీరు మే 5 1943న నల్గొండ జిల్లా వలిగొండ మండలం వెల్దుర్తి గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు వెంకట నరసమ్మ, సరసయ్యలు. ఎం.ఏ. తెలుగు, ఎం. ఏ సంస్కృతం. సంస్కృతంలో బంగారు పతకాన్ని పొందారు.

“భాస్కర రామాయణం- విమర్శనాత్మక పరిశీలన” అన్న అంశంపై పరిశోధన చేశారు. ఉస్మానియా హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో ఆచార్యునిగా పని చేశారు. ద్రవిడ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా సేవలందించారు.

రచనలు

తెలుగు కవుల సంస్కృతానుకరణలు, సంకేత పదకోశం, తెలంగాణ మాండలికాలు, కావ్యప్రయోగాలు, తెలుగులో అబద్దవాఙ్మయం, ఉభయ భారతి, సంస్కృత వైజయంతి, సంస్కృత సూక్తి రత్నాకరం, అన్నమయ్య భాషా వైభవం, వంటి 40 గ్రంథాలను వెలువరించారు.

డా.సి.నారాయణరెడ్డి పంచపదులు, జాషువా గబ్బిలం, ఫిరదౌసి కావ్యాలను, వేమన శతకం, నరసింహ శతకాలను సంస్కృతం లోకి అనువదించారు. సూర్యరాయాంధ్ర నిఘంటువులో లేని 35 వేల కొత్త పదాలను సేకరించి శ్రీహరి నిఘంటువును వెలువరించారు. సంస్కృత వ్యాకరణ గ్రంథం పాణినీయం అష్టాధ్యాయినిని రెండు భాగాలు తెలుగునకు అనువాదంచేశారు. వీరు రచించిన సంకేత పదకోశం ఉపయుక్త గ్రంథం.

అవార్డులు – బిరుదులు – పురస్కారాలు

రవ్వా శ్రీహరి గార్కి తిరుపతి కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం మహా మహోూపాధ్యాయ బిరుదునిచ్చింది. తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ సంస్కృత పండితునిగా పురస్కారం అందించింది.

ప్రపంచ పదీ సంస్కృత అనువాదానికి కేంద్ర ‘సాహిత్య అకాడమీ పురస్కారం 2001 లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉగాది పురస్కారం, గణపతి సచ్చిదానంద స్వామిచే స్వర్ణకంకణ పురస్కారం, పరవస్తు చిన్నయసూరి జాతీయ పురస్కారం, తెలంగాణ ఎన్.ఆర్.ఐ అసోషియేషన్ జీవన సాఫల్య పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గురజాడ ప్రతిభా పురస్కారాలను అందుకున్నారు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 3 ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం

ప్రస్తుత పాఠ్యభాగం శ్రీహరి గారు రచించిన “సాహితీ నీరాజనం” అన్న వ్యాస సంకలనం నుండి గ్రహించబడింది.

పాఠ్యభాగ సందర్భం

ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశాలెన్నో ఉన్నాయి. ప్రాచీన రచయితలు కవులు జీవితంలో ఆచరించదగిన మానవీయ విలువలను సందర్భాను సారంగా వివరించారు. ఆకలిచే అలమటించే దీనులను, బాలలను, వృద్ధులను, రోగులను, పశుపక్ష్యాదులను ఆదరించాలని తెలిపారు.

సంపద కొంత మందికే కాకుండా అందరికి అందాలని చెప్పారు. రాజ్యం, మోక్షం, స్వర్గాలకంటే దుఃఖితులకు దుఃఖాన్ని పోగొట్టటం ముఖ్యమన్నారు. వ్యక్తిత్వ వికాసాన్ని విద్యార్థులకు బోధించుటకు ఈ పాఠ్యభాగం ఇవ్వబడింది.

పాఠ్యాభాగ సారాంశం

మానవతా వాదం అంటే మానవ సంక్షేమాన్ని, మానవ ప్రగతిని లక్ష్యంగా చేసుకుని తోటి మానవుని గురించి శుభకామనతో చేసే ఆలోచనగా చెప్పవచ్చు. దీనిని మానవతావాదం అనటం కన్నా మానవతా దృక్పథం అనటం సరైనది. దీనికి మూలం ప్రేమ, మానవుడు తోటి మానువునిపై ప్రేమ, కరుణ, సౌహార్థాలను చూపిస్తూ ఉండాలి.

సంస్కృతంలో వేదవాఙ్మయం అతి ప్రాచీనమైనది. ఆ వేదాలలో ఋగ్వేదం మొదటిది. ఋగ్వేదంలోని 10వ మండలంలో అన్నదాన మహాత్మ్యం చెప్పబడింది. ఆకలితో బాధపడే వానికి అన్నంపెట్టనివాడు మృతి చెందిన వానితో సమానమని అలాంటి వారికి అన్నదానం చేస్తే పుణ్యలోకాలను పొందుతాడని ఆ సూక్త తాత్పర్యం. ఇది మానవతా లక్షణం.

వాల్మీకి రామాయణంలో జీవకారుణ్య భావం మనకు కన్పిస్తుంది.

“మానిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః యత్రాంచ మిథునా దీక్ష మవధీః కామమోహితం” ఇందులో కఠినాత్ముడైన బోయవాడు సరసల్లాపాలు ఆడుకుంటున్న క్రౌంచ పక్షులలో ఒకదానిని కొట్టాడు. మరొక పక్షి దుఃఖం ఆ దృశ్యాన్ని చూసిన వాల్మీకి హృదయం ద్రవించింది. ఈ ఘట్టం జీవకారుణ్యాన్ని తెలియచేస్తుంది. అలాగే అష్టాంగ హృదయంలో “ఆత్మవత్సతతం పశ్యేదపి కీటపిపీలికామ్” సృష్టిలో ఉన్న పిపీలికాది జీవరాశులను మనవలెనే భావించాలని దీని భావం.

TS Inter 1st Year Telugu Study Material Chapter 3 ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం

“వృద్ధబాల వాధితక్షీణాన్ పుశూన్ బాంధవానివపోషయేత్” అన్నది నీతి వాక్యం. వృద్ధులను, బాలలను, రోగ పీడితులను, పశుపక్ష్యాదులను ఆదరణతో చూడాలి అని నీతి -వాక్యాలు చెపుతున్నాయి.

ఇక మహాభారతంలో చెప్పని విషయాలుంటూ ఏమీ లేవు. మానవతా దృక్పధం కల అంశాలు అడుగడుగునా కన్పిస్తాయి. దదీచి, శిబి, రంటిదేవుడు వంటి వారి కథలు త్యాగానికి మానవత్వానికి దయకు నిదర్శనాలుగా నిలుస్తాయి.

“నత్వహం కామయే రాజ్యం న స్వర్గం నా పునర్భవమ్
కామయే దుఃఖతప్తానాం ప్రాణినా మూర్తినాశనమ్”

నాకు రాజ్యము వద్దు, స్వర్గమూ వద్దూ, మోక్షము అసలేవద్దు. దుఃఖంతో బాధపడుతున్న జీవుల ఆర్తిని తొలగించటమే నాకు కావాలని ఇందలి భావం. దీనిలో ఎంతటి మానవతా దృక్పథం దాగి ఉందో చూడండి. రంతిదేవుని కథాఘట్టంలో కూడా ఇదే చెప్పబడింది.

“నకామయేల హం గతి మీశ్వరాత్ పరాం
అష్టయుక్తా మపునర్భవం నా
ఆర్తిం ప్రపద్యే ఖిల దేహబాజం
అంతఃస్థితో యేన భవంత్యుడుఃఖాః ”

దానాలన్నింటిలో అన్నదానం గొప్పదని సకల శాస్త్రాలు చెప్తున్నాయి. తాను కడుపునిండా తింటూ కొందరు ఆకలితో అలమటిస్తూ ఉంటే చూసి చూడనట్లుండటం మానవత్వం అనిపించుకోదు. ఏ దానమైన ఒక్కసారి చేయటం కాకుండా నిత్యం చేస్తూనే ఉండాలట

“అదత్వా యత్కించిదపి న నయే ద్దివీసం బుధః”

శుక్రనీతిలో చెప్పబడిన ఈ శ్లోకానికి తెలివిగలవారు రోజూ ఏదో ఒక దానం చేస్తూనే ఉండాలట.

“అహన్వహ జాతవ్యం అదీ నేనాంతదాత్మనా”

ప్రతిరోజూ ఆనందంగా ఏదో ఒకటి దానం చేయాలి. ఇది మానవతావాదం.

TS Inter 1st Year Telugu Study Material Chapter 3 ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం

భాగవతంలో గృహస్థ ధర్మాలను వివరించే ఘట్టంలో ధర్మాన్ని గురించి వివరించాడు. ప్రాచీనుల ఆలోచనలలో మానవులందరూ సుఖంగా ఉండాలి. వారితో పాటు సకల జీవరాశులు సుఖంగా ఉండాలని భావించారు. ఇక ధర్మసింధువులో బాలురకు, వృద్ధులకు పెట్టిన తరువాతే ఇతరులు భోజనం చేయాలని చెప్పబడింది.

సంస్కృత నాటక కర్తల్లో భవభూతి ఎంతో మానవతా దృక్పథం కలవాడుగా కన్పిస్తాడు. సీతను అడవులకు పంపేటప్పుడు శంబూకుని సంహరించేటప్పుడు రాముడు పశ్చాత్తాపం చెందినట్లు వర్ణించాడు. వేదవ్యాసుడు “ఊర్థ్యబాహుర్విరామ్యేష న చ కశ్చిచ్చణోతిమాన్” గొంతెత్తి గట్టిగా ధర్మాన్ని గురించి ఎంత చెప్పినా వినేవాడు ఒక్కడే లేడని అనడం శోచనీయం.

కఠిన పదాలకు అర్థాలు

అలమటించు = బాధపడు
హితం = మేలు
హితవు = మంచిమాట
సమున్నత = గొప్పవైన
ప్రగతి = అభివృద్ధి
శుభకామన = మంచి ఆలోచన
మృతప్రాయుడు = మరణించిన వానితో సమానుడు
క్షుధార్తి = ఆకలిబాధ
ఆవిర్భావం = పుట్టుక
ద్రవించిపోవు = కరిగిపోవు
ప్రశంసించు = మెచ్చుకొను
దృష్టాంతం = ఉదాహరణ
ఘట్టము = సందర్భము
అధ్యయనం చేయు = చదువు
అలమటించు = బాధపడు
ఆర్తులు = బాధతో ఉన్నవార
కాంక్ష = కోరిక

TS Inter 1st Year Telugu Study Material Chapter 2 తెలంగాణ తెలుగుపదాలు – ఉర్దూ మూలాలు

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 2nd Lesson తెలంగాణ తెలుగుపదాలు – ఉర్దూ మూలాలు Textbook Questions and Answers.

TS Inter 1st Year Telugu Study Material 2nd Lesson తెలంగాణ తెలుగుపదాలు – ఉర్దూ మూలాలు

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు : జవాబులు

ప్రశ్న 1.
ఉర్దూ నుంచి తెలుగులోకి చేరినప్పుడు పదాలలో జరిగిల మార్పును వివరించండి?
జవాబు:
తెలంగాణా తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అను పాఠ్యభాగం సామల సదాశివ చే రచించ బడింది. డా.సి. నారాయణరెడ్డి సంపాదకీయంలో వెలువడిన “వ్యాస గుళుచ్ఛం”, రెండవ భాగం నుండి గ్రహించబడింది. ఇందులో తెలంగాణా తెలుగులో ఉ ర్దూ పదాల మూలాలను చక్కగా వివరించారు.

ఉర్దూ ఒక ప్రత్యేక భాషకాదు, పారసీ, అరబ్బీ, తర్కీ శబ్దాల కలగాపులగం ఉర్దూ భాష. దీనిని ఇది మన దేశంలో 14వ శతాబ్దంలో రూపుదిద్దుకున్నది. దీనిని తొలుత హిందుయి జబానే హిందూస్థాన్ అన్న పేర్లతో పిలువబడింది. 18వ శతాబ్దానికి కాని అది ఉర్దూ అని పిలువబడలేదు.

తెలుగులో కొన్ని ఉర్దూ పదాలు యథాతదంగానే చేరాయి. కమలము, కలందాన్, ఖజానా, జమీందారు, జాగీర్దారు, ఖుషీ, గులాము రోజు, కూలీ, బాకీ, బజారు, దుకాణం మొదలగు పదాలు ఇందుకు ఉదాహరణము. హలంతమైన ఉర్దూ భాషలోని పదాలు అజంతమైన తెలుగు భాషలో చేరినప్పుడు ఆ పదాలు అజంతమవటం సహజం. ఉదాహరణకు కలమ్-కలము అయింది. జమీందార్ – జమీందారు అయింది. బజార్- బజారు అయింది.

కొన్ని పదాలు ఉర్దూ నుండి తెలుగులోకి వచ్చేటప్పుడు తమ రూపాన్ని మార్చు. కున్నాయి. ఉదాహరణకు బాఖీ అనే ఉర్దూ పదం తెలుగులో బాకీ అయింది. అలాగే ‘నఖద్’ నగదుగా మారింది.

TS Inter 1st Year Telugu Study Material Chapter 2 తెలంగాణ తెలుగుపదాలు - ఉర్దూ మూలాలు

ఉర్దూపదం – తెలుగు పదం
ఉదార్ – ఉద్దర
సొహబత్ – సొబతి
మస్జిద్ – మసీదు
కుర్చీ= కుర్చీ
ఘిలాప్ – గలిబు/గలేబు
జుర్మానా – జుర్మానా
నక్స్ – నగిషీ
అబ్రూ – ఆబోరు

ఇలా ఉర్దూపదాలు తెలుగులో మార్పుచెందాయి.

కొన్ని ఉర్దూపదాలు తెలుగులోకి వచ్చి అర్థాన్ని కూడా మార్చుకున్నాయి. ఉదాహరణకు ‘ముదామ్’ అనే పారసీ పదానికి ‘ఎల్లప్పుడూ అనే అర్థం ఉంది. ఇది తెలుగులో ‘ముద్దాముగా’ మారి ‘ప్రత్యేకించి’ అనే అర్థంలో వాడబడుతుంది. ఇలా పలు మార్పులతో అనేక పదాలు ఉర్దూ నుండి తెలుగు భాషలోకి ప్రవేశించాయి.

ప్రశ్న 2.
భాషల మధ్య జరిగే ఆధానప్రదానాలను చర్చించండి?
జవాబు:
తెలంగాణా తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అను పాఠ్యభాగం సామల సదాశివచే రచించబడింది. డా.సి. నారాయణరెడ్డి సంపాదకీయంలో వెలువబడిన “వ్యాసగుళు చ్ఛం” రెండవ భాగం నుండి గ్రహంచ బడింది. ఇందులో భాషల మధ్య ఆదాన ప్రదానాలు సహజంగానే జరుగుతాయని సదాశివ వివరించారు.

ఒక భాషా పదాన్ని మరొక భాష స్వీకరించడం కొత్తేమీకాదు. పలు భాషలు మాట్లాడే ప్రజలు ఒక చోట కలిసి మెలసి ఉన్నప్పుడు భాషలలో ఆదాన ప్రదానాలు సహజంగా జరుగుతుంటాయి. ఒక భాషా పదాన్ని వేరొక భాష స్వీకరించేటప్పుడు ఏదో ఒక విభక్తి ప్రత్యయాన్ని చేర్చి ఆ భాషా పదాన్ని మరొక భాషాపదం స్వీకరిస్తుంది. ఒక్కొక్కసారి యథాతదంగాను లేదా ఒక అక్షరాన్ని చేర్చి, ఒక అక్షరాన్ని తీసేసి, లేదా ఒక అక్షరాన్ని మార్చి స్వీకరించటం జరుగుతుంది.

TS Inter 1st Year Telugu Study Material Chapter 2 తెలంగాణ తెలుగుపదాలు - ఉర్దూ మూలాలు

స్వీకరించిన భాష తాను స్వీకరించిన మూల భాషా పద అర్థాన్నే స్వీకరిస్తుంది. కొన్ని సందర్భాలలో వేరే భాషా పదాన్ని స్వీకరించిన భాష మూల భాష యొక్క అర్థాన్ని కాక కొత్త అర్థంలో కూడ స్వీకరించడం జరుగుతుంది. ఇలా భారతీయ భాషలన్నింటిలోనూ సంస్కృత భాషా ప్రభావం అధికంగా ఉంది. అలాగే ఆంగ్లభాషా ప్రభావం కూడా! అన్య భాషా పదాలను స్వీకరించడంలో వర్ణాగమ, వర్ణాలోప, వర్ణవ్యత్యయాల ద్వారా ఆదాన ప్రదానాలు జరుగుతుంటాయి.

ఉదాహరణకు :-
లార్డ్ అనే ఆంగ్లపదం ఉర్దూలోకి ‘లాట్సాహెబ్’గా మారటం. ఫిలాసఫీ అనే ఆంగ్లపదం ఫల్సఫాగా ఉర్దూలోకి రావటం సొహబత్ అనే ఉర్దూపదం తెలుగులో ‘సోబతి’ అవటం. ఉర్దూలో ఆబ్రూ అనే పదం తెలుగులో ఆబోరుగా మారటం వర్ణలోప వర్ణాగమ. వర్ణవ్యత్యయాలకు ఉదాహరణులుగా చెప్పవచ్చు.

II. సంగ్రహ రూప ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
ఉర్దూ వానా పదాన్ని వివరించండి?
జవాబు:
తెలంగాణా తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అను పాఠ్యభాగం సామల సదాశివచే రచించబడినది. డా.సి. నారాయణరెడ్డి సంపాదకీయంలో వెలువబడిన ‘వ్యాసగుళు చ్ఛం’, రెండవ భాగం నుండి గ్రహించబడింది.

మన దేశంలోని భాషలన్నింటిపై సంస్కృత భాషా ప్రభావం ఎలా ఉందో అలాగే ఆంగ్లభాషా ప్రభావం ఉర్దూ భాషపై ఉంది. ఉర్దూ భాషా శాస్త్రవేత్తలు, ‘ఉర్దువానా’ అనే పదాన్ని తరుచుగా వాడుతుంటారు. ఉర్దూ, పండితులు పలు ఆంగ్లపదాలను పద బంధాలను ఉర్దూలోకి అనువదించుకున్నారు. అవిగాక ఒక భాష అన్యభాషా పదాలను స్వీకరించే వర్ణాగమ, వర్ణలోప వర్ణవ్యత్యయ పద్దతులలో ఎన్నో ఆంగ్లపదాలను ఉర్దూభాషలోకి మార్చుకున్నారు. ఆభాషా రూపమే ‘ఉర్దూవానా’.

ఉదా : లార్డ్ అనే ఆంగ్లపదం లాట్ సాహెబ్ ను
కమాండ్ అనే ఆంగ్లపదం కమాన్ ను
ఫిలాసఫీ అనే పదం ఫల్సపా గాను

ఇలా పలు ఆంగ్లపదాలు ఉర్దూలోకి వచ్చాయి. ఆ పదాల సమూహంతో వచ్చిన దానిని ‘ఉర్దూవానా’ అన్నారు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 2 తెలంగాణ తెలుగుపదాలు - ఉర్దూ మూలాలు

ప్రశ్న 2.
తెలంగాణ తెలుగు మిగతా ప్రాంతాల తెలుగు కంటే భిన్నమైనది ఎందుకు?
జవాబు:
తెలంగాణ తెలుగు పదాలు ఉర్దూమూలాలు అను పాఠ్యభాగం సామల సదాశివచే రచించబడింది. డా.సి. నారాయణరెడ్డి, సంపాదకీయంలో వెలువబడిన ‘వ్యాస గుళుచ్చం’, రెండవ భాగం నుండి ఈ పాఠ్యభాగం గ్రహించబడింది.

ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ, ప్రజలు మాట్లాడుకునే భాష తెలుగు, తెలుగు గ్రాంథిక రూపంలో ఈ నాలుగు ప్రాంతాలలో ఒకటిగానే ఉంటుంది. వ్యవహారికంలోకి వచ్చేటప్పటికి నాలుగు ప్రాంతాలలోనూ వేరు వేరుగా ఉంటుంది. తెలుంగాణా తెలుగు భాష మిగిలిన మూడు ప్రాంతాల భాష కంటే భిన్నంగా ఉంటుంది. దానికి కారణం లేకపోలేదు. తెలంగాణ ప్రాంతం తెలుగు భాషలో ఉర్దూ, హిందీ మరాఠీ భాషా పదాలు అధికంగా ఉండటం వలన మిగిలిన ప్రాంతాల తెలుగు భాషకన్నా తెలంగాణ తెలుగు భిన్నంగా ఉంటుంది.

ప్రశ్న 3.
తెలంగాణా తెలుగులో యథాతదంగా చేరిన ఉర్దూ పదాలను తెలపండి?
జవాబు:
‘తెలంగాణా తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అను పాఠ్యభాగం సామన సదాశివచే రచించబడింది. డా. సి. నారాయణరెడ్డి సంపాదకీయంలో వెలువబడి. ‘వ్యాస గుళు చ్చం’ రెండవ భాగం నుండి గ్రహించబడింది.

ఒక భాషలోని పదాలు మరొక భాషలోకి చేరేటప్పుడు వాటి రూపు రేఖలు మారటమో లేకఅర్థం మారటమో జరుగుతుంది. అలా కాకుండా తెలంగాణ తెలుగు భాషలో ఉర్దూ పదాలు యథాతదంగా చేరాయి. అలాంటి పదాలలో కలము, కలందాన్, ఖజానా, జమీందారు, జాగీర్దారు, ఖుషీ, గులాము, రోజు, కూలీ, బాకీ, గురుజు, బజారు, దుకాణం, మాలు, జబర్దస్తీ, జోరు, మొదలగు పదాలున్నాయి. ఇవన్నీ యథాతదంగా ఎలాంటి మార్పును పొందకుండా తెలుగులోకి వచ్చిన ఉర్దూపదాలు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 2 తెలంగాణ తెలుగుపదాలు - ఉర్దూ మూలాలు

ప్రశ్న 4.
సామల సదాశివ రచనలను సంగ్రహంగా తెలుపండి ?
జవాబు:
సామల సదాశివ ఆదిలాబాద్ జిల్లా దహగాం మండలంలోని తెలుగు పల్లెలో మే 11, 1928న జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు సామల చిన్నమ్మ, నాగయ్యలు. సదాశివ విభిన్న భాషా సంస్కృతుల కళావారధి, వీరు సంస్కృతం, హిందీ, ఉర్దూ, ఆంగ్లం, ఫార్సీ, మరాఠీ తెలుగు భాషలలో పండితుడు. వీరి తొలి రచనలలో ప్రభాతము అనే లఘు కావ్యం, సాంబశివ శతకం, నిరీక్షణము, అంబపాలి, సర్వస్య దానము, విశ్వామిత్ర మొదలుగునవి ఉన్నాయి.

హిందూస్థానీ సంగీత కళాకారుల ప్రతిభపై, ‘మలయమారుతాలు’ ప్రముఖుల జ్ఞాపకాలు, ఉర్దూ, భాషా కవిత్వ సౌందర్య ఉర్దూకవుల కవితా సామాగ్రి మొదలగునవి ప్రసిద్ధ గ్రంథాలు.

అన్జద్ రుబాయిలు తెలుగు అనువాదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ అనువాద పురస్కారాన్ని ఇచ్చింది. వీరి ‘స్వరలయలు’ గ్రంథానికి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కాకతీయ, తెలుగు విశ్వవిద్యాలయాలు వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. వీరి రచనలపై విశ్వవిద్యాలయాలలో పలు పరిశోధనలు జరిగాయి.

III. ఏక పద/వాక్య సమాధాన ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
ఉర్దూ భాషను పూర్వం ఏ పేర్లతో పిలిచేవారు ?
జవాబు:
ఉర్దూ భాషను పూర్వం హిందుయి-జబానె-హిందుస్థాన్ అనే పేర్లతో 18వ శతాబ్దం వరకు పిలిచేవారు.

ప్రశ్న 2.
‘లాట్ సాహెబ్’ పదానికి మూల పదం ఏది?
జవాబు:
‘లాట్ సాహెబ్’ అనే పదానికి మూల పదం ‘లార్డ్’ అనే ఆంగ్లపదం

ప్రశ్న 3.
‘జుర్మానా’ అనే ఉర్దూపదం తెలుగులో ఏ విధంగా మారింది?
జవాబు:
జుర్మానా అనే ఉర్దూపదం తెలుగులో ‘జుల్మానా’గా మారింది.

TS Inter 1st Year Telugu Study Material Chapter 2 తెలంగాణ తెలుగుపదాలు - ఉర్దూ మూలాలు

ప్రశ్న 4.
‘ముహ్జుబాణీ’ అనే ఉర్దూపదానికి అర్థం?
జవాబు:
‘ముహ్ జుబాణీ అనే ఉర్దూపదానికి’ ‘నోటితో’ అని అర్థం.

ప్రశ్న 5.
‘కులాసా’ తెలుగు పదానికి ఉర్దూరూపం?
జవాబు:
కులాసా తెలుగు పదానికి ఉర్దూరూపం ‘ఖులాసా’

ప్రశ్న 6.
‘ఉర్దూ’ భాషకు ‘ఉర్దూ’ అనుపేరు ఏ శతాబ్దంలో వచ్చింది
జవాబు:
18వ శతాబ్దంలో

ప్రశ్న 7.
‘సామల సదాశివ’ రాసిన శతకం?
జవాబు:
‘సాంబశివ’ శతకం

TS Inter 1st Year Telugu Study Material Chapter 2 తెలంగాణ తెలుగుపదాలు - ఉర్దూ మూలాలు

ప్రశ్న 8.
ఏ గ్రంథానికి సామల సదాశివకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది?
జవాబు:
స్వరలయలు అనే గ్రంథానికి

తెలంగాణ తెలుగుపదాలు – ఉర్దూ మూలాలు Summary in Telugu

రచయిత పరిచయం

రచయిత : డా॥ సామల సదాశివ

పుట్టిన తేదీ : మే 11, 1928

పుట్టిన ఊరు : ఆదిలాబాద్ జిల్లా దహగాం మండలం తెనుగుపల్లె

తల్లిదండ్రులు : సామల చిన్నమ్మ, నాగయ్యలు

భాషాప్రావీణ్యం : తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, ఫార్సీ మరాఠీ భాషలు

రచనలు :

  1. ఏ భాతము, సాంబశివ శతకం, నిరీక్షణము, అంబపాలి, సర్వస్వదానం నవలలు, కథలు చిన్ననాటి రచనలు
  2. హిందూస్థానీ సంగీత కళాకారులపై మలయ మారుతాలు, ప్రముఖుల జ్ఞాపకాలు, అనుభవాలు గల ‘యాది’ సంగీత శిఖరాలు, ఉర్దూ భాషాకవిత్వ సౌందర్యం, ఉర్దూకవుల కవితాసామాగ్రి గ్రంథాలు ప్రసిద్ధమైనవి.
  3. అన్జద్ రుబాయిలు అనువాదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ అనువాద రచన పురస్కారం అందుకున్నారు.
  4. స్వరలయలు గ్రంథానికి 2011లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 2 తెలంగాణ తెలుగుపదాలు - ఉర్దూ మూలాలు

అవార్డులు :

  1. కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు
  2. తెలుగు విశ్వవిద్యాలయంచే గౌరవ డాక్టరేట్

మరణం : ఆగస్టు 7, 2012

కవి పరిచయం

డా॥ సామల సదాశివ భిన్న భాషా సంస్కృతులకు వారధి ఈయన మే 11, 1928 న ఆదిలాబాద్ జిల్లా దహగాం మండలం తెలుగు పల్లె గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు సామల చిన్నమ్మ, నాగయ్యలు. అధ్యాపక వృత్తిని చేపట్టి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా రిటైరయ్యారు. సంస్కృతం, హిందీ, ఉర్దూ, ఆంగ్లం, ఫార్సీ, మరాఠీ, తెలుగు భాషలలో పాండిత్యాన్ని సంపాదించారు. ప్రభాతము అనే లఘు కావ్యాన్ని సాంబశివ శతకం, నిరీక్షణ, అంబపాలి, సర్వస్వదానం, విశ్వామిత్రము వీరి తొలి రచనలు.

హిందూస్థానీ సంగీత కళాకారులపై మలయ మారుతాలు ప్రముఖులు జ్ఞాపకాలు, అనుభవాలు గల ‘యాది’ సంగీత శిఖరాలు, వీరి రచనలే. అమాన్ రుబాయిలు’ అనువాదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘స్వరలయలు’ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2011లో లభించింది. కాకతీయ, తెలుగు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సన్మానించాయి. ఈయన రచనలపై పరిశోధనలు జరిగాయి. ఆగస్టు 7, 2012న పరమపదించారు.

ప్రస్తుత పాఠ్యభాగ్యం డా॥సి. నారాయణరెడ్డి సంపాదకత్వంలో వెలువడిన ‘వ్యాసగు ళచ్ఛం’ రెండవ భాగం నుండి గ్రహించబడింది.

పాఠ్యభాగ సందర్భము

తెలంగాణ తెలుగు పదాలు ఉర్దూమూలాలను విద్యార్థులకు తెలియజేయు సందర్భంలోనిది.

పాఠ్యభాగ సారాంశం

తెలంగాణ తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అను పాఠ్యభాగం సామల సదాశివచే వ్రాయబడింది. డా.సి. నారాయణరెడ్డి సంపాదకత్వంలో వెలువడిన “వ్యాస గుళుచ్ఛం” రెండవ భాగం నుండి గ్రహించబడింది. ఇందులో తెలంగాణా తెలుగు భాషలో ఉర్దూ పదాలు ఎలా మిళితమైనాయో చెప్పబడ్డాయి.

TS Inter 1st Year Telugu Study Material Chapter 2 తెలంగాణ తెలుగుపదాలు - ఉర్దూ మూలాలు

ఆంధ్రదేశంలో దక్షిణ కోస్తా ఆంధ్ర రాయలసీమ తెలంగాణ ప్రజలు మట్లాడుకునే భాష తెలుగు. గ్రంథికంలో ఉన్నప్పుడు ఈ నాలుగు ప్రాంతాలలో తెలుగు ఒకే విధంగా ఉంటుంది. వ్యవహారికం దగ్గరకు వచ్చేసరికి నాలుగు ప్రాంతాల భాష వేరు వేరుగా ఉంటుంది. తెలంగాణ భాష మిగిలిన మూడు ప్రాంతాల భాషల కన్నా భిన్నంగా ఉంటుంది. దానికి కారణం తెలంగాణ తెలుగులో ఉర్దూ, హిందీ, మరాఠీ పదాలు ఎక్కువగా ఉండటం.

ఉర్దూ ఒక ప్రత్యేక భాషకాదు. ఉత్తరాన పలుకృత అపభ్రంశాల శబ్దాలతో పారసీ, అరబ్బీ, తుర్కీ శబ్దాలు కలిసి కలగా పులగంగా ఏర్పడిన భాష ఉర్దూ. ఇది 14వ శతాబ్దాంలో రూపుదిద్దుకొని హిందూయి, జబానె – హిందూస్తాన్ అన్న పేర్లతో పిలవబడి 18వ శతాబ్దానికి ఉర్దూ భాషగా పేరు పొందింది.

దక్కన్ ప్రాంతంలో ముస్లిం పాలకులకు ప్రజలకు వారధిగా ఒక భాష అవసరం ఏర్పడింది. దానిని దక్కనీ ఉర్దూ అన్నారు. ఇది మహారాష్ట్ర ప్రాంతంలో తెలుగు ప్రాంతంలో ఏర్పడింది. తెలుంగాణా జిల్లాలు పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతంలో ఉండడం వలన కన్నడ పదాలు తెలుగులో కలిశాయి. కనుక తెలంగాణ తెలుగు ప్రత్యేకతను పొందింది.

ఒక భాషా పదాన్ని మరొక భాష స్వీకరించడం సర్వసాధారణం. పలు భాషలు మట్లాడే ప్రజలు ఒకచోట ఉండటంతో భాషలలో ఆధాన ప్రదానాలు సహజమే. భారతదేశ భాషలపై సంస్కృతం ఎంతటి ప్రభావాన్ని చూపించిందో ఉర్దూ బోధనా మాధ్యం గల ప్రాంతాలలో ఆంగ్ల భాష అంతగా ప్రభావాన్ని చూపించింది. అలా ఆంగ్ల పదాలను ఉర్దూ భాషలోకి అనువదించుకుని దానిని ఉర్దూ వానా అని పిలుచుకున్నారు.

ఒక భాష నుండి. మరొక భాషకు పదాలు వర్ణగమ, వర్ణలోప, వర్ణ వ్యత్యయ పద్ధతుల ద్వారా వెళ్తుంటాయి.. ఒక్కోసారి యధాతదంగా కూడా వస్తుంటాయి. ఉదాహరణకు. లార్డ్ అనే ఆంగ్లపదం ఉ ర్దూలో లాట్సాహెబాను, ఫిలాసఫీ అనే పదం ఫల్సఫా గాను మార్పు చెందింది. కొన్ని పదాలు అర్థాన్ని మార్చుకుని కూడా ప్రవేశిస్తుంటాయి. ఉదాహరణకు ఉపన్యాసమంటే తెలుగులో ప్రసంగం హిందీలో నవల అన్న అర్థాన్ని స్తుంది.

TS Inter 1st Year Telugu Study Material Chapter 2 తెలంగాణ తెలుగుపదాలు - ఉర్దూ మూలాలు

తెలుగులోకి యధాతథంగా వచ్చిన ఉర్దూపదాలు కలము, జమీందారు, ఖుషీ, మొదలగునవి. కొన్ని ఉర్దూ పదాలు హలంలూలు తెలుగులో అజంతాలుగా మార్పుచెందాయి. ఉదాహరణకు రోజ్ రోజు అయింది. బజార్ .. బజారు అయింది. కొన్ని ఉర్దూ పదాలు తమ రూపాన్ని మార్చుకుని తెలుగులోకి వచ్చాయి. ఉదాహరణకు అబ్రు ఆబూరుగను, జర్మానా, జుల్మాన్గాను మార్పుచెందాయి.

కొన్ని ఉర్దూపదాలు తెలుగులోకి అర్థమార్పిడితో వచ్చాయి. ముదామ్ అన్న పదానికి ఉర్దూలో ఎల్లప్పుడు అని అర్థం. అది తెలుగులో ముద్దాముగా మారి ప్రత్యేకించి అను అర్థాన్ని పొందింది. ఇలా ఉర్దూ పదాలు తెలుగు భాషలోకి వచ్చి చేరాయి.

కఠిన పదాలకు అర్థాలు

ఖరారు = నిర్థారణ
అన్యభాష = ఇతర భాష
యథాతథంగా = ఉన్నది ఉన్నట్లుగా
విద్వాంసులు = పండితులు
భీతిగొల్పేది = భయాన్ని కలిగించేది
సావభావికమే = సర్వసాధారణమే
తరుచుగా = అప్పుడప్పుడు
హలంత పదాలు = హల్లులు అంతంగా గల పదాలు
అజంతపదాలు = అచ్చులు అంతంగా గల పదాలు
భూషణము = అలంకారము
మేజువాణి = పాటకచ్చేరి
గలాభా = గొడవ
రూపుదిద్దుకున్న = తయారైన
భిన్నంగా = వేరుగా

TS Inter 1st Year Commerce Study Material Chapter 11 Multi National Corporations (MNCs)

Telangana TSBIE TS Inter 1st Year Commerce Study Material 11th Lesson Multi National Corporations (MNCs) Textbook Questions and Answers.

TS Inter 1st Year Commerce Study Material Chapter 11 Multi National Corporations (MNCs)

Long Answer Questions

Question 1.
Define MNC and explain its features.
Answer:
Meaning of MNC: The term “Multinational” is made out of two words “Multi” and “National”. Hence a multinational company corporation is an organisation doing business in two or more countries. In other words, MNC is an organization or enterprise carrying on business in not only the country where it is registered but also in several other countries.

MNCs are also called “International Corporations”, “Global Giant” and “Transnational Corporation”. MNCs are giant firms with their headquarters located in one country (home country) but their activities are spread over in other countries (host countries). MNC’s may engage in various activities like exporting, importing, and manufacturing in different countries.

For example INFOSIS, WIPRO, Reddy Labs, IBM, Microsoft, Coco-Cola, Sony, Wal- Mart, Honda etc.

Definitions of MNCs:

  • According to David E. Liliental, MNC is defined as, “Corporations which have their home in one country but operate and live under the laws and customs of other countries as well”.
  • According to WH. Moreland “Multinational Corporations or Companies are those enterprises whose management, ownership and controls are spread in more than one foreign country”.
  • In a report of the International Labour Organization (ILO), it is observed that, “The essential of the MNCs lies in the fact that its managerial headquarters are located is one country (home country), while the enterprise carries out operations in a number of other countries (host countries)”.

Features of MNCs:
Some of the main features of multinational companies are given below:
1) Large in Size: An MNC is generally big in size. Some of the MNCs own and control assets worth billions of dollars. Their annual sales turnover is more than the Gross National Product of many small countries.

2) International Operations: A multinational corporation carries on business in more than one country. Multinational corporations such as Wipro, Colgate-Palmolive, Coco-Cola have branches in seventy countries around the world.

3) International Management: The management of MNCs is international in character. It operates on the basis of best possible alternative available anywhere in the world. Its local subsidiaries are managed by the nationals of the host country. For example, the management of Hindustan Lever lies with Indians. The parent company Unilever is in the United States of America.

4) Mobility of Resources: The operations of multinational company involves the mobility of capital, technology, entrepreneurship and other factors of production across the territories.

5) Centralized Control: The branches of MNCs spread in different countries which are controlled and managed from the headquarters situated in the home country. All branches operate within the policy framework formed by headquarters.

6) Integrated Activities: A multinational company is usually a complete organization comprising manufacturing, marketing, research and development and other facilities.

7) Oligopolistic Powers: Oligopoly means power in the hands of few companies only. Due to their giant size, the MNCs occupy dominating position in the market. They also take over other firms to acquire huge power and improve market share.

8) Sophisticated Technology: MNCs make use of latest and advanced technology to supply world class products. They use capital-intensive technology and innovative techniques for production.

9) Several Forms: A multinational company may operate is host countries in several ways i.e., branches, subsidiaries, franchise, joint ventures. Turn key projects.

Question 2.
Explain various types of MNCs.
Answer:
Multinational Corporations are operated in the following ways.
Forms of MNCs:
1) Franchising: In this form, MNC grants firms in foreign countries the right to use its trade marks, patents, brand names etc. The firms get the right or licence to operate their business as per the terms and conditions of franchise agreement. They pay royalty or licence fee to MNC. This system is popular for products which enjoy good demand in host countries.

2) Branches: In this system, MNCs open branches in different countries. These branches work under the direction and control of head office. The headquarters frames policies to be followed by the branches.

TS Inter 1st Year Commerce Study Material Chapter 11 Multi National Corporations (MNCs)

3) Subsidiaries: An MNC may establish wholly owned subsidiaries in foreign countries. The subsidiary in foreign countries follow the policies laid down by holding (parent) company. An MNC can expand its business operations through subsidiaries all over the world.

4) Joint Venture: In this systems an MNC establishes a company in foreign country in partnership with local firms. The MNC and foreign country firm share the ownership and control of the business.

Generally, the MNC, provides technology and managerial skills and the day to day management is left to the local partner.

5) Turn Key Projects: In this method, the MNC constructs and operates the industrial plant by itself. It provides training to the staff in the operation of plant. It may also guarantee the quality and quantity of production over a long period of time.

Classification of MNCs:
There are three types of MNCs. They are (1) The Ethnocentric MNC (2) Polycentric MNC and (3) Regiocentric and Geocentric MNCs.

1) The Ethnocentric MNC:

  • These are the type of MNCs which have strong orientation towards home country. This means that home country people are considered as superior and allocated all key posts.
  • Usually companies that are involved in extractive FDI such as oil or gas companies included in ethnocentric MNC. Communication and information is top down and all strategic decisions are steered from corporate headquarters. Subsidiaries sell products design and manufactured by parent companies with little or no local control.

2) Polycentric MNCs:

  • Polycentric type of MNCs has strong orientation towards host country where few key people are nationals and remaining are from the host country.
  • An MNC that adopts the polycentric innovation model evolving through four successive stages of maturity they are:
    • At this stage, the MNCs R & D operations are mostly concentrated in the west. MNC starts shifting some of its R & D works to low cost countries like India that offer plenty of high quality scientists and engineers.
    • MNC recognizes the massive potential of emerging markets and delegates more responsibilities to local units in emerging markets which initiates and manage their own R & D projects to cater to local needs.
    • The MNC starts networking R & D activities in emerging markets.
    • At this stage, the R & D hubs in emerging markets are given a global remit as they now own the P & L responsiblity for global design and rollout of new products.

3) Regiocentric and Geocentric MNCs:

  • These MNCs have their concentration in whole world and they make selection for best employees whether they are from host country or home country it does not matter.
  • When MNCs desire an integration of all of their foreign subsidiaries and melding of a world wide corporate culture, they adopt a geocentric management strategy.

Question 3.
Explain the role of Multinational Corporations in the Indian economy.
Answer:
MNCs made its foray in India after the 1991 economic reforms. The LPG (Liberalisation, Privatization, Globalisation) reforms opened the Indian economy to companies across the world. India hosts the largest number of MNCs from USA and Europe. MNCs comes to India through FDI route.

Some of the important roles played by MNCs in India are as follows:
1) Transfer of Technology: The most important role that MNCs play in India and across the globe is transfer of technology. Transfer of technology to developing countries increases the quality and productivity of output produced. India has not just received the technology from MNCs but also the beneficiary of technical know how which results in the skill enhancement of the work force.

2) Capital Investment: When MNCs come to India, they are responisible for non debt creating capital inflows. Post the 1991 economic reforms, MNCs contributed towards creating a positive balance of payment. Therefore when MNCs invest in India it goes into no debt creating capital receipts. Moreover, they contribute towards increasing the GDP of India.

3) Increase in Exports: MNCs have greatly contributed towards increasing our exports. India offers cheap labour and land. Hence, it is both economical it and profitable for MNCs to invest in India. When MNCs export their goods to other nations, it benefits us directly.

4) Managerial Practices: MNCs have also brought best managerial practices to India. The human resource management, financial controls, operation and advertising strategies have been emulated by Indian companies to their advantage.

5) Increase in Competition: Entry of MNCs promotes competition in the economy of the host country. This increase in competition results in lowering of prices, which is beneficial to the end user.

6) The Multiplier Effect: MNC contribute towards increasing income and employment opportunities. MNC’s like Hindustan Unilever, Toyota etc., are paying higher to management, engineering graduates. The Maruti Suzuki and Hero Honda collaborations have also contributed towards increasing employment.

7) Infrastructural Investment: MNCs have also invested in the field of infrastructure. These investments have contributed towards our economic growth and development. Power projects, Tele -communication have been immense benefit to India for expanding our horizons.

Therefore, MNCs have been a harbinger growth and development of the economy of India “Make in India” programme will further give a fillip to MNCs.

Question 4.
Define MNC and explain its advantages.
Answer:
Meaning: The term “Multinational” is made out of two words “Multi” and “National”. Hence, a multinational company corporation is an organization doing business in two or more countries. MNCs are giant firms with their headquarter located in one country (home country) but its activities are spread over in other countries (host countries).

MNCs are also called as “International Corporation” or “Global Gaint” and “Transnational Corporation” MNCs are engage in various activities like exporting, importing, manufacturing in different countries. Infosis, Wipro, Reddy Labs, IBM, Microsoft, Coco-Cola, Wal- Mart, Honda, Sony etc., are the example of MNC’s.

TS Inter 1st Year Commerce Study Material Chapter 11 Multi National Corporations (MNCs)

Definitions:

  • According to David E. Liliental, MNC is defined as, “Corporations which have their home in one country but operate and live under the laws and customs of other countries as well”.
  • As per W.H.Moreland, “Multi national Corporations or companies are those enterprises whose management, ownership and control are spread in more than one foreign country”.
  • As per the report of the International Labour Organization (ILO) it is observed that, “The essential of the MNC lies in the fact that its managerial headquarters are located in one country (home Country), while the enterprise carries out operations in a number of other countries (host Countries)”.

Advantages of MNC’s:
MNCs directly and indirectly help both home country and the host country. Various advantages of MNCs are explained below:
1) Economic Development: The developing countries need both foreign capital and technology to make use of available resources for economic and industrial development. MNCs can provide the required financial, technical and other resources to the needy countries in exchange for economic gains.

2) Technology Gap: Technology is necessary to bring down cost of production and for producing quality goods on a large scale. MNCs can help to bridge the technological gap between developed and developing countries by transfer technology to the host country.

3) Industrial Growth: MNCs offer growth opportunities for domestic industries. MNCs assist local producers to enter the global markets through their well established inter-national network of production and marketing to ensure industrial growth.

4) Marketing Opportunities: MNCs have access to many markets in different countries. They have the necessary skills and expertise to market products at international level. For example, an Indian company can enter into joint venture with a foreign company to sell its products in the international market.

5) Work Culture: MNCs introduce a work culture of excellence, professionalism and transparency in deals. The primary objective of MNCs is to maximise the profits and increase the market share by use of product innovation, technology upgradation, and professional management.

6) Export Promotion: MNCs helps developing countries in earning foreign exchange revenue. This can be achieved by promoting and developing export oriented and import substitute industries.

7) Research and Development: The resources and experience of MNCs in the field of research enables the host country to establish efficient research and development system. In order to avail of monetary incentives and cheap labour in developing countries like India, MNCs are shifting research units to such countries.

Question 5.
Define MNC and explain the limitations of MNCs.
Answer:
A Multinational Corporation / Company is an organization doing business in more than one country. Its headquarters are located in one country (home country) but its activities are spread over in other countries (host countries). MNCs are also called as “International Corporation”, “Global Giant” and “Transactional Corporation”. Examples of MNCs are INFOSIS, WIPRO, Reddy Lab, Coca-Cola, Wal-Mart, Honda, IBM etc.

Definitions:
According to David E.Liliental, MNC is defined as “Corporations which have their home in one country but operate and live under the laws and customs of other countries as well”.

According to W.H Moreland, “Multinational Corporations or Companies are those enterprises whose management, ownership and controls are spread in more than one foreign country”.

Disadvantages of MNCs:
1) Problem of Technology: Technology developed by MNCs from developed countries which does not fully fit in the needs of developing countries. This is because, such technology is mostly intensive.

2) Political Interference: The MNCs from developed countries are criticised for their interference in the political affairs of developing countries. Through their financial and other resources, they influence the decision-making process of the government of developing countries.

3) Self-Interest: MNCs work towards their own self interest rather than working for the development of host country. They are more interested in only making profits.

4) Outflow of foreign Exchange: MNCs charge high price in the form of commission and royalty paid by local subsidiary to its parent company. This leads to outflow of foreign exchange.

5) Exploitation: MNCs are exploiting the consumers and companies in the host country. MNCs are financially very strong and they adopt aggressive marketing strategies to sell their products, adopt all means to eliminate competition and create monopoly in the market.

6) Investment: MNCs prefer to invest in areas of low risk and high profitability. Issues like social welfare, national priority do not find any place on the agenda of MNCs.

7) Artificial Demand: MNCs create artificial and unwanted demand by making extensive use of the advertising and sales promotion techniques.

Question 6.
What is Globalization ? Explain the necessity of Globalization.
Answer:
Globalization defined as the process of integration and convergence of economic, financial, cultural and political systems across the world. Globalization refers to the free cross border movement of goods, services, capital, information and people. It is the process of creating networks of connections among nations at multi – continental distances.

Importance of Globalization:
1) Economic Liberalization: Economic liberalization both in terms of regulations and tariff structure, has greatly contributed to the globalization of trade and investment.

TS Inter 1st Year Commerce Study Material Chapter 11 Multi National Corporations (MNCs)

2) Technological Break throughs: The breakthroughs in science and technology have transformed the world virtually into a global village, especially manufacturing, transportation and information and communication technologies.

3) Multilateral Institutions: A number of multilateral institutions under the UN frame-work, setup during the Post World War II era, have facilitated exchanges among countries and became prominent forces in present day globalization. Multinational organisations such as the GATT and WTO contributed to the process of globalization.

4) Creates Employment Opportunities: Globalization helps to provide employment to a large number of people. Multinational companies appoint a large number of personnel with high pay scale and other benefits.

5) Global Expansion of Business Operations: Growing markets and movement of capital flows across the countries have facilitated the rapid expansion of business operations globally.

6) Emergence of Global Consumer Segment: Globalization encourages free and fair competition at world level. Due to this, organizations try to supply quality goods and at a reduced prices. Customers may have more choices due to increased suppliers at global level.

7) Maximization of Economic Efficiencies: The global integration of economies has promoted a rapid rise in the movement of products, capital and labour across the borders. It contributes to the maximization of economic efficiencies, including efficient utilization of resources.

8) Enhanced Trade: Due to Globalization, trade across the countries has enhanced and business organizations are enjoying the benefits of global access to the customers resulting in enhanced revenues.

Short Answer Questions

Question 1.
Explain the meaning of MNC.
Answer:
Meaning of MNC: The term “Multinational” is made out of two words “Multi” and “National”. Hence, a multinational company corporation is an organization doing business in two or more countries. MNCs are giant firms with their headquaters located in one country (home country) but its activities are spread over in other countries (host countries).

NCs are also called “International Corporation” or “Global Gaint” and “Transnational Corporation”. MNCs are engaged in various activities like exporting, importing, manufacturing in different countries. INFOSIS, WIPRO, Reddy Labs, IBM, Microsoft, Coco-Cola, Wal-Mart, Honda, Sony etc., are the examples of MNCs.

Definitions:

  • According to David E.Liliental, MNC is defined as, “Corporations which have their home in one country but operate and live under the laws and customs of other countries as well”.
  • As per WH. Moreland, “Multinational Corporations or Companies are those enterprises whose management, ownership and control are spread in more than one foreign country”.
  • As per the report of the International Labour Organization (ILO) it is observed that, “The essential of the MNC lies in the fact that its managerial headquarters are located in one country (home country) while the enterprise carries out operations in a number of other countries (host countries)”.

Question 2.
List out the features of MNCs.
Answer:
Some of the main features of Multinational Corporations are given below:
1) Large in Size: An MNC is generally big in size. Some of the MNCs own and control assets worth billions of dollars. Their annual sales turnover is more than the gross National Product of many small countries.

TS Inter 1st Year Commerce Study Material Chapter 11 Multi National Corporations (MNCs)

2) International Operations: An MNC carries on the business in more than one country. Multinational Corporations such as Wipro, Colgate-Palmolive, Coco-Cola, have branches in seventy countries around the world.

3) International Management: The management of MNCs is international in character. It operates on the basis of best possible alternative available anywhere in the world. It’s local subsidiaries are managed by the nationals of the host country. For example, the management of Hindustan Lever lies with Indians. The parent company Unilever is in United States of America.

4) Mobility of Resources: The operations of multinational company involves the mobility of capital, technology, entrepreneurship and other factors of production across the territories.

5) Centralized Control: The branches of MNCs spread in different countries which are controlled and managed from the headquarters situated in the home country. All the branches operate within the policy framework formed by headquarters.

6) Several Forms: A Multinational Company may operate in host countries in several ways i.e. branches, subsidiaries, franchise, joint ventures.

Question 3.
State any four advantages of MNCs.
Answer:
MNCs directly and indirectly help both home country and the host country. Various advantages of MNCs are explained below:
1) Economic Development: The developing countries need both foreign capital and technology to make use of available resources for economic and industrial development. MNCs can provide the required financial, technical and other resources to the needy countries in exchange for economic gains.

2) Technology Gap: Technology is necessary to bring down cost of production and for producing quality goods on a large scale. MNCs can help to bridge the technological gap between developed and developing countries by transfer of technology to the host country.

3) Industrial Growth: MNCs offer growth opportunities for domestic industries. MNC’s assist local producers to enter the enter global markets through their well established international network of production and marketing to ensure industrial growth.

4) Marketing Opportunities: MNCs have access to many markets in different countries. They have the necessary skills and expertise to market products at international level. For example, an Indian company can enter into joint venture with a foreign company to sell its products in the international market.

5) Export Promotion: MNCs helps developing countries in earning foreign exchange revenue. This can be achieved by promoting and developing export oriented and import substitute industries.

Question 4.
State any four disadvantages of MNCs.
Answer:
Disadvantages of MNCs:
1) Problem of Technology: Technology developed by MNCs from developed countries which does not fully fit in the needs of developing countries. This is because, such technology is mostly intensive.

2) Political Interference: The MNCs from developed countries are criticised for their interference in the political affairs of developing countries, through their financial and other resources, they influence the decision making process of the governments of developing countries.

3) Self Interest: MNCs work towards their own self interest rather than working for the development of host country. They are more interested in only making profits.

4) Outflow of Foreign Exchange: MNCs charge high price in the form of commission and royality paid by local subsidiary to its parent company. This leads to outflow of foreign exchange.

5) Investment: MNCs prefer to invest in areas of low risk and high profitability. Issues like social welfare, national priority do not find any place on the agenda of MNCs.

TS Inter 1st Year Commerce Study Material Chapter 11 Multi National Corporations (MNCs)

Very Short Answer Questions

Question 1.
Globalization.
Answer:
1) Globalization defined as the process of integration and convergence of economic, financial, cultural and political systems across the world.

2) Globalization refers to the free cross – border movement of goods, services, capital, information and people.

3) In otherwords, Globalization refers to the increasing integration of markets, and production to include the mobility of resources like capital, labour, organization and knowledge.

Question 2.
Foreign Direct Investment.
Answer:
1) Foreign Direct Investment (FDI) is an investment made by a firm or individual in one countiy into business interests located in another country.

2) Foreign Direct Investment occurs when a firm invests its resources in business activities outside its home country.

Question 3.
International Trade.
Answer:
1) International Trade means trade between countries. It occurs when a firm exports goods or services to customers of other countries.

2) The trade which takes place between the nations is called International Trade. It is also called “foreign trade”.

Question 4.
Multinational Corporation.
Answer:
1) A Multinational Corporation is an organisation doing business in more than one country. In other words, it is an organisation or enterprise carrying on business in not only the country where it is registered but also in several other countries.

2) MNCs are giant firms with their headquarters located in one country and with a variety of business operations in several other countries.

3) For example Nike, WIPRO, IBM, Sony, Honda, Coco-Cola etc., are MNCs.

TS Inter 1st Year Telugu Study Material Chapter 1 పాల్కురికి సోమనాథుడు

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 1st Lesson పాల్కురికి సోమనాథుడు Textbook Questions and Answers.

TS Inter 1st Year Telugu Study Material 1st Lesson పాల్కురికి సోమనాథుడు

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు- జవాబులు

ప్రశ్న 1.
పాల్కురికి సోమన జీవిత విశేషాలు, కవితా గుణాలను పేర్కొనండి?
జవాబు:
పాల్కురికి సోమనాథుడు అను పాఠ్యభాగం గడియారం రామకృష్ణ శర్మ కవిచే రచించబడిన “చైతన్యలహరి” వ్యాస సంపుటి నుండి గ్రహించబడినది. దీనిలో పాల్కురికి సోమనాథుని జీవిత విశేషాలు, కవితా గుణాలు వివరించబడ్డాయి.

పాల్కురికి సోమన కాకతీయ చక్రవర్తులలో చివరివాడైన ప్రతాపరుద్రుని కాలంవాడు. 13వ శతాబ్ధమునకు చెందినకవి. సోమన ఓరుగంటికి సమీపంలోని జనగామ తాలూకా పాలకుర్తి గ్రామానికి చెందినవాడు. ఈ గ్రామానికి దగ్గరలో సోమేశ్వరాలయం ఉ ంది. ఈ దేవునిపేరే తమ కుమారునికి పెట్టుకున్నారు.

సోమన తల్లిదండ్రులు శ్రియాదేవి విష్ణురామిదేవుడు. సోమనకు గురువులు నలుగురు. వీరమాహేశ్వర దీక్షనిచ్చిన గురువు. గురులింగార్యుడు. శిక్షాగురువు కట్టకూరి పోతిదేవర, జ్ఞానగురువు బెలిదేవి వేమనారాధ్యుని మనుమడు. సాహితీగురువు కరస్థలి విశ్వనాధయ్య.

సోమన వ్యక్తిత్వము, విశిష్టమైనది. వీరశైవలోకానికి మూలపురుషుడు, వీరశైవవాఙ్మయమంతా ఇతని రచనలపైనే ఆధారపడిఉన్నది. వీరశైవ మతాన్ని బసవేశ్వరుడు స్థాపించగా, పండితారాధ్యుడు ప్రచారం చేయగా, పాల్కురికి సోమనాధుడు వీరశైవసాహిత్యాన్ని సృష్టించాడు.

ఇతని తరువాతి వారు సోమనాధుని భృంగీశ్వరుని అవతారంగా భావించారు. సంస్కృత భాషను కాదని ఆంధ్రభాషను అందలం ఎక్కించాడు. తెలుగు భాష భావరూపాలలో నూతనత్వాన్ని తీసుకువచ్చాడు. బ్రాహ్మణమతానికి ధీటుగా వీరశైవమతాన్ని నిలబెట్టాలని భావించి శైవంలో శ్రుతి, స్మృతి, పురాణ, ఇతిహాస, కావ్య స్తుత్యాదులన ప్రవేశపెట్టాడు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 1 పాల్కురికి సోమనాథుడు

అనుభవసారం, రుద్రభాష్యం, బసవపురాణం, పండితారాధ్య చరిత్ర, వృషాధిప శతకం, బసవరగడ, బసవోదాహరణలను రచించాడు. ఆయన రచనలు దేశీ ఛందస్సుకు పట్టం కట్టాయి. తెలుగుభాషలో ద్విపద ఛందస్సుకు ఆధ్యుడు పాల్కురికే! సోమనాధుడు శైవమత ప్రచారానికే సాహిత్యాన్ని సృష్టించాడు. భాష చందస్సులను గురించి సోమన

భాష:
“ఉ రుతర గద్య పద్యోక్తుల కంటే
సరసమై బరగిన జాను తెనుంగు
చర్చింపగా సర్వసామాన్యమగుట
గూర్చెద ద్విపదలు గోర్కిదైవార”

అని అన్నాడు. జానుతెనుగు అంటే “లోక వ్యవహారములోని సుబోధకమైన తెనుగు అని అర్థం. ఈయన రచనలన్నీ నిత్య వ్యవహార భాషలోనే సాగాయి.

ఛందస్సు : సోమన అనుసరించిన ఛందస్సు కూడా నూతనమైంది. వృత్తపద్యాలు కొన్ని రాసినా జాతులు ఉపజాతులనే ఎంచుకున్నారు. ద్విపద ఛందస్సుకు ప్రాధాన్యమిచ్చాడు. ద్విపద ఛందస్సులోనే బసవపురాణం, పండితారాధ్య చరిత్ర అను వీరశైవమత గ్రంథాలను రచించాడు.

వర్ణన : సోమనాధుని ప్రకృతి వర్ణనలు స్వభావోక్తికి దగ్గరగా ఉంటాయి. తెల్లలవారుజామున కోడికూత వర్ణనం దీనికో ఉదాహరణ. పండితారాధ్య చరిత్రలో

“తొలికోడి కనువిచ్చి నిలచి మైపెంచి
జలజల రెక్కలు సడలించి నీలి
గ్రక్కున గాలార్చి కంఠంబు విచ్చి
ముక్కున నీకెలు చక్కొల్పి కడుపు
నిక్కించి మెడసాచి నిక్కిమిన్సూచి
కొక్కొరో కు అని కూయక మున్న…..”

ఈ ద్విపద వాక్యాలలో కోడి కూతను అతి సహజ సిద్ధంగా సోమనాథుడు వర్ణించాడు. ఇలా సోమనాథుడు వీరశైవ సంప్రదాయ ప్రవర్తకునిగా, దేశీకవితా కవిగా కీర్తి నార్జించాడు.

ప్రశ్న 2.
సోమన రచనలను తెలిపి, వాటిని సంక్షిప్తంగా వివరించండి?
జవాబు:
పాల్కురికి సోమనాథుడను పాఠ్యభాగం గడియారం రామకృష్ణ శర్మచే రచించబడిన “చైతన్యలహరి” అను వ్యాససంపుటి నుండి గ్రహించబడినది. దీనిలో పాల్కురికి జీవితం, రచనలు, కవితాగుణాలు వివరించబడ్డాయి.
పాల్కురికి సోమనాథుడు దాదాపు 21 రచనలు చేశాడు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 1 పాల్కురికి సోమనాథుడు

  1. బసవపురాణం
  2. పండితారాధ్య చరిత్ర
  3. అనుభవసారం
  4. చతుర్వేద సారము
  5. సోమనాథభాష్యం
  6. రుద్రభాష్యం
  7. బసవరగడ
  8. గంగోత్పత్తి రగడ
  9. శ్రీ బసవారాధ్య రగడ
  10. సద్గురు రగడ
  11. చెన్నముల్లు సీసములు
  12. నమస్కార గద్య
  13. వృషాధిపశతకము
  14. అక్షరాంక గద్య అష్టకం
  15. పంచప్రకార గద్య
  16. పంచకము
  17. ఉదాహరణ యుగములు మొదలగునవి వాటిలో ముఖ్యమైనవి.

1. అనుభవసారం : సోమనాథుని మొదటి రచన ఇది. దీనిలో 245 పద్యాలున్నాయి. ఈ కావ్యంలో భక్తి స్వరూపం, లక్షణాలు, పూజా విధానం, జంగమ సేవ మొదలగు వీరశైవ ధర్మములు చెప్పబడ్డాయి.

2. బసవపురాణం : సోమన శ్రీశైల క్షేత్రమును దర్శించి భక్తి పారవశ్యముతో వ్రాసిన గ్రంథము ఇది. దీనిలో నందికేశ్వరుని అవతారమైన బసవేశ్వరుడు కథానాయకుడు. బిజ్జలుడు ప్రతినాయకుడు. బసవేశ్వరుని చరిత్రతోపాటు దీనిలో 75 గురు భక్తుల కథలున్నాయి. ముగ్ధ సంగయ్య కథ, బెజ్జమహాదేవికథ, గొడగూడికథ, ఉడుమూరి కన్నకప్పకథ, మడిమేలు మాచయ్య కథలున్నాయి.

3. లఘుకృతులు : సోమనాథుడు శివ స్తుతిపరమైన కొన్ని లఘుకృతులను రచించాడు. వాటిలో 4 గద్యలు, 1. రగడ, 2. ఉదాహరణములు 11 పంచకములు 2 అష్టకములు 1 స్తవము ఉన్నాయి.

4. వృషాధిపశతకం : బసవేశ్వరుని శివస్వరూపునిగా భావించి ఆయనపై 108 చంపక ఉత్పలమాలలతో రచించిన శతకమిది. సోమనాథుని అష్టభాసా ప్రావీణ్యమునకు ఇది ఒక ఉదాహరణ.

5. చతుర్వేదసారం: దీనిలో ‘బసవలింగ’ మకుటము గల 357 సీసపద్యాలున్నాయి. శైవమునకు సంబంధించిన భక్తి విషయాలు ఇందులో ఉన్నాయి.

6. చెన్నమల్లు సీసములు : ఇది 32 సీసద్యాలు గల చిన్న కృతి.

7. రుద్రభాష్యం: ఇది లభ్యం కాలేదు.

8. సోమనాథ భాష్యం: ఇది ఒక సంస్కృత గ్రంథం. 25 ప్రకరణములున్నాయి. దీనినే బసవరాజీయం అంటారు. వీరశైవమతం తాంత్రికం కాదని శుద్ధవైదికమని నిరూపించటానికి ఈ గ్రంథాన్ని రచించాడు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 1 పాల్కురికి సోమనాథుడు

9. పండితారాధ్య చరిత్రము : ఇది సోమనాథుని చివరికృతి, ద్విపద రచించబడిన ప్రౌఢ పురాణ కావ్యం. దీనిలో మల్లికార్జున పండితారాధ్యుని పుణ్యచరిత్రతోపాటుగా పలువురి శివ భక్తులు చరిత్రలు వ్రాయబడ్డాయి. ఇది 12వేల ద్విపదలతో రాయబడిన కావ్యం. సోమన కావ్యకళా విశిష్టతను, బహుభాషా పాండిత్యమును, సంగీత, నాట్య రసవాద, వైద్య శాస్త్రాల పరిజ్ఞానమును లోకానుభవంతో వ్రాయబడ్డాయి.

భాషలో ద్విపద రచనలో పాల్కురికి తరువాత తరాల వారికి మార్గదర్శ కుడయ్యాడు. పోత భక్తి పారవశ్యానికి శ్రీనాథుని నుడికారమునకు, కృష్ణదేవరాయల వర్ణనాపటిమకు ఇతరుల విశిష రచనలకు సోమనాథుని ద్విపదలైన బసవపురాణం పండితారాధ్య చరిత్రలే మార్గదర్శకాలని పండితుల అభిప్రాయం.

II. సంక్షిప్తరూప ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
కావ్య భాషను గురించి సోమన అభిప్రాయాలు తెలపండి?
జవాబు:
పాల్కురికి సోమనాథుడు అను పాఠ్యభాగం గడియారం రామకృష్ణశర్మచే రచించబడిన చైతన్యలహరి అను వ్యాస సంపుటి నుండి గ్రహించబడింది. దీనిలో సోమనాథునకు కావ్యభాష పట్ల ఉన్న అభిప్రాయాన్ని వివరించాడు.

గుడ్డెద్దు చేలో పడినట్లు కాకుండా కావ్య భాష, భాష, భావము, రూపాలలో నూతనత్వాన్ని పొందాలన్నాడు. ఎక్కడా కావ్యభాషకు మర్యాద గౌరవాలు తక్కువ కాకూడదన్నాడు. కావ్యభాషను గురించి వివరిస్తూ

“ఉరుతర గద్య పద్యోక్తుల కంటే
సరసమై బరిగిన జాను తెనుంగు……

అని చెప్తూ కావ్యభాష లోక వ్యవహారంలో సర్వజనులకు అందుబాటులో ఉండాలని అభిప్రాయపడ్డారు. నిఘంటువులలోని మారుమూల పదాలుకాక, మారుమూలల్లోని అచ్చతెలుగు పదాలు కాక నిత్య వ్యవహారంలో సుపరిచితమైన పదాలతో కావ్య భాష ఉ ండాలన్నారు. వర్ణనలు, సహజ సుందరంగా ఉండాలన్నాడు. సోమనాథుడు శైవమత ప్రచారానికే సాహిత్య సృష్టి చేసినప్పటికీ కావ్యభాషకు ఎక్కడా లోపాన్ని రానీయలేదు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 1 పాల్కురికి సోమనాథుడు

ప్రశ్న 2.
‘బసవపురాణం’ కావ్యం గురించి సంక్షిప్తంగా రాయండి?
జవాబు:
పాల్కురికి సోమనాథుడు అను పాఠ్యభాగం గడియారం రామకృష్ణ శర్మ రచించిన ‘చైతన్యలహరి’ అను వ్యాససంపుటి నుండి గ్రహించబడింది.

బసవపురాణం పాల్కురికి ద్విపద రచన. ఆయన ఒకనాడు శ్రీశైల క్షేత్రమును దర్శించి అక్కడ భక్తుల ద్వారా బసవేశ్వరుని దివ్య చరితమును విని బసవపురాణాన్ని రచించాడు. ఈ ద్విపద కావ్యంలో నందికేశ్వరుని అవతారమైన బసవేశ్వరుడు కథానాయకుడు. బిజ్జలుడు ప్రతినాయకుడు. బసవేశ్వరుని చరిత్రతోపాటుగా ఈ కావ్యంలో 75 మంది శివభక్తుల కథలున్నాయి. ఈ కావ్యమందు సోమనాథుని కథా కథననైపుణ్యం కన్పిస్తుంది. ముగ్ధ సంగయ్య కథ, బెజ్జమహాదేవికథ, గొడగూచి కథ, ఉడుమూరి కన్నకప్పకథ, మడిమేలు మాచయ్య కథలు చక్కగా వర్ణించబడ్డాయి.

సోమనాథుని రచనా రీతిలో అంత్యానుప్రాసల ప్రభావం అధికం. ఇది పోతన లోని అంత్య ప్రాసరచనకు కారణమైందని చెప్పవచ్చు. ద్విపద రచనలలో సోమనాథునికి మంచిపేరు తెచ్చిన కావ్యం బసవపురాణం.

ప్రశ్న 3.
సోమన లఘుకృతులను గురించి క్లుప్తంగా రాయండి?
జవాబు:
పాల్కురికి సోమనాథుడు అను పాఠ్యభాగం గడియారం రామకృష్ణశర్మచే రచించనబడిన ‘చైతన్యలహరి’ అను వ్యాససంపుటి నుండి గ్రహించబడినది. దీనిలో సోమనాథుని రచనలలోని భాష ఛందస్సులలో నూతనత్వాన్ని ఎలా తీసుకువచ్చాడో వివరించ బడింది. సోమనాథుని రచనలను, వర్ణనానైపుణ్యాన్ని ఇందులో వివరించాడు. పాల్కురికి రాసిన 21 రచనలను పేర్కొంటూ వాటిలో లఘు కృతులను తెలియజేశాడు.

సోమనాథుడు శివభక్తి తత్పరుడైన బసవేశ్వరుని పై భక్తి తన్మయత్వంతో కొన్ని లఘుకృతులను రచించాడు. అవి 1. రగడ 4 గద్యలు, 2 ఉదాహరణలు 11 పంచకములు 2 అష్టకములు, 1. స్తవము ఉన్నాయి. ఇవన్నీ వైరశైవమత సంబంధ రచనలే.

TS Inter 1st Year Telugu Study Material Chapter 1 పాల్కురికి సోమనాథుడు

ప్రశ్న 4.
గడియారం రామకృష్ణశర్మ సాహిత్యసేవను తెలుపండి?
జవాబు:
గడియారం రామకృష్ణ శర్మ సుబ్బమ్మ జ్వాలాపతి దంపతులకు మార్చి 6. 1919న అనంతపురం జిల్లాలో జన్మించాడు. ఆయన జీవితమంతా మహబూబ్ నగర్ జిల్లా అలంపురంలోనే గడిచింది. ఈయన తిరుపతి వేంకటకవుల శిష్యుడైన వేలూరి శివరామశాస్త్రి వద్ద విద్యలనభ్యసించాడు.

సంస్కృతం, తెలుగు, కన్నడ, ఆంగ్ల సాహిత్యాలలో పండితు డయ్యాడు. కవిగా, పండితునిగా, కావ్య పరిష్కర్తగా, శాసన పరిశోధకునిగా, చరిత్రకారునిగా, సంఘసంస్కర్తగా, ఉద్యమకర్తగా క్రియాశీలక పాత్రను పోషించాడు.

నిజాం రాష్ట్రంలో తెలుగు భాషను చిన్నచూపు చూడటం సహించలేక ఆంధ్ర మహాసభల ఏర్పాటుకు కృషి చేశారు. తెలంగాణమంతా పర్యటించి ‘భాగ్యనగర్ రేడియో’ ద్వారా ప్రజలను చైతన్యపరిచారు. బాలవితంతువును వివాహమాడటంతోపాటు వితంతు వివాహాలు జరిపించాడు. ‘సుజాత’ పత్రికను ప్రారంభించారు.

మెకంజీ కైఫీయత్తులను వ్రాయించారు. ‘తెలంగాణ శాసనాలు’ రెండవ సంపుటిని తీసుకువచ్చారు. కన్నడ సాహిత్య చరిత్రను రాశారు. కన్నడకవి రన్నడు రాసిన ‘గదాయుద్ధాన్ని’ తెలుగునకు అనువదించినాడు. అలంపురం చరిత్ర, విద్యారణ్యుల చరిత్రలను రాశాడు. వీరి ఆత్మకథ ‘శతపత్రం’ 2006లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డునందుకుంది.

III. ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
‘పాల్కురికి సోమనాథుడు’ పాఠ్యభాగ రచయిత ఎవరు?
జవాబు:
గడియారం రామకృష్ణ శర్మ

ప్రశ్న 2.
సోమన జన్మస్థలం ఏది?
జవాబు:
ఓరుగల్లుకు 12మైళ్ళ దూరంలోని జనగామ తాలూకా పాలకుర్తి గ్రామం.

ప్రశ్న 3.
సోమన తల్లిదండ్రులెవరు?
జవాబు:
తల్లి శ్రియాదేవి, తండ్రి విష్ణురామిదేవుడు

TS Inter 1st Year Telugu Study Material Chapter 1 పాల్కురికి సోమనాథుడు

ప్రశ్న 4.
సోమన గురువులెవరు.
జవాబు:
సోమనకు 4గురు గురువులు. ఒకరు దీక్షాగురువు గురులింగార్యుడు, శిక్షాగురువు కట్టకూరి పోతిదేవర, జ్ఞానగురువు బెలిదేవి వేమనారాధ్యుని మనుమడు, సాహిత్యగురువు కరస్థలి విశ్వనాథయ్య.

ప్రశ్న 5.
ద్విపదలో సోమన రచించిన గ్రంథాలేవి?
జవాబు:
సోమన ద్విపద గ్రంథాలు బసవపురాణం, పండితారాధ్య చరిత్ర,

ప్రశ్న 6.
సోమన మొదటికృతి ఏది?
జవాబు:
సోమన మొదటి కృతి ‘అనుభవసారము’

ప్రశ్న 7.
బసవపురాణంలో ఎంతమంది భక్తుల కథలున్నాయి?
జవాబు:
బసవపురాణంలో 75మంది శివభక్తుల కథలున్నాయి.

TS Inter 1st Year Telugu Study Material Chapter 1 పాల్కురికి సోమనాథుడు

ప్రశ్న 8.
తెలుగులో తొలి విజ్ఞానసర్వస్వంగా ఏ గ్రంథాన్ని పరిగణించారు?
జవాబు:
తెలుగులో తొలి విజ్ఞాన సర్వస్వంగా పరిగణించిన గ్రంథం పండితారాధ్య చరిత్ర.

పద్యాలలో ద్విపదలలో కఠినపదాలకు అర్థాలు

1వ పద్యం :

“భృంగిరిటి గోత్రుడను గురు
లింగ తనూజుఁడ శివకులీనుండ దుర్వ్యా
సంగ వివర్జిత చరితుఁడ
జంగమలింగ ప్రసాద సత్ప్రణుండన్”

భృంగిరిటి గోత్రుడను = భృంగీశ్వరుని గోత్రమువాడిని
తనూజుడను = కుమారుడును
శివకులీనుండిను = శివభక్తుడును
దుర్వాసంగ = చెడ్డపనులను
వివర్జిత = విసర్జించినవాడను
సత్ + ప్రాణుండన్ = మంచివాడను

2వ పద్యం :

“ధరను మామాత పితారుద్రయనెడు
వర పురాణోక్తి నీశ్వర కులజుండ
భక్త కారుణ్యాభిషిక్తుండఁ బాశ
ముక్తుండ గేవలభక్తి గోత్రుండ
భ్రాజిష్ణుడగు విష్ణు రామి దేవుండు
జిష్ణువగు శ్రియాదేవి యమ్మయును
గారవింపఁగ నొప్పు గాదిలి సుతుఁడ
వీర మాహేశ్వరాచార వ్రతుండ

ధరను = భూమిపై
డ.మామాత = పార్వతీదేవి
పిత = తండ్రి
రుద్ర = శివుడు
కారుణ్య + అభిషిక్తుండు = కరుణచేత అభిషేకింపబడినవాడు
పాశముక్తుండ = కోరికలను వదలివేసినవాడు
గాదిలిసుతుడ = ముద్దుల కొడుకును

TS Inter 1st Year Telugu Study Material Chapter 1 పాల్కురికి సోమనాథుడు

3వ పద్యం :

“ఉరుతర గద్యపద్యోక్తులకంటే
సరసమై బరగిన జాను తెనుంగు
చర్చింపగా సర్వ సామాన్యమగుట
గూర్చెద ద్విపదలు గోర్కిడైవార
తెలుగు మాటలనంగ వలదు వేదముల
కొలదియగా జూడుడిల నెట్టులనిన…. (బసవపరాణం)

ఉరుతర = గొప్పవైన
పరగిన = ఒప్పిన
కోర్కెదైవారు = కోర్కెలు తీరేవిధంగ

4వ పద్యం :

“తొలికోడి కనువిచ్చి నిలిచి మై వెంచి.
జలజల రెక్కలు సడలించి నీల్లి
గ్రక్కున గాలార్చి కంఠంబు విచ్చి
ముక్కున నీకెలు చక్కొల్పి కడుపు
నిక్కించి మెడసాచి నిక్కి మిన్సూచి
కొక్కొరో కుఱ్ఱని కూయకమున్న

మై = శరీరము
గ్రక్కున = వెంటనే
కాలు + ఆర్చి = కాళ్ళు చాపి
చక్కొల్పి = విదిలించి
మిన్ను చూసి = ఆకాశమువైపు చూసి.

TS Inter 1st Year Telugu Study Material Chapter 1 పాల్కురికి సోమనాథుడు

పాల్కురికి సోమనాథుడు Summary in Telugu

రచయిత పరిచయం

రచయిత : గడియారం రామకృష్ణ శర్మ

తల్లితండ్రులు : సుబ్బమ్మ, జ్వాలాపతి

పుట్టినతేది : మార్చి 6, 1919

పుట్టిన ఊరు : అనంతపురం జిల్లా,

స్థిరనివాసం : తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా అలంపురం

గురువులు : తిరుపతి వేంకటకవుల శిష్యుడైన వేలూరి శివరామశాస్త్రి

నేర్చిన భాషలు : సంస్కృతం, తెలుగు, కన్నడం, ఆంగ్లం

రచనలు

  1. మెకంజీకై ఫీయత్తులను రాయించారు.
  2. తెలంగాణా శాసనాలు గ్రంథం రెండవ సంపుటిని ప్రచురించారు.
  3. కన్నడ సాహిత్య చరిత్రను పరిశోధనాత్మకంగా రాశారు.
  4. కన్నడ కవి ‘రన్నడు’ రచించిన గదాయుద్ధాన్ని తెలుగులో అనువాదం చేశాడు.
  5. అలంపురం చరిత్ర, విద్యారణ్యస్వామి చరిత్ర, ప్రామాణిక చారిత్రాక గ్రంథాలను రచించారు.
  6. గడియారం ఆత్మకథ “శతపత్రం” దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

TS Inter 1st Year Telugu Study Material Chapter 1 పాల్కురికి సోమనాథుడు

నడిపిన పత్రికలు:

  1. ‘భాగ్యనగర్ రేడియో’ ద్వారా వార్తా ప్రచారం
  2. సుజాత పత్రికను పునరుద్ధరించాడు.

మరణం : జులై 2006లో మరణించారు.

పోతిదేవర, జ్ఞానగురువు బెలిదేవి వేమనారాధ్యుని మనుమడు. ఇతని పేరు పేర్కొనలేదు. సాహిత్యగురువు కరస్తలి విశ్వనాథయ్య.

సోమనాధుని వ్యక్తిత్వం

సోమనాధుడు వీరశైవలోకానికి మూలపురుషుడు. వీర శైవ వాఙ్మయమంతా పాల్కురికి రచనలపైనే ఆధారపడింది. వీరశైవాన్ని ఉద్ధరించినవాడు బసవేశ్వరుడు ప్రచారం చేసినవాడు. పండితారాధ్యుడు. పండితపామర జనరంజకంగా శైవమతగ్రంథాలను రచించినవాడు పాల్కురికి. ఇతని తరువాతి వీరశైవులు పాల్కురికిని భృంగీశ్వరుని అవతారంగా భావించారు.

గుడ్డెద్దు చేలోపడినల్లుగాకాక ఆంధ్రవాఙ్మయాన్ని భాష, భావం, రూపాలలో క్రొత్తదనాన్ని తీసుకువచ్చినవాడు పాల్కురికి. వీరశైవ వాఙ్మయంలో శ్రుతి, స్మృతి, పురాణ, ఇతిహాస, కావ్యస్తుత్యాదులను తీసుకువచ్చాడు సోమనాథుడు. అనుభవ సారము, రుద్రభాష్యము, బసవపురాణము, పండితారాధ్య చరిత్ర, వృషాధిపశతకం, బసవరగడ, బసవోదాహరణాలను రచించాడు. దేశీయ ఛందమగు ద్విపదలో జానుతెనుగు భాషలో రచన చేశాడు.

సోమనాధుని సాహిత్య సృష్టికి ప్రధాన కారణం మతం. ఈతనిపై వీరశైవమత ప్రభావం, కన్నడసాహిత్య ప్రభావాలున్నాయి. ఈయన తన భాషాఛందస్సులనుగూర్చి

“ఉరుతర గద్య పద్యోక్తుల కంటే
సరసమై బరిగిన జాను తెనుంగు…..”

అని ‘జాను తెనుగు’లో కృతులు రచించాడు. జాను తెనుగు అంటే లోక వ్యవహారములోని సర్వజన సుబోధకమై తెలుగు భాష అని అర్థం.

TS Inter 1st Year Telugu Study Material Chapter 1 పాల్కురికి సోమనాథుడు

సోమనాథుడు అనుసరించిన ఛందస్సు కూడా కొత్తది. వృత్తపద్యాలు కొన్ని వ్రాసినా జాతులు, ఉపజాతులలోనే రచనను సాగించాడు. ఈయన వ్రాసిన ఛందస్సు ‘ద్విపద’.

ఇక సోమనాథుని వర్ణనలు ప్రకృతికి దగ్గరగా ఉంటాయి. స్వభావోక్తితో కూడి ఉంటాయి. వేకువజామును కోడికూతను ఎంత చక్కగా వర్ణించాడో చూడండి.

“తొలికూడి కనువిచ్చి, నిలిచిమై వెంచి
జల జల రెక్కలు సడలించి నీలి…….

అన్న ద్విపద పద్యంలో సహజత్వం కూర్చడబడింది.

సోమనాథుని రచనలు.

సోమనాథుడు దాదాపు 21 రచనలు చేశాడు. 1. బసవపురాణం 2. పండితారాధ్య చరిత్ర 3. అనుభవసారం 4. చతుర్వేద సారము 5. సోమనాథ భాష్యం 6. రుద్రభాష్యం 7. బసవరగడ 8. గంగోత్పత్తి రగడ 9. శ్రీ బసవారాధ్య రగడ 10. సద్గురు రగడ 11. చెన్నముల్లు సీసములు 12. నమస్కార గద్య 13. వృషాధిపశతకము 14. అక్షరాంక గద్య 15. పంచప్రకార గద్య 16. పంచకము 17. ఉదాహరణయుగములు.

భాషలో ద్విపదలో తరువాత కవులకు పాల్కురికి మార్గదర్శకుడయ్యాడు.

కఠిన పదాలకు అర్ధాలు

దీక్షాగురువు = శివదీక్షను ఇచ్చిన గురువు
శిక్షాగురువు = భక్తితో శిక్షణను ఇచ్చిన గురువు
జ్ఞానగురువు = జ్ఞానాన్ని ప్రసాదించిన గురువు
సాహిత్యగురువు = సాహిత్యమును నేర్పిన గురువు
ప్రతివాద భయంకరుడు = వాదనలో ఎదుటివారికి భయాన్ని కలిగించే వాడు.
యశము = కీర్తి

TS Inter 1st Year Telugu Study Material Chapter 1 పాల్కురికి సోమనాథుడు

పరివర్తనము = మార్పు
గ్రాహ్యము = గ్రహించు
రమణీయ = అందమైన
బహుభాషాకోవిదుడు = పలు భాషలలో పండితుడు
సుగ్రాహ్యము = తేలికగా గ్రహించగలిగినది
గ్రక్కున = వెంటనే
అష్టభాషాప్రావీణ్యము = ఎనిమిది భాషలలో నేర్పుగల
కృతి = కావ్యము
నగము = పర్వతము
ఆధ్యుడు = మొదటివాడు
పామరులు = సామాన్యజనులు

TS Inter 1st Year Telugu Grammar స్థూల అవగాహన

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material Grammar స్థూల అవగాహన Questions and Answers.

TS Inter 1st Year Telugu Grammar స్థూల అవగాహన

విద్యార్థులలో అవగాహనా సామర్థ్యాన్ని పరీక్షించడానికి ‘స్థూల అవగాహన’ ను ఒక అంశంగా చేర్చడం జరిగింది. మనం ఎన్నో పుస్తకాలు చదువుతాం. అయితే ఆ చదివే విధానం పాఠకుల మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. కొందరు ఒక గంటలో పేజీలు పేజీలు తిప్పివేస్తారు. మరికొందరు ఎక్కువ సమయాన్ని తీసుకుని తక్కువ పేజీలు చదువుతారు. ఇది వారి వారి నైపుణ్యాలను బట్టి వుంటుందని గమనించాలి.

ఐతే, విద్యార్థులు పుస్తక పఠనంలో అనేక మెలకువలను పాటించాలి. ప్రధానంగా మనం చదివే విషయం మీద దృష్టి సారించాలి. మనం చదివే ‘పేరా’లో ఏ అంశం గురించి ప్రస్తావిస్తున్నారో గమనించాలి. అందులో ప్రస్తావనకు వచ్చే అంశాలను క్రమపద్ధతిలో గుర్తుంచుకోవాలి.

అలా చేసినపుడు మనకు విషయం మీద సమగ్ర అవగాహన ఏర్పడుతుంది. అవగాహన లేకుండా ఎన్ని పుస్తకాలు తిరిగేసినా, ఎన్ని గంటలు చదివినా ప్రయోజనం శూన్యం. కాబట్టి విద్యార్థులలో అవగాహనా సామర్థ్యాలను పరీక్షించడానికి చిన్నచిన్న పేరాలను విషయ ప్రాధాన్యతను బట్టి ఎంపిక చేసుకొని వారిచేత చదివించాలి. ఆ తర్వాత దానిని వారెంత వరకు అర్థం చేసుకున్నారో తెల్సుకోవడం కోసం చిన్నచిన్న ప్రశ్నలు అడగాలి.

దానిని బట్టి విద్యార్థుల అవగాహనా సామర్థ్యాన్ని అంచనా వేయవచ్చు. ఈ దృష్టితో ఇంటర్ విద్యార్థులకు ‘స్థూల అవగాహన’ ను ఒక అంశంగా సిలబస్లో చేర్చడం జరిగింది.

1. కథానిక

ఆధునిక వచన సాహిత్యంలో కథానిక ప్రక్రియ ప్రత్యేక స్థానాన్ని పొందింది. ప్రాచీన సాహిత్యంలో వినిపించే కథలు నేటి కథానిక సాహిత్య పరిధిలోకి రావు. కథానిక ఆంగ్ల సాహిత్య ప్రభావంతో ఆధునిక లక్షణాలతో విభిన్న ప్రయోగధోరణులతో వర్తమాన పరిణామాలకు అనుగుణంగా నడుస్తుంది. ఆంగ్లంలో ‘short story’ అనే పదానికి సమానార్థకంగా తెలుగులో కథ, కథానిక అనే పర్యాయపదాలను వాడుతున్నాం.

ఈ కథానిక పదం ‘కథ’ ధాతువునుంచి పుట్టింది. దీనికి మాట్లాడుట, చెప్పుట, సంభాషించుట అనే భేదాలున్నాయి. కథానిక ప్రస్తావన ‘అగ్నిపురాణం’లో కనిపిస్తుంది. క్లుప్తతతో బిగువైన కథనంతో ఉదాత్త అంశాలతో భయాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తూ కరుణ, అద్భుత రసపోషణతో ఆనందాన్ని అందించడమే కథానిక లక్షణంగా చెప్పబడింది.

TS Inter 1st Year Telugu Grammar స్థూల అవగాహన

ఆధునిక కాలానికి చెందిన కథారచన యూరోపియన్ సామాజిక, రాజకీయ పరిణామాల ప్రభావంతో ఆవిర్భవించింది. తొలి కథా రచయితగా భావించబడుతున్న ‘ఎడ్గార్ ఎలన్ పో “ఒకే సంఘటనను అది యథార్థమైనా, కల్పనాత్మకమైనా తక్కువ సమయంలో చదువగలిగే సాహిత్య ప్రక్రియ” కథానిక అని నిర్వచించాడు.

తెలుగు కథానికపై తొలి సిద్ధాంత గ్రంథం రచించిన డా॥ పోరంకి దక్షిణామూర్తి కథానికను నిర్వచిస్తూ “ఏకాంశవ్యగ్రమై, స్వయం సమగ్రమైన కథాత్మక వచన రచనా ప్రక్రియ” అని తన ‘తెలుగు కథానిక స్వరూప స్వభావం’లో వివరించాడు. కథానిక నిర్వచనాలన్నింటిని క్రోడీకరిస్తే సంక్షిప్తత, ఏకాంశవస్తువు, అనుభూతి ఐక్యత, సంఘర్షణ, ప్రతిపాద్య ప్రవీణత, సంవాద చాతుర్యం, నిర్మాణ సౌష్ఠవాలు కథానికకు ప్రధాన లక్షణాలుగా స్థిరపడ్డాయి. సామాజిక వాస్తవికతను అందిస్తూ మనోవికాసాన్ని కలిగించడంలో కథానిక ప్రక్రియ శక్తివంతమైనదిగా విమర్శకులు పరిగణించారు.

ప్రశ్నలు

ప్రశ్న 1.
‘కథానిక’ పదం ఎలా పుట్టింది?
జవాబు:
‘కథ్’ ధాతువు నుంచి పుట్టింది

ప్రశ్న 2.
‘కథానిక’ ప్రస్తావన ఏ పురాణంలో ఉంది?
జవాబు:
అగ్నిపురాణంలో

ప్రశ్న 3.
తొలి కథారచయితగా ఎవరిని భావిస్తున్నాం ?
జవాబు:
విఙ్గర్ విలన్పో

ప్రశ్న 4.
కథానిక ప్రక్రియ ఏ కాలానికి సంబంధించినది?
జవాబు:
ఆధునిక కాలానికి

TS Inter 1st Year Telugu Grammar స్థూల అవగాహన

ప్రశ్న 5.
తెలుగు కథానికపై తొలి సిద్ధాంత గ్రంథం రచించినదెవరు?
జవాబు:
పోరంకి దక్షిణామూర్తి

2. నవల

ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వచ్చిన ప్రక్రియ నవల. ఆంగ్లంలో ‘Novel’ అనే పదంనుండి ‘నవల’ పుట్టింది. అయితే నవల పదానికి మూలం సంస్కృతంలో కనిపిస్తుందని కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి ‘నవాన్ విశేషాలాతి గృష్ణాతీతి నవలా’ అంటూ ‘కొత్త విశేషాలు తెలిపేది నవల’గా నిర్వచించాడు. 1872 కాలంలో నవలను ‘వచన ప్రబంధము’ అనే పేరుతో పిలుచుకున్నారు. దీనికి సమర్ధనగా కందుకూరి వీరేశలింగం ‘తెలుగులో మొదటి వచన ప్రబంధమును నేనే చేసితిని’ అని ప్రకటించుకున్నాడు.

‘తెలుగులో తొలి నవల ఏది?” అనే విషయంలో పరిశోధకుల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి. 1872లో గోపాలకృష్ణమశెట్టి ‘శ్రీరంగరాజ చరిత్రము’ నవల వెలువడింది.’ ‘శ్రీరంగరాజ చరిత్రము’లో నవలా లక్షణములు లేవనే అభిప్రాయాలతో ‘రాజశేఖర చరిత్ర’నే తొలి నవలగా అందరూ అంగీకరించారు. ఈ నవలకు ‘వివేకచంద్రిక’ అనే మరో పేరు ఉంది. ఇది ఆంగ్లంలో అలీవర్ గోల్డ్ స్మిత్ రాసిన ‘వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్’ అనే ప్రసిద్ధ నవలకు అనుకరణ.

రచనా కాలంలోని ‘వాస్తవికాలనే జీవితాచార వ్యవహారాలను చిత్రించేది నవల’ అని ‘తెలుగు నవలా పరిణామం’ గ్రంథంలో బొడ్డపాటి కుటుంబరావు, ‘వ్యక్తుల జీవితాన్ని ప్రధానంగా తీసుకుని సాంఘిక జీవితాన్ని స్ఫురింపజేసే సాహిత్య ప్రక్రియ నవల’ అని ఆర్.ఎస్. సుదర్శనం నిర్వచించారు. కథ సంఘటన చుట్టు తిరిగితే, నవల అనేక జీవితాల చుట్టు తిరుగుతుంది.

కథకు సంక్షిప్తత ప్రాణమయితే, నవల విస్తృతమైన వివరణలతో నడుస్తుంది. కథ, కథావస్తువు, ఇతివృత్త నిర్వహణ, పాత్రలు, పాత్రోచిత సంభాషణలు, సంఘటనలు, సన్నివేశం, నేపథ్య చిత్రణ, మంచి ఎత్తుగడ, అర్థవంతమైన ముగింపు మొదలైన లక్షణాలతో, పద్ధతులతో నవల పఠితల్ని ఆకర్షితుల్ని చేస్తుంది.

ప్రశ్నలు

ప్రశ్న 1.
కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి నవలను ఏవిధంగా నిర్వచించాడు?
జవాబు:
విద్యావాన్ విశేషాన్వాతి గృష్ణాతీతి నవలా అంటూ కొత్త విశేషాలు తెలిసేది నవలగా నిర్వచించారు.

ప్రశ్న 2.
‘మొదటి వచన ప్రబంధము నేనే రాసానని’ ఎవరన్నారు?
జవాబు:
కందుకూరి విరేశలింగం

TS Inter 1st Year Telugu Grammar స్థూల అవగాహన

ప్రశ్న 3.
తెలుగులో తొలి నవల ఏది?
జవాబు:
రాజశేఖర్ చరిత్ర

ప్రశ్న 4.
‘తెలుగు నవలా పరిణామం ‘ గ్రంథకర్త ఎవరు?
జవాబు:
ఆర్.ఎస్ సుదర్శనం’

ప్రశ్న 5.
నవల దేనిచుట్టూ తిరుగుతుంది.
జవాబు:
అనేక జీవితాల

3 స్థూల అవగాహన

సాహిత్య ప్రక్రియల్లో నాటకం శక్తివంతమైన ప్రక్రియ. సంస్కృతంలో ‘కావ్యేషు నాటకం రమ్యం, నాటకాంతం హి సాహిత్యం ‘ అని నాటక ప్రాశస్త్యాన్ని పండితులు ప్రశంసించారు. కాళిదాసు వంటి మహాకవులు నాటక ప్రక్రియను దృశ్యకావ్యంగా మలచి అద్భుతమైన నాటకాలను రచించారు. ప్రాచీన సాహిత్యంలోని నాటక ప్రక్రియకంటే భిన్నంగా పాశ్చాత్య నాటకాల ప్రభావంతో ఆధునిక తెలుగునాటకం రూపుదిద్దుకుంది.

1860లో కోరాడ రామచంద్రశాస్త్రి రాసిన ‘మంజరీ మధుకరీయము’ మొదటి తెలుగునాటకం. సంస్కృతనాటకాలు ఐదు నుండి పది అంకాల నిడివి వుండేవి. తెలుగునాటకాలు మాత్రం మూడు, నాలుగు అంకాలుగానే ప్రదర్శితమయ్యేవి. కాలక్రమేణా నాటకం అంక విభజనను వదిలేసి కథానుగుణంగా రంగాలుగా విభజిస్తున్నారు. కాలపరిమితి గంట, రెండుగంటల మధ్య సంక్షిప్తంగా, సన్నివేశ గాఢత, సంభాషణా ప్రాధాన్యతతో నాటకాలు ప్రదర్శితమవు తుంటాయి. నాటికలు, ఏకాంకికలు నాటకశాఖకు చెందిన ఉపప్రక్రియలే.

‘ఆంధ్రనాటక పితామహుడి’గా పేరుగాంచిన ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించిన ‘విషాదసారంగధర’ నాటకం పాఠ్యాంశంగాను చదువుకోవడం విశేషం. ధర్మవరం తరువాత కోలాచలం శ్రీనివాసరావు చారిత్రక, ఇతిహాస నాటకాలు రచించి ‘ఆంధ్రచారిత్రక నాటక పితామహుడు’గా పేరుగాంచాడు. ‘ధార్వాడ’, పార్సీ నాటకసమాజాల వల్ల కూడా తెలుగు ప్రాంతంలో నాటక ప్రక్రియ ప్రాచుర్యం పొందింది.

కందుకూరి వీరేశలింగం ‘వ్యవహారధర్మబోధిని’ నాటకం 1880 ప్రాంతంలో తన చారిత్రక బాధ్యతను నిర్వర్తిస్తూ నాటక ప్రక్రియకు వ్యాప్తిని అందించింది. తెలుగునాట అనేక నాటక సమాజాలు ఏర్పడి ప్రజలలో నాటక అభిరుచిని, చైతన్యాన్ని కలిగించాయి. గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’ మొదటి వ్యవహారిక, సాంఘిక నాటకంగా సంచలనాన్ని సృష్టించింది. 1911లో చందాల కేశవదాసు రాసిన ‘కనకతార’ తెలంగాణ నుండి వచ్చిన తొలి నాటకంగా భావిస్తున్నారు.

TS Inter 1st Year Telugu Grammar స్థూల అవగాహన

ప్రశ్నలు

ప్రశ్న 1.
మొదటి తెలుగు నాటకం ఏది?
జవాబు:
మంజరీ మధుకరీయము

ప్రశ్న 2.
‘ఆంధ్రనాటక పితామహుడు’ ఎవరు?
జవాబు:
ధర్మవరం రామకృష్ణమాచార్యులు

ప్రశ్న 3.
కందుకూరి రాసిన నాటకం పేరు?
జవాబు:
వ్యవహారధర్మబోధిని

ప్రశ్న 4.
వ్యవహారిక భాషలో వెలువడిన తొలి నాటకం ఏది ?
జవాబు:
కన్యాశుల్కం

ప్రశ్న 5.
‘కనకతార’ నాటకకర్త ఎవరు?
జవాబు:
చందాల కేశవదాసు

4. వచన కవిత

కవిత్వం పద్య, గేయ రూపంలో గాకుండా వ్యవహారిక పదాలు, వాక్యాలతో కొత్త రూపాన్ని సంతరించుకుంది. పాశ్చాత్య కవితాధోరణుల ప్రభావం దీనికి ప్రధాన కారణం. ఫ్రెంచి భాషలోని ‘verse libre’ అని, ఆంగ్లంలో ‘free verse’ అని పిలుచుకుంటున్న. కవితా పద్ధతే తెలుగులో వచనకవితగా స్థిరపడింది.

TS Inter 1st Year Telugu Grammar స్థూల అవగాహన

వచనకవితకు ఆద్యుడుగా చెప్పుకునే శిష్ట్లా ఉమామహేశ్వరరావు తను రాసిన వచనకవితల్ని 1938లో ‘విష్ణుధనువు’, ‘నవమి చిలుక’ సంపుటాలుగా ప్రకటించాడు. వచనకవిత ప్రయోగదశ, తొలిదశలో వచ్చిన ఈ కవిత్వాన్ని శిష్ట్లా ‘ప్రాహ్లాద కవిత’గా పేర్కొన్నాడు. అటుతర్వాత వచనగేయం, వచనపద్యం, ముక్తచ్ఛంద కవిత, స్వచ్ఛంద కవిత, ఫ్రీవర్, వరిబర్, వచనకవిత అనే పలు పేర్లు వ్యాప్తిలోకి వచ్చినా వచనకవిత అనే పేరు స్థిరపడిపోయింది.

వ్యవహార భాషా ప్రయోగాలతో భావపరమైన చిన్న వాక్యాల పాద విభజనతో వచనకవిత నడుస్తుంది. భావగణాలతో, అంతర్లయ గల వాక్యాలతో వచనకవిత స్వేచ్ఛానుగుణంగా కదులుతుంది. ప్రతి వచనకవికి తనదైన నిర్మాణ శిల్పం వుండటం వచనకవిత ప్రత్యేకత. వచనకవితలో పాఠకునికి భావోద్వేగం కలిగించేట్లుగా ఒక విరుపు, భావలయ, అంతర్లయలు నిగూఢంగా వుంటాయి.

వచనకవిత ఆవిర్భావదశలో 1939లో పఠాభి ‘ఫిడేలు రాగాల డజన్’ కవితాసంపుటి, ‘నయాగరా’ కవితాసంకలనం ముఖ్యమైనవి. తెలుగులో తొలి వచనకవితా సంకలనమైన ‘నయాగరా’ను కుందుర్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాస్, ఏల్చూరి సుబ్రహ్మణ్యంలు ప్రచురించారు. కుందుర్తి వచనకవితకు ఉద్యమస్ఫూర్తిని అందించాడు. వచన కావ్యంగా ‘తెలంగాణ’ కావ్యాన్ని రచించి ‘వచనకవితాపితామహుడి’గా ప్రసిద్ధి చెందాడు.

ప్రశ్నలు

ప్రశ్న 1.
వచన కవితకు ఆద్యుడుగా ఎవరిని భావిస్తున్నాం?
జవాబు:
శిష్ట్లా ఉమాహేశ్వరరావు

ప్రశ్న 2.
శిష్టా తన కవిత్వానికి పెట్టుకున్న పేరు ఏమిటి?
జవాబు:
ప్రహ్లాద కవిత

TS Inter 1st Year Telugu Grammar స్థూల అవగాహన

ప్రశ్న 3.
‘వచనకవితాపితామహుడు ఎవరు?
జవాబు:
కందుర్తి

ప్రశ్న 4.
తెలుగులో తొలి వచనకవితా సంకలనం ఏది?
జవాబు:
‘విష్ణుధనువు’, ‘నవమిచిలుక’

ప్రశ్న 5.
‘ఫిడేలు రాగాల డజన్’ కవితా సంపుటి కర్త?
జవాబు:
శిష్ట్లా ఉమాహేశ్వరరావు

5. లఘు కవితా ప్రక్రియలు

వచనకవిత్వ వికాసంలో భాగంగా వచనకవిత విభిన్న లఘురూపాలుగా వైవిధ్యాన్ని సంతరించుకుంది. ఈ క్రమంలో కవిత్వచరిత్రలో ప్రాచుర్యం పొందిన మినీకవిత, హైకూ, నానీల ప్రక్రియలను స్థూలంగా తెలుసుకుందాం. 1970వ దశకం నుండి మినీకవిత వెలుగులోకి వచ్చింది. పదిపంక్తులు మించకుండా సంక్షిప్తంగా సూటిగా కొసమెరుపుతో చెప్పగలగడం మినీకవిత ప్రధాన లక్షణం.

TS Inter 1st Year Telugu Grammar స్థూల అవగాహన

మినీకవితలో ధ్వని, వ్యంగ్యం ప్రాధాన్యం వహిస్తాయి. మినీకవితలపై 1977లో నండూరి రామమోహనరావు మొదలు పెట్టిన చర్చ మినీకవిత్వోద్యమంగా మారింది. అలిశెట్టి ప్రభాకర్ ‘సిటీలైఫ్’ శీర్షికతో ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాసిన మినీకవితలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘మినీకవిత ఆయుష్షు మెరుపంత, కాని అది ప్రసరిస్తుంది కాలమంత’ అని డా|| సి. నారాయణ రెడ్డి మినీకవితా ప్రక్రియను నిర్వచనాత్మకంగా ప్రశంసించాడు. జపాన్ కవి బషో సృష్టించిన కవితా ప్రక్రియ ‘హైకూ’.

హైకూలో మూడుపాదాలు ఉంటాయి. మొదటిపాదంలో ఐదు, రెండోపాదంలో ఏడు, మూడోపాదంలో ఐదు అక్షరాల నియమంతో మొత్తం పదిహేడు అక్షరాలతో హైకూ కవిత రూపొందింది. హైకూ జైన, బౌద్ధ తాత్త్వికతను, ప్రకృతి సౌందర్యాన్ని, మార్మిక అంశాలను ధ్యాన ఛాయలతో ఆవిష్కరిస్తుంది. తెలుగులో హైకూ ప్రక్రియను గాలి నాసరరెడ్డి రేఖామాత్రంగా పరిచయం చేసాడు. ఇస్మాయిల్ హైకూ ప్రక్రియను విస్తృత పరిచాడు. తెలుగులో పదిహేడు అక్షరాల నియమం పాటించకుండా మూడు పొడుగు పాదాలతో హైకూలు రాసినవారే ఎక్కువ.

నానీల ప్రక్రియ రూపకర్త డా॥ ఎన్. గోపి. 1997లో వార్త దినపత్రిక ఎడిట్ పేజీలో నానీలు తొలిసారిగా సీరియల్గా వెలువడినాయి. నానీలు అంటే ‘చిన్నపిల్లలు’, ‘చిట్టి పద్యాలు’ అని అర్థం. నావీ, నీవీ వెరసి మన భావాల సమాహారమే నానీలు. నాలుగు పాదాల్లో ఇరవై అక్షరాలకు తగ్గకుండా, ఇరవై ఐదు అక్షరాలకు మించకుండా నానీ నడుస్తుంది. ఈ నాలుగు పాదాల నానీలో మొదటి, రెండు పాదాల్లో ఒక భావాంశం, చివరి రెండుపాదాల్లో మరొక భావాంశం ఉంటాయి. మొదటి దానికి రెండోది సమర్థకంగా ఉంటుంది.

TS Inter 1st Year Telugu Grammar స్థూల అవగాహన

కొన్ని వ్యాఖ్యానా త్మకం గాను, వ్యంగ్యాత్మకంగాను ఉంటాయి. ఇప్పటివరకు నానీలను ప్రముఖ, వర్ధమాన కవులు రాయడం విశేషం. ఈ ఇరవైమూడు సంవత్సరాల్లో నానీలు మూడువందల యాభై సంపుటాలు రాగా, వందలాది కవులు నానీలు రాయడం నానీ ప్రక్రియకున్న శక్తికి, ఆదరణకు నిదర్శనం. భారతీయ సాహిత్య చరిత్రలో లఘు ప్రక్రియను అనుసరిస్తూ ఇన్ని గ్రంథాలు వెలువడడం అద్భుతమైన విషయం.

ప్రశ్నలు

ప్రశ్న 1.
‘సిటీ లైఫ్’ పేరుతో మినీకవితల్ని రాసిన కవి ఎవరు?
జవాబు:

ప్రశ్న 2.
మినీ కవితను నిర్వచనాత్మకంగా ప్రశంసించిన కవి ఎవరు?
జవాబు:

ప్రశ్న 3.
హైకూలోని పాదాలు, అక్షరాల నియమాలను తెలుపండి.
జవాబు:

ప్రశ్న 4.
నానీల్లోని పాదాలు, అక్షరాల నియమాలను వివరించండి.
జవాబు:

TS Inter 1st Year Telugu Grammar స్థూల అవగాహన

ప్రశ్న 5.
నానీలు తొలిసారిగా ఎప్పుడు, ఎక్కడ ప్రచురితమైనాయి?
జవాబు:

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 3rd Poem శతక సుధ Textbook Questions and Answers.

TS Inter 1st Year Telugu Study Material 3rd Poem శతక సుధ

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు – సమాధానములు

ప్రశ్న 1.
ఏనుగు లక్ష్మణకవి తన పద్యాల ద్వారా అందించిన నీతిని వివరించండి?
జవాబు:
ఏనుగు లక్ష్మణకవి 18వ శతాబ్దానికి చెందినవాడు. లక్ష్మణకవి సంస్కృతంలో భర్తృహరి రచించిన, సుభాషిత త్రిశతిని తెలుగులోకి సుభాషిత రత్నావళిగా అనువదించారు. సుభాషిత రత్నావళి నీతి, శృంగార, వైరాగ్య, శతకాలని మూడు భాగములు. రత్నావళిల పద్యాలు అవి మనోహరంగా, యథామూలంగా, సందర్భోచితంగా ఉంటాయని విమర్శకుల భావన.

లక్ష్మణకవి నీతి శతకంలో అనేక విషయాలు తెలియచేసాడు. కాలిన ఇనుముపై పడిన నీటిచుక్క ఊరు పేరు లేక నశించిపోవును. ఆ బిందువే తామరఆకు మీద పడితే ముత్యంలాగా ప్రకాశించును. ఆ బిందువే ముత్యపు చిప్పలో పడితే ముత్యం అవుతుంది. కావున ఆశ్రయించిన వారిననుసరించి నీచులు, ముత్యములు, ఉత్తములు అనే పేరు వచ్చును.

క్షమ కలిగియున్నచో బాధలు తప్పించుకొనుటకు వేరే కవచం అక్కరలేదు. క్రోధమును మించిన శత్రువులేదు. సమస్తము నిర్మూలించకు దాయాది ఉంటే చాలు. వేరే నిప్పు అక్కరలేదు. స్నేహితుని మించిన ఔషధం లేదు. ప్రాణాలు తీయుటకు దుష్టజనాలు చాలు, వేరే సర్పాలు అవసరం లేదు. విద్యయే ధనము, తగినంత సిగ్గు కలిగివుండుట అలంకారము. లోకులను వశం చేసుకొనుటకు మంచి పాండిత్యంగాని, కవిత్వం గాని ఉంటే చాలు రాజ్యమక్కరలేదు.

విద్యాధనాన్ని దొంగలు హరించలేరు. అది ఎల్లప్పుడూ సుఖమునే కలుగజేయును. కోరిన వారికి ఎల్లప్పుడూ ఇచ్చిననూ మరింత వృద్ధి చెందును. ప్రళయకాలంలో కూడా నశించదు. ఇట్టి విద్యాధనము గలవారితో సామాన్యధనము గల రాజులు తమ గర్వాన్ని . తగ్గించుకుని ఉండుట ఉత్తమము.

చేతులతో సదా దానం చేయుట, సదా సత్యమునే పలుకుట, గురుపాదాల విందాలను శిరస్సున దాల్చుట, భుజయుగమునకు జయమునిచ్చే పరాక్రమాన్ని, నిర్మలమైన మనస్సును, చెవులకు శాస్త్ర శ్రవణం – ఇవి సత్పురుషులకు ఐశ్వర్యము లేకపోయినను గొప్ప అలంకారములు.

ఇలా ఏనుగు లక్ష్మణకవి తెలుగులో అనువదించిన నీతి శతకాలలోని నీతి అన్ని కాలాలకూ వర్తిస్తుంది. విద్యార్థులకు పెద్దలకు అందరికీ వారి నిజ జీవితంలో ఉపయోగపడేలా, ఎలా మసలుకోవాలో అనేక ఉపమానాలు సుమధురంగా నీతిని ప్రబోధించారు.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

ప్రశ్న 2.
పాఠ్యాంశం ఆధారంగా నృసింహ శతకంలోని భక్తితత్త్వాన్ని తెలపండి?
జవాబు:
శేషప్పకవి 18వ శతాబ్దానికి చెందినవాడు. కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి ప్రాంతం వాడు. ధర్మపురిలోని నరసింహస్వామిపై రాసిన శతకం నరసింహ శతకం. ఇది సీస పద్యాలలో రచింపబడిన ద్విపాద మకుట శతకం. శతకం లేని పద్యాలలో నరసింహస్వామిని సంబోధించడంలో ప్రేమ, మృదుత్వం, కాఠిన్యం, కోపం ఇంకా అనేక విధాలుగా తన భక్తిని ప్రదర్శించాడు.

ఆభరణములతో మిక్కిలి ప్రకాశించేవాడా! దుష్టులను సంహరించేవాడా! పాములకు దూరమైనవాడా! ధర్మపురము నందు నివసించే ఓ నరసింహస్వామీ!

భూమిలో వేయేండ్లు దేహం నిలవదు. ధనమెప్పటికీ స్థిరం కాదు. ఆలుబిడ్డలు తన వెంటరాలేరు. సేవకులు చావును తప్పింపలేరు. చుట్టముల గుంపు తనను బ్రతికించుకోలేదు. శక్తి శౌర్యమేమి పనికిరాదు. గొప్పగ సకల సంపదలున్నను గోచి పాతంతైన తీసుకొని పోలేడు. పిచ్చికుక్కలలాంటి ఆలోచనలను ఆలోచించక నిన్ను కొలిచే వారికి మిక్కిలి సౌఖ్యం కలుగుతుంది.

కాలిన ఇనుముపై పడిన నీటిచుక్క ఊరు పేరు లేక నశించిపోవును. ఆ బిందువే తామరఆకు మీద పడితే ముత్యంలాగా ప్రకాశించును. ఆ బిందువే ముత్యపు చిప్పలో పడితే ముత్యం అవుతుంది. కావున ఆశ్రయించిన వారిననుసరించి నీచులు, ముధ్యములు, ఉత్తములు అనే పేరు వచ్చును.

గాడిదకు కస్తూరిబొట్టు, కోతికి గంధము, పులికి చక్కెరపిండివంట, పందికి మామిడిపండు, పిల్లికి మల్లెపూలచెండు, గుడ్లగూబకు చెవులు పోగులు, దున్నపోతునకు పరిశుభ్రవస్త్రము, కొంగలకు పంజరము ఎలా అవసరంలేదో అలాగే చెడ్డ ఆలోచనలుచేసే దుర్మార్గులకు తియ్యనైన నీ నామం అనే మంత్రం (దైవభక్తి) అవసరం లేదు అని భావము.

ఆభరణములతో మిక్కిలి ప్రకాశించువారా! దుష్టులకు సంహరించువారా! పాములకు దూరమైనవారా! ధర్మపురమునందు నివసించే ఓ నరసింహస్వామీ!

నరసింహస్వామి! తల్లిదండ్రులు, భార్య, కొడుకులు, స్నేహితులు, బావము అందులు, అన్నాలు, మేనమామలు, ఇంకా పెద్ద చుట్టుములున్నాను. తాను వెడలగ వెంటరాదు. యమదూతలు ప్రాణము తీసుకుని పోవునపుడు వారు ప్రేమతో పోరాడి గెలవలేరు. చుట్టుములందరూ దుఃఖపడుదురే గాని ఆయువునివ్వలేదు. కావున చుట్టుముల మీద ప్రేమ చూరున చెక్కి, ఎప్పుడూ నిన్ను నమ్ముకొనుటే ఉపయోగము.

భుజముల శక్తిచే పెద్దపులులు చంపవచ్చు. పాము కంఠమును చేతితో పట్టవచ్చును. బ్రహ్మరాక్షసులు ఎందరినైనా తరిమివేయవచ్చు. మనుష్యుల రోగమును మాన్పవచ్చును. నాలుకకు చేదైనవి మింగవచ్చును. పదునైన కత్తిని చేతితో ఒత్తవచ్చును. కష్టముతో ముండ్లకంపలోనికి ప్రవేశించవచ్చును. తిట్టుబోతుల నోళ్ళను మూయించవచ్చును. బోధియందు దుర్మార్గులకు దేవుని గూర్చిన ఉపదేశం తెలిపి, వారిని ఎంతటి సమర్ధుడైనను మంచివానిగా చేయలేడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

ఈ విధంగా మృదు మధుర, సులభమైన ఉపమానాలలో శేషప్ప కవి నరసింహస్వామిపై తనకున్న భక్తిని చాటుకున్నాడు.

II. సంగ్రహరూప ప్రశ్నలు- సమాధానాలు

ప్రశ్న 1.
సజ్జనుడి మాట తీరును తెలపండి?
జవాబు:
మేఘుడు నీటి బిందువులనే వర్షించును. ఒకానొకప్పుడు చలువ కొరమే వడగండ్లను కురిపించినను, అవి వెంటనే చల్లని నీళ్ళగునుమారి రాళ్ళుగా ఉండవు. అదే విధంగా మంచివాడు మంచి మాటలనే పల్కును. ఒకానొక సమయమందున కఠోర వచన మును పలికినను మేలుగానే ఉంటుంది కీడుగా ఉండవు.

ప్రశ్న 2.
అధమ, మద్యమ, ఉత్తములను కొలిచేవారి స్థితి ఎలా ఉంటుందని కవి వర్ణించాడు?
జవాబు:
కాలిన ఇనుముపై పడిన నీటిచుక్క ఊరు పేరు లేక నశించిపోవును. ఆ బిందువే తామరఆకు మీద పడితే ముత్యంలాగా ప్రకాశించును. ఆ బిందువే ముత్యపు చిప్పలో పడితే ముత్యం అవుతుంది. కావున ఆశ్రయించిన వారిననుసరించి నీచులు, మధ్యములు, ఉత్తములు అనే పేరు వచ్చును.

ప్రశ్న 3.
బలిష్ఠునికే బంధుసహాయం అందుతుందని ఎలా చెప్పవచ్చు?
జవాబు:
అగ్నిహోత్రుడు నిండు బలము కలవాడై అడవిని కాల్చే సమయంలో వాయుదేవుడు అతినికి స్నేహం చూపుచూ తోడ్పడును. ఆ అగ్నిచిన్నదీపమై ఉన్న సమయంలో ఆ వాయుదేవుడే విరోధియై ఆర్పును. అదే విధంగా మానవుడు శక్తివంతుడై ఉన్న సమయంలో తన బంధువులే తోడ్పడును. బలము లేనపుడు ఆ చుట్టమే తనకు పగవాడై కీడు చేయును.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

ప్రశ్న 4.
ఏనుగు లక్ష్మణకవిని గురించి తెలపండి
జవాబు:
భర్తృహరి సుభాషిత త్రిశలు అనే పేరుతో సంస్కృతం వంటి మూడు శతకాలు రచించాడు. అవి నీతి, వైరాగ్య శృంగార శతకాలు. ఈ సుభాషిత త్రిశతిని తెలుగులో ఎలకూచి బాలసరస్వతి, ఏనుగు లక్ష్మణకవి, పుష్పగిరి తిమ్మనలు తెలుగులోకి అనువదించారు. వీటిలో ఏనుగు లక్ష్మణకవి రచన ప్రాచుర్యం పొందింది.

IV. ఏకపద/వాక్య సమాధాన ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
మనిషికి శత్రువు ఎవరు?
జవాబు:
కోపము

ప్రశ్న 2.
దివ్యమైన ధనం ఏది?
జవాబు:
విద్య

ప్రశ్న 3.
దుర్జనులు ఎలాంటి ఆలోచనలను చేస్తారు ?
జవాబు:
చెడ్డ ఆలోచనలు

ప్రశ్న 4.
నృసింహ శతక కర్త ఎవరు?
జవాబు:
శేషప్పకవి

ప్రశ్న 5.
ఎవరి భజన చేసేవారు పరమసుఖాన్ని పొందుతారు?
జవాబు:
ధర్మపురి నరసింహస్వామి భజన చేసేవారు

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

ప్రశ్న 6.
భాస్కర శతకకర్త ఎవరు?
జవాబు:
మారద వెంకయ్య

ప్రశ్న 7.
సజ్జనుడి పలుకులు ఎలాంటివి?
జవాబు:
మంచి మాటలు

ప్రశ్న 8.
చతురుడైన వాడు కూడా చేయలేని పని ఏమిటి?
జవాబు:
దుర్మార్గులకు దేవుని గురించి తెలిపి వారిని మంచివారుగా చేయలేరు.

V. సందర్భ సహిత వాఖ్యలు

ప్రశ్న 1.
గర్వము మానుటొప్పగున్
జవాబు:
పరిచయం :
ఈ వాక్యము ఏనుగు లక్ష్మణకవిచే రచింపబడిన సుభాషిత రత్నావళి నుండి గ్రహించిన పద్యంలోనిది.

సందర్భము :-
విద్యను ఆర్జించిన పండితులతో ఎలా ప్రవర్తించాలో రాజులకు, డబ్బున్నవారికి కవి తెలియచేస్తున్న సందర్భంలోనిది.

భావము :-
విద్యాధనాన్ని దొంగలు హరించలేరు. అది ఎల్లప్పుడూ సుఖమునే కలుగ జేయును. కోరిన వారికి ఎల్లప్పుడూ ఇచ్చిననూ మరింత వృద్ధి చెందును. ప్రళయ కాలంలో కూడా నశించదు. ఇట్టి విద్యాధనము గలవారితో సామాన్యధనము గల రాజులు తమ గర్వాన్ని తగ్గించుకుని ఉండుట ఉత్తమము.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

ప్రశ్న 2.
నిన్ను భాజన చేసెడి వారికి పరమ సుఖము
జవాబు:
పరిచయము :-
శేషప్పకవిచే రచింపబడిన నృసింహ శతకం నుండి గ్రహించిన పద్యంలోనిది.

సందర్భము :-
శరీరం, సంతానం, బంధుగణం, బలపరాక్రమాలు, సంపదలు శాశ్వతం కాదని నరసింహస్వామి భజన చేయటే శాంతకరణమని చెప్పిన సందర్భంలోనిది.

భావము :-
చేతులతో సదా దానం చేయుట, సదా సత్యమునే పలుకుట, గురుపాదార విందాలకు శిరస్సు దాల్చుట, భుజయుగమునకు జయమునిచ్చే పరాక్రమాన్ని, నిర్మలమైన మనస్సును, చెవులకు శాస్త్ర శ్రవణం – ఇవి సత్పురుషులకు ఐశ్వర్యము లేకపోయినను గొప్ప అలంకారములు.

ప్రశ్న 3.
సజ్జనుల జేయులేడెంత చతురుడైన
జవాబు:
పరిచయం :-
శేషప్ప కవిచే రచింపబడిన నృసింహశతకం నుండి గ్రహించిన

సందర్భము :
క్రూరజీవులనైన అదుపు చేయవచ్చుగానీ, దుర్మార్గుల మనసును ఎంతటితెలివిగల వాడైనను, మార్చలేడని కవి చెబుతున్న సందర్భంలోనిది.

భావము :-
భుజముల శక్తిచే పెద్దపులుల చంపవచ్చు. పాము కంఠమును చేతితో పట్టవచ్చును. బ్రహ్మరాక్షసులు ఎందరినైనా తరిమివేయవచ్చు. మనుష్యుల రోగమును మాన్పవచ్చును. నాలుకకు చేదైనవి మింగవచ్చును. పదునైన కత్తిని చేతితో ఒత్తవచ్చును.

కష్టముతో ముండ్లకంపలోనికి ప్రవేశించవచ్చును. తిట్టుబోతుల నోళ్ళను మూయించవచ్చును. బోధియందు దుర్మార్గులకు దేవుని గూర్చిన ఉపదేశం తెలిపి, వారిని ఎంతటి సమర్ధుడైనను మంచివానిగా చేయలేడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

ప్రశ్న 4.
వెల్తికుండ తొఁదొలుకుచునుండు
జవాబు:
పరిచయం :-
ఈ వాక్యం మారద వెంకయ్యచే రచింపబడిన భాస్కర శతకం నుండి గ్రహించిన పద్యంలోనిది.

సందర్భము :-
నీచుడికి, గుణవంతుడికి ఉన్న లక్షణాలను కవి తెలిపిన సందర్భం

భావము :-
వెలితి కుండ తొణకును గాని, నీరు నిండుగా గల కుండ తొణకదు. అట్లే గుణములేని నీచుఁడు న్యాయమునెంచక కఠినపు పలుకులను మాట్లాడును. సద్గుణములలో ప్రకాశించే గుణవంతుడు. అటువంటి కఠినపు మాటలను మాట్లాడడు.

VI. సంధులు

1. చరణాభివాదన :
చరణ + అభివాదన = సవర్ణదీర్ఘసంధి
సూత్రము :-

2. అభిలార్థి
అఖిల + అధి = సవర్ణదీర్ఘసంధి
సూత్రము :-

3. నిష్ఠురో
నిష్టుర + ఉక్తి = గుణసంధి
సూత్రము :-

4. కురియకుండునే
కురియక + ఉండునే = ఉకారసంధి
సూత్రము :- అత్తునకు సంధి బహుళమగును.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

5. భాగ్యంబెంత
భాగ్యంబు +ఎంత = ఉకారసంధి
సూత్రము :- ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధియగును.

6. భ్రమలన్నీ
భ్రమలు + అన్ని = ఉకార సంధి
సూత్రము :- ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధియగును.

7. ముత్యము
ముత్యము + అట్లు = ఉకారసంధి
సూత్రము :- అత్తునకు సంధి బహుళమగును.

8. సూకరంబునకేల
సూకరంబునకు + ఏల = ఉకరా సంధి
సూత్రము :- అత్తునకు సంధి బహుళమగును.

9. అదెట్లు
అదెట్లు = అది + ఎట్లు = ఇకారసంధి
సూత్రము :- ఏమ్యాదుల యిత్తునకు సంధి వైకల్పకముగాను.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

10. ముద్దుసేయగ
ముద్దు + చేయగ = గసడదవాదేశ
సూత్రము :- కళలైన క్రియా పదములపై పరుషములకు గసడడవలు వైకల్పికముగానగు.

VII. సమాసాలు

1. వేయేండ్లు = వేయి సంఖ్యల గల సంవత్సరాలు – ద్విగు సమాసం
2. దారాసుతాదులు = భార్య మరియు పిల్లలు – ద్వంద్వ సమాసం
3. తల్లిదండ్రులు = తల్లి మరియు తండ్రి – ద్వంద్వ సమాసం
4. ప్రియభాషలు = ప్రియమైన భాషలు – విశేషణ పూర్వపద క్మరధాయ సమాసం
5. దివ్యధనం = దివ్యమైన ధనం – విశేషణపూర్వపద క్మరధాయ సమాసం
6. శర్కరాపూపంబు = శర్కరము (చక్కెర)తో చేసి అపూకము (పిండివంట) – తృతీయా తత్పురుష సమాసం
7. చూతఫలము = చూతము (మామిడి) అనెడి ఫలము – రూపక సమాసము
8. భుజబలము = భుజముల యొక్క బలము – షష్ఠీ తత్పురుష సమాసము
9. లోకరక్షణ = లోకమునకు రక్షణ – షష్ఠీ తత్పురుష సమాసము
10. భూషణ వికాస = భూషణముతో ప్రకాశించబడేవాడు – బహువ్రీహి సమాసం
11. అనామకం = పేరులేనిది – నఇ+త్పురుష సమాసం
12. శీతల నీరము = శీతలమైన నీరము – విశేషణ పూర్వపద కర్మధారయ – సమాసం

పద్యాలు – ప్రతిపదార్థాలు- తాత్పర్యాలు

1వ పద్యం :

ఉ. నీరము భక్తలోహమున నిల్చి యనామకమై నశించు, నా
నీరమే ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తసర్చు, నా
నీరమె శక్తిలోఁబడి మణిత్వముంగాంచు సమంచితప్రభం;
వాదనవృత్తు లిట్లధము మధ్యము సుత్తముఁగొల్చువారికిన్,

అర్థాలు :
నీరము = నీరు
తప్తలోహము = కాలిన ఇనుముపై
నిల్చి = పడితే
అనామకమై = ఊరు, పేరు లేక
నశించునే = నశించిపోవును
ఆ నీరమే = ఆ నీరే
నళినీదళ = తామరాకు మీద
సంస్థితమై = పడితే
ముత్యము + అట్లు = ముత్యము వలె
తసర్చు = కనిపించను
ఆనీరమే = ఆ నీరే
సమంచిత = మిక్కిలి ఒప్పిదమైన
ప్రభన్ = ప్రకాశంలో
శుక్తిలోపడి = ముత్యపు చిప్పలో పడి
మణిత్వము = ముత్యం
గాంచు = అవుతుంది
అధముడు = నీచుడు
మధ్యము = మధ్యములు
ఉత్తములు = ఉత్తములు
పౌరుష = పురుషునకు సంబంధించి
వృత్తులు = నడవడులు
ఇట్లు = ఈ విధంగానే ఉంటాయి.

భావము :
కాలిన ఇనుముపై పడిన నీటిచుక్క ఊరు పేరు లేక నశించిపోవును. ఆ బిందువే తామరఆకు మీద పడితే ముత్యంలాగా ప్రకాశించును. ఆ బిందువే ముత్యపు చిప్పలో పడితే ముత్యం అవుతుంది. కావున ఆశ్రయించిన వారిననుసరించి నీచులు, మధ్యములు, ఉత్తములు అనే పేరు వచ్చును.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

2వ పద్యం :

చ. క్షమ కవచంబు, క్రోధ మది శత్రువు, జాతి హుతాశనుందు, మీ
“త్రము దగుమందు, దుర్జనులు దారుణపన్నగముల్, సువిద్య వి.
త, ముచిత లబ్ది భూషణముదాత్తకవిత్వము రాజ్యమి క్షమా
ప్రముఖ పదార్ధముల్ గలుగుపట్టునందత్కవచాదు లేటికిన్,

అర్థాలు :
క్షమ = ఓర్పు
కవచము = ఆయుధాల దాడి నుండి కాపాడేది.
క్రోధము + అది = కోపం అనేది
శత్రువు = శత్రువు (పగవాడు)
హూతాశనుడు = నిప్పు
తగుమందు = సరైన ఔషధం
దుర్జనులు = చెడ్డవారు
దారుణ = భయంకరమైన
పన్నగముల్ = సర్పములు
సువిద్య = మంచి విద్య
విత్తము = ధనము
ఉచిత లజ్జ = తగినంత సిగ్గు
భూషణము = అలంకారము
ఉదాత్త = గొప్ప
కవిత్వం = కవిత్వం
రాజ్యము = రాజ్యం
క్షమా = ఓర్పు వంటి
ప్రముఖ = ప్రముఖ
పదార్థముల్ = గుణములు
కలుగుపట్టున = కలిగి ఉంటే
తత్ = ఆ
కవచాదులు = కవచాల వంటివి
ఏటకిన్ = ఎందుకు (అవసరం లేదు)

భావము :
క్షమ కలిగియున్నచో బాధలు తప్పించుకొనుటకు వేరే కవచం అక్కరలేదు. క్రోధమును మించిన శత్రువులేదు. సమస్తము నిర్మూలించకు దాయాది ఉంటే చాలు. వేరే నిప్పు అక్కరలేదు. స్నేహితుని మించిన ఔషధం లేదు. ప్రాణాలు తీయుటకు దుష్టజనాలు చాలు, వేరే సర్పాలు అవసరం లేదు. విద్యయే ధనము, తగినంత సిగ్గు కలిగివుండుట అలంకారము. లోకులను వశం చేసుకొనుటకు మంచి పాండిత్యంగాని, కవిత్వం గాని ఉంటే చాలు రాజ్యమక్కరలేదు.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

3వ పద్యం :

ఉ. హర్తకుఁగాదు గోచర మహర్నిశమున్ సుఖపుష్టిఁ జేయు స
శ్రీశ్మీర్షి ఘటించు విద్య యనుదివ్యధనం బఖిలార్డికోటికిం
బూర్తిగనిచ్చినన్ బెరుఁగుఁ బోదు యుగాంతపు వేళ నైన భూ
బర్తలు తర్ధనాధికుల పట్టున గర్వము మానుటొప్పగున్.

అర్థాలు :
హర్త = దొంగకు (చోరునకు)
గోచరము = కనిపించుట
లేదు = కనిపించదు
అహర్నిశము = ఎల్లప్పుడూ
సుఖపుష్ట+చేయు = సుఖమునే కలిగించును.
సత్ + కీర్తి = మంచి పేరు
ఘటించు = తెస్తుంది (కలిగిస్తుంది)
విద్య + అసు = చదువు అనే
దివ్యధనం = పవిత్రమైన సంపద
అఖిల + అర్ధ = ఆశించిన
కోటికి = జనులందరికీ
పూర్తిగ = దానం
ఇచ్చినన్ = చేసిననూ
పెరుగున్ = వృద్ధి చెందుతుంది (నశించదు)
యుగాంతసవేళను+ఐన = ప్రళయకాలంలో కూడా
పోదు = నశించదు
భూ భర్తలు = రాజులు
తత్ + ధన + అధికులు = ఆ విద్యాధికుల
పట్టున = వృద్ధి
గర్వము = గర్వం
మానుట = తగ్గించుకొనుట
ఒప్పగున్ = మంచిది

భావం :
విద్యాధనాన్ని దొంగలు హరించలేరు. అది ఎల్లప్పుడూ సుఖమునే కలుగ జేయును. కోరిన వారికి ఎల్లప్పుడూ ఇచ్చిననూ మరింత వృద్ధి చెందును. ప్రళయకాలంలో కూడా నశించదు. ఇట్టి విద్యాధనము గలవారితో సామాన్యధనము గల రాజులు తమ గర్వాన్ని తగ్గించుకుని ఉండుట ఉత్తమము.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

4వ పద్యం :

చ. కరమున నిత్యదానము, ముఖంబున సూనృతవాణి, యౌఁదలం
గురుచరణాభివాదన, మకుంఠితవీర్యము దోర్యుగంబునన్
వరహృదయంబునన్ విశదవర్తనమంచితవిద్య వీనులన్
సురుచిరభూషణంబులివి శూరులకున్ సిరి లేనియప్పుడున్.

అర్ధాలు :
కరమున = చేతులతో
నిత్యదానము = సదాదానము చేయుట
ముఖంబున = నోటి నుంచి
సూనృతవాణి = సత్యవాక్కు
గురుచరణ = గురువు పాదాలను
అభివాదన = నమస్కరించి
ఔదలన్ = శిరస్సున దాల్చుట
డోర్యుగము = భుజయుగమునకు
అకుంఠిత = తీవ్రమైన
వీర్యము = పరాక్రమము
వరహృదయంబునన్ = హృదయమునకు
విశదవర్తన = సత్ప్రవర్తన
వీనులు = చెవులు
అంచిత విద్య = శాస్త్ర శ్రవణము
సురుచిర = సుందరమైన
సూరులకున్ = సత్పురుషులకు
సిరిలేని = ధనంలేని
అప్పుడున్ = ఆ సమయంలోను
ఇవి = ఇవి
భూషణములు = అలంకారములు

భావము :
చేతులతో సదా దానం చేయుట, సదా సత్యమునే పలుకుట, గురుపాదార విందాలకు శిరస్సు దాల్చుట, భుజయుగమునకు జయమునిచ్చే పరాక్రమాన్ని, నిర్మలమైన మనస్సును, చెవులకు శాస్త్ర శ్రవణం – ఇవి సత్పురుషులకు ఐశ్వర్యము లేకపోయినను గొప్ప అలంకారములు.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

5వ పద్యం :

తే. వెట్టి కుక్కల భ్రమలన్ని విడిచి నన్ను
భజన జేసెడివారికిఁ బరమసుఖము
భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

అర్థాలు :
భూషణ వికాస = ఆభరణాలతో ప్రకాశించేవాడా
శ్రీధర్మపుర నివాసా = సంపత్కరమైన ధర్మపురములో నివసించేవాడు.
దురితదూర = పాపములకు దూరమైనవాడా
దుష్ట సంహార = పాపులను సంహరించేవాడా
నరసింహ = ఓ నరసింహ స్వామి!
ధరణిలో = భూమిలో
వేయేండ్లు = వేయి సంవత్సరాలు
తనువు = శరీరం
నిల్వగబోదు = జీవించ ఉండలేము
ధనము = సంపద
ఎన్నటికీ = ఎప్పటికీ
శాశ్వతంగాదు = స్థిరంకాదు
దార = భార్య
సుతాదులు = పిల్లలు
తనవెంట = తనతోపాటు
రాలేరు = చావులో రాలేరు
భృత్యులు = సేవకులు
మృతిని = చావును
తప్పింపలేరు = తప్పించలేరు
బంధజలము = చుట్టముల గుంపు
తన్ను = తనని (అతనిని)
బ్రతికించుకోలేరు = బతికించలేరు
బలపరాక్రమము = శక్తి శౌర్యము
ఏమీ పనికిరాదు = ఏమీ ఉపయోగపడలేవు
ఘనమైన = గొప్పవైన
సకలభాగ్యంబు = సమస్త ఐశ్వర్యాలు
ఎంత గల్లియున్ = ఎంత కలిగి వున్నా
గోచిమాత్రంబు = గోచిపాతంత
ఐన = అయిన
కొనుచుఁబోడు = తీసుకుపోలేడు
వెట్టి కుక్కల = పిచ్చికుక్కల
భ్రమల + అన్ని = ఆలోచనలన్నీ
కుక్కల భ్రమల + అన్ని
విడచి = వదలి
నిన్ను= నిన్ను (నరసింహస్వామిని)
భజన = భజన (కీర్తించుట)
చేసెడివారికి = చేయువారికి
పరమసుఖము = మిక్కిలి సౌఖ్యం కలుగుతుంది.

భావం :
ఆభరణములతో మిక్కిలి ప్రకాశించేవాడా! దుష్టులను సంహరించేవాడా! పాములకు దూరమైనవాడా! ధర్మపురము నందు నివసించే ఓ నరసింహస్వామీ!

భూమిలో వేయేండ్లు దేహం నిలవదు. ధనమెప్పటికీ స్థిరం కాదు. ఆలుబిడ్డలు తన వెంటరాలేరు. సేవకులు చావును తప్పింపలేరు. చుట్టముల గుంపు తనను బ్రతికించు కోలేదు. శక్తి శౌర్యమేమి పనికిరాదు. గొప్పగ సకల సంపదలున్నను గోచి పాతంతైన తీసుకొని పోలేడు. పిచ్చికుక్కలలాంటి ఆలోచనలను ఆలోచించక నిన్ను కొలిచే వారికి మిక్కిలి సౌఖ్యం కలుగుతుంది.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

6వ పద్యం :

తే. ద్రోహచింతన జేసెడు దుర్జనులకు
మధురమైనట్టి నీనామ మంత్రమేల?
శ్రీ భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురిదదూర!

అర్ధాలు :
గార్దబము = గాడిదకు
కస్తూరి తిలకము = కస్తూరి బొట్టు
ఏల = ఎందుకు
మలయజంబు = గంధము
మర్కటమునకు = కోతికి
ఏల = ఎందుకు
శర్కర + అపూపంబు= చక్కెరతోఁ చేసిన పిండి వంటలు
శార్దూలమునకు = పులికి
ఏల = ఎందుకు
చూతఫలము = మామిడిపండు
సూకరమునకు + ఏల = పందికెందుకు
మల్లెపువ్వుల బంతి = మల్లెపూలతో చేసిన బంతి
మార్జాలమునకు + ఏల = పిల్లికెందుకు
గుడ్లగూబలకు + ఏల = గుడ్లగూబలకెందుకు
కుండలములు = చెవుల పోగులు
మహిషంబునకు = దున్నపోతునకు
నిర్మల వస్త్రము అదియేల = పరిశుభ్ర వస్త్రం ఎందుకు
ఒకసంతతికిన్+ఏల = కొంగలకెందుకు
పంజరము = చిలుకల నుంచే పంజరము
ద్రోహచింతనన్ = చెడ్డ ఆలోచనను
చేసెడు = చేసే
దుర్మార్గులకు = దుర్జనులకు
మధురము + ఐనట్టి = తియ్యనైన
నీనామమంత్రము = నీ పేరనే మంత్రము
ఏల = ఎందుకు( అక్కరలేదు అనుట)

భావం:
కాలిన ఇనుముపై పడిన నీటిచుక్క ఊరు పేరు లేక నశించిపోవును. ఆ బిందువే తామరఆకు మీద పడితే ముత్యంలాగా ప్రకాశించును. ఆ బిందువే ముత్యపు చిప్పలో పడితే ముత్యం అవుతుంది. కావున ఆశ్రయించిన వారిననుసరించి నీచులు, ముద్యములు, ఉత్తములు అనే పేరు వచ్చును.

గాడిదకు కస్తూరిబొట్టు, కోతికి గంధము, పులికి చక్కెరపిండివంట, పందికి మామిడిపండు, పిల్లికి మల్లెపూలచెండు, గుడ్లగూబకు చెవులు పోగులు, దున్నపోతునకు పరిశుభ్రవస్త్రము, కొంగలకు పంజరము ఎలా అవసరంలేదో అలాగే చెడ్డ ఆలోచనలుచేసే దుర్మార్గులకు తియ్యనైన నీ నామం అనే మంత్రం (దైవభక్తి) అవసరం లేదు అని భావము.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

7వ పద్యం :

తల్లిదండ్రులు భార్య తనయులాపులు బావ
మఱిఁదులన్నలు మేనమామగారు.
ఘనముగా బంధువుల్ మేనమామగారు.
దానుదర్లగ వెంటఁ దగిలిరారు.
యముని దూతలు ప్రాణముపహరించుక పోలవ
మమతతోఁ బోరాడి మాన్పలేరు.
బలగముందఱు దుఃఖపడుట మాత్రమే కాని
యించుక నాయుష్యమియ్యలేరు.

తే చుట్టములమీఁది భ్రమదీసి చూరఁబెట్టి
సంతతము మిమ్ము నమ్ముట సార్థకంబు
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

అర్ధాలు :

తల్లిదండ్రుల = తల్లిదండ్రులు
భార్య. = భార్య
తనయులు = కుమారులు
ఆప్తులు = స్నేహితుల
ఘనముగా = ఎక్కువగా
తర్లగ = వెడcగ (చనిపోతే)
వెంటఁదగిలిరారు = అనుసరించి రారు
యముని దూతలు = మృత్యుదేవత దూతలు
అపహరించుకుపోవ = ఎత్తుకుపోతుంటే
మామతో = ప్రేమతో
పోరాడి = పోరాటం చేసి
మాన్పలేరు = ఆపలేరు
బలగము+అందరు = చుట్టూ అందరూ
దుఃఖపడుట = దుఃఖిస్తారు.
ఇంచుక = కొంచెమైనను
ఆయుష్యము = ఆయువు
ఈయలేరు = ఇవ్వలేరు
చుట్టములు = బంధువుల
మీది = మీద
భ్రమన్ = ఆపేక్ష
తీసిచూరిన్ + చెక్క = ఇంటి యొక్క చూరులో చెక్క
సంతతము = ఎల్లప్పుడు
మిమ్ము = మిమ్ములను (నరసింహస్వామి)
నమ్ముట = నమ్ముట
సార్థకంబు = ఉపయోగము

భావం:
ఆభరణములతో మిక్కిలి ప్రకాశించువారా! దుష్టులకు సంహరించువారా! పాములకు దూరమైనవారా! ధర్మపురమునందు నివసించే ఓ నరసింహస్వామీ!

నరసింహస్వామి! తల్లిదండ్రులు, భార్య, కొడుకులు, స్నేహితులు, బావము అందులు, అన్నాలు, మేనమామలు, ఇంకా పెద్ద చుట్టుములున్నాను. తాను వెడలగ వెంటరాదు. యమదూతలు ప్రాణము తీసుకుని పోవునపుడు వారు ప్రేమతో పోరాడి గెలవలేరు. చుట్టుములందరూ దుఃఖపడుదురే గాని ఆయువునివ్వలేదు. కావున చుట్టుముల మీద ప్రేమ చూరున చెక్కి, ఎప్పుడూ నిన్ను నమ్ముకొనుటే ఉపయోగము.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

8వ పద్యం :

తే, బుడమిలో దుష్టులకు జ్ఞానబోధ దెలిపి
సజ్జనులఁ జేయలేండేంత చతురుఁడైన
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర!

అర్ధాలు :
భుజబలంబునన్ = భుజముల యొక్క శక్తిలో
పెద్దపులుల = పెద్దపులులను
చంపగవచ్చు = చంపవచ్చు
పాము = సర్పము
కంఠము = గొంతును
చేట = చేతితో
పట్టవచ్చు = పట్టుకోవచ్చు
బ్రహ్మరాక్షసకట్ల = బ్రహ్మరాక్షసుల కోట్లలో ఉన్నాను
పాలంఁద్రోగలవచ్చు = తరిమి వేయవచ్చు
మనుజుల = మనుష్యుల
రోగముల్ = రోగాలను
మాన్పవచ్చు = తగ్గించవచ్చు
జిహ్వకు = నాలుకకు
ఇష్టముగాని = రుచికరం కాని
చేదు = చేదైనవి
మ్రింగగ వచ్చుఁ = మింగవచ్చు
పదను = పదునైన
ఖడ్గము = కత్తి
చేతను = చేతిలో
అదునువచ్చును = ఒత్తవచ్చును
కష్టము + అందుచు = కష్టపడుచు
ముండ్ల కంపలో = ముళ్ళకంపలో
చొరవచ్చున్ = ప్రవేశించవచ్చును
తిట్టుబోతుల = తిడుతూ ఉండేవారిని
నోళ్ళుకట్టవచ్చుఁ = నోళ్లను మూయించవచ్చును
పుడమిలో = భూమియందు
దుష్టులకు = దుర్మార్గులకు
జ్ఞానబోధ = దేవుని గురించి ఉపదేశము
తెలిపి = ఎఱిఁగించి
సజ్జనులన్ = మంచివారలకు
ఎంతచతురుఁడ + ఐ = ఎంత సమర్థుడయిన చేయలేఁడు

భావము :
భుజముల శక్తిచే పెద్దపులులు చంపవచ్చు. పాము కంఠమును చేతితో పట్ట వచ్చును. బ్రహ్మరాక్షసుల ఎందరినైనా తరిమివేయవచ్చు. మనుష్యుల రోగమును మాన్ప వచ్చును. నాలుకకు చేదైనవి మింగవచ్చును. పదునైన కత్తిని చేతితో ఒత్తవచ్చును. కష్టముతో ముండ్లకంపలోనికి ప్రవేశించవచ్చును. తిట్టుబోతుల నోళ్ళను మూయించవచ్చును. బోధియందు దుర్మార్గులకు దేవుని గూర్చిన ఉపదేశం తెలిపి, వారిని ఎంతటి సమర్ధుడైనను మంచివానిగా చేయలేడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

9వ పద్యం :

చ. పలుమఱు సజ్జనుండు ప్రియభాషలెవల్కు ఁగఠోర వాక్యముల్
పలుకఁడొకానొకప్పుడవి పల్కినఁ గీడునుగాదు నిక్కమే
చలువకు వచ్చి మేఘుఁ డొక జాడను దా వడగండ్ల రాల్ఫినన్’
శిలలగునోటు వేగిరమె శీతల నీరముగాక భాస్కరా!

అర్ధాలు :
భాస్కరా = ఓ సూర్యదేవా
సజ్జనుడు = మంచి మనిషి
పలుమాఱులు = అనేకసార్లు
ప్రియభాషులు+ఏ = మంచి మాటలే
పల్కు = పలికిన
కంఠవాక్యముల్ = చెడ్డమాటలు
పలుకడు = పలుకడు
ఒకొనొక్కప్పుడు = ఒక్కొక్కసారి
పల్కినన్ = మాట్లాడినా
కీడునుకాదు = కీడుకాదు
నిజం + ఏ = నిజమే
ఎట్లనిన = ఎలాగంటే
చలువకున్ = చల్లదనమునకు
వచ్చి = వచ్చి
మేఘుఁ డు= మబ్బు
తాన్ = తాన్
వడగండ్లన్ = వడగళ్ళను
రాల్చినన్ = కురిపించినను
వేగిరమే = వెంటనే
శీతలము = చల్లని
నీరము కాక = నీళ్ళుకాక
శిలలగుటు = రాళ్ళగునా (లేవు)

భావము :
మేఘుడు నీటి బిందువులనే వర్షించును. ఒకానొకప్పుడు చలువ కొరమే వడగండ్లను కురిపించినను, అవి వెంటనే చల్లని నీళ్ళగునుగాని రాళ్ళుగా ఉండవు. అదే విధంగా మంచివాడు మంచి మాటలనే పల్కును. ఒకానొక సమయమందున కఠోరవచనమును పలికినను మేలుగానే ఉంటుంది కీడుగా ఉండవు.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

10వ పద్యం :

చ. పలుచని నీచమానవుఁదు పాటిఁదలంపక నిష్ఠురోక్తులం.
బలుకుచు నందుఁగాని మతిభాసురుఁజైఁన గుణ ప్రపూర్ణుఁద
ప్పులకులుఁపల్కఁబోవడు నిబద్ధిగ, నెట్లన వెల్తికుంద తాం
లంకుచు నందుఁగాని మట్టిదొల్కునై నిందుఘటంబు భాస్కరా!

అర్ధాలు :
భాస్కరా = ఓ సూర్యదేవా!
పలుచని = బలహీనుడైన
హీనమానవుడు = నీచ మానవుడు
పాటి = న్యాయం ఆలోచించక
నిష్టర + ఉక్తులను = కఠినమైన మాటలను
పలుకుచు ఉండు+కని = పలుకుతూనే ఉంటాడు
మతి భాసురుడు = బుది & ప్రకాశించేవాడు.
ఐన = అయిన
గుణ ప్రపూర్ణుడు = మంచి గుణములతో నిండినవాడు
ఆ+పలుకులను = అటువంటి మాటలను
నిబద్ధిగ = నిజముగ
పల్కన్ + పోవఁడు = మాట్లాడబోడు
ఎట్లన = ఎలాగంటే
వైల్తైకుండ = నీరు తక్కువగా ఉన్నా కుండ
తాన్ = తాసు
తొణకుచుండునుగాని = తొణకు చుండునుగాని
మఱి = మది
నిండుఘటంబు = నీటిలో నిండుగా గల కుండ
తొల్కున్ = తొణకునా? (తొణకడు)

భావము :
వెలితి కుండ తొణకును గాని, నీరు నిండుగా గల కుండ తొణకదు. అట్లే గుణములేని నీచుఁడు న్యాయమునెంచక కఠినపు పలుకులను మాట్లాడును. సద్గుణములలో ప్రకాశించే గుణవంతుడు. అటువంటి కఠినపు మాటలను మాట్లాడడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

11వ పద్యం :

చ. బలయుతుఁడైన వేళ నిజబంధుఁడు తోడ్పడుఁగాని యాతఁడే
బలము తొలంగెనేని తన పాలిటి శత్రువదెట్లు పూర్ణుఁడై
జ్వలనుఁదు కానఁగాల్చు తఱి సఖ్యముఁ జూవును వాయుదేవుఁదా
బలియుఁడు సూక్ష్మదీపమగు పట్టున నార్పదె గాలి భాస్కరా!

అర్ధాలు :
భాస్కరా = ఓ సూర్యదేవా!
బలయుతుఁడు = బలము కలవాడు
ఒళవేళన్ = ఒకవేళ
నిజబంధుడు = తన చుట్టము
తోడ్పడుఁ + కాని = తోడ్పడడుగాని
అతడే = అతడే (ఆ చుట్టుమే)
బలము తొలంగనేని = బలము పోయినచో
తనపాలిట = తనకు
శత్రువు = పగవాడు అగును
అది = అది
ఏట్లు = ఏ విధంగా అంటే
జ్వాలనుడు = అగ్నిదేవుడు
పూర్ణుఁడై = నిండినవాడై (వ్యాపించి)
కానును = అడవిని
కాల్చుతంతిన్ = కాల్చే సమయంలో
వాయుదేవుడు = గాలి
సఖ్యము = స్నేహం
చూపును = చూపును
ఆ బలియుడు = ఆ బలవంతుడైన అగ్నిదేవుడు
సూక్ష్మదీపము = చిన్న దీపము
అగుపట్టునన్ = అయిన సమయంలో
గాలి = గాలి (వాయుదేవుడు)
ఆర్పదు + ఏ = ఆర్పదా! (ఆర్పును)

భావము :
అగ్నిహోత్రుడు నిండు బలము కలవాడై అడవిని కాల్చే సమయంలో వాయుదేవుడు అతినికి స్నేహం చూపుచూ తోడ్పడును. ఆ అగ్నిచిన్నదీపమై ఉన్న సమయంలో ఆ వాయుదేవుడే విరోధియై ఆర్పును. అదే విధంగా మానవుడు శక్తివంతుడై ఉన్న సమయంలో తన బంధువులే తోడ్పడును. బలము లేనపుడు ఆ చుట్టమే తనకు పగవాడై కీడు చేయును.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

12వ పద్యం :

చ. ఉరుకరుణాయుతుండు సమయోచిత మాత్మఁదలంచి యుగ్రవా
క్పరుషతం జూఫినన్ ఫలముగల్గుట తథ్యముగాదె యంబుదం
బురిమిన యంతనే కురియకుండునె వరము లోకరక్షణ
స్థిరతర పౌరుషంబున సశేషజనంబు లెఱుంగ భాస్కరా!

అర్థాలు :

భాస్కరా = ఓ సూర్యదేవా
ఉరు = గొప్ప
కరుణాయుతుడు = దయతో కూడినవాడు
సమయోచితము = కాలమునకు తగిన ఆలోచన
ఆత్మన్ = మనసులో
తలంచి = ఆలోచించి
ఉగ్ర+పాక్+పరుషత = భయంకరమైన మాటల కాఠిన్యము
చూపినన్ = చూపిన
ఫలము = లాభము
కల్గుట = కలుగుట
తధ్యము +కాదె = నిజమే కదా
ఎట్లనిన్ = ఎలాగంటే
అంబుదంబు = మేఘము
ఉరిమినయంతనే = గర్జించిన వెంటనే
లోక = జనులను
రక్షణ = రక్షించుటయందు
స్థిరతర = మిక్కిలి స్థిరమై
పౌరుషంబునన్ = శౌర్యమచేత
అశేషజనంబులు = జనులందరూ
ఎరుంగన్ = తెలియునట్లుగా
వర్షము = వర్షహు (వాననీరు)
కురియక + ఉండునె = కురియకుండా ఉంటుందా? (ఉండదు)

భావము :
మేఘుడు ప్రాణానికి భయం కలిగేటట్లు ఉరిమినను వెంటనే జనులను రక్షించు పట్టుదలతో అందరికీ ఆనందం కల్గునట్లు వర్షించును. అటులనే గొప్పదయకలవాడు. సమయానుకూలముగా కఠినవాక్యము మాట్లాడినను తరువాత తప్పక మేలు కలిగిస్తాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

శతక సుధ Summary in Telugu

కవుల కాలాదులు

ఏనుగు లక్ష్మణ కవి : భర్తృహరి సుభాషిత త్రిశలు అనే పేరుతో సంస్కృతంలో మూడు శతకాలు రచించాడు. అవి నీతి, వైరాగ్య శృంగార శతకాలు. ఈ సుభాషిత త్రిశతిని తెలుగులో ఎలకూచి బాలసరస్వతి, ఏనుగు లక్ష్మణకవి, పుష్పగిరి తిమ్మనలు తెలుగులోకి అనువదించారు. వీటిలో ఏనుగు లక్ష్మణకవి రచన ప్రాచుర్యం పొందింది.

కాలం : 18వ శతాబ్ధం

ఇతర రచనలు : రామేశ్వర మహత్మ్యము, విశ్వామిత్ర చరిత్రము, గంగామహాత్మ్యం, రామ విలాసం రచించాడు.

ధర్మపురి శేషప్ప : తెలంగాణాలోని గోదావరి తీర్థక్షేత్రం ధర్మపురి.

కాలం : క్రీ.శ. 1800 ప్రాంతంలో జీవించాడు.

విశేషం : నరసింహస్వామి భక్తుడు. నరసింహ శతకం రచించాడు.

ఇతర రచనలు : న్నకేసరి శతకం

మారద వెంకయ్య : తెలుగు శతకాలలో ప్రచారం పొందినవాటిలో భాస్కర శతకం ఒకటి.

విశేషం : ఉత్పలమాల, చంపకమాల వృత్తాలతో సాగిన ఈ శతకం ఉత్తమ దృష్టాంత శతకంగా ప్రసిద్ధి చెందింది.

కాలం : క్రీ.శ. 1560-1660 మధ్య వాడని అభిప్రాయం.

ప్రాంతం : శబ్ధ ప్రయోగాలను బట్టి ఈ కవి గోదావరికి ఉత్తర దిక్కు వాడని ఊహించారు.

పాఠ్యభాగ ప్రాధాన్యం

శతకము అనగా వంద పద్యాలతో రచించే ఒక సాహితీ ప్రక్రియ శతకానికి మకుటము ఉంటుంది. మకుటం అనగా కిరీటం అని సామాన్యార్థం. కానీ శతకాలలో ప్రతి పద్యం చివరన పునరుక్తమయ్యే పదాన్నిగాని, పాదాన్ని గాని మకుటం అంటారు. ఆంధ్ర సాహిత్యంలో శతక ప్రక్రియకు విశిష్ట స్థానముంది.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

శతకములు పురాణములు వలె కథా ప్రాధాన్యం కలవికావు. అయినా తెలుగునాట పిల్లలు, పెద్దలు, వృద్ధులు, పండితులు, పామరులు ఇలా అందరిలోనూ బహుళ ప్రచారం పొందింది. శతకాలలో కవి హృదయం స్వేచ్ఛగా ఆవిష్కరింపబడుతుంది. మానవ మనస్తత్వాన్ని తెలపాలన్నా, సంఘంలోని దురాచారాలను విమర్శించాలన్నా, నీతి బోధించాలన్నా, భక్తికి, ముక్తికి, రక్తికి శతకాలు అద్భుతంగా కవులకు ఉపకరించాయి.

పాఠ్యభాగ సారాంశం

విద్యార్ధి దశ ఎంతో కీలకమైన దశ. ఈ దశలో ఉత్తములతో స్నేహం చేస్తే ఎలా అభివృద్ధి చెందుతామో, దుష్టులతో స్నేహం వలన ఎలా చెడిపోతామో గ్రహించాలి.

మానవుడు ఏ దశలోనైనా క్షమాగుణం కలిగి ఓర్పు కలిగి వుండాలి. మంచి మిత్రుడుంటే ఎన్నో సమస్యలు తొలగిపోతాయి.

విద్య యొక్క ప్రాధాన్యాన్ని విద్యార్ధి గమనిస్తే విద్యాధనాన్ని మరింతగా సంపాదించుకొంటాడు,. అది ఎల్లవేళలా ఉపయోగపడేది, దొంగిలింపబడనిది. దానగుణం, సత్యంపలకడం, ధైర్యంగా ఉండటం వంటి సద్గుణాలను అలవరచుకోవాలి.

మానవుడు చిరకాలం జీవించడు. ధనం, వేషం, ఏదీ శాశ్వతం కాదు. మృత్యువు ను ఎవరూ ఆపలేరు. కావున అత్యాశ ఉండకూడదు. గాడిద కస్తూరిబొట్లులాగా, కోతికి గంధంలాగా, చెడ్డ ఆలోచనలతో ఉండే దుర్మార్గులకు, దివ్యమైన భగవంతుని నామం రుచించదు. తల్లిదండ్రులు, భార్యా, సంతానం, బంధువులు ఎవరూ చనిపోయినపుడు తోడుగా చనిపోరు. దుఃఖిస్తారేగాని ఆయువునివ్వలేరు. కావున భగవంతుని నమ్ముటే మానవుడికి శ్రేయస్సు అని గ్రహించాలి.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

మంచివారు కఠినంగా మాట్లాడిన అంతా మన మంచికోసమే అని గ్రహించవలెను. నిండుకుండలాగా, తొణకకుండా స్థిరంగా ఉంటూ మానవుడు మంచి లక్షణాలు అలవరచుకోవాలి. ఎంతటి శక్తివంతుడైనను మంచి స్నేహము ఉంటే అది వ్యక్తికి అదనపు బలం అవుతుంది. ఒకరి మేలు కోసం కఠినంగా మాట్లాడినప్పటికీ వారికి దయతో మనం సమయానుకూలంగా సహాయం చేయవలెను.

TS Inter 1st Year Telugu Grammar సాధారణ వ్యాసాలు

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material Grammar సాధారణ వ్యాసాలు Questions and Answers.

TS Inter 1st Year Telugu Grammar సాధారణ వ్యాసాలు

1. తెలంగాణా చారిత్రక సాంస్కృతిక వైభవం

ప్రతీ సమాజానికి తనదైన చరిత్ర, సంస్కృతి ఉంటుంది. అది ఆ ప్రాంత ప్రజల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఆలోచనాపరుడైన మనిషికి తన ఉనికి గురించి, తన ప్రాంత చరిత్ర గురించి, తన భాషాసంస్కృతుల విశిష్టతల గురించి తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. చరిత్రను, సంస్కృతిని అధ్యయనం చేయడం, అవగాహన చేసుకోవడం ద్వారా ఉత్తేజాన్ని, ప్రేరణను పొందవచ్చు.

చరిత్రను తెలుసుకోకుండా చరిత్రను నిర్మించలేమని పెద్దలు చెబుతుంటారు. అలాగే, సంస్కృతి కూడా నిత్యజీవితంలోని అనేక సందర్భాలను ఉత్సాహభరితం చేస్తుంది. చరిత్ర, సంస్కృతి రెండూ సమాజాన్ని ఒక రీతిగా తీర్చిదిద్దుతాయి. తెలంగాణ ప్రాంతవాసులుగా మన చరిత్ర, సంస్కృతుల పైన మనం కనీస అవగాహనను కలిగి ఉండడం, వాటిని పరిరక్షించుకోవడం అవసరం.

తెలంగాణలో ఆదిమానవ సమాజానికి సంబంధించిన క్రీ.పూ. రెండువేల ఏళ్ల నాటి బృహత్ శిలాసమాధులు అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. నవీన శిలాయుగానికి సంబంధించిన రేఖాచిత్రాలు అనేక గుహలలో చిత్రించబడినాయి. తెలంగాణ ప్రాంతానికి ప్రాచీన గ్రంథాలలో క్రీ.పూ ఆరవ శతాబ్దం నాటికి అశ్మక (అస్సక), ములక, మహిషక, మంజీరక, తెలింగ అనే పేర్లున్నాయి. గోదావరీ పరీవాహక ప్రాంతాలలో తొలినాటి ఆవాసాలకు సంబంధించిన ఆధారాలున్నాయి.

తెలంగాణను పాలించిన తొలి రాజవంశం శాతవాహన వంశం. వీరు కోటిలింగాల, పైఠాన్, పాలనాకేంద్రాలుగా కొండాపురం టంకశాలగా క్రీ.పూ. మూడవ శతాబ్దం నుండి క్రీ. శ. మూడవ శతాబ్దం వరకు పరిపాలించారు. వీరి కాలంలోనే శాతవాహన రాజైన హాలుడు సంకలనం చేసిన ప్రాకృత గాథాసప్తశతిలో అత్త, పత్తి, పడ్డ, పాడి, పిల్ల, పొట్ట మొదలైన తెలుగు పదాలు కనిపిస్తున్నాయి. శాతవాహన కాలపు మట్టికోటాలు ఆనవాళ్ళు, అవశేషాలు కోటిలింగాల, ధూళికట్ట, పెద్ద బొంకూరు, ఫణిగిరి, గాజుల బండ, కొండాపురం లాంటి ప్రాంతాల్లో లభించాయి. అట్లాగే, శాతవాహ నులు వేయించిన నాణాలు తెలంగాణలో లోహపరిశ్రమ ఉండేదనడానికి సాక్ష్యాలుగా ఉన్నాయి.

TS Inter 1st Year Telugu Grammar సాధారణ వ్యాసాలు

తర్వాత విష్ణుకుండినులు, బాదామి చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, వాకాటకులు పరిపాలించారు. తదనంతరం కాకతీయుల సామ్రాజ్యం క్రీ.శ. 950 నుండి 1323 వరకు విస్తరిల్లింది. ముసునూరు నాయకులు, పద్మనాయకులు, కుతుబ్ షాహీలు, బహమనీలు (క్రీ.శ. 1518 16) అసఫ్ జాహీలు (క్రీ.శ. 1724-1948) తెలంగాణ నేలను పరిపాలించారు.

క్రీస్తుపూర్వం వేలసంవత్సరాల నుంచి ఉనికిలో ఉన్న గోండులు ప్రాచీన ఉత్పత్తి కథను చెప్పుకుంటూ ‘ టేకం, మార్కం, పూసం, తెలింగం’ అనే నలుగురు మూలపురుషుల్ని దేవతలుగా పేర్కొంటారు. ఈ ‘తెలింగ’ శబ్దమే ‘తెలుంగు’ శబ్దానికి మూలంగా భావించవచ్చు. మెదక్ జిల్లా తెల్లాపూర్ లో బయట పడిన క్రీ.శ. 1417 నాటి శాసనంలో ‘తెలుంగణ’ పదం, 1510 వెలిచర్ల శాసనంలో ‘తెలంగాణ’ పదం ప్రయోగించబడింది. అనంతర కాలంలో, వ్యవహారాల్లో ‘తెలంగాణ’ పదం విస్తృత ప్రచారంలోకి వచ్చింది.

కాకతీయ రాజులు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల నీటి పారుదల కోసమే చెరువుల నిర్మాణం అధికంగా జరిగింది. పెద్ద చెరువులు, గొలుసు చెరువులు, చెరువులవ్యవస్థ ప్రత్యేకంగా కనిపించటం వల్ల అప్పట్లో ఈ ప్రదేశాన్ని ‘చెరువులదేశం’గా పిలిచేవారు. వరి, గోధుమ, నువ్వులు, పత్తి వంటి తృణధాన్యాలతో పాటు తోటల పెంపకం కూడా కొనసాగింది. ఆ క్రమంలో ‘బాగ్’ల విస్తరణ ‘బాగ్’ (తోటలు)కు నెలవైన నగరం కనుకనే హైదరబాద్ కు ‘బాగనగర్’ అనే పేరొచ్చింది.

వ్యవసాయం చుట్టూ అనేక వృత్తులు ఏర్పడ్డాయి. పనిముట్లు చేసేవారు. అవసరాలు చూసేవారు, పనులు చేసేవారు వివిధ వృత్తులుగా మార్పు చెందుతూ వచ్చినారు. పురోహితులు, కంసాలి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి, పద్మశాలి, గొల్ల, బెస్త, గౌండ్ల, గాండ్ల, చర్మకార, వడ్డెర వంటి ఎన్నో వృత్తులు కొనసాగుతూ వచ్చినాయి. శాతవాహనుల కాలం నాటికే నిర్మల్ కత్తులు ప్రసిద్ధి పొందాయి. పట్టువస్త్రాలకు పోచంపల్లి, గద్వాల, ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. వ్యవసాయం, కుటీర పరిశ్రమల ఉత్పత్తులతో గ్రామాలచుట్టూ ఎన్నో పండుగలు, జాతరలు తెలంగాణ సంస్కృతిలో వర్థిల్లినాయి.

తెలంగాణ ప్రజలు వ్యవహరించే తెలుగు విశేషమైంది. ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంటుంది. గ్రాంథికానికి, జాను తెలుగుకు దగ్గరగా, వ్యాకరణ ప్రమాణాలతో కూడి ఉంటుంది. తెలుగులో తొలి ప్రాచీన కందపద్యాలు బొమ్మలమ్మగుట్ట శాసనంలో లభించి, క్రీ.శ. 9 శతాబ్ది నాటికే ఛందోబద్ధ సాహిత్యమున్నదని నిరూపిస్తున్నాయి. కన్నడంలో, తెలుగులో పద్యాలు రాసిన పంపమహాకవి చరిత్ర తెలంగాణకు గర్వకారణం.

మల్లియరేచన రచించిన ‘కవిజనాశ్రయం ‘ తెలుగులో తొలిఛందోగ్రంథం. ‘వృషాధిప శతకం’ పేరుతో తొలిశతకాన్ని పాల్కురికి సోమన రచించాడు. సామాజిక చైతన్యానికి, దేశీరచనలకు బీజం వేసిన పాల్కురికి సోమన తెలంగాణ ఆదికవి. తెలుగులో తొలి స్వతంత్ర రచన చేసిన కవి. జానపద, సంప్రదాయిక, ప్రజాస్వామిక సాహిత్యాలు తెలంగాణాలో విస్తృతంగా వర్ధిల్లినాయి.

ఆదిమ సమాజ• జీవనవిధానానికి ఆనవాళ్లు గిరిజనులు. అడవిలో పుట్టి, అడవిలో పెరిగి, అడవితల్లినే దేవతగా కొలిచే వీరి కళలన్నీ ప్రకృతి అనుకరణ రూపాలే. మన తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, నిజామాబాద్, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, ఇత్యాది జిల్లాల్లో కోయ, గోండు, కొండరెడ్డి, లంబాడ, గుత్తికోయల, చెంచులు మొదలైన గిరిజన తెగలవారు జీవిస్తున్నారు.

TS Inter 1st Year Telugu Grammar సాధారణ వ్యాసాలు

రుంజలు, బైండ్లు, ఒగ్గుకథ, శారద కథ, హరికథ, చిందు భాగోతం, బాలసంతులు, బుడిగె జంగాలు, గంగిరెద్దులు, సాధనాశూరులు, బహురూపులు, పెద్దమ్మలు, గుస్సాడీ నృత్యం, చెంచు, కోయ, బంజారా ప్రదర్శనలు కళకళలాడినాయి. బతుకమ్మ, బొడ్డెమ్మ, బోనాలు, వనభోజనాలు, పీరీలు, దసరా, రంజాన్, కాట్రావులు, కొత్తలు, సంక్రాంతి, ఉగాది పండుగులు ఎన్నో కొనసాగుతున్నాయి. పేరిణి శివతాండవం, లాస్యం, భజనలు, చిరుతలు, శిల్పకళ, పెంబర్తి జ్ఞాపికలు, నిర్మల్ బొమ్మలు, నకాశి చిత్రాలు, కరీంనగర్ వెండిపనులు ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాయి.

సమ్మక్క సారక్క, బల్మూరి కొండలరాయుడు, సర్వాయి పాపన్న, రాణి శంకరమ్మ, సోమనాద్రి, సదాశివరెడ్డి, రాంజీగోండు, కొమురంభీం, బండిసాయన్న, ఆరుట్ల రామచంద్రా రెడ్డి, బందగీ, రేణుకుంటరామిరెడ్డి మొదలగు ఎందరో వీరుల సాహసగాథలు కళారూపాలు సంతరించుకొని వీరగాధలుగా విస్తరిస్తున్నాయి.

తెలంగాణలోని జనగామ జిల్లాకు చెందిన చుక్క సత్తయ్య ‘ఒగ్గు’ కథకు జాతీయస్థాయి గౌరవాన్ని కలిగించారు. అదేవిధంగా మిద్దె రాములు ఎల్లమ్మకథకు తెచ్చిన ప్రాచుర్యం కూడా అలాంటిదే. చిందు ఎల్లమ్మ, గడ్డం సమ్మయ్యలాంటి కళాకారులు చిందు యక్షగానానికి జాతీయస్థాయి గుర్తింపు తెచ్చారు.

చరిత్రలో ఆయా రాజులకాలంలో నిర్మితమైన గోల్కొండ, ఓరుగల్లు, దేవరకొండ, రాచకొండ, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, ఎలగందల, జగిత్యాల, రామగిరి వంటి కోటలు ప్రసిద్ధి చెందాయి. వివిధ మతాలకు చెందిన రామప్ప, భద్రాచలం, పాకాల, జోగులాంబ, మక్కా మసీదు, మెదక్ చర్చి, వేములవాడ, కాళేశ్వరం, బాసర, యాదాద్రి, ప్రార్థనా స్థలాలుగా అలరారుతున్నాయి.

వేయిస్తంభాల గుడి, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, కొలనుపాక, నేలకొండపల్లి, పైగా, కుతుబ్ షాహీ సమాధుల వంటి చారిత్రక పర్యాటక ప్రదేశాలున్నాయి. కుంటాల, బొగత, పొచ్చర అలీసాగర్, నిజాంసాగర్, హుస్సేన్ సాగర్, నాగార్జునసాగర్, కాళేశ్వరం వంటి రమణీయ జలపాతాలు. ప్రాజెక్టులున్నాయి. నెహ్రూ జంతు ప్రదర్శనశాల, కవ్వాల్, పిల్లలమట్టి, పోచారం, శివ్వారం, ఏటూరునాగారం వంటి వన్యప్రాణి సందర్శన స్థలాలు తెలంగాణలో ఉన్నాయి.

తెలంగాణలో భాషా ఉద్యమాలు, గ్రంథాలయ ఉద్యమాలు, ఆంధ్రమహాసభ, ఆర్యసమాజం, రైతాంగ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు, విప్లవోద్యమం, మద్యపాన వ్యతిరేకోద్యమం, జలసాధనోద్యమం, హరితహారం లాంటి అనేక ప్రజా ఉద్యమాలు వర్ధిల్లి ప్రజాసమూహాలను చైతన్య పరుస్తున్నాయి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు ప్రజలను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఎంతో గొప్ప చరిత్రకు, సంస్కృతికి, ఎన్నో కళలకు పుట్టినిల్లు మనందరి తెలంగాణ. ఆడుదాం… పాడుదాం… అభివృద్ధిలో పోటీపడదాం. బంగారు తెలంగాణను నిర్మించుకుందాం…

2. యువత – జీవన నైపుణ్యాలు

ఒకదేశ అభివృద్ధి. ఆ దేశ యువత శక్తిసామర్థ్యాలపై ఆధారపడివుంటుంది. మెరుగైన సమాజ నిర్మాణంలో యువతీయువకులే కీలక పాత్ర పోషిస్తారు. యువతరం శిరమెత్తితే నవతరం గళమెత్తితే చీకటి మాసిపోతుందని, లోకం మారిపోతుందని కవులు ఉపదేశించారు. ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగిన పదిమంది యువకులతో ఉన్నత సమాజాన్ని నిర్మించ వచ్చునని స్వామి వివేకానంద గొప్పభరోసాను అందించాడు.

TS Inter 1st Year Telugu Grammar సాధారణ వ్యాసాలు

ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో యువతీయువకులు కలిగిన దేశం భారతదేశం. ఉత్తుంగ తరంగాలతో పొటెత్తే నదికి ఆనకట్ట కట్టి, ఆ నదీజలాలతో బంగారు పంటలు పండించినట్లు, నెత్తురుమండే శక్తులు నిండే యువతీయువకులను సమర్థ మానవవనరులుగా తీర్చిదిద్ది ప్రగతి సిరులను పండించవచ్చు. యువతీయువకులు సునిశితమైన జీవన నైపుణ్యాలను సమకూర్చుకుంటే దేశ భావినిర్ణేతలుగా రాణిస్తారు. “We cannot always build the future for our youth, but we can build our youth for the future” అని ఫ్రాంక్ లిన్ డి. రూజ్ వెల్ట్ అన్నట్లుగా సమున్నతమైన భవితకోసం సమర్థవంతమైన యువతరం రూపొందాలి.

జ్ఞానసముపార్జనతోపాటు ఆ జ్ఞానసంపదను సద్వినియోగ పరుచుకోవటానికి జీవన నైపుణ్యాలను పెంపొందింపజేసుకోవాలి. విద్యార్థులు, యువకులు పోటీ ప్రపంచంలో విజేతలుగా ఎదగడానికి, ఉత్తమ పౌరులుగా, నవ సమాజనిర్మాతలుగా రూపొందటానికి తగిన జీవన నైపుణ్యాలను విధిగా అలవర్చుకోవాలి.

పరీక్షల్లో ఉత్తీర్ణులు కావటమే ప్రధానం కాదు, అవరోధాలను అధిగమించి, ఉపద్రవాలను సాహసోపేతంగా ఎదుర్కొని జీవితాన్ని గెలిచే నైపుణ్యాలను కూడా నేటి యువత సొంతం చేసుకోవాలి. జీవన నైపుణ్యాల తీరుతెన్నుల గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా చర్చించారు. బాల్యం నుండి విద్యార్థులు సమకూర్చుకోవలసిన కింది జీవన నైపుణ్యాల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్యంగా ప్రస్తావించింది.

1. స్వీయ అవగాహన (Self Awareness) :
ప్రతి మనిషికి తనపైన తనకు అవగాహన ఉండాలి. తన సామర్థ్యంపట్ల సరైన అంచనా ఉండాలి. ‘స్వీయ లోపమ్ములెరుగుట పెద్ద విద్య అన్నాడు దాశరథి. తనను తాను తెలుసుకోవడమే అసలైన విద్య. ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటూ, లోపాలను సవరించుకుంటూ, ఉన్నత గుణాలను సమకూర్చు కుంటూ యువత ముందడుగు వేయాలి. తమ బలాలను, బలహీనతలను సహేతుకంగా సమీక్షించుకొని, అందుకనుగుణమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని, ఆ లక్ష్యసాధనకు అకుంఠిత దీక్షతో యువత కృషిచేయాలి.

2. సహానుభూతి (Empathy):
పరస్పరం సహాయమర్థిస్తూ జీవించే మానవుల సమూహమే సమాజం. కావున, సాటి మనిషి కష్టసుఖాల పట్ల సహానుభూతి ఉండాలి. ఇతరుల సమస్యలకు తక్షణం స్పందించగలిగే మానవీయస్పృహను యువత అందిపుచ్చు కోవాలి. తద్వారా మానవ సంబంధాలు బలోపేతమవుతాయి.

TS Inter 1st Year Telugu Grammar సాధారణ వ్యాసాలు

3. భావవ్యక్తీకరణ నైపుణ్యం (Communication skill):
మాటే మనిషికి శాశ్వత ఆభరణం. మంచిమాట తీరువల్ల మహాకార్యాలను కూడా చక్కబెట్టుకోవచ్చు. సమయస్ఫూర్తితో కూడిన, నైపుణ్యవంతమైన భావవ్యక్తీకరణ మనకు అనేక విధాలుగా మేలుచేస్తుంది. విద్యావిషయక స్ఫూర్తిని ఇనుమడింపజేసుకోవడానికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందటానికి, వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి, రోజువారి వ్యవహారాలను త్వరితగతిని సాధించు కొనటానికి భావవ్యక్తీకరణ నైపుణ్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. కావున ఉద్వేగరహితంగా, ప్రభావశీలంగా, ప్రియంగా, హితంగా, సత్యసమ్మతంగా, అంగీకారయోగ్యంగా మాట్లాడే సామర్థ్యాలను యువత సంపాదించుకోవాలి.

4 భావోద్వేగాల నియంత్రణ (Management of emotions):
యువతీయువకుల హృదయాల్లో ఎన్నోరకాల భావోద్వేగాలు అనునిత్యం సుడులు తిరుగుతుంటాయి. ఈ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆగ్రహావేశాలను సంయమనంతో నియంత్రిం చు కోవాలి. సమయ, సందర్భాలను అనుసరించి ఓపికతో వ్యవహరించాలి. యువత భావోద్వేగాలను అదుపులో పెట్టుకోకపోతే అనేక అనర్థాలు సంభవిస్తాయి.

5. సమస్యనధిగమించే నైపుణ్యం (Problem solving skill):
సమస్య ఎదురైనప్పుడు ఒత్తిడికి గురికాకుండా, సానుకూల దృష్టితో సావధానంగా ఆలోచించి తగిన పరిష్కారాన్ని కనుగొనాలి. నిరాశ చెందకూడదు. చిన్నసమస్యను అతి పెద్దగా ఊహించుకొని ఒత్తిడికి గురి కాకూడదు. ప్రతికూల ఆలోచనతో సమస్యనుండి పారిపోకూడదు. మనచుట్టూ ఉన్నదారులన్నీ మూసుకుపోయినప్పుడు ఏమాత్రం భయపడకూడదు. ఇక లాభం లేదని క్షణికావేశంతో ఆత్మహత్యకు పాల్పడకూడదు.

ఎక్కడో మరొకదారి మన కోసం తెరిచేవుంటుం దన్న నమ్మకంతో, ఆశావహదృక్పథంతో నలుమూలలా అన్వేషించాలి. సమస్య గురించి స్నేహితులతో, శ్రేయోభిలాషులతో నిర్భయంగా చర్చించాలి. సానుకూల అవగాహనతో ఆత్మవిశ్వాసంతో, వివేకంతో ఆపదనుండి బయటపడాలి. గెలుపు ఓటములను, కష్టసుఖాలను సమతౌల్యంతో స్వీకరించే స్థితప్రజ్ఞతను యువత అలవాటు చేసుకోవాలి.

TS Inter 1st Year Telugu Grammar సాధారణ వ్యాసాలు

6. నిర్ణయం తీసుకునే నైపుణ్యం (Decision making):
సరైన సమయంలో సముచిత నిర్ణయం తీసుకోవడం వల్ల సత్వర ఫలితాలను పొందవచ్చు. ఒక అంశం గురించి అన్ని కోణాలలో ఆలోచించి, అనంతర పర్యవసానాలను గ్రహించి, లాభనష్టాలను అంచనావేసి మరీ నిర్ణయం తీసుకోవాలి. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఏమాత్రం కాలయాపన చేయకూడదు. ఆ నిర్ణయం బహుళ ప్రయోజనదాయకంగా ఉండాలి.

7. విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యం (Critical thinking):
ప్రతివిషయాన్ని గురించి విమర్శనాత్మకంగా ఆలోచించాలి. స్వీయదృక్కోణంలో నుండి మాత్రమే కాకుండా బహుముఖీన కోణాల నుండి ఆలోచించాలి. శాస్త్రీయంగా ఆలోచించాలి. ఎవరో పెద్దలు చెప్పారనో, ఇంకెవరో సెలవిచ్చారనో ప్రతివిషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు. స్వీయానుభవాల ఆధారంగా, ప్రమాణబద్ధంగా నిర్ధారించుకున్న తరువాత సంబంధిత విషయాన్ని ఆమోదిం చాలి. తార్కిక అవగాహనతో ఆలోచించాలి.

8. సృజనాత్మక ఆలోచనా నైపుణ్యం (Creative thinking):
యువతలో అనుకరణ ధోరణి బాగా పెరిగిపోతుంది. ఆయా రంగాలలో ప్రసిద్ధులైన వారి ఆలోచనాధోరణితో వేలం వెర్రిగా ముందుకుపోతున్నారు. వారిని స్ఫూర్తిగా మాత్రమే తీసుకోవాలిగాని అనుకరించడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రతిక్షణం కొత్తగా ఆలోచించాలి. కాలానుగుణంగా స్వతంత్రంగా ఆలోచించడం మూలంగా అందరికీ మార్గదర్శకంగా ఉండవచ్చు.

ఈ విధమైన జీవననైపుణ్యాలతో పాటు నాయకత్వ లక్షణాలను, పరోపకారదృష్టిని, సామాజిక స్పృహను, పర్యావరణ ఎరుకను, దేశభక్తిని సమకూర్చుకుంటే యువతీయువకులు జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు. ‘పావన నవజీవన బృందావననిర్మాత’లుగా జాతిపునర్నిర్మాణంలో భాగస్వాములు కావచ్చు.

3. యువతపై సామాజిక మాధ్యమాల ప్రభావం

శ్రీకృష్ణుడు ఒకప్పుడు తన నోట్లో విశ్వరూప సందర్శనం చేయిస్తే ఇప్పుడు నట్టింట్లో ‘నెట్’ తిష్ఠ వేసుక్కూచున్నది. ‘ఇంటర్ నెట్ ఇవాళ మనుషులు పనిలో భారాన్ని తగ్గించి మనసుల మధ్య దూరాన్ని పెంచుతున్నది. ఒకప్పుడు ‘లేఖ’లు, టెలిగ్రామ్ లు, టెలిఫోన్లు మనుషుల మధ్య ఇంత సమాచార వేగాన్ని పెంచకపోయినా ఒత్తిడి లేని జీవనం ఉండేది.

ఇప్పుడు ‘సెల్ ఫోన్’ శరీరభాగాల్లో ఒకటిగా మారిపోగా, టీవీ ఇంట్లోని వస్తువుల్లో ఒకటిగా మారింది. ఫోను సంభాషణలు, వీడియోకాల్స్ మనిషికి మనిషికి మధ్య దూరాన్ని తగ్గించడంతో పాటు ఆత్మీయతానుబంధాలను మాయం చేశాయి.

వేగవంతమైన ఇంటర్నెట్ సమాచార వ్యవస్థలు ఆత్మీయత, అనుబంధాలను పెంచుతున్నాయో, తుంచుతున్నాయో అర్థం కానంత సంఘర్షణలో సమాజం జీవిస్తున్నది. మనలాంటి అత్యధిక జనాభా ఉన్న దేశంలో ఆధునిక సమాచార వ్యవస్థ వల్ల లాభనష్టాలు రెండూ కలగలిసి ఉన్నాయి. పూర్వం ప్రతివారూ బాల్యంలో రెండు అగ్గిపెట్టెల్లోని బాక్స్ లకు దారం కట్టి ఒకరు చెవికి పెట్టుకొంటే ఇంకొకరు మాట్లాడేవారు.

ఇదే పెద్ద ఆనందం..! మరిప్పుడు వాట్సాప్, ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్ వంటి మాధ్యమాలు, అనేక ‘యాప్స్’ అపరిమిత జ్ఞానంతో పాటు అనవసర విషయాలకు ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తున్నాయి. ‘అరచేతిలో వైకుంఠం’ లాగా ఇప్పుడు అన్నీ మనచేతి ఫోన్ లో తెలుసుకొనే సౌకర్యం కలిగింది. ‘అన్నీ’ ఉన్నప్పుడు అందులో మంచీ చెడూ రెండూ ఉన్నాయి.

TS Inter 1st Year Telugu Grammar సాధారణ వ్యాసాలు

1857లో స్కాట్లాండ్ దేశానికి చెందిన అలెగ్జాండర్ గ్రాహంబెల్ అనే శాస్త్రవేత్త ఫోన్ ను కనుగొని 1892లో ప్రథమంగా న్యూయార్క్ నుండి షికాగో మాట్లాడాడు. దాని అంచెలంచెల పరిణామాల అవతారాలు ఈ రోజు మన చేతిలో విన్యాసం చేస్తున్న కర్ణపిశాచి అవతారం వరకు రూపాంతరం చెందింది. 1973లో మార్టిన్ కూపర్ అనే అమెరికా దేశస్తుడు ‘మొబైల్ ఫోను’ అందుబాటులోకి తెచ్చారు. అలాగే 1857లో చార్లెస్ బాబేజ్ కంప్యూటరకు రూపకల్పన చేయగా 1936లో దానికి ఓ సాంకేతిక రూపం వచ్చింది. . పర్సనల్ కంప్యూటర్ను 1977లో రూపొందిస్తే 1983లో ఐ.బి.ఎం. అనే సంస్థ అందరికి అందుబాటులోకి వచ్చేట్లు చేసింది.

ఇది మనదేశంలోకి ఇంకో రూపంలో ప్రవేశించేసరికి మరో ఇరవై ఏళ్లు పట్టింది. పాటలు వినడం, అలారం, సమాచారం, సమయం మాత్రమే తెలుసుకొనే అవకాశం ఉన్న ఈ మొబైల్ ఫోన్లు 21వ శతాబ్దంలోకి అడుగు పెట్టగానే అనేక కొత్త ఫీచర్స్ తో అందుబాటులోకి వచ్చాయి.

ఈ ఇరవై ఏళ్లలో మొబైల్ ఫోను నేటి నిత్యావసర సరుకుగా మారిపోయింది. ఈ ఫోన్లకు ఇప్పుడు ఇంటర్నెట్ తోడవడంతో ప్రపంచం ఫోన్లోకి వచ్చి కూర్చొంది. సినిమాలు, డిక్షనరీలు, ఆటలు, లైవ్ ప్రోగ్రాంలు, టైపింగ్, విజ్ఞానం, సౌందర్యం వంటి మార్పులు, మత విజ్ఞానం, భాషలు, సైన్సు, విస్తృత సమాచారం, లలితకళలు, యోగవిజ్ఞానం, 24 గంటలు వార్తలు, ఇలా సమస్త ప్రపంచం ఇందులోకి చేరి ‘ఇందులో లేనిది ప్రపంచంలో లేదు. ప్రపంచంలో లేనిది ఇందులో లేదు’ అన్న స్థితికి చేరాం. ఇక్కడే అసలు సమస్య మొదలైంది.

అవసరమైన అనవసరమైన సమాచారం ఒకచోట కలగాపులగంగా ఉండడం వలన సమాజంలో దుష్ప్రభావాలకు దారి సులభంగా ఏర్పడింది. ప్రతాపరుద్రుడు, స్వామి వివేకానంద, భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి స్ఫూర్తిమూర్తుల చరిత్రలుకూడా నెట్లో దొరుకుతున్నాయి. మనుషులు ఎప్పుడైనా చెడువైపు త్వరగా ఆకర్షితులవుతారు. సమాచారం ఉప్పెనలా మనమీద పడిన తర్వాత మనుషులు సెల్ ఫోన్ లోని సోషల్ మీడియా అనే అష్టదిగ్బంధనంలో చిక్కుకపోయారు. తనతోపాటు తన చుట్టుప్రక్కల వ్యక్తులతో, ప్రకృతితో సంబంధం కోల్పోయారు.

ఇటీవల కాలంలో మనం రైలు, బస్సు ఎక్కి కూర్చొంటే ప్రక్కనున్న సీట్లోని మనిషి ఎక్కడికి వెళ్తున్నారని వారి యోగక్షేమాలను పూర్వంలా ఎవరూ అడగడం లేదు. ఎవరి ఫోన్లో వారు తలదూర్చే దృశ్యం చూస్తున్నాం. మానవసంబంధాల యాంత్రికతకు ఇదో నిదర్శనం. అలాగే కొందరు ఇళ్లలో అస్తమానం కంప్యూటర్ లోనో, ఫోన్లోనో తలపెట్టి పక్కకు చూడడం లేదు.

సుదీర్ఘంగా ఒకే స్థితిలో కూర్చోవడం వల్ల మెడ, వెన్ను నొప్పి వంటి దేహబాధలు తప్పడం లేదు. అలాగే కదలకుండా కూర్చొని ఊబకాయం, చక్కెర వ్యాధి వంటి వ్యాధులు కొని తెచ్చుకొంటున్నారు. మైదానాల్లో ఆడాల్సిన కబడ్డీ, క్రికెట్ వంటి ఆటలు ఫోన్లోనే ఆడడం వల్ల శారీరక వ్యాయామం జరగడం లేదు. కాలాన్ని ఎక్కువగా వాటిలోనే దుర్వినియోగం చేస్తున్నారు.

TS Inter 1st Year Telugu Grammar సాధారణ వ్యాసాలు

తోటివారితోనే కాకుండా తనకుతానే సంబంధం కోల్పోతున్నాడు. తననుతానే వదిలి పెట్టినవాడు సమాజంతో ఎలా సంబంధం నెరపగలడు! అందుకే ఇటీవల ‘వర్చువల్ మీటింగ్స్’ తో పెళ్లిళ్లు, ఆఖరుకు అంత్యక్రియలు కూడా ఇంటర్నెట్లో చూసే దుస్థితికి దిగజారాయి. అలాగే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ తో, అప్లోడ్ డౌన్లోడ్ లతో జీవితం దుర్భరం చేసుకొంటు న్నారు.

అనవసరమైన ‘చెత్త సమాచారం’ ఫార్వార్డ్ చేస్తూ అనవసర భారం ఇతరుల తలల్లోకి చొప్పిస్తున్నారు. కొన్నిసార్లు విశ్వసనీయత లేని సమాచారం ఫార్వార్డ్ చేసి సామాజిక అశాంతికి కారణం అవుతున్నారు. అసత్యాలతో కథనాలు, వీడియోలు రూపొందించి సంచలనం చేసే సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులు ఎక్కువైపోయి సోషల్ మీడియా విశ్వసనీయత దెబ్బతింటున్నది. అసత్య కథనాలతో సంచలనాలతో డబ్బు సంపాదించే వ్యక్తులు సోషల్ మీడియాలో ఉండటం వల్ల భావోద్వేగాలకు సంబంధించిన కుల, ప్రాంత, మత విద్వేషాలు రెచ్చగొట్టే సమాచారం ఇతరులకు పంపించి వాళ్లలో లేనిపోని ఉద్రిక్తతలు కలిగిస్తున్నారు.

ఒకప్పుడు గొప్ప అవధానంతో ఎన్నో శ్లోకాలు, పద్యాలు మనవాళ్లు ధారణ చేసేవారు. పల్లెటూళ్లలో జానపదులు సైతం ఎన్నో సామెతలు, జానపద గీతాలు, కథలు నోటికి చెప్పేంత ధారణ ఉండేది. విద్యార్థులు ఎక్కాలు’ శతక పద్యాలు వల్లెవేసి ఎక్కడ అవసరం వస్తే అక్కడ ధారాళంగా చదివేవారు. ఇపుడు ప్రతీది ‘ఇంటర్నెట్ సమాచారం తప్ప ‘స్వీయశక్తి’తో జ్ఞాపకాన్ని జ్ఞానంగా మార్చుకోవడం లేదు.

తమ తమ స్వీయ జ్ఞానాన్ని’ వీడియోలుగా మార్చి సమాజానికి అందిస్తున్నారు. ఇందులో గుణదోషాలు రెండూ ఉన్నాయి. అలాగే అశ్లీల వెబ్ సైట్లు సమాజంలో అత్యాచారాలకు ప్రధాన కారణం అవుతున్నాయి. ఆటల్లో గడపాల్సిన యువత ఎక్కువగా ఫోన్లకు, కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. దీనివల్ల శారీరక శ్రమ తగ్గి, అనవసర మానసికఒత్తిడి పెరిగి మెదడు మొద్దుబారే స్థితి వచ్చింది. చదువుకోసం విస్తృత సమాచారం ఇవాళ నెట్టింట్లో దొరుకుతుంది. అంతవరకు యువత స్వీకరిస్తే వారి జీవితం పూలబాటగా మారుతుంది.

బియ్యంలోని రాళ్లు తొలగించుకొన్నట్లు అనవసర సమాచారం తొలగించి సదసద్వివేకంతో ఈ మాధ్యమాలను తమ జ్ఞానానికి అనుకూలంగా మార్చుకోవడమే నేటి యువతరానికి ఉండవలసిన వివేకం. అదేవిధంగా ‘పిచ్చోడిచేతి’లో రాయిగా మారిన ‘సామాజిక మాధ్యమాలు’ ఇపుడు కొందరికి వ్యాపారవనరుగా మారడం మరో కోణం. యువతరం మాదకద్రవ్యాల మత్తులో పడకుండా ఎంత జాగ్రత్తగా మెలగాలో అలాగే ఈ మాధ్యమాల వలలో పడకుండా చైతన్యంతో ఉత్తమ భవిష్యత్తుకోసం ఆదర్శమార్గంలో నడవాలి.

4. జాతీయ విపత్తులు

అకస్మాత్తుగా సంభవించే ఉపద్రవపూరిత సంఘటననే విపత్తు. దీనివల్ల భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరుగుతుంది. ఇది సంభవించిన ప్రాంతంలో మానసిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక దుష్ఫలితాలు కలుగుతాయి.

విపత్తుల వల్ల సాధారణ జీవితానికి అంతరాయం కలుగుతుంది. అత్యవసర చర్యలకు ప్రతిబంధక మేర్పడుతుంది. దైనందిన కార్యక్రమాలకు విఘాతం కలుగుతుంది.

TS Inter 1st Year Telugu Grammar సాధారణ వ్యాసాలు

విపత్తు లక్షణాలు

  • ఆకస్మికంగా సంభవించడం
  • అతివేగంగా విస్తరించడం
  • ప్రజల జీవనోపాధిని దెబ్బతీయడం.
  • ప్రకృతి వనరులను ధ్వంసం చేసి, అభివృద్ధికి ఆటంకం కలిగించడం.

సాధారణంగా విపత్తులు రెండు రకాలుగా సంభవిస్తాయి.

  1. సహజమైనవి
  2. మానవ తప్పిదాలవల్ల సంభవించేవి.

భూకంపాలు, సునామీలు, వరదలు, తుఫానులు, కరువులు, కీటకదాడులు, అంటువ్యాధులు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సహజమైన విపత్తులైతే యుద్ధాలు, అణు ప్రమాదాలు, రసాయన విస్ఫోటనాలు, ఉగ్రవాద దాడుల్లాంటివి మానవ తప్పిదాల వల్ల సంభవించే విపత్తులుగా చెప్పవచ్చు.

ఇండియన్ డిజాస్టర్ నాలెడ్జ్ నెట్ వర్క్ (IDKN) నివేదికల ప్రకారం భారతదేశంలో కొన్ని ప్రాంతాలు తరచు ఏదో ఒక విపత్తుకు గురవుతున్నాయి. దీనికి కారణం మనదేశ విభిన్న శీతోష్ణస్థితులు, అధిక జనాభా, సుదీర్ఘ తీరరేఖ, వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, అటవీ నిర్మూలన మొదలయినవి.

భారతదేశంలో సంభవించిన కొన్ని ఘోర విపత్తులను పరిశీలించినట్లయితే – భోపాల్ గ్యాస్ దుర్ఘటన, ఉత్తర కాశీ భూకంపం, లాతూర్ (మహారాష్ట్ర భూకంపం, భుజ్ (గుజరాత్) భూకంపం, దివిసీమ ఉప్పెన, దక్షిణ కోస్తాలో సునామీ, ముంబై పై ఉగ్రవాదుల దాడి, కేరళ వరదలు, కరోనా మహమ్మారి విజృంభణ మొదలైనవి కొన్ని. అంత విపత్తుల తీవ్రతను తగ్గించడంలో విపత్తు నిర్వహణ చాలా ముఖ్యం. విపత్తు నిర్వహణ అనేది విపత్తుల వలన కలిగే నష్టాన్ని తగ్గించడానికి మనిషి చేసే క్రమశిక్షణాయుతమైన ప్రయత్నం.

TS Inter 1st Year Telugu Grammar సాధారణ వ్యాసాలు

విపత్తు నిర్వహణలో ప్రధానాంశాలు

  • సంసిద్ధత
  • ఉపశమన చర్యలు
  • సహాయక చర్యలు
  • పునరావాసం.

విపత్తు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండటమే సంసిద్ధత. కొన్ని రకాల విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి ప్రమాద సూచనలు కనబడకపోవచ్చు. ఉదాహరణకు భూకంపాలు, విస్ఫోటనాలు ఎలాంటి హెచ్చరికలు లేకుండానే సంభవించే అవకాశం కలదు.

అందుబాటులో ఉన్న పరిమిత సాధనాలు (వనరులు) ఉపయోగించుకొని విపత్తు నుండి బయటపడటం, విపత్తు ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడానికి చేపట్టే చర్యలు ఉపశమన చర్యలు. విపత్తుకు గురైన వారిని తక్షణం ఆదుకొని వారికి తిండి, వస్త్రాలు, తాత్కాలిక వసతి, వైద్యం వంటి మౌలికావసరాలను తీర్చడం సహాయక చర్యలు. ఆస్తిపాస్తులు కోల్పోయిన బాధితులకు ఋణ సహాయాన్ని అందించడం, ప్రత్యామ్నాయ వసతి, ఉపాధి అవకాశాలు కల్పించడం పునరావాసం.

2005వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో విపత్తు నిర్వహణ వ్యవస్థను ఏర్పాటుచేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయి.

విపత్తు నిర్వహణకు మానవ వనరులను అభివృద్ధి చేస్తూ శిక్షణ, పరిశోధనను ప్రోత్సహించడానికి జాతీయ విపత్తు నిర్వహణ పరిశోధన వ్యవస్థను ఏర్పాటుచేశారు. విపత్తులు సంభవించినపుడు తక్షణం స్పందించి సహాయక చర్యలు చేపట్టడానికి జాతీయ విపత్తు స్పందన బలగాన్ని కూడా రూపొందించారు. వీటికి తోడుగా జాతీయ అగ్నిమాపక కళాశాల, జాతీయ పౌర రక్షణ కళాశాలను ప్రారంభించారు.

విపత్తులను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ, వాటిని సంభవించకుండా ఆపడం అసాధ్యం. విపత్తు సంభవించేవరకు వేచి ఉండకుండా, ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడుకోగలుగుతాం. సక్రమమైన ప్రణాళిక, శిక్షణ, ప్రజలలో సరైన అవగాహన ద్వారా విపత్తులతో సంభవించే విధ్వంసాన్ని తగ్గించవచ్చు. దీనికి ఉదాహరణ కోవిడ్-19 వ్యాధి. దీని గురించి ప్రజలకు అవగాహన కలిగించి, వ్యాధి నివారణకు మాస్కులు, శానిటైజర్ల వినియోగం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యల వల్ల వ్యాధి సంక్రమణను, ప్రాణనష్టాన్ని నివారించ గలుగుతున్న విషయం వాస్తవం.

TS Inter 1st Year Telugu Grammar సాధారణ వ్యాసాలు

విపత్తు నిర్వహణ అనే అంశంపై పాఠశాలస్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కలిగేలా పాఠ్యాంశాలు రూపొందించాలి. విపత్తులు సంభవించినపుడు ఎలా వ్యవహరించాలనే సమాచారాన్ని ప్రభుత్వాలు ప్రజలకు తెలియజేయాలి.

విపత్తు తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు, సంక్షోభ సమయంలో స్పందించాల్సిన విషయాల పట్ల పౌరులకు శిక్షణ అందించాలి. విపత్తులు సంభవించినపుడు ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తూ, ప్రజలకు సహాయపడాలి. ప్రజలు కూడ బాధ్యతతో మసలుకుంటూ ప్రభుత్యాలకు తమ వంతు సహకారాన్ని అందించాలి.

TS Inter 1st Year Telugu Grammar లేఖారచన

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material Grammar లేఖారచన Questions and Answers.

TS Inter 1st Year Telugu Grammar లేఖారచన

మన మనసులోని భావాలను, ఆలోచనలను, సమాచారాన్ని ఇతరులకు తెలుపడానికి ఉత్తమసాధనం ఉత్తరం. ఒకప్పుడు ఉత్తరం అనే దానిని నేడు మనం లేఖ అంటున్నాం. సాధారణంగా అన్ని సందర్భాలలో వ్యక్తులతో, సంస్థలతో ప్రత్యక్షంగా చర్చించలేని విషయాలను లేఖల ద్వారా చేరవేస్తాం. లేఖలను ఒకప్పుడు వక్షుల ద్వారా, జంతువుల ద్వారా చేరవేసే వాళ్ళు.

స్మార్ట్ ఫోన్స్ లేని రోజులలో ఉత్తరాల కోసం ఎదురు చూసేవారు. దీనిలో ఒక ఆనందం, ఉద్వేగం దాగి ఉండేది. కానీ, సాంకేతిక పరిజ్ఞానం పెరిగి, నేడు ఎస్.ఎం.ఎస్., ఈ – మెయిల్, సామాజిక మాధ్యమాల స్థాయికి చేరింది. అయితే మనుషుల మధ్య అనుబంధాలను ఆనాటి లేఖలు ఏర్పరచినట్లుగా, నేటి సామాజిక మాధ్యమాలు ఏర్పరచలేకపోయాయనవచ్చు.

ఉత్తరాలు సంఘజీవితంలో ఒక భాగం. వ్యక్తిగత విషయాలకు సంబంధించిన లేఖలే కాదు, వ్యాపార సంబంధ, ఉద్యోగసంబంధ లేఖలు రాయడం కూడా ముఖ్యమైన అంశమే. భవిష్యత్తులో వివిధ రంగాలలో స్థిరపడే విద్యార్థులకు వ్యక్తిగతంగానూ, విద్యా, ఉద్యోగ, వ్యాపార పరంగానూ లేఖారచన చేయడం అవసరమే. అందుకే, మనం లేఖారచన ప్రాధాన్యతను గుర్తించి, చక్కని శైలిలో, స్పష్టంగా లేఖలు రాయడం నేర్చుకోవాలి.

చక్కని ఉత్తరాలు రాయాలి అంటే లేఖా రచనలోని మెలకువలను మనం తెలుసుకోవాలి.

లేఖారచనలో పాటించే సాధారణ మెలకువలు
ముందుగా లేఖలో పై భాగాన కుడివైపు మనం ఎక్కడి నుండి రాస్తున్నామో ఊరి పేరు, తేదీలను పొందుపరచాలి. ఊరిపేరు తరువాత కామా (,) ఉంచి, తేది తరువాత విరామ చిహ్నం (.) ఉంచాలి.

ఉత్తరాలలో రెండవ ప్రధానవిషయం సంబోధన, ఉత్తరాలు రాసేటప్పుడు ఎవరికి రాస్తున్నామో దానిని బట్టి సంబోధన ఉంటుంది. మనకంటే పెద్దవారి విషయంలో మాన్యశ్రీ, పూజ్యులైన, గౌరవనీయులైన అని సంబోధిస్తారు. వ్యాపార లేఖల్లో మహాశయా! ఆర్యా! అయ్యా! అమ్మా! అని సంబోధిస్తారు. స్నేహితులకు ప్రియమైన అని సంబోధిస్తారు.

TS Inter 1st Year Telugu Grammar లేఖారచన

ఉత్తరాలలో మూడవ అంశం ప్రధాన విషయం మనం చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా, అంశాలవారిగా విభజించి రాయాలి. ముఖ్యంగా వ్యాపార లేఖలలో ఇది మరింత అవసరం. ఉద్యోగ సంబంధ లేఖలలో మన అర్హలు, అనుభవం, ఉద్యోగం పట్ల అవగాహన ఇలా విభజించి రాస్తే బాగుంటుంది. ప్రధానవిషయ వివరణ తరువాత ముగింపువాక్యాలు రాయాలి. స్నేహితులకు, బంధువులకు “ప్రత్యుత్తరం రాయగలరు” అని అధికారులు, ఉద్యోగ సంబంధ ఉత్తరాలలో కృతజ్ఞతలు వంటి వాక్యాలు రాయాలి.

లేఖ చివరన సంతకానికి ముందు లేఖను బట్టి భవదీయుడు, విశ్వసనీయుడు, విధేయుడు వంటివి ఉపయోగించాలి.

ఉత్తరం ముగిసిన తరువాత ఎడమ వైపు చివరన “పూర్తి చిరునామా” రాయాలి. కొన్ని లేఖలలో పై భాగంలోనే పూర్తి చిరునామా రాస్తారు.

లేఖల్లో భేదాలు

  • సాధారణంగా లేఖల్లో వ్యక్తిగత లేఖలు, వ్యవహార లేఖలు, సాంఘిక లేఖలు, వ్యాపార లేఖలు అని విభజించవచ్చు. కానీ, నియమిత భేదాలు ఇవి మాత్రమే ఉంటాయని చెప్పడానికి వీలు లేదు.
  • మన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు రాసే లేఖలను వ్యక్తిగత లేఖలు అంటారు.
  • ప్రభుత్వపరంగా జరిగే కార్యకలాపాలన్నీ వ్యవహార లేఖలుగా గుర్తించవచ్చు. దీంట్లో స్పష్టత, సంక్షిప్తత, సరళత, యథార్థత వంటివి ప్రముఖ అంశాలుగా కనిపిస్తాయి. వీటిలో అధికారిక లేఖలు, అర్థ అధికారిక లేఖలు, మెమోరాండం, నోటిఫికేషన్, సర్యులర్ వంటివి వివిధ వైవిధ్యాలతో కూడా ఉంటాయి.
  • వార్తా పత్రికల్లో ప్రచురితమయ్యే సంపాదకీయ లేఖలు, వినతి పత్రాలు, ఆహ్వాన లేఖలు మొ||నవి సాంఘిక లేఖల క్రిందికి వస్తాయి.
  • ఒక సంస్థ వ్యాపార అభివృద్ధికి రాసే లేఖలు వ్యాపార లేఖలు. వీటిలో సుబోధకత, సంగ్రహత, స్పష్టత, సందర్భ శుద్ధి, యథార్థత, సంక్షిప్తత అనేవి ప్రధాన లక్షణాలు.

1. తల్లిదండ్రులకు లేఖ

వరంగల్,
10-02-2020.

పూజ్యులైన అమ్మానాన్నలకు నమస్కారములు.

నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను. మీరు కూడా క్షేమమే అని తలుస్తున్నాను . నేను బాగా చదువుతున్నాను. ఇక్కడ మాకు ఉపన్యాసకులు చక్కగా బోధిస్తున్నారు. పాఠ్యాంశాలు పూర్తి అయినవి.

ఇటీవల మా కళాశాల నుండి హైదరాబాదుకు విజ్ఞాన విహారయాత్రకు వెళ్లి వచ్చాం. నగరంలోగల సాలార్జంగ్ మ్యూజియంనందున్న పురాతన వస్తువులు, నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో నేను ఇంతవరకు చూడని ఎన్నో జంతువులను చూశాను. బిర్లా మందిర్ అద్భుతమైన పాలరాతి కట్టడం, బిర్లా ప్లానిటోరియం మరియు సైన్స్ మ్యూజియం, రామోజీ ఫిల్మ్ సిటీ, గోలకొండ కోట వంటివి నన్ను ఎంతగానో ఆకర్షించాయి.

TS Inter 1st Year Telugu Grammar లేఖారచన

ఈ విజ్ఞాన, విహారయాత్రకు వెళ్ళడం వలన ఎన్నో చారిత్రక విషయాలు తెలుసుకోవ డంతో పాటు, ఎంతో విజ్ఞానం పొందడం జరిగింది. ఈ విజ్ఞాన, విహారయాత్ర నా భవిష్యత్ విద్యకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పూర్తి విషయాలు ఇంటికి వచ్చిన తరువాత వివరిస్తాను. తాతయ్యకు, నానమ్మకు నా నమస్కారాలు తెలియజేయండి.

ఇట్లు
మీ కుమారుడు
xxxxx

చిరునామా
జి. రాజేశ్వర్
ఇంటి నెంబర్ 1-3-178,
ఎ.యన్. రెడ్డి కాలని, నిర్మల్,
పిన్ నం . 504106

2. కళాశాల ప్రధానాచార్యుల వారికి లేఖ

కరీంనగర్,.
15-06-2020.

గౌరవనీయులైన ప్రధానాచార్యులు గారికి,
ప్రభుత్వ జూనియర్ కళాశాల,
కరీంనగర్. నమస్కారాలు.

విషయము: టి.సి. (బదిలీ పత్రము) ఇప్పించుటకు విజ్ఞప్తి.

నేను మీ కళాశాలలో యం.పి.సి. గ్రూపు ద్వారా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసాను. ఈ సంవత్సరం మార్చి నెలలో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాను. ప్రస్తుతం నేను పై తరగతులు చదువుటకై డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి ‘దోస్త్’ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసాను. ‘దోస్త్’ వెబ్ సైట్ వారు విడుదల చేసిన మొదటి జాబితాయందు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి అనుమతి లభించినది. ప్రవేశం పొందుటకు గాను నాకు బదిలీ పత్రము అవసరం ఉంది.

కావున, నాకు బదిలీ పత్రము ఇప్పించగలరని విజ్ఞప్తి.
కృతజ్ఞతలతో,

TS Inter 1st Year Telugu Grammar లేఖారచన

ఇట్లు
మీ విద్యార్థి
XXXX

3. స్నేహితులకు లేఖ

మెదక్
09-08-2020.

ప్రియమైన సౌమ్యకి,

నేను క్షేమంగా ఉన్నాను. నీవు ఎలా ఉన్నావు? నేను బాగా చదువుతున్నాను. నీవు ఎలా చదువుతున్నావో ఉత్తరం ద్వారా తెలియజేయగలవు.

ఇటీవల మా కళాశాలలో ఎన్.ఎస్.ఎస్ (N.S.S) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రమాదాలు జరిగినపుడు గాని, శస్త్రచికిత్సలు చేసినపుడు గాని మనిషి ప్రాణాన్ని కాపాడడానికి కొన్నిసార్లు రక్తం అవసరం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రక్తదానం చేసి సాటివారి ప్రాణాలు కాపాడాలని తెలియజేసారు. ఈ మాటలు విన్న వింటనే నేను రక్తదానం చేశాను. నీవు కూడా రక్తదానం చేస్తావని భావిస్తున్నాను.

మన స్నేహితులు సమత, సంధ్య, ప్రవళిక ఎలా ఉన్నారు ? వారిని అడిగానని చెప్పు. మీ అమ్మానాన్నలకు నా నమస్కారాలు తెలియజేయగలవు. వచ్చే దసరా సెలవులలో మనం కలుసుకుందాం. నీ ఉత్తరం కోసం ఎదురుచూస్తూ ఉంటాను.

TS Inter 1st Year Telugu Grammar లేఖారచన

ఇట్లు
నీ ప్రియమైన స్నేహితురాలు
XXXXX

చిరునామా ఎ. సౌమ్య
ఇంటి నంబర్ 21-12/68,
సుచిత్ర, సికింద్రాబాద్,
పిన్. నం. – 500067.

4. అధికారికి లేఖ

దిలావర్పూర్,
10.08.2020.

స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు,
పోలీస్ స్టేషన్,
దిలావర్పూర్.

విషయము : నా సైకిల్ దొంగిలింపబడిన విషయం గురించి.

ఆర్య !
నమస్కారములు.

నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల, దిలావర్ పూర్ నందు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాను. నేను నిన్న కళాశాలకు అట్లాస్ కంపెనీకి చెందిన ఎరుపు రంగు సైకిల్ పై వెళ్ళి, కళాశాల ముందర తాళం వేసి పెట్టి, తరగతులకు హాజరు అయ్యాను. సాయంత్రం వచ్చి చూసేసరికి నా సైకిల్ కనిపించలేదు. దొంగిలించబడినదని నిర్ధారణ అయింది.

దయచేసి నా సైకిల్ గురించి విచారణ చేసి తిరిగి నాకు అప్పగించవలసినదిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.

కృతజ్ఞతలతో,

TS Inter 1st Year Telugu Grammar లేఖారచన

ఇట్లు
మీ విశ్వసనీయుడు
పి. ఆదిత్య
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం
ప్రభుత్వ జూనియర్ కళాశాల
దిలావర్పూర్

5. ఉద్యోగానికి లేఖ

నల్లగొండ,
26.07.2020.

శ్రీయుత గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి,
నల్లగొండ.
నమస్కారములు.

విషయము: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం కొరకు దరఖాస్తు

నిర్దేశము: నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రకటన, తేది: 20.07.2020.

ఆర్యా,

ఈ నెల తేది 20.07.2020 నాటి నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన ఉద్యోగ ప్రకటనను చూసాను. మీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగ ఖాళీలను తాత్కాలిక ప్రాతిపదికపై నింపుతున్నట్లు, అర్హులైన వారు దరఖాస్తు చేసుకొమ్మని ప్రకటించారు. తమ ప్రకటన ప్రకారం ఆ ఉద్యోగానికి కావలసిన విద్యార్హతలు అన్నీ నాకు ఉన్నాయి. అలాగే, కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. కావున, ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నాను.

ఈ ఉద్యోగమును క్రమశిక్షణతో, పూర్తి సామర్థ్యంతో పనిచేస్తానని మనవి చేసుకుంటున్నాను. కావున, నాకు ఉద్యోగ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

కృతజ్ఞతలతో,

TS Inter 1st Year Telugu Grammar లేఖారచన

ఇట్లు
మీ భవదీయుడు
XXXX

దరఖాస్తుతో జత చేసిన పత్రాలు:

  1. ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రం
  2. జనన ధ్రువీకరణ పత్రం
  3. స్థానిక ధ్రువీకరణ పత్రం
  4. ఉద్యోగానుభవ ధ్రువీకరణ పత్రం

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 4th Poem అచలం Textbook Questions and Answers.

TS Inter 1st Year Telugu Study Material 4th Poem అచలం

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
దున్న ఇద్దాసు జీవితం- తాత్వికతను సమగ్రంగా వివరించడి?
జవాబు:
“అచలం” అను పాఠ్యభాగం ‘దున్న ఇద్దాసు’ చే రచించబడినది. ఇది దున్న విశ్వనాథం సంపాదకత్వంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్వాలు” గ్రంథం లోనిది.

దున్న ఇద్దాసు తెలంగాణలో ప్రసిద్ధ తత్వకవి. ఈయన 1811 1919 సం||ల మధ్య కాలంలో జీవించాడు. నల్గొండ జిల్లా ‘చింతపల్లి గ్రామానికి చెందినవాడు. తల్లిదండ్రులు రామయ్య, ఎల్లమ్మలు. ఇతని అసలు పేరు ఈదయ్య. తాత్వికునిగా మారాక ‘ఇద్దాసు’గా ప్రసిద్ధివహించాడు. డా. బిరుదురాజు రామరాజు’ ఇద్దాసు’ను మాదిగ మహాయోగిగా కీర్తించాడు.

ఇద్దాను బాల్యంలో మోతుబరి రైతు వద్ద పశువుల కాపరిగా జీవితాన్ని ప్రారంభించాడు. భావిదగ్గర ‘మోట’ కొడుతూ గీతాలను అశువుగా పాడుకునేవాడు. ఈతని మధుర గీతాలను విన్న వరసిద్ధి జంగమ దేవర’ పూదోట బసవయ్య’ ఈతనికి ‘పంచాక్షరీ’ మంత్రాన్ని ఉపదేశించాడు. మెడలో లింగధారణ చేశాడు. ఇద్దాసు అడవులలో సంచారం చేస్తూ “రాజయోగాన్ని” ఏకాంతంగా సాధన చేశాడు. అష్టసిద్ధులను పొందాడు. పూర్వతాత్త్విక కవులైన శివరామ దీక్షితులు, పోతులూరి వీరబ్రహ్మం, ఈశ్వరాంబల ప్రభావం ఇతనిపై ఉంది.

ఇద్దాసు వేమనలా తత్త్వవేత్తగా, అచలుడిగా, వీరశైవ తత్త్వజ్ఞానిలా కన్పిస్తాడు. పటేల, పట్వారీలతోపాటు ప్రజలు ఈతని శిష్యులయ్యారు. సంచారం చేస్తూ నల్గొండ నుండి మహబూబ్ నగర్ జిల్లా వరకు ఆధ్యాత్మిక పర్యటనలు చేశాడు. అచ్చంపేట తాలూకాలోని అయ్యవారిపల్లె, పోలేపల్లి, ఆవులోనిపల్లి, కాంసానిపల్లి, కల్వకుర్తి తాలూకాలోని గుడిగానిపల్లి దేవరకొండ తాలూకాలోని జీడికట్ల వంటి గ్రామాలలో ఈశ్వరమ్మ పీఠాలను నెలకొల్పాడు. వీరశైవ భక్తితో ఈయన 30కిపైగా తత్వాలను మేలుకొలుపులను, మంగళహారతులను రచించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

ప్రశ్న 2.
‘అచలం’ పాఠ్యభాగ సారాంశాన్ని వివరించండి?
జవాబు:
‘అచలం’ అను పాఠ్యభాగం ‘దున్న ఇద్దాసు’ చే రచించబడినది. ఈ పాఠ్యభాగం దున్న విశ్వనాథం సంపాదకత్వంలో వెలువడిన శ్రీ దున్న ఇద్దాసుగారి తత్వాలు” నుండి గ్రహించబడింది. తెలంగాణ పద సంకీర్తన కవులలో ‘ఇద్దాసు’ కలికితురాయి.

ఇద్దాసు తత్వాలు ఆత్మపరంగ, తత్వపరంగ తెలంగాణ నుండి పుట్టిన మాణిక్యాలు. వేదాంత శాస్త్రజ్ఞాన సారాంశాన్ని సామాన్య ప్రజలకు ఈయన అందించాడు. వేదాంత తత్వాక అంశాలను పరిచయం చేయటం ఈ తత్వాల ఉద్దేశ్యం.

ఈ దేహం శాశ్వతం కాదు. కనుక ఈ దేహంపై మోహం విడచిపెట్టాలి. మంచి గురువును ఆశ్రయించి జీవన రాహిత్యాన్ని పొందటానికి ప్రయత్నించాలి. అపుడే మోక్షాన్ని పొందగలుగుతాము. భార్యాబిడ్డలు, ధనధాన్యాల పట్ల మోహాన్ని వదలిపెట్టాలి. ఏదో ఒకనాటికి కీలు వదలిన బొమ్మలా ఈ దేహం రాలిపోక తప్పదు.

ఓ నామః అని అక్షరాలు రాస్తున్నాం నేర్చుకుంటున్నాం కాని, మన జీవిత ఆనవాళ్ళను తెలుసుకోలేకపోతున్నాం. దాని అంతు తెలియక అల్లరిపాలు అవతున్నాం. మంచి చెడులను తెలుసుకొని మసలు కోవాలని ఇద్దాసు పలుకుతున్నారు.

ఈ లోకంలో గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, దీనిని మనం గమనించాలి. మన దేహంలో షట్ చక్రాలుంటాయి. సహస్రారం శిరసుపై ఉంటుంది. అదే చివరి చక్రం. దానిని తెరుచుకోగలిగి శక్తిని పొందితే, ఆ రహస్యం అంతుచిక్కితే అది మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అజ్ఞాచక్రంమును పొందండి, తరించండి.

ఈ లోకం అంతా శూన్యం. ఎక్కడ చూసినా ఎక్కడ వెతికినా ఏమీ కన్పించదు. మనం గమనించాలి. మన దేహంలో షటం చక్రాలుంటాయి. సహస్రారం శిరస్సుపై ఉంటుంది. అదే చివరి చక్రం. దానిని తెరుచుకోగలిగే శక్తిని పొందితే, ఆ రహస్యం అంత చిక్కితే అది మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఆజ్ఞాచక్రంమును పొందండి తరించండి.

ఈ దాసు చెప్పిన మాటలు సత్యములు. అందరూ అనుసరింపదగినవి. వీరశైవ మత గురువైన బసవని యొక్క భావాలను అర్థం చేసుకుని ప్రవర్తించండి. అపుడే జీవన సాఫల్యం జరుగుతుంది.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

II. సంగ్రహ రూప ప్రశ్నలు – సమాధానాలు.

ప్రశ్న 1.
మనుషులు ఎందుకు భ్రమల్లో మునుగుతున్నారు?
జవాబు:
‘అచలం’ అనుపాఠ్యభాగముదున్న ‘ఇద్దాసు’ చేరచించబడింది. ప్రస్తుత పాఠ్య భాగం దున్న విశ్వనాథం సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్వాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.

ఈయన రాసిన తత్వాలు, ఆత్మపరంగా, తత్త్వపరంగా తెలంగాణ మట్టి నుండి పుట్టిన మాణిక్యాలు. ఈ దేహము మనదికాదు, మోహాన్ని విడచి ప్రయత్నం చేసి గురువును చేరుకోవాలన్నాడు. ఆలు, బిడ్డలు ధనము నాది అనుభ్రమల్లో మానవులు బతుకుతున్నారు. భార్యా బిడ్డలు ధన, ధాన్యాలు ఏవీ శాశ్వతంకావు. ఆ భ్రమల్లో బ్రతుకుతూ సత్యాన్ని తెలుసుకునే లోపే జీవితం పూర్తయిపోతున్నది. కీలు విడచిన బొమ్మలాగా నేలలో కలిసిపోతున్నారు. కావున ఆ భ్రమలు వీడి నిజాన్ని తెలుసుకుని ప్రవర్తించాలి అని ఇద్దాసు వివరించాడు.

ప్రశ్న 2.
ఆగం కాకుండా జీవించాలంటే ఏమీ చేయాలి?
జవాబు:
‘అచలం’ అను పాఠ్యభాగము ‘దున్న ఇద్దాసు’ చేరచించబడినది. దున్న విశ్వనాథం సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్వాలు” గ్రంథం నుండి గ్రహించబడింది.

‘ఓనామః శ్రీవాయుః’ అన్న అక్షరాలు రాస్తున్నాం. నేర్చుకుంటున్నాం, మన జీవిత ఆనవాళ్ళను మాత్రం తెలుసుకోలేకపోతున్నాం. మన జీవితం యొక్క ఆనవాళ్ళను తెలుసుకోలేకపోవటం వలననే అల్లరిపాలు అవుతున్నాం. మంచి చెడులను, పూర్వాపరాలను, మన జీవిత ఆనవాళ్ళను తెలుసుకోలేక పోవటం వలననే మనం ఆగమవుతున్నామని ఇద్దాసు ‘అచలం’ అను తత్వాల ద్వారా మనకు తెలియచేశాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

ప్రశ్న 3.
గురువు తత్వం వివరించండి?
జవాబు:
‘అచలం’ అను పాఠ్యభాగం ‘దున్న ఇద్దాసు’ చే రచించబడింది. ‘దున్న విశ్వనాథం’ సంపాదనకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్వాలు” అను గ్రంథం నుండి ఈ పాఠ్యభాగం గ్రహించబడింది.

ఈ లోకంలో గురువే బ్రహ్మం గురువే విష్ణువు. ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. మన దేహంలో షట్ చక్రాలుంటాయి. సహస్రారం శిరస్సుపై ఉంటుంది. మూలాధారం, స్వాధిష్టానం అనాహతం, మణిపూరకం, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారాలు, వీటిలో చివరిది సహస్రారం, అది విచ్చుకునే శక్తిని ప్రసాదించేవాడు గురువు. అపుడే మోక్షప్రాప్తి కలుగుతుంది. కనుక ఆ రహస్యాన్ని తెలుసుకుని మంచి గురువుని ఆశ్రయించి ఆయన ద్వారా మోక్షాన్ని పొందమని ఇద్దాసు వివరిస్తున్నాడు.

ప్రశ్న 4.
దేహ తత్త్వాన్ని గురించి ఇద్దాసు ఏమి చెప్తున్నాడు?
జవాబు:
‘అచలం’ అను పాఠ్యభాగం ‘దున్న ఇద్దాసు’చే రచించబడింది. ‘దున్న విశ్వనాథం’ సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్త్వాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.

ఏడ చూసినా ఏమీ లేదు. అంతామిథ్య. ఎక్కడ వెదకినా ఏమీ కన్పించదు. అంతాశూన్యం. అజ్ఞానంలో ఉన్నంత కాలం చీకటే కన్పిస్తుంది. అజ్ఞానాన్ని వదలి గురుని నమ్మి ఆయనను అనుసరిస్తే ఫలితం ఉంటుంది. మానవులు జీడికంటి వంటి నేత్రాలను తెరచుకోవాలి. ఆ జ్ఞాన నేత్రాలు, ఆ అగ్నినేత్రాలు మన దేహం తత్వాన్ని తెలియచేస్తాయి. అపుడు గురుని ద్వారా ముక్తి మూలాలను తెలుసుకోగలమని దున్న ఇద్దాసు వివరించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

III. ఏక పద/వాక్య సమాధాన ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
దున్న ఇద్దాసు తల్లిదండ్రుల పేర్లు తెలపండి?.
జవాబు:
దున్న రామయ్య – ఎల్లమ్మలు

ప్రశ్న 2.
ఇద్దాసుకు పంచాక్షరిని ఎవరు ప్రబోధించారు?
జవాబు:
వరసిద్ధి జంగమ దేవర పూదోట బసవయ్య ప్రబోధించాడు.

ప్రశ్న 3.
తెలంగాణలో గొప్ప ‘అచల’ గురువు.
జవాబు:
దున్న ఇద్దాసు

ప్రశ్న 4.
ఇద్దాసు ఎవరి సమాధిని దర్శించాడు?
జవాబు:
కందిమల్లయ్యపల్లెలో ఉన్న ఈశ్వరాంబ సమాధిని దర్శించాడు.

ప్రశ్న 5.
దున్న ఇద్దాసు ఏఏ కోణాల్లో కన్పిస్తాడు?
జవాబు:
తత్త్వవేత్తగా, అచలునిగా, వీరశైవతత్త్వజ్ఞానిగా పలుకోణాల్లో కన్పిస్తాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

ప్రశ్న 6.
‘మాదిగ మహాయోగి’ అని ఇద్దాసును ఎవరు పేర్కొన్నారు?
జవాబు:
డా. బిరుదురాజు రామరాజుగారు

ప్రశ్న 7.
సాహసంతో గురుని చేరాక లభించేది ఏది?
జవాబు:
సోహము లభిస్తుంది.

ప్రశ్న 8.
కనురెప్పపాటులో పోయేది ఏమిటి?
జవాబు:
ప్రాణం, శరీరతత్త్వం.

IV. సందర్భ సహిత వ్యాఖ్యలు

ప్రశ్న 1.
సోహమే తన సొమ్మయా!
జవాబు:
పరిచయం :-
ఈ వాక్యము ‘దున్న ఇద్దాసు’చే రచించబడినది. దున్న విశ్వనాథం సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి” తత్వాలు అనుగ్రంథం నుండి గ్రహించబడింది.

సందర్భము :-
ఈ దేహం మనదికాదు మోహాన్ని విడువమని చెప్పిన సందర్భంలోనిది.

భావము :-
ఈ దేహం మనదికాదు. దానిమీద మోహాన్ని వదలిపెట్టండి. ప్రయత్నించి గురుసేవ చేసుకుంటే ఆత్మ పరమాత్మను చేరాక తప్పుతుందా! అని ఇందలి భావం.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

ప్రశ్న 2.
ఆనవాలు అంతు తెలియక ఆగమై పోతారయా!
జవాబు:
పరిచయము :-
ఈ వాక్యం ‘దున్న ఇద్దాసు’చే రచించబడినది. దున్న విశ్వనాథం సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్త్వాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.

సందర్భము :-
మానవులు జీవం యొక్క మూల తత్త్వాన్ని తెలుసుకోలేక పోతున్నారని తెలియచేసిన సందర్భంలోనిది.

భావము :-
ఓ నమః శివాయః అని రాస్తున్నాము గాని మన జీవిత అసలు ఆనవాళ్ళను తెలుసుకోలేకపోతున్నాము. అలా తెలిసికోలేక పోవటం వలన ఆగమైపోతున్నామని ఇందలి భావం.

ప్రశ్న 3.
మూల మెరిగిన గురునిచేత ముక్తి దొరకును మనకయా!
జవాబు:
పరిచయం :-
ఈ వాక్యము ‘దున్న ఇద్దాసు’ చే రచించబడినది. దున్న విశ్వనాథం “సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసు తత్వాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.

సందర్భము :-
మానవులు మంచి గురువును ఆశ్రయిస్తే ముక్తి దొరకుతుందని వివరించిన సందర్భంలోనిది.

భావము :-
ఎక్కడ వెదికినా ఏమీ కన్పించదు శూన్యం తప్ప. జ్ఞాననేత్రాన్ని తెరచి, దాని మూలాన్ని గ్రహించిన గురువును ఆశ్రయించిన మానవులకు మోక్షం లభిస్తుందని ఇద్దాసు చెప్పాడని ఇందలి భావం.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

ప్రశ్న 4.
కీలువదలిన బొమ్మవలెను నేలబడి పోతున్నది.
జవాబు:
పరిచయం :-
ఈ వాక్యము దున్న ఇద్దాసుచే రచించబడినది. దున్న విశ్వనాథం సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్త్వాలు అను గ్రంథం నుండి గ్రహించబడినది.

భావము :-
భార్యా, బిడ్డలు, ధనధాన్యాలు నావి నావారున భ్రమలో మానవులు ఉంటున్నారు. ఆ భ్రమ సత్యంకాదు. ఆ భ్రమలో ఉండగనే కీలువదలిన బొమ్మలాగా రాలిపోతున్నామని ఇందలి భావం.

V. సంధులు

1. మూలమెరిగిన
మూలము+ఎరిగిన = ఉ. కార సంధి. ఉత్వసంధి
సూత్రము :- ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధియగు

2. రాసేరుగాని
రాసేరు + కాని = గసడదవాదేశ సంధి
సూత్రము :- ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళముగానగు. ప్రథమావిభక్తి ప్రత్యయములనగా డు ము వు లు పరుషము లనగా క, చ, ట, త, ప, లు
డు ము వు ల కు, క చ ట త ప లు వస్తే అవి గ స డ ద వ లు గా మారతాయని భావం.

3. భ్రమజెందేరయా
భ్రమజెందేరు + అయా = ఉత్వసంధి / ఉ. కారసంధి
సూత్రము :- ఉత్తునకు అచ్చుపరం బగునపుడు సంధియగు

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

4. ఆగమైపోతారయా
ఆగము+అయిపోతారు+అయా = ఉత్వసంధి/ఉకారసంధి
సూత్రము :- ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు

5. పోతుందయా
పోతుంది + అయ = ఇత్వసంధి
సూత్రము :- ఏమ్యాదుల యిత్తునకు సంధివైకల్పికముగానను ఏమ్యాదులు అనగా ఏమి, మది,కి, షష్ఠి, అది, అవి, ఇది, ఇవి ఏది ఏవి మొదలగునవి.

6. నా దని
నాది + అని = ఇత్వసంధి
సూత్రము : ఏమ్యాదుల యిత్తునకు సంధిపై కల్పికముగానను.
ఏమ్యాదులు అనగా ఏమి, మరి, కి, షష్ఠి, అది, అవి, ఇది, ఇవి, ఏది, ఏవి మొదలగునవి.

7. ఎల్లి యెల్లక
ఎల్లి + ఎల్లక = యడాగమసంధి
సూత్రము :- సంధిలేని చోట స్వరంబుకంటెన్ పరంబైన స్వరంబునకుయట్, ఆగమముగానగు.

8. నేల బ్రడి
నేలన్+పడి = ద్రత సంధి (సరళాదేశ సంధి)
సూత్రము :- ద్రుత ప్రవృతికము మీద పరుషములకు సరళములగు. ద్రుతసంధి/సరళాదేశ సంధి

9. ఏడజ్రూచిన
ఏడన్ + చూచిన = ద్రత సంధి / సరళాదేశ సంధి
సూత్రము :- ద్రుత ప్రకృతికముల మీది పరుషములకు సరళములగు.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

10. సొమ్మయా
సొమ్ము + అయా = ఉత్వసంధి
సూత్రము :- ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు.

VI. సమాసాలు

1. ఆలు పిల్లలు = ఆలియును పిల్లలును – ద్వంద్వసమాసం
2. గురునిపాదము = గురునియొక్క పాదము – షష్ఠితత్పురుష సమాసం
3. బసవగురుడు = బసవ అనుపేరుగల గురుడు – సంభావనాపూర్వపద కర్మధారయము
4. కనురెప్ప = కనుయొక్కరెప్ప – షష్ఠీతత్పురుష సమాసం

అర్థతాత్పర్యములు

1వ పద్యం :

పల్లవి: దేహమైతే మనదిగాడు.
మోహములు విడువందయా
సాహసం బున గురుని జేరితే.
‘సోహమే తన సొమ్ముయా ||

అర్థాలు :
దేహము = శరీరము
మోహము = ప్రేమ, ఆకాంక్ష
సాహసంబున = ప్రయత్నపూర్వకంగా
గురుడు = శివ గురువు బసవన
సోహము = ఆత్మపరమాత్మ అన్న భావన
సొమ్మయా = సంపద

తాత్పర్యము :
ఈ దేహము శాశ్వతం కాదు. కనుక ఈ దేహంపై మోహాన్ని విడచిపెట్టాలి. మంచి శివ గురువును ఆశ్రయించి జీవన రాహిత్యాన్ని పొందాలి. అపుడేమోక్షం లభిస్తుంది. ఆత్మపరమాత్మలో లీనమౌతుంది అని ఇద్దాసు బోధించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

2వ పద్యం :

ఆలు పిల్లలు ధనము నాదని
“ఏల భ్రమ జెందేరయా
కీలు వదలిన బొమ్మవలెను
నేలబడిపోతున్నది.

అర్థాలు :
ఆలు = భార్య
పిల్లలు = సంతానం
ధనము = డబ్బు
భ్రమ = మాయ
కీలు = మూలము

తాత్పర్యము :
భార్యాబిడ్డలు ధన ధాన్యముల పట్ల మోహాన్ని వదలిపెట్టాలి. ఏదో ఒకనాటికి కీలు వదలిన బొమ్మలాగా ఈ దేహం పడిపోక తప్పదు. కనురెప్పపాటున ఇదంతా జరిగిపోతుందని ఇందలి భావం.

3వ పద్యం :

ఏప్పటికిని ముప్పులేదని
మెకృగసు మురిసేరయా!
చెప్పకు కనురెప్పపాటున
చెదరిపోతున్నాదయా!

అర్థాలు :
ఎప్పటికిని = ఏనాటికి
ముప్పు = ప్రమాదము
మొప్పుగా = గొప్పగా
మురిసేరయా = ఆనందిస్తారు
చెప్పకు = చెప్పకుండానే
కనురెప్పపాటున = కనురెప్పతెరచిమూసేలోపే
చెదరిపోతున్నది = చెల్లాచెదురవుతుంది.

తాత్పర్యము :
సంతోషంగా ఉన్నంతకాలం ఏ బాధలు బందీలు లేనంతకాలం మనకేం ప్రమాదం లేదని భావిస్తున్నాం. ఒకసారిగా కనురెప్పపాటున ఈ దేహాన్ని వదలివేయవలసి వస్తుందని ఇందలి భావం.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

4వ పద్యం :

ఓనమాలు రాసేరుగాని
ఆనవాలు రాయండయా!
ఆనవాలు అంతుతెలియక
ఆగమైపోతారయా!

అర్థాలు :
ఓనమాలు = ఓనామః శివాయః సిద్ధం నమః
రాసేరుగాని =రాస్తున్నారని
ఆనవాలు = జీవిత ఆనవాళ్ళన
తెలియక = తెలుసుకోలేక
ఆగమైపోతారయా = స్థిరత్వం లేకుండా పోతున్నారు.

తాత్పర్యం :
ఓనామః శివాయః సిద్ధం నమః అని వ్రాస్తున్నాము గాని మన జీవిత ఆనవాళ్ళను తెలుసుకోలేకపోతున్నాం. తీరా తెలుసుకునేసరికి అల్లరిపాలౌతున్నాం. మంచి చెడులను తెలుసుకొని మసలుకోవాలని ఇందలి భావం.

5వ పద్యం :

గురుడె బ్రహ్మం గురుడే విష్ణువు
గుర్తు తెలుసుకోండయా!
మేడమీద గురుని పాదము
కీలు తెలుసుకోండయా!

అర్థాలు :
గురుడె = గురువు
బ్రహ్మ = బ్రహ్మము
గురుడె = గురువు
విష్ణువు = విష్ణువు
మేడమీద గురుని పాదము = సహస్రార చక్రమునందున్న
కీలు = రహస్యము (పరబ్రహ్మ రహస్యము)
తెలుసుకోండయా = తెలుసుకొనుటకు ప్రయత్నించండి.

తాత్పర్యం :
ఈ లోకంలో గురువే బ్రహ్మం. గురవే విష్ణువు. మన దేహంలో షట్ చక్రాలు న్నాయి. మూలాధారం, స్వాధిస్థానం, అనాహతం, మణిపూరకం, విశుద్ధ, అజ్ఞా, సహస్రారం. వీటిలో చివరిది సహస్రారం. దానిని విచ్చుకునేలా చేయగలిగితే ఆ రహస్యాన్ని చేధించగలిగితే మోక్షాన్ని పొందగలం. దానిని తెలుసుకొని తరించండని ఇందలి భావం.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

6వ పద్యం :

ఏడజూచిన ఏమిలేదు.
జీడి కంటికి పొందయా
మూల మెరిగిన గురుని చేత
ముక్తి దొరకును మనకయా!

అర్థాలు :
చిన = ఎక్కడ వెతికినా
ఏమీలేదు = ఏమీ కన్పించదు
జీడికన్ను= అగ్నినేత్రం, జ్ఞాననేత్రం, ఆజ్ఞాచక్రం
మూలమెరిగిన = మూలాన్ని అంటే అధ్యాత్మిక మూలాన్ని
ఎరిగిన = తెలుసుకున్నా
ముక్తి = మోక్షము
దొరకును = లభిస్తుంది.

తాత్పర్యం :
ఎక్కడ వెతికినా ఏమీ కన్పించదు. అగ్ని నేత్రం, అజ్ఞాచక్రం, మూలాన్ని అంటే ఆథ్యాత్మిక మూలన్ని తెలుసుకున్న వానికి మోక్షము లభిస్తుంది.

7వ పద్యం :

వాసిగను ఇద్దాను చెప్పిన
మాట నిజమిది కనరయా!
భాసురంబుగా బసవగురుని
భావము మీరు గనరయా!

అర్థాలు:
వాసిగను = నాణ్యమైన
ఇ + దాసు = ఈ దాసుడు
చెప్పిన = పలికిన
మాట = పలుకు
నిజమిది = సత్యము
కనరయా = తెలుసుకోండయా
భాసురంబుగా = విశేషముగా
బసవగురుని = బసవగురుని యొక్క
భావము = ఆలోచనను
కనరయా = ఆచరించండి.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

తాత్పర్యం :
ఇద్దాసు చెప్పిన మాటలు నిత్యసత్యాలు. తప్పకుండా అనుసరింపతగినవి. వీరశైవ మతాచార్యుడైన బసవని ఆలోచనలను ఆచరించండి. తరించండి అని ఇందలి భావం.

అచలం Summary in Telugu

కవి పరిచయం

కవిపేరు : దున్న ఇద్దాసు అసలు పేరు ఈదయ్య
కాలం : 1811-1919 మధ్యకాలం
పుట్టిన ఊరు : నల్గొండజిల్లా చింతపల్లి గ్రామం
తల్లిదండ్రుల : దున్నరామయ్య, ఎల్లమ్మలు
రచనలు : తత్వాలు, మేలుకొలుపులు, మంగళహారతులు మాత్రమే కొన్ని లభిస్తున్నాయి. మొత్తం రచనలు 30 వరకు ఉన్నాయి.

దున్న ఇద్దాసు గొప్ప తత్త్వకవి, ప్రముఖ వాగ్గేయకారుడు ఈయన నల్గొంజిల్లా చింతపల్లి గ్రామంలో క్రీ॥శ 1811-1919 మధ్య కాలంలో జీవించారు. తల్లిదండ్రులు దున్న రామయ్య, ఎల్లమ్మలు. ఇతని అసలు పేరు ఈదయ్య. తత్వకారుడయ్యాక ఇద్దాసు అయ్యాడు. ప్రముఖ పరిశోధనకుడు డా. బిరుదు రాజు రామరాజు ఇద్దాసును “మాదిగ మహాయోగి” గా అభివర్ణించాడు.

ఇద్దాసు చింతపల్లి గ్రామంలో మోతుబరి ఇంటి పశువుల కాపరి. రోజూ బావి దగ్గర “మోటకొడుతూ” ఆనువుగా గీతాలను ఆలపించేవాడు. ఆ గీతాలను విన్న వరసిద్ధ జంగమదేవర “పూదోట బసవయ్య” ఇద్దాసు పంచాక్షరీ మంత్రోపదేశం చేశారు. లింగధారణ చేయించి శైవునిగా మార్చాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

అడవులలో సందరిస్తూ “రాజయోగాన్ని” ఏకాంతంలో సాధన చేశాడు. దానితో ఆయన అష్టసిద్ధులను పొందాడు. పూర్వతాత్విక కవులైన శివరామదీక్షితులు, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, ఈశ్వరాంబల ప్రభావం ఇద్దాసుపై ఉంది. ఈయన ఈశ్వరాంబ సంప్రదాయాన్ని అనుసరించాడు. ఆమె సమాధి సందర్శనకు ఇద్దాసు కందిమల్లయ్యపల్లెను దర్శించాడు.

ఇద్దాసు వేమనలా తత్త్వవేత్తగా, అచలుడిగా వీరశైవ తత్త్వ జ్ఞానిగా కన్పిస్తాడు. పఠేల్, పట్వారీలు ఇద్దాసుకు శిష్యులయ్యారు. సంచార యోగిగా నల్గొండ నుండి మహబూబ్ నగర్ వరకు తిరుగుతూ అధ్యాత్మికతను ప్రచారంచేశాడు. అచ్చంపేట తాలూకాలోని అయ్యవారిపల్లి, పోలేపల్లి, ఆవులోని బాయి మొదలగు చోట్ల ఈశ్వరమ్మ పీఠాలను స్థాపించాడు.

ఇద్దాసు 30కి పైగా తత్వాలను మేలుకొలుపులను, మంగళహారతులను రచించాడు. ప్రస్తుత పాఠ్యభాగం దున్న విశ్వనాథం సంపాదకత్వంలో వచ్చిన “శ్రీ దున్న ఇద్దాసు తత్త్వాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.

పాఠ్యాంశ సందర్భం.

దున్నఇద్దాసు తత్త్వాలు ఆత్మపరంగా, తత్త్వపరంగా తెలంగాణ మట్టి నుండి పుట్టిన మాణిక్యాలు. వేదాంతశాస్త్రాల జ్ఞానాన్ని సామాన్య ప్రజలలోకి తీసుకువెళ్ళి ఆథ్యాత్మిక సుగంధాలను ఇద్దాసు లోకంలో వెదజల్లాడు. తెలంగాణ పద సంకీర్తనా కవులలో కలికి తురాయి ఇద్దాసు. వేదాంత తాత్వికాంశాలను విద్యార్థులకు పరిచయం చేయటం ఈ పాఠ్యభాగ ఉద్దేశం.

పాఠ్యభాగ సారాంశం

అచలం అను పాఠ్యభాగం ‘దున్న ఇద్దాసు’చే రచించినబడినది. ఈ పాఠ్యభాగం దున్న విశ్వనాథం సంపాదకత్వంలో వెలువడిన శ్రీ దున్న ఇద్దాసు గారి తత్వాలు నుండి గ్రహించబడింది. తెలంగాణ పద సంకీర్తన కవులలో “ఇద్దాసు” కలికి తురాయి.

ఇద్దరు తలు ఆత్మపరంగ, తత్వపరంగ, తెలంగాణ నుండి పుట్టిన మాణిక్యాలు. వేదాంత శాస్త్రజ్ఞాన సారాంశాన్ని సామాన్య ప్రజలకు ఈయన అందించాడు. వేదాంత తాత్విక అంశాలను పరిచయం చేయడం ఈ తత్వాల ఉద్దేశ్యం.

ఈ దేహం శాశ్వతం కాదు. కనుక ఈ దేహంపై మోహం విడచిపెట్టాలి. మంచి గురువును ఆశ్రయించి జీవనరాహిత్యాన్ని పొందటానికి ప్రయత్నించాలి. అపుడే మోక్షాన్ని పొందగలుగుతాము. భార్యాబిడ్డలు, ధన ధాన్యాల పట్ల మోహాన్ని వదలిపెట్టాలి. ఏదో ఒకనాటికి కీలు వదలిన బొమ్మలా ఈ దేహం రాలిపోకతప్పదు”.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

ఓ నామః అని అక్షరాలు రాస్తున్నాం నేర్చుకుంటున్నాం కాని, మన జీవిత ఆనవాళ్ళనుతెలుసుకోలేకపోతున్నాం. దాని అంతం తెలియక అల్లరి పాలు అవుతున్నాం. మంచి చెడులను తెలుసుకుని మసలుకోవాలని ఇద్దాసు పలుకుతున్నారు.

ఈ లోకంలో గురువే బ్రహ్మ, గురువే విష్ణువు. దీనిని మనం గమనించాలి. మన దేహంలో షట్ చక్రాలుంటాయి. సహస్రారం శిరస్సుపై ఉంటుంది. అదే చివరి చక్రం. దానిని తెరుచుకోగలిగే శక్తిని పొందితే, ఆ రహస్యం అంతం చిక్కితే అది మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఆజ్ఞాచక్రంమును పొందండి తరించండి.

ఈ లోకం అంతా శూన్యం. ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ఎక్కడ వెతికినా ఏమీ కన్పించదు. మనం జీడికంటి వంటి జ్ఞాన నేత్రాన్ని తెరచి చూసుకోవాలి. అపుడే ముక్తిమూలాలు అర్థమౌతాయి.
ఈ దాసు చెప్పిన మాటలు సత్యములు. అందరూ అనుసరింపదగినవి. వీరశైవ మత మత గురువైన బసవని యొక్క భావాలను అర్థం చేసుకుని ప్రవర్తించండి. అపుడే జీవన సాఫల్యం జరుగుతుంది.

TS Inter 1st Year Commerce Study Material Chapter 12 Emerging Trends in Business

Telangana TSBIE TS Inter 1st Year Commerce Study Material 12th Lesson Emerging Trends in Business Textbook Questions and Answers.

TS Inter 1st Year Commerce Study Material Chapter 12 Emerging Trends in Business

Long Answer Questions

Question 1.
Define e-business and explain the nature and scope of e-business.
Answer:
E-business means “Electronic business”. The term “E-business”, was first used by IBM in 1997, it defined E-business as, “The transformation of key business processes through the use of internet technologies”.

“e-business” is defined as the application of information and communication technologies (ICT) that support all the activities and realms of business. E-business focuses on the use of ICT to enable the external activities and relationships of the business with customers. The term “E-business” refers to the integration of business tools, based on ICT to improve the function of the company.

Scope of E-Business:
The scope of E-commerce is to transact online. Transaction online can be either on products or services.

E-business can be divided into the following areas. They are:
a) Within the organization
b) Business – to – Business (B2B) dealings
c) Business – to – Customer (B2C) transactions
d) Customer – to – Customer (C2C)
e) Customer – to – Business (C2B) and
f) Business – to – Government (B2G).

a) E-business within the organization.

b) B2B refers to exchange of products and services by one business enterprise to another business enterprise.
Ex: India mart, Trade India, Ali baba etc.

c) B2C business refers to an exchange of products and services from a business to a customer.
Ex: Amazon.com, Netflix.com, Sulekha.com etc.

d) C2C here customers offer their products online to be bought by other customers.
Ex: OLX, Quicker etc.

e) C2B is a business model in which consumers (individuals) offer products and services to companies and the companies pay them.
Ex: Online Advertising sites like Google Ad sense, affiliation platforms like commission junction and affiliation programs like Amazon.

f) B2G refers to Business-to-Government, e – commerce is generally defined as commerce between companies and the Government or public sector enterprises. It refers to the use of the Internet for public procurement, Licensing procedures, and other government-related operations.
Ex: Business pay taxes, file reports, or sell goods and services to Government.

Scope of E-Business:
The scope of e-business in discussed in terms of the following broad elements, viz:
1) e-commerce: Transacting or facilitating business through internet is called e-commerce. E-commerce is short form of “Electronic Commerce”, i.e, selling and buying products or services online. Any form of business transaction conducted electronically by. using internet is called e-commerce.

2) e-auctioning: In e-auctioning individuals who want to participate in the auction visit the website with a click and go through the details of goods offered or kept in auction in concerned web pages and participate in auction without sacrificing their personal time.

3) e-banking: Electronic banking is one of the most successful online business. E-banking allows customers to access their accounts and execute orders through use of website. Online banking allows the customers to get their money from an Automated Teller Machine (ATM). Then they can view their accounts, transfer funds, deposit amount and can pay bills.

4) m-banking: Another emerging trend in e-banking operations m-banking known as mobile banking. Customer can perform all most all e-commerce operations by using their Mobile phones. All most all e-commerce portals developed their apps to enable the customers to buy their products / services by using these apps.

5) e-marketing: Electronic marketing provides a Worldwide platform for buying and selling of goods without having any geographical barriers. The internet allows companies to react to individual customer demands immediately without any loss of time.

6) e-trading: E-trading is also known as “online trading” or “e-broking”. It is used for buying and selling stocks in stock exchanges.
Ex: Money conrol.com

Question 2.
Explain the benefits of e-business.
Answer:
E-business has many advantages which can be broadly classified into the following categories.
A. Benefits to consumer:
1) Convenient shopping: e-business enables customers to shop or do any transactions 24 hrs a day, round the year from almost any location as per their convenience.

TS Inter 1st Year Commerce Study Material Chapter 12 Emerging Trends in Business

2) Wider choices: e-business enables the customers to have more choices or more alternative products and services online.

3) Price Advantage: e-business provides customers with less expensive products and services by allowing them to shop in many places and conduct quick comparisions. E-business facilities competition which results in substantial price advantages.

4) Exchange of information: E-business allows the customers to interact with other customers and exchange business ideas, opinions and experiences about the products / services which are available at different online portals.

B) Benefits to Business Organization:
1) Reach beyond boundaries: E-business enables the organizations to extend the organizations to extend their market place to national and international markets and there by increase their sales / revenues with limited time span.

2) Cost Savings: Reduces the cost of creating, processing, distributing,, storing and retrieving information. Further, it allows reduced inventories and overheads cost.

3) Competitive Advantage: E-business enables the customer to compare the chosen products / services with all available competitor products / services. This helps in reduced processing time allows for customization of products and services for achieving competitive advantages.

4) Shortens Recovery of capital Invested: E-business reduces the time between the outlay of capital and the receipt of products and services.

C) Benefits to Society:
1) Environmental Benefits: Since customers can buy their required products/services online with a click of button either from their place of work or home, without moving to the shops physically. This results in reduced traffic congestion, air and sound pollution.

2) Public Welfare: E-business allows some merchandise to be sold at lower prices benefiting the poor people.

3) Availability Products: Due to e-business, abundant. Varieties of products / services are available to the customers according to their choices and preferences. Similarly, customers can have access to their desired products / services which are available at any comer of the world.

Question 3.
Explain the opportunities of business enterprises in 21st century.
Answer:
The following are the opportunities of business enterprises in 21st century.
1) LPG: The economic reforms initiated in the form of liberalization, privatization and Globalization (LPG) have brought structural changes which ultimately created favourable environment for business enterprises in India.

2) Increasing size and diversification: The 21 century business enterprises are large sized and highly diversified organizations. Due to large size and increased output, companies are able to reduce their costs and their by increase in profits.

3) Increasing per capital Income: India has emerged as the third largest economy globally with a high growth rate with its improved per capita Income. As India’s per capital income is increasing, the business opportunities are also increasing in India.

4) Market Economies: The India economy being one of the largest economics in the world with a population of more than 1.2 billion is flourishing and attracting industrial, trade and service sectors all around the world.

5) E-commerce – A gate way to global markets: Business enterprises across the globe are discovering the benefits of electronic commerce. Improved cash flow, customer retention, and service satisfaction are few of the benefits gained from e-commerce.

6) Technological advance merits: 21st century business enterprises are able to use ultramodern technology with the advancement of technology organizations are able to offer services, which are relevant, cost effective and compatible with society’s needs.

7) Expansion of financial services: In 21st century the financial services like Banking, insurance, debt and equity financing, micro finance sectors helping the people to save money and to get liberal credit for their future needs. It resulted in widering of business expansion opportunities.

8) Growing mergers, acquisitions and foreign collaborations: Mergers and acquisitions is a strategy of modem business enterprises for improving innovation / profitability, market share and stock prices.

9) Scope for International business: In 21st century, many organizations are globalizing business in terms of manufacturing, service delivery, capital sourcing or talent acquisition as a defensive strategy. These are discovering a new business opportunities in more than one country.

10) Government support and encouragement: Governments both at state and central level are encouraging new innovative business opportunities by introducing new pro-grams like startup, stand up and make in India.

Question 4.
Explain the challenges of business enterprises in 21st century.
Answer:
The following are the challenges of business enterprises in 21st century.
1) Threat for technology: Rapid change in technology has been a great threat for the business enterprises in terms of cost and time. Business organizations have to adopt themselves in tune with the changing technology and modernize their plant and equipment and processes, unless and otherwise they will become outdated in the market place.

TS Inter 1st Year Commerce Study Material Chapter 12 Emerging Trends in Business

2) Growing consumer awareness: Consumers are awareness about the products and services. Business need to respond the consumer demand to gain customers, otherwise, they lose their market share.

3) Challenges of Globalization: As MNCs are dominating the world markets, it is the question of survival to the local business. This gives rise to increased global competition and increased prices of goods and services.

4) Depleting Natural Resources: Most of the manufacturing enterprises depend upon certain natural resources. Such as minerals, metals, forests, fish etc. which are depleted and they are in danger of vanishing from the planet. This will have a direct impact on the growth of future business enterprises.

5) Economic Recession: International economic and political order has been changing throughout the globe. Economic recession took place in united states and europe is slowly spreading over to other countries also.

6) Environmental challenges: Environmental considerations are one of the biggest challenges of business organisations facing Economic, social, political, legal, technological environments have been changing rapidly. It affecting business enterprises in 21st century.

7) Corruption and Bureaucratic Hurdles: Corruption is a very big hurdle for doing business particularly in India. Corruption is a barrier to the effective development of any sector and poses business risks.

8) Foreign exchange Risk: Foreign exchange risk is another factor causing instability in the running of organizations. Exchange rates, amount of exports and imports and political factors are also affect the Business.

9) Security Issues: Security threats to business can happen in various forms like information security, internet security, physical security, wireless Access to the company network, risk management, insider threat, privary laws etc.

10) Human Resource challenges: One of the biggest challenges of 21st century business is Human Resource – finding the right staff, training and retaining them are concerns of the HR function.

In 21st century, managers must understand the cultures around the world and operate at global level.

Short Answer Questions

Question 1.
Explain the scope of e – business.
Answer:
The scope of e-business is discussed in terms of the following broad elements, viz:
1) e-commerce: Transacting or facilitating business through internet is called e-commerce. e-commerce is short form of “Electronic Commerce”, i.e., selling and buying products and/or services online. Any form of business transaction conducted electronically by using internet is called e-commerce.

2) e-auctioning: In e-auctioning individuals who want to participate in the auction visit the website with a click and go through the details of goods offered or kept in auction in concerned web pages and participate in auction without sacrifing their personal life.

3) e-banking: Electronic banking is one of the most successful online businesses e-banking allows customers to access their accounts and execute orders through use of website. Online banking allows the customers to get their money from an Automated Teller Machine (ATM). They can view their accounts, transfer funds, deposit amount and can pay bills.

4) m-banking: Another emerging trend in e-banking operations is m-banking known as mobile banking. Customer can perform all most all e-commerce operations by using their mobile phones. All most all e-commerce portals developed their apps to enable the customers to buy their products / services by using these apps.

5) e-marketing: Electronic marketing provides a world wide platform for buying and selling of goods without having any geographical barriers. The internet allows companies to react to individual customer demands immediately without any loss of time.

6) e-trading: e-trading is also known as “online trading” or “e-broking”. It is used for buying and selling stocks in stock exchanges.
Ex: Money conrol.com

Question 2.
What are the benefits of e-business to business organisations?
Answer:
The benefits of e-business to business organisation.
1) Reach beyond boundaries: e-business enables the organizations to extend their market place to national and international markets and thereby increase their sales/revenues with limited time span.

TS Inter 1st Year Commerce Study Material Chapter 12 Emerging Trends in Business

2) Cost savings: Reduces the cost of creating, processing, distributing, storing and retrieving information. Further, it allows reduced inventories and overheads cost.

3) Competitive Advantage: E-business enables the customer to compare the chosen products/services with all available competitor products/ services. This helps in reduced processing time allows for customization of products and services for achieving competitive advantages.

4) Shortens Recovery of capital Invested: E-business reduces the time between the outlay of capital and the receipt of products and services.

Question 3.
What are the benefits of e-business to customers?
Answer:
The benefits of e-business to customers are:
1) Convenient shopping: e-business enables customers to shop or do any transactions 24 hrs a day, round the year from almost any location as per their convenience.

2) Wider choices: E-business enables the customers to have more choices or more alter-native products and services online.

3) Price Advantage: E-business provides customers with less expensive products and services by allowing them to shop in many places and Conduct Quick Comparisions. E-business facilitated Competition which results in substantial price advantages.

4) Exchange of Information: E-business allows the customers to interact with other customers and exchange business ideas, opinions and experiences about the products/ services which are available at different online portals.

Question 4.
What are the benefits of e-business to Society?
Answer:
The benefits of e-business to society
1) Environmental Benefits: Since customers can buy their required products/services online with a click of button either from their place of work or home, without moving to the shops physically. This results in reduced traffic congestion, air and sound pollution.

2) Public welfare: e-business allows some merchandise to be sold at lower prices benefiting the poor people.

3) Availability products: Due to e-business, abundant varieties of products/services are available to the customers according to their desired products/services which are available at any comer of the world.

TS Inter 1st Year Commerce Study Material Chapter 12 Emerging Trends in Business

Very Short Answer Questions

Question 1.
e-Business.
Answer:
1) The term “E-business” refers to the integration of business tools based on ICT to improve the following of the company.

2) E-business means Electronic Business. The term e-business was first used by IBM in 1997, it defined E-business as, “the transformation of key business processes through the use to internet technologies”.

Question 2.
e-Ban king.
Answer:
1) Performing all banking operations by using internet is known as “E-banking”. It is also called “Online Banking”.

2) Online banking allows the customers to get their money from an Automated Teller Machine (ATM). They can view their accounts, transfer funds, deposit amount and can pay bills.

Question 3.
e-Commerce.
Answer:
1) Transacting or facilitating business through internet is called E-Commerce.

2) E-commerce revolve around buying and selling online. But the E-Commerce universe contains other types of activities as well. Any form of Business transaction conducted electronically is E-commerce.

Question 4.
e-Auctioning.
Answer:
1) The internet enables people to participate in the auction without sacrificing their personal time.

2) In E-Auctioning the people, who want to participate in the auction, visit the website with a click and go through the details of goods offered or kept in the auction concerning web pages and participate in the auction. Ex: Bank auctioneers tenders.

TS Inter 1st Year Commerce Study Material Chapter 12 Emerging Trends in Business

Question 5.
e-Trading.
Answer:
1) E-trading is also known as “Online trading” or E-broking.
2) It is used for buying and selling stocks in stock exchanges.
For example Money conrol.com.

Question 6.
e-Marketing.
Answer:
1) Performing all marketing functions like buying selling, advertisement, etc., by electronic media is called “E-marketing”.

2) The Internet allows companies to react to individual customers’ demands immediately without any loss of time. It does not matter where the customer is located. It can be done by e-mail etc.

Question 7.
Foreign exchange risk.
Answer:
1) Foreign exchange risk is also known as “Exchange rate risk” or “Currency risk”.

2) It is a financial risk that exists when a financial transaction is denominated in a currency other than that of the base currency of the company.

3) This risk arises due to variations in the exchange rates in the foreign exchange market.