TS Inter 1st Year Political Science Study Material Chapter 10 రాజ్యాంగం

Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 10th Lesson రాజ్యాంగం Textbook Questions and Answers.

TS Inter 1st Year Political Science Study Material 10th Lesson రాజ్యాంగం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
రాజ్యాంగాన్ని నిర్వచించి, రాజ్యాంగం యొక్క లక్షణాలను వివరించండి.
జవాబు.
పరిచయం :
ఆధునిక కాలంలో ప్రతి రాజ్యానికి ఒక రాజ్యాంగముంటుంది. రాజ్యాంగంలో రాజ్యానికి సంబంధించిన అన్ని వ్యవస్థల అధికారాలు, విధులు మొదలైన విషయాలను స్పష్టంగా, నిర్దిష్టంగా, క్లుప్తంగా తెలియజేయడం జరుగుతుంది. రాజ్యానికి సంబంధించిన వ్యవహారాలు క్రమబద్ధంగా జరగడానికి రాజ్యాంగం చాలా ముఖ్యం.

అర్థం :
Constitution అనే ఇంగ్లీషు పదం “Constitutio” అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. లాటిన్ భాషలో కాన్స్టిట్యూషియో. అంటే “స్థాపించు” అని అర్థం.

నిర్వచనాలు :

  1. అరిస్టాటిల్ : “రాజ్యంలో అత్యున్నతమైన పదవులతో సహా అన్నింటిని క్రమబద్ధంగా ఏర్పాటు చేసేదే రాజ్యాంగం”.
  2. లార్డ్ బ్రైస్ : “ప్రభుత్వం పనిచేసే విధానాన్ని తెలిపే నిర్దిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం”.
  3. స్టీఫెన్ లీకాక్ : “రాజ్యాంగం అంటే ప్రభుత్వరూపం”.

“రాజ్యాంగం మౌలిక లక్షణాలు (Essential features of the Constitution) :
సాధారణంగా రాజ్యాంగాన్ని రాజ్యంలోని ప్రముఖ వ్యక్తులు, ప్రజాప్రతినిధులు, విషయ నిపుణులు మొదలైనవారు రూపొందిస్తారు. ప్రతి రాజ్యాంగానికి కొన్ని మౌళిక లక్షణాలు ఉంటాయి. వాటిని క్రింది విధంగా వివరించవచ్చు :

1. పీఠిక (Preamble) :
ప్రతి రాజ్యాంగం ఒక పీఠికను కలిగి ఉంటుంది. ఆ పీఠిక రాజ్యాంగ లక్ష్యాలు, ఆకాంక్షలను వ్యక్తీకరిస్తుంది. పీఠిక రాజ్యాంగానికి ఆత్మగా ఉంటుంది. కాబట్టి రాజ్యాంగపు ఆవశ్యక లక్షణాలలో పీఠిక అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించవచ్చు.

2. స్పష్టత (Clarity) :
స్పష్టత అనేది రాజ్యాంగపు మరొక ఆవశ్యక లక్షణం. రాజ్యపాలన, ప్రభుత్వ విధానాలను రాజ్యాంగం స్పష్టంగా వివరిస్తుంది. రాజ్యాంగం’ ఎంతో సులభశైలిలో, స్పష్టమైన భాషలో లిఖించబడి ఉంటుంది.

కాబట్టి రాజ్యాంగంలోని వివిధ అంశాలను అర్థం చేసుకోవడంలో ఏ రకమైన సందేహాలకు గానీ, అస్పష్టతకు గానీ అవకాశం ఉండదు. సమాజంలోని అన్ని వర్గాలకు ఎంతగానో సంతృప్తిని కలిగిస్తుంది. సుదీర్ఘ చర్చలు, సంప్రదింపులు తరువాతే రాజ్యాంగ రూపకల్పన జరుగుతుంది.

3. ప్రాథమిక హక్కులు (Fundamental Rights) :
ప్రతి రాజ్యాంగం కొన్ని ప్రాథమిక హక్కులను కలిగి ఉంటుంది. ప్రాథమిక హక్కులనేవి పౌరుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను పరిరక్షించుటకు ఉద్దేశించినవి. విభిన్న రంగాలలో పౌరులు తమ వ్యక్తిత్వాలను పెంపొందించుకొనేందుకు ఈ హక్కులు వీలు కల్పిస్తాయి. రాజ్యంలో పౌరులు సంతోషకరమైన, గౌరవప్రదమైన జీవనాన్ని గడిపేందుకు ఇవి సహాయపడతాయి.

4. క్లుప్తత (Brevity) :
క్లుప్తత అనేది రాజ్యాంగపు లక్షణాలలో ముఖ్యమైనది. రాజ్యాంగ అంశాలను అర్థం చేసుకోవడంలోను వాటిని వ్యాఖ్యానించడంలోనూ వ్యక్తులలో గందరగోళాన్ని నివారిస్తుంది. రాజ్యాంగంలో అనవసర అంశాలు చేర్చబడవు. కాబట్టి రాజ్యాంగం అనేది క్లుప్తంగా ఉంటుంది. అందులో మితిమీరిన సంఖ్యలో ప్రకరణలు, అధికరణలు, ఇతర నిబంధనలు ఉండవు. రాజ్యాంగంలో లెక్కకు మించిన వివరణలు ఉంటే వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

5. సరళత్వం (Flexibility) :
ప్రజల ఆకాంక్షలను ఎప్పటికప్పుడు గ్రహించి, వాటిని ఆచరణలో పెట్టేందుకు రాజ్యాంగం సరళమైనదిగా ఉండాలి. అవసరమైనప్పుడు రాజ్యాంగంలోని ప్రకరణలను సవరించే వీలు ఉండాలి. అయితే రాజ్యాంగంలోని అంశాలను పలుసార్లు సవరించకూడదు.

అప్పుడే రాజ్యాంగస్ఫూర్తి పదిలంగా ఉంటుంది. ‘ అలాగే ఆధునిక రాజ్యాలలో రాజ్యాంగంలోని అంశాలను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సవరించేందుకు అవకాశం ఉండాలి. అనుభవజ్ఞులు, మేధావులు రాజ్యాంగంలోని దోషాలను వెల్లడించినప్పుడు, వాటిని రాజ్యాంగం నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి.

6. శాశ్వతత్వం (Permanence) :
రాజ్యాంగం ముఖ్య లక్షణాలలో శాశ్వతత్వం ఒకటి. మొత్తం జాతి సంక్షేమం దృష్ట్యా రాజ్యాంగం సుదీర్ఘకాలంపాటు పనిచేసే విధంగా కొన్ని విలువలు కలిగి ఉండాలి. ఎందుకంటే రాజ్యాంగమనేది రాజ్యంతో సహా అనేక రాజకీయ సంస్థల నిర్మాణానికి – విధులకు ప్రతీకగా ఉంటుంది. ప్రజల ఆచార సంప్రదాయాలను రాజ్యాంగం గౌరవిస్తూ సామాజిక విలువలతో మమేకమై ఉండాలి.

7. రాజ్యాంగ సవరణ పద్ధతి (Mode of Amendment) :
రాజ్యాంగంలోని అంశాలను సవరించే పద్ధతిని ప్రతి రాజ్యాంగం సూచిస్తుంది. రాజ్యాంగం రాజ్యంలో నెలకొనే సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. రాజ్యాంగ అంశాల సవరణ పద్ధతుల గురించి రాజ్యాంగంలో ప్రత్యేక అధ్యాయంలో వివరించటం జరుగుతుంది.

సాధారణంగా రాజ్యాంగ అంశాలను మూడు రకాలుగా సవరించవచ్చు. అవి :

  1. కఠినమైన చర్య పద్ధతి
  2. సరళమైన పద్ధతి
  3. పాక్షిక కఠినమైన, పాక్షిక సరళమైన పద్ధతి.

మొత్తం మీద ప్రతి రాజ్యాంగంలో సరళమైన, కఠినమైన సవరణ పద్ధతులు రెండూ ఉంటాయి. పర్యవసానంగా రాజ్యంలో ప్రభుత్వం స్థిరత్వం కలిగి ఉంటూ అందరి ఆమోదాన్ని పొందగలుగుతుంది. రాజ్యాంగంలోని సరళమైన, కఠినమైన సవరణ పద్ధతులు రెండూ రాజకీయ వ్యవస్థ సాఫీగా, సమర్థవంతంగా పనిచేసేటట్లు దోహదపడతాయని అనేక మంది రాజ్యాంగవేత్తలు వర్ణించారు.

8. వివరణాత్మకమైనది (Explanatory):
రాజ్యాంగం వివరణాత్మకమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. అదే విధంగా ప్రజలకు, ప్రభుత్వానికి, రాజ్యానికి సంబంధించిన అనేక అంశాలను రాజ్యాంగంలో ప్రస్తావించి చర్చించడమవుతుంది. రాజ్యనిర్మాణం, దాని కార్యకలాపాల పరిధి, విధులకు సంబంధించి ప్రత్యేకంగా రాజ్యాంగంలో పేర్కొనడం జరుగుతుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 10 రాజ్యాంగం

ప్రశ్న 2.
రాజ్యాంగాన్ని నిర్వచించి దృఢ – అదృఢ (సరళ) రాజ్యాంగాల మధ్యగల తేడాలను పేర్కొనండి.
జవాబు.
నిర్వచనం :

  1. అరిస్టాటిల్ : “రాజ్యంలో అత్యున్నతమైన పదవులతో సహా అన్నింటిని క్రమబద్ధంగా ఏర్పాటు చేసేదే రాజ్యాంగం”.
  2. లార్డ్ బ్రైస్ : “ప్రభుత్వం పనిచేసే విధానాన్ని తెలిపే నిర్దిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం”.
  3. స్టీఫెన్ లీకాక్ : “రాజ్యాంగం అంటే ప్రభుత్వరూపం”.

దృఢ రాజ్యాంగం (లేదా) పరుష రాజ్యాంగం :
రాజ్యాంగంలోని అంశాలను అంత సులభంగా సవరించడం సాధ్యంకాని రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగం అంటారు. ‘దృఢ రాజ్యాంగం అమలులో ఉన్న రాజ్యాలలో సాధారణ చట్టాల తయారీకి, రాజ్యాంగ చట్టాల రూపకల్పనకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది.

దృఢ రాజ్యాంగంలోని ‘అంశాలను సవరించేందుకు ప్రత్యేకమైన పద్ధతిని అనుసరించడం జరుగుతుంది. రాజ్యాంగ అంశాల సవరణలో దృఢ రాజ్యాంగం ఎంతో కాఠిన్యతను ప్రదర్శిస్తుంది. దృఢ రాజ్యాంగానికి అత్యుత్తమ ఉదాహరణగా అమెరికా రాజ్యాంగాన్ని పేర్కొనవచ్చు. అమెరికాతో పాటుగా ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ వంటి రాజ్యాలలో దృఢ రాజ్యాంగాలు వాడుకలో ఉన్నాయి.

సరళ లేదా అదృఢ రాజ్యాంగం :
రాజ్యాంగంలోని అంశాలను అతిసులభంగా మార్చేందుకు అవకాశం ఉన్నట్లయితే దానిని అదృఢ రాజ్యాంగం అంటారు. అదృఢ రాజ్యాంగంలోని అంశాల సవరణకు ప్రత్యేక రాజ్యాంగ సవరణ పద్ధతిని అనుసరించాల్సిన అవసరం లేదు.

సాధారణ చట్టాల వలె రాజ్యాంగంలోని అంశాలను సైతం సవరించే వీలు ఉంటుంది. అందువల్ల అదృఢ రాజ్యాంగంలో సాధారణ చట్టాలు, రాజ్యాంగ చట్టాల మధ్య ఎటువంటి వ్యత్యాసం ఉండదు. అదృఢ రాజ్యాంగాలనేవి ప్రాచీన కాలంలో వాడుకలో ఉండేవి. అదృఢ రాజ్యాంగానికి బ్రిటన్ మంచి ఉదాహరణ.

సరళ లేదా అదృఢ మరియు దృఢ లేదా పరుష రాజ్యాంగాల మధ్య వ్యత్యాసాలు :

సరళ లేదా అదృఢ రాజ్యాంగం (Flexible constitution)పరుష లేదా దృఢ రాజ్యాంగం (Rigid Constitution)
1. రాజ్యాంగంలోని అంశాలు స్పష్టంగా పేర్కొనడం జరగదు.1. రాజ్యాగంలోని అంశాలు స్పష్టంగా పేర్కొనడం జరుగుతుంది.
2. రాజ్యాంగాన్ని సులభంగా సవరించవచ్చు.2. రాజ్యాంగాన్ని సవరించేందుకు కఠినమైన పద్ధతి ఉంటుంది.
3. ప్రజల హక్కులు, స్వేచ్ఛా స్వాతంత్య్రాలను న్యాయ శాఖ కాపాడగలుగుతుంది.3. ప్రజల హక్కులు, స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను న్యాయశాఖ కాపాడలేకపోవచ్చు.
4. ఇది సమాఖ్య రాజ్యానికి సరైనది కాదు.4. ఇది సమాఖ్య రాజ్యానికి సరైనది.
5. ఇది న్యాయసమీక్షకు అవకాశం ఇవ్వదు.5. ఇది న్యాయసమీక్షకు అవకాశం ఇస్తుంది.
6. ఈ రాజ్యాంగంలో శాసనసభకు అపరిమితమైన అధికారాలు ఉంటాయి.6. శాసనసభ అధికారాలు పరిమితంగా ఉంటాయి.
7. ఇది మిక్కిలి అస్థిరమైనది.7. ఇది ఎంతో స్థిరత్వంతో కూడుకొని ఉంటుంది.
8. రాజ్యాంగ చట్టాలకు, సాధారణ చట్టాలకు మధ్య ఎటువంటి వ్యత్యాసం ఉండదు.8. రాజ్యాంగ చట్టాలు, సాధారణ చట్టాల మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది.
9. రాజ్యంలో ఒకేరకమైన చట్టాలు ఉంటాయి.9. రాజ్యంలో రెండు రకాల చట్టాలు ఉంటాయి. అవి : 1) రాజ్యాంగ చట్టాలు, 2) సాధారణ చట్టాలు. రాజ్యాంగ చట్టాలు సాధారణ చట్టాలపై ఆధిక్యతను కలిగి ఉంటాయి.
10. రాజకీయ పురోగతి సాధించిన రాజ్యాలకు అదృఢ రాజ్యాంగం అనువైనది.10. అభివృద్ధి చెందుతున్న రాజ్యాలకు దృఢ రాజ్యాంగం అనువైనది.
11. విప్లవాలకు వీలు కల్పించదు.11. విప్లవాలకు అవకాశం ఇస్తుంది.
12. చిన్న రాజ్యాలకు తగినది.12. పెద్ద రాజ్యాలకు సరైనది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 10 రాజ్యాంగం

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
రాజ్యాంగాన్ని నిర్వచించి, దాని లక్షణాలను పేర్కొనండి.
జవాబు.
నిర్వచనాలు :

  1. అరిస్టాటిల్ : “రాజ్యంలో అత్యున్నతమైన పదవులతో సహా అన్నింటిని క్రమబద్ధంగా ఏర్పాటు చేసేదే రాజ్యాంగం”.
  2. లార్డ్ బ్రైస్ : “ప్రభుత్వం పనిచేసే విధానాన్ని తెలిపే నిర్దిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం”.
  3. స్టీఫెన్ లీకాక్ : “రాజ్యాంగం అంటే ప్రభుత్వరూపం”.

రాజ్యాంగం మౌలిక లక్షణాలు (Essential features of the Constitution) :
సాధారణంగా రాజ్యాంగాన్ని రాజ్యంలోని ప్రముఖ వ్యక్తులు, ప్రజాప్రతినిధులు, విషయ నిపుణులు మొదలైనవారు రూపొందిస్తారు. ప్రతి రాజ్యాంగానికి కొన్ని మౌళిక లక్షణాలు ఉంటాయి. వాటిని క్రింది విధంగా వివరించవచ్చు :

1. పీఠిక (Preamble) :
ప్రతి రాజ్యాంగం ఒక పీఠికను కలిగి ఉంటుంది. ఆ పీఠిక రాజ్యాంగ లక్ష్యాలు, ఆకాంక్షలను వ్యక్తీకరిస్తుంది. పీఠిక రాజ్యాంగానికి ఆత్మగా ఉంటుంది. కాబట్టి రాజ్యాంగపు ఆవశ్యక లక్షణాలలో పీఠిక అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించవచ్చు.

2. స్పష్టత (Clarity) :
స్పష్టత అనేది రాజ్యాంగపు మరొక ఆవశ్యక లక్షణం. రాజ్యపాలన, ప్రభుత్వ విధానాలను రాజ్యాంగం స్పష్టంగా వివరిస్తుంది. రాజ్యాంగం ఎంతో సులభశైలిలో, స్పష్టమైన భాషలో లిఖించబడి ఉంటుంది. కాబట్టి రాజ్యాంగంలోని వివిధ అంశాలను అర్థం చేసుకోవడంలో ఏ రకమైన సందేహాలకు గానీ, అస్పష్టతకు గానీ అవకాశం ఉండదు. సమాజంలోని అన్ని వర్గాలకు ఎంతగానో సంతృప్తిని కలిగిస్తుంది. సుదీర్ఘ చర్చలు, సంప్రదింపుల తరువాతే రాజ్యాంగ రూపకల్పన జరుగుతుంది.

3. ప్రాథమిక హక్కులు (Fundamental Rights) :
ప్రతి రాజ్యాంగం కొన్ని ప్రాథమిక హక్కులను కలిగి ఉంటుంది. ప్రాథమిక హక్కులనేవి పౌరుల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను పరిరక్షించుటకు ఉద్దేశించినవి. విభిన్న రంగాలలో పౌరులు తమ వ్యక్తిత్వాలను పెంపొందించుకొనేందుకు ఈ హక్కులు వీలు కల్పిస్తాయి. రాజ్యంలో పౌరులు సంతోషకరమైన, | గౌరవప్రదమైన జీవనాన్ని గడిపేందుకు ఇవి సహాయపడతాయి.

4. క్లుప్తత (Brevity) :
క్లుప్తత అనేది రాజ్యాంగపు లక్షణాలలో ముఖ్యమైనది. రాజ్యాంగ అంశాలను అర్థం చేసుకోవడంలోను వాటిని వ్యాఖ్యానించడంలోనూ వ్యక్తులలో గందరగోళాన్ని నివారిస్తుంది. రాజ్యాంగంలో అనవసర అంశాలు చేర్చబడవు. కాబట్టి రాజ్యాంగం అనేది క్లుప్తంగా ఉంటుంది. అందులో మితిమీరిన సంఖ్యలో ప్రకరణలు, అధికరణలు, ఇతర నిబంధనలు ఉండవు. రాజ్యాంగంలో లెక్కకు మించిన వివరణలు ఉంటే వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

5. సరళత్వం (Flexibility):
ప్రజల ఆకాంక్షలను ఎప్పటికప్పుడు గ్రహించి, వాటిని ఆచరణలో పెట్టేందుకు రాజ్యాంగం సరళమైనదిగా ఉండాలి. అవసరమైనప్పుడు రాజ్యాంగంలోని ప్రకరణలను సవరించే వీలు ఉండాలి. అయితే రాజ్యాంగంలోని అంశాలను పలుసార్లు సవరించకూడదు.

అప్పుడే రాజ్యాంగస్ఫూర్తి పదిలంగా ఉంటుంది. అలాగే ఆధునిక రాజ్యాలలో రాజ్యాంగంలోని అంశాలను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సవరించేందుకు అవకాశం ఉండాలి. అనుభవజ్ఞులు, మేధావులు రాజ్యాంగంలోని దోషాలను వెల్లడించినప్పుడు, వాటిని రాజ్యాంగం నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి.

6. శాశ్వతత్వం (Permanence) :
రాజ్యాంగం ముఖ్య లక్షణాలలో శాశ్వతత్వం ఒకటి. మొత్తం జాతి సంక్షేమం దృష్ట్యా రాజ్యాంగం సుదీర్ఘకాలంపాటు పనిచేసే విధంగా కొన్ని విలువలు కలిగి ఉండాలి. ఎందుకంటే రాజ్యాంగమనేది రాజ్యంతో సహా అనేక రాజకీయ సంస్థల నిర్మాణానికి – విధులకు ప్రతీకగా ఉంటుంది. ప్రజల ఆచార సంప్రదాయాలను రాజ్యాంగం గౌరవిస్తూ సామాజిక విలువలతో మమేకమై ఉండాలి.

7. రాజ్యాంగ సవరణ పద్ధతి (Mode of Amendment) :
రాజ్యాంగంలోని అంశాలను సవరించే పద్ధతిని ప్రతి రాజ్యాంగం సూచిస్తుంది. రాజ్యాంగం రాజ్యంలో నెలకొనే సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. రాజ్యాంగ అంశాల సవరణ పద్ధతుల గురించి రాజ్యాంగంలో ప్రత్యేక అధ్యాయంలో వివరించటం జరుగుతుంది. సాధారణంగా రాజ్యాంగ అంశాలను మూడు రకాలుగా సవరించవచ్చు. అవి :

  1. కఠినమైన చర్య పద్ధతి
  2. సరళమైన పద్ధతి
  3. పాక్షిక కఠినమైన, పాక్షిక సరళమైన పద్ధతి.

మొత్తం మీద ప్రతి రాజ్యాంగంలో సరళమైన, కఠినమైన సవరణ పద్ధతులు రెండూ ఉంటాయి. పర్యవసానంగా రాజ్యంలో ప్రభుత్వం స్థిరత్వం కలిగి ఉంటూ అందరి ఆమోదాన్ని పొందగలుగుతుంది. రాజ్యాంగంలోని సరళమైన, కఠినమైన సవరణ పద్ధతులు రెండూ రాజకీయ వ్యవస్థ సాఫీగా, సమర్థవంతంగా పనిచేసేటట్లు దోహదపడతాయని అనేక మంది రాజ్యాంగవేత్తలు వర్ణించారు.

8. వివరణాత్మకమైనది (Explanatory):
రాజ్యాంగం వివరణాత్మకమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. అదే విధంగా ప్రజలకు, ప్రభుత్వానికి, రాజ్యానికి సంబంధించిన అనేక అంశాలను రాజ్యాంగంలో ప్రస్తావించి చర్చించడమవుతుంది. రాజ్యనిర్మాణం, దాని కార్యకలాపాల పరిధి, విధులకు సంబంధించి ప్రత్యేకంగా రాజ్యాంగంలో పేర్కొనడం జరుగుతుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 10 రాజ్యాంగం

ప్రశ్న 2.
లిఖిత రాజ్యాంగం ప్రయోజనాలు, లోపాలు ఏవి ?
జవాబు.
లిఖిత రాజ్యాంగం (Written Constitution) : లిఖిత రాజ్యాంగాన్ని ఒక రాజ్యాంగ పరిషత్తు లేదా ప్రత్యేక సదస్సు రూపొందిస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన అనేక నియమ నిబంధనలు ఈ రాజ్యాంగంలో ఉంటాయి. లిఖిత రాజ్యాంగానికి భారత రాజ్యాంగం ఒక చక్కటి ఉదాహరణగా పేర్కొనవచ్చు. ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగంగా అమెరికా రాజ్యాంగాన్ని పరిగణించడమైనది.

ప్రయోజనాలు (Merits) :

  1. లిఖిత రాజ్యాంగం మిక్కిలి సులభమైనది. రాజ్యంలోని వివిధ సంస్థల నిర్మాణ, నిర్వహణలను అవగాహన చేసుకోవడంలో లిఖిత రాజ్యాంగం ‘ఏ విధమైన గందరగోళానికి, అస్పష్టతలకు అవకాశం ఇవ్వదు.
  2. లిఖిత రాజ్యాంగం కొంతమేరకు కఠిన స్వభావాన్ని కలిగి ఉంటుంది. దాంతో అది రాజకీయ స్థిరత్వాన్ని అందించగలుగుతుంది.
  3. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడుతుంది.
  4. కేంద్ర, రాష్ట్రాల మధ్య న్యాయమైన రీతిలో అధికారాల పంపిణి ద్వారా సమతౌల్యతను పాటిస్తుంది..
  5. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుంది. ప్రజల అవసరాలను తీర్చేందుకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందనే విషయాన్ని ప్రభుత్వానికి గుర్తుచేస్తుంది.
  6. ప్రభుత్వ అధికారాలపై కొన్ని పరిమితులను విధిస్తుంది.
  7. సమాఖ్యవ్యవస్థ పవిత్రతను, స్ఫూర్తిని కాపాడుతుంది.

లోపాలు (Demerits) :

  1. లిఖిత రాజ్యాంగం మెరుగైన ప్రభుత్వాన్ని అందించలేదు. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీలపై ఆ రాజ్యాంగం అనేక ఆంక్షలను విధిస్తుంది..
  2. లిఖిత రాజ్యాంగపు కఠిన స్వభావం రాజ్యం అభివృద్ధికి దోహదపడదు.
  3. ప్రజల ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా ఆ రాజ్యాంగంలోని అంశాలను సవరించడం సాధ్యం కాదు. దాంతో జాతి పురోగతి మందకొడిగా సాగుతుంది.
  4.  న్యాయశాఖ ఆధిపత్యానికి లిఖిత రాజ్యాంగం అవకాశం ఇస్తుంది.
  5. ప్రభుత్వాంగాల మధ్య ఘర్షణలకు వీలు కల్పిస్తుంది.
  6. సంక్షేమ రాజ్యస్థాపనకు అనుకూలం కాదు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 10 రాజ్యాంగం

ప్రశ్న 3.
అలిఖిత రాజ్యాంగం ప్రయోజనాలు, లోపాలను తెలపండి.
జవాబు.
అలిఖిత రాజ్యాంగం (Unwritten Constitution) :
అలిఖిత రాజ్యాంగం అనేది ప్రత్యేక రాతప్రతిలో పేర్కొనబడని రాజ్యాంగం. అలిఖిత రాజ్యాంగం అనేక ఆచారాలు, సంప్రదాయాల ఆధారంగా ఏర్పడినది. వీటినే శాసనాలకు ప్రాతిపదికగా తీసుకుంటారు. ఇటువంటి రాజ్యాంగం అత్యంత ప్రాచీనమైన, చట్టబద్దమైన పాలనకు అవకాశం కల్పిస్తుందని పలువురు భావించారు.

18వ శతాబ్దం వరకు ప్రపంచంలో అనేక రాజ్యాలలో రాజ్యాంగబద్ధమైన పాలనకు ఇటువంటి రాజ్యాంగాలు ఆధారంగా ఉంటూ వచ్చాయి. ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణలో శాసనబద్ధమైన పాలనకు ఈ రాజ్యాంగాలు వీలు కల్పించాయి.

బ్రిటన్ రాజ్యాంగం అలిఖిత రాజ్యాంగానికి అత్యుత్తమ ఉదాహరణ. బ్రిటన్లో చట్టాలన్నీ ఆచారాలు, సంప్రదాయాలు, వాడుకలు, అలవాట్ల ఆధారంగా రూపొందించబడ్డాయి.

ప్రయోజనాలు (Merits) :

  1. ప్రగతిశీలక శాసన నిర్మాణానికి అలిఖిత రాజ్యాంగం దోహదపడుతుంది. ఇటువంటి రాజ్యాంగం అభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది.
  2. అలిఖిత రాజ్యాంగం కాలానుగుణంగా సంభవించిన పరిణామాలకు ప్రతీకగా మార్పు చెందుతూ ఉంటుంది. రాజకీయ వ్యవస్థను ఉత్తమమైందిగా తీర్చిదిద్దేందుకు వీలు కల్పిస్తుంది.
  3. అలిఖిత రాజ్యాంగంలోని అంశాలు వ్యాకోచ స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల ఈ రాజ్యాంగంలో మార్పులను సులభంగా ప్రవేశపెట్టవచ్చు.
  4. ప్రజల అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగంలోని అంశాలను సవరించుకొనే వీలుంటుంది.
  5. అలిఖిత రాజ్యాంగం అవాంఛనీయమైన విప్లవాలు, ఇతర ఆందోళనలకు అవకాశం ఇవ్వదు. ప్రజల డిమాండ్లను పరిష్కరించే వీలు ఈ రాజ్యాంగం కల్పిస్తుంది.

లోపాలు (Demerits) :

  1. అలిఖిత రాజ్యాంగంలోని అంశాలను అధికారంలో ఉన్న పార్టీ స్వీయ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా తరచుగా సవరించే అవకాశం ఉంటుంది. దాంతో రాజ్యంలో రాజకీయ సుస్థిరతకు భంగం వాటిల్లే ప్రమాదం ఏర్పడుతుంది.
  2. అలిఖిత రాజ్యాంగం న్యాయమూర్తుల చేతిలో ఆటబొమ్మగా మారే అవకాశాలు ఎక్కువ. న్యాయమూర్తులు యధేచ్ఛగా రాజ్యాంగంలోని అంశాలను వ్యాఖ్యానించే అవకాశం ఉంటుంది.
  3. ప్రజాస్వామ్య రాజ్యాలకు అలిఖిత రాజ్యాంగం అనుకూలమైనది కాదు.
  4. సమాఖ్య రాజ్యాలకు ఇటువంటి రాజ్యాంగం సరిపోదు.
  5. ప్రజల హక్కులు, స్వాతంత్ర్యాలకు అలిఖిత రాజ్యాంగం రక్షణ కల్పించడంలో విఫలమవుతుంది.
  6. రాజ్యాంగంలోని అంశాలు తరచుగా సవరణలకు లోనవుతాయి.
  7. అలిఖిత రాజ్యాంగం మిక్కిలి లాంఛనప్రాయమైనది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 10 రాజ్యాంగం

ప్రశ్న 4.
లిఖిత, అలిఖిత రాజ్యాంగాల మధ్య తేడాలను తెలపండి.
జవాబు.
లిఖిత రాజ్యాంగం :
లిఖిత రాజ్యాంగాన్ని ఒక రాజ్యాంగ పరిషత్తు లేదా ప్రత్యేక సదస్సు రూపొందిస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన అనేక నియమ నిబంధనలు ఈ రాజ్యాంగంలో ఉంటాయి. లిఖిత రాజ్యాంగానికి భారత రాజ్యాంగం ఒక చక్కటి ఉదాహరణగా పేర్కొనవచ్చు. ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగంగా అమెరికా రాజ్యాంగాన్ని పరిగణించడమైనది.

అలిఖిత రాజ్యాంగం :
అలిఖిత రాజ్యాంగం అనేది ప్రత్యేక రాతప్రతిలో పేర్కొనబడని రాజ్యాంగం. అలిఖిత రాజ్యాంగం అనేక ఆచారాలు, సంప్రదాయాల ఆధారంగా ఏర్పడినది. వీటినే శాసనాలకు ప్రాతిపదికగా తీసుకుంటారు. ఇటువంటి రాజ్యాంగం అత్యంత ప్రాచీనమైన, చట్టబద్ధమైన పాలనకు అవకాశం కల్పిస్తుందని పలువురు భావించారు.

18వ శతాబ్దం వరకు ప్రపంచంలో అనేక రాజ్యాలలో రాజ్యాంగబద్ధమైన పాలనకు ఇటువంటి రాజ్యాంగాలు ఆధారంగా ఉంటూ వచ్చాయి. ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణలో శాసనబద్ధమైన పాలనకు ఈ రాజ్యాంగాలు వీలు కల్పించాయి.

లిఖిత, అలిఖిత రాజ్యాంగాల మధ్య కింద పేర్కొన్న వ్యత్యాసాలను ప్రతి ఒక్కరు అత్యంత సులభంగా గుర్తించవచ్చు.

లిఖిత రాజ్యాంగం (Written Constitution)అలిఖిత రాజ్యాంగం (Unwritten Constitution)
1. లిఖిత రాజ్యాంగం అనేది ఒక రాత ప్రతి లేదా కొన్ని నిర్ణీత రాతప్రతులతో రాయబడి ఉంటుంది. ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను ఈ రాజ్యాంగం నియంత్రించేందుకు కొన్ని నియమ నిబంధనలను సూచిస్తుంది.1. అలిఖిత రాజ్యాంగం అనేది అనేక ఆచారాలు, సంప్రదాయాలు, వేడుకలు, అలవాట్ల సమాహారం. ఈ రాజ్యాంగంలోని అంశాలు క్రమబద్ధంగా ఒకచోట రాయబడి ఉండవు.
2. రాజ్యానికి సంబంధించిన అన్ని ప్రధాన అంశాలు స్పష్టంగా రాయబడి ఉంటాయి.2. రాజ్యానికి సంబంధించిన అంశాలన్నీ ఆచార సంప్రదాయాలు, వాడుకల రూపంలో ఉంటాయి.
3. లిఖిత రాజ్యాంగాన్ని నిర్దిష్ట సమయంలో ప్రత్యేకంగా ఏర్పాటైన శాసనసభ రూపొందించి ఆమోదిస్తుంది.3. అలిఖిత రాజ్యాంగంలోని అంశాలు నిర్దిష్ట సమయంలో రూపొందినవి కావు. అవి కాలాను గుణంగా శాసనాల రూపంలో, ముఖ్యమైన నిబంధనల (Charters) ద్వారా వివిధ కాలాలలో అమల్లోకి వస్తాయి.
4. లిఖిత రాజ్యాంగాన్ని సులభంగా సవరించడం సాధ్యం కాదు.4. అలిఖిత రాజ్యాంగాన్ని సవరించడం ఎంతో సులభం.
5. లిఖిత రాజ్యాంగంలో ఉదహరించబడిన పౌరులు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను న్యాయస్థానాలు పరిరక్షిస్తాయి.5. అలిఖిత రాజ్యాంగాన్ని పౌరుల ప్రాథమిక హక్కులను న్యాయస్థానాలు సులభమైన రీతిలో కాపాడలేవు.
6. లిఖిత రాజ్యాంగం ఒక నిర్ణీత కాలంలో రూపొందించబడింది.6. అలిఖిత రాజ్యాంగం మారుతూ ఉంటుంది.
7. లిఖిత రాజ్యాంగం రాజకీయ సుస్థిరతను ఏర్పరుస్తుంది.7. అలిఖిత రాజ్యాంగం రాజకీయ స్థిరత్వాన్ని అందించకపోవచ్చు.
8. విద్యావంతులు, అక్షరాస్యులు అధికంగా ఉన్న రాజ్యాలకు లిఖిత రాజ్యాంగం సరైంది.8. నిరక్షరాస్యులు, విద్యావంతులైన ప్రజలకు అలిఖిత రాజ్యాంగం సరైనది.
9. లిఖిత రాజ్యాంగం సమాఖ్య రాజ్యాలకు తగినది.9. అలిఖిత రాజ్యాంగం ఏకకేంద్ర రాజ్యాలకు సరైనది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 10 రాజ్యాంగం

ప్రశ్న 5.
దృఢ, అదృఢ (సరళ) రాజ్యాంగాల మధ్య తేడాలను తెలపండి.
జవాబు.
నిర్వచనం :

  1. అరిస్టాటిల్ : “రాజ్యంలో అత్యున్నతమైన పదవులతో సహా అన్నింటిని క్రమబద్ధంగా ఏర్పాటు చేసేదే “రాజ్యాంగం”.
  2. లార్డ్ బ్రైస్ : “ప్రభుత్వం పనిచేసే విధానాన్ని తెలిపే నిర్దిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం”.
  3. స్టీఫెన్ లీకాక్ : “రాజ్యాంగం అంటే ప్రభుత్వరూపం”.

దృఢ రాజ్యాంగం (లేదా) పరుష రాజ్యాంగం :
రాజ్యాంగంలోని అంశాలను అంత సులభంగా సవరించడం సాధ్యంకాని రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగం అంటారు. దృఢ రాజ్యాంగం అమలులో ఉన్న రాజ్యాలలో సాధారణ చట్టాల తయారీకి, రాజ్యాంగ చట్టాల రూపకల్పనకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. దృఢ రాజ్యాంగంలోని అంశాలను సవరించేందుకు ప్రత్యేకమైన పద్ధతిని అనుసరించడం జరుగుతుంది. రాజ్యాంగ అంశాల సవరణలో దృఢ రాజ్యాంగం

ఎంతో కాఠిన్యతను ప్రదర్శిస్తుంది. దృఢ రాజ్యాంగానికి అత్యుత్తమ ఉదాహరణగా అమెరికా రాజ్యాంగాన్ని పేర్కొనవచ్చు. అమెరికాతో పాటుగా ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ వంటి రాజ్యాలలో దృఢ రాజ్యాంగాలు వాడుకలో ఉన్నాయి.

సరళ లేదా అదృఢ రాజ్యాంగం:
రాజ్యాంగంలోని అంశాలను అతిసులభంగా మార్చేందుకు అవకాశం ఉన్నట్లయితే దానిని అదృఢ రాజ్యాంగం అంటారు. అదృఢ రాజ్యాంగంలోని అంశాల సవరణకు ప్రత్యేక రాజ్యాంగ సవరణ పద్ధతిని అనుసరించాల్సిన అవసరం లేదు.

సాధారణ చట్టాల వలె రాజ్యాంగంలోని అంశాలను సైతం సవరించే వీలు ఉంటుంది. అందువల్ల అదృఢ రాజ్యాంగంలో సాధారణ చట్టాలు, రాజ్యాంగ చట్టాల మధ్య ఎటువంటి వ్యత్యాసం ఉండదు. అదృఢ రాజ్యాంగాలనేవి ప్రాచీన కాలంలో వాడుకలో ఉండేవి. అదృఢ రాజ్యాంగానికి బ్రిటన్ మంచి ఉదాహరణ.

సరళ లేదా అదృఢ మరియు దృఢ లేదా పరుష రాజ్యాంగాల మధ్య వ్యత్యాసాలు :

సరళ లేదా అదృఢ రాజ్యాంగం (Flexible constitution)పరుష లేదా దృఢ రాజ్యాంగం (Rigid Constitution)
1. రాజ్యాంగంలోని అంశాలు స్పష్టంగా పేర్కొనడం జరగదు.1. రాజ్యాగంలోని అంశాలు స్పష్టంగా పేర్కొనడం జరుగుతుంది.
2. రాజ్యాంగాన్ని సులభంగా సవరించవచ్చు.2. రాజ్యాంగాన్ని సవరించేందుకు కఠినమైన పద్ధతి ఉంటుంది.
3. ప్రజల హక్కులు, స్వేచ్ఛా స్వాతంత్య్రాలను న్యాయ శాఖ కాపాడగలుగుతుంది.3. ప్రజల హక్కులు, స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను న్యాయశాఖ కాపాడలేకపోవచ్చు.
4. ఇది సమాఖ్య రాజ్యానికి సరైనది కాదు.4. ఇది సమాఖ్య రాజ్యానికి సరైనది.
5. ఇది న్యాయసమీక్షకు అవకాశం ఇవ్వదు.5. ఇది న్యాయసమీక్షకు అవకాశం ఇస్తుంది.
6. ఈ రాజ్యాంగంలో శాసనసభకు అపరిమితమైన అధికారాలు ఉంటాయి.6. శాసనసభ అధికారాలు పరిమితంగా ఉంటాయి.
7. ఇది మిక్కిలి అస్థిరమైనది.7. ఇది ఎంతో స్థిరత్వంతో కూడుకొని ఉంటుంది.
8. రాజ్యాంగ చట్టాలకు, సాధారణ చట్టాలకు మధ్య ఎటువంటి వ్యత్యాసం ఉండదు.8. రాజ్యాంగ చట్టాలు, సాధారణ చట్టాల మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది.
9. రాజ్యంలో ఒకేరకమైన చట్టాలు ఉంటాయి.9. రాజ్యంలో రెండు రకాల చట్టాలు ఉంటాయి. అవి : 1) రాజ్యాంగ చట్టాలు, 2) సాధారణ చట్టాలు. రాజ్యాంగ చట్టాలు సాధారణ చట్టాలపై ఆధిక్యతను కలిగి ఉంటాయి.
10. రాజకీయ పురోగతి సాధించిన రాజ్యాలకు అదృఢ రాజ్యాంగం అనువైనది.10. అభివృద్ధి చెందుతున్న రాజ్యాలకు దృఢ రాజ్యాంగం అనువైనది.
11. విప్లవాలకు వీలు కల్పించదు.11. విప్లవాలకు అవకాశం ఇస్తుంది.
12. చిన్న రాజ్యాలకు తగినది.12. పెద్ద రాజ్యాలకు సరైనది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 10 రాజ్యాంగం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
రాజ్యాంగం అంటే ఏమిటి ?
జవాబు.
ప్రజలు, ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని సూచించే కొన్ని నిర్దిష్ట నియమాల సముదాయాన్ని రాజ్యాంగం అని అంటారు. రాజ్యం, ప్రభుత్వాల అధికారాలు, విధులకు రాజ్యాంగం ముఖ్య ప్రాతిపదికగా ఉంటుంది.

అదే విధంగా పౌరుల హక్కులు, బాధ్యతలకు సంబంధించిన ప్రధాన ప్రామాణికతకు నిదర్శనం రాజ్యాంగమే. అందుకనే “ప్రభుత్వం పనిచేసే విధానాన్ని తెలిపే నిర్దిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం” అని లార్డ్ బ్రైస్ పేర్కొన్నాడు.

ప్రశ్న 2.
అలిఖిత రాజ్యాంగం అంటే ఏమిటి ?
జవాబు.
అలిఖిత రాజ్యాంగం అంటే రాజ్యాంగ నియమాలన్నింటినీ ఒక రాతప్రతిలో పొందుపరచని రాజ్యాంగం. అనేక ఆచార, సంప్రదాయాలు శాసనాల రూపంలో పొందుపరచినదాన్నే అలిఖిత రాజ్యాంగంగా పేర్కొంటారు. అలిఖిత రాజ్యాంగానికి ఖచ్చితమైన ఉదాహరణ బ్రిటన్ రాజ్యాంగం. ఆచార సంప్రదాయాలు, బ్రిటీష్ పార్లమెంట్ రూపొందించిన సాధారణ శాసనాలే ఆ దేశంలో రాజ్యాంగ శాసనాలుగా పని చేస్తాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 10 రాజ్యాంగం

ప్రశ్న 3.
లిఖిత రాజ్యాంగం అంటే ఏమిటి ?
జవాబు.
లిఖిత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ గానీ లేదా ప్రత్యేక రాజ్యాంగ సదస్సుగాని రూపొందిస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన అనేక నియమ, నిబంధనలు లిఖిత పత్రం రూపంలో పొందుపరచబడి ఉంటాయి. భారత రాజ్యాంగాన్ని లిఖిత పూర్వక రాజ్యాంగానికి ముఖ్యమైన ఉదాహరణగా పేర్కొనవచ్చు.

ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం 1789లో ఆమోదించబడిన అమెరికా రాజ్యాంగం. అమెరికా, భారత రాజ్యాంగాలను ప్రస్తుత ప్రపంచంలో ‘లిఖిత రాజ్యాంగాలకు చక్కని ఉదాహరణగా పేర్కొనవచ్చు.

ప్రశ్న 4.
సరళ రాజ్యాంగం అంటే ఏమిటి ?
జవాబు.
రాజ్యాంగంలోని అంశాలను అతి సులభంగా మార్చేందుకు అవకాశం ఉన్నట్లయితే దానిని అదృఢ లేదా సరళ రాజ్యాంగం అంటారు. సరళ రాజ్యాంగంలోని అంశాల సవరణకు ప్రత్యేక రాజ్యాంగ సవరణ పద్ధతిని అనుసరించాల్సిన అవసరం లేదు.

సాధారణ చట్టాలవలె రాజ్యాంగంలోని అంశాలను సైతం సవరించే వీలుంటుంది. అందువలన సరళ రాజ్యాంగంలో సాధారణ చట్టాలు, రాజ్యాంగ చట్టాల మధ్య ఎటువంటి వ్యత్యాసం వుండదు. సరళ రాజ్యాంగాలనేవి ప్రాచీన కాలంలో వాడుకలో ఉండేవి. అదృఢ లేదా సరళ రాజ్యాంగానికి బ్రిటన్ మంచి ఉదాహరణ.

ప్రశ్న 5.
దృఢ రాజ్యాంగం అంటే ఏమిటి ?
జవాబు.
రాజ్యాంగంలోని అంశాలను అంత సులభంగా సవరించడం సాధ్యం కాని రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగం అంటారు. దృఢ రాజ్యాంగం అమలులో వున్న రాజ్యాలలో సాధారణ చిట్టాల తయారీకి, రాజ్యాంగ చట్టాల రూపకల్పనకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది.

దృఢ రాజ్యాంగంలోని అంశాలను సవరించేందుకు ప్రత్యేకమైన పద్ధతిని అనుసరించడం జరుగుతుంది. రాజ్యాంగ అంశాల సవరణలో దృఢ రాజ్యాంగం ఎంతో కాఠిన్యతను ప్రదర్శిస్తుంది. దృఢ రాజ్యాంగానికి అత్యుత్తమ ఉదాహరణగా అమెరికా రాజ్యాంగాన్ని పేర్కొనవచ్చు. అమెరికాతో పాటుగా ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ వంటి రాజ్యాలలో దృఢ రాజ్యాంగాలు వాడుకలో ఉన్నాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 10 రాజ్యాంగం

ప్రశ్న 6.
రాజ్యాంగ ప్రవేశిక అంటే ఏమిటి ?
జవాబు.
ప్రతి రాజ్యాంగం ఒక ప్రవేశిక లేదా పీఠికను కలిగి ఉంటుంది. ఆ ప్రవేశిక రాజ్యాంగ లక్ష్యాలు, ఆకాంక్షలను వ్యక్తీకరిస్తుంది. ప్రవేశిక రాజ్యాంగానికి ఆత్మగా ఉంటుంది. కాబట్టి రాజ్యాంగపు ఆవశ్యక లక్షణాలలో ప్రవేశిక అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించవచ్చు. ఉదాహరణకు భారత రాజ్యాంగంలోని ప్రవేశిక భారతదేశాన్ని ఒక సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా పేర్కొంది.

TS Inter 1st Year Political Science Study Material Chapter 3 జాతి – జాతీయత, జాతీయ వాదం

Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 3rd Lesson జాతి – జాతీయత, జాతీయ వాదం Textbook Questions and Answers.

TS Inter 1st Year Political Science Study Material 3rd Lesson జాతి – జాతీయత, జాతీయ వాదం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
జాతీయత నిర్వచించి, జాతీయతకు అవసరం అయిన లక్షణాలను తెలపండి.
జవాబు.
జాతీయతను ఆంగ్లంలో ‘నేషనాలిటీ” (Nationality) అంటారు. ఈ ఆంగ్ల పదం ‘నేషియో’ (Natio) అనే లాటిన్ భాష నుండి గ్రహించబడినది. దీనికి “పుట్టుక” లేదా “జన్మ” అని అర్థము. సంస్కృతంలో ‘జా’ అంటే ‘పుట్టుక’ అని అర్థం కలదు.

నిర్వచనం :

  1. బర్జెస్ : “మొత్తం జనాభాలో మెజారిటీ సభ్యులతో కూడిన సామాజిక, సాంస్కృతిక సముదాయమే జాతీయత”.
  2. జె.డబ్ల్యు. గార్నర్ : “తెగవంటి అనేక ప్రజాబంధాలతో ఐక్యమైన ప్రజా సముదాయంలో భాగమే జాతీయత”.
  3. ఆర్.జి.గెటిల్ : “ఒకే తెగ, భాష, మతం, ఆచారాలు, చరిత్ర వంటి ఉమ్మడి అంశాలు గల ప్రజానీకమే జాతీయత”.

జాతీయత లక్షణాలు :
1. స్వచ్ఛమైన తెగ (Purity of Race) :
దీనిని ఏకజాతి లేదా వారసత్వము అనవచ్చు. ఒకే తెగ మనుషుల మధ్య రక్తసంబంధం ఉంటుంది. ఒకే సంతతికి చెందినవారమనే భావంతో ఒకే తెగ ప్రజలు ఐకమత్య భావంతో ఉంటారు. అది దృఢమైన జాతీయత, జాతీని పెంపొందిస్తుంది.
ఉదా : హిట్లర్ కాలంలో జర్మనులు, తమిళనాడులో డి.యం.కె. పార్టీ తమ జాతీయతలను ప్రత్యేకమైనవిగా చెప్పుకున్నాయి. అయితే ఈ కాలంలో ఒక తెగవారే ఒక రాజ్యంలో ఉండటం సాధ్యం కాదు.

2. ఉమ్మడి మతము (Common Religion) :
ఒకే మతస్థుల మధ్య ఐకమత్య భావం ఏర్పడుతుంది. జాతులను సమైక్యపరచడంలో మతం ప్రముఖ పాత్ర వహించింది.’ అయితే ఆధునిక కాలంలో జాతీయతా భావానికి ఒకే మతం ఉండాలనే నియమం లేదు.
ఉదా : 1947లో ముస్లిమ్లంతా మత ప్రాతిపదికన పాకిస్థాన్ రాజ్యం ఏర్పరచుకున్నారు. అది 1972లో రెండుగా చీలిపోయి బంగ్లాదేశ్ ఏర్పడింది.

3. ఉమ్మడి భాష (Common Language) :
ప్రజల మధ్య భావ వ్యక్తీకరణకు, సంప్రదింపులకు భాష అనేది ఒక సాధనం. ఒకే భాషను మాట్లాడే ప్రజలు ఎంతో సులభమైన రీతిలో ఒక జాతిగా రూపొందుతారు. ఉమ్మడి భాష, ఉమ్మడి సాన్నిహిత్యానికి దోహదపడుతుంది. ఒకే రకమైన భావాలు గల వ్యక్తులు సన్నిహితంగా మెలిగేందుకు భాష ముఖ్య సాధనంగా ఉంటుంది.
ఉదా : స్విట్జర్లాండ్లో భాషాపరమైన వైవిధ్యాలు గల ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్ జాతులకు చెందిన ప్రజలు నివసిస్తున్నప్పటికీ, వారందరి మధ్య ఉమ్మడి జాతీయత భావాలు నెలకొన్నాయి. అటువంటి పరిస్థితియే కెనడా, ఇండియా వంటి రాజ్యాలలో గోచరిస్తున్నది.

4. భౌగోళిక ఐక్యత (Geographical Unity) :
జాతీయత, జాతి భావనలో భౌగోళిక ఐక్యత అనేది మరొక ముఖ్య అంశం. భౌగోళిక ఐక్యత అనేది ప్రకృతిలోనే ఇమిడి ఉంది. ఒక దేశపు సమైక్యతకు భౌగోళిక ఐక్యత చిహ్నంగా ఉంటుంది. అంతేకాకుండా, ఒకే రకమైన వాతావరణ పరిస్థితులలో ప్రజలందరూ కలిసికట్టుగా జీవించేందుకు భౌగోళిక ఐక్యత దోహదపడుతుంది. ఒక నిర్ణీత ప్రదేశంలో నివసించే ప్రజల మనసులు, శరీరాలపై భౌగోళిక ఐక్యత అంశం ప్రకృతి సహజమైన ప్రభావాన్ని చూపుతుంది.

అటువంటి ప్రజలు ఒకే రకమైన భావాలతో కూడిన మానసిక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటారు. అయితే భౌగోళిక ఐక్యత ఒక్కటే జాతీయ భావాన్ని పెంపొందిస్తుందని చెప్పలేం.
ఉదా : పాలస్తీనా రాజ్యం ఏర్పాటు జరుగకముందే యూదు జాతికి చెందిన ప్రజలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో నివాస స్థావరాలు ఏర్పరచుకొన్నారు.

5. ఉమ్మడి చరిత్ర (Common History) :
జాతీయతాభావ ఆవిర్భావంలో ఉమ్మడి చరిత్రను ఇంకొక ప్రధాన అంశంగా పరిగణించవచ్చు. ఉమ్మడి చరిత్ర ప్రజానీకంలో ఎంతో ఉత్తేజాన్ని నింపి, వారిని కలిపి ఉంచుతుంది. కొన్నిసార్లు, చారిత్రక సంఘటనలు ప్రజలలో జాతీయతాభావాల వ్యాప్తికి దోహదపడతాయి. ఉదా : బ్రిటిష్ పాలన నుంచి భారతీయులు జాతీయతకు సంబంధించిన అనేక పాఠాలను నేర్చుకున్నారు.

6. ఉమ్మడి సంస్కృతి (Common Culture) :
సంస్కృతి అంటే విస్తృతార్థంలో జీవనవిధానం. సంస్కృతి అనేది కొన్ని ఉమ్మడి అంశాలైన దుస్తులు, ఆచారాలు, ఆహారపు అలవాట్లు, మత విశ్వాసాలు, నైతిక విలువలు మొదలైన వాటి ద్వారా వెల్లడించబడుతుంది. ఈ ఉమ్మడి అంశాలు ప్రజలను ఒక త్రాటిపైకి తెచ్చి కలిపి ఉంచుతాయి.

7. ఉమ్మడి రాజకీయ ఆకాంక్షలు (Common Political Aspirations) :
ఒక ప్రదేశంలో నివసించే ప్రజలు ఉమ్మడి రాజకీయ ఆర్థిక ఆకాంక్షలచే ప్రేరణ పొందుతారు. అటువంటి ఆకాంక్షలు జాతి అవతరణలో శక్తివంతమైన పాత్రను పోషిస్తాయి. ప్రత్యేక రాజ్యాంగం ఏర్పాటై రాజ్యాన్ని నిర్వహించే సామర్థ్యం గల ప్రజలు తగినంత మంది ఉంటే, అటువంటివారు స్వతంత్ర రాజకీయ వ్యవస్థగా రూపొందాలనే ఆకాంక్షను కలిగి ఉంటారు.

విభిన్నమైన అంశాలతో కూడిన ప్రజానీకం కూడా ఉమ్మడి జాతీయతగా ఏర్పడే అవకాశం ఉంటుంది. జర్మనీ, ఇటలీలలోని ఏకీకరణ ఉద్యమాలు, అమెరికా స్వాతంత్య్ర పోరాటం, భారత జాతీయోద్యమాల మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయి. ఇవన్నీ ఆయా దేశాల ప్రజల రాజకీయ ఆకాంక్షలకు ప్రతీకలుగా నిలిచాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 3 జాతి – జాతీయత, జాతీయ వాదం

ప్రశ్న 2.
జాతి – జాతీయవాదం మధ్య సంబంధాన్ని చర్చించండి.
జవాబు.
ఆధునిక ప్రపంచ వ్యవహారాలలో జాతి, జాతీయవాదం అనేవి చాలా శక్తివంతమైన అంశాలు. ఈ రెండు భావనలు ప్రపంచవ్యాప్తంగా సర్వసత్తాక, సార్వభౌమాధికార రాజ్యవ్యవస్థలు ఏర్పరచుకొనేలా ప్రజలను ఉత్తేజపరిచాయి.

అర్థం :
జాతి, జాతీయవాదం అనే ఈ రెండు పదాలు ఒకదానికొకటి పర్యాయపదాలుగా వాడబడతాయి. “ఈ రెండు పదాలు లాటిన్ భాషలోని “నేషియో” (Natio) అనే పదం నుండి ఉద్భవించాయి. లాటిన్ భాషలో ఆ పదానికి జన్మతః పుట్టుక అనే అర్థం ఉంది.

జాతి (Nation) :
ఈ ఆంగ్ల పదం ‘నేటస్’ (Nates), నేషియో (Natio) అనే లాటిన్ పదాల నుండి గ్రహించబడెను. దీనికి ‘పుట్టుక’ అని అర్థము కలదు. లార్డ్స్ ప్రకారము “స్వాతంత్ర్యం పొందిన లేదా స్వాతంత్ర్యం పొందాలని కోరుకుంటూ, రాజకీయంగా వ్యవస్థీకృతమైన ప్రజలనే” జాతి అంటారు. బర్జెస్ ప్రకారం “భౌగోళిక ఐక్యత కలిగి ఉంటూ ఒక నిర్దిష్ట ప్రదేశములో నివసించే తెగకు సంబంధించిన జాతీయతయే జాతి”.

జాతీయవాదం (Nationalism) :
జాతీయవాదం ఆధునిక రాజ్యానికి ఒక లక్షణం. ఇది ఒక మానసిక భావన. ‘అంతర్గతంగా తమ హక్కులను పరిరక్షించుకునేందుకు, విదేశీ దండయాత్రల నుండి తమ దేశ స్వాతంత్య్రాన్ని రక్షించుకునేందుకు దేశ ప్రజలలో ఐకమత్యాన్ని ప్రేరేపించే మానసిక శక్తి ‘జాతీయవాదం’. దీనిని సంక్షిప్తంగా ‘ఐకమత్య ‘భావన’ అనవచ్చు. జాతుల స్వతంత్రానికి, దేశ అభివృద్ధికి ఇది అవసరం. కానీ సంకుచిత, మితిమీరిన జాతీయతా భావం, హానికరము.

జాతి, జాతీయవాదం మధ్య సంబంధం :

  1. జాతీయవాదం ఒక మానసిక భావన. ఒక ప్రజా సమూహం స్వతంత్రంగా వేరుపడి, ప్రత్యేక రాజ్యం కలిగి ఉండటం అనే అంశం ఇందులో ఇమిడి ఉంటుంది.
  2. ఈ భావం ప్రజలలో బలంగా నాటుకుపోవటంతో ప్రజలు తమ జాతి మనుగడ కోసం వారి సమస్త ప్రయోజనాలను పణంగా పెడతారు. వాదం.
  3. జాతీయత అనేది ప్రజల యొక్క ప్రగాఢమైన ఆకాంక్ష. జాతిరాజ్య ఆవిర్భావానికి దోహదపడుటయే జాతీయ
  4. 16వ శతాబ్దంలో ఐరోపాలో ఆవిర్భవించిన సాంస్కృతిక పునరుజ్జీవనం జాతీయవాదానికి బీజాలు వేసింది.
  5. 1789లో సంభవించిన ఫ్రెంచ్ విప్లవం జాతీయవాదాన్ని ఐరోపాలో మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్ళింది. దాని నినాదాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఐరోపా జాతీయులలో తీవ్రమైన రాజకీయ చైతన్యాన్ని కలుగజేశాయి.
  6. వియన్నా సమావేశం (1815) ఐరోపాలో జాతీయవాదాన్ని మరింత బలపరచింది.
  7. ఇటలీ ఏకీకరణ మరియు జర్మనీ ఏకీకరణ జాతీయవాదానికి మరింత బలాన్నిచ్చాయి.
  8. 1774లో సంభవించిన అమెరికా స్వాతంత్ర్య యుద్ధం ప్రజలలో జాతీయవాద వ్యాప్తికి బాగా తోడ్పడింది.
  9. 1917లో నాటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్ ప్రతిపాదించిన “జాతుల స్వయం నిర్ణయహక్కు” ప్రపంచ ప్రజలలో ప్రతి జాతీయ సముదాయం ఒక ప్రత్యేక రాజ్యంగా ఏర్పడాలనే భావాన్ని బలంగా నాటింది.
  10. రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఆసియా, ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికాలలోని దేశాలలో జాతిరాజ్య ఆవిర్భావం కోసం స్వాతంత్ర్యోద్యమాలు ఊపందుకున్నాయి.
  11. 1885 నుండి 1947 మధ్య సాగిన భారత జాతీయోద్యమం భారత్, పాకిస్థాన్లు స్వతంత్ర రాజ్యాలుగా ఆవిర్భవించటానికి దోహదం చేసింది.

దీనిని బట్టి మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే జాతీయవాదం అనే భావం ఎప్పుడైతే ఐక్యతను, స్వాతంత్ర్యాన్ని సాధిస్తుందో, అప్పుడు అది సార్వభౌమాధికార జాతిగా రూపొందుతుంది.
కొంతమంది రాజనీతి శాస్త్రవేత్తలు ఈ రెండింటిని పర్యాయపదాలుగా పరిగణించారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 3 జాతి – జాతీయత, జాతీయ వాదం

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
జాతీయతకు అవసరం అయిన లక్షణాలను సంక్షిప్తంగా వివరించండి.
జవాబు.
జాతీయత లక్షణాలు :
1. స్వచ్ఛమైన తెగ (Purity of Race) :
దీనిని ఏకజాతి లేదా వారసత్వము అనవచ్చు. ఒకే తెగ మనుషుల మధ్య రక్తసంబంధం ఉంటుంది. ఒకే సంతతికి చెందినవారమనే భావంతో ఒకే తెగ ప్రజలు ఐకమత్యభావంతో ఉంటారు. అది దృఢమైన జాతీయత, జాతిని పెంపొందిస్తుంది.
ఉదా : హిట్లర్ కాలంలో జర్మనులు, తమిళనాడులో డి.యం.కె. పార్టీ తమ జాతీయతలను ప్రత్యేకమైనవిగా చెప్పుకున్నాయి. అయితే ఈ కాలంలో ఒకే తెగవారే ఒక రాజ్యంలో ఉండటం సాధ్యం కాదు.

2. ఉమ్మడి మతము (Common Religion) :
ఒకే మతస్థుల మధ్య ఐకమత్య భావం ఏర్పడుతుంది. జాతులను సమైక్యపరచడంలో మతం ప్రముఖ పాత్ర వహించింది. అయితే ఆధునిక కాలంలో జాతీయతా భావానికి ఒకే మతం ఉండాలనే నియమం లేదు.
ఉదా : 1947లో ముస్లిమ్లంతా మత ప్రాతిపదికన పాకిస్థాన్ రాజ్యం ఏర్పరచుకున్నారు. అది 1972లో రెండుగా చీలిపోయి బంగ్లాదేశ్ ఏర్పడింది.

3. ఉమ్మడి భాష (Common Language) :
ప్రజల మధ్య భావ వ్యక్తీకరణకు, సంప్రదింపులకు భాష అనేది ఒక సాధనం. ఒకే భాషను మాట్లాడే ప్రజలు ఎంతో సులభమైన రీతిలో ఒక జాతిగా రూపొందుతారు. ఉమ్మడి భాష, ఉమ్మడి సాన్నిహిత్యానికి దోహదపడుతుంది. ఒకే రకమైన భావాలు గల వ్యక్తులు సన్నిహితంగా మెలిగేందుకు భాష ముఖ్య సాధనంగా ఉంటుంది.
ఉదా : స్విట్జర్లాండ్లో భాషాపరమైన వైవిధ్యాలు గల ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్ జాతులకు చెందిన ప్రజలు నివసిస్తున్నప్పటికీ, వారందరి మధ్య ఉమ్మడి జాతీయత భావాలు నెలకొన్నాయి. అటువంటి పరిస్థితియే కెనడా, ఇండియా వంటి రాజ్యాలలో గోచరిస్తున్నది.

4. భౌగోళిక ఐక్యత (Geographical Unity) :
జాతీయత, జాతి భావనలో భౌగోళిక ఐక్యత అనేది మరొక ముఖ్య అంశం. భౌగోళిక ఐక్యత అనేది ప్రకృతిలోనే ఇమిడి ఉంది. ఒక దేశపు సమైక్యతకు భౌగోళిక ఐక్యత చిహ్నంగా ఉంటుంది. అంతేకాకుండా, ఒకే రకమైన వాతావరణ పరిస్థితులలో ప్రజలందరూ కలిసికట్టుగా జీవించేందుకు భౌగోళిక ఐక్యత దోహదపడుతుంది.

ఒక నిర్ణీత ప్రదేశంలో నివసించే ప్రజల మనసులు, శరీరాలపై భౌగోళిక ఐక్యత అంశం -ప్రకృతి సహజమైన ప్రభావాన్ని చూపుతుంది. అటువంటి ప్రజలు ఒకేరకమైన భావాలతో కూడిన మానసిక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటారు. అయితే భౌగోళిక ఐక్యత ఒక్కటే జాతీయ భావాన్ని పెంపొందిస్తుందని చెప్పలేం.
ఉదా : పాలస్తీనా రాజ్యం ఏర్పాటు జరుగకముందే యూదు జాతికి చెందిన ప్రజలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో నివాస స్థావరాలు ఏర్పరచుకొన్నారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 3 జాతి – జాతీయత, జాతీయ వాదం

ప్రశ్న 2.
జాతీయవాదం ప్రయోజనాలను తెలపండి ?
జవాబు.
జాతీయవాద లక్షణాలను కలిగిన ఆధునిక రాజ్యాలలో కింద పేర్కొన్న సుగుణాలు కనిపిస్తాయి :

  1. జాతీయ వాదం ప్రజల మధ్య నెలకొన్న పరస్పర వైరుధ్యాలు, వ్యక్తిగత విద్వేషాలు, అంతర్గతమైన ఘర్షణలను నిలువరించగలిగింది. ఒక జాతికి సంబంధించిన ప్రజలలో ఐక్యత, సమగ్రత, సంఘీభావాన్ని పెంపొందించింది. ఇరుగు పొరుగు ప్రజల ఉద్దేశ్యాలను తెలుసుకొనేందుకు వీలు కల్పించింది. కాబట్టి ప్రజల మధ్య చక్కని అవగాహనను పెంపొందించింది.
  2. ప్రజలు ప్రభుత్వం పట్ల విధేయత చూపించేలా జాతీయవాదం దోహదపడింది.
  3. అతిస్వల్ప వ్యవధిలో జాతి అన్ని రంగాలలో ప్రగతిని సాధించేందుకు సహాయపడింది.
  4. రాజ్యంలో అభివృద్ధి వేగం పుంజుకొనేలా చూసింది. ప్రభుత్వానికి ప్రజాస్వామ్య పునాదిని ఏర్పాటు చేసింది. తద్వారా పాలన వ్యవస్థకు బలం చేకూర్చింది.
  5. సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించింది. ఆర్థిక దోపిడిని ఖండించింది.
  6. రాజకీయస్థిరత్వాన్ని చేకూర్చింది. ప్రశాంతమైన సామాజిక వాతావరణాన్ని సృష్టించింది.
  7. ప్రజలలో సాంస్కృతిక వికాసానికి దోహదపడింది. అందుకొరకై ప్రజల భాష, సంస్కృతి, సాహిత్యం వేష ధారణలలో సాన్నిహిత్యాన్ని పెంచింది.

ప్రశ్న 3.
జాతి, రాజ్యం ఏ విధంగా వ్యత్యాసాలను కలిగి ఉంటాయి ?
జవాబు.
‘జాతి, రాజ్యం ఒక్కటే అన్న భావాన్ని చాలామంది వ్యక్తపరిచారు. హేస్ అనే శాస్త్రజ్ఞుడి దృష్టిలో రాజకీయ ఐక్యత, సార్వభౌమత్వంతో కూడిన స్వాతంత్ర్యాన్ని పొందిన ఒక జాతీయ సముదాయం జాతి అవుతుంది. అలా ఏర్పడిన జాతినే జాతిరాజ్యం లేదా జాతీయరాజ్యం అని అనవచ్చునని హేస్ పేర్కొన్నాడు.

అందువలన జాతి, రాజ్యం రెండు సమానార్థకాలుగా భావించవచ్చు. ఐక్యరాజ్యసమితి అనే అంతర్జాతీయ సంస్థను ఇంగ్లీషులో United Nations Organisation అంటారు. ఇక్కడ జాతి (Nation) అనే పదానికి రాజ్యం అనే అర్థం.

జాతి : లార్డ్ బ్రైస్ ప్రకారం, “స్వాతంత్ర్యం పొందిన లేదా స్వాతంత్ర్యం పొందాలని కోరుకుంటూ, రాజకీయంగా వ్యవస్థీకృతమైన ప్రజలే జాతి”.
రాజ్యం : ఉడ్రోవిల్సన్ ప్రకారం, “నిర్ణీత భూభాగంలో శాసనబద్ధులై నివసించే ప్రజలే రాజ్యం”

జాతి – రాజ్యం మధ్య వ్యత్యాసాలు (Differences between Nation and State) :

జాతి (Nation)రాజ్యం (State)
1. జాతి అనేది స్వతంత్ర రాజకీయ సముదాయం’ లేదా ఒకానొక బహుళజాతి రాజ్యంలో అంతర్భాగమైందిగా పరిగణించవచ్చు.1. రాజ్యం ఒక జాతి లేదా అనేక జాతుల ప్రజా సముదాయాన్ని కలిగి ఉండవచ్చు.
2. రాజ్యం కంటే జాతి ముందుగా ఆవిర్భవించింది.2. రాజ్యం జాతి తరువాత ఉద్భవించింది. రాజ్యత్వ హోదాను కలిగి ఉండటమే జాతి అంతిమ లక్షణంగా పేర్కొనవచ్చు.
3. ఒకే రకమైన మానసిక భావాలను కలిగి ఉమ్మడి లక్ష్యంతో నివసించే ప్రజా సముదాయమే జాతి.3. ఒక నిర్దిష్ట ప్రదేశంలో శాసనబద్ధులైన ప్రజా సముదాయమే రాజ్యం.
4. జాతి అనేది చారిత్రక, సాంస్కృతిక పరిణామాన్ని కలిగి ఉంటుంది.4. రాజ్యమనేది ఒకే రకమైన రాజకీయ, చట్టబద్ధమైన నిర్మితిని కలిగి ఉంటుంది.
5. జాతి అనే భావన సుదీర్ఘకాలం పాటు జీవనం సాగించిన ప్రజలతో కూడిన సముదాయం.5. రాజ్యం పరిణామాత్మక స్వభావాన్ని కలిగి ఉండక పోవచ్చు. స్వాతంత్ర్యం గల కొన్ని చిన్న రాజకీయ సమాజాలు లేదా విభజన కారణంగా ఏర్పడిన రాజకీయ సమాజాల ఏకీకరణ ఫలితంగా రాజ్యం ఏర్పడుతుంది.

 

TS Board Inter First Year Political Science Study Material Chapter 3 జాతి – జాతీయత, జాతీయ వాదం

ప్రశ్న 4.
జాతి, జాతీయతల మధ్య వ్యత్యాసాలు ఏవి ?
జవాబు.
జాతి, జాతీయతల మధ్య కింద అంశాలలో వ్యత్యాసాలు.

జాతి (Nation)జాతీయత (Nationality)
1. జాతి అనేది రాజకీయ భావన.1. జాతీయత అనేది మానసిక భావన.
2. జాతి అనేది ఎల్లప్పుడూ రాజకీయంగా సంఘటితమైన రాజ్యాన్ని సూచిస్తుంది.2. జాతీయత అనేది ఎల్లప్పుడూ అసంఘటితమైన, అతి సులభమైన భావన.
3. జాతి అనే భావన ఎల్లప్పుడూ స్వతంత్రతను కలిగి ఉంటుంది.3. జాతీయత అనే భావన స్వతంత్రతను కలిగి ఉండదు.
4. జాతీయత లేకుండా జాతి అనేది ఉండదు.4. జాతి లేకుండా జాతీయత ఉంటుంది.
5. జాతిగా ఏర్పడిన ప్రజలు రాజ్య శాసనాలకు విధేయులుగా ఉంటారు.5. జాతీయతగల ప్రజలు జాతిగా రూపొందేవరకు, రాజ్యాంగ చట్టాలు ఉండవు. అయితే స్వీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రజలు కొన్ని ఉమ్మడి నియమాలను అనుసరిస్తారు.

 

ప్రశ్న 5.
జాతుల స్వయం నిర్ణయాధికారం సంక్షిప్త సమాధానం రాయండి.
జవాబు.
ప్రతి జాతీయ సముదాయానికి స్వతంత్రంగా ఉండటానికి, అంటే రాజ్యంగా ఏర్పడటానికి సొంతహక్కు ఉన్నది అని చెప్పేదే జాతి స్వయం నిర్ణయాధికార సిద్ధాంతం. వియన్నా కాంగ్రెసు (1815) కాలం నుంచి 19వ శతాబ్దం చివరి వరకు ‘ఒకే జాతీయ సముదాయం ఒకే జాతి రాజ్యం’ అనే సిద్ధాంతం యూరప్ రాజకీయాలను ప్రభావితం చేస్తూ వచ్చింది.

ఈ సిద్ధాంతాన్ని కారల్మార్క్స్, ఏంజల్స్, లెనిన్ మొదలగువారు బలపరిచారు. అలాగే అమెరికా అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్ మొదటి ప్రపంచ యుద్ధకాలంలో తాను ప్రతిపాదించిన ’14 అంశాల కార్యక్రమంలో ఈ సిద్ధాంతాన్ని చేర్చాడు. 1945లో స్థాపించబడిన ఐక్యరాజ్యసమితి రాజ్యాంగం ఈ సిద్ధాంతానికి మరింత బలాన్ని చేకూర్చింది.

ధర్మకర్తృత్వ మండలి ఉద్దేశ్యం జాతీయ సముదాయాలకు క్రమంగా స్వయం పాలన కలుగజేయటమే. ఒక్కొక్క జాతీయ సముదాయం ఒక్కొక్క జాతీయ రాజ్యంగా అవతరించినందువల్ల పెక్కు ప్రయోజనాలు ఉన్నమాట నిజమే.

అయితే దానివలన కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ భావాన్ని ఖండిస్తూ దానిని మొత్తం ప్రజల వ్యవస్థీకృతమైన స్వార్థ ప్రయోజనంగా (organised self interest of whole people) అభివర్ణించాడు. ఆధునిక కాలంలో జాతీయ భావం ఒక మత భావనకు దారితీస్తున్నదని షిలిటో (Schillito) హెచ్చరించాడు. లార్డ్ యాక్టన్ అభిప్రాయంలో ఏకజాతి రాజ్యం కన్నా బహుళ జాతిరాజ్యమే అన్ని విధాల మెరుగైనది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 3 జాతి – జాతీయత, జాతీయ వాదం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
జాతీయత అంటే ఏమిటి ?
జవాబు.
జాతీయతను ఆంగ్లంలో ‘నేషనాలిటీ’ (Nationality) అంటారు. ఇది ‘నేషియో’ (Natio) అనే లాటిన్ పదం నుంచి గ్రహించబడింది. దీనికి “పుట్టుక” అని అర్థము. ఒక రాజకీయ వ్యవస్థగా రూపొందే జాతీయత జాతి అనబడుతుంది. అంటే రాజ్యము, జాతీయతల కలయిక జాతి అవుతుంది. “ఒకే రక్త సంబంధం, ఒకే భాష, సాహిత్యం, సంప్రదాయాలు, ఉండి కొన్ని కట్టుబాట్లకు లోనై ఉన్న జనసమూహం” జాతీయత అని ‘లార్డ్ బ్రైస్’ నిర్వచించాడు.

ప్రశ్న 2.
జాతిని నిర్వచించండి.
జవాబు.
జాతిని ఆంగ్లంలో ‘నేషన్’ (Nation) అంటారు. ఈ ఆంగ్ల పదం ‘నేటస్’ (Nates), నేషియో (Natio) అనే లాటిన్ పదాల నుండి గ్రహించబడెను. దీనికి ‘పుట్టుక’ అని అర్థము కలదు. లార్డ్స్ ప్రకారము “స్వాతంత్య్రం పొందిన లేదా స్వాతంత్ర్యం పొందాలని కోరుకుంటూ, రాజకీయంగా వ్యవస్థీకృతమైన ప్రజలనే” జాతి అంటారు. బర్జెస్ ప్రకారం “భౌగోళిక ఐక్యత కలిగిఉంటూ ఒక నిర్దిష్ట ప్రదేశంలో నివసించే తెగకు సంబంధించిన జాతీయతయే జాతి”.

TS Board Inter First Year Political Science Study Material Chapter 3 జాతి – జాతీయత, జాతీయ వాదం

ప్రశ్న 3.
జాతీయవాదం ప్రాధాన్యతను వివరించండి.
జవాబు.
జాతీయవాదాన్ని సూక్ష్మంగా పరిశీలించినచో ప్రపంచ వ్యవహారాలలో ఈ భావన కీలకపాత్ర పోషించినదని చెప్పవచ్చు. గత రెండు శతాబ్దాలుగా జాతీయవాదం అత్యంత ప్రాముఖ్యత గల రాజకీయ సిద్ధాంతంగా ప్రాచుర్యం పొంది ప్రపంచ చరిత్రలో కీలక అంశంగా పరిణమించింది.

అయితే జాతీయవాదం ఒకవైపు ప్రపంచ ప్రజలను ప్రభావితం చేయగా మరొకవైపు ప్రపంచ ప్రజానీకం మధ్య విద్వేషాలను కూడా సృష్టించింది. నియంతృత్వ పాలకుల ప్రతిఘటనల నుంచి ప్రజలకు విముక్తి గావించి అనేక సామ్రాజ్యాలు, పలు రాజ్యాల విభజనలలో నిర్ణయాత్మక పాత్రను పోషించింది. అనేక రాజ్యాల సరిహద్దులను నిర్ణయించడంలో సైతం కీలకపాత్ర పోషించింది.

ప్రశ్న 4.
జాతీయవాదానికి సంబంధించి ఏవైనా రెండు ప్రయోజనాలు తెలపండి.
జవాబు.

  1. దేశాన్ని ప్రేమించడం అనే భావాన్ని ప్రజల్లో ఉత్పన్నం చేయడం జాతీయవాదం యొక్క అత్యంత ప్రధాన ప్రయోజనం ప్రజలు ఎప్పుడైతే దేశాన్ని ప్రేమించడం ఆరంభిస్తారో, ఆ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందగలదని ఆశించవచ్చు.
  2. జాతి సంస్కృతులలో గల భిన్నత్వాన్ని జాతీయవాదం పరిరక్షిస్తుంది. తమ సంస్కృతులను కాపాడుకుంటూ ప్రపంచంలోని అన్ని సంస్కృతుల సహజీవనం వల్ల విశ్వమానవత్వ భావన పరిఢవిల్లుతుంది.
  3. ఇతర జాతులకంటే ముందుండాలని లేదా అభివృద్ధి చెందాలని ప్రతి జాతి ప్రయత్నం చేస్తుండటం వల్ల వారి మధ్య ఆరోగ్యకరమైన పోటి ఏర్పడి మానవ జాతి మొత్తం లాభపడే అవకాశం ఉండేలా జాతీయవాదం దేశాల మధ్య జాతీయ దృక్పథంతో కూడిన జాతుల మధ్య పోటీ ఏర్పడుతుంది.
  4. అనేక మంది కవులు, వక్తలు, చిత్రకారులు జాతీయవాదం వల్ల ప్రేరణ పొంది మరపురాని రచనలు, చిత్రాలను ప్రపంచానికి అందించారు.
  5. ప్రతి దేశానికి విముక్తి స్వతంత్ర దేశంగా కొనసాగించాలని జాతీయవాదం కోరుకుంటుంది. అన్ని దేశాలకు స్వాతంత్య్రం లభించినప్పుడు ప్రపంచంలో తక్కువ సంఘర్షణలు, ఉద్రిక్తతలు, కఠినత్వాలు తగ్గే అవకాశం ఉంటుంది.
  6. జాతీయవాదం శక్తుల ఆధారంగా సామ్రాజ్య వాదాన్ని అదుపు చేయవచ్చు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 3 జాతి – జాతీయత, జాతీయ వాదం

ప్రశ్న 5.
జాతీయవాదానికి సంబంధించిన రెండు దుష్పరిణామాలు వివరించండి.
జవాబు.
జాతీయవాదం విమర్శలకు అతీతం ఏమీ కాదు. జాతీయవాదంలో క్రింది దుష్పరిణామాలు ఉన్నాయి.

  1. తమ దేశాన్ని ప్రేమించడం ఎన్నడూ తప్పుకాదు. కాని అది సంకుచితంగా మారి ఇతర దేశాల ప్రయోజనాలకు భంగకరంగా మారకూడదు. ఉదా : జర్మని – ఫ్రెంచ్ల మధ్య జరిగిన యుద్ధం.
  2. సంకుచిత జాతీయవాదం సైనిక సమీకరణకు దారితీస్తుంది. ఈ సమీకరణ దీర్ఘకాలంలో యుద్ధంగా మారే
    అవకాశం ఉంటుంది.
  3. ప్రతి జాతీయవాదం తన వైభవం ఇతరులకంటే అధికంగా ఉండాలని నిరంతరంగా కృషిచేస్తుంది. ఈ వైభవం లేదా ఇతరులకంటే ముందుండాలనే లక్ష్యం ఇతరుల భూభాగాలను చేర్చుకోవడం ద్వారా నెరవేర్చుకోవాలని కోరుకుంటారు. ఇదే జరిగితే ప్రపంచంలో సంఘర్షణలు తలెత్తుతాయి.
  4. తీవ్ర జాతీయవాదం ఆ జాతి ప్రజలలో అసహనాన్ని ఏర్పరుస్తుంది. తమ జాతి అత్యున్నతమైందని భావించి, ఇతర జాతులు పనికిరావని భావించే అవకాశం ఉంది..
  5. జాతీయవాదం సామ్రాజ్య వాదానికి దారి తీస్తుంది. సామ్రాజ్యవాదం మైనారిటి జాతుల సమస్యను తీసుకువస్తుంది.
  6. పెద్ద దేశాలు అనేక జాతీయతలతో కూడుకుని ఉంటాయి. ఆ దేశాలలోని మైనారిటి జాతీయులు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసే అవకాశం ఉంటుంది. అదే జరిగితే జాతీయవాదం విభజన శక్తిగా, ఐక్యత శక్తిగా ` కూడ పనిచేస్తుంది.
  7. దూకుడుతో కూడిన జాతీయవాదం ఇతర దేశాల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తుంది. ఇతరుల బాధలను అసలు పట్టించుకోదు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 3 జాతి – జాతీయత, జాతీయ వాదం

ప్రశ్న 6.
జాతీయత మౌలిక అంశాలలో రెండింటిని తెలపండి.
జవాబు.
జాతీయత లక్షణాలు :
1. స్వచ్ఛమైన తెగ (Purity of Race) :
దీనిని ఏకజాతి లేదా వారసత్వము అనవచ్చు. ఒకే తెగ మనుషుల మధ్య రక్తసంబంధం ఉంటుంది. ఒకే సంతతికి చెందినవారమనే భావంతో ఒకే తెగ ప్రజలు ఐకమత్యభావంతో ఉంటారు. అది ధృఢమైన జాతీయత, జాతిని పెంపొందిస్తుంది.
ఉదా : హిట్లర్ కాలంలో జర్మనులు, తమిళనాడులో డి. యం.కె. పార్టీ తమ జాతీయతలను ప్రత్యేకమైనవిగా చెప్పుకున్నాయి. అయితే ఈ కాలంలో ఒక తెగవారే ఒక రాజ్యంలో ఉండటం సాధ్యం కాదు.

2. ఉమ్మడి మతము (Common Religion) :
ఒకే మతస్థుల మధ్య ఐకమత్య భావం ఏర్పడుతుంది. జాతులను సమైక్యపరచడంలో మతం ప్రముఖ పాత్ర వహించింది. అయితే ఆధునిక కాలంలో జాతీయతా భావానికి ఒకే మతం ఉండాలనే నియమం లేదు.
ఉదా : 1947లో ముస్లిమ్లంతా మత ప్రాతిపదికన పాకిస్థాన్ రాజ్యం ఏర్పరచుకున్నారు. అది 1972లో రెండుగా చీలిపోయి బంగ్లాదేశ్ ఏర్పడింది.

TS Inter 2nd Year Political Science Study Material Chapter 11 భారతదేశం – ప్రపంచదేశాలు

Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 11th Lesson భారతదేశం – ప్రపంచదేశాలు Textbook Questions and Answers.

TS Inter 2nd Year Political Science Study Material 11th Lesson భారతదేశం – ప్రపంచదేశాలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారత విదేశాంగ విధానానికి ఉన్న ఏవేని రెండు లక్షణాలను తెలపండి.
జవాబు.
1. వలసవాదం, సామ్రాజ్యవాదాలకు వ్యతిరేకత :
భారత విదేశాంగ విధానం ప్రధానంగా వలసవాదాన్ని సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తుంది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఖండాల్లోని వివిధ దేశాల్లో వలసవాదపాలనలో ఉన్న ప్రజలపట్ల భారతదేశం సానుభూతి ప్రకటించింది.

వలసవాద పాలన ప్రాంతాల్లో ప్రజలపై నిరంకుశ పాశవిక విధానాన్ని భారతదేశం తీవ్రంగా ఖండిస్తుంది. ఈ ప్రాంతాల ప్రజలు స్వాతంత్ర్యాన్ని పొందడానికి రాజకీయ, దౌత్యపర, ఆర్థిక సహాయాలన్నింటినీ భారతదేశం అందించింది. అగ్రరాజ్యాలు రూపొందించిన సామ్రాజ్యవాద వ్యూహాన్ని కూడా విదేశాంగ విధానం వ్యతిరేకిస్తుంది.

2. జాతి విచక్షణకు వ్యతిరేకత :
సుదీర్ఘకాలంగా భారతదేశం వర్ణ, జాతి, సంస్కృతి తదితర అంశాల ఆధారంగా జరిగే అన్ని రకాల విచక్షణలను వ్యతిరేకిస్తోంది. జాతి విచక్షణ సమస్యను అంతర్జాతీయ స్థాయిలో సముచితంగా వివిధ వేదికల్లో, చర్చనీయాంశం చేసింది. దక్షిణాఫ్రికా, కాంగో, రొడీషియా (ఇప్పటి జింబాబ్వే)లలో అనుసరిస్తున్న ప్రభుత్వ జాతి విచక్షణ విధానాన్ని తీవ్రంగా విమర్శించింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 11 భారతదేశం - ప్రపంచదేశాలు

ప్రశ్న 2.
అలీనోద్యమం పాత్రపై ఒక సంక్షిప్త సమాధానం రాయండి.
జవాబు.
అలీనోద్యమం 1955లో బాండుంగ్లో జరిగిన ఆఫ్రో-ఆసియన్ సమావేశం ద్వారా రూపుదిద్దుకుంది. ఇది ఒక విదేశాంగ విధానంగా పశ్చిమ దేశాల కూటమికి, కమ్యూనిస్టు కూటమికి సమానదూరం పాటించే సంవర్థక విధానంగా వృద్ధి చెందింది. అలీనోద్యమ వ్యవస్థాపక నాయకులుగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ, మార్షల్ టిటో, సుకార్నో, నిక్రోమా, అబ్దుల్ నాజర్ తదితర రాజనీతిజ్ఞులు ఉద్యమ వ్యాప్తికి ఎంతో కృషి చేశారు.

అలీనోద్యమ లక్ష్యాలు :
అలీనోద్యమం కొన్ని నిర్దిష్ట లక్ష్యాలతో పనిచేస్తుంది. వాటిలో ప్రధానమైనవి :

  1. ప్రపంచ శాంతి, నిరాయుధీకరణ
  2. వలసప్రాంతాల ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కు
  3. జాతివివక్షకు, వర్ణవివక్షకు వ్యతిరేకంగా ప్రతీవారికి సమానత్వపు హక్కు
  4. ఆర్థిక సమానత్వాన్ని సాధించండం
  5. సాంస్కృతిక ఆధిపత్యం లేదా సాస్కృతిక సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించడం
  6. అంతర్జాతీయ వాదాన్ని సమర్ధించడం.

ప్రశ్న 3.
సార్క్ అనగానేమి ? వివరించండి.
జవాబు.
దక్షిణ ఆసియా ప్రాంతీయ సహకార సంఘం (South Asian Association of Regional Co-operation) లోని ఆంగ్ల ప్రథమాక్షరాల పదబంధంగా సార్క్ (SAARC) అని దీనిని వ్యవహరిస్తారు. ఈ సార్క్ ఏర్పాటులో బంగ్లాదేశ్ అధ్యక్షడు జియాఉర్ రెహమాన్ (Zia-ur Rehaman) ఎంతో ప్రధాన పాత్ర పోషించాడు.

సార్క్న లాంఛనప్రాయంగా డిసెంబర్ 8, 1985న స్థాపించారు. దీనిని బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవులు, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక దేశాలు ఏడు సభ్యదేశాలుగా ఏర్పడ్డాయి. ఆ తరువాత ఏప్రియల్ 3, 2007న ఆఫ్ఘనిస్తాన్ సభ్యదేశం కావడంతో ప్రస్తుతం సార్స్లో మొత్తం ఎనిమిది దేశాలు సభ్య రాజ్యాలుగా ఉన్నాయి.

సార్క్ లక్ష్యాలు :

  1. దక్షిణాసియా ప్రాంతంలో సంక్షేమరంగాన్ని వృద్ధిచేసి జనాభా జీవన పరిస్థితులను గుణాత్మకంగా వృద్ధి చేయడం.
  2. దక్షిణాసియా ప్రాంత దేశాల మధ్య సమష్టి స్వాబలంబనను బలోపేతం చేయడం.
  3. ఆర్థికవృద్ధి, సాంఘిక ప్రగతి, సంస్కృతి అభివృద్ధులను వేగిరపరచడం.
  4. సభ్యదేశాలు తమ సమస్యలపట్ల సానుభూతితో పరస్పర విశ్వాసాన్ని పెంపొందిచుకోవడం.
  5. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో పరస్పర సహాయంతో తోడ్పాటు అందించుకోవడం.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 11 భారతదేశం - ప్రపంచదేశాలు

ప్రశ్న 4.
ఐక్యరాజ్యసమితి సాధారణ సభ అధికారాలు, విధులను వివరించండి.
జవాబు.
సాధారణ సభ అధికారాలు – విధులు :

  1. అంతర్జాతీయ శాంతి భద్రతలు, రక్షణ విషయాలను చర్చించి, సిఫార్సులు చేయడం.
  2. అంతర్జాతీయ సాంఘిక-ఆర్థిక సహకారానికి సంబంధించిన విషయాల్లో మార్గనిర్దేశనం చేస్తే, పర్యవేక్షించడం.
  3. స్వయంపాలన చేసుకోలేని ప్రాంతాల పరిపాలనపై సమాచారాన్ని, నివేదికలను సేకరించడం.
  4. ఐక్యరాజ్యసమితి నిధులపై ప్రత్యేక నియంత్రణ అధికారాన్ని కలిగి, వార్షిక బడ్జెట్ను ఆమోదిస్తుంది.
  5. భద్రతామండలకి 10 మంది తాత్కాలిక సభ్యులను ఎన్నుకుంటుంది. అలాగే ఆర్థిక సాంఘిక మండలికి 5 మంది సభ్యులను, అంతర్జాతీయ న్యాయస్థానానికి 15 మంది న్యాయమూర్తులను, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిని సాధారణ సభ ఎన్నుకుంటుంది.
  6. అంతర్జాతీయ ఒప్పందాలను ఆమోదిస్తుంది.
  7. ఐక్కరాజ్యసమితి ఛార్ట్క అవసరమైన సవరణలు చేసే అధికారం సాధారణ సభకు ఉంటుంది.
  8. ఐక్యరాజ్యసమితిలోకి కొత్తగా రాజ్యాలను సభ్యులుగా చేర్చుకోడానికి, సస్పెండ్ చేయడానికి, సభ్యరాజ్యాలను తొలగించడానికి సాధారణ సభకు అధికారం ఉంటుంది.

ప్రశ్న 5.
భద్రతామండలి నిర్మాణాన్ని తెల్పి, దీనికి గల ఏవైనా రెండు అధికారాలను, విధులను తెలపండి.
జవాబు.
నిర్మాణం :
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యనిర్వాహక విభాగంగా భద్రతామండలిని పేర్కొనవచ్చు. దీనిలో 15 మంది సభ్యులు ఉంటారు. వీటిలో 5 రాజ్యాలను శాశ్వత దేశాలనీ, వీటో అధికారం ఉన్న పెద్ద దేశాలనీ చెప్పవచ్చు. మిగిలిన 10 తాత్కాలిక దేశాలను సాధారణ సభ రెండు సంంత్సరాల పదవీకాలానికి ఎన్నుకుంటుంది.

ఈ పది తాత్కాలిక దేశాలలో అయిదు ఆఫ్రికా-ఆసియా ఖండాలనుంచి, ఒకటి తూర్పు యూరోపు నుంచి, రెండు లాటిన్ అమెరికా ఖండం నుంచి, రెండు పశ్చిమ యూరోపు తదితర ప్రాంతాలనుంచి ప్రాతినిధ్యం వహించేలా ఎన్నికవుతాయి.

ఇవేకాక, ఏదేని వివాదానికి సంబంధించిన ఏదేని ఒక సభ్యరాజ్యన్నికానీ, రాజ్యేతర సభ్యులు కానీ చర్చలలో పాల్గొనమని భద్రతామండలి కోరవచ్చు. భద్రతామండలి అధ్యక్ష పదవి దానిలోని సభ్యరాజ్యాల మధ్య అక్షర క్రమంలో ప్రతి నెలకు ఒకసారి మారుతూ ఉంటుంది. భద్రతామండలికి సహాయం అందించడానికి మూడు స్థాయూ సంఘాలు ఉంటాయి.

అధికారాలు – విధులు :
అంతర్జాతీయ శాంతిభద్రతలు – రక్షణ వ్యవహారాల నిర్వహణలో ఐక్యరాజ్యసమితికి గణనీయమైన అధికారాలు ఉన్నాయి. భద్రతామండలి అధికారాలు – విధులు ఈ దిగువ తెలిపిన విధంగా ఉంటాయి.

  1. భద్రతా మండలి అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది.
  2. అంతర్జాతీయ శాంతి, భద్రతల నిర్వహణకు కార్యాచరణను అమలుచేసి, శాంతికి విఘాతం కలిగించే వాటిపై నివారక చర్యలు చేపడుతుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 11 భారతదేశం - ప్రపంచదేశాలు

ప్రశ్న 6.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అధికారాలు-విధులను సంక్షిప్తంగా రాయండి.
జవాబు.
ప్రధాన కార్యదర్శి అధికారాలు – విధులు :
ఐక్యరాజ్యసమితి ఛార్టర్ నిర్దేశించిన పరిధిలోని అనేక విధులను-బాధ్యతలను ప్రధాన కార్యదర్శి నిర్వహిస్తారు. వీటిలో ప్రధానమైనవి :

  1. అంతర్జాతీయ శాంతిభద్రతలకు విఘాతం కల్పించే అన్ని విషయాలను ప్రధాన కార్యదర్శి సాధారణ సభ భద్రతామండలి ముందు నివేదిస్తాడు.
  2. ఐక్యరాజ్యసమితి వార్షిక బడ్జెట్ను రూపొందిస్తాడు. అలాగే ఐక్యరాజ్యసమితి పనితీరుపై నివేదికను ప్రతి సంవత్సరం తయారుచేస్తాడు.
  3. భద్రతామండలి వినతిపైగాని, ఐక్యరాజ్యసమితి మెజారిటీ సభ్యుల కోరికపైగాని, సాధారణ సభ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేస్తారు.
  4. అంతర్జాతీయ ఒప్పందాలు, ఒడంబడికలకు రిజిష్టర్ చేసే అధికారిలాగా వ్యవహరిస్తారు.
  5. వివిధ సందర్భాలలో ఐక్యరాజ్యసమితి ఏర్పరచిన శాంతి పరిరక్షణ దళాల కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటారు.

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
బిమ్ క్ అనగానేమి ?
జవాబు.
ఈ సంస్థను 1997వ సంవత్సరంలో బంగాళాఖాత (సముద్ర) తీరప్రాంతదేశాలైన దక్షిణాసియా, ఆగ్నేయ ఆసియా దేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. “బంగాళాఖాత తీరప్రాంత దేశాల బహుళరంగ సాంకేతిక ఆర్థిక సహకార సంస్థ” పేరుతో ఏర్పడిన ఈ సంస్థలో భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, బర్మా (మియన్మార్), థాయ్లాండ్ దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. బిమ్క్ అనే ఈ సంస్థ ప్రధాన కేంద్ర కార్యాలయం బంగ్లాదేశ్ ఢాకాలో ఉంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 11 భారతదేశం - ప్రపంచదేశాలు

ప్రశ్న 2.
సార్క్ 18వ శిఖరాగ్ర సమావేశం గురించి రాయండి.
జవాబు.
సార్క్ 18వ శిఖరాగ్ర సమావేశం ఖాట్మండ్లో నవంబరు 27, 2014న జరిగింది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. దక్షిణాసియా దేశాలు అన్ని రంగాల్లో సహకారం అందించుకోవడానికి ముందుండాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు.

ఈ సహకారం ప్రజలు పరస్పరం ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా సమాచార సాంకేతిక అనుసంధానం ద్వారా మరింత తేలికగా జరుగుతుందని పిలుపునిచ్చారు. సార్క్ ద్వారా వాణిజ్యం, పెట్టుబడులు, సహాయం, సహకారాలు ప్రతి రంగంలో సాధ్యమౌతాయని భారతదేశం భావిస్తోంది.

ప్రశ్న 3.
ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ఎన్ని దేశాలు సభ్యత్వం కల్గి ఉన్నాయి ?
జవాబు.
ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో 194 సభ్య రాజ్యాలు ఉన్నాయి.

ప్రశ్న 4.
సార్క్ లోని సభ్యదేశాలు ఏవి ?
జవాబు.
సార్క్ లోని సభ్యదేశాలు

  1. బంగ్లాదేశ్
  2. ఇండియా
  3. మాల్దీవులు
  4. నేపాల్
  5. పాకిస్తాన్
  6. శ్రీలంక
  7. భూటాన్

2007లో ఆఫ్ఘనిస్తాన్ కూడా సభ్యదేశం కావటంతో ప్రస్తుతం సార్క్ ఎనిమిది సభ్యదేశాలున్నాయి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 11 భారతదేశం - ప్రపంచదేశాలు

ప్రశ్న 5.
ఐక్యరాజ్యసమితి ప్రధాన అంగాలు ఏవి ?
జవాబు.

  1. సాధారణ సభ
  2. భద్రతా మండలి
  3. ఆర్థిక-సాంఘిక మండలి
  4. ధర్మకర్తృత్వ సంఘం
  5. అంతర్జాతీయ న్యాయస్థానం
  6. సచివాలయం.

వీటిలో ప్రస్తుతం ధర్మకర్తృత్వమండలి పనిచేయటం లేదు.

ప్రశ్న 6.
ఐక్యరాజ్యసమితి ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎవరు ?
జవాబు.
ఐక్యరాజ్యసమితి ప్రస్తుత ప్రధాన కార్యదర్శి పోర్చుగీసుకు చెందిన ‘ఆంటోనియో గుటిరస్’.

ప్రశ్న 7.
బ్రిక్స్లోని సభ్యదేశాలేవి ?
జవాబు.

  1. బ్రెజిల్ (Brazil)
  2. రష్యా (Russia)
  3. ఇండియా (India)
  4. చైనా (China)
  5. దక్షిణాఫ్రికా (South Africa)

ఈ దేశాల పేర్లలోని మొదటి అక్షరాలతో బ్రిక్స్ (BRICS) అనే పదబంధంతో ఈ సంస్థ ఏర్పడింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 11 భారతదేశం - ప్రపంచదేశాలు

ప్రశ్న 8.
పంచశీల సూత్రాలను వివరించండి.
జవాబు.

  1. రాజ్యాల ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని పరస్పరం గౌరవించుకోవడం.
  2. రాజ్యాలు పరస్పర దురాక్రమణకు పాల్పడకుండా ఉండడం.
  3. ఇతర రాజ్యాల అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం.
  4. రాజ్యాల మధ్య సమానత్వం, పరస్పర ప్రయోజనాత్మక సహకారం.
  5. శాంతియుత సహజీవనం.

TS Inter 2nd Year Political Science Study Material Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్

Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 10th Lesson స్మార్ట్ గవర్నెన్స్ Textbook Questions and Answers.

TS Inter 2nd Year Political Science Study Material 10th Lesson స్మార్ట్ గవర్నెన్స్

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఎలక్ట్రానిక్ పాలన (e-Governance) అంటే ఏమిటి ? దాని సుగుణాలను వివరించండి.
జవాబు.
ఇ-గవర్నెన్స్ అంటే ఆంగ్లంలో ఎలక్ట్రానిక్ గవర్నెన్స్. దీన్ని ఎలక్ట్రానిక్ పాలన అని వ్యవహరిస్తారు. దీన్ని కాగిత రహిత పాలన (Paperless Governance) అని కూడా పేర్కొంటారు. దీన్ని అనుసరించి, సమాచార సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ఆధారంగా ప్రభుత్వం విధులు నిర్వహిస్తుంది. దీని వల్ల సేవలలో సమర్థత కార్యసాధకత పెరుగుతుంది.

దీనిలో భాగంగా అంతర్జాలాన్ని (Internet), ఇతర వెబ్ ఆధారిత సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగిస్తారు. పాలనలో వేగం ఖచ్చితత్వం దీనికి గల అదనపు లక్షణాలు, పౌరులు, సమూహాలు, సంస్థలు ఎలక్ట్రానిక్ పాలన పద్ధతి వల్ల గుణాత్మకమైన, నిరంతరాయమైన సేవలను పొందుతారు.

ఎలక్ట్రానిక్ పాలన పారదర్వకతను, కార్యసాధకతను, జవాబుదారీతనాన్ని పెంపొందిస్తుంది. భరతదేశంలోని ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో దీన్ని అమలుచేస్తున్నారు. 2017 సంవత్సరానికల్లా కాగితపు పాలన సాధన లక్ష్యంతో దీనిని అమలు చేస్తున్నారు.

నిర్వచనం :
భారత మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె అబ్దుల్ కలాం అభిప్రాయంలో భారతదేశపాలన సందర్భంలో ఎలక్ట్రానిక్ పాలన (e-Governance) అంటే, “ఒక పారదర్శక, సత్వర ఎలక్ట్రానిక్ పాలన అవధులు లేని, భద్రమైన విశ్వసనీయ సమాచార ప్రవాహాన్ని, శాఖాంతర అడ్డంకులను అధిగమించాలి. అందుబాటులోకి తెస్తూ పౌరులకు న్యాయబద్ధమైన, పక్షపాతం లేని సేవలను అందిస్తుంది”.

ఇంకా, ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర సాంస్కకృతిక సంస్థ (UNESCO), అభిప్రాయంలో “ఎలక్ట్రానిక్ పాలనలో ప్రభుత్వరంగం సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ, సమాచారాన్ని, సేవల బట్వాడాను పెంపొందించడం. నిర్ణయీకరణ ప్రక్రియలో పౌరుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, ప్రభుత్వం మరింత జవాబుదారీతనంతో, పారదర్శకంగా, సమర్థవంతంగా ఉండేలా చేయడం తదితర లక్ష్యలతో పనిచేస్తుంది.”

పైన పేర్కొన్న నిర్వచనాలు-అర్థవివరణలు పాతకాలపు రాతపని ఆధారిత పాలన ముగించి, పాలనలో ఎలక్ట్రానిక్ పద్ధతిలో సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించవలసిన ఆవశ్యకతను తెలుపుతాయి. పౌరులకు-ప్రభుత్వానికి మధ్య సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానమై కార్యాచరణ సాధనంగా ఉపయోగపడుతుంది. ఫలితంగా పాలనలో పారదర్శకతను చూడవచ్చు. ప్రస్తుతం భారతదేశంలో జాతీయ ఎలక్ట్రానిక్ పాలన ప్రణాళిక (National-Governance Plan-NEGP) అమలులో ఉంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్

ఎలక్ట్రానిక్ పాలన నమూనాలు (Modules of e-Governance) :

ఎ. ప్రభుత్వం నుంచి పౌరులకు (Government to Citizens G to C) :
ఈ నమూనా ఆధారంగా ప్రభుత్వానికి, పౌరులకు మధ్య కార్యాచరణ, సంబంధాన్ని కల్పించి, విస్తృత స్థాయిలో సేవలు అందించడం జరుగుతుంది. ఇది సాధారణ ప్రజానీకానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

బి. ప్రభుత్వం నుంచి వ్యాపార రంగానికి (Government to Business G to B) :
వ్యాపార రంగాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం సదుపాయదారునిలాగా పనిచేస్తుంది. లైసెన్సులను జారీచేసి, రెవెన్యూ వసూలు చేస్తుంది. అంతేకాకుండా, వర్తక వాణిజ్యాలకు, పర్యాటక రంగానికి పెట్టుబడులకు సదుపాయాలు కల్పిస్తుంది.

సి. ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి (Government to Government G to G) :
ప్రభుత్వ సేవలను అందించడంలో సమాచార-సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించడం జరుగుతోంది. స్వేచ్ఛ సమాచార ప్రవాహం సమాంతరంగా, నిలువుగా అందుబాటులో ఉండటం గమనిస్తాం. దీనితో జాతీయ, రాష్ట్ర స్థానిక నిర్వహణ సులువు అవుతుంది.

డి. ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు (Government to Employees G to E) :
ఈ నమూనా కింద ప్రభుత్వం, ఉద్యోగులు సమాచార సాంకేతిక పరిజ్ఞాన సాధనాలతో నిరంతరం స్థిరంగా ఒకరినొకరు సంప్రదించుకొని, కార్యాచరణ జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఉద్యోగులలో విస్తృత కార్యసాధనకు, సంతృప్తికి దారితీస్తుంది.

ఎలక్ట్రానిక్ పాలన-సుగుణాలు : ఎలక్ట్రానిక్ పాలన పద్ధతిలో ఈ దిగువ తెలిపిన ఉపయోగాలు ఉంటాయి.

  1. పౌరునికి సమాచారం అందించి, సంప్రదించే అవకాశం.
  2. పాలన ప్రక్రియను సంస్కరించడం.
  3. సమాచార అందుబాటు
  4. పౌరులకు గుణాత్మక సేవలు పెంపొందించడం
  5. సరళతర నియమాలు
  6. కార్యసాధన
  7. జవాబుదారీతనం
  8. పారదర్శకత
  9. ఎక్కువమంది పౌరులకు గుణాత్మక సేవ

TS Board Inter Second Year Political Science Study Material Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్

ప్రశ్న 2.
ఎలక్ట్రానిక్ పాలనలోని సుగుణాలను, లోపాలను చర్చించండి.
జవాబు.
నిర్వచనం :
భారత మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలాం అభిప్రాయంలో భారతదేశ పరిపాలన సందర్భంలో ఎలక్ట్రానిక్ పాలన (e-Governance) అంటే, “ఒక పారదర్శక, సత్వర ఎలక్ట్రానిక్ పాలన అవధులు లేని, భద్రమైన విశ్వసనీయ సమాచార ప్రవాహాన్ని శాఖాంతర అడ్డంకులను అధిగమించి, అందుబాటులోకి తెస్తూ పౌరులకు న్యాయబద్ధమైన పక్షపాతం లేని సేవలను అందిస్తుంది”.

ఎలక్ట్రానిక్ పాలన-సుగుణాలు :
ఎలక్ట్రానిక్ పాలన పద్ధతిలో ఈ దిగువ తెలిపిన ఉపయోగాలు ఉంటాయి.

  1. పౌరునికి సమాచారం అందించి, సంప్రదించే అవకాశం.
  2. పాలన ప్రక్రియను సంస్కరించడం.
  3. సమాచార అందుబాటు.
  4. పౌరులకు గుణాత్మక సేవలు పెంపొందించడం.
  5. సరళతర నియమాలు.
  6. కార్యసాధకత.
  7. పారదర్శకత.
  8. ఎక్కువమంది పౌరులకు గుణాత్మక సేవ.

ఎలక్ట్రానిక్ పాలన లోపాలు :
ఎలక్ట్రానిక్ పాలనపద్ధతిలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది.

  1. నిర్వహణ, నిర్వర్తన వ్యయాలు అధికం.
  2. సమీకృత సేవలు లేకపోవడం.
  3. మౌలిక సదుపాయాల లేమి
  4. బలహీనమైన న్యాయ ప్రక్రియ, నిస్సారమైన శాసనాలు
  5. న్యాయపర, చట్టపర, పరిపాలనపరమైన, పోలీసు సంస్కరణల అవసరం కలుగుతూ ఉండటం.
  6. పౌరుల అవసరాలను అవగాహన చేసుకోవడం కష్టతరం, భాషాపరమైన అవరోధాలు.
  7. ప్రజావిత్త నిర్వహణ వ్యవస్థ కష్ట సాధ్యం కావడం.
  8. ప్రజా నిర్ణయీకరణలో పౌరసమాజ భాగస్వామ్యాన్ని, పాత్రను నిరోధించడం.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్

ప్రశ్న 3.
సమాచార హక్కు అంటే ఏమిటి ?
జవాబు.
ఆధునిక పాలనలో పౌరుని పాత్రను వివరించడానికి సమాచార హక్కుచట్టం అధ్యయనం ఎంతో మౌలికమైనది. సమాచార హక్కు చట్టం పాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచి, పారదర్శకతను, జవాబుదారీతనాన్ని అందిస్తుంది. 20వ శతాబ్దం రెండో భాగంలో అనేక దేశాలు సమాచార హక్కు చట్టాన్ని రూపొందించాయి.

  1. పాలనలో పౌరులు పాల్గొనగలరా ?
  2. ప్రభుత్వ పథకాల సమాచారాన్ని పౌరులు ఎలా పొందగలరు ?
  3. ప్రభుత్వం న్యాయబద్ధంగా వ్యవహరిస్తోందా ?
  4. ప్రజలకు సమాచానాన్ని బహిర్గతం చేయవచ్చునా ?

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా సమాచార హక్కుచట్టం స్వభావం, ప్రాధాన్యత అధ్యయనం చేయాలి. దానిలో జవాబులు దొరుకుతాయి.

సమాచార హక్కుచట్టం 2005 రాష్ట్రపతి ఆమోదముద్రను 15 జూన్ 2005న పొంది, అక్టోబర్ 2005 నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. ఈ చట్టం జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రం మినహా దేశంలోని అన్ని రాష్ట్రాలు-కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తిస్తుంది. ఆ రాష్ట్రానికి మాత్రం ప్రత్యేక ఏర్పాటు ఉండి.

సమాచార హక్కుచట్టం ప్రకారం దేశంలోని ప్రతీపౌరునికి సంబంధించనదే అయినందున, ప్రభుత్వం ప్రజలతో సమాచారార్ని, పంచుకోవడాన్ని ఈ చట్టం అంగీకరిస్తుంది. ఇది ప్రజాస్వామ్యం మరింత ఆరోగ్యవంతంగా (బలోపేతంగా), లాభదాయకంగా పనిచేయడానికి ఉపకరిస్తుంది. అంతిమంగా సమాచారం ప్రజల్లో వినూత్న అవగాహనకు,య సాధికారతకు దారితీస్తుంది.

ప్రశ్న 4.
సమాచార హక్కులోని నిబంధనలను వివరించండి.
జవాబు.
సమాచార హక్కు ఒక ప్రాథమిక మానవ హక్కు దీనిలో అంతర్గతంగా హక్కులు-బాధ్యతులు కూడా ఉంటాయి. వీటిని ఈ కింది విధంగా వివరించవచ్చు.

  1. ప్రతీ వ్యక్తికి ప్రభుత్వం నుంచి సమాచారాన్ని కోరే హక్కు ఉంటుంది. ప్రైవేటు సంస్థల నుంచి కూడా సమాచారాన్ని కోరవచ్చు.
  2. ప్రజలు కోరిన సమాచారాన్ని అందించే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ప్రత్యేక కారణాల రీత్యా వెల్లడి చేయకూడని సమాచారాన్ని మినహాయించి, మిగిలిన సమాచారాన్ని ప్రభుత్వం తప్పక అందుబాటులో ఉండాలి.
  3. ప్రభుత్వం సమాచారాన్ని అనుకూల కార్యాచరణతో తప్పక వెల్లడి చేయాలి. సమాచారం ప్రజలకు చెందినదని భావించాలి. అంతేకాని దానిని నిర్వహించే ప్రభుత్వ సంస్థదని భావించరాదు.
  4. సమాచారాన్ని కోరుతూ ప్రశ్నించిన 30 రోజుల లోపు ప్రభుత్వం స్పందించాలి.
  5. సమాచార ప్రసరణకు వీలుగా ప్రభుత్వ రికార్డులను కంప్యూటరీకరణ, డిజిటలీకరణ చేయాలి.
  6. సమాచారాన్ని ప్రింట్ కాగితాల రూపంలో, కంప్యూటర్ ఫ్లాపీలు, వీడియో, క్యాసెట్లు లేదా ఏ ఇతర ఎలక్ట్రానిక్ సాధనాల రూపంలోనైనా అందించవచ్చు. ఈ చట్టంలోని 2(ఎఫ్) నిబంధన పైన తెలిపిన వాటిని సమాచారంగా పరిగణిస్తుంది.

ప్రజా సమాచార అధికారుల (PIO’s) నియామకం :
ప్రభుత్వంలోని ప్రతీ కార్యాలయంలో, శాఖలో, సంస్థలో, అథారిటీలో ప్రజాసమాచార అధికారిని (PIO) నియమించాలని ఈ చట్టం నిర్ధేశిస్తుంది. పౌరులు కోరిన సమాచారాన్ని వారికి అందించే బాధ్యత ఈ ప్రజా సమాచార అధికారిపై ఉంటుంది.

అలాగే సమాచార హక్కు అప్పీళ్ళను (వినతులను) స్వీకరించడానికి సహాయక ప్రజా సమాచార అధికారులను (Assistant Public information Officers-APIOs) నియమించాలని ఈ చట్టం సిఫార్సు చేస్తోంది. సమాచారం కోసం ప్రజలు ఆన్లైన్ దరఖాస్తు రూపంలో కూడా వినతిని ఇవ్వవచ్చు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్

ప్రశ్న 5.
స్మార్ట్ గవర్నెన్స్ అంటే ఏమిటి ?
జవాబు.
పరిపాలనలోని దుర్లక్షణాలను తొలగించి, పాలన ప్రజల సాంఘిక-ఆర్థిక అభివృద్ధికి అనుగుణంగా తీర్చిదిద్దే క్రమంలో భారతదేశంలోని అనేక రాష్ట్రాలు స్మార్ట్ గవర్నెన్స్న స్వీకరించాయి. స్వాతంత్య్రానంతరం భారతదేశ పాలనలో, ప్రజల సాంఘిక-ఆర్థిక అభివృద్ధి కేంద్రంగా ఎన్నో సంస్కరణలు వచ్చినప్పటికీ పాలనలో దుర్లక్షణాలైన అవినీతి, అశ్రిత, పక్షపాతం, అధికార దుర్వినియోగం, నిర్ణయీకరణలో జాప్యం, పాలనలో నిర్లక్ష్యం విలయతాండవం చేశాయి.

అయితే ఏ పరిస్థితితో మార్పు తీసుకువచ్చి పాలనను మరింత ప్రజా ప్రయోజనకరంగా మలచేక్రమంలో స్మార్ట్ గవర్నెన్స్ భావన ముందుకు వచ్చింది. ఈ భావనలో SMART అనే పదంలోని ప్రతి ఆంగ్ల అక్షరానికి ఒక్కొక్క నిర్దిష్టమైన అర్థం ఉంది.

దీనిలో S అనగా Simple సరళతరమైన పాలన ప్రక్రియలు
M అనగా Moral, నైతిక విలువలతో కూడిన పాలన
A అనగా Accountable, జవాబుదారీ పాలన
R అనగా Responsive, ప్రజాసమస్యలపై స్పందనాత్మకపాలన
T అనగా Transparent, పారదర్శకత కలిగిన పాలనగా పేర్కొనవచ్చు.

స్మార్ట్ గవర్నెన్స్లో అంతర్గత అంశాలు :

  1. పరిపాలన నిర్వర్తన సామర్థ్యాన్ని వృద్ధి చేయడం.
  2. పాలనలో జవాబుదారీతనం పారదర్శకత పెంచడం.
  3. సంకుచిత, రాజకీయాల నుంచి పాలనను వేరుచేయడం.
  4. ప్రభుత్వ విధానాన్ని విజయవంతంగా అమలుచేయడం
  5. గరిష్ట సామర్ధ్యం సాధించడం
  6. పాలనలో సామాజిక నాయకత్వం కీలకపాత్ర పోషించేలా చేయడం.
  7. ప్రభుత్వ సేవలలో నూతన వరవడి తీసుకురావడం, రాబోయే కాలానికి పాలనను సన్నద్ధం చేయడం.
  8. పాలనలో ఇంటర్నెట్, మొబైల్ తదితర సమాచార సాంకేతిక పరిజ్ఞానం విస్తృత స్థాయిలో ఉపయోగించడం.
  9. ఎలక్ట్రానిక్ పాలన.

భారతదేశంలో పాలన ప్రక్రియను పటిష్టంచేయడానికి ఈ దిగువ తెలిపిన సంస్థలు ఎంతో కృషి చేస్తున్నాయి. స్మార్ట్ గవర్నెన్స్ భావనలోని అనేక అంశాల అమలుకు వివిధ మార్గాలను, పద్ధతులను సూచించడానికి, స్మార్ట్ గవర్నెన్స్ భావనను సంవర్ధకంగా వృద్ధి చేయడానికి ఈ దిగువ తెలిపిన విశిష్ట సంస్థలను స్థాపించడం జరిగింది.

  • ది నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవన్నమెంట్, హైదరాబాద్, ఇండియా
    The National Institute for Smart government (NISG), Hyderabad, India
  • ది సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, హైదరాబాద్, ఇండియా
    The Centre for Good Governance, Hyderabad, India
  • ది సెంటర్ ఫర్ లా అండ్ గవర్నెన్స్, న్యూఢిల్లీ
    The Centere for Law and Governance, New Delhi
  • ది సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెర్స్, న్యూఢిల్లీ
    The Centre for Public Policy and Governance, New Delhi

ప్రశ్న 5.
లోక్పాల్ అధికారాలు-విధులు పేర్కొనండి.
జవాబు.
లోక్పాల్ వ్యవస్థ ఈ కింద పేర్కొన్న పదవులోరి వారిపై వచ్చే అవినీతి ఆరోపణలను విచారణ చేస్తారు.

  1. ప్రధానమంత్రి
  2. కేంద్రమంత్రులు
  3. పార్లమెంట్ ఉభయసభల సభ్యులు
  4. గ్రూప్ ‘A’ మరియు గ్రూప్ ‘B’ ఉద్యోగులు
  5. కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే గ్రూప్ ‘C’ మరియు గ్రూప్ ‘D’ ఉద్యోగులు
  6. ఇతర సంస్థలు, ట్రస్ట్లు సొసైటీలు (10 లక్షలకు మించి విదేశీ విరాళాలను పొందే సంస్థలు)

TS Board Inter Second Year Political Science Study Material Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
జవాబుదారీతనం అంటే ఏమిటి ?
జవాబు.
ప్రభుత్వంలోని ఉద్యోగులు, అధికారులు, ప్రజాసేవకులు తమ నిర్ణయాలు, కార్యాచరణలను ప్రజలకు బాద్యత వహించడాన్ని జవాబుదారీతనంగా చెప్పవచ్చు. ఇక నుంచి వారు తమ కార్యకలాపాల విషయంలో ప్రజా పరిశీలనకు గురి కావలసి ఉంటుంది. విస్తృత అర్థంలో చెప్పాలంగే, పౌర, సేవా సంస్థలు, వినియోగదారుల సంస్థలకు ఉద్యోగులు జవాబుదారీగా ఉండాలి. పాలనలో సమన్యాయం, పారదర్శకత పాటిస్తే జవాబుదారీతనం సిద్ధిస్తుంది.

ప్రశ్న 2.
ఎలక్ట్రానిక్ పాలనలోని ఏవైనా రెండు సుగుణాలు రాయండి.
జవాబు.

  1. పౌరునికి సమాచారం అందించి, సంప్రదించే అవకాశం
  2. పాలన ప్రక్రియ సంస్కరించడం.
  3. సమాచార అందుబాటు
  4. పౌరులకు గుణాత్మక సేవలు పెంపొందించడం
  5. సరళతరం నియమాలు

ప్రశ్న 3.
పాలన సంబంధితుల జాబితా తెలపండి.
జవాబు.

  1. కార్యనిర్వాహక వర్గం
  2. శాసన నిర్మాణ శాఖ
  3. న్యాయశాఖ
  4. ప్రచార ప్రసార మాధ్యమాలు
  5. ప్రైవేటు రంగం
  6. సాంఘిక సేవా సంస్థలు
  7. పౌర సమాజం
  8. రాజకీయ పార్టీలు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్

ప్రశ్న 4.
ఎలక్ట్రానిక్ పాలనలో ప్రభుత్వం నుంచి పౌరుల నమూన అంటే ఏమిటి ?
జవాబు.
ప్రభుత్వానికి, పౌరులకు మధ్య కార్యాచరణ సంబంధాన్ని కల్పించి, విస్తృత స్థాయిలో సేవలు అందించే విధానాన్నే ప్రభుత్వం నుంచి పౌరుల నమూన అంటారు. ఇది సాధారణ ప్రజానీకానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రశ్న 5.
పారదర్శకతను కొన్ని పదాలతో వివరించండి.
జవాబు.
పారదర్శకత, పరిపాలనలో ఈ కింది సూచించిన పద్దతుల ద్వారా కార్యసాధకతను పెంపొందిస్తుంది.

  1. సేవల అందుబాటు వ్యవస్థను క్రమబద్ధీకరించండి.
  2. జవాబుదారీదతనాన్ని పెంపొందించడం.
  3. పాలనలో అవినీతి, అక్రమాల తొలగింపు అనుచిత ఆచరణలు తగ్గించడానికి సాంఘిక తనిఖీ సిఫార్సు చేయడం.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్

ప్రశ్న 6.
సమాచార హక్కుచట్టం ఏ సంవత్సరంలో రూపొంది, అమలయింది.
జవాబు.
సమాచార హక్కుచట్టం 2005 రాష్ట్రపతి ఆమోదముద్రను 15 జూన్ 2005న పొంది, అక్టోబర్ 2005 నుంచి ‘పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది.

TS Inter 1st Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 4th Lesson రాజనీతి భావనలు Textbook Questions and Answers.

TS Inter 1st Year Political Science Study Material 4th Lesson రాజనీతి భావనలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
శాసనాన్ని నిర్వచించి, దాని ముఖ్య ఆధారాలను వివరించండి.
జవాబు.
పరిచయం : రాజనీతిశాస్త్ర అధ్యయనంలో చట్టం అనేది ఒక ముఖ్యమైన భావన.

రాజ్యం శాసనాల ద్వారా ప్రజలను పరిపాలిస్తుంది. శాసనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. రాజ్య సార్వ భౌమాధికారం శాసనాల ద్వారా వ్యక్తమవుతుంది. రాజ్యం ఆశించే సాంఘిక, ఆర్థిక, రాజకీయ మార్పులు శాసనం ద్వారానే సాధించగలదు. మానవుని బాహ్య ప్రవర్తనను క్రమబద్ధం చేసే నియమాలే శాసనాలు. వ్యక్తులు రాజ్యంలో చేయవలసినవి, చేయకూడనివి శాసనం చెబుతుంది. ప్రభుత్వంలోని శాసనశాఖ శాసనాలు చేస్తుంది.

అర్థం :
శాసనాన్ని ఆంగ్లంలో ‘లా’ అంటారు. ‘లాగ్’ అనే ట్యూటానిక్ పదం నుండి ‘లా’ అనే మాట వచ్చింది. ‘లాగ్’ అంటే ‘సమమైన’ లేదా ‘స్థిరమైన’ అని అర్థం. శాసనాలు స్థిరమైన నిబంధనలు.

నిర్వచనాలు :

  1. “సార్వభౌముడి ఆదేశమే చట్టం. ప్రజలందరూ సార్వభౌముడికి విధేయులుగా ఉండేందుకు చట్టం కొన్ని ఉమ్మడి నియమాలను రూపొందిస్తుంది” అని జాన్ ఎరిస్కిన్ పేర్కొన్నాడు.
  2. “రాజకీయాధికారాన్ని పొందిన సార్వభౌముడిచే అమలు చేసే బాహ్య చర్యలకు సంబంధించిన సాధారణ నియమమే చట్టం” అని టి. ఇ. హాలండ్ పేర్కొన్నాడు.
  3. న్యాయపాలనలో రాజ్యం ఉపయోగించే సూత్ర సముదాయమే చట్టం” అని జాన్ సాల్మండ్ పేర్కొన్నాడు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

శాసనానికి ఆధారాలు :
హాలండ్ అనే రచయిత సంప్రదాయాలు, మతము, ధర్మబద్ధత (సమత), న్యాయమూర్తుల తీర్పులు, శాస్త్రీయ వ్యాఖ్యానాలు, శాసనశాఖ అనేవి శాసనాలకు ఆధారాలని చెప్పాడు. శాసనాలు వివిధ రంగాలలో క్రమంగా రూపొందుతాయి. అనేక అంశాల ప్రభావం వాటిపై ఉంటుంది. రాజనీతి శాస్త్రజ్ఞులు చెప్పిన శాసనాల ఆధారాలు ఈ క్రింది విధంగా చెప్పవచ్చు.

1. ఆచార, సంప్రదాయాలు, వాడుకలు (Customs) :
ఇవి శాసనానికి తొలి ఆధారాలు. ప్రజల ఆచారాలు, వాడుకలు, సంప్రదాయాలు శాసనాలకు మూలాధారము. సంప్రదాయాలు సంఘంలో ఒక అలవాటుగా, క్రమంగా రూపొందుతాయి. పూర్వం సంప్రదాయాలే సమాజ జీవితాన్ని క్రమబద్ధం చేసేవి. రాజ వీటిని గుర్తించి, వాటిని ఆధారం చేసుకొని కొన్ని శాసనాలను రూపొందిస్తుంది.

రాజకీయ ఆచారాలు కూడా రాజ్యంచే గుర్తించబడి అమలు చేయబడితే అవి శాసనాలవుతాయి. బ్రిటన్లో ‘సామాన్య న్యాయం’ సంప్రదాయబద్ధమైన శాసనానికి ఉదాహరణ. అదే విధంగా భారతదేశంలో వివాహ చట్టాలు, ఆస్తి పంపిణీ చట్టాలు మొదలగునవి సంప్రదాయాల ఆధారంగా చేయబడ్డాయి.

2. మతం (Religion) :
ఆచారానికి మతం సమాజాన్ని విపరీతంగా ప్రభావితం చేసే వ్యవస్థ. సంఘ జీవితం మత నియమాలకు అనుగుణంగా జరుపుకుంటారు. పూర్వం మతాధిపతులు చెప్పే నియమాలు శాసనాల వలె చెలామణి అయ్యేవి. ఆధునిక కాలంలో కూడా శాసనాలు చేయడానికి మతం ఒక ఆధారం. వారసత్వం, వివాహం, కుటుంబ ఆస్తి మొదలైన వాటి శాసనాలు మతం ఆధారంగా చేయబడ్డాయి.

హిందువులు, క్రైస్తవులు, ముస్లిములకు గల శాసనాలు వారి మతాల ఆధారంగా రూపొందాయి. ఇరాన్, పాకిస్థాన్ వంటి మత ప్రమేయ దేశాలలో సంఘ జీవనానికి మత నియమాలే ఆధారం.

3. న్యాయస్థానాల తీర్పులు (Judicial Decisions) :
న్యాయస్థానాలలో న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు శాసన నిర్మాణానికి ఆధారాలు. న్యాయస్థానాలు చట్టాలను వ్యాఖ్యానిస్తాయి. ఈ విధి నిర్వహణలో న్యాయమూర్తులు తీర్పులిచ్చేటప్పుడు క్రొత్త న్యాయ సూత్రాలను సృష్టిస్తారు. ఈ తీర్పులు అదే విధమైన వివాదాలు తలెత్తినప్పుడు న్యాయసూత్రాల వలె వర్తింపచేస్తారు. నేడు న్యాయమూర్తుల నిర్ణయాలు శాసనాలలో అంతర్భాగమవుతున్నాయి.
ఉదా : భారతదేశంలో సుప్రీంకోర్టు తీర్పులిచ్చిన గోలక్నాథ్ కేసు, కేశవానంద భారతి కేసు, మినర్వామిల్స్ కేసు.

4. శాస్త్రీయ వ్యాఖ్యానాలు (Scientific commentories) :
ప్రముఖ న్యాయశాస్త్ర కోవిదులు, రచయితలు, విమర్శకులు చేసే వ్యాఖ్యానాలు శాసన నిర్మాణానికి ఆధారమవుతాయి. ఇవి న్యాయస్థానాలలో న్యాయమూర్తుల వ్యాఖ్యానాలు, వివరణలు, శాసనాలు చేయటానికి ప్రభుత్వానికి ఉపయోగపడతాయి.

న్యాయమూర్తుల నిర్ణయాలు, తీర్పులు, భవిష్యత్లో శాసన నిర్మాణానికి తోడ్పడతాయి. ఇంగ్లండ్లో కోక్, బ్లాక్టన్, అమెరికాలో స్టోరీ, కెంట్, భారతదేశంలో విజ్ఞానేశ్వర, అపరార్క వంటి వారి వ్యాఖ్యానాలు శాసన నిర్మాణానికి ఆధారాలు.

5. సమత లేదా సమబద్ధత (Equity) :
‘సమత’ అనే పదానికి నిష్పక్షపాతం, న్యాయంలాంటి సూత్రాలను పర్యాయపదాలుగా వాడుతున్నారు. సమత అంటే సహజన్యాయం. అమలులో ఉన్న చట్టాలు వివాదాల పరిష్కారానికి సరిపడని సందర్భాలలో న్యాయమూర్తులు తమ విజ్ఞతతో, సక్రమ అవగాహన ద్వారా వివాదాల పరిష్కారంలో కక్షిదారులకు న్యాయం చేకూర్చేందుకు ప్రయత్నిస్తారు. సమత అనేది సహజన్యాయ భావన ద్వారా రూపొందింది. దానినే న్యాయమూర్తులచే నిర్మితమైన చట్టాలుగా పరిగణించడమైంది.

ఈ సందర్భంలో హెన్రీమెయిన్ అనే పండితుడు సహజన్యాయం గురించి ప్రస్తావిస్తూ అది కొన్ని ప్రత్యేక సూత్రాల ఆధారంగా రూపొంది పౌరన్యాయంతో కూడిన నియమాల సముదాయంగా పేర్కొన్నాడు. పౌరన్యాయం కంటే సమత అనేది ఉన్నతమైనది. సమదృక్పథం, సహజన్యాయం లాంటి సూత్రాల ఆధారంగా పాత చట్టాల స్థానంలో కొత్త చట్టాలను రూపొందించే సాంప్రదాయకమైన పద్ధతికి సమత సంకేతంగా ఉంటుంది.

6. శాసనసభ (Legislature) :
ప్రజాస్వామ్యంలో శాసన నిర్మాణశాఖ చట్టం ఆధారాలలో ముఖ్యమైనదిగా భావిస్తారు. ప్రభుత్వ సంస్థలలో ఒకటైన శాసనసభ చట్టాలను ఆమోదిస్తుంది. అందుచేత శాసననిర్మాణ శాఖను చట్టం ఆధారాలలో ప్రత్యక్షమైన అంశంగా గుర్తించడమైంది.

ఆధునిక కాలంలో చట్టాల రూపకల్పనలో శాసనసభలు ప్రముఖమైనవిగా భావించడమైంది. చట్ట నిర్మాణంలో శాసనసభలు సాధారణ ప్రజానీకం ఆకాంక్షలకు ప్రతీకగా ఉంటాయి. శాసనసభలోని అధికార, ప్రతిపక్షాలు రెండూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 2.
శాసనం అంటే ఏమిటి ? శాసన లక్షణాలను చర్చించండి.
జవాబు.
ఆధునిక రాజ్య వ్యవస్థలో శాసనాలకు లేదా చట్టాలకు అత్యంత ప్రాముఖ్యత వుంది. రాజ్యం శాసనాలు రూపొందించడం, అమలుపరచడం ద్వారా తన సార్వభౌమాధికారాన్ని వ్యక్తం చేస్తుంది. శాసనం అనేది రాజ్యానికి సంబంధించిన విశిష్ట లక్షణం.

రాజ్యంలోని వివిధ సంస్థల మధ్య, వ్యక్తుల మధ్య, సంస్థలు – వ్యక్తుల మధ్య సంబంధాలను శాసనాల ద్వారా రాజ్యం క్రమబద్ధం చేస్తుంది. రాజ్య లక్ష్యాలు, విధానాలు శాసనాల ద్వారానే సాధించడానికి వీలవుతుంది. రాజ్యంలోని వ్యక్తులు ఏమి చేయ్యాలి ? ఏమి చేయకూడదు ? అని నిర్దేశించేది శాసనం. రాజనీతి శాస్త్రంలోను, న్యాయశాస్త్రంలోను శాసనానికి విస్తృతమైన అర్థం వుంది.

అర్థం – నిర్వచనం :
చట్టాన్ని లేదా శాసనాన్ని ఆంగ్లంలో లా (Law) అంటారు. ఈ పదానికి లాగ్ (Lag) అనే పురాతన ట్యుటానిక్ పదం మూలం ‘లాగ్’ అంటే స్థిరమైంది అని అర్థం. చట్టబద్ధమైన, అధికారిక వ్యవస్థ రూపొందించి, అమలుపరచే స్థిరమైన నియమాలను, నిబంధనలను శాసనంగా చెప్పవచ్చు. రాజనీతి శాస్త్రజ్ఞులు శాసనాన్ని రకరకాలుగా నిర్వచించారు. కొన్ని నిర్వచనాలను కింద ఇవ్వడమైంది.

జాన్ ఎరిక్ సన్ : “ప్రజల జీవన విధానాన్ని నిర్దేశించి దానికి వారు విధేయులై వుండాలని శాసిస్తూ సార్వభౌమాధికారి జారీ చేసే ఆజ్ఞే న్యాయ శాసనం”.
టీ.ఇ. హాలండ్ : “మానవుని బాహ్యప్రవర్తనను క్రమబద్ధం చేయడానికి రాజ్యం అధికారికంగా అమలుచేసే నియమావళే శాసనం”.
జాన్ సాల్మండ్ : “న్యాయ పాలన కోసం రాజ్యం గుర్తించి, అమలుపరిచే నియమాల సముదాయమే శాసనం”.
జాన్ ఆస్టిన్ : “సార్వభౌమాధికారి ఆదేశమే శాసనం”.

శాసనం – లక్షణాలు :
పైన పేర్కొన్న నిర్వచాలను బట్టి శాసనానికి క్రింది లక్షణాలు ఉంటాయని చెప్పవచ్చు.

  1. రాజ్యం ఆశయాలను అభీష్టాలను శాసనాలు వ్యక్తీకరిస్తాయి.
  2. శాసనాలను ఉల్లంఘించే ప్రజలను దండించే అధికారం రాజ్యానికి వుంది.
  3. శాసనాలు లిఖితరూపంలో ఉంటాయి.
  4. మానవుని బాహ్య ప్రవర్తనను శాసనాలు నియంత్రిస్తాయి. మానవుని అంతరాత్మను శాసనాలు నియంత్రించవు.
  5. శాసనాలు అందరికీ సమానంగా వర్తిస్తాయి. శాసనాల అమల్లో రాజ్యం ప్రజల మధ్య విచక్షణ చూపదు.
  6. శాసనాలు క్లుప్తంగా, స్పష్టంగా ఉంటాయి.
  7. శాసనాలను రాజ్యం తనకున్న సార్వభౌమాధికారం ద్వారా అమలు పరుస్తుంది.
  8. శాసనాలు సంఘ సంక్షేమానికి సాధనాలు.
  9. శాసనాలు సామాజిక అవసరాలకు అనుగుణంగా మారుతుంటాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 3.
న్యాయం రకాలను తెలపండి.
జవాబు.
పరిచయం :
రాజనీతిశాస్త్ర అధ్యయనంలో న్యాయం ఒక ముఖ్యమైన భావన. సమకాలీన సమాజంలో దాదాపు ప్రపంచ రాజ్యాలన్నీ. తమ రాజకీయ, ఆర్థిక సిద్ధాంతాల వైరుధ్యాలతో సంబంధం లేకుండా మానవ సమాజంలో న్యాయం చేకూర్చి కొనసాగేందుకు కృషి చేస్తున్నాయి.

అర్థం : న్యాయం (Justice) అనే ఇంగ్లీష్ పదం “జస్” (Jus) అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. లాటిన్ భాషలో “జస్” అంటే “బంధించి ఉండటం” లేదా “కలిపి ఉంచడం” అని అర్థం.

నిర్వచనాలు :

  1. ప్లేటో : “వ్యక్తి తన పని తాను చేసుకుంటూ, ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే న్యాయం”.
  2. అరిస్టాటిల్ : “న్యాయం అంటే సమాజంలో ప్రతి వ్యక్తీ తన నైతిక బాధ్యతలను నిర్వర్తించడం తప్ప మరేదీకాదు”.
  3. కెఫాలస్ : “న్యాయం అంటే ప్రతి ఒక్కరూ సత్యాన్ని పలకడం, ఇతరులకు ఇవ్వాల్సింది ఇవ్వడం”.

న్యాయం రకాలు (Types of Justice) :
న్యాయం అనేక రకాలుగా ఉంటుంది. ఇది సహజవాబు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, చట్టబద్ధమైన పార్శాలకు సంబంధించినది. న్యాయభావనలోని వివిధ రకాలను గురించి క్రింద వివరించడం
జరిగింది.

1. సహజ న్యాయం (Natural Justice) :
ప్రపంచంలో లభించే సహజ వనరులను ప్రతి ఒక్కరూ వినియోగించు కోవచ్చుననే సూత్రం ఆధారంగా ప్రతిపాదించబడినదే సహజ న్యాయం. భూమిపై నివసించే ప్రతి ఒక్కరికీ సహజ వనరులు జీవన ఆధారంగా ఉంటాయి. మానవులు ఒక్కరే హేతుబద్ధమైన జీవనం గడపటం వల్ల, సహజ వనరులను న్యాయబద్ధంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఈ సందర్భంలో మానవులు భవిష్యతరాల అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి.

2. సామాజిక న్యాయం (Social Justice) :
సామాజిక న్యాయం అనేది వ్యక్తుల హక్కులు, సమాజం నియంత్రణల మధ్య చక్కని సమతౌల్యాన్ని నెలకొల్పేందుకు ఉద్దేశించింది. వర్తమాన చట్టాలకు లోబడి వ్యక్తుల న్యాయబద్ధమైన ఆకాంక్షలను నెరవేర్చుకొనేందుకు ఈ రకమైన న్యాయం వీలు కల్పిస్తుంది.

చట్టం దృష్టిలో అందరూ సమానులే అనే సూత్రాన్ని సామాజిక న్యాయం నమ్ముతుంది, సామాజిక అనర్థాలైన పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం, ఆకలి వంటి వాటిని అధిగమించేందుకు సామాజిక న్యాయం హామీ ఇస్తుంది. సమాజంలోని నిమ్నవర్గాలు, బడుగు, బలహీన వర్గాలకు రక్షణ కల్పిస్తుంది. అంతిమంగా వ్యక్తుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తుంది.

3. రాజకీయ న్యాయం (Political Justice) :
రాజకీయ న్యాయం అనేది రాజకీయ సమానత్వాన్ని సూచిస్తుంది. రాజ్యంలోని వయోజనులైన పౌరులకు రాజకీయ హక్కులను ఈ రకమైన న్యాయం ప్రతిపాదిస్తుంది. దేశ పాలనలో పౌరులు స్వేచ్ఛగానూ, నిర్భయంగానూ పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. ఎన్నికల సమయంలో రాజకీయ న్యాయ భావన విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకొంటుంది. రోజువారి పాలనలో పౌరులు చురుకుగా పాల్గొనేందుకు రాజకీయ న్యాయం సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది.

ప్రతి ఒక్కరూ ఇతరులతో పాటుగా సమానులేనని, ఏ ఒక్కరూ ఇతరుల కంటే ఏ విషయంలోనూ అధికులు కారనీ, ఎటువంటి ప్రత్యేకతలు కలిగి ఉండరనే సూత్రంపై ఈ భావన రూపొందింది. రాజ్యంలో రాజకీయ న్యాయం ఉండాలంటే కింద పేర్కొన్న పరిస్థితులు నెలకొనాలి.

  1. సమన్యాయ పాలన
  2. స్వతంత్ర న్యాయశాఖ
  3. ప్రాతినిధ్య సంస్థలకు ఎన్నికలు
  4. రాజకీయ పార్టీలు
  5. పత్రికా స్వాతంత్య్రం
  6. ప్రజాస్వామ్య పాలన మొదలైనవి.

4. ఆర్థిక న్యాయం (Economic Justice) :
వ్యక్తుల మధ్య నిర్హేతుకమైన, ప్రకృతి విరుద్ధమైన వ్యత్యాసాలు లేని పరిస్థితినే ఆర్థికన్యాయంగా పేర్కొనవచ్చు. ఆదాయం, ద్రవ్యం, సంపద, ఆస్తివంటి వ్యత్యాసాలు లేకుండా వ్యక్తులందరికీ సమానమైన ఆదరణ కల్పించేందుకు ఆర్థికన్యాయం ఉద్దేశించింది.

సానుకూల దృష్టిలో ఆర్థిక న్యాయం అనేది శ్రామికులకు చాలినంత వేతనాలను చెల్లించేందుకు దోహదపడుతుంది. సంపద, ఆదాయంలో విపరీతమైన అంతరాలను తొలగించేందుకు కృషి చేస్తుంది.

బడుగు బలహీనవర్గాలు దోపిడీకి గురికావడాన్ని ఎట్టి పరిస్థితులలో ఈ న్యాయం అనుమతించదు. ప్రతి ఒక్కరూ కనీస ప్రాథమికావసరాలను పొందేందుకు ఎదురయ్యే ఆటంకాలను తొలగిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడు, గుడ్డ, వసతి వంటి ప్రాథమిక అవసరాలు కలిగి ఉండేందుకు చర్యలు తీసుకొంటుంది.

సమాజంలో న్యాయబద్ధమైన ఆర్థిక వ్యవస్థాపనకు తోడ్పడుతుంది. “ప్రతి ఒక్కరూ వారి సామర్థ్యాన్ని బట్టి ఉపాధి పొందడం, అవసరాన్ని బట్టి ఆర్థిక వనరులను వినియోగించుకోవడం” అనే భావనను ఆర్థికన్యాయం బలపరుస్తుంది.

5. చట్టబద్ధమైన న్యాయం (Legal Justice) :
చట్టబద్ధమైన న్యాయం అనేది రాజ్యాంగ శాసనాల ద్వారా వెల్లడి అవుతుంది. సమాజంలో ఎంతోకాలంగా ప్రాచుర్యంలో ఉన్న ఆచార సంప్రదాయాలతో ఈ రకమైన న్యాయం సంబంధాన్ని కలిగి ఉంటుంది. రాజ్యంలోని రాజ్యాంగం, ఇతర శాసనచట్టాల రూపంలో అది వ్యక్తమవుతుంది. న్యాయం చట్టబద్ధమైన పరిమితులను నిర్ణయిస్తుంది. చట్టబద్ధమైన న్యాయంలో రెండు అంశాలు ఇమిడి ఉంటాయి. అవి :

1. సమాజంలో చట్టాలన్నీ సమన్యాయ పాలన సూత్రంపై ఆధారపడి రూపొందితమై, అమలులో ఉంటాయి.
2. చట్టాలన్నీ సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా రూపొందుతాయి. మొత్తం సమాజ సంక్షేమాన్ని చట్టాలు ఆకాంక్షిస్తాయి. అయితే చట్టబద్ధమైన న్యాయం అనేది పూర్తిగా న్యాయంగా పరిగణితం కాదు. ఈ సందర్భంలో న్యాయం అంటే చట్టం అని ఎర్నస్ట్ బార్కర్ పేర్కొన్నాడు.

చట్టబద్ధమైన న్యాయం అనేది న్యాయాన్ని ప్రసాదించేందుకు ఉద్దేశించిందని కొందరు పేర్కొన్నారు. మొత్తం మీద చట్టం అనేది న్యాయానికి కొంతమేరకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని మరికొందరు భావించారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 4.
స్వేచ్ఛను నిర్వచించండి. వివిధ రకాల స్వేచ్ఛలను తెలపండి.
జవాబు.
పరిచయం :
స్వేచ్ఛ అనేది రాజనీతిశాస్త్ర అధ్యయనంలో ఒక ముఖ్యమైన భావన. వ్యక్తులకు గల స్వేచ్ఛపైనే రాజకీయ వ్యవస్థ విజయం ఆధారపడి ఉంటుంది. వ్యక్తులు తమ సర్వతోముఖాభివృద్ధి కోసం స్వేచ్ఛను వాంఛిస్తారు. సామాజిక స్థితిగతులను మెరుగుపరచుకోవడంలో వ్యక్తులకు స్వేచ్ఛ తగిన శక్తిని ప్రసాదిస్తుంది. జె. ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్, మాంటెస్క్యూ, హెచ్. జె. లాస్కీ, సీలీ లాంటి రాజనీతి శాస్త్రవేత్తలు స్వేచ్ఛను పెంపొందించటంలో ప్రధాన పాత్రను పోషించారు.

అర్థం :
స్వేచ్ఛను ఇంగ్లీషులో ‘లిబర్టీ’ (LIBERTY) అంటారు. లిబర్టీ (LIBERTY) అనే ఇంగ్లీషు పదం “లిబర్” (LIBER) అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. లాటిన్ భాషలో “లిబర్” అనే పదానికి అర్థం “ఆంక్షల నుంచి విముక్తి”.

నిర్వచనాలు :

  1. హెచ్.జె. లాస్కీ: “వ్యక్తులు వారంతటవారు ఉత్తమమైన అవకాశాలను పొందగలిగి, నిర్వహించుకోగల వాతావరణమే స్వేచ్ఛ”.
  2. మాంటెస్క్యూ : “వ్యక్తులు సంకల్పించుకొని, సాధించగలిగే శక్తియే స్వేచ్ఛ”.
  3. జె.ఆర్. సీలీ : “మితిమీరిన ప్రభుత్వానికి వ్యతిరేకమైనదే స్వేచ్ఛ”.

స్వేచ్ఛ రకములు : స్వేచ్ఛ ఐదు రకాలు. అవి

  1. సహజ స్వేచ్ఛ
  2. పౌర స్వేచ్ఛ
  3. ఆర్థిక స్వేచ్ఛ
  4. రాజకీయ స్వేచ్ఛ.
  5. జాతీయ స్వేచ్ఛ.

వీటిని గురించి ఈ కింద పేర్కొన్న విధంగా విపులీకరించవచ్చు.

1. సహజ స్వేచ్ఛ (Natural Liberty) :
సహజ స్వేచ్ఛ అనేది ఎటువంటి ఆంక్ష లేకుండా ఏదైనా చేయడాన్ని సూచిస్తుంది. ఇది ఎలాంటి జోక్యానికి లేదా నిర్భంధాలకు తావివ్వదు. వ్యక్తులు తమ ఇచ్ఛానుసారం చేయదలచినదాన్ని సుసాధ్యం చేస్తుంది. అయితే, నిర్నిబంధమైన స్వేచ్ఛ వ్యక్తుల స్వేచ్ఛలను హరిస్తుంది.

నేటి సమాజంలో సహజ స్వేచ్ఛ అనేది కనిపించదు. ఇది అన్యాయం అరాచకత్వాలకు పర్యాయపదమైనది. సహజ స్వేచ్ఛగల చోట స్వాతంత్ర్యం మృగ్యమవుతుంది. ఆదిలో రోమన్ రాజనీతి తత్త్వవేత్తలు ఈ భావనను సమర్థించారు. ఎటువంటి అవధుల్లేని ప్రాకృతిక వ్యవస్థలోని మానవులు అపరిమితమైన స్వేచ్ఛను అనుభవించారన్నారు. అటువంటి స్వేచ్ఛ – రాజ్యం, సమాజాల ఆవిర్భావానికి ముందు మాత్రమే ఉనికిలో ఉండేది.

2. పౌర స్వేచ్ఛ (Civil Liberty) :
పౌరస్వేచ్ఛను వ్యక్తిగత స్వేచ్ఛ అని కూడ అంటారు. ఇది సామాజిక సంస్థలోని సభ్యుడైన వ్యక్తి జీవనంలోని స్వాతంత్య్రాన్ని తెలియజేస్తుంది. పౌరస్వేచ్ఛలో కింద పేర్కొన్న మూడు అంశాలు ఇమిడి ఉంటాయని బార్కర్ పేర్కొన్నాడు.

  • సంచార స్వేచ్ఛను సూచించే భౌతిక స్వాతంత్ర్యం
  • ఆలోచన, అభివ్యక్తి, విశ్వాసాన్ని కలిగి ఉండే భౌద్ధిక స్వాతంత్ర్యం
  • నిజజీవితంలోని ఆచరణాత్మక ఐచ్ఛిక స్వాతంత్య్రం. పౌరస్వేచ్ఛ అనేది మిగతా స్వేచ్ఛలకు ప్రాతిపదికగా ఉంటుంది. సహజ స్వేచ్ఛకు ఇది విరుద్ధమైంది.

సమాజంలోని పౌరులు దానిని అనుభవిస్తారు. ఒంటరిగా ఉంటున్న వ్యక్తులకిది ఆవశ్యకమైనది సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రాపంచిక విషయాలను ఉమ్మడిగా అనుభవించగలిగినప్పుడే పౌర స్వేచ్ఛ వాస్తవమవుతుంది.

“రాజ్యం చేత గుర్తించబడి అమలయ్యే హక్కుల సముదాయమే పౌర స్వేచ్ఛ” అని గెటిల్ పేర్కొన్నాడు.
పౌరస్వేచ్ఛ అనేది అనేక హక్కుల రూపంలో ఉంటుంది. అవి

  1. జీవించే హక్కు
  2. పనిచేసే హక్కు
  3. ఆస్తిహక్కు
  4. వాక్ స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణ, సమావేశ, సంచార, స్థిర నివాసపు హక్కులు మొదలైనవి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

3. ఆర్థిక స్వేచ్ఛ (Economic Liberty) :
ఆర్థిక స్వేచ్ఛ అంటే ప్రతి ఒక్కరూ తమ జీవనోపాధిని తామే సంపాదించుకోగలగడం. ఒక వ్యక్తి తన రోజువారీ ఆహారాన్ని హేతుబద్ధంగా సంపాదించుకొనే భద్రమైన అవకాశమే ఆర్థికస్వేచ్ఛగా లాస్కీ అభివర్ణించాడు. కోరిక – భయము, ఆకలి – పస్తులు, నిరుద్యోగం – అసంపూర్ణతల నుంచి విముక్తి కలిగించేదే ఆర్థిక స్వేచ్ఛ. ఇది ఆర్థిక సంబంధమైన లేమి లేదా అభద్రతల నుంచి స్వాతంత్ర్యాన్ని సూచిస్తుంది. ఆర్థిక స్వేచ్ఛలేని ప్రజాస్వామ్యం అర్థరహితమైంది.

ఈ దిగువ పేర్కొన్న చర్యల అమలు ద్వారా ఆర్థిక స్వేచ్ఛను పొందవచ్చు.

  1. కనీస వేతనాలను అందించడం.
  2. పనిహక్కుకు భరోసా కల్పించడం.
  3. నిరుద్యోగం, అనారోగ్యం వంటి వివిధ రకాల అభద్రతల నుంచి కార్మికులను రక్షించడం.
  4. తగినంత విశ్రాంతిని కల్పించడం.
  5. పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు ప్రాతినిధ్యం కల్పించడం.

4. రాజకీయ స్వేచ్ఛ (Political Liberty) :
రాజకీయ స్వేచ్ఛ పౌరులు రాజకీయాంశాలలో పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. ఈ రకమైన స్వేచ్ఛ పౌరులకు రాజ్య కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనే శక్తినిస్తుందని లాస్కీ పరిగణించాడు. రాజకీయ స్వేచ్ఛను ప్రజాస్వామ్యానికి పర్యాయపదంగా గిల్ క్రిస్ట్ భావించాడు. రాజకీయ స్వేచ్ఛ అంటే ఎవరికి వారు తమ ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకొనే రాజ్యాంగ స్వేచ్ఛగా లీకాక్ వర్ణించాడు. రాజకీయ స్వేచ్ఛ పౌరులకు మాత్రమే పరిమితమైంది.

అది సంవర్ధక స్వభావాన్ని కలిగి ఉంటుంది. రాజకీయ స్వేచ్ఛ పౌరులకు రాజకీయాంశాలలో వివిధ హక్కులను కల్పిస్తుంది. అటువంటి వాటిలో i) ఓటు వేసే హక్కు ii) ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీ చేసే హక్కు iii) ప్రభుత్వ పదవులను చేపట్టే హక్కు iv) విమర్శించే హక్కువంటివి ఉన్నాయి. విద్య, నిజాయితీ, నిష్పక్షపాతమైన పత్రికలు మొదలైనవి ఉన్నప్పుడే రాజకీయ స్వేచ్ఛ వాస్తవం అవుతుందని లాస్కీ నొక్కి చెప్పాడు.

5. జాతీయ స్వేచ్ఛ (National Liberty) :
జాతీయ స్వేచ్ఛ అంటే రాజ్యం – స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కలిగి ఉండడంగా పేర్కొనవచ్చు. రాజ్యపు సార్వభౌమత్వాన్ని అది సూచిస్తుంది. ప్రతి రాజ్యం ఈ స్వేచ్ఛను అనుభవిస్తూ ఇతర రాజ్యాల ఆధిపత్యానికి లోనుకాకుండా ఉంటుంది. అన్ని రంగాలలో జాతి అభివృద్ధికి ఈ స్వేచ్ఛ ఆవశ్యకమైంది. ప్రాచీన కాలం నుంచి అనేక దేశాల్లో ఇది విశదమైంది.

ఈ రకమైన స్వేచ్ఛను పొందడం కోసం అనేక దేశాలు ఎంతగానో ప్రయత్నించాయి. గతంలో టర్కీ ప్రజలకు వ్యతిరేకంగా గ్రీకులు స్వాతంత్య్ర సమరం సాగించారు. అట్లాగే మహాత్మాగాంధీ నాయకత్వంలో భారత ప్రజలు బ్రిటీష్ పాలన నుంచి స్వాతంత్య్రం కోసం అహింసాయుత పోరాటం చేశారు. జాతీయ స్వేచ్ఛ ఎంతో విలువైంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 5.
స్వేచ్ఛ అంటే ఏమిటి ? స్వేచ్ఛ పరిరక్షణలను వివరించండి.
జవాబు.
పరిచయం :
స్వేచ్ఛ అనేది రాజనీతి శాస్త్ర అధ్యయనంలో ఒక ముఖ్యమైన భావన. వ్యక్తులకు గల స్వేచ్ఛపైనే రాజకీయ వ్యవస్థ విజయం ఆధారపడి ఉంటుంది. వ్యక్తులు తమ సర్వతోముఖాభివృద్ధి కోసం స్వేచ్ఛను వాంఛిస్తారు. సామాజిక స్థితిగతులను మెరుగుపరచుకోవడంలో వ్యక్తులకు స్వేచ్ఛ తగిన శక్తిని ప్రసాదిస్తుంది. జె. ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్, మాంటెస్క్యూ, హెచ్. జె. లాస్కీ, సీలీ లాంటి రాజనీతిశాస్త్రవేత్తలు స్వేచ్ఛను పెంపొందించటంలో ప్రధాన పాత్రను పోషించారు.

అర్థం : స్వేచ్ఛను ఇంగ్లీషులో ‘లిబర్టీ’ (LIBERTY) అంటారు. లిబర్టీ (LIBERTY) అనే ఇంగ్లీషు పదం “లిబర్” (LIBER) అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. లాటిన్ భాషలో “లిబర్” అనే పదానికి అర్థం “ఆంక్షల నుంచి విముక్తి”.

నిర్వచనాలు :

  1. హెచ్.జె.లాస్కీ : “వ్యక్తులు వారంతటవారు ఉత్తమమైన అవకాశాలను పొందగలిగి, నిర్వహించుకోగల వాతావరణమే స్వేచ్ఛ”.
  2. మాంటెస్క్యూ : “వ్యక్తులు సంకల్పించుకొని, సాధించగలిగే శక్తియే స్వేచ్చ”.
  3. జె.ఆర్. సీలీ : “మితిమీరిన ప్రభుత్వానికి వ్యతిరేకమైనదే స్వేచ్ఛ”.

స్వేచ్ఛ సంరక్షణలు (లేదా) పరిరక్షణ మార్గాలు :
స్వేచ్ఛ అనేది మానవుల పాలిట అత్యంత విలువైన ఆదర్శం. కాబట్టి దానిని సమాజవాబు. రాజ్య విస్తృత ప్రయోజనాల దృష్ట్యా పరిరక్షించుకోవాలి. ఈ సందర్భంగా స్వేచ్ఛ పరిరక్షణలో కిందివాటిని పేర్కొనవచ్చు.

1. ప్రజాస్వామ్య వ్యవస్థ (Democratic Rule) :
ప్రజాస్వామ్య వ్యవస్థ వ్యక్తి స్వేచ్ఛను పరిరక్షిస్తుంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల ప్రభుత్వం. ఎన్నికైన ప్రతినిధులు ప్రజల స్వేచ్ఛను నిరంతరం కాపాడుతుంటారు. కేవలం ప్రజాస్వామ్య సంస్థలు మాత్రమే స్వేచ్ఛను పరిరక్షించగలవు.

2. లిఖిత మరియు దృఢ రాజ్యాంగం (Written and Rigid Constitution) :
వ్యక్తి స్వేచ్ఛకు లిఖిత, దృఢ రాజ్యాంగాన్ని వేరొక ముఖ్య లక్షణంగా భావించవచ్చు. ఇటువంటి రాజ్యాంగం అనేక నిబంధనలలో వ్యక్తి స్వాతంత్ర్యాలను పేర్కొంటుంది. ప్రజల స్వేచ్ఛ, హక్కులకు అది రక్షకురాలిగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వాంగాల చర్యలకు అది హద్దులను ఏర్పరుస్తుంది.

ప్రభుత్వాధికారులు లేదా మరెవరి చేతనైనా ప్రజల స్వాతంత్ర్యాలు ఉల్లంఘించబడినప్పుడు చేపట్టవలసిన వివిధ చర్యలను వివరిస్తుంది. తమ సంకుచిత ప్రయోజనాల కోసం రాజ్యాంగంలోని అంశాలను సవరించేందుకు ప్రయత్నించే పార్టీలపై ఆంక్షలను విధిస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

3. స్వతంత్ర న్యాయవ్యవస్థ (Independent Judiciary) :
పౌరుల స్వేచ్ఛా పరిరక్షణకు స్వయం ప్రతిపత్తి ఉన్న నిష్పాక్షిక న్యాయ వ్యవస్థ తప్పనిసరి. దేశంలో స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న న్యాయస్థానాలు ఉన్నప్పుడే అవి శాసనసభ చేయగల ప్రజావ్యతిరేక చట్టాలను, కార్యనిర్వాహకశాఖ అమలుపరచగల ప్రజావ్యతిరేక విధానాలను ఆపగలవు.

4. సమన్యాయపాలన (Rule of Law) :
స్వేచ్ఛకున్న వేరొక పరిరక్షణయే సమన్యాయపాలన. బ్రిటన్, ఇండియా, అమెరికా సంయుక్తరాష్ట్రాలు వంటి అనేక దేశాల్లో ఇది అమలులో ఉంది. వ్యక్తుల స్వేచ్ఛలను సమన్యాయపాలన మూడు విధాలుగా పరిరక్షిస్తుంది. అవి (i) ఇది వ్యక్తులందరినీ సమానంగా చూస్తుంది. (ii) రాజ్యమంతటా. ఒకే విధమైన చట్టాలు అమలయ్యేటట్లు చేస్తుంది. (iii) కార్యనిర్వాహకవర్గపు నిరంకుశాధికారాలపైన తగిన ఆంక్షలను విధిస్తుంది.

5. ప్రాథమిక హక్కులు (Fundamental Rights) :
ప్రాథమిక హక్కులనేవి వ్యక్తి స్వేచ్ఛలను చాలావరకు పరిరక్షిస్తాయి. ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరచడం వల్ల ఎటువంటి ఆంక్షలు లేకుండా. ప్రజలు స్వేచ్ఛలను పొందుతారు. పౌరులలో నిబిడీకృతమైన నైపుణ్యాలను అభివృద్ధిపరచుటకు, విభిన్న రంగాలలో వారు తమ ప్రతిభను చాటుకొనేందుకు ప్రాథమిక హక్కులు దోహదపడతాయి.

6. ఆర్థిక సమానత్వం (Economic Equality) :
వ్యక్తుల స్వేచ్ఛా పరిరక్షణలో ఆర్థిక సమానత్వం కూడా ప్రధానమైంది. ఆకలి, పేదరికం, నిరుద్యోగం వంటి దుష్ప్రభావాల నుంచి బయటపడేందుకు వ్యక్తులకు చాలినన్ని అవకాశాలను కల్పించాలనే భావన ఇందులో ఇమిడి ఉంది. ఆర్థిక సమానత్వం నెలకొన్నప్పుడే స్వేచ్ఛ సాధ్యమవుతుంది. ఆర్థిక సమానత్వంలో ఆర్థిక న్యాయం అంతర్భాగంగా ఉంటుంది. దీనిని రాజ్యం ప్రసాదిస్తుంది.

7. అధికారాల వికేంద్రీకరణ (Decentralisation of Powers) :
అధికారాలు వికేంద్రీకరణ ద్వారా స్వేచ్ఛను మెరుగైన రీతిలో పరిరక్షించవచ్చు. ప్రభుత్వాధికారాల కేంద్రీకరణ నుంచి దేశానికి విముక్తి కలిగినప్పుడే వ్యక్తులు స్వేచ్ఛను అనుభవించగలరు. కేంద్రం రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాల మధ్య అధికారాలను కేటాయించినప్పుడు నిరంకుశత్వానికి, వ్యక్తి స్వేచ్ఛల హరింపునకు తావుండదు లేనిచో రాజ్యాంగంలో పొందుపరచిన ‘ హక్కులను అనుభవించటమన్నది ప్రజలకు కష్టమవుతుంది.

8. పత్రికా స్వాతంత్ర్యం (Independent Press) :
ప్రజాస్వామ్యాన్ని కొందరు వ్యక్తి స్వేచ్ఛా పరిరక్షణ కవచంగా భావించారు. తమ పనితీరులో చాలినంత స్వతంత్ర ప్రతిపత్తిని పత్రికలు, ఇతర మాధ్యమాలు కలిగి ఉన్నప్పుడే వ్యక్తులు స్వేచ్ఛలను అనుభవించగలరు. ప్రజాభిప్రాయాన్ని ఏర్పరచి, సంఘటితపరచి, వ్యక్తీకరించడంలో పత్రికలు ముఖ్యమైన వాహకంగా వ్యవహరిస్తాయి. అవి తమ నిష్పాక్షిక సంపాదకీయాలు, సత్య సమ్మతమైన వార్తలు, అభిప్రాయాల ద్వారా వ్యక్తి స్వేచ్ఛలను పరిరక్షించగలుగుతాయి.

9. బలమైన ప్రతిపక్షం (Strong Opposition) :
వ్యక్తి స్వేచ్ఛను పెంపొందించేందుకు బలమైన ప్రతిపక్షం అవసరమవుతుంది. ఒకవిధంగా వ్యక్తి స్వేచ్ఛకు ప్రతిపక్షం కాపలాదారుడిగా పనిచేస్తుంది. అధికారంలో ఉన్న పార్టీ లేదా ప్రభుత్వంలో ఉన్నత స్థానంలోని వ్యక్తులు నిరంకుశ చట్టాల అమలు ద్వారా సామాన్యుల స్వేచ్ఛలకు హద్దులు గీసి హరించి వేసినపుడు, ప్రతిపక్షం అట్టి చర్యలను తీవ్రంగా అడ్డుకుంటుంది. అంతిమంగా, అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా వ్యక్తుల స్వేచ్ఛలను కాపాడుతుంది.

10. ప్రజల అప్రమత్తత (People vigilance) :
స్వేచ్ఛకు అన్నింటికన్నా ముఖ్యమైంది ప్రజల అప్రమత్తత. స్వేచ్ఛ పరిరక్షణకు ప్రజలు నిరంతరం అప్రమత్తతతో ఉండాలి. తమ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పరిరక్షించుకోవాలనే ఆకాంక్ష, స్ఫూర్తి, పట్టుదల పౌరస్వేచ్ఛకు శక్తివంతమైన రక్షణ కవచంగా పనిచేస్తాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 6.
సమానత్వాన్ని నిర్వచించండి. వివిధ రకాల సమానత్వాలను తెలపండి.
జవాబు.
సమానత్వం ఆధునికకాలంలో ఒక ప్రధాన ఆశయం. అది ప్రజాస్వామ్య ఆదర్శం. మానవులంతా పుట్టుకతో సమానులని కొందరు నమ్మారు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ వ్యవహారాలలో ప్రజలందరికి జాతి, మత, కుల, లింగ, భాషా, ప్రాంతీయ, వర్ణ, వర్గ భేదాలు లేకుండా సమానావకాశాలుండటమే సమానత్వము. సమానత్వం అంటే

  1. ఏ అడ్డంకులూ లేకుండా ప్రతి వ్యక్తీ వికాసం పొందడం
  2. శాసనాలు పాలనలలో వ్యక్తుల మధ్య భేదం లేకుండా చేయడం
  3. చట్టం ప్రకారం లభించే హక్కులు సమానంగా లభించడం.

నిర్వచనం :
“సమానత్వం అంటే సమాజంలో కొందరికి మాత్రమే ప్రత్యేకమైన హక్కులు, అవకాశాలు కాకుండా అందరికీ సమానావకాశాలు ఉండటమే” అని లాస్కీ నిర్వచించాడు. పుట్టుక, కులం, మతం, ఆస్తి వంటి అర్హతలనుబట్టి వ్యక్తులకు అవకాశాలు కలుగజేస్తే సమానత్వం లభించదు.

అందరికీ సమాన ఆదరణ ఉండటమే సమానత్వానికి అవసరం. సమానత్వ సిద్ధాంతం ప్రకారం చట్టం ముందు అంతా సమానులే. ఆధునిక రాజ్యం ప్రజలందరికీ సాంఘిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో సమానావకాశాలు కల్పించాలి.

సమానత్వం – రకాలు : సమానత్వం ప్రధానంగా ఐదు రకాలు. అవి 1) సహజ సమానత్వం 2) సాంఘిక సమానత్వం 3) ఆర్థిక సమానత్వం 4) రాజకీయ సమానత్వం 5) అంతర్జాతీయ సమానత్వం. వీటిని గురించి ఈ కింద పేర్కొన్న విధంగా విపులీకరించవచ్చు.

1. సహజ సమానత్వం (Natural Equality) :
సహజ సమానత్వం అంటే అన్ని రకాల అవరోధాలు, సాంఘిక కట్టుబాట్ల నుంచి స్వాతంత్ర్యాన్ని పొందడం. దీని అర్థం వ్యక్తిపరిధిలో ఎటువంటి ఆంక్షలు ఉండకపోవడం. సహజ సమానత్వం గురించి థామస్ హాబ్స్ ప్రతిపాదించిన సామాజిక ఒడంబడిక సిద్ధాంతంలో పేర్కొనడమైంది.

పౌర సమాజం ఆవిర్భవించక ముందే ప్రజలు ప్రాకృతిక వ్యవస్థలో జీవించారని ఈ సిద్ధాంతం పేర్కొన్నది. అసమానతలు, బంధనాలకు నాగరికత దారితీసిందని హాబ్స్ ఉద్ఘాటించాడు. గ్రీకు రోమన్ రాజకీయ తత్త్వవేత్తల రచనలలో ఈ భావం కనపడుతుంది.

2. సాంఘిక సమానత్వం (Social Equality) :
వర్గ వ్యత్యాసాలు లేకపోవడం, సమానమైన హోదాలు కలిగి ఉండటాన్ని సాంఘిక సమానత్వం సూచిస్తుంది. ఏ వ్యక్తి మతం, వర్గం, వర్ణ, లింగం, పుట్టుక వంటి అంశాల ఆధారంగా వివక్షతకు గురికాకుండా ఉంటే సాంఘిక సమానత్వం నెలకొంటుంది.

ఉదాహరణకు భారతరాజ్యాంగం కుల, వర్గపరమైన వ్యత్యాసాలను నిషేధించింది. వాస్తవానికి అస్పృశ్యతను అది వ్యతిరేకించింది. పౌరులందరూ సాంఘిక సమానత్వాన్ని అనుభవించినప్పుడు, ఏ ఒక్కరు ఇతరులతో పోల్చినచో కులం, వర్గం, వర్ణం, పుట్టుక, తెగ, జన్మస్థలం వంటి అంశాలపై ఏ విధమైన వివక్షతకు గురికారు. ఈ సందర్భంలో క్రింద పేర్కొన్న అంశాలు సాంఘిక సమానత్వ సాధన, కొనసాగింపులకు సహాయపడతాయని చెప్పవచ్చు.

  1. రాజ్యం ఏ ఒక్క పౌరుడికి ప్రత్యేక సౌకర్యాలను అనుమతించరాదు.
  2. విద్య, ఉపాధి, పరిపాలన, శాసన నిర్మాణం వంటి రంగాలలో ప్రభుత్వం ఒకే విధానాన్ని పాటించి, అమలు చేయాలి.
  3. సాంఘిక, మతపరమైన వ్యవహారాలలో ప్రజలు సహనం, త్యాగం, నిజాయితీ వంటి లక్షణాలతో కూడిన విశాల దృక్పథాన్ని కలిగి ఉండాలి.
  4. రాజ్యంలోని పౌరులు తోటి పౌరులతో సహృద్భావ సంబంధాలను ఏర్పరచుకొని కొనసాగించుకోవాలి.
  5. తమ విజ్ఞాపనలను పంపించేటప్పుడు కులం, తెగ, లేక మతం వంటి వాటిని సూచించే పేర్లను ప్రజలు ఉపయోగించరాదు.
  6. కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

3. ఆర్థిక సమానత్వం (Economic Equality) :
ఆర్థిక సమానత్వాన్ని సాంఘిక, రాజకీయ సమానత్వాలకు పునాదిగా పరిగణించడమైంది. ఆధునిక రాజ్యకార్యకలాపాల వెనుక అదొక ముఖ్యమైన చోదకశక్తిగా పనిచేస్తుంది. ఆర్థిక సమానత్వమంటే ఆదాయం, ఆస్తి, సంపదలలో విపరీతమైన వ్యత్యాసాలు లేకుండా చేయడంగా పేర్కొనవచ్చు.

ఎర్నెస్ట్ బార్కర్ దృష్టిలో ఆర్థిక సమానత్వం అనేది హోదాకు, పాక్షికంగా ఆస్తి-ఆదాయాలకు సంబంధించిన అంశం. ఆర్థిక సమానత్వాన్ని “సంపదకు చెందిన వ్యత్యాసాలను తొలగించి ప్రయత్నంగా, ప్రాపంచిక వస్తువులను స్త్రీ, పురుషుల మధ్య సమానంగా పంపిణీ చేయాల్సిన ప్రయత్నం”గా లార్డ్స్ భావించాడు. ప్రొఫెసర్ లాస్కీ “పారిశ్రామిక ప్రపంచంలో విశృంఖలమైన, బాధ్యతారహిత ఇచ్ఛను నిషేధించడాన్ని ఆర్థిక సమానత్వం”గా భావించాడు.

4. రాజకీయ సమానత్వం (Political Equality):
రాజకీయ సమానత్వం రాజకీయ కార్యకలాపాలలో ప్రజలకు చాలినన్ని అవకాశాలను కల్పించేందుకు అనుకూల పరిస్థితులను సూచిస్తుంది. రాజ్యంలోని పౌరులకు వివిధ రకాల రాజకీయ హక్కులను ప్రసాదించడం ద్వారా ఆ రకమైన సమానత్వాన్ని సాధించవచ్చు. ఈ సందర్భంలో రాజకీయ సమానత్వాన్ని పౌరులు మాత్రమే అనుభవిస్తారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రాజ్యంలో నివసించే అన్యులు, విదేశీయులకు ఇది వర్తించదు.

ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేసేందుకు రాజకీయ సమానత్వమన్నది అత్యంత ఆవశ్యకమైంది. వివిధ రాజకీయ హక్కులను ప్రసాదించినప్పుడే పౌరులు రాజకీయ స్వేచ్ఛను అనుభవిస్తారు. అంటే, రాజకీయ సమానత్వమనేది రాజకీయ స్వేచ్ఛకు పర్యాయపదంగా భావించవచ్చు.

5. అంతర్జాతీయ సమానత్వం (International Equality) :
అంతర్జాతీయ సమానత్వమంటే భౌగోళిక, ఆర్థిక లేదా సైనికపరమైన అంశాలతో నిమిత్తం లేకుండా అన్ని రాజ్యాలనూ సమానంగా చూడటంగా పేర్కొనవచ్చును. ఈ విధమైన సమానత్వం ద్వారా ప్రపంచంలోని చిన్న, పెద్ద రాజ్యాలన్నీ సమానమవుతాయి. ఉదాహరణకు ఐక్యరాజ్యసమితి తన చార్టర్లో అన్ని రాజ్యాలకు సమానమైన గౌరవం, హోదాలను కల్పించింది.

అంతర్జాతీయ సమానత్వం మానవీయ లక్షణాలను ప్రతిబింబిస్తుంది. రాజ్యాల మధ్య ఉత్పన్నమయ్యే వివాదాలను శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలని నొక్కిచెబుతుంది. అంతర్జాతీయ న్యాయానికి గౌరవం లోపించినప్పుడు మూడో ప్రపంచ యుద్ధం సంభవించవచ్చని కొందరు హెచ్చరించారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 7.
సమానత్వం అంటే ఏమిటి ? దాని లక్షణాలను వివరించండి.
జవాబు.
సమానత్వం, అసమానత్వం అనే రాజనీతి భావనలు అరిస్టాటిల్ కాలం నుంచే ఉన్నాయి. విప్లవానికి గల కారణాలలో అసమానత్వం ఒకటని అరిస్టాటిల్ పేర్కొన్నాడు. 18వ శతాబ్దం వరకు అసమానతలు అనేవి సహజమని ప్రకృతి పరంగా వారసత్వంగా వచ్చినవనే భావనలో ఉండేవారు.

ఆధునిక కాలంలో 17వ శతాబ్దం మొదట్లో సహజ సమానత్వం, సహజన్యాయం, అనే భావనల మూలాలు హాబ్స్, లాక్, రూసోల సామాజిక ఒడంబడిక సిద్ధాంతాలలో ఉన్నాయి. సమానత్వం అనే భావన ఆధునిక సామాజిక ఉద్యమాలకు, విప్లవాలకు ప్రేరణగా నిలిచింది.

మార్క్సిస్టుల దృష్టిలో సమానత్వం అంటే మానవుల మధ్య సమానత్వం. సమానత్వం అనే సూత్రం ప్రస్తుతం అన్ని ఆధునిక రాజ్యాంగాలలోను, మానవహక్కుల ప్రకటనలోను సాధారణ సూత్రావళిగా ఆమోదించబడింది.

ఒక విధంగా చెప్పాలంటే అమెరికా, ఫ్రెంచి విప్లవాల నుంచి ఆధునిక కాలం వరకు సమానత్వం అనే భావన ప్రముఖ స్థానం వహించింది. ఆధునిక సమాజంలో ఈ భావన అసమానతలను తొలగించి సామాజిక స్పృహను ప్రయత్నం చేసింది. సమానత్వ భావన సమాజంలో కొద్దిమంది మాత్రమే అపరిమిత సంపాదనను కలిగి ఉండడాన్ని, అపరిమిత అధికారం, హెూదా కలిగి ఉండడాన్ని నిరోధించి, దోపిడికి గురైన వారికి వీటిని పంచేలా చేసింది.

ఎ. సమానత్వం అర్థం :
సమానత్వం అనే భావన సమాన హక్కులు, సమాన అవకాశాలు అనే అంశాన్ని సూచిస్తుంది.

  1. హెరాల్డస్కీ తన “ఏ గ్రామర్ ఆఫ్ పాలిటిక్స్” అనే గ్రంథంలో సమానత్వం అనేది ప్రాథమికంగా సమానత్వం సాధించే ప్రక్రియగా పేర్కొన్నాడు.
  2. బార్కర్ అభిప్రాయంలో “సమానత్వం అంటే కొందరికి ప్రత్యేక హక్కులు, ప్రత్యేక సౌకర్యాలు అనే దాన్ని నిషేధించి అందరికీ సమానహక్కులు కల్పించడం”గా భావించాడు.

బి. సమానత్వం లక్షణాలు :
1. సమానత్వం హక్కులను సాధించడం:
సమానత్వం అనేది సూచనాత్మకమైనదే కాని వివరణాత్మకమైనది కాదు. మానవులంతా తప్పకుండా సమానులే అని మనం భావిస్తాం. కాని అది వాస్తవం కాదు. సమాజంలో సాంఘిక ప్రయోజనాలను విస్తృతం చేసి వాటి ఫలాలను పేద వారికి అందించడం.

2. సమానత్వం ఆధునిక భావన :
మానవ జీవిత చరిత్రలో సంపదలో వ్యత్యాసాలు, అధికారంలో వ్యత్యాసాలు, గౌరవ ప్రతిష్ఠలలో వ్యత్యాసాలు అనేవి దాదాపు ప్రపంచమంతా కనిపిస్తాయి. శాస్త్రీయ యుగ ఆరంభంలో మానవుడు తన హేతుబద్ధమైన అనుభవపూర్వక జ్ఞానంతో ప్రకృతి వైపరీత్యాన్ని నియంత్రించడం నేర్చుకున్నాడు. ఈ పరిజ్ఞానం, ఆలోచన సమాజంలో ఉన్న సాంఘిక అసమానతలు సహజం కాదని, అసమానతలు తొలగించవచ్చనే ఆలోచనకు దారి తీసింది.

3. సామాజిక మార్పుకు సమానత్వం :
శాస్త్ర సాంకేతిక రంగాలలో సాధించిన ప్రగతి ఎక్కువ ప్రాంతాలలో సహజ అసమానత్వాన్ని ప్రత్యామ్నాయంగా పెంచిపోషించింది. ఆరోగ్యం, శారీరక పటిష్టత అనేది సరైన పౌష్టికాహారం వల్ల, మానసిక పరిపక్వత అనేది సరైన విద్య, రక్షణ ద్వారా సాధించవచ్చని మనకు తెలుసు. కాని ఈ ప్రయోజనాల లభ్యత అనేది వ్యక్తుల వ్యక్తిగత సాంఘిక, ఆర్థిక స్థితిగతుల మీద ఆధారపడి ఉంది.

4. సామాజిక న్యాయం, స్వేచ్ఛ :
సామాజిక న్యాయ సాధనకు సమానత్వం అత్యవసరం. సమానత్వం, స్వేచ్ఛకు చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. నిజం చెప్పాలంటే స్వేచ్ఛ లేనిదే సమానత్వం లేదు. సమానత్వం లేకుండా స్వేచ్ఛ వ్యర్థం.

5. సామాజిక ప్రత్యేకత ప్రజాప్రయోజనంపై ఆధారపడుతుంది :
సమాజంలో బుద్ధిబలం గల వారు సహజంగా మిగిలిన వారిని పీడించే తత్వాన్ని కలిగి ఉంటారు. అధికారం, శ్రామికుల విభజన అనేది హేతుబద్ధంగా ఉంటే అసమానత్వం అనేది ఆక్షేపణ కాదు. సమాజంలో సాధారణ ప్రయోజనం దృష్ట్యా అధికార వ్యవస్థ నిర్వహించే కార్యం చాలా కాలంగా ప్రత్యేక అంశంగా గుర్తించబడలేదు.

6. సమానత్వం సంపూర్ణ సమానత్వాన్ని సూచించదు :
దీని అర్థం అవకాశాలలో సమానత్వం. సామాజిక అసమ నతలలో ఆశించిన మేరకు తగ్గుదల ఉండాలని సమానత్వాన్ని కోరుకుంటుంది. వ్యక్తిగత నైపుణ్యాలు, హెూఒ పురోగతికి సమాన అవకాశాలను సూచిస్తుంది. దీని అర్థం ఫలితాల్లో సమానత్వం కాదు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 8.
సమానత్వం సంబంధించి ఏవైనా మూడు రకాలను తెలపండి.
జవాబు.
సమానత్వంకి ఆధునికకాలంలో ఒక ప్రధాన ఆశయం. అది ప్రజాస్వామ్య ఆదర్శం. మానవులంతా పుట్టుకతో సమానులని కొందరు నమ్మారు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ వ్యవహారాలలో ప్రజలందరికి జాతి, మత, కుల, లింగ, భాషా, ప్రాంతీయ, వర్ణ, వర్గ భేదాలు లేకుండా సమానావకాశాలుండటమే సమానత్వము. సమానత్వం అంటే

  1. ఏ అడ్డంకులూ లేకుండా ప్రతి వ్యక్తీ వికాసం పొందడం
  2. శాసనాలు పాలనలో వ్యక్తుల మధ్య భేదం లేకుండా చేయడం
  3. చట్టం ప్రకారం లభించే హక్కులు సమానంగా లభించడం.

నిర్వచనం :
“సమానత్వం అంటే సమాజంలో కొందరికి మాత్రమే ప్రత్యేకమైన హక్కులు, అవకాశాలు కాకుండా అందరికీ సమానావకాశాలు ఉండటమే” అని లాస్కీ నిర్వచించాడు. పుట్టుక, కులం, మతం, ఆస్తి వంటి అర్హతలనుబట్టి వ్యక్తులకు అవకాశాలు కలుగజేస్తే సమానత్వం లభించదు.

అందరికీ సమాన ఆదరణ ఉండటమే సమానత్వానికి అవసరం. సమానత్వ సిద్ధాంతం ప్రకారం చట్టం ముందు అంతా సమానులే. ఆధునిక రాజ్యం ప్రజలందరికీ సాంఘిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో సమానావకాశాలు కల్పించాలి.

1. సహజ సమానత్వం (Natural Equality) :
సహజ సమానత్వం అంటే అన్ని రకాల అవరోధాలు, సాంఘిక కట్టుబాట్ల నుంచి స్వాతంత్య్రాన్ని పొందడం. దీని అర్థం వ్యక్తి పరిధిలో ఎటువంటి ఆంక్షలు ఉండకపోవడం. సహజ సమానత్వం గురించి థామస్ హాబ్స్ ప్రతిపాదించిన సామాజిక ఒడంబడిక సిద్ధాంతంలో పేర్కొనడమైంది.

పౌర సమాజం ఆవిర్భవించక ముందే ప్రజలు ప్రాకృతిక వ్యవస్థలో జీవించారని ఈ సిద్ధాంతం పేర్కొన్నది. అసమానతలు, బంధనాలకు నాగరికత దారితీసిందని హాబ్స్ ఉద్ఘాటించాడు. గ్రీకు రోమన్ రాజకీయ తత్త్వవేత్తల రచనలలో ఈ భావం కనపడుతుంది.

2. సాంఘిక సమానత్వం (Social Equality) :
వర్గ వ్యత్యాసాలు లేకపోవడం, సమానమైన హోదాలు కలిగి ఉండటాన్ని సాంఘిక సమానత్వం సూచిస్తుంది. ఏ వ్యక్తి మతం, వర్గం, వర్ణ, లింగం, పుట్టుక వంటి అంశాల ఆధారంగా వివక్షతకు గురికాకుండా ఉంటే సాంఘిక సమానత్వం నెలకొంటుంది.

ఉదాహరణకు భారతరాజ్యాంగం కుల, వర్గపరమైన వ్యత్యాసాలను నిషేధించింది. వాస్తవానికి అస్పృశ్యతను ‘అది వ్యతిరేకించింది. పౌరులందరూ సాంఘిక సమానత్వాన్ని అనుభవించినప్పుడు, ఏ ఒక్కరు ఇతరులతో పోల్చినచో కులం, వర్గం, వర్ణం, పుట్టుక, తెగ, జన్మస్థలం వంటి అంశాలపై ఏ విధమైన వివక్షతకు గురికారు.

ఈ సందర్భంలో క్రింద పేర్కొన్న అంశాలు సాంఘిక సమానత్వ సాధన, కొనసాగింపులకు సహాయపడతాయని చెప్పవచ్చు.

  1. రాజ్యం ఏ ఒక్క పౌరుడికి ప్రత్యేక సౌకర్యాలను అనుమతించరాదు.
  2. విద్య, ఉపాధి, పరిపాలన, శాసన నిర్మాణం వంటి రంగాలలో ప్రభుత్వం ఒకే విధానాన్ని పాటించి, అమలు చేయాలి.
  3. సాంఘిక, మతపరమైన వ్యవహారాలలో ప్రజలు సహనం, త్యాగం, నిజాయితీ వంటి లక్షణాలతో కూడిన విశాల దృక్పథాన్ని కలిగి ఉండాలి.
  4. రాజ్యంలోని పౌరులు తోటి పౌరులతో సహృద్భావ సంబంధాలను ఏర్పరచుకొని కొనసాగించుకోవాలి.
  5. తమ విజ్ఞాపనలను పంపించేటప్పుడు కులం, తెగ, లేక మతం వంటి వాటిని సూచించే పేర్లను ప్రజలు ఉపయోగించరాదు.
  6. కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి.పేర్కొనవచ్చు.

3. ఆర్థిక సమానత్వం (Economic Equality) :
ఆర్థిక సమానత్వాన్ని సాంఘిక, రాజకీయ సమానత్వాలకు పునాదిగా పరిగణించడమైంది. ఆధునిక రాజ్యకార్యకలాపాల వెనుక అదొక ముఖ్యమైన చోదకశక్తిగా పనిచేస్తుంది.

ఆర్థిక సమానత్వమంటే ఆదాయం, ఆస్తి, సంపదలలో విపరీతమైన వ్యత్యాసాలు లేకుండా చేయ ఎర్నెస్ట్ బార్కర్ దృష్టిలో ఆర్థిక సమానత్వం అనేది హోదాకు, పాక్షికంగా ఆస్తి – ఆదాయాలకు సం ఆర్థిక సమానత్వాన్ని “సంపదకు చెందిన వ్యత్యాసాలను తొలగించి ప్రయత్నంగా, ప్రాపంచిక వస్త స్త్రీ, పురుషల మధ్య సమానంగా పంపిణీ చేయాల్సిన ప్రయత్నం”గా లార్డ్స్ భావించాడు. ప్రొఫెసర్ లాస్కీ “పారిశ్రామిక ప్రపంచంలో విశృంఖలమైన, బాధ్యతారహిత ఇచ్ఛను నిషేధించడాన్ని ఆర్థిక సమానత్వం”గా భావించాడు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 9.
సమానత్వం మూలం మరియు ప్రాధాన్యతను తెలపండి.
జవాబు.
‘సమానత్వం’ అనే పదం సాధారణంగా మానవులందరూ సమానులే కాబట్టి అందరికీ ఒకే విధమైన ఆదరణ, గుర్తింపు, సంపద ఉండాలనే అర్థాన్ని స్ఫురింపజేస్తుంది. ప్రతి మానవునికి సహజ సిద్ధంగానే సమానత్వ వాంఛ ఉంటుంది. అయితే సమానత్వం అనే పదానికి శాస్త్రీయమైన అర్థాన్ని 1789లో ఫ్రాన్స్ దేశపు జాతీయసభ ఆమోదించిన మానవ హక్కుల ప్రకటనలో వివరించటం జరిగింది.

“మానవులందరూ స్వేచ్ఛా సమానత్వాలతో జన్మించి వాటితోనే జీవితాంతం కొనసాగుతాడ అని ప్రకటించబడింది. “ప్రజలందరూ సృష్టిరీత్యా సమానులే అనే సత్యాన్ని మేము స్పష్టపరచిన దానిగా భావిస్తాం అని 1776లో వెలువడిన అమెరికా స్వాతంత్ర్య ప్రకటనలో కూడా అనే భావం స్ఫురించే విధంగా వివరించారు.

అంటే సమానత్వం మానవునికి ప్రకృతి ప్రసాదించిన వరం. దాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదన్న మాట. ఆ పంధాలోనే “స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే నినాదత్రయం ఫ్రెంచ్’ విప్లవాన్ని ఎంతగానో ఉత్తేజితపరచింది. 1917లో రష్యన్ భూమిపై ప్రజ్వరిల్లిన కమ్యూనిస్ట్ విప్లవం ఆర్థిక సమానత్వాన్ని సాధించి ఉద్భవించింది.

సమానత్వం ప్రాధాన్యత :

  1. వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తుంది : వ్యక్తి వికాసానికి సమానత్వం అవసరం. మానవుని అభివృద్ధికి కావలసిన పరిస్థితులను సమానత్వం ఉన్న చోట పొందవచ్చు.
  2. ప్రతిభను గుర్తిస్తుంది : సమానత్వం ఉన్న చోట అన్ని వర్గాల ప్రజలు సమానావకాశాలు పొందుతారు. పేదరికం, వెనుకబాటుతనం వంటివి ప్రతిభను నిరూపించుకోవడానికి ఆటంకాలు కావు.
  3. స్వేచ్ఛను పెంపొందిస్తుంది : స్వేచ్ఛ, సమానత్వాలు పరస్పర పోషకాలు సమానత్వం స్వేచ్ఛను పెంపొందిస్తుంది.
  4. ప్రజాస్వామ్య విజయము : సమానత్వం ప్రజారాజ్య ఆదర్శం అదిలేనిదే ప్రజాస్వామ్యం విజయవంతం కాదు. ఆర్థిక, రాజకీయ, సాంఘిక సమానత్వాలు పౌరులకు లభించాలి.
  5. ప్రతిష్ట పెంచుతుంది : వ్యక్తులంతా సమాన హోదా కలిగి, సాంఘికముగా ప్రతిష్ట పొందుతారు. రాజకీయ సమానత్వం వెనుకబడిన వర్గాల స్థాయిని పెంచింది.
  6. సాంఘిక న్యాయం : సమానత్వం సాంఘిక న్యాయాన్నిస్తుంది. అంటరానితనం, వెట్టిచాకిరి వంటి సాంఘిక దురాచారాలు రూపుమాపుతుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 10.
న్యాయన్ని నిర్వచించండి. దానిలోని రకాలను తెలపండి.
జవాబు.
పరిచయం :
రాజనీతిశాస్త్ర అధ్యయనంలో న్యాయం ఒక ముఖ్యమైన భావన. సమకాలీన సమాజంలో దాదాపు ప్రపంచ, రాజ్యాలన్నీ తమ రాజకీయ, ఆర్థిక సిద్ధాంతాల వైరుధ్యాలతో సంబంధం లేకుండా మానవ సమాజంలో న్యాయం చేకూర్చి కొనసాగేందుకు కృషి చేస్తున్నాయి.

అర్థం :
న్యాయం (Justice) అనే ఇంగ్లీష్ పదం “జస్” (Jus) అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. లాటిన్ భాషలో “జస్” అంటే “బంధించి ఉండటం” లేదా “కలిపి ఉంచడం” అని అర్థం.

నిర్వచనాలు :

  1. ప్లేటో : “వ్యక్తి తన పని తాను చేసుకుంటూ, ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే న్యాయం”.
  2. అరిస్టాటిల్ : “న్యాయం అంటే సమాజంలో ప్రతి వ్యక్తీ తన నైతిక బాధ్యతలను నిర్వర్తించడం తప్ప మరేదీకాదు”.
  3. కెఫాలస్ : “న్యాయం అంటే ప్రతి ఒక్కరూ సత్యాన్ని పలకడం, ఇతరులకు ఇవ్వాల్సింది ఇవ్వడం”.

న్యాయం రకాలు (Types of. Justice) :
న్యాయం అనేక రకాలుగా ఉంటుంది. ఇది సహజవాబు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, చట్టబద్ధమైన పార్శాలకు సంబంధించినది. న్యాయభావనలోని వివిధ రకాలను గురించి క్రింద వివరించడం జరిగింది.

1. సహజ న్యాయం (Natural Justice) :
ప్రపంచంలో లభించే సహజ వనరులను ప్రతి ఒక్కరూ వినియోగించు కోవచ్చుననే సూత్రం ఆధారంగా ప్రతిపాదించబడినదే సహజ న్యాయం. భూమిపై నివసించే ప్రతి ఒక్కరికీ సహజ వనరులు జీవన ఆధారంగా ఉంటాయి.

మానవులు ఒక్కరే హేతుబద్ధమైన జీవనం గడపటం వల్ల, సహజ వనరులను న్యాయబద్ధంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఈ సందర్భంలో మానవులు భవిష్యతరాల అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి.

2. సామాజిక న్యాయం (Social Justice) :
సామాజిక న్యాయం అనేది వ్యక్తుల హక్కులు, సమాజం నియంత్రణల మధ్య చక్కని సమతౌల్యాన్ని నెలకొల్పేందుకు ఉద్దేశించింది. వర్తమాన చట్టాలకు లోబడి వ్యక్తుల న్యాయబద్ధమైన ఆకాంక్షలను నెరవేర్చుకొనేందుకు ఈ రకమైన న్యాయం వీలు కల్పిస్తుంది.

చట్టం దృష్టిలో అందరూ సమానులే అనే సూత్రాన్ని సామాజిక న్యాయం నమ్ముతుంది, సామాజిక అనర్థాలైన పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం, ఆకలి వంటి వాటిని అధిగమించేందుకు సామాజిక న్యాయం హామీ ఇస్తుంది. సమాజంలోని నిమ్నవర్గాలు, బడుగు, బలహీన వర్గాలకు రక్షణ కల్పిస్తుంది. అంతిమంగా వ్యక్తుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

3. రాజకీయ న్యాయం (Political Justice) :
రాజకీయ న్యాయం అనేది రాజకీయ సమానత్వాన్ని సూచిస్తుంది. రాజ్యంలోని వయోజనులైన పౌరులకు రాజకీయ హక్కులను ఈ రకమైన న్యాయం ప్రతిపాదిస్తుంది. దేశ పాలనలో పౌరులు స్వేచ్ఛగానూ, నిర్భయంగానూ పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది.

ఎన్నికల సమయంలో రాజకీయ న్యాయ భావన విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకొంటుంది. రోజువారి పాలనలో పౌరులు చురుకుగా పాల్గొనేందుకు రాజకీయ న్యాయం సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది.

ప్రతి ఒక్కరూ ఇతరులతో పాటుగా సమానులేనని, ఏ ఒక్కరూ ఇతరుల కంటే ఏ విషయంలోనూ అధికులు కారనీ, ఎటువంటి ప్రత్యేకతలు కలిగి ఉండరనే సూత్రంపై ఈ భావన రూపొందింది. రాజ్యంలో రాజకీయ న్యాయం ఉండాలంటే కింద పేర్కొన్న పరిస్థితులు నెలకొనాలి.

  1. సమన్యాయ పాలన
  2. స్వతంత్ర న్యాయశాఖ
  3. ప్రాతినిధ్య సంస్థలకు ఎన్నికలు
  4. రాజకీయ పార్టీలు
  5. పత్రికా స్వాతంత్ర్యం
  6. ప్రజాస్వామ్య పాలన మొదలైనవి.

4. ఆర్థిక న్యాయం (Economic Justice) :
వ్యక్తుల మధ్య నిర్హేతుకమైన, ప్రకృతి విరుద్ధమైన వ్యత్యాసాలు లేని పరిస్థితినే ఆర్థికన్యాయంగా పేర్కొనవచ్చు. ఆదాయం, ద్రవ్యం, సంపద, ఆస్తివంటి వ్యత్యాసాలు లేకుండా వ్యక్తులందరికీ సమానమైన ఆదరణ కల్పించేందుకు ఆర్థికన్యాయం ఉద్దేశించింది. సానుకూల దృష్టిలో ఆర్థిక న్యాయం అనేది శ్రామికులకు చాలినంత వేతనాలను చెల్లించేందుకు దోహదపడుతుంది. సంపద, ఆదాయంలో విపరీతమైన అంతరాలను తొలగించేందుకు కృషి చేస్తుంది.

బడుగు బలహీనవర్గాలు దోపిడీకి గురికావడాన్ని ఎట్టి పరిస్థితులలో ఈ న్యాయం అనుమతించదు. ప్రతి ఒక్కరూ కనీస ప్రాథమికావసరాలను పొందేందుకు ఎదురయ్యే ఆటంకాలను తొలగిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడు, గుడ్డ, వసతి వంటి ప్రాథమిక అవసరాలు కలిగి ఉండేందుకు చర్యలు తీసుకొంటుంది. సమాజంలో న్యాయబద్ధమైన ఆర్థిక వ్యవస్థాపనకు తోడ్పడుతుంది. “ప్రతి ఒక్కరూ వారి సామర్థ్యాన్ని బట్టి ఉపాధి పొందడం, అవసరాన్ని బట్టి ఆర్థిక వనరులను వినియోగించుకోవడం” అనే భావనను ఆర్థికన్యాయం బలపరుస్తుంది.

5) చట్టబద్ధమైన న్యాయం (Legal Justice) :
చట్టబద్ధమైన న్యాయం అనేది రాజ్యాంగ శాసనాల ద్వారా వెల్లడి అవుతుంది. సమాజంలో ఎంతోకాలంగా ప్రాచుర్యంలో ఉన్న ఆచార సంప్రదాయాలతో ఈ రకమైన న్యాయం సంబంధాన్ని కలిగి ఉంటుంది. రాజ్యంలోని రాజ్యాంగం, ఇతర శాసనచట్టాల రూపంలో అది వ్యక్తమవుతుంది.

న్యాయం చట్టబద్ధమైన పరిమితులను నిర్ణయిస్తుంది. చట్టబద్ధమైన న్యాయంలో రెండు అంశాలు ఇమిడి ఉంటాయి. అవి : 1. సమాజంలో చట్టాలన్నీ సమన్యాయ పాలన సూత్రంపై ఆధారపడి రూపొందితమై, అమలులో ఉంటాయి. 2. చట్టాలన్నీ సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా రూపొందుతాయి. మొత్తం సమాజ సంక్షేమాన్ని చట్టాలు ఆకాంక్షిస్తాయి.

అయితే చట్టబద్ధమైన న్యాయం అనేది పూర్తిగా న్యాయంగా పరిగణితం కాదు. ఈ సందర్భంలో న్యాయం అంటే చట్టం అని ఎర్నస్ట్ బార్కర్ పేర్కొన్నాడు. చట్టబద్ధమైన న్యాయం అనేది న్యాయాన్ని ప్రసాదించేందుకు ఉద్దేశించిందని కొందరు పేర్కొన్నారు. మొత్తం మీద చట్టం అనేది న్యాయానికి కొంతమేరకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని మరికొందరు భావించారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 11.
న్యాయం అంటే ఏమిటి ? వివిధ రకాల న్యాయభావనలను తెలపండి.
జవాబు.
న్యాయం అనే పదాన్ని ఆంగ్లంలో జస్టిస్ (Justice) అంటారు. ఈ పదం ‘జస్టీషియా’ అనే లాటిన్ భాషా పదం నుంచి అవతరించింది. ఇందులో ‘జస్’ లేదా ‘జస్టిస్’ అనే పదాలు ఇమిడి ఉన్నాయి. దీని అర్థం ‘కలపటం’ లేదా ‘బంధించడం’. మానవ సమాజానికే సంబంధించి వివిధ వర్గాల ప్రజలను ఒకే వ్యవస్థలో కూర్చటంగా చెప్పవచ్చు. వ్యవస్థీకృత సమాజంలో మనుషుల మధ్య మానవ సంబంధాలను సమన్వయం చేస్తూ, మానవాళికి ఉపకరించటానికి రాజ్యం గుర్తించి, అమలు చేసే సూత్రావళే న్యాయం.

ఈ పదాన్ని ధర్మం, సరైన లేదా న్యాయమైన అని వివిధ అర్థాల్లో కూడా వాడతారు. అన్యాయం, అధిక్యత, తప్పులను ఇది వ్యతిరేకిస్తుంది. కొందరు రాజనీతి వేత్తలు న్యాయాన్ని ‘సుగుణం’ అంటే మరికొందరు ‘సమానత్వం’ అని అర్థ వివరణ ఇచ్చారు. అయితే ఎక్కువ మంది దీన్ని సమన్యాయ పాలనతో పోల్చారు.

న్యాయం అనే భావన కేవలం రాజనీతి శాస్త్రంలో మాత్రమే గాక నీతిశాస్త్రం, న్యాయశాస్త్రం, తత్వశాస్త్రాలలో కూడా అధ్యయన అంశంగా ఉంది. ఇది సహజమైనది, విలువలతో కూడుకున్నది. సమాజంలో మానవ గమనాన్ని తెలుపుతుంది. ఇది ప్రజాజీవనానికే చిహ్నంగా ఉంటూ సామాజిక బాధ్యతతో కూడుకొని ఉంటుంది.

న్యాయ భావనను అనేక మంది రాజనీతి వేత్తలు వివిధ రకాలుగా నిర్వచించారు. అందులో కొన్నింటిని క్రింది విధంగా చెప్పవచ్చు.
ప్లేటో : “ఇతరుల కార్యకలాపాలలో జోక్యం చేసుకోకుండా, ఎవరి పనులు వారే నిర్వహించడం అదే విధంగా హేతువు, ధీరత్వం, ఇచ్ఛల సమన్వయమే న్యాయం”
అరిస్టాటిల్ : “సమాజంలో ఎవరికి నిర్దేశించిన నైతిక విధులను వా సక్రమంగా నిర్వహించడమే న్యాయం”.
బార్కర్ : “రాజనీతి విలువల సమ్మేళనం లేదా సమన్వయమే న్యాయం”.
జాన్ రాల్స్ : “సాంఘిక సంస్థల వాస్తవిక తాత్విక చింతన ప్రాథమిక సూత్రమే న్యాయం; సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు హక్కులు విధులను కల్పిస్తూ; సామాజిక ప్రయోజనాలను అన్ని వర్గాలకు అందించడమే న్యాయం”.

బి. న్యాయానికి సంబంధించి ప్రధాన భావనలు :
న్యాయం అనే భావనను వివిధ న్యాయ సిద్ధాంతాలు విస్తృతం చేశాయి. వీటిని స్థూలంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.

  1. గ్రీకులు, స్లోయిక్లు, రోమన్ల న్యాయ సిద్ధాంతం
  2. ఆధునిక న్యాయ సిద్ధాంతం
  3. సమకాలీన న్యాయ సిద్ధాంతాలు.

1. గ్రీకులు, స్లోయిక్లు, రోమన్ల న్యాయ సిద్ధాంతం :
న్యాయ భావనను తొలిసారిగా చర్చించిన వారు గ్రీకులు కాగా, దానికి పునాదులు వేసిన వ్యక్తి ప్లేటో, ప్లేటో న్యాయ సిద్ధాంతంలో సుగుణం ప్రధానమైంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఎవరి పనులు వారే నిర్వహించుకోవడమే సుగుణం. అరిస్టాటిల్ ప్రకారం న్యాయం సంపూర్ణంగా సుగుణవంతమైంది.

స్లోయిన్ల ప్రకారం న్యాయం హేతువు ద్వారా కనుగొనబడింది. అదే విధంగా ఇది రాజ్యంచే రూపొందించబడిన సంవర్ధక శాసనం కంటే ఉన్నతమైంది. రోమన్ల ప్రకారం న్యాయం అనే భావన శాసనానికి సన్నిహితంగా ఉంటుంది.

2. ఆధునిక న్యాయ సిద్ధాంతం:
సంస్కరణోద్యమం, సాంస్కృతిక పునరుజ్జీవనం, పారిశ్రామిక విప్లవం అనంతరం ఇది అవతరించింది. హాబ్స్, లాక్, రూసోల సామాజిక ఒడంబడిక సిద్ధాంతంతో ఆధునిక న్యాయ సిద్ధాంతం అవతరించింది. నిరపేక్ష సార్వభౌమాధికారాన్ని రాజ్యానికి ఇవ్వడమే న్యాయం అని హాబ్స్ పేర్కొన్నాడు. లాక్ సహజ హక్కులలో న్యాయాన్ని గుర్తించగా, రూసో చెప్పిన “జనేచ్ఛ” న్యాయంతో కూడుకున్నదిగా చెప్పాడు.

3. సమకాలీన న్యాయ సిద్ధాంతాలు :
ఈ సిద్ధాంతాలు ప్రధానంగా స్థిరమైన న్యాయం (Substantial Justice), ప్రక్రియాత్మకమైన న్యాయం (Procedural Justice) ల మధ్యగల వ్యత్యాసాలపై దృష్టి పెడుతుంది. మార్కెట్ ఆర్థిక వ్యవస్థ నియమ, నిబంధనలు మానవుని ప్రవర్తనను నిర్దేశించటానికీ నమూనా నిబంధనలుగా ఉంటాయని ప్రక్రియాత్మకమైన న్యాయం పరిగణిస్తుంది.

అన్ని రకాల వివక్షతలను వ్యతిరేకిస్తూ, మానవుని మధ్య నైతికతను, సమాన గౌరవాన్ని ప్రక్రియాత్మకమైన న్యాయం అనుమతిస్తుంది. F. A. హాయక్, మిల్టన్ ఫ్రీడ్ మన్, నాజిక్ వంటి వారు దీన్ని ప్రతిపాదించిన వారిలో ప్రముఖులు.

స్థిరమైన న్యాయ భావన అనేది సామాన్యవాదం ఆలోచనల నుంచి అవతరించింది. సమాజంలోని పేదలు, అణగారిన వర్గాల జీవన ప్రమాణాల పెంపుదలకు తగిన అవకాశాలు పొందేందుకు స్థిరమైన న్యాయం తోడ్పడుతుంది. ఇందులో వనరుల పంపిణీ అనేది ప్రధాన అంశం కాగా ప్రక్రియ అనేది ద్వితీయమైంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

4. జాన్రాల్స్ న్యాయ సిద్ధాంతం :
స్థిరమైన న్యాయానికి కావలసిన సాధనాలను రూపొందించటానికి ఉపకరించే పద్ధతిగా ప్రక్రియాత్మకమైన న్యాయం ఏ విధంగా తోడ్పడుతుందో రాల్స్ న్యాయ సిద్ధాంతం తెలుపుతుంది. సమాజంలో గల బలహీన అంశాలను బలోపేతంగా చేయడానికి ఇతను ప్రయత్నించాడు. ఇతని న్యాయ సిద్ధాంతం మూడు అంశాలపై ఆధారపడింది.

  1. సమాన స్వేచ్ఛ సూత్రం.
  2. సమాన అవకాశాల సూత్రం.
  3. అణగారిన వర్గాలకు లబ్ధిని వేకూర్చే ప్రతిపాదనను సమర్థించవచ్చు.
    ఈ విధంగా రాల్స్ సామ్యవాదం పెట్టుబడి దారి విధానం విలువలను చెప్పడానికి ప్రయత్నించాడు.

ప్రశ్న 12.
శక్తిని నిర్వచించి, దానిలోని వివిధ రకాలను తెలపండి.
జవాబు.
ఎ. శక్తి అర్థ వివరణ, నిర్వచనం :
వ్యక్తి తన కోరికలను తీర్చుకోవటానికి లేదా లక్ష్యాన్ని సాధించటానికి అతనిలో గల నైపుణ్యతను తెలియజేసేదే శక్తి. ఒక వ్యక్తి లేదా సమూహం వేరే వ్యక్తి లేదా సమూహంపై చూపే ప్రభావాన్ని శక్తి తెలుపుతుంది. శక్తిని అనేక మంది రాజనీతి పండితులు నిర్వచించారు. అవి :
హెచ్. వి. వైజ్మాన్ : “ఎటువంటి ఆటంకాలనైన ఎదుర్కొని ఒక వ్యక్తి తాను కోరుకున్నది సాధించటానికి గల నైపుణ్యమే శక్తి”.
రాబర్ట్ ధాల్ : “శక్తి అనేది ఒక రకమైన ప్రభావం చూపే భావన, అనంగీకారాన్ని అంగీకరించే విధంగా చేయడానికి ఉపకరించేదే శక్తి”.
ఎడ్వర్డ్ ఎ. షిల్స్ : “స్వప్రయోజనాల సాధన కోసం మానవ ప్రవర్తనను ప్రభావితం చేసే సామర్థ్యమే శక్తి”. బి. శక్తి వివిధ రూపాలు.

1. రాజకీయ శక్తి :
రాజకీయ శక్తి అనేది వ్యవస్థీకృతమైన, అవ్యవస్థీకృతమైన రాజకీయ అంశాలచేత ప్రభావితం అవ్వడాన్ని సూచిస్తుంది. రాజకీయాలలో శక్తి అనేది ఎప్పుడు రాజకీయశక్తి, రాజ్యశక్తి, ప్రభుత్వశక్తి, శాసనాలశక్తి మొదలై ప్రభుత్వ చర్యల మీద ఆధారపడి ఉంది.

కాని ఈ వ్యవస్థీకృత అంశాలు కేవలం ప్రతిపక్షంలో ఉండే పార్టీల చేతనేకాక అతి పెద్ద సంఖ్యలో ఉండి ప్రభావ వర్గాలు, ప్రజాభిప్రాయం, ప్రజా ఉద్యమాలు, మాస్ మీడియా మొదలైన వాటిచే ప్రభావితమవుతుంటాయి. కాబట్టి శక్తి అనేది వ్యవస్థీకృత అంశాలైన రాజ్యంతోపాటు అవ్యవస్థీకృత అంశాలకు కూడా వర్తిస్తుంది.

2. సాంకేతిక శక్తి :
ఆధునిక కాలంలో శక్తిని ప్రదర్శించటంలో సాంకేతిక పరిజ్ఞానం అతి ముఖ్యమైన సాధనంగా ఉంది. ఇటీవలికాలంలో సాంకేతిక మేధస్సు అనేది కృత్రిమ మేధస్సు రూపంలో మనిషి, సమాజం, రాజకీయాలపై విప్లవాత్మక ప్రభావం చూపిస్తుంది. సమకాలీన ప్రజాస్వామ్యాలలో కంప్యూటర్లు, జ్ఞానంలేని యంత్రం, ఎంతో పనిని చేస్తూనే ఉన్నాయి.

రాజకీయ పార్టీలకు వారి ప్రచారాలలో ఈ సాంకేతిక పరిజ్ఞానంతో చాలా సంబంధం ఉంది. ఆరోగ్య సాధనకు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రభుత్వాలు చాలా వరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాయి.

మనం సాంకేతిక విజ్ఞానంపై ఆధారపడడం అనేది సాంకేతిక విస్ఫోటనానికి (పెరుగుదలకు దారితీసింది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి ఓటర్లను వారి ఓటింగ్ ప్రవర్తనపై చాలా సూక్ష్మస్థాయిలో కూడా ప్రభావపరుస్తున్నాయి. కాబట్టి సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంలో ఎవరు పైచేయి సాధిస్తారో వారే రాజకీయాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేస్తున్నారు.

3. ఆర్థిక శక్తి :
ఆర్ధిక శక్తి అనేది ప్రధానంగా సంపదను స్వాధీనం చేసుకోవడం ద్వారా ప్రత్యేకించి ఉత్పత్తి, పంపిణీ ద్వారా వస్తుంది. ఆర్థికశక్తి అనేది ఉదార ప్రజాస్వామ్యదేశాలలో చాలా కీలక పాత్ర వహిస్తుంది. ఒకవేళ రాజ్యం సమృద్ధిగా సహజవాబు. ఇతర వనరులను కలిగి ఉంటుందో అది ప్రబలమైన ఆర్థికశక్తిగా మారుతుంది.

ప్రముఖ వార్తా పత్రికలు, టి.వి. ఛానెళ్ళు పెద్ద పెద్ద వ్యాపారవేత్తల చేతుల్లో ఉండటం వల్ల, ఈ మీడియా ద్వారా వారికి అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తున్నారు. వీరి వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా వినియోగదారుల సంస్కృతిని పెంపొందిస్తున్నారు.

4. సైద్ధాంతికపరమైన శక్తి :
ఆధిపత్య పాలకవర్గం ప్రజల ఆలోచనలను, భావోద్వేగాలపై పూర్తిగా పట్టును సాధించటానికి, వారిలో సమ్మతి అనే భ్రాంతిని సృష్టించటానికి ఉపయోగించే శక్తిని ఇది సూచిస్తుంది. అలాగే సమ్మతిని సృష్టించడంలో భ్రాంతిని కలిగిస్తుంది.

తద్వారా ప్రజలు వారు అంగీకరించిన వాటిలోనే పాలింపబడుతున్నామనే నమ్మకానికి దారితీస్తుంది. ఈ సిద్ధాంతపరంగా “పాలక వర్గంచే ఆధిపత్యం చెలాయించడమనేది పెత్తందారికి దారితీస్తుందని” ఇటలీ మార్క్సిస్టుగా పేరుపడిన ఆంటోనియో గ్రాంస్కీ (1891 1937) అన్నారు.

ఈ విధంగా రాజకీయశక్తి అతిముఖ్య లక్షణమైన రాజకీయ సిద్దాంతం అనేది పాలక వర్గాలకు శాసనబద్ధతను కల్పిస్తూ వారు చాలా దృఢమైన రాజకీయశక్తిని నిర్వహించడంలో సహకరిస్తుంది. ఎప్పుడైతే ప్రజలు ప్రభుత్వ వ్యవస్థలలో ప్రత్యేకించి చాలా మంచిది అని భావిస్తే, ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని సవాలు చేయరు.

5. జాతీయశక్తి :
వాస్తవవాదుల దృష్టి నుంచి చూస్తే రాజకీయాలు అనేవి “శక్తి” కోసం పోరాటమే. అంతర్జాతీయ రాజకీయాల తక్షణ లక్ష్యం కూడా శక్తిని సాధించడమే. అంతర్జాతీయ వ్యవహారాలలో సార్వభౌమాధికార రాజ్యాలు ఇతర సార్వభౌమాధికార రాజ్యాలను, జాతి రాజ్యాలు తమ స్వంత లక్ష్యాలను సాధించడం అనేది అంతర్జాతీయ సంబంధాలను ప్రభావితపరుస్తుంది.

ఈ సందర్భంలోనే ‘ఏక ధృవ’, ‘ద్వి ధృవ’, ‘బహుళ ధృవ’ ప్రపంచాలు అనే పదాలు ప్రాచుర్యం పోందాయి. ఒకే దేశం ప్రపంచం మొత్తాన్ని శాసిస్తే దానిని ఏక ధృవ ప్రపంచమని; రెండు దేశాలు ఆధిపత్యం చెలాయిస్తే ద్వి ధృవ ప్రపంచం అని; అనేక దేశాలు ఆధిపత్యం చెలాయిస్తే బహుళ ధృవ ప్రపంచం అని అంటారు.

జాతీయశక్తిని ప్రదర్శించటానికి విభిన్న అంశాలు ఉన్నాయి. అవి బలం, ప్రభావం, అధికారం. బలం అనేది బెదిరించటం లేదా సైన్యాన్ని వినియోగించటం, ఆర్థిక, ఇతర సాధనాలను ఉపయోగించి క్రమపద్ధతిలో చెప్పడం ద్వారా ఇతర దేశాల ప్రవర్తనలో మార్పు తీసుకురావటమే ప్రభావం.

ఒక దేశం యొక్క ఆదేశాన్ని మరోదేశం పాటించడమే అధికారం. ఇది గౌరవం, సంఘీభావం, అభిమానం, అనుబంధం, నాయకత్వం, విజ్ఞానం, నైపుణ్యం వంటి దృక్కోణాల్లో ఉండడం.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 13.
శక్తి అంటే ఏమిటి ? వివిధ రకాల శక్తి ధృక్పధాలను వివరించండి.
జవాబు.
వ్యక్తి తన కోరికలను తీర్చుకోవటానికి లేదా లక్ష్యాన్ని సాధించటానికి అతనిలో గల నైపుణ్యతను తెలియజేసేదే శక్తి. ఒక వ్యక్తి లేదా సమూహం వేరే వ్యక్తి లేదా సమూహంపై చూపే ప్రభావాన్ని శక్తి తెలుపుతుంది. శక్తిని అనేకమంది రాజనీతి పండితులు నిర్వచించారు. అవి :
హెచ్. వి. వైజ్మాన్ : “ఎటువంటి ఆటంకాలనైన ఎదుర్కొని ఒక వ్యక్తి తాను కోరుకున్నది సాధించటానికి గల నైపుణ్యమే శక్తి”.
రాబర్ట్ ధాల్ : “శక్తి అనేది ఒక రకమైన ప్రభావం చూపే భావన, అనంగీకారాన్ని అంగీకరించే విధంగా చేయడానికి ఉపకరించేదే శక్తి”.

వివిధ రకాల శక్తి దృక్పధాలు (లేదా) ధృక్కోణాలు :
రాజనీతిశాస్త్ర అధ్యయన ఆధునిక ధృక్కోణం శక్తి అనే భావనను ప్రధానమైనదిగా గుర్తించారు. ఏ దేశంలోనైన శక్తి ఎప్పుడు సాంఘిక, ఆర్థిక, సైద్ధాంతిక నిర్మాణంలో నిబిడీకృతమై ఉంటుంది. రాజ్యాంగం అంతస్థు, అవకాశాలలో సమానత్వం కల్పించినప్పటికీ శక్తి ప్రధాన కేంద్రంగా ఉంటుంది.

శక్తిని కలిగి ఉండే సమూహాలు, వర్గాలను తెలుసుకోవడానికి రాజకీయాలను అర్థం చేసుకోవాలి. శక్తిని అధ్యయనం చేయటానికి వివిధ ధృక్కోణాలు ఉన్నాయి. వీటిని స్థూలంగా రెండు రకాలుగా చెప్పవచ్చు. అవి ఉదారవాద, మార్క్సస్ట్ ధృకోణాలు. వీటిని కింది విధంగా వివరించవచ్చు.

1. శ్రేష్ట వర్గ ధృక్కోణం :
శక్తికి సంబంధించి శ్రేష్ట వర్గ ధృక్కోణం 20వ శతాబ్దం ప్రారంభంలో పరెటో, మోస్కా, మిచెల్స్ అనే ముగ్గురు సామాజిక శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీని ప్రకారం సమాజం శ్రేష్ట వర్గం, సామాన్య జన సమ్మేళనంగా చీలి ఉంటుంది.

ఈ విధంగా చీలటానికి వ్యక్తులలో గల పోటీతత్వం, వారి వారి ఆసక్తులపై ఆధారపడి ఉంటుంది. శ్రేష్ఠ వర్గం రాజకీయ శక్తిని ప్రభావితం చేస్తుంది. ఈ సిద్ధాంతం ప్రకారం సమాజంలో విభజన అనేది సహజవాబు. కార్యకరణ పరంగా ఉంటుంది. ఇది సంపూర్ణంగా మారుతుందనే నమ్మకాన్ని కలిగి ఉంటుంది.

2. సమూహ ధృక్కోణం :
ఈ ధృక్కోణంను అర్థర్ బెంట్లీ అభివృద్ధి చేశాడు. శక్తిపై సమూహ ధృక్కోణం బహుతా సిద్ధాంతానికి అనుగుణంగా ఉంటుంది. దీని ప్రకారం శక్తి అనే భావన సమాజాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది. ఇవి ఆధిపత్య సమూహాలు, ఆధారిత సమూహాలు, సమూహ ధృక్కోణం ప్రకారం సమాజంలో శక్తి ఏ ఒక్క సమూహం చేతిలో కేంద్రీకృతం కాకుండా అది విభిన్న సామాజిక వర్గాల మధ్య విభజించబడి ఉంటుంది. ఈ సమూహాలు ఎక్కువగా స్వయం ప్రతిపత్తిని కలిగి ఉండి, స్వతంత్రంగా నిర్ణయాలను తీసుకుంటాయి.

3. లింగ సంబంధ ధృక్కోణం :
ఇటీవలి కాలంలో శక్తిని అధ్యయనం చేయటానికి లింగపర ధృక్కోణం ముఖ్యాంశంగా ఉంది. ఇది సమాజాన్ని లింగపరంగా రెండు వర్గాలుగా గుర్తిస్తుంది. అవి స్త్రీలు, పురుషులు మానవ జాతి పురోగమించడానికి ఈ విభజనను ప్రకృతి సృష్టించింది. మానవ జీవనం, నాగరికత, సంస్కృతి సార్థకం కావడానికి ఇది తోడ్పడింది.

పరిణామ క్రమంలో సమాజంలో స్త్రీ, పురుషులు పరస్పరం ఆధారపడి జీవించారు. స్త్రీలపై పురుషుల ఆధిపత్యం చెలాయించడం జరిగింది. పితృస్వామిక వ్యవస్థలో అనాదిగా స్త్రీ, పై పురుషుడు ఆధిపత్యం కలిగి ఉంటున్నాడు. పురుష ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ స్త్రీకి విముక్తి కల్పించాలని స్త్రీవాద సిద్ధాంతం కోరుతుంది.

4. వర్గపర ధృక్కోణం :
శక్తి భావనపై వర్గపద ధృక్కోణం 19వ శతాబ్దంలో కారల్ మార్క్స్ (1818 – 83), ఏంజెల్స్ (1820 – 95) లు అభివృద్ధి చేశారు. ఈ సిద్ధాంతం ప్రకారం రాజకీయ శక్తి అనేది ఆర్థిక శక్తిచే సృష్టించబడింది. దీనికి గల కారణం ఉత్పత్తి సాధనాలు ఆర్థిక శక్తి యాజమాన్యంలో ఉండడం, నాగరికత ప్రతీ దశలోను సమాజం రెండు పరస్పర విరుద్ధ వర్గాలుగా విభజించబడి ఉంటుంది. అవి ఉన్నవారు, లేనివారు, ఉత్పత్తి సాధనాల పంపిణీ ద్వారా మాజం యాజమాన్యం గలవారు, యాజమాన్యం లేనివారిగా విభజించబడింది.

ఈ సిద్ధాంతం “వర్గం” అనేది సమాజంలో శక్తిని ప్రదర్శించడానికి ఒక వ్యవస్థీకృత తరగతిగా గుర్తిస్తుంది. సమాజంలో ఉత్పత్తి సాధనాలు అయితే ఎవరి చేతిలో ఉంటాయో వారిని “ఆధిపత్య వర్గం”గా, మిగిలిన వారిని “ఆధారపడిన” లేదా “ఆశ్రిత” వర్గంగా పరిగణిస్తుంది. సామాజిక విప్లవం ద్వారా వర్ణరహిత సమాజాన్ని నెలకొల్పాలని ఈ సిద్ధాంతం నమ్ముతుంది.

5. ఆధునిక ధృక్కోణం :
సాంప్రదాయిక సిద్ధాంతాలను వ్యతిరేకిస్తూ ఆధునిక ధృక్కోణం అవతరించింది. తరతరాలుగా అణగారిన వర్గాల ప్రజలను సాధికారికత దిశగా పయనింపచేయటం కోసం మహిళలకు, సాధారణ ప్రజలకు అధికారం పంచాలని తెలుపుతుంది. గతంలో సాంప్రదాయిక శక్తి సిద్ధాంతం ఆధిపత్య వర్గాలు శక్తిని చెలాయించిన అంశంగా శక్తి సిద్ధాంతాన్ని పరిగణించడం జరిగింది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
శాసనాన్ని నిర్వచించి, దాని లక్షణాలను వివరించండి.
జవాబు.
పరిచయం :
రాజనీతిశాస్త్ర అధ్యయనంలో చట్టం అనేది ఒక ముఖ్యమైన భావన.

రాజ్యం శాసనాల ద్వారా ప్రజలను పరిపాలిస్తుంది. శాసనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. రాజ్య సార్వ భౌమాధికారం శాసనాల ద్వారా వ్యక్తమవుతుంది. రాజ్యం ఆశించే సాంఘిక, ఆర్థిక, రాజకీయ మార్పులు శాసనం ద్వారానే సాధించగలవు. మానవుని బాహ్య ప్రవర్తనను క్రమబద్ధం చేసే నియమాలే శాసనాలు. వ్యక్తులు రాజ్యంలో చేయవలసినవి, చేయకూడనివి శాసనం చెబుతుంది. ప్రభుత్వంలోని శాసనశాఖ శాసనాలు చేస్తుంది.

అర్థం :
శాసనాన్ని ఆంగ్లంలో ‘లా’ అంటారు. ‘లాగ్’ అనే ట్యూటానిక్ పదం నుండి ‘లా’ అనే మాట వచ్చింది. ‘లాగ్’ అంటే ‘సమమైన’ లేదా ‘స్థిరమైన’ అని అర్థం. శాసనాలు స్థిరమైన నిబంధనలు.
నిర్వచనాలు :

  1. “సార్వభౌముడి ఆదేశమే చట్టం. ప్రజలందరూ సార్వభౌముడికి విధేయులుగా ఉండేందుకు చట్టం కొన్ని ఉమ్మడి నియమాలను రూపొందిస్తుంది” అని జాన్ ఎరిస్కిన్ పేర్కొన్నాడు.
  2. “రాజకీయాధికారాన్ని పొందిన సార్వభౌముడిచే అమలు చేసే బాహ్య చర్యలకు సంబంధించిన సాధారణ నియమమే చట్టం” అని టి.ఇ. హాలండ్ పేర్కొన్నాడు.
  3. న్యాయపాలనలో రాజ్యం ఉపయోగించే సూత్ర సముదాయమే చట్టం” అని జాన్ సాల్మండ్ పేర్కొన్నాడు.

శాసనానికి ఆధారాలు :
హాలండ్ అనే రచయిత సంప్రదాయాలు, మతము, ధర్మబద్ధత (సమత), న్యాయమూర్తుల తీర్పులు, శాస్త్రీయ వ్యాఖ్యానాలు, శాసనశాఖ అనేవి శాసనాలకు ఆధారాలని చెప్పాడు. శాసనాలు వివిధ రంగాలలో క్రమంగా రూపొందుతాయి. అనేక అంశాల ప్రభావం వాటిపై ఉంటుంది. రాజనీతి శాస్త్రజ్ఞులు చెప్పిన శాసనాల ఆధారాలు ఈ క్రింది విధంగా చెప్పవచ్చు.

చట్టం ముఖ్య లక్షణాలు (Features of Law): చట్టానికి కింద పేర్కొన్న లక్షణాలు ఉన్నాయి.

  1. సార్వభౌముడు ఆమోదించిన నియమ నిబంధనల సముదాయమే చట్టం.
  2. చట్టాన్ని రాజ్యం అమలుపరుస్తుంది. రాజ్యం అనుమతి పొందడంతో చట్టాన్ని యోగ్యమైందిగా పరిగణించవచ్చు.
  3. చట్టం నిర్దిష్టమైనది, ఖచ్చితమైనది, విశ్వవ్యాప్తమైనది.
  4. చట్టం ప్రజల అభీష్టాన్ని ప్రతిబింబిస్తుంది.
  5. చట్టం ఉల్లంఘన శిక్షకు దారితీస్తుంది.
  6. చట్టాలు నిర్బంధమైన, శిక్షాత్మక స్వభావాన్ని కలిగి ఉంటాయి.
  7. చట్టం వైయక్తిక, సాధారణ సంక్షేమాన్ని సంరక్షించే ఉద్దేశ్యాన్ని కలిగి ఉంటుంది.
  8. చట్టం ప్రజల అవసరాల మేరకు మార్చబడుతుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 2.
శాసనం యొక్క ఏవైనా నాలుగు లక్షణాలను చర్చించండి.
జవాబు.
చట్టం ముఖ్య లక్షణాలు (Features of Law) : చట్టానికి కింద పేర్కొన్న లక్షణాలు ఉన్నాయి.

  1. సార్వభౌముడు ఆమోదించిన నియమ నిబంధనల సముదాయమే చట్టం.
  2. చట్టాన్ని రాజ్యం అమలుపరుస్తుంది. రాజ్యం అనుమతి పొందడంతో చట్టాన్ని యోగ్యమైందిగా పరిగణించవచ్చు.
  3. చట్టం నిర్దిష్టమైనది, ఖచ్చితమైనది, విశ్వవ్యాప్తమైనది.
  4. చట్టం ప్రజల అభీష్టాన్ని ప్రతిబింబిస్తుంది.
  5. చట్టం ఉల్లంఘన శిక్షకు దారితీస్తుంది.
  6. చట్టాలు నిర్బంధమైన, శిక్షాత్మక స్వభావాన్ని కలిగి ఉంటాయి.
  7. చట్టం వైయక్తిక, సాధారణ సంక్షేమాన్ని సంరక్షించే ఉద్దేశ్యాన్ని కలిగి ఉంటుంది.
  8. చట్టం ప్రజల అవసరాల మేరకు మార్చబడుతుంది.

ప్రశ్న 3.
శాసనం యొక్క ఏవైనా మూడు ఆధారాలను తెలపండి.
జవాబు.
1. ఆచార, సంప్రదాయాలు, వాడుకలు (Customs) :
ఇవి శాసనానికి తొలి ఆధారాలు. ప్రజల ఆచారాలు, వాడుకలు, సంప్రదాయాలు శాసనాలకు మూలాధారము. సంప్రదాయాలు సంఘంలో ఒక అలవాటుగా, క్రమంగా రూపొందుతాయి. పూర్వం సంప్రదాయాలే సమాజ జీవితాన్ని క్రమబద్ధం చేసేవి. రాజ్యం వీటిని గుర్తించి, వాటిని ఆధారం చేసుకొని కొన్ని శాసనాలను రూపొందిస్తుంది.

రాజకీయ ఆచారాలు కూడా రాజ్యంచే గుర్తించబడి అమలు చేయబడితే అవి శాసనాలవుతాయి. బ్రిటన్లో ‘సామాన్య న్యాయం’ సంప్రదాయబద్ధమైన శాసనానికి ఉదాహరణ. అదే విధంగా భారతదేశంలో వివాహ చట్టాలు, ఆస్తి పంపిణీ చట్టాలు మొదలగునవి సంప్రదాయాల ఆధారంగా చేయబడ్డాయి.

2. మతం (Religion) :
ఆచారానికి మతం సమాజాన్ని విపరీతంగా ప్రభావితం చేసే వ్యవస్థ. సంఘ జీవితం మత నియమాలకు అనుగుణంగా జరుపుకుంటారు. పూర్వం మతాధిపతులు చెప్పే నియమాలు శాసనాల వలె చెలామణి అయ్యేవి. ఆధునిక కాలంలో కూడా శాసనాలు చేయడానికి మతం ఒక ఆధారం.

వారసత్వం, వివాహం, కుటుంబ ఆస్తి మొదలైన వాటి శాసనాలు మతం ఆధారంగా చేయబడ్డాయి. హిందువులు, క్రైస్తవులు, ముస్లిములకు గల శాసనాలు వారి మతాల ఆధారంగా రూపొందాయి. ఇరాన్, పాకిస్థాన్ వంటి మత ప్రమేయ దేశాలలో సంఘ జీవనానికి మత నియమాలే ఆధారం.

3. న్యాయస్థానాల తీర్పులు (Judicial Decisions) :
న్యాయస్థానాలలో న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు శాసన నిర్మాణానికి ఆధారాలు. న్యాయస్థానాలు చట్టాలను వ్యాఖ్యానిస్తాయి. ఈ విధి నిర్వహణలో న్యాయమూర్తులు తీర్పులిచ్చేటప్పుడు క్రొత్త న్యాయ సూత్రాలను సృష్టిస్తారు.

ఈ తీర్పులు అదే విధమైన వివాదాలు తలెత్తినప్పుడు న్యాయసూత్రాల వలె వర్తింపచేస్తారు. నేడు న్యాయమూర్తుల నిర్ణయాలు శాసనాలలో అంతర్భాగమవుతున్నాయి.
ఉదా : భారతదేశంలో సుప్రీంకోర్టు తీర్పులిచ్చిన గోలక్నాథ్ కేసు, కేశవానంద భారతి కేసు, మినర్వామిల్స్ కేసు.

4. శాస్త్రీయ వ్యాఖ్యానాలు (Scientific Commentories) :
ప్రముఖ న్యాయశాస్త్ర కోవిదులు, రచయితలు, విమర్శకులు చేసే వ్యాఖ్యానాలు శాసన నిర్మాణానికి ఆధారమవుతాయి. ఇవి న్యాయస్థానాలలో న్యాయమూర్తుల వ్యాఖ్యానాలు, వివరణలు, శాసనాలు చేయటానికి ప్రభుత్వానికి ఉపయోగిస్తాయి.

న్యాయమూర్తుల నిర్ణయాలు, తీర్పులు, భవిష్యత్లో శాసన నిర్మాణానికి తోడ్పడతాయి. ఇంగ్లండ్లో కోక్, బ్లాక్టన్, అమెరికాలో స్టోరీ, కెంట్, భారతదేశంలో విజ్ఞానేశ్వర, అపరార్క వంటి వారి వ్యాఖ్యానాలు శాసన నిర్మాణానికి ఆధారాలు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 4.
సమన్యాయ పాలన అంటే ఏమిటి ? వివరించండి.
జవాబు.
సమన్యాయ పాలన: బ్రిటీష్ రాజ్యాంగ విశిష్ట లక్షణం సమన్యాయ పాలన. ఇది ముందుగా ఇంగ్లాండ్లో అవతరించింది. అనంతరం భారతదేశం, అమెరికా దేశాలలో దీనిని అమలుచేశారు. ‘చట్టం ముందు అందరూ సమానమే, చట్టం అందరినీ సమానంగా రక్షిస్తుంది’ అని తెలిపేదే సమన్యాయ పాలన.

రాజ్యంలో నివసించే ప్రతీ పౌరునికి శాసనాలు ఒకే విధంగా వర్తిస్తాయి. సమాజంలో వివిధ వర్గాలకు ప్రత్యేక శాసనాలు అంటూ ఉండవని తెలుపుతుంది. పరిపాలన వ్యవస్థ, గవర్నెన్స్ శాసనం ప్రకారమే కొనసాగుతుంది.

ప్రభుత్వ నిరంకుశ పాలనను అడ్డుకోవడం సమన్యాయ పాలన ప్రధాన లక్ష్యం. ఇది శాసన నిర్మాణశాఖచే నిర్మించి అధికార వ్యవస్థ ద్వారా అమలు చేయబడుతుంది. శాసన ఉల్లంఘన శిక్షార్హం కిందకు వస్తుంది. చట్టం ముందు అందరూ సమానమే అనేది అధికారులకు, సామాన్యులకు అన్ని వర్గాలకు వర్తిస్తుంది.

సమన్యాయ పాలన అనేది ఇంగ్లాండ్ రాజ్యాంగ విశిష్ట లక్షణంగా చెప్పుకున్నాం. ఇంగ్లాండ్లో అలిఖిత రాజ్యాంగం అమలులో ఉండడం వల్ల పౌరుల హక్కులకు రాజ్యాంగ పరంగా హామీ లేదు. పౌరుల హక్కుల రక్షణకు ఇంగ్లాండ్లో సాధారణ శాసనం రూపంలో సమన్యాయ పాలన అమలులో ఉంది. ఇది బ్రిటీష్ రాజ్యాంగ వ్యవస్థకు మౌలిక పునాదిగా ఉంది.

సమన్యాయ పాలనపై వివిధ పరిమితులు ఉండటం వల్ల అది అనేక విధాలుగా మార్పులకు గురయి సాంఘిక, ఆర్థిక రంగంలో మార్పులు చోటు చేసుకున్నాయి. శాసన నిర్మాణశాఖ విపరీత పని భారం దృష్ట్యా దీని పరిధిలో మార్పు చోటుచేసుకున్నది. స్థూలంగా “చట్టం ముందు అందరూ సమానమే. ఏ ఒక్కరూ కూడా నిరంకుశంగా శిక్షించరాదు” అనేది సమన్యాయ పాలన ప్రధాన సూత్రం. ఇదే ప్రజాస్వామ్య వ్యవస్థ ఆశయం.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 5.
స్వేచ్ఛను నిర్వచించి, ఏవైనా మూడు రకాల స్వేచ్ఛలను తెలపండి.
జవాబు.
పరిచయం :
స్వేచ్ఛ అనేది రాజనీతి శాస్త్ర అధ్యయనంలో ఒక ముఖ్యమైన భావన. వ్యక్తులకు గల స్వేచ్ఛపైనే రాజకీయ వ్యవస్థ విజయం ఆధారపడి ఉంటుంది. వ్యక్తులు తమ సర్వతోముఖాభివృద్ధి కోసం స్వేచ్ఛను వాంఛిస్తారు. సామాజిక స్థితిగతులను మెరుగుపరచుకోవడంలో వ్యక్తులకు స్వేచ్ఛ తగిన శక్తిని ప్రసాదిస్తుంది. జె. ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్, మాంటెస్క్యూ, హెచ్. జె. లాస్కీ, సీలీ లాంటి రాజనీతి శాస్త్రవేత్తలు స్వేచ్ఛను పెంపొందించటంలో ప్రధాన పాత్రను పోషించారు.

అర్థం : స్వేచ్ఛను ఇంగ్లీషులో ‘లిబర్టీ’ (LIBERTY) అంటారు. లిబర్టీ (LIBERTY) అనే ఇంగ్లీషు పదం “లిబర్” (LIBER) అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. లాటిన్ భాషలో “లిబర్” అనే పదానికి అర్థం “ఆంక్షల నుంచి విముక్తి”.

నిర్వచనాలు :

  1. హెచ్.జె.లాస్కీ : “వ్యక్తులు వారంతటవారు ఉత్తమమైన అవకాశాలను పొందగలిగి, నిర్వహించుకోగల వాతావరణమే స్వేచ్ఛ”.
  2. మాంటెస్క్యూ : “వ్యక్తులు సంకల్పించుకొని, సాధించగలిగే శక్తియే స్వేచ్ఛ”.
  3. జె.ఆర్. సీలీ : “మితిమీరిన ప్రభుత్వానికి వ్యతిరేకమైనదే స్వేచ్ఛ”.

1. సహజ స్వేచ్ఛ (Natural Liberty) :
సహజ స్వేచ్ఛ అనేది ఎటువంటి ఆంక్ష లేకుండా ఏదైనా చేయడాన్ని సూచిస్తుంది. ఇది ఎలాంటి జోక్యానికి లేదా నిర్భంధాలకు తావివ్వదు. వ్యక్తులు తమ ఇచ్ఛానుసారం చేయదలచినదాన్ని సుసాధ్యం చేస్తుంది. అయితే, నిర్నిబంధమైన స్వేచ్ఛ వ్యక్తుల స్వేచ్ఛలను హరిస్తుంది. నేటి సమాజంలో సహజ స్వేచ్ఛ అనేది కనిపించదు. ఇది అన్యాయం, అరాచకత్వాలకు పర్యాయపదమైనది. సహజ స్వేచ్ఛగల చోట స్వాతంత్య్రం మృగ్యమవుతుంది.

ఆదిలో రోమన్ రాజనీతి తత్త్వవేత్తలు ఈ భావనను సమర్థించారు. ఎటువంటి అవధుల్లేని ప్రాకృతిక వ్యవస్థలోని మానవులు అపరిమితమైన స్వేచ్ఛను అనుభవించారన్నారు. అటువంటి స్వేచ్ఛ – రాజ్యం, సమాజాల ఆవిర్భావానికి ముందు మాత్రమే ఉనికిలో ఉండేది.

2. పౌర స్వేచ్ఛ (Civil Liberty) :
పౌరస్వేచ్ఛను వ్యక్తిగత స్వేచ్ఛ అని కూడ అంటారు. ఇది సామాజిక సంస్థలోని సభ్యుడైన వ్యక్తి జీవనంలోని స్వాతంత్ర్యాన్ని తెలియజేస్తుంది. పౌరస్వేచ్ఛలో కింద పేర్కొన్న మూడు అంశాలు ఇమిడి ఉంటాయని బార్కర్ పేర్కొన్నాడు.

  1. సంచార స్వేచ్ఛను సూచించే భౌతిక స్వాతంత్ర్యం
  2. ఆలోచన, అభివ్యక్తి, విశ్వాసాన్ని కలిగి ఉండే భౌద్ధిక స్వాతంత్ర్యం
  3. నిజజీవితంలోని ఆచరణాత్మక ఐచ్ఛిక స్వాతంత్ర్యం.

పౌర స్వేచ్ఛ అనేది మిగతా స్వేచ్ఛలకు ప్రాతిపదికగా ఉంటుంది. సహజ స్వేచ్ఛకు ఇది విరుద్ధమైంది. సమాజంలోని పౌరులు దానిని అనుభవిస్తారు. ఒంటరిగా ఉంటున్న వ్యక్తులకిది ఆవశ్యకమైనది. సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రాపంచిక విషయాలను ఉమ్మడిగా అనుభవించగలిగినప్పుడే పౌర స్వేచ్ఛ వాస్తవమవుతుంది.

“రాజ్యం చేత గుర్తించబడి అమలయ్యే హక్కుల సముదాయమే పౌర స్వేచ్ఛ” అని గెటిల్ పేర్కొన్నాడు.

పౌర స్వేచ్ఛ అనేది అనేక హక్కుల రూపంలో ఉంటుంది. అవి –

  1. జీవించే హక్కు
  2. పనిచేసే హక్కు
  3.  ఆస్తి హక్కు
  4. వాక్ స్వాతంత్ర్యం, భావవ్యక్తీకరణ, సమావేశ, సంచార, స్థిరనివాసపు హక్కులు మొదలైనవి.

3. ఆర్థిక స్వేచ్ఛ (Economic Liberty) :
ఆర్థిక స్వేచ్ఛ అంటే ప్రతి ఒక్కరూ తమ జీవనోపాధిని తామే సంపాదించుకోగలగడం. ఒక వ్యక్తి తన రోజువారీ ఆహారాన్ని హేతుబద్ధంగా సంపాదించుకొనే భద్రమైన అవకాశమే ఆర్థిక స్వేచ్ఛగా లాస్కీ అభివర్ణించాడు. కోరిక – భయము, ఆకలి – పస్తులు, నిరుద్యోగం – అసంపూర్ణతల నుంచి – విముక్తి కలిగించేదే ఆర్థిక స్వేచ్ఛ. ఇది ఆర్థిక సంబంధమైన లేమి లేదా అభద్రతల నుంచి స్వాతంత్ర్యాన్ని సూచిస్తుంది. ఆర్థిక స్వేచ్ఛలేని ప్రజాస్వామ్యం అర్థరహితమైంది.

ఈ దిగువ పేర్కొన్న చర్యల అమలు ద్వారా ఆర్థిక స్వేచ్ఛను పొందవచ్చు.

  1. కనీస వేతనాలను అందించడం.
  2. పనిహక్కుకు భరోసా కల్పించడం.
  3. నిరుద్యోగం, అనారోగ్యం వంటి వివిధ రకాల అభద్రతల నుంచి కార్మికులను రక్షించడం.
  4. తగినంత విశ్రాంతిని కల్పించడం.
  5. పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు ప్రాతినిధ్యం కల్పించడం.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 6.
స్వేచ్ఛ భావన పరిణామాన్ని వివరించండి.
జవాబు.
ఆధునిక కాలంలో ప్రాధాన్యత పొందిన భావనలలో అతి ముఖ్యమైనది స్వేచ్ఛ. క్రీ.శ. 16, 17 శతాబ్దాలలో ఐరోపా ఖండంలో వచ్చిన పారిశ్రామిక విప్లవము మరియు ఆనాటి ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితుల ప్రభావం ఫలితంగా అభివృద్ధి చెందుతున్న పెట్టుబడిదారి విధానానికి అనుగుణంగా నూతన రాజకీయ సిద్ధాంతాలు, రాజకీయ సంస్థల భావనలు రూపొందాయి.

1688లో ఇంగ్లండ్లో జరిగిన రక్తరహిత విప్లవం, 1776లో అమెరికన్ విప్లవం, 1789 ఫ్రెంచి విప్లవాల ద్వారా ఈ భావనలు మరింత ప్రాబల్యాన్ని సంపాదించాయి. ఫ్రెంచి విప్లవంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం నినాదాలుగా వర్థిల్లాయి. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత వివిధ జాతులు తమ స్వేచ్ఛకై జాతీయోద్యమాలను కొనసాగించాయి.

రెండవ ప్రపంచ యుద్ధానంతరం నూతనంగా స్వతంత్రం పొందిన దేశాలలోని ప్రజలు నియంతృత్వాలకు వ్యతిరేకంగా స్వేచ్ఛకోసం ఉద్యమించటం జరుగుచూనే ఉన్నది. ఇటీవల కాలంలో నేపాల్, బర్మా మొదలైన దేశాలలో ప్రజలు స్వేచ్ఛకోసం అనేక ఉద్యమాలను నడిపారు.

పై అంశాలను పరిశీలిస్తే సమకాలీన మానవజాతి చరిత్రను స్వేచ్ఛకోసం మానవులు జరుపుతున్న పోరాటంగా వర్ణించవచ్చు. స్వేచ్ఛ కావాలనటం మానవుని సహజమైన వాంఛ. స్వేచ్ఛ యొక్క ప్రాముఖ్యాన్ని నొక్కి చెపుతూ రూసో స్వేచ్ఛాయుతంగా ఉండకపోవటం మానవుడుగా మనలేకపోవటమే అంటాడు.

ప్రశ్న 7.
స్వేచ్ఛకుగల ఏవైనా మూడు పరిరక్షణలను తెలపండి.
జవాబు.
1. ఆర్థిక సమానత్వం (Economic Equality) :
వ్యక్తుల స్వేచ్ఛా పరిరక్షణలో ఆర్థిక సమానత్వం కూడా ప్రధానమైంది. ఆకలి, పేదరికం, నిరుద్యోగం వంటి దుష్ప్రభావాల నుంచి బయటపడేందుకు వ్యక్తులకు చాలినన్ని అవకాశాలను కల్పించాలనే భావన ఇందులో ఇమిడి ఉంది. ఆర్థిక సమానత్వం నెలకొన్నప్పుడే స్వేచ్ఛ సాధ్యమవుతుంది. ఆర్థిక సమానత్వంలో ఆర్థిక న్యాయం అంతర్భాగంగా ఉంటుంది. దీనిని రాజ్యం ప్రసాదిస్తుంది.

2. అధికారాల వికేంద్రీకరణ (Decentralisation of Powers) :
అధికారాలు వికేంద్రీకరణ ద్వారా స్వేచ్ఛను మెరుగైన రీతిలో పరిరక్షించవచ్చు. ప్రభుత్వాధికారాల కేంద్రీకరణ నుంచి దేశానికి విముక్తి కలిగినప్పుడే వ్యక్తులు స్వేచ్ఛను అనుభవించగలరు. కేంద్రం రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాల మధ్య అధికారాలను కేటాయించినప్పుడు నిరంకుశత్వానికి, వ్యక్తి స్వేచ్ఛల హరింపునకు తావుండదు, లేనిచో రాజ్యాంగంలో పొందుపరచిన హక్కులను అనుభవించటమన్నది ప్రజలకు కష్టమవుతుంది.

3. పత్రికాస్వాతంత్ర్యం (Independent Press) :
ప్రజాస్వామ్యాన్ని కొందరు వ్యక్తి స్వేచ్ఛా పరిరక్షణ కవచంగా భావించారు. తమ పనితీరులో చాలినంత స్వతంత్ర ప్రతిపత్తిని పత్రికలు, ఇతర మాధ్యమాలు కలిగి ఉన్నప్పుడే వ్యక్తులు స్వేచ్ఛలను అనుభవించగలరు.

ప్రజాభిప్రాయాన్ని ఏర్పరచి, సంఘటితపరచి, వ్యక్తీకరించడంలో పత్రికలు ముఖ్యమైన వాహకంగా వ్యవహరిస్తాయి. అవి తమ నిష్పాక్షిక సంపాదకీయాలు, సత్య సమ్మతమైన వార్తలు, అభిప్రాయాల ద్వారా వ్యక్తి స్వేచ్ఛలను పరిరక్షించగలుగుతాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 8.
స్వేచ్ఛ లక్షణాలను వివరించండి.
జవాబు.
పరిచయం :
స్వేచ్ఛ అనేది రాజనీతి శాస్త్ర అధ్యయనంలో ఒక ముఖ్యమైన భావన. వ్యక్తులకు గల స్వేచ్ఛపైనే రాజకీయ వ్యవస్థ విజయం ఆధారపడి ఉంటుంది. వ్యక్తులు తమ సర్వతోముఖాభివృద్ధి కోసం స్వేచ్ఛను వాంఛిస్తారు. సామాజిక స్థితిగతులను మెరుగుపరచుకోవడంలో వ్యక్తులకు స్వేచ్ఛ తగిన శక్తిని ప్రసాదిస్తుంది. జె. ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్, మాంటెస్క్యూ, హెచ్. జె. లాస్కీ, సీలీ లాంటి రాజనీతి శాస్త్రవేత్తలు స్వేచ్ఛను పెంపొందించటంలో ప్రధాన పాత్రను పోషించారు.

అర్థం :
స్వేచ్ఛను ఇంగ్లీషులో ‘లిబర్టీ’ (LIBERTY) అంటారు. లిబర్టీ (LIBERTY) అనే ఇంగ్లీషు నం “లిబర్” (LIBER) అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. లాటిన్ భాషలో “లిబర్” అనే పదానికి అర్థం “ఆంక్షలనుంచి విముక్తి”.

నిర్వచనాలు :

  1. హెచ్.జె. లాస్కీ: “వ్యక్తులు వారంతటవారు ఉత్తమమైన అవకాశాలను పొందగలిగి, నిర్వహించుకోగల వాతావరణమే స్వేచ్ఛ”.
  2. మాంటెస్క్యూ : “వ్యక్తులు సంకల్పించుకొని, సాధించగలిగే శక్తియే స్వేచ్ఛ”.
  3. జె.ఆర్. సీలీ : “మితిమీరిన ప్రభుత్వానికి వ్యతిరేకమైనదే స్వేచ్ఛ”.

స్వేచ్ఛ లక్షణాలు (Characteristics of Liberty) :
స్వేచ్ఛ ముఖ్య లక్షణాలను కింద పేర్కొనడమైనది.

  1. స్వేచ్ఛ ఒక శక్తివంతమైన భావన. దాని వ్యాఖ్యానమనేది స్థలం, కాలం, ప్రాంతం, ప్రజల ఆకాంక్షలను బట్టి ఉంటుంది.
  2. రాజకీయంగా లోబరచుకోవడం, బానిసలుగా మార్చటాన్ని స్వేచ్ఛ ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తుంది.
  3. వ్యక్తుల ఆకాంక్షలను సదా వాస్తవం చేయడమే స్వేచ్ఛ లక్ష్యం అవుతుంది.
  4. నిర్హేతుకమైన ఆంక్షలకు బదులు నిరంతరం సానుకూల పరిస్థితులను కలిగి ఉండటమే స్వేచ్ఛ.
  5. ఇది హక్కుల ఫలం.
  6. మానవీయ వ్యక్తిత్వాల సాధనకు అత్యంత ఆవశ్యకమైంది.
  7. ప్రజాస్వామ్య రాజ్యాలలోనే ఇది కనిపిస్తుంది.
  8. హక్కుల రూపంలో ఇది సాకారమవుతుంది.
  9. స్వేచ్ఛ అంటే ఏ ఒక్కరు యధేచ్ఛగా వ్యవహరించడం కాదు. ఇది ఎన్నో పరిమితులతో కూడుకొని ఉంటుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 9.
పౌర స్వేచ్ఛ అంటే ఏమిటి ?
జవాబు.
పౌర స్వేచ్ఛ (Civil Liberty) :
పౌర స్వేచ్ఛను వ్యక్తిగత స్వేచ్ఛ అని కూడ అంటారు. ఇది సామాజిక సంస్థలోని సభ్యుడైన వ్యక్తి జీవనంలోని స్వాతంత్ర్యాన్ని తెలియజేస్తుంది. పౌర స్వేచ్ఛలో కింద పేర్కొన్న మూడు అంశాలు ఇమిడి ఉంటాయని బార్కర్ పేర్కొన్నాడు.

  1. సంచార స్వేచ్ఛను సూచించే భౌతిక స్వాతంత్య్రం
  2. ఆలోచన, అభివ్యక్తి, విశ్వాసాన్ని కలిగి ఉండే భౌద్ధిక స్వాతంత్ర్యం
  3. నిజజీవితంలోని ఆచరణాత్మక ఐచ్ఛిక స్వాతంత్ర్యం. పౌర స్వేచ్ఛ అనేది మిగతా స్వేచ్ఛలకు ప్రాతిపదికగా ఉంటుంది.

సహజస్వేచ్ఛకు ఇది విరుద్ధమైంది. సమాజంలోని పౌరులు దానిని అనుభవిస్తారు. ఒంటరిగా ఉంటున్న వ్యక్తులకిది ఆవశ్యకమైనది సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రాపంచిక విషయాలను ఉమ్మడిగా అనుభవించగలిగినప్పుడే పౌర స్వేచ్ఛ వాస్తవమవుతుంది.

“రాజ్యం చేత గుర్తించబడి అమలయ్యే హక్కుల సముదాయమే పౌర స్వేచ్ఛ” అని గెటిల్ పేర్కొన్నాడు. పౌరస్వేచ్ఛ అనేది అనేక హక్కుల రూపంలో ఉంటుంది. అవి

  1. జీవించే హక్కు
  2. పనిచేసే హక్కు
  3. ఆస్తి హక్కు
  4. వాక్ స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణ, సమావేశ, సంచార, స్థిర నివాసపు హక్కులు మొదలైనవి.

ప్రశ్న 10.
స్వేచ్ఛ మరియు సమానత్వాలు పరస్పర పోషకాలు వివరించండి.
జవాబు.
వ్యక్తులకు గల స్వేచ్ఛ – సమానత్వాలపైనే రాజకీయ వ్యవస్థ విజయం ఆధారపడి ఉంటుంది. రాజనీతి శాస్త్ర అధ్యయనంలో ఈ రెండు అంశాలు విశేషమైన ప్రాముఖ్యతను సంతరించుకొన్నాయి. వ్యక్తులు తమ సర్వ సమగ్రమైన అభివృద్ధి కోసం స్వేచ్ఛ, సమానత్వాలను వాంఛిస్తారు.

స్వేచ్ఛ, సమానత్వం మధ్య సంబంధం (Relationship between Liberty and Equality) :
స్వేచ్ఛ – సమానత్వం మధ్యగల సంబంధం గురించి రాజనీతి తత్త్వవేత్తలు రెండు భిన్న అభిప్రాయాలను వెల్లడించారు.

ఆ రెండింటి భావనలు రాజనీతి శాస్త్రం అధ్యయనంలో ముఖ్యమైనవిగా వారు అంగీకరించారు. అయితే కొందరు ఆ రెండింటి మధ్య సంబంధం ఉందని పేర్కొనగా, మరికొందరు అవి ఒకదానికొకటి వ్యతిరేకమైనవిగా పరిగణించారు.

స్వేచ్ఛ, సమానత్వం పరస్పర సంబంధం కలిగి ఉంటాయనే భావనను రాజనీతి తత్త్వవేత్తలైన రూసో, టానీ, లాస్కీ, జి.డి.హెచ్. కోల్ వంటివారు ప్రతిపాదించారు. ఇక స్వేచ్ఛ, సమానత్వం అనేది పరస్పర వ్యతిరేకమైన భావనలని పేర్కొన్న వారిలో లార్డ్ మాధ్యూ, ఆర్నార్డ్, లార్డ్ ఆక్టన్, డి టాక్విల్లీ వంటి రాజనీతి తత్వవేత్తలు ఉన్నారు. పైన పేర్కొన్న రెండు వాదనల గురించి కింది విధంగా తెలపడమైంది.

1. స్వేచ్ఛ, సమానత్వం పరస్పర పోషకాలు :

  1. వ్యక్తి శ్రేయోవాదులు, అరాచకవాదులు, కమ్యూనిస్టుల దృష్టిలో స్వేచ్ఛ, సమానత్వం పరస్పర పోషకాలు.
  2. సమానత్వం లేని స్వేచ్ఛ అర్థరహితం, ‘సమానత్వం’ నెలకొల్పబడిన తరువాతే స్వేచ్ఛను గురించి ఆలోచించాలని కమ్యూనిస్టులు భావిస్తారు.
  3. సక్రమమైన, ఆదర్శమైన రాజ్యం స్థాపించబడాలంటే తప్పనిసరిగా సమానత్వ ప్రాతిపదికగా ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించాలి. ఈ రెండు విస్తృత పరిధిలో చూడబడాలి.
  4. స్వేచ్ఛ, సమానత్వం – ఈ రెండింటిలో దేన్నీ త్యాగం చేయడానికి ప్రయత్నించరాదు. సమానత్వం, స్వేచ్ఛ లోపించినట్లయితే అరాచకత్వం ప్రబలుతుంది. కావున ప్రభుత్వం శాసనాల ద్వారా ప్రజలందరికి ఎటువంటి జాతి, మత, కుల, వర్గ, వర్ణ, లింగ భేదము లేకుండా సమానంగా ‘స్వేచ్ఛను’ ప్రసాదించాలి.
  5. రాజకీయ స్వేచ్ఛ ద్వారా భావ ప్రకటనా స్వాతంత్ర్యం, ఓటుహక్కు, అర్హత ప్రాతిపదికగా పదవులకు పోటీచేసే హక్కు లభిస్తాయి. సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమానత్వాలను ప్రజలందరూ కలిగి ఉండాలంటే వారందరూ స్వేచ్ఛను పొంది ఉండాలి. అందువలనే స్వేచ్ఛ లేకుండా సమానత్వం, సమానత్వం లేకుండా స్వేచ్ఛ ఉండవు.
  6. ఏ రాజ్యంలో ప్రజలు ఆర్థిక, సాంఘిక, రాజకీయ రంగాలలో స్వేచ్ఛ, సమానత్వాలను సమానంగా పొంది ఉంటారో ఆ రాజ్యం బహుముఖంగా త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని పరిశీలకులు భావిస్తారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

2. స్వేచ్ఛ-సమానత్వాలు పరస్పర విరుద్దాలు :
స్వేచ్ఛ, సమానత్వం పరస్పర శత్రువులు అని పేర్కొన్న వారిలో లార్డ్ ఆక్టన్ ముఖ్యుడు. రాజ్యముగాని, వ్యక్తులుగాని సమానత్వానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తే స్వేచ్చ మరుగున పడిపోతుంది అని ఆక్టన్ మహాశయుడు వాదిస్తాడు. ‘మితిమీరని ప్రభుత్వ పరిపాలననే స్వేచ్ఛ’ అని సీలీ మహాశయుడు పేర్కొన్నాడు. ప్రభుత్వ అధికారాలు మితిమీరడమంటే ప్రజలు తమ స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను కోల్పోవటమేనని వీరు భావిస్తారు.

ప్రజల వ్యక్తిగత వ్యవహారాలలో, కార్యకలాపాలలో ప్రభుత్వము జోక్యం కల్పించుకోరాదు అని ఆక్టన్ అభిప్రాయం. ప్రజలందరికి ఆర్థిక స్వేచ్ఛను ప్రసాదించినట్లయితే శక్తిసామర్థ్యాలు, తెలివితేటలు, విద్యా పరిజ్ఞానం కలిగినవారు అపారమైన సంపదను కూడబెడితే, అమాయకులు, నిరక్షరాస్యులు, సోమరిపోతులు తమతమ కనీస అవసరాలను కూడా సమకూర్చుకోలేరు. ఇది సమాజములో ఆర్థిక అసమానత్వానికి, వర్గతత్వానికి దారితీస్తుంది. కావున స్వేచ్ఛ- సమానత్వం పరస్పరం శత్రు సంబంధాన్ని కలిగి ఉంటాయి.

“ఎక్కడ స్వేచ్ఛ ఉంటుందో, అక్కడ సమానత్వం ఉండదు. ఎక్కడ సమానత్వం ఉంటుందో, అక్కడ స్వేచ్ఛ ఉండదు. స్వేచ్ఛ-సమానత్వం రెండు కత్తుల వంటివి. అవి ఒక ఒరలో ఇమడవు” అని ‘లార్డ్ ఆక్టన్’, ‘డి టాక్వెల్లీ’, ‘సీలీ’ మొదలగు రాజనీతిజ్ఞులు వాదిస్తారు.

పైన పేర్కొన్న రెండు రకాల వాదనలు పూర్తిగా నిజమైనవికావు. వాస్తవ అంశం ఆ రెండింటికీ మధ్య ఉంటుంది. స్వేచ్ఛ, సమానత్వాలు రెండూ ఒకదానికొకటి పరస్పర పోషక, పరస్పర వ్యతిరేక స్వభావాన్ని కలిగి ఉండవు. ఈ సందర్భంలో ఆ రెండు భావనల మధ్య ఉండే వాస్తవిక సంబంధాన్ని క్రింది విధంగా వివరించడమైంది.

సమానత్వానికి స్వేచ్ఛ అవసరం (Liberty is essential for Equality) :

  1. స్వేచ్ఛ అంటే నిరపేక్షమైనదికాదు. దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. కొన్ని నిబంధనలకు లోబడి సామాజిక సంక్షేమాన్ని సాధించేందుకై ఈ స్వేచ్ఛ అందరికీ అందుబాటులో ఉంటుంది.
  2. స్వేచ్ఛ అంటే ఏ ఒక్కవ్యక్తి లేదా వ్యక్తుల సముదాయపు గుత్తాధికారంగా భావించరాదు.
  3. ఒకానొక వ్యక్తి స్వేచ్ఛను అనుభవించడమనేది ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించేదిగా ఉండకూడదనే ఈ సూత్రాన్ని ఆమోదించారు. సమానత్వ సూత్రాన్ని గౌరవించవలసి ఉంటుంది.

దాని అర్థం స్వేచ్ఛా ఫలాలు సమానత్వమనే వృక్షానికి చెందిన శాఖలలో ఉంటాయని పేర్కొనవచ్చు. కాబట్టి స్వేచ్ఛ, సమానత్వాలు ఒకదానికొకటి పరస్పర పోషకాలుగా భావించడమైంది. సమానత్వ సూత్రం ఆధారంగా స్వేచ్ఛను వర్తింపజేస్తే, స్వేచ్ఛాలక్ష్యం వాస్తవానికి నెరవేరినట్లవుతుంది.

స్వేచ్ఛకు సమానత్వం అవసరం (Equality is essential for Liberty) :
సమానత్వం అంటే ఒకే విధమైన ఆదరణ అని అర్థం కాదు. ఎందుకంటే అటువంటి సమానత్వం పౌర సమాజంలో సాధ్యంకాదు. అందుకు బదులుగా ఒకేరకమైన పరిస్థితులలో సమానమైన ఆదరణయే సమానత్వంగా పేర్కొనవచ్చు.

పౌర సమాజంలో కొందరు ఇతరులతో సమానమైన హోదాను కలిగి ఉండరు. అయితే వారికి తమ వ్యక్తిత్వం, హోదాలను పెంపొందించుకొనేందుకై కొన్ని పరిస్థితులు, అవకాశాలను కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలందరూ సమానంగా ఉన్నప్పుడు స్వేచ్ఛా, ఫలాలను వారందరూ అనుభవిస్తారని చెప్పవచ్చు.

పైన పేర్కొన్న విధంగా స్వేచ్ఛ, సమానత్వం ఒకదానికొకటి పరస్పర పోషకాలుగా ఉంటాయి. ఆ రెండు భావనలు ఒకే ఉమ్మడి లక్ష్యాన్ని కలిగి ఉంటాయి. సమానత్వాన్ని విస్మరించినందునే స్వేచ్ఛ అనే అరాచకం, నియంతృత్వాలకు దారితీస్తుంది. అట్లాగే స్వేచ్ఛను పట్టించుకోకుండా, సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తే, బానిసత్వం ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి వ్యక్తి, సమాజాల ఔన్నత్యానికి ఆ రెండు భావనలు ఆవశ్యకమైనవిగా పేర్కొనవచ్చు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 11.
సమానత్వానికి సంబంధించి ఏవైనా మూడు లక్షణాలను తెలపండి.
జవాబు.
1. సమానత్వం హక్కులను సాధించడం :
సమానత్వం అనేది సూచనాత్మకమైనదే కాని వివరణాత్మకమైనది కాదు. మానవులంతా తప్పకుండా సమానులే అని మానం భావిస్తాం. కాని అది వాస్తవం కాదు. సమాజంలో సాంఘిక ప్రయోజనాలను విస్తృతం చేసి వాటి ఫలాలను పేద వారికి అందించడం.

2. సమానత్వం ఆధునిక భావన :
మానవ జీవిత చరిత్రలో సంపదలో వ్యత్యాసాలు, అధికారంలో వ్యత్యాసాలు, గౌరవ ప్రతిష్ఠలలో వ్యత్యాసాలు అనేవి దాదాపు ప్రపంచమంతా కనిపిస్తాయి. శాస్త్రీయ యుగ ఆరంభంలో మానవుడు తన హేతుబద్ధమైన అనుభవపూర్వక జ్ఞానంతో ప్రకృతి వైపరీత్యాన్ని నియంత్రించడం నేర్చుకున్నాడు. ఈ పరిజ్ఞానం, ఆలోచన సమాజంలో ఉన్న సాంఘిక అసమానతలు సహజం కాదని, అసమానతలు తొలగించవచ్చనే ఆలోచనకు దారి తీసింది.

3. సామాజిక మార్పుకు సమానత్వం :
శాస్త్ర సాంకేతిక రంగాలలో సాధించిన ప్రగతి ఎక్కువ ప్రాంతాలలో సహజ అసమానత్వాన్ని ప్రత్యామ్నాయంగా పెంచిపోషించింది. ఆరోగ్యం, శారీరక పటిష్టత అనేది సరైన పౌష్టికాహారం వల్ల, మానసిక పరిపక్వత అనేది సరైన విద్య, రక్షణ ద్వారా సాధించవచ్చని మనకు తెలుసు. కాని ఈ ప్రయోజనాల లభ్యత అనేది వ్యక్తుల వ్యక్తిగత సాంఘిక, ఆర్థిక స్థితిగతుల మీద ఆధారపడి ఉంది.

ప్రశ్న 12.
సమానత్వానికి సంబంధించి ఏవైనా మూడు రకాలను తెలపండి.
జవాబు.
సమానత్వం ఆధునికకాలంలో ఒక ప్రధాన ఆశయం. అది ప్రజాస్వామ్య ఆదర్శం. మానవులంతా పుట్టుకతో సమానులని కొందరు నమ్మారు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ వ్యవహారాలలో ప్రజలందరికి జాతి, మత, కుల, లింగ, భాషా, ప్రాంతీయ, వర్ణ, వర్గ భేదాలు లేకుండా సమానావకాశాలుండటమే సమానత్వము. సమానత్వం అంటే

  1. ఏ అడ్డంకులూ లేకుండా ప్రతి వ్యక్తీ వికాసం పొందడం
  2. శాసనాలు, పాలనలలో వ్యక్తుల మధ్య భేదం లేకుండా చేయడం
  3. చట్టం ప్రకారం లభించే హక్కులు సమానంగా లభించడం.

నిర్వచనం :
“సమానత్వం అంటే సమాజంలో కొందరికి మాత్రమే ప్రత్యేకమైన హక్కులు, అవకాశాలు కాకుండా అందరికీ సమానావకాశాలు ఉండటమే” అని లాస్కీ నిర్వచించాడు. పుట్టుక, కులం, మతం, ఆస్తి వంటి అర్హతలనుబట్టి వ్యక్తులకు అవకాశాలు కలుగజేస్తే సమానత్వం లభించదు. అందరికీ సమాన ఆదరణ ఉండటమే సమానత్వానికి అవసరం. సమానత్వ సిద్ధాంతం ప్రకారం చట్టం ముందు అంతా సమానులే. ఆధునిక రాజ్యం ప్రజలందరికీ సాంఘిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో సమానావకాశాలు కల్పించాలి.

1. సహజ సమానత్వం (Natural Equality) :
సహజ సమానత్వం అంటే అన్ని రకాల అవరోధాలు, సాంఘిక కట్టుబాట్ల నుంచి స్వాతంత్ర్యాన్ని పొందడం. దీని అర్థం వ్యక్తి పరిధిలో ఎటువంటి ఆంక్షలు ఉండకపోవడం. సహజ సమానత్వం గురించి థామస్ హాబ్స్ ప్రతిపాదించిన సామాజిక ఒడంబడిక సిద్ధాంతంలో పేర్కొనడమైంది.

పౌర సమాజం ఆవిర్భవించక ముందే ప్రజలు ప్రాకృతిక వ్యవస్థలో జీవించారని ఈ సిద్ధాంతం పేర్కొన్నది. అసమానతలు, బంధనాలకు నాగరికత దారితీసిందని హాబ్స్ ఉద్ఘాటించాడు. గ్రీకు రోమన్ రాజకీయ తత్త్వవేత్తల రచనలలో ఈ భావం కనపడుతుంది.

2. సాంఘిక సమానత్వం (Social Equality) : వర్గ వ్యత్యాసాలు లేకపోవడం, సమానమైన హోదాలు కలిగి ఉండటాన్ని సాంఘిక సమానత్వం సూచిస్తుంది. ఏ వ్యక్తి మతం, వర్గం, వర్ణ, లింగం, పుట్టుక వంటి అంశాల ఆధారంగా వివక్షతకు గురికాకుండా ఉంటే సాంఘిక సమానత్వం నెలకొంటుంది.

ఉదాహరణకు భారతరాజ్యాంగం కుల, వర్గపరమైన వ్యత్యాసాలను నిషేధించింది. వాస్తవానికి అస్పృశ్యతను అది వ్యతిరేకించింది. పౌరులందరూ సాంఘిక సమానత్వాన్ని అనుభవించినప్పుడు, ఏ ఒక్కరు ఇతరులతో పోల్చినచో కులం, వర్గం, వర్ణం, పుట్టుక, తెగ, జన్మస్థలం వంటి అంశాలపై ఏ విధమైన వివక్షతకు గురికారు. ఈ సందర్భంలో క్రింద పేర్కొన్న అంశాలు సాంఘిక సమానత్వ సాధన, కొనసాగింపులకు సహాయపడతాయని చెప్పవచ్చు.

  1. రాజ్యం ఏ ఒక్క పౌరుడికి ప్రత్యేక సౌకర్యాలను అనుమతించరాదు.
  2. విద్య, ఉపాధి, పరిపాలన, శాసన నిర్మాణం వంటి రంగాలలో ప్రభుత్వం ఒకే విధానాన్ని పాటించి, అమలు చేయాలి.
  3. సాంఘిక, మతపరమైన వ్యవహారాలలో ప్రజలు సహనం, త్యాగం, నిజాయితీ వంటి లక్షణాలతో కూడిన విశాల దృక్పథాన్ని కలిగి ఉండాలి.
  4. రాజ్యంలోని పౌరులు తోటి పౌరులతో సహృద్భావ సంబంధాలను ఏర్పరచుకొని కొనసాగించుకోవాలి.
  5. తమ విజ్ఞాపనలను పంపించేటప్పుడు కులం, తెగ, లేక మతం వంటి వాటిని సూచించే పేర్లను ప్రజలు ఉపయోగించరాదు.
  6. కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి.

3. ఆర్థిక సమానత్వం (Economic Equality) :
ఆర్థిక సమానత్వాన్ని సాంఘిక, రాజకీయ సమానత్వాలకు పునాదిగా పరిగణించడమైంది. ఆధునిక రాజ్యకార్యకలాపాల వెనుక అదొక ముఖ్యమైన చోదకశక్తిగా పనిచేస్తుంది. ఆర్థిక సమానత్వమంటే ఆదాయం, ఆస్తి, సంపదలలో విపరీతమైన వ్యత్యాసాలు లేకుండా చేయడంగా పేర్కొనవచ్చు. ఎర్నెస్ట్ బార్కర్ దృష్టిలో ఆర్థిక సమానత్వం అనేది హోదాకు, పాక్షికంగా ఆస్తి – ఆదాయాలకు సంబంధించిన అంశం.

ఆర్థిక సమానత్వాన్ని “సంపదకు చెందిన వ్యత్యాసాలను తొలగించి ప్రయత్నంగా, ప్రాపంచిక వస్తువులను స్త్రీ, పురుషల మధ్య సమానంగా పంపిణీ చేయాల్సిన ప్రయత్నం”గా లార్డ్స్ భావించాడు. ప్రొఫెసర్ లాస్కీ “పారిశ్రామిక ప్రపంచంలో విశృంఖలమైన, బాధ్యతారహిత ఇచ్చను నిషేధించడాన్ని ఆర్థిక సమానత్వం”గా భావించాడు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 13.
సమానత్వం మూలం మరియు ప్రాధాన్యతను తెలపండి.
జవాబు.
‘సమానత్వం’ అనే పదం సాధారణంగా మానవులందరూ సమానులే కాబట్టి అందరికీ ఒకే విధమైన ఆదరణ, గుర్తింపు, సంపద ఉండాలనే అర్థాన్ని స్ఫురింపజేస్తుంది. ప్రతీ మానవునికి సహజ సిద్ధంగానే సమానత్వ వాంఛ ఉంటుంది.

అయితే సమానత్వం అనే పదానికి శాస్త్రీయమైన అర్థాన్ని 1789లో ఫ్రాన్స్ దేశపు జాతీయసభ ఆమోదించిన మానవ హక్కుల ప్రకటనలో వివరించటం జరిగింది. మానవులందరూ స్వేచ్ఛ సమానత్వలతో జన్మించి వాటితోనే జీవితాంతం కొనసాగుతారు అని ప్రకటించబడింది.

“ప్రజలందరూ సృష్టిరీత్యా సమానులే అనే సత్యాన్ని మేము స్పష్టపరచిన దానిగా భావిస్తాం అని ‘1776లో వెలువడిన అమెరికా స్వాతంత్ర్య ప్రకటనలో కూడా అనే భావం స్ఫురించే విధంగా వివరించారు. అంటే సమానత్వం మానవునికి ప్రకృతి ప్రసాదించిన వరం.

దాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదన్న మాట. ఆ పంధాలోనే “స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే నినాదత్రయం ఫ్రెంచ్’ విప్లవాన్ని ఎంతగానో ఉత్తేజితపరచింది. 1917లో రష్యన్ భూమిపై ప్రజ్వరిల్లిన కమ్యూనిస్ట్ విప్లవం ఆర్థిక సమానత్వాన్ని సాధించి ఉద్భవించింది.

సమానత్వం ప్రాధాన్యత :

  1. వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తుంది : వ్యక్తి వికాసానికి సమానత్వం అవసరం. మానవుని అభివృద్ధికి కావలసిన పరిస్థితులను సమానత్వం ఉన్న చోట పొందవచ్చు.
  2. ప్రతిభను గుర్తిస్తుంది : సమానత్వం ఉన్న చోట అన్ని వర్గాల ప్రజలు సమానావకాశాలు పొందుతారు. పేదరికం, వెనుకబాటుతనం వంటివి ప్రతిభను నిరూపించుకోవడానికి ఆటంకాలు కావు.
  3. స్వేచ్ఛను పెంపొందిస్తుంది : స్వేచ్ఛ, సమానత్వాలు పరస్పర పోషకాలు సమానత్వం స్వేచ్ఛను పెంపొందిస్తుంది.
  4. ప్రజాస్వామ్య విజయము : సమానత్వం ప్రజారాజ్య ఆదర్శం అదిలేనిదే ప్రజాస్వామ్యం విజయవంతం కాదు. ఆర్థిక, రాజకీయ, సాంఘిక సమానత్వాలు పౌరులకు లభించాలి.
  5. ప్రతిష్ట పెంచుతుంది : వ్యక్తులంతా సమాన హోదా కలిగి, సాంఘికముగా ప్రతిష్ట పొందుతారు. రాజకీయ సమానత్వం వెనుకబడిన వర్గాల స్థాయిని పెంచింది. ”
  6. సాంఘిక న్యాయం : సమానత్వం సాంఘిక న్యాయాన్నిస్తుంది. అంటరానితనం, వెట్టిచాకిరి వంటి సాంఘిక దురాచారాలు రూపుమాపుతుంది.

ప్రశ్న 14.
న్యాయానికి సంబంధించి ఏవైనా మూడు రకాలను తెలపండి.
జవాబు.
న్యాయం రకాలు (Types of Justice) :
న్యాయం అనేక రకాలుగా ఉంటుంది. ఇది సహజవాబు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, చట్టబద్ధమైన పార్శాలకు సంబంధించినది. న్యాయభావనలోని వివిధ రకాలను కింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.

1. సహజ న్యాయం (Natural Justice) :
ప్రపంచంలో లభించే సహజ వనరులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవచ్చుననే సూత్రం ఆధారంగా ప్రతిపాదించబడినదే సహజ న్యాయం. భూమిపై నివసించే ప్రతి ఒక్కరికీ సహజ వనరులు జీవన ఆధారంగా ఉంటాయి. మానవులు ఒక్కరే హేతుబద్ధమైన జీవనం గడపటం వల్ల, సహజ వనరులను న్యాయబద్ధంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఈ సందర్భంలో మానవులు భవిష్యతరాల అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి.

2. సామాజిక న్యాయం (Social Justice) :
సామాజిక న్యాయం అనేది వ్యక్తుల హక్కులు, సమాజం నియంత్రణల మధ్య చక్కని సమతౌల్యాన్ని నెలకొల్పేందుకు ఉద్దేశించింది. వర్తమాన చట్టాలకు లోబడి వ్యక్తుల న్యాయబద్ధమైన ఆకాంక్షలను నెరవేర్చుకొనేందుకు ఈ రకమైన న్యాయం వీలు కల్పిస్తుంది.

చట్టం దృష్టిలో అందరూ సమానులే అనే సూత్రాన్ని సామాజిక న్యాయం నమ్ముతుంది, సామాజిక అనర్థాలైన పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం, ఆకలి వంటి వాటిని అధిగమించేందుకు ‘సామాజిక న్యాయం హామీ ఇస్తుంది. సమాజంలోని నిమ్నవర్గాలు, బడుగు, బలహీన వర్గాలకు రక్షణ కల్పిస్తుంది. అంతిమంగా వ్యక్తుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తుంది.

3. రాజకీయ న్యాయం (Political Justice) :
రాజకీయ న్యాయం అనేది రాజకీయ సమానత్వాన్ని సూచిస్తుంది. రాజ్యంలోని వయోజనులైన పౌరులకు రాజకీయ హక్కులను ఈ రకమైన న్యాయం ప్రతిపాదిస్తుంది. దేశ పాలనలో పౌరులు స్వేచ్ఛగానూ, నిర్భయంగానూ పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది.

ఎన్నికల సమయంలో రాజకీయ న్యాయ భావన విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకొంటుంది. రోజువారి పాలనలో పౌరులు చురుకుగా పాల్గొనేందుకు రాజకీయ న్యాయం సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది.

ప్రతి ఒక్కరూ ఇతరులతో పాటుగా సమానులేనని, ఏ ఒక్కరూ ఇతరుల కంటే ఏ విషయంలోనూ అధికులు కారనీ, ఎటువంటి ప్రత్యేకతలు కలిగి ఉండరనే సూత్రంపై ఈ`భావన రూపొందింది. రాజ్యంలో రాజకీయ న్యాయం ఉండాలంటే కింద పేర్కొన్న పరిస్థితులు నెలకొనాలి.

  1. సమన్యాయ పాలన
  2. స్వతంత్ర న్యాయశాఖ
  3. ప్రాతినిధ్య సంస్థలకు ఎన్నికలు
  4. రాజకీయ పార్టీలు
  5. పత్రికా స్వాతంత్య్రం
  6. ప్రజాస్వామ్య పాలన మొదలైనవి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 15.
న్యాయానికి సంబంధించి ఏవైనా రెండు భావనలను వివరించండి.
జవాబు.
1. గ్రీకులు, స్లోయిక్లు, రోమన్ల న్యాయ సిద్ధాంతం :
న్యాయ భావనను తొలిసారిగా చర్చించిన వారు గ్రీకులు కాగా, దానికి పునాదులు వేసిన వ్యక్తి ప్లేటో, ప్లేటో న్యాయ సిద్ధాంతంలో సుగుణం ప్రధానమైంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఎవరి పనులు వారే నిర్వహించుకోవడమే సుగుణం. అరిస్టాటిల్ ప్రకారం న్యాయం సంపూర్ణంగా సుగుణవంతమైంది.

స్లోయిక్ల ప్రకారం న్యాయం హేతువు ద్వారా కనుగొనబడింది. అదే విధంగా ఇది రాజ్యంచే రూపొందించబడిన సంవర్ధక శాసనం కంటే ఉన్నతమైంది. రోమన్ల ప్రకారం న్యాయం అనే భావన శాసనానికి సన్నిహితంగా ఉంటుంది.

2. ఆధునిక న్యాయ సిద్ధాంతం:
సంస్కరణోద్యమం, సాంస్కృతిక పునరుజ్జీవనం, పారిశ్రామిక విప్లవం అనంతరం ఇది అవతరించింది. హాబ్స్, లాక్, రూసోల సామాజిక ఒడంబడిక సిద్ధాంతంతో ఆధునిక న్యాయ సిద్ధాంతం అవతరించింది. నిరపేక్ష సార్వభౌమాధికారాన్ని రాజ్యానికి ఇవ్వడమే న్యాయం అని హాబ్స్ పేర్కొన్నాడు. లాక్ సహజ హక్కులలో న్యాయాన్ని గుర్తించగా, రూసో చెప్పిన “జనేచ్ఛ” న్యాయంతో కూడుకున్నదిగా చెప్పాడు.

3. సమకాలీన న్యాయ సిద్ధాంతాలు :
ఈ సిద్ధాంతాలు ప్రధానంగా స్థిరమైన న్యాయం (Substantial Justice), ప్రక్రియాత్మకమైన న్యాయం (Procedural Justice) ల మధ్యగల వ్యత్యాసాలపై దృష్టి పెడుతుంది. మార్కెట్ ఆర్థిక వ్యవస్థ నియమ, నిబంధనలు మానవుని ప్రవర్తనను నిర్దేశించటానికీ నమూనా నిబంధనలుగా ఉంటాయని ప్రక్రియాత్మకమైన న్యాయం పరిగణిస్తుంది.

అన్ని రకాల వివక్షతలను వ్యతిరేకిస్తూ, మానవుని మధ్య నైతికతను, సమాన గౌరవాన్ని ప్రక్రియాత్మకమైన న్యాయం అనుమతిస్తుంది. F. A.. హాయక్, మిల్టన్ ఫ్రీడ్ మన్, నాజిక్ వంటి వారు దీన్ని ప్రతిపాదించిన వారిలో ప్రముఖులు.

స్థిరమైన న్యాయ భావన అనేది సామాన్యవాదం ఆలోచనల నుంచి అవతరించింది. సమాజంలోని పేదలు, అణగారిన వర్గాల జీవన ప్రమాణాల పెంపుదలకు తగిన అవకాశాలు పొందేందుకు స్థిరమైన న్యాయం తోడ్పడుతుంది. ఇందులో వనరుల పంపిణీ అనేది ప్రధాన అంశం కాగా ప్రక్రియ అనేది ద్వితీయమైంది.

ప్రశ్న 16.
భారత రాజ్యాంగం మరియు సామాజిక న్యాయం.
జవాబు.
సామాజిక న్యాయం (Social Justice) :
సామాజిక న్యాయం అనే భావన సామాజిక భద్రతను కాంక్షిస్తుంది. అన్ని రకాల వివక్షతలను తొలగించాలని కోరుకుంటుంది. అదే విధంగా కులం, మతం, వర్ణ, లింగం, జాతి, పుట్టుక వంటి అంశాల ప్రాతిపదికన కొన్ని వర్గాలకు కల్పించే ప్రత్యేక హక్కులను నిషేధిస్తుంది.

అదేవిధంగా సామాజిక ప్రక్రియలో కొద్దిమంది ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ అత్యధిక జనాభాకు అన్ని అవకాశాలను పొందటానికి అనుకూల వాతావరణాన్ని కల్పించడం కూడా సామాజిక న్యాయంలో అంతర్భాగం. సమాజంలో గల పేదరికం, నిరుద్యోగం, ఆకలి చావులు వంటి అంశాలను తొలగిస్తూ, అణగారిన వర్గాల శ్రేయస్సుకు తోడ్పడుతుంది.

ప్రతి వ్యక్తి గౌరవ ప్రదంగా జీవించి విద్యా, సాంస్కృతిక రంగాల్లో ఉన్నతంగా ఉండాలి. అన్ని స్థాయిల్లో సాంఘిక వివక్షతను తొలగిస్తుంది. సామాజిక న్యాయ భావన ద్వారా మూడు రకాల న్యాయాలను అర్థం చేసుకోవచ్చు అవి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం. నీటిలో ఆర్థిక న్యాయం అత్యంత ప్రధానమైంది. ఎందుకంటే ఆర్థిక అసమానతలు అన్యాయానికి దారి తీసి శాసన, రాజకీయ న్యాయాలను హరించి వేస్తుంది.

భారత రాజ్యాంగం 1950 నుంచి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ ప్రవేశికలో మరియు 4వ భాగంలో పేర్కొన్న ఆదేశిక సూత్రాల్లో న్యాయ భావనను పొందుపరిచారు. అవి సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయాలు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 17.
శక్తి అంటే ఏమిటి ? దాని ప్రాముఖ్యతను తెలపండి.
జవాబు.
శక్తి – స్వభావం – ఆవశ్యకత:
అర్థశాస్త్రంలో ద్రవ్యానికి ఎంత ప్రాముఖ్యత ఉందో రాజనీతి శాస్త్రంలో శక్తికీ అంతే ప్రాధాన్యత ఉంది. రాజనీతి శాస్త్రంలో శక్తి అనే భావన ప్రధానాంశం కావటంతో ఇది స్వతంత్ర హెూదాను పొందింది. ఇది తత్వశాస్త్రం, చరిత్ర, నీతిశాస్త్రం, న్యాయశాస్త్రాల సరసన చేరి ఒక ప్రముఖ అధ్యయన శాస్త్రంగా గుర్తించబడింది.

రాజకీయాలలో శక్తి భావన విశేషతను సంతరించుకొని దాని దృష్టి శక్తిని పొందటం, నిర్వహించడం, కోల్పోవటం వంటి వాటిపై పెట్టింది. “శక్తిని పొందటం మరియు పంచటం గురించి అధ్యయనం చేయటమే రాజనీతి |శాస్త్రమని” హెరాల్డ్ లాస్పెల్, ఎ. కాప్లాన్లు నిర్వచించారు.

ఆధునిక రాజనీతి శాస్త్రం అభివృద్ధి చెందుతున్న దశలో రాజనీతి శాస్త్రం కేవలం రాజ్యం వంటి వ్యవస్థీకృత సంస్థల గురించి మాత్రమే అధ్యయనం చేసేదిగా భావించేవారు. కాని నేడు అవ్యవస్థీకృత అంశాలైన శక్తి వాటి సంస్థలు కూడా చేరాయి. కాబట్టి వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రాజకీయ వ్యవస్థలతో కూడా రాజనీతిశాస్త్రం తన పరిధిని విస్తరించుకుంది.

సంప్రదాయ ధృక్కోణంలో శక్తి కేవలం సమాజంలో రెండు వర్గాల మధ్య నిర్వహించబడింది. అవి ఆధిపత్య వర్గాలు, అధీన వర్గాలు. కాని ఆధునిక బహుళత సమాజంలో వ్యక్తులు వారి వారి అంతస్థు, అభిరుచులను బట్టి విభిన్న వర్గాలుగా విభజించబడింది. ఈ వర్గాలు ఆధిపత్య, అధీన వర్గాలుగా మాత్రమే విభజించబడలేదు.

ప్రతీ వర్గం తమ తమ ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ వర్గాలు ప్రభుత్వంపై, ప్రభుత్వ విధానంపై ప్రభావితం చూపుతాయి. విధాన నిర్ణయంలో ప్రభుత్వానికి సహకరిస్తాయి. ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించటానికి రాజనీతి శాస్త్రంలో శక్తి అధ్యయనం ఆవశ్యకం.

ప్రశ్న 18.
శక్తికి సంబంధించి ఏవైనా రెండు ధృక్పధాలను తెలపండి.
జవాబు.
1. శ్రేష్ఠ వర్గ ధృక్కోణం :
శక్తికి సంబంధించి శ్రేష్ఠ వర్గ దృక్కోణం 20వ శతాబ్దం ప్రారంభంలో పరెటో, మోస్కా, మిచెల్స్ అనే ముగ్గురు సామాజిక శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీని ప్రకారం సమాజం శ్రేష్ఠ వర్గం, సామాన్య జన సమ్మేళనంగా చీలి ఉంటుంది.

ఈ విధంగా చీలటానికి వ్యక్తులలో గల పోటీతత్వం, వారి వారి ఆసక్తులపై ఆధారపడి ఉంటుంది. శ్రేష్ఠ వర్గం రాజకీయ శక్తిని ప్రభావితం చేస్తుంది. ఈ సిద్ధాంతం ప్రకారం సమాజంలో విభజన అనేది సహజవాబు. కార్యకరణ పరంగా ఉంటుంది. ఇది సంపూర్ణంగా మారుతుందనే నమ్మకాన్ని కలిగి ఉంటుంది.

2. సమూహ ధృక్కోణం:
ఈ ధృక్కోణంను అర్ధర్ బెంట్లీ అభివృద్ధి చేశాడు. శక్తిపై సమూహ ధృక్కోణం బహుతా సిద్ధాంతానికీ అనుగుణంగా ఉంటుంది. దీని ప్రకారం శక్తి అనే భావన సమాజాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది.

ఇవి ఆధిపత్య సమూహాలు, ఆధారిత సమూహాలు. సమూహ ధృక్కోణం ప్రకారం సమాజంలో శక్తి ఏ ఒక్క సమూహం చేతిలో కేంద్రీకృతం కాకుండా అది విభిన్న సామాజిక వర్గాల మధ్య విభజించబడి ఉంటుంది. ఈ సమూహాలు ఎక్కువగా స్వయం ప్రతిపత్తిని కలిగి ఉండి, స్వతంత్రంగా నిర్ణయాలను తీసుకుంటాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 19.
ఏవైనా మూడు రకాల అధికారాలను తెలపండి.
జవాబు.
1. చట్టబద్ధమైన అధికారం :
కొన్ని నిర్ణయాత్మక హక్కులు మరియు విధుల ప్రకారం అధికారంలో వున్న వ్యక్తులు తమ అధికారాలను చెలాయిస్తారు. ప్రదర్శన విధేయత అధికారంలో ఉన్న వ్యక్తిని దృష్టిలో ఉంచుకోకుండా, చట్టం ప్రకారం అధికారం ప్రకారం జరుగుతుంది.

మాక్స్వెబర్ అభిప్రాయంలో ఒక వ్యక్తి తన కార్యాలయం ప్రకారం కొన్ని, ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా మరియు అధికారాన్ని న్యాయమైన రీతిలో నిర్వహించడం ద్వారా చట్టబద్ధం అధికారాన్ని చెలాయిస్తాడు. చట్టబద్ధ అధికారాన్ని రాజ్యాంగబద్ధ అధికారం అనికూడా అంటారు. పార్లమెంటరీ విధానంలో నామమాత్రపు మరియు వాస్తవ కార్యనిర్వాహక అధిపతులైన రాష్ట్రపతి, ప్రధానమంత్రి చెలాయించే అధికారాన్ని చట్టబద్ధ అధికారంగా చెప్పుకోవచ్చు.

2. సాంప్రదాయ అధికారం :
సాంప్రదాయ అధికారం ప్రాచీన ఆచారాలు, సాంప్రదాయాల ఆధారంగా నిర్వహించబడుతుంది. ఈ అధికారాన్ని చెలాయించే వ్యక్తులు ప్రజల సాంప్రదాయాలు, ఆచారాలకు ప్రాధాన్యత ఇస్తారు. సాంప్రదాయ అధికారం నిరపేక్షమైనది కాదని, దాన్ని చెలాయించే వ్యక్తుల విచక్షణను బట్టి వుంటుందని మాక్స్వెబర్ పేర్కొన్నాడు.

అభివృద్ధికి నోచుకోని సమాజంలో ఈ విధమైన అధికారం వుంటుంది. ఒకప్పుడు నేపాల్, భూటాన్ లో ఈ విధమైన అధికారం వుండేది. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ ప్రభావంతో ఈ అధికారం తన ప్రాభవాన్ని, ప్రాముఖ్యతను కోల్పోయింది.

3. సమ్మోహన (లేదా) ఆకర్షణీయమైన అధికారం :
సమ్మోహన అధికారం నేటి ప్రపంచంలోని అనేక రాజ్యాల్లో వుంది. అనేక దేశాల్లో చట్టబద్ధ అధికారం ఆచరణలో వున్నప్పటికీ కొందరు రాజకీయ నాయకులు వారి రాజ్యాంగబద్ధ స్థాయికి బదులుగా సమ్మోహన అధికారం ద్వారానే కార్యకర్తలను, అనుచరులను ప్రభావితం చేస్తున్నారు.

సమ్మోహనాధికారం గల నాయకులు నిజాయితీకి అంకితమైన ధృక్పథంను కలిగి వుంటారు. ఫలితంగా వారు తమ దేశ ప్రజలను ప్రభావితం చేయగల మరియు ప్రేరేపించగల సామర్థ్యం కలిగి వుంటారు.
ఉదా : ‘బాలగంగాధర్ తిలక్, మహాత్మగాంధీ, రాజేంద్రప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్పటేల్, టంగుటూరి ప్రకాశం, షేక్ అబ్దుల్లా, ఎం.జి.రామచంద్రన్, ఎన్.టి.రామారావు.

ప్రశ్న 20.
శక్తి మరియు అధికారం మధ్య తేడాలను తెలపండి.
జవాబు.

శక్తి

అధికారం

1. శక్తి అనేది రాజకీయాలను అన్ని కోణాల్లో పరిశీలిస్తుంది.1. అధికారం రాజకీయాలను పాలనాపరమైన కోణంలోనే చూస్తుంది.
2. శక్తికి చట్టబద్ధత ఉండవచ్చు, లేకపోవచ్చు.2. శక్తికి చట్టబద్ధత జోడిస్తేనే అధికారమవుతుంది.
3. ఇతరులను ఆదేశించేదే అధికారం.3. శాసనబద్ధమైన ప్రభావమే అధికారం.
4. సమాజంలో శక్తి అనేది ఆదేశం, విధేయతలను వ్యక్తపరుస్తుంది.4. ఉన్నతస్థాయి నుంచి వచ్చే ఆదేశాన్ని దిగువ స్థాయిలో ఆమోదించటాన్ని అధికారం అంటారు.
5. ఇతరుల ఆలోచనలను, చర్యలను ప్రభావితం చేసేది శక్తి.5. ఆదేశాలను, ఆజ్ఞలను ఇచ్చి, నిర్ణయాలను తీసుకునే హక్కును కలిగి వుండేది అధికారం.
6. శక్తికి ప్రధాన ఆధారం జ్ఞానం మరియు అనుభవం.6. ఒక వ్యక్తి యొక్క అధికారాన్ని స్థాయి, పదవి నిర్ణయిస్తాయి.

 

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
శాసనం పదం అవతరణను తెలపండి.
జవాబు.
‘చట్టం’ అనే పదం టైటానిక్ భాష (జర్మన్) లోని ‘లాగ్’ అనే పదం నుండి గ్రహించబడింది. లాగ్ అనగా ”స్థిరంగా ఉండటం’ అని అర్థం. పద అర్థాన్ని బట్టి సార్వభౌమత్వ రాజకీయ అధికారిచే ప్రతిపాదించబడి, అమల్లోకి వచ్చిన ప్రవర్తనా నియమావళియే చట్టం అని భావించవచ్చు.

మరికొందరు రాజనీతిజ్ఞులు ‘చట్టం’ అనే పదం లాటిన్ భాషలోని ‘జస్’, ‘జంగేరి’ అనే రెండు పదాల నుండి గ్రహించబడిందని పేర్కొన్నారు. లాటిన్ భాషలోని ఈ రెండు పదాలకు ‘బంధం’ అనే అర్థం ఉంది.

ప్రశ్న 2.
శాసనానికి సంబంధించి ఏవైనా రెండు నిర్వచనాలను తెలపండి.
జవాబు.

  1. “రాజకీయాధికారాన్ని పొందిన సార్వభౌముడిచే అమలుచేసే బాహ్య చర్యలకు సంబంధించిన సాధారణ నియమమే చట్టం” అని టి. ఇ. హాలండ్ పేర్కొన్నాడు.
  2. “న్యాయపాలనలో రాజ్యం ఉపయోగించే సూత్ర సముదాయమే చట్టం” అని జాన్ సాల్మండ్ పేర్కొన్నాడు.

ప్రశ్న 3.
శాసనం లక్షణాలు ఏవి ?
జవాబు.
చట్టం ఈ క్రింది ముఖ్య లక్షణాలను కలిగి ఉంటుంది.

  1. సార్వభౌముడు ఆమోదించిన నియమ నిబంధనల సముదాయమే చట్టం.
  2. చట్టం నిర్దిష్టమైనది, ఖచ్చితమైనది మరియు విశ్వవ్యాప్తమైనది.
  3. చట్టం ప్రజాభిప్రాయానికి అనుకూలంగా ఉంటుంది.
  4. చట్టం ఉల్లంఘన శిక్షకు దారితీస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 4.
సమన్యాయ పాలనను నిర్వచించండి.
జవాబు.
సమన్యాయపాలన అంటే చట్టం ఆధిక్యత అని అర్థం. సమన్యాయపాలన అమలులో ఉన్న దేశాలలో ప్రభుత్వాధికారాలు చట్టాల ద్వారా నిర్ణయించబడతాయి. ప్రభుత్వ చర్యలన్నింటికి చట్టసమ్మతి ఉండాలి. చట్టాన్ని ఉల్లంఘించినపుడు మాత్రమే వ్యక్తి శిక్షింపబడతాడు.

ధనిక, పేద అనే విచక్షణ లేకుండా చట్టం అందరినీ సమానంగా చూస్తుంది. చట్ట ఆధిక్యత లేదా సమన్యాయ పాలన ఉండటం వలన వ్యక్తులకు స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు లభిస్తాయి.

ప్రశ్న 5.
సంవర్థక శాసనం అంటే ఏమిటి ?
జవాబు.
మానవ సంస్థలచే రూపొందించబడేదే సంవర్థక శాసనం. ఈ శాసనాన్ని రాజకీయ శాసనం అని కొందరు పేర్కొన్నారు. వర్తమాన సామాజిక రాజకీయ పరిస్థితుల ఆధారంగా ఈ శాసనం నిర్మితమైంది. సార్వభౌమత్వ రాజకీయ అధికారి ఈ శాసనానికి అనుమతిస్తారు. ఈ శాసనాన్ని అతిక్రమించినవారు శిక్షార్హులు.

ప్రశ్న 6.
పరిపాలక శాసనం అంటే ఏమిటి ?
జవాబు. పరిపాలక చట్టం (Administrative Law) :
పరిపాలన నిర్విఘ్నంగానూ, ప్రశాంతంగానూ కొనసాగే విషయంలో చట్టం కీలకపాత్రను పోషిస్తుంది. ప్రజలకు, ప్రభుత్వాధికారులకు మధ్య సంబంధాలను ఈ రకమైన చట్టం నియంత్రిస్తుంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సంస్కరణలను తీసుకురావడంలో ఇది దోహదపడుతుంది.

పరిపాలక చట్టాలను అనుసరించడం ద్వారా ఈనాటి రాజ్యాలు అనేక దశలుగా శీఘ్రగతిన అభివృద్ధిని సాధించాయి. ప్రభుత్వ సిబ్బంది క్రమశిక్షణతో పనిచేసేటట్లు పరిపాలక చట్టం దోహదపడుతుంది.

ప్రశ్న 7.
శాసనం యొక్క ఏవైనా రెండు ఆధారాలను తెలపండి.
జవాబు.
చట్టానికి గల మూడు ఆధారాలు :

  1. ఆచారాలు
  2. మతం
  3. శాసనసభ.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 8.
రాజ్యాంగ శాసనం అంటే ఏమిటి ?
జవాబు.
రాజ్యాంగ చట్టం (Constitutional Law) :
రాజ్యాంగ చట్టమనేది సాధారణ చట్టం కంటే భిన్నంగా ఉంటుంది. రాజ్యంలో ఈ రకమైన చట్టం అత్యున్నతమైనది. ప్రభుత్వ నిర్మాణానికి ఇది వీలు కల్పిస్తుంది. ప్రభుత్వాంగాల మధ్య సంబంధాన్ని వివరిస్తుంది. ప్రభుత్వాంగాల అధికార పరిధిని నిర్ణయిస్తుంది.

ఈ రకమైన చట్టం లిఖిత పూర్వకంగా ఉంటుంది. రాజ్యంలో నివసించే పౌరుల హక్కులు, బాధ్యతల గురించి వివరిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఈ చట్టానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఇది ప్రజాభీష్టానికి ప్రతీకగా ఉంటుంది.

ప్రశ్న 9.
సామాన్య శాసనం గురించి మీకు తెలిసినది వివరించండి.
జవాబు.
సామాన్య శాసనం :
పబ్లిక్ శాసనాల నుంచి పరిపాలక శాసనాన్ని మినహాయిస్తే మిగిలినవన్నీ సామాన్య శాసనంలో అంతర్భాగం. రాజ్యంలో గల పౌరుల మధ్యగల సంబంధాలను నిర్ణయించేదే సామాన్య శాసనం. వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారాలను వివరిస్తుంది. వివాహం, విడాకులు, ఒప్పందాలు మొదలైనవి. ఇందులో అంతర్భాగాలు. సామాన్య శాసనాన్ని చట్టబద్ధ శాసనం, సాధారణ శాసనంగా విభజించవచ్చు.

ప్రశ్న 10.
పబ్లిక్ శాసనాన్ని నిర్వచించండి.
జవాబు.
పబ్లిక్ చట్టం (Public Law) :
పబ్లిక్ చట్టం, రాజ్యం వ్యక్తుల మధ్య సంబంధాలను నియంత్రిస్తుంది. రాజ్యానికి సంబంధించిన మౌలిక నిర్మితి, విధులను పబ్లిక్ చట్టం వివరిస్తుంది. రాజ్యపు మితిమీరిన జోక్యానికి వ్యతిరేకంగా వ్యక్తులకు అవసరమైన హక్కులను అందిస్తుంది. పౌరులందరు ఈ చట్టాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ఈ చట్టాన్ని అతిక్రమించడం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 11.
బ్రిటిష్ రాజ్యాంగం ప్రత్యేకతను తెలపండి.
జవాబు.
బ్రిటిష్ రాజ్యాంగ విశిష్ట లక్షణం సమన్యాయపాలన. ఇది ముందుగా ఇంగ్లండులో అవతరించింది. అనంతరం భారతదేశం, అమెరికా దేశాలలో దీనిని అమలు చేశారు. చట్టం ముందు అందరూ సమానమే, చట్టం అందరినీ సమానంగా రక్షిస్తుంది, అని తెలిపేదే సమన్యాయపాలన. రాజ్యంలో నివశించే ప్రతి పౌరునికి శాసనాలు ఒకే విధంగా వర్తిస్తాయి.

ప్రశ్న 12.
సమత అంటే ఏమిటి ?
జవాబు.
‘సమత’ అనే పదానికి నిష్పక్షపాతం, న్యాయం లాంటి సూత్రాలను పర్యాయపదాలుగా వాడుతున్నారు. సమత అంటే సహజ న్యాయం. అమలులో ఉన్న చట్టాలు వివాదాల పరిష్కారానికి సహాయపడిన సందర్భాలలో న్యాయమూర్తులు తమ విజ్ఞత, విచక్షణతో వివాదాలను పరిష్కరిస్తారు. ఈ పరిష్కారాలే రాజ్యముచేత గుర్తించబడి చట్టాలుగా ప్రకటించబడతాయి.

ప్రశ్న 13.
శాస్త్రీయ వ్యాఖ్యానాలు అంటే ఏమిటి ?
జవాబు.
శాస్త్రవేత్తల వ్యాఖ్యానాలు చట్టానికి మరొక ముఖ్యమైన ఆధారం. ప్రఖ్యాత న్యాయమూర్తులు, న్యాయవాదులు వెల్లడించే అభిప్రాయాలు ఎనలేని ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. న్యాయవేత్తలు తమ వ్యాఖ్యానాల ద్వారా చట్టంలోని దోషాలను గుర్తించి, వాటి నివారణకు కొన్ని సూచనలు చేస్తారు. కాలక్రమంలో ఈ సూచనలే చట్ట నిర్మాణానికి ప్రధాన ఆధారాలవుతాయి.

ప్రశ్న 14.
శాసనానికి శాసన నిర్మాణ శాఖ ఒక ఆధారం తెలపండి.
జవాబు.
ప్రజాస్వామ్యంలో శాసనసభ శాసన నిర్మాణ ప్రక్రియలో ప్రధానపాత్ర పోషిస్తుంది. కావున శాసనసభను చట్టం యొక్క ప్రత్యక్ష ఆధారంగా పేర్కొంటారు. చట్ట నిర్మాణంలో శాసనసభలు ప్రజానీకం ఆకాంక్షలకు ప్రతీకగా ఉంటాయి. శాసనసభలోని అధికార, ప్రతిపక్షాలు రెండూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 15.
భారత రాజ్యాంగంలో గల సమన్యాయపాలన.
జవాబు.
భారత రాజ్యాంగం సమన్యాయపాలనను రాజ్యాంగ మౌలిక లక్షణంగా గుర్తించింది. సమన్యాయపాలన రాజ్యాంగ మౌళిక నిర్మాణంగా భారత సుప్రీంకోర్టు పదేపదే ప్రకటించింది. భారత రాజ్యాంగం మూడో భాగంలోని 14 నుంచి 21 వరకు గల ప్రకరణాలు సమన్యాయపాలన భావనను పొందుపరిచాయి. సమన్యాయపాలన భావన అనేది “చట్టం ముందు అందరూ సమానులే” ఏ ఒక్కరు విచక్షణారహితంగా శిక్షకు గురికాకూడదు” అనే సూత్రంపై ఆధారపడి వున్నది.

ప్రశ్న 16.
సంవర్థక స్వేచ్ఛ అంటే ఏమిటి ?
జవాబు.
సకారాత్మక ధృక్కోణంలో స్వేచ్ఛ అనేది వ్యక్తి తన అభీష్టం మేరకు నడుచుకొంటూ ఇతరులు కూడా తనవలె నడుచుకోవాలనే పరిస్థితిని సూచిస్తుంది. వేరొక మాటలో చెప్పాలంటే ఇతరులకు హాని కలిగించని అధికారమే స్వేచ్ఛ అనే ధృక్కోణాన్ని సూచిస్తుంది.

టి.హెచ్.గ్రీన్ అనే ఆదర్శ తత్త్వవేత్త ఈ రకమైన స్వేచ్ఛా ధృక్కోణాన్ని ప్రతిపాదించాడు. ఇతరులతో సమానంగా ఆనందంతో ఏదైనా చేసి అనుభవించేందుకు గల అధికారమే స్వేచ్ఛగా అతడు భావించాడు.

ప్రశ్న 17.
సంరక్షక స్వేచ్ఛ అంటే ఏమిటి ?
జవాబు.
సకారాత్మక ధృక్కోణంలో స్వేచ్ఛ అంటే ఎటువంటి ఆంక్షలు లేకపోవడం. తమ స్వాతంత్య్రాల మీద ఎలాంటిఆంక్షలు లేనప్పుడే వ్యక్తులు స్వాతంత్ర్యాన్ని పొందగలరు. అయితే కొందరు దీన్ని వాస్తవ విరుద్ధమైనదిగా భావించారు. రాజ్యం ఆవిర్భావానికి పూర్వం మాత్రమే వ్యక్తులకు ఆంక్షల్లేని స్వేచ్ఛ ఉందన్నారు. వారి ప్రకారం అటువంటి రాజ్యం అసాధ్యమైందే కాకుండా, ఆధునిక కాలంలో వ్యక్తులు స్వాతంత్ర్యాన్ని అనుభవించే వీలులేనిది కూడా అవుతుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 18.
స్వేచ్ఛకు సంబంధించి ఏవైనా నాలుగు లక్షణాలను తెలపండి.
జవాబు.

  1. మానవీయ వ్యక్తిత్వాల సాధనకు అత్యంత ఆవశ్యకమైంది.
  2. స్వేచ్ఛ ఒక శక్తివంతమైన భావన. దాని వ్యాఖ్యానమనేది స్థలం, కాలం, ప్రాంతం, ప్రజల ఆకాంక్షలను బట్టి ఉంటుంది.
  3. వ్యక్తుల ఆకాంక్షలను సదా వాస్తవం చేయడమే స్వేచ్ఛ లక్ష్యం అవుతుంది.
  4. నిర్హేతుకమైన ఆంక్షలకు బదులు నిరంతరం సానుకూల పరిస్థితులను కలిగి ఉండటమే స్వేచ్ఛ.

ప్రశ్న 19.
స్వేచ్ఛకు సంబంధించి ఏవైనా రెండు రకాలను తెలపండి.
జవాబు.
స్వేచ్ఛలోని నాలుగు రకాలు :

  1. సహజ స్వేచ్ఛ
  2. పౌర స్వేచ్ఛ
  3.  రాజకీయ స్వేచ్ఛ
  4. ఆర్థిక స్వేచ్ఛ.

ప్రశ్న 20.
పౌర స్వేచ్ఛ అంటే ఏమిటి ?
జవాబు.
పౌర స్వేచ్ఛ (Civil Liberty) :
పౌర స్వేచ్ఛను వ్యక్తిగత స్వేచ్ఛ అని కూడ అంటారు. ఇది సామాజిక సంస్థలోని సభ్యుడైన వ్యక్తి జీవనంలోని స్వాతంత్ర్యాన్ని తెలియజేస్తుంది. పౌర స్వేచ్ఛలో కింద పేర్కొన్న మూడు అంశాలు ఇమిడి ఉంటాయని బార్కర్ పేర్కొన్నాడు.

  1. సంచార స్వేచ్ఛను సూచించే భౌతిక స్వాతంత్ర్యం
  2. ఆలోచన, అభివ్యక్తి, ముఖ్యమైన ప్రశ్నలు విశ్వాసాన్ని కలిగి ఉండే భౌద్ధిక స్వాతంత్ర్యం
  3. నిజజీవితంలోని ఆచరణాత్మక ఐచ్ఛిక స్వాతంత్ర్యం.

పౌర స్వేచ్ఛ అనేది మిగతా స్వేచ్ఛలకు ప్రాతిపదికగా ఉంటుంది. సహజ స్వేచ్ఛకు ఇది విరుద్ధమైంది. సమాజంలోని పౌరులు దానిని అనుభవిస్తారు. ఒంటరిగా ఉంటున్న వ్యక్తులకిది ఆవశ్యకమైనది. సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రాపంచిక విషయాలను ఉమ్మడిగా అనుభవించ గలిగినప్పుడే పౌర స్వేచ్చ వాస్తవమవుతుంది.

“రాజ్యం చేత గుర్తించబడి అమలయ్యే హక్కుల సముదాయమే పౌర స్వేచ్చ” అని గెటిల్ పేర్కొన్నాడు.

పౌర స్వేచ్ఛ అనేది అనేక హక్కుల రూపంలో ఉంటుంది. అవి

  1. జీవించే హక్కు
  2. పనిచేసే హక్కు
  3. ఆస్తి హక్కు
  4.  వాక్ స్వాతంత్ర్యం, భావవ్యక్తీకరణ, సమావేశ, సంచార, స్థిర నివాసపు హక్కులు మొదలైనవి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 21.
రాజకీయ స్వేచ్ఛ గురించి తెలపండి.
జవాబు.
రాజకీయ స్వేచ్ఛ (Political Liberty) :
రాజకీయ స్వేచ్ఛ పౌరులు రాజకీయాంశాలలో పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. ఈ రకమైన స్వేచ్ఛ పౌరులకు రాజ్య కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనే శక్తినిస్తుందని లాస్కీ పరిగణించాడు. రాజకీయ స్వేచ్ఛను ప్రజాస్వామ్యానికి పర్యాయపదంగా గిల్ క్రిస్ట్ భావించాడు. రాజకీయ స్వేచ్ఛ అంటే ఎవరికి వారు తమ ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకొనే రాజ్యాంగ స్వేచ్ఛగా లీకాక్ వర్ణించాడు.

రాజకీయ స్వేచ్ఛ పౌరులకు మాత్రమే పరిమితమైంది. అది సంవర్ధక స్వభావాన్ని కలిగి ఉంటుంది. రాజకీయ స్వేచ్ఛ పౌరులకు రాజకీయాంశాలలో వివిధ హక్కులను కల్పిస్తుంది. అటువంటి వాటిలో i) ఓటు వేసే హక్కు ii) ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీ చేసే హక్కు iii) ప్రభుత్వ పదవులను చేపట్టే హక్కు iv) విమర్శించే హక్కువంటివి ఉన్నాయి. విద్య, నిజాయితీ, నిష్పక్షపాతమైన పత్రికలు మొదలైనవి ఉన్నప్పుడే రాజకీయ స్వేచ్ఛ వాస్తవం అవుతుందని లాస్కీ నొక్కి చెప్పాడు.

ప్రశ్న 22.
ఆర్థిక స్వేచ్ఛను సాధించడానికి కావలసిన సాధనాలు తెలపండి.
జవాబు.
సంపూర్ణ ఆర్థిక స్వేచ్ఛ సాధన ఈ క్రింది చర్యల ద్వారా సాధ్యమవుతుంది. అవి

  1. కనీస వేతనాలను అందించటం
  2. పనిహక్కుకు భరోసా కల్పించటం
  3. నిరుద్యోగం, అనారోగ్యం వంటి అభద్రతల నుండి కార్మికులను రక్షించటం
  4. తగినంత విశ్రాంతిని కల్పించటం
  5. పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు ప్రాతినిధ్యం కల్పించటం.

ప్రశ్న 23.
ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏమిటి ?
జవాబు.
ఆర్థిక స్వేచ్ఛ (Economic Liberty) :
ఆర్థిక స్వేచ్ఛ అంటే ప్రతిఒక్కరూ తమ జీవనోపాధిని తామే సంపాదించుకోగలగడం. ఒక వ్యక్తి తన రోజువారీ ఆహారాన్ని హేతుబద్ధంగా సంపాదించుకొనే భద్రమైన అవకాశమే ఆర్థికస్వేచ్ఛగా లాస్కీ అభివర్ణించాడు. కోరిక – భయము, ఆకలి – పస్తులు, నిరుద్యోగం – అసంపూర్ణతల నుంచి విముక్తి కలిగించేదే ఆర్థిక స్వేచ్ఛ. ఇది ఆర్థిక సంబంధమైన లేమి లేదా అభద్రతల నుంచి స్వాతంత్ర్యాన్ని సూచిస్తుంది. ఆర్థిక స్వేచ్ఛలేని ప్రజాస్వామ్యం అర్థరహితమైంది.

ఈ దిగువ పేర్కొన్న చర్యల అమలు ద్వారా ఆర్థిక స్వేచ్ఛను పొందవచ్చు.

  1. కనీస వేతనాలను అందించడం.
  2. పని హక్కుకు భరోసా కల్పించడం.
  3. నిరుద్యోగం, అనారోగ్యం వంటి వివిధ రకాల అభద్రతల నుంచి కార్మికులను రక్షించడం.
  4. తగినంత విశ్రాంతిని కల్పించడం.
  5. పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు ప్రాతినిధ్యం కల్పించడం.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 24.
జాతీయ స్వేచ్ఛ గురించి తెలపండి.
జవాబు.
జాతీయ స్వేచ్ఛ (National Liberty) :
జాతీయ స్వేచ్ఛ అంటే రాజ్యం – స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కలిగి ఉండడంగా పేర్కొనవచ్చు. రాజ్యపు సార్వభౌమత్వాన్ని అది సూచిస్తుంది. ప్రతి రాజ్యం ఈ స్వేచ్ఛను అనుభవిస్తూ ఇతర రాజ్యాల ఆధిపత్యానికి లోనుగాకుండా ఉంటుంది. అన్ని రంగాలలో జాతి అభివృద్ధికి ఈ స్వేఛ్ఛ ఆవశ్యకమైంది. ప్రాచీనకాలం నుంచి అనేక దేశాల్లో ఇది విశదమైంది.

ఈ రకమైన స్వేచ్ఛను పొందడం కోసం అనేక దేశాలు ఎంతగానో ప్రయత్నించాయి. గతంలో టర్కీ ప్రజలకు వ్యతిరేకంగా గ్రీకులు స్వాతంత్య్ర సమరం సాగించారు. అట్లాగే మహాత్మాగాంధీ నాయకత్వంలో భారత ప్రజలు బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రం కోసం అహింసాయుత పోరాటం చేశారు. జాతీయ స్వేచ్ఛ ఎంతో విలువైంది.

ప్రశ్న 25.
స్వేచ్ఛకు సంబంధించి ఏవైనా నాలుగు పరిరక్షణలను తెలపండి.
జవాబు.
స్వేచ్ఛకు గల నాలుగు పరిరక్షణలు :

  1. ప్రజాస్వామ్య పాలన
  2. లిఖిత మరియు దృఢ రాజ్యాంగం
  3. స్వతంత్ర న్యాయవ్యవస్థ
  4. సమన్యాయపాలన.

ప్రశ్న 26.
స్వేచ్ఛ రక్షణకు న్యాయశాఖ స్వతంత్రత ఏ విధంగా తోడ్పడుతుంది ?
జవాబు.
వ్యక్తి స్వేచ్ఛకు పరిరక్షణయే స్వతంత్ర, నిష్పాక్షిక న్యాయవ్యవస్థ. న్యాయవ్యవస్థ రాజ్యాంగాన్ని సమర్థించి, ప్రభుత్వం ప్రజలకు బాధ్యత వహించేటట్లు చూస్తుంది. పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడేందుకు వివిధ రక్షణలను సూచిస్తుంది. కావున స్వేచ్ఛ పరిరక్షించబడటానికి స్వతంత్ర న్యాయశాఖ అత్యంత అవసరం అని రాజనీతిజ్ఞులు భావిస్తారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 27.
శాసనబద్ద సమానత్వం అంటే ఏమిటి ?
జవాబు.
సమాజంలో అందరికీ పౌరహక్కులు లభించడమే శాసనబద్ద సమానత్వం. కుల, వర్ణ, ‘జన్మ, మతపరమైన అంశాల్లో ఎలాంటి విచక్షణ లేకుండా సామాజిక హోదాపరంగాగాని, మతపరమైన నమ్మకాల విషయంలోగాని, రాజకీయపరమైన అభిప్రాయాల్లోగాని, ప్రతి ఒక్కరు సమానత్వాన్ని కలిగి వుండటమే శాసనబద్ద సమానత్వం. ఏ ఒక్కరు ప్రత్యేక హోదాగాని, అవకాశాలు గాని కలిగి వుండరు.

సమాజంలో చట్టం ముందు అందరూ సమానులే అనే భావన వుంటుంది. ప్రజలందరికీ చట్టపరమైన సమాన రక్షణలను శాసనబద్ధ సమానత్వం కలిగిస్తుంది.

ప్రశ్న 28.
ఆర్థిక సమానత్వం అంటే ఏమిటి ?
జవాబు.
ఆర్థిక సమానత్వం (Economic Equality) :
ఆర్థిక సమానత్వాన్ని సాంఘిక, రాజకీయ సమానత్వాలకు పునాదిగా పరిగణించడమైంది. ఆధునిక రాజ్య కార్యకలాపాల వెనుక అదొక ముఖ్యమైన చోదకశక్తిగా పనిచేస్తుంది. ఆర్థిక సమానత్వమంటే ఆదాయం, ఆస్తి, సంపదలలో విపరీతమైన వ్యత్యాసాలు లేకుండా చేయడంగా పేర్కొనవచ్చు. ఎర్నెస్ట్ బార్కర్ దృష్టిలో ఆర్థిక సమానత్వం అనేది హోదాకు, పాక్షికంగా ఆస్తి – ఆదాయాలకు సంబంధించిన అంశం.

ఆర్థిక సమానత్వాన్ని “సంపదకు చెందిన వ్యత్యాసాలకు తొలగించి ప్రయత్నంగా, ప్రాపంచిక వస్తువులను స్త్రీ, పురుషుల మధ్య సమానంగా పంపిణీ చేయాల్సిన ప్రయత్నంగా లార్డ్స్ భావించాడు.

ఇక ప్రొఫెసర్ లాస్కీ “పారిశ్రామిక ప్రపంచంలో విశృంఖలమైన, బాధ్యతారహిత ఇచ్ఛను భావించాడు. అదేసమయంలో ఆర్థిక సమానత్వమనేది సమాన ఆదరణ, ప్రతిఫలంగా భావించరాదు. వ్యక్తులు తగిన పనిని పొందే అవకాశం ద్వారా జీవనభృతిని సంపాదించుకొని, తమ ఆర్థిక హోదాను పెంపొందించుకొనేందుకు అది సంకేతంగా ఉంటుంది. అనేక సామ్యవాద దేశాలు ఆర్థిక సమానత్వ సాధనకు ప్రయత్నించి పాక్షికంగా విజయవంతమైనాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 29.
రాజకీయ సమానత్వం అంటే ఏమిటి ?
జవాబు.
రాజకీయ సమానత్వం (Political Equality) :
రాజకీయ సమానత్వం రాజకీయ కార్యకలాపాలలో ప్రజలకు చాలినన్ని అవకాశాలను కల్పించేందుకు అనుకూల పరిస్థితులను సూచిస్తుంది. రాజ్యంలోని పౌరులకు వివిధ రకాల రాజకీయ హక్కులను ప్రసాదించడం ద్వారా ఆ రకమైన సమానత్వాన్ని సాధించవచ్చు. ఈ సందర్భంలో రాజకీయ సమానత్వాన్ని పౌరులు మాత్రమే అనుభవిస్తారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రాజ్యంలో నివసించే అన్యులు, విదేశీయులకు ఇది వర్తించదు.

ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేసేందుకు రాజకీయ సమానత్వమన్నది అత్యంత ఆవశ్యకమైంది. వివిధ రాజకీయ హక్కులను ప్రసాదించినప్పుడే పౌరులు రాజకీయ స్వేచ్ఛను అనుభవిస్తారు. అంటే, రాజకీయ సమానత్వమనేది రాజకీయ స్వేచ్ఛకు పర్యాయపదంగా భావించవచ్చు.

ప్రశ్న 30.
సమానత్వం – సామాజిక మార్పు.
జవాబు.
శాస్త్ర, సాంకేతిక రంగాలలో సాధించిన ప్రగతి ఎక్కువ ప్రాంతాలలో సహజ అసమానత్వాన్ని ప్రత్యామ్నాయంగా పెంచి పోషించింది. ఆరోగ్యం, శారీరక పటిష్టత అనేది సరైన పౌష్ఠికాహారం వల్ల, మానసిక పరిపక్వత అనేది సరైన విద్య, రక్షణ ద్వారా సాధించవచ్చని మనకు తెలుసు. కాని ఈ ప్రయోజనాల లభ్యత అనేది వ్యక్తుల వ్యక్తిగత సాంఘిక, | ఆర్థిక స్థితిగతుల మీద ఆధారపడి వుంది.

ప్రశ్న 31.
అంతర్జాతీయ సమానత్వం అంటే ఏమిటి ?
జవాబు.
అంతర్జాతీయ సమానత్వం: అంతర్జాతీయ సమానత్వం అంటే ప్రతిదేశం భౌగోళిక, ఆర్థిక, సైనికపరమైన విషయాలలో మాత్రమే కాకుండా అన్నింటా సమానంగా గుర్తింపు పొందడమే. దీని ప్రకారం ప్రపంచంలో చిన్న రాజ్యాలైన లేదా పెద్ద రాజ్యాలైన అన్ని సమానమే.

ఐక్యరాజ్యసమితి ఛార్టర్లో కూడా అన్ని రాజ్యాలకు సమావ హోదా, గౌరవం ఇచ్చింది. తద్వారా ప్రతీ రాజ్యం తమ సార్వభౌమాధికారానికి గౌరవమిస్తూ తమ మధ్య నెలకొనే వివాదాలను పరిష్కరించుకోవాలి. అంతర్జాతీయ సమానత్వం అనేది మానవాళి ప్రత్యేక లక్షణంగా చెప్పవచ్చు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 32.
సాంఘిక సమానత్వం అంటే ఏమిటి ?
జవాబు.
వర్గ వ్యత్యాసాలు లేకపోవడం, సమానమైన హోదాను కలిగి ఉండటాన్ని సాంఘిక సమానత్వం సూచిస్తుంది. ఏ వ్యక్తి మతం, వర్గం, వర్ణం, లింగం, పుట్టుక మొదలగు అంశాల ఆధారంగా వివక్షతకు గురికాకుండా ఉంటే సాంఘిక సమానత్వం నెలకొంటుంది.

సమాజంలో పౌరులందరినీ సమానమైనవారుగా సాంఘిక సమానత్వం భావిస్తుంది. పౌరులందరూ సమానమైన సాంఘిక, రాజకీయ, ఆర్థిక, చట్టపరమైన హక్కులను అనుభవించేందుకు వీలు కల్పించే సమానత్వాన్నే సాంఘిక సమానత్వం అని అంటారు.

ప్రశ్న 33.
సమానత్వం అనేది స్వేచ్ఛకు ఏవిధంగా అవసరం ?
జవాబు.
సమానత్వం అంటే ఒకే విధమైన ఆదరణ అని అర్థం కాదు. ఎందుకంటే అటువంటి సమానత్వం పౌర సమాజంలో సాధ్యంకాదు. అందుకు బదులుగా ఒకేరకమైన పరిస్థితులలో సమానమైన ఆదరణయే సమానత్వంగా పేర్కొనవచ్చు.

పౌర సమాజంలో కొందరు ఇతరులతో సమానమైన హోదాను కలిగి వుండరు. అయితే వారికి తమ వ్యక్తిత్వం, హోదాలను పెంపొందించుకొనేందుకై కొన్ని పరిస్థితులు, అవకాశాలను కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలందరూ సమానంగా ఉన్నప్పుడు స్వేచ్ఛా ఫలాలను వారందరూ అనుభవిస్తారని చెప్పవచ్చు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 34.
స్వేచ్ఛ అనేది సమానత్వంకు ఏ విధంగా అవసరం ?
జవాబు.
సమానత్వానికి స్వేచ్ఛ అవసరం (Liberty is essential for Equality) :

  1. స్వేచ్ఛ అంటే నిరపేక్షమైనది కాదు. దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. కొన్ని నిబంధనలకు లోబడి సామాజిక సంక్షేమాన్ని సాధించేందుకై ఈ స్వేచ్ఛ అందరికీ అందుబాటులో ఉంటుంది.
  2. స్వేచ్ఛ అంటే ఏ ఒక్క వ్యక్తి లేదా వ్యక్తుల సముదాయపు గుత్తాధికారంగా భావించరాదు.
  3.  ఒకానొక వ్యక్తి స్వేచ్ఛను అనుభవించడమనేది ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించేదిగా ఉండకూడదనే ఈ సూత్రాన్ని ఆమోదించారు. సమానత్వ సూత్రాన్ని గౌరవించవలసి ఉంటుంది.

దాని అర్థం స్వేచ్ఛా ఫలాలు సమానత్వమనే వృక్షానికి చెందిన శాఖలలో ఉంటాయని పేర్కొనవచ్చు. కాబట్టి స్వేచ్ఛ, సమానత్వాలు ఒకదానికొకటి పరస్పర పోషకాలుగా భావించడమైంది. సమానత్వ సూత్రం ఆధారంగా స్వేచ్ఛను వర్తింపజేస్తే, స్వేచ్ఛా లక్ష్యం వాస్తవానికి నెరవేరినట్లవుతుంది.

ప్రశ్న 35.
అవకాశాలలో సమానత్వం అంటే ఏమిటి ?
జవాబు.
రాజకీయ సమానత్వం: రాజకీయ సమానత్వం అంటే ప్రజలందరికీ సమాన రాజకీయ అవకాశాలు, రాజకీయ పదవులు, రాజకీయ హోదా కలిగి ఉండడం. ప్రతీ పౌరుడు ఓటు వేసే హక్కు, ఎన్నికలలో పోటీ చేసే హక్కు, ప్రభుత్వ ఉద్యోగం పొందే హక్కు, ప్రభుత్వాన్ని సద్విమర్శ చేసే హక్కు మొదలైనవి అనుభవిస్తాడు. శతాబ్దాలుగా ఈ రకమైన సమానత్వం. కొద్దిమందికే పరిమితమై చాలా మందికి నిరాకరించబడింది. రాజకీయ హక్కులు కేవలం భూస్వాములు, పన్ను కట్టేవారు, విద్యావంతులు మొదలైన వారికే ఉండేవి.

ఆధునిక ప్రజాస్వామ్యం 17, 18వ శతాబ్దంలో అవతరించినప్పటికి 20వ శతాబ్దం వరకు స్త్రీలకు కూడా రాజకీయ హక్కులు నిరాకరించబడినవి. ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చెయ్యాలంటే పౌరులకు రాజకీయ సమానత్వం తప్పనిసరి. రాజకీయ సమానత్వం అనే భావన ప్రజాస్వామ్యం, సార్వజనీన వయోజన ఓటు హక్కు ద్వారా వెల్లడవుతుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 36.
న్యాయాన్ని నిర్వచించండి.
జవాబు.
నిర్వచనాలు :

  1. ప్లేటో : “వ్యక్తి తన పని తాను చేసుకుంటూ, ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే న్యాయం”.
  2. అరిస్టాటిల్ : “న్యాయం అంటే సమాజంలో ప్రతి వ్యక్తీ తన నైతిక బాధ్యతలను నిర్వర్తించడం తప్ప మరేదీకాదు”.
  3. కెఫాలస్ : “న్యాయం అంటే ప్రతి ఒక్కరూ సత్యాన్ని పలకడం, ఇతరులకు ఇవ్వాల్సింది ఇవ్వడం”.

ప్రశ్న 37.
న్యాయం లక్షణాన్ని తెలపండి.
జవాబు.
శాసనం, స్వేచ్ఛ, సమానత్వం భావనలను సమన్వయం చేస్తూ, ఐక్యం చేయటానికే న్యాయం ఉపయోగపడుతుంది. అణగారిన వర్గాల, అసహాయుల అణచివేత, పీడన నుంచి విముక్తి కలిగించటానికే న్యాయం తోడ్పడుతుంది. సమకాలీన ప్రపంచంలో వస్తువులు, సేవలు, అవకాశాలు, లాభాలు, శక్తి, గౌరవం వంటివి న్యాయబద్ధంగా లభించటం అనేది న్యాయం వల్లనే సాధ్యమవుతుంది.

ప్రశ్న 38.
రాజకీయ న్యాయం అంటే ఏమిటి ?
జవాబు.
రాజకీయ న్యాయం (Political Justice) :
రాజకీయ న్యాయం అనేది రాజకీయ సమానత్వాన్ని సూచిస్తుంది. రాజ్యంలోని వయోజనులైన పౌరులకు రాజకీయ హక్కులను ఈ రకమైన న్యాయం ప్రతిపాదిస్తుంది. దేశ పాలనలో పౌరులు స్వేచ్ఛగానూ, నిర్భయంగానూ పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. ఎన్నికల సమయంలో రాజకీయ న్యాయ భావన విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకొంటుంది. రోజువారి పాలనలో పౌరులు చురుకుగా పాల్గొనేందుకు రాజకీయ న్యాయం సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది.

ప్రతి ఒక్కరూ ఇతరులతో పాటుగా సమానులేనని, ఏ ఒక్కరూ ఇతరుల కంటే ఏ విషయంలోనూ అధికులు కారనీ, ఎటువంటి ప్రత్యేకతలు కలిగి ఉండరనే సూత్రంపై ఈ భావన రూపొందింది. రాజ్యంలో రాజకీయ న్యాయం ఉండాలంటే కింద పేర్కొన్న పరిస్థితులు నెలకొనాలి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 39.
సామాజిక న్యాయానికి సంబంధించి నీకేమి తెలుసు ?
జవాబు.
సామాజిక న్యాయం (Social Justice) :
సామాజిక న్యాయం అనేది వ్యక్తుల హక్కులు, సమాజం నియంత్రణల మధ్య చక్కని సమతౌల్యాన్ని నెలకొల్పేందుకు ఉద్దేశించింది. వర్తమాన చట్టాలకు లోబడి వ్యక్తుల న్యాయబద్ధమైన ఆకాంక్షలను నెరవేర్చుకొనేందుకు ఈ రకమైన న్యాయం వీలు కల్పిస్తుంది.

చట్టం దృష్టిలో అందరూ సమానులే అనే సూత్రాన్ని సామాజిక న్యాయం నమ్ముతుంది, సామాజిక అనర్థాలైన పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం, ఆకలి వంటి వాటిని అధిగమించేందుకు సామాజిక న్యాయం హామీ ఇస్తుంది. సమాజంలోని నిమ్నవర్గాలు, బడుగు, బలహీన వర్గాలకు రక్షణ కల్పిస్తుంది. అంతిమంగా వ్యక్తుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తుంది.

ప్రశ్న 40.
శాసనబద్ధ న్యాయం గురించి తెలపండి.
జవాబు.
శాసనబద్ధ న్యాయం : (Legal Justice) :
రాజ్యం రూపొందించిన శాసనాల ద్వారా శాసనబద్ధ న్యాయం గోచరిస్తుంది. ఇది రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా పార్లమెంట్ చట్టం ద్వారా రూపొందించబడుతుంది. ఇది న్యాయ విస్తరణను నిర్ణయిస్తుంది.

ప్రశ్న 41.
న్యాయ భావనపై ప్లేటో అభిప్రాయం.-
జవాబు.
ఇతరుల కార్యకలాపాలలో జోక్యం చేసుకోకుండా ఎవరి పనులు వారే నిర్వహించడం; అదే విధంగా హేతువు, ధీరత్వం, ఇచ్ఛల సమన్వయమే న్యాయం”.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 42.
న్యాయ భావనపై అరిస్టాటిల్ అభిప్రాయం.
జవాబు.
“సమాజంలో ఎవరికి నిర్దేశించిన నైతిక విధులను వారు సక్రమంగా నిర్వహించడమే న్యాయం”.

ప్రశ్న 43.
ప్రక్రియాత్మకమైన న్యాయం గురించి తెలపండి.
జవాబు.
మార్కెట్ ఆర్థిక వ్యవస్థ నియమ, నిబంధనలు మానవుని ప్రవర్తనను నిర్దేశించటానికి నమూనా నిబంధనలుగా ఉంటాయని ప్రక్రియాత్మకమైన న్యాయం పరిగణిస్తుంది. అన్ని రకాల వివక్షతలను వ్యతిరేకిస్తూ, మానవుని మధ్య నైతికతను, సమాన గౌరవాన్ని ప్రక్రియాత్మకమైన న్యాయం అనుమతిస్తుంది. ఎఫ్.ఎ. హాయక్, మిల్టన్ ఫ్రీడ్మన్, నాజిక్ వంటి వారు దీన్ని ప్రతిపాదించిన వారిలో ముఖ్యులు.

ప్రశ్న 44.
స్థిరమైన న్యాయం గురించి తెలపండి.
జవాబు.
స్థిరమైన న్యాయభావన అనేది సామాన్యవాదం ఆలోచనల నుంచి అవతరించింది. సమాజంలోని పేదలు, అణగారిన వర్గాల జీవన ప్రమాణాల పెంపుదలకు తగిన అవకాశాలు పొందేందుకు స్థిరమైన న్యాయం తోడ్పడుతుంది. ఇందులో వనరుల పంపిణీ అనేది ప్రధానాంశం కాగా ప్రక్రియ అనేది ద్వితీయమైనది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 45.
శక్తి అంటే ఏమిటి ?
జవాబు.
వ్యక్తి తన కోరికలను తీర్చుకోవటానికి లేదా లక్ష్యాన్ని సాధించటానికి అతనిలోగల నైపుణ్యతను తెలియజేసేదే శక్తి. ఒక వ్యక్తి లేదా సమూహం వేరే వ్యక్తి లేదా సమూహంపై చూపే ప్రభావాన్ని శక్తి తెలుపుతుంది.

రాబర్ట్ ధాల్ అభిప్రాయంలో “శక్తి అనేది ఒక రకమైన ప్రభావం చూపే భావన, అనంగీకారాన్ని అంగీకరించే విధంగా చేయడానికి ఉపకరించేదే శక్తి”.

ప్రశ్న 46.
అధికారం అంటే ఏమిటి ?
జవాబు.
ఇతరులను ఆదేశించేదే అధికారం. ఉన్నత స్థాయి నుంచీ వచ్చే ఆదేశాన్ని దిగువ స్థాయిలో ఆమోదించటాన్ని అధికారం అంటారు. రాజకీయాలలో శక్తిని ప్రదర్శించటానికి అత్యంత ప్రభావవంతమైన సాధనంగా అధికారం వుంటుంది. అధికారం అనే భావన రెండు ప్రధానమైన రూపాలను కలిగి వుంటుంది. అది శక్తి, శాసనబద్ధత.

ప్రశ్న 47.
శాసనబద్ధత అంటే ఏమిటి ?
జవాబు.
ఒక చట్టం శాసనబద్ధత ద్వారా సమాజంలోని వ్యక్తులతోపాటు అందరికీ ప్రయోజనకరంగా ఉన్నప్పుడు వ్యక్తులు ఆ చట్టాలకు ఇష్టపూర్వకంగానే విధేయత చూపుతారు. ఒకవేళ శక్తి అనేది దేనినైన బలవంతంగా అమలుచేయడాన్ని సూచిస్తే, శాసనబద్ధత అనేది ఇష్టపూర్వకంగా ఆమోదించటాన్ని తెలుపుతుంది.

సమాజంలో శక్తి అనేది ఆదేశం, విధేయతలను వ్యక్తపరుస్తుంది. ఒకవేళ ఆదేశం అనేది సరైన ప్రేరణపై ఆధారపడితే, విధేయత అనేది ఇష్టపూర్వకంగా ఉంటుంది. ఈ సందర్భంలో శక్తి అనేది శాసనబద్ధమై వుంటుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 48.
ఏకధృవ ప్రపంచం అంటే ఏమిటి ?
జవాబు.
ప్రచ్ఛన్న యుద్ధ పరిసమాప్తి తర్వాత అంతర్జాతీయ రాజకీయాలలో అమెరికా ఆధిపత్యాన్ని ఏకధృవ ప్రపంచం అని పేర్కొంటున్నారు. ప్రస్తుత ప్రపంచంలో ఆర్థిక, సైనిక రంగాలలో అమెరికా ప్రథమ దేశంగా కొనసాగుతున్నది. ప్రచ్ఛన్న యుద్ధం సమాప్తం కావడం, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కావడం, అమెరికా శక్తిని, అధికారాన్ని ఎదుర్కొనే మరొక దేశం లేకపోవడం, అమెరికా సైనిక, ఆర్థిక, పారిశ్రామిక, సాంకేతిక రంగాలలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తుండటం మొదలగు కారణాల వలన అమెరికా అధికారానికి తిరుగులేకుండా ఉంది.

ప్రశ్న 49.
రాజ్యంలో శక్తి యొక్క ప్రాథమిక అంశాలు ఏవి ?
జవాబు.

  1. శక్తి అనేది వ్యక్తుల మధ్య లేదా వ్యక్తి సమూహాల మధ్య ఉండే సంబంధం.
  2. మానవ ప్రవర్తనను అదుపులో పెట్టడానికి ఉండే సంబంధం.
  3. వ్యక్తుల మధ్య లేదా వర్గాల మధ్య ఉండే అంతర్గత బంధం.
  4. సమ్మతి, బలాత్కారం ఉన్న అంతర్గత సంబంధం.
  5. స్వాభావిక గుణదోషరహితమైంది శక్తి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 50.
శక్తికి సంబంధించి శ్రేష్ఠ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు.
జవాబు.
శక్తికి సంబంధించి శ్రేష్ఠవర్గ దృక్కోణం 20వ శతాబ్దం ప్రారంభంలో పరెటో, మోస్కా, మిచెల్స్ అనే ముగ్గురు సామాజిక శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

TS Inter 2nd Year Telugu Grammar సంభాషణ రచనా నైపుణ్యం

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material Grammar సంభాషణ రచనా నైపుణ్యం Questions and Answers.

TS Inter 2nd Year Telugu Grammar సంభాషణ రచనా నైపుణ్యం

ఇద్దరు వ్యక్తుల మధ్య మాటల ద్వారా జరిగే భావప్రసారాన్ని ‘సంభాషణ’ అంటారు. మనం రోజూ ఇంట్లోనూ, బయట ఎంతమందితోనో మాట్లాడుతూ ఉంటాం. ఈ మాటల్లో లెక్కలేనన్ని పదాలు దొర్లుతుంటాయి. ఎదుటి వారితో అర్థవంతంగా, గౌరవంతో కూడిన మాటలు మాట్లాడటం ప్రతి ఒక్కరు అభ్యసించాలి. నైపుణ్యంతో మాట్లాడటం ఒక కళ.

సంభాషణ రచన ద్వారా రచనలో నైపుణ్యాలను సాధించవచ్చు. సంభాషణలో నేర్పును సాధించడానికి కింది అభ్యాసాలు అందుకు ఎంతగానో తోడ్పడుతాయి. సూచించిన పదాలను ఆధారం చేసుకొని సందర్భోచితంగా వ్యక్తుల మధ్య సంభాషణ రాయాల్సి ఉంటుంది. సంభాషణలో వ్యవహారిక భాషలో వాడే ఇతర భాషా పదాలు కూడా వాడవచ్చు. సందర్భోచితంగా వాడే జాతీయాలు, సామెతలు, పదబంధాలు సంభాషణలను ఆసక్తికరంగా మారుస్తాయి.

ప్రశ్న 1.
కాలిదెబ్బలకు వైద్యం కోసం వెళ్ళినపుడు వైద్యునితో సంభాషణ.
(క్రికెట్ ఆడటం – దెబ్బ తగలడం – నొప్పి – ఫస్ఎయిడ్ – మందులు – కాపడం – పథ్యం)
జవాబు:
విద్యార్థి  :  నమస్తే డాక్టర్ !
డాక్టర్  :  నమస్తే సురేశ్ ! ఎలా ఉన్నావు ? కుంటుతున్నావెందుకు ?
విద్యార్థి :  మా కళాశాలలో క్రికెట్ ఆడుతుంటే కాలిబొటన వేలికి దెబ్బ తగిలింది.
డాక్టర్  :  రక్తం ఏమైనా పోయిందా ? ఫస్ట్ ఎయిడ్ ఏమైనా చేశారా !
విద్యార్థి  :  చాలా రక్తం పోయింది. బాగా నొప్పిగా ఉంది డాక్టర్ ! దెబ్బ తగలగానే మా టీచర్ శుభ్రంగా కడిగి పసుపు పెట్టి ఫస్ట్ ఎయిడ్ చేసింది.
డాక్టర్  :  భేష్ పసుపు పెట్టి మీ టీచరు మంచి పని చేసింది. లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చేది.
విద్యార్థి  :  అవును డాక్టర్ ! నా మోకాలు బాగా కమిలి పోయింది. మా అమ్మ కాలికి వేడినీళ్ళతో కాపడం కూడా పెట్టింది.
డాక్టర్  :  మంచి పనిచేసింది సురేశ్ ! దెబ్బను ప్రతిపూటా డెట్టాల్ నీళ్ళతో కడగాలి. నేనిచ్చే మందు పెట్టు, దుమ్ము తగలనీయకు.
విద్యార్థి  :  ఏమైనా పథ్యం చెయ్యాలా డాక్టర్ ?
డాక్టర్  :  అవసరం లేదు. బలమైన ఆహారం తీసుకో !
విద్యార్థి  :  సరే డాక్టర్ ! నమస్కారం.

TS Inter 2nd Year Telugu Grammar సంభాషణ రచనా నైపుణ్యం

ప్రశ్న 2.
ఆదాయ పత్రం జారీ కొరకు విజ్ఞాపన చేయడానికి వెళ్ళినపుడు అధికారితో సంభాషణ. *(M.P.)
(ఆదాయపత్రం – దరఖాస్తు – జతపరుచు – తహశీల్దార్ – ఉపకారవేతనం)
జవాబు:
విద్యార్థి  :  తహశీల్దార్ సర్ నమస్కారం ! నా పేరు శ్రీరాం.
అధికారి  :  నమస్తే చెప్పు బాబూ, ఏ పనిమీద వచ్చావు ?
విద్యార్థి  :  ఆదాయపత్రం కొరకు దరఖాస్తు చేసుకుందామని వచ్చాను సార్ !
అధికారి  :  దరఖాస్తు తెచ్చావా ! వివరాలు అన్నీ ఉన్నాయా ?
విద్యార్థి  :  ఉన్నాయి సర్! సంబంధిత పత్రాలన్నీ జతపరిచాను. ఈ ఆదాయ పత్రం నాకెంతో ఉపయోగపడుతుంది సర్.
అధికారి  :  ఉపకార వేతనం ఏ రకంగా ఉపయోగిస్తావు శ్రీరాం.
విద్యార్థి  :  ఉపకార వేతనంతో పుస్తకాలు, దుస్తులు ఇతర వస్తువులు కొనడానికి తల్లిదండ్రులపై ఆధారపడే ఇబ్బంది ఉండదు సర్.
అధికారి  :  మంచిది ! నేను కూడా ఉపకార వేతనం సాయంతోనే ఎమ్.ఎ. వరకు చదివాను.
విద్యార్థి  :  అలాగా సర్ ! మరి ఆదాయపత్రం ఎప్పుడు ఇస్తారు ?
అధికారి  :  రెండు రోజుల్లో.
విద్యార్థి  :  ధన్యవాదాలు సర్ !

TS Inter 2nd Year Telugu Grammar సంభాషణ రచనా నైపుణ్యం

ప్రశ్న 3.
బోనఫైడ్ సర్టిఫికెట్ కొరకు విజ్ఞప్తి చేయడానికి వెళ్ళినపుడు ప్రిన్సిపాల్తో సంభాషణ.
(ఎన్.సి.సి లో ప్రవేశం – కవాతు – ఆత్మవిశ్వాసం – ధన్యవాదాలు)
జవాబు:
విద్యార్థిని  :  నమస్తే సర్ !
ప్రిన్సిపాల్  :  నమస్తే ! చెప్పమ్మా సుప్రజా ! ఏం కావాలి !
విద్యార్థిని  :  సర్ బోనఫైడ్ సర్టిఫికెట్ కొరకు వచ్చాను సర్.
ప్రిన్సిపాల్  :  దరఖాస్తు తెచ్చావా! సర్టిఫికెట్ దేనికి అమ్మా !
విద్యార్థిని  :  దరఖాస్తు ఇదిగో సర్ ! ఎన్.సి.సి లో చేరాలంటే నేను మన కళాశాల విద్యార్థిని అని సర్టిఫికెట్ కావాలి.
ప్రిన్సిపాల్  :  ఎన్.సి.సిలో చేరాలని ఎందుకనుకుంటున్నావు ?
విద్యార్థిని  :  నాకు కవాతు, రైఫిల్ ఘాటింగ్ అంటే చాలా ఇష్టం.
ప్రిన్సిపాల్  :  అంతేకాదు నీకు ఎన్.సి.సిలో ‘బి’ సర్టిఫికెట్ ఉంటే పై చదువుల్లో సీట్లలో, ఉద్యోగాలలో కూడా ప్రాధాన్యం ఇస్తారు.
విద్యార్థిని  :  అవును సర్ ! మా నాన్నగారు ఎన్.సి.సిలో చేరమన్నారండి.
ప్రిన్సిపాల్  :  మంచిది ఎన్.సి.సి వల్ల నీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. మధ్యాహ్న సమయంలో సర్టిఫికెట్ తీసుకోమ్మా.
విద్యార్థిని  :  అట్లాగే సర్ ! ధన్యవాదాలు.

TS Inter 2nd Year Telugu Grammar సంభాషణ రచనా నైపుణ్యం

ప్రశ్న 4.
పత్రికా విలేకరితో కళాశాల ఉత్సవం గురించి ఫోన్లో వివరించే సంభాషణ.
(కళాశాల వార్షికోత్సవం – కలం, కాగితం ముఖ్య అతిథి ఉపన్యాసం – ఉత్తేజకరం – బహుమతులు – పాటలు – నృత్యాలు.)
జవాబు:
వందన  :  నమస్తే రమణ సర్ ! నా పేరు వందన నేను ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినిని మాట్లాడుతున్నాను.
రమణ  :  నమస్తే వందనా ! నిన్న మీ కళాశాలలో వార్షికోత్సవం జరిగిందట కదా ?
వందన  :  అవును సర్ ! ఆ విషయమే మీకు వివరిద్దామని ఫోన్ చేశాను సర్.
రమణ  :  ఒక నిముషం ఆగమ్మా ! కాగితం, కలం తీసుకుంటాను…. ఇంక చెప్పమ్మా !
వందన  :  నిన్న మా కళాశాల వార్షికోత్సవం వైభవంగా జరిగింది. జూనియర్ కళాశాలల జిల్లా అధికారి ముఖ్య అతిథిగా వచ్చాడు.
రమణ  :  అవునా ! ముఖ్య అతిథి ఏమని ఉపన్యసించాడో చెప్పగలవా ?
వందన  :  మా జిల్లా అధికారి సత్యనారాయణ రెడ్డి ఉపన్యాసం చాలా ఉత్తేజకరంగా సాగింది. జీవితలక్ష్యం కొరకు కృషి, సాధన, ఏకాగ్రత గురించి వివరించాడు.
రమణ  :  బాగుంది వందనా ! ఇంకా వివరాలు చెప్పమ్మా!
వందన  :  వార్షికోత్సవం సందర్భంగా ఆటలపోటీలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
రమణ  :  ఏయే సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినవి ?
వందన  :  ఒక నాటిక, నృత్యాలు, పాటలు, హాస్యసంభాషణలు, ధ్వన్యనుకరణ, అనుకరణ మొదలైన అంశాలతో రెండు గంటలపాటు కార్యక్రమాలు జరిగాయి. అందరికీ బాగా నచ్చాయి. ఫోటోలు ఈమెయిల్ చేస్తాను సర్ ! రేపటి మీ పత్రికలో ఫోటోలు వివరాలు ప్రచురిస్తారా ?
రమణ  :  తప్పకుండానమ్మా ! మంచిదమ్మా !
వందన  :  ధన్యవాదాలు సర్ !

TS Inter 1st Year Telugu Grammar సంధులు

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material Grammar సంధులు Questions and Answers.

TS Inter 1st Year Telugu Grammar సంధులు

సంధి అనే పదానికి కూడిక, కలయిక, చేరిక అనే అర్థాలున్నాయి. వ్యాకరణ శాస్త్ర వ్యవహారాల్లో సంధి అనగా, ఉచ్చారణ సౌకర్యం కొరకు జరిగిన వర్ణసంయోగమని చెప్పవచ్చును.

‘పూర్వపరస్వరంబులకు పరస్వరం బేకాదేశంబగుట సంధి యనంబడు’ అని చిన్నయ సూరి సంధిని నిర్వచించాడు.

సంధిలో రెండు పదాలుంటాయి. మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని పరపదమని అంటారు. పూర్వపదం చివరి అచ్చును పూర్వస్వరమని, పరపదం మొదటి అచ్చును పరస్వరమని అంటారు.

రెండు పదాలు కలిసినపుడు పూర్వపదం చివరి అచ్చునకు పరపదం తొలి అచ్చునకు మారుగా పరస్వరమే నిలుచుట సంధి అనబడుతుంది.

సంధులు రెండు రకాలు.

  1. సంస్కృత సంధులు
  2. తెలుగు సంధులు.

సంస్కృత పదాలకు చేసే సంధి విధానాన్ని సంస్కృత సంధులుగా, తెలుగు పదాలకు సంధి చేసే విధానాన్ని తెలుగు సంధులుగా పేర్కొంటారు

1. సంస్కృత సంధులు:
(ఎ) సవర్ణదీర్ఘ సంధి:
అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాచ్చులు పరమైనపుడు వాటి దీర్ఘాలు ఏకాదేశమగును. సమానంగా ఉచ్చరించబడే వర్ణాలు సవర్ణాలు. అంటే ఒకే ఉచ్చారణ స్థానం నుండి పలుకబడే వర్ణాలను ‘సవర్ణాలు’ అంటారు. అఆ, ఇఈ, ఊ, ఋబూ…. మొదలైనవి సవర్ణాలు

ఉదా:

  • విద్య + అర్థులు = విద్యార్థులు (అ + అ = ఆ)
  • ధరణి + ఈశ = ధరణీశ (ఇ + ఈ = ఈ)
  • గురు + ఉపదేశం = గురూపదేశం (ఉ + ఉ = ఊ)
  • పితౄ + ఋణం = పితౄణం (ఋ + ఋ = బూ)

TS Inter 1st Year Telugu Grammar సంధులు

(బ) గుణసంధి:
అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైనపుడు క్రమంగా ఏ, ఓ, అర్ లు ఏకాదేశమగును. సంస్కృతంలో ఏ, ఓ, అర్ అనువాటికి ‘గుణాలు’ అని పేరు. ఇవి ఆదేశంగా వస్తాయి కాబట్టి ఈ సంధికి ‘గుణసంధి’ అని పేరు.

ఉదా:

  • దేవ + ఇంద్రుడు = దేవేంద్రుడు (అ + ఇ = ఏ)
  • పర + ఉపకారము = పరోపకారము (అ + ఉ = ఓ)
  • దేవ + ఋషి = దేవర్షి (అ + ఋ= అర్)

(సి) వృద్ధి సంధి:
అకారమునకు ఏ, ఐ లు పరమైనపుడు ‘ఐ’కారం; ఓ, ఔలు పరమైనపుడు ‘ఔ’కారం ఏకాదేశమగును.
సంస్కృతంలో ఐ, ఔ లకు ‘వృద్ధులు’ అని పేరు. ఇవి ఏకాదేశంగా వస్తాయి కాబట్టి ఈ సంధికి ‘వృద్ధి సంధి’ అని పేరు.
ఉదా:

  • లోక + ఏక = లోకైక ఆ (అ + ఏ = ఐ)
  • దేశ + ఐక్యత వ దేశైక్యత (అ + ఐ = ఐ)
  • మహా + ఓఘం = మహౌఘం (ఆ + ఓ= ఔ)
  • దివ్య + ఔషధం దివ్యౌషధం (అ + ఔ + ఔ)

TS Inter 1st Year Telugu Grammar సంధులు

(డి) యణాదేశ సంధి:
ఇ, ఉ, ఋ లకు అసవర్ణములైన అచ్చులు పరమగునపుడు క్రమంగా య, వ, ర లు ఏకాదేశమగును.
య, వ, ర లకు సంస్కృతంలో ‘యణు &ణలులు’ అని పేరు. ఇవి ఆదేశంగా వస్తాయి కాబట్టి ఈ సంధికి యణాదేశ సంధి అని పేరు.

ఉదా:

  • ఆది + అక్షరం = ఆద్యక్షరం (ఇ + అ = య)
  • గురు + ఆజ్ఞ = గుర్వాజ్ఞ (ఉ + ఆ = వ)
  • పితృ + ఆర్జితం = పిత్రార్జితం (బు + ఆ = ర)

2. తెలుగు సంధులు :

(ఎ) అత్వసంధి :
అత్తునకు సంధి బహుళముగానగు.
హ్రస్వమైన అకారాన్ని ‘అత్తు’ అంటారు. బహుళమనగా సంధి నాలుగు రూపాల్లో ఉండటం.

  1. నిత్యం
  2. నిషేధం
  3. వైకల్పికం
  4. అన్యవిధం.

ఉదా:

  1. రామ + అయ్య = రామయ్య
  2. అమ్మ + ఇచ్చెను = అమ్మయిచ్చెను
  3. పుట్టిన + ఇల్లు = పుట్టినిల్లు, పుట్టినయిల్లు
  4. ఒక + ఒక = ఒకానొక

TS Inter 1st Year Telugu Grammar సంధులు

(బి) ఇత్వసంధి: (i) ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగానగు.
ఏమి, మణి, కి(షష్ఠి), అది, అవి, ఇది, ఇవి, ఏది, ఏవి మొదలైనవి ఏమ్యాదులు. ఇత్తు అనగా హ్రస్వమైన ఇకారము. వికల్పమనగా సంధి రెండు రూపాల్లో ఉండటం.

  1. సంధి జరిగిన రూపం
  2. సంధి జరగని రూపం.

ఉదా:

  1. ఏమి + అంటివి = ఏమంటివి, ఏమియంటివి
  2. మఱి + ఏమి = మతేమి, మఱియేమి

(ii) క్రియా పదంబులందిత్తునకు సంధి వైకల్పికముగానగు.
క్రియా పదంలోని హ్రస్వ ఇకారానికి అచ్చు పరమైనపుడు సంధి వైకల్పికమని సూత్రార్థం.

ఉదా:

  1. వచ్చిరి + అప్పుడు = వచ్చినప్పుడు, వచ్చిరియప్పుడు
  2. వచ్చితిమి + ఇప్పుడు = వచ్చితిమిప్పుడు, వచ్చితిమియిప్పుడు

(సి) ఉకార సంధి:
ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు.
ఉదా: సోముడు + ఇతడు = సోముడితడు

(డి) యడాగమ సంధి: సంధి లేనిచోట స్వరంబుకంటెఁ బరంబయిన స్వరంబునకు యడాగమంబగు.

ఉదా:

  1. మా + అమ్మ = మా + య్ + అమ్మ = మాయమ్మ
  2. మీ + ఇల్లు = మీ + య్ + ఇల్లు = మీయిల్లు

TS Inter 1st Year Telugu Grammar సంధులు

(ఇ) గసడదవాదేశ సంధి:
ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళముగానగు.

ఉదా:

  1. వాడు + కొట్టె = వాడుగొట్టె, వాడుకొట్టే
  2. అప్పుడు + చనియె = అప్పుడుసనియె, అప్పుడుచనియె
  3. నీవు + టక్కరివి = నీవుడక్కరివి, నీవుటక్కరివి
  4. నీవు తప్ప = నీవుదప్ప, నీవు తప్ప
  5. వారు + పోరు = వారు వారు, వారు పోరు

కళలైన క్రియాపదముల మీద సహితం పరుషములకు గసడదవలు వస్తాయి.

  1. రారు + కదా = రారుగదా, రారుకదా
  2. వత్తురు + పోదురు = వత్తురు వోదురు, వత్తురుపోదురు.

(ఎఫ్) ద్రుత ప్రకృతిక సంధి (సరళాదేశ సంధి):

(i) ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
ద్రుతమనగా ‘న’కారము. ద్రుత ప్రకృతికము అనగా ‘న’కారము చివరన కలది. మొదటి పదం చివర ద్రుతం ఉండి, రెండో పదం మొదట పరుషం ఉంటే, పరుషం స్థానంలో సరళం ఆదేశమవుతుంది.

ఉదా:

  1. పూచెను + కలువలు = పూచెను గలువలు
  2. తోచెను + చుక్కలు = తోచెనుజుక్కలు
  3. చేసెను + టక్కులు = చేసెనుడక్కులు
  4. పాలను + తాగెను = పాలను దాగెను
  5. మొగిడెను + పద్మము = మొగిడెనుబద్మము.

TS Inter 1st Year Telugu Grammar సంధులు

(ii) ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషములు విభాషనగు.
ఆదేశ సరళమనగా మొదటి సూత్రం ప్రకారం పరుషముల స్థానంలో వచ్చిన సరళం. కొన్నిసార్లు ద్రుతముగా మొదటి పదం చివరనున్న ‘ను’ అనుదానికి నిండుసున్న (0), అరసున్న (c) లేదా సంశ్లేషరూపం (ద్రుతం పక్క హల్లుతో కలసిన రూపం) వస్తుంది. సంధి జరిగి ఈ కింది రూపాలు ఏర్పడతాయి.

ఉదా:
పూచెను + కలువలు
= పూచెను గలువలు (మొదటి సూత్రం ప్రకారం)
= పూచెంగలువలు (పూర్ణ బిందువు)
= పూచెంగలువలు (అర్ధ బిందువు)
= పూచెన్గలువలు (సంశ్లేషము)

TS Inter 2nd Year Telugu Grammar సంక్షిప్తీకరణ

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material Grammar సంక్షిప్తీకరణ Questions and Answers.

TS Inter 2nd Year Telugu Grammar సంక్షిప్తీకరణ

ఇటీవల రచనల్లో సంక్షిప్తీకరణకు ప్రాధాన్యత పెరిగిపోయింది. పెద్ద పెద్ద పేరాలలో ఉండే విషయాలను కుదించి మొత్తం విషయాన్ని క్లుప్తంగా చెప్పడం రాతనైపుణ్యాలలో ఒక అంశంగా చెప్పుకుంటున్నాం. మూలంలోని అంశం ప్రతిబింబించేలా తక్కువ పదాల్లో భావాన్ని వ్యక్తీకరించడమే సంక్షిప్తీకరణ. విద్యార్థులలో ఈ నైపుణ్యాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో దీనిని ఒక అంశంగా చేర్చాం.

ప్రశ్న 1.
తెలంగాణా ప్రాంతంలో ఊరూర ఉద్ధండులైన సంస్కృతాంధ్ర పండితులున్నప్పటికిని వారు సభలలో సమావేశమై పరస్పర అవగాహన చేసుకునే అవకాశాలు బొత్తిగా లేకుండెను. రాజభాషయైన ఉర్దూ, ప్రాథమిక దశ నుంచి విశ్వవిద్యాలయ దశవరకు బోధనాభాష కావడంవల్ల తెలుగు భాషాభివృద్ధికి గొప్ప సంకట పరిస్థితి యేర్పడినది. ఆ రోజులలో హైదరాబాదు రాష్ట్రం ఒక ప్రత్యేకమైన ద్వీపకల్పముగా సిద్ధమై అక్కడ నివసించే ప్రజలను ఇతర ప్రపంచము నుండి వేరు చేసినది. అందుచేత గత శతాబ్దమునుంచి భారత స్వాతంత్య్ర ప్రాప్తివరకు అక్షరాస్యులైన ప్రజల సంఖ్య మిక్కిలి తక్కువగా ఉండెను. సంస్కృతాంధ్ర పండితులు కవులు గ్రాసవాసోదైన్యానికి గురియై పల్లెటూళ్ళలో కృశించిరి. కొద్దిమంది ఉర్దూ, ఫారసీ భాషలతో పరిచయం చేసుకొని ప్రభుత్వ ఆశ్రయముతో తమ పనులను నెరవేర్చుకొనిరి. ఈ విధంగా తెలుగు భాషా వికాసానికి తెలంగాణా ప్రాంతంలో గ్రహణము పట్టినది.
జవాబు:
సంక్షిప్తరూపం :
తెలంగాణ ప్రాంతంలో సంస్కృతాంధ్ర పండితులున్నప్పటికి సభలకు అవకాశాలు లేకుండేది. ఉర్దూ రాజభాషగా, బోధనాభాషగా ఉండటం వల్ల తెలుగు భాషాభివృద్ధికి సంకట స్థితి ఏర్పడింది. ఆ రోజులలో హైదరాబాదు రాష్ట్రంలో భారత స్వాతంత్ర్యప్రాప్తి వరకు అక్షరాస్యత తక్కువగా ఉండేది. కొందరు సంస్కృతాంధ్ర పండితులు, కవులు పల్లెటూళ్ళలో కృశించిపోతే, మరికొందరు రాజభాషను నేర్చుకొని తమ పనులు నెరవేర్చుకొన్నారు.

TS Inter 2nd Year Telugu Grammar సంక్షిప్తీకరణ

ప్రశ్న 2.
ఇక నేను తెలుగు సాహిత్య రంగంలో చేసిన పరిశోధన గురించి సంగ్రహంగా మనవి చేస్తాను. హైస్కూలు విద్యార్ధిగా ఉండినప్పటినుంచే భారతి తదితర పత్రికల్లో మానవల్లి, వేటూరి, నిడుదవోలు, ఈయుణ్ణి, మల్లంపల్లి వంటి పరిశోధకుల వ్యాసాలు, వారు సంపాదించిన గ్రంథాల పీఠికలు చదవటంచేత వారివలె ఇంతవరకు సాహిత్యలోకానికి తెలియని క్రొత్త విషయాలు చెప్పవలెననే నిశ్చయంతో పరిశోధన రంగంలో అడుగు పెట్టినాను. జానపద విజ్ఞానంలో విశ్వవిద్యాలయ స్థాయి పరిశోధనలో తెలుగులోనే కాదు దక్షిణభారతదేశ భాషలన్నిటిలో నా తెలుగు జానపదగేయ సాహిత్యము మొదటి సిద్ధాంత గ్రంథమైనది. ఆ రంగంలో అనేక జానపదగేయ సంకలనాలు ప్రకటించినాను. తెలుగులోను ఇంగ్లీషులోను జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పదులకొలది పరిశోధనాత్మకపత్రాలు చదివినాను. ఇంగ్లీషులో ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ.పి., ఫోక్లోర్ ఆఫ్ ఏ.పి., సౌత్ ఇండియన్ ఫోక్ సాంగ్స్, గ్లింప్సెస్ ఇంటూ తెలుగు ఫోక్లోర్ గ్రంథాలు ప్రకటించినాను.
జవాబు:
సంక్షిప్తరూపం :
హైస్కూల్ విద్యార్థిగా ఉన్నప్పటినుండే భారతిలాంటి పత్రికల్లో మానవల్లి, వేటూరి, నిడుదవోలు, మల్లంపల్లి వంటి వాళ్ళ వ్యాసాలు చదివాను. అందువల్ల కొత్త సాహిత్య విషయాలు చెప్పాలని పరిశోధక రంగంలో అడుగుపెట్టాను. దక్షిణ భారతదేశ భాషల్లోనే నా తెలుగు జానపదగేయ సాహిత్యం మొదటి సిద్ధాంత గ్రంథం. తెలుగు, ఆంగ్లంలో జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో ఎన్నో పరిశోధక పత్రాలు చదివాను. ఆంగ్లంలో ‘ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ.పి., ఫోక్ లోర్ ఆఫ్ ఏ.పి., సౌత్ ఇండియన్ ఫోక్ సాంగ్స్, గ్లింప్సెస్ ఇంటూ తెలుగు ఫోక్లోలోర్ గ్రంథాలు ప్రకటించాను.

TS Inter 2nd Year Telugu Grammar సంక్షిప్తీకరణ

ప్రశ్న 3.
ప్రకృతిసిద్ధంగా జరిగే పరిణామక్రమంలో ప్రకృతి చేసుకునే ఎంపిక గురించి చార్లెస్ డార్విన్ వివరిస్తూ మానవజాతి ఆవిర్భావం గురించి విభిన్నంగా ఆలోచించేటట్టు చేశాడు. విద్యుచ్ఛక్తి కనుగొనడం ద్వారా థామస్ ఆల్వా ఎడిసన్ సైన్సుకూ, టెక్నాలజీకి చెందిన ప్రతి రంగాన్ని సమూలంగా మార్చివేశాడు. దక్షిణాఫ్రికాలో జాతి విచక్షణతకు వ్యతిరేకంగా తన అహింసా ధర్మ ఉద్యమాన్ని ప్రారంభించిన మహాత్మాగాంధీ అహింస ద్వారా భారతదేశాన్ని బ్రిటిష్ పాలననుండి విడిపించి స్వాతంత్ర్యాన్ని సంపాదించాడు. 20వ శతాబ్దానికి చెందిన ఈ మూడు ప్రధాన సంఘటనలు సృజనాత్మక ఆలోచనల ఫలితాలు. *(M.P.)
జవాబు:
సంక్షిప్తరూపం :
ప్రకృతిసిద్ధమైన పరిణామక్రమాన్ని చార్లెస్ డార్విన్ మనం విభిన్నంగా ఆలోచించేటట్టు చేశాడు. విద్యుచ్ఛక్తి కనుగొని థామస్ ఆల్వా ఎడిసన్ సైన్స్ & టెక్నాలజీని మొత్తం మార్చేశాడు. అహింసా ఉద్యమాన్ని మహాత్మాగాంధీ ఉపయోగించి బ్రిటీషువారిని భారతదేశం నుండి పంపించేశాడు. ఈ మూడు 20వ శతాబ్దపు సృజనాత్మక ఆలోచనల ఫలితాలు.

TS Inter 2nd Year Telugu Grammar భాషాభాగములు

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material Grammar భాషాభాగములు Questions and Answers.

TS Inter 2nd Year Telugu Grammar భాషాభాగములు

భాషా భాగములు : తెలుగు భాషలోని శబ్దాలన్నీ ప్రధానంగా, ఐదురకాలైన భాషాభాగాలతో కూడి యుంటాయి. భాషలోని భాగాలే భాషాభాగాలు. ఇవి ప్రధానంగా ఐదు రకాలు.

  1. నామవాచకం
  2. సర్వనామం
  3. విశేషణం
  4. క్రియ
  5. అవ్యయం

1. నామవాచకం :
‘నామం’ అంటే పేరు. పేర్లను తెలియజేసే భాషా పదాలు, ‘నామవాచకాలు’. నామవాచకానికి, ‘విశేష్యం’ అని పేరు కూడా ఉంది.
ఉదా :
రాము, రఘ, వరంగల్, నల్లగొండ, కూచిపూడి, భద్రాచలం, వనిత, కవిత మొదలయినవి నామవాచకములు.

వాక్యరూప ఉదాహరణలు :

  1. రాము కళాశాలకు వెళ్ళాడు. – (‘రాము’ అనేది నామవాచకం)
  2. వరంగల్ పెద్ద పట్టణం – (వరంగల్ అనేది నామవాచకం)
  3. వనిత, కవిత అక్కా చెల్లెళ్ళు – (వనిత, కవిత అనే పదాలు నామవాచకాలు)
  4. భద్రాచలం గొప్ప పుణ్యక్షేత్రం – (‘భద్రాచలం’ అనేది నామవాచకం)
  5. కూచిపూడి నాట్యం గొప్పది – (‘కూచిపూడి’ అనేది నామవాచకం)

TS Inter 2nd Year Telugu Grammar భాషాభాగములు

2. సర్వనామం :
నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం.
ఉదా :
వాడు, వీడు, అతడు, ఆమె, ఇతడు, ఈమె, ఎన్ని, ఇన్ని, కొన్ని, మీరు, మనం, మేము, అన్ని, వారు, వీరు, ఎవరు, ఏది మొదలయినవి సర్వనామాలు.

వాక్యరూప ఉదాహరణలు :

  1. ఈ పని ఎవడు చేస్తాడో అతడే గొప్పవాడు. – (‘అతడే’ సర్వనామం)
  2. అతడు శ్రీరాముడు. – (‘అతడు’ సర్వనామం)
  3. వీడు అబద్దాల కోరు. – (‘వీడు’ సర్వనామం)
  4. ఆమె సౌందర్యవతి. – (‘ఆమె’ సర్వనామం)
  5. మనం భారతీయులం. – (‘మనం’ సర్వనామం)

3. విశేషణం :
నామవాచకం, సర్వనామాల గుణాలను తెలియజేసేవి ‘విశేషణాలు’.
ఉదా :
నల్లని, తెల్లని, మనోహరమైన, సరసమైన, పచ్చని, పుల్లని, తియ్యని మొదలయినవి విశేషణాలు.

వాక్యరూప ఉదాహరణలు :

  1. శ్రీజ మంచి తెలివిగల పిల్ల. – (‘మంచి’ విశేషణము)
  2. స్వాతి అందమైన పాప. – (‘అందమైన’ విశేషణము)
  3. కృష్ణుడు నల్లని వాడు. – (‘నల్లని’ విశేషణము)
  4. మాధవి మనోహరమైన స్త్రీ. – (‘మనోహరమైన’ అనేది విశేషణము)
  5. శ్రీనివాసుడు ధనవంతుడు. – (‘ధనవంతుడు’ విశేషణము)

TS Inter 2nd Year Telugu Grammar భాషాభాగములు

4. క్రియ :
చేసే పనిని తెలియజేసే పదాన్ని ‘క్రియ’ అంటారు.
ఉదా :
కొట్టు, తిట్టు, తిను, వెళ్ళు, చూచు, నిద్రించు, మాట్లాడు, నడుచు మొదలయినవి క్రియలు.

వాక్యరూప ఉదాహరణలు :

  1. రాముడు రావణుని సంహరించాడు. – (‘సంహరించాడు’ అనేది క్రియ)
  2. వాల్మీకి రామాయణం రచించాడు. – (‘రచించాడు’ అనేది క్రియ)
  3. రాము గ్రంథాలయానికి వెళ్ళాడు. – (‘వెళ్ళాడు’ అనేది క్రియ)
  4. మాధవరావు నాతో మాట్లాడుతున్నాడు. – (‘మాట్లాడుతున్నాడు’ అనేది క్రియ)
  5. సుప్రజ నిద్రిస్తుంది. – (‘నిద్రిస్తుంది’ అనేది క్రియ)

5. అవ్యయం :
లింగ, విభక్తి, వచనం లేని శబ్దములను ‘అవ్యయాలు’ అంటారు.
ఉదా :
అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు, ఔరా, ఆహా, అయ్యో, ఊరక, మిన్నక, అక్కడ, ఇక్కడ, ఎక్కడ, అచట, ఇచట, ఎచట – మొదలయినవి అవ్యయాలు.

వాక్యరూప ఉదాహరణలు :

  1. ఎక్కడ ఆరోగ్యం వుంటుందో అక్కడ సంపద వుంటుంది. – (ఎక్కడ, అక్కడ అనేవి అవ్యయాలు)
  2. మా అమ్మ అప్పుడు చెప్పిన పనిని ఇప్పుడు చేస్తున్నాను. – (‘అప్పుడు అవ్యయం’)
  3. బంగారు లేడిని చూచి సీత ఆహా ! అనుకుంది. – (‘ఆహా’ అనేది అవ్యయం)

TS Inter 2nd Year Telugu Grammar భాషాభాగములు

గమనిక :
భాషాభాగాలపై ఈ అభ్యాసములోని ప్రశ్నలలో నుండి ఐదు ప్రశ్నలు పరీక్షలలో ఇస్తారు. ఐదు జవాబులకూ, ఐదు మార్కులు. మీకు ఈ అభ్యాసంలో 12 ప్రశ్నలు ఉన్నాయి. వీటి నుండే, మీకు పేపర్లో ప్రశ్నలు వస్తాయి. కాబట్టి, శ్రద్ధగా చదువండి. ఐదుకి ఐదుమార్కులు పొందండి.

అభ్యాసం

ప్రశ్న 1.
అవ్యయానికి ఒక ఉదాహరణ ఇవ్వండి ? *(M.P)
జవాబు:
ఎక్కడ ఆరోగ్యం ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది.
పై వాక్యంలోని ఎక్కడ, అక్కడ అనేవి అవ్యయాలు.

ప్రశ్న 2.
‘ఎప్పుడు’ అన్నది ఏ భాషాభాగం ? *(M.P)
జవాబు:
‘ఎప్పుడు’ అన్నది, ‘అవ్యయము’ అనే భాషాభాగము.

ప్రశ్న 3.
సర్వనామాల గుణాలను తెలియజేసే వాటిని ఏమంటారు ?
జవాబు:
సర్వనామాల గుణాలను తెలియజేసే పదాలను ‘విశేషణం’ అంటారు.

ప్రశ్న 4.
‘శ్రీజ మంచి తెలివిగల పిల్ల’ వాక్యంలోని విశేషణం ఏమిటి ?
జవాబు:
పై వాక్యంలో ‘మంచి’ అనే శబ్దము, ‘విశేషణము’.

TS Inter 2nd Year Telugu Grammar భాషాభాగములు

ప్రశ్న 5.
‘స్వాతి అందమైన అమ్మాయి’ వాక్యంలో అందమైన అన్నది ఏ భాషాభాగం ?
జవాబు:
ఈ వాక్యంలోని ‘అందమైన’ అనే శబ్దము, ‘విశేషణం’ అనే భాషాభాగం అవుతుంది.

ప్రశ్న 6.
‘వీడు అబద్ధాల కోరు’ వాక్యంలోని ‘వీడు’ అన్నది ఏ భాషాభాగం ? *(M.P)
జవాబు:
ఈ వాక్యంలోని ‘వీడు’ అనేది సర్వనామం.

ప్రశ్న 7.
‘రాము గ్రంథాలయానికి వెళ్ళాడు’ వాక్యంలోని క్రియ ఏమిటి ? *(M.P)
జవాబు:
ఈ వాక్యంలోని క్రియ ‘వెళ్ళాడు’ అనే శబ్దము.

ప్రశ్న 8.
‘రాముడు రావణుని సంహరించాడు’ వాక్యంలో ‘సంహరించాడు’ అన్నది ఏ భాషాభాగం ?
జవాబు:
ఈ వాక్యంలో ‘సంహరించాడు’ అనేది ‘క్రియ’.

ప్రశ్న 9.
భాషాభాగములు ఎన్ని రకాలు ?
జవాబు:
భాషాభాగములు ఐదు రకాలు.

ప్రశ్న 10.
నామవాచకానికి గల మరో పేరు ఏమిటి ? *(M.P)
జవాబు:
నామవాచకానికి గల మరో పేరు, ‘విశేష్యము’.

TS Inter 2nd Year Telugu Grammar భాషాభాగములు

ప్రశ్న 11.
‘సర్వనామం’ అనగానేమి ?
జవాబు:
నామవాచకానికి బదులు వాడబడే శబ్దాన్ని ‘సర్వనామం’ అంటారు.

ప్రశ్న 12.
‘అతడు శ్రీరాముడు’ వాక్యంలో ‘అతడు’ అన్నది ఏ భాషాభాగం ?
జవాబు:
‘అతడు’ అనేది, ‘సర్వనామము’.

TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material Grammar ఛందస్సు Questions and Answers.

TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

పద్య లక్షణాలను తెలిపేది ఛందస్సు. లయ ప్రాధాన్యత ఛందస్సులో అంతర్గతంగా వుంటుంది. గణాల కూర్పుతో పద్యపాదాలు ఏర్పడతాయి. ఆ గణాలు గురు లఘువులతో కలిసి ఉంటాయి.

  1. లఘువు : ఒక మాత్ర కాలంలో పలుక బడేది లఘువు. లఘువుని (I) ఈ గుర్తుతో సూచిస్తాం.
  2. గురువు : రెండు మాత్రల కాలంలో పలికేది గురువు. గురువును (U) ఈ గుర్తుతో సూచిస్తాం.
  3. యతి : పద్యానికి సౌందర్యాన్ని చేకూర్చేవి యతి, ప్రాసలు. పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు.
  4. యతి మైత్రి : పద్యంలో నియమిత స్థానంలో ఉండే మైత్రికి, ‘యతిమైత్రి’ అని పేరు.
  5. ప్రాస : పద్య పాదంలో రెండవ అక్షరాన్ని ‘ప్రాస’ అంటారు.
  6. ప్రాస నియమం : నాలుగు పద్య పాదాలలోనూ, ఒకే హల్లును ప్రాస స్థానంలో ప్రయోగిస్తే, దానిని ‘ప్రాసనియమం’ అంటారు.

TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

పద్యాలు ప్రధానం మూడు రకాలు.

  1. వృత్తాలు,
  2. జాతులు,
  3. ఉపజాతులు.

వృత్త పద్యాలు

1. ఉత్పలమాల లక్షణము:

  1. ప్రతి పాదానికి వరుసగా భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలుంటాయి.
  2. ప్రతి పాదానికి ‘20′ అక్షరాలుంటాయి.
  3. ప్రతి పాదంలో, 10 వ అక్షరం యతిమైత్రి కల్గివుంటుంది.
  4. నాలుగు పాదాల్లో ప్రాస నియమం ఉంటుంది.
  5. నాలుగు పాదాలకు లక్షణాలు సమానం..
    ఉదా :
    TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 1
    యతిమైత్రి : 1-10 అక్షరాలైన ‘డ, టా’ లకు యతిమైత్రి చెల్లుతుంది.

2. చంపకమాల లక్షణము :

  1. ప్రతి పాదానికి 21 అక్షరాలుంటాయి.
  2. ప్రతి పాదానికి వరుసగా న, జ, భ, జ, జ, జ, ర అనే గణాలుంటాయి.
  3. ప్రతి పాదానికి 11వ అక్షరం యతిమైత్రి కల్గివుంటుంది.
  4. నాలుగు పాదాలలోనూ ప్రాసనియమం ఉంటుంది.
  5. నాలుగు పాదాలకూ లక్షణాలు సమానం.
    ఉదా :
    TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 2
    యతిమైత్రి : 1-11 అక్షరాలైన ‘అఆ’ లకు యతిమైత్రి చెల్లుతుంది.

గమనిక : (ఎసగన్ + ఆర్యులు) అని విడదీసినపుడున్న ‘ఆ-తో” యతి.

TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

3. శార్దూలం లక్షణము :

  1. ప్రతి పాదానికి 19 అక్షరాలుంటాయి.
  2. ప్రతి పాదానికి వరుసగా మ, స, జ, స, త, త, గ అనే గణాలుంటాయి.
  3. ప్రతి పాదంలో 13వ అక్షరం యతిమైత్రి కల్గి ఉంటుంది.
  4. అన్ని పాదాలలో ‘ప్రాసనియమం’ ఉంటుంది.
  5. నాలుగు పాదాలకు లక్షణాలు సమానము.
    ఉదా :
    TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 3
    యతిమైత్రి : 1-13 అక్షరాలైన ‘శ్రే – రే’ లకు యతిమైత్రి.

4. మత్తేభం లక్షణము :

  1. ప్రతి పాదానికి స, భ, ర, న, మ, య, వ అనే గణాలుంటాయి.
  2. ప్రతి పాదానికి 20 అక్షరాలుంటాయి.
  3. ప్రతి పాదంలో 14వ అక్షరం యతిమైత్రి కల్గి ఉంటుంది.
  4. నాలుగు పాదాలకు ‘ప్రాసనియమం’ ఉంటుంది.
  5. నాలుగు పాదాలకు లక్షణాలు సమానం.
    ఉదా :
    TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 4
    యతిమైత్రి : 1-14 అక్షరాలైన ‘స-త్స’లకు యతిమైత్రి చెల్లుతుంది.

జాతులు

1. కందం లక్షణము

  1. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  2. ఒకటి మూడు పాదాలకు మూడేసి గణాలు, రెండు నాలుగు పాదాలకు అయిదేసి గణాల చొప్పున ఉంటాయి.
    మొదటి రెండు పాదాలను ఒక భాగంగాను, చివరి రెండు పాదాలను ఒక భాగంగాను చెప్తారు.
  3. కంద పద్యంలో, నల, గగ, భ, జ, స అనే చతుర్మాత్రా గణాలు మాత్రమే ఉపయోగించాలి.
  4. బేసి గణాలలో మాత్రం (1, 3, 5, 7), ‘జ’ గణం ఉండకూడదు.
  5. ఆరవ గణం, ‘నల’ లేదా ‘జ’ గణం ఉండాలి.
  6. 2, 4 పాదాల్లో చివరి అక్షరం, విధిగా గురువు అయి ఉండాలి.
  7. రెండు, నాలుగు పాదాల్లో, 1-4 గణాల మొదటి అక్షరానికి, యతిమైత్రి ఉంటుంది.
  8. ప్రాసనియమం ఉండాలి.
    ఉదా :
    TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 5
    యతిమైత్రి : 2వ పాదములోని 1-4 గణాల మొదటి అక్షరాలైన ‘ప-బ’ లకు యతిమైత్రి చెల్లింది.

TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

ఉపజాతులు

ప్రాస యతి ఉండి, ప్రాస నియమం లేకపోవడం, ఉపజాతి పద్యాల ప్రత్యేకత.

1. ఆటవెలది లక్షణము :

  1. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  2. 1, 3 పాదాలలో వరుసగా 3 సూర్యగణాలు, రెండు ఇంద్ర గణాలు; 2-4 పాదాల్లో వరుసగా, ఐదు సూర్య గణాలు ఉంటాయి.
  3. ప్రతి పాదంలోను 1-4 గణాల మొదటి అక్షరాలకు యతిమైత్రి ఉండాలి.
  4. ప్రాసయతిని పాటింపవచ్చును.
  5. ప్రాసనియమం ఉండదు.
    ఉదా :
    TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 6
    యతిమైత్రి : 1-4 గణాల మొదటి అక్షరాలైన ‘క-గా’ లకు, ‘పు-వు’ లకు యతిమైత్రి.

2. తేటగీతి లక్షణము :

  1. తేటగీతి పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి.
  2. ప్రతి పాదానికీ వరుసగా ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, మరల రెండు సూర్యగణాలు ఉంటాయి.
  3. ప్రతిపాదంలోనూ 1-4 గణాల మొదటి అక్షరానికి యతిమైత్రి ఉంటుంది.
  4. ప్రాసయతిని పాటింపవచ్చు.
  5. ప్రాస నియమం ఉండదు.
    ఉదా :
    TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 7
    యతిమైత్రి : 1-4 గణాల మొదటి అక్షరాలైన ‘పా – ఫ’ లకు యతిమైత్రి చెల్లింది.

TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

3. సీసం లక్షణము :

  1. సీస పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి.
  2. ప్రతి పాదానికి వరుసగా ఆరు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు ఉంటాయి.
  3. పఠన సౌలభ్యం కోసం సీసాన్ని 8 అర్ధపాదాలుగా విభజిస్తారు.
  4. ప్రతి అర్ధపాదంలోనూ 1-3, 5-7 గణాల మొదటి అక్షరాలకు, యతిమైత్రి చెల్లుతుంది.
  5. ప్రాస నియమం ఉండదు. కాని ప్రాసయతి ఉంటుంది.
  6. సీస పద్యానికి, అనుబంధంగా ఆటవెలది గాని, తేటగీతి గాని చేర్చాలి.
    ఉదా :
    TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 8
    యతిమైత్రి : 1-3 లో-లో, 5-7 క-గ లకు యతిమైత్రి చెల్లింది. లో-లో, క-గ-యతిమైత్రి చెల్లింది.

గమనిక :
ఈ అభ్యాసములో 22 చిన్న ప్రశ్నలున్నాయి. వీని నుండి మీకు పేపరులో, ఎనిమిది ప్రశ్నలు ఇస్తారు. అందులో మీరు ఆరు ప్రశ్నలకు జవాబులు వ్రాయాలి. వాటికి ఆరుమార్కులు వస్తాయి. కాబట్టి వీటిని, అతిశ్రద్ధగా చదివి, ఆరుమార్కులను మీ స్వంతము చేసికోండి.

అభ్యాసం

ప్రశ్న 1.
‘లఘువు’ అనగానేమి ?
జవాబు:
ఒక మాత్ర కాలములో పలుకబడేది, ‘లఘువు’. లఘువును (I) గుర్తుతో సూచిస్తారు.

ప్రశ్న 2.
‘గురువు’ అనగానేమి ? * (M.P)
జవాబు:
రెండు మాత్రల కాలములో, పలికేది ‘గురువు’. గురువును (U) గుర్తుతో సూచిస్తాము.

TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

ప్రశ్న 3.
‘ఛందస్సు’ అనగానేమి ?
జవాబు:
పద్య లక్షణాలను తెలిపేది ఛందస్సు. లయ ప్రాధాన్యత, ఛందస్సులో అంతర్గతంగా ఉంటుంది.

ప్రశ్న 4.
ప్రాస అనగానేమి ?
జవాబు:
పద్య పాదంలోని రెండవ అక్షరాన్ని ‘ప్రాస’ అంటారు.

ప్రశ్న 5.
యతి అనగానేమి ?
జవాబు:
పద్య పాదంలోని, మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు.

ప్రశ్న 6.
పద్యాలు ప్రధానంగా ఎన్ని రకాలు ? * (M.P.)
జవాబు:
పద్యాలు ప్రధానంగా మూడు రకాలు :

  1. వృత్తాలు
  2. జాతులు
  3. ఉపజాతులు.

ప్రశ్న 7.
‘ఉత్పలమాల’లో వచ్చే గణాలు ఏవి ? * (M.P.)
జవాబు:
ఉత్పలమాలలో ప్రతి పాదములోనూ వరుసగా భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు ఉంటాయి.

ప్రశ్న 8.
‘ఉత్పలమాల’లో ఎన్నవ అక్షరం యతిస్థానం ? * (M.P.)
జవాబు:
ఉత్పలమాలలో 10వ అక్షరం యతిస్థానంగా ఉంటుంది.

TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

ప్రశ్న 9.
‘ఉత్పలమాల’ పద్యంలో ప్రతీ పాదానికి ఎన్ని అక్షరాలు ఉంటాయి ?
జవాబు:
ఉత్పలమాలలో ప్రతి పాదానికీ 20 అక్షరాలు ఉంటాయి.

ప్రశ్న 10.
‘చంపకమాల’లో వచ్చే గణాలు ఏవి ? * (M.P.)
జవాబు:
చంపకమాలలో వచ్చే గణాలు, వరుసగా న, జ, భ, జ, జ, జ, ర అనేవి.

ప్రశ్న 11.
‘చంపకమాల’లో ఎన్నవ అక్షరం యతిస్థానం ?
జవాబు:
చంపకమాలలో 11వ అక్షరం యతిస్థానం.

ప్రశ్న 12.
‘చంపకమాల’ పద్యంలో ప్రతి పాదానికి ఎన్ని అక్షరాలు ఉంటాయి ?
జవాబు:
చంపకమాల పద్యంలో, ప్రతి పాదానికీ 21 అక్షరాలు చొప్పున ఉంటాయి.

ప్రశ్న 13.
‘శార్దూలం’లో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
శార్దూలంలో వచ్చే గణాలు వరుసగా మ, స, జ, స, త, త, గ అనేవి.

ప్రశ్న 14.
‘శార్దూలం’లో ఎన్నవ అక్షరం యతిస్థానం ?
జవాబు:
శార్దూలంలో, 13వ అక్షరం యతిస్థానం.

TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

ప్రశ్న 15.
‘మత్తేభం’లో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
మత్తేభంలో ప్రతి పాదంలోనూ వరుసగా వచ్చే గణాలు, స, భ, ర, న, మ, య, వ అనే గణాలు.

ప్రశ్న 16.
‘మత్తేభం’ ఎన్నవ అక్షరం యతి స్థానం ?
జవాబు:
మత్తేభం, 14వ అక్షరం, యతిస్థానం.

ప్రశ్న 17.
‘కందపద్యం’లో ఆరవగణంలో వచ్చే గణాలు ఏవి ? * (M.P.)
జవాబు:
కందపద్యంలో, ఆరవ గణంగా, ‘నలము’ లేదా ‘జ గణం’ ఉండాలి.

ప్రశ్న 18.
‘ఆటవెలది’ పద్యంలో ప్రతి పాదంలో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
ఆటవెలది పద్యంలో ప్రతి పాదంలోనూ వచ్చే గణాలు, ఒకే రకంగా ఉండవు. ఈ పద్యంలో 1-3 పాదాల్లో మూడు సూర్యగణాలు, రెండు ఇంద్రగణాలూ ఉంటాయి. 2-4 పాదాల్లో ఐదునూ సూర్యగణాలే ఉంటాయి.

ప్రశ్న 19.
‘ఇంద్రగణాలు’ ఎన్ని ? * (M.P.)
జవాబు:
ఇంద్రగణాలు ‘ఆరు’, అవి : నల, నగ, సల, భ, ర, త అనేవి.

ప్రశ్న 20.
‘సూర్యగణాలు’ ఎన్ని ?
జవాబు:
సూర్యగణాలు రెండు. అవి :

  1. హ గణము (గలము)
  2. న గణము అనేవి.

TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

ప్రశ్న 21.
‘తేటగీతి’ పద్యంలో వచ్చే గణాలు ఏవి ? * (M.P.)
జవాబు:
తేటగీతి పద్యంలో, ప్రతి పాదంలోనూ, వరుసగా ఒక సూర్య గణము, రెండు ఇంద్ర గణములు, మరలా రెండు సూర్య గణములూ వస్తాయి.

ప్రశ్న 22.
సీసపద్యానికి అనుబంధంగా ఉండే పద్యాలు ఏవి ?
జవాబు:
సీసపద్యానికి అనుబంధంగా ఆటవెలది గాని, తేటగీతి గాని ఉంటుంది.

TS Inter 2nd Year Telugu Study Material

TS Inter 1st Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 2nd Lesson రాజ్యం, సార్వభౌమాధికారం Textbook Questions and Answers.

TS Inter 1st Year Political Science Study Material 2nd Lesson రాజ్యం, సార్వభౌమాధికారం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
రాజ్యాన్ని నిర్వచించి, దానికి గల మౌలిక లక్షణాలను చర్చించండి.
జవాబు.
పరిచయం :
రాజ్యం అనేది ఒక రాజకీయ సంస్థ. ఇది సార్వభౌమాధికారం గల అతిశక్తివంతమైన సంస్థ. అందువల్ల రాజ్యానికి రాజనీతి శాస్త్ర అధ్యయనంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. రాజ్యం సమాజంలోని అన్ని సాంఘిక, రాజకీయ సంస్థలన్నింటికంటే ఉన్నతమైనది.

అర్థం :
రాజ్యం అనే పదం మొట్టమొదటిసారిగా 16వ శతాబ్దంలో వాడుకలోకి వచ్చింది. ఇటలీ రాజనీతి తత్వవేత్త నికోలో మాకియవెల్లి 1513లో తన గ్రంథమైన “ప్రిన్స్”లో “లా స్టాటో” అనే ఇటలీ పరిభాషను ‘స్టేట్’కు పర్యాయపదంగా వాడాడు. అతని ఉద్దేశంలో స్టేట్ అంటే రాజకీయ శక్తి అని అర్థం.

ఆ తరువాత ఆంగ్లపదం ‘స్టేట్’ విరివిగా వాడుకలోకి వచ్చి విస్తృతంగా చర్చించారు. 18వ శతాబ్దం నాటికి రాజ్యం ఒక మానవ నిర్మిత వ్యవస్థగా బహుళ ఆదరణ పొంది విశ్వజనీన సంస్థగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

నిర్వచనాలు :
రాజ్యం అత్యంత ఆవశ్యకమైన విశ్వజనీన సంస్థ. అందువల్ల రాజనీతిశాస్త్ర అధ్యయనంలో దాని ప్రాధాన్యత మరింత పెరిగింది. అయితే, అనేక మంది రాజనీతి శాస్త్రవేత్తల మధ్య నిర్వచనాలపై ఏకాభిప్రాయం లేదు. ఎందుకంటే గాణ్య స్వభావానికి సంబంధించి భిన్న అభిప్రాయాలుండడం వల్ల దాని నిర్వచనంపై ఏకాభిప్రాయంలేదు. ప్రతి రాజనీతి శాస్త్రవేత్త తనదైన దృక్కోణంలో నిర్వచించడానికి ప్రయత్నించారు.

గార్నర్ :
“ఒక నిర్దిష్ట ప్రదేశంలో స్థిరనివాసులై, స్వతంత్రులుగా, వ్యవస్థాపూర్వక ప్రభుత్వానికి విధేయులుగా ఉండే ప్రజా సముదాయమే రాజ్యం”గా ‘నిర్వచించారు.

బ్లంట్ షిల్లీ :
“నిర్ణీత భూభాగంలో రాజకీయంగా వ్యవస్థాపితమైన ప్రజలే రాజ్యం” అని వర్ణించారు.

ఉడ్రో విల్సన్ :
“నిర్ణీత భూభాగంలో శాసన బద్ధమైన జీవితానికి సంఘటితం కాబడిన ప్రజలే” రాజ్యమని నిర్వచించారు.

హెచ్.జె. లాస్కీ:
“ఒక నియమిత భౌగోళిక ప్రాంతంలో ప్రభుత్వంగా, పాలితులుగా విభజితమై ఇతర సంస్థలన్నింటి మీద ఆధిక్యం కలిగి ఉండే ప్రాదేశిక సంఘమే రాజ్యం” అని నిర్వచించారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

రాజ్యం-మౌలిక లక్షణాలు :
పైన ఉదహరించిన నిర్వచనాలను నిశితంగా పరిశీలించినట్లయితే రాజ్యానికి నాలుగు ప్రధాన లక్షణాలున్నట్లు మనకు బోధపడుతుంది. అవి : 1. ప్రజలు, 2. ప్రదేశం, 3. ప్రభుత్వం, 4. సార్వభౌమాధికారం. ఈ నాలుగు లక్షణాలతోపాటు ఇటీవల కాలంలో రాజ్యానికి అంతర్జాతీయ గుర్తింపు కూడా అవసరమని భావించటం జరిగింది.

1. ప్రజలు :
రాజ్యం ఒక మానవ సంస్థ కాబట్టి ప్రజలులేనిదే రాజ్యంలేదు. ప్రజలు రాజ్యానికి గల మౌలిక లక్షణాలలో మొట్టమొదటిది. ప్రజలులేని రాజ్యం మనుగడను కలిగి ఉండదు. అందువల్ల కొందరు పాలించడానికి మరికొందరు పరిపాలించబడటానికి రాజ్యంలో ఉండాలి.

మానవ సముదాయంలేని ఎడారి ప్రాంతాన్ని మనం రాజ్యంగా భావించలే. రాజ్యంలోని ప్రజలు పలురకాల వర్గాలకు, తెగలకు చెందినవారై భిన్న ఆచార సంప్రదాయాలను అలవాట్లను, అదే విధంగా, అనేక దృక్పథాలను, అభిప్రాయాలను కలిగి ఉంటారు.

రాజ్యంలో ఎంత జనాభా ఉండాలనే దానిపై రాజనీతి శాస్త్రవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. గ్రీకు తత్త్వవేత్త ప్లేటో తన గ్రంథమైన “దిలాస్”లో 5040 మంది జనాభా కలిగి ఉన్న రాజ్యం ఆదర్శ రాజ్యమన్నాడు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యవాది, చిన్న చిన్న గణతంత్ర రాజ్యాలు ఉండాలని భావించిన ఫ్రెంచి తత్త్వవేత్త రూసో, రాజ్యంలో పదివేల జనాభా ఉండవచ్చునన్నాడు.

స్వయం పోషకత్వానికి, సమర్థపాలనకు సరిపడా జనాభా మాత్రమే ఉండాలని అరిస్టాటిల్ పేర్కొన్నాడు. ఏది ఏమైనప్పటికీ, రాజ్యవనరులకు, విస్తీర్ణతకు మించిన జనాభా ఉండకూడదు అనేది అందరి అభిప్రాయం.

2. ప్రదేశం :
ప్రదేశం లేదా భూభాగం అనేది రాజ్యానికి గల రెండవ లక్షణం. ఒక నిర్దిష్ట ప్రదేశంలో ప్రజలు నివసించనట్లయితే దాన్ని రాజ్యంగా పరిగణించలేం: నోమడ్స్, జిప్సీలు వంటి తెగలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి నిరంతరం వలస వెళుతున్నందున వారు ఒక రాజ్యపరిధిలో నివసించినట్లు భావించలేం. ప్రదేశం అనేది రాజ్యానికి సంబంధించిన ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాన్ని సూచిస్తుంది.

ఆ ప్రదేశం ప్రభుత్వ అధీనంలో ఉండి దానిపై సార్వభౌమాధికారంతో కూడిన నియంత్రణాధికారం ఉంటుంది. ప్రదేశం రాజ్యం నుంచి విడదీయలేనటువంటిది. -ప్రదేశం ప్రజల మధ్య సహోదర భావాన్ని సమైక్యతను ఏర్పర్చి రాజ్యానికి తిరుగులేని అధికారాన్ని అందిస్తుంది.

ప్రదేశం ఒక నిర్దిష్ట భూభాగమే కాకుండా దాని పరిధిలో సారవంతమైన నేలను, పర్వతాలను, నదులను, సరస్సులను అనేక ఇతర వనరులను కలిగి ఉంటుంది.

అదే విధంగా, ఆకాశంలో కొంత భాగాన్ని ఆ రాజ్య ప్రాదేశిక వియత్తలంగాను, అట్లాగే ఆ రాజ్యానికి సముద్రతీరం ఉన్నట్లయితే కొంత దూరాన్ని ప్రాదేశిక జలాలుగాను భూభాగంతోపాటు రాజ్యానికి హద్దులుగా నిర్ణయిస్తారు. గతంలో ప్రాదేశిక జలాల దూరం 3 నాటికల్ మైళ్ళుగా ఉండేది నేడు అది 12 నాటికల్ మైళ్ళదూరంగా గుర్తించబడింది.

3. ప్రభుత్వం :
రాజ్యానికి ప్రభుత్వం మూడవ మౌలిక లక్షణం. ప్రభుత్వమనేది ఒక రాజకీయ సంస్థగా ప్రజల కార్యకలాపాలను నియంత్రిస్తూ మార్గనిర్దేశకం చేస్తూ వారి మధ్య ఉత్పన్నమయ్యే అనేక రకాల సమస్యలకు పరిష్కారాలను చూపుతుంది.

రాజ్యం తన విధివిధానాలను, అభిప్రాయాన్ని ప్రభుత్వం ద్వారా అమలుపరుస్తుంది. ప్రభుత్వం ద్వారా రాజ్యం తన ఉనికిని కొనసాగిస్తుంది. గార్నర్ అనే రాజనీతి పండితుడు “ప్రభుత్వం రాజ్యానికి ఒక సాధనంగా ప్రజలందరిని ఉద్దేశించి రూపొందించిన విధానాలను, పథకాలను అమలుపరుస్తూ ప్రజలందరి ప్రయోజనాలను కాపాడే వ్యవస్థ”గా అభివర్ణించాడు.

ప్రభుత్వం, ఒక సాధనంగా రాజ్య అభీష్టాన్ని అమలుపర్చే కార్యంలో నిమగ్నమౌతుంది. అందువల్ల ప్రభుత్వంలేని రాజ్యాన్ని ఊహించలేం. ప్రభుత్వంలేని రాజ్యంలో ప్రజలు అసంఘటితంగా, అశాంతి అభద్రతా భావంతో అరాచకస్థితిలో నివసిస్తారు.

సమష్టి ఆలోచనలుగాని, సమిష్టి నిర్ణయాలు గాని, సమష్టి ప్రయోజనాల సాధనకై ప్రయత్నాలుగాని చేయలేని పరిస్థితిలో శాంతి భద్రతలు లోపించి చట్టాలను అతిక్రమించటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రజాసంక్షేమం దృష్ట్యా నిర్దిష్ట ప్రభుత్వ యంత్రాంగం అత్యంత ఆవశ్యకమైంది.

4. సార్వభౌమాధికారం :
సార్వభౌమాధికారం రాజ్యానికి గల నాలుగవ అతిముఖ్యమైన మౌలిక లక్షణం. ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం ఉన్నా సార్వభౌమాధికారం లేనట్లయితే రాజ్యం ఏర్పడదు. రాజ్యానికి గల ఈ మౌలిక లక్షణమే ఇతర సంస్థలన్నింటికంటే రాజ్యానికి ఉన్నతమైనదిగా గుర్తింపును కలిగిస్తుంది. సార్వభౌమాధికారం ఒక్క రాజ్యానికి మాత్రమే ఉండే లక్షణం.

సార్వభౌమాధికారం రాజ్యానికి గల సర్వాధికారాలకు నిదర్శనం. రాజ్యానికి గల తిరుగులేని అధికారమే సార్వభౌమాధికారం. ఇది ఒక్క రాజ్యానికి మాత్రమే గల అధికారం. ఈ అధికారం వల్లనే సర్వస్వతంత్రత కలిగిన వ్యవస్థగా రాజ్యం గుర్తించబడింది.

సార్వభౌఉకారం, రాజ్యంపై విదేశీపరమైన నియంత్రణలు లేని స్వతంత్ర వ్యవస్థగా, రాజ్యంలోని వ్యక్తులపై సంస్థలపై నళిక ప్రదేశంపై తిరుగులేని అధికారాన్ని చలాయించే శాసనాధికారాన్ని కల్పిస్తుంది. అంతేకాదు.

రాజ్యం అమలుపరచదలుచుకున్న అన్ని రకాల కార్యకలాపాలు యథేచ్ఛగా కొనసాగేటట్లుగాని, ప్రజలు రాజ్యానికి విధేయులుగా ఉండేటట్లుగాని చేయడంలో సార్వభౌమాధికారానికి మించినదేదీలేదు. రాజ్యానికి మాత్రమే ఉన్న ఈ సార్వభౌమాధికారం రాజ్యాన్ని ఇతర సంస్థలన్నింటికంటే ఉన్నతమైన, విశిష్టమైనదిగా నిలబెడుతుంది.

మరోవిధంగా చెప్పాలంటే, సార్వభౌమాధికారం రెండు రకాల రూపాలను కలిగి ఉంటుంది. ఒకటి, రాజ్యపరిధిలోని వ్యక్తులపై, సంస్థలపై చలాయించే శాసనాధికారం అంతర్గత సార్వభౌమత్వం కాగా, విదేశీ విధానంలో రాజ్యం ప్రదర్శించే స్వతంత్రత బాహ్య సార్వభౌమత్వం రెండవది అవుతుంది.

అంతర్జాతీయ గుర్తింపు :
అంతర్జాతీయ గుర్తింపు అనేది ఇటీవల కాలంలో రాజ్య మౌలిక లక్షణాలలో ఒకటిగా గుర్తించబడింది. ఆధునిక కాలంలో అనేక జాతీయ రాజ్యాలు, అంతర్జాతీయ సంస్థలు ఉనికిలోకి వచ్చాయి. అందువల్ల కొంతమంది రాజనీతి పండితులు అంతర్జాతీయ గుర్తింపు అత్యంత ఆవశ్యకమైనదిగా భావించాలన్నారు. ఎందుకంటే

ఏ రాజ్యమైనా ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం, సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటుంది. కాని అది అంతర్జాతీయ స్థాయిలో గుర్తించబడినప్పుడే దానికి గల అధికారాలు చెల్లుబాటు అవుతాయి. ఒక సార్వభౌమాధికార రాజ్యాన్ని మరో సార్వభౌమాధికార రాజ్యం గుర్తించిననాడే దాని మనుగడ కొనసాగుతుంది. అంతర్జాతీయ గుర్తింపు అనేది ప్రపంచ సంస్థయైన ఐక్యరాజ్యసమితి ద్వారా లభిస్తుంది.

ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశంగా గుర్తింపు పొందడం ద్వారా ఆ రాజ్యానికి సంబంధించిన సార్వభౌమాధికారం ఇతర రాజ్యాల చేత ఆమోదం పొందుతుంది. ఈ విధంగానే నూతన రాజ్యాలు ఏర్పడతాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

ప్రశ్న 2.
ఏకత్వ సార్వభౌమాధికారాన్ని వివరించండి.
జవాబు.
జాన్ ఆస్టిన్ ఏకత్వ సార్వభౌమాధికార సిద్ధాంతం : 18వ శతాబ్దంలో ఏకత్వ సార్వభౌమాధికార సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఇంగ్లాండ్ దేశ న్యాయకోవిదుడు జాన్ ఆస్టిన్. ఇతను తన గ్రంథమైన “లెక్చర్స్ ఆన్ జ్యూరిస్ట్రుడెన్స్” (1832)లో ఈ సిద్ధాంత ప్రతిపాదన చేశాడు.

తన కంటే ముందున్న థామస్ హాబ్స్, జెర్మి బెంథామ్ల సిద్ధాంతాలను తన సిద్ధాంతానికి ఆధారంగా తీసుకున్నాడు. ఆస్టిన్ సిద్దాంతాన్ని “నిరపేక్ష లేదా న్యాయబద్ధ సార్వభౌమాధికార సిద్ధాంతమని” కూడా పేర్కొంటారు. ఇతని అభిప్రాయంలో శాసనమనేది సార్వభౌముడు ప్రజలకిచ్చిన ఆజ్ఞగా పేర్కొన్నాడు.

ఆస్టిన్ సార్వభౌమాధికారం – ముఖ్య లక్షణాలు :
1. ఇది నిశ్చయాధికారం :
ప్రతి స్వతంత్ర రాజకీయ సమాజంలో ఒక నిర్ణీత మానవ అధికారి లేదా వ్యక్తుల సముదాయానికి సార్వభౌమాధికారం ఉంటుంది. వ్యక్తికి లేదా వ్యక్తుల సముదాయానికి గల అధికారం నిశ్చయ సార్వభౌమాధికారం.

2. సార్వభౌమాధికారి ప్రజలు అలవాటు ప్రకారం విధేయులై ఉంటారు :
సమాజంలోని ప్రజలందరు తమ అలవాటు ప్రకారం సార్వభౌమాధికారికి విధేయులై ఉంటారు. ప్రజలపై ఎటువంటి ఒత్తిడిగాని, ప్రలోభంగాని ఉండదు. ప్రజలు యథాలాపంగా సార్వభౌముడికి విధేయులై ఉంటారు.

3. సార్వభౌమత్వం అవిభాజ్యం:
సార్వభౌమాధికారం విభజించడానికి లులేనటువంటిది. ఎందుకంటే అది ఒకే దగ్గర కేంద్రీకరించబడి ఉంటుంది. సార్వభౌముడి అధికారానికి ఎటువంటి పరిమితులుండవు. శాసనాలకు మూలాధారం సార్వభౌముడు.

4. సార్వభౌమాధికారం ఆవశ్యకమైంది :
రాజకీయ సమాజానికి సార్వభౌమాధికారం అల్మ ‘అవసరమైంది. సార్వభౌమత్వం లేని సమాజం, రాజకీయంగాని స్వతంత్రతగాని లేని సమాజమౌతుంది.

5. చట్టమే తుది ఆజ్ఞ :
సార్వభౌముని ఆజ్ఞే చట్టం. చట్టాన్ని ఉల్లంఘించిన వారు శిక్షార్హులు అవుతారు. ఎందుకంటే సార్వభౌమాధికారం ‘ నిరపేక్షమైంది, నిర్దిష్టమైంది, స్పష్టమైంది, అపరిమితమైంది కాబట్టి.

6. రాజ్యానికి వ్యతిరేకమైన ఎటువంటి హక్కులు ప్రజలకు ఉండవు :
రాజకీయ సమాజంలోని ప్రజలకు సార్వభౌముడు ప్రసాదించిన హక్కులు మినహా ఏ ఇతర హక్కులు ఉండవు. ప్రజలు రాజ్యాన్ని వ్యతిరేకించే హక్కులను కలిగి ఉండరు.

ఆస్టిన్ సార్వభౌమాధికారం విమర్శ:
ఆస్టిన్ ప్రతిపాదించిన ఏకత్వ సార్వభౌమాధికారాన్ని ఎంతో మంది రాజనీతి పండితులు విమర్శించారు. ముఖ్యంగా ప్రజాస్వామికవాదులు, బహుతావాదులు విమర్శించారు.

వారిలో ప్రముఖంగా ఎ.వి.డైసీ, హెచ్.జె. లాస్కీ, జె.సి. గ్రే, హెన్రీమెయిన్, సివిక్ మొదలైన వారు ముఖ్యులు. కింది అంశాల ఆధారంగా వారు విమర్శించారు.

1. ఇది చారిత్రికమైంది కాదు :
హెన్రీమొయిన్ అభిప్రాయంలో ఆస్టిన్ ఏకత్వ సార్వభౌమాధికారానికి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు.

2. ప్రజాస్వామ్య వ్యతిరేకం:
ఆస్టిన్ సిద్దాంతం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైంది. ఇది ప్రజాస్వామ్య విలువలకు, జీవనానికి పూర్తి విరుద్ధమైనటువంటిది.

3. నిరపేక్ష సార్వభౌమాధికారం హానికరం :
ఆధునిక ప్రజాస్వామ్యదేశాలలో నిరపేక్ష, అపరిమిత సార్వభౌమాధి కారమనేది ఏ రూపంలో ఉన్నా హానికరమైనటువంటిది. ఎందుకంటే, నిరపేక్ష సార్వభౌమాధికారి బాధ్యతారహితంగా పాలించే అవకాశముంది.

4. సార్వభౌమత్వ ఉనికిని గుర్తించడం కష్టం:
ఆస్టిన్ అభిప్రాయంలో సార్వభౌమాధికారం అవిభాజ్యం. ఈ అభిప్రాయాన్ని బహుతావాదులు అంగీకరించలేదు. అమెరికా, భారతదేశం వంటి సమాఖ్య రాజ్యాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాన్ని విభజించడం జరుగుతుంది. కాబట్టి సమాఖ్య రాజ్యాలలో సార్వభౌమాధికారం ఎక్కడుందో గుర్తించడం కష్టమని లాస్కీ వ్యాఖ్యానించాడు.

5. రాజ్యం సర్వోన్నతమైంది కాదు :
ఆస్టిన్ రాజ్యాన్ని సర్వోన్నతమైన సంస్థగా పరిగణించాడు. కానీ వాస్తవంగా సమాజంలో రాజ్యంతో పాటు వివిధ రకాల సంఘాలు కూడా ఎన్నో రకాల సేవలను ప్రజలకు అందిస్తున్నాయని బహుతావాదుల వాదన. వీరి అభిప్రాయంలో వ్యక్తి వికాసానికి రాజ్యమెంత అవసరమో ఇతర సంఘాలు కూడా అంతే అవసరం.

6. ఆచార, సంప్రదాయాల ప్రాధాన్యతను విస్మరించడం :
ఆస్టిన్ సిద్ధాంతం ప్రకారం శాసనాలకు సార్వభౌముడి అధికారం మూలం. అయితే శాసన నిర్మాణంలో ప్రజల ఆచార, సంప్రదాయాలు ప్రాచీనకాలం నుంచి ప్రభావితం చేస్తున్నాయనే విషయాన్ని ఆస్టిన్ విస్మరించాడు.

పైన వివరించిన విమర్శలు ఎన్ని ఉన్నప్పటికీ ఆస్టిన్ ఏకత్వ సార్వభౌమాధికార సిద్ధాంతానికి రాజనీతిశాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

ప్రశ్న 3.
బహుత్వ సార్వభౌమాధికారాన్ని వివరించండి.
జవాబు.
బహుతావాద (బహుత్వవాద) సార్వభౌమాధికార సిద్ధాంతం ఆస్టిన్ ప్రతిపాదించిన ఏకత్వ నిరపేక్ష సార్వభౌమాధికార సిద్ధాంతానికి వ్యతిరేకంగా ప్రచారంలోకి వచ్చింది. ప్రజాస్వామ్యం, సమాఖ్య సిద్దాంత స్ఫూర్తి. వ్యక్తిగత స్వేచ్ఛ, అధికారాల విభజన వంటి అనేక అంశాలు బహుతావాద సార్వభౌమాధికారం బహుళ ప్రాచుర్యం పొందడానికి దోహదపడ్డాయి.

వాన్ గిర్కే (1844 – 1925) : మొట్టమొదటిసారి బహుతావాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆ తరువాత మెట్లాంగ్, బార్కర్, జి.డి.హెచ్. కోల్, హెచ్.జె. లాస్కీ, లిండ్సే, మైకేవర్, ఫాలెట్ వంటి వారు బహుతావాద సార్వభౌమాధికార సిద్ధాంతాన్ని బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు.

వీరందరూ ఏకత్వ సార్వభౌమాధికారం చాలా ప్రమాదకరమైందని ఆధునిక ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలి పెట్టులాంటిదని అభిప్రాయపడ్డారు. బహుతావాదుల అభిప్రాయంలో రాజకీయ సమాజంలోని అనేక సంస్థలలో రాజ్యం ఒకటని అందువల్ల అధికారమంతా ఒక్క రాజ్య అధీనంలోనే ఉండదని వీరు పేర్కొన్నారు.

బహుతావాద సార్వభౌమాధికారం – ప్రధాన అంశాలు :

  1. సమాజంలోని అనేక సంస్థల్లో రాజ్యం ఒకటి. రాజ్యం ఒక్కటే అధికారాన్ని కలిగి ఉండదు. సమాజంలోని వివిధ సంఘాలు కూడా సమాజానికి ఉపయోగకరమైన పనులు చేస్తాయి. అందువల్ల సార్వభౌమాధికారాన్ని రాజ్యానికి వివిధ సంఘాల మధ్య పంచడమే సమంజసమని వీరి అభిప్రాయం.
  2. రాజ్యం సమాజాన్నిగాని మరే ఇతర సంస్థను గాని నిర్మించలేదు. అదే విధంగా సమాజంలోని సాంస్కృతిక, ఆర్థిక, మతపరమైన, రాజకీయపరమైన సంస్థలను కూడా రాజ్యం సృష్టించలేదు. ఈ కారణం చేత రాజ్యం ఈ సంస్థలను రద్దు చేయజాలదు. రాజ్యానికి ఆ అధికారం కూడా లేదు.
  3. సమాజం సమాఖ్య రూపాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి రాజ్యం దాని అధికారాలను అన్ని సంస్థలకు పంపిణీ చేయవలసి ఉంటుంది.
  4. సార్వభౌమాధికారం ఒక్క రాజ్యానికి మాత్రమే చెందింది కాదు. కాబట్టి మిగతా సంస్థలన్నింటి మీద దాని అధికారం ఉండదు.
  5.  సార్వభౌమాధికారం నిరపేక్షంకాదు. అది అపరిమితమైంది, ప్రశ్నించలేనిది కాదు. దానికి కొన్ని అంతర్గత – బాహ్య పరిమితులున్నాయి. అంతర్జాతీయ వేదికలు సార్వభౌమాధికారంపై కొన్ని పరిమితులు విధించవచ్చు.
  6. సార్వభౌమాధికారం ఏకపక్ష స్వభావం కలిగి ఉండదు. సమాజంలో రాజ్యాంగపరమైన, సంప్రదాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకొని సార్వభౌమాధికారం అమలుపర్చవలసి ఉంటుంది. సార్వభౌమాధికారం ఒక్క రాజ్యం చేతిలోనే ఉండదు.
  7. సార్వభౌముడి ఆజ్ఞలే చట్టాలు, శాసనాలు అనుకోవడానికి వీలులేదు. సమాజంలోని అనేక అంశాలను దృష్టిలో ఉంచుకొని దాన్ని అమలుచేయాలి.
  8. ఆస్టిన్ రాజ్యానికి తిరుగులేని అధికారాన్ని కట్టబెట్టాడని బహుతావాదులు విమర్శించారు. దీని పర్యవసానంగా మానవ సమాజంలోని అనేక ఇతర సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

ప్రశ్న 4.
సార్వభౌమాధికారం అంటే ఏమిటి ? దాని ముఖ్య లక్షణాలను పేర్కొనండి.
జవాబు.
ఆధునిక రాజ్యానికి గల అతి ముఖ్యమైన లక్షణం సార్వభౌమాధికారం. నేడు అన్ని ఆధునిక రాజ్యాలు జాతీయ రాజ్యాలే. సార్వభౌమాధికారం వాటి ప్రధాన లక్షణం. సార్వభౌమాధికార లక్షణం వల్లనే రాజ్యం ఇతర సంస్థల సంఘాల కంటే భిన్నమైనదిగా గుర్తించబడింది. సార్వభౌమాధికారం రాజ్యానికి ఉండటం వల్లనే అది అన్ని రకాల అధికారాలను నిర్వహించగలుగుతుంది.

ఆధునిక రచయితల్లో ముఖ్యమైన ఫ్రెంచితత్వవేత్త 16వ శతాబ్దానికి చెందిన జీనో బోడిన్ మొట్ట మొదటి సారి “సార్వభౌమాధికారం” అనే పదాన్ని వాడారు. ఈ భావనను తన గ్రంథమైన “Six Books on the Republic”లో -1576లో పేర్కొన్నాడు.

నిర్వచనాలు : సార్వభౌమాధికారం అనే భావనను అనేక మంది పలు విధాలుగా నిర్వచించారు. కొన్ని నిర్వచనాలను కింది విధంగా తెలుసుకుందాము :
విల్లోభి : “రాజ్యం యొక్క అత్యున్నతా అభీష్టమే సార్వభౌమాధికారం” అన్నాడు.
బ్లాక్న్ : “ఎటువంటి పరిమితులు, నియంత్రణలేని నిరపేక్షమైన, శాసనబద్ధమైన అతి ఉన్నత అధికారమే సార్వభౌమాధికారం”.
జీన్ బోడిన్ : “పౌరులపై పాలితులపై శాసనాతీతమైన అత్యున్నత రాజ్యాధికారమే సార్వభౌమాధికారం”గా నిర్వచించాడు.
హ్యుగో గ్రోషియస్ : “ఎవరు అతిక్రమించలేని, విస్మరించలేని రాజ్యాధికారమే సార్వభౌమాధికారం” అన్నాడు. జెంక్స్ : “సమాజంలోని ప్రతి వ్యక్తి చర్యలను సంపూర్ణంగా నియంత్రించే అధికారమే సార్వభౌమాధికారం.”
ఉడ్రోవిల్సన్ : “శాసనాల తయారీ, అమలు దైనందిన శక్తి వ్యవహారం.”

సార్వభౌమాధికారం లక్షణాలు: సార్వభౌమాధికార లక్షణాలను కింది విధంగా వివరించవచ్చు.

  1. నిరపేక్షత (Absoluteness)
  2. సార్వజనీనత (Universality)
  3. శాశ్వతత్వం (Permanence)
  4. అనన్యసంక్రామకత్వం (Inalienability)
  5. అవిభాజ్యత (Indivisibility)

1. నిరపేక్షత :
రాజ్యానికి గల నిరపేక్షాధికారమే సార్వభౌమాధికారం. రాజ్యపరిధిలో సార్వభౌమాధికారాన్ని మించిన మరే అధికారం ఉండదు. సార్వభౌమాధికారాన్ని శాసించే అధికారం ఏ వ్యక్తికిగాని, సంస్థకుగాని ఉండదు. సార్వభౌమాధికారంపై ఎలాంటి ఆంక్షలను వ్యక్తులుగాని, సముదాయాలుగాని సాధించలేవు. అదేవిధంగా ఒక సార్వభౌ మాధికారం గల రాజ్యం సరిహద్దులలో మరో రాజ్యం జోక్యం చేసుకోవడం తగదు.

అయితే, మెట్లాండ్ వంటి రచయితలు సార్వభౌమాధికార నిరపేక్షతపై కొన్ని పరిమితులున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా, ప్రజాస్వామ్య రాజ్యాలు, ప్రజల ఆచార సంప్రదాయాలలోగాని, వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు వ్యతిరేకంగా తన అధికారాన్ని ఉపయోగించవు. అదే విధంగా, అంతర్జాతీయ న్యాయస్థానం ఏర్పడిన తరువాత అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు లోబడి మాత్రమే రాజ్యాలు ప్రవర్తిస్తున్నాయని చెప్పవచ్చు.

2. సార్వజనీనత :
సార్వభౌమాధికారం దాని స్వభావ రీత్యా సార్వజనీనమైంది. రాజ్య పరిధిలో గల ప్రజలందరి సంస్థలన్నింటికీ, సంఘాలన్నింటికీ సార్వభౌమాధికారం వర్తిస్తుంది. సార్వభౌమాధికారం ఏ వ్యక్తికి గాని, సంస్థకు గాని, సంఘానికి గాని ఎటువంటి మినహాయింపు ఇవ్వదు.

అయితే, విదేశీ రాయబారులు, రాయబార కార్యాలయ సిబ్బందికి మినహాయింపులుంటాయి. కొన్ని ప్రత్యేక సందర్భాలలో వారికి గల ప్రత్యేక అధికారాలను తొలగించవచ్చు. కాబట్టి వారు సైతం ప్రత్యేక సందర్భాలలో సార్వభౌమాధికారానికి లోబడి తమ వ్యవహారశైలిని మార్చుకోవలసి ఉంటుంది.

3. శాశ్వతత్వం :
సార్వభౌమాధికారం రాజ్యానికి గల శాశ్వత అధికారం. రాజ్యం తన మనుగడను కొనసాగించినంత కాలం సార్వభౌమాధికారం కూడా కొనసాగుతూనే ఉంటుంది. ప్రభుత్వం కాలపరిమితిలో మారుతుంది. కాని రాజ్యం మాత్రం మారదు. ఎందుకంటే రాజ్యం శాశ్వతమైంది. ప్రభుత్వం అశాశ్వతమైంది. గార్నర్ అభిప్రాయం ప్రకారం “మరణం లేదా తాత్కాలికంగా గుణములలో సంబంధించిన మార్పులవల్ల గాని, రాజ్యపునఃనిర్మాణం వల్లగాని సార్వభౌమాధికారం మారదు.”

4. అనన్యసంక్రామకత్వం :
రాజ్యానికి గల సార్వభౌమాధికారాన్ని మరొక రాజ్యానికి గాని, సంస్థకుగాని బదిలీ చేయడానికి వీలుపడదు. దాన్ని ఇతరులకు బదిలీ చేసినట్లయితే అది నాశనమౌతుంది. ఒకవేళ రాజ్యం తన భూభాగంలో కొంత భాగాన్ని స్వతహాగా వదులుకుంటే ఆ రాజ్యం సార్వభౌమాధికారాన్ని కోల్పోయినట్లు కాదు. కేవలం ఆ ప్రాంతంపై మాత్రమే తన అధికారం కోల్పోతుంది.

రాజ్యపాలకుణ్ణి ఆ రాజ్యంలోని తిరుగుబాటుదారులు అధికారం నుంచి తొలగించినట్లయితే అది కేవలం ప్రభుత్వంలో మార్పు సంభవించినట్లుగా భావించాలి గాని సార్వభౌమాధికారం మారినట్లు కాదు. సార్వభౌమాధికారం, రాజ్యం సమాంతరంగా కొనసాగుతాయి. ఎందుకంటే శరీరం నుంచి ఆత్మను ఏ విధంగా విడదీయడం సాధ్యం కాదో అదే మాదిరి రాజ్యం నుంచి సార్వభౌమాధికారాన్ని విడదీయలేం.

5. అవిభాజ్యత :
సార్వభౌమాధికారం విడదీయరానిది, దాన్ని విడదీయడం సాధ్యం కాదు. ఒకవేళ దాన్ని విభజించినట్లయితే అది మనుగడను కొనసాగించలేదు. ప్రతి రాజ్యం ఒకే ఒక అభీష్టాన్ని కలిగి ఉంటుంది. సార్వభౌమాధికారాన్ని విడదీయడమనేది సార్వభౌమాధికార సిద్ధాంతానికే వ్యతిరేకం.

బహుతావాదులు సార్వభౌమాధికారం అవిభాజ్యతను వ్యతిరేకించారు. వీరిలో ప్రముఖంగా లోవెల్, బ్రైస్ లాంటి వారు సార్వభౌమాధికార విభజన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.

వీరి ఉద్దేశంలో ఒక రాజ్యంలో రెండు స్థాయిలు గల సార్వభౌమాధికారం ఉంటుంది. దీనికి వీరిచ్చే ఉదాహరణ సమాఖ్య వ్యవస్థలో రాజ్యానికి గల అధికారాలు కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజించబడతాయి. అయితే, వీరి వాదనను వ్యతిరేకించే వారు కేంద్ర – రాష్ట్రాల మధ్య అధికారాల విభజన మాత్రమే జరుగుతుంది గాని సార్వభౌమాధికారం విభజించబడదని అభిప్రాయపడ్డారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఏవైనా నాలుగు రకాల స్వాభౌమాధికారాలను పేర్కొనండి.
జవాబు.
1. నామమాత్రపు సార్వభౌమా కారం :
ఒక వ్యక్తి లేదా సంస్థ రాజ్యం అధికారాలన్నీ పేరుకు మాత్రమే కలిగి ఉండటాన్ని నామమాత్రపు సార్వభౌమాధికారమంటారు. సంప్రదాయానుసారం మాత్రమే సదరు వ్యక్తి లేదా సంస్థ అధికారాలను కలిగి ఉంటారు. వాస్తవానికి ఏ అధికారం ఉండదు.

బ్రిటన్ రాణి, భారత రాష్ట్రపతి నామమాత్రపు సార్వభౌమాధికారానికి చక్కటి ఉదాహరణలు. ఈ రెండు దేశాలలో ఆచరణలో వారి పేరుతో అధికారాన్ని కేబినెట్ చెలాయిస్తుంది.

2. వాస్తవిక సార్వభౌమాధికారం:
సార్వభౌమాధికారాన్ని నామమాత్రపు అధిపతి పేరుతో వేరొక వ్యక్తి లేదా సంస్థ చెలాయించడాన్ని వాస్తవ సార్వభౌమాధికారం అంటారు. వాస్తవ సార్వభౌమాధికారి సహాయ సహకారాలతోనే నామమాత్రపు సార్వభౌమాధికారి ప్రభుత్వ అధికారాలను వినియోగిస్తాడు.

ఉదాహరణకు, పార్లమెంటరీ ప్రభుత్వ విధానం అమల్లో ఉన్న భారతదేశం వంటి రాజ్యాల్లో ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని మంత్రిమండలి సూచనల ప్రకారం నామమాత్రపు సార్వభౌమాధికారి అయిన రాష్ట్రపతి తన అధికారాన్ని వినియోగిస్తారు.

3. న్యాయబద్ధ సార్వభౌమాధికారం:
న్యాయబద్ధ సార్వభౌమాధికారంలో శాసనాలకు, చట్టాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. న్యాయబద్ధ సార్వభౌమాధికారి మాత్రమే అన్ని రకాల ఆజ్ఞలను జారీ చేస్తారు. వీటిని అందరూ తప్పనిసరిగా గౌరవించాలి. దైవిక న్యాయాన్ని లేదా సాధారణ న్యాయాన్ని, ప్రజాభిప్రాయాన్ని చట్ట రూపంలో తీసుకొచ్చే అధికారం కేవలం న్యాయబద్ధ సార్వభౌమాధికారికి మాత్రమే ఉంటుంది. ఇతను జారీ చేసిన కోర్ట్ ఆఫ్ లా కూడా అంగీకరిస్తుంది.

ఈ రకమైన సార్వభౌమాధికారానికి బ్రిటన్ రాజు, రాణి, జపాన్ రాజు, భారతదేశపు రాష్ట్రపతి చక్కటి ఉదాహరణలు. న్యాయబద్ధ సార్వభౌమాధికారం స్పష్టమైంది. వ్యవస్థీకృతమైంది. నిర్బంధమైంది. దాన్ని అతిక్రమించిన వారు శిక్షార్హులు.

4. రాజకీయ సార్వభౌమాధికారం :
ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాల్లో రాజకీయ సార్వభౌమాధికారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. రాజ్యంలోని అందరి చర్యలను రాజకీయ సార్వభౌమాధికారం ప్రభావితం చేస్తుంది. ఎ.వి.డైసీ అనే రాజకీయ పండితుడి దృష్టిలో అందరూ ఆమోదించి ఆచరణలో ఉండే ఒక ఉన్నతాధికారి చర్యయే రాజకీయ సార్వభౌమాధికారం.

అయితే, రాజకీయ సార్వభౌమాధికారం ఎవరెవరికి ఉంటుందో గుర్తించడం సాధ్యం కాదు. సమాజం, సంస్థలు, ప్రజలు, ప్రజాభిప్రాయం వంటి వివిధ రూపాలలో అది నెలకొని ఉంటుంది. ప్రజాభిప్రాయం సాధనాలవల్ల ప్రభావితమై వెల్లడౌతుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

ప్రశ్న 2.
రాజ్యానికి, ప్రభుత్వానికి మధ్యగల వ్యత్యాసాలను వివరించండి.
జవాబు.
రాజ్యానికి – ప్రభుత్వానికి మధ్యగల వ్యత్యాసాలు :

రాజ్యంప్రభుత్వం
1. రాజ్యం చాలా విశాలమైనది. దీనిలో ప్రజలందరూ భాగస్వాములు.1. ప్రభుత్వం చాలా పరిమితమైనది. ఇది కొద్దిమంది పౌరులకు చెందిన సంస్థ.
2. రాజ్యం శాశ్వతమైనది.2. ప్రభుత్వం నిరంతరం మారుతూ ఉంటుంది. ప్రభుత్వం కాలపరిమితికి తగ్గట్టుగా ఏర్పడుతుంది. ఉదాహరణకు భారతదేశంలో ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే మరోసారి బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుంది.
3. రాజ్యానికి సార్వభౌమాధికారం ఉంటుంది.3. ప్రభుత్వానికి సార్వభౌమాధికారం ఉండదు. అయితే, పేరు మీదుగా ప్రభుత్వం సార్వ భౌమాధికారాన్ని చెలాయిస్తుంది.
4. రాజ్యం అమూర్త రూపం4. ప్రభుత్వం నిర్దిష్ట రూపాన్ని కలిగి ఉంటుంది. ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకతను కలిగి ఉండవచ్చు. కాని రాజ్యానికి వ్యతిరేకంగా ఉండలేరు.
5. రాజ్యాలన్నీ విశ్వజనీనమైనవి, స్వభావరీత్యా లక్షణాల రీత్యా పోలికలను కలిగి ఉంటాయి.5. ప్రభుత్వాలు మాత్రం ఆయా రాజ్యాలను బట్టి ఏర్పడతాయి. ఉదాహరణకు, పార్లమెంటరీ, అధ్యక్షతరహా ప్రభుత్వాలు.
6. రాజ్యానికి దాని పౌరులు తప్పనిసరిగా విధేయతను కలిగి ఉండాలి.6. ప్రజాస్వామ్యంలో పౌరులు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కును కలిగి ఉంటారు.
7. రాజ్యం సర్వోన్నతమైనది. అది కొన్ని మౌలిక లక్షణాలను కలిగి ఉంటుంది. అవి ప్రజలు, ప్రభుత్వం, ప్రదేశం, సార్వభౌమాధికారం.7. ప్రభుత్వం రాజ్యానికి గల మౌలిక లక్షణాలలో ఒకటి మాత్రమే. ఈ విధంగా ప్రభుత్వం రాజ్యంలో అంతర్భాగమైనది.
8. రాజ్యానికి గల అధికారాలు వాస్తవమైనవి.8. ప్రభుత్వం చాలా పరిమిత అధికారాలను కలిగి ఉంటుంది. అవి కూడా రాజ్యం ప్రసాదించినవే.
9. రాజ్యం యజమాని వంటిది. అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు.9. ప్రభుత్వ రాజ్యానికి సాధనం వంటిది. ఈ రెండు యజమాని – సేవకుడు సంబంధాలను కలిగి ఉంటాయి. ప్రభుత్వ మనుగడ రాజ్య అభీష్టం మీద ఆధారపడి ఉంటుంది.
10. రాజ్యానికి నిర్దిష్ట భౌగోళిక ప్రదేశం ఉంటుంది. ఇది లేకుండా రాజ్యం మనుగడను కొనసాగించలేదు.10.  భౌగోళిక ప్రదేశం ప్రభుత్వానికి అవసరం లేదు. ఎందుకంటే, ఉదాహరణకు బ్రిటన్ ప్రభుత్వం భారతదేశాన్ని చాలా సంవత్సరాలు పరిపాలించింది.
11. రాజ్యంలో వ్యక్తులకు సభ్యత్వం తప్పనిసరి. ఏ ఒక వ్యక్తి సభ్యత్వం నుంచి తప్పించుకోలేడు.11. ప్రభుత్వంలో వ్యక్తులకు సభ్యత్వం తప్పనిసరికాదు. వ్యక్తి ఇష్టాయిష్టాల మీద సభ్యత్వం ఆధారపడి ఉంటుంది.
12. రాజ్యానికి గల అధికారం నిరపేక్షం, యథార్థం.12. ప్రభుత్వ అధికారాలు పరిమితం, ఆపాదించబడినవి.

 

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

ప్రశ్న 3.
రాజ్యానికి ఇతర సంస్థలకు గల తేడాలు ఏమిటి ?
జవాబు.
రాజ్యానికి – సంస్థలకు / సంఘాలకు మధ్యగల వ్యత్యాసాలు :

రాజ్యంసంస్థలు / సంఘాలు
1. రాజ్యం శాశ్వతమైంది.1. సంస్థలు/సంఘాలు అశాశ్వతమైనవి.
2. రాజ్యానికి సార్వభౌమాధికారం ఉంది.2. సంస్థలు/సంఘాలకు సార్వభౌమాధికారం ఉండదు.
3. రాజ్యానికి నిర్దిష్ట సరిహద్దులు ఉంటాయి. ఏ రాజ్యం విశ్వవ్యాప్తం కాదు లేదా ప్రపంచ వ్యాప్తం కాదు.3. ఇవి నిర్దిష్ట సరిహద్దులను కలిగి ఉండవు. అయితే కొన్ని సంస్థలు అంతర్జాతీయమైవి కూడా ఉంటాయి. ఉదాహరణకు ఐక్యరాజ్యసమితి, రెడ్ క్రాస్ సొసైటీ, ది లైన్స్ క్లబ్ మొదలైనవి.
4. రాజ్యంలో పౌరులకు సభ్యత్వం తప్పనిసరి. ప్రతి పౌరుడు రాజ్యంలో సభ్యుడుగా ఉండాలి.4. సంస్థల/సంఘాలలో సభ్యత్వం అనేది ఐచ్ఛికం. వ్యక్తుల ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది.
5. ఒక వ్యక్తికి ఒక్క సభ్యత్వం మాత్రమే ఉంటుంది.5. వీటిలో ఒక వ్యక్తి ఎన్నింటిలోనైనా సభ్యత్వం పొందవచ్చు.
6. రాజ్యం బహుళ విధులను నిర్వహిస్తుంది.6. సంస్థల విధులు ఒక్కటిగానే ఉండి కేవలం సభ్యులకు మాత్రమే చెందుతాయి.
7. రాజ్యం చట్టాలను, శాసనాలను చేస్తుంది. వాటిని అతిక్రమించినవారికి శిక్ష విధిస్తుంది.7. సంస్థలు/సంఘాలు శాసనాలను, చట్టాలను చేయవు. కాని వాటికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలను ఏర్పర్చుకుంటాయి.
8. ప్రజల మీద రాజ్యం పన్నును విధిస్తుంది.8. సంస్థలు/సంఘాలు ఎటువంటి పన్నులను విధించ లేవు. అయితే స్వచ్ఛందంగా సభ్యత్వ రుసుం చెల్లించుకోవచ్చు.
9. రాజ్యం లక్ష్యాలు విశాలమైనవి.9. సంస్థలు/సంఘాల లక్ష్యాలు ఆశయాలు చాలా పరిమితమైనవి.
10. రాజ్యం తన నిర్ణయాలను ప్రజలపై రుద్దవచ్చు. వాటిని పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవచ్చు.10. సంస్థలు, సంఘాలు తమ నిర్ణయాలను బలవంతంగా ప్రజలపై రుద్దలేవు. పాటించనివారిపై చర్యలు తీసుకోలేవు.
11. సంస్థలన్నింటికంటే రాజ్యం శ్రేష్ఠమైనది.11. సంస్థలన్నీ రాజ్యం పరిధిలో ఉండి రాజ్యం దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి కొనసాగుతూ ఉంటాయి.

 

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

ప్రశ్న 4.
జాన్ ఆస్టిన్ ఏకత్వసార్వభౌమాధికారం అంటే ఏమిటి ?
జవాబు.
18వ శతాబ్దంలో ఏకత్వ సార్వభౌమాధికార సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఇంగ్లాండ్ దేశ న్యాయకోవిదుడు జాన్.ఆస్టిన్. ఇతను తన గ్రంథమైన “లెక్చర్స్ ఆన్ జ్యూరిస్ ప్రుడెన్స్” (1832)లో ఈ సిద్ధాంత ప్రతిపాదన చేశాడు. తన కంటే ముందున్న థామస్ హాబ్స్, జెర్మి బెంథామ్ల సిద్ధాంతాలను తన సిద్ధాంతానికి ఆధారంగా తీసుకున్నాడు.

ఆస్టిన్ సిద్ధాంతాన్ని “నిరపేక్ష లేదా న్యాయబద్ధ సార్వభౌమాధికార సిద్ధాంతమని” కూడా పేర్కొంటారు. ఇతని అభిప్రాయంలో శాసనమనేది సార్వభౌముడు ప్రజలకిచ్చిన ఆజ్ఞగా పేర్కొన్నాడు.

ఆస్టిన్ సార్వభౌమాధికారం – ముఖ్య లక్షణాలు :
1. ఇది నిశ్చయాధికారం :
ప్రతి స్వతంత్ర రాజకీయ సమాజంలో ఒక నిర్ణీత మానవ అధికారి లేదా వ్యక్తుల సముదాయానికి సార్వభౌమాధికారం ఉంటుంది. వ్యక్తికీ లేదా వ్యక్తుల సముదాయానికి గల అధికారం నిశ్చయ సార్వభౌమాధికారం.

2. సార్వభౌమాధికారి ప్రజలు అలవాటు ప్రకారం విధేయులై ఉంటారు :
సమాజంలోని ప్రజలందరు తమ అలవాటు ప్రకారం సార్వభౌమాధికారికి విధేయులై ఉంటారు. ప్రజలపై ఎటువంటి ఒత్తిడిగాని, ప్రలోభంగాని ఉండదు. ప్రజలు యథాలాపంగా సార్వభౌముడికి విధేయులై ఉంటారు.

3. సార్వభౌమత్వం అవిభాజ్యం:
సార్వభౌమాధికారం విభజించడానికి వీలులేనటువంటిది. ఎందుకంటే అది ఒకే దగ్గర కేంద్రీకరించబడి ఉంటుంది. సార్వభౌముడి అధికారానికి ఎటువంటి పరిమితులుండవు. శాసనాలకు మూలాధారం, సార్వభౌముడు.

4. సార్వభౌమాధికారం ఆవశ్యకమైంది :
రాజకీయ సమాజానికి సార్వభౌమాధికారం అత్యంత అవసరమైంది. సార్వభౌమత్వం లేని సమాజం, రాజకీయంగాని స్వతంత్రతగాని లేని సమాజమౌతుంది.

5. చట్టమే తుది ఆజ్ఞ :
సార్వభౌముని ఆజ్ఞే చట్టం. చట్టాన్ని ఉల్లంఘించిన వారు శిక్షార్హులు అవుతారు. ఎందుకంటే సార్వభౌమాధికారం నిరపేక్షమైంది, నిర్దిష్టమైంది, స్పష్టమైంది, అపరిమితమైంది కాబట్టి.

6. రాజ్యానికి వ్యతిరేకమైన ఎటువంటి హక్కులు ప్రజలకు ఉండవు :
రాజకీయ సమాజంలోని ప్రజలకు సార్వభౌముడు ప్రసాదించిన హక్కులు మినహా ఏ ఇతర హక్కులు ఉండవు. ప్రజలు రాజ్యాన్ని వ్యతిరేకించే హక్కులను కలిగి ఉండరు.

ప్రశ్న 5.
బహుతావాద సార్వభౌమాధికారం అంటే ఏమిటి ?
జవాబు.
బహుతావాద (బహుత్వవాద) సార్వభౌమాధికార సిద్ధాంతం ఆస్టిన్ ప్రతిపాదించిన ఏకత్వ నిరపేక్ష సార్వభౌమాధికార సిద్ధాంతానికి వ్యతిరేకంగా ప్రచారంలోకి వచ్చింది. ప్రజాస్వామ్యం, సమాఖ్య సిద్ధాంత స్ఫూర్తి. వ్యక్తిగత స్వేచ్ఛ, అధికారాల విభజన వంటి అనేక అంశాలు బహుతావాద సార్వభౌమాధికారం బహుళ ప్రాచుర్యం పొందడానికి దోహదపడ్డాయి.

వాన్ గిర్కే (1844 – 1925) :
మొట్టమొదటిసారి బహుతావాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆ తరువాత మెట్లాంగ్, బార్కర్, జి.డి. హెచ్. కోల్, హెచ్.జె. లాస్కీ, లిండ్సే, మైకేవర్, ఫాలెట్ వంటి వారు బహుతావాద సార్వభౌమాధికార సిద్ధాంతాన్ని బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు.

వీరందరూ ఏకత్వ సార్వభౌమాధికారం చాలా ప్రమాదకరమైందని ఆధునిక ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలి పెట్టులాంటిదని అభిప్రాయపడ్డారు. బహుత్తావాదుల అభిప్రాయంలో రాజకీయ సమాజంలోని అనేక సంస్థలలో రాజ్యం ఒకటని అందువల్ల అధికారమంతా ఒక్క రాజ్య అధీనంలోనే ఉండదని వీరు పేర్కొన్నారు.

బహుతావాద సార్వభౌమాధికారం – ప్రధాన అంశాలు :

  1. సమాజంలోని అనేక సంస్థల్లో రాజ్యం ఒకటి. రాజ్యం ఒక్కటే అధికారాన్ని కలిగి ఉండదు. సమాజంలోని వివిధ సంఘాలు కూడా సమాజానికి ఉపయోగకరమైన పనులు చేస్తాయి. అందువల్ల సార్వభౌమాధికారాన్ని రాజ్యానికి వివిధ సంఘాల మధ్య పంచడమే సమంజసమని వీరి అభిప్రాయం.
  2. రాజ్యం సమాజాన్ని గాని మరే ఇతర సంస్థను గాని నిర్మించలేదు. అదేవిధంగా సమాజంలోని సాంస్కృతిక, ఆర్థిక, మతపరమైన, రాజకీయపరమైన సంస్థలను కూడా రాజ్యం సృష్టించలేదు. ఈ కారణం చేత రాజ్యం ఈ సంస్థలను చేయజాలదు. రాజ్యానికి ఆ అధికారం కూడా లేదు.
  3. .సమాజం సమాఖ్య రూపాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి రాజ్యం దాని అధికారాలను అన్ని సంస్థలకు పంపిణీ చేయవలసి ఉంటుంది.
  4. సార్వభౌమాధికారం ఒక్క రాజ్యానికి మాత్రమే చెందింది కాదు. కాబట్టి మిగతా సంస్థలన్నింటి మీద దాని అధికారం ఉండదు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

ప్రశ్న 6.
సమాజానికి, రాజ్యానికి గల తేడాలు ఏమిటి ?
జవాబు.
రాజ్యానికి – సమాజానికి మధ్యగల వ్యత్యాసాలు :

రాజ్యంసమాజం
1. రాజ్యం రాజకీయ సంస్థ.1. సమాజం సాంఘిక సంస్థ.
2. రాజ్యానికి నిర్ణీత నిర్దిష్ట భౌగోళిక సరిహద్దులుంటాయి.2. సమాజానికి నిర్దిష్ట భౌగోళిక సరిహద్దులుండవు.
3. రాజ్యం శాసనబద్ధంగా నిర్మితమైన ప్రభుత్వాన్ని కలిగి ఉంటుంది.3. సమాజం శాసనబద్ధంగా నిర్మితమైన సంస్థను కలిగి ఉండదు.
4. రాజ్యానికి అధికారం ఒక అలంకారంగా ఉంటుంది. రాజ్యాధికారాన్ని ధిక్కరించిన వారిని శిక్షించే శాసనం చట్టం చేతిలో ఉంటుంది.4. సమాజం ఎటువంటి అధికారాన్ని కలిగి ఉండదు. సమాజంలోని వ్యక్తుల నిరసనను శిక్షించే భౌతిక అధికారం దీనికి ఉండదు.
5. రాజ్యానికి మాత్రమే సార్వభౌమాధికారం ఉంటుంది. ఆ అధికారాన్ని దానికి గల సాధనాల ద్వారా శాసనాలను చట్టాలను, పథకాలను అమలు పరుస్తూ ఉంటుంది.5. సమాజానికి ఎటువంటి సార్వభౌమాధికారం ఉండదు. కాని ఆచారాలు, సంప్రదాయాలు, నైతిక విలువలు దీనికి అలంకార నియమాలుగా ఉంటాయి. అధికారంతో కూడిన శక్తి మాత్రం దీనికి ఉండదు.
6. రాజ్యం సహజ సంస్థ కాదు. మానవ ప్రయోజనాలకై నిర్మించిన సంస్థ. దీనిలో వ్యక్తులకు సభ్యత్వం తప్పనిసరి.6. సమాజం సహజ స్వచ్ఛందమైన సంస్థ. దీనిలో సభ్యత్వం ఇష్టపూర్వకంగా లభిస్తుంది.
7. రాజ్యం సమాజంలో అతి ముఖ్యమైన సంస్థ. రాజకీయంగా వ్యవస్థీకృతమైన సమాజంలో రాజ్యం అంతర్భాగం.7. సమాజం రాజ్యం కంటే విశాలమైనది. సమాజం అనేక గుంపుల సంఘాలకు నిలయం అయినందున దీనిలోని సంబంధాలు సైతం సంక్లిష్టంగా ఉంటాయి.
8. రాజ్యానికి బలం అది రూపొందించుకొనే శాసనం, చట్టం, రాజ్యాంగం.8. సమాజానికి బలం, అది కలిగి ఉన్న ఆచారం, సంప్రదాయాలు విలువలు, కట్టుబాట్లు మొదలైనవి.
9. రాజ్యం, వ్యక్తుల బహిర్గత కార్యకలాపాలను మాత్రమే పర్యవేక్షిస్తుంది. దాని నిమిత్తం కొన్ని నియమ నిబంధనలను రూపొందిస్తుంది.9. సమాజం వ్యక్తుల అంతర్గత బహిర్గత కార్యకలాపాలను నియంత్రిస్తుంది. సమాజం అన్ని రకాల సాంఘిక రూపాలను పర్యవేక్షిస్తుంది.
10. రాజ్యం ఒక అభివృద్ధి చేసిన సాంఘిక సంస్థ. ఇది సమాజం నుంచి ఆవిర్భవించింది.10. సమాజం మొట్టమొదటిగా ఏర్పడిన సంస్థ, అతి విశాలమైనది. మానవులు స్వభావరీత్యా సంఘ జీవులు.
11. రాజ్యం శాశ్వతమైనది కాకపోవచ్చు. కాలక్రమంలో అది అంతరించిపోవచ్చు లేదా మరో బలవంతమైన రాజ్యం ద్వారా ఆక్రమణకు గురికావచ్చు.11. సమాజం శాశ్వతమైనది. అది ఎల్లవేళలా కొనసాగేది.

 

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం 

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
రాజ్యం అంటే ఏమిటి ?
జవాబు.
‘రాజ్యం’ అనే పదాన్ని అనేకమంది రాజనీతిశాస్త్ర పండితులు అనేక రకాలుగా నిర్వచించారు. వారిలో కొందరు ఇచ్చిన నిర్వచనాలను కింది విధంగా పేర్కొనడమైంది.

  1. అరిస్టాటిల్ : “మానవునికి సుఖప్రదమైన, గౌరవప్రదమైన జీవనాన్ని ప్రసాదించడమే లక్ష్యంగా కలిగిన కుటుంబాలు, గ్రామాల సముదాయమే రాజ్యం”.
  2. బ్లంట్లీ : “ఒక నిర్ణీత ప్రదేశంలో నివసిస్తూ రాజకీయంగా వ్యవస్థీకృతమైన ప్రజల సముదాయమే రాజ్యం”.

ప్రశ్న 2.
ప్రభుత్వం అంటే ఏమిటి ?
జవాబు.
రాజ్యం యొక్క ఆశయాలను, లక్ష్యాలను నెరవేర్చే సాధనమే ప్రభుత్వం. ప్రభుత్వం మూడు అంగాలను కలిగి ఉంటుంది. అవి :

  1. శాసనశాఖ
  2. కార్యనిర్వాహక శాఖ
  3. న్యాయశాఖ.

ప్రశ్న 3.
సమాజం అంటే ఏమిటి ?
జవాబు.
సమాజం ప్రాచీనమైనది. రాజ్యం కంటే ముందు ఏర్పడినది. మానవుడు సంఘజీవి. సమాజంలో మాత్రమే వ్యక్తి సంపూర్ణ వికాసాన్ని, సుఖవంతమైన జీవితాన్ని గడపగలడు. “సమిష్టి జీవనాన్ని గడుపుతున్న మానవ సముదాయమే” సమాజము. సమాజంలో సభ్యత్వం లేని మానవుడిని ఊహించలేము.

వలలాగా అల్లబడిన వివిధ రకాల మానవ సంబంధాలను ‘సమాజం’ అని చెప్పవచ్చు. అయితే రాజ్యంలాగా సార్వభౌమాధికారము, దండనాధికారం ఉండదు. సాంఘిక ఆచార సంప్రదాయాల ఆధారముగా శిక్షలు ఉంటాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

ప్రశ్న 4.
ఏకత్వ సార్వభౌమాధికార సిద్దాంతం.
జవాబు.
18వ శతాబ్దంలో ఏకత్వ సార్వభౌమాధికార సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఇంగ్లాండ్ దేశ న్యాయకోవిదుడు జాన్ ఆస్టిన్. ఇతను తన గ్రంథమైన “లెక్చర్స్ ఆన్ జ్యూరిస్ప్రుడెన్స్”లో ఈ సిద్ధాంత ప్రతిపాదన చేశాడు. ఆస్టిన్ సిద్ధాంతాన్ని నిరపేక్ష లేదా న్యాయబద్ధ సార్వభౌమాధికార సిద్ధాంతమని కూడా పేర్కొంటారు. ఇతని అభిప్రాయంలో శాసనమనేది సార్వభౌముడు ప్రజలకిచ్చిన ఆజ్ఞగా పేర్కొన్నాడు.

ప్రశ్న 5.
బహుత్వ సార్వభౌమాధికార సిద్ధాంతం.
జవాబు.
బహుతావాద సార్వభౌమాధికార సిద్ధాంతం ఆస్టిన్ ప్రతిపాదించిన ఏకత్వ నిరపేక్ష సార్వభౌమాధికార సిద్ధాంతానికి వ్యతిరేకంగా ప్రచారంలోకి వచ్చింది. వాన్ గిర్కే మెట్లా లాండ్, బార్కర్, జి.డి. హెచ్. కోల్, లస్కీ, మెకైవర్, ఫాలెట్ వంటివారు బహుతావాద సార్వభౌమాధికార సిద్ధాంతాన్ని బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. సమాజంలోని అనేక సంస్థల్లో రాజ్యం ఒకటి.

రాజ్యం ఒక్కటే అధికారాన్ని కలిగివుండదు. సమాజంలోని వివిధ సంఘాలు కూడా సమాజానికి ఉపయోగకరమైన పనులు చేస్తాయి. అందువల్ల సార్వభౌమాధికారాన్ని రాజ్యానికి, వివిధ సంఘాల మధ్య పంచడమే సమంజసమని బహుతావాదుల అభిప్రాయం.

ప్రశ్న 6.
అంతర్గత సార్వభౌమాధికారం.
జవాబు.
అంతర్గత సార్వభౌమాధికారం : దేశంలోని ఆంతరంగిక వ్యవహారాలతో ఆ రాజ్యానికున్న అత్యున్నత అధికారాన్ని అంతర్గత సార్వభౌమాధికారంగా చెప్పవచ్చు. ఒక రాజ్య ప్రాదేశిక పరిధిలో నివసిస్తున్న వ్యక్తులు, సంస్థలు, సంఘాలన్నింటికి సంబంధించిన విషయాలలో శాసనాలు రూపొందించి అమలు చేసే అధికారాన్ని అంతర్గత సార్వభౌమాధికారం అంటారు. ప్రజలకు సంబంధించిన అన్ని రకాల స్వేచ్ఛలు హక్కులు రాజ్యానికి గల సార్వభౌమాధికారం ద్వారా మాత్రమే సంక్రమిస్తాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

ప్రశ్న 7.
బహిర్గత సార్వభౌమాధికారం.
జవాబు.
బాహ్య సార్వభౌమాధికారం :
ఒక రాజ్యం తన జాతి ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా అంతర్జాతీయ సమాజంలో ఇతర దేశాలలో చేసుకొనే ఒప్పందాలు, సంప్రదింపులు, దౌత్యనీతి, యుద్ధం వంటి అంశాలలో ఏ ఇతర రాజ్యాల ప్రభావానికి లోబడక సర్వస్వతంత్రంగా వ్యవహరించడాన్ని ఆ రాజ్యానికి ఉన్న బాహ్య సార్వభౌమాధికారంగా చెప్పవచ్చు. మరో విధంగా చెప్పాలంటే ఇటువంటి అధికారం గల రాజ్యంలో విదేశీ వ్యవహారాలలో ఇతర రాజ్యాల జోక్యానికి తావుండదు.

ప్రశ్న 8.
చట్టబద్ధ సార్వభౌమాధికారం.
జవాబు.
‘డి జ్యూర్’ అనేది ఫ్రెంచి పదం. డిజ్యూర్ అంటే చట్టబద్ధమైన అధికారం అని అర్థం. ఒక ప్రాదేశిక రాజ్యంలోని ప్రజలు, సంస్థలన్నింటికీ ఆజ్ఞలను జారీ చేసే చట్టబద్ధమైన అధికారం కలిగి ఉండటాన్ని డిజ్యూర్ సార్వభౌమాధికారమంటారు.

డిజ్యూర్ సార్వభౌమాధికారం రాజ్యాంగం, శాసనాల ద్వారా సంక్రమిస్తుంది. రాజ్యంలోని న్యాయస్థానాలు ఈ సార్వభౌమాధికారాన్ని గుర్తిస్తాయి. బ్రిటన్ రాణి, భారత రాష్ట్రపతి ఇటువంటి సార్వభౌమాధికారానికి ఉదాహరణలు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

ప్రశ్న 9.
యథార్థ సార్వభౌమాధికారం.
జవాబు.
‘డిఫాక్టో’ అనేది ఫ్రెంచిపదం. డిఫాక్టో అంటే ఫ్రెంచి భాషలో యథార్థమైందని అర్థం. రాజ్యంలో సార్వభౌమాధికారాన్ని ‘ఎవరైతే వాస్తవంగా చెలాయిస్తారో వారికి ‘డిఫాక్టో’ సార్వభౌమాధికారం ఉంటుంది. ఈ విధమైన సార్వభౌమాధికారం ఒత్తిడి, నిర్బంధం, బలప్రయోగం వంటి అంశాలపట్ల నియంత్రించబడుతుంది. అటువంటి అధికారాన్ని చట్టం గుర్తించదు. కాని యథార్థానికి వారి యథార్థానికి వారి మాటే చెల్లుతుంది. ఈ విధంగా అధికారంలోకి వచ్చినవారు సైనికాధికారులు కావచ్చు. నియంతలు కావచ్చు లేదా మతాధికారులు కావచ్చు.