TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 2 బిచ్చగాడు?

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 2nd Lesson బిచ్చగాడు? Textbook Questions and Answers.

TS Inter 1st Year Non-Detailed 2nd Lesson బిచ్చగాడు?

ప్రశ్నలు- జవాబులు

ప్రశ్న 1.
‘బిచ్చగాడు కుటుంబానికి ఎదురైన కష్టాలను వివరించండి?
జవాబు:
బిచ్చగాడు కథ అంపశయ్య నవీనే చ్చే రచించబడింది. అంపశయ్య నవీన్ అసలు పేరు దొంగరి మల్లయ్య ‘బిచ్చగాడు’ పాఠ్యభాగం నవీన్ రాసిన ‘ఎనిమిదో అడుగు’ కథా సంపుటి నుండి గ్రహించబడింది.

ప్రపంచంలో పలు రకాల దోపిడీలు మోసాలు జరుగుతుంటాయి. అందులో శ్రామికుల కార్మికుల జీవితాలలో జరిగే శ్రమదోపిడి అత్యంత భయంకరమైనది. రోజువారి కూలీ పనులు చేస్తూన్న వలన కార్మికులలో, సంచార జీవనం సాగించేవారిలో, రోజు అడుక్కుంటూ పొట్టపోసుకునే బతుకులలో ఈ శ్రమదోపిడి మానవతా విలువలకు తావులేకుండా చేస్తుంది. వారి దోపిడీకి నగ్న సత్యంగా నిలచిన కథే ఈ బిచ్చగాడి కథ.. గౌరవ ప్రదమైన వృత్తులలో ఉన్నవారి హీన మనస్తత్వానికి దోపిడీ స్వభావానికి ఇది ఒక ఉదాహరణం. ఈ కథ అమానవీయతను, నైతిక పతనాన్ని తెలియచేస్తుంది.

ఈ కథ ప్రయాణ సమయంలో విభిన్న మనస్తత్వాలు గల మానవ హృదయాలను ఆవిష్కరిస్తుంది. రచయిత కొత్తగూడెంలో బంధువుల వివాహ వేడుకలకు అటెండయి తిరిగి వరంగల్లుకు వెళ్తున్న సందర్భంలో జరిగింది. రైలు చాల రద్దీగా ఉంది. కూర్చోటానికి జాగా ఎక్కడా కన్పించలేదు.

చివరికి ఒక కంపార్ట్మెంట్లో ఓ సీటు మొత్తాన్ని ఒకామె బోల్డు లగేజీతో సీటు మొత్తాన్ని ఆక్రమించేసింది. ఆమె ఓ బిచ్చగత్తె. ఆమె భర్త టికెట్ తీసుకురావటానికి వెళ్ళాడు. కౌంటర్ దగ్గర చాలా రద్దీగా ఉంది. బండి కదలటానికి సిద్ధమవటంతో అతడు పరిగెత్తుకొచ్చాడు. వాడికి టికెట్ అందనేలేదు. ఎవడికో డబ్బులిచ్చి వచ్చాడు. కొందరు టికెట్ లేకపోతే టి.సి వచ్చి నానాయాగీ చేస్తాడన్నాడు.

ట్రైన్ కదలింది. టికెట్ తెస్తానన్నవాడు ఆ డబ్బులతో అటే పోయాడు. టి.సి రానే వచ్చాడు. ఆ బిచ్చగాడి పేరు బ్రహ్మయ్య. ఒరేయ్ టికెట్ తీయరా! అన్నాడు టి.సి. “అయ్యా!

టికెట్ కోసమే పోయినయ్యా! ఇయ్యాళ కొత్తగూడెం టేషన్లో అంతా మందే…… టికెట్ తీసుకోమని మా అన్న కొడుకుని పంపిన. ఆడు చెయ్యి బెడ్తుండగనే బండి కదిలింది. నేను వాణ్ణి వదిలేసి బండెక్కిన” “నోర్ముయిరా దొంగ వెధవ. ఎక్కడివెళ్ళాలి” అన్నాడు. “నెక్కొండ” “బాంచెన్” అన్నాడువాడు. ఆ ఆడది నల్గురు పిల్లలు నీ వాళ్ళేనా”

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 2 బిచ్చగాడు?

“అయ్యా మా వాళ్ళే’ అయితే 56 రూపాయలు తియ్” అతడు వెంటనే టి.సి రెండు కాళ్ళు పట్టుకున్నాడు.

“లే గాడిద కొడకా! నా కాళ్ళెందుకుకురా పట్టుకుంటావ్” పైసలిస్తవా పోలీసోళ్ళకు పట్టించనా అన్నాడు టి.సి “నన్ను కోసినా నా దగ్గర పైసల్లేవు బాంచనా” ఈ భాగోతం అంతా బండిలో ఉన్న వారికి వినోదంగా మారింది” వరేయ్ బ్రహ్మయ్య! డబ్బు తియ్యరా” అన్నాడు టి.సి “అయ్యా! నన్ను కోసినా నా వద్దపైసాలేదయ్యా! అంటూ బ్రహ్మయ్య మళ్ళీ కాళ్ళు పట్టుకోబోయాడు. “నన్నుంటుకున్నావంటే చంపేస్తా…

బద్మాష్ లుచ్చ నీ దగ్గర డబ్బులేదురా. ఆరుమాలు తీయ్ ” అన్నాడు టి.సి “ఈ రూమాల్నేముందు బాంచెన్…. మీ అసుంటి ఓ దొర దగ్గర అడుక్కున్నా నన్ను నమ్మండ్రి బాంచెన్ అని మళ్ళీ కాళ్ళు పట్టుకోబోయాడు. ఇద్దరి మధ్య పెనుగులాటలో రుమాలు చిరిగి పోయింది. దాన్లో నుండి 30 రూ॥ బయట పడ్డాయి. ఆ ముప్పై ఇదేనా అన్నాడు టి.సి “ఛట్ దొంగ రాస్కెల్. ఇంకా మోసం చేద్దామని చూస్తావురా! తీయ్ మిగతా 26రూ॥ అన్నాడు. “మమ్ముల కొట్టుండి. సంపుండ్రి. ఈ బండ్లె నుంచి బయటకు ఇసిరి కొటుండ్రి మా వద్దిక పైసల్లేవ్ అంది బ్రహ్మయ్య భార్య.

“నోర్మూయ్యలే దొంగముండ. పైసల్ లేవంటే ఫైనెవ్వడు కడ్డడు. నీ నడుంకున్న ఆ సంచితియ్ అన్నాడు టి.సి. దాంట్లో ముంది నిన్న మొన్న అడుక్కున్న డబ్బులు. నిండు చూలాలు. నలుగురు పిల్లలలో ఉన్న ఆమెను చూస్తే ఎవరికి జాలి కలుగలేదు“ఈ పూటకు నూక మందమన్నా ఉంచుండ్రయ్యా! నిన్న మొన్న ఏమిటి నేను ఏమిటినేను.

నా పోరగాండ్లను సూడుండ్రి ఆకలితో నకనక లాడిపోతండ్రు అని ఎంత కాళ్ళు పట్టుకున్నా ప్రతమ్నాయం లేకపోయింది. ఆ సంచిలోని డబ్బంతా క్రిందపోసి 26 రూ॥ తీసుకుని ఒక రిసీట్ బుక్ తీసి ఏదో రాశాడు. నా దృష్టి ఆ కాగితం పై 22 రూ॥లు డోర్నక్ టు నెక్కొండ” అని పడింది. ఇంతకూ ఎవరు పెద్ద బిచ్చగాడో మీరే అర్ధం చేసుకోండి. అని కవికథలు ముగించాడు.

ప్రశ్న 2.
బిచ్చగాడు కథలోని ప్రయాణీకుల మనస్తత్వాన్ని విశ్లేషించండి?
జవాబు:
బిచ్చగాడు కథ అంపశయ్య నవీన్ చే రచించబడింది. ఈయన అసలు పేరు దొంగరి మల్లయ్య. ‘బిచ్చగాడు’ పాఠ్యభాగం నవీన్ రాసిన ‘ఎనిమిదో అడుగు’ కథా సంపుటి నుండి గ్రహించబడింది. గౌరవ ప్రదమైన వృత్తులలో ఉన్నవారి హీనమనసత్వాలను చక్కగా వివరించాడు. సమాజంలోని మనుషుల స్పందనా రాహిత్యాన్ని అమానవీయతను నైతిక పతనాన్ని ఈ కథ వివరిస్తుంది.

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 2 బిచ్చగాడు?

రచయిత కొత్తగూడెంలో బంధువుల వివాహానికి వెళ్ళి తిరిగి వరంగల్కు ప్రయాణం చేసే సందర్భంలో జరిగిన సంఘటనలకు సంబంధించిన కథ ఇది. ఆ రోజు స్టేషన్ చాల రద్దీగా ఉంది. టికెట్ దొరికే అవకాశం ఏ మాత్రం కన్పించలేదు. అంతలో ఒకప్పటి తన విద్యార్థి భాస్కర్ సి. ఐగా పని చేస్తాడు. అతని పుణ్యమా అని టికెట్ సంపాదించి ట్రైన్లోకి ప్రవేశించాడు. కూర్చోటానికి సీటు ఎక్కడా ఖాళీ లేదు. చివరికి ఒక కంపార్ట్మెంట్లో ఒక సీటు మొత్తాన్ని ఒక స్త్రీ తన సామానులతో ఆక్రమించింది.

ఆ సామానంతా అటూ ఇటూ జరిపితే ఐదుగురు కూర్చోవచ్చు. ఆ స్త్రీ చాల పేదరాలుగా ఉంది. బిచ్చగత్తెలా ఉంది. నలుగురు సంతానంతో చినిగిపోయిన గుడ్డపీలికలు కట్టుకునుండి. మురికిగా అసహ్యంగా ఉన్నారు. ఎలాగోలా అక్కడ కూర్చోవాలని “ఇదిగో ఇటు చూడు…. ఆ సామానంతా క్రిందపెట్టేస్తే ఇక్కడ ఇంకో ఇద్దరు ముగ్గురు కూర్చోవచ్చుగా అన్నాడు. ఆ స్త్రీ “గదంతేం లేదు మేము సామాను తియ్యం. ఇంకో డబ్బాలోకి పోయి కూకో”చాలా మొరటుగా సమాధానం చెప్పింది.

ఇంతలో అక్కడ కూర్చున్న పెద్ద మనిషి. “అధునా భిచ్చముండవు. నీ పొగరుండీ మాకెంతుండాల్నే ఆ సారెంత మర్యాదగా అడిగిండు- ఈ రైలు మీ తాతదనుకున్నావా” అని గద్దించాడు. చివరికి అక్కడ కూర్చున్నారు కవిగారు.

ఇంతలో గార్డువిజిల్ విన్పించింది. ఆ బిచ్చగత్తె గొంతులో ఆందోళన. “మీ అయ్యేడిరా! ఎక్కడ సచ్చిండు? రైలు పోతాంది” అంది ఇంతలో టికెట్ కోసం వెళ్ళిన వాడు వచ్చాడు. “టికెట్ దొరకనేలేదు బండిపోతాంది. సామానునంతా కిందకి దించి మీరు దిగుండే” అన్నాడు.

“ఓరిపిచ్చిగాడిద కొడకా సామానునంతా దించే వరకు బండి ఆగుతుందా ఏమిటి? టి.సి. గారితోని చెప్పి బండిలో కూర్చో అన్నాడు ఆ పెద్దమనిషి. అప్పటికే ఆ బిచ్చగాడు బండిదిగి టికెట్ తీయమని డబ్బులిచ్చిన వాడి దగ్గరకు పరిగెత్తాడు. ఆడురాక పోతే టి. సీకి కట్టడానికి నీ దగ్గర డబ్బులున్నాయా అన్నారొకరు.

“ఒక్కపైసాలేదు. లేదు బాంచెను “అందామె ఏడుస్తూ “నువ్వట్లనే అంటావు. ఇయ్యాళేపు బిచ్చగాళ్ళ దగ్గరున్నన్ని డబ్బులు మా అసంట్లోళ్ళ దగ్గర కూడా లేవు. మీకేందే పెట్టుబడి లేని వ్యాపారం” అన్నాడు ఎగతాళిగా. అక్కడ ఉన్నవారందరూ చులకనగా నవ్వారు.

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 2 బిచ్చగాడు?

మీ పనే బాగుందిరా. ఎక్కడా బిచ్చమే… కానీ ఖర్చులేని బతక్కు అన్నాడకొడు. ఊళ్ళన్నీ వాళ్ళవే! దేశాలన్నీ వాళ్ళవే దొరికింది తింటారు. లేకుంటే పస్తులుంటారు. ఏ బాదరాబందీ లేదు. మనకంటే వాళ్ళేనయం అన్నాడో ప్రయాణీకుడు. టి.సి రావడం ఆ బిచ్చగాణ్ణి బెదిరించడం జరిగాయి. ఆ బిచ్చగాడి రుమాలులో డబ్బులు కిందపడ్డాయి. అక్కడి ప్రయాణీకులలో బిచ్చగాడిపట్ల అప్పటి వరకు ఉన్న సానుభూతి ఎరిగిపోయింది.

“దొంగముండా కొడుకులు. వీళ్ళను చచ్చినా నమ్మోద్దు. టి.టి గారికి వీళ్ళ సంగతి బాగా తెలుసు. మంచిపని చేసుండు” అన్నాడు ఆ ఖద్దరు బట్టల నాయకుడు. నిండుచూలాలు వీళ్ళకు ఇలా జరుగుతుంటే వారిపై ప్రయాణీకులెవరికి జాలికలుగలేదు. అదే విషయం సినిమాలో చూస్తే కళ్ళ వెంట నీళ్ళు కారుస్తారు.

మేమంతా, టికెట్లు కొన్నాం. వీళ్ళు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు. మనకు లేని ప్రివిలేజ్ వీళ్ళకెందుకు పొందాలి అన్న ఈర్ష్య వారిలో కన్పించింది. టీ.సి ఆ గర్భిణి నుండి ‘సంచిని లాక్కొని డబ్బంతా కింద బోర్లించాడు. ఫైనుతో టికెట్కు సరిపడా డబ్బులు తీసుకుని మిగిలినవి ఆమెకివ్వబోయాడు. “వాటిని కూడా వార్నేతీసుకోమనురి” అంది ఆమె.

“చెప్పుతీసుకుని తంతాను దొంగముండా” అని ఇష్టమొచ్చినట్లు తిట్టి ఒక కాగితం ముక్క ఆ బిచ్చగాడి చేతిలో పెట్టాడు. ఆ చీటిలో 22 రూపాయలే రాసి ఉన్నాయి. ఆ ఇద్దరిలో ఎవరు బిచ్చగాడో కవిగారికి అర్థం కాలేదు. భిన్నమనస్తత్వాలు గల వ్యక్తులు వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారని కవి బాధపడ్డాడు.

ప్రశ్న 3.
‘బిచ్చగాడు’ కథలోని రచయిత అభిప్రాయాలను పరిశీలించండి?
జవాబు:
‘బిచ్చగాడు’ అను పాఠ్యభాగం ‘అంపశయ్య నవీన్’ చే రచించబడింది. నవీన్ రచించిన ఎనిమిదో అడుగు’ కథా సంపుటి నుండి ఈ పాఠ్యభాగం గ్రహించబడింది. నవీన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేసి పదవీరమణ పొందారు.

ప్రపంచంలో అనేక రకాల దోపిడీలు మోసాలు జరుగుతున్నాయి. అందులోను శ్రామికులు కార్మికుల జీవితాలలో జరిగే దోపిడీలు అత్యంత భయంకరమైనవి. మానవతా విలువలను దిగజార్చేచవని నవీన్ గారి అభిప్రాయం. రోజువారి కూలీపనులు చేస్తూ సంచార జీవన చేసేవారిలో దారిద్ర్యం, దైన్యం కన్పిస్తుందని అటువంటి వారిని కూడా దోపిడీ చేసే మనస్తత్వం గలవారు మన సమాజంలో ఉన్నారని వారిలో మార్పురావాలన్నది నవీన్ భావన. రోజూ అడుక్కుంటూ పొట్టపోసుకునే వ్యక్తులు దోపిడీకి గురి అవటం శోచనీయం అంటారు. నవీన్. ఇలాంటి వారు గౌరవనీయమైన వృత్తులలో ఉన్నవారి చేతుల్లోనే దోపిడీకి గురి అవుతున్నారు. అందుకు ఈ కథ ఒక ఉదాహరణం.

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 2 బిచ్చగాడు?

టికెట్ దొరకలేదని లబోదిబో మంటూ ఏడుస్తూ పరిగెత్తుకొచ్చి బిచ్చగాడిని చూసి ఒక పెద్దమనిషి ఇష్టమెచ్చినట్లు తిట్టడం రచయిత తప్పుపడతాడు. బిచ్చగాడు టికెట్ దొరకక తన వారినందరిని బండి దిగిపోండన్నప్పుడు ఆ పెద్ద మనిషి అన్న మాటలు అరె వారి పిచ్చిగాడిద కొడకా, నీ బండెడు సామాను దించే వరకు బండి ఆగుతుందిరా! ఈ మాటలు మానవత్వానికి మచ్చ అని రచయిత అభిప్రాయం.

“పాపం వాళ్ళలా బిక్కచచ్చి యేడుస్తుంటే మీరు ఇలా నవ్వటం ఏమిటి? అని వాళ్ళందరిని రచయిత గద్దించాలనుకున్నాడు. నేనలా అంటే నన్ను పిచ్చివాడిలా భావిస్తారేమోనని రచయిత భయమేసి ఊరుకున్నాడు. టి.టి బిచ్చగాడిని గద్దించి డబ్బురాబట్టడానికి ప్రయత్నిస్తుంటే, రచయిత టీ.టీగారూ! అతడు చెప్తున్నది కొంచెం విన్పించుకోండి అని ఇంగ్లీషులో మాట్లాడేసరికి కొంచెం టి.టి. తగ్గాడు. ఇక్కడ సత్యానికి విలువలేదు. సభ్యతకు తావులేదు. డబ్బుకే విలువ అన్న అభిప్రాయాన్ని రచయిత తెలియచేస్తున్నారు.

నిండుచూలాలుగా ఉన్న ఆ నిర్భాగ్యురాలిని చూసి ఆ కంపార్ట్మెంట్లో ఉన్నవారికి జాలి కలుగక పోగా ద్వేషపూరిత భావం కలగడం రచయితను బాధించింది. ఇలాంటి దృశ్యాన్నే సినిమాలో చూస్తే అందరూ కళ్ళంట నీళ్ళు కారుస్తారు. మనుషులలో ఈ భిన్న భావావేశాలకు కారణం ఏమిటి? అని రచయిత ఆలోచించాడు. ఎలాగైతేనేం బిచ్చగాడు.

బిచ్చగత్తె లిద్దరి వద్దా డబ్బురాబట్టుకున్నాటు టి.టి. వాళ్ళచేతిలో ఒక రిసీట్ పెట్టాడు. రచయిత ప్రక్కనే ఉండటంతో ఆ రిసీట్ మీద 22 రూ॥ మాత్రమే రాసుంది అన్న విషయం తెలిసింది. 56 రూపాయలు దండుకున్న టి.టి మోసాన్ని అందరికీ చెప్తామనుకున్నాడు రచయిత. కాని ఇవన్నీ మామూలే అని పెదవి విప్పలేకపోయాడు రచయిత. దోపిడీ చేసేవారికి ఉచ్చనీచాలు లేవని రచయిత అభిప్రాయంగా మనకు అర్థమౌతుంది.

బిచ్చగాడు Summary in Telugu

రచయిత పరిచయం

రచయిత పేరు : అంపశయ్య నవీన్

పుట్టిన తేదీ : డిశంబర్ 24, 1941

పుట్టిన ఊరు : వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం ‘వావిలాల’ గ్రామం

తల్లిదండ్రులు : పిచ్చమ్మ, నారాయణలు

చదువులు : ఉస్మానియాలో ఎం. ఏ అర్థశాస్త్రం

ఉద్యోగం : నల్గొండలో డిగ్రీ కళాశాల లెక్చరర్, ప్రినిపల్ రిటైర్మెంట్

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 2 బిచ్చగాడు?

రచనలు : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో

  1. 1965 – 69 మధ్యకాలంలో తన ఉపవాచకం అనుభవాలను ఇతివృత్తంగా వ్రాసిన నవల “అయ్య ప్పటికి 13 సార్లు ముద్రించబడింది.
  2. ముళ్ళపొదలు, అంతస్రవంతి నవలలు.
  3. ‘చీకటిరోజులు’ ఎమర్జెన్సీ కాలం నాటి స్థితిగతులపై వచ్చిన నవల
  4. ‘కాలరేఖలు’ నవల. ఇది 1944 నుండి 1947 వరకు జరిగిన సంఘటన సమ్మేళనం
    ఇవికాక నవీన్ అగాధాలు, దాగుడు మూతలు, ప్రత్యూష, ప్రయాణాల్లో ప్రమదలు, ఉమెన్స్ కాలేజీ, దృక్కోణాలు, చెదిరిన స్వప్నాలు, ఏ వెలుగులకీ ప్రస్థానం మొదలగు 31 నవలలను రాశాడు.

కథా సంపుటాలు : లైఫ్ ఇన్ ఏ కాలేజ్, ఎనిమిదో అడుగు, ఫ్రమ్ అనురాధ విత్లవ్, నిష్కృతి, బంధితులు, అస్మదీయులు తస్మదీయులు కథాసంపుటాలు.
సాహిత్య వ్యాసాలు, సాహిత్యకబుర్లు, తెలుగులో, ఆధునిక నవలలు సినిమా వీక్షణం – వీరి వ్యాస సంపుటాలు

TS Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

Telangana TSBIE TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ Textbook Questions and Answers.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
డిమాండ్ ఫలం అంటే ఏమిటి ? ఒక వస్తువు డిమాండ్ను నిర్ణయించే అంశాలు (కారకాలు) ఏమిటి ?
జవాబు.
“ఒక నిర్ణీతమైన కాలంలో, నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తు పరిమాణాన్ని ఆ వస్తువుకు లేదా సేవకు ఉన్న డిమాండ్” అంటారు.

ఒక వస్తువు డిమాండ్ దాని ధరపైనే కాకుండా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా వస్తువు డిమాండ్ను ప్రభావితము చేసే అంశాలు; ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలు, వినియోగదారుల ఆదాయం, వినియోగదారుల అభిరుచులు, అలవాట్లు మొదలైనవి. కనుక ఒక వస్తువు డిమాండ్ పరిమాణానికి, దీనిని నిర్ణయించే కారకాలకు మధ్యగల సంబంధాన్ని తెలియజేసేదే డిమాండ్ ఫలము. దీనిని ఈ క్రింది సమీకరణం ద్వారా చూపవచ్చు.

Dn = f (Pn, P1, P2, …………. Pn-1, y, T)
Dn = n వస్తువుల డిమాండ్ పరిమాణం
Pn = n వస్తువు ధర
P1, P1, ………….. Pn-1 = ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలు
y = వినియోగదారుని ఆదాయం
T = వినియోగదారుని అభిరుచులు, అలవాట్లు మొదలైనవి.
f = ప్రమేయ సంబంధము.

డిమాండ్ను నిర్ణయించే కారకాలు లేదా అంశాలు :
1. ఆదాయంలో మార్పు :
ప్రజల ఆదాయాల మార్పును బట్టి వస్తువుల డిమాండ్ లో మార్పు ఏర్పడుతుంది. ప్రజల ఆదాయం పెరిగితే వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. ఆదాయాలు తగ్గితే వస్తువుల డిమాండ్ తగ్గుతుంది.

2. అభిరుచులు, అలవాట్లలో మార్పులు :
ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చే మార్పుల వలన వస్తువు డిమాండ్లో మార్పు వస్తుంది.

3. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో మార్పులు :
ప్రజల అభిరుచులలో, అలవాట్లలో మార్పులవల్ల వస్తువు డిమాండ్లో మార్పులు వస్తాయి.

4. జనాభాలో మార్పు :
జనాభా పెరుగుదల, తగ్గుదలను అనుసరించి కూడా వస్తువుల డిమాండ్లో మార్పులు వస్తాయి.

5. వాతావరణంలో మార్పులు :
వాతావరణంలో మార్పులు కూడా డిమాండ్లో మార్పులను తీసుకొని వస్తాయి. ఉదా : వేసవికాలంలో చల్లని పానీయాలకు డిమాండ్ పెరుగుతుంది.

6. సాంకేతికాభివృద్ధి :
సాంకేతికాభివృద్ధి వలన వస్తూత్పత్తి వ్యయం తగ్గి, వస్తు ధరలు తగ్గుతాయి. అందువల్ల పూర్వం కొనుగోలు చేయడానికి ఉపయోగించిన ద్రవ్య పరిమాణంలో వస్తువులను ఎక్కువగా డిమాండ్ చేయటానికి అవకాశం ఉంటుంది.

7. ఆర్థిక స్థితిగతులు :
వాణిజ్య విజృంభణ కాలంలో అన్ని వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. కానీ, ఆర్థిక మాంద్య పరిస్థితులలో అన్ని వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది.

8. ప్రభుత్వ విధానము :
ప్రభుత్వ పన్నుల విధానం, రాయితీ విధానము మొదలైనవి వస్తువు ధర తగ్గితే డిమాండ్ ప్రభావితం చేయును.

9. వస్తువు ధర :
ఒక వస్తువు ధరకు, డిమాండ్కు విలోమ సంబంధం ఉన్నది. కనుక వస్తువు ధర తగ్గితే, డిమాండ్ పెరుగుతుంది. వస్తువు ధర పెరుగుటచే డిమాండ్ తగ్గుతుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 2.
డిమాండ్ సూత్రాన్ని తెలిపి, దాని మినహాయింపులను పరిశీలించండి.
జవాబు.
అర్ధశాస్త్రంలో డిమాండ్ భావనకు చాలా ప్రాధాన్యత ఉన్నది. ఒక వస్తువును కొనాలనే కోరికతోపాటు కొనే శక్తి, కొనాలన్న ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుంది. కనుక డిమాండ్ను ఈ క్రింది విధముగా నిర్వచించవచ్చు. “ఒక నిర్ణీత కాలంలో, నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తు పరిమాణాన్ని ఆ వస్తువుకు లేదా సేవకు ఉన్న డిమాండ్” అని బెన్హామ్ పేర్కొన్నాడు.

ఒక వస్తువుకున్న డిమాండ్ ముఖ్యంగా ఈ క్రింది అంశాలపై ఆధారపడి ఉండును.

  1. వినియోగదారుల అభిరుచులు, అలవాట్లు
  2. వస్తువుల ధరలు
  3. వినియోగదారుల ఆదాయాలు
  4. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలు మొదలైనవి.

డిమాండ్ సూత్రము :
డిమాండ్ సూత్రం వస్తువు ధరకు, డిమాండ్కు గల సంబంధాన్ని తెలియజేస్తుంది. “ఇతర అంశాలు స్థిరంగా ఉంటే, వస్తువు ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది. ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది” అని మార్షల్ డిమాండ్ సూత్రాన్ని నిర్వచించెను. డిమాండ్ సూత్రాన్ని ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చును.
Dn = f

డిమాండ్ పట్టిక :

వస్తువు ధర ₹వస్తువు డిమాండ్ కిలోలలో
1200
2150
3100
450
525

వినియోగదారుడు లేదా వినియోగదారులు ఒక వస్తువును వివిధ ధరల వద్ద ఏ పరిమాణంలో కొనుగోలు చేస్తారో తెలియజేస్తుంది డిమాండ్ పట్టిక. పట్టికననుసరించి వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుందని, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుందని తెలుస్తుంది. దీనిని ఆధారంగా చేసుకొని డిమాండ్ రేఖను గీయవచ్చును.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 1

పై రేఖాపటంలో ‘X’ అక్షముపై వస్తువు డిమాండ్ పరిమాణం, ‘Y’ అక్షముపై వస్తువు ధరను చూపినాము. ‘DD’ డిమాండ్ రేఖ. డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి క్రింది వైపుకు వాలి ఉంది. ఇది ఋణాత్మకమైన వాలు. వస్తువు ధరకు, డిమాండ్కు మధ్య విలోమ సంబంధమున్నదని ఋణాత్మకమైన వాలు తెలియజేస్తుంది.

మినహాయింపులు :
డిమాండ్ సూత్రానికి కొన్ని మినహాయింపులున్నాయి. అవి :

1. గిఫెన్ వైపరీత్యం :
పేద కార్మికులు రొట్టె ధర పెరిగితే మాంసముపై వెచ్చించే డబ్బును కూడా రొట్టెపై ఖర్చు చేస్తారు. అనగా రొట్టె ధర పెరిగినా డిమాండ్ తగ్గదు. ఇది పేదవాళ్ళ ఆహారం కావటమే ఇందుకు కారణము. ఈ సత్యాన్ని సర్ రాబర్ట్ గిఫెన్ అనే ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఆర్థికవేత్త 19వ శతాబ్దం మధ్య భాగంలో పరిశీలించాడు.

కనుక దీనిని గిఫెన్ వైపరీత్యం అంటారు. పేదవారు ముఖ్యంగా నిత్యావసర వస్తువులలో తక్కువ ధర గల వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ ప్రత్యేకమైన వస్తువులనే గిఫెన్ వస్తువులంటారు.
ఉదా : రాగులు, జొన్నలు మొదలైనవి.

2. గౌరవ సూచిక వస్తువులు :
గౌరవ సూచిక వస్తువుల ధర పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. వీటిని కొనుగోలు చేయటం వలన సమాజంలో గౌరవము, ప్రతిష్ఠ పెరుగుతాయని భావిస్తారు. వీటి ధర తగ్గితే గౌరవం, ప్రతిష్ఠ తగ్గుతాయని భావిస్తారు.
ఉదా : విలువ గల వజ్రాలు, ఆభరణాలు మొదలైనవి. ఇది డిమాండ్ సూత్రానికి వ్యతిరేకము. ఈ విషయాన్ని వెబ్లెన్ అనే అమెరికా ఆర్థికవేత్త తెలియజేసెను. అందువల్ల ఇటువంటి వస్తువులను వెబ్లెన్ వస్తువులంటారు.

3. అంచనా వ్యాపారం :
ఒక వస్తువు ధర మరింత పెరగడానికి వ్యాపారస్తులు, కొనుగోలుదారులు ఆ వస్తువును ఎక్కువగా డిమాండ్ చేస్తారు. అదేవిధంగా ధర తగ్గినప్పుడు ఇంకా తగ్గుతుందని భావిస్తే కొనుగోలు తగ్గిస్తారు. దీనినే సట్టా వ్యాపారం అని కూడా అంటారు.
ఉదా : షేర్లు, బాండ్లు.

4. భ్రాంతి :
కొంతమంది వినియోగదారులు కొన్నిసార్లు ఎక్కువ ధర కలిగి ఉన్న వస్తువులు ఎక్కువ నాణ్యతతో కూడి ఉంటాయన్న భ్రాంతిలో ఉంటారు. అందువల్ల ధర ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఇటువంటి వాటి విషయంలో డిమాండ్ సూత్రం వర్తించదు.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 3.
ఆదాయ డిమాండ్, జాత్యంతర డిమాండ్ భావనలను తగిన పటాల సహాయంతో వివరించండి.
జవాబు.
అర్థశాస్త్రంలో డిమాండ్ భావనకు చాలా ప్రాధాన్యత ఉంది. ఒక వస్తువును కొనాలనే కోరిక దానితోపాటు కొనే శక్తి ఈ రెండూ జతకూడినప్పుడే ఆ వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుంది. అందువల్ల “ఒక నిర్ణీత కాలంలో, నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తు పరిమాణాన్ని ఆ వస్తువుకు ఉన్న డిమాండ్” అంటారు.

డిమాండ్ను నిర్ణయించే కారకాలను బట్టి డిమాండ్ను మూడు రకములుగా విభజించవచ్చు.

  1. ధర డిమాండ్
  2. ఆదాయ డిమాండ్
  3. జాత్యంతర డిమాండ్.

1. ధర డిమాండ్ :
ఒక వస్తువు ధరకు, దాని డిమాండ్ పరిమాణానికి గల సంబంధాన్ని తెలియజేయునది ధర డిమాండ్. డిమాండ్ను ప్రభావితంచేసే ఇతర అంశాలలో మార్పులేదనే ప్రమేయంపై ఆధారపడి ధర డిమాండ్ నిర్వచించబడుతుంది. దీనిని ఈ విధంగా చూపవచ్చు.
Dx = f(Px)

2. ఆదాయ డిమాండ్ :
వినియోగదారుని ఆదాయానికి, వస్తువు డిమాండ్కు మధ్యనున్న సంబంధాన్ని ఆదాయ డిమాండ్ అంటారు. వివిధ ఆదాయాల వద్ద వస్తువు డిమాండ్ పరిమాణం ఏ విధంగా ఉందో ఆదాయ డిమాండ్ తెలియజేస్తుంది.
Dy = f(y)

ఇతర అంశాలు మారకుండా స్థిరంగా ఉన్నప్పుడు ఆదాయం పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. ధరకు, ఆదాయంకు ధనాత్మక సంబంధం ఉంది. ఆదాయ డిమాండ్ను అనుసరించి వస్తువులలో మేలురకం లేదా నాసిరకం వస్తువులుగా గుర్తించవచ్చు.

మేలురకం వస్తువులు / సాధారణ వస్తువులు :
ఆదాయం పెరిగితే మేలురకం వస్తువులు లేదా సాధారణ వస్తువుల డిమాండ్ పెరుగుతుంది.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 2

పై రేఖాపటంలో ‘OX’ అక్షంపై డిమాండ్ పరిమాణంను, ‘OY’ అక్షంపై ఆదాయంను తీసుకొన్నాం. ఆదాయం ‘OY’ ఉన్నప్పుడు ‘OQ’ వస్తు పరిమాణం డిమాండ్ చేయబడింది. ఆదాయం ‘OY’ నుంచి ‘OY’ కు పెరిగినప్పుడు మేలురకం వస్తువుల డిమాండ్ ‘0Q’ నుంచి ‘0Q1’ కు పెరిగింది. ‘YD’ రేఖ ధనాత్మక వాలు కలిగి ఉంటుంది.

నాసిరకం వస్తువులు :
మేలురకం వస్తువులకు భిన్నంగా వినియోగదార్ల ఆదాయం పెరిగితే నాసిరకం వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 3

పై రేఖాపటంలో ‘OX’ అక్షం మీద డిమాండ్ పరిమాణాన్ని, ‘OY’ అక్షం మీద ఆదాయంను తీసుకొన్నాం. ఆదాయం ‘OY,’ నుంచి ‘OY’ కు పెరిగినప్పుడు డిమాండ్ పరిమాణం ‘OQ’ నుంచి ‘OQ1‘ కు తగ్గును. ‘YD’ రేఖ ఎడమ నుండి కుడికి వాలి ఉంది.

3. జాత్యంతర డిమాండ్ :
ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలకు, ఒక వస్తువు డిమాండ్కు మధ్య ఉన్న సంబంధాన్ని జాత్యంతర డిమాండ్ అంటారు. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చిన మార్పుల వల్ల ఒక వస్తువు డిమాండ్లో వచ్చే మార్పులను జాత్యంతర డిమాండ్ తెలియజేయును.

జాత్యంతర డిమాండ్ను ఈ విధంగా వ్రాయవచ్చు.
Dx = f(Py).

ప్రత్యామ్నాయ వస్తువులు :
ఒక కోర్కెను తీర్చగల వివిధ వస్తువులను ప్రత్యామ్నాయ వస్తువులు అంటారు. ఉదా : కాఫీ, టీ. ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ ధనాత్మక సంబంధాన్ని తెలియజేయును. దీనిని ఈ క్రింది రేఖాపటం ద్వారా చూపవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 4

పై రేఖాపటంలో కాఫీ ధర ‘OY’ నుంచి ‘OY2‘ కు పెరిగినప్పుడు టీ, డిమాండ్ ‘OQ’ నుండి ‘OQ2‘ కు పెరిగింది. ‘CD’ రేఖ ధనాత్మక వాలును కలిగి ఉంది.

పూరక వస్తువులు : ఒకే కోరికను తీర్చగల సమిష్టి వస్తువులు.
ఉదా : పెట్రోలు, వీటి విషయంలో డిమాండ్ విలోమ సంబంధాన్ని తెలియజేయును.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 5

పై రేఖాపటంలో డిమాండ్ ‘OQ’ నుండి ‘OQ’ కు పెరిగింది. ధర ‘OP’ నుండి ‘OP’ కు తగ్గినప్పుడు ‘CD’ రేఖ ఋణాత్మక వాలు కలిగి ఉంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 4.
డిమాండ్ వ్యాకోచత్వ భావనను నిర్వచించండి. ఆదాయ, జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వాలను వివరించండి.
జవాబు.
ఆర్థికశాస్త్రంలో “డిమాండ్ వ్యాకోచత్వం” అనే భావనకు అధిక ప్రాధాన్యత ఉంది. ధరలో వచ్చిన మార్పుకు అనుగుణంగా డిమాండ్ ఎంత మేరకు మార్పు వస్తుందో డిమాండ్ వ్యాకోచత్వ భావన తెలుపుతుంది.

శ్రీమతి జోన్ రాబిన్సన్ అభిప్రాయంలో “ధరలో వచ్చిన అనుపాతపు మార్పు స్పందనకు బదులుగా డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాత మార్పు ప్రతిస్పందన ఏ మేరకు ఉంటుందో తెలియజేసే భావన డిమాండ్ వ్యాకోచత్వం”.
డిమాండ్ వ్యాకోచత్వం = డిమాండ్లో వచ్చిన అనుపాతపు మార్పు / ధరలో వచ్చిన అనుపాతపు మార్పు

ఈ వ్యాకోచత్వ భావన మూడు రకాలు.

  1. ధర డిమాండ్ వ్యాకోచత్వం
  2. ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం
  3. జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం

ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం :
ఆదాయంలో వచ్చే మార్పు వల్ల డిమాండ్ పరిమాణంలో ఏ మేరకు స్పందన వస్తుందో ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం తెలుపుతుంది. వినియోగదారుని ఆదాయం కొంత శాతం మార్పు చెందినప్పుడు, వస్తువు డిమాండ్ పరిమాణం ఎంత శాతం మార్పు చెందుతుందో ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం తెలియజేయును.

ఈ ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం మేలు రకం వస్తువుల విషయంలో ధనాత్మకంగా, నాసిరకం వస్తువుల విషయంలో రుణాత్మకంగా ఉంటుంది.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 6

జాత్యంతర వ్యాకోచ డిమాండ్ :
ఒక వస్తువుకున్న డిమాండ్ దాని ధరపైనే కాకుండా, దానికున్న ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరపైన కూడా ఆధారపడి ఉంటుంది. ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరల్లో వచ్చే అనుపాతపు మార్పు లేదా శాతం మార్పు ఆ వస్తు డిమాండ్లో ఎంత అనుపాత మార్పు కల్గిస్తుందో జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం తెలియజేయును.

ప్రత్యామ్నాయ వస్తువులైన టీ, కాఫీల విషయంలో ధనాత్మక సంబంధాన్ని, పూరక వస్తువుల విషయాలలో రుణాత్మక సంబంధాన్ని కలిగి ఉంటాయి.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 7

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 5.
ధర డిమాండ్ వ్యాకోచత్వం అంటే ఏమిటి ? ధర డిమాండ్ వ్యాకోచత్వంలోని రకాలను విపులీకరించండి.
జవాబు.
ధర డిమాండ్ వ్యాకోచత్వం అనే భావనను ఆల్ఫ్రెడ్ మార్షల్ అభివృద్ధిపరిచారు. ధర డిమాండ్ వ్యాకోచత్వం అనగా ధరలో వచ్చే అనుపాతపు మార్పువల్ల డిమాండ్లో వచ్చే అనుపాత మార్పు ఎంత ఉంటుందో తెలియజేస్తుంది.
Ep = డిమాండ్లో వచ్చిన మార్పు శాతం / ధరలో వచ్చిన మార్పు శాతం

వ్యాకోచత్వ విలువ ఆధారంగా ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని ఐదు రకాలుగా చెప్పవచ్చు.

  1. పూర్తి వ్యాకోచ డిమాండ్ (Ep = ∝)
  2. పూర్తి అవ్యాకోచ డిమాండ్ (Ep = 0)
  3. ఏకత్వ వ్యాకోచ డిమాండ్ (Ep = 1)
  4. సాపేక్ష వ్యాకోచ డిమాండ్ (Ep = > 1)
  5. సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ (Ep = < 1)

1. పూర్తి వ్యాకోచ డిమాండ్ :
ధరలో స్వల్ప మార్పు వచ్చినా లేదా రాకపోయినా డిమాండ్లో ఊహించలేనంతగా మార్పు కలిగితే దానిని పూర్తి వ్యాకోచ డిమాండ్ అంటారు. దీని వ్యాకోచ విలువ అనంతంగా ఉంటుంది. ఇక్కడ ‘ డిమాండ్ రేఖ ‘X’ అక్షంకు సమాంతరంగా ఉంటుంది.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 8

పై రేఖాపటంలో డిమాండ్ రేఖ ‘X’ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. Ed = ∞.

2. పూర్తి అవ్యాకోచ డిమాండ్ :
ధర పెరిగినా లేదా తగ్గినా డిమాండ్లో ఎలాంటి మార్పు రాకుంటే దానిని పూర్తి అవ్యాకోచ డిమాండ్ అంటారు. దీని విషయంలో వ్యాకోచత్వ విలువ ‘0’ గా ఉంటుంది. డిమాండ్ రేఖ ‘y’ అక్షానికి సమాంతరంగా ఉంటుంది.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 9

‘DD’ రేఖ ‘Y’ అక్షానికి సమాంతరంగా ఉంది. పూర్తి అవ్యాకోచ డిమాండ్ ఉన్నప్పుడు వ్యాకోచత్వం విలువ ‘0’ కు సమానం.
∴ Ed = 0

3. ఏకత్వ వ్యాకోచ డిమాండ్ :
వస్తువు ధరలో వచ్చే అనుపాతపు మార్పుకు, డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పుకు సమానమైతే దానిని ఏకత్వ వ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ డిమాండ్ వ్యాకోచత్వం విలువ ‘1’ కి సమానంగా ఉంటుంది. ఈ డిమాండ్ రేఖ “లంబ అతిపరావలయంగా” ఉంటుంది.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 10

పై రేఖాపటంలో OQ1 = PP1 కి సమానం.
అందువల్ల Ed = 1,

4. సాపేక్ష వ్యాకోచ డిమాండ్ :
వస్తువు ధరలో వచ్చే అనుపాతపు మార్పు కంటే డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పు ఎక్కువగా ఉంటే దానిని సాపేక్ష వ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ వ్యాకోచత్వం విలువ ‘1’
కంటే ఎక్కువగా ఉంటుంది.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 11

పై రేఖాపటంలో ‘DD’ రేఖ సాపేక్ష వ్యాకోచ డిమాండ్ను సూచించు . OQ > PP గా ఉంది. ఇక్కడ వ్యాకోచత్వ విలువ 1 కంటే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల AP కంటే AQ ఎక్కువగా ఉంటుంది.

5. సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ :
వస్తువు ధరలో వచ్చిన అనుపాతపు మార్పు కంటే డిమాండ్ పరిమాణంలో. వచ్చిన అనుపాత మార్పు తక్కువగా ఉంటుంది. దానిని సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ డిమాండ్ వ్యాకోచ విలువ ‘1’ కంటే తక్కువగా ఉంటుంది.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 12

‘DD’ రేఖ సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ను సూచిస్తుంది. ఇక్కడ వ్యాకోచత్వ విలువ ‘1’ కంటే తక్కువగా ఉంటుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 6.
ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్ణయించే అంశాలను (కారకాలను) చర్చించండి.
జవాబు.
ఒక వస్తువు ధరలో మార్పు కలిగినప్పుడు ఏ మేరకు డిమాండ్లో ప్రతిస్పందన వస్తుందో తెలియచేసేదే డిమాండ్ వ్యాకోచత్వము. ధర మార్పు శాతానికి, డిమాండ్లో వచ్చే మార్పు శాతానికి మధ్యగల నిష్పత్తినే వ్యాకోచత్వంగా నిర్వచించ వచ్చును. డిమాండ్ వ్యాకోచత్వము అన్ని వస్తువులకు ఒకే విధంగా ఉండదు. ధర డిమాండ్ వ్యాకోచత్వ స్వభావాన్ని లేదా స్థాయిని ఈ క్రింది అంశాలు నిర్ణయిస్తాయి.

డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్ణయించే కారకాలు :
1. వస్తువు స్వభావము :
వస్తువులలో కొన్ని అవసరాలు, మరికొన్ని సౌకర్యాలు, ఇంకొన్ని విలాసాలు ఉంటాయి. నిత్యావసర వస్తువులకు ధర పెరిగినా, డిమాండ్ తగ్గదు. కనుక వాటికి అవ్యాకోచ డిమాండ్ ఉంటుంది. ఇవి లేకపోతే మానవ మనుగడ కష్టం.

సౌకర్యాలు, విలాసాలకు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఇవి లేకపోయినా ప్రజలు బ్రతకగలరు. కనుక వీటి ధర మార్పు కంటే డిమాండ్లో వచ్చే మార్పు అధికంగా
ఉంటుంది.

2. ప్రత్యామ్నాయ వస్తువులు :
ప్రత్యామ్నాయ వస్తువులు అధిక సంఖ్యలో ఉన్న వస్తువులకు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ప్రత్యామ్నాయ వస్తువులు లేనప్పుడు డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది.

3. కొనుగోలు వాయిదా వేయటానికి అవకాశం :
కొనుగోలును వాయిదా వేయటానికి అవకాశం ఉన్న వస్తువుఁ విషయంలో ధర డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. కొనుగోలును వాయిదా వేయటానికి వీలులేని వస్తువులకు డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది.

4. బహుళ ప్రయోజనాలున్న వస్తువులు :
బొగ్గు, విద్యుచ్ఛక్తి మొదలగు బహుళ ప్రయోజనాలు గల వస్తువులకు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఒకే ప్రయోజనం లేక ఉపయోగం గల వస్తువులకు డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది.

5. కాలము :
స్వల్పకాలంలో డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. దీర్ఘకాలంలో వ్యాకోచత్వం ఎక్కువగా ఉంటుంది.

6. పూరక వస్తువులు :
పూర వస్తువుల విషయంలో డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది.

7. ధరస్థాయి :
ధర స్థాయి ఎక్కువగా ఉంటే వ్యాకోచమైన డిమాండ్ ఉంటుంది. ధర స్థాయి తక్కువగా ఉంటే అవ్యాకోచమైన డిమాండ్ ఉంటుంది.

8. వినియోగదారుని బడ్జెట్ లో వస్తువుకు గల ప్రాధాన్యం :
వినియోగదారుని ఆదాయంలో ఒక వస్తువుపై చేసే ఖర్చు శాతం తక్కువగా ఉంటే డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఆదాయంలో హెచ్చు శాతం ఖర్చు చేసే వస్తువుల విషయంలో డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది.

9. వస్తువు మన్నికపై ఆధారపడును :
మన్నికగల, నిల్వ చేయటానికి వీలైన అనశ్వర వస్తువులపై చేసే డిమాండ్ అవ్యాకోచంగాను, నశ్వర వస్తువులకు డిమాండ్ వ్యాకోచంగాను ఉంటుంది.

10. పేదవారి వస్తువులు :
పేదవారు వినియోగించే వస్తువులకు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఈ వస్తువుల ధరలు తగ్గినపుడు వాటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 7.
ధర డిమాండ్ వ్యాకోచత్వం ప్రాముఖ్యాన్ని విశదీకరించండి.
జవాబు.
ధరలోని మార్పుకు ప్రతిస్పందనగా డిమాండులో ఏమేరకు మార్పు వస్తుందనేది ధర డిమాండు వ్యాకోచత్వం తెలియజేస్తుంది. ధర డిమాండ్ వ్యాకోచత్వం అనే భావనను ఆల్ఫ్రెడ్ మార్షల్’ అనే ఆర్థికవేత్త అభివృద్ధి పరిచాడు.

స్వతంత్ర చలాంకమైన ధరలో వచ్చే మార్పులు ఆధార చలాంకమైన డిమాండ్ పరిమాణంలో కలిగించే మార్పులు ఎప్పుడూ ఇతర కారకాలలో మార్పులు లేకుండా ఉన్నప్పుడు ఒకే రీతిగా ఉండవు.

1. ఉత్పత్తిదార్లకు :
ఉత్పత్తిదార్లు వస్తువులకున్న డిమాండ్ వ్యాకోచత్వాన్ని అనుసరించి ఉత్పత్తి చేస్తారు. ఏ వస్తువులకైతే డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుందో ఆ వస్తువులను ఉత్పత్తి చేస్తారు. ఎందుకంటే అటువంటి వస్తువుల ధరను పెంచి లాభం పొందగలుగుతారు.

2. సమిష్టి వస్తువుల ధర నిర్ణయం :
జంటగా కొన్ని వస్తువులు ఉత్పత్తి చేయబడతాయి.
ఉదా : పంచదార, మొలాసిన్, ఈ వస్తువుల విషయంలో ఒక్కొక్క వస్తువు ఉత్పత్తి వ్యయాన్ని విడదీసి చెప్పడానికి వీలుండదు. అందువల్ల ఈ వస్తువుల ధర నిర్ణయంలో డిమాండ్ వ్యాకోచంగా ఉన్న వాటికి తక్కువ ధరను, అవ్యాకోచంగా ఉన్న వాటికి ఎక్కువ ధర నిర్ణయించడం జరుగుతుంది.

3. ఏకస్వామ్యదార్లు :
ఏకస్వామ్యదార్లు వస్తువుకున్న డిమాండ్ వ్యాకోచత్వం ఆధారంగా ధర నిర్ణయిస్తారు. అవ్యాకోచత్వం ఉన్న వస్తువులకు ఎక్కువ ధరను, వ్యాకోచత్వం ఎక్కువ ఉన్న వస్తువులకు తక్కువ ధరను నిర్ణయిస్తారు.

4. ప్రభుత్వం :
కొన్ని వస్తువులు ప్రజాసంక్షేమాన్ని పెంపొందిస్తాయి. అందువల్ల ఈ వస్తువులకు డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది.
ఉదా : మందులు, రైలు ప్రయాణం మొదలైనవి.

5. ఆర్థిక మంత్రికి :
పన్నులు విధించేటప్పుడు ఆర్థిక మంత్రికి వస్తువులకున్న డిమాండ్ వ్యాకోచత్వం ఉపయోగపడుతుంది. అంతేకాక ఆర్థిక మంత్రికి కోశ విధాన రూపకల్పనలో డిమాండ్ వ్యాకోచత్వ భావన తోడ్పడుతుంది.

6. అంతర్జాతీయ వ్యాపారం :
అంతర్జాతీయ వ్యాపారంలో వివిధ దేశాల మధ్య వస్తువుల మారకపు రేటును నిర్ధారించేటప్పుడు వస్తువులకున్న డిమాండ్ వ్యాకోచత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
ఉదా : ఏ దేశమైనా మూల్యహీనీకరణ ద్వారా ప్రయోజనం పొందాలనుకుంటే ఎగుమతి చేసే వస్తువులకు దిగుమతి చేసుకొంటున్న వస్తువులకు ధర డిమాండ్ వ్యాకోచత్వం ‘1’ కంటే ఎక్కువగా ఉండాలి.

7. పేదరికం :
సంపద మాటున దాగిఉన్న పేదరికంను అర్థం చేసుకోవడానికి డిమాండ్ వ్యాకోచత్వ భావన ఉపయోగపడుతుంది.

8.వేతనాలు :
శ్రామికులకున్న డిమాండ్ వ్యాకోచత్వం వారి వేతనాలను ప్రభావితం చేస్తుంది. అందువల్ల యాజమాన్యం వేతనాలను నిర్ణయించేటప్పుడు శ్రామికులకున్న డిమాండ్ వ్యాకోచత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
డిమాండ్ను నిర్ణయించే కారకాలు ఏమిటి ?
జవాబు.
“ఒక నిర్ణీతమైన కాలంలో, నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తు పరిమాణాన్ని ఆ వస్తువుకు లేదా సేవకు ఉన్న డిమాండ్” అంటారు.
డిమాండ్ను నిర్ణయించే కారకాలు లేదా అంశాలు :

1. ఆదాయంలో మార్పు :
ప్రజల ఆదాయాల మార్పును బట్టి వస్తువుల డిమాండ్లో మార్పు ఏర్పడుతుంది. ప్రజల ఆదాయం పెరిగితే వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. ఆదాయాలు తగ్గితే వస్తువుల డిమాండ్ తగ్గుతుంది.

2. అభిరుచులు, అలవాట్లలో మార్పులు:
ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చే మార్పుల వలన వస్తువు డిమాండ్లో మార్పు వస్తుంది.

3. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో మార్పులు :
ప్రజల అభిరుచులలో, అలవాట్లలో మార్పుల వల్ల వస్తువు డిమాండ్లో మార్పులు వస్తాయి.

4. జనాభాలో మార్పు :
జనాభా పెరుగుదల, తగ్గుదలను అనుసరించి కూడా వస్తువుల డిమాండ్లో మార్పులు వస్తాయి.

5. వాతావరణంలో మార్పులు :
వాతావరణంలో మార్పులు కూడా డిమాండ్లో మార్పులను తీసుకొని వస్తాయి.
ఉదా : వేసవికాలంలో చల్లని పానీయాలకు డిమాండ్ పెరుగుతుంది.

6. సాంకేతికాభివృద్ధి :
సాంకేతికాభివృద్ధి వలన వస్తూత్పత్తి వ్యయం తగ్గి, వస్తు ధరలు తగ్గుతాయి. అందువల్ల పూర్వం కొనుగోలు చేయడానికి ఉపయోగించిన ద్రవ్య పరిమాణంలో వస్తువులను ఎక్కువగా డిమాండ్ చేయటానికి అవకాశం ఉంటుంది.

7. ఆర్థిక స్థితిగతులు :
వాణిజ్య విజృంభణ కాలంలో అన్ని వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. కానీ, ఆర్థిక మాంద్య పరిస్థితులలో అన్ని వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది.

8. ప్రభుత్వ విధానము :
ప్రభుత్వ పన్నుల విధానం, రాయితీ విధానము మొదలైనవి వస్తువు ధర తగ్గితే డిమాండ్ ప్రభావితం చేయును.

9. వస్తువు ధర :
ఒక వస్తువు ధరకు, డిమాండ్కు విలోమ సంబంధం ఉన్నది. కనుక వస్తువు ధర తగ్గితే, డిమాండ్ పెరుగుతుంది. వస్తువు ధర పెరుగుటచే డిమాండ్ తగ్గుతుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 2.
డిమాండ్ సూత్రాన్ని వివరించండి.
జవాబు.
అర్థశాస్త్రంలో డిమాండ్ భావనకు చాలా ప్రాధాన్యత ఉన్నది. ఒక వస్తువును కొనాలనే కోరికతోపాటు కొనేశక్తి, కొనాలన్న ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుంది. కనుక డిమాండును ఈ క్రింది విధముగా నిర్వచించవచ్చు. “ఒక నిర్ణీత కాలంలో, నిర్ణీతమైన ధరవద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తువు పరిమాణాన్ని ఆ వస్తువుకు లేదా సేవకు ఉన్న డిమాండ్” అని బెన్హామ్ పేర్కొన్నాడు.

ధర డిమాండ్-డిమాండ్ సూత్రము :
డిమాండ్ సూత్రం వస్తువు ధరకు, డిమాండ్కు గల సంబంధాన్ని తెలియజేస్తుంది. “ఇతర అంశాలు స్థిరముగా ఉంటే, వస్తువు ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది. ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది.” అని మార్షల్ డిమాండ్ సూత్రాన్ని నిర్వచించెను. డిమాండ్ సూత్రాన్ని ఈ విధంగా పేర్కొనవచ్చును.
Dn = f[Pn]

వస్తువు ధర ₹

వస్తువు డిమాండ్ కిలోలలో

1

200

2

150
3

100

4

50
5

25

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 13

వినియోగదారుడు లేదా వినియోగదారులు ఒక వస్తువును వివిధ ధరల వద్ద ఏ పరిమాణంలో కొనుగోలు చేస్తారో తెలియజేస్తుంది డిమాండ్ పట్టిక. పట్టిక నుంచి వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుందని, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుందని తెలుస్తుంది. దీనిని ఆధారంగా చేసుకొని డిమాండ్ రేఖను గీయవచ్చును.

డిమాండ్ రేఖ :
పటములో X – అక్షముపై వస్తువు డిమాండ్ పరిమాణం, Y- అక్షముపై వస్తువు ధరను చూపినాము. DD డిమాండ్ రేఖ. డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి క్రిందివైపుకు వాలి ఉంది. ఇది ఋణాత్మకమైన వాలు. వస్తువు ధరకు, డిమాండ్కు మధ్య విలోమ సంబంధమున్నదని ఋణాత్మకమైన వాలు తెలియజేస్తుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 3.
డిమాండ్ సూత్రానికి మినహాయింపులను విపులీకరించండి.
జవాబు.
డిమాండ్ సూత్రం ప్రకారం వస్తు ధరకు, డిమాండ్కు విలోమ సంబంధాన్ని కలిగి ఉంటాయి. కాని కొన్ని పరిస్థితులలో ధర, డిమాండ్ అనులోమ సంబంధాన్ని కలిగి ఉంటాయి. అంటే ధర పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. ధర తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. ఈ పరిస్థితి డిమాండ్ సూత్రానికి మినహాయింపు.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 14

ధర ‘OP’ ఉన్నప్పుడు ‘OQ’ వస్తు పరిమాణం డిమాండ్ ధర చేయ కింది. ధర ‘OP’ నుంచి OP1 కు పెరగగా డిమాండ్ OQ1 కు పెరిగింది. ఈ పరిస్థితి డిమాండ్ సూత్రానికి విరుద్ధం.

మినహాయింపులు :
1. గిఫెన్ వైపరీత్యం :
పేద కార్మికులు రొట్టె ధర పెరిగితే మాంసముపై వెచ్చించే డబ్బును కూడా రొట్టెపై ఖర్చు చేస్తారు. అనగా రొట్టె ధర పెరిగినా డిమాండ్ తగ్గదు. ఇది పేదవాళ్ళ ఆహారం కావటమే ఇందుకు కారణము. ఈ సత్యాన్ని సర్ రాబర్ట్ గిఫెన్ అనే ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఆర్థికవేత్త 19వ శతాబ్దం మధ్య భాగంలో పరిశీలించాడు.

కనుక దీనిని గిఫెన్ వైపరీత్యం అంటారు. పేదవారు ముఖ్యంగా నిత్యావసర వస్తువులలో తక్కువ ధర గల వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ ప్రత్యేకమైన వస్తువులనే గిఫెన్ వస్తువులంటారు.
ఉదా : రాగులు, జొన్నలు మొదలైనవి.

2. గౌరవ సూచిక వస్తువులు :
గౌరవ సూచిక వస్తువుల ధర పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. వీటిని కొనుగోలు చేయటం వలన సమాజంలో గౌరవము, ప్రతిష్ఠ పెరుగుతాయని భావిస్తారు. వీటి ధర తగ్గితే గౌరవం, ప్రతిష్ఠ తగ్గుతాయని భావిస్తారు.
ఉదా : విలువ గల వజ్రాలు, ఆభరణాలు మొదలైనవి. ఇది డిమాండ్ సూత్రానికి వ్యతిరేకము. ఈ విషయాన్ని వెబ్లెన్ అనే అమెరికా ఆర్థికవేత్త తెలియజేసెను. అందువల్ల ఇటువంటి వస్తువులను వెబ్లెన్ వస్తువులంటారు.

3. అంచనా వ్యాపారం :
ఒక వస్తువు ధర మరింత పెరగడానికి వ్యాపారస్తులు, కొనుగోలుదారులు ఆ వస్తువును ఎక్కువగా డిమాండ్ చేస్తారు. అదే విధంగా ధర తగ్గినప్పుడు ఇంకా తగ్గుతుందని భావిస్తే కొనుగోలు తగ్గిస్తారు. దీనినే సట్టా వ్యాపారం అని కూడా అంటారు.
ఉదా : షేర్లు, బాండ్లు మొదలైనవి.

4. భ్రాంతి :
కొంతమంది వినియోగదారులు కొన్నిసార్లు ఎక్కువ ధర కలిగి ఉన్న వస్తువులు ఎక్కువ నాణ్యతతో కూడి ఉంటాయన్న భ్రాంతిలో ఉంటారు. అందువల్ల ధర ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఇటువంటి వాటి విషయంలో డిమాండ్ సూత్రం వర్తించదు.

ప్రశ్న 4.
డిమాండ్ రేఖ ఋణాత్మక వాలుకు గల కారణాలను విపులీకరించండి.
జవాబు.
ఒక నిర్ణీత కాలంలో, నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తువు పరిమాణాన్ని డిమాండ్ అంటారు. పరిస్థితులు మారకుండా స్థిరంగా ఉన్నప్పుడు ఒక నిర్ణీత కాలంలో ఒక వస్తువు ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది.” అని డిమాండ్ సూత్రం తెలియజేస్తుంది. దీనిని బట్టి వస్తువు ధరకు, డిమాండు విలోమ సంబంధం ఉందని తెలుస్తుంది. కనుక డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి క్రిందివైపుకు వాలి ఉంటుంది. దీనికి అనేక కారణాలున్నాయి. అవి :

1. క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం:
క్షీణోపాంత ప్రయోజనాన్ని ఆధారంగా చేసుకొని డిమాండ్ సూత్రం చెప్పబడినది. వస్తువు పరిమాణం ఎక్కువైతే ఉపాంత ప్రయోజనం తగ్గుతుంది. ఉపాంత ప్రయోజనం తక్కువగా ఉంటే వినియోగదారుడు ఆ వస్తువుకు ధర చెల్లించాలనుకున్నాడు. అందువల్ల ధర తక్కువగా ఉంటే ఎక్కువగానూ, ధర ఎక్కువగా ఉంటే తక్కువగాను వస్తు పరిమాణాన్ని బట్టి డిమాండ్ చేస్తాడు.

2. ఆదాయ ప్రభావము :
ఒక వస్తువు ధర పెరిగితే వినియోగదారుని వాస్తవిక ఆదాయం ధర పెరిగిన మేరకు తగ్గుతుంది. అందువల్ల వాస్తవిక ఆదాయం తగ్గినమేరకు ఆ వస్తువును తక్కువ పరిమాణంలో డిమాండ్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఒక వస్తువు ధర తగ్గితే ధర తగ్గిన మేరకు వాస్తవిక ఆదాయం పెరిగినట్లే అవుతుంది. కనుక ఆ మేరకు డిమాండ్ పెరుగుతుంది. దీనినే డిమాండ్పై ఆదాయ ప్రభావం అంటారు.
ఉదా : ఒక వస్తువుకు వినియోగదారుడు 5 రూపాయలు కేటాయిస్తే వస్తువు ధర ఒక రూపాయిగా ఉంటే 5 యూనిట్లు కొనుగోలు చేస్తాడు. వస్తువు ధర అర్థ రూపాయికి తగ్గితే 10 యూనిట్లను కొనుగోలు చేస్తారు.

3. ప్రత్యామ్నాయాల ప్రభావం :
రెండు వస్తువులు ప్రత్యామ్నాయ వస్తువులు అయితే ఒక వస్తువు ధర తగ్గి | మరొక వస్తువు ధర స్థిరంగా ఉంటే ధర తగ్గిన వస్తువుకు, ధర స్థిరంగా ఉన్న వస్తువుకు బదులుగా ప్రత్యామ్నాయం చేస్తారు.
ఉదా : పెప్సి, థమ్సప్ శీతల పానీయాలు. పెప్సి ధర పెరిగితే వినియోగదార్లు దానికి ప్రత్యామ్నాయంగా థమ్సప్ కొనుగోలు చేస్తారు.

4. పాత, నూతన కొనుగోలుదార్లు :
ఒక వస్తువు ధర తగ్గగానే ముందు నుంచి ఆ వస్తువును కొనుగోలు చేస్తున్న పాత వినియోగదారుల వాస్తవిక ఆదాయం పెరిగి ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా ఒక వస్తువు ధర తగ్గినప్పుడు ఆకర్షితులైన కొత్త వినియోగదార్లు ఆ వస్తువును ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అందువల్ల ధర తగ్గినప్పుడు వస్తువుకు డిమాండ్ పెరుగుతుంది.

5. వస్తువుకున్న బహుళ ఉపయోగాలు :
కొన్ని వస్తువులకు బహుళ ఉపయోగాలుంటాయి. మరికొన్ని వస్తువులు ఒక ప్రత్యేకమైన ఉపయోగానికి మాత్రమే వినియోగించబడతాయి. అనేక ఉపయోగాలున్న వస్తువులకు ధర తగ్గితే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
ఉదా : పాలు, బొగ్గు, విద్యుచ్ఛక్తి మొదలైనవి.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 5.
ఆదాయ డిమాండ్ భావనను చర్చించండి.
జవాబు.
వినియోగదారుని ఆదాయానికి, వస్తువు డిమాండ్కు మధ్యనున్న సంబంధాన్ని ఆదాయ డిమాండ్ అంటారు. వివిధ ఆదాయాల వద్ద వస్తువు డిమాండ్ పరిమాణం ఏవిధంగా ఉందో ఆదాయ డిమాండ్ తెలియజేస్తుంది.
Dx = f(y)
ఇతర అంశాలు మారకుండా స్థిరంగా ఉంటే ఆదాయం పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. ధరకు, ఆదాయంకు ధనాత్మక సంబంధం ఉంది. ఆదాయ డిమాండును అనుసరించి వస్తువులలో |మేలురకం లేదా నాసిరకం వస్తువులుగా గుర్తించవచ్చు.

మేలురకం వస్తువులు / సాధారణ వస్తువులు:
ఆదాయం పెరిగితే మేలురకం వస్తువులు లేదా సాధారణ వస్తువుల డిమాండ్ పెరుగుతుంది.
ప్రక్క రేఖాపటంలో ‘OX’ అక్షంపై డిమాండ్ పరిమాణంను, ‘OY’ అక్షంపై ఆదాయంను తీసుకొన్నాం. ఆదాయం ‘OY’ ‘ ఉన్నప్పుడు ‘0Q’ వస్తు పరిమాణం డిమాండ్ చేయబడింది. ఆదాయం ‘OY’ నుంచి ‘OY’ కు పెరిగినప్పుడు మేలురకం వస్తువుల డిమాండ్ ‘0Q’ నుంచి ‘001’ కు పెరిగింది. ‘YD’ రేఖ ధనాత్మక వాలు కలిగి ఉంటుంది.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 15

నాసిరకం వస్తువులు :
మేలురకం వస్తువులకు భిన్నంగా వినియోగదార్ల ఆదాయం పెరిగితే నాసిరకం వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది. ప్రక్క రేఖాపటంలో ‘OX’ అక్షం మీద డిమాండ్ పరిమాణాన్ని, ‘OY’ అక్షం మీద ఆదాయంను తీసుకొన్నాం. ఆదాయం ‘OY’ నుంచి ‘OY1‘ కు పెరిగినప్పుడు డిమాండ్ ‘OQ’ నుంచి ‘OQ1‘ కు తగ్గును. ‘OD’ రేఖ ఎడమ నుండి కుడికి వాలి ఉంది.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 16

ప్రశ్న 6.
జాత్యంతర డిమాండ్ భావనను వివరించండి.
జవాబు.
ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలకు, ఒక వస్తువు డిమాండ్కు మధ్య ఉన్న సంబంధాన్ని జాత్యంతర డిమాండ్ అంటారు. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చిన మార్పుల వల్ల ఒక వస్తువు డిమాండ్లో వచ్చే మార్పులను జాత్యంతర డిమాండ్ తెలియజేయును.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 17

జాత్యంతర డిమాండ్ను ఈ విధంగా వ్రాయవచ్చు.
Dx = f(Py).

ప్రత్యామ్నాయ వస్తువులు : ఒక కోర్కెను తీర్చగల వివిధ వస్తువులను ప్రత్యామ్నాయ వస్తువులు అంటారు.
ఉదా : కాఫీ, టీ. ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ ధనాత్మక సంబంధాన్ని తెలియజేయును. దీనిని రేఖాపటం ద్వారా చూపవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 18

పై రేఖాపటంలో కాఫీ ధర ‘OY’ నుంచి ‘OY,’ కు పెరిగినప్పుడు టీ డిమాండ్ ‘OQ’ నుండి ‘OQ్క’ కు పెరిగింది. ‘CD’ రేఖ ధనాత్మక వాలును కలిగి ఉంది.
పూరక వస్తువులు : ఒకే కోరికను తీర్చగల సమిష్టి వస్తువులు.
ఉదా : కారు, పెట్రోలు, వీటి విషయంలో డిమాండ్ విలోమ సంబంధాన్ని తెలియజేయును.

ప్రక్క రేఖాపటంలో డిమాండ్ ‘OQ’ నుండి ‘OQ2‘ కు పెరిగింది. ధర ‘OP’ నుండి ‘OP2‘ కు తగ్గినప్పుడు ‘CD’ రేఖ ఋణాత్మక వాలు కలిగి ఉంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 7.
డిమాండ్ వ్యాకోచత్వం అంటే ఏమిటి ?
జవాబు.
అర్థశాస్త్రంలో డిమాండ్ వ్యాకోచత్వం అనే భావనకు విశేష ప్రాధాన్యత ఉంది. ధరలో వచ్చిన మార్పుకు ప్రతిస్పందనగా డిమాండ్లో ఎంత మేరకు మార్పు వస్తుందో డిమాండ్ వ్యాకోచత్వ భావన తెలుపుతుంది. ఒక వస్తువు ధరలో వచ్చిన అనుపాతపు మార్పు వల్ల డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పు ఎంత ఉంటుందో డిమాండ్ వ్యాకోచత్వ భావన తెలియజేయును.

అంటే ధరలో వచ్చే శాతం మార్పుకు, డిమాండ్లో వచ్చే శాతం మార్పుకు మధ్య ఉన్న సంఖ్యాత్మక సంబంధాన్ని డిమాండ్ వ్యాకోచత్వం తెలుపుతుంది. డిమాండ్ వ్యాకోచత్వం అనే భావనను కీరనీట్, మిల్ రూపొందించినప్పటికీ, మార్షల్ అభివృద్ధిపరిచారు.

మార్షల్ అభిప్రాయంలో “ధర తగ్గినప్పుడు డిమాండ్ ఎక్కువ పెరిగిందా లేదా తక్కువ పెరిగిందా, ధర పెరిగినప్పుడు డిమాండ్ తక్కువ తగ్గిందా లేదా ఎక్కువ తగ్గిందా అనే దాని ఆధారంగా మార్కెట్ డిమాండ్ వ్యాకోచత్వం ఎక్కువగాని, తక్కువగాని ఉంటుంది.”

శ్రీమతి జోన్ రాబిన్సన్ అభిప్రాయంలో “ధరలో వచ్చే అనుపాత మార్పు స్పందనకు బదులుగా డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పుకు ప్రతిస్పందన ఏ మేరకు ఉంటుందో తెలియజేసే భావన డిమాండ్ వ్యాకోచత్వం”.

డిమాండ్ వ్యాకోచత్వం = డిమాండ్లో వచ్చిన అనుపాతపు మార్పు / ధరలో వచ్చిన అనుపాతపు మార్పు

డిమాండ్ వ్యాకోచత్వాన్ని మూడు రకాలుగా చెబుతారు. అవి :

  1. ధర డిమాండ్ వ్యాకోచత్వం
  2. ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం
  3. జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 8.
ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్వచించండి.
జవాబు.
ఇతర కారకాలలో ఎలాంటి మార్పులు లేవనే ప్రమేయంతో, ఒక వస్తువు ధరలో వచ్చే అనుపాతపు మార్పు వల్ల డిమాండ్లో వచ్చే అనుపాతపు మార్పు ఎంత ఉంటుందో ధర డిమాండ్ వ్యాకోచత్వ భావన తెలియజేస్తుంది. ధర కొంత శాతం మార్పు చెందినప్పుడు వస్తువు డిమాండ్ పరిమాణం ఎంత శాతం మార్పు చెందుతుంది అనే దాన్ని ధర డిమాండ్ వ్యాకోచత్వం తెలియజేస్తుంది.

వస్తువు ధర పెరిగితే డిమాండ్ పరిమాణం తగ్గుతుంది. అయితే అన్ని సందర్భాల్లో ధరలో వచ్చిన మార్పు ఫలితంగా డిమాండ్లో వచ్చే ప్రతిస్పందన ఒకే రీతిగా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ధరలో వచ్చిన స్వల్ప మార్పు వల్ల డిమాండ్లో గణనీయమైన మార్పులు సంభవిస్తాయి.

ఈ పరిస్థితిని వ్యాకోచ డిమాండ్ అంటారు. మరి కొన్నిసార్లు ధరలో గణనీయమైన మార్పులు సంభవించినప్పటికీ డిమాండ్లో స్వల్ప మార్పులు మాత్రమే రావచ్చు. ఈ పరిస్థితిని అవ్యాకోచ డిమాండ్ అంటారు. వ్యాకోచత్వ విలువ ఆధారంగా ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని అయిదు రకాలుగా చెప్పవచ్చు.

ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలవడానికి ప్రొఫెసర్ మార్షల్ కింది సమీకరణాన్ని రూపొందించాడు.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 19

ఇచ్చట, Ed = ధర డిమాండ్ వ్యాకోచత్వం
Q = వస్తువు డిమాండ్
ΔQ = వస్తువు డిమాండ్లో వచ్చిన మార్పు
P = వస్తువు (ప్రారంభ) ధర
ΔP = వస్తువు ధరలో వచ్చిన మార్పు.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 9.
ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్ణయించే ముఖ్య అంశాలు (కారకాలు) ఏమిటి ?
జవాబు.
ఒక వస్తువు డిమాండ్ వ్యాకోచత్వంగా ఉందా లేదా అవ్యాకోచంగా ఉందా అనే విషయాన్ని సులభంగా చెప్పలేం. ఎందుకంటే ఒక వస్తువుకు ఒక ప్రాంతంలో, ఒక వ్యక్తికి ఒక కాలంలో వ్యాకోచ డిమాండ్ ఉండవచ్చు. అదే వస్తువుకు మరో ప్రాంతంలో, మరో వ్యక్తికి మరో కాలంలో అవ్యాకోచ డిమాండ్ ఉంటుంది. వ్యాకోచత్వం విలువను అనేక అంశాలు నిర్ణయిస్తాయి. ఒక వస్తువుకున్న డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్ణయించే కొన్ని అంశాలను కింద పేర్కొన్నాం.

1. వస్తువు స్వభావం :
వస్తువు స్వభావం ఆధారంగా డిమాండ్ వ్యాకోచత్వం మారుతూ ఉంటుంది. నిత్యావసర వస్తువులైన బియ్యం, ఉప్పు, పప్పులు, పంచదార మొదలైన వాటికి డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. ఆ వస్తువుల ధరలు మారినా డిమాండ్ మారదు. అలాగే విలాస వస్తువులైన బంగారం, డైమండ్స్ మొదలైన వాటికి డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది.

2. ప్రత్యామ్నాయాల (Substitutes) లభ్యత :
ఒక వస్తువుకున్న డిమాండ్ను దానికున్న ప్రత్యామ్నాయాల ధరలు కొంతమేరకు ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు కోల్గేట్ ధర పెరిగితే క్లోజప్కు డిమాండ్ పెరుగుతుంది. అట్లాగే కోల్గేట్ ధర తగ్గితే క్లోజపు డిమాండ్ తగ్గుతుంది. ఒక వస్తువుకు ఎక్కువ సంఖ్యలో ప్రత్యామ్నాయాలు ఉన్నప్పుడు ఆ వస్తువుకు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఏ వస్తువుకైతే ప్రత్యామ్నాయ వస్తువులు తక్కువగా ఉంటాయో అది అవ్యాకోచ డిమాండ్ను కలిగి ఉంటుంది.

3. పూరక (Complementaries) వస్తువులు :
కోరికలను సంతృప్తి పరచుకోవడానికి కొన్ని వస్తువులను కలిపి ఉపయోగించవలసి ఉంటుంది. ఉదాహరణకు, కారు ఇంధనం.
ఉదా : కారు ధర పెరిగితే ఇంధనానికి డిమాండ్ తగ్గుతుంది. అట్లాగే కారు ధర తగ్గితే ఇంధనానికి డిమాండ్ పెరుగుతుంది. కార్ల డిమాండ్ వ్యాకోచంగా ఉంటే ఇంధనం డిమాండ్ కూడా వ్యాకోచంగా ఉంటుంది. అలాగే కార్ల డిమాండ్ అవ్యాకోచంగా ఉంటే ఇంధనం డిమాండ్ కూడా అవ్యాకోచంగా ఉంటుంది.

4. వస్తువుకు ఉన్న బహుళ ఉపయోగాలు :
ఏ వస్తువుకైతే బహుళ ఉపయోగాలు ఉంటాయో, ఆ వస్తువుకు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఎందుకంటే ధర తగ్గినప్పుడు ఆ వస్తువును అనేక ఉపయోగాలకు వాడుకోవచ్చని ఎక్కువగా కొంటారు. ధర పెరిగినప్పుడు ఆ వస్తువును ఒక ప్రత్యేక ఉపయోగానికి మాత్రమే పరిమితం చేసి తక్కువగా కొంటారు.

ఉదాహరణకు పాలు, బొగ్గు, విద్యుచ్ఛక్తి, పాల ధరలు తక్కువగా ఉన్నప్పుడు పాలను ఎక్కువగా కొనుగోలు చేసి పెరుగు, క్రీమ్, నెయ్యి, స్వీట్స్ మొదలైన ఉపయోగాలకు వాడతారు. అందుకు భిన్నంగా, ధర ఎక్కువగా ఉన్నప్పుడు పాలను చిన్న పిల్లలు, వృద్ధులకు ఆహారంగా మాత్రమే వాడతారు, ఇతర ఉపయోగాలకు తగ్గిస్తారు.

5. వినియోగాన్ని వాయిదా వేయగలగడం :
ఒక వస్తువు వినియోగాన్ని వాయిదా వేయడానికి వీలున్నట్లయితే ఆ వస్తువు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఉదాహరణకు వాహనాలు, నగలు, AC యూనిట్ల కొనుగోలు వాయిదా వేయగలం. మరికొన్ని వస్తువుల వినియోగాన్ని వాయిదా వేయలేం. ఉదాహరణకు ప్రాణరక్షణ మందులు. వీటి ధర పెరిగినా వినియోగాన్ని వాయిదా వేయలేం. ఈ వస్తువుల డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది.

6. ఆదాయంలో వస్తువుపై ఖర్చు పెట్టే అనుపాతం :
వినియోగదారులు మొత్తం ఆదాయం నుంచి ఏ వస్తువులపై తక్కువ అనుపాతంలో ఖర్చు చేస్తారో ఆ వస్తువుల ధర, డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. ఉదాహరణకు, ఉప్పు, వార్తాపత్రికలు మొదలైనవి. ఆదాయంలో ఎక్కువ భాగం ఏ వస్తువుల వినియోగంపై ఖర్చు చేస్తారో వాటి డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఉదాహరణకు ఎయిర్ కండిషనర్స్, వాహనాలు.

7. కాలం :
స్వల్ప కాలంలో వస్తువులు అవ్యాకోచ డిమాండు, దీర్ఘ కాలంలో వ్యాకోచ డిమాండ్ను కలిగి ఉంటాయి. ఎందుకంటే స్వల్ప కాలంలో వస్తువుల ధరలు పెరిగిన తక్షణమే ప్రత్యామ్నాయ వస్తువులను తయారు చేయలేం. ఉదాహరణకు స్వల్ప కాలంలో పెట్రోలు ధర పెరిగిన తక్షణమే పెట్రోలు ఇంజన్లకు ప్రత్యామ్నాయంగా డీజిల్ ఇంజన్లు తయారు చేయలేరు. కానీ దీర్ఘకాలంలో డీజిల్ ఇంజన్లు తయారు చేయగలరు.

8. ధరల స్థాయి :
వస్తువుల ధరలు చాలా ఎక్కువగా లేదా చాలా తక్కువగా ఉన్నా డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. అదే వస్తువుల ధరలు సాధారణ స్థాయిలో ఉంటే వాటి డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది.

9. వ్యసనానికి దోహదపడే వస్తువులు :
కొన్ని వస్తువుల వినియోగం వ్యసనానికి దారితీస్తుంది. ఆ వస్తువుల ధర పెరిగినప్పటికీ వాటిని వినియోగించాలనే కోరిక బలంగా ఉంటుంది. అందువల్ల ఈ వస్తువుల డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది.
ఉదా : పొగాకు, ఆల్కహాల్.

10. ఆదాయ వర్గాలు :
అధిక ఆదాయ వర్గానికి చెందిన వినియోగదార్లు కొనుగోలు చేసే వస్తువులకు డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. ఎందుకంటే వీరు ధర పెరిగినా వస్తువులను కొనగలరు. అల్ప, మధ్య ఆదాయ వర్గాలకు చెందినవారు కొనుగోలు చేసే వస్తువులకు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ధర పెరిగితే వీరు వస్తువులను కొనలేరు. ఒక వస్తువుకు వ్యాకోచ డిమాండ్ ఉందా లేదా అవ్యాకోచ డిమాండ్ ఉందా అనేది చెప్పడం కష్టం.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 10.
ధర డిమాండ్ వ్యాకోచత్వ ప్రాధాన్యతను వివరించండి.
జవాబు.
వ్యాపార సంస్థలు, వ్యాపారస్తులు, ప్రభుత్వం ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి నిర్ణయాలు తీసుకొనేటప్పుడు ధర డిమాండ్ వ్యాకోచత్వ భావన ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. డిమాండ్ వ్యాకోచత్వం ఎక్కువగా ఉపయోగపడే రంగాలను కొన్నింటిని కింద చూడవచ్చు.

1. ఏకస్వామ్య మార్కెట్ :
వివిధ మార్కెట్లలో డిమాండ్ వ్యాకోచత్వం వేరుగా ఉంటే దీన్ని బట్టి ఏకస్వామ్యదారుడు వివిధ ధరలను నిర్ణయిస్తాడు. వ్యాపారస్తులు వస్తువులకు ధర నిర్ణయించేటప్పుడు ఆ వస్తువుకున్న ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.

ఏకస్వామ్యదార్లు వస్తువుకున్న డిమాండ్ వ్యాకోచత్వం ఆధారంగా ధర నిర్ణయిస్తారు. వ్యాకోచత్వం ఎక్కువగా ఉన్న మార్కెట్లో వస్తువులకు తక్కువ ధరను, అవ్యాకోచత్వం ఉన్న మార్కెట్లో వస్తువులకు ఎక్కువ ధరను నిర్ణయిస్తారు.

2. సంయుక్త (Joint) వస్తువుల ధర నిర్ణయం :
జంటగా కొన్ని వస్తువులు ఉత్పత్తి చేయబడతాయి. ఉదాహరణకు మాంసం, ఉన్ని, పంచదార, మొలాసిస్. ఈ వస్తువుల విషయంలో ఒక్కొక్క వస్తువు ఉత్పత్తి వ్యయాన్ని విడదీసి చెప్పడానికి వీలుండదు. ఈ వస్తువుల ధర నిర్ణయంలో డిమాండ్ వ్యాకోచంగా ఉన్న వాటికి తక్కువ ధరను, అవ్యాకోచంగా ఉన్న వాటికి ఎక్కువ ధరను నిర్ణయించడం జరుగుతుంది.

3. ప్రభుత్వం :
కొన్ని వస్తువులు ప్రజా సంక్షేమాన్ని పెంపొందిస్తాయి. సాధారణంగా ఈ వస్తువులకు డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ వస్తూత్పత్తి పరిశ్రమలను ప్రజోపయోగాలుగా ప్రకటిస్తుంది. ఇందుకు మంచి ఉదాహరణగా రైల్వేలని చెప్పవచ్చు.

4. అంతర్జాతీయ వ్యాపారం :
రెండు దేశాల మధ్య వ్యాపారం జరగాలంటే రెండు దేశాల వస్తువులకున్న డిమాండ్ వ్యాకోచత్వాన్ని చూడాలి. అంతర్జాతీయ వ్యాపారంలో వివిధ దేశాల మధ్య వస్తువుల మారకపు రేటును నిర్ధారించేటప్పుడు వస్తువులకున్న డిమాండ్ వ్యాకోచత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.

5. వస్తువులపై పన్ను విధింపు :
ప్రభుత్వం తన రాబడిని పెంచుకోవడానికి సాధారణంగా పన్నులను విధిస్తుంది. పన్నులను విధించేటప్పుడు ఆర్థికమంత్రికి వస్తువులకున్న డిమాండ్ వ్యాకోచత్వ భావన ఉపయోగపడుతుంది. అంటే డిమాండ్ అవ్యాకోచంగా ఉన్న వస్తువులను ఎన్నుకొని ఎక్కువ పన్నులను విధిస్తారు.

6. వేతనాల నిర్ణయం :
శ్రామికులకున్న డిమాండ్ వ్యాకోచత్వం వారి వేతనాలను ప్రభావితం చేస్తుంది. వీరికున్న డిమాండ్ అవ్యాకోచంగా ఉంటే వేతనాల పెంపుదలకు కార్మిక సంఘాల ప్రయత్నం సఫలం అవుతాయి. శ్రామికులకున్న డిమాండ్ వ్యాకోచంగా ఉంటే వేతనాల పెంపుదలకు కార్మిక సంఘాల ప్రయత్నం విఫలం కావచ్చు.

7. సంపద మాటున దాగి ఉన్న పేదరికం :
సంపద మాటున దాగి ఉన్న పేదరికం అనే వైపరీత్యాన్ని అర్థం చేసుకోవడానికి డిమాండ్ వ్యాకోచత్వ భావన ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, ఆహార ధాన్యాలు బాగా పండితే రైతులు అధిక ఆదాయాన్ని పొందాలి. ఆహార ధాన్యాలు సమృద్ధిగా పండినప్పటికీ వాటికి ఉన్న డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. అందువల్ల ఆహార ధాన్యాల డిమాండ్ స్థిరంగా ఉండి, సరఫరా పెరిగినందువల్ల వాటికి తక్కువ ధర నిర్ణయించబడుతుంది.

8. వస్తూత్పత్తి నిర్ణయం :
‘ఉత్పత్తిదార్లు’ వస్తువులకున్న డిమాండ్ వ్యాకోచత్వాన్ని అనుసరించి ఉత్పత్తి చేస్తారు. ఏ వస్తువులకైతే డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుందో ఆ వస్తువులను ఉత్పత్తి చేస్తారు. ఎందుకంటే వాటి ధరలను పెంచి లాభం పొందగలుగుతారు. కాబట్టి ఉత్పత్తి ఎంత చేయాలని నిర్ణయించడానికి వ్యాకోచత్వ భావన తోడ్పడుతుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 11.
ఆదాయ, జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వాలను విశదీకరించండి.
జవాబు.
అర్థశాస్త్ర సిద్ధాంతాల్లో ‘డిమాండ్ వ్యాకోచత్వం’ అనే భావనకు విశేష ప్రాధాన్యత ఉంది. డిమాండ్ను నిర్ణయించే ఒక అంశంలో వచ్చిన మార్పు శాతానికి ప్రతిస్పందనగా డిమాండ్లో ఎంత శాతం మేరకు మార్పు వస్తుందో డిమాండ్ వ్యాకోచత్వ భావన తెలుపుతుంది.

వస్తువు ధర, ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలు, వినియోగదారుని ఆదాయం, అభిరుచులు, ప్రాధాన్యతలు మొదలగునవి ఒక వస్తువు డిమాండ్ను నిర్ణయిస్తాయని ఇంతకు ముందే చర్చించుకున్నాం.

ఒక వస్తువు డిమాండ్ పరిమాణంలో వచ్చిన మార్పు శాతాన్ని డిమాండ్ను నిర్ణయించే అంశాలలోని ఒక అంశంలో వచ్చిన మార్పుల శాతంతో భాగిస్తే డిమాండ్ వ్యాకోచత్వం వస్తుంది. డిమాండ్ వ్యాకోచత్వం అన్ని వస్తువులకు, అన్ని సమయాల్లో, అన్ని ప్రదేశాల్లో, అందరు వ్యక్తులకు ఒకేలా ఉండదు.

ఉదా : నిత్యావసర వస్తువులైన బియ్యం, ఉప్పు, కూరగాయలు మొదలైన వాటి ధరలలో గణనీయమైన మార్పులు వచ్చినా డిమాండ్లో పెద్దగా మార్పు రాదు. కానీ విలాస వస్తువులైన రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, వాషింగ్ మిషన్లు మొదలైన వాటి ధరలలో కొద్ది తగ్గుదల వచ్చినా, డిమాండ్లో గణనీయమైన మార్పులు వస్తాయి.

ఒక వస్తువు ధరలో వచ్చిన అనుపాతపు మార్పు వల్ల డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పు ఎంత ఉంటుందో డిమాండ్ వ్యాకోచత్వ భావన తెలియజేస్తుంది. అంటే ఒక వస్తువు ధరలో వచ్చే శాతం మార్పుకు, డిమాండ్లో వచ్చే శాతం మార్పుకు మధ్య ఉన్న సంఖ్యాత్మక సంబంధాన్ని డిమాండ్ వ్యాకోచత్వం తెలుపుతుంది.

ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం :
ఆదాయంలో వచ్చే మార్పు వల్ల (పెరుగుదల లేదా తగ్గుదల) డిమాండ్ పరిమాణంలో ఏ మేరకు స్పందన వస్తుందో ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం తెలుపుతుంది. వినియోగదారుని ఆదాయంలో వచ్చిన అనుపాతపు మార్పు వల్ల వస్తువు డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పును ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం అంటారు.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 20

జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం :
ఒక వస్తువుకున్న డిమాండ్ దాని ధర పైనే కాకుండా, దానికున్న ప్రత్యామ్నాయ, | పూరక వస్తువుల ధర పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఇతర కారకాలు మారకుండా ఉండి, ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరల్లో వచ్చే అనుపాతపు మార్పు లేదా శాతపు మార్పు ఆ వస్తువు డిమాండ్లో ఎంత అనుపాతపు మార్పు లేదా శాతపు మార్పు కలిగిస్తుందో జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం తెలియజేస్తుంది.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 21

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ధర డిమాండ్ అంటే ఏమిటి ?
జవాబు.
ఒక వస్తువును కొనాలనే కోరికతో పాటు, కొనగలిగే శక్తి ఉంటే దానిని అర్థశాస్త్రంలో ఆ వస్తువుకు గల డిమాండ్ అంటారు. ఒక నిర్ణీతకాలంలో మార్కెట్లోని వివిధ ధరల వద్ద ఒక వినియోగదారుడు కొనే వస్తువుల లేదా సేవల పరిమాణాలను ధర డిమాండ్ తెలియజేస్తుంది. ఇతర అంశాలు స్థిరంగా ఉన్నప్పుడు ధరకు, దాని డిమాండుకు మధ్య విలోమ సంబంధం ఉంటుంది.

ప్రశ్న 2.
వైయుక్తిక డిమాండ్ పట్టిక తయారు చేయండి.
జవాబు.
ఒక వినియోగదారుడు ఒక వస్తువును వివిధ ధరల వద్ద ఎంతెంత పరిమాణంలో కొనుగోలు చేస్తాడో తెలియజేయునది వైయుక్తిక డిమాండ్. దానిని పట్టిక రూపంలో తెలియజేస్తే అది వైయుక్తిక డిమాండ్ పట్టిక.

ప్రశ్న 3.
మార్కెట్ డిమాండ్ పట్టిక తయారు చేయండి.
జవాబు.
మార్కెట్లో అనేక మంది వినియోగదారులు ఉంటారు. వారందరి డిమాండ్ పట్టికలను కలిపితే మార్కెట్ డిమాండ్ పట్టిక వస్తుంది. మార్కెట్ డిమాండ్ వివిధ వినియోగదార్ల వస్తువులను వివిధ ధరల వద్ద ఒక వస్తువును ఎంతెంత పరిమాణంలో కొనుగోలు చేస్తారో తెలియజేస్తుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 4.
డిమాండ్ ఫలం అంటే ఏమిటి ?
జవాబు.
ఒక వస్తువు డిమాండ్ పరిమాణానికి, దానిని నిర్ణయించే కారకాలకు మధ్యగల సంబంధాన్ని డిమాండ్ ఫలం తెలియజేయును. డిమాండ్ ఫలాన్ని ఈ క్రింది సమీకరణం ద్వారా తెలియజేయవచ్చు.
DX = f (PX, PY, Y, T).
DX = X వస్తువు డిమాండ్
PX = x వస్తువు ధర
PY = ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలు
Y = వినియోగదారుని ఆదాయం
T = అభిరుచులు, అలవాట్లు.

ప్రశ్న 5.
గిఫెన్ వైపరీత్యం / గిఫెన్ వస్తువులు భావనను వివరించండి.
జవాబు.
ధర పెరిగినప్పటికి డిమాండ్ తగ్గకపోగా, పెరగటం లేదా అదే విధంగా డిమాండ్ను కలిగి ఉండే వస్తువులను గిఫెన్ వస్తువులంటారు. నాసిరకపు వస్తువులను గిఫెన్ వస్తువులంటారు. వాటి ధర పెరిగితే ఇతర వస్తువులపై ఖర్చు తగ్గించి ఈ వస్తువులను కొనుగోలు చేస్తారు. దీనిని సర్ రాబర్ట్ గిఫెన్ అనే ఆర్థికవేత్త పరిశీలించడం వల్ల దీనిని “గిఫెన్ వైపరీత్యం” అంటారు.

ప్రశ్న 6.
వెబ్లెన్ వస్తువులు (గౌరవ సూచిక వస్తువులు) అనగానేమి ?
జవాబు.
దీనిని గూర్చి చెప్పిన ఆర్థికవేత్త వెల్లెన్.. గౌరవ సూచిక వస్తువులయిన వజ్రాలు, బంగారు నగలు మొదలైనవి. కలిగి ఉండటం సమాజంలో ప్రతిష్టగా భావిస్తారు ధనికులు. వీటి ధర తగ్గితే వారి గౌరవం, ప్రతిష్ట తగ్గుతాయని కొనుగోలు తగ్గిస్తారు. కనుక ఈ వస్తువుల విషయంలో ధర తగ్గితే డిమాండ్ కూడా తగ్గును.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 7.
ఆదాయ డిమాండ్ అంటే ఏమిటి ?
జవాబు.
ఆదాయానికి, కొనుగోలు చేసే వస్తు పరిమాణానికి ఉన్న సంబంధాన్ని ఆదాయ డిమాండ్ పరిశీలిస్తుంది. సాధారణంగా ఆదాయం పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. ఆదాయ డిమాండ్ను బట్టి వస్తువులను మేలురకం అని, నాసిరకమని విభజించవచ్చు.
ఆదాయ డిమాండ్ Dn = f(y).

ప్రశ్న 8.
జాత్యంతర డిమాండ్ అంటే ఏమిటి ?
జవాబు.
ప్రత్యామ్నాయ, పూరక వస్తువు ధరలకు, ఒక వస్తువు డిమాండ్కు ఉన్న సంబంధాన్ని జాత్యంతర డిమాండ్ అంటారు. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చిన మార్పుల వల్ల ఒక వస్తువు డిమాండ్లో వచ్చే మార్పులను జాత్యంతర డిమాండ్ తెలియజేయును.
Dx = f(Py).

ప్రశ్న 9.
ప్రత్యామ్నాయాలు (ప్రతిస్థాపక వస్తువులు) వస్తువులను వివరించండి.
జవాబు.
సన్నిహిత సంబంధం ఉన్న వివిధ వస్తువులను ప్రత్యామ్నాయ వస్తువులంటారు.
ఉదా : కాఫీ, టీ. ఈ వస్తువుల విషయంలో ప్రత్యామ్నాయ వస్తువు ధరలో మార్పు వస్తే, మరో వస్తువు డిమాండ్లో మార్పు వస్తుంది. కనుక ఈ వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి పైకి వాలి ఉంటుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 10.
పూరక వస్తువులను వివరించండి.
జవాబు.
సంయుక్త వస్తువులను పూరక వస్తువులంటారు. ఉదా : కారు, పెట్రోలు. వీటిలో ఒకటి లేకపోయినా మరొకటి ఉపయోగపడదు. పూరక సంబంధం ఉన్న వస్తువు ధర పెరిగితే, ఇతర వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది. ధర తగ్గితే ఇతర వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. పూరక సంబంధం ఉన్న వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ క్రిందికి వాలి ఉంటుంది.

ప్రశ్న 11.
ధర డిమాండ్ వ్యాకోచత్వం అంటే ఏమిటి ?
జవాబు.
ఒక వస్తువు ధరలోని శాతం మార్పుకు, వస్తు డిమాండ్లో డిమాండ్ వ్యాకోచత్వం” అంటారు.
Ep = డిమాండ్లో వచ్చిన మార్పు శాతం / ధరలో వచ్చిన మార్పు శాతం

ప్రశ్న 12.
ధర డిమాండ్ వ్యాకోచత్వ రకాలు తెల్పండి.
జవాబు.
ధరలోని మార్పుకు ప్రతిస్పందనగా డిమాండ్లో ఏ మేరకు మార్పు వస్తుందనేది, ధర డిమాండ్ వ్యాకోచత్వం తెలియజేస్తుంది. ఈ భావనను మార్షల్ అభివృద్ధి పరచినాడు. దీనిని క్రింది విధంగా కొలవవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 22

ధర డిమాండ్ వ్యాకోచత్వపు రకాలు 5. అవి :

  1. పూర్తి వ్యాకోచ డిమాండ్ (Ep = ∞)
  2. సాపేక్ష వ్యాకోచ డిమాండ్ (Ed >1)
  3. పూర్తి అవ్యాకోచ డిమాండ్
  4. సాపేక్ష అవ్యాకోచ డిమాండ్
  5. ఏకత్వ వ్యాకోచ డిమాండ్

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 13.
ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం అంటే ఏమిటి ?
జవాబు.
వినియోగదారుని ఆదాయంలో వచ్చిన మార్పు శాతంకు, అతని డిమాండ్లో వచ్చిన శాతం మార్పును “ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం” అంటారు.
Ey = డిమాండ్లో వచ్చిన మార్పు శాతం / ఆదాయంలో వచ్చిన మార్పు శాతం

ప్రశ్న 14.
జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వంను వివరించండి.
జవాబు.
ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చిన శాతం మార్పుకు, డిమాండ్లో కలిగే శాతం మార్పును “జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం” అంటారు.
Ec = డిమాండ్లో వచ్చిన మార్పు శాతం / ప్రత్యామ్నాయ, పూరక వస్తువు ధరలో వచ్చిన మార్పు శాతం

ప్రశ్న 15.
పూర్తి వ్యాకోచ డిమాండ్ అంటే ఏమిటి ?
జవాబు.
ధరలో ఏ మార్పు వచ్చినా లేకున్నా డిమాండ్లో అంటారు. ఇక్కడ డిమాండ్ రేఖ ‘X’ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. దీని సంఖ్యాత్మక విలువ Ep = ∞.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 16.
పూర్తి అవ్యాకోచ డిమాండ్ అంటే ఏమిటి ?
జవాబు.
ధరలో ఎంత మార్పు వచ్చినా డిమాండ్లో ఏ మాత్రము మార్పు ఉండదు. దీనినే పూర్తి అవ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ డిమాండ్ రేఖ Y – అక్షానికి సమాంతరంగా ఉంటుంది. దీని సంఖ్యాత్మక విలువ Ep = 0.

ప్రశ్న 17.
ఏకత్వ వ్యాకోచ డిమాండ్ను వివరించండి.
జవాబు.
ఒక వస్తువు ధరలో వచ్చిన అనుపాతపు మార్పు డిమాండ్లో వచ్చిన అనుపాతపు మార్పుకు సమానమైతే దానిని ఏకత్వ వ్యాకోచ డిమాండ్ అంటారు. దీని విలువ ఒకటికి సమానము.
Ep = 1
ఇక్కడ డిమాండ్ రేఖ లంబ అతిపరావలయ ఆకారంలో ఉంటుంది.

ప్రశ్న 18.
సాపేక్ష వ్యాకోచ డిమాండ్ గురించి తెల్పండి.
జవాబు.
ఒక వస్తువు ధరలో వచ్చే అనుపాతపు మార్పు కంటే డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పు ఎక్కువగా ఉంటే దానిని సాపేక్ష వ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ వ్యాకోచత్వం విలువ ‘1’ కంటే ఎక్కువగా ఉంటుంది.

ప్రశ్న 19.
సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ గురించి తెల్పండి..
జవాబు.
వస్తువు ధరలో వచ్చిన అనుపాతపు మార్పు కంటే డిమాండ్ పరిమాణంలో వచ్చిన అనుపాతపు మార్పు తక్కువగా ఉన్నట్లయితే దీనిని సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ డిమాండ్ వ్యాకోచత్వం విలువ ‘1’ కంటే తక్కువగా ఉంటుంది.

ప్రశ్న 20.
మేలురకం వస్తువులను నిర్వచించండి.
జవాబు.
ఆదాయం పెరిగితే మేలు రకం వస్తువులు లేదా సాధారణ వస్తువులు డిమాండ్ పెరుగుతుంది. మేలు రకం వస్తువుల డిమాండ్ విషయంలో డిమాండుకు, ఆదాయానికి మధ్య ధనాత్మక సంబంధం ఉంటుంది. కాబట్టి ఆదాయ డిమాండ్ రేఖ ధనాత్మక వాలును కలిగి ఎడమ నుంచి కుడికి పైకి వెళ్తుంది.

ప్రశ్న 21.
నాసిరకం వస్తువులను నిర్వచించండి.
జవాబు.
ఆదాయం పెరిగేకొలది కొన్ని రకాల వస్తువులకు డిమాండ్ తగ్గును. ఆదాయం తగ్గితే డిమాండ్ పెరుగును. ఇటువంటి వస్తువులను నాసిరకం వస్తువులంటారు. ఈ వస్తువుల విషయంలో ఆదాయానికి, వస్తువు డిమాండ్కు విలోమ సంబంధం ఉంటుంది.
ఉదా : సజ్జలు, రాగులు.

TS Inter 1st Year Economics Study Material Chapter 7 జాతీయాదాయ విశ్లేషణ

Telangana TSBIE TS Inter 1st Year Economics Study Material 7th Lesson జాతీయాదాయ విశ్లేషణ Textbook Questions and Answers.

TS Inter 1st Year Economics Study Material 7th Lesson జాతీయాదాయ విశ్లేషణ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
జాతీయాదాయపు వివిధ నిర్వచనాలు ఏవి ? జాతీయాదాయ నిర్ణాయకాలను విశదీకరించండి.
జవాబు.
జాతీయాదాయం అనే భావన అనేక రకాలుగా నిర్వచింపబడ్డది. ఒక దేశంలో నిర్ణీత కాలంలో ఉత్పత్తి చేసిన వస్తువుల, సేవల మార్కెట్ విలువ మొత్తాన్ని జాతీయాదాయం అంటారు. ఇంకొక విధంగా చెప్పాలంటే వివిధ ఆర్థిక కార్యకలాపాల ద్వారా ఒక దేశంలో సమకూరే ఆదాయమే జాతీయాదాయం.

వివిధ ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలాలైన భాటకం, వేతనాలు, వడ్డీ మరియు లాభాల వంటివి ఇందులో కలిసి ఉంటాయి. జాతీయాదాయ నిర్వచనాలను స్థూలంగా రెండు రకాలుగా చెప్పవచ్చు. అవి :

  1. మార్షల్, పిగూ, ఫిషర్ ప్రతిపాదించిన సంప్రదాయ నిర్వచనాలు
  2. ఆధునిక నిర్వచనాలు.

1. మార్షల్ నిర్వచనం :
“ఒక దేశంలోని శ్రమ, మూలధనం సహజ వనరుల సహాయంతో ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసే భౌతిక, అభౌతిక వస్తు సేవలతో కూడుకున్న నికర వస్తు సేవల మొత్తమే ఆ దేశ వాస్తవిక నికర వార్షిక ఆదాయం”.

2. పిగూ నిర్వచనం :
పిగూ నిర్వచనం ప్రకారం ‘ద్రవ్య రూపంలో కొలవడానికి వీలయ్యి విదేశాల నుంచి లభించే నికర ఆదాయంతో సహా సమాజానికి సంప్రాప్తించే ఆదాయాన్ని జాతీయాదాయం’ అంటారు.

3. ఫిషర్ నిర్వచనం :
ఫిషర్ నిర్వచనం ప్రకారం “తుది వినియోగదారులు భౌతిక లేదా మానవ పరిసరాల నుంచి పొందే సేవల సముదాయమే జాతీయాదాయం”. మార్షల్, పిగూ నిర్వచనాల కంటే ఫిషర్ నిర్వచనం మెరుగైందని చెప్పవచ్చు.

ఎందుకంటే ఫిషర్ నిర్వచనం వినియోగంపై ఆధారపడ్డ ఆర్థిక సంక్షేమాన్ని కూడా పరిగణనలోకి తీసుకొంటుంది. అంతేకాక మార్షల్, పిగూ నిర్వచనాల కంటే ఫిషర్ ప్రతిపాదించిన నిర్వచనం దోషరహితమైనది. జాతీయాదాయ విశ్లేషణలో ఆర్థిక సంక్షేమ కారణాలను ఆర్థిక సంక్షేమ స్థాయిని పోల్చడానికి ఫిషర్ నిర్వచనం ఉపకరిస్తుంది.

4. కుజ్నెట్స్ నిర్వచనం :
‘ఒక దేశ ఉత్పాదక వ్యవస్థ నుంచి అంతిమ వినియోగదారులకు ఒక సంవత్సర కాలంలో ప్రవహించే వస్తు సేవల నికర ఉత్పత్తి లేదా దేశ మూలధన వస్తువులను నికరంగా చేరే వస్తు సేవలను జాతీయాదాయం అంటారు. దేశంలోని వ్యక్తులు, వ్యాపార సంస్థలు, సామాజిక, రాజకీయ సంస్థలు వారి ఆర్థిక వ్యాపారాలకు ప్రతిఫలంగా పొందే నికర ఆదాయ సముదాయమే జాతీయాదాయం’.

జాతీయాదాయ పరిమాణాన్ని నిర్ణయించే అంశాలు :
ఒక దేశ జాతీయాదాయ పరిమాణం అనేక అంశాలలో ప్రభావితమై నిర్ణయింపబడుతుంది. ఈ అంశాల కారణంగానే వివిధ దేశాలలో జాతీయాదాయ స్థాయి లేదా పరిమాణంలో వ్యత్యాసాలు గోచరిస్తాయి. ఒకే దేశంలో ఎప్పటికీ జాతీయాదాయ పరిమాణం ఒకే విధంగా ఉండదు. జాతీయాదాయ పరిమాణాన్ని నిర్ణయించే అంశాలలో ముఖ్యమైన వాటిని ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు.

ఎ) సహజ వనరులు :
సహజ వనరులు, శీతోష్ణస్థితి, భౌగోళిక అంశాలు, సారవంతమైన నేలలు, గనులు, ఇంధన వనరులు మొదలైనవి అధికంగాను, అనుకూలంగాను లభ్యమయ్యే దేశాలలో, అన్ని రంగాలలో అధికోత్పత్తులు సాధించవచ్చు. అందువల్ల జాతీయాదాయం పెరుగుతుంది.

బి) ఉత్పత్తికారకాల నాణ్యత, లభ్యత :
ఒక దేశంలో అధిక శక్తి సామర్థ్యం గల శ్రామికుల లభ్యత, చొరవ, సాహసం, సామర్థ్యం గల సమర్థవంతమైన వ్యవస్థాపకులు, మూలధనం పెరుగుదల రేటు జాతీయాదాయ పరిమాణాన్ని నిర్ణయిస్తాయి.

సి) సాంకేతిక విజ్ఞాన ప్రగతి :
ఒక దేశంలో సాంకేతిక విజ్ఞాన ప్రగతిని అనుసరించి ఉత్పత్తి, జాతీయాదాయ పరిమాణం నిర్ణయింపబడుతుంది. ప్రకృతి వనరుల అభిలషణీయ వినియోగానికి అధునాతన ఉత్పత్తి పద్ధతులు దోహదం చేస్తాయి.

డి) రాజకీయ నిర్ణయాలు, స్థిరత్వం :
ప్రణాళికాబద్ధమైన ఆర్థికాభివృద్ధికి, జాతీయాదాయ వృద్ధిరేటు పెంపుకు రాజకీయ నిర్ణయాలు, స్థిరత్వం దోహదం చేస్తాయి. ప్రభుత్వ విధానాలు, ఎగుమతి · దిగుమతి విధానాలు, మానవ వనరుల అభివృద్ధి, పరిశోధనలపై పెట్టుబడులు మొదలైన అంశాలు కూడా జాతీయాదాయాన్ని నిర్ణయిస్తాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 7 జాతీయాదాయ విశ్లేషణ

ప్రశ్న 2.
జాతీయాదాయాన్ని నిర్వచించి, దాని వివిధ భావనలను వివరించండి.
జవాబు.
ఒక సంవత్సర కాలంలో ఆర్థిక కార్యకలాపాల వలన దేశంలో ఉత్పత్తయ్యే వస్తుసేవల ద్రవ్యరూపం జాతీయాదా యంగా భావించవచ్చు. ఆధునిక అర్థశాస్త్రంలో ‘జాతీయాదాయం’ అనే అంశానికి చాలా ప్రాధాన్యత ఉంది.

జాతీయాదాయ భావనలు :
1. స్థూల జాతీయోత్పత్తి :
ఒక సంవత్సర కాలంలో దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తుసేవల ద్రవ్యరూపాన్ని స్థూల జాతీయోత్పత్తి అంటారు. దీనికి విదేశీ వ్యాపారం వలన లభించే ఆదాయం కలపాలి. స్థూల జాతీయోత్పత్తిని అంచనా వేయడంలో

  1. ప్రతి అంతిమ వస్తువు లేదా సేవల విలువలను ద్రవ్యరూపంలో చెప్పాలి.
  2. ఏ వస్తువు విలువను రెండుసార్లు లెక్కపెట్టకుండా జాగ్రత్తపడాలి.
  3. ముడిపదార్థాలను పూర్తిగా తయారు కాని వస్తువుల విలువను జాతీయోత్పత్తిలో కలపాలి. వీటిని

ఇన్వంటరీస్ అంటారు. వీటిలో తరుగుదల ఉంటే ఆ సంవత్సరపు జాతీయోత్పత్తి నుండి తీసివేయాలి.
స్థూల జాతీయోత్పత్తిని ఈ క్రింది విధముగా చెప్పవచ్చు.
GNP లేదా GNI = C + I + G + (X – M)

2. స్థూల దేశీయోత్పత్తి :
ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల ద్రవ్యరూపం మొత్తాన్ని స్థూల దేశీయోత్పత్తి అంటారు. స్థూల జాతీయోత్పత్తిలో వినియోగము, స్థూల దేశీయ పెట్టుబడి, ప్రభుత్వ వ్యయము, నికర విదేశీ ఆదాయం’ కలిసి ఉంటాయి.

స్థూల దేశీయోత్పత్తిలో వినియోగం, స్థూల దేశీయ పెట్టుబడి, ప్రభుత్వ వ్యయం మాత్రమే ఉంటాయి.
స్థూల దేశీయోత్పత్తి లేదా GDP = C + I + G.

3. నికర జాతీయోత్పత్తి – నికర దేశీయోత్పత్తి :
వస్తూత్పత్తిలో ఉత్పత్తి సంస్థలు, యంత్రాలు, భవనాలు, యంత్ర పరికరాలను ఇతర సామాగ్రిని వినియోగిస్తాయి. వీటిని అవిచ్ఛిన్నంగా ఉపయోగించడం వలన అవి తరుగుదలకు లోనవుతాయి. దీనినే మూలధనం తరుగుదల అంటారు.

ఈ తరుగుదలను స్థూల జాతీయోత్పత్తి లేదా స్థూల దేశీయోత్పత్తి నుండి తీసివేస్తే వచ్చేదే నికర జాతీయోత్పత్తి లేదా నికర దేశీయోత్పత్తి. నికర జాతీయోత్పత్తినే మార్కెట్ ధరలలో జాతీయాదాయం అని కూడా అంటారు. నికర జాతీయాదాయాన్ని అర్థశాస్త్ర పరిభాషలో ‘జాతీయాదాయం’ అంటారు.

నికర జాతీయోత్పత్తి స్థూల జాతీయోత్పత్తి – మూలధనం పెరుగుదల
NNP = GNP – Depreciation

నికర దేశీయోత్పత్తి = స్థూలదేశీయోత్పత్తి – మూలధనం తరుగుదల
NDP = GDP – Depreciation

నికర జాతీయాదాయాన్ని మదింపు చేయటంలో ఈ క్రింది అంశాలను దృష్టిలో ఉంచుకొనవలెను.

a) అంతర్జాతీయ వ్యాపారం వలన సంభవించే లాభనష్టాలను పరిగణనలోకి తీసుకోవాలి.
b) ప్రభుత్వ సంస్థలో ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవలను స్థూల, నికర జాతీయోత్పత్తులలోను, స్థూల, నికర దేశీయోత్పత్తులలోను భాగంగా పరిగణించాలి. సిబ్బందికి ప్రభుత్వం చేసే వ్యయం కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

4. వ్యష్టి ఆదాయం :
ఒక సంవత్సర కాలంలో దేశంలోని వివిధ వ్యక్తులకు, సంస్థలకు లభించే ఆదాయం. మొత్తము వ్యష్టి ఆదాయము. వ్యష్టి ఆదాయం, నికర జాతీయోత్పత్తి సమానం కాదు. సంస్థలు తమ లాభంలో కొంత భాగాన్ని ఆదాయ పన్నుగా ప్రభుత్వానికి చెల్లిస్తాయి.

కొంత భాగాన్ని పంపిణీ కాని లాభాల రూపంలో “రిజర్వ్ డ్ ఫండ్”గా ఉంచుతారు. మిగిలిన భాగాన్ని డివిడెండ్గా వాటాదార్లకు పంపిణీ చేస్తారు. డివిడెండ్లు మాత్రమే వ్యక్తిగత ఆదాయంలో చేరతాయి. కనుక సాంఘిక భద్రతా విరాళాలు, కార్పొరేట్ పన్నులు, పంపిణీ కాని లాభాలు నికర జాతీయోత్పత్తి నుండి మినహాయించాలి.

కొంతమంది వ్యక్తులు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనకపోయినప్పటికి ఆదాయం లభిస్తుంది. వీటిని జాతీయాదాయంలో చేర్చరాదు. వృద్ధాప్యపు పింఛనులు సిద్యోగ భృతి, వడ్డీలు మొదలైనవాటిని బదిలీ చెల్లింపులంటారు. ఇవి వ్యక్తిగత ఆదాయంలో చేరతాయి. ఈ బదిలీ చెల్లింపులను జాతీయాదాయంలో చేర్చరాదు.

వ్యష్టి ఆదాయం = జాతీయాదాయం – పంపిణీ కాని సంస్థల లాభాలు + బదిలీ చెల్లింపులు – సాంఘిక భద్రతా విరాళాలు – కార్పొరేట్ పన్నులు

5. వ్యయార్హ ఆదాయం :
వ్యక్తుల వినియోగానికి అందుబాటులో ఉండే ఆదాయాన్ని వ్యయార్హ ఆదాయం అంటారు. వ్యక్తులకు వివిధ రూపాలలో లభించే ఆదాయాలన్నింటిని ఖర్చు చేయడానికి వీలుండదు. ప్రభుత్వానికి వ్యక్తులు ప్రత్యక్ష పన్నులను చెల్లించవలసి ఉంటుంది. కనుక వ్యష్టి ఆదాయం నుండి ప్రత్యక్ష పన్నులను తీసివేస్తే వ్యయార్హ ఆదాయం వస్తుంది. వ్యయార్హ ఆదాయంలో కొంత భాగాన్ని మిగుల్చుకుంటే దానిని పొదుపు అంటారు.

దీనిని ఈ క్రింది విధంగా చూపవచ్చును.
వ్యయార్హ ఆదాయం = వ్యష్టి ఆదాయం – వ్యష్టి పన్నులు
వ్యయార్హ ఆదాయం = వినియోగము + పొదుపు

6. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయం :
వస్తూత్పత్తి ప్రక్రియలో వినియోగించిన ఉత్పత్తి సాధనాలకు ప్రతిఫలాలను చెల్లిస్తారు. వాటి మొత్తాన్ని ఉత్పత్తి వ్యయం అంటారు. దీనినే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయం అని అంటారు. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయోత్పత్తికి, నికర జాతీయోత్పత్తికి తేడా ఉంది. నికర జాతీయోత్పత్తి మొత్తం ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ కాదు.

నికర జాతీయోత్పత్తి నుండి పన్నులను తీసివేస్తే మిగిలేదే ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ అయ్యేది. ప్రభుత్వం కొన్ని వస్తువుల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఉత్పత్తి సంస్థలకు సబ్సిడీలు ” ఇస్తుంది. అప్పుడు వస్తువుల ధరలు సబ్సిడీల మేరకు తగ్గుతాయి. కనుక సబ్సిడీలను నికర జాతీయోత్పత్తికి కలపాలి.

ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయము = నికర జాతీయోత్పత్తి + సబ్సిడీలు – పరోక్ష పన్నులు
National Income at Factor Cost = Net National Income + Subsidies – Indirect Taxes.

7. తలసరి ఆదాయం : జాతీయాదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది.
తలసరి ఆదాయం = జాతీయాదాయం / దేశ జనాభా
ఒక దేశ ప్రజల సగటు జీవన ప్రమాణాన్ని తలసరి ఆదాయం నిర్ణయిస్తుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 7 జాతీయాదాయ విశ్లేషణ

ప్రశ్న 3.
జాతీయాదాయాన్ని లెక్కించడానికి గల వివిధ పద్ధతులు ఏమిటి ? వాటిని వివరించండి.
జవాబు.
ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తు, సేవల మొత్తం విలువను జాతీయాదాయం అంటారు.
జాతీయాదాయాన్ని గణించడానికి మూడు పద్ధతులు అమలులో ఉన్నాయి. అవి :

  • ఉత్పత్తి పద్ధతి లేదా ఉత్పాదిత పద్ధతి
  • వ్యయాల పద్ధతి
  • ఆదాయాల పద్ధతి

కైరన్ క్రాస్ అభిప్రాయం ప్రకారం “జాతీయాదాయాన్ని మూడు పద్ధతులలో ఏ పద్ధతి ద్వారానైనా తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరి ఆదాయాలను కలపడం పిల్ల, ప్రతి ఒక్క ఉత్పత్తిని కలపటం వల్ల, ప్రజలు కొనుగోలు చేసే అన్ని వస్తువుల విలువలను వారి పొదుపులను కలపటం ద్వారా జాతీయాదాయాన్ని గణన చేయవచ్చు”.

1. ఉత్పత్తి మదింపు పద్ధతి:
దీనిని ఇన్వెంటరీ పద్ధతి లేదా వస్తుసేవా పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో స్థూల జాతీయోత్పత్తి గణించడానికి ఒక సంవత్సర కాలంలో వివిధ రంగాలలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తుసేవల పరిమాణాన్ని వాటి మార్కెట్ ధరలతో గుణించి వాటి విలువను నిర్ణయిస్తారు.
మార్కెట్ ధరలలో నికర దేశీయోత్పత్తి = (P1Q1 + P2Q2 + …………….. + PnQn)
P = ధర
Q = పరిమాణం
1, 2, n = వివిధ రంగాలు ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవలు

జాతీయాదాయం :
ఈ పద్ధతిలో కేవలం అంతిమ వస్తువుల విలువలను మాత్రమే లెక్కించాలి. ముడిసరుకులు, మాధ్యమిక వస్తువులు మొదలైనవాటి విలువలను లెక్కించకూడదు.
“దీనిలో మదింపు చేసిన విలువలను వివిధ రంగాలైన వ్యవసాయం, పరిశ్రమ, సేవా రంగాలకు ఆపాదిస్తారు. అందువల్ల దీన్ని మదింపు చేసిన విలువ లేదా వాల్యుయాడెడ్ పద్ధతి అని కూడా అంటారు.

2. వ్యయాల మదింపు పద్ధతి:
ఈ పద్ధతిలో ఒక సంవత్సర కాలంలో వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వం వస్తు సేవలపై చేసిన ఖర్చు మొత్తాలను, నికర ఎగుమతులు, విదేశీ నికర ఆదాయం కూడితే జాతీయాదాయం తెలుస్తుంది.

NI = EH + EF + EG + Net exports + Net income from abroad
ఇచ్చట, EH గృహరంగం చేసిన ఖర్చు
EF = సంస్థల వ్యయం
EG = ప్రభుత్వం వస్తు సేవలపై చేసిన ఖర్చు మొత్తం

జాతీయాదాయం = ప్రైవేటు అంతిమ వినియోగ వ్యయం + ప్రభుత్వం అంతిమ వినియోగ వ్యయం + నికర దేశీయ మూలధన సంచయనం + నికర వినిమయం + నికర విదేశీ ఆదాయం
కేవలం అంతిమ వస్తుసేవలపై వ్యయాన్ని మాత్రమే గణనలో చేర్చే విధంగా జాగ్రత్త వహించాలి.

3. ఆదాయ మదింపు పద్ధతి :
ఈ పద్ధతిలో దేశంలో వివిధ ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలంగా లభించే భాటకం, వేతనం, వడ్డీ, లాభం, సంస్థలకు వచ్చిన ఆదాయాన్ని కలిపితే జాతీయాదాయం తెలుస్తుంది. ఈ పద్ధతిలో స్వయం ఉపాధి వల్ల ఆర్జించే ఆదాయాలను కలపాలి. బదిలీ చెల్లింపులను కలపకూడదు. ఇదియే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయం.

జాతీయాదాయం = భాటకం + వేతనం + వడ్డీ + లాభం + నికర విదేశీ ఆదాయం

ఉద్యోగిత ఆదాయం :
– స్వయం ఉద్యోగిత ఆదాయం
+ కంపెనీల స్థూల వ్యాపార లాభాలు
+ జాతీయం చేయబడిన పరిశ్రమల స్థూల వ్యాపారం మిగుళ్ళు
+ సాధారణ ప్రభుత్వ సంస్థల స్థూల వ్యాపారం మిగుళ్ళు
+ భాటకం
+ వ్యాపారంలో ఉపయోగించని మూలధన వినియోగానికి ఆపాదించిన ఛార్జీ
= మొత్తం గృహరంగ ఆదాయం
– స్టాక్ ఆప్రిసియేషన్
+ శేషించిన పొరపాటు
= ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి
ఈ పద్ధతిలో జాతీయాదాయం గణించడానికి వివిధ ఆధారాల నుంచి వేల సంస్థలో దత్తాంశ సేకరణ అవసరం. ఆచరణలో ఆదాయానికి సంబంధించిన అన్ని వివరాలు ఖచ్చితంగా తెలియకపోవచ్చు.

TS Board Inter First Year Economics Study Material Chapter 7 జాతీయాదాయ విశ్లేషణ

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
జాతీయాదాయాన్ని నిర్ణయించే అంశాలు ఏవి ?
జవాబు.
ఒక దేశ జాతీయాదాయ పరిమాణం అనేక అంశాలలో ప్రభావితమై నిర్ణయింపబడుతుంది. జాతీయాదాయ పరిమాణాన్ని నిర్ణయించే అంశాలలో ముఖ్యమైనవి.

ఎ) సహజ వనరులు :
సహజ వనరులు, భౌగోళిక అంశాలు, సారవంతమైన నేలలు మొ||నవి అధికంగా, అనుకూలంగాను లభ్యమై దేశాలలో అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి జాతీయాదాయంను పెంచుకోవచ్చు.

బి) ఉత్పత్తి కారకాల నాణ్యత, లభ్యత :
ఒక దేశంలో అధిక శక్తి సామర్థ్యం గల శ్రామికుల లభ్యత, చొరవ, సామర్థ్యం గల సమర్థవంతమైన వ్యవస్థాపకులు, మూలధనం పెరుగుదల రేటు జాతీయాదాయ పరిమాణాన్ని నిర్ణయిస్తాయి.

సి) సాంకేతిక విజ్ఞాన ప్రగతి :
ఒక దేశ సాంకేతిక ప్రగతి ఉత్పత్తి, జాతీయాదాయమును నిర్ణయిస్తుంది. ప్రకృతి వనరులను పూర్తిగా వినియోగించుకొనుటకు ఆధునిక సాంకేతిక పద్ధతులు ఉపకరిస్తాయి.

డి) రాజకీయ నిర్ణయాలు, స్థిరత్వం :
ఆర్థికాభివృద్ధికి, జాతీయాదాయ వృద్ధిరేటు పెంపుకు రాజకీయ నిర్ణయాలు, స్థిరత్వం దోహదం చేస్తాయి. ప్రభుత్వ విధానాలు, ఎగుమతి, దిగుమతి విధానాలు, పరిశోధనలపై పెట్టుబడులు మొదలైన అంశాలు కూడా జాతీయాదాయాన్ని నిర్ణయిస్తాయి.

ప్రశ్న 2.
మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తికి మధ్య గల తేడాలను వివరించండి.
జవాబు.
జాతీయాదాయం అనే భావన అనేక రకాలుగా నిర్వచింపబడ్డది. ఒక దేశంలో నిర్ణీత కాలంలో ఉత్పత్తి చేసిన వస్తువుల, సేవల మార్కెట్ విలువ మొత్తాన్ని జాతీయాదాయం అంటారు. ఇంకొక విధంగా చెప్పాలంటే వివిధ ఆర్థిక కార్యకలాపాల ద్వారా ఒక దేశంలో సమకూరే ఆదాయమే జాతీయాదాయం.

వివిధ ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలాలైన భాటకం, వేతనాలు, వడ్డీ మరియు లాభాలు వంటివి ఇందులో కలిసి ఉంటాయి. జాతీయాదాయ నిర్వచనాలను స్థూలంగా రెండు రకాలుగా చెప్పవచ్చు. అవి:

  1. మార్షల్, పిగూ, ఫిషర్ ప్రతిపాదించిన సంప్రదాయ నిర్వచనాలు
  2. ఆధునిక నిర్వచనాలు.

1. మార్షల్ నిర్వచనం :
“ఒక దేశంలోని శ్రమ, మూలధనం సహజ వనరుల సహాయంతో ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసే భౌతిక, అభౌతిక వస్తు సేవలతో కూడుకున్న నికర వస్తు సేవల మొత్తమే ఆ దేశ వాస్తవిక నికర వార్షిక ఆదాయం”.

మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి (Gross National Product GNP):
స్థూల జాతీయోత్పత్తినే మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి అని కూడా అంటారు. ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేసిన “అంతిమ వస్తు సేవల ప్రస్తుత మార్కెట్ విలువ మొత్తాన్ని మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి అంటారు.

ఇందులోని ప్రధాన భాగాలు :

  1. వినియోగదారులు కొనుగోలు చేసిన వస్తువులు, సేవలు (C)
  2. మూలధన వస్తువులపై స్థూల దేశీయ ప్రైవేటు పెట్టుబడి (I)
  3. ప్రజోపయోగ సేవలపై ప్రభుత్వ వ్యయం (G)
  4. అంతర్జాతీయ వ్యాపారం ద్వారా ఆర్జించిన ఆదాయాలు : (ఎగుమతుల విలువ దిగుమతుల విలువ X – M)
  5. మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి C + I + G + (X – M).
    మార్కెట్ ధరలలో GNP = వినియోగం + పెట్టుబడి/ఉత్పాదక వస్తువులు + ప్రభుత్వం మొత్తం వ్యయం + (ఎగుమతుల విలువ – దిగుమతుల విలువ).
    ఈ భావనలో వస్తువులు, సేవలు ఎవరు ఉత్పత్తి చేశారనేది ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. కానీ ఎక్కడ ఉత్పత్తయినది ముఖ్యం కాదు.

ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి (GNP at Factor Cost) :
ఉత్పత్తి కారకాల ద్వారా ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తువుల ద్రవ్య విలువల మొత్తాన్ని తెలిపేది ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయం.

మార్కెట్ ధరలో స్థూల జాతీయోత్పత్తిలో వేతనాలు, భాటకం, వడ్డీ, డివిడెండ్లు, చేయబడని కార్పొరేటు లాభాలు, మిశ్రమ ఆదాయం (చిల్లర వర్తకపు లాభాలు), ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నుల తరుగుదల, విదేశీ వ్యాపార నికర మిగులు కలిసి ఉంటాయి.

అయితే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయ త్పత్తిలో పరోక్ష పన్నులు మినహా మార్కెట్ ధరల్లో స్థూల జాతీయోత్పత్తిలో గల అన్ని అంశాలు ఉంటాయి. అందువల్ల మార్కెట్ ధరల్లో స్థూల జాతీయోత్పత్తి, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయ విలువ కంటే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఉత్పత్తిదారులకు సబ్సిడీలు కల్పించినచో ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయాన్ని లెక్కించుటకు, మార్కెట్ ధరల్లో జాతీయోత్పత్తికి సబ్సిడీలను కలపాలి.

ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి = మార్కెట్ ధరలో స్థూల జాతీయోత్పత్తి – పరోక్ష పన్నులు.

TS Board Inter First Year Economics Study Material Chapter 7 జాతీయాదాయ విశ్లేషణ

ప్రశ్న 3.
మార్కెట్ ధరలలో జాతీయాదాయం, ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయాదాయం అంటే ఏమిటి ?
జవాబు.
ఈ భావనలను క్రింది విధంగా వివరించవచ్చు.
మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి (Net National Product – NNP) :
వస్తు సేవల ఉత్పత్తిలో వినియోగించబడే యంత్రాలు, యంత్రపరికరాలు కొంత కాలం తరువాత కొంత తరుగుదలకు, అరుగుదలకు గురికావచ్చు లేదా కొంత కాలం తరువాత అవి నిరుపయోగం కావచ్చు. ఈ కారణం వల్ల స్థూల జాతీయోత్పత్తి నుంచి కొంత భాగం తరుగుదల, అరుగుదలను పూరించడానికి ఉపయోగించాల్సి ఉంటుంది.

అందువల్ల స్థూల జాతీయోత్పత్తి అంతా ఆ సంవత్సర ఆదాయంగా పరిగణించడానికి వీలుండదు. అందువల్ల స్థూల జాతీయోత్పత్తి నుంచి తరుగుదలకు, అరుగుదలకు కావలసిన మొత్తాన్ని మినహాయించగా మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి వస్తుంది.

మార్కెట్ ధరల్లో నికర జాతీయోత్పత్తి = మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి – మూలధన తరుగుదల.
మూలధన తరుగుదలను ‘user cost’ అని అంటారు.

ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయం :
ఒక ఆర్థిక వ్యవస్థలో నిర్ణీత సమయంలో ఉత్పత్తి కారకాలైన భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన పొందే ద్రవ్యరూప ప్రతిఫలాలైన భాటకం, వేతనం, వడ్డీ, లాభం కలిపితే వచ్చే మొత్తాన్ని ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయోత్పత్తి లేదా జాతీయాదాయం అంటారు.

దీనినే వస్తూత్పత్తిలో సేవలు లేదా వనరులు సప్లై చేసిన వ్యక్తులు పొందే ఆదాయాలుగా పేర్కొనవచ్చు. దీనిలో ఉద్యోగులు పొందే వేతనాలు, ప్రైవేటు వ్యక్తులకు చెల్లించిన వడ్డీ, భూస్వాములు పొందిన నికర భాటకం అన్ని రకాల వ్యాపార లాభాలు ఇమిడి ఉంటాయి. నికర జాతీయోత్పత్తి మొత్తం ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ కాదు. ఎందుకంటే సంస్థలు ప్రభుత్వానికి పరోక్ష పన్నులు.

ఉదా : ఎక్సైజ్, అమ్మకం పన్ను చెల్లిస్తారు. కాని ఉత్పత్తికారకాలకు కాదు. అదేమాదిరిగా ప్రభుత్వం కొన్ని రకాల వస్తుసేవలకు సబ్సిడీ చెల్లిస్తుంది. అంటే వస్తు ఉత్పత్తికారకాలకు కాదు. అందువల్ల వాస్తవ ఉత్పత్తి వ్యయాల కంటే తక్కువ ధరకే మార్కెట్లో వస్తువులు విక్రయింపబడతాయి.

అందువల్ల సబ్సిడీల విలువను నికర జాతీయాదాయానికి కలపాలి. ఈ రోజులలో ప్రభుత్వ రంగం విస్తరించుటయే కాకుండా అనేక పరిశ్రమలను, సంస్థలను నిర్వహిస్తున్నందువల్ల అది పొందుతున్న లాభాలు ఉత్పత్తి కారకాలకు పంపిణీ కావు. అందువల్ల ప్రభుత్వ సంస్థల లాభాలను నికర జాతీయాదాయం నుంచి తీసివేయాలి.

ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి లేదా జాతీయాదాయం = మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి – పరోక్ష పన్నులు + సబ్సిడీలు – ప్రభుత్వ సంస్థల లాభాలు.

TS Board Inter First Year Economics Study Material Chapter 7 జాతీయాదాయ విశ్లేషణ

ప్రశ్న 4.
ఏవేని మూడు జాతీయాదాయ నిర్వచనాలను చర్చించండి.
జవాబు.
ఒక ఆర్థిక వ్యవస్థలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తుసేవల మొత్తం నికర విలువను జాతీయా దాయంగా భావించవచ్చు. జాతీయాదాయం ఆ దేశంలోని ప్రజల జీవన స్థితిగతులకు, ప్రజల సంక్షేమానికి మధ్య ఉండే సంబంధాన్ని వివరిస్తుంది.

1. పిగూ నిర్వచనం :
ఆచార్య పిగూ నిర్వచనం ప్రకారం ద్రవ్యంలో కొలవదగిన ఆర్థిక వ్యవస్థ యొక్క నిరపేక్ష ఆదాయాన్ని విదేశాల నుంచి లభించే నికర ఆదాయాన్ని జాతీయోత్పత్తి అనవచ్చు.

2. ఫిషర్ నిర్వచనం :
తుది వినియోగదారులు భౌతిక లేదా మానవ పరిసరాల నుంచి పొందే సేవల సముదాయమే జాతీయాదాయం.

3. మార్షల్ నిర్వచనం :
ఒక దేశంలోని శ్రమ, మూలధనం, సహజ వనరుల సహాయంతో ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసే భౌతిక, అభౌతిక వస్తుసేవలతో కూడుకున్న నికర వస్తుసేవల మొత్తమే ఆ దేశ వాస్తవిక నికర వార్షిక ఆదాయం.

ప్రశ్న 5.
తలసరి ఆదాయాన్ని ఏ విధంగా లెక్కిస్తారు ? జనాభా, తలసరి ఆదాయం మధ్య గల సంబంధం ఎలాంటిది ?
జవాబు.
ఒక నిర్దేశిత సంవత్సరంలో ఒక దేశ ప్రజల సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం తెలుపుతుంది. ప్రస్తుత సంవత్సరపు జాతీయాదాయాన్ని ప్రస్తుత సంవత్సర జనాభాచే భాగించడం ద్వారా దీనిని లెక్కిస్తాం.
2010-11 సంవత్సరానికి తలసరి ఆదాయం = 2010-11 సం॥ మార్కెట్ ధరల్లో జాతీయాదాయం / 2010-11 సంవత్సరంలో జనాభా

తలసరి ఆదాయపు భావన దేశ ప్రజల జీవన ప్రమాణాన్ని తెలుపుతుంది. కాని ఇది సగటు రూపంలో ఉండటం వల్ల దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయని గమనించాలి. వాస్తవానికి సగటు ఆదాయం కంటే ఎక్కువ లేదా తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు అధిక సంఖ్యలో ఉంటే ఇది నమ్మదగిన ఫలితాన్ని ఇవ్వదు.

తలసరి ఆదాయాన్ని ప్రస్తుత ధరలలోనే కాకుండా ఆధార సంవత్సర ధరల ద్వారా కూడా లెక్కించవచ్చు. తద్వారా నిజ తలసరి ఆదాయాన్ని తెలుసుకోవచ్చు. ఇందుకోసం దిగువ తెలిపిన సూత్రాన్ని వాడతాం.
నిజ తలసరి ఆదాయం = నిజ జాతీయాదాయం / జనాభా

ఒక దేశంలో ఒక నిర్దేశిత సంవత్సర కాలంలో (అంటే ఒక విత్త సంవత్సరంలో నిజ (జాతీయాదాయాన్ని) ఆ దేశ జనాభాతో భాగిస్తే వచ్చేదే నిజ తలసరి ఆదాయం.

తలసరి ఆదాయానికి, జనాభాకు మధ్య గల సంబంధం :
జాతీయాదాయానికి, జనాభాకు చాలా దగ్గరి సంబంధాలు ఉంటాయి. ఈ రెండు భావనల ద్వారా తలసరి ఆదాయాన్ని లెక్కిస్తారు. జాతీయాదాయంలో పెరుగుదల రేటు 6 శాతం కాగా, జనాభా వృద్ధిలోని పెరుగుదల రేటు 3% అయితే, తలసరి ఆదాయంలో పెరుగుదల రేటు 3 శాతం అవుతుంది.

దీనిని ఈ విధంగా పేర్కొనవచ్చు.
gpc = gni – gp
gpc = తలసరి ఆదాయంలో పెరుగుదల రేటు
gni = జాతీయాదాయంలో పెరుగుదల రేటు
gp = జనాభా పెరుగుదల రేటు

తలసరి ఆదాయంలో పెరుగుదల ప్రజల జీవన ప్రమాణంలో పెరుగుదలను సూచిస్తుంది. అయితే జాతీయా దాయంలోని పెరుగుదల రేటు, జనాభా పెరుగుదల రేటు కంటే ఎక్కువగా ఉన్నప్పుడే ఇది సాధ్యపడుతుంది. క్రింది పటం స్థూల ఆర్థిక చలాంకాల మధ్యగల సంబంధాన్ని వివరిస్తుంది.

TS Inter 1st Year Economics Study Material 7th Lesson జాతీయాదాయ విశ్లేషణ 1

ఇచ్చట,
NIA = నికర విదేశీ ఆదాయాలు
D = తరుగుదల
ID = పరోక్ష పన్నులు
SUB =
UP = పంపిణీ కాని లాభాలు
CT = కార్పొరేటు పన్నులు
TrH = వ్యక్తులకు లభించే బదిలీ చెల్లింపులు
PTP = ప్రత్యక్ష పన్నులు
GDP = స్థూల దేశీయోత్పత్తి
GNP = స్థూల జాతీయోత్పత్తి
NNP = నికర జాతీయోత్పత్తి
NI = జాతీయాదాయం
PI = వ్యష్టి ఆదాయం
DI = వ్యయార్హ ఆదాయం

TS Board Inter First Year Economics Study Material Chapter 7 జాతీయాదాయ విశ్లేషణ

ప్రశ్న 6.
ఏవేని రెండు జాతీయాదాయ మదింపు పద్ధతులను విశ్లేషించండి.
జవాబు.
జాతీయాదాయాన్ని గణించడానికి మూడు పద్ధతులు అమలులో ఉన్నాయి. అవి

  1. ఉత్పత్తి పద్ధతి లేదా ఉత్పాదిత పద్ధతి
  2. వ్యయాల పద్ధతి
  3. ఆదాయాల పద్ధతి

కైరన్ క్రాస్ అభిప్రాయం ప్రకారం “జాతీయాదాయాన్ని మూడు పద్ధతులలో ఏ పద్ధతి ద్వారానైనా తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరి ఆదాయాలను కలపడం ద్వారా, ప్రతి ఒక్క ఉత్పత్తిని కలపటం ద్వారా, ప్రజలు కొనుగోలు చేసే అన్ని వస్తువుల విలువలను, వారి పొదుపులను కలపటం ద్వారా జాతీయాదాయాన్ని గణన చేయవచ్చు.”

1. ఉత్పత్తి మదింపు పద్ధతి (Product Method) :
దీన్ని ఇన్వెంటరీ పద్ధతి లేదా వస్తుసేవా పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో స్థూల జాతీయోత్పత్తి గణించడానికి ఒక సంవత్సర కాలంలో వివిధ రంగాలలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తుసేవల పరిమాణాన్ని వాటి మార్కెట్ ధరలతో గుణించి వాటి విలువను నిర్ణయిస్తారు.

స్థూల జాతీయోత్పత్తి (GNP) = (P1Q1 + P2Q2 + ………….. + PnQn)

విదేశీ నికర ఆదాయం .
GNP = స్థూల జాతీయోత్పత్తి
P = ధర
Q = పరిమాణం
1, 2, ………….. n = వివిధ రంగాలు ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవలు. ఈ పద్ధతిలో ముడిసరుకులు, మాధ్యమిక వస్తువులు మొదలైనవాటి విలువలను లెక్కించకూడదు. ఒక సంవత్సరంలో ఉత్పత్తి అయిన కేవలం అంతిమ వస్తు సేవల విలువలను మాత్రమే లెక్కించాలి.

2. ఆదాయ మదింపు పద్ధతి (Income Method) :
ఈ పద్ధతిలో దేశంలో వివిధ ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలంగా లభించే భాటకం, వేతనం, వడ్డీ, లాభం, సంస్థలకు వచ్చిన ఆదాయాన్ని కలిపితే జాతీయాదాయం తెలుస్తుంది. ఈ పద్ధతిలో స్వయం ఉపాధి వల్ల ఆర్జించే ఆదాయాలను కలపాలి. బదిలీ చెల్లింపులను కలపకూడదు. ఇదియే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయం.

జాతీయాదాయం = భాటకం + వేతనం + వడ్డీ + లాభం.
ఆర్థిక వ్యవస్థలో జాతీయాదాయంలో ఉత్పత్తి కారకాల వాటాలను పంపిణీ పద్ధతి ద్వారా మనం తెలుసుకోగలుగుతాం.

3. వ్యయాల మదింపు పద్ధతి (Expenditure Method) :
ఈ పద్ధతిలో ఒక సంవత్సర కాలంలో వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వం వస్తు సేవలపై చేసిన ఖర్చు మొత్తాలను, నికర ఎగుమతులు, విదేశీ నికర ఆదాయం కూడితే జాతీయాదాయం తెలుస్తుంది.

NI = EH + EF + EG + Net exports.
ఇచ్చట, NI = జాతీయాదాయం
EH = గృహరంగం చేసిన ఖర్చు
EF = సంస్థల వ్యయం
EG = వస్తు సేవలపై ప్రభుత్వం చేసిన ఖర్చు మొత్తం.

జాతీయాదాయం = ప్రైవేటు అంతిమ వినియోగ వ్యయం + ప్రభుత్వం అంతిమ వినియోగ వ్యయం + నికర దేశీయ మూలధన సంచయనం + నికర వినిమయం + నికర విదేశీ ఆదాయం.
కాబట్టి జాతీయ వ్యయానికి జాతీయాదాయం సమానమనే ప్రమేయం ద్వారా ఈ మదింపు జరుగుతుంది. కేవలం అంతిమ వస్తుసేవలపై వ్యయాన్ని మాత్రమే గణనలో చేర్చే విధంగా జాగ్రత్త వహించాలి.

TS Board Inter First Year Economics Study Material Chapter 7 జాతీయాదాయ విశ్లేషణ

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
జాతీయాదాయం అంటే ఏమిటి ?
జవాబు.
జాతీయాదాయం అనే భావన అనేక రకాలుగా నిర్వచింపబడ్డది. ఒక దేశంలో నిర్ణీత కాలంలో ఉత్పత్తి చేసిన వస్తువుల, సేవల మార్కెట్ విలువ మొత్తాన్ని జాతీయాదాయం అంటారు. ఇంకొక విధంగా చెప్పాలంటే వివిధ ఆర్థిక కార్యకలాపాల ద్వారా ఒక దేశంలో సమకూరే ఆదాయమే జాతీయాదాయం.

వివిధ ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలాలైన భాటకం, వేతనాలు, వడ్డీ మరియు లాభాలు వంటివి ఇందులో కలిసి ఉంటాయి. జాతీయాదాయ నిర్వచనాలను స్థూలంగా రెండు రకాలుగా చెప్పవచ్చు. అవి :

  1. మార్షల్, పిగూ, ఫిషర్ ప్రతిపాదించిన సంప్రదాయ నిర్వచనాలు
  2. ఆధునిక నిర్వచనాలు.

1. మార్షల్ నిర్వచనం :
“ఒక దేశంలోని శ్రమ, మూలధనం సహజ వనరుల సహాయంతో ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసే భౌతిక, అభౌతిక వస్తు సేవలతో కూడుకున్న నికర వస్తు సేవల మొత్తమే ఆ దేశ వాస్తవిక నికర వార్షిక
ఆదాయం”.

2. పిగూ నిర్వచనం :
పిగూ నిర్వచనం ప్రకారం ‘ద్రవ్య రూపంలో కొలవడానికి వీలయ్యి విదేశాల నుంచి లభించే నికర ఆదాయంతో సహా సమాజానికి సంప్రాప్తించే ఆదాయాన్ని జాతీయాదాయం’ అంటారు.

ప్రశ్న 2.
జాతీయాదాయాన్ని నిర్ణయించే అంశాలను పేర్కొనండి.
జవాబు.
జాతీయాదాయ పరిమాణాన్ని నిర్ణయించే అంశాలు :
ఒక దేశ జాతీయాదాయ పరిమాణం అనేక అంశాలలో ప్రభావితమై నిర్ణయింపబడుతుంది. ఈ అంశాల కారణంగానే వివిధ దేశాలలో జాతీయాదాయ స్థాయి లేదా పరిమాణంలో వ్యత్యాసాలు గోచరిస్తాయి. ఒకే దేశంలో ఎప్పటికీ జాతీయాదాయ పరిమాణం ఒకే విధంగా ఉండదు. జాతీయాదాయ పరిమాణాన్ని నిర్ణయించే అంశాలలో ముఖ్యమైన వాటిని ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు.

ఎ) సహజ వనరులు : సహజ వనరులు, శీతోష్ణస్థితి, భౌగోళిక అంశాలు, సారవంతమైన నేలలు, గనులు, ఇంధన వనరులు మొదలైనవి అధికంగాను, అనుకూలంగాను లభ్యమయ్యే దేశాలలో, అన్ని రంగాలలో అధికోత్పత్తులు సాధించవచ్చు. అందువల్ల జాతీయాదాయం పెరుగుతుంది.

బి) ఉత్పత్తికారకాల నాణ్యత, లభ్యత :
ఒక దేశంలో అధిక శక్తి సామర్థ్యం గల శ్రామికుల లభ్యత, చొరవ, సాహసం, సామర్థ్యం గల సమర్థవంతమైన వ్యవస్థాపకులు, మూలధనం పెరుగుదల రేటు జాతీయాదాయ పరిమాణాన్ని నిర్ణయిస్తాయి.

సి) సాంకేతిక విజ్ఞాన ప్రగతి :
ఒక దేశంలో సాంకేతిక విజ్ఞాన ప్రగతిని అనుసరించి ఉత్పత్తి, జాతీయాదాయ పరిమాణం నిర్ణయింపబడుతుంది. ప్రకృతి వనరుల అభిలషణీయ వినియోగానికి అధునాతన ఉత్పత్తి పద్ధతులు దోహదం చేస్తాయి.

డి) రాజకీయ నిర్ణయాలు, స్థిరత్వం :
ప్రణాళికాబద్ధమైన ఆర్థికాభివృద్ధికి, జాతీయాదాయ వృద్ధిరేటు పెంపుకు రాజకీయ నిర్ణయాలు, స్థిరత్వం దోహదం చేస్తాయి. ప్రభుత్వ విధానాలు, ఎగుమతి దిగుమతి విధానాలు, మానవ
వనరుల అభివృద్ధి, పరిశోధనలపై పెట్టుబడులు మొదలైన అంశాలు కూడా జాతీయాదాయాన్ని నిర్ణయిస్తాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 7 జాతీయాదాయ విశ్లేషణ

ప్రశ్న 3.
స్థూల జాతీయోత్పత్తి (GNP) భావనను వివరించండి.
జవాబు.
ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేసిన వస్తుసేవల మొత్తం విలువను స్థూల జాతీయోత్పత్తి అంటారు. మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి
(GNP) = C + I + G + (X – M).

ప్రశ్న 4.
ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి అంటే ఏమిటి ?
జవాబు.
నికర జాతీయోత్పత్తి అంతా మొత్తం ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ కాదు. సంస్థలు ప్రభుత్వానికి పరోక్ష పన్నులు చెల్లిస్తాయి. అదే విధంగా ప్రభుత్వం కొన్ని రకాల వస్తు సేవలకు సబ్సిడీ చెల్లిస్తుంది. అందువలన వాస్తవ ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరకే మార్కెట్లో వస్తువులు విక్రయించబడతాయి.

ప్రభుత్వ సంస్థల లాభాలు నికర జాతీయాదాయం నుంచి మినహాయించాలి.
ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి = మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి – పరోక్ష పన్నులు + సబ్సిడీ.

ప్రశ్న 5.
వ్యష్టి ఆదాయం అంటే ఏమిటి ?
జవాబు.
వ్యష్టి ఆదాయం (Personal Income):
ప్రత్యక్ష పన్నుల చెల్లింపుకు పూర్వం ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఆ దేశ పౌరులు పొందే మొత్తం ఆదాయాన్ని ఇది తెలుపుతుంది. జాతీయాదాయం పూర్తిగా వీరికి లభించదు. ఈ విధమైన ఆదాయం నుంచి సంస్థలు ప్రభుత్వానికి కార్పొరేట్ పన్నును చెల్లించాలి.

అలాగే సంస్థలు అవి పొందిన లాభాల మొత్తాన్ని వాటాదారులకు పంచకుండా సంస్థల విస్తరణకు లేదా అనుకోని పరిస్థితులను ఎదుర్కొనుటకు కొంత మొత్తం పంపిణీ చేయని కార్పొరేట్ లాభాల రూపంలో ఉంచుతాయి. కాగా వేతనం పొందే ఉద్యోగస్తులు సాంఘిక భద్రత కోసం కొంత మొత్తాన్ని చెల్లిస్తారు.

ప్రభుత్వం ఏ విధమైన ఉత్పాదక సేవలనందించని వారికి సాంఘిక భద్రతను కల్పించడానికి పెన్షన్లు, నిరుద్యోగభృతి, స్కాలర్షిప్స్, ఉపశమన చెల్లింపులు, ప్రభుత్వ ఋణాలపై వడ్డీ చెల్లింపులు మొదలైనవి చెల్లిస్తుంది. వీటినే బదిలీ చెల్లింపులు (transfer payments) అంటారు.

వ్యష్టి ఆదాయం = జాతీయాదాయం (ఉత్పత్తి కారకాల వ్యయం దృష్ట్యా నికర జాతీయ ఉత్పత్తి) – పంపిణీ చేయబడని కార్పొరేటు లాభాలు – కార్పొరేట్ పన్నులు – సాంఘిక భద్రత విరాళాలు + బదిలీ చెల్లింపులు.

TS Board Inter First Year Economics Study Material Chapter 7 జాతీయాదాయ విశ్లేషణ

ప్రశ్న 6.
సబ్సిడీలు అంటే ఏమిటి ?
జవాబు.
ఉత్పత్తిదారుడు ఉత్పత్తిని ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరకు అమ్మితే నష్టం వస్తుంది. దీని సర్దుబాటుకోసం ఉత్పత్తిదారులకు ప్రభుత్వం ఇచ్చే నిధులను సబ్సిడీలు అంటారు.

ప్రశ్న 7.
వాస్తవిక తలసరి ఆదాయం అంటే ఏమిటి ?
జవాబు.
తలసరి ఆదాయాన్ని స్థిరమైన ధరలలో కూడా లెక్కించి తద్వారా నిజ తలసరి ఆదాయాన్ని తెలుసుకోవచ్చు. ఒక ప్రత్యేక సంవత్సర నిజ జాతీయాదాయాన్ని ఆ సంవత్సరపు జనాభాచే భాగించుట వల్ల ఆ సంవత్సర నిజ తలసరి ఆదాయాన్ని తెలుసుకొనుట.
నిజ తలసరి ఆదాయం = నిజ జాతీయాదాయం / జనాభా.

ప్రశ్న 8.
జాతీయాదాయం నందలి భాగాలను తెలపండి.
జవాబు.
జాతీయాదాయం అనగా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయ్యే వస్తు సేవల నికర విలువను జాతీయాదాయం అంటారు.

జాతీయాదాయం-భాగాలు : జాతీయాదాయంలో 5 ప్రధాన భాగాలున్నాయి. అవి :
ఎ) వినియోగం – C
బి) స్థూల దేశీయ పెట్టుబడి – I
సి) ప్రభుత్వ వ్యయం – G
డి) నికర విదేశీ పెట్టుబడి – (X – M)
ఇ) నికర విదేశీ ఆదాయం.

TS Board Inter First Year Economics Study Material Chapter 7 జాతీయాదాయ విశ్లేషణ

ప్రశ్న 9.
జాతీయాదాయ గణనలో ఆదాయ మదింపు పద్ధతి అంటే ఏమిటి ?
జవాబు.
ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొన్న వివిధ ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలంగా లభించే భాటకం, వేతనం, వడ్డీ, లాభం, సంస్థలకు వచ్చిన ఆదాయాన్ని కలిపితే జాతీయాదాయం తెలుస్తుంది. ఈ పద్దతిలో కారకాల స్వయం ఉపాధి వలన వచ్చే ఆదాయాలను కలపాలి. అలాగే బదిలీ చెల్లింపులను జాతీయాదాయానికి కలుపకూడదు.
జాతీయాదాయం = భాటకం + వేతనం + వడ్డీ + లాభం.

ప్రశ్న 10.
భారతదేశంలో జాతీయాదాయ అంచనాను ఏవిధంగా చేస్తారు ?
జవాబు.
స్వాతంత్ర్యానంతరం 1949వ సంవత్సరంలో జాతీయాదాయ అంచనాల కమిటీని నియమించింది. ప్రస్తుతం జాతీయాదాయాన్ని లెక్కించే బాధ్యత CSO చూస్తుంది. భారతదేశంలో జాతీయాదాయం ఆదాయ మదింపు పద్ధతి, ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా లెక్కించబడుతుంది.

కేంద్ర గణాంక సంస్థ భారత ఆర్థిక వ్యవస్థను 13 రంగాలుగా వాటిని తిరిగి 5 విభాగాలుగా పరిగణిస్తుంది. అవి ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, రవాణా సమాచారం, విత్తం, రియల్ ఎస్టేట్, సామాజిక వ్యష్టి సేవలు.

ప్రశ్న 11.
తలసరి ఆదాయం (Per Capita Income) మరియు జాతీయాదాయాలను విభేదించండి.
జవాబు.
ఒక నిర్దేశిత సంవత్సరంలో ఒక దేశ ప్రజల సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం తెలుపుతుంది. ప్రస్తుత సంవత్సరపు జాతీయాదాయాన్ని ప్రస్తుత సంవత్సర జనాభాచే భాగించడం ద్వారా దీనిని లెక్కిస్తాం.

2017 – 18 సంవత్సరానికి తలసరి ఆదాయం = 2017 – 2018 సం||లో ప్రస్తుత ధరల్లో జాతీయాదాయం / 2017 – 18 సంవత్సరంలో జనాభా.

ఇది ప్రస్తుత ధరలలో తలసరి ఆదాయాన్ని కొలవడాన్ని సూచిస్తుంది. ఈ భావన ఒక దేశ ప్రజల సగటు ఆదాయం మరియు వారి జీవన ప్రమాణాన్ని వివరించే ఒక మంచి సూచిక. కాని ఇది విశ్వసించదగినది కాదు. ఎందుకంటే, సగటు ఆదాయంతో పోల్చినపుడు వాస్తవ ఆదాయం సగటు కంటే అధికంగానో లేదా తక్కువగానో ఉండవచ్చు.

తలసరి ఆదాయాన్ని స్థిరమైన ధరలలో కూడా లెక్కించి తద్వారా నిజ తలసరి ఆదాయాన్ని తెలుసుకోవచ్చు. ఒక ప్రత్యేక సంవత్సర నిజ జాతీయాదాయాన్ని ఆ సంవత్సరపు జనాభాచే భాగించుట వల్ల ఆ సంవత్సర నిజ తలసరి ఆదాయాన్ని తెలుసుకోగలం. ఒక దేశ జాతీయాదాయ పరిమాణం అనేక అంశాలలో ప్రభావితమై నిర్ణయింపబడుతుంది. జాతీయాదాయ పరిమాణాన్ని నిర్ణయించే అంశాలలో ముఖ్యమైనవి.

TS Board Inter First Year Economics Study Material Chapter 7 జాతీయాదాయ విశ్లేషణ

ప్రశ్న 12.
బదిలీ చెల్లింపులు అంటే ఏమిటి ? ఉదాహరణలిమ్ము.
జవాబు.
కొందరు వ్యక్తులు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనకపోయినా ఆదాయంలో కొంత భాగాన్ని చెల్లించవలసి ఉంటుంది. అవి పెన్షన్లు, నిరుద్యోగభృతి, ప్రభుత్వ బాండ్లపై వడ్డీ మొదలగునవి. వీటిని బదిలీ చెల్లింపులు అంటారు.

ప్రశ్న 13.
జాతీయాదాయ అంచనాల ప్రాముఖ్యత ఏమిటి ?
జవాబు.
స్వాతంత్య్రానంతరం 1949వ సంవత్సరంలో జాతీయాదాయ అంచనాల కమిటీని నియమించింది. ప్రస్తుతం జాతీయాదాయాన్ని లెక్కించే బాధ్యత CSO చూస్తుంది. భారతదేశంలో జాతీయాదాయం ఆదాయ మదింపు పద్ధతి, ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా లెక్కించబడుతుంది.

కేంద్ర గణాంక సంస్థ భారత ఆర్థిక వ్యవస్థను 13 రంగాలుగా వాటిని తిరిగి 5 విభాగాలుగా పరిగణిస్తుంది. అవి ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, రవాణా సమాచారం, విత్తం, రియల్ ఎస్టేట్, సామాజిక వ్యష్టి సేవలు.

ప్రశ్న 14.
సి.ఎస్.ఓ (C.S.O)ను విస్తరించండి. దాని బాధ్యత ఏమిటి ?
జవాబు.
స్వాతంత్ర్యానంతరం భారత ప్రభుత్వం 1949 సంవత్సరంలో P.C. మహలనోబిస్, గాద్గిల్, వి.కె.ఆర్. రావులతో జాతీయాదాయ అంచనాల కమిటీని నియమించింది. భారతదేశంలో జాతీయాదాయాన్ని మదింపు చేయడం దీని లక్ష్యం. ప్రస్తుతం కేంద్ర గణాంక సంస్థకు (CSO) జాతీయాదాయాన్ని లెక్కించే బాధ్యతను అప్పగించారు.

భారతదేశంలో జాతీయాదాయం రెండు పద్ధతులలో లెక్కింపబడుతుంది. అవి :

  • ఆదాయ మదింపు పద్ధతి
  • ఉత్పత్తి మదింపు పద్ధతి.

కేంద్ర గణాంక సంస్థ భారత ఆర్థిక వ్యవస్థను 13 రకాలుగా విభజించి, వాటిని తిరిగి 5 విభాగాలుగా పరిగణిస్తుంది. అవి :

  1. ప్రాథమిక రంగం : వ్యవసాయం, అడవులు, లాగింగ్, (Logging) చేపలు పట్టడం, గనుల తవ్వకం.
  2. ద్వితీయ రంగం : తయారీ సంస్థలు (రిజిస్టరయినవి, రిజిస్టరు కానివి), నిర్మాణం, విద్యుచ్ఛక్తి, గ్యాస్, నీటి సరఫరా.
  3. రవాణా, సమాచారం, వ్యాపారం : రైల్వేలు, ఇతర పద్ధతుల ద్వారా రవాణా, నిలవ (storage), కమ్యూనికేషన్స్, వ్యాపారం, హోటళ్ళు, రెస్టారెంట్లు.
  4. విత్తం, రియల్ ఎస్టేట్: బాంకింగ్, బీమా, రియల్ ఎస్టేట్, నివాస స్థలాల ఆధిపత్యం, వ్యాపార సేవాలు.
  5. సామాజిక, వ్యష్టి సేవలు : రక్షణ, ప్రభుత్వ పరిపాలన, ఇతర సేవలు.

TS Board Inter First Year Economics Study Material Chapter 7 జాతీయాదాయ విశ్లేషణ

ప్రశ్న 15.
తరుగుదల అంటే ఏమిటి ?
జవాబు.
యంత్రాలు నిరంతరం ఉపయోగించినప్పుడు అవి అరిగిపోయే అవకాశం ఉంది. వాటికయ్యే మరమ్మత్తు ఖర్చును తరుగుదల అంటారు.

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 1 గొల్ల రామవ్వ

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 1st Lesson గొల్ల రామవ్వ Textbook Questions and Answers.

TS Inter 1st Year Non-Detailed 1st Lesson గొల్ల రామవ్వ

ప్రశ్నలు- సమాధానాలు

ప్రశ్న 1.
‘గొల్లరామవ్య’ కథ ఇతివృత్తాన్ని పరిచయం చేయండి.
జవాబు:
‘గొల్లరామయ్య కథ’ దక్షిణ భారతదేశం నుండి తొలిసారి భారత ప్రధాని అయిన పాముల పర్తి వేంకటనరసింహారావుచే రచించబడింది. శ్రీమతి సురభి వాణీదేవి, చీకోలు సుందరయ్య సంపాదకత్వంలో వెలువడిన ‘గొల్లరామవ్వ – మరికొన్ని రచనలు’ సంపుటి నుండి గ్రహించబడింది.

నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా విముక్తి పోరాటంలో చిత్రించబడిన అద్భుతఘట్టం గొల్లరామవ్య కథ. పోలీసులకు, రజాకార్లకు వ్యతిరేకంగా ప్రజాశ్రేయస్సు కోసం విజృంభించిన ఒక సాహస విప్లవ కారుని ఒక సామాన్య వృద్ధురాలు రక్షించిన అపూర్వఘటం, ఇందులోని ఇతివృత్తం. తెలంగాణా పోరాట చరిత్రలో ఈ కథ ఒక సృజనాత్మక డాక్యుమెంట్.

అదో తెలంగాణ పల్లె, గొల్ల రామవ్వ తన గుడిసెలో చీకటిలోనే కూర్చుని ఉంది. ఆమె వడిలో పదిహేనేండ్ల బాలిక. ఆ గ్రామంలో అప్పుడు అయిన పెద్ద శబ్దాలకు గ్రామంలోకి వారితోపాటు వీరిద్దరి మొహాల్లో భయం తాలూకా ప్రకంపనలు కన్పిస్తున్నాయి.

“అవ్వా! గిప్పుడిదేం చప్పుడే! అని ఆ బాలిక ప్రశ్నించింది” “నీకెందుకే మొద్దముండా… అన్నీ నీకే కావాలె” అని నోరు మూయిచింది గొల్లరామవ్వ. హఠాత్తుగా కిటికీని ఎవరో తట్టినట్లుంది రజకార్లో, పోలీసులో అని భయపడింది గొల్లరామవ్వ. ఆమెకు మిన్ను విరిగి మీద పడ్డట్లయింది. అగంతకు డొకడు ఆ ఇంటి కిటికీ ద్వారా ఇంట్లోకి వచ్చాడు. సందేహం లేదు. రజాకార్లో, తురకోడో, పోలీసోడు అయి ఉండాడు. తనకు చావు తప్పదు. తను అల్లారు ముద్దుగా పెంచి పెళ్ళి చేసిన తన మనవరాలికి మానభంగం తప్పదు అని తల్లడిల్లిపోయింది.

అంతలో ఆగంతకుడు నేను దొంగను కాను, రజాకారును కాను పోలీసునూ కాను నేను మీలానే ఒక తెలుగోడిని. ఇది రివల్వార్ మిమ్మల్ని చంపేవాళ్ళను చంపేందుకది. ఈ రాత్రి ఇద్దరు పోలీసుల్ని చంపాను. మొన్న మీ గ్రామంలో నలుగురు అమాయకులను చంపిన పోలీసు లే, లే, ‘నేను స్టేట్ కాంగ్రెస్ వాలంటీర్ ‘ను నైజాం రాజుతోటి కాంగ్రెస్ పోరాడుతుంది.

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 1 గొల్ల రామవ్వ

తెల్లవారుతుండగా పోలీసులు గ్రామంలోకి ప్రతి ఇల్లును సోదాచేస్తున్నారు. గొల్ల రామవ్వ ఇంటికి కూడా వచ్చారు. ఆమె భయపడిపోయింది. కాంగ్రెస్ వాలంటీర్ అయిన ఆ యువకుని ఎలాగైనా రక్షించాలనుకుంది. తన మనవరాలిని గొంగళితో ఆయువకుని కప్పి ఉంచమన్నది. వారిద్దరిని ఒకే మంచంపై పడుకోమని ఆజ్ఞాపించింది. అతనికి గొల్లవేషం వేయించింది. ఇంటిలోపలికి ప్రవేశించిన పోలీసులతో ఆ పిల్లలిద్దరూ నా మనవరాలు ఆమె పెనిమిటి అని బొంకింది. పోలీసోడు గొల్లరామవ్వను వాడు ఎవడన్నావ్. కాంగ్రెసోడా ఏం అని ప్రశ్నించిన రామవ్వ కంగారు పడలేదు.

పోలీసులు వెళ్ళిపోయారు. రామవ్వ మంచం మీద కూర్చొంది. ఒక వైపు యువకుడు, మరోవైపు ఆమె మనవరాలు వారిది అపూర్వ సమ్మేళనం అన్పించింది ఆ యువకునికి “అవ్వా! నీవు సామాన్యురాలివి కావు. ‘సాక్షాత్ భరతమాతవే’ అన్నాడు. ఇలా ఒక విప్లవ కారుని సామాన్య వృద్ధురాలు రక్షించిన కథే గొల్ల రామవ్వ కథ.

ప్రశ్న 2.
గొల్ల రామవ్వ ఉద్యమకారుని ఏ విధంగా రక్షించింది?
జవాబు:
‘గొల్ల రామవ్వ’ అను పాఠ్యభాగం మాజీ భారతదేశ ప్రధాని కీ॥శే॥ పాములపర్తి వేంకట నరసింహారావుచే రచించబడింది. శ్రీమతి సురభివాణీదేవి, చీకోలు సుందరయ్య సంపాదకత్వంలో వెలువడిన “గొల్ల రామవ్వ మరి కొన్ని రచనలు” కథా సంపుటి నుండి గ్రహించబడింది.

నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా విముక్తిపోరాటకాలం నాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించిన కథ ఇది. నిజాం పోలీసులకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఒక స్టేట్ కాంగ్రెస్ ‘వాలంటీరును, విప్లవ కారుడిని ఒక సామాన్య వృద్ధురాలు రక్షించిన అపూర్వ ఇతివృత్తం గొల్లరామవ్వకథ. తెలంగాణపోరాట చరిత్రలో ఈ కథ ఒక సృజనాత్మక డాక్యుమెంట్

తెలంగాణలో అదో పల్లె. ఆ పల్లెలోకి ఉద్యమకారులు ప్రవేశించి రజాకార్లను, పోలీసులకు, నవాబులకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యం చేస్తున్నారని నిజాం ప్రభుత్వవాదన. ఆ రోజు ఇద్దరు పోలీసుల్ని చంపినట్లు సమాచారం. అర్ధరాత్రి ప్రశాంత వాతావరణాన్ని చిన్నాభిన్నం చేస్తూ బాంబులమోత.

గొల్లరామవ్వ తన గుడిసెలో చీకటిలోనే కూర్చొని ఉంది. ఆమె వడిలో భయం భయంగా పదిహేనేండ్ల బాలిక తలదాచుకుని ఉంది.

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 1 గొల్ల రామవ్వ

“అవ్వా గిప్పుడిదేం చప్పుడే” అని ప్రశ్నించింది మనమరాలు. “నీకెందుకే మొద్దుముండ, గదేంది గిదేంది – ఎప్పటికి అడుగుడే” అని కసిరింది. ఇంతలో ఇంటికిటికీ చప్పుడు ఆ కిటికీ గుండా ఓ అగంతకుడి ప్రవేశం. అతడు అవ్వ దగ్గరకు వచ్చి “చప్పుడు చేయకు” నేను దొంగను కాను, రజాకార్ను కాను, పోలీసును కాను, మిమ్మల్ని ఏమీ అనను. లొల్లి చేయకండి” అన్నాడు. నేను స్టేట్ కాంగ్రెస్ వాలంటీరును వారి నుండి మిమ్మల్ని రక్షించేవాడిని అన్నాడు. అతని శారీరక పరిస్థితిని తెలుసుకున్న అవ్వ మనఃస్థితిలో కాయకల్పమైంది. భావ పరివర్తన కలిగింది. “ఇదేం గతిరానీకు? గిట్లెందుకైనవు కొడకా? అని ప్రశ్నించింది.

“రాజోలిగెఉన్నవు కొడకా! నీ కెందుకు కొచ్చెరా ఈ కట్టం. పండు పండు గొంగల్ల పండు, బీరిపోతవేందిరా! పండు” అని అతన్ని ఓదార్చి సపర్యలు చేసింది. “కొడకా కొద్దిగ గింత గటుక చిక్కటి సల్లలు పిసుక్కచ్చిన గింత కడుపుల పడేసుకో” అంది. యువకుడు లేచాడు. అవ్వ ఇచ్చినది ప్రసాదంగా తీసుకున్నాడు.

పాలు పిండేవేళయింది. యువకుడు నిద్రపోతునే ఉన్నాడు. ఇంతలో “చస్తి సస్తి నీబాంచెన్… నాకెరుక లేదు, అయ్యో వావ్వో! వాయ్యో అన్న అరుపులు మిన్ను ముట్టే ఆక్రోశాలు” యువకుడు లేచాడు రివాల్వరు తోటాలతో నింపుకుని బయలుదేరాడు. వెనుక నుండి అతని భుజం మీద మరొక చేయబడ్డది”. యాడికి? అన్న ప్రశ్న. ముసల్వ మరేం మాట్లాడలేను. అతన్ని చెయ్యపట్టి వెనక్కి లాంగింది.

యువకునికి మనవరాలి చేత దుప్పటి కండువాను ఇప్పించింది. అతడిచే “గొల్లేశమేయిచింది. ఎవడన్నా మాట్లాడితే గొల్లునోలె మాట్లాడాలె” అన్నది. ఈ లోపు పోలీసులు అవ్వ ఇంటికి రానేవస్తిరి. ఇంకేముంది గొల్ల వేసమంతా వ్యర్థమైనట్లే అనుకున్నాడు యువకుడు. అవ్వ మనవరాలితో “మల్లీ! ఆ మూలకు మంచం వాల్చి గొంగడయ్యె! పిల్లగా ఆండ్ల పండుకో. ఈ పండుకో” అంది. “పొల్లా పోరని మంచానికి నాగడంచే అడ్డం పెట్టు” “మల్లీ మాట్లాడక ఆ పోరని పక్కల పండు ఊనడూ అంది”. “చెయ్యసి పండుకో పోండా దానిమీద! చూసెటోని కనువాదం రావద్దు” అంది.

అంతలోనే ఇట్లకొచ్చిన పోలీసోళ్ళు ఆ యువకుని చూసి “వాడు యెవడన్నావ్ చెప్పు! కాంగ్రెసోడా యేం” అని అవ్వను గద్దించాడు వాడెవ్వడా! ఎవ్వడు పడితేవాడు మా పక్కలల్ల పండుటానికి మేమేం బోగమోల్ల మనుకున్నావా? నిన్నెవడన్నా గట్లనే అడుగుతే ఎట్లంటది అని బొంకింది. అవ్వ మంచంమీద కూర్చుంది. ఒక వైపు యువకుడు మరో వైపు మల్లి. అపూర్వ సమ్మేళనం. అవ్వా నీవు సామాన్యరాలువుకావు. సాక్షాత్తు భారతమాతవే” అన్నాడు.

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 1 గొల్ల రామవ్వ

ప్రశ్న 3.
గొల్ల రామవ్వ సంభాషల్లోని ఔన్నత్యాన్ని విశ్లేషించండి?
జవాబు:
గొల్లరామవ్వ అను పాఠ్యభాగం మాజీ భారతదేశ ప్రధాని కీ॥శే॥ పాములపర్తి వేంకటనరసింహారావుచే రచించబడినది. శ్రీమతి సురభి వాణీదేవి, చీకోలు సుందరయ్య సంపాదనకత్వంలో వెలువడిన. “గొల్ల రామవ్వ మరికొన్ని రచనలు” కథా సంపుటి నుండి గ్రహించబడింది.

నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా విముక్తి పోరాట కాలం నాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించిన కథ ఇది. పోలీసులకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఒక స్టేట్ కాంగ్రెస్, ‘వాలంటీరును, విప్లవకారుని ఒక సామాన్య వృద్ధురాలు రక్షించిన అపూర్వ ఇతి వృత్తం. ‘గొల్ల రామవ్వకథ. తెలంగాణ పోరాట చరిత్రలో ఈ కథ ఒక సృజనాత్మక డాక్యుమెంట్.

అదో తెలంగాణ పల్లె. అందులో గొల్ల రామవ్వ తన పదియేనేండ్ల, మనవరాలితో కలిసి ఉంటుంది. ఆమె ప్రతి సంభాషణ ఉన్నత విలువలను గలినదే! అర్ధరాత్రి తనింటికి దొంగలా ప్రవేశించిన యువకుని రజోకారో పోలీసోడో అని భావించింది.

“నేను పోలీసోన్ని కాను రజోకార్నుకాను” అన్నమాటలో నమ్మలేక “అబ్బా ఎంతకైనా తగుతారీ రాక్షసులు! ఔను ముందుగా తీయని మాటలు అవి సాగకపోతే అన్యోపాయాలు – అదే కదా క్రమం అయింది. ఆ వ్యక్తి రెండు కాళ్ళు పట్టుకుని “బాంచెన్! చెప్పులు మోత్తా నా తలకాయైనా తీసుకో, పోర్ని మాత్రం ముట్టకు, అది నీకు చెల్లెలనుకో, నీ కాల్లు మొక్కుత! అంటుంది.

యువకుడు విప్లవకారుడని తెలుసుకుని ఉపచారాలు చేస్తుంది. ఆమె మనస్థితి కాయకల్పమైంది. “ఇదేం గతిరానీకు! గిట్లెందుకైనవు కొడకా! అంది. వెళ్ళిపోతానన్న యువకుని “ఆ మాపోతా! మా పోతా… ఒక్కటే పోకడ! చక్కంగ స్వర్గమే పోతా! హు పోతడండ యాడికో” అని నిలువరించింది.

రాజోలిగే ఉన్నవు కొడకా! నీవెందుకొచ్చెరా ఈకట్టం? పండుపండు గొంగల్లపండు” అని అతనిపై గాఢనిద్రలోని వెళ్ళేట్లు ఓదార్చింది. మనవరాలిని పిలిచి దీపం వెలిగించి ఆ యువకుని శరీరంపై గుచ్చుకున్న ముళ్ళను తీసేయమని చెప్పింది. “మా చేత్తవులే సంసారం! ఇక కూకోవాని పక్క, ముండ్లు తీసెయి ఉల్లుల్లుగ అయ్యో సిగ్గయితాందా వాని ముట్టుకుంటే, ఏం మానవతివి గదవే! నీ సిగ్గు అగ్గిలబడ! వాని పానం దీత్తవా యేం సిగ్గు సిగ్గను కుంట! ఊ చెయ్యి చెప్పినపని. పాపం పీనుగోలె పడున్నడు గాదె! వాని జూత్తే జాలి పుడుతలేదె నీకు! ఆ! గట్ల! నొప్పించకు పాపం” అమ్మ సంభాషన తీరిది.

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 1 గొల్ల రామవ్వ

యువకుని లేసి “ఇగ లే కొడకా కొద్దిగ గింత గటుక చిక్కటి సల్లల పిసుక్కచ్చిన …. గింత కడుపుల పడేసుకో! ఎన్నడన్న తాగినావు తాతా గట్క? వరి బువ్వ తినెటోనికి నీకే మెరుక? గొల్లరామి గల్కుంటే ఏమనుకున్నా? పోయేపానం మర్లుతది. చూడు మరి కులం జెడిపోతవని భయపడుతున్నావా? నువ్వు యేకులమోడవైనా సరే – మొదలు పానం దక్కిచ్చుకో…. తాగి పారెయ్యి గటగట” అంటుంది.

రాత్రి ఇద్దరు పోలీసోల్లను మట్టుపెట్టిన అని యువకుడు అనగానే అవ్వ “ఇద్దరా! కాని ఇంకిద్దరు మిగిలిన్రు కొడకా! సగంపనే చేసినవు” అంటుంది. పోలీసులు ఇంట్లోకి వచ్చి యువకుని వైపు చూపిస్తూ “వాడు యెవడన్నావ్ చెప్పు! కాంగ్రెసోడాయేం” అంటే “వాడెవ్వడా? ఎవ్వడు పడితే వాడు మా పక్కల పండుటానికి మేమేం బోగమోల్ల మనుకున్నవా? నిన్నెవడన్న గట్లనె అడుగితే ఎట్లుంటది! ఈ మాటల్తోటి మనం దీసుడెందుకు పానం తియ్యరా దుండి! నా బుద్దెరిగిన కాన్నుంచి నీనైతగింతచే ఇజ్జతి మాట యెవ్వల్ల నోట్నుంచి యినలే!. అంటుంది. రామవ్వ సంభాషచతురత అద్భుతమైంది అని ఈ సంభాషణ వలన తెలుస్తుంది.

గొల్ల రామవ్వ Summary in Telugu

రచయిత పరిచయం

రచయిత పేరు : పాముల పర్తి వేంకట నరసింహరావు

పుట్టిన తేదీ : జూన్ 28, 1921

పుట్టిన ఊరు : వరంగల్ జిల్లా, ‘లక్నెపల్లి’

తల్లిదండ్రులు : రుక్మాబాయమ్మ, సీతారామరావు

దత్తుడిగా : కరీంనగర్ జిల్లా, భీమదేవరపల్లి మండలం ‘వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావుకు దత్తుడిగా వెళ్ళాడు. అందుకే వంగర గ్రామవాసి అయ్యాడు.

చదువు : ఉస్మానియాలో బి.ఎస్.సి నాగపూర్లో న్యాయశాస్త్రంలో స్వర్ణపతకం

పదవులు : కేంద్రరాష్ట్ర స్థాయిలో మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, భారతదేశ ప్రధానిగా పనిచేశాడు.

భాషాపాండిత్యం : తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, ఫ్రెంచ్, స్పానిష్, అరబిక్, పార్సీ, హిందీ, సంస్కృతం, తమిళం, కన్నడం, మరాఠీ భాషలలో పండితుడు

పత్రికలు : ‘కాకతీయ’ పత్రికను నడిపారు.

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 1 గొల్ల రామవ్వ

రచనలు :

  1. ప్రేమ – ప్రణయం – ఖండకావ్యం
  2. గొల్లరామయ్య, మంగయ్య అదృష్టం కథా సంపుటాలు
  3. ‘ఇన్సైడర్’ ఆత్మకథ నవల ‘లోపలిమనిషి’ తెలుగులో అనువదింపబడింది.
  4. విశ్వనాథ వారి వేయిపడగలు ‘సవాస్రఫణ్’గా హిందీలోకి అనువదించారు.
  5. మరాఠీలో ‘ఆస్తీ’ నవలను ‘అబలాజీవితం’ పేరుతో తెలుగులోకి అనువదించారు.
  6. దేశవిభజన సమయంలో ‘బ్లూ సిల్క్ శారీ’ అనే ఆంగ్లకథను తెలుగులోకి అనువాదం చేశారు.
  7. హిందీ ఇంగ్లీషు తెలుగు భాషలలో విలువైన సాహిత్య వ్యాసాలను పీఠికలను అందించారు.

పురస్కారాలు : శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది.
ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కార కమిటీలో అధ్యక్షలుగా నియమించబడ్డారు.

TS Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

Telangana TSBIE TS Inter 1st Year Economics Study Material 6th Lesson పంపిణీ సిద్ధాంతాలు Textbook Questions and Answers.

TS Inter 1st Year Economics Study Material 6th Lesson పంపిణీ సిద్ధాంతాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతాన్ని విమర్శనాత్మకంగా వివరించండి.
జవాబు.
ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలాలు ఏ విధంగా నిర్ణయించబడతాయో ఉపాంత ఉత్పాదకతా సిద్ధాంతం తెలియజేయును.

ఒక ఉత్పత్తి కారకం అదనపు యూనిట్ ఉత్పత్తిలో పాల్గొన్నప్పుడు మొత్తం ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను కారకం యొక్క ఉపాంత ఉత్పాదకత అంటారు. దీనిని అనుసరించి ఉత్పత్తిదారుడు కారకానికి ఇచ్చే ప్రతిఫలాన్ని నిర్ణయిస్తాడు. డేవిడ్ రికార్డో ఈ సిద్ధాంతాన్ని భూమికి మాత్రమే అన్వయించాడు. జె.బి. క్లార్క్ ఈ సిద్ధాంతానికి ఒక రూపాన్ని కల్పించి దానిని అభివృద్ధిపరిచారు. ఉపాంత ఉత్పాదకతను వస్తురూపంలో గాని, ద్రవ్యరూపంలో గాని లెక్కించవచ్చు.

ఒక కారకం యొక్క ఉపాంత ఉత్పాదకతను ఈ క్రింది విధంగా వివరించవచ్చు.
ఉదా : నలుగురు టైలర్లు రోజుకు పది చొక్కాలు కుట్టగలరని అనుకుందాం. అదే ఐదుగురు టైలర్లు 13 చొక్కాలు కుట్టగలరు. 5వ టైలర్ ఉపాంత భౌతిక ఉత్పత్తి మూడు చొక్కాలు. ఒక్క చొక్కా కుట్టినందుకు వేతనం 100/- అనుకుంటే 5వ శ్రామికునికి 3 చొక్కాలు కుట్టినందుకు 300/- వేతనం ఇవ్వవలసి వస్తుంది. ఈ కౌ 300/-ను ఉపాంత ఉత్పత్తి రాబడి అంటారు.

ఉపాంత భౌతిక ఉత్పత్తి సిద్ధాంతం సంపూర్ణ పోటీ మార్కెట్ ప్రమేయంపై ఆధారపడటం వల్ల ఒక ఉత్పత్తి కారకం సగటు వ్యయం దాని ఉపాంత వ్యయంకు సమానంగా ఉంటుంది. ఉత్పత్తి మొదటి దశలో శ్రామికుల సంఖ్య పెంచుతూపోతే తరహాననుసరించి పెరుగుతున్న ప్రతిఫలాల వల్ల అదనపు ఉత్పత్తి రాబడి పెరుగుతుంది.

తరువాత ఇంకా శ్రామికులను పెంచితే క్షీణ ప్రతిఫలాలు వస్తాయి. అందువల్ల ఉపాంత ఉత్పత్తి రాబడి, సగటు ఉత్పత్తి రాబడి ఒక స్థాయి వరకు పెరిగి క్షీణిస్తాయి. దీనిని ఈ క్రింది రేఖాపటం ద్వారా వివరించవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 6th Lesson పంపిణీ సిద్ధాంతాలు 1

పై రేఖాపటంలో ‘E’ బిందువు వద్ద ఉపాంత కారక వ్యయం (MFC), ఉపాంత కారక రాబడి (MRP) సమానంగా ఉండి సంస్థ సమతౌల్యంలో ఉంటుంది. AFC, ARP ఇక్కడ సమానంగా ఉండటం వల్ల సాధారణ లాభాలు పొందుతుంది. శ్రామికులను OL యూనిట్లకు తగ్గిస్తే ‘E’ బిందువు వద్ద MFC, MRP సమానమైనాయి. ఈ బిందువు వద్ద ARP కంటే AFC తక్కువగా ఉండటం వల్ల లాభాలు వస్తాయి.

అందువల్ల శ్రామికులను OL వరకు పెంచవచ్చు. కాని శ్రామికులను OLకు పెంచితే ‘E’ బిందువు వద్ద MFC, MRP సమానమైనాయి. ARP కంటే AFC ఎక్కువగా ఉండటం వల్ల సంస్థకు నష్టాలు వస్తాయి. అందువల్ల శ్రామికులను OL యూనిట్లకు తగ్గించడం జరిగింది. ఇక్కడ శ్రామికుల ఉపాంత ఉత్పత్తికి సమానంగా వేతనం ఉంటుంది.

ప్రమేయాలు :

  1. ఉత్పత్తి కారకాల మార్కెట్ లో పరిపూర్ణ పోటీ ఉంటుంది.
  2. ఉత్పత్తి కారకాలు అన్ని సజాతీయాలు.
  3. ఉత్పత్తి కారకాలకు పూర్తి గమనశీలత ఉంటుంది.
  4. సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది.
  5.  ఒక ఉత్పత్తి కారకం ఉపాంత ఉత్పత్తిని కొలవవచ్చు.

TS Board Inter First Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

ప్రశ్న 2.
భాటకాన్ని నిర్వచించి, రికార్డో భాటక సిద్ధాంతాన్ని విమర్శనాత్మకంగా వివరించండి.
జవాబు.
ఉత్పత్తి కారకంగా భూమి వస్తూత్పత్తి ప్రక్రియలో అందించే సేవలకు లభించే ప్రతిఫలం భాటకము. “డేవిడ్ రికార్డో భాటకాన్ని ఈ విధంగా నిర్వచించారు. “భూమికి ఉన్న సహజమైన, నశింపు కాని ఉత్పాదక శక్తులను ఉపయోగించుకొన్నందుకు పొందే ఫలసాయంలో భూస్వామికి చెల్లించే భాగమే భాటకము”.

రికార్డో భాటక సిద్ధాంతము :
డేవిడ్ రికార్డో భాటకాన్ని వైవిధ్యం వల్ల ఏర్పడే మిగులుగా భావించాడు. భూసారాలలోని వైవిధ్యం వల్ల భాటకం జనిస్తుంది. ఈ భాటకం ఏ విధంగా ఉత్పన్నమవుతుందో రికార్డో ఈ విధంగా వివరించాడు. ఒక ఆర్థిక వ్యవస్థలోని భూములను వాటి సారాన్నిబట్టి 3 రకాలైన భూములున్నాయి అనుకుంటే భాటకం లేదా వైవిధ్యం మిగులు ఏ విధంగా ఏర్పడుతుందో ఈ విధంగా వివరించాడు.

ఒక కొత్త దేశానికి కొంతమంది వలస వెళ్లారనుకుందాం. వాళ్లు అతిసారవంతమైన భూములను సాగు చేస్తారనుకుంటే ముందుగా ‘A’ గ్రేడ్ భూములను సాగుచేస్తారు. ఈ భూమిపై 20 క్వింటాళ్ళు పండించటానికి ఉత్పత్తి వ్యయం ₹ 300 అనుకుందాం.

అంటే యూనిట్ వ్యయం ₹ 15. ప్రతి వ్యవసాయదారుడు కనీసం ఉత్పత్తి వ్యయాన్ని రాబట్టుకోవటానికి యూనిట్ ధరను కూడా ₹ 15గా నిర్ణయించాల్సి ఉంటుంది. అప్పుడు ‘A’ గ్రేడ్ భూములపై మిగులు ఉండదు. కాని ఇంకా కొంతమంది ఆ దేశానికి వలస వస్తే లేదా ఆ దేశ జనాభా పెరిగి ధాన్యానికి డిమాండ్ పెరుగుతుంది.

‘A’ గ్రేడ్ భూములన్నీ సాగు చేశారనుకుంటే ‘B’ గ్రేడ్ ₹ 300 ఖర్చు చేస్తే 15 క్వింటాళ్ళ ధాన్యాన్ని మాత్రమే పండించగలుగుతారు. ‘B’ గ్రేడ్ భూమిపై చేసిన వ్యయాన్ని రాబట్టటానికి ధాన్యం యూనిట్ ధరను ₹ 20గా నిర్ణయించాల్సి ఉంటుంది. ఇప్పుడు ‘B’ గ్రేడ్ భూమిపై మిగులుండదు.

కాని ‘A’ గ్రేడ్ భూమిపై భౌతిక రూపంలో భాటకం 5 క్వింటాళ్ళు. విలువ రూపంలో ₹ 100 ఇంకా జనాభా పెరిగితే ఆహారధాన్యాలకు డిమాండ్ పెరిగి ‘C’ గ్రేడ్ భూములను కూడా సాగుచేయవలసి ఉంటుంది.

‘C’ గ్రేడ్ భూములు, ‘B’ గ్రేడ్ భూముల కంటే ఇంకా తక్కువ సారవంతమైనవి కనుక ₹ 300 ‘C’ గ్రేడ్ భూములపై వ్యయం చేస్తే 10 క్వింటాళ్ళు మాత్రమే పండించటం జరుగుతుంది. వ్యయాన్ని రాబట్టుకోవటానికి యూనిట్ ధాన్యం ధరను ₹ 30గా నిర్ణయించాలి.

అప్పుడు ‘C’ గ్రేడ్ భూమిపై మిగులు ఉండదు. ‘B’ గ్రేడ్ భూమిపై భౌతికంగా 5 క్వింటాళ్ళు మిగులుంటుంది. దాని విలువ ₹ 150. ‘A’ గ్రేడ్ భూమిపై భాటకం పెరుగుతుంది. ‘A’ గ్రేడ్ భూమిపై భౌతికంగా భాటకం 10 క్వింటాళ్ళు దాని విలువ ₹ 300. దీనిని ఈ క్రింది పట్టిక ద్వారా పరిశీలించవచ్చును.

పై పట్టికలో భాటకం లేని భూమిని ఉపాంత భూమి అంటారు. భాటకం భూసారంలోని వైవిధ్యం వల్ల ఏర్పడుతుంది. అన్ని ‘A’ గ్రేడ్ భూములైతే భాటకం ఉండదు.’B’ గ్రేడ్ భూములను సాగుచేస్తే ‘A’ గ్రేడ్ భూమిపై భాటకం ఏర్పడుతుంది. ‘C’ గ్రేడ్ భూములను సాగుచేస్తే ‘B’ గ్రేడ్ భూములపై భాటకం ఏర్పడుతుంది. అందువల్ల వ్యవసాయ ఉత్పత్తిలో క్షీణప్రతిఫలాలు ఏర్పడతాయి.

TS Inter 1st Year Economics Study Material 6th Lesson పంపిణీ సిద్ధాంతాలు 3

పై రేఖాపటంలో షేడెడ్ ఏరియా వివిధ గ్రేడు భూములలో భాటకం లేదా మిగులును తెలియజేస్తుంది. ‘C’ గ్రేడ్ భూమి ఉపాంత భూమి. కాబట్టి ఈ భూమిలో భాటకం లేదు.

TS Board Inter First Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

ప్రశ్న 3.
వాస్తవిక వేతనాలు అంటే ఏమిటి ? వాస్తవిక వేతనాలను నిర్ణయించు అంశాలు ఏమిటి ?
జవాబు.
శ్రామికులు వివిధ రంగాలలో వస్తూత్పత్తి ప్రక్రియలో తన సేవలను అందించారు. అందుకు ప్రతిఫలంగా ఉత్పత్తిదారులిచ్చే ప్రతిఫలం లేదా ధరను వేతనం అంటారు. శ్రామికులకు ప్రతిఫలం లేదా ధరను ద్రవ్య రూపంలో చెల్లిస్తారు. ద్రవ్య రూపంలో ఇచ్చిన వేతనం కొనుగోలు శక్తిని వాస్తవిక వేతనం అంటారు. ఇది ద్రవ్యం కొనుగోలు శక్తిపై ఆధారపడుతుంది.

ఈ కొనుగోలు శక్తి సాధారణ ధర సూచికపై ఆధారపడి ఉంటుంది.
ధరల స్థాయి మారుతున్నప్పుడు ద్రవ్యవేతనంలో మార్పులు లేకపోయినా వాస్తవిక వేతనంలో మార్పు వస్తుంది. వాస్తవిక వేతనమే శ్రామికుని జీవన ప్రమాణస్థాయిని నిర్ణయిస్తుంది. ప్రజలు వినియోగిస్తున్న వస్తువులు, వాటి పరిమాణాలు, నాణ్యతను అనుసరించి వారి జీవన ప్రమాణాలు నిర్ణయించబడతాయి.

వాస్తవిక వేతనాన్ని నిర్ణయించే అంశాలు :

1. ద్రవ్యం కొనుగోలు శక్తి :
సాధారణంగా ద్రవ్యానికుండే కొనుగోలు శక్తిపై వాస్తవిక వేతనాలు ఆధారపడి ఉంటాయి. ద్రవ్యానికి కొనుగోలు శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు శ్రామికులు తమ వేతనంలో ఎక్కువ సౌకర్యాలను సమకూర్చుకోగలరు. ద్రవ్యం కొనుగోలు శక్తి తగ్గినప్పుడు శ్రామికుల వాస్తవిక వేతనం తగ్గుతుంది.

2. వేతనమిచ్చే విధానము :
శ్రామికులకు ఇచ్చే ద్రవ్య వేతనంతోపాటు యాజమాన్యం కొన్ని సదుపాయాలను కూడా కల్పిస్తుంది. ఉదా : ఉచిత వసతి సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు మొదలైనవాటివల్ల వారి వాస్తవిక వేతనాలు అధికమవుతాయి.

3. ఉద్యోగ స్వభావము :
చేసే పని స్వభావం మీద కూడా వాస్తవిక వేతనాలు ఆధారపడతాయి. కొన్ని వృత్తులలో పని దుర్భరంగా ఉంటుంది. కొన్ని వృత్తులు ఆపదతో కూడినవిగా ఉంటాయి. అటువంటి వృత్తులలో ద్రవ్యవేతనాలు ఎక్కువగా ఉన్నా వాస్తవిక వేతనాలు తక్కువ.

ఆహ్లాదకరమైన వృత్తులలో ద్రవ్యవేతనాలు తక్కువైనా వాస్తవిక వేతనాలు ఎక్కువని ఉద్యోగ స్వభావాన్నిబట్టి చెప్పవచ్చును. ఉదా : గనులలో పనిచేసేవారి వృత్తి దుర్భరంగా ఉంటుంది. కనుక ద్రవ్య వేతనాలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాస్తవిక వేతనం తక్కువగా ఉంటుంది.

4. పనిచేసే పరిస్థితులు :
అనారోగ్యకరమైన పరిసరాలలో పనిచేసే శ్రామికుల వేతనం ఎక్కువగా ఉన్నా వారి వాస్తవిక వేతనం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ గంటలు పనిచేసేవారి ద్రవ్యవేతనం ఎక్కువగా ఉన్నా వారి వాస్తవిక వేతనం రేటు తక్కువగా ఉంటుంది.

5. ఆకస్మిక లాభాలు :
యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు, పోటీ సంస్థలు మూతపడుట మొదలైన కారణాల వల్ల ధరలు పెరిగి లభించే ఆకస్మిక లాభాలు నికరలాభంలో అంతర్భాగంగా ఉంటాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

ప్రశ్న 4.
స్థూల వడ్డీ, నికర వడ్డీలను గురించి వివరించండి.
జవాబు.
సాధారణంగా అప్పు తీసుకొన్న వ్యక్తి, అప్పు ఇచ్చిన వ్యక్తికి చెల్లించవలసిన సొమ్మును వడ్డీ అని అంటారు. దీనిని సాధారణంగా సంవత్సరానికి వంద రూపాయలకు ఇంత రేటు అని నిర్ణయిస్తారు. కానీ అర్థశాస్త్రంలో మూలధన సేవలకు చెల్లించే దానిని వడ్డీ అని పిలుస్తారు.

జాతీయాదాయంతో తన వాటాగా పెట్టుబడిదారుడు తన మూలధనానికి పొందే ధరను వడ్డీ అంటారు. మూలధన యజమానికి అందే ఆదాయమే వడ్డీ అని కార్వర్ అన్నాడు.

వడ్డీ భావనలు:

వడ్డీ భావనలు రెండు రకాలు అవి :

  1. స్థూల వడ్డీ
  2. నికర వడ్డీ.

1. స్థూల వడ్డీ :
రుణం ఇచ్చిన వ్యక్తి రుణం తీసుకున్న వ్యక్తి నుంచి అసలు మొత్తం కాకుండా అదనంగా పొందే దాన్ని స్థూల వడ్డీ అంటారు. స్థూల వడ్డీలో కింద వివరించిన చెల్లింపులు ఉంటాయి.

2. నికర వడ్డీ :
నికర వడ్డీ అంటే కేవలం మూలధనం లేదా ద్రవ్య సేవకు మాత్రమే ఇచ్చే ప్రతిఫలం. ఆర్థిక పరిభాషలో ఇదే వడ్డీ రేటు.

కీన్స్ ద్రవ్యత్వాభిరుచి సిద్ధాతం (Liquidity Preference Theory of JM Keynes):

కీన్స్ వడ్డీ రేటుకు ద్రవ్యపరమైన వివరణను ఇచ్చాడు. ద్రవ్యానికున్న డిమాండ్, సప్లయ్ ను బట్టి వడ్డీ రేటు నిర్ణయించబడుతుందని కీన్స్ అన్నాడు. కీన్స్ ప్రకారం ‘ద్రవ్యత్వాన్ని కొంతకాలం వదులుకున్నందుకు చెల్లించే ప్రతిఫలం వడ్డీ.

ద్రవ్య సప్లయ్ :
ద్రవ్య సరఫరా అంటే చలామణిలో ఉన్న మొత్తం ద్రవ్య పరిమాణం. వడ్డీ రేటు కొంత మేరకు ద్రవ్య సప్లయ్న ప్రభావితం చేసినప్పటికీ, ద్రవ్య సప్లయ్ ఒక నిర్ణీత కాలానికి స్థిరంగా లేదా సంపూర్ణ అవ్యాకోచంగా ఉంటుంది. ద్రవ్య సరఫరా దేశంలోని కేంద్ర బ్యాంకు వల్ల నిర్ణయించబడుతుంది.

ద్రవ్య డిమాండ్ :
కీన్స్ ద్రవ్యత్వాభిరుచి అను నూతన భావనను ఉపయోగించాడు. ద్రవ్యానికి ఉన్న ద్రవ్యత్వం వల్ల ప్రజలు ద్రవ్యాన్ని డిమాండ్ చేస్తారు. ద్రవ్యాన్ని ద్రవ్య రూపంలో తమవద్ద ఉంచుకోవాలనే కోరికే ద్రవ్యత్వాభిరుచి.

ద్రవ్యత్వాభిరుచి ఎక్కువగా ఉన్నప్పుడు ద్రవ్యత్వ ఆస్తులను వదులుకోవడానికి ప్రేరేపించాలంటే అధిక వడ్డీ రేటును చెల్లించాలి. ద్రవ్యత్వాభిరుచి తక్కువగా ఉన్నప్పుడు ద్రవ్యాన్ని కలిగి ఉన్న వ్యక్తులకు తక్కువ వడ్డీ రేటు చెల్లించడం జరుగుతుంది. ప్రజలు ప్రాథమికంగా మూడు కారణాలు వల్ల ద్రవ్యాన్ని డిమాండ్ చేస్తారు. అవి :

  • వ్యాపార వ్యవహారాల కోసం (transaction motive)
  • ముందు జాగ్రత్త కోసం (precautionary motive)
  • అంచనా వ్యాపారం కోసం (speculative motive).

i) వ్యాపార వ్యవహారాల కోసం :
వ్యక్తులు, వ్యాపార సంస్థలు తమ రోజువారి కార్యకలాపాల కోసం ద్రవ్యాన్ని డిమాండ్ చేస్తారు. వ్యక్తులు వినియోగ అవసరాల కోసం, వ్యాపార సంస్థలు వ్యాపార అవసరాల కోసం ద్రవ్యాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ అవసరాల కోసం ఉంచుకొనే మొత్తం ఆదాయంపైన, వ్యాపార లక్ష్యాలపైన ఆధారపడుతుంది.

ii) ముందు జాగ్రత్త కోసం :
అనారోగ్యం, ప్రమాదం, నిరుద్యోగం మొదలైన వాటికి అనుకోకుండా ఎదురయ్యే వ్యయాల కోసం ప్రజలు కొంత ద్రవ్యాన్ని తమ వద్ద ఉంచుకొంటారు. వ్యాపార సంస్థలు భవిష్యత్తులో ఊహించని వ్యాపార వ్యవహారాలవల్ల లాభాన్ని పొందడానికి కొంత ద్రవ్యాన్ని తమ వద్ద ఉంచుకోవాలనుకుంటాయి. వ్యక్తులు, వ్యాపారస్తులు ఊహించని అవసరాల కోసం ద్రవ్యాన్ని తమ వద్ద అట్టిపెట్టుకుంటారు.

iii) అంచనా వ్యాపారం కోసం :
భవిష్యత్లో వడ్డీ రేట్లు, బాండ్ల ధరలలో వచ్చే మార్పుల వల్ల ప్రయోజనాన్ని పొందడానికి వ్యక్తులు, సంస్థలు తమ వద్ద కొంత ద్రవ్యాన్ని ఉంచుకోవాలనుకుంటారు. దీనినే అంచనా వ్యాపారం కోసం డిమాండ్ అంటారు. బాండ్ల ధరలు, వడ్డీ రేట్లు విలోమ సంబంధాన్ని కలిగి ఉంటాయి.

బాండ్ల ధరలు పెరుగుతాయనుకుంటే వడ్డీ రేటు తగ్గుతుంది. కాబట్టి వ్యాపారస్తులు బాండ్లను కొని భవిష్యత్తులో వాటి ధరలు పెరిగినప్పుడు అమ్ముతారు. అలాగే బాండ్ల ధరలు తగ్గుతాయనుకుంటే వడ్డీ రేటు పెరిగి వ్యాపారస్తులు బాండ్లను అమ్ముతారు.

బాండ్ల ధరలు తక్కువగా ఉండే వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నట్లు. అలాగే బాండ్ల ధరలు ఎక్కువ ఉండే వడ్డీ రేటు తక్కువ ఉన్నట్లు. వడ్డీ రేటుకు, ద్రవ్యానికున్న డిమాండ్కు విలోమ సంబంధం ఉంది.

వ్యాపార వ్యవహారాల కోసం, ముందు జాగ్రత్త కోసం ద్రవ్యాన్నికున్న డిమాండ్కు వడ్డీ రేటుకున్న సంబంధం సాపేక్ష అవ్యాకోచంగా ఉంటుంది. అయితే ఆదాయంలో మాత్రం అధిక వ్యాకోచత్వ సంబంధాన్ని కలిగి ఉంటుంది. వడ్డీ రేటును నిర్ణయించడంలో ఈ రెండు రకాల డిమాండుకు ఎలాంటి పాత్ర లేదు.

అంచనా వ్యాపారం కోసం ఉన్న డిమాండ్లకు వడ్డీకున్న సంబంధం వ్యాకోచంగా ఉండి ద్రవ్య సరఫరా స్థిరంగా ఉన్నప్పుడు వడ్డీ రేటును నిర్ణయించడంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఎప్పుడైతే ద్రవ్యాన్నికున్న డిమాండ్, ద్రవ్య సప్లయ్ సమానం అవుతాయో అప్పుడు సమతౌల్యంతో పాటుగా వడ్డీ రేటు కూడా నిర్ణయించబడుతుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

ప్రశ్న 5.
లాభం అంటే ఏమిటి ? వివిధ లాభ భావనలను వివరించండి.
జవాబు.
సాధారణ అర్థంలో ఉత్పత్తి వ్యయానికంటే అధికంగా ఉన్న మిగులు ఆదాయాన్ని లాభం అంటారు. ఉత్పత్తి ప్రక్రియలో ఉద్యమదారుడు వ్యవస్థాపకుడు అందించే సేవలకు పొందే ప్రతిఫలాన్ని లాభం అంటారు. రాబడి నుంచి మిగిలిన ఉత్పత్తి కారకాలకు భాటకం, వేతనం, వడ్డీ రూపంలో ప్రతిఫలాలు చెల్లించిన తరువాత మిగిలిన ఆదాయాన్ని ఉద్యమదారుడు ప్రతిఫలంగా అంటే లాభం రూపంలో పొందుతాడు.

లాభాల సిద్ధాంతాలు:
లాభం ఏ విధంగా నిర్ణయించబడుతుందో వివరించడానికి ఆర్థికవేత్తలు చాలా సిద్ధాంతాలను రూపొందించారు. ఈ యూనిట్ లో మూడు లాభ సిద్ధాంతాలను మాత్రమే చర్చించుకుంటాం.

1. నవకల్పనల సిద్ధాంతం (Innovation Theory) :
ఈ సిద్ధాంతాన్ని జోసెఫ్ షుంపీటర్ అనే ఆర్థికవేత్త ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం ఉద్యమదారుని నవకల్పనా నైపుణ్యాలకు పారితోషికంగా లాభం చెల్లించబడుతుంది. ఉద్యమదారుడు ఉత్పత్తి కార్యక్రమంలో ప్రవేశపెట్టే నవకల్పనల వల్ల ధర కంటే ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉండి లాభం వస్తుంది.

షుంపీటర్ ప్రకారం ఉద్యమదారుని విధి ఏమిటంటే చక్రీయ ప్రవాహాన్ని లేదా స్థిర సమతౌల్యాన్ని చేదించడానికి నవకల్పనలు ప్రవేశపెట్టడం. అవి :

  1. నూతన వస్తువులను ప్రవేశపెట్టడం
  2. నూతన ఉత్పత్తి పద్ధతులను ప్రవేశపెట్టడం
  3. నూతన మార్కెట్లను తెరవడం
  4. నూతన ముడి సరుకులను కనుగొనడం
  5.  పరిశ్రమ పునర్వ్యవస్థీకరణ, ఈ నవకల్పనలు ప్రవేశపెట్టినందువల్ల ధరల కంటే ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉండి లాభాలు వస్తాయి.

2. హాలే నష్ట భయ లాభ సిద్ధాంతం (The Risk Theory of Profit) :
ప్రొఫెసర్ ఎఫ్.బి. హాలే ఈ సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఉద్యమదారుడు నష్ట భయాన్ని భరించినందుకు వచ్చే ప్రతిఫలం లాభం. ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యమదారుడు తప్ప మిగిలిన ఏ ఉత్పత్తి కారకం నష్ట భయాన్ని భరించదు.

అందువల్ల ఇతర ఉత్పత్తి కారకాలకు పంచగా మిగిలిన ఆదాయం ఉద్యమదారునికి చెందుతుందనేది ఈ సిద్ధాంత సారాంశం. వస్తువుల ధర, డిమాండ్లలో ఏర్పడే ప్రతికూల మార్పుల వల్ల, అనూహ్య ఉపద్రవాల వల్ల నష్టభయాన్ని ఎదుర్కొవలసి ఉంటుంది.

అందువల్ల ఉద్యమదారునికి నష్ట భయానికి మించి వచ్చే ఆదాయమే లాభం. హాలే ప్రకారం ఉద్యమదారుడు కొన్ని రకాల నష్ట భయాన్ని బీమా చేసి నష్ట భయాన్ని తొలగించుకోవచ్చు. అయితే అన్ని రకాలు కాదు. ఒకవేళ మొత్తం నష్ట భయాన్ని బీమా చేస్తే వచ్చే లాభాలను బీమా కంపెనీ తీసుకుంటుంది.

కాబట్టి ఉద్యమదారుడు కేవలం వేతనం మాత్రమే తీసుకుంటాడు. ఈ విదంగా వ్యాపారంలో నష్ట భయాన్ని భరించేవారే నష్టం భయం వాస్తవిక విలువకంటే అధిక మొత్తాన్ని లాభం రూపంలో ఆర్జిస్తారు. అందువల్ల ఉద్యమదారుడు తెలివిగా ఎంపిక చేసుకున్న నష్ట భయాలను భరించినందుకు లభించేదే లాభం.

3. అనిశ్చితత్వ లాభ సిద్ధాంతం (Uncertainty Theory of Profit) :
ప్రొఫెసర్ ఎఫ్. హెచ్. నైట్ అనిశ్చితత్వ లాభ సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఇది మెరుగుపరచబడిన నష్ట భయ సిద్ధాంతం. బీమా చేయలేని నష్ట భయాన్ని అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొన్నందుకు చెల్లించే ప్రతిఫలమే లాభం అని నైట్ పరిగణించాడు.

అతను నష్ట భయాలను రెండు రకాలుగా వర్గీకరించాడు. అవి :

  1. ఊహించి బీమా చేయగలిగిన నష్ట భయాలు. ఉదా : అగ్నిప్రమాదాలు, దొంగతనాలు, ప్రకృతి వైపరీత్యాలు మొదలైనవి.
  2. ఊహకందని, బీమా చేయలేని నష్ట భయాలు. ఉదా : ధర, డిమాండ్, సప్లయ్లో మార్పులు మొదలైనవి. ఈ భీమా చేయలేని నష్ట భయాలను లెక్కించలేం.

TS Board Inter First Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఆదాయ పంపిణీలో రకాలను వివరించండి.
జవాబు.
అర్థశాస్త్రంలో పంపిణీ భావనను రెండు అర్థాలలో ఉపయోగించడం జరుగుతుంది. అంటే జాతీయాదాయ పంపిణీని రెండు విధాలుగా పరిశీలించవచ్చు.

  1. విధులననుసరించి పంపిణీ
  2. వైయక్తిక పంపిణీ

1. విధులననుసరించి పంపిణీ :
ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్న ఉత్పత్తి కారకాలైన భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనలు సేవలందించినందుకు గాను, అవి ప్రతిఫలాలుగా భాటకం, వేతనం, వడ్డీ, లాభాల రూపంలో పొందుతాయి. ఒక ఉత్పత్తి కారకం ఏవిధంగా ఎంత మొత్తంలో ప్రతిఫలం పొందుతుందో విధులననుసరించి పంపిణీ తెలియజేస్తుంది.

కొంతమంది ఒకటికంటే ఎక్కువ ఉత్పత్తి కారకాలకు యజమానులుగా ప్రతిఫలాలను పొందవచ్చు. ఒక ఉత్పత్తి కారకం ఏవిధంగా ఎంత మొత్తంలో ప్రతిఫలం పొందుతుందో విధులననుసరించి పంపిణీ తెలుపుతుంది. విధులననుసరించి జరిగే పంపిణీని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.

a) సూక్ష్మ పంపిణీ :
సూక్ష్మ పంపిణీ ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నందుకు ఒక ఉత్పత్తి కారకం ధర ఏవిధంగా ఎంత నిర్ణయించబడుతుందో వివరిస్తుంది.
ఉదా : శ్రామికుల వేతన రేటు నిర్ణయం. వివరిస్తుంది.

b) స్థూల పంపిణీ :
జాతీయాదాయంలో వివిధ ఉత్పత్తి కారకాల వాటా ఎంత ఉందో స్థూల పంపిణీ
ఉదా : మొత్తం జాతీయాదాయంలో వేతనాల వాటా ఎంత ఉంది అనే విషయాన్ని స్థూల పంపిణీ తెలియజేస్తుంది.

2. వైయక్తిక పంపిణీ :
దేశంలోని వ్యక్తుల మధ్య జాతీయాదాయాన్ని పంపిణీ చేయడాన్ని వైయక్తిక పంపిణీ అంటారు. ఇక్కడ వ్యక్తులు ఎంత ఆదాయం పొందుతున్నారు అనే విషయాన్ని పరిశీలిస్తారు. అంతేగాని ఏవిధంగా లేదా ఎన్ని విధాలుగా పొందారు అనే విషయ పరిశీలన ప్రధానం కాదు. వైయక్తిక పంపిణీ పరిశీలన ద్వారా ఆదాయ అసమానతలను అందుకు గల కారణాలను తెలుసుకోవచ్చు.

TS Board Inter First Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

ప్రశ్న 2.
ఉత్పత్తి కారకాల ధరను నిర్ణయించే అంశాలు ఏమిటి ?
జవాబు.
ఉత్పత్తి కారకాల ధరలను వాటి డిమాండ్, సప్లయ్లు కలసి నిర్ణయిస్తాయి.
ఉత్పత్తి కారకాల డిమాండ్ను నిర్ణయించే అంశాలు :

  1. ఉత్పత్తి కారకాల డిమాండ్ ఉత్పన్న డిమాండ్ లేదా పరోక్ష డిమాండ్ అంటే ఉత్పత్తి కారకం డిమాండ్ అది ఉత్పత్తి చేసే వస్తువు డిమాండ్పై ఆధారపడి ఉంటుంది.
  2. ఒక ఉత్పత్తి కారకం డిమాండ్ దాని ధరపై ఆధారపడి ఉంటుంది.
  3. ఒక ఉత్పత్తి కారకం డిమాండ్ ఉత్పత్తి తనకు సహకరించే ఇతర ఉత్పత్తి కారకాల ధరలపై ఆధారపడి ఉంటుంది.
  4. సాంకేతిక విజ్ఞానం ఉత్పత్తి కారకాల డిమాండ్ను నిర్ణయిస్తుంది.
    ఉదా : కంప్యూటరీకరణ వల్ల శ్రామికుల డిమాండ్ గణనీయంగా తగ్గింది.
  5. తరహాననుసరించి ప్రతిఫలాలు ఉత్పత్తి కారకం డిమాండ్ను నిర్ణయిస్తాయి. ఉత్పత్తిలో పెరుగుతున్న ప్రతిఫలాలు వస్తుంటే ఉత్పత్తి కారకాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
  6. ఉత్పత్తి కారకాల సప్లయ్ ని నిర్ణయించే అంశాలు. ఉదా : శ్రామికుల సప్లయ్.

ప్రశ్న 3.
ఉపాంత ఉత్పాదకతా సిద్ధాంతపు ప్రమేయాలను, పరిమితులను పేర్కొనండి.
జవాబు.
ఒక యూనిట్ ఉత్పత్తి కారకాన్ని అదనంగా నియమిస్తే మొత్తం ఉత్పత్తిలో వచ్చే మార్పును ఉపాంత భౌతిక ఉత్పత్తి (marginal physical product) అని అంటారు. అదనపు ఉత్పత్తిని మార్కెట్ ధరతో గుణిస్తే, ఉపాంత ఉత్పత్తి విలువ (marginal value product) లేదా ఉపాంత ఉత్పత్తి రాబడి (marginal revenue product) వస్తుంది.

అదనంగా ఒక ఉత్పత్తి కారకపు యూనిట్ను ఉపయోగించినప్పుడు మొత్తం రాబడిలో వచ్చిన మార్పునే ఉపాంత ఉత్పత్తి రాబడి అంటారు. ఉత్పత్తి కారకాల యూనిట్లను పెంచుతుంటే ప్రారంభంలో ఉపాంత ఉత్పాదక రాబడి పెరిగి తరవాత గరిష్ఠ స్థాయికి చేరుతుంది.

ఆ తరవాత ఇది తగ్గుతూ ఉత్పత్తి కారకం ధరకు (సగటు కారక వ్యయంకు) సమానమవుతుంది. చరానుపాతాల సూత్రం ప్రమేయాన్ని బట్టి ఉపాంత ఉత్పాదక రాబడి తగ్గుతుంది. సంపూర్ణ పోటీలో పరిశ్రమలో ఉత్పత్తి కారకానికి ఉన్న ధరనే సంస్థ కూడా చెల్లించాలి. గరిష్ఠ లాభార్జనకు సంస్థ ప్రతిస్థాపన సూత్రాన్ని పాటిస్తుంది.

ఉత్పత్తి కారకం ధర అంటే సగటు కారక వ్యయంకు (average factor cost) ఉపాంత ఉత్పాదక రాబడి (MRP) సమానమయ్యేంత వరకు అధిక ధరలున్న ఉత్పత్తి కారకాలకు బదులుగా తక్కువ ధరలున్న ఉత్పత్తి కారకాలను ప్రతిస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ఈ స్థితిలో ఉత్పత్తి కారకాల సమ్మేళనం సమర్థవంతంగా ఉండటంతోపాటుగా సంస్థ లాభాలు గరిష్ఠంగా ఉంటాయి.

సిద్ధాంతానికున్న ప్రమేయాలు : సిద్ధాంతం కింది ప్రమేయాలపై ఆధారపడి ఉంటుంది.

  1. ఉత్పత్తి కారకాల మార్కెట్లో వస్తువు మార్కెట్లో పరిపూర్ణ పోటీ ఉంటుంది.
  2. ఉత్పత్తి కారకాలు అన్నీ సజాతీయాలు.
  3. ఉత్పత్తి కారకాలకు సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది.
  4. ఉత్పత్తి కారకాలకు పూర్తి గమనశీలత ఉంటుంది.
  5. ఉత్పత్తి కారకాలు ఒక దానికి బదులు మరొకటి పూర్తి ప్రత్యామ్నాయాలు.
  6. ఉద్యమదారులు లాభాలవల్ల ప్రేరితమవుతారు.
  7.  వివిధ కారకాల యూనిట్లు విభాజ్యం.
  8. ఈ సిద్దాంతం దీర్ఘ కాలానికి వర్తిస్తుంది.
  9.  ఇది చరానుపాతాల సూత్రంపై ఆధారపడింది.
  10. ఒక ఉత్పత్తి కారకం ఉపాంత ఉత్పత్తిని కొలవవచ్చు.

సిద్ధాంతం పై విమర్శ : ఉపాంత ఉత్పాదక పంపిణీ సిద్ధాంతం అవాస్తవిక ప్రమేయాలపై ఆధారపడింది. అందుచేత ఇది విమర్శంపబడింది.

  1. కారకాల మార్కెట్లో, వస్తువు మార్కెట్లో సంపూర్ణ పోటీ లేదు.
  2. కారక యూనిట్లన్నీ సజాతీయం కాదు.
  3. కారకాలన్నీ ఉపయోగింపబడవు.
  4. కారకాలకు పూర్తి గమనశీలత లేదు.
  5. కారకాల మధ్య అన్ని వేళలా ప్రతిస్థాపన సాధ్యం కాదు.
  6. లాభం పొందడం ముఖ్య ఉద్దేశం కాదు.
  7. కారకాలన్నీ విభాజ్యం కావు.
  8. స్వల్ప కాలంలో ఈ సిద్ధాంతం వర్తించదు.
  9. ఉత్పత్తి కేవలం ఒక కారకం యొక్క ఫలితం కాదు.
  10. కారకాల చెల్లింపు మొత్తం విలువకు సమానం కాదు.

TS Board Inter First Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

ప్రశ్న 4.
నిజ వేతనాలను నిర్ణయించే కారకాలు ఏమిటి ?
జవాబు.
శ్రామికులు వివిధ రంగాలలో వస్తూత్పత్తి ప్రక్రియలో తన సేవలను అందించారు. అందుకు ప్రతిఫలంగా ఉత్పత్తిదారులిచ్చే ప్రతిఫలం లేదా ధరను వేతనం అంటారు. శ్రామికులకు ప్రతిఫలం లేదా ధరను ద్రవ్య రూపంలో చెల్లిస్తారు. ద్రవ్య రూపంలో ఇచ్చిన వేతనం కొనుగోలు శక్తిని వాస్తవిక వేతనం అంటారు. ఇది ద్రవ్యం కొనుగోలు శక్తిపై ఆధారపడుతుంది. ఈ కొనుగోలు శక్తి సాధారణ ధర సూచికపై ఆధారపడి ఉంటుంది.

ధరల స్థాయి మారుతున్నప్పుడు ద్రవ్యవేతనంలో మార్పులు లేకపోయినా వాస్తవిక వేతనంలో మార్పు వస్తుంది. వాస్తవిక వేతనమే శ్రామికుని జీవన ప్రమాణస్థాయిని నిర్ణయిస్తుంది. ప్రజలు వినియోగిస్తున్న వస్తువులు, వాటి పరిమాణాలు, నాణ్యతను అనుసరించి వారి జీవన ప్రమాణాలు నిర్ణయించబడతాయి.

వాస్తవిక వేతనాన్ని నిర్ణయించే అంశాలు :

1. ద్రవ్యం కొనుగోలు శక్తి :
సాధారణంగా ద్రవ్యానికుండే కొనుగోలు శక్తిపై వాస్తవిక వేతనాలు ఆధారపడి ఉంటాయి. ద్రవ్యానికి కొనుగోలు శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు శ్రామికులు తమ వేతనంలో ఎక్కువ సౌకర్యాలను సమకూర్చుకోగలరు. ద్రవ్యం కొనుగోలు శక్తి తగ్గినప్పుడు శ్రామికుల వాస్తవిక వేతనం తగ్గుతుంది.

2. వేతనమిచ్చే విధానము :
శ్రామికులకు ఇచ్చే ద్రవ్య వేతనంతోపాటు యాజమాన్యం కొన్ని సదుపాయాలను కూడా కల్పిస్తుంది. ఉదా : ఉచిత వసతి సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు మొదలైనవాటివల్ల వారి వాస్తవిక వేతనాలు అధికమవుతాయి.

3. ఉద్యోగ స్వభావము :
చేసే పని స్వభావం మీద కూడా వాస్తవిక వేతనాలు ఆధారపడతాయి. కొన్ని వృత్తులలో పని దుర్భరంగా ఉంటుంది. కొన్ని వృత్తులు ఆపదతో కూడినవిగా ఉంటాయి. అటువంటి వృత్తులలో ద్రవ్యవేతనాలు ఎక్కువగా ఉన్నా వాస్తవిక వేతనాలు తక్కువ.

ఆహ్లాదకరమైన వృత్తులలో ద్రవ్యవేతనాలు తక్కువైనా వాస్తవిక వేతనాలు ఎక్కువని ఉద్యోగ స్వభావాన్నిబట్టి చెప్పవచ్చును. ఉదా : గనులలో పనిచేసేవారి వృత్తి దుర్భరంగా ఉంటుంది. కనుక ద్రవ్య వేతనాలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాస్తవిక వేతనం తక్కువగా ఉంటుంది.

4. పనిచేసే పరిస్థితులు :
అనారోగ్యకరమైన పరిసరాలలో పనిచేసే శ్రామికుల వేతనం ఎక్కువగా ఉన్నా వారి వాస్తవిక వేతనం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ గంటలు పనిచేసేవారి ద్రవ్యవేతనం ఎక్కువగా ఉన్నా వారి వాస్తవిక వేతనం రేటు తక్కువగా ఉంటుంది.

5. ఆకస్మిక లాభాలు :
యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు, పోటీ సంస్థలు మూతపడుట మొదలైన కారణాల వల్ల ధరలు పెరిగి లభించే ఆకస్మిక లాభాలు నికరలాభంలో అంతర్భాగంగా ఉంటాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

ప్రశ్న 5.
స్థూల లాభాల భావనలను వివరించండి.
జవాబు.
మొత్తం రాబడి నుండి మొత్తం వ్యయం తీసివేయగా మిగిలినదానిని స్థూలలాభం అని అంటారు.
స్థూలలాభంలో ఉన్న అంశాలు :

1. ఉద్యమదారుని సొంత మూలధనం మీద వడ్డీ :
వ్యవస్థాపకుడు ఉత్పత్తి ప్రక్రియలో సొంత మూలధనం ఉపయోగిస్తే దానిమీద చెల్లించే వడ్డీని లెక్కలోకి తీసుకోవాలి.

2. సొంత భూమి మీద భాటకం :
ఉత్పత్తి ప్రక్రియలో తన సొంత భూమిని ఉపయోగిస్తే దానికి భాటకం లెక్కగట్టాలి. దానిని లాభంగా అన్వయించకూడదు.

3. నిర్వహణ వేతనాలు :
వ్యవస్థాపకుడే వ్యాపారాన్ని నిర్వహించి, అజమాయిషీ చేస్తే అతని సేవలకు వేతనం ఇవ్వాలి. అది స్థూలలాభంలో తీసివేయాలి.

4. బీమా ఖర్చులు :
యంత్రాల తరుగుదల, బీమా వ్యయాలు మొదలైనవాటిని స్థూలలాభాల నుండి తీసివేయాలి.

5. నికరలాభం :
వ్యవస్థాపనకు ఉత్పత్తికరమైన సేవలకు మాత్రమే వచ్చే ప్రతిఫలం నికరలాభం.

6. భవిష్యదవకాశాలు :
భవిష్యత్తులో పదోన్నతి జరిగి ఎక్కువ సంపాదించుకునే అవకాశమున్న వృత్తులలో ద్రవ్యవేతనం తక్కువగా ఉన్నప్పటికీ, వాస్తవిక వేతనం ఎక్కువగా ఉంటుంది.

7. వృత్తి స్థిరత్వం : ప్రతి శ్రామికుడు ద్రవ్యవేతనం తక్కువగా ఉన్నప్పటికీ శాశ్వతమైన ఉద్యోగం కోరుకుంటాడు. కాని తాత్కాలికమైన ఉద్యోగంలో ద్రవ్యవేతనం ఎక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో నిరుద్యోగిగా ఉండిపోవలసి వస్తుంది. కనుక వాస్తవిక వేతనం తక్కువగా ఉంటుంది.

8. అదనపు రాబడి : అదనపు రాబడి ఆర్జించటానికి అవకాశమున్న వృత్తులలో ద్రవ్యవేతనం తక్కువగా ఉన్నప్పటికీ వారి వాస్తవిక వేతనం ఎక్కువగా ఉంటుంది. ఉదా : అధ్యాపకులు, టైపిస్టులు మొదలైనవారు అదనపు రాబడిని ఆర్జించగలరు.

నికరలాభంలో ఉన్న అంశాలు : స్థూలలాభంలో అంతర్భాగంగా ఉన్న వ్యవస్థాపక సేవలకు వచ్చే ప్రతిఫలాన్ని మాత్రమే నికర లాభం అంటారు.

ఎ) నష్టభయాన్ని భరించడం:
వ్యాపారంలో బీమా చేయలేని నష్టభయాలను, అనిశ్చితాలను భరించినందుకు వచ్చే ప్రతిఫలం నికర లాభంలో అంతర్భాగంగా ఉంటుంది.

బి) ఉత్పత్తి కారకాల సమన్వయం:
ఉత్పత్తి కారకాలను ఒకచోట చేర్చి అభిలషణీయ అనుపాతంలో కూర్చి, సమన్వయపరిచినందుకు వచ్చే ప్రతిఫలాలు నికరలాభంలో ఇమిడి ఉంటాయి.

సి) మార్కెటింగ్ సేవలు :
ఉత్పత్తి కారకాలను కొనుగోలుచేసి తయారైన వస్తువులను విక్రయించటంలో వ్యవస్థాపకుని మార్కెటింగ్ సమర్థతకు ప్రతిఫలం నికరలాభంలో అంతర్భాగం.

డి) నవకల్పనలు ప్రవేశపెట్టడం :
నూతన ఉత్పత్తి పద్ధతులు ప్రవేశపెట్టడం, నూతన మార్కెట్లు కనుక్కోవడం, నూతన వస్తువులను తయారుచేయడంలాంటి నవకల్పనలు ప్రవేశపెట్టినందుకు చెల్లించే పారితోషికం నికరలాభంలో అంతర్భాగం.

TS Board Inter First Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
కారక డిమాండ్ను నిర్ణయించే అంశాలు ఏమిటి ?
జవాబు.
ఉత్పత్తికి ధర నిర్ణయించబడినట్లుగానే ఉత్పత్తి కారకాల ధరలను వాటి డిమాండ్, సప్లయ్ లు కలిసి నిర్ణయిస్తాయి. అయితే రెండింటికి తేడాలున్నాయి. ఉత్పత్తి కారకానికి డిమాండ్ను నిర్ణయించే అంశాలు (కారకాలు) :

  1. ఉత్పత్తి కారకాల డిమండ్ ఉత్పన్న డిమాండ్. అంటే ఉత్పత్తి కారకం డిమాండ్ అది ఉత్పత్తి చేసే వస్తువు మాండ్ పై ఆధారపడి ఉంటుంది.
  2. ఒక ఉత్పత్తి కారకం డిమాండ్ దాని ధరపై ఆధారపడి ఉంటుంది.
  3. ఒక ఉత్పత్తి కారకం డిమాండ్ ఉత్పత్తిలో దానికి సహకరించే ఇతర ఉత్పత్తి కారకాల ధరలపై ఆధారపడి ఉంటుంది.
  4. సాంకేతిక విజ్ఞానం ఉత్పత్తి కారకాల డిమాండ్ను నిర్ణయిస్తుంది. ఉదా : సాంకేతిక పరిజ్ఞానం పెరిగితే శ్రామికుల డిమాండ్ తగ్గుతుంది.
  5. తరహాననుసరించి ప్రతిఫలాలు ఉత్పత్తి కారకాల డిమాండ్ను నిర్ణయిస్తాయి. ఉత్పత్తిలో పెరుగుతున్న ప్రతిఫలాలు వస్తుంటే ఉత్పత్తి కారకాలను డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.

ప్రశ్న 2.
శ్రమ సరఫరాను నిర్ణయించే అంశాలు ఏమిటి ?
జవాబు.

  1. ధరల స్థాయి
  2. చెల్లింపు విధానం
  3. ఉద్యోగ క్రమబద్ధత
  4. పని స్వభావం
  5. పనిచేసే పరిస్థితులు.

TS Board Inter First Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

ప్రశ్న 3.
ఒప్పంద భాటకం అంటే ఏమిటి ?
జవాబు.
ఒప్పంద భాటకం అంటే నిర్ణీతకాలానికి భూమి సేవలకు, గృహాలకు ముందుగా నిర్ణయించిన ఒప్పందం ప్రకారం చెల్లించే ప్రతిఫలం.

ప్రశ్న 4.
ఆర్థిక భాటకం అంటే ఏమిటి ?
జవాబు.
ఆర్థిక భాటకం కేవలం భూమికే పరిమితం కాకుండా మిగతా మూడు ఉత్పత్తి కారకాలైన శ్రమ, మూలధనం, వ్యవస్థాపనకు వర్తిస్తుంది. ఇది మూడు రకాలు.

  1. కొరత భాటకం
  2. కృత్రిమ భాటకం
  3. బదిలీ సంపాదన

ప్రశ్న 5.
ద్రవ్య వేతనాలు అంటే ఏమిటి ?
జవాబు.
ద్రవ్య వేతనం అంటే శ్రామికుని శ్రమకు నగదు రూపంలో చెల్లించే ధర లేదా ప్రతిఫలం.

TS Board Inter First Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

ప్రశ్న 6.
వాస్తవిక వేతనాలు అంటే ఏమిటి ?
జవాబు.
వాస్తవిక వేతనాన్ని అభివృద్ధి పరిచినది ఆడమస్మిత్, వాస్తవిక వేతనం అంటే శ్రామికుడి శ్రమకు ప్రతిఫలంగా పొందిన ద్రవ్యవేతనం కొనుగోలుశక్తి.

ప్రశ్న 7.
కాలాన్ని బట్టి వేతనాలు అంటే ఏమిటి ?
జవాబు.
కాలాన్ని బట్టి వేతనం అంటే శ్రామికుల ఉత్పాదకతతో సంబంధం లేకుండా నిర్ణీత కాలానికి ఒక వృత్తిలో పనిచేసే వారందరికి ఒకే వేతనం చెల్లించడం.

ప్రశ్న 8.
పనిని బట్టి వేతనాలు అంటే ఏమిటి ?
జవాబు.
శ్రామికుల ఉత్పాదకత, నైపుణ్యం బట్టి చెల్లించే వేతనంను పనిని బట్టి వేతనం అంటారు.

TS Board Inter First Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

ప్రశ్న 9.
స్థూల వడ్డీ అంటే ఏమిటి ?
జవాబు.
ఋణం తీసుకున్న వ్యక్తి తాను తీసుకొన్న మొత్తంతో పాటు అదనంగా ఋణదాతకు ఎంత చెల్లిస్తున్నాడో, మొత్తాన్ని స్థూల వడ్డీ అంటారు.

ప్రశ్న 10.
నికర వడ్డీ అంటే ఏమిటి ?
జవాబు.
మూలధన సేవలకు మాత్రమే ఇచ్చే ప్రతిఫలం.
ఉదా : ప్రభుత్వ బాండ్లు, ప్రభుత్వ ఋణాలపై వడ్డీ.

ప్రశ్న 11.
స్థూల లాభం అంటే ఏమిటి ?
జవాబు.
రాబడి నుండి ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలు, తరుగుదల తీసివేయగా మిగిలినది స్థూల లాభం. స్థూల లాభం = నికర లాభం + అప్రకటిత భాటకం + అప్రకటిత వేతనం + అప్రకటిత వడ్డీ + తరుగుదల + భీమా చెల్లింపులు.

TS Board Inter First Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

ప్రశ్న 12.
నికర లాభం అంటే ఏమిటి ?
జవాబు.
వ్యవస్థాపకుని సేవలకు మాత్రమే వచ్చే ప్రతిఫలం నికర లాభం.
నికర లాభం = స్థూల లాభం – అప్రకటిత భాటకం + అప్రకటిత వేతనం + అప్రకటిత వడ్డీ + తరుగుదల + భీమా చెల్లింపులు.

TS Inter 1st Year Telugu Study Material Poem 6 మహైక

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 6th Poem మహైక Textbook Questions and Answers.

TS Inter 1st Year Telugu Study Material 6th Poem మహైక

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు – సమాధానములు

ప్రశ్న 1.
‘మహైక’ పాఠ్యభాగ సారాంశాన్ని వివరించండి?
జవాబు:
‘మహైక’ అనుపాఠ్యభాగం “తిరుగుబాటు సాహిత్యంలో ధ్రువతారగ’ పేరుపొంది న కవిరాజుమూర్తిచే రచించబడిన ‘మహైక’ అను దీర్ఘకవిత నుండి గ్రహించబడింది. తెలంగాణలో నియంతృత్వ, భూస్వామ్య అధికారుల పీడనలకు వ్యతిరేకంగా కవిరాజుమూర్తి పోరాడాడు.

మహైక దీర్ఘకవిత సమాజంలో ఆధునికతను కోరుకుంటూ ప్రయోగాత్మకంగా నడచిన కవిత. ఇది సామాన్య మానవుడు, కవి, కార్మికుడు, పతతి పాత్రల పరస్పర సంభాషణలతో కూడి ఉన్నది. నేటి నాగరిక సమాజంలో తాను అనుభవిస్తున్న కష్టాలను, వేదనలను, నిరాశతో నిట్టూర్పుతో కవి చెప్పటం ఈ కవిత లోని ప్రధానాంశం. సమాజానికి ప్రాతినిథ్యం వహిస్తున్నవారిని ఓదారుస్తూ మనిషిపై మనిషికి విశ్వాసం తగ్గకుండా ప్రోత్సహించే విప్లవ రచన ఇది.

భవిష్యత్తుపై ఆశలను నిలుపుతూ మానవీయ లక్షణాలను పెంపొందిస్తూ అసమానతలు లేని సోషలిజానికి దారులు వేసిందీ కవిత. దీర్ఘకవితను చదివినపుడు ఏడో నూతన లోకాన్ని చూసినట్లుంది అంటారు. ఈ కావ్యానికి ముందుమాట రాసిన బెల్లకొండ రామదాసు, రెంటాల గోపాలకృష్ణులు. ‘మహైకా’ను చదువుతుంటే టి.ఎస్. ఇలియట్ వేస్టాండ్ జ్ఞాపకం వస్తుంది. చిలి దేశ మహాకవి ‘పోబ్లో నెరుడా’ ఎలాంటి కవో తెలుగులో మూర్తి అలాంటివాడు.

తోటమాలి తనని తాను బలిదానంగా సమర్పించుకుంటేనే పువ్వులు పరిమళాలను వెదజల్లుతాయి. మనిషి మనిషి కలిస్తేనే దేశం వృద్ధి చెందుతుంది. యుగ యుగాల నైరాశ్యం మన బతుకులను నాశనం చేస్తున్నది. చేయి చేయి కలిపి సోమరితనాన్ని వదలిపెట్టి ఆనందంతో శ్రమ చేస్తే అందరికి సంతోషం భూగోళానికి నూతనత్వం వస్తాయి.

అన్నలూ, అక్కలూ మీకు తెలియనిదేమున్నది. సముద్రపు నీరంతా ఉప్పే. త్రాగటానికి పనికిరాదు. మండే మంటంతా నిప్పే ప్రక్కనున్న వాటిని కూడా దహిస్తుంది. ఆకలితో ఆహారాన్ని కోరటం తప్పుకాదు. నిస్సత్తువ ప్రాణానికే ప్రమాదకరం.

కుండలు వేరైనా మట్టి ఒక్కటే, రంగులు వేరైనా మానవులంతా ఒక్కటే. కొమ్మలు రెమ్మలు వేరైనా అవి వృక్షంలో భాగాలే. ఎన్ని దేశాలున్నా మానవులంతా ఒక్కటే. మానవులలో భేదాలు సృష్టి మానవ వినాశనానికి దారి తీస్తుంది. అందరం ఒకటిగా నడిస్తే ప్రమాదాలను దాటగలం అని ఐకమత్యాన్ని గూర్చి ‘మహైక’ కవిత వివరిస్తుంది.

TS Inter 1st Year Telugu Study Material Poem 6 మహైక

ప్రశ్న 2.
‘మహైక’ కవితలో కవి ఆశయాన్ని విశ్లేషించండి?
జవాబు:
‘మహైక’ అను పాఠ్యభాగం కవిరాజుమూర్తి చే రచించబడిన ‘మహైక ‘ దీర్ఘ కవిత నుండి గ్రహించబడింది. ఈ కవితలో అభ్యుదయ భావాలే కాదు. ఆధునికతను అడుగడుగునా కవి చూపించాడు. సంక్షిప్తత సాంద్రత ఈ రచనా ప్రధాన లక్షణం.

‘మహైక’’ దీర్ఘకవిత సామాన్య మానవుడు, కవి, కార్మికుడు పతితల పాత్రల పరస్పర సంభాషణలతో నడుస్తుంది. నాగరిక సమాజంలో తాను అనుభవిస్తున్న కష్టాలను, వేదనలను, నిరాశతో నిట్టూర్పులతో నివేదించటం ఈ రచనలోని విశేషం. ఈ రచనలోని ప్రధానాంశం. సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని ఓదారుస్తూ మనిషి తనపై తాను విశ్వాసాన్ని కోల్పోకుండా ఒక విముక్తిని విప్లవాత్మక ధోరణిలో చూపించాడు మూర్తి. భవిష్యత్తుపై ఆశలను పెంచుతూ, మానవీయ విలువల ప్రాధాన్యతను ఈ కవిత ద్వారా తెలియచేశాడు.

మనిషి శ్రమిస్తేనే జీవితంలో విజయాలను అందుకోగలడు. ఐకమత్యంతో మెలగితేనే అభివృద్ధి సాధించగలుగుతాడు.

“చరిత్రలు మన ఉనికికి కావు ప్రమాణం
ధరిత్రిని వెనక్కి నెట్టి చేయాలి ప్రయాణం” అంటాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 6 మహైక

రంగులు, వర్ణాలు మానవులను విడదీయకూడదు. ప్రతి ఒక్కరూ చేయీ, చేయీ కలిపి నడిస్తేనే విజయం అన్నాడు. మనిషి ఎప్పుడూ సోమరి పోతుగా మారకూడదు. నిత్య చైతన్యంతో బతకాలి.

“మనలో మన చీలిక
మన పతనానికి ఏలిక
మలోమన చీలిక
మత్యుదేవతకు నాలిక”

కాబట్టి నూతన భావాలతో ఐకమత్యంగా జీవించి జగత్తును శాసిద్ధాం అఅని ‘మహైక’ కవిత ద్వారా మూర్తి తన ఆశయాలను వివరించాడు.

II. సంగ్రహరూప ప్రశ్నలు- సమాధానాలు

ప్రశ్న 1.
కవిరాజు మూర్తి రచనలను పేర్కొనండి?
జవాబు:
‘మహైక’ అను పాఠ్య భాగము కవిరాజు మూర్తిచే రచించబడిన ‘మహైక’ ‘దీర్ఘ కవిత’ నుండి గ్రహించబడింది. మూర్తిగారు ఉన్నత కుటుంబంలో పుట్టినా ఆనాటి నియంతృత్వ, భూస్వామ్య అధికారులు పీడనకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. రైతుల పక్షాన, అణగారిన పీడిత ప్రజల పక్షాన మధ్యతరగతి జీవుల కోసం రచనలు చేశాడు.

మూర్తిగారు దీర్ఘకవితలు రాసిన తొలితరం కవులలో అగ్రగణ్యులు. మహైక, ప్రణుతి, మానవ సంగీతం దీర్ఘకవితా సంపుటాలను వ్రాసారు. “మైఁగరీబ్ హుఁ” ఉర్దూనవలలను రాసి జవహర్లాల్ నెహ్రూకు అంకితం చేశాడు. గిడుతూరి సూర్యం తెలుగులోకి అనువదించాడు. హీరాలాల్ మోరియా ఉర్దూలో రాసిన కావ్యాన్ని మహాపథంగా తెలుగులోకి అనువదించారు.

గాంధీజీ దివ్య చరితను జముకుల కథగా రాసాడు. ఉర్దూలో ‘లాహుకే లఖీర్’ అంగారే. తెలుగులో చివరి రాత్రి, మొదటి రాత్రి జారుడు బండ నవలలను రచించాడు. నవయుగ శ్రీ పేరుతో గేయాలు, ఉర్దూ పారశీకవుల గజళ్ళు “మధుధారలు” పేరుతో ముక్త కాలుగా రాశాడు” తిరుగుబాటు సాహిత్యంలో ధ్రువతారగా దాశరథి చేత ప్రశంసించబడ్డాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 6 మహైక

ప్రశ్న 2.
‘మహైక’లోని ఐకమత్య భావనలను వివరించండి.
జవాబు:
‘మహైక’ అను పాఠ్యభాగము ‘కవిరాజు మూర్తి’చే రచించబడిన ‘మహైక’ దీర్ఘకవిత నుండి గ్రహించబడింది.

“మానవుడు కలవాలి మానవుణ్ణి
తిడితే ఏం లాభం కనిపించని దేవుణ్ణి”

మానవులు ఐకమత్యంతో మెలగాలని లేనిపక్షాన మానవజాతికి విముక్తి లేదన్నాడు. అన్నదమ్ములుగా జాతివర్ణ భేదం లేకుండా చేయి చేయి కలిపి ముందుకు నడవాలి. అందుకు అక్క చెల్లెళ్ళు ఆనందగీతికలను ఆలపిస్తూ చైతన్యంతో అందరిని ఏకతాటిపైకి తీసుకురావాలి. అదే భూమికి నూతనత్వం అన్నాడు.

“రంగులు జాతులు
కావు మనకు జ్ఞాతులు
మనమంతా మానవులం
కలయికలో ఉంది జయం”

రంగులు, జాతులు అని చూడకుండా మనమంతా మానవులం అనే భావనతో ఐకమత్యంగా ఉండాలని లేని యెడల

“మనలో మన చీలిక
మన పతనానికి ఏలిక”.

అని ఐకమత్యాన్ని గురించి ‘మహైక’ కవితలో మూర్తిగారు వివరించారు.

TS Inter 1st Year Telugu Study Material Poem 6 మహైక

ప్రశ్న 3.
కవిరాజుముర్తి దృక్పథాన్ని తెలపండి.
జవాబు:
‘మహైక’ అను పాఠ్యభాగము ‘కవిరాజమూర్తి’ చే రచించబడిన ‘మహైక’ అను దీర్ఘకవిత నుండి గ్రహించబడింది. మూర్తిగారు నాగరిక సమాజంలో తాను అనుభవిస్తున్న కష్టాలను వేదనలను నిరాశతో, నిట్టూర్పులతో నివేదించటం జరిగింది. సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని ఓదార్చుతూ విశ్వాసం కోల్పోకుండా విప్లవాత్మక ధోరణిలో ఊతాన్నివ్వాలని చూశాడు. భవిష్యత్తుపై ఆశను ప్రేరేపిస్తూ మానవీయ విలువలను -పెంపొందిస్తూ అసమానతలు లేని సోషలిజాన్ని కోరుకున్నాడు.

ఈ ‘మహైక’ కావ్యాన్ని చూసిన్పుడు ‘ఏదో నూతన లోకాన్ని చూసినట్లుంది’ అన్న బెల్లంకొండరామదాసు, రెంటాల గోపాల కృష్ణ మాటలను బట్టి కవి నూతన దృష్టి ఎంతటిదో మనకు అర్థమౌతుంది. ఈ కావ్యాన్ని తెలంగాణ యోధుడు “సర్దార్జమలాపురం కేశవరావుకు అంకితం ఇవ్వడంలోనే కవి అభ్యుదయ విప్లవాత్మక దృక్పధాలు మనకు తెలుస్తున్నాయి.

ప్రశ్న 4.
‘మహైక’ కావ్య విశిష్టతను వర్ణించండి?
జవాబు:
‘మహైక కావ్యం ‘కవిరాజుమూర్తి’చే రచించబడిన ‘మహైక’ దీర్ఘకవిత కావ్యం నుండి గ్రహించబడింది. వచన కవితా ప్రక్రియలో వచ్చిన దీర్ఘకావ్యం ‘మహైక’, ఇది సెప్టెంబరు 1953లో ప్రచురించబడింది. ఇది సామాన్య మానవుడు, కవి, కార్మికుడు, పతితల పాత్రల పరస్పర సంభాషణలతో సాగింది. నాగరిక సమాజంలో తాను అనుభవిస్తున్నకష్టాలను, వేదనలను, నిరాశతో నిట్టూర్పులతో నిర్వేదంగా నివేదించుట ఈ కావ్యంలోని ముఖ్య అంశం.

TS Inter 1st Year Telugu Study Material Poem 6 మహైక

భవిష్యత్తుపై ఆశలను ప్రేరేపిస్తూ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నవారిని రక్షిస్తూ మానవ విలువలను తెలియచేస్తూ అసమానతలు లేని సోషలిజానికి ‘మహైక కావ్యం బాటలు వేసింది. దీనికి ముందు మాటలు రాసిన బెల్లంకొండ రామదాసు, రెంటాల గోపాలకృష్ణ మాటలలో “మహోజ్వలమైన ఈ ‘మహైకా’ కావ్యం చదివినపుడు ఏదో నూతనలోకాన్ని చూసినట్టుంది” అన్న మాటలే ఈ కావ్యం యొక్క విశిష్టతను తెలియజేస్తున్నాయి. ఈ కావ్యాన్ని తెలంగాణ పోరాటయోధుడు ‘జమలాపురం కేశవరావుకు అంకితం ఇచ్చినపుడే కవి అభ్యుదయ విప్లవాలు తెలుస్తున్నాయి. దీర్ఘ కవితలలో ‘మహైక’ అత్యంత విశిష్ట కావ్యంగా పేర్కొనవచ్చు.

III. ఏకపద/వాక్య సమాధాన ప్రశ్నలు- సమాధానాలు

ప్రశ్న 1. కవిరాజు మూర్తి నెలకొల్పిన సాహిత్య సంస్థ పేరు ఏమిటి?
జవాబు:
‘ప్రజాసాహిత్య పరిషత్తు’ను ఖమ్మంజిల్లాలో స్థాపించాడు.

ప్రశ్న 2.
‘మై గరీబు’ నవలనను ఎవరికి అంకితమిచ్చాడు?
జవాబు:
భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూకి అంకితమిచ్చాడు.

ప్రశ్న 3.
‘మహైక’ కావ్యాన్ని ఎవరు అంకితంగా స్వీకరించారు?
జవాబు:
తెలంగాణ యోధుడు ‘సర్దార్ జమలాపురం కేశవరావుకు అంకితమిచ్చాడు.

ప్రశ్న 4.
కవిరాజుమూర్తిని ఏ మహాకవితతో పోల్చవచ్చు?
జవాబు:
చిలీ దేశ మహాకవి! బ్లో నెరుడాపాతో పోల్చవచ్చు.

ప్రశ్న 5.
పువ్వులు పరిమళాన్ని ఎప్పుడు వ్యాపింపచేస్తాయి?
జవాబు:
తోటమాలి బలిదానం చేసినపుడు

TS Inter 1st Year Telugu Study Material Poem 6 మహైక

ప్రశ్న 6.
మానవజాతికి ఎప్పుడు మేలు కలుగుతుంది?
జవాబు:
మానవత్వంతో మెలగినపుడు

ప్రశ్న 7.
మనలో మన చీలిక వల్ల కలిగే నష్టాలు ఏమిటి?
asn:
మనలో మన చీలిక మన పతనానికి దారి తీస్తుంది. మృత్యువు దరికి చేరుస్తుంది.

ప్రశ్న 8.
మనిషి ఏవిధంగా బ్రతకాలి ?
జవాబు:
మనిషి మనిషిగా మానవత్వంతో బ్రతకాలి.

IV. సందర్భ సహిత వాఖ్యలు

ప్రశ్న 1.
చరిత్రలు మన ఉనికిని కావు ప్రమాణం
జవాబు:
పరిచయం :
ఈ వాక్యము కవిరాజు మూర్తిచే రచించబడిన ‘మ హైక’ దీర్ఘకవితా గ్రంథము నుండి గ్రహించబడింది.

సందర్భము :-
మానవజాతి చరిత్రలను వివరిస్తున్న సందర్భం లోనిది.

భావము :
మానవత్వమొక్కటే మానవజాతికి శ్రేయస్కరమైనది. చరిత్రలు మన ఉనికి ప్రమాణం కాదని ఇందలి భావం.

TS Inter 1st Year Telugu Study Material Poem 6 మహైక

ప్రశ్న 2.
రంగులు వేరైనా నరజాతి నరంగు మానవత్వమే.
జవాబు:
పరిచయము :-
ఈ వాక్యము కవిరాజుమూర్తిచే రచించబడిన ‘మహైక’ అను దీర్ఘ కవితా సంపుటి నుండి గ్రహించబడింది.

సందర్భము :-
కవి మానవతను గూర్చి వివరించిన సందర్భంలోనిది.

భావము :
ఏడురంగుల సమ్మేళనం ఇంద్రధనస్సు. కాని దాని ఛాయ ఒకటే. ఏడు రంగుల సమ్మేళం అయినా చంద్రుని కాంతి తెలుపే. ఎన్ని వర్ణాలవారున్నా మానవులు నందరిని నడిపించే సరంగు మానవత్వమే అని ఇందలి భావము.

ప్రశ్న 3.
మనలోమన చీలిక మృత్యుదేవకి నాలుక.
జవాబు:
పరిచయం :-
ఈ వాక్యము కవిరాజు మూర్తిచే రచించబడిన ‘మహైక’ దీర్ఘ కావ్య సంపుటి నుండి గ్రహించబడింది.

సందర్భము : :-
కవి మానవులలో ఐకమత్యము యొక్క ఆవశ్యకతను వివరించిన సందర్భం లోనిది.

భావము :-
మనమంతా మానవులం. రంగు రూపు వేరైనా మానవజాతి ఒక్కటే. అందుకే మానవజాతి అంతా ఐకమత్యంతో మెలగాలి. లేని ఎడల, మానవుల మధ్య చీలికలు వచ్చిన ఎడల అది జాతి పతనావస్థకు దారి తీస్తుంది. మఋత్యువుకు దగ్గర చేస్తుందని ఇందలి భావం.

TS Inter 1st Year Telugu Study Material Poem 6 మహైక

ప్రశ్న 4.
అంబరాన్ని చుంబించాలి మనం
జవాబు:
పరిచయం :-
ఈ వాక్యము కవిరాజు మూర్తిచే రచించబడిన ‘మహైక ‘ దీర్ఘకవితా సంపుటి గ్రంథం నుండి గ్రహిబచబడినది.

సందర్భము :-
మానవుడు అభ్యుదయ భావనలతో భవిష్యుత్తుపై ఆశలతో బ్రతకాలని చెప్పిన సందర్భము లోనిది.

భావము :-
మానవులంతా ఆశాపాశాలతో బ్రతకాలి. ఆకాశమంత ఎత్తుకు ఎదిగి అనంతమైన ఈ ప్రపంచాన్ని శాసించాలి. ప్రపంచ మానవులంతా సోదర భావంతో మెలగాలని ఇందలి భావం.

V. సంధులు

1. భానోదయము = భాను+ఉదయము = సవర్ణదీర్ఘ సంధి
సూత్రము :- అ, ఇ, ఉ, ఋ వర్ణములకు సవర్ణములైన అచ్చులు పరమైనచో వానికి దీర్ఘములు ఏకాదేశమగును.

2. లేదెన్నటికి = లేదు+ఎన్నటికి – లేదెన్నటికి – ఉకారసంధి/ఉత్వసంధి
సూత్రము :- ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధియగు

3. సంగమమైనా = సంగమము +ఐన – సంగమమైనా – ఉ.కార సంధి/ఉత్వసంధి
సూత్రము :- ఉత్తనకచ్చు పరంబగునపుడు సంధియగు

4. వేరైనా = వేరు+ఐన – వేరైన – ఉత్వసంధి /ఉ. కార సంధి
సూత్రము :- ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు.

TS Inter 1st Year Telugu Study Material Poem 6 మహైక

5. క్షణమాగాలి = క్షణము + ఆగాలి – క్షణమాగాలి – ఉకార సంధి/ఉత్వసంధి
సూత్రము ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగును.

6. నలుపైన = నలుపు +ఐన = నలుపైన – ఉకార సంధి/ఉత్వసంధి

VI. సమాసాలు

1. సప్తరంగులు – వైరి సమాసం
2. నరజాతి – నరుల యొక్క జాతి – షష్ఠీతత్పురుష సమాసం
3. యమపాశము – యముని యొక్క పాశము – షష్ఠీతత్పురుష సమాసం
4. ఆహ్లాదగీతిక – ఆహ్లాదమైన గీతిక – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
5. భానుకాంతి – భానుని యొక్క కాంతి – షష్ఠీతత్పురుష సమాసం
6. ఉదధి నీరు – ఉదధి యందలి నీరు – సప్తమీ తత్పురుష సమాసం

అర్థతాత్పర్యాలు

1వ పద్యం :

తోటమాలి బలిదానం చేస్తేనే
పువ్వులు పరిమళాల నీపగలవు.
మానవుడు కలవాలి మానవుణ్ణి
తిడితే ఏం లాభం కన్పించని దేవుణ్ణి

అర్థాలు :-
తోటమాలి = తోటకు కాపలాదారు
బలిదానం = జీవితాన్ని బలిచేస్తేనే
పరిమళాలన్ = సువాసనలను
ఈవగలవు = ఇస్తాయి

భావము :
తోటమాలి తన జీవితాన్ని బలిదానంగా చేస్తేనే పువ్వులు సువాసనలను వెదజల్లుతాయి. మానవులు ఒకరితో ఒకరు కలిసి పోవాలి. మనం చేయాల్సింది చేయకుండా దేవుని తిడితే ప్రయోజనం ఏమిటి?

TS Inter 1st Year Telugu Study Material Poem 6 మహైక

2వ పద్యం :

అకాశానికి శోభ చందమామ.
మిణుగురుతో విద్యుత్ కాంతులు ప్రసరించవు.
ఘరాలి నేటి నాటు వ్యక్తి
కాకుంటే లేదెన్నటికి విముక్తి

అర్థాలు :
శోభ = అందం
ప్రసరించవ = సోకవు
విముక్తి = విడుదల

భావం :
చందమామ ఆకాశానికి అందాన్నిస్తుంది. మిణుగురు పురుగుకాంతితో విద్యుత్ కాంతులు వ్యాప్తించవు. మనిషికి మార్పు తప్పనిసరి. అలా మారకపోతే విముక్తే లేదు మనిషికి.

3వ పద్యం :

మానవునికి మానవుడే ధ్యేయం
మానవత్వమే మానవతానికి శ్రేయం
చరిత్రలు మన ఉనికికి కావు ప్రమాణం
చరిత్రిని వెనక్కి నెట్టి చేయాలి ప్రయాణం

అర్థాలు :
ధ్యేయం = లక్ష్యము
మానవత్వము = మంచి చెడులను తెలుసుకుని ప్రవర్తించటం
శ్రేయం = మంచిది
ఉనికి = జాడ
ధరిత్రి = భూమి
ప్రమాణం = కొలత

భావం :
మానవునకు మానవుడే లక్ష్యంకావాలి. మానవత్వము మానవజాతికి మేలును చేకూరు స్తుంది. చరిత్రకు ఉనికికి కొలబద్దకాదు. ధరిత్రిని గెలిపించటానికి మనందరం ప్రమాణం చేయాలి.

TS Inter 1st Year Telugu Study Material Poem 6 మహైక

4వ పద్యం :

మనం కోరే క్షణం శాంతి
జగత్కల్యాణానికి కాదు క్రాంతి
మన కాళ్ళల్లోని బొబ్బలు
దౌర్జన్యానికి చావుదెబ్బలు

అర్ధాలు :
శాంతి = ప్రశాంతత
జగత్ = భూమియొక్క
కళ్యాణానికి = శుభానికి
క్రాంతి = వెలుగు

భావం :
మనం కోరుకునే క్షణం ప్రశాంతత ఈలోకాలకు శుభాల నివ్వాలి. మన కాళ్ళలోని బొబ్బలు దౌర్జన్యానికి నిజంగా చావు దెబ్బలే!

5వ పద్యం :

ఆకాశంలో ఎగిరే కీరం
ఎల్లప్పుడు తిరిగే గోళం
మధురగీతికలు పాడే గోళం
విశ్రాంతిని కోరవు నిజం

అర్థాలు :
కీరం = చిలుక
మధుర = మధురమైన
గీతికలు = గేయాలు
గళం = గొంతుక

భావం :
ఆకాశాన ఎగిరే చిలుక ఎల్లవేళల పరిభ్రమిస్తూనే ఉంటుంది. అందమైన గీతాలను ఆలపించే గొంతుక విశ్రాంతిని ఎరుగదు.

TS Inter 1st Year Telugu Study Material Poem 6 మహైక

6వ పద్యం :

యుగయుగాల నైరాశ్యం
మన బ్రతుక్కియమపాశం
తరతరాల ఈ శాంతం
మనజీవిత ఆసాంతం

అర్ధాలు :
నైరాశ్యం = నిరాశ
యమపాశ = ముగింపు
ఆసాంతం = చివరి వరకు

భావం:
యుగయుగాలుగా మానవులలో గూడుకట్టుకున్న నిరాశ నిస్పృహలు మన బ్రతుకులకు. యమపాశాలు. తరతరాల ప్రశాంతతను జీవితాంతం కావాలని ఆశించాలి.

7వ పద్యం :

అడుగడుగు కదలికలో
అవవీగర్భం కంపించాలి.
మనకన్నుల కాంతి ప్రసరణతో
కాలగమనం క్షణమాగాలి.

అర్ధాలు :
అడుగడుగున = ప్రతి అడుగులో
అవని = భూమి
కంపించాలి = కదలిపోవాలి
ప్రసరణ = అలముకొను వ్యాపించు
గమనం = ప్రయాణం

భావము:
మన ప్రతి అడుగు కదలికలో భూమి కంపించి పోవాలి. మన కన్నుల కాంతి అలముకొని కాలగమనం క్షణకాలం ఆగిపోవాలి.

TS Inter 1st Year Telugu Study Material Poem 6 మహైక

8వ పద్యం :

అన్నలూ
చేతులో చేతులు కలపండి.
విశ్రాంతిని విసర్జించి నడవండి.
అక్కలూ
” ఆహ్లాదగీతిక లాలాపించండి.
ఆనందంతో కందళిస్తూ కదలండి.
మనందరి ఏకత్వం
పృథ్వీకి నవ్యత్వం

అర్ధాలు :
విసర్జించు = వదలివేయు
ఆహ్లాదగీతికలు = సంతోష గేయాలు
ఆలపించండి = పాడండి
కందళిస్తూ = వికసిస్తూ
పృథ్వీ = భూమి
నవ్యత్వం = నూతనత్వం

భావము :
అన్నా తమ్ములు చేతిలో చేయివేసి ముందుకు కదలండి. బద్దకాన్ని వదలివేసి ముందుకు నడవండి. అక్కా చెల్లెళ్ళు మీరు ఆనందకర గీతాలను పాడండి. ఆనందంతో అంకురంలా వికసిస్తూ కదలండి. మనమధ్య ఏకత్వం కావాలి. ఐకమత్యంగా ముందుకు నడవాలి. అపుడే ఈ భూమిపై నూతనత్వం వెల్లివిరుస్తుంది.

9వ పద్యం :

అన్నలూ విన్నారా ?
అక్కలూ విన్నారా ?
ఉదధి నీరు అంతటా ఉప్పే ?
మందే మంట అంతా నిప్పే ?
ఆకలికి అన్నం కోరడం ఒప్పే ?
దౌర్జన్యం ప్రతి దేశంలో తప్పే
నిర్వీర్యత ప్రాణానికి ముప్పే

అర్ధాలు :
ఉదధి = సముద్రము
నిర్వీర = పౌరుషము లేని తత్వం
ముప్పే = ప్రమాదమే!

భావము :
అన్నలూ అక్కలూ విన్నారా! సముద్రపునీరు అంతా ఉప్పే. త్రాగటానికి పనికిరాదు. మండుతున్న మంట అంతా నిప్పుతో కూడి ఉంటుంది. అది తన దగ్గరకు వచ్చిన వాటిని కూడా మండిస్తుంది. ఆకలి వేసినపుడు అన్నాన్ని కోరటం తప్పేమీకాదు. దౌర్జన్యం ఈ లోకానికి అపరాధమే! పౌరుషం లేకపోతే మనల్నిం మనం కాపాడుకోలేం!

TS Inter 1st Year Telugu Study Material Poem 6 మహైక

10వ పద్యం :

సప్తరంగుల సంగమమైనా.
ఇంద్ర ధనస్సు ఛాయ ఒకటే
ఏడు రంగుల కూడికఐనా
భానుకాంతి తెలుపే
రంగులు వేరైనా నరజాతి.
స రంగు మానవత్వమే
చంద్రికలను వెదజల్లే చందమామ నలుపైనా
చంద్రుడు నలుపని మనమనగలమా!

అర్ధాలు :
సప్తరంగులు = ఏడురంగులు
ఛాయ = నీడ
కూడిక = కలయిక.
సరగు = మనలను నడిపించేది
మానవత్వమే = మానవతే
చంద్రికలు = వెన్నెల
వెదజల్లే = వ్యాపింపచేయు

భావము :
ఏడురంగులను కలిగియున్నా ఇంద్రధనస్సునీడ ఒకటే ఏడు రంగులతో ఉన్నా చంద్రుని కాంతి తెలుపే! మానవులలో వివిధ వర్ణాల వారు ఉన్నా అందరిని నడిపించేది. మానవత్వమే.

TS Inter 1st Year Telugu Study Material Poem 6 మహైక

11వ పద్యం :

రంగులు జాతులు
కావు మనకు – జ్ఞాతులు
కుండలు చేరైనా
మృత్తిక ఒకటే
కొమ్మలు, రెమ్మలు వేరైనా
ఏక వృక్ష భాగాలే!
మనమంతా మానవులం
కలయికలో ఉంది బలం.
మనలో మన చీలిక
మన పతనానికి ఏలిక
మనలో మన చీలిక
మృత్యుదేవికి నాలుక

అర్ధాలు :
జ్ఞాతులు = పినతండ్రి, పెదతండ్రి
మృత్తిక = మట్టి
చీలిక = వేరు బడుట

భావము :
రంగులు జాతులు మనకి జ్ఞాతులు. కుండలను ఎన్ని రకాలుగా మలచినా వాటికి మూలం మట్టే. కొమ్మలు రెమ్మలు వేరుగా కన్పిస్తున్నా అవన్నీ ఒక చెట్టు భాగాలే! మానవులంతా కలిసి బతకాలి ఐకమత్యంలోనే బలం ఉంది. ఐకమత్యాన్ని కోల్పోతే మనల్ని మనం కోల్పోయినట్లే.

TS Inter 1st Year Telugu Study Material Poem 6 మహైక

12వ పద్యం :

ఆశాపాశాలతో
బ్రతకాలి మనం
అంబరాన్ని ముంచించాలి మనం
అనంత విశ్వాన్ని శాసించాలి మనం
అఖిల జగత్పాదరుల
కలవాలి మనం

అర్థాలు :
ఆశాపాశాలు = కోరికలనే భావనలు
అంబరాన్ని = ఆకాశాన్ని
చుంబించాలి = ముద్దు పెట్టుకోవాలి
అనంతం = అంతమనేది లేని
శాసించు = నియంత్రించు
జగత్ + సోదరులం = ప్రపంచ సోదరులము

భావము :
ఆశలను చిగురింపచేసుకుని మనం బతకాలి. ఆకాశమంత ఎత్తుకు ఎదిగి మనం పరిధులు లేని ప్రపంచాన్ని నియంత్రించాలి. ప్రపంచం మొత్తంలో ఉన్న అందరికి స్నేహస్తం అందించాలి.

TS Inter 1st Year Telugu Study Material Poem 6 మహైక

13వ పద్యం :

భానూదయం కాకపోడు.
నేటి చీకటి రేపురాదు.
చేతికి చేయి కలిస్తే
రెండవక మానవు
మానవుడు మానవుణ్ణి కలిస్తే
బాధలు తీరకపోవు.

అర్థాలు :
భానూదయం = సూర్యోదయం

భావము :
సూర్యోదయం రాకపోదు. నేడు ఉన్న చీకటి రేపు ఉండకపోవచ్చు. చేయికి చేయి కలిస్తే మరింత బలం చేకూరుతుంది. మానవులంతా కలిసిమెలసి ఉంటే బాధలన్నీ మానవు.

మహైక Summary in Telugu

కవి పరిచయం

కవి : కవిరాజుమూర్తి (సర్వదేవభట్ల నరసింహమూర్తి)

పుట్టిన తేదీ : అక్టోబరు 1926

పుట్టిన ఊరు : ఖమ్మం జిల్లా పిండిప్రోలు గ్రామం

రచనలు :

  • మహైక
  • ప్రణుతి
  • మానవ సంగీతం

ఉర్దూ అనువాదాలు : –

  • మైగరీబ్ హు
  • హీరాలాల్ మోరియా రాసిన ఉర్దూ కావ్యం మహాపధంగా తెలుగుకు అనువాదించారు.
  • జముకుల కథ, నవలలు
  • గాంధీజీ జీవిత చరిత్ర
  • లాహుకే, లభీర్, నవలలను ఉర్దూలోను, చివరిరాత్రి, మొదటిరాత్రి, జారుడు బండ నవలలను వ్రాశాడు

గేయాలు :

  • నవయుగ శ్రీ పేరుతో రాశాడు.
  • ఉర్దూ పారశీకవుల గజళ్ళను ‘మధురధారలుగా’ ముక్తకాలుగా తెచ్చారు.

TS Inter 1st Year Telugu Study Material Poem 6 మహైక

దాశరథి కృష్ణమాచార్యుల చేత “తిరుగుబాటు సాహిత్య ధ్రువతార” ప్రశంసలు అందుకున్న కవిరాజుమూర్తి అసలు పేరు ‘దేవభట్ల నరసింహమూర్తి’. వీరు అక్టోబరు 1926న ఖమ్మం జిల్లా పిండిప్రోలు గ్రామంలో జన్మించారు. బాల్యం విద్యాభ్యాసం అంతా ఖమ్మంజిల్లా మామిళ్ళ గూడెంలో సాగింది. ఉన్నత కుటుంబంలో పుట్టినా నాటి నియంతృత్వ భూస్వాముల అధికార పీడనకు వ్యతిరేకంగా పోరాడారు. స్వాతంత్య్ర సమయంలోను పాల్గొని జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. ఖమ్మం జిల్లాలో “ప్రజాసాహిత్య పరిషత్తును” స్థాపించారు.

తెలుగు వచన కవితారంగంలో దీర్ఘకవితలు రాసిన తొలి తరం కవులలో మూర్తి ముఖ్యుడు. వీరి ‘మహైకా’ మానవ సంగీతం, పణుతి దీర్ఘ కవితలు ప్రశంసలను అందుకున్నాయి. ‘మైగరీబు’ అన్న ఉర్దూ నవల మంచి గుర్తింపు పొందింది. దీనిని జవ హర్లాల్ నెహ్రూకు అంకితం చేశారు. దీనిని గిడుతూరి సూర్యం తెలుగులోకి అనువదించాడు.

ఉర్దూలో హీరాలాల్ మోరియా రాసిన కావ్యాన్ని ‘మహాపథం’ పేరుతో తెలుగులోకి మూర్తి అనువదించారు. గాంధీ దివ్య చరిత్రను ‘జముకుల’ కథా రూపంలో రచించాడు. ఉర్దూలో ‘లాహుకే, లఖీర్, అంగారే నవలలను తెలుగులో ‘చివరి రాత్రి’ ‘మొదటిరాత్రి’ జారుడుబండ నవలలను రాశాడు. తెలుగులో, నవయుగశ్రీ, పేరుతో గేయాలను, ఉర్దూ పారశీకవుల గజళ్ళను ముక్తకాలుగా రాశాడు.

పాఠ్యాంశ సందర్భం

వచన దీర్ఘకవితా రూపంలో వెలువడిన కావ్యం ‘మహైక’. దీనిలో సామాన్య మానవుడు, కవి కార్మికుడు, పతితల పాత్రల సంభాషణతో కూడి ఉంటుంది. నాగరిక సమాజంలో సామాన్యులు అనుభవిస్తున్న కష్టాలను, వేదనలను, నిరాశలో నిట్టూర్పులతో కవి నివేదించటం ఈ కవిత లోని ప్రధానాంశం. ఆనాటి నియంతృత్వ భూస్వామ్య, అధికారుల పీడనలను నేటి తరానికి తెయలిజేయాలనే ఈ రచన మూర్తి చేశారు.

పాఠ్యభాగ సారాంశం

‘మహైక’ అనుపాఠ్యభాగం “తిరుగుబాటు సాహిత్యంలో ధ్రువతారగ’ పేరు పొందిన కవిరాజు మూర్తిచే రచించబడిన ‘మహైక’ అను దీర్ఘకవిత నుండి గ్రహించబడింది. తెలంగాణ లో నియంతృత్వ, భూస్వామ్య అధికారుల పీడనలకు వ్యతిరేకంగా కవిరాజుమూర్తి పోరాడాడు.

మహైక దీర్ఘకవిత సమాజంలో ఆధునికతను కోరుకుంటూ ప్రయోగాత్మకంగా నడచిన కవిత. ఇది సామాన్య మానవుడు, కవి, కార్మికుడు, పతతి పాత్రల పరస్పర సంభాషణలతో కూడి ఉన్నది. నేటి నాగరిక సమాజంలో తాను అనుభవిస్తున్న కష్టాలను, వేదనలను, నిరాశతో నిట్టూర్పుతో కవి చెప్పటం ఈ కవిత లోని ప్రధానాంశం. సమాజానికి ప్రాతినిథ్యం వహిస్తున్నవారిని ఓదారుస్తూ మనిషిపై మనిషికి విశ్వాసం తగ్గకుండా ప్రోత్సహించే విప్లవ రచన ఇది.

TS Inter 1st Year Telugu Study Material Poem 6 మహైక

భవిష్యత్తుపై ఆశలను నిలుపుతూ మానవీయ లక్షణాలను పెంపొందిస్తూ అసమానతలు లేని సోషలిజానికి దారులు వేసిందీ కవిత. ఈ దీర్ఘకవితను చదివినపుడు ఏదో నూతన లోకాన్ని చూసినట్లుంది అంటారు. ఈ కావ్యానికి ముందుమాట రాసిన బెల్లకొండ రామదాసు, రెంటాల గోపాలకృష్ణులు. ‘మహైకా’ను చదువుతుంటే టి.ఎస్. ఇలియట్ వేస్టాండ్ జ్ఞాపకం వస్తుంది. చిలి దేశ మహాకవి ‘పోబ్లో నెరుడా’ ఎలాంటి కవో తెలుగులో మూర్తి అలాంటివాడు.

తోటమాలి తనని తాను బలిదానంగా సమర్పించుకుంటేనే పువ్వులు పరిమళాలను వెదజల్లుతాయి. మనిషి మనిషి కలిస్తేనే దేశం వృద్ధి చెందుతుంది. యుగ యుగాల నైరాశ్యం మన బతుకులను నాశనం చేస్తున్నది. చేయి చేయి కలిపి సోమరితనాన్ని వదలిపెట్టి ఆనందంతో శ్రమ చేస్తే అందరికి సంతోషం భూగోళానికి నూతనత్వం వస్తాయి.

అన్నలూ, అక్కలూ మీకు తెలియనిదేమున్నది. సముద్రపు నీరంతా ఉప్పే. త్రాగటానికి పనికిరాదు. మండే మంటంతా నిప్పే ప్రక్కనున్న వాటిని కూడా దహిస్తుంది. ఆకలితో ఆహారాన్ని కోరటం తప్పుకాదు. నిస్సత్తువ ప్రాణానికే ప్రమాదకరం.

కుండలు వేరైనా మట్టి ఒక్కటే, రంగులు వేరైనా మానవులంతా ఒక్కటే. కొమ్మలు రెమ్మలు వేరైనా అవి వృక్షంలో భాగాలే. ఎన్ని దేశాలున్నా మానవులంతా ఒక్కటే. మానవులలో భేదాల సృష్టి మానవ వినాశనానికి దారి తీస్తుంది. అందరం ఒకటిగా నడిస్తే ప్రమాదాలను దాటగలం అని ఐకమత్యాన్ని గూర్చి ‘మహైక’ కవిత వివరిస్తుంది.

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 5th Poem నాపేరు ప్రజాకోటి Textbook Questions and Answers.

TS Inter 1st Year Telugu Study Material 5th Poem నాపేరు ప్రజాకోటి

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు – సమాధానములు

ప్రశ్న 1.
‘నా పేరు ప్రజాకోటి’ కవితలో దాశరథి అందించిన సందేశాన్ని తెలియచేయండి?
జవాబు:
‘నాపేరు ప్రజా కోటి’ అను పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యులచే రచించిబడిన “పున్నవం” అను కవితాఖండిక నుండి గ్రహించబడింది. “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని తెలంగాణ వైభవాన్ని వివరించిన కవి దారశథి. ఆయన పీడిత ప్రజల వాణికి తన కవిత్వాన్ని ‘మైక్’గా అమర్చాడు.

కవి అయిన వానికి మానవత ఉండాలి. మంచి చెడులకు స్పందించే మనసుండాలి. అన్ని దృక్పధాలకు కేంద్ర బిందువుమానవుడే! తోటి మానవుని ప్రేమించ లేనివాడు దేనినీ ప్రేమించలేడు. గతాన్ని వర్తమానాన్ని నిశితంగా పరిశీలించి భవిషత్తుకు బాటలు వేయాలన్నాడు. మన దేశం అనాది నుండి శాంతి అహింసలకు ఉపాసించిందన్నాడు. విశ్వశ్రేయస్సును కోరేవారు భారతీయులని అభివర్ణించాడు. తనతో అందరిని కలుపుకోవటం అందరిలో తాను ఒకడిగా కలిసిపోవటమే భారతీయత. చెడు నుండి మంచి వైపుకు ప్రయాణం చేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.

అహింసను అలవరచుకోవాలి. హింసద్వారా విజయాన్ని పొందినవారు ఈ. ప్రపంచంలో ఎవరూ ఉండరు. అహింసే జీవిత పరమావధి కావాలని ఈ కవిత ద్వారా దాశరథి ప్రబోధించాడు.

గతమంతా బూది కుప్పకాదు. వర్తమానం అద్భుతమూ కాదు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుని నడిస్తేనే ప్రజా విజయ మౌతుందన్నాడు. ఎన్ని శక్తులను సాధించినా మానవత ముందు దిగదుడుపే. ఏ జెండా పట్టుకున్నా మైత్రీ బంధం కూర్చేనేరు అహింసకు మాత్రమే ఉంది. ప్రపంచంలో ఎక్కడ మానవున్నాడ వాడు మానవుడే. రంగు రూపు భేదమున్నా స్నేహం చేయటం నేర్చుకోవాలన్నాడు. హింసాత్మక ధోరణులను వదలి హాయిగా జీవనం గడపమని దాశరథి ఈ కవిత ద్వారా ప్రబోధించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

ప్రశ్న 2.
అహింస ఆవస్యకతను పాఠ్యాంశం ఆధారంగా వివరించండి?
జవాబు:
‘నాపేరు ప్రజాకోటి’ అను పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యులు రచించిన ‘పునర్నవం’ అను కవితా సంపుటి నుండి గ్రహించబడింది. భారతదేశం అనాది నుండి శాంతి అహింసలను ఉపాసించింది. విశ్వశ్రేయస్సును కోరుకుంది. తనలో అందరిని కలుపుకోవటం, అందరిలో తానై పర్యవసించటమే భారతీయత. హింసను ఆధారంగా చేసుకుని ప్రపంచంలో ఎవరూ విజయాన్ని సాధించ లేదు. అహింస జీవన పరమావధి కావాలని దాశరథి కోరుకున్నాడు.

“నిజం ఏమిటోగాని వట్టి చేతితో శత్రువు పైకి దుమికే శక్తి ఉంది”.

వట్టి చేతితో శత్రువుపైకి దూకేశక్తి అహింస సొంతం. మాటలనే ఈటెలుగా చేసుకుని ఎదిరించే బలం అహింసకున్నది. వీరశైనికుని కూడా చూసి భయపడని ఈ లోకం నన్ను చూసి భయపడుతుంది. నేను కోతల రాయుణ్ణిని భావించవద్దు. ఎర్రజెండా పట్టుకున్న వారిని పచ్చజెండా పట్టుకున్న వారిని కలిపే శక్తిఅహింసకున్నది. రాక్షసులతో కూడ స్నేహం చేయగల సత్తా అహింసా మార్గనికున్నది.

“హృదయం వినా నా దగ్గర ఏ వస్తువు లభింపదు
ఉదయం వినా నాకంటికి ఏ వస్తువూ రుచించదు”.

హృదయం నా ఆయుధం. ఉషోదయం తప్ప నాకు ఏదీ నచ్చదు. అణ్వస్రా లను అఘాతంలో పడవేసిన శక్తినాది. ప్రజల సుఖశాంతులే నాకు పరమావధి. ఘర్షణలో ఏనాటికీ ఆనందం లభించదు. కనుక లోకాలకు అహింస పరమావధికావాలి. అదే ప్రపంచానికి అవస్యం కావలసిన నీతి.

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

II. సంగ్రహరూప ప్రశ్నలు- సమాధానాలు

ప్రశ్న 1.
దాశరథి కవితా సంపుటాలను తెలియచేయండి?
జవాబు:
‘నాపేరు ప్రజాకోటి’ అన్న పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యులుచే రచించబడిన “పునర్నవం” కవితా సంపుటి నుండి గ్రహించ బడింది.

ఆధునికాంధ్ర సాహిత్యంలో దాశరథిది విశిష్ట స్థానం. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించిన దాశరథి పీడిత ప్రజల వాణికి తన కవిత్వాన్ని ‘మైక్’ గా అమర్చాడు. ఉర్దూ, తెలుగు సంస్కృం, ఆంగ్లభాషా సాహిత్యాలను అధ్యయనం చేశాడు.

వీరి కవితా సంపుటాలు అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, అమృతాభిషేకం, కవితాపుష్పకం ఆలోచనా లోచనలు, తిమిరంతో సమరం. మహాబోధి కథాకావ్య రచన చేశాడు. నవ మంజరి, దాశరథి బాలగేయాలు, ఖబడ్డార్ చైనా అన్న గేయ రచనలు చేసాడు. వీటితో పాటుగా ‘నవిమి’ నాటికల సంపుటిని వెలువరించాడు. దాశరథి శతకంతోపాటు గాలిబుగీతాలను తెలుగునకు అనువదించారు.

ప్రశ్న 2.
యుద్ధానికి సంబంధించి దాశరథి అభిప్రాయాలను తెలపండి?
జవాబు:’
నా పేరు ప్రజాకోటి’ అన్న పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యులుచే రచించబడిన “పునర్నవం” కవితా సంపుటి నుండి గ్రహించబడింది.

‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని నినదించిన దాశరథి తాడిత పీడితుల కోసం తన కవితను ‘మైక్’గా అమర్చాడు. ఒకరినొకరు ద్వేషించటం తగదని రాక్షస స్వభావం గల వారితో కూడా మైత్రిని చేయాలని అంటారు దాశరథి. ఆయన దృష్టిలో యుద్ధం రాక్షసక్రీడ. నవ సమాజానికి పనికిరానిది.

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

అందరికంటే ముందే
అణ్వస్త్రము గొనిపోయి
అఖాతాన పడవేసితి
సుఖపడగా ప్రజాకోటి”
అని అణ్వస్త్ర ప్రయోగాన్ని నిరసించాడు.
కత్తి పట్టి గెలిచినట్టి
ఘనుడగు వీరుండెవ్వడు
మెత్తని హృదయం దాటికి
తుత్తునియలు కానిదెవరు?
ఘర్షణలో ఏనాటికి
హర్షం లభియింపబోదు”

అని నవసమాజానికి యుద్ధం పనికిరాదని మెత్తని హృదయంతో అహింసా యుతంగా విజయాలను పొందాలని దాశరథి భావన.

ప్రశ్న 3.
పాఠ్యాంశంలోని కవి ప్రతిపాదించిన త్రికాల దృష్టిని వివరించండి ?
జవాబు:
‘నా పేరు ప్రజాకోటి’ అను పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన “పునర్నవం” అను కవితా సంపుటి నుండి గ్రహించబడింది. కవి అనేవాడు. మొదట మానవతా వాది కావాలి. కన్పించే మంచికి చెడుకు స్పందించే మనసుండాలి. గతాన్ని వర్తమానాన్ని భవిష్యత్తును తెలుసుకోగలగాలి.

గతకాలాన్ని మంచి కాలంగా భావించి జీవితాలను గడిపే వ్యక్తులను వెక్కిరించే మనస్తత్వ దృష్టి ఉండకూడదంటాడు.

“గతమే జీవిత మనుకుని
వర్తమానమె వలదని
వెనక్కు నడిచేవారిని
వెక్కిరించు కోర్కిలేదంటాడు”

అలాగే గతమంతా శూన్యం జ్ఞాన ప్రదమైన వర్తమానాన్ని మాత్రమే మంచిగా భావించాలను తలపొగరు గలవారిని నిందించే ఆలోచనా చేయకూడదు. గతము వర్తమానము కత్తికి రెండు వైపులా ఉండే పదును. రెండింటిని సమర్థిస్తానన్నాడు.

“గతాన్ని కాదనలేను
వర్తమానం వద్దనుబోను భవిష్యత్తు వదులుకోను”

అని గతాన్ని, వర్తమాన్ని భవిష్యత్తును ఒకటిగా చూసే దృష్టి కలవాడు దాశరథి.

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

ప్రశ్న 4.
పాఠ్యాంశం ఆధారంగా కవి వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి ?
జవాబు:
‘నా పేరు ప్రజాకోటి’ అను పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన “పునర్నవం” కవితాసంపుటి నుండి గ్రహించబడింది. ఆధునిక ఆంధ్రసాహిత్యంలో దాశరథి కృష్ణమాచార్యులు ఒక విశిష్ట స్థానాన్ని పొంది ఉన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని నినదించి పీడిత తాడిత ప్రజల వాణికి తన కవిత్వాన్ని ‘మైక్’ గా అమర్చాడు.

కృష్ణమార్యుల గారి దృష్టిలో కవి అయినవాడు మానవతా వాది కావాలన్నాడు కనిపించే మంచికిచెడుకి స్పందించాలన్నాడు. అన్ని దృక్పథాలకు కేంద్ర బిందువు మానవుడే. మనిషిని ప్రేమించలేనివాడు దేనినీ ప్రేమించలేడన్నాడు. గతాన్ని వర్తమానాన్ని నిశితంగా పరీక్షించి భవిష్యత్తులోకి ప్రయాణం చేయాలన్నాడు. శాంతి అహింసలు తోడుగా విశ్వశ్రేయస్సును కోరుకున్నాడు. అహింసనే జీవిత పరమావధిగా అందరూ తలచాలని అందుకు కవులు తమ రచనల ద్వారా దోహదకారులవ్వాలని భావించాడు.

III. ఏకపద/వాక్య సమాధాన ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
దాశరథి తల్లిదండ్రులెవరు?
జవాబు:
దాశరథి తల్లిదండ్రులు వేంకటమ్మ, వేంకటచార్యులు

ప్రశ్న 2.
దాశరథి ఏ గ్రామంలో జన్మించాడు?
జవాబు:
వరంగల్లు జిల్లా మానుకోట తాలూకా చిన గూడూరు గ్రామంలో జన్మించాడు

ప్రశ్న 3.
దాశరథి ప్రసిద్ధ నినాదమేది?
జవాబు:
“నా తెలంగాణ కోటి రతనాల వీణ” అన్నది దాశరథి ప్రసిద్ధనినాదం.

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

ప్రశ్న 4.
దాశరథి తన పేరు ఏమని చెప్పకున్నాడు?
జవాబు:
నా పేరు ప్రజాకోటి అని చెప్పుకున్నాడు.

ప్రశ్న 5.
అజ్ఞానాన్ని కవి దేనితో పోల్చాడు.
జవాబు:
అజ్ఞానాన్ని “అడుసు”తో పోల్చాడు

ప్రశ్న 6.
దాశరథి అణ్వస్త్రాలను ఎక్కడ పారేయాలని ఆకాంక్షించాడు?
జవాబు:
“అఖాదం”లో పడవేయాలని ఆకాంక్షించాడు.

ప్రశ్న 7.
కవి కంటికి రుచించేదేమిటి?
జవాబు:
హృదయం, ఉదయాలు కవి కంటికి రుచించేవి

ప్రశ్న 8.
కాలాన్ని కవి దేనితో పోల్చాడు?
జవాబు:
కంఠ మాలతో పోల్చాడు.

IV. సందర్భ సహిత వాఖ్యలు

ప్రశ్న 1.
వెనక్కు నడిచేవారిని వెక్కిరించే కోర్కిలేదు.
జవాబు:
పరిచయం :
ఈ వాక్యము దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన, నా పేరు ప్రజాకోటి అను పాఠ్యభాగం నుండి గ్రహించబడింది. ‘పునర్నవం’ అను కవితా ఖండికలోనిది.

సందర్భము :-
ప్రతికాలాలను గురించి కవి తెలియచేయు సందర్భంలోనిది

భావము :-
గతించిన కాలమే జీవితం అనుకుని వర్తమానాన్ని నిందిస్తూన్న వారిని పరిహాసం చేసే కోరిక తనకు లేదని ఇందలి భావం.

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

ప్రశ్న 2.
వట్టిచేతితో శత్రువుపై దుమికే శక్తి ఉంది
జవాబు:
పరిచయము :-
ఈ వాక్యము దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన “నా పేరు ప్రజాకోటి” అని పాఠ్యభాగం నుండి గ్రహించబడింది. “పునర్నవం” అన్న కవితాఖండికలోనిది.

సందర్భము :-
కవి “అహింసా” శక్తిని గురించి వివరించే సందర్భములోనిది.

భావము :
చిన్నపాటి అంకుశంతో గున్న ఏనుగు బంధించే కొత్త శక్తిని కనుగొన్నాను. అలాగే వట్టి చేతులతో ‘అహింస’నే ఆయుధంగా చేసుకుని శత్రువుపై దూకే శక్తిని తెలుసుకున్నాని ఇందలి భావం.

ప్రశ్న 3.
రాక్షసినైనా మైత్రికి రానిత్తును భయం లేదు
జవాబు:
పరిచయం :-
ఈ వాక్యము దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన ‘నాపేరు ప్రజాకోటి’ అన్న పాఠ్యభాగం నుండి గ్రహించబడింది. ‘పునర్నవం’ అను ఖండకావ్యం లోనిది.

సందర్భము :
మానవులంతా ఒక్కటే అన్న భావాన్ని వివరించిన సందర్భము

భావము :-
అందరం మానవులమే. ఒకరినొకరు ద్వేషించు కోవటం ఎందుకు. రాక్షస స్వభావం ఉన్న వారిని కూడా నేను ఆహ్వానిస్తాను అని ఇందలి భావం.

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

ప్రశ్న 4.
ఘర్షణలో ఏనాటికి హర్షం లభియింపబోదు.
జవాబు:
పరిచయం :
ఈ వాక్యము దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన, ‘నా పేరు ప్రజాకోటి’ అన్న పాఠ్యభాగం నుండి గ్రహించబడింది. ‘పునర్నవం’ అన్న కవితా ఖండికలోనిది.

సందర్భము :-
మనలోని అజ్ఞానాన్ని తొలగించుకుని అసలు విషయాన్ని తెలుసుకోమని చెప్పిన సందర్భంలోనిది.

భావము :-
కత్తిపట్టి గెలిచిన వీరుడెవ్వరూ లేడు. కాని మెత్తని హృదయంతో లొంగనివారు ఉండరు. హింస అనే అజ్ఞానాన్ని వదలి అహింస మార్గాన్ని ఎంచుకోవాలి. హింస ద్వారా సంతోషం ఏనాటికి లభించదని ఇందలి భావం.

V. సంధులు

1. గతమంత
గతము + అంత = గతమంత సూత్రము – ఉత్వసంధి/ ఉకారసంథి
సూత్రము :- ఉత్తున కచ్చు పరంబగునపుడు సంథియగు

2. అణ్వస్త్రము:
అణు+అస్త్రము = అణ్వస్త్రము – యణాదేశ సంధి
సూత్రము :- ఇ.డి.ఋ అనువానికి అసవర్ణములైన అచ్చులు పరమైనచో క్రమముగా య,వ,ర,ల అనునవి ఆదేశముగా వచ్చును.

3. అణువంత
అణువు+అంత = అణువంత – ఉకార సంధి/ఉ. త్వసంధి
సూత్రము :- ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

4. చేతులెత్తి
చేతులు + ఎత్తి = చేతెలెత్తి – ఉకారసంధి/ఉత్వసంథి
సూత్రము :- ఉత్తన ‘కచ్చు పరంబగునపుడు సంథియగు.

5. రెండంచులు
రెండు + అంచులు = రెండంచులు – ఉకారసంథి/ఉత్వసంథి
సూత్రము :- ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధియగు.

6. కానిదెవడు
కానిది + ఎవడు = కానిదెవడు – ఇత్వసంధి/ఇకారసంథి
సూత్రము :- ఏ మ్యాదులయిత్తనకు సంధి వైకల్పికముగానగు. ఏమ్యాదులనగా ఏమి, మరి,కి,షష్ఠి, అది, అవి, ఇది, ఇవి, ఏది, ఏవి ఇత్తు అంటే హ్రస్వమైన ఇకారము.

VI. సమాసాలు

1. ఎర్రజెండా :
ఎర్రనైన జెండా – విశేషణ పూర్వపద కర్మధారయము.

2. గున్నయేనుగు :
గున్నదైన ఏనుగు – విశేషణ పూర్వపద కర్మధారయము

3. మహాశక్తి:
మహాతైన శక్తి – విశేషణ పూర్వపద కర్మధారయము

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

4. మనోజ్ఞభావి :
మనోజ్ఞమైన భావి – విశేషణ పూర్వపద కర్మధారయము

5. శబ్దధాటి:
శబ్దము యొక్క ధాటి – విశేషణ పూర్వపద కర్మధారయము

6. అజ్ఞానం :
జ్ఞానము కానిది – నైత్పురుష సమాసము

7. భరతభూమి :
భరత అనుపేరుగు భూమి – సంభావనా పూర్వపద కర్మధారయము

8. ఇలాగోళము :
భూమి యొక్క గోళము – షష్ఠీతత్పురుష సమాసం

9. మైత్రే బంధము :
మైత్రి చేత బంధము – తృతీయా తత్పురుష సమాసం
మైత్రి వలన బంధము – పంచమీ తత్పురుష సమాసం

10. కంఠమాల :
కంఠమునందలి మాల – సప్తమీ తత్పురుష సమాసం

ప్రతిపదార్థ తాత్పర్యాలు

1వ పద్యం :

తెలంగాణలో కోటిధీరులు గళధ్వనినేగాక
ఇలా గోళమందుండెడి ఎల్లరి శబ్దాన్ని నేను
నా పేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాటి

అర్థాలు :
ధీరులు = ధైర్య వంతుల
గళధ్వని = కంఠధ్వని
ఇలాగోళము = భూగోళము
ఎల్లరి = అందరి

భావము :
కోట్ల ప్రజల తెలంగాణ వీరుల (గళాన్ని) గొంతుకను నేను అంతేకాదు ఈ భూమిపై ఉండే ప్రజలందరి ఊపిరిని నేను నా పేరు ప్రజా కోటి, నా ఊరు ప్రజావాటి అని కవి పేర్కొన్నాడని ఇందలి భావం.

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

2వ పద్యం :

అయినా అణువంతవాణ్ణి
అసలే కనరాని వాణ్ణి
కోట్ల కొలది జనుల మనసు
కొద్దో గొప్పో ఎరుగుదు

అర్థాలు :
అణువంత = అణువంత చిన్నరూపం
కనరాని = కన్పించనటువంటి
ఎరుగుదు = తెలుసుకున్నవాడిన

భావం:
కోట్లకొలది ప్రజలలో నేను అణువంతటివాడిని. అయినా వారందరి మనస్సులను కొద్దోగొప్పో తెలిసినవాడిని.

3వ పద్యం :

గతమే జీవితమనుకొని
వర్తమానమే వలదని
వెనక్కు నడిచేవారిని
వెక్కిరించు కోర్కిలేదు.

అర్థాలు :
గతము = గడిచిన కాలం
వర్తమానము = ప్రస్తుతము
వలదని = వద్దని
నడచేవారిని = పయనించేవారిని
వెక్కిరించ = ఎగతాళి గేళి చేసే
కోర్కెలేదు = ఆలోచన కోరిక లేదు.

భావం :
గతించిన కాలమే అసలైన జీవితమనుకొని వర్తమానం వద్దని గతకాలాన్ని గుర్తుకుతెచ్చుకొని బ్రతికేవారిని ఎగతాళి చేసే కోరిక ఏ మాత్రం నాకులేదు.

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

4వ పద్యం :

గతమంతా బూదికుప్ప
కావాలి మనోజ్ఞభావి
తిరగబడండని అరచే
బిరుసువారి నిందింపను

అర్ధాలు :
గతమంతా = గడిచిన కాలమంతా
బూదికుప్ప = శూన్యం
మనోజ్ఞభావి = ఆనందాన్నిచ్చే భవిష్యత్తు
తిరగబడండి+అని = ఎదురు తిరగమని
అరచే = గొంతెత్తే
బిరుసువారి = తలపొగరు వారిని
నిందింపను = తిట్టను

భావం :
గడిచిన కాలమంతా పనికిరానిది సుందరమైన భవిష్యత్తు కావాలని తిరగబడండి అని అరచే తలబిరుసుగాళ్ళను నేనేమి అనగలను.

5వ పద్యం :

ఇవి రెండూ ఒక కత్తికి
అటూ ఇటూ రెండంచులు.
నే మాత్రం రెండంచులు
సాము చేయగలను లెండి!

అర్థాలు :
ఇవి రెండూ = పూర్వాపరాలు రెండూ
రెండంచులు = రెండువైపులా
నే మాత్రం = నేను మాత్రం
సాము = పరిశ్రమ

భావం :
భూత వర్తమాన కాలాలు రెండూ కత్తికున్న రెండంచులు. నేను మాత్రం రెండింటిని సమంగా చూస్తాను అని ఇందలి భావం.

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

6వ పద్యం :

గతాన్ని కాదనలేను
వర్తమానం వద్దనబోను
భవిష్యత్తు వదులుకోను
కాలం నా కంఠమాల
నా పేరు ప్రజాకోటి
నా ఊరు ప్రజావాటి

అర్ధాలు :
గతము = గడచిన కాలము
వర్తమానం = గడుస్తున్న కాలం
కంఠమాల = కంఠమందు ధరించేమాల
ప్రజాకోటి = ప్రజలయొక్క సమూహం
ప్రజావాటి = ప్రజల నివాసం

భావం:
గతించిన కాలాన్ని కాదనలేను. వర్తమానాన్ని వద్దనను కాలం నా కంఠమాల నాపేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాటి.

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

7వ పద్యం :

బాంబుల బలం వచ్చి.
పాములలో విషం చచ్చి
ప్రేమములో బలం హెచ్చి
స్నేహములో శక్తి హెచ్చి
చిన్నపాటి అంకుశమున
గున్నయేనుగును వంచే
కొత్తరకం పద్ధతికను
“గొన్నానండో రండో!
భరతభూమి నేర్చినదో.
ప్రజాకోటీ నేర్పినదో
నిజం ఏమిటోగాని
వట్టి చేతితో శత్రువు
పై దుమికే శక్తి ఉంది.

అర్ధాలు :
బాంబులు = మారణాయుధాలు
బలంచచ్చి = బలం నశించి
పాములలో = విషసర్పాలలో
విషం చచ్చి = విషంపోయి
ప్రేమములో = ప్రేమభావంలో
బలం హెచ్చి = బలము పెరిగి
స్నేహంలో = మిత్రత్వంలో
అంకుశము = త్రిశూలంవలె ఉండే ఆయుధం

భావము:
మారణాయుధాలలో బలం నశించి పాములలో విషం పోయి, ప్రేమ భావంలో బలం పెరిగి స్నేహానికున్న శక్తి పెరిగి చిన్న పాటి అంకుశముతో గున్న ఏనుగును దారికి తెచ్చుకునే కొత్త పద్ధతిని కనుగొన్నాను. నా భారతభూమి నేర్చినదో, ప్రజాసమూహాలు నేర్పాయో వట్టి చేతులతో అహింస భావనతో శత్రువుపై దూకే శక్తి నాకు లభించింది.

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

8వ పద్యం :

మాటలనే ఈటెలతో
పోటుపెట్టు బలంవుంది.
సైనికుడిని చూచివెరువ
బోని జగం నన్ను జూచి
భీతిజెంది భక్తి పొంది
చేతులెత్తి దండమిడును.

అర్ధాలు :
మాటలనే = మాటలు అనే
ఈటెలతో = ఆయుధాలతో
పోటు పెట్టు = గాయపరచు
వెరువు = భయం
భీతిజెంది = భయపడి

భావము :
మాటలనే ఈటెలతో ఎదుర్కొనే బలం ఉంది. సైనికుడిని చూసి భయపడని జగతి నన్ను చూసి భయాన్ని భక్తిని పొంది చేతులెత్తి నమస్కరిస్తున్నది. నేనెవరినో తెలుసా అహింసను ప్రేమను

9వ పద్యం :

వినుడీ నా శబ్దధాటి
నా పేరు ప్రజాకోటి
ఒక్క కోటి కాదండో
కోటికోట్ల ప్రాణులకు
మాట బలంతో ఆశా
పాటవమును కలిగిస్తా

అర్ధాలు :
శబ్ధదాటి = మాటల యొక్క శక్తి
ఆశాపాటవము = ఆశతో కూడిన నేర్పు

భావము :
నా శబ్దం యొక్క ప్రతాపాన్ని వినండి. నా పేరు ప్రజాకోటి. ఒక్క కోటి కాదండి. కోటానుకోట్ల ప్రాణులకు మాటలనే బలాన్నిచ్చి నైపుణ్యాన్ని కలిగిస్తాను.

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

10వ పద్యం :

అయితే గప్పాలకోరు.
అనుకోబోకండి మీరు

అర్ధాలు :
గప్పాకోరు = కోతలరాయుడు

భావము :
అలాగని నేను గొప్పలు చెప్పుకునే వాడిని కాదండి.

11వ పద్యం :

మీ గొప్పయే నా గొప్ప మీరు లేకనే చొప్ప

అర్ధాలు :
చొప్ప = నిరుపయోగం

భావము :
మీ గొప్పేనా గొప్పకూడా. మీరు లేకపోతే నేను శూన్యం. నేను లేనేలేను.

12వ పద్యం :

ఎర్రజెండా పట్టుకోని
ఎగసిపోవువాడితోటి
పచ్చజెండా పట్టుకోని
పరుగు తీయువాని తోటి
మైత్రి బంధం కూర్చే
మహాశక్తినాకున్నది

అర్థాలు:
ఎర్రజెండా = కమ్యూనిష్టులు
పచ్చజెండా = జనతావారు
మైత్రిబంధ = స్నేహసంబంధాన్ని
కూర్చే = కలిపే

భావము :
ఎర్రజెండా పట్టుకుని నినదించే కమ్యూనిష్టులను, పచ్చజెండా పట్టుకుని పరుగులు తీసే ప్రజాస్వామ్యవాదులను మైత్రీ బంధంతో ఒకచోటికి ఒక దారికి తెచ్చే శక్తి నాకున్నది. నేను ప్రేమను అహింసను అని ఇందలి భావం.

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

13వ పద్యం :

ఎవడైనా మానవుడే
ఎందుకు ద్వేషించడాలు?
రాక్షసి మైత్రికి
రాత్తును భయం లేదు

అర్థాలు:
ద్వేషించ = అయిష్టంగాచూచు

భావము :
ఈ భూమిమీద ఎక్కడ నివశించినా మానవుడే! అతనిని ద్వేషించటం ఎందుకు? రాక్షస స్వభావం ఉన్న వారినైనా స్నేహహస్తాన్ని అందిస్తాను. నాకు భయం లేదు.

14వ పద్యం :

దేవతనైనాతోడ్కొని
తెత్తును, భేదమ్మురాదు
నాపేరు ప్రజాకోటి
నా ఊరు ప్రజావాటి

భావము :
అహింసతో ప్రేమతో దేవతలనైనా నాతోపాటు తీసుకుని వస్తాను. నా పేరు ప్రజాకోటి ఊరు ప్రజావాటి.

15వ పద్యం :

హృదయం వినా నా దగ్గర
ఏ వస్తువు లభింపదు
ఉదయం వినా నా కంటికి
ఏ వస్తువు రుచింపడు.

అర్థాలు :
ఉదయం = సూర్యోదయకాలం
వినా = తప్ప

భావము :
మంచి హృదయం తప్ప నా దగ్గర ఏ వస్తువూ లభించదు. ఉషోదయం తప్ప నా కంటికి ఏ వస్తువు ఆనందాన్ని కలుగచేయదు.

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

16వ పద్యం :

అందరికంటే ముందే
అణ్వస్త్రముగొనిపోయి
అభాతాన పడవేసితి
సుఖపడగా ప్రజాకోటి

అర్థాలు :
అణ్వస్త్రము = అణుబాంబు
కొనిపోయి = తీసికొనిపోయి
అతఖాన = భూమిలోపల
పడవేసితి = కప్పేశాను.
ప్రజాకోటి = ప్రజా సమూహాలు
సుఖపడగా = సుఖపడటం కోసం

భావము :
ప్రజలు సుఖపడాలన్న భావనతో అందరికంటే ముందుగా అణ్వస్త్రాన్ని అఘాతంలో

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

17వ పద్యం :

కత్తిపట్టి గెలిచినట్టి
ఘనుడగు వీరుండెవ్వడు?
మెత్తని హృదయం దాడికి
తుత్తునియలు కానిదెవరు?
అజ్ఞానపు అడుసు కడిగి
అసలు విషయమెరుంగుడీ
ఘర్షణలో ఏనాటికి
హర్షం లభియింపబోదు

అర్థాలు :
ఘనుడు + అడు = గొప్పవాడైన
మెత్తని హృదయం = మెత్తని మనసు
ధాటికి = దెబ్బకు
తుత్తునియలు = ముక్కలు ముక్కలు
అజ్ఞానపు = తెలివితక్కువ తనపు
అడుసు = మలినము
కడిగి = శుభ్రపరచి
ఘర్షణలో = పోరులో
హర్షం = ఆనందం

భావము :
కత్తి పట్టి విజయం సాధించినవాడు ఒక్కడు కూడా లేడు. మెత్తని ప్రేమ అహింసలను గల హృదయానికి లొంగనివాడు ఈ లోకంలో ఎవరూ ఉండరు. హింస అనే అజ్ఞానాన్ని వదలి సత్యాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. ఘర్షణ వలన సంతోషం ఏనాటికీ లభించదని తెలుసుకోండి. నాపేరు ప్రజా కోటి, నా ఊరు ప్రజావాటి.

నాపేరు ప్రజాకోటి Summary in Telugu

కవి పరిచయం

కవి : దాశరథి కృష్ణమాచార్యులు

పుట్టిన తేదీ : జూలై 22, 1925

పుట్టిన ఊరు : వరంగల్లు జిల్లా, మానుకోట తాలూకా చినగూడూరు గ్రామం

తల్లిదండ్రులు : వెంకటమ్మ, వెంకటాచార్యులు

విధ్యాభ్యాసం : ఖమ్మంలో హైస్కూలు చదువు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యంలో బి.ఏ

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

రచనలు :

  1. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, అమృతాభిషేకం, కవతాపుష్పకం, ఆలోచనాలోచనలు, తిమిరంతో సమరం మొదలగునవి.
  2. “మహాబోధి” కథాకావ్యం
  3. నవమంజరి, దాశరథి బాలగేయాలు, ఖబడ్డార్ చైనా గేయరచనలు
  4. గాలీబు గీతాలను ఊర్దూ నుండి తెలుగునకు అనువాదం
  5. “నవమి” నాటికలసంపుటి
  6. దాశరథి శతకం
  7. వందలకొలది సినిమాపాటలు

పురస్కారాలు, బిరుదులు :

  1. ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవడాక్టరేట్ కళా ప్రపూర్ణబిరుదులు
  2. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవడాక్టరేట్ను
  3. కేంద్ర రాష్ట్ర సాహిత్య అకాడమీలు పురస్కారాలు
  4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా పనిచేశారు.

మరణం : నవంబరు 5, 1987

“నా తెలంగాణ కోటిరతనాల వీణ” అని నినదించిన కవి దాశరథి. పీడిత ప్రజల వాణికి తన కవిత్వాన్ని “మైగ్”గా అమర్చిన కవి. జూలై 22, 1925న వరంగల్లు జిల్లా మానుకోట తాలూకా చినగూడూరు గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు వేంకటమ్మ వేంకటాచార్యులు. తల్లిదండ్రులు ఇద్దరూ సాహిత్యాభి రుచి గలవారే! ఉర్దూ, తెలుగు, సంస్కృతం, ఆంగ్లభాషా సాహిత్యాలను అధ్యయం చేశారు. ఖమ్మంలో హైస్కూలు విద్యను, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ ఆంగ్లం చదివారు.

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం అమృతాభిషేకం, కవితాపుష్పం, ఆలోచనాలోచనలు, తిమిరంతో సమరం, వంటి పద్య వచన రచనలు చేశారు. “మహాబోధి” వీరి కథాకావ్యం నవమంజరి, దాశరథి బాలగేయాలు, ఖబడ్డార్ చైనా వంటి గేయాలు రచించారు. గాలీబు గీతాలను తెలుగులోనికి తీసుకువచ్చారు. నవమి నాటి కల సంపుటి, దాశరథి శతకం, వందలాది సినిమా పాటలు దాశరథి కలం నుండి జాలువారాయి.

దాశరథి తెలుగు సాహిత్యానికి చేసిన సేవను గుర్తించి ఆంధ్ర, వేంకటేశ్వర విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ను ఇచ్చాయి. ఆంధ్రవిశ్వవిద్యాలయం, “కళాప్రపూర్ణ” బిరుదుతో సత్కరించింది. కేంద్ర సాహిత్య అకాడమీ, రాష్ట్ర సాహిత్య అకాడమీలు పురస్కారాలను అందించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థానకవిగా కొంతకాలం పనిచేశారు. నవంబరు 5, 1987న దాశరథికాలం చేశారు.

పాఠ్యాంశ సందర్భం

కవి అయినవాడు మొదట మానవతావాది కావాలి. కన్పించే మంచికి చెడుకు స్పందించే మనసుండాలి. అన్ని దృక్పథాలకు కేంద్ర బిందువు మానవుడే! మనిషిని ప్రేమించలేనివాడు దేనినీ ప్రేమించలేడు. గతం వర్తమానం నిశితంగా పరిశీలించి ముందుకు సాగాలి.

మన దేశం అనాది నుండి శాంతి, అహింసలను అసురించింది. విశ్వశ్రేయస్సును కోరుకుంది. తనలో అందరిని అందరిలో తనను కలుపుకోవటం భారతీయుల నైజం.

చెడునుండి మంచికి చేరుకుని జీవితాలను సార్థకం చేసుకోవాలన్నది ఈ కవిత ద్వారా దాశరథి ప్రబోధించాడు. హింసను ఆధారంగా చేసుకొని ప్రపంచంపై ఎవరూ విజయం సాధించలేరు. అహింస జీవితపరమావధి కావాలని దాశరథి భావించారు.

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

ప్రస్తుత పాఠ్యభాగం నాపేరు ప్రజాకోటి దాశరథి కవితా ఖండిక “పునర్నవం” నుండి గ్రహించబడింది.

పాఠ్యభాగ సారాంశం

భారతదేశం అనాది నుండి శాంతి అహింసలను ఉపాసించింది. విశ్వశ్రేయస్సును కోరుతూ అహింసే జీవిత పరమావధిగా భారతజాతి జీవనం సాగిస్తున్నది. హింసతో ప్రపంచంలో ఎవరూ విజయాన్ని సాధించలేరు. అహింస పరమావధికావాలని దాశరధి ఆకాంక్ష.

కోట్ల ప్రజల తెలంగాణ వీరుల గొంతుకనునేను. అంతేకాదు ఈ భూమిపై నివసించే కోటాను కోట్ల ప్రజల ఊపిరిని నేను నా పేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాణి. వారందరిలో నేను అణువంతవాడిని. అయినా వారందరి మనసు కొద్దో గొప్పో తెలిసినవాడిని నేను.

గతించిన కాలమే మంచిదన్న భావన పనికి రాదని గతించిన కాలాన్ని, గుర్తుకు తెచ్చుకుని, ఆనందించే వారిని ఎగతాళిచేసే కోరిక కూడా ఏ మాత్రం వర్తమాన ప్రజలకు ఉండకూడదన్నాడు. గతాన్ని వర్తమానాన్ని నిశితంగా పరిశీలించి భవిష్యత్తులోకి ప్రయాణం చేయాలని అన్నాడు”.

అనాది నుండి భారతదేశం శాంతి అహింసలను ఉపాసించిందని, విశ్వశ్రేయస్సును కోరుకున్నదని తనలో అందరిని కలుపుకోవటం అందరిలో తానై కలసిపోవటం భారతీయ తాత్వికతకు నిదర్శనంగా భావించాలన్నాడు.

ఎర్రజెండా పట్టుకుని ఎగసిపడుతున్నవారిని పచ్చజెండా పట్టుకుని పరుగులు తీస్తున్నవారిని ఏకం చేయగలసత్తా అహింసకు ప్రేమకు సొంతమన్నాడు.

ఈ ప్రపంచంలో జీవించేవారంతా మానవులే! వారిలో కొందరిని ప్రేమించటం ద్వేషించటం తగదు. రాక్షసస్వభావం గల వారితో కూడా స్నేహం చేయగలగాలి. ఉదయము హృదయము తప్పనాకు ఏదీ ఏదీ రుచింపదు. యుద్ధం వర్తమానానికి ఔట్ టెట్. శాంతి అహింస ప్రేమలు వర్తమాన భవిషత్తులకు ఆదర్శప్రాయాలు.

TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

అణ్వస్త్రాలను అందరికంటే ముందుగా అగాధాన పడవేయాలి. అది ప్రజలకు సుఖ సంతోషాలనిస్తుంది. ఈ లోకంలో కత్తిపట్టి నిజమైన విజయాన్ని సాధించనవాడు ఒక్కడూ లేడు. మెత్తని హృదయంతో ప్రేమతో, అహింసతో శత్రువులోని అజ్ఞానాన్ని తొలగించి ఆదర్శభావాలను పెంపొందించాలి. ఘర్షణ వలన ఏనాటికీ ఆనందానుభూతులు లభించవు. ఇది నామాట కాదు ప్రజలమాట అని దాశరథి కృష్ణమాచార్యులు నా పేరు ప్రజాకోటిలో వివరించాడు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 6 రాజాబహద్దుర్ వేంకట రామారెడ్డి సేవాతత్పరత

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 6th Lesson రాజాబహద్దుర్ వేంకట రామారెడ్డి సేవాతత్పరత Textbook Questions and Answers.

TS Inter 1st Year Telugu Study Material 6th Lesson రాజాబహద్దుర్ వేంకట రామారెడ్డి సేవాతత్పరత

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి స్థాపించిన విద్యావ్యవస్థలను వివరించండి?
జవాబు:
‘రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి సేవా తత్పరత’ అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డిచే రచించబడిన రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి జీవిత చరిత్ర నుండి గ్రహించబడింది. వెంకట రామారెడ్డి అందరి మన్ననలను పొందిన వ్యక్తి. బహుభాషావేత్త. తన జీవితాన్ని -ప్రజాసేవకే అంకితం చేసిన వ్యక్తి. ఆయనకు విద్యపట్ల శ్రద్ధగలవారు. పలు విద్యాసంస్థలను స్థాపించి ప్రజాసేవ చేశారు.

1. బాలికల ఉన్నత పాఠశాల :
మొత్తం హైదరాబాదు రాష్ట్రంలో మన బాలికలకు మాతృభాషా బోధనకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల లేకపోవటం దురదృష్టకరమని రెడ్డిగారు భావించారు. ఉన్నత పాఠశాలల్లో కూడా ఉర్దూ, ఆంగ్ల మాధ్యమ బోధన జరుగుతుంది. కావున హైదరాబాదులో ఒక మాతృభాషా పాఠశాలను బాలికల కోసం నిర్మించాలని తలచి స్త్రీ విద్యా ప్రోత్సాహకులు మాడపాటి హనుమంతరావుగారిని కలిసి బాలికల పాఠశాలను నిర్మించారు. ఇది బొంబాయిలో ‘కార్వే’ మహాశయులు స్థాపించిన మహిళావిద్యాపీఠంతో జత చేశారు. దీనికి అధ్యక్షులుగా రామారెడ్డి ఉన్నారు.

2. పరోపకారిణీ బాలికా పాఠశాల :
హైదరాబాద్ రామారెడ్డిగారు స్థాపించిన మరొక పాఠశాల పరోపకారిణీ బాలికా పాఠశాల. ఇది ప్రైమరీ తరగతి వరకు ఉన్నది. దీనికి అధ్యక్షులుగా రామారెడ్డి న్నారు.

3. ఎక్సెల్ సియర్ మిడిల్ పాఠశాల:
ఈ పాఠశాలను 1945లో స్థాపించారు. దీని పాలక వర్గ అధ్యక్షులు రామారెడ్డిగారే! దీనిలో తెలుగు బాలురకే ప్రవేశముంది. ఆంగ్ల, ఉర్దూ మాధ్యమాలు లేకపోవటంతో అంతగా విద్యార్థులు ఆసక్తి చూపలేదు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 6 రాజాబహద్దుర్ వేంకట రామారెడ్డి సేవాతత్పరత

4. బాలికా పాఠశాల (గొల్లబిడ్కి) :
హైదరాబాదు గొల్లఖిడ్కిలో ఒక ఆంధ్రబాలికా పాఠశాలను ప్రజాసేవకులు కొందరు స్థాపించారు. దీని బాధ్యతను కూడా రెడ్డిగారే స్వీకరించారు.

5. పరోపకారిణీ బాలికా పాఠశాల :
సికిందరాబాదు నగరంలో కీ॥శే॥ సీతమ్మగారు ఆ కాలంలో ఉండేవారు. ఆమె తన జీవితాన్ని ధారపోసి ఒక మాధ్యమిక పాఠశాలను స్థాపించారు. ఆ పాఠశాల అభివృద్ధికి రెడ్డిగారు సహాయ పడ్డారు.

6. ఆంధ్రవిద్యాలయం :
హైదరాబాదు నగరంలో తెలుగు పిల్లలకు మాతృభాష ద్వారా చదువు చెప్పుటకు ఒక్క మాధ్యమిక పాఠశాల కూడా లేదు. 1931లో దేవరకొండ సభలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. రాజాబహద్దూర్ వెంకట రామరెడ్డిగారు ఆ సభకు అధ్యక్షత వహించారు. ఎలాగైనా ఒక పాఠశాలను నిర్మించాలని తీర్మానం చేశారు. అది చివరకు సెప్టెంబరు1, 1944కు కానీ సానుకూలం కాలేదు. ఆ తరువాత అది 1947 నాటికి రెడ్డిగారి చలవతో ఉ న్నత పాఠశాలగా ఎదిగింది.

ఇలా రాజాబహద్దూర్ రామారెడ్డిగారు విద్యపట్ల మిక్కిలి ఆసక్తిని కనపరచి, తెలుగు మాధ్యమంలో బాలికలు చదువు కోవటానికి పాఠశాలలను స్థాపించటానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారకులయ్యారు.

ప్రశ్న 2.
రాజాబహద్దూర్ సంఘసేవా తత్పరతను పరిచయం చేయండి?
జవాబు:
రాజాబహద్దూర్ వెంకటరామారెడ్డి సేవతత్పరత అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డిచే రచించబడిన “వెంకటరామారెడ్డి జీవిత చరిత్ర” అన్న గ్రంథం నుండి గ్రహించబడింది.

వెంకటరామారెడ్డి గొప్ప సంఘ సేవా తత్పరులు. విద్యార్థుల కోసం, బాలికల విద్య కోసం, వితంతు వివాహాలు, బాల్య వివాహల నిరసన, అనాధల వేశ్యల రక్షణ మొదలగు అంశాలపై ఆయన చేసిన సేవ మెచ్చతగింది. హైదరాబాద్లో చదువుకునే రెడ్డి విద్యార్థులకు (హాస్టల్) వసతి గృహం, నిర్మించటం, మాతృభాషలో విద్యాభ్యాసం చేసే విద్యార్థినులకు పాఠశాలలను నిర్మించటం వారి సేవలో ప్రధాన భాగాలు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 6 రాజాబహద్దుర్ వేంకట రామారెడ్డి సేవాతత్పరత

సంఘ సంస్కారం :
గోల్కొండ పత్రికను స్థాపించి దాని ద్వారా యువతలో చైతన్యాన్ని నింపారు. రెడ్డిగారు పూర్వకాలం వారు అయినప్పటికి సంఘసంస్కారం కలవారు. బాల్య వివాహాలను నిరసించారు. వితంతు వివాహాలను ప్రోత్సహించారు. కీ॥శే॥ పండిత కేశవరావుగారు వీటిపై రెండు చిత్తు శాసనాలను చేస్తే వాటికి రెడ్డిగారు మద్దతు నిచ్చారు. దీనిపై శాసనసభవారు ఒక ఉప సంఘాన్ని నియమించారు. ఆ ఉపసంఘంలో రెడ్డిగారు ముఖ్యపాత్ర వహించారు. ఒక రెడ్డి హాస్టల్ విద్యార్థి వితంతు వివాహం చేసుకుంటే అతనిని ప్రోత్సహించి ఉపాధిని కల్పించారు. వీరికి కులభేధ పట్టింపులు లేవు. మూఢాచారాలను నిరసించారు. అన్ని కులాల మతాల వారితో కలిసి జీవించారు.

అనాధలపై ప్రేమ :
రెడ్డిగారికి అనాధలపై, వృద్ధులపై, రోగ గ్రస్తులపై, చివరకు జంతువులపై కూడా ప్రేమ ఉండేది. జంతు హింస నివారణ సంఘంలో ముఖ్యులుగా పనిచేశారు. అనాధ బాలికలను ధనవంతులు, నవాబులు ఉంచుకొనుట ఆచారంగా ఆ రోజులలో ఉండేది. నాటి పోలీసు అధికారి ‘సర్ ట్రెంచ్’ గానిని సంప్రదించి “శిశువుల సంరక్షక శాసనము’ను చేయించి అనాధ బాలికలను రక్షించారు.

సికిందరాబాద్ లో రెండు వృద్ధాశ్రమాలుండేవి. వాటికి ద్రవ్యసహాయాన్ని రెడ్డిగారు పలుమార్లు చేశారు. హైదారాబాద్ లో కుష్ఠిరోగుల చికిత్సాలయం ఉండేది. అక్కడి రోగుల పట్ల సేవాభావంతో చాలాసార్లు ఆర్థిక సహాయం చేశారు. అనాధలపై వీరికి ఎంతటి సేవాభావం ఉండేదో అలాగే హరిజనులపై ఉండేది. హిందువుల దురాచారాలలో అస్పృశ్యత ఒకటి. దీనితో పాటుగా మరొక కుసంస్కారం ఉండేది.

TS Inter 1st Year Telugu Study Material Chapter 6 రాజాబహద్దుర్ వేంకట రామారెడ్డి సేవాతత్పరత

హరిజన బాలికలను చిన్నతనంలోనే “మురళీలు”గను, బసివిరాండ్రు”గను తయారుచేసి అగ్రవర్ణాలవారు వారితో వ్యభిచారం చేసేవారు. వారికిక వివాహం అంటూ ఉండేదికాదు. జీవితాంతం వ్యభిచారులుగానే గడపవలసి వచ్చేది. రెడ్డిగారు దీనిని నిరసించి వారిని ఆదుకున్నారు. సర్వజనులకు పరోపకారి, కరుణా సముద్రులు, ప్రజానురంజకులు, రాష్ట్రసేవాపరాయణులుగా ప్రజా సేవచేస్తూ కీర్తి ప్రతిష్టలను పొందారు రామారెడ్డిగారు.

II. సంగ్రహ రూప ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
ధనవంతులు తమ అధికార బలాన్ని దేనికి ఉపయోగించాలి?
జవాబు:
రాజాబహద్దూర్ వెంటకరామారెడ్డి సేవాతత్పరత అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డిచే రచించబడిన “వేంకట రామారెడ్డి జీవిత చరిత్ర” నుండి గ్రహించబడింది.

భారతదేశంలోను, మన రాష్ట్రంలోను అధికారులు, గొప్ప గొప్ప ఉద్యోగులు ఎందరో ఉన్నారు. వారందరూ ధనమును బాగా సంపాదించినవారే! గొప్ప గొప్ప బిరుదులను పొందినవారే! కాని వారిని లోకం గుర్తించలేదు. దానికి కారణం వారిలో సామాజిక సంఘసేవా తత్పరత లేకపోవటమే! ఎంతటి గొప్పవారైనా ఎంతటి ధనికులైనా సంఘ సేవ చేయని ఎడల గుర్తింపు పొందరు.

తాము సంపాదించిన ధనములో ఎంతో కొంత సమాజ శ్రేయస్సుకు వినియోగించాలి. దేశాభివృద్ధికి ప్రజలలో మంచిని ప్రబోధించటానికి తప్పక వినియోగించాలి. అలా చేయనిఎడల గుర్తింపును కోల్పోతారు. రామారెడ్డిగారు ఇతరుల వలే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ పనిచేసినా మంచిపలుకుబడిని ప్రజానురాగాన్ని పొందారు. దానికి కారణం ఆయన తన ధనాన్ని శక్తిని, పలుకుబడిని ప్రజాభ్యుదయానికి ఉపయోగించారు.

కాబట్టి ధనవంతులు అధికారులు తమ అధికారాన్ని ధనాన్ని ఇతరుల కోసం, సమాజాభివృద్ధికి ఉపయోగించాలి.

TS Inter 1st Year Telugu Study Material Chapter 6 రాజాబహద్దుర్ వేంకట రామారెడ్డి సేవాతత్పరత

ప్రశ్న 2.
సురవరం ప్రతాపరెడ్డి ‘సాహితీసేవ’ను వివరించండి?
జవాబు:
‘రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి సేవాతత్పరత’ అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డిచే రచించబడిన “రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి జీవిత చరిత్ర నుండి గ్రహించబడింది.

సురవరం ప్రతాపరెడ్డి మహబూబ్ నగర్ జిల్లా గద్వాల సంస్థాన కేంద్రమైన ‘బోరవెల్లి’ గ్రామంలో మే 28, 1896న జన్మించారు. వీరి స్వస్థలం ‘ఇటిక్యాలపాడు’ తల్లిదండ్రులు రంగమ్మ, నారాయణరెడ్డిలు. వీరు సంస్కృత సాహిత్యంతోపాటు ఎఫ్ఎ, బి.ఏ,బి.ఎల్ చదివారు. తొలుత న్యాయవాదిగా ఉన్నా తరువాత సాహిత్య కారునిగా మారారు.

సురవరం వారు గోల్కొండ పత్రికను స్తాపించారు. 1926 నుండి 20 సం॥ల పాటు ఆయనే సంపాదకత్వం వహించారు. “తెలంగాణలో కవులు పూజ్యుం” అన్న విమర్శకు తుడిచివేసి 354 మంది తెలంగాణ కవుల జీవిత చరిత్రలను రాశారు. గోల్కొండ కవుల చరిత్రను వెలువరించారు. 1931 నుండి 1953 వరకు తెలంగాణ సామాజిక పరిస్థితులు ప్రతిబింబించేలా మొగలాయి కథలను రాశారు.

1948లో “ఆంధ్రుల సాహిత్య చరిత్రను” వెలువరించారు. “ప్రజావాణి” పత్రికను నడిపారు. భక్తతుకారాం. డచ్చల విషాదము” అన్న నాటకాలను రచించారు. హిందువుల పండుగలు హైందవధర్మవీరులు, రామాయణ విశేషాలు వంటి 40 గ్రంథాలను సురవరం వారు రాశారు.

ప్రశ్న 3.
‘గోల్కొండ’ పత్రిక అభివృద్ధికి రాజాబహద్దూర్ ఎలా తోడ్పడ్డారు?
జవాబు:
రాజా బహద్దూర్ వెంకటరామారెడ్డి సేవతత్పరత అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డిచే రచించబడిన రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి జీవిత చరిత్ర నుండి గ్రహించబడింది.

సురవరం ప్రతాపరెడ్డిగారు 1926లో తెలంగాణలో గోల్కోండ పత్రికను స్థాపించారు. అప్పటి వరకు తెలంగాణలో పత్రికలకు పాత్రినిద్యంలేదు. ఆయనే 20స||లపాటు దానికి ప్రధాన సంపాదకులుగా వ్యవహించారు. పత్రికారంగంలో ఒక నూతన ఒరవడిని గోల్కొండ పత్రిక సృష్టించింది. సురవరం వారిలో రాజా బహద్దార్ రామారెడ్డి గారికి అనుబంధం ఏర్పడింది. అది గోల్కోండ పత్రికతో వారిద్దరికి ఉన్న అనుబంధం

గోల్కొండ పత్రిక తొలుత హైదరాబాద్ నుండి వెలువడుటకు కావలసిన ముద్రణా లయము స్థాపించటానికి యంత్రాలకు కావలసిన ధన సహాయం. రూ. 7,300 రాజా బహద్దూర్ వెంకటరామారెడ్డి గారే సమకూర్చారు. గోల్కొండ పత్రిక ఒకటి తెలంగాణా నుండి రావటానికి ప్రధాన కారకుడిగా రాజాబహద్దూర్ గారు నిలిచారు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 6 రాజాబహద్దుర్ వేంకట రామారెడ్డి సేవాతత్పరత

ప్రశ్న 4.
రాజా బహద్దూర్’ హరిజనుల పట్ల దృష్టి తెలుపండి?
జవాబు:
శ్రీ రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి సేవాతత్పరత అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డి గారిచే రచించబడిన ‘రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి’ జీవిత చరిత్ర నుండి గ్రహించబడింది. వీరు తన బలమును, ధనమును, అధికారమును, ప్రజాభ్యుదయానికి వినియోగించారు. మంచి సంఘసంస్కరణాభిలాషి, అనాధలపై వీరికి ఎంతటి అనురాగమో హరిజనులపై కూడా అంతటి ప్రేమాదరణలను కలిగియున్నారు.

హిందూ దురాచారాలలో అగ్రస్థానం వహించిన అస్పృస్యతా నివారణను పెద్దదోషము గా రామారెడ్డిగారు భావించారు. వారిని కూడా హిందూ సోదరులుగా భావించి వారికి సమానత్వాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. హరిజనులలో ఒక దుష్ట సంప్రదాయం ఉండేది. హరిజనులు తమ ఆడపిల్లలను ‘మురళీలుగా’ ‘బసివిరాండ్రుగా’ తయారు చేసేవారు.

బాల్యంలోనే ఇలా తయారుచేయబడిన హరిజన బాలికలు వారి జీవితాతంతం వ్యభిచారులుగా బ్రతుకవలసి వచ్చేది. సమాజంలోని అగ్రవర్ణాలవారు వీరితో వ్యభిచారం చేసేవారు. ఈ దుష్ట సంప్రదాయాన్ని రూపుమాపటానికి రాజాబహద్దూర్ వెంకటరామారెడ్డి గారు తీవ్రమైన కృషి చేశారు. ఈయన సర్వజన ప్రియులై అఖండకీర్తి ప్రతిష్టలనందుకున్నారు.

III. ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
సురవరం ప్రతాపరెడ్డి ఎపుడు జన్మించారు?
జవాబు:
సురవరం ప్రతాపరెడ్డి మే 28. 1896న జన్మించారు.

ప్రశ్న 2.
సురవరం ప్రతాపరెడ్డి రాసిన ఏ గ్రంథం కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం పొందింది.
జవాబు:
1948లో రాసిన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ అనే గ్రంధానికి .

TS Inter 1st Year Telugu Study Material Chapter 6 రాజాబహద్దుర్ వేంకట రామారెడ్డి సేవాతత్పరత

ప్రశ్న 3.
అనాధభాల బాలికల సంరకక్షణ కోసం ఎలాంటి శాసనం వచ్చింది?
జవాబు:
అనాథ బాలబాలికల కోసం “శిశువుల సంరక్షక శాసనము వచ్చింది.

ప్రశ్న 4.
బొంబాయిలో మహిళావిద్యాపీఠాన్ని ఎవరు స్థాపించారు?
జవాబు:
బొంబాయిలో మహిళా విద్యా పీఠాన్ని స్థాపించినవారు ‘కార్వే’ మహాశయుడు.

ప్రశ్న 5.
స్త్రీల క్లబ్ భవన నిర్మాణానికి ఎవరు సాయం చేశారు?
జవాబు:
స్త్రీల క్లబ్ భవన నిర్మాణానికి సాయం చేసింది సర్ బన్సీలాల్గారు 15,000 రూ॥ ఇచ్చారు.

ప్రశ్న 6.
స్వార్థం లేకుండా పరోపకారిణీ బాలికల పాఠశాల నడిపినదెవరు?
జవాబు:
కీ॥శే॥ సీతమ్మగారు.

ప్రశ్న 7.
రాజాబహద్దూర్ కాలంలో వృద్ధాశ్రమాలు ఎక్కడెక్కడా కలవు?
జవాబు:
హైదరాబాద్ లో ఒకటి, సికిందరాబాద్లో ఒకటి కలవు.

ప్రశ్న 8.
‘సర్ంచ్’ ఎవరు.
జవాబు:
‘సంచ్’ ఆ కాలంలో ఉన్న పోలీసు శాఖామంత్రి.

TS Inter 1st Year Telugu Study Material Chapter 6 రాజాబహద్దుర్ వేంకట రామారెడ్డి సేవాతత్పరత

రాజాబహద్దుర్ వేంకట రామారెడ్డి సేవాతత్పరత Summary in Telugu

రచయిత పరిచయం

రచయిత : సురవరం ప్రతాపరెడ్డి

పుట్టిన తేదీ : మే 28, 1896

పుట్టిన ఊరు : మహబూబ్ నగర్ జిల్లా, గద్వాల సంస్థానంలోని బోరవెల్లి గ్రామం ఇటిక్యాలపాడు స్వగ్రామం

తల్లిదండ్రులు : రంగమ్మ, నారాయణరెడ్డి

విద్యాభ్యాసం : సంస్కృత సాహిత్య వ్యాకరణాలతో పాటు ఎఫ్. ఎ. బి.ఎ. బి.ఎల్

వృత్తి : కొంతకాలం న్యాయవాది, సంపాదకుడు, సాహిత్య కారుడు, సామాజిక కార్యకర్త

రచనలు :

  1. ‘గోల్కొండ పత్రిక’
  2. గోల్కొండ కవుల సంచిక 354 మందితో
  3. మొగలాయి కథలు
  4. ఆంధ్రుల సాంఘిక చరిత్ర
  5. భక్తతుకారం నాటిక
  6. డచ్చల విషాదము నాటిక
  7. హిందూ పండుగలు
  8. హైందవధర్మ వీరులు
  9. రామాయణ విశేషాలు
    మొత్తం 40 గ్రంథాలను రచించారు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 6 రాజాబహద్దుర్ వేంకట రామారెడ్డి సేవాతత్పరత

మరణం : ఆగస్టు 25 1953

కవి పరిచయం

తెలంగాణ, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. ఈయన మే 28, 1896లో మహబూబ్ నగర్ జిల్లా గద్వాల సంస్థానానికి కేంద్రమైన బోరవెల్లి గ్రామంలో జన్మించారు. వీరి స్వగ్రామం. ఇటిక్యాలపాటు. వీరి తల్లిదండ్రులు రంగమ్మ, నారాయణరెడ్డిలు.

సంస్కృత వ్యాకరణంతోపాటు ఎఫ్.ఎ., బి.ఏ.బి.ఎల్ చదివారు. తొలుత న్యాయవాది గా తరువాత పత్రికా సంపాదకుడిగా, సామాజిక కార్యకర్తగా సాహిత్య కారునిగా మారాడు. తెలుగుభాష, తెలంగాణ భారతీయ సంస్కృత జీవనంపై పరిశోధనాత్మక వ్యాసాలు రాశారు.

1926లో తెలంగాణలో పత్రికలకు ప్రాతినిధ్యం లేని కాలంలో గోల్కొండ పత్రికను స్థాపించారు. ఆ పత్రికకు 20 సం॥ల కాలం సంపాదకునిగా పనిచేశారు. తన అమూల్యమైన సంపాదకీయాలతో సృజనాత్మక రచనలతో సామాజిక చైతన్యాన్ని పెంపొందించారు. ‘తెలంగాణలో కవులు పూజ్యం’ అన్న విమర్శకు జవాబుగా 1935లో 354 మంది తెలంగాణ కవులను పరిచయం చేస్తూ “గోల్కొండ కవుల సంచికను వెలువరించాడు.

1931, 1953 వరకు జరిగిన సామాజిక పరిస్థితులు ప్రతి బింబించేలా మొగలాయికథలను రచించారు. 1948లో సురవరంవారు రాసిన “ఆంధ్రుల సాంఘిక చరిత” పరిశోధన గ్రంథానికి 1955లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి గ్రంథమిది.

ఆంధ్ర విద్యాలయం, ఆంధ్రసారస్వత పరిషత్ వంటి సంస్థల స్థాపనకు విశేషకృషి చేశారు. ఆంధ్రమహాసభకు తొలి అధ్యక్షుడు సురవరం. శాసనసభ్యునిగా పనిచేశారు. “ప్రజావాణి”. పత్రికను కూడా నడిపారు. గ్రంథాలయం ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ప్రజల చైతన్యానికి దోహపదపడ్డారు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 6 రాజాబహద్దుర్ వేంకట రామారెడ్డి సేవాతత్పరత

భక్త తుకారం, డచ్చల విషాదము అన్న నాటకాలు. హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, రామాయణ విశేషాలు మొదలైన 40 గ్రంథాలు రచించారు. తెలుగు సామాజిక సాహిత్య రంగాలలో విశేషమైన కృషి చేసిన సురవరం ఆగస్టు 25, 1953న కన్నుమూశారు.

పాఠ్యభాగ సందర్భం

రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి తెలంగాణ ప్రాంతంలో మంచి పలుకుబడి గలవారు. ఆయన సంఘసేవాతత్పరులు. వీరు తమ శక్తియులతో మంచి ఉద్యోగము ను సంపాదించి రాష్ట్రంలోని అన్ని జిల్లాలో పనిచేశారు. పలు భాషలతో పరిచయం ఉన్నవారు. ప్రజాభ్యుదయం కోసం తన ధనమును శక్తిని, బలమును, పలుకుబడిని వినియోగించారు. వీరి ప్రజాసేవలో రెడ్డి విద్యార్థులకు వసతి గృహం నిర్మించటం ముఖ్యమైనది.

20వ శతాబ్దానికి పూర్వం హైదరాబాదు నగరంలో ఒకే హిందూ హెూటలుండేది. ఎంతో మంది ధనుకులుండి కూడా రెడ్డి విద్యార్థులకు విద్యాసౌకర్యం చేయలేక పోయారని బాధపడ్డారు. ఈ విషయంపై ఒక కార్యక్రమంలో ప్రస్తావించగా “ఎవరైనా బాధ్యత తీసుకున్న ఎడల సహాయం చేస్తామన్నారు. వెంకటరామారెడ్డి ఆ బాధ్యతను తీసుకున్నారు. హైదరాబాద్లో రెడ్డి హాస్టల్ స్థాపించబడింది.

బాలికల ఉన్నత పాఠశాల :
హైదరాబాద్ లో బాలికలు చదువుటకు తెలుగు బోధన పాఠశాల లేకపోయింది. ఉన్నత పాఠశాలల్లో, ఉర్దూ, ఇంగ్లీషు బోధించేవారు. మాడపాటి హనుమంతరావు వంటివారు పూనుకుని మాతృభాషలో బాలికల పాఠశాలను స్థాపించారు. దీనికి వెంకటరమారెడ్డి అధ్యక్షులుగా వ్యవహరించారు. బొంబాయి రాజధానిలోని పూనా నగరంలో “కార్వే” మహాశయులు నిర్మించిన మహిళా విద్యాపీఠానికి అనుబంధంగా ఉండి బి.ఏ డిగ్రీ చదువు అవకాశాన్ని బాలికలకు ప్రసాదించేలా అభివృద్ధిచేశారు. తరువాత హైదరాబాద్లోనే పరోపకారిణీ పాఠశాలను స్థాపించారు. దీని అధ్యక్షులు కూడా రెడ్డిగారే!

స్త్రీల క్లబ్ (కాస్మాపాలిటన్ క్లబ్):
హైదరాబాద్ నగరంలోని బొగ్గుల కుంటలో మహిళా సంఘం పేరున ఒక క్లబ్ నిర్మాణం చేశారు.

బాలికా పాఠశాల :
హైదరాబాద్ నగరంలో గొల్లఖిడ్కిలో ఆంధ్రబాలికా ప్రాథమిక పాఠశాలను కొందరు ప్రజాసేవకులు స్థాపించారు. దీని అధ్యక్షులు రెడ్డిగారే!

TS Inter 1st Year Telugu Study Material Chapter 6 రాజాబహద్దుర్ వేంకట రామారెడ్డి సేవాతత్పరత

పరోపకారిణీ పాఠశాల :
సికిందరాబాదు నగరంలో కీ.శే. సీతమ్మగారు బాలికా మాధ్యమిక పాఠశాలను నడిపేవారు. దీనికి రెడ్డిగారు చాలసాయం చేశారు.

ఆంధ్ర విద్యాలయము :
హైదరాబాదు నగరంలో తెలుగు పిల్లలకు మాతృభాషలో బోధించుటకు ఒక మాధ్యమిక పాఠశాలను నిర్మించాలనుకున్నారు. 1931న ‘దేవరకొండ’ సభలో తీర్మాన చేసినా 1944లోకి గాని అది స్థాపించబడలేదు.

గోల్కోండ పత్రిక :
గోల్కొండ పత్రిక సురవరం వారిపై రామారెడ్డికి ప్రత్యేక అభిమానం. సురవరం వారికి ముద్రణాయంత్ర నిర్మాణంకొరకు 3,500 రూ. సహాయంగా అందించారు.

సంఘ సంస్కారం :
రామారెడ్డిగారు గొప్ప సంఘ సంక్కర్త కీ॥శే॥ పండిత కేశవరావు బాల్య వివాహములు తప్పని, వితంతు వివాహాలు జరుపాలని రెండు చిత్తూ శాసనాలను చేస్తే వాటికి మద్దతు ఇచ్చినవారు రామారెడ్డి – రెడ్డి హాస్టల్లోని ఒక విద్యార్థి వితంతు వివాహం చేసుకుంటే అతనిని ప్రోత్సహించారు. రామారెడ్డిగారికి కుల, బేధ పట్టింపులు లేవు. అందరితో కలసి ఉండేవారు.

అనాథలపై ప్రేమ :
రాజాబహద్దూర్ రామారెడ్డిగారికి అనాథలపై మిక్కిలి ప్రేమ ఉ ౦డేది. బాలికలను, వృద్ధులను, రోగపీడితులను చివరకు జంతువులపై కూడా ప్రేమ ఎక్కువే! జంతు హింసా నివారణ సంఘంలో ప్రముఖంగా సేవచేశారు. అనాధశిశువులకు పెంపుడు పిల్లలకు విశేష సేవలందించారు.

సంచ్ ఆకాలంలో పోలీసు శాఖా మంత్రిగా ఉ ండేవారు. వారితో చెప్పి “శిశు సంరక్షక శాసనాన్ని చేయించి అనాథలను బానిస బతుకుల ‘నుండి బయటపడవేశారు. అప్పటికి హైదరాబాద్లో రెండు వృద్ధాశ్రమాలుండేవి. కుష్ఠు రోగులకు చికిత్సాలయాన్ని ‘డిచ్పల్లిలో’ స్థాపించి సేవలందించారు.

అస్పృశ్యతా నివారణపై వెంకటరామారెడ్డిగారు ప్రత్యేక శ్రద్ధ చూపించారు. హరిజన ‘బాలికలను ‘ఆరోజులలో చిన్న వయసులోనే “మురళీలు, బసివిరాండ్రుగా మార్చేవారు. వారు జీవితాంతం వ్యభిచారిణులుగా ఉండవలసి వచ్చేది. ఈ పద్ధతికి స్వస్తి చెప్పి ఆ కళంకాన్ని తుడిచి వేయటానికి వెంకటరామిరెడ్డి కృషిచేశారు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 6 రాజాబహద్దుర్ వేంకట రామారెడ్డి సేవాతత్పరత

రాజాబహద్దూర్ రామారెడ్డి సర్వజన ప్రియులు, పరోపకారులు, కరుణాసముద్రులు, ప్రజారంజకులు. సేవా పరత్వంతో అఖండకీర్తిని గడించారు.

కఠిన పదాలకు అర్థాలు

ద్రవ్యము = ధనము
విస్మృతులు = గుర్తింపు లేనివారు
సర్వదా = ఎప్పుడు
బాడుగ = ಅದ್ದ
ప్రముఖులు = ముఖ్యమైనవారు
ద్రవ్యసహాయ = ధన సహాయం
వితంతు ద్వహములు = భర్తచనిపోయిన స్త్రీలకు తిరిగి వివాహం జరిపించుట
కళంకము = మరక

TS Inter 1st Year Economics Study Material Chapter 5 మార్కెట్ విశ్లేషణ

Telangana TSBIE TS Inter 1st Year Economics Study Material 5th Lesson మార్కెట్ విశ్లేషణ Textbook Questions and Answers.

TS Inter 1st Year Economics Study Material 5th Lesson మార్కెట్ విశ్లేషణ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
మార్కెట్ల వర్గీకరణను విశదీకరించండి.
జవాబు.
వాడుక భాషలో మార్కెట్ అంటే వస్తువుల అమ్మకాలు, కొనుగోళ్ళు జరిపే ఒక ప్రత్యేక స్థలం. మూడు అంశాల ఆధారంగా మార్కెట్ వర్గీకరణ జరుగుతుంది.

  1. కాలానుసారం మార్కెట్లు లేదా కాలవ్యవధి మార్కెట్లు
  2. స్థలానుసారం మార్కెట్లు
  3. పోటీ ఆధార మార్కెట్లుదీనిని ఈ క్రింది పట్టిక ద్వారా చూపించవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 5th Lesson మార్కెట్ విశ్లేషణ 1

I. కాలానుసారం మార్కెట్లు : కాలవ్యవధి ఆధారంగా మార్కెట్లు మూడు రకాలుగా విభజించవచ్చు.

1. అతిస్వల్పకాలం :
ఉత్పత్తిదారుడు అతిస్వల్పకాలంలో ఉత్పత్తిలో ఎలాంటి మార్పుచేయలేదు. సప్లయ్ మార్పులు తేవడానికి ఉత్పాదకాలను మార్చవలసి ఉంటుంది. ఉత్పాదకాలను అతిస్వల్పకాలంలో మార్చడం సాధ్యం కాదు. అందువల్ల సప్లయ్ స్థిరంగా ఉంటుంది.
ఉదా : నశ్వర వస్తువులయిన పూలు, పాలు మొదలగునవి.

2. స్వల్పకాలం :
స్వల్ప కాలంలో సప్లయ్ని కొంతమేరకు మార్చవచ్చు. కొన్ని ఉత్పాదకాలను మార్చడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. చర ఉత్పాదకాలను మార్చడం వల్ల ఇది సాధ్యం.

3. దీర్ఘకాలం :
మార్కెట్లో వస్తువులుండే డిమాండ్ను బట్టి ఉత్పత్తిదారుడు దీర్ఘకాలంలో అన్ని ఉత్పాదకాల్లో మార్పులు చేస్తాడు. దీర్ఘకాలంలో సప్లయ్లో కావలసిన మార్పులు చేయవచ్చు.

మార్కెట్ల వర్గీకరణను విశదీకరించండి.

II. స్థలానుసారం మార్కెట్లు : స్థలాన్ని బట్టి స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లుగా వర్గీకరించబడ్డాయి.

1. స్థానిక మార్కెట్ :
ఒక వస్తువు అమ్మకాలు అది ఉత్పత్తి అయిన ప్రాంతంలోనే జరిగితే దానిని స్థానిక మార్కెట్ అంటారు..
ఉదా : కూరగాయలు, పండ్లు మొదలగునవి.

2. జాతీయ మార్కెట్లు :
ఒక వస్తువుకు దేశంలోని వివిధ ప్రాంతాలలో డిమాండ్ సప్లయి ఉన్నట్లయితే ఆ వస్తువుకు జాతీయ మార్కెట్ ఉన్నట్లుగా చెప్పవచ్చు.
ఉదా : గోధుమ, పంచదార, పత్తి మొదలగునవి.

3. అంతర్జాతీయ మార్కెట్లు :
ఒక వస్తువును ఇతర దేశాల్లో అమ్మకాలు, కొనుగోళ్ళు జరిపినట్లయితే ఆ వస్తువుకు అంతర్జాతీయ మార్కెట్ ఉంటుంది.
ఉదా : బంగారం, వెండి, పెట్రోలు మొదలగునవి.

III. పోటీని బట్టి మార్కెట్లు : పోటీని బట్టి మార్కెట్లు రెండు రకాలు

  1. సంపూర్ణ పోటీ మార్కెట్
  2. అసంపూర్ణ పోటీ మార్కెట్.

1. సంపూర్ణ పోటీ మార్కెట్ :
అధిక సంఖ్యలో కొనుగోలుదార్లు, అమ్మకందార్లు ఉండేదే సంపూర్ణ పోటీ మార్కెట్. కృత్రిమ అడ్డంకులు లేకుండా అందరు సజాతీయ వస్తువునే కొనడం, అమ్మడం జరుగుతుంది.

2. అసంపూర్ణ పోటీ మార్కెట్:
కొనుగోలుదార్ల మధ్యకాని, అమ్మకందార్ల మధ్యకాని సంపూర్ణ పోటీ లేనటువంటి దానిని అసంపూర్ణ పోటీ మార్కెట్ అంటారు. అందువల్ల వస్తువుకు వేరువేరు ధరలు ఉంటాయి. ఈ అసంపూర్ణ పోటీ మార్కెట్లు నాలుగు రకాలు.

  1. ఏకస్వామ్యం
  2. ద్విస్వామ్యం
  3. పరిమితస్వామ్యం
  4. ఏకస్వామ్య పోటీ మార్కెట్.

TS Board Inter First Year Economics Study Material Chapter 5 మార్కెట్ విశ్లేషణ

ప్రశ్న 2.
సంపూర్ణ పోటీ లక్షణాలు ఏవి ?
జవాబు.
అత్యధిక సంఖ్యలో ఉత్పత్తిదార్లు, వినియోగదార్లుండే మార్కెట్ను సంపూర్ణ పోటీ మార్కెట్ అంటారు. మార్కెట్ అంతట ఒకే ధర ఉంటుంది.

1. అధిక సంఖ్యలో కొనుగోలుదార్లు, అమ్మకందార్లు:
ఈ మార్కెట్లో అధిక సంఖ్యలో కొనుగోలుదార్లు, అమ్మకందార్లు ఉంటారు. ఏ ఒక్క అమ్మకందారుడు కాని, కొనుగోలుదారుడు కాని మార్కెట్ ధరను ప్రభావితం చేయలేడు. ఒక వస్తువు ధర దానికుండే డిమాండ్, సప్లయ్లు నిర్ణయిస్తాయి. ఈ ధరను కొనుగోలుదారుడు, అమ్మకందారుడు అంగీకరించాలి. సంస్థ మార్కెట్ ధరను అనుసరించాలి.

2. సజాతీయ వస్తువులు :
ఈ మార్కెట్లో వస్తువులన్నీ సజాతీయంగా ఉంటాయి. ఈ వస్తువులకుండే జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం సంపూర్ణం. అందువల్ల మార్కెట్ అంతటా ఒకే ధర ఉంటుంది.

3. ప్రవేశించడానికి, నిష్క్రమించడానికి స్వేచ్ఛ:
ఈ మార్కెట్లో నూతన పరిశ్రమలు ప్రవేశించడానికి, నిష్క్రమించడానికి స్వేచ్ఛ ఉంటుంది. సంస్థ గరిష్ట లాభాలు పొందుతున్నప్పుడు నూతన సంస్థలు ప్రవేశించుటకు, నష్టాలు వచ్చేటప్పుడు నిష్క్రమించుటకు స్వేచ్ఛ కలదు.

4. సంస్థ, పరిశ్రమ వేరువేరు :
ఈ మార్కెట్లో సంస్థ, పరిశ్రమ వేరువేరుగా ఉంటాయి. సంస్థ అంటే వస్తువులను ఉత్పత్తి చేసే యూనిట్. పరిశ్రమ అనగా సంస్థల సముదాయం.

5. రవాణా ఖర్చులు ఉండవు :
రవాణా ఖర్చు ఉండనందువల్ల మార్కెట్ అంతటా వస్తువుకు ఒకే ధర ఉంటుంది.

6. ఉత్పత్తి కారకాలకు, వస్తువులకు సంపూర్ణ గమనశీలత :
ఈ మార్కెట్లో ఉత్పత్తి కారకాలు ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు వెళ్ళవచ్చు. అదే విధంగా వస్తు మార్కెట్లో పూర్తి గమనశీలత ఉంటుంది.

7. మార్కెట్ సంపూర్ణ పరిజ్ఞానం:
ఈ మార్కెట్లో మార్కెట్ను గురించి సంపూర్ణ పరిజ్ఞానం కొనుగోలుదార్లకు, అమ్మకందార్లకు ఉంటుంది. ప్రతి కొనుగోలుదారుకు, అమ్మకందారుకు ధర తెలుస్తుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 5 మార్కెట్ విశ్లేషణ

ప్రశ్న 3.
సంపూర్ణ పోటీ అర్థాన్ని వివరించండి. సంపూర్ణ పోటీ మార్కెట్లో ధర నిర్ణయ విధానాన్ని చిత్రీకరించండి.
జవాబు.
సంపూర్ణ పోటీ మార్కెట్ వ్యవస్థలో వైయక్తిక సంస్థల మధ్య ప్రతిస్పర్థ ఉండదు. నిత్యం వాడుకలో ఉన్న అర్థానికి భిన్నంగా ఆర్థిక సిద్ధాంతంలో సంపూర్ణ పోటీ పదాన్ని వాడుతున్నాం. వర్తకులు ‘పోటీ’, ‘ప్రతిస్పర్థ’ అనే పదాలను పర్యాయ పదాలుగా ఉపయోగిస్తారు.

సిద్ధాంతరీత్యా సంపూర్ణపోటీలో సంస్థల మధ్య ప్రతిస్పర్ధ ఉండదు. సజాతీయ వస్తువులను తయారుచేసే సంస్థలు అధికసంఖ్యలో ఉండి, పరిశ్రమలోనికి సంస్థలు ప్రవేశించడానికి, పరిశ్రమ నుంచి నిష్క్రమించడానికి స్వేచ్ఛ, కొనుగోలుదారునికి సంపూర్ణ పరిజ్ఞానం, ఉత్పత్తికారకాలకు పూర్తి గమనశీలత, రవాణా వ్యయాలు లేకుండటం అనే లక్షణాలుంటే దానిని సంపూర్ణ పోటీ మార్కెట్ అంటారు.

ధర నిర్ణయం :
మార్కెట్లో సప్లయ్, డిమాండ్ ను బట్టి వస్తువు ధరను నిర్ణయిస్తారు. మార్కెట్లోనికి అమ్మకానికి వచ్చే వస్తువులకు, కొనుగోలుదార్లు డిమాండ్ చేసే వస్తువులకు మధ్య సమతౌల్యాన్ని తెస్తుంది. సప్లయ్, డిమాండ్ సమానంగా ఉన్నచోట మార్కెట్ సమతౌల్య ధరను నిర్ణయిస్తుంది. మార్కెట్ నిర్ణయించిన ధరను ఉత్పత్తిదారులు అనుసరిస్తారు.

ధరడిమాండ్ పరిమాణంసప్లయ్ పరిమాణం
11050
22040
33030
44020
55010

పై పట్టికలో ధరలో మార్పులు జరిగినప్పుడు వస్తువు సప్లయ్, డిమాండ్లో కూడా మార్పులు జరిగాయి. వస్తువు ధర పెరిగినప్పుడు డిమాండ్ పరిమాణం తగ్గింది. అంటే ధరకు, డిమాండ్కు విలోమ సంబంధం ఉంది. అయితే ధర పెరిగితే సప్లయ్ పరిమాణం పెరిగింది. అనగా సప్లయ్కి, ధరకు ప్రత్యక్ష సంబంధం ఉంది. ₹ 3/- వద్ద సప్లయ్ డిమాండ్ సమానం అయినాయి. దీనిని సమతౌల్య ధర అంటారు. దీనిని ఈ క్రింది రేఖాపటం ద్వారా తెలియజేయవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 5th Lesson మార్కెట్ విశ్లేషణ 2

పై రేఖాపటంలో DD డిమాండ్ రేఖ, SS సప్లయేఖలు. ఈ రెండు ‘e’ బిందువు ఖండించుకున్నప్పుడు ధర OP గా, సప్లయ్, డిమాండ్ 0Q గా ఉన్నాయి. అందువల్ల OP సమతౌల్యపు ధర.

TS Board Inter First Year Economics Study Material Chapter 5 మార్కెట్ విశ్లేషణ

ప్రశ్న 4.
సంపూర్ణ పోటీలో సంస్థ సమతౌల్యాన్ని వివరించండి.
జవాబు.
సంస్థ సమతౌల్యం :
సంపూర్ణ పోటీలో వస్తువు ధరను మార్కెట్ను నిర్ణయిస్తుంది. ఉత్పత్తిదారుడు ఈ ధరను స్వీకరించి తన ఉత్పత్తిని నిర్ణయించుకుంటాడు. ఒక సంస్థ అధిక లాభాలను పొందాలనుకుంటుంది. కాబట్టి ఎక్కువ లాభాలనిచ్చే ఉత్పత్తిని ఎంపిక చేస్తుంది. అధిక లాభాలనిచ్చే ఉత్పత్తిని చేసినప్పుడు సంస్థ సమతౌల్య స్థితిలో ఉంటుంది.

సమతౌల్య ఉత్పత్తి చేసే సంస్థ తన ఉత్పత్తిని మార్చుకోవడానికి ఇష్టపడడు. ఈ స్థితి నుంచి ఉత్పత్తిని పెంచుకోవడానికి, తగ్గించడానికి ఇష్టపడదు. సంస్థ సమతౌల్య స్థితిని రెండు కాలాల్లో వివరిస్తారు. అవి

  1. స్వల్పకాలం
  2. దీర్ఘకాలం.

1. స్వల్పకాల సమతౌల్యం :
స్వల్పకాలంలో సంస్థ స్థిర ఉత్పత్తి కారకాలు అంటే యంత్రాలు, భవనాలు మొదలగునవి మార్చలేదు. చరకారకాలు మాత్రమే మార్చి ఉత్పత్తిని పెంచుకుంటుంది. స్వల్పకాలంలో ఉపాంత వ్యయం, ఉపాంత రాబడికి సమానమైనప్పుడు స్వల్పకాలిక సమతౌల్య ఉత్పత్తి జరుగుతుంది. స్వల్పకాలంలో సంస్థ గరిష్ట లాభాన్ని లేదా సాధారణ లాభాన్ని లేదా నష్టాన్ని పొందుతుంది. దీనిని ఈ క్రింది రేఖాపటాల ద్వారా తెలియజేయవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 5th Lesson మార్కెట్ విశ్లేషణ 3

A రేఖాపటంలో ‘OX’ అక్షంమీద ఉత్పత్తి పరిమాణంను, ‘OY’ అక్షం మీద ధరను చూపినాము.

B రేఖాపటంలో OX అక్షంపై ఉత్పత్తి పరిమాణాన్ని, OY పై వ్యయం, రాబడిని కొలుస్తాం. A రేఖాపటంలో ‘E’ బిందువు వద్ద డిమాండ్, సప్లయ్ సమానమయినాయి. అందువల్ల పరిశ్రమలో OP సమతౌల్యపు ధర నిర్ణయించబడుతుంది. ఇదే ధరను సంస్థ అంగీకరిస్తుంది. దీనికి సమతౌల్య ధర నిర్ణయించబడుతుంది. ఇదే ధరను సంస్థ అంగీకరిస్తుంది. దీనిని సంస్థలో క్షితిజరేఖ ద్వారా చూపించడం జరిగింది. దీనినే ‘ధర రేఖ’ అంటారు.

సంస్థలో ఉపాంత వ్యయం = ఉపాంత రాబడి అయినప్పుడు ఉండే ఉత్పత్తి వల్ల లాభాలు గరిష్టంగా ఉంటాయి. రేఖాపటంలో 0Q ఉత్పత్తి దగ్గర లాభాలు గరిష్టంగా ఉంటాయి. సమతౌల్య బిందువు ‘E’ దగ్గర ధర P; సగటు వ్యయం QB సగటు లాభం BA.

∴ మొత్తం లాభం PABC కి సమానం. అనగా OQ వస్తుపరిమాణంను ఉత్పత్తి చేయటానికి అయిన వ్యయం OCBQ; రాబడి OPAQ.

2. దీర్ఘకాలిక సమతౌల్యం :
దీర్ఘకాలంలో సంస్థ ఉత్పాదకాలు అన్నింటికి మార్చడం ద్వారా ఉత్పత్తిలో మార్పులు చేస్తుంది. సంస్థ దీర్ఘకాలంలో కూడా ఉపాంత వ్యయం, ఉపాంత రాబడికి సమానమైనచోట సమతౌల్యం ఉత్పత్తి చేస్తుంది. దీర్ఘకాలంలో ఒక ముఖ్యమైన అంశం సంస్థల ప్రవేశం, నిష్క్రమణ ఈ కాలంలో జరుగుతుంది. ఈ  కారణం వల్ల ప్రతి సంస్థ దీర్ఘకాలంలో సాధారణ లాభాలు మాత్రమే పొందుతుంది. దీర్ఘకాలిక సమతౌల్యాన్ని ఈ ప్రక్క రేఖాపటం ద్వారా వివరించవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 5th Lesson మార్కెట్ విశ్లేషణ 4

పై రేఖాపటంలో ‘OX’ అక్షంపై వస్తుపరిమాణాన్ని, ‘OY’ అక్షంపై ధర వ్యయం, రాబడులను కొలుస్తాము. పై రేఖాపటంలో ‘E’ బిందువు వద్ద AR = MR = LMC LAC గా ఉంది. అప్పుడు ధర OP గా, పరిమాణం 0Q గా ఉండును.

TS Board Inter First Year Economics Study Material Chapter 5 మార్కెట్ విశ్లేషణ

ప్రశ్న 5.
ఏకస్వామ్యం అంటే ఏమిటి ? ఏకస్వామ్యంలో ధర ఏ విధంగా నిర్ణయించబడుతుందో వివరించండి.
జవాబు.
అసంపూర్ణ పోటీ మార్కెట్లో ఏకస్వామ్యం ఒకటి. దీనినే గుత్తాధిపత్యం అంటారు. ఒక వస్తువుకు ఒకే అమ్మకం దారుడుండి, ఆ వస్తువుకు సన్నిహిత ప్రత్యామ్నాయాలు లేని మార్కెట్ను ఏకస్వామ్య మార్కెట్ అంటారు. కనుక ఏకస్వామ్యదారుడు వస్తువు సప్లైని, వస్తువు ధరను నియంత్రించగలడు.

కాని రెండింటినీ ఒకే సమయంలో నియంత్రించలేడు. ఉత్పత్తిని నియంత్రిస్తే మార్కెట్ ధరను స్వీకరిస్తాడు. మార్కెట్ ధరను నిర్ణయిస్తే ఉత్పత్తిని మార్కెటు వదిలివేస్తాడు.

లక్షణాలు :

  1. మార్కెట్లో ఒక సంస్థ మాత్రమే వస్తూత్పత్తిని చేస్తుంది.
  2. ఈ మార్కెట్లో వస్తువులకు సమీప ప్రత్యామ్నాయాలుండవు.
  3. ఈ మార్కెట్లో సంస్థ, పరిశ్రమ ఒక్కటే.
  4. మార్కెట్లోనికి నూతన సంస్థలు ప్రవేశించడానికి వీలులేని నిబంధనలుంటాయి.
  5. ఏకస్వామ్యదారుడే వస్తుధరను, వస్తు సప్లయ్న నియంత్రిస్తాడు.

ధర నిర్ణయం :
గరిష్ట లాభాలను ఆర్జించటం ఏకస్వామ్య సంస్థ ధ్యేయం. ఏకస్వామ్యంలో ఉత్పత్తిదారుడు వస్తూత్పత్తిని తగ్గిస్తూ ధరను పెంచగలడు. వస్తూత్పత్తిని పెంచుతూ ధరను తగ్గించగలడు. ఈ విధమైన ధర నిర్ణయం వల్ల ఏకస్వామ్యదారుడు గరిష్ట లాభాలను ఆర్జిస్తాడు.

ఏకస్వామ్యంలో కూడా ఉపాంత వ్యయం, ఉపాంత రాబడికి సమానమైన పరిస్థితిలో ఏకస్వామ్య సంస్థ సమతౌల్యంలో ఉంటుంది. ఏకస్వామ్యంలో ధర నిర్ణయాలు క్రింది రేఖాపటం ద్వారా తెలుసుకోవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 5th Lesson మార్కెట్ విశ్లేషణ 5

పై రేఖాపటంలో ‘X’ అక్షంపై ఉత్పత్తి పరిమాణంను, Y అక్షంపై వ్యయం రాబడిని చూపాము. AR సగటు రాబడి రేఖ, MR ఉపాంత రాబడిరేఖ, AC సగటు వ్యయరేఖ, MC ఉపాంత వ్యయరేఖ. MR రేఖ MC ని ‘E’ బిందువు వద్ద ఖండించడం వల్ల, MC MR అవుతుంది. కనుక OM ఉత్పత్తి వద్ద సంస్థ సమతౌల్యంలో ఉంది.

E నుండి గీయబడిన రేఖ ‘X’ అక్షంపైన ఉత్పత్తి పరిమాణంను, AR రేఖపై వస్తువు ధరను తెలియజేయును. AR, ACల మధ్య తేడా సంస్థ లాభనష్టాలను సూచించును. AC కంటే AR ఎక్కువగా ఉంటే అసాధారణ లాభాలు వచ్చును. పై రేఖాపటంలో OM వస్తురాశిని ఉత్పత్తి చేయడానికి అయ్యే వ్యయం OCBM వచ్చే ఆదాయం OPAM.

మొత్తం లాభం = మొత్తం రాబడి – మొత్తం వ్యయం
= OCBM – OPAM = CPAB
∴ CPAB పై రేఖాపటంలో సంస్థ ఆర్జించే లాభాలు.

TS Board Inter First Year Economics Study Material Chapter 5 మార్కెట్ విశ్లేషణ

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
కాలాన్నిబట్టి మార్కెట్ వర్గీకరణపై ఒక వ్యాఖ్యను రాయండి.
జవాబు.
సాధారణంగా వస్తుసేవల అమ్మకాలు, కొనుగోళ్ళు జరిగే ప్రదేశాన్ని మార్కెట్గా పరిగణిస్తాం. ఆధునిక కాలంలో మార్కెట్ భావనలో గొప్ప మార్పులు ఏర్పడ్డాయి. మార్కెట్ అనే పదాన్ని కూరగాయల మార్కెట్, పండ్ల మార్కెట్, బంగారం, వెండి మార్కెట్, షేర్ మార్కెట్ మొదలైనవాటిని తెలియజేయడానికి ఉపయోగిస్తారు.

ఆధునిక కాలంలో ఒక “వ్యక్తి ఒక వస్తువును కొనడానికి, అమ్మడానికి మార్కెట్కు వెళ్ళవలసిన అవసరం లేదు. ప్రస్తుతం వస్తు సేవల అమ్మకాలు, కొనుగోళ్ళు మార్కెట్కు వెళ్ళకుండానే సమాచార సౌకర్యాల ద్వారా జరపవచ్చు.

ప్రజలు టెలిఫోన్, మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ (అంతర్జాలం) సదుపాయాల ద్వారా దూర ప్రాంతాల నుండి వస్తు సేవల కొనుగోళ్ళు, అమ్మకాలు జరపడాన్ని మనం గమనించవచ్చు. అమ్మకందార్లకు, కొనుగోలుదార్లను ఒక దగ్గరికి చేర్చే యంత్రాంగమే మార్కెట్ అని ఎడ్వర్డ్స్ (Edwards) నిర్వచించాడు.

కాలానుసార మార్కెట్లు (Time Based Markets) :
కాలానుసారం వస్తు సప్లయ్ లో సర్దుబాట్లు జరుగుతాయి. కాలవ్యవధి ఆధారంగా మార్కెట్లు మూడు రకాలుగా ఉంటాయి. అవి : అతిస్వల్పకాలిక మార్కెట్, స్వల్పకాలిక మార్కెట్, దీర్ఘకాలిక మార్కెట్.

a) మార్కెట్ కాలం లేదా అతిస్వల్ప కాలం (Market Period or Very Short Period) :
ఉత్పత్తిదారుడు అతిస్వల్ప కాలంలో ఉత్పత్తిలో ఎలాంటి మార్పు చేయలేడు. అందువల్ల సప్లయ్ స్థిరంగా ఉంటుంది. ఉత్పాదకాలను మార్చడం వల్ల సప్లయ్లో మార్పులు తీసుకురావచ్చు. ఉత్పాదకాలను అతిస్వల్ప కాలంలో మార్చలేం. నశ్వర వస్తువులకు (perishable goods) ఈ మార్కెట్ వర్తిస్తుంది.

b) స్వల్పకాలం (Short Period) :
స్వల్పకాలంలో సప్లయ్ను కొంతవరకు మార్చవచ్చు. కొన్ని ఉత్పాదకాలను మార్చడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. శ్రమలాంటి చర ఉత్పాదకాలను మార్చడం వల్ల ఇది సాధ్యం.

c) దీర్ఘకాలం (Long Period) :
పెరిగే డిమాండు తీర్చడానికి తగినట్లుగా దీర్ఘకాలంలో సప్లయ్లో మార్పు చేయవచ్చు. దీర్ఘకాలంలో వస్తువుకుండే డిమాండ్ ఆధారంగా ఉత్పత్తిదారుడు అన్ని ఉత్పాదకాల్లో మార్పులు చేస్తాడు. దీర్ఘ కాలంలో సప్లయ్లో కావాల్సిన సర్దుబాట్లు చేయవచ్చు.

TS Board Inter First Year Economics Study Material Chapter 5 మార్కెట్ విశ్లేషణ

ప్రశ్న 2.
సంపూర్ణ పోటీలో స్వల్పకాలంలో సంస్థ సమతౌల్యాన్ని వివరించండి.
జవాబు.
సంస్థ సమతౌల్యం :
సంపూర్ణ పోటీలో వస్తువు ధరను మార్కెట్ను నిర్ణయిస్తుంది. ఉత్పత్తిదారుడు ఈ ధరను స్వీకరించి తన ఉత్పత్తిని నిర్ణయించుకుంటాడు. ఒక సంస్థ అధిక లాభాలను పొందాలనుకుంటుంది. కాబట్టి ఎక్కువ లాభాలనిచ్చే ఉత్పత్తిని ఎంపిక చేస్తుంది. అధిక లాభాలనిచ్చే ఉత్పత్తిని చేసినప్పుడు సంస్థ సమతౌల్య స్థితిలో ఉంటుంది. సమతౌల్య ఉత్పత్తి చేసే సంస్థ తన ఉత్పత్తిని మార్చుకోవడానికి ఇష్టపడడు.

ఈ స్థితి నుంచి ఉత్పత్తిని పెంచుకోవడానికి, తగ్గించడానికి ఇష్టపడదు. సంస్థ సమతౌల్య స్థితిని రెండు కాలాల్లో వివరిస్తారు. అవి

  1. స్వల్పకాలం
  2. దీర్ఘకాలం.

1. స్వల్పకాల సమతౌల్యం :
స్వల్పకాలంలో సంస్థ స్థిర ఉత్పత్తి కారకాలు అంటే యంత్రాలు, భవనాలు మొదలగునవి మార్చలేదు. చరకారకాలు మాత్రమే మార్చి ఉత్పత్తిని పెంచుకుంటుంది. స్వల్పకాలంలో ఉపాంత వ్యయం, ఉపాంత రాబడికి సమానమైనప్పుడు స్వల్పకాలిక సమతౌల్య ఉత్పత్తి జరుగుతుంది.

స్వల్పకాలంలో సంస్థ గరిష్ట లాభాన్ని లేదా సాధారణ లాభాన్ని లేదా నష్టాన్ని పొందుతుంది. దీనిని ఈ క్రింది రేఖాపటాల ద్వారా తెలియజేయవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 5th Lesson మార్కెట్ విశ్లేషణ 3

A రేఖాపటంలో ‘OX’ అక్షంమీద ఉత్పత్తి పరిమాణంను, ‘OY’ అక్షం మీద ధరను చూపినాము.

B రేఖాపటంలో OX అక్షంపై ఉత్పత్తి పరిమాణాన్ని, OY పై వ్యయం, రాబడిని కొలుస్తాం. A రేఖాపటంలో ‘E’ బిందువు వద్ద డిమాండ్, సప్లయ్ సమానమయినాయి. అందువల్ల పరిశ్రమలో OP సమతౌల్యపు ధర నిర్ణయించబడుతుంది. ఇదే ధరను సంస్థ అంగీకరిస్తుంది.

దీనికి సమతౌల్య ధర నిర్ణయించబడుతుంది. ఇదే ధరను సంస్థ అంగీకరిస్తుంది. దీనిని సంస్థలో క్షితిజరేఖ ద్వారా చూపించడం జరిగింది. దీనినే ‘ధర రేఖ’ అంటారు.

సంస్థలో ఉపాంత వ్యయం = ఉపాంత రాబడి అయినప్పుడు ఉండే ఉత్పత్తి వల్ల లాభాలు గరిష్టంగా ఉంటాయి. రేఖాపటంలో 0Q ఉత్పత్తి దగ్గర లాభాలు గరిష్టంగా ఉంటాయి. సమతౌల్య బిందువు ‘E’ దగ్గర ధర P; సగటు వ్యయం QB సగటు లాభం BA.

∴ మొత్తం లాభం PABC కి సమానం. అనగా OQ వస్తుపరిమాణంను ఉత్పత్తి చేయటానికి అయిన వ్యయం OCBQ; రాబడి OPAQ.

2. దీర్ఘకాలిక సమతౌల్యం :
దీర్ఘకాలంలో సంస్థ ఉత్పాదకాలు అన్నింటికి మార్చడం ద్వారా ఉత్పత్తిలో మార్పులు చేస్తుంది. సంస్థ దీర్ఘకాలంలో కూడా ఉపాంత వ్యయం, ఉపాంత రాబడికి సమానమైనచోట సమతౌల్యం ఉత్పత్తి చేస్తుంది. దీర్ఘకాలంలో ఒక ముఖ్యమైన అంశం సంస్థల ప్రవేశం, నిష్క్రమణ ఈ కాలంలో జరుగుతుంది.

ఈ ఈ కారణం వల్ల ప్రతి సంస్థ దీర్ఘకాలంలో సాధారణ లాభాలు మాత్రమే పొందుతుంది. దీర్ఘకాలిక సమతౌల్యాన్ని ఈ ప్రక్క రేఖాపటం ద్వారా వివరించవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 5th Lesson మార్కెట్ విశ్లేషణ 4

పై రేఖాపటంలో ‘OX’ అక్షంపై వస్తుపరిమాణాన్ని, ‘OY’ అక్షంపై ధర వ్యయం, రాబడులను కొలుస్తాము. పై రేఖాపటంలో ‘E’ బిందువు వద్ద AR = MR = LMC LAC గా ఉంది. అప్పుడు ధర OP గా, పరిమాణం 0Q గా ఉండును.

TS Board Inter First Year Economics Study Material Chapter 5 మార్కెట్ విశ్లేషణ

ప్రశ్న 3.
సంపూర్ణ పోటీలో, దీర్ఘకాలంలో సంస్థ సమతౌల్యాన్ని వివరించండి.
జవాబు.
సంస్థ సమతౌల్యం :
సంపూర్ణ పోటీలో వస్తువు ధరను మార్కెట్ను నిర్ణయిస్తుంది. ఉత్పత్తిదారుడు ఈ ధరను స్వీకరించి తన ఉత్పత్తిని నిర్ణయించుకుంటాడు. ఒక సంస్థ అధిక లాభాలను పొందాలనుకుంటుంది. కాబట్టి ఎక్కువ లాభాలనిచ్చే ఉత్పత్తిని ఎంపిక చేస్తుంది.

అధిక లాభాలనిచ్చే ఉత్పత్తిని చేసినప్పుడు సంస్థ సమతౌల్య స్థితిలో ఉంటుంది. సమతౌల్య ఉత్పత్తి చేసే సంస్థ తన ఉత్పత్తిని మార్చుకోవడానికి ఇష్టపడడు. ఈ స్థితి నుంచి ఉత్పత్తిని పెంచుకోవడానికి, తగ్గించడానికి ఇష్టపడదు. సంస్థ సమతౌల్య స్థితిని రెండు కాలాల్లో వివరిస్తారు. అవి

  1. స్వల్పకాలం
  2. దీర్ఘకాలం.

1. స్వల్పకాల సమతౌల్యం :
స్వల్పకాలంలో సంస్థ స్థిర ఉత్పత్తి కారకాలు అంటే యంత్రాలు, భవనాలు మొదలగునవి మార్చలేదు. చరకారకాలు మాత్రమే మార్చి ఉత్పత్తిని పెంచుకుంటుంది. స్వల్పకాలంలో ఉపాంత వ్యయం, ఉపాంత రాబడికి సమానమైనప్పుడు స్వల్పకాలిక సమతౌల్య ఉత్పత్తి జరుగుతుంది. స్వల్పకాలంలో సంస్థ గరిష్ట లాభాన్ని లేదా సాధారణ లాభాన్ని లేదా నష్టాన్ని పొందుతుంది. దీనిని ఈ క్రింది రేఖాపటాల ద్వారా తెలియజేయవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 5th Lesson మార్కెట్ విశ్లేషణ 3

A రేఖాపటంలో ‘OX’ అక్షంమీద ఉత్పత్తి పరిమాణంను, ‘OY’ అక్షం మీద ధరను చూపినాము.

B రేఖాపటంలో OX అక్షంపై ఉత్పత్తి పరిమాణాన్ని, OY పై వ్యయం, రాబడిని కొలుస్తాం. A రేఖాపటంలో ‘E’ బిందువు వద్ద డిమాండ్, సప్లయ్ సమానమయినాయి. అందువల్ల పరిశ్రమలో OP సమతౌల్యపు ధర నిర్ణయించబడుతుంది. ఇదే ధరను సంస్థ అంగీకరిస్తుంది. దీనికి సమతౌల్య ధర నిర్ణయించబడుతుంది. ఇదే ధరను సంస్థ అంగీకరిస్తుంది. దీనిని సంస్థలో క్షితిజరేఖ ద్వారా చూపించడం జరిగింది. దీనినే ‘ధర రేఖ’ అంటారు.

సంస్థలో ఉపాంత వ్యయం = ఉపాంత రాబడి అయినప్పుడు ఉండే ఉత్పత్తి వల్ల లాభాలు గరిష్టంగా ఉంటాయి. రేఖాపటంలో 0Q ఉత్పత్తి దగ్గర లాభాలు గరిష్టంగా ఉంటాయి. సమతౌల్య బిందువు ‘E’ దగ్గర ధర P; సగటు వ్యయం QB సగటు లాభం BA.

∴ మొత్తం లాభం PABC కి సమానం. అనగా OQ వస్తుపరిమాణంను ఉత్పత్తి చేయటానికి అయిన వ్యయం OCBQ; రాబడి OPAQ.

2. దీర్ఘకాలిక సమతౌల్యం :
దీర్ఘకాలంలో సంస్థ ఉత్పాదకాలు అన్నింటికి మార్చడం ద్వారా ఉత్పత్తిలో మార్పులు చేస్తుంది. సంస్థ దీర్ఘకాలంలో కూడా ఉపాంత వ్యయం, ఉపాంత రాబడికి సమానమైనచోట సమతౌల్యం ఉత్పత్తి చేస్తుంది. దీర్ఘకాలంలో ఒక ముఖ్యమైన అంశం సంస్థల ప్రవేశం, నిష్క్రమణ ఈ కాలంలో జరుగుతుంది. ఈ ఈ కారణం వల్ల ప్రతి సంస్థ దీర్ఘకాలంలో సాధారణ లాభాలు మాత్రమే పొందుతుంది. దీర్ఘకాలిక సమతౌల్యాన్ని ఈ ప్రక్క రేఖాపటం ద్వారా వివరించవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 5th Lesson మార్కెట్ విశ్లేషణ 4

పై రేఖాపటంలో ‘OX’ అక్షంపై వస్తుపరిమాణాన్ని, ‘OY’ అక్షంపై ధర వ్యయం, రాబడులను కొలుస్తాము. పై రేఖాపటంలో ‘E’ బిందువు వద్ద AR = MR = LMC LAC గా ఉంది. అప్పుడు ధర OP గా, పరిమాణం OQ గా ఉండును.

TS Board Inter First Year Economics Study Material Chapter 5 మార్కెట్ విశ్లేషణ

ప్రశ్న 4.
ఏకస్వామ్యం అంటే ఏమిటి ? దాని లక్షణాలు ఏవి ?
జవాబు.
సంపూర్ణ పోటీతో పోల్చినప్పుడు ఏకస్వామ్యం పూర్తిగా భిన్నమైన మార్కెట్. ఏకస్వామ్యం అంటే ఒకే ఉత్పత్తిదారుడు ఉన్న మార్కెట్ అని అర్థం. మార్కెట్లో సమీప ప్రత్యామ్నాయ వస్తువులు లేని వస్తువును ఒకే సంస్థ సప్లయ్ చేసినప్పుడు ఏకస్వామ్య మార్కెట్ ఉన్నట్లు.
‘బిలాస్’ మాటల్లో సమీప ప్రత్యామ్నాయ వస్తువులు లేని వస్తూత్పత్తిని చేసే ఒకే అమ్మకందారుడు ప్రాతినిధ్యం వహించే మార్కెట్ను ఏకస్వామ్యమంటారు. మార్కెట్లో అమ్మబడే ఇతర వస్తువులు, వాటి ధరల వల్ల ఏకస్వామ్యదారుడు ప్రభావితం కాడు, వాటిని ప్రభావితం చేయలేడు.

ఏకస్వామ్యం ముఖ్య లక్షణాలు :

  • మార్కెట్లో ఒక్క సంస్థ మాత్రమే వస్తూత్పత్తిని చేస్తుంది.
  • ఏకస్వామ్యంలో తయారయ్యే వస్తువుకు సమీప ప్రత్యామ్నాయాలుండవు.
  • మార్కెట్లోనికి నూతన సంస్థలు ప్రవేశించడానికి వీలులేని నిబంధనలుంటాయి.
  • పరిశ్రమ, సంస్థ రెండూ ఒక్కటే.
  • ఉత్పత్తిదారుడు వస్తువు ధరను, వస్తు సప్లయ్ను నియంత్రిస్తాడు. అయితే ఒక సమయంలో వస్తువు ధరను లేదా వస్తువు సప్లయ్ను ఏదో ఒకదాన్ని మాత్రమే నియంత్రించగలడు.

ఏకస్వామ్యంలో సమతౌల్యం – ధర నిర్ణయం :
ఏకస్వామ్యంలో వస్తువు డిమాండ్, సప్లయ్ ఆధారంగా దాని ధర, వస్తూత్పత్తి, లాభాలు నిర్ణయించబడతాయి. ఏకస్వామ్యదారుడు వస్తువు సరఫరాపై పూర్తి నియంత్రణను కలిగిఉంటాడు. అంతేకాకుండా గరిష్ఠ లాభం వచ్చే విధంగా ధరను నిర్ణయించగలడు. అయితే రెండింటిని ఒకేసారి నిర్ణయించలేడు.

ఏకస్వామ్యదారుడు వస్తువు ధరను నిర్ణయించితే, ఆ ధరకు మార్కెట్లోని వినియోగదారుని డిమాండ్ వల్ల సప్లయ్ నిర్ణయించబడుతుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 5 మార్కెట్ విశ్లేషణ

ప్రశ్న 5.
ఏకస్వామ్య పోటీ లక్షణాలు ఏవి ?
జవాబు.
సంపూర్ణ పోటీ లేదా నిరపేక్ష ఏకస్వామ్యం లేనటువంటి ఏకస్వామ్య పోటీ మాత్రమే వాస్తవంగా ఉంటుంది. ఈ. హెచ్. చాంబర్లిన్ (E.H. Chamberlin), జోన్ రాబిన్సన్ (Joan Robinson) ఈ రకమైన మార్కెట్ విశ్లేషణను ప్రతిపాదించారు.

ఏకస్వామ్య పోటీ లక్షణాలు (Characteristics of Monopolistic Competition) :
చాంబర్లిన్ ప్రకారం ఏకస్వామ్య పోటీకి కింది ముఖ్య లక్షణాలు ఉంటాయి.

a) తక్కువ సంఖ్యలో సంస్థలు :
సంపూర్ణ పోటీలోని సంస్థల కంటే ఏకస్వామ్య పోటీలో సంస్థల సంఖ్య తక్కువ. సంస్థలకు ఈ పోటీలో కొంతమేరకు ఏకస్వామ్య అధికారం ఉంటుంది. వస్తూత్పత్తి ప్రక్రియలో తగినంత పరిమాణంలో ఉత్పత్తిదారులు పాల్గొంటారు. మార్కెట్లో తీవ్రమైన పోటీ ఉన్నందువల్ల ఏ ఒక్క ఉత్పత్తిదారుడు మార్కెట్కు సంబంధించిన మొత్తం ఉత్పత్తిని ప్రభావితం చేయలేడు.

b) వస్తు వైవిధ్యం (Product Differentiation) :
ఏకస్వామ్య పోటీ లక్షణాలలో ముఖ్యమైంది వస్తు వైవిధ్యం. అనేక సంస్థలు వస్తువులను తయారుచేసినా, ఒక సంస్థ ఉత్పత్తి చేసిన వస్తువును మార్కెట్లోని ఇతర సంస్థలు ఉత్పత్తి చేసిన వస్తువులతో పోల్చినప్పుడు కొన్ని తేడాలుంటాయి. ఈ పోటీలో సజాతీయ వస్తువులు కాకుండా విజాతీయ వస్తువులే ఉంటాయి.

వస్తువు వైవిధ్యమనేది బ్రాండ్ నేమ్, ట్రేడ్ మార్క్ మొదలైన రూపాల్లో ఉంటుంది. అంటే సంస్థ ఉత్పత్తికి సమీప ప్రత్యామ్నాయాలుంటాయి. వీటికుండే జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం అధికం.

c) నూతన సంస్థలు ప్రవేశించే, నిష్క్రమించే స్వేచ్ఛ:
ప్రతీ సంస్థ తన వస్తూత్పత్తిపై ఏకస్వామ్య అధికారాన్ని కలిగి ఉంటుంది. అయితే ఇదే పోలికలున్న వస్తువులను తయారుచేసే ఇతర సంస్థల నుంచి పోటీని ఎదుర్కొంటుంది. కాబట్టి పరిశ్రమలోకి వీలుంది. అలాగే పరిశ్రమ నుంచి నిష్క్రమించే స్వేచ్ఛ ఉంది.

d) పోటీతో కూడుకున్న ప్రకటనలు లేదా అమ్మకం వ్యయాలు :
వస్తువుల వైవిధ్యం వల్ల తమ అమ్మకాల్లో పెరుగుదల కోసం పోటీ ప్రకటనలను సంస్థలు అనుసరిస్తాయి. వినియోగదారుల మనస్సులో బ్రాండ్ ‘ఏ’, బ్రాండ్ ‘బి’ మధ్యగల తేడాలు ఏర్పడటానికి వ్యాపార ప్రకటనలు ఇస్తారు.

అమ్మకాల పెంపుదల కోసం ప్రకటన వ్యయాలను ఒక సాధనంగా ఉపయోగించుకోవడమనేది ఏకస్వామ్య పోటీ ముఖ్య లక్షణం. ఈ వ్యయాలను ‘అమ్మకం వ్యయాలంటారు.’ అమ్మకం వ్యయాలు, ఉత్పత్తి వ్యయాలు వేరువేరుగా ఉంటాయి.

e) అధిక డిమాండ్ వ్యాకోచత్వం :
ఏకస్వామ్య పోటీలోని సంస్థకుండే డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి కిందకు వాలుతుంది. ఈ డిమాండ్ రేఖ అధిక వ్యాకోచత్వాన్ని కలిగి ఉంటుంది. అయితే సంపూర్ణ పోటీ మాదిరిగా సంపూర్ణ వ్యాకోచత్వాన్ని మాత్రం కలిగివుండదు.

f) సంస్థ పరిశ్రమ :
ఈ పోటీలో సంస్థ, పరిశ్రమ రెండూ ఉంటాయి. అయితే పరిశ్రమ గ్రూప్ గా ఉంటుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 5 మార్కెట్ విశ్లేషణ

ప్రశ్న 6.
పరిమితస్వామ్యం అంటే ఏమిటి ? దాని లక్షణాలను వివరించండి.
జవాబు.
Oligopoly అనే పదం గ్రీకు పదాలయిన ‘Oligos’, ‘Pollein’ అనే పదాల నుండి గ్రహించడమైంది. ‘Oligos’ అంటే కొద్దిమంది అని, Pollein అంటే అమ్మడం అని అర్థం. పరిమిత స్వామ్యంలో కొద్దిమంది అమ్మకపుదార్లు నుండి వారు సజాతీయమైన వస్తూత్పత్తిని గాని లేదా వైవిధ్యం ఉన్న వస్తూత్పత్తిని గాని చేస్తూ ఉంటారు. ఈ కొద్దిమంది అమ్మకందారుల మధ్య పోటీ ఉంటుంది. పరిశ్రమలోని ఇతర సంస్థలపై ప్రతి సంస్థ ప్రత్యక్షంగా చెప్పుకోదగ్గ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

లక్షణాలు :

  1. వస్తువును అమ్మే సంస్థలు చాలా కొద్ది సంఖ్యలో ఉంటాయి.
  2. దీనిలో డిమాండ్ రేఖ అనిశ్చితత్వంగా ఉంటుంది.
  3. ధరల దృఢత్వం ఉంటుంది.
  4. ప్రకటనలపై అధిక వ్యయాన్ని చేస్తారు.
  5. సంస్థల మధ్య పరస్పర ఆధార సంబంధం ఉంటుంది.

ప్రశ్న 7.
ద్విదాధిపత్యం భావనను దాని లక్షణాలను వివరించండి.
జవాబు.
గ్రీకు భాషలో ‘duo’ అంటే ఇద్దరు అని, ‘poly’ అంటే అమ్మకందారులు అని అర్థం. ఈ రకమగు వ్యవస్థలో ఇద్దరు ఉత్పత్తిదారులు మాత్రమే వస్తూత్పత్తిని కొనసాగిస్తారు. వీరు మార్కెట్పై పూర్తి ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు.

పరిమితస్వామ్యంలోని భాగమే ద్విదాధిపత్యం. ఇద్దరు అమ్మకందార్లే వస్తూత్పత్తిని చేస్తారు. ద్విదాధిపత్యం సూక్ష్మ ” రూపంలో ఉండే పరిమితస్వామ్యం. ఉత్పత్తిదారులు ఉత్పత్తి చేసే వస్తువులు సజాతీయాలు కాని లేదా భిన్నమైన వస్తువులుగా కాని ఉండొచ్చు. ఇద్దరు ఉత్పత్తిదారులు ఉన్నందువల్ల ఒకరి నిర్ణయాలు మరొకరి నిర్ణయాలను ప్రభావితం చేస్తాయని ఇద్దరికీ తెలుసు.

ఉత్పత్తిదారుల మధ్య పోటీ ఉండవచ్చు లేదా ఇద్దరు కలిసి ఒక ఒప్పందానికి రావచ్చు. మార్కెట్లో ఈ రెండు సంస్థలు చెప్పుకోదగ్గ నియంత్రణను కలిగి ఉంటాయి. ప్రస్తుతం పారిశ్రామిక వ్యవస్థలో సులభంగా అధ్యయనం చేయబడుతున్న మార్కెట్ వ్యవస్థ ఇదే.

1838లో ఫ్రెంచి ఆర్థికవేత్త ఆగస్టిన్ కూర్నాట్ ద్విదాధిపత్యం నమూనాను అభివృద్ధి చేసాడు. రెండు సంస్థల ఉదాహరణతో కూర్నాట్ తన నమూనాను వివరించాడు. అమ్మకందారులు పోటీదారుని పూర్వపు ప్రతిచర్యలను పరిగణించకుండానే తన చర్యకు ఉపక్రమించు ప్రవర్తనను కలిగి ఉంటారు.

ఫలితంగా ప్రతీ సంస్థ మొత్తం ఉత్పత్తిలో 1/3వ వంతు, రెండు సంస్థలు కలిసి 2/3వ వంతు మాత్రమే ఉత్పత్తిని చేస్తాయి. ప్రతి సంస్థ లాభాలను గరిష్ఠం చేసుకొంటుంది. పరిశ్రమలో మాత్రం లాభాలు గరిష్ఠం కావు. సంస్థలు పరస్పరం ఆధారపడడాన్ని గుర్తించకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతుంది.

ద్విదాధిపత్యం లక్షణాలు :

  •  ఇద్దరు అమ్మకందార్లు ఉంటారు.
  • సజాతీయ ఉత్పత్తి.
  • ఉత్పత్తి వ్యయం శూన్యం
  • అమ్మకందార్లు పరస్పరం ఆధారపడడాన్ని గుర్తించరు.

TS Board Inter First Year Economics Study Material Chapter 5 మార్కెట్ విశ్లేషణ

ప్రశ్న 8.
సంపూర్ణ పోటీని, ఏకస్వామ్యాన్ని పోల్చండి.
జవాబు.
సంపూర్ణ పోటీలో అనేకమంది అమ్మకందారులు, కొనుగోలుదారులు ఉండి సజాతీయమైన వస్తువుల ఉత్పత్తి జరుగుతుంది. మార్కెట్లో నిర్ణయమైన ధరను సంస్థ అంగీకరిస్తుంది. కాని సంస్థకు ధర నిర్ణయంలో ప్రాధాన్యత ఉండదు. సంస్థ గరిష్ట లాభాలనైతే గరిష్ట స్థాయికి పెంచటానికి, నష్టాలనైతే కనిష్ట స్థాయికి తగ్గించటానికి ప్రయత్నిస్తుంది. అందువల్ల ఉపాంత వ్యయం, ఉపాంత రాబడికి సమానమయ్యేట్లు సంస్థ ప్రయత్నిస్తుంది.

ఏకస్వామ్యంలో ఒక వస్తువుకు ఒకే ఉత్పత్తిదారుడుంటాడు. మార్కెట్లో తన వస్తువుకు ఎటువంటి సన్నిహిత ప్రత్యామ్నాయాలు లభించవు. సంస్థ వస్తువు ధరను, వస్తురాశిని నిర్ణయించగలదు. కాని ఒకే సమయంలో రెండు నిర్ణయాలను చేయలేదు. సంస్థ సమతౌల్యంలో ఉండటానికి ఉపాంత వ్యయం, ఉపాంత రాబడికి సమానం అవ్వాలి.
సంపూర్ణ పోటీ, ఏకస్వామ్యాల మధ్య పోలిక :

సంపూర్ణ పోటీఏకస్వామ్యం
1. అత్యధిక సంఖ్యలో అమ్మకందార్లు ఉంటారు.1. ఒకే ఒక్క ఉత్పత్తిదారుడు ఉంటాడు.
2. సంస్థలకు ప్రవేశానికి, నిష్క్రమించటానికి స్వేచ్ఛ ఉంటుంది.2. నూతన సంస్థల ప్రవేశాలకు స్వేచ్ఛ ఉండదు.
3. ఇక్కడ వస్తువులన్నీ సజాతీయాలు.3. ఇక్కడ సజాతీయత ఉండదు. ఉత్పత్తికి సమీప ప్రత్యామ్నాయాలు ఉండవు.
4. ఈ మార్కెట్లో సంస్థ, పరిశ్రమకు తేడా ఉంది.4. ఈ మార్కెట్లో సంస్థ, పరిశ్రమ రెండు ఒక్కటే.
5. మార్కెట్ వస్తువు ధరను నిర్ణయిస్తుంది. ఉత్పత్తి దారుడు ధరను స్వీకరిస్తాడు.5. ఉత్పత్తిదారుడే ధరను నిర్ణయిస్తాడు.
6. మార్కెట్లో ఒకే ధర ఉంటుంది.6. మార్కెట్లో ధర విచక్షణ చేస్తాడు.
7. సగటు, ఉపాంత రాబడులు సమానం. ఇవి ‘X’ అక్షంకు సమాంతరంగా ఉంటాయి.7. సగటు రాబడి, ఉపాంత రాబడి కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు రేఖలు ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 5 మార్కెట్ విశ్లేషణ  

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
మార్కెట్ని నిర్వచించండి.
జవాబు.
సాధారణంగా మార్కెట్ అంటే వస్తువుల క్రయ, విక్రయాలు జరిగే ప్రదేశం అని భావిస్తాం. కాని అర్థశాస్త్రంలో మార్కెట్ అంటే అమ్మకందార్లు, కొనుగోలుదార్లు కలిసి ధరలు నిర్ణయించుకోవటానికి ఉపయోగపడే యంత్రాంగం.

ప్రశ్న 2.
కాలాన్నిబట్టి మార్కెట్లపై ఒక వాక్యం వ్రాయండి.
జవాబు.
కాలాన్ని ఆధారంగా చేసుకుని మార్కెట్లో వస్తు సప్లయ్లో సర్దుబాట్లు జరుగుతాయి. కాల వ్యవధి ఆధారంగా మార్కెట్ను నాలుగు రకాలుగా విభజిస్తారు. అవి :

  1. మార్కెట్ కాలం లేదా అతిస్వల్ప కాలం
  2. స్వల్ప కాలం
  3. దీర్ఘకాలం
  4. అతిదీర్ఘ కాలం.

ప్రశ్న 3.
ప్రదేశాన్ని బట్టి మార్కెట్లు.
జవాబు.
ఒక వస్తువుకు ఉండే మార్కెట్ విస్తీర్ణం దానికుండే డిమాండ్, రవాణా సౌకర్యాలు, వస్తువు మన్నికపై ఆధారపడి ఉంటుంది. కాలం ఆధారంగా మార్కెట్ను క్రింది విధంగా వర్గీకరిస్తారు.

  1. స్థానిక మార్కెట్
  2. జాతీయ మార్కెట్
  3. ప్రాంతీయ మార్కెట్
  4. అంతర్జాతీయ మార్కెట్ లేదా విదేశీ మార్కెట్.

TS Board Inter First Year Economics Study Material Chapter 5 మార్కెట్ విశ్లేషణ

ప్రశ్న 4.
పోటీని బట్టి మార్కెట్లు.
జవాబు.
మార్కెట్లోని పోటీ ఆధారంగా మార్కెట్ను క్రింది విధంగా వర్గీకరిస్తారు.

(a) సంపూర్ణ పోటీ మార్కెట్ :
ఈ మార్కెట్లో అధిక సంఖ్యలో అమ్మకందార్లు, కొనుగోలుదార్లు ఉండి, అందరూ సజాతీయ వస్తువులను అమ్మడం, కొనడం చేస్తారు. ఒకే ధర మార్కెట్లో ఉంటుంది.

(b) అసంపూర్ణ పోటీ మార్కెట్ :
ఈ మార్కెట్లో వివిధ సంఖ్యలలో అమ్మకందార్లు, అధిక సంఖ్యలో కొనుగోలుదార్లు ఉండి, వైవిధ్యం గల వస్తువులు వేరువేరు ధరల వద్ద అమ్మటం జరుగుతుంది. ఉదా : ఏకస్వామ్యం, ద్విస్వామ్యం, ఏకస్వామ్య పోటీ.

ప్రశ్న 5.
సంపూర్ణ పోటీ అంటే ఏమిటి ?
జవాబు.
సంపూర్ణ పోటీ మార్కెట్ వ్యవస్థలో వైయక్తిక సంస్థల మధ్య ప్రతిస్పర్థ ఉండదు. నిత్యం వాడుకలో ఉన్న అర్థానికి భిన్నంగా ఆర్థిక సిద్ధాంతంలో సంపూర్ణ పోటీ పదాన్ని వాడుతున్నాం. వర్తకులు ‘పోటీ’, ‘ప్రతిస్పర్ధ’ అనే పదాలను పర్యాయ పదాలుగా ఉపయోగిస్తారు. సిద్ధాంతరీత్యా సంపూర్ణ పోటీలో సంస్థల మధ్య ప్రతిస్పర్థ ఉండదు.

సజాతీయ వస్తువులను తయారుచేసే సంస్థలు అధిక సంఖ్యలో ఉండి, పరిశ్రమలోనికి సంస్థలు ప్రవేశించడానికి, పరిశ్రమ నుంచి నిష్క్రమించడానికి స్వేచ్ఛ, కొనుగోలుదారునికి సంపూర్ణ పరిజ్ఞానం, ఉత్పత్తి కారకాలకు పూర్తి గమనశీలత, రవాణా వ్యయాలు లేకుండటం అనే లక్షణాలుంటే దానిని సంపూర్ణ పోటీ మార్కెట్ అంటారు.

ప్రశ్న 6.
ఏకస్వామ్యం నిర్వచించండి.
జవాబు.
అసంపూర్ణ పోటీలో ఏకస్వామ్యం ఒకటి. దీనినే గుత్తాధిపత్యం అంటారు. మార్కెట్లో ఒకే ఒక అమ్మకందారుడుండి, సమీప ప్రత్యామ్నాయ వస్తువులు లభ్యంకాని మార్కెట్ని ఏకస్వామ్యం అంటారు. ఈ మార్కెట్లో ధర విచక్షణకు అవకాశం ఉంటుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 5 మార్కెట్ విశ్లేషణ

ప్రశ్న 7.
ఏకస్వామ్యపు పోటీ అంటే ఏమిటి ?
జవాబు.
ఈ మార్కెట్లో వస్తు వైవిధ్యం ఉంటుంది. అనగా అనేక సంస్థలు కొంత భేదంతో ఒకే రకమైన వస్తువులను ఉత్పత్తి చేస్తాయి. అవన్నీ సన్నిహిత ప్రత్యామ్నాయాలు. ఉదా : బూస్ట్, బోర్నవిటా మొదలగునవి.

ప్రశ్న 8.
పరిమితస్వామ్యంని నిర్వచించండి.
జవాబు.
ఈ మార్కెట్లో ఉత్పత్తిదారులు పరిమితంగా ఉంటారు. సంస్థలు స్వతంత్రంగా లేదా ఉమ్మడి అంగీకారంతో సంస్థలు వస్తువుల ధరలను నిర్ణయిస్తాయి.

ప్రశ్న 9.
ద్విదాధిపత్యం అంటే ఏమిటి ?
జవాబు.
ఈ మార్కెట్లో ఉత్పత్తిదారులు ఇద్దరుంటారు. వీరి మధ్య పోటీ అధికంగా ఉంటుంది. ఒక సంస్థ తన మార్కెట్ విధాన రూపకల్పనలో తనకు పోటీగా ఉన్న సంస్థ ప్రవర్తనను కూడా పరిగణనలోనికి తీసుకోవలసి ఉంది.

ప్రశ్న 10.
సమతౌల్యపు ధరను వివరింపుము.
జవాబు.
ఒక సంస్థ తన తరహాని లేదా పరిమాణాన్ని ఏవిధంగాను మార్చటానికి ఇష్టపడని పరిస్థితిని సమతౌల్యస్థితి అంటారు. ఏ ధర వద్ద సప్లయ్, డిమాండ్ సమానంగా ఉంటాయో దానిని సమతౌల్యపు ధర అని అంటారు.

TS Board Inter First Year Economics Study Material Chapter 5 మార్కెట్ విశ్లేషణ

ప్రశ్న 11.
వస్తు వైవిధ్యం / ఉత్పాదనా భిన్నత్వం అంటే ఏమిటి ?
జవాబు.
ఏకస్వామ్య పోటీ మార్కెట్లో అనేక సంస్థలు వస్తువులను తయారుచేసినా, ఒక సంస్థ ఉత్పత్తి చేసిన వస్తువును మార్కెట్లోని ఇతర సంస్థలు ఉత్పత్తి చేసిన వస్తువులతో పోల్చినపుడు బ్రాండ్నేమ్, ట్రేడ్మార్క్, వస్తువు లక్షణాలు మొదలైన వాటి విషయంలో భేదం ఉంటుంది. అంతేగాక వస్తువుకు సమీప ప్రత్యామ్నాయాలు ఉంటాయి. అలాగే | జాత్యంతర డిమాండ్ వ్యాకోచత ఎక్కువ.

ప్రశ్న 12.
అమ్మకపు వ్యయాలు.
జవాబు.
సంస్థలు ఉత్పత్తి చేసిన వస్తువుల అమ్మకాలను మార్కెట్లో పెంచుకోవడానికి చేసే ఖర్చులను అమ్మకపు వ్యయాలు అని అంటారు. పత్రికలు, టెలివిజన్, ప్రదర్శనలు మొదలగునవి వాటి కోసం సంస్థ అధిక మొత్తంలో అమ్మకాల అభివృద్ధికి ఖర్చు చేస్తుంది.

TS Inter 1st Year Telugu Study Material Chapter 4 బతుకమ్మ పండుగ

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 4th Lesson బతుకమ్మ పండుగ Textbook Questions and Answers.

TS Inter 1st Year Telugu Study Material 4th Lesson బతుకమ్మ పండుగ

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు- సమాధానాలు

ప్రశ్న 1.
‘బతుకమ్మ’ పండుగ వెనుక ఉన్న ఆచారసంప్రదాయాలను వివరించండి?
జవాబు:
బతుకమ్మ పండుగ అను పాఠ్యభాగం డా. రావి ప్రేమలతచే రచించబడిన ‘జానపద విజ్ఞాన పరిశీలనం’ అనే గ్రంథం నుండి గ్రహించబడింది. దీనిలో బతుకమ్మ పండుగ వెనుక దాగియున్న ఆచార సంప్రదాయాలు వివరించబడ్డాయి.

తెలంగాణా జానపద స్త్రీల ఆచార సంప్రదాయాలలో ఆనందోత్సాహాలతో వెల్లివిరిసేత పండుగ బతుకమ్మ పండుగ. ఈ పండుగ జానపదుల సాహిత్య, సంగీత, నృత్య కళారూపాలకు ప్రతీక. స్త్రీలకు సౌభాగ్యాలనిచ్చే తల్లి గౌరమ్మ ఆమె బతుకమ్మ. భయాన్ని గొలిపే స్వరూపం గౌరమ్మది. నవరాత్రుల సమయంలో తెలంగాణ స్త్రీలు సుకుమారమైన అందమైన రూపంగా భావించి అమ్మవారిని కొలుస్తారు.

బతుకమ్మ పండుగ నాటికి ప్రకృతి అంతా పూలమయం అవుతుంది. స్త్రీల సౌందర్యారాధన, అలంకరణ నైపుణ్యం కళాత్మక దృష్టి పూల బతుకమ్మను పూలతో అలంకరించటంతోనే ఉంటుంది. మహాలయ అమావాస్యనాడు ఎంగిలి బతుకమ్మను పేర్చటంతో బతుకమ్మ పండుగ ప్రారంభమై మహార్నవమి వరకు సాగుతుంది.

ముత్తైదువుల తెల్లవారుజాముననే లేచి అభ్యంగనం స్నానంచేసి అలికి ముగ్గువేసి పూలతో అలంకరిస్తారు. ఉదయం బతుకమ్మను అలంకరించిన సాయంకాలం ఇంటిముందే ఆడతారు. ఆ తరువాత మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొనివెళ్ళి ఊరి మధ్యలోగాని, చెరువుగట్టుపైగాని ఉంచి స్త్రీలందరూ వలయాకారంలో నిలబడి ఒంగి ఒగురుతూ చేతులను తడుతూ పాటలు పాడతారు. చీకటి పడేవరకు ఆడి బతుకమ్మను కాలువలోగాని, చెరువులోగాని,భావిలోగాని వదిలిపెడతారు. బతుకమ్మకు వీడ్కోలు చెపుతారు.

నిద్రపోగౌరమ్మా నిద్రపోవమ్మా
నిద్రకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు
నిను గన్న తల్లికి నిండునూరేండ్లు

TS Inter 1st Year Telugu Study Material Chapter 4 బతుకమ్మ పండుగ

అని పాటలు పాడుతారు. ప్రకృతి నుండి సేకరించిన పూలను మళ్ళీ ప్రకృతికే సమర్పించుకోవటం బతుకమ్మను నీటిలో విడిచిపెట్టడానికి కావచ్చు.

ఎర్రమట్టిని త్రిభుజాకారంలోకి మలచి దానిపై వెంపలిచెట్టు కొమ్మనుంచి పసుపుకుంకుమలతో పూజిస్తారు. ఇలా చేయటం భూమిని స్త్రీ దేవతగా భావించి అర్చించటమే! బతుకమ్మను ఆడేటపనుడు స్త్రీలు పౌరాణిక, నీతిభోధాత్మక, కథా గేయాలను పాడుకుంటారు. బతుకమ్మపండుగలో పాడే పాటల్లో స్త్రీల మనోభావాలు, జీవిత విధానాలు ఒదిగి ఉంటాయి.

“గౌరమ్మ వెనుకను ఉయ్యాలో- గౌరీశ్వరుడు ఉయ్యాలో
భక్తులు పాలించ ఉయ్యాలో- వచ్చేరిసతిగూడి ఉయ్యాలో ‘

ఈ గేయంలో పనిలోనే పరమాత్మను దర్శించమనే బోధ స్త్రీలశ్రమైక జీవనానికి దర్పణం. పనిలోని అలసటను పాటల ద్వారా సులభతరం చేసుకొన్న పరమాత్మ స్వరూపులు స్త్రీలు. పసితనంలో పెళ్ళిళ్ళు చేసి బరువు దింపుకున్న తల్లిదండ్రుతు అల్లారుముద్దుగా తమవద్ద పెరిగిన కూతురిని వియ్యాలవారికి అప్పగిస్తూన్న పాటలో వారి ఆవేదన అర్థమౌతుంది.

“పెరుగు అన్నము పెట్టి ఉయ్యాలో- పెంచుకోండి సీతను ఉయ్యాలో
సద్ది అన్నము పెట్టి ఉయ్యాలో సాదుకోండి సీతను ఉయ్యాలో”

ఈ విధంగా అద్దంలోని కొండ ప్రతిబింబంలాగా బతుకమ్మ పండుగలో తెలంగాణా జానపద స్త్రీల జీవన విధానం, మనస్తత్వం కళలు ప్రతిబింబిస్తాయి.

ప్రశ్న 2.
బతుకమ్మ పండుగలోని సంగీత, సాహిత్య కళాంశాలను పేర్కొనండి?
జవాబు:
బతుతకమ్మ పండుగ అను పాఠ్యభాగం డా. రావి ప్రేమలతచే రచించబడిన ‘జ్ఞానపద విజ్ఞానం పరిశీలనం’ అనే గ్రంథం నుండి గ్రహించబడింది. తెలంగాణా జానపద స్త్రీల ఆచార సంప్రదాయాలు వారి సాహిత్య సంగీత, నృత్య కళారూపాల త్రివేణి సంగమం. సౌభాగ్యదాయిని అయిన గౌరీదేవిని అందమైన పూలతో అలంకరించి పాటలు పాడుతూ ఆడుతూ పూజించటం వారి కళాభిలాషకు ఉదాహరణం.

సుఖదుఃఖాలతో ఉత్సాహ ఉల్లాసాలతో మనసు ఉద్వేగం చెందినపుడే కళారూపాలు ఆవిర్భవిస్తాయి. బతుకమ్మ పండుగ నాటికి ప్రకృతి అంతా పూల మయంగా ఉంటుంది. పంటచేలు నిండు గర్భిణులుగా దర్శనమిస్తాయి. పప్పుధాన్యాలు ఇళ్ళకు చేరతాయి. అలాంటి సంతోష సమయంలో పల్లెపడుచులు తమ మనోభావాలను పాటల ద్వారా నాట్యం చేస్తూ తమ ఆనందపాఠవశ్యాలను సంగీత రూపంలో ప్రకటించుకుంటారు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 4 బతుకమ్మ పండుగ

అలంకరణ:
బతుకమ్మను అలంకరించటమే ఒక కళ. ఉదయాన్నే ఇంటిముందు అలికి రంగు రంగుల ముగ్గులేయటం మరొక కళ. ఒక ఇత్తడి పళ్ళెంలో గుమ్మడి ఆకులను పరచి దానిపై తంగేడు పూలను పేర్చటం, పొడవైన గునుగుపూల చివరలను కత్తిరించి వాటికి రంగులను పూసి ముత్యాలపూలను గుత్తులు గుత్తులుగా అమర్చటం, స్త్రీల కళాభిరుచికి ఒక ఉదాహరణం.

పూవులు ఎక్కువగా దొరికితే మనిషంత ఎత్తుగా బతుకమ్మను అలంకరిస్తారు. పెద్ద బతుకమ్మ లేదా తల్లి బతుకమ్మ ప్రక్కల పిల్ల బతుకమ్మను అమర్చుతారు. ఉదయం బతుకమ్మను పేర్చిన ముత్తయిదువలు సాయంత్రం తమని తాము అలంకరించుకొని ఇంటిముందు ఆటపాటలతో కొంతసేపు కాలక్షేపంచేసి ఆ తర్వాత మేళతాళాలతో ఊరేగింపుగా బతుకమ్మను సాగనంపుతారు.

పాట- నాట్యం : జానపద స్త్రీలు వలయాకారంలో తిరుగుతూ నాట్యం చేస్తూ పాటలు పాడుకుంటారు.

నిద్రపోగౌరమ్మా నిద్రపోవమ్మా
నిద్రకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు
నిను గన్న తల్లికి నిండునూరేండ్లు

అని రాగయుక్తంగా పాడటం వారి కళాసక్తికి నిదర్శనం. జానపదస్త్రీల బొడ్డెమ్మ బతుకమ్మ ఆటలకు మూలం. ఆటవికులు పండుగ సమయాలలో చేసే బృంద నృత్యాలే! పార్వతీపరమేశ్వరులు సాయంత్రం వేళల్లోనే నృత్య పోటీని పెట్టుకునేవారని అందులో ఈశ్వరుడే విజయం సాధించేవాడని ఒక కథనం. తెలంగాణ ప్రాంతంలో ఉంది. అందుకే బతుకమ్మను సాయంత్ర సమయంలో ఆడతారు.

బతుకమ్మ పండుగ ఆటపాటల మేలు కలయిక. స్త్రీల పాటలన్నీ ఒడుదుడుకులు లేకుండా ఒకే స్వరంలో సాగిపోతాయి. వీరు పాడే పాటలకు సంగీత శాస్త్రనియమాలుండవు. అవి చతురస్రగతిలో ‘కిటతక, కిటతకిట అను మాత్రలతో ఉంటాయి.

స్త్రీలు పౌరాణిక గీతాలు, నీతిబోధాత్మక గీతాలు కథాగేయాలను పడుతుంటారు. పాటలోని ప్రతి చరణాంతంలో ఉయ్యాలో, వలలో, చందమామ అని పునరావృతమౌతుం టుంది. ఆ పాటల్లో ప్రతి వనిత యొక్క మనోభావాలు, జీవిత విధానాలు ఒదిగి ఉంటాయి.

“గౌరమ్మ వెనుకను ఉయ్యాలో- గౌరీశ్వరుడు ఉయ్యాలో
భక్తులు పాలించ ఉయ్యాలో- వచ్చేరి సతిగూడి ఉయ్యాలో

వారు పనిచేసే పనిలోని శ్రమను మరచి పోవటం ఈ పాటలలోని అసలు రహస్యం. పనిపాటలు పరమాత్మ స్వరూపాలుగా భావించటం ప్రజల సంప్రదాయం. ఇలా బతుకమ్మ పండుగలో సంగీత సాహిత్య నాట్యాలు కళాంశాలుగా రూపుదిద్దుకుంటాయి.

TS Inter 1st Year Telugu Study Material Chapter 4 బతుకమ్మ పండుగ

II. సంగ్రహరూప ప్రశ్నలు- సమాధానాలు

ప్రశ్న 1.
రావిప్రేమలత రచనలను తెలుపండి?
జవాబు:
బతుకమ్మ పండుగ అను పాఠ్యభాగం రావిప్రేమలతచే రచించబడిన, జానపదవిజ్ఞానం పరిశీలనం అన్న గ్రంథం నుండి గ్రహించబడింది.
రావిప్రేమలత సిద్ధాంత వ్యాసం తెలుగు జానపదసాహిత్యం – పురాగాథలు తొలిరచన. జానపద విజ్ఞానంలో స్త్రీ ప్రేమలత వ్యాససంపుటి. తెలుగు స్త్రీల ముగ్గులపై పరిశోధన చేసి ‘తెలుగు స్త్రీల చిత్రలిపి’ అనే వైవిధ్య భరితమైన గ్రంథాన్ని రాశారు. ఇది బిరుదురాజు రామరాజు జానపదవిజ్ఞాన బహుమతిని, తెలుగు విశ్వవిద్యాలయ ఉత్తమ గ్రంథ పురస్కారాన్ని అందుకున్నది.

ఈమె రాసిన ‘వ్యాసలతిక’ తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ విమర్శ గ్రంథంగా బహుమతినందుకున్నది. డా. కురుగంటి శ్రీలక్ష్మితో కలిసి ‘జానపదవిజ్ఞాన పరిశీలనం’ అన్న వ్యాస సంపుటిని వెలువరించారు. Folk Tales of South India- Andhra Pradesh అన్న కథా సంకలనానికి సంపాదకత్వం వహించారు. ఈమె రచనలన్నీ జానపద సాహిత్యం తోనే ముడిపడి ఉండటం ముదావహం.

ప్రశ్న 2.
బతుకమ్మను పేర్చే విదాధాన్ని వర్ణించండి?
జవాబు:
బతుకమ్మ పండుగ అను పాఠ్యభాగం రావి ప్రేమలతచే రచించబడిన ‘జానపదవిజ్ఞాన పరిశీలనం’ అన్న గ్రంథం నుండి గ్రహించబడింది.

తెలంగాణా జానపదస్త్రీల ఆచార సాంప్రదాయాలతో ఆనందోత్సాహాలతో వెల్లివిరిసేది బతుకమ్మ పండుగ అదే పూలపండుగ. బతుకమ్మ పండుగనాటికి ప్రకృతి పూలమయంగా ఉంటుంది. బతుకమ్మను ఆ పూలతో అందంగా అలంకరిస్తారు. ముందుగా ఇత్తడి పళ్ళెంలో మొదట గుమ్మడి ఆకులను పరచి దానిపై తంగేడు పూలను పరుస్తారు. పొడవైన గునుగు పూలను చివర కత్తిరించి వాటికి పలురంగులు పూస్తారు. ఆ తరువాత ముత్యాల పువ్వులను గుత్తులు గుత్తులుగా అమరుస్తారు.

ఇళ్ళలో ఉండే గన్నేరు, రుద్రాక్ష, గోరింట, బీర పూలను గూడా గుండ్రంగా శిఖరాలలో పేరుస్తారు. శిఖరంపై గుమ్మడి పూలను అలంకరిస్తారు. పసుపుతో త్రికోణాకృతిలో బతుకమ్మను పెట్టడంతో బతుకమ్మను పేర్చే కార్యక్రమం పూర్తి అవుతుంది. బతుకమ్మ ప్రక్కనే పిల్ల బతుకమ్మలను ఉంచుతారు. బతుకమ్మలను కూరాటికుండ వద్దగాని, దేవుడి వద్దగాని పెట్టి నువ్వులు, సెనగపప్పు, పెసరపప్పు, పొడులతో చద్దుల పులిహోర దద్యోన్నంను నైవేద్యంగా అమర్చుతారు. పూలు ఎక్కువగా లభిస్తే మనిషంత ఎత్తు బతుకమ్మలను అమర్చుతారు. త్రికోణం స్త్రీకి సంకేతం. త్రికోణాకారంలో పసుపు ముద్దనుంచటం గౌరీదేవిని ప్రతిష్టించటంగా భావిస్తారు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 4 బతుకమ్మ పండుగ

ప్రశ్న 3.
బొడ్డెమ్మ ఆటను గురించి రాయండి?
జవాబు:
‘బతుకమ్మపండుగ’ అను పాఠ్యభాగం డా. రావి ప్రేమలతచే రచించబడిన ‘జానపద విజ్ఞాన పరిశీలనం’ అను గ్రంథం నుండి స్వీకరించబడింది.

బొడ్డెమ్మఆట బతుకమ్మ ఆటకు పూర్వరంగం బతుకమ్మతోపాటు ఎర్రమట్టిముద్దను త్రిభుజాకారంలో తయారుచేసి దానిపై వెంపలిచెట్టు కొమ్మను పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించి పూజచేస్తారు. దీనిని కూడా నీటిలో నిమజ్జనం చేస్తారు. ఈ బొడ్డెమ్మ ఆట వినాయక చవితి నుండి ప్రారంభమై మహాలయ అమావాస్య నాటికి పూర్తవుతుంది.

బొడ్డెమ్మ ఆటలో ఎర్రమట్టి ముద్దను త్రిభుజాకారంలో మలచటం, పూజించటం భూమిని స్త్రీ మూర్తిగా భావించి అర్చింటమే! ఇది ఆటవికులు భూదేవిని పూజిస్తూ చేసే నాట్యాలలో వలే విందులు వినోదాలతో పాటలతో జరుపబడుతుంది. భూదేవికి ప్రతిరూపమైన బొడ్డెమ్మను పూజించటం, అడవిపూలైన తంగేడు, ముత్యాలపూలతో పూజించటం ఆటవికుల నమ్మకాల ప్రభావంగా భావించాలి.

ప్రశ్న 4.
బతుకమ్మ పాటలోని విశేషాలు ఏమిటి?
జవాబు:
బతుకమ్మ పండుగ అను పాఠ్యభాగం డా. రావి ప్రేమలతచే రచించబడిన ‘జానపద విజ్ఞాన పరిశీలనం’ అను గ్రంథం నుండి గ్రహించబడింది. బతుకమ్మ పండుగ ఆట పాటల మేలు కలయిక. స్త్రీల పాటలన్నీ ఒడిదుడుకులు లేక క్రమగతిలో ఒకే స్వరంలో సాగిపోతాయి. కంఠస్వరంనాళాలకు, గర్భాశయానికి హానికలుగని మధ్యమస్థాయిలో స్త్రీలు పాటలు పాడుతుంటారు.

సహజ సంగీతంతో సాగిపోయే బతుకమ్మ పాటలను సంగీత శాస్త్ర నియమాలు, లక్షణాలతో పనిలేదు. వీరి పాట నాట్యాన్ని అనుసరించి ఉంటుంది. బతుకమ్మ ఆటకు అనుగుణంగా ఉంటాయి. వీరి పాటలు పౌరాణిక గీతాలుగా, నీతి బోధకాలుగా, కథాగేయాలుగా ఉంటాయి. వారి పాటలలో ఉయ్యాలో, వలలో, చందమామ అన్న పల్లవులు ఆవృతాలవుతుంటాయి. సూర్యాస్త సమయంలో బతుకమ్మ పాటలు పాడతారు కాబట్టి “చందమామ” అని, గౌరమ్మను నీటిలో ఓలలాడిస్తారు కావున “వలలో” అని ‘ఊయలవలె’ ఊగుతూ పాడతారు కావున “ఊయాలో” అన్న పదాలుంటాయి.

బతుకమ్మకు వీడ్కోలు చెప్తున్న ఈ పాటలో
“నిద్రపో గౌరమ్మ నిద్రపోవమ్మా
నిద్రకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు…..”

ఈ పాటలో జగజ్జననికి జనని జానపదయువతి. స్త్రీది మాతృ హృదయం. చిన్నారి పాపను జో కొడుతూ పాడే పాటలను బతుకమ్మ పాటగా పాడుతుంది.

TS Inter 1st Year Telugu Study Material Chapter 4 బతుకమ్మ పండుగ

బతుకమ్మ పాటలలో స్త్రీల మనోభావాలు, జీవిత విధానాలు ఒదిగి ఉంటాయి. ఉదాహరణకు.

“గౌరమ్మ వెనుకను ఉయ్యాలో గౌరీశ్వరుడు ఉయ్యాలో
భక్తులు పాలించ ఉయ్యాలో- వచ్చేరిసతిగూడి ఉయ్యాలో ‘

పనులలో అలుపు సొలుపు తెలియకుండా పాడే ఈ పాటలు పరమాత్మ స్వరూపాలు.

III. ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు- సమాధానాలు

ప్రశ్న 1.
రావిప్రేమలత పిహెచ్.డి పరిశోధనాంశం పేరేమిటి?
జవాబు:
“తెలుగు జానపద సాహిత్యం – పురాగాథలు” రావిప్రేమలత పిహెచ్. డి పరిశోధనాంశం.

ప్రశ్న 2.
తెలుగు స్త్రీల ముగ్గులపై రావిప్రేమలత రాసిన గ్రంథం పేరేమిటి?
జవాబు:
“తెలుగు స్త్రీల చిత్రలిపి” రావిప్రేమలత స్త్రీల ముగ్గులపై వ్రాసిన గ్రంథం.

ప్రశ్న 3.
రావిప్రేమలత “వ్యాసలతిక”కు లభించిన పురస్కారం ఏది?
జవాబు:
ఉత్తమ విమర్శన గ్రంథంగా తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం లభించింది.

ప్రశ్న 4.
బతుకమ్మ పండుగలో ఏ పూలకు అగ్రస్థానం ఇస్తారు?
జవాబు:
‘తంగేడు’ పూలకు బతుకమ్మ పండుగలలో అగ్రస్థానం ఇస్తారు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 4 బతుకమ్మ పండుగ

ప్రశ్న 5.
గుమ్మడికాయ, గుమ్మడిపూలు దేనికి సంకేతం?
జవాబు:
గుమ్మడికాయ, గుమ్మడిపూలు ‘సఫలతాశక్తికి’ సంకేతం.

ప్రశ్న 6.
బతుకమ్మ పాటలలోని పల్లవులు ఏవి?
జవాబు:
ఉయ్యాలో, వలలో, చందమామ అనునవి బతుకమ్మ పాటలలో పల్లవులు.

ప్రశ్న 7.
బతుకమ్మ పాటల్లో ఏవి ఒదిగి ఉంటాయి?
జవాబు:
బతుకమ్మ పాటల్లో స్త్రీల మనోభావాలు జీవన విధానాలు ఒదిగి ఉంటాయి.

ప్రశ్న 8.
పప్పుధాన్యాలను పొడిచేసి పెట్టే నైవేద్యాన్ని ఏమంటారు?
జవాబు:
‘సద్దులు’ అంటారు.

బతుకమ్మ పండుగ Summary in Telugu

రచయిత్రి పరిచయం

రచయిత్రి పేరు : డా. రావి ప్రేమలత

పుట్టినతేది : జూన్ 10, 1945

పుట్టిన ఊరు : నల్గొండజిల్లా, నాగిరెడ్డి పల్లె

తల్లితండ్రులు : మనోహరమ్మ, నాగిరెడ్డి

విద్యార్హతలు : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ, పిహెచ్.డి

పిహెచ్ సిద్ధాంత గ్రంథం : తెలుగు జానపద సాహిత్యం – పురాణగాథలు

TS Inter 1st Year Telugu Study Material Chapter 4 బతుకమ్మ పండుగ

రచనలు :

  1. జానపద విజ్ఞానంలో స్త్రీ (వ్యాససంపుటి)
  2. తెలుగు స్త్రీల చిత్రలిపి
  3. వ్యాస లతిక

పురస్కారాలు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ అధ్యాపకురాలిగా తంగిరాల సాహిత్యపీఠం, ఉత్తమ పరిశోధకురాలు’ గా సత్కరించారు.

డా. రావిప్రేమలత జూన్ 10, 1945 ఉమ్మడి నల్గొండ జిల్లా నాగిరెడ్డిపల్లెలో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు మనోహరమ్మ, నాగిరెడ్డిలు, భువనగిరి కళాశాలలో చదివి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ తెలుగు, పిహెచ్.డి పూర్తి చేశారు. నాయని కృష్ణకుమారిగారి పర్యవేక్షణలో “తెలుగు జానపద సాహిత్యం- పురాగాథలు అన్న అంశంపై పరిశోధనచేసి పిహెచ్.డి సాధించారు.

రావి ప్రేమలత జానపద విజ్ఞానం సిద్ధాంతాలనేపధ్యంలో ‘జానపద విజ్ఞానంలో స్త్రీ’ అనే వ్యాససంపుటిని ప్రచురించారు. తెలుగు స్త్రీల ముగ్గులపై పరిశోధన చేసి “తెలుగు స్త్రీల చిత్రలిపి” అన్న వైవిధ్య గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథం బిరుదురాజు రామ రాజు జానపదవిజ్ఞాన బహుమతి, తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమగ్రంథ పురస్కారాన్ని అందుకుంది.

ఈమె ‘వ్యాసలతిక’ సంపుటి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమవిమర్శ గ్రంథంగా పురస్కారం అందుకుంది. డా॥ కురుగంటి లక్ష్మీతో కలిసి ‘జానపదవిజ్ఞాన పరిశీలనం’ అన్న వ్యాససంపుటిని వెలువరించారు. Folk Tales of South India- Andhra Pradesh అనే సంకలనానికి సంపాదకత్వం వహించారు. రావిప్రేమలత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉ త్తమ అధ్యాపకురాలు, తంగిరాల సాహిత్యపీఠం ఉత్తమ పరిశోధకురాలిగా పురస్కారం అందుకున్నారు.

పాఠ్యభాగ సారాంశం

తెలంగాణా జానపద స్త్రీల ఆచారసంప్రదాయాలతో ఆనందోత్సాహాలతో వెల్లివెరిసే పండుగ బతుకమ్మ పండుగ, అదే పూల పండుగ. ఇది జానపద స్త్రీల సాహిత్య, సంగీత, నృత్యకళారూపాల త్రివేణీ సంగమం. స్త్రీల సౌభాగ్య ప్రదాయిని అయిన గౌరీదేవిని బతుకమ్మగా భావించి అందమైన పూలతో మరింత అందంగా అలం కరించుకొని పూజిస్తుంటారు. బతుకమ్మ పండుగనాటికి ప్రకృతి అంతా పూలమయంగా ఉంటుంది. తంగేడు, గునుగు, ముత్యాలపూలు, ప్రకృతికి అందాన్నిస్తాయి. పంట పొలాలు సస్యస్యామలంగా ఉంటాయి.

TS Inter 1st Year Telugu Study Material Chapter 4 బతుకమ్మ పండుగ

మొదటి ఎనిమిది రోజులు బతుకమ్మను నెమ్మదిగా పేరుస్తారు. తొమ్మిదోరోజు పెద్ద పండుగ జరుపుతారు. దానినే ‘సద్దుల’ పండుగ అంటారు. ముత్తైదువలు తెల్లవారుజామున లేని అభ్యంగన స్నానాదికాలు ఆచరించి, అలికి ముగ్గువేసి మగపిల్లలు సేకరించిన పూలతో అలంకరణ ప్రారంభిస్తారు.

ఇత్తడి పళ్ళెంలో మొదట గుమ్మడి ఆకులను పరచి దానిపై తంగేడు పూలను అలంకరిస్తారు. పొడవైన గునుగు పూలను కత్తిరించి వరుసగా పైకి పేరుస్తూ వివిధ రంగులను పూస్తారు. తరువాత ఇళ్ళలో ఉండే గన్నేరు, రుద్రాక్ష, గోరింట పూలను అలంకరించి శిఖరంపై గుమ్మడి పూలనుంచుతారు. త్రికోణ ఆకారంలో పసుపు ముద్దను పెట్టడంతో బతుకమ్మ అలంకరణ పూర్తవుతుంది.

పెద్ద బతుకమ్మ లేదా తల్లి బతుకమ్మ చుట్టురా పిల్ల బతుకమ్మలను పెడతారు. ఇది స్త్రీ మాతృహృదయానికి సంకేతం ఇలా ఉదయం బతుకమ్మను పెట్టిన ముత్తైదువులను సాయంత్రం అలంకరించుకొని ఇంటి ముందే కొంచెంసేపు ఆడుకుంటారు.

ఆ తరువాత మేళ తాళాలతో ఊరేగిస్తూ ఊరి మధ్యలోగాని చెరువు గట్టుపైగాని ఉంచి స్త్రీలంతా వంగి చేతులతో చప్పట్లు కొడుతూ అందరూ కలిసి పాటలు పాడుకుంటారు. చీకటి పడుతుండగా కాలువలోగాని, చెరువులోగాని బావిలోగాని వదిలివేస్తారు. ఆ దృశ్యం ఈశ్వరుని కోసం వెళ్తున్న పార్వతిని తలపిస్తుంది.

నిద్రపో గౌరమ్మ నిద్రపోవమ్మా
నిద్రకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు

పాడుతుంతారు. బతుకమ్మను ఎర్రమట్టి ముద్దతో త్రిభుజాకారంలో చేసి దానిపై వెంపలి చెట్టుకొమ్మను పెట్టి పసుపు కుంకుమలతో పూజించి నీటిలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మకు పూర్వ రంగమైన బొడ్డెమ్మ ఆట వినాయక చవితి నుండి ప్రారంభమై మహాలయ అమావాస్య నాటికి పూర్తవుతుంది.

బతుకమ్మను ఆడేటపుడు స్త్రీలు పౌరాణిక గీతాలను, నీతిబోధాత్మక గీతాలను, కథాగేయాలను పాడుతుంటారు. ఈ పాటలలో ఉయ్యాలో, వలలో, చందమామ పల్లవులుగా ఉంటాయి.

“గౌరమ్మ వెనుకను ఉయ్యాలో- గౌరీశ్వరుడు ఉయ్యాలో
భక్తుల పాలించి ఉయ్యాలో వచ్చిరి సతిగూడి ఉయా అని పాడతారు.

ఈ పాటలు మత విశ్వాసానికి ప్రతీక.
అలాగే పసితనంలో పెళ్ళిళ్ళు చేసి బరువు దిగిపోయిందని తృప్తిచెందే వ్యవస్థ మనది. ఆ పిల్ల అత్తవారికి అప్పగిస్తూ ఎలా చూసుకోవాలో పాటగా విన్పిస్తారు.

“పెరుగు అన్నము పెట్టి – ఉయ్యాలో పెంచుకోండి సీతను ఉయ్యాలో
సద్ది అన్నము పెట్టి- ఉయ్యాలో సాదుకోండి సీతను ఉయ్యాలో ఈ గేయాలతో జానపద స్త్రీల జీవిత విధానాల, మనస్తత్వం- కళలు మనకు కన్పిస్తాయి.

TS Inter 1st Year Telugu Study Material Chapter 4 బతుకమ్మ పండుగ

కఠినపదాలకు అర్థాలు

భీకరస్వరూపం = భయమును గొలిపే రూపము
ఏపుగా = బాగా
మనోరంజకంగా = మనసుకు ఆనందాన్నిచేకూర్చేదిగా
దద్యోన్నం – దధి+అన్నం = పెరుగు అన్నం
విస్తరించు = వ్యాపించ
ముత్తైదువల = మూడు తరాలపాటు భర్తతోడుగా ఉన్న స్త్రీ
వలయాకారం = గుండ్రంగా
ఒడిదుడుకులు = కష్టనష్టాలు
మందలిస్తూ = కోప్పడుతూ
పరిణామం = మార్పు
అతివలు = స్త్రీలు

TS Inter 1st Year Commerce Study Material Chapter 8 Business Finance

Telangana TSBIE TS Inter 1st Year Commerce Study Material 8th Lesson Business Finance Textbook Questions and Answers.

TS Inter 1st Year Commerce Study Material Chapter 8 Business Finance

Long Answer Questions

Question 1.
What is business Finance? Explain its need and significance in the business organizations.
Answer:
Meaning: The requirement of funds by business firm to carryout its various activities is called ‘business finance’.

Finance is considered as the life blood of any organization. The success of an industry depends on the availability of adequate finance. Finance is a vital functional area of business. It deals with procurement of funds and their effective utilisation. A business fundamentally requires identifying its sources of finance from where it can procure funds.

Definition:
According to B.O. Wheeler, “Finance is that business activity which is concerned with the acquisition and conservation of capital funds in meeting the financial needs and overall objectives of a business enterprise”.

Nature and Need:
The financial needs of a business organization can be categorized as follows:
A) Fixed capital requirements:
In order to start business, funds are required to purchase fixed assets like “land and building, plant and machinery and furniture and fixtures”. This is known as fixed capital requirements of the business enterprise. The funds required in fixed assets remain, invested in the business for a long period of time. Different business units need varying amount of fixed capital depending on various factors such as “the nature of business”.

For Example: A trading concern, may require small amount of fixed capital as compared to a manufacturing concern and the need for fixed capital investment would be greater for a large business enterprise, as compared to that of a small enterprise.

B) Working capital requirements:
A business may be small or large, it needs funds for its day-to-day operations. This is known as “Working Capital” of an Enterprise. It is used for holding current assets such as stock of material, bills receivables and for meeting expenses like salaries, wages, taxes and rent. The amount of working capital required varies from one business enterprises to another depending on various factors.

For Example: A business unit selling goods on credit, or having a slow sales turnover, would require more working capital as compared to a concern selling its goods and services on cash basis or having a high turnover.

Significance of Business Finance:
Business needs finance mainly for acquiring various types of assets and to meet various expenses on day to day basis. The significance and need of business finance is explained below:

1. To meet fixed capital requirement of business: To purchase fixed assets like land and building, plant and machinery, furniture and fixtures etc., business requires finance.

2. To meet Working Capital Requirements: Working capital is used for holding current assets such as stock of material, payment of wages, transportation expenses, etc.

3. For growth and expansion: For growth and expansion activities, a business requires finance. It may be required to increase production, to install more machines, to set up a R & D centre etc.

4. For diversification: Entering into new businesses and new lines of activities is known as diversification.

For Example: ITC dealing with tobacco started ITC kakatiya (hotels), Vivel (shampoos & cosmetics), classmate (note books & stationery) etc. So, Business finance is needed to start any new activity in business.

5. For Survival: To carry out the various business operations in continuity, business finance is needed. Without the required finance, organizations cannot survive for longtime.

6. Liabilities: To meet liabilities of business, be it long-term or short, a business requires sufficient finance, e.g, for payment of loan installments, creditors, etc.

7. For payment of Expenses: For paying salaries, wages, taxes, advertisements and rent, finance is needed.

Therefore, to Execute the various plans of the business, finance is needed.

Question 2.
What are the Various factors that determine the selection of sources of finance?
Answer:
Factors determining the choice of sources of finance: Financial needs of a business are of different types; long term, short term, fixed and fluctuating. Therefore, business firms resort to different types of source for raising funds. The following are the Various factors determining the choice of source of finance:

i) Cost: There are two types of cost viz, the cost of procurement of funds and cost of utilizing the funds. Both these costs should be taken into account while deciding about the source of funds that will be used by an organisation.

TS Inter 1st Year Commerce Study Material Chapter 8 Business Finance

ii) Financial strength and stability of operations: The financial strength of a business is also a key determinant. In the choice of source of funds for business should be in a sound financial position. It should be able to repay the principal amount and interest on the borrowed amount.

iii) Form of organisation and legal status: The form of business organisation and status influences the choice of a source for raising money.

For Example: A partnership firm, cannot rise money by issue of equity shares as these can be issued only by a joint stock company.

iv) Purpose and time period: Business should plan according to the time period for which the funds are required. A short-term need can be met through borrowing funds of low rate of interest, through trade credit, commercial paper etc. For long term finance, sources such as issue of shares and debentures are more appropriate.

v) Risk profile: Business should Evaluate each of the source of finance in terms of the risk involved.

For Example: There is a least risk in equity as the share capital has to be repaid only at the time of winding up and dividends need not be paid if no profits are available.

On the other hand A loan has a repayment schedule for both the principal and the interest. The interest is required to be paid, irrespective of the firm earning a profit or incurring a loss.

vi) Control: A particular source of fund may affect the control and power of the owners on the management of a firm.

For Example: As equity share holders enjoy voting rights, financial institutions may take control of the assets or impose conditions as part of the loan agreement. Thus, business firm should choose a source keeping in mind the extent to which they are willing to share their control over business.

vii) Effect on credit Worthiness: The dependance of business on certain sources may affect its credit worthiness in the market. For example, issue of secured debentures may affect the interest of unsecured creditors of the company and may adversely affect their willingness to extend further loans as credit to the company.

viii) Flexibility and ease: Another aspect affecting the choice of a source of finance is the flexibility and ease of obtaining funds. Restrictive provisions, detailed investigation and documentation. In case of borrowings from banks and financial institutions business organisations may not prefer it, if other options are readily available.

ix) Tax benefits: Various sources may also be weighed in terms tax benefits.

For Example: While the dividend on preference shares is not tax deductible, interest paid on debentures and loan is tax deductible. Therefore, be preferred by organisations seeking tax advantage.

TS Inter 1st Year Commerce Study Material Chapter 8 Business Finance

Short Answer Questions

Question 1.
Explain the need and nature of business finance?
(or)
Question 2.
What are the various types of capitals required for business enterprises?
Answer:
The financial needs of a business organization can be categorized as follows:
A) Fixed capital requirements:
In order to start business, funds are required to purchase fixed assets like land and building, plant and machinery, furniture and fixtures. This is known as fixed capital requirements of the business enterprise. The funds required in fixed assets remain invested in the business for a long period of time. Different business units need varying amount of fixed capital depending on various factors such as the Nature of business etc.

For Example: A trading concern may require small amount of fixed capital as compared to a manufacturing concern and the Need for fixed capital investment would be greater for a large business enterprise, as compared to that of a small enterprise.

B) Working Capital requirements: A business may be small or large it needs funds for its day-to-day operations. This is known as ‘Working Capital” of an enterprise, it is used for holding current assets such as stock of material, bills receivables and for meeting expenses like salaries, wages, taxes, and rent.

The amount of working capital required varies from one business enterprises to another depending on various factors.

For Example: A business unit selling goods on credit, or having a slow sales turnover, would require more working capital as compared to a concern selling its goods and services on cash basis or having a high turnover.

The requirement for fixed and working capital increases with the growth and expansion of business. Sometimes, additional funds are required for upgrading the technology employed so that the cost of production can be reduced.

Question 3.
Explain the classification of sources of finance.
Answer:
The sources of funds can be categorized using different basis viz, On the basis of the period, on the basis of the ownership and on the basis of source of generation. The brief explanation about classification of sources is given below.

A) On the Basis of period: On the basis of period, sources of funds can be categorized into three ways. They are:

  • Long-term finance,
  • Medium-term finance and
  • Short-term finance.

1) Long-term finance: The long-term sources fulfill the requirements of an enterprise for a period exceeding five years and include sources such as:

  • Shares and debentures
  • Long-term borrowings, and
  • Loans from financial institution.

Such financing is generally for the acquisition of fixed assets such as Land and buildings, equipment, plant and machinery etc.

2) Medium-term-finance: Where the funds are required for a period of more than one year but less than five years, medium-term sources of finance are used. These sources include:

  • borrowing from commercial banks,
  • public deposits,
  • lease financing and
  • loans from financial institutions.

3) Short-term sources of finance: Short-term funds are those which are required for short duration i.e., a period not exceeding one year.

Trade credit, loans from commercial banks, indigenous Bankers, installment credit, advances, bank over drafts, cash credits and commercial papers are some of the example of short-term sources.

B) On the basis of Ownership: On the basis of ownership, the sources can be classified into 2 types of funds. They are 1) owner’s funds 2) Borrowed funds.

1) Owners funds: It means funds that are provided by the owners of an enterprise, which may be a sole trader or partners or shareholders of a company. It also includes profits reinvested in the business.
Issue of Equity shares and retained earnings are the two important sources from where owner’s funds can be obtained.

2) Borrowed funds: It refers to the funds raised through loans or borrowings. The sources for raising borrowed funds include loans from commercial banks, loans from financial institutions, issue of debentures, public deposits & Trade credit.

C) On the basis of Generation: On the basis of Generation the sources of finances can be generated from 1) Internal source of funds; 2) External source of funds.

1) Internal Sources of funds are those which are generated from within the business. Such as ploughing back of profits, retained earnings, collection of receivables, disposing of surplus inventories and depreciation of funds etc.

2) External Sources of funds include those sources that lie outside an organization, such as shares, debentures, public deposits, borrowing from commercial banks and financial institutions, suppliers, lenders and investors.

TS Inter 1st Year Commerce Study Material Chapter 8 Business Finance

Very Short Answer Questions

Question 1.
Business finance.
Answer:
1) The requirement of funds by business firm to carryout its activities is called “Business finance”. Business finance is viewed as “the business activity which is concerned with the acquisition and conservation of capital funds in meeting the financial needs and overall objectives of a business enterprise”.

2) Finance is considered as the life blood of the organization. A business fundamentally require to identifying its sources of finance from where it can procure funds.

Question 2.
Fixed capital.
Answer:
1. The capital which is used to acquire fixed assets such as land and buildings, plant and machinery etc., is called fixed capital. Capital used by the business organisations to meet the long term requirements is called fixed capital or block capital.

2. The amount of fixed capital required by the business concern depends on the size and nature of business. A trader concern may required small amount of fixed capital than a manufacturing concern.

Question 3.
Working capital.
Answer:
1. The capital required by a business enterprise to run its day-to-day operations such as purchase of raw materials, payment of wages and holding current assets like stock of raw materials, bills receivable is called working capital.

2. The amount of working capital required varies from business to business Generally trading concerns require more working capital as compared to manufacturing concerns.

Question 4.
Long-term finance.
Answer:
1. The funds raised for a period of exceeding five years is known as long-term finance. Long-term finance is essential for investing funds in fixed assets like land and buildings, plant and machinery etc.

2. Requirement of the long-term finance depends on size, nature of business and level of technology used. Sources of long-term finance are issue of shares and debentures, long term loans from financial institutions, retained earnings etc.

TS Inter 1st Year Commerce Study Material Chapter 8 Business Finance

Question 5.
Short term finance.
Answer:
1. The finance required for a period of not exceeding one year is called short-term finance. Short-term finance is utilised for meeting working capital requirements of the business.

2. The amount required for short-term funds depends on nature of business order and delivery time, volume of business and operating cycle. The sources of short-term finance are trade credit, bank credit, installment credit, customer advance etc.

Question 6.
Internal sources of finance.
Answer:
1. Internal sources of funds are those which are generated from within the business.
2. The sources ploughing back of profits, retained earnings, collection of receivables, disposing of surplus inventories and depreciation of funds etc.

Question 7.
External sources of finance.
Answer:
1. External sources of funds are those sources that lie outside the business organization.
2. The sources include shares, debentures, borrowings from commercial banks, financial institutions, suppliers, lenders, and investors.