TS Inter 2nd Year Maths 2A Solutions Chapter 10 Random Variables and Probability Distributions Ex 10(a)

Students must practice this TS Intermediate Maths 2A Solutions Chapter 10 Random Variables and Probability Distributions Ex 10(a) to find a better approach to solving the problems.

TS Inter 2nd Year Maths 2A Solutions Chapter 10 Random Variables and Probability Distributions Ex 10(a)

I.
Question 1.
A p.d.f of a discrete random variable h zero except at the point to x = 0, 1, 2. At these points it has the value P(0) = 3c3 P(1)= 4c – 10c2, P(2)= 5c – 1 for same c > 0. Find the value of c.
Solution:
Given P(0) = 3c3,
P(1) = 4c – 10c2,
P(2) = 5c – 1
we have \(\sum_{i=0,1,2}\) P(i) = 1
⇒ P(0) + P(1) + P(2) = 1
⇒ 3c3 + 4c – 10c2 + 5c – 1 = 1
⇒ 3c3 – 10c2 + 9c – 2 = 0
c = 1 satisfy the equation by inspection and for c = 1, we have
P(0) = 3,
P(1) = 4 – 10 = 6,
P(2) = 4
Hence c = 1 does not satisfy 0 ≤ P (E) ≤ 1.
So we try for other solutions by synthetic division method.

TS Inter 2nd Year Maths 2A Solutions Chapter 10 Random Variables and Probability Distributions Ex 10(a) 1

∴ 3c2 – 7c + 2 = 0
⇒ 3c2 – Gc – c . 2 0
⇒ 3c (c – 2) – 1 (c – 2 )= 0
(3c – 1) (c – 2 ) = 0
c – 2 = 0
⇒ c = 2 is not admissible;
∴ c = \(\frac{1}{3}\) suit the solutions P (0), P (1) and P (2)
∴ c = \(\frac{1}{3}\).

TS Board Inter 2nd Year Maths 2A Solutions Chapter 10 Random Variables and Probability Distributions Ex 10(a)

Question 2.
Find the constant c, so that F(x)= c\(\frac{2}{3}\), x = 1, 2, 3, …………… is the p.d.f. of a discrete random variable X.
Solution:
Since F (x) is the p.d.f. oF discrete random variable x.
we have \(\sum_{x=1}^{\infty}\) F(x) = 1

TS Inter 2nd Year Maths 2A Solutions Chapter 10 Random Variables and Probability Distributions Ex 10(a) 2

Question 3.

TS Inter 2nd Year Maths 2A Solutions Chapter 10 Random Variables and Probability Distributions Ex 10(a) 3

is the probability distribution of a random variable X. Find the value of k and the variance of X.
Solution:
Sum of the probability = 1
⇒ 0.1 + k + 0.2 + 2k + 0.3 + k = 1
⇒ 4k + 0.6 = 1
⇒ 4k = 0.4
⇒ k = 0.1

TS Inter 2nd Year Maths 2A Solutions Chapter 10 Random Variables and Probability Distributions Ex 10(a) 4

Mean = Σxi P (X = xi)
= (- 2 ) × 0.1 + (- 1 ) × 0.1 + 0 × 0.2 + 1 × 0.2 + 2 × 0.3 + 3 × 0.1 = 0.8
Variance σ2 = Σx2 P (X = x ) – μ2
= ( – 2 )2 × 0.1 + ( – 1)2 × 0.1 + 02 × 0.2 + 12 × 0.2 + 22 × 0.3 + 32 × 0.1 – ( 0.8 )2 = 2.16.

TS Board Inter 2nd Year Maths 2A Solutions Chapter 10 Random Variables and Probability Distributions Ex 10(a)

Question 4.

TS Inter 2nd Year Maths 2A Solutions Chapter 10 Random Variables and Probability Distributions Ex 10(a) 5

is the probability distribution of a random variable X. Find the value of k and the variance of X.
Solution:

TS Inter 2nd Year Maths 2A Solutions Chapter 10 Random Variables and Probability Distributions Ex 10(a) 6

Question 5.
A random variable X has the following probability distribution.

TS Inter 2nd Year Maths 2A Solutions Chapter 10 Random Variables and Probability Distributions Ex 10(a) 7

Find i) k ii) the mean and iii) P(0 < X < 5).
Solution:
Sum of the probability = 1
⇒ 0 + k + 2k + 2k + 3k + k2 + 2k2 + 7k2 + k = 1
⇒ 10k2 + 9k – 1 = 0
⇒ 10k2+ 10k – k – 1 = 0
⇒ 10k(k + 1) -1 (k + 1) = 0
⇒ (10k – 1) (k + 1) = 0
⇒ k = \(\frac{1}{10}\); (k = – 1 is not admissible since probability is non-negative).

TS Board Inter 2nd Year Maths 2A Solutions Chapter 10 Random Variables and Probability Distributions Ex 10(a)

II.
Question 1.
The range of a random variable X Is (0, 1, 2). Given that P (X = 0) = 3c3,
P (X = 1) = 4c – 10c2, P (X = 2) = 5c – 1.
Find (i) the value of c
ii) P(X < 1), P (1 < X ≤ 2) and P (0 < X ≤ 3).
Solution:
i) Sum of the probabilities = 1
⇒ P( X = 0) + P (X = 1) + P (X = 2) = 1
⇒ 3c3 + 4c – 10c2 + 5c – 1 = 1
⇒ 3c3 – 10c2 + 9c – 2 = 0
⇒ (3c – 1) (c – 1) (c – 2) = 0
⇒ c = \(\frac{1}{3}\) [∵ c ≠ 1, 2].

ii) P(X < 1) = P(X = 0)
= 3c3
= 3 × (\(\frac{1}{27}\)) = \(\frac{1}{9}\)

P(1 < X ≤ 2) = P(X = 2)
= 5c – 1
= 5(\(\frac{1}{27}\)) – 1
= \(\frac{2}{3}\).

P(0 < X ≤ 3) = P(X = 1) + P(X = 2)
= 4c – 10c2 + 5c – 1
= – 10c2 + 9c – 1
= \(-\frac{10}{9}+\frac{9}{3}-1=\frac{8}{9}\).

Question 2.
The range of a random variable X is {1, 2, 3, …………} and P (X = k) = \(\frac{c^{\mathbf{k}}}{\mathbf{k} !}\). Find the value of c and P (0 < X < 3).
Solution:
∵ Σ P(X = k) = 1

TS Inter 2nd Year Maths 2A Solutions Chapter 10 Random Variables and Probability Distributions Ex 10(a) 8

TS Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(c)

Students must practice this TS Intermediate Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(c) to find a better approach to solving the problems.

TS Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(c)

I.
Question 1.
Three screws are drawn at random from a lot of 50 screws, 5 of which are defective. Find the probability of the event that all 3 screws are non-defective assuming that the drawing is
a) with replacement
b) without replacement
Solution:
Total number of screws = 50
Number of defective screws = 5
Number of non-defective screws = 45
∴ n (S) = 50C3
a) With replacement:
P(E) = \(\frac{45}{50} \times \frac{45}{50} \times \frac{45}{50}=\frac{9}{10} \times \frac{9}{10} \times \frac{9}{10}\)
= \(\left(\frac{9}{10}\right)^3\)

b) Without replacement:
P(E) = \(\frac{45}{50} \times \frac{44}{49} \times \frac{43}{48}=\frac{1419}{1960}\).

TS Board Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(c)

Question 2.
If A, B, C are three independent events of an experiment such that
p(A ∩ B ∩ C) = \(\frac{1}{4}\), P\(\left(A^c \cap B \cap C^c\right)\) = \(\frac{1}{8}\), P(C) = \(\frac{1}{4}\) then find P(A), P(B) and P(C).
Solution:

TS Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(c) 1

TS Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(c) 2

TS Board Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(c)

Question 3.
There are 3 black and 4 white balls in one bag, 4 black and 3 white balls In the second bag. A die is rolled and the first bag is selected if the die shows up 1 or 3, and the second bag for the rest Find the probability of drawing a black ball from the bag thus selected.
Solution:
Let E1, E2 be the events of selecting first and second bag respectively.
P(E1) = \(\frac{2}{6}\)
P(E2) = 1 – \(\frac{2}{6}\)
= \(\frac{4}{6}\)
Let B be the event of getting black ball from the selected bag.
\(P\left(\frac{B}{E_1}\right)=\frac{3}{7}\),
\(P\left(\frac{B}{E_2}\right)=\frac{4}{7}\)
∴ Required probability = P(E1 ∩ B) + P(E2 ∩ B)
= P(E1) . \(P\left(\frac{B}{E_1}\right)\) + P(E2). \(P\left(\frac{B}{E_2}\right)\)
= \(\frac{2}{6} \times \frac{3}{7}+\frac{4}{6} \times \frac{4}{7}\)
= \(\frac{6}{42}+\frac{16}{42}=\frac{22}{42}=\frac{11}{21}\)
Probability of drawing a black ball from the bag selected = \(\frac{11}{21}\).

Question 4.
A, B, C are aiming to shoot a balloon. A will succeed 4 times out of 5 attempts. The chance of B to shoot the balloon is 3 out of 4 and that of C is 2 out of 3. If the three aim the balloon simultaneously, then find the probability that atleasi two of them hit the balloon.
Solution:
Given that
P(A) = \(\frac{4}{5}\); P(B) = \(\frac{3}{4}\); P(C) = \(\frac{2}{3}\)
At least two of them will hit the balloon means if A, B hits the balloon then C will not hit or A, C hits the balloon then B will not hit or B, C hits the balloon then A will not hit or all the three will hit the balloon.
Required probability,

TS Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(c) 3

TS Board Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(c)

Question 5.
If A, B are two events, then show that P(A/B) P(B) + P(A/\(\mathbf{B}^c\)) P(\(\mathbf{B}^c\)) = P(A).
Solution:

TS Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(c) 4

Question 6.
A pair of dice are roiled. What is the probability that they sum to 7 given that neither dic shows a 2?
Solution:
Given that neither die shows a ‘2’, when the two dice are rolled, the number of sample points.
n(S) = 36 – 11 = 25
(Faces showing ‘2’ will be excluded)
If E is the event of not getting ‘2’ on both the dice and sum is 7, then
E = {( 1, 6), (3, 4), (4, 3), (6, 1)}
∴ n(E) = 4
∴ Required probability = \(\frac{4}{25}\).

TS Board Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(c)

Question 7.
A pair of dice are rolled. What is the probability that neither die shows a 2 gIven that they sum to 7?
Solution:
Since S consists of points whose sum of points on faces is 7.
S = {(1, 6) (2, 5), (3, 4), (4, 3),(5, 2), (6, 1)}
∴ n(S) = 6
Let E be the event of a die not showing ‘2’. then
E = { (1, 6), (3, 4), (4, 3), (6, 1)}
n(E) = 4
∴ Required probability = \(\frac{\mathrm{n}(\mathrm{E})}{\mathrm{n}(\mathrm{S})}=\frac{4}{6}=\frac{2}{3}\).

Question 8.
If A, B are any two events in an experiment, and P (B) ≠ 1. Show that
P(A/\(\mathbf{B}^c\)) = \(\frac{P(A)-P(A \cap B)}{1-\mathbf{P}(\mathbf{B})}\)
Solution:
\(P\left(\frac{A}{B^{\prime}}\right)=\frac{P(A \cap \bar{B})}{P(\bar{B})}\)
= \(\frac{P(A)-P(A \cap B)}{1-P(B)}\)

Question 9.
An urn contains 12 red balls and 12 green balls. Suppose two balls are drawn one after another wlt.hout replacement Find the probability that the second ball drawn; is green, given that the first ball drawn is red.
Solution:
Let E1 be the event of drawing a red ball
n (S) = Total number of balls = 24
∴ n(E1) = 12C1 = 12
∴ P(E) = \(\frac{\mathrm{n}\left(\mathrm{E}_1\right)}{\mathrm{n}(\mathrm{S})}=\frac{12}{24}=\frac{1}{2}\)
Now there are 23 balls remaining.
∴ n(S) = 23
Let \(\frac{E_2}{E_1}\) be the event of drawing a green ball in the second attempt.
∴ n(\(\frac{E_2}{E_1}\)) = 12C1 = 12
∴ P(\(\frac{E_2}{E_1}\)) = \(\frac{12}{23}\)
P(E1 ∩ E2) = P(E1) . P(\(\frac{E_2}{E_1}\))
= \(\frac{1}{2} \cdot \frac{12}{23}=\frac{6}{23}\)
Hence the probability that the second ball drawn is green, given that the first ball drawn is red is \(\frac{6}{23}\).

TS Board Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(c)

Question 10.
A single die is rolled twice in succession. What is the probability that the number on the second toss is greater than that on the first rolling?
Solution:
n(S) = 36
Let E be the event that the number on the second toss is greater than that on the first rolling when a single die is rolled twice in succession.
Then E = {(1, 2), ( 1, 3), ( 1, 4),(1, 5), (1, 6 ), (2, 3), (2, 4), (2, 5), (2, 6), (3, 4), (3, 5), (3, 6), (4, 5), (4, 6), (5, 6)}
n(E) = 15
Hence the probability oF required event
P(E) = \(\frac{\mathrm{n}(\mathrm{E})}{\mathrm{n}(\mathrm{S})}=\frac{15}{36}\).

Question 11.
If one card is drawn at random from a pack of cards then show that the event of getting an ace and getting a heart are independent events.
Solution:
Let E1 be the event of getting an ace and E2 be the event of getting a heart.
P(E1) = \(\frac{4}{52}\)
P(E2) = \(\frac{13}{52}\)
P(E1) . P(E2) = \(\frac{4}{52} \times \frac{13}{52}=\frac{1}{52}\)
Common to E1 and E2 is an ace from hearts
∴ P(E1 ∩ E2) = \(\frac{1}{52}\)
∴ P(E1 ∩ E2) = P ( E1) . P (E2)
∴ E1 and E2 are independent events.

TS Board Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(c)

Question 12.
The probability that a boy A will get a scholarship is 0.9 and that another boy B will get is 0.8. What is the probability that atleast one of them will get the scholarship?
Solution:
Let E1 be the event that A will get scholarship and E2 be the event that B will get scholarship.
P(E1) = 0.9;
P(E2) = 0.8
Required probability
P(E1 ∪ E2) = P(E1) + P(E2) – P(E1 ∩ E2)
= P(E1) + P(E2) – P(E1) . P(E2)
= 0.9 + 0.8 – 0.72
= 1.7 – 0.72 = 0.98.

Question 13.
If A, B are two events with P(A ∪ B) = 0.65, P (A ∩ B) = 0.15, then find the value of P(\(A^{\mathrm{C}}\)) + P(\(B^{\mathrm{C}}\)).
Solution:
Given that P (A ∪ B) = 0.65;
P (A ∩ B ) = 0.15
From addition theorem on probabilities
P(A ∪ B) = P(A) + P(B) – P(A ∩ B)
⇒ P(A) + P(B) = P(A ∪ B) + P(A ∩ B)
= 0.65 + 0.15 = 0.8
∴ \(P(\bar{A})+P(\bar{B})\) = 1 – P(A) + 1 – P(B)
= 2 – [P(A) + P(B)]
= 2 – 0.8 = 1.2.

TS Board Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(c)

Question 14.
If A, B, C are independent events then show that A B and C are also independent events.
Solution:
P[(A ∪ B) ∩ C] = P(A ∩ C) ∪ (B ∩ C)]
= P(A ∩ C) + P(B ∩ C) – P[(A ∩ C) ∪ (B ∩ C)]
= P(A ∩ C) + P(B ∩ C) – P(A ∩ B ∩ C)
= P(A) . P(C) + P(B) . P(C) – P(A)P(B)P(C)
(∵ A, B, C are independent events)
= [P (A) + P ( B ) – P (A) . P (B)] P( C)
= [P(A) P(B) – P(A ∩ B) ] . P(C)
= P(A ∪ B) . P(C)
= (A ∪ B ) and C are independent events.

Question 15.
A, B are two independent events such that, the probability of both the events to occur is \(\frac{1}{6}\) and the probability of both the events do not occur \(\frac{1}{3}\). Find P(A).
Solution:
Given P(A ∩ B) = \(\frac{1}{6}\) …………..(1)
\(\mathrm{P}(\overline{\mathrm{A}} \cap \overline{\mathrm{B}})=\frac{1}{3}\) ………….(2)
∴ \(\mathrm{P}(\overline{\mathrm{A}}) \mathrm{P}(\overline{\mathrm{B}})=\frac{1}{3}\)
⇒ [1 – P(A)] [1 – P(B)] = \(\frac{1}{3}\)
⇒ 1 – P(A) – P(B) + P(A) . P(B) = \(\frac{1}{3}\)
⇒ 1 – [P(A) + P(B)] + P(A ∩ B) = \(\frac{1}{3}\)
⇒ 1 – [P(A) + P(B)] + \(\frac{1}{6}\) = \(\frac{1}{3}\)
⇒ P(A) + P(B) = \(\frac{5}{6}\)
From (1) P(A) . P(B) = \(\frac{1}{6}\)
P(B) = \(\frac{1}{6 \mathrm{P}(\mathrm{A})}\)
Substituting this in (3)
P(A) + \(\frac{1}{6 \mathrm{P}(\mathrm{A})}\) = \(\frac{5}{6}\)
⇒ 6[P(A)]2 + 1 = 5P(A)
⇒ 6[P(A)]2 – 5P(A) + 1 = 0
⇒ [3P(A) – 1] [2P(A) – 1] = 0
⇒ P(A) = \(\frac{1}{3}\) or P(A) = \(\frac{1}{2}\).

TS Board Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(c)

Question 16.
A fair die is rolled. Consider the events A = {1, 3, 5}, B = {2, 3) and C = {2, 3, 4, 5}.
Find
i) P (A ∩ B), P (A ∪ B)
ii) P(A/B), P(J3/A)
iii) P(A/C), P(C/A)
iv) P(B/C), P(C/B)
Solution:
n(S) = 6
P(A) = \(\frac{3}{6}=\frac{1}{2}\);
P(B) = \(\frac{2}{6}=\frac{1}{3}\) and
P(C) = \(\frac{4}{6}=\frac{2}{3}\)

i) A ∩ B = {3}
∴ n(A ∩ B) = 1
∴ P(A ∩ B) = \(\frac{1}{6}\)
A ∪ B = {1, 2, 3, 4, 5}
n(A ∪ B) = 4,
∴ P(A ∪ B) = \(\frac{4}{6}=\frac{2}{3}\)

ii)

TS Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(c) 5

iii)

TS Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(c) 6

iv)

TS Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(c) 7

TS Board Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(c)

Question 17.
If A, B, C are three events in a random experiment, prove the following
i) P(A/A) = 1
ii) P(Φ / A) = 0
iii) A ⊆ B ⇒ P(A/C) ≤ P(B/C)
iv) P(A – B) = P(A) – P(A ∩ B)
v) If A, B are mulnally exclusive and P(B) > 0 ihen P (A/B) = 0.
vi) If A, C are mutually exclusive then \(\mathbf{P}\left(\mathbf{A} / \mathbf{B}^{\mathrm{C}}\right)=\frac{\mathbf{P}(\mathbf{A})}{1-\mathbf{P}(\mathbf{B})}\) where P(B) ≠ 1
vii) If A and B are mutually exclusive and P (A ∪ B) ≠ 0 then
P(A/A ∪ B) = \(\frac{\mathbf{P}(\mathbf{A})}{\mathbf{P}(\mathbf{A})+\mathbf{P}(\mathbf{B})}\)
Solution:
i) A ∩ A is the common sample points of A and A is A.
\(P\left(\frac{A}{A}\right)=\frac{P(A \cap A)}{P(A)}=\frac{P(A)}{P(A)}\)
= 1 = R.H.S.

ii) \(P\left(\frac{\phi}{A}\right)=\frac{P(\phi \cap A)}{P(A)}\)
= \(\frac{\mathrm{P}(\phi)}{\mathrm{P}(\mathrm{A})}=\frac{\theta}{\mathrm{P}(\mathrm{A})}\)
= 0 (∵ P(Φ) = 0)

iii) A ⊆ B
⇒ A ∩ C ≤ B ∩ C
⇒ P(A ∩ C) ≤ P(B ∩ C)
\(P\left(\frac{A}{C}\right)=\frac{P(A \cap C)}{P(C)} \leq \frac{P(B \cap C)}{P(C)} \leq P\left(\frac{B}{C}\right)\)
∴ \(\mathrm{P}\left(\frac{\mathrm{A}}{\mathrm{C}}\right) \leq \mathrm{P}\left(\frac{\mathrm{B}}{\mathrm{C}}\right)\)

iv) P(A – B) P(A ∩ \(\))
= P(A ∩ (S – B))
= P[(A ∩ S) – (A ∩ R)]
= P(A) – P(A ∩ B)

v) Given A, B are mutually exclusive.
⇒ A ∩ B = Φ
⇒ P(A ∩ B) = P(Φ) = 0
∴ \(P\left(\frac{A}{B}\right)=\frac{P(A \cap B)}{P(B)}=\frac{0}{P(B)}\) = 0
(∵ P(B) > 0).

vi) Given A, B are mutually exclusive.

TS Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(c) 8

vii) Given A, B are mutually exclusive.

TS Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(c) 9

TS Board Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(c)

Question 18.
Suppose that a coin is tossed three times. Let event A be “getting three heads” and B be the event of “getting a head on the first toss”. Show that A and B are dependent events.
Solution:
When a coin is tossed 3 times,
S = {HHH, HHT, HTH, HTT, THH, THT, TTH, TTT)
⇒ n(S) = 6, n(A) = 1,
P(A) = \(\frac{1}{6}\)
When event B occurred, the possibilities are HHH, FIHT, HTI-I, HTT in which HHH is favourable for the event \(\frac{A}{B}\).
P(\(\frac{A}{B}\)) = \(\frac{1}{4}\)
Hence P(A) ≠ P(\(\frac{A}{B}\))
∴ A, B are dependent events.

Question 19.
Suppose that an unbiased pair of dice is rolled. Let A denote the event that the same number shows on each die. Let B denote the event that the sum is greater than 7. Find
(i) P(\(\frac{A}{B}\))
(ii) P(\(\frac{B}{A}\))
Solution:
n(S) = 36
Let A be the event of getting the same number on two dice.
n(A) = {(1, 1), (2, 2), (3, 3), (4, 4), (5, 5), (6, 6)} = 6
P(A) = \(\frac{6}{36}\)
Let B be the event at getting the sum greater then 7.
n(B) = {(2, 6), (3, 5), (4, 4), (5, 3), (6, 2), (3, 6), (4, 5), (5, 4), (6, 3), (4, 6), (5, 5), (6, 4), (5, 6), (6, 5), (6, 6)} = 15
P(B) = \(\frac{15}{36}\)
n(A ∩ B) = {(4, 4), (5, 5), (6, 6)} = 3
P(A ∩ B) = \(\frac{3}{36}\)

i) \(P\left(\frac{A}{B}\right)=\frac{P(A \cap B)}{P(B)}\)
= \(\frac{\frac{3}{36}}{\frac{15}{36}}=\frac{3}{15}=\frac{1}{5}\)

ii) \(P\left(\frac{B}{A}\right)=\frac{P(B \cap A)}{P(A)}\)
= \(\frac{\frac{3}{36}}{\frac{1}{6}}=\frac{3}{6}=\frac{1}{2}\).

TS Board Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(c)

Question 20.
Prove that A and B are independent events if and only if \(P\left(\frac{A}{B}\right)=\mathbf{P}\left(\frac{A}{B^C}\right)\).
Solution:
Let A and B are independent.

TS Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(c) 10

∴ L.H.S = R.H.S.

II.
Question 1.
Suppose A and B are independent events with P(A)= 0.6, P (B)= 0.7 thencompute
i) P(A ∩ B)
ii) P(A ∪ B)
iii) P(B/A)
iv) \(\mathbf{P}\left(\mathbf{A}^{\mathrm{C}} \cap \mathbf{B}^{\mathrm{C}}\right)\).
Solution:
i) Given P(A) = 0.6, P(B) = 0.7
and A, B are independent events.
i) P(A ∩ B) = P(A) . P(B)
= 0.6 × 0.7 = 0.42.

ii) P(A ∪ B) = P(A) + P(B) – P(A ∩ B)
= 0.6 + 0.7 – 0.42
= 1.3 – 0.42 = 0.88.

iii) \(P\left(\frac{B}{A}\right)=\frac{P(B \cap A)}{P(A)}=\frac{0.42}{0.6}\) = 0.7

iv) \(P(\overline{\mathrm{A}} \cap \overline{\mathrm{B}})=\mathrm{P}(\overline{\mathrm{A}}) \mathrm{P}(\overline{\mathrm{B}})\)
= [ 1 – P(A)] [1 – P(B)]
= ( 1 – 0.6) ( 1 – 0.7)
= (0.4) (0.3) = 0.12.

TS Board Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(c)

Question 2.
The probability that Australia wins a match against India in a ciickel gaine is given to be if India and Australia play 3 matches, what is the probability that
i) Australia will loose all the three matches?
ii) Australia will win atleast one match?
Solution:
Let E1, E2, E3 be the events that Australia wins a cricket match against India in the 1st, 2nd and 3rd matches respectively.
P(E1) = P(E2) = P(E3) =
\(\mathrm{P}\left(\overline{\mathrm{E}}_1\right)=\mathrm{P}\left(\overline{\mathrm{E}}_2\right)=\mathrm{P}\left(\overline{\mathrm{E}}_3\right)\)
= 1 – \(\frac{1}{3}\) = \(\frac{2}{3}\).

i) Australia will loose all the three matches is \(\mathrm{P}\left(\overline{\mathrm{E}}_1 \cap \overline{\mathrm{E}}_2 \cap \overline{\mathrm{E}}_3\right)\)
= \(P\left(\bar{E}_1\right) P\left(\overline{\mathrm{E}}_2\right) P\left(\overline{\mathrm{E}}_3\right)\)
= \(\frac{2}{3} \cdot \frac{2}{3} \cdot \frac{2}{3}=\frac{8}{27}\).

ii) Australia will win atleast one match is P(E1 ∪ E2 ∪ E3)
= 1 – P\(\left(\overline{\mathrm{E}}_1 \cap \overline{\mathrm{E}}_2 \cap \overline{\mathrm{E}}_3\right)\)
= 1 – \(\frac{8}{27}\) = \(\frac{19}{27}[latex].

TS Board Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(c)

Question 3.
Three boxes numbered I, II, III contain the balls as Follows:

WhiteBlackRed
I123
II211
II453

 

One box is randomly selected and a ball is drawn from it. If the ball is red, then find the probability that it is from box II.
Solution:
Let E1, E2, E3 be the events of selecting 1st, 2nd and 3rd boxes.
P(E1) = P(E2) = P(E3) = [latex]\frac{1}{3}\)
Let us denote the event of drawing a red ball by R.

TS Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(c) 11

∴ The probability for the ball to he red that it is from box II is \(\frac{1}{4}\).

Question 4.
A person secures a job in a construction company in which the probability that the workers go ou strike is 0.65 and the probability that the construction job will be completed on time if there is no strike is 0.80. If the probability that the construction job will be completedon tinte even if there is a strike is 0.32, determine the probability that the construction job will be completed on time.
Solution:
Given that the probability that the workers go on strike = 0.65
∴ P(S) = 0.65
P\((\overline{\mathrm{S}})\) = 1 – P(S)
= 1 – 0.65 = 0.35.
The probability that the construction job will be completed on time, if there is no strike = 0.80.
\(\mathrm{P}\left(\frac{A}{\overline{\mathrm{S}}}\right)\) = 0.80
The probability that the onstruction job will be completed on time even if there is a strike = 0.32
P\(\left(\frac{A}{S}\right)\) = 0.32
∴ P(A) = P(A ∩ S) + P(A ∩ \(\overline{\mathrm{S}}\))
= P(S) . P\(\left(\frac{A}{S}\right)\) + P\((\overline{\mathrm{S}})\) . \(\mathrm{P}\left(\frac{A}{\overline{\mathrm{S}}}\right)\)
= 0.65 × 0.32 + 0.35 × 0.80 = 0.488.

TS Board Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(c)

Question 5.
For any two events A, B show that P(A ∩ B) – P(A) P(B) = \(P\left(A^C\right) P(B)-P\left(A^C \cap B\right)\)
= \(\mathbf{P}(\mathbf{A}) \mathbf{P}\left(\mathbf{B}^{\mathrm{C}}\right)-\mathbf{P}\left(\mathbf{A} \cap \mathbf{B}^{\mathrm{C}}\right)\)
Solution:
\(P\left(A^C\right) P(B)-P\left(A^C \cap B\right)\)
= [1 – P(A)] P(B) – P[(S – A) ∩ B]
= P(B) – P(A P(B) – P [B – (A ∩ B)]
= P(B) – P(A) P(B) – P(B) + P(A ∩ B)
= P(A ∩ B) – P(A)P(B) ……………………(1)
\(\mathbf{P}(\mathbf{A}) \mathbf{P}\left(\mathbf{B}^{\mathrm{C}}\right)-\mathbf{P}\left(\mathbf{A} \cap \mathbf{B}^{\mathrm{C}}\right)\)
= P(A)[1 – P(B)] – P(A ∩ (S – B))
= P(A) – P(A) P(B) – P[A – (A ∩ B)]
= P(A) – P(A) P(B) – P(A) + P(A ∩ B)
= P(A ∩ B) – P(A) P(B) ………….(2)
From (1) and (2) we get
P(A ∩ B) – P(A) P(B) = \(P\left(A^C\right) P(B)-P\left(A^C \cap B\right)\)
= \(\mathbf{P}(\mathbf{A}) \mathbf{P}\left(\mathbf{B}^{\mathrm{C}}\right)-\mathbf{P}\left(\mathbf{A} \cap \mathbf{B}^{\mathrm{C}}\right)\).

III.
Question 1.
Three urns have the following composition of balls.
Urn I: 1 white, 2 black
Urn II: 2 white 1 black
(ini III: 2 white, 2 black
One of the urns is selected at random and a ball is drawn. It turns out to he while. Find the probability that it came from uni III.
Solution:
Let E1, E2, E3 be the events of selecting Urns B1, B2, B3 respectively.
Then P(E1) = P( E2) = P(E3) = \(\frac{1}{3}\)
Let W denote the event of white ball chosen from the Urn III.
Then we have to find P\(\left(\frac{E_3}{\mathrm{~W}}\right)\)
Now
\(P\left(\frac{\mathrm{W}}{\mathrm{E}_1}\right)=\frac{1}{3}, \mathrm{P}\left(\frac{\mathrm{W}}{\mathrm{E}_2}\right)=\frac{2}{3}, \mathrm{P}\left(\frac{\mathrm{W}}{\mathrm{E}_3}\right)=\frac{2}{4}\)
∴ Probability for the ball to be white selected from Urn III by Bayes theorem is

TS Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(c) 12

TS Board Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(c)

Question 2.
In a shooting lest the probability of A, B, C hitting the targets are \(\frac{1}{2}\), \(\frac{1}{3}\), \(\frac{1}{4}\) and respectively. If all of them fire at the same target, find the probability that (i) only one of them hits the target (ii) atleast one of them bits the target.
Solution:
Given P(A) = \(\frac{1}{2}\), P(B) = \(\frac{1}{3}\) and P(C) = \(\frac{3}{4}\)
i) The probability that only one of them hits the target

TS Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(c) 13

Question 3.
In a certain college, 25% of the boys and 10% of the girls are studying mathematics. The girls constItute 60% of student strength. If a student selected at random is found studying mathematics, find the probability that the student is a girl.
Solution:
Given girls constitute 60% of student strength, we have 40% students are boys probability of an event being girl.

TS Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(c) 14

TS Board Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(c)

Question 4.
A person is known to speak truth 2 out of 3 times. He throws a die and reports that it is 1. Find the probability that it is actually 1.
Solution:
Given that the probability of a person to speak truth = \(\frac{2}{3}\)
P(T) = \(\frac{2}{3}\)

TS Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(c) 15

TS Inter 2nd Year English Study Material Chapter 14 Lost

Telangana TSBIE TS Inter 2nd Year English Study Material 14th Lesson Lost Textbook Questions and Answers.

TS Inter 2nd Year English Study Material 14th Lesson Lost

Paragraph Questions & Answers (Section A, Q.No.5, Marks: 4)
Answer the following Questions in about 100 words

Question 1.
Attempt the character sketch of the lady in the story.
Answer:
Guy de Maupassant was a great French writer. He was one of the best short story writers in the world.

The present short Lost deals with complex problem women face from men The baroness is beautiful, daring, tactful, and devoted. Their poverty never shakes her from her moral path. She, like any other young lady, is dreamy. But she quickly realises her predicament and becomes pragmatic. When the ghetto baron approaches her, she politely and firmly attempts to keep him at bay. When he pushes the boundaries, she teaches him a lesson.

గై డి మౌపస్సంట్ గొప్ప ఫ్రెంచ్ రచయిత. అతను ప్రపంచంలోని అత్యుత్తమ కథా రచయితలలో ఒకడు. ప్రస్తుత షార్ట్ లాస్ట్ పురుషుల నుండి మహిళలు ఎదుర్కొనే క్లిష్టమైన సమస్యతో వ్యవహరిస్తుంది బారోనెస్ అందంగా, ధైర్యంగా, వ్యూహాత్మకంగా మరియు అంకితభావంతో ఉంటుంది. వారి పేదరికం ఆమె నైతిక మార్గం నుండి ఆమెను ఎప్పుడూ కదిలించదు. ఆమె, ఇతర యువతిలాగే, కలలు కనేది. కానీ

ఆమె తన కష్టాలను త్వరగా గ్రహించి ఆచరణాత్మకంగా మారుతుంది. ఘెట్టో బారన్ ఆమె వద్దకు వచ్చినప్పుడు, ఆమె మర్యాదగా మరియు దృఢంగా అతనిని దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. అతను హద్దులు దాటితే, ఆమె అతనికి గుణపాఠం నేర్పుతుంది.

Question 2.
Narrate the incident that led to the agreement between the lady and the baron. (Revision Test – IV)
Answer:
Guy de Maupassant was a fantastic French author. He was one of the world’s best short story writers.

The current short Lost deals with the complex issues that women face from men. When the licentious baron was prepared to go to any length to obtain her, she suggested that if he was willing to accept 25 whippings, she would listen to him. “Are you telling the truth?” she inquired. After the ghetto man finished his response, he grabbed her hand and passionately pressed it to his lips. When he asked when she could come, she said tomorrow at eight o’clock. When he asked if I could bring the sable close and whip, she said no, I’d handle it myself.

గై డి మౌపస్సంట్ ఒక అద్భుతమైన ఫ్రెంచ్ రచయిత. అతను ప్రపంచంలోని అత్యుత్తమ కథా రచయితలలో ఒకడు. ప్రస్తుత షార్ట్ లాస్ట్ పురుషుల నుండి మహిళలు ఎదుర్కొనే సంక్లిష్ట సమస్యలతో వ్యవహరిస్తుంది. లైసెన్షియల్ బారన్ ఆమెను పొందేందుకు ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధమైనప్పుడు, అతను 25 కొరడా దెబ్బలను అంగీకరించడానికి సిద్ధంగా ఉంటే, ఆమె అతని మాట వినాలని ఆమె సూచించింది. “నువ్వు నిజమే చెబుతున్నావా?” ఆమె విచారించింది. ఘెట్టో మనిషి తన ప్రతిస్పందనను ముగించిన తర్వాత, అతను ఆమె చేతిని పట్టుకుని ఉద్రేకంతో తన పెదవులపైకి నొక్కాడు. ఎప్పుడొస్తావని అడిగితే రేపు ఎనిమిదికి అని చెప్పింది. నేను స్టేబుల్ని దగ్గరకు తీసుకుని కొరడాతో కొట్టగలనా అని అతను అడిగినప్పుడు, ఆమె లేదు, నేనే దాన్ని నిర్వహిస్తాను అని చెప్పింది.

TS Inter 2nd Year English Study Material Chapter 14 Lost

Question 3.
What was the baron,s wish? Was it fulfilled? Explained? (Revision Test – IV )
Answer:
Guy de Maupassant was a fantastic French author. He was one of the world’s best short story writers. The current short Lost deals with the complex issues that women face from men A gorgeous, married woman caught the eye of a ghetto baron, who developed an enduring crush on her. Baron wished that she would provide to him because of her limited salary. His wish was not granted because she said that if he was willing to take twenty-five lashes, she would listen to him.

But on the appointed day, she whipped him 24 times in a ruthless manner. He would have reached her one more time, but the shrewd little lady purposefully avoided handing him the twenty-five cut. She mockingly laughed at him and insisted that she would only give in to him after giving him 25 lashes.

గై డి మౌపస్సంట్ ఒక అద్భుతమైన ఫ్రెంచ్ రచయిత. అతను ప్రపంచంలోని అత్యుత్తమ కథా రచయితలలో ఒకడు. ప్రస్తుత షార్ట్ లాస్ట్ పురుషుల నుండి మహిళలు ఎదుర్కొనే సంక్లిష్ట సమస్యలతో వ్యవహరిస్తుంది, ఒక అందమైన, వివాహిత స్త్రీ తనపై శాశ్వతమైన ప్రేమను పెంచుకున్న ఘెట్టో బారన్ దృష్టిని ఆకర్షించింది. తన జీతం పరిమితమైనందున ఆమె అతనికి అందించాలని బారన్ కోరుకున్నాడు. ఇరవై ఐదు కొరడా దెబ్బలు తినడానికి సిద్ధమైతే తన మాట వింటానని ఆమె చెప్పడంతో అతని కోరిక

ఫలించలేదు కానీ నిర్ణీత రోజున, ఆమె అతనిని నిర్దాక్షిణ్యంగా 24 సార్లు కొరడాతో కొట్టింది. అతను మరొకసారి ఆమె పేరుకునేవాడు, కానీ తెలివిగల చిన్న మహిళ ఉద్దేశపూర్వకంగా ఇరవై ఐదు కట్ని అతనికి ఇవ్వకుండా తప్పించుకుంది. ఆమె అతనిని చూసి ఎగతాళిగా నవ్వింది మరియు అతనికి 25 కొరడా దెబ’ లు ఇచ్చిన తర్వాత మాత్రమే ఇస్తానని పట్టుబట్టింది.

Question 4.
Write about the character of the baron.
Answer:
Guy De Maupassant was a fantastic French author. He was one of the world’s best short story writers.

The current short Lost deals with the complex issues that women face from men One of the barons of the ghetto’s almanack who fled the field was a young boy, the son of Palestine who was by no means unattractive. In 1873, he would frequently go to the Universal Exhibition in Vienna to distract himself from his problems and find peace among the many different settings and attractions. He ran into a new couple one day in the Russian section. the stockbroker to secretly approach the charming young lady. He was drawn to that woman and suffered as a result.

గై డి మౌపస్సంట్ ఒక అద్భుతమైన ఫ్రెంచ్ రచయిత. అతను ప్రపంచంలోని అత్యుత్తమ కథా రచయితలలో ఒకడు.

ప్రస్తుత షార్ట్ లాస్ట్ స్త్రీ పురుషుల నుండి ఎదుర్కొనే సంక్లిష్ట సమస్యలతో వ్యవహరిస్తుంది. ఘెట్టో యొక్క పంచాంగం యొక్క బారన్లలో ఒకరు ఫీల్డ్ నుండి పారిపోయిన ఒక యువకుడు, అతను ఏ విధంగానూ ఆకర్షణీయం కాని పాలస్తీనా కుమారుడు. 1873లో, అతను వియన్నాలోని యూనివర్సల్ ఎగ్జిబిషన్కు తరచూ వెళ్తూ తన సమస్యల నుండి తనను తాను మరల్చుకోవడానికి మరియు అనేక విభిన్న సెట్టింగ్లు మరియు ఆకర్షణల మధ్య శాంతిని కనుగొనేవాడు. అతను రష్యన్ విభాగంలో ఒక రోజు కొత్త జంటతో పరుగెత్తాడు. ఆకర్షణీయమైన యువతిని రహస్యంగా సంప్రదించడానికి స్టాక్ బ్రోకర్. అతను ఆ స్త్రీకి ఆకర్షించబడ్డాడు మరియు దాని ఫలితంగా బాధపడ్డాడు.

Lost Summary in English

About Author

TS Inter 2nd Year English Study Material Chapter 14 Lost 1

Henri René Albert Guy de Maupassant (5 August 1850 – 6 July 1893) was a 19th- century French author, remembered as a master of the short story form, as well as a representative of the Naturalist school, who depicted human lives, destinies and social forces in disillusioned and often pessimistic terms.

Maupassant was a protégé of Gustave Flaubert and his stories are characterized by economy of style and efficient, seemingly effortless dénouements. Many are set during the Franco-Prussian War of the 1870s, describing the futility of war and the innocent civilians who, caught up in events beyond their control, are permanently changed by their experiences. He wrote 300 short stories, six novels, three travel books, and one volume of verse. His first published story, “Boule de Suif” (“The Dumpling”, 1880), is often considered his most famous work.

Guy De Maupassant was a great French writer. He was one of the best short story writers in the world. He was a representative of the naturalist school of writers. He depicted human lives often in pessimistic terms. He wrote more than three hundred stories. He also wrote novels, travel books, and poetry.

One of the barons of the ghetto’s almanack who fled the field was a young boy, the son of Palestine who was by no means unattractive. He ran into a new couple one day in the Russian section. The stockbroker to secretly approach the charming young lady.

He was drawn to the woman, and she felt offended by his comments. They came to an understanding where she said she would listen to him if he would take 25 whippings. She responded that she could come tomorrow at 8:00 when he inquired when she could. But on the designated day, she mercilessly beat him 24 times.

One more time he would have reached her, but the cunning little lady purposely didn’t give him the twenty-five cut.
She mocked him and laughed at him, saying she would only give in to him after giving him 25 lashes. With those words, she pulled back the curtains covering the door, signaling her husband and two other men to emerge from the adjacent room. I have witnesses to prove it.
The stockbroker was still silent and furious.

TS Inter 2nd Year English Study Material Chapter 14 Lost

Lost Summary in Telugu

గై డి మౌపస్సంట్ గొప్ప ఫ్రెంచ్ రచయిత. అతను ప్రపంచంలోని అత్యుత్తమ కథా రచయితలలో ఒకడు. అతను రచయితల సహజవాద పాఠశాల ప్రతినిధి. అతను తరచుగా నిరాశావాద పరంగా మానవ జీవితాలను చిత్రించాడు. మూడు వందలకు పైగా కథలు రాశారు. అతను నవలలు, ప్రయాణ పుస్తకాలు మరియు కవిత్వం కూడా వ్రాసాడు.

ఫీల్డ్ నుండి పారిపోయిన ఘట్టో యొక్క పంచాంగం యొక్క బారన్లలో ఒక యువకుడు, పాలస్తీనా కుమారుడు, అతను ఏ విధంగానూ ఆకర్షణీయంగా లేడు.
అతను రష్యన్ విభాగంలో ఒక రోజు కొత్త జంటతో పరుగెత్తాడు. ఆకర్షణీయమైన యువతిని రహస్యంగా సంప్రదించడానికి స్టాక్ బ్రోకర్.

అతను ఆ స్త్రీ వైపు ఆకర్షితుడయ్యాడు మరియు అతని వ్యాఖ్యలతో ఆమె మనస్తాపం చెందింది. 25 కొరడా ఝుళిపిస్తే ఆమె మాట వింటుందని ఎక్కడి వారు ఓ అవగాహనకు వచ్చారు. తాను ఎప్పుడు వస్తానని ఆరా తీస్తే రేపు 8:00 గంటలకు రావచ్చని ఆమె బదులిచ్చారు. కానీ నిర్ణీత రోజున ఆమె కనికరం లేకుండా అతడిని 24 సార్లు కొట్టింది. మరొకసారి అతను ఆమెను చేరుకుంటాడు, కానీ మోసపూరిత చిన్న మహిళ ఉద్దేశపూర్వకంగా అతనికి ఇరవై ఐదు కట్ ఇవ్వలేదు.

25 కొరడా దెబ్బలు ఇచ్చిన తర్వాతే అతనికి లొంగిపోతానని చెప్పి అతడిని ఎగతాళి చేస్తూ నవ్వింది. ఆ మాటలతో, ఆమె తన భర్త మరియు మరో ఇద్దరు వ్యక్తులను ప్రక్కనే ఉన్న గదిలో నుండి బయటికి రావాలని సూచించి, తలుపు కప్పిన కర్టెన్లను వెనక్కి తీసుకుంది. నిరూపించడానికి నా దగ్గర సాక్షులు ఉన్నారు. స్టాక్ బ్రోకర్ ఇంకా మౌనంగా మరియు కోపంగా ఉన్నాడు.

Lost Summary in Hindi

गाइ डी मौपासेंट एक महान फ्रांसीसी लेखक थे । वे दुनिया के सर्वश्रेष्ठ लघु कथाकारों में – से एक थे । वे लेखकों के प्रकृतिवादी स्कूल के प्रतिनिधि थे । उन्होंने मानव जीवन को अकसर निराशावादी शब्दों में चित्रित किया । उन्होंने तीन सौ से अधिक कहानियाँ लिखीं । उन्हों ने उपन्यास, यात्रा – पुस्तकें और कविताएँ भी लिखीं ।

यहूदी बस्ती के पंचाग के बहुत ही धनी एवं शक्तिशाली व्यवसायी (बैरन) में से एक, जो मैदान से भाग गया, वह युवा लड़का था, जो फिलिस्तीन का बेटा था, जो किसी भी तरह से अनाकर्षक नहीं था । एक दिन वह रूसी खंड में एक नए जोड़े से मिला। स्टॉक ब्रोकर गुप्त रूप से आकर्षक युवती के पास आता है। वह महिला के प्रति आकर्षिक हुआ, और वह महिला उस युवक की टिप्पणियों से नाराज हुई। दोनों में समझौता हुआ कि अगर युवक 25 चाबुक लेगा तो युवती उसकी बात सुनेगी । जब उसने पूछा कि वह कब आ सकती है। उसने जवाब दिया कि वह कल 8 बजे आ सकती है । निधारित दिन पर उसने उसे 24 बार बेरहमी से पीटा। एक बार और वह उसके पास पहुँच जाता, लेकिन चालाक छोटी महिला ने जानबूझकर उसे पच्चीस प्रहार नहीं दिया । उसने उसका मज़ाक उड़ाया और उसपर हँसते हुए कहा कि वह उसे 25 कोड़े देने के बाद ही वह हार मानेगी ।

इन शब्दों के साथ, उसने अपने पति और दो अन्य पुरुषों को बगल के कमरे से बाहर आने का संकेत देते हुए, दरवाजे को ढकने वाले पर्दों को वापस खींच लिया । मेरे पास इसे साबित करने के लिए गव है।
स्टॉक ब्रोकर अभी भी चुप और गुस्से में था |

Meanings and Explanations

Peculiar (adj)/ pr’kju:.li.ər : odd or strange flog – బేసి లేదా వింత కొరడా, अजीब या अजीब

Flog (v)/(ఫ్లోగ్)/flɒg : to beat with a whip – కొరడాతో కొట్టడం, वाबुक से पीठ ना

Ardently (adv) / (ఆ(ర్)డన్ ట్ లి) /’a:.dǝnt.li : passionately – ఉద్రేకంతో, उत्साह

Enamoured (adj)/(ఇన్యామ (ర్)డ్) / ɪ’næm.ǝd/ : delighted – ఆనందంగా ఉంది, प्रसन्न

Amorous (adj) / (యామరస్) /’æmə.rəs / showing sexual desire and love towards somebody, లైంగిక కోరిక మరియు ఒకరి పట్ల ప్రేమను చూపడం,
किसी के प्रति यौन इच्छा और प्रेम दिखाना

Delilah (prop n) (డెలైల) : She is a lady who betrayed Samson. She is a symbol of taking revenge cleverly,
ఆమె సామ్సన్ కు ద్రోహం చేసిన ఒక మహిళ. తెలివిగా ప్రతీకారం తీర్చుకోవడానికి ఆమె ప్రతీక, वह एक महिला है जिसने शामसन को धोखा दिया । वह चतुराई से बदला लेने का प्रतीक है ।

Don Juan (prop n ) / (డాన్ హవాన్) : a notorious person for his skills in seducing women (a fictional character from a Spanish novel of the same name), స్త్రీలను మోహింపజేయడంలో అతని నైపుణ్యాలకు పేరుగాంచిన వ్యక్తి (అదే పేరుతో ఉన్న స్పానిష్ నవల నుండి ఒక కల్పిత పాత్ర) अपने कौशल से महिलाओं को बहकानेवाला एक कुख्यात व्यक्ति । ( इसी नाम के एक स्पेनिश उपन्यास का एक काल्पनिक चरित्र

By no means (adv-phr) : definitely not – ఖచ్చితంగా కాదు, किसी भी तरह से निश्चित रूप से नहीं

Almanac (n)/(ఓల్ మన్యాక్) /’ɔ:l.ma.næk : an annual publication containing tabular information in a particular field, arranged according to the calendar of a year – ఒక నిర్ధిష్ట ఫీల్డ్ లోని పట్టిక సమాచారాన్ని కలిగి ఉన్న వార్షిక ప్రచురణ, ఒక సంవత్సరం క్యాలెండర్ ప్రకారం ఏర్పాటు చేయబడింది पंचांग : एक विशेष क्षेत्र में सारणीबद्ध जानकारी युक्त एक वार्षिक प्राकाशन, एक वार्षिक कैलेंडर के अनुसार व्यवस्थित

Baron (n)/(బ్యారన్)/ ‘bær.ən : a very wealthy or powerful businessman చాలా ధనవంతుడు లేదా శక్తివంతమైన వ్యాపారవేత్త एक बहुत ही धनी शक्ति शाली व्यवसायी

Ghetto (n)/(7á)/ ‘get.əu : quarters in which Jews live – యూదులు నివసించే క్వార్టర్స్, क्वार्टर जिसनें यहूदी रहते हैं

TS Inter 2nd Year English Study Material Chapter 14 Lost

Embolden (v) / ɪm’bəul.dən : give encouragement to – ప్రోత్సాహాన్ని ఇవ్వ౦డి, को प्रास्साहन द

Overtures (n-pl)/(అ ఉవ (ర్)చ (ర్)జ్)/ ‘əʊ.və.tjʊər : advances – పురోగతులు, प्रस्ताव / अग्रिम

Rapture (n) / (ర్యాప్చర్) )/ ‘ræp.tʃər : a feeling of intense pleasure or joy, తీవ్రమైన ఆనందం లేదా ఆనందం యొక్క అనుభూతి, तीव्र आनंद या गहरे आनंद की भावना

Sable (n)/(సె ఇ బల్) / ‘seɪ.bəl / : a small animal with dark brown fur- ముదురు గోధుమ రంగు బొచ్చుతో ఒక చిన్న జంతువు, गहरे भूरे रंग का लोम वाला एक छोटा जानवर

Outrageous (adj)/(ఔట్ రెఇజనస్) / aʊt’reɪ.dʒəs : grossly offensive – స్థూలంగా ప్రమాదకరంగా, घोर आपत्तिजनक

TS Inter 2nd Year Maths 2A Quadratic Expressions Important Questions

Students must practice these TS Inter 2nd Year Maths 2A Important Questions Chapter 3 Quadratic Expressions to help strengthen their preparations for exams.

TS Inter 2nd Year Maths 2A Quadratic Expressions Important Questions

Question 1.
Find the roots of the equation
3x2 + 2x – 5 = 0.
Solution:
The roots of the quadratic equation
ax + bx + c = 0 are \(\frac{-b \pm \sqrt{b^2-4 a c}}{2 a}\)
Here a = 3, b = 2 and c = – 5.
Therefore the roots of the given equation are
TS Inter 2nd Year Maths 2A Quadratic Expressions Important Questions 1
Hence 1 and – \(\frac{5}{3}\) are the roots of the given equation.

TS Inter 2nd Year Maths 2A Quadratic Expressions Important Questions

Another method:
We can also obtain these roots in the following way.
3x2 + 2x – 5 = 3x2 + 5x -3x – 5
= x(3x+5) – 1 (3x+5)
= (x-1) (3x + 5)
= 3 (x – 1) \(\left(x+\frac{5}{3}\right)\)
Since 1 and \(\frac{5}{3}\) are the zeros of 3x2 + 2x – 5, they are the roots of 3x2 + 2x – 5 = 0.

Question 2.
Find the roots of the equation
4x2– 4x + 17 = 3x2 – 10x – 17.
Solution:
Given equation can be rewritten as x2 + 6x + 34 = 0.
The roots of the quadratic equation, ax2 + bx + c = 0 are
\(\frac{-b \pm \sqrt{b^2-4 a c}}{2 a}\)
Therefore the roots of the given equation are
TS Inter 2nd Year Maths 2A Quadratic Expressions Important Questions 2
Hence the roots of the given equation are
– 3 + 5i and -3-5i

Question 3.
Find the roots of the equation
\(\sqrt{3} x^2+10 x-8 \sqrt{3}=0\)
Solution:
The roots of the quadratic equation a+ b
TS Inter 2nd Year Maths 2A Quadratic Expressions Important Questions 3

TS Inter 2nd Year Maths 2A Quadratic Expressions Important Questions

Question 4.
Find the nature of the roots of 4x2 – 20x + 25 = 0.
Solution:
Here a = 4, b = -20 and c = 25
Hence Δ = b2 – 4ac = (-20)2– 4 (4) (25) = 0
Since Δ is zero and a, b, c are real, the roots of the given equation are real and equal.

Question 5.
Find the nature of the roots of 3x2 + 7x + 2 = 0.
Solution:
Here a=3, b=7 and c=2
Hence = b2 – 4ac
= (7)2 4(3) (2) = 25 = 52  > 0.
Since Δ = 5 is a square number, the roots of the given equation are rational and unequal.

Question 6.
For what values of m, the equation x2 – 2 (1 + 3m) x + 7 (3 + 2m) = 0 will have equal roots?
Solution:
The given equation will have equal roots if its discriminant is 0.
Here Δ = {- 2(1+3m))}2 + 4(1) 7(3 + 2m)
= 4(1+3m)2 – 28 (3+2m) = 4(9m2 – 8m – 20)
= 4 (m – 2) (9m + 10) = 36 (m – 2) m + \(\left(m+\frac{10}{9}\right)\)
Hence Δ = 0 ⇔ m = 2 or m= \(-\frac{10}{9}\)
Therefore the roots of the given equation are equal \(\left\{-\frac{10}{9}, 2\right\}\)

TS Inter 2nd Year Maths 2A Quadratic Expressions Important Questions

Question 7.
If α and β are the roots of ax2 +bx + c = 0, find the values of α2 + β2 and α3 + β3 in terms of a, b, c.
Solution:
From the hypothesis
TS Inter 2nd Year Maths 2A Quadratic Expressions Important Questions 4

Question 8.
Form a quadratic equation whose roots are 2\(\sqrt{3}\) -5 and -2\(\sqrt{3}\) – 5.
Solution:
TS Inter 2nd Year Maths 2A Quadratic Expressions Important Questions 5

TS Inter 2nd Year Maths 2A Quadratic Expressions Important Questions

Question 9.
Let α and β be the roots of the quadratic equation ax2 + bx + c = 0. If c ≠ 0, then form the quadratic equation whose roots are \(\frac{1-\alpha}{\alpha}\) and \(\frac{1-\beta}{\beta}\)
Solution:
From the hypothesis we have
TS Inter 2nd Year Maths 2A Quadratic Expressions Important Questions 6
TS Inter 2nd Year Maths 2A Quadratic Expressions Important Questions 7

Question 10.
Find a quadratic equation, the sum of whose roots is I and the sum of the squares of the roots is 13.
Solution:
Let a and 3 be the roots of a required equation
TS Inter 2nd Year Maths 2A Quadratic Expressions Important Questions 8

Therefore x2 – a + x a = 0 becomes  – x  – 6 = 0. This is a required equation.
Equations reducible to quadratic equations: We now explain by some illustrations how to solve some equations which are reducible to quadratic equations by suitable substitutions.

TS Inter 2nd Year Maths 2A Quadratic Expressions Important Questions

Question 11.
Solve \(x^{\frac{2}{3}}+x^{\frac{1}{3}}\) – 2 = 0.
Solution:
On taking \(\mathrm{x}^{\frac{1}{3}}\) = t, the given equation becomes
t2 + t – 2= 0, which is a quadratic equation in t.
Hence a complex number a is a solution of the equation.
\(x^{\frac{2}{3}}+x^{\frac{1}{3}}\) – 2 = 0, if there exists λ such that λ2 + λ -2 = 0 and λ3 = α.
Therefore the set of all solutions of the given equation is
TS Inter 2nd Year Maths 2A Quadratic Expressions Important Questions 9
Therefore the solution set of the given equation is { – 8, 1}.

Question 12.
Solve 71+x +71-x = 50 for real x.
Solution:
The given equation can be written as
TS Inter 2nd Year Maths 2A Quadratic Expressions Important Questions 10
X = – 1 or x = 1
Therefore the solution set of the given equation is (-1, 1).

TS Inter 2nd Year Maths 2A Quadratic Expressions Important Questions

Question 13.
Solve \(\sqrt{\frac{x}{1-x}}+\sqrt{\frac{1-x}{x}}=\frac{13}{6}\)
Solution:
On taking \(\sqrt{\frac{x}{1-x}}=t\) the given equation becomes
TS Inter 2nd Year Maths 2A Quadratic Expressions Important Questions 11

Question 14.
Find all numbers which exceed their square root by 12.
Solution:
Let x be any such number.
Then \(x = \sqrt{\mathrm{x}}\) + 12 ie., x – 12 = \(x = \sqrt{\mathrm{x}}\)
On squaring both sides and simplifying we obtain (x – 12)2
i.e., x2  – 24x 144 = x
i.e., x2 – 25x + 144 = 0
i.e.,x (x – 16) – 9(x – 16) = 0
i.e., (x – 16) (x – 9) = 0
The roots of the equation (x – 16) (x – 9) = 0 are 9 and 16.
But x = 9 does not satisfy equation (1), while x = 16 satisfies (1). Therefore the required number is 16.

TS Inter 2nd Year Maths 2A Quadratic Expressions Important Questions

Question 15.
Prove that there is a unique pair of consecutive positive odd integers such that the sum of their squares is 290 and find it.
Solution:
Since two consecutive odd integers differ by
2, we have to prove that there is a unique
positive odd integer x such that
⇔ x2+(x+2)2=290 ……………. (1)
⇔ x2+ (x + 2)2 = 290
⇔x2 + x2 + 4x + 4 = 290
⇔ 2x2 + 4x – 286 = 0
⇔ x2 + 2x – 143 = 0
⇔ x2+ 13x – 11x – 143 = 0
⇔ x(x + 13) – 11 (x + 13) = 0
⇔ (x+ 13)(x – 11)=0
⇔ x∈( – 13,11)
Hence 11 is the only positive odd integer satisfying equation (1).
Therefore (11, 13) is the unique pair of integers which satisfies the given condition.

Question 16.
The cost of a piece of cable wire is Rs. 35/-. If the length of the piece of wire is 4 meters more and each meter costs Rs. 1/- less, the cost would remain unchanged. What is the length of the wire?
Solution:
Let the length of the piece of wire be ‘l’ meters and the cost of each meter be Rs. x I –
By the given conditions lx = 35 ……………………. (1)
Also, (1+ 4) (x – 1) = 35
i.e., lx – 1 + 4x – 4 = 35 ……………………… (2)
From (1) and (2), 35 – l + 4x – 4 = 35
i.e., 4x = l + 4
Therefore \(x=\frac{l+4}{4}\)
On substituting this value of ‘x’ in (1) and simplifying, we get
\(l\left(\frac{l+4}{4}\right)=35\)
i.e., l2 + 4l- 140 = 0
i.e., l2 + 14l – 10l- 140 = 0
i.e., l(l+ 14)-10 (1+ 14)=0
i.e., (l+ 14) (1- 10) = 0
The roots of the equation (l + 14) (l- 10) = 0 are-14 and 10.
Since the length can not be negative, i = 10
Therefore the length of the piece of wire is 10 metres.

TS Inter 2nd Year Maths 2A Quadratic Expressions Important Questions

Question 17.
One fourth of a herd of goats was seen in the forest. Twice the square root of the number in the herd had gone up the bill and the remaining l5goatswere on the bank of the flyer. Find the total number of goats
Solution:
Let the number of goats in the herd be ‘x’.
By the given conditions, the number of goats seen in the forest is \(\frac{x}{4}\) the number of goats gone up the hill is \(2 \sqrt{x}\) and the number of the remaining goats which were on the bank of the river is 15.
Therefore \(\frac{x}{4}\) + \(2 \sqrt{x}\) + 15 = X
i.e., x + \(8 \sqrt{x}\) + 60 = 4x
i.e., 3x – \(8 \sqrt{x}\) –  60 = 0.
On taking \(\sqrt{x}\) = t, this equation becomes
3t2 – 8t – 60 = 0
i.e., 3t2– 18t+ 10t – 60 = 0
i.e.,3t(t – 6)+ 10(t – 6)=0
i.e.,(t – 6)(3t+ 10)=0
The roots of the equation (t – 6) (3t + 10) = 0 are 6 and \(-\frac{10}{3}\)
Hence 3x – \(8 \sqrt{x}\) – 60 = 0 = \(\sqrt{x}\) = 36
(since \(\sqrt{x}\) is non-negative)⇔ x = 36
Therefore the total number of goats in the herd is 36

Question 18.
In a cricket match Anli took one wicket less than twice the number of wickets taken by Ravi. If the product of the number of wickets taken by them is 15, find the number of wickets taken by each of them.
Solution:
Let the number of wickets taken by Anil and
Ravi be x and y respectively.
Then x = 2y – 1 …………… (1)
xy = 15 ……………(2)
From (1) and (2), (2y – 1) y = 15
i.e., 2y2-y-15=0
i.e., 2y2-6y + 5y- 15 = 0
i.e., 2y(y-3) + 5 (y-3) = 0
i.e., (y-3)(2y + 5)= 0
The roots of the equation (y – 3) (2y + 5) = 0 are 3 and \(-\frac{5}{2}\)
Since the number of wickets must be positive integer y = 3.
From (2) we get 3x = 15, i.e., x = 5
Therefore the wickets taken by Anil and Ravi are 5 and 3 respectively.

Question 19.
Some points on a plane are marked and they are connected pairwise by line segments. if the total number of line segments formed is 10, find the number of marked points on the plane.
Solution:
Let the number of points marked on the plane be ‘x’. Since each point is joined to the remaining (x – 1) points, the number of line segments having a given point as an end point is (x – 1). Hence the total number of line segments formed appears to be x (x – 1).
But in this counting, each line segment is counted exactly twice at each of its end points. Hence the total number of line
segments actually formed is \(\frac{x(x-1)}{2}\)
Therefore by hypothesis \(\frac{x(x-1)}{2}\) = 10
i.e., x – x – 20 = 0
i.e., (x – 5) (x +4) = 0
The roots of the equation (x – 5) (x + 4) = 0 are – 4 and 5.
x can not be negative, so x = 5.
Therefore the number of points marked on the plane is 5.

TS Inter 2nd Year Maths 2A Quadratic Expressions Important Questions

Question 20.
Suppose that the quadratic equations ax2 + bx +c = 0 and bx2 + cx + a = 0 have a common root. Then show that
a3 + b3 + C3 = 3abc.
Solution:
The condition for two quadratic equations
TS Inter 2nd Year Maths 2A Quadratic Expressions Important Questions 12

Question 21.
For what values of x the expression – 5x – 14 is positive?
Sol.
Since x2 – 5x  – 14 = (x + 2) (x – 7), the roots of the equation x2 – 5x – 14 = 0 are – 2 and 7.
Flere the coefficient of x2 is 1, which is positive.
Hence x2 – 5x – 14 is positive when x < – 2 or x> 7.

Question 22.
For what values of x the expression  – 6x2+2x – 3 is negative?
Solution:
– 6x + 2x – 3 = 0 can be written as
6x2 – 2x + 3= 0.
The roots of this equation are
\(\frac{2 \pm \sqrt{(-2)^2-4(6)(3)}}{2(6)}\)
Therefore the roots of – 6x2+2x – 3 = 0 are non-real complex numbers.
Here the coefficient of x2 is – 6 which is negative.
Hence – 6x2 + 2x – 3 < 0 for all x R

TS Inter 2nd Year Maths 2A Quadratic Expressions Important Questions

Question 23.
Find the value of x at which the following expressions have maximum or minimum.

(i) x2+5x+6
(ii) 2x – x2+7
Solution:
(i) In the expression x2+5x+6, the coefficient of x2 is positive.
So x2 + 5x + 6 has absolute minimum at
x – (since b=5, a= 1).

(ii) In the expression 2x – x2 + 7, the coefficient of x2 is negative.
So 2x – x2 + 7 has an absolute maximum at
\(x=-\frac{2}{2(-1)}=1\) (since b=2, a-1).

Question 24.
Find the maximum or minimum value of the quadratic expression.
(i) 2x – 7 – 5 x 2
(ii) 3x2 + 2x + 11
Solution:
(i) Comparing the given expression with ax2 + bx + C,
we have a = -5, b = 2 and c = – 7.
TS Inter 2nd Year Maths 2A Quadratic Expressions Important Questions 13

Question 25.
Find the changes in the sign of 4x – 5x2 + 2 for x ∈ R and find the extreme value.
Solution:
Comparing the given expression with
ax2 + bx+c, we have a = – 5 < 0.
The roots of the equation 5x2 – 4x – 2 = 0 are \(\frac{2 \pm \sqrt{14}}{5}\)
Therefore, when \(\frac{2-\sqrt{14}}{5}<x<\frac{2+\sqrt{14}}{5}\) the sign of 4x – 5x2 + 2 is positive and when
\(x<\frac{2-\sqrt{14}}{5} \text { or } x>\frac{2+\sqrt{14}}{5}\) the sign of 4x – 5x2 + 2 is negitive
Since a < 0, the maximum value of the expression 4x – 5x2 + 2 is
TS Inter 2nd Year Maths 2A Quadratic Expressions Important Questions 15

TS Inter 2nd Year Maths 2A Quadratic Expressions Important Questions

Question 26.
Show that none of the values of the function \(\frac{x^2+34 x-71}{x^2+2 x-7}\) over R lies between 5 and 9.
Solution:
Let y0 be a value of the given function.
Then ∋ x0 ∈ R such that
\(y_0=\frac{x_0^2+34 x_0-71}{x_0^2+2 x_0-7}\)
If y0 = 1, then clearly y0 ∉(5,9).
Suppose that y0 ≠ 1.
Then the equation y0 (x2 + 2x – 7) = x2 + 34x – 71 is a quadratic equation and x0 is a real root of it.
Therefore(y0 -1)x2+(2y0 – 34)x – (7y0 – 71)
= 0 is a quadratic equation having a real root x0.
Since all the coefficients of this quadratic equation are real, the other root of the equation is also real.
Therefore
Δ = (2y0 – 34)2 +4 (y0 -1) (7y0 – 71) ≥ 0.
On simplifyìng this we get
y20 – 14y0 + 45 ≥ 0
i.e., (y0-5) (y0– 9) ≥ 0
Therefore y0 ≤ 5 or y0 ≥ 9.
Hence y0 does not lie in (5, 9).
Hence none of the values of the given function over R lies between 5 and 9.

Question 27.
Find the maximum value of the function
\(\frac{x^2+14 x+9}{x^2+2 x+3}\) over R.
Solution:
Since the discriminant of x2 + 2x + 3 is negative, x2 + 2x + 3 is never zero on R.
TS Inter 2nd Year Maths 2A Quadratic Expressions Important Questions 16
The above inequality is true even when y0 = 1.
Hence the range of the given function on R is a subset of [- 5, 4].
For m = 4, the equation (1 – m) x2 + (14 – 2m) x+ 9 – 3m = 0 is a quadratic equation with real coefficients and discriminant zero and hence has only one root which is real. Let it be α.
Then for m = 4, we have (1 – m) α2 + (14 – 2m) α + 9 – 3m = 0.
Hence \(\frac{\alpha^2+14 \alpha+9}{\alpha^2+2 \alpha+3}=m=4\)
Hence 4 is in the range of the given function.
Since the range is a subset of [-5, 4] and 4 is in the range, 4 is the absolute maximum value given function over R.

TS Inter 2nd Year Maths 2A Quadratic Expressions Important Questions

Question 28.
Find the solution set of x2 + x – 12 ≤ 0 by both algebraic and graphical methods.
Solution:
Algebraic Method:
We have x2 + x – 12 (x + 4) (x – 3)
Hence – 4 and 3 are the roots of the equation x2 + x – 12 = 0
Since the coefficient of x2 in the quadratic expression x2 + x – 12 = 0 is positive, x2 + x – 12 is negative if – 4 < x < 3 and positive if either x < – 4 or x > 3.
Hence x2 + x – 12 ⇔ -4 ≤ x ≤ 3
Therefore the solution set is
{ x ∈ R : – 4 ≤ x ≤ 3}
Graphical Method:
Let y = f(x) x2 – x – 12
The values of y at some selected values of x are given in the following table:
TS Inter 2nd Year Maths 2A Quadratic Expressions Important Questions 17
The graph of the function y = f(x) is drawn using the above tabulated values.
TS Inter 2nd Year Maths 2A Quadratic Expressions Important Questions 18
Therefore from the graph of y = f(x we observe that
y = x2 – x – 12 ≤ 0 if i – 4 ≤ x≤3
Hence the solution set is {x ∈ R : – 4 ≤ x ≤ 3}.

Question 29.
Find the set of values of x for which the inequalities x2-3x-10<0, 10x – x2-16>0 hold simultaneously.
Solution:
We have x2 -3x – 10 (x + 2) (x – 5)
Flence – 2 and 5 are the roots of the equation x2-3x-10= 0.
Since the coefficient of x2 in the quadratic 30. expression x2 – 3x -10 is positive.
x2-3x-10<0 =-2<x<5
We have 10x – x2-16 = – (x – 2)(x – 8)
Hence 2 and 8 are the roots of the equation
10x – x2 – 16 = 0.
Since the coefficient of x2 in the quadratic expression 10x – x2 -16 is negative.
10x- x2-16>0=2 < x< 8
Hence x2 -3x -10 < 0 and
⇔ X∈ (-2,5)∩(2,8)
Therefore the solution set is {x∈R : 2 < x < 5}.
10x – x2 – 16 >0

Question 30.
Solve the inequation \(\sqrt{x+2}>\sqrt{8-x^2}\)
Solution:
TS Inter 2nd Year Maths 2A Quadratic Expressions Important Questions 19
We have (x + 2) >(8-x2)
⇔ x2+ x – 6>0
Now x2 + x-6 = (x + 3)(x-2)
Since -3 and 2 are the roots of the equation
x2 + x – 6 = 0 and the coefficient of x2 in x2 + x – 6 is positive
TS Inter 2nd Year Maths 2A Quadratic Expressions Important Questions 20

TS Inter 2nd Year Maths 2A Quadratic Expressions Important Questions

Question 31.
Solve the inequation
\(\sqrt{(x-3)(2-x)}<\sqrt{4 x^2+12 x+11}\)
Solution:
The given inequation is equivalent to the following two inequalities.
(x-3) (2-x) ≥ 0 and (x – 3)(2-x)4x2+ 12x+11
(x – 3)(2- x)≥ 0 (x-2)(x-3)≤0
– x2+ 5x- 6<4x2 + 12x+ 11
⇔ 5x2 + 7x + 17 > 0
The discriminant of the quadratic expression 5x2 + 7x + 17 is negative.
Hence 5x2 + 7x + 17 > 0 ∀x ∈ R.
Hence the solution set of the given inequation is {x ∈R :2 ≤ x ≤ 3}.

Question 32.
Solve the inequation
\(\frac{\sqrt{6+x-x^2}}{2 x+5} \geq \frac{\sqrt{6+x-x^2}}{x+4}\)
Solution:
TS Inter 2nd Year Maths 2A Quadratic Expressions Important Questions 21
TS Inter 2nd Year Maths 2A Quadratic Expressions Important Questions 22

TS Inter 2nd Year Maths 2A Quadratic Expressions Important Questions

Question 33.
Solve the inequation
\(\sqrt{x^2-3 x-10}>(8-x)\)
Solution:
TS Inter 2nd Year Maths 2A Quadratic Expressions Important Questions 23
TS Inter 2nd Year Maths 2A Quadratic Expressions Important Questions 24

TS Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(b)

Students must practice this TS Intermediate Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(b) to find a better approach to solving the problems.

TS Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(b)

I.
Question 1.
If 4 fair coins are tossed simultaneously, then find the probability that 2 heads and 2 tails appear.
Solution:
If getting Head and Tail are denoted by H, T the number of sample points in the sample space n(S ) = 24 = 16.
If E is the event of getting 2 heads and 2 tails then E = {THHT, TTHH, HTHT, HHTT, TTHH, HTTH}
∴ n ( E ) = 6
∴ Probability of getting 2 heads and 2 tails.
P(E) = \(\frac{n(E)}{n(S)}=\frac{6}{16}=\frac{3}{8}\)

Question 2.
Find the probability that a non-leap year contains
(i) 53 Sundays
(ii) 52 Sundays only.
Solution:
A non-leap year contains 365 days in which there are 52 full weeks and one day.
52 full weeks contain 52 × 7 = 364 days and
left out of one day may be either Sun, Mon, Tues, Wed, Thu, Fri or Sat.
∴ n(S) = 7.

i) For a non-leap year to contain 53 Sundays, we have only on possibility to have 365th day a Sunday.
∴ n(E) = 1

ii) For a non-leap year to contain 52 Sundays, we have 6 possibilities for 365th day be a day other Sunday
∴ n ( E ) = 6
∴ Probability of getting 52 Sundays in a non leap year is
∴ p(E) = \(\frac{\mathrm{n}(\mathrm{E})}{\mathrm{n}(\mathrm{S})}=\frac{6}{7}\).

TS Board Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(b)

Question 3.
Two dice are rolled. What is the probability that none of the dice shows the number 2?
Solution:
n = 6, m = 2 i.e., n(S) = 6, n (E) = 2
P ( E ) = Probability of not getting 2 when a single die is rolled = \(\frac{5}{6}\).
∴ The probability of not getting 2 when two dice are rolled = \(\left(\frac{5}{6}\right) \times\left(\frac{5}{6}\right)=\left(\frac{5}{6}\right)^2\).

Question 4.
In an experiment of drawing a card at random from a pack, the event of getting a spade is denoted by A and getting a pictured card (King, Queen or Jack) is denoted by B. Find the probabilities of A, B, A ∩ B and A ∪ B.
Solution:
Total number of cards in the pack n ( S ) = 52
If A is the event of getting a spade card then n (A) = 13
∴ Probability of getting a spade card,
P(A) = \(\frac{\mathrm{n}(\mathrm{A})}{\mathrm{n}(\mathrm{S})}=\frac{13}{52}=\frac{1}{4}\).

If B is the event of getting a picture card (King, Queen or Jack) then n (B) = 12
(there are 4 kings, 4 queens and 4 jacks)
∴ Probability of getting a picture card = \(\frac{\mathrm{n}(\mathrm{B})}{\mathrm{n}(\mathrm{S})}=\frac{12}{52}=\frac{3}{13}\)
∴ P(B) = \(\frac{3}{13}\)
Common to the events A and B there is a spade king, spade queen and spade jack
∴ n(A ∩ B) = 3
∴ Probability of getting (A ∩ B) is
P(A ∩ B) = \(\frac{\mathrm{n}(\mathrm{A} \cap \mathrm{B})}{\mathrm{n}(\mathrm{S})}=\frac{3}{52}\)
By addition theorem,
P(A ∪ B) = P(A) + P(B) – P(A ∩ B)
= \(\frac{13}{52}+\frac{12}{52}-\frac{3}{52}=\frac{22}{52}=\frac{11}{26}\).

TS Board Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(b)

Question 5.
In a class of 60 boys and 20 girls, half of the boys and half of the girls know cricket. Find the probability of the event that a person selected from the class is either a boy or a girl who knows cricket.
Solution:
Let E, be the event of selecting a boy and E, be the event of selecting a person who knows cricket.
P(E1) = \(\frac{60}{80}\);
P(E2) = \(\frac{40}{80}\)
(30 boys + 10 girls who knows cricket)
P (E1 ∩ E2) = \(\frac{30}{80}\)
(∵ 30 boys are common to E1 and E2)
∴ Probability of selecting a boy or a girl who knows cricket is .
P(E1 ∪ E2) = P(E1) + P(E2) – P(E1 ∩ E2)
= \(\frac{60}{80}+\frac{40}{80}-\frac{30}{80}=\frac{70}{80}=\frac{7}{8}\)
∴ ProbabilIty of the event that a person selected from the class is either a boy or a girl who knows cricket = \(\frac{7}{8}\).

Question 6.
For any two events A and B, show that P\(\left(A^c \cap B^c\right)\) = 1 + P(A ∩ B) – P(A) – P(B)
Solution:
\(\left(A^c \cap B^c\right)\) = \((A \cup B)^c\)
∴ P\(\left(A^c \cap B^c\right)\) = P\((A \cup B)^c\)
= 1 – P(A ∪ B) (∵ P(S) = 1)
= 1 – [P (A) + P (B ) – P (A ∩ B)]
= 1 + P(A ∩ B) – P(A) – P(B)
[From Demorgan’s law \(\left(A^c \cap B^c\right)\) = \((A \cup B)^c\)].

Question 7.
Two persons A and B are rolling a dice on the condition that the person who gets 3 will win the game. If A starts the game, then find the probabilities of A and B respectively to win the game.
Solution:
Two persons A and B toss a die.
The probability of throwing 3 with a die = \(\frac{1}{6}\)
The probafility of not throwing 3 with the die = 1 – \(\frac{1}{6}\) = \(\frac{5}{6}\)
If A is to win, A must throw 3 in the 1st or 2nd or 3rd rounds etc.
P(A) = \(\frac{1}{6}+\frac{5}{6} \cdot \frac{5}{6} \cdot \frac{1}{6}+\frac{5}{6} \cdot \frac{5}{6} \cdot \frac{5}{6} \cdot \frac{5}{6} \cdot \frac{1}{6}+\ldots .\)
which is an infinite G.P. with a = \(\frac{1}{6}\)
r = \(\frac{5}{6} \cdot \frac{5}{6}=\left(\frac{5}{6}\right)^2\)
∴ P(A) = S
= \(\frac{a}{1-r}=\frac{\frac{1}{6}}{1-\left(\frac{5}{6}\right)^2}=\frac{6}{11}\)
B wins when A fails to win
∴ P(B) = \(P(A)^c\)
= 1 – P(A)
= 1 – \(\frac{6}{11}\) = \(\frac{5}{11}\).

TS Board Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(b)

Question 8.
A, B, C are 3 newspapers from a city, 20% of the population read A, 16% read B, 14% read C, 8% both A and B, 5% both A and C, 4% both B and C and 2% all the three. Find the percentage of the population who read atleast one newspaper.
Solution:
Given P(A) = \(\frac{20}{100}\),
P(B) = \(\frac{16}{100}\)
P(C) = \(\frac{14}{100}\)
P(A ∩ B) = \(\frac{8}{100}\)
P(A ∩ C) = \(\frac{5}{100}\)
P(B ∩ C) = \(\frac{4}{100}\) and
P(A ∩ B ∩ C) = \(\frac{2}{100}\)
∴ The percentage of the population who read atleast one newspaper.
∴ P(A ∪ B ∪ C) = P(A) + P(B) + P(C) – P(A ∩ B) – P(B ∩ C) – P(C ∩ A) + P(A ∩ B ∩ C)
= \(\frac{20}{100}+\frac{16}{100}+\frac{14}{100}-\frac{8}{100}-\frac{4}{100}-\frac{5}{100}+\frac{2}{100}\)
= \(\frac{35}{100}\)
∴ 35 % read as atleast one newspaper.

Question 9.
If one ticket is randomly selected from tickets numbered 1 to 30, then find the probability that the number on the ticket is
i) a multiple of 5 or 7
ii) a multiple of 3 or 5.
Solution:
Given n (S) = 30
i) Let E1 he the event of getting a number which is a multiple of 5.
Let E2 be the event of getting a number which is a multiple of 7..
n(E1) = {5, 10, 15, 20, 25, 30} = 6
and n(E2) = {7, 14, 21, 28} = 4
∴ P(E1) = \(\frac{n\left(E_1\right)}{n(S)}=\frac{6}{30}\)
P(E2) = \(\frac{\mathrm{n}\left(\mathrm{E}_2\right)}{\mathrm{n}(\mathrm{S})}=\frac{4}{30}\)
∴ P(E1 ∪ E2) = P(E1) + P(E2)
(∵ P(E1 ∩ E2) = 0, because E1 ∩ E2 = Φ)
= \(\frac{6}{30}+\frac{4}{30}=\frac{10}{30}=\frac{1}{3}\)

ii) Let E3 be the event of getting ticket which is a number multiple of 3.
Let E4 be the event of getting a number which is a multiple of 5.
n(E3) = {3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30}
n(E3) = 10
∴ P(E3) = \(\frac{n\left(E_3\right)}{n(S)}=\frac{10}{30}=\frac{1}{3}\)
E4 = {5, 10, 15, 20, 25, 30} = 6
n(E4) = 6,
∴ P(E4) = \(\frac{\mathrm{n}\left(\mathrm{E}_4\right)}{\mathrm{n}(\mathrm{S})}=\frac{6}{30}=\frac{1}{5}\)
n(E3 ∩ E4) = {15, 30} = 2
∴ P(E3 ∩ E4) = \(\frac{\mathrm{n}\left(\mathrm{E}_3 \cap \mathrm{E}_4\right)}{\mathrm{n}(\mathrm{S})}=\frac{2}{30}\)
∴ P(E3 ∪ E4) = P(E3) + P(E4) – P(E3 ∩ E4)
= \(\frac{10}{30}+\frac{6}{30}-\frac{2}{30}=\frac{14}{30}=\frac{7}{15}\)
∴ Probability for the number on the ticket to be a multiple of 3 or 5 is \(\frac{7}{15}\).

TS Board Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(b)

Question 10.
If two numbers are selected randomly from 20 consecutIve natural numbers, find the probability that the sum of the two numbers is
i) an even number
ii) an odd number.
Solution:
i) Let A be the event that the sum of the numbers is even when two numbers chosen out of 20 consecutive positive integers.
n(S) = 20C2 = 190
n (A) = 10C2 + 10C2
= 45 + 45 = 90
∴ Probability for the sum of two numbers to be even = \(\frac{90}{190}=\frac{9}{19}\)

ii) Probability for the sum of numbers to be odd = 1 – \(\frac{9}{19}\) = \(\frac{10}{19}\).

Question 11.
A game consists of tossing a coin 3 tintes and noting its outcome. A boy wins if all tosses give tite same outcome and loses otherwise. Find the probability that the boy loses the gante.
Solution:
If a coin is tossed 3 times then the total number of sample points n(S) = 23 = 8
For winning the game all tosses gives the same outcome.
Let E be such that event then E = {HHH, TTT}
∴ n(E) = 2
P(E) = \(\frac{\mathrm{n}(\mathrm{E})}{\mathrm{n}(\mathrm{S})}=\frac{2}{8}\)
∴ The probability for the boy to loose the game
P\((\overline{\mathrm{E}})\) = 1 – P(E)
= 1 – \(\frac{2}{8}\) = \(\frac{6}{8}\).

Question 12.
If E1, E2 are two events with E1∩ E2 = Φ, then show that
\(P\left(E_1^C \cap E_2^C\right)=P\left(E_1^C\right)-P\left(E_2\right)\).
Solution:
\(P\left(E_1^C \cap E_2^C\right)=P\left(E_1^C\right)-P\left(E_2\right)\)
= 1 – [P(E1 ∪ E2)]
= 1 – [P(E1) + P(E2)]
[∵ P(E1 ∩ E2) = P(Φ) = 0]
(∵ From Addition theorem)
= 1 – P(E1) – P(E2)
= \(\mathrm{P}\left(\mathrm{E}_1^{\mathrm{C}}\right)\) – P(E2).

TS Board Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(b)

II.
Question 1.
A pair of dice is rolled 24 times. A person wins by not getting a pair of 6’s on any ot the 24 rolls. What is the probability of his winnIng ? (This is the problem proved by the French gambler Chevalier de Mere (1607 – 1685) to Blaise Pascal, who in turn discussed it with Pierre de Fermat and solved the saine).
Solution:
When a pair of dice are rolled at a time, we get n(S) = 36.
If \(\overline{\mathrm{E}}\) is the event of getting a pair of 6’s then
n(\(\overline{\mathrm{E}}\)) = 1
∴ P(\(\overline{\mathrm{E}}\)) = \(\frac{1}{36}\)
∴ Probability of getting a pair of 6’s when two dice are roiled at a time = \(\frac{1}{36}\)
∴ Probability of not getting a pair of 6’s when two dice are rolled = P (E)
= 1 – P (\(\overline{\mathrm{E}}\))
= 1 – \(\frac{1}{36}\) = \(\frac{35}{36}\)
∴ A person wins the game if the dice are rolled for 24 times without getting pair of sixes.
∴ The probability that the person wins the game = \(\left(\frac{35}{36}\right)^{24}\).

Question 2.
If P is a probability function, then show that for any two events A and B.
P(A ∩ B) ≤ P(A) ≤ P(A ∪ B) ≤ P(A) + P(B)
Solution:
Here P(A ∩ B) = P(A) . P\(\left(\frac{\mathrm{B}}{\mathrm{A}}\right)\) where
P\(\left(\frac{\mathrm{B}}{\mathrm{A}}\right)\) is the conditional probability of B relative to A.
P(A ∪ B) = P(A) + P(B) – P(A ∩ B)
∴ P(A ∩ B) ≤ P(A) …………(i)
(∵ P\(\left(\frac{\mathrm{B}}{\mathrm{A}}\right)\) ≤ 1)
P(A) ≤ P(A ∪ B) …………..(ii)
(∵ A ⊆ A ∪ B)
∴ P(A ∪ B) ≤ P(A) + P(B) ………….(iii)
From (i), (ii) and (iii).
P(A ∩ B) ≤ P(A) ≤ P(A ∪ B) ≤ P(A) + P(B).

TS Board Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(b)

Question 3.
In a box contaIning 15 bulbs, 5 are defective. If 5 bulbs are selected at random from the box, find the probabflky of the event, that
i) none of them is defective.
ii) only one of theni is defective.
iii) atleast omie of ihietim is defective.
Solution:
Total number of bulbs = 15
Defective bulbs = 5
Number of good bulbs = 10
n(S) = 15C5 = 3003.

i) None of theni is defective:
If E is the event of selecting all good bulbs from 10,
= 10C2 = 252
∴ P(E) = \(\frac{n(E)}{n(S)}=\frac{252}{3003}=\frac{12}{143}\).

ii) Only one of them is defective:
So selecting one defective from 5 and 4 good bulbs from 10.
n(E1) = 10C4 . 5C1 = 1050
∴ P(E1) = \(\frac{\mathrm{n}\left(\mathrm{E}_1\right)}{\mathrm{n}(\mathrm{S})}=\frac{1050}{3003}=\frac{50}{143}\)

iii) Atleast one of them is defective:
P(E) = 1 – \(\frac{12}{143}\)
= \(\frac{131}{143}\).

TS Board Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(b)

Question 4.
A and B are seeldng admission into IIT. If the probability for A to be selected is 0.5 and that both to be selected is 0.3, then it is possible that, the probability of B to be selected is 0.9?
Solution:
Given that P(A) = 0.5; P (A ∩ B) = 0.3
and P(A ∪ B) ≤ 1
⇒ P (A) + P(B ) – P (A ∩ B) ≤ 1
⇒ 0.5 + P(B) – 0.3 ≤ 1
⇒ P( B) + 0.2 ≤ 1
⇒ P(B) ≤ 1 – 0.2 = 0.8
∴P (B) = 0.9 is not possible.

Question 5.
The probability for a contractor to get a road contract is \(\frac{2}{3}\) and to get a building contract is \(\frac{5}{9}\). The probability to get atleast one contract is \(\frac{4}{5}\). Find the probability that he gets both the contracts.
Solution:
Let A be the event that a contractor gets road contract and R he the event that a contractor gets a building contract.
Given P(A) = \(\frac{2}{3}\);
P(B) = \(\frac{5}{9}\)
P(A ∪ B) = \(\frac{4}{5}\)
We have to find P(A ∩ B).
From Addition theorem on probabilities, we have the probability that the contractor gets both the contracts is
P(A ∩ B) = P(A) + P(B) – P(A ∪ B)
= \(\frac{2}{3}+\frac{5}{9}-\frac{4}{5}=\frac{19}{45}\).

TS Board Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(b)

Question 6.
In a committee of 25 members, each member is proficient either in Mathematics or in Statistics or in both. If 19 of these are proficient in Mathematics, 16 in Statistics, find the probability that a person selected from the committee is proficient in both.
Solution:
Let A be the event that a person is proficient in Mathematics and B be the event that a person is proficient in Statistics.
n(S) = 25;
n(A) = 19;
n(B) = 16
P(A ∪ B) = P(A) + P(B) – P(A ∩ B)
P(A ∩ B) = P(A) + P(B) – P(A ∪ B)
= \(\frac{19}{25}+\frac{16}{25}\) – 1
= \(\frac{35-25}{25}=\frac{10}{25}=\frac{2}{5}\)
10 members arc proficient in Mathematics and Statistics.

Question 7.
A, B, C are three horses in a race. The probability of A to win the race is twice that of B and probability of B is twice that of C. What are the probablilties of A, B and C to win the race?
Solution:
Let probability of C to win the race be ‘x’
i.e.. P(C) = x
Given that P(B) = 2P(C) = 2x
and P(A) = 2P(B) = 2 × 2x = 4x
Sum of the probabilities is ‘1’.
x + 2x + 4x = 1
⇒ 7x = 1
⇒ x = \(\frac{1}{7}\)
∴ P(A) = 2(\(\frac{1}{7}\)) = \(\frac{2}{7}\)
and P(C) = x = \(\frac{1}{7}\).

TS Board Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(b)

Question 8.
A bag contains 12 two rupee coins, 7 one rupee coins and 4 half rupee coins. 1f three coins are selected at random, then find the probability that
i) the sum of three coins is maximum
ii) the sum of three is minimum
iii) each coin is of different value.
Solution:
Total number of coins 12 + 7 + 4 = 23 coins
n(S) = 23C3
i) The sum of the three coins is maximum when we select 3 two rupee coins from 12 coins in 12C3 ways.
∴ n(E) = 12C3
Probability that te sum of three coins is maximum.
P(E) = \(\frac{\mathrm{n}(\mathrm{E})}{\mathrm{n}(\mathrm{S})}=\frac{{ }^{12} C_3}{{ }^{23} C_3}\)

ii) The sum of the three coins is minimum when we selecting 3 half rupee coins from 4 half a rupee coins which can be done in 4C3 ways.
∴ n(E) = 4C3
∴ Probability for the sum of three coins to be minimum P(E) = \(\frac{{ }^4 C_3}{{ }^{23} C_3}\)

iii) Three coins each of different value
n(E) = 12C1 . 7C1 . 4C1 and probability that the each coin has of different value = \(\frac{{ }^{12} C_1 \cdot{ }^7 C_1 \cdot{ }^4 C_1}{{ }^{23} C_3}\) ways.

Question 9.
The probabilities of three events A, B, C are such that P (A) = 0.3, P(B) = 0.4, P(C) = 0.8, P(A ∩ B) = 0.08, P(A ∩ C) = 0.28, P(A ∩ B ∩ C) = 0.09 and P(A ∩ B ∩ C) ≤ 0.75. Show that P(B ∩ C) lies in the interval [0.23, 0.48].
Solution:
Probability for any event is always less than or equal to ‘1’ and given that
P (A ∪ B ∪ C) ≥ 0.75
∴ 0.75 ≤ P(A ∪ B ∪ C) ≤ 1
⇒ 0.75 ≤ P(A) + P(B) + P(C) – P(A ∩ B) – P(B ∩ C) – P(C ∩ A) + P(A ∩ B ∩ C) ≤ 1
⇒ 0.75 ≤ 0.3 + 0.4 + 0.8 – 0.08 – P(B ∩ C) – 0.28 + 0.09 ≤ 1
⇒ 0.75 ≤ 1.23 – P(B ∩ C) ≤ 1
⇒ – 1.23 + 0.75 ≤ – P(B ∩ C) ≤ 1 – 1.23
⇒ – 0.48 ≤ – P(B ∩ C) ≤ – 0.23
⇒ 0.23 ≤ P(B ∩ C) ≤ 0.48
⇒ P(B ∩ C) ∈ [0.23, 0.48].

TS Board Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(b)

Question 10.
The probabilities of three mutually exclusive events are respeclively given as \(\frac{1+3 p}{3}, \frac{1-\mathbf{p}}{4}, \frac{1-2 \mathbf{p}}{2}\). Prove that \(\frac{1}{3} \leq p \leq \frac{1}{2}\).
Solution:
Suppose A, B, C are exclusive events
such that P(A) = \(\frac{1+3 \mathrm{P}}{3}\)
P(B) = \(\frac{1-P}{4}\)
P(C) = \(\frac{1-2 P}{2}\)
We know that
0 ≤ P(A) ≤ 1
o ≤ \(\frac{1+3 \mathrm{P}}{3}\) ≤ 1
0 ≤ 1 + 3P ≤ 3
– 1 ≤ 3P ≤ 3 – 1
\(\frac{-1}{3} \leq P \leq \frac{2}{3}\) ……………(1)
0 ≤ P(B) ≤ 1
0 ≤ \(\frac{1-\mathrm{P}}{4}\) ≤ 4
0 ≤ 1 – P ≤ 4
– 1 ≤ – P ≤ 4 – 1
1 ≥ P ≥ – 3
– 3 ≤ P ≤ 1 …………(2)
0 ≤ P(C) ≤ 1
0 ≤ \(\frac{1-2 \mathrm{P}}{2}\) ≤ 1
0 ≤ 1 – 2P ≤ 2
– 1 ≤ – 2P ≤ 2 – 1
1 ≥ 2P ≥ – 1
\(\frac{1}{2} \geq \mathrm{P} \geq-\frac{1}{2}\)
\(\frac{-1}{2} \leq P \leq \frac{1}{2}\) ……….(3)
Since A, B, C are exclusive events,
0 ≤ P(A ∪ B ∪ C) ≤ 1
⇒ 0 ≤ P(A) + P(B) + P(C) ≤ 1
⇒ 0 ≤ \(\frac{4+12 P+3-3 P+6-12 P}{12}\) ≤ 1
⇒ 0 ≤ \(\frac{13-3 P}{12}\) ≤ 1
⇒ 0 ≤ 13 – 3p ≤ 12
⇒ – 13 ≤ – 3P ≤ 12 – 13
⇒ 13 ≥ 3P ≥ 1
⇒ \(\frac{13}{3} \geq \mathrm{P} \geq \frac{1}{3}\)
⇒ \(\frac{1}{3} \leq \mathrm{P} \leq \frac{13}{3}\) ……………(4)
Max.of \(\left\{\frac{-1}{3},-3, \frac{-1}{2}, \frac{1}{3}\right\}=\frac{1}{3}\)
Min.of \(\left\{\frac{2}{3}, 1, \frac{1}{2}, \frac{13}{3}\right\}=\frac{1}{2}\)
(1), (2), (3) and (4) holds if \(\frac{1}{3} \leq P \leq \frac{1}{2}\).

TS Board Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(b)

Question 11.
On a festival day, a man plans to visit 4 holy temples A, B, C, D in a random order. Find the probability that he visits
(i) A before B
(ii) A before B and B before C
Solution:
Given that 4 holy temples are A, B, C and D.
Number of ways to visit 4 holy tempies in 4P4 ways.
∴ n(S) = 4P4
= 4! = 24

i) A before B:

TS Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(b) 1

ii) A before B and B before C:

TS Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(b) 2

Question 12.
From the employees of a company, 5 persons are selected to represent them in the managing committee  lite company. The particulars of 5 persons are as follows :

NameSexAge in years
1. HarishM30
2. RohanM33
3. SheetalaF46
4. AlisF28
5. SalimM41

 

A person is selected at random front this group to act as a spokesperson. Find the probability that the spokesperson will be either male or above 35 years.
Solution:
Let ‘A’ be the event of selecting a male
n(A) = 3
Let ‘B’ be the event of selecting a person whose age is above 35.
n(B) = 2
n(S) = 5, n(A ∩ B) = 1
P(A ∩ B) = P(A) + P(B) – P(A ∩ B)
= \(\frac{n(A)}{n(S)}+\frac{n(B)}{n(S)}-\frac{n(A \cap B)}{n(S)}\)
= \(\frac{3}{5}+\frac{2}{5}-\frac{1}{5}=\frac{4}{5}\).

TS Board Inter 2nd Year Maths 2A Solutions Chapter 9 Probability Ex 9(b)

Question 13.
Out of 100 Students, two sections of 40 and 60 are formed. If you and your friend are among the 100 students, find the probability that
(ï) you both enter the same section
(ii) you both enter the different sections.
Solution:
n(S) = 100C40
i) You both enter (lie saine seclion:
n(A) = 98C38 + 98C58
P(A) = \(\frac{n(A)}{n(S)}\)
= \(\frac{{ }^{98} C_{38}+{ }^{98} C_{58}}{{ }^{100} C_{40}}=\frac{17}{33}\)

ii) You both enter the different sections :
n(A) = 98C39 + 98C59
P(A) = \(\frac{n(A)}{n(S)}\)
= \(\frac{{ }^{98} C_{39}+{ }^{98} C_{59}}{{ }^{100} C_{40}}=\frac{16}{33}\).

TS Inter 2nd Year Economics Study Material Chapter 7 తృతీయ రంగం

Telangana TSBIE TS Inter 2nd Year Economics Study Material 7th Lesson తృతీయ రంగం Textbook Questions and Answers.

TS Inter 2nd Year Economics Study Material 7th Lesson తృతీయ రంగం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
తృతీయ రంగం అంటే ఏమిటి ? భారత ఆర్థిక వ్యవస్థలో తృతీయ రంగం ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు.
ఆధునిక ఆర్థిక వ్యవస్థలో తృతీయ రంగం అంతర్భాగాలు (components) :
వ్యాపారం, మరమ్మత్తు సేవలు, ఆతిథ్య (hospitality) సేవలు (హోటళ్ళు, భోజనాలయాలు), రవాణా (రైలు, రోడ్డు, వాయు, జల రవాణా), సమాచారం, గిడ్డంగి, స్థిరాస్తి వ్యాపారం (real estate), విత్త సేవలు, బాంకింగ్, ఇన్సూరెన్సు, వాణిజ్య సేవలు, ఐటి సేవలు, కన్సల్టెన్సీ సేవలు, ప్రభుత్వ పాలన, వైయక్తిక, గృహ రంగ సేవలు, మొదలైనవి ఆధునిక ఆర్ధిక వ్యవస్థలో ప్రధాన ఉపరంగాలుగా కొనసాగుతున్నవి.

తృతీయ రంగ ప్రాధాన్యత :
సాధారణంగా ఆర్ధిక వ్యవస్థలో ఒక రంగపు ప్రాధాన్యతను అనేక అంశాల ఆధారంగా అంచనా వేస్తారు. అనగా స్థూల దేశీయోత్పత్తిలో వాటా, ఉపాధి కల్పనలో వాటా, ఎగుమతులలో వాటా, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం మొదలైనవి.

భారతదేశంలో సేవల రంగపు ప్రాధాన్యత క్రమంగా పెరుగుతున్నది. సేవల రంగం ప్రస్తుతం (2019 సం.) భారతదేశ జోడించిన స్థూల ఉత్పత్తి విలువ (GVA) లో 55 శాతం వాటాను, మనదేశంలోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిలో మూడింట రెండొంతుల వాటాను, దేశ ఎగుమతులలో 38 శాతం వాటాను కలిగి ఉన్నది.

భారతదేశంలో గల 33 రాష్ట్రాలలో దాదాపు 15 రాష్ట్రాలతో బాటు కేంద్రపాలిత ప్రాంతాలలో సేవల రంగం వాటి స్థూల ఉత్పత్తిలో 50 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉండటం గమనార్హం.

i) జోడించిన స్థూల ఉత్పత్తి విలువ (GVA) లో సేవల రంగం వాటా :
సేవల రంగం భారతదేశ ఆర్థిక వృద్ధిని ప్రధానంగా ప్రభావితం చేస్తున్న రంగంగా పరిగణించబడుతుంది. జోడించిన స్థూల ఉత్పత్తి విలువలో సేవల రంగం వాటా 2013-14 సంవత్సరంలో 49.4 శాతం ఉండగా 2019-20 (AE) లో 57.8 శాతం ఉంది.

గత కొంత కాలం నుండి కూడా GVA కు సేవల రంగం సగటున ప్రతి సంవత్సరం 58 శాతం సమకూర్చుతున్నది. ద్వితీయ రంగం సగటున 28 శాతం సమకూర్చుతుండగా ప్రాథమిక రంగం 14 శాతం సమకూర్చుతుండటం గమనార్హం.

2019-20 సంవత్సరంలో ద్వితీయ రంగం 28.3 శాతం, ప్రాథమిక రంగం 13.9 శాతం వాటాను కలిగి ఉన్నప్పటికీ, ఈ రెండు రంగాల వాటా గత కొన్ని సంవత్సరాలుగా క్రమంగా తగ్గుతున్నది. భారత ఆర్థిక సర్వే – 2019 ప్రకారం 2019-20 సంవత్సరంలో సేవల రంగంలోని ప్రధాన ఉపరంగాలైన వ్యాపార, హోటళ్ళు, రవాణా, గిడ్డంగి, సమాచారం, ప్రసార మాధ్యమం సేవలు కలిసి 18.1 శాతం వాటాను, ద్రవ్యరంగం, రియల్ ఎస్టేట్, వృత్తి పరమైన సేవలు 24.5 శాతం వాటాను, ప్రభుత్వ పాలన, రక్షణ ఇతర సేవలు 15.2 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

ii) ఉపాధికి సేవల రంగం తోడ్పాటు :
ప్రస్తుతం సేవల రంగంలో ఉపాధి చాలా నాణ్యతతో కూడుకొని ఉండడమే గాకుండా తులనాత్మకంగా ఎక్కువ ప్రతిఫలం పొందగల రంగం, సమాచార విప్లవం (IT) తరువాత ఈ ధోరణి మరింత వేగాన్ని సంతరించుకుంది.

సేవల రంగంలో ఉపాధి పొందుతున్న వారి నగటు ఆదాయం ఇతర రంగాలలో పనిచేస్తున్న వారి సగటు ఆదాయం కంటే ఎక్కువగా ఉంది. 1950-51 సంవత్సరంలో మొత్తం ఆర్థిక వ్యవస్థ కల్పిస్తున్న ఉపాధిలో 17.3 శాతం సేవల రంగం కల్పించగా 2010 సంవత్సరం నాటికి 26.5 శాతం, 2018 సంవత్సరంలో 31.45 శాతం సేవల రంగం కల్పించింది.

iii) ఎగుమతులు :
భారతదేశ అంతర్జాతీయ చెల్లింపుల శేషంలోని అదృశ్య అంశాల ఖాతాలో సాధారణంగా మిగులు లేదా అనుకూల వ్యాపార శేషం ఉంటుంది. దీనిని బట్టి సేవల రంగ ఎగుమతులు, సేవల రంగ దిగుమతుల కంటే ఎక్కువగా ఉంటున్నాయన్నది అర్థమవుతుంది.

ప్రత్యేకించి సమాచార సాంకేతిక పరిజ్ఞాన విప్లవానంతరం సాఫ్ట్వేర్ ఎగుమతుల వాటా మొత్తం సేవల రంగ ఎగుమతులలో ఎక్కువగా ఉంటున్నది. భారతదేశ సేవల ఎగుమతుల విలువ 2017-18 లో 195.1 బిలియన్ డాలర్లు కాగా 2018-19 లో 205.8 బిలియన్ డాలర్లుగా ఉంది.

ఈ మొత్తం సేవల ఎగుమతుల విలువలో సాఫ్ట్వేర్ 40 శాతం, రవాణా 23 శాతం, వ్యాపార సేవలు 19 శాతం, ద్రవ్య సేవలు 2 శాతం, సమాచారం 1 శాతం, బీమా సేవలు 1 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2018-19 లో భారతదేశ నికర ఎగుమతుల విలువ (ఎగుమతుల విలువల నుండి దిగుమతుల విలువను తీసివేసిన తర్వాత) 81.9 బిలియన్ డాలర్లు.

iv) సేవల రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు :
2018-19 లో భారతదేశంలోకి వచ్చిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 28,264 మిలియన్ అమెరికన్ డాలర్లు. మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో సేవల రంగంలోకి వచ్చినవి 2018-19లో 64.6 శాతం కాగా 2017-18 లో 63.7 శాతం.

నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో పెరుగుదల ఏర్పడితే అంతర్జాతీయ చెల్లింపుల శేషంపై అనుకూల ప్రభావం ఉంటుంది. 2009-19 మధ్య కాలంలో భారతదేశంలో రెండింతలుగా నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినందు వల్లనే మనదేశంలో 2014, మార్చి నుండి 2019 మార్చి మధ్య కాలంలో, విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో చెప్పుకోదగ్గ మెరుగుదల సంభంవించింది.

స్థూల దేశీయోత్పత్తిలో సేవల రంగం వాటా 60 శాతం పైగా ఉన్నందున, ఈ రంగంలోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రత్యేక ప్రాధాన్యత గలదు. 2000 సంవత్సరం ఏప్రిల్ నుంచి 2019 సంవత్సరం సెప్టెంబర్ వరకు భారతదేశంలోకి 4.46 లక్షల మిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాగా అందులో 50 శాతం సేవల రంగంలోకి వచ్చాయి.

TS Inter 2nd Year Economics Study Material Chapter 7 తృతీయ రంగం

ప్రశ్న 2.
భారతదేశ పర్యాటక రంగం సేవలను వివరించండి.
జవాబు.
“విశ్రాంతి కోసం కానీ వ్యాపారం నిమిత్తం గానీ, ఇతర అవసరాల నిమిత్తం కానీ సంవత్సరం కంటే తక్కువ కాలం తమ సాధారణ నివాస స్థలంలో గాకుండా ఇతర ప్రాంతాలలో గడపటంను పర్యాటకం” అని ప్రపంచ పర్యాటక సంస్థ నిర్వచించింది.

భారత ప్రభుత్వ నిర్వచనం ప్రకారం “ఒకరోజు కంటే ఎక్కువ మరియు ఒక సంవత్సరం కంటే తక్కువ కాలం పాస్పోర్ట్ సౌకర్యం కలిగి ఉన్న విదేశీయులు విశ్రాంతి, వినోదం, వ్యాపారం ఆరోగ్య చికిత్స, మతం, ఆటలు, సభలు, సమావేశాలు మొదలైన వాటికోసం భారతదేశంలో ఉండడం” ను పర్యాటకం అని పేర్కొంది. యాత్రికులకు సంబంధించిన ఆర్థిక, సాంఘిక కార్యకలాపాల సమాహారమే పర్యాటక రంగం, పర్యాటక రంగంను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి :

  • దేశీయ టూరిజం
  • విదేశీ టూరిజం.

i) దేశీయ టూరిజం :
మన దేశవాసులు మన దేశంలోని ప్రాంతాలను సందర్శించడాన్ని దేశీయ టూరిజం అంటారు. సంప్రదాయంగా ప్రజలు మత ప్రాధాన్యత గల స్థలాలను, పర్యాటక ప్రాధాన్యత గల స్థలాలను, చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు. అయితే ప్రస్తుత తరం వన్య ప్రాణుల రక్షణ కేంద్రాలను, సముద్ర తీరాలను, పర్వత ప్రాంతాలను, వినోదపు పార్క్ ను, రిసార్ట్న సందర్శిస్తున్నారు.

ii) అంతర్జాతీయ టూరిజం :
పాస్పోర్టు కలిగి ఉన్న వ్యక్తులు వ్యాపారం, విశ్రాంతి, ఆరోగ్యం, చికిత్స, మతం, ఆధ్యాత్మికం, పురాతన కట్టడాల సందర్శన, ఆటలు, సభలు, సమావేశాల కోసం విదేశాలను సందర్శించుటను అంతర్జాతీయ టూరిజం అంటారు. భారతదేశంలో ఆగ్రా, ఢిల్లీ, రాజస్థాన్, కాశ్మీర్, గోవా, కేరళ, తమిళనాడు, ఒడిషా, మహారాష్ట్ర, తెలంగాణ ప్రధాన పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి.

పర్యాటక రంగం ఆర్థిక వృద్ధిని పెంచడంలో, GVA కూర్పులో, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడంలో, ఉద్యోగ కల్పనలో తగినంత పాత్ర వహిస్తున్నది. పర్యాటక రంగం 2015 నుండి 2017 సంవత్సరం వరకు విదేశీ పర్యాటకుల సందర్శనలో మంచి వృద్ధిని కనబరిచింది. అయితే 2018 లో 5.2 శాతం ఉన్న విదేశీ పర్యాటకుల ఆగమన వృద్ధిరేటు 2019 (జనవరి – అక్టోబర్)లో కేవలం 2.7 శాతం వృద్ధికి పరిమితమైంది. అయితే ఈ కాలంలో ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచ పార్యటక వ్యవస్థ మొత్తం ఇలాంటి మందగమనంలోనే ఉంది.

2017 లో 7.1 శాతం వృద్ధిని నమోదు చేసిన ప్రపంచ పార్యటక రంగం 2018 లో కేవలం 5.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. అందుకు అనుగుణంగానే విదేశీ మారక ద్రవ్య నిల్వలలో కూడా 2017 సంవత్సరం వరకు మంచి వృద్ధి ఉండగా 2018, 2019 సంవత్సరాలలో తక్కువ వృద్ధి నమోదయింది. భారతదేశం 2019 జనవరి నుండి 2019 అక్టోబర్ మధ్య 24 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలను 2 శాతం వృద్ధితో ఆర్జించింది.

2014 నుండి 2018 మధ్య కాలంలో ప్రపంచ పర్యాటకుల సందర్శనలో భారతదేశం స్థితిని పరిశీలించినట్లయితే 2014లో భారతదేశాన్ని సందర్శించిన విదేశీయుల సంఖ్య 7.68 మిలియన్లు కాగా 2018లో 10.66 మిలియన్లుగా ఉంది. అదే కాలంలో భారతదేశంలోకి వచ్చిన అంతర్జాతీయ యాత్రికుల సంఖ్య (విదేశీయులు మరియు విదేశాలలో ఉండే స్వదేశీయులు కలుపుకుని) 2014 లో 13.11 మిలియన్ల నుండి 17.42 మిలియన్లకు పెరిగింది.

ఇదే కాలంలో మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య 1137 మిలియన్ల నుండి 1401 మిలియన్లకు పెరిగింది. ప్రపంచ వ్యాప్త అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్యలో భారతదేశాన్ని సందర్శించిన వారి సంఖ్య 2014 లో 1.15 శాతం ఉండగా 2018 నాటికి 1.24 శాతంకు పెరిగింది.

ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తున్న దేశాలలో ఇండియా స్థానం 2014 లో 24 కాగా 2018 లో 22గా ఉంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంను సందర్శించిన వారిలో ఇండియాను సందర్శించిన వారు 2014 లో 4.86 శాతం ఉండగా 2018లో 5.01 శాతం ఉన్నారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఇండియా స్థానం 2014 లో 8 కాగా 2018 లో 7గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ పర్యాటకుల ద్వారా పొందుతున్న ఆదాయంలో భారత్ వాటా 2014 లో 1.57 శాతం ఉండగా 2018లో 1.97 శాతంగా ఉంది.

అంతర్జాతీయ సందర్శకుల ద్వారా ఎక్కువ ఆదాయం పొందుతున్న దేశాలలో ఇండియా స్థానం 2014 లో 15 ఉండగా 2018 లో 13గా ఉంది. అదే విధంగా అంతర్జాతీయ సందర్శకుల ద్వారా ఎక్కువ ఆదాయం పొందుతున్న ఆసియా-పసిఫిక్ దేశాలలో ఇండియా 7వ స్థానంలోనే స్థిరంగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయ సందర్శకుల ద్వారా ఆసియా-పసిఫిక్ ప్రాంతం పొందిన ఆదాయంలో ఇండియా ఆదాయం 2014 లో 5.49 శాతం ఉండగా 2018 లో 6.54 శాతంకు పెరిగింది.

జోడించిన స్థూల విలువ, ఉద్యోగితలో వివిధ రాష్ట్రాలలో పర్యాటక రంగం వాటా :
పర్యాటక రంగంలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాల స్థితిని పరిశీలించినప్పుడు దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలు ముందు వరుసలో ఉండి 2018 లో దేశంలో సందర్శించిన మొత్తం దేశీయ సందర్శకులలో 65 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

వివిధ రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల జోడించిన స్థూల ఉత్పత్తి విలువలో పర్యాటక రంగం వాటా 1.36 శాతం నుండి 11.55 శాతం వరకు కలదు. ఈ విషయంలో గోవా ముందుండగా డామన్ డయ్యు చివరి స్థానంలో ఉంది. వివిధ రాష్ట్రాల మొత్తం ఉద్యోగితలో పర్యాటక రంగం వాటా 4.76 శాతం నుండి 56.24 శాతం వరకు ఉంది. ఈ విషయంలో పుదుచ్చేరి మొదటి స్థానంలో ఉండగా అరుణాచల్ ప్రదేశ్ చివరి స్థానంలో ఉంది.

పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వ చర్యలు :
అంతర్జాతీయ పర్యాటకాన్ని సులభతరం చేయడంలో భాగంగా 2014 సంవత్సరం సెప్టెంబర్ లో 46 దేశాలకు ఇండియా ఈ-పర్యాటక వీసా’ ను ప్రవేశపెట్టింది. అంతకు పూర్వం ఈ సౌకర్యం 12 దేశాలకే పరిమితమై ఉంది.

భారత ప్రభుత్వం 2016 లో వీసా పద్ధతిని మరింత సరళీకరించింది. అందులో భాగంగా ఈ-వీసాను అయిదు ఉప వర్గాలుగా విభజించింది. అవి :

  1. ఈ-పర్యాటక వీసా
  2. ఈ వ్యాపార వీసా
  3. ఈ-విద్య వీసా
  4. ఈ-సమావేశ వీసా
  5. ఈ-వైద్య సహాయకుల వీసా (రోగికి సహాయం చేయడానికి వచ్చేవారికి).

ప్రస్తుతం ఈ వీసా 169 దేశాలకు వర్తిస్తుంది. దేశంలోని 28 విమానాశ్రయాల ద్వారా, ప్రకటింపబడిన అయిదు ఓడ రేవుల ద్వారా వచ్చే విదేశీయులకు ఈ-వీసా సౌకర్యంను వర్తింపజేస్తున్నారు. ఫలితంగా ఈ వీసా సౌకర్యం ద్వారా దేశం సందర్శనకు వచ్చిన వారి సంఖ్య 2015 లో 4.45 లక్షలు ఉండగా 2018 నాటికి 23. 69 లక్షలకు పెరిగింది. ఆ విధంగా విదేశీ పర్యాటకుల సంఖ్యలో ప్రతి సంవత్సరం దాదాపు 21 శాతం వృద్ధి నమోదయింది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 7 తృతీయ రంగం

ప్రశ్న 3.
IT-BPM రంగం సేవలను వివరించండి.
జవాబు.
సమాచార సాంకేతిక పరిజ్ఞానం, వ్యాపార సంబంధిత సేవల నిర్వహణ (ITBPM) : సంస్థల నిర్మాణం, నిర్వహణ, నియంత్రణ అంచనా అభిలషణీయ రాబడి ప్రవాహం, సంస్థల లక్ష్యాలు, ఉద్యోగులు, వినియోగదారులు, భాగస్వాములు మొదలైన వాటికి సంబంధించిన సంస్థలో, సంస్థ బయట ఉండి సేవలు అందించే ప్రక్రియయే వ్యాపార సంబంధిత సేవల నిర్వహణ లేదా బిజినెస్ ప్రాసెస్ మేనేజ్ మెంట్. గత రెండు దశాబ్దాల నుండి భారతదేశ సేసల ఎగుమతులలో IT-BPM ప్రధాన భూమికను పోషిస్తున్నది.

2019 ఆర్థిక సర్వే ప్రకారం 2019 మార్చిలో ఈ పరిశ్రము ద్వారా జరిగిన ఎగుమతుల విలువ 177 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరింది. ఉద్యోగవకాశాలను కల్పించడంలో, అదనపు విలువను చేకూర్చడంలో IT-BPM పరిశ్రమ ప్రధాన పాత్ర నహిస్తున్నది. 2018-19 లో జరిగిన మొత్తం IT-BPM సేవలలో IT సేవలు 51 శాతం, సాఫ్ట్వేర్, ఇంజనీరింగ్ సేవలు 20.6 శాతం, BPM సేవలు 19.7 శాతం వాటాలను కలిగి ఉన్నాయి. మొత్తం IT సేనల ద్వారా వచ్చింది. IT సేవలలో డిజిటల్ సేవలు సాలీనా 30 శాతం వృద్ధితో ఉండి 33 బిలియన్ల అమెరికన్ డాలర్ల పిలువకు చేరింది.

IT-BPM సేవలను నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి :

  1. IT సేవలు
  2. సాఫ్ట్వేర్ మరియు ఇంజనీరింగ్,
  3. హార్డ్వేర్. నాస్కామ్ (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ కంపనీస్) ప్రకారం మొత్తం IT-BPM సేవలలో 2018- 19 లో IT సేవలు 51.2 శాతం, సాఫ్ట్వేర్ మరియు ఇంజనీరింగ్ సేవలు 20.6 శాతం, BPM సేవలు 19.7 శాతం, హార్డ్ వేర్ 8.5 శాతం వాటాలను కలిగి ఉన్నాయి.

IT-BPMరంగ ఎగుమతులు :
హార్డ్ వేర్ను మినహాయించి IT-BPM సేవలు ప్రధానంగా ఎగుమతుల ప్రాధాన్యత (83 శాతం)ను కలిగినవి. IT-BPM సేవలలో ఎగుమతుల ద్వారా 2018-19లో భారతదేశం 135 బిలియన్ అమెరికన్ డాలర్లను ఆర్జించింది. IT-BPM ఆదాయంలో 2017-18 లో 8.2 శాతం వృద్ధి ఉండగా 2018-19 లో కొంత తగ్గి 6.8 శాతం వృద్ధి ఉంది.

మొత్తం IT-BPM సేవల ఎగుమతుల విలువ 135.5 బిలియన్ డాలర్లలో IT సేవలు 55 శాతం కాగా మిగతా 45 శాతంను సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్, BPM సేవలు కలిగి ఉన్నాయి. ‘2018-19లో IT-BPM ఎగుమతులలో IT సేవలు 7.3 శాతం, BPM సేవలు .8.3 శాతం, సాఫ్ట్ వేర్ మరియు ఇంజనీరింగ్ సేవలు 11.2 శాతం వృద్ధిని సాధించాయి.

దేశాల వారీగా IT-BPM సేవల, ఎగుఘితులను పరిశీలించినప్పుడు అమెరికా మనదేశ IT-BPM ఎగుమతులలో ప్రధాన వాటాను కలిగి ఉంది. 2018-19లో మనదేశం చేసిన IT-BPM ఎగుమతులలో అమెరికా వాటా 62 శాతం. ఇండియా, అమెరికాకు ఎగుమతి చేసిన IT-BPM సేవల ద్వారా వచ్చిన ఆదాయం 2018-19 లో 84 బిలియన్ అమెరికన్ డాలర్లు. ఇండియా IT-BPM ఎగుమతులలో అధిక వాటా కలిగిన రెండవ దేశం ఇంగ్లాండ్. ఇది 17 శాతం వాటాను కలిగి ఉండగా మిగతా యూరప్ దేశాలు (ఇంగ్లాండ్ మినహా) 11.1 శాతం, ఆసియా-పసిఫిక్ ప్రాంతం 7.6 శాతం వాటాలను కలిగి ఉన్నాయి.

ప్రభుత్వ చర్యలు :
IT-BPM రంగంలో నవకల్పనలు, సాంకేతికత అభివృద్ధికి తీసుకున్న చర్యలలో స్టార్ట్ ఆప్ ఇండియా, జాతీయ సాఫ్ట్ వేర్ ఉత్పత్తి విధానం, ఆంజల్ పన్నుకు సంబంధించి సమస్యల నిర్మూలన ముఖ్యమైనవి. నాస్కామ్ అధ్యయనం ప్రకారం ఇండియా స్టార్ట్ – అప్ వ్యాపారంలో ప్రపంచంలో చైనా (206), అమెరికా (203) తరువాత 24 యూనికార్న్ (స్టార్ట్-అప్ సంఖ్యలు)లతో మూడవ స్థానంలో ఉంది. ఇండియా యూనికార్న్ సంస్థలలో 55 శాతం బెంగుళూర్, ఢిల్లీ, ముంబాయిలో ఉన్నాయి.

TS Inter 2nd Year Economics Study Material Chapter 7 తృతీయ రంగం

ప్రశ్న 4.
మనదేశంలో వివిధ రకాల రవాణా సౌకర్యాలను వివరించండి.
జవాబు.
రవాణా వ్యవస్థ : మానవ శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ నిర్వహించే పాత్రను ఆర్థికవ్యవస్థలో రవాణా వ్యవస్థ నిర్వహిస్తుంది. రవాణా వ్యవస్థ నాలుగు సాధనాల ద్వారా నడుస్తున్నది.

1. రోడ్డు రవాణా :
భారతదేశంలో స్థూల దేశీయోత్పగికి ఆదాయలను నసుకూర్చడంలో, ప్రయాణికులు, సరుకుల రవాణాలో రోడ్డు రవాణాదే ప్రధాన పాత్ర, 2017-18లో స్థూల దేశీయోత్పత్తిలో రవాణా రంగం వాటా 4.77 శాతం కాగా ఇందులో రోడ్డు రవాణా 3.06 శాతం, రైల్వేలు 0.75 శాతం, వాయు రవాణా 0.15 శాతం, జల రవాణా 0.06 శాతం వాటాలను కలిగి ఉన్నాయి.

జాతీయ రవాణా అభివృద్ధి విధాన కమిటీ నివేదిక ప్రకారం మొత్తం ప్రయాణికుల రవాణాలో 69 శాతం, మొత్తం సరుకుల రవాణాలో 90 శాతం రోడ్డు రవాణా ద్వారా జరుగుతున్నది. దేశంలో జాతీయ రహదారుల అభివృద్ధి, నాహనాల చట్టం అమలుసు పర్యవేక్షిస్తూ సంబంధిత విధానాల రూపకల్పన బాధ్యతను కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ చూసుకుంటుంది.

2. రైల్వేలు :
రైల్వేలు 1950 సంవత్సరంలో జాతీయం చేయబడ్డాయి. ఒకే యాజమాన్యం కింద ఉన్న భారతీయ రైల్వేలు 68 వేల కి.మీ. మార్గంతో ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద స్థానాన్ని కలిగి ఉన్నాయి. భారతీయ రైల్వే 2018-19 లో 840 కోట్ల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి ప్రపంచంలో మొదటి స్థానాన్ని, 120 కోట్ల టన్నుల సరుకును తరలించి ప్రపంచంలో నాల్గవ స్థానాన్ని కలిగి ఉన్నది. ప్రస్తుతం రైల్వే ప్రయాణికుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ ప్రమాదాలను నివారించే ప్రయత్నం చేస్తున్నది.

స్టేషన్ల ఆధునీకీకరణ :
రైల్వేస్టేషన్ల ఆదునికీకరణ నిరంతర అభివృద్ధి ప్రక్రియలో భాగం. 2019-20 నాటికి ఆదర్శ రైల్వే స్టేషన్’ పథకం కింద 1253 రైల్వే స్టేషన్లను అభివృద్ధి పరచాలని నిర్ణయించారు. ఒక ప్రత్యేక కార్యక్రమం (స్పెషల్ పర్పస్ వెహికల్) క్రింద భారతీయ రైల్వే స్టేషన్ల అభివృద్ది కార్పోరేషన్ (IRSDC) ను ఏర్పాటు వేసి ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం (PPP) తో రేల్వే స్టేషన్ల ఆధునీకీకరణ జరుగుచున్నది.

3. వాయు రవాణా :
దేశీయంగా జరిగే పౌర విమానయానాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇండియా ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది. భారతీయ వాయు రవాణా సంస్థ (ఎయిర్ పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా – AAI) ఆధ్వర్యంలో 136 విమానాశ్రయాలు వాణిజ్య సరంగా నిర్వహించబడుతున్నాయి. ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం (పబ్లిక్, ప్రయివేట్ పార్టనర్షిప్ – PPP) లో ఆరు విమానాశ్రయాలు పనిచేస్తున్నాయి.

ఇండియాలో వాయు రవాణాను 1953 సంవత్సరంలో జాతీయం చేసి ఇండియన్ ఎయిర్ లైన్స్ మరియు ఎయిర్ ఇండియాను ఏర్పాటు చేశారు. ఇండియాకు చెందిన వాయు రవాణా సంస్థల తలసరి సీట్ల పెరుగుదల 2013 లో 0.07 ఉండగా 2018 లో 0.12 గా ఉంది. కాగా దేశీయ విమానయానంలో రెండవ స్థానంలో ఉన్న చైనాలో తలసరి సీట్ల పెరుగుదల 2013లో 0.33 ఉండగా 2018లో 0.49గా ఉంది. మొదటి స్థానంలో ఉన్న అమెరికాలో 2013 లో 2.59 ఉండగా 2018లో 2.96 గా ఉంది.

2019-20లో ఇండియాలో వినూనయానంను పునఃనిర్మాణం చేయడం జరిగింది. వినియోగంలో లేని పట్టణాల విమానాశ్రయాలను ఆరంభించే పథకం క్రింద ఆరంభమైన 43 విమానాశ్రయాలలో 4 విమానాశ్రయాలు 2019-20లో ఆరంభమయ్యాయి. ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకానమిక్ ఫోరం) 2019 నివేదిక ప్రకారం విమానాశ్రయాల అనుబంధం (ఎయిర్ పోర్ట్ కనెక్టివిటి) విషయంలో ప్రపంచంలో ఇతర ఏడు దేశాలతో (అమెరికా, చైనా, జపాన్, ఇంగ్లాడ్…) భారతదేశం మొదటిస్థానంలో ఉంది.

2019 లో దేశీయ విమానయాన సంస్థలు కలిగి ఉన్న 680 విమానాల సంఖ్యను 2023-24 సంవత్సరానికి 1200కు పెంచడానికి అవసరమయిన అవస్థాపన వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించే ప్రయత్నం చేస్తున్నది.

4 జల రవాణా :
దేశంలోని కాలువలు, కొలనులు, నదులు, సముద్రాల వెనుక జలాల ద్వారా దేశీయ జల రవాణా జరుగగా దేశంలోని ఓడరేవులను ప్రపంచ ఓడ రేవులతో కలుపుతూ అంతర్జాతీయ జల రవాణా జరుగుతుంది. మన దేశంలో 5,000 కి.మీ. మేర తీర ప్రాంతాలున్నాయి. అంతర్గత నీటి రవాణా అభివృద్ధికి ఎంతో అవకాశం ఉంది. అంతర్గత నీటి రవాణాలో కొంత భాగం చిన్న పడవలతో కొనసాగగా కొంత భాగం డీజిల్ బోట్లు, స్టీమర్లతో కొనసాగుతుంది.

అతి తక్కువ నిర్వహణ వ్యయాలతో, కాలుష్యం లేని రవాణా వ్యవస్థ అంతర్గత జల రవాణా. ఈ రవాణా వ్యవస్థ అభివృద్ధి తీర ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పించి, ఆదాయాన్ని, వ్యాపారాన్ని పెంపొందిస్తుంది. భారతదేశం 7,156 కి.మీ. సముద్ర తీరంతో 13 భారీ, 200 చిన్న నౌకాశ్రయాలు కలిగి ఉన్నది. మొత్తం రవాణా రంగంలో జల రవాణా వాటా 29%. ఓడల ద్వారా ప్రధానంగా పెట్రోలియం ఉత్పత్తులను, బొగ్గును రవాణా చేస్తారు.

2019 భారతీయ ఆర్థిక సర్వే ప్రకారం 2019 జనవరి నాటికి ప్రపంచ దేశాలు కలిగి ఉన్న ఓడల సంఖ్యలో 0.9 శాతంను భారతదేశం కలిగి ఉంది. 2019 మార్చి నాటికి భారతదేశంలో ఓడ రేవులు సాలీనా 1452.64 మిలియన్ టన్నుల సరుకును నిల్వ చేసే సామర్థ్యంసు కలిగి ఉన్నాయి.

2010 లో ఈ సామర్థ్యం 628.03 మిలియన్ టన్నులుగా ఉంది. దేశంలోని ఓడరేవులలో పారదీప్, చైనా, విశాఖపట్నం, దీనదయాల్ (కాంట్లో), నవశేవగా కూడా పిలవబడే జవహర్ లాల్ నెహ్రూ ఓడ రేవులు పేరొందిన పెద్ద ఓడ రేవులు.

జవహర్లాల్ నెహ్రూ ఓడరేవు భారతదేశంలో అతి ఎక్కువ సరుకు రవాణా, నిల్వ సామర్థ్యం గల ఓడరేవు. భారతీయ ఓడల యజమానులు కల్గి ఉన్న ఓడల సంఖ్య 2010 లో 1,040 కాగా 2019 ఆగస్టు నాటికి 1414గా ఉంది. 2013– 14 నుండి 2016-17 మధ్యకాలంలో భారతీయ జలరవాణా వేగంగా వృద్ధి చెందినప్పటికీ 2017-18 నుండి వృద్ధి మందగించింది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 7 తృతీయ రంగం

ప్రశ్న 5.
భారతదేశంలో గల ఇందన వనరులపై ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు.
ఇంధన రంగం :
మానవాభివృద్ధి పరిణామ క్రమంలో, ఇంధనం ప్రధాన అభివృద్ధి కారకాలలో ఒకటిగా మారి కీలక పాత్రను పోషిస్తుంది. ఆర్థికాభివృద్ధికి ఇంధన వనరుల కొరత ప్రధాన అడ్డంకిగా ఉంది. 2019-20 ఆర్థిక సర్వే ప్రకారం, 2017 లో అమెరికా, చైనాల తరువాత భారతదేశం విద్యుత్తు వినియోగంలో మూడవ స్థానంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా వినియోగం అవుతున్న విద్యుత్తులో భారతదేశం 5.8 శాతం వినియోగిస్తున్నది.

ఇంధన వనరులు :
వేడిచేసే ప్రక్రియలో గానీ, విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియలో గానీ, శక్తి మార్పిడి ప్రక్రియలో గానీ వినియోగపడుతున్న అన్ని రకాల ఇంధనాలను ఇంధన వనరుల మూలాధారాలు లేదా ఇంధన వనరులు అనవచ్చు. ఇంధన వనరులను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.

I. పునఃస్థాపిత ఇంధన వనరులు :
ప్రకృతి నుండి లభించి వినియోగించిన తరువాత పునరుత్పత్తికి అవకాశం ఉన్న ఇంధనాన్ని పునఃస్థాపిత ఇంధన వనరులు అంటారు. పునఃస్థాపిత ఇంధన వనరులు ఆర్థిక ప్రయోజనం కలిగి ఉండి ఇంధన భద్రతను కల్పించడమే కాకుండా ఉత్పత్తి, పంపిణీ ప్రక్రియలలో తక్కువ మోతాదులో పర్యావరణ కాలుష్యాన్ని కలిగిస్తాయి. పునఃస్థాపిత ఇంధన వనరుల రకాలు :

1. సౌర విద్యుత్ :
సూర్య కిరణాలను, వేడిని విద్యుత్ గా మలచడమే సౌర శక్తి. సౌర శక్తిని వెలుగు కోసం, వేడి కోసం, ఇతర రకాల విద్యుత్ కోసం వినియోగించవచ్చు.

2. పవన శక్తి :
పవనాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేయడాన్ని పవన విద్యుత్తు అంటారు. చాలా సంవత్సరాల నుంచి మనం పవన యంత్రాలను నీటిని ఎత్తిపోయడానికి వినియోగిస్తున్నాం. పెద్ద పెద్ద పవన టర్బన్లను పవన విద్యుత్తు ఉత్పత్తికి వినియోగిస్తారు. టర్బన్లను సహజంగా భూమిపై వచ్చే గాలి (పవనాలు) ద్వారా తిప్పుతారు. నిరంతరం పవనాలు ఉండే ఎత్తైన ప్రాంతాలు టర్బైన్ల ఏర్పాటుకు అనుకూలం.

3. జల విద్యుత్తు :
ప్రవహించే నీటికి అడ్డుగా కట్టే జల ప్రాజెక్టులు లేదా రిజర్వాయర్లు జల విద్యుత్తుకు ఆధారాలు. ప్రవహించే నీటిని టర్బైన్లను తిప్పడానికి గతిశక్తిని వినియోగించి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తారు. సముద్రాలలో వచ్చే ఆటుపోటుల నుంచి అలల శక్తిని, తరంగాల నుండి తరంగపు శక్తిని కూడా ఉత్పత్తి చేస్తారు.

4. భూగర్భ శక్తి :
భూగర్భంలో వేడి నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్ శక్తిని భూగర్భ (జియోధర్మల్) శక్తి అంటారు. భూమి పై ఉండే వేడి నీటి బుగ్గలు, అగ్నిపర్వతాల నుంచి విద్యుత్ శక్తి తీసి నేరుగా పరిశ్రమల వినియోగానికి సరఫరా చేస్తారు.

5. జీవ సంబంధిత ఇంధనం (బయోఎనర్జీ) :
జీవుల నుండి వచ్చే జీవ వ్యర్థ పదార్థాల నుంచి తీసే శక్తిని జీవ సంబంధిత ఇంధనం అంటారు. జీవ పదార్థంను ప్రత్యక్షంగా వేడిని ఉత్పత్తి చేయడానికి గానీ, పరోక్షంగా ఇంధనాల ఉత్పత్తికి గాని వినియోగించవచ్చు. రవాణా ఇంధనాలు ఎతనాల్, మీథేన్, బయో డీజిలు కూడా జీవ సంబంధిత ఇంధనాలలో భాగం.

2019 మార్చి 31 నాటికి ఇండియాలో పునఃస్థాపిత ఇంధన వనరుల ద్వారా లభించగల శక్తి 1097465 మిలియన్ వాట్లు. ఇందులో సౌర విద్యుత్ 68.25 శాతం, పవన విద్యుత్ 27.54 శాతం కాగా సూక్ష్మ జల విద్యుత్తు, జీవ వ్యర్థాల ఇంధనం మొదలైనవి మిగతా వాటాను కలిగి ఉన్నాయి. ఇండియా పునఃస్థాపిత శక్తికి సంబంధించిన వివరాలను కింద చూడవచ్చు.

ప్రాంతాలు వారిగా పునఃస్థాపిత శక్తి వనరుల పంపిణీని చూసినప్పుడు మొత్తం పునఃస్థాపిత ఇంధన వనరులలో 2019 మార్చి 31 నాటికి రాజస్థాన్ రాష్ట్రం అతి ఎక్కువగా 15 శాతం (1,62,223 మి.వా), గుజరాస్ 11 శాతం (1,22,086 మి.వా) మహారాష్ట్ర (1,13,925 మి.వా), జమ్ము, కాశ్మీర్ (1,12,800) 10 శాతం వాటాను సౌర విద్యుత్ కారణంగా ప్రధాన నాటాను కల్గి ఉండగా గుజరాత్ మాత్రం పవన విద్యుత్ కారణంగా అధిక వాటాను కలిగి ఉంది.

II. అంతరించిపోయే ఇంధన వనరులు :
సమీప అవిష్యత్తులో తిరిగి పునఃస్థాపితం అయ్యే అవకాశం లేని ఇంధన వనరులను అంతరించిపోయే ఇంధన వనరులు అంటారు. శిలాజ ఇంధనాల నుండి వచ్చే బొగ్గు, క్రూడాయిల్, సహజవాయువు మరియు కేంద్రీయ ఇంధనాలైన యురేనియంలను అంతరించి పోయే ఇంధన వనరులుగా చెప్పవచ్చు.

శిలాజ ఇంధనాలు ప్రధానంగా కార్బన్ నుంచి తయారవుతాయి. ఆ రకంగా అంతరించిపోయే ఇంధన వనరులు రెండు రకాలు. అవి:
(ఎ) శిలాజ ఇంధనాలు,
(బి) కేంద్రీయ ఇంధనాలు.

A) శిలాజ ఇంధనాలు :
జంతువులు, వృక్షాల అవశేషాలు రూపాంతరం పొందే శిలాజం నుంచి వచ్చే ఇంధనాలు శిలాజ ఇంధనాలు. వీటిని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.

1. బొగ్గు :
దాదాపు 98 శాతం కంటే ఎక్కువ బొగ్గు నిల్వలు జార్ఖండ్, ఒడిషా, చత్తీస్ ఘడ్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలోనే ఉన్నాయి. మొత్తం దేశంలోని బొగ్గు నిల్వలలో 2019 మార్చి 31 నాటికి 25.88 శాతం జార్ఖండ్లో ఉండగా, ఒడిషాలో 24.76 శాతం నిల్వలు ఉన్నాయి. 2018-19లో దేశంలో 8.1 శాతం వృద్ధితో 730.4 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది.

2. క్రూడాయిల్ :
2019 మార్చి 31 నాటికి భారతదేశ చమురు నిల్వలు 618. 95 మిలియన్ టన్నులు. 2018 మార్చి 31న ఇది 594. 69 మిలియన్ టన్నులు. దేశంలో చమురు నిల్వలు పంపిణీని చూసినప్పుడు మొత్తం చమురు నిల్వలలో పశ్చిమ తీరంలో 38 శాతం ఉండగా అస్సాంలో 25.6 శాతం ఉన్నవి. అదేవిధంగా మొత్తం సహజ వాయువు నిల్వలలో తూర్పు తీరంలో 41 శాతం, పశ్చిమ తీరంలో 23.4 శాతం ఉన్నవి.

3. సహజ వాయువు :
2019 మార్చి 31 నాటికి దేశంలో ఉన్న సహజ వాయువు నిల్వలు 1380.63 బిలియన్ క్యూబిక్ మీటర్లు (BCM) ఉండగా 2018 మార్చి 31 నాటికి అవి 1339.57 BCM లుగా ఉన్నవి.

B) కేంద్రీయ ఇంధనాలు :
అణు విచ్ఛిత్తి ప్రక్రియలో ఉపయోగపడే ఇంధనాలనే అణు ఇంధనాలు లేదా కేంద్రీయ ఇంధనాలు అంటారు. ఈ ప్రక్రియ ద్వారా వచ్చే శక్తిని అణు శక్తి, అణు విద్యుత్తు అంటారు. మొత్తం ప్రపంచ శక్తి ఉత్పత్తిలో అణుశక్తి 6 శాతం ఉండగా ప్రపంచ విద్యుత్ ఉత్పత్తిలో అణు విద్యుత్ వాటా 13-14 శాతంగా ఉంది.

అంతరించి పోయే ఇంధన వనరుల అనుకూల అంశాలు :

  1. అంతరించి పోయే ఇంధన వనరులు తులనాత్మకంగా తక్కువ వ్యయానికి లభ్యమవుతాయి.
    ఉదా : డీజిల్, ఇతర చమురు
  2. వీటిని సులభంగా వెలికి తీసే అవకాశం ఉంటుంది.
  3. అంతరించి పోయే ఇంధన వనరులను నిల్వ చేయడం సులభం.

అంతరించిపోయే ఇంధన వనరుల లోపాలు :

  1. అంతరించిపోయే ఇంధన వనరులు ఒకసారి వినియోగిస్తే పునస్థాపితానికి సమీప భవిష్యత్ లో అవకాశం ఉండదు.
  2. అంతరించిపోయే ఇంధన వనరుల ఉత్పత్తి, వినియోగం ప్రక్రియలో పర్యావరణ కాలుష్యం ఎక్కువగా జరుగుతుంది.
  3. అంతరించి పోయే వనరుల వినియోగ ప్రక్రియలో గ్రీన్ హౌస్ వాయువుల తీవ్రత పెరుగుతుంది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 7 తృతీయ రంగం

ప్రశ్న 6.
టెలికం రంగం సేవలను వివరించండి.
జవాబు.
టెలికం రంగం :
టెలిఫోన్, రేడియో, దూరదర్శిని లేదా కంప్యూటర్ నెట్ వర్క్ ద్వారా విద్యుత్ అయస్కాంత తరంగాల సహాయంతో దూర ప్రాంతాలకు సమాచారాన్ని చేరవేసే శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం మొత్తాన్ని కలిపి టెలికం రంగం అని పిలుస్తున్నారు.

భారతదేశంలో తెలిఫోన్ సౌకర్యం కల్గి ఉన్నవారి సంఖ్య 2014-15 లో 9,961 లక్షలు ఉండగా 2018-19 నాటికి 11,834 లకు పెరిగింది. అంటే 2014-15, 2018-19ల మధ్య కాలంలో టెలిఫోన్ సౌకర్యం గల వారి సంఖ్యలో 18.8 శాతం పెరుగుదల చోటు చేసుకుంది.

2019 సెప్టెంబర్ 30 నాటికి భారతదేశంలో టెలిఫోన్ సౌకర్యం గల వారి సంఖ్య 11,943 లక్షలు. అందులో 5,147 లక్షలు గ్రామీణ ప్రాంతానిని కాగా మిగతా 6, 796 లక్షలు పట్టణ ప్రాంతాలవి. 2019 సెప్టెంబర్ నాటికి మొత్తం 11,736 లక్షలు వైర్లెస్ కనెక్షన్లు ఉండగా 206 లక్షలు మాత్రమే ల్యాండ్ లైన్ కనెక్షన్లు. మొత్తం కనెక్షన్లలో 98.27 శాతం వైర్లెస్ కనెక్షన్లు కాగా 1.73 శాతం మాత్రమే ల్యాండ్ లైన్ కనెక్షన్లు.

భారతదేశంలో టెలిసాంద్రతను చూసినపుడు 2019 సెప్టెంబర్ నాటికి మొత్తం మీద 90.45 శాతం కాగా గ్రామాలలో ఇది 57.35 శాతంగా, పట్టణాలలో 160.71 శాతంగా ఉంది. ప్రయివేటు రంగం 10,606 లక్షల కనెక్షన్లతో ఉండి 88.81 శాతం వాటాను ఆక్రమించగా 1,336 లక్షల కనెక్షన్లతో ప్రభుత్వం రంగం 11.19 శాతం వాటాకు పరిమితమైంది.

ఇక అంతర్జాల (ఇంటర్నెట్) సౌకర్యాన్ని పరిశీలిస్తే మొత్తం అంతర్జాల సౌకర్యం గల వారి సంఖ్య 2014 లో 2,516 లక్షలు ఉండగా 2019 జూన్ నాటికి 6,653 లక్షలకు పెరిగింది. అందులో 217 లక్షలు వైర్ లైన్లో అంతర్జాల సౌకర్యం కలిగి ఉన్నారు.

మొత్తం అంతర్జాల సౌకర్యాలలో బ్రాడ్ బాండ్ సౌకర్యం గల వారి సంఖ్య 2014 లో 610 లక్షలు ఉండగా 2019 జూన్ నాటికి 5,946 లక్షలకు పెరిగింది. దీనితో అంతర్జాల సౌకర్యంలో అంతకు పూర్వం ఎన్నడూ లేనంతగా, వేగం పెరిగి 2019 సంవత్సరంలో 462 లక్షల టెర్రాబైట్స్ (terabytes)కు చేరింది.

టెలికాం రంగ సవాళ్ళు :
దేశంలో ప్రసుత్తం టెలికం రంగంలో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (MTNL) లు ప్రభుత్వ రంగంలో ఉండగా ప్రయివేటు రంగంలో మూడు ప్రధాన సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు తమ తమ ప్రత్యేక పరిధిలో పనిచేస్తున్నాయి. 2016 నుండి ఈ రంగంలో తీవ్రమయిన పోటీ ఏర్పడి టెలికం సేవల ధరలు తగ్గించబడి, ద్రవ్యపరమైన ఒత్తిడిని ఈ రంగం ఎదుర్కొంటుంది.

ఫలితంగా సంస్థల బలోపేతం కోసం ఒక సంస్థ మరో సంస్థతో కలిసిపోయే ప్రయత్నాలు ఒకవైపు జరుగుతుండగా కొన్ని సంస్థలు ద్రవ్యపరంగా దివాళా తీశామని తెలియజేశాయి. ప్రపంచంలో అతి తక్కువ ధరలకు టెలికం సేవలు అందుతున్న దేశాలలో భారతదేశం ఒకటిగా ఉంది.

మొబైల్ సేనల ద్వారా సగటున ఒక వినియోగదారుని నుంచి పొందే ఆదాయం 2016 జూన్లో రూ. 126గా ఉండగా 2019 జూన్లో అది రూ. 74.30గా ఉంది. BSNL, MTNL లు ధరల నిర్ణయంలో పోటీపడి తీవ్ర నష్టాన్ని చవి చూశాయి. ఫలితంగా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నది.

అందులో ఈ సంస్థల ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ ఇచ్చి ఉద్యోగుల పై వ్యయాన్ని తగ్గించడం, 4G సేవల పంపిణీ, సంస్థలకున్న భూములు, భవనాలు, టవర్లు, ఫైబర్ ఆస్తులను అమ్మివేసి ద్రవ్యం రూపంలోకి మార్చడం, సార్వభౌమ హామీ పత్రాల ద్వారా రుణాల పునఃనిర్మాణం, సూత్రబద్ధంగా ఈ రెండు సంస్థల విలీన ప్రతిపాదన లాంటివి ఉన్నాయి.

టెలికం రంగ అవస్థాపన మరియు సేవలు :
శాటిలైట్ సేవల ద్వారా
i) భారత్ నెట్ :
దేశంలోని 2.5 లక్షల గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్, రేడియో, బహుళ అంతర్జాల (బ్రాడ్ బాంబ్) సేవలను అందుబాటులోకి తేవడానికి భారత్ నెట్ అనే కార్యక్రమం క్రింద డిజిటల్ ఇండియా ప్రచారంలో భాగంగా బహుళ అంతర్జాల వ్యవస్థలను నిర్మిస్తున్నది.

ii) ప్రజా వైఫై సేవలు :
నూతన మొబైల్ టవర్ల నిర్మాణాలకు బదులు ప్రజా వైఫై హాట్ స్పాట్ కేంద్రాలను నెలకొల్పి ప్రజలకు బహుళ అంతర్జాల సేవలు కల్పిస్తున్నారు.

iii) టవర్లు మరియు మొబైల్ స్టేషన్లు :
2014లో మొబైల్ ఆధారిత ట్రాన్స్వర్ స్టేషన్లు (BTS) 7.9 లక్షలు ఉండగా 2019 జూలై నాటికి 21.8 లక్షలకు పెరిగాయి. అదే కాలంలో ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ళ సంఖ్య 7 లక్షల నుండి 14 లక్షలకు పెరిగాయి.

iv) వామ పక్ష తీవ్రవాద ప్రాంతాలు మరియు ఈశాన్య రాష్ట్రాల కోసం ప్రత్యేక ప్రణాళిక :
వామపక్ష తీవ్రవాదం ప్రభావంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, బీహార్, చత్తీస్గడ్, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్లోని 2,335 ప్రాంతాలలో చరవాణి (మొబైల్) సేవలను అందించడం కోసం రూ.4,781 కోట్లతో .ప్రత్యేక ప్రణాళికను టెలికాం శాఖ అమలు పరుస్తున్నది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 7 తృతీయ రంగం

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
మనదేశంలో తృతీయ రంగం వృద్ధిని వివరించండి.
జవాబు.
వ్యాపారం, మరమ్మత్తు, ఆతిధ్య సేవలు (హోటళ్ళు), రవాణా (రైలు, రోడ్డు, వాయు, జల రవాణా), సమాచారం గిడ్డంగి, స్థిరాస్తి, వ్యాపారం, విత్తసేవలు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, వాణిజ్య సేవలు, IT సేవలు, కన్సల్టెన్సీ సేవలు, ప్రభుత్వ పాలన, వైయక్తిక, గృహరంగ సేవలు మొదలగునవి ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ప్రధాన ఉపరంగాలుగా కొనసాగుతుతున్నాయి.

సేవల రంగం వృద్ధి :
నిర్ణీత కాలంలో వస్తు, సేవల ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను వృద్ధి అంటారు. ఇక్కడ మనం సేవల రంగంలో వచ్చిన పెరుగుదలను గూర్చి మాట్లాడుతున్నాము. ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న పరిమిత కాలపు మందగమనంను వదిలేస్తే జోడించిన స్థూల ఉత్పత్తి విలువ వృద్ధికి సేవల రంగమే 58 శాతం సమకూర్చుతున్నది.

క్రింది పట్టికలో మనం సేవల రంగ వృద్ధి తీరును చూడవచ్చు.

భారతదేశంలో సేవల రంగ వృద్ధి – 2011-12 స్థిర ధరలలో (%):

రంగం2017 – 182018 – 192019 – 20 (AE)
వ్యాపారం, హోటళ్ళు, రవాణా, సమాచారం – ప్రసార సంబంధిత సేవలు7.86.95.9
ద్రవ్య, రియల్ ఎస్టేట్, వృత్తి పరమైన సేవలు6.27.46.4
ప్రభుత్వపాలన, రక్షణ, ఇతర సేవలు11.98.69.1
మొత్తం సేవల రంగం7.56.97.5

 

వట్టిక ప్రకారం స్థిరమైన ధరలలో 2017-18 నుండి 2019-20 వరకు భారతదేశంలో సేవల రంగం సగటున ప్రతి సంవత్సరం 7 శాతం వృద్ధిని నమోదు చేసింది. సేవల రంగం 2017-18 లో 7.5 శాతం, 2018-19 లో 6.9 శాతం, 2019 – 20 లో 7.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2017-18 లో వ్యాపారం, హోటళ్లు, రవాణా, సమాచారం, ప్రసార సేవలు 7.8 శాతం వృద్ధిని నమోదు చేయగా 2019-20 లో 5.9 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

అదే కాలంలో ద్రవ్య సేవలు, రియల్ ఎస్టేట్, వృత్తిపర సేవల వృద్ధి రేటు 6.2 శాతం నుండి 6.4 శాతం వరకు పెరిగింది. కాగా ప్రభుత్వ సేవలు, రక్షణ మరియు ఇతర సేవలు 2017-18 లో. .11.9 శాతం వృద్ధిని నమోదు చేయగా 2019-20 లో 9.1 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేశాయి.

ప్రశ్న 2.
సేవల రంగపు ఉపరంగాల పనితీరు, వృద్ధిరేట్లను విశ్లేషించండి.
జవాబు.
వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో సేవల రంగం – పనితీరు :
2018-19 లో GVA లో సేవల రంగం వాటా కేంద్రపాలిత ప్రాంతమైన చంఢీఘర్ లో అధికంగా ఉండగా రెండవ స్థానంలో ఢిల్లీ ఉంది. సేవల రంగం వాటాను రాష్ట్రాల వారీగా పరిశీలించినప్పుడు కర్ణాటక ప్రథను స్థానంలో ఉండగా మణిపూర్ రెండవ స్థానంలో ఉంది. తరువాత స్థానాలలో వరుసగా తెలంగాణ, కేరళలు ఉన్నాయి. కాగా సేవల రంగం వాటా సిక్కిం రాష్ట్రంలో అతి తక్కువగా ఉండగా కింది నుండి తరువాత స్థానాలలో గుజరాత్, మధ్యప్రదేశ్ మరియు చత్తీస్గడ్ వరుసగా ఉన్నాయి.

సేవల రంగం వృద్ధిని పరిశీలించనప్పుడు 2014-15 నుండి 2018-19 మధ్య కాలంలో 11.2 శాతం అత్యధిక సగటు వార్షిక వృద్ధితో తెలంగాణ రాష్ట్రం ముందుండగా తరువాత స్థానంలో 10.5 శాతంలో కర్ణాటక, 9.8 శాతంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. కాగా త్రిపుర రాష్ట్రం 3.0 శాతం సగటు వార్షిక వృద్ధితో చివరి స్థానంలో ఉండగా కింది నుండి తరువాత స్థానంలో 4.4 శాతంలో సిక్కిం, 4.9 శాతంతో నాగాలాండ్ ఉన్నాయి.

భారతదేశ సేవల రంగంలోని ప్రధాన ఉపరంగాల పనితీరు :
భారతదేశ సేవల రంగంలో బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (BPM), విమానయాం, టెలికం, పర్యాటక రంగం, సముద్ర రవాణా (షిప్పింగ్)లు ఉప-రంగాలుగా ఉన్నాయి.

2014-15 నుండి 2018-19 మధ్య కాలంలో బి.పి.ఎమ్ సేవల ద్వారా వచ్చిన ఆదాయం 118.6 బిలియన్ అమెరికన్ డాలర్ల నుండి 161.8 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇందులో బి.పి.ఎమ్ సేవల ఎగుమతుల విలువ 97.7 బిలియన్ అమెరికన్ డాలర్ల నుండి 135.5 మిలియన్ డాలర్లకు చేరింది. ఇదే కాలంలో విమానయానాన్ని పరిశీలించినప్పుడు విమానయానం చేసిన వారి సంఖ్య 115.8 మిలియన్ల నుండి 135.5 మిలియన్లకు పెరిగింది. అందులో అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 45.7 మిలియన్ల నుండి 63.9 మిలియన్లకు పెరిగింది.

టెలికం రంగంను చూసినప్పుడు వైర్ లెస్ ఫోన్ చందాదారుల సంఖ్య 969. 9 మిలియన్ల నుండి 1161.8 మిలియన్లకు పెరిగింది. అలాగే వైర్ లెస్ ఇంటర్నెట్ చందాదారుల సంఖ్య 283.3 మిలియన్ల నుండి 615 మిలియన్ లకు పెరిగింది. అంతర్జాతీయ యాత్రికుల సంఖ్య 7.7 మిలియన్లు నుండి 10.6 మిలియన్లకు పెరిగింది.

ఫలితంగా విదేశీ యాత్రికుల ద్వారా వచ్చిన విదేశీ మారక ద్రవ్య నిల్వలు 19.7 బిలియన్ డాలర్ల నుండి 28.6 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఓడరేవుల ద్వారా జరిగిన వస్తు రవాణా 581.3 మిలియన్ టన్నుల నుండి 699.1 మిలియన్ టన్నులకు పెరిగింది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 7 తృతీయ రంగం

ప్రశ్న 3.
భారతదేశ జోడించిన స్థూల ఉత్పత్తి విలువ, ఉద్యోగితలలో సేవల రంగం పాత్రను తెలపండి.
జవాబు.
వ్యాసరూప సమాధాన ప్రశ్న 1 చూడుము.

ప్రశ్న 4.
జాతీయ అవస్థాపనా పెట్టుబడి ప్రవాహ కార్యక్రమం 2020-25 అనగానేమి ?
జవాబు.
అవస్థాపన సౌకర్యాలు :
ప్రత్యక్ష ఉత్పత్తి కార్యకలాపాల అభివృద్ధికి దోహదపడే సౌకర్యాలను అవస్థాపన సౌకర్యాలు అంటారు. వాటిలో రవాణా, విద్యుత్తు, నీరు, సమాచారం మొదలైన వాటిని ఆర్థిక అవస్థాపన సౌకర్యాలు అని విద్య, వైద్య సౌకర్యాలను సాంఘిక అవస్థాపన సౌకర్యాలు అని అంటారు.

అవస్థాపన సౌకర్యాలలో పెట్టుబడి ఆర్థిక వృద్ధికి ఇతోధికంగా దోహదం చేస్తుంది. విద్యుత్తు కొరత అధిక వ్యయ విద్యుత్తు సరఫరాకు కారణమై ఉత్పత్తిలో అధిక వ్యయాలకు దారి తీస్తుంది. ఫలితంగా పోటీని ఇవ్వలేని స్థితి వస్తుంది.

రవాణా సౌకర్యాల కొరత వలన ముడిపదార్థాల సప్లయ్, పూర్తిగా తయారైన వస్తూత్పత్తిని మార్కెట్ కు తరలించడం కష్టతరమవుతుంది. ఫలితంగా రైతులు తమ గిట్టుబాటు ధరలు పొందలేరు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాలు వృద్ధి ప్రతిఫలాలను పొందలేక తక్కువ స్థాయి ఆదాయంతో ఉండి పోయే అవకాశం ఉంటుంది.

అందువలన సమ్మిళిత వృద్ధి సాధనకు కూడా తగినంత అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి అవసరం. అవస్థాపన రంగంలో పెట్టుబడులు పెంపు నిరంతరం కొనసాగడం కోసం ఈ మధ్య కాలంలో ప్రభుత్వం “జాతీయ అవస్థాపన సౌకర్యాల పెట్టుబడి ప్రవాహ కార్యక్రమం, 2020-25” ను ఆరంభించింది.

జాతీయ అవస్థాపన పెట్టుబడి ప్రవాహ కార్యక్రమం 2020-2025 (National Infrastructure Pipeline):
ఆర్థిక వృద్ధికి అవస్థాపన సౌకర్యాలలో పెట్టుబడి తప్పనిసరి. భారతదేశం 2024-25 సంవత్సరం నాటికి 5 ట్రిలియన్ డాలర్ల స్థూల దేశీయోత్పత్తిని కలిగి ఉండాలంటే ఈ కాలంలో 1.4 ట్రిలియన్ డాలర్ల (రూ. లక్ష కోట్లు) పెట్టుబడిని అవస్థాపనా రంగంలో చేయాలి. ప్రతి సంవత్సరం అవస్థాపన సౌకర్యాలలో పెట్టుబడిని పెంచి ఆర్థికాభివృద్ధి అడ్డంకులను తొలగించుకోవాలి.

అందుకోసం తగిన పథకాలను రూపొందించి అమలు పరచాలి. 2019-20 ఆర్థిక సంవత్సరం నుండి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం జాతీయ అవస్థాపన సౌకర్యాలలో పెట్టుబడి ప్రవాహం (NIP) ను రూపొందించడానికి 2019 సెప్టెంబర్ లో వివిధ మంత్రిత్వ శాఖలతో టాస్క్ పోర్సు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

NIP, 2020-2025 సంవత్సరాల మధ్య కాలానికి భారతదేశంలో రూ.102 లక్షల కోట్ల పెట్టుబడి అవసరాన్ని గుర్తించింది. ఈ పెట్టుబడిలో కేంద్రం 39 శాతం, రాష్ట్రం 39 శాతం, ప్రయివేటు రంగం 22 శాతం చేయవలసి ఉంటుంది.

భారతదేశంలో ఇలాంటి అవస్థాపన కార్యక్రమం మొదటిసారి రూపొందించబడింది. అయితే ఈ కార్యక్రమాన్ని అమలు పరచడం NIP కి ఒక సవాలు లాంటిది. ఆకర్షణీయ పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, పట్టణ స్థానిక ప్రభుత్వాలు, బ్యాంకులు, విత్త సంస్థలు, స్వదేశీ, విదేశీ ప్రయివేటు పెట్టుబడిదారుల నుండి NIP పెట్టుబడిని ఆకర్షించవచ్చు.

TS Inter 2nd Year Economics Study Material Chapter 7 తృతీయ రంగం

ప్రశ్న 5.
పునఃస్థాపిత ఇంధన వనరులు ఏవి ?
జవాబు.
వ్యాసరూప సమాధాన ప్రశ్న 5 చూడుము.

ప్రశ్న 6.
అంతరించిపోయే ఇందన వనరుల ఆధారాలు ఏవి ?
జవాబు.
వ్యాసరూప సమాధాన ప్రశ్న 5 చూడుము.

ప్రశ్న 7.
భారతదేశంలో బాంకింగ్ వ్యవస్థ నిర్మాణాన్ని విశదీకరించండి.
జవాబు.
భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ :
వ్యవస్థీకృత భారత బ్యాంకింగ్ వ్యవస్థ (organised banking sector) అంతర్భాగాలు :

  1. భారతీయ రిజర్వ్ బ్యాంకు
  2. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు
  3. షెడ్యూల్డ్ సహకార బ్యాంకులు.

బ్యాంకింగ్ వ్యవస్థలో శిఖరాగ్ర బ్యాంకు (apex bank) కేంద్ర బ్యాంకు, షెడ్యూల్డ్ బ్యాంకులు రూ. 5 లక్షలు చెల్లించిన మూలధనంతో కేంద్ర బ్యాంకు రెండవ అధికార సూచిక (second schedule) లో చేర్చబడిన బాంకులు.

వాణిజ్య బ్యాంకులు లాభార్జన లక్ష్యంతో ద్రవ్య వ్యాపారం చేస్తాయి. డిపాజిటర్ల శ్రేయస్సుకి భంగం కలగకుండా పెట్టుబడులు చేస్తాయి. సహకార బ్యాంకులు సభ్యుల సౌలభ్యం లక్ష్యంతో లాభాపేక్ష లేకుండా సేవలందిస్తాయి. ప్రజల, సంస్థల పొదుపును వాణిజ్య బ్యాంకులు డిపాజిట్లుగా సేకరిస్తాయి. సేకరించిన పొదుపును స్వల్ప కాల ఋణాలుగా మంజూరు చేస్తాయి. మన దేశంలో వాణిజ్య బ్యాంకులన్నింటిని ప్రయివేటు రంగం స్థాపించింది. 1969, 1980 సంవత్సరాలలో గరిష్ట డిపాజిట్లు గల 20 బ్యాంకులను భారత ప్రభుత్వం జాతీయం చేసింది.

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను (Regional Rural Banks-RRBs) 1975లో స్థాపించారు. ఈ బ్యాంకులు వాణిజ్య బ్యాంకులు నిర్వహించే విధులన్నిటినీ నిర్వహిస్తాయి. కాని ఈ బ్యాంకుల కార్యకలాపాల పరిధి గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే పరిమితం. ఈ బ్యాంకులు గ్రామీణ ప్రాంతాలలో పొదుపు సేకరించి చిన్న, ఉపాంత వ్యవసాయదార్లకు, వ్యవసాయ కూలీలకు, గ్రామీణ కుటీర పరిశ్రమలకు ఋణాలను అందిస్తాయి.

సహకార బ్యాంకుల వ్యవస్థలో రాష్ట్ర సహకార బ్యాంకుల అధ్వర్యంలో జిల్లా సహకార బ్యాంకులు విధులను నిర్వహిస్తాయి. జిల్లా సహకార బ్యాంకుల అధ్వర్యంలో జిల్లాలోని అన్ని గ్రామ ప్రాథమిక సహకార సంఘాలు (Primary Co-operative societ- ies) పనిచేస్తాయి.

2. భారతీయ రిజర్వ్ బ్యాంకు (Reserve Bank of India-RBI) :
భారతీయ రిజర్వు బ్యాంకు 1936 సంవత్సరంలో స్థాపించబడి 1949లో జాతీయం చేయబడినది. భారతీయు రిజర్వ్ బ్యాంకు (RBI) మన కేంద్ర బ్యాంకు.

కరెన్సీ నోట్లు జారీ చేయడం, ప్రభుత్వానికి బ్యాంకరు, ఏజెంటు, సలహాదారుగా వ్యవహరించడం, విదేశీ మారక ద్రవ్య నిధులు, బంగారం నిల్వల పరిరక్షణ, బ్యాంకులకు బ్యాంకరుగా, అంతిమ రుణదాతగా ద్రవ్య సహాయం అందించడం, చెక్కుల క్లియరింగ్ సేవలందించడం, పరపతి నియంత్రణ, మారకం రేటు నియంత్రణ వంటి విధులతో బాటు కేంద్ర బ్యాంకు ఆర్థికాభివృద్ధి, సాంఘిక సంక్షేమాన్ని పెంపొందించే అనేక ఇతర విధులు కూడా నిర్వహిస్తుంది. ద్రవ్యోల్బణ నివారణకు రిజర్వు బ్యాంకు చర్యలు తీసుకొంటుంది.

3. వాణిజ్య బ్యాంకులు (Commercial Banks) :
1950-51 భారతదేశంలో ఉన్న వాణిజ్య బ్యాంకుల సంఖ్య 430. 2007 లో అవి 172గా ఉండగా అందులో 27 ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. భారతీయ రాష్ట్ర బ్యాంకు (SBI) 6 అనుబంధ బ్యాంకులతో ప్రభుత్వ రంగ బ్యాంకులలో అతి పెద్ద బ్యాంకుగా ఉండింది.

2017 ఏప్రిల్ 1న SBI తనకు అనుబంధంగా ఉన్న అయిదు బ్యాంకులను, భారతీయ మహిళా బ్యాంకును తనలో విలీనం చేసుకుంది. 2020 ఏప్రిల్ 1న 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసి నాలుగు బ్యాంకులుగా మార్చారు.

వాణిజ్య బ్యాంకుల ప్రాథమిక విధి ప్రజల నుంచి డిపాజిట్లను స్వీకరించి, రుణాలను ఇవ్వటం. వాణిజ్య బ్యాంకులు తమ డిపాజిట్లలో కొంత మొత్తాన్ని రిజర్వుబ్యాంకు దగ్గర నిల్వగా ఉంచుతాయి. నిల్వను మినహాయించి ఉన్న డిపాజిట్లను రుణాలుగా ఇస్తాయి. ఈ ప్రక్రియలో వాణిజ్య బ్యాంకులు పరపతి సృష్టి చేస్తాయి.

TS Inter 2nd Year Economics Study Material Chapter 7 తృతీయ రంగం

ప్రశ్న 8.
జీవిత భీమా సంస్థ (LIC) ప్రధాన లక్ష్యాలు ఏవి ?
జవాబు.
జీవిత బీమా సంస్థ (Life Insurance Corporation of India- LIC) : జీవిత బీమా సంస్థ ధ్యేయం ప్రజలకు ఆర్థిక భద్రతతో కూడిన పొదుపును ప్రోత్సహించడం. జీవిత బీమా సంస్థ లక్ష్యం. ఇతర పొదుపు పథకాల కంటే లాభదాయకంగా ఉండి మార్కెట్ పోటీ తట్టుకొనే పథకాలను, పాలసీలను, స్కీములను బీమాదార్లకు అందించడం, ఈ లక్ష్యంతో పాటుగా ఆర్థికాభివృద్ధికి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చడం.

జీవిత బీమా సంస్థ విక్రయించే పాలసీలు, వ్యక్తులు వారి కుటుంబాలకు హఠాత్తుగా సంభవించే ఆపదలకు ఆర్థిక భద్రత కల్పిస్తాయి. జీవిత బీమా సంస్థ అందించే కొన్ని పథకాలు: జీవిత బీమా, ఆరోగ్య బీమా, గ్రూప్ ఇస్సూరెన్సు, చిల్డ్రన్స్ గ్రోత్ ఫండ్, యూనిట్ లిండీ ఇస్సూరెన్సు మొదలైనవి.

జీవిత బీమా సంస్థ ముఖ్య లక్ష్యాలు :

  1. జీవిత బీమా సదుపాయాన్ని గ్రామీణ ప్రజలకు, సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా వాయిదా చెల్లింపులను (premium) నిర్ణయించడం.
  2. బీమాతో కూడిన పొదుపును గరిష్టం చేయడం.
  3. బీమా పాలసీదార్లకు భద్రత, గరిష్ట బోనస్ లను అందించడం,
  4. ఆర్థికాభివృద్ధి, సోమాజిక ప్రయోజనం చేకూర్చే విధంగా బీమా చేసిన వ్యక్తుల పొదుపు మొత్తాలను పెట్టుబడి’ చేయడం.
  5. పెట్టుబడి చేసిన వారి ద్రవ్యాన్ని పూర్తిగా వినియోగిస్తూ ఆర్థిక వ్యవస్థ పురోగతికి తోడ్పడటం.

ప్రశ్న 9.
అంతరిక్ష రంగం యొక్క ప్రాధాన్యతను మదింపు చేయండి.
జవాబు.
అంతరిక్ష రంగం :
అంతరిక్ష పరిశోధన కోసం ఈ మధ్య కాలంలో అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు పెద్ద ఎత్తున పెట్టుబడి చేస్తున్నాయి. భారతదేశం కూడా ఈ ప్రస్థానంలో ఉంది.

ఇండియా అంతరిక్ష వాహక నౌకల రూపకల్పన, అభివృద్ధి, సంబంధిత సాంకేతిక పరిజ్ఞానం, శాటిలైట్ రూపకల్పన, సంబంధిత సాంకేతిక పరిజ్ఞానం, భూగోళ పరిశీలన సంబంధిత సాంకేతిక పరిజ్ఞాసం, టెలి కమ్యూనికేషన్లు, బహుళ అంతర్జాలం, నావిగేషన్, వాతావరణ శాస్త్ర సాంకేతికత, అంతరిక్ష సంబంధిత శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం, అంతరిక్ష పరిశోధన శాస్త్రం, వివిధ గ్రహాల పరిజ్ఞానం అన్వేషణ మొదలైన వాటిపై చేసే వ్యయం అంతరిక్ష రంగ అభివృద్ధి కోసం చేసే వ్యయంలో భాగం.

2018 లో ఇండియా అంతరిక్ష కార్యక్రమాలపై 1.5 బిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చు చేసింది. అయితే ఈ మొత్తం అదే సంవత్సరంలో అమెరికా చేసిన 19.5 బిలియన్ డాలర్లు, చైనా చేసిన 11 బిలియన్ డాలర్లు, రష్యా చేసిన 3.3 బిలియన్ డాలర్ల కంటే చాలా తక్కువ.

ఇండియా అంతరిక్ష రంగ కార్యక్రమాలలో ప్రముఖమైనవి :

  1. ఇండియన్ నేషనల్ శాటిలైట్ (INSAT) వ్యవస్థ జీసాట్ (జియో సింక్రోనస్ శాటిలైట్) వ్యవస్థ సహాయంతో సమాచారం. దీని ద్వారా టెలి కమ్యూనికేషన్లు, ప్రసార వ్యవస్థ, బహుళ అంతర్జాల వ్యవస్థ మొదలైనవి ప్రయోజనం పొందుతాయి.
  2. అంతరిక్ష ఆధారిత సమాచారం ఆధారంగా భూగోళంను పరిశీలిస్తూ చేసే వాతావరణ సమాచారం, విపత్తుల నిర్వహణ, జాతీయ వనరుల చిత్రణ, పాలన,
  3.  శాటిలైట్ ఆధారంగా గగన్ (GAGAN), నావిక్ (నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్-NAVIC) లాంటి నావిగేషన్. గగన్ కార్యక్రమంను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), భారతీయ విమానాశ్రయాల సంస్థ (AAI)లు ఉమ్మడిగా నిర్వహిస్తాయి.

గగన్ ద్వారా జీపీఎస్ (GPS) ఆధారంతో పౌర విమానయానపు దారి ఖచ్చితత్వం, సమగ్రత విమానాల ట్రాఫిక్ మొదలగు వాటి అంతరిక్ష పాలనను మరింత సమర్థవంతంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. నావిక్ కార్యక్రమం ద్వారా కూడా విమానాల స్థానం, సమయానికి సంబంధించిన పాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా అంతరిక్ష రంగంలో నిరంతరం అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వాలు, ప్రవేటు రంగాల అంతరిక్ష కార్యక్రమాలలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వాలు అంతరిక్ష పరిజ్ఞానాలను జాతీయ అవసరాలు దేశ భద్రతకు వినియోగిస్తుంటే ప్రయివేటు రంగం అంతరిక్షంలో దొరికే పదార్థాలపై దృష్టి పెట్టింది.

ఇస్రో కూడా ప్రయివేటు పెట్టుబడిని అంతరిక్ష రంగంలోకి ఆకర్షించడానికి కొన్ని రంగాలను గుర్తించింది. అవి :

  1. పి.ఎస్.ఎల్.వి. (పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్) (PSLV)
  2. శాటిలైట్ నిర్మాణ ప్రక్రియ, అసెంబ్లింగ్ ;
  3. వివిధ కూర్పులతో కూడిన ముడి పరికరాల తయారీ
  4. ఘన, ద్రవ, క్రయోజనిక్, సెమి-క్రియోజనిక్ చోధకాలు (ప్రొపెల్లాంట్స్) ఉత్పత్తి,
  5. ఎలక్ట్రానిక్ ప్యాకేజీలు, విమానాలు, శాటిలైట్ ఉప-వ్యవస్థల సాంకేతిక పరికరాల పరీక్ష, నిర్వహణ.

TS Inter 2nd Year Economics Study Material Chapter 7 తృతీయ రంగం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
తృతీయ రంగం
జవాబు.
ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించడానికి అవసరమైన సౌకర్యాలను అందించే సేవల రంగం. దీనినే సేవరంగమని అంటారు. అవస్థాపన సౌకర్యాలైన శక్తి, రవాణా, సమాచారం, బ్యాంకింగ్, బీమా మొదలైనవి ఈ రంగం క్రిందకు వస్తాయి.

ప్రశ్న 2.
అవస్థాపన.
జవాబు.
వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి సాగునీరు, శక్తి, రవాణా, గిడ్డంగి, మార్కెట్ సౌకర్యాలు, పరిశ్రమ, రవాణా సమాచారం, మార్కెటింగ్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ మొ॥ సౌకర్యాలు అవస్థాపనా రంగం అందిస్తుంది. ప్రాథమిక, ద్వితీయ రంగాల అభివృద్ధి అవస్థాపనా సౌకర్యాల లభ్యతపై ఆధారపడుతుంది. ఇది రెండు రకాలు. 1. ఆర్థిక అవస్థాపన సౌకర్యాలు, 2. సాంఘీక అవస్థాపన సౌకర్యాలు.

ప్రశ్న 3.
జలరవాణా.
జవాబు.
అధిక పరిమాణం, బరువుగల సరుకులను రవాణా చేయడంతో జలరవాణా దోహదపడుతుంది. ఇది రెండు రకాలు

  • దేశీయ జల రవాణా
  • అంతర్జాతీయ జలరవాణా.

అంతర్జాతీయ నౌక రవాణా మరల రెండు రకాలు :

  • కోస్టల్ షిప్పింగ్
  • ఓవర్సీస్ షిప్పింగ్.

TS Inter 2nd Year Economics Study Material Chapter 7 తృతీయ రంగం

ప్రశ్న 4.
ఇంధన వనరులు.
జవాబు.
వేడిచేసే ప్రక్రియలో గాని, విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియలో గాని, శక్తి పూర్పిడి ప్రక్రియలో గాని నీటి వినియోగం పడుతున్న అన్ని రకాల ఇంధనాలను ఇంధన వనరుల మూలాధారాలు లేదా ఇంధన వనరులు అనవచ్చు. నీటిని ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి :
a) పునఃస్థాపిత ఇంధన వనరులు, అంతరించిపోయే ఇంధన వనరులు
b) సాంప్రదాయ, సాంప్రదాయేతర ఇంధన వనరులు.

ప్రశ్న 5.
శిలాజ ఇంధనాలు.
జవాబు.
జంతువుల, వృక్షాల అవశేషాలు రూపాంతరం పొందే శిలాజం నుంచి వచ్చే ఇంధనాలు శిలాజ ఇంధనాలు. వీటిని మూడు రకాలుగా చెప్పవచ్చు. అవి బొగ్గు, క్రూడాయిల్, సహజ వాయువు. శిలాజ ఇంధనాలు ప్రధానంగా కార్బన్ నుంచి తయారు అవుతాయి. వీటినే అంతరించిపోయే ఇంధన వనరులుగా చెప్పవచ్చు.

ప్రశ్న 6.
భారత్ నెట్
జవాబు.
దేశంలోని 2.5 లక్షల గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్, రేడియో, శాటిలైట్ సేవల ద్వారా దిహుక అంతర్జాల (బ్రాడ్ బాంబ్) . సేవలను అందుబాటులోకి తేవడానికి భారత్ నెట్ అనే కార్యక్రమం క్రింద డిజిటల్ ఇండియా ప్రచారంలో భాగంగా బహుళ అంతర్జాల వ్యవస్థలను నిర్మిస్తున్నది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 7 తృతీయ రంగం

ప్రశ్న 7.
వాణిజ్య బ్యాంకులు
జవాబు.
ప్రజల నుంచి, సంస్థల నుండి పొదుపును, డిపాజిట్లుగా స్వీకరించడం, స్వీకరించిన డిపాజిట్లలో అధిక భాగం రుణాలుగా మంజూరు చేయడం వాణిజ్య బ్యాంకుల ప్రాథమిక విధులు. మనదేశంలో 172 వాణిజ్య బ్యాంకులున్నాయి. అందులో 27 ప్రభుత్వ రంగంలో 145, ప్రైవేటు రంగంలో ఉన్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో అతిపెద్ద పబ్లిక్ వాణిజ్య బ్యాంకు S.B.I ప్రైవేటు బ్యాంకు ICICI బ్యాంకు.

ప్రశ్న 8.
IRDA.
జవాబు.
దీనిని 1999లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ చట్టం ప్రవేశ పెట్టారు. ఆర్థిక సంస్కరణలో భాగంగా బీమా రంగంలో కార్పొరేట్ విదేశీ సంస్థలను అనుమతించాలని నిర్ణయించారు. 2000 సం॥లో బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి క్రమబద్ధీకరణ, పునఃభీమా సదుపాయాలు కల్పించే అధికారం ఇచ్చింది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 7 తృతీయ రంగం

ప్రశ్న 9.
సాధారణ భీమా సంస్థ.
జవాబు.
G.I.C దీనిని 1973 సం॥లో ప్రారంభించారు. ఇది అన్ని ప్రమాదాలు, వరదలు, సముద్ర ప్రయాణాలు, విమానయానం, విదేశీ ప్రయాణాలు రోడ్డు ప్రమాదాలు, పంటల నష్టాలకు బీమా సదుపాయాన్ని అందిస్తాయి.

TS Inter 2nd Year Economics Study Material Chapter 6 పారిశ్రామిక రంగం

Telangana TSBIE TS Inter 2nd Year Economics Study Material 6th Lesson పారిశ్రామిక రంగం Textbook Questions and Answers.

TS Inter 2nd Year Economics Study Material 6th Lesson పారిశ్రామిక రంగం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారతదేశంలో పారిశ్రామిక వృద్ధి సరళిని వివరించండి.
జవాబు.
భారతదేశంలో పారిశ్రామిక వృద్ధి సరళి:
భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధి నమూనా బ్రిటిష్ వారు మనలను విడిచి పెట్టిన ఆర్థిక స్థితి ద్వారా నిర్ణయించబడింది. బ్రిటీష్ వారు భారతదేశాన్ని చౌకైన ముడి పదార్థాలకు మూలంగా మరియు తుది ఉత్పత్తులకు లాభదాయకమైన మార్కెట్గా ఉపయోగించారు. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి వారు ఎటువంటి ప్రయత్నం చేయలేదు.

స్వాతంత్య్రం పొందిన తరువాత, భారతదేశం వెంటనే మూలధన వస్తువుల అవసరాన్ని గుర్తించింది మరియు మూలధన వస్తువుల పరిశ్రమల వేగవంతమైన వృద్ధిని ప్రోత్సహించాలని నిర్ణయించారు. మూడవ పంచవర్ష ప్రణాళిక ముగిసే వరకు, ఇనుము మరియు ఉక్కు రవాణా పరికరాలు మరియు వివిధ రకాల యంత్రాలతో సహా వివిధ రకాల మూలధన వస్తువులను భారతదేశం దిగుమతి చేసుకోవలసి వచ్చింది.

కానీ ఇప్పుడు పరిస్థితి సమూలంగా మారిపోయింది. సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాలు అయిన పశ్చిమ ఐరోపా, అమెరికా మరియు రష్యాలకు కూడా ఈ మూలధన వస్తువులను ఎగుమతి చేసే స్థితిలో భారత్ ఇప్పుడు ఉంది.

భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధి ముఖ్య లక్షణం ప్రభుత్వ రంగ అసాధారణ వృద్ధి. ఈ రంగంలో రైల్వేలు, రహదారి రవాణా, పోస్ట్ మరియు టెలిగ్రాఫ్, విద్యుత్ మరియు నీటిపారుదల ప్రాజెక్టులు, రక్షణ ఉత్పత్తి సంస్థలతో సహా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల విభాగ సంస్థలు మరియు అనేక ఇతర పారిశ్రామిక సంస్థలు ఉన్నాయి.

జాతీయ ఆదాయంలో పారిశ్రామిక రంగం వాటాలో ఐదవ వంతుకు ప్రభుత్వ రంగం ఇప్పుడు దోహదం చేస్తుంది. దాని ద్వారా సంపాదించిన మిగులు ప్రభుత్వ పన్నేతర ఆదాయానికి ముఖ్యమైన వనరుగా నిలుస్తుంది. ఇది పెద్ద సంఖ్యలో ప్రజలకు ఉద్యోగ అవకాశాలను కూడా అందిస్తుంది.

1951 లో భారత పంచవర్ష ప్రణాళికలను ప్రారంభించడంతో, భారతదేశ పారిశ్రామిక అభివృద్ధికి అనుకూలంగా దృక్పథం మారడం వలన ఆ రంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. దీనితోపాటు వ్యవసాయరంగం కూడ అభివృద్ధి చెందవలసి ఉంది.

వ్యవసాయ పరిశ్రమలు, గ్రామ పరిశ్రమలు మరియు చిన్న తరహా సంస్థల అభివృద్ధి పారిశ్రామిక అభివృద్ధి ప్రక్రియలో ముఖ్యమైన భాగం. నిర్వహణ మూలధనం, ఉపాధి మరియు కర్మాగారాల సంఖ్య సంపూర్ణ గణాంకాలు రాష్ట్రాల వారీ విశ్లేషణ ప్రకారం, మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది.

దాని తరవాత తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తర ప్రదేశ్ కర్మాగారాలు మరియు కార్మికుల సంఖ్యకు సంబంధించి అభివృద్ధి నాటలో ఉన్నాయి. అయితే, నిర్వహణ మూలధనం పరంగా, గుజరాత్ రెండవ స్థానంలో ఉంది, తరువాత తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పూర్వపు ఆంధ్రప్రదేశ్ మరియు హర్యానా ఉన్నాయి.

పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రభుత్వం చేసిన సమిష్టి కృషి కారణంగా, భారతదేశం ప్రపంచంలోని 6వ పారిశ్రామిక దేశంగా అవతరించింది. వివిధ రకాల వస్తువుల ఉత్పత్తి మరియు ఉపాధి కల్పనలో విశేషమైన అభివృద్ధిని సాధించింది. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రణాళికా రహిత ప్రయత్నాలు దేశంలో అసమాన పారిశ్రామిక అభివృద్ధిని నియంత్రించలేదు.

TS Inter 2nd Year Economics Study Material Chapter 6 పారిశ్రామిక రంగం

ప్రశ్న 2.
భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధి స్వభావాన్ని తెలపండి.
జవాబు.
1. స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటీష్ ప్రభుత్వం భారతదేశంలో పరిశ్రమలను అభివృద్ధి చేయాలని అనుకోలేదనేది అందరికీ తెలిసిన సత్యం. దేశ స్వాతంత్య్రం అనంతరం ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధికి అవసరమైన అవస్థాపనా సౌకర్యాలను కలుగజేసే పారిశ్రామికాభివృద్ధిని, ప్రజలు వారి జీవితాలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళగలదని ప్రభుత్వంపై స్వాతంత్య్రానంతరం అనేక ఆశలు పెట్టుకున్నారు.

1948 పారిశ్రామిక విధానం, పారిశ్రామిక చట్టం, 1957 ద్వారా పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వ ధోరణిని తెలియజేశాయి. కానీ, పరిశ్రమల అభివృద్ధికి కావలసిన అనుకూల వాతావరణం 1951లో ప్రణాళికలను అనుసరించిన తరువాత మాత్రమే సృష్టించబడింది.

2. భారతదేశానికి స్వాతంత్య్రం అనంతరం ప్రైవేటు రంగం, ప్రభుత్వ రంగం, ఉమ్మడి రంగాలలో అధిక సంఖ్యలో పరిశ్రమలను స్థాపించడమైంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దంన్నర కాలంలో భిలాయ్, బొకారో, రూర్కెలా, రాంచి, జమ్హడ్పూర్, రేనుకూట్ మొదలైనవి ప్రధాన పారిశ్రామిక కేంద్రాలుగా కొనసాగాయి.

3. ఏమైనప్పటికీ, తరవాత అన్ని రాష్ట్రాల్లో చిన్నతరహా, మధ్య తరహా పరిశ్రమలలో పారిశ్రామికీకరణ జరిగింది. ఎలక్ట్రానిక్స్, రవాణా, సమాచార రంగాలలో నేడు పారిశ్రామికీకరణలో ప్రధాన రంగాలు. మొత్తం శ్రామిక జనాభాలో కేవలం 10 శాతం మంది మాత్రమే సంఘటిత పారిశ్రామిక రంగంలో ఉపాధి పొందుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ప్రైవేట్, ప్రభుత్వ రంగాలు పక్కపక్కన అభివృద్ధి చెందాయి.

4. ప్రభుత్వం నిర్వహించే సంస్థలు, ప్రభుత్వ రంగంచే నడపబడే సంస్థలు భారీ నష్టాలతో నడుస్తున్నాయి. ఇవి భారత ప్రభుత్వ సామర్థ్యాలు, భారత ప్రభుత్వం తన సొంత సంస్థలను నిర్వహించే పద్ధతులు ప్రశ్నార్ధకంగా మారాయి. అప్పుడు ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థల భాగస్వామ్యం మరియు వాటి విభజనపై చర్చ ప్రారంభమైంది. ఆ చర్చ ప్రైవేటు రంగానికి అనుకూలంగా ఉంది.

చాలా ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు వ్యవస్థాపకులకు, పారిశ్రామికవేత్తలకు స్వాధీనం చేయబడ్డాయి. ఎంపిక చేసిన మార్గాలలోని ఆఫీసులు, రోడ్లు, రైల్వేలు, వాయుమార్గాలను కలుపుకుని రవాణా రంగంలో ప్రైవేటీకరణ ప్రవేశించింది.

5. భారతదేశంలో ప్రణాళికలు మొదలైన మొదటి 15 సంవత్సరాలలో పెద్ద తరహా పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. పారిశ్రామిక వృద్ధి రేటు 2 నుంచి 12 శాతం మధ్య తిరుగుతూ ఉంది. ఏమైనప్పటికీ 1967 తరువాత పారిశ్రామిక ప్రగతి స్థిరంగా ఉండటాన్ని మనం గమనించవచ్చు.

ఈ పారిశ్రామికాభివృద్ధికి సహజ వనరులు, ఆర్ధిక మిగులు, అధిక శ్రామిక శక్తి, ఎక్కువ స్థాయిలో నగర కేంద్రీకరణ, చిన్న సామాజిక సముదాయాల మధ్య మిగులు కేంద్రీకరణ, శిక్షణ పొందిన శ్రామికులు అందుబాటులో ఉండటం, స్థిరమైన రాజకీయ వ్యవస్థ, శక్తివంతమైన వనరులపై ప్రభుత్వ ఆర్థిక నియంత్రణ మొదలైన కారకాలు పనిచేశాయి.

ప్రస్తుతం వృద్ధిరేటు దాదాపు 8 శాతంగా ఉంది. ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాలతో పోలిస్తే భారీగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో నేడు భారతదేశం ఒకటిగా నిలిచింది.

6. ఏమైనప్పటికీ, విలాస వస్తువుల ఉత్పత్తి, ఏకస్వామ్యాల నియంత్రణ, వ్యవసాయాభివృద్ధి రేటు తగ్గడం మొదలైనవి పారిశ్రామికాభివృద్ధికి ఆటంకాలుగా ఉన్నాయి.

7. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలైన యుఎస్ఎ, యుకె, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్లతో కలిసి పని చేయడం భారత పారిశ్రామిక ప్రగతికి స్పష్టమైన తార్కాణం. వివిధ ప్రణాళికల సమయంలో చిన్న తరహా పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. ప్రస్తుతం భారతదేశం ఒక ప్రపంచ మార్కెట్. భారతదేశం, చైనా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పరిగణించబడుతున్నాయి.

8. 20వ శతాబ్దంలో సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రశ్నించలేని స్థాయిలో ఉన్నప్పుడు ఒక దేశ వాస్తవ అభివృద్ధిని కొలవటానికి, ఆదేశ పారిశ్రామికాభివృద్ధిని ఒక కొలమానంగా ఉపయోగించేవారు. ఒక వేళ ఒక దేశం సాంకేతికంగా వెనుకబడి ఉంటే, ఆ దేశం మిగిలిన ఏ విషయాలలోనైనా ప్రగతిని సాధించినా అది వెనుకబడిన దేశంగానే ఉండేది.

9. ఒక ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధిని పారిశ్రామిక వృద్ధి రేటులో వృద్ధి, జాతీయాదాయంలో పరిశ్రమల వాటా, ఉద్యోగితలో పరిశ్రమల వాటా వంటి వివిధ పద్ధతులద్వారా కొలవవచ్చు. ఈ పద్ధతిని ఉపయోగించడం ఆధారంగా ప్రణాళికా కాలాన్ని రెండు భిన్నదశలుగా విభజిస్తుంది. వీటిలో 1965-66 వరకు మొదటి దశ. అక్కడ నుంచి ప్రారంభమైంది రెండవ దశ.

7వ పంచవర్ష ప్రణాళికా కాలంలో వృద్ధి రేటు 8 శాతం కాగా, కొన్ని పరిశ్రమలలో అంతకంటే ఎక్కువగా వృద్ధిరేటు నమోదయ్యింది. కానీ, భవిష్యత్తులో సాధించగలిగే వాటిని కాలం మాత్రమే నిర్ణయించగలదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా నూతన పరిశ్రమల అభివృద్ధిలో కొన్ని సమస్యలు ఉన్నాయి.

TS Inter 2nd Year Economics Study Material Chapter 6 పారిశ్రామిక రంగం

ప్రశ్న 3.
భారతదేశంలో పంచవర్ష ప్రణాళికల సందర్భంగా పారిశ్రామిక అభివృద్ధిపై వ్యాఖ్యానించండి.
జవాబు.
భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలలో పారిశ్రామిక అభివృద్ధి :
భారతదేశంలో పారిశ్రామిక రంగం నిజమైన వృద్ధి మరియు అభివృద్ధి ఐదేళ్ల ప్రణాళికల కాలంలో ప్రారంభమైంది.

మొదటి పంచవర్ష ప్రణాళిక (1951-56) :
మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రధాన లక్ష్యం వ్యవసాయ అభివృద్ధిపై ఉంది. పత్తి, ఉన్ని మరియు జనపనార వస్త్రాలు, సిమెంట్, కాగితం, న్యూస్-ప్రింట్, పవర్ లూమ్స్, మందులు, పెయింట్స్, చక్కెర, వనస్పతి, రసాయన మరియు ఇంజనీరింగ్ వస్తువులు మరియు రవాణా పరికరాలు కొంత పురోగతిని చూపాయి.

రెండవ పంచవర్ష ప్రణాళిక (1956-61) :
రెండవ పంచవర్ష ప్రణాళికలో భారీ పరిశ్రమల స్థాపనకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇనుము – ఉక్కు హెవీ ఇంజనీరింగ్, లిగ్నైట్ ప్రాజెక్టులు మరియు ఎరువుల పరిశ్రమలపై ప్రధాన దృష్టి సారించడం జరిగింది. మూడు కొత్త ఇనుము మరియు ఉక్కు కర్మాగారాలు ఖిలాయి, దుర్గాపూర్, రుర్కెలా లో ఈ ప్రణాళిక కాలంలోనే స్థాపించబడ్డాయి.

మూడవ పంచవర్ష ప్రణాళిక (1961-66) :
రాంచీ యంత్ర పరికరాలు మరియు మరో మూడు హెచ్.ఎమ్.టి. యూనిట్లు ఏర్పాటు చేయబడ్డాయి. యంత్ర నిర్మాణం, లోకోమోటివ్ మరియు రైల్వే కోచ్ తయారీ, షిప్ బిల్డింగ్, ఎయిర్ క్రాఫ్ట్ తయారీ, రసాయనాలు, మందులు మరియు ఎరువుల పరిశ్రమలు కూడా స్థిరమైన పురోగతి సాధించాయి.

వార్షిక ప్రణాళికలు (1966-69) :
1966 మరియు 1969 మధ్య కాలం వార్షిక ప్రణాళికల కాలం, వార్షిక ప్రణాళికల కాలంలో పారిశ్రామిక ప్రగతి పెద్దగా పురోగతి సాధించలేకపోయింది.

నాల్గవ పంచవర్ష ప్రణాళిక (1969-74) :
నాల్గవ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలైన చక్కెర, పత్తి, జనపనార, వనస్పతి, లోహ ఆధారిత మరియు రసాయన పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. ఈ ప్రణాళిక సమయంలో మిశ్రమాలు, అల్యూమినియం, ఆటోమొబైల్స్, టైర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, యంత్ర పరికరాలు, ట్రాక్టర్లు మరియు ప్రత్యేక ఉక్కు పరిశ్రమలలో చాలా పురోగతి సాధించారు.

ఐదవ పంచవర్ష ప్రణాళిక (1974-79) :
ఈ ప్రణాళిక ప్రధాన దృష్టి ఉక్కు కర్మాగారాలు, ఎగుమతి-ఆధారిత వస్తువులు మరియు విరివిగా వినియోగించే వస్తువులు వేగంగా వృద్ధి చెందడం. అదనపు సామర్థ్యాన్ని’ సృష్టించడానికి సేలం, విజయనగర్, విశాఖపట్నం వద్ద ఉక్కు కర్మాగారాలను ప్రతిపాదించారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) ను ఏర్పాటు చేశారు.

ఆరవ పంచవర్ష ప్రణాళిక (1980-85) :
ఈ ప్రణాళికలో అల్యూమినియం, ఆటోమొబైల్స్, ఎలక్ట్రిక్ పరికరాలు, థర్మోస్టాట్లు వంటి పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వబడింది. వాణిజ్య వాహనాలు, మందులు, డి.వి. రిసీవర్లు, ఆటోమొబైల్స్, సిమెంట్, బొగ్గు, జనపనార పరిశ్రమ, ఫెర్రస్ కాని లోహాలు, వస్త్రాలు, రైల్వే వ్యాగన్లు, చక్కెర పరిశ్రమ మొదలైన పరిశ్రమలలో ఉత్పత్తి లక్ష్యాలను సాధించారు.

ఏడవ పంచవర్ష ప్రణాళిక (1985-90) :
ఏడవ పంచవర్ష ప్రణాళిక ప్రధాన లక్ష్యం ‘హైటెక్’ మరియు ఎలక్ట్రానిక్ పరిశ్రమల స్థాపన. ఈ ప్రణాళిక ప్రాధాన్యత వివిధ ప్రాంతాలకు పరిశ్రమల వ్యాప్తి, స్వయం ఉపాధి, స్థానిక వనరుల దోపిడీ మరియు సరైన శిక్షణ మొదలైనవి.

ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక (1992-97) :
1990 మరియు 1992 మధ్య కాలం వార్షిక ప్రణాళికల కాలం. 1991 లో భారత ప్రభుత్వ పారిశ్రామిక విధానంలో పెద్ద మార్పు వచ్చింది. విదేశీ బహుళ జాతుల పెట్టుబడుల కోసం సరళీకరణ విధానం అవలంబించబడింది. ప్రాంతీయ అసమానతలను తొలగించడం మరియు చిన్న మరియు అతి చిన్న రంగాలలో ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడం కోసం ప్రాధాన్యత ఇవ్వబడింది.

తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక (1997-2002) :
సిమెంట్, బొగ్గు, ముడి చమురు, వినియోగ వస్తువులు, విద్యుత్, మౌలిక సదుపాయాలు, శుద్ధి కర్మాగారం మరియు నాణ్యమైన ఉక్కు ఉత్పత్తులకు ఈ ప్రణాళికలో ప్రాధాన్యత ఇచ్చారు.

పదవ పంచవర్ష ప్రణాళిక (2002-07) : ఏదన పంచవర్ష ప్రణాళికలో

  • ఆధునీకరణ, సాంకేతిక పరిజ్ఞానం, లావాదేవీలు ఖర్చులను తగ్గించడం, ఎగుమతులను పెంచడం
  • ఎగుమతులను పెంచడానికి, ప్రపంచ పోటీతత్వాన్ని పెంచడానికి,
  • సమతులు ప్రాంతీయ అభివృద్ధిని సాధించడం అనేవి ప్రధాన లక్ష్యాలు.

పదకొండవ పంచవర్ష ప్రణాళిక (2007 – 12) :
పడకొండవ ప్రణాళిక వేగంగా పారిశ్రామిక అభివృద్ధి ఉండాలని, అది పేదరికాన్ని వేగంగా తగ్గిస్తుందని, ఉపాధిని అధికంగా సృష్టిస్తుందని, సమాజంలోని అన్ని వర్గాలకు ఆరోగ్యం మరియు విద్య వంటి అవసరమైన సేవలను అందించే పారిశ్రామిక అభివృద్ధిని త్వరితగతిన సాధించాలని గుర్తించింది. ఈ ప్రణాళిక కాలంలో, పారిశ్రామిక రంగంలో ఊహించిన వృద్ధి రేటు 10-11 శాతం, అయితే 8 శాతం వృద్ధిని సాధించింది.

పన్నెండవ పంచవర్ష ప్రణాళిక (2012 – 17) :
ఈ ప్రణాళిక భారతదేశ ఉత్పాదక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఉపాధిని సృష్టిస్తుందని మరియు దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళాలని భావించింది. పదకొండవ పంచవర్ష ప్రణాళికా కాలంలో పరిశ్రమ మరియు తయారీ సంబంధిత కార్యకలాపాలు 8 శాతం వృద్ధిని సాధించగా, ఈ ప్రణాళిక కాలంలో 11 శాతం వృద్ధి చెందాలని లక్ష్యంగా పెట్టుకుంది.

నీతి ఆయోగ్ (నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా) ఎస్ఐటిఐ :
దేశ ఆర్థికాభివృద్ధికి పంచవర్ష ప్రణాళికలను భారత ప్రణాళికా సంఘం పర్యవేక్షించింది. అయితే, 2014లో 65 ఏళ్ల ప్లానింగ్ కమిషన్ రద్దు చేయబడింది. దీని స్థానంలో ఎస్ఐటిఐ (నేషనల్ ఇన్సిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా – నీతి ఆయోగ్) అనే సంస్థను స్థాపించడం జరిగింది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 6 పారిశ్రామిక రంగం

ప్రశ్న 4.
భారతదేశంలో పారిశ్రామిక వెనుకబాటుతనానికి కారణాలు ఏమిటి ?
జవాబు.
పారిశ్రామిక వెనుకబాటుతనానికి కింద పేర్కొన్నవి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు :

1. బ్రిటీష్ పాలనా విధానం :
బ్రిటీష్ పరిపాలకులు ఈ ప్రాంతంలో సహజ వనరులను వారి సొంత ఆర్ధికాభివృద్ధికి ఉపయోగించుకున్నారు. ఈ విధానం చెడు ప్రభావాన్ని చూపించింది. ఇది మనకు అధిక నష్టాలను తెచ్చిపెట్టింది.

2. ఖనిజ వనరులు లేకపోవడం:
పారిశ్రామికా వృద్ధికి అవసరమైన చమురు, బొగ్గు వంటి ఖనిజ వనరులు తగినంతగా లేవు. అందువల్ల భారతదేశం, పాకిస్తాన్లలో పారిశ్రామికాభివృద్ధి రేటు చాలా తక్కువగా ఉంది.

3. మూలధనం లేకపోవడం :
భారతదేశంలో తక్కువ తలసరి ఆదాయం కారణంగా పోదుపు రేటు తక్కువగా ఉంది. పొదుపు రేటు తక్కువ కావటం వల్ల పెట్టుబడి రేటు చాలా తక్కువగా ఉంది. ఇది పారిశ్రామికీకరణకు ప్రధాన ఆటంకంగా పరిణమించింది.

4. పరపతి సౌకర్యాలు లేకపోవటం :
పరిశ్రమలకు అవసరమైన పరపతి సౌకర్యాలను కల్పించే విత్త సంస్థలు తగినంతగాలేవు.

5. విదేశీ మారక ద్రవ్యం లేకపోవటం:
పారిశ్రామిక రంగానికి అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవటానికి అవసరమైన విదేశీ మారక ద్రవ్యం కొరతగా ఉంది. మనం విదేశీ రుణాలు తీర్చుకోవాలి అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవాలి అనేవి విదేశీ మారక ద్రవ్యంపై ఆధారపడి ఉంటుంది. అందుకే పారిశ్రామిక అభివృద్ధికి విదేశీ మారక ద్రవ్య లోటు ప్రధాన సమస్యగా పరిగణించవచ్చు.

6. సాంకేతిక నిపుణులు లేకపోవటం :
దురదృష్టవశాత్తు భారతదేశంలో నైపుణ్యం గల వ్యక్తులు లేకపోవటం పరిశ్రమలకు పెద్ద లోపంగా ఉంది. మన దేశంలోని నైపుణ్యం గల వ్యక్తులు విదేశాలలో అధిక ప్రతిఫలాలకు పని చేస్తున్నారు. కాబట్టి మనం విదేశీ నిపుణులకు ఎక్కువ మొత్తం చెల్లించవలసి వస్తున్నది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 6 పారిశ్రామిక రంగం

7. రవాణా సౌకర్యాలు లేకపోవటం :
మన దేశంలో రవాణా వ్యవస్థ వెనుకబడి ఉంది. అందుబాటులో ఉన్న సదుపాయాలు ఖరీదైనవి మరియు తగినంతగా లేవు. రోడ్లు, రైల్వే రవాణా పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి.

8. పారిశ్రామిక పరిశోధన లేకపోవటం :
దేశంలో పారిశ్రామిక పరిశోధన లేకపోవటం వల్ల ఉత్పత్తి పద్ధతులలో నవకల్పనలు లేవు. ఉత్పత్తి వ్యయాలు పెరిగి ఉత్పత్తికి డిమాండు తగ్గుతోంది.

9. ఇంధనం కొరత :
మనదేశంలో విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయటానికి అవసరమైన నీరు, బొగ్గు, అణుశక్తి మొదలైన వనరులు పరిమితంగా ఉండటం వల్ల పరిశ్రమలకు అవసరమైన విద్యుచ్ఛక్తి కొరతగా ఉంది.

10. పన్నులలో పెరుగుదల :
పారిశ్రామిక ఉత్పత్తి మీద భారీగా పన్నులు విధించడం, ఎక్కువగా దిగుమతి మరియు ఎగుమతి సుంకాలను విధించడం వల్ల పారిశ్రామిక ఉత్పత్తి నిరుత్సాహపడింది.

11. పరిమిత మార్కెట్ :
మన వస్తువులకు దేశీయ మార్కెట్ పరిమితంగా ఉంది. మరో వైపు వస్తువుల నాణ్యత చాలా తక్కువగా ఉండటం వల్ల అవి విదేశీ మార్కెట్లో పోటీ చేయలేకపోతున్నాయి. కాబట్టి మన వస్తువులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లు పరిమితంగా ఉన్నాయి.

12. శ్రామికుల ధోరణి (Attitute of Labour) :
శ్రామికుల నాణ్యత తక్కువగా ఉంది మరియు పని చేసే ధోరణి లేదు. రాజకీయ పార్టీలు వాటి ప్రయోజనాలకోసం శ్రామికులను వాడుకుంటున్నాయి. ఈ కారణాలు పారిశ్రామిక ఉత్పత్తిని నిరుత్సాహపరుస్తున్నాయి.

13. లోప భూయిష్టమైన ప్రణాళిక :
పారిశ్రామిక రంగంలో ప్రభావంతమైన ప్రణాళిక లేదు. పారిశ్రామిక రంగంలోని వివిధ విభాగాల మధ్య సమన్వయం లేదు. ఫలితంగా ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 6 పారిశ్రామిక రంగం

ప్రశ్న 5.
పారిశ్రామిక విధాన తీర్మానాలు 1948 మరియు 1956 యొక్క లక్షణాలను చర్చించండి.
జవాబు.
ఆగస్ట్ 15, 1947 నాడు దేశం స్వాతంత్ర్యాన్ని పొందిన తరువాత పారిశ్రామికాభివృద్ధి కోసం ప్రాధాన్యతా అంశాలను నిర్ణయించడానికి, ప్రస్తుతం ఉన్న పరిశ్రమలను జాతీయీకరణ చేయడంపై ప్రైవేట్ వ్యవస్థాపకుల మనస్సులలో ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికి, ఒక నూతన విధానాన్ని ప్రకటించవలసిన అవసరం ఏర్పడింది.

మన రాజ్యాంగాన్ని అనుసరించక పూర్వం, న్యాయ వ్యవస్థ ఏర్పడక పూర్వం పారిశ్రామిక విధాన తీర్మానం, 1948ని జానీ చేశారు. పారిశ్రామికాభివృద్ధిలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల రెండింటినీ భాగస్వాములను చేస్తూ భారత ప్రభుత్వం ఏప్రిల్ 6, 1948 వ సంవత్సరంలో పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రకటించింది. దాని ప్రకారం పరిశ్రమలను నాలుగు విభాగాలుగా వర్గీకరించారు.

ఎ) కేవలం ప్రభుత్వ ఏకస్వామ్యాలు :
వీటిలోకి ఆయుధాలు మరియు ఆయుధ సామాగ్రి, అణుశక్తి ఉత్పత్తి మరియు నియంత్రణ, రోడ్డు రవాణా నిర్వాహణ మొదలైనవి వస్తాయి. ఈ పరిశ్రమలు కేవలం కేంద్ర ప్రభుత్వ ఏకస్వామ్యంలోకి వస్తాయి.

బి) నూతన సంస్థలకు ప్రభుత్వ ఏకస్వామ్యాలు :
బొగ్గు, ఇనుము, ఉక్కు, విమానాల తయారీ, నౌకా నిర్మాణం, టెలిఫోన్, టెలిగ్రాఫ్, వైర్లెస్లు తయారు చేయడం, ఖనిజ నూనెలు ఈ విభాగంలోకి వస్తాయి ఈ విభాగంలో కొత్త సంస్థలను కేవలం రాష్ట్ర ప్రభుత్వంలోకి మాత్రమే తీసుకోవాలి.

సి) ప్రభుత్వ క్రమబద్ధీకరణ :
యంత్ర పరికరాలు, రసాయనాలు, ఎరువులు, నాన్-ఫెర్రస్ లోహాలు, రబ్బరు తయారీ, సిమెంటు కాగితం, సమాచార ముద్రణ, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ మొదలైన పరిశ్రమలు ఈ విభాగంలోకి వస్తాయి. వీటికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించడం, వాటికి ప్రణాళికను తయారు చేయడం, నియంత్రణ చేయడం తప్పనిసరి.

డి) క్రమబద్దీకరించని ప్రైవేట్ సంస్థ : ఈ విభాగంలో పరిశ్రమలు ప్రైవేట్ రంగానికి వ్యక్తులు, సహకార సంఘాలకు విడిచిపెట్టారు.

TS Inter 2nd Year Economics Study Material Chapter 6 పారిశ్రామిక రంగం

1. పరిశ్రమల వర్గీకరణ : ఈ తీర్మానంలో మూడు జాబితాలు ఉన్నాయి.

  1. జాబితా ఎ లో 17 పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమలలోని అన్ని నూతన యూనిట్లను ప్రభుత్వమే స్థాపించాలి.
  2. జాబితా బి లో 12 పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమలన్నీ భవిష్యత్తులో ప్రభుత్వ యాజమాన్యంలో ఉంటాయి. ఈ రంగంలో ప్రైవేటు సంస్థలు వాటి కృషిని ప్రభుత్వ కృషికి అదనంగా జోడించవచ్చు.
  3. జాబితా సి లో మిగిలిన పరిశ్రమలన్నీ వస్తాయి. ఈ పరిశ్రమల అభివృద్ధిని ప్రైవేటు రంగంలోని వ్యవస్థాపకుల ఉద్యమిత్వానికి, చొరవకు వదిలేశారు.

2. ప్రైవేట్ రంగానికి సహాయం :
పారిశ్రామిక విధాన తీర్మానం 1956 ప్రభుత్వ రంగానికి ప్రధాన పాత్ర ఇచ్చినప్పటికీ, ప్రైవేటు రంగానికి కూడా సముచిత స్థానం కల్పించింది. ప్రైవేటు రంగానికి సహాయం చేయడం కోసం విద్యుచ్ఛక్తి, రవాణా మొదలైన అవస్థాపనా సౌకర్యాలను ప్రభుత్వం బలోపేతం చేసింది.

3. కుటీర మరియు చిన్న తరహా పరిశ్రమల పాత్ర విస్తరణ :
పారిశ్రామికాభివృద్ధిలో ప్రాంతీయ అసమానతలను తగ్గించడానికి, స్థానికంగా లభ్యమయ్యే శ్రామిక శక్తిని వనరులను ఉపయోగంలోకి తేవడానికి, ఎక్కువగా ఉద్యోగ అవకాశాలను సృష్టించడానికి కుటీర, చిన్న తరహా పరిశ్రమల పాత్ర మీద 1956 పారిశ్రామిక విధాన తీర్మానం ప్రాధాన్యత ఇచ్చింది.

4. వివిధ ప్రాంతాల మధ్య సంతులిత పారిశ్రామికాభివృద్ధి :
పారిశ్రామికాభివృద్ధిలో ప్రాంతీయ అసమానతలు తగ్గించడానికి పారిశ్రామిక విధాన తీర్మానం, 1956 దోహదపడింది. పారిశ్రామికంగా వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధి అవకాశాలను అందుబాటులోకి తీసుకురావచ్చని ఈ విధానం తెలియజేసింది.

వెనుకబడిన ప్రాంతాలలో ఎక్కువగా ప్రభుత్వ రంగ పరిశ్రమలను స్థాపించడంతో పాటు, పన్ను రాయితీలు, సబ్సిడీలు ఇవ్వడం వంటి ప్రోత్సాహకాలను వెనుకబడిన ప్రాంతాలలో పరిశ్రమలను స్థాపించే వ్యవస్థాపకులకు ప్రభుత్వం ప్రకటించింది.

5. విదేశీ మూలధనం :
దేశ ఆర్ధికాభివృద్ధిలో విదేశీ మూలధన పాత్రను పారిశ్రామిక విధాన తీర్మానం 1956 గుర్తించింది. విదేశీ మూలధనం దేశంలోకి రావటాన్ని దేశం స్వాగతించింది. కాని సంస్థల్లో ప్రధాన వాటా, నిర్వహణ, యాజమాన్యం, నియంత్రణ మన దేశ పౌరుల చేతులలోనే ఉన్నప్పుడు మాత్రమే విదేశీ మూలధనాన్ని దేశంలోకి అనుమతించాలని ఈ విధానం స్పష్టంగా తెలియజేసింది.

6. నిర్వహణ, సాంకేతిక అభివృద్ధి :
సంస్థలను స్థాపించి, వాటిని బలోపేతం చేయాలి. ప్రభుత్వ సేవలలో కూడా సరైన నిర్వహణ నిపుణులను, సాంకేతిక నిపుణులను నియమించాలని ఈ విధానం పేర్కొంది.

7. శ్రామికులకు ప్రోత్సాహకాలు :
అభివృద్ధి అనే లక్ష్యంలో భాగస్వాములుగా శ్రామికులు ప్రధానపాత్ర పోషిస్తారని పారిశ్రామిక విధాన తీర్మానం, 1956 గుర్తించింది. కాబట్టి ఈ విధానం శ్రామికుల పని, సేవల పరిస్థితులను అభివృద్ధి చేయటానికి తగినన్ని ప్రోత్సాహకాలను కల్పించింది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 6 పారిశ్రామిక రంగం

ప్రశ్న 6.
పారిశ్రామిక విధాన తీర్మానం, 1991ను విమర్శనాత్మకంగా పరిశీలించండి.
జవాబు.
జూన్ 1991 లో శ్రీ.పి.వి నరసింహారావు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆర్ధిక వ్యవస్థలో సరళీకరణను, సంస్కరణలను అది ప్రవేశపెట్టింది. ఈ నూతన వాతావరణంలో ప్రభుత్వం ఒక నూతన పారిశ్రామిక విధానాన్ని జూలై 24, 1991న ప్రకటించింది. ఈ నూతన విధానం పారిశ్రామిక ఆర్ధిక వ్యవస్థను బాగా సులభతరం చేసింది.

ఇప్పటి వరకు సంపాదించుకున్న వాటిని నిలబెట్టుకోవడం, వ్యవస్థలో ఉండే లోపాలను సరిదిద్దటం ఉత్పాదకతలో స్థిరమైన వృద్ధిని కొనసాగించడం, ఉద్యోగ అవకాశాలను కల్పించడం, విదేశీ సంస్థల పోటీని తట్టుకోవడం అనేవి ఈ నూతన విధానం యొక్క ప్రధాన లక్ష్యాలు.

అంశాలు:
1. పారిశ్రామిక లైసెన్సింగ్ పద్ధతిని తొలగించడం :
ఆర్ధిక వ్యవస్థను సరళీకరణ వైపు నడిపించడానికి నూతన పారిశ్రామిక విధానం రక్షణ, వ్యూహాత్మక, సాంఘిక కారణాలు గల కొన్ని పరిశ్రమలను తప్ప అన్ని పారిశ్రామిక లైసెన్స్లను తొలగించింది. 1999 ఫిబ్రవరిలో చేసిన చట్ట సవరణ ప్రకారం ప్రస్తుతం ఆరు పరిశ్రమలకు మాత్రమే లైసెన్స్లు తప్పనిసరిగా ఉండాలి.

అవి : ఆల్కహాల్, రెట్లు, హానికరమైన రసాయనాలు, మత్తుపదార్థాలు, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, రక్షణకు అవసరమైన పరికరాలు, పారిశ్రామిక ప్రేలుడు పదార్థాలు మొదలైనవి పారిశ్రామిక విధానం సూచించింది.

ఈ విధంగా నూతన విధానం మంచి పారిశ్రామిక వాతావరణంలో అందుబాటులో ఉన్న వ్యవస్థ ఉద్యమిత్వ నైపుణ్యాలను మంచిగా ఉపయోగించుకుంటూ, మార్కెట్లో ఎక్కువ స్నేహపూర్వకంగా ఉండాలని సూచించింది. పరిశ్రమలు వేగవంతంగా వృద్ధి చెందాలని నూతన పారిశ్రామిక విధానం 1991 భావించింది.

1991 నూతన పారిశ్రామిక విధానంపై విమర్శనాత్మక విశ్లేషణ :
భారతదేశ ఆర్ధిక వ్యవస్థపైన, సమాజంపైన 1991 విధానం అధిక ప్రభావం కలిగి ఉంది, దీనిలో అనుకూల ప్రతికూల ప్రభావాలు ఉన్నాయి, వాటిని కింది విధంగా సంక్షిప్తీకరించవచ్చు.

TS Inter 2nd Year Economics Study Material Chapter 6 పారిశ్రామిక రంగం

అనుకూల ప్రభావం :
1. ప్రస్తుతం సృజనాత్మకత మరియు నవకల్పనలు, తప్పనిసరి అయ్యాయి. పరిశోధన మరియు అభివృద్ధిపై నిరంతరంగా శ్రద్ధ వహించడంతో పరిజ్ఞానం పెరుగుతుంది, వస్తువుల రూపకల్పనలో సృజనాత్మకతను తీసుకురావడానికి పరిశోధన అభివృద్ధిపై పరిశ్రమలు, తమ దృష్టిని కేంద్రీకరించడం.
2. 1991 విధానం తరువాత నాణ్యత అనే అంశానికి చాలా గుర్తింపు ఉంది. పస్తువుల తయారీ నుంచి అవి వినియోగదారుడికి చేరే వరకు అన్ని స్థాయిల్లోను మొత్తం నాణ్యతను కొనసాగించడంపై దృష్టి కేంద్రీకరించడం.

2. ప్రభుత్వ రంగ పాత్రను నిర్వీర్యం చేయడం :
1956 నుంచి ప్రభుత్వ రంగంలో 17 పరిశ్రమలు ఉండేవి. ఈ సంఖ్య 3కు తగ్గించబడింది. అవి. 1. ఆయుధాలు, ఆయుధసామాగ్రి, రక్షణకు సంబంధించిన పరికరాలు. 2. అణుశక్తి 3. రైలు రవాణా మొదలైనవి. ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన ప్రభుత్వ విధానంలోని ప్రధాన అంశాలు క్రింది విధంగా ఉన్నాయి.

  • వ్యూహాత్మకం కాని ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రభుత్వ ఈక్విటీని అవసరమైతే 26 శాతం లేదా అంతకంటే తక్కువకు తగ్గించడం.
  • ప్రభుత్వ రంగ సంస్థల ఉత్పాదక సామర్థ్యాన్ని పునర్నిర్మించడం.
  • పునర్నిర్మించలేని ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయడం.
  • శ్రామికుల ఆసక్తులను పూర్తిగా పరిరక్షించడం.

3. MRTP Act:
MRTP చట్టాన్ని సవరించారు. దాని ప్రకారం MRTP కంపెనీ ఆస్తుల పరిమితిని ఎత్తివేశారు. తక్కువ సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే ప్రభుత్వ రంగ సంస్థలు, చిన్న తరహా సంస్థలు, వ్యూహాత్మకం కాని ప్రదేశంలో ప్రస్తుతం పనిచేసే సంస్థలను ప్రభుత్వ పునః సమీక్షిస్తుందని నూతన పారిశ్రామిక విధానం తెలియజేసింది.

రుగ్మత గల సంస్థల పునరావాసం, పునర్నిర్మాణం కోసం పారిశ్రామిక, విత్త పునర్నిర్మాణ బోర్డును సలహా కోసం సంప్రదించాలని ప్రభుత్వం కోరింది. ప్రభుత్వ రంగంలో మిగిలిన సంస్థలకు అవగాహన పత్రం ద్వారా నిర్వహణలో అధిక స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది.

4. విదేశీ పెట్టుబడి ప్రవేశానికి, సాంకేతిక పరిజ్ఞాన ప్రవేశానికి స్వేచ్ఛ :
మేలైన సాంకేతిక పరిజ్ఞానం కోసం, ఆధునికీకరణ కోసం ఎగుమతులను అంతర్జాతీయ ప్రమాణాలతో వస్తు సేవలను సమకూర్చుకోవడానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ప్రవాహాన్ని పెంచడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకని దేశీయ కృషికి అనుబంధంగా ముఖ్యంగా అవస్థాపన సౌకర్యాల రంగంలో విదేశీ పెట్టుబడిని ప్రోత్సహించాలని ఈ విధానం ద్వారా ప్రభుత్వం తెలియజేసింది.

5. పారిశ్రామిక స్థల నిర్ణయ విధానాన్ని సరళీకరించడం :
ఒక మిలియన్ జనాభా కంటే ఎక్కువగా ఉన్న నగరాలను మినహాయిస్తే లైసెన్సు తప్పనిసరిగా తీసుకోవాలనే నిబంధనను మినహాయిస్తే పరిశ్రమలను స్థాపించడానికి కేంద్రం నుంచి ఎటువంటి పారిశ్రామిక అనుమతి తీసుకోనవసరం లేదని పారిశ్రామిక విధాన తీర్మానం తెలియజేస్తుంది.

6. తప్పనిసరిగా మార్చే క్లాజును తొలగించడం :
భారతదేశ పారిశ్రామిక పెట్టుబడిలో ఎక్కువ భాగం బాంకులు, విత్త సంస్థలు రుణాల రూపంలో సమకూర్చాయి. ఈ సంస్థల నూతన పరిశ్రమలకు రుణాలు ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా మార్చే క్లాజును తప్పనిసరి చేశాయి.

వాటి యాజమాన్యం అవసరం అని భావిస్తే వారి రుణాలలో కొంత భాగాన్ని ఈక్విటీ రూపంలోకి మార్చుకునే సదుపాయం తప్పనిసరిగా ఉండాలనే నిబంధన ఉండేది. కాని విత్త సంస్థలు ఇలాంటి తప్పనిసరిగా మార్చే క్లాజును తొలగించాలని నూతన పారిశ్రామిక విధానం సూచించింది.

ఈ విధంగా నూతన పారిశ్రామిక విధానం ప్రకారం రవాణా, బ్యాంకింగ్, సమాచారం మొదలైన అవస్థాపన సౌకర్యాల వృద్ధిని విస్తరించింది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 6 పారిశ్రామిక రంగం

ప్రశ్న 7.
1991 సం|| నుండి భారతదేశంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలను వివరించండి.
జవాబు.
సరళీకరణ, ప్రైవేటీకరణ మరియు ప్రపంచీకరణ (Liberalization, Privatization and Globalization -LPG) : ఆర్థిక సంస్కరణల ముఖ్యమైన లక్ష్యాలు

  1. సరళీకరణ
  2. ప్రైవేటీకరణ మరియు
  3. ప్రపంచీకరణ, వీటిని క్లుప్తంగా LPG అని పిలుస్తారు.

లక్షణాలు : వీటిని క్రింది విధంగా వివరించవచ్చును.

I. సరళీకరణ (Liberalization) :
పారిశ్రామిక రంగంపై అనవసరమైన నియంత్రణలు మరియు నిబంధనలను తొలగించడానికి కొత్త ఆర్థిక విధానం అనేక సరళీకరణ చర్యలను ప్రవేశపెట్టింది. సరళీకరణ అనేది వాణిజ్యం మరియు పరిశ్రమలపై పరిమితులను తొలగించడాన్ని సూచిస్తుంది. సరళీకరణ ప్రధాన లక్ష్యం అనవసరమైన బ్యూరోక్రాటిక్ నియంత్రణల నుండి పారిశ్రామిక రంగాన్ని విడదీయడం.

సరళీకరణ విధానం యొక్క ప్రధాన లక్షణాలు :

1. పారిశ్రామిక లైసెన్సింగ్ రద్దు :
1991 కొత్త పారిశ్రామిక విధానం భద్రత మరియు వ్యూహాత్మక విధానాల కారణంగా ఎంచుకున్న 18 పరిశ్రమలు మినహా అన్ని పరిశ్రమలకు పారిశ్రామిక లైసెన్సింగ్ను రద్దు చేసింది. ప్రమాదకర రసాయనాలను తయారుచేసే పరిశ్రమలు మరియు పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమలు వీటిలో ఉన్నాయి.

2. పరిమితుల తొలగింపు :
పైన పేర్కొన్న 18 మినహా అన్ని పరిశ్రమలు ఎటువంటి పరిమితులు లేకుండా వాటాలను విక్రయించవచ్చు. వారు తమ వ్యాపారాన్ని విస్తరించవచ్చు మరియు ఎటువంటి లైసెన్స్ పొందకుండానే కొత్త ఉత్పత్తి శ్రేణిని ప్రారంభించవచ్చు.

3. MRTP పరిమితుల సడలింపు :
సంస్కరణలు ప్రవేశ పెట్టడానికి ముందు, గుత్తాధిపత్య మరియు నియంత్రణ వాణిజ్య పద్ధతులు (MRTP) చట్టం ప్రకారం రూ.100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడిగల పరిశ్రమలపై అనేక ఆంక్షలు విధించబడ్డాయి. ఇదినరిలో ఏదైనా పెట్టుబడి నిర్ణయం కోసం వారు ప్రీ-ఎంట్రీ సమీక్ష చేయవలసి వచ్చింది. సరళీకరణ విధానం ద్వారా ఈ పరిమితులు తొలగించబడ్డాయి.

MRTP చట్టం ఇప్పుడు పోటీ చట్టం, 2002 ద్వారా భర్తీ చేయబడింది, ఇది 2009 నుండి అమల్లోకి వచ్చింది. పోటీ చట్టం అన్ని పోటీ వ్యతిరేక పద్ధతులను తనిఖీ చేస్తుంది మరియు ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేయడాన్ని నిషేధిస్తుంది. వినియోగదారుల ఆసక్తిని కాపాడటానికి మార్కెట్లో పోటీని ప్రోత్సహించడం మరియు నిలబెట్టడం దీని లక్ష్యం.

TS Inter 2nd Year Economics Study Material Chapter 6 పారిశ్రామిక రంగం

4. విదేశీ పెట్టుబడులు :
1991 సంస్కరణలు విదేశీ పెట్టుబడులకు అనేక విధానపరమైన అడ్డంకులను తొలగించాయి. అధిక ప్రాధాన్యత కలిగిన పరిశ్రమల ఈక్విటీలో 51 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి లభించింది. సరళీకరణ చర్యలు చిన్న తరహా పరిశ్రమలపై పెట్టుబడి పరిమితిని పెంచాయి. సాధారణ విధానాలతో విదేశాల నుండి పెట్టుబడులు పెంచడానికి పరిశ్రమలను కూడా అనుమతించారు.

5. విదేశీ సాంకేతిక పరిజ్ఞానం :
విదేశీ సాంకేతిక’ ఒప్పందాలకు సంబంధించి భారతీయ పరిశ్రమలకు ప్రత్యేకించి అధిక ప్రాధాన్యత కలిగిన పరిశ్రమల విషయంలో స్వయంచాలక ఆమోదం లభించింది.

విదేశీ సాంకేతిక నిపుణులను నియమించడానికి మరియు దేశీయంగా అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం యొక్క విదేశీ పరీక్షలకు అనుమతులు అవసరం లేదు. ఈ చర్యలన్నీ పారిశ్రామిక రంగం పనితీరును మెరుగుపరిచాయి మరియు విదేశాలలో ఉన్న పరిశ్రమల నుండి పోటీని ఎదుర్కోవటానికి దేశీయ పరిశ్రమలు సమర్థవంతంగా మారవలసి వచ్చింది.

II. ప్రైవేటీకరణ :
ప్రైవేటీకరణ అనేది ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రైవేట్ యాజమాన్యాన్ని ప్రవేశపెట్టడాన్ని సూచిస్తుంది. ఆర్థిక సంస్కరణల సమయంలో ప్రవేశపెట్టిన ప్రైవేటీకరణ చర్యలు ప్రభుత్వ రంగానికి ప్రత్యేకంగా కేటాయించిన పరిశ్రమల సంఖ్యను 17 నుండి 8 కి తగ్గించాయి.

ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రభుత్వ హెల్డింగ్ విక్రయించబడింది. నిర్వహణలో అసమర్థత, ఆవిష్కరణలు లేకపోవడం మరియు పరిశోధన – అభివృద్ధిలో పెట్టుబడులు లేకపోవడం వల్ల అనేక ప్రభుత్వ-రంగ యూనిట్లు నష్టాలను చవిచూశాయి.

భారతదేశంలో ప్రవేశ పెట్టిన వివిధ ప్రైవేటీకరణ చర్యలు :

  1. ప్రభుత్వ రంగ యూనిట్ల యాజమాన్యాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా ప్రైవేటు చేతులకు అప్పగించడం ద్వారా బదిలీ చేయడం.
  2. పెట్టుబడుల విధానాల ద్వారా నియంత్రణను ప్రైవేటు రంగానికి బదిలీ చేయడం.
  3. ప్రభుత్వ రంగానికి ప్రత్యేకంగా కేటాయించిన పరిశ్రమలను తెరవడం.
  4. ఫ్రాంచైజింగ్, కాంట్రాక్ట్ మరియు లీజింగ్ ద్వారా నిర్వహణను ప్రైవేటు రంగానికి బదిలీ చేయడం.
  5. ప్రభుత్వ రంగ పరిధిని పరిమితం చేయడం.

III. ప్రపంచీకరణ (Globalization) :
వస్తువులు, సేవలు, ప్రజలు, ఆలోచనలు, సాంకేతికత మొదలైన వాటి కదలికను సులభతరం చేసే లక్ష్యంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో దేశీయ ఆర్ధిక వ్యవస్థను ఏకీకృతం చేయడం ప్రపంచీకరణ అని నిర్వచించవచ్చు. ఇది అంతర్జాతీయ పోటీకి ఆర్ధిక వ్యవస్థను తెరవడాన్ని సూచిస్తుంది.

1991లో చేపట్టిన ప్రపంచీకరణ చర్యల ప్రధాన లక్షణాలు :

1. వాణిజ్య అవరోధాల తగ్గింపు :
వాణిజ్య అవరోధాలు దేశాల మధ్య వస్తువులు మరియు సేవల ఉచిత ప్రవాహాన్ని పరిమితం చేస్తాయి. ప్రపంచీకరణ చర్యలను ప్రవేశ పెట్టడంతో ఈ పరిమితులు తొలగించబడ్డాయి. ప్రపంచీకరణ భారతదేశం మరియు ఇతర దేశాల మధ్య వస్తువులు మరియు సేవలను సజావుగా మార్పిడి చేయడానికి వాతావరణాన్ని సృష్టించింది. భారతీయ పరిశ్రమలకు తమ మార్కెట్లను విదేశాలకు విస్తరించడానికి ఇది అపారమైన అవకాశాలను కల్పించింది.

2. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రోత్సాహం :
ప్రపంచీకరణ ప్రవేశపెట్టడంతో, అనేక భారతీయ పరిశ్రమలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తెరవబడ్డాయి. తక్కువ ఉత్పత్తి వ్యయం, తక్కువ కార్మిక వనరుల లభ్యత కారణంగా భారతదేశం విదేశీ పెట్టుబడిదారులకు అనుకూలమైన పెట్టుబడి గమ్యస్థానంగా మారింది. విదేశీ బ్యాంకుల పోటీ కారణంగా బ్యాంకింగ్ రంగం సామర్థ్యం కూడా మెరుగుపడింది.

3. సామర్థ్యాన్ని ప్రోత్సహించడం :
ప్రపంచీకరణ దేశీయ పరిశ్రమలను ప్రపంచ స్థాయిలో పోటీని ఎదుర్కోవటానికి మరింత సమర్ధవంతంగా ఉండటానికి ప్రోత్సహించింది. విదేశీ ఉత్పత్తిదారులు చౌకైన, ఉన్నత నాణ్యమైన వస్తువులతో పోటీ పడటానికి దేశీయ పరిశ్రమలు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేయాల్సి వచ్చింది.

4. సాంకేతిక పరిజ్ఞానం విస్తరణ :
ప్రపంచీకరణ భారత దేశానికి ప్రపంచ సాంకేతిక పరిత్యాగాన్ని పొందటానికి అవకాశాన్ని కల్పించింది. మరియు విస్తరణను వేగం చేసింది. పరిశోధన మరియు అభివృద్ధిలో ఎక్కువ పెట్టుబడి లేకుండా అభివృద్ధి చెందిన దేశాల సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ ఉపయోగించుకోగలిగింది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 6 పారిశ్రామిక రంగం

ప్రశ్న 8.
ప్రయివేటీకరణ అంటే మీరు ఏమి అర్థం చేసుకున్నావు ? దానిని భారతదేశంలో అమలు చేయడానికి గల కారణాలను చర్చించండి.
జవాబు.
1991 ఆర్థిక సంస్కరణల్లో భాగమైన భారతదేశంలో ప్రైవేటీకరణ తరంగం ప్రైవేటు రంగం పాత్రను పెంచింది మరియు ప్రభుత్వ రంగాన్ని ప్రాధాన్యతా పరిశ్రమలకు పరిమితం చేసింది. ఆ పరిశ్రమలు ఏవనగా :

  1. భౌతిక మరియు సామాజిక మౌలిక సదుపాయాలు
  2. మైనింగ్ మరియు చమురు అన్వేషణ
  3. వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన ఉత్పత్తుల తయారీ మరియు భద్రతపరమైన విషయంలో రక్షణ పరికరాల తయారీ విషయంలో మరియు
  4. భారీ వ్యయం అవసరమయ్యే సాంకేతిక పరిజ్ఞానంలో మరియు ప్రైవేటు రంగ పెట్టుబడులు సరిపోని చోట పెట్టుబడి.

ఈ క్రింది కారణాల వల్ల 1991 లో ఆర్థిక సంస్కరణల్లో భాగంగా భారతదేశంలో ప్రైవేటీకరణ చర్యలు ప్రవేశపెట్టబడ్డాయి.

1. ప్రభుత్వ భారాన్ని తగ్గించడానికి :
ప్రభుత్వ రంగ సంస్థలు భారతదేశంలో పారిశ్రామిక వృద్ధికి ఆధారాన్ని సృష్టించాయి. అయినప్పటికీ ప్రాజెక్టులు పూర్తి చేయడంలో ఆలస్యం, ఉత్పత్తి వ్యయం పెరగడం నల్ల అనేక ప్రభుత్వ రంగ సంస్థలు నిరంతరం నష్టాలను చవిచూస్తున్నాయి. అనేక ప్రభుత్వ రంగ యూనిట్లు కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించడానికి మాత్రమే పనిచేస్తున్నాయి. ప్రైవేటీకరణ ప్రభుత్వం నుండి ఈ భారాన్ని, వనరులపై ఒత్తిడిని తగ్గించింది.

2. సామర్థ్యాన్ని ప్రోత్సహించడానికి :
అసమర్థ నిర్వహణ, పారదర్శకత లేకపోవడం మరియు అవినీతి కారణంగా చాలా ప్రభుత్వ రంగ సంస్థలు సమస్యలు ఎదర్కొంటున్నాయి. పేలవమైన పారిశ్రామిక సంబంధాలు మరియు అధిక సిబ్బంది ఉత్పాదకతను తగ్గించి ఈ యూనిట్లకు నష్టాన్ని కలిగించాయి. తీసుకున్న చర్యలతో ఈ సమస్యల నుండి చాలా సంస్థలు బయటపడ్డాయి మరియు ప్రభుత్వ రంగ యూనిట్లు వాంఛనీయ ఉత్పాదకతను సాధించగలిగాయి.

3. పెట్టుబడి అవకాశాలను మెరుగుపరచడానికి :
నిర్వహణలో ఉన్న అసమానతలను తగ్గించడంలో ప్రైవేటీకరణ సహాయపడింది మరియు అనేక ప్రభుత్వ రంగ యూనిట్ల ఆర్థిక స్థితిని మెరుగుపరిచింది. ఇది మంచి రాబడిని తెచ్చి పెట్టుబడులను ఆకర్షించింది.

4. మౌలిక సదుపాయాల వృద్ధిని సులభతరం చేయడానికి :
పరిశ్రమల ప్రైవేటీకరణ ఆధునిక మార్గాల్లో పారిశ్రామిక రంగం వృద్ధికి దారితీసింది. ప్రైవేట్ సంస్థలు పోటీ ఉత్పత్తులు మరియు సేవలను అందించడానికి మౌలిక సదుపాయాల అభివృద్ధిని సాధిస్తూ ప్రక్రియను సులభతరం చేశాయి.

5. అనవసరమైన బ్యూరోక్రాటిక్ జోక్యాలను తగ్గించడానికి :
ప్రైవేటీకరణ నిర్వహణలో అనవసరమైన ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించింది. తద్వారా ప్రైవేట్ సంస్థలకు నిర్వహణ, కార్యకలాపాలలో మరింత స్వయం ప్రతిపత్తి లభించింది. ఇది వారి సామర్థ్యాన్ని, లాభదాయకతను పెంచింది. పరిమితుల తొలగింపు అవినీతిని సమర్థవంతంగా తగ్గించింది మరియు ఉత్పాదకతను మెరుగుపరిచింది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 6 పారిశ్రామిక రంగం

ప్రశ్న 9.
చిన్నతరహా మరియు కుటీర పరిశ్రమలు అంటే ఏమిటి ? చిన్నతరహా పరిశ్రమల లక్షణాలను తెలియచేయండి.
జవాబు.
ప్లాంటు మరియు యంత్రాలపై స్థిర పెట్టుబడి 25 లక్షల రూపాయల కంటే ఎక్కువ లేదా కోటి రూపాయలకు మించకుండా ఉండే పారిశ్రామిక యూనిట్లను చిన్న తరహా పరిశ్రమ అంటారు.

లక్షణాలు :

  1. యాజమాన్యం : చిన్నతరహా యూనిట్ యాజమాన్యం సొంత వ్యాపారంతో అయితే ఒక వ్యక్తి లేదా భాగస్వామ్యంలో అయితే కొద్ది మంది వ్యక్తుల ఆధీనంలో ఉంటుంది.
  2. నిర్వాహణ, నియంత్రణ : ఈ యూనిట్ల నిర్వహణ వ్యక్తిగతంగా జరుగుతుంది. వ్యాపారానికి సంబంధించిన అన్ని నిర్ణయాలను యజమానే తీసుకుంటాడు.
  3. కార్యకలాపాల నిధి : చిన్న సంస్థల కార్యకలాపాల పరిధి సాధారణంగా స్థానిక లేదా ప్రాంతీయ డిమాండులను తీర్చడం కోసం స్థానికంగా ఉంటుంది.
  4. సాంకేతిక పరిజ్ఞానం : పెద్ద యూనిట్లతో పోలిస్తే చిన్న పరిశ్రమ శ్రమ సాంద్రతతో కూడుకున్నాయి. అందుకని ఇవి మూలధన కొరత, శ్రామిక సప్లయి బాగా ఎక్కువగా ఉన్న ఆర్థిక వ్యవస్థలో స్థాపించబడతాయి.
  5. ఫలనకాలం : పెద్ద తరహా పరిశ్రమలతో పోలిస్తే చిన్న తరహా యూనిట్లలో ఫలనకాలం తక్కువగా ఉంటుంది.
  6. సరళత్వం : పెద్దతరహా పరిశ్రమలతో పోలిస్తే చిన్న తరహా పరిశ్రమలు ఎక్కువగా సామాజిక, ఆర్ధిక పరిస్థితులకు అనుగుణంగా మారతాయి. అంతేకాకుండా చిన్న తరహా పరిశ్రమలు నూతన ఉత్పత్తి పద్ధతులను అనుసరించడంలోనూ, నూతన వస్తువులను ప్రవేశపెట్టడంలోనూ, వాటికి అనుకూలంగా మారతాయి.
  7. వనరులు : చిన్న తరహా యూనిట్లు శ్రమ, ముడి పదార్థాల వంటి స్థానికంగా లేదా దేశీయంగా లభించే వనరులను ఉపయోగిస్తాయి.
  8. యూనిట్ల వ్యాప్తి : వీటిని గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాలలో అభివృద్ధి చేయడం వల్ల సంతులిత ప్రాంతీయాభివృద్ధిని సాధించడంతో పాటు ఉద్యోగాన్వేషణ కోసం ప్రజలు గ్రామీణ ప్రాంతాలనుంచి నగరాలకు వచ్చే వలసలను నివారించవచ్చు.

TS Inter 2nd Year Economics Study Material Chapter 6 పారిశ్రామిక రంగం

ప్రశ్న 10.
భారతీయ ఆర్థిక వ్యవస్థలో చిన్నతరహా పరిశ్రమల పాత్రను వివరించండి.
జవాబు.
భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో పేదరిక నిర్మూలన, ఉపాధికల్పన, గ్రామీణాభివృద్ధి మరియు ప్రాంతీయాభివృద్ధిని సాధించడంలోనూ, వివిధ రకాలైన అభివృద్ధి కార్యకలాపాలను వృద్ధి చేయడంలోనూ చిన్న తరహా పరిశ్రమల ప్రాధాన్యత, పాత్ర చాలా ముఖ్యమైంది. తయారీ రంగంలో ఉత్పత్తి చేయబడిన మొత్తం ఉత్పత్తిలో దాదాపు 40% ఈ రంగం సమకూరుస్తోంది.

పెద్ద తరహా రంగంతో పోలిస్తే చిన్న తరహా రంగం 5 రెట్లు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నది. పెద్ద తరహా పరిశ్రమలనుంచి గట్టి పోటీ ఉన్నప్పటికి, ప్రభుత్వం నుంచి ఈ రంగానికి మద్దతు ప్రోత్సాహకరంగా లేకపోయినప్పటికీ, భారతదేశ ఆర్ధిక వ్యవస్థ పురోగతిలో చిన్న తరహా పరిశ్రమలు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి.

1. చిన్న తరహా పరిశ్రమలు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తాయి :
భారత ఆర్ధిక వ్యవస్థ ఎదుర్కొనే సమస్యలలో ప్రధానమైనవి జనాభా ఒత్తిడి, నిరుద్యోగం. ఈ సమస్యను చాలా వరకు చిన్న తరహా పరిశ్రమలు తీర్చగలుగుతాయి. కాబట్టి అవి అధిక సంఖ్యలో ఉద్యోగాకాశాలు సృష్టించగలుగుతాయి.

2. వనరుల గమనశీలతను వ్యవస్థాపనా, నైపుణ్యాన్ని పెంచుతుంది :
చిన్న తరహా పరిశ్రమలు పెద్ద మొత్తంలో పొదుపును సమీకరించవచ్చు. గ్రామీణ మరియు పాక్షిక పట్టణ ప్రాంతాల నుంచి పెద్ద తరహా సంస్థలతో సంబంధం లేకుండా నైపుణ్యాన్ని తీసుకువచ్చి ఉత్పాదక కార్యకలాపాల కోసం పొదుపును చిన్న తరహా పరిశ్రమలలో పెట్టుబడిగా పెడతాయి.

3. ఆదాయాన్ని సమానంగా పంపిణీ చేయడం :
సంఘటిత రంగంలో ఆదాయ సంపదల పంపిణీలో అసమానతలు ఎక్కువగా ఉండే మన సమాజంలో చిన్న తరహా పరిశ్రమలు కొంత వరకు ఆ అసమానతలు తగ్గించుటకు అవకాశం కలదు.

4. అన్ని ప్రాంతాలకు పరిశ్రమల విస్తరణ :
గ్రామీణ మరియు పాక్షిక పట్టణ ప్రాంతల నుంచి ప్రజలు ఉద్యోగాల కోసం లేదా ఉన్నత జీవనం కోసం బాగా అభివృద్ధి చెందిన కేంద్రాలకు వలస పోతూ ఉంటారు. అప్పుడు నగరాలలోకి ప్రజల వలస వల్ల జనాభా వత్తిడి పెరగడం, కాలుష్యం, మురికివాడలు సృష్టించడం మొ||లైన చెడు ప్రభావాలకు దారితీస్తుంది.

5. సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి చేయడానికి అవకాశాలను సమకూరుస్తుంది :
ఇవి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి తగినన్ని అవకాశాలు కల్పిస్తాయి. ఇవి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి బదిలీ చేసే సదుపాయాలను కల్పిస్తాయి. దీనిఫలితంగా ఆర్ధిక వ్యవస్థ మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం వల్ల వచ్చే ఫలితాలను అనుభవించగలుగుతుంది.

6. ఎగుమతుల ప్రోత్సాహం :
చాలా కాలం నుంచి ఎగుమతులు పెరుగుదలలో చారిత్రాత్మక వృద్ధిని చిన్న తరహా పరిశ్రమలు నమోదు చేశాయి. ఈ విధంగా అవి దేశం యొక్క విదేశీ మారక నిల్వలను పెంచడంలో సహాయం చేస్తూ, ఆపైన దేశంపై విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంపై ఒత్తిడిని తగ్గిస్తున్నాయి.

7. పెద్ద తరహా పరిశ్రమల వృద్ధికి మద్దతు:
పెద్ద పరిశ్రమలు మరియు ప్రాజెక్టులకు సహాయం చేయడంలో చిన్న తరహా పరిశ్రమలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అవి పెద్ద తరహా పరిశ్రమలకు కావలసిన పరికరాలు, విడిభాగాలు మరియు సగం తయారైన వస్తువులను సమకూర్చడం ద్వారా వాటి అభివృద్ధికి మద్దతునిస్తున్నాయి.

8. మంచి పారిశ్రామిక సంబంధాలు కొనసాగింపు :
యజమానులకు, శ్రామికులకు మధ్య మంచి పారిశ్రామిక సంబంధాలు ఉండటం వల్ల శ్రామికుల సామర్ధ్యం పెరగడానికి మరియు పారిశ్రామిక వివాదాలు తక్కువగా ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది.

ఉత్పత్తి నష్టపోవడం, శ్రామికులు గైరు హాజరు అవడం తక్కువగా ఉంటుంది. ఈ పరిశ్రమలో యజమానికి, ఉద్యోగస్తులకు మంచి సంబంధాలు ఉండటం వల్ల సమ్మెలు, లాకౌట్లు చాలా తక్కువగా ఉంటాయి.

TS Inter 2nd Year Economics Study Material Chapter 6 పారిశ్రామిక రంగం

ప్రశ్న 11.
భారతదేశంలో చిన్నతరహా పరిశ్రమల సమస్యలను పరిశీలించండి.
జవాబు.
చిన్న తరహా పరిశ్రమల ఆటంకాలు, అవి ఎదుర్కొనే సమస్యలు కింది విధంగా ఉన్నాయి.
1. విత్తం :
చిన్న తరహా పరిశ్రమల ముందున్న ప్రధాన సమస్య విత్తం. ఏ సంస్థకైనా విత్తం అనేది రక్తనాళం వంటిది. తగినన్ని నిధులు లేకపోతే ఏ సంస్థ సక్రమంగా పనిచేయలేదు. మూలధనం కొరత, పరపతి సదుపాయాలు తక్కువగా అందుబాటులో ఉండటం అనేవి ఈ సమస్యకు ప్రధాన కారణాలు.

2. ముడి పదార్థాలు :
చిన్న తరహా పరిశ్రమలు సాధారణంగా వాటి ముడిపదార్థాల అవసరాలను తీర్చుకోవడానికి స్థానికంగా లభ్యమయ్యే వనరులను ఉపయోగించుకుంటాయి. ఈ సంస్థలు తగినంతగా నాణ్యతలేని ముడి పదార్థాలు కావడం లేదా తక్కువ. నాణ్యత గలవి కావడం, ముడి పదార్థాలు సరఫరా నిరంతరంగా లభ్యం కాకపోవటం వంటి అనేక సమస్యలను చిన్న తరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్నాయి. ఈ కారణాలన్నీ ఆ సంస్థల పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.

3. నిరుపయోగ సామర్థ్యం. (Idle Capacity) :
చిన్న తరహా పరిశ్రమలు అందుబాటులో ఉండే సామర్థ్యంలో దాదాపు 40 నుంచి 50 శాతం తక్కువగా ఉపయోగించుకుంటున్నాయి. దానికి కారణం విద్యుచ్ఛక్తి అందుబాటులో లేకపోవడం. ముడిపదార్థాల కొరతకు తోడు నిధులు తక్కువగా ఉండటం మొదలైనవి. పెద్ద తరహా పరిశ్రమలు వాటికి ప్రత్యర్ధులుగా ఉంటున్నాయి. కాబట్టి చిన్న తరహా పరిశ్రమలు ఈ సమస్యలన్నింటి నుంచి బయట పడలేకపోతున్నాయి.

4. సాంకేతిక పరిజ్ఞానం :
చిన్న తరహా వ్యవస్థాపకులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేక పోతున్నారు. ఇంకా వారి సంస్థ యంత్రాలను ఆధునికీకరణ చేసుకోవడానికి తగినన్ని వనరులు వారి దగ్గర లేవు.

వారు పాత ఉత్పత్తి పద్ధతులను అనుసరించడం వల్ల తక్కువ నాణ్యతగల వస్తువులను తక్కువ పరిమాణంలో ఎక్కువ ఉత్పత్తి వ్యయాలకు ఉత్పత్తి చేయడం అనే సమస్యలను ఎదుర్కొంటున్నారు. మంచి ఆధునిక యంత్రాలు గల పెద్ద తరహా సంస్థల ప్రత్యర్ధులతో పోటీ చేసే పరిస్థితులలో అవి లేవు.

5. మార్కెటింగ్ :
చిన్న తరహా పరిశ్రమలు మార్కెటింగ్ సమస్యలను కూడా ఎదుర్కొంటున్నాయి. చిన్న తరహా పరిశ్రమలు ఉత్పత్తి చేసే వస్తువులకు ఉండే పోటీ వినియోగదారుల అభిరుచులు, ఇష్టాలు, అయిష్టాలు ప్రస్తుతం ఉన్న ఫ్యాషన్ల గురించి ఈ పరిశ్రమలకు సమాచారం తెలియడం లేదు. ఫలితంగా అవి మార్కెట్ అవసరాలను బట్టి వస్తువులను ఉత్పత్తి చేయలేకపోతున్నాయి.

6. అవస్థాపనా సౌకర్యాలు :
చిన్న తరహా పరిశ్రమలపై అవస్థాపనా వసతులు ప్రతికూల ప్రభావాలను చూపుతున్నాయి. వెనుకబడిన ప్రాంతాలలో రవాణా, సమాచారం, విద్యుచ్ఛక్తి, ఇతర సదుపాయాలు తగినంతగా లేవు. అసంపూర్ణం గాను, తగిన విధంగాను లేని రవాణా మరియు సమాచార వ్యవస్థ వల్ల వివిధ యునిట్లు పని చేయడం చాలా కష్టం అవుతోంది.

7. ప్రాజెక్టు ప్రణాళిక :
చిన్న తరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న మరొక ముఖ్యమైన సమస్య ప్రాజెక్టు ప్రణాళిక సరిగా లేకపోవటం ఈ ఉత్పత్తిదారులు లాభాల అధ్యయనానికి అంతగా ప్రాధాన్యతను ఇవ్వరు. ప్రాజెక్టు లాభదాయకత విశ్లేషణ ప్రాజెక్టులవి, సాంకేతిక లాభదాయకతతో పాటు పై అంశాలన్నింటినీ వివరిస్తుంది. కానీ వీటి గురించి వారు ఏ మాత్రం పట్టించుకోరు. ఫలితంగా ప్రాజెక్టు ప్రణాళిక రచన, దాని నిర్వహణ అమలు లోపభూయిష్టంగా ఉంటుంది.

8. నైపుణ్యం గల మానవ వనరులు :
వెనుకబడిన ప్రాంతాలలో స్థాపించబడిన ఒక చిన్న తరహా పరిశ్రమ నైపుణ్యం లేని శ్రామికులను పొందడంలో సమస్యలను ఎదుర్కోదు కానీ నైపుణ్యంగల శ్రామికులు అక్కడ అందుబాటులో ఉండరు. దీనికి మొదటి కారణం నైపుణ్యం గల శ్రామికులు ఈ ప్రాంతాలలో ఆ పని చేయడానికి సుముఖత చూపరు.

రెండవ కారణం, నైపుణ్యం గల శ్రామికులకు వేతనాలు చెల్లించే స్థితిలోను, వారు డిమాండు చేసే సదుపాయాలను కలగజేసే స్థితిలోను చిన్న తరహా పరిశ్రమలు ఉండవు.”

9. నిర్వహణ సామర్థ్యం :
వ్యవస్థాపకుల వైపు నుంచి నిర్వహణ సామర్థ్యం లేకపోవడం వల్ల చాలా చిన్న తరహా పరిశ్రమలు పారిశ్రామిక రుగ్మతకు దారి తీస్తున్నాయి. ఒక వ్యవస్థాపకుడి యొక్క నిర్వహణ సామర్ధ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన శిక్షణ, కౌన్సిలింగ్లు తీసుకోకపోవడం వ్యవస్థాపకులకు మరొక సమస్యగా ఉంటోంది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 6 పారిశ్రామిక రంగం

ప్రశ్న 12.
పారిశ్రామిక విత్తం అంటే ఏమిటి ? భారతదేశంలో పారిశ్రామిక ఆర్థిక వనరులు ఏవి ?
జవాబు.
పారిశ్రామిక సంస్థలు వాటి ఉత్పాదక కార్యకలాపాలకు వెచ్చించే విత్తం మొత్తాన్ని పారిశ్రామిక విత్తం అంటారు. వివిధ ఆధారాల నుంచి సంపాదించిన విత్తాన్ని పరిశ్రమలలో స్థిర మూలధనం, చర మూలధనంగా ఉపయోగించుకుంటున్నాయి.

ఎ. అంతర్గత స్వయం – విత్తం :
పరిమాణాత్మకంగా ఎక్కువ ప్రాధాన్యమైన ఒక ఆధారం సంస్థలోనే పొదుపు చేసుకోవడం. ఆ పొదుపు చేయడం గృహ రంగంలో లేదా ప్రభుత్వంలో కావచ్చు. సాధారణంగా గృహ రంగం నుంచి వచ్చే పెట్టుబడి, ఆ రంగం చేసిన పొదుపు నుంచి మాత్రమే గాక ఇది ఇతర యూనిట్లలో మిగుళ్ళను తీసుకుంటుంది. అంటే అవి బ్యాంకులు, విత్త మార్కెట్ మొదలైన విత్త సంస్థల నుంచి తీసుకుంటాయి.

బి. ఈక్విటి – డిబెంచర్లు మరియు బాండ్లు :
స్థిర మూలధనానికి కావలసిన విత్తంలో అధిక భాగం సాధారణ, కుమ్యులేటివ్, నాన్ కుమ్యులేటివ్ ప్రత్యేక ఆధిక్యపు వాటాలు వంటి ఈక్విటి వివిధ రకాలుగా వస్తుంది. తరచుగా పారిశ్రామిక కంపెనీలు డిబెంచర్లను, బాండ్లను జారీ చేయడం ద్వారా వాటికి కావలసిన దీర్ఘకాలిక విత్తాన్ని పొందుతాయి.

సి. ప్రజలనుంచి డిపాజిట్లు :
పారిశ్రామిక విత్తానికి ఇంకొక ఆధారం ప్రజలనుంచి డిపాజిట్లు స్వీకరించడం. ఇది స్వల్ప కాలిక విత్తానికి సంబంధించిన ఒక రుణ పత్రం. ఈ పద్ధతి ప్రకారం, ప్రజలు వారి ద్రవ్యాన్ని ఈ కంపెనీలలో డిపాజిట్ చేస్తారు.

డి. బ్యాంకుల నుంచి ఋణాలు :
స్వల్పకాలిక అవసరాలు లేదా నిర్వహణ మూలధనం కోసం వాణిజ్య బాంకులు నిధులను సమకూరుస్తాయి. వాణిజ్య బాంకులు ఈ రుణాలను ప్రభుత్వ సెక్యూరిటీలు మరియు కంపెనీల స్టాకులను గ్యారంటీగా తీసుకొని మంజూరు చేస్తాయి. వాణిజ్య బ్యాంకులు వాటాలను కొనుగోలు చేయడానికి, వాటి నిధులు ఉపయోగించడానికి నిరాకరిస్తాయి.

ఇ. దేశీయ బ్యాంకర్లు :
నూతన విత్త సంస్థలను స్థాపించినప్పటికీ, దేశీయ బ్యాంకర్లు కూడా కొన్ని పెద్ద తరహా పరిశ్రమలకు ప్రత్యేకంగా ఒత్తిడి ఉన్న సమయంలో స్థిర, నిర్వహణా మూలధనాలకు విత్త సహాయాన్ని అందిస్తారు.

ఎఫ్. విదేశీ మూలధనం :
దేశీయ విత్తానికి అనుబంధంగా, విదేశీ మూలధనం కూడా పారిశ్రామిక అవసరాలను తీర్చుకోవడానికి ఉపయోగపడుతోంది. విదేశీ సహాయం విదేశీ ప్రభుత్వాలు, విదేశీ విత్త సంస్థలు మన ప్రభుత్వానికి అందిస్తాయి.

జి. అభివృద్ధి విత్త సంస్థలు :
ప్రణాళికా లక్ష్యాలకు, పారిశ్రామిక విత్తానికి మధ్య ఉన్న లోటును భర్తీ చేయడానికి ప్రభుత్వ సహాయంతో అభివృద్ధి విత్త సంస్థలు స్థాపించబడ్డాయి. ఈ సంస్థలు పెద్ద తరహా, చిన్న తరహా పరిశ్రమల అవసరాలు తీరుస్తాయి.

TS Inter 2nd Year Economics Study Material Chapter 6 పారిశ్రామిక రంగం

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారతీయ పరిశ్రమల నిర్మాణాన్ని వివరించండి.
జవాబు.
ఆర్థిక వ్యవస్థతో వివిధ వస్తువుల ఉత్పత్తి, తయారీతో సంబంధం కల్గిన రంగాన్ని పారిశ్రామిక రంగం అంటారు. భారతదేశంలో పరిశ్రమల నిర్మాణాలు కింది ఆధారాలను బట్టి చేయడమైంది.

I. ఉపయోగాన్ని బట్టి పరిశ్రమ నిర్మాణం.
ఇది మూడు తరగతులుగా విభజించవచ్చు.

  1. ప్రాథమిక పరిశ్రమ
  2. వినియోగ వస్తువులను ఉత్పత్తి చేసే పరిశ్రమ
  3. మాధ్యమిక వస్తువులను ఉత్పత్తి చేసే పరిశ్రమ.

II. యాజమాన్యం ఆధారంగా పరిశ్రమలను మూడు రకాలుగా విభజించవచ్చు అవి.

  1. ప్రభుత్వ రంగ సంస్థలు : ఇది పూర్తి ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. ఉదా : ఎయిర్ ఇండియా బి.యస్.ఎన్.ఎల్ మొదలైనవి.
  2. ప్రైవేటు రంగ సంస్థలు : వీటి నిర్వహణ, యాజమాన్యం ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉంటాయి.
    ఉదా : రిలయన్స్, టాటా కన్సల్టెన్సీ మొదలైనవి
  3. ఉమ్మడి రంగ పరిశ్రమలు : ఈ సంస్థల నిర్వహణ, యాజమాన్యం ప్రభుత్వ, ప్రైవేటు వ్యవస్థాపకులు, పెద్ద సంఖ్యలో ప్రజల చేతిలో ఉంటుంది. ఉదా : గోవా కార్బన్ లిమిటెడ్, బిపియల్ మొదలైనవి.

III. పెట్టుబడి పరిమాణాన్ని బట్టి పరిశ్రమలు ఎనిమిది తరగతులుగా విభజించవచ్చు.

  1. పెద్ద పరిశ్రమ : ఈ పరిశ్రమలో పెట్టుబడి 10 కోట్ల కంటే ఎక్కువ, 100 కోట్ల కంటే తక్కువగా ఉంటుంది.
  2. మధ్య తరహా పరిశ్రమ : తయారీ సంస్థలలో పెట్టుబడి 5 కోట్ల కంటే ఎక్కువగా 10 కోట్ల కంటే తక్కువగా ఉంటుంది.
  3. మెగా పరిశ్రమ : ఈ పరిశ్రమలలో పెట్టుబడి 100 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుంది.
  4. సూక్ష్మ పరిశ్రమలు : తయారీ సంస్థలలో పెట్టుబడి 25 లక్షల కంటే తక్కువగా ఉండేది.
  5. చిన్న పరిశ్రమలు : దీని పెట్టుబడి పరిమితి 10 లక్షల నుంచి 2 కోట్ల మధ్యగా నిర్ణయించారు.
  6. కుటీర పరిశ్రమలు : వస్తువులు పరిశ్రమలో కాకుండా గృహాలలో ఉత్పత్తి అయ్యే వస్తుసేవలు తయారు చేసే పరిశ్రమ.
  7. అనుబంధ పరిశ్రమ : పెద్ద తరహా పరిశ్రమలకు అవసరమైన విడిభాగాలు, యంత్ర పరికరాల తయారు చేసే పరిశ్రమ.
  8. అతిచిన్న పరిశ్రమ : యంత్రాలపై పెట్టుబడి 25 లక్షల రూపాయలకు పరిమితమైతే దానిని అతిచిన్న పరిశ్రమ అంటారు.

IV. సంస్థ రకాన్ని ఆధారంగా ఇవి మూడు రకాలు.

  1. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు : సభ్యులు అందరు స్వచ్ఛందంగా కలిసిన ఒక సమూహం.
  2. ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలు : కనిష్టంగా ఇద్దరు, గరిష్టంగా 50 మంది సభ్యులకు మించకుండా ఉండే స్వచ్ఛంద సమూహాన్ని ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ అంటారు.
  3. ప్రభుత్వ కంపెనీలు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న కంపెనీని ప్రభుత్వ కంపెనీ అంటారు.

TS Inter 2nd Year Economics Study Material Chapter 6 పారిశ్రామిక రంగం

ప్రశ్న 2.
భారతదేశంలోని ప్రధాన పరిశ్రమల గురించి వ్రాయండి.
జవాబు.
1. వస్త్ర పరిశ్రమ :
ఈ పరిశ్రమ మానవునిచే తయారు చేయబడిన లేదా సహజ పీచుల వాటిని జనపనార, ఉన్ని వంటి ముడి పదార్థాలకు విలువను పెంచడం అనే కార్యకలాపాలు ఈ పరిశ్రమ పరిధిలోకి వస్తాయి. ఇది 45 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తోంది.

2. పంచదార పరిశ్రమ :
వస్త్ర పరిశ్రమ తరువాత పంచదార పరిశ్రమ దేశంలో అతి పెద్ద వ్యవసాయాధార పరిశ్రమ. సుమారు 45 మిలియన్ల రైతులు ఈ పరిశ్రమ మీద ఆధారపడ్డారు. ఇది 0.5 మిలియన్ల ప్రజలకు ఉపాధిని కల్పించుచున్నది.

3. జనపనార పరిశ్రమ :
ఇది మనదేశంలో ఉన్న ఒక ప్రాచీన పరిశ్రమ. ప్రపంచంలో భారతదేశానికి’ పెద్ద జనపనార ఉత్పత్తిదారుగా, జనపనార వస్తువులను ఎగుమతి చేసే రెండవ పెద్ద దేశం. ఈ రంగం 4 లక్షల మంది శ్రామికులకు ఉపాధి కల్పించుచున్నది.

4. రసాయన పరిశ్రమ:
ఇది భారతదేశంలో ఒక ప్రాచీన దేశీయ పరిశ్రమ. ఈ పరిశ్రమ సుమారు 70,000 వాణిజ్య వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇది 12 పెద్ద తరహా రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది.

5. సిమెంటు పరిశ్రమ :
ప్రపంచంలో చైనా తరువాత సిమెంటును ఎక్కువగా ఉత్పత్తి చేసే రెండవ దేశం మనది. ప్రస్తుతం మనదేశంలో 185 పెద్ద సిమెంటు సంస్థలు, 350 చిన్న సిమెంటు సంస్థలు ఉన్నాయి. ఉదా : అంబుజా, జె.కె. బిర్లా మొదలైనవి.

6. ఇనుము-ఉక్కు పరిశ్రమ :
భారతదేశంలో ఉక్కు పరిశ్రమకు 400 సంవత్సరాలు ప్రాచీన చరిత్ర ఉంది. 90,000 కోట్ల రూ॥ మూలధనాన్ని కల్గి, 6 లక్షల ప్రజలకు ఉపాధి కల్పిస్తూ మనదేశంలో 4వ స్థానంలో ఉంది. ఉక్కు పరిశ్రమలో స్టీల్ అథారిటి ఆఫ్ ఇండియా, బొకారొ స్టీల్ ప్లాంట్, మొ||నవి ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి.

7. IT పరిశ్రమ :
నేడు మన దేశం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషిస్తున్నది. ప్రపంచంలోని IT రంగంలో పేరు పొందిన సంస్థలన్ని మన దేశంలో ఉన్నాయి. ఈ రంగం ప్రత్యక్షంగా 2.8 మిలియన్లకు, పరోక్షంగా 8.9 మిలియన్ల జనాభాకు ఉపాధి కల్పిస్తోంది.

8. మైనింగ్ పరిశ్రమ :
మనదేశంలో అతిముఖ్యమైన పరిశ్రమ మైనింగ్. స్థూల దేశీయోత్పత్తిలో దీని వాటా 2.2 % నుంచి 2.5 % వరకు ఉంది. ఇది 7 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.

9. పెట్రోలియం పరిశ్రమ :
ఇది ఒక ప్రాచీన పరిశ్రమ. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న చమురు మార్కెట్లలో భారతదేశం ఒకటి. గత కొన్ని దశాబ్దాలుగా ONGC, HPCL, IOC జాతీయ కంపెనీల విస్తరణ దీనికి ఉదాహరణ.

TS Inter 2nd Year Economics Study Material Chapter 6 పారిశ్రామిక రంగం

ప్రశ్న 3.
1977 పారిశ్రామిక విధాన తీర్మానంలోని అంశాలను పేర్కొనండి.
జవాబు.
పారిశ్రామిక విధానం, 1977 :
మార్చి 1977లో కేంద్రంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం డిసెంబరు 23, 1977 నాడు ఒక నూతన పారిశ్రామిక విధాన తీర్మానాన్ని సార్లమెంటులో ప్రకటించింది. ఈ నూతన విధానంలో ప్రధాన అంశాలు కింది విధంగా ఉన్నాయి :

  1. చిన్న తరహా రంగాన్ని మూడు భాగాలుగా విభజించారు. అవి :
    (ఎ) కుటీర, గృహ పరిశ్రమలు
    (బి) ఒక లక్ష రూపాయల కంటే తక్కువగా పెట్టుబడి ఉండే అతి చిన్న రంగం (tiny sector)
    (సి) 10 లక్షల రూపాయల లోపు పెట్టుబడి పెట్టే చిన్న తరహా రంగాలు.
  2. చిన్న తరహా, కుటీర పరిశ్రమల అభివృద్ధికి సహాయం చేయడానికి ప్రతి జిల్లాకి జిల్లా పారిశ్రామిక కేంద్రాన్ని (District Industrial Centre) ఏర్పాటు చేయడం.
  3. విద్యుచ్ఛక్తితో నడిచే మగ్గాలు (powertooms) మరియు మిల్ రంగాలకు గాకుండా చేనేత రంగానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చారు.
  4. ప్రాంతీయ అసమానతలను తగ్గించటానికి వెనుకబడిన ప్రాంతాలలో పరిశ్రమలను బదిలీ చేసేవారికి సహాయం అందిస్తూ, పట్టణ ప్రాంతాలలో నూతన పరిశ్రమల స్థాపనను నిషేదించారు.
  5. ఎగుమతి ప్రధానమైన సంస్థలకు ప్రత్యేక విత్త రాయితీలను ప్రకటించారు.
  6. ఎంపిక ఆధారంగా రుగ్మత కలిగిన యూనిట్లను (sick units) కలుపుకోవటం.
  7. 50 వేలకు మించకుండా జనాభా ఉన్న గ్రామాలు / పట్టణాలలో 1 లక్ష రూపాయలలోపు పెట్టుబడి కలిగిన చిన్న రంగాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపబడింది.
  8.  పెద్ద పారిశ్రామిక గృహాలు నూతన ప్రాజెక్టులను స్థాపించడానికి లేదా ఉన్న ప్రాజెక్టులను విస్తరించడానికి ఆ గృహాలు అంతర్గతంగా వనరులను అవే సృష్టించుకోవాలి.
  9. చిన్న తరహా, కుటీర పరిశ్రమల రంగంలో నిపుణ్యంగల సొందరిక పరిజ్ఞానం, నిర్వహణను అందుబాటులోకి తేవడం ద్వారా ఉత్పత్తి వికేంద్రీగరణను వృద్ధి చేయుటం, అనుబంధ పరిశ్రమలను (acillary industries) విస్తృత స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యతను ప్రభుత్వ రంగానికి ఇవ్వటం జరిగింది.
  10. సాంకేతికంగ స్వయం సమృద్ధిని సాధించడానికి భారతీయ నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం తగినంతగా అభివృద్ధి చెందని అధిక ప్రాధాన్యతలు గల రంగాలలో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవడానికి అనుమతించాలని ఈ విధానం గుర్తించింది.

ప్రశ్న 4.
1991 పారిశ్రామిక విధాన తీర్మానం ప్రధాన లక్షణాలు ఏవి ?
జవాబు.
జూన్ 1991 లో శ్రీ.పి.వి నరసింహారావు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ‘ఆర్ధిక వ్యవస్థలో సరళీకరణను, సంస్కరణలను అది ప్రవేశపెట్టింది. ఈ నూతన వాతావరణంలో ప్రభుత్వం ఒక నూతన పారిశ్రామిక విధానాన్ని జూలై 24, 1991 న ప్రకటించింది. ఈ నూతన విధానం పారిశ్రామిక ఆర్ధిక వ్యవస్థను బాగా సులభతరం చేసింది.

ఇప్పటి వరకు సంపాదించుకున్న వాటిని నిలబెట్టుకోవడం, వ్యవస్థలో ఉండే లోపాలను సరిదిద్దటం ఉత్పాదకతలో స్థిరమైన వృద్ధిని కొనసాగించడం, ఉద్యోగ అవకాశాలను కల్పించడం, విదేశీ సంస్థల పోటీని తట్టుకోవడం అనేవి ఈ నూతన విధానం యొక్క ప్రధాన లక్ష్యాలు.

అంశాలు:
1. పారిశ్రామిక లైసెన్సింగ్ పద్ధతిని తొలగించడం :
ఆర్ధిక వ్యవస్థను సరళీకరణ వైపు నడిపించడానికి నూతన పారిశ్రామిక విధానం రక్షణ, వ్యూహాత్మక, సాంఘిక కారణాలు గల కొన్ని పరిశ్రమలను తప్ప అన్ని పారిశ్రామిక లైసెన్స్లను తొలగించింది. 1999 ఫిబ్రవరిలో చేసిన చట్ట సవరణ ప్రకారం ప్రస్తుతం ఆరు పరిశ్రమలకు మాత్రమే లైసెన్స్లు తప్పనిసరిగా ఉండాలి.

అవి : ఆల్కహాల్, సిగరెట్లు, హానికరమైన రసాయనాలు, మత్తుపదార్థాలు, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, రక్షణకు అవసరమైన పరికరాలు, పారిశ్రామిక ప్రేలుడు పదార్థాలు మొదలైనవి పారిశ్రామిక విధానం సూచించింది.

ఈ విధంగా నూతన విధానం మంచి పారిశ్రామిక వాతావరణంలో అందుబాటులో ఉన్న వ్యవస్థ ఉద్యమిత్వ నైపుణ్యాలను మంచిగా ఉపయోగించుకుంటూ, మార్కెట్ తో ఎక్కువ స్నేహపూర్వకంగా ఉండాలని సూచించింది. పరిశ్రమలు వేగవంతంగా వృద్ధి చెందాలని నూతన పారిశ్రామిక విధానం 1991 భావించింది.

1991 నూతన పారిశ్రామిక విధానంపై విమర్శనాత్మక విశ్లేషణ :
భారతదేశ ఆర్ధిక వ్యవస్థపైన, సమాజంపైన 1991 విధానం అధిక ప్రభావం కలిగి ఉంది, దీనిలో అనుకూల ప్రతికూల ప్రభావాలు ఉన్నాయి, వాటిని కింది విధంగా సంక్షిప్తీకరించవచ్చు.

TS Inter 2nd Year Economics Study Material Chapter 6 పారిశ్రామిక రంగం

అనుకూల ప్రభావం :

  1. ప్రస్తుతం సృజనాత్మకత మరియు నవకల్పనలు, తప్పనిసరి అయ్యాయి. పరిశోధన మరియు అభివృద్ధిపై నిరంతరంగా శ్రద్ధ వహించడంతో పరిజ్ఞానం పెరుగుతుంది, వస్తువుల రూపకల్పనలో సృజనాత్మకతను తీసుకురావడానికి పరిశోధన అభివృద్ధిపై పరిశ్రమలు, తమ దృష్టిని కేంద్రీకరించడం.
  2. 1991 విధానం తరువాత నాణ్యత అనే అంశానికి చాలా గుర్తింపు ఉంది. పస్తువుల తయారీ నుంచి అవి వినియోగదారుడికి చేరే వరకు అన్ని స్థాయిల్లోను మొత్తం నాణ్యతను కొనసాగించడంపై దృష్టి కేంద్రీకరించడం.

2. ప్రభుత్వ రంగ పాత్రను నిర్వీర్యం చేయడం :
1956 నుంచి ప్రభుత్వ రంగంలో 17 పరిశ్రమలు ఉండేవి. ఈ సంఖ్య 3కు తగ్గించబడింది. అవి. 1. ఆయుధాలు, ఆయుధసామాగ్రి, రక్షణకు సంబంధించిన పరికరాలు. 2. అణుశక్తి 3. రైలు రవాణా మొదలైనవి.

ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన ప్రభుత్వ విధానంలోని ప్రధాన అంశాలు క్రింది విధంగా ఉన్నాయి.

  1. వ్యూహాత్మకం కాని ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రభుత్వ ఈక్విటీని అవసరమైతే 26 శాతం లేదా అంతకంటే తక్కువకు తగ్గించడం.
  2. ప్రభుత్వ రంగ సంస్థల ఉత్పాదక సామర్థ్యాన్ని పునర్నిర్మించడం.
  3. పునర్నిర్మించలేని ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయడం.
  4. శ్రామికుల ఆసక్తులను పూర్తిగా పరిరక్షించడం.

3. MRTP Act :
MRTP చట్టాన్ని సవరించారు. దాని ప్రకారం MRTP కంపెనీ ఆస్తుల పరిమితిని ఎత్తివేశారు. తక్కువ సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే ప్రభుత్వ రంగ సంస్థలు, చిన్న తరహా సంస్థలు, వ్యూహాత్మకం కాని ప్రదేశంలో ప్రస్తుతం పనిచేసే సంస్థలను ప్రభుత్వ పునః సమీక్షిస్తుందని నూతన పారిశ్రామిక విధానం తెలియజేసింది.

రుగ్మత గల సంస్థల పునరావాసం, పునర్నిర్మాణం కోసం పారిశ్రామిక, విత్త పునర్నిర్మాణ బోర్డును సలహా కోసం సంప్రదించాలని ప్రభుత్వం కోరింది. ప్రభుత్వ రంగంలో మిగిలిన సంస్థలకు అవగాహన పత్రం ద్వారా. నిర్వహణలో అధిక స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది.

4. విదేశీ పెట్టుబడి ప్రవేశానికి, సాంకేతిక పరిజ్ఞాన ప్రవేశానికి స్వేచ్ఛ:
మేలైన సాంకేతిక పరిజ్ఞానం కోసం, ఆధునికీకరణ. కోసం ఎగుమతులను అంతర్జాతీయ ప్రమాణాలతో వస్తు సేవలను సమకూర్చుకోవడానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ప్రవాహాన్ని పెంచడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకని దేశీయ కృషికి అనుబంధంగా ముఖ్యంగా అవస్థాపన సౌకర్యాల రంగంలో విదేశీ పెట్టుబడిని ప్రోత్సహించాలని ఈ విధానం ద్వారా ప్రభుత్వం తెలియజేసింది.

5. పారిశ్రామిక స్థల నిర్ణయ విధానాన్ని సరళీకరించడం :
ఒక మిలియన్ జనాభా కంటే ఎక్కువగా ఉన్న నగరాలను మినహాయిస్తే లైసెన్సు తప్పనిసరిగా తీసుకోవాలనే నిబంధనను మినహాయిస్తే పరిశ్రమలను స్థాపించడానికి కేంద్రం నుంచి ఎటువంటి పారిశ్రామిక అనుమతి తీసుకోనవసరం లేదని పారిశ్రామిక విధాన తీర్మానం తెలియజేస్తుంది.

6. తప్పనిసరిగా మార్చే క్లాజును తొలగించడం :
భారతదేశ పారిశ్రామిక పెట్టుబడిలో ఎక్కువ భాగం బాంకులు, విత్త సంస్థలు రుణాల రూపంలో సమకూర్చాయి. ఈ సంస్థల నూతన పరిశ్రమలకు రుణాలు ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా మార్చే క్లాజును తప్పనిసరి చేశాయి.

వాటి యాజమాన్యం అవసరం అని భావిస్తే వారి రుణాలలో కొంత భాగాన్ని ఈక్విటీ రూపంలోకి మార్చుకునే సదుపాయం తప్పనిసరిగా ఉండాలనే నిబంధన ఉండేది. కాని విత్త సంస్థలు ఇలాంటి తప్పనిసరిగా మార్చే క్లాజును తొలగించాలని నూతన పారిశ్రామిక విధానం సూచించింది.

ఈ విధంగా నూతన పారిశ్రామిక విధానం ప్రకారం రవాణా, బ్యాంకింగ్, సమాచారం మొదలైన అవస్థాపన సౌకర్యాల వృద్ధిని విస్తరించింది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 6 పారిశ్రామిక రంగం

ప్రశ్న 5.
జాతీయ తయారీ విధానం, 2011 గురించి వ్రాయండి.
జవాబు.
జాతీయ తయారీ విధానం (National Manufacturing Policy – NMI), 2011 :
2011-12లో భారత స్థూలదేశీయ ఉత్పత్తి (Gros Domestic Product – GDP) లో ఉత్పాదక రంగం వాటా సుమారు 16-17% ఆసియా ఖండంలోని ఇతర పెద్ద ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే ఇది దాని సామర్థ్యానికి చాలా తక్కువగా ఉంది.

పరిమాణాత్మక మరియు గుణాత్మక మార్పు తీసుకురావడానికి, ఉత్పాదక రంగానికి అవసరమైన ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని పారిశ్రామిక విధాన మరియు ప్రమోషన్ విభాగం (Depertment of Industrial Policy and Promotion – DIPP) నవంబర్ 2011 లో జాతీయ తయారీ విధానాన్ని (National Manufacturing Policy-NMP) తయారుజేసింది.

దీని ఉద్దేశం జిడిపిలో తయారీ రంగ వాటాను 25% కి పెంచడం మరియు ఒక దశాబ్ద కాలంలో 100 మిలియన్ ఉద్యోగాలను సృష్టించడం. ఈ విధానం రాష్ట్రాల భాగస్వామ్యంతో పారిశ్రామిక వృద్ధి సూత్రంపై ఆధారపడి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి విధివిధానాలను రూపొందిస్తుంది.

దీని ప్రకారం తగిన ఫైనాన్సింగ్ సాధనాల ద్వారా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి) ప్రాతిపదికన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రోత్సాహకాలను అందిస్తుంది, మరియు తగిన ఆర్థిక విధానాలను అవలంబించడానికి రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్సహిస్తుంది. సంబంధిత కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు రాష్ట్రాలతో సంప్రదించి ఈ విధానం అమలును విభాగం చేపట్టింది.

A. NMP యొక్క లక్ష్యాలు :
NMP యొక్క ప్రధాన లక్ష్యాలు క్రింది విధంగా ఉన్నాయి :

  1. జిడిపిలో ఉత్పాదక రంగం వాటా 2022 లో 26%కు పెంచడం.
  2. 2022 నాటికి 100 మిలియన్ల అదనపు ఉద్యోగాల కల్పన కోసం తయారీ రంగంలో ఉపాధి కల్పన రేటును పెంచడం.
  3. సమర్థవంతమైన విధాన మద్దతు ద్వారా భారత ఉత్పాదక రంగం ప్రపంచ పోటీతత్వాన్ని మెరుగుపరచడం.
  4. భారతదేశంలో ఉత్పాదక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారాన్ని ఆకర్షించే లక్ష్యంతో 2014 లో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించడం.
  5. స్వచ్ఛమైన శక్తి సామర్థ్య సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి జాతీయ పెట్టుబడి మరియు తయారీ మండలాలను (National Investment and Manufacturing Zones-NIMZ) ఏర్పాటు చేయడం.
  6. పారిశ్రామిక టౌన్షిప్ రాజ్యాంగం ప్రకారం స్వయం పాలన మరియు స్వయం ప్రతిపత్త సంస్థలుగా ప్రతిపాదించబడటం.
  7. మౌలిక సదుపాయాలకు కేంద్ర ప్రభుత్వం అనుకూల గ్యాప్ ఫండింగ్ (Viability Gap Funding)ద్వారా తగిన విధంగా నిధులు సమకూర్చుడం.
  8. తయారీ రంగంలో చిన్న మరియు మధ్యతరహా సంస్థలకు (Small and Medium Enterprises – SMEs) ఫైనాన్సు అందుబాటును మెరుగుపరచడం.

B. జాతీయ తయారీ విధానం యొక్క ముఖ్యమైన సాధనాలు :

  1. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు.
  2. యువ శ్రామికులకు పారిశ్రామిక శిక్షణ, నైపుణ్యం పెంచే చర్యలు,
  3. హేతుబద్ధీకరణ, వ్యాపార నిబంధనల సరళీకరణ,
  4. యూనిట్ల మూసివేత కోసం సరళమైన, వేగవంతమైన విధానం, మరియు
  5. హరిత సాంకేతికతతో సహా సాంకేతిక అభివృద్ధికి ఆర్థిక, సంస్థాగత విధానం.

TS Inter 2nd Year Economics Study Material Chapter 6 పారిశ్రామిక రంగం

ప్రశ్న 6.
1991 సం||లో ప్రారంభించబడిన ప్రపంచీకరణ చర్యల ప్రధాన లక్షణాలను చర్చించండి.
జవాబు.
వ్యాసరూప సమాధాన ప్రశ్న – 7 లోని ప్రపంచీకరణ చూడుము.

ప్రశ్న 7.
భారతదేశంలో నోట్ల రద్దు గురించి వ్రాయుము.
జవాబు.
నోట్ల రద్దు (డీమోనిటైజేషన్): నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) అంటే దేశ కేంద్ర బ్యాంకు (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కొన్ని పాత కరెన్సీ నోట్లను అధికారిక చెల్లింపు నుండి ఉపసంహరించుకుంటుంది. నవంబర్ 8, 2016 న, కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత అధిక విలువ కలిగిన కరెన్సీని (రూ. 500 మరియు రూ. 1000) చట్టపరమైన కరెన్సీగా నిలిపివేస్తునట్లు ప్రకటించింది. నల్లధనంతో పోరాడటానికి మరియు అవినీతిని అంతం చేయడానికి ఇది ప్రభుత్వ అతి పెద్ద సంస్కరణ అని పేర్కోవడం జరిగింది.

ప్రభుత్వం కొత్తగా రూ.500, రూ.2000 నోట్లను ప్రవేశపెట్టి, తక్కువ నగదు ఆర్థిక వ్యవస్థ వైపు వెళ్ళాలని ప్రజలను కోరారు. భారతదేశంలో నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) అమలు చేయడం ఇదే మొదటిసారి కాదు. 1936 లో రూ.10,000 అత్యధిక విలువ కలిగిన నోటుగా ప్రవేశపెట్టబడింది, కాని 1946 లో నోట్ల రద్దు చేయబడింది.

అయినప్పటికీ, దీనిని 1954 లో తిరిగి ప్రవేశపెట్టారు. కాని తరువాత, 1978 లో నల్లధనాన్ని ఎదుర్కోవటానికి అప్పటి ప్రభుత్వం తన ఇంటెన్సివ్ కదలికలో భాగంగా హై డినామినేషన్ బ్యాంక్స్ యాక్ట్ (డీమోనిటైజేషన్) ప్రవేశపెట్టి రూ.500, రూ.1000 మరియు రూ. 10,000 నోట్లను చట్టవిరుద్ధంగా ప్రకటించింది.

నవంబర్ 2016 నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) అది చేయాల్సిన పనిని చేయడంలో విఫలమైందని, దాని ప్రభావం మొదట్లో ఊహించిన దానికంటే ఎక్కువ కాలం కొనసాగుతుందని భారతదేశం మరియు విదేశాలలో చాలా విశ్లేషణలు చెబుతున్నాయి. డిజిటల్ డబ్బును ప్రోత్సహించే దృక్కోణంలో కూడా, ప్రభుత్వం మొత్తం కరెన్సీలో 86 శాతం చెలామణిలో ఉంచాల్సిన అవసరం లేదు. తదుపరి అధ్యయనాలు చాలా తక్కువ నల్లధనం పట్టుకున్నాయని తెలిపాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగస్టు 30, 2017 నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) పై తన నివేదికను విడుదల చేసింది. నిషేధిత నోట్లలో 99 శాతం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయని నివేదిక పేర్కొంది. ఈ చర్య నల్లధనం మరియు నకిలీ కరెన్సీ బయటకు తీస్తుందని కేంద్ర ప్రభుత్వం చేసిన అన్ని వాదనలను చెదరగొట్టింది.

అయితే వ్యవస్థలో 99 శాతం పాత కరెన్సీని తిరిగి రావడంతో, నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) వైఫల్యం రెండు విషయాలను సూచిస్తుంది: నగదులో ఉన్న నల్లధనం చాలా తక్కువగా ఉంది లేదా నోట్ల రద్దును సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది మరియు మొత్తం నల్లధనం రూ.500 మరియు రూ. 1000 బ్యాంక్ నోట్లను బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి ప్రవేశ పెట్టడం జరిగింది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 6 పారిశ్రామిక రంగం

ప్రశ్న 8.
భారతదేశంలో వస్తుసేవల పన్ను (GST) ను ఎందుకు ప్రవేశపెట్టారు ? భారత ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావాన్ని తెలుపుము.
జవాబు.
వస్తు సేవల పన్ను (Goods and Service Tax – GST) :
వస్తు సేవల పన్ను (జిఎస్టీ) అనేది పరోక్ష పన్ను. ఇది భారతదేశంలో అనేక పరోక్ష పన్నులను భర్తీ చేసింది. జీఎస్టీ చట్టం పార్లమెంటులో 29 నూర్చి 2017 న ఆమోదించబడింది. ఈ చట్టం జూలై 1, 2017 నుండి అమల్లోకి వచ్చింది.

భారతదేశంలో వస్తు సేవల పన్ను అనేది సమగ్రమైన, బహుళ దశల, గమ్య- ఆధారిత పన్ను. ఇది ప్రతి విలువ ఆధారంగా విధించబడుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, వస్తువులు మరియు సేవల సరఫరాపై విధించేది జీఎస్టీ పరోక్ష పన్ను.

ఈ చట్టం భారతదేశంలో గతంలో ఉన్న అనేక పరోక్ష పన్ను చట్టాలను భర్తీ చేసింది. జీఎస్టీ మొత్తం దేశానికి ఒక పరోక్ష పన్ను. పన్ను పై పన్ను ప్రభావాన్ని తొలగించడం, అసంఘటిత రంగాన్ని నియంత్రించడం ద్వారా చేయడం జిఎస్టీ ప్రధాన లక్ష్యం.

భారత ఆర్థిక వ్యవస్థపై జీఎస్టీ ప్రభావం :
భారత ఆర్ధిక వ్యవస్థపై GST ప్రభావం క్రింద వివరించబడింది:

  1. GST ఉత్పత్తిదారులపై పన్ను భారాన్ని తగ్గిస్తుంది మరియు ఎక్కువ ఉత్పత్తి ద్వారా వృద్ధిని పెంచుతుంది. ప్రస్తుత పన్నుల నిర్మాణం అనేక పన్ను నిబంధనలతో కూడి ఉంది. తయారీదారులను వారి వాంఛనీయ సామర్థ్యానికి ఉత్పత్తి చేయకుండా నిరోధిస్తుంది మరియు వృద్ధిని తగ్గిస్తుంది. తయారీదారులకు పన్ను క్రెడిట్ ఇవ్వడం ద్వారా GST ఈ సమస్యను పరిష్కరిస్తుంది.
  2. చెక్ పోస్టులు మరియు టోల్ ప్లాజాలు వంటి వివిధ పన్ను అడ్డంకులు రవాణా చేసే నిల్వ చేయలేని వస్తువుల వృథా అవడానికి దారితీస్తాయి. బఫర్ స్టాక్ మరియు గిడ్డంగుల ఖర్చులు అధికంగా ఉండటం వల్ల ఈ జరిమానా ప్రధాన ఖర్చుగా మారుతుంది. ఒకే పన్ను విధానం ఈ భారాన్ని తొలగిస్తుంది.
  3. వ్యవస్థలో మరింత పారదర్శకత ఉంటుంది, ఎందుకంటే వినియోగదారులకు ఎంత పన్నులు వసూలు చేస్తున్నారో మరియు ఏ ఆధారం పై పన్ను వేస్తున్నారో ఖచ్చితంగా తెలుస్తుంది.
  4. ప్రభుత్వ ఆదాయం పెరగడానికి GST దోహదపడుతుంది.
  5. వస్తువులు లేదా సేవల గొలుసులో ఉత్పత్తిదారులు చెల్లించే పన్నులకు GST క్రెడిట్ అందిస్తుంది. ఇది వేర్వేరు రిజిస్టర్డ్ డీలర్ల నుండి ముడిసరుకును కొనుగోలు చేయడానికి ఉత్పత్తిదారులను ప్రోత్సహిస్తుంది. ఎక్కువ మంది విక్రేతలు మరియు సరఫరాదారులను పన్ను పరిధిలోకి ఇది తీసుకువస్తుంది.
  6. GST ఎగుమతులకు వర్తించే కస్టమ్ సుంకాలను తొలగిస్తుంది. లావాదేవీల తక్కువ ఖర్చుల కారణంగా విదేశీ మార్కెట్లలో దేశం యొక్క పోటీతత్వం పెరుగుతుంది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 6 పారిశ్రామిక రంగం

ప్రశ్న 9.
చిన్నతరహా పరిశ్రమలను పరిష్కరించే చర్యలను సూచించండి.
జవాబు.

  1. పరపతి సదుపాయాలు: చిన్న తరహా కుటీర పరిశ్రమలకు తక్కువ వడ్డీ రేటుతో ప్రభుత్వ పరపతిని అందించాలి. ఈ పరిశ్రమల అభివృద్ధికి వాణిజ్య బ్యాంకులు కూడా రుణాలు సమకూర్చాలి.
  2. పారిశ్రామిక క్షేత్రాలు : చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి కొన్ని ప్రాంతాలలో రోడ్లు, బ్యాంకింగ్, మార్కెటింగ్, రవాణా వంటి వివిధ సదుపాయాలను కల్పిస్తూ దేశంలోని వివిధ నగరాలలో ప్రభుత్వం చాలా సంఖ్యలో పారిశ్రామిక క్షేత్రాలను స్థాపించడమేకాక, ఇతర అవస్థాపన సౌకర్యాలను కలగచేయాలి.
  3. పరీక్ష చేసే ప్రయోగశాలలు : కుటీర పరిశ్రమల ఉత్పత్తులు సూచించబడిన ప్రమాణాలను కొనసాగించడానికి ప్రభుత్వం వాటిని పరీక్ష చేసే ప్రయోగశాలలను అభివృద్ధి చేయాలి, మరికొన్నింటిని స్థాపించాలి.
  4. ఆకృతి లేదా నమూనాల సప్లయి : కుటీర పరిశ్రమ యొక్క నాణ్యతను మెరుగుపర్చడానికి ఉత్పత్తిదారులకు ప్రభుత్వం నూతన నమూనాలను, ఆకృతులను సమకూర్చింది.
  5. ప్రచారం : కుటీర పరిశ్రమల ఉత్పత్తి అమ్మకాలను పెంచడానికి దేశం లోపల మరియు వెలుపల ప్రభుత్వం ప్రదర్శనా కేంద్రాలను, షోరూంలను స్థాపించింది.
  6. ముడి పదార్థాల సదుపాయం : కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడానికి, వాటికి కావలసిన ముడి పదార్థాలను ప్రభుత్వం విదేశాల నుండి దిగుమతి చేసుకొని వాటిని తక్కువ ధరలకు కుటీర పరిశ్రమలకు సమకూర్చింది.
  7. కుటీర పరిశ్రమ వస్తువుల కొనుగోలు : ప్రభుత్వం కుటీర పరిశ్రమలు ఉత్పత్తి చేసిన అంతిమ వస్తువులను కొనుగోలు చేసి వాటిని షోరూంలో అమ్ముతుంది. ప్రభుత్వం కుటీర పరిశ్రమల వస్తువులకు డిమాండ్ సృష్టించడానికి దేశం లోపల, దేశం వెలుపల ప్రదర్శనా కేంద్రాలను, షోరూంలను స్థాపించింది.
  8. విదేశీ పోటీ నుంచి రక్షణ : దిగుమతులపై అధిక సుంకాలను విధించడం ద్వారా దేశీయ పరిశ్రమలకు ప్రభుత్వం రక్షణ కల్పించింది. ఇంకా పరిశ్రమలకు రక్షణ కల్పించవలసిన అవసరం ఉంది.
  9. శిక్షణా సంస్థలను స్థాపించడం : కుటీర మరియు చిన్న తరహా పరిశ్రమలకు అర్హత కలిగిన శ్రామికులను సమకూర్చడానికి ప్రభుత్వం పారిశ్రామిక, ఒకేషనల్, వాణిజ్య, పాలిటెక్నిక్ వంటి వివిధ సంస్థలను స్థాపించింది.
  10. చేతి వృత్తుల కేంద్రాలు : చేతి వృత్తుల వస్తువులను ప్రోత్సహించడానికి, చేతివృత్తుల అభివృద్ధి కేంద్రాలను స్థాపించింది.

ప్రశ్న 10.
చిన్నతరహా పరిశ్రమల మనుగడ మరియు వృద్ధికి తీసుకోవలసిన చర్యల గురించి సలహా ఇవ్వండి.
జవాబు.
చిన్నతరహా పరిశ్రమల మనుగడ, వృద్ధికోసం పరిష్కార చర్యలు :
భారతదేశ ఆర్థిక వ్యస్వలో పారిశ్రామిక నిర్మాణంలో చిన్న తరహా పరిశ్రమలు ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాయి. అందుకని, ఈ సమస్యలన్నింటిని తొలగించడానికి, పరిశ్రమల మనుగడ, వృద్ధి కోసం తగిన చర్యలు తీసుకోవలసి ఉంది. పరిశ్రములు అభివృద్ధి చెందేటట్లు ఉండాలంటే, పరిశ్రమలు సక్రమంగా నడిచే వాతావరణం ఉండాలి.

పరిశ్రనులు సాధించగలిగిన వృద్ధిని పొందడానికి కింది పరిష్కార చర్యలు సూచించబడ్డాయి :

  1. ప్రస్తుతం ఉన్న చిన్న తరహా పరిశ్రమల గురించి వివరణాత్మక సర్వేలను నిర్వహించి, వాటికి ఉత్పాదక పథకాలను నిర్దేశించాలి.
  2. చిన్న తరహా పారిశ్రామిక సంస్థలలో పనిచేసే శ్రామికులకు తగిన విద్య, శిక్షణ సదుపాయాలను ప్రభుత్వం కల్పించాలి. మరియు నిబంధనలను ఇంకా సరళీకరణ చేయాలి.
  3. అసంఘటిత రంగంలో ఉన్న చిన్న తరహా పరిశ్రమలకు రోడ్లు, విద్యుచ్ఛక్తి, మురుగు నీటి పారుదల, నీటి సప్లయ్ వంటి అవస్థాపనా సౌకర్యాలకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.
  4. మార్కెటింగ్ రంగంలో పెద్ద తరహా పరిశ్రమలతో చిన్న తరహా పరిశ్రమలు పోటీ పడే విధంగా సమర్ధవంతమైన మార్కెటింగ్ వ్యవస్థను ప్రభుత్వం స్థాపించాలి.
  5. చిన్న తరహా పరిశ్రమలు ఉత్పత్తి పద్ధతుల మీద పరిశోధనలు నిర్వహించాలి. ఈ విధంగా, అవి ఉత్పత్తి పద్ధతులను మెరుగు పర్చే ప్రయత్నం చేస్తూ ఆధునిక మరియు సున్నితమైన సాంకేతిక పరిజ్ఞానం వారి సంస్థలలో అనుసరించాలి.
  6. చిన్న తరహా వ్యవస్థాపకులు వారి ఉత్పత్తులకు పెద్ద తరహా సంస్థల ఉత్పత్తులలాగా మంచి నాణ్యత, పరిమాణాలను
    కొనసాగించాలి.
  7. ప్రభుత్వం చిన్న తరహా పరిశ్రమలకు సుంకాల రేట్లు తగ్గించాలి. చిన్న తరహా పరిశ్రమలకు ఎగుమతి ప్రోత్సాహకాలను కల్పించాలి.

ఈ విధంగా ప్రభుత్వం పై చర్యలను తగిన సమయంలో, స్పూర్తితో తీసుకుంటే చిన్న తరహా పరిశ్రమలు విజయవంతంగా పురోగతి చెంది ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర వహిస్తాయి.

TS Inter 2nd Year Economics Study Material Chapter 6 పారిశ్రామిక రంగం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
సంగ్రహణ పరిశ్రమ.
జవాబు.
భూమి, వాయువు లేదా నీటి నుంచి వస్తువులను వెలికి తీసే పనిని వెతికి తీసే పరిశ్రమ చేస్తుంది. సాధారణంగా వెతికి తీసే పరిశ్రమల ద్వారా లభించే వస్తువులు ముడి పదార్థాల రూపంలో ఉంటాయి. వాటిని తయారీ రంగంలో, వినియోగ వస్తువులను ఉత్పత్తి చేసే నిర్మాణ పరిశ్రమ, బొగ్గు, ఖనిజాలు మొదలగునవి.

ప్రశ్న 2.
నిర్మాణ పరిశ్రమ.
జవాబు.
గృహాలు, వంతెనలు, రోడ్లు, ఆనకట్టలు, కాలువలు మొదలైన వాటి నిర్మాణ పనులను నిర్మాణ పరిశ్రమ చేపడుతుంది. ఈ పరిశ్రమ మిగిలిన అన్ని ఇతర పరిశ్రమలకంటే భిన్నమైనది. నిర్మాణ పరిశ్రమ ఉత్పత్తి చేసిన వస్తువులను అదే ప్రదేశంలో అమ్ముకోవలసి ఉంటుంది.

ప్రశ్న 3.
పారిశ్రామిక ఉత్పత్తి సూచిక.
జవాబు.
ఇది పరిశ్రమకు సంబంధించిన మైనింగ్ తయారీ, విద్యుచ్ఛక్తి అనే మూడు మూలకాలను కల్గి ఉంటుంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచికను దాని ఉపయోగాన్ని ఆధారంగా చేసుకొని వర్గీకరించవచ్చు.

TS Inter 2nd Year Economics Study Material Chapter 6 పారిశ్రామిక రంగం

ప్రశ్న 4.
వస్త్ర పరిశ్రమ.
జవాబు.
ఈ పరిశ్రమ మానవునిచే తయారు చేయబడిన లేదా సహజ పీచుల ద్వారా రెడీమేడ్ దుస్తులు వంటి వాటిని జనపనార, ఉన్ని, సిల్క్, ఖద్దరు వంటి ముడి పదార్థాల విలువను పెంచడం అనే కార్యకలాపాలు ఈ పరిశ్రమ పరిధిలోకి వస్తాయి. ఈ పరిశ్రమ 45 మిలియన్ల ప్రజలకు ఉపాధి కల్పిస్తోంది. దేశానికి ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయంలో 11% ఈ పరిశ్రమ ద్వారా లభిస్తోంది.

ప్రశ్న 5.
ఇనుము, ఉక్కు పరిశ్రమ.
జవాబు.
భారతదేశంలో ఉక్కు పరిశ్రమకు 400 సం॥రాల ప్రాచీన చరిత్ర ఉంది. 90,000 కోట్ల రూ॥ మూలధనాన్ని కల్గి, 6 లక్షల ఉపాధి అవకాశాలు కల్పిస్తూ భారతదేశ ఉక్కు పరిశ్రమ ప్రపంచంలో నాలుగవ స్థానంలో ఉంది. భారతదేశ ఉక్కు పరిశ్రమలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, బొకారో స్టీల్ ప్లాంటు, రూర్కెలా స్టీల్ ప్లాంట్, భిలాయ్ మొదలగునవి ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి.

ప్రశ్న 6.
పారిశ్రామిక వెనుకబాటుతనం.
జవాబు.
దేశంలో పారిశ్రామికంగా వెనుకబడిన ప్రాంతాలను గుర్తించడానికి 1968లో పాండే కమిటి ఏర్పడింది. పారిశ్రామిక వెనుకబాటుతనం గుర్తించడానికి ఈ కమిటీ ఆరు చలాంకాలను ఉపయోగించింది. అవి :

  1. తలసరి ఆదాయం,
  2. మైనింగ్,
  3. పరిశ్రమలలో నమోదు చేసుకున్న శ్రామికులు,
  4. పరిశ్రమలలో తలసరి విద్యుత్ వాడకం,
  5. జనాభా పరిమాణంతో రోడ్లు,
  6. ఉపరితల రోడ్ల పొడవు. వెనుకబడిన రాష్ట్రాలు యు.పి. అస్సాం, పశ్చిమ రాజస్థాన్, ‘ తెలంగాణ మొదలైనవి.

TS Inter 2nd Year Economics Study Material Chapter 6 పారిశ్రామిక రంగం

ప్రశ్న 7.
పారిశ్రామిక విధాన తీర్మానం, 1956
జవాబు.
ఈ పారిశ్రామిక విధానం భారతదేశంలో సామ్యవాద తరహా సమాజాన్ని స్థాపించడానికి, ప్రభుత్వ రంగం విస్తరణకు ప్రాధాన్యమిచ్చింది. ఈ తీర్మానం మిశ్రమ ఆర్థిక విధానాన్ని ఆధునీకరించింది. పారిశ్రామికీకరణ వేగంగా జరగాలంటే ప్రభుత్వ, ప్రయివేటు రంగాల మధ్య సహకారం, చిన్న పరిశ్రమ ప్రోత్సాహం ఆవశ్యకతను గుర్తించింది.

ప్రశ్న 8.
పారిశ్రామిక విధాన తీర్మానం, 1977
జవాబు.
దీనిని జనతాపార్టీ ప్రవేశపెట్టింది. చిన్న తరహా రంగాన్ని మూడు భాగాలుగా విభజించారు. అవి 1. కుటీర, గృహ పరిశ్రమలు, 2. చిన్న రంగం, 3. అతిచిన్న రంగం. ప్రాంతీయ అసమానతలు తగ్గించటానికి గ్రామీణ ప్రాంతాలలో పరిశ్రమలు స్థాపించే వారికి ప్రోత్సాహం. పట్టణ ప్రాంతాలలో నూతన పారిశ్రామిక స్థాపన నిషేధించెను. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవడానికి అనుమతించాలని ఈ విధానం గుర్తించింది.

ప్రశ్న 9.
పారిశ్రామిక విధాన తీర్మానం, 1980.
జవాబు.
ప్రభుత్వ రంగ సంస్థల సామర్థ్యాన్ని పెంచాలని, పారిశ్రామికంగా వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి, చిన్న, కుటీర పరిశ్రమలను స్థాపించుట ద్వారా ఆర్థిక ఫెడరలిజం భావనను ప్రవేశపెట్టారు. ఈ విధానం రుగ్మతగల సంస్థల పట్ల స్పష్టమైన పద్ధతి తెలియచేసింది. FERA మరియు MRTP కంపెనీలను ప్రత్యేక హోదాగల కంపెనీలుగా పరిగణించడం జరిగింది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 6 పారిశ్రామిక రంగం

ప్రశ్న 10.
సరళీకరణ (Liberalization).
జవాబు.
పారిశ్రామిక రంగంపై అనవసరమైన నియంత్రణలు మరియు నిబంధనలను తొలగించడానికి కొత్త ఆర్థిక విధానం అనేక సరళీకరణ చర్యలను ప్రవేశపెట్టింది. సరళీకరణ అనేది వాణిజ్యం మరియు పరిశ్రమలపై పరిమితులను తొలగించడాన్ని సూచిస్తుంది. సరళీకరణ ప్రధాన లక్ష్యం అనవసరమైన బ్యూరోక్రాటిక్ నియంత్రణల నుండి పారిశ్రామిక రంగాన్ని విడదీయడం.

ప్రశ్న 11.
భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు.
జవాబు.
ఇది చిన్న తరహా పరిశ్రమల రంగ ప్రత్యేక అవసరాలను తీర్చుకోవడానికి ప్రత్యక్ష విత్త సదుపాయాలను సమకూరుస్తోంది. గ్రామీణ పేదల కోసం చాలా పరిధిలో ప్రోత్సాహక, అభివృద్ధి చర్యలను SIDBI సమకూర్చింది.

ప్రశ్న 12.
పారిశ్రామిక విత్తం.
జవాబు.
పారిశ్రామిక సంస్థలు వాటి ఉత్పాదక కార్యకలాపాలకు వెచ్చించే విత్తం మొత్తాన్ని పారిశ్రామిక విత్తం అంటారు. వివిధ ఆధారాల నుంచి సంపాదించిన విత్తాన్ని పరిశ్రమలలో స్థిర మూలధనం, చర మూలధనంగా ఉపయోగించుకుంటున్నాయి.

TS Inter 2nd Year Economics Study Material Chapter 6 పారిశ్రామిక రంగం

ప్రశ్న 13.
గ్లోబల్ మార్కెట్.
జవాబు.
ప్రపంచంలోని ‘వివిధ దేశాల మధ్య వస్తువులు, సేవల అమ్మకాలు, కొనుగోలు లేదా వర్తకం జరిగే మార్కెట్ను గ్లోబల్ మార్కెట్ అని అంటారు. సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందడం వలన కంప్యూటర్ వాడకం వలన ఆన్లైన్ ద్వారా ప్రపంచ మార్కెట్, ఆర్థిక కార్యకలాపాలకు ఎల్లలు లేకుండా వృద్ధి చెందింది.

ప్రశ్న 14.
ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలు.
జవాబు.
ఆర్థిక కార్యకలాపాలలో ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగం పరస్పరం సమన్వయంలతో పనిచేస్తే దానిని మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు. అనగా ఆర్థిక వ్యవస్థలోని వనరులపై యాజమాన్యం, పరిపాలన, నియంత్రణ ప్రభుత్వం చేతులలో ఉంటే అది ప్రభుత్వ రంగం అవుతుంది. ఇదే అధికారం ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు చేతులలో ఉంటే దానిని ప్రైవేటు రంగం అని అంటారు.

ప్రశ్న 15.
భారతదేశంలో తయారుచేయడం.
జవాబు.
మేక్ ఇన్ ఇండియా చొరవ 2014 సెప్టెంబరులో దేశ నిర్మాణ కార్యక్రమాలలో విస్తృతంగా ప్రారంభించబడింది. భారతదేశాన్ని గ్లోబల్ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చడానికి రూపొందించబడిన మేక్ ఇన్ ఇండియా క్లిష్టమైన పరిస్థితిలో సకాలంలో వచ్చిన ప్రతిస్పందన. 2013 నాటికి, బాగా అభివృది చెందుతున్న మార్కెట్లతో పోల్చినప్పుడు భారతదేశ వృద్ధిరేటు ఒక దశాబ్దంలో కనిష్ట స్థాయికి పడిపోయింది.

TS Inter 2nd Year English Study Material Chapter 13 The Doctor’s Word

Telangana TSBIE TS Inter 2nd Year English Study Material 13th Lesson The Doctor’s Word Textbook Questions and Answers.

TS Inter 2nd Year English Study Material 13th Lesson The Doctor’s Word

Paragraph Questions & Answers (Section A, Q.No.5, Marks: 4)
Answer the following Questions in about 100 words

Question 1.
Sketch the character of Dr Raman.
Answer:
R K Narayan wrote The Doctor’s Word, which was his next connector in Malgudi Days. He is a well-known Indian author as well as the founder of Indian Thought Publications. Among his numerous works are The Painter of Signs, The Guide, and The Bachelor of Arts. The story is set in the well-known Malgudi Village.

The poet describes about Dr Raman individual personality of the behavior in the society. First of all he was an intelligent doctor. He speak less and work hard. He never believes whitewashing and comforting lies. He is a straight forward person. he always try to fulfillment his patients with courage. His main aim was to saved his patients from the clusters death. He mingled with every one in a friendly manner and he always loves his profession. He is an honorable and admirable person in the society.

ఆర్.కె నారాయణి డాక్టర్స్ వర్డ్ రాశారు, ఇది మాల్గుడి డేస్లో అతని తదుపరి కనెక్టర్. అతను సుప్రసిద్ధ భారతీయ రచయిత అలాగే ఇండియన్ థాట్ పబ్లికేషన్స్ వ్యవస్థాపకుడు. అతని అనేక రచనలలో ది పెయింటర్ ఆఫ్ సైన్స్, ది గైడ్ మరియు ది బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఉన్నాయి. బాగా తెలిసిన మాల్గుడి విలేజ్ నేపథ్యంలో కథ సాగుతుంది.

కవి డాక్టర్ రామన్ వ్యక్తిత్వం గురించి సమాజంలో ప్రవర్తన గురించి వివరిస్తాడు. అన్నింటిలో మొదటిది, అతను తెలివైన వైద్యుడు. అతను తక్కువ మాట్లాడతాడు మరియు కష్టపడి పనిచేస్తాడు. అబద్ధాలు తెలుపుతూ, ఓదార్పునిస్తూ ఎప్పుడూ నమ్మడు. అతను స్ట్రెయిట్ ఫార్వర్డ్ పర్సన్. అతను ఎల్లప్పుడూ ధైర్యంతో తన రోగులను నెరవేర్చడానికి ప్రయత్నిస్తాడు. అతని ప్రధాన లక్ష్యం అతని రోగులను సమూహాల మరణం నుండి రక్షించడం. అతను ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా మెలిగేవాడు మరియు అతను ఎల్లప్పుడూ తన వృత్తిని ప్రేమిస్తాడు. అతను సమాజంలో గౌరవప్రదమైన మరియు ప్రశంసనీయమైన వ్యక్తి.

Question 2.
“People came to him (Dr Raman) when the patient was on his last legs.”why?
Answer:
R Narayan’s next connector in Malgudi Days was The Doctor’s Word. He is an accomplished Indian author and the founder of Indian Thought Publications. His many works include The Painter of Signs, The Guide, and The Bachelor of Arts. The plot takes place in the well-known Malgudi Village.

One of the main reason people came to Doctor Raman in the last days because of he charged twenty five rupees on the other hand, never deviates from his principles. He never hides facts, no matter how unpleasant they are Once there is hope, he works day and night until the patient is completely recovered.

మాల్గుడి డేస్లో ఆర్.కె నారాయణ్ తదుపరి కనెక్టర్ ది డాక్టర్స్ వర్డ్. అతను నిష్ణాతుడైన భారతీయ రచయిత మరియు ఇండియన్ థాట్ పబ్లికేషన్స్ వ్యవస్థాపకుడు. అతని అనేక రచనలలో ది పెయింటర్ ఆఫ్ సైన్స్, ది గైడ్ మరియు ది బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఉన్నాయి. ఈ ప్లాట్లు ప్రసిద్ధ మాల్గుడి గ్రామంలో జరుగుతాయి.

చివరి రోజుల్లో డాక్టర్ రామన్ వద్దకు ప్రజలు రావడానికి ఒక ప్రధాన కారణం ఏమిటంటే, అతను ఇరవై ఐదు రూపాయలు వసూలు చేయడం, మరోవైపు అతని సూత్రాల నుండి ఎప్పుడూ వైదొలగడం లేదు. అతను వాస్తవాలను ఎప్పుడూ దాచడు, అవి ఎంత అసహ్యకరమైనవి అయినా, ఒకసారి ఆశ కలిగితే, రోగి పూర్తిగా కోలుకునే వరకు అతను పగలు మరియు రాత్రి పనిచేస్తాడు.

TS Inter 2nd Year English Study Material Chapter 13 The Doctor's Word

Question 3.
Describe Gopal’s health condition and his anxiety about the will.
Answer:
The Doctor’s Word was R K Narayan’s next wire in Malgudi Days. He is a well-known Indian author and the creator of Indian Thought Publications. By many is writings are The Painter of Signs, The Guide, and The Bachelor of Arts. The story takes place in the well-known Malgudi Village.

Dr. Raman and Gopal’s wife were conversing. According to the latter, Gopal’s condition is critical. Gopal’s wife began to cry as she heard this. Gopal heard her cry and thought he was going to die. He asked the doctor for confirmation-Doctor! Is it possible that I will die? He was worried about his death. Gopal asked to the doctor to give him a piece of paper. He wants to leave his property to his children that is his will. Dr. Raman reasoned that by signing the will, he declared his intention to die. In this case, his chances of dying would be increased. Subbiah and his gang would occupy his property if he did not give the will. He went against his nature and told a lie in order to keep Gopal happy so that he could be psychologically cured.

మాల్గుడి డేస్లో ఆర్కె నారాయణ్ తర్వాతి వైర్ డాక్టర్ మాట. అతను సుప్రసిద్ధ భారతీయ రచయిత మరియు ఇండియన్ థాట్ పబ్లికేషన్స్ సృష్టికర్త. అతని అనేక రచనలు ది పెయింటర్ ఆఫ్ సైన్స్, ది గైడ్ మరియు ది బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్. కథ బాగా తెలిసిన మాల్గుడి గ్రామంలో జరుగుతుంది.

డాక్టర్ రామన్ మరియు గోపాల్ భార్య సంభాషించుకున్నారు. అనంతరం తెలిపిన వివరాల ప్రకారం గోపాల్ పరిస్థితి విషమంగా ఉంది. ఇది విన్న గోపాల్ భార్య ఏడవడం ప్రారంభించింది. ఆమె ఏడుపు విన్న గోపాల్ తను చనిపోతానని అనుకున్నాడు. అతను నిర్ధారణ కోసం వైద్యుడిని అడిగాడు డాక్టర్! నేను చనిపోయే అవకాశం ఉందా? ఆయన మృతి పట్ల ఆందోళన చెందారు. గోపాల్ ఒక కాగితం ఇవ్వమని డాక్టర్ని అడిగాడు. అతను తన ఆస్తిని తన పిల్లలకు వదిలివేయాలని కోరుకుంటాడు. వీలునామాపై సంతకం చేయడం ద్వారా తాను చనిపోవాలనుకుంటున్నానని డాక్టర్ రామన్ వాదించారు. ఈ సందర్భంలో, పెరుగుతాయి. వీలునామా ఇ సింటే సుబ్బయ్య మరియు అతని గ్యాంగ్ అ ఆస్తిని ఆక్రమించేవారు. అతను తన స్వభావానికి విరుద్ధంగా కాల్ను సంతోషంగా ఉంచడానికి అబద్దం చెప్పాడు. కాల్ను సంతోషంగా ఉంచడానికి అబద్ధం చెడు, తద్వారా అతను మానసికంగా నయం అయ్యాడు.

Question 4.
If my word can save his life, he shall not die,” said Dr Raman to himself. Explain the situation that makes the doctor say so.
Answer:
RK Narayan’s next connector in Malgudi Days was The Loctor’s Word. He is a proficient Indian author and the founder of Indian Thought Publications. His works are known as The Painter of Signs, The Guide, and The Bachelor of Arts. The plot is set in the well- known Malgudi Village.

Dr. Raman is not positive about Gopal’s recovery. Nonetheless, he gives his all. But the real issue is Gopal’s request for the truth. Gopal is anxious to sign the will in order to save his family. Dr. Raman’s dilemma is whether or not to tell the truth. He never uses whitewash. He can’t, however, ruin Gopal’s slim chance of recovery. Finally, he decides to save Gopal. He will live if his word can save Gopal. And Gopal is saved by the doctor’s word.

మాల్గుడి డేస్లో ఆర్.కె నారాయణ్ తదుపరి కనెక్టర్ ది డాక్టర్స్ వర్డ్. అతను ప్రవీణ భారతీయ రచయిత మరియు ఇండియన్ థాట్ పబ్లికేషన్స్ వ్యవస్థాపకుడు. అతని రచనలను ది పెయింటర్ ఆఫ్ సైన్స్, ది గైడ్ మరియు ది బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అని పిలుస్తారు. మాల్గుడి విలేజ్లో ప్లాట్ సెట్ చేయబడింది.

గోపాల్ కోలుకోవడం పట్ల డాక్టర్ రామన్ సానుకూలంగా లేరు. అయినప్పటికీ, అతను తన సర్వస్వం ఇస్తాడు. అయితే అసలు విషయం ఏమిటంటే గోపాల్ సత్యాన్ని కోరడం. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు వీలునామాపై సంతకం చేయాలని గోపాల్ ఆరాటపడుతున్నాడు. నిజం చెప్పాలా వద్దా అన్నది డాక్టర్ రామన్ సందిగ్ధంలో పడింది. అతను ఎప్పుడూ వైట్వాష్ ఉపయోగించడు. అయినప్పటికీ, అతను గోపాల్ యొక్క స్వల్ప కోలుకునే అవకాశాన్ని నాశనం చేయలేడు. చివరగా, అతను గోపాల్ ను రక్షించాలని నిర్ణయించుకున్నాడు. తన మాట గోపాలుడిని కాపాడగలిగితే బతుకుతాడు. డాక్టర్ మాటతో గోపాల్ రక్షించబడ్డాడు.

TS Inter 2nd Year English Study Material Chapter 13 The Doctor's Word

The Doctor’s Word Summary in English

About Author
TS Inter 2nd Year English Study Material Chapter 13 The Doctor's Word 1

Rasipuram Krishnaswami Iyer Narayanaswami (10 October 1906-13 May 2001) was an Indian writer known for his work set in the fictional South Indian town of Malgudi. He was a leading author of early Indian literature in English along with Mulk Raj Anand and Raja Rao.

Narayan’s mentor and friend Graham Greene was instrumental in getting publishers for Narayan’s first four books including the semi-autobiographical trilogy of Swami and Friends, The Bachelor of Arts and The English Teacher. The fictional town of Malgudi was first introduced in Swami and Friends.

In a career that spanned over sixty years Narayan received many awards and honours including the AC Benson Medal from the Royal Society of Literature, the Padma Vibhushan and the Padma Bhushan, India’s second and third highest civilian awards, [2] and in 1994 the Sahitya Akademi Fellowship, the highest honor of India’s national academy of letters.[3] He was also nominated to the Rajya Sabha, the upper house of the Indian Parliament.

The Doctor’s Word, is a short story from the collection of “Malgudi Days” by R K Narayan published in 1943. In “The Doctor’s Word” R.K.Narayan tells the story how a doctor’s word saved the life of a patient, that’s very reason his opinion was valued; he was not a mere doctor expressing an opinion, but a judge pronouncing a verdict.”

Dr. Raman was a skilled doctor. He was straightforward and he always spoke the truth. As a result, his declaration was highly regarded. Dr. Raman’s best friend was Gopal. They known each other for 40 years. They spent their time eating, looking at pictures, and talking. Their friendship was unaffected by the flow of time.

One day Dr.Raman was informed that Gopal was ill. He went to Gopal’s house. Gopal was lying on the bed as if asleep. Dr.Raman examined him and gave necessary treatment. He is exceptionally fond of him and scolds Gopal’s family for not notifying him earlier about Gopal’s illness. He was worried about his friend’s life and he had no hope of saving his life.

The patient inquired about his condition with the doctor. To avoid “endless misery for his wife and children,” he wanted to sign the will and settle the property before he died. If Dr. Raman expresses his depressing belief that Gopal will not survive the night, it will “virtually mean a death sentence and destroy the unit” part of a chance that the patient had of survival.” As a result, Dr. Raman decided to tell a lie. He told a lie to his patient for the first time in his life. He told Gopal that he would be alive for a long time. Gopal was relieved to hear this news. The doctor was surprised to find Gopal alive and well the next morning. The patient’s survival would be a secret to him all his life.

The Doctor’s Word Summary in Telugu

ది డాక్టర్స్ వర్డ్, 1943లో ప్రచురించబడిన ఆర్ కె నారాయణ్ రచించిన “మాల్గుడి డేస్” సంకలనంలోని ఒక చిన్న కథ. “డాక్టర్స్ వర్డ్”లో ఆర్.కె. నారాయణ్ ఒక వైద్యుని మాట రోగి ప్రాణాన్ని ఎలా కాపాడిందో కథ చెబుతుంది, అందుకే అతని అభిప్రాయం విలువైనది; అతను కేవలం అభిప్రాయాన్ని వ్యక్తపరిచే వైద్యుడు కాదు, తీర్పు చెప్పే న్యాయమూర్తి.

డాక్టర్ రామన్ నైపుణ్యం కలిగిన వైద్యుడు. అతను సూటిగా ఉండేవాడు మరియు అతను ఎప్పుడూ నిజమే మాట్లాడేవాడు. ఫలితంగా, అతని ప్రకటన చాలా గౌరవించబడింది. డాక్టర్ రామనికి ప్రాణ స్నేహితుడు గోపాల్. వారు ఒకరికొకరు 40 సంవత్సరాలుగా తెలుసు. తింటూ, చిత్రాలు చూస్తూ, మాట్లాడుకుంటూ గడిపారు. వారి స్నేహం కాల ప్రవాహంతో ప్రభావితం కాలేదు.

ఒకరోజు గోపాల్ అనారోగ్యంతో ఉన్నాడని డా.రమణకు సమాచారం అందింది. అతను గోపాల్ ఇంటికి వెళ్ళాడు. గోపాల్ మంచం మీద పడుకుని నిద్రపోతున్నాడు. డాక్టర్ రామన్ పరీక్షించి అవసరమైన చికిత్స అందించారు. అతను అనూహ్యంగా అతనిని ఇష్టపడతాడు మరియు గోపాల్ అనారోగ్యం గురించి ముందుగా అతనికి తెలియజేయనందుకు గోపాల్ కుటుంబాన్ని తిట్టాడు. అతను తన స్నేహితుడి జీవితం గురించి ఆందోళన చెందాడు మరియు అతని ప్రాణాలను కాపాడుకోవాలనే ఆశ అతనికి లేదు.

రోగి పరిస్థితి గురించి డాక్టర్ని అడిగి తెలుసుకున్నారు. “తన భార్యాబిడ్డలకు అంతులేని దుస్థితి” రాకుండా ఉండాలంటే చనిపోయేలోపు వీలునామాపై సంతకం చేసి ఆస్తిని సెటిల్ చేయాలనుకున్నాడు. డా. రామన్ గోపాల్ రాత్రికి రాత్రే బ్రతకలేడని తన నిరుత్సాహకరమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తే, అది “వాస్తవంగా మరణశిక్ష అని అర్థం మరియు యూనిట్ను నాశనం చేస్తుంది” అని రోగికి జీవించే అవకాశం ఉంది.” ఫలితంగా, డాక్టర్ రామన్ అబద్దం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అతను తన జీవితంలో మొదటిసారిగా తన రోగికి అబద్ధం చెప్పాడు. తను చాలా కాలం బ్రతుకుతానని గోపాల్కి చెప్పాడు. ఈ వార్త వినగానే గోపాల్ కాస్త ఊరట చెందాడు. మరుసటి రోజు ఉదయం గోపాల్ సజీవంగా ఉండటం చూసి డాక్టర్ ఆశ్చర్యపోయాడు. రోగి మనుగడ అతని జీవితాంతం రహస్యంగా ఉంటుంది.

The Doctor’s Word Summary in Hindi

‘द डॉक्टर्स वर्ड’ 1943 में प्रकाशित आर. के. नारायण के “मालगुडी डेज़” के संग्रह से की गई एक छोटी कहानी है । ‘द डॉक्टर वर्ड’ में आर. कै. नारायण बताते हैं कि कैसे एक डॉक्टर के एक शब्दने एक मरीज की जान बचाई, यही कारण है कि उनकी राय मूल्यवान था, वह कल राथ व्यक्त करनेवाले नहीं थे, बल्कि फैसला सुनानेवाले न्यायाधीश थे ।”

डॉ. रामन एक कुशल चिकित्सक थे । वह सीधे स्पष्टवादी थे और सदा सच बोलते थे । इसके फलस्वरूप, सादे थे और हमेशा सच बोलते थे । वे उनकी धोषणा का अत्यधिक आदार होता स्पष्टवादी थे और सदा सच बोलते थे । इसके फलस्वरूप, उनकी धोषणा का अत्यधिक आदार होता था । डॉ. रामन के सब से अच्छे दोस्त गोपाल थे । वे परस्पर 40 साल से जानते थे । वे अपने समय खाने, चित्र देखने और बातें करने में व्यतीत करते थे । उनकी दोस्ती समय के प्रवाह से अप्रभावित थी ।

एक दिन डॉ.रामन को सूचना मिली कि गोपाल बीमार है । वे गोपाल के घर गाए । गोपाल बिस्तर पर ऐसे लेटे हुए थे जैसे सो रहे हों। डॉ. रामन ने उनकी जाँच की और आवश्यक उपचार दिया । वे उनसे बोहत प्यार करते हैं और गोपाल की बीमशि के बारे में पहले उन्हें सूचित नहीं करने केलिए गोपाल के परिवार को डाँटता है । उन्हें अपने दोस्त की जान की चिंता थी और उन्हें गोपाल की जान बचाने की कोई उम्मीद नहीं थी ।

मरीज ने डॉक्टर से अपनी स्थिति के बारे में जानकारी की। “अपनी पत्नी और बच्चों के लिए अंतहीन दुख” से बचने के लिए, वे वसीयत पर हस्ताक्षर करना चाहते थे और मरने से सफले संपत्ति का निपटान करना चाहते थे । यदि डॉ. रामन अपने निराशाजनक विश्वास को व्यक्त करते हैं कि गोपाल रात में जीवित नहीं रहेंगे, तो यह “वस्तुत: मौट की सजा का मतलब होगा और यूनिट को नष्ट कर देगा ।” रोगी के जीवित रहने का मौवा था । फलितः डॉ. रामन ने झूठ बोलने का फैसला किया । उन्हों ने अपने जीवन में पहली बार अपने मरीज से झूठ कहा । उन्होंने गोपाल से कहा कि तुम लंबे समय तक जीवित रहोगे । यह रक्चर सुनकर गोपाल को राहत मिली। अगली सुबह गोपाल को जीवित और स्वस्थ पाकर डॉकटर हैरान रह गए। रोगी का जीवित रहना उनके लिए जीवन भर रहस्य रहेगा ।

TS Inter 2nd Year English Study Material Chapter 13 The Doctor's Word

Meanings and Explanations

shirk (v) / (ష (ర్)క్) / ʃ3:k : avoid – తప్పించు, वचना

ominous (adj)/(ఒమినస్)/ ‘ɒm.I.nəs : suggesting that something bad is going to happen – ఏదో చెడు జరగబోతోందని సూచిస్తుంది, सुभाव है कि कुछ बुरा होनेवाला है

whitewashing (gerund-(n) (వైట్ వోషింగ్) / ‘waɪt.wɒʃ.ɪŋ : hiding unpleasant facts – అసహ్యకరమైన వాస్తవాలను దాచడం अप्रिय तथ्यों का छिपाना

curt (adj)/(క (ర్)ట్)/ k3:t : brief using very few words – సంక్షిప్త; చాలా తక్కువ పదాలను ఉపయోగించడం संक्षिप्त, बहुत काम शब्दों का प्रयोग

rolled up his sleeves (idiom) : prepared to work – పని చేయడానికి సిద్ధం, लुढका, (मुहावरा) काम करने के लिए पैयार

arena (n) / (అరీన) : /əri:nə’/ : an area of activity – కార్యాచరణ యొక్క ప్రాంతం, गतिविधि का एक क्षेत्र

wrested (v-pt) / rest (రెస్టిడ్)/’restid : took something with great effort or forcefully-
ఎంతో శ్రమతో లేదా బలవంతంగా ఏదైనా తీసుకున్నాడు
बहुत प्रयास से या जबरदस्ती कुछ लेना

soothing (adj)/ (సూదింగ్)/su:ðin/ : calming; comforting; relieving – ప్రశాంతత; ఓదార్పునిస్తుంది; ఉపశమనం కలిగించడం, शांत करना, आराम देना, राहत

sizzled (pt)/(సిజ్ ల్ డ్)/sizld ‘sız.əl : made the sound of boiling in hot water, – వేడి నీటిలో ఉడకబెట్టిన శబ్దం, गर्म पानी में उबलने की आवाज दी

whimpered (v-pt) / wimpe(r)d (వింప(ర్)డ్)/ ‘wim.pər : made low, weak crying noises, – తక్కువ, బలహీనమైన ఏడుపు శబ్దాలు, फुसफुसाते हुए, कम और धीमी गति से रोने की आवजें

essayed (v-pt)/(ఎసెఇడ్) / ‘es.eɪ /: tried; attempted – ప్రయత్నించారు; ప్రయత్నించాడు, कोशिश की; का प्रयास किया

snapped (v-pt)/(స్ప్యాప్ ట్)/ snæp : said impatiently, angrily – అసహనంగా, కోపంగా అన్నాడు अधीरता से, गुस्से से कहा

fatigue (n)/(ఫటీగ్) / fəti:g : a feeling of being extremely tired – విపరీతంగా అలసిపోయిన అనుభూతి अत्यधिक थका हुआ महसूस करना

famished (adj)/(ఫ్యామిష్ట్) /fæmist ‘fæm.ɪʃt : very hungry – చాలా ఆకలిగా ఉంది, भूखा; बहुत भूखा

pull through (phrasal v) /pʊl θru: : get better after a serious illness, operation, etc. తీవ్రమైన అనారోగ్యం, ఆపరేషన్ మొదలైన తర్వాత మెరుగుపడండి. गंभीर बीमारी, ऑपरेशन आदि के बाद बेहतर हो जाए

see him through (phrasal v) : give help or support to him to come out of illness అనారోగ్యం నుండి బయటపడటానికి అతనికి సహాయం లేదా మద్దతు ఇవ్వండి

ruminated (v-pt) / (రూమినెఇటిడ్) / ‘ru:mɪ.neɪt : thought deeply – లోతుగా ఆలోచించారు, गहराई से विचार

swarmed (v-pt)/(స్వ మ్ డ్) / swɔ:m : moved around in groups – గుంపులుగా తిరిగారు, सम् हों, में धूमा है

evasive (adj)/(ఇవెఇసివ్)/ ɪ’veɪ.sɪv : not willing to give clear answer to a question-
ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వడానికి ఇష్టపడతారు, किसी प्रश्न का स्पष्ट उत्तर देने को तैयार

TS Inter 2nd Year English Study Material Chapter 13 The Doctor's Word

beckoned (v-pp) / (బెకన్ డ్) / ‘bek.ən : signalled; gave signal to move nearer-దగ్గరకు వెళ్ళమని సిగ్నల్ ఇచ్చాడు

clasped (v-pt)/(క్లాస్ ప్ ట్)/ kla:sp : held tightly – గట్టిగా పట్టుకుంది, कसकर पकड़ा

bewilderment (n)/ (బివిల్డ(ర్)మన్ట్) : confusion – గందరగోళం, भ्रम

deprecating (adj) / (డెప్రకెఇటింగ్) : disappproving – నిరాకరణ, अस्वीकृति

TS Inter 2nd Year Economics Study Material Chapter 10 తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

TS Inter 2nd Year Economics Study Material 10th Lesson తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
తెలంగాణ రాష్ట్ర నిర్మితిపై వ్యాసం రాయండి.
జవాబు.
హైదరాబాద్ రాష్ట్రం నిజాం నవాబులచే రెండు శతాబ్దాలకు పైగా (1724-1948) పరిపాలించబడింది. రాష్ట్రానికి స్వంత కరెన్సీ, పరిపాలనా వ్యవస్థ రవాణా మరియు కమ్యూనికేషన్ వ్యవస్థ, స్వంత రైల్వే, పోస్టల్ వ్యవస్థ ఉండేది. ఉర్దూ భాష అధికార భాషగానే కాకుండా ఉర్దూలోనే విద్యాభ్యాసం జరిగేది.

భారత దేశానికి 15 ఆగస్టు, 1947 స్వాతంత్ర్యం వచ్చినపుడు, హైదరాబాద్ రాజ్యపాలకుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్, ఏడవ నిజాం రాజు స్వతంత్రంగానే ఉంచాలనుకున్నాడు. కానీ అన్ని సంస్థానాలు, రాజరిక వ్యవస్థలు భారతదేశంలో కలవాలనుకున్నాయి. ఆ సమయం రాష్ట్రంలో అంతర్గత కలహాలు మొదలయ్యాయి. ముఖ్యంగా వ్యవసాయ కూలీలు ఫ్యూడల్ పాలనపై తిరుగుబాటు చేసారు.

తెలంగాణ సాయుధ పోరాటంగా ఈ సంఘటన పిలువబడింది. ఆ పరిస్థితులలో భారత ప్రభుత్వం “సాయుధ బలగాలతో” నిజాం రాజుపై ఒత్తిడి తెచ్చి భారత్లో కలవాలని కోరింది. చరిత్రలో పోలీస్ చర్యగా పిలవబడింది. ఈ ఘటనతో సెప్టెంబర్ 17, 1948 రోజున హైదరాబాద్ రాజ్య విలీనం జరిగింది. 1952వ సంవత్సరంలో సాధారణ ఎన్నికలు జరిగాయి. అందులో డా॥ బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది.

మద్రాసు రాష్ట్రంలో చాలా కాలం భాగంగా ఉన్న ఆంధ్ర ప్రాంతం 1 అక్టోబరు, 1953న ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటైంది. తెలంగాణ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో కలిసింది. ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ ప్రాంతం కలవడం వల్ల ఈ క్రింది ప్రయోజనాలు పొందవచ్చునని భావించారు.

  1. హైదరాబాద్ను కలుపుకుంటే రాజధాని సమస్య పరిష్కారమవుతుందని భావించారు.
  2. తీవ్ర ఆర్థిక ఇబ్బందులలో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి, మిగులు బడ్జెట్ నిధులు గల తెలంగాణ ఆదాయం ఉపయోగించుకొనుటకు
  3. కృష్ణా, గోదావరి నదులపై నియంత్రణ మొదలైనవి.
  4. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు సమయంలో చేసుకొన్న వాగ్దానాలు, తెలంగాణ ప్రాంతానికి కల్పించిన రక్షణలు అమలు కాలేదు.

ఆ సమయంలో చేసుకొన్న ముఖ్య ఒప్పందాలు.

  1. 1956 నాటి పెద్ద మనుషుల ఒప్పందం.
  2. 1969లో అఖిలపక్ష ఒప్పందం.
  3. 1969లో 8 అంశాల ఫార్ములా, 1970లో 5 అంశాల ఫార్ములా.
  4. 972లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.
  5. ఆరుసూత్రాల పథకం.
  6. జీ.వో నెం. (G.O.No.) 610 గిర్ గ్లాని కమీషన్ రిపోర్టు.

పైన పేర్కొన్న అంశాలు అమలుకు నోచుకోకపోవడం వల్ల తెలంగాణ ప్రాంతం, సీమాంధ్ర ప్రాంతాలకంటే అన్ని రంగాలలో వెనుకబడిపోయింది. ఈ పరిస్థితులు తరచూ ఉద్యమాలు చెలరేగడానికి కారణాలైనాయి.

1969లో చెలరేగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నిరంతరం కొనసాగుతూ 2009 నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారింది.

ఉద్యమం వివిధ రూపాలుగా సమ్మెలు, బండ్లు, రైలురోకో, జాతీయ రహదార్ల నిర్బంధం, విద్యార్థుల నిరసనలు, విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల మూసివేత, సకల జనుల సమ్మెలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడం, ఆర్.టి.సి., సింగరేణి కార్మికుల సమ్మెలు, ఆత్మహత్యలు, శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు (ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి) ఆమరణ నిరాహార దీక్షతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణను 29వ రాష్ట్రంగా ప్రకటించింది.

జూన్ 2, 2014న ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. తెలంగాణలోని 10 జిల్లాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది.

TS Board Inter Second Year Economics Study Material Chapter 10 తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 2.
స్థూల రాష్ట్ర ప్రాంతీయోత్పత్తి (GSDP) అనగానేమి ? తెలంగాణాలో స్థూల రాష్ట్ర ప్రాంతీయోత్పత్తి, తలసరి ఆదాయాల ధోరణిని వివరించండి.
జవాబు.
స్థూల రాష్ట్ర ప్రాంతీయోత్పత్తి లేదా రాష్ట్ర ఆదాయం అనేది రాష్ట్ర ఆర్థిక వృద్ధిని కొలవడానికి ముఖ్యమైన సూచిక. “రాష్ట్రంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తువుల, సేవల విలువల మొత్తాని లెక్కించడాన్ని (without duplication) స్థూల రాష్ట్ర ప్రాంతీయాదాయం అని నిర్వచించవచ్చు.

ఆర్థిక గణాంక శాఖ సంచాలకులు రాష్ట్రంలో ఉత్పత్తి, ఆదాయ మదింపు పద్ధతుల ద్వారా స్థూల రాష్ట్ర ప్రాంతీయోత్పత్తి (GSDP) ని అంచనా వేస్తున్నారు.

తెలంగాణ ఆర్ధిక వ్యవస్థలో స్థూల రాష్ట్ర ప్రాంతీయ్పోత్తి ధోరణులు :
ఒక రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ పనితీరును స్థూల రాష్ట్ర ప్రాంతీయోత్పత్తిలో వచ్చే వృద్ధి రేటు సూచిస్తుంది. స్థూల రాష్ట్ర ప్రాంతీయోత్పత్తి అధ్యయనం ద్వారా ఒక నిర్దిష్ట కాలంలో ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల పని తీరును అంచనా వేయవచ్చు.

2011-12 నుంచి 2019-20 మధ్య కాలంలో తెలంగాణ స్థూల రాష్ట్ర ప్రాంతీయోత్పత్తి, భారత్ స్థూల దేశీయోత్పత్తి వార్షిక వృద్ధి రేట్ల ప్రస్తుత, తెలంగాణకు సంబంధించి, స్థూల రాష్ట్ర ప్రాంతీయోత్పత్తి 2011-12 నుండి 2019-20 మధ్య కాలంలో ప్రస్తుత ధరలో రూ. 3.59 లక్షల కోట్ల నుండి రూ. 9.69 లక్షల కోట్లకు పెరగగా, స్థిర ధరలలో రూ. 3.59 లక్షల కోట్ల నుంచి రూ.6.63 కోట్లకు పెరిగింది.

కాగా ఇదే కాలంలో భారత్లో ప్రస్తుత ధరల్లో స్థూల దేశీయోత్పత్తి రూ.87.36 లక్షల కోట్ల నుంచి రూ. 203.8 లక్షల కోట్లకు, స్థిర ధరల్లో రూ.87.36 లక్షల కోట్ల నుంచి రూ. 146.83 లక్షల కోట్లకు పెరిగింది.

ఇక వార్షిక వృద్ధి రేట్లకు సంబంధించి ప్రస్తుత ధరలలో తెలంగాణలో స్థూల రాష్ట్ర ప్రాంతీయోత్పత్తి వృద్ధి రేటు 2011-12లో 11.7 నుంచి 2018-19 నాటి 14.3 శాతం పెరగగా 2019-20లో 12.6 శాతంగా నమోదయింది. కాగా ఇదే కాలంలో భారత్ లో ఇది వరుసగా 13.8 శాతం, 11 శాతం, 7.5 శాతంగా నమోదయింది. 2011-12 నుంచి 2019-20 మధ్య కాలంలో 2012-13, 2013-14 సంవత్సరాలు మినహా తెలంగాణ రాష్ట్ర స్థూల ప్రాంతీయోత్పత్తి రేటు, భారత్ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు కంటే ఎక్కువగా నమోదయింది.

2012-13 నుంచి 2019-20 మధ్య కాలంలో, స్థిర ధరలలో, తెలంగాణ స్థూల రాష్ట్ర ప్రాంతీయోత్పత్తి వార్షిక వృద్ధి రేటు 3 శాతం నుంచి 8.2 శాతానికి పెరగగా, భారత్ స్థూల దేశీయోత్పత్తి వార్షిక వృద్ధి రేటు 2012-13లో 5, 6 శాతం ఉండగా 2016-17 లో 8.3 శాతానికి పెరిగి 2019-20 నాదికి 5 శాతానికి పడిపోయింది.

2011-12 నుంచి 2019-20 మధ్య కాలంలో భారత దేశ స్థూల దేశీయోత్పత్తిలో తెలంగాణ రాష్ట్ర వాటా స్థిర, ప్రస్తుత ధరలలో 4.11 శాతం నుంచి 4.5 శాతం మధ్య ఉన్నది.

తెలంగాణలో భారతదేశంలో ప్రస్తుత ధరలలో తలసరి ఆదాయం :
నిర్దేశిత సంవత్సరంలో రాష్ట్ర నికర ప్రాంతీయోత్పత్తి విలువను రాష్ట్ర జనాభాచే భాగించడం ద్వారా రాష్ట్ర తలసరి ఆదాయాన్ని లెక్కిస్తారు.

తెలంగాణలో 2011-12 లో తలసరి ఆదాయం రూ. 91,121 ఉండగా అది 2019-20 (ముందస్తు అంచనా) నాటికి రూ. 2,28,216 కు పెరిగి 2011-12పై 150 శాతం వృద్ధిని సాధించింది. కాగా భారత్లో తలసరి ఆదాయం 2011-12లో రూ. 63,462 కాగా 2019-20 (ముందస్తు అంచనా) నాటికి రూ. 13,432 కి పెరిగి 2011-12పై 111 శాతం వృద్ధిని సాధించింది. ఈ విధంగా తెలంగాణలో తలసరి ఆదాయం భారత్ తలసరి ఆదాయం కంటే ఎక్కువ.

TS Board Inter Second Year Economics Study Material Chapter 10 తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 3.
తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో జోడించిన స్థూల రాష్ట్ర ఉత్పత్తి విలువ (GVSA) లో వివిధ రంగాల వాటాపై వ్యాసం వ్రాయండి.
జవాబు.
ఆర్థిక వ్యవస్థలో గల వివిధ రంగాలు ప్రదర్శించిన వృద్ధి రేట్లు ఆ వ్యవస్థ యొక్క వృద్ధి ధోరణిని తెలుపుతాయి. ఆర్థిక వ్యవస్థలో గల వివిధ రంగాలను 16 రంగాలుగా విభజించినప్పటికీ సులభంగా గ్రహించుట కొరకు వీటిని స్థూలంగా మూడు రంగాలుగా వర్గీకరిస్తారు.
అవి : ప్రాథమిక, ద్వితీయ, గౌణ రంగాలు. ఈ రంగాల వృద్ధి రేట్లను ప్రాథమిక ధరలలో జోడించిన స్థూల ఉత్పత్తి విలువ (GVA) తో సూచిస్తారు.

a) ప్రాథమిక రంగం :
ఈ రంగంలో పంటలు, పశుసంపద, అడవులు, మత్స్య పరిశ్రమ, గనులు మొదలైనవి.

b) ద్వితీయ రంగం :
ఇందులో తయారీ రంగం, గ్యాస్, నీటి సరఫరా, ఇతర అనుబంధ సేవలు మొదలైనవి.

c) గౌణ రంగం :
ఇందులో వ్యాపారం రిపేర్ సేవలు, హోటళ్ళు, రెస్టారెంటులు, రవాణా (రైల్వే రోడ్ వే, నౌకాయానం, విమానయానం మొ.||) నిలువ (storage), కమ్యూనికేషన్, బ్రాడ్కాస్టింగ్, ఆర్థిక సేవలు, స్థిరాస్థి రంగం, ప్రభుత్వ పాలన మొదలైనటువంటివి ఉంటాయి.

ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల విశ్లేషణ ఆ వ్యవస్థలో ఆయా రంగాల పని తీరుని తెలుపుటకు, ఆర్థిక స్థితిగతుల అంచనాకు తోడ్పడుతుంది. అంతేగాక ప్రస్తుత సంవత్సరంలో ఆర్థికవ్యవస్థలో ఆయా రంగాలు ఏ విధమైన పనితీరును కనబరచాయో, రాబోయే కాలంలో ఏ విధంగా పనిచేయగలవో తెలుసుకొనుటకు వీలవుతుంది.

ప్రాథమిక రంగం వృద్ధి రేటు 2012-13లో 21.9 శాతం (స్థిర ధరలో 8.6 శాతం) నుంచి 2015-16 లో కేవలం 2.2 శాతానికి (స్థిర ధరలలో 58 శాతం) తగ్గగా 2016-17 నాటికి 17.1 శాతానికి పెరిగి తిరిగి 2019-20 (AE)లో 15.8 శాతానికి (స్థిర ధరలలో 10.7 శాతం) తగ్గింది.

ఈ విధంగా ప్రాథమిక రంగంలో మిశ్రమ వార్షిక సగటు వృద్ధి రేట్లు నమోదగుటను గమనించవచ్చు. 2012-13, 2014-15 సంవత్సరాలలో ద్వితీయ రంగం రుణాత్మక వృద్ధి రేటును చవిచూడగా 2015-16 లో అత్యధిక వృద్ధి రేటు అనగా 20.3 శాతం (స్థిర ధరలలో 21.4 శాతం) ను నమోదు చేసుకొన్నది.

2019-20 (AE) ప్రకారం ఈ రంగంలో 5.3 శాతం వృద్ధిరేటు నమోదయింది. 2012-13 నుంచి 2019-20 మధ్య కాలంలో గౌణ రంగపు వృద్ధి రేటు 18.4 శాతం నుంచి 14.1 శాతం (స్థిర ధరలలో 8.4 శాతం నుంచి 9.6 శాతం) మధ్య కొనసాగింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుత, స్థిర ధరలలో జోడించిన స్థూల రాష్ట్ర ఉత్పత్తి విలువ వృద్ధి రేటులో మిశ్రమ ధోరణిని చూడవచ్చు.

జోడించిన స్థూల రాష్ట్ర ఉత్పత్తి విలువ (GSVA) లో వివిధ రంగాల వాటా :
GSVA లో గౌణ రంగం లేదా సేవల రంగం వాటా 2011-12లో 52.8 శాతం నుంచి 2019-20 (AE) నాటికి 65.2 శాతానికి పెరగగా, ప్రాథమిక రంగం లేదా వ్యవసాయ రంగం దాని అనుబంధ రంగాల వాటా ఇదే కాలంలో 19.6 శాతం నుంచి 18.6 శాతానికి తగ్గగా, ద్వితీయ రంగం లేదా పారిశ్రామిక రంగం వాటా 27.6 శాతం నుంచి 16.2 శాతానికి తగ్గింది. తెలంగాణ రాష్ట్రపు GSVAలో ప్రాథమిక, ద్వితీయ రంగాల వాటా అస్థిర రూపంలో ఉండగా, గౌణ రంగం లేదా సేవల రంగం వాటా స్థిరంగా ఉండటాన్ని గమనించవచ్చు.

TS Board Inter Second Year Economics Study Material Chapter 10 తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 4.
తెలంగాణ రాష్ట్ర జనభా తీరుతెన్నులను విశదీకరించండి.
జవాబు.
ఒక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి ఆ వ్యవస్థలో లభ్యమవుతున్న వనరులపై ఆధారపడి ఉంటుంది. మానవ వనరులు ఉంటే, సహజ వనరులను అభిలషణీయంగా, సమర్థవంతంగా వినియోగపరిచి, రాష్ట్ర ప్రగతికి, అధిక ఉత్పత్తికి కారకులవుతారు. నాణ్యమైన జనాభాతో పాటు మూలధన కల్పన, సాంకేతిక పరమైన మార్పులు ఆర్థిక వ్యవస్థకు చలనత్వాలను కలిగిస్తుంది.

2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా దాదాపు 42%గా నమోదయింది. భారతదేశమొత్తం భౌగోళిక వైశాల్యంలో తెలంగాణ 3.5% విస్తీర్ణం కల్గి ఉంది. రంగారెడ్డి జిల్లా జనాభాలో అత్యధికంగా 52.97 లక్షల మంది ఉండగా, నిజామాబాద్ జిల్లా జనాభాలో 25.51 లక్షల మందితో చివరి భాగాన ఉంది.

జనసాంద్రత :
ప్రతి చదరపు కిలోమీటరులో నివసించే జనాభాను జనసాంద్రత అంటారు. ఈ జనసాంద్రత జనాభా పెరుగుదల రేటును బట్టి మారుతూ ఉంటుంది. భారతదేశ మొత్తం జనసాంద్రతతో పోలిస్తే తెలంగాణలో జనసాంద్రత పెరుగుదల తక్కువగా ఉంది.

హైదరాబాద్ జిల్లా రాష్ట్ర రాజధాని నగరం కాబట్టి అధిక జనసాంద్రతను కల్గి ఉండి చదరపు కిలోమీటరుకు 18,172 మంది నివసిస్తున్నారు. 2001-2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో జనాభా వృద్ధి రేటు 1.4% భారతదేశ జనాభా వృద్ధి రేటు 1.84% కంటే తక్కువ.

పిల్లల జనాభా :
0-6 సం॥లోపు వారిని పిల్లలు అంటారు. తెలంగాణలో పిల్లల జనాభా శాతం 2001లో 14.2% నుంచి 2011లో 10.5% తగ్గింది. ఈ తగ్గుదలకు కారణం పెరుగుతున్న అక్షరాస్యత, అధిక ఆదాయాలకు తోడు కుటుంబ నియంత్రణ పద్ధతులు అవలంబించడం. అన్ని జిల్లాలలో పిల్లల జనాభా శాతం రాష్ట్ర సగటుకు దగ్గరగా 10.5% గా ఉన్నది. ఒక మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం పిల్లల జనాభా 17.4% గా ఉంది.

కుటుంబ పరిమాణం, ఎస్.సి. & ఎస్.టి. జనాభాలో స్త్రీ, పురుషుల నిష్పత్తి :
జనాభా లెక్కల ప్రకారం కొంతమంది వ్యక్తులు `ఒక దగ్గర కలిసి జీవిస్తూ ఒకే వంటగదిని వాడుకోవడాన్ని కుటుంబం అంటారు. మొత్తం జనాభాను గృహాల సంఖ్యచే భాగించగా కుటుంబ పరిమాణం వస్తుంది. తెలంగాణలో సగటు కుటుంబ పరిమాణం 42% గా ఉంది.

ఎస్.సి/ఎస్.టి. జనాభా :
2011 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్ కులాల (ఎస్.సి.) జనాభా మొత్తం రాష్ట్ర జనాభాలో 15.44% ఉంది. అదే విధంగా షెడ్యూల్ తెగల (ఎస్.టి.) జనాభా మొత్తం రాష్ట్ర జనాభాలో 9.34% ఉంది. .2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్.సి. జనాభా మొత్తం జనాభాలో 54,32,650 మంది ఉన్నారు.

ఎస్.టి. జనాభా 32,86,928 మంది. ఎస్.సి. జనాభా అత్యధిక శాతం కరీంనగర్ జిల్లాలో 18-80%గా నమోదయ్యారు. అత్యల్పం హైదరాబాద్ 6.29%. ఎస్.టి. జనాభా ఖమ్మం జిల్లాలో 27.37%గా ఉంది. అత్యల్పం హైదరాబాద్లో 1.24%గా ఉంది. పట్టణాల కంటే గ్రామాలలోనే అధిక జనాభా వృద్ధి నమోదయింది.

స్త్రీ-పురుష నిష్పత్తి :
1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య ఆధారంగా స్త్రీ, పురుష నిష్పత్తి నిర్ణయించబడుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ప్రతి 1,000 మంది పురుషులకు 990 మంది స్త్రీల అనుపాతం ఉంది.

మానవ అభివృద్ధి సూచి :
ఇది మూడు అంశాల వారిగా రూపొందించారు.

  1. పుట్టిన సమయంలో ఆయుఃప్రమాణం
  2. శిశుమరణాల రేటు
  3. అక్షరాస్యతా స్థాయి.

తెలంగాణలో మానవ అభివృద్ధి సూచిక (HDI):

TS Inter 2nd Year Economics Study Material 10th Lesson తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 1

వలసదారుల వాటా :
తెలంగాణలోని పట్టణ జనాభాలో అధిక పెరుగుదలకు ఆంధ్ర ఇతర రాష్ట్రాల నుండి వలసదారులే కారణం. 1961 నుంచి 2011 మధ్య కాలంలో తెలంగాణలో వలసదారుల జనాభా 62 లక్షలు. పట్టణ జనాభాలో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 70% జనాభా పట్టణ వాసులే. దీనికి కారణం పట్టణాల అభివృద్ధి మరియు హైదరాబాద్ పరిసరాల అభివృద్ధి.

అక్షరాస్యత :
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో అక్షరాస్యత శాతం 66%.

TS Board Inter Second Year Economics Study Material Chapter 10 తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 5.
తెలంగాణ రాష్ట్రంలో విద్య, ఆరోగ్య రంగాల స్థితిని విశదీకరించండి.
జవాబు.
తెలంగాణలో విద్య :
దేశంలో మానవ వనరులు, ఆర్థికాభివృద్ధి బలోపేతం కావడానికి విద్యను ప్రధాన సాధనంగా భావించాలి. ఉత్పాదక శ్రామిక శక్తిని పెంపొందించడంలో విద్య కీలక పాత్ర పోషిస్తుంది. భారత రాజ్యాంగంలోని 45 వ నిబంధన ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలబాలికలకు ఉచిత, నిర్బంధ విద్యను అందించడం రాష్ట్రాల బాధ్యత.

తెలంగాణలో అక్షరాస్యత రేటు :
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో అక్షరాస్యత రేటు 66.54 శాతం. అయితే పట్టణ-గ్రామీణ, అంతర్ జిల్లా, వయస్సు వారీ జనాభా, స్త్రీ-పురుషులు, సామాజిక వర్గాల పరంగా అక్షరాస్యత రేటులో తేడాలున్నాయి. రాష్ట్రంలో విద్యా రంగం స్థితి :

a) నమోదు(Enrollment) :
2017-18 సంవత్సరంలో అన్ని పాఠశాలలు కలిపి 58.71 లక్షల విద్యార్థులు నమోదు చేసుకొన్నారు. ఇందులో 53 శాతం ప్రైవేటు పాఠశాలల నమోదు కాగా మిగితా 47 శాతం ప్రభుత్వ పాఠశాలల నమోదు.

b) స్థూల నమోదు నిష్పత్తి (Gross Enrollment Ration-GER) :
స్థూల నమోదు నిష్పత్తి (GER) విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలో విద్యార్థుల నమోదు సంఖ్యను నిర్ణయిస్తుంది. GER 2017-18లో ప్రాథమిక పాఠశాలలో బాలురు – 98.76 శాతం, బాలికలు -. 98.05 శాతం కాగా ఉచ్ఛతర ప్రాథమిక పాఠశాలలో బాలురు – 87.32 శాతం, బాలికలు 88.4 శాతం.

c) విద్యార్థి – ఉపాధ్యాయ నిష్పత్తి (Pupil – Teacher Ratio – PTR) :
ఇది ఒక విద్యా సంవత్సరంలో ప్రత్యేక విద్యా స్థాయికి సంబంధించి ఎంత మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉంటాడనే విషయాన్ని తెలుపుతుంది. PTR, 2018-19లో రాష్ట్రంలో ప్రాథమిక స్థాయిలో 18.90, ఉచ్ఛతర ప్రాథమిక స్థాయి 14.12, సెకండరీ స్థాయిలో 17.85 గా ఉంది. రాష్ట్రం మొత్తానికి 2018-19లో PTR 17.67.

పాఠశాల విద్య :
i) సమగ్ర శిక్షా అభియాన్:
గతంలో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలైన

  1. సర్వ శిక్షా అభియాన్ (SSA) సార్వత్రిక ప్రాథమిక విద్యను అమలు పరుస్తూండగా
  2. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (RMSA) సెకండరీ విద్యలో సామీప్యత (acess), ప్రమాణం (quality) లో పెంపుదలకు అమలు చేసింది.

ii) కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం :
వీటిని 2004-05 లో రెసిడెన్షియల్ పాఠశాల సౌకర్యం కల్పించే ఉద్దేశంతో నెలకొల్పారు. నీటిలో ప్రవేశానికి అర్హతలు : SC, ST, BC, మైనారిటీ వర్గాలకు సంబంధించిన

  1. VI నుంచి VII తరగతులు వారికి,
  2. అనాధలు,
  3. బడి మానేసిన ఒంటరి తల్లి/తండ్రి కలిగిన విద్యార్థులు

iii) ఆదర్శ పాఠశాలలు :
194 ఆదర్శ పాఠశాలలు రాష్ట్రంలో 2013-14లో స్థాపించబడ్డాయి. వీటిలో అధిక విద్యార్హతలున్న ఉపాధ్యాయులచే ఇంగ్లీషు మీడియంలో విద్యా బోధన జరుగుతుంది. ఈ వథకం రద్దయినందువలన తెలంగాణ ప్రభుత్వం వీటి బాధ్యత తీసుకొని 2015-16 నుంచి వీటిని కొనసాగిస్తున్నది.

ఇంటర్మీడియట్ విద్య :
ప్రస్తుతం రాష్ట్రంలో 2,558 జూనియర్ కళాశాలలు ఉండగా వాటిలో విద్యార్థుల సంఖ్య 7.18 లక్షలు. 2,558 జూనియర్ కళాశాలలో, 404 ప్రభుత్వ, 4 వొకేషనల్, 41 ప్రైవేట్ ఎయిడెడ్, 1,583 ప్రైవేట్ మరియు ఇతర జూనియర్ కళాశాలలు కాగా 530 ఇతర ప్రభుత్వ సంస్థలు. ఈ బోర్డు ఉపాధిని కల్పించేందుకు వీలయిన 23 వొకేషనల్ కోర్సులను ఇంటర్మీడియట్ స్థాయిలో ప్రవేశపెట్టింది.

TS Board Inter Second Year Economics Study Material Chapter 10 తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

ఉన్నత విద్య:

a) కళాశాల విద్య :
కళాశాల విద్య డిపార్ట్ మెంట్ యొక్క ప్రధాన లక్ష్యం ఉన్నత విద్యలో సామీప్యత (access), సమానత (equality), నాణ్యత (quality) ను సాధించుట. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకమైన రాష్ట్రీయ ఉచ్ఛతర శిక్షా అభియాన్ (RUSA) నుంచి నిధుల సమీకరణకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది.

b) డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) :
డిగ్రీ కళాశాలలో బి.ఎ/బి.కాం/బి.యస్సీ/బి.బి.ఎ వండి డీగ్రీ కోర్సులలో ప్రవేశాలను తెలంగాణ ప్రభుత్వం 2016 సంవత్సరం నుంచి DOST ద్వారా కల్పిస్తున్నది. 2018 – 19లో డిగ్రీ కళాశాలలో 2,00,472 మంది విద్యార్థులు ప్రవేశాన్ని పొందగా ఇందులో 42,688 విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాన్ని పొందారు.

c) సాంకేతిక విద్య :
సాంకేతిర విద్యా డైరెక్టరేట్ రాష్ట్రంలో పాలిటెక్నిక్, వృత్తి విద్యలను పర్యవేక్షిస్తుంది. ఇది ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ రంగాలలలో ప్రవేశాలు, విద్యా బోధనను పర్యవేశిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 820 డిప్లమో డిగ్రీలో యుక్తమైన కళాశాలలు 1,36,805 విద్యార్థులతో పనిచేస్తున్నాయి.

సాంఘిక సంక్షేమ విద్యా సంస్థలు :
SC, ST, BC, మైనారిటీ, వికలాంగ బాలబాలికలక సమీప ప్రాంతాలలో విద్యా సంస్థలు ఉండే విధంగా చూని సాంఘిక సమానత్వ సాధనకు ప్రభుత్వం సాంఘిక సంక్షేమ విద్యా సంస్థలను నెలకొల్పింది. ఈ సంస్థలు రెసిడెన్షియల్ రూపంలో ఉండి విద్యార్థులకు ఉచిత హాస్టల్ వసతితో బాటు పాఠ్యపుస్తరాల పంపిణీ చేస్తాయి.

A) షెడ్యూల్డ్ కులాల రెసిడెన్షియల్ పాఠశాలలు :
తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్నియల్ విద్యా సంస్థల సొసైటి (TSWREIS) రాష్ట్రంలో 269 రెసిడెన్షియల్ విద్యా సంస్థలను నడుపుచున్నది. ఇందులో 175 బాలికలకు సంబంధించినవి. వీటిలో 5వ తరగతి నుండి డిగ్రీ వరకు షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులకు ప్రవేశం కలదు. ప్రస్తుతం 268 విద్యా సంస్థలు ఉండగా అందులో 134 తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రారంభించబడ్డాయి.

B) షెడ్యూల్డ్ తెగల రెసిడెన్షియల్ పాఠశాలలు :
a) తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీ (TTWRESIS) – గురుకులాలు :
రాష్ట్రంలో ఈ గురుకులాలు 175 ఉన్నాయి.

b) ఆశ్రమ పాఠశాలలు :
రాష్ట్రంలో ప్రస్తుతం 321 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి.

c) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు :
గిరిజన సంక్షేమ శాఖ 1,427 ప్రాథమిక పాఠశాలలను నిర్వహిస్తున్నది.

C) వెనుకబడిన తరగతులు సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు :
మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ సంస్థల సొసైటీ (M,JPTBCWREIS) వెనకబడిన తరగతులు, ఆర్థికంగా వెనకబడిన తరగతుల వారికి విద్యను అందించుటకు స్థాపించారు.

ఒక రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను నడుపుతున్నది. ఈ విద్యా సంస్థలలో దాదాపు 99,360 విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.

D) మైనారిటీ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు :
మైనారిటీ వర్గాలకు చెందిన బాలబాలికలకు అధిక నాణ్యతతో కూడిన విద్యను అందించుటకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మైనారిటీల రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీ (TMREIS) ని స్థాపించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 216 మైనారిటీ విద్యా సంస్థలు 12 కళాశాలలతో కలిపి 79,424 విద్యార్థులకు విద్యను కల్పిస్తున్నాయి.

TS Board Inter Second Year Economics Study Material Chapter 10 తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

II. తెలంగాణలో ఆరోగ్య రంగం :
‘అందరికీ ఆరోగ్యం’ అనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లక్ష్యాన్ని చేరుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను చేపట్టింది. జాతీయ ప్రసూతి లబ్ది పథకం (National Maternity Benefit Programme), సమగ్ర శిశు అభివృద్ధి పథకం, పిల్లల కోసం బాలికా సమృద్ధి యోజన పథకం, పునరుత్పత్తి కలిగిన మహిళలకు సప్లిమెంటరీ న్యూట్రీషన్ పథకాన్ని అమలు చేస్తున్నది.

‘సామాజిక, ఆర్థిక దృక్పథం 2020’ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 4,797 ఆరోగ్య ఉప కేంద్రాలు, 633 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 249 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 90 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, 19 ఏరియా ఆసుపత్రులు, 29 జిల్లా కేంద్ర ఆసుపత్రులు, 9 వైద్య కళాశాల ఆసుపత్రులు, 12 స్పెషాలిటీ ఆసుపత్రులు, 2 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నాయి.

ఆరోగ్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న పథకాలు : రాష్ట్రావతరణ అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగంలో అనేక పథకాలను రూపొందించి అమలు పరుస్తున్నది. అందులో ముఖ్యమైనవి.

a) కంటి వెలుగు :
సామాన్యంగా ప్రజలు ప్రత్యేకించి మహిళలు, వృద్ధులు కంటి సమస్యలను వాయిదా వేయడం లేదా ఆ సమస్యలను కొనసాగిస్తూనే జీవనాన్ని గడుపుతుంటారు. ఈ సమస్య నివారణ కోసమే తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు పథకాన్ని రూపొందించి అమలుపరుస్తున్నది.

b) బస్తీ దవాఖాన :
పట్టణ ప్రాంతాలలో ప్రామాణికతతో కూడిన ఆరోగ్య సేవలు అందించుటకు బస్తీ దవాఖానాలు స్థాపించారు. ప్రతి బస్తీ దవాఖాన 6,000 నుండి 10,000 జనాభా ఉన్న ప్రాంతాలకు సేవలందిస్తుంది. పట్టణ మురికినాడలలో వీటిని స్థాపిస్తారు. రాష్ట్రంలో 104 బస్తీ దవాఖానాలు పనిచేస్తున్నాయి.

c) ఆరోగ్య, వెల్నెస్ కేంద్రాలు :
ఇవి సమగ్ర ఆరోగ్య సేవలతో బాటు ప్రసూతి, చిన్న పిల్లల ఆరోగ్య రక్షణ సేవలను అందిస్తున్నాయి. వైద్య సేవలు, అవసరమైన ఔషధాలను ఇవి ఉచితంగా పంపిణీ చేస్తాయి. రాష్ట్రంలో 636 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 86 ఉపకేంద్రాలు, 104 బస్తీ దవాఖానాలు, 227 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆరోగ్య వెల్నెస్ కేంద్రాలుగా పనిచేస్తున్నాయి.

d) తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) ఆసుపత్రులు :
తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 107 TVVP ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. ఇవి ప్రసూతి, చిన్న పిల్లల ఆరోగ్య రక్షణ సేవలు, సాధారణ వైద్య సేవలు, సర్జరీలు, ఆప్తమాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, డెర్మటాలజీ, ENT మొదలైన సేవలను అందిస్తాయి.

e) ఆయుష్ (ఆయుర్వేద, యోగ, నాచురోపతి, యునాని, హోమియోపతి) :
తెలంగాణ ప్రభుత్వం, జాతీయ ఆయుష్ మిషన్ సహకారంతో రాష్ట్రంలో ఆయుష్ పద్ధతి వైద్యాన్ని ప్రోత్సహిస్తున్నది. ఆయుష్ శాఖ కింద రాష్ట్రంలో 860 దవాఖానాలు పనిచేస్తున్నాయి.

f) ఆరోగ్య శ్రీ :
‘ఆరోగ్యశ్రీ ఆరోగ్య రక్షణ ట్రస్టు’ ద్వారా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనే ఒక ఏకైక పథకం ఆరోగ్య బీమాతో అమలవుతుంది. దీని ప్రధాన ఆశయం పేదరిక రేఖకు దిగువన ఉన్న వారికి వైద్య సేవలను అందించడం. ఈ పథకం ద్వారా పేద వారికి ఎంపిక చేయబడిన వ్యాధులకు నగదు రహిత సేవలు అందించబడతాయి.

g) KCR కిట్ :
ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం జూన్ 2, 2017 న ప్రారంభించింది. పేదరికపు రేఖకు దిగువన ఉండి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల నుంచి ఆరోగ్య సేవలు పొందే గర్భిణీ స్త్రీలకు, మగశిశువు జన్మిస్తే రూ. 12,000, ఆడశిశువు జన్మిస్తే రూ. 13,000 సహాయం అందించబడుతుంది.

TS Board Inter Second Year Economics Study Material Chapter 10 తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 6.
తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల సౌకర్యాలను వివరించండి.
జవాబు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన నాటి నుంచి నీటి పారుదల సౌకర్యాల అభివృద్ధి పట్ల తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత నిచ్చుచున్నది. నీటిపారుదల సౌకర్యాలను విస్తరించుట ద్వారా రాష్ట్రంలో కనీసం ఒక కోటి ఎకరాలకు నీటి పారుదలను దించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకొన్నది. రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిని గురించి కింద వివరించవచ్చు.

a) డా॥ బి.ఆర్. అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు:
కుమరం భీం జిల్లాలో గల తుమ్మిడిహట్టి గ్రామం, కౌటాల నుండలం, ప్రాంతంలో పెంగ, వార్ధా నదుల సంగమం వద్ద గల ప్రాణహిత నదిపై ఒక బ్యారేజిని నిర్మించి 20 TMC ల నీటిని మళ్లించి ఉత్తర ఆదిలాబాద్ జిల్లాలో గతంలో నిర్దేశించిన 56,500 ఎకరాలకు బదులు 2 లక్షల ఎకరాలకు నీటిని సమకూర్చడం.

b) కాళేశ్వరం ప్రాజెక్టు :
కాళేశ్వరం దగ్గరలో గల మేడిగడ్డ వద్ద గోదావరి నదిపై ఒక బ్యారేజీ, మేడిగడ్డ (లక్ష్మీ బ్యారేజీ) మరియు అన్నారం వద్ద గల శ్రీపాద యెల్లంపల్లి మరియు అన్నారం వద్ద గల శ్రీపాద యెల్లంపల్లి మరియు సుందిల్ల వద్ద మరో రెండు బ్యారేజీలను నిర్మించడం.

వీటి ద్వారా కాలువలు, టన్నెల్స్, లిఫ్ట్ పద్ధతులు, రిజర్వాయర్లు, నీటి పంపిణీ వ్యవస్థలను ఉపయోగించి కమాండ్ ఏరియాలో గల 7 జిల్లాల (పునర్విభజన వలన 13 జిల్లాలకు) ఆయకట్టు తొలుత ప్రకటించిన 16,40,000 ఎకరాలకు బదులు 18,25,700 ఎకరాలకు నీటిని అందించుటకు నిర్ణయం తీసుకున్నారు.

i) అలీసాగర్ ఎత్తిపోతల పథకం :
ఈ పథకం ద్వారా నిజామాబాద్ జిల్లాలో గల నవీపేట, రెంజల్, ఎడపల్లి, నిజామాబాద్, డిచ్పల్లి, మాక్లూర్ మండలాలలో సుమారు 53,793 ఎకరాలకు నిజాంసాగర్ ఆయకట్టు ద్వారా నీటి పారుదలలో వచ్చిన కొరత తీర్చుటకు అనుబంధంగా నీటి పారుదల కల్పిస్తారు. కోహ్లి గ్రామం వద్ద గోదావరి కుడి కాలువ నుండి 720 క్యూసెక్కుల నీరు ఎత్తిపోయడం ఈ పథకం ప్రతిపాదన.

ii) అర్గుల రాజారాం గుత్ప – ఎత్తిపోతల పథకం :
నిజాంసాగర్ ఆయకట్టు ద్వారా నీటి పారుదలలో వచ్చిన కొరతను తీర్చుటకు నిజామాబాద్ జిల్లాలో సుమారు 38,792 ఎకరాలకు నిజాంసాగర్ యొక్క D74 నుంచి నుంచి D82 డిస్ట్రిబ్యూటరీల ద్వారా నీటిపారుదల ఈ పథకం ద్వారా కల్పించబడుతుంది.

iii) చౌట్పల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల పథకం :
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు – లక్ష్మీ కెనాల్ యొక్క D4 డిస్ట్రిబ్యూటరీ ద్వారా షెట్పల్లి చెరువును నింపి నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లి, మోర్తాడ్ మండలాలలోని 18 గ్రామాలకు 180 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోతల ద్వారా 11,625 ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం కల్పించుట ఈ పథకం ఉద్దేశం.

iv) లెండ్ అంతర్ రాష్ట్ర ప్రాజెక్టు :
ఇది తెలంగాణ, మహారాష్ట్రలకు సంబంధించిన అంతర్ రాష్ట్ర ప్రధాన ప్రాజెక్టు. దీని ప్రధాన పనులు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో 27,000 ఎకరాలు, మహారాష్ట్రలో 22,000 ఎకరాలు మొత్తం 49,000 ఎకరాలకు నీటి పారుదల కల్పించాలనేది ప్రతిపాదన.

v) ఎం. బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు :
సంగారెడ్డి జిల్లా, సింగూరు గ్రామం వద్ద గోదావరి ఉపనది అయిన మంజీరా నది వద్ద ఈ ప్రాజెక్టు నిర్మించబడ్డది. దీని స్థూల నీటి నిలువ స్థాయి 29.91 TMCలు.

vi) జె: చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం :
ఈ పథకం ద్వారా జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఏటూరు నాగారం మండలం, గంగారం వద్ద గోదావరి నది నుంచి ఎత్తిపోతల ద్వారా వరంగల్ పట్టణ ప్రాంతంలో గల ఎత్తు ప్రాంత కరువు భూములైన 6.21 లక్షల ఎకరాలకు నీటి పారుదల సౌకర్యం కల్పించడం.

vii) దిగువ పెంగా ప్రాజెక్టు :
ఇది తెలంగాణ, మహారాష్ట్రల ఉమ్మడి ప్రాజెక్టు. ఇది గోదావరి ఉపనది అయిన పెన్గాంగ వద్ద కలదు. ఈ ప్రాజెక్టు నికర నీటి నిలువ అంచనా 42.67 TMCలు, మహారాష్ట్ర, తెలంగాణ ఈ నీటిని 88:12 నిష్పత్తిలో పంచుకొంటాయి.

viii) శ్రీరామ ఎత్తిపోతల పథకం :
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత గతంలో ఉన్న రాజీవ్ దుమ్ముగూడెం, ఇందిరా సాగర్ రుద్రంకోట ఆయకట్టులను కలిపి ఈ పథకాన్ని ప్రారంభించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలలో లక్షల ఎకరాలకు నీటిపారుదల కల్పించడం దీని లక్ష్యం.

ix) తుపాకుల గూడెం బ్యారేజి (సమ్మక్క బ్యారేజి) :
ప్రభుత్వం ఈ బ్యారేజి స్థలాన్ని కంతనపల్లి గ్రామం నుంచి తుపాకుల గూడెం గ్రామం, వరంగల్ రూరల్కు బదిలీ చేయుటకు అంగీకారం తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా పూర్వ వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలు లబ్ది పొందుతాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పేరును “సమ్మక్క బ్యారేజి” గా మార్చుటకు ప్రతిపాదించింది.

x) శ్రీ కుమరం భీం ప్రాజెక్టు :
ఇది ఒక మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టు. దీనిని ఆసిఫాబాద్ జిల్లా, మండలం, అడ గ్రామం వద్ద స్థాపించుటకు ప్రతిపాదించారు. దీని ద్వారా ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి, ఆసిఫాబాద్, కాగజ్ నగర్, సిర్పూర్ (IT) మండలాలలో 69 గ్రామాల 45,500 ఎకరాల ఆయకట్టుకు నీటిపారుదల, అందించాలనేది లక్ష్యం.

xi) పాలెం వాగు ప్రాజెక్టు :
ఇది గోదావరి ఉపనది అయిన పాలెంవాగు వద్ద మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టు రూపంలో ఉన్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం మల్లాపురం గ్రామం ప్రాంతంలో ఉన్నది. ఈ ప్రాజెక్టు ఖరీప్ సీజన్లో 4100 హెక్టార్లు (10,132 ఎకరాలు), రబీ సీజన్లో 1250 హెక్టార్ల భూమికి నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించుచున్నది.

xii) శ్రీరాం సాగర్ ప్రాజెక్టు :
దీనిని నిజామాబాద్ జిల్లాలో పోచంపాడు వద్ద గోదావరి నదిపై నిర్మించారు. దీని ముఖ్య లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలోని 5 పూర్వ జిల్లాలకు అనగా కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు త్రాగునీరు, సాగు నీరును అందించడం. ఈ ప్రాజెక్టు కింద సుమారు 4 లక్షల ఎకరాలకు నీరు లభిస్తుంది.

xiii) కడెం ప్రాజెక్టు :
దీనిని పూర్వ ఆదిలాబాద్ జిల్లాలోని కడెం నదిపై నిర్మించారు. దీని ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో 25,000 ఎకరాలకు సాగునీరు లభిస్తుంది.

xiv) నిజాంసాగర్ ప్రాజెక్టు :
పూర్వ నిజామాబాద్ జిల్లాలోని అచ్చంపేట, భంజపల్లి గ్రామాల మధ్య గోదావరి నదికి ఉపనది. అయిన మంజీర నదిపై నిర్మించారు. ఈ డ్యామ్ 2.31 లక్షల ఎకరాల భూమికి సాగునీటిని అందిస్తుంది.

TS Board Inter Second Year Economics Study Material Chapter 10 తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

B. కృష్ణానది పరివాహక ప్రాంతం :

i) మహార్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు :
మహబూబ్ నగర్ జిల్లాలో 4.10 లక్షల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించి ఎత్తు ప్రాంతాలలో కరువు పీడిత ప్రజలకు తాగునీటి సరఫరా చేయడం ఈ పథకం ఉద్దేశం. శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి మూడు దశలలో ఎత్తిపోతల ద్వారా 40 TMC ల నిలువకు ప్రతిపాదన.

ii) రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం :
ఈ పథకం ద్వారా రెండు ప్రాంతాలలో అనగా జూరాల ప్రాజెక్టు వద్ద గల పంచదేవ్పాడ్, ఉకబెట్టివాగు వద్ద గల రామన్పౌడ్ నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిపారుదల సౌకర్యాన్ని ఎత్తు ప్రాంతాలలో తీవ్రమైన కరువును చవిచూసిన పూర్వ మహబూబ్ నగర్ జిల్లాలోని 15 మండలాలలో వివిధ ప్రాంతాలకు విస్తరించడం. అంతేగాక ఈ ప్రాంతాలలో గల 196 గ్రామాలకు తాగు నీరును సరఫరా చేయడం ఈ పథకపు లక్ష్యం.

iii) జవహర్ నెట్టంపాడు ఎత్తిపోతల పథకం :
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి 21.425 TMCల నీటిని ఎత్తిపోయడం ద్వారా గద్వాల, ఆలంపూర్ నియోజక వర్గాలలోని 8 మండలాలలో గల 148 గ్రామాలలలో 2 లక్షల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం కల్పించడం ఈ పథకం ఉద్దేశం.

iv) ప్రియుదర్శిని జూరాల ప్రాజెక్టు :
ఇది ఒక బహుళార్ధక సాధక ప్రాజెక్టు. జోగులాంబ గద్వాల జిల్లా, రేవులపల్లి గ్రామం వద్ద కృష్ణా నదిపై దీనిని నిర్మించారు. ఈ ప్రాజెక్టు ఎడమ (ఎన్.టి.ఆర్. కాలువ), కుడి (నల్లసోమనాద్రి కాలువ) కాలువల ద్వారా కరువు పీడిత ప్రాంతాలైన వనపర్తి జిల్లాలోని ఆత్మకూరు, కొత్తకోట, పెబ్బేరు మండలాలు, నాగర్ కర్నూల్ జిల్లాలోని వేపగండల, కొల్లాపూర్ మండలాలు, మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాల్ మానోపాడ్ మండలాలకు సంబంధించి 1.02 లక్షల ఎకరాలకు నీటి పారుదల కల్పించుట.

v) రాజోలిబండ మళ్లింపు పథకం :
ఇది తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో తుంగభద్ర నదిపై నిర్మించిన ఆనకట్టతో యుక్తమైనది ఈ ప్రాజెక్టు. నిజాం రాష్ట్ర పాలన కాలంలో ఈ పథకం మంజూరు చేయబడ్డది. ఈ ఆనకట్ట 1946లో ప్రారంభించబడి 1958లో పూర్తిచేయబడ్డది.

vi) కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకం :
సుహబూబ్ నగర్ జిల్లా, దేవరకద్ర మండలం, బొల్లారం గ్రామం వద్ద 1955లో ఈ ప్రాజెక్టును నిర్మించారు. మహబూబ్ నగర్ జిల్లా అమరచింత నియోజ వర్గంలోని 12,000 ఎకరాల ఆయకట్టుకు నీటిపారుదల ఈ ప్రాజెక్టు ద్వారా జరుగుతుంది.

vii) పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం :
ఎత్తు ప్రాంతంలో గల 12.310 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిపారుదల సౌకర్యం కల్పించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు ద్వారా నాగర్ కర్నూల్ (1 లక్ష ఎకరాలు), మహబూబ్ నగర్ (4.14 లక్షల ఎకరాలు), రంగారెడ్డి (3.64 లక్షల ఎకరాలు), వికారాబాద్ (3.32 లక్షల ఎకరాలు), నల్గొండ (0, 30 లక్షల ఎకరాలు) జిల్లాలకు నీటి పారుదలతో బాటు సమీప గ్రామాలకు, GHMCకి తాగు నీరు మరియు పారిశ్రామిక అవసరాలకు నీటి సౌకర్యం సమకూర్చాలనేది ప్రభుత్వ ఆశయం.

viii) గట్టు ఎత్తిపోతల పథకం :
జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు, దరూర్, కె.టి. దొడ్డి మండలాలలోని ఎత్తు ప్రాంతాలలో గల 28,000 ఎకరాలకు నీటి పారుదల సౌకర్యం కల్పించడం ఈ పథకం ముఖ్య లక్ష్యం.

ix) డిండి ఎత్తిపోతల పథకం:
నల్గొండ జిల్లాలోని ఎత్తు ప్రాంతాలు కరువు పీడిత ప్రాంతాలే కాకుండా వీటిలో చాలా ప్రాంతాలు ఫ్లోరైడ్ సమస్యకు గురైనాయి. ఈ సమస్య నివారణకు ఇక్కడి ప్రాంతాలకు ఏకైక మార్గం కృష్ణా నది నీరు. డిండి ప్రాజెక్టు ద్వారా నాగర్ కర్నూల్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాలకు 3.61 లక్షల ఎకరాలకు నీటి పారుదల సౌకర్యాన్ని కల్పించడంతో బాటు తాగు నీటి సౌకర్యాన్ని కల్పించడం జరుగుచున్నది.

x) ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం :
ఎలిమినేటి మాధవ రెడ్డి శ్రీశైలం ఎడమ కాలువ బాలెన్సింగ్ రిజర్వాయర్ అయిన ఉదయ సముద్రం నుంచి ఎత్తిపోతల ద్వారా 6.70 TMC ల నీటిని నల్గొండ జిల్లాలోని నక్రేకల్, నల్గొండ, మునుగోడు, తుంగతుర్తి అసెంబ్లీ నియోజక వర్గాలలో తీవ్రంగా క్షామం, కరువు పీడిత ఎత్తు ప్రాంతాలలో 1 లక్ష ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం కల్పించడం ఈ పథకం లక్ష్యం.

xi) నాగార్జున సాగర్ ప్రాజెక్టు :
ఇది ప్రపంచంలోనే అతి పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు. దీనిని కృష్ణా నదిపై నల్గొండ,, గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో నిర్మించారు. ఈ ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా ఆంధ్రాకు 1.11 మిలియన్ హెక్టార్లకు, తెలంగాణకు 0.32 మిలియన్ హెక్టార్లకు నీరు లభిస్తుంది.

xii) శ్రీశైలం ప్రాజెక్టు :
దీనిని కృష్ణా నది పైస మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాల సరిహద్దుల్లో నిర్మించారు. దీని ఎడమ కాలువ ద్వారా 4.20 లక్షల ఎకరాల భూమికి సాగు నీరు లభిస్తుంది.

TS Board Inter Second Year Economics Study Material Chapter 10 తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 7.
తెలంగాణ రాష్ట్రంలో IT, ITeS వృద్ధి, దృష్టి కోణాన్ని అంచనా వేయండి.
జవాబు.
రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నప్పుడు వ్యవసాయాధార వ్యవస్థ నుంచి పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతుంది. ఆర్థికాభివృద్ధి ప్లవన దశకు (take off stage) చేరుకున్నప్పుడు సేవా రంగం వృద్ధి త్వరిగతిన జరగడమే కాకుండా పారిశ్రామిక రంగం కంటే ముందుంటుంది.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో జోడించిన స్థూల రాష్ట్ర ప్రాంతీయోత్పత్తి విలున (GVSA)లో సేనా రంగం 2018-19 (మొదటి సవరించిన అంచనా) లో స్థిర ధరలలో 64.5 శాతం నాటాను కలిగి ఉండి ముందంజ రంగంగా కొనసాగుతున్నది.

తెలంగాణలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT), దాని అనుబంధ సేవలు (ITeS) : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT), దాని అనుబంధ సేవల (ITeS) ఉత్పత్తి, ఎగుమతులలో తెలంగాణ రాష్ట్రం ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. IT రంగం ద్వారా వచ్చిన పెను మార్పులు నూతన అవకాశాలను ప్రత్యేకించి బిగ్ డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, యానిమేషన్ గేమింగ్ వంటి వాటిని కల్పించింది. రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్ ప్రాపంచిక IT హబ్ గా గుర్తింపు పొందింది.

ఇక్కడ చిన్నవి, పెద్దవి కలిపి 1500 IT, ITeS కంపెనీలు ప్రత్యక్షంగా 4.3 లక్షల వృత్తి నైపుణ్యులకు ఉద్యోగిత కల్పించడమే కాకుండా 7 లక్షల మందికి పరోక్ష ఉద్యోగితను కల్పించుచున్నవి. 2014-15 నుంచి IT, ITeS రంగంలో బలమైన వృద్ధి చోటు చేసుకొనుచున్నది. ఈ స్థితిని పట్టిక – 10.7 ద్వారా చూడవచ్చు. 2014-15 నుంచి 2016-17 మధ్య కాలంలో IT, ITeS యూనిట్ల సంఖ్య, ఉద్యోగిత, ఎగుమతులలో శ్రీఘ్రతర వృద్ధి ఏర్పడింది.

2018-19 లో రాష్ట్ర IT సాఫ్ట్వేర్ ఉత్పత్తుల ఎగుమతుల విలువ రూ. 1,09,219 కోట్లు (US$15.6 బిలియన్లు), దేశ IT ఎగుమతులలో తెలంగాణ రాష్ట్ర వాటా 11 శాతం, దేశానికి IT ఎగుమతుల ద్వారా సంక్రమించే రాబడిలో హైదరాబాద్ 2 స్థానాన్ని కలిగి ఉంది.

IT విధానం :
దేశంలో సాంకేతికత పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మార్చే లక్ష్యంతో IT, ITeS సేవలను పెంపొందించి ఈ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించి ఉద్యోగితను పెంచుట కొరకు తెలంగాణ ప్రభుత్వం ICT (Information and Commu- nication Technology) విధానాన్ని రూపొందించింది.

TS Board Inter Second Year Economics Study Material Chapter 10 తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

IT, ITeS ప్రధాన లక్ష్యాలు :

i) IMAGE టవర్ :
అధునాతన అవస్థాపనా సౌకర్యాల కల్పన ద్వారా యానిమేషన్, గేమింగ్, VFX సేవల కల్పనకు IMAGE టవర్ను నెలకొల్పుటకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. దీనిని రుద్రారం గ్రామం, రంగారెడ్డి జిల్లాలో 10 ఎకరాల స్థలంలో రూ. 1,000 కోట్లతో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (PPP)లో స్థాపించ తలపెట్టింది.

ii) తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు:
ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. తగిన అవస్థాపనా సౌకర్యాలను కల్పించి 10 జోన్లు (33 జిల్లాలో) గా ‘డిజిటల్ తెలంగాణ’ను సాకారం చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.

iii) ఎలక్ట్రానిక్ నేవల డెలివరీ (ESD) :
రాష్ట్ర ప్రజలకు, వ్యాపారస్థులకు ప్రభుత్వం కల్పించే ఎలక్ట్రానిక్ సేవలలో పారదర్శకత, జవాబుదారీతనం, సామర్థ్యంతో కూడిన డెలివరీలో ESD నోడల్ ఏజెన్సీగా విధులను నిర్వర్తిస్తుంది. డిజిటల్ తెలంగాణ సాధనలో భాగంగా సాంకేతికత ద్వారా ప్రజాకేంద్రక స్మార్ట్ సేవలు అందించుట ESD లక్ష్యం. ESD, 550 పై చిలుకు సేవలను 38 కార్యా లయాల ద్వారా మీ సేవ, T-వాలెట్, T-ఆప్ వంటి వాటి ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సేవలను అందించుచున్నది.

iv) నైపుణ్యం, విజ్ఞానాన్నిఅందించే తెలంగాణ అకాడమి (TASK) :
IT, ITeS, జీవశాస్త్రాలు ఆరోగ్యం రక్షణ, ఏరోస్పేస్, బాంకింగ్, ఆర్ధిక, సేవలు వంటి రంగాలకు అవసరమైన శ్రామికశక్తి నైపుణ్యాల పెంపుదల కోసం ఉద్దేశించిన ఏకైక సంస్థ TASK (Telangana Academy for Skill and Knowledge) విద్యా రంగం, పరిశ్రమల భాగస్వామ్యంతో లాభరహిత వ్యవస్థగా TASK నెలకొల్పబడింది.

డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన విద్యార్ధులకు సాంకేతిక, సాంకేతికేతర సాఫ్ట్ స్కిల్స్ అందించి పరిశ్రమలకు పూర్తి తయారీ రూపంలో శ్రామిక శక్తిని అందించుట TASK లక్ష్యం.

TS Board Inter Second Year Economics Study Material Chapter 10 తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 8.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్లుప్తంగా వివరించండి.
జవాబు.
తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన నాటి నుంచి పేద ప్రజల జీవన ప్రమాణ స్థాయిలో పెంపుదల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను రూపొందించింది. వీటిని గురించి కింద వివరించవచ్చు.

a) పౌరులందరికీ సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు :

i) ఆసరా పెన్షన్ల పథకం :
సంక్షేమ కార్యక్రమాలు, సాంఘిక భద్రత కల్పనలో భాగంగా పేదవారు గౌరవంగా జీవనాన్ని గడపడానికి వీలుగా తెలంగాణ ప్రభుత్వం ‘ఆసరా పెన్షన్’ల పథకాన్ని ప్రవేశపెట్టింది. సమాజంలో అతి పేదవారికి, బలహీన వర్గాలకు రక్షణ కల్పించుటలో భాగంగా ఎయిడ్స్ రోగులు, వితంతువులు, అశక్తులైన నేత పనివారు, గీత కార్మికులు, పెరుగుతున్న వయస్సుతో జీవన అవసరాలు కోల్పోయిన వారికి ఈ పథకం ద్వారా సహాయం లభిస్తుంది.

నవంబర్ 8, 2014 న ఈ పథకాన్ని పూర్వ మహబూబ్ నగర్ జిల్లాలోని, కొత్తూరులో పథకాన్ని ప్రారంభించారు.

ii) ఆరోగ్యలక్ష్మి :
గర్భిణీ స్త్రీలు, పిల్లలకు పాలిచ్చే తల్లులలో పౌష్టిక, పోషక విలువలు పెంచుట కొరకు ఈ పథకాన్ని రూపొందించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని అంగన్ వాడి కేంద్రాల ద్వారా పేదరికపు రేఖకు దిగువన ఉన్న గర్భిణీ స్త్రీలు, 6 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలకు ప్రతిరోజు పోషకాహాన్ని అందిస్తుంది. ఈ పథకాన్ని జనవరి 1, 2015 న ప్రారంభించారు.

iii) అమ్మ ఒడి :
రాష్ట్రంలో మాతా, శిశు మరణాలను తగ్గించుట కొరకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా గర్భిణీ స్త్రీలకు ప్రసూతికి ముందు, ప్రసూతి తరవాత ఆర్థిక, రవాణా సహకారం కల్పించబడుతుంది.

iv) మిషన్ భగీరథ :
కృష్ణా, గోదావరి నదుల నీటి సహాయంతో శుద్ధి చేసిన తాగు నీరుసు పైపులైను ద్వారా రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తేవడం ఈ పథకం ముఖ్య ఆశయం. ఆగష్టు 7, 2016న మెదక్ జిల్లా, గజ్వేల్ నుండలం, కోమటిబండ గ్రామంలో ఈ పథకాన్ని ప్రారంభించారు.

v) పేదవారికి గృహాలు :
ఈ పథకం ద్వారా హైదరాబాద్, ఇతర పట్టణ ప్రాంతాలలో రెండంతస్తుల మూడంతస్తుల భవనాలలో రెండు పడకల గదుల (2 BHK) ప్లాట్లు, గ్రామీణ ప్రాంతాలలో స్వతంత్ర గృహాలు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

vi) బియ్యం పంపిణీ :
ఈ పథకాన్ని జనవరి, 1, 2015న ప్రారంభించారు. కుటుంబ సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా ఒక రూపాయికి కిలోగ్రాము చొప్పున 6 కిలోల బియ్యాన్ని తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పోరేషన్ చౌక ధరల దుకాణాల ద్వారా సప్లయ్ చేస్తుంది.

TS Board Inter Second Year Economics Study Material Chapter 10 తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

B. SC/STs వర్గాల అభివృద్ధి, సంక్షేమ పథకాలు :

i) SC, ST ల ప్రత్యేక అభివృద్ధి నిధి :
SC, ST ల ప్రత్యేక అభివృద్ధి నిధి (SDF) చట్టం, 2017 ననుసరించి తెలంగాణ ప్రభుత్వం రెండు బడ్జెట్ పద్దులను అనగా (i) SC ప్రత్యేక అభివృద్ధి నిధి (SCSDF), (ii) ST ప్రత్యేక అభివృద్ధి నిధి (STSDF) లను రూపకల్పన చేసింది.

ii) షెడ్యూల్డ్ కులాల సంక్షేమం :
తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కింద వివరించిన పథకాల అమలును పర్యవేక్షిస్తుంది.

a) SC లకు కల్యాణ లక్ష్మి :
అక్టోబర్, 2, 2014న ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. తెలంగాణకు చెందిన SC వర్గపు 18 సంవత్సరాల వయస్సు పై బడిన బాలిక వివాహ ఖర్చుల కొరకు వధువు కుటుంబానికి రూ. 51,000 ప్రభుత్వం గతంలో ఇచ్చేది. ఇందుకు SC కుటుంబపు తల్లిదండ్రుల ఆదాయ పరిమితి 2 లక్షల రూపాయలు. కాగా కల్యాణ లక్ష్మి గ్రాంటును ప్రభుత్వం 2017లో రూ.75,116 లకు, 2018 లో రూ.1,00,116 లకు పెంచింది.

b) అంబేద్కర్ ఓవర్సీస్ నిధి పథకం :
ఈ గ్రాంటు ద్వారా విద్యార్థులు USA, UK, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, న్యూజిలాండ్ మరియు సౌత్ కొరియా వంటి దేశాల్లో విద్యను అభ్యసించవచ్చు. 2018-19 సంవత్సరంలో 101 మంది విద్యార్థులు ఈ పథకంలో ఎంపికయ్యారు.

c) భూమి కొనుగోలు పథకం :
నిరుపేద షెడ్యూల్డ్ కులాల మహిళలకు లబ్ధి చేకూర్చుటకు ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పధరం కింద 2014-16 నుంచి 2019-20 మధ్య కాలంలో దాదాపు రూ.667.71 కోట్ల వ్యయంతో సుమారు 15,044.35 ఎకరాల భూమిని కొనుగోలు చేయగా 5,930 మందికి పంపిణీ చేశారు.

iii) షెడ్యూల్డ్ తెగల సంక్షేమం :
షెడ్యూల్డ్ తెగల సమగ్రాభివృద్ధి కొరకు తెలంగాణ ప్రభుత్వం కింద తెలిపిన పథకాలను అమలు పరుస్తున్నది.

a) ST లకు కల్యాణ లక్ష్మి :
ఈ పథకాన్ని అక్టోబర్ 2, 2014లో ప్రారంభించారు. ఈ పథకం కింద 18 సంవత్సరాలు నిండిన తెలంగాణకు చెందిన ST యువతి కళ్యాణ ఖర్చుల కోసం రూపాయలు 1,00,116 ఆర్థిక సహాయం ఇవ్వబడుతుంది.

b) ఆర్థిక మద్దతు పథకాలు :
ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగం, ఉద్యానవనం, మత్స్య పరిశ్రమ, చిన్న నీటి పారుదల, పశు సంవర్ధకం, స్వయం ఉపాధి వంటి రంగాలలో నిమగ్నమైన గిరిజనులకు ఆర్థిక సహాయం కల్పిస్తారు.

c) అడవి హక్కుల చట్టం, 2006 :
తమ జీవనోపాధి కొరకు కొన్ని యుగాల నుంచి అడవుల పై ఆధారపడి జీవించే గిరిజనులు, ఇతర సంప్రదాయ ఆటవిక జీవులకు తమ జీవనాన్ని కొనసాగించుకొనే రక్షణను అడవి హక్కుల చట్టం 2006 కల్పిస్తుంది. ఈ చట్టం ప్రకారం 93,494 మంది గిరిజనులకు 3,00,092 ఎకరాల భూమిని పంపిణీ చేయడం జరిగింది.

TS Board Inter Second Year Economics Study Material Chapter 10 తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

C. వెనకబడిన వర్గాల (BC) అభివృద్ధి, సంక్షేమ పథకాలు :

వెనకబడిన తరగతుల వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలు :

i) కళ్యాణ లక్ష్మి :
2016-17 సంవత్సరం నుంచి కళ్యాణ లక్ష్మి పథకాన్ని వెనకబడిన తరగతులు (BC), ఆర్థికంగా వెనకబడిన తరగతుల వారికి కూడా వర్తింపజేశారు.

ii) చాలా వెనకబడిన తరగతుల అభివృద్ధి కార్పోరేషన్ :
వెనకబడిన తరగతుల వర్గాలలో సాంఘికంగా, విద్యాపరంగా, ఆర్థికపరంగా చాలా వెనకబడిన తరగతుల (MBC) సంక్షేమంలో మెరుగుదల కొరకు ఈ కార్పోరేషన్ ను 2017లో తెలంగాణ ప్రభుత్వం స్థాపించింది.

D. మైనార్టీల అభివృద్ధి, సంక్షేమ పథకాలు :
తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ వర్గం వారి సాంఘిక, ఆర్థిక స్థితిగతులలో పెంపుదల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన. కొన్ని ముఖ్యమైన పథకాలను కింద వివరించాం.

a) బ్యాంక్ తో అనుసంధానం చేయబడిన సబ్సిడీ పథకం :
మైనార్టీ వర్గాల వారు స్వయంఉపాధి చేపట్టే వ్యాపారం చేసేవారికి ఈ పథకాన్ని ఉద్దేశించారు. సబ్సిడీతో కూడుకున్న ఆర్థిక సహాయాన్ని బ్యాంకుల ద్వారా మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ కల్పిస్తుంది.

b) శిక్షణ, ఉద్యోగిత, నైపుణ్య అభివృద్ధి :
మైనార్టీల శాఖ మైనార్టీ యువతకు తగిన శిక్షణను ఆ వారు స్వయం ఉపాధి చేపట్టుటకు వీలుగా మైనార్టీ పైనాన్స్ కార్పోరేషన్ ద్వారా ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది.

c) షాదీ ముబారక్ పథకం :
ఈ పథకం ప్రకారం అర్హమైన మైనార్టీ వర్గానికి చెందిన యువతి పెళ్ళి ఖర్చులకు రూ.1,00,116 గ్రాంటు రూపంలో ఇవ్వబడుతుంది.

TS Board Inter Second Year Economics Study Material Chapter 10 తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో రంగాల వారీ వృద్ధి రేటు ధోరణులను వివరించండి.
జవాబు.
ఆర్థిక వ్యవస్థలో గల వివిధ రంగాలు ప్రదర్శించిన వృద్ధి రేట్లు ఆ వ్యవస్థ యొక్క వృద్ధి ధోరణిని తెలుపుతాయి. ఆర్థిక వ్యవస్థలో గల వివిధ రంగాలను 16 రంగాలుగా విభజించినప్పటికీ సులభంగా గ్రహించుట కొరకు వీటిని స్థూలంగా మూడు రంగాలుగా వర్గీకరిస్తారు.
అవి : ప్రాథమిక, ద్వితీయ, గౌణ రంగాలు. ఈ రంగాల వృద్ధి రేట్లను ప్రాథమిక ధరలలో జోడించిన స్థూల ఉత్పత్తి విలువ (GVA) తో సూచిస్తారు.

a) ప్రాథమిక రంగం :
ఈ రంగంలో పంటలు, పశుసంపద, అడవులు, మత్స్య పరిశ్రమ, గనులు మొదలైనవి.

b) ద్వితీయ రంగం :
ఇందులో తయారీ రంగం, గ్యాస్, నీటి సరఫరా, ఇతర అనుబంధ సేవలు మొదలైనవి.

c) గౌణ రంగం :
ఇందులో వ్యాపారం రిపేర్ సేవలు, హోటళ్ళు, రెస్టారెంటులు, రవాణా (రైల్వే రోడ్ వే, నౌకాయానం, విమానయానం మొ.||) నిలువ (storage), కమ్యూనికేషన్, బ్రాడ్కాస్టింగ్, ఆర్థిక సేవలు, స్థిరాస్థి రంగం, ప్రభుత్వ పాలన మొదలైనటువంటివి ఉంటాయి.

ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల విశ్లేషణ ఆ వ్యవస్థలో ఆయా రంగాల పని తీరుని తెలుపుటకు, ఆర్థిక స్థితిగతుల అంచనాకు తోడ్పడుతుంది. అంతేగాక ప్రస్తుత సంవత్సరంలో ఆర్థికవ్యవస్థలో ఆయా రంగాలు ఏ విధమైన పనితీరును కనబరచాయో, రాబోయే కాలంలో ఏ విధంగా పనిచేయగలవో తెలుసుకొనుటకు వీలవుతుంది.

ప్రాథమిక రంగం వృద్ధి రేటు 2012-13లో 21.9 శాతం (స్థిర ధరలో 8.6 శాతం) నుంచి 2015-16 లో కేవలం 2.2 శాతానికి (స్థిర ధరలలో 58 శాతం) తగ్గగా 2016-17 నాటికి 17.1 శాతానికి పెరిగి తిరిగి 2019-20 (AE)లో 15.8 శాతానికి (స్థిర ధరలలో 10.7 శాతం) తగ్గింది.

ఈ విధంగా ప్రాథమిక రంగంలో మిశ్రమ వార్షిక సగటు వృద్ధి రేట్లు నమోదగుటను గమనించవచ్చు. 2012-13, 2014-15 సంవత్సరాలలో ద్వితీయ రంగం రుణాత్మక వృద్ధి రేటును చవిచూడగా 2015-16 లో అత్యధిక వృద్ధి రేటు అనగా 20.3 శాతం (స్థిర ధరలలో 21.4 శాతం) ను నమోదు చేసుకొన్నది.

2019-20 (AE) ప్రకారం ఈ రంగంలో 5.3 శాతం వృద్ధిరేటు నమోదయింది. 2012-13 నుంచి 2019-20 మధ్య కాలంలో గౌణ రంగపు వృద్ధి రేటు 18.4 శాతం నుంచి 14.1 శాతం (స్థిర ధరలలో 8.4 శాతం నుంచి 9.6 శాతం) మధ్య కొనసాగింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుత, స్థిర ధరలలో జోడించిన స్థూల రాష్ట్ర ఉత్పత్తి విలువ వృద్ధి రేటులో మిశ్రమ ధోరణిని చూడవచ్చు.

జోడించిన స్థూల రాష్ట్ర ఉత్పత్తి విలువ (GSVA) లో వివిధ రంగాల వాటా :
GSVA లో గౌణ రంగం లేదా సేవల రంగం వాటా 2011-12లో 52.8 శాతం నుంచి 2019-20 (AE) నాటికి 65.2 శాతానికి పెరగగా, ప్రాథమిక రంగం లేదా వ్యవసాయ రంగం దాని అనుబంధ రంగాల వాటా ఇదే కాలంలో 19.6 శాతం నుంచి 18.6 శాతానికి తగ్గగా, ద్వితీయ రంగం లేదా పారిశ్రామిక రంగం వాటా 27.6 శాతం నుంచి 16.2 శాతానికి తగ్గింది. తెలంగాణ రాష్ట్రపు GSVAలో ప్రాథమిక, ద్వితీయ రంగాల వాటా అస్థిర రూపంలో ఉండగా, గౌణ రంగం లేదా సేవల రంగం వాటా స్థిరంగా ఉండటాన్ని గమనించవచ్చు.

ప్రశ్న 2.
తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో రంగాల వారీ వృద్ధి రేటు ధోరణులను వివరించండి.
జవాబు.
ఒక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి ఆ వ్యవస్థలో లభ్యమవుతున్న వనరులపై ఆధారపడి ఉంటుంది. మానవ వనరులు ఉంటే, సహజ వనరులను అభిలషణీయంగా, సమర్థవంతంగా వినియోగపరిచి, రాష్ట్ర ప్రగతికి, అధిక ఉత్పత్తికి కారకులవుతారు. నాణ్యమైన జనాభాతో పాటు మూలధన కల్పన, సాంకేతిక పరమైన మార్పులు ఆర్థిక వ్యవస్థకు చలనత్వాలను కలిగిస్తుంది.

2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా దాదాపు 42%గా నమోదయింది. భారతదేశమొత్తం భౌగోళిక వైశాల్యంలో తెలంగాణ 3.5% విస్తీర్ణం కల్గి ఉంది. రంగారెడ్డి జిల్లా జనాభాలో అత్యధికంగా 52.97 లక్షల మంది ఉండగా, నిజామాబాద్ జిల్లా జనాభాలో 25.51 లక్షల మందితో చివరి భాగాన ఉంది.

జనసాంద్రత :
ప్రతి చదరపు కిలోమీటరులో నివసించే జనాభాను జనసాంద్రత అంటారు. ఈ జనసాంద్రత జనాభా పెరుగుదల రేటును బట్టి మారుతూ ఉంటుంది. భారతదేశ మొత్తం జనసాంద్రతతో పోలిస్తే తెలంగాణలో జనసాంద్రత పెరుగుదల తక్కువగా ఉంది.

హైదరాబాద్ జిల్లా రాష్ట్ర రాజధాని నగరం కాబట్టి అధిక జనసాంద్రతను కల్గి ఉండి చదరపు కిలోమీటరుకు 18,172 మంది నివసిస్తున్నారు. 2001-2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో జనాభా వృద్ధి రేటు 1.4% భారతదేశ జనాభా వృద్ధి రేటు 1.84% కంటే తక్కువ.

పిల్లల జనాభా :
0-6 సం॥లోపు వారిని పిల్లలు అంటారు. తెలంగాణలో పిల్లల జనాభా శాతం 2001లో 14.2% నుంచి 2011లో 10.5% తగ్గింది. ఈ తగ్గుదలకు కారణం పెరుగుతున్న అక్షరాస్యత, అధిక ఆదాయాలకు తోడు కుటుంబ నియంత్రణ పద్ధతులు అవలంబించడం. అన్ని జిల్లాలలో పిల్లల జనాభా శాతం రాష్ట్ర సగటుకు దగ్గరగా 10.5% గా ఉన్నది. ఒక మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం పిల్లల జనాభా 17.4% గా ఉంది.

కుటుంబ పరిమాణం, ఎస్.సి. & ఎస్.టి. జనాభాలో స్త్రీ, పురుషుల నిష్పత్తి :
జనాభా లెక్కల ప్రకారం కొంతమంది వ్యక్తులు `ఒక దగ్గర కలిసి జీవిస్తూ ఒకే వంటగదిని వాడుకోవడాన్ని కుటుంబం అంటారు. మొత్తం జనాభాను గృహాల సంఖ్యచే భాగించగా కుటుంబ పరిమాణం వస్తుంది. తెలంగాణలో సగటు కుటుంబ పరిమాణం 42% గా ఉంది.

ఎస్.సి/ఎస్.టి. జనాభా :
2011 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్ కులాల (ఎస్.సి.) జనాభా మొత్తం రాష్ట్ర జనాభాలో 15.44% ఉంది. అదే విధంగా షెడ్యూల్ తెగల (ఎస్.టి.) జనాభా మొత్తం రాష్ట్ర జనాభాలో 9.34% ఉంది. .2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్.సి. జనాభా మొత్తం జనాభాలో 54,32,650 మంది ఉన్నారు.

ఎస్.టి. జనాభా 32,86,928 మంది. ఎస్.సి. జనాభా అత్యధిక శాతం కరీంనగర్ జిల్లాలో 18-80%గా నమోదయ్యారు. అత్యల్పం హైదరాబాద్ 6.29%. ఎస్.టి. జనాభా ఖమ్మం జిల్లాలో 27.37%గా ఉంది. అత్యల్పం హైదరాబాద్లో 1.24%గా ఉంది. పట్టణాల కంటే గ్రామాలలోనే అధిక జనాభా వృద్ధి నమోదయింది.

స్త్రీ-పురుష నిష్పత్తి :
1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య ఆధారంగా స్త్రీ, పురుష నిష్పత్తి నిర్ణయించబడుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ప్రతి 1,000 మంది పురుషులకు 990 మంది స్త్రీల అనుపాతం ఉంది.

మానవ అభివృద్ధి సూచి :
ఇది మూడు అంశాల వారిగా రూపొందించారు.

  1. పుట్టిన సమయంలో ఆయుఃప్రమాణం
  2. శిశుమరణాల రేటు
  3. అక్షరాస్యతా స్థాయి.

తెలంగాణలో మానవ అభివృద్ధి సూచిక (HDI):

TS Inter 2nd Year Economics Study Material 10th Lesson తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 1

వలసదారుల వాటా :
తెలంగాణలోని పట్టణ జనాభాలో అధిక పెరుగుదలకు ఆంధ్ర ఇతర రాష్ట్రాల నుండి వలసదారులే కారణం. 1961 నుంచి 2011 మధ్య కాలంలో తెలంగాణలో వలసదారుల జనాభా 62 లక్షలు. పట్టణ జనాభాలో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 70% జనాభా పట్టణ వాసులే. దీనికి కారణం పట్టణాల అభివృద్ధి మరియు హైదరాబాద్ పరిసరాల అభివృద్ధి.

అక్షరాస్యత :
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో అక్షరాస్యత శాతం 66%.

ప్రశ్న 3.
తెలంగాణ వ్యవసాయ రంగాన్ని చర్చించండి.
జవాబు.
తెలంగాణలో వ్యవసాయ రంగం : వ్యవసాయం ప్రధానంగా వర్షాధారంపై ఆధారపడి, అధిక భాగం భూగర్భ జలాల (ground water) ద్వారా సాగు చేయబడుతుంది. దాదాపు నేటికి 55.49% మంది ప్రజలు జీవనోధారం కోసం వ్యవసాయ పనుల పైననే ఆధారపడుతున్నారు.

విలువతో కూడిన స్థూల రాష్ట్ర ప్రాంతీయోత్పత్తి (GSVA) లో వ్యవసాయ రంగం వాటా 2018-19 (మొదట సవరించిన అంచనా) లో ప్రస్తుత ధరలలో 18.1 శాతం (స్థిర ధరలలో 15.6 శాతం) కాగా 2019-20 (ముందస్తు అంచనా) లో ఇది ప్రస్తుత ధరలలో 18,6 శాతం (సిర ధరలలో 16 శాతం).

భారతదేశ భౌగోళిక వైశాల్యంలో తెలంగాణ 12వ అతిపెద్ద రాష్ట్రం. తెలంగాణ రాష్ట్ర మొత్తం భూమి వైశాల్యం 112.08 లక్షల హెక్టారులు. ఇందులో 60 శాతం భూమి వ్యవసాయ యోగ్యమైనది. 2018-19లో 48.98 లక్షల హెక్టార్ల భూమి నికర పంట భూమి కాగా 60.59 లక్షల హెక్టార్ల భూమి స్థూల పంటల భూమి.

కాగా రాష్ట్ర భౌగోళిక వైశాల్యంలో అడవుల కింద గల భూవిస్తీర్ణం 26.98 లక్షల హెక్టార్లు, దాదాపుగా 24.07 శాతం. ఇక వ్యవసాయేతర భూవిస్తీర్ణం 8.34 లక్షల హెక్టారులు, 15.78 లక్షల హెక్టార్లు తడి భూమి, వ్యవసాయానికి పనికి రాని భూమి 6.07 లక్షల హెక్టార్లు, 5.94 లక్షల హెక్టార్ల భూమి పచ్చిక భూమి.

నికర, స్థూల పంటసాగు భూమి :
తెలంగాణ రాష్ట్రంలో గల వివిధ జిల్లాలలో 2018-19లో భౌగోళిక వైశాల్య పరంగా పంటలు పండించిన నికర భూమి 46. 60 లక్షల హెక్టార్లు (41.5 శాతం).

తెలంగాణలో ఆహార, ఆహారేతర పంటల సాగు భూవిస్తీర్ణం :
ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పు దినుసులు వంటివి ఆహార పంటలు. కాగా పత్తి, నూనెగింజలు, పూలు వంటివి ఆహారేతర పంటలు. 2017-18 సంవత్సరంలో 37.14 లక్షల హెక్టార్ల భూమిలో ఆహార పంటలు సాగు చేయబడ్డాయి. రాష్ట్రంలో పత్తి, నూనెగింజలు, పూలు, పొగాకు, పశుగ్రాసం వంటి ఆహారేతర పంటలు సాగు చేయబడ్డాయి.

నీటి పారుదల తక్కువ మోతాదులో ఉన్న ప్రాంతాలలో ఖరీఫ్ (యాసంగి) కాలంలో ఆహారేతర పంటలలో పత్తి ప్రముఖంగా సాగుచేయబడుతుంది. 2017-18లో 23.45 లక్షల హెక్టార్లలో ఆహారేతర పంటలు సాగుచేయబడ్డాయి.

2018 – 19లో ఆహార, ఆహారేతర పంటల సాగుభూమి :
తెలంగాణలో 2018-19 సంవత్సరంలో ఖరీఫ్, రబీ కాలంలో సాగులో ఉన్న స్థూల పంట సాగు భూమి 57.75 లక్షల హెక్టార్లు. ఖరీఫ్ కాలంలో సాగుచేయబడిన 45 లక్షల హెక్టార్ల భూమిలో 2018-19 సంవత్సరంలో 53, 9 శాతం ఆహార పంటలు కాగా 46.1 శాతం ఆహారేతర పంటలు. అయితే రబీ సీజన్ లో మాత్రం సాగుచేసిన భూమి 12.75 లక్షల హెక్టారులలో ఆహార పంటల భూవిస్తీర్ణం 11.07 లక్షల హెక్టార్లు (87 శాతం).

మనుగడలో లేదా అమలులో ఉన్న భూకమతాలు :
తెలంగాణ రాష్ట్రంలో 2010-11లో మనుగడలో గల సగటు కమతం పరిమాణం 1.12 హెక్టార్లు కాగా ఇది 2015-16 నాటికి 1.00 హెక్టారు (2.47105 ఎకరాలు). గమనించదగ్గ విషయమేమిటంటే మనుగడలో గల మొత్తం కమతాలలో ఉపాంత, చిన్న కమతాలు మొత్తం కమతాలలో 80 శాతం. అయితే 2010-11ని 2015– 16తో పోల్చగా 2015-16 లో మాధ్యమిక, పెద్ద కమతాల పరిమాణం తగ్గింది.

TS Board Inter Second Year Economics Study Material Chapter 10 తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

వ్యవసాయ రంగానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన పథకాలు :

a) రైతు బంధు :
రుణ భారం నుంచి విముక్తి కల్పిచేందుకు వీలుగా ఒక పెట్టుబడి రూపంలో సహకారాన్ని అందించి రైతుల సాధికారితను పెంచే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన పథకమే రైతు బంధు. 2018, మే 10వ తేదిన ఈ పథకం ప్రారంభించబడ్డది.

2019-20 సంవత్సరం నుంచి తెలంగాణ ప్రభుత్వం ఈ రకమైన పెట్టుబడి సహకారాన్ని ప్రతి సీజను రూ. 4,000 ఎకరం నుంచి రూ.5,000 లకు పెంచింది.

b) రైతు బీమా :
2018, ఆగష్టు 15న తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. రోగగ్రస్తుడైన రైతు మరణిస్తే, అతని కుటుంబ సభ్యులు లేదా అతనిపై ఆధారపడిన వారికి ఆర్థికపరమైన భద్రతను కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ పథకం కింద ప్రతి రైతుకు రూపాయలు 5 లక్షల బీమా కవరేజి ఉంటుంది.

ప్రశ్న 4.
తెలంగాణ పారిశ్రామికాభివృద్ధిని వివరిచండి.
జవాబు.
తెలంగాణలో పారిశ్రామిక రంగం :
దేశంలో గల ప్రధాన పారిశ్రామిక రాష్ట్రాలలో ఒకటిగా తెలంగాణ అరన స్థానాన్ని, జోడించిన స్థూల దేశీయోత్పత్తి విలువలో 8వ స్థానాన్ని కలిగియున్నది. జోడించిన స్థూల రాష్ట్ర ప్రాంతీయోత్పత్తి విలువలో పారిశ్రామిక రంగం వాటా 2018-19 (మొదటి సవరించిన అంచనా) ప్రస్తుత ధరలలో 17.4% (స్థిర ధరలలో 19.9 శాతం) కాగా 2019- 20 (ముందస్తు అంచనా) లో 16.2 శాతం (స్థిర ధరలలో 18.7 శాతం).

పరిశ్రమల వార్షిక సర్వే (Annual Survey of Industries) దత్తాంశం ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో 2008-09 లో . పరిశ్రమల సంఖ్య 7,357 కాగా ఈ సంఖ్య 2012-13లో 10,279 కి, 2013-14లో 11,068 కి 2014-15 లో 11,995 కి, 2015-16 లో 12,353 కి పెరిగింది.

తెలంగాణలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSME) :
సూక్ష్మ, చిన్న, మధ్య మిక పరిశ్రమలు (Micro, Small and Medium Enterprises – MSME), పెద్ద తరహా పరిశ్రమలకు అవసరమైన ఉత్పాదకాలను సప్లయ్ చేసే అనుషంగిక పరిశ్రమలుగా పనిచేస్తూ రాష్ట్రంలో సంతులిత ప్రాంతీయాభివృద్ధికి, సమ్మిళిత వృద్ధికి తోడ్పడతాయి. తక్కువ మూలధనం, తక్కువ స్థాయి నైపుణ్యంగల పారిశ్రామిక యూనిట్ల ద్వారా ఉద్యోగ కల్పనలో కీలక పాత్రను కలిగి ఉంటాయి.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన నాటి నుంచి MSME యూనిట్ల స్థాపనలో గణనీయ పెరుగుదల సంభవించింది. జనవరి 2015 నాటికి MSME లు 8,435 కు పెరిగి రూ. 11,847 కోట్లతో 1.59 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాయి.

తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం:
దేశ 29 వ రాష్ట్రంగా అవతరించిన అనంతరం తెలంగాణ ప్రభుత్వం తన “పారిశ్రామిక విధానం-2014” ను ప్రకటించింది. ఇందులో రాష్ట్రంలో పారిశ్రామికీకరణకు ఒక నినాదాన్ని తన విజన్ గా ప్రకటించింది. ఆ నినాదం : “పరిశోధన సుంచి నవకల్పన, నవకల్పన నుంచి పరిశ్రమ, పరిశ్రమ నుంచి సౌభాగ్యం”. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నినాదపు ముఖ్య లక్ష్యం – “ఆవిష్కరించు, ఆరంభించు, సంలీనించు”.

అవస్థాపనా సౌకర్యాలను కల్పిస్తూ. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాల కల్పన ద్వారా తెలంగాణలో పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పించి సులభ రీతిలో వ్యాపారం కొనసాగించే విధంగా చర్యలు చేపట్టడం ఈ విధానపు ప్రధాన లక్ష్యం.

TS Board Inter Second Year Economics Study Material Chapter 10 తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 5.
TS GENCO, TS TRANSCO లపై వ్యాఖ్యానించండి.
జవాబు.
(a) తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి కార్పోరేషన్ TSGENCO : 1.7, 2019 నాటికి తెలంగాణలో TSGENCOతో కలిపి విద్యుత్ కాంట్రాక్టెడ్ కెపాసిటీ 16,201 MM. ఇందులో ప్రైవేటు రంగం వాటా 7,739 MW, రాష్ట్ర వాటా 5,826 MW, కేంద్ర రంగం వాటా 2,536 MW, అంతర్రాష్ట్ర 76 MW, ఉమ్మడి రంగ వాటా 25 MW, TSGENCO కెపాసిటీ అయిన 5,825 MW లలో థర్మల్ విద్యుత్తు 3,382. 50MW, హైడల్ విద్యుత్తు 2,441.76 MV, సోలార్ విద్యుత్తు 1 MW.

తెలంగాణలో విద్యుత్తు డిమాండ్లో పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని TSGENC0, 5,080 MW లతో రెండు కొత్త ధర్మల్ యూనిట్లను ప్రతిపాదించింది. అవి : భదాద్రి థర్మల్ పవర్ సెక్షన్ 4 × 270 MW ; యాదాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ – 5 × 800 MW.

(b) విద్యుత్ ప్రసారం, పంపిణీ :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తరవాత విద్యుత్తు ప్రసారం, పంపిణీ కొరకు TS TRANSCO ను నెలకొల్పింది. ప్రస్తుతం 112 FIT స్టేషన్లు, 833, 33/11 KVA ఉప కేంద్రాలు, 2.54 లక్షల పంపిణీ ట్రాన్స్ఫార్మర్లు. రాష్ట్రంలో ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో గల ప్రధాన విద్యుదుత్పత్తి కేంద్రాలు :
నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ (NTPC), కరీంనగర్ జిల్లాలోని రామగుండంలో ఉంది. కొత్తగూడెం థర్మల్ పవర్ కార్పోరేషన్ (KTPC) పాల్వంచ, ఖమ్మం జిల్లాలో, కాకతీయ థర్మల్ పవర్ కార్పోరేషన్ భూపాలపల్లిలో ఉండగా కొన్ని హైడల్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు నాగార్జున సాగర్, పోచంపాడు, సింగూర్, నిజాం సాగర్, పులిచింతలలలో ఉన్నాయి. 2013-14లో రాష్ట్రంలో 2,482 MW విద్యుత్తు కొరత ఉండేది.

విద్యుత్తు డిమాండ్ 47,428 MW కాగా అందుబాటులో ఉన్నది 44,946 MW. 2014-15లో విద్యుత్తు డిమాండ్ 50,916 MW కాగా అందుబాటులో ఉండింది 48,788 MW.

విద్యుచ్ఛక్తి పంపిణీకి సంబంధించి తెలంగాణలో రెండు కంపెనీలు పనిచేస్తున్నాయి. అవి :
తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL), తెలంగాణ రాష్ట్ర ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ లిమిటెడ్ (TSNPDCL). 1.12.2019 నాటికి రాష్ట్రంలో 1.53 కోట్ల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 73 శాతం విద్యుత్ వినియోగం గృహ వినియోగం
రూపంలో కలదు.

TS Board Inter Second Year Economics Study Material Chapter 10 తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 6.
రాష్ట్రంలో విద్యతీరు తెన్నులను క్లుప్తంగా వ్యాఖ్యానించండి.
జవాబు.
తెలంగాణలో విద్య :
దేశంలో మానవ వనరులు, ఆర్థికాభివృద్ధి బలోపేతం కావడానికి విద్యను ప్రధాన సాధనంగా భావించాలి. ఉత్పాదక శ్రామిక శక్తిని పెంపొందించడంలో విద్య కీలక పాత్ర పోషిస్తుంది. భారత రాజ్యాంగంలోని 45 వ నిబంధన ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలబాలికలకు ఉచిత, నిర్బంధ విద్యను అందించడం రాష్ట్రాల బాధ్యత.

తెలంగాణలో అక్షరాస్యత రేటు :
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో అక్షరాస్యత రేటు 66.54 శాతం. అయితే పట్టణ-గ్రామీణ, అంతర్ జిల్లా, వయస్సు వారీ జనాభా, స్త్రీ-పురుషులు, సామాజిక వర్గాల పరంగా అక్షరాస్యత రేటులో తేడాలున్నాయి. రాష్ట్రంలో విద్యా రంగం స్థితి :

a) నమోదు(Enrollment) :
2017-18 సంవత్సరంలో అన్ని పాఠశాలలు కలిపి 58.71 లక్షల విద్యార్థులు నమోదు చేసుకొన్నారు. ఇందులో 53 శాతం ప్రైవేటు పాఠశాలల నమోదు కాగా మిగితా 47 శాతం ప్రభుత్వ పాఠశాలల నమోదు.

b) స్థూల నమోదు నిష్పత్తి (Gross Enrollment Ration-GER) :
స్థూల నమోదు నిష్పత్తి (GER) విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలో విద్యార్థుల నమోదు సంఖ్యను నిర్ణయిస్తుంది. GER 2017-18లో ప్రాథమిక పాఠశాలలో బాలురు – 98.76 శాతం, బాలికలు -. 98.05 శాతం కాగా ఉచ్ఛతర ప్రాథమిక పాఠశాలలో బాలురు – 87.32 శాతం, బాలికలు 88.4 శాతం.

c) విద్యార్థి – ఉపాధ్యాయ నిష్పత్తి (Pupil – Teacher Ratio – PTR) :
ఇది ఒక విద్యా సంవత్సరంలో ప్రత్యేక విద్యా స్థాయికి సంబంధించి ఎంత మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉంటాడనే విషయాన్ని తెలుపుతుంది. PTR, 2018-19లో రాష్ట్రంలో ప్రాథమిక స్థాయిలో 18.90, ఉచ్ఛతర ప్రాథమిక స్థాయి 14.12, సెకండరీ స్థాయిలో 17.85 గా ఉంది. రాష్ట్రం మొత్తానికి 2018-19లో PTR 17.67.

పాఠశాల విద్య :
i) సమగ్ర శిక్షా అభియాన్:
గతంలో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలైన

  1. సర్వ శిక్షా అభియాన్ (SSA) సార్వత్రిక ప్రాథమిక విద్యను అమలు పరుస్తూండగా
  2. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (RMSA) సెకండరీ విద్యలో సామీప్యత (acess), ప్రమాణం (quality) లో పెంపుదలకు అమలు చేసింది.

ii) కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం :
వీటిని 2004-05 లో రెసిడెన్షియల్ పాఠశాల సౌకర్యం కల్పించే ఉద్దేశంతో నెలకొల్పారు. నీటిలో ప్రవేశానికి అర్హతలు : SC, ST, BC, మైనారిటీ వర్గాలకు సంబంధించిన

  1. VI నుంచి VII తరగతులు వారికి,
  2. అనాధలు,
  3. బడి మానేసిన ఒంటరి తల్లి/తండ్రి కలిగిన విద్యార్థులు

iii) ఆదర్శ పాఠశాలలు :
194 ఆదర్శ పాఠశాలలు రాష్ట్రంలో 2013-14లో స్థాపించబడ్డాయి. వీటిలో అధిక విద్యార్హతలున్న ఉపాధ్యాయులచే ఇంగ్లీషు మీడియంలో విద్యా బోధన జరుగుతుంది. ఈ వథకం రద్దయినందువలన తెలంగాణ ప్రభుత్వం వీటి బాధ్యత తీసుకొని 2015-16 నుంచి వీటిని కొనసాగిస్తున్నది.

ఇంటర్మీడియట్ విద్య :
ప్రస్తుతం రాష్ట్రంలో 2,558 జూనియర్ కళాశాలలు ఉండగా వాటిలో విద్యార్థుల సంఖ్య 7.18 లక్షలు. 2,558 జూనియర్ కళాశాలలో, 404 ప్రభుత్వ, 4 వొకేషనల్, 41 ప్రైవేట్ ఎయిడెడ్, 1,583 ప్రైవేట్ మరియు ఇతర జూనియర్ కళాశాలలు కాగా 530 ఇతర ప్రభుత్వ సంస్థలు. ఈ బోర్డు ఉపాధిని కల్పించేందుకు వీలయిన 23 వొకేషనల్ కోర్సులను ఇంటర్మీడియట్ స్థాయిలో ప్రవేశపెట్టింది.

TS Board Inter Second Year Economics Study Material Chapter 10 తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

ఉన్నత విద్య:

a) కళాశాల విద్య :
కళాశాల విద్య డిపార్ట్ మెంట్ యొక్క ప్రధాన లక్ష్యం ఉన్నత విద్యలో సామీప్యత (access), సమానత (equality), నాణ్యత (quality) ను సాధించుట. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకమైన రాష్ట్రీయ ఉచ్ఛతర శిక్షా అభియాన్ (RUSA) నుంచి నిధుల సమీకరణకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది.

b) డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) :
డిగ్రీ కళాశాలలో బి.ఎ/బి.కాం/బి.యస్సీ/బి.బి.ఎ వండి డీగ్రీ కోర్సులలో ప్రవేశాలను తెలంగాణ ప్రభుత్వం 2016 సంవత్సరం నుంచి DOST ద్వారా కల్పిస్తున్నది. 2018 – 19లో డిగ్రీ కళాశాలలో 2,00,472 మంది విద్యార్థులు ప్రవేశాన్ని పొందగా ఇందులో 42,688 విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాన్ని పొందారు.

c) సాంకేతిక విద్య :
సాంకేతిర విద్యా డైరెక్టరేట్ రాష్ట్రంలో పాలిటెక్నిక్, వృత్తి విద్యలను పర్యవేక్షిస్తుంది. ఇది ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ రంగాలలలో ప్రవేశాలు, విద్యా బోధనను పర్యవేశిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 820 డిప్లమో డిగ్రీలో యుక్తమైన కళాశాలలు 1,36,805 విద్యార్థులతో పనిచేస్తున్నాయి.

సాంఘిక సంక్షేమ విద్యా సంస్థలు :
SC, ST, BC, మైనారిటీ, వికలాంగ బాలబాలికలక సమీప ప్రాంతాలలో విద్యా సంస్థలు ఉండే విధంగా చూని సాంఘిక సమానత్వ సాధనకు ప్రభుత్వం సాంఘిక సంక్షేమ విద్యా సంస్థలను నెలకొల్పింది. ఈ సంస్థలు రెసిడెన్షియల్ రూపంలో ఉండి విద్యార్థులకు ఉచిత హాస్టల్ వసతితో బాటు పాఠ్యపుస్తరాల పంపిణీ చేస్తాయి.

A) షెడ్యూల్డ్ కులాల రెసిడెన్షియల్ పాఠశాలలు :
తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్నియల్ విద్యా సంస్థల సొసైటి (TSWREIS) రాష్ట్రంలో 269 రెసిడెన్షియల్ విద్యా సంస్థలను నడుపుచున్నది. ఇందులో 175 బాలికలకు సంబంధించినవి. వీటిలో 5వ తరగతి నుండి డిగ్రీ వరకు షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులకు ప్రవేశం కలదు. ప్రస్తుతం 268 విద్యా సంస్థలు ఉండగా అందులో 134 తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రారంభించబడ్డాయి.

B) షెడ్యూల్డ్ తెగల రెసిడెన్షియల్ పాఠశాలలు :
a) తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీ (TTWRESIS) – గురుకులాలు :
రాష్ట్రంలో ఈ గురుకులాలు 175 ఉన్నాయి.

b) ఆశ్రమ పాఠశాలలు :
రాష్ట్రంలో ప్రస్తుతం 321 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి.

c) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు :
గిరిజన సంక్షేమ శాఖ 1,427 ప్రాథమిక పాఠశాలలను నిర్వహిస్తున్నది.

C) వెనుకబడిన తరగతులు సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు :
మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ సంస్థల సొసైటీ (M,JPTBCWREIS) వెనకబడిన తరగతులు, ఆర్థికంగా వెనకబడిన తరగతుల వారికి విద్యను అందించుటకు స్థాపించారు.

ఒక రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను నడుపుతున్నది. ఈ విద్యా సంస్థలలో దాదాపు 99,360 విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.

D) మైనారిటీ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు :
మైనారిటీ వర్గాలకు చెందిన బాలబాలికలకు అధిక నాణ్యతతో కూడిన విద్యను అందించుటకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మైనారిటీల రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీ (TMREIS) ని స్థాపించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 216 మైనారిటీ విద్యా సంస్థలు 12 కళాశాలలతో కలిపి 79,424 విద్యార్థులకు విద్యను కల్పిస్తున్నాయి.

TS Board Inter Second Year Economics Study Material Chapter 10 తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

II. తెలంగాణలో ఆరోగ్య రంగం :
‘అందరికీ ఆరోగ్యం’ అనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లక్ష్యాన్ని చేరుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను చేపట్టింది. జాతీయ ప్రసూతి లబ్ది పథకం (National Maternity Benefit Programme), సమగ్ర శిశు అభివృద్ధి పథకం, పిల్లల కోసం బాలికా సమృద్ధి యోజన పథకం, పునరుత్పత్తి కలిగిన మహిళలకు సప్లిమెంటరీ న్యూట్రీషన్ పథకాన్ని అమలు చేస్తున్నది.

‘సామాజిక, ఆర్థిక దృక్పథం 2020’ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 4,797 ఆరోగ్య ఉప కేంద్రాలు, 633 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 249 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 90 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, 19 ఏరియా ఆసుపత్రులు, 29 జిల్లా కేంద్ర ఆసుపత్రులు, 9 వైద్య కళాశాల ఆసుపత్రులు, 12 స్పెషాలిటీ ఆసుపత్రులు, 2 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నాయి.

ఆరోగ్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న పథకాలు : రాష్ట్రావతరణ అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగంలో అనేక పథకాలను రూపొందించి అమలు పరుస్తున్నది. అందులో ముఖ్యమైనవి.

a) కంటి వెలుగు :
సామాన్యంగా ప్రజలు ప్రత్యేకించి మహిళలు, వృద్ధులు కంటి సమస్యలను వాయిదా వేయడం లేదా ఆ సమస్యలను కొనసాగిస్తూనే జీవనాన్ని గడుపుతుంటారు. ఈ సమస్య నివారణ కోసమే తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు పథకాన్ని రూపొందించి అమలుపరుస్తున్నది.

b) బస్తీ దవాఖాన :
పట్టణ ప్రాంతాలలో ప్రామాణికతతో కూడిన ఆరోగ్య సేవలు అందించుటకు బస్తీ దవాఖానాలు స్థాపించారు. ప్రతి బస్తీ దవాఖాన 6,000 నుండి 10,000 జనాభా ఉన్న ప్రాంతాలకు సేవలందిస్తుంది. పట్టణ మురికినాడలలో వీటిని స్థాపిస్తారు. రాష్ట్రంలో 104 బస్తీ దవాఖానాలు పనిచేస్తున్నాయి.

c) ఆరోగ్య, వెల్నెస్ కేంద్రాలు :
ఇవి సమగ్ర ఆరోగ్య సేవలతో బాటు ప్రసూతి, చిన్న పిల్లల ఆరోగ్య రక్షణ సేవలను అందిస్తున్నాయి. వైద్య సేవలు, అవసరమైన ఔషధాలను ఇవి ఉచితంగా పంపిణీ చేస్తాయి. రాష్ట్రంలో 636 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 86 ఉపకేంద్రాలు, 104 బస్తీ దవాఖానాలు, 227 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆరోగ్య వెల్నెస్ కేంద్రాలుగా పనిచేస్తున్నాయి.

d) తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) ఆసుపత్రులు :
తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 107 TVVP ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. ఇవి ప్రసూతి, చిన్న పిల్లల ఆరోగ్య రక్షణ సేవలు, సాధారణ వైద్య సేవలు, సర్జరీలు, ఆప్తమాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, డెర్మటాలజీ, ENT మొదలైన సేవలను అందిస్తాయి.

e) ఆయుష్ (ఆయుర్వేద, యోగ, నాచురోపతి, యునాని, హోమియోపతి) :
తెలంగాణ ప్రభుత్వం, జాతీయ ఆయుష్ మిషన్ సహకారంతో రాష్ట్రంలో ఆయుష్ పద్ధతి వైద్యాన్ని ప్రోత్సహిస్తున్నది. ఆయుష్ శాఖ కింద రాష్ట్రంలో 860 దవాఖానాలు పనిచేస్తున్నాయి.

f) ఆరోగ్య శ్రీ :
‘ఆరోగ్యశ్రీ ఆరోగ్య రక్షణ ట్రస్టు’ ద్వారా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనే ఒక ఏకైక పథకం ఆరోగ్య బీమాతో అమలవుతుంది. దీని ప్రధాన ఆశయం పేదరిక రేఖకు దిగువన ఉన్న వారికి వైద్య సేవలను అందించడం. ఈ పథకం ద్వారా పేద వారికి ఎంపిక చేయబడిన వ్యాధులకు నగదు రహిత సేవలు అందించబడతాయి.

g) KCR కిట్ :
ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం జూన్ 2, 2017 న ప్రారంభించింది. పేదరికపు రేఖకు దిగువన ఉండి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల నుంచి ఆరోగ్య సేవలు పొందే గర్భిణీ స్త్రీలకు, మగశిశువు జన్మిస్తే రూ. 12,000, ఆడశిశువు జన్మిస్తే రూ. 13,000 సహాయం అందించబడుతుంది.

ప్రశ్న 7.
తెలంగాణ రాష్ట్రంలో రెసిడెన్షియల్ విద్యాసంస్థల స్థితిని, అవకాశాలను చర్చించండి.
జవాబు.
ఆర్థిక వ్యవస్థలో గల వివిధ రంగాలు ప్రదర్శించిన వృద్ధి రేట్లు ఆ వ్యవస్థ యొక్క వృద్ధి ధోరణిని తెలుపుతాయి. ఆర్థిక వ్యవస్థలో గల వివిధ రంగాలను 16 రంగాలుగా విభజించినప్పటికీ సులభంగా గ్రహించుట కొరకు వీటిని స్థూలంగా మూడు రంగాలుగా వర్గీకరిస్తారు.
అవి : ప్రాథమిక, ద్వితీయ, గౌణ రంగాలు. ఈ రంగాల వృద్ధి రేట్లను ప్రాథమిక ధరలలో జోడించిన స్థూల ఉత్పత్తి విలువ (GVA) తో సూచిస్తారు.

a) ప్రాథమిక రంగం :
ఈ రంగంలో పంటలు, పశుసంపద, అడవులు, మత్స్య పరిశ్రమ, గనులు మొదలైనవి.

b) ద్వితీయ రంగం :
ఇందులో తయారీ రంగం, గ్యాస్, నీటి సరఫరా, ఇతర అనుబంధ సేవలు మొదలైనవి.

c) గౌణ రంగం :
ఇందులో వ్యాపారం రిపేర్ సేవలు, హోటళ్ళు, రెస్టారెంటులు, రవాణా (రైల్వే రోడ్ వే, నౌకాయానం, విమానయానం మొ.||) నిలువ (storage), కమ్యూనికేషన్, బ్రాడ్కాస్టింగ్, ఆర్థిక సేవలు, స్థిరాస్థి రంగం, ప్రభుత్వ పాలన మొదలైనటువంటివి ఉంటాయి.

ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల విశ్లేషణ ఆ వ్యవస్థలో ఆయా రంగాల పని తీరుని తెలుపుటకు, ఆర్థిక స్థితిగతుల అంచనాకు తోడ్పడుతుంది. అంతేగాక ప్రస్తుత సంవత్సరంలో ఆర్థికవ్యవస్థలో ఆయా రంగాలు ఏ విధమైన పనితీరును కనబరచాయో, రాబోయే కాలంలో ఏ విధంగా పనిచేయగలవో తెలుసుకొనుటకు వీలవుతుంది.

ప్రాథమిక రంగం వృద్ధి రేటు 2012-13లో 21.9 శాతం (స్థిర ధరలో 8.6 శాతం) నుంచి 2015-16 లో కేవలం 2.2 శాతానికి (స్థిర ధరలలో 58 శాతం) తగ్గగా 2016-17 నాటికి 17.1 శాతానికి పెరిగి తిరిగి 2019-20 (AE)లో 15.8 శాతానికి (స్థిర ధరలలో 10.7 శాతం) తగ్గింది.

ఈ విధంగా ప్రాథమిక రంగంలో మిశ్రమ వార్షిక సగటు వృద్ధి రేట్లు నమోదగుటను గమనించవచ్చు. 2012-13, 2014-15 సంవత్సరాలలో ద్వితీయ రంగం రుణాత్మక వృద్ధి రేటును చవిచూడగా 2015-16 లో అత్యధిక వృద్ధి రేటు అనగా 20.3 శాతం (స్థిర ధరలలో 21.4 శాతం) ను నమోదు చేసుకొన్నది.

2019-20 (AE) ప్రకారం ఈ రంగంలో 5.3 శాతం వృద్ధిరేటు నమోదయింది. 2012-13 నుంచి 2019-20 మధ్య కాలంలో గౌణ రంగపు వృద్ధి రేటు 18.4 శాతం నుంచి 14.1 శాతం (స్థిర ధరలలో 8.4 శాతం నుంచి 9.6 శాతం) మధ్య కొనసాగింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుత, స్థిర ధరలలో జోడించిన స్థూల రాష్ట్ర ఉత్పత్తి విలువ వృద్ధి రేటులో మిశ్రమ ధోరణిని చూడవచ్చు.

జోడించిన స్థూల రాష్ట్ర ఉత్పత్తి విలువ (GSVA) లో వివిధ రంగాల వాటా :
GSVA లో గౌణ రంగం లేదా సేవల రంగం వాటా 2011-12లో 52.8 శాతం నుంచి 2019-20 (AE) నాటికి 65.2 శాతానికి పెరగగా, ప్రాథమిక రంగం లేదా వ్యవసాయ రంగం దాని అనుబంధ రంగాల వాటా ఇదే కాలంలో 19.6 శాతం నుంచి 18.6 శాతానికి తగ్గగా, ద్వితీయ రంగం లేదా పారిశ్రామిక రంగం వాటా 27.6 శాతం నుంచి 16.2 శాతానికి తగ్గింది. తెలంగాణ రాష్ట్రపు GSVAలో ప్రాథమిక, ద్వితీయ రంగాల వాటా అస్థిర రూపంలో ఉండగా, గౌణ రంగం లేదా సేవల రంగం వాటా స్థిరంగా ఉండటాన్ని గమనించవచ్చు.

ప్రశ్న 8.
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య రంగ కార్యక్రమాలను విశదీకరించండి.
జవాబు.
తెలంగాణలో ఆరోగ్య రంగం : ‘అందరికీ ఆరోగ్యం’ అనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లక్ష్యాన్ని చేరుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను చేపట్టింది. జాతీయ ప్రసూతి లబ్ది పథకం (National Maternity Benefit Programme), సమగ్ర శిశు అభివృద్ధి పథకం, పిల్లల కోసం బాలికా సమృద్ధి యోజన పథకం, పునరుత్పత్తి కలిగిన మహిళలకు సప్లిమెంటరీ న్యూట్రీషన్ పథకాన్ని అమలు చేస్తున్నది.

”సామాజిక, ఆర్థిక దృక్పథం – 2020′ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 4,797 ఆరోగ్య ఉప కేంద్రాలు, 633 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 249 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 90 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, 19 ఏరియా ఆసుపత్రులు, 29 జిల్లా కేంద్ర ఆసుపత్రులు, 9 వైద్య కళాశాల ఆసుపత్రులు, 12 స్పెషాలిటీ ఆసుపత్రులు, 2 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నాయి.

ఆరోగ్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న పథకాలు :
రాష్ట్రావతరణ అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగంలో అనేక పథకాలను రూపొందించి అమలు పరుస్తున్నది. అందులో ముఖ్యమైనవి.

a) కంటి వెలుగు :
సామాన్యంగా ప్రజలు ప్రత్యేకించి మహిళలు, వృద్ధులు కంటి సమస్యలను వాయిదా వేయడం లేదా ఆ సమస్యలను కొనసాగిస్తూనే జీవనాన్ని గడుపుతుంటారు. ఈ సమస్య నివారణ కోసమే తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు పథకాన్ని రూపొందించి అమలుపరుస్తున్నది.

b) బస్తీ దవాఖాన :
పట్టణ ప్రాంతాలలో ప్రామాణికతతో కూడిన ఆరోగ్య సేవలు అందించుటకు బస్తీ దవాఖానాలు స్థాపించారు. ప్రతి బస్తీ దవాఖాన 6,000 నుండి 10,000 జనాభా ఉన్న ప్రాంతాలకు సేవలందిస్తుంది. పట్టణ మురికినాడలలో వీటిని స్థాపిస్తారు. రాష్ట్రంలో 104 బస్తీ దవాఖానాలు పనిచేస్తున్నాయి.

c) ఆరోగ్య, వెల్నెస్ కేంద్రాలు :
ఇవి సమగ్ర ఆరోగ్య సేవలతో బాటు ప్రసూతి, చిన్న పిల్లల ఆరోగ్య రక్షణ సేవలను అందిస్తున్నాయి. వైద్య సేవలు, అవసరమైన ఔషధాలను ఇవి ఉచితంగా పంపిణీ చేస్తాయి. రాష్ట్రంలో 636 ప్రాథమిక- ఆరోగ్య కేంద్రాలు, 86 ఉపకేంద్రాలు, 104 బస్తీ దవాఖానాలు, 227 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆరోగ్య వెల్నెస్ కేంద్రాలుగా పనిచేస్తున్నాయి.

d) తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) ఆసుపత్రులు :
తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 107 TVVP ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. ఇవి ప్రసూతి, చిన్న పిల్లల ఆరోగ్య రక్షణ సేవలు, సాధారణ వైద్య సేవలు, సర్జరీలు, ఆప్తమాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, డెర్మటాలజీ, ENT మొదలైన సేవలను అందిస్తాయి.

e) ఆయుష్ (ఆయుర్వేద, యోగ, నాచురోపతి, యునాని, హోమియోపతి) :
తెలంగాణ ప్రభుత్వం, జాతీయ ఆయుష్ మిషన్ జంలో ఆయుష్ పద్ధతి వైద్యాన్ని ప్రోత్సహిస్తున్నది. ఆయుష్ శాఖ కింద రాష్ట్రంలో 860 దవాఖానాలు పనిచేస్తున్నాయి.

f) ఆరోగ్య శ్రీ :
ఆరోగ్యశ్రీ ఆరోగ్య రక్షణ ట్రస్టు’ ద్వారా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనే ఒక ఏకైక పథకం ఆరోగ్య బీమాతో అమలవుతుంది. దీని ప్రధాన ఆశయం పేదరిక రేఖకు దిగువన ఉన్న వారికి వైద్య సేవలను అందించడం, ఈ పథకం ద్వారా పేద వారికి ఎంపిక చేయబడిన వ్యాధులకు నగదు రహిత సేవలు అందించబడతాయి.

g) KCR కిట్ :
ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం జూన్ 2, 2017 న ప్రారంభించింది. పేదరికపు రేఖకు దిగువన ఉండి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల నుంచి ఆరోగ్య సేవలు పొందే గర్భిణీ స్త్రీలకు, మగశిశువు జన్మిస్తే రూ.12,000, ఆడశిశువు జన్మిస్తే రూ. 13,000 సహాయం అందించబడుతుంది.

TS Board Inter Second Year Economics Study Material Chapter 10 తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 9.
తెలంగాణలో పేదరికం, నిరుద్యోగిత స్థితిగతులను విశ్లేషించండి.
జవాబు.
పేదరికం బహుముఖ దృగ్విషయం. ఇది సాంఘిక, ఆర్థిక, రాజకీయ, కొంతమేరకు బహిర్గత కారణాలచే ప్రభావితమౌతుంది. పేదరికమనేది ఒక సాంఘిక దృగ్విషయం. సమాజంలో గల ఒక వర్గం పౌరులు తను జీవనాన్ని గడుపుటకు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిని సేవలికంగా నిర్వచించవచ్చు.

(a) టెందూల్కర్ నిపుణుల కమిటీ పేదరికం అంచనాలు :
1993-94లో తెలంగాణలో పేదరికపు అంచనాల కొరకు సాలుసలి తలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాలకు రూ. 11,244, పట్టణ ప్రాంతాలకు రూ. 11,282 గా ప్రమేయం చేయబడ్డది.

అదే విధంగా 2011-12 లో పేదరికపు అంచనా కొరకు సాలునరి తలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాలకు రూ.860గా పట్టణ ప్రాంతాలకు రూ.1,009 గా భావించడం జరిగింది. కమిటీ అంచనాల ప్రకారం 1993-94 నుండి 2011-12 మధ్య కాలంలో తెలంగాణలో గ్రామీణ, పట్టణ పేదరికం వరుసగా 49 శాతం, 30.5 శాతంగా ఉంది.

(b) రంగరాజన్ కమిటీ రిపోర్టు పేదరికం అంచనాలు :
పేదరికంపై రంగరాజన్ కమిటీ రిపోర్టు అంచనాల ప్రకారం 2011-12లో తెలంగాణలో పేదరికపు స్థాయి దేశం మొత్తం పేదరికపు స్థాయి కంటే చాలా తక్కువ. ఈ రిపోర్టు ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో పేదరికపు స్థాయి తెలంగాణలో 9.3 శాతం కాగా దేశం మొత్తంలో అది 30.9 శాతంగా ‘అలాగే పట్టణ ప్రాంతాలలో పేదరికపు స్థాయి 11.1 తాతం కాగా దేశం మొత్తంలో అది 26.4 శాతంగా ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగిత రేట్లు :
అమలులో ఉన్న వేతనం వద్ద ఒక వ్యక్తి శారీరకంగా, మానసికంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ అతనికి ఉద్యోగ అవకాశం లభ్యం కాకపోవడాన్ని నిరుద్యోగితగా నిర్వచించవచ్చు. ఇంకొక విధంగా చెప్పాలంటే ఇది దేశంలో నిరుద్యోగుల సంఖ్య కంటే ఉద్యోగ అవకాశాల సంఖ్య తక్కువగా ఉండే స్థితిని సూచిస్తుంది.

తెలంగాణ రాష్ట్రంతో బాటు భారతదేశంలో నిరుద్యోగిత రేటు 2011-12లో తెలంగాణలో నిరుద్యోగిత రేటు భారతదేశ నిరుద్యోగిత రేటు కంటే తక్కువ. మొత్తానికి రాష్ట్రంలో పురుషులతో పోల్చినప్పుడు స్త్రీలలోనే నిరుద్యోగిత రేటు ఎక్కువ. పట్టణ, గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగిత రేట్లలో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి ఉన్నది.

ప్రశ్న 10.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాముఖ్యతను చర్చించండి.
జవాబు.
కాళేశ్వరం ప్రాజెక్టు :
కాళేశ్వరం దగ్గరలో గల మేడిగడ్డ వద్ద గోదావరి నదిపై ఒక బ్యారేజీ, మేడిగడ్డ (లక్ష్మీ బ్యారేజీ) మరియు అన్నారం వద్ద గల శ్రీపాద యెల్లంపల్లి మరియు సుందిల్ల వద్ద మరో రెండు బ్యారేజీలను నిర్మించడం.

వీటి ద్వారా కాలువలు, టన్నెల్స్, లిఫ్ట్ పద్ధతులు, రిజర్వాయర్లు, నీటి పంపిణీ వ్యవస్థలను ఉపయోగించి కమాండ్ ఏరియాలో గల 7 జిల్లాల (పునర్విభజన వలన 13 జిల్లాలకు) ఆయకట్టు తొలుత ప్రకటించిన 16,40,000 ఎకరాలకు బదులు 18,25,700 ఎకరాలకు నీటిని అందించుటకు నిర్ణయం.

దీనితో బాటు స్టేజి-1, స్టేజి-II, సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టుల స్థిరీకరణ ద్వారా మరో 18,82,970 ఎకరాలకు (18,25,700 + 18,82,970 = 37,08,670 ఎకరాలు) నీరును అందించుట తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం. వీటితో బాటు జంట నగరాలకు 20 TMC లు, నదీ పరీవాహక గ్రామాలకు 10 TMCల తాగు నీరు, పారిశ్రామిక అవసరాలకు 16 TMCల నీరు అందించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క మొత్తం అంచనా వ్యయం 80,000 కోట్ల రూపాయలు కాగా 31.7.2019 నాటికి 51,434 కోట్ల రూపాయలు వ్యయం చేయడం జరిగింది.

TS Board Inter Second Year Economics Study Material Chapter 10 తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 11.
తెలంగాణలో ఇంధన మార్గాలు గురించి వ్రాయండి.
జవాబు.
తెలంగాణలో ఇంధన (శక్తి) రంగం : తెలంగాణ ఆర్ధిక వ్యవస్థ వ్యవసాయాధారితం అయినందున ఇతర రాష్ట్రాలతో పోల్చితే విద్యుచ్ఛక్తి వినియోగం ఎక్కువ తెలంగాణ రాష్ట్రంలో 2017-18 లో రాష్ట్ర తలసరి విద్యుచ్ఛక్తి వినియోగం 1,727 యూనిట్లతో 13.62 శాతం వినియోగ వృద్ధి రేటును నమోదు చేసుకొన్నది.

2018-19లో భారత్ లో సగటు విద్యుత్తు వినియోగం 1,181 యూనిట్లు, ఈ వివరాల ప్రకారం తెలంగాణలో విద్యుత్తు సగటు వినియోగం, దేశ వినియోగం కంటే ఎక్కువగా ఉండటమే కాకుండా దేశంలో మొదటి స్థానంలో ఉన్నది.

2016-17లో తెలంగాణలో విద్యుత్తు వినియోగం 53,017 మిలియన్ యూనిట్లు (MU) కాగా ఇది 2017-18 లో 60,237 MUకు పెరిగింది. అదేవిధంగా విద్యుత్తు తలసరి వినియోగం 2016-17 లో 1,551 యూనిట్లు 2017-18 లో 1,727 యూనిట్లకు పెరిగింది.

ఆవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో గల విద్యుత్తు స్థాపిత శక్తి (installed capacity)ని రాష్ట్ర విభజనానంతరం తెలంగాణకు 53.89 శాతం, ఆంధ్రకు 46.11 శాతంగా నిర్దేశించబడ్డది.

తదనుగుణంగా డిసెంబర్ 2016 నాటికి తెలంగాణ రాష్ట్ర స్థాపిత శక్తి కేంద్ర, రాష్ట్ర ప్రైవేటు రంగాలన్నింటిని కలిపి మొత్తం 12,295.75 MW. ‘Power Sector, జనవరి 2018, రిపోర్టు ప్రకారం 31.1.2018 నాటికి తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు స్థాపిత శక్తి 14.689.46 MW; ఇందులో రాష్ట్రం వాటా 7572.65 MW, కేంద్రం వాటా 2036.85 MW, ప్రైవేటు రంగం వాటా 5079.96 MW.

ప్రశ్న 12.
తెలంగాణలో SC/ST వర్గాల సంక్షేమ పథకాల గురించి రాయండి.
జవాబు.
SC/STs వర్గాల అభివృద్ధి, సంక్షేమ పథకాలు :

i) SC, ST ల ప్రత్యేక అభివృద్ధి నిధి :
SC, ST ల ప్రత్యేక అభివృద్ధి నిధి (SDF) చట్టం, 2017 ననుసరించి తెలంగాణ ప్రభుత్వం రెండు బడ్జెట్ పద్దులను అనగా (i) SC ప్రత్యేక అభివృద్ధి నిధి (SCSDF), (ii) ST ప్రత్యేక అభివృద్ధి నిధి (STSDF) లను రూపకల్పన చేసింది.

ii) షెడ్యూల్డ్ కులాల సంక్షేమం :
తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కింద వివరించిన పథకాల అమలును పర్యవేక్షిస్తుంది.

a) SC లకు కళ్యాణ లక్ష్మి :
అక్టోబర్, 2, 2014న ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. తెలంగాణకు చెందిన SC వర్గపు 18 సంవత్సరాల వయస్సు పై బడిన బాలిక వివాహ ఖర్చుల కొరకు వధువు కుటుంబానికి రూ.51,000 ప్రభుత్వం గతంలో ఇచ్చేది. ఇందుకు SC కుటుంబపు తల్లిదండ్రుల ఆదాయ పరిమితి 2 లక్షల రూపాయలు. కాగా కల్యాణ లక్ష్మి గ్రాంటును ప్రభుత్వం 2017లో రూ.75,116 లకు, 2018 లో రూ.1,00,116 లకు పెంచింది.

b) అంబేద్కర్ ఓవర్సీస్ నిధి పథకం :
ఈ గ్రాంటు ద్వారా విద్యార్థులు USA, UK, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, న్యూజిలాండ్ మరియు సౌత్ కొరియా వంటి దేశాల్లో విద్యను అభ్యసించవచ్చు. 2018-19 సంవత్సరంలో 101 మంది విద్యార్థులు ఈ పథకంలో ఎంపికయ్యారు.

c) భూమి కొనుగోలు పథకం :
నిరుపేద షెడ్యూల్డ్ కులాల మహిళలకు లబ్ధి చేకూర్చుటకు ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పధరం కింద 2014-16 నుంచి 2019-20 మధ్య కాలంలో దాదాపు రూ.667.71 కోట్ల వ్యయంతో సుమారు 15,044.35 ఎకరాల భూమిని కొనుగోలు చేయగా 5,930 మందికి పంపిణీ చేశారు.

iii) షెడ్యూల్డ్ తెగల సంక్షేమం :
షెడ్యూల్డ్ తెగల సమగ్రాభివృద్ధి కొరకు తెలంగాణ ప్రభుత్వం కింద తెలిపిన పథకాలను అమలు పరుస్తున్నది.

a) ST లకు కల్యాణ లక్ష్మి :
ఈ పథకాన్ని అక్టోబర్ 2, 2014లో ప్రారంభించారు. ఈ పథకం కింద 18 సంవత్సరాలు నిండిన తెలంగాణకు చెందిన ST యువతి కళ్యాణ ఖర్చుల కోసం రూపాయలు 1,00,116 ఆర్థిక సహాయం ఇవ్వబడుతుంది.

b) ఆర్థిక మద్దతు పథకాలు :
ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగం, ఉద్యానవనం, మత్స్య పరిశ్రమ, చిన్న నీటి పారుదల, పశు సంవర్ధకం, స్వయం ఉపాధి వంటి రంగాలలో నిమగ్నమైన గిరిజనులకు ఆర్థిక సహాయం కల్పిస్తారు.

c) అడవి హక్కుల చట్టం, 2006 :
తమ జీవనోపాధి కొరకు కొన్ని యుగాల నుంచి అడవుల పై ఆధారపడి జీవించే గిరిజనులు, ఇతర సంప్రదాయ ఆటవిక జీవులకు తమ జీవనాన్ని కొనసాగించుకొనే రక్షణను అడవి హక్కుల చట్టం – 2006 కల్పిస్తుంది. ఈ చట్టం ప్రకారం 93,494 మంది గిరిజనులకు 3,00,092 ఎకరాల భూమిని పంపిణీ చేయడం జరిగింది.

C. వెనకబడిన వర్గాల (BC) అభివృద్ధి, సంక్షేమ పథకాలు :
వెనకబడిన తరగతుల వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలు :

i) కళ్యాణ లక్ష్మి :
2016-17 సంవత్సరం నుంచి కళ్యాణ లక్ష్మి పథకాన్ని వెనకబడిన తరగతులు (BC), ఆర్థికంగా వెనకబడిన తరగతుల వారికి కూడా వర్తింపజేశారు.

ii) చాలా వెనకబడిన తరగతుల అభివృద్ధి కార్పోరేషన్ :
వెనకబడిన తరగతుల వర్గాలలో సాంఘికంగా, విద్యాపరంగా, ఆర్థికపరంగా చాలా వెనకబడిన తరగతుల (MBC) సంక్షేమంలో మెరుగుదల కొరకు ఈ కార్పోరేషన్ ను 2017లో తెలంగాణ ప్రభుత్వం స్థాపించింది.

D. మైనార్టీల అభివృద్ధి, సంక్షేమ పథకాలు :
తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ వర్గం వారి సాంఘిక, ఆర్థిక స్థితిగతులలో పెంపుదల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కొన్ని ముఖ్యమైన పథకాలను కింద వివరించాం.

a) బ్యాంక్తో అనుసంధానం చేయబడిన సబ్సిడీ పథకం : మైనార్టీ వర్గాల వారు స్వయంఉపాధి చేపట్టే వ్యాపారం చేసేవారికి ఈ పథకాన్ని ఉద్దేశించారు. సబ్సిడీతో కూడుకున్న ఆర్థిక సహాయాన్ని బ్యాంకుల ద్వారా మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ కల్పిస్తుంది.
b) శిక్షణ, ఉద్యోగిత, నైపుణ్య అభివృద్ధి : మైనార్టీల శాఖ, మైనార్టి యువతకు తగిన శిక్షణను ఆ వారు స్వయం ఉపాధి చేపట్టుటకు వీలుగా మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది.
c) షాదీ ముబారక్ పథకం : ఈ పథకం ప్రకారం అర్హమైన మైనార్టీ వర్గానికి చెందిన యువతి పెళ్ళి ఖర్చులకు రూ. 1,00,116 గ్రాంటు రూపంలో ఇవ్వబడుతుంది.

TS Board Inter Second Year Economics Study Material Chapter 10 తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
స్థూల జిల్లా ప్రాంతీయోత్పత్తి
జవాబు.
ఒక నిర్దిష్ట కాలం లేదా ఒక సంవత్సర కాలంలో ఒక జిల్లా యొక్క భౌగోళిక సరిహద్దులలో ఒక సంవత్సర కాలంలో ఒకటి. కంటే ఎక్కువసార్లు లెక్కించకుండా ఉత్పత్తి చేయబడిన వస్తుసేవల విలువను తెలిపేదే స్థూల, జిల్లా ప్రాంతీయోత్పత్తి (GDDP). ఈ GDDP అంచనా, ఒక జిల్లాను ఇతర జిల్లాలతో పోల్చుట ద్వారా ఆ జిల్లా యొక్క అభివృద్ధి స్థాయి వివరణకు తోడ్పడుతుంది.

ఈ వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో GDDP లో హైదరాబాదు జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలు వరుసగా రెండవ, మూడవ, నాల్గవ స్థానాల్లో నిలిచాయి.

ప్రశ్న 2.
తలసరి ఆదాయం.
జవాబు.
ఒక దేశ జాతీయాదాయాన్ని ఆ దేశపు జనాభాతో భాగించగా వచ్చే మొత్తాన్ని తలసరి ఆదాయం అని అంటారు. ఈ భావనను క్రింది విధంగా వివరించవచ్చును.

తలసరి ఆదాయం = జాతీయాదాయం / జనాభా.

ప్రశ్న 3.
పిల్లల జనాభా.
జవాబు.
పిల్లల జనాభా (Child Population) :
0-6 సంవత్సరాల లోపు వారిని పిల్లలు (Children) గా భావించాలి. తెలంగాణలో పిల్లల జనాభా శాతం 2001 లో 14.2% నుంచి, 2011 లో 10.5%కు తగ్గింది. ఈ తగ్గుదలకు కారణం పెరుగుతున్న అక్షరాస్యత, అధిక ఆదాయాలకు తోడుగా కుటుంబ నియంత్రణ పద్ధతులు అవలంభించడం.

అన్ని జిల్లాలలో పిల్లల జనాభా శాతం, రాష్ట్ర సగటుకు దగ్గరగా 10.5%గా ఉన్నది. కేవలం ఒక మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం పిల్లల జనాభా 17.4% గా ఉంది.

TS Board Inter Second Year Economics Study Material Chapter 10 తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 4.
ఆహార, ఆహారేతర పంటలు.
జవాబు.
ధాన్యాలు, చిరుదాన్యాలు, పప్పుదినుసులు వంటివి ఆహార పంటలు. ప్రత్తి, నూనెగింజలు, పూలు వంటివి ఆహారేతర పంటలు. 2017-18 సంవత్సరంలో 37.14 లక్షల హెక్టార్ల భూమిలో ఆహారపంటలు సాగుచేయబడ్డాయి. ఇదే కాలంలో 23-45 లక్షల హెక్టార్లలో ఆహారేతర పంటలు సాగుచేయబడ్డాయి.

ప్రశ్న 5.
మనుగడలో ఉన్న కమతం.
జవాబు.
ఈ రకమైన వ్యవసాయ భూకమతాల సమాచార సేకరణ కోసం భారత ప్రభుత్వం ప్రతి 5 సం॥లకు ఒకసారి గణన నిర్వహిస్తుంది. ఈ గణన ప్రకారం మనుగడలో ఉన్న కమతాలు, ఉపాంత, చిన్న, మాధ్యమిక పెద్ద కమతాలు రూపంలో ఉన్నాయి. తెలంగాణలో 2010-11లో మనుగడలో గల సగటు కమతం పరిమాణం 1.12 హెక్టారులు. 2015-16 నాటికి ఇది 1.00 హెక్టారు (2.47 ఎకరాలు)గా ఉంది.

ప్రశ్న 6.
రైతుబంధు.
జవాబు.
రుణ భారం నుంచి విముక్తి కల్పిచేందుకు వీలుగా ఒక పెట్టుబడి రూపంలో సహకారాన్ని అందించి రైతుల సాధికారితను పెంచే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన పథకమే రైతు బంధు. 2018, మే 10వ తేదిన ఈ పథకం ప్రారంభించబడ్డది.

2019-20 సంవత్సరం నుంచి తెలంగాణ ప్రభుత్వం ఈ రకమైన పెట్టుబడి సహకారాన్ని ప్రతి సీజను రూ.4,000 ఎకరం నుంచి రూ.5,000 లకు పెంచింది.

ప్రశ్న 7.
రైతు బీమా.
జవాబు.
2018, ఆగష్టు 15న తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. రోగగ్రస్తుడైన రైతు మరణిస్తే, అతని కుటుంబ సభ్యులు లేదా అతనిపై ఆధారపడిన వారికి ఆర్థికపరమైన భద్రతను కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ పథకం కింద ప్రతి రైతుకు రూపాయలు 5 లక్షల బీమా కవరేజి ఉంటుంది.

TS Board Inter Second Year Economics Study Material Chapter 10 తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 8.
సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు (MSME).
జవాబు.
ఈ పరిశ్రమలు పెద్దతరహా పరిశ్రమలకు అవసరం అయిన ఉత్పాదకాలను సప్లయ్ చేసే అనుషంగిక పరిశ్రమలుగా పనిచేస్తూ రాష్ట్రంలో సంతులిత ప్రాంతీయాభివృద్ధికి, సమ్మిళిత వృద్ధికి తోడ్పడతాయి. ఇవి తక్కువ మూలధనం, తక్కువ స్థాయి నైపుణ్యం గల పారిశ్రామిక యూనిట్ల ద్వారా ఉద్యోగ కల్పనలో కీలక పాత్రను కలిగి ఉంటాయి.

ప్రశ్న 9.
TS-ipass.
జవాబు.
తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధాన నినాదం “ఆవిష్కరించు, వృద్ధిపరచు, సంవిలీనించు”. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ”తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్ట్ అనుమతి సొంత ధ్రువీకరణ (సర్టిఫికేషన్) విధానాన్ని (TS-ipass) రూపొందించి, పెట్టుబడిదారుల అనుకూల విధానాన్ని ప్రవేశపెట్టి, పెట్టుబడులను ఆకర్షించి పారిశ్రామిక ప్రగతికి బాటలు వేసింది”.

ప్రశ్న 10.
ఇమేజ్ టవర్.
జవాబు.
అధునాతన అవస్థాపనా సౌకర్యాల కల్పన ద్వారా యానిమేషన్, గేమింగ్, VFX సేవల కల్పనకు IMAGE టవర్ను నెలకొల్పుటకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. దీనిని రుద్రారం గ్రామం, రంగారెడ్డి జిల్లాలో 10 ఎకరాల స్థలంలో రూ. 1,000 కోట్లతో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (PPP)లో స్థాపించ తలపెట్టింది.

ప్రశ్న 11.
ఆసరా పెన్షన్ పథకం
జవాబు.
ప్రభుత్వం సాంఘిక భద్రత, సంక్షేమం దృష్ట్యా ఈ పథకాన్ని ప్రారంభించింది. ఆసరా పథకం క్రింద వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, నేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఉపాధిని కోల్పోయిన వారికి నెలకు 1000/- వికలాంగులకు 1,500/- ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. దీనిని బీడి కార్మికులకు కూడా వర్తింపజేసింది.

TS Board Inter Second Year Economics Study Material Chapter 10 తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 12.
తెలంగాణ ఫైబర్ గ్రిడ్.
జవాబు.
ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. తగిన అవస్థాపనా సౌకర్యాలను కల్పించి 10 జోన్లు (33 జిల్లాలో) గా ‘డిజిటల్ తెలంగాణ’ను సాకారం చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.

ప్రశ్న 13.
మిషన్ కాకతీయ.
జవాబు.
వ్యవసాయాన్ని పునరుత్తేజం చేసేందుకు దీర్ఘకాలిక చర్యగా నూతన ప్రభుత్వం “మిషన్ కాకతీయ” అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ప్రధాన ఆశయం “మన ఊరు మన చెరువు”.

ఈ కార్యక్రమం క్రింద సంప్రదాయ చెరువులు, చిన్న నీటిపారుదల వనరులను పునరుద్ధరించడం, ఉపరితల భూగర్భ జలాలను మెరుగుపర్చడం ద్వారా 46,531 చెరువులను రానున్న 5 సంవత్సరాలలో దశల వారీగా పునరుద్ధరించాలని ప్రతిపాదించడం జరిగింది.

ప్రశ్న 14.
తెలంగాణలో స్త్రీ,పురుషుల నిష్పత్తి.
జవాబు.
వెయ్యిమంది పురుషులకు స్త్రీల సంఖ్య ఆధారంగా స్త్రీ-పురుష నిష్పత్తి నిర్ణయించబడుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ప్రతి 1000 మంది పురుషులకు 988 మంది స్త్రీల అనుపాతం ఉంది. భారతదేశంలో ఈ అనుపాతం 1,000 మంది పురుషులకు 943 మంది స్త్రీలు ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో స్త్రీలు ఇండియాలో గల సగటు స్త్రీల సంఖ్య కంటే అధికంగా ఉన్నారని తెలుస్తుంది.

ప్రశ్న 15.
స్థూల నమోదు నిష్పత్తి (GER).
జవాబు.
స్థూల నమోదు నిష్పత్తి (GER) విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలో విద్యార్థుల నమోదు సంఖ్యను నిర్ణయిస్తుంది. GER 2017-18లో ప్రాథమిక పాఠశాలలో బాలురు – 98.76 శాతం, బాలికలు – 98.05 శాతం కాగా ఉచ్ఛతర ప్రాథమిక పాఠశాలలో బాలురు – 87.32 శాతం, బాలికలు 88.4.

TS Board Inter Second Year Economics Study Material Chapter 10 తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 16.
షెడ్యూల్డ్ కులాల రెసిడెన్షియల్ పాఠశాలలు.
జవాబు.
తెలంగాణా సాంఘికసంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ రాష్ట్రంలో 269 రెసిడెన్షియల్ విద్యాసంస్థలను నడుపుతుంది. ఇందులో 175 బాలికలకు సంబంధించినవి. వీటిలో 5వ తరగతి నుండి డీగ్రీ వరకు షెడ్యూల్డ్ కులాలకు చెందిన ప్రవేశం కలదు.

ప్రశ్న 17.
కంటి వెలుగు,
జవాబు.
సామాన్యంగా ప్రజలు ప్రత్యేకించి మహిళలు, వృద్ధులు కంటి సమస్యలను వాయిదా వేయడం లేదా ఆ సమస్యలను కొనసాగిస్తూనే జీవనాన్ని గడుపుతుంటారు. ఈ సమస్య నివారణ కోసమే తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు పథకాన్ని రూపొందించి అమలుపరుస్తున్నది.

ప్రశ్న 18.
మానవ అభివృద్ధి సూచిక.
జవాబు.
ఈ సూచికలో మూడు అంశాలు ఉంటాయి. అవి
ఎ) తలసరి ఆదాయం
బి) ఆయుర్ధాయం, ఆరోగ్య ప్రామాణికతలు,
సి) అక్షరాస్యత, విద్య.

ప్రశ్న 19.
ఆరోగ్య లక్ష్మి.
జవాబు.
గర్భిణీ స్త్రీలు, పిల్లలకు పాలిచ్చే తల్లులలో పౌష్టిక, పోషక విలువలు పెంచుట కొరకు ఈ పథకాన్ని రూపొందించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని అంగన్ వాడి కేంద్రాల ద్వారా పేదరికపు రేఖకు దిగువన ఉన్న గర్భిణీ స్త్రీలు, 6 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలకు ప్రతిరోజు పోషకాహాన్ని అందిస్తుంది. ఈ పథకాన్ని జనవరి 1, 2015 న ప్రారంభించారు.

TS Board Inter Second Year Economics Study Material Chapter 10 తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 20.
నిరుద్యోగిత.
జవాబు.
అమలులో ఉన్న వేతన రేటు వద్ద ఒక వ్యక్తి శారీరకంగా, మానసికంగా పనిచేయడాన్ని సిద్ధంగా ఉన్నప్పటికి అతనికి ఉద్యోగ అవకాశం లభ్యం కాకపోవడాన్ని నిరుద్యోగితగా చెబుతారు. ఈ భావన దేశంలో నిరుద్యోగుల సంఖ్య కంటే ఉద్యోగావకాశాల సంఖ్య తక్కువగా ఉండే స్థితిని సూచిస్తుంది.

ప్రశ్న 21.
కళ్యాణ లక్ష్మి.
జవాబు.
ఆర్థికంగా వెనుకబడిన ఎస్.సి., ఎస్.టి. కుటుంబాలలో పెళ్ళి చేసుకొనే అమ్మాయిలకు ఒకేసారి 51 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమాన్ని అక్టోబరు 2, 2014 నుంచి ప్రారంభించింది.

ప్రశ్న 22.
మిషన్ భగీరథ.
జవాబు.
కృష్ణ, గోదావరి నదుల నీటి సహాయంతో శుద్ధి చేసిన త్రాగునీరును పైపులైను ద్వారా రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తేవడం ఈ పథకం ముఖ్య ఆశయం. ఈ పథకాన్ని 7 ఆగస్టు, 2016లో కోమటిబండ, మెదక్ జిల్లాలో ప్రారంభించారు. గ్రామ ప్రజలకు 100 లీటర్లు, మున్సిపాలిటీ వాసులకు 135 లీటర్లు కార్పొరేషన్ వారికి 150 లీటర్లు అందించాలనేది లక్ష్యం.

ప్రశ్న 23.
B.C సంక్షేమ పథకాలు.
జవాబు.
వెనకబడిన తరగతుల వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలు :

i) కళ్యాణ లక్ష్మి :
2016-17 సంవత్సరం నుంచి కళ్యాణ లక్ష్మి పథకాన్ని వెనకబడిన తరగతులు (BC), ఆర్థికంగా వెనకబడిన తరగతుల వారికి కూడా వర్తింపజేశారు.

ii) చాలా వెనకబడిన తరగతుల అభివృద్ధి కార్పోరేషన్ :
వెనకబడిన తరగతుల వర్గాలలో సాంఘికంగా, విద్యాపరంగా, ఆర్థికపరంగా చాలా వెనకబడిన తరగతుల (MBC) సంక్షేమంలో మెరుగుదల కొరకు ఈ కార్పోరేషన్ ను 2017లో తెలంగాణ ప్రభుత్వం స్థాపించింది.

TS Board Inter Second Year Economics Study Material Chapter 10 తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 24.
మైనారిటీల సంక్షేమ పథకాలు.
జవాబు.
తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ వర్గం వారి సాంఘిక, ఆర్థిక స్థితిగతులలో పెంపుదల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కొన్ని ముఖ్యమైన పథకాలను కింద వివరించాం.

a) బ్యాంక్ తో అనుసంధానం చేయబడిన సబ్సిడీ పథకం :
మైనార్టీ వర్గాల వారు స్వయంఉపాధి చేపట్టే వ్యాపారం చేసేవారికి ఈ పథకాన్ని ఉద్దేశించారు. సబ్సిడీతో కూడుకున్న ఆర్థిక సహాయాన్ని బ్యాంకుల ద్వారా మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ కల్పిస్తుంది.

b) శిక్షణ, ఉద్యోగిత, నైపుణ్య అభివృద్ధి :
మైనార్టీల శాఖ, 3 యువతకు తగిన శిక్షణను ఆ వారు స్వయం ఉపాధి చేపట్టుటకు వీలుగా మైనార్టీ పైనాన్స్ కార్పోరేషన్ ద్వారా ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది.

c) షాదీ ముబారక్ పథకం :
ఈ పథకం ప్రకారం అర్హమైన మైనార్టీ వర్గానికి చెందిన యువతి పెళ్ళి ఖర్చులకు రూ.1,00,116 గ్రాంటు రూపంలో ఇవ్వబడుతుంది. కళ్యాణ లక్ష్మి. మిషన్ భగీరథ.

TS Inter 2nd Year Economics Study Material

TS Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

Telangana TSBIE TS Inter 2nd Year Economics Study Material 2nd Lesson జనాభా, మానవ వనరుల అభివృద్ధి Textbook Questions and Answers.

TS Inter 2nd Year Economics Study Material 2nd Lesson జనాభా, మానవ వనరుల అభివృద్ధి

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
జనాభా పరిణామ సిద్ధాంతాన్ని వివరించండి.
జవాబు.
ఆర్థికాభివృద్ధికి (Economic Development) మరియు జనన మరణాల రేట్లకు సంబంధాన్ని బట్టి జనాభా పరిణామ సిద్ధాంతంలోని మూడు దశలు ప్రతి దేశంలో ఉంటాయి.

మొదటి దశ :
ఈ దశలో జనన, మరణాల రేట్లు అధికంగా ఉంటాయి. అధిక జననాల రేటు, అధిక మరణాల రేటు రెండూ కూడా దాదాపుగా సమానంగా వుంటాయి. కావున జనాభా దాదాపుగా స్తబ్ధంగా వుంటుంది. ఈ దశలో వ్యవసాయ ప్రాధాన్యత గల ఆర్థిక వ్యవస్థలో సరైన ఆహారం, పరిశుభ్రత, వైద్య సదుపాయాలు, అధిక జీవన ప్రమాణస్థాయి, తగినటువంటి గృహసదుపాయం, విద్యావకాశాలు లేకపోవడం వల్ల అశాస్త్రీయ మరియు అహేతుబద్ధ దృక్పథం వల్ల మరణాల రేట్లు అధికంగా వుంటాయి.

అంతేకాకుండా విద్యలేనందువల్ల మూఢనమ్మకాలు, కుటుంబ పరిమాణం, బాల్య వివాహాల విషయంలో ప్రజల సాంఘిక ఆచారాలు, కట్టుబాట్లు మొదలైన కారణాలవల్ల ఈ దశలో జననాల రేట్లు కూడా అధికంగానే వుంటాయి. కుటుంబ నియంత్రణ పట్ల ప్రజలు ఉదాసీనంగా వుంటారు. ఈ దశలో అధిక జననాల రేటు, అధిక మరణాల రేటు సమానంగా వుంటాయి. కాబట్టి జనాభా వృద్ధిరేటు అధికంగా వుండదు. 1921కి పూర్వం భారతదేశంలో ఈ దశ వుంది.

రెండవ దశ :
ఈ దశలో మరణాలరేటు గణనీయంగా తగ్గుతుంది. అయితే దీనికి అనుగుణంగా జననాల రేటు మాత్రం బాగా తగ్గదు. అభివృద్ధి ప్రక్రియ ప్రారంభంవల్ల జీవన ప్రమాణం, విద్య, వైద్య, ఆరోగ్య సదుపాయాలు పెరుగుతాయి. ప్రభుత్వం అంటువ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలను తీసుకుంటుంది. ఈ కారణాలన్నింటి వల్ల మరణాల రేటు తగ్గుతుంది. అయితే వ్యవసాయక ఆర్థిక వ్యవస్థ అయినందువల్ల, ప్రజలందరికీ విద్య లేనందువల్ల కుటుంబ పరిమాణం విషయంలో ప్రజల దృక్పథంలో విప్లవాత్మక మార్పు రాదు.

అందుకే జననాలరేటు అధికంగా ఉంటుంది. అధిక జననాల రేటు, బాగా తగ్గుతున్న మరణాలరేటు రెండూ అధిక జనాభా వృద్ధిరేటుకు దారితీస్తుంటాయి. ఈ దశలో జనాభా వృద్ధిరేటు అత్యధికంగా వుంటుంది. దీనినే ఆర్థికవేత్తలు “జనాభా విస్ఫోటనం” అని అంటారు. 1951-91 మధ్యకాలంలో భారతదేశం ఈ పరిస్థితిని ఎదుర్కొంది.

మూడవ దశ :
ఆర్థికాభివృద్ధి వేగవంతం అయినందువల్ల ఆర్థిక వ్యవస్థ పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. పారిశ్రామికీకరణ పెరగడంవల్ల నగరీకరణ కూడా అధికమవుతుంది. గ్రామీణ ప్రాంతాలలో కంటే పట్టణ ప్రాంతాలలో పిల్లలను ఆస్తిగా కాక భారంగా ప్రజలు ఊహించుకుంటున్నారు. చిన్న కుటుంబాల వల్ల స్త్రీలు వారి ఆర్థిక బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలమనుకొంటారు.

పారిశ్రామికీకరణ ఫలితంగా కుటుంబ పరిమాణం పట్ల ప్రజల దృక్పథం మారడమేకాక చిన్న కుటుంబం వల్ల వుండే ప్రయోజనాలను గుర్తిస్తారు. ప్రజలు సక్రమ దిశలో ఆలోచించటానికి విద్య తోడ్పడుతుంది. కాబట్టి జననాలరేటు గణనీయంగా తగ్గుతుంది. అల్ప జననాల రేటు, అల్ప మరణాల రేటు, చిన్న కుటుంబం, అల్ప జనాభా వృద్ధిరేటు అనేవి ఈ మూడవ దశ లక్షణాలు.

TS Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి 1

అధిక జనన, మరణాల రేట్లు వుండే ఆర్థిక వ్యవస్థ అల్ప జనన మరణాల రేట్లు వుండే స్థితికి మారడాన్ని ఈ మూడు దశలు వివరిస్తాయి. రెండవ దశను “జనాభా విస్ఫోటనంగా పిలుస్తారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలో ఈ దశ సంక్లిష్టతరమైంది. పటంలో క్షితిజ అక్షరం (OX) పైన కాలాన్ని ఊర్థ్వ (OY), అక్షంపైన 1,000 జనాభాకు వార్షిక జనన మరణాల రేట్లను కొలుస్తున్నాం.

O నుంచి T వరకు వున్న మొదటి దశలో జనన మరణాల రేట్లు అధికంగాను, జనాభావృద్ధి రేటు అత్యంత అల్పంగా వుంటాయి. T నుంచి T1 వరకు వున్న రెండవ దశలో మరణాలరేటు క్షీణిస్తున్నప్పటికీ, జననాలరేటు అధికంగా వుంటున్నందువల్ల జనాభా వృద్ధిరేటు అధికంగా వుండి “జనాభా విస్ఫోటనం” ఏర్పడుతుంది. T1 తర్వాత మూడవ దశలో జనన మరణాల రేట్లు రెండూ తగ్గుతున్నందువల్ల కూడా జనాభా వృద్ధిరేటు తక్కువగా వుండి జనాభా నెమ్మదిగా పెరుగుతుంది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 2.
భారదేశంలోని జనాభా పెరుగుదల ధోరణులను పరిశీలించండి.
జవాబు.
ప్రపంచ భూమి వైశాల్యంలో భారతదేశం 2.4% వాటాను కలిగి ఉంటే ప్రపంచ జనాభాలో 17.5% వాటాను కలిగి ఉంది. జనాభా పరిమాణం విషయంలో చైనా తరువాత భారతదేశం రెండవ స్థానాన్ని పొందింది. ప్రపంచ ఆదాయంలో భారతదేశ జాతీయాదాయం 1.2% కంటే తక్కువ. 1901 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 236 మిలియన్లు ఉంటే 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా 1210 మిలియన్లు.

మొదటి 30 సంవత్సరాలలో (1891-1921) భారతదేశ జనాభా 1891లో 236 మిలియన్ల నుంచి 1921లో 251 మిలియన్లకు పెరిగింది. ఈ కాలంలో జనాభా వృద్ధి రేటు సగటున సంవత్సరానికి 0.9% నమోదు అయ్యింది. జననాల రేటు అధికంగా ఉన్నప్పటికీ, అధిక మరణాల రేటు వల్ల జనాభా వృద్ధి రేటు నిరోధించబడింది. 1891 నుంచి 1921 వరకు భారతదేశం జనాభా పరిణామ సిద్ధాంతంలోని మొదటి దశలో ఉంది. ఈ కాలంలో జనాభా స్తబ్ధంగా ఉంది.

రెండవ 30 సంవత్సరాల కాలంలో (1921-1951) 1921లో భారతదేశ జనాభా 251 మిలియన్ల నుంచి 1951లో 361 మిలియన్లకు పెరిగింది. ఈ కాలంలో జనాభా వృద్ధి రేటు సగటున సంవత్సరానికి 1.22%. దీనిని ఒక మోస్తరు వృద్ధి రేటుగా పరిగణించాం. దీనికి కారణం మరణాల రేటు 1000 49 నుంచి 1000 కి 27 వరకు బాగా తగ్గడం మరియు జననాల రేటు 1000కి -49 నుంచి 1000 కి 40 వరకు అల్పంగా తగ్గడమే.

1921 నుంచి 1951 వరకు భారతదేశం జనాభా పరిణామ సిద్ధాంతంలోని రెండవ దశలో ఉంది. ఈ కాలంలో జనాభా వృద్ధి రేటు అల్పంగా ఉన్నప్పటికీ క్రమంగా పెరిగింది. 1921లో జనాభా తగ్గినందువల్ల 1921 సంవత్సరాన్ని జనాభా విభాజిక సంవత్సరంగా పరిగణిస్తున్నాం. అప్పటి నుంచి జనాభా వృద్ధి రేటు క్రమేణా పెరగడం జరిగింది.

1950 నుంచి 1981 వరకు ఉన్న 30 సంవత్సరాల కాలంలో 1951లో 361 మిలియన్లగా ఉన్న జనాభా 1981నాటికి 683 మిలియన్లకు పెరిగింది. జనాభా వార్షిక సగటు వృద్ధి రేటు 2.14%. ఇది ఇంతకు పూర్వం 30 సంవత్సరాల కాలంలోని వార్షిక సగటు వృద్ధి రేటు కంటే సుమారుగా రెట్టింపు. ప్రణాళికల అమలువల్ల మరణాలను తగ్గించే అనేక చర్యలను తీసుకోవడం జరిగింది. ఫలితంగా మరణాల రేటు బాగా తగ్గి 15కి చేరింది. కాని జననాల రేటు మాత్రం 40 నుంచి 37కి మాత్రమే తగ్గింది. కాబట్టి ఈ కాలంలో జనాభా విస్ఫోటనం ఏర్పడింది.

1981 నుంచి 2011 వరకు ఉన్న 30 సంవత్సరాల కాలంలో భారతదేశ జనాభా 683 మిలియన్ల నుంచి 1,210 మిలియన్లకు పెరిగి 77% జనాభా పెరుగుదల నమోదయింది. ఫలితంగా, భారతదేశం ప్రస్తుతం జనాభా పరిణామ సిద్ధాంతంలోని 2వ దశలోనే ఉన్నప్పటికీ, ఈ సిద్ధాంతంలోని 3వ దశలోకి ప్రవేశించే అవకాశం ఏర్పడింది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 3.
భారతదేశంలో జనాభా వేగంగా పెరగడానికి గల కారణాలు ఏమిటి ?
జవాబు.
అధిక జననాల రేటు, అల్ప మరణాల రేటు : ఒక దేశ జనాభా వేగంగా పెరగడానికి మూడు కారణాలు ఉన్నాయి. అవి:

  1. అధిక జననాల రేటు,
  2. సాపేక్ష అల్ప మరణాల రేటు,
  3. వలసరావడం.

భారతదేశ జనాభా వృద్ధిపై వలసరావడం ప్రభావం ఏమీ లేదు. మరణాల రేటు క్రమేణా తగ్గుతున్నా, జననాల రేటు అధికంగా ఉన్నందువల్ల భారతదేశంలో జనాభా వేగంగా పెరిగి జనాభా విస్ఫోటనానికి దారి తీసింది.

ఎ) మరణాల రేటు తగ్గుదలకు కారణాలు :
1. క్షామాలను (Famines) నివారించడం :
భారతదేశంలో బ్రిటీష్ పాలనా కాలంలో తరచుగా కరువు కాటకాలు ఏర్పడటం వల్ల మరణాల రేటు ఎక్కువగా ఉండేది. స్వాతంత్ర్యం పొందిన తరువాత కరువు కాటకాలు భారీ స్థాయిలో రాకపోవడం, కరువుల వల్ల ఏర్పడిన సమస్యల నివారణకు అనేక చర్యలు తీసుకోవడం వల్ల పరిస్థితులు బాగా మెరుగయ్యాయి.

2. రోగాల నియంత్రణ :
స్వాతంత్ర్యానికి పూర్వం కలరా, మశూచి, మలేరియా వ్యాధులు భారీ మరణాలకు కారణమయ్యాయి. ప్రస్తుతం మశూచిని పూర్తిగా నివారించడం, కలరా, మలేరియా వ్యాధులు బాగా నియంత్రణలో ఉండటం జరిగింది. క్షయ కొంతవరకు తగ్గినప్పటికీ భారతదేశంలో ఇదే అధిక మరణాలకు కారణంగా ఉంది.

3. ఇతర కారణాలు :
తాగునీటి సరఫరా, పరిశుభ్రత, ఆరోగ్యం, విద్యావ్యాప్తి, వైద్య సౌకర్యాల విస్తరణ, రోగ నిరోధక శక్తి మెరుగవ్వడం, పేదరిక నిర్మూలనా పథకాలు, జీవన ప్రమాణాల పెంపుదల లాంటి అంశాల ప్రభావం కూడా మరణాల రేటుపై ఉంటుంది.

బి) అధిక జననాల రేటుకు కారణాలు :

I. ఆర్థిక కారణాలు :

1. వ్యవసాయం అధిక ప్రాధాన్యతను కలిగి ఉండటం :
వ్యవసాయ సంబంధిత సమాజంలో పిల్లలను ఆర్థిక భారంగా పరిగణించలేదు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత కార్యక్రమాలు ఉధృతంగా ఉన్న కాలంలో శ్రామికులు అధికంగా అవసరం. అందుకే వ్యవసాయ ప్రాధాన్యత గల భారత ఆర్థిక వ్యవస్థలో పెద్ద కుటుంబాలు ఉంటున్నాయి.

2. నగరీకరణ :
భారతదేశంలో పారిశ్రామికీకరణ నిర్విరామంగా, వేగంగా జరగకపోవడం వల్ల నగరీకరణ ప్రక్రియ కూడా నెమ్మదిగా ఉంది. మన దేశంలో జరిగిన నగరీకరణ జననాల రేటును తగ్గించే సాంఘిక మార్పును తీసుకురాలేదు.

3. పేదరికం :
అభివృద్ధి చెందని దేశాలలో పేదరికం కారణంగా జననాల రేటు అధికంగా ఉంది. పేదవారికి తమ శ్రమ తప్ప ఇతర ఆర్థిక ఆస్తులు ఏమీ లేవు. కాబట్టి కుటుంబంలో ఎక్కువ మంది ఆర్జించే వాళ్ళు ఉంటే కుటుంబ ఆర్జనలు ఎక్కువ అని భావిస్తారు. పుట్టిన శిశువులు జీవించే అవకాశం తక్కువగా ఉంటే కూడా ఎక్కువ మంది పిల్లలను కనడానికి ప్రాధాన్యత ఉంటుంది. పేద వర్గాల వారు కుటుంబ నియంత్రణ పథకాలను అంగీకరించకపోవడానికి పేదరికం ముఖ్య కారణం.

II. సాంఘిక కారణాలు :
వివాహానికి సర్వజన అంగీకారం (universality) ఉండటం, తక్కువ వయస్సులో వివాహం, మతపరమైన, సాంఘిక మూఢ నమ్మకాలు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, విద్యారాహిత్యం, గర్భ నిరోధక పద్ధతులను పరిమితంగా ఉపయోగించడం మొదలైన కొన్ని సాంఘిక కారణాల వల్ల జననాల రేటు తగ్గుదల స్థాయి ప్రభావితం అవుతుంది. అనగా పై కారణాల వల్ల జననాల రేటు ఆశించిన స్థాయికి తగ్గకపోవచ్చు.

1. వివాహానికి సర్వజన అంగీకారం :
వివాహం మతపరంగా, సామాజికంగా తప్పనిసరి. విద్యావ్యాప్తి వల్ల వివాహం పట్ల ప్రజల దృక్పథం మారి తక్కువ వయస్సులో వివాహం చేసుకోవద్దనే నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. అయితే విద్యావ్యాప్తి వేగంగా జరగకుండా, నెమ్మదిగా మారుతున్న సమాజంలో ఈ ఫలితాన్ని ఆశించలేము.

2. తక్కువ వయస్సులో వివాహం :
తక్కువ వయస్సులో వివాహం చేసుకోవడం వల్ల జననాల రేటు అధికంగా ఉంటుంది. భారతదేశంలో 2001లో సగటు వివాహ వయస్సు స్త్రీలకు 18.3 సంవత్సరాలు ఉంటే పురుషులకు 22.6 సంవత్సరాలుగా ఉంది. సగటు వివాహ వయస్సు పెరగడానికి, సామాజిక స్పృహ, విద్యావ్యాప్తి తోడ్పడతాయి. వివాహ వయస్సు అధికంగా ఉంటే ప్రసూతి రేటు తగ్గి జననాల రేటు కూడా తగ్గుతుంది.

3. మతపరమైన సాంఘిక మూఢ నమ్మకాలు :
మతపరమైన సాంఘిక మూఢ నమ్మకాల వల్ల ఎక్కువ మంది ప్రజలు తమ ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా పిల్లలను కనడానికి ప్రాధాన్యతను ఇస్తారు.

4. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ :
యుక్త వయస్సులోని భార్యాభర్తలకు తమ పిల్లలను పోషించే ఆర్థిక స్థోమత లేకపోయినా వీరు పిల్లల్ని కనడాన్ని ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే వీరి ఆర్థిక భారాన్ని ఆదాయాన్ని ఆర్జించే కుటుంబ సభ్యులు భరిస్తారు. అయితే ఈ వ్యవస్థ క్రమేణా విచ్ఛిన్నం అవ్వడం జరిగింది.

5. విద్యా రాహిత్యం :
2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అక్షరాస్యత రేటు 74% స్త్రీల అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉంది. పురుష అక్షరాస్యత 82.14% ఉంటే స్త్రీల అక్షరాస్యత 65.46% గా ఉంది. కుటుంబం, వివాహం, పిల్లల జననాల విషయంలో .ప్రజల దృక్పథం కేవలం విద్యతోనే మారుతుంది. విద్యకు, ప్రసూతి రేటుకు మధ్య విలోమ సంబంధం ఉంది.

గర్భ నిరోధక పద్ధతులను (Contraceptives) పరిమితంగా ఉపయోగించడం :
ప్రభుత్వం కుటుంబ నియంత్రణ ఆలోచనను కొనసాగిస్తున్నా, గర్భ నిరోధక పద్ధతులను అందుబాటులో ఉంచినా, విద్యా రాహిత్యం వల్ల, మూఢనమ్మకాల వల్ల కొన్ని వర్గాల ప్రజల నుంచి స్పందన ప్రోత్సాహకరంగా లేదు. విద్యావ్యాప్తి బాగా జరిగినట్లయితే ప్రజలు తప్పకుండా చిన్న కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తారు.

TS Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 4.
జనాభా విస్ఫోటనాన్ని అరికట్టడానికి గల చర్యలు ఏమిటి ?
జవాబు.
భారతదేశపు ప్రస్తుత జనాభా ఆర్థికాభివృద్ధికి ఆటంకంగా ఉంది. అయితే కొందరు జనాభా వృద్ధి ఆటంకం కాదని వాదిస్తున్నారు. జనాభా చాలా నెమ్మదిగా పెరగడం చాలా మంచిదని అందరూ అంగీకరించారు. జనాభా విస్ఫోటనాన్ని ఎదుర్కోవడానికి మూడు రకాల చర్యలు అవసరం. అవి : ఆర్థిక చర్యలు, సాంఘిక చర్యలు, కుటుంబ నియంత్రణ పథకం.

I. ఆర్థిక చర్యలు :

1. పారిశ్రామిక రంగ విస్తరణ :
ఉద్యోగాలను పొందటంలో ఉన్న సమస్యలు పారిశ్రామిక శ్రామికులకు తెలుసు కాబట్టి కుటుంబ పరిమాణాన్ని తగ్గించుకోవడానికి శ్రద్ధ చూపిస్తారు. జీవన ప్రమాణ స్థాయిని పెంచుకోవడానికి కుటుంబ పరిమాణాన్ని తగ్గించుకోవలసిన అవససరాన్ని వీరు గుర్తిస్తారు. కాబట్టి పారిశ్రామికీకరణ వేగవంతం కావల్సిన అవసరం ఉంది.

2. ఉద్యోగావకాశాల కల్పన :
నగరీకరణ, పారిశ్రామీకీకరణ పరస్పరం ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి. పట్టణాలలో, గ్రామాలలో అధిక ఉద్యోగ అవకాశాలను కల్పించాలి. జనాభా వృద్ధిని అరికట్టడంలో ఇది శక్తివంతమైన నిరోధకంగా పనిచేస్తుంది. నగరాల్లో గృహ సమస్య, పిల్లల పెంపకం సమస్యలు సహజంగానే ప్రజలకు పెద్ద కుటుంబాలు ఉండటాన్ని నిషేధిస్తాయి.

3. సమత్వంతో కూడుకొన్న ఆదాయ పంపిణీ, పేదరిక నిర్మూలన :
పేద ప్రజలకు కనీస జీవన సదుపాయాలు లభిస్తే ఎక్కువ పిల్లలను పొందే ఆర్థిక నిర్బంధం ఉండదు. కుటుంబ పరిమాణం విషయంలో ప్రజల దృక్పథం కూడా మారుతుంది. ఎంతమంది పిల్లలను కలిగి ఉండాలో ఆలోచించడమేకాక, పిల్లలకు సౌకర్యవంతమైన జీవనాన్ని అందించే ప్రయత్నం చేస్తారు. ఈ మార్పుల కోసం సమత్వంతో కూడుకొన్న ఆదాయ పంపిణీ, జీవనానికి తగిన వేతనంతో కూడిన పని హక్కు ఉండాలి.

II. సాంఘిక చర్యలు :
జనాభా విస్ఫోటనం ఆర్థిక సమస్యే కాకుండా ఇది సాంఘిక సమస్య కూడా. విస్ఫోటనానికి ఉన్న అనేక కారణాలు సామాజికంగా బలమైనవి. జననాల రేటును తగ్గించడానికి సాంఘిక దురాచారాలను రూపుమాపాలి.

1) విద్య :
కుటుంబం, వివాహం, పిల్లల సంఖ్య విషయానికొస్తే విద్య వ్యక్తి ఆలోచనా సరళిని మారుస్తుంది. విద్యావంతులలో అధికులు వివాహాలు ఆలస్యంగా చేసుకొని చిన్న కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తారు. సంప్రదాయాలను, మూఢ నమ్మకాలను విద్య మార్చివేసి ప్రజలను కుటుంబ నియంత్రణ వైపు ప్రేరేపిస్తుంది.

బాల బాలికలు పాఠశాలలకు కళాశాలలకు వెళ్తే వివాహాలు ఆలస్యంగా జరిగి తద్వారా స్త్రీలలో పునరుత్పత్తి కాలం తగ్గుతుంది. స్త్రీల అక్షరాస్యతా రేటును బాగా పెంపొందించాలి. అందుకే జనాభా త్వరిత వృద్ధిని అరికట్టడానికి బాలికల విద్యకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి..

2) స్త్రీల హోదా :
భారత రాజ్యాంగం పురుషులకు, స్త్రీలకు సమానత్వాన్ని కల్పించినా, సామాజిక జీవనంలో వివక్షత ఉంది. సామాజికార్థికంగా పురుషుల స్థాయి కంటే స్త్రీల స్థాయి తక్కువగా ఉంది. అయితే స్త్రీలలో విద్య తక్కువ ఉండి వారు కుటుంబ నియంత్రణ పట్ల ఉదాసీనంగా ఉన్నారు. వెనుకబడిన సమాజంలో స్త్రీలకు తమ పిల్లల విషయంలో ఎంపిక అవకాశం లేదు.

3) వివాహ వయస్సు :
ప్రసూతి రేటు స్త్రీల వివాహ వయస్సుపై ఆధారపడుతుంది. కాబట్టి వివాహ వయస్సు పెంచడానికి సాధ్యమయిన ప్రతీ సామాజిక, చట్టపర, విద్యాపర చర్యలను తీసుకోవాలి. భారతదేశంలో సగటు వివాహ వయస్సు తక్కువ. 1903 బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం పురుషుల కనీస వివాహ వయస్సు 18 సంవత్సరాలయితే స్త్రీలకు ఇది 15 సంవత్సరాలు. 1978లో ఈ చట్టాన్ని సవరించి కనీస వివాహ వయస్సు పురుషులకు 21 సంవత్సరాలయితే, స్త్రీలకు 18 సంవత్సరాలని నిర్ణయించారు.

III. కుటుంబ నియంత్రణ పథకం :
ప్రపంచ వ్యాప్తంగా జనాభా విస్ఫోటనాన్ని నియంత్రించే సాధనంగా కుటుంబ నియంత్రణ పథకానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించారు. ఉదాహరణకు, చైనాలో ఒక్క శిశువు విధానాన్ని సమర్థించి జననాల రేటు భారతదేశంలో 2009లో 1000కి 22 వుంటే చైనాలో దీనిని 1000కి 12 వరకు తగ్గించడంలో విజయాన్ని సాధించారు.

1. ప్రభుత్వ సమాచార పథకం :
పునరుత్పత్తి దశలో ఉన్న వివాహిత జంటలకు కుటుంబ నియంత్రణ పథకం వల్ల ఉపయోగాలను తెలియచేసి వారి సామాజిక స్పృహ స్థాయిని పెంచాలి. కుటుంబ నియంత్రణకున్న ప్రాధాన్యతను తెలియపరచడానికి ప్రభుత్వం అన్నిరకాల సమాచార సాధనాలను ఉపయోగిస్తోంది. ఒక్కసారి ప్రజల ఆలోచనలు కుటుంబ నియంత్రణవైపు మళ్ళితే వారే స్వచ్ఛందంగా దీనిని పాటిస్తారు.

2. ప్రోత్సాహకాలు, నిరుత్సాహకాలు :
కుటుంబ నియంత్రణను అంగీకరించిన వారికి ప్రభుత్వం అనేక పథకాల ద్వారా ప్రోత్సాహకాలను ఇస్తుంది. ప్రజలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవడానికి నగదు బహుమతులు ప్రోత్సాహకాలుగా ఉంటున్నాయి. చిన్న కుటుంబ విధానాన్ని పాటించిన ప్రజలకు అవసరమైతే ఉద్యోగాలు కల్పించడంలో ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబ నియంత్రణను తిరస్కరించిన వారికి కొన్ని సదుపాయాలను కల్పించకుండా వుండాలి. వాస్తవానికి నిర్బంధ కుటుంబ నియంత్రణ అవసరం.

3. కుటుంబ నియంత్రణ కేంద్రాలు:
కుటుంబ నియంత్రణ పథకంలో కుటుంబ నియంత్రణ కేంద్రాల స్థాపన తప్పనిసరిగా ఒకభాగం. కుటుంబ నియంత్రణ అవసరమయ్యే వివిధ వైద్య సదుపాయాలను ఈ కేంద్రాలు కల్పిస్తాయి. గర్భ నిరోధక సాధనాల పంపిణీ కేంద్రాలు కూడా ముఖ్యపాత్రను వహిస్తున్నాయి.

4. పరిశోధన :
జనన, మరణాల రేట్లు, సమాచార ప్రేరణ, పునరుత్పత్తి, ప్రసూతి నియంత్రణ మొదలైన అంశాల పరిశోధనకు . ప్రాధాన్యత ఇవ్వాలి. భారత ప్రభుత్వం ఈ పరిశోధనల ద్వారా గరిష్ఠ ప్రయోజనం పొందవచ్చని గుర్తించింది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 5.
భారతదేశంలో వృత్తుల వారీ జనాభా పంపిణీని విశదీకరించండి.
జవాబు.
శ్రమ ప్రాథమిక ఉత్పత్తి కారకమే కాకుండా ఇతర కారకాలను చురుకుదనాన్ని ఏర్పరచి ఉత్పత్తి కోసం అవి ఉపయోగపడేలాగా చేస్తుంది. ఒక దేశ జనాభా వివిధ రకాలైన వృత్తుల మధ్య విభజించబడటాన్ని వృత్తులవారీ జనాభా విభజన అంటారు. వృత్తులను 3 రకాలుగా విభజించవచ్చు. అవి :

  1. వ్యవసాయం, పశు పోషణ మొదలైన వాటిని సమిష్టిగా ప్రాథమిక వృత్తులంటారు. ఈ రంగం ప్రకృతిపై అధికంగా ఆధారపడి ఉంటుంది.
  2. చిన్న, భారీ తరహా వస్తు తయారీ పరిశ్రమలను ద్వితీయ వృత్తులు అంటారు.
  3. రవాణా, కమ్యూనికేషన్లు, బ్యాంకింగ్, విత్తం మొదలైన సేవలను సేవా వృత్తులు అంటారు. ఇవి ప్రాథమిక, ద్వితీయ రంగాలకు అత్యంత సహాయాన్ని అందిస్తాయి.

ఆర్థికాభివృద్ధి – వృత్తులవారీ విభజన :
వ్యవసాయ రంగం నుంచి జనాభా పరిశ్రమ రంగానికి, ఆ తరువాత సేవల రంగానికి బదిలీ కావడాన్ని ఆర్థికాభివృద్ధికి సూచికగా పరిగణించడం జరిగింది. కోలిన్ క్లార్క్ ప్రకారం అధిక శాతం శ్రామిక జనాభా సేవల రంగంలో పనిచేస్తుంటే ప్రజల వాస్తవిక సగటు తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఎ.జి.బి. ఫిషర్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు.

అభివృద్ధి పంథాలో వున్న ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక రంగం నుంచి ఉద్యోగితా, పెట్టుబడి క్రమంగా ద్వితీయ రంగానికి, ఇంకా అధికంగా సేవల రంగానికి మారతాయన్నారు. సైమన్ కుజ్నెట్స్ కూడా ఇదే విషయాన్ని పరిశీలించారు. హాన్స్ సింగార్ ప్రకారం ఒక దేశ జనాభా 85% వ్యవసాయ రంగంపై ఆధారపడే స్థితి నుంచి 15% మాత్రమే వ్యవసాయ రంగంపై ఆధారపడే స్థితికి మారినప్పుడే ఆర్థికాభివృద్ధిని సాధించవచ్చు.

భారతదేశంలో వృత్తుల వారీ శ్రమ విభజన (శాతాలు):

TS Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి 2

ఆధారాలు :
Indian Economy, Misra & Puri, 2012 Edition;
Indian Economy, Datt & Sundharam, 2012 Edition.

1951 నుంచి 2010 వరకు వ్యవసాయమే ప్రజల ప్రధాన వృత్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. 1951-1971 కాలంలో ప్రాథమిక రంగంలో పనిచేస్తున్న శ్రామికుల శాతం ఏ మాత్రం మారకుండా 72% ఉంది. 1991-2010 మధ్య కాలంలో గణనీయ మార్పు ఏర్పడింది. అది 1991లో 67% శ్రామికులు ప్రాథమిక రంగంలో పనిచేస్తుంటే 2010 నాటికి ఇది 51 శాతానికి తగ్గింది.

స్వాతంత్ర్యానంతరం పారిశ్రామికీకరణ ప్రక్రియ వేగవంతమై ద్వితీయ రంగంలో ఉద్యోగితను పొందిన వ్యక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 1951లో 11% శ్రామికులు ద్వితీయ రంగంలో పనిచేస్తే 2010 నాటికి ఈ శాతం 22గా పెరిగింది. అయితే 1991-2010 మధ్య కాలంలో ద్వితీయ రంగంలో శ్రామికుల శాతం గణనీయంగా పెరిగింది. 1991లో ఈ శాతం 13 ఉంటే 2010లో ఇది 22. 1951 – 2010 వరకు ఉన్న 60 సంవత్సరాల కాలంలో సేవా రంగంలో పనిచేస్తున్న శ్రామికుల శాతం పెరిగింది. 1951లో -17% శ్రామికులు సేవా రంగంలో పనిచేస్తే 2010 నాటికి ఇది 27% వరకు పెరిగింది.

1951-1991 వరకు వున్న నాలుగు దశాబ్దల ప్రణాళికా కాలంలో భారతదేశంలోని వృత్తులవారీ శ్రమ విభజన దాదాపుగా మారలేదు అనేది స్పష్టం. 1991-2010 వరకు ఉన్న రెండు దశాబ్దాల కాలంలో వృత్తులవారీ శ్రమ విభజనలో కొన్ని ముఖ్యమైన మార్పులు సంభవించాయి. భారతదేశంలో జనాభా త్వరితగతిన పెరుగుదల, శ్రామిక అల్ప ఉత్పాదక శక్తితో కూడుకున్న సంప్రదాయ వ్యవసాయం, నెమ్మదిగా కొనసాగిన పారిశ్రామికీకరణ అనే కారణాల వల్ల వృత్తులవారీ శ్రమ విభజనలో గణనీయమైన మార్పులు ఏర్పడలేదు.

TS Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 6.
జాతీయ జనాభా విధానం, 2000 ను వివరించండి.
జవాబు.
జాతీయ జనాభా విధానం 2000 తక్షణమే సాధించవలసిన ఆశయాలను, మధ్యకాలిక, దీర్ఘకాలిక ఆశయాలను నిర్ణయించింది. తక్షణ ఆశయాలలో గర్భ నిరోధక అవసరాలను ఏర్పాటుచేయడం, వైద్య వ్యవస్థాపన సౌకర్యాలను ఏర్పరచడం, వైద్య సిబ్బందిని ఏర్పాటుచేయడం, పునరుత్పత్తి, శిశు ఆరోగ్య సంరక్షణకు సమగ్ర సేవలను అందించడం ప్రధానమైనవి.

2010 నాటికి ప్రసూతి రేటును సాధ్యమైనంత స్థాయికి తగ్గించడం మధ్యకాలిక లక్ష్యంగా, 2046 నాటికి జనాభాను స్థిరీకరించడం దీర్ఘకాలిక లక్ష్యంగా పెట్టుకుంది. 2046 నాటికి జనాభాను స్థిరపరచడానికి జాతీయ జనాభా విధానం క్రింది చర్యలను ప్రకటించింది.

  1. 1000 జననాలకు శిశు మరణాల రేటును 30కి దిగువగా తగ్గించడం.
  2. 1 లక్ష జననాలకు ప్రసవ మరణాల రేటును 100కి దిగువగా తగ్గించడం.
  3. అందరికీ రోగనిరోధక శక్తిని పెంచే చర్యలు.
  4. శిక్షణ పొందిన సిబ్బంది వున్న వైద్యాలయాలు, వైద్య సంస్థలో 80% ప్రసవాలు జరిగేలా చూడటం.
  5. సమాచారం, ఎయిడ్స్ నివారణ, అంటువ్యాధుల నిరోధన, నియంత్రణ అందుబాటులో ఉండటం.
  6. ఇద్దరు సంతానంలో చిన్న కుటుంబ విధానాన్ని అనుసరించడానికి ప్రోత్సాహకాలు ప్రకటించడం.
  7. సురక్షిత గర్భస్రావాలకు సౌకర్యాలను పెంపొందించడం.
  8. బాల్య వివాహ నిరోధక చట్టాన్ని, ప్రసవపూర్వం పరీక్ష పద్ధతులు చట్టాన్ని ఖచ్చితంగా అమలుచేయడం.
  9. బాలిక వివాహ వయస్సును 18 సంవత్సరాలకు పెంచడం, మరియు దీనిని 20 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలకు పెంచడానికి ప్రాధాన్యతను ఇవ్వడం.
  10. 21 సంవత్సరాల వయస్సు తర్వాత వివాహం చేసుకొని ఇద్దరు పిల్లల తర్వాత గర్భనిరోధక పద్ధతులను పాటించే స్త్రీలకు ప్రత్యేక బహుమతులు ఇవ్వడం.
  11. పేదవారుగా వుండి ఇద్దరు పిల్లల తర్వాత కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న వారికి ఆరోగ్య బీమా సదుపాయాలను కల్పించడం.
  12. జననాలను క్రమబద్ధీకరించడం, గర్భనిరోధకాలకు సంబంధించి సమాచారం, సలహాలు, సేవలు అందరికీ అందుబాటులో ఉంచడం.
  13. కుటుంబ సంక్షేమాన్ని ప్రజాలక్ష్య పథకంగా రూపొందించడానికి సంబంధించిన సామాజిక రంగ పథకాలన్నింటిని అమలుచేయడానికి ఒక తాటిపైకి తీసుకురావడం.

ప్రశ్న 7.
ఆర్థికాభివృద్ధిలో విద్యకున్న పాత్రను పరిశీలించండి.
జవాబు.
మానవ వనరుల అభివృద్ధికి విద్య, నైపుణ్య శిక్షణ ముఖ్యం.

1. విద్య, ఆర్థికాభివృద్ధి:
విద్యపై పెట్టుబడి ఆర్థికాభివృద్ధిని ఉన్నత స్థాయికి చేరుస్తుంది. టోడారో, స్మిత్ ప్రకారం విద్యనల్ల పరిజ్ఞానం, నైపుణ్యం పెరుగుతుంది. కాబట్టి ఎక్కువ మంది ఉత్పాదక శ్రామికులను సృష్టించవచ్చు. విద్య వల్ల ఉద్యోగ, ఆదాయ ఆర్జన అవకాశాలు మెరుగవుతాయి. విద్యావంతులైన నాయకులు సృష్టించబడతారు. విద్య నైపుణ్యాన్ని అందిస్తుంది. ఆధునిక ధృక్పథాన్ని ప్రోత్సహిస్తుంది.

2. ఆదాయ అసమానతల తగ్గింపు:
సంపూర్ణ విద్య ద్వారా ప్రజల సామర్థ్యాన్ని పెంచవచ్చు. ఇది వారి ఆదాయాల పెంపుకు సహకరిస్తుంది.

3. గ్రామీణ అభివృద్ధి :
గ్రామీణ ప్రజలకు విద్య ద్వారా పరిజ్ఞానం అందుతుంది. కాబట్టి ప్రజలు వారి అజ్ఞానాన్ని, మూఢ నమ్మకాలను అధిగమిస్తారు. రైతులు విద్యావంతులైతే నూతన వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తారు. కుటీర పరిశ్రమలను స్థాపించడానికి అవసరమయ్యే నైపుణ్యాన్ని విద్య అందిస్తుంది. కాబట్టి ప్రచ్ఛన్న నిరుద్యోగిత తగ్గుతుంది.

4. కుటుంబ నియంత్రణ :
జీవన ప్రమాణాల స్థాయిని పెంచుకోవలసిన అవసరాన్ని, అందుకు కుటుంబ పరిమాణాన్ని తగ్గించుకోవాల్సిన అవసరాన్ని ప్రజలు విద్య ద్వారా తెలుసుకొంటారు. దీర్ఘకాలంలో కుటుంబ నియంత్రణకు విద్య ఉత్తమ సాధనంగా పనిచేస్తుంది. ఇది నిరూపించబడింది కూడా. స్త్రీలలో ఎక్కువమంది విద్యావంతులైతే వారు ఉద్యోగాలు కోరుకుంటారు. ఉద్యోగితా స్త్రీలకు పిల్లల పోషణ కష్టమవుతుంది. కాబట్టి ప్రసూతి రేటు తగ్గుతుంది.

5. ఉద్యోగ శిక్షణ :
అనేక సంస్థలు వాటి ఉద్యోగ శిక్షణను అందిస్తాయి. ఎందుకంటే మానవ మూలధనంలో మెరుగుదల ఉంటే భౌతిక మూలధనం ఉత్పాదకత పెరుగుతుంది. ఉద్యోగ శిక్షణ వల్ల శ్రామికుల నైపుణ్యం, సామర్థ్యం పెరిగి ఉత్పాదకత, ఉత్పత్తి పెరుగుతాయి.

విద్య బాగా పెరిగితే ప్రస్తుత, భావితరాలకు సశేష (spill over) ఆదాయాలు అందడం, నైపుణ్యవంతమైన మానవ వనరుల అవసరాలను తీర్చడం, విజ్ఞాన శాస్త్రంలో పరిశోధన, బాధ్యతాయుత ప్రవర్తన పెరగడం, రాజకీయ సుస్థిరత రావడం, సాంస్కృతిక వారసత్వాన్ని అందించడం లాంటి ప్రయోజనాలు సమాజంలో ఏర్పడతాయి. ప్రజలు తగిన విద్యను పొందకపోతే, వాళ్ళు ప్రస్తుత కాలంలోనేకాక భవిష్యత్తులో కూడా చాలా ఎక్కువగా కోల్పోతారు.

TS Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 8.
భారతదేశంలో అనుసరించిన ఆరోగ్య విధానాలను, పథకాలను విపులీకరించండి.
జవాబు.
భారతదేశంలో 1946లో ఏర్పాటుచేసిన ఆరోగ్య సర్వే, అభివృద్ధి కమిటీ, 1961లో ఏర్పడిన ఆరోగ్య సర్వే, ప్రణాళికా కమిటీల సూచనల మేరకు ప్రభుత్వం ఆరోగ్య ప్రమాణాలను పెంచడానికి ఒక పథకాన్ని రూపొందించింది. ఈ పథకం ఆశయాలను క్రింద తెలియచేయటం జరిగింది.

  1. అంటువ్యాధుల నియంత్రణకు ఏర్పాట్లు.
  2. ఆరోగ్య సేవలను కల్పించడం..
  3. ఆరోగ్య శాఖల్లోని ఉద్యోగులకు శిక్షణను కల్పించడం, గ్రామీణ రంగంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేయడం.

అయిదవ పంచవర్ష ప్రణాళికలో ఆరోగ్య అభివృద్ధి పథకాలను కుటుంబ సంక్షేమం, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బిడ్డ తల్లుల పౌష్టికాహార పథకాలతో సమగ్ర పరిచారు. ఆరవ పంచవర్ష ప్రణాళికలో గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య సంరక్షణ, వైద్య సేవలను సమాజ ఆధారిత పథకాన్ని ప్రవేశపెట్టారు. 9వ, 10వ పంచవర్ష ప్రణాళికలలో ఆరోగ్య సంరక్షణ నాణ్యతను పెంచి, దీనిని బాగా అందుబాటులోకి తెచ్చి, ప్రజల ఆరోగ్య స్థాయిని పెంచడానికి తీవ్ర ప్రయత్నం చేశారు.

11వ పంచవర్ష ప్రణాళిక వైయుక్తిక ఆరోగ్య సంరక్షణ, ప్రజా ఆరోగ్యం, పారిశుద్ధ్యం, స్వచ్ఛమైన తాగు నీరు, ఆహారం, పరిశుభ్రత, పోషణ పరిజ్ఞానం మొదలైన అనేక అంశాలను కలిపి సర్వతోముఖ విధానాన్ని రూపొందించింది. ఈ ప్రణాళికా అంతానికి (2011-12) క్రింది లక్ష్యాలను సాధించాలని ఏర్పరచుకొంది.

  1. ప్రసూతి మరణ రేటును 1 లక్ష జననాలకు 100 వరకు తగ్గించడం.
  2. శిశు మరణాల రేటును 1000 జననాలకు 28 వరకు తగ్గించడం.
  3. మొత్తం ప్రసూతి రేటును 2:1కి తగ్గించడం.
  4. 2009 నాటికి అందరికీ పరిశుభ్రమైన త్రాగునీటిని అందించడం.
  5. పౌష్టికాహార లోపాన్ని 0 నుంచి 3 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో 50% తగ్గించడం.
  6. స్త్రీలలో, బాలికల్లో రక్త హీనతను 50% తగ్గించడం.
  7. 0 నుంచి 6 సంవత్సరాల వయస్సుగల వారిలో లింగ నిష్పత్తిని 2011-12 నాటికి 1000 కి 935 వరకు 2016-17 నాటికి 950 వరకు పెంచడం.

2001 – 03 కాలంలో ప్రసూతి మరణ రేటు 1 లక్ష జననాలకు 301 అయితే 2010 నాటికి ఇది 200కి తగ్గింది. జననాలు, ప్రసవాలు శిక్షణ పొందిన వారి పర్యవేక్షణలో జరగడానికి కావలసిన సదుపాయాలు వేగంగా మెరుగయితే భారతదేశంలో ప్రసూతి మరణాల రేటును తగ్గించవచ్చు.

భారతదేశంలో ఆరోగ్య పథకాలు :
2001 – 02 సంవత్సరంలో ఆరోగ్యంపైన చేసిన మొత్తం వ్యయ శాతం స్థూల దేశీయ ఉత్పత్తిలో 4.6. ఇందులో ఆరోగ్యంపైన చేసిన ప్రభుత్వ వ్యయం స్థూలదేశీయ ఉత్పత్తిలో 0.94% అయితే ప్రైవేటు వ్యయశాతం 3.58 విదేశీ సహాయం 0.11%. 11వ పంచవర్ష ప్రణాళికలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ను, జాతీయ నగర ఆరోగ్యమిషన్ ను ప్రవేశపెట్టి సమ్మిళిత వృద్ధిపైన దృష్టి పెట్టింది.

1. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ :
ఆరోగ్య అవస్థాపనా సౌకర్యాలను బలపరచి, నాణ్యతాపరమైన ఆరోగ్యాన్ని అందుబాటులోకి బాగా తీసుకురావడంతో పాటుగా దాని ఉపయోగాన్ని కూడా పెంచడం ఈ మిషన్ లక్ష్యం.

2. జననీ సురక్షా యోజన :
సంస్థాపరమైన కాన్పులను ప్రోత్సహిస్తూ ప్రసూతి మరణాలను శిశు మరణాలను తగ్గించడం ఈ పథకానికి ఉన్న లక్ష్యాలు. ఈ పథకాన్ని 100% కేంద్రం స్పాన్సర్ చేసింది. అంతేకాకుండా నగదు సహాయం, వైద్య సంరక్షణ రెంటిని సమగ్రపరుస్తుంది. అంచెలంచెలుగా పెరిగే విధానంలో సంస్థల సామర్థ్య స్థాయిని పెంచడం వల్ల సంస్థాపరమైన కాన్పులను ప్రోత్సహించడం వల్ల పథకానికి విజయాన్ని చేకూర్చవచ్చు.

3. జాతీయ నగర ఆరోగ్యమిషన్ :
దీని ముఖ్య లక్ష్యం నగరాల్లోని పేదవారి, మురికివాడలో నివసించేవారి మురికి వాడల్లో లేదా పని స్థలాల్లోని అత్యల్ప ఆదాయ స్థాయికల నివాసితుల ఆరోగ్య అవసరాలను తీర్చడం. కనీసం ఒక లక్ష జనాభా వున్న అన్ని పట్టణ ప్రాంతాలకు ఈ పథకం వర్తిస్తుంది.

4. స్వచ్ఛమైన త్రాగునీరు, పరిశుభ్రత :
కలుషిత నీరు త్రాగడం వల్ల రోగాల బారిన పడటం పౌష్టికాహార లోపం, నీటి సంబంధ రోగాలు వచ్చి అనారోగ్యానికి గురిఅవుతారు. అందుకే స్వచ్ఛమైన త్రాగునీరు ముఖ్య అవసరం. అనేక నీటి సంబంధ రోగాలకు అపరిశుభ్రతే ప్రత్యక్ష కారణమవుతుంది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 9.
మానవ అభివృద్ధిని కొలవడానికి ఉన్న వివిధ సూచికలు ఏమిటి ? వాటిని వివరించండి.
జవాబు.
మానవ అభివృద్ధి సూచిక (Human Development Index) :
పాకిస్తాన్ ఆర్థికవేత్త మహబూబ్-ఉల్-హక్ నాయకత్వంలో 1990 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పథకం (UNDP) తయారుచేసిన తన మొదటి మానవ అభివృద్ధి రిపోర్టులో (Human Development Report) మానవ అభివృద్ధి సూచికను ప్రవేశపెట్టింది. తరువాత మానవ అభివృద్ధిని పద్ధతులను కనుగొనే మరియు సంస్కరించే ప్రయత్నం జరిగింది.

1. లింగ సంబంధిత సూచికలు (Gender Related Indexes) :
1995 మానవ అభివృద్ధి రిపోర్టు ప్రపంచ వ్యాప్తంగా రెండు లింగ సూచికలను ప్రవేశ పెట్టింది.

a) మానవ అభివృద్ధి సూచికలో చేర్చబడిన ఆయుర్దాయం, విద్యా సంపాదన, ఆదాయం అనే ప్రాథమిక సామర్థ్యాల ఆధారంగా అభివృద్ధిని కొలిచే ప్రయత్నాన్ని ‘లింగ సంబంధిత అభివృద్ధి సూచిక’ (Gender Related Devel- opment Index) చేసింది. మానవ అభివృద్ధి సూచికను లింగ అసమానత్వంతో సర్దుబాటు చేస్తారు.

b) ఆర్థిక రాజకీయ జీవితంలో స్త్రీల భాగస్వామ్యం చురుకుగా ఉందా లేదా అనే దానిని లింగ సాధికార కొలమానం (GEM) తెలుపుతుంది. రాజకీయాలలో పాల్గొనడం (పార్లమెంటు సీట్లలో స్త్రీల వాటా), ఆర్థిక అంశాలలో పాల్గొనడం (ఉన్నత స్థానాల్లో, వృత్తిపరమైన స్థానాల్లో వాటా), ఆర్థిక వనరులపై స్త్రీలకున్న పట్టు (ఆదాయాల్లోని తేడాలు) అనే అంశాలపై లింగ సాధికార కొలమానం దృష్టిని సారిస్తుంది.

2. మానవ పేదరిక సూచిక (Human Poverty Index) :
మానవ పేదరిక సూచిక అనే భావనను మానవ అభివృద్ధి రిపోర్టు (Human Development Report), 1997 ప్రవేశపెట్టింది. ఇది మానవ అభివృద్ధి సూచికలో ఉన్న మానవ జీవనానికి అవసరమైన అంశాలు దీర్ఘాయువు (Iongevity), పరిజ్ఞానం (Knowledge), ఉన్నత జీవన ప్రమాణాలలో (decent living standards) మానవులు కోల్పోయిన దానిపై లేదా పొందలేకపోయిన (deprivation) దానిపై అధిక శ్రద్ధ వహిస్తుంది.

3. స్థూల జాతీయ ఆనంద సూచిక (Gross National Happiness Index) :
భూటాన్ లాంటి దేశాలు వాటి అభివృద్ధిని స్థూల జాతీయ ఆనంద సూచికల ద్వారా కొలుస్తున్నారు. అభివృద్ధిని కొలుస్తున్న ప్రస్తుత పద్ధతిలో మార్పును తేవలసిన అవసరం ఉంది. ప్రగతి లేదా అభివృద్ధిని కొలవడానికి స్థూల దేశీయోత్పత్తి ప్రత్యామ్నాయ సూచికగా స్థూల జాతీయ ఆనందాన్ని (సంతోషాన్ని ) భూటాన్ రూపొందించింది. స్థూల జాతీయ ఆనందం భావనను భూటాన్ నాల్గవ రాజు జిగ్మే సింగ్యే వాంగుక్ (Jigme Singye Wangchuck) 1970 తర్వాతి దశాబ్దిలో వాడారు.

ప్రశ్న 10.
మానవ అభివృద్ధిపై అమర్త్య సేన్ ఆలోచనలను వివరించండి.
జవాబు.
అమర్త్యసేన్ గ్రంథం “Development as Freedom” 1999లో ప్రచురించబడింది. అర్ధశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన ఒకే ఒక్క భారతీయుడు ఇతనే. ప్రజలు అనుభవించే వాస్తవ స్వేచ్ఛలను (real freedom) విస్తరించే ప్రక్రియ ఆర్థికాభివృద్ధి అని అమర్త్యసేన్ వాదన.

అభివృద్ధి లక్ష్యం స్వేచ్ఛ అని అభివృద్ధిని సాధించడానికి ప్రాథమిక సాధనంగా స్వేచ్ఛ ఉంటుందనేది సేన్ వాదన. ఎందుకంటే,

  1. మానవ ప్రగతిని మదింపు చేయడానికి ఆమోదింపదగ్గ ఒకే ఒక్క అంశం స్వేచ్ఛను పెంపొందించడం.
  2. అభివృద్ధిని సాధించడం ప్రజల స్వేచ్ఛ మీదనే ఆధారపడి ఉంది.

ప్రజలు అనుభవించే స్వేచ్ఛను విస్తరించాలంటే స్థూల జాతీయోత్పత్తి పెరుగుదల లేదా వైయుక్తిక ఆదాయాల పెరుగుదల ముఖ్య సాధనాలుగా ఉంటాయి. స్వేచ్ఛ సామాజిక ఆర్థిక ఏర్పాట్లు, రాజకీయ, పౌరహక్కులు పైన కూడా ఆధారపడుతుంది. వ్యక్తులు తమకు తామే సహాయం చేసుకోవడానికి కావలసిన వారి సామర్థ్యాన్ని స్వేచ్ఛ పెంచుతుంది. సామాజిక అవకాశాలలో పాల్గొనే స్వేచ్ఛవల్ల, నిర్ణయాలను చేయడంలో పాల్గొనే స్వేచ్ఛవల్ల సంస్థాగత ఏర్పాట్లు కూడా ప్రభావితమవుతాయి.

అమర్త్యసేన్ అయిదు రకాల స్వేచ్ఛలను వివరించాడు. అవి :
రాజకీయ స్వేచ్ఛలు, ఆర్థిక సదుపాయాలు, సామాజిక అవకాశాలు, పారదర్శకత హామీలు మరియు కాపాడే రక్షణ. రాజకీయ స్వేచ్ఛలు ఆర్థిక భద్రతను పెంచుతాయి. ఆర్థిక సదుపాయాలు వ్యక్తులు సంపన్నవంతులు కావడానికి వనరులు సామాజిక సదుపాయాలు కల్పించడానికి సహాయపడతాయి. సామాజిక అవకాశాలు ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొనేటట్లు తోడ్పడతాయి.

అన్ని రకాల స్వేచ్ఛలు ఒకదానిని మరొకటి బలోపేతం చేసుకొంటాయి. అభివృద్ధిని సాధించాలంటే స్వేచ్ఛలు లేకపోవడానికి ఉన్న కారణాలను తొలగించాలి. అంటే పేదరికం, పీడించడం (Hyranny) తక్కువ ఆర్థిక అవకాశాలు, ఒక పద్ధతి ప్రకారం జరిగిన సామాజిక నష్టం (Social deprivation) ప్రజా సౌకర్యాలను ఉపేక్షించడం, సమ్మతించకపోవడం (intalerance) అణచే ధోరణి వున్న ప్రభుత్వాల (repressive states) అతి కార్యక్రమాలు మొదలైన వాటిని తొలగించాలి.

TS Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారతదేశంలోని జనన మరణాల రేట్ల ధోరణులను వివరించండి.
జవాబు.
జనాభా వృద్ధి అనేది జనన, మరణాల రేట్లను బట్టి, వలసల స్థాయి దిశను బట్టి నిర్ణయించబడుతుంది. భారతదేశానికి సంబంధించి వలసలకు ప్రాధాన్యత లేనందున దానిని పరిగణనలోకి తీసుకోనవసరం లేదు. జనన-మరణాల రేట్లలోని తేడాల వల్ల జనాభా వృద్ధి వివరించబడుతుంది. పట్టికలో భారతదేశ జనన-మరణాల రేట్లను ఇవ్వడం జరిగింది.

1921కి పూర్వం భారతదేశంలోని అధిక జనన మరణాల రేట్లు జనాభా పెరుగుదలను నిరోధించాయి. 1901-1921 మధ్య కాలంలో జననాల రేటు 1000కి 46 నుంచి 49 వరకు ఉంటే మరణాల రేటు 44 నుంచి 49 వరకు ఉన్నందువల్ల జనాభా పెరుగుదల చాలా అల్పంగా ఉంది లేదా చెప్పుకోతగినంతగా లేదు. 1921 తరువాత మరణాల రేటు స్పష్టంగా తగ్గింది. 1911- 20లో మరణాల రేటు 48.6 ఉంటే 2010-11లో 1000కి 7.2 వరకు తగ్గింది.

అయితే ప్రారంభంలో జననాల రేటు అల్పంగా తగ్గినా తరువాత కాలంలో కుటుంబ నియంత్రణ పథకాల వల్ల 2010-11లో ఇది 1000కి 22.1కి తగ్గింది. గత 60 సంవత్సరాలలో శిశు మరణాల రేటు క్రమంగా తగ్గింది. 20వ శతాబ్దంలోని రెండవ దశాబ్దంలో ప్రతి 1000 జననాలకు 28గా నమోదయిన శిశు మరణాల రేటు 2010లో 1000 జననాలకు 47గా ఉంది. ప్రసూతి మరణాల సంఖ్య కూడా క్రమేణా తగ్గుతూ ఇది 2007- 2009లో 1 లక్ష జననాలకు 2010గా నమోదయింది.

భారతదేశంలో వార్షిక సగటు జనన మరణాల రేట్లు:

1891 – 190045.844.4
1901 – 191048.142.6
1911 – 192049.248.6
1921 – 193046.436.3
1931 – 194045.231.2
1941 – 195039.927.4
1951 – 196040.018.0
1961 – 197041.219.2
1971 – 198037.215.0
1981 – 199029.59.8
1991 – 200125.48.4
2010 – 2011322.17.2

అధిక జననాల రేటు, ‘వేగంగా క్షీణిస్తున్న మరణాల రేట్ల ద్వారా అధిక జనాభా వృద్ధి రేటును పై విధంగా వివరించవచ్చు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, కర్నాటక, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలు 1000కి జననాల రేటు కంటే తక్కువ స్థాయిలో ఉండే విధంగానే సాధించాయి. ఈ రాష్ట్రాలన్నీ జనాభా పరిణామ సిద్ధాంతంలోని 3వ దశలో ఉన్నాయి. అయితే తలసరి ఆదాయంలో ఉచ్ఛస్థాయిలో ఉన్న హర్యానా, గుజరాత్ రాష్ట్రాలు జననాల రేటును తగ్గించడంలో బాగా వెనుకబడినాయి.

ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, రాష్ట్రాలలో జననాల రేటు చాలా అధికంగా 1000కి 25 నుంచి 31 వరకు ఉన్నాయి. ఈ రాష్ట్రాలు జనాభా పరిణామ సిద్ధాంతంలోని రెండవ దశలో ఉన్నాయి. సామాజిక, ఆర్థిక పరిస్థితులు, పెద్ద కుటుంబాలకు అనుకూలంగా ఉన్నప్పుడు జననాల రేటును బాగా తగ్గించడం అంత సులభం కాదు. ఇంకా చాలా మంది ప్రజలు కుటుంబ నియంత్రణ పథకాల పట్ల ఆసక్తి కనబర్చడంలేదు. వివాహం, కుటుంబం, కుటుంబ నియంత్రణ పథకాల విషయంలో ప్రజల దృక్పథం మారాలి. అప్పుడు మాత్రమే జననాల రేట్లు గణనీయంగా తగ్గుతాయి.

TS Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 2.
భారతదేశంలోని లింగ నిష్పత్తిని వివరించండి.
జవాబు.
1,000 పురుష జనాభాకు స్త్రీ జనాభా ఎంత అనేది లింగ నిష్పత్తిని లేదా స్త్రీ పురుష నిష్పత్తిని తెలియజేస్తుంది. భారతదేశంలోని లింగ నిష్పత్తిని పట్టిక వివరిస్తుంది. 1901లో లింగ నిష్పత్తి 972 ఉంటే 1951 నాటికి 946కి తగ్గి, 1991 నాటికి బాగా తగ్గి 927గా ఉంది. ఇది కలవరపెట్టే అంశమే. తరవాత కాలంలో లింగ నిష్పత్తి స్వల్పంగా పెరిగి 2001లో 933గాను 2011లో 940గాను నమోదయింది. కేరళ రాష్ట్రంలో మాత్రమే స్త్రీల అనుపాతం పెరిగి 2011లో 1,000 మంది పురుష జనాభాకు 1,084 స్త్రీ జనాభా ఉంది.

పంజాబ్ రాష్ట్రంలో, హర్యానా రాష్ట్రంలో స్త్రీ – పురుష జనాభా నిష్పత్తి చాలా అల్పంగా ఉంది. 2011లో పంజాబ్లో లింగ నిష్పత్తి 893గాను, హర్యానాలో 877గాను ఉండి అడుగున ఉన్నాయి. బీదరికం, ఆడ శిశువుల మరణాల రేటు అధికంగా ఉండటం, పునరుత్పత్తి వయస్సులోని స్త్రీలలో అధిక మరణాలరేటు, సామాజిక కారణాలు లింగ నిష్పత్తి తగ్గడానికి దోహదపడుతున్నాయి.

భారతదేశంలో లింగ నిష్పత్తి:

సంత్సరం1,000 పరుషులకు స్త్రీలు
1901972
1911964
1921955
1931950
1941945
1951946
1961941
1971930
1981934
1991927
2001933
2011940

ప్రశ్న 3.
భారతదేశంలోని కుటుంబ నియంత్రణ పథకాన్ని విశదీకరించడి.
జవాబు.
కుటుంబ నియంత్రణ పథకం : ప్రపంచ వ్యాప్తంగా జనాభా విస్ఫోటనాన్ని నియంత్రించే సాధనంగా కుటుంబ నియంత్రణ పథకానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించారు. ఉదాహరణకు, చైనాలో ఒక్క శిశువు విధానాన్ని సమర్థించి జననాల రేటు భారతదేశంలో 2009లో 1000కి 22 వుంటే చైనాలో దీనిని 1000కి 12 వరకు తగ్గించడంలో విజయాన్ని సాగించారు.

1. ప్రభుత్వ సమాచార పథకం :
పునరుత్పత్తి దశలో ఉన్న వివాహిత జంటలకు కుటుంబ నియంత్రణ పథకం వల్ల ఉపయోగాలను తెలియచేసి వారి సామాజిక స్పృహ స్థాయిని పెంచాలి. కుటుంబ నియంత్రణకున్న ప్రాధాన్యతను తెలియపరచడానికి ప్రభుత్వం అన్నిరకాల సమాచార సాధనాలను ఉపయోగిస్తోంది. ఒక్కసారి ప్రజల ఆలోచనలు కుటుంబ నియంత్రణవైపు మళ్ళితే వారే స్వచ్ఛందంగా దీనిని పాటిస్తారు.

2. ప్రోత్సాహకాలు, నిరుత్సాహకాలు :
కుటుంబ నియంత్రణను అంగీకరించిన వారికి ప్రభుత్వం అనేక పథకాల ద్వారా ప్రోత్సాహకాలను ఇస్తుంది. ప్రజలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవడానికి నగదు బహుమతులు ప్రోత్సాహకాలుగా ఉంటున్నాయి. చిన్న కుటుంబ విధానాన్ని పాటించిన ప్రజలకు అవసరమైతే ఉద్యోగాలు కల్పించడంలో ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబ నియంత్రణను తిరస్కరించిన వారికి కొన్ని సదుపాయాలను కల్పించకుండా వుండాలి. వాస్తవానికి నిర్బంధ కుటుంబ నియంత్రణ అవసరం.

3. కుటుంబ నియంత్రణ కేంద్రాలు:
కుటుంబ నియంత్రణ పథకంలో కుటుంబ నియంత్రణ కేంద్రాల స్థాపన తప్పనిసరిగా ఒకభాగం. కుటుంబ నియంత్రణ అవసరమయ్యే వివిధ వైద్య సదుపాయాలను ఈ కేంద్రాలు కల్పిస్తాయి. గర్భ నిరోధక సాధనాల పంపిణీ కేంద్రాలు కూడా ముఖ్యపాత్రను వహిస్తున్నాయి.

4. పరిశోధన :
జనన, మరణాల రేట్లు, సమాచార ప్రేరణ, పునరుత్పత్తి, ప్రసూతి నియంత్రణ మొదలైన అంశాల పరిశోధనకు ప్రాధాన్యత ఇవ్వాలి. భారత ప్రభుత్వం ఈ పరిశోధనల ద్వారా గరిష్ఠ ప్రయోజనం పొందవచ్చని గుర్తించింది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 4.
ఆర్థికాభివృద్ధికి, వృత్తుల వారీ విభజనకు మధ్యగల సంబంధం ఏమిటి ?
జవాబు.
భారతదేశంలో వృత్తులవారీ, రంగాల వారీ జనాభా విభజన :
శ్రమ ప్రాథమిక ఉత్పత్తి కారకమే కాకుండా ఇతర కారకాలకు చురుకుదనాన్ని ఏర్పరచి ఉత్పత్తి కోసం అవి ఉపయోగపడేలాగా చేస్తుంది. ఒక దేశ జనాభా వివిధ రకాలైన వృత్తుల మధ్య విభజించటాన్ని ‘వృత్తులవారీ జనాభా విభజన’ అంటారు. వృత్తులను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి :

  1. వ్యవసాయం, పశుపోషణ, అడవులు, చేపల పెంపకం మొదలైన వాటిని సమిష్టిగా ప్రాథమిక కార్యకలాపాలు అంటారు. (Primary activities) ఈ ఉత్పత్తులు మానవ మనుగడకు చాలా అవసరం. ఈ రంగం ప్రకృతిపై అధికంగా ఆధారపడి ఉంటుంది.
  2. చిన్నతరహా, భారీ తరహా వస్తు తయారీ పరిశ్రమలను ద్వితీయ (Secondary activities) కార్యకలాపాలు అంటారు.
  3. రవాణా, కమ్యూనికేషన్లు, బ్యాంకింగ్, విత్తం మొదలైన సేవలను సేవా కార్యకలాపాలు అని అంటారు. ఇవి ప్రాథమిక, ద్వితీయ రంగాలకు అత్యంత సహాయాన్ని అందిస్తాయి.

వ్యవసాయ రంగం నుంచి జనాభా పరిశ్రమ రంగానికి, ఆ తరువాత సేవల రంగానికి బదిలీ కావడాన్ని ఆర్థికాభివృద్ధికి సూచికగా పరిగణించడం జరిగింది. కోలిన్ క్లార్క్ ప్రకారం అధిక శాతం శ్రామిక జనాభా సేవల రంగంలో పనిచేస్తుంటే ప్రజల వాస్తవిక సగటు తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటుంది. తక్కువ శాతం గ్రామీణ జనాభా సేవల రంగంలో పనిచేస్తూ, ఎక్కువ శాతం ప్రాథమిక రంగంలో పనిచేస్తుంటే ప్రజల వాస్తవిక తలసరి ఆదాయం తక్కువగా ఉంటుంది.

ఎ.జి.జి. ఫిషర్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. అభివృద్ధి పంథాలో ఉన్న ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక రంగం నుంచి ఉద్యోగితా, పెట్టుబడి క్రమంగా ద్వితీయ రంగానికి, ఇంకా అధికంగా సేవల రంగానికి మారతాయన్నారు. సైమన్ కుజ్నెట్స్ కూడా ఇదే విషయాన్ని పరిశీలించారు. హాన్స్ సింగార్ ప్రకారం ఒక దేశ జనాభా 85% వ్యవసాయ రంగంపై ఆధారపడే స్థితి నుంచి 15% మాత్రమే వ్యవసాయ రంగంపై ఆధారపడే స్థితికి మారినప్పుడే ఆర్థికాభివృద్ధిని సాధించవచ్చు.

ప్రశ్న 5.
మానవ వనరుల అభివృద్ధి భావనను, దాని ప్రాధాన్యతను వివరించండి.
జవాబు.
భౌతిక కారకాలయిన శ్రమ, మూలధనంలోని పెరుగుదల అనే కారణంవల్ల వివరించలేనంత అధిక రేటులో ఉత్పత్తి పెరిగిందని అనేక పరిశోధనలు తెలియచేస్తున్నాయి. ఎందుకంటే, విద్య, నైపుణ్యంలోని పెరుగుదల వల్ల, వైద్య సదుపాయాలు మొదలైనవి లభించడం వల్ల ఉత్పాదక సాధనంగా మానవుల నాణ్యత పెరిగింది. ఆర్థికాభివృద్ధిని సాధించడానికి, భౌతిక మూలధన సమీకరణతోపాటుగా మానవ వనరుల అభివృద్ధి కూడా ప్రధాన పాత్రను పోషిస్తుంది.

మానవ వనరుల అభివృద్ధి భావన :
విద్యపై పెట్టుబడి పెడితే మానవ మూలధన సమీకరణ (human capital forma- tion) పెరుగుతుందని థియోడోక్ డబ్ల్యు. షుల్జ్ వాదించాడు. మానవుడి ఉత్పాదక శక్తిని పెంచే ఏ చర్య అయినా సరే మానవ వనరుల అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇటువంటి అయిదు చర్యలను షుల్జ్ వివరించాడు అవి :

  1. ఆరోగ్య సదుపాయాలు, సేవలు, ప్రజల ఆయుర్ధాయాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని, బలాన్ని ప్రభావితంచేసే వ్యయాలు.
  2. సంస్థలు నిర్వహించే అప్రెంటిస్ షిప్, ఉద్యోగులకు ఇచ్చే శిక్షణ.
  3. ప్రాథమిక, ద్వితీయ, ఉన్నత స్థాయిలో లాంఛనప్రాయంగా నిర్వహించే విద్య.
  4. సంస్థలు నిర్వహించని వయోజన విద్యా పథకాలు, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో విస్తరణ కార్యకలాపాలు.
  5. మారుతున్న ఉద్యోగ అవకాశాలకు సర్దుబాటు కావడానికి వ్యక్తుల, కుటుంబ వలస.

మానవ వనరుల అభివృద్ధి ప్రాధాన్యత :
మానవ వనరుల అభివృద్ధికి విద్య అధికంగా తోడ్పడుతుంది కాబట్టి విద్య చాలా ముఖ్యం. ఆర్థికాభివృద్ధిలో మానవ వనరుల అభివృద్ధి ముఖ్యపాత్రను పోషిస్తుంది. భౌతిక వనరులను సమర్థవంతంగా వాడాలంటే సాంకేతిక, వృత్తి సంబంధ, పరిపాలనా సంబంధ నిపుణులు అవసరం.

అందుకే వనరుల కోసం ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. మానవ వనరుల అభివృద్ధి చెందకపోవడంవల్ల దేశాలు అభివృద్ధి చెందలేదు. ఈ దేశాల్లోని సాధారణ ప్రజలు నిరక్షరాస్యులుగా లేదా తక్కువగా చదువుకున్న వారుగా, నైపుణ్యం, శిక్షణ లేకుండా లేదా అనారోగ్యంతో ఉన్నారు. మానవ వనరుల అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి ప్రక్రియ రెండూ జంటగా పనిచేయడమేగాక ఒకదానిని మరొకటి ప్రభావితం చేసుకుంటాయి.

TS Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 6.
జాతీయ ఆరోగ్య విధానం (NHP), 2017ని వివరించండి.
జవాబు.
జాతీయ ఆరోగ్య విధానం, 2017 :
జాతీయ ఆరోగ్య విధానం, 2017 ఆరోగ్య, సంక్షేమ కేంద్రాల ద్వారా భారీ ప్యాకేజిగా హామీతో కూడిన సర్వతోముఖ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను అందించాలని లక్షంగా పెట్టుకుంది. అందరూ సాధ్యమైన అధిక స్థాయిలో ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని పొందేలా చూడడం ఈ విధాన లక్ష్యం.

దీనికోసం ఎవరూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన కుండానే, నివారణా ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్య సంరక్షణ ఉన్నతీకరణ, నాణ్యమైన ఆరోగ్య సేవలు అందరికి అందుబాటులో ఉండటం అనే సాధనాలను ఎన్నుకొన్నారు. ఈ లక్ష్యాన్ని, ఆరోగ్య సంరక్షణ ఎక్కువగా అందుబాటులో ఉండేలా చూడటం, దీని నాణ్యతను పెంచడం, వ్యయాన్ని తగ్గించడం ద్వారా సాధించడం జరుగుతుంది.

ఈ విధాన ప్రధానాంశాలు :

  1. హామీ ఆధార విధానం
  2. సూక్ష్మ పోషకాల లోపం
  3. భారత్లో తయారి ఆరంభ యత్నం
  4. డిజిటల్ ఆరోగ్య వర్తింపు.
    విధానంలోకి ఒక ఆజ్ఞ ఏమంటే, ఆరోగ్య సంరక్షణలో సమాచార సాంకేతికతను వాడటం.

జాతీయో ఆరోగ్య విధానం, 2017కి సంబంధించిన ముఖ్య లక్ష్యాలను కింద ఇవ్వడం జరిగింది.

  1. స్థూల దేశీయోత్పత్తిలో ప్రస్తుతం ఉన్న 1.15 శాతం ప్రభుత్వ ఆరోగ్య వ్యయాన్ని 2025 నాటికి 2.5 శాతానికి పెంచాలి.
  2. ఆయుః ప్రమాణాన్ని 67.5 సంవత్సరాల నుంచి 2025 నాటికి 70 సంవత్సరాలకు పెంచడం.
  3. జాతీయ స్థాయిలోను, దిగువ స్థాయిలోను 2025 నాటికి మొత్తం ప్రసూతి రేటును 2.1కి తగ్గించడం.
  4. 2019 వాటికి శిశు మరణాల రేటును 28కి తగ్గించడం. శిశు మరణాల రేటు 2016లో 1000 జననాలకు 34గా ఉంది.
  5. అంధత్వాన్ని 2025 నాటికి వెయ్యికి 0.25 కి తగ్గించడం, అట్లాగే రోగ భారాన్ని ప్రస్తుత స్థాయిలో 1/3 తగ్గించాలి.
  6. ప్రస్తుత స్థాయి నుంచి 2025 నాటికి ప్రభుత్వ ఆరోగ్య సౌకర్యాల ఉపయోగాన్ని 50 శాతం వరకు పెంచడం.
  7. 2025 నాటికి అప్పుడే పుట్టిన శిశువులలో 90 శాతానికి మించి ఒక సంవత్సరం వయస్సులోపునే పూర్తిగా వ్యాధి నిరోధకాలను పొందాలి.
  8. 2025 నాటికి 90 శాతం మించి ప్రసవాలు నైపుణ్యుల సమక్షంలో జరగాలి.
  9. ప్రస్తుత పొగాకు వినియోగాన్ని 2020 నాటికి 15 శాతం తగ్గించాలి. అట్లాగే 2025 నాటికి 30 శాతం తగ్గించాలి.
  10. 2020 నాటికి అందరికి రక్షిత నీటి సౌకర్యం, పారిశుద్ధ్యం అందుబాటులో ఉండాలి.
  11. 2020 నాటికి ఆరోగ్యం కోసం రాష్ట్ర వాటాను దాని బడ్జెట్ లో 8 శాతానికి మించి పెంచాలి.

ప్రశ్న 7.
మానవ అభివృద్ధి సూచికను నిర్మించే పద్ధతిని వివరించండి.
జవాబు.
మావన అభివృద్ధికి సంబంధించిన మూడు అంశాల అభివృద్ధి సగటును మానవ అభివృద్ధి సూచిక కొలుస్తుంది. అవి :

  • దీర్ఘకాలిక ఆరోగ్యవంతమైన జీవితం : దీనిని ఆయుర్ధాయం ద్వారా కొలుస్తారు.
  • పరిజ్ఞానం : దీనిని వయోజన అక్షరాస్యత రేటు, విద్యారంగంలోని ఉమ్మడి స్థూల విద్యార్థుల నమోదు నిష్పత్తి ద్వారా లెక్కిస్తారు.
  • ఉన్నత జీవన ప్రమాణం : దీనిని తలసరి స్థూల దేశీయ ఉత్పత్తి ద్వారా లెక్కిస్తారు.

మానవ అభివృద్ధి సూచికను లెక్కించే ముందు మూడు అంశాలలో ఒక్కొక్క అంశానికి సూచికను తయారుచేస్తారు. దీనికోసం ఒక్కొక్క సూచికకు కింద తెలియచేసినట్లుగా గరిష్ఠ, కనిష్ఠ విలువలను కల్పిస్తారు.

సూచికలుగరిష్ఠ విలువకనిష్ఠ విలువ
1. ఆయుర్ధాయం8525
2. వయోజన అక్షరాస్యత రేటు1000
3. స్థూల నమోదు నిష్పత్తి1000
4. తలసరి స్థూల దేశీయ ఉత్పత్తి కొనుగోలు శక్తి సమానత ఆధారంగా – US ($)40,000100

ప్రతి అంశం పనితీరును 0 నుంచి 1 మధ్య విలువలను ఇచ్చి క్రింది సూత్రం ద్వారా అంచనా వేస్తారు.
అంశపు సూచిక = వాస్తవ విలువ – కనిష్ట విలువ / గరిష్ట విలువ – కనిష్ట విలువ
పైన వివరించిన అంశాల సూచికల సాధారణ సగటు విలువనే మానవ అభివృద్ధి సూచికగా లెక్కిస్తారు.

TS Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 8.
లింగ సంబంధిత అభివృద్ధి సూచికను, మానవ పేదరిక సూచికను గురించి ఏమి అనుకుంటున్నావు ?
జవాబు.
1. లింగ సంబంధిత సూచికలు (Gender Related Indices):
1995 మానవ అభివృద్ధి రిపోర్టు ప్రపంచ వ్యాప్తంగా రెండు లింగ సూచికలను ప్రవేశపెట్టింది. అవి :

a) లింగ సంబంధిత సూచిక (Gender Related Development Index) :
మానవ అభివృద్ధి సూచికలో చేర్చబడిన ఆయుర్దాయం, విద్యా సంపాదన, ఆదాయం అనే ప్రాథమిక సామర్థ్యాల ఆధారంగా అభివృద్ధిని కొలిచే ప్రయత్నాన్ని ‘లింగ సంబంధీత అభివృద్ధి సూచిక’ చేసింది. మానవ అభివృద్ధి సూచికను లింగ అసమానత్వంతో సర్దుబాటు చేస్తారు.

ప్రాథమిక మానవ అభివృద్ధిలో లింగపరమైన అసమానతలు అధికంగా ఉంటే లింగ సంబంధిత అభివృద్ధి సూచిక (GDI) మానవ అభివృద్ధి సూచిక కంటే తక్కువగా ఉంటుంది. మానవ అభివృద్ధి సూచికకు, లింగ సంబంధిత అభివృద్ధి సూచికకు మధ్య తేడా అధికంగా ఉంటే అసమానతలు ఎక్కువగా ఉంటాయి.

b) లింగ సాధికార కొలమానం (Gender Empowerment Measure) :
ఆర్థిక రాజకీయ జీవితంలో స్త్రీల భాగస్వామ్యం చురుకుగా ఉందా లేదా అనే దానిని లింగ సాధికార కొలమానం (GEM) తెలుపుతుంది. రాజకీయాలలో పాల్గొనడం (పార్లమెంటు సీట్లలో స్త్రీల వాటా), ఆర్థిక అంశాలలో పాల్గొనడం (ఉన్నత స్థానాల్లో, వృత్తిపరమైన స్థానాల్లో వాటా), ఆర్థిక వనరులపై స్త్రీలకున్న పట్టు (ఆదాయాల్లోని తేడాలు) అనే అంశాలపై లింగ సాధికార కొలమానం దృష్టిని సారిస్తుంది.

2. మానవ పేదరిక సూచిక (Human Poverty Index) :
మానవ పేదరిక సూచిక అనే భావనను మానవ అభివృద్ధి రిపోర్టు (Human Development Report), 1997 ప్రవేశపెట్టింది. ఇది మానవ అభివృద్ధి సూచికలో ఉన్న మానవ జీవనానికి అవసరమైన అంశాలు దీర్ఘాయువు (longevity), పరిజ్ఞానం (Knowledge), ఉన్నత జీవన ప్రమాణాలలో (decent living standards) మానవులు కోల్పోయిన దానిపై లేదా పొందలేకపోయిన (deprivation) దానిపై అధిక శ్రద్ధ వహిస్తుంది. మానవ పేదరిక సూచికను లెక్కించడానికి మానవ అభివృద్ధి రిపోర్టు, 2009 కింద వివరించిన చలన రాసులను ఉపయోగించింది.

  1. 40 సంవత్సరాల వయస్సు కంటే ముందుగా చనిపోయే వారి శాతం
  2. వయోజనులలో నిరక్షరాస్యుల శాతం
  3. ఆరోగ్య సేవలు, రక్షిత మంచి నీరు అందుబాటులో ఉన్న ప్రజల శాతం
  4. పౌష్టికాహార లోపం ఉన్న అయిదు సంవత్సరాలలోపు పిల్లల శాతం.

ప్రశ్న 9.
స్థూల జాతీయ ఆనంద సూచిక భావనను వివరించండి.
జవాబు.
స్థూల జాతీయ ఆనంద సూచిక (Gross National Happiness Index):
భూటాన్ లాంటి దేశాలు వాటి అభివృద్ధిని స్థూల జాతీయ ఆనంద సూచిక ద్వారా కొలుస్తున్నారు. అభివృద్ధిని కొలుస్తున్న ప్రస్తుత పద్ధతిలో మార్పును తేవలసిన అవసరం ఉంది. ప్రగతి లేదా అభివృద్ధిని కొలవడానికి స్థూల దేశీయోత్పత్తి ప్రత్యామ్నాయ సూచికగా స్థూల జాతీయ ఆనందాన్ని (సంతోషాన్ని) భూటాన్ రూపొందించింది. స్థూల జాతీయ ఆనందం భావనను భూటాన్ నాల్గవ రాజు జిగ్మే సింగ్యే వాంగుక్ (Jigme Singye Wangchuck) 1970 తర్వాతి దశాబ్దిలో వాడారు.

సుస్థిర అభివృద్ధి ప్రగతి భావాలకు సంబంధించి సంపూర్ణ విధానాన్ని పాటించాలని, ఈ సంక్షేమానికి చెందిన ఆర్థికేతర అంశాలకు సమాన ప్రాధాన్యతను ఇవ్వాలని స్థూల జాతీయ ఆనందం భావన తెలుపుతుంది. బహుకోణ పద్ధతిని ఆధారంగా చేసుకొని స్థూల జాతీయ ఆనంద సూచికను నిర్మించడం జరుగుతుంది. ఈ పద్ధతిని (Alkire-Foster) పద్ధతి అని అంటారు.

స్థూల జాతీయ ఆనందం భావనను నాలుగు ఆధారాలతో వివరించవచ్చు. అవి : సుపరిపాలన, సుస్థిర, సామాజికార్థిక . అభివృద్ధి, సంస్కృతిని కాపాడుట, పర్యావరణ పరిరక్షణ. పై నాలుగు ఆధారాలను తిరిగి తొమ్మిది భాగాలుగా (domains) వర్గీకరించడమైంది. అవి, మానసిక సంక్షేమం, ఆరోగ్యం, విద్య, కాలాన్ని ఉపయోగించుట, సాంస్కృతిక భిన్నత్వం మరియు నిలదొక్కుకొనుట (resilence), సుపరిపాలన, సమాజ సజీవత్వము (vitality) జీవావరణ భిన్నత్వం మరియు నిలదొక్కుకొనుట, “జీవన ప్రమాణాలు.

అన్ని భాగాలకు సమాన భారితాలను ఇవ్వడం జరుగుతుంది. ఈ అన్ని భాగాలు సంక్షేమానికి సంబంధించిన 33. సూచికలకు లేదా చలన రాసులకు ప్రాతినిధ్యాన్ని వహిస్తాయి. ఒక భాగం (domain) లో ఉండే వివిధ చలన రాసుల భారితాలు సమానంగా ఉండవు. సాధారణంగా ఆత్మాశ్రయ సూచికలకు పరాశ్రయ సూచికల కంటే తక్కువ భారితాలను ఇస్తారు.

ఆనందం విషయంలో సగటులు లెక్కలోకి రావు. అందుచేతనే ప్రతి సూచికలో “కావలసినంత” (sufficiency) అనే ఒక లక్ష్యాన్ని పెద్దారు. ఒక సూచిక విషయంలో వ్యక్తి ఎప్పుడైతే “కావలసినంత” స్థాయిని సాధిస్తాడో అప్పుడు ఆ సూచికకు సంబంధించి వ్యక్తి ‘ఆనందంగా’ ఉన్నట్లు పరిగణిస్తాం. ఈ విధంగా 33 సూచికలకు సంబంధించి వ్యక్తి తెలిపే స్పందనల ఆధారంగా వ్యక్తి ఏ మేరకు ఆనందంగా ఉన్నాడో కింద తెలిపిన పద్దతిలో తీర్పునివ్వడం జరుగుతుంది.

77% – 100% సూచికలలో కావలసినంత స్థాయి ఉంటే – మిక్కిలి సంతోషం (deeply happy)
66% – 76% సూచికలలో కావలసినంత స్థాయి ఉంటే – అధిక సంతోషం (extensively happy)
50% – 65% సూచికలలో కావలసినంత స్థాయి ఉంటే – తక్కువ సంతోషం (narrowly happy)
0% – 49% సూచికలలో కావలసినంత స్థాయి ఉంటే – సంతోషం లేదు లేదా ఇంకా సంతోషం లేదు (unhappy or not yet happy)

TS Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
జననాల రేటు.
జవాబు.
ఒక సంవత్సర కాలంలో 1,000 మంది జనాభాకు ఉన్న జననాల నిష్పత్తి, కుటుంబ నియంత్రణ పథకాలను పాటించినప్పుడే జననాలరేటు తగ్గటానికి వీలు ఉంటుంది. ప్రతి 1000 మందికి 1901-1921 మధ్య కాలంలో జననాల రేటు 46 నుంచి 49గా ఉండగా, 2010-11 సం॥ నాటికి ఈ రేటు ప్రతి 1000 మందికి 2.18గా ఉంది.

ప్రశ్న 2.
మరణాల రేటు.
జవాబు.
ఒక సంవత్సర కాలంలో 1,000 మందిలో చనిపోయిన వారి నిష్పత్తి. 1901-1921 మధ్య కాలంలో మరణాల రేటు ప్రతి 1000 మందికి 44 నుంచి 49గా ఉండగా, ఈ రేటు 2010-11 సం॥ నాటికి ప్రతి 1000కి 7.1గా ఉంది.

ప్రశ్న 3.
శిశు మరణాల రేటు.
జవాబు.
ఒక సంవత్సర కాలంలో 1,000 జననాలకు మరణించిన శిశువుల నిష్పత్తి. 20వ శతాబ్దం రెండవ దశకంలో ఈ రేటు ప్రతి 1000కి 218గా ఉండగా, అది 2010-11 నాటికి ప్రతి 1000కి 47గా ఉంది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 4.
ప్రసూతి మరణాల రేటు.
జవాబు.
ఒక సంవత్సర కాలంలో 1 లక్షమంది స్త్రీలలో ప్రసవం వల్ల మరణించిన వారి నిష్పత్తి. 2007-09 సం॥ నాటికి 1 లక్ష మంది స్త్రీలలో ప్రసవం వలన మరణించిన స్త్రీల నిష్పత్తి 210గా నిర్ణయించబడినది.

ప్రశ్న 5.
లింగ నిష్పత్తి / స్త్రీ పురుష నిష్పత్తి.
జవాబు.
1,000 మంది పురుషులకు ఉన్న స్త్రీల సంఖ్య. ప్రస్తుతం అనగా 2011 లెక్కల ప్రకారం 1,000 కు 940గా స్త్రీల సంఖ్య నమోదు అయింది. 1901 సం॥లో ఈ రేటు 972 రేటు ఉండగా అది 1951 సం॥లో 946కు తగ్గింది. మరల 1991 సం॥లో 927కి తగ్గింది. ఈ రేటు 2001 సం॥లో 933గా ఉంది. పేదరికం, స్త్రీ, శిశు మరణాల రేటు ఈ రేటుకి కారణంగా చెప్పవచ్చు.

ప్రశ్న 6.
జనాభా విస్పోటనం.
జవాబు.
ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ రంగంపై ఆధారపడటం, విద్య పరిమితంగా ఉండటం మొదలైన కారణాలవల్ల జననాలరేటు అధికంగా ఉండి జనాభా చాలా వేగంగా పెరుగుతుంది. ఈ దశను జనాభా విస్ఫోటన దశగా పేర్కొంటారు. మన దేశంలో 1921 సం॥ నుండి ఈ దశ ప్రారంభమైంది.

ప్రశ్న 7.
గర్భ నిరోధకాలు.
జవాబు.
కుటుంబ నియంత్రణకు ఉపకరించే సాధనాలు, గర్భ నిరోధకాలు, కుటుంబ నియంత్రణ కేంద్రాలు గర్భ నిరోధక సాధనాల పంపిణీ కేంద్రాలు కూడా ముఖ్యపాత్ర నిర్వహిస్తాయి.

TS Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 8.
అక్షరాస్యత రేటు.
జవాబు.
చదవడం, రాయటంలో మనిషికున్న సామర్థ్యమే అక్షరాస్యత.
అక్షరాస్యత రేటు = ఏడు సంవత్సరాల వయస్సు పైబడిన జనాభాలో అక్షరాస్యత / మొత్తం జనాభా × 100

ప్రశ్న 9.
జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్.
జవాబు.
దీని ప్రధాన లక్ష్యం నగరాలలోని మురికివాడల ప్రజలకు, పేదవారికి అత్యవసర ప్రాథమిక ఆరోగ్య సేవలను కల్పించడం. ఈ పథకాన్ని 1,00,000 మంది జనాభా ఉన్న అన్ని నగరాలలో అమలుచేస్తారు. ఇది నగరాలలోని ఉపాంత కూలీలు, మురికివాడల ప్రజలు, బస్సు, రైల్వే కూలీలు మొదలైన శ్రామికులకు ఆరోగ్య సదుపాయాలు కల్పిస్తుంది.

ప్రశ్న 10.
జననీ సురక్ష యోజన.
జవాబు.
2005-06 సం॥లో దీనిని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినది. ఇది సంస్థాపరమైన కాన్పులను ప్రోత్సహిస్తూ శిశు మరణాల రేటును తగ్గించటానికి ప్రయత్నిస్తుంది. ఇది ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలో కాన్పులు జరిగేటట్లు గర్భిణీ స్త్రీలను ప్రోత్సహించి ప్రసూతి, శిశు మరణ రేట్లను తగ్గించడం దీని ఆశయం.

ప్రశ్న 11.
జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్.
జవాబు.
దీనిని 12-6-2005లో ప్రవేశపెట్టారు. ఆరోగ్య, భౌతిక మరియు మానవ అవస్థాపనా సౌకర్యాలను బలపరచి ఆరోగ్య నైపుణ్యతలను ఉపయోగించుకోవడానికి దీనిని రూపొందించారు.

TS Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 12.
లింగ సాధికారత కొలమానం (GEM).
జవాబు.
ఇది స్త్రీ-పురుషుల మధ్య వ్యత్యాసాన్ని అంచనా వేస్తుంది. దీనిలో మూడు అంశాలు ఇమిడి ఉంటాయి.

  1. స్త్రీల ఆయుర్దాయము
  2. వయోజన స్త్రీల అక్షరాస్యత
  3. స్త్రీల తలసరి ఆదాయం.

ప్రశ్న 13.
మానవ పేదరిక సూచిక (HPI).
జవాబు.
మానవ అభివృద్ధి రిపోర్టు 1997 సం॥లో దీనిని ప్రవేశపెట్టింది. ఇది మానవ అభివృద్ధిలో ఉన్న దీర్ఘాయువు, పరిజ్ఞానం, జీవన ప్రయాణం మొదలైన వాటిపై అధిక శ్రద్ధ వహిస్తుంది. దీనిలో కూడా మూడు అంశాలు పరిగణనలోనికి తీసుకుంటారు.

  1. ఆరోగ్య సేవలు పొందుతున్న ప్రజలు
  2. రక్షిత మంచినీరు పొందుతున్న ప్రజలు
  3. పౌష్టిక ఆహార లోపంలో ఉన్న 5 సం॥లోపు వయస్సు పిల్లలు.

TS Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి

Telangana TSBIE TS Inter 2nd Year Economics Study Material 1st Lesson ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి Textbook Questions and Answers.

TS Inter 2nd Year Economics Study Material 1st Lesson ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి భావనల గురించి వివరించండి. వాటి మధ్య తారతమ్యాలు ఏవి ?
జవాబు.
ఆర్థిక వృద్ధి అనేది ఆర్థికాభివృద్ధితో పోల్చితే సముచితమైన భావన. ఒక దేశంలో జాతీయోత్పత్తి వల్ల సంభవించిన పెరుగుదలను ఆర్థిక వృద్ధి సూచిస్తుంది. అంటే దేశంలో నాణ్యమైన వనరుల పెరుగుదలకు, దేశంలో వనరుల పరిమాణం పెరగడంతోపాటు లేదా సాంకేతికత వృద్ధి చెందడంతోపాటు లేదా దేశ ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగంలోనూ వస్తువుల, సేవల ఉత్పత్తుల పెరుగుదలను సూచిస్తుంది. ఆర్థిక వృద్ధి అనేది ఒక దేశంలోని స్థూల దేశీయోత్పత్తిలో పెరుగుదలను అంచనా వేస్తుంది.

మైఖేల్ పి. తొడారో ఉద్దేశం ప్రకారం “ఆర్థిక వృద్ధి అనేది ఒక స్థిరమైన ప్రక్రియ. ఆర్థిక వ్యవస్థ యొక్క ఉత్పాదక సామర్ధ్యం నియతకాలంలో పెరుగుతుంది. దీనివల్ల జాతీయ ఉత్పత్తిలో, ఆదాయంలో పెరుగుదల సాధ్యమవుతుంది”. సైమన్ కంజ్నెట్స్ ప్రకారం “ఆర్థిక వృద్ధి అనేది దీర్ఘకాలిక ప్రక్రియ. ఇందులో వాస్తవ జాతీయ ఆదాయంలో మొత్తం జనాభాలో, వాస్తవిక తలసరి ఆదాయంలో పెరుగుదల చోటు చేసుకుంటుంది.”

ఆర్థిక వృద్ధి ప్రధానాంశాలు :
పైన పేర్కొన్న నిర్వచనాలను బట్టి ఆర్థిక వృద్ధికి చెందిన ప్రధానాంశాలు కింద ఇవ్వడమైంది.

  1. ఆర్థిక వృద్ధి అనేది జనాభా పెరుగుదల రేటు కంటే వాస్తవిక జాతీయ ఆదాయం పెరుగుదల ఎక్కువగా ఉంటేనే సాధ్యమవుతుంది.
  2. ఆర్థిక వ్యవస్థలోని ఉత్పత్తి సామర్ధ్యంలో ఎక్కువ స్థాయి పెరుగుదల నమోదు అయినప్పుడు ఆర్థికవృద్ధి ఉంటుంది.

ఒకదేశ ప్రగతి, అది ధనిక లేదా పేద దేశమైన, ఆర్థిక వృద్ధికి సంబంధించిన నాలుగు కారకాల మీద ఆధారపడి ఉంటుంది.
ఎ) ఆర్థిక వ్యవస్థ పొదుపు రేటు,
బి) మూలధన ఉత్పత్తి నిష్పత్తి,
సి) శ్రామిక శక్తి వృద్ధి రేటు,
డి) సాంకేతిక విజ్ఞానంలో మార్పులు మరియు నవకల్పనలు.

ఆర్థిక వృద్ధి అనేది దేశ వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదలను, తలసరి ఉత్పత్తిలో పెరుగుదలను తెలియచేస్తుంది. ఒక దేశంలో వస్తు సేవల ఉత్పత్తిలో వృద్ధి రేటుతో సమానంగా జనాభా వృద్ధి రేటు పెరిగినట్లయితే వాస్తవిక తలసరి ఆదాయంలో మార్పేమి ఉండదు. అంటే మొత్తం ఉత్పత్తి పెరిగినప్పటికీ ప్రజల జీవన ప్రయాణ స్థాయిలో పెరుగుదల సంభవించకపోవచ్చు.

ఆర్థికాభివృద్ధి భావన :
ఆర్థికాభివృద్ధి అనేది ఆర్థిక వృద్ధి కంటే విస్తృతమైన భావన. ఒక దేశంలో వచ్చే సాంఘిక, ఆర్ధిక, వ్యవస్థాపరమైన, ప్రగతిశీలమైన మార్పులను ఆర్థికాభివృద్ధి సూచిస్తుంది. సాధారణంగా తలసరి ఆదాయం ఎక్కువగా ఉండడాన్ని ఆర్థికాభివృద్ధికి సూచికగా భావిస్తారు. ఆర్థిక వృద్ధితో ఆర్థికాభివృద్ధికి అవినాభావ సంబంధం ఉంది.

ఆర్థికాభివృద్ధి వల్ల దేశ సామాజిక, ఆర్థిక నిర్మితల పురోగతి ఉంటుంది. ఎక్కడైతే ప్రజల జీవన ప్రమాణ స్థాయితో మార్పు ఉంటుందో అక్కడ సరైన వృద్ధి సాధించబడుతుంది. ఆర్థిక వృద్ధి అనేది ఆర్థికాభివృద్ధికి అవసరం, ఆర్థికాభివృద్ధి నిర్ణయాత్మకమైంది.

మైఖేల్ పి. తొడారో ప్రకారం ఆర్థికాభివృద్ధి బహుముఖమైన అభివృద్ధి ప్రక్రియ. సామాజిక నిర్మాణంలో, ప్రజామోదమైన వైఖరులు, జాతీయ సంస్థలలో చెప్పుకోదగిన మార్పులు ఈ ప్రక్రియలో భాగం. అంతేగాకుండా త్వరితగతిన ఆదాయ పెరుగుదల అసమానతల తగ్గుదల, సాపేక్ష పేదరిక నిర్మూలన ప్రక్రియలు ఉంటాయి.

ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధిల మధ్య తారతమ్యాలు :
కిండల్ బర్గర్ ప్రకారం ఆర్థికవృద్ధి అనేది అధిక ఉత్పత్తిని సూచించగా, ఆర్థికాభివృద్ధి అనేది అధిక ఉత్పత్తితోబాటు అందుకు దోహదపడే సాంకేతిక, సంస్థాపూర్వక మార్పులను సూచిస్తుంది.

ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధిల మధ్య గల బేధాలు:

ఆర్థిక వృద్ధిఆర్థికాభివృద్ధి
1. ఆర్థిక వృద్ధి వస్తుసేవల’ పెరుగుదలను అంటే వాస్తవిక స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలను సూచిస్తుంది.1. ఆర్థికాభివృద్ధి దేశంలో ఆర్థిక వృద్ధితో పాటుగా వ్యవస్థాపూర్వక, సంస్థాగత, సాంఘిక, ఆర్థిక మార్పులను సూచిస్తుంది.
2. ఆర్థిక వృద్ధి అనేది ఏకోన్ముఖమైన ప్రక్రియ.2. ఆర్థికాభివృద్ధి అనేది బహుపార్శ్వ (ముఖ) ప్రక్రియ.
3. ఆర్థిక వృద్ధి ఆర్థిక వ్యవస్థలో పరిమాణాత్మకమైన మార్పులనే సూచిస్తుంది.3. ఆర్థికాభివృద్ధి పరిమాణాత్మక మార్పులతో పాటు, గుణాత్మక మార్పులను సూచిస్తుంది.
4. ప్రభుత్వ జోక్యం ఉన్నా లేకున్నా ఆర్థిక వృద్ధి సాధించవచ్చు.4. ప్రభుత్వ జోక్యం లేకుంటే ఆర్థికాభివృద్ధిని సాధించలేం. ఆర్థికాభివృద్ధి ప్రారంభంలో దేశంలో ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. దానిని పెంచి అభివృద్ధిని సాధించాలంటే ప్రభుత్వం చురుకైన పాత్రను పోషించాలి.
5. ఆర్థిక వృద్ధి వేగంగా సంభవించేటప్పుడు అధిక సాంకేతిక మార్పులు ఉంటాయి.5. అధిక స్థాయిలో ఆర్థికాభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణంలో మార్పు తీసుకురావడం.
6. సాంప్రదాయ అర్థశాస్త్ర నేపథ్యంలో ఆర్థిక వృద్ధి అనేది ఒక కీలక అంశం. ఈ దృక్పథం ప్రకారం వృద్ధిపై, పురోగతిపై మనం దృష్టి సారిస్తే దానంతట అదే పేదరికాన్ని నిర్మూలిస్తుంది. దీనినే కింది స్థాయి వరకు అభివృద్ధి ఫలాలు చేరే దృక్పథం (tricke down | approach) అంటారు.6. ఆధునిక అర్థశాస్త్ర సాహిత్యంలో ఆర్థికాభివృద్ధి అనేది ముఖ్యమైన అంశం. మనం పేదరికంపై దృష్టి సారిస్తే ఆర్థిక వృద్ధి దానంతటదే సాధ్యమవుతుంది.
7. ఆర్థిక వృద్ధి పరిధి సంకుచితమైంది. ఎందుకంటే తలసరి ఆదాయ స్థాయిలోని మార్పుతో మాత్రమే ఆర్థిక వృద్ధికి సంబంధం ఉంది.7. ఆర్థికాభివృద్ధి పరిధి విస్తృతమైంది. తలసరి ఆదాయ పెరుగుదలనే గాకుండా ఆర్థిక వ్యవస్థలో ధనాత్మక మార్పులను, ప్రజల జీవన వ్యవహారాలలో మెరుగుదలను సూచిస్తుంది.
8. ఆర్థిక వృద్ధి స్వల్ప కాలానికి సంబంధించిన అంశం. సాధారణంగా సంవత్సర ఆధారంగా దీనిని తెలుపుతారు.8. ఆర్థికాభివృద్ధి అనేది దీర్ఘ కాలానికి సంబంధిం చిన అంశం. 20 నుంచి 25 సంవత్సరాలలో సంస్థాగత మార్పులను తెలుపుతుంది.
9. ఆర్థిక వృద్ధి అనేది ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాలకు

సంబంధించింది.

9. ఆర్థికాభివృద్ధి అనేది ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించింది.
10. సామాజిక మార్పు అనేది ఆర్థిక వృద్ధితో సాధ్యం కావచ్చు లేదా కాకపోవచ్చు.10. సామాజిక మార్పు అనేది ఆర్థికాభివృద్ధిలో తప్పనిసరి. అర్హతకు తగిన ఉద్యోగ అవకాశాలు, ఆహార ధాన్యాల లభ్యత, మంచి ఆరోగ్యం, విద్య, ప్రజల జీవన నైపుణ్యాల మార్పు అనేవి ఆర్థికాభివృద్ధి వల్ల సాధ్యమవుతాయి.
11. ఆర్థిక వృద్ధిని ఆదాయ స్థాయిలతో అంచనా వేస్తారు. సాధారణంగా సంఖ్యాపరంగా సంవత్సరాల వారీగా ఆర్థిక వృద్ధి రేటును అంచనా వేస్తారు.11. ఆర్థికాభివృద్ధిలో పేదరికం తగ్గింపు, మానవ వనరుల అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల వంటి అంశాలు ప్రధాన పాత్ర వహిస్తాయి.

TS Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 2.
ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను వివరించండి.
జవాబు.
భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థికాభివృద్ధి ముఖ్య లక్ష్యాలను క్రింద వివరించవచ్చు. అవి :

1. అధిక వృద్ధి రేటు (High Rate of Growth) :
స్థూల దేశీయోత్పత్తి సగటు వార్షిక వృద్ధి రేటు 1980 వరకు 3.73 శాతంగా ఉండేది. అదే కాలంలో దేశంలో సగటు వార్షిక జనాభా వృద్ధి రేటు 2.5 శాతం ఉంది. దీనివల్ల తలసరి ఆదాయంలో వృద్ధి రేటు 1 శాతం దరిదాపులోనే ఉండేది. అయితే ఆరవ పంచవర్ష ప్రణాళికా కాలం నుంచి భారత ఆర్థిక వ్యవస్థ చెప్పుకోదగిన స్థాయిలో మార్పు చెందడం మొదలైంది. ఆరవ, ఏడవ, ఎనిమిదవ పంచవర్ష ప్రణాళికల్లో వృద్ధి రేటు వరుసగా 5.4 శాతం, 5.8 శాతం, 6.8 శాతంగా నమోదు అయింది.

1997లో ప్రారంభమయిన 9వ ప్రణాళిక వార్షిక వృద్ధి రేటు లక్ష్యాన్ని 7 శాతంగా నిర్దేశించుకోగా, సాధించిన స్థూల దేశీయోత్పత్తి సగటు వృద్ధి రేటు 5.35 శాతంగా ఉంది. తర్వాత సంవత్సరాలలో ఆర్థిక వ్యవస్థ 9 శాతం అధిక వృద్ధి రేటును సాధించింది. సాపేక్షికంగా దీనిని అధిక వృద్ధి రేటుగా మనం భావిస్తే, 21వ శతాబ్దపు మొదటి దశాబ్దంలో చైనా 10 శాతం వృద్ధి రేటును సాధించింది. 12వ ప్రణాళిక (2012-17) లో 7.9 శాతం సగటు వృద్ధి రేటు లక్ష్యంగా ఉంది, 2014-15 నుండి 2018-19 వరకు స్థూల దేశీయ ఉత్పత్తి 7.5 శాతం చొప్పున పెరిగింది.

2. ఆర్థిక స్వావలంబన (Economic Self-Reliance) :
ఆర్థిక స్వావలంబన ఒక ముఖ్య లక్ష్యంగా ఉంది. అయితే స్వావలంబనకు, స్వయం సమృద్ధి (self-sufficiency)కి మధ్య స్పష్టత అవసరం. స్వయంసమృద్ధి అంటే ఒకదేశం తనకు అవసరమైన అన్ని వస్తుసేవలను ఇతర దేశాలపై ఆధారపడకుండా తానే ఉత్పత్తి చేస్తుంది. ఈ దేశం దిగుమతులను చేసుకోదు.

అదే స్వావలంబన అంటే ఒక దేశం తనకు అవసరమైన వాటిని కొనడానికి సరిపడే మిగులును సృష్టించుకుంటుంది. అయితే ఒక దేశం తాను చేసుకొనే దిగుమతులకు చెల్లింపులు చేయడం ద్వారా స్వావలంబనను సాధించే ప్రయత్నం చేస్తుంది. స్వయం పోషకత్వం అంటే తన కాళ్లపై తాను నిలబడాలి. భారతదేశ విషయానికి వస్తే విదేశీ సహాయం (foreign aid) పైన సాధ్యమైనంత వరకు తక్కువ ఆధారపడాలి.

ప్రణాళికల ఆరంభంలో స్వదేశీ అవసరాల కోసం భారతదేశం అమెరికా నుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవడం జరిగింది. అలాగే సత్వర పారిశ్రామిక, అభివృద్ధి కోసం విదేశాల నుంచి మూలధన వస్తువులైన భారీ యంత్రాలు, సాంకేతికతను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది.

మన దేశంలో మౌళిక వసతులైన రోడ్లు, రైల్వేలు, ఇంధనం అభివృద్ధి కోసం పెట్టుబడి రేటును పెంచడానికి విదేశీ సహాయం మీద ఆధారపడ్డాం. విదేశీ రంగం పై అధికంగా ఆధారపడడం ఆర్థిక వలస విధానానికి దారితీస్తుంది. ఈ విషయంలో 3వ ప్రణాళిక నుండి స్వయం పోషకత్వం సాధించే లక్ష్యాన్ని ప్రణాళికావేత్తలు పొందుపర్చారు.

TS Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి

3. సామాజిక న్యాయం (Social Justice) :
దేశంలోని ఆదాయ, సంపదలు సమాజంలోని వివిధ వర్గాల మధ్య సమానంగా పంపిణీ జరగాలన్నదే సామాజిక న్యాయం. భారతదేశంలో అధిక సంఖ్యలో ప్రజలు పేదలు కాగా, కొద్దిమంది మాత్రం విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. సమాజంలో పేద, బలహీన వర్గాల వారిపై శ్రద్ధ వహించి ఆర్థిక, సామాజిక న్యాయం అందించడం అనేది ఆర్థికాభివృద్ధి మరొక లక్ష్యం. పంచవర్ష ప్రణాళికలు భారత దేశంలో నాలుగు సామాజిక న్యాయ అంశాలకు ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది.
అవి :

  1. దేశ రాజకీయ వ్యవస్థలో ప్రజాస్వామిక సూత్రాలు అమలు చేయడం.
  2. సామాజిక, ఆర్థిక సమానత్వం సాధించడం, ప్రాంతీయ అసమానతలను తగ్గించడం.
  3. ఆర్థిక శక్తి కేంద్రీకరణ ప్రక్రియను సమాప్తం చేసి శక్తి వికేంద్రీకరణను సాధించడం.
  4. వెనుకబడిన, అణగారిన వర్గాల వారి పరిస్థితులను మెరుగు పరచడానికి ప్రయత్నాలు.

4. ఆధునికీకరణ (Modernisation) :
ఆధునికీకరణ లక్ష్యం దేశంలోని ప్రజల జీవన ప్రమాణాలలో మార్పులు తీసుకురావడం. ఇందులో భాగంగా ఉన్నత శాస్త్రీయ ఉత్పత్తి పద్ధతులను అనుసరించడం, పురాతన వెనుకబడిన పద్ధతులను మార్చడం, గ్రామీణ వ్యవస్థలో, సంస్థలలో మార్పులు తీసుకొని రావడం జరుగుతుంది. ఈ మార్పుల లక్ష్యం జాతీయ ఆదాయంలో పారిశ్రామిక ఉత్పత్తి వాటా పెంచడం, ఉత్పత్తుల నాణ్యతను పెంచడం, నానావిధమైన పరిశ్రమలను స్థాపించడం. అదేవిధంగా మన దేశ పరిశ్రమలు కూడా వృద్ధి చెందుతాయి.

అంతేగాక ఆధునికీకరణ వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు అవసరమయ్యే బాంకింగ్, బ్యాంకేతర సేవల విస్తరణకు తోడ్పుడుతుంది. భూ సంస్కరణల అమలుతో పాటుగా వ్యవసాయ రంగాన్ని ఆధునికీకరణ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అధునికీకరణ పెరగడానికి ముఖ్య కారణం సమాచార సాంకేతిక పరిజ్ఞాన రంగం అద్భుతంగా వృద్ధి చెందడమే.

5. ఆర్థిక స్థిరత్వం (Economic Stability) :
దేశంలో ద్రవ్యోల్బణ రహిత సంపూర్ణోద్యోగిత వృద్ధి ఉన్నప్పుడు ఆర్థిక స్థిరత్వం సాధ్యం అవుతుంది. రెండవ ప్రణాళిక తర్వాత మన దేశంలో ధరల పెరుగుదల చాలా కాలం వరకు కొనసాగింది. దీనిని అదుపులో పెట్టి ఆర్థిక స్థిరత్వం సాధించడానికి ప్రణాళికావేత్తలు ప్రయత్నించారు. ఈ దిశలో పురోగతి సంతృప్తికరంగా ఉంది. అందువల్ల, సామాజిక న్యాయంతో కూడిన ద్రవ్యోల్బణ రహిత స్వయం పోషకత్వ వృద్ధిని సాధించడం ఆర్థికాభివృద్ధి విస్తృత లక్ష్యం అని చెప్పవచ్చు.

6. సుస్థిర అభివృద్ధి :
“సుస్థిర అభివృద్ధి అంటే భవిష్యత్ తరాల అవసరాల విషయంలో రాజీ లేకుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చుకోవడం” అని బ్రుండ్రెండ్ రిపోర్ట్ (Brundtland Report) నిర్వచించింది. సుస్థిర అభివృద్ధి అంటే అభివృద్ధి నిర్విరామంగా కొనసాగడం (keep going).

భవిష్యత్తు తరాలు నష్టపోకుండా పర్యావరణ, మానవ, భౌతిక మూలధనం నిల్వలను పరిరక్షించుతూ, పెంపొందించుతూ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడమే సుస్థిర అభివృద్ధి లక్ష్యం. పర్యావరణ క్షీణత పైన ఉన్న ఆర్థికాభివృద్ధి నష్ట ప్రభావాలను ఆర్థిక, పర్యావరణ విధానాలను, పర్యావరణ పెట్టుబడులను వివేకంతో ఎంపిక చేసుకోవడం వల్ల తగ్గించవచ్చు. విధానాలను, పెట్టుబడులను ఎంపిక చేసేటప్పుడు అవిరోధ ఆర్థికాభివృద్ధితో కూడిన సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఉండాలి.

7. సమ్మిళిత వృద్ధి (Inclusive Growth) :
ఆర్ధిక వృద్ధి గమనాన్ని (pace), తీరును సమ్మిళిత వృద్ధి తెలుపుతుంది. ఈ భావననే ప్రపంచ బాంకు ఇప్పుడు సుస్థిర సమ్మిళిత వృద్ధి అని అంటుంది. సమ్మిళిత వృద్ధిలో వృద్ధి ఫలాలు జనాభాలో దిగువ వర్గాలకు అందడంతో పాటుగా మానసికేతర అంశాలు ఉంటాయి. వృద్ధి ఫలాలు అన్ని వర్గాల వారికి సమాన స్థాయిలో పంపిణీ కానందున, ఆర్థికాభివృద్ధి వ్యూహంగా ఈ సమ్మిళిత వృద్ధికి ప్రాధాన్యత పెరిగింది.

ఆర్థిక వృద్ధి క్రమంలో ప్రతిఫలాలు పంపిణీ చేయకుండా గతంలో విస్మరించబడిన వర్గాల వారిని వృద్ధి ప్రక్రియలో భాగస్వాములను చేయడం సమ్మిళిత వృద్ధి లక్ష్యం. మొత్తం ఆదాయంలో అతి తక్కువ వాటా కల్గి ఉన్న విస్మరించబడిన అట్టడుగు వర్గాల ప్రజలను వృద్ధి ప్రక్రియలో చేర్చే ప్రక్రియగా సమ్మిళిత భావనను చూడాలి.

TS Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 3.
ఆర్థికాభివృద్ధి సూచికలను పరిశీలించండి.
జవాబు.
ఆర్థికాభివృద్ధి సూచికలు : ఆర్థికాభివృద్ధి సూచికలు ఈ కింద పేర్కొన్న విధంగా ఉంటాయి :

1. నిజ జాతీయాదాయం :
ఆర్థికాభివృద్ధిని కొలిచే పద్ధతులలో ఒకటి దీర్ఘ కాలంలో ఆర్థిక వ్యవస్థలో నిజ జాతీయాదాయంలోని పెరుగుదలను పరిగణించడం. నిజ జాతీయాదాయం ఎక్కువగా ఉంటే ఆర్థికాభివృద్ధి స్థాయి ఎక్కువగా ఉన్నట్లు, అట్లాగే నిజ జాతీయాదాయం తక్కువగా ఉంటే ఆర్థికాభివృద్ధి స్థాయి తక్కువగా ఉన్నట్లు. కింది కారణాల వల్ల ఈ సూచిక సంతృప్తికరమైంది కాదు :

  • నిజ జాతీయాదాయాన్ని కొలిచేటప్పుడు ధరల మార్పులను పరిగణనలోకి తీసుకోరాదు. అయితే ధరలలో తేడాలు తప్పనిసరిగా ఉంటాయి. జాతీయాదాయంలోని స్వల్పకాలిక పెరుగుదల ఆర్థికాభివృద్ధిగా పరిగణింపబడదు.
  • జనాభా వృద్ధిలోని మార్పులను పరిగణనలోకి తీసుకోలేదు. నిజ జాతీయాదాయం పెరిగినా, జనాభా పెరుగుదల వేగంగా ఉంటే ఆర్థికాభివృద్ధి ఉండకపోవడమే కాక అది తగ్గుతుంది.
  • సమాజంలోని సామాజిక వ్యయాన్ని ఇది తెలియచేయదు.
  • ఆర్థిక వ్యవస్థలోని ఆదాయ పంపిణీని గూర్చి ఏమీ ఇది తెల్పదు.
  • స్థూల జాతీయోత్పత్తిని కొలవడంలో భావనల పరంగా కొన్ని సమస్యలున్నాయి.

2. తలసరి స్థూల జాతీయోత్పత్తి :
ఏ దేశంలోనైనా తలసరి నిజ ఆదాయంలోని పెరుగుదల ఆ దేశంలోని ఆర్థిక వృద్ధి రేటులోని పెరుగుదలను సూచిస్తుందే తప్ప ఆర్థికాభివృద్ధిని మాత్రం కాదు. ఆర్థికాభివృద్ధి అంటే తలసరి నిజ ఆదాయంలోని పెరుగుదలతో పాటుగా అనేక రంగాలలో మార్పులు కూడా ఉంటాయి. ఈ పద్ధతిలో కొన్ని పరిమితులు ఉన్నాయి.
అవి :

  • నిజ తలసరి ఆదాయం పెరిగినా, ఇది ప్రజల నిజ జీవన ప్రమాణాల స్థాయిని పెంపొందించకపోవచ్చు.
  • తలసరి నిజ స్థూల జాతీయోత్పత్తి పెరిగినా, ఆదాయ పంపిణీలో అధిక అసమానత్వం ఉంటే ప్రజల పేదవారిగానే ఉంటారు.
  • తలసరి నిజ స్థూల జాతీయోత్పత్తికి చెందిన అంతర్జాతీయ పోలికలు నిర్ధిష్టంగా ఉండవు. ఎందుకంటే నామమాత్ర మారకం రేట్లు (nominal exchange rates) వివిధ కరెన్సీల సాపేక్ష కొనుగోలు శక్తిని ప్రతిబింబించవు.
  • కనీస అవసరాలకు చెందిన సమస్యలను పరిగణించడంలో తలసరి నిజ స్థూల జాతీయోత్పత్తి విఫలమయింది. కనీస అవసరాలను అందించితే జీవన ప్రమాణాలలో ఏర్పడే పెరుగుదలను తలసరి స్థూల జాతీయోత్పత్తిలోని పెరుగుదలతో కొలవలేము.

3. సంక్షేమం :
ఆర్థికాభివృద్ధికి మరొక సూచిక ఆర్థిక శ్రేయస్సు. వ్యక్తుల వస్తు సేవల వినియోగంలోని పెరుగుదలనే ఆర్థికాభివృద్ధి ప్రక్రియగా పరిగణిస్తాం. ఈ సూచిక పై కూడా పరిమితులు ఉన్నాయి. కొన్ని పరిమితులు కింద ఇవ్వబడ్డాయి :

  • వ్యక్తుల సంక్షేమ సూచికలను తయారు చేసేటప్పుడు వివిధ వ్యక్తుల వినియోగానికి ఒకే విధంగా భారితాలను ఇవ్వడం సరికాదు.
  • మొత్తం ఉత్పత్తి సమ్మేళనం (composition), మదింపు (valuation) విషయంలో జాగ్రత్తను వహించడం అవసరం.
  • సంక్షేమం దృష్ట్యా, కేవలం ఏమి ఉత్పత్తి చేయబడిందో మాత్రమే కాక, అది ఏ విధంగా ఉత్పత్తి చేయబడిందో చూడాలి. నిజ జాతీయోత్పత్తి పెరిగినప్పుడు ఆర్థిక వ్యవస్థలో ఏర్పడ్డ నిజ వ్యయాలు (real costs), సామాజిక వ్యయాలను (social costs) కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
  • సమత్వ(equitable) మరియు సమర్థనీయ (justifiable) జాతీయ ఆదాయ పంపిణీ లేనంతవరకు ఆర్థిక శ్రేయస్సు పెరిగినా ఆర్థికాభివృద్ధికి దారి తీయదు.

4. సామాజిక సూచికలు లేదా ప్రాథమిక అవసరాలు :
కొంతమంది ఆర్థికవేత్తలు ఆర్థికాభివృద్ధిని సామాజిక సూచికలు ద్వారా కొలిచే ప్రయత్నం చేసారు. అభివృద్ధికి కావాల్సిన ప్రాథమిక అవసరాలను సామాజిక సూచికలుగా పరిగణిస్తాం. పేదవాళ్ళ ప్రాథమిక మానవ అవసరాలను తీర్చడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించడంలో ప్రాథమిక అవసరాల దృష్టి ఉంటుంది.

స్థూల జాతీయోత్పత్తి, తలసరి స్థూల జాతీయోత్పత్తి వ్యూహానికి బదులుగా ఆరోగ్యం, విద్య, ఆహారం, నీరు, పారిశుద్ధ్యం, గృహ వసతి మొదలైన ప్రాథమిక అవసరాలను ప్రత్యక్షంగా అందించడం వల్ల తక్కువ ద్రవ్య వనరులతోనే పేదరికాన్ని స్వల్ప కాలంలోనే ప్రభావితం చేయవచ్చు. ప్రాథమిక అవసరాలను అందించడం వల్ల విద్యావంతులు మరియు ఆరోగ్యవంతులైన ప్రజల రూపంలో మానవాభివృద్ధి ద్వారా ప్రజల ఉత్పాదక శక్తి, ఆదాయం పెరుగుతాయి.

5. భౌతిక జీవన ప్రమాణ సూచిక (Physical Quality of Life Index – PQLI) :
దీనిని 1979లో యమ్.డి. మోరిస్ రూపొందించాడు. 23 దేశాలకు సంబంధించి ఇతడు ఉమ్మడి భౌతిక జీవన ప్రమాణ సూచికను తులనాత్మక అధ్యాయానికి రూపొందించాడు. ఆర్థికాభివృద్ధి గణనలో ఉపయోగించే ఆదాయేతర సూచిక భౌతిక జీవన ప్రమాణ సూచిక. ఎందుకంటే భౌతిక జీవన ప్రమాణాన్ని సూచికగా ఉపయోగించింది. ఈ పద్ధతి ఆర్థికాభివృద్ధిని కొలవడానికి మూడు ప్రమాణాలను ఆధారంగా తీసుకుంటుంది.
అవి :

  • ఆయుః ప్రమాణం,
  • శిశు మరణాల రేటు,
  • ప్రాథమిక అక్షరాస్యత.

ప్రజలు అత్యంత ప్రాథమిక అవసరాలను పొందడంలో పనితీరును ఈ సూచిక కొలుస్తుంది. ఆరోగ్యం, విద్య, తాగు నీరు, ఆహారం, పారిశుద్ధ్యం లాంటి ప్రాథమిక అవసరాలకు ఈ సూచిక ప్రాతినిధ్యాన్ని వహిస్తుంది.

భౌతిక జీవన ప్రమాణ సూచికలో కొన్ని పరిమితులున్నాయి. అవి :

  • ప్రాథమిక అవసరాలకు సంబంధించి భౌతిక జీవన ప్రమాణ సూచిక పరిమితమైన కొలమానం అని మోరిస్ అంగీకరించాడు.
  • ఆర్థిక, సామాజిక వ్యవస్థ నిర్మితిలో వస్తున్న మార్పులను ఇది వివరించదు.
  • ఇది మొత్తం శ్రేయస్సును కొలవదు.
  • భౌతిక జీవన ప్రమాణ సూచికలోని మూడు అంశాలకు సమాన భారితాలను ఇవ్వడం జరిగింది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి

6. మానవ అభివృద్ధి సూచిక (Human Development Index) :
మానవ అభివృద్ధి సూచికను మహబూబ్-ఉల్- హక్ అభివృద్ధి చేయగా, 1990 సంవత్సరంలో ఐక్య రాజ్య సమితి అభివృద్ధి పథకం తయారుచేసిన తన మొదటి మానవ అభివృద్ధి రిపోర్ట్లో మానవ అభివృద్ధి సూచికను చేర్చింది. ఒక దేశ సామాజిక, ఆర్థిక కోణాలలో సాధించిన అభివృద్ధిని కొలిచే గణాంక సాధనం మానవ అభివృద్ధి సూచిక. ఈ సూచికను నిర్మించడానికి కింది సూచికలు కావాలి :

  • పుట్టుక సమయంలో ఆయుఃప్రమాణం.
  • విద్య – వయోజన అక్షరాస్యత, విద్యా సంస్థలలో సమ్మిళిత స్థూల నమోదు నిష్పత్తి.
  • డాలర్ల రూపంలో కొనుగోలు శక్తి సమానత ఆధారంగా తలసరి నిజ స్థూల దేశీయోత్పత్తి.

7. లింగ సంబంధ అభివృద్ధి సూచిక (Gender related Development Index – GDI) :
1995 మానవ అభివృద్ధి రిపోర్టు ప్రపంచవ్యాప్తంగా రెండు లింగ సూచికలను ప్రవేశ పెట్టింది. అవి : లింగ సంబంధిత అభివృద్ధి సూచిక, లింగ సాధికార కొలమానం. మానవ అభివృద్ధి సూచిక మాదిరిగానే ఇది కూడా జనాభా సగటు విజయాలను కొలిచే ఒక ఉమ్మడి సూచిక. ఇది మానవ అభివృద్ధిలోని మూడు ప్రాథమిక అంశాల విజయాల స్థాయిలను లింగ అసమానతలతో సర్దుబాటు చేస్తారు. మానవ అభివృద్ధి సూచికలోని అంశాలనే ఇది పరిగణనలోనికి తీసుకుంటుంది.

8. సామాజిక ప్రగతి సూచిక (Social Progress Index – SPI) :
ఒక దేశం తమ పౌరుల సామాజిక, పర్యావరణ అవసరాలను తీర్చడానికి అందించే సేవలను సామాజిక ప్రగతి సూచిక కొలుస్తుంది. కనీస మానవ అవసరాలు, సంక్షేమానికి వేసే పునాదులు, వారి అభివృద్ధికి ఉన్న అవకాశం మొదలైనటువంటి అంశాలకు చెందిన 54 సూచికలను తీసుకుని వివిధ దేశాల సాపేక్ష పనితీరును తెలపడం జరుగుతుంది.

ఈ సూచికకు అమర్త్య సేన్, డగ్లస్ నార్త్, జోసెఫ్ స్టిగ్లిట్ల రచనలు ఆధారం. సామాజిక ప్రగతి సూచిక ఆర్థిక కారకాల స్థానంలో సామాజిక, పర్యావరణ పరిరక్షణ సాధన ద్వారా సమాజ సంక్షేమాన్ని అంచనా వేస్తుంది. సంక్షేమం (ఆరోగ్యం, ఆవాసం, పరిశుభ్రత), సమానత్వం, సమ్మిళిత వృద్ధి, సుస్థిరత, వ్యక్తిగత స్వతంత్రం, రక్షణలు సామాజిక, పర్యావరణ కారకాలలోని భాగాలు.

9. బహు పార్శ్వ పేదరిక సూచిక (Multi-Dimensional Poverty Index – MPI) :
అత్యంత అణగారిన వర్గాలు కోల్పోయిన అంశాలను విశదీకరించడానికి బహుపార్శ్వ పేదరిక సూచికను 2010లో ప్రవేశపెట్టారు. అంటే ఒకే సమయంలో బహు కారకాలను కోల్పోయిన కుటుంబాల అధ్యయనానికి ఈ సూచిక అవసరం. భారిత సూచికల (weighted indicators)లో ఎవరైతే కనీసం 33 శాతం కోల్పోతారో వారిని బహుపార్శ్వ పేదలుగా భావిస్తారు. సహస్రాబ్ధి అభివృద్ధి లక్ష్యాల (Millennium development goals) తో బహుముఖ కోణ పేదరిక సూచిక దగ్గర సంబంధాన్ని కలిగి ఉంది. ఈ సూచికలో గల 10 అంశాలను కింద ఇవ్వనైనది.

  1. కొన్ని ఆస్తులు కలిగి ఉండటం
  2. పోషకాహారం
  3. శిశు మరణాల రేటు
  4. త్రాగు నీరు అందుబాటు
  5. పారిశుద్ధ్యం కల్పించడం
  6. భద్రతాపరమైన గృహ సౌకర్యం కల్పించడం
  7. విద్యుత్ సౌకర్యం కల్పించడం
  8. మెరుగైన వంట నూనెను అందుబాటులో ఉంచడం
  9. సంవత్సరాల చదువు (years of schooling)
  10. పాఠశాలలో బాలల నమోదు

10. ఆర్థిక వృద్ధి :
ఆర్థిక వృద్ధి వార్షిక స్థూల దేశీయోత్పత్తి, స్థూల జాతీయోత్పత్తి, తలసరి స్థూల దేశీయోత్పత్తి లేదా తలసరి స్థూల జాతీయోత్పత్తిలో పెరుగుదలను కొలుస్తుంది.

11. స్థూల జాతీయ సంతోష సూచిక :
భూటాన్ లాంటి దేశాలు వాటి అభివృద్ధిని స్థూల జాతీయ సంతోష సూచికతో కొలుస్తున్నాయి. అందుకే అభివృద్ధిని కొలిచే ప్రస్తుత పద్ధతిలో మార్పును తీసుకురావల్సిన అవసరం ఉంది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 4.
ఆర్థికాభివృద్ధిని నిరోధించే కారకాలను వివరించండి.
జవాబు.
అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థికాభివృద్ధికి ఆటంకంగా ఉండే కారకాలను కింది విధంగా విభజించవచ్చు. అవి :

  1. సహజ వనరుల కొరత
  2. అల్ప మానవ మూలధన వృద్ధి
  3. తక్కువ స్థాయి అవస్థాపనా సదుపాయాలు
  4. పేదరిక విషవలయం.

సహజ వనరుల కొరత :
సారవంతమైన నేల వంటి వనరులు అంత్య దశలో ఉంటే ఆదేశ ఆర్థిక వృద్ధి పరిమితంగా ఉంటుంది. ఒక ఆర్థిక వ్యవస్థ ఉత్పత్తి సామర్థ్యాన్ని అన్ని రకాల వనరులు కలిసి పెంచుతాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో అధిక జనాభా ఉంటుంది.

ఎ) వనరులను వినియోగించలేకపోవడం:
చాలా పేద దేశాలలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. కాని వాటిని చాలా దేశాలు వినియోగించుకోవడం లేదు. దీనికి గల కారణం ఆ దేశాలలో పరిశోధన, అభివృద్ధి తక్కువగా ఉండడం, సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉండడం, మూలధన కల్పన తక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల సహజ వనరులును సక్రమంగా, సమర్థవంతంగా వినియోగించలేకపోతున్నాయి.

బి) వనరుల నిర్వహణలో అసమర్థత :
వెనుకబడిన దేశాలు ఉత్పాదక సామర్థ్యం మరియు ఆర్థిక వనరుల కేటాయింపు సామర్థ్యాన్ని కలిగి ఉండవు. ఈ దేశాలలో రాజకీయ కారణాలతో ఉత్పాదక సామర్థ్యాన్ని సరియైన స్థాయిలో వినియోగించుకోవడం లేదు.

అల్ప మానవ మూలధన వృద్ధి రేటు :
అభివృద్ధి చెందుతున్న దేశాల బడ్జెట్ లో విద్యకి, ఆరోగ్యానికి తక్కువ బడ్జెట్ కేటాయించడం జరుగుతుంది. దీనికి మూడు కారణాలు ఉన్నాయి. అవి :

  • అభివృద్ధి చెందిన దేశాలు దిగుమతి చేసుకొనే వ్యవసాయ ఉత్పత్తులపై విధించే ఆంక్షల వల్ల ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గడం
  • జాతీయాదాయంలో ఎక్కువ మొత్తం ప్రపంచ బాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి అప్పులు తీర్చడానికి వినియోగించడం
  • రుణాల రీషెడ్యూలుకు సంబంధించింది. ఈ దేశాలలోని ఆర్థిక సంస్థలు మిత వ్యయ చర్యలను ప్రకటించడం జరుగుతుంది.

విద్యకు తక్కువ నిధులు కేటాయించడం వల్ల చాలా మందికి చదవటం రాకపోవడం, రాయడం తెలియకపోవడం, కనీస గణిత అవగాహన లేకపోవడం, ఆధునిక ఎలక్ట్రానిక్ ఉపకరణాలను వాడలేకపోవడం జరుగుతుంది. మానవ మూలధనం నిరుపయోగంగా ఉంటుంది.

అవస్థాపనా సదుపాయాల కొరత :
అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉండే అప్పులు, తత్సంబంధ మిత వ్యయ చర్యల కారణంగా ఈ దేశాల్లో అవస్థాపనా సౌకర్యాల కల్పన అనేది క్లిష్టతరంగా మారింది. రవాణా టెలికమ్యూనికేషన్ల అభివృద్ధి అనేవి విదేశీ పెట్టుబడులను ఆకర్షించే రెండు కీలక రంగాలు. వీటితో పాటుగా రోడ్లు, బ్రిడ్జిలు, ఓడరేవులు, రైల్వేలు అభివృద్ధి వస్తువులను సమయానుకూలంగా చేరవేయడంలో ముఖ్యపాత్ర వహిస్తాయి. కాని ఈ సౌకర్యాల కొరత వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది.

పేదరిక విషవలయం (Vicious Circle of Poverty) :

TS Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి 1

1950 సంవత్సరం నుంచి ప్రధానంగా వెనుకబడిన దేశాలు పేదరికపు విషవలయాల్లో చిక్కుకొని వేగవంతమైన అభివృద్ధిని సాధించలేక పోతున్నాయి. పేదరికమనేది మానసిక ఒత్తిడితో పాటు నైతికంగా కూడా మనిషిని దిగజారుస్తుంది. దీని ఫలితంగా మూలధన కొరతను ఎదుర్కోవడం వల్ల తక్కువ ఉత్పాదకత కల్పించబడుతుంది. తక్కువ ఉత్పాదకతకు కారణం తక్కువ ఆదాయం. పేదరిక విషవలయాల ఛాయా చిత్రాన్ని ప్రక్క పటంలో చూపించవచ్చు.

5. అల్ప మూలధన సమీకరణ రేటు :
అల్పాభివృద్ధి చెందిన దేశాలలోని ప్రజలు బీదవాళ్ళేగాక, ఎక్కువ మంది నిరక్షరాస్యులు, నైపుణ్యం లేనివారు, పురాతన యంత్రాలను మరియు ఉత్పత్తి పద్ధతులను వాడుతుంటారు. ప్రజల ఉపాంత ఉత్పాదక శక్తి బాగా తక్కువ కాబట్టి అల్ప నిజాదాయం, అల్ప పొదుపు, అల్ప పెట్టుబడి, అల్ప మూలధన సమీకరణ రేటు ఉంటాయి. కొద్ది స్థాయిలో ప్రజలు పొదుపు చేయగలిగినా దానిని కరెన్సీ రూపంలోనే దాచిపెట్టుకోవడం గాని, బంగారం మొదలగు వాటిని కొనుగోలు చేయడానికి గాని వాడడం జరుగుతుంది.

6. సామాజిక, సాంస్కృతిక అవరోధాలు :
సామాజిక సంస్థలు, వాటి దృక్పథాలు, సంప్రదాయ నమ్మకాలు మరియు విలువలు, దృఢమైన వృత్తుల విభజన, పొదుపు చేయడానికి మరియు పెట్టుబడి పెట్టడానికి ప్రజల ఉద్దేశాలు, సామాజిక విధులకు చేసే వ్యయం, బందుప్రీతి, అసమర్ధ మరియు చెడు పరిపాలన, లంచగొండితనము, విద్య విషయంలో సామాజిక దృక్పథం, శారీరక శ్రమ విషయంలో ప్రతికూలాభిప్రాయం, ప్రాచీన మతాలు, తీరికకు అధిక విలువనివ్వడం, ఖర్మ సిద్ధాంతాన్ని గ్రుడ్డిగా పాటించడం మొదలగునవి ఆర్థికాభివృద్ధికి అనుకూలంగా లేవు.

7. వ్యవసాయ అవరోధం :
అభివృద్ధి చెందుతున్న దేశాలలో అధికం ప్రధానంగా వ్యవసాయాధార దేశాలు. వీటి స్థూల దేశీయ ఉత్పత్తిలో ఎక్కువ వాటా వ్యవసాయ ఉత్పత్తిదే. అట్లాగే ఎగుమతుల విలువలో అధికం వ్యవసాయ వస్తువుల నుంచే వస్తుంది. వ్యవసాయ రంగం అధిక ఉద్యోగితను కూడా సృష్టిస్తుంది. అందుబాటులో ఉన్న సాంకేతికతను రైతులు ఉపయోగించడం, ఉత్పత్తికి, పెట్టుబడికి ప్రోత్సాహకాలు, ఉత్పాదకాల లభ్యత మరియు వాటి ధరలు, నీటి పారుదల సౌకర్యాల ఏర్పాటు, వాతావరణం, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు మొదలగు అంశాలకు సంబంధించి అవరోధాలున్నాయి.

8. విదేశీ మారక ద్రవ్య అవరోధం :
అల్పాభివృద్ధి చెందిన దేశాల ఎగుమతులు బాగా పెరిగినా, ఇతర రంగాలను ఉపేక్షించి ఎగుమతుల రంగాన్ని అభివృద్ధి చేసినందువల్ల, ఇది అభివృద్ధికి ఎక్కువగా తోడ్పడలేదు. ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడితే మన వస్తువులకున్న డిమాండ్, వాటికున్న ధరలపై అంతర్జాతీయ ఒడుదుడుకుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 5.
ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించే కారకాలను వివరించండి.
జవాబు.
ఒక దేశ ఆర్థికాభివృద్ధిని ప్రధానంగా రెండు రకాలు కారకాలు ప్రభావితం చేస్తాయి. అవి :

  1. ఆర్థికపరమైన కారకాలు.
  2. ఆర్థికేతర కారకాలు.

TS Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి 2

ఆర్థికపరమైన కారకాలు :
ఆర్థికాభివృద్ధిలో ఆర్థికపరమైన కారకాల పాత్ర నిర్ణయాత్మకమైంది. నిర్ణీత కాలంలో ఒక దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందా? లేదా నెమ్మదిగా అభివృద్ధి చెందుతుందా? అనే వాటిని ఆ దేశంలో ఉన్న మూలధన నిల్వ మరియు దాని విలువ ప్రధానంగా నిర్ణయిస్తాయి. జనాభాకు సరిపడే ఆహార ధాన్యాలు, విదేశీ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ స్వభావం మొదలైన కారకాలు కూడా ఆర్థికాభివృద్ధిలో ప్రధానమైనవే.

1. మూలధన కల్పన :
అర్థశాస్త్ర విశ్లేషణలో ఉత్పత్తి స్థాయిని పెంచడంలో మూలధన కల్పన పాత్ర కీలకమైంది. విశ్వ వ్యాప్తంగా వివిధ దేశాలు వచ్చిన ఆదాయంలో పొదుపుల ద్వారా గాని విదేశీ పెట్టుబడుల ద్వారా గానీ వృద్ధిని సాధించడం జరిగింది.

2. సహజ వనరులు :
ఒక దేశ ఆర్థికాభివృద్ధిని నిర్ధారించు ప్రధాన కారకం ఆ దేశంలో లభ్యమయ్యే సహజ వనరులు. భూమి, భూసారం, అటవీ సంపద, మంచి నదీ వ్యవస్థ, చమురు వనరులు, మంచి వాతావరణం, జీవావరణ వ్యవస్థ మొదలైనవి సహజ వనరులలోనికి వస్తాయి. ఆర్థికపరమైన వృద్ధికి విస్తారమైన వనరుల లభ్యత అనేది ఆవశ్యకమైంది.

3. వ్యవసాయ రంగం :
ఆర్థికాభివృద్దిలో భూమి యాజమాన్యంతో పాటుగా వ్యవసాయం చేసే పద్ధతి అనేది ముఖ్యమైన పాత్రని నిర్వహిస్తుంది. భూసంస్కరణలు, వ్యవసాయంలో ఆధునికీకరణ, సాంకేతికపరమైన మార్పులు ఆర్థిక రంగంలో వేగవంతమైన వ్యవసాయ వృద్ధికి దోహదపడతాయి.

4. మార్కెట్లో విక్రయం కాగల వ్యవసాయ మిగులు (Marketable surplus) :
ఉత్పాదకతను పెంచే క్రమంలో వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం అనేది ఒక దేశ అభివృద్ధిలో ముఖ్యమైన ప్రక్రియ. కానీ మార్కెట్లో విక్రయం కాగల వ్యవసాయ మిగులును పెంచడం’ అనేది దానికంటే ముఖ్యమైనది. గ్రామీణ జనాభా తమ మనుగడకు కావాల్సిన ఉత్పత్తి కంటే ఎక్కువగా లభించగల వ్యవసాయోత్పత్తిని మార్కెట్లో విక్రయంకాగల వ్యవసాయ మిగులు అంటారు. కాని వ్యవసాయ రంగ పురోగతిని మార్కెట్లో విక్రయం చేసిన వ్యవసాయ మిగులు ద్వారా సూచిస్తారు.

5. పారిశ్రామిక నిర్మాణం :
భారీ, చిన్న తరహా, కుటీర పరిశ్రమలు వాటి సాపేక్షిక ప్రాధాన్యతను వాటిలో ఉపయోగించే సాంకేతిక స్థాయిని కోరుకుంటాయి. అభివృద్ధి చెందిన ఆధునిక సాంకేతికతలను అభివృద్ధి చెందుతున్న దేశాలలో వినియోగించడంవల్ల ఆధునికీకరణ ఏర్పడి వ్యవస్థ నిర్మితిలో మార్పు వస్తుంది. ఫలితంగా అధిక ఆర్థిక అభివృద్ధికి దారితీస్తుంది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి

6. వ్యవస్థాపరమైన మార్పులు :
సంస్థలలో, సాంఘిక దృక్పథాలలో, ప్రేరేపణలలో విప్లవాత్మక మార్పుల ద్వారా సంప్రదాయ వ్యవసాయక సమాజం నుంచి ఆధునిక పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థకు మారడాన్ని వ్యవస్థాపరమైన మార్పులంటాం. ఈ మార్పుల వల్ల ఉద్యోగ అవకాశాలు పెరగడం, శ్రామిక ఉత్పాదకత పెరగడం, మూలధన రాశి పెరగడం, నూతన వనరులను ఉపయోగించడం, సాంకేతిక మెరుగుదల జరుగుతాయి.

7. వ్యవస్థాపన :
వృద్ధి ప్రక్రియకు సంబంధించి ఇదొక ముఖ్యమైన అంశం. ఆర్థిక కార్యకలాపాలలో ఉత్పత్తి కారకాలను అభిలషణీయంగా ఉపయోగించడానికి సంబంధించినదే వ్యవస్థాపన. ఉద్యమదారుడు వ్యవస్థాపకుడు నిర్వహించే విధులను నిర్వర్తిస్తూ, వ్యాపారంలోని నష్టభయాన్ని, అనిశ్చితలను ఎదుర్కొంటున్నాడు. అల్పాభివృద్ధి చెందిన దేశాలలో ఉద్యమిత్వ చర్యలు లేవు. అందువల్ల వెనుకబడిన దేశాలు ఉద్యమిత్వాన్ని ప్రోత్సహించే వాతావరణాన్ని కల్పించాలి. దీనికొరకు అవసరమైన సామాజిక, ఆర్థిక, సాంకేతిక సంస్థలను ఏర్పాటు చేయడం అవసరం.

8. సాంకేతిక ప్రగతి :
నూతన పరిశోధన లేదా నవకల్పనల మూలంగా ఉత్పత్తి పద్ధతులలో మార్పులు రావడమే సాంకేతిక మార్పులు. సాంకేతిక మార్పుల వల్ల శ్రమ, మూలధనం, ఇతర ఉత్పత్తి కారకాల ఉత్పాదకత పెరుగుతుంది. ఘంపీటర్, కుజ్నెట్ ఆర్థిక వృద్ధిలో నవకల్పనను అతి ముఖ్యమైన సాంకేతిక కారకంగా పరిగణించారు. పరిశోధన మరియు అభివృద్ధి పైన జాతీయ ఆదాయంలో ఎక్కువ శాతాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది.

9. శ్రమ విభజన :
ప్రత్యేకీకరణ, శ్రమ విభజన వల్ల ఉత్పాదకత పెరుగుతుంది. అంతేకాక పెద్ద తరహా ఉత్పత్తి ఆదాలు ఏర్పడి, ఆర్థికాభివృద్ధి రేటు పెరుగుదలకు తోడ్పడతాయి. ఆడమ్ స్మిత్ ఆర్థికాభివృద్ధిలో శ్రమ విభజనకు అధిక ప్రాముఖ్యత నిచ్చాడు. శ్రమ విభజన మార్కెటు పరిమాణం పైన ఆధారపడుతుంది. పెద్ద తరహా ఉత్పత్తి ఉన్నప్పుడు ప్రత్యేకీకరణ, శ్రమ విభజన అధికమవుతాయి. ఆధునిక రవాణా, కమ్యూనికేషన్స్ సాధనాలను ఏర్పాటు చేయడం వల్ల మార్కెటును విస్తృతం చేసి తద్వారా అల్పాభివృద్ధి చెందిన దేశాలలో వృద్ధి ప్రక్రియను వేగవంతం చేయవచ్చు.

10. విదేశీ వర్తకం :
సాధ్యమైనంత త్వరగా అభివృద్ధి చెందుతున్న దేశాలు మూలధన పరికరాలలోనూ, పారిశ్రామిక ఉత్పత్తులలోనూ స్వావలంబనను సాధించే ప్రయత్నం చేయడమే కాకుండా ప్రాథమిక ఉత్పత్తుల ఎగుమతులకు బదులుగా పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులు ఉండే స్థాయికి పరిశ్రమల అభివృద్ధిని బాగా పెంచాలి. భారతదేశం వంటి ఆర్థిక వ్యవస్థలలో స్థూల ఆర్థిక అంతర్ సంబంధాలకు ప్రాధాన్యత ఉంది. ఈ దేశ సమస్యలకు పరిష్కారం కేవలం విదేశీ వర్తక రంగం ద్వారా ఉండదు.

11. ఆర్థిక వ్యవస్థ :
ఒక దేశ ఆర్థిక వ్యవస్థ, ఆ దేశ చారిత్రక ఏర్పాటు అభివృద్ధిని నిర్ణయిస్తాయి. ఒక దేశ ఆర్థిక వృద్ధిలో స్వేచ్ఛా వాణిజ్య విధానం అమలులో ఉన్న కాలంలో ఏ విధమైన ఆటంకాలు ఏర్పడ లేదు. అయితే మారిన నేటి కాల పరిస్థితులలో ఇదే అభివృద్ధి వ్యూహంతో ఒక దేశం వృద్ధి చెందటం కష్టతరం.

b) ఆర్థికేతర కారకాలు :
అభివృద్ధిలో ఆర్థికేతర కారకాలు కూడా ఆర్థిక కారకాలతో సమ ప్రాధాన్యాన్ని కలిగి ఉంటాయనేది స్పష్టం. ఆర్థికాభివృద్ధి ప్రక్రియను ఇవి ఏ విధంగా ప్రభావితం చేస్తాయో తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.

1. మానవ వనరులు :
ఆర్థికాభివృద్ధిలో మానవ వనరులు అనేవి ముఖ్యమైన కారకాలు. ఉత్పత్తి కోసం మానవులు శ్రామికులుగా పని చేయడం జరుగుతుంది. ఒక దేశ శ్రామికులలో సామర్థ్యం, నైపుణ్యం అధికంగా ఉంటే ఆ దేశం యొక్క వృద్ధి అధికంగా ఉంటుంది. నిరక్షరాస్యుల, అవివేకుల, నైపుణ్యం లేనివారి, వ్యాధిగ్రస్తుల, మూఢ విశ్వాసం గలవారి ఉత్పాదకత సహజంగానే తక్కువ.

ఒక దేశ అభివృద్ధికి వీరి తోడ్పాటు అధికంగా ఉండదు. మానవ వనరులు నిరుపయోగంగా ఉన్నా లేదా శ్రామిక నిర్వహణ లోపభూయిష్టంగా ఉన్నా ఇది ఆ దేశానికి భారంగా ఉంటుంది. శ్రామిక శక్తి సామర్థ్యం లేదా ఉత్పాదకత ఆరోగ్యం, విద్య, సామాజిక సేవలపైన ఆధారపడుతుంది. మానవుడు ఉత్పత్తి ప్రక్రియలో నూతన మార్గాలు అవలంబించడం జరిగి దానివల్ల ఆ దేశ ఉత్పాదకత పెరుగుతుంది.

ఉద్యమదారులు ప్రవేశపెట్టే నవకల్పనలను ఘంపీటర్ అనే ఆర్ధిక శాస్త్రవేత్త బాగా మెచ్చుకొని, పెట్టుబడి దారీ విధాన అభివృద్ధికి ఈ ఉద్యమదారులు ఎంతో దోహదం చేశారని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ నైపుణ్యాన్ని సంతరించుకున్నందువల్ల, దీనిని ఇంకా మెరుగుపర్చడానికి పరిశోధన మరియు అభివృద్ధికి ఇంకా ఎక్కువ శ్రద్ధ అవసరం. ఉదాహరణకు, ఆధునిక కాలంలో ఇంటర్నెట్ (అంతర్జాలం) అనే గొప్ప నవకల్పన సమాచార, సాంకేతిక రంగంలో పెను మార్పులకు దారి తీసింది.

2. రాజకీయ, పరిపాలన సంబంధ కారకాలు :
ఆధునిక ఆర్థిక వృద్ధికి రాజకీయ, పరిపాలన సంబంధ కారకాలు కూడా సహాయపడ్డాయి. బ్రిటన్, జర్మనీ, యుఎస్, జపాన్, ఫ్రాన్స్ దేశాలలోని ఆర్థిక వృద్ధికి ముఖ్య కారణాలు వాటి రాజకీయ పటిష్టమైన పాలనలే. ఇటలీలో రాజకీయ అస్థిరత వల్ల, అవినీతి, బలహీన పరిపాలన వల్ల పై దేశాల స్థాయిలో వృద్ధి రాలేదు.

అభివృద్ధి చెందిన దేశాలలో శాంతి, రక్షణ స్థిరత్వం అనేవి ఉద్యమిత్వ అభివృద్ధిని ప్రోత్సహించడమే కాకుండా, సరియైన ద్రవ్య, కోశ విధానాలను అమలు చేసే అవకాశాన్ని ఏర్పర్చాయి. వెనుకబడిన దేశాలలో బలహీన పరిపాలన, రాజకీయ వ్యవస్థ ఆర్థికాభివృద్ధికి పెద్ద ఆటంకం. ఆర్థికాభివృద్ధిని అవినీతి లేని, పటిష్టమైన పరిపాలన, స్థిర రాజకీయ పరిస్థితులు ఉత్తేజపర్చుతాయి.

3. సామాజిక కారకాలు :
సామాజిక దృక్పథాలు, విలువలు, సంస్థలు కూడా ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేస్తాయి. వాస్తవ మానవ ప్రవర్తనకు కారణంగా ఉండే నమ్మకాలు, విలువలనే దృక్పథాలు అంటాం. ప్రత్యేక లక్ష్యాలకు సంబంధించి మానవ ప్రవర్తనా ఉద్దేశాలను విలువలు తెలుపుతాయి. అల్పాభివృద్ధి చెందిన దేశాలలో శీఘ్ర ఆర్థికాభివృద్ధికి విలువల ఆధునీకీకరణను అనుసరించాలని గున్నార్ మిర్థాల్ అన్నాడు.

అవి ఏవంటే ఆలోచనలో, చర్యలలో హేతుబద్ధత ఉండటం. అంటే ఉత్పాదకతను పెంచడానికి, జీవన స్థాయిలను పెంచడానికి, సామాజికార్థిక సమానత్వాన్ని సాధించడానికి ఉద్దేశపూర్వకంగానే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవడం, ఆధునిక సాంకేతికతను వాడడం.

విలువల ఆధునీకరణ వల్ల దృక్పథాలలో మార్పులు ఏర్పడి ఇవి ఆర్థిక వ్యవస్థలోని వ్యవసాయ, పారిశ్రామిక, సేవల రంగాలు అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి. అయితే ఉద్యమిత్వం లేనట్లయితే ఈ రంగాల అభివృద్ధి సాధ్యం కాదు. గున్నార్ మిర్డాల్ ప్రకారం అల్పాభివృద్ధి చెందిన దేశాలలో ఉద్యమిత్వం లేకపోవడానికి కారణం ఉద్యమిత్వానికి సంబంధించి సరియైన దృక్పథం కలిగిన వ్యక్తులు కొరతగా ఉండటమే. దృక్పథాలకు సంబంధించి విలువల ఆధునీకరణ ఆర్థికాభివృద్ధి సాధన లక్ష్యంతో ఉద్యమిత్వాన్ని వృద్ధి చేయాలి.

TS Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 6.
అభివృద్ధి చెందిన దేశాల లక్షణాలను చర్చించండి.
జవాబు.
అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలో మూలధన వనరుల పెరుగుదల, శ్రామికుల సామర్థ్యంలో వృద్ధి, అన్ని రంగాలలోని ఉత్పత్తులలో నాణ్యతా నిర్వహణ, రవాణా సమాచార రంగాలలో సౌకర్యాల అభివృద్ధి, బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలలో వృద్ధి, పట్టణీకరణ, జీవన ప్రమాణ స్థాయిలో పెరుగుదల, విద్య మరియు ఆయుఃప్రమాణ స్థాయిలలో అభివృద్ధి, అధిక విశ్రాంతి సమయం, అధికంగా వినోద కార్యక్రమాలు, మానసిక జ్ఞాన విస్తరణ మొదలైన లక్షణాలు ఉంటాయి. ఈ దేశాల్లో ఆర్థికాభివృద్ధి పేదరిక వలయాన్ని ఛేదించి స్వయం పోషకత్వాన్ని సాధిస్తుంది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల ముఖ్య లక్షణాలు కింది విధంగా ఉంటాయి.

1. సేవలు మరియు పారిశ్రామిక రంగాల ప్రాధాన్యత :
ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలు పారిశ్రామిక రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇచ్చాయి. ఉత్పతి వనరులను అన్నింటిని ఉపయోగించడానికి జాతీయాదాయాన్ని గరిష్టం చేయడానికి, నిరుద్యోగులకు ఉపాధిని కల్పించడానికి ఈ దేశాలు అధిక సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

రంగాల వాటాలను చూస్తే స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయేతర రంగాలైన పరిశ్రమలు, సేవల పాత్ర అధికంగా ఉంటుంది. ఉదాహరణకు, 2014లో ఇంగ్లండ్లో 79.6 శాతం వరకు స్థూల దేశీయోత్పత్తి సేవల రంగం నుంచి, 19.8 శాతం పరిశ్రమల నుంచి, 0.6 శాతం వ్యవసాయం నుంచి సమకూర్చబడింది. ఇదే విధంగా ఉద్యోగిత విషయానికొస్తే, 2011లో యు.కె.లో వ్యవసాయ రంగం నుంచి కేవలం 1 శాతం ఉద్యోగిత ఏర్పడితే, ఇది భారతదేశ వ్యవసాయ రంగంలో 47 శాతంగా ఉంది.

2. అధిక స్థాయిలో మూలధన కల్పన :
ఈ అభివృద్ధి చెందిన దేశాలలో స్థూల మూలధన సమీకరణ అధికంగా ఉంటుంది. బాగా అభివృద్ధి చెందిన మూలధన మార్కెట్లు, అధిక స్థాయిలో పొదుపులు, విస్తృత వ్యాపార అవకాశాలు, నవకల్పనలను బాగా ప్రవేశపెట్టే ఉద్యమిత్వం ఈ దేశాలలో మూలధన సమీకరణ అధికంగా ఉండటానికి దారితీసాయి. అధిక రేటులో స్థూల మూలధన సమీకరణ ఉన్నప్పుడు మాత్రమే ఆర్థికాభివృద్ధికి మార్గం ఏర్పడుతుంది.

స్థూల మూలధన కల్పన (GDP లో శాతం):

దేశం19902018
అమెరికా1821
యు.కె.2017
జర్మనీ2422
జపాన్3324
చైనా3544

3. ఆధునిక ఉత్పత్తి పద్ధతులను, నైపుణ్యాలను ఉపయోగించడం :
అభివృద్ధి చెందిన దేశాల ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో ఆధునిక ఉత్పత్తి పద్ధతులు, నైపుణ్యాలు ముఖ్యమైన భాగంగా మారాయి. ఈ దేశాలలో నూతన మరియు అభివృద్ధి పరిచిన పద్ధతులను వినియోగించడం ద్వారా భౌతిక మానవ వనరులను ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ దేశాలు ఉత్పత్తి పద్ధతులను మెరుగుపర్చడానికి, నూతనమైన ఉత్పత్తి పద్ధతులను అభివృద్ధి చేయడానికి శాస్త్రీయ పరిశోధనలకు ప్రాధాన్యతను ఇస్తున్నాయి.

ముఖ్యమైన ప్రశ్న ఫలితంగా అధిక నాణ్యత గల వస్తువులను, సేవలను అతి తక్కువ వ్యయానికి ఉత్పత్తి చేయగలుగుతున్నాయి. 2015లో స్విట్జర్లాండ్ తన స్థూల దేశీయోత్పత్తిలో 3.37 శాతాన్ని పరిశోధన, అభివృద్ధిపై ఖర్చు చేస్తే, భారతదేశపు వ్యయం 0.62 శాతం మాత్రమే.

పరిశోధన, అభివృద్ధిపై ఖర్చు:

దేశం2017 సంవత్సరానికి ఆర్ & డి పై ఖర్చు (శాతాలలో)
యు.ఎన్.ఎ2.80
యు.కె1.67
స్విట్జర్లాండ్3.37 (2015)
జర్మనీ3.04
జపాన్3.20
భారతదేశం0.62 (2015)
చైనా2.13

 

TS Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి

4. తక్కువ జనాభా వృద్ధి :
అభివృద్ధి చెందిన దేశాలు యు.ఎస్.ఏ., యు.కె., పశ్చిమ యూరోపియన్ దేశాల వంటి వాటిల్లో అల్ప జననాల రేటు, అల్ప మరణాల రేట్ల కారణంగా తక్కువ జనాభా వృద్ధి నమోదవుతుంది. మెరుగైన ఆరోగ్య పరిస్థితులు, అధిక స్థాయి విద్య, ప్రజల వినియోగంలో అధిక స్థాయి తక్కువ జనాభా వృద్ధికి దారితీసాయి. ఈ దేశాలలో ఆయుః ప్రమాణం కూడా చాలా అధికంగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాలలో జనాభా సగటు వార్షిక వృద్ధి రేటు 0.7 శాతమయితే అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇది 2 శాతంగా ఉంది.

అభివృద్ధి చెందిన దేశాలలో ఆయుఃప్రమాణం పుట్టుక సమయంలో సగటున 75 సంవత్సరాలు. ఫలితంగా ఈ దేశాల ప్రజల జీవన ప్రమాణ స్థాయి మరింత పెరిగి వీరు ఈ దేశాల అతివేగవంతమైన పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధికి ఐక్యంగా పనిచేస్తారు. దీనికి అదనంగా ఇక్కడి సమాజం, దాని నిర్మాణం, విలువలు వేగవంతమైన పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి దోహదపడేవిగా ఉంటాయి. ఇక్కడ కార్మికులకు గౌరవం ఉంటుంది.

5. అధిక తలసరి స్థూల జాతీయాదాయం (కొనుగోలు శక్తి సమానత) :
అభివృద్ధి చెందిన దేశాల ముఖ్య లక్షణాలలో అధిక తలసరి జాతీయాదాయం ఉండటం ఒకటి.

మార్కెట్ ధరల దృష్ట్యా తలసరి స్థూల జాతీయాదాయం డాలర్లలో (కొనుగోలు శక్తి సమానత), 2018:

దేశంతలసరి స్థూల జాతీయాదాయం
యు.ఎస్.ఎ.63,690
యు.కె45,350
స్విట్జర్లాండ్68,820
జర్మనీ54,560
జపాన్44,380
చైనా18,170
భారతదేశం7,680

 

పట్టిక ప్రకారం 2018 సంవత్సరానికి గాను తలసరి స్థూల జాతీయాదాయం యు.ఎస్.ఎ.కి 63, 690 డాలర్లు, యు.కె. కి 45,350 డాలర్లు, స్విట్జర్లాండ్కి 68,820 డాలర్లు, భారతదేశానికి 7,680 డాలర్లు ఉండటాన్ని బట్టి అభివృద్ధి చెందిన దేశాలలో అధిక తలసరి స్థూల జాతీయాదాయం ఉంది.

ఒక వస్తువు సముదాయాన్ని కొనుగోలు చేయడానికి ఒక కరెన్సీలో ఎంత వ్యయమవుతుందో, అదే వస్తువు సముదాయాన్ని ఇంకొక విదేశీ కరెన్సీలో కోనుగోలు చేసేందుకు అయ్యే వ్యయంతో తులనాత్మక పరిశీలన చేసి ఆయా కరెన్సీల కొనుగోలు శక్తి ఆధారంగా తలసరి స్థూల జాతీయాదాయాన్ని అంచనా వేయడం ద్వారా వివిధ దేశాలను సాపేక్షికంగా పరిశీలిస్తాం. కొనుగోలు శక్తి సమానత (Purchasing power parity) ఆధారంగా 2018లో యు.ఎస్.ఎ.లో సగటు తలసరి స్థూల జాతీయాదాయం ఇండియాలోని దానికంటే 8.3 రెట్లు ఎక్కువ.

TS Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 7.
భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలను విమర్శనాత్మకంగా విశ్లేషించండి.
జవాబు.
భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలు :
అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి సాధారణంగాను, భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రత్యేకంగాను కింది లక్షణాలుంటాయి :

1. అల్ప తలసరి ఆదాయం :
అల్ప తలసరి స్థూల జాతీయోత్పత్తి బీదరికాన్ని ప్రతిబింబించుతుంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలను పరిశీలించడానికి సాపేక్ష పేదరికానికి బదులుగా నిరపేక్ష పేదరికమే చాలా ముఖ్యం. నిరపేక్ష పేదరికాన్ని కేవలం అల్ప ఆదాయంతో మాత్రమే కాకుండా పోషకాహార లోపం, అనారోగ్యం, వస్త్ర మరియు గృహ సౌకర్యాలు సరిగా లేకపోవడం, విద్య లేకపోవడం అను అంశాలతో కూడా కొలుస్తాం.

కైర్న్ క్రాస్ (Cairncross) ప్రకారం “అల్పాభివృద్ధి చెందిన దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చెందిన మురికివాడలు”. 1995-96 సంవత్సరంలో భారతదేశ తలసరి నికర జాతీయోత్పత్తి రూ.9,300. 2012-13 సంవత్సరానికి ఇది రూ.22,000.

ప్రపంచ దేశాలతో పోల్చితే తక్కువ విలువలలో ఇదొకటి. 133 దేశాలలో భారతదేశ స్థానం 110. 2018లో కొనుగోలు శక్తి సమానత ఆధారంగా భారతీయుని తలసరి స్థూల జాతీయాదాయం $ 7680. ఇదే సంవత్సరంలో యు.ఎస్.ఏ. లోని సగటు తలసరి స్థూల జాతీయాదాయం భారతదేశంలోని దానికి 8.3 రెట్లుగా ఉంది.

ఉదాహరణకు రంగరాజన్ కమిటీ అంచనాల ప్రకారం 2011-12 సంవత్సరంలో భారతదేశంలో 29.5 శాతం ప్రజలు పేదరిక రేఖకు దిగువన ఉండి, కనీస పోషకాహారాన్ని కూడా తీసుకోలేక పోతున్నారు. జీవన ప్రమాణ స్థాయి తక్కువగా ఉండటంవల్ల శ్రామిక సామర్థ్యం కూడా తక్కువగా ఉంటుంది.

2. వ్యవసాయ రంగ ప్రాధాన్యత :
అభివృద్ధి చెందుతున్న దేశాలలో 2/3వ వంతు లేదా అంతకు మించి ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం. వ్యవసాయం ఎక్కువగా అనుత్పాదకంగా ఉంటుంది. ఇటువంటి దేశాలు ప్రధానంగా ముడి సరుకులను, ఆహార ఉత్పత్తులను ఉత్పత్తి చేయడంలో ప్రత్యేకీకరణను కలిగి ఉంటాయి. అల్పాభివృద్ధి చెందిన దేశం ప్రాథమిక రంగ ఆర్థిక వ్యవస్థగా ఉంటుంది. అయితే ద్వితీయ రంగం, సేవల రంగం రెండూ వెనకబడి (అల్పాభివృద్ధి చెంది) ఉంటాయి.

భారతదేశంలో 2017లో 42.7 శాతం శ్రామికులు వ్యవసాయంలో నిమగ్నమయినారు. అదే విధంగా 2019-20లో స్థూల జోడించబడిన విలువ (Gross Value Added) లో 16.5 శాతం వ్యవసాయం నుంచి రావడం జరిగింది (Economic Survey, 2019-20). నీటి పారుదలకు ముఖ్య ఆధారం వర్షాలే. వ్యవసాయ రంగంలో సంప్రదాయ సాంకేతికతను వాడుతుంటారు. అయితే ఆధునికీకరణ నెమ్మదిగా జరుగుతుంది.

3. మూలధన లోటు :
అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల మరొక లక్షణం మూలధన పరికరాలు సరిపడే పరిమాణంలో లేకపోవడం. అభివృద్ధి చెందుతున్న దేశాలు “మూలధన బీద లేక అల్ప పొదుపు మరియు అల్ప పెట్టుబడి” ఆర్థిక వ్యవస్థలుగా ఉంటున్నాయి. తక్కువ ఆదాయ స్థాయి తక్కువ పొదుపుకు దారి తీస్తుంది.

దీని కారణంగా తక్కువ మూలధన కల్పన ఏర్పడుతుంది. మూలధన లోటు కారణంగా శ్రామికులు, సహజ వనరులు లాంటి ఇతర వనరులు నిరుపయోగంగా ఉంటాయి. రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక నివేదిక, 2019 ప్రకారం 2017-18లో ప్రస్తుత ధరల ప్రకారం స్థూల దేశీయ పొదుపు రేటు 30.1 శాతంగా ఉంటే, స్థూల దేశీయ పెట్టుబడి రేటు 32.3 శాతంగా ఉంది.

4. సాంకేతికంగా వెనుకబడి ఉండటం :
పురాతన పద్దతులను విసర్జించే ప్రక్రియకు, ఆధునిక పద్ధతులను అనుసరించడంలోను మూలధన కొరత అడ్డంకిగా ఉంది. నిరక్షరాస్యత, నైపుణ్యం ఉన్న శ్రామిక శక్తి లేకపోవడం అనేవి వెనుకబడిన ఆర్థిక వ్యవస్థలలో ఆధునిక పద్ధతులు విస్తరించడానికి గొప్ప అవరోధాలుగా ఉన్నాయి. ఆర్థిక వెనుకబాటుతనానికి సాంకేతిక వెనుకబాటుతనం కారణంగా ఉండటమే కాకుండా, దాని ఫలితంగా కూడా ఉంది. భారతదేశంలో అల్పఉత్పాదకత సాంకేతిక వెనుకబాటుతన పర్యవసానమే.

5. తక్కువ అవస్థాపనా సదుపాయాలు :
బ్యాంకింగ్, విద్య, ప్రజా ఆరోగ్యం, తాగునీరు, మురుగు నీటి పారుదల, సాగునీరు, ఎద్యుత్, రవాణా, సమాచారం మొదలైనవి అవస్థాపనా సదుపాయాల కిందకి వస్తాయి. ఒక దేశ వ్యవసాయ, పారిశ్రామిక, సేవల రంగాల అభివృద్ధికి ఈ సౌకర్యాలు అతి ముఖ్యమైనవి. పై సదుపాయాలన్నీ భారతదేశంలో ఆశించిన స్థాయిలో లేవు.

6. జనాభా లక్షణాలు :
అభివృద్ధి చెందుతున్న దేశాలలో జనాభా సగటు వార్షిక వృద్ధిరేటు 2 శాతం ఉంటే, అభివృద్ధి చెందిన దేశాలలో ఇది సుమారుగా 0.7 శాతంగా ఉంది. 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న జనాభా శాతం అభివృద్ధి చెందుతున్న దేశాలలో దాదాపుగా 40 ఉంటే ఇది అభివృద్ధి చెందిన దేశాలలో 20 నుంచి 25 శాతం ఉంది.

అభివృద్ధి చెందిన దేశాలలో పుట్టుక సమయంలో సగటు ఆయుఃప్రమాణం సుమారుగా 51 సంవత్సరాలయితే అభివృద్ధి చెందిన దేశాలలో ఆయుః ప్రమాణం 75 సంవత్సరాలుగా ఉంది. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఆయుఃప్రమాణం 68.5 సంవత్సరాలు. 2019 మానవ అభివృద్ధి రిపోర్టు ప్రకారం 2018లో భారతదేశంలో ఆయుఃప్రమాణం 69.4 సంవత్సరాలుగా ఉంది.

భారతదేశంలో 2006లో చదరపు కిలోమీటరుకు జనాభా సాంద్రత 373 అయితే, యు.ఎస్. ఏ లో ఇది 33 గాను, చైనాలో 141 గాను ఉంది. మనదేశంలో 2010లో 1000 జననాలకు సంవత్సరంలోపు వయస్సున్న శిశు మరణాల రేటు 44గా ఉంది. ఇది వైద్య సదుపాయాల కొరతను, అల్పస్థాయి పోషకాహారాన్ని. దైన్య పారిశుద్ధ్య సదుపాయాలను చూపిస్తుంది.

భారతదేశంలో జనాభా చాలా అధికంగా ఉంది. 2014లో జనాభా 129.5 కోట్లు. మన జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం సంవత్సరానికి 1.64 శాతం చొప్పున పెరుగుదలను కలిగి ఉంది. 1971 నుంచి అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నప్పటికీ జననాల రేటు అశించిన స్థాయిలో తగ్గకపోవడం, మరణాల రేటు బాగా తగ్గడం జరిగింది. అధిక మొత్తంలో జనాభా వృద్ధి పెరగడం వల్ల వనరుల పై మరింత ఒత్తిడి పెరుగుతుంది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి

7. అధిక నిరక్షరాస్యత రేటు :
భౌతిక మూలధనమేగాక ప్రజలు పొందిన జ్ఞానం, శిక్షణ కూడా మూలధనంలో భాగమే. విచారించాల్సిన విషయం ఏమంటే, ఆయుఃప్రమాణం, వయోజన అక్షరాస్యత, విద్యా సంస్థలలో సమ్మిళిత నమోదు నిష్పత్తి యు.ఎస్. డాలర్ల రూపంలో తలసరి వాస్తవ స్థూల దేశీయోత్పత్తి అంశాల ఆధారంగా నిర్మితమయ్యే మానవ అభివృద్ధి సూచికకు సంబంధించి HDI, 2019 రిపోర్టు ప్రకారం 2018లో భారతదేశం 129వ స్థానాన్ని పొందడం.

భారతదేశంలో నిరక్షరాస్యత రేటు 1951 నుంచి గణనీయంగా తగ్గింది. పురుషులతో పోల్చితే మహిళలలో ఈ రేటు అధికంగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇండియాలో అక్షరాస్యత రేటు, పురుషుల అక్షరాస్యత రేటు, స్త్రీల అక్షరాస్యత రేటు (శాతం) వరుసగా 74.0, 82.14, 65.5గా ఉన్నాయి.

8. ద్వంద ఆర్థిక వ్యవస్థ :
అభివృద్ధి చెందిన పారిశ్రామిక వ్యవస్థ, దేశీయ వెనుకబడిన వ్యవసాయ వ్యవస్థ ఈ రెండూ ఉన్నప్పుడు కూడా ద్వైవిద్యం (dualism) ఉంటుంది. పారిశ్రామిక రంగం మూలధన సాంద్రత పద్ధతులను ఉపయోగించి వివిధ రకాల మూలధన వస్తువులను, అనశ్వర వినియోగ వస్తువులను తయారు చేస్తుంది. గ్రామీణ రంగం పురాతన పద్ధతులను ఉపయోగించి వ్యవసాయక వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. విత్త ద్వైవిద్యాన్ని కూడా చూడవచ్చు.

ఇది ఋణాలపై చాలా అధిక వడ్డీ రేట్లు ఉండే అసంఘటిత ద్రవ్య మార్కెటును, తక్కువ వడ్డీ రేట్లు మరియు అధిక పరపతి సౌకర్యాలుండే సంఘటిత ద్రవ్య మార్కెటును తెలుపుతుంది. ద్వంద ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యకరమైన ఆర్థిక ప్రగతికి అనుకూలం కాదు. ద్వితీయ రంగంలోను, సేవల రంగంలోను, వృద్ధిని ప్రాథమిక రంగం నిషేదిస్తుంది.

9. అల్పాభివృద్ధి చెందిన సహజ వనరులు :
సాంకేతికతలో, సామాజిక మరియు ఆర్థిక వ్యవస్థలో తగినటువంటి మార్పులు చేసి సహజ వనరుల కొరత సమస్యను అధిగమించడంలో అల్పాభివృద్ధి చెందిన దేశాలు విజయవంతం కాలేదు. సహజ వనరులు అల్పాభివృద్ధి చెందాయి (నిరుపయోగంగా ఉండటం, అల్ప వినియోగం చేయడం, దుర్వినియోగం చేయడం). దీనికి కారణాలు సహజ వనరులు అందుబాటులో లేకపోవడం, సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం, మూలధన లభ్యత లేకపోవడం, మార్కెటు చిన్నదిగా ఉండటం అని చెప్పవచ్చు.

10. ఉద్యమిత్వం కొరతగా ఉండటం :
అల్పాభివృద్ధి చెందిన దేశాల మరొక లక్షణం ఉద్యమిత్వ సామర్థ్యం కొరతగా ఉండటం. సామాజిక వ్యవస్థ సృజనాత్మక బుద్ధులను ఉపయోగించుకొనే అవకాశాలను కల్పించకపోవడం వల్ల, ఉద్యమిత్వం అభివృద్ధి చెందదు. మార్కెటు పరిమాణం చిన్నదిగా ఉండటం, మూలధన కొరత, అవస్థాపన సౌకర్యాల కొరత, సాంకేతిక వెనుకబాటుతనం, ప్రైవేటు ఆస్తి ఉండకపోవడం, ఒప్పందాలు చేసుకొనే స్వేచ్ఛ ఉండకపోవడం, శాంతి భద్రతల సమస్య అనే అంశాలు అన్నీ సాహస చర్యలకు, అరంభయత్నాలకు ప్రతిబంధకాలుగా ఉంటాయి.

11. నిరుద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగిత:
భారతదేశంలో నిరుద్యోగిత సంస్థాగతమైనది, ఎందుకంటే మూలధన కొరతే దీనికి కారణం. అల్పాభివృద్ధి చెందిన దేశాలలో అల్ప ఉద్యోగిత లేదా ప్రచ్ఛన్న లేదా దాగిన నిరుద్యోగిత ముఖ్యమైన లక్షణం. భారతీయ వ్యవసాయ రంగంలో వాస్తవంగా అవసరమైన శ్రామికుల సంఖ్య కంటే మించి చాలా అధిక సంఖ్యలో శ్రామికులు పని చేస్తున్నారు. వ్యవసాయ రంగంలో శ్రామికుని ఉపాంత ఉత్పత్తి అతి స్వల్పంగా లేదా శూన్యంగా లేదా ఋణాత్మకంగా ఉండొచ్చు.

భారతదేశంలో 11వ ప్రణాళిక (2007-12) నాటికి నిరుద్యోగుల సంఖ్య 37 మిలియన్లుగా ఉంటే, ఈ ప్రణాళికా కాలంలో అదనంగా కొత్తగా 45 మిలియన్ల మంది శ్రామిక మార్కెట్లోకి ప్రవేశిస్తారని అంచనా వేయడం జరిగింది. 2017-18లో నిరుద్యోగిత 6.1 శాతానికి చేరింది.

12. సామాజిక సంస్థలు :
అభివృద్ధి చెందుతున్న దేశాలలో సామాజిక సంస్థలు ఆర్థికాభివృద్ధికి అనుకూలంగా లేవు. భారతదేశంలోని సమాజం వివిధ కులాలు, ఉప కులాలుగా విభజించబడి ఉండటం వల్ల సమాజంలో ఘర్షణలు ఏర్పడ్డాయి. వైజ్ఞానిక దృక్పథాల పెరుగుదలకు మత, సాంఘిక నమ్మకాలు, ఆచార వ్యవహారాలు ఆటంకాలుగా ఉన్నాయి. ప్రజలు సాంప్రదాయాలను వదులుటకు ఇష్టపడరు, మూఢ విశ్వాసాలను కలిగి ఉండటంతో పాటుగా, ఆచారాలకు, సంప్రదాయాలకు కట్టుబడి ఉంటారు.

13. విదేశీ వర్తక ప్రాధాన్యత :
ప్రాథమిక ఉత్పత్తుల ఎగుమతుల పైన అధికంగా ఆధారపడటం వల్ల ఇతర రంగాలను ఉపేక్షించడం, అంతర్జాతీయ ఒడుదుడుకులకు లోనవడం రూపంలో గంభీర పర్యవసనాలు ఆర్థిక వ్యవస్థలలో ఏర్పడతాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు విదేశీ వ్యాపార చెల్లింపుల శేష సమస్యలను ఎదుర్కొంటున్నాయి. భారతదేశంలో ఇటీవల దిగుమతుల వ్యయం అతివేగంగా పెరగడం వల్ల, ఎగుమతుల స్తబ్ధత వల్ల వర్తక శేషం చెప్పుకోదగ్గ స్థాయిలో దిగజారింది. 2018-19లో ఇది US$ (-)180.3 బిలియన్లుగా ఉంది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఆర్థికాభివృద్ధిని నిర్వచించి, దానికి సంబంధించిన ప్రధాన అంశాలను తెలపండి.
జవాబు.
ఆర్థిక వృద్ధి భావన:
ఆర్థిక వృద్ధి అనేది ఆర్థికాభివృద్ధితో పోల్చితే సముచితమైన భావన. ఒక దేశంలో జాతీయోత్పత్తి వల్ల సంభవించిన పెరుగుదలను ఆర్థిక వృద్ధి సూచిస్తుంది. అంటే దేశంలో నాణ్యమైన వనరుల పెరుగుదలకు దేశంలో వనరుల పరిమాణం పెరగడంతోపాటు లేదా సాంకేతికత వృద్ధి చెందడంతో పాటు లేదా దేశ ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగంలోనూ వస్తువుల, సేవల ఉత్పత్తుల పెరుగుదలను సూచిస్తుంది. ఆర్థిక వృద్ధి అనేది ఒక దేశంలోని స్థూల దేశీయోత్పత్తిలో పెరుగుదలను అంచనా వేస్తుంది.

మైఖేల్ పి. తొడారో ఉద్దేశం ప్రకారం “ఆర్థిక వృద్ధి అనేది ఒక స్థిరమైన ప్రక్రియ. ఆర్థిక వ్యవస్థ యొక్క ఉత్పాదక సామర్ధ్యం. నియత కాలంలో పెరుగుతుంది. దీనివల్ల జాతీయ ఉత్పత్తిలో, ఆదాయంలో పెరుగుదల సాధ్యమవుతుంది.” సైమన్ కుజ్నెట్స్ ప్రకారం “ఆర్థిక వృద్ధి అనేది దీర్ఘకాలిక ప్రక్రియ. ఇందులో వాస్తవ జాతీయ ఆదాయంలో, మొత్తం జనాభాలో, వాస్తవిక తలసరి ఆదాయంలో పెరుగుదల చోటు చేసుకుంటుంది.”

ఆర్థిక వృద్ధి ప్రధానాంశాలు :
పైన పేర్కొన్న నిర్వచనాలను బట్టి ఆర్థిక వృద్ధికి చెందిన ప్రధానాంశాలు కింద ఇవ్వడమైంది :

  1. ఆర్థిక వృద్ధి అనేది జనాభా పెరుగుదల రేటు కంటే వాస్తవిక జాతీయ ఆదాయం పెరుగుదల ఎక్కువగా ఉంటేనే సాధ్యమవుతుంది.
  2. ఆర్థిక వ్యవస్థలోని ఉత్పత్తి సామర్ధ్యంలో ఎక్కువ స్థాయి పెరుగుదల నమోదు అయినప్పుడు ఆర్థిక వృద్ధి ఉంటుంది.

ఒక దేశ ప్రగతి, అది ధనిక లేదా పేద దేశమైనా, ఆర్థిక వృద్ధికి సంబంధించిన నాలుగు కారకాల మీద ఆధారపడి ఉంటుంది.
ఎ) ఆర్థిక వ్యవస్థ పొదుపు రేటు.
బి) మూలధన ఉత్పత్తి నిష్పత్తి.
సి) శ్రామిక శక్తి వృద్ధి రేటు.
డి) సాంకేతిక విజ్ఞానంలో మార్పులు మరియు నవకల్పనలు.

ఆర్థిక వృద్ధి అనేది దేశ వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదలను, తలసరి ఉత్పత్తిలో పెరుగుదలను తెలియచేస్తుంది. ఒకదేశంలో వస్తు సేవల ఉత్పత్తిలో వృద్ధి రేటుతో సమానంగా జనాభా వృద్ధి రేటు పెరిగినట్లయితే వాస్తవిక తలసరి ఆదాయంలో మార్పేమి ఉండదు. అంటే మొత్తం ఉత్పత్తి పెరిగినప్పటికీ ప్రజల జీవన ప్రమాణ స్థాయిలో పెరుగుదల సంభవించకపోవచ్చు.

ప్రశ్న 2.
ఆర్థికాభివృద్ధిలో నిర్మాణాత్మక మార్పులను వివరించండి.
జవాబు.
ఆర్థికాభివృద్ధిలో నిర్మాణాత్మక మార్పులు : ఆర్థికాభివృద్ధి దేశంలోని వివిధ రంగాల్లో వచ్చే నిర్మాణాత్మక మార్పులను సూచిస్తుంది. వృత్తిపరమైన నిర్మాణంలో మార్పులు వస్తాయి. ఆర్థికాభివృద్ధి వల్ల ప్రాథమిక రంగంలో (వ్యవసాయం, చేపలు పట్టడం మొదలగునవి) శ్రామిక శక్తి వాటా తగ్గి, ద్వితీయ (పరిశ్రమ, గనులు, మొదలగునవి) రంగంలో కార్మిక శక్తి వాటా పెరుగుతుంది. అదే విధంగా సేవా రంగంలో కార్మిక వాటా పెరుగుతుంది. నిర్మాణాత్మక మార్పులను కింది విధంగా చూడవచ్చు.

  1. జాతీయ ఉత్పత్తి నిర్మాణంలో (structure) మార్పులు సంభవిస్తాయి. జాతీయ ఉత్పత్తిలో ప్రాథమిక రంగం వాటా పడిపోయి ద్వితీయ, తృతీయ రంగాల వాటాలు క్రమంగా పెరుగుతాయి.
  2. పారిశ్రామిక ఉత్పత్తి నిర్మాణంలో మార్పులు సంభవిస్తాయి. మూలధన వస్తువుల ఉత్పత్తిలో పెరుగుదలతో పాటుగా వినియోగ వస్తూత్పత్తిలో పెరుగుదల ఉంటుంది.
  3. విదేశీ వాణిజ్యంలో మార్పులు వస్తాయి. ఎగుమతులలో ప్రాథమిక రంగ వస్తువుల వాటా తగ్గి, దిగుమతులలో మూలధన వస్తువుల వాటా పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధి ఏర్పడుతుంటే తయారీ (manufactured), తుది వస్తువుల, సేవల ఎగుమతులు పెరుగుతాయి. ఇదే పరిస్థితిలో వినియోగ వస్తువుల దిగుమతులలో తగ్గుదల ఏర్పడుతుంది. ప్రస్తుత ప్రపంచీకరణ కాలంలో అభివృద్ధ చెందుతున్న దేశాలు ప్రపంచ వ్యవసాయ వాణిజ్యంలో పాల్గొంటూ, వ్యవసాయ ఎగుమతులకే ప్రాధాన్యతను ఇస్తున్నాయి. అట్లాగే తక్కువ స్థాయిలో వినియోగ వస్తువులను దిగుమతి చేసుకొంటున్నాయి. అయితే దీనిని ఇంతకు ముందున్న ధోరణికి విరుద్ధంగా పరిగణించరాదు.
  4. సాంకేతిక నిర్మాణంలో మార్పులు సంభవిస్తాయి. ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలలో ఆధునిక, అభివృద్ధి చెందిన సాంకేతిక పద్ధతులను ఉపయోగిస్తారు.
  5. సామాజిక, సంస్థాపరమైన రంగాలలో మార్పులు సంభవిస్తాయి. ఆర్థికాభివృద్ధి ద్వారా ప్రజల ఆత్మగౌరవం పెరగటంతో పాటుగా ప్రజల జీవన ప్రమాణాల్లో పెరుగుదల ఉంటుంది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 3.
ఆర్థికాభివృద్ధి, ఆర్థికవృద్ధిల మధ్య తారతమ్యాలను తెలియజేయండి.
జవాబు.
ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధిల మధ్య గల తారతమ్యాలు :
కిండర్ బర్గర్ ప్రకారం ఆర్థికవృద్ధి అనేది అధిక ఉత్పత్తిని సూచించగా, ఆర్థికాభివృద్ధి అనేది అధిక ఉత్పత్తితో బాటు అందుకు దోహదపడే సాంకేతిక సంస్థాపూర్వక మార్పులను సూచిస్తుంది.

ఆర్థిక వృద్ధిఆర్థికాభివృద్ధి
1. ఆర్థిక వృద్ధి వస్తుసేవల’ పెరుగుదలను అంటే వాస్తవిక స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలను సూచిస్తుంది.1. ఆర్థికాభివృద్ధి దేశంలో ఆర్థిక వృద్ధితో పాటుగా వ్యవస్థాపూర్వక, సంస్థాగత, సాంఘిక, ఆర్థిక మార్పులను సూచిస్తుంది.
2. ఆర్థిక వృద్ధి అనేది ఏకోన్ముఖమైన ప్రక్రియ.2. ఆర్థికాభివృద్ధి అనేది బహుపార్శ్వ (ముఖ) ప్రక్రియ.
3. ఆర్థిక వృద్ధి ఆర్థిక వ్యవస్థలో పరిమాణాత్మకమైన మార్పులనే సూచిస్తుంది.3. ఆర్థికాభివృద్ధి పరిమాణాత్మక మార్పులతో పాటు, గుణాత్మక మార్పులను సూచిస్తుంది.
4. ప్రభుత్వ జోక్యం ఉన్నా లేకున్నా ఆర్థిక వృద్ధి సాధించవచ్చు.4. ప్రభుత్వ జోక్యం లేకుంటే ఆర్థికాభివృద్ధిని సాధించలేం. ఆర్థికాభివృద్ధి ప్రారంభంలో దేశంలో ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. దానిని పెంచి అభివృద్ధిని సాధించాలంటే ప్రభుత్వం చురుకైన పాత్రను పోషించాలి.
5. ఆర్థిక వృద్ధి వేగంగా సంభవించేటప్పుడు అధిక సాంకేతిక మార్పులు ఉంటాయి.5. అధిక స్థాయిలో ఆర్థికాభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణంలో మార్పు తీసుకురావడం.
6. సాంప్రదాయ అర్థశాస్త్ర నేపథ్యంలో ఆర్థిక వృద్ధి అనేది ఒక కీలక అంశం. ఈ దృక్పథం ప్రకారం వృద్ధిపై, పురోగతిపై మనం దృష్టి సారిస్తే దానంతట అదే పేదరికాన్ని నిర్మూలిస్తుంది. దీనినే కింది స్థాయి వరకు అభివృద్ధి ఫలాలు చేరే దృక్పథం (tricke down | approach) అంటారు.6. ఆధునిక అర్థశాస్త్ర సాహిత్యంలో ఆర్థికాభివృద్ధి అనేది ముఖ్యమైన అంశం. మనం పేదరికంపై దృష్టి సారిస్తే ఆర్థిక వృద్ధి దానంతటదే సాధ్యమవుతుంది.
7. ఆర్థిక వృద్ధి పరిధి సంకుచితమైంది. ఎందుకంటే తలసరి ఆదాయ స్థాయిలోని మార్పుతో మాత్రమే ఆర్థిక వృద్ధికి సంబంధం ఉంది.7. ఆర్థికాభివృద్ధి పరిధి విస్తృతమైంది. తలసరి ఆదాయ పెరుగుదలనే గాకుండా ఆర్థిక వ్యవస్థలో ధనాత్మక మార్పులను, ప్రజల జీవన వ్యవహారాలలో మెరుగుదలను సూచిస్తుంది.
8. ఆర్థిక వృద్ధి స్వల్ప కాలానికి సంబంధించిన అంశం. సాధారణంగా సంవత్సర ఆధారంగా దీనిని తెలుపుతారు.8. ఆర్థికాభివృద్ధి అనేది దీర్ఘ కాలానికి సంబంధిం చిన అంశం. 20 నుంచి 25 సంవత్సరాలలో సంస్థాగత మార్పులను తెలుపుతుంది.
9. ఆర్థిక వృద్ధి అనేది ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాలకు

సంబంధించింది.

9. ఆర్థికాభివృద్ధి అనేది ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించింది.
10. సామాజిక మార్పు అనేది ఆర్థిక వృద్ధితో సాధ్యం కావచ్చు లేదా కాకపోవచ్చు.10. సామాజిక మార్పు అనేది ఆర్థికాభివృద్ధిలో తప్పనిసరి. అర్హతకు తగిన ఉద్యోగ అవకాశాలు, ఆహార ధాన్యాల లభ్యత, మంచి ఆరోగ్యం, విద్య, ప్రజల జీవన నైపుణ్యాల మార్పు అనేవి ఆర్థికాభివృద్ధి వల్ల సాధ్యమవుతాయి.
11. ఆర్థిక వృద్ధిని ఆదాయ స్థాయిలతో అంచనా వేస్తారు. సాధారణంగా సంఖ్యాపరంగా సంవత్సరాల వారీగా ఆర్థిక వృద్ధి రేటును అంచనా వేస్తారు.11. ఆర్థికాభివృద్ధిలో పేదరికం తగ్గింపు, మానవ వనరుల అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల వంటి అంశాలు ప్రధాన పాత్ర వహిస్తాయి.

TS Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 4.
అభివృద్ధిని ప్రోత్సహించే ఆర్థిక కారకాలను వివరించండి.
జవాబు.
ఆర్థికపరమైన కారకాలు :
ఆర్థికాభివృద్ధిలో ఆర్థికపరమైన కారకాల పాత్ర నిర్ణయాత్మకమైంది. నిర్ణీత కాలంలో ఒక దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందా ? లేదా నెమ్మదిగా అభివృద్ధి చెందుతుందా ? అనే వాటిని ఆ దేశంలో ఉన్న మూలధన నిల్వ మరియు దాని విలువ ప్రధానంగా నిర్ణయిస్తాయి. జనాభాకు సరిపడే ఆహార ధాన్యాలు, విదేశీ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ స్వభావం మొదలైన కాలు కూడా ఆర్థికాభివృద్ధిలో ప్రధానమైనవే.

1. మూలధన కల్పన :
అర్థశాస్త్ర విశ్లేషణలో ఉత్పత్తి స్థాయిని పెంచడంలో మూలధన కల్పన పాత్ర కీలకమైంది. విశ్వ వ్యాప్తంగా వివిధ దేశాలు వచ్చిన ఆదాయంలో పొదుపుల ద్వారా గాని విదేశీ పెట్టుబడుల ద్వారా గానీ వృద్ధిని సాధించడం జరిగింది.

2. సహజ వనరులు :
ఒక దేశ ఆర్థికాభివృద్ధిని నిర్ధారించు ప్రధాన కారకం ఆ దేశంలో లభ్యమయ్యే సహజ వనరులు. భూమి, భూసారం, అటవీ సంపద, మంచి నదీ వ్యవస్థ, చమురు వనరులు, మంచి వాతావరణం, జీవావరణ వ్యవస్థ మొదలైనవి సహజ వనరులలోనికి వస్తాయి. ఆర్థికపరమైన వృద్ధికి విస్తారమైన వనరుల లభ్యత అనేది ఆవశ్యకమైంది.

3. వ్యవసాయ రంగం :
ఆర్థికాభివృద్ధిలో భూమి యాజమాన్యంతో పాటుగా వ్యవసాయం చేసే పద్ధతి అనేది ముఖ్యమైన పాత్రని నిర్వహిస్తుంది. భూసంస్కరణలు, వ్యవసాయంలో ఆధునికీకరణ, సాంకేతికపరమైన మార్పులు ఆర్థిక రంగంలో వేగవంతమైన వ్యవసాయ వృద్ధికి దోహదపడతాయి.

4. మార్కెట్లో విక్రయం కాగల వ్యవసాయ మిగులు (Marketable surplus) :
ఉత్పాదకతను పెంచే క్రమంలో వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం అనేది ఒక దేశ అభివృద్ధిలో ముఖ్యమైన ప్రక్రియ. కానీ మార్కెట్లో విక్రయం కాగల వ్యవసాయ మిగులును పెంచడం అనేది దానికంటే ముఖ్యమైనది. గ్రామీణ జనాభా తమ మనుగడకు కావాల్సిన ఉత్పత్తి కంటే ఎక్కువగా లభించగల వ్యవసాయోత్పత్తిని మార్కెట్లో విక్రయంకాగల వ్యవసాయ మిగులు అంటారు. కాని వ్యవసాయ రంగ పురోగతిని మార్కెట్లో విక్రయం చేసిన వ్యవసాయ మిగులు ద్వారా సూచిస్తారు.

5. పారిశ్రామిక నిర్మాణం :
భారీ, చిన్న తరహా, కుటీర పరిశ్రమలు వాటి సాపేక్షిక ప్రాధాన్యతను వాటిలో ఉపయోగించే సాంకేతిక స్థాయిని కోరుకుంటాయి. అభివృద్ధి చెందిన ఆధునిక సాంకేతికతలను అభివృద్ధి చెందుతున్న దేశాలలో వినియోగించడంవల్ల ఆధునికీకరణ ఏర్పడి వ్యవస్థ నిర్మితిలో మార్పు వస్తుంది. ఫలితంగా అధిక ఆర్థిక అభివృద్ధికి దారితీస్తుంది.

6. వ్యవస్థాపరమైన మార్పులు :
సంస్థలలో, సాంఘిక దృక్పథాలలో, ప్రేరేపణలలో విప్లవాత్మక మార్పుల ద్వారా సంప్రదాయ వ్యవసాయక సమాజం నుంచి ఆధునిక పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థకు మారడాన్ని వ్యవస్థాపరమైన మార్పులంటాం. ఈ మార్పుల వల్ల ఉద్యోగ అవకాశాలు పెరగడం, శ్రామిక ఉత్పాదకత పెరగడం, మూలధన రాశి పెరగడం, నూతన వనరులను ఉపయోగించడం, సాంకేతిక మెరుగుదల జరుగుతాయి.

7. వ్యవస్థాపన :
వృద్ధి ప్రక్రియకు సంబంధించి ఇదొక ముఖ్యమైన అంశం. ఆర్థిక కార్యకలాపాలలో ఉత్పత్తి కారకాలను అభిలషణీయంగా ఉపయోగించడానికి సంబంధించినదే వ్యవస్థాపన. ఉద్యమదారుడు వ్యవస్థాపకుడు నిర్వహించే విధులను నిర్వర్తిస్తూ, వ్యాపారంలోని నష్టభయాన్ని, అనిశ్చితలను ఎదుర్కొంటున్నాడు. అల్పాభివృద్ధి చెందిన దేశాలలో ఉద్యమిత్వ చర్యలు లేవు. అందువల్ల వెనుకబడిన దేశాలు ఉద్యమిత్వాన్ని ప్రోత్సహించే వాతావరణాన్ని కల్పించాలి. దీనికొరకు అవసరమైన సామాజిక, ఆర్థిక, సాంకేతిక సంస్థలను ఏర్పాటు చేయడం అవసరం.

8. సాంకేతిక ప్రగతి :
నూతన పరిశోధన లేదా నవకల్పనల మూలంగా ఉత్పత్తి పద్ధతులలో మార్పులు రావడమే సాంకేతిక మార్పులు. సాంకేతిక మార్పుల వల్ల శ్రమ, మూలధనం, ఇతర ఉత్పత్తి కారకాల ఉత్పాదకత పెరుగుతుంది. ఘంపీటర్, కుజ్నెట్ ఆర్థిక వృద్ధిలో నవకల్పనను అతి ముఖ్యమైన సాంకేతిక కారకంగా పరిగణించారు. పరిశోధన మరియు అభివృద్ధి పైన జాతీయ ఆదాయంలో ఎక్కువ శాతాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం’ ఉంది.

9. శ్రమ విభజన :
ప్రత్యేకీకరణ, శ్రమ విభజన వల్ల ఉత్పాదకత పెరుగుతుంది. అంతేకాక పెద్ద తరహా ఉత్పత్తి ఆదాలు ఏర్పడి, ఆర్థికాభివృద్ధి రేటు పెరుగుదలకు తోడ్పడతాయి. ఆడమ్ స్మిత్ ఆర్థికాభివృద్ధిలో శ్రమ విభజనకు అధిక ప్రాముఖ్యత నిచ్చాడు. శ్రమ విభజన మార్కెటు పరిమాణం పైన ఆధారపడుతుంది. పెద్ద తరహా ఉత్పత్తి ఉన్నప్పుడు ప్రత్యేకీకరణ, శ్రమ విభజన అధికమవుతాయి. ఆధునిక రవాణా, కమ్యూనికేషన్స్ సాధనాలను ఏర్పాటు చేయడం వల్ల మార్కెటును విస్తృతం చేసి తద్వారా అల్పాభివృద్ధి చెందిన దేశాలలో వృద్ధి ప్రక్రియను వేగవంతం చేయవచ్చు.

10. విదేశీ వర్తకం :
సాధ్యమైనంత త్వరగా అభివృద్ధి చెందుతున్న దేశాలు మూలధన పరికరాలలోనూ, పారిశ్రామిక ఉత్పత్తులలోనూ స్వావలంబనను సాధించే ప్రయత్నం చేయడమే కాకుండా ప్రాథమిక ఉత్పత్తుల ఎగుమతులకు బదులుగా పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులు ఉండే స్థాయికి పరిశ్రమల అభివృద్ధిని బాగా పెంచాలి. భారతదేశం వంటి ఆర్థిక వ్యవస్థలలో స్థూల ఆర్థిక అంతర్ సంబంధాలకు ప్రాధాన్యత ఉంది. ఈ దేశ సమస్యలకు పరిష్కారం కేవలం విదేశీ వర్తక రంగం ద్వారా ఉండదు.

11. ఆర్ధిక వ్యవస్థ :
ఒక దేశ ఆర్థిక వ్యవస్థ, ఆ దేశ చారిత్రక ఏర్పాటు అభివృద్ధిని నిర్ణయిస్తాయి. ఒక దేశ ఆర్థికవృద్ధిలో స్వేచ్ఛా వాణిజ్య విధానం అమలులో ఉన్న కాలంలో ఏ విధమైన ఆటంకాలు ఏర్పడ లేదు. అయితే మారిన నేటి కాల పరిస్థితులలో ఇదే అభివృద్ధి వ్యూహంతో ఒక దేశం వృద్ధి చెందటం కష్టతరం.

TS Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 5.
అభివృద్ధిని ప్రోత్సహించే ఆర్థికేతర కారకాలను వివరించండి.
జవాబు
ఆర్థికేతర కారకాలు :
అభివృద్ధిలో ఆర్థికేతర కారకాలు కూడా ఆర్థిక కారకాలతో సమ ప్రాధాన్యాన్ని కలిగి ఉంటాయనేది స్పష్టం. ఆర్థికాభివృద్ధి ప్రక్రియను ఇవి ఏ విధంగా ప్రభావితం చేస్తాయో తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.

a) మానవ వనరులు :
ఆర్థికాభివృద్ధిలో మానవ వనరులు అనేవి ముఖ్యమైన కారకాలు. ఉత్పత్తి కోసం మానవులు శ్రామికులుగా పని చేయడం జరుగుతుంది. ఒక దేశ శ్రామికులలో సామర్థ్యం, నైపుణ్యం అధికంగా ఉంటే ఆ దేశం యొక్క వృద్ధి అధికంగా ఉంటుంది. నిరక్షరాస్యుల, అవివేకుల, నైపుణ్యం లేనివారి, వ్యాధిగ్రస్తుల, మూఢ విశ్వాసం గలవారి ఉత్పాదకత సహజంగానే తక్కువ. ఒక దేశ అభివృద్ధికి వీరి తోడ్పాటు అధికంగా ఉండదు.

మానవ వనరులు నిరుపయోగంగా ఉన్నా లేదా శ్రామిక నిర్వహణ లోపభూయిష్టంగా ఉన్నా ఇది ఆ దేశానికి భారంగా ఉంటుంది. శ్రామిక శక్తి సామర్థ్యం లేదా ఉత్పాదకత ఆరోగ్యం, విద్య, సామాజిక సేవలపైన ఆధారపడుతుంది. మానవుడు ఉత్పత్తి ప్రక్రియలో నూతన మార్గాలు అవలంబించడం జరిగి దానివల్ల ఆ దేశ ఉత్పాదకత పెరుగుతుంది.

ఉద్యమదారులు ప్రవేశపెట్టే నవకల్పనలను ఘంపీటర్ అనే ఆర్ధిక శాస్త్రవేత్త బాగా మెచ్చుకొని, పెట్టుబడి దారీ విధాన అభివృద్ధికి ఈ ఉద్యమదారులు ఎంతో దోహదం చేశారని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ నైపుణ్యాన్ని సంతరించుకున్నందువల్ల, దీనిని ఇంకా మెరుగుపర్చడానికి పరిశోధన మరియు అభివృద్ధికి ఇంకా ఎక్కువ శ్రద్ధ అవసరం. ఉదాహరణకు, ఆధునిక కాలంలో ఇంటర్నెట్ (అంతర్జాలం) అనే గొప్ప నవకల్పన సమాచార, సాంకేతిక రంగంలో పెను మార్పులకు దారి తీసింది.

b) రాజకీయ, పరిపాలన సంబంధ కారకాలు :
ఆధునిక ఆర్థిక వృద్ధికి రాజకీయ, పరిపాలన సంబంధ కారకాలు కూడా సహాయపడ్డాయి. బ్రిటన్, జర్మనీ, యుఎస్, జపాన్, ఫ్రాన్స్ దేశాలలోని ఆర్థిక వృద్ధికి ముఖ్య కారణాలు వాటి రాజకీయ స్థిరత్వం, పటిష్టమైన పాలనలే. ఇటలీలో రాజకీయ అస్థిరత వల్ల, అవినీతి, బలహీన పరిపాలన వల్ల పై దేశాల స్థాయిలో వృద్ధి రాలేదు.

అభివృద్ధి చెందిన దేశాలలో శాంతి, రక్షణ స్థిరత్వం అనేవి ఉద్యమిత్వ అభివృద్ధిని ప్రోత్సహించడమే కాకుండా, సరియైన ద్రవ్య, కోశ విధానాలను అమలు చేసే అవకాశాన్ని ఏర్పర్చాయి. వెనుకబడిన దేశాలలో బలహీన పరిపాలన, రాజకీయ వ్యవస్థ ఆర్థికాభివృద్ధికి పెద్ద ఆటంకం. ఆర్థికాభివృద్ధిని అవినీతి లేని, పటిష్టమైన పరిపాలన, స్థిర రాజకీయ పరిస్థితులు ఉత్తేజపర్చుతాయి.

c) సామాజిక కారకాలు :
సామాజిక దృక్పథాలు, విలువలు, సంస్థలు కూడా ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేస్తాయి. వాస్తవ మానవ ప్రవర్తనకు కారణంగా ఉండే నమ్మకాలు, విలువలనే దృక్పథాలు అంటాం. ప్రత్యేక లక్ష్యాలకు సంబంధించి మానవ ప్రవర్తనా ఉద్దేశాలను విలువలు తెలుపుతాయి. అల్పాభివృద్ధి చెందిన దేశాలలో శీఘ్ర ఆర్థికాభివృద్ధికి విలువల ఆధునీకీకరణను అనుసరించాలని గున్నార్ మిర్దాల్ అన్నాడు. అవి ఏవంటే ఆలోచనలో, చర్యలలో హేతుబద్ధత ఉండటం.

అంటే ఉత్పాదకతను పెంచడానికి, జీవన స్థాయిలను పెంచడానికి, సామాజికార్థిక సమానత్వాన్ని సాధించడానికి ఉద్దేశపూర్వకంగానే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవడం,’ ఆధునిక, సాంకేతికతను వాడడం. విలువల ఆధునీకరణ వల్ల దృక్పథాలలో మార్పులు ఏర్పడి ఇవి ఆర్థిక వ్యవస్థలోని వ్యవసాయ, పారిశ్రామిక, సేవల రంగాలు అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి.

అయితే ఉద్యమిత్వం లేనట్లయితే ఈ రంగాల అభివృద్ధి సాధ్యం కాదు. గున్నార్ మిర్డాల్ ప్రకారం అల్పాభివృద్ధి చెందిన దేశాలలో ఉద్యమిత్వం లేకపోవడానికి కారణం ఉద్యమిత్వానికి సంబంధించి సరియైన దృక్పథం కలిగిన వ్యక్తులు కొరతగా ఉండటమే. దృక్పథాలకు సంబంధించి విలువల ఆధునీకరణ ఆర్థికాభివృద్ధి సాధన లక్ష్యంతో ఉద్యమిత్వాన్ని వృద్ధి చేయాలి.

TS Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 6.
భౌతిక జీవన ప్రమాణ సూచిక (PQLI) ని చర్చించుము.
జవాబు.
భౌతిక జీవన ప్రమాణ సూచిక (Physical Quality of Life Index – PQLI) :
దీనిని 1979లో యమ్.డి. మోరిస్ రూపొందించాడు. 23 దేశాలకు సంబంధించి ఇతడు ఉమ్మడి భౌతిక జీవన ప్రమాణ సూచికను తులనాత్మక అధ్యాయానికి’ రూపొందించాడు. ఆర్థికాభివృద్ధి గణనలో ఉపయోగించే ఆదాయేతర సూచిక భౌతిక జీవన ప్రమాణ సూచిక. ఎందుకంటే భౌతిక జీవన ప్రమాణాన్ని సూచికగా ఉపయోగించింది.

ఈ పద్ధతి ఆర్థికాభివృద్ధిని కొలవడానికి మూడు ప్రమాణాలను ఆధారంగా తీసుకుంటుంది. అవి :

  1. ఆయుః ప్రమాణం,
  2. శిశు మరణాల రేటు,
  3. ప్రాథమిక అక్షరాస్యత.

ప్రజలు అత్యంత ప్రాథమిక అవసరాలను పొందడంలో పనితీరును ఈ సూచిక కొలుస్తుంది. ఆరోగ్యం, విద్య, తాగు నీరు, ఆహారం, పారిశుద్ధ్యం లాంటి ప్రాథమిక అవసరాలకు ఈ సూచిక ప్రాతినిధ్యాన్ని వహిస్తుంది.

ఒక దేశ భౌతిక జీవన ప్రమాణ సూచిక విలువ పెరుగుతుండటం అనేది ఆ దేశ ప్రజల భౌతిక జీవనంలో నాణ్యత పెరిగినట్లుగా సూచిస్తుంది. అంటే ఆయుః ప్రమాణం పెరగడాన్ని, శిశు మరణాల రేటు తగ్గడాన్ని, ప్రాథమిక అక్షరాస్యత రేటు పెరగడాన్ని సూచిస్తుంది. ఒక దేశంలోని తలసరి ఆదాయంలో పెరుగుదల ఆరోగ్యం, ఆహారం, పారిశుద్ధ్యం, విద్య మొదలైన సదుపాయాల పెరుగుదలను సూచించదు. కాబట్టి తలసరి ఆదాయ సూచీకన్నా భౌతిక జీవన ప్రమాణ సూచీ మెరుగైంది. భౌతిక జీవన ప్రమాణ సూచిక జీవన ప్రమాణాన్ని ప్రత్యక్షంగా కొలవడంతో పాటుగా ఏ అంశం విషయంలో సత్వర చర్య అవసరమో తెలుపుతుంది.

పరిమితులు :
భౌతిక జీవన ప్రమాణ సూచికలో కొన్ని పరిమితులున్నాయి.
అవి :

  1. ప్రాథమిక అవసరాలకు సంబంధించి భౌతిక జీవన ప్రమాణ సూచిక పరిమితమైన కొలమానం అని మోరిస్ అంగీకరించాడు.
  2. ఆర్థిక, సామాజిక వ్యవస్థ నిర్మితిలో వస్తున్న మార్పులను ఇది వివరించదు.
  3. ఇది మొత్తం శ్రేయస్సును కొలవదు.
  4. భౌతిక జీవన ప్రమాణ సూచికలోని మూడు అంశాలకు సమాన భారితాలను ఇవ్వడం జరిగింది.

ప్రశ్న 7.
మానవ వనరుల అభివృద్ధి సూచిక (HDI) భావనను చర్చించుము. ఈ భావనను ఎలా లెక్కిస్తారు ?
జవాబు
మానవ అభివృద్ధి సూచిక (Human Development Index) :
మానవ అభివృద్ధి సూచికను మహబూబ్-ఉల్- హక్ అభివృద్ధి చేయగా, 1990 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పథకం తయారుచేసిన తన మొదటి మానవ అభివృద్ధి రిపోర్ట్లో మానవ అభివృద్ధి సూచికను చేర్చింది. అప్పటి నుంచి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పథకం తన వార్షిక రిపోర్ట్లో మానవ అభివృద్ధిని. కొలవడాన్ని సమర్పిస్తుంది. ఆర్థికాభివృద్ధి సూచికలలో మానవ అభివృద్ధి సూచిక నూతనమైంది. ఒక దేశ సామాజిక, .ఆర్థిక కోణాలలో సాధించిన అభివృద్ధిని కొలిచే గణాంక సాధనం మానవ అభివృద్ధి సూచిక.

ఈ సూచికను నిర్మించడానికి కింది సూచికలు కావాలి :

  • పుట్టుక సమయంలో ఆయుఃప్రమాణం.
  • విద్య – వయోజన అక్షరాస్యత, విద్యా సంస్థలలో సమ్మిళిత స్థూల నమోదు నిష్పత్తి.
  • డాలర్ల రూపంలో కొనుగోలు శక్తి సమానత ఆధారంగా తలసరి నిజ స్థూల దేశీయోత్పత్తి.

కింద చూపిన విధంగా ఒక్కొక్క సూచికకు స్థిర కనిష్ఠ, గరిష్ట విలువలను ఇచ్చి ప్రతి సూచికకు (indicator) సూచిక (Index) ను సృష్టించి, మానవ అభివృద్ధి సూచికలోని అంశాలకు కింది సాధారణ సూత్రం నుంచి వ్యక్తిగత సూచికలను గణించడం జరుగుతుంది. సూచికల ద్వారా మానవ అభివృద్ధి సూచికను నిర్మించడం జరుగుతుంది.

సూచిక = వాస్తవ విలువ – కనిష్ట విలువ/గరిష్ట విలువ – కనిష్ట విలువ

తరవాత, అంశాల సూచికల సాధారణ సగటు విలువనే మానవ అభివృద్ధి సూచికగా లెక్కిస్తారు. మానవ అభివృద్ధి సూచిక విలువ ‘0’ నుంచి ‘1’ వరకు ఉంటుంది. మానవ అభివృద్ధి సూచిక విలువ 0.5 కంటే తక్కువగా ఉన్న దేశాలను అల్ప స్థాయిలో మానవ అభివృద్ధి చెందిన దేశాలుగాను, 0.5 నుండి 0.8 మధ్య గలవి మధ్యస్థ స్థాయిలో మానవ అభివృద్ధి చెందిన దేశాలుగాను, 0.8 కంటే అధికంగా ఉన్నవి అధిక మానవ అభివృద్ధి చెందిన దేశాలుగాను పరిగణింపబడ్డాయి.

మానవ అభివృద్ధి రిపోర్టు 2014లో 2013 సంవత్సరానికి మానవ అభివృద్ధి సూచికల విలువ ఆధారంగా దేశాలను నాలుగు రకాలుగా వర్గీకరించడమైంది.

  1. మానవ అభివృద్ధి సూచిక విలువ 0.8, అంతకంటే అధికంగా ఉన్న దేశాలను అత్యధిక మానవ అభివృద్ధి చెందిన దేశాలుగాను,
  2. మానవ అభివృద్ధి సూచిక విలువ 0.7 నుంచి 0.8 వరకున్న దేశాలను అధిక మానవ అభివృద్ధి చెందిన దేశాలుగాను.
  3. మానవ అభివృద్ధి సూచిక విలువ 0.5 నుంచి 0.7 వరకున్న దేశాలను మధ్యస్థ మానవ అభివృద్ధి చెందిన దేశాలుగాను,
  4. మానవ అభివృద్ధి సూచిక విలువ 0.5 కంటే తక్కువగా ఉన్న దేశాలను అల్ప మానవ అభివృద్ధి, చెందిన దేశాలుగాను వర్గీకరించడమైంది.

కింది పట్టికలో భారతదేశ మానవ అభివృద్ధి సూచిక విలువలను చూపించడమైంది.

సంవత్సరంమానవ అభివృద్ధి సూచిక విలువ
19900.427@
19950.546
20010.472
20020.595
20070.612
20100.519
20130.586
20170.640@
20180.647 B

TS Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఆర్థిక వృద్ధి.
జవాబు.
ఆర్థిక వృద్ధి వస్తు సేవల పెరుగుదలను అంటే వాస్తవిక స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలను సూచిస్తుంది. ఇది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించినది. ఇది పరిమాణాత్మకమైనది మరియు దీర్ఘకాలికమైన అంశం.

ప్రశ్న 2.
ఆర్థికాభివృద్ధి.
జవాబు.
ఆర్ధికాభివృద్ధి దేశంలో ఆర్థిక వృద్ధి పాటుగా వ్యవస్థాపూర్వక సంస్థాగత, సాంఘిక, ఆర్థిక మార్పులను సూచిస్తుంది. ఇది అభివృద్ధి చెందినదేశాలకు సంబంధించినది. ఈ భావన పరిమాణాత్మకం మరియు గుణాత్మకమైనది. ఇది అభివృద్ధి చెందుతున్న. దేశాలకు సంబంధించినది.

ప్రశ్న 3.
స్వావలంబన (Self Patience).
జవాబు.
ఒక దేశం తనకు అవసరం అయిన వాటిని కొనడానికి సరిపడే మిగులను సృష్టించుకుంటుంది. తనకు అవసరం అయిన వాటిని పొందటానికి అవసరం అయ్యే నిధుల కోసం ఇతర దేశాలపై ఆధారపడదు.
దిగుమతులకు చేయాల్సిన చెల్లింపు సామర్థ్యం దేశానికి ఉంటే దిగుమతులను స్వావలంబన అనుమతిస్తుంది. అయితే ఒక దేశం తాను చేసుకునే దిగుమతులకు చెల్లింపులు చేయడం ద్వారా స్వావలంబనను సాధించే ప్రయత్నం చేస్తుంది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 4.
సుస్థిర అభివృద్ధి.
జవాబు.
సుస్థిర అభివృద్ధి అంటే భవిష్యత్ తరాల అవసరాల విషయంలో రాజీ లేకుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చుకోవడం అని బ్రుండ్అండ్ రిపోర్టు నిర్వచించింది. సుస్థిర అభివృద్ధి అంటే అభివృద్ధి నిర్విరామంగా కొనసాగడం. భవిష్యత్తు తరాలు నష్ట పోకుండా పర్యావరణ, మానవ భౌతిక మూలధనం నిల్వలను పరిరక్షిస్తూ పెంపొందిస్తూ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడం సుస్థిర అభివృద్ధి లక్ష్యం.

ప్రశ్న 5.
సమ్మిళిత వృద్ధి.
జవాబు.
ఆర్థికాభివృద్ధి గమనాన్ని, తీరును ఈ భావన తెలియజేస్తుంది. ఈ భావనలో వృద్ధి ఫలాలు జనాభాలో దిగువ వర్గాలకు అందటంతో పాటుగా మానసికేతర అంశాలు ఉంటాయి. వృద్ధిఫలాలు అన్ని వర్గాల వారికి సమాన స్థాయిలో పంపిణీ కానందున గతంలో విస్మరించబడిన వర్గాల వారిని వృద్ధి ప్రక్రియలో భాగస్వాములను చేయడం సమ్మిళిత వృద్ధి లక్ష్యం. మొత్తం ఆదాయంలో అతి తక్కువ వాటా కలిగి ఉన్న, విస్మరించబడిన అట్టడుగు వర్గాల ప్రజలను వృద్ధి ప్రక్రియలో చేర్చే ప్రక్రియగా సమ్మిళిత భావనను చూడాలి.

ప్రశ్న 6.
భౌతిక జీవన ప్రమాణ సూచిక.
జవాబు.
ఈ భావనను 1979వ సంవత్సరంలో M.D. మోరిస్ రూపొందించినాడు.
ఆర్థికాభివృద్ధి గణనలో ఉపయోగించే ఈ ఆదాయేతర సూచిక :

  1. జీవన ప్రమాణం
  2. శిశుమరణాలు
  3. అక్షరాస్యతలను వాడుతుంది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 7.
మానవ అభివృద్ధి సూచిక,
జవాబు.
ఈ భావనను మహబూబ్-ఉల్ – హక్ అభివృద్ధి చేయగా, 1990వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పథకం తయారు చేసిన తన మొదటి మానవ అభివృద్ధి రిపోర్ట్లో ఈ సూచికను చేర్చింది.

ఒకదేశ సామాజిక, ఆర్థిక కోణాలలో సాధించిన అభివృద్ధిని కొలిచే గణాంక సూచీ మానవ అభివృద్ధి సూచిక. ఈ సూచికను నిర్మించడానికి’ మూడు కారకాలు తీసుకుంటారు.

  1. మెరుగైన జీవనం కోసం ఆదాయం,
  2. విద్య,
  3. జీవన ప్రమాణం.

మానవ అభివృద్ధి సూచిక = వాస్తవ విలువ – కనిష్ఠ విలువ/గరిష్ఠ విలువ – కనిష్ఠ విలువ.

ప్రశ్న 8.
లింగ సంబంధిత అభివృద్ధి సూచిక (GDI).
జవాబు.
ఇది కూడా జనాభా సగటు విజయవానలు కొలిచే ఒక సమగ్ర సూచిక. దీనిలో కూడా మూడు అంశాలు పరిగణనలోనికి తీసుకుంటారు.

  1. రాజకీయ భాగస్వామ్యం
  2. ఆర్థిక భాగస్వామ్యం
  3. స్త్రీ పురుషులు ఆర్జించే ఆదాయాలు.

ప్రశ్న 9.
సామాజిక ప్రగతి సూచిక (SPI).
జవాబు.
ఒక దేశం తమ పౌరుల సామాజిక, పర్యావరణ అవసరాలను తీర్చడానికి అందించే సేవలను సామాజిక ప్రగతి సూచిక కొలుస్తుంది. సామాజిక ప్రగతి సూచిక ద్వారా ఆర్థిక కారకాల స్థానంలో సామాజిక, పర్యావరణ పరిరక్షణ సాధన ద్వారా సమాజ సంక్షేమాన్ని అంచనా వేస్తుంది. ఈ సూచికకు అమర్త్యసేన్, డగ్లస్వార్, జోసెఫ్ స్టిగ్లిట్జ్ రచనలు ఆధారం.

TS Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 10.
బహుపార్శ్వ పేదరిక సూచిక (MPI).
జవాబు.
అత్యంత అణగారిన వర్గాలు కోల్పోయిన అంశాలు విశదీకరించడానికి ఈ భావన ఉపయోగపడుతుంది. ఈ సూచికను 2010వ సం||లో ప్రవేశపెట్టారు. ఒకే సమయంలో బహు కారకాలను కోల్పోయిన కుటుంబాల అధ్యయనానికి ఈ సూచిక అవసరం. భారత సూచికలలో ఎవరైతే కనీసం 33 శాతం కోల్పోతారో వారిని బహుపార్శ్వ పేదలుగా భావిస్తారు. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలతో బహుముఖ కోణ పేదరిక సూచిక దగ్గర సంబంధాన్ని కలిగి ఉంది.

ప్రశ్న 11.
సహజ వనరులు.
జవాబు.
ప్రకృతిలో లభ్యమవుతూ, జీవరాశులకు ఉపయోగపడేవే సహజ వనరులు. అవి ప్రకృతిలో ముడిరూపంలో దొరుకుతాయి. అవే శక్తి వనరులుగా కూడా ఉపయోగపడతాయి. పర్యావరణంలో లభించే ఈ సహజ వనరులు ఈ క్రింది లక్షణాలను కలిగి ఉంటాయి. పరిమితంగా లభ్యమవడం, పరిమితిని ప్రకృతి నిర్ణయిస్తుంది. జీవరసాయన మార్పు ఆధారంగా వీటి విలువ మారుతుంది.

ప్రశ్న 12.
మానవ మూలధనం.
జవాబు.
ప్రజల సమర్థతలను, నైపుణ్యాలను అభివృద్ధి పరచడం మానవ మూలధనం. అభివృద్ధి చెందుతున్న దేశాలలో శ్రామిక శక్తికి, సాంకేతిక పరమైన నిర్వహణ పరమైన అంశాలలో శిక్షణ కల్పించాల్సి ఉంటుంది. కాని ఇది దీర్ఘకాలంలోనే సాధ్యపడుతుంది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 13.
బీదరిక విషవలయాలు.
జవాబు.
పేదవాడు ఎల్లప్పుడూ పేదరిక విషవలయాల బంధంలో చిక్కుకుని’ ఉంటాడు. అభివృద్ధి చెందడానికి సాధనాలు అతను కలిగి లేనందున అతడు పేదవాడిగానే మిగిలిపోతాడు. ఈ భావనను నర్క్స్ అనే అర్థశాస్త్రవేత్త ప్రవేశపెట్టినాడు. వెనుకబడిన దేశాలు పేదరికపు విషవలయాల్లో చిక్కుకుని వేగవంతమైన అభివృద్ధిని సాధించలేకపోయినాయి. ఈ దేశాలలో పేదరికమే పేదరికానికి గల కారణం. ఇవి డిమాండ్ వైపు, సప్లయ్ వైపు ఉంటాయి.

ప్రశ్న 14.
మూలధన సమీకరణ.
జవాబు.
మూలధన కల్పన అంటే మూలధన నిల్వలో చేరిన నికర పనిముట్లు, భవనాలు మరియు ఇతర మధ్య రకం వస్తువులు. ఒక దేశం మూలధన నిల్వను శ్రమతో కలిపి సేవలను, వస్తువులను ఉత్పత్తి చేసేందుకు ఉపయోగిస్తుంది. మూలధన నిల్వ పెరుగుదలను మూలధన కల్పన అంటారు.

ప్రశ్న 15.
విక్రయం కాగల వ్యవసాయ మిగులు.
జవాబు.
గ్రామీణ జనాభా మనుగడకు కావలసిన ఉత్పత్తి కంటే ఎక్కువగా ఉన్న వ్యవసాయోత్పత్తిని మార్కెట్లో విక్రయం కాగల వ్యవసాయ మిగులు అని అంటారు. వ్యవసాయ రంగం ప్రగతిని ఈ భావన సూచిస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ మిగులు పైన పట్టణ పారిశ్రామిక ప్రజల మనుగడ ఆధారపడి ఉంటుంది. ఏ దేశం అయినా తగినంత అమ్మదగిన మిగులును సాధించడంలో విఫలం అయినట్లు అయితే తప్పనిసరిగా ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవాలి.

TS Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 16.
సాంఘిక కారణాలు.
జవాబు.
సాంఘిక దృక్పథాలు, విలువలు, సంస్థలు కూడా ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేస్తాయి. గున్నార్ మిర్డాల్ ప్రకారం అల్పాభివృద్ధి చెందిన దేశాలలో శీఘ్ర ఆర్థికాభివృద్ధికి విలువల ఆధునీకరణ అవసరం. అనగా ఉత్పాదకతను పెంచడానికి, జీవన స్థాయిలను పెంచడానికి, సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని సాధించడానికి ఉద్దేశ్య పూర్వకంగానే శాస్త్రీయ దృక్పధాన్ని అలవర్చుకోవడం, ఆధునిక