TS 10th Class Telugu Important Questions 9th Lesson జీవనభాష్యం

These TS 10th Class Telugu Important Questions 9th Lesson జీవనభాష్యం will help the students to improve their time and approach.

TS 10th Class Telugu 9th Lesson Important Questions జీవనభాష్యం

PAPER – I : PART – A

I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)

1. లఘు సమాధాన ప్రశ్నలు మార్కులు

అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
మన పేరు శాశ్వతంగా నిలవాలంటే ఏం చేయాలి ?
జవాబు:
మన పేరు శాశ్వతంగా నిలవాలంటే చెరగని త్యాగం చేయాలి. మనం చేసిన త్యాగకృత్యం, ఎప్పటికీ మరచి పోలేనిదిగా ఉండాలి. అంతటి త్యాగము చేసిన వారి పేరు, చరిత్రలో నిలిచిపోతుంది. ప్రస్తుతం ఏదో బిరుదులు ఇస్తున్నారని, ఆ బిరుదులు మనకు ఉన్నాయి కదా అని అనుకుంటే లాభం లేదనీ, ఆ బిరుదుల వల్ల, సన్మానాల వల్ల వచ్చే పేరు చిరకాలం నిలవదనీ కవి గుర్తుచేశారు. ప్రజలు ఎన్నటికీ మరచిపోలేని గొప్ప త్యాగం చేసిన త్యాగమూర్తుల పేరు చిరస్థాయిగా నిలిచి ‘ఉంటుందని కవి తెలిపాడు.

ప్రశ్న 2.
“ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు” అనే వాక్యంలో మీరేం గ్రహించారు ?
జవాబు:
ఎడారిలో ఇసుకదిబ్బలు ఉంటాయి. అక్కడ నీళ్ళు దొరకవు. ఇసుక నేలల్లో పంటలు పండవు. అందువల్ల నీళ్ళు దొరకని ఎడారులలోని ఇసుక దిబ్బలను దున్నితే ఫలితము ఏముంటుంది ? అవి వ్యవసాయానికి పనికిరావు కదా ! అని నిరాశపడరాదని కవి చెప్పాడు.

సేద్యానికి పనికిరావు కదా అని బంజరు బీడులను దున్నకుండా విడిచిపెట్టవద్దనీ, వాటిని దున్ని విత్తులు చల్లితే చక్కని పైరు పంటలు పండుతాయనీ, నిరాశ పనికిరాదనీ, ఆశావహ దృక్పథంతో ముందుకు నడిస్తే, తప్పక ఫలితాలు వస్తాయనీ కవి ఈ వాక్యాల ద్వారా సందేశం అందించాడు.

TS 10th Class Telugu Important Questions 9th Lesson జీవనభాష్యం

ప్రశ్న 3.
జయాపజయాలను నువ్వెలా స్వీకరిస్తావు ? సి.నా.రె. చెప్పారు?
జవాబు:
ఒక లక్ష్యాన్ని సాధించాలంటే మనం చక్కటి ప్రణాళిక వేసుకోవాలి. ప్రణాళిక లేని ప్రయాణం గమ్యం తెలీకుండా సాగుతుంది. గమ్యం చేరనీదు. అందుకనే ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి. ప్రణాళికలు సఫలమైనా ఒక్కొక్క సారి ఇతరుల, అధికారుల సహాయ నిరాకరణ వల్ల అపజయం కలగవచ్చు లేదా శక్తికి మించిన లక్ష్యాన్ని ఎంచుకున్న అపజయం ఎదురవవచ్చు. కానీ కుంగి పోను.

సాలీడు ఎన్నిసార్లు కింద పడ్డా మళ్ళీ గూడు కట్టినట్లు పోరాడతాను విజయం సాధిస్తాను. విజయానికి పొంగిపోను పరాజయానికి కుంగిపోను. విజయమైనా, అపజయమైనా తరువాత ప్రణాళికను సిద్ధపరుస్తూనే ఉంటాను. సి.నా.రె కూడా ‘జీవన భాష్యం’ లో ఇదే చెప్పారు. “పేరవుతుందని” చదువుకున్నాక ఏ విద్యార్థి అయిన తన పేరు తల్లిదండ్రుల పేరు తరాలపాటు నిలిచేలా ప్రయత్నం తప్పక చేస్తాడు.

ప్రశ్న 4.
జీవనభాష్యం పాఠం చదవడం వలన ప్రయోజనం ఏమిటి?
జవాబు:
జీవన భాష్యం పాఠం చదవడం వలన జీవించే విధానం తెలుస్తుంది. ధైర్యంగా పనిని ప్రారంభించడం తెలుస్తుంది. ఎవరో ఏదో ‘వంక’ పెడతారేమో అనే సంశయం పటాపంచలవుతుంది. ఎవరో భయపెడితే భయపడే పరిస్థితి ఉండదు. భయపడకుండా ప్రయత్నించి, సాధించినవే ఇపుడు మనం అనుభవించే సౌఖ్యాలని తెలుస్తుంది.

కష్టపడి పనిచేస్తే ఫలితం ఉండదని నిరాశ పడకూడదు. తప్పనిసరిగా ఫలితం ఉంటుందని తెలు స్తుంది. అందరితో కలిసిమెలిసి ఉండే స్వభావం అల వడుతుంది. ఆటంకాలకు భయపడకుండా ముందుకు సాగిపోయే గుణం అలవడుతుంది.

ఈ పాఠం చదవడం వలన దేన్నైనా సాధించాలనే పట్టుదల పెరుగుతుంది. జంకు ఉండదు. సమాజం మహోన్నతంగా తీర్చదిద్దబడుతుంది. అదే ఈ పాఠం చదవడం వలన ప్రయోజనం.

ప్రశ్న 5.
‘ఎంతటి ఎత్తులకు ఎదిగినా ఉంటుంది పరీక్ష’ అనే కవి అనడంలో గల ఉద్దేశ్యం ఏమిటి ? (June ’17)
జవాబు:
ఎంత సామర్థ్యం మనకు ఉన్నా, అధికారం, సంపదలు ఉన్నా, మనం ఎన్నో విజయాలు సాధించినా, ఇంక మనకు ఏ కష్టాలూ, బాధలూ రావని ధీమాగా ఉండరాదని కవి సందేశం ఇచ్చాడు. విధి ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో, సమస్యలను తీసుకువస్తుందో, పరీక్షలు పెడుతుందో ఎవరూ ఊహించలేరని కవి సూచించాడు. విధి శక్తి ముందు ఎవరైనా తలవంచ వలసిందే అని కవి తెలియ జెప్పాడు.

కవి తాను చెప్పిన మాటకు దృష్టాంతంగా హిమాలయ పర్వతాన్ని గూర్చి గుర్తు చేశాడు. ఉన్నతమైన హిమాలయపర్వత శిఖరం కూడా ఎండవేడికి కరిగిపోయి, నదిగా ప్రవహించవలసి వస్తోంది. అలాగే ఎంతటి మనిషి అయినా, విధి పరీక్షిస్తే అతని గర్వం కరిగి నీరు కావలసిందే అని కవి తెలిపాడు.

TS 10th Class Telugu Important Questions 9th Lesson జీవనభాష్యం

2. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు మార్కులు

ఆ) కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘చెదరని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది’ అంటే ఏమిటి ? పేరు నిలపడానికి ఏమి మంచిపనులు చేయాలి?
జవాబు:
చెదరని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది’ అంటే, త్యాగం చేసినవారి యొక్క మంచిపనులు చేసిన వారి యొక్క పేర్లు, చరిత్రలో శాశ్వతంగా నిలుస్తాయని అర్థము.

పేరు నిలవడానికి చేయవసిన పనులు :

  1. దానధర్మాలు విరివిగా చేయాలి.
  2. దేవాలయాలు, ధర్మసత్రాలు కట్టించాలి.
  3. పేదవారికి ఉచితంగా పెళ్ళిళ్ళు చేయించాలి.
  4. కావ్యాలను రచించాలి లేదా అంకితం తీసికోవాలి.
  5. బావులు, చెరువులు తవ్వించాలి.
  6. ఉద్యానవనాలు ఏర్పాటు చేయాలి.
  7. విద్యాలయాలు ఏర్పాటు చేయాలి.
  8. చదువుకొనేవారికి ఉపకారవేతనాలు ఇవ్వాలి.
  9. వైద్యశాలలు కట్టించాలి.
  10. గ్రామాలకు రోడ్లు వగైరా వేయించాలి.

ప్రశ్న 2.
గజల్ ప్రక్రియను పరిచయం చేయండి. మీరు చదివిన గజల్ దేనిని గూర్చి చెప్పిందో తెలపండి.
జవాబు:
సరస భావన, చమత్కార ఖేలన, ఇంపూ, కుదింపూ అనేవి గజల్ ప్రక్రియకు జీవగుణాలు. మేము సి. నారాయణరెడ్డి గారు రాసిన ‘జీవనభాష్యం’ అనే గజల్న చదివాము.

గజల్లో పల్లవిని ‘మత్లా’ అని, చివరి చరణాన్ని ‘మక్తా’ అని పిలుస్తారు. కవి నామ ముద్రను ‘తఖల్లుస్’ అని అంటారు. పల్లవి చివర ఉన్న పదం, ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది.

మేము చదివిన జీవనభాష్యం గజల్, మనిషి దేనికోసమూ నిరుత్సాహం పడకూడదనీ, ఎంతటి గొప్ప విషయాన్ని అయినా, ఎంతటి ఘనకార్యాన్ని అయినా, ప్రయత్నం చేస్తే సాధింపవచ్చుననీ తెలుపుతుంది. దుఃఖాన్ని తట్టుకుంటూ, కష్టాలను ఎదుర్కొంటూ, తనంతట తాను ఎదుగుతూ, ఇతరుల కోసం శ్రమిస్తూ జీవించే మనిషి, సంఘంలో బాగా గౌరవం పొందు తాడని ఈ గజల్లో చెప్పబడింది.

ప్రశ్న 3.
‘జీవనభాష్యం’ పాఠం ఆధారంగా సి.నా.రె. గారి కవిత్వాన్ని విశ్లేషించండి.
జవాబు:
సి.నా.రె. గారు రచించిన ‘జీవన భాష్యం’ చాలా బాగుంది. నీరవుతుంది, దారవుతుంది, ఊరవుతుంది, పేరవుతుంది వంటి పదాలను పాదాల చివర రాసి అంత్యప్రాసను పాటించారు.

‘మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది’ వంటి వాక్యాలలో వాస్తవికతను చిత్రీకరించారు. చల్లటి గాలి తగిలితే ఎవరికైనా మనసుకు హాయిగా ఉంటుంది. అలాగే మబ్బుకు కూడా అన్ని చెప్పాడు. ‘జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది’ వంటి వాక్యాల ద్వారా, ఒక పనిని ప్రారంభించడానికి జంకకూడదని చెప్పారు. జంకకుండా పని మొదలు పెడితే తర్వాతి తరాలకు అదే ఆదర్శమౌతుందని చెప్పారు.

‘ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు’ అనే చరణంలో కష్టపడి పనిచేస్తే దేన్నైనా సాధించవచ్చని బోధించారు. అందరూ కలసిమెలసి ఉండాలని ఉద్బో ధించారు. ఎంత గొప్ప వారికైనా ఏవో కష్టాలు తప్పవని బోధించారు. కష్టాలను తట్టుకొంటేనే సుఖాలు కలుగు తాయని చెప్పారు.

జీవన భాష్యం పాఠం ద్వారా జీవితాన్ని గడప వలసిన విధానాన్ని వివరించారు. జీవితాన్ని కాచి వడబోసిన అనుభవాన్ని భావితరాలకు పాఠ్యాంశంగా రచించారు.

TS 10th Class Telugu Important Questions 9th Lesson జీవనభాష్యం

ప్రశ్న 4.
మనిషి గొప్పస్థానానికి చేరుకోవడానికి ‘జీవన భాష్యం’ పాఠం ద్వారా కవి సి.నా.రె. సూచించిన (Mar. ’17)
జవాబు:
ప్రకృతికి భయపడిన ఆదిమానవుడు తనకు తాను నిలదొక్కుకున్నాడు. చాలా ప్రగతిని సాధించాడు. టెక్నాలజీ పెరిగింది. సౌకర్యాలు పెరిగాయి. కానీ, జీవన విధానంపై ఇంకా పూర్తి అవగాహనను మానవుడు పెంచుకోలేదు.

ఈరోజు చాలామంది ప్రతి చిన్న విషయానికీ ఆందోళన చెందుతున్నారు. తమలో తాము కుమిలి పోతున్నారు. తమ బాధలను కనీసం స్నేహితులకు, తల్లిదండ్రులకు అయినా చెప్పు కోవాలి. అలా చెప్పు కొంటే బాధతో నిండిన మనసు కరిగి కన్నీటి రూపంలో బయటికి పోతుంది. మనసు తేలికవుతుంది.

ఏవో చిన్న చిన్న సమస్యలు చూసి భయపడ కూడదు. కష్టపడి పనిచేస్తే తప్పనిసరిగా ఫలితం ఉంటుంది. జంతువులకు లేని ఆలోచన మనుషులకు ఉంది. ఆ ఆలోచనను సద్వినియోగం చేసుకోవాలి. అందరితో కలిసిమెలిసి ఉండాలి.

ఎంత గొప్పవారికైనా కష్టాలు తప్పవు. వాటిని పరీక్షలనుకోవాలి. గుణపాఠాలు నేర్చుకోవాలి. అభివృద్ధిని సాధించాలి. ఈ విధంగా జీవన విధానం ఉండాలి.

ప్రశ్న 5.
‘చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది’ అనే మాటద్వారా సి.నా.రె మనకిచ్చిన సందేశంలో ఉన్న అంతరార్థాన్ని సోదాహరణంగా వివరించండి. (June ’18)
జవాబు:
చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది. అంటే త్యాగం చేసిన వారి యొక్క మంచిపనులు, చేసిన వారి యొక్క పేర్లు చరిత్రలో శాశ్వతంగా నిలుస్తాయి. ప్రస్తుతం మనకు ఏదో బిరుదులు వస్తాయనీ అనుకుంటే లాభం లేదనీ, ఆ బిరుదుల వల్ల, సన్మానాల వల్ల వచ్చే పేరు చిరకాలం నిలువదనీ సినారె ఈ గజల్ ద్వారా తెలియపరిచారు.

త్యాగం చేసేవారిని, మంచి పనులు చేసేవారి పేర్లు మాత్రమే చరిత్రలో వెలుగుతాయని కవి ప్రబోధించాడు. మనం స్వార్థాన్ని విడిచి సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి. చేసే పనుల్లో చిత్తశుద్ధి, అంకితభావం ఉండాలి. తనకు మేలు కలిగే పనులను చేయడంకంటే తోటివారికి ఎక్కువ మేలు కలిగే పనులను చేయాలి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో అనాథలైన, అన్నార్హులైన, నిరాశ్రయులైన ప్రజలను ఆదుకోవాలి.

వికలాంగుల సంక్షేమంకోసం నిరంతరం కృషిచేయాలి. వారికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేయాలి. గ్రామంలో పచ్చని చెట్లను నాటాలి. మూగజీవాల సంరక్షణకు చర్యలను చేపట్టాలి. ప్రమాదాల్లో గాయపడినవారిని ఆసుపత్రుల్లో చేర్పించి వైద్యసహాయం అందే విధంగా కృషి చేయాలి. ఈ విధంగా మనమంతా ప్రజల హితం కోసం నిస్వార్థంగా సేవలను అందించాలి. ఇటువంటి పనుల వల్లనే మన పేరు చరిత్రలో నిలిచిపోతుంది.

PAPER – II : PART – A

1. అవగాహన – ప్రతిస్పందన

అపరిచిత పద్యాలు (5 మార్కులు)

ప్రశ్న 1.
ఈ క్రింది పద్యమును చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.

తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు
చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు

ప్రశ్నలు – సమాధానములు

1. తైల మెచ్చట నుండి తీయవచ్చును ?
జవాబు:
తైలమును ఇసుక నుండి తీయవచ్చును.

2. కుందేటి కొమ్ము ఎలా సాధించవచ్చు ?
జవాబు:
ఎక్కడెక్కడో తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు.

3. మూర్ఖుని మనసు రంజింప చేయగలమా ?
జవాబు:
మూర్ఖుని మనసు రంజింపజేయలేము.

4. ఈ పద్యానికి శీర్షిక సూచించండి.
జవాబు:
“మూర్ఖుని మనసు” అను శీర్షిక సరిపోవును.

5. ఇసుము అనగానేమి ?
జవాబు:
ఇసుము అనగా ఇసుక అని అర్థము.

TS 10th Class Telugu Important Questions 9th Lesson జీవనభాష్యం

2. క్రింది పద్యము చదివి, క్రింద తప్పొప్పులను గుర్తించండి.

కమలములు నీటబాసిన
కమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు దప్పిన
తమ మిత్రుల శత్రులగుట తథ్యము సుమతీ!

ప్రశ్నలు – సమాధానములు

1. కమలములకు, సూర్యునికి గల సంబంధంలేదు ( )
జవాబు:
తప్పు

2. ‘కమలిన భంగిన్’ అనగా వాడిపోని విధం. ( )
జవాబు:
తప్పు

3. తమ స్థానములు కోల్పోతే అనే అర్థం ఇచ్చే పదం తమతమ నెలవులు దప్పిన ( )
జవాబు:
ఒప్పు

4. నీట బాసినవి కమలములు. ( )
జవాబు:
ఒప్పు

5. ఇది వేమన శతకంలోని పద్యం. ( )
జవాబు:
తప్పు

3. ఈ క్రింది పద్యమును చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.

ఎఱుక గల వారి చరితలు
గఱచుచు సజ్జనుల గోష్ఠి గదలక ధర్మం
బెఱుగుచు నెఱిగిన దానిని
మఱువ కనుష్ఠించునది సమంజస బుద్ధిన్

ప్రశ్నలు – సమాధానములు

1. ఎవరి చరిత్ర తెలుసుకోవాలి ?
జవాబు:
జ్ఞానవంతుల చరిత్ర తెలుసుకోవాలి.

2. ధర్మాన్ని ఎక్కడ నుంచి తెలుసుకోవాలి ?
జవాబు:
ధర్మాన్ని సజ్జనుల సమావేశం నుంచి తెలుసుకోవాలి.

3. దేనిని అనుష్ఠించాలి ?
జవాబు:
ధర్మాన్ని అనుష్ఠించాలి.

4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక “నీతి బోధ”.

5. గోష్ఠి అనగానేమి ?
జవాబు:
గోష్ఠి అనగా సమావేశమని అర్థము.

4. క్రింది పద్యమును చదివి క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.

ఎప్పుడు తప్పులు వెదకెడు
అప్పురుషుని గొల్వగూడదది యెట్లన్నన్
సర్పంబు పడగ నీడను
కప్ప వసించిన విధంబు గదరా సుమతీ !

ప్రశ్నలు – సమాధానములు

1. నిరంతరం తప్పులు వెతికే వాని సన్నిధి ఎటువంటిది ?
జవాబు:
పాము నీడలాంటిది.

2. ఎప్పుడూ తప్పులు వెతికే వాడు ఎలాంటివాడు ?
జవాబు:
పాము లాంటివాడు.

TS 10th Class Telugu Important Questions 9th Lesson జీవనభాష్యం

3. ఎవరిని సేవించకూడదు ?
జవాబు:
ఎప్పుడూ తప్పులు వెతికేవాడిని.

4. ఈ పద్యం ఏ శతకంలోనిది ?
జవాబు:
ఈ పద్యం సుమతీ శతకంలోనిది.

5. “అప్పురుషుడు” అంటే అర్థం ఏమిటి ?
జవాబు:
ఎప్పుడూ తప్పులు వెతికే వ్యక్తి అని అర్థం.

5. క్రింది పద్యం చదివి, ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.

అనగననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగతినగ వేము తీయనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభి రామ వినురవేమ!

ప్రశ్నలు – సమాధానములు

1. అనగా అనగా అభివృద్ధి అయ్యేది ఏది ?
జవాబు:
అనగా అనగా అభివృద్ధి అయ్యేది రాగం

2. ఏది తినగా తినగా తియ్యగా ఉంటుంది ?
జవాబు:
వేము (వేపాకు) తినగా తినగా తియ్యగా ఉంటుంది.

3. పనులు సమకూరాలంటే ఏం చేయాలి ?
జవాబు:
పనులు సమకూరాలంటే సాధన చెయ్యాలి.

4. ఈ శతక పద్యాలు చెప్పిన కవి ఎవరు ?
జవాబు:
ఈ శతకపద్యాలు చెప్పిన కవి వేమన.

5. ఈ పద్యంలో ఒక సంధి పదాన్ని విడదీసి, సంధి పేరు వ్రాయండి.
జవాబు:
విశ్వద + అభిరామ = విశ్వదాభిరామ (సవర్ణదీర్ఘ సంధి).

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

సృజనాత్మక ప్రశ్నలు (5 మార్కులు)

ప్రశ్న 1.
జీవనభాష్యం పాఠం చదవడం వలన నీవు పొందిన అనుభూతిని వివరిస్తూ మీ మిత్రునికి లేఖ వ్రాయండి.
జవాబు:

సికింద్రాబాద్,
X X X X

ప్రియనేస్తం రహీమ్,

మాకు నిన్న జీవన భాష్యం పాఠం చెప్పారు. పాఠం చిన్నదే కానీ, చాలా బాగుంది. జీవన విధానం ఈ పాఠంలో చాలా బాగా చెప్పారు.

ప్రతి పనికీ ఏదో ఒక వంక పెట్టకూడదన్నారు. ఏవో సమస్యలుంటాయని ఎవరినీ భయపెట్ట కూడదని చెప్పారు.

మా స్నేహితులు నన్ను దేనికో దానికి భయ పెడుతుంటారు. ఈ పాఠం చదివాక భయపెట్టడం, భయపడడం మానేశారు.

ఇది వరకు ఏ పనిచేసినా ప్రయోజనం ఉంటుందా ? ఉండదా ? అని ఆలోచించేవాళ్ళం. ఇక అటువంటి ఆలోచన మానేశాం. కష్టపడి చదివితే మార్కులవే వస్తాయి. కష్టపడి పనిచేస్తే ఫలితం తప్పక ఉంటుందనే నమ్మకం కలిగింది.

మొత్తం మీద ఈ పాఠం చదివాక మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఉంటాను మరి. నీకు 10వ తరగతిలో నచ్చిన పాఠం గురించి రాయి.

ఇట్లు,
నీ స్నేహితుడు,
XXXX.

చిరునామా :

ఆర్. రహీమ్, నెం. 6,
10వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
మల్కాపురం,
రంగారెడ్డి జిల్లా.

ప్రశ్న 2.
మనిషి జీవించవలసిన విధానాన్ని వివరిస్తూ ఒక వ్యాసం రాయండి.
జవాబు:

జీవన విధానం

ప్రకృతికి భయపడిన ఆదిమానవుడు తనకు తాను నిలదొక్కుకున్నాడు. చాలా ప్రగతిని సాధించాడు. సాంకేతిక విజ్ఞానం పెరిగింది. సౌకర్యాలు పెరిగాయి. కానీ, జీవన విధానంపై ఇంకా పూర్తి అవగాహనను మానవుడు పెంచుకోలేదు.

ఈ రోజు చాలామంది ప్రతి చిన్న విషయానికీ ఆందోళన పడుతున్నారు. తమలో తాము కుమిలి పోతున్నారు. తమ బాధలను కనీసం స్నేహితులకు, తల్లిదండ్రులకు అయినా చెప్పుకోవాలి. అలా చెప్పుకొంటే బాధతో నిండిన మనసు కరిగి కన్నీటి రూపంలో బయటికి పోతుంది. మనసు తేలికవుతుంది.

ఏవో చిన్న చిన్న సమస్యలు చూసి భయపడ కూడదు. కష్టపడి పనిచేస్తే తప్పనిసరిగా ఫలితం ఉంటుంది. జంతువులకు లేని ఆలోచనాశక్తి మనుషులకు ఉంది. ఆ ఆలోచనాశక్తిని సద్వినియోగం చేసుకోవాలి. అందరితో కలిసిమెలిసి ఉండాలి.

ఎంత గొప్పవారికైనా కష్టాలు తప్పవు. వాటి ద్వారా గుణపాఠాలు నేర్చుకోవాలి. అభివృద్ధిని సాధించాలి. ఈ విధంగా జీవన విధానం మెరుగుపరచుకోవాలి.

TS 10th Class Telugu Important Questions 9th Lesson జీవనభాష్యం

ప్రశ్న 3.
సమస్యలను చూసి భయపడేవారికి ధైర్యాన్ని కలిగించే సూక్తులను రాయండి.
జవాబు:
పరిష్కారం లేని సమస్య లేదు.. భయపడకునేస్తం. ఉంటుంది ఆదుకొనే హస్తం. సమస్యల వల్ల కష్టాలు రావు. కష్టాలే ఉంటాయనుకొంటే సమస్యలు పెరుగుతాయి.

ప్రతి సమస్యనూ కాలం పరిష్కరిస్తుంది. సమస్యలు ఏర్పడినపుడే బుర్ర చురుకుగా పని చేస్తుంది.
సమస్యలు లేని జీవితం పందిరి లేని పాదువంటిది. సమస్యలు మనుషులకు కాక మానులకొస్తాయా ? సాధన చేస్తే సాధ్యం కానిది లేదు.

ప్రయత్నిస్తే పరమాత్మైనా కనిపిస్తాడు. ధైర్యమే విజయం.

ప్రశ్న 4.
భయపడే వ్యక్తికి ధైర్యం కల్గించేలా సంభాషణ తయారు చేయండి.
జవాబు:
మురళి : నేను తప్పు చేశాన్రా, నాకు చాలా భయం వేస్తోంది.
సుధీర్ : ఏం చేశావు ? చెప్పు.

మురళి : ఎవ్వరూ ఏమీ చేయలేరురా. ఇదంతా నా కర్మ.
సుధీర్ : అంత తప్పేం చేశావురా !
మురళి : మా నాన్నగారి పరువు తీసేశాను రా ! నాకు బతికే అర్హత లేదు రా !
సుధీర్ : ఛీ ఛీ అవేం మాటలురా, ఏమయిందో చెప్పు.
మురళి : నా పరీక్ష ……….. పోతుందిరా. నేను పరీక్ష సరిగా రాయలేదు. మా నాన్నగారేమో 10 / 10 రావాలన్నారు.
సుధీర్ : పోతే పోతుంది. దానికే భయ పడిపోతావా ? అయినా ఫలితాలు రావాలి కదా !
మురళి : అపుడు తలెత్తుకోలేనురా !

సుధీర్ : ఏడిశావ్. పరీక్ష పాసవ్వడమే జీవితం కాదు. గొప్పవారు చాలా మంది చిన్నతనంలో సరిగ్గా చదవలేదు. గొప్పవాళ్ళు కాలేదా, మనకు తెలుగు వ్యాక రణం రాసిన పరవస్తు చిన్నయ సూరికి కూడా చిన్నతనంలో సరిగ్గా చదువు రాలేదు. భయ పడిపోయేడా !
మురళి : అయితే ……. పరీక్ష పోయినా ఫరవాలేదా ?
సుధీర్ : నేనిప్పుడే మీ నాన్నగారికి చెబుతా, మనం బాగా చదవాలని అంటారు కానీ, పరీక్ష పాసవ్వడమే జీవిత ధ్యేయమని ఎవ్వరూ చెప్పరు.
మురళి : అలాగే ఇక ఈ విషయం ఆలోచించను.
సుధీర్ : వెరీ గుడ్ – బై

ప్రశ్న 5.
జీవన భాష్యం గజల్లోని అంత్య పదాలతో సొంతంగా వచన కవిత రాయండి.
జవాబు:
నీరవుతుంది : సౌమ్యంగా మాట్లాడితే కోపం కరిగి నీరవుతుంది.
దారవుతుంది : ముందు నిలబడి నడిస్తే పది మందికి అది దారవుతుంది.
ఊరవుతుంది : చమటతో నేలను తడిపితే అది ఊరవుతుంది
ఏరవుతుంది. : మనిషిని మనిషితో కలిపితే అది ఏరవుతుంది
పేరవుతుంది : వాన ఆగక కురిస్తే చేనే ఏరవుతుంది.
పేరవుతుంది : లోకం నన్ను పొగిడినప్పుడే అది నా పేరవుతుంది.

ప్రశ్న 6.
ఆచార్య సి.నారాయణరెడ్డి గారు ఒకవేళ మీ పాఠశాలకు వస్తే మీరు వారి నుంచి ఏం తెలుసుకోవాలని అను కుంటున్నారో ప్రశ్నలు రాయండి.
జవాబు:

  1. మీ రచనల్లో మీకు ఏదంటే ఎక్కువ ఇష్టం ?
  2. విశ్వంభరలో దేని గురించి వివరించారు ?
  3. మీకు బాగా ఇష్టమైన సాహిత్య ప్రక్రియ ఏది ?
  4. మేమూ గజల్స్ రాయాలంటే ఏం చేయాలి ?
  5. తెలుగు భాషపైన పట్టు రావాలంటే మేం ఏమేం పుస్తకాలు చదవాలి ?
  6. ఆధునిక ఆంధ్ర కవిత్వము, సంప్రదాయాలు, ప్రయోగాల పేరిట మీరు ఇతరుల సాహిత్యాన్ని ఎందుకు పరిశోధనా అంశంగా తీసుకున్నారు ?

అదనపు వ్యాకరణాంశాలు

PAPER – I : PART – B

1. సొంతవాక్యాలు

1. గుండెలు పగులు : అగ్ని బాధితులు గుండెలు పగిలేలా ఏడ్చి, సొమ్మసిల్లి పడ్డారు.
2. ఎత్తుల కెదుగు : ఎంత ఎత్తులకెదికినా, బుద్ధిమంతుడు తన మూలాన్ని మరిచిపోడు.

TS 10th Class Telugu Important Questions 9th Lesson జీవనభాష్యం

2. పర్యాయపదాలు

మబ్బు – మేఘము, చీకటి, అజ్ఞానము
మనసు – మానసము, హృదయము, ఇష్టము,తలపు, అభిలాష
కన్ను – నేత్రము, చూపు, జాడ, బండిచక్రము
నేస్తం – మైత్రి, చెలిమి, స్నేహం
ఫలము – నాలుగు కర్షములయెత్తు, మాంసము, విఘడియ
మనుష్యుడు – మనుజుడు, మానసి

3. నానార్థాలు

మనస్సు = హృదయము, తలపు, కోరిక, అభిప్రాయము
మబ్బు = మేఘము, అజ్ఞానము, చీకటి
అడుగు = పాదము, పాతాళము, అధమము, పద్యపాదం
దిబ్బ = ఉన్నతభూమి, కుప్ప, మట్టిదిబ్బ, కొండ, ద్వీపము
ఫలము = పండు, ప్రతిఫలం, ప్రయోజనం, ధనము
మృగము = జింక, పశువు, యాచన, వేట, కస్తూరి
శిరస్సు = తల, కొండ కొన, ముఖ్యము, సేనాగ్రము
వంక = వంకర, దిక్కు, నదీ వక్రము, వాగు, వంపు
డొంక = పొద, పల్లపు ప్రదేశం, పశువుల ధారి

4. ప్రకృతి – వికృతులు

ప్రకృతి – వికృతి

మనుష్యుడు – మనిషి
హిమము – ఇగము
నీరము – నీర
శిరస్సు – సిరస్సు
త్యాగము – చాగము
ద్వీపము – దిబ్బ
ప్రతిజ్ఞ – బిరుదు
మృగము మెకము

5. వ్యుత్పత్త్యర్థాలు

హిమగిరి = హిమము గల కొండ (మంచుకొండ)
మనుష్యుడు = మనువు వలన పుట్టినవాడు (నరుడు)

PAPER – II : PART – B

1. సంధులు

1. ఉకారసంధి

సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు.
ఉదా : నీరవుతుంది = నీరు + అవుతుంది

కన్నీరవుతుంది = కన్నీరు + అవుతుంది
దారవుతుంది = దారి + అవుతుంది
ఫలమేమి = ఫలము + ఏమి
పైరవుతుంది = పైరు + అవుతుంది
ఊరవుతుంది = ఊరు + అవుతుంది

2. ఇకార సంధి

సూత్రం : ఏమ్యాదులలోని, క్రియాపదాలలోని ఇత్తునకు సంధి వైకల్పికముగా వస్తుంది.
ఉదా : ఫలమేముందనకు = ఫలమేమి + ఉందనకు

3. అకార సంధి

సూత్రం : ఏమ్యాదులలోని, క్రియాపదాలలోని ఇత్తునకు సంధి వైకల్పికముగా వస్తుంది.
ఉదా : ఫలమేముందనకు = ఫలమేమి + ఉందనకు

TS 10th Class Telugu Important Questions 9th Lesson జీవనభాష్యం

2. సమాసాలు

సమాస పదము – విగ్రహవాక్యము – సమాసము పేరు

వంకలు, డొంకలు – వంకలునూ, డొంకలునూ – ద్వంద్వ సమాసం
మనిషి మృగము – మనిషియూనూ, మృగమూను – ద్వంద్వ సమాసం
జంకని అడుగులు – జంకనివైన అడుగులు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
చెరగని త్యాగం – చెరగనిదైన త్యాగం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఎడారి దిబ్బలు – ఎడారి యొక్క దిబ్బలు – షష్ఠీ తత్పురుష సమాసం
హిమగిరి శిరస్సు – హిమగిరి యొక్క శిరస్సు – షష్ఠీ తత్పురుష సమాసం
ఇసుకగుండెలు – ఇసుక అనెడి గుండెలు – రూపక సమాసం

3. ప్రత్యక్ష-పరోక్ష కథనం

1. ప్రత్యక్ష కథనం : “నేను జీవితంలో ఎవరినీ మోసం చేయలేదు. స్వార్థానికి నేను ఏ పాపం చేయలేదు” అన్నాడు.
పరోక్ష కథనం : తాను జీవితంలో ఎవరినీ మోసం చేయలేదనీ – స్వార్థానికి తాను ఏ పాపం చేయలేదనీ అన్నాడు.

2. ప్రత్యక్ష కథనం : “నాతో ఇన్ని బేరాలు లేవు” అని పరోక్ష కథనం
దుకాణాదారుడు అన్నాడు. :: తనతో అన్ని బేరాలు లేవని దుకాణాదారుడు అన్నాడు.

3. ప్రత్యక్ష కథనం : నేను నీతో “నేను రాను” అని చెప్పాను.
పరోక్ష కథనం : నేను నీతో రానని చెప్పాను.

4. ప్రత్యక్ష కథనం : “నీవు ఎక్కదలచిన ట్రైన్ ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు” అని చెప్పాడు ఆరుద్ర.
పరోక్ష కథనం : అతను ఎక్కదలచిన ట్రైన్ ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు అని ఆరుద్ర చెప్పాడు.

5. ప్రత్యక్ష కథనం : “అందరూ విద్య నేర్వండి” అని ప్రభుత్వం అంటున్నది.
పరోక్ష కథనం : అందరూ విద్య నేర్వండి అని ప్రభుత్వం అంటున్నది.

6. ప్రత్యక్ష కథనం : “నేను ఆవకాయలేనిదే ముద్ద ఎత్తను” అని చెప్పాడు.
పరోక్ష కథనం : అతను ఆవకాయ లేనిదే ముద్ద ఎత్తనని చెప్పాడు.

4. సంక్లిష్టవాక్యాలు

ప్రశ్న 1.
లక్ష్మీబాయి గుంటూరు వచ్చింది. లక్ష్మీబాయి శారదా నికేతనంలో చేరింది. (సామాన్య వాక్యం)
జవాబు:
లక్ష్మీబాయి గుంటూరు వచ్చి, శారదానికేతనంలో చేరింది. (సంక్లిష్ట వాక్యం)

ప్రశ్న 2.
అంబేద్కర్ మిళింద మహా విద్యాలయానికి స్థలం సంపాదించారు. అంబేద్కర్ భవన నిర్మాణాన్ని స్వయంగా పర్యవేక్షించారు. (సామాన్య వాక్యం)
జవాబు:
అంబేద్కర్ మిళింద మహా విద్యాలయానికి స్థలం సంపాదించి, భవన నిర్మాణాన్ని స్వయంగా పర్య వేక్షించారు. (సంక్లిష్ట వాక్యం)

ప్రశ్న 3.
రవి అన్నం తిన్నాడు. రవి బడికి వెళ్ళాడు. రవి చదువు కొన్నాడు. రవి తిరిగి వచ్చాడు. సామాన్య వాక్యం)
జవాబు:
రవి అన్నం తిని, బడికి వెళ్ళి, చదువుకొని, తిరిగి వచ్చాడు. (సంక్లిష్ట వాక్యం)

ప్రశ్న 4.
పశుబలంతో నాయకత్వాన్ని సాధించవచ్చు. పశు బలంతో నాయకత్వాన్ని నిలబెట్టుకోలేం. (సామాన్య వాక్యం)
జవాబు:
పశుబలంతో నాయకత్వం సాధించి నిలబెట్టుకోలేం. (సంక్లిష్ట వాక్యం)

ప్రశ్న 5.
రాముడు అడవికి వెళ్ళెను. తండ్రి మాట నెరవేర్చెను. (సామాన్య వాక్యం)
జవాబు:
రాముడు అడవికి వెళ్ళి తండ్రి మాట నెరవేర్చెను. (సంక్లిష్ట వాక్యం)

ప్రశ్న 6.
అతడు వేకువనే నిద్ర లేచెను. కాలకృత్యములు తీర్చుకొనెను. (సామాన్య వాక్యం)
జవాబు:
అతడు వేకువనే కాలకృత్యములు తీర్చు కొనెను. (సంక్లిష్ట వాక్యం)

5. ఆధునిక వాక్యాలు

1. నా జీవితములో అది ఒక సువర్ణావకాశము.
ఆధునిక భాష : నా జీవితంలో అదొక సువర్ణావకాశం.

2. కొందరు ఉపన్యాసముల మూలమున నా పని చేయుదురు.
ఆధునిక భాష : కొంతమంది (కొందరు) ఉపన్యాసాల మూలంగా ఆ పనిచేస్తారు.

3. మంటలు వేగముగా వ్యాపించుచున్నవి.
ఆధునిక భాష : మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి.

4. తత్పురుష సమాసమునకే వ్యధికరణమని పేరు కలదు.
ఆధునిక భాష : తత్పురుష సమాసానికే వ్యధికరణం అని పేరు. (లేదా) తత్పురుష సమాసాన్నే వ్యధికరణం అని అంటారు.

TS 10th Class Telugu Important Questions 9th Lesson జీవనభాష్యం

6. కర్తరి, కర్మణి వాక్యాలు

1. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను ఆహ్వానించాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
విశ్వామిత్రునిచే రామలక్ష్మణులు ఆహ్వానించబడ్డారు. (కర్మణి వాక్యం)

2. జనకుడు శివధనుస్సు తెప్పించాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
జనకునిచే శివధనుస్సు తెప్పించబడింది. (కర్మణి వాక్యం)

3. సుతీక్షమహర్షి తపశ్శక్తిని శ్రీరామునకు ధారాదత్తం చేసాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
సుతీక్ష తపశ్శక్తి శ్రీరామునకు ధారాదత్తం చేయబడింది. (కర్మణి వాక్యం)

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

Telangana SCERT 10th Class Telugu Guide Telangana 11th Lesson భిక్ష Textbook Questions and Answers.

TS 10th Class Telugu 11th Lesson Questions and Answers Telangana భిక్ష

చదువండి – ఆలోచించి చెప్పండి (T.B. P.No. 109)

కం. తనకోపమె తన శత్రువు
తనశాంతమె తనకురక్ష దయ చుట్టంబౌఁ
దనసంతోషమె స్వర్గము
తనదుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ఈ పద్యంలో శత్రువుగా దేనిని పేర్కొన్నాడు ? ఎందుకు ?
జవాబు:
ఈ పద్యంలో శత్రువుగా కోపాన్ని పేర్కొన్నాడు. కోపం అంతర్గతమైన శత్రువు. ఇది సకల అనర్థాలను కలిగిస్తుంది. బంధువులను, ఆప్తులను, మిత్రులను దూరం చేస్తుంది. రోగాలను కల్గిస్తుంది.

ప్రశ్న 2.
శాంతి రక్షగా ఉంటుందనడంలో కవి ఉద్దేశమేమిటి ?
జవాబు:
శాంతి మానవాళికి రక్షణకవచంలా ఉంటుంది. శాంతం ఉంటే మనకు శ్రీరామరక్ష. సమాజంలో గౌరవ మర్యాదలను వృద్ధి పొందింపజేస్తుంది. ఆప్తులను, బంధువులను దూరం చేయదు. పనులు త్వరగా అవుతాయి. ఇంట్లో సకల సుఖాలు కలుగుతాయి. యుద్ధోన్మాదాలు కలుగవు. అందువల్ల శాంతి అనేది కేవలం శరీరానికేకాదు. సకల సమాజానికి రక్షణగా ఉంటుంది. “తనశాంతమె తనకు రక్ష” అని సుమతీ శతకకర్త బద్దెన చెప్పాడు.

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

ప్రశ్న 3.
సంతోషాన్ని స్వర్గంగా కవి ఎందుకు భావిస్తున్నాడు?
జవాబు:
మానవునికి సంతోషం స్వర్గంలాంటిది. సంతోషంగా ఉండడంవల్ల సమస్యలు తొలగిపోయి అంతటా ఆనందం వెల్లివిరుస్తుంది. తృప్తి కలుగుతుంది. ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది. అరిషడ్వర్గాలకు లోనుకాడు. అందువల్లనే సంతోషాన్ని స్వర్గంగా కవి భావించాడు. “తన సంతోషమే తన స్వర్గము” అని కవులు చెప్పారు.

ప్రశ్న 4.
కోపంవల్ల కలిగే అనర్థాలను గురించిన సంఘటనలు మీకేమైనా తెలుసా ? చెప్పండి.
జవాబు:
కోపం వల్ల ఓర్పు పోతుంది. ఎదుటి వారిని అనకూడని మాటలు అంటాము. దాని మూలంగా పనులు చెడతాయి. అందరూ శత్రువులౌతారు. కోపం వల్ల జరిగే నష్టాన్ని చెప్పే కథ ఒకటి పంచతంత్రంలో ఉంది.

ఒక రైతు తాను అల్లారుముద్దుగా పెంచు కుంటున్న ముంగిసను తన బిడ్డకు కాపలాగా ఉంచి బయటకు వెళ్ళాడు. ఈ లోపు పాము ఇంట్లోకి రావడం చూసి బిడ్డను కాపాడడానికి ముంగిస ఆ పామును కరచి చంపింది. ఇంతలో రైతు ఇంటికి వచ్చాడు. ముంగిస యజమానిని చూసిన ఆనందంలో అతనికి ఎదురు వచ్చింది.

దాని నోటికి, ఒంటికి ఉన్న రక్తం మరకలు చూసి, బిడ్డను చంపిందనుకొని కోపంతో రైతు ముంగిసను కర్రతో కొట్టి చంపాడు. ముంగిసను చంపి, ఇంటిలోపలికి వెళ్ళిచూస్తే, బిడ్డ హాయిగా పడుకొని ఉన్నాడు. చచ్చిపడివున్న పాము కనబడింది. తన బిడ్డను రక్షించిన ముంగిసనే ఒళ్ళు తెలియని కోపంతో చంపానని రైతు వెక్కివెక్కి ఏడ్చాడు. కానీ జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 111)

ప్రశ్న 1.
ప్రాచీనకాలంలో భిక్షాటనాన్ని పవిత్రకార్యంగా ఎందుకు భావించేవారు ?
జవాబు:
సన్యాసులు, బ్రహ్మచారులు, మహర్షులు ‘భిక్షా’ వృత్తితో జీవించాలని, ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. వ్యాస మహర్షి వంటివారు పంచ భిక్ష స్వీకరించేవారు. అంటే కేవలం ఐదు గృహాలకు వెళ్ళి, ఐదుమంది నుండి మాత్రమే భిక్ష స్వీకరించేవారు. ఉపనయనం చేసినప్పుడు బ్రహ్మచారులు ముందుగా తల్లి నుండి, తరువాత తండ్రి నుండి భిక్షలు స్వీకరించాలి.

సన్యాసులు వంటి వారు జీవనం కోసం వస్తువులు, ధనం, వగైరా దాచరాదని, వారు భిక్ష ద్వారా లభించిన దానినే తిని జీవించాలనీ, శాస్త్రాలు చెపుతున్నాయి. అందుకే ప్రాచీన కాలంలో భిక్షాటనాన్ని పవిత్ర కార్యంగా భావించేవాడు

ప్రశ్న 2.
భిక్ష సమర్పించేటప్పుడు నాటికి నేటికి ఉన్న
జవాబు:
భిక్ష సమర్పించేటప్పుడు పూర్వం గృహిణులు, తమ ఇంటివాకిలిని ఆవు పేడతో శుద్ధిచేసి, అక్కడ ముగ్గు పెట్టి, అతిథికి అర్ఘ్యపాద్యాలిచ్చి, పుష్ప గంధాలతో పూజచేసి, అన్నం మీద నెయ్యి అభిఘూరం చేసి, పిండివంటలతో భక్తి విశ్యాసాలతో అతిథులకు పెట్టేవారు.

ఇప్పుడు భిక్ష పెట్టడం తక్కువ అయ్యింది. కేవలం కొద్దిమంది మాత్రం, ముష్టి పెడుతున్నారు. అది కూడా విసుగుకుంటూ, తప్పనిసరి పరిస్థితుల్లోనే బిచ్చగాండ్రకు ముష్టి వేస్తున్నారు. ముష్టి ఎత్తుకోడం, కొన్ని ప్రాంతాల్లో నేరంగా పరిగణింపబడుతోంది. నేడు దాన ధర్మాలు బాగా తగ్గిపోయాయి.

ఆలోచించండి – చెప్పండి (T.B. PNo. 113)

ప్రశ్న 1.
భిక్ష దొరకని వ్యాసుడు కోపగించాడు కదా ! దీనిపైన మీ అభిప్రాయమేమిటి ?
జవాబు:
వ్యాసుడు వేదవేదాంగవేత్త. అష్టాదశ పురాణాలు రచించినవాడు. భారతం రచించినవాడు. అటువంటి వాడు కేవలం రెండు రోజులు భిక్ష దొరకలేదని కాశీ నగరంపై కోపించి శపించడానికి సిద్ధమయ్యాడు. వ్యాసుడు కోపించడం, ధర్మం కాదు. లోకంలో ఎందరో మహర్షులు, తాపసులు నివ్వరి బియ్యం తిని జీవిస్తున్నారు.

కొందరు శాకాహారంతో, కంద భోజనంతో కడుపు నింపుకుంటున్నారు. కొందరు ఉంఛ వృత్తితో జీవిస్తున్నారు. కాబట్టి వ్యాసుని వంటి మహర్షి రెండు రోజులు పస్తు ఉండలేక, శివుని భార్యయైన కాశీ నగరాన్ని శపించబోవడం నేరం అని నా అభిప్రాయం.

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

ప్రశ్న 2.
“ఆకలి మనిషిని విచక్షణ కోల్పోయేటట్లు చేస్తుంది” దీన్ని గురించి మాట్లాడండి.
జవాబు:
మనిషికైనా, జంతువుకైనా, ఏ ప్రాణికైనా ఆకలి వేసినపుడు తిండి కావాలి. అది శరీరానికి ప్రాథమిక అవసరం. తిండి లేకపోతే కడుపులో మంట వస్తుంది. తలపోటు, చిరాకు, కోపం వస్తాయి. ఆ పరిస్థితులలో మనిషి విచక్షణ కోల్పోతాడు. తను ఏం చేస్తున్నాడో తనకు తెలియదు.

ప్రశ్న 3.
ఉన్న ఊరును కన్నతల్లితో సమానమని ఎందుకు (A.P Mar. ’16)
జవాబు:
కన్నతల్లి మనకు కావలసిన దానిని తాను గుర్తించి మన కడుపు నింపుతుంది. కన్నతల్లి తన బిడ్డలపై ఎప్పుడూ కోపగించుకోదు. పిల్లలను కన్నతల్లి బాగా ప్రేమగా చూసి, వారికి కావలసిన వాటిని ఇస్తుంది.

అలాగే మనం ఉన్న ఊరు కూడా, మనకు కావలసిన వాటిని సమకూరుస్తుంది. మనం ఉన్న ఊరిలో మనకు ప్రజలు అందరూ తెలిసిన వారు ఉంటారు. వారు తన తోడి వ్యక్తిని ప్రేమగా కన్నతల్లి వలె చూస్తారు. అందుకే జననీ, జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి” అన్నారు.

కన్నతల్లిని విడిచి వెళ్ళకూడదు. అలాగే మనం ఉన్న ఊరును విడిచి పొరుగూరు పోకూడదు. పొరుగూరిలో మనం ఎన్నటికీ ఉన్న ఊరులో వలె సుఖంగా ఉండలేము. కన్నతల్లి, ఉన్న ఊరు స్వర్గంతో
సమానం.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 114)

ప్రశ్న 1.
భోజనానికి ఆహ్వానించిన గృహిణితో వ్యాసుడు పలికిన మాటలను బట్టి మీకేమి అర్థమయింది
జవాబు:
గృహిణి వ్యాసుడిని భోజనానికి రమ్మని ఆహ్వానించింది. అప్పుడు వ్యాసుడు తానొక్కడినే భోజనానికి రానని, శిష్యులు పస్తులుండగా తానొక్కడినే తినడం మంచిది కాదని చెప్పాడు. దీనివల్ల వ్యాసునికి తన శిష్యులపట్ల ప్రేమానురాగాలు కలవని అందరూ ఆకలితో ఉంటే ఒక్కడినే తినడం మంచిదికాదని వ్యాసుని మాటల వల్ల అర్థమైంది.

ప్రశ్న 2.
ఈ పాఠం ఆధారంగా నాటి గురుశిష్య సంబంధాల గురించి వివరించండి.
జవాబు:
ఈ పాఠం ఆధారంగా అలనాటి గురుశిష్య సంబంధాలు జాతికి ఆదర్శంగా నిలుస్తాయి. శిష్యులు గురువుపై గౌరవాన్ని చూపేవారు. గురువు కూడా శిష్యులపై ప్రేమను, వాత్సల్యాన్ని చూపేవారు. శిష్యులు పస్తులుండగా గురువు ఆహారాన్ని స్వీకరించే వాడు కాదని తెలుస్తుంది.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
క్రింది పద్యం చదవండి. శ్రీ నాథుడు తన గురించి తాను ఏమని చెప్పుకొన్నాడో తెల్పండి.

సీ|| వచియింతు వేములవాడ భీమన భంగి
నుద్దండలీల నొక్కొక్కమాటు

భాషింతు నన్నయభట్టు మార్గంబున
నుభయవాక్రౌఢి నొక్కొక్క మాటు
వాక్రుత్తు తిక్కయజ్వ ప్రకారము రసా
భ్యుచిత బంధమున నొక్కొక్కమాటు
పరిఢవింతు ప్రబంధపరమేశ్వరుని ఠేవ
సూక్తివైచిత్రి నొక్కొక్కమాటు

తే॥గీ॥ నైషధాది మహాప్రబంధములు పెక్కు
చెప్పినాడవు మాకు నాశ్రితుడ వనఘ
ఇపుడు చెప్పఁదొడంగిన యీ ప్రబంధ
మంకితముసేయు వీరభద్రయ్యపేర (కాశీ 1-18)
జవాబు:

ఈ పద్యం శ్రీనాథుడి కవిత్వ రచనా విధానాన్ని గూర్చి చెపుతోంది.

  1. శ్రీనాథుడు వేములవాడ భీమన అనే కవి వలె, ఒక్కొక్కసారి “ఉద్దండ లీల”గా కవిత్వం చెపుతాడు.
  2. ఒక్కొక్కసారి నన్నయభట్టు కవి వలె, “ఉభయ, వాక్రౌఢి” తో కవిత్వం రాస్తాడు. “
  3. ఒకసారి తిక్కన గారి వలె, ‘రసాభ్యుచిత బంధము’గా రాస్తాడు.
  4. ఒక్కొక్కసారి ప్రబంధ పరమేశ్వరుడైన ఎఱ్ఱన గారి వలె “సూక్తి వైచిత్రి”ని చూపిస్తాడు.
  5. నైషధము వంటి అనేక ప్రబంధాలు రాశాడు.

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

ప్రశ్న 2.
‘అన్ని దానాల్లోకీ అన్నదానం మిన్న’ అనే అంశంపై తరగతిలో చర్చించండి.
జవాబు:
‘దానం’ అంటే ఇతరుడికి ఇవ్వడం. దానం చేస్తే పుణ్యం వస్తుందని చెపుతారు. ఈ జన్మలో దానం చేసుకుంటే తరువాతి జన్మలో భగవంతుడు మనకు తిరిగి ఇస్తాడని మన గ్రంథాలు చెపుతున్నాయి. దశదానాలు, షోడశ మహాదానాలు చేయాలని చెపుతారు. అయితే దానాలు అన్నింటిలోకి ‘అన్నదానం’ గొప్పది అని పెద్దలు చెపుతారు. ఈ మాట సత్యమైనది.

ఎదుటి వ్యక్తికి తృప్తి కలిగేటట్లు అన్నదానం చేయవచ్చు. అన్నదానం చేస్తే తిన్నవాడికి కడుపు నిండుతుంది. మరింతగా పెడతానన్నా అతడు తినలేడు. ఇతర దానాలు ఎన్ని చేసినా ఎంత విరివిగా చేసినా దానం పుచ్చుకున్న వాడికి తృప్తి కలుగదు. మరింతగా ఇస్తే బాగుండు ననిపిస్తుంది. అన్నదానం చేస్తే తిన్నవాడి ప్రాణం నిలుస్తుంది. కాబట్టి అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న అన్నమాట నిజం

ప్రశ్న 3.
“ఆకంఠంబుగ ….. శిలోంఛప్రక్రముల్ తాపసుల్!” పదాన్ని పాదభంగం లేకుండా పూరించి, భావాన్ని వ్రాయండి. (Mar. ’16)
జవాబు:
ప్రతిపదార్థ తాత్పర్యాలలో 10వ పద్యాన్ని చూడుము.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

1. క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు వ్రాయండి.

అ) పాఠం ఆధారంగా వ్యాసుడు ప్రవర్తించిన తీరుపై మీ అభిప్రాయాన్ని వ్రాయండి.
జవాబు:
“భిక్ష” పాఠం ఆధారంగా వ్యాసుడు ప్రవర్తించిన తీరును పరిశీలించగా ఎంతటి వారికయినా ఆకలిబాధ భరించరానిది అని అర్థమవుచున్నది. ఈ ఆకలి బాధచే వేదాలను నాలుగు విధాలుగా విభజించిన వేదవ్యాసుడు కోపానికి లోనయ్యాడు. కోపం వలన మంచి చెడుల విచక్షణను కోల్పోయి కాశీనగరాన్ని శపించబోయాడు. అంతేగాకుండా సకలశాస్త్రాలను చదివి, వాటి సారాన్ని తెలుసుకున్న వ్యాసుడు కేవలం 20 రోజులు భిక్ష దొరకని కారణంగా తీవ్రకోపానికి లోనై తన చేతిలోని భిక్షపాత్రను నేలకేసి విసిరిగొట్టెను.

“కనుక కోపం చాలా ప్రమాదకరమయినది. కోపం మానవునికి అంతర్గత శత్రువు. కోపం మన ప్రశాంతతను దెబ్బ తీస్తుంది. తోటివారిని ప్రశాంతంగా ఉండనివ్వదు. మనిషి ఆలోచనా శక్తిని, జ్ఞానాన్ని క్రమంగా క్షీణింపజేస్తుంది. ఆప్తులను, స్నేహితులను దూరం చేస్తుంది. గౌరవ, మర్యాదలు తగ్గిస్తుంది. కనుక మనిషి కోపాన్ని దూరం చేసుకోవాలి. అప్పుడే అందరికీ ఆదర్శంగా ఉండగలము” అనే విషయాన్ని గ్రహించాలి. మనిషికి కేవలం శాస్త్రజ్ఞానం మాత్రమే ఉంటే సరిపోదనీ, ఆత్మజ్ఞానం మరియు ఇంద్రియ నిగ్రహం ఉండాలని వ్యాసుని పాత్ర ద్వారా గ్రహించవచ్చు.

ఆ) నేఁడు నిన్నటికి మఱునాఁడు నిక్కువంబు” అను మాటలు ఎవరు ఎవరితో ఏ సందర్భంలో అన్నారు ? వీటి అంతరార్థమేమిటో వివరించండి.
జవాబు:
పరిచయం : ఈ మాటలు శ్రీనాథ మహాకవి రచించిన కాశీఖండం నుండి గ్రహించిన “భిక్ష” పాఠంలోనిది.
భావము : ఈ రోజు నిన్నటికి మరునాడే కదా !

అంతరార్థం : అంటే ఈ రోజు నాకు భిక్ష లభించకపోతే నిన్నటిలాగే ఈ రోజు కూడా ఉపవాసం తప్పదని వ్యాసుని మాటల్లోని అంతరార్థము.

ఇ) ఆకలి వల్ల వ్యాసుడు కాశీ నగరాన్ని శపించాలను కున్నాడు కదా ! “ఆకలి మనిషి విచక్షణను నశింప జేస్తుంది” అనే దాని గురించి రాయండి.
జవాబు:
వేదవ్యాసుడు మహాపండితుడు. వేద విభజన చేసినవాడు. 18 పురాణాలు రచించినవాడు. సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు అంశతో జన్మించాడు. అటువంటి మహర్షి కూడా ఆకలి వల్ల విచక్షణ కోల్పోయాడు. కాశీని శపించాలనుకొన్నాడు. ఎందుకంటే మనిషి దేనినైనా జయించగలడు. కానీ ఆకలిని జయించలేడు. ఆకలి ఎక్కువైతే కడుపులో మంట వస్తుంది. కళ్ళు తిరుగుతాయి.

తలపోటు, వికారం, చిరాకు, కోపం అన్నీ వస్తాయి. వాటివలన మనిషి విచక్షణను కోల్పోతాడు. విచక్షణ కోల్పోయిన మనిషి ఎంతకైనా తెగిస్తాడు. తనకు అన్నం పెట్టని లోకంపై కక్ష పెంచుకొంటాడు. రాక్షసుడుగా మారతాడు. అంటే మనిషిని రాక్షసుడిగా మార్చేది ఆకలి. అందుకే ఆకలిగొన్న వారికి అన్నం పెట్టాలి.

ప్రశ్న 2.
క్రింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబులు వ్రాయండి.

అ) “భిక్ష” పాఠంలోని కథను సంక్షిప్తంగా వ్రాయండి. (A.P June’18)
(లేదా)
“భిక్ష” పాఠ్యభాగ కథను మీ మాటల్లో వివరించండి.
జవాబు:
వ్యాసమహర్షి శిష్యులతో కూడి నగరంలో నివ సిస్తున్నాడు. ఒకసారి వ్యాసుడు శిష్యులతో కలిసి భిక్షాటనకై బయలుదేరాడు. శివుని యోగమాయతో వ్యాసునికి గాని, అతని శిష్యులకు గాని భిక్ష లభించలేదు. ఏ ఇల్లాలు కూడా భిక్షను వేయలేదు. వాస్తవంగా కాశీ నగరంలోని ఇల్లాండ్రు అన్నపూర్ణా దేవికి చెలికత్తెలు. వారంతా అతిథులను గౌరవిస్తారు. కాని రెండు రోజుల పాటు భిక్ష దొరకలేదు.

వ్యాసుడు తీవ్రమైన కోపాన్ని పొందాడు. కాశీ నగరంలోని ప్రజలను శపించబోయాడు. ఆ సమయంలో అన్నపూర్ణాదేవి సాధారణ స్త్రీ వలె వ్యాసుని ముందుకు వచ్చింది. అతనితో మహర్షి ! నీవు కాశీపై కోపగించుట తగునా ? నీవు శాంత స్వభావం కల వాడివా ? పిడికెడు వరి గింజలతో కాలం వెళ్ళబుచ్చే శాకా హారంతో జీవించే తాపసుల కంటే నీవు గొప్ప వాడివా ? ‘ఉన్న ఊరు కన్నతల్లితో సమానం’ అనే ధర్మాన్ని మరిచిపోయావా ? ఆకలితో ఉన్న నిన్ను ఇంకా మాటలతో బాధపెట్టడం తగదు. నీవు వెంటనే భోజనానికి రమ్ము.

తరువాత నీకు కొన్ని మాటలు చెప్పాలి. అని పలికింది. వ్యాసుడు ఆ మాటలను విని ‘అమ్మా ! నా శిష్యులు, ఇతరులు మొత్తం పదివేల మంది ఉన్నారు. వారందరు తినకుండా నేను భోజనం చేయటం మంచిది కాదు’ అని పలికాడు. అది విని అన్నపూర్ణాదేవి “మహర్షీ! నీతోపాటు నీ శిష్యులు కలసి రావలసినది. విశ్వనాథుని అనుగ్రహంతో మీకందరికి రుచి కరములైన ఆహారాన్ని అందిస్తాను” అని పలికింది. వ్యాసుడు అంగీకరించిన శిష్యులతో కలిసి అన్నపూర్ణాదేవి ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజన శాలలో భోజనం చేశాడు.

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

ఆ) కోపంవల్ల కలిగే దుష్పరిణామాలను గురించి రాయండి.
జవాబు:
మనం జయించవలసిన మనలోని శత్రువులు ఆరు. వీటిని అరిషడ్వర్గాలు అంటారు. అవి

  1. కామం,
  2. క్రోధం,
  3. లోభం,
  4. మోహం,
  5. మదం,
  6. మాత్సర్యం.

ఈ ఆరు అంతః శత్రువులను జయించిన వాడే మహనీయుడు అవుతాడు. వీటిలో ప్రధానమైన శత్రువు క్రోధం. అదే కోపం. ‘తన కోపమే తన శత్రువు – తన శాంతమే తనకు రక్ష’ అని శతకకర్త ఎప్పుడో చెప్పాడు. ‘కోపమునను ఘనత కొంచెమై పోవును’ అని కూడా మహాకవి చెప్పాడు.

కోపాన్ని జయించి సహనాన్ని శాంతాన్ని అలవరచుకోవడం చాలా కష్టం. ఎంతో సాధన చేస్తే తప్ప కోపాన్ని జయించలేం. భృగు మహర్షి, విశ్వామిత్రుడు, దుర్వాసుడు లాంటి గొప్ప మహర్షులు సహితం ఈ ప్రయత్నంలో విఫల మయ్యారు. కోపాన్ని జయించలేక తమను తాము తగ్గించుకొన్నారు. ఈ కోపం మనిషిని క్షణికావేశానికి లోను చేసి ఎన్నో అనర్థాలకు కారణమౌతుంది.

బ్రహ్మజ్ఞాన సంపన్నుడైన వేదవ్యాస మహర్షి ఆకలి బాధ తాళలేక కోపానికి వశుడై, పరమేశ్వరునికి ప్రీతి పాత్రమైన కాశీనగరాన్ని శపించడానికి సిద్ధపడ్డాడంటే – కోపం ఎంతటి వారినైనా విచక్షణను కోల్పోయేటట్లు చేస్తుందనేదానికి నిదర్శనం. సాధన చేస్తే సాధ్యం కానిది లేదు. ప్రతి ఒక్కరూ అంతః శత్రువైన కోపాన్ని జయించాలి. సహనాన్ని అలవర్చుకోవాలి. ఆనాడే సమాజంలో శాంతి పరిఢవిల్లుతుంది.

“కోపాన్ని జయించండి – ఉత్తమ వ్యక్తులుగా ఎదగండి”

ప్రశ్న 3.
క్రింది అంశాలను గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ వ్రాయండి.

అ) భిక్ష, రక్ష, పరీక్ష, సమీక్ష, వివక్ష… వంటి పదాలతో ఒక చక్కని భావాన్ని ప్రకటించే కవిత వ్రాయండి.
జవాబు:
సకల శుభదాయక కల్పవల్లీ
జనులందరికీ జ్ఞాన భిక్ష ప్రసాదించు
నీ కృపారస దృష్టే జనులందరికీ రక్ష
అదే మాకందరికి జీవన రక్ష.

జీవన పోరాట పరీక్షలెన్నో ఉన్నాయి
పరీక్షలన్నింటిలో నీ రక్షతో గెలవాలి మేము
నవ సమాజంలో ఎన్నో వివక్షలు
కక్షలేని రహదారులు లేవెక్కడ
నిరక్షరాస్యులైన నిర్భాగ్యులెందరో
వారందరినీ చూడుము నిష్పక్షపాతంగా

సమీక్షలు లేని ప్రభుత్వ పథకాలెన్నో
దూరమవుతున్నాయి నిర్భాగ్యులకు
నాగరిక సమాజంలో ఎన్నో వివక్షలు
కనిపించని మానవ నైతిక సంబంధాలు
తల్లీ ! ఇక రక్షించు ! నీవైనా !
మా కందరికీ పంచిపెట్టు జ్ఞానభిక్ష !

III. భాషాంశాలు

పదజాలం

1. క్రింది వాక్యాల్లో గీతగీసిన పదాలకు పర్యాయ పదాలు రాయండి.

అ) ద్వాఃకవాటంబు దెఱవదు వనిత యొకతె
జవాబు:
వనిత = మహిళ, స్త్రీ, పడతి, ఉవిద, నారి, పురంధ్రి, అంగన, మగువ

ఆ) ప్రక్షాళితంబైన పసిఁడి చట్టువము.
జవాబు:
పసిడి = బంగారం, కాంచనం, పుత్తడి, సువర్ణం, కనకము, హిరణ్యము

ఇ) పారాశర్యుండు క్షుత్పిపాసా పరవశుండై శపియింపఁ
జవాబు:
పారాశర్యుండు = వ్యాసుడు, బాదరాయణుడు, కృష్ణ ద్వైపాయనుడు, సాత్యవ తేయుడు

ఈ) ఇవ్వీటిమీద నాగ్రహము తగునె ?
జవాబు:
ఆగ్రహము = కోపము, క్రోధము, అలుక, ఉద్రేకం, రోషము

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

ఉ) అస్తమింపగ జేసినాడు అహిమకరుడు.
జవాబు:
అహిమకరుడు = సూర్యుడు, భానుడు, రవి, ప్రభాకరుడు, ఆదిత్యుడు, ఇనుడు

2. క్రింది పదాలను అర్థాలను రాయండి.

అ) ద్వాఃకవాటము
ఆ) వీక్షించు
ఇ) అంగన
ఈ) మచ్చెకంటి
ఉ) భుక్తిశాల

అ) ద్వాఃకవాటము
జవాబు:
ద్వారబంధము

ఆ) వీక్షించ
జవాబు:
చూచు

ఇ) అంగన
జవాబు:
స్త్రీ

ఈ) మచ్చెకంటి
జవాబు:
చేపకనులు గల స్త్రీ

ఉ) భుక్తిశాల
జవాబు:
భోజనశాల

3. క్రింది వాక్యాల్లో నానార్థాలు వచ్చే పదాలను గుర్తించండి.

అ) వీడు ఏ వీడువాడోగాని దుష్కార్యములను వీడుచున్నాడు.
జవాబు:
ఈ వాక్యంలో ‘వీడు’ అనే పదం మూడు అర్థాలలో వాడబడింది.
వీడు (నానార్థాలు) :

  1. ఈ మనుష్యుడు
  2. పట్టణము
  3. వదలుట

ఆ) రాజు ఆకాశంలోని రాజును చూసి సంతోషించాడు. (A.P Mar.16)
జవాబు:
ఈ వాక్యంలో ‘రాజు’ అనే పదం మూడు అర్థాల్లో వాడబడింది.
రాజు (నానార్థాలు) :

  1. క్షత్రియుడు
  2. చంద్రుడు

4. క్రింది ప్రకృతి పదాలకు సరైన వికృతి పదాలను ఎంపిక చేయండి.

అ) విద్య ()
క) విదియ
చ) విజ్జ
ట) విద్దె
త) విద్య
జవాబు:
ట) విద్దె

ఆ) భిక్ష ()
క) బత్తెము
చ) బచ్చ
ట) బిచ్చ
త) బిచ్చము
జవాబు:
త) బిచ్చము

ఇ) యాత్ర ( )
క) యతర
చ) జాతర
ట) జైత్ర
త) యతనము
జవాబు:
క) యతర

ఈ) మత్స్యము ( )
క) మచ్ఛీ
చ) మత్తియము
ట) మచ్చెము
త) మత్తము
జవాబు:
ట) మచ్చెము

ఉ) రత్నము ( )
క) రతనము
చ) రచ్చ
ట) రచ్చము
త) రత్తము
జవాబు:
క) రతనము

ఊ) పంక్తి ( )
క) పంతులు
చ) పత్తి
ట) బంతి
త) పంకు
జవాబు:
ట) బంతి

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

వ్యాకరణాంశాలు

1. కింద గీత గీసిన పదాల్లోని సంధులను గుర్తించి సంధి పేరు రాయండి.

అ) పుణ్యాంగనయు భిక్ష యిడదయ్యెఁ గటా !
జవాబు:

  1. పుణ్య + అంగన = పుణ్యాంగన
    సవర్ణదీర్ఘ సంధి సూత్రం : అ, ఇ, ఉ, ఋలకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశమౌతాయి.
  2. భిక్ష + ఇడదయ్యె = భిక్షయిడదయ్యె
    యడాగమసంధి సూత్రం : సంధిలేని చోట అచ్చుకంటె పరమైన అచ్చునకు యడాగమం వస్తుంది.
  3. ఇడదయ్యెన్ + కటా = ఇడదయ్యెఁ గటా! ద్రుతప్రకృతిక సంధి (సరళాదేశ సంధి)

సూత్రాలు :

  1. ద్రుత ప్రకృతికము మీది పరుషాలకు సరళాలు వస్తాయి.
  2. ఆదేశ సరళానికి ముందున్న ద్రుతానికి బిందు, సంశ్లేషలు విభాషగా వస్తాయి.

ఆ) కాశి; యివ్వీటి మీద నాగ్రహము దగునె.
జవాబు:

1) కాశి + ఇవ్వీటి = కాశి యివ్వీటి (యడాగమ సంధి)
ఈ + వీటి = ఇవ్వీటి (త్రికసంధి)

త్రికసంధి సూత్రాలు :

  1. ఆ,ఈ,ఏ లు త్రికములు.
  2. త్రికము మీదున్న అసంయుక్త హాల్లునకు ద్విత్వ బహుళంగా వస్తుంది.
  3. ద్విరుక్తంబగు హల్లు పరమగునపుడు ఆచ్ఛికంబగు దీర్ఘానికి హ్రస్వం.

2) గసడదవాదేశ సంధి
సూత్రం : ప్రథమమీది పరుషములకు గ, స, డ, ద, వ లు బహుళముగానగు.

ఇ) ఓ మునీశ్వర ! వినవయ్య
జవాబు:

1) ముని + ఈశ్వర = మునీశ్వర (సవర్ణదీర్ఘ సంధి)

సవర్ణదీర్ఘసంధి సూత్రం : అ, ఇ, ఉ, ఋలకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశమౌతాయి.
యడాగమసంధి సూత్రం:
సంధిలేని చోట అచ్చుకంటే పరమైన అచ్చునకు యడాగమం వస్తుంది
వినవు + అయ్య = వినవయ్య (ఉత్వ సంధి)
ఉత్వసంధి సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యంగా వస్తుంది.

2. పాఠంలోని తేటగీతి పద్యాన్ని గుర్తించి లక్షణాలతో సమన్వయం చేయండి.

అ) మునీశ్వర! ……….. నా గ్రహముదగునె ?
జవాబు:
TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష 1

పై పద్యంలోని ప్రతి పాదంలో ఒక సూర్య గణం, రెండు ఇంద్ర గణాలు, రెండు సూర్య గణాలు వరసగా వచ్చాయి కాబట్టి ఇది తేటగీతి పద్యం.
ఇది ఉపజాతి
ప్రాసనియమం ఉండదు.
ఒకటవ గణం మొదటి అక్షరానికి నాల్గవ గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది.

సీస పద్యం

క్రింది తరగతులలో తేటగీతి, ఆటవెలది పద్యాలు తెలుసుకున్నారు కదా ! ఇప్పుడు ‘సీస పద్య’ లక్షణాలను పరిశీలిద్దాం.

క్రింది ఉదాహరణలను పరిశీలించండి.
ఉదా :
TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష 2

సీసపద్య లక్షణం:

ఇందులో నాలుగు పాదాలుంటాయి.
ప్రతిపాదంలో ఆరు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు వరుసగా ఉంటాయి.
పద్యపాదం రెండు సమభాగాలుగా ఉంటుంది. రెండు భాగాల్లోను మూడో గణంలోని మొదటి అక్షరం యతి లేదా ప్రాస యతి.
ప్రాసనియమం లేదు.
తేటగీతి లేదా ఆటవెలది దీనికి చివరగా ఉంటుంది.

పై పద్యపాదాల్లో –

  1. ఒక్కొక్కటి రెండు భాగాలుగా ఉన్నాయి.
  2. రెండు భాగాల్లో కలిపి ఎనిమిది గణాలున్నాయి. (ఆరు ఇంద్రగణాలు + రెండు సూర్యగణాలు)
  3. యతి, ప్రాస యతులు (కా – గ, ర – ర) (ప-పు, ప-ప) ఉన్నాయి.
  4. ప్రాసనియమం లేదు. వీటిని బట్టి ఇది సీసపద్యం అన్ని గుర్తించవచ్చు.

ప్రశ్న 1.
పాఠంలోని సీసపద్యానికి గణవిభజన చేసి లక్షణాలను అన్వయించండి.
జవాబు:
TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష 3
TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష 4
TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష 5
తేటగీతి :
TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష 6

లక్షణాలు :

  1. 4 పాదాలుంటాయి.
  2. ప్రతి పాదంలో 6 ఇంద్ర గణాలు + 2 సూర్య గణాలు ఉంటాయి.
  3. 3వ గణంలో 1 మొదటి అక్షరం యతి లేదా ప్రాస యతి.
  4. ప్రాస నియమం లేదు.
  5. తేటగీతి దీనికి చివరగా.

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

ప్రాజెక్టు పని

శ్రీనాథుడు రచించిన ఏవైనా 5 పద్యాలు సేకరించండి. (లేదా) కాశీపట్టణ విశేషాలు తెలుసుకొని రాయండి. నివేదిక రాసి వినిపించండి.

1. సీ. ‘తల్లి మదేకపుత్రక పెద్ద కన్నులు
గానదిప్పుడు మూడుకాళ్ళ ముసలి
యిల్లాలు గడుసాధ్వి యేమియు నెఱుగదు.
పరమ పాతివ్రత్య భవ్య చరిత వెనుక ముందర లేరు నెనరైన చుట్టాలు
లేవడి యెంతేని జీవనంబు
గానక కన్న సంతానంబు శిశువులు
జీవన స్థితికేన తావలంబు

2. సీ. వేదండ సదన శుండాదండ గండూష
కాండ సిక్తాస్సరో మండలములు
గంధర్వ కన్యకా కనక సౌగంధిక
మాలికాలగ్న షాణ్మాతురములు
నందీశ్వరక్షిప్త నారంగ ఫలపాక
తారశ విద్యాద్ధరీ స్తనభరములు
గరుడ లీలావతీ కస్తూరికా పంక
పిహిత నిశ్శేషాంగ భృంగిరిటులు

3. సీ. శ్రీ భీమనాయక శివనామ ధేయంబు
చింతింపనేర్చిన జిహ్వ జిహ్వ
దక్షవాటీ పురాధ్యక్ష మోహనమూర్తి
చూడంగనేర్చిన చూపుచూపు
దక్షిణాంబుధి తటస్థాయి పావనకీర్తి
చేవింపనేర్చిన చెవులు చెవులు
తారకబ్రహ్మ విద్యాదాత యౌదల
విరులు పూన్పగనేర్చు కరము కరము

4. “ఓరి దురాత్మ ! నీ వార ముష్టింపచా
భాస, యోజనగంధి ప్రథమపుత్ర
దేవర న్యాయదుర్భావనా పరతంత్ర
బహుసంహిత వృధా పాదపఠన
భారత గ్రంథ గుంభన పండితం మన్య
నీవా మదీయ పత్నికి నశేష
కైవల్య కల్యాణఘంటాపథమునకు
గాశికాపురికి నిష్కారణంబ

5. సీ॥ సంస్తుతించిరి బహ్వృచ ప్రపంచంబుల
నొకకొందఱసిత కంఠోపకంఠు
నుచ్చైస్స్వనంబున నొక కొందఱునుతించి
రార్యాకళత్రు సధ్వర్యుశాఖ
శివునిఁ బ్రశంస చేసిరి యొకకొందఱు
సద్భక్తి మైసప్త సామములను
సర్వజ్ఞుఁ బొగడిరధర్వ వేదంబున
నొకకొందఱగిఁ బ్రసంగోచితముగఁ

తే.గీ. వీరభద్ర వికీర్ణ కర్పూర చూర్ణ
ధనకళితాకాశ చరవనితా ముఖములు
శాంభవీశంభు మధుకేళి సంభ్రమములు
పొడులి నాసించుగాకత నా హృదయవీధి
– హరవిలాసం – శ్రీనాథుడు.

తే.గీ. ధవళకర శేఖరునకు బ్రదక్షిణంబు
నర్థి దిరుగంగ నేర్చిన యడుగులడుగు
లంబికానాయక ధ్యానమార్గ జలధి
మధ్యమున దేలియాడెడి మనసు మనసు
– భీమఖండము – శ్రీనాథుడు.

తే.గీ. శాపమిచ్చెదనని యనాచార సరణి
నడుగుపెట్టినవాడ వహంకరించి
పొమ్ము ! నిర్భాగ్య మాయూరి పాలము వెడలి
యెచటికేన్ శిష్యులు నీవు నీక్షణంబు” (భీమేశ్వర పురాణము)

తే.గీ. గాశికాతీర్థ వాసులఁ గర్మపరులఁ
భూతి రుద్రాక్షధారులఁ బుణ్యనిధుల
నందఱినిఁ జూచి కరుణా సమగ్రబుద్ధి
నిట్టులని యానతిచ్చె విశ్వేశ్వరుండు ।

1. కాశీ పట్టణ విశిష్టత : మనదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో పరమపావనమైనది, దివ్యమైనది కాశీ క్షేత్రం. ద్వాదశి జ్యోతిర్లింగ క్షేత్రంగాను, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందింది. పరమపావనమైన గంగానది ఇక్కడ ప్రవహిస్తుంది. కాశీలో మరణించినవారికి శివుని సాయుజ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇది ఎంతో అందమైన ప్రాంతం. నిరంతర వేదఘోష మార్మోగుతుంది. విద్యాలయాలకు నిలయంగా మారింది. అన్నార్తులకు కల్పవల్లిగా విరాజిల్లింది. భారతదేశంలో జన్మించిన ప్రతి హిందువు జీవితంలో ఒకసారైన కాశీని దర్శించాలని అనుకుంటాడు.

నివేదిక

శ్రీనాథుడు ప్రాచీన తెలుగు సాహిత్య చరిత్రలో కవిసార్వభౌమునిగా గుర్తింపు పొందాడు. కావ్య రచనలో రసపోషణకు ప్రాధాన్యం ఎక్కువగా ఇచ్చాడు. ఇతనిది వర్ణనాత్మకశైలి. కవిత్వం కొంత ప్రౌఢంగా ఉన్నప్పటికీ కూడా ఆపాతమధురంగా ఉంటుంది. ఇతడు సీసపద్య రచనలో తన విశేష ప్రతిభను ప్రదర్శించాడు. పాత్రానుగుణమైన శైలి, పదబంధము ఇతని ప్రత్యేకత. ఇతని పద్యాల్లో అంత్యానుప్రాస, ఉత్ప్రేక్ష, రూపకాలంకారాలు ఎక్కువగా కనిపిస్తాయి. తెలుగు సాహిత్యంలో విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వారిలో శ్రీనాథుడ్నే ప్రథముడుగా చెప్పవచ్చు. ఇతని కవిత్వం ప్రబంధ యుగానికి పునాది వేసింది.

విశేషాంశాలు

1. మాధుకరము : మధుకర వృత్తి అంటే తుమ్మెదలు పూలలోపలి తేనెను గ్రహించినట్లు గృహస్థులు ఇండ్ల నుండి భిక్షను గ్రహించడం

మీకు తెలుసా ?

1. బ్రాహ్మీముహూర్తం : సూర్యోదయానికి 90 ని॥ల ముందుకాలాన్ని బ్రాహ్మీముహూర్తం అంటారు. బ్రాహ్మీ అంటే సరస్వతి అని కూడా అర్థం. బుద్ధిని పెంపొందించే సమయం కాబట్టి దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా ఈ సమయం శ్రేష్ఠమైనది.

2. దేవకార్యము : భగవంతుడికి విశేషంగా చేసే పూజా కార్యక్రమం. రెండోది పితృదేవతా కార్యం. అంటే శ్రాద్ధము. శ్రాద్ధమునాడు భిక్ష సమర్పించరాదనే సంప్రదాయమున్నది.

3. కామధేనువు : (దేవతల ఆవు). కోరిన కోర్కెలను తీరుస్తుంది.

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

4. కాశి : ప్రపంచంలో అతి పురాతన క్షేత్రం. 5 క్రోశములు కోసం వ్యాపించినది. వరుణ, అసినదుల సంగమ ప్రాంతం కనుక “వారణాసి” అయింది. విశ్వేశ్వరుని ఆలయం కలదు. పార్వతీమాతను అన్నపూర్ణగా కొలుస్తారు. దీనికి మహాశ్మశానమని కూడా పేరు. సప్త మోక్షధామాలలో ఇది ఒకటి.

5. అష్టాదశపురాణాలు : భాగవత, భవిష్య, మత్స్య, మార్కండేయ, బ్రహ్మ, బ్రహ్మండ, బ్రహ్మవైవర్త, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కాంద పురాణాలు.

6. పారణ : ఉపవాసం ఉండి తర్వాత రోజు చేయు భోజనం (ఉపవాసానంతర భోజనం).

సూక్తి : మేధావి ఎన్నికష్టాలుపడ్డా, శుద్ధమైన నడవడిని, జీవనాన్ని వదలడు. దానివల్లనే అతడు ప్రతిష్టను, ఉత్తమ గతులనూ పొందుతాడు.
– మహాభారతం ఉద్యోగపర్వం

ప్రతిపదార్థ తాత్పర్యాలు

I

1. తే॥గీ॥ నెట్టుకొని కాయ బీటెండ పట్టపగలు
తాను శిష్యులు నిల్లిల్లు దప్పకుండఁ
గాశికా విప్రగృహ వాటికల నొనర్చు
నఖిల విద్యాగురుండు భిక్షాటనంబు.

కవి పరిచయము
ఈ పద్యం కవిసార్వభౌముడు శ్రీనాథుడు రచించిన ‘భిక్ష’ అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థము
అఖిల విద్యాగురుండు = సకల విద్యలకు గురువైన వ్యాసుడు
తాను = తానును
శిష్యులున్ = శిష్యులును
పగలు + పగలు = పట్ట పగటియందు
బీఱు + ఎండ = అధికమైన ఎండ
నెట్టుకొనికాయన్ = అతిశయించి కాయుచుండగా
కాశికా = కాశీనగరమందలి
విప్రగృహ = బ్రాహ్మణుల గృహాలకు సంబంధించిన
వాటికలన్ = వాడలయందు
భిక్షాటనంబు = భిక్షాటనను
ఇల్లిల్లు = ప్రతిఇంటిని
తప్పకుండగన్ = విడువకుండా
ఒనర్చున్ = చేసెను

తాత్పర్యము
విద్యాగురుడైన వ్యాసమహర్షి శిష్యులతో కూడి పట్టపగలు, అధికమైన ఎండలో కాశీనగరంలోని బ్రాహ్మణ వీధిలో భిక్షకోసం ఇల్లిల్లూ తిరగసాగాడు.

2. తే॥గీ॥ వండుచున్నారమను నొక్క వనజనేత్ర
తిరిగి రమ్మను నొక్క లేఁదీఁగె బోఁడి
దేవకార్యంబు నేఁడనుఁ దెఱవ యోర్తు
ద్వాః కవాటంబుఁ దెఱవదు వనిత యొకతె

కవి పరిచయము
ఈ పద్యం కవిసార్వభౌముడు శ్రీనాథుడు రచించిన ‘భిక్ష’ అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థం

ఒక్కవనజనేత్ర = పద్మములవంటి కన్నులు గల ఒక
వండుచున్నారమనున్ = వంటచేయుచున్నవారమని
ఒక్కలేదీగబోడి = లతవంటి శరీరముగల ఒక స్త్రీ
తిరిగిరమ్మనున్ = తిరిగిరమ్మనును
తెఱవయోర్తు = ఒక ఇల్లాలు
నేడు = ఈరోజు
దేవకార్యంబు = దేవతాసమారాధన
అనున్ = అంటున్నది
వనితయొకతె = ఒక స్త్రీ
ద్వాఃకవాటంబున్ = వాకిటి తలుపును
తెఱవదు = తెరవనే తెరువదు

తాత్పర్యము
ఒక ఇల్లాలు ‘వండుతున్నాం’ అంటున్నది. మరొక స్త్రీ ‘మళ్ళీ రండి’ అంటున్నది. ఇంకొకావిడ ఈరోజు వ్రతం (దేవకార్యం) అని చెబుతుంది; వేరొకావిడైతే అసలు తలుపులే తెరవడం లేదు.

3. సీ॥
ముంగిట గోమయంబున గోముఖము దీర్చి
కడలు నాల్గుగ మ్రుగ్గుకఱ్ఱ వెట్టి,
యతిథి నచ్చో నిల్పి యర్ఘ్య పాద్యము లిచ్చి
పుష్పగంధంబులఁ బూజసేసి,
ప్రక్షాళితంబైన పసిడి చట్టువమున
నన్నంబుమీఁద నెయ్యభిఘరించి,
ఫలపాయసాపూప బహుపదార్థములతో
భక్తివిశ్వాస తాత్పర్య గరిమఁ

తే॥గీ॥ బెట్టుదురు మాధుకరభిక్ష భిక్షుకులకుఁ
గంకణంబులతో సూడిగములు రాయఁ
గమ్రకరముల బ్రాహ్మణాంగనలు కాశి
నన్నపూర్ణ భవాని కట్టనుఁగుఁ జెలులు

కవి పరిచయము
ఈ పద్యం కవిసార్వభౌముడు శ్రీనాథుడు రచించిన ‘భిక్ష’ అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థం

ముంగిటన్ = ఇంటిముందు భాగమందు
గోమయంబునన్ = ఆవుపేడతో
గోముఖముదీర్చి = అలుకుపెట్టి (అలికి)
కడలు = అంచులు
నాల్గుగన్ = నాలుగవునట్లుగా
మ్రుగ్గుకఱ్ఱ = ముగ్గుతో నేలమీద రేఖలు
పెట్టి = పెట్టి
అతిథిన్ = అతిథిని
ఆ + చోటన్ = ఆ రంగవల్లుల మధ్యమునందు నిలుచుండ పెట్టి అర్ఘ్యపాద్యాదులను
నిల్చి = నిలుచుండపెట్టి
అర్ఘ్యపాద్యములు = అర్ఘ్యయపాద్యదులను
ఇచ్చి = ఇచ్చి
పుష్పగంధంబులన్ = పూవులతోను, చందనముతోను,
పూజచేసి = పూజించి, అర్చించి
ప్రక్షాళితంబు + ఐన = బాగుగా కడుగబడిన
పసిడి = బంగారుమయమైన
చట్టువమునన్ = గరిటెతో
అన్నంబుమీదన్ = అన్నము పైన
నెయ్యి = నేతిని
అభిఘరించి = అభిఘారముచేసి (కొద్దిగా చల్లి)
ఫల = పండ్లు
పాయస = పరమాన్నము
అపూప = పిండివంటకములు
బహు = అనేకములైన
పదార్దములతోన్ = వస్తువులతో
భక్తి = పూజ్యభావము యొక్క
విశ్వాస = నమ్మకము యొక్క
తాత్పర్య = తత్పరభావము యొక్క
గరిమన్ = పెంపుతో
కమ్రకరములన్ = ఇంపైన చేతులయందు
బ్రాహ్మణ + అంగనలు = బ్రాహ్మణ స్త్రీలు
కంకణంబులతోన్ = ముత్యాలు, పగడాలు మొదలైన వానిని గుచ్చి చేతికి కట్టుకొనేడి
సూడిగములు = గాజులు
రాయన్ = ఒరసికొనగా
కాశిన్ = కాశీయందు
అన్నపూర్ణ = అన్నపూర్ణ అను పేరుగల
భవాని = పార్వతి
కడు + అనుంగు = గారాబమైన
చెలులు = స్నేహితురాండ్రు
భిక్షకులన్ = = యాచకులకు
మధుకర = మధూకరమను
భిక్షన్ = భిక్షను
పెట్టుదురు = పెడతారు

తాత్పర్యము
కాశీనగరంలోని గృహిణులు అన్నపూర్ణ భవానికి ప్రియమైన చెలులుగా పేరుగాంచినవారు. వారు భిక్షార్థమై వచ్చిన వాళ్ళను సాక్షాత్తు శివుడిగా భావించి, అపురూపంగా ఆదరిస్తారు. వాకిట్లో ఆవుపేడతో చక్కగా అలికి, నాలుగంచులూ కలిసేటట్లు ముగ్గుపెట్టి, దాని మధ్యలో వచ్చిన అతిథిని నిలబెట్టి, కాళ్ళకూ, చేతులకూ నీళ్ళిచ్చి, పూవులతో, గంధంతో వారిని అర్చించి, శుభ్రంగా కడిగిన బంగారుగరిటెతో అన్నం మీద నెయ్యి అభిఘరించి (వేసి), పండ్లు, పరమాన్నం, పిండివంటలు చేర్చి, భక్తి విశ్వాసాలు ఉట్టిపడుతుండగా భిక్ష సమర్పిస్తారు. (అతిథి దేవోభవ ! అనే భారతీయ సంప్రదాయాన్ని ఈ పద్యంలో వర్ణించాడు కవి).

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

విశేషాంశాలు

1. అతిథి : తిథి, వార, నక్షత్ర నియమం లేకుండా భోజనానికి వచ్చువాడు.
2. అర్ఘ్యం : (వ్యుత్పత్తి) పూజకు తగినది.

అష్టవిధ అర్ఘ్యములు :

  1. పెరుగు,
  2. తేనె,
  3. నెయ్యి,
  4. అక్షతలు,
  5. గరిక,
  6. నువ్వులు,
  7. దర్భ,
  8. పుష్పము

3. పాద్యము : వ్యుత్పత్తి, పాదములు కడుగుకొనుటకు ఉపయోగించు నీరు.
4. మాధుకర భిక్ష : (వ్యుత్పత్తి) = మధుకరం అంటే తుమ్మెద. తుమ్మెద వివిధ పుష్పాలపై వ్రాలి, తేనెను గ్రహించినట్లు, సన్యాసులు వివిధ గృహాలకు వెళ్ళి, ఆ ఇంటి గృహిణుల నుండి భిక్షాన్నములను స్వీకరిస్తారు. అందువల్ల సన్యాసులు స్వీకరించే భిక్షను ‘మాధుకర భిక్ష’ అంటారు.

4. కం॥ ఆ పరమపురంధ్రులయం
దే పుణ్యాంగనయు భిక్ష యిడదయ్యెఁ గటా !
రేపాడి మేలుకని యే
నే పాపాత్ముని ముఖంబు నీక్షించితినో ?

కవి పరిచయము
ఈ పద్యం కవిసార్వభౌముడు శ్రీనాథుడు రచించిన ‘భిక్ష’ అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థం

ఆ పరమ పురంధ్రుల యందున్ = అట్టి పరమ పుణ్యస్త్రీలయందు
ఏ పుణ్యాంగనయున్ = ఏ పుణ్యురాలైన ఇల్లాలు
భిక్ష = భిక్షాన్నము
ఇడదెయ్యెన్ = పెట్టకుండెను
కటా = అయ్యో !
ఏను = నేను
రేపాడి = ప్రాతఃకాలమునందు
మేలుకని = నిద్రలేచి
ఏ పాపాత్ముని = ఏ పాపాత్మునియొక్క
ముఖంబున్ = ముఖాన్ని
ఈక్షించితినో = చూచియున్నానో

తాత్పర్యము
అటువంటి పుణ్యస్త్రీలున్న ఈ నేలలో ఒక్కరైనా భిక్ష సమర్పించడం లేదంటే ఆశ్చర్యంగా ఉన్నది. ఈ రోజు ఉదయమే లేచి, ఏ పాపిష్టివాని ముఖం చూశానో ‘అనుకున్నాడు వ్యాసుడు.

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

విశేషాంశాలు

1. పాపాత్ముని ముఖం చూడడం: దుర్మార్గుల ముఖం చూస్తే, చెడ్డ పరిణామాలు కలుగుతాయని నమ్మకం. అందుకే ఉదయం లేవగానే కాని, పాడ్యమి తిథినాడు చంద్రోదయాన్ని గమనించినప్పుడు కాని, ఇష్టమైన వాళ్ళ ముఖాలను చూస్తారు. అలాగే ఏదయినా పనిపై వెళ్ళేటప్పుడు, కులస్త్రీలు శకునంగా ఎదురువస్తే మంచిది అనే సంప్రదాయాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఇటువంటి వాటిపై, నమ్మకం పోతూ ఉండడం గమనింపదగిన విషయం.

5. తే॥గీ॥ ఉపవసింతుముగాక నేఁడుడిగి మడిఁగి
యస్తమించుచు నున్నవాఁ డహిమభానుఁ
డెల్లి పారణకైన లేదెట్లు మనకు ?
మాధుకరభిక్ష బ్రాహ్మణమందిరముల

కవి పరిచయము
ఈ పద్యం కవిసార్వభౌముడు శ్రీనాథుడు రచించిన ‘భిక్ష’ అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థం

ఉడిగి = భిక్షకై తిరుగుట మాని
మడిగి = అణగి యుండి
నేడు = ఈరోజు
ఉపవసింతుముగాక = ఉపవాసం ఉందుముగాక !
అహిమభానుడు = వేడికిరణములు గల సూర్యుడు
అస్తమించుచున్నవాడు = అస్తమించుచున్నాడు
ఎల్లి = రేపు
మనకున్ = మనకు
బ్రాహ్మణమందిరములన్ = ఆ బ్రాహ్మణుల ఇళ్ళలో
మాధురభిక్ష = మధూకరరూపమైన భిక్ష
పారణకైనన్ = ఉపవాసాంత భోజనముకైనను
లేదెట్లు = లేకుండా ఎలా ఉంటుంది (తప్పక లభిస్తుంది) ?

తాత్పర్యము
సరే, ఇక భిక్షాటనం మాని ఈ రోజుకు ఉపవాసమే చేద్దాం. సూర్యుడు అస్తమిస్తున్నాడు. రేపైనా మనకు ఈ బ్రాహ్మణ వాటికలో ఉపవాసాంత భోజనానికి సరిపడ భిక్ష దొరకక పోదు.

II

6. వ. అని యా రాత్రి గడపి మఱునాఁడు
మధ్యాహ్నకాలంబున
శిష్యులుం దాను వేఱువేఱు విప్రభవన వాటికల
భిక్షాటనం
బొనర్పంబోయి,తొలునాఁటియట్ల ముక్కంటిమాయ నే
మచ్చెకంటియు వంటకంబు పెట్టకున్నఁ గటకటంబడి
భిక్షాపాత్రంబు నట్టనడువీథిం బగులవైచి
– కోపావేశంబున

ప్రతిపదార్థం

అని = అట్లు చెప్పి
ఆ రాత్రి = ఆ రాత్రి
గడిపి = వెళ్ళబుచ్చి
మఱునాడు = మరుసటిరోజు
మధ్యాహ్నకాలంబున = మధ్యాహ్నసమయంలో
శిష్యులున్ = శిష్యులు
తాను = తానునూ (వేద వ్యాసుడునూ)
వేఱవేఱన్ = విడివిడిగా
వేదవ్యాసుడు = వేద వ్యాసమహర్షి
విప్రభవన = బ్రాహ్మణ భవనముల యొక్క
వాటికలన్ = వీధులయందు
భిక్షాటనంబు = భిక్ష కోసం సంచారం
ఒనర్పంబోయి (ఒనర్పన్ + పోయి) = చేయబోయి
తొలినాటియట్ల (తొలినాటి + అట్ల) = ముందురోజువలె
ముక్కంటి మాయన్ = శివునిమాయచేత
ఏ మచ్చెకంటియున్ = మీనాక్షియును
వంటకంబు = అన్నమును
పెట్టకున్న (పెట్టక + ఉన్నన్) = పెట్టకపోగా
కటకటంబడి = బాధపడి
భిక్షాపాత్రంబు = శివభిక్షాపాత్రను
నట్టనడివీధికి = వీధి నట్టనడుమ
పగులవైచి = పగులగొట్టి
కోపావేశంబునన్ = కోపావేశంతో

తాత్పర్యము
అని వ్యాసుడు శిష్యులతో ఆ రాత్రి మఠంలో గడిపి, మరునాడు యథావిధిగా మధ్యాహ్న సమయానికి శిష్యులు, తాను వేరువేరుగా విప్రవాటికల్లో భిక్షాటనం చేయసాగారు. కాని మొదటి రోజులాగానే విశ్వనాథుని మాయవల్ల ఏ ఇల్లాలు భిక్షపెట్టలేదు. దాంతో బాధపడి కోపంతో భిక్షాపాత్రను నట్టనడి వీథిలో ముక్కలు ముక్కల య్యేటట్లు విసిరి ఆవేశంతో.

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

7. తే॥గీ॥ ధనము లేకుండెదరు మూఁడు తరములందు
మూఁడు తరములఁ జెడుఁగాక మోక్షలక్ష్మి
విద్యయును మూఁడు తరముల వెడలవలయుఁ
బంచజనులకుఁ గాశికాపట్టణమున

కవి పరిచయము
ఈ పద్యం కవిసార్వభౌముడు శ్రీనాథుడు రచించిన ‘భిక్ష’ అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థం

కాశీకాపట్టణమునన్ = కాశీపట్టణమందు
పంచజనులకున్ = నివసించే ప్రజలకు
మూడు తరములన్ = మూడు తరములందు
మోక్షలక్ష్మి = కైవల్యలక్ష్మి
చెడుగాక = చెడిపోవుగాక
మూడుతరములన్ = మూడు తరములందున్
విద్యయును = విద్యకూడా
వెడలవలయున్ = తొలగిపోవలయును
మూడుతరముల యందు = మూడుతరములయందు
ధనములేక = సంపదలేక
ఉండెదరు = ఉంటారు

తాత్పర్యము
‘ఈ కాశీ పట్టణంలో నివసించే మనుషులకు మూడు తరములదాక ధనం, విద్య, మోక్షం లేకుండు గాక’!

8. వ. అని పారాశర్యుండు క్షుత్పిపాసా పరవశుండై శపియింపందలంచు |
నవసరంబున నొక్క విప్రభవనంబు వాఁకిటం బార్వతి
ప్రాకృత వేషంబున

ప్రతిపదార్థం

అని = ఈ విధముగా
పారాశర్యుండు = పరాశరుని కుమారుడైన వ్యాసుడు
క్షుత్ = ఆకలి
పిపాస = దప్పికతో
పరవశుండై = లొంగిపోయినవాడై
శపియింపన్ + తలంప = శపించడానికి ప్రయత్నించగా
అవసరంబున = ఆ సమయంబున
ఒక్క = ఒకానొక
విప్రభవనంబు = బ్రాహ్మణ ఇంటి యొక్క
వాకిటన్ = వాకిటయందు
పార్వతి = పార్వతీదేవి
ప్రాకృతవేషంబునన్ = సామాన్య స్త్రీ వేషముతో

తాత్పర్యము
అని ఆకలిదప్పులచే బాధపడుతున్న వ్యాసుడు శపించబోయిన సమయంలో ఒక బ్రాహ్మణ మందిరపు వాకిట పార్వతీదేవి సామాన్య స్త్రీ వేషంలో –

9. ఉ॥
వేదపురాణశాస్త్ర పదవీ నదవీయసియైన పెద్దము
త్తైదువ కాశికానగర హాటకపీఠ శిఖాధిరూఢ య
య్యాదిమ శక్తి, సంయమివరా ! యిటు రమ్మని పిల్చె హస్తసం
జ్ఞాదరలీల రత్నఖచితాభరణంబులు ఘల్లు ఘల్లనన్

కవి పరిచయము
ఈ పద్యం కవిసార్వభౌముడు శ్రీనాథుడు రచించిన ‘భిక్ష’ అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థం
“వేదపురాణశాస్త్ర పదవీ నదవీయసియైన”
వేద = వేదములకు
పురాణ = పురాణములకు
శాస్త్ర = శాస్త్రములకు, (ప్రతిపాద్యమైన)
పదవీ = జ్ఞానమునకు
నదవీయసియైన = మిక్కిలి దూరమునందు లేని
పెద్దముత్తైదువ = పెద్దకాలపునాటి పురంధ్రి

“కాశికానగర హాటకపీఠ శిఖాధిరూఢ”
కాశికానగర = కాశీనగరమనెడి
హాటకపీఠ = స్వర్ణ పీఠము యొక్క
శిఖా = శిఖరమునందు
అధిరూఢ = అధిరోహించియున్న
అయ్యాదిమ శక్తి = ఆ ఆదిమశక్తి (ఆ + ఆదిమ శక్తి) (ఆ మొదటి శక్తి స్వరూపిణియైన)
హస్తసంజ్ఞాదరలీల హస్త సంజ్ఞ = చేతిసంజ్ఞయందు స్ఫురించుచున్న
ఆదర = ఆదరముతో కూడిన
లీలన్ = విలాసముతో
రత్నఖచితాభరణంబులు
రత్నఖచిత = రత్నకంకణరూపములైన
ఆభరణంబులు = నగలు
ఘల్లుఘల్లన్ = ఘల్లు ఘల్లుమనునట్లుగా
సంయమివరా = ఓ ముని శ్రేష్ఠుడా !
రమ్ము + అని = రమ్మని
ఇటు = ఇచ్చటకు
పిల్చెన్ = పిలిచింది

తాత్పర్యము
వేదపురాణ శాస్త్రాలు నిర్దేశించే జ్ఞాన స్వరూపిణి ఆ ముత్తైదువ. కాశీనగరం అనే స్వర్ణపీఠ శిఖరాన్ని అధిరోహించి ఉన్న ఆమె – చేతికి ధరించిన రత్నకంకణాలు ఘల్లు ఘల్లుమనేట్లు చెయ్యి ఊపుతూ ఓ సంయమివరా ! ఇటురా అని పిల్చింది. (ఒక్క రోజు ఆకలికే తట్టుకోలేని వాడికి నీకేం సంయమనం ఉందయ్యా ! అని వ్యంగ్యంగా అడగడానికే సంయమివరా! అని సంబోధించింది ఆ ముత్తైదువ.)

10. శా॥
ఆకంఠంబుగ నిష్ఠు మాధుకర భిక్షాన్నంబు భక్షింపఁగా
లేకున్నం గడు నంగలార్చెదవు మేలే ? లెస్స ! శాంతుండవే!
నీకంటెన్ మతిహీనులే కటకటా ! నీవార ముష్టింపచుల్
శాకాహారులుఁ గందభోజులు, శిలోంఛప్రక్రముల్ తాపసుల్ ! (A.P Mar. ’16)

కవి పరిచయము
ఈ పద్యం కవిసార్వభౌముడు శ్రీనాథుడు రచించిన ‘భిక్ష’ అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడినది. (T.S Mar. ’17)

ప్రతిపదార్థం

ఇప్డు = ఇప్పుడు
ఆ కంఠంబుగన్ = గొంతుదాకా
మాధుకర భిక్షాన్నంబు = మాధుకర రూపమైన భిక్షాన్నము
భక్షింపగాన్ = తినుటకు
లేకున్నన్ = లేకపోయినను
కడున్ = మిక్కిలియును
అంగలార్చెదవు = చిందులువేస్తూ అరుస్తున్నావు
మేలే = మంచిదా !
లెస్స = బాగు
శాంతుండవే = శాంతస్వభావము గలవాడవేనా!
కటకటా = అయ్యెయ్యో !
నీవారముష్టింపచుల్ = పిడికెడు వరిగింజలతో కాలం వెళ్ళబుచ్చేవారును
శాకాహారులు = కాయకూరలు తినేవారును
కందభోజులు = దుంపలు మాత్రమే తినెడివారును
శిల = కోతకోసిన వరిమళ్ళలో జారిపడిన కంకులను ఏరుకొని బ్రతుకువారును
ఉచక్రముల్ = రోళ్ళవద్ద మిగిలిన బియ్యంతో జీవనం గడుపువారికంటే
తాపసుల్ = మునులు (తపస్సుచేసుకొనేవారు)
నీ కంటెన్ = నీ కన్నా
మతిహీనులే = తెలివితక్కువ వారా ?

తాత్పర్యము
ఇప్పుడు గొంతుదాకా తినడానికి భిక్ష దొరకలేదని ఇంతగా చిందులువేస్తున్నావు కదా ! ఇది నీకు మంచిదా ? బాగున్నది. నిజంగా నీవు శాంత స్వభావుడవా ? పిడికెడు వరిగింజలతో కాలం వెళ్ళబుచ్చేవారు, శాకాహారంతో, దుంపలతో సరిపెట్టుకునేవాళ్ళు, కంకులు ఏరుకొని బ్రతికేవాళ్ళు, రోళ్ళవద్ద బియ్యం ఏరుకొని జీవనం సాగించే మునులు నీకంటే తెలివితక్కువ వాళ్ళ ?

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

11. తే॥గీ॥ ఓ మునీశ్వర! వినవయ్య యున్న యూరుఁ
గన్నతల్లియు నొక్క రూపన్న రీతి ?
యటు విశేషించి శివుని యర్ధాంగలక్ష్మి
కాశి; యివ్వీటిమీఁద నాగ్రహము దగునె ?

కవి పరిచయము
ఈ పద్యం కవిసార్వభౌముడు శ్రీనాథుడు రచించిన ‘భిక్ష’ అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థం
ఓ మునీశ్వర(ముని + ఈశ్వరా) = ఓ మునీశ్వరుడా ! (ఓ వ్యాస మహర్షి)
ఉన్నయూరున్(ఉన్న + ఊరున్) = తానున్న ఊరును
కన్నతల్లియున్ = తన్నుకన్న తల్లియును
ఒక్కరూపన్న రీతిన్ = ఒకే మాదిరను రీతిని
వినవయ్య = నీవు వినియుండలేదా?
కాశి = కాశీపట్టణం
అటు విశేషించి = అంతకంటే విశేషించి
శివుని = పరమేశ్వరుని యొక్క
అర్ధాంగ లక్ష్మికాశి = అర్ధభాగమైన భార్య కాశి
ఇవ్వీటి మీదన్ (ఈ + వీటిమీదన్) = ఈ నగరము మీద
ఆగ్రహము = కోపము
తగునే (తగును + ఏ) = తగునా ?

తాత్పర్యము
‘ఉన్నఊరు కన్నతల్లితో సమానం’ అనే నీతి నీకు తెలియదా ? అంతకంటే విశేషించి శివుని అర్ధాంగ లక్ష్మియైన ఈ కాశీనగరి మీద నీవింత కోపం చూపించడం తగునా ? అని మందలించింది పెద్దముత్తైదువ రూపంలో ఉన్న పార్వతీదేవి.

12.వ. ఇట్టి కాశికానగరంబుమీద భిక్ష లేకుండుట కారణంబుగా
నీయంత వాడు కటకటంబడి శపియింపందలంచునే?
విశేషించి యాఁకొన్నవాఁడవు గావున నీ యవసరంబున
నిన్ను హెచ్చు గుందాడుట మము బోఁటి గృహిణులకు
మెచ్చుగాదు. మా యింటికిం గుడువ రమ్ము! కుడిచి
కూర్చున్న పిమ్మటం గొన్నిమాటలు నీతో నాడఁగలననిన
నమ్మహాసాధ్వింగని, పారాశర్యుండిట్టులనియె -.

ప్రతిపదార్థం

ఇట్టి = ఇటువంటి
కాశికానగరంబుమీది = కాశీనగరంమీద
భిక్షలేకుండుట = భిక్షలేకపోవుట
కారణంబుగా = కారణంగా
నీ + అంతవాడు = నీవంటివాడు
కటకటంబడి = కోపగించుకొని
శపియింపన్ = శపించడానికి
తలంచునే = తలంతువా ?
విశేషించి = ప్రత్యేకించి
ఆకొన్నవాడవున్ + కావున = ఆకలికొనియున్న వాడవు
నిన్నున్ = నిన్ను
హెచ్చున్ = అధికముగా
కుందాడుట = నిందించుట (నీతో తగువుపడుట)
మముబోటి = మావంటి
గృహిణులకున్ = ఇల్లాండ్రకు
మెచ్చుగాదు = మర్యాదకాదు
మా + ఇంటికిన్ = మా ఇంటికి
కుడువరమ్ము = భోజనంచేయడానికి రమ్ము
కుడిచికూర్చున్న = తిని కూర్చున్న
పిమ్మటన్ = తరువాత
కొన్నిమాటలు = కొన్ని పలుకులు (మాటలు)
నీతోన్ = నీతో
ఆడగలను = పలుకగలను
అనినన్ = అనగా
ఆ + మహాసాధ్విన్ = ఆ మహా పతివ్రతను
కని = చూచి
పారాశర్యుండు = వేదవ్యాసుడు (పరాశరుని కుమారుడు)
ఇట్లు = ఈ విధముగా
అనియె = పలికాడు

తాత్పర్యము
కేవలం భిక్షదొరకలేదని బాధపడి విశిష్టమైన కాశీనగరాన్ని నీలాంటి ఉత్తముడు శపించాలనుకుంటాడా ? చాలా ఆకలితో ఉన్నావు. కాబట్టి ఈ సమయంలో నిన్ను ఎక్కువగా బాధపెట్టడం మావంటి గృహిణులకు మంచిది కాదు. మా ఇంటికి భోజనానికిరా ! తిని కూర్చున్న తర్వాత నీతో కొన్ని మాటలు మాట్లాడుతాను’ అన్న ఆ మహాసాధ్విని చూసి, వ్యాసుడిట్లా అన్నాడు.

III

13. తే॥గీ॥ అస్తమింపగఁ జేసినాఁ డహిమకరుఁడు
శిష్యులేఁగాక యయుతంబు చిగురుబోఁడి !
వ్రతము తప్పి భుజింపంగ వలను గాదు
నేఁడు నిన్నటి మఱునాఁడు నిక్కు వంబు

కవి పరిచయము
ఈ పద్యం కవిసార్వభౌముడు శ్రీనాథుడు రచించిన ‘భిక్ష’ అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థం

చిగురుబోఁడి = తల్లీ (ఓ పల్లవగాత్రీ) !
‘అహిమకరుడు = సూర్యుడు
అస్తమింపగన్ = అస్తమించడానికి
చేసినాడు = సమీపించినాడు
ఏగాక = నేనుగాకుండా
శిష్యులు = శిష్యులు
అయుతంబు = పదివేలమంది ఉన్నారు
వ్రతము తప్పి = నియమాన్ని తప్పి
భుజింపగన్ = తినడానికి
వలనుకాదు = యుక్తముకాదు (సరికాదు)
నేడున్ = నేడుకూడా
నిన్నటిమఱునాడు = నిన్నటి దినమునకు మరుసటి దినమే, పస్తుండటమే ?
నిక్కంబు = సత్యము (నిజం)

తాత్పర్యము
తల్లీ ! సూర్యుడస్తమిస్తున్నాడు. నేనే కాదు, నాతోపాటు శిష్యులూ ఉన్నారు. శిష్యులతో కలిసి భుజించాలనే నా వ్రతం విడిచిపెట్టి మీ ఇంట నేనొక్కడినే భుజించలేను. ఈ రోజు నిన్నటికి మరునాడేకదా ! (అంటే నిన్నటిలాగే ఈ రోజు కూడా ఉపవాసం తప్పదని అంతరార్థం).

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

14. చ॥
అనవుడు నల్ల నవ్వి కమలానన యిట్లను, లెస్సగాక, యో
మునివర ! నీవు శిష్యగణముంగొని చయ్యన రమ్ము విశ్వనా
థుని కృప పేర్మి నెందఱతిథుల్ చనుదెంచినఁ గామధేనువుం
బనిగొనునట్లు పెట్టుదు నపారములైన యభీప్సితాన్నముల్ (A.P June’15)

కవి పరిచయము
ఈ పద్యం కవిసార్వభౌముడు శ్రీనాథుడు రచించిన ‘భిక్ష’ అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థం

అనవుడున్ = వేదవ్యాసుడు ఈ విధంగా
అల్ల = కొంచెం
నవ్వి = నవ్వి
కమలాన = కమలమువంటి ముఖముగల ఆ ముత్తైదువ
ఇట్లనున్ = ఈ విధముగా పలికింది
లెస్సగాక = మేలగునుగాక !
ఓ మునివర = ఓ మునీశ్వరుడా !
నీవు = నీవు
శిష్యగణం ముంగొని = శిష్య సమూహముతో కలిసి
చయ్యన = వెంటనే (వేగముగా)
రమ్ము = రావలసినది
విశ్వనాథుని = విశ్వనాథుని యొక్క
కృప పేర్మిన్ = అతిశయమైన దయతో
ఎందఱు = ఎంతమంది
అతిథులు = అతిథులు
చనుదెంచినన్ కామధేనువుంబని = వచ్చినప్పటికీ
గొనునట్లు = కామధేనువును కల్గియున్నట్లు
అపారములైన (అభీప్సితాన్నముల్) = అంతులేని
అభీప్సిత = కోరినటువంటి
అన్నముల్ = భోజనములను
పెట్టుదున్ = పెడతాను

తాత్పర్యము
అని వేదవ్యాసుడు పల్కగా కొంచెం నవ్వి పద్మముఖియైన ఆ ఇల్లాలు సరేలే ! మునీంద్రా ! విశ్వనాథుని దయవల్ల ఎంతమంది అతిథులు వచ్చినా కామధేనువు వలె కోరిన పదార్థాలన్నీ అనంతంగా నేను ఏర్పాటు చేయగలను. నీ శిష్యగణాన్ని తీసుకొని వెంటనే రా ! అన్నది.

15. వ॥ అనిన నట్లకాక మహాప్రసాదంబని వేదవ్యాసుండు
శిష్యులంగూర్చుకొని భాగీరథికిం జని యుపస్పర్శం
బాచరించి యేతెంచిన –

ప్రతిపదార్థం

అనినన్ = అని పలుకగా
అట్లాకాక = అట్లేయగునుగాక
మహాప్రసాదంబు = గొప్పదైన అనుగ్రహము
అని = అని
వేదవ్యాసుండు = వేదవ్యాసుడు
శిష్యులన్ = శిష్యులను
కూర్చుకొని = కలుపుకొని (తనవెంట పెట్టుకొని)
భాగీరథికిన్ = గంగానదికి
చని = వెళ్ళి
ఉపస్పర్శంబు = స్నానము, ఆచమనమును
ఆచరించి = చేసి
ఏతెంచినన్ = రాగా

తాత్పర్యం
అనగా, ‘సరే, మహాప్రసాదం’ అని, వేద వ్యాసుడు శిష్యులను తీసుకొని గంగానదికి వెళ్ళి, స్నాన, ఆచమనాదులు పూర్తి గావించుకొని రాగా.

16. తే॥గీ॥ గొడుగు పాగల గిలకలు గులకరింప
నిందుబింబాస్య యెదురుగా నేగుదెంచి
ఛాత్రసహితంబుగాఁ బరాశరతనూజు
బంతి సాగించె భుక్తి శాలాంతరమున

కవి పరిచయము
ఈ పద్యం కవిసార్వభౌముడు శ్రీనాథుడు రచించిన ‘భిక్ష’ అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థం

గొడుగు పాగల = గొడుగు, పావుకోళ్ళయొక్క
గిలకలు = గిలకలు
గులకరింపన్ = మ్రోగుతుండగా
ఇందుబింబాస్య = చంద్రబింబానమైన ఆ ఇల్లాలు
ఎదురుగాన్ = వ్యాసునకు ఎదురుగా
ఏగుదెంచి = వచ్చి (మునీశ్వరునకు ఎదురేగి)
ఛాత్రసహితంబుగాన్ = శిష్యసమేతముగా
పరాశరతనూజుబంతి = పరాశరనందనుడైన వ్యాసుడు కూర్చున్న పంక్తిని
భుక్తిశాల + అంతరమునన్ = భోజనశాల లోపల
సాగించెన్ = వడ్డన సాగించెను

తాత్పర్యము
గొడుగు, పావుకోళ్ళ (గొడుగు ఆకారంలోని బుడిపెలున్న పావుకోళ్ళు) గిలకలు మోగుతుండగా చంద్రముఖియైన ఆ ఇల్లాలు వారికి ఎదురెళ్ళి ఆహ్వానించింది. శిష్యులతో వ్యాసుడు భోజనశాలలో కూర్చున్నాడు. అప్పుడామె పంక్తికి వడ్డన సాగించింది.

పాఠం నేపథ్యం / ఉద్దేశం

వేదవిభజన చేసి, పంచమవేదంగా మహాభారతాన్ని రచించి, అష్టాదశ (18) పురాణాలను రచించిన బ్రహ్మజ్ఞాని వేదవ్యాసుడు. పరమపవిత్రము, పరమేశ్వరునికి ప్రీతిపాత్రం అయిన కాశిలో వ్యాసుడు తన పదివేలమంది శిష్యులతో కొంతకాలం నివసించాడు. బ్రాహ్మీముహూర్తంలో నిద్రలేచి, ప్రాతర్మాధ్యాహ్నిక విధులను పూర్తిగావించి, శిష్యులతో కాశీ నగరంలో భిక్షాటనం చేసేవాడు. శిష్యులు, తాను వేర్వేరుగా తెచ్చిన భిక్షలో సగం అతిథి అభ్యాగతులకు సమర్పించి, మిగిలినది భుజించేవారు. ఒకరోజు కాశీ విశ్వనాథునికి వ్యాసుడిని పరీక్షించాలన్న సంకల్పం కలిగింది. ఆ సందర్భంగా జరిగిన సంఘటనే ఈ పాఠం.

ఆకలి ఎంతటి వారినైనా విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. ఇది మంచిది కాదని తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠ్యాంశం కావ్యప్రక్రియకు చెందింది. కావ్యం e వర్ణనా ప్రధానమైనది. ఇది శ్రీనాథ కవిసార్వభౌముడు రచించిన ‘కాశీఖండము’ సప్తమాశ్వాసం లోనిది.

కవి పరిచయం

కవి : శ్రీనాథుడు
కాలం : 1380 – 1470
తల్లిదండ్రులు : భీమాంబ, మారయ
మూలగ్రంథం: కాశీఖండం – సప్తమాశ్వాసం

రచనలు :

  1. మరుత్తరాట్చరిత్ర
  2. శాలివాహన సప్తశతి
  3. పండితారాధ్య చరిత్ర
  4. శృంగారనైషధం
  5. భీమఖండం
  6. కాశీఖండం
  7. హర విలాసం,
  8. ధనంజయవిజయం
  9. క్రీడాభిరామం
  10. శివరాత్రిమాహాత్మ్యం
  11. పల్నాటి వీరచరిత్ర
  12. నందనందన చరిత్రలు

బిరుదు : కవిసార్వభౌముడు

విశేషాంశాలు : శ్రీనాథుడు రెడ్డి రాజుల ఆస్థానకవిగా ఉన్నాడు. పెదకోమటి వేమారెడ్డి కాలంలో విద్యాధికారిగా ఉన్నాడు. సుమారు ఇరవై సంవత్సరాలు రాజా శ్రయం పొందాడు. ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడడిండిమభట్టు యొక్క కంచుఢక్కను పగులగొట్టాడు. కనకా భిషేక గౌరవాన్ని పొందాడు.

శైలి – రచనా విధానం: ఉద్దండ లీల, ఉభయ వాక్రౌఢి, రసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి శ్రీనాథుని కవితా లక్షణాలు. శ్రీనాథుని కవితావైశిష్ట్యానికి అతని సీసపద్య రచనా వైభవం ఒక నిదర్శనం. శ్రీనాథుడు శివ భక్తుడు. శివార్చన కళాశీలుడు. తెలుగు కవులలో విశిష్ట కవి శ్రీనాథుడు.

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

ప్రవేశిక

ఈనాడు ‘భిక్ష’ అనే మాట కేవలం ‘అడుక్కుతినడం’ అనే అల్పార్థానికి పరిమితమైంది కాని, ఒకప్పుడు ‘భిక్ష’ అనేది పరమపవిత్రమైన వ్రతం. శివుడు ఆదిభిక్షువుగా ప్రసిద్ధి. గురువులు శిష్యులకు ‘జ్ఞానభిక్ష’ పెట్టేవాళ్ళు. బుద్ధుడు భిక్షాధర్మంతోనే జీవనం సాగించేవాడు; బౌద్దులందరికీ అదే జీవనసూత్రంగా ఉండేది. గురుకులంలో చదువుకునే రాజకుమారులైనా భిక్షాటనంతో విద్యార్థిజీవనం గడిపేవారు.

భిక్షపెట్టేవాళ్ళు కూడా అది మహాపుణ్యకార్యంగా భావించి, తమ ఇంటికి వచ్చిన వారికి నమస్కరించి, పూజించి, భిక్ష సమర్పించేవాళ్ళు. భిక్షా ధర్మంతో చరించిన వేదవ్యాసమహర్షి కాశీనగరంలో పొందిన అనుభవమేమిటో ఈ పాఠం చదివి తెలుసుకోండి.

విద్యార్థులకు సూచనలు

  • పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
  • పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత గీయండి.
  • వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పదవిజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసు కోండి.

ముఖ్య పదాలు – అర్థాలు

అపూప = పిండివంటలు
అభిఘరించు = చల్లు
అర్ధాంగలక్ష్మి = శరీరంలో సగభాగమైన లక్ష్మి
ఆగ్రహం = కోపం
ఈప్సిత = కోరిక
బీటెండ = అధికమైన ఎండ
ద్వాఃకవాటము = ద్వారబంధము
భుక్తిశాల = భోజనశాల
మతిహీనులు = మతిలేనివారు
మచ్చెకంటి = చేపకనులుగల స్త్రీ
సాన్నిధ్యము = సమీపము
క్షుత్పిపాసులు = ఆకలి, దప్పిక బాధతో కూడినవారు
గోమయము = ఆవుపేడ
ప్రక్షాళితం = కడుగబడిన
పసిడి = బంగారం
ముక్కంటి = శివుడు
మోక్షలక్ష్మి = మోక్షము అనెడి లక్ష్మి
పారాశర్యుడు = వేదవ్యాసుడు
కటకటపడు = బాధపడు
సూడిగములు = గాజులు
బ్రాహ్మణాంగనలు = బ్రాహ్మణ స్త్రీలు
లెస్స = మేలు
కుందాడుట = బాధపెట్టునట్లు మాట్లాడు
భాగీరథి = గంగానది
బింబాస్య = చంద్రబింబము వంటి ముఖముకలది
ఆరగించుట = తినుట

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

ప్రక్రియ – కావ్యం (ప్రాచీన పద్యం)

ప్రాచీన తెలుగు సాహిత్య ప్రక్రియల్లో ప్రబంధం ఒకటి. పురాణ, ఇతిహాసాలనుండి ఒక చిన్న కథను తీసుకొని, దానిని అనేకములైన వర్ణనలతోను, కల్పనల తోను, పెంచి పెద్దచేసి వర్ణించే గ్రంథాన్ని ‘ప్రబంధం’ అని అంటారు. ఇందులో వర్ణనలకు ప్రాధాన్యం ఉంటుంది. శృంగార రసానికి ప్రాధాన్యం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇతర రసాలు కూడా ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. మనుచరిత్ర, వసుచరిత్ర మొదలైనవాటిని ప్రబంధాలుగా పేర్కొనవచ్చు.

పాఠ్యభాగ సారాంశము

వేదవ్యాసుడు ఒకరోజు కాశీనగరంలో శిష్యులతో మధ్యాహ్న సమయంలో భిక్ష కోసం బ్రాహ్మణ వీధులలో ఇంటింటికీ తిరిగాడు. ఎవరూ ఆయనకు భిక్ష పెట్టలేదు. కాశీ నగరంలోని బ్రాహ్మణ స్త్రీలు రోజూ అతిథులకు మధూకర భిక్ష పెడుతూ ఉంటారు. కాని ఆనాడు వ్యాసుడికి భిక్ష పెట్టలేదు.

ఆ రోజుకు ఉపవాసం ఉందామని, మరునాడు పారణకు భిక్ష దొరకకపోదని వ్యాసుడు నిశ్చయించాడు. మరుసటి రోజున వ్యాసుడు తిరిగి శిష్యులతో భిక్షాటనకు వెళ్ళాడు. ఈశ్వరుడి మాయవల్ల ఆ రోజు కూడా ఆయనకు ఎవ్వరూ భిక్ష పెట్టలేదు. వ్యాసుడు కోపంతో తన భిక్షాపాత్రను వీధి మధ్యలో పగులగొట్టి, కాశీ వాసులకు మూడు తరాల దాకా ధనం, మోక్షం, విద్య లేకుండా పోవాలి అని శపించ డానికి సిద్ధమయ్యాడు.

అప్పుడు పార్వతీదేవి ఒక బ్రాహ్మణ మధూభవనం వాకిట్లో సామాన్య స్త్రీ వలె కనబడి, వ్యాసుని రమ్మని పిలిచి ఇలా మందలించింది. “ఓ మహర్షీ ! నీవు గొంతు దాకా తినడానికి మధూకర భిక్ష దొరకలేదని గంతులు వేస్తున్నావు. నివ్వరి బియ్యం తినేవారు, శాకాహారులూ, కందభోజులూ, ఉంఛవృత్తితో జీవించేవారూ అయిన మునీశ్వరులు నీ కంటే తెలివితక్కువ వారు కాదు. ఉన్న ఊరు, కన్నతల్లితో సమానం అంటారు. అదీకాక ‘కాశీ’, ఈశ్వరుడి భార్య. భిక్ష దొరక లేదని నీవు కాశీ నగరాన్ని శపించడం తగదు.

నీవు ఆకలితో ఉన్నావు. మావంటి గృహిణులు నిన్ను ఇలా నిందించడం మంచిది కాదు. మా ఇంటికి భోజనానికి రా, భోజనం చేసిన తరువాత నీతో మాట్లాడవలసిన మాటలు ఉన్నాయి”.

పార్వతీదేవి మాటలు విని, వ్యాసుడు ఆమెతో “అమ్మా! సూర్యుడు అస్తమిస్తున్నాడు. నాకు పదివేలమంది శిష్యులు ఉన్నారు. వారు తినకుండా నేను తిననని నాకు వ్రతం ఉంది. నిన్నటిలాగే ఈ రోజు కూడా పస్తు ఉంటాం” అన్నాడు.

అప్పుడు పార్వతీదేవి చిరునవ్వు నవ్వి “మునీశ్వరా ! నీవు శిష్యులను కూడా వెంటబెట్టుకొని తొందరగా రా. ఈశ్వరుడి దయవల్ల ఎంతమంది అతిథులు వచ్చినా, అందరికీ కోరిన అన్నం పెడతాను” అంది.

వ్యాసుడు సరేనని గంగలో స్నానం చేసి, శిష్యులతో వచ్చాడు. పార్వతీదేవి వారికి స్వాగతం చెప్పి, వారందరికీ భోజనశాలలో బంతివేసి వడ్డించింది.

TS 10th Class Telugu Important Questions 10th Lesson గోలకొండ పట్టణము

These TS 10th Class Telugu Important Questions 10th Lesson గోలకొండ పట్టణము will help the students to improve their time and approach.

TS 10th Class Telugu 10th Lesson Important Questions గోలకొండ పట్టణము

PAPER – I : PART – A

I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)

1. లఘు సమాధాన ప్రశ్నలు మార్కులు

అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
ఇబ్రహీం కుతుబ్షా గురించి రాయండి.
జవాబు:
ఇబ్రహీం కుతుబ్షా విద్యాప్రియుడు. ఇతనికి కులమత భేదాలు లేవు. ఇతని ఆస్థానంలో కవులు, పండితులను పోషించేవారు. ఇతని ఆస్థానంలో నిరంతరం విద్యాగోష్టి సాగేది. పండితులను ఘనంగా సన్మానించేవాడు. తెలుగు భాషపైన అభిమానం కలవాడు. జంతు రక్షణకు ప్రాధాన్యం ఇచ్చేవాడు. ద్రాక్ష తోటల పెంపకాన్ని ప్రోత్సహించే వాడు. ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యం ఇచ్చేవాడు.

ప్రశ్న 2.
‘బాల్బోవా వృక్షాన్ని సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్షా ఆఫ్రికా నుండి తెప్పించాడు’. దీనిని బట్టి నీవేమి గ్రహించావు?
జవాబు:
గోలకొండ నవాబులకు ఇతర దేశాలతోనే కాక, ఇతర ఖండాలతో కూడా సంబంధ బాంధవ్యాలు ఉండేవి. ఇతర దేశాల వ్యాపారులు కూడా గోలకొండతో వ్యాపార సంబంధాలకు ప్రాధాన్యతను ఇచ్చేవారు.

గోలకొండ నవాబులు కళలకు, కళా ఖండాలకు ప్రాధాన్యతను ఇచ్చేవారు. అపురూప మైనది ఏదైనా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ఎంత ఖర్చయినా తెప్పించే వారు. దానిని జాగ్రత్తగా సంరక్షించేవారు అని గ్రహించాను.

TS 10th Class Telugu Important Questions 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 3.
గోలకొండ పట్టణములో వీధులు విశాలముగా ఎందుకు ఉండేవి ?
జవాబు:
గోలకొండ పట్టణములో జనసమ్మర్థం ఎక్కువ. పరిపాలకులు, అధికారులు, సామాన్య ప్రజలు తిరగడానికి వీధులు విశాలంగా ఉండేవి. గోలకొండ పట్టణంలో ఏనుగులు, ఒంటెలు, గుఱ్ఱాలు కూడా ఎక్కువగా ఉండేవి. అవి రాజవీధులలో ఎక్కువగా తిరిగేవి. ఇటువంటి పెద్ద పెద్ద జంతువులు, మానవులు తిరగాలంటే వీధులు చాలా విశాలంగా ఉండాలి కదా ! అందుకే గోలకొండ పట్టణంలోని వీధులు విశాలంగా ఉండేవి.

ప్రశ్న 4.
ఇబ్రహీం కుతుబ్షా సరదార్లను, భాగ్యవంతులను కోట లోపల మేడలు కట్టవలసినదిగా ఎందుకు ఆజ్ఞాపించాడు ?
జవాబు:
సాధారణంగా ధనవంతుల ఇండ్లలోనే దొంగతనాలు ఎక్కువ జరుగుతాయి. దొంగలు కూడా సామాన్యుల ఇళ్ళను దొంగతనానికి ఎంచుకోరు. ధనవంతులనే లక్ష్యంగా పెట్టుకొంటారు.

ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఎక్కువ ధనాన్ని చెల్లించేది ధనవంతులే. వారిని కాపాడడం ప్రభుత్వం యొక్క కనీస ధర్మం. కోట బయట ఉంటే ధనవంతులను దొంగల బారి నుండి కాపాడడం కష్టం. కోట లోపలయితే సైన్యం ఉంటుంది. కనుక దొంగతనాలకు అవకాశం తక్కువ. అందుచేత ధనవంతులను, సరదార్లను కోటలోపల మేడలు కట్టుకోమని ఇబ్రహీం కుతుబ్షా ఆజ్ఞాపించాడు.

ప్రశ్న 5.
ఇబ్రహీం కుతుబ్షా పన్నెండు భిక్షా గృహాలను ఎందుకు నిర్మించాడు ?
జవాబు:
కనీసం తిండికి కూడా లేని పేదవారు భిక్షాటన చేస్తారు. వారు అనాథలు. వారిలో అవయవాలు సరిగ్గా లేనివారుంటారు. వృద్ధులు ఉంటారు. తల్లి దండ్రులెవరో తెలియని పిల్లలుంటారు. ఏ ఆధారం లేనివారుంటారు. వారికి ఆశ్రయం కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిది. అటువంటి యాచకులకు భోజనం, వసతి కల్పించడం ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత. అందుకే ఇబ్రహీం కుతుబ్షా 12 భిక్షా గృహాలను నిర్మించి యాచకులకు ఆశ్రయం కల్పించాడు.

ప్రశ్న 6.
గోల్కొండ పట్టణంలోకి కొత్తవారికి ప్రవేశం ఉండేదా ? కాదా ? ఎందుకు ?
జవాబు:
గోలకొండ పట్టణంలోకి క్రొత్తవారికి ప్రవేశం దుర్లభం. ‘దారోగా’ నుండి అనుమతి పత్రం ఉంటేనే రానిచ్చేవారు. లేదా రాజోద్యోగులు పరిచయం ఉన్న వారిని రానిచ్చేవారు. కొత్తగా వచ్చినవారిని రక్షక భటులు చాలా తనిఖీలు చేసేవారు. ఎందుకంటే వారి వద్ద ఉప్పు కాని, పొగాకు కాని ఉందేమో అని అధికారులు తనిఖీ చేసేవారు. ఉప్పు, పొగాకు వల్ల రెవెన్యూ వసూలు ఎక్కువగా ఉండేది. అందుకే ఎక్కువగా తనిఖీలు నిర్వహించేవారు.

కొత్తవారి వలన ఎక్కువగా వస్తాయి. రెవెన్యూ వచ్చే వస్తువులు అక్రమంగా తరలిపో తాయనే అనుమానం కూడా కారణం. అందుచేతనే కొత్త వారికి ప్రవేశం ఉండేది కాదు.

ప్రశ్న 7.
ఆదిరాజు వీరభద్రరావు రచనలను పేర్కొనండి. (Mar.’17)
జవాబు:
తెలంగాణ తెలుగుకవుల్లో ఆదిరాజు వీరభద్రరావు ప్రసిద్ధులు. వీరి రచనలు తెలంగాణ సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. వీరి రచనల్లో ‘మన తెలంగాణ’ అనే వ్యాససంపుటి ప్రసిద్ధమైంది.

ఆదిరాజు వీరభద్రరావు గారి రచనలు : ప్రాచీనాంధ్ర నగరములు, లలిత కథావళి, రత్నప్రభ, జీవిత చరితావళి, జీవిత చరిత్రలు, నవ్వుల పువ్వులు, మిఠాయి చెట్టు, షితాబ్ ఖాన్. సంగ్రహాంధ్ర విజ్ఞానకోశంలో యాభై వ్యాసాలు రాశాడు.

2. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు మార్కులు

ఆ) కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
ఉమ్రావుల పటాటోపం వివరించండి.
జవాబు:
ఉమ్రావులు బజారులలో వెళ్ళేటపుడు చాలా పటాటోపంతో వెళ్ళేవారు. ఒక ఉమ్రావు బయలు దేరితే అతని ముందు ఒకటో, రెండో ఏనుగులు బయల్దేరేవి. వాటి మీద జెండాలతో భటులు కూర్చొనేవారు. తర్వాత గుఱ్ఱాలపై 50 లేక 60 మంది భటులు ఆయుధాలు ధరించి వెళ్ళేవారు.

వీరి వెనుక బాకాలు, సన్నాయిలతో కొందరు వెళ్ళేవారు. వీరి వెనుక ఉమ్రావు గుఱ్ఱంపై వచ్చేవాడు. అతనికి 40 మంది అంగరక్షకులుండేవారు. కొందరు విసనకర్రలతో విసిరేవారు. ఒకడు గొడుగు పట్టేవాడు.

మరొకడు హుక్కాతో వచ్చేవాడు. ఒకడు పూర్ణ కుంభాలతో వచ్చేవాడు. తర్వాత ఒక పల్లకిని నలుగురు మోసుకొని వచ్చేవారు. తర్వాత నలుగురు పల్లకితో వచ్చేవారు. తర్వాత ఒంటెలపై తప్పెటలు వాయిస్తూ వచ్చేవారు. నవాబుగారికి ఇష్టమయినపుడు పల్లకిలో వెళ్ళేవాడు.

TS 10th Class Telugu Important Questions 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 2.
గోలకొండ పట్టణంలోని కట్టడాల ద్వారా పరిపాలనకు ప్రయోజనాలేమిటి ?
జవాబు:
గోలకొండ పట్టణాన్ని ఒక పద్ధతి ప్రకారం నిర్మించారు. దీని నిర్మాణ పథక కర్త ఆజంఖాన్ అనే ఇంజనీరు. పట్టణ నిర్మాణం వలననే పరిపాలన పటిష్ఠంగా సాగుతుంది.

వీధులు విశాలంగా నిర్మించడం వలన ట్రాఫిక్ సమస్యలు చాలా తక్కువగా ఉండేవి. సర్దార్లను, భాగ్యవంతులను కోట లోపల మేడలు కట్టుకోమని ఆజ్ఞాపించడం ద్వారా ధనవంతుల రక్షణను కట్టు దిట్ట౦ చేశారు.

ఉద్యోగులకు భవనాలు కట్టించడం ద్వారా, వారికి సౌఖ్యాలు కల్పించారు. దానివల్ల ఉద్యోగులు సమయానికి కార్యాలయాలకు రాగలరు. పని మీద పూర్తిగా దృష్టి పెడతారు.

భిక్షా గృహాల వలన యాచకులకు కూడా సౌఖ్యం కల్పించారు. దీని వలన నేరాల సంఖ్య తగ్గుతుంది. పాఠశాలలు నిర్మించారు. దాని వలన భావి తరాలకు విజ్ఞానం అందుతుంది. చదువు వలన మాత్రమే ఉత్తమ సమాజం రూపొందుతుంది. పాఠశాలల నిర్మాణం ద్వారా ఉత్తమ సమాజానికి విత్తనాలు చల్లారు.

విదేశీ రాయబారులకు ప్రత్యేక నివాసాలు కట్టడం ద్వారా విదేశాల దృష్టిలో పరువు ప్రతిష్ఠలు పెంచారు.

ప్రశ్న 3.
గోలకొండ పట్టణ వైభవాన్ని వివరించండి. (June ’16)
జవాబు:
పట్టణమనగా గోలకొండ పట్టణమనియే దక్షిణా పథమున ప్రసిద్ధి. గోలకొండ దుర్గమనగా ఒక్క కోట కాదు, మూడు కోటలు. గోలకొండ పట్టణ నిర్మాణ పథకమునకు కర్త ఆజంఖాన్ అను ఇంజనీరు అని తెలియుచున్నది. ఈతడే పట్టణము యొక్క రూపు రేఖలను దిద్దినవాడు.

గోలకొండ పట్టణములో ఏనుగులు, ఒంటెలు, గుఱ్ఱాలు అధిక సంఖ్యలో నుండి పట్టణములో సందడిగా సంచరించు చుండెను. గోలకొండ పట్టణం అలంకార భూయిష్టముగా ఉంటుంది. గోలకొండ పట్టణములో ఉద్యానవన నిర్మాణమునందు విలక్షణమయి, ఆకర్షణీయ మైనట్టివి మిద్దెల మీది తోటలు, భవనముల పైభాగము ఎంతో మనోహరంగా నిర్మించినారు. ఈ విధంగా ఆనాటి చరిత్ర, సంస్కృతి మనకు తెలుస్తోంది.

PAPER – II : PART – A

I. అవగాహన – ప్రతిస్పందన

అపరిచిత గద్యాలు

1. కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ఒకప్పుడు మానవజాతి ప్రగతికి సంకేతాలుగా భావింపబడిన సాంకేతిక అద్భుతాలు ఈవేళ పర్యా వరణానికి పెద్ద ప్రమాదాలుగా పరిణమిస్తున్నాయి. మన పరిశ్రమలు, కర్మాగారాలు, వాహనాలు, రక రకాల విద్యుత్ పరికరాలు పర్యావరణ కాలుష్యానికి ముఖ్యమైన కారణాలుగా ఉంటున్నాయి. వాతా వరణంలో బొగ్గుపులుసు వాయువులు, గ్రీన్ హౌస్ వాయువులు ఎక్కువవుతున్నాయి. వీటి వలన తీవ్రమయిన పర్యావరణ సమస్యలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2050 నాటికి 15 మించి 35 శాతం జంతువులు నశించిపోయే ప్రమాదముందనిశాస్త్రవేత్తలు అభిప్రాయపడు
తున్నారు.

ప్రశ్నలు – సమాధానములు

ప్రశ్న 1.
వాతావరణ కాలుష్యానికి కారణమయిన వాయువేది ?
జవాబు:
బొగ్గుపులుసు వాయువు

ప్రశ్న 2.
జంతువులు ఎందుకు నశించిపోతాయి ?
జవాబు:
వాతావరణ కాలుష్యం వలన

ప్రశ్న 3.
మానవులు ఉపయోగించే వాహనాలలో కాలుష్యం కలిగించనిదేది ?
జవాబు:
సైకిలు

ప్రశ్న 4.
వాతావరణ కాలుష్య నివారణకు ఏం చేయాలి ?
జవాబు:
చెట్లను ఎక్కువగా పెంచాలి

ప్రశ్న 5.
పెద్ద ప్రమాదం ఏమిటి ?
జవాబు:
వాతావరణ కాలుష్యం

TS 10th Class Telugu Important Questions 10th Lesson గోలకొండ పట్టణము

2. క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.

సముద్రగర్భంలో ఆయుధ పాణులైన సైనికుల్లాంటి ప్రాణులున్నాయంటే నమ్మశక్యం కాదు. అయినా ఇది నిజం. సముద్రగర్భంలో ఒక ప్రత్యేకమైన నత్తజాతి ఉంది. ఈ నత్తల శరీరం మీద పాదాల అడుగున ఇనుప పొలుసులు ఉంటాయి. మామూలు నత్తల కున్న వీపుమీది పై తొడుగు వీటికి ఉండదు. పాదాల అడుగున ఉన్న ఈ ఇనుప పొలుసులే క్రమంగా నత్తల పై తొడుగుగా మారి ఉండవచ్చునని సముద్ర జల జీవశాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇవి శత్రువులను ఆ ఇనుప తొడుగులతో ఎదుర్కొంటాయి.

ప్రశ్నలు

1. సముద్రగర్భంలో ఏది నమ్మశక్యంకాదు ?
జవాబు:
ఆయుధపాణులైన సైనికుల్లాంటి ప్రాణులున్నాయంటే నమ్మశక్యం కాదు.

2. వేటిమీద పొలుసులు ఉన్నాయి ?
జవాబు:
ఒక ప్రత్యేకమైన నత్తజాతి శరీరం మీద.

3. సైనిక నత్తలు శత్రువులను ఎలా ఎదుర్కొంటాయి ?
జవాబు:
ఇనుప తొడుగులతో శత్రువులను ఎదుర్కొంటాయి.

4. “పాదాల అడుగున” దీనిలో ఏ సంధి పదం కలదు ?
జవాబు:
లులనల సంధి.

5. చిత్ర విచిత్రమైన జలచరాలు ఎక్కడ ఉంటాయి ?
జవాబు:
సముద్రగర్భంలో.

TS 10th Class Telugu Important Questions 10th Lesson గోలకొండ పట్టణము

3. క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు సరైన సమాధానాలు వ్రాయండి

“దేశ భాషలందు తెలుగు లెస్స” అని సాహితీ సమరాంగణ సార్వభౌములచే ప్రశంసింపబడిన భాష మన తెలుగుభాష, భాషాభ్యుదయమునకు సాహిత్య సంపద జీవగర్ర. ఆదికవి నన్నయభట్టారకుని నాటినుండి నేటి వరకు ఆంధ్ర భాషా సాహిత్యము అవిచ్ఛిన్నముగా, బహు-ముఖములుగా రాణించి మించినది. ముద్రణాది సౌకర్యములు ఏర్పడిన తరువాత మన తెలుగు భాషలో ప్రాచీన కావ్య పురాణాది వివిధ గ్రంథములు ప్రచురింపబడి సుప్రకాశితములయ్యెను.

ప్రశ్నలు – సమాధానములు

1. తెలుగు భాష ఏమని ప్రశంసింపబడినది ?
జవాబు:
తెలుగు భాష “దేశ భాషలందు తెలుగు లెస్స” అని ప్రశంసింపబడింది.

2. ముద్రణా సౌకర్యము ఏర్పడుట ద్వారా భాషకు కల్గిన ప్రయోజనమేమి ?
జవాబు:
తెలుగు భాషలో ప్రాచీన కావ్య పురాణాది గ్రంథములు ప్రచురింపబడ్డాయి.

3. ఆదికవి ఎవరు ?
జవాబు:
ఆదికవి నన్నయ భట్టారకుడు.

4. భాషాభ్యుదయమునకు ఏది జీవగర్ర ?
జవాబు:
భాషాభ్యుదయానికి సాహిత్య సంపద జీవగర్ర.

5. సాహిత్యరంగంలో, యుద్ధరంగంలో రెండింటి లోను చక్రవర్తి అని చెప్పిన పదం ఏది ?
జవాబు:
సాహితీ సమరాంగణ సార్వభౌముడు.

4. క్రింది పేరా చదివి ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.

కుందుర్తి ఆంజనేయులు రచించిన వచన పద్య ఖండిక ‘నగరంలో వాన’ కవిత్వంలా మొదలై రాజకీయ శాసనంతో అంతం అవుతుంది. అందరూ వాస్తవికత నుంచి వ్యంగ్యాన్ని పుట్టిస్తే, ఇందులో కవి వ్యంగ్యం నుంచి వాస్తవికతను సృష్టిస్తాడు. ప్రబంధకవి అయ్యలరాజు రామభద్రుడు వర్షధార నుంచి కవితాధారను శ్లేషించాడు. అది కేవలం శబ్దగతమైన శ్లేష మాత్రమే. ఇందులో భావసంఘర్షణ నుంచి వెలువడిన వ్యంగ్యం గుబాళిస్తుంది.

కవి భావుకత వ్యంగ్య ధనువును ఎక్కు పెడితే, సంస్కారం వాస్తవికత భాగాన్ని గుండెలకు గురిపెట్టి కొడుతున్నది. ఆ దెబ్బ తప్పదు. అది ఎంత సున్నితంగా తాకుతుందో అంత గాఢంగా ముద్ర వేస్తుంది. వచన పద్యం ఎంత సహజమైన ఛందస్సో, ఈ ఖండికలోని రచన కూడా అంత సహజంగా రూపుదిద్దుకున్నది. కుందుర్తి వాన కురిసింది నగరంలోనే అయినా, ఆ వానలో తడి సింది మాత్రం సామాన్యుడి జీవనమే ! ఇందులో వాన కేవలం కేన్వాసు మాత్రమే. దాని ఆధారంగా చేసుకుని కవి చిత్రించిన వాస్తవిక దృశ్యాలు మనల్ని నిలబెట్టి ఆలోచింపజేస్తాయి.

ప్రశ్నలు – సమాధానములు

1. ‘నగరంలో వాన’ దేనితో అంతమవుతుంది ?
జవాబు:
రాజకీయ శాసనంతో అంతమవుతుంది.

2. కవి దేనినుంచి వాస్తవికతను సృష్టిస్తాడు ?
జవాబు:
కవి వ్యంగ్యం నుంచి వాస్తవికతను సృష్టిస్తాడు.

TS 10th Class Telugu Important Questions 10th Lesson గోలకొండ పట్టణము

3. కుందుర్తి నగరంలో వాన కవితను ఏ శైలిలో రాశాడు ?
జవాబు:
కుందుర్తి ‘నగరంలో వాన’ కవితను ‘వచన పద్య ఛందస్సు’ లో వ్రాశారు.

4. నగరంలో వాన కవితలోని ప్రధానాంశం ఏమిటి ?
జవాబు:
సామాన్యుడి జీవనమే ప్రధానాంశం.

5. మనల్ని ఆలోచింపచేసేవి ఏవి ?
జవాబు:
కవి చిత్రించిన వాస్తవిక దృశ్యాలు మనల్ని నిలబెట్టి ఆలోచింపచేస్తాయి.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత (5 మార్కులు)

సృజనాత్మక ప్రశ్నలు

ప్రశ్న 1.
మీ పల్లె గురించి వివరిస్తూ కవిత రాయండి.
జవాబు:
మా పల్లె

మా పల్లె అందిస్తోంది కలుషితం కాని ఆహారం. మా పల్లె అందిస్తోంది మంచి మనసుల సహవాసం. మా పల్లె కలిగిస్తోంది పక్షులు, జంతువులకు ఆవాసం. మా పల్లె అందిస్తోంది బడిలో చక్కటి చదువులు మా కోసం.
మా పల్లె నేర్పిస్తోంది ఎక్కడా తలవంచని శౌర్య పౌరుషాలు.
మా పల్లె పాడిపంటలకు ఆలవాలం.
చిరునవ్వుకు చిరునామా మా పల్లె రండి. రండి……

ప్రశ్న 2.
గోలకొండ పట్టణం గురించి మీ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

హైదరాబాదు,
X X X X X.

ప్రియనేస్తమా సుభాష్,

గోలకొండ పట్టణం చరిత్ర ప్రసిద్ధి గల పట్టణం. గోలకొండ మూడు కోటల నిలయం. గోలకొండ పట్టణ నిర్మాణ పథక కర్త ఆజంఖాన్ అనే ఇంజనీరు.

ఈ పట్టణంలో ఏనుగులు, గుఱ్ఱాలు, ఒంటెలు ఎక్కువగా ఉండేవి. జనం కూడా చాలా మంది ఉండేవారు. వీధులు చాలా విశాలంగా ఉండేవి.

గోలకొండ పట్టణాన్ని నలుగురు నవాబులు అద్భుతంగా అభివృద్ధి చేశారు. అనేక భవనాలు కట్టించారు. అందమైన ఉద్యానవనాలు కూడా ఏర్పరచారు. మిద్దెల మీది తోటలు గోలకొండ ప్రత్యేకత.

నీవు దర్శించిన వరంగల్లు పట్టణం ప్రత్యేకతలురాయి.

ఇట్లు,
నీ స్నేహితుడు,
X X X X.

చిరునామా :

వై. సుభాష్, నెం. 20,
10వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
మధిర, ఖమ్మం జిల్లా.

ప్రశ్న 3.
చక్కటి గోలకొండ నగరాన్ని నిర్మించి ఇచ్చిన ఆజంఖాన్ ను అభినందిస్తూ ఒక అభినందన పత్రం రాయండి.
జవాబు:
గోలకొండ నిర్మాత ఆజంఖాన్కు సమర్పించు

అభినందన పత్రం

అలనాటి మేటి ఇంజనీర్ ఆజంఖాన్ !

నీ మేధకు అపురూప సాక్ష్యం గోలకొండ పట్టణం. 500 సంవత్సరాలు దాటినా నీ కళాత్మక సృష్టి కొత్తకొత్తగానే కనిపిస్తోంది. ఆ భవన నిర్మాణాలు మీ ఆలోచనా పటిష్ఠతను చెబుతున్నాయి. ఆ వీధుల వైశాల్యం నీ హృదయ విశాలతను చాటు తున్నాయి. రమ్యమైన ఉద్యానవనాలు అందమైన మీ కళాత్మక దృష్టికి దర్పణం పడుతున్నాయి. నీ వంటి మహోన్నతుడిని అభినందించడం మా అదృష్టం. అందుకోండి మా అభినందన మందారమాల.

ఇట్ల
గోలకొండ పట్టణ అభివృద్ధి కమిటీ.

ప్రశ్న 4.
ఇటీవల నీవు సందర్శించిన చారిత్రక కట్టడాన్ని వివరిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

సిరిపూర్ కాగజ్నగర్,
తేది : ……………

ప్రియ మిత్రమా,

నేను ఇక్కడ క్షేమం. నువ్వూ అక్కడ క్షేమంగా ఉన్నావని తలుస్తాను. ముఖ్యంగా ఈ లేఖ రాయడంలో ఉద్ధేశ్యం ఏమిటంటే నేను ఇటీవల మన ప్రఖ్యాత చారిత్రక కట్టడం రామప్ప గుడిని సందర్శించాను. దాని విశేషాలను నీతో పంచుకుందామని అనుకొంటు న్నాను. రామప్ప దేవాలయాన్ని ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించారు. ఇది హైదరాబాదు 157 కి.మీ. దూరంలో వరంగల్ జిల్లా పాలంపేరు అనే ఊరి దగ్గర ఉంది. ఇక్కడ ప్రధాన దైవం రామలింగేశ్వరస్వామి.

ఈ ఆలయం దానిలోని దైవం పేరు మీదుగా కాక, దానిని చెక్కిన శిల్పి రామప్ప పేరు మీదుగా ప్రసిద్ధి చెందటం విశేషం. ఇక్కడ శిల్ప సంపద కాకతీయులు కళాభిరుచికి నిదర్శనం. ఎత్తైన పీఠం పై నల్లరాతితో చెక్కబడిన పెద్ద శివలింగం చక్కగా ఉంది. ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఏ దిశ నుండి చూసినా నంది మనవైపే చూస్తున్నట్లు ఉంటుంది. ఇక్కడ ఇటుకలు నీటిమీద తేలుతూ ఉంటాయి. ఇక్కడ కాకతీయుల శిల్ప చాతుర్యం నాకు చాలా ఆనందాన్ని కలుగజేసింది. మరో ఉత్తరంతో మరలా కలుస్తాను సెలవు.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
X X X X.

చిరునామా :

క్రొత్త నాగేశ్వర్,
ఇం. నెం. 3-256,
గాంధీ నగర్,
నల్లగొండ,

TS 10th Class Telugu Important Questions 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 5.
‘గోలకొండ పట్టణము’ లోని అందచందాలను ‘వచన కవిత’ రూపంలో రాయండి.
జవాబు:
గోలకొండ దక్షిణాపథమ్మున అలరె
జగతికి జాగృతిని కల్పించె
తెలంగాణమ్ములన మకుటాయమానమ్ముగ
నిలచె గగన తలంబుదాక !

శిల్పకళావైభవంబున కొదువలేదు
నిర్మాణ కౌశలమ్మునకు ఎదురు లేదు
ప్రకృతిరమణీయతకు తిరుగులేదు
చూచినంతనే చూడాలనిపించు

వ్యాపార సామ్రాజ్యమునకు నెలవుగా నిలిచె
రామదాసు కీర్తనలకు ఆలవాలమాయె
పాలకుల ఏలుబడిలో జీవకారుణ్యం అలరె

సకల వసతులకు మూలకేంద్రమాయె.

అదనపు వ్యాకరణాంశాలు

PAPER – I : PART – B

1. సొంతవాక్యాలు

1. పెంపుసొంపులు : నగరం పెంపుసొంపులకై ముఖ్యమంత్రిగారు బాగా కష్టపడుతున్నారు.

2. మిరుమిట్లు గొలుపు సర్కసువారు ఏర్పాటు చేసిన దీప కాంతులు కళ్ళకు మిరుమిట్లు గొలుపు తున్నాయి.

3. రాకపోకలు : దేశంలో రాకపోకలకై అనేక రహదారులు కలవు.

2. పర్యాయపదాలు

ఏనుగు = దంతి, హస్తి, ద్విరదము, గజము, అనే కపము
ఒంటె = లొట్టె, లొట్టిపిట్ట, ఉష్ట్రము, వాసంతము
గుఱ్ఱము = ఘోటకము, వీతి, తురగము, తురంగము
ద్రాక్ష = కృష్ణ, గోసన్తి, మధురస, స్వాద్వి
మేడ = ఉపకారిక, పురము, నగరు, సౌదము
వర్తకుడు = వైదేహకుడు, వణిజుడు, సార్ధవాహుడు, వైగముడు
హర్మ్యము = మేడ, ప్రాసాదము, సౌధము, భవనము
ధ్వజము = పతాకము, కేతనము, టెక్కెము, జెండా
జైలు = చెరసాల, కారాగృహము, ఖైదు
హాటకం = బంగారం, సువర్ణం, పసిడి, హేమం,
భార్య = పతి, ఇల్లాలు, ఆలి
పోరాటం = యుద్ధము, సంగ్రామము, సమరము
బాట = దారి, మార్గము
భర్త = ధవుడు, నాథుడు, పతి, మగడు

3. వ్యుత్పత్త్యర్థాలు

రాజధాని = రాజు నివసించే ప్రధాన పట్టణము (రాచవీడు)
భవనము = బాలురు దీనియందు పుట్టుదురు (ఇల్లు)
నందనము= సంతోషపెట్టునది (ఇంద్రుని ఉద్యాన వనము)
హర్మ్యము = మనస్సును హరించునది (ధనికుని గృహము)

4. నానార్థాలు

పట్టణము = రాజధాని, ఉత్తరీయము, వస్త్రము
సమ్మర్దము = గుంపు, రాపిడి, యుద్ధము, త్రొక్కుట
జలము = నీళ్ళు, జడము, కురువేర, ఎఱ్ఱ తామర
శిఖరము = అగ్రము, కొండ కొన, మండపము
గాలి = వాయువు, పిశాచము, దుర్భాష
ధర = నేల, మెదడు, వెల, రక్తనాళము
అంబరము = వస్త్రము, ఆకాశము
ఆశ = కోరిక, దిక్కు
పేరు = నామధేయం, కీర్తి, అధికం, హారము
క్షేత్రము = చోటు, పుణ్యస్థానం, శరీరము, భూమి

TS 10th Class Telugu Important Questions 10th Lesson గోలకొండ పట్టణము

5. ప్రకృతి – వికృతులు

రూపము – రూపు
స్త్రీలు – ఇంతులు
మృత్యువు – మిత్తి
భీతి – బీతు
దేవాలయము – దేవళము
ముఖము – మొగము
రాజ్ఞి – రాణి
కర్పూరము – కప్పురము
పట్టణము – పట్నము, పట్టము
నాణకము – నాణెము
హృదయము – ఎద, ఎడ,ఎడద
యజ్ఞం – జన్నం
గుచ్ఛము – గుత్తి
భటుడు – బంటు
యోధులు – జోదులు
స్తంభము – కంబము
భీతి – భీతు
ప్రయాణం – పయనం
ఆజ్ఞ = ఆన
గృహము = గీము
రాట్టు = ఱేడు
భక్తి – బత్తి
కవిత – కైత
దిశ – దెస
కావ్యము – కబ్బము
దక్షిణము – దక్కిణము
భాష – బాస
పల్యంకిక – పల్లకి
విద్య – విద్దె
శిఖ – సిగ
ఉష్ట్రము – ఒంటె

PAPER – II : PART – B

1. సంధులు

1. సవర్ణదీర్ఘ సంధి

సూత్రం : అ, ఇ, ఉ, ఋలకు సవర్ణములైన అచ్చులు పరమగునపుడు వాని దీర్ఘములు ఏకాదేశమగును.

ఉదా : దేవాలయాలు = దేవ + ఆలయాలు
ఉపాహరము = ఉప + ఆహారము
క్రమాభివృద్ధి = క్రమ + అభివృద్ధి
సౌకర్యార్థము = సౌకర్య + అర్థము
విక్రయాదులు = విక్రయ + ఆదులు
రాజాదరణము = రాజ + ఆదరణము
సింగరాచార్య = సింగర + ఆచార్య
హటకాంబర = హటక + అంబర
తెలగనార్యుని = తెలగన + ఆర్యుని
రాజాజ్ఞ = రాజ + ఆజ్ఞ
పటాటోపము = పట + ఆటోపము
శస్త్రాదులు = శస్త్ర + ఆదులు
కార్యాలయము = కార్య + ఆలయము

2. గుణ సంధి

సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైనపుడు క్రమముగా ఏ, ఓ, ఆర్లు ఏకాదేశమగును.

ఉదా :
రమ్యోద్యానములు = రమ్య + ఉద్యానములు
రాజోద్యోగులు = రాజ + ఉద్యోగులు
సంవరణోపాఖ్యానము = సంవరణ + ఉపాఖ్యానము

3. వృద్ధి సంధి

సూత్రం : అకారమునకు ఏ – ఐలు పరమగునపుడు
‘ఐ’ కారమును, ‘ఓ ఔలు పరమగునపుడు ‘ఔ’
కారమును ఏకాదేశమగును.
‘ఐ – ఔ’ లను వృద్ధులు అని అందురు.
ఉదా : ఏకైక = ఏక + ఏక

4. యణాదేశ సంధి

సూత్రం : ఇ – ఉ – ఋ లకు అసమానమయిన అచ్చులు పరమగునప్పుడు క్రమంగా య – వ – ర లు ఆదేశమగును.
ఉదా : అత్యంత = అతి + అంత

5. అనునాసిక సంధి

సూత్రం : క – చ – ట – త – ప లకు న – మ లు పరమైతే క్రమంగా జ్ఞ – ఞ ణ న – మలు ఆదేశమగును.
ఉదా : వాఙ్మయము = వాక్ + మయము

6. లులనల సంధి

సూత్రం : లు- ల – న లు పరంబగునపుడు ఒకానొకచో ముగామంబునకు లోపంబును దత్పూర్వ స్వరంబునకు దీర్ఘంబును విభాషనగు.
ఉదా : వజ్రాలు = వజ్రము + లు

TS 10th Class Telugu Important Questions 10th Lesson గోలకొండ పట్టణము

2. సమాసాలు

సమాస పదము – విగ్రహవాక్యము – సమాసము పేరు

గోలకొండ పట్టణము – గోలకొండ అను పేరుగల పట్టణము – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
మజ్నూ బురుజు – మజ్నూ అను పేరు గల బురుజు – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
హైదరాబాద్ నగరము – హైదరాబాద్ అను పేరు గల నగరము – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
మచిలీపట్టణము – మచిలీ అను పేరుగల పట్టణము – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
బంజారా దర్వాజ – బంజారా అను పేరుగల దర్వాజ – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
మూడు కోటలు – మూడు సంఖ్య గల కోటలు – ద్విగు సమాసం
ఏడు మైళ్ళు రెండు – ఏడు సంఖ్యగల మైళ్ళు – ద్విగు సమాసం
రెండు వస్తువులు – రెండు సంఖ్యగల వస్తువులు – ద్విగు సమాసం
రెండు బారకాసులు – రెండైన బారకాసులు – ద్విగు సమాసం
నాలుగు కుర్చీలు – నాలుగైన కుర్చీలు – ద్విగు సమాసం
రెండు లక్షలు – రెండైన లక్షలు – ద్విగు సమాసం

పన్నెండు ద్వారములు – పన్నెండు సంఖ్య గల ద్వారములు – ద్విగు సమాసం
నలుమూలలు – నాలుగైన మూలలు – ద్విగు సమాసం
జనసమ్మర్దము – జనము చేత సమ్మర్థము – తృతీయా తత్పురుష సమాసం
వజ్రాల వ్యాపారము – వజ్రాలతో వ్యాపారము – తృతీయా తత్పురుష సమాసం
బంగారు నాణెము – బంగారంతో నాణెలు – తృతీయా తత్పురుష సమాసం
స్నాన మందిరము – స్నానము కొరకు మందిరము – చతుర్థీ తత్పురుష సమాసం
రాజభవనాలు – రాజుల కొఱకు భవనాలు – చతుర్థీ తత్పురుష సమాసం
భిక్షా గృహములు – భిక్ష కొఱకు గృహములు – చతుర్థీ తత్పురుష సమాసం
విహారభూమి – విహారము కొఱకు భూమి – చతుర్థీ తత్పురుష సమాసం
రూపురేఖలు – రూపును, రేఖయు – ద్వంద్వ సమాసం
క్రయ విక్రయాలు – క్రయమును, విక్రయమును – ద్వంద్వ సమాసం
అస్త్రశస్త్రములు – అస్త్రమును, శస్త్రమును – ద్వంద్వ సమాసం

సంపద్వైభవములు – సంపత్తును, వైభవమును – ద్వంద్వ సమాసం
కూరగాయలు – కూరయును, కాయయును – ద్వంద్వ సమాసం
రాకపోకలు – రాకయును, పోకయును – ద్వంద్వ సమాసం
అందచందములు – అందమును, చందమును – ద్వంద్వ సమాసం
ప్రజాసముదాయము – ప్రజల యొక్క సముదాయము – షష్ఠీ తత్పురుష సమాసం
పర్వత శిఖరము – పర్వతము యొక్క శిఖరము – షష్ఠీ తత్పురుష సమాసం
గోలకొండ ప్రాధాన్యము – గోలకొండ యొక్క ప్రాధాన్యము – షష్ఠీ తత్పురుష సమాసం
వెండిపూత – వెండితో పూత – షష్ఠీ తత్పురుష సమాసం
వణికుంగవులు – వర్తకులలో శ్రేష్ఠులు – షష్ఠీ తత్పురుష సమాసం
దుర్గతటాకము – దుర్గము నందలి తటాకము – సప్తమీ తత్పురుష సమాసం
విద్యాప్రియుడు – విద్యలయందు ప్రియుడు – సప్తమీ తత్పురుష సమాసం
ద్వార రక్షకులు – ద్వారమును రక్షించేవారు – ద్వితీయా తత్పురుష సమాసం
యుద్ధభీతి – యుద్ధము వలన భీతి – పంచమీ తత్పురుష సమాసం
సుందరాకారము – సుందరమైన ఆకారము – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

3. వాక్య పరిజ్ఞానం

అ) క్రింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యంగా మార్చండి.

1. నేను గుంటూరు వచ్చాను. శారదానికేతనంలో చేరాను.
జవాబు:
నేను గుంటూరు వచ్చి శారదానికేతనంలో చేరాను.

2. రవి బాగా చదివాడు. రవి పరీక్ష వ్రాశాడు.
జవాబు:
రవి బాగా చదివి పరీక్ష వ్రాసాడు.

TS 10th Class Telugu Important Questions 10th Lesson గోలకొండ పట్టణము

3. గోపాల్ బాగా చదువుతాడు. గోపాల్ తొమ్మిదింటికే నిద్రపోతాడు.
జవాబు:
గోపాల్ బాగా చదివి తొమ్మిదింటికే నిద్రపోతాడు.

4. గీత బాగా నృత్యం నేర్చుకొంది. గీత బాగా నృత్యం చేసింది.
జవాబు:
గీత బాగా నృత్యం నేర్చుకొని, చేసింది.

5. మంచి రచనలను వ్రాయండి. మంచి మెప్పు పొందండి.
జవాబు:
మంచి రచనలను వ్రాసి మెప్పు పొందండి.

ఆ) క్రింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగాను, కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగాను రాయండి.

1. దున్నేవానికి భూమినిచ్చే హక్కు తయారయ్యింది. (కర్తరి వాక్యం)
జవాబు:
దున్నేవానికి భూమినిచ్చే హక్కు తయారు చేయబడింది. (కర్మణి వాక్యం)

2. బూర్గులవారు మంచినిర్ణయాలు తీసుకున్నారు. (కర్తరి వాక్యం).
జవాబు:
బూర్గుల వారిచే మంచి నిర్ణయాలు తీసుకొనబడ్డాయి. (కర్మణి వాక్యం)

3. వారి న్యాయవాద పటిమ ఇతరులను అబ్బురపరచింది. (కర్తరి వాక్యం)
జవాబు:
వారి న్యాయవాద పటిమ ఇతరులచే అబ్బురపరచబడింది. (కర్మణి వాక్యం)

4. రేఖామాత్రంగా నా భావాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి. (కర్తరి వాక్యం)
జవాబు:
రేఖామాత్రంగా నా భావాలను ఇక్కడ పొందుపరిచాను. (కర్మణి వాక్యం)

5. పర్షియన్ ట్యూటర్గా ఆయన కొంతకాలం పని చేశారు. (కర్తరి వాక్యం)
జవాబు:
పర్షియన్ ట్యూటర్ ఆయనచే కొంతకాలం పని చేయబడింది. (కర్మణి వాక్యం)

ఇ) క్రింది ప్రత్యక్ష కథనాలను పరోక్ష కథనంలోకి మార్చి రాయండి.

ప్రశ్న 1.
‘నేను నేటి సినిమాలను చూడలేకపోతున్నాను’ అని అమ్మతో అన్నాను.
జవాబు:
తాను నేటి సినిమాలను చూడలేకపోతున్నానని అమ్మతో అన్నాడు.

ప్రశ్న 2.
నీకివ్వాల్సింది ఏమీ లేదు అని నాతో అతడన్నాడు.
జవాబు:
అతనికివ్వాల్సింది ఏమీలేదని నాతో అన్నాడు.

TS 10th Class Telugu Important Questions 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 3.
సుందరకాండ చదవమని నాకు ఉపాధ్యాయుడు చెప్పాడు.
జవాబు:
‘సుందరకాండ చదువుము’ అని నాకు ఉపాధ్యాయుడు చెప్పాడు.

ప్రశ్న 4.
వాళ్ళమ్మ చెప్పింది భానుప్రకాశ్ ఊరికెళ్ళాడని.
జవాబు:
వాళ్ళమ్మ చెప్పింది “భానుప్రకాశ్ ఊరికి వెళ్ళాడు” అని.

ప్రశ్న 5.
ప్రజ్ఞ పద్యాలు బాగాపాడిందని అందరను కుంటున్నారు.
జవాబు:
“ప్రజ్ఞ పద్యాలు బాగా పాడింది” అని అందరను కుంటున్నారు.

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

These TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష will help the students to improve their time and approach.

TS 10th Class Telugu 11th Lesson Important Questions భిక్ష

PAPER – I : PART – A

I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)

1. లఘు సమాధాన ప్రశ్నలు (3 మార్కులు)

అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘భిక్ష’ పాఠ్యభాగ రచయిత గురించి వివరించండి. (Mar. ’18)
(లేదా)
“భిక్ష” పాఠ్యభాగ కవి గురించి వ్రాయండి.
జవాబు:
‘భిక్ష’ పాఠ్యభాగ రచయిత మహాకవి శ్రీనాథుడు. తెలుగు సాహిత్యంలో కవిసార్వభౌముడిగా కీర్తి పొందాడు. తెలుగు సాహిత్యంలో శ్రీనాథ యుగం కూడా ఉంది. శ్రీనాథుడు 1380-1470 మధ్య జీవించాడు. అనగా 15వ శతాబ్ది కవి. రాజమహేంద్రవరంలో రెడ్డిరాజుల కొలువులో ఆస్థానకవి. మారయ, భీమాంబలు శ్రీనాథుని తల్లిదండ్రులు.

‘కవి సార్వభౌమ’ బిరుదాంకితుడు. పెదకోమటి వేమారెడ్డి కొలువులో విద్యాధికారి. ప్రౌఢ దేవరాయల ఆస్థానంలోని గౌడడిండిమ భట్టును పాండిత్యంలో ఓడించాడు. అతని కంచుఢక్కను పగులకొట్టించాడు.

ప్రశ్న 2.
వ్యాసుని కోపకారణం తదనంతర పరిణామాలను (APSCERT మాదిరి ప్రశ్న)
జవాబు:
వ్యాసమహర్షి శిష్యపరివారంతో కలసి భిక్షకోసం కాశీలో తిరిగారు. పరమేశ్వరుని మాయతో రెండు రోజులపాటు ఆయనకు ఎవరూ భిక్ష పెట్టలేదు. దాంతో వ్యాసుడు తీవ్రంగా కోపగించాడు. భిక్షపాత్రను పగులకొట్టాడు. కాశీనగర ప్రజలకు మూడుతరములదాకా ధనం, విద్య, మోక్షం లేకుండుగాక ! అని శపించబోయాడు.

అంతలో పార్వతీదేవి పవిత్రమైన కాశీనగరాన్ని శపించడం తప్పని, ఉన్నఊరు కన్నతల్లితో సమానమని వ్యాసుడిని మందలించింది. వ్యాసుడిని భోజనానికి రమ్మని పిలిచింది. కాని వ్యాసుడు తన పదివేల మంది శిష్యులు తినకుండా తానుతిననని ప్రకటించాడు. అది విని పార్వతీదేవి అందరికి భోజనం పెడతానని చెప్పింది. వ్యాసుడు శిష్య సమేతంగా గంగలో స్నానంచేశాడు. పార్వతీదేవి ఇంటికి వచ్చాడు. పార్వతీదేవి వారందరికి భోజనం పెట్టింది.

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

ప్రశ్న 3.
వ్రతము తప్పి భుజింపంగ వలనుగాదు. ఈ మాటలను ఎవరు ఎవరితో ఏ సందర్భంలో అన్నారు ? (APSCERT మాదిరి ప్రశ్న)
జవాబు:
‘వ్రతము తప్పి భుజింపంగ వలనుగాదు’ అని వ్యాసుడు సామాన్యస్త్రీవలె కన్పించిన అన్నపూర్ణా దేవితో అన్నాడు. వ్యాసుడు ఒకసారి శిష్యులతో కలిసి కాశీకి వచ్చాడు. అక్కడ అతనికి, అతని శిష్యులకు శివునిమాయవల్ల భిక్ష దొరకలేదు. దాంతో కోపగించిన వ్యాసుడు కాశీనగరంలోని ప్రజలను, కాశీనగరాన్ని శపించబోయాడు.

అప్పుడు పార్వతీదేవి సామాన్యస్త్రీవలె కన్పించి వ్యాసుడిని మందలించింది. ఆహారానికి రమ్మని ఆహ్వానించింది. అది విని వ్యాసుడు తనవెంట పదివేల మంది శిష్యులు ఉన్నారు. వారికి ఆహారం లేకుండా నేను తినను. ఇది నా వ్రతము అని చెప్పాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి అందరికి అన్నం పెట్టింది.

ప్రశ్న 4.
కాశీ పట్టణంలో స్త్రీలు అతిథులను ఎలా ఆదరించేవారు ? (APSCERT మాదిరి ప్రశ్న)
జవాబు:
మనదేశంలో అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాశీ. ఇక్కడ పరమశివుడు అన్నపూర్ణాదేవితో వెలసి యున్నాడు. ఇక్కడ నివసించే మానవులు పుణ్యాత్ములు. ముఖ్యంగా ఇక్కడి స్త్రీలు అన్నపూర్ణా దేవికి మిత్రురాండ్రు. వారు ప్రతిరోజు ఆవుపేడతో ఇంటిని చక్కగా అలుకుతారు. చక్కగా ముగ్గులు పెడతారు.

ఇంటికి వచ్చిన అతిథులను ముగ్గుల మధ్యలో నిలిపి భక్తి విశ్వాసాలు కనబరుస్తూ పండ్లతోను, పరమాన్నముతోను, పలురకాల పిండివంటలతోను గాజులు గలగల ధ్వనిచేస్తుండగా భిక్ష పెడతారు. అతిథి మర్యాదకు ప్రతిరూపంగా నిలుస్తారు.

ప్రశ్న 5.
కోపం తగదని అన్నపూర్ణాదేవి వ్యాసునికి ఏయే ఉదాహరణ పూర్వకంగా తెలిపింది. (APSCERT) మాదిరి ప్రశ్న
జవాబు:
వ్యాసుడు శిష్యపరివారంతో కలిసి ఒకసారి కాశీ నగరానికి వచ్చాడు. అతనికి మూడు రోజులపాటు భిక్ష దొరకలేదు. వ్యాసుడు కాశీనగరాన్ని శపించ బోయాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి సాధారణ స్త్రీవలె కన్పించి, వ్యాసుడిని మందలించింది.

“ఓ మహర్షీ ! నీవు ఇప్పుడు గొంతుదాకా తినడానికి భిక్షాన్నము దొరకలేదని చిందులు వేస్తున్నావు. ఇది మంచిపని కాదు. నీవు నిజంగా శాంత స్వభావం కలవాడవు కాదు. ఎందుకంటే, ఎంతో మంది మునులు పిడికెడు వరిగింజలతో కాలం వెళ్ళదీస్తున్నారు. మరికొందరు శాకాహారంతో, దుంపలతో సరిపెట్టుకుంటున్నారు. కొందరు వరిమళ్ళలో రాలిన ధాన్యం కంకులు ఏరుకొని దానితో బతుకుతున్నారు. మరికొందరు మునులు రోళ్ళ దగ్గర జారిపడిన బియ్యం ఏరుకొని బతుకుతున్నారు. వారంతా నీ కంటె తెలివి తక్కువ వారు కాదు కదా ! ఆలోచించు.

అదీగాక ఉన్నఊరు, కన్నతల్లి వంటిది. కాశీ నగరం శివునికి భార్య. “నీవంటివాడు అటువంటి కాశీ నగరాన్ని భిక్ష దొరకలేదని కోపించడం తగదు.” ఈ ఉదాహరణలతో అన్నపూర్ణాదేవి వ్యాసుడిని
మందలించింది.

ప్రశ్న 6.
“ఇవ్వీటిమీద నాగ్రహముదగునె?” అనే మాటలు ఎవరు ఎవరితో ఏ సందర్భంలో అన్నారు ? (A.P Mar.17)
జవాబు:
పెద్ద ముత్తైదువ రూపంలో ఉన్న పార్వతి భిక్ష దొరకనందున కోపంతో కాశీ నగరాన్ని శపించబోయిన వ్యాసునితో అనిన మాటలు ఇవి. ఓ సంయమివరా! “ఉన్న ఊరు, కన్నతల్లితో సమానమైనది అనే నీతిని నీవు వినలేదా ? అంతకంటే, విశేషించి శివుని అర్థాంగ లక్ష్మి అయిన ఈ కాశీ నగరం మీద కోపించుట తగునా ?” అని పార్వతి వ్యాసుని మందలించినది.

ప్రశ్న 7.
అతిథులు అంటే ఎవరు ? అతిథి మర్యాద అంటే ఏమిటి?
జవాబు:
తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు చూడకుండా ఇంటికి వచ్చేవారిని అతిథులు అంటారు. ఆ విధంగా వచ్చిన వారిని గౌరవించి, ఆదరించి కాళ్ళు కడుగుకోవడానికి నీళ్లు ఇచ్చి, కుశల ప్రశ్నలు అడుగుతూ మంచినీళ్లు ఇచ్చి మర్యాదలు చేయాలి. మనం భోజనం చేస్తున్న సమయంలో ఎవరైనా వస్తే తప్పకుండా వారికి కూడా భోజనం పెట్టాలి. వారిని తగిన రీతిగా ఆదరించి, గౌరవ మర్యాదలతో చూడాలి.

ప్రశ్న 8.
‘భిక్ష’ పాఠ్యభాగ నేపథ్యాన్ని రాయండి.
జవాబు:
వేదవిభజన చేసి, పంచమవేదంగా పేరున్న మహాభారతాన్ని రచించి, అష్టాదశ (18) పురాణాలను రచించిన బ్రహ్మజ్ఞాని వేదవ్యాసుడు. పరమ పవిత్రము, పరమేశ్వరునికి ప్రీతిపాత్రం అయిన కాశీలో వేదవ్యాసుడు తన పదివేలమంది శిష్యులతో కొంతకాలం నివసించాడు. బ్రాహ్మీముహూర్తంలో నిద్రలేచి, ప్రాతర్మాధ్యాహ్నిక విధులను పూర్తిగావించి శిష్యులతోకూడా కాశీనగరంలో భిక్షాటనం చేసేవాడు.

శిష్యులు, తానూ వేర్వేరుగా తెచ్చిన భిక్షలో సగం అతిథి అభ్యాగతులకు సమర్పించి, మిగిలినది భుజించేవారు. ఒకరోజున కాశీ విశ్వనాథుడికి వ్యాసుణ్ణి పరీక్షించాలన్న సంకల్పం కలిగింది. ఆ సందర్భంగా జరిగిన సంఘటనే ఈ పాఠ్యాంశం.

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

ప్రశ్న 9.
శ్రీనాథుని రచనా శైలిని, సాహిత్య సేవను వివరించండి.
జవాబు:
శ్రీనాథుడు చిన్నతనం నుండే కావ్యరచన ప్రారంభించాడు. మరుత్తరాట్చరిత్ర, కాశీఖండం, శృంగారనైషధం మొదలైనవి రచించాడు.

చమత్కారానికీ, లోకానుశీలనకు, రసజ్ఞతకు, ఆయన జీవిత విధానానికీ అద్దంపట్టే చాటువులు చాలా ఉన్నాయి. ఆయన కవిత్వం ఉద్ధండలీల, ఉభయ వాక్రౌఢి, రసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి వంటి లక్షణాలతో ఉంటుంది.
సీస పద్య రచనలో ఆయనకు ఆయనే సాటి. వృద్ధాప్యంలో కష్టాలనుభవించాడు.

ప్రశ్న 10.
తన కోపమే తన శత్రువు. తన శాంతమే తనకు రక్ష. – దీన్ని భిక్ష పాఠం ఆధారంగా వివరించండి.
జవాబు:
మానవునికి అంతర్గత శత్రువు కోపం. ఇది సర్వఅనర్థాలకు మూలం. కోపం వల్ల విచక్షణాజ్ఞానం నశిస్తుంది. ఆలోచనాశక్తి తగ్గుతుంది. అసూయా ద్వేషాలు పెరుగుతాయి. కోపం చదువుకు దూరం చేస్తుంది. బంధువులు, క్రమంగా దూరం అవుతారు. కుటుంబంలో వైషమ్యాలు పెరుగుతాయి. కోపం వల్ల ఎన్నో రోగాలు కూడా వస్తాయి. జరుగవలసిన పనులు కూడా ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది. ఇరుగుపొరుగు వారితో తగాదాలు వస్తాయి.

శాంతం మానవునికి రక్ష. అది మానవీయ విలువలను పెంచుతుంది. మనశ్శాంతి దొరుకుతుంది. శాంతియుత జీవనం ద్వారా మైత్రి పెరుగుతుంది. బాంధవ్యాలు వృద్ధిపొందుతాయి. సుఖమయజీవనం కలుగుతుంది. ప్రపంచ దేశాల మధ్య యుద్ధవాతావరణం నశిస్తుంది. అందువల్ల మానవులందరు శాంతిని పొందాలి. కోపాన్ని తొలగించుకోవాలి.

ప్రశ్న 11.
ఆకలిని తట్టుకోలేని వ్యాసునికి పార్వతి చేసిన హితబోధపై మీ అభిప్రాయాన్ని వివరించండి.
జవాబు:
మానవునికి అంతర్గత శత్రువు కోపం. ఈ కోపం అన్ని అనర్థాలకు మూలం. మహర్షి వ్యాసుడు కూడా ఈ కోపానికి బానిస అయ్యాడు. తన విచక్షణను కోల్పోయాడు. అట్టి వ్యాసుడికి పార్వతీదేవి హితోపదేశం చేసింది.

పార్వతీదేవి చేసిన హితబోధ వ్యాసునిలో గొప్ప పరివర్తనను తెచ్చింది. వాస్తవాన్ని గ్రహించాడు. కోపం వలన కలిగే అనర్థాలను వ్యాసుడు గ్రహించాడని తెలుస్తుంది.

కోపంలో ఉన్న వ్యక్తిని పెద్దమనసుగల మహ నీయులు శాంతపరచాలి. అప్పుడే ఆ వ్యక్తిలో వివేకం కలుగుతుంది. లోకం శాంతి మార్గంలో నడుస్తుంది.

ప్రశ్న 12.
‘రేపాడి మేలుకని ఏ నేపాపాత్ముని ముఖంబు నీక్షించితినో? అని వ్యాసుడు అనుకోవడంలో ? (June’18)
జవాబు:
వ్యాసుడు శిష్య పరివారంతో కలిసి కాశీనగరంలో బ్రాహ్మణ వీధుల్లో భిక్షాటనకు బయలుదేరాడు. వ్యాసునికి ఏ ఇల్లాలు భిక్ష వేయలేదు. వ్యాసుడు తనకు భిక్ష లభించక పోవడంతో నిరాశచెంది పలికిన పలుకులు ఇవి.

“రేపాడి మేలుకని యే నేపాపాత్ముని ముఖంబు నీక్షించితినో” అని వ్యాసుడు అనడంలో ఆంతర్యం – దుర్మార్గుల మొహం చూస్తే దుష్పరిణామాలు కలుగుతాయన్నది విశ్వాసం. అందుకే ఉదయం లేచినపుడు గానీ, పాడ్యమి చంద్రోదయాన్ని గమనించినప్పుడు గానీ ఇష్టమైన వాళ్ళముఖం చూడడం, పనిమీద వెళ్తున్నప్పుడు కులస్త్రీలు ఎదురు రావడం అనే సంప్రదాయాలు ఏర్పడ్డాయి.

2. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు (6 మార్కులు)

ఆ) కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘భిక్ష’ పాఠ్యభాగం ఆధారంగా అన్నపూర్ణాదేవి, వ్యాస మహర్షి, కాశీనగరంలోని సామాన్య స్త్రీల స్వభావాన్ని వివరించండి. (APSCERT మాదిరి ప్రశ్నాపత్రం)
జవాబు:
‘భిక్ష’ అనే పాఠ్యభాగంలో ఎన్నో ముఖ్య పాత్రలు ఉన్నాయి. వాటిలో అన్నపూర్ణాదేవి, వ్యాసుడు, కాశీ నగరంలోని సామాన్య స్త్రీల పాత్రలు అద్భుతంగా ఉంటాయి.

1. అన్నపూర్ణాదేవి : అన్నపూర్ణాదేవి పరమేశ్వరుని అర్థాంగి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెడుతుంది. కాశీలో ఆకలి బాధతో ఎవరూ ఉండరు. కేవలం భిక్ష దొరకనంత మాత్రాన ఇంత బాధపడిపోతావా ? ఇది మంచిదా? అని బిడ్డను తల్లి మందలించినట్లు వ్యాసుని మందలించింది. పిడికెడు బియ్యం వండుకొని తినే వారున్నారు. కేవలం కాయలు తినే వారున్నారు. ఇంకా రకరకాల వారున్నారు కదా ! వారంతా నీకంటే తెలివితక్కువ వారా ! అని ప్రశ్నించింది. ఒక బిడ్డకు తల్లి చెప్పే నీతులు, మందలింపులు, పోలికలు, ప్రశ్నలు సంధిస్తూ పార్వతీదేవి ఒక పెద్ద ముత్తైదువగా కనిపిస్తుంది. పరిపూర్ణ మాతృత్వం మూర్తీభవించినట్లుగా అన్నపూర్ణాదేవి స్వభావం కనిపిస్తుంది.

2. వ్యాస మహర్షి : ప్రాచీన సంస్కృత సాహిత్యంలో వ్యాస మహర్షికి సమున్నతమైన స్థానం ఉంది. ఒకే ఆకారంగా ఉన్న వేదవాఙ్మయాన్ని నాల్గు విధాలుగా విభజించాడు. లోకానికి జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆది గురువు అయ్యాడు. వేద విభజన చేశాడు. 18 పురాణాలు రచించాడు. 10 వేల మంది శిష్యులకు విద్య నేర్పేవాడు.

ఋషి ధర్మంగా భిక్షాటన చేసినవాడు. రెండు రోజులు భిక్ష దొరకలేదు. తన శిష్యుల ఆకలి చూడలేక కాశీని శపించబోయాడు. అంటే కాశీని కూడా శపించగల మహా తప స్సంపన్నుడు. అన్నపూర్ణాదేవి స్వయంగా పిలిచి భిక్షను పెట్టింది. అంటే అన్నపూర్ణా దేవిని కూడా ప్రత్యక్షం చేసుకోగల పుణ్యాత్ముడు. ఆ జగన్మాత చేతి వంటను రుచి చూసిన మహాభాగ్యశాలి. కాని తన కోపం కారణంగా ఆ వైభవాలను కోల్పోయాడు. అల్పసంతోషి, తక్షణ కోపం కలవాడు.

3. కాశీలోని సామాన్య స్త్రీలు : చక్కగా అలికి ముగ్గులు పెట్టి, ఇల్లు కళకళలాడుతూ ఉంచే స్వభావం కలవారు. అతిథులను సాక్షాత్తు దైవంగా భావించి పూజిస్తారు. బంగారు కంచంలో పిండి వంటలతో అన్నం పెడతారు. భిక్షుకులకు లేదు అనే మాట వారినోట రాదు. వారి హృదయాలలో నిరంతరం అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. కాశీలోని స్త్రీలు అన్నపూర్ణాదేవికి చెలికత్తెలు. అంతటి పుణ్యస్త్రీలు ఎక్కడా కనిపించరు. వారికి వారేసాటి.

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

ప్రశ్న 2.
అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమవడానికి గల కారణాలు వివరించండి. (APSCERT మాదిరి ప్రశ్న)
జవాబు:
వ్యాసమహర్షి తన పదివేల మంది శిష్యులతో కలిసి పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీనగరానికి వెళ్ళాడు. శివుని మాయవల్ల వ్యాసునికి రెండు రోజులపాటు భిక్ష దొరకలేదు. కొందరు మళ్ళీ రమ్మని చెప్పారు. మరికొంతమంది ‘అన్నం వండుతున్నానని’ చెప్పారు. ఒక స్త్రీ దేవకార్యం జరుగుతుందని చెప్పింది.

వ్యాసునికి, అతని శిష్యులకు ఆహారం దొరకలేదని దాంతో ఆకలి బాధతో అలమటి స్తున్నారు. వ్యాసునికి తీవ్రమైన కోపం వచ్చింది. కాశీనగరాన్ని, కాశీనగర ప్రజలను మూడుతరముల వరకు ధనము, మోక్షము, విద్య లేకుండునట్లుగా శపించదలచుకున్నాడు. ఆ సమయంలో అన్నపూర్ణాదేవి ఒక సామాన్య స్త్రీ వేషం ధరించింది. వ్యాసుని ఎదుట ప్రత్యక్షం అయింది. అతని శాపమివ్వదలచుచున్న వ్యాసుడిని అడ్డగించింది. నీతినిబోధించింది.

ప్రశ్న3.
‘కోపం అన్ని అనర్థాలకు కారణం’ అని ఎలా చెప్పగలవు ? (APSCERT మాదిరి ప్రశ్న)
(లేదా)
కోపం అన్ని విధాలుగా అనర్థదాయకమని భిక్ష పాఠ్యభాగం ఆధారంగా సమర్థించండి.
జవాబు:
మానవులకు జయింపరాని శత్రువు కోపం. నాకు కోపం వస్తే మనిషిని కాను అని కొందరు అంటారు. ఇది నిజమే. కోపం వస్తే తనను తాను మరచి మనిషి రాక్షసుడవుతాడు. ఆ కోపంతో తాను ఏమి చేస్తున్నాడో తెలిసికొనడు. కోపం వల్ల జీవితంలో ఎన్నో అనర్థాలు కలుగుతాయి. బంధువులు, మిత్రులు క్రమంగా దూరమవుతారు. కుటుంబంలో తగాదాలు ఏర్పడతాయి. మానవీయ సంబంధాలు దెబ్బ తింటాయి. విచక్షణను కోల్పోయి పశువుగా మారతారు.

వ్యాసుడు గొప్ప మహర్షి, వేదాలను విభజించాడు. మహాభారతాన్ని, పురాణాలను రచించాడు. అయినా కోపానికి దూరం కాలేకపోయాడు. అసహనంతో కాశీ నగరాన్ని శపించ బోయాడు. అట్లే దుర్యోధనుడికి పాండవుల మీద, భీమునిమీద కోపం ఎక్కువ. వాళ్ళతో వైరం పెంచుకున్నాడు. చివరకు సర్వనాశనమై పోయాడు. అందువల్ల కోపాన్ని విడిచిపెట్టాలి. సహనాన్ని అలవరచుకోవాలి.

ప్రశ్న4.
అన్నపూర్ణాదేవి పాత్ర స్వభావం వివరించండి. (APSCERT మాదిరి ప్రశ్న)
జవాబు:
అన్నపూర్ణాదేవి కాశీవిశ్వేశ్వరుని ఇల్లాలు. కాశీ నగరంలో అన్నపూర్ణాదేవి అందరికీ ఇష్టదైవం. ఒకసారి అన్నపూర్ణాదేవి, పరమేశ్వరులు కాశీ నగరానికి వచ్చిన వ్యాసుడిని పరీక్షించదలచు కున్నారు.

అన్నపూర్ణాదేవి కాశీ నగరంలో ఉన్న వారందరికి అన్నం పెడుతుంది. కాశీనగరంలోని స్త్రీలందరు అన్నపూర్ణాదేవికి స్నేహితురాండ్రు. ఈమె వేదపురాణ శాస్త్ర మార్గాన్ని చక్కగా పాటించే ముత్తయిదువు. ఆమె కాశీనగర బంగారు పీఠాన్ని అధిష్టించిన ఆదిశక్తి.

అన్నపూర్ణాదేవి వ్యాసుడు కాశీనగరాన్ని శపించ కుండా అడ్డుతగిలింది. ఈమె ఒక సామాన్య బ్రాహ్మణ స్త్రీవలె నిలబడి వ్యాసుడిని మందలించింది. అతనికి, అతని శిష్యులకు భోజనం పెట్టింది. అన్నపూర్ణాదేవి మాటల్లో నైపుణ్యం ఉంది. గొంతు దాకా తిండిలేదని గంతులు వేస్తున్నావు. మహర్షులు పిడికెడు నివ్వెరి ధాన్యంతో, కాయగూరలతో తృప్తి పడుతున్నారు గదా ! అని చక్కగా వ్యాసుడిని మందలించింది. ఉన్న ఊరు తల్లి వంటిదని, కాశీ నగరం శివునికి ఇల్లాలని గుర్తుచేసింది.

ప్రశ్న5.
ఎంతటి గొప్పవారినైనా ఆవేశం ఆలోచనలను నశింప జేస్తుందని ‘భిక్ష’ పాఠం ఆధారంగా వివరించండి. (APSCERT మాదిరి ప్రశ్నాపత్రం)
జవాబు:
కోపం వస్తే, ఆవేశం వస్తుంది. ఆవేశంలో ఏది మంచిదో, ఏది చెడ్డదో గ్రహించే వివేచనాశక్తి మనిషికి నశిస్తుంది. దానితో అతడు తప్పుడు పనులకు సిద్ధం అవుతాడు. ఆవేశంతో కట్టుకున్న భార్యను, కన్న పిల్లల్నీ కూడా చంపడానికి సిద్ధం అవుతాడు.

కోపం యొక్క ఆవేశంలో అష్టాదశ పురాణాలు రచించిన వ్యాసమహర్షి అంతటివాడు, కన్నతల్లి వంటి కాశీనగరాన్నే శపించబోయాడు. వ్యాసమహర్షి పదివేలమంది శిష్యులకు గురువు. నిత్యం కాశీనగరంలో శిష్యులతో భిక్షకు వెళ్ళి ఆ భిక్షాన్నం తిని జీవించేవాడు. వ్యాసుడిని పరీక్షించాలని శివుడు భావించాడు. అన్నపూర్ణాదేవితో చెప్పి ఎవరూ వ్యాసునికి భిక్ష పెట్టకుండా చేశాడు.

ఒకరోజు వ్యాసుడికి, శిష్యులకూ ఎవరూ భిక్ష పెట్టలేదు. ఆరోజు కాకపోయినా, మరునాడు తప్పక భిక్ష దొరుకుతుందని వారు అనుకున్నారు. మరునాడు కూడా వ్యాసునికి ఎవరూ భిక్ష పెట్టలేదు.
దానితో వ్యాసుడు కోపంవల్ల వచ్చిన ఆవేశంతో, ఉద్రేకంతో తాను నివసిస్తున్న కాశీనగరాన్నే శపించ బోయాడు. ఉన్న ఊరు కన్నతల్లితో సమానం అంటారు. భిక్ష దొరకలేదనే ఆవేశంతో, వ్యాసుడు కాశీ నగరవాసులకు మూడు తరాల దాకా విద్య, ధనము, మోక్షము లేకుండా పోవుగాక అని శపించబోయాడు.

దీనిని బట్టి ఆవేశం, ఆలోచనలను నశింప జేస్తుంది అని మనకు తెలుస్తోంది.

ప్రశ్న6.
“ఆకలి దప్పికలు, కోపానికి కారణాలు” అని ఎట్లా సమర్థిస్తారు?
జవాబు:
ఆకలి, దాహం ఎక్కువయితే, తినడానికి తిండి, త్రాగడానికి నీరు దొరకకపోతే, కోపం వస్తుంది. ఆకలి దప్పికలు, కోపాన్ని తెప్పిస్తాయన్నమాట నిజం.

వ్యాసమహర్షి అష్టాదశ పురాణాలు రచించాడు. భారత భాగవతాలు రచించాడు. బ్రహ్మసూత్రాలు రచించాడు. అటువంటి విజ్ఞానధనుడు, రెండు రోజులు తనకు కాశీలో ఎవరూ భిక్ష వేయలేదన్న కారణంతో, భిక్షాపాత్రను పగులకొట్టి, కాశీవాసులకు మూడుతరాల వరకూ, ధనము, విద్య, మోక్షము లేకుండుగాక అని శపించడానికి సిద్ధమయ్యాడు. ఇందుకు ఆకలిదప్పికలే కారణం కదా !

శాంతమే భూషణమని తెలిసిన వ్యాసమహర్షి కోపానికి కారణం ఆకలిదప్పికలే కదా! కాబట్టి ఆకలి దప్పికలు కోపానికి కారణాలు అన్న మాట సత్యమైనది.

ప్రశ్న7.
కాశీ అన్నపూర్ణా దేవి వేదవ్యాసుణ్ణి పరీక్షించడానికి కారణాలు ఏమై ఉంటాయి ? దీని ద్వారా మీరు గ్రహించిన విషయాలేవి ?
జవాబు:
ఆకలిని తట్టుకోలేక వ్యాసమహర్షి కాశీ నగరాన్ని శపించబోయాడు. అప్పుడు పార్వతి మహర్షిని ఇలా మందలించింది. “గొంతుదాకా తినడానికి మాధు కరభిక్ష దొరకలేదని, శివునికి భార్యయైన పవిత్ర కాశీనగరాన్ని శపించాలనుకోడం బాగోలేదు. నీవు కాశీలో ఉన్నావు. ఉన్న ఊరు, కన్నతల్లితో సమానం అంటారు. అలాంటి కాశీని శపించడం ధర్మం కాదు.

అదిగాక ఎంతోమంది మహర్షులు శాకాహారంతో నెవ్వరి ధాన్యం దంచి తిని జీవిస్తున్నారు. కదా !” అని పార్వతి మందలించింది.

పార్వతీదేవి చేసిన మందలింపు యుక్తి యుక్తంగా ఉంది. నిజానికి వ్యాసుని వంటి మహర్షులు ఒకటి రెండు రోజులు తిండిలేదని పవిత్రమైన కాశీనగరాన్ని శపించడం తగదు. పార్వతీదేవి చెప్పిన మాటలు ధర్మబద్ధంగా, న్యాయంగా నాకు తోచాయి.

PAPER – II : PART – A

I. అవగాహన – ప్రతిస్పందన

అపరిచితపద్యాలు

1. ఈ క్రింది అపరిచిత పద్యమును చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి. (5 మార్కులు )

“కమలములు నీట బాసినఁ
గమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు దప్పినఁ
దమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ !”

ప్రశ్నలు – జవాబులు

1. కమలములు ఎక్కడుంటాయి ?
జవాబు:
కమలములు నీటిలో ఉంటాయి.

2. కమలాప్తుడనగా ఎవరు ?
జవాబు:
కమలాప్తుడు అంటే ‘సూర్యుడు’.

3. తమతమ నెలవులు తప్పితే ఎలాంటి పరిస్థితులెదురవుతాయి ?
జవాబు:
తమతమ నెలవులు తప్పితే, తమ మిత్రులే శత్రువులు అవుతారు.

4. ఈ పద్యము ఏ శతకములోనిది ?
జవాబు:
ఈ పద్యము సుమతీ శతకములోది.

5. “తథ్యము” అనగా ?
జవాబు:
తప్పదు అని అర్ధము.

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

2. ఈ క్రింది అపరిచిత పద్యమును చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.

“అంతరంగమందు నపరాధములు సేసి
మంచివానివలెను మనుజుఁడుండు
నితరులెరుగ కున్న నీశ్వరుఁడెఱుఁగడా ?
విశ్వదాభిరామ వినురవేమ !”

ప్రశ్నలు – జవాబులు

1. ఎవరు అపరాధములు చేస్తారు ?
జవాబు:
మనుజులు అపరాధములు చేస్తారు.

2. మంచివానిలాగ ప్రవర్తించేది ఎవరు ?
జవాబు:
మంచివానిలాగా ప్రవర్తించేది మనుజుడు.

3. మనిషి అపరాధములను ఎవరు ఎరిగి ఉంటారు ?
జవాబు:
మనిషి అపరాధములను, ఈశ్వరుడు ఎరిగి ఉంటాడు.

4. పై పద్యం ద్వారా అలవరచుకోవలసిన గుణాలేమిటి ?
జవాబు:
మనిషి తాను చేసిన తప్పులను తన మనస్సు ద్వారా తెలుసుకొని తన్ను సరిదిద్దుకోవాలి.

5. ఈ పద్యంలోని మకుటమేమి ?
జవాబు:
ఈ పద్యంలోని మకుటం విశ్వదాభిరామ వినురవేమ.

3. ఈ క్రింది అపరిచిత పద్యమును చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.

“కలహపడు నింట నిలువదు.
కలుముల జవరాలు కానఁగలకాలంబే
కలహము లేక సమ్మతి
మెలగంగా నేర్చునేని మేలు కుమారీ !”

ప్రశ్నలు

1. కలహపడే ఇంట ఏమి నిలవదు ?
జవాబు:
కలహపడే ఇంట కలుముల జవరాలు (లక్ష్మి) నిలువదు.

2. కలుముల జవరాలు అనగా ఎవరు ?
జవాబు:
కలుముల జవరాలు అనగా లక్ష్మీదేవి.

3. ఈ పద్యం మనకు తెలియజేసే మేలు ఏమిటి ?
జవాబు:
కలకాలము ఎటువంటి కలహాలూ లేకుండా కలసి మెలసి ఉండడం నేర్చుకోవడం ‘మేలు’ అని ఈ పద్యం తెలుపుతుంది.

4. ఈ పద్యానికి శీర్షికను పెట్టండి.
జవాబు:
‘పోరు నష్టం – పొందు లాభం’ అని ఈ పద్యానికి శీర్షికగా ఉంచవచ్చు.

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

5. ఈ పద్యం దేనిలోనిది ?
జవాబు:
ఈ పద్యం కుమారీ శతకంలోనిది.

4. ఈ క్రింది పద్యం చదివి, ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.

“కనకపు సింహాసనమున
శునకము గూర్చండబెట్టి శుభలగ్నమునం
దొనరగ పట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ !”

ప్రశ్నలు – జవాబులు

1. శునకాన్ని దేనిపై కూర్చుండపెట్టారు ?
జవాబు:
బంగారు సింహాసనం మీద శునకాన్ని కూర్చుండ పెట్టారు.

2. సింహాసనంపై కూర్చున్నది ఎవరు ?
జవాబు:
సింహాసనంపై కూర్చున్నది శునకం.

3. శునకానికి పట్టము కట్టిన వేళ ఏది ?
జవాబు:
శునకానికి పట్టము కట్టిన వేళ శుభలగ్నము.

4. శునకానికి పట్టము కడితే ఏమి జరుగుతుంది ?
జవాబు:
శునకానికి పట్టము కడితే వెనుకటి గుణాన్ని మానదు.

5. ఈ పద్యం ఏ శతకంలోనిది ?
జవాబు:
ఈ పద్యం సుమతీ శతకంలోనిది.

5. క్రింది పద్యాన్ని చదివి క్రింది ప్రశ్నలకు సరైన సమాధానాలు వ్రాయండి.

చేతులారంగ శివుని పూజింపడేని
నోరునవ్వగ హరికీర్తి నుడువడేని
దయయు సత్యము లోనుగా దలపడేని
కలుగు నేటికి తల్లుల కడుపు చేటు

ప్రశ్నలు – జవాబులు

1. “కడుపుచేటు” అనే మాటకు అర్థమేమి ?
జవాబు:
‘కడుపుచేటు’ అనే మాటకు పుట్టుక దండగని అర్థం.

2. కవి శివపూజ ఎలా చేయమంటున్నాడు ?
జవాబు:
కవి శివపూజ చేతులతో తృప్తి కలిగేటట్లు చేయ మంటున్నాడు.

3. దయను, సత్యాన్ని ఎట్లా తలచాలి ?
జవాబు:
దయను, సత్యాన్ని మనసులో తలచాలి.

4. హరికీర్తిని ఎలా పలకాలి ?
జవాబు:
హరికీర్తిని నోరారా పలకాలి.

5. ఈ పద్యానికి శీర్షిక ఏమిటి ?
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘హరికీర్తన’.

6. కవిత చదివి తప్పొప్పులను గుర్తించండి.

ఓ పిడుగా !
నాకు తెలుసు,
నీశక్తి విద్యుచ్ఛక్తి కంటె గొప్పదని
కాని ఏం లాభం ?
నీ ఆవేశమే నిన్ను నేలకు చేరుస్తుంది
పాతాళానికి దిగజారుస్తుంది.
నీ కంటె
నా గదిలో జీరోబల్బు నయం
రాత్రంతా
చీకటితో పోరాడుతుంది.

ప్రశ్నలు – జవాబులు

1) విద్యుచ్ఛక్తిని మించిన శక్తి లేనిది పిడుగు. ( )
జవాబు:

2) ఆవేశం వల్ల పిడుగు నేలకు చేరుతుంది. ( )
జవాబు:

3) కవితననుసరించి పిడుగు చాలా గొప్పది. ( )
జవాబు:

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

4) చీకటితో పోరాడేది పిడుగు.
జవాబు:

5) పిడుగుకంటె జీరో బల్బే నయం.
జవాబు:

7. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.

ఉడుముండదె నూటేండ్లును
బడియుండదె పేర్మిఁబాము పదినూటేండ్లున్
మడువున కొక్కెర యుండదె
కడ నిల పురుషార్థపరుడు గావలె సుమతీ !

ప్రశ్నలు – జవాబులు

1. నూతేండ్లు జీవించే జంతువు ఏది ?
జవాబు:
నూటేండ్లు జీవించే జంతువు ‘ఉడుము’

2. పాము ఎన్నాళ్ళు జీవిస్తుంది ?
జవాబు:
పాము పదినూర్లు అనగా వేయి సంవత్సరాలు జీవిస్తుంది.

3. ‘కొక్కెర’ అంటే ఏమిటి?
జవాబు:
కొక్కెర అంటే కొంగ.

4. ‘వాడు కావాలి’ అనే అర్థం ఇచ్చే పాదం ఏది ?
జవాబు:
‘భూమండలంలో ధర్మార్థమోక్షాలను సాధించే 4వ పాదం.

5. కొక్కెర ఎక్కడ ఉంటుంది ?
జవాబు:
కొక్కెర మడుగులో ఉంటుంది.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

సృజనాత్మక ప్రశ్నలు (5 మార్కులు)

ప్రశ్న 1.
శ్రీనాథుని కవితా ప్రశస్తిని తెలుపుతూ మిత్రునికి లేఖ రాయుము.
జవాబు:

నిజామాబాద్,
12.01.2018.

ప్రియ మిత్రుడు అనంతు,

నీ మిత్రుడు వ్రాయునది. నేను బాగా చదువు తున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా రాయునది. మన ప్రాచీన తెలుగు సాహిత్యంలో శ్రీనాథునికి సమున్నతమైన స్థానం ఉంది. ఈయన కవిసార్వ భౌముడిగా కీర్తి పొందాడు. వీరు ఎన్నో రచనలు చేశారు. శ్రీనాథుని వర్ణనాత్మక ప్రతిభ విశిష్టమైనది. శ్రీనాథుని సీస పద్యాలకు విశిష్టస్థానం ఉంది. అలంకార ప్రయోగం కూడా అద్భుతంగా ఉంటుంది. శ్రీనాథుని కవిత్వం, శైలి, భావి కవులకు మార్గదర్శకము అయ్యింది. పెద్దలందరికి నమస్కారాలు తెలుపగలరు.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
XXXXXX.

చిరునామా :
ఎన్. అనంత్,
10వ తరగతి,
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ పాఠశాల,
శాంతి నగర్,
కరీంనగర్.

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

ప్రశ్న 2.
కోపంవల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ వ్యాసం రాయండి. (APSCERT మాదిరి ప్రశ్న)
జవాబు:
మానవులు వదిలించుకోవల్సిన దుర్గుణాలలో కోపం ప్రధానమైనది. కోపంవల్ల మోహం కలుగుతుంది. బుద్ధి నశిస్తుంది. మానవుని పతనాన్ని శాసిస్తుంది. కోపం వల్ల ఎన్నో అనర్థాలు కలవు. విచక్షణా శక్తిని కోల్పోతాడు. హింసాప్రవృత్తిని అలవరచుకుంటాడు. ఉన్మాదిగా మారతాడు.

బంధువులు, మిత్రులు దూరమౌతారు, ఆప్తులు ఆదరించరు. ఒంటరితనాన్ని అనుభవిస్తారు. కుటంబగౌరవం తగ్గుతుంది. తన కుటుంబంలో అంతర్గత కలహాలు పెరుగుతాయి. దుర్యోధనుడు, విశ్వామిత్రుడు, దుర్వాసుడి వంటివారు కోపానికి బానిసలుగా మారారు. ఎన్నో అనర్థాలను పొందారు.

మన శతకాలు కోపం మంచిదిగాదని, దాన్ని విడిచిపెట్టమని బోధిస్తున్నాయి. అందువల్ల మన మంతా కోపాన్ని విడనాడాలి. శాంతిని పొందాలి. జీవితాన్ని ఆదర్శంగా మలచుకోవాలి.

ప్రశ్న 3.
కోపంవల్ల గౌరవం తగ్గుతుందనే విషయాన్ని వివరిస్తూ ఒక కరపత్రం రాయండి. (APSCERT మాదిరి ప్రశ్న)
జవాబు:

శాంతిని పొందు ! క్రోధం వదులుకో ! ఆదర్శంగా జీవించు !

మాన్యులారా ! వదాన్యులారా ! సోదర సోదరీ | మణులారా ! కోపం మనందరి శత్రువు. దానిని మనమంతా దూరం చేసుకోవాలి. కోపంవల్ల ఎన్నో అనర్థాలు కలుగుతాయి. అందరిని దూరం చేస్తుంది. సకలదుర్గుణాలకు మూలాధారం. దుర్యోధనుడు, విశ్వామిత్రుని వంటి పురాణపురుషులు కోపం వల్ల సర్వనాశనమైనారు.

అందువల్ల మనం కోపాన్ని దూరంగా ఉంచుదాం ! ప్రశాంతమైన జీవనాన్ని సాగిద్దాం ! ఆలోచించి ప్రశాంతంగా మాట్లాడుకుందాం. సహజీవన మాధుర్యాన్ని అనుభవిద్దాం. అందరికి ఆదర్శంగా జీవిద్దాం !

ఇట్లు,
ఆరోగ్య సంరక్షణ కమిటీ,
నల్గొండ.

ప్రశ్న 4.
కోపం అనర్థదాయకమని, శాంతిని పెంపొందించ మని తెలుపుతూ నినాదాలు రాయండి.
జవాబు:
కోపం వద్దు – శాంతి ముద్దు
మితిమీరిన కోపం – అనర్థాలకు మూలం
మానవుల అంతర్గత శత్రువు క్రోథం
కోపాన్ని తగ్గించు – ఆదర్శంగా జీవించు
శాంతియుత జీవనం – అదే అందరికి ఆదర్శం
కోపం త్యజించు – శాంతిని స్వాగతించు

ప్రశ్న 5.
ఆకలిగా ఉన్నవాళ్ళకు అన్నంపెట్టడం, అవసరానికి సహాయంచేయడం వంటివి మంచి లక్షణాలు. మీ తరగతిలో ఇలా మంచి లక్షణాలు గలవాళ్ళు ఎవరు ఉన్నారు ? వాళ్ళను అభినందించండి.
జవాబు:
మా తరగతిలో మేమందరం పేద విద్యార్థులకు సహాయం చేస్తాము. మా ఊరికి సమీపంలో ఒక విదేశీయుని కుటుంబం వచ్చి వీధి పిల్లలను చేరదీసి వారికి కావలసిన సకల సదుపాయాలు కల్పిస్తుంది. ఆ విదేశీయులు పెద్దల దగ్గర విరాళాలు వసూలు చేసి, వీధి పిల్లల కోసం ఒక గ్రామాన్ని స్థాపించారు. అందులో అందరూ అనాథపిల్లలే ఉంటారు.

ఆ అనాథ పిల్లలకు మా పాఠశాల పిల్లలందరం దుస్తులు, సబ్బులు, కొబ్బరినూనె, పుస్తకాలు, ధన సహాయం చేస్తుంటాము. అందుకు మాకెంతో తృప్తిగా ఉంటుంది. ఈ సంవత్సరం మా తరగతి విద్యార్థులందరం చందాలు వసూలు చేసి, ఆ అనాథ పిల్లలకు ఒక కంప్యూటర్ను బహూకరించాము. అందుకు మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మా తరగతి విద్యార్థులనందరినీ అభినందించారు.

ప్రశ్న 6.
ప్రపంచశాంతి (విశ్వశాంతి) గూర్చి వ్యాసం వ్రాయండి.
జవాబు:
శాంతి అంటే శమము లేదా ఓర్పు అని అర్థం. బాధలు, దుఃఖాలు, ప్రకృతి వైపరీత్యాలు, మానవ కల్పితమగు ఉపద్రవాలు ప్రాణికోటికి కష్టనష్టాలు కలిగిస్తున్నాయి. లోకపు మనుగడకే ముప్పు తెచ్చిపెడుతున్నాయి. భూమండలంపై ఉన్న సమస్త ప్రాణులు ఎటువంటి ఉపద్రవాలు లేకుండా కూడు, గూడు, గుడ్డ గలిగి సుఖంగా జీవించడమే ప్రపంచ శాంతి.

సహజంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రపంచ మానవాళికి కష్టాలు కలుగుతాయి. భూకంపాలు, వరదలు, తుఫానులు, అతివృష్టి, అనావృష్టి వంటి వాటి వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడతారు. వాటి వల్ల జరిగే నష్టాన్ని తగ్గించడానికి శాస్త్రజ్ఞులు అంతా కృషి చేస్తున్నారు.

మానవ కల్పితాలైన ఉపద్రవాలు నేడు ప్రపంచ శాంతికి తీరని ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఒక దేశంవారు మరో దేశంపై సాగించే యుద్ధాలు ఇటువంటివే. యుద్ధం వల్ల ఓడిపోయిన వారికే కాక గెలిచిన వారికి కూడా ఎంతో నష్టం కలుగుతుంది. 20వ శతాబ్దంలో జరిగిన రెండు ప్రపంచ యుద్ధాల వల్ల ప్రజలలో భయాందోళనలు పెరిగి అశాంతి వాతావరణం నెలకొంది.

మొదటి ప్రపంచ యుద్ధం తరువాత నానాజాతి సమితి, రెండో ప్రపంచయుద్ధం తరువాత ఐక్యరాజ్యసమితి ఏర్పడ్డా అవి ప్రపంచ శాంతికి సరైన కృషిని కొనసాగించలేకపోయాయి. నేడు శ్రీలంక తమిళుల సమస్య, దక్షిణాఫ్రికా వర్ణ వివక్షత, పంజాబ్లోని టెర్రరిస్టుల చర్యలు మొదలైనవి మరో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయేమో అనే భయాందోళనలు కలిగిస్తున్నాయి.

నేడు ప్రపంచ శాంతి నెలకొల్పడానికై వివిధ దేశాలు గణనీయమైన కృషి చేస్తున్నాయి. అందులో భారతదేశం ఒకటి. ప్రపంచ దేశాల మధ్య స్నేహభావాన్ని పెంచి శాంతి చేకూర్చడానికి నెహ్రూగారి పంచశీల సిద్ధాంతాన్ని ఆచరించటం మంచిది.

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

ప్రశ్న 7.
యాచన వృత్తి మంచిది కాదు అని చెబుతూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:

యాచన మానండి. మాన్పించండి.

నరులారా !

మానవులు కాయకష్టంచేసి జీవించాలి. ఆత్మాభి మానంతో జీవించాలి. ఇతరుల ముందు
చేయిచాచి యాచించకూడదు. కృషితో నాస్తి దుర్భిక్షం అని అంటారు. కష్టించి పనిచేసే వారిని సమాజం గౌరవిస్తుంది. సోమరిపోతుల్లా జీవించాలని కోరు కోకండి. ఆత్మవిశ్వాసంతో జీవించండి. అందరికి ఆదర్శంగా నిలుస్తారు. తోటివారికి సహాయపడండి. యాచన మానండి. కష్టంతో జీవించండి.

ఇట్లు,
యాచక వ్యతిరేక కమిటీ.

ప్రశ్న 8.
కోపం అనర్థదాయకమనే విషయాన్ని తెలుపుతూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:
కోపంవీడు కోపం అనర్ధదాయకం సహనం పొందు మిత్రులారా ! మానవుల అంతర్గత శత్రువు కోపం. అరిషడ్వర్గాలలో కోపం ప్రధానమైనది. అన్ని అనర్ధాలకు కోపం మూలం. దీనివల్ల విచక్షణా జ్ఞానం నశిస్తుంది. ఆవేశం కలుగుతుంది. ఆలోచనా శక్తి కోల్పోతాడు. స్నేహం దెబ్బ తింటుంది.

“కోపం ఆత్మీయులను దూరం చేస్తుంది. బంధువులతో సంబంధాలను దూరం చేస్తుంది. మానవీయ సంబంధాలను, నైతిక విలువలను కోల్పోతాడు. సమాజంలో గౌరవం తగ్గుతుంది. సహజీవన మాధుర్యం క్రమంగా నశిస్తుంది. హింసాయుత ప్రవృత్తి అలవడుతుంది.

అందువల్ల మనంకూడా కోపాన్ని వదలిపెట్టాలి. శాంతిని పొందాలి. అందరితో నవ్వుతూ మాట్లాడాలి. కోపాన్ని వదలి నూరు సంవత్సరాలు సుఖంగా జీవించాలి. అదే మనకు ఆరోగ్య రక్ష.

ఇట్లు,
ఆరోగ్య సంరక్షణ కమిటీ,
X X X X X.

అదనపు వ్యాకరణాంశాలు

PAPER – I: PART – B

1. పర్యాయపదాలు

అర్ధాంగి = భార్య, ఇల్లాలు, పత్ని

ఆగ్రహం = కోపం, అలుక, క్రోధం

గృహము = ఇల్లు, గేహము, నికేతనం

శివుడు = శంకరుడు, రుద్రుడు, గౌరీపతి

పసిడి = బంగారం, కాంచనం, పుత్తడి

పారాశర్యుడు = వ్యాసుడు, బాదరాయణుడు, కృష్ణద్వైపాయనుడు

మోక్షం = కైవల్యం, ముక్తి

శిష్యులు = ఛాత్రులు, విద్యార్థులు, అంతేవాసులు

నిక్కము = నిజము, సత్యము, యదార్థం

భాగీరథి = గంగ, త్రిపథగ, జాహ్నవి

బ్రాహ్మణులు = విప్రులు, ద్విజులు, భూసురులు

భవాని = పార్వతి, గౌరి, ఉమ

వనిత = స్త్రీ, మహిళ, పడతి, అంగన

భానుడు = సూర్యుడు, రవి, దివాకరుడు

తనూజుడు = కుమారుడు, సుతుడు, ఆత్మజుడు

అంగన = వనిత, స్త్రీ, మహిళ

నెయ్యి = ఆజ్యము, ఘృతము, నేయి

ఇల్లు = గృహము, భువనం, భార్య, పేరు

గంధము = చందనం, మలయజం

పుష్పము = పువ్వు, కుసుమము, ప్రసూనము

ముఖము = వదనము, ఆననము, మొగము

గొడుగు = ఛత్రము, ఆతపత్రము, ఖర్పరము

మరికొన్ని పర్యాయపదాలు

క్రింది వాక్యములలో పర్యాయపదములు గుర్తించండి.

1. భిక్ష మునుల వృత్తి. ముష్టికి వచ్చిన వారికి తిరిపము పెట్టాలి కాని విసుక్కోకూడదు.
జవాబు
భిక్ష, ముష్టి, తిరిపము

2. శిష్యుడు గురువును గౌరవించాలి. గురువు అంతేవాసిని తీర్చి దిద్దాలి. ఆ ఛాత్రుడు ఎంత గొప్పవాడైతే అంత మంచిది.
జవాబు:
శిష్యుడు, అంతేవాసి, ఛాత్రుడు

3. చదువుపై శ్రద్ధ పెట్టాలి. విద్యను మించిన సంపద లేదు. పలుకును బట్టి గౌరవం పెరుగుతుంది.
జవాబు:
చదువు, విద్య, పలుకు

4. గురువును గౌరవించాలి. ఆచార్యుడు తన సమయాన్ని విద్యాదానానికి ఉపయోగించి మంచి దేశికుడుగా పేరు తెచ్చుకోవాలి.
జవాబు:
గురువు, ఆచార్యుడు, దేశికుడు

5. ఆవును బాధ పెట్టకూడదు. మొదవు ఎక్కడ ఉంటే అక్కడ ఆరోగ్యం. అందుకే. గోవును పూజించాలి.
జవాబు:
ఆవు, మొదవు, గోవు

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

6. రాత్రి ప్రయాణం మంచిది కాదు. నిశీధిలో దీపం ఉండాలి. అలంకరిస్తే రజనిని మించినది లేదు.
జవాబు:
రాత్రి, నిశీధి, రజని

7. ముక్కంటి కంటి మంటకు మదనుడు నశించాడు. వరాలిచ్చే శివుడుకి కోపం వస్తే రుద్రుడు అవుతాడు.
జవాబు:
ముక్కంటి, శివుడు, రుద్రుడు

8. తొలిపలుకులు ఆగమములంటారు. వేదము శిరో ధార్యము.
జవాబు:
తొలిపలుకులు, ఆగమము, వేదము

9. వ్యాసుడు వేదాలు విభజించాడు. ఆ కృష్ణద్వైపా యనుడు 18 పురాణాలు రచించాడు. అందు పారాశర్యుడు తొలి గురువు.
జవాబు:
వ్యాసుడు, కృష్ణద్వైపాయనుడు, పారాశర్యుడు

10. ఎవరిపైనా నింద వేయకూడదు. దూషణములే శాపములై తగులును.
జవాబు:
నింద, దూషణము, శాపము

2. వ్యుత్పత్త్యర్థాలు

శివుడు = స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు. (శంకరుడు)

అతిథి = తిథి, వార, నక్షత్ర నియమం లేకుండా ఇంటికి భోజనానికి వచ్చువాడు.

గురువు = అధికారమనెడి అజ్ఞానమును తొలగించువాడు. (ఉపాధ్యాయుడు)

మోక్షము = జీవుడిని పాపము నుండి విడిపించునది (కైవల్యం)

పతివ్రత = పతిని సేవించుటయే వ్రతముగా కలది (సాధ్వి)

శిష్యులు = శిక్షింపతగిన వారు (ఛాత్రులు)

పారాశర్యుడు = పరాశరుని యొక్క కుమారుడు (వ్యాసుడు)

ఛాత్రుడు = గురువు యొక్క దోషాలను కప్పిపుచ్చు స్వభావం గలవాడు. (విద్యార్థి)

భాస్కరుడు = కాంతిని కలుగజేయువాడు (సూర్యుడు)

భవాని = భవుని యొక్క భార్య (పార్వతి)

విశ్వనాథుడు = ప్రపంచానికి నాథుడు (శివుడు)

పార్వతి = పర్వతరాజు యొక్క కుమార్తె (గౌరి)

వేదవ్యాసుడు = వేదములను విభజించువాడు (పారాశర్యుడు)

పురంధ్రి = గృహమును ధరించునది (ఇల్లాలు)

తాపసుడు = తపము చేయువాడు (ముని)

పంచజనుడు = ఐదుభూతములచే పుట్టబడేవాడు (మనిషి)

ముక్కంటి = మూడు కన్నులు కలవాడు (శివుడు)

వనజనేత్ర = పద్మముల వంటి కన్నులు కలది.

లేదీగబోడి = లేతతీగ వంటి శరీరము కలది

అహిమభానుడు = చల్లనివికాని కిరణములు గలవాడు. (సూర్యుడు)

వ్యాసుడు = వేదములను విభజించి ఇచ్చినవాడు (వ్యాసమహర్షి)

3. నానార్థాలు

కంకణము = తోరము, నీటిబిందువు, స్త్రీలు చేతికి ధరించేది
గురువు = ఉపాధ్యాయుడు, బృహస్పతి, తండ్రి, పురోహితుడు
మోక్షము = కైవల్యం, నిర్యాణం, విడుదల
ఫలము = పండు, ఫలితము, ప్రయోజనము
లక్ష్మి = సంపద, రమ, మెట్టతామర
కామము = కోరిక, మామిడి
ప్రసాదము = అనుగ్రహము, ప్రసన్నత, మంచి స్వభావం
కరము = చేయి, తొండము, కిరణము
గృహము = ఇల్లు, భార్య, రాశి
కాయ = చెట్టుకాయ, బిడ్డ
ఇల్లు = గృహము, కుటుంబము, స్థానము
ముఖము = మోము, ఉపాయము, ముఖ్యమైనది
బంతి = కందుకము, ఒక జాతి పువ్వుల చెట్టు, పంక్తి
రూపు = ఆకారము, దేహము, కన్నెమెడలో బంగారు నాణెము
గంధము = చందనము, గంధకము, సువాసన

4. ప్రకృతి – వికృతులు

ఆజ్ఞ – ఆన
దోషం – దోసం
స్వామి – సామి
భాగ్యము – బాగ్గెము
శక్తి – సత్తి
కార్యం – కర్జం
భిక్షము – బిచ్చము
పట్టణము – పత్తనము

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

వేషము – వేసము
రాత్రి – రాతిరి
స్వర్గము – సొన్నము
తపస్వి – తపసి
రూపము – రూపు
లక్ష్మి – లచ్చి
ఆహారము – ఓగిరమ
విద్య – విద్దె
శ్రీ – సిరి
ఈశ్వరుడు – ఈసుడు
పుణ్యం – పున్నెము
సుఖము – సుకము
రత్నము – రతనము
బ్రాహ్మణుడు – బాపడు
గంధము – గందము
పుష్పం – పూవు
శిష్యుడు – చట్టు
పాయసము – పాసెము

PAPER – II : PART – B

1. సంధులు

1. సవర్ణదీర్ఘ సంధి

సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు దాని దీర్ఘము ఏకాదేశమగును.

ఉదా: పుణ్యాంగన – పుణ్య + అంగన
బింబాస్య – బింబ + ఆస్య
అర్ధాంగ – అర్ధ + అంగ
శాకాహారులు – శాక + ఆహారులు
శిఖాధిరూఢ – శిఖ + అధిరూఢ
భిక్షాన్నం – భిక్ష + అన్నం
శాలాంతరం – శాల + అంతరం
మధ్యాహ్నం – మధ్య + అహ్నం
పాయసాపూపం – పాయస + అపూపం
బ్రాహ్మణాంగన – బ్రాహ్మణ + అంగన
కమలానన – కమల + ఆనన
పాపాత్ములు – పాప + ఆత్ములు
అభీప్సితాన్నములు – అభీప్సిత + అన్నములు
ఖచితాభరణంబు – ఖచిత + ఆభరణంబు
మునీశ్వర – ముని + ఈశ్వర

2. గుణ సంధి

సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమముగా ఏ, ఓ, ఆర్లు ఏకాదేశమగును.
ఉదా : శిలోంచ శిల + ఉంచ్ఛ

3. అత్వసంధి

సూత్రం : అత్తునకు సంధి బహుళముగానగు.
ఉదా : లేకైన – లేక + ఐన
ముత్తైదువ – ముత్త + ఐదువ

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

4. ఉత్వసంధి

సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు

ఉదా : లేదెట్లు – లేదు + ఎట్లు
బీఱెంద – బీఱు + ఎండ
ప్రక్షాలితంబైన – ప్రక్షాలితంబు + ఐన
అపారములైన – అపారములు + ఐన
రూపన్న – రూపు + అన్న
పారణకైన – పారణకు + ఐన
రమ్మని – రమ్ము + అని

5. యడాగమ సంధి

సూత్రం: సంధి లేనిచోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు యడాగమంబగు.
ఉదా : మా యిల్లు – మా + ఇల్లు

6. త్రికసంధి

సూత్రాలు :

  1. అ, ఈ, ఏ అను సర్వనామములు త్రికములనబడును.
  2. త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు.
  3. ద్విరుక్తంబగు హల్లు పరమగునపుడు ఆచ్చి కంబగు దీర్ఘంబునకు హ్రస్వంబగును.

ఉదా : ఇవ్వీటి – ఈ + వీటి
అచ్చోట – ఆ + చోట
అమ్మహాసాధ్వి – ఆ + మహాసాధ్వి
ఆయ్యాదిమశక్తి – ఆ + ఆదిమశక్తి – యడాగమ త్రికసంధులు

7. గసడదవాదేశ సంధి

సూత్రము : ప్రథమమీది పరుషములకు గసడదవలు బహుళంబుగానగు.
ఉదా : లెస్సగాక – లెస్స + కాక
కఱ్ఱపెట్టి – కఱ్ఱ + పెట్టి
పూజచేసి – పూజ + చేసి

8. ద్రుత ప్రకృతిక సంధి

సూత్రము : ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
ఉదా : కవాటంబుఁదెరువము – కవాటంబున్ + తెరువము
చనుదెంచినఁగామధేనువు – చనుదెంచినన్ + కామధేనువు

2. సమాసాలు

సమాస పదం – విగ్రహవాక్యం – సమాసం పేరు
మతిహీనులు – మతిచేత హీనులు – తృతీయా తత్పురుష సమాసము
కోపావేశం – కోపము చేత ఆవేశం – తృతీయా తత్పురుష సమాసము
రత్నఖచిత – రత్నముచేత ఖచితం – తృతీయా తత్పురుష సమాసము
విప్రగృహం – విప్రుని యొక్క గృహం – షష్ఠీ తత్పురుష సమాసము
విద్యాగురుండు – విద్యలకు గురుండు – షష్ఠీ తత్పురుష సమాసము
బ్రాహ్మణాంగనలు – బ్రాహ్మణుల యొక్క అంగనలు – షష్ఠీ తత్పురుష సమాసము
పాపాత్ముని ముఖం – పాపాత్ముని యొక్క ముఖం – షష్ఠీ తత్పురుష సమాసము
‘బ్రాహ్మణ మందిరములు – బ్రాహ్మణుల యొక్క మందిరములు – షష్ఠీ తత్పురుష సమాసము
గోముఖము – గోవు యొక్క ముఖము – షష్ఠీ తత్పురుష సమాసము

ద్వాఃకవాటం – ద్వారము యొక్క కవాటం – షష్ఠీ తత్పురుష సమాసము
శిష్యగణం – శిష్యుల యొక్క గణం – షష్ఠీ తత్పురుష సమాసము
మాయిల్లు – మా యొక్క ఇల్లు – షష్ఠీ తత్పురుష సమాసము
విప్రవాటికలు – విప్రుల యొక్క వాటికలు – షష్ఠీ తత్పురుష సమాసము
విశ్వనాథుని రూపం – విశ్వనాథుని యొక్క రూపం – షష్ఠీ తత్పురుష సమాసము
విప్రభవనం – విప్రుని యొక్క భవనం – షష్ఠీ తత్పురుష సమాసము
ముక్కంటిమాయ – ముక్కంటి యొక్క మాయ – షష్ఠీ తత్పురుష సమాసము
భిక్షాటనం – భిక్ష కొఱకు అటనం – చతుర్థీ తత్పురుష సమాసము
భిక్షాపాత్ర – భిక్ష కొఱకు పాత్ర – చతుర్థీ తత్పురుష సమాసము
భుక్తిశాల – భుక్తి కొరకు శాల – చతుర్థీ తత్పురుష సమాసము
కాశినగరం – కాశిఅనే పేరుగల నగరం – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
కాశీపట్టణం – కాశి అనే పేరుగల పట్టణం – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
మోక్షలక్ష్మి – మోక్షము అనెడి లక్ష్మి – రూపక సమాసం
మూడుతరములు – మూడు సంఖ్య గల తరములు – ద్విగు సమాసం
మధ్యాహ్నం – అహ్నము మధ్య భాగము – ప్రథమా తత్పురుష సమాసం
ముక్కంటి – మూడు కన్నులు కలవాడు – బహువ్రీహి సమాసం

మచ్చెకంటి – చేప కన్నుల వంటి కన్నులు కలది – బహువ్రీహి సమాసం
బింబాస్య – చంద్రబింబము వంటి ముఖము కలది – బహువ్రీహి సమాసం
పాపాత్ముడు – పాపముతో కూడిన మనస్సు కలవాడు” – బహువ్రీహి సమాసం
శాకాహారులు – శాకమును ఆహారముగా కలవారు ” – బహువ్రీహి సమాసం
కమలాలన – కమలముల వంటి ఆననము కలది” – బహువ్రీహి సమాసం
బహు పదార్థములు – ఎక్కువైన పదార్థములు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
లేతీగ – లేతదైన తీగ – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
పుణ్యాంగన – పుణ్యమైన అంగన – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మహాప్రసాదం – గొప్పదైన ప్రసాదం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ప్రాకృత వేషం – ప్రాకృతమైన వేషం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
అభీప్సితాన్నములు – అభీప్సితములైన అన్నములు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
కొన్ని మాటలు – కొన్నైన మాటలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

పెద్ద ముత్తైదువ – పెద్దదైన ముత్తైదువ – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
అర్ఘ్యపాద్యములు – అర్ఘ్యమును, పాద్యమును – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
పుష్పగంధములు – పుష్పములును, గంధములును – ద్వంద్వ సమాసం
ఫలపాయసములు – ఫలమును, పాయసమును – ద్వంద్వ సమాసం
భక్తివిశ్వాసములు – భక్తియును, విశ్వాసమును – ద్వంద్వ సమాసం
క్షుత్పిపాసలు – క్షుత్తును, పిపాసయును – ద్వంద్వ సమాసం
వేదపురాణశాస్త్రములు – వేదములును, పురాణములును, శాస్త్రములును – బహుపద ద్వంద్వం

3. గణవిభజన

ప్రశ్న 1.
‘అనవుడు నల్ల నవ్వి కమలానన యిట్లను లెస్సగా కయో – ఈ పద్యపాదానికి గురు లఘువులను గుర్తించి, గణ విభజన చేసి, ఏ పద్యపాదమో తెల్పండి.
జవాబు:
TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష 1
పై పద్యపాదంలో న, జ, భ, జ, జ, జ, అనే గణాలు ఉన్నాయి. కాబట్టి ఇది చంపకమాల పద్యపాదం.

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

ప్రశ్న 2.
‘ఆ కంఠంబుగ నిఫ్టు మాధుకర భిక్షాన్నంబు భక్షింపగా’ – ఈ పద్య పాదానికి గురు లఘువులను గుర్తించి, గణ విభజన చేసి, ఏ పద్యపాదమో తెల్పండి.
జవాబు:
TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష 2
పై పద్యపాదంలో మ, స, జ, స, త, త, గ అనే గణాలు ఉన్నాయి కావున ఇది ‘మత్తేభ’ పద్యపాదము.

ప్రశ్న 3.
జ్ఞాదర లీలరత్న కటకా భరణంబులు ఘల్లు ఘల్లనన్ – ఈ పద్య పాదానికి గురు లఘువులను గుర్తించి, గణ విభజన చేసి, ఏ పద్యపాదమో తెల్పండి.
జవాబు:
TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష 3
ఈ పాదంలో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు ఉన్నాయి. కాబట్టి ఇది ‘ఉత్పలమాల’ పద్యపాదం.

ప్రశ్న 4.
‘అనవుడు నల్ల నవ్వికమలానన యిట్లను లెస్సగాకయో, అన్న పద్యపాదానికి గురు లఘువులు గుర్తించి, గణ విభజన చేసి, ఏ పద్యపాదమో తెలపండి.
జవాబు:
TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష 4
పై పద్యపాదంలో ‘న, జ, భ, జ, జ, జ, ర’ గణాలు ఉన్నాయి కాబట్టి 11వ అక్షరం యతిమైత్రి. ఇది చంపకమాల పద్యపాదము.

ప్రశ్న 5.
‘ఓ మునీశ్వర వినవయ్య యున్నయూరు’ – పద్యపాదానికి గురు లఘువులు గుర్తించి, గణవిభజన చేసి ఏ పద్యపాదమో తెలపండి.
జవాబు:
TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష 5

  1. పై పాదంలో 1 సూర్య, 2 ఇంద్ర, 2 సూర్య గణాలు వరుసగా వచ్చాయి. కాబట్టి ఇది తేటగీతి పద్యపాదం.
  2. యతి నాల్గవ గణం మొదటి అక్షరంతో (ఓ – యు)

ప్రశ్న 6.
‘శాకాహారులు కందభోజులు శిలోంఛ ప్రక్రముల్ తాపసుల్’ అనే పద్యపాదానికి, గురు లఘువులు గుర్తించి, గణవిభజన చేసి, అది ఏ పద్యపాదమో తెలుపండి.
జవాబు:
TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష 6
పై పాదంలో ‘మ, స, జ, స, త, త, గ’ గణాలున్నాయి. కాబట్టి శార్దూల 13వ అక్షరం యతిమైత్రి (శా-ఛ) పద్యపాదము.

4. అలంకారాలు

ప్రశ్న 1.
ముంగిట గోమయంబున గోముఖము దీర్చి కడలు నాల్గుగ మ్రుగ్గు కఱ్ఱ వెట్టి,
జవాబు:
ఈ (సీస) పద్యంలో స్వభావోక్తి అలంకారం ఉంది.
లక్షణం : ఒక విషయాన్ని ఉన్నదున్నట్లుగా వర్ణిస్తే అది స్వభావోక్తి అలంకారం.
సమన్వయం : పై పద్యం వాకిట్లో ముగ్గులు, ఆతిథ్యం మొదలగునవి ఉన్నవి ఉన్నట్లుగా చక్కని పదాలతో వర్ణించారు. కనుక, అది స్వభావోక్తి అలంకారం.

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

ప్రశ్న 2.
మూడుతరముల చెడుగాక మోక్ష లక్ష్మి
జవాబు:
ఈ వాక్యంలో రూపకాలంకారం ఉంది.
లక్షణం : ఉపమాన ధర్మాన్ని ఉపమేయంలో ఆరోపించి, రెండింటికీ భేదం లేనట్లు చెప్పడాన్ని రూపకాలంకారం అంటారు.
సమన్వయం : మోక్షమును లక్ష్మితో పోల్చారు. మోక్షమనెడు లక్ష్మి అని ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్పారు. కనుక ఇది రూపకాలంకారం.

ప్రశ్న 3.
అని పారాశర్యుండు క్షుత్పిపాసా పరవశుండై శపియింపందలంచు.
జవాబు:
ఈ వాక్యంలో వృత్త్యనుప్రాసాలంకారం ఉంది.
లక్షణం : ఒకే అక్షరం చాలాసార్లు వస్తే అది వృత్త్యనుప్రాసాలంకారం.
సమన్వయం : పై వాక్యంలో ‘ప’కారం చాలాసార్లు వచ్చింది. కనుక దానిలో వృత్త్యనుప్రాసాలంకారం ఉంది.

TS 10th Class Telugu Important Questions 12th Lesson భూమిక

These TS 10th Class Telugu Important Questions 12th Lesson భూమిక will help the students to improve their time and approach.

TS 10th Class Telugu 12th Lesson Important Questions భూమిక

PAPER – 1 : PART- A

I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)

1. లఘు సమాధాన ప్రశ్నలు (3 మార్కులు)

అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘భూమిక లేక పీఠిక’ అనే సాహిత్య ప్రక్రియను గూర్చి వివరించండి.
జవాబు:
ఒక పుస్తకానికి ముందు రాసే ముందుమాటనే ‘పీఠిక’ లేక ‘భూమిక’ అని అంటారు. ఒక పుస్తకం ఆశయాన్నీ, దానిలోని సారాన్నీ, దాని తత్త్వాన్నీ, ఆ గ్రంథ రచయిత దృక్పథాన్నీ, ‘ముందుమాట’ తెలియజేస్తుంది.

ఒక గ్రంథము యొక్క నేపథ్యమును, లక్ష్యములను పరిచయము చేస్తూ స్వయంగా ఆ గ్రంథ రచయిత గానీ, మరొకరు గానీ, లేదా ఒక విమర్శకుడు గానీ రాసే విశ్లేషాత్మక పరిచయ వాక్యాలను, ‘పీఠిక’ లేక ‘భూమిక’ అని పిలుస్తారు. ఈ పీఠికనే, ముందుమాట, భూమిక, ప్రస్తావన, తొలిపలుకు, ఆముఖము, మున్నుడి అనే పేర్లతో కూడా పిలుస్తారు.
నేషనల్ బుక్ ట్రస్టు ప్రచురించిన నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథల సంపుటానికి, శ్రీ గూడూరి సీతారాం గారు పీఠిక రాశారు.

ప్రశ్న 2.
సంక్షుభిత వాతావరణంలో హిందూ, ముస్లింల సఖ్యత కోసం ఎందరో ప్రజాస్వామిక వాదులు నడుం బిగించారు అంటే మీకేమి అర్థమయింది ?
జవాబు:
ఆ రోజులలో హిందూ – ముస్లింల సఖ్యత లోపించింది. మానవ సంబంధాలు మరుగునపడ్డాయి. మమతలు మసకబారినాయి. మతాల ముసుగులో దారుణాలు ఎక్కువయ్యాయి. కులాతీత సమాజం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. మతాతీత స్నేహాలు మటుమా యమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆత్మీయతలు అడుగంటిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. అందుకే దానిని సంక్షుభిత వాతావరణం అన్నారు.

ఆ సంక్షుభిత వాతావరణాన్ని చక్కబరిచి, మళ్ళీ మమతలు, ఆత్మీయతలు, స్నేహాలు పెంపొంది కులాతీత మతాతీత సమాజం ఏర్పడటానికి చాలామంది ప్రజాస్వామికవాదులు పూనుకొన్నారని అర్థమయింది.

TS 10th Class Telugu Important Questions 12th Lesson భూమిక

ప్రశ్న 3.
నెల్లూరి కేశవస్వామి హృదయాన్ని ఆవిష్కరించండి.
జవాబు:
ఒక రచయిత యొక్క హృదయం అతని రచనలలో కన్పిస్తుంది. అలాగే నెల్లూరి కేశవస్వామి హృదయం ఆయన రచనలలో కన్పిస్తుంది. కేశవస్వామి హృదయం ఆయన రాసిన కథలలో కనిపిస్తుంది. స్వామి లోహియా సోషలిస్టు. సమాజంలో అన్ని కులాలవారు, అన్ని మతాల వారు స్నేహభావంతో ఉండాలని ఆయన ఆలోచన.

దానికి విఘాతం కలిగితే తట్టుకోలేడు. అందుకే హిందూ – ముస్లిం సఖ్యత లోపించినపుడు అశాంతిగా గడిపాడు. ఎన్నో రాత్రులు నిద్రలేకుండా గడిపాడు. స్నేహం కోసం తపించాడు. ఆత్మీయత కోసం అర్రులు చాచాడు. కులాతీత, మతాతీత సమాజ నిర్మాణం కోసం చాలా ప్రయత్నం చేశాడు. ఆయన రచించిన చార్మినార్ కథలలో ఇవే కనిపిస్తాయి.

సామాజిక శాస్త్రవేత్తగా తన ప్రయత్నాలు తాను చేస్తూనే, ఉత్తమ సమాజ నిర్మాణానికి కథల ద్వారా పాఠకులలో చైతన్యం కల్గించాడు. సామాజిక మార్పులను తన కథలలో వ్యక్తపరిచాడు. సామాజిక చరిత్రను కథలలో రాశాడు.

ప్రశ్న 4.
కేశవస్వామి చాలా కథలు రచించాడు కదా! కథా రచన వలన ప్రయోజనం ఏమిటి?
జవాబు:
కేశవస్వామి తన కథల ద్వారా నాటి సమాజాన్ని గురించి తెలియజేశారు. ఆనాటి సమాజాన్ని చైతన్యపరిచారు. అలాగే కథల వలన సమాజాన్ని చైతన్యపరచవచ్చు. సమాజాన్ని సంస్కరించవచ్చును. సమాజంలోని అసమానతలను ప్రశ్నించవచ్చు. సమాజంలోని సమస్యలకు పరిష్కారాలు సూచించవచ్చును.

కథలోని భాష, శైలి సామాన్య పాఠకులను కూడా ఆకట్టుకొనేలా ఉండాలి. పాఠకుల హృదయాలను కదిలించగలవు. ఉత్తమ సమాజ నిర్మాణానికి తమవంతు ప్రయత్నాన్ని తాము చేయాలనే సంకల్పం కలిగిస్తాయి. ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకొనే అవకాశం కల్పిస్తాయి. పాఠకుల మనోధైర్యాన్ని పెంచుతాయి. పాఠకులకు ఆనందాన్ని కల్గిస్తాయి. కత్తితో సాధ్యం కానిది, కలంతో సాధ్యమని కథలు నిరూపిస్తాయి. అందుకే ఉత్తమ కథా సాహిత్యం ఉత్తమ సమాజాన్ని రూపొందిస్తుందంటారు.

ప్రశ్న 5.
నెల్లూరి కేశవస్వామి కథల్లోని వస్తు వైవిధ్యాన్ని వివరించండి.
జవాబు:
కేశవస్వామి ‘చార్మినార్ కథలు’ సంపుటిలో 11 కథలున్నాయి. ఈ కథలన్నీ విశిష్టమైనవి, దేనికదే ప్రత్యేకమైనవి. ‘యుగాంతం’ కథ ఆనాటి సామాజిక, చారిత్రక పరిణామాల నేపథ్యంలో సాగింది. ‘మహీఅపా’ కథలో ముస్లిం నవాబులు ఒక ముజ్రాల రమణిని గౌరవించిన తీరు వారి హృదయం సంస్కారానికి అద్దం పడుతోంది. వంశాకురం వధ ముస్లిం పెళ్లి సంబంధాలు ఎలా ఉంటాయో, కొడుకు కావాలనే ఆశ ఆడపిల్లల జీవితాలను ఎలా అతలాకుతలం చేస్తుందో చిత్రించింది. ‘కేవలం మనుషులం’ కథ మతాల సరిహద్దులను చెరిపివేసిన స్నేహం గురించి వివరిస్తుంది. భరోసా కథ నమ్మిన పేదలను నట్టేట ముంచిన వైనాన్ని తెలుపుతుంది.

ప్రశ్న 6.
‘భూమిక’ పాఠం రచయితను గురించి రాయండి. (June ’17)
జవాబు:
‘భూమిక’ పాఠ్యభాగ రచయిత గూడూరి సీతారాం. వీరు 18.07.1936న రాజన్న సిరిసిల్ల జిల్లా దగ్గర గల హనుమాజీ పేటలో జన్మించారు. 1953 నుండి 1965 వరకు సుమారు 80 కథలు రాశారు. తెలంగాణ భాషను, యాసను ఒలికించడం ఈయన కలానికున్న ప్రత్యేకత. తెలంగాణ కథా సాహిత్యంలో పేదకులాల జీవితాలను, అట్టడుగు వర్గాల భాషను అక్షర బద్ధం చేసిన రచయిత. తెలంగాణా రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేశాడు. మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజారికం మొదలగునవి వీరి రచనలు. 25.09.2011 న వీరు మరణించారు.

TS 10th Class Telugu Important Questions 12th Lesson భూమిక

ప్రశ్న 7.
“ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోహినూర్, జాకోబ్ వజ్రాల వంటివే స్వర్గీయ నెల్లూరి కేసవస్వామి చార్మినార్ కథను ” వివరించండి.
జవాబు:
నెల్లూరి కేశవస్వామి ‘చార్మినార్ కథలు’ ఆనాటి చారిత్రక, సామాజిక పరిణామాలను నమోదు చేశాయి. మొత్తం 11 కథలలో దేనికదే ప్రత్యేకమైనది. దేనికదే విశిష్టమైనది, వస్తు వైవిధ్యంతో ఆనాటి హైదరాబాద్ లోని సామాజిక సమస్యలను మానవీయ కోణంలో స్పృశించారు. మతాతీతమైన స్నేహం, తెలంగాణా సాయుధ పోరాటం, ముస్లిం జీవన విధానం, ముస్లిం నవాబు హృదయ సంస్కారం మొదలైన అంశాలు ఇతి వృత్తాలుగా కథలు సాగాయి. అందుకే కేశవస్వామి కథలు కోహినూర్ వజ్రం లాంటివని గూడూరి సీతారాం వ్యాఖ్యానించారు.

ప్రశ్న 8.
గూడూరి సీతారాం సాహిత్యసేవను వివరించండి.
జవాబు:
గూడూరి సీతారాం కరీంనగర్ జిల్లా హనుమాజీపేటలో జన్మించారు. 80 కథలు రాస్తే వాటిలో కొన్ని మాత్రమే లభ్యమవుతున్నాయి. తెలంగాణ కథా సాహిత్యాన్ని పేదల జీవితంతో, అట్టడుగు వర్గాల వారి జీవిత విశేషాలతో నింపారు. తెలంగాణ తొలితరం కథలకు దిక్సూచి. తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పని చేసారు. మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజీరికం లాంటి కథలు రాసారు. తెలంగాణ భాష, యాసను వాడిన గొప్ప కవి.

ప్రశ్న 9.
‘ఈ ఒక్క కథ రాసి మరేమి రాయక పోయినప్పటికీ నెల్లూరి కేశవస్వామి భారతదేశం గర్వించదగిన గొప్ప కథకుల్లో ఒక్కడుగా కీర్తించబడేవాడు’ – ఆ ఒక్క కథ ఏది ? దానికున్న ప్రాధాన్యాన్ని తెలుపండి. (June ’18)
జవాబు:
యుగాంతం నిజంగానే ఒక గొప్పకథ. ఇండియా రెండు దేశాలుగా విడిపోయి పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితులు. సంక్షోభాలు, హత్యాకాండ గురించి భీష్మ సహాని “తమస్” నవలలో చిత్రించారు. అది దూరదర్శన్ టి.వి.

సీరియల్గా ప్రసారమైనపుడు పెద్ద ఎత్తున చర్చ సాగింది. అలాంటి పరిస్థితులే హైదరాబాద్ రాజ్యంలో 1946-1950ల మధ్య ఎలా కొనసాగాయో చాలా మందికి తెలియదు. హైదరాబాద్ రాష్ట్ర చరిత్ర ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డంతో మూలకు నెట్టివేయబడింది. ఒక సామాజిక వ్యవస్థ, రాజరిక వ్యవస్థ అంతమవుతూ ఒక నూతన దశలోకి సమాజం, మానవ సంబంధాలు మారుతున్న పరిణామాలను చిత్రించడం వల్ల కథకు యుగాంతం అనే పేరు సార్థకతను చేకూర్చింది.

అందుకే ఈ ఒక్క కథ రాసి మరేమి రాయక పోయినా నెల్లూరి కేశవస్వామి భారతదేశం గర్వించదగ్గ గొప్ప కథకుల్లో ఒకడుగా కీర్తించబడేవాడు.

2. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు (6 మార్కులు)

క్రింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న1.
నెల్లూరి కేశవస్వామి కథలలోని ప్రత్యేకతలను వివరించండి. (Mar. ’16)
నెల్లూరి కేశవస్వామి భారతదేశం గర్వించదగిన గొప్ప కథకుల్లో ఒకరు. సమర్థించండి. (Mar. ’18)
జవాబు:
నెల్లూరి కేశవస్వామి, సుప్రసిద్ధ కథా రచయిత. ఈయన మొదటి కథల సంపుటి, ‘పసిడి బొమ్మ’. ఈయన రెండవ కథా సంపుటం చార్మినార్ కథలు. తాను అనుభవించిన జీవితం, స్నేహం, కులాతీత, మతాతీత వ్యవస్థలు, తెలిపే విధంగా ఓల్డ్ సిటీ. జీవితాన్ని, ‘చార్మినార్ కథలు’గా ఈయన రాశాడు.

ఒక సామాజిక శాస్త్రవేత్తగా, చైతన్యశీలిగా, తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఈ కథలను, ఈయన రాశాడు. ఈ చార్మినార్ కథలు, వాస్తవిక జీవితాల సామాజిక పరిణామాల చరిత్రతో నిండిన చారిత్రాత్మక కథలు. ఈ కథలో కేశవస్వామి హృదయం ఉంది.

ఈయన ‘రుహీ ఆపా’ అనే కథ, ముస్లిం నవాబులలోని హృదయ సంస్కారాన్ని తెలుపుతుంది. ఈయన కథలు, దేనికవే విశిష్టమైనవి. ప్రత్యేకమైనవి. ఈయన ‘యుగాంతం’ కథ, నిజంగానే ఒక యుగాంతాన్ని చిత్రించిన గొప్పకథ. ఈ కథలో హైదరాబాద్ రాజ్యంలో ప్రత్యేక పరిణామాలను ఒక చరిత్ర డాక్యుమెంటుగా ఈయన రాశాడు. ఈ కథ ఒక్కటే ఈయన రాసినా, భారతదేశం గర్వించదగ్గ కథకులలో ఒకడుగా ఈయన ఉండేవాడు.

ఈయన ‘వంశాకురం’ కథలో ముస్లిం పెళ్ళి సంబంధాలు ఎలా ఉంటాయో చెప్పాడు. పేదల నమ్మకాలను ఎలా భగ్నం చేస్తారో ‘భరోసా’ కథలో చెప్పాడు.
ఈయన కథలు, ‘కొహినూర్’, ‘జాకోబ్’ వజ్రాల వంటివి. ఈయన వాసిలో వస్తు నైపుణ్యంలో పేరుకెక్కిన కథలు రాశాడు.

TS 10th Class Telugu Important Questions 12th Lesson భూమిక

ప్రశ్న2.
గూడూరి సీతారాం వ్యాసం ఆధారంగా నెల్లూరి కేశవస్వామి కథలను గురించి రాయండి.
జవాబు:
నెల్లూరి కేశవస్వామి సుప్రసిద్ధ కథా రచయిత. ఆయన రాసిన కొన్ని కథలు నేడు దొరకట్లేదు. ఈయన తన కథలను కొన్ని సంపుటాలుగా వెలువరించాడు. ఈయన తొలికథల సంపుటి “పసిడి బొమ్మ”. ఇది 1969లో వెలువడింది. ఇది భాస్కరభట్ల కృష్ణారావుగారికి అంకితం ఇవ్వబడింది. ఈయన రెండవ కథా సంకలనం

“చార్మినార్” కథలు. ఇవి ఊహించి రాసిన కథలు కావు. ఇది సమాజంలోని మార్పులను కథలుగా రాసిన సామాజిక చరిత్ర రచన అని చెప్పాలి. చార్ మినార్ కథలు హైదరాబాదు సంస్కృతినీ, మానవ సంబంధాలనూ, అక్కడి ముస్లింల జీవితాలనూ అపూర్వంగా చిత్రించాయి. ఇవి మొత్తం 11 కథలు. హైదరాబాద్ నగరం కాస్మో పాలిటన్ నగరంగా ఎదిగింది. ఆ నేపథ్యాలనూ, ఆ జీవితాలనూ కేశవస్వామి చార్మినార్ కథల్లో చిత్రించాడు.

ఈయన “యుగాంతం” కథ సార్థకమైంది. దీనిలో హైదరాబాద్ రాజ్యంలో పరిణామాలను ఒక చారిత్రక డాక్యుమెంటుగా రాశాడు. ఈ ఒక్క కథే రాసినా, కేశవస్వామి భారతదేశం గర్వించదగ్గ గొప్ప కథకుల్లో ఒక్కడు అయ్యేవాడు.

చార్మినార్ కథల్లో కేశవస్వామి హృదయం ఉంది. ఇవి నిజాం రాజ్యయుగం అంతరించిన పరిణామాలకు చిత్రించిన కథలు, కేశవస్వామి రాసిన ‘రుహీ అపో’ కథ, గొప్ప మానవీయ సంబంధాలనూ, కులమతాలకు అతీతంగా స్పందించిన మనిషినీ చిత్రించిన కథ. ఈ కథలో ముస్లిం నవాబుల్లో ఉన్న హృదయ సంస్కారాన్ని రచయిత చక్కగా చూపించాడు.

ఈయన ‘వంశాంకురం’ కథలో ముస్లిం పెళ్ళి సంబంధాలు ఎలా ఉంటాయో చెప్పాడు. నమ్మిన పేదల నమ్మకాలను ఎలా భగ్నం చేస్తారో ‘భరోసా’ కథలో చెప్పాడు. కేశవస్వామి వాసిలో, వస్తు నైపుణ్యంలో వాసికెక్కిన కథలు రాశాడు. ఈయన హిందీ కథా రచయితలు ప్రేమ్చంద్, కిషన్ చందర్లతో పోల్చదగిన గొప్ప కథా రచయిత.

PAPER – II : PART – A

I. అవగాహన – ప్రతిస్పందన

అపరిచిత గద్యాలు

ప్రశ్న1.
క్రింది గద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన వాక్యాలలో తప్పొప్పులను గుర్తించండి. (5 మార్కులు)

“పూర్వం నుండి మనకు తులసి, రావి, వేప చెట్లను పూజించే సంప్రదాయం ఉంది. అనాది నుండి మనం తులసిని దేవతగా పూజిస్తూ వస్తున్నాం. తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నట్లు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. పూర్వకాలంలో తట్టు, ఆటలమ్మ వంటి వ్యాధులు వచ్చినప్పుడు రోగి దగ్గర వేపాకులు ఉంచేవారు. వేపాకులను ఒంటికి రాసేవారు. స్నానం చేయించే ముందు వేపాకులు ముద్దగా నూరి, నూనె, పసుపు కలిపి ఒంటికి రాసేవారు. ఎందుకనగా తట్టు, ఆటలమ్మ వస్తే దేహంపై పొక్కులు వస్తాయి. కొన్ని పచ్చిగా దురద పెడతాయి. అలా దురద రాకుండా ఉండడానికి, గోకటం మానడానికి, ఈ వేపాకు, పసుపు దోహద పడతాయి. ఈ రకంగా వైద్యశాస్త్రానికి సంబంధించిన వేప, సంస్కృతీపరంగా కూడా ప్రాధాన్యతను సంతరించుకొంది.

తప్పొప్పులు

1. తులసిని మనము నేడు దేవతగా పూజిస్తున్నాం.
జవాబు:
తప్పు

TS 10th Class Telugu Important Questions 12th Lesson భూమిక

2. తులసిలో ఔషధ గుణాలున్నాయని శాస్త్రజ్ఞుల కథనం.
జవాబు:
ఒప్పు

3. వేపకు వైద్యశాస్త్రంలోనే ప్రాధాన్యత ఉంది.
జవాబు:
తప్పు

4. దురద రాకుండా, గోకకుండా పసుపు, వేపాకులు ఉపయోగపడతాయి.
జవాబు:
ఒప్పు

5. తట్టు, ఆటలమ్మ వ్యాధులకు, పూర్వం వైద్యం లేదు.
జవాబు:
తప్పు

ప్రశ్న2.
క్రింది గద్యాన్ని చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలను తయారుచేయండి.

వీరభద్రారెడ్డికి అంకితముగా కాశీఖండము రచించిన శ్రీనాథుడు, పోతనకు సమకాలికుడు. శ్రీనాథుడు కాశీఖండము అనే పురాణాన్ని తెనిగించినను దానిని స్వతంత్రించి ప్రబంధముల వలె రచించినాడు. భీమఖండము గోదావరి తీర దేశ దివ్య వైభవ వర్ణనా గ్రంథమని చెప్పవచ్చును. కాశీఖండము ప్రౌఢాంధ్ర కవితా పరిజ్ఞానమునకు చదువదగిన గ్రంథము. ఈయన హరవిలాసం వ్రాసి అవచి తిప్పయ్య శెట్టికి అంకితమిచ్చాడు. కవి సార్వభౌముడిగా ప్రసిద్ధి చెందిన శ్రీనాథుడు 15వ శతాబ్దివాడు. ఈయనకు ప్రౌఢ కవితా పాకంపై ప్రీతి ఎక్కువ.
జవాబులు:

  1. శ్రీనాథుని గ్రంథములెవ్వి ?
  2. శ్రీనాథుని బిరుదమేమి ?
  3. శ్రీనాథుడు హరవిలాసమును ఎవరికి అంకితమిచ్చెను?
  4. శ్రీనాథునికి దేనిపై మక్కువ ఎక్కువ ?
  5. వీరభద్రారెడ్డికి అంకితమిచ్చిన గ్రంథమేది ?

ప్రశ్న3.
క్రింది గద్యాన్ని చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

స్త్రీ జనోద్ధరణము కూడా సంఘసేవయే. పురుషులు మాత్రమే చదివి లోకమున విజ్ఞులమని, ప్రయోజకులమని చెప్పుకొనుట చాలదు. స్త్రీలు సహితము పురుషులతో పాటుగా చదువుకొన్నప్పుడే సంఘము బాగుపడును. సంఘమనే బండికి పురుషులిద్దరు రెండు చక్రములు వంటివారు. అందులో ఏ చక్రము అవిటిగా నున్నను ఆ బండి నడువజాలదు. కావున రెండు చక్రములను సరిగా నడుచునట్లు చూచుకొన్నప్పుడే బండి చక్కగా సాగిపోవును.

ప్రశ్నలు – జవాబులు

1. సంఘ సేవ యనదగినదేది ?
జవాబు:
స్త్రీల జనోద్ధరణము సంఘసేవ అనదగినది.

TS 10th Class Telugu Important Questions 12th Lesson భూమిక

2. సంఘము ఎప్పుడు బాగుపడును ?
జవాబు:
స్త్రీలు కూడా పురుషులతో పాటుగా చదువుకొన్నప్పుడే సంఘం బాగుపడును.

3. సంఘమనే బండికి చక్రములవంటి వారెవరు ?
జవాబు:
సంఘమనే బండికి స్త్రీ పురుషులిద్దరూ రెండు చక్రముల వంటివారు.

4. బండి ఎప్పుడు చక్కగా సాగును ?
జవాబు:
రెండు చక్రములు సరిగా నడుచుచున్నట్లు చూచుకొన్నప్పుడే బండి చక్కగా సాగును.

5. ఎవరు విజ్ఞులమని, ప్రయోజకులమని చెప్పుకొనుట చాలదు ?
జవాబు:
పురుషులు మాత్రమే చదివి లోకమున విజ్ఞులమని, ప్రయోజకులమని చెప్పుకొనుట చాలును.

ప్రశ్న4.
క్రింది గద్యాన్ని చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

పొదుపు మానవ జీవితానికి అత్యవసరము. పొదుపు లేని మానవుడు దారం తెగిన గాలిపటం వంటివాడు. పొదుపు చేయకుండ అడ్డుపడే వాటిల్లో అతి ముఖ్యమైనవి కోరికలు. కోరికలు మానవుడిని మానసికంగా బలహీనుణ్ణి చేస్తాయి. పొదుపు అనేక విషయాలలో పాటించవచ్చు. ధనము, జలము, భాషణము మొదలగు వానిలో పొదుపు పాటించడం ద్వారా దేశాభివృద్ధిని సాధించగలము. పొదుపును నిర్లక్ష్యం చేస్తే అప్పులు చేయక తప్పదు. అప్పు చేయటం వలన మన వ్యక్తిత్వాన్నే కోల్పోతాము.

ప్రశ్నలు – సమాధానాలు

1. పొదుపు లేని మానవుడు ఎట్టివాడు ?
జవాబు:
పొదుపు లేని మానవుడు దారం తెగిన గాలిపటం వంటివాడు.

2. కోరికలు మానవుని ఏమి చేస్తాయి ?
జవాబు:
కోరికలు మానవుడిని మానసికంగా బలహీనుణ్ణి చేస్తాయి.

3. పొదుపు పాటించవలసిన ముఖ్య విషయాలేవి ?
జవాబు:
పొదుపు పాటించవలసిన ముఖ్య విషయాలు ధనం, జలం, భాషణం.

4. పొదుపును నిర్లక్ష్యం చేస్తే ఏమి జరుగుతుంది ?
జవాబు:
పొదుపును నిర్లక్ష్యం చేస్తే, అప్పులు చేయడం జరుగుతుంది.

5. అప్పు చేయటం వలన మనమేమి కోల్పోతాము ?
జవాబు:
అప్పు చేయడం వలన మనం మన వ్యక్తిత్వాన్ని కోల్పోతాము.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

సృజనాత్మక ప్రశ్నలు (5 మార్కులు)

ప్రశ్న 1.
ఉత్తమ సమాజం గురించి వివరించే కవిత రాయండి.
జవాబు:
ఆదర్శ సమాజం

కులాల కుళ్ళు లేదు.
మతాల మతలబులు లేవు.
ధనిక పేద తేడాలసలే లేవు.
మేడా మిద్దె గూడూ గుడిసె ఒక్కటే.
రాజకీయపు రంగురంగుల వలలు లేవు.
అరాచకపు ఆనవాళ్ళు అసలే లేవు.
ఆనందం, స్నేహం, సౌఖ్యం ఉన్నాయి.
అందరం ఒకే కుటుంబం అందరం బంధువులమే.
ఇదే మా ఆదర్శ సమాజం.

అదనపు వ్యాకరణాంశాలు

PAPER – 1: PART – B

1. సొంతవాక్యాలు

1. ఉన్నత శిఖరాలు : ప్రతి వ్యక్తి తన జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలి అని ఆశించాలి.

2. సామాజిక పరిణామం : సంస్కర్తలు, తన శక్తి కొద్దీ మంచి సామాజిక పరిణామం తీసుకు రావడం కోసం కృషి చేయాలి.

3. నడుం బిగించు : హనుమంతుడు, కార్యసాధన కై నడుం బిగించాడు.

4. భారతీయ సంస్కృతి : వివేకానంద స్వామి దేశ విదేశాల్లో మన భారతీయ సంస్కృతి యొక్క గొప్ప తనాన్ని ప్రచారం చేశారు.

5. హృదయ విదారకం : వరద బాధితుల కష్టాలు వినడానికే హృదయ విదారకంగా ఉన్నాయి.

6. ఆదానప్రదానాలు
(ఇచ్చి పుచ్చుకోవడాలు) : అనుకున్న పని నెరవేరాలంటే, ఆదాన ప్రదానాలు రెండూ ఉండాలి.

7. అపూర్వంగా : షాజహాన్ తాజమహల్ను అపూర్వంగా నిర్మించాడు.

TS 10th Class Telugu Important Questions 12th Lesson భూమిక

2. పర్యాయపదాలు

స్నేహము = ప్రేమ, ప్రియము, సాంగత్యము, మైత్రి, నెయ్యం
కథ = కత, కథానిక, ఆఖ్యాయిక, గాథ
సైన్యము = సేన, ధ్వజని, వాహిని, బలం, దండు, దళం
కవిత్వము = కవనము, కవిత, కయిత
ముస్లిమ్ = మహమ్మదీయుడు, తురుష్కుడు, పఠాణీ, యవనుడు
వంశము = కులము, అన్వయము, గోత్రము, జాతి, తెగ, సంతతి
పెళ్ళి = పరిణయము, వివాహము, ఉద్వా హము, కరగ్రహణము, కల్యాణము, మనువు

3. వ్యుత్పత్త్యర్థాలు

అంధకారము = లోకులను అంధులుగా చేయునట్టిది (చీకటి)
వార్తాపత్రిక = వార్తలను ప్రకటన చేయు కాగితం (వార్తాపత్రిక)

కేశవులు =
1) మంచి వెంట్రుకలు కలవాడు
2) కేశి అను రాక్షసుని చంపినవాడు

కథ = కొంచెము సత్యమును, కొంత కల్పన గల చరిత్ర – కత
అదృష్టము = చూడబడనిది – భాగ్యము
ఆయుధము = యుద్ధము చేయుటకు తగిన సాధనము – శస్త్రము
యుగాంతము = యుగముల అంతము మహా ప్రళయము
తెలుగు = త్రిలింగముల మధ్య ఉపయోగించబడు భాష – తెనుగు
వాతావరణము = గాలితో కూడి ఉండునది పర్యావరణము
హృదయము = హరింపబడునది గుండెకాయ

4. నానార్థాలు

భాష = బాస, మాట, వ్రతము, ప్రతిన
కథ = కత, పూర్వకథ, చెప్పుట, గౌరి
సుధ = అమృతము, సున్నము, ఇటుక
సొంపు = ఒప్పు, సంతోషం, సమృద్ధి
స్నేహము = చెలిమి, చమురు, ప్రేమ
రాజు = ప్రభువు, పాలకుడు, క్షత్రియుడు, యక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు
పత్రిక = కాగితము, పత్రము, జాబు, వార్తాపత్రిక
అచ్చు = ముద్ర, విధము, ప్రతిబింబము, నాణెము, పోతపోసిన అక్షరములు
పసిడి = బంగారము, ధనము
జీవితము = ప్రాణము, జీతము, జీవితకాలము, జీవనము
అపూర్వము = అపురూపము, తెలియనిది, క్రొత్తది, కారణములేనిది, పరబ్రహ్మము
వంశము = కులము, వెదురు, పిల్లనగ్రోవి, వెన్నెముక, సమూహము
యుగము = కాల పరిమాణ విశేషము, జత, కాళి, వయస్సు, రెండు బార
అదృష్టము = భాగ్యము, కర్మఫలము, చూడబడనిది, అనుభవింపబడనిది
చర్చ = విచారము, చింత, అధ్యయనము చేయుట, పార్వతి
సన్నివేశము = ఇంటివెనుక పెరడు, కలయిక, సమీపము, తావు
సంబంధము = చుట్టరికము, కూడిక
అక్క = పెద్దదైన తోబుట్టువు, పూజ్యస్త్రీ, వంటలక్క, తల్లి
భరణము = భరించుట, కూలి, జీతము

5. ప్రకృతి – వికృతులు

ప్రకృతి – వికృతి

స్నేహము -నెయ్యము
స్వామి – సామి
కవి – కయి
ఆర్య – అయ్య
రాజు – తేడు
పీఠము – పీట
కథ – కత
వృద్ధి – వడ్డీ
అత్యంత – అందంద
అంబ – అమ్మ
స్వీకారం – సేకరము
కథ – కత
జీవితము – జీతము
చిత్రము – చిత్తరువు
త్రిలింగము – తెలుగు
ప్రజ – పజ
అపూర్వము – అపురూపము
విధము – వితము
ఆశ్చర్యము – అచ్చెరువు
నిద్ర – నిదుర
హృదయము – ఎద
రాత్రి – రేయి
వంశము – వంగడము

PAPER – II : PART – B

1. సంధులు

1. సవర్ణదీర్ఘ సంధి

సూత్రం : అ, ఇ, ఉ, ఋలకు సవర్ణములైన అచ్చులు పరమగునప్పుడు వాని దీర్ఘము ఏకాదేశమగును.

ఉదా :
రంగాచార్య – రంగ + ఆచార్య
విద్యాలయం – విద్య + ఆలయం
హిమాలయాలు – హిమ + ఆలయాలు
కోస్తాంధ్ర – కోస్త + ఆంధ్ర
వంశాకురం – వంశ + అంకురం
యుగాంతం – యుగ + అంతం
ఉత్తరాంధ్ర – ఉత్తర + ఆంధ్ర
సార్ధకత – స + అర్ధకత
అపార్ధాలు – అప + అర్ధాలు
కులాతీతము – కుల + అతీతము
మతాతీతము – మత + అతీతము
చారిత్రాత్మకం – చారిత్ర + ఆత్మకం

2. గుణ సంధి

సూత్రం: అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమగునప్పుడు క్రమముగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమగును.

ఉదా :
జాతీయోద్యమం – జాతీయ + ఉద్యమం
మహోన్నతము – మహ + ఉన్నతము

TS 10th Class Telugu Important Questions 12th Lesson భూమిక

2. సమాసాలు

సమాసపదం – విగ్రహవాక్యం – సమాసం పేరు

తెలుగు సాహిత్యము – తెలుగు అను పేరుగల సాహిత్యం – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము

ఉస్మానియా యూనివర్శిటీ – ఉస్మానియా అను పేరుగల యూనివర్శిటీ – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము

హైదరాబాద్ రాజ్యం – హైదరాబాద్ అను పేరుగల రాజ్యం – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము

సమాజ పరిశీలన – సమాజం యొక్క పరిశీలన – షష్ఠీ తత్పురుష సమాసము

తెలంగాణ పలుకుబడులు – తెలంగాణ యొక్క పలుకుబడులు – షష్ఠీ తత్పురుష సమాసము

హైదరాబాద్ రాష్ట్ర చరిత్ర – హైదరాబాద్ రాష్ట్రం యొక్క చరిత్ర – షష్ఠీ తత్పురుష సమాసము

రైతాంగ పోరాటం – రైతాంగము యొక్క పోరాటం – షష్ఠీ తత్పురుష సమాసము

వంశాకురం – వంశమునకు అంకురం – షష్ఠీ తత్పురుష సమాసము

స్వేచ్ఛావాయువులు – స్వేచ్ఛ అనెడి వాయువులు – రూపక సమాసము

అదృష్టం – దృష్ఠం కానిది – నఞ తత్పురుష సమాసము

రాజకీయ పరిణామాలు – రాజకీయములందలి పరిణామాలు – సప్తమీ తత్పురుష సమాసము

శిల్ప నైపుణ్యము – శిల్పము నందు నైపుణ్యము – సప్తమీ తత్పురుష సమాసము

ప్రపంచ ప్రఖ్యాతి – ప్రపంచము నందు ప్రఖ్యాతి – సప్తమీ తత్పురుష సమాసము

3. వాక్య పరిజ్ఞానం

ఈ క్రింది వాక్యాలు ఏ రకానికి చెందినవో వ్రాయండి.

ప్రశ్న 1.
ఈనాటికీ విదేశీయులెవరైనా మన మహానగరాలకు వచ్చినట్లయితే వాళ్ళకు పావురాలు బృందాలు కనిపిస్తాయి.
జవాబు:
చేదర్థక వాక్యం

ప్రశ్న 2.
తెల్ల జెండాలు ఊపుతూ సంకేతాలు అందించే కుర్రాళ్ళు కనబడతారు.
జవాబు:
శత్రర్థక వాక్యం

ప్రశ్న 3.
రంగు రంగుల పావురాలతోనూ, నీలికళ్ళతో కువకువలాడే గువ్వలతోనూ నిండి ఉండడం కద్దు.
జవాబు:
సంయుక్త వాక్యం

ప్రశ్న 4.
అలా కలగలిసి, ఎగసి గంటల తరబడి ఎగిరాక తిరిగి అన్నీ విడివిడిగా తమ తమ యజమానుల ఇళ్ళకు చేరుకుంటాయి.
జవాబు:
సంక్లిష్ట వాక్యం

TS 10th Class Telugu Important Questions 12th Lesson భూమిక

4. కర్తరి – కర్మణి వాక్యాలు

1. కర్తరి : అవి ఒక బృహత్తర సమూహంగా రూపొందుతాయి.
కర్మణి : ఒక బృహత్తర సమూహం వాటిచేత రూపొందించ బడుతుంది.

2. కర్తరి : మా పావురాన్ని హరివిల్లు మెడగాడు అని ముద్దుగా పిలుస్తూ ఉంటాను.
కర్మణి : మా పావురం హరివిల్లు మెడగాడని నా చేత ముద్దుగా పిలువబడుతూ ఉంటుంది.

3. కర్తరి : చిత్రగ్రీవం కథను నేను మొట్టమొదట్నుంచీ మొదలెడతాను.
కర్మణి : నా చేత చిత్రగ్రీవం కథ మొట్టమొదట్నుంచీ మొదలెట్టబడుతుంది.

4. కర్తరి : ఆ రోజును నేను ఎప్పటికీ మరచిపోలేను.
కర్మణి : ఆ రోజు నా చేత ఎప్పటికీ మరచిపోబడదు.

5. కర్తరి : తల్లిపిట్టను మృదువుగా లేపి తీసి ఓ పక్కన ఉంచాను.
కర్మణి : తల్లిపిట్ట నా చేత మృదువుగా లేపబడి తీయబడి ఓ పక్కన ఉంచబడింది.

6. కర్తరి : వాటిని తగు మోతాదులోనే ఉంచాలి.
కర్మణి : అవి తగు మోతాదులోనే ఉంచబడాలి.

7. కర్తరి : ఆ ఆహారాన్ని పిల్లలకు అందిస్తాయి.
కర్మణి : ఆ ఆహారం పిల్లలకు అందించబడుతుంది.

8. కర్తరి : ఆ రోజుల్లోనే నేనో విషయం కనిపెట్టాను.
కర్మణి : ఓ విషయం ఆ రోజులలో నా చేత కనిపెట్ట

9. కర్తరి : ఆ రోజుల్లోనే దాని ఈకల రంగు మారడం గమనించాను.
కర్మణి : దాని ఈకల రంగు మారడం ఆ రోజులలోనే నా చేత గమనించబడింది.

10. కర్తరి : తండ్రిపక్షి జరగటం కొనసాగించింది.
కర్మణి : తండ్రిపక్షిచేత కూడా జరగటం కొనసాగించబడింది.

TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం

Telangana SCERT 10th Class Telugu Guide Telangana 5th Lesson నగరగీతం Textbook Questions and Answers.

TS 10th Class Telugu 5th Lesson Questions and Answers Telangana నగరగీతం

చదవండి – ఆలోచించి చెప్పండి (T.B. P.No. 47)

చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్ళు చెరుగుతున్నప్పుడు
సంసారం బరువెంతో సమీక్షించగలిగినవాణ్ణి
ఆకుపచ్చని చెట్టు, ఆహ్లాదభరితమైన వాతావరణమేమి
లేకుండానే
పగలూరాత్రి ఆస్బెస్టాస్ రేకులకింద పడి ఎంత వేడెక్కినా
మాడిపోకుండా ఉండగల్గిన మానవాతీతుణ్ణి
నరకప్రాయమైన నగర నాగరికతను నరనరానా
జీర్ణించుకున్నవాణ్ణి
రోజుకో రెండు కవితా వాక్యాల్ని రాయలేనా…
అది మనకు పెన్నుతో పెట్టిన విద్య… అఫ్ కోర్సు…
కవిత్వం ఎంత నిత్యనూతనంగా వెలికి వచ్చినా
రాసిన ప్రతిదీ ఆణిముత్యం కాదని అందరికి తెలుసు
– అలిశెట్టి ప్రభాకర్

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
“చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్ళు చెరుగు తున్నప్పుడు” వాక్యం ద్వారా మీరేం గ్రహించారు ?
జవాబు:
అర్ధాంగి ఇంట్లో సరుకులన్నీ ఉన్నప్పుడు సంతోషంగా వంటావార్పులు చేస్తుంది. ఇంట్లో సరుకులు లేనప్పుడు కన్నీళ్ళతో ఖాళీ చేటనే చెరుగుతుంది. చూచేవారికి ఇంట్లో అన్నీ ఉన్నట్లు అనుకుంటారు. దీనిద్వారా సంసారాన్ని నిర్వహించడం ఎంత కష్టమో తెలుసుకోవాలని కవి సూచించాడు.

ప్రశ్న 2.
కవి నివాసం ఎట్లా ఉన్నది ?
జవాబు:
పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం లేనటు వంటి పగలూ, రాత్రి ఆస్బెస్టాస్ రేకుల షెడ్లో రచయిత నివాసం ఉంటున్నాడు. ఆ ఇంట్లో సకల కష్టాలను అనుభవిస్తున్నాడు.

TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం

ప్రశ్న 3.
నగర నాగరికతను నరకప్రాయమని కవి ఎందుకు అని ఉంటాడు ? దానిపై మీ అభిప్రాయాలు చెప్పండి.
జవాబు:
నగర నాగరికత నరకప్రాయమని కవి చెప్పాడు. ఇది యదార్థమే. నగరంలో ప్రశాంత వాతావరణం ఉండదు. కలుషితమైన వాతావరణం ఉంటుంది. శబ్ద కాలుష్యం, ధ్వని కాలుష్యం, నీటి కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. మానవీయ సంబంధాలు అంతగా ఉండవు. జీవితం ఉరుకులుపరుగులతో కూడి ఉంటుంది. అందువల్ల నగర నాగరికతను నరకప్రాయమని కవి చెప్పాడు.

ప్రశ్న 4.
కవితాత్మక వాక్యాలు చదివారు కదా! ఈ కవి గురించి మీకు ఏమర్థమైంది ?
జవాబు:
జీవితాన్ని నిరాశానిస్పృహలతో గడపకూడదని, సాధించాల్సిన దానిని సాధించాలని, నరకప్రాయమైన నగర నాగరికతను కూడా జీర్ణించుకోవాలనే సత్యాన్ని చెప్పినట్లుగా అర్థమవుతుంది.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 50)

ప్రశ్న 1.
పల్లెసీమల్ని కవి తల్లిఒడితో ఎందుకు పోల్చాడు ?
జవాబు:
పల్లెసీమలు ప్రకృతి అందాలకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ప్రశాంత వాతావరణం పల్లెల్లో ఉంటుంది. మరువలేని, మరుపురాని ఆత్మీయతాను బంధాలు పల్లెల్లో ఉంటాయి. అక్కడి ప్రజలు ఒకరి కష్టసుఖాల్లో మరొకరు పాలుపంచుకుంటారు. తల్లి ఒడిలోని పిల్లవానికి ఎంత రక్షణ ఉంటుందో, పల్లెసీమలో ఉండే మనిషికి కూడా అంతటి రక్షణ ఉంటుందనే ఉద్దేశ్యంతో పల్లెసీమల్ని తల్లిఒడితో పోల్చాడు.

ప్రశ్న 2.
పట్టణాలను ‘ఇనప్పెట్టెలు’ అని అనడంలో కవి ఉద్దేశం ఏమై ఉంటుంది ?
జవాబు:
ఇనప్పెట్టెలను డబ్బు దాచుకోవడానికి వాడతారు. అవి చిన్నవిగా, ఇరుకుగా ఉంటాయి. ఇన ప్పెట్టెలో ఊపిరి పీల్చుకోడానికి కూడా గాలి రాదు. నగరాల లోని ఇళ్లలో కూడా తగినంత ఖాళీ ప్రదేశం లేక ఇరుకుగా ఉంటుంది. ఆ దృష్టితోనే కవి నగరాలను ఇనప్పెట్టెలతో పోల్చాడు.

ప్రశ్న 3.
‘నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే’ అనే వాక్యం గురించి మీకు ఏమర్థమైంది ?
జవాబు:
పఠనీయ గ్రంథంలో ఎన్నో విషయాలు చదివి తెలుసు కోవలసినవి ఉంటాయి. వాటిలో ఎంతో సమాచారం దాగి ఉంటుంది. అలాగే నగరంలో నివసించే ప్రతి మనిషికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. అక్కడ ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా జీవనం సాగిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తుల జీవన చరిత్రలు తప్పక తెలుసుకోతగ్గట్టుగా ఉంటాయి. అందుకే నగరంలో ప్రతి మనిషిని పఠనీయ గ్రంథం అని కవి చెప్పాడు.

TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం

ప్రశ్న 4.
“పేవ్మెంట్లపై విరబూసిన కాన్వెంటు పువ్వుల సందడి” అని కవి ఎవరి గురించి అన్నాడు ? దీని గురించి మీ అభిప్రాయం తెలుపండి.
జవాబు:
నగరంలో ఉదయాన్నే సిటీబస్సుల్లో, ఆటోల్లో, పేవ్మెంట్లపై విరబూసిన పువ్వుల్లాంటి స్కూల్ పిల్లలు సందడి చేస్తుంటారు. వారి మాటల్లో చదువుల పుప్పొడి రాలుతుంది. విరబూసిన పువ్వులతో పిల్లలను పోల్చాడు. పిల్లలు సుకుమార మనస్కులు. వారి నవ్వులు ఆహ్లాదంగా ఉంటాయి.

ఆలోచించండి – చెప్పండి. (T.B. P.No. 50)

ప్రశ్న 1.
“సిటీ అంటే అన్నీ బ్యూటీ బిల్డింగ్లు కావు!” ఇది వాస్తవమేనా ? ఎందుకు ?
జవాబు:
సిటీ అంటే అన్నీ బ్యూటీ బిల్డింగ్లు కావు. ఇది వాస్తవమే. ఎందుకంటే ఒకవైపు ఖరీదైన భవంతులు పక్క పక్కనే చిన్న చిన్న పూరిపాకలు సమాంతర గీతలుగా కనిపిస్తాయి. నగరం వైవిధ్యమైన సమస్యల తో, విభిన్న మనస్తత్వాలతో కనిపిస్తుంది. అనగా నగరంలో అందమైన భవనాలేకాదు, మురికివాడలు కూడా ఉంటాయని చెప్పడమే కవి ఉద్దేశ్యం.

ప్రశ్న 2.
రెండు కాళ్ళు, మూడు కాళ్ళు, నాలుగు కాళ్ళు అని కవి అనడంలో ఉద్దేశం ఏమిటి ?
జవాబు:
రెండుకాళ్ళు అంటే కాలినడక, మూడుకాళ్ళంటే రిక్షా, నాలుగుకాళ్ళంటే కారు అని అర్థం. అనగా వారివారి ఆర్థిక స్తోమతనుబట్టి మానవులు ప్రయాణం సాగిస్తారని భావం.

ప్రశ్న 3.
“మహానగరాల రోడ్లకి మరణం నాలుగువైపులు” అంటే ఏమిటి ?
జవాబు:
నగరంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. నగరంలో అన్నివైపులా ప్రమాదాలు పొంచి ఉంటాయి. నగరంలో నాలుగుదిక్కుల్లోని రోడ్లలో మృత్యువు పొంచి ఉంటుందని కవి హెచ్చరిస్తున్నాడు.

ప్రశ్న 4.
నగరాన్ని రసాయనశాల అనీ, పద్మవ్యూహం అనీ కవి అనడంలో ఉద్దేశం ఏమై ఉంటుంది ?
జవాబు:
రసాయనశాల అంటే రసాయనద్రవ్యాలు, ఆమ్లాలు ఉన్న ప్రయోగశాల అని అర్థం. ప్రయోగశాలలో ఏవేవో తెలియని రసాయన ద్రవాలూ, ఆమ్లాలు ఉంటాయి. ఆ ద్రవాలకు వేర్వేరు చర్యలు ఉంటాయి. వాటి చర్యలు అందరికీ అర్థం కావు. నగరం కూడా ఎవరికీ అర్థం కాదు. అందుకే నగరాన్ని కవి “రసాయనశాల” అన్నాడు.

ఇక పద్మవ్యూహం సంగతి. పద్మవ్యూహంలో ప్రవేశించినవాడు తిరిగి తేలికగా బయటకు రాలేడు. అక్కడే జీవనపోరాటం చేస్తూ మరణిస్తాడు.

నగరం కూడా ఇటువంటిదే, బతుకు కోసం నగరానికి వచ్చిన సామాన్యులకు ఉపాధి దొరకక పోయినా వారు ఏదో ఒక రోజున దొరుకుతుందనే ఆశతో, నగరంలోనే ఉండి దానికై ఎదురుచూస్తూ ఉంటారు. నగరంలోని సౌకర్యాలకూ, వినోద విలాసాలకూ, పైపై మెరుగులకూ వారు లొంగిపోతారు. మరోవైపు నిరుద్యోగం, అధిక ధరలు భయపెడుతున్నా నగరాన్ని విడిచి వారు వెళ్ళలేరు. వారిని కాలుష్యం కలవరపెట్టినా, వింత వింత జబ్బులు పీడిస్తున్నా, ట్రాఫికామ్లలో చిక్కుకుంటున్నా వారు నగరాన్ని విడిచి ప్రశాంతమైన తమ పల్లెలకు వెళ్ళలేరు. అందుకే కవి నగరాన్ని “పద్మవ్యూహం” అని పిలిచాడు.

TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
క్రింది అంశాలలో ఒకదాని గురించి చర్చించండి.

అ) మీరు ఇప్పటివరకు ఏయే నగరాలను చూశారు ? మీరు చూసిన నగరాల్లో మీకు నచ్చిన, నచ్చని అంశాలు తెలుపండి.
జవాబు:
నేను ఇప్పటి వరకు ఎన్నో నగరాలు చూశాను. వాటిలో నాకు నచ్చిన అంశాలు ఉన్నాయి, నచ్చని అంశాలు కూడా ఉన్నాయి. వాటిని ఈ పట్టిక ద్వారా తెలియజేస్తున్నాను.
TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం 1
TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం 2

ఆ) మీ ఊరి నుండి ఎవరైనా నగరాలకు వలస వెళ్ళారా ? ఎందుకు వెళ్ళవలసి వచ్చింది ? వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు ?
జవాబు:
మా ఊరు నుండి ఎంతోమంది యువతీయువకులూ, వివిధమైన చేతివృత్తులవారూ, బ్రాహ్మణులూ హైదరాబాద్ నగరానికి వలస వెళ్ళారు.

వలస వెళ్ళడానికి కారణం : మా గ్రామంలో వారికి సరైన ఉపాధి సౌకర్యాలు లేవు. విద్యా వైద్య సదుపాయాలు లేవు. ఇక్కడ వారికి ఉద్యోగాలు దొరకలేదు. అందువల్ల వారు నగరానికి వలస పోయారు. మా గ్రామంలో వ్యవసాయం వారికి గిట్టుబాటు కానందున, చిన్న చిన్న ఉద్యోగాల కోసం, కూలిపనుల కోసం, తాపీ, వడ్రంగం వంటి వృత్తుల వారు సైతం నగరాలకు వలసవెళ్ళారు. మరికొందరు యువకులు, సినీమా పరిశ్రమలో చేరి, తమ నైపుణ్యాన్ని పెంపొందించుకొని, నటులుగా కళాకారులుగా అభివృద్ధి చెందాలని. నగరానికి వలస వెళ్ళారు.

కొందరు యువకులు అక్కడ కూలీ పనులు చేస్తున్నారు. కొందరు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు. కొందరు లఘుపరిశ్రమలు పెట్టారు. కొందరు బ్రాహ్మణులు గుళ్ళలో పూజారులుగా, పురోహితులుగా పనిచేస్తున్నారు. కొందరు తమకు తెలిసిన చేతివృత్తులు చేసుకుంటూ అపార్ట్మెంట్ల వద్ద కాపలాదార్లుగా పనిచేస్తున్నారు.

ఇంజనీరింగ్ చదివిన యువతీ యువకులు నగరంలో శిక్షణ పొంది, చిన్న పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారిలో కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా, ప్రభుత్వంలో ఉద్యోగులుగా, ప్రైవేటు పరిశ్రమల్లో కార్మికులుగా, కొందరు నిరుద్యోగులుగా ఉంటున్నారు. కొందరు వైద్యశాలల్లో నర్సులుగా పనిచేస్తున్నారు.

ప్రశ్న 2.
పాఠం ఆధారంగా కింది కవితా పంక్తుల్లో దాగిన అంతరార్థాన్ని గుర్తించి రాయండి.

అ) నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే.
జవాబు:
పట్టణాల్లో నివసిస్తున్న ప్రతిమనిషి వెనుక ఎంతో చరిత్ర ఉంటుంది. వారంతా ఏదో వృత్తిని అన్వేషిస్తూ అక్కడకు వచ్చినవారే అయి ఉంటారు. వారిలో కొందరు నిరుద్యోగులు, కొందరు చిరుద్యోగులు, కొందరు విద్యార్థులుగా, బీదవారుగా, కొందరు మధ్యతరగతి వారుగా ఉంటారు. వారు ఎన్నో రకాల సమస్యలలో చిక్కుపడి ఉంటారు. వారందరిని గూర్చి పూర్తిగా తెలుసుకోవలసిన అవసరం ఉందని పై వాక్య సారాంశము.

గ్రంథం అట్ట చూసినంత మాత్రాన ఆ గ్రంథంలోని విషయం ఏమిటో తెలియదు. అలాగే నగరవాసి పై వేషభాషల్ని బట్టి అతడి చరిత్రను గ్రహించలేము. నగరవాసిని అడిగి తెలుసు కోవాలి. అతడు చదివి తెలుసుకోవలసిన పుస్తకం వంటి వాడని భావం.

ఆ) నగరం మహావృక్షంమీద ఎవరికి వారే ఏకాకి.
జవాబు:
వృక్షాలమీద ఉండే పక్షులు పరస్పరం కలిసిపోయి కలివిడిగా ఉంటాయి. నగరమనే మహావృక్షంమీద నివసించే ఈ మనుషులు సాటిమనిషితో ఎటువంటి ఆత్మీయ పలకరింపులు లేకుండా ఇరుగూ పొరుగనే భావన లేకుండా ఎవరికి వారే ఏకాకిగా బతుకు తుంటారు. ఈ యాంత్రిక మానసిక స్థితిని కవి నిరసిస్తున్నాడు.

ఇ) మహానగరాల రోడ్లకు మరణం నాలుగు వైపులు.
జవాబు:
నగరంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. నగరంలో అన్నివైపులా ప్రమాదాలు పొంచి ఉంటాయి. నగరంలో నాలుగు దిక్కుల్లోని రోడ్లలో మృత్యువు పొంచి ఉంటుందని కవి హెచ్చరిస్తున్నాడు. కావున రోడ్లపై జాగ్రత్తగా వెళ్ళాలని కవి స్పష్టం చేయదలచుకున్నాడు.

TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం

ప్రశ్న 3.
క్రింది వచన కవితను చదవండి.

నా జ్ఞాపకాల్లో గూడు కట్టుకొన్న మమతల ముల్లె
మలిన మెరుగని మట్టి మనుషుల ఎదమల్లె నా పల్లె!

చుట్టూ బాంధవ్యాల పాతాళ గరిగె నా పల్లె
అనుబంధాల పెరుగు గురిగి నా పల్లె!
తనువంతా తంగేడు పూలు పేర్చుకొన్న బతుకమ్మ
కాపురాజయ్య గీతల్లో బోనాలెత్తిన పల్లెపడతి బొమ్మ

అసోయ్ దూలాల పీరీల పండుగ
అలాయ్ బలాయ్లా దసరా పండుగ
ఆటల అల్లిబిల్లి జూలా నా పల్లె!
నా పల్లెలో మా ఇళ్ళు
ఊరంతటికి ఆనందాల్ని పంచే లోగిళ్ళు!

కవిత చదివారు కదా! కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) కవితలోని ప్రాస పదాలను గుర్తించి రాయండి.
జవాబు:
మమతల ముల్లె
ఎదమల్లె నా పల్లె
పాతాళగరిగె నా పల్లె

గురిగి నా పల్లె
పేర్చుకొన్న బతుకమ్మ
పల్లెపడతి బొమ్మ

పీరీల పండుగ
దసరా పండుగ
నా పల్లె
మా ఇళ్ళు
పంచే లోగిళ్ళు !

ఆ) కవితలో కవి ఏయే పండుగలు ప్రస్తావించాడు ?
జవాబు:
బతుకమ్మ, బోనాలు, పీరీల పండుగ, అలాయ్, బలాయ్, దసరా పండుగ.

ఇ) మనుషుల నడుమ బాంధవ్యాలను కవి వేటితో పోల్చాడు ?
జవాబు:
పాతాళ గరిగె, అనుబంధాల పెరుగు గురిగితో పోల్చాడు.

ఈ) కవితకు శీర్షిక పెట్టండి. ఎందుకు ఆ శీర్షిక పెట్టారో వివరించండి.
జవాబు:
ఈ కవిత కు శీర్షిక “నా పల్లె”. ఈ వచన కవితలో అంతా చక్కని పల్లె గురించి రాసాడు. కాబట్టి “నా పల్లె” అనే శీర్షిక పెట్టాను.

TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) అలిశెట్టి ప్రభాకర్ గురించి వ్రాయండి.
జవాబు:
కరీంనగర్ జిల్లా జగిత్యాల అలిశెట్టి ప్రభాకర్ జన్మస్థలం. మొదట చిత్రకారుడుగా జీవితం ప్రారంభించాడు. ప్రారంభంలో పండుగల, ప్రకృతి దృశ్యాల, సినీనటుల బొమ్మలను పత్రికలకు వేశాడు. తరువాత జగిత్యాలలో సాహితీ మిత్రదీప్తి’ సంస్థ పరిచయంతో కవిత్వ రంగంలోకి ప్రవేశించాడు. 1974 లో ఆంధ్రసచిత్ర వార్తాపత్రికలో వచ్చిన ‘పరిష్కారం’ అచ్చయిన ఆయన మొదటి కవిత. ఎర్ర పావురాలు (1978) మొదటి కవితా సంకలనం.

మంటల జెండాలు, చురకలు (1979), రక్తరేఖ (1985), ఎన్నికల ఎండమావి (1989), సంక్షోభగీతం (1990), సిటీలైఫ్ (1992) అచ్చయిన కవిత్వ సంకలనాలు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్ళపాటు సీరియల్గా ‘సిటీలైఫ్’ పేరుతో హైదరాబాదు నగరంపై రాసిన మినీ కవితలతో ప్రఖ్యాతిపొందాడు. తన కవిత్వంతో పాఠకుల్లో ఆలోచనాదృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన కవి అలిశెట్టి ప్రభాకర్.

ఆ) ‘నగరజీవికి తీరిక దక్కదు, కోరిక చిక్కదు’ అనే కవితా పంక్తుల్లోని వాస్తవాన్ని వివరించండి.
జవాబు:
నగరవాసులకు తీరిక ఉండదు. నగరంలో ఉద్యోగాలు చేసేవారు ఉదయమే బయలుదేరి దూరంగా ఉన్న తమ కార్యాలయాలకు ఉరుకులు పరుగులు పెడుతూ వెళ్లాలి. ట్రాఫిక్ఆమ్లు ఉంటాయి. కాబట్టి ఆఫీసు వేళకు చాలా ముందుగానే వారు బయలుదేరాలి. తిరిగి వచ్చేటప్పటికి పొద్దుపోతుంది.

అలాగే కూలిపనులు చేసి జీవించే వారికి కూడా వారికి పని దొరికే ప్రాంతానికి రావడానికీ, పోవడానికీ ఎంతో సమయం పడుతుంది. అందుచేత వారికి కూడా తీరిక దక్కదు.

ఎంత కష్టపడినా నగరజీవి చిరుసంపాదనతో వారి కోరికలు తీరవు. తిండికి, బట్టకూ, ప్రయాణాలకూ వారికి ఖర్చయిపోతుంది. అందువల్ల నగరవాసులకు తీరిక దక్కదు, కోరిక చిక్కదు అని కవి నిజం చెప్పాడు.

ఇ) నగర జీవితంలోని ప్రతికూల అంశాలను ఇంత కఠినంగా వర్ణించడంలో కవి ఆంతర్యం ఏమిటి ?
జవాబు:
‘నగరగీతం’ అనే పాఠ్యభాగం ద్వారా కవి నగర జీవన చిత్రాన్ని చక్కగా ఆవిష్కరించాడు. నగరంలోని కష్టాలను వివరించాడు. ప్రమాదాల గురించి, అసమానతల గురించి కూడా కవి చక్కగా తెలియజేశాడు.

కవి ఇంత కఠినంగా నగర జీవన చిత్రాన్ని ఆవిష్కరించడంలో ఆంతర్యం లేకపోలేదు. ముఖ్యంగా నగర జీవన విధానంలో మార్పు రావాలని, ప్రజలమధ్య అసమానతలు తొలిగి, ఐకమత్యం వర్థిల్లాలని, మురికి వాడలులేని సుందర నగరం ఉండాలని కవి ఆకాంక్షించాడు. అందుకోసమే నగర ప్రజలను జాగృతం చేయదలిచాడు.

ఈ) నగరంలో మనిషి జీవన విధానం గురించి పాఠం ఆధారంగా వివరించండి.
జవాబు:
‘నగరగీతం’ అనే పాఠ్యభాగంలో అలిశెట్టి ప్రభాకర్ నగర జీవన చిత్రాన్ని చక్కగా ఆవిష్కరించారు. నగరంలో జీవించే ప్రజల కష్టసుఖాలను వివరించిన తీరు అద్భుతంగా ఉంది. నగర ప్రజలు ఎప్పుడూ రణగొణ ధ్వనులతో ఇబ్బందులు పడతారు. ఇరుకైన ఇండ్లలోను, మురికివాడల్లోను జీవనం సాగిస్తారు. నగరంలోని మనిషి వెనుక ఆసక్తికరమైన ఆనంద, విషాద గాథలు ఉంటాయి. నగర ప్రజలకు ఏనాడు విశ్రాంతి దొరకదు. సంపాదించిన ధనంతో కోరికలను తీర్చుకోలేరు. రోడ్డు ప్రమాదాలతో ప్రజలు అవస్థలుపడతారు. చిక్కు విడదీయలేని పద్మవ్యూహంలాంటి నగరంలో ప్రజల దుస్థితి హృదయ విదారకంగా ఉంటుంది.

ప్రశ్న 2.
క్రింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ)
నేడు నగర జీవనం ఎందుకు సంక్లిష్టంగా మారిందో విశ్లేషించండి.
(లేదా)
నేడు నగర జీవితం ఎలా ఉన్నదో తెలుపండి.
(లేదా)
‘నగర జీవనం’ పాఠ్యాంశం ఆధారంగా నగరం ఎంత సంక్లిష్టంగా మారిందో వివరించండి.
జవాబు:
ప్రజలు వలసపోవటం : బ్రతుకు తెరువుకోసం, ఉపాధి కోసం ఎక్కువమంది పల్లె ప్రజలు నగరాలకు వలస పోవటం.
జనాభా పెరుగుదల : విద్యా, ఉద్యోగ అవకాశాలు, వైద్య సదుపాయాలు నగరాల్లో ఎక్కువగా ఉంటాయని ప్రజలు నగరాలకు వెళ్ళడంతో విపరీతంగా జనాభా పెరగటం.
రద్దీ పెరగటం : ప్రమాదాలు జరగటం, ఎప్పుడూ రోడ్లు రద్దీగా ఉండడంతో ప్రతిరోజు ప్రమాదాలు ఎక్కువగా జరగటం.

నీటి సమస్య : చెరువుల భూమి ఆక్రమణలకు గురియై భూగర్భ జలాలు తగ్గి త్రాగునీటికి, వాడుక నీటికీ కొరత ఏర్పడటం, ఉన్న చెరువులు, బావులు అవసరాలకు చాలకపోవటం.
కాలుష్యం పెరగటం : వాహనాలు, కర్మాగారాల్లో ఇంధనం ఎక్కువగా వాడటం, మురుగునీటి సౌకర్యాలు లేకపోవటంతో జల కాలుష్యం, వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం పెరగటం.

ధరల పెరుగుదల : జనాభా పెరగటంతో వస్తువులకు గిరాకీ పెరిగి ధరలు విపరీతంగా పెరిగిపోవటం. విదేశీ సంస్కృతి ప్రభావం : భిన్న సంస్కృతులు ప్రజలు ఒక్కచోట ఉండటంతో ప్రజలు విదేశీ వ్యామోహానికి గురికావటం.

సగటు మనిషి పడేపాట్లు : ఇరుకు ఇళ్ళల్లో, అధిక ధరలతో, రణగొణ ధ్వనులతో, నీటి వసతులు లేక, నిరంతరం జీవనపోరాటం చేస్తూ పద్మవ్యూహం లాంటి నగరంలో సగటు మనిషి ఎన్నో అగచాట్లు పడు తున్నాడు. క్లిష్ట సమస్యలను మానసిక సంఘర్షణతో ఎదుర్కోవటంతో నేడు నగర జీవితం నరకప్రాయంగా మారుతుంది.

TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం

ప్రశ్న 3.
క్రింది అంశాల గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

అ) మన పరిసరాల పరిశుభ్రత కోసం అందరూ కృషి చేయాలని తెలిపేటట్లు కరపత్రం రాసి ప్రదర్శించండి.
జవాబు:
పర్యావరణ పరిరక్షణ – పర్యావరణ స్పృహ

ఉపోద్ఘాతము :

మనము నివసించు భూమిపై మానవులే గాక గాలి, నీరు, చెట్లు, పర్వతాలు మొదలైనవి ఉంటాయి. ఈ మొత్తాన్నే వాతావరణం లేదా పర్యావరణం అంటారు. మనము ఎల్లప్పుడూ చక్కని ఆరోగ్యంతో ఉండాలంటే వీటిపై చక్కని అవగాహన కలిగి ఉండాలి. ఇట్లు అవగాహన కలిగి ఉండుటనే “పర్యావరణ స్పృహ” అని అంటారు. ప్రస్తుతం ఈ ఆధునిక యుగంలో మనం పీల్చేగాలి, త్రాగేనీరు, నివసించు స్థలం ఇవన్నీ కలుషితమే. రోజురోజుకీ మన ఆరోగ్యాన్ని హరిస్తూ ఆయుష్షును తగ్గిస్తున్నాయి. ఈ కాలుష్యం అనేది ప్రధానంగా 4 రకాలుగా ఉంటుంది.

1. వాయు కాలుష్యం
2. జల కాలుష్యం
3. ధ్వని కాలుష్యం
4. భూమి కాలుష్యం

1) వాయు కాలుష్యం : మనం ఎంతటి సౌకర్య వంతమైన జీవితం గడుపుతున్నా మనం ఉదయం పూట పీల్చే రెండు గంటల గాలి తప్ప మిగిలిన గాలంతా విషతుల్యమే. ఫ్యాక్టరీలు, వాహనాలు వదిలే పొగతో పాటు బొగ్గు, వంటచెరకు, చెత్తా చెదారం వంటివి కాల్చడం వలన మన ఎముకలకు, మూత్ర పిండాలకు, ఊపిరితిత్తులకు హాని జరిగి, అనేక రకాల భయంకరమైన రోగాలు వచ్చు ప్రమాదం ఉంది.

2) జలకాలుష్యం : నేడు మన భారతదేశంలోని ముఖ్యమైన 14 నదులతో పాటు అనేక ఉపనదులు, సరస్సులు, చెరువులు, తీవ్రమైన కాలుష్యానికి గురి అవుతున్నాయి. ఫ్యాక్టరీల నుండి వెలువడు మలినాలు, విషపదార్థాలు అనేకం నీటిలో కలవడం వలన జలకాలుష్యం జరుగుతున్నది. ప్రస్తుతం ప్రజలలో చాలా ఎక్కువ మంది ఈ నీటి కాలుష్యం వల్లనే బాధలు అనుభవిస్తున్నారు. దీని వలన మనకు కలరా, టైఫాయిడ్, మలేరియా మరియు డయేరియా వంటి వ్యాధులు వస్తాయి.

3) ధ్వని కాలుష్యం : ధ్వని కాలుష్యం నేడు పెద్ద పెద్ద పట్టణాలలో తీవ్రతరం అగుచున్నది. మోటారు వాహనాలు, ఫ్యాక్టరీలు, విమానాలు, రైల్వేలు, లౌడుస్పీకర్లు మొదలైనవి ధ్వని కాలుష్యానికి కారణాలు. దీని వలన మనకు చెవుడు, జ్ఞాపకశక్తి తగ్గిపోవుట, ఏకాగ్రత లోపించుట, తలనొప్పి, జీర్ణశక్తి తగ్గుట, రక్తపోటు గుండెదడ వంటి జబ్బులు వస్తాయి.

4) భూమి కాలుష్యం : ప్రాణులన్నీ భూమిపైనే నివసిస్తాయి. మనం జీవించడానికి కావలసిన ఆహారం భూమిపైనే లభిస్తుంది. అటువంటి భూమి రసాయన ఎరువుల వాడకం వల్ల నిస్సారమై పోతోంది. చెత్త, చెదారం, ప్లాస్టిక్ సంచుల వాడకం మొదలైన కారణాల వల్ల భూమి సమతౌల్యం దెబ్బతింటోంది.

కాలుష్య నివారణ మార్గాలు : వాతావరణం మనకు రక్షణ కవచం వంటిది. కాబట్టి చక్కని ఆరోగ్యం అందరికి కావలెనన్న ఈ పర్యావరణ పరిరక్షణ బాధ్యతను మనం మనందరి బాధ్యతగా గుర్తించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కాలుష్య నివారణకు తగిన చర్యలు చేపట్టాలి. వాహనాలు పొగను తగ్గించాలి.

నీరు కలుషితం కాకుండా చెరువులు, బావుల యందలి నీటిలో క్లోరిన్ వంటి క్రిమి సంహారక మందులు కలపాలి. మొక్కలు విస్తారంగా నాటి, సాధ్యమైనంత విశాల భూమిని పచ్చపచ్చగా ఉంచాలి. దంపతులైన వారు విధిగా కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించాలి. ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని నిషేధించాలి. ఎల్లరూ కూడ “వన రక్షణే జన రక్షణ” అన్న సూక్తిని మరువరాదు. “వృక్షో రక్షతి రక్షితః” “చెట్లు పెంచితే క్షేమం – నరికితే క్షామం”.

III. భాషాంశాలు

పదజాలం

1. క్రింది పదాలకు అర్థాలు రాయండి.

అ) నగారా
ఆ) సందడి
ఇ) ఘోష
ఈ) పఠనీయ గ్రంథం
జవాబు:
అ) నగారా : పెద్ద ఢంకా
ఆ) సందడి : జన సమూహధ్వని
ఇ) ఘోష : ఉరుము, ఆవులమంద, కంచు
ఈ) పఠనీయ గ్రంథం : చదువదగిన గ్రంథము

TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం

2. క్రింది పదాలకు పర్యాయపదాలు రాసి వాటితో వాక్యాలు రాయండి.

అ) నరుడు
ఆ) అరణ్యం
ఇ) రైతు
ఈ) పువ్వు
ఉ) మరణం
ఊ) వాంఛ
ఎ) వృక్షం

ఉదా ॥ పల్లె – గ్రామం, జనపదం

పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అని గ్రామస్వరాజ్యం కోసం గాంధీజీ కలలు కన్నాడు. జనపదాలను బాగుజేసుడే దేశ సౌభాగ్యమనుకున్నాడు.

అ) నరుడు – మానవుడు, మనిషి
నరుడు జ్ఞానవంతుడని, లోకంలో మానవుడు సాధించ లేనిది ఏదీలేదన్నారు. మనిషి తన శక్తి సామర్థ్యాలను వినియోగించుకోవాలి.

ఆ) అరణ్యం – విపినం, అడవి
అరణ్యంలో ప్రకృతి సౌందర్యం ఉట్టిపడుతుండటం వల్ల సింహాలు విపినంలో నివసిస్తాయి. అడవి జంతువులకు రక్షణ కావాలి.

ఇ) రైతు – కర్షకుడు, కృషీవలుడు

రైతు లేనిదే రాజ్యం లేదు. కర్షకుడు పండిస్తే పంటలు పండుతాయి అందువల్ల మనమంతా కృషీవలునికి ఋణపడియున్నాము.

ఈ) పువ్వు – కుసుమం, పుష్పం
ఉద్యానవనంలో గులాబీపువ్వు, మందార కుసుమం, మల్లెపుష్పం ఉన్నాయి.

ఉ) మరణం – మృత్యువు, చావు
పుట్టినవానికి మరణం తప్పదని తెలిసినా మానవుడు మృత్యువుకు భయపడతాడు. చావును ధైర్యంగా ఎదుర్కొనాలి.

ఊ) వాంఛ – కోరిక, ఇచ్ఛ
రవి తీరని వాంఛలను పొందలేక, వేరొక కోరిక కోరాడు. తన ఇచ్ఛ నెరవేరలేదని దిగులు చెందాడు.

ఎ) వృక్షం – చెట్టు, తరువు
ఇంటి ముందు వృక్షం ఉంటే ఆ చెట్టు గాలికి పరవశిస్తాము. తరువులపై జీవనం నిలిచియుంది.

వ్యాకరణాంశాలు

ప్రశ్న 1.
క్రింది కవితా భాగాల్లోని అలంకారాన్ని గుర్తించండి.

అ)నగారా మోగిందా
నయాగరా దుమికిందా
జవాబు:
ఇది అంత్యానుప్రాసాలంకారానికి చెందినది. ఇందులో ‘దా’ అనే హల్లు రెండు పదాల్లోను అంత్యంలో ప్రయోగించబడింది. అందువల్ల ఇది అంత్యానుప్రాసాలంకారం.

లక్షణం : ప్రాస పాదం చివర ఒక అక్షరంగాని, అక్షర సముదాయంగాని ఉండేటట్లు రచన చేయడాన్ని ‘అంత్యానుప్రాసం’ అని అంటారు.

ఆ)కొందరికి రెండు కాళ్ళు
రిక్షావాళ్ళకి మూడు కాళ్ళు
ఉన్నవాళ్ళకి నాలుక్కాళ్ళు
జవాబు:
ఇక్కడ అంత్యానుప్రాసాలంకారం ఉంది. ఈ ఉదాహరణలోని పాదాల్లో చివరగా ‘కాళ్ళు’ అనే హల్లుల జంట అంత్యప్రాసగా వాడబడింది. అందువల్ల ఇక్కడ అంత్యానుప్రాసాలంకారం ఉంది. లక్షణం : ప్రాస పాదం చివర ఒక అక్షరంగాని, అక్షర సముదాయంగాని ఉండేటట్లు రచన చేయడాన్ని ‘అంత్యానుప్రాసం’ అని అంటారు.

TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం

ప్రశ్న 2.
క్రింది పద్యాలలోని అలంకారాలను గుర్తించండి.

అ) అడిగెద నని కడువడిఁ జను
నడిగినఁదను మగుడ నుడుగఁడని నడ
యుడుగున్
వెడవెడ చిడిముడి తడఁబడ
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్
జవాబు:
ఇది వృత్త్యనుప్రాసాలంకారం.
లక్షణము : ఒకే హల్లు పలుమార్లు ఆవృత్తము చెందినది. కావున దీనిని వృత్త్యనుప్రాసాలంకారం అంటారు.

ఆ) రంగదరాతిభంగ; ఖగరాజతురంగ, విపత్పరంపరో
త్తుంగ తమఃపతంగ; పరితోషితరంగ, దయాంతరంగ; స
త్సంగ; ధరాత్మజా హృదయ సారస భృంగ; నిశాచరాబ్జ మా
తంగ; శుభాంగ ! భద్రగరి దాశరథీ! కరుణా పయోనిధీ !
జవాబు:
ఇందులో అంత్యానుప్రాసాలంకారం ఉంది. ఇక్కడ అంత్యప్రాసగా ‘గ’ అనే ఒకే హల్లు, రంగ అనే హల్లుల జంట వాడబడినాయి. అందువల్ల ఇక్కడ అంత్యాను ప్రాసాలంకారం ఉంది.

లక్షణం : ప్రాస పాదం చివర ఒక అక్షరంగాని, అక్షర సముదాయంగాని ఉండేటట్లు రచన చేయడాన్ని ‘అంత్యానుప్రాసం’ అని అంటారు.

రూపకాలంకారము

క్రింది వాక్యాలను పరిశీలించండి.

  1. ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేస్తాడు.
  2. బతుకాటలో గెలుపు ఓటములు సహజం.
  3. వానజాణ చినుకుపూలను చల్లింది.
  4. నవ్వులనావలో తుళ్ళుతూ పయనిస్తున్నాం..

పై వాక్యాలను గమనించారు కదా ! ఏం అర్థమయ్యింది. మొదటి వాక్యంలో జ్ఞానమే జ్యోతిగా చెప్పబడింది. ఇందులో జ్ఞానం ఉపమేయం.
జ్యోతి ఉపమానం. ఈ రెండింటికి భేదం లేనట్లు (అభేదం)గా చెప్పబడింది. ఇట్లా అభేదం చెప్పడాన్నే ‘రూపకాలంకారం’ అంటారు.
ఉదా :నగరారణ్య హోరు నరుడి జీవనఘోష.

సమన్వయం:ఇందులో నగరం ఉపమేయం. అరణ్యం ఉపమానం. ఇక్కడ ఉపమేయమైన నగరానికి, ఉపమానమైన అరణ్యానికి భేదం ఉన్నా, లేనట్లే చెప్పబడింది. కాబట్టి ఇది రూపకాలంకారం.
(ii) (iii) (iv) లలో ఒక వాక్యానికి సమన్వయం రాయండి.
జవాబు:
ii) బతుకాటలో గెలుపు ఓటములు సహజం.
సమన్వయం : ఈ వాక్యంలో బతుకు, ఆట వేరువేరు కాదు. బతుకు ఉపమేయం, ఆట ఉపమానం. ఈ రెండింటికి భేదం ఉన్నా లేనట్లు చెప్పబడింది. కాబట్టి ఇది రూపకాలంకారం.

iii) వానజాణ చినుకుపూలను చల్లింది.

సమన్వయం : వాన ఉపమేయం – జాణ ఉపమానం
చినుకు ఉపమేయం – పూలను
ఉపమానం.వాన, జాణ వేరైనప్పటికి అభేదం (భేదం లేనట్లు) చెపితే అది రూపకాలంకారం.

iv) ‘నవ్వులవానలో తుళ్ళుతూ పయనిస్తున్నాం’.

సమన్వయం : నవ్వులు అనేది ఉపమేయం వాన అనేది ఉపమానం భేదం లేనట్లు చెప్పటం.

పై ఉదాహరణలలో ఉపమేయమునకు, ఉపమాన మునకు భేదం ఉన్నా లేనట్లు చెప్పబడింది. కావున `ఇది రూపకాలంకారం.

ఇలాంటివి పాఠంలో వెతికి రాయండి. సమన్వయం చేయండి.
1. చదువుల పుప్పొడి
2. నగరం మహావృక్షం

1 వ వాక్యం : చదువుల పుప్పొడి
సమన్వయం : ఇందులో ‘చదువులు’ అనేది ఉపమేయం. ‘పుప్పొడి’ అనేది ఉపమానం. ఇక్కడ ఉపమేయమైన చదువులకు, ఉపమానమైన పుప్పొడికి, భేదం ఉన్నా, లేనట్లే చెప్పబడింది. కాబట్టి ఈ వాక్యంలో రూపకాలంకారం ఉంది.
2 వ వాక్యం : నగరం మహావృక్షం.
సమన్వయం: ఇందులో ‘నగరం’ అనేది ఉపమేయం. ‘మహావృక్షం’ అనేది ఉపమానం. ఇక్కడ ఉపమేయమైన నగరానికీ, ఉపమానమైన మహావృక్షానికీ భేదం ఉన్నా, లేనట్లే చెప్పబడింది. కాబట్టి ఈ వాక్యంలో రూపకాలంకారం ఉంది.

ప్రాజెక్టు పని

పల్లెలు / పట్నాలలోని జీవన విధానానికి గల తేడాలు పట్టికగా రాయండి. నివేదిక రాసి ప్రదర్శించండి.
జవాబు:
TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం 3

మీకు తెలుసా ?

పట్టణ వీధుల్లో విద్యుత్తు వాడకం తక్కువగా ఉండటానికి నియాన్ దీపాలను వాడుతారు. అయితే ఈ నియాన్ దీపాల వెలుగు ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నదని ‘ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సస్టైనబుల్’ అనే సంస్థ ప్రకటించింది. ముంబయి నగరంలో నియాన్ దీపాల వాడకాన్ని నిషేధించాలని ముంబయి నగరపాలక సంస్థ మీద కోర్టులో కేసు వేసింది. ముంబయి కోర్టు ఒక కమిటీని ఏర్పరచింది.

కమిటీ నివేదిక ప్రకారం నియాన్ దీపాల వెలుగు చాలా ఎక్కువగా ఉంటే మూర్ఛరోగం వచ్చే అవకాశం ఉంటుంది. కళ్ళు, మెదడుకు హాని కలిగిస్తుంది. అధికరక్తపీడనం, నరాలక్షీణత, అల్సరు వంటి రోగాలకు కారణమవుతుంది. అందువలన రాత్రి పదకొండు గంటలనుండి నియాన్ దీపాలను వాడరాదని హైకోర్టు తీర్పునిచ్చింది.

విశేషాంశాలు :

1.పద్మవ్యూహం : మహాభారతంలో ఈ మాట ఉంది. బయటకు వెళ్ళడానికి వీలు లేకుండా కట్టుదిట్టంగా శత్రువును బంధించే యుద్ధ వ్యూహం ఇది. భారతంలో అభిమన్యుడు ఈ పద్మవ్యూహంలో చిక్కుకొని వీర మరణాన్ని పొందాడు. ఎవరైనా తమ శత్రువులు పన్నిన, సంక్లిష్టమైన ఉచ్చులో పడినట్టయితే “అతడు పద్మ వ్యూహంలో చిక్కుకున్నాడు” అంటారు.

సూక్తి : సహజమైన పర్యావరణ పరిసరాలవల్ల జీవనానందం పునరుత్తేజం పొందుతుంది.
జీవించాలనే తపన నిరంతరం పునరావృత్తమవుతుంది.

TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం

అర్థ తాత్పర్యాలు

I

నగారా మోగిందా
నయాగరా దుమికిందా
నాలుగురోడ్ల కూడలిలో ఏమది ?
అదే, నగరారణ్యహోరు నరుడి జీవనఘోష

తల్లి ఒడివంటి
పల్లెసీమల్నొదిలి
తరలివచ్చిన పేదరైతులూ
ఇనప్పెట్టెల్లాంటి
ఈ పట్టణాల్లో
ఊపిరాడని మీ బతుకులూ

నగరంలో ప్రతిమనిషి
పఠనీయ గ్రంథమే
మరి నీ బతుకు
పేజీలు తిరగేసేదెవరో!

ఉదయమే
బస్సుల్లో రిక్షాల్లో
పేవ్మెంట్లపై విరబూసిన
కాన్వెంటు పువ్వుల సందడి
రాలే చదువుల పుప్పొడి!

అర్ధాలు

మినీ కవిత = గొప్ప ప్రాధాన్యం కల విషయాన్ని కొద్దిమాటలలో చెప్పడం (Mini Poetry)
నగారా, మోగిందా = పెద్ద ఢంకా, చేసిందా శబ్దం
నయాగరా దుమికిందా = ‘నయాగరా’ అనేది అమెరికాలోని పెద్ద జలపాతం. అది కిందికి దుమికిందా ? (దుమికినపుడు పెద్ద ధ్వని వస్తుంది.)
నాలుగురోడ్ల కూడలిలో = నాలుగు రోడ్లూ కలిసే చోటులో (Four Roads Junction)
ఏమది (ఏమి + అది) = ఏమిటి అది ?

అదే = ఆ ధ్వని
నగరారణ్యహోరు
(నగర +అరణ్య, హోరు) = పట్టణం అనే అరణ్యంలో వినిపించే ధ్వని, గాలి వీచేటప్పుడు వచ్చే ధ్వనిని “హోరు” అంటారు.
నరుడి, జీవనఘోష = మానవుడి బ్రతుకు పోరాటం లోంచి వచ్చిన ఉరుము వంటి శబ్దం.
తల్లి ఒడివంటి = అమ్మ ఒడిలాంటి
పల్లెసీమల్నొదిలి
(పల్లె సీమలన్+వొదిలి) = గ్రామ సీమలను వదలి (గ్రామసీమలను విడిచిపెట్టి)
తరలివచ్చిన పేదరైతులు = బయలుదేరి వచ్చిన బీద రైతులూ
ఇనప్పెట్టెల్లాంటి = ఇనుముతో చేసిన పెట్టెలవలె ఇరుకుగా ఉన్న

ఈ పట్టణాల్లో = ఈ నగరాలలోని ఇళ్ళలో
ఊపిరాడని
(ఊపిరి+అడని) = శ్వాస పీల్చుకోవడానికి కూడా గాలి దొరకని
మీ బతుకులూ = మీ జీవితాలు
నగరంలో ప్రతిమనిషి = పట్టణంలో నివసించే ప్రతి మనిషి కూడా
పఠనీయ గ్రంథమే = చదువదగిన పుస్తకం వంటి వాడే, (చదువదగిన పుస్తకం లాంటి వాడే పుస్తకం చదివితే, ఎన్నో విషయాలు తెలుస్తాయి. అలాగే నగరజీవి యొక్క చరిత్రను పరిశీలిస్తే, ఎన్నో జీవన సత్యాలు వెల్లడి అవుతాయని భావం. )

మరి నీ బతుకు = మరి నీ జీవితం అనే పుస్తకం యొక్క
పేజీలు తిరగేసేదెవరో = పుటలు ఎవరు తెరచి చదువుతారో ! (ఎవ్వరూ నగరజీవి చరిత్రను పట్టించుకోరని భావం. నగర జీవుల చరిత్రలలో ఆసక్తికరమైన, దుఃఖభరితమైన సంగతులు ఎన్నో ఉంటాయి. కాని ఎవ్వరూ అతడి వివరాలు జీవన విధానాలు పట్టించుకోరని కవి చెప్పారు)
ఉదయమే = ప్రొద్దున్నే
బస్సుల్లో, రిక్షాల్లో = స్కూలు వారు తీసుకెళ్ళే బస్సులలోనూ, సిటీబస్సుల్లోనూ, ఆటోరిక్షాల వారు తీసుకువెళ్ళే రిక్షాల్లోనూ.
పేవ్మెంట్లపై (Pavements) = రోడ్లు ప్రక్కన రాళ్ళు పరచి చదును చేసిన నడకదారుల పైన
విరబూసిన
(విరియబూసిన) = సమృద్ధిగా పూసిన
కాన్వెంటు పువ్వుల
సందడి = (convent) కాన్వెంటు బడులలో చదువుకొనే పువ్వుల వంటి పిల్లల గోల
రాలే చదువుల పుప్పొడి = ఆ పిల్లల మాటలు, ఆ పిల్లలనే పువ్వుల నుండి రాలిపడే పుప్పొడి లాంటివి.

తాత్పర్యము

అనేక వాహనాల శబ్దాలు, మనుషుల మాటలు, చిరు వ్యాపారుల అరుపులతో నగరంలోని నాలుగు రోడ్ల కూడలిలో వినిపించే రణగొణ ధ్వనులు గుండెలదిరిపోయేలా మోగిస్తున్న ఢంకానాదంలా, ఉధృతమైన వేగంతో దూకే నయాగరా జలపాతం హోరులా అనిపిస్తుంది. నిజానికది అరణ్యంలాంటి నగరం చేస్తున్న ధ్వనిలా, నగరజీవి బతుకు పోరాటంలోంచి వచ్చిన ఉఱుములాంటి శబ్దంలా ఉన్నాయని కవి వర్ణిస్తున్నాడు.

అమ్మఒడిలాంటి పుట్టిన ఊరిని వదిలి ఉపాధికోసం నగరం తరలివచ్చిన వారికి ఇంత పెద్ద పట్నంలో తలదాచు కోవడానికి కాసింత స్థలం కూడా దొరకదు. పేదరైతులు ఇనప్పెట్టెల్లాంటి ఇరుకిరుకు మురికి ప్రదేశంలో ఊపిరాడని స్థితిని అనుభవిస్తూ బతుకుతుంటారు.

నగరంలో ప్రతిమనిషీ చదువవలసిన ఒక పుస్తకం లాంటివాడు. అయితే ఎవరూ అతని బతుకు పుస్తకములోని పేజీలను చదివేవారు ఉండరు. నగరంలోని మనిషివెనక అనేక ఆసక్తికరమైన ఆనంద, విషాదగాథలుంటాయి. ఒక్క రైనా అతని బాగోగులు పట్టించుకునేవారే ఉండరనే చేదునిజాన్ని చెపుతున్నాడు కవి.

నగరంలో ఉదయాన్నే సిటీబస్సుల్లో, ఆటోల్లో, పేవ్మెంట్లపై విరబూసిన పువ్వుల్లాంటి స్కూల్పిల్లలు సందడి చేస్తుంటారు. వారి మాటల్లోంచి చదువుల పుప్పొడి రాలుతుంది.

TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం

II

సిటీ అంటే అన్నీ
బ్యూటీ బిల్డింగ్లు కావు
అటు భవంతులూ ఇటు పూరిళ్ళూ
దారిద్ర్యం, సౌభాగ్యం సమాంతర రేఖలు!

ఇది వెరైటీ సమస్యల మనుష్యుల
సమ్మేళన కోలాహలం!
ఎంతచేసినా ఎవరికీ
తీరిక దక్కదు కోరిక చిక్కదు

మెర్క్యూరీ నవ్వులు, పాదరసం నడకలు
కొందరికి రెండు కాళ్ళు
రిక్షావాళ్ళకి మూడుకాళ్ళు
ఉన్నవాళ్ళకి నాలుక్కాళ్ళు!

నగరంలో అన్నిపక్కలా
సారించాలి మన చూపులు
మహానగరాల రోడ్లకి
‘మరణం నాలుగువైపులు!

నగరం మహావృక్షంమీద
ఎవరికి వారే ఏకాకి!
నగరం అర్ధంకాని రసాయనశాల!
నగరం చిక్కు వీడని పద్మవ్యూహం!!

అర్ధాలు

సిటీ (City) = నగరం, పట్టణం
అంటే = అన్నట్లయితే
అన్నీ = అక్కడ ఉన్నవన్నీ
(Beauty Buildings) కావు = కావు
ఇటు పూరిళ్ళూ = మరింకోపక్క, గడ్డితో నేసిన ఇళ్ళు
దారిద్య్రం = బీదతనం
సౌభాగ్యం = ధనవైభవం (అదృష్టం)
సమాంతర రేఖలు = సమానమైన మధ్యదూరం గల రేఖలు (సమాంతర రేఖలు ఎంత దూరం పొడిగించినా కలిసికోవు)
ఇది = ఈ పట్టణం
వెరైటీ సమస్యలు
(Variety) = నానావిధాలయిన చిక్కులు గల
మనుష్యుల = మానవుల

సమ్మేళన కోలాహలం = కలయికల పెద్ద రొద (చప్పుడు)
ఎంతచేసినా = ఎంత కష్టపడి పనిచేసినా (ప్రొద్దుస్తమానం పనిచేసినా)
ఎవరికీ = నగరవాసులు ఎవరికీ
తీరిక = విశ్రాంతి
దక్కదు = లభించదు (అక్కడ మనిషికి విశ్రాంతి తీసుకోడానికి సమయం దొరకదు)
కోరిక = కోరిన కోరిక
చిక్కదు = దొరకదు (సంపాదించిన ధనం తో వారి కోరికలు తీరవు)

మెర్క్యురీ నవ్వులు (Mercury) = పాదరసం నవ్వులు (కృత్రిమపు నవ్వులు) (తెచ్చి పెట్టుకొన్న అసహజపు నవ్వులు)
పాదరసం నడకలు = పాదరసం దొర్లిపోయేలా, వేగంగా పరుగువంటి నడకలు
కొందరికి రెండు కాళ్ళు= నగరంలో ప్రయాణాలు చేసే వాళ్ళలో కొందరికి రెండు కాళ్ళు, అంటే వారు కాలి నడకన ప్రయాణాలు సాగిస్తారు. వారికి, వారి రెండు కాళ్ళే ప్రయాణ సాధనాలు

రిక్షావాళ్ళకి మూడుకాళ్ళు = రిక్షాల్లో తిరిగేవాళ్ళకు మూడు కాళ్ళు, అంటే మూడుచక్రాల రిక్షాలూ, ఆటో రిక్షాలూ వారి ప్రయాణ సాధనాలు.
ఉన్నవాళ్ళకి నాలుక్కాళ్ళు = డబ్బు ఉన్నవారికి నాల్గు కాళ్ళు అనగా నాల్గుచక్రాలు గల కార్లలో వారు తిరుగుతారు. అంటే వారి ప్రయాణసాధనాలు కార్లు.
నగరంలో = పట్టణంలో
అన్నిపక్కలా = అన్నివైపులకూ
సారించాలి = ప్రసరింపచేయాలి.(అన్నివైపులకూ చూస్తూ ప్రయాణం సాగించాలి)
మన చూపులు = మన చూపులను
మహానగరాల రోడ్లకి = పెద్ద పట్టణాలలోని రోడ్లకు

మరణం నాలుగువైపులు = నాలుగు వైపుల నుండి చావు రావడానికి సావకాశం ఉంటుంది. (ఏ వైపు నుండైనా, ఎవరైనా వచ్చి తమ వాహనంతో పొర పాటున గుద్దుతారు. అందువల్ల రోడ్డుపై నడిచేటప్పుడు నాలుగు వైపులకూ చూసుకుంటూ ఉండాలి. లేకపోతే ఏ వైపు నుంచైనా మరణం సంభవిస్తుంది,)

నగరం మహావృక్షంమీద = పట్టణం అనే ఒక పెద్ద చెట్టు మీద
ఎవరికి వారే ఏకాకి = ఎవరికి వారే ఒంటరిగా ఉంటారు.
నగరం = పట్టణం
అర్థంకాని = అది ఏమిటో తెలియని
రసాయనశాల = ప్రయోగశాల (Laboratory)
నగరం చిక్కువీడని
పద్మవ్యూహం = పట్టణం చిక్కులో తగిలిన నగరవాసులు, దాని నుండి తప్పించు కొని బయటకు రాలేని పద్మవ్యూహం వంటిది

తాత్పర్యము

నగరం నిండా అన్నివైపులా అందమైన ఎత్తైన భవనాలు ఉంటాయనుకోవద్దు. ఒకవైపు ఖరీదైన భవంతుల పక్కనే చిన్న చిన్న పూరిపాకలూ ఉంటాయి. ఇక్కడ ఐశ్వర్యం దారిద్ర్యం పక్కపక్కనే సమాంతర రేఖలుగా కనిపిస్తాయి. నగరం వైవిధ్యమైన సమస్యలతో, విభిన్న మనస్తత్వాలతో కలిసిపోయి కలకలంతో నిండి ఉంటుంది.

ఎంత నిరంత రాయంగా పనిచేసినా నగరంలోని మనిషికి విశ్రాంతి తీసుకోవడానికి అనువైన సమయం దొరకదు. సంపాదించిన ధనంతో కోరికను తీర్చుకునే తీరిక దొరకదు. కృత్రిమమైన వెలుగుల్లాంటి అసహజపు నవ్వులతో, స్థిరత్వంలేని హడావుడి నడకలతో వెళ్ళేవారు, ఆటోరిక్షాల్లో తిరిగేవాళ్ళు, కార్లలో ప్రయాణించే ధనవంతులూ ఉంటారు.

నగరంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. నగరంలో అన్నివైపులా ప్రమాదాలు పొంచి ఉంటాయి. నగరంలో నాలుగు దిక్కుల్లోని రోడ్లలో మృత్యువు పొంచి ఉంటుందని కవి హెచ్చరిస్తున్నాడు.

వృక్షాలమీద ఉండే పక్షులు పరస్పరం కలిసిపోయి కలివిడిగా ఉంటాయి. నగరమనే మహావృక్షంమీద నివసించే ఈ మనుషులు సాటిమనిషితో ఎటువంటి ఆత్మీయ పలకరింపులు లేకుండా ఇరుగూ పొరుగనే భావన లేకుండా ఎవరికి వారే ఏకాకిగా బతుకుతుంటారు. ఈ యాంత్రిక మానసిక స్థితిని నిరసిస్తున్నాడు కవి.

ప్రయోగశాలలో ఏవేవో రసాయన ద్రవాలు, ఆమ్లాలు ఉంటాయి. వాటి చర్యలు అందరికీ అర్థం కావు. నగరం అంతకంటే అర్థంకాని రసాయనశాలలా ఉంటుంది. నగరంలో బతుకుదామని వచ్చినవారు, ఉపాధి దొరకక పోయినా ఏదో ఒకరోజు దొరుకుతుందని ఆశగా వేచి చూస్తుంటారు. ఇక్కడి సౌకర్యాలు, విలాసాలు, వినోదాలు పైపై మెరుగులు బలంగా ఆకర్షిస్తాయి.

మరోవైపు నిరుద్యోగం, జీవనవ్యయం భయపెడుతున్నా నగరం విడిచి వెళ్ళబుద్ధికాదు. కాలుష్యం కలవరపెట్టినా, ట్రాఫిక్ జామ్ జీవితం ఇరుక్కు పోయినా నగరం విడిచి ప్రశాంతంగా మన పల్లెలకు వెళ్ళనివ్వని, చిక్కువిడదీయలేని పద్మవ్యూహం లాంటిది నగరం.

పాఠం నేపథ్యం / ఉద్దేశం

ఆధునిక కాలంలో మనుషులంతా నగరాల్లో జీవించాలని కోరుకుంటున్నారు. మరోవైపు పల్లెల్లో ఉపాధి అవకాశాలు తగ్గడంతో బతుకుతెరువుకోసం నగరాలకు వలసలు పెరిగాయి. నగరంలోని అనుకూలాంశాలన్నింటిని వినియోగించుకోవాలనే కోరికతో మనుషులు నగరంలో ఉండడానికి తాపత్రయపడుతున్నారు. దీనితో అనేక నగరాలు అత్యధిక జనాభాతో కిక్కిరిసిపోతున్నాయి. చాలా సమస్యలు పెరిగిపోయాయి.

ప్రపంచీకరణ ప్రభావంతో నగరం శర వేగంగా తన రూపం మార్చుకుంటున్నది. సామాన్యుడికి అంద నంత దూరంగా కదిలిపోతున్నది. మధ్యతరగతికి అంతుచిక్కని ప్రాంతంగా మారిపోయింది. మనిషి యాంత్రిక స్థితిలోకి మారిపోతున్నాడు. తనకుతానే పరాయీకరణకు గురవు తున్నాడు.

ఈ నేపథ్యంలో నగరజీవితంలోని యథార్థదృశ్యాల్ని మన కళ్ళముందు నిలుపుతూ, నగరపు మరో పార్శ్వాన్ని చూపుతూ, వాస్తవాల్ని కఠినంగా నిర్వచించిన తీరును తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం “మినీ కవిత” అనే ప్రక్రియకు చెందినది. ఏదైనా ఒక అంశాన్ని కొసమెరుపుతో, వ్యంగ్యంగా, చురకల తో తక్కువ పంక్తుల్లో చెప్పడమే మినీ కవిత.
‘అలిశెట్టి ప్రభాకర్ కవిత’ అనే గ్రంథంలోని ‘సిటీలైఫ్’ అనే మినీ కవితలలో కొన్నిటిని ‘నగరగీతం’ గా కూర్చడమైనది.

కవి పరిచయం

కవి పేరు : అలిశెట్టి ప్రభాకర్

జననం : 12-01-1954 వ సం॥

మరణం : 12-01-1993 వ సం॥

జన్మస్థలం : పూర్వపు కరీంనగర్ జిల్లా నేటి జగిత్యాల జిల్లా

తల్లిదండ్రులు : వీరి తండ్రి “అలిశెట్టి చినరాజం”, తల్లి “లక్ష్మి”.

వ్యాసంగం : మొదట ఆర్టిస్ట్గా ఎదిగాడు. ప్రారంభం లో పత్రికలకు పండగలు, ప్రకృతి, సినీనటుల బొమ్మలు వేసేవాడు. తరువాత జగిత్యాలలో ‘సాహితీ మిత్రదీప్తి’ సంస్థ పరిచయంతో కవిత్వ రంగంలోకి ప్రవేశించాడు. 1974లో ఆంధ్రసచిత్ర వారపత్రికలో వచ్చిన ‘పరిష్కారం’ అచ్చయిన మొదటి కవిత. జగిత్యాలలో ‘స్టూడియో పూర్ణిమ’ (1976), కరీంనగర్లో స్టూడియో శిల్పి’ (1979) హైదరాబాద్లో ‘స్టూడియో చిత్రలేఖ’ (1983) ఏర్పాటు చేసుకొని జీవిక కోసం ఫోటోగ్రాఫర్గా, జీవిత పోరాటంలో కవిగా ఎదిగాడు.

మొదటి కవిత : ‘పరిష్కారం’ అన్న వీరి కవిత, మొదటగా ఆంధ్రసచిత్ర వార్త పత్రిక లో అచ్చయ్యింది.

రచనలు :

  1. ఎర్ర పావురాలు (1978) మొదటి కవితా సంకలనం,
  2. మంటల జెండాలు, చురకలు (1979),
  3. రక్తరేఖ (1985),
  4. ఎన్నికల ఎండమావి (1989),
  5. సంక్షోభ గీతం (1990),
  6. సిటీలైఫ్ (1992)

అచ్చయిన కవిత్వ సంకలనాలు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్ళ పాటు సీరియల్గా ‘సిటీలైఫ్” పేరుతో హైదరాబాదు నగరంపై వ్రాసిన మినీ కవితలతో ప్రఖ్యాతి పొందాడు.

శైలి : కవిత్వాన్ని ఆయుధంగా మలచుకొని పాఠకుల్లో ప్రగతిని, ఆలోచనా దృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన కవి అలిశెట్టి ప్రభాకర్.

ప్రవేశిక

దృష్టిని బట్టి సృష్టి గోచరిస్తుంది.
కొందరిని కొన్ని సన్నివేశాలు విశేషంగా ఆకర్షిస్తాయి. సహృదయుడు ప్రతి కదలిక నుంచీ ప్రేరణ పొందుతాడు. అతనికి భాష ఆయుధమైతే, భావం కవితారూపం సంతరించుకుంటుంది.

నగరంలోని మూలలను, మూలాలనూ ఓ కవి హృదయం ఎట్లా దర్శించిందో- ‘అలిశెట్టి’ మినీ కవిత(లు) మన కళ్ళకు గడుతుంది. మనసు కిటికీ తెరిచి చూస్తే అక్షరాల వెనుక అనంత దృశ్యాలు కనిపిస్తాయి ……………

TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం

విద్యార్థులకు సూచనలు

  • పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠం లోని విషయాన్ని ఊహించండి.
  • పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత గీయండి..
  • వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పదవిజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకోండి

ప్రక్రియ -వచన కవిత

ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియలలో ‘వచన కవిత’ అనే ప్రక్రియ ముఖ్యమైనది. ఇది పద్య, గేయాల్లో ఉండే ఛందస్సు. మాత్రాగణాలతో సంబంధం లేకుండా, వ్యావహారిక భాషలో రాసే కవితను వచనకవితగా పేర్కొనవచ్చు. చిన్న చిన్న పద్యాలు, వాక్యాలతో ధ్వని గర్భితంగా ఉండే కవిత వచన కవిత.

పాఠ్యభాగ సారాంశము

అనేకరకాల వాహనాల శబ్దాలు, మనుషుల మాటలు, చిన్న వ్యాపారుల అరుపులతో నాలుగురోడ్ల కూడలి దద్దరిల్లిపోతుంది. నిజానికి ఆ శబ్దం నయాగరా జలపాతం హోరులా, నగరజీవి బతుకు పోరాటంలోంచి వచ్చిన ఉరుము లాంటి శబ్దంలా ఉంది. అమ్మఒడిలాంటి పుట్టిన ఊరును వదిలి ఉపాధికోసం కొందరు పట్టణాలకు వలసవెళ్తున్నారు. పేద రైతులు నగరంలో ఇనుప పెట్టెలవంటి ఇళ్ళల్లోను, మురికివాడల్లోను నివసిస్తుంటారు. నగరంలో ప్రతి మనిషి చదువవలసిన ఒక పుస్తకంలాంటివాడు. నగరంలోని మనిషి వెనుక ఆసక్తిదాయకమైన ఆనంద, విషాదగాథలు ఉంటాయి. పిల్లలు చదువులతో సందడిచేస్తుంటారు.

నగరంలో అందమైన ఎత్తైన భవనాలు ఒకపక్క ఉన్నా, మరొకపక్క మురికివాడలు కూడా ఉంటాయి. నగరంలోని మనిషికి విశ్రాంతి తీసుకోవడానికి అనువైన సమయం దొరకదు. కొందరు కాలినడకతో, మరికొందరు ఆటోరిక్షాల్లో, ధనవంతులు కార్లలో ప్రయాణంచేస్తూ ఉంటారు. నగరంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

నగరంలో ప్రమాదాలు అన్ని వైపులా పొంచిఉన్నాయి. నగర ప్రజలు పరస్పరం పలకరించుకోకుండా ఏకాకిగా బతుకు తారు. నగరం అర్థంకాని రసాయనశాలలా ఉంటుంది. ఇక్కడి సౌకర్యాలు, విలాసాలు, వినోదాలు, పైపై మెరుగులు బలంగా ఆకర్షిస్తాయి. మరోవైపు నిరుద్యోగం, జీవన వ్యయం భయపెడుతున్నా నగరం విడిచి వెళ్ళబుద్ధికాదు.

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

Telangana SCERT 10th Class Telugu Guide Telangana 12th Lesson భూమిక Textbook Questions and Answers.

TS 10th Class Telugu 12th Lesson Questions and Answers Telangana భూమిక

చదువండి – ఆలోచించి చెప్పండి (T.B. P.No. 120)

పుస్తకాలకు రెక్కలుండవు. కాని వాటిని చదివితే మనకు రెక్కలు మొలిచినట్లుగా ఉంటుంది. ఆ రెక్కలు జ్ఞానాన్ని, ఆలోచనాశక్తిని, సృజనాత్మకతా నైపుణ్యాన్ని, లోకపరిశీలనా దృష్టిని, జిజ్ఞాసను, ఉత్సాహాన్ని అందిస్తాయి. మంచిపుస్తకం ఉత్తమమిత్రునితో సమానం. శరీరానికి వ్యాయామం ఎట్లాంటి శక్తినిస్తుందో మంచిపుస్తకం చదవడంవల్ల మనసుకు అలాంటి ఉత్తేజం కలుగుతుంది. ఏది మంచిపుస్తకం, ఏ పుస్తకాన్ని చదువాలనే ఎంపికలో పుస్తక పరిచయవాక్యాలు మార్గదర్శనం చేస్తాయి.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
పుస్తకాలు చదువడంవల్ల కలిగే ప్రయోజనాలు ఏవి ?
జవాబు:
పుస్తకాలు జ్ఞానాన్ని, ఆలోచనా శక్తిని, సృజనాత్మక శక్తిని, లోకపరిశీలనా దృష్టిని, జిజ్ఞాసను, ఉత్సాహాన్ని అందిస్తాయి.

ప్రశ్న 2.
ఎటువంటి పుస్తకాలను చదువాలి ?
జవాబు:
మనకు స్ఫూర్తినిచ్చే, జ్ఞానాన్ని ఇచ్చే పుస్తకాలను చదువాలి.

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

ప్రశ్న 3.
‘ఏదైనా పుస్తకాన్ని చదువాలి’ అనే ఆసక్తిని కలిగించే అంశమేది ?
జవాబు:
పుస్తక పరిచయ వాక్యాలు మనకు ఏదైనా పుస్తకాన్ని చదువాలనే ఆసక్తిని కలిగిస్తాయి.

ప్రశ్న 4.
మీరు చదివిన కొన్ని పుస్తకాల పేర్లు చెప్పండి.
జవాబు:
మహాప్రస్థానం, మహాభారతం, రామాయణం, దేవరకొండ, అమృతం కురిసిన రాత్రి.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 124)

నెల్లూరి కేశవస్వామితో స్నేహం ………. సాహిత్యంలో ఈ కథలకు విశిష్ట స్థానం ఉంది.

ప్రశ్న 1.
కథలకు, కవిత్వానికి గల భేదం ఏమిటి ? మీకు ఏవంటే ఇష్టం ? ఎందుకు ?
జవాబు:
కథలు సరళభాషలో సాగే వచన రచన. విశిష్టమైన వస్తు, శిల్పంతో సాగే రచన కథలు. ఛందస్సుతో ముడిపడి సాగే రచన కవిత్వం. ప్రాసలతో, అలంకారములతో కూడిన రచన కవిత్వం. నాకు కవిత్వం అంటే ఇష్టం. వినసొంపుగా, పాడుకోవటానికి వీలుగా ఉంటుంది. అందుకని కవిత్వం అంటే నాకు ఇష్టం.

ప్రశ్న 2.
నాటి హైదరాబాదు రాజ్యంలో హక్కుల కోసం, స్వాతంత్య్రం కోసం ప్రజలు ఎందుకు ఉద్యమించి ఉండవచ్చు?
జవాబు:
తెలంగాణ రైతు పోరాటం జరిగింది. ఈ సాయుధ పోరాటంలో 4 వేల మంది చనిపోయారు. మరోవైపు రజాకార్లు విజృంభించి రైతాంగ పోరాటంపై దాడులు చేశారు. ఈ కారణాల వల్ల హక్కుల కోసం, స్వాతంత్ర్య కోసం ప్రజలు ఉద్యమించి ఉండవచ్చు.

ప్రశ్న 3.
హైదరాబాదు నగర జీవితాన్ని, సంస్కృతిని తెలుగులో చిత్రించడం అంటే మీకేమి అర్థమైంది ?
జవాబు:
హైదరాబాదు నగరంలోని ప్రజల జీవితాలను, సంస్కృతిని బాగా పరిశీలించాలి, విశ్లేషించాలి. ఆ పట్టణ ప్రజల మానసిక స్థితిని కూడా అవగాహన చేసుకోవాలి. సమాజంలో నానాటికి వస్తున్న మార్పులను ఆకళింపు చేసుకోవాలి.

ఫ్యూడల్ సమాజంలో ఉండే బాధలు, వ్యతిరేకతలు పరిశీలించాలి. ప్రజాస్వామ్యంలోని స్వేచ్ఛా వాయువుల హాయిని కూడా పరిశీలించాలి. రకరకాల కులవృత్తులను పరిశీలించాలి.

ఉద్యమాలు, రాజకీయ మార్పులు, సంస్కృతి, గ్రామీణ జీవితం ఇలా అన్ని కోణాలలోనూ హైదరాబాదు నగరాన్ని పరిశీలించాలి. పై వాటి నన్నింటినీ కళ్ళకు కట్టినట్లు వివరించడమే చిత్రించడం. అది తెలుగుభాషలో చేస్తే తెలుగులో చిత్రించడం అంటారని మాకర్థమైంది.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 125)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, …….. కేశవస్వామి హృదయం ఉంది.

ప్రశ్న 1.
అపార్థాలు ఎందుకు వస్తాయి ?
జవాబు:
అవగాహనా లోపం వలన అపార్థాలు వస్తాయి. ఎదుటి వ్యక్తిని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వలన, వారి ఆలోచనా విధానం నచ్చకపోయినా అపార్థాలు తలెత్తుతాయి. మరియు ఇద్దరి వ్యక్తుల మధ్య అభిప్రాయాలు విభిన్నంగా ఉండటం వలన అపార్థాలు ఏర్పడతాయి. అపార్థాలు మనిషిలోని ఆలోచనా శక్తిని వక్రమార్గంలో నడిపిస్తాయి. మనిషిని భ్రమకు లోనుచేసి వ్యక్తుల మధ్య సంబంధాలను దూరం చేస్తాయి.

ప్రశాంతంగా ఉండనివ్వదు. మనిషి ఆలోచనా శక్తిని, జ్ఞానాన్ని క్రమంగా క్షీణింప చేస్తుంది. ఆప్తులను, స్నేహితులను దూరం చేస్తుంది. గౌరవ మర్యాదలు తగ్గిస్తుంది. కనుక మనిషి కోపాన్ని దూరం చేసుకోవాలి. అపుడే అందరికీ ఆదర్శంగా ఉండగలము అనే విషయాన్ని గ్రహించాలి. మనిషికి కేవలం శాస్త్రజ్ఞానం మాత్రమే ఉంటే సరిపోదనీ, ఆత్మజ్ఞానం మరియు ఇంద్రియ నిగ్రహం ఉండాలని వ్యాసుని పాత్ర ద్వారా గ్రహింపవచ్చు.

ప్రశ్న 2.
‘చార్మినార్’ కథలను ఎందుకు చదువాలి ?
జవాబు:
చార్మినార్ కథలు కేవలం కథలు కావు. వాస్తవ జీవితంలో సామాజిక పరిణామాల సామాజిక చరిత్రను నిక్షిప్తం చేసుకున్న చారిత్రాత్మక కథలు. కాబట్టి తప్పక చదువాలి.

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

ప్రశ్న 3.
రెండు మతాల మధ్య ఆలోచనలు, సంస్కృతిలో ఆదాన ప్రదానాలు జరగడం అంటే ఏమిటి ?
జవాబు:
11వ శతాబ్దం నుండి ఇండియాలో సాగిన ముస్లింల వలసలు, రాజ్యాలు, అవి తెచ్చిన పరిపాలనా విధానాలు, జీవనవిధానం, సంస్కృతి, భారతీయ సంస్కృతిపై, జీవన విధానంపై చెరగని ముద్ర వేసాయి. భారతీయ సంస్కృతిలో, జీవితంలో అంతర్భాగమైనాయి. అవి హిందూ ప్రజల జీవితంలోకి కూడా ప్రవేశిస్తూ రెండు మతాల మధ్య ఆలోచనల్లో, సంస్కృతిలో, జీవితంలో ఆదానప్రదానాలు జరిగాయి. అలా ఒక నూతన సమన్వయ సంస్కృతి విస్తరించిందని దాని అర్థం.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 127)

అందులో భాగంగా చూసినప్పుడు …………. వజ్రాల వంటివే స్వర్గీయ నెల్లూరి కేశవస్వామి కథలు

ప్రశ్న 1.
హృదయ సంస్కారం అంటే ఏమిటి ? కొన్ని ఉదాహరణలు చెప్పండి.
జవాబు:
హృదయ సంస్కారం అంటే మనసులో ఉండే మంచి భావన. నాకు మా తాతగారు, అమ్మా, నాన్నలు మంచి ప్రవర్తన అలవర్చుకోవాలని చాలా విషయాలు, కథలు చెబుతుంటారు.

ఉదాహరణకు మా తాతగారు మా గ్రామంలో జరిగిన ఒక సంఘటన చెప్పారు. మా తాతగారి చిన్నతనంలో బాల్యవివాహాలు జరిగేవిట. ఒకసారి మా గ్రామంలో ఒక 12 సం॥ల అమ్మాయిని పెళ్ళిచూపులు చూసుకొందుకు 60 సం॥ల వృద్ధుడు వచ్చేడుట. ఆ అమ్మాయిది చాలా పేద కుటుంబం. డబ్బుకు ఆశపడి వృద్ధుడికి పెళ్ళి చేద్దామనుకొన్నారు. వృద్ధుడు అమ్మాయి నచ్చిందన్నాడు.

వాళ్ళడిగిన డబ్బిచ్చాడు. ఆ అమ్మాయిని వృద్ధుడు ‘నేను నీకు నచ్చానా?’ అన్నాడుట. భయం, భయంగా ‘ఊ’ అందిట. ‘మరి, నేను చెప్పినట్లు వింటావా ?’ అన్నాడట, ‘ఊ’ అంది. ‘నీకేమిష్టం ?” అన్నాడు. ‘చదువు’ అంది అమ్మాయి.

అంతే వృద్ధుడు పకపకానవ్వాడుట. ‘పెళ్ళి ముహూర్తం పెట్టించమంటారా ? బాబూ అని అమ్మాయి తండ్రి అడిగాడుట.

‘పెట్టించండి. కానీ, పెళ్ళికి కాదు. దత్తతకు, ఈ రోజు నుండి మీ బంగారుతల్లి నాకు బంగారు తల్లి అయింది. బాగా చదివిస్తాను. మంచి కుర్రాడికిచ్చి పెళ్ళిచేస్తాను. రామ్మా ! మనింటికి వెడదాం’ అన్నాడట. ‘అదీ హృదయ సంస్కారం’ అన్నారు మా తాతగారు. ఆ అమ్మాయి తర్వాత బాగా చదువుకొని జిల్లా కలెక్టరైందిట. ఎంతోమంది పేదల జీవితాలలో వెలుగులు నింపిందట.

ప్రశ్న 2.
“స్నేహం మతాల సరిహద్దులను చెరిపివేస్తుంది”? – సమర్థించండి.
జవాబు:
అవును. “స్నేహాని కన్న మిన్న లోకాన లేదు కన్నా” అని కదా ! ఇది మతం, కులం, ప్రాంతం, భాషలను చూడదు. స్నేహం త్యాగాన్ని కోరుతుంది. “కేవలం మనుషులం” కథలో హుస్సేన్మీర్జా, మహబూబ్ సక్సేనా దశాబ్దాల స్నేహితులు. వారి స్నేహానికి మతం అడ్డు రాలేదు. ఇది చక్కని కథ. నేను స్నేహం మతాల సరిహద్దులను
చెరిపివేస్తుందని నమ్ముతాను.

ప్రశ్న 3.
పేదల కష్టాలు ఎట్లా ఉంటాయి ? పేదల జీవితాల్లో మార్పులు రావడానికి ఏం చేస్తే బాగుంటుంది ?
జవాబు:
పేదల కష్టాలు వర్ణించటానికి కూడా వీలుకానివి. ఆర్థికం, సామాజికం అనే సమస్యలతో అతలాకుతలం అవుతారు. వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలంటే ప్రభుత్వం వారికి ఆర్థిక స్వావలంబన కల్పించాలి. రాయితీలు ఇవ్వాలి. సబ్సిడీలు ఇవ్వాలి. వారికి ప్రభుత్వం విశ్వాసం, భరోసా కల్పించాలి.

కూడు, గుడ్డా, నీడ కల్పిస్తే చాలావరకు వారి జీవితాల్లో వెలుగులు (మార్పులు) వచ్చినట్లే.

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
కవులు, రచయితలు రాసిన పుస్తకాలను అందరికీ పరిచయం చేయడానికి పుస్తకావిష్కరణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇటువంటి కార్యక్రమాలలో ఏమేం చేస్తారో చెప్పండి.
జవాబు:

  1. సభా నిర్వహణ : అతిథులను, పుస్తక రచయితనూ, సమీక్షకున్నీ వేదికపైకి పిలిచి సభ నిర్వహిస్తారు.
  2. పుస్తకావిష్కరణ : ముఖ్య అతిధి చేతుల మీదుగా పుస్తకాన్ని ఆవిష్కరింపజేస్తారు.
  3. పుస్తక సమీక్ష : సమీక్షకుడు పుస్తకంలోని అంశాలను రేఖా మాత్రంగా స్పృశిస్తూ పుస్తకాన్ని పరిచయం చేస్తారు.
  4. ప్రసంగాలు : అతిథులు పుస్తకం గురించి, రచయిత గురించి ప్రశంసిస్తూ మాట్లాడతారు.
  5. కవి సత్కారం : పుస్తక రచయితను అందరూ సన్మానిస్తారు.
  6. కవి స్పందన : ఈ కార్యక్రమ నిర్వహణపై కవి లేదా రచయిత తన స్పందనను తెలియజేస్తారు.

ప్రశ్న 2.
నేటి సమాజానికి ఎటువంటి రచయితల అవసరం ఉందో చెప్పండి.
జవాబు:
మానవ మనస్తత్వాన్ని, సమాజంలోని కుళ్ళునూ, సమాజపు స్థితిగతులను కళ్ళకు కట్టినట్లు చూపించే రచయితలు అవసరం. సమాజానికి ప్రతినిధిగా రచయిత ఉండాలి. నిజాన్ని నిర్భయంగా చెప్పగలగాలి. ఒక సమస్యను చూపి, దానికి పరిష్కారాన్ని కూడా చెప్పగలిగే రచయితలు అవసరం.

సమాజంలోని రుగ్మతలను, మూఢనమ్మకాలను, దురాచారాలను ఖండించగలిగే నిర్భయత్వం గల రచయితలు కావాలి. ఉదాహరణకు వేమన, శ్రీశ్రీలాంటి వారు నేటి సమాజానికి చాలా అవసరం.

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

ప్రశ్న 3.
ఈ పాఠం ఆధారంగా కింది పట్టికను పూరించండి.
జవాబు:
TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక 1

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) ‘ఒక భాషలోని సాహిత్యం చదవడం ద్వారా నాటి పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు’ దీనిపై మీ అభిప్రాయం చెప్పండి.
(లేదా)
‘ఒక భాషలోని సాహిత్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా అప్పటి సమాజ స్థితిగతులను గ్రహించవచ్చు’ దీన్ని విశ్లేషించండి.
జవాబు:
నెల్లూరి కేశవస్వామి గారి ‘చార్మినార్ కథలు’ చదివితే ఆనాటి నవాబుల గురించి తెలుసుకోవచ్చు. ఆనాటి డేవిడీల గురించి తెలుసుకోవచ్చు. ఆనాటి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు తెలుస్తాయి. అలాగే ఆ రోజులలో కల్మషం ఎరుగని స్నేహాలు, ఆత్మీయతలు, కులమతాలకు అతీతమైన వారి మమతలు తెలుస్తాయి.

అలాగే ఆంగ్లసాహిత్యం చదివితే, ఆంగ్ల దేశాల ఆచార వ్యవహారాలు తెలుస్తాయి. బ్రిటిషుకాలంనాటి ఇంగ్లాండు పరిస్థితులు తెలియాలంటే ఆనాటి బ్రిటన్ సాహిత్యం చదవాలి. ప్రేమచంద్, కిషన్చందర్ సాహిత్యం చదివితే ఆనాటి ఉర్దూ, హిందీ భాషా ప్రాంతాల ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు తెలుస్తాయి.

రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలు చదివితే ఆనాటి బెంగాల్ పరిస్థితులు తెలుస్తాయి. వారి సంప్రదాయాలు తెలుస్తాయి.

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

ఆ) తెలంగాణ పలుకుబడులంటే ఏమిటి ? కొన్ని ఉదాహరణలు రాయండి.
(లేదా)
తెలంగాణ భాషలోని పలుకుబడులను గురించి విశ్లేషించండి.
జవాబు:
పలుకుబడి అంటే ఉచ్ఛారణము, వచో నిబంధనము, ఒడంబడిక, మాటచెల్లుబడి అని నిఘంటువులో చెప్పబడింది. తెలంగాణ ప్రాంతంలోని మాట చెల్లుబడి, మాటల ఉచ్ఛారణము అని అర్థం. ఏ భాషకైనా పలుకుబడులు, జాతీయాలు, గుండెకాయ (ముఖ్యమైనవి) వంటివి. అవి భాషను పదికాలాల పాటు నిలిపి ఉంచుతాయి.

ఉదాహరణలు :

సామెతలు :

  1. అతి రహస్యం బట్టబయలు.
  2. నక్క నదిలో కొట్టుకుపోతూ ప్రపంచమంత మునుగు- తుందన్నదట.
  3. మావోనికి ముప్ఫైరెండు గుణాలు మంచియే రెండే రెండు పాడు తనకు దెలది ఒకడు చెపితే వినడు.
  4. చెరువుల పడ్డాన్ని తీసి బావిలేసినట్లు.

జాతీయాలు :

జాతీయం – సందర్భం

  1. అగ్గిబుక్కుట – కోపంతో ఉడికిపోవుట
  2. ఉడుంపట్టు – గట్టి పట్టుదల
  3. ఒంటికోతి – ఏకాకి, ఒంటరివాడు
  4. కడుపు కుటుకుట – ఓర్వలేనితనం

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

ఇ) “తెలంగాణ కథ పుట్టుక నుండి సామాజిక చైతన్యం తోనే కొనసాగుతూ వచ్చింది” అనే వాక్యం ద్వారా మీకేమర్థ మయిందో తెలుపండి.
(లేదా)
తెలంగాణ కథల పుట్టుక గురించి, సామాజిక చైతన్యం గురించి రాయండి.
జవాబు:
కథ, వస్తు, శిల్ప నైపుణ్యంతో ఉంటుంది. తెలంగాణ కథ మొదటి నుండి సామాజిక పరిణామాలను చిత్రిస్తూ వచ్చింది. 1902 నుండి తెలంగాణ కథ ప్రారంభమైంది. పుట్టుకనుండి సామాజిక చైతన్యంతోనే కొనసాగుతూ వచ్చింది. ఉద్యమాలు, పోరాటాలు మున్నగునవి పలు కోణాల్లో చిత్రించబడ్డాయి. 1918లో స్థాపించబడిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇందుకు తోడ్పడింది. ఈ విధంగా తెలంగాణ కథ పుట్టుక నుండి సామాజిక చైతన్యం, ఉద్యమాలు, పోరాటాలను చూపిస్తూ వచ్చిందని నాకర్థమయింది.

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

ప్రశ్న 2.
కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబులు రాయండి. “మెతుకును చూసి అన్నం ఉడికిందో లేదో చెప్పవచ్చు”. అట్లే “పుస్తక పరిచయ వ్యాసాన్ని లేదా సమీక్షను చదివితే కూడా ఆ పుస్తకం గురించి ఆమూలా గ్రంగా అర్థం చేసుకోవచ్చు” ఎట్లాగో రాయండి.
(లేదా)
పుస్తక సమీక్ష ద్వారా ఆ పుస్తకము యొక్క విశేషాలను తెలుసుకోవచ్చు. దీన్ని సమీక్షించండి.
జవాబు:

  1. పీఠిక లేదా సమీక్షను చదివితే చాలా విషయాలు తెలుస్తాయి.
  2. పుస్తకం యొక్క ఆశయాన్ని, అంతస్సారాన్ని, తాత్త్వికతను, రచయిత దృక్పథాన్ని సవివరంగా వివరిస్తుంది పుస్తక సమీక్ష.
  3. ఇది విశ్లేషణాత్మకంగా ఉంటుంది.
  4. నైతిక విలువలను వివరిస్తుంది.
  5. సామాజిక బాధ్యతను తెలియజేస్తుంది.
  6. మానవుల మనస్తత్వాన్ని, సంఘర్షణను తెలుపుతుంది.
  7. చార్మినార్ కథలు సామాజిక పరిణామాలకు సాహిత్య రూపం ఇచ్చిన సామాజిక చరిత్ర అని చెప్పవచ్చును.
  8. పాఠకుడు మూలగ్రంథాన్ని చదివే తీరిక లేనప్పుడు పుస్తకం సమీక్ష కొంతవరకు విషయాన్ని మనకు తేటతెల్లం చేస్తుంది.
  9. పుస్తక సమీక్షలు ఆధారం ఒక్కొక్కసారి ఒక గ్రంథంతో ప్రజాదరణ పొందిన సందర్భాలూ ఉన్నాయి.
  10. నిష్పక్షపాతంగా, నిర్భయంగా రచనలను సమీక్ష చెయ్యాలి. అప్పుడు మాత్రమే ఆ పుస్తకం ఆమూలాగ్రంగా అర్థంచేసుకోటానికి వీలు కలుగుతుంది.
  11. పుస్తక సమీక్షను చదివితే ఆ గ్రంథాన్ని ఆమూలాగ్రం చదువాలనే ఉత్సాహం, ఉత్సుకత కల్గించేలా సమీక్ష ఉండాలి.

(లేదా)

ఆ) కేశవస్వామి కథల గురించి గూడూరి సీతారాం రాసిన వ్యాసం ఆధారంగా కేశవస్వామి రచనల గురించి రాయండి. (Mar. ’15)
(లేదా)
కేశవస్వామి రచనల విశిష్టతలను విశ్లేషించండి.
జవాబు:
విశిష్టమైన వస్తు, శిల్ప నైపుణ్యంతో మహోన్నతమైన కథలు రాసిన నెల్లూరి కేశవస్వామి భారతీయ కథా సాహిత్యంలో సుప్రసిద్ధమైన ప్రేమ్చంద్, కిషన్ చందర్ లతో పోల్చదగిన వారు.

  1. తొలి కథల సంపుటి “పసిడి బొమ్మ”. ఇది 1969 ఆగస్టులో వెలువడింది.
  2. రెండవ కథా సంకలనం “చార్మినార్ కథలు”. ఇవి కేవలం ఊహాజనిత కథలు కావు. సామాజిక పరిణామాలకు సాహిత్యరూపం ఇచ్చిన సామాజిక చరిత్ర రచన ఇది. దీనిలో హైదరాబాద్ రాజ్య చరిత్ర, సంస్కృతిని, మానవ సంబంధాలను, ఇక్కడి ముస్లిం జీవితాలను అపూర్వంగా చిత్రించారు.
  3. “యుగాంతం” కథలో హైదరాబాద్ గురించి వివరించారు. ఇండియా రెండు దేశాలుగా విడిపోయి నాటి పరిస్థితులు, సంక్షోభాలు, హత్యాకాండ ఎట్లా జీవనాన్ని కుదిపేసాయో అట్లే హైదరాబాద్ రాజ్యంలో 1946 – 50ల మధ్య పరిస్థితులు ఎలా కొనసాగాయో వివరించబడింది. సమాజం, మానవ సంబంధాల గురించి వివరించబడింది.
  4. “వంశాకురం” కథలో ముస్లిం పెళ్ళి సంబంధాలు ఎలా ఉంటాయో, కొడుకు పుట్టాలనే ఆశ ఆడపిల్లల జీవితాలను ఎలా అతలాకుతలం చేసి ఆత్మహత్యకు పురికొల్పుతాయో హృదయ విదారకంగా చిత్రించింది.
  5. “కేవలం మనుషులం’ కథలో హుస్సేన్ మిర్జా, మహబూబ్రాయ్ సక్సేనాల మతాల సరిహద్దులను చెరిపివేసిన స్నేహం గురించిన చక్కని కథ.
  6. “భరోసా కథ” నమ్మిన పేదలను నట్టేట ఎలా ముంచుతారో భరోసాను భగ్నం చేసిన యదార్థ కథ.
  7. “ఆఖరి కానుక” కథ రోజు రోజుకు పేదరికంలోకి ఈడ్వబడుతున్న ముస్లిం కుటుంబాలు అరబ్బు దేశాల షేక్లకు తమ కూతుళ్ళను ఇచ్చి పెళ్ళిచేసి తద్వారా కాస్త ఆర్థిక సౌలభ్యం పొందాలనుకునే దుస్థితిని తెలియచేస్తుంది.

ఈ విధంగా కేశవస్వామి కథల గురించి గూడూరి సీతారాం గారు అద్భుతంగా, సజీవంగా, సప్రమాణకంగా వ్యాసం రాశారు.

ప్రశ్న 3.
కింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

అ) మీ పాఠశాల గ్రంథాలయంలోని ఏదైనా ఒక కథల పుస్తకం తీసుకొని చదువండి. దీనికి పుస్తక పరిచయం (పీఠిక) రాయండి.
జవాబు:
వివిధ రంగాల్లో కృషిచేసిన మహిళామూర్తుల సేవలను స్మరిస్తూ ‘మహిళావరణం’ అనే గ్రంథాన్ని కొందరు రచించారు. దీనికి ముందుమాటను ప్రముఖ వ్యాసకర్తలు రచించారు. సమాజంలో వివిధరంగాల్లో రమణీయమైన సేవలను చేసిన వారి త్యాగాలను, సాహసాలను చక్కగా వివరించారు.

ఎందరో స్త్రీలు ఉద్యమాలు చేశారు. చదువులు చదివారు. రాజకీయ నాయకులైనారు. డాక్టర్లు అయ్యారు. నాటక, క్రీడ మొదలైన రంగాల్లో రాణించారు. అయినా వారికి తగిన గౌరవం చరిత్రలో దొరకలేదు. పురుషాధిక్యంతో స్త్రీల సేవలను చరిత్ర గుర్తించడం లేదు. స్త్రీలందరు అద్భుతమైన చరిత్ర నిర్మాణానికి ఎంతో మూల్యం చెల్లించారు. ఎన్నో త్యాగాలు చేశారు.

వివిధ రంగాలలో ప్రసిద్ధి చెందిన మహిళలను ఎంపిక చేసి, వారి వివరాలు, వారి ఇంటర్వ్యూలను కలిపి ‘మహిళావరణం’ అనే పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఆర్థికపరమైన భారాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక వందమంది మహిళల గురించి మాత్రమే ఇందులో ప్రస్తావించారు.

వారికి సంబంధించిన వివరాలను ఈ పుస్తకంలో పొందుపరచారు. ఈ పుస్తక నిర్మాణంలో ఎందరో తమ సహాయసహకారాలను అందించారు. వారందరి సేవలు చిరస్మరణీయంగా ఉంటాయి. రచయితలు వారందరికి కృతజ్ఞతలు తెలియజేశారు.

III. భాషాంశాలు

పదజాలం

ప్రశ్న 1.
గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి.

అ) రాజు ధ్యాస అంతా క్రికెట్ ఆటపైనే ఉన్నది.
జవాబు:
దృష్టి (ఆలోచన)

ఆ) ప్రజ్ఞ, మనోజ్ఞ ఇద్దరూ సఖ్యత తో మెలుగుతారు.
జవాబు:
స్నేహం

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

ఇ) ఫల్గుణ్ హస్తవాసి చాలా మంచిది.
జవాబు:
చేతిచలువ

ఈ) తెలంగాణలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రఖ్యాతి చెందింది.
జవాబు:
మిక్కిలి ప్రసిద్ధి.

ఉ) పూర్వం జమీందారులు దేవిడీలలో చర్చాగోష్ఠులు జరిగేవి.
జవాబు:
సంపన్నులు నివసించే పెద్ద భవంతి

ప్రశ్న 2.
కింది పదాలను వివరించి రాయండి.
జవాబు:
అ) హృదయసంస్కారం : మనసుకు సంబంధించిన సంస్కారం. ఇది ఎంతో విలువ కలిగినది. సొంత కూతురులా నవాబు, నవాబు కొడుకు ఒక ముజ్రాల రమణిని గౌరవించిన తీరును చిత్రించడం ద్వారా ముస్లిం నవాబుల్లో కొనసాగిన హృదయ సంస్కారాన్ని రచయిత ఒడిసిపట్టారు.

ఆ) సామాజిక పరిణామం : సమాజపరంగా జరిగే మార్పు యుగాంతం కథలో వివరించబడింది. మానవ సంబంధాలు, మారుతున్న పరిణామాలను చిత్రించడం వల్ల కథకు “యుగాంతం” అనే పేరు సార్ధకతను చేకూర్చింది.

ఇ) భారతీయ సంస్కృతి : ఇది ఎంతో విశిష్ఠమైంది. 11వ శతాబ్దం నుండి ఇండియాలో సాగిన ముస్లిం వలసలు, రాజ్యాలు, అవి తెచ్చిన పరిపాలనా విధానాలు, జీవన విధానం, సంస్కృతి భారతీయ సంస్కృతిపై జీవన విధానంపై చెరగని ముద్ర వేసారు.

ఈ) అతలాకుతలం : విపరీతంగా శ్రమపడడం లేదా క్రింది లోకం, పైలోకం అల్లకల్లోలమైనంత శ్రమ అనే అర్థంలో దీన్ని వాడతారు. అతలము అనగా ‘పాతాళము’. కుతలము అనగా భూమి అని అర్థం.

వ్యాకరణాంశాలు

1. కింది పదాలకు విగ్రహవాక్యాలురాసి, సమాసాలు గుర్తించండి.

అ) దశకంఠుడు = దశ కంఠములు కలవాడు – బహువ్రీహి సమాసము
ఆ) పీతాంబరుడు = పీతము అంబరముగా కలవాడు – బహువ్రీహి సమాసము
ఇ) అరవిందానన = అరవిందము ఆననముగా కలది – బహువ్రీహి సమాసము
ఈ) మృగనేత్ర = మృగము వంటి నేత్రములు కలది – బహువ్రీహి సమాసము
ఉ) చంచలాక్షి = చంచలమైన అక్షములు కలది – బహువ్రీహి సమాసము
ఊ) మానధనులు = మానమే ధనముగా కలవారు – బహువ్రీహి సమాసము
ఋ) రాజవదన = రాజు యొక్క వదనం కలవాడు – బహువ్రీహి సమాసము
ౠ) నీరజభవుడు = నీరజము నుండి పుట్టినవాడు – బహువ్రీహి సమాసము

2. కింది ప్రత్యక్ష వాక్యాలను పరోక్ష వాక్యాలుగా మార్చండి.

అ) “హైదరాబాదు రాజ్యం ఇండియన్ యూనియన్లో విలీనమైంది” అని సర్దార్ వల్లభభాయ్ పటేల్ ప్రకటించాడు. (ప్రత్యక్షం)
జవాబు:
హైదరాబాదు రాజ్యం ఇండియన్ యూనియన్లో విలీనమైందని సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రకటించాడు. (పరోక్షం)

ఆ) “తెలుగు కథాసాహిత్యంలో రమణీయమైన పోకడలు కల్పించిన ప్రసిద్ధ కథకుల్లో ఒకరు నెల్లూరి కేశవ స్వామి” అని గూడూరి సీతారాం అన్నాడు. (ప్రత్యక్షం)
జవాబు:
తెలుగు కథాసాహిత్యంలో రమణీయమైన పోకడలు కల్పించిన ప్రసిద్ధ కథకుల్లో ఒకరు నెల్లూరి కేశవస్వామియని గూడూరి సీతారాం అన్నాడు. (పరోక్షం)

ఇ) “చార్మినార్ అనే పేరును బట్టే ఈ కథల విశిష్టత వ్యక్తమవుతుంది” అని డి. రామలింగం పేర్కొన్నాడు. (ప్రత్యక్షం)
జవాబు:
చార్మినార్ అనే పేరును బట్టే ఈ కథల విశిష్టత వ్యక్తమవుతుందని డి. రామలింగం పేర్కొన్నాడు. (పరోక్షం)

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

3. కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా మార్చండి.

అ) పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితుల గురించి భీష్మ సహాని “తమస్” నవలలో చిత్రించాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితుల గురించి భీష్మసహాని చేత తమస్ నవలలో చిత్రించబడింది. (కర్మణి వాక్యం)

ఆ) హైదరాబాద్ రాష్ట్ర చరిత్రను ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత మూలకు నెట్టివేశారు. (కర్తరి వాక్యం)
జవాబు:
హైదరాబాద్ రాష్ట్ర చరిత్ర ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత మూలకు నెట్టివేయబడింది. (కర్మణి వాక్యం)

ఇ) నెల్లూరి కేశవస్వామిని భారతదేశం గర్వించ దగిన గొప్ప కథకుల్లో ఒకడిగా కీర్తించారు. (కర్తరి వాక్యం)
జవాబు:
నెల్లూరి కేశవస్వామి భారతదేశం గర్వించదగిన గొప్ప కథకుల్లో ఒకడిగా కీర్తించబడ్డారు. (కర్మణి వాక్యం)

శ్లేషాలంకారం

కింది వాక్యాలను పరిశీలించండి.

అ) మిమ్ముమాధవుడు రక్షించుగాక !
అర్థం :

  1. మిమ్ము మాధవుడు (విష్ణువు) రక్షించుగాక !
  2. మిమ్ము ఉమాధవుడు (శివుడు) రక్షించుగాక !

ఆ) మానవ జీవనం సుకుమారం.
అర్థం :

  1. మానవ (ఆధునిక) జీవనం సుకుమారమైంది.
  2. మానవ (మనిషి) జీవనం సుకుమారమైంది.

పై అర్థాలను గమనించినారు కదా ! ఒకే శబ్దం రెండు వేర్వేరు అర్థాలనందిస్తున్నది. (విభిన్న అర్థాలు ఆశ్రయించి ఉన్నాయి.) ఇట్లా విభిన్న అర్థాలను కలిగి ఉండే పదాలుంటే దానిని ‘శ్లేషాలంకారం’ అని అంటారు.

లక్షణం : నానార్థాలను కలిగి ఉండే అలంకారం శ్లేష.

4. కింది లక్ష్యాలలో ఉన్న అలంకారాన్ని గుర్తించి సమన్వయం చేయండి.

1. రాజు కువలయానందకరుడు :
రాజు = ప్రభువు, చంద్రుడు
కువలయం = భూమి, కలువపూవు
ఆనందకరుడు = ఆనందింప చేసేవాడు
1వ అర్ధములో = ప్రభువు భూమిని ఆనందింప చేసేవాడు.
2వ అర్థములో = చంద్రుడు కలువ పూవులను ఆనందింపచేసేవాడు.
అనేకమైన అర్థాలు గల శబ్దాలను ఉపయోగించి చెబితే దాన్ని శ్లేషాలంకారం అని అంటారు.

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

2. నీవేల వచ్చెదవు.

  1. నీవు ఏల వచ్చెదవు = నీవు ఏల వచ్చెదవు.
  2. నీవేల వచ్చెదవు = నీవు ఏ సమయంలో వచ్చెదవు.
    ఇట్లా ఒకే వాక్యంలో రెండు కానీ అంతకుమించి అర్థాలను కానీ కూర్చడమే శ్లేషాలంకారం.

5. క్రింది వాక్యాల్లోని అలంకారాలను గుర్తించండి.

అ) మావిడాకులు తెచ్చివ్వండి.

  1. మామిడి ఆకులను తెచ్చి ఇవ్వమని ఒకటి.
  2. మా ‘విడాకులను’ తెచ్చి ఇవ్వమని ఒకటి అర్థం స్ఫురిస్తుంది. ఇది శ్లేషాలంకారం.

ఆ) వాడి కత్తి తీసుకోండి.

  1. వాడి యొక్క కత్తిని తీసుకోమని
  2. వాడియైన (పదును గల) కత్తిని తీసుకోమని ‘అర్థం’ వాడబడింది.
    ఇది శ్లేషాలంకారం.

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

ఇ) “ఆమె లత పక్కన నిలుచున్నది”.

  1. ఆమె లత అనే ఆమె ప్రక్కన నిలుచున్నది (ఒక అర్థం)
  2. ఆ, మెలత (స్త్రీ), ప్రక్కన నిలుచున్నది (రెండవ అర్థం) ఇది శ్లేషాలంకారం.

ప్రాజెక్టు పని

వార్తా పత్రికలు లేదా మ్యాగజైన్లలో వచ్చిన పుస్తకం పరిచయాలను / సమీక్షా వ్యాసాలను సేకరించండి. నివేదిక రాసి తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:
బతుకు పుస్తకం అనేది సావిత్రి సమగ్ర రచనా సంపుటిలోనిది. బతుకు పుస్తకం లక్ష్మణరావుగారి జీవితచరిత్ర. ఇది ఆంధ్రజ్యోతి వారి వారపత్రికలో ధారావాహికంగా వెలువడింది.

‘బతుకు పుస్తకం’ రచయిత లక్ష్మణరావుగారు నిజాయితీ గల సాహితీమూర్తి అని రచయిత్రి నమ్మకం. బతుకు పుస్తకం చదవడానికి ముందే లక్ష్మణరావు గారు రచించిన ‘అతడు-ఆమె’ పుస్తకాన్ని రచయిత్రి చదివిందట. లక్ష్మణరావుగారి మీదా, ఆయన జీవితభాగస్వామి మెల్లీ మీదా రచయిత్రికి మంచి అభిమానం ఉంది.

లక్ష్మణరావుగారు మంచి సహృదయుడైన రచయిత అనడానికి ఉదాహరణలు ఇచ్చింది. మెల్లీ కరుణ గల విజ్ఞాని అని, మహా సాహసి అని, పట్టుపట్టి తాను అనుకున్నది సాధించే గుణం కలదని, అనడానికి సబర్మతి జైలులో ఆమె చేసిన సత్యాగ్రహం సంఘటనను పేర్కొంది.

లక్ష్మణరావుగారు కరుణ గల విజ్ఞాని అని, ఆయన చూపిన విజ్ఞత, ప్రపంచం పట్ల ఆయన చూపిన బాధ్యత మరచిపోరానివని గుర్తు చేసింది. మన దేశానికి ఉపయోగించని పరిశోధనలు అనవసరం అని పరిశోధనలకు స్వస్తి చెప్పి అనువాదక వృత్తిని ఆయన చేపట్టిన విషయాన్ని రచయిత్రి గుర్తు చేసింది.
మొత్తముపై లక్ష్మణరావుగారి జీవితంలోని ముఖ్య సంఘటనలను, బతుకు పుస్తకం నుండి రచయిత్రి ఎత్తి చూపింది.

విశేషాంశాలు

1. హైదరాబాద్ రాజ్యం : 1724లో అసఫ్ జాహీ వంశీయుడైన నిజం ఉల్ముల్క్ ఈ రాజ్య స్థాపకుడు. ఇతడు మొగలాయీ చక్రవర్తులకు అత్యంత విశ్వాసపాత్రుడు. హైదరాబాద్ రాజ్యాన్నే ‘హైదరాబాద్ సంస్థానం’ అనే పేరుతో వ్యవహరించేవారు. ఏడుగురు నిజాం వంశీయులు ఈ రాజ్యాన్ని పరిపాలించారు. రాజ్యంలో ప్రస్తుత తెలంగాణతో పాటు నేటి కర్ణాటకలోని మూడు, మహారాష్ట్రలోని ఐదు జిల్లాలు కలిసి ఉండేవి.

2. తెలంగాణ రైతాంగపోరాటం: వందలాది ఎకరాలు కలిగిన భూస్వాములు, వారికి అండదండలు అందించిన నిజాం ప్రభుత్వంపై రైతులు చేసిన పోరాటం ఇది. చారిత్రాత్మకమైన ఈ పోరాటం 1946-51 సంవత్సరాల మధ్య కొనసాగింది. భూమికోసం – భుక్తి కోసం – బానిసత్వ విముక్తికోసం పేదరైతులు చేసిన ఈ సాయుధ పోరాటం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది.

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

3. దేవిడి : నిజాం పాలనా కాలంలో నిర్మించిన పెద్ద పెద్ద భవనాలను ‘దేవిడీ’ లు అనే పేరుతో పిలిచేవారు. ఇవి పెద్ద భవంతులు. వీటిలో సంస్థానాలకు చెందిన సంపన్నులు నివసించేవారు. హైదరాబాద్ పాతనగరం తోపాటు తెలంగాణలోని పలు పట్టణాలలోనూ పాతబడిన దేవిడీలు కనబడతాయి.

4. పాన్దాన్ : తాంబూలాన్ని వేసుకునేవారు. తమలపాకులతోపాటు సున్నం, కాచు, పోకలు, ఇతర సుగంధ ద్రవ్యాలను ఒక చిన్న పెట్టెలో సర్దిపెట్టుకునేవారు. దానిని ‘పాన్దాన్’ అనే పేరుతో వ్యవహరించేవారు. ఇది ఉర్దూపదం.

5. కోహినూర్ : కుతుబ్షాహిల ఖజానాలో ఉండేది ఈ కోహినూర్ వజ్రం. ఈ వజ్రం బరువు 750 ఇంగ్లీషు కారెట్లుగా నిర్థారించారు. కోహినూర్ వజ్రం ప్రపంచంలోని వజ్రాల చరిత్రలోనే అత్యంత విలువైనది, విశిష్టమైనది.

సూక్తి : మంచిపుస్తకం మంచిమనసుకు మరోపేరు సొంతపుస్తకం మంచి మనిషికి మరోతోడు.

చదువండి – తెలుసుకొండి

విశ్వకవి ‘గీతాంజలి’

సాహిత్య సృజనలో అంతర్జాతీయ కీర్తినందుకొన్న మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్. కవిగా రచయితగా తత్త్వవేత్తగా సంగీతజ్ఞుడిగా చిత్రకారుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించాడు. రవీంద్రునిపేరు వినగానే చప్పున స్ఫురించేవి. ‘జనగణమన’ గీతం, ‘గీతాంజలి’. ‘జనగణమన’ గీతం భారత జాతీయగీతంగా గుర్తింపబడింది.

బంగ్లాదేశ్ జాతీయగీతం కూడా ఇతని లేఖిని నుండి వెలువడినదే. ఇలా రెండు జాతీయగీతాలనందించిన కవిగా అపూర్వ చరిత్రను సృష్టించాడు. ‘శాంతినికేతన్’ పేరున ఆదర్శవిద్యాలయాన్ని స్థాపించి ‘గురుదేవుడు’గా కీర్తింపబడ్డాడు. ఈ సంస్థద్వారా సంస్కారయుక్తమైన విద్యనందించాడు.

కవిగా ఇతనికి ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చిన రచన ‘గీతాంజలి’. 1913లో దీనికి ‘నోబెల్ సాహిత్య పురస్కారం’ దక్కింది. నోబెల్ బహుమతిని అందుకున్న తొలి భారతీయుడిగా ఠాగూర్ అరుదైన గౌరవాన్ని పొందాడు. ‘గీతాంజలి’ భారతీయ భాషల్లోకి మాత్రమేకాక ఎన్నో విదేశీ భాషలలోకి అనువదింపబడింది. ఒక్క తెలుగు భాషలోనే దాదాపు 50 దాకా అనువాదాలొచ్చాయంటే దీని గొప్పదనమేమిటో ఊహించవచ్చు. తాత్త్విక, సామాజిక అంశాలను స్పృశిస్తూ సాగిన ఈ రచన పాఠకుని హృదయాన్ని కదిలిస్తుంది.

‘గీతాంజలి’లోని రెండు అనువాద కవితా ఖండికలను ఇప్పుడు చూద్దాం.

1. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో
ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో
ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో
సంసారపు గోడలమధ్య ఎక్కడ భాగాల కింద ప్రపంచం విడిపోలేదో

ఎక్కడ సత్యాంతరాళంలోంచి పలుకులు బైలు వెడలతాయో
ఎక్కడ అలసటనెరగని శ్రమ తన బహువుల్ని పరిపూర్ణతవైపు జాస్తుందో
ఎక్కడ నిర్జీవమైన ఆచారపుటెడారిలో స్వచ్ఛమైన బుద్ధిప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో
ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకీ, కార్యాలలోకీ నీచే నడపబడుతుందో
ఆ స్వేచ్ఛా స్వర్గానికి, తండ్రీ! నా దేశాన్ని మేల్కొలుపు. – చలం

2. నా హృదయంలోని పేదరికాన్ని సమూలంగా తొలగించు ప్రభూ – ఇదే నా ప్రార్థన.
నా సుఖదుఃఖాలను తేలికగా భరించ గలిగే శక్తిని నాకు ప్రసాదించు.
సేవలోనే నా ప్రేమను ఫలింపజేసుకొనే శక్తిని అందజేయి,
పేదలను కాదనకుండా, అధికారదర్పానికి దాసోహమనకుండా ఉండే శక్తిని ప్రసాదించు.
దైనందిన అల్పవిషయాలకు అతీతంగా బుద్ధిని నిలుపుకోగల శక్తిని ప్రసాదించు.
నీ అభీష్టానికి ప్రేమతో నా శక్తిని అర్పించుకోగలిగే శక్తి నివ్వు. – డా॥ జె. భాగ్యలక్ష్మి

పదాలు – అర్థాలు

I

భూమిక = ప్రదేశము
సాయుధ = ఆయుధాలతో
విరివిగా = ఎక్కువగా
ధ్యాస = ఆలోచన, దృష్టి
విశ్లేషణ = వివరణ
చిత్రించబడ్డాయి = వివరించబడ్డాయి
విజృంభించి = అతిసయించి
దివాన్ = మంత్రి
జనాభా = పరివారము
కోఠీ = వేశ్యావాటిక
అంతర్యుద్ధం = లోలోపల వారిలో జరిగే
ఒప్పందం = ఒడంబడిక
రిటైర = పదవీ విరమణ
విశిష్ట స్థానం = ప్రత్యేక స్థానం
సంక్షుభిత = చిన్నాభిన్నమైన

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

II

నిర్దిష్టం = నిర్దేశించబడిన
వెలువడింది = వచ్చింది
అంకితం = ఒక గ్రంథమును వ్రాసి మఱి యొకరి పేర కృతి ఇచ్చుట
అపూర్వము = అపురూపము, క్రొత్తది, కారణం లేనిది
ఆదానప్రదానాలు = ఇచ్చిపుచ్చుకొనుట
నేపథ్యం = వస్త్రాద్యలంకారం, వేషము నాట్య స్థానము, నాట్య రంగమందు తెర లోపలి ప్రదేశం
తమస్ = చీకటి
పరిణామాలు = మార్పులు

III

ప్రోగ్రాం = కార్యక్రమము
మహోన్నతము = గొప్పదైన
అతీతంగా = అతిక్రాంతము, కడచినది
పొడసూపితే = కలిగితే
సున్నితమైన = మృదువైన
అతలాకుతలం = నలుగుట, శ్రమము, చెదరిపోవుట
సౌలభ్యం = సులభత్వం
దేవిడీ = సంపన్నులు నివసించే పెద్ద భవంతి

పాఠం ఉద్దేశం

ముందుమాట వల్ల పుస్తకంపై ప్రాథమిక అవగాహన ఎలా కలుగుతుందో, పుస్తకాన్ని చదవాలనే ఆసక్తి, ఆతురత ఎట్లా ఏర్పడుతాయో తెలియజేస్తూ దాని స్వరూప స్వభావాలను పరిచయం చేయడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

నేషనల్ బుక్స్ట్ ప్రచురించిన ‘నెల్లూరి కేశవస్వామి ఉత్తమకథలు’ సంపుటికి గూడూరి సీతారాం రాసిన పీఠిక ప్రస్తుత పాఠ్యాంశం.

TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

కవి పరిచయం

రచయిత : గూడూరి సీతారాం
నివాసం : రాజన్న సిరిసిల్ల జిల్లా దగ్గర గల హనుమాజీ పేట
జననం : 18.07.1936
మరణం : 25.09.2011
రచనలు : 1953 నుండి 1965 వరకు సుమారు 80 కథలు రాశారు. కొన్ని మాత్రమే ప్రస్తుతం దొరుకు తున్నాయి.
ప్రత్యేకత : తెలంగాణ భాషను, యాసను ఒలికించడం ఈయన కలానికున్న ప్రత్యేకత.
ఇతర అంశాలు : తెలంగాణ కథా సాహిత్యంలో పేద కులాల జీవితాలను, అట్టడుగు వర్గాల భాషను అక్షరబద్ధం చేసిన రచయిత. తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేశాడు.
ఇతర రచనలు : మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజీరికం మొదలగునవి.

ప్రవేశిక

కథలు ఒకప్పుడు మానసికానందాన్ని, నైతిక విలువలను చెప్పడానికి పరిమితమై ఉండేవి. 20వ శతాబ్దంలో ఆధునిక కథానిక సాహితీరంగ ప్రవేశం చేయడంతో కథ స్వరూప స్వభావాల్లో స్పష్టమైన మార్పులు చోటుచేసుకున్నాయి. కథానిక సామాజిక బాధ్యతను తలకెత్తుకున్నది. మానవ మనస్తత్త్వాన్ని, సంఘర్షణను భిన్న సంస్కృతులను తన జీవ లక్షణాలుగా చేసుకున్నది. తెలుగు కథానిక అంతర్జాతీయ వేదికల మీద గర్వంగా తలెత్తుకొని నిలబడింది. అటువంటి గొప్ప కథానికా రచయితల్లో నెల్లూరి కేశవస్వామి ఒకరు.

విశిష్టమైన వస్తు, శిల్ప నైపుణ్యంతో మహోన్నతమైన కథలు రాసిన నెల్లూరి కేశవస్వామి భారతీయ కథా సాహిత్యంలో సుప్రసిద్ధులైన ప్రేమ్చంద్, కిషన్ చందర్ తో పోల్చదగిన వాడు. ఆయన ఉత్తమ కథల గురించి కొంతైనా తెలుసు కోవడం ఎంతైనా అవసరం.

విద్యార్థులకు సూచనలు

  • పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
  • పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత గీయండి.
  • వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పద విజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకోండి.

ప్రక్రియ – పీఠిక

ఈ పాఠం ‘పీఠిక’ ప్రక్రియకు చెందినది. ఒక పుస్తకం ఆశయాన్ని, అంతస్సారాన్ని, తాత్త్వికతను, రచయిత దృక్పథాన్ని, ప్రచురణకర్త వ్యయప్రయాసలను తెలియజేసేదే పీఠిక. ఒక గ్రంథ నేపథ్యాన్ని, లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయితగాని, మరొకరుగాని, విమర్శకుడుగాని రాసే విశ్లేషణాత్మక పరిచయవాక్యాలను పీఠిక అంటారు. దీనికే ముందుమాట, భూమిక, ప్రస్తావన, తొలిపలుకు, మున్నుడి, ఆముఖం మొదలైన పేర్లెన్నో ఉన్నాయి.

TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి

Telangana SCERT 10th Class Telugu Guide Telangana 8th Lesson లక్ష్యసిద్ధి Textbook Questions and Answers.

TS 10th Class Telugu 8th Lesson Questions and Answers Telangana లక్ష్యసిద్ధి

ప్రశ్నలు – జవాబులు (T.B. P.No. 77)

ప్రశ్న 1.
పైనున్న సంపాదకీయ శీర్షికలు ఏ విషయాన్ని తెలుపుతున్నాయి ?
జవాబు:
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని గురించి.

ప్రశ్న 2.
ఆ వార్తకున్న ప్రాధాన్యమేమిటి ?
జవాబు:
తెలంగాణ ప్రజలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తాము నష్టపోతున్నామనీ, ప్రత్యేకంగా తెలంగాణగా విడిపోతే, తమ ప్రాంతాన్ని తాము అభివృద్ధి చేసుకోవచ్చనీ, చాలాకాలంగా తమ ప్రాంతాన్ని వేరు రాష్ట్రంగా ప్రకటించమనీ కోరుతున్నారు. ఆ ప్రజల అభి మతమూ, వారి లక్ష్యమూ సిద్ధించాయని ఆ వార్త తెలుపుతోంది.

TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 3.
మీరెప్పుడైనా సంపాదకీయాలు చదివారా ? సంపాదకీయమంటే ఏమిటి ?
జవాబు:
సినిమా వార్తలు, క్రీడావార్తలు తప్ప సంపాదకీయాలను పెద్దగా చదువం. కాని, సంపాదకీయమంటే తెలుసు. ప్రతిరోజూ వార్తలు దినపత్రికలలో ప్రచురిస్తారు. ఒక్కొక్క రోజున ఒక్కొక్క వార్త చాలా ప్రాధాన్యం కలిగి ఉంటుంది. ఆ విధంగా ప్రాధాన్యం కలిగిన వార్తలోని విషయాన్ని పత్రికా సంపాదకులు విశ్లేషిస్తారు. అదే సంపాదకీయం. అంటే సమకాలీన వార్తలపైన పత్రికల విశ్లేషణ.

ప్రశ్న 4.
సంపాదకీయాల ద్వారా ఆయా పత్రికల గూర్చి మనం ఏం తెలుసుకోవచ్చు?
జవాబు:
సంపాదకీయాల ద్వారా ఆయా పత్రికల మనో భావాలు తెలుస్తాయి. ఆ పత్రిక ఎవరికి అను కూలమో కూడా తెలుసుకోవచ్చు. పత్రికల యొక్క విశ్లేషణా సామర్థ్యం తెలుసుకోవచ్చు. సమకాలీన సమస్యలపై పత్రికకు ఉన్న అవగాహన తెలుస్తుంది.

TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 79)

“అర్థరాత్రి వేళ ప్రపంచమంతా నిద్రిస్తున్నప్పుడు ………… హృదయాలను ఆర్ద్రంగా మార్చాయి.

ప్రశ్న 1.
“సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది.” ఈ మాటలన్నది ఏ సందర్భంలో ? ఎవరన్నారు?
జవాబు:
పాతదనంలోంచి కొత్తదనంలోకి అడుగుపెడుతాం. ఒక శకం ముగుస్తుంది. సుదీర్ఘకాలం అణచివేయ బడిన తెలంగాణ జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుం దని” దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు నెహ్రూ గారు ఈ మాటలన్నారు.

ప్రశ్న 2.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటంలోని ఏయే ఘట్టాలు ఈ ప్రాంత ప్రజల హృదయాలను ఆర్ద్రంగా మార్చాయి?
జవాబు:
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన వేళ మూడు తరాల తెలంగాణ బిడ్డల నుండి భావోద్వేగంతో భాష్పాలు రాలాయి. 1969 ఉద్యమం, మలిదశ పోరాటం, పతాకస్థాయి ఘట్టాలు, లాఠీలు ….. తూటాలు ….. గాయాలు ఇట్లా ఎవరి జ్ఞాపకాలు, అనుభూతులు వారివి. ఆనందోత్సాహాలతో పాటు పోరాట జ్ఞాపకాలు కూడా ముసురుకొని హృదయాలను ఆర్థంగా మార్చాయి.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 80)

తెలంగాణలోని ప్రతి అడుగడుగూ ఉద్యమ చరిత్రతో ………. అమరవీరులకు నివాళులు

ప్రశ్న 1.
‘జై తెలంగాణ’ నినాదం బలపడడానికి దారితీసిన సంఘటనలేవి ? వాటి పర్యవసానాలేవి ?
జవాబు:
తెలంగాణ ప్రతి విషయం ఉద్యమంతో ముడిపడి ఉన్నదే. ప్రతి ప్రదేశం ఉద్యమంతో ముడిపడిన పవిత్ర ప్రదేశమే. సచివాలయంలో ‘నల్లపోచమ్మ’ గుడి ఉండేది. అది మనకు పరమ పవిత్రమైన దేవాలయం కదా ! అక్కడ ‘నల్లపోచమ్మ’ను మాయం చేసి ‘బెజవాడ కనకదుర్గ’ ను పెట్టారు.

దాంతో తెలంగాణ ఉద్యోగులు పోరాటానికి దిగారు. మళ్ళీ ‘నల్లపోచమ్మ’ వెలిసింది. ఇది ‘జై తెలంగాణ’ నినాదాన్ని బలపరిచింది. పర్యవసానంగా మన తొలి ముఖ్యమంత్రి కె.సి.ఆర్. గారు ఆ గుడిలోనే పూజలు చేశారు.

ఉద్యమం చివరిదశలో ‘పరేడ్ గ్రౌండ్’ లో సభ పెట్టుకోవడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. దానితో ‘జై తెలంగాణ’ నినాదం మిన్నంటింది. తెలంగాణ మొత్తం ‘జై తెలంగాణ’ నినాదంతో దద్దరిల్లి పోయింది. పర్యవసానంగా మన బంగారు ‘తెలంగాణ’ మనకేర్పడింది. మన ప్రియతమ ముఖ్యమంత్రిగారు అదే ‘పరేడ్ గ్రౌండ్’ లో గౌరవ వందనం స్వీకరించారు.

ప్రశ్న 2.
ఉద్యమకాలంలో హైదరాబాదు వీధులు, మైదానాల ప్రత్యేకతలు ఏమిటి ?
జవాబు:
ఉస్మానియా క్యాంపస్లో లాఠీచార్జీ, గస్పార్క్ అమర వీరుల స్తూపం దగ్గర చర్చలు, ముళ్ళతీగలను ఛేదించుకొని అమర వీరుల స్తూపం దగ్గరకు ఉరకడం ‘ఇవన్నీ’ ఉద్యమకాలంలో జరిగిన ప్రత్యేకతలు.

ప్రశ్న 3.
“గన్పార్క్ అమరవీరుల స్తూపంతో ముడిపడిన సంఘటన లెన్నో……….. ఆ సంఘటనలను గురించి చర్చించండి.
జవాబు:
తెలంగాణ ఉద్యమం గస్పార్క్ అమరవీరుల స్తూపంతో విడదీయలేని సంబంధం కలిగి ఉంది. ఉద్యమం ప్రతి దశలో, ప్రతి మలుపులోనూ, ప్రతి సంఘటనలోనూ ‘గస్పార్క్’ ససాక్ష్యంగా నిలిచింది. తెలంగాణ బిడ్డలు ‘గస్పార్క్’ దగ్గర కలుసుకొని చర్చించుకొనేవారు. వలసపాలకులు ఆంక్షలను ఉద్యమకారులు ధిక్కరించేవారు.

లాఠీ దెబ్బలకు జంకలేదు. ముళ్ళతీగలను ఛేదించేవారు. అమర వీరుల స్తూపం దగ్గరకు ఉరికేవారు. జూన్ రెండున అనేకమంది అక్కడ చేరి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. ‘గన్పార్క్’ చూస్తే అమరవీరుల త్యాగాలు గుర్తుకు వస్తాయి. కళ్ళు చెమ్మగిల్లుతాయి.

TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 81)

స్వీయరాష్ట్రం సిద్ధించింది గనుక ఇక జాతి ……..
…………. ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది.

ప్రశ్న 1.
తెలంగాణ పునర్నిర్మాణంలో ఎట్లాంటి చర్యలు వెంటనే చేపట్టాలని సంపాదకుడు భావిస్తున్నాడు ? దీన్ని మీరు సమర్థిస్తారా ?
జవాబు:
తెలంగాణ పునర్నిర్మాణం జరగాలి. తెలంగాణ ప్రజలకు కావలసింది ప్రశాంతత. పచ్చని బతుకు. తెలంగాణ పునర్నిర్మాణానికి శక్తియుక్తులన్నీ కూడ గట్టాలని సంపాదకీయం పేర్కొంది. మా అభిప్రాయం కూడా ఇదే. మూడు తరాల నుండి ఉద్యమాలతో ప్రశాంతత లేదు. ఎటు చూసినా బాధలే. ఎటు చూసినా కన్నీరే. ఎటు చూసినా ఉద్రిక్తతలే. ఇంక మంచిరోజులు వచ్చాయి. ఇంక కావలసినది ప్రశాంతత.

ఉద్యమాలతో చాలామంది తమ ప్రాణాలను కోల్పోయారు. ప్రాణప్రదమైన వారిని కోల్పోయేరు. ఇక పచ్చని బతుకులు కావాలనేదే మా అందరి కోరిక. తెలంగాణ ప్రజలందరికీ కావలసినది కడుపు నిండా తిండి. కంటినిండా నిద్ర. రేపటి గురించి గుబులు లేని జీవితం అని కూడా సంపాదకీయం పేర్కొంది. మా కోరిక కూడా అదే.

ప్రశ్న 2.
నవ తెలంగాణ నిర్మాణంలో ప్రభుత్వ వ్యూహాలు ఏమిటి
జవాబు:
మూడు తరాల నుండి అణచివేతలో మగ్గిన సమాజాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం వ్యూహాలు తయారుచేసుకొంది.

  1. సంక్షేమ పథకాలు కచ్చితంగా అమలు జరిగేలా చూడాలి. అణచివేతకు గురైన మన సమాజాన్ని ఆదుకోవాలి.
  2. రుణమాఫీ – రైతులు అప్పులపాలై అప్పులు తీర్చే దారిలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆ పరిస్థితి నివారించాలంటే ‘రుణమాఫీ’ తప్పనిసరిగా అమలు జరగాలి.
  3. నీటి పారుదల – నీటి విషయంలో కూడా వివక్షకు గురయ్యాం. గురవుతున్నాం. ఈ పరిస్థితి నివారించక పోతే పంట పొలాలు ఎండిపోతాయి. విద్యుత్తు తగ్గిపోతుంది. అందుచేత ‘నీటి పారుదల’ అనేది చాలా పెద్ద పని.
  4. పరిపాలనా సంస్కరణలు – పాలనాపరమైన సంస్కరణలు కూడా చేపట్టాలి. మన పరిపాలన మనమే చేసుకొనే బంగారు రోజులు వచ్చాయి. కనుక మనకు అనుకూలమైన సంస్కరణలు పరిపాలనలో తీసుకొని రావాలి.

ప్రశ్న 3.
తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మీరెట్లాంటి పాత్ర పోషిస్తారు?
జవాబు:

  1. సంక్షేమ పథకాలు అమలయ్యేటట్లు చూస్తాను.
  2. రుణాలు మాఫీ, 2 పడకల గదుల ఇల్లు. ఇలాంటి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చుతాను.
  3. వ్యక్తిగా ప్రభుత్వపు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల నిర్వహణలో ప్రభుత్వానికి అండగా ఉంటాను.
  4. గౌరవానికి భంగం కలుగకుండా నవతెలంగాణ నిర్మాణానికి సహకరిస్తాను.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కృషిచేసిన వారిని అభినందించడానికి మీ పాఠశాలలో సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఏదైనా ఒక అంశం గురించి మాట్లాడాలి. మీరైతే కింది అంశాలలో దేని గురించి మాట్లాడుతారు ?
అ) రాష్ట్రసాధనలో కవులు, కళాకారుల పాత్ర.
ఆ) ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల పాత్ర.
ఇ) ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల పాత్ర.
ఈ) సకలజనుల పాత్ర.
జవాబు:
అ) రాష్ట్ర సాధనలో కవులు, కళాకారుల పాత్ర :

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కవులు, కళాకారుల పాత్ర ఎంతో ముఖ్యమయినది. 1969 తెలంగాణ తొలి ఉద్యమం కంటే ముందే 1925లో తెలంగాణ ఔన్నత్యాన్ని నిజాం రాష్ట్ర ప్రశంస పేరుతో శేశాద్రి రమణ కవులు ప్రచురించారు. ఆ తర్వాత 1934లో గోల్కొండ కవుల సంచిక ప్రచురితమైంది. దానికి కొనసాగింపుగా వట్టికోట అళ్వారుస్వామి సంపాద కత్వంతో “ఉదయ ఘంటలు” వెలువడింది.

1950లో ‘ప్రత్యూష’ కవితా సంకలనం హైద్రాబాదు కవులు తెచ్చారు. ‘తొలి కారు’ పేరుతో 1957లో వరంగల్ నుంచి కవిత్వ సంకలనం దాశరథి సంకిరెడ్డి నారాయణరెడ్డి గారి “మత్తడి”, “పొక్కిలి” తరువాత జాగో జగావో, దిమ్మెస, క్విట్ తెలంగాణ, ‘గాయాలే గేయాలై’, ‘మునుం’ వంటి కవితా సంకలనాలు వెలువడినాయి. అంతేకాక అనేక జిల్లాల నుండి కవితా సంపుటులు వెలువడ్డాయి.

అందెశ్రీ, గద్దర్, గోరెటి వెంకన్న, జయరాజ్ యస్పాల్ ధూంధాంలు నిర్వహించారు. తొలితరం ఉద్యమంలోనే గూడ అంజయ్య, మిత్ర, దరువు ఎల్లన్న, విమలక్క వంటి గాయకులు, కవులు ఎందరో 1949-1950లో చిత్తలూరి వీరస్వామి, రావెళ్ళ వెంకట్రామారావు మొదలయిన వారితో రసమయి బాలకిషన్, దేశపతి శ్రీనివాస్ వంటి గాయకులు, ఘంటాచక్రపాణి, ఎన్. వేణుగోపాల్, అన్నవరం దేవేందర్, ఘనపురం దేవేందర్, జ్వలిత, జూపాక సుభద్ర, షాజహానా వంటి కవయిత్రులు ఎందరో తెలంగాణ ఉద్యమంలో తమ పాత్ర పోషించారు.

TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి

ఆ) ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల పాత్ర :

ఉద్యోగులు, ఉపాధ్యాయులు తెలంగాణ రాష్ట్ర సాధనకు వెనుదిరగని ఉద్యమాలు చేశారు. సచివాలయంలో రోజూ ఉద్యమాలే. తెలంగాణ ఉద్యోగులు తమ ఉద్యోగాలకంటే ఆత్మాభిమానానికే విలువనిచ్చారు. బెదిరింపులకు భయపడలేదు. నాల్గవ తరగతి ఉద్యోగి నుండి అత్యున్నత అధికారి వరకు ఒకేమాట. ఒకేబాట. అదే ప్రత్యేక రాష్ట్ర సాధన. అవసరమైతే తమ ఉద్యోగాలు వదులుకునేందుకు కూడా సిద్ధపడ్డారు.

ఉపాధ్యాయులదీ అదే బాట. అందుకే అన్నమాట ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ‘స్పెషల్ ఇంక్రి మెంట్’ ఇచ్చి గౌరవించింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా 43 శాతం ఫిట్మెంట్ కూడా ఇచ్చింది.

ఇక విద్యార్థుల ఆవేశం కట్టలు తెచ్చుకొంది. చాలామంది ప్రాణాలను కూడా తృణప్రాయంగా విడిచిపెట్టారు. ఉస్మానియా క్యాంపస్ లో పోలీసు ఆంక్షలను లెక్క చేయకుండా ఉద్యమించారు. తెలంగాణలోని అన్ని యూనివర్శిటీలు, కళాశాలలది ఇదే పరిస్థితి. కేజీ నుండి పీ.జీ వరకు ఒకటేమాట. ఒకేబాట. అదే ‘ జై తెలంగాణ’. తెలంగాణ రాష్ట్రం కావాలి’. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎక్కువ కష్టాలను ఎదుర్కొన్నది విద్యార్థి లోకం.

ఇ) ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల పాత్ర :

ఒక రాష్ట్ర సాధన కోసమే ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డల ఆత్మగౌరవంకు నినాదంగా రూపుదిద్దుకున్నది. ‘తెలంగాణా రాష్ట్ర సమితి టి.ఆర్.యస్.పార్టీ. రాష్ట్ర సాధనకోసం గ్రామ స్థాయి నుంచి ఉద్యమ పార్టీగా, ఉద్యమమే ధ్యేయంగా రూపుదిద్దుకున్నది. ఇతర పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం, కమ్యూనిస్టు పార్టీలు తమ వంతు కృషిచేసినా. వేరు స్థాయినుంచి పటిష్టమైన నిర్మాణం చేయగలిగింది తెరాసే.

ప్రజాప్రతినిధులుగా ప్రజల ఆశలను, ఆలోచన లనూ ప్రతిబింబించే బాధ్యతలను నెత్తికెత్తుకున్న ప్రజాప్రతినిధులు రాష్ట్ర సాధనకై పలుమార్లు తమ పదవులకు రాజీనామాలు చేసి తిరిగి ఎన్నిక కావటం ద్వారా ఈ ప్రాంతపు ప్రజల మనోభావాలను ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేశారు.

రాజకీయ నాయకులుగా రాష్ట్రశ్రేయస్సుకోసం పనిచేస్తూనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషిచేసి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి ప్రత్యేక రాష్ట్ర సాధనకు కృషిచేసిన వాళ్ళందరకీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

ఈ) సకలజనుల పాత్ర :

సకలజనుల సమ్మె ఉద్యమ ఘట్టంలో ప్రధాన భూమిక పోషించింది. అందరూ ‘చేయి చేయి కలిపి’ ముందుకు సాగారు. నాటి ప్రభుత్వానికి వణుకు పుట్టించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సకల జనుల సమ్మెకు దిగి వచ్చాయి. ఈ విధంగా అనేక రకాల ఉద్యమాలు, ఎందరో వీరుల త్యాగఫలమే మన నేటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం.

ప్రశ్న 2.
కింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

1926 మే 19న గోలకొండ పత్రిక ప్రారంభ మైంది. నేడు ఉన్న సదుపాయాలు నాడు పత్రికా నిర్వహణకు ఏమాత్రం లేకుండె. సంపాదకుడే అన్ని పనులు నిర్వహించుకొనేవాడు. విలేఖరిపని, వ్యాస రచయితలపని, గుమాస్తాపని, ప్రూఫ్ రీడర్ పని ఇట్లా దాదాపు అన్ని పనులను ఒక్కరే చేయవలసి వచ్చేది. ఈ పరిస్థితుల్లో గోలకొండ పత్రిక ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొన్నది. బంధుమిత్రుల సహకారంతో సురవరం ప్రతాపరెడ్డి పట్టుదలతో పత్రిక నిర్వహించాడు. 1939 ఆగస్టు 3వ తేదీ నుండి గోలకొండ పత్రికకు సంపాదకుడిగా ప్రతాపరెడ్డి నియమితుడయ్యాడు. గోలకొండ పత్రిక ప్రతాపరెడ్డి ప్రతిభకు అద్దం పట్టింది. తెలంగాణ ప్రజానీకాన్ని జాగృతపరిచింది.

ఆయన రాసిన వ్యాసాలు, విమర్శలు, సంపాద కీయాలు వెయ్యికిపైగా ఉంటాయి. పత్రికలో చర్చా వేదికను నిర్వహించి సత్యాలను నిగ్గుతేల్చే అవకాశాలను విమర్శకులకు కలిగించే వాడు. వ్యక్తి స్వాతంత్ర్యం, పౌరహక్కులు, ప్రాంతీయ భాషలకు, పత్రికా స్వాతంత్ర్యానికి గడ్డురోజులు ఉన్నప్పటికీ కూడా నిజాం ప్రభుత్వం ఆంక్షల నెదుర్కొంటూ గోలకొండ పత్రిక తెలంగాణ ప్రజల్లో కొత్త భావాలను, ఆలోచనలను, చైతన్యాన్ని రగిల్చింది.

అ) గోలకొండ పత్రిక సంపాదకుడెవరు ?
జవాబు:
గోలకొండ పత్రిక సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి గారు.

ఆ) నాటి పత్రికాసంపాదకులు ఏయే పనులు చేసేవారు ?
జవాబు:
నాటి పత్రికాసంపాదకుడే, అన్ని పనులూ నిర్వహించే వాడు. విలేఖరులపని, వ్యాసరచయితలపని, గుమాస్తాపని, ప్రూఫ్ రీడర్పని ఇట్లా అన్ని పనులు చేసేవారు.

TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి

ఇ) ప్రతాపరెడ్డి గోలకొండపత్రిక ద్వారా ఏం చేశాడు?
జవాబు:
సురవరం ప్రతాపరెడ్డిగారు గోలకొండ పత్రిక ద్వారా తెలంగాణా ప్రజానీకాన్ని జాగృతపరచాడు. పత్రికలో చర్చావేదికను నిర్వహించి సత్యాలను నిగ్గు తేల్చేవారు.

ఈ) గోలకొండ పత్రిక వల్ల తెలంగాణ ప్రజలకు కలిగిన ప్రయోజనమేమిటి ?
జవాబు:
వ్యక్తి స్వాతంత్య్రం, పౌరహక్కులు, ప్రాంతీయ భాషలకు పత్రికా స్వాతంత్ర్యానికి గడ్డు రోజులు ఉన్నప్పటికీ కూడా నిజాం ప్రభుత్వం ఆంక్షల నెదుర్కొంటూ గోలకొండ పత్రిక ప్రజల్లో కొత్త భావాలను, ఆలోచనను, చైతన్యాన్ని రగిల్చింది. గోలకొండ పత్రిక వల్ల తెలంగాణ ప్రజలకు నిగ్గు తేల్చే నిజాలను తెలుసుకునే అవకాశం కలిగింది. ప్రజలను ప్రభుత్వంపై ధైర్యంగా పోరాడే ఆత్మస్థైర్యం, సంకల్పబలం కలిగింది. ప్రజల్లో నూతన ఆలోచనల ఆవిష్కరణకు అవకాశం కల్పించింది.

ఉ) పై పేరాకు పేరు పెట్టండి.
జవాబు:
శీర్షిక “గోలకొండ పత్రిక” – ప్రతాపరెడ్డి సంపాదకత్వం.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జాతి చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టంగా ఎందుకు అనుకుంటున్నారు?
జవాబు:
1969 నుండి జూన్, 2014 వరకు సాగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సఫలమై, తెలంగాణ సకల జనుల స్వప్నం సాకారమైన వేళ, భారతదేశ పటంపై 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఇది అద్భుతమైన ఘట్టం. చరిత్రలో అరుదుగా కన్పిస్తుంది. పాతదనం లోంచి కొత్త దనంలోకి అడుగుపెట్టడం.

ఒక శకం ముగుస్తుంది. సుదీర్ఘ కాలం అణచివేయబడిన జాతి తన గొంతు విన్పించింది. ఇది తెలంగాణ సమాజం చేసిన సమిష్టి ప్రకటన. తెలంగాణ పోరాటం గమ్యాన్ని ముద్దాడిన క్షణమది. జాతి చరిత్రలో అరుదైనక్షణం. అత్యద్భుతమైన క్షణం.

ఆ) తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మీరు ఎట్లాంటి పాత్ర పోషిస్తారు?
జవాబు:
తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మేము మా సర్వ శక్తులు ధారపోస్తాము. తెలంగాణా జాతి సర్వతో ముఖాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటాము. తెలంగాణా ఉద్యమకాలంలో ప్రాణాలర్పించిన అమర వీరుల ఆశయాల సాధనకు ఊపిరి ఉన్నంతవరకూ పోరాడుతాము. తెలంగాణా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలూ శ్రమించి వారి కలలను సాకారం చేస్తాము.

తెలంగాణ భాష సంస్కృతులకు మళ్ళీ ప్రాణం పోసి, ఉత్కృష్టమైన తెలంగాణ జీవన విధానాన్ని పునరుద్ధరింపజేసే విధంగా యువతను జాగురూకులను చేస్తాము. రాష్ట్ర ప్రజల మధ్య సామాజిక సంబంధాలు బలపడే విధంగా సామాజిక చర్యలు చేపడతాము. ప్రభుత్వ వ్యూహాలను ప్రజలకు తెలియజేసి, వాటి అమలుకు కృషి చేస్తాము.

  • ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు అన్ని సకాలంలో అమలయ్యే విధంగా చూస్తాము.
  • పరిపాలనా రంగంలో నూతన సంస్కరణలు ప్రవేశ పెట్టి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతాము.
  • తెలంగాణా పునర్నిర్మాణానికి మా శక్తియుక్తులన్ని కూడదీసుకుని కార్యాచరణ దిశగా పయనిస్తాము.
  • నవతెలంగాణ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తామని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తాము.

TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి

ఇ) సంపాదకీయాలు పత్రికల్లో ఎందుకు రాస్తారు ?
జవాబు:
ఒక్కొక్క పత్రికకు కొన్ని విశిష్ఠ లక్షణాలుంటాయి. ఆ పత్రిక ద్వారా చాలా విషయాలు వెలుగు చూస్తాయి. నార్ల వేంకటేశ్వరరావు, తాపీ ధర్మారావు, విద్వాన్ విశ్వం, పింగళి వెంకటకృష్ణారావు, బూదరాజు రాధాకృష్ణ, సురవరం ప్రతాపరెడ్డి లాంటి వ్యక్తులు తమ తమ జ్ఞానంతో, మేధస్సుతో రచనలు చేశారు.

పత్రికలు సమాజానికి ప్రతిబింబాలు. అసంఖ్యాకంగా పాఠకులు చదువుతారు. కాబట్టి సంపాదకీయాలు పత్రికల్లోనే రాస్తారు. అవి ప్రజాదరణ పొందుతాయి.

ఈ) పత్రికలలోని సంపాదకీయాలకు, సాధారణ వార్తాంశాలకు మధ్యనున్న భేదాలేవి ?
జవాబు:
పత్రికకు ప్రాణం సంపాదకీయం. సంపాదకీయం మొత్తం పత్రికకు ప్రతిబింబం. ఆ రోజు జరిగిన ముఖ్యమైన సంఘటనపై సంపాదకుని వ్యాఖ్యానం, విశ్లేషణల సమాహారమే సంపాదకీయం. ఇది వార్తాంశం కాదు. వార్తాంశంపై సమగ్ర విశ్లేషణ. పూర్వాపరాల పరామర్శ, అవసరమైతే తర్వాత కాలానికి కూడా వర్తిస్తుంది. ఇది ప్రధాన సంపాదకుడు రాస్తాడు. సాధారణ వార్తాంశం అంటే ఒక వార్తగా ప్రచురిస్తారు.

ఆయా ప్రాంతాలలోని విలేఖరులు వార్తలు పంపుతారు. వాటి ప్రాధాన్యతాక్రమాన్ని బట్టి పత్రికలో ఏ పేజీలో వెయ్యాలో నిర్ణయిస్తారు. వార్తకు ఆ రోజుకు మాత్రమే విలువ ఉంటుంది. మరునాటికది మామూలు విషయమే. వార్తాంశంలో పెద్దగా విశ్లేషణలు, వ్యాఖ్యానాలు ఉండవు. కేవలం జరిగిన సంఘటన, ప్రజాభిప్రాయం మాత్రమే పాఠకుల దృష్టికి వస్తుంది.

ప్రశ్న 2.
క్రింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) “సంపాదకీయాలు సమకాలీన అంశాలను ప్రతి బింబిస్తాయి” – దీనిని సమర్థిస్తూ వ్రాయండి.
(లేదా)
సంపాదకీయాలు సమకాలీన అంశాలను స్పృశిస్తాయి. దీనిని నీవు ఎలా సమీక్షిస్తావు ?
జవాబు:
ఆధునిక తెలుగు సాహిత్యంలో సంపాదకీయాలకు సమున్నతమైన స్థానం ఉంది. సంపాదకుడిచేత, లేదా సంపాదకుడి తరపున రాయబడేవి సంపాదకీయాలు. ఈ సంపాదకీయాలు దిన పత్రికలకు, ఇతర మాస, వార, సాంవత్సరిక పత్రికలకు తేడాగా ఉంటాయి.

దిన పత్రికల్లోని సంపాదకీయాలు సమకాలీన అంశాలపై స్పందిస్తాయి. ప్రజలను చైతన్యవంతులనుగా చేస్తాయి. ఈ సంపాదకీయాలు పత్రికలకు గుండెకాయ వంటివి. ఇవి ప్రజాశ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని రాయబడతాయి.

ఈ సంపాదకీయాలు సమకాలీన అంశాలపై తీవ్రంగా స్పందిస్తాయి. ముఖ్యంగా స్వాతంత్రపోరాట సమయంలోను, తెలంగాణా ఉద్యమకాలంలోను వ్రాసిన సంపాదకీయాలు ప్రజలను చైతన్యవంతులనుగా మార్చాయి. సంపాదకీయాల్లోని అక్షరాలు ఒక్కోసారి ఫిరంగుల్లా పనిచేస్తాయి. పాలకుల గుండెల్లో దిగిపోతాయి.

తెలంగాణ పోరాటసమయంలో పత్రికలు సంధించిన సంపాదకీయాలు ప్రత్యేకరాష్ట్ర ఆవశ్యకతను తెలియ జేశాయి. తెలంగాణ ప్రాంత ప్రజల్లో వీరత్వం నింపాయి. అందువల్లనే సంపాదకీయాలు సమకాలీన అంశాలను ప్రతిబింబిస్తాయని చక్కగా తెలుస్తోంది.

ప్రశ్న 3.
క్రింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ వ్రాయండి.

అ) ఈ మధ్యకాలంలో చోటుచేసుకున్న ఏదైనా ఒక ప్రధాన సామాజికాంశం / సంఘటనల ఆధారంగా సంపాద కీయ వ్యాసం రాయండి. మీ తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:
సంపాదకీయ వ్యాసం
అవ్యవస్థను చక్కదిద్దిన ఏడాది !
‘ఆరంభం బాగుంటే సగం పని పూర్తి అయినట్లే’ అన్నది ఆంగ్లేయుల నానుడి. ‘నేను ప్రధానమంత్రిని కాను, ప్రధాన సేవకుణ్ణి’ అని ఎర్రకోట బురుజులనుంచి ప్రకటించిన నరేంద్రమోదీ ఏలుబడికి నేటితో ఏడాది పూర్తి అవుతోంది.

పదేళ్ళ యూపీఏ అన్ని రంగాల్లోనూ దేశాన్ని సర్వభ్రష్టం చేసి, అవినీతిలో మాత్రం కొత్త రికార్డులు నెలకొల్పి చరిత్రపుటల్లో కలిసిపోగా, ‘అచ్ఛేదిన్’ కోసం మోదీ సారథ్యంపై ఆమ్ ఆద్మీ పెట్టుకొన్న కొండంత ఆశ ఎన్డీఏకు దక్కిన బంపర్ మెజారిటీల్లోనే ప్రస్ఫుటమైంది.

యూపీఏ నిర్వాకాల వల్ల దేశపాలనకు సంబంధించిన సకల వ్యవస్థలనూ నిష్క్రియాపరత్వం కమ్మేసి, అంతర్జాతీయ పెట్టుబడిదారులు దృష్టిపథంలో ఇండియా లేకుండాపోయిన నేపథ్యంలో అధికారానికి వచ్చిన మోదీ ప్రభుత్వానికి – ఇంటాబయటా ఆ ప్రమాద కర స్తబ్ధతను బదాబదలు చెయ్యడమే ప్రాధాన్య అంశంగా మారింది. విధానాల రూపకల్పన, అమలులో మంత్రివర్గ సచివాలయం (క్యాబినెట్ సెక్రటేరియట్) ద్వారా ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) నిర్ణాయక పాత్ర పోషించేలా వ్యవస్థాగత మార్పులు తెచ్చి, ప్రణాళిక సంఘానికి కొరత వేసిన మోదీ ప్రభుత్వం – పాలనను కొత్త పుంతలు తొక్కించింది.

అవినీతికి ఆస్కారంలేని అవకాశాల స్వర్గంగా ఇండియాను ఆవిష్కరించి, దేశ విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడం ద్వారా మౌలిక సదుపాయాల్ని పెంపొందించి, పారిశ్రామికీకరణకు కొత్త ఊపుతో ఉపాధి అవకాశాలను విస్తారం చేసి, ప్రజల జీవన ప్రమాణాలను పెంచే వ్యూహానికి అనుగుణంగా మోదీ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.

అవినీతి నిరోధక శాసనాలు, భారత్లో తయారీ, స్వచ్ఛభారత్, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి పథకాలు, పెట్టుబడులపై గురిపెట్టి విస్తృతంగా విదేశీ యాత్రలు …. ఇవన్నీ శ్రేష్ఠ భారత్ లక్ష్య సాధనకు ప్రాతిపదికలే. అదే సమయంలో, 128 కోట్ల జనావళి అభివృద్ధి కాంక్షలకు గొడుగు పట్టే విధంగా మోదీ ప్రభుత్వం మరెంతో చెయ్యాల్సి ఉందన్నదీ నిజమే !

III. భాషాంశాలు

పదజాలం

ప్రశ్న 1.
క్రింది పదాలు ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

అ) ముసురుకొను = మూగు, కమ్ము
జవాబు:
మధ్య తరగతి మానవుడిని అనేక సమస్యలు ముసురుకుంటున్నాయి.

ఆ) ప్రాణం పోయు = జీవాన్ని ఇవ్వడం
జవాబు:
మానవత్వంతో చేయు మంచిపనులు సమాజానికి ప్రాణం పోయుచున్నాయి.

ఇ) గొంతు వినిపించు = సమస్యపై స్పందించు, గొంతు విప్పి మాట్లాడుట
జవాబు:
అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు “తమ గొంతును వినిపించుట” లేదు.

ఈ) యజ్ఞం = దీక్షగా చేయు
జవాబు:
విద్యార్థులు విద్యను యజ్ఞంగా చేయాలి.

ప్రశ్న 2.
కింది పదాలకు పర్యాయపదాలు రాసి, వాటితో వాక్యాలు రాయండి.
ఉదా : తారలు = చుక్కలు, నక్షత్రాలు
ఆకాశంలో నక్షత్రాలు మల్లెలు విరబూసినట్లుగా ఎంతో అద్భుతంగా ఉన్నాయి.

అ) జ్ఞాపకం = గుర్తు, లక్ష్యము, లెక్క, జ్ఞప్తి, స్మృతి తెలంగాణ లక్ష్యంగా ప్రజాఉద్యమాలు జరిగాయి.
ఆ) పోరాటం = సమరం, యుద్ధం, కయ్యం, రణం కాకతీయ వీరులు యుద్ధపటిమ కల్గినవారు.
ఇ) విషాదం = భేదం, బాధ, దుఃఖం, వ్యధ భూకంపం వల్ల నేపాల్లో దుఃఖం అలుముకుంది.
ఈ) సంస్కరణ = మార్పుతీసుకొచ్చుట, బాగు చేయుట, సత్కర్మము
కందుకూరి వీరేశలింగంగారు సంఘంలో మార్పు తీసుకువచ్చారు.

TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 3.
దిన పత్రికలకు సంబంధించిన పదజాలం ఆధారంగా భావనా చిత్రాన్ని గీయండి.
జవాబు:
TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి 1

  1. కాశ్మీర్లో తొలి మహిళ ఐపీయస్
  2. మధుమేహం
  3. వారెవ్వా అనార్కలీ
  4. ఇష్టపడి చదివా. నెంబర్వనయ్యా

వ్యాకరణాంశాలు

ప్రశ్న 1.
కింది ప్రత్యక్ష కథన వాక్యాలను పరోక్ష కథనంలోకి మార్చండి.

అ) రాజకీయపార్టీలవారు “జనానికి తక్షణం కావల్సింది కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర” అని ఎన్నికల ప్రకటించారు.
జవాబు:
రాజకీయపార్టీలవారు జనానికి తక్షణం కావల్సింది కడుపునిండా తిండి, కంటినిండా నిద్రాయని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటించారు.

ఆ) “సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది” అని నెహ్రూ అన్నాడు.
జవాబు:
సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుందని నెహ్రూ అన్నాడు.

ప్రశ్న 2.
క్రింది పరోక్ష కథన వాక్యాలను ప్రత్యక్ష కథనంలోకి మార్చండి.

అ) పరిపాలనారంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం అవసరమని ముఖ్యమంత్రి ప్రకటించాడు.
జవాబు:
“పరిపాలనారంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం అవసరం” అని ముఖ్యమంత్రి ప్రకటించాడు.

ఆ) సమాజాన్ని సంక్షేమపథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరని మేధావులు నిర్ణయించారు.
జవాబు:
“సమాజాన్ని సంక్షేమపథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరి” అని మేధావులు నిర్ణయించారు.

ఇ) తెలుగులోనే రాయండని, తెలుగే మాట్లాడండని టివి ఛానల్లో ప్రసారం చేశారు.
జవాబు:
“తెలుగులోనే రాయండి. తెలుగే మాట్లాడండి” అని టివి. ఛానల్లో ప్రసారం చేశారు.

ప్రశ్న 3.
క్రింది పదాలను విడదీసి, సంధులను గుర్తించి, సూత్రాలను రాయండి.

అ) ప్రపంచమంతా = ప్రపంచము + అంతా – ఉకారసంధి
సూత్రం: ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు.

ఆ) అత్యద్భుతం = అతి + అద్భుతం = యణాదేశసంధి
సూత్రం: ఇ, ఉ, ఋ లకు అసవర్ణములైన అచ్చులు పరమగునప్పుడు క్రమముగా య, వ, ర లు ఆదేశంగా వస్తాయి.

ఇ) సచివాలయం = సచివ + ఆలయం = సవర్ణదీర్ఘసంధి
సూత్రం: అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమగునప్పుడు వాని దీర్ఘము ఏకాదేశమగును.

ప్రశ్న 4.
క్రింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి.
సమాసపదం – విగ్రహవాక్యం – సమాసం పేరు
అ) బృహత్కార్యం – బృహత్ అయిన కార్యం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఆ) శక్తియుక్తులు – శక్తియును, యుక్తియును – ద్వంద్వ సమాసం
ఇ) సంక్షేమ పథకాలు – సంక్షేమము కొరకు పథకాలు – చతుర్థీతత్పురుష సమాసం

TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి

అతిశయోక్తి అలంకారం

III. కింది ఉదాహరణను పరిశీలించండి.

ఉదా : హిమాలయ శిఖరాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

హిమాలయ పర్వతాలు చాలా ఎత్తుగా ఉంటాయి. కాని అవి నిజంగా ఆకాశాన్ని తాకవు. కాని వాటిని ఎక్కువచేసి చెప్పడంవల్ల ‘ఆకాశాన్ని తాకుతున్నాయి” అని అంటున్నాము.

ఏదైనా ఒక వస్తువుని గాని, విషయాన్ని గాని ఉన్న దాని కంటే ఎక్కువ చేసి చెప్పడం ‘అతిశయోక్తి’ అలంకారం

కింది లక్ష్యాలను పరిశీలించండి. అలంకారం గుర్తించండి.
(కింది పద్యం సీతాదేవి, అశోకవనంలో హనుమంతుని విరాడ్రూప దర్శన సందర్భంలోనిది)

అ) కం. చుక్కలు తల పూవులుగా
నక్కజముగ మేను పెంచి యంబరవీథిన్
వెక్కసమై చూపట్టిన
నక్కోమలి ముదము నొందె నాత్మస్థితిలోన్.
– మొల్ల రామాయణం

పై పద్యపాదం అతిశయోక్తి అలంకారానికి చెందినది.

సమన్వయం : పై పద్యంలో హనుమంతుడు శరీరాన్ని పెంచితే ఆకాశంలోని నక్షత్రాలు కనబడ్డాయని అనగా బాగా ఎత్తు పెరిగాడని చెప్పడానికి ఉన్న దాని కన్నా ఎక్కువ చేసి చెప్పబడినది కావున ఇది అతిశయోక్తి అలంకారం.

ఆ) మా ఊర్లో సముద్రమంత చెరువు ఉన్నది.
జవాబు:
వివరణ : చెరువును వర్ణించుట ప్రధానం. దానిని ఎక్కువ చేసి సముద్రమంత అని చెప్పడం అతిశయోక్తి.

ఇ) అభిరాం తాటి చెట్టంత పొడవు ఉన్నాడు.
జవాబు:
సమన్వయం / వివరణ / = అభిరాం యొక్క పొడవును చెప్పటాన్కి తాటిచెట్టంత అని చెప్పడం అతిశయోక్తి కావున దీనిలో అతిశయోక్తి అలంకారం ఉంది.

స్వభావోక్తి అలంకారం

క్రింది ఉదాహరణను పరిశీలించండి.
శివాజీ ఎర్రబడిన కన్నులతో అదిరిపడే పై పెదవితో ఘనహుంకారముతో కదలాడే కనుబొమ్మ ముడితో గర్జిస్తూ “గౌరవించదగిన, పూజించదగిన స్త్రీని బంధించి అవమానిస్తావా ? అని సోన్దేవుని మంద లించాడు.

పై వాక్యంలో కన్నులు ఎర్రబడటం, పై పెదవి అదరడం, గట్టిగా హుంకరించడం, కనుబొమ్మ ముడి కదలాడటం కోపంగా ఉన్నప్పుడు కలిగే స్వభావాలు. ఇట్లా ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడం కూడా ఒక అలంకారమె. దీన్ని ‘స్వభా వోక్తి’ అలంకారం అంటారు.

స్వభావోక్తి అలంకారం : విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడమే ‘స్వభావోక్తి అలంకారం’. “జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు నిగిడ్చి చెంగు చెంగున గెంతుతున్నాయి”.
పై వాక్యంలోని అలంకారాన్ని గుర్తించండి.

సమన్వయం : జింకలు సహజంగానే బిత్తర చూపులు చూడటం, చెవులు నిగిడ్చిటం, చెంగు చెంగున గెంతడం సహజ సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం.

ప్రాజెక్టు పని

వివిధ దిన పత్రికల ఆధారంగా 5 సంపాదకీయ వ్యాసాలు సేకరించండి. చదివి అర్థం చేసుకొండి. కీలకాంశాలను గుర్తించండి. పట్టికలో నమోదు చేయండి. నివేదిక రాసి ప్రదర్శించండి.
TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి 2
జవాబు:
TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి 3
TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి 4

TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి

విశేషాంశాలు:

1969 – ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం :
తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన కొన్ని రక్షణలు, షరతులు ప్రాతిపదికపై ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. పెద్దమనుషుల ఒప్పందం కుదుర్చుకొనబడింది. ప్రభుత్వానికి తగు సిఫార్సులు చేసేటందుకు ఒక ప్రాంతీయ సంఘం ఉండేది. పెద్దమనుషుల ఒప్పందం తూ.చ. తప్పకుండ అమలవు తుందని కేంద్ర ప్రభుత్వం వారు హామీ ఇచ్చారు. కాని విఫలమయ్యారు. ప్రజల నమ్మకానికి ద్రోహం జరిగింది.

ప్రజల్లో పెద్దపెట్టున అసంతృప్తి చెలరేగింది. తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరు కున్నారు. స్వల్ప వ్యవధిలోనే ఇది స్వచ్ఛందమైన, ఉద్ధృత మైన ప్రజోద్యమంగా మారింది. గ్రామం మొదలుకొని నగరం వరకు అన్ని రంగాలకు చెందిన యువకులు, మహిళలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరు ఉద్యమంలో పాల్గొన్నారు.

నాటి పత్రికలైన ‘జై తెలంగాణ’, ‘తెలుగుగడ్డ’, ‘తెలుగువాణి’ కూడ వీటికి తమ మద్దతును ప్రకటించాయి. ఈ సందర్భంలోనే తెలంగాణ ప్రజాసమితి, తెలంగాణ విమోచనోద్యమ సమితి వంటి సంస్థలు ఆవిర్భవించాయి.

సూక్తి : సత్యాన్ని త్రికరణశుద్ధిగా నమ్మితే విజయం తథ్యం. నెమ్మదిగానైనా సరే మనం జయించక తప్పదు.
– స్వామి వివేకానంద

ముఖ్య పదాలు – అర్థాలు.

I
అరుదుగా = అపూర్వము, ఆశ్చర్యము
శకము = ఒకదేశము, ఒకజాతి, ఒకని పరిపాలనతో చేరిన సంవత్సరం
సంబురాలు = వేడుకలు
ఆవిర్భవించు = పుట్టు, జన్మము, కలుగు
పతాకస్థాయి = చివరి దశ
స్వతంత్రము = స్వచ్ఛందము, సొంతము
భాష్పాలు = కళ్ళనీళ్ళు
అనుభూతి = అనుభవము, అనుభవించు
సుదీర్ఘకాలం = ఎక్కువ సంవత్సరాలు / ఎక్కువ కాలంపాటు

II

ఉద్రిక్తత = అతిశయించినది
రాచఠీవి = దర్జా, రాజదర్పం
ముడిపడు = కూడుకొని, కలిసి
సచివాలయం = మంత్రులు ఉండుచోటు, పరిపాలనా భవనం
ధిక్కరించడం = వ్యతిరేకించడం, లెక్కచేయకపోవడం
ఘట్టం = సంఘటన
ఆంక్ష = వెలివేయుట, బహిష్కారము
అమరుడు = చావనివాడు
జడుపు = జంకు, భయం

TS 10th Class Telugu Guide 8th Lesson లక్ష్యసిద్ధి

III

అస్తిత్వం = ఉనికి
స్వీయరాష్ట్రం = సొంతరాష్ట్రం
సిద్ధించింది = లభించింది
సంక్షోభం = ఎక్కువ వ్యాకులత
ఛిద్రము = ముక్కలు
పునర్నిర్మాణ = తిరిగి నిర్మించుకోవడం
విషాదం = దుఃఖం
సర్వతోముఖాభివృద్ధి = అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించుట
పాటుపడు = చేయుట
ఋగులు = కలత
అనుగుణం = తగినది
తక్షణం = వెంటనే
క్షోభ = కలత

పాఠం ఉద్దేశం

దిన పత్రికల్లోని సంపాదకీయాలు, వ్యాఖ్యలు సమాజ చైతన్యానికి తోడ్పడుతాయి. కాబట్టి విద్యార్థుల్లో సంపాదకీయ వ్యాసాలు, వ్యాఖ్యల పట్ల అభిరుచిని కలిగిస్తూ, ఆసక్తిని పెంపొందింపజేయడం, సాధారణ వార్తలకు, సంపాద కీయాలకు మధ్య ఉండే తేడాను, వాటి ప్రాధాన్యాన్ని అర్థం చేసుకొనేందుకు ఉద్దేశించినదే ఈ పాఠం.

పాఠ్యభాగ వివరాలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా 2వ జూన్, 2014 నాడు “నమస్తే తెలంగాణ” దినపత్రికలో వెలువడిన సంపాదకీయ వ్యాసం ఇది.

ప్రవేశిక

‘సంపాదకీయం’ సమకాలీన ప్రపంచంలో జరిగిన స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంఘటనలను గాని, దాని పరిణామాలనుగాని, అద్భుత విశేషాలనుగాని వివరిస్తుంది. జాతిపిత మహాత్మాగాంధీ మృతి చెంది నప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పత్రికలన్నీ సంతాపం తెలియజేస్తూ గాంధీ గొప్పతనాన్ని కీర్తిస్తూ ప్రత్యేక సంపాదకీయాలు రాశాయి. అదే విధంగా మన భారతీయ క్రీడాకారులు, శాస్త్రవేత్తలు ఆయా రంగాల్లో అద్భుత విజయాలు ఆవిష్కరించినప్పుడు (ఆనాటి) దినపత్రికలన్నీ వారిని ప్రశంసిస్తూ సంపాదకీయాలు రాశాయి.

అట్లాగే 1969 నుండి 2 జూన్, 2014 వరకు సాగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సఫలమై, తెలంగాణ సకల జనుల స్వప్నం సాకారమైన వేళ, భారతదేశ పటంపై 29వ రాష్ట్రంగా ‘తెలంగాణ’ అవతరించింది. ఈ సందర్భంగా పత్రికలన్నీ పతాక శీర్షికలతో ఈ వార్తను ప్రచురించి, ప్రత్యేక సంపాదకీయాలు రాశాయి. అట్లాంటి సంపాదకీయాల్లో ఒకటి ప్రస్తుత పాఠ్యాంశం. తెలంగాణ ఉద్యమ మహా ప్రస్థానంలోని మైలురాళ్ళను మనకు పరిచయం చేస్తున్నదీ వ్యాసం.

విద్యార్థులకు సూచనలు

  • పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
  • పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత గీయండి.
  • వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పదవిజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకొండి.

ప్రక్రియ – సంపాదకీయ వ్యాసం

ఈ పాఠం సంపాదకీయ వ్యాస ప్రక్రియకు చెందినది. సమకాలీన సంఘటనలలో ముఖ్యమైన వాటిని తీసుకొని పత్రికల్లో వ్యాఖ్యాన రూపంతో పూర్వా పరాలను పరామర్శిస్తూ సాగే రచన సంపాదకీయ వ్యాసం. తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకుంటూ, ఆలోచింపచేయగలగడం మంచి సంపాదకీయ లక్షణం. ఇవి తత్కాలానికి సంబంధించినవే అయినా ఒక్కొక్క సందర్భంలో విభిన్న కాలాలకూ అనువర్తింప జేసుకోవచ్చు.

TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం

Telangana SCERT 10th Class Telugu Guide Telangana 9th Lesson జీవనభాష్యం Textbook Questions and Answers.

TS 10th Class Telugu 9th Lesson Questions and Answers Telangana జీవనభాష్యం

చదువండి – ఆలోచించి చెప్పండి (T.B. P.No. 87)

పరులకోసం పాటుపడని
నరునిబతుకు దేనికని ?
మూగనేలకు నీరందివ్వని
వాగుపరుగు దేనికని ?
జల్లుకు నిలవని ఎండకు ఆగని
చిల్లులగొడుగు దేనికని ?
పదపదమంటూ పదములేగాని
కదలని అడుగు దేనికని ?
– సినారె

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
పరుల కోసం పాటుపడటం అంటే ఏమిటి ?
జవాబు:
పాటుపడటం అంటే కష్టపడడం, పనిచేయడం. ఎవరైనా తమ గురించి, తమ కుటుంబం గురించి, తమ వాళ్ళ గురించి పాటుపడడం సహజం. పరులు అంటే ఇతరులు. అంటే మనకు సంబంధం లేనివాళ్ళు. వాళ్ళ గురించి కష్టపడడం గొప్పవారి లక్షణం. ఇతరులకు ఉపకారం చేయడానికి దేనినీ లెక్క చేయకూడదు. అంటే సమాజం కోసం కష్టపడాలి. సమాజ అభివృద్ధి కోసం
పాటు పడాలని కవి సందేశం.

ప్రశ్న 2.
కవి ప్రశ్నల్లోని ఆంతర్యం ఏమిటి ?
జవాబు:
ప్రతిదానికీ ఒక ఉపయోగం ఉంటుంది. కొన్ని ఖచ్చితంగా కొన్ని పనులకు ఉపయోగపడాలి. ఆయా పనులకు ఉపయోగపడనపుడు అవి ఉన్నా లేక పోయినా ఒకటే అని కవిగారి ఉద్దేశం.

  1. సమాజం కోసం పాటుపడని మనిషి ఉన్నా లేకపోయినా ఒకటే.
  2. చేలకు నీరివ్వని ఏరు వలన ప్రయోజనం లేదు.
  3. ఎండా, వానలనుండి కాపాడలేని గొడుగు వృథా.
  4. మాటలే తప్ప కదలని అడుగులు వలన ఏమీ సాధించలేము.

TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం

ప్రశ్న 3.
దీనిని రాసిందెవరు ?
జవాబు:
ఈ కవితను డా॥ సి. నారాయణరెడ్డి గారు (సినారె) రచించారు.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 89)

ప్రశ్న 1.
‘మనసుకు మబ్బుముసరడం’ అనడంలో ఆంతర్యంమేమిటి?
జవాబు:
నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కితే వర్షమై అవి భూమి మీద కురుస్తాయి. అలాగే మనసుకు ఆందోళనలు, బాధలు, చింతలు అనే దిగులు మబ్బులు కమ్ముకుంటే దుఃఖస్థితి వస్తుంది. అది కన్నీరుగా మారుతుంది.

ప్రశ్న 2.
‘జంకని అడుగులు కదిలితే అది దారవుతుం’దనడాన్ని మీరెట్లా సమర్థిస్తారు ?
జవాబు:
లోకం భయపెడుతుంది. ఆ మాటలకు జంకకుండా, అడుగులు ముందుకు వేస్తే, అనగా భయపడకుండా, నిరుత్సాహపడకుండా ముందుకు నడిస్తే నీకు విజయం లభిస్తుంది. ఆ స్ఫూర్తే నలుగురూ అనుసరించేందుకు ఒక దారిగా మారుతుందని దీని అర్థం. నేను కూడా ఇది సరైనదేనని సమర్థిస్తాను.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 90)

ప్రశ్న 1.
మనిషి మృగము ఒకటేనా ? కాదా ? చర్చించండి .
జవాబు:
మనిషీ, మృగమూ ఒక్కటికానేకాదు. మనిషికి ఆలోచనాశక్తి వుంది. భావాలను తెలుపగలిగే భాష ఉంది. కానీ మృగానికి ఆలోచనాశక్తీ, భావాలను తెలిపే భాష లేవు. కనుక మనిషి మృగమూ ఒకటికాదు. ఆలోచనాశక్తి నశించి మానవత్వం మరిచిపోతే మనిషినే మృగం అనవచ్చు.

ప్రశ్న 2.
హిమగిరి శిరసు మాడటం అంటే మీకేమర్థమయింది ?
జవాబు:
హిమాలయ పర్వతం ప్రపంచంలోనే ఎత్తైనది. అయినా దాని నెత్తిని కూడా సూర్యుడు తన వేడి కిరణాలతో మాడుస్తాడు. అంత ఎత్తు ఉన్నా హిమగిరికీ సూర్యుని తాపం తప్పలేదు కదా ! ఎండవేడికి అది కరిగి ఏఱుగా, అనగా నదిగా ప్రవహించవలసిందే. అలాగే ఎంతటి మనిషైనా అతని గర్వం, సమస్యలకు వేడెక్కి నీరుగా కారిపోవలసిందే అని నాకు అర్థమయింది.

ప్రశ్న 3.
‘చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుం’దనడాన్ని మీరు సమర్థిస్తారా ? ఎట్లా?
జవాబు:
త్యాగం అంటే మనకున్నది ఇతరులకు ఇవ్వడం. స్వార్థం చూసుకోకుండా ఇవ్వడం. ప్రతిఫలం ఆశించకుండా ఇవ్వడం. మనకోసం ఎవరైనా ఏదైనా త్యాగం చేస్తే మనం వారిని జీవితాంతం మరచిపోలేము.

అలాగే తమకున్న డబ్బుతో గుడి, బడి, ఆసుపత్రి, అన్నదాన సత్రము మొదలైనవి కట్టిస్తే వారి పేరును సమాజం గుర్తు పెట్టుకొంటుంది. ఉదాహరణకు రంగయ్యగారు బడి కట్టిస్తే, దానిని రంగయ్య బడి అంటాం. బిర్లా టెంపుల్ మొదలైనవి. అంటే అవి ఉన్నంతకాలం వారి పేరు కూడా ఉంటుంది. అందుకే ఇది సమర్థించతగినది.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
క్రింది అంశాన్ని గురించి చర్చించండి.

అ) ‘జీవనభాష్యం’ అనే శీర్షిక ఈ గజల్కు ఎలా సరి పోయిందో చెప్పండి..
జవాబు:
ఈ పాఠానికి ‘జీవన భాష్యం’ అనే పేరు తగినదిగా ఉంది. ఎందుకంటే ఈ పాఠ్యభాగంలో మానవుడు తన జీవితంలో ఎప్పుడు గౌరవం పొందుతాడు. ఎలా జీవించాలి అనే విషయాలను లోతుగా పరిశీలించి కవి మనకు అందించారు. మానవ జీవిత పరమార్థాన్ని ఈ చిన్న గజల్ ద్వారా అందించడం జరిగింది.

మానవుడు దుఃఖాలన్నింటిని సమర్థవంతంగా తట్టుకుంటూ, కష్టాలను సాహసంతో ఎదుర్కొంటూ ఉండాలని, తనంతట తాను ఉన్నతంగా ఎదుగుతూ, తోటి వారి కోసం పాటుపడుతూ జీవించాలనే జీవిత సత్యం ఇందులో ఉంది. అందువల్ల ఈ పాఠానికి ‘జీవన భాష్యం’ అనేపేరు తగినదిగా చెప్పవచ్చు.

TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం

ప్రశ్న 2.
పాఠం చదివి ప్రాస పదాలను గుర్తించండి. రాయండి.
జవాబు:
TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం 1

ప్రశ్న 3.
క్రింది అపరిచిత గేయ పాదాలను చదువండి.

భీతి లేక మనిషి ఎచట శిరమునెత్తి నిలుచునో
తనివి తీర జనులకెల్ల జ్ఞానసుధలు దొరుకునో
అడ్డుగోడ లేని సమసమాజమెచట నుండునో
హృదంతరాళ జనితమౌ సత్యమెచట వరలునో
ఆ స్వతంత్ర స్వర్గసీమ నిర్మింపగ తరలి రమ్ము
లెమ్ము లెమ్ము లెమ్ము లెమ్ము లెమ్ము సోదరా !

గేయం చదివి క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) ‘శిరమునెత్తి నిలుచునో’ అంటే మీకేమి అర్థమైంది?
జవాబు:
భీతి లేకుండా (భయం) ఉంటే మనిషి తలఎత్తుకొని నిలబడతాడని అర్థమైంది.

ఆ) జ్ఞానసుధలు ఎట్లా ఉండాలని గేయంలో ఉన్నది ?
జవాబు:
జ్ఞానసుధలతో తృప్తి కలగాలి. అంటే జ్ఞానతృష్ణ తీరాలి.

ఇ) సమసమాజం ఎట్లా ఏర్పడుతుంది ?
జవాబు:
సమసమాజం అడ్డుగోడలు లేకుండా ఏర్పడుతుంది.

ఈ) సత్యం విలసిల్లడం అంటే ఏమిటి ?
జవాబు:
మనస్సులో నుండి వచ్చే నిజమే విలసిల్లుతుంది.

ఉ) ‘స్వర్గసీమ’ అనడంలో అంతరార్థం ఏమిటి ?
జవాబు:
స్వర్గసీమలో భయం ఉండదు. తృప్తి కలిగించే జ్ఞానం దొరుకుతుంది. కుల, మతాలు, ధనిక, పేద అనే అడ్డుగోడలుండవు. నిజమైన మాట, ఆలోచన, ప్రవర్తన ఉంటుంది. పూర్తిగా స్వతంత్రం ఉంటుంది. అటువంటి ప్రదేశం కావాలి కనుక స్వర్గసీమ అన్నారు.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) ‘చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది’ అంటే త్యాగం చేసేవారి, మంచిపనులు చేసే వారి పేర్లు చరిత్రలో శాశ్వతంగా నిలుస్తాయి అని అర్థం. అందుకోసం ఎట్లాంటి మంచిపనులు చేయాలి?’
జవాబు:

  1. దశదానాలు, షోడశమహాదానాలు చేయాలి.
  2. గ్రామంలో దేవాలయము కట్టించాలి.
  3. పేద బ్రాహ్మణుడికి పెళ్ళి చేయించాలి.
  4. ఒక కవి రాసిన కావ్యాన్ని అంకితం తీసుకోవాలి.
  5. గ్రామంలో అందరికీ త్రాగేందుకు నీటి కోసం చెరువు తవ్వించాలి.
  6. ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయాలి. పైన చెప్పినవి అన్నీ “సప్త సంతానములు” అనే వాటిలోని మంచి పనులు.

ఇవిగాక పాఠశాలలూ, కళాశాలలూ ఏర్పాటు చేయించడం, పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వడం, చదువులు చెప్పించడం, పేదవారికి వైద్య ఖర్చులు భరించడం, గ్రామాలకు మంచినీటి సదుపాయాలు, రోడ్లు వేయించడం, దైవపూజలు చేయించడం, పేదల కోసం పెళ్ళి ఖర్చులు భరించడం, మంగళసూత్రాలు దానం చేయడం వంటి మంచి పనులు చేస్తే వారి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుంది.

ఆ) “ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు” అనే వాక్యం ద్వారా విద్యార్థులకు ‘సినారె’ ఇచ్చే సందేశం ఏమై ఉండవచ్చు?
జవాబు:
జీవన భాష్యం’ అనే పాఠ్యభాగంలో “ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు” అనే వాక్యం ద్వారా సినారె విద్యార్థులకు అద్భుతమైన సందేశాన్ని ఇచ్చాడు. విద్యార్థులు చదువులో ఒక్కోసారి వెనుకబడతారు. చదువుకునేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. అయినప్పటికీ విద్యార్థులు తమకు ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి. కష్టాలను ఓర్పుతో సహించాలి.

అవాంతరాలను అధిగమించాలి. అప్పుడే విద్యార్థులు చదువులో రాణిస్తారు. ప్రగతి పథంలో పయనించ గలుగుతారు. ఉత్తమ ఫలితాలను పొంద గలుగుతారు. తమకు డబ్బులేదని, చదువు సరిగా రావడం లేదని నిరాశపడవద్దని, అధైర్యంతో ఆత్మహత్యలకు పాల్పడ కుండా ధైర్యంతో ముందుకు వెళ్ళాలనే ఉపదేశాన్ని నారాయణరెడ్డి గారు విద్యార్థులకు అందించారని భావిస్తున్నాను.

TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం

ఇ) ‘మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది” అని ‘సినారె’ ఎందుకు అని ఉంటాడు ?
జవాబు:
“జీవన భాష్యం” అనే పాఠ్యభాగంలో మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది” అని నారాయణ రెడ్డి గారు ఉపదేశించారు. సమాజంలో మానవులంతా కలిసిమెలిసి జీవించాలి. పరస్పర సహకారాన్ని పొందాలి. వర్గ వైషమ్యాలను విడనాడాలి. కులమతాల అడ్డు గోడలను తొలగించుకోవాలి. ఒకరినొకరు గౌరవించు కోవాలి. ఆపదల్లో ఉన్న తోటివారిని ఆదుకోవాలి.

అప్పుడే సమాజంలోని వారందరూ సుఖశాంతులతో వర్ధిల్లుతారని, అటువంటి ప్రశాంతతో కూడిన గ్రామీణ వాతావరణం రావాలని కవి కోరుతున్నారు. పరస్పర సహకారంతో జీవించడమే ఉత్తమ సాంఘిక జీవనం. సాటి మనుషుల పట్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పరచు కోవాలి. అప్పుడే అందరు కలిసి ఆనందంగా జీవించ గలుగుతారని, అలాంటి మనుషులంతా ఏకమైతేనే చల్లని ఊరు ఏర్పడుతుందని కవి భావించాడు.

ప్రశ్న 2.
క్రింది ప్రశ్నలలో ఒకదానికి పది వాక్యాల్లో జవాబు వ్రాయండి.

అ) ‘జీవనభాష్యం’ అందించే సందేశాన్ని వివరించండి.
జవాబు:
జీవనభాష్యం ద్వారా ఇతరుల కోసం పాటుపడుతూ జీవించే మనిషి సమాజంలో గౌరవం పొందుతాడనీ మరియు వ్యక్తులు మాత్రమే కాకుండా ప్రకృతిలో ఇటువంటి పరోపకార గుణం గల ఎన్నో విషయాలు ఉన్నాయని తెలుస్తుంది. అంతేగాకుండా పరోపకార గుణం గల నదులు, మేఘాలు, వృక్షాలు మనకు ఎంతో సహకారం అందిస్తాయి. జీవనభాష్యం ద్వారా చింతలు, బాధలు, ఆందోళనలు అనేవి మనసును కుంగదీసినపుడు అవి కన్నీరు రూపంలో బయటకు వస్తాయి.

ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ఎన్నో అడ్డంకులు ఎదురైతే వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు నడిచినపుడే మనకు విజయం చేకూరుతుంది. అదే విధంగా బీడు భూమిలో ఏ పంటలూ పండవని నిరాశపడకుండా అదే నేలను కష్టపడి దున్నితే, విశ్వాసంతో విత్తనాలు నాటితే మంచి పంటలు పండుతాయి.

సాటి మనుషుల పట్ల ప్రేమ ఆప్యాయత, సంబంధాలు కలిగి ఉండాలని నేర్పుతుంది జీవనభాష్యం. అటువంటి మనుషులు కలిస్తేనే ఒక ఊరు ఏర్పడుతుందని కవి భావన.

అలాగే “కష్టం వెనుక సుఖం, సుఖం వెనుక కష్టం” ఒకదాని తరువాత మానవ జీవితంలో పరిపాటి అని తెలుస్తుంది. ఏమి ఆలోచించకుండా మబ్బు వర్షాన్ని ఇస్తుంది. నదులు నీటిని అందిస్తాయి. అలాగే రైతు మనందరి కోసం రేయింబవళ్ళు కష్టపడి మనకు ఆహారాన్ని అందించి “అన్నదాత” గా మారాడు.

అటువంటి రైతు చేసే గొప్ప పని, నిస్వార్థ త్యాగం మనం మరచిపోరాదు. మన పేరు ప్రపంచానికంతా తెలిసేలా ప్రఖ్యాతి పొందే పనులు చేసి, నిజమైన విలువ, గుర్తింపు పొందాలని ఈ పాఠం ద్వారా తెలుస్తుంది. అప్పుడే మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుందని జీవనభాష్యం మనకు సందేశం ఇస్తుంది.

ప్రశ్న 3.
క్రింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ వ్రాయండి.

అ) “జీవన భాష్యం” గజల్లోని అంత్యప్రాసల ఆధారంగా సొంతగా ఒక వచన కవితను రాయండి.
జవాబు:

1) మంచు కరిగితే నీరవుతుంది.
2) మంచి నడకనడిస్తే దారవుతుంది.
3) వర్షం కురిస్తే పంట పైరవుతుంది.
4) మంచి వ్యక్తులు కూడితే ఊరవుతుంది.
5) నదులు పారితే అది ఏరవుతుంది.
6) త్యాగధనులుంటే పేరవుతుంది.

(లేదా)

ఆ) ఆచార్య సి. నారాయణ రెడ్డి గారు ఒకవేళ మీ పాఠశాలకు వస్తే మీరు వారి నుండి ఏం తెలుసుకోవాలనుకొంటున్నారో ప్రశ్నలు వ్రాయండి.
జవాబు:

  1. మీ రచనలలో మీకు బాగా నచ్చిన కావ్యం ఏది ?
  2. ‘ప్రపంచ పదులు’ దీన్ని మీరు ఎలా సృష్టించారు ?
  3. మీ సినీగేయాలలో మీకు నచ్చిన గేయం ఏది ?
  4. మిమ్ములను కవిత్వం వైపు నడిపించినది ఎవరు ?
  5. మీ రచనలకు ప్రేరణనందించిన అంశాలు ఏవి ?
  6. మధ్యతరగతి మందహాసంలోని ప్రధానమైన అంశం ఏమిటి ?
  7. ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతన్నలకు, మీరిచ్చే సందేశం ఏమిటి ?
  8. విద్యార్థులు మానసిక వత్తిడి నుండి ఎలా బయట పడగలుగుతారు ?
  9. నేటి యువ రచయితలకు మీరిచ్చే సలహాలు ఏమి ?
  10. ప్రస్తుతం మీరు ఎందుకు సినిమా పాటలు రాయడం లేదు ?

III. భాషాంశాలు

పదజాలం

1. క్రింది పదాలకు పర్యాయపదాలు రాయండి.

అ) మబ్బు: మేఘం, చీకటి, అజ్ఞానము, అంబుదం, జలదం
ఆ) గుండె : హృదయము, మనస్సు, ధైర్యము, ఎద, ఎడద
ఇ) శిరసు : తల, శిఖరము, సీనాగ్రము, ప్రధానము, మస్తకం

2. క్రింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

అ) వ్యాప్తి : తెలంగాణా సంగీతాన్ని రాష్ట్ర ప్రభుత్వం దేశం అంతట వ్యాప్తి చేసింది.
ఆ) జంకని అడుగులు: గుండె బలం కలవాడు జంకని అడుగులు వేస్తూ ముందుకు వెళ్తాడు.
ఇ) ఎడారి దిబ్బలు : ప్రయోజనంలేని ఎడారి దిబ్బలపై కూడా కష్టపడితే పంటలు పండించవచ్చు.
ఈ) చెరగని త్యాగం : పరోపకార పరాయణులు చెరగని త్యాగగుణం కలవారుగా ఉంటారు.

TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం

వ్యాకరణాంశాలు

1. క్రింది పదాలను కలిపి, సంధిని గుర్తించి వ్రాయండి.

అ) నీరు + అవుతుంది – నీరవుతుంది – ఉకార సంధి
ఆ) ఎత్తులకు + ఎదిగిన = ఎత్తులకెదిగిన – ఉకార సంధి
ఇ) పేరు + అవుతుంది = పేరవుతుంది – ఉకార సంధి

2. క్రింది పంక్తులలోని సమాస పదాలు గుర్తించి, విగ్రహ వాక్యాలు రాసి, అవి ఏ సమాసాలో తెలియజేయండి.

అ) ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు.
జవాబు:
ఎడారి దిబ్బలు – ఎడారి యొక్క దిబ్బలు (షష్ఠీ తత్పురుష సమాసం)

ఆ) ఇసుకగుండెలు పగిలితే అది పైరవుతుంది.
జవాబు:
ఇసుకగుండెలు – ఇసుక అనెడి గుండెలు (రూపక సమాసం)

3. క్రింది వాటిని చదివి ఏ అలంకారాలో గుర్తించండి.

అ) నీకు వంద వందనాలు
జవాబు:
పై వాక్యంలో వంద అనే హల్లుల జంట, వెంటవెంటనే అర్థ భేదంతో వచ్చింది. ఇక్కడ మొదట వచ్చిన ‘వంద’ నూరు సంఖ్యను తెలుపుతుంది. రెండోసారి వచ్చిన ‘వంద’ వందనాలు అంటే నమస్కారాలు అని తెలుపుతోంది. కావున ఇది ఛేకానుప్రాసాలంకారం.

ఛేకానుప్రాసాలంకారం : హల్లుల జంట, అర్థభేదంతో వెంటవెంటనే వస్తే దానిని ‘ఛేకానుప్రాస’ అలంకారం అంటారు.

ఆ) తెలుగు జాతికి అభ్యుదయం
నవ భారతికే నవోదయం
జవాబు:
పై గేయంనందు ప్రాసపదాలు అంత్యములో ఉన్నాయి కాబట్టి ఇది అంత్యానుప్రాసాలంకారం.

ఇ) రాజు రివాజులు బూజు పట్టగన్
జవాబు:
ఇది వృత్త్యానుప్రాసాలంకారం. పదం మధ్యలో జ అనే అక్షరం పలుమార్లు వచ్చింది. కాబట్టి ఇది వృత్త్యానుప్రాసాలంకారం.

ఈ) అజ్ఞానాంధకారం తొలిగితే మంచిది.
జవాబు:
ఇది రూపకాలంకారం
అజ్ఞానము – ఉపమేయం
అంధకారం – ఉపమానం

ఇక్కడ ఉపమేయమైన అజ్ఞానమునందు ఉపమానమైన అంధకార ధర్మం ఆరోపించబడింది. కావున ఇది రూపకాలంకారం.

ప్రాజెక్టు పని

డా|| సి. నారాయణ రెడ్డి రాసిన ఏవైనా రెండు గేయాలు/ గజల్లను సేకరించండి. నివేదిక రాసి ప్రదర్శించండి.
జవాబు:
కొన్ని (సినారె) గేయాలు :

1) “నా పేరు కవి
ఇంటి పేరు చైతన్యం
ఊరు సహజీవనం
తీరు సమభావనం”

TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం

2) “నా వచనం బహువచనం
నా వాదం సామ్యవాదం
కవిత్వం నా మాతృభాష
ఇతివృత్తం మానవత్వం”

3) “ఊపిరాడడం లేదు
ఉక్కపోస్తుంది. ఎ.సి గదిలో
కారణం తెలిసిపోయింది.
కవిత రాయలేదు ఇవాళ”

నివేదిక

డా॥ సి. నారాయణరెడ్డి గారు తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధ కవులుగా కీర్తి పొందారు. వీరి గేయాలు భావస్ఫోరకంగా ఉంటాయి. తేటతెలుగు పదాలతో అలరారుతుంటాయి. అంత్యప్రాసలు పాటలకు మరింత అందాన్ని ఇస్తాయి. చిన్న పదాలతో విస్తృతమైన భావాన్ని గేయాల ద్వారా అందించడం నారాయణరెడ్డి గారి ప్రత్యేకత.

సన్నివేశానికి అనుగుణంగా పదాలను గేయంలో చూపించడం నారాయణరెడ్డి గారికే చెల్లుతుంది. జాతీయాలను, తెలుగు నుడికారాలను చక్కగా చెప్పగల విశిష్ట కవి. పదలాలిత్యం, అంతకుమించిన గుణాత్మకశైలి గేయాలకు వన్నె చేకూరుస్తాయి. అందుకే తరాలు మారినా తెలుగువాడి మదిలో నారాయణరెడ్డి గారి గేయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. గేయరచనలో వీరు చూపిన దారి అందరికి ఆదర్శంగా నిలుస్తుంది.

విశేషాంశాలు

ఆచార్య సింగిరెడ్డి నారాయణరెడ్డిగారి రచనలు

1) ఆధునికాంధ్ర కవిత్వము

  • సంప్రదాయములు
  • ప్రయోగములు

2) ‘విశ్వంభర’ – (జ్ఞానపీఠ అవార్డు వచ్చిన కావ్యం)
3) నాగార్జున సాగరం
4) కర్పూర వసంతరాయలు
5) మధ్యతరగతి మందహాసం
6) ప్రపంచపదులు

7) విశ్వనాథనాయకుడు
8) నారాయణరెడ్డి గేయాలు
9) దివ్వెల మువ్వలు
10) అజంతా సుందరి
11) రామప్ప
12) నవ్వని పువ్వు
13) వెన్నెలవాడ
14) ఋతుచిత్రం
15) స్వప్నభంగం
16) విశ్వగీతి

17) జలపాతం
18) సినీగేయాలు
19) జాతిరత్నం
20) తరతరాల వెలుగు (గేయ రూపకాలు)
21) అక్షరాల గవాక్షాలు
22) మంటలు – మానవుడు
23) ఉదయం నా హృదయం
24) మార్పు నా తీర్పు
25) ఇంటి పేరు చైతన్యం

TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం

26) రెక్కలు
27) నడక నా తల్లి
28) కాలం అంచుమీద
29) కవిత నా చిరునామా
30) కలం సాక్షిగా
31) భూమిక, మట్టీ – మనిషి (దీర్ఘ కావ్యాలు)
32) తెలుగు గజళ్ళు
33) వ్యాసవాహిని, సమీక్షణం
34) పాశ్చాత్యదేశాల్లో 50 రోజులు (యాత్రా సాహిత్యం)
35) పాటలో ఏముంది – నా మాటలో ఏముంది (సినిమా పాటల విశ్లేషణ)

సూక్తి : మనిషిలో ఏ గుణం సన్నగిల్లినా మానవత్వం మృతి చెందకుండా ఉంటే చాలు. ఆ మానవత్వమే మనిషిని మహనీయుడిని చేస్తుంది.

అర్థాలు – భావాలు

I

మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది
మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది
వంకలు డొంకలు కలవనీ జడిపించకు నేస్తం !
జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది.

అర్థాలు

నేస్తం = స్నేహితుడా !
మబ్బుకు = మేఘానికి
మనసే = హృదయమే
కరిగితే = కరిగినట్లయితే
అది = ఆ మేఘం
నీరు + అవుతుంది = నీరుగా మారుతుంది
ముసిరితే = ముసిరినట్లయితే
కన్నీరు + అవుతుంది = కన్నీళ్ళుగా అవుతుంది
వంకలు డొంకలు = వంకలు, సందులు
కలవనీ = కలిసిపోవని
జడిపించకు = భయపెట్టకు
నేస్తం = మిత్రమా
జంకని = భయపడని
అడుగులు = అడుగులు
కదిలితే = కదిలినట్లయితే
అది = ఆ నడిచిన ప్రదేశం
దారి + అవుతుంది = మార్గం అవుతుంది

భావం:
నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కితే వర్షమై అవి భూమి మీద కురుస్తాయి. అలాగే మనసుకు ఆందోళనలు, బాధలు, చింతలు అనే దిగులు మబ్బులు కమ్ముకుంటే దుఃఖస్థితి వస్తుంది. అది కన్నీరుగా మారుతుంది.

ఒక లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరినపుడు అడుగడుగునా ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదురవుతాయని లోకం భయపెడుతుంది. కాని ఆ మాటలకు భయపడకుండా, నిరుత్సాహపడకుండా ముందుకు నడిస్తేనే విజయం లభిస్తుంది. ఆ స్ఫూర్తే నలుగురు అనుసరించే దారిగా మారుతుంది.

TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం

II

ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు
ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది
మనిషీ మృగమూ ఒకటనీ అనుకుంటే వ్యర్థం
మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది
ఎంతటి ఎత్తుల కెదిగినా ఉంటుంది పరీక్ష
హిమగిరి శిరసే మాడితే అది యేరవుతుంది
బిరుదులు పొందే వ్యాప్తికీ విలువేమి “సినారె”
చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది.

అర్థాలు

ఎడారి దిబ్బలు = బీడుగా ఉన్న ప్రాంతాలు
దున్నితే = దున్నినట్లయితే
ఫలము = ప్రయోజనం
ఏముంది + అనకు = ఏముంటుందని అనవద్దు
ఇసుక గుండెలు = ఇసుకతో ఉన్న హృదయాలు
పగిలితే = పగిలినట్లయితే
అది = ఆ భూమి
పైరు + అవుతుంది = పంటలు పండుతుంది
మనిషి = మానవుడు
మృగము = మృగము
ఒకటని = ఒక్కటే అని
అనుకుంటే = భావిస్తే
వ్యర్థం = అనవసరము
మనుషులు = మానవులు
పదుగురు = అనేకమంది
కూడితే = కలిసినట్లయితే
ఒక ఊరవుతుంది = ఒక గ్రామం అవుతుంది
ఎంతటి ఎత్తులకు = ఎంతటి ఎత్తుకైనా
ఎదిగినా = ఎదిగినప్పటికీ
ఉంటుంది = ఉండును
పరీక్ష = పరీక్ష
హిమగిరి = హిమాలయ
శిరసే = శిఖరమే
మాడితే = ఎండితే
ఏ + అవుతుంది = నది అవుతుంది
బిరుదులు = పురస్కారాలు
పొందే = పొందేటటువంటి
వ్యాప్తికే = కీర్తికే
చెరగని = చెదిరిపోని
విలువేమి = విలువ ఏమిటి ?
సినారె = సి. నారాయణరెడ్డి
త్యాగం = త్యాగము
ఒక పేరు + అవుతుంది = ఒక పేరుగా నిలుస్తుంది

భావం
బీడుపడి, పనికిరాకుండా ఉన్న నేలలో ఏ పంటలూ పండవని ఏ ప్రయత్నాలూ చేయకుండానే నిరాశపడవద్దు. కష్టపడి ఆ నేలను దున్నితే విశ్వాసంతో విత్తనాలు నాటితే మంచి పంటలు పండుతాయి.

నలుగురు మనుషులు కలిసి పరస్పర సహకారంతో జీవించడమే ఉత్తమ సాంఘిక జీవనం. సాటి మనుషుల పట్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోవాలి. అప్పుడే అందరు కలిసి ఆనందంగా జీవించగలుగుతారు. అటువంటి మనుషులు కలిస్తేనే ఒక ఊరు ఏర్పడుతుంది.

ఎంత సామర్థ్యమున్నా, అధికారం, సంపదలు ఉన్నా, ఎన్నో విజయాలు సాధించినా, ఇక నాకు ఏ కష్టాలూ, బాధలు రావని ధీమాగా ఉండలేం. విధి ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో, సమస్యల పరీక్షలు పెడుతుందో ఎవరూ ఊహించలేరు. దాని శక్తి ముందు ఎవరైనా తలవంచవలసిందే. ఉన్నతమైన హిమాలయ పర్వత శిఖరం కూడా ఎండ వేడికి కరిగిపోయి నదిగా ప్రవహించవలసిందే ! అలాగే ఎంతటి మనిషైనా గర్వం నీరు కారిపోవలసిందే.

మనపేరు ప్రపంచానికంతా తెలిసేలా ప్రఖ్యాతి పొందామని, ప్రతిష్టాత్మక బిరుదులు, సత్కారాలు పొందామని అనుకోవడంలో నిజమైనవిలువ, గుర్తింపు లేదు. మానవాళికి పనికివచ్చే గొప్పపని, నిస్వార్థ త్యాగం చేస్తేనే ఆ మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది.

పాఠం ఉద్దేశం

మనిషి దేన్ని గురించి నిరుత్సాహపడకూడదు. దేన్నైనా ప్రయత్నం ద్వారా సాధించవచ్చు. దుఃఖాన్ని తట్టుకుంటూ, కష్టాలను ఎదుర్కొంటూ, తనంతటతాను ఎదుగుతూ, ఇతరుల కోసం పాటుపడుతూ జీవించే మనిషి సమాజంలో గౌరవం పొందుతాడని చెప్పడం, తెలుగులో గజల్ ప్రక్రియను పరిచయం చేయడం ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ప్రస్తుత పాఠ్యభాగం డాక్టర్ సి. నారాయణరెడ్డి సమగ్ర సాహిత్యం “ఆరవ సంపుటిలోని తెలుగు గజళ్ళు” లోనిది.

కవి పరిచయం

కవి పేరు : డా॥ సింగిరెడ్డి నారాయణరెడ్డి (సి.నా.రె)
జన్మస్థలం : రాజన్న సిరిసిల్లాజిల్లా హనుమాజీ పేట గ్రామం.
దేనినుండి గ్రహింపబడినది : నారాయణరెడ్డి సమగ్ర సాహిత్యం ఆరవ సంపుటిలోని ‘తెలుగు గజళ్ళు’ నుండి.
జననం : 1931, జులై 29

కవి విశేషాలు : ప్రముఖ ఆధునిక కవి, వక్త, పరిశోధకుడు, బహుభాషావేత్త, ప్రయోగశీలి, సినీగేయ రచయిత
ఇతర రచనలు : నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మంద హాసం, విశ్వంభర, ప్రపంచపదులు మొదలైనవి. నలభైకి పైగా కావ్యాలు, అద్భుతమైన సినీ గేయాలు, గజల్స్ రచించారు.

ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయ ములు – ప్రయోగములు, వీరి ప్రామాణిక సిద్ధాంత గ్రంథం.
బిరుదులు : పద్మభూషణ్, జ్ఞానపీఠ అవార్డు.
పురస్కారాలు : ‘విశ్వంభర’ కావ్యానికి జాతీయ స్థాయిలో అత్యున్నత జ్ఞానపీఠ పురస్కారం.

ఉద్యోగ నిర్వహణ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖలో ఆచార్యులుగా, అధికార భాషాసంఘం అధ్యక్షులుగా, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికీ,
తెలుగు విశ్వ విద్యాలయానికీ ఉపకులపతి, రాజ్యసభ సభ్యులు.

సారస్వత సేవ : ఆంధ్ర సారస్వత (వైస్ ఛాన్స్లర్) సేవలు అందించారు.
కవితాశైలి : శబ్దశక్తి, అర్థయుక్తి సినారె కలానికీ, గళానికీ ఉన్న ప్రత్యేకత. వీరి రచన సరళంగాను, మనోహరంగాను ఉంటుంది.
మరణం : 2017, జూన్ 12

TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం

ప్రవేశిక

ఏ ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగే ప్రయాణానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉండదు. అనేక రకాల అవరోధాలను, ఆటుపోట్లను అనుభవిస్తూ విజయాన్ని సాధించడంలోనే ఆనందం, సంతృప్తితోపాటు నిజమైన గుర్తింపు లభిస్తుంది. అటువంటి అనేక జీవన విలువలను ఉద్బోధించే మానవ వికాస భాష్యాన్ని విందాం.

విద్యార్థులకు సూచనలు

  • పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
  • పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత గీయండి.
  • వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పద విజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకోండి.

ప్రక్రియ – గజల్

ఈ పాఠం ‘గజల్’ ప్రక్రియకు చెందినది. గజల్లో పల్లవిని “మత్లా” అని, చివరి చరణాన్ని “మక్తా” అని, కవి నామముద్రను “తఖల్లుస్” అని అంటారు. పల్లవి చివర ఉన్న పదం, ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది. సరస భావన, చమత్కార ఖేలన, ఇంపూ, కుదింపూ గజల్ జీవగుణాలు.

పాఠ్యభాగ సారాంశం

నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కితే వర్షమై అవి భూమి మీద కురుస్తాయి. అలాగే మనసుకు ఆందోళనలు, బాధలు, చింతలు అనే దిగులుమబ్బులు కమ్ముకుంటే దుఃఖస్థితి వస్తుంది. అది కన్నీరుగా మారుతుంది.

ఒక లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరినపుడు అడుగడుగునా ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదురవుతాయని లోకం భయపెడుతుంది. కాని ఆ మాటలకు భయపడకుండా నిరుత్సాహపడకుండా ముందుకు నడిస్తేనే విజయం లభిస్తుంది. ఆ స్ఫూర్తే నలుగురు అనుసరించే దారిగా మారుతుంది. బీడుపడి, పనికిరాకుండా ఉన్న నేలలో ఏ పంటలూ పండవని ఏ ప్రయత్నాలూ చేయకుండానే నిరాశపడవద్దు. కష్టపడి ఆ నేలను దున్నితే, విశ్వాసంతో విత్తనాలు నాటితే మంచి పంటలు పండుతాయి.

నలుగురు మనుషులు కలిసి పరస్పర సహకారంతో జీవించడమే ఉత్తమ సాంఘిక జీవనం. సాటి మనుషులు పట్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పరుచుకోవాలి. అప్పుడే అందరు కలిసి ఆనందంగా జీవించగలుగుతారు. అటువంటి మనుషులు కలిస్తేనే ఒక ఊరు ఏర్పడుతుంది.

ఎంత సామర్థ్యమున్నా, అధికారం, సంపదలు ఉన్నా ఎన్నో విజయాలు సాధించినా ఇక నాకు ఏ కష్టాలూ బాధలూ రావని ధీమాగా ఉండలేం. విధి ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో సమస్యల పరీక్షలు పెడుతుందో ఎవరూ ఊహించలేరు. దాని శక్తిముందు ఎవరైనా తలవంచ వలసిందే. ఉన్నతమైన హిమాలయ పర్వత శిఖరం కూడా ఎండ వేడికి కరిగిపోయి నదిగా ప్రవహించవలసిందే ! అలాగే ఎంతటి మనిషి గర్వమైనా నీరుకారిపోవలసిందే.

మనపేరు ప్రపంచానికంతా తెలిసేలా ప్రఖ్యాతి పొందామని, ప్రతిష్ఠాత్మక బిరుదులు, సత్కారాలు పొందామని అనుకోవడంలో నిజమైనవిలువ, గుర్తింపు లేదు. మానవాళికి పనికివచ్చే గొప్పపని, చెరగని త్యాగం చేస్తేనే ఆ మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచి పోతుంది.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

Telangana SCERT 10th Class Telugu Guide Telangana 7th Lesson శతక మధురిమ Textbook Questions and Answers.

TS 10th Class Telugu 7th Lesson Questions and Answers Telangana శతక మధురిమ

చదవండి – ఆలోచించి చెప్పండి. (T.B. P.No. 66)

నల్లగొంగడిదెచ్చి చల్లనద్దినగాని
మల్లెపూల విధంబు తెల్లఁబడునె

వేపాకు పసరెంతసేపు గాచిన గాని
తేనెతో సమముగ తియ్యఁబడునె

వెల్లిపాయలు దెచ్చి వే గంధమునఁ గూర్చ
పరిమళించునె మొల్ల విరులవలెను

కుక్కతోకకు రాతిగుండు గట్టిన గాని
వంకబోయిన కొన చక్కనగునె

కొంటెలను సజ్జనులతోను గూర్చితేమి
ఆత్మపరిశుద్ధులై భక్తులౌదురెట్లు
చక్రధర ! ధర్మపురిధామ ! సార్వభౌమ !
నరహరీ ! భక్తజనకల్ప ! నాగతల్ప !

– నరహరి శతకము, కాకుత్థ్సం శేషప్పకవి

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ఈ పద్యం ఎవరు రాశారు ? ఏ శతకంలో ఉన్నది ?
జవాబు:
కాకుత్థ్సం శేషప్పకవి. నరహరి శతకములోనిది.

ప్రశ్న 2.
ఈ పద్యం ద్వారా మీరేమి గ్రహించారు ?
జవాబు:
చెడ్డవారిని సజ్జనులుగా మార్చుట కష్టమని గ్రహించాను.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

ప్రశ్న 3.
ఇట్లాంటి పద్యాలు మీకింకా ఏమి తెలుసు ?
జవాబు:

  1. గంగిగోవుపాలు గరిటెడైనచాలు ….. వినుర వేమ ||
  2. గాజుం బూస యనర్ఘ రత్నమగునా …….. పార్వతీ వల్లభా |

ఈ పద్యాలు చదివాను.

ప్రశ్న 4.
వీటిని ఎందుకు నేర్చుకోవాలి ?
జవాబు:
ఇటువంటి మంచి మంచి పద్యాలు నేర్చుకోవడం వలన నీతులు తెలుస్తాయి. మానవ స్వభావాలు అంచనా వేయవచ్చు. మంచి ప్రవర్తన అలవాటు అవుతుంది. చక్కగా మాట్లాడడం తెలుస్తుంది. ఏ సమస్యనైనా పరిష్కరించుకోగల నేర్పు వస్తుంది. జీవితంలో జరిగే సంఘటనలను ముందుగానే ఊహించవచ్చు.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 69)

ప్రశ్న 1.
దైవాన్ని పూజించే విధానాలు ఎట్లా ఉండాలి ? ఎందుకు ?
జవాబు:
సత్యం, దయ, విశిష్టమైన ఏకాగ్రత (భక్తియోగ విధానం) ఈ విధానాల ద్వారా దైవాన్ని పూజించాలి ఎందుకంటే ఇవి మనిషికి అత్యంత అవసరం.

ప్రశ్న 2.
ప్రజలు రాజులను ఆశ్రయించ వచ్చునా ? ఎందుకు ?
జవాబు:
ఆశ్రయించరాదు. తినడానికి భిక్షం పెడతారు. నివాసానికి గుహలున్నాయి. వస్త్రాలు వీథుల్లో దొరుకు తాయి. తాగడానికి నదుల్లో చల్లని నీరు దొరుకుతుంది. తపస్సు చేసే మునులను రక్షించటానికి శ్రీకాళ హస్తీశ్వరుడు ఉన్నాడు. ఇంకా ఎందుకు రాజులను ఆశ్రయించాలి (ఆశ్రయించరాదు).

ప్రశ్న 3.
సిరిలేకున్నా పండితుడు ఏయే గుణాలవల్ల శోభిస్తాడు ?
జవాబు:
తలవంచి గురువు పాదాలకు నమస్కరించేవాడు, దానగుణం కలిగినవాడు, చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినేవాడు. సత్యవ్రతుడైనవాడు. భుజబలంతో విజయా లను పొందేవాడు. మనస్సునిండా మంచితనం కల వాడయిన పండితుడు సంపదలు లేకున్నా ప్రకాశిస్తాడు.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 70)

ప్రశ్న 1.
రాముని గొప్పదనాన్ని ఏ విధంగా చాటిచెప్పవచ్చు?.
జవాబు:
దశరథుని కుమారుడు, దయాసముద్రుడైన శ్రీరాముడు యుద్ధరంగంలో శత్రుభయంకరుడని, దుఃఖాలు పొందేవారి పాలిట బంధువువని, కాంతిమంతమైన అమ్ములపొది, బాణాలు, కోదండముల నుపయోగించే నేర్పులో ప్రచండమైన భుజతాండనం చూపి, కీర్తి పొందిన నీకు సాటివచ్చే దైవం మరొకరులేరని, మదించిన ఏనుగు నెక్కి ఢంకా మ్రోగిస్తూ, భూమండల మంతా వినబడేటట్లు చాటి చెప్పవచ్చు.

ప్రశ్న 2.
సత్ప్రవర్తన వల్ల పొందే ఫలితాలు ఏమిటి ?
జవాబు:
విష్ణుభక్తులను నిందించకుండా ఉంటే అనేక గ్రంథాలను చదివినట్లే, భిక్షమిచ్చేవారిని ఆపకుంటేచాలు, అది దానము చేసినట్లే. సజ్జనులను మోసం చేయకుండా ఉంటే గొప్ప బహుమతినిచ్చినట్లే, దేవతా మాన్యములను ఆక్రమించకుండా ఉంటే అది బంగారు ధ్వజస్తంభంతో కూడిన గుడి కట్టించినట్లే. ఇంకొకరి ‘వర్షాశనం’ (ఒక ఏడాదికి సరిపడే భోజనాన్ని) రాకుండా చేయకుంటే చాలు. తన పేరుతో సత్రాలు కట్టించినట్లే అవుతుంది.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

ప్రశ్న 3.
మోసం ఎందుకు చేయకూడదు ?
జవాబు:
అనేక దుర్గుణాల్లో మోసం ఒకటి. మోసం ఎన్నడూ, ఎవరికీ చేయకూడదు. దీనివల్ల విశ్వాసం కోల్పోతారు. మానవీయ సంబంధాలు దెబ్బతింటాయి. గౌరవం అంతరించిపోతుంది. మానసిక స్పర్థలు కలుగుతాయి. అందువల్ల మోసం అనేది చేయకుండా ఉండాలి.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 71)

ప్రశ్న 1.
కవి దృష్టిలో నిజమైన ఘనుడెవరు ?
జవాబు:
స్వార్ధం లేనివాడు, త్యాగంతో కూడిన దీక్షను పూని జను లందరి దీనస్థితిని రూపుమాపి, అందరికి సుకుమారమైన, ఆనందకర జీవితసుఖాన్ని పంచి, మాతృదేశపు గొప్పతనాన్ని ఎవరయితే విశదపరుస్తారో వారే గొప్ప వారవుతారు. అపూర్వమైన కీర్తిమంతులవుతారు.

ప్రశ్న 2.
మిత్రుని సహాయం ఎన్ని విధాలుగా ఉంటుంది ?
జవాబు:
మిత్రుని సహాయం చాలా రకాలుగా ఉంటుంది. మంచి పుస్తకంలాగా మంచిని బోధిస్తాడు. కార్యసాధనంలో సంపదలా సహాయపడతాడు. స్వాధీనమైన కత్తిలాగ శత్రుసంహారం చేసేవాడు. రక్షించే మనసులాగ సౌఖ్యాలను ఇచ్చేవాడు నిజమైన మిత్రుడు.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

ప్రశ్న 3.
నరరూప రాక్షసులంటే ఎవరు ?
జవాబు:
కలలో కూడా సత్యాన్ని పలకడానికి ఇష్టపడనివాడు, మాయమాటలు చెప్పి ఇతరుల సొమ్ము అపహరించే వాడు, కులగర్వంతోటి పేదవాండ్ల ఇండ్లను నాశనం చేసేవాడు, లంచాలకు విలువను పెంచేవాడు, చెడు ప్రవర్తనతో తిరిగేవాడు, వావివరుసలను పాటించని వాడు, నవ్వుతూ ముచ్చటాడుతూనే ఎదుటివాడిని నాశనం చేయాలనుకునేవాడు, తల్లిదండ్రులను ఇంటినుంచి వెళ్ళగొట్టేవాడు ఈ భూమిమీద మానవ రూపంలో ఉన్న రాక్షసుడే.

ఇవి చేయండి

1. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
శతక ప్రక్రియ శతాబ్దాల తరబడి కొనసాగుతూ ఉన్నది. పాఠంలోని శతక పద్యాల భావాలు నేటి కాలానికి కూడా తోడ్పడుతాయని భావిస్తున్నారా ? ఎందుకు ? చర్చించండి.
జవాబు:
తెలుగు సాహిత్యంలో శతకాలకు ప్రత్యేక స్థానం ఉంది. వందల సంవత్సరాల నుండి శతకాలు మానవులలో నైతికతను, సద్గుణాలను, మానవీయ విలువలను, భక్తితత్త్వాన్ని పెంపొందించడానికి తోడ్పడుతున్నాయి. పూర్వపు విద్యావిధానంతో ప్రతి ఒక్క విద్యార్థి శతక పద్యాలను కంఠస్థం చేసేవారు.

శతక పద్యాలు రాని విద్యార్థి ఉండేవాడు కాదు. నేడు అన్ని రంగాలలో మార్పులు వచ్చినట్లే భాషను నేర్చుకొనే విధానంలో కూడా మార్పులు వచ్చాయి. అందువల్ల కొందరు మాత్రమే శతకాలు చదువుతున్నారు. అయితే కాలం ఎంత మారినా నేటి సమాజానికి కూడా శతకాలు చదవడం ముఖ్యావసరం అని చెప్పవచ్చు.

ప్రస్తుత పాఠంలోని సర్వేశ్వర శతక పద్యం ద్వారా దేవుని అనుగ్రహం పొందాలంటే కోట్లాది రూపాయలు అవసరం లేదని సత్యం, దయ, ఏకాగ్రత అనే పుష్పాలు ఉంటే చాలని తెలుసుకున్నాం. దీని వల్ల నేడు భక్తి పేర జరుగుతున్న వృథా ఖర్చులను తగ్గించు కునే అవకాశం కల్గుతుంది.

కాళహస్తీశ్వర శతకం రాజుల నాశ్రయించవద్దని తెలిపింది. ఇప్పుడు రాజులు లేనప్పటికీ వారి స్థానంలో వచ్చిన ఎమ్.ఎల్.ఏలు, ఎమ్.పి.ల దగ్గరికి చేరకూడదని గ్రహించవచ్చు.

లోకంలో సంపద లేకపోయినా గురువులకు నమస్కరించడం, సత్యం పలకడం, దానం చేయటం అనే గుణాల వల్ల పండితుడు ప్రకాశిస్తాడు అని చెప్పటం వల్ల డబ్బు కంటే సత్యం, దానం, గురువందనం గొప్పవని మల్ల భూపాలీయ శతకం వల్ల తెలుస్తున్నది. దాశరథీ శతకం వలన శ్రీ రాముని వైభవాన్ని తెలుసు కున్నాం. నృసింహ శతకం ద్వారా ఏయే పనులు చేయకూడదో గ్రహించవచ్చు.

అందులో చెప్పిన విషయాలు నేటి సమాజంలో కూడా జరుగుతున్నవే. విశ్వనాథేశ్వర శతకం గొప్పవారు కావాలంటే త్యాగం చెయ్యాలని చెప్పుటయేగాక విద్యార్థులు కూడా దేశం కోసం త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలని బోధిస్తున్నది.

లొంకరామేశ్వర శతకం మిత్రుడు పుస్తకం లాంటి వాడని తెలిపి ఈ నాటికి కూడా స్నేహితుల విలువను మనకు గుర్తుకు తెస్తుంది. ఇక వేణుగోపాల శతకంలో చెప్పిన విషయాలు నేడు కూడా జరుగుతున్నా వాటిని చేయకుండా ఉండటానికి ప్రతివిద్యార్థి ప్రయత్నించాలి.

ప్రశ్న 2.
కింది భావమున్న పద్య పాదాలను పాఠంలో గుర్తించండి.

అ) మిత్రుడు యుద్ధరంగంలో కత్తివలె ఉపయోగపడుతాడు.
జవాబు:
7వ పద్యం – పొత్తంబై కడునేర్పుతో ………. స్వాయత్తంబైన కృపాణమై యరుల నాహరించు మిత్రుండు

ఆ) రాముని మించిన దైవం లేడని చాటుతాను.
జవాబు:
4వ పద్యం – భండన భీమ ….. రెండవ సాటి దైవమిక లేఁడనుచున్ కరుణాపయోనిథీ” ||

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

ప్రశ్న 3.
విద్వాన్ కలువకుంట కృష్ణమాచార్య రాసిన కింది పద్యాన్ని చదువండి. భావాన్ని సొంతమాటల్లో రాయండి.

పద్యానికి తగిన శీర్షికను పెట్టండి.
అనుభవమ్మున నేర్చిన యట్టి చదువు
తండ్రివలె కాపునిచ్చును తాను ముందు
పడిన కష్టాలచే గుణపాఠమయ్యి
తగిన ప్రేరణ – కాపాడు తల్లివోలె

భావం : అనుభవముతో నేర్చుకొన్న చదువు తండ్రిలాగా -రక్షించును. ముందు పడిన కష్టాలు, గుణ పాఠాలుగా పొంది తగిన ప్రేరణను ఇస్తుంది. అమ్మలాగా చదువు కాపాడుతుంది అని అర్థం.
శీర్షిక : “చదువు గొప్పతనం”, “చదువు వల్ల ప్రయోజనం”.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) మీ దృష్టిలో అపూర్వ కీర్తిమంతుడంటే ఎట్లా ఉండాలి?
(లేదా)
కీర్తివంతుని లక్షణాలను పాఠం ఆధారంగా వివరించండి.
జవాబు:
త్యాగం గుణం కల్గి జనులందరి దీనస్థితిని రూపు మాపి, అందరికి సుఖమయమైన, ఆనందకర జీవిత సుఖాన్ని పంచి, మాతృదేశపు గొప్పతనాన్ని ఎవరయితే విశదపరుస్తారో వారే గొప్పవారవుతారు. అపూర్వమైన కీర్తిమంతులవుతారు. ఈ పై లక్షణాలన్ని అపూర్వ కీర్తిమంతునికి ఉండాలని నా అభిప్రాయం.

ఆ) త్యాగి లక్షణాలెట్లా ఉంటాయి ?
(లేదా)
త్యాగి లక్షణాలను వివరించండి.
జవాబు:
నిజమైన త్యాగి తన సర్వస్వాన్ని ధారపోయటానికి కూడా ఇష్టపడతాడు. అడిగితే కాదనకుండా ఇస్తాడు. తనకిష్టమైనా సరే తృణప్రాయంగా భావించి ఇస్తాడు. ఇది చాలా గొప్ప విషయం.

  1. అతడు తన ప్రాణాలు కూడా లెక్కచేయడు.
  2. గొప్ప కోసం చూడడు.
  3. కీర్తి ప్రతిష్ఠలను కూడా లెక్కచేయడు.
  4. తన సర్వసాన్ని ఇచ్చివేస్తాడు. ఇవి త్యాగి లక్షణాలు.
    ఉదా : కర్ణుడు, బలిచక్రవర్తి, శిబి చక్రవర్తి మొదలగువారు.

ఇ) మిత్రుడు పుస్తకంవలె మంచి దారి చూపుతాడని ఎట్లా చెప్పగలరు ?
జవాబు:
మంచి పుస్తకాన్ని మించిన స్నేహితుడు లేడు. మంచి స్నేహితుని మించిన పుస్తకం లేదు. పుస్తకం అంటే విజ్ఞానం. ఒక విషయం తెలుసుకోవాలంటే పుస్తకంలో చూసుకొంటాం లేదా స్నేహితులను అడుగుతాం. పుస్తకం మనకు కథల రూపంలో మంచి మంచి నీతులను చెబుతుంది. జీవితంలో ఉపయోగించే ఎన్నో మంచి విషయాలను చక్కటి పదాలతో చెబుతుంది.

అలాగే స్నేహితుడు కూడా ఎన్నో మంచి విషయాలు చెబుతాడు. తప్పు చేస్తుంటే చేయవద్దు అంటాడు. మనకు వినసొంపైన మాటలతో మంచిని చెబుతాడు. కష్టకాలంలో తోడుగా నిలబడతాడు. తప్పుచేస్తే పరిహారం కూడా చెబుతాడు. అందుకే స్నేహితుడు మంచి పుస్తకం వలె మంచి మార్గం చూపిస్తాడు అంటారు.

ఈ) పూజకు సత్యం, దయ, ఏకాగ్రత అనే పుష్పాలు అవసరమని పాఠంలో తెలుసుకున్నారు కదా ! మరి చదువు విషయంలో ఏవేవి అవసరమనుకుంటున్నారు?
జవాబు:
ఏకాగ్రత అవసరం. శ్రద్ధ చాలా అవసరం. ఉత్సుకత, కార్యదీక్ష కూడా అవసరం “శ్రద్ధయా వర్థతే విద్య”. విద్యార్థికి అలసత్వం పనికిరాదు. “అలసతకూడదు ఇంచుక అధ్యయనంబున, బోధనంబునన్” అని ఒక ప్రసిద్ధ కవి అన్నాడు. వినయం, విధేయత, క్రమశిక్షణ కూడా చాలా అవసరం. పట్టుదల సాధించాలనే తపన ఉండాలి. వీటితోపాటుగా శారీరక, మానసిక దృఢత్వం ఎంతో అవసరం.

ప్రశ్న 2.
క్రింది ప్రశ్నకు పది వాక్యాలలో జవాబు రాయండి.

అ) శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా ఉపయోగపడుతాయో విశ్లేషించి రాయండి.
(లేదా)
శతక పద్యాల్లోని నీతులు జగతికి మార్గదర్శకాలు ఎలా అవుతాయో విశ్లేషించండి.
జవాబు:
శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో చాలా ఉపయోగ పడతాయి. ఎలాగంటే ……. సర్వేశ్వర శతకంలోని ‘భవదీయార్చన……….` అనే పద్యంలో దేవుని పూజించడానికి సత్యం, దయ, ఏకాగ్రత అనే లక్షణాలు ఉండాలన్నారు.

సత్యం మాట్లాడే లక్షణం అలవాటైతే మోసంచేసే ఆలోచన రాదు. అందుచేత గౌరవం పెరుగుతుంది. దయ కలిగి ఉంటే, కష్టాలలో ఉన్నవారికి సహాయం చేస్తాము. దాని వలన సమాజంలో స్నేహభావం పెరుగు తుంది. కక్షలు కార్పణ్యాలూ ఉండవు.

ఏకాగ్రత కలిగి ఉంటే ఏ పనినైనా సాధించవచ్చు. ఏ విషయమైనా అర్థమవుతుంది. తెలివి పెరుగుతుంది. తెలివైన సమాజం సంపదలను అభివృద్ధి చేస్తుంది. దరిద్రం ఉండదు. కరవుకాటకాలు ఉండవు.

శ్రీకాళహస్తీశ్వర శతకంలోని ‘ఊరూరం జనులెల్ల ……….’ అనే పద్యంలో చక్కటి నీతులు ఉన్నాయి. అవి అర్థం చేసుకొంటే ‘నేను, నావాళ్ళు’ అనే స్వార్థం పోతుంది. సంపాదన మాత్రమే జీవితం కాదని తెలుస్తుంది. భగవంతునిపైన నమ్మకం పెరుగుతుంది. ఉత్తమమైన సంస్కారం కలుగుతుంది.

‘సిరిలేకైన విభూషితుండె’ అనే పద్యంలో గురువులను గౌరవించాలని చెప్పారు. ఈ రోజులలో గురువులంటే గౌరవం తగ్గుతోంది. దానగుణం కావాలన్నారు. దానగుణం ఉంటే దొంగతనాలు, దోపిడీలు ఉండవు. మంచి విషయాలను వినాలన్నారు. మంచి విషయాలను వింటే మంచి ఆలోచనలు వస్తాయి. మంచిపనులు చేస్తాం. మంచి సమాజం ఏర్పడుతుంది. మనసులో సౌజన్యం ఉండాలన్నారు. మనసులో సౌజన్యం ఉంటే ఎవ్వరిపైనా కోపం, ద్వేషం ఉండవు. అందరూ నావాళ్ళే అనే భావం కలుగుతుంది. గొడవలకు అవకాశం లేదు. అందుచేత శతక పద్యాలలో చెప్పిన నీతుల వలన అనేక ప్రయోజనాలున్నాయి.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

ప్రశ్న 3.
క్రింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

అ) ఈ పాఠం ఆధారంగా మనం అలవర్చుకోవాల్సిన మంచి గుణాలు, అలవర్చుకోకూడని గుణాలను వివరిస్తూ మిత్రునికి ఒక లేఖ రాయండి.
జవాబు:
వరంగల్,
9.6.2018.
ప్రియమైన మిత్రునకు,
ఉభయకుశలోపరి. నేను 10వ తరగతి చదువు చున్నాను. మన 10వ తరగతిలోని 7వ పాఠం “శతక మధురిమ” చాలా బాగుంది. ఈ పాఠంలో మంచి గుణాలు, ఉండకూడని గుణాలు మా పంతులుగారి ద్వారా తెలుసుకున్నాను. వాటిని ఇక్కడ రాస్తున్నాను.

అలవర్చుకోవాల్సిన మంచి గుణాలు :

  1. పూజకు సత్యం, దయ, ఏకాగ్రత ఉండాలి. ఇవి లేని పూజ వ్యర్ధం.
  2. రాజులను ఆశ్రయించరాదు. అది నరకంతో సమానం.
  3. శ్రద్ధ, దానగుణం గల సత్యవ్రతుడు సంపదలు లేకపోయినా ప్రకాశిస్తాడు.
  4. మిత్రుడు మంచి పుస్తకంలాగా, ధనంలాగా, సహాయపడతాడు నిండు మనస్సుతో సుఖాన్ని ఇస్తాడు.

అలవర్చుకోకూడని గుణాలు :

  1. విష్ణు భక్తులను నిందించరాదు.
  2. భిక్షం ఇచ్చేవారిని ఆపకూడదు.
  3. సజ్జనులను మోసం చేయరాదు.
  4. దేవతామాన్యములను ఆక్రమించరాదు.
  5. అసత్యాన్ని పలకరాదు.
  6. మాయమాటలు చెప్పరాదు. లంచాలకు విలువ ఇవ్వరాదు. చెడు ప్రవర్తనతో తిరగరాదు.
    మీ పాఠంలో నీవు తెలుసుకున్న విషయాలు తెలియపరచగలవు.

ఇట్లు,
నీ మిత్రుడు,
X X X X X.

చిరునామా :

యం. యుగంధర్,
10వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూల్,
బాసర,
ఆదిలాబాద్ (జిల్లా.)

(లేదా)

ఆ) ఏదైనా ఒక పద్యభావం ఆధారంగా నీతికథ రాసి ప్రదర్శించండి.
జవాబు:
6వ పద్య భావం ఆధారంగా నీతి కథ

త్యాగం : అన్ని సద్గుణాల్లోను ‘త్యాగం’ ఎంతో గొప్పది. ఇది మానవుడికి అజరామరమైన కీర్తిని సంపాదించిపెడుతుంది. మనం కన్న సంతానం కన్నా, మనం సంపాదించిన ధనం కన్నా, మనం చేసిన మంచి పనుల కన్నా, శాశ్వతత్వాన్ని సమకూర్చి పెట్టేది త్యాగం ఒక్కటే! అందుకనే “నకర్మణా నప్రజయా ధనేన, త్యాగేనైకేన అమృతత్వమానసు” అని వేదం ఘోషిస్తుంది. దానం – త్యాగం ఈ రెండూ దగ్గర లక్షణాలు కలవిగానే కనిపించినా రెండింటిలో చాలా తేడా ఉంది. తన దగ్గరవున్న దానిలో ఇతరు లకు ఇవ్వడం దానం.

తనకు మిక్కిలి అవసరమైనదని తెలిసికూడా, దానిని లెక్కపెట్ట కుండా ఇతరు లకు ఇచ్చేయడం త్యాగం. భారతీయ సంస్కృతి ఈ త్యాగానికి పెద్దపీట వేసింది. త్యాగధనుల్ని ప్రాతః స్మరణీయులుగా భావించి నిత్యం ఆరాధించింది. అలాంటి త్యాగానికి సంబంధించిన ఎన్నో కథల్లో భాగవతంలోని ‘రంతిదేవుని” చరిత్ర వినదగ్గది. రంతిదేవుడు గొప్ప మహారాజు. తన దగ్గర వున్న సంపదనంతా ప్రజలకు దానం చేశాడు.

చివరకు ఏమీలేని నిర్ధన స్థితిలో భార్యాబిడ్డలతో మిగిలి పోయాడు. తినడానికి, తాగడానికి ఏమీ లభించని పరిస్థితిలో 48 రోజులు గడిపాడు. అప్పుడు ఆయన ముందు ఆకస్మాత్తుగా పంచభక్ష్య పరమాన్నాలు ప్రత్యక్షమయ్యాయి. నకనకలాడే భార్యాబిడ్డలతో ఆ ఆహారాన్ని తీసుకోడానికి సిద్ధపడ్డాడు.

అంతలో ఒక బ్రాహ్మణుడు వచ్చి ‘అయ్యా ! ఆకలితో బాధ పడుతున్నాను. నాకేమైనా పెట్టండి’ అని దీనంగా అడిగాడు. రంతిదేవుడు ఆ పరిస్థితిలో కూడా అతడికి సగభాగం యిచ్చేశాడు. ఆ తరువాత మరొక అతిథి వచ్చాడు. అతడికి తన దగ్గరవున్న సగభాగం యిచ్చాడు.

వరుసగా వచ్చి అడిగే ఆర్తులతో ఆహారం అయిపోయింది. చివరకు పానీయం మాత్రమే మిగిలింది. కనీసం ఆ నీరైనా తాగి ఆకలిని తీర్చుకుందామని అనుకున్నాడు. సరిగ్గా ఆ సమ యంలోనే ఓ దాహార్తుడు వచ్చి మంచినీరు యివ్వమని కోరాడు. రంతిదేవుడు ఎంతో ఆప్యాయతతో “అన్నా ! కష్టాలు ఎవరికైనా వస్తాయి.

రా అన్నా. ఈ నీరు త్రాగు” అని తనవద్ద మిగిలివున్న మధుర పానీయాలను కూడా యిచ్చివేశాడు. ఇదీ అసలైన త్యాగం. త్యాగం చేసిన మహానుభావుడు రంతి దేవుడు. అతని త్యాగానికి అంతటి విలువ ఉంది.

III. భాషాంశాలు

పదజాలం

ప్రశ్న 1.
క్రింది పదాలతో సొంతవాక్యాలు రాయండి.

అ) భాసిల్లు = ప్రకాశించు
జవాబు:
వినయ విధేయలతో విద్యార్థులు భాసిల్లాలి.

ఆ) ఉద్బోధించు = మేలుకొల్పుట, రగుల్చు
జవాబు:
యువకులకు వివేకానందస్వామి ఉద్బోధించాడు.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

ఇ) దైన్యస్థితి = దారిద్ర్యం చేత కలుగు దురవస్థ, దీనత్వం
జవాబు:
కుచేలుడు దైన్యస్థితిలో జీవనం సాగించాడు.

ఈ) నరరూప రాక్షసుడు = మనుష్య రూపంలోని రాక్షసుడు
జవాబు:
నేడు సమాజంలో నరరూప రాక్షసులు ఎక్కువగా ఉన్నారు.

ప్రశ్న 2.
క్రింది వాక్యాలలోని పర్యాయపదాలు గుర్తించండి. రాయండి.

అ) అడవిలో ఏనుగుల గుంపు ఉన్నది. ఆ గుంపుకు ఒక గజము నాయకత్వం వహిస్తున్నది. ఆ కరి తన గుంపులోని నాగములను రక్షిస్తుంది.
జవాబు:
ఏనుగు, గజము, కరి, నాగము.

ఆ) స్నేహితులతో నిజాయితీగా ఉండాలి. ఆ నిజాయితీ ఎందరో మిత్రులను సంపాదిస్తుంది. ఆ నెచ్చెలులే మనకు నిజమైన సంపద.
జవాబు:
స్నేహితులు, మిత్రులు, నెచ్చెలులు.

ఇ) రాజుల వీరత్వానికి చిహ్నం కృపాణం. వారు కత్తి సాములో నైపుణ్యానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఆ అసితోనే రాజులు శత్రువులపై విజయం సాధిస్తారు.
జవాబు:
కృపాణం, కత్తి, అసి.

ఈ) బంగారం అంటే అందరికీ ఇష్టం. అందుకే కనకం కొనడానికి అందరూ ఆసక్తి చూపుతారు. ఆ స్వర్ణంతో స్వర్ణకారుల దగ్గరకు వెళ్ళి తమకు నచ్చిన పసిడి ఆభరణాలను తయారు చేయించుకుంటారు.
జవాబు:
కనకం, బంగారం, స్వర్ణం, పసిడి.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

ప్రశ్న 3.
క్రింది వాక్యాలలోని ప్రకృతి, వికృతులను గుర్తించండి. వేరు చేసి రాయండి.

అ) తూరుపు దెస ఎర్రబడింది. దక్షిణ దిశవైపున్న నేను ఒక్కసారిగా అటు తిరిగాను.
జవాబు:
దిశ (ప్రకృతి) – దెస (వికృతి)

ఆ) సముద్రంలోని కెరటాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. ఆ సమయంలో సంద్రం భయాన్ని కలిగిస్తుంది.
జవాబు:
సముద్రం (ప్రకృతి) – సంద్రం (వికృతి)

ఇ) రాయడు తలుచుకుంటే అన్నీ సాధ్యం. రాజు మనసును పసిగట్టడం కష్టం.
జవాబు:
రాజు (ప్రకృతి) – రాయడు (వికృతి)

వ్యాకరణాంశాలు

1. క్రింది వాక్యాలు చదివి సంధి పదాలు గుర్తించి, విడదీసి సంధుల పేర్లు రాయండి.

అ) సీతను అందరూ బుద్ధిమంతురాలు అంటారు.
జవాబు:
బుద్ధిమంత + ఆలు = బుద్ధిమంతురాలు
– రుగాగమ సంధి

ఆ) అచ్చోట ఆ గులాబి మొక్కకు ఎన్ని పూలు పూచినాయో !
జవాబు:
ఆ + చోట = అచ్చోట = త్రిక సంధి

ఇ) రోగికి వైద్యుడు దివ్యౌషధం ఇచ్చాడు.
జవాబు:
దివ్య + ఔషధం = దివ్యౌషధం = వృద్ధి సంధి

ఈ) ఎవరెస్టు నధిరోహించిన పూర్ణ సాహసవంతురాలు.
జవాబు:
సాహసవంత + ఆలు = సాహసవంతురాలు – రుగాగమ సంధి

ఉ) సమాజం అభివృద్ధి చెందాలంటే సమైక్యత అవసరం.
జవాబు:
సమ + ఐక్యత = సమైక్యత = వృద్ధి సంధి

ఊ) విద్యావంతులే ఎక్కాలంలోనైనా కీర్తించబడతారు.
జవాబు:
ఏ + కాలము = ఎక్కాలం = త్రిక సంధి

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

2. క్రింది పద్యపాదానికి గణవిభజన చేసి, గురు లఘువులను గుర్తించి, ఏ పద్యపాదమో తెలుపండి. (T.S) June ’16 ; Mar. ’16

అ) భండనభీముఁ డార్తజన బాంధవుఁ డుజ్జ్వల బాణతూణ కో
జవాబు:
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 11

ఇది ఉత్పలమాల పద్యపాదము.

  1. ప్రతి పాదంలోను నాలుగు పాదాలుంటాయి.
  2. భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు వచ్చాయి.
  3. యతి 1 – 10వ అక్షరం (భ – బా)
  4. ప్రాస నియమం కలదు (౦డ)

ఆటవెలది

క్రింది పద్యపాదాలను గమనించండి.

అ)
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 12
జవాబు:
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 13

ఆ)
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 15
జవాబు:
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 14

ఇ)
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 16
జవాబు:
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 17

ఈ)
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 19
జవాబు:
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 18

  1. పై పద్యంలో 4 పాదాలున్నాయి.
  2. ప్రతి పాదానికి ఐదు గణాలు ఉన్నాయి.
  3. 1, 3 పాదాల్లో వరుసగా మూడు సూర్యగణాలు, రెండు ఇంద్రగణాలు ఉన్నాయి.
  4. 2, 4 పాదాల్లో ఐదు సూర్యగణాలు ఉన్నాయి.
  5. ప్రతి పాదంలో 4వ గణంలోని మొదటి అక్షరం యతి చెల్లింది.
    (బ్ర – బ, వ – వ, జే – జె, మా – మా)
  6. ప్రాసనియమం పాటించలేదు.

ఇట్లాంటి లక్షణాలున్న పద్యాన్ని ‘ఆటవెలది’ పద్యం అని అంటారు.
సూర్యగణాలు : నగణం (| | |), హగణం – U |

ఇంద్రగణాలు :
నల (| | |), నగ (| | | U) సల (| | UI), భ (U | |) ర (U | U), త (U U |) లు.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

క్రింది పద్యపాదాన్ని గణవిభజన చేసి ఏ పద్య పాదమో గుర్తించండి.

ఆ)
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 20
1 సూర్యగణము + 2 ఇంద్రగణాలు + 2 సూర్యగణాలు ఉన్న పద్యంను తేటగీతి పద్యం అంటారు.

ప్రాజెక్టు పని

6 నుండి 10 వ తరగతి వరకు చదువుకొన్న శతకాల పేర్లు, శతక కవుల వివరాలు కింది పట్టికలో రాసి ప్రదర్శించండి. వాటిలో ఎన్ని పద్యాలు మీరు కంఠస్థం చేశారో తెలుపండి.
జవాబు:
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 21

విశేషాంశాలు

  1. శతకం శతకం అనగా ముక్తకం. ముక్తకం స్వతంత్ర భావంతో ఉంటుంది. ఏ పద్యానికి ఆ పద్యం ప్రత్యేక భావాన్ని ప్రకటించడానికి అనువుగా ఉంటుంది. శతకం మకుట నియమం కలిగి ఉంటుంది. సంఖ్యా నియమం కల్గి ఉంటుంది. శతకాల్లో సమకాలీన సామాజికాంశాల విమర్శ సాధారణంగా కనిపించే లక్షణం. ఇది విద్యార్థులను ఆకట్టుకుంటుంది. తన చుట్టూ ఉన్న సమాజాన్ని విమర్శనాత్మకంగా చూస్తుంది.
  2. బృహస్పతి దేవతల గురువు. అంగీరసుడి కొడుకు. ఉతధ్యుడు, సంవర్తనుడు ఇతడి సోదరులు. బృహస్పతి భార్య తార. ఇతనికి శంయుడు అనే కొడుకున్నాడు. శుక్రనీతి, కణికనీతి లాగా బృహస్పతి నీతిసూత్రాలు ప్రసిద్ధి చెందాయి.
  3. శైవ కవిత్రయం నన్నె చోడుడు, మల్లిఖార్జున పండితారాధ్యుడు, పాల్కురికి సోమన. ఈ ముగ్గురిని శైవ కవిత్రయం అంటారు.
  4. శైవ పండిత త్రయం శ్రీపతి పండితుడు, మల్లిఖార్జున పండితారాధ్యుడు. శివలెంక మంచన. ఈ ముగ్గురిని శైవ పండిత త్రయం అంటారు.
  5. చింతామణి కోరిన కోర్కెలను తీర్చే మణి. నాగరాజు శిరస్సు నుంచి ఈ మణిని పొందవచ్చని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి.
  6. భాగీరథి గంగ, భగీరథుని ప్రయత్నం చేత భూమి మీదకు తీసుకురాబడినది. అందువల్ల భాగీరథి అయ్యింది.
  7. జాహ్నవి సగరులకు ఉత్తమ లోకాలు కల్గించడానికి భగీరథుడు తెచ్చిన గంగ జహ్నుమహర్షి యాగాన్ని పాడుచేసింది. జహ్నుమహర్షి కోపించి ఆ గంగను త్రాగివేసాడు. భగీరథుని కోరిక మేరకు (అభ్యర్థన వల్ల) తిరిగి ఎంగిలి కాకుండా తన చెవుల ద్వారా విడిచి పెడతాడు. కాబట్టి జహ్నుమహర్షి చేత త్రాగి విడువబడినది కాబట్టి దానికి జాహ్నవి అనే పేరు వచ్చింది.
  8. అంతరింద్రియాలు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ నాల్గింటిని అంతరింద్రియాలు అంటారు.
  9. బాహ్య ఇంద్రియాలు కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం ఈ ఐదింటిని బాహ్య ఇంద్రియాలు అంటారు.

సూక్తి : తన తోటి వారితో స్నేహంగా ఉంటూ ఇతరులకు మంచిని పంచుతూ, గురువులకు విధేయుడై ఉంటూ అభ్యసించే విద్య మంచి ఫలితాన్నిస్తుంది.

ప్రతిపదార్థ తాత్పర్యాలు

I.

1. మ.
భవదీయార్చన సేయుచోఁ బ్రథమ పుష్పంబెన్న సత్యంబు, రెం
డవ పుష్పంబు దయాగుణం, బతివిశిష్టం బేకనిష్ఠా సమో
త్సవ సంపత్తి తృతీయ పుష్పమది భాస్వద్భక్తి సంయుక్తి యో
గవిధానం బవి లేని పూజల మదింగైకోవు సర్వేశ్వరా.

కవి పరిచయం
ఈ పద్యము యధావాక్కుల అన్నమయ్యచే రచింపబడిన సర్వేశ్వర శతకము నుండి గ్రహింపబడినది.

ప్రతిపదార్థము (June 2017)

సర్వ + ఈశ్వరా = లోకాలన్నిటికీ ప్రభువైన ఓ ఈశ్వరా!
భవదీయ + ఆర్చన = నీ పూజ
చేయుచో = చేసేటప్పుడు
ప్రథమ పుష్పంబు + ఎన్నన్ = మొదటి పుష్పం
సత్యంబు = సత్యం
రెండవ పుష్పం = రెండవ పుష్పం
దయాగుణం = కారుణ్యమనే గుణం (దయ)
తృతీయ పుష్పము +
అది = మూడో పుష్పం
అతి = మిక్కిలి
విశిష్ట = విశిష్టమైన
ఏకనిష్టా = ఏకాగ్రతతో
సమోత్సవ సంపత్తి = సమానమైనది
అది = ఆ విధంగా మూడు పువ్వులు సమర్పించడం
భాస్వద్భక్తిసంయుక్తి విధానం = భక్తియోగ విధానం
అవి = ఈ మూడు పుష్పాలు
లేని = లేని
పూజలను = పూజలను
మదిన్ = మనస్సులో
గైకోవు = అంగీకరించవు కదా ! (అంగీకరించవు అని అర్థం)

తాత్పర్యము ఓ సర్వేశ్వరా ! నీ పూజ చేసేటప్పుడు మొదటి పుష్పం సత్యం. రెండవ పుష్పం దయ. మూడో పుష్పం మిక్కిలి విశిష్టమైన ఏకాగ్రత. ఇది భక్తియోగ విధానం. ఈ మూడు పుష్పాలు లేని పూజలను నీవు అంగీకరించవు కదా !

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

2. శా.
ఊరూరం జనులెల్ల భిక్షమిడరో, యుండంగుహల్గల్గవో
చీరానీకము వీథులందొరకదో, శీతామృత స్వచ్ఛవాః
పూరం బేరుల బారదో, తపసులం బ్రోవంగ నీ వోపవో
చేరం బోవుదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వరా !

కవి పరిచయం
ఈ పద్యము ధూర్జటిచే రచింపబడిన శ్రీకాళహస్తీశ్వర శతకము నుండి గ్రహింపబడినది.

ప్రతిపదార్థము

శ్రీకాళహస్తీశ్వరా = శ్రీకాళహస్తిలో వెలసిన ఓ ఈశ్వరా !
ఊరూరన్ = ప్రతి గ్రామములోనూ
జనులు + ఎల్లన్ = ప్రజలందరూ
భిక్షము + ఇడరో = అడిగితే భిక్షము పెట్టరా ?
ఉండన్ = నివసించడానికి
గుహల్ = గుహలు
కల్గవో చీరానీకము = లేవా ?
(చీర + అనీకము) = వస్త్రముల గుంపు
వీథులన్ = వీధులలో (అంగళ్ళలో)
దొరకదో = దొరకవా ?
శీతామృత స్వచ్ఛవాః పూరంబు ; శీత = చల్లని
అమృత = అమృతము వంటి తియ్యని
స్వచ్ఛ = నిర్మలమైన
వాఃపూరంబు = జలప్రవాహము
ఏఱులన్ = సెలయేళ్ళలో పాఱదో
(పాఱదు + ఓ) = ప్రవహించడం లేదా ?
తపసులన్ = తపశ్శాలులను
బ్రోవంగన్ = రక్షించడానికి
నీవు = నీవు
ఓపవో (ఓపవు + ఓ) = సమర్థుడవు కాదా ?
జనుల్ = ప్రజలు
రాజులన్ = రాజులను
చేరన్ = సమీపించడానికి
పోవుదురు + ఏల = ఎందుకు పోతారో !

తాత్పర్యము
శ్రీకాళహస్తీశ్వరా ! తినడానికి అడిగితే ఎవరయినా ఇంత భిక్షం పెడతారు. నివసించడానికి గుహలు ఉన్నాయి. వస్త్రాలు వీధుల్లో దొరుకుతాయి. తాగడానికి నదుల్లో చల్లని అమృతంవంటి స్వచ్ఛమైన నీరు దొరుకుతుంది. తాపసులను కాపాడటానికి నీవున్నావు. అయినా ఈ ప్రజలు రాజులను ఎందుకు ఆశ్రయిస్తారో తెలియదు.

3. మ.
సిరి లేకైన విభూషితుండె యయి భాసిల్లున్ బుధుండౌదలన్
గురుపాదానతి కేలనీగి చెవులందున్విన్కి వక్త్రంబునన్
స్థిర సత్యోక్తి భుజంబులన్విజయమున్ చిత్తంబునన్ సన్మనో
హర సౌజన్యము గల్గినన్ సురభిమల్లా ! నీతివాచస్పతీ !

కవి పరిచయం
ఈ పద్యము ఎలకూచి బాలసరస్వతీచే రచింపబడినది.

ప్రతిపదార్థము

సురభిమల్లా = ఓ “సురభిమల్ల” భూపాలుడా !
నీతివాచస్పతీ = నీతిశాస్త్రమునందు దేవతల గురువైన బృహస్పతి వంటివాడా !
ఔదలన్ = శిరస్సునందు
గురుపాదానతి
(గురుపాద + ఆనతి)
గురుపాద = గురువుగారి పాదాలకు
ఆనతి = మ్రొక్కుటయు (నమస్కరించడము)
కేలన్ = చేతియందు
ఈగి = దానగుణమునూ
చెవులందున్ = చెవులయందు
విన్కి = శాస్త్ర శ్రవణమునూ (శాస్త్రములు వినుటయూ)
వక్త్రంబునన్ స్థిరసత్యోక్తి ; = ముఖమునందు
స్థిర = స్థిరమైన
సత్యోక్తి (సత్య + ఉక్తి) = సత్యమైన వాక్కునూ
భుజంబులన్ = భుజములందు
విజయమున్ = విజయమునూ
చిత్తంబునన్ = మనస్సు నందు సన్మనోహర సౌజన్యము ;
సత్ = చక్కని
మనోహర = ఇంపైన
సౌజన్యము = మంచితనమునూ
కల్గినన్ = కల్గి ఉన్నట్లయితే
బుధుండు = పండితుడు
సిరి = ఐశ్వర్య౦
లేకైనన్
(లేక + ఐనన్) = లేకుండా ఉన్నా (లేకపోయినా)
విభూషితుండె ;
(విభూషితుండు + ఎ) = అలంకరింపబడినవాడే
అయి = అయి
భాసిల్లున్ = ప్రకాశిస్తాడు

తాత్పర్యము
నీతిలో బృహస్పతి అంతటి వాడవయిన ఓ సురభిమల్లా ! తలవంచి గురువు పాదాలకు నమస్కరించే వాడు, దానగుణం కలిగినవాడు, చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినేవాడు, సత్యవ్రతుడైనవాడు, భుజబలంతో విజయాలను పొందేవాడు, మనస్సునిండా మంచితనం కలవాడయిన పండితుడు సంపదలు లేకున్నా ప్రకాశిస్తాడు.

II

4. ఉ.
భండనభీముఁ డార్తజన బాంధవుఁ డుజ్జ్వల బాణతూణ కో
దండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్
రెండవ సాటి దైవమిక లేఁడనుచున్ గడగట్టి భేరికా
దాండ దడాండదాండ నినదంబులజాండము నిండ మత్తవే
దండము నెక్కి చాటెదను దాశరథీ ! కరుణా పయోనిధీ !!

కవి పరిచయం
ఈ పద్యము కంచర్ల గోపన్నచే రచింపబడిన దాశరథి శతకము నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్దము

దాశరథీ = దశరథుని కుమారా !
కరుణాపయోనిథీ = దయాసముద్రునివైన ఓ రామా !
భండన భీముడు = నీవు యుద్ధరంగంలో శత్రు భయంకరునివని
ఆర్తజన = దుఃఖాలు పొందేవారి పాలిట
బాంధవుడు = బంధువువని
ఉజ్వల = కాంతిమంతమైన
తూణ = అమ్ములపొది
బాణ = బాణాలు
కోదండ = కోదండములు
కళాప్రచండ = ఉపయోగించే నేర్పులో ప్రచండమైన
భుజతాండవ = భుజతాండవం చూపి
కీర్తికి = కీర్తిపొందిన
రామమూర్తికిన్ = శ్రీరామచంద్రునకు
రెండవసాటి దైవము = సాటివచ్చే మరియొక దైవం
ఇకన్ = ఇంక
లేడనుచున్ = లేరని
గడగట్టి = స్తంభము నాటి
భేరికా = ఢంకా యొక్క
దాండడ, డాండ, డాండ = డాం డాం డాం అనే
నినదంబులు = ధ్వనులు
అజాండము = బ్రహ్మండం
నిండన్ = వ్యాపించే విధంగా
మత్త = మదించిన
వేదండమునెక్కి = ఏనుగునెక్కి
చాటెదను = చాటుతాను

తాత్పర్యము
దశరథుని కుమారా ! దయాసముద్రునివైన ఓ శ్రీరామా ! నీవు యుద్ధరంగంలో శత్రుభయంకరుడవు, దుఃఖాలు పొందేవారి పాలిట బంధువువు, కాంతిమంతమైన అమ్ములపొది, బాణాలు, కోదండమును కలిగి ప్రచండ భుజతాండవంతో, ధనుర్విద్యాకళలో కీర్తి పొందిన నీకు సాటివచ్చే దైవం మరొకరు లేరని, మదించిన ఏనుగు నెక్కి ఢంకా మ్రోగిస్తూ, భూమండలమంతా వినబడేటట్లు చాటుతాను !

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

5. సీ. హరిదాసులను నిందలాడకుండినఁ జాలుఁ
సకల గ్రంథమ్ములు చదివినట్లు
భిక్షమియ్యంగఁ దప్పింపకుండినఁ జాలుఁ
జేముట్టి దానంబు చేసినట్లు
మించి సజ్జనుల వంచింపకుండినఁ జాలుఁ
నింపుగా బహుమాన మిచ్చినట్లు
దేవాగ్రహారముల్ దీయకుండినఁ జాలు
గనకకంబపుగుళ్ళు గట్టినట్లు

తే.గీ. ఒకరి వర్షాశనము ముంచకున్నఁ జాలు
బేరు కీర్తిగ సత్రముల్ పెట్టినట్లు
భూషణవికాస! శ్రీధర్మపురి నివాస !
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

కవి పరిచయం
ఈ పద్యం కాకుత్థ్సం శేషప్ప కవిచే రచింపబడిన నరసింహ శతకం నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థము

భూషణవికాస = అలంకారాల చేత శోభిల్లేవాడా !
శ్రీ ధర్మపుర నివాస = ధర్మపురి క్షేత్రంలో వెలసినవాడా !
దుష్టసంహార = దుష్టులను సంహరించేవాడా !
దురితదూర = పాపాలను పోగొట్టేవాడా !
నరసింహా = నరసింహా
హరిదాసులను = విష్ణుభక్తులను
నిందలాడకుండిన + చాలు = నిందించకుండా ఉంటే చాలు
సకల గ్రంథాలను = అనేక గ్రంథాలను
చదివినట్లు = చదివినట్లే
భిక్షము + ఇయ్యంగ = భిక్షమిచ్చేవారిని
తప్పింపకుండినచాలు = ఆపకుంటేచాలు
చేముట్టిదానము = అది దానము
చేసినట్లే = చేసినట్లే
మించి = అతిసయించి, ఉప్పొంగి
సజ్జనుల = సజ్జనులను
వంచింపకుండిన = మోసం చేయకుండా ఉంటే
చాలు = చాలు
ఇంపుగా = చక్కగా
చాలు = చాలు
బహుమానమిచ్చినట్లు = బహుమతినిచ్చినట్లే
దేవ = దేవతా
అగ్రహారముల్ = మాన్యములను
తీయకుండిన = ఆక్రమించకుండా ఉంటే
చాలు = చాలు
కనకకంబపు = అది ధ్వజస్తంభంతో కూడిన
గుళ్ళు + కట్టినట్లు = గుళ్ళు కట్టించినట్లే
ఒకరి = ఇంకొకరి
వర్షాశనము = వర్షాసనం (ఒక ఏడాదికి సరిపడే భోజనాన్ని)
మంచుకున్న = పాడు చేయకుండునట్లైతే
చాలు = చేయకుంటేచాలు
పేరు = తన పేరుతో
కీర్తిగ = కీర్తితో
సత్రముల్ = సత్రాలు
పెట్టినట్లు = కట్టించినట్లే అవుతుంది

తాత్పర్యము
అలంకారాల చేత శోభిల్లేవాడా ! ధర్మపురి క్షేత్రంలో వెలసినవాడా ! దుష్టులను సంహరించేవాడా ! పాపాలను పోగొట్టేవాడా! నరసింహా ! విష్ణుభక్తులను నిందించకుండా ఉంటే చాలు, అనేక గ్రంథాలను చదివినట్లే. భిక్షమిచ్చేవారిని ఆపకుంటేచాలు, అది దానము చేసినట్లే. సజ్జనులను మోసం చేయకుండా ఉంటే చాలు, గొప్ప బహుమతినిచ్చినట్లే. దేవతా మాన్యములను ఆక్రమించకుండా ఉంటే చాలు, అది బంగారు ధ్వజ స్తంభంతో కూడిన గుడికట్టించినట్లే. ఇంకొకరి ‘వర్షా శనాన్ని’ (ఒక ఏడాదికి సరిపడే భోజనాన్ని) ముంచకుంటే చాలు, తన పేరుతో సత్రాలు కట్టించినట్లే అవుతుంది.

III

6. మ.
ఘనుడవ్వాడగు, వేడు త్యాగమయ దీక్షంబూని సర్వంసహా
జన ధైన్యస్థితి బోనడంచి సకలాశాపేశలానంద జీ
వన సంరంభము పెంచి, దేశజననీ ప్రాశస్త్యమున్ పంచునో
అనిదంపూర్వ యశస్వి యాతడగు నన్నా ! విశ్వనాథేశ్వరా !

కవి పరిచయం
ఈ పద్యము గుమ్మన్నగారి లక్ష్మీ నరసింహ శర్మచే రచింపబడిన విశ్వనాథేశ్వర శతకము నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థము

విశ్వనాథేశ్వరా ! = విశ్వనాథేశ్వరా !
వేడు = ఎవడు
త్యాగమయ = త్యాగంతో కూడిన
దీక్షన్ + పూని = దీక్షను పూని
సర్వంసహాజన = జనులందరి
దైన్యస్థితి + పోనడంచి = దీనస్థితిని రూపుమాపి
సకల = అందరికి (సమస్తమైన, అన్ని)
ఆశాపేశ = కోరికలతో అలంకరింపబడిన
ఆనంద = ఆనందకర
జీవన సంరంభము = జీవిత సుఖాన్ని
పెంచి = పెంచి
దేశ జననీ = మాతృదేశపు
ప్రాశస్త్యమున్ = గొప్పతనాన్ని
పంచునో = ఎవరయితే విశదపరుస్తారో
అవ్వాడు (అ+వాడు) = అటువంటివాడే
అనిందపూర్వ = నిందించుటకు వీలులేని
ఘనుడు + అగున్ = గొప్పవారవుతారు
యశస్వి + ఆతడగు = అపూర్వమైన కీర్తిమంతులవుతారు

తాత్పర్యము
విశ్వనాథేశ్వరా! త్యాగంతో కూడిన దీక్షను పూని జనులందరి దీనస్థితిని రూపుమాపి, అందరికి సుకుమారమైన, ఆనందకర జీవితసుఖాన్ని పంచి, మాతృదేశపు గొప్పతనాన్ని ఎవరయితే విశదపరుస్తారో వారే గొప్ప వారవుతారు. అపూర్వమైన కీర్తిమంతులు అవుతారు.

7. శా.
పొత్తంబై కడునేర్పుతో హితము నుద్బోధించు మిత్రుండు, సం
విత్తంబై యొక కార్యసాధనమునన్ వెల్గొందు మిత్రుండు, స్వా
యంబైన కృపాణమై యరుల నాహారించు మిత్రుండు, ప్రో
చ్చిత్తంబై సుఖమిచ్చు మిత్రుడు దగన్ శ్రీలొంకరామేశ్వరా !

కవి పరిచయం
ఈ పద్యం నంబి శ్రీధరరావుగారిచే రచింప బడిన శ్రీలొంక రామేశ్వర శతకము నుండి గ్రహించ బడినది.

ప్రతిపదార్థము (Mar. ’17)

శ్రీలొంకరామేశ్వరా ! = ఓ లొంకరామేశ్వరా !
మిత్రుండు = మిత్రుడైనవాడు
పొత్తంబు + ఐ = పుస్తకం మాదిరిగా
కడున్ = మిక్కిలి
నేర్పుతో = నేర్పుతో
హితమున్ = మంచిని
ఉద్బోధించు = బోధిస్తాడు
ఒక = ఒకానొక
కార్య = కార్య
సాధనమునన్ = సఫలతలో
మిత్రుండు = మిత్రుడైనవాడు
కార్య = కార్య
సాధనమునన్ = సఫలతతో
వెల్గొందు = విలువైన
సంవిత్తంబు + ఐ = ధనం వలె
వెల్గొందు = ఉపకరిస్తాడు
అరులన్ = శత్రు నాశనంలో
మిత్రుండు = మిత్రుడైనవాడు
స్వాయత్తంబు + ఐన = స్వాధీనమైన
కృపాణము + ఐ = కత్తి వలె
ప్రోచు = రక్షించెడు
తగన్ = తగినవిధంగా
ఆహారించు = సహాయపడతాడు
ప్రోచిత్తంబు + ఐ = నిండు మనస్సై
సుఖమిచ్చు = సుఖాన్నిస్తాడు.

తాత్పర్యము
ఓ లొంకరామేశ్వరా ! మిత్రుడైనవాడు పుస్తకం మాదిరిగా మిక్కిలి నేర్పుతో మంచిని బోధిస్తాడు. కార్య సఫలతలో విలువైన ధనం వలె ఉపకరిస్తాడు. శత్రు నాశనంలో స్వాధీనమైన కత్తివలె సహాయపడుతాడు. నిండు మనస్సై సుఖాన్నిస్తాడు.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

8. సీ. కలనైన సత్యంబు బలుకనొల్లనివాడు (June 2018)
మాయమాటల సొమ్ము దీయువాడు
కులగర్వమున పేద కొంపలార్చెడివాడు
లంచంబులకు వెల బెంచువాడు
చెడు ప్రవర్తనలందు జెలగి తిరుగువాడు
వరుసవానికి నీళ్ళు వదులువాడు
ముచ్చటాడుచు కొంప ముంచజూచెడివాడు
కన్నవారల గెంటుచున్నవాడు

గీ. పుడమిలో నరరూపుడై పుట్టియున్న
రాక్షసుడు గాక వేరౌన రామచంద్ర
కృపనిధీ ధరనాగరకుంటపారి
వేణుగోపాలకృష్ణ మద్వేల్పు శౌరి

కవి పరిచయం
ఈ పద్యము గడిగె భీమ కవిచే రచింప బడిన వేణుగోపాల శతకము నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్దము

“కృపనిధీ = దయకు నిధివంటివాడా !
రామచంద్ర = ఓ శ్రీ రామచంద్రా !
ధర నాగరకుంటపౌరి = నాగరకుంటపురమునందు కొలువైన వాడా !
వేణుగోపాలకృష్ణ = ఓ వేణుగోపాలకృష్ణా
మత్ + వేల్పు = నా దైవమా !
శౌరి ! = శ్రీ కృష్ణా !
కలన్ + ఐన = కలలో కూడా
సత్యంబున్ = సత్యాన్ని
పలుకన్ + = పలకడానికి
ఒల్లనివాడు = ఇష్టపడనివాడు
మాయమాటలు = మాయమాటలు చెప్పి
సొమ్మున్ = ఇతరుల సొమ్మును
తీయువాడు = అపహరించేవాడు
కులగర్వమున = కుల గర్వంతోటి
పేద = పేదవాండ్ల
కొంపల్ = ఇండ్లను
ఆర్చెడివాడు = నాశనం చేసేవాడు
లంచంబులకు = లంచాలకు
వెలన్ = విలువను
పెంచువాడు = పెంచేవాడు
చెడు ప్రవర్తనలందు = చెడు ప్రవర్తనతో
చెలగితిరుగువాడు = తిరిగేవాడు
వరుసవావికి = వావివరుసలను
నీళ్ళు వదలువాడు = పాటించనివాడు
ముచ్చటన్ + ఆడుచూ = నవ్వుతూ ముచ్చటాడుతూనే
కొంప = ఎదుటివాడిని
ముంచ = నాశనం
చూచెడివాడు = చేయాలనుకునేవాడు
కన్నవారల = తల్లిదండ్రులను
గెంటువాడు = ఇంటి నుంచి వెళ్ళగొట్టేవాడు
పుడమిలో = ఈ భూమిమీద
నరరూపుడై = మానవరూపంలో ఉన్న
పుట్టియున్న = పుట్టినట్టి
రాక్షసుడుగాక = రాక్షసుడుగాని
(వేరు + ఔన) వేరౌన = వేరొకరు గారు కదా !

తాత్పర్యము
దయకు నిధివంటివాడా ! శ్రీ రామచంద్రా ! నాగరకుంట పురమునందు కొలువైనవాడా! ఓ వేణు గోపాల- కృష్ణా ! నా దైవమా ! శ్రీ కృష్ణా ! కలలో కూడా సత్యాన్ని పలకడానికి ఇష్టపడనివాడు, మాయమాటలు చెప్పి ఇతరుల సొమ్మును అపహరించేవాడు, కులగర్వంతోటి పేదవాండ్ల ఇండ్లను నాశనం చేసేవాడు, లంచాలకు విలువను పెంచేవాడు, చెడు ప్రవర్తనతో తిరిగేవాడు, వావి వరుసలను పాటించనివాడు, నవ్వుతూ ముచ్చటాడుతూనే ఎదుటివాడిని నాశనం చేయాలనుకునేవాడు. తల్లి తండ్రులను ఇంటినుంచి వెళ్ళగొట్టేవాడు ఈ భూమిమీద మానవరూపంలో ఉన్న రాక్షసుడే.

పాఠం ఉద్దేశం

సమాజహితాన్ని కోరి కవులు శతక రచనలు చేశారు. సమాజంలోని పరిస్థితులను తెలుపుతూ మానవులలో నైతిక, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుటకు శతక కవులు కృషిచేశారు. అట్లాంటి వివిధ శతక పద్యాల్లోని విలువలను తెలియజేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతకాలలోని పద్యాలను ‘ముక్తకాలు’ అంటారు. ముక్తక పద్యం దేనికదే స్వతంత్ర భావంతో ఉంటుంది. శతకాల్లో మకుటం సాధారణంగా పద్యపాదం చివర ఉంటుంది. అయితే మకుట రహితంగా కూడా కొన్ని శతకాలు ఉన్నాయి. ఈ పాఠ్యభాగంలో సర్వేశ్వర, శ్రీకాళహస్తీశ్వర, మల్లభూపాలీయ, దాశరథి, నరసింహ, విశ్వనాథేశ్వర, లొంక రామేశ్వర, వేణుగోపాల శతకాల పద్యాలు ఉన్నాయి.

కవుల పరిచయం

1. కవి : యథావాక్కుల అన్నమయ్య
కాలం : 13వ శతాబ్దం
శైలి : ధారాళమైనది
శతకం పేరు : సర్వేశ్వర శతకం.
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 1

2. కవి : ధూర్జటి
కాలం : 16వ శతాబ్దం
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 2
ఇతర అంశాలు :
శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యమనే గ్రంథం రాశాడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాల్లో ఒకరు. రాజుల ఆస్థానంలో ఉండి కూడా “రాజుల్ మత్తులు, వారి సేవ నరకప్రాయం” అని చెప్పిన ధీశాలి.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

3. కవి : ఎలకూచి బాలసరస్వతి
కాలం : 17వ శతాబ్దం
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 3
ఇతర అంశాలు : నాగర్ కర్నూల్ జిల్లా జటప్రోలు సంస్థానాధీశుడైన సురభి మాధవ రాయల ఆస్థానకవి.

రచనలు :

  1. తెలుగులో మొదటి త్ర్యర్థి కావ్యం “రాఘవ యాదవ పాండ వీయం” ను రాశాడు.
  2. భర్తృహరి సంస్కృతంలో రాసిన “సుభాషిత త్రిశతి”ని తెలుగులో అనువదించిన తొలికవి.

విశేషాంశం : ఈయన రచన పాండిత్య స్ఫోరకంగా, ధారాళంగా ఉంటుంది.

4. కవి : కంచెర్ల గోపన్న
కాలం : 17వ శతాబ్దం
జన్మస్థలం : ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి
రచన : దాశరథి శతకం
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 4
ఇతర అంశాలు : భద్రాచలంలో శ్రీరామాలయాన్ని నిర్మించిన భక్తాగ్రేసరుడు. శ్రీరాముని పేర దాశరథి శతకాన్ని రాసాడు. ఎన్నో కీర్తనలు రచించాడు. అందమైన శబ్దాలంకారాలు ఈయన కవిత్వంలో
జాలువారాయి.

5. కవి : కాకుత్సం శేషప్ప కవి
కాలం : 18వ శతాబ్దం
జన్మస్థలం : జగిత్యాల జిల్లా, ధర్మపురి నివాసి
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 5
శతకం : నరహరి శతకంతోపాటు, నృకేసరి శతకం, ధర్మపురి రామాయణం (యక్షగానం) రాశాడు.
ఇతర అంశాలు : ఇతని రచనల్లో భక్తి తత్పరతతోపాటు తాత్త్వికచింతన, సామాజిక స్పృహ కనిపిస్తుంది. తెలంగాణ ప్రాంతంలోని జానపదులు కూడా నరసింహ శతక పద్యాలను పాడుకుంటారు.

6. కవి : గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ
కాలం : 1934 – 2011
జన్మస్థలం : సిద్ధిపేట జిల్లా, పోతారెడ్డి పేట
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 6
(1934-2011)
ఇతర అంశాలు : 300 పైగా అష్టావధానాలు చేసాడు. హిందోళ రాగంలో ఈయన పద్యపఠన విన్యాసం ప్రత్యేకమైనది.
బిరుదులు : అవధాని శశాంక, ఆశు కవితాకేసరి.
ఇతర రచనలు : కవితా కళ్యాణి, అవధాన సరస్వతి, వాగీశ్వరీస్తుతి, ఆద్యమాతృక, పద్యోద్యానము మొదలైనవి.

7. కవి : నంబి శ్రీధరరావు
కాలం : 1934 – 2000
జన్మస్థలం : నిజామాబాద్ జిల్లా, భీమ్ గల్ (వేముగల్లు) నివాసి
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 7
(1934-2000)
రచన : శ్రీలొంక రామేశ్వర శతకం
ఇతర రచనలు : శ్రీమన్నింబాచల మాహాత్మ్యము, శ్రీమన్నింబగిరి నరసింహశతకం
బిరుద : కవిరాజ

8. కవి : గడిగె భీమకవి
జననం : 14.1.1920
మరణం : 3.4.2010
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 8
(14-01-1920
03-04-2010)
రచన : వేణుగోపాల శతకం
జన్మస్థలం : రంగారెడ్డి జిల్లా, షాబాద్ మండలం, నాగరకుంట గ్రామం
ఇతర విషయాలు : వీధిబడి వరకు విద్యాభ్యాసం చేసిన ఈయనకు పద్యరచనలో నైపుణ్యం అబ్బడం విశేషం.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

ప్రవేశిక

మానవుల ప్రవర్తన ఎట్లా ఉండాలి ? ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి ? స్నేహితులు ఎట్లా ఉంటారు ? భగవంతుని గుణగణాలు, భక్తులతో ఎట్లా ఉండాలి ? కీర్తిమంతులు ఎవరు? మనుషుల్లోని రాక్షసగుణాలు ఏవి ? అని తెలుపుతూ వివిధ శతకకర్తలు రాసిన పద్యాలను పాఠం చదివి తెలుసుకోండి. వీటి ఆవశ్యకతను అర్థం చేసుకోండి. ఆచరించే ప్రయత్నం చేయండి.

విద్యార్థులకు సూచనలు

  • పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
  • పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత
    గీయండి.
  • వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పదవిజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకోండి.

ప్రక్రియ శతకం

ప్రాచీన తెలుగు సాహిత్య ప్రక్రియలలో ‘శతకం’ ఒకటి. ఇందులో వంద పద్యాలు ఉంటాయి. కొన్నింటిలో వందకు పైగా పద్యాలు ఉంటాయి. శతకాల్లో మకుటం ప్రధానంగా ఉంటుంది. కొన్ని శతకాల్లో మకుటం లేకుండా పద్యాలు ఉంటాయి. ఏ పద్యానికాపద్యమే స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటుంది. శతకాలు నీతి, ధర్మం, సత్యం, భక్తి, వైరాగ్యం మొదలైన విషయాలను బోధిస్తాయి. సుమతీ శతకం, వేమన శతకం మొదలైనవి శతక గ్రంథాలుగా పేర్కొనవచ్చు.

TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం

Telangana SCERT 10th Class Telugu Guide Telangana 6th Lesson భాగ్యోదయం Textbook Questions and Answers.

TS 10th Class Telugu 6th Lesson Questions and Answers Telangana భాగ్యోదయం

చదవండి – ఆలోచించి చెప్పండి (T.B. P.No. 56)

నవభారత రాజ్యాంగ నిర్మాత, చరిత్రకారుడు, జాతీయతావాది, తత్త్వశాస్త్రవేత్త, దళిత నాయకుడు డా॥ బి.ఆర్. అంబేద్కర్. దేశంలోని అస్పృశ్యతను నివారించడానికి, దళితుల అభ్యున్నతికి ఎంత గానో కృషి చేశాడు. నిమ్న వర్గాలలో ‘అందరిలాగ మనమూ అన్నీ చేయగలం’ అన్న ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం అతని లక్ష్యం. దేశప్రజలు అందరికీ సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని రూపొందించాడు. దేశ విదేశాలలో విద్యను అభ్యసించి ప్రపంచంలోనే మహామేధావిగా గుర్తింపు పొందాడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
పై పేరా ఎవరిని గురించి తెలుపుతున్నది?
జవాబు:
డా॥ బి.ఆర్. అంబేద్కర్ గురించి తెలుపుతున్నది.

ప్రశ్న 2.
ఆయన ఎవరి గురించి కృషి చేశాడు ? ఎందుకు ?
జవాబు:
నిమ్న వర్గాల గురించి కృషి చేశాడు. వారిలో ఆత్మ విశ్వాసాన్ని నెలకొల్పటానికి కృషిచేశాడు. వారు వెనుకబడి ఉన్నారు కాబట్టి.

TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం

ప్రశ్న 3.
మన రాష్ట్రంలో దళితులు, నిమ్నజాతుల వారి కోసం కృషి చేసిన వ్యక్తులు ఎవరు ? వాళ్ళ గురించి చెప్పండి.
జవాబు:
కృష్ణస్వామి ముదిరాజ్ : తన మిత్రుడు భాగ్యరెడ్డి వర్మతో కలిసి దళితుల అభ్యున్నతి కోసం కృషిచేశాడు. 1948లో ఉర్దూలో ‘హైదరాబాద్ – కి తీస్ సాలా సియాసి జదు జిహిద్’ పేరుతో హైదరాబాద్ లోని రాజకీయోద్యమాలపై గ్రంథాన్ని రాశాడు.

భాగ్యరెడ్డి వర్మ : దళితులు తమ పరిస్థితిని గుర్తించి హక్కుల కోసం పోరాడటానికి కృషి చేశారు. అలాగే దళితులను ‘అది ఆంధ్రులు’ గా పిలుచుకోవాలని, దళిత బాలికలను దేవదాసీలుగా, జోగినులుగా చేయడాన్ని వ్యతిరేకించెను.

జ్యోతిబాపూలే : 1848 వ సం||లో ‘అంటరాని’ కులాల బాలికల కోసం జ్యోతిబా ఒక పాఠశాల స్థాపించి సావిత్రిబాయికి శిక్షణనిచ్చి మొదటి మహిళా ఉపాధ్యాయినిగా చేశాడు.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No.59)

తన జాతి జనుల ………………..
అనుచరులలో కలిగేటట్టు చేయగలిగాడు.

ప్రశ్న 1.
కుల వ్యవస్థ వలన, సమాజంలో ఏం జరుగుతున్నది ?
జవాబు:
కుల వ్యవస్థ వలన ఒక వర్గం వారు అంటరాని వారిగా చూడబడ్డారు. ఒక వర్గం తక్కువ, మరో వర్గం ఎక్కువ అనే భావం ప్రజల్లో ఉండేది. సామాజిక, ఆర్థిక అసమానతలు చోటుచేసుకున్నాయి. కొన్ని కులాల వారు అణగారిన వర్గాలుగా దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నారు. కులవ్యవస్థ వలన సమాజానికి ఏమీ ఉపయోగం లేదు. ఒకరిపై ఒకరికి స్నేహభావం తగ్గుతోంది.

ప్రశ్న 2.
చిత్తశుద్ధి, నిజాయితీ అంటే మీకు ఏమి అర్థమయింది ?
జవాబు:
చిత్తము అంటే మనస్సు. కొంతమంది మనసులో ఇష్టం లేకపోయినా పది మంది మెప్పుకోసం మంచి పనులు చేస్తారు. పేదలకు సహాయం చేస్తారు. పూర్తిగా వారు బాగుపడాలంటే మనసులో ఆ భావాలు బలంగా ఉండాలి. మనసులో బలమైన సంకల్పం కలగాలి. ఆ విధంగా మనసులో బలమైన సంకల్పం కలగడమే చిత్తశుద్ధి అంటారు. అంటే మనసులోని వ్యతిరేక భావాలను తొలగించుకోవడమే చిత్తశుద్ధి అంటారు.

నిజాయితీ : నిజమును అనుసరించి ప్రవర్తించడం అంటే సత్యవర్తన కలిగి ఉండడం. చేసే పనిలో తన స్వార్థం చూసుకోకుండా ఉండడం, చేసే పనిని కచ్చితంగా చేయడం. ఎదురుగా ఒక విధంగా వెనుక ఒక విధంగా ప్రవర్తించకుండా ఉండడం. నిజాయితీగా చేసే ఏ పని అయినా సాధ్యమే.

ప్రశ్న 3.
అజ్ఞానం, ఉదాసీనత వలన నష్టాలేమిటి? చర్చించండి.
జవాబు:
జ్ఞానం అంటే తెలివి. ఒక విషయం గురించి పూర్తిగా తెలుసుకోవడం, ఏదైనా సమస్యను సులువుగా పరిష్కరించగల శక్తిని కూడా జ్ఞానం అంటారు. అజ్ఞానం అంటే సరిపడ తెలివిలేకపోవడం. ఒక సమస్య యొక్క మూల స్వభావాన్ని తెలుసుకోలేక పోవడం కూడా అజ్ఞానమే. అసలు దానిని సమస్యగా గుర్తించలేకపోవడం కూడా అజ్ఞానమే.

ఉదాసీనత అంటే దేనినీ పట్టించుకోకపోవడం. తమకు ఉపకారం జరుగుతున్నా, అపకారం జరుగు తున్నా పట్టించుకోకపోవడం, మంచికానీ, చెడుకానీ పట్టించుకోకపోవడం కూడా ఉదాసీనతే. తెలిసినా తెలియనట్లు ఉండడం కూడా ఉదాసీనతే.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No.59)

మనుషులంతా ……………… రాణిస్తారని నిరూపించాడు.

ప్రశ్న 1.
మూఢనమ్మకాలు అంటే మీకేం అర్థమయ్యింది ?
జవాబు:
శాస్త్రీయత లేకుండా గుడ్డిగా ఆచరించేవి అని అర్థం. అయితే పెరిగిన వాతావరణం, సంప్రదాయాలు, అజ్ఞానం వల్ల మూఢనమ్మకాలు మనిషిని పతనం (పడిపోయేటట్లు) చేస్తున్నాయి.
ఉదా : పిల్లి వస్తే వెనుకకు రావటం, విధవ (భర్త చనిపోయిన స్త్రీ) వస్తే వెనుకకు రావటం, తుమ్మితే ఆగిపోవటం మొదలగునవి.

ప్రశ్న 2.
వర్మ తన జాతి జనుల్లో ఏ విధమైన మార్పును తీసుకురాగలిగాడు ?
జవాబు:
మనుష్యులంతా పుట్టుకతో సమానమని, ఎవరూ ఎక్కువ ఎవరూ తక్కువ కాదన్న సత్యాన్ని తెలుసు కునేటట్లు చేశాడు. నమ్మకాల అజ్ఞానాన్ని తొలగించాడు. అంటరాని వర్గాలు చదువుకునేటట్లు ప్రోత్సహించాడు. తన జాతి జనుల్లో చైతన్యాన్ని తీసుకువచ్చాడు. దేవదాసి, ముర్లీ, వేశ్యా సంప్రదాయాలు అడ్డుకున్నాడు. నిమ్న వర్గాల్లో తాగుడు అలవాటును మాన్పించాడు.

TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం

ప్రశ్న 3.
మంచివక్త అని ఎవరిని అనవచ్చు ?
జవాబు:
ప్రతీ విషయాన్ని కూలంకషంగా (విస్తృతంగా, వివరంగా) చెప్పుట, తన అభిప్రాయాన్ని సశాస్త్రీయంగా నిరూపించుట, సమయం, సందర్భం పరిస్థితులనుబట్టి బాగా మాట్లాడేవాణ్ణి మంచి వక్త అని అనవచ్చును. అణగారిన వర్గాలలో చైతన్యాన్ని, సమాజాన్ని ప్రభావితం చెయ్యగలిగేటట్లు ప్రసంగించగలిగితే అతడిని మంచి వక్త అంటారు.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No.60)

ఆదిహిందువుల మేలుకోసం ……….. కాకుండా రక్షించగలిగాడు.

ప్రశ్న 1.
చదువుకోవడం వల్ల సమాజం ఏవిధంగా చైతన్యవంత మవుతుంది ?
జవాబు:
సొంతకాళ్ళ మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గం. మంచీ చెడు, కష్టం – సుఖం, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనేది, జ్ఞానం – అజ్ఞానం తెలియాలంటే తప్పనిసరిగా చైతన్యవంతమైన, జ్ఞానాత్మకమైన చదువును చదువుకోవల్సిందే. ఇంతకంటే వేరొక మార్గమే లేదు.

ప్రశ్న 2.
నాయకత్వ పటిమను ఏవిధంగా అంచనా వేయ వచ్చు?
జవాబు:
ఒక నాయకుడు, ఒక వ్యక్తి తను చెప్పిన అంశాలు ప్రజామోదం పొందినప్పుడు, అందరినీ మెప్పించ, గలిగినప్పుడు, అతని పలుకులే (మాటలే) శిరోధార్య మవుతాయి. దానినే నాయకత్వ పటిమ అని అంటారు. పైన చెప్పిన ప్రకారం ప్రజలలో నాయకునికి ఉన్న ఆదరణ బట్టే నాయకత్వ పటిమను మనం అంచనా వేయవచ్చు.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
నిమ్న వర్గాలలో భాగ్యరెడ్డి వర్మ తెచ్చిన మార్పులు చెప్పండి.
జవాబు:

  1. దళితుల అభ్యున్నతి కొరకు కృషి చేశాడు.
  2. అనేక బహిరంగ సభలు నిర్వహించాడు.
  3. సామాజిక స్వచ్ఛత గురించి చెప్పాడు.
  4. తనజాతి జనులను (నిమ్న వర్గాలను) ఏకతాటిపై నడిపాడు.
  5. దేవదాసి, ముర్లీ, వేశ్యా సంప్రదాయాలను అడ్డు కున్నారు.
  6. ఆడ, మగ పిల్లలను దేవునికి వదలివేయడాన్ని తీవ్రంగా నిరసించాడు.
  7. కులవ్యవస్థ నిర్మూలన కొరకు శ్రమించాడు.
  8. మనుషులంతా పుట్టుకతో సమానం అనే భావం కలిగించాడు.
  9. చదువుపై శ్రద్ధ కల్గించాడు.
  10. సాంఘిక దురాచారాలను నిర్మూలించాడు.

ఈ పై పనుల వల్ల నిమ్న వర్గాలలో సామాజిక భాగస్వామ్యం, స్వయంకృషి, ఆత్మవిశ్వాసం, నిస్వార్థసేవ వంటి మంచి విషయాలలో మార్పులు తీసుకువచ్చారు.

ప్రశ్న 2.
భాగ్యరెడ్డి వర్మ, అంబేద్కర్ ల మధ్య పోలికలను తెలుపండి.
జవాబు:
TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం 1
TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం 2

TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం

ప్రశ్న 3.
క్రింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

మహారాష్ట్రలో పుట్టిన జ్యోతిబాఫూలె బహు జనుల అభివృద్ధికి విశేషకృషి చేశాడు. దొరల దోపిడీ దౌర్జన్యాలను ధైర్యంతో ఎదుర్కొన్నాడు. పేదలందరికీ విద్య అందుబాటులోకి రావాలని ఉద్యమాలు చేశాడు. సత్యశోధక సమాజం ఏర్పాటుచేశాడు. బి.యస్. వెంకటరావు హైదరాబాద్లోని ఘాసండిలో పుట్టాడు.

హైదరాబాదు అంబేద్కర్గా ప్రసిద్ధిచెందాడు. హైదరాబాదులో అంబేద్కరిజానికి పాదులు తీసి, దారులు వేశాడు. సమరోత్సాహంతో దళిత ఉద్యమా లను నడిపిన ధీశాలి. హైదరాబాద్లో దేవదాసీ దురాచార నిర్మూలనకు, దళితులలో విద్యాభివృద్ధికి కృషి చేశాడు. 1926 లో ఆదిహిందూ మహాసభను స్థాపించాడు.

సరైన జవాబు గుర్తించి కుండలీకరణం (బ్రాకెట్)లో రాయండి.

అ) జ్యోతిబాఫూలె స్థాపించిన సమాజం పేరు ఏమిటి ?
అ) సత్యశోధక
ఆ) సమసమాజం
ఇ) నవసమాజం
జవాబు:
అ) సత్యశోధక

ఆ) పేదలందరికీ అందుబాటులోనికి రావలిసింది.
అ) డబ్బు
ఆ) చదువు
ఇ) న్యాయం
జవాబు:
ఆ) చదువు

ఇ) దేవదాసీ దురాచార నిర్మూలనకు కృషిచేసింది.
అ) జ్యోతిబాఫూలె
ఆ) అంబేద్కర్
ఇ) బి.ఎస్. వెంకటరావు
జవాబు:
ఇ) బి.ఎస్. వెంకటరావు

ఈ) ఆదిహిందూ మహాసభను స్థాపించిన సంవత్సరం
అ) 1936
ఆ) 1926
ఇ) 1916
జవాబు:
ఆ) 1926

II. వ్యక్తీకరణ సృజనాత్మకత

ప్రశ్న 1.
క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) చదువుకుంటే కలిగే లాభాలను తెలుపండి.
జవాబు:
విద్యలేనివాడు వింత పశువు అని పెద్దలు అంటారు. చదవటం, రాయడం లెక్కలు నేర్చుకోవడమే అక్షరాస్యత. చదువుకుంటే ఎవరిమీద ఆధారపడకుండా జీవితాన్ని సాగించవచ్చు.

  1. విద్య వల్ల మనకు జ్ఞానం కలుగుతుంది.
  2. మంచి కీర్తిని తెచ్చిపెడుతుంది.
  3. భోగములను ఇస్తుంది.
  4. దొంగలు దొంగిలించలేని విద్య సొంతమైతే అజ్ఞానాన్ని పోగొడుతుంది.
  5. సక్రమ మార్గంలో నడిపిస్తుంది.
  6. ఆర్థిక భద్రత, సామాజిక భద్రత కల్పిస్తుంది.
  7. విచక్షణా జ్ఞానం కలుగుతుంది. ఇంకా ఎన్నో, ఎన్నెన్నో లాభాలు ఉన్నాయి.

ఆ) అసమానతలు తొలగి సమానత్వం రావాలంటే ఏం జరగాలి ?
జవాబు:

  1. విద్యను నేర్చుకోవాలి / నేర్పాలి.
  2. నిమ్న వర్గాలు “అందరిలాగా మనము అన్నీ చేయగలం” అన్న ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి.
  3. దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలి.
  4. స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు విలసిల్లాలి (వెల్లివిరియాలి).
  5. జాతీయ జీవన స్రవంతిలో అందరూ కలవాలి. కులతత్వం, మతతత్వం, అంటరానితనం రూపు మాసిపోవాలి.
  6. మూఢనమ్మకాలను పారద్రోలాలి.

ఇవన్నీ సాధించితే అసమానతలు తొలగి సమానత్వం ఏర్పడుతుంది.

ఇ) అంకితభావంతో పనిచేయడం అంటే ఏమిటి ?
జవాబు:
ఒక లక్ష్యం కోసం దీక్షతో పనిచేయడాన్ని అంకిత భావంతో పనిచేయడం అంటారు. ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా లక్ష్యాన్ని విడిచి పెట్టకూడదు. లక్ష్య సాధన దిశగా మనపని మనం చేసుకుంటూ పోవాలి.

డా॥ బి.ఆర్. అంబేద్కర్. మహాత్మాగాంధీ లాంటి వారు అంకిత భావంతో కృషి చేయడం వల్లనే సమాజంలో ఎన్నో సంస్కరణలు చోటుచేసుకున్నాయి. సమాజాభివృద్ధిని కృషి చేయాలనుకునే నాయకులను అంకితభావం, చిత్తశుద్ధి, నిజాయితీ అవసరం.

ఈ) వ్యసనాల వలన ఎట్లాంటి నష్టాలు కలుగుతాయి ?
(లేదా)
దుర్వ్యసనాల వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి ?
జవాబు:
వ్యసనం అంటే అలవాటు. అది మంచి అలవాటు అయితే సద్వ్యసనం అంటారు. చెడు అలవాటైతే దుర్వ్యసనం అంటారు. సాధారణంగా ‘వ్యసనం’ అనే మాట “చెడు అలవాటు” అనే అర్థంలోనే ఉపయోగి స్తాము.

  1. మనిషి జీవనం పతనమవుతుంది.
  2. చెదపురుగు వృక్షాన్ని నాశనం చేసినట్లు వ్యసనాలు మనిషిని సమూలంగా నాశనం చేస్తాయి.
  3. ధర్మరాజు వ్యసనం వల్లనే కదా రాజ్యాన్ని పోగొట్టుకుంది.
  4. వ్యసనాల వల్ల మనిషి తన ఉనికిని కోల్పోతాడు.
  5. త్రాగుడు (మద్యపానం), జూదం, వ్యభిచారం, లంచ గొండితనం మొదలైనవి సమాజంలో వ్యసనాలుగా చెప్పవచ్చును.
  6. వ్యక్తి నాశనమే కాక సమాజానికి హాని జరుగుతుంది.
  7. సమాజంలో గౌరవ మర్యాదలను కోల్పోతాడు.

ప్రశ్న 2.
క్రింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) మీ చుట్టూ ఉన్న సమాజంలో నెలకొన్న మూఢ నమ్మకాలను పారదోలడానికి మీరు ఏం చేయగలరు?
(లేదా)
మీ పరిసరాల్లో మీకు కన్పించే మూఢనమ్మకాల నిర్మూలనకు ఎలాంటి చర్యలను తీసుకుంటారు ?
జవాబు:
మన చుట్టూ ఉన్న సమాజాన్ని అనేక మూఢనమ్మకాలు ప్రభావితం చేస్తున్నాయి. వాటిని పారద్రోలడానికి నేను చేసే పనులను వివరిస్తాను.

  1. ముందుగా నిరక్షరాస్యులకు విద్య నేర్పుతాను.
  2. వయోజనులకు మంచిగా నచ్చచెపుతాను.
  3. స్వచ్ఛత, స్వేచ్ఛ, సమానత్వం గురించి వివరించి చెపుతాను. అప్పటికీ మార్పు రాకపోతే సామాజిక సేవా కార్యకర్తలు, సంస్కర్తలచే చెప్పిస్తాను.
  4. మూఢనమ్మకాల వల్ల కలిగే నష్టాలను చిన్నచిన్న నాటికల ద్వారా మా వాడలో ప్రదర్శిస్తాను.
  5. మూఢనమ్మకాలను పారద్రోలటానికి, ర్యాలీలు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేయిస్తాను.
  6. మూఢనమ్మకాల వల్ల కలిగే నష్టాలను, కరపత్రాల ద్వారా మౌఖికంగా వివరిస్తాను.
  7. వయోజనులతో సత్సంబంధాలను కల్గి, వారికి నచ్చచెప్పి మూఢనమ్మకాలపై వారికి అవగాహన కల్పిస్తాను.
  8. నా మిత్ర బృందంతో కల్సి వారి జీవితాలలో మార్పు కొరకు కృషిచేస్తాను.

(లేదా)

ఆ) భాగ్యరెడ్డివర్మ ఆదిహిందువుల కోసం చేసిన కృషిని వివరించండి.
(లేదా)
ఆదిహిందువుల కోసం భాగ్యరెడ్డి వర్మ చేసిన కృషిని సొంత మాటల్లో వ్రాయండి.
జవాబు:
ఆదిహిందువుల మేలుకోసం వర్మ నిరంతరం చేపట్టిన కార్యాచరణ ఎంతోమంది ప్రముఖుల మనసులను చూరగొని వారు ఆదిహిందువులకు దగ్గరయ్యేలా చేసింది. భాగ్యరెడ్డివర్మ నిరంతర కార్యాచరణ సభల వలన ఆదిహిందూ సమాజం జాగరూకమయ్యింది. ఆది హిందువులు సొంతకాళ్ళ మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గమని వర్మ బలమయిన నమ్మకం. ఈ విషయంలో ఆయన ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తన బాధ్యతను గుర్తించేలా చేశాడు.

కృషి, పోరాటం ఫలితంగా ప్రభుత్వం ఆది హిందువుల కోసం ఎన్నో పాఠశాలలు నెలకొల్పింది. 1931 జనాభా లెక్కల సేకరణ సందర్భంగా వర్మ ఎంతగానో శ్రమపడి అంటరాని వర్గాలను ఆది హిందువులుగా నమోదు చేయించాడు. మానవులలలో ఎక్కువ, తక్కువలు లేవని ఆది హిందువులు తెలుసుకొనేలా చేశాడు.

3,348 ఉపన్యాసాలు ఇచ్చి ఆదిహిందువులను చైతన్య పరిచాడు. ఇది ఆయన నాయకత్వ పటిమకు మచ్చుతునక. హిందూ సమాజం మొత్తంగా ఆయనకు రుణపడి ఉండాలె. ఆ చర్యతో హిందూ సమాజాన్ని ఆయన చీలికలు, పేలికలు కాకుండా రక్షించగలిగాడు.

ప్రశ్న 3.
క్రింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

అ) భాగ్యరెడ్డి వర్మ గురించి తెలుసుకున్నారు కదా ! ఇట్లాగే సమాజం కోసం పాటుపడిన వాళ్ళలో ఎవరి గురించైనా “అభినందన” వ్యాసం రాయండి.
జవాబు:
మలాలా యూసుఫ్ జాయ్
మలాలా యూసుఫయ్ ఈ తరం బాలికల నూతన స్ఫూర్తికి ప్రతినిధి. మలాలా పాకిస్థాన్లోని స్వాత్ లోయ మింగోరా పట్టణంలో 12 జూలై, 1997లో జన్మించింది.

చిన్నప్పటి నుంచి చదువంటే చాలా ఆసక్తిగల మలాలాకు తమ ప్రాంతంలోని ప్రతికూల పరిస్థితులకు ఎదురు నిలిచి పోరాడింది. అక్కడి ప్రభుత్వంపై ఆధిపత్యం వహిస్తున్న తాలిబాన్ ఛాందసవాదులు బాలికలు పాఠశాలకు వెళ్ళడం, చదువుకోవడంపై నిషేధం విధించారు. మలాలా ఏ మాత్రం భయ పడకుండా చదువుకుంటూనే తన తోటి బాలికలకు చదువుపై ఆసక్తిని పెంచి పాఠశాలకు వెళ్ళేటట్లుగా ప్రోత్సహించింది.

దీంతో ఆగ్రహించిన తాలిబాన్లు మలాలాపై 9, అక్టోబర్ 2012 న కాల్పులు జరిపారు. ఆమె తీవ్రంగా గాయపడింది. ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా మలాలాపై సానుభూతి వెల్లువెత్తింది. అందరూ ఆమె కోలు కోవాలని కోరుకున్నారు.

ఆమె ప్రాణాపాయ స్థితి నుండి బయటికి వచ్చింది. మలాలా చైతన్యానికి, సాహసానికి, ఆత్మస్థైర్యానికి ముగ్ధులైన ఐక్యరాజ్య సమితి ఆమె జన్మదినాన్ని (జూలై 12ను) ‘మలాలా రోజు’ (Malala Day) గా ప్రకటించింది. ప్రతీ బాలిక చదువుకోవడం ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించింది. మలాలాను ‘ఇంటర్నేషనల్ చిల్డ్రన్ పీస్ ప్రైజ్’ కు నామినీగా స్వీకరించింది.

ఈ విధంగా తన ప్రాణాలను లెక్కచేయకుండా మలాలా యూసఫ్ జాయ్ ఎదుర్కొంది. ఇది నాకు స్ఫూర్తినిచ్చిన అంశం.

III. భాషాంశాలు

పదజాలం

1. క్రింది పదాలకు పర్యాయపదాలను రాయండి.

అ) అండ = ఆసరా, తోడు, ఆలంబనం, ఆశ్రయం
ఆ) ఉన్నతి = వికాసం, అభివృద్ధి, ప్రగతి, ప్రవృద్ధి, ఘనత
ఇ) స్వేచ్ఛ = స్వతంత్రత, సొంతం, అలవోక, విచ్చలవిడి
ఈ) వికాసం = వికసనము, తెలివి, అభివృద్ధి, ప్రగతి

TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం

2. క్రింది పదాలను ఉపయోగిస్తూ సొంతవాక్యాలు రాయండి.

అ) ఏకతాటిపై = ఒక మాటమీద నిలబెట్టడం
జవాబు:
గాంధీగారు స్వాతంత్య్ర పోరాటాన్ని ఏకతాటి పై నిలారు.

ఆ) మచ్చుతునక = ఉదాహరణ
జవాబు:
ఆమ్లవర్షాలు పడటం పర్యావరణం దెబ్బతినటానికి మచ్చుతునక.

ఇ) మహమ్మారి = వ్యాధి
జవాబు:
నేడు అవినీతి అనే మహమ్మారి ఎక్కువయింది.

ఈ) నిరంతరం = ఎల్లప్పుడు
జవాబు:
1) జీవన పోరాటం నిరంతరం జరుగుతూనే ఉంటుంది.
2) విద్యార్థులు నిరంతరం అధ్యయనంపై దృష్టిపెట్టాలి.

3. కింది పదాలు / పదబంధాలను వివరించి రాయండి.

అ) అంకితం కావడం = సమర్పించడం / లీనం కావడం
జవాబు:
ఒక పనిని శ్రద్ధగా చేయడం, ఇచ్చిన పనిని త్రికరణ శుద్ధిగా చేయడం అని అర్థం.
మహాత్మాగాంధీ జాతికి స్వాతంత్ర్యం కోసం అంకిత మయ్యారు.

ఆ) నైతిక మద్దతు = నీతికి ఓటు వేయడం, నీతిని సమర్థించడం
జవాబు:
ఒక మంచి పనికి నైతిక మద్దతు చాలా అవసరం. అది లేనిదే విజయం లభించదు.
మంచిచేసేవారికి / సంఘసంస్కర్తలకు నైతిక మద్దతు ఇవ్వాలి.

ఇ) చిత్తశుద్ధి = మనస్పూర్తిగా, మనస్సు దోషం లేకుండా
జవాబు:
“చిత్తశుద్ధి కల్గి చేసిన పుణ్యము వృథా కాదు” అని వేమన చెప్పాడు.
నేడు ఎక్కడచూసినా చిత్తశుద్ధి లేకుండా పనిని చేస్తున్నారు. తర్వాత బాధపడుతున్నారు. ఇది పనికిరాదు.

ఈ) సాంఘిక దురాచారాలు = సంఘమునందలి చెడ్డ ఆచారములు
జవాబు:
సాంఘిక దురాచారాలు ప్రగతికి ఆటంకం కల్గిస్తాయి. సమాజం అభివృద్ధి సాధించాలంటే తప్పనిసరిగా సాంఘిక దురాచారాలకు దూరంగా ఉండాలి.
సాంఘిక దురాచారాలను రూపుమాపటానికి ఎందరో సంస్కర్తలు నడుంబిగించారు.

ఉ) సొంతకాళ్ళపై నిలబడడం అంటే స్వతంత్ర భావనతో జీవించడం అని అర్థం.
జవాబు:
ఒకరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడరాదని భావం. శ్రమ పడకుండా డబ్బు సంపాదించటం నేడు సరదాగా మారింది. పరుల సొమ్ము పాము వంటిది. కాబట్టి తన కాళ్ళపై తను నిలబడి స్వతంత్రంగా జీవించడం అని దీని అర్థం.

TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం

వ్యాకరణాంశాలు

క్రింది వాక్యాలను పరిశీలించండి.

ప్రత్యక్ష కథనం :
అ)“అక్కా! ఆ చెరువు జూడు”.
ఆ)”నేను రాన్రా తమ్ముడు”.
ఇ) “పిల్లలూ ! రేపు బీర్పూరు జాతరకు వెళుతున్నాను”.
ఈ) “మేమూ వస్తాం సర్”.

పై వాక్యాలను పరిశీలించారు గదా !
పై వాక్యాలు నేను, మేము మొదలైనవారు చెబు తున్నట్లుగా ఉన్నాయి కదా !

ఇట్లా ఉత్తమపురుషలోని వాక్యాలు సాధారణంగా ప్రత్యక్షంగా చెపుతున్నట్లు ఉంటాయి. కాబట్టి ఇవి “ప్రత్యక్ష” కథనంలో ఉన్న వాక్యాలు. – ప్రత్యక్ష కథనానికి ఉద్ధరణ చిహ్నాలు (“ ” ఉండాలి. కింది ఉదాహరణలను పరిశీలించండి.

అ)“మనుషులంతా పుట్టుకతో సమానం, ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు” అన్నాడు. భాగ్యరెడ్డి వర్మ.
ఆ)రుద్రమదేవితో తల్లి నారాంబ “నువ్వు నేను మామూలు స్త్రీలం కాదు. నువ్వు పట్టమహిషివి, నేను భావిచక్రవర్తిని, మనకు కండ్లు మటుకే ఉండాలి. కాని కన్నీళ్ళు ఉండకూడదు” అన్నది.

పై ఉదాహరణలను పరిశీలిస్తే ప్రత్యక్ష కథనంలో రాసేటప్పుడు కింది నియమాలను గుర్తుంచు కోవాలని తెలుస్తున్నది.

  • ఒకరు చెప్పిన మాటలు / వాక్యాలను చెప్పింది చెప్పినట్లే రాయాలి.
  • ఆ మాటలకు / వాక్యాలకు ఉద్ధరణ చిహ్నాలు ఉండాలి.
  • ప్రథమపురుషలో ఉన్న పదాలు (అనగా తమను, తమ, తాను, తాము వంటి పదాలు) ఉత్తమ పురుషలోనికి నేను, మేముగా మారుతాయి.

పరోక్ష కథనం :

క్రింది వాక్యాలు చదువండి.

అ) హర్షవర్ధన్ తాను రానని హర్షిణితో అన్నాడు.
ఆ) ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లు చేస్తామని పిల్లలు అన్నారు.
ఇ) తనను క్షమించమని రాజు తన మిత్రునితో అన్నాడు. పైనున్న వాక్యాలు చదివారు కదా !

ఇవి సూటిగా వాళ్లే చెప్తునట్లుకాకుండా ! ఇంకొకళ్ళు చెప్తున్నట్లున్నాయి కదా !
ఇలాంటి వాక్యాలను “పరోక్ష కథనం” లో ఉన్న వాక్యాలు అంటారు. వీటిలో ఉద్ధరణ చిహ్నాలు ఉపయోగించవలసిన అవసరం లేదు.

క్రింది వాక్యాలను చదువండి. ఏం మార్పు జరిగిందో చెప్పండి.

అ)“నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను” అన్నాడు శ్రీనివాస్. (ప్రత్యక్ష కథనం)
ఆ) తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నానని శ్రీనివాస్ అన్నాడు.
(పరోక్ష కథనం)

మొదటి వాక్యంలో శ్రీనివాస్ మాటలకు ఉద్ధరణ చిహ్నాలు పెట్టారు.
రెండవ వాక్యంలో శ్రీనివాస్ మాటలను ఇంకొకరు చెప్పినట్లు రాశారు.
ఇందుకోసం ఉద్ధరణ చిహ్నాలు తీసేసి “అని” చేర్చి వాక్యం రాశారు.
మొదటిది ప్రత్యక్ష కథనం. రెండవది పరోక్ష కథనం.

పై ఉదాహరణల పరిశీలన ద్వారా పరోక్ష కథన వాక్యాలు రాసేటప్పుడు కింది నియమాలను గుర్తుంచుకోవాలని తెలుస్తున్నది.

పరోక్ష కథనంలో ఉద్ధరణ చిహ్నాలు తొలగించి “అని” చేరుస్తారు.
ఉత్తమ పురుష పదాలు నేను, మేము, నా, మా వంటివి. ప్రథమ పురుష పదాలుగా తాను, తాము, తన, తమ లుగా మారుతాయి.

పాఠంలోని పరోక్ష కథన వాక్యాలను గుర్తించండి. వాటిని ప్రత్యక్ష కథన వాక్యాలుగా మార్చండి.

1. పరోక్ష కథనం : తన జాతి జనులను ఏకతాటి పై నడుప గలనని ఆయన అన్నారు.
ప్రత్యక్ష కథనం: “నా జాతి జనులను ఏకతాటిపై నడుప గలను” అని ఆయన అన్నారు.

2. పరోక్ష కథనం : ఆది హిందువులు సొంతకాళ్ళ మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గమని భాగ్యరెడ్డి వర్మ అన్నారు.
ప్రత్యక్ష కథనం: “ఆది హిందువులు సొంతకాళ్ళ మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గము” అని భాగ్యరెడ్డి వర్మ అన్నారు.

ప్రాజెక్టు పని

బడుగు వర్గాల కోసం కృషిచేసిన జ్యోతిబాఫూలె, అంబేద్కర్, సావిత్రీబాయి ఫూలె జీవితాల్లోని ఏదైనా ముఖ్యమైన ఘట్టాన్ని మీ మాటల్లో రాయండి. నివేదిక రాసి తరగతిలో చదివి వినిపించండి.
జవాబు:
జ్యోతిబాఫూలె జీవితంలోని ముఖ్యమైన ఘటన :

ఒకరోజు రాత్రి ఇద్దరు మనుషులు జ్యోతిబాఫూలె చంపడానికి వచ్చారు. సావిత్రి బాఫూలె వాళ్ళకు, సేరీకి మధ్యలో నిలబడింది. ‘అన్నలారా – ఆగండి, దయచేసి వెళ్ళిపొండి’ అని వారిని భయంతో ప్రార్థించింది. వాళ్ళలో ఒకడు సావిత్రిపై గర్జించాడు. ‘మేం ఆగటానికి రాలేదు’. “అయితే మీరిక్కడకు ఎందుకొచ్చారు” అని అడిగాడు సేబీ నెమ్మదిగా. “కొందరు పెద్దలు నిన్ను చంపే కాంట్రాక్టు మాకిచ్చారు.

నువ్వు ఈ బడులు నడపటం, ఈ యవ్వారమంతా మానేస్తేగాని సంఘం బాగుపడదని వాళ్ళు చెప్పారు” అని వాళ్ళు అనగా తన చావు వాళ్ళకు లాభం అయితే చంపమని, బీదవాళ్ళకు సాయం చేయడమే తన జీవితాశయం అని సేరీ మెడవంచి చంపమని శాంతంగా చావుకు సిద్ధమయ్యాడు.
TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం 3
ఆ ఇద్దరు మనుషులు గొడ్డళ్ళు క్రింద పారేసి, సేరీ కాళ్ళమీద పడ్డారు. “మేం మిమ్మల్ని చంపం. మీరు మాకు తండ్రి లాంటివారు. ఇప్పుడే వెళ్ళి మమ్మల్ని పంపిన వాళ్ళని చంపివస్తాం” అని అనగానే సేరీ వాళ్ళను ఆపి వాళ్ళ ఆలోచన మారే దాకా వాళ్ళతో మాట్లాడాడు. ఆ ఇద్దరు హంతకుల పేర్లు దోండిరామ్, నామ్రేవ్ కుంబార్డే.

వాళ్ళు ఇద్దరూ రాత్రి బడిలో చేరారు. తర్వాత రోడే సేరీ బాడీగార్డుగా తయారయ్యాడు. కుంబార్ ‘వేదాచార్’ అనే పుస్తకం వ్రాసి ఫూలే దంపతులకు సహకరించాడు. చంపటానికి వచ్చిన వాళ్ళ హృదయం ఆ విధంగా పరివర్తన చెందిందంటే ఆ రోజుల్లో మనుషులు అలా ఆలోచించేవారని తెలుస్తోంది.

అంబేద్కర్ జీవితంలో ముఖ్యఘటన:

1931 రెండవ రౌండు టేబుల్ సమావేశం తర్వాత బ్రిటిషు ప్రభుత్వం కమ్యూనల్ అవార్డు ద్వారా హరిజనులకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించింది. కాని అంబేద్కర్ గాంధీజీ పూనా ఒడంబడి చేసుకొని ప్రత్యేక నియోజకవర్గాలకు బదులుగా కాంగ్రెస్ అభ్యర్థులను నిలిపేటట్లుగా అంగీకరింపచేశాడు. ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పరచటం సాధ్యం చేశారు.
అంబేద్కర్ సాంఘిక దురాచారాలకు లొంగక వాటిని ఎదిరిస్తూ జీవితమంతా ఏటికి ఎదురీదాడు.
TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం 4

విశేషాంశాలు

1. దేవదాసి : ఆలయాలలో నృత్యం చేస్తూ ఆలయ సేవకే అంకితమయిన వాళ్ళను దేవదాసీలుగా పిలిచేవాళ్ళు. ఈ దేవదాసి వ్యవస్థ చాళుక్యకాలంనుండే ఉన్నట్లు తెలుస్తున్నది. కాలక్రమంలో దేవదాసీలు చిన్న చూపుకు గురయినారు. అనేక ఉద్యమాలు నిరసనల కారణంగా ఈ వ్యవస్థ లేకుండపోయింది.

సూక్తి : మంచి సమాజం మనిషి శరీరం వంటిది. అందుకే శరీరమైనా, సమాజమైనా – అందులో ఏ ఒక్క భాగానికి బాధ కలిగినా, నివారణకు అందరూ నడుం బిగించాలి.
-వినోబాభావే

పదాలు – అర్థాలు

I

గమనం = ప్రయాణం
నిర్దేశించు = చూపు
అవస్థ = కాలకృతమైన స్థితి, సంకటం, దశ
గట్టెక్కడం = ఒడ్డుకు చేరడం (కష్టాలుతీరడం)
అంకితభావం = వేరే ఆలోచన లేకపోవడం
వికాసం = వికసించడం, ప్రకాశం
అణగారిన = అణచి వేయబడిన
చిత్తసుద్ది = చెప్పింది చేసే నిజాయితీ
నివసించు = తిరస్కరించు
ఏకతాటి పై = ఐక్యంగా
ఎరుక = తెలివి, జ్ఞానం
అవగతము = తెలియబడినది, పొందుట
కడగండ్లు = కష్టములు, విపత్తులు
ఉదాసీనత = నిర్లిప్తత
అండ = ఆసరా
మహమ్మారి = మశూచి, అమ్మతల్లి (ఓ పెద్ద అంటురోగం)

TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం

II

జీర్ణించుకుపోవడం = బాగా అర్థం కావడం
అజ్ఞానం = చీకటి
నిరంతరం = ఎల్లప్పుడు
మటుమాయం = కన్పించకుండా
ఏకతాటి = ఒకే మాటపై నిలబెట్టడం
స్వచ్ఛత = నిర్మలత్వం
దుర్భరం = భరింపరాని
మార్గదర్శి = మార్గమును చూపువాడు
ఆదిగా = మొదలుగా
కృషి = ప్రయత్నం

III

జాగరూకమయ్యింది = అప్రమత్తమయింది
నెలకొల్పుట = ఏర్పాటుచేయుట
పటిమ = నేర్పు, ఓపిక, బిగువు
మచ్చుతునక = ఉదాహరణ
మేలుకోసం = మంచికోసం
నమ్మకం = విశ్వాస

పాఠం ఉద్దేశం

స్వయంకృషి, ఆత్మవిశ్వాసం ఉంటే ప్రతి ఒక్కరూ ఏమైనా సాధించగలరు. అన్ని వర్గాల వాళ్ళలో సామాజిక భాగస్వామ్యం, చైతన్యం అవసరం. స్వార్ధం పెరిగిపోతున్న ప్రస్తుత సమాజంలో ఇతరుల గురించి ఆలోచించి, వాళ్ళ ప్రగతికి తోడ్పడే వ్యక్తులు అరుదు. అటువంటి వ్యక్తిత్వం నుండి స్ఫూర్తి పొందడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

భాగ్యరెడ్డివర్మ కుమారుడైన ఎం.బి. గౌతమ్ రచించిన ‘భాగ్యరెడ్డివర్మ జీవితచరిత్ర’ గ్రంథంలోని కృష్ణస్వామి ముదిరాజ్ రాసిన వ్యాసంలోనిది ఈ పాఠ్యభాగం.

రచయిత పరిచయం

రచయిత : కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్
జననం : 25.8.1893
మరణం : 15.12.1967
వృత్తి / ఇతర

అంశాలు : స్వాతంత్య్ర సమర యోధుడు, రచయిత, జర్నలిస్టు, విద్యాసంస్థల స్థాపకుడు, బహుజన సమాజ సంస్కర్త, విద్యావేత్త, హైదరాబాద్ మేయర్, ఆంధ్ర మహాసభ నిర్వాహకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి.

ఇతర రచనలు / పనులు :

  1. 1957 లో హైదరాబాద్ మేయర్గా “మాస్టర్గాన్” ను తయారుచేసిన దార్శనికుడు.
  2. దక్కన్లోర్లో సంపాదకీయాలు, వ్యాసాలు రాసారు.
  3. హైదరాబాద్ నగరంపై “పిక్టో రియల్ హైదరాబాద్” అనే అద్భుత గ్రంథాన్ని రాశారు.
  4. దళితుల అభ్యున్నతి కొరకు కృషి చేశాడు.
  5. 1948 లో ఉర్దూలో “హైదరాబాద్ – కి – తీస్ సాలాసియాసి జదు జిహిద్” పేరుతో రాజకీయోద్య మాలపై గ్రంథాన్ని రాశాడు.
  6. “భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర” రాసే సంఘంలో ప్యానల్ సభ్యుడిగా పనిచేశారు.

ప్రవేశిక

ఆయన అనేక బహిరంగ సభలు నిర్వహించాడు. సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి, తన జాతి జనులను ఏకతాటిపై నడుపగలిగాడు. ఆయన చేపట్టిన పనులలోకెల్లా మరపురానిది దేవదాసి, ముర్లీ, వేశ్యా సంప్రదాయాలను అడ్డుకోవడం. ఆడ, మగ పిల్లలను దేవునికి వదిలి వేయడాన్ని తీవ్రంగా నిరసించాడు. తాగుడును మానిపించాడు. ఈ విధంగా సామాజిక బాధ్యతను నెరవేర్చడానికి తన జీవితాన్నంతా ధారపోసే మహోన్నత వ్యక్తులు కొందరే ఉంటారు. ఆ కొందరిలోనూ ముందు వరుసలో ఉండే భాగ్యరెడ్డి వర్మ గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం కదా !

TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం

విద్యార్థులకు సూచనలు

  • పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
  • పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత గీయండి.
  • వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పదవిజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకొండి.

ప్రక్రియ – జీవిత చరిత్ర

ఈ పాఠ్యాంశం ‘జీవిత చరిత్ర’ ప్రక్రియకు చెందినది. విభిన్న రంగాలలో పనిచేస్తూ సమాజంమీద ప్రభావం చూపిన వ్యక్తుల విశిష్టతలను తెలుపుతూ రాసే గ్రంథమే ‘జీవిత చరిత్ర’.