TS 10th Class Telugu Grammar కరపత్రాలు

Telangana SCERT 10th Class Telugu Grammar Telangana కరపత్రాలు Questions and Answers.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 1.
మాతృభాష గొప్పదనాన్ని తెలియజేస్తూ కరపత్రం రాయండి. (June 2018)
జవాబు:
భాషాభిమానం
తెలుగు వెలుగు – నిండు నూరేళ్ళు

తల్లి నుండి బిడ్డ నేర్చుకొనెడి భాషే మాతృభాష. మానసిక భావపరంపరను వ్యక్తులు పరస్పరం తెలియజేసుకోవడానికి ఉపయోగించే సాధన భాష. మనందరి మాతృభాష తెలుగు. తెలుగు చాలా మధురమయిన భాష, తెలుగును “ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్” అంటారు. తెలుగులో అనేక జాతీయాలు, నుడికారాలు, సామెతలు, పదబంధాలు ఉన్నాయి.

తెలుగు భాష అభివృద్ధికై ఎందరో కవులు, రచయితలు కృషి చేశారు. విదేశీయులు సైతం మెచ్చుకునే భాష మన తెలుగు భాష, ఎందరో చక్రవర్తులు, రాజులు, జమిందార్లు అభిమానించి, ఆదరించిన భాష మన తెలుగు భాష.

కానీ ఎవరి ప్రాంతపు మాండలికమంటే వారికి మక్కువ. ఎవరి ప్రాంతపు యాస అంటే వారికి ప్రీతి. అందరి మాతృభాష ఒకటే అయినా ప్రాంతాన్ని బట్టి భాషలో యాస మారుతుంది. ప్రతీ తెలుగువాడు గర్వించదగ్గ భాష తెలుగు భాష అటువంటిది. మాతృభాష అభివృద్ధికి అందరం కృషి చేద్దాం.

దేశభాషలందు తెలుగు లెస్స.

తేది : XXXX

ఇట్లు,
మాతృభాషాభివృద్ధి సంఘం,
వరంగల్.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

OR

మాతృభాష గొప్పదనాన్ని తెలిపే కరపత్రము :

ప్రియమైన మాతృభాషా ప్రేమికులారా !

ఇద్దరు ఇంగ్లీషు వ్యక్తులు కలిస్తే ఇంగ్లీషులోనే మాట్లాడతారు. ఇద్దరు హిందీ మాతృభాషగా కలవారు అమెరికాలో కలిసినా సరే వారి సంభాషణ హిందీలోనే జరుగుతుంది. అలాగే తమిళులు తమిళంలోనే మాట్లాడడానికే మొగ్గు చూపిస్తారు. మరి మన తెలుగువారి దౌర్భాగ్యం ఏమిటో గాని ఇద్దరు తెలుగువాళ్ళు కలిస్తే తెలుగే రాదన్నట్టు ఇంగ్లీషులోనో, మరేదో భాషలోనో మాట్లాడడానికి ఇష్టపడతారు.

మాతృభాషలో సాగే విద్యాభ్యాసం మెట్ల మీద నుండి ఇంటి పైకి చేరినట్లుంటుంది. అదే పరాయి భాషలో సాగడం మెట్లు లేకుండా ఇంటి పై భాగానికి చేరడంలా ఉంటుందని, మాతృభాషలో విద్యాభ్యాసం కళ్ళ వంటిదని, పరాయి భాషలో అయితే కళ్ళజోడు వంటిదని ఎందరో పెద్దలు చెప్పారన్న సంగతి మరువద్దు.

మాతృభాష తల్లి పాలవంటిది. ఇతర భాషలు నేర్చుకోండి. కానీ మాతృభాషను మరువవద్దు. “తల్లికి తిండిపెట్టనివాడు పిన్నికి గాజులు వేయిస్తానన్నట్లు” ఉండవద్దు. ఎంత ఎత్తు ఎదిగినా మన మూలాలను మరువవద్దు. మాతృభాషను మృతభాషగా చేయకండి. భాష జీవిస్తేనే మనం జీవిస్తున్నట్లు అన్న మాట మరువకండి.

ప్రశ్న 2.
“అవయవదానం” గురించి తెల్పుతూ కరపత్రం రాయండి. (March 2018)
జవాబు:
అవయవదానం చేయండి

సోదర సోదరీమణులారా !

‘పరోపకారార్థమిదం శరీరమ్’ – అని ఆర్యోక్తి కాబట్టి ఇతరులకు ఉపకారం చేయుట కొరకే భగవంతుడు శరీరమిచ్చాడని గ్రహించాలి.

ఎంతోమంది మానవులు అనేక రకాలైన ప్రమాదాల్లో అవయవాలు పోగొట్టుకుంటుంటారు. అలా పోగొట్టుకుంటే శరీరంలో ఏ అవయవం లేకపోయినా జీవించడం కష్టం.

కళ్ళు, మూత్రపిండాలు, కాలేయం వంటి వాటిని దానమిచ్చి, మనచుట్టూ ఆయా అవయవాల లోపంతో బాధపడేవారిని ఆదుకోవడమే మానవ జన్మకు సార్థకత.

నేడు వైద్యరంగంలో మనిషి యొక్క ఒక అవయవం పాడయితే దాన్ని తొలగించి, ఇతరులు దానం చేసిన అవయవాలను అక్కడ అతికించి వారికి ప్రాణదానం చేస్తున్నారు. ఇప్పుడు నేత్రదానం, కిడ్నీల దానం, కాలేయము వగైరా అవయవాలు దానం చేస్తున్నారు.

ప్రమాదాలలో “బ్రెయిన్డెడ్” అయిన వారి అవయవాలను సేకరించి, వాటిని అవసరం ఉన్నవారికి అతుకు తున్నారు. మనిషికి ఒక మూత్రపిండం ఉంటే చాలు. కాబట్టి ప్రతివ్యక్తీ ఒక మూత్రపిండాన్ని దానం చేసి, అది అవసరమైన వారి ప్రాణాలు కాపాడాలి. మనం నేత్రదానం చేస్తే ఆ మనిషి మరణించినా అతని కళ్ళు శాశ్వతంగా నిలుస్తాయి. అలాగే కాళ్ళు, చేతులు మొదలైన అవయవాలు కూడా మరణానంతరం దానం చేయాలి.

ఈ విధంగా మానవులందరు తమ తమ అవయవాల్ని దానం చేస్తే కొంతమంది జీవితాల్లో వెలుగుల్ని నింపవచ్చు. ఇటువంటివారు రాబోయే తరాలవారికి స్ఫూర్తి ప్రదాతమవుతారు.

తేది : X X X X

ఇట్లు,
రాష్ట్ర యువజనసమితి,
సిరిసిల్ల.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 3.
‘సమాజంలోని మూఢనమ్మకాలను పారద్రోలడం’ అనే అంశంపై కరపత్రం తయారు చేయండి. (March 2016)
జవాబు:
‘మూఢనమ్మకాలను తరిమికొడదాం’

మన సమాజములో ఎంతో కాలంగా ఎన్నో దురాచారములు, మూఢనమ్మకాలు పాతుకు పోయాయి. వాటిని మనం గుడ్డిగా నమ్మి పాటిస్తూ వస్తున్నాము. రాజారామమోహనారయ్ు, ఈశ్వర చంద్ర విద్యాసాగర్, కందుకూరి వీరేశలింగము పంతులుగారు వంటి సంఘ సంస్కర్తలు, సతీ సహగమనము, భర్తపోయిన స్త్రీలకు అలంకారాలు తొలగించడం, వంటి దురాచారాల నిర్మూలనకు కృషిచేసి, విజయం సాధించారు. మన ఆంధ్ర దేశంలో కందుకూరి వీరేశలింగము పంతులుగారు విధవలకు తిరిగి వివాహాలు జరిపించారు. ఎన్నో మూఢాచారాలను వారు నిర్మూలించారు.

దెయ్యాలు లేవని, భూత వైద్యం అంతాదగా అని వారు నిరూపించారు. సంఘంలో దెయ్యాలు, చేతబడులు, శకునాలు, వంటి వాటిని నమ్ము తున్నారు. చేతబడులు చేశారని కొంత మందిని
చంపేస్తున్నారు. శకునం మంచిది కాదని, ఆ రోజు తిథి మంచిది కాదని, పనులు ఆపేస్తున్నారు. ఇవన్నీ మూఢాచారాలు.

దెయ్యాలు లేవు. భగవంతుడు సృష్టించిన రోజులు, తిథులు అన్నీ మంచివే. ఎవరు శకునం వచ్చినా, ఫర్వాలేదు. పిల్లి శకునం, వెధవ ముండ శకునం వంటి వాటిని పాటించనక్కరలేదు. అలాగే అంటరానితనాన్ని పాటించకూడదు.

దేవుడి దృష్టిలో అంతా సమానమే. మూఢ నమ్మకాలను తరిమికొట్టండి. మంచిని పాటించండి. పక్కవారిలో దైవాన్ని చూడండి. మతాలు అన్నీ మంచిని చెప్పేవే, నమ్మండి.

తేది : XXXX

ఇట్లు,
వరంగల్ జిల్లా,
విద్యార్థి సంఘం.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

OR

మూఢనమ్మకాలకు స్వస్తి పలుకుదాం

సోదర సోదరీమణులారా !

మానవ సమాజంలో అనేక దురాచారాలు, మూఢనమ్మకాలు అనాదిగా నెలకొనియున్నాయి. తర్వాతి తరాలవారు వాటిని గుడ్డిగా నమ్మారు. ఆ మూర్ఖత్వం నుండి ఆ మూఢత్వం నుండి ఇంకను జాగృతం కాని మానవసమాజం నేటికి కూడా మనకు కనిపిస్తుంది.

బాల్యవివాహాలు జరపడం, సతీసహగమనాలు, అంటరానితనం, కూకటివేళ్ళతో పేరుకునిపోయి ఉన్నాయి. ఇంకా దయ్యాలనీ, భూతాలనీ, చేతబడులనీ నేటికి మానవాళి విశ్వసిస్తూనే ఉన్నది. కొన్ని ప్రాంతాలలో అయితే క్షుద్రశక్తుల్ని వశం చేసుకొనుటకు నరబలులు ఇస్తూనే ఉన్నారు. ఇటువంటి మూఢాచారాన్ని నశింపచేయాలి.

ఈ ఆధునికయుగంలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రాజారామమోహనరాయలు, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి సంఘసంస్కర్తలు సతీసహగమనాన్ని మాన్పించారు. బాల్యవివాహాల్ని నిర్మూలించారు. వితంతు వివాహాల్ని పునరుద్ధరింపచేశారు.

శకునం మంచిది కాదని, ఆ రోజు తిథి మంచిది కాదని, పనులు చేయడం ఆపేస్తున్నారు. ఇటువంటి మూఢనమ్మకాల నుండి ప్రజల్ని జాగృతం చెయ్యాలి.

భగవంతుని సృష్టిలో అందరూ సమానమే. మూఢనమ్మకాల్ని తరిమికొట్టండి. సాటిమనిషిని మనిషిగా గుర్తించి, మానవత్వాన్ని పరిమళింపచెయ్యాలి. ఏ మతమైనా మానవత్వం ఒక్కటే. అని ఎలుగెత్తి చాటాలి.
తేది : x x x x x.

ఇట్లు,
నవయువత జాగృతి పరిషత్,
షాద్నగర్.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 4.
నీటిని ప్రతి చుక్క పొదుపుగా వాడుకోవాలని సూచిస్తూ కరపత్రం తయారు చేయండి.
జవాబు:
నీటి పొదుపు

మిత్రులారా! నీరు మనకు భగవంతుడిచ్చిన గొప్పవరము. ఆహారం లేకుండా అయినా ఉండగలమేమో కాని, నీరు లేకుండా త్రాగకుండా ఒక్కరోజు గడపలేము. పంచభూతాలలో నీరు ముఖ్యమైనది.

ఒకప్పుడు నీరు ప్రపంచంలో సమృద్ధిగా దొరొకేది. మంచి వర్షాలు కురిసి ఆ నీరు చెరువుల ద్వారా, కాలువల ద్వారా, నదుల ద్వారా, బావుల ద్వారా, ప్రజలకు లభించేది. ప్రపంచంలో జనాభా పెరిగింది. మానవుడికి నీటి పట్ల అశ్రద్ధ పెరిగింది. వాతావరణ కాలుష్యం వల్ల వర్షాలు తగ్గాయి. మానవుడి అవివేకంవల్ల చెరువులు, నదులు ఎండిపోతున్నాయి.

బోరుల వల్ల నేలలోని నీరు సైతం ఎండి పోతుంది. బోర్లు ఎండిపోయి త్రాగడానికి నీటిచుక్క లేక ప్రజలు వలసలు పోతున్నారు. దీనికి పరిష్కారం నీటిని పొదుపుగా వాడుకోవాలి. పొలాల్లో, ఇళ్ళల్లో ఇంకుడు గుంతలు తవ్వాలి.

కురిసిన ప్రతి వర్షపు నీటి బిందువు నేలలో ఇంకాలి. చెరువులు కలుషితం కాకుండా ప్రజలు చూసుకోవాలి. నీటిని మిక్కిలి పొదుపుగా వాడుకోవాలి. ప్రతి గ్రామములో చెరువులు, బావులు శుభ్రంగా ఉండాలి. చెరువులో నీరు పుష్కలంగా ఉంటే, గ్రామాలలోని బావులలో నీరు నిండుగా ఉంటుంది.

నదులు, ఏరులలో నీరు సముద్రంలోకి పోకుండా అడ్డుకట్టలు వేసి ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవాలి. బోరులు ఇష్టానుసారం వేయకూడదు. మొక్కలను విరివిగా పెంచి వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలి.

ప్రతి వ్యక్తి ఈ జలయజ్ఞంలో పాల్గొనాలి. పాల్గొందాము. సరేనా ? నీటిని పొదుపు చేసి మనల్ని మనము రక్షించుకుందాం.

తేది : 10.10.2016.

ఇట్లు,
తెలంగాణ జల సంరక్షణ సమితి.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 5.
స్వచ్ఛ భారత్లో ప్రతి వ్యక్తి పాల్గొనాలని ప్రబోధిస్తూ కరపత్రము తయారు చెయ్యండి.
జవాబు:
‘ఆరోగ్యమే మహాభాగ్యము’ అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. మన ఇల్లు, మనవీధి, మన గ్రామము, శుభ్రంగా స్వచ్ఛంగా ఉంటే, దేశమంతా స్వచ్ఛంగా ఉంటుంది. దేశమంతా స్వచ్ఛంగా ఉంటే దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ప్రజలకు వైద్యం ఖర్చులు తగ్గుతాయి.

ఒకనాడు గ్రామాలలో ఇల్లు, వాకిలి శుభ్రంగా తుడుచుకొని నీళ్ళు చల్లుకొని ముగ్గులు పెట్టుకొనేవారు. గ్రామాలలో అడుగుపెడితే ఆ పరిశుభ్ర వాతావరణానికి ముచ్చట వేసేది. శుభ్రమైన ఆ ఇళ్ళల్లో మహాలక్ష్మి సిరిసంపదలతో కొలువు తీరేది.

ఈనాడు గ్రామాలు, నగరాలు చెత్తకు, మురికి కాలువలకు నిలయమైపోయాయి. పందులు, పశువులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, వైద్యశాలలు, పాఠశాలలు, కళాశాలలు సైతం చెత్త కుప్పలతో కలుషిత వాతావరణంతో దుర్గంధమును వెదజల్లుతున్నాయి. అపరిశుభ్రమైన వైద్యశాలల్లో మందులు సేవించినా రోగాలు తగ్గవు.

కాబట్టి ప్రతి పౌరుడు తన ఇల్లు, తన గ్రామము, తన వాడ, తన నగరము పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ప్లాస్టిక్ వస్తువులు, సంచులు వాడరాదు. ఎవరికి వారు తమ ఇల్లు, వీధి శుభ్రం చేసుకొని ఆ చెత్తను పంచాయితీ మునిసిపల్ వారి బళ్ళకు అందించాలి. చెత్తను పోగుచేసి ప్రభుత్వము దానిని చేలకు ఎరువులుగా తయారు చేయాలి. చెత్త నుండి విద్యుచ్ఛక్తి తయారు చేయాలి.

‘స్వచ్ఛభారత్’ అని మన ప్రధాని ఇచ్చిన పిలుపును ప్రతివ్యక్తి అందుకొని, దేశాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యవంతంగా ఉంచే బాధ్యతను తీసుకోవాలి. ఇది ఒక మహా యజ్ఞం. ఈ యజ్ఞంలో ప్రతి భారతీయుడు పాల్గొనాలి. పాల్గొందాం.

‘జై స్వచ్ఛ భారత్’

తేది. 10.08.2018.

ఇట్లు,
స్వచ్ఛ భారత్ యువజన సంఘం,
నల్గొండ జిల్లా శాఖ.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 6.
‘వందేమాతరానికి వందేళ్ళు’ పూర్తయిన సందర్భాన్ని గుర్తుచేస్తూ ఒక కరపత్రాన్ని తయారు చేయండి.
జవాబు:
మన భారతదేశంలో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించిన మహా ఉద్యమం వందేమాతరానికి వందేళ్ళు పూర్తయిన సందర్భంగా 2005వ సంవత్సరంలో ఉత్సవాలు నిర్వహించాం. వందేమాతరం గీతం బంకించంద్ర చటర్జీ రచించిన ‘ఆనంద మఠం’ అనే నవలలోనిది. ఆ నవలలో సన్యాసుల తిరుగుబాటు సందర్భంలో ఈ గీతం ఉంది.

బ్రిటిష్వాళ్ళు దేశ ఐక్యతను చెడగొట్టే ప్రయత్నంలో భాగంగా బెంగాల్ రాష్ట్రాన్ని విభజించడానికి పూనుకున్నారు. దీనికి వ్యతిరేకంగా వందేమాతరం ఉద్యమం ప్రారంభమైంది. 1905లో బిపిన్ చంద్రపాల్ వంటి దేశభక్తులు దేశమంతటా సంచరించి, ప్రజలకు నాడు జరుగుతున్న విషయాలను విశదీకరించారు. దేశమంతటా ‘లాల్, బాల్, పాల్’త్రయాల ప్రసంగాల ఫలితంగా వందేమాతరం ఉద్యమం వ్యాపించింది.

దేశప్రజలలో ఐకమత్యకు ఎంతో ఉపకరించింది ఈ వందేమాతరం ఉద్యమం. మొదట బీజప్రాయం కాగా అది మొలకెత్తి మహావృక్షమై దేశమంతటా అలుముకున్నది. అదే మహాస్వాతంత్ర్యోద్యమమై మనకు 1947 ఆగస్ట్ 15న స్వాతంత్య్రం రావడానికి కారణభూతమైంది.

ఆనాటి జాతీయ స్ఫూర్తి, స్వాతంత్ర్య దీప్తిని దేశమంతటా వ్యాపింపచేసిన వందేమాతరం ఉద్యమాన్ని మనం గుర్తు చేసుకోవడానికి ఈ ఉత్సవం ఎంతో తోడ్పడుతుంది. చీలిపోతే కూలిపోతామనీ, కలిస్తేనే నిలుస్తామనీ ఈ ఉద్యమం మనకు చెబుతున్నది. ఈ స్ఫూర్తికి మనం తిరిగి ఈనాడు పొందడానికి వందేమాతరం ఉద్యమ శతసంవత్సరాల పండుగ తోడ్పడుతున్నది.

ఇట్లు,
X X X X X

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 7.
మీ పాఠశాలలో ఉండే సౌకర్యాలు, బోధన, ఇతర ప్రత్యేకతలు తెల్పుతూ, పాఠశాలలో పిల్లలను చేర్పించమని కోరుతూ, కరపత్రం తయారు చేయండి.
జవాబు:
సురక్షితం ! మా బడిలో చేర్పించండి! సలక్షణం!

మా పాఠశాలలో 2017 – 2018 సంవత్స రానికి అన్ని తరగతులకు అడ్మిషన్లు తెరవబడినాయి. నగరంలోనే మా పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. చూడండి ! మా ప్రత్యేకతలు.

బోధన : అనుభవజ్ఞులైన, సుశిక్షితులైన అధ్యాపకులచే బోధన, కేరళ ఉపాధ్యాయులచే ఇంగ్లీషు బోధన, వారాంత పరీక్షలు, సి.సి.ఇ. పద్ధతిలో బోధన.
సౌకర్యాలు : విశాలమైన తరగతిగదులు, విశాలమైన క్రీడా ప్రాంగణం, పచ్చని చెట్లతో కూడిన ప్రశాంత వాతావరణం.
ప్రత్యేకతలు : ఎలాంటి డొనేషన్లు లేవు, పాఠ్య పుస్తకాలు, యూనిఫాం ఉచితం. ప్రభుత్వ నిర్ణీత ఫీజులు, సంగీతం, క్రీడలు, వృత్తివిద్యలయందు ప్రత్యేక శిక్షణ. దూర ప్రాంతాల వారికి బస్సు సదుపాయం కలదు.

ఇట్లు,
యాజమాన్యం,
శ్రీ వివేకానంద ఉన్నత పాఠశాల,
నల్గొండ.

ప్రశ్న 8.
గ్రంథాలయాల ఆవశ్యకత, ప్రయోజనాలు, సంరక్షణ గురించి అవగాహన కల్పిస్తూ కరపత్రం తయారు చేయండి.
జవాబు:
చదవండి – విజ్ఞానం పొందండి

సమాజంలో గ్రంథాలయాల పాత్ర సమున్నతంగా ఉంది. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు. పరిశోధనలకు నిలయాలు. విద్యార్థుల బుద్ధి వికాసానికి సోపానాలు. తరతరాల భారతీయ సంస్కృతికి, సాహితీరసాస్వాదనానికి దేవాలయాలు.

మనం గ్రంథాలయాలకు వెళ్ళాలి. విజ్ఞాన గ్రంథాలను చదవాలి. గ్రంథాలయాల్లో విస్తృత పఠనం, మౌనపఠనం అలవడుతుంది. మనం ఈ గ్రంథాలయాలను రక్షించాలి. పతనం చెందుతున్న మన గ్రంథాలయాలను ఆదుకోవాలి. మనవంతు కృషిచేయాలి.

ఇట్లు,
గ్రంథాలయ సంరక్షణ కమిటీ,
కావలి.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 9.
‘చెట్టు – నీరు’ పథకం గురించి, ప్రజలందరూ దానిలో పాల్గొనాలని ప్రబోధిస్తూ కరపత్రం సిద్ధం చేయండి.
జవాబు:
‘చెట్టు – నీరు పథకం’

ఈనాడు దేశం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ‘నీరు’ యొక్క కొరత. మనకు పూర్వకాలంలో మహారాజులు, దాతలు గ్రామాల్లో చెరువులు త్రవ్వించి, వర్షం నీటిని దానిలో నిల్వ చేసి ప్రజలకు నీటి సదుపాయం కల్పించారు. దేశ విస్తీర్ణంలో మూడవ వంతు అడవులు ఉంటే మంచి వర్షాలు పడతాయి. ఇప్పుడు అడవుల విస్తీర్ణం తగ్గి పోయింది. దానితో వర్షాలు లేవు. దానితో నదులు నిండుగా ప్రవహించడం లేదు.

ఇప్పుడు రోడ్లు, ఇళ్ళు అన్నీ కాంక్రీట్ అయి పోయాయి. దానితో నీరు భూముల్లోకి ఇంకడం లేదు. అందువల్ల ప్రతి ఇంటివారు ఇంకుడు గుంటలు ఏర్పాటు చేయాలి. చెరువులను బాగా త్రవ్వించి నీరు నిలువ చేయాలి. చెరువులలో, కాలువల్లో నీరు నిండుగా ఉంటే భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయి.

ప్రతి ఒక్కరు ఖాళీ ప్రదేశాల్లో చెట్లు పెంచాలి. అందువల్ల వాతావరణం చల్లబడుతుంది. పరిశుభ్ర మవుతుంది. మంచి వర్షాలు పడతాయి. ప్రభుత్వం ఇందుకే చెట్టు – నీరు పథకం మొదలు పెట్టింది. దీనిలో ప్రజలంతా పాల్గొనాలి. తమ ఊరిలో చెరువు వారు బాగు చేసుకోవాలి. ప్రజలందరికీ నీరు పుష్కలంగా లభించేలా చూడాలి. నీటి వనరులను కలుషితం కాకుండా కాపాడుకోవాలి.

వృక్ష పరిరక్షణ సమితి,
హైదరాబాద్.

ప్రశ్న 10.
బహుళ ప్రయోజనాలను చేకూర్చే నదుల ప్రాముఖ్యం వివరిస్తూ, ఆ నదులు కాలుష్యం బారిన పడకుండా చూడటానికి ప్రజలను చైతన్యపరుస్తూ ఒక కరపత్రం తయారు చేయండి.
జవాబు:
నదులను కాపాడుకుందాం !

ప్రజలారా !

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎన్నో నదులతో భారతదేశం పవిత్రమవుతోంది. మన రాష్ట్రంలో గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, తుంగభద్ర మొదలైన నదులున్నాయి. నదులకూ మానవ జీవితానికి అవినాభావ సంబంధం ఉన్నది. నదుల మీద కడుతున్న ఆనకట్టలతో, నీటిని నిల్వచేసి వ్యవసాయానికి నీరు అందించుకోగలుగు తున్నాం.

నదుల్లో చేపల వంటి విలువైన జలసంపదను పెంచుకో గలుగుతున్నాం. విద్యుత్ను ఉత్పత్తి చేసుకో గలుగుతున్నాం.

కానీ మన స్వార్థంతో నేడు మనకు ప్రాణాధార మైన నదులను కలుషితం చేస్తున్నాం. పారిశ్రామిక వ్యర్థాలను నదుల్లోకి వదిలి నీటిని కలుషితం చేస్తున్నాం. ఇకపై పారిశ్రామిక వ్యర్థాలను నదుల్లోకి
కలపకుండా చూడాలి.

నదుల్లో మల, మూత్రాదులను వదిలి కలుషితం చేస్తున్నాం. మల, మూత్రాదులను నదుల్లో కలప కుండా రక్షణ చర్యలు చేపట్టాలి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి.

పశువులను, బట్టలను నదులలో కడగడం, ఉతకడం వంటి నదులను కలుషితం చేసే పనులను ఆపాలి.

ఇకనైనా చైతన్యవంతులమవుదాం. నదుల కాలుష్యాన్ని అరికడదాం.

రోగాల బారిన పడకుండా మనల్ని కాపాడు కుందాం.

ఇట్లు,
రోటరీక్లబ్,
భద్రాచలం.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 11.
అనేక వ్యాధులకు కారణమవుతున్న దోమల్ని నివారించడానికి తెలియజేస్తూ కరపత్రం తయారుచేయండి. (March 2017)
జవాబు:
దోమల నిర్మూలన

సోదర సోదరీమణులారా !

ఈరోజు మనగ్రామంలో దోమల బాధ ఎక్కువగా ఉంది. ఈ దోమల వల్ల మానవాళికి అనేక రకాలైన వ్యాధులు వస్తున్నాయి. కలరా, మలేరియా, టైఫాయిడ్ వ్యాధిని వ్యాప్తి చేసే దోమలెన్నో పుట్టుకువస్తున్నాయి. అంతేకాకుండా బోదకాలు వ్యాధిని కూడా వ్యాప్తిని చేసే దోమలు అనేక విధాలుగా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రజలందరు జాగ్రత్తలు పాటించినట్లైతే రోగాలపాలు కాకుండా ఉంటారు.

‘ఆరోగ్యమే మహాభాగ్య’మన్నారు పెద్దలు. కనుక ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. త్రాగునీటిని కాచి చల్లార పెట్టి త్రాగవలెను. మురికి కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి. ఫినాయిల్ను ఉపయోగించాలి. దోమలు నివసించే ప్రదేశాల్లో డి.డి.టి మందుల్ని వారానికి రెండుసార్లు ఉపయోగించాలి. చెత్తకుండీల్ని ప్రత్యేకంగా ఏర్పాటుచేసి అందులో చెత్తనుంచాలి. దానిని వారానికి రెండుసార్లు తగలబెట్టాలి.

రోడ్ల వెంట చెట్లను విరివిగా నాటాలి. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయకుండా తగు చర్యలు తీసుకోవలెను. పారిశుద్ధ్యం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. పరిసరాల పరిశుభ్రతతోనే మనందరి అభివృద్ధి ఉందని గ్రహించాలి. దీనికై అందరు ఉద్యమించాలి.

ఇట్లు,
ప్రాథమిక ఆరోగ్యకేంద్రం,
సిద్ధిపేట.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 12.
‘పచ్చని చెట్లు – ప్రగతికి మెట్లు’ అంటూ పర్యావరణ పరిరక్షణకు చెట్ల ఆవశ్యకతను వివరిస్తూ ఒక కరపత్రం రూపొందించండి. (March 2017)
జవాబు:
చెట్లు లేనిదే బ్రతుకు లేదు

సోదర సోదరీమణులారా !

“వృక్షో రక్షతి రక్షితః” – అని ఆర్యోక్తి. అనగా చెట్లను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అని అర్థం. భూగోళంలో మూడువంతులు నీరు, ఒక వంతు నేల మాత్రం కల్గి ఉంది. ఆ నేలలో సగభాగం అరణ్యాలు, కొండలు ఉన్నాయి. భూమి వేడెక్కకుండా ఉండాలంటే అరణ్యాలు ముఖ్యపాత్ర వహిస్తున్నాయి. అంతేకాక వర్షపాతాన్ని కూడా అధికంగా పెంచుతాయి.

మానవాళి తమ తమ శరీరంలో దిగువభాగం నుండి వదిలెడి దుర్గంధ వాయువుల్ని చెట్లు పీల్చుకుంటాయి.’ తర్వాత మానవాళి జీవించడానికి అవసరమైన ప్రాణవాయువునిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణకు సహకరిస్తున్నాయి. సూర్యుని వద్ద నుండి వెలువడే అతినీలలోహిత కిరణాలు భూమి చుట్టూ ఉన్న భూకక్ష్యను తాకి, మార్పు చెంది, ఆ తర్వాత చెట్లను తాకుతాయి. ఆ తర్వాత భూమి పైకి వస్తాయి. ఈ చెట్లు భూమి వెడెక్కకుండా రక్షిస్తాయి.

భూమిని రక్షించడంలో ముఖ్యపాత్ర వహిస్తున్న చెట్లను స్వార్థంతో అకారణంగా నరికివేస్తున్నాడు. ధనదాహంతో అడవుల్ని నశింపచేసి ఇళ్ళ నిర్మాణమంటూ ద్రోహం చేస్తున్నాడు. మానవాళిని రక్షించే చెట్లను నరకుట మానాలి. ప్రభుత్వాలు శాసనాలు చేసి చెట్లను రక్షించాలి. ప్రతి మానవుడు చెట్లను నాటి వాటి ఆవశ్యకతను గుర్తించాలి. “పచ్చని చెట్లు ప్రగతికి మెట్లను” అనే నినాదంతో రాబోయే భావితరాలవారికి ఇబ్బంది కలుగకుండా చెట్లను నాటి, వాటి పెరుగుదలకు దోహదపడాలి. అప్పుడే లోకకల్యాణం సిద్ధిస్తుంది. అనారోగ్యాల బారి నుండి మానవుడు రక్షింపబడతాడు.

ఇట్లు,
పర్యావరణ పరిరక్షణ సమితి,
భద్రాచలం.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 13.
నేటి కాలంలో “ఎంతోమంది వృద్ధుల్ని వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారు. ఇది సరికాదని తెలియజేస్తూ” ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:
‘తాతా · మామ్మ ముద్దు’ వృద్ధాశ్రమం వద్దు

సోదర సోదరీమణులారా !

అనాధి నుంచి మన భారతదేశం కుటుంబవ్యవస్థకు పెట్టింది పేరు. ఎన్నెన్నో కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలుగా ఖ్యాతిని పొందాయి. అమ్మమ్మ, తాతయ్య, అమ్మానాన్నలు, పిల్లలు ఇలా కలసి ఉండే అందమైన కుటుంబాలు మనవి. వీరంతా ఒకరికొకరు కలసిమెలసి పరస్పర సహాయ సహకారాలు చేసుకుంటూ జీవించేవారు. అన్ని విషయాల్లో ఐకమత్యంగా ఉండేవారు.

కాని నేడు మనదేశంలో ప్రతివ్యక్తికి స్వార్థం పెరిగిపోయింది. మనమనేభావన పోయింది. నాదన్న భావన పెరిగిపోయింది. నేను, నా భార్య, నా పిల్లలు అనే స్వార్థంతో పెద్దల్ని దూరంగా ఉంచుతున్నారు. వృద్ధుల విషయంలో శ్రద్ధపోయి విసుక్కుంటున్నారు. అసహించుకుంటున్నారు. నిరాదరణ పెరిగిపోయింది. పైగా ఇంట్లో ఉంచుకోకుండా వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారు.

ఈనాడు అనేకమంది వృద్ధులు నిరాదరణకు గురై, అనాథలుగా జీవిస్తున్నారు.

కనుక ఈనాటి బాలబాలికలే రేపటి భావిభారత పౌరులు కదా ! అందువల్ల దయను చూపిస్తూ వృద్ధుల్ని గౌరవించండి. ఆదరణతో ఆదుకొనండి. వారి అనుభవాల్ని తెలుసుకుని, నేటి విద్యార్థులంతా పాఠాలుగా స్వీకరించండి. ఉమ్మడి కుటుంబాలే ఈనాటి సమాజానికి వెన్నుముక వంటిదవుతుంది. మంచి ప్రపంచం ఏర్పడి, ఆరోగ్యవంతమైన వాతావరణం కల్గుతుంది. ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి.

తేది : xxxxx,

ఇట్లు,
వృద్ధజన సేవాసమితి,
హైదరాబాద్.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 14.
“నదుల ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ఒక కరపత్రం రూపొందించండి.
జవాబు:
నదుల్ని కాపాడుకుందాం !

మిత్రులారా !

మనదేశం వ్యవసాయిక దేశం. వ్యవసాయానికి ముఖ్యంగా కావలసింది నీరు. మనదేశంలో ఆసేతు హిమాలయ పర్యంతమూ అనేక నదులు కలవు. అందులో మన ఆంధ్రరాష్ట్రంలో గోదావరి, కృష్ణా, పెన్నా, తుంగభద్ర మున్నగు జీవ నదులున్నాయి. ఈ నదులకు మానవాళికి అవినాభావ సంబంధం కలదు.

ఈ నదులపై అనేక ఆనకట్టలు కట్టి, నీరును నిల్వచేసి, ఎగువ ప్రాంతాలకు ప్రవహింపచేసి వ్యవసాయానికి నీరందిస్తున్నారు. అంతేకాక జలసంపదను అభివృద్ధిని సాధిస్తున్నారు. మరియు నీటి నుండి విద్యుత్తును సృష్టించి వ్యవసాయానికి, పారిశ్రామిక రంగానికి ఉత్పత్తి చేస్తున్నారు.

కాని, మానవుడు స్వార్థంతో నేడు మనకు ప్రాణాధారమైన నదుల్ని కలుషితం చేస్తున్నారు. పారిశ్రామిక వ్యర్థాల్ని వదలి నీటిని కలుషితం చేస్తున్నారు. నగర, పట్టణాలందలి మురికినీటిని నదులలోకి వదలి కలుషితం చేస్తున్నారు. ఆ నీరే తాగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. నదులు కాలుష్యకోరల్లో చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకనైనా ప్రజలంతా చైతన్యవంతులవ్వాలి. రోగాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకుందాం.

తేది : x x x x x.

ఇట్లు,
జాతీయ విద్యార్థి సంఘం,
సికింద్రాబాద్.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 15.
“తెలుగు వారందరూ ఒక్కటే” అంటూ సోదరభావం కలిగేలా ఒక కరపత్రాన్ని తయారుచేయండి.
జవాబు:
తెలుగువారందరూ ఒక్కటే

సోదర సోదరీ మణులారా !

“తెలుగుజాతి మనది – నిండుగ వెలుగుజాతి మనది” – అని డా. సి. నారాయణరెడ్డి అన్నారు. ప్రాంతీయ భేదాలు మనల్ని మన మనసుల్ని కలుషితం చేస్తాయి. ప్రాంతాలు వేరైనా మనభాష తెలుగుభాషే. ఆంధ్రాయైనా, తెలంగాణయైనా, మనమంతా తెలుగువారం. ఆత్మీయతకు, అనురాగానికి పుట్టినిల్లు మన తెలుగునేల.

ప్రాంతాలు విడిపోయినా, సంస్కృతీ సంప్రదాయాల్లో, భాషా వ్యవహారాల్లో మనమంతా ఒక్కటే. ‘కలసి ఉంటే కలదు సుఖం’ అని పెద్దలు చెప్పుచున్నారు కదా ! మనమంతా మన మాతృభాషను గౌరవిద్దాం. ఆంధ్రభోజునిగా కీర్తిపొందిన శ్రీకృష్ణదేవరాయలు దక్షిణాపథాన్ని ఒకే గొడుగు క్రిందకు తీసుకొచ్చి మన ఆంధ్రదేశాన్ని పాలిస్తూ “దేశభాషలందు తెలుగు లెస్స” – అని పల్కాడు. మన తెలుగుదేశ గొప్పతనాన్ని ప్రపంచమంతా కొనియాడింది.

మనలో మనకు ఈర్ష్యా ద్వేషాలు; వైషమ్యాలు మున్నగునవి పతనానికి దారితీస్తాయే కాని అభివృద్ధిని సాధించలేవు. ఒక తల్లిబిడ్డల్లా విడిపోయినా కలసిమెలసి అందరం అభివృద్ధి పథంలో పయనిద్దాం. ప్రాంతీయవాదం జాతి సమైక్యతకు గొడ్డలిపెట్టు. మనమంతా ఒకే తల్లిబిడ్డల్లా, అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉందాం. మన తెలుగువారంతా ఒక్కటే అన్న నినాదాన్ని ప్రపంచమంతా చాటి చెప్పుదాం.

జై తెలుగుతల్లి

తేది : x x x x x.

ఇట్లు,
తెలుగు సాహితీ సమితి,
శంషాబాద్.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 16.
“స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాల్ని ఖండిస్తూ వారిని గౌరవించాలని తెలుపుతూ” ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:
స్త్రీలను గౌరవిద్దాం

సోదర సోదరీ మణులారా !

స్త్రీ తల్లిగా, చెల్లిగా, భార్యగా కుటుంబంలో పోషించే పాత్ర కదా ! ఆమె నిస్వార్థంగా సేవచేస్తూ మమతానుబంధాల్ని పంచుతూ జీవిస్తుంది.

అందుకే “యత్ర నార్యస్తు పూజ్యంతే, తత్సరమంతే దేవతాః” – అని ఆర్యోక్తి. అనగా ఎక్కడ స్త్రీలు పూజింపబడుతారో అక్కడ దేవతలు ఆనందిస్తారని స్త్రీ యొక్క గొప్పతనాన్ని ఆర్యులు గొప్పగా చెప్పారు.

ప్రాచీనకాలం నుంచి విజ్ఞానరంగంలో స్త్రీలు, పురుషునితో పోటీపడుతూనే ఉన్నారు. నేడు స్త్రీలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారు. చదువుల్లో పురుషునికంటే ముందంజ వేస్తున్నారు. సమాజంలో క్రియాశీలమైన స్త్రీలపై అత్యాచారాలు జరగడం సిగ్గుచేటు, స్త్రీని గౌరవించడం అనే మంచి సంప్రదాయం ఉన్న మనదేశానికి అవమానకరం.

క్షణికమైన ఆవేశంతో స్త్రీలపై అత్యాచారాలు చేయడం వల్ల మన జాతి నిర్మాతలైన సోదరీమణుల ఆత్మగౌరవం దెబ్బ తింటుంది. విలువైన ప్రాణాలు పోతున్నాయి. జాతికి పరువుపోతుంది. కనుక స్త్రీలను గౌరవిద్దాం ! వారి ఆత్మగౌరవానికి ఆటంకం కలిగించకుండా పురుషునితో సమానంగా ఆదరిద్దాం ! మహాకవి చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు “ముదితల్ నేర్వగలేని విద్య కలదే ముద్దార నేర్పించినన్” అని స్త్రీ యొక్క గొప్పతనాన్ని ఏనాడో విశ్లేషించి చెప్పాడు. స్త్రీల కున్న స్వేచ్ఛను రక్షించుదాం ! వారి హక్కుల్ని కాపాడుదాం !

తేది : X X X X,

ఇట్లు,
తెలంగాణ మహిళాసంఘం,
సికింద్రాబాద్.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 17.
“బాలకార్మిక వ్యవస్థను నిర్మూలిస్తూ” ఒక కరపత్రాన్ని తయారుచేయండి.
జవాబు:
బాలకార్మికుల్ని రక్షిద్దాం

మిత్రులారా !

“కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్లను, నిరక్షరాస్యత వల్లను, కరవు కాటకాల కారణంగా లక్షలాది పిల్లలు చిన్నవయస్సు లోనే కార్మికులుగా చేరుతున్నారు.” – అని అంతర్జాతీయ కార్మిక నిర్వహణ సంస్థ (IOL) తన సర్వేలో వెల్లడించింది. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా మన భారతదేశంలో బాలకార్మిక వ్యవస్థ ఉందని ఐ.ఓ.యల్ (IOL) తన సర్వేలో తెలియజేసింది. మనదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా బాలకార్మికులు ఉన్నారని ఆ నివేదికలో పేర్కొన్నారు.

భారతదేశంలో 9.9 కోట్లమంది బాలలు పాఠశాలలకు వెళ్ళడంలేదని, వీరంతా ఇళ్ళలోను, కర్మాగారాల్లోను, పొలాల్లోను పనిచేస్తున్నారని “గ్లోబల్ మార్చ్ ఎగనెస్ట్ లేబర్” అనే అంతర్జాతీయసంస్థ పేర్కొంది. బాలకార్మికుల కొరకు ప్రత్యేక పాఠశాలల్ని ఏర్పాటు చెయ్యాలి. వారు చదువకొనే అవకాశాన్ని కల్పించాలి.

మన రాష్ట్రంలో 16 లక్షలమంది బాలకార్మికులున్నారు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామనే ప్రభుత్వం పలు సందర్భాల్లో చేస్తున్న ప్రకటనలు కేవలం ప్రకటనలుగానే మిగిలిపోతున్నాయి.

కాబట్టి నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసి అది అమలు జరిగేట్లు చూడాలి. ప్రభుత్వం రూపొందించిన బాలకార్మిక నియంత్రణ చట్టం సరిగా అమలు అయ్యేటట్లు చూడాలి.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 18.
“వరకట్న సమస్యను నిర్మూలిస్తూ” ఒక కరపత్రాన్ని తయారుచేయండి.
జవాబు:
వరకట్నం నిర్మూలిద్దాం

సోదర సోదరీ మణులారా !

వివాహం అయిన తదుపరి పెళ్ళికూతుర్ని అత్తవారింటికి పంపుతూ కూతురు మీద ఉన్న ప్రేమతో తల్లిదండ్రులు అనేక కానుకలనిచ్చి పంపుతారు. రానురాను ఈ సంప్రదాయం భయంకరంగా రూపొందించుకుంది. అది ఒక పెద్ద సమస్యగా పరిణమించింది.

ఈ కట్నం అనే లాంఛనం తప్పనిసరిగా వరుడికిచ్చే పరిస్థితి నేడు నెలకొంది. ఆడపిల్లకు వివాహం చేయాలంటే కట్నకానుకలను ఇచ్చే స్తోమత లేక అనేకమంది అనేక రకాలుగా బాధపడుతున్నారు. వరకట్నం తీసుకోవడంగానీ, ఇవ్వడంగానీ నేరం అని చట్టం చెబుతున్నా పట్టించుకునేవాళ్ళు లేరు. ఈ చట్టాన్ని ఎవరు పాటించడం లేదు. చట్టాన్ని కాపాడవలసిన అధికారులే కట్నం తీసుకుంటున్నారు. వరకట్నం ఇస్తున్నారు. కంచే చేను మేస్తుంటే చేసేదేముంది ?

వరకట్న సమస్య నశించాలంటే ముందు పెద్దల్లో మార్పురావాలి. శాఖాంతర, కులాంతర ప్రేమ వివాహాల్ని ప్రోత్సహించాలి. యువతీ యువకులు కూడా ఆదర్శాలతో ఈ వరకట్న మనే దురాచారాన్ని రూపుమాపాలి. అబ్బాయికిచ్చినా, అమ్మాయికిచ్చినా రెండూ అక్రమమేనన్న ఆలోచన కలగాలి. నేడు ప్రచార, ప్రసార సాధనాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక వీటి ద్వారా ప్రచారం జరగాలి. వరకట్న సమస్యను రూపుమాపాలి.

ప్రశ్న 19.
“నిరుద్యోగ సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపెడుతూ” ఒక కరపత్రాన్ని తయారుచేయండి.
జవాబు:
నిరుద్యోగ సమస్య పారదోలుదాం !

మిత్రులారా !

ప్రస్తుత పరిస్థితుల్లో చదివిన వారందరూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎగబ్రాగటం వల్ల నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చింది. కులవృత్తులు చేయువారు కూడా ఉద్యోగాలకు పరుగులిడుతున్నారు. అవి రాని పరిస్థితి వల్ల కులవృత్తులందు తగిన నైపుణ్యాన్ని కోల్పోయారు.

నిరుద్యోగ సమస్య తీరాలంటే ప్రభుత్వాలు విద్యావిధానాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి. వృత్తి విద్యలకు, కులవృత్తులకు ప్రోత్సాహమియ్యాలి. లఘు పరిశ్రమల్ని, కుటీర పరిశ్రమల్ని ప్రోత్సహించాలి. అవసరమైతే బ్యాంకుల ద్వారా వారికి ఋణాల్ని ఇప్పించాలి. ఉపాధి అవకాశాల్ని మెరుగుపర్చాలి.

యువతీయువకులు ప్రభుత్వ ఉద్యోగాలకు పరుగు విడక స్వయం ఉపాధికై అన్వేషణ జరపాలి. స్వతంత్రంగా జీవించడానికి సంసిద్ధులు కావాలి. అంతేకాదు ఏ యువకుడైనా తన కాళ్ళపై తాను నిలబడిన తాను పదిమందికి దారి చూపిననాడు నిరుద్యోగ సమస్య నశించిపోతుంది.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 20.
“పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను గూర్చి ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:
పర్యావరణ పరిరక్షణ – మన ఆరోగ్యపు సంరక్షణ

మిత్రులారా !

మానవుడు భూమిపై నివసిస్తున్నాడు కదా ! అతడు తన పరిసర ప్రాంతాల్ని కలుషితం కాకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా మానవుడు చేయగలిగిననాడు పర్యావరణ పరిరక్షణకు సాకారం జరుగుతుంది.

పర్యావరణంలో భాగంగా జలకాలుష్యం మిక్కిలి భయంకరమైనది. రసాయనిక పదార్థాలు, పరిశ్రమల వల్ల విడుదలయ్యే వ్యర్థ పదార్థాలు సాగునీటిని, త్రాగునీటిని కాలుష్యం చేస్తున్నాయి. మురుగు నీటికి, త్రాగునీటికి తేడా లేకుండా పోయింది.

వాయు కాలుష్యం పారిశ్రామిక వ్యవస్థ వల్ల మితిమీరిపోతోంది. విషపూరితమైన గాలి పీల్చడం వల్ల మానవులకు అనేక వ్యాధులు సంక్రమించి మరణావస్థకు దారితీస్తున్నాయి.

యంత్రాల వల్ల, వాహనాల వల్ల ధ్వని కాలుష్యం పెరిగిపోతోంది. అణుశక్తి పరీక్షల వల్ల కూడా వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది. పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లను పెంచాలి. కలుషితమైన నీటిని శుభ్రం చేసి, ప్రత్యేక కాలువల ద్వారా మురుగును సముద్రంలోనికి వెళ్ళేటట్లు చూడాలి పరిశ్రమల వ్యవస్థ వల్ల గాలి కలుషితం కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.

పర్యావరణ వ్యవస్థలోని సమతౌల్యాన్ని కాపాడుకోవడానికి అందరూ కృషి చేయాలి.

ఇట్లు,
పర్యావరణ పరిరక్షణ సమితి,
వరంగల్.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 21.
“మానవాళి నీటిని ఎంతో జాగ్రత్తగా వాడవలసిన అవసరం ఉందని” తెలియజేస్తూ ఒక కరపత్రాన్ని విడుదల చెయ్యండి.
జవాబు:
నీటి రక్షకుడు – లోకరక్షకుడు

మిత్రులారా !

సకల చరాచర జీవరాసులకి నీరే ప్రాణాధారం. నీరులేనిదే ఏ జీవి జీవించలేదు. ప్రతిరోజూ దైనందిన జీవితంలో నీటి ప్రాముఖ్యత ఎంతో ఉంది. మానవులు, పశువులు, పక్షులు ఒకటేమిటి అనేక జీవరాశులు నీరులేనిదే జీవించలేవు. ఇంత ఆవశ్యకత ఉన్న నీటి లభ్యత క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఆనాటికానాటికి భూగర్భజలాలు అంతరించిపోతున్నాయి.

మానవాళికి ఆహారం కావాలంటే పంటలు పండాలంటే సాగునీరు అవసరం. కనుక భూగర్భజలాలు పెరిగితే పుష్కలంగా నీరు లభిస్తుంది.

భూమిపైన జనాభా నానాటికీ పెరిగిపోతుంది. ప్రస్తుతం ఉన్న నీరు భవిష్యత్తుకుపయోగపడదు. కనుక ప్రజలు నీటి ఆవశ్యకతను గ్రహించి విరివిగా చెట్లను పెంచాలి. కాలుష్య పొరల నుండి భూమిని కాపాడాలి. గాలి కాలుష్యం కాకుండా చూడాలి.

పరిశ్రమలు వదిలే వ్యర్థ పదార్థాల్ని శుద్ధిచేసి ప్రత్యేక కాలువల ద్వారా సముద్రంలోకి వదలాలి. చెట్లను నరకకుండా తగు చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. అడవుల్ని సంరక్షించాలి. అపుడే వర్షపాతం పెరిగి తద్వారా భూగర్భజలాలు పెరుగుతాయి. అంచేత సాగునీరు, త్రాగునీరు పుష్కలంగా భవిష్యత్తులో కొన్ని శతాబ్దాల వరకు లభిస్తుందనుటలో సందేహం లేదు.

ఇట్లు,
జల సంరక్షణ సమితి,
మెదక్.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 22.
నైతిక విలువలు – మనిషిని మహనీయునిగా మారుస్తాయి అంటూ ఒక కరపత్రాన్ని రూపొందించండి.
జవాబు:
ప్రియమైన మిత్రుడా !

ఎదుటివారిలో తప్పులు వెదకడం కన్నా వారి నుండి మంచిని స్వీకరించు. ఈ గుణం నీకు వారిలోని మంచిని తెలుసుకోవడానికి, నీలోని మంచితనం లోకానికి తెలియజేయడానికి తోడ్పడుతుంది. నీతిని పాటించే విలువలు నైతిక విలువలు. ఇవి సమాజాన్ని సన్మార్గంలో నడిపించడానికి తోడ్పడతాయి. ఈ విలువలు పాటించిన మహర్షులు, ప్రజా నాయకులు, దేశభక్తులు, దాతలు తరతరాలకు మార్గదర్శకులౌతారు. నైతిక విలువలతో సత్యం, ధర్మం, న్యాయం, మానవీయతలు ప్రకాశిస్తుంటాయి.

ఒక అగ్గిపుల్ల తాను మండిపోతూ ఇంకొకదానిని మండిస్తుంది. అట్లాగే నైతిక విలువలు లేని వ్యక్తి తాను నాశనమౌతూ, సమాజానికీ చెడునే చేస్తాడు. ఇది ఎలా అంటారా ? దుర్యోధనుడు ఎప్పుడూ పాండవులకు హాని చేద్దామా అని వారి లోపాలు వెతుకులాటలోనే జీవితాన్ని గడిపాడు. ఇక ధర్మరాజు అన్నివేళలా ధర్మం తప్పని ధర్మమూర్తిగా, తోటివారి పట్ల ప్రేమ మూర్తిగా కనిపిస్తాడు. ఎదుటివారి అవగుణాలు గణింపక, సుగుణాలను స్వీకరించి, తనను తాను తీర్చిదిద్దుకోవడానికే ప్రయత్నించాడు.

మన చరిత్రను పరిశీలిస్తే గురుకులాలలో దేవాలయాలలో నైతికవిలువలు ప్రబోధించే, పెంపొందించే కార్యక్రమాలు విరివిగా జరిగాయి. సాహిత్యం, కళలు ద్వారా సమాజంలో మార్పును తేవడానికి ఎందరో మహనీయులు తమ జీవితాలను ధారపోశారు.

ఇట్లు,
తెలంగాణ వైతాళిక సంఘం.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 23.
ఆడపిల్లల పట్ల, స్త్రీల పట్ల మనం ఎలా ప్రవర్తించాలో తెలిపే కరపత్రం తయారు చేయండి.
జవాబు:
ప్రియమైన సోదరులారా !

భారతీయ సంస్కృతి స్త్రీలకు గొప్ప స్థానాన్నిచ్చింది. ప్రతి స్త్రీలోనూ తల్లిని చూడమని చెబుతుంది మన సంస్కృతి. మన ప్రాచీన సాహిత్యం లోతులు చూస్తే ‘మాతృదేవోభవ’, ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ అని తల్లి వైభవాన్ని తెలుపుతాయి.

త్రిమూర్తులను తన పాతివ్రత్యంతో చంటిబిడ్డలుగా చేసి, వారికి జోలపాడిన మహనీయురాలు అనసూయ, యమధర్మరాజు పాశాన్ని ఎదిరించి, తన భర్త ప్రాణాన్ని రక్షించుకొన్న పవిత్రురాలు సావిత్రి; భగభగమండే అగ్నిగుండంలో కూడా పూలరాశిలో తిరిగినట్లు తిరిగి బయటకు వచ్చిన పతివ్రత సీత; భర్త కోసం సూర్యభగవానుని ఉదయించకుండా నిలిపిన పుణ్యస్త్రీ సుమతి. ఇలా ఎందరో భారతీయ స్త్రీలు తమ పాతివ్రత్యంతో ఈ నేలను పునీతం చేసారు. అటువంటి మాతృమూర్తుల పట్ల మనం ప్రవర్తించాల్సినది ఇట్లాగేనా ?

“యత్రనార్యస్తు పూజ్యంతే, రమయంతే తత్ర దేవతాః” అని మనుస్మృతిలో చెప్పబడింది. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని దీనర్థం. ఒక్కసారి మనం గతంలోకి వెళ్తే రామాయణంలో పరస్త్రీ వ్యామోహంతో రావణుడు తన వంశానికే చేటు తెచ్చుకొన్నాడు. భారతంలో దుర్యోధనుడు తల్లితో సమానమైన ద్రౌపదిని వివస్త్రను చేయడానికి పూనుకొని, చరిత్రహీనుడయ్యాడు. మనం పసితనంలో తడబడిన అడుగులు వేసాము. మనలో కొందరు పెరిగి పెద్దయి కూడా తప్పటడుగులు ఇంకా వేస్తూనే ఉన్నారు.

పుట్టిన బిడ్డకు తల్లి సాయం కావాలి. పెరిగిన తర్వాత అక్క, చెల్లి తనతో ఆడటానికి, ఆడిపించడానికి కావాలి. తర్వాత తన వంశం వృద్ధి చెందడానికి భార్య కావాలి. తన బిడ్డలకు తల్లి కావాలి. ఇలా ప్రతి మగవాడి జీవితంలో స్త్రీ లేకపోతే, ఆ మగవాడి జీవితం వెలుతురు లేని చీకటే అవుతుంది. “స్త్రీ సృష్టికి జీవగఱ్ఱ”. అటు స్త్రీల పట్ల, పసి బాలికల పట్ల అమానుషంగా ప్రవర్తించుట సరికాదు.

ఇట్లు,
తెలంగాణ స్త్రీ జాగృతి సంఘం.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 24.
“పల్లెటూర్లు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు” అన్న అంశంపై కరపత్రం తయారు చేయండి.
జవాబు:
ఓ అన్నలారా ! అక్కలారా !

ఒక దేశం సుభిక్షంగా ఉండాలంటే రెండు అంశాలను పరిగణనలోనికి తీసుకోవాలి. ఒకటి వ్యవసాయం, రెండు పరిశ్రమలు. వ్యవసాయంపై ఆధారపడినపుడు పల్లెటూళ్ళు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. అందుకే “పల్లెటూళ్ళే దేశానికి పట్టుకొమ్మలు” అన్నారు పెద్దలు.

ప్రకృతి అందచందాలకు భూతలస్వర్గం పల్లె. పచ్చని పొలాలతో, చక్కని పొదరిళ్ళ బారులతో, ప్రతి ఇంటిముందు పాడి పశువులతో పల్లెలు అలరారుతుంటాయి. మమతానురాగాలతో కూడిన పిలుపులతో, చక్కని అనుబంధాలతో సౌహార్థానికి ఐకమత్యానికి నిలయాలు పల్లెటూర్లు.

స్వచ్ఛమైన గాలి, నీరు, వెలుతురు దొరికే భూలోక స్వర్గం పల్లెటూరు. పల్లెప్రజలు ఎండనక, వాననక, పగలనక, రాత్రనక చెమటోడ్చి కష్టపడతారు. కష్టపడుతున్నామన్న బాధను మరచి చిరునవ్వులు చిందిస్తారు. పల్లె గీతాలతో నేల తల్లికి హారతులు పడతారు.

“జనాః పద్యంతే అత్ర జనపదః”, నియమేన వర్తంతే జనా అస్మిన్ ఇతి నీ పృత్” – అని అమరకోశంలో చెప్పబడింది. విద్య లేదేమో కాని వినయంలో ఎవరికీ తీసిపోరు జానపదులు. ఆర్థిక ఇబ్బందులు వస్తూ పోతుంటాయి. కానీ ముఖాలపై చిఱునవ్వు చెరగదు. కష్టం తెలిసినవారు, సుఖాలకై పరుగిడని వారు. సోమరితనం దరిచేరనివారు, ఇంకెవరు పల్లెటూరి వారే.

దేశానికి వెన్నెముక, అన్నదాత అయిన రైతు వ్యవసాయాన్ని ఒక తపస్సుగా భావిస్తాడు. పేదసాదలకు ఉన్నంతలో దానం చేసి తృప్తిగా జీవిస్తాడు. కులవృత్తులు, చేతివృత్తులు, చేనేత వృత్తులు వారును, ఒగ్గు కథలవారు, హరిదాసులు, తోలుబొమ్మలు ఆడించేవారు, పగటివేషగాళ్ళు, గంగిరెద్దులవాళ్ళు ఇలా ఎన్నో జానపదకళలకు ఆలవాలమై పల్లెటూళ్ళు శోభిస్తున్నాయి.

చక్కని పాడిపంటలతో అలరారే పల్లెటూళ్ళలోని ముంగిళ్ళు అందమైన ముగ్గులతో స్వాగతమంటూ ఆహ్వానిస్తాయి. కనువిందైన కట్టుబొట్టుతో పల్లెపడుచులు చిఱునవ్వులు చిందిస్తారు. ప్రశాంతతకు, ఆధ్యాత్మికతకు నిలయాలు ఇక్కడి దేవాలయాలు, స్వచ్ఛమైన కోనేరులు, చూడచక్కని పుష్పజాతులతో, పక్షి జాతులతో అలరారుతుంటాయి. ఇలాంటి పల్లెలను కాపాడాల్సిన బాధ్యత మనందరిది. చేయి చేయి కలుపుదాం పల్లెటూళ్ళను కాపాడదాం. “పల్లెటూళ్ళు బాగుంటేనే ప్రపంచమంతా బాగుంటుంది” అన్న కరుణశ్రీ మాటలు స్ఫూర్తిదాయకాలు.

ఇట్లు,
జనపద సంక్షేమ సంఘం.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 25.
నగరం, పల్లె దేని గొప్పదనం దానిదే అని తెలిపే కరపత్రం తయారు చేయండి.
జవాబు:
ఓ అమ్మలారా ! అయ్యలారా !

“నగరాల్లో వసతులెక్కువ, పల్లెలలో తక్కువ. నగరాల్లో ఖుషీ, జల్సాలు ఎక్కువ. పల్లెల్లో తక్కువ. అక్కడ ఉన్న ఆనందం ఇక్కడ ఉండదు” ఇలాంటి మాటలతో పల్లె, పట్టణం ఏది గొప్పదో తేల్చుకోలేకపోతున్నారా ? ఇదిగో ఇది చదవండి. మీకే అర్థమౌతుంది. మన ఆలోచనలే సరిగాలేక అటూ ఇటూ ఊగిసలాడుతున్నాయి. రెండూ గొప్పవే. వీటిలో కొన్ని సుఖాలు, కొన్ని ఇబ్బందులు అనేవి సహజం. ఇంక విషయంలోకి వెళితే –

“నగ సదృశాః ప్రసాదాదయో అత్ర సంతీ ఇతి నగరీ” అని అమరకోశంలో చెప్పబడింది. అంటే పర్వత సమానాలైన రాజగృహాలు మొదలగునవి దీని యందు కలవు అని అర్థం. ఎత్తైన భవన సముదాయాలు కలవని భావం. అంతేగాక “క్రీడార్థం నగాః పర్వతావా అత్ర సంతీ ఇతి నగరీ” అని కూడా అమరకోశం చెబుతోంది. విహారార్థమై వృక్షాలు, పర్వతాలు గాని దీనియందు కలవని అర్థం. ప్రస్తుతార్థంలో విహారకేంద్రాలు, ఎత్తైన ప్రదేశాలు కలవని గ్రహించాలి.

అన్ని విద్యలకు ఆటపట్లు నగరాలు. నవ్య సంప్రదాయాలకు, నూత్న ధోరణులకు, విలాసవంతమైన జీవనం, అనేక నాగరికతలతో కొత్త పాతల మేలు కలయికలతో భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిపాదిస్తాయి నగరాలు. ఇక్కడ ఒకరునొకరితో ధన శక్తిని, శ్రమ శక్తిని బదలాయింపు చేసుకొంటారు. ‘గుడ్డలు లేని వారికి గుడ్డలిచ్చి అవమానించడం ఎందుకు ? పని ఇవ్వండి. పని ద్వారా తన గుడ్డలకు కావాల్సిన డబ్బును తానే సంపాదించుకుంటాడు” అని గాంధీజీ అన్నట్లు నగరం అందరికీ ఎవరు చేయదగ్గ పనిని వారికి చూపిస్తుంది”.

ఇక పల్లె విషయానికొస్తే “జనాః పద్యంతే అత్రజనపదః”, “నియమేన వర్తంతే జనా అస్మిన్ ఇతి నీ పృత్” అని అమరుకం చెబుతోంది. నియమానుసారంగా ఎక్కడ జనులు నివసిస్తారో అవే జనపదాలని అర్థం. ప్రపంచీకరణ ప్రభావంతో నగరం శరవేగంగా తన రూపం మార్చుకుంటున్నది. తల్లి ఒడి ఒక జీవశక్తి. అలాంటి జీవశక్తి పల్లెసీమల్లో తొణికిసలాడుతుంది. పల్లెలు ప్రాచీన సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను ఇంకా పాటిస్తూనే ఉన్నాయి. విశ్రాంతి అనే తియ్యదనం, శ్రమ అనే చేదు నుండి లభిస్తుందనే సంగతి మరువనపుడు నగరమైనా, పల్లె అయినా ఒకటే.

ఇట్లు,
తెలంగాణ జనజాగృతి సంఘం.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 26.
మాతృభాష గొప్పదనాన్ని తెలిపే కరపత్రం తయారు చేయండి.
జవాబు:
తెలుగుభాష గొప్పదనం :

“దేశభాషలందు తెలుగులెస్స” అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. మన తెలుగుభాష, అజంత భాష. ఇది సంగీతానికి అనువైన భాష. అందుకే త్యాగరాజు వంటి తమిళులు సైతం తెలుగులోనే పాటలు రాశారు. “తెలుగు తేట, కన్నడ కస్తూరి, అరవమధ్వానం” అన్నారు. మన తెలుగు, తూర్పు ప్రాంతాన ఉన్న ఇటలీ భాష వంటిదని పాశ్చాత్యులు ప్రశంసించారు. (ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్)

ఎంతో తపస్సు చేసుకుంటే తప్ప ఆంధ్రత్వమూ, ఆంధ్రభాష లభింపవని అప్పయ్య దీక్షితుల వంటి తమిళపండితులు మెచ్చుకున్నారు. జన్మజన్మల తపస్సు యొక్క ఫలితము, తెలుగువారిగా జన్మించడం అని రాయప్రోలువారు అన్నారు.

మన తెలుగు కమ్మని భాష, తెలుగు పద్యము తెలుగువారి ఆస్తి. తెలుగులోని యతి ప్రాసలు పద్యానికి వాద్య సహకారం అందించి, గానకచేరి చేస్తాయి. తెలుగు కవులలో కవిత్రయం, శ్రీనాధ పోతనలు, అష్టదిగ్గజ కవులు గొప్పవారు. మన తెలుగు మందార మకరంద సదృశమైన భాష. తేనెవంటిది తెలుగుభాష. తెలుగుభాష అష్టావధానాలకు అనుకూలమైనది.

వెయ్యేళ్ళ చరిత్ర ఉన్న తెలుగుభాషను ప్రాచీన భాషగా గుర్తింపు పొందడమే ఆలస్యం. ఇంకా తెలుగుభాషకు గల ప్రత్యేకత – మనం ఏ అక్షరాలు పలుకుతామో అవే వ్రాస్తాం. ఏవి వ్రాస్తామో అవే పలుకుతాం. ఈ ప్రత్యేకత భారతదేశంలోని భాషలలో ఒక్క సంస్కృతం, తెలుగు భాషలకే ఉంది. కూతకు, రాతకు తెలుగులో తేడా లేదు. మిగిలిన భాషలలో కొంత తేడా ఉంది. తెలుగులో అనేక జాతీయాలు, సామెతలు, పదబంధాలు ఉన్నాయి.

ఇట్లు,
తెలుగుభాషాభివృద్ధి సంఘం.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 27.
‘తెలంగాణ తల్లి’ వైభవాన్ని వివరిస్తూ కరపత్రం తయారు చేయండి.
జవాబు:
తెలంగాణ తల్లి ముద్దుబిడ్డలారా !

“నా తెలంగాణ కోటి రత్నాల వీణ” అన్న దాశరథి కృష్ణమాచార్యుల పలుకులు అక్షరసత్యం. కాకతీయుల కదనరంగం తెలంగాణ. ఆ వీరుల వారసత్వాన్ని అందిపుచ్చుకున్న తరువాతి తరాలవారు నిజాం పాలనను తరిమికొట్టారు. కళలకు మూలస్తంభం తెలంగాణ. పోతన, దాశరథి, సి.నా.రె వంటి వారు గొప్ప కవిత్వాన్ని ఈ నేలలో పండించారు.

రామప్పగుడి, కాకతీయశిల్పం, చార్మినార్ వంటి అపురూప కట్టడాలతో ఈ నేల విరాజిల్లుతోంది. భద్రాద్రి, యాదాద్రి, మెదక్ చర్చి, ఎన్నో ప్రాచీన దర్గాలతో సర్వమత సమానత్వాన్ని చాటుతోంది. అన్ని సంస్కృతులకూ సంగమమైన భాగ్యనగరం భారతదేశంలోనే గొప్ప నగరాలలో తలమానికంగా ఉంది. గాయకులు, నాట్యకళావంతులకు ఈ గడ్డ పెట్టింది పేరు. రామదాసాది భక్తాగ్రగణ్యులు, వాగ్గేయకారులుగా వెలుగొందారు. గోలకొండ కోట మన ఘనచరిత్రకు తార్కాణం.

ఈ నేల స్వాతంత్ర్యానికై ఎందరో వీరులు చూపిన త్యాగనిరతి వారి బలిదానం చరిత్రను తట్టిలేపింది. యావత్ భారతాన్నీ కదిలించింది. ఎందరో కవులు ఈ నేలతల్లి ఋణం తీర్చుకోవడానికి అక్షరానికి ఆవేశాన్ని తొడిగి అభ్యుదయ మార్గంలో తమ కవిత్వాన్ని నడిపారు. ఆ కవుల కలాలు వరద గోదావరిలా, ఆవేశంతో, వీరరసోద్రేకంతో, తెలంగాణ మాతృ సంకీర్తనతో, రసవంతంగా సాగాయి. గోదావరి, కృష్ణమ్మ వంటి గంగా ప్రవాహాలు ఈ నేల తల్లి ఒడిలో ప్రవహిస్తూ, సస్యశ్యామలం చేస్తున్నాయి. ఈ తెలంగాణ ముద్దుబిడ్డలు ప్రేమమూర్తులు. సహనశీలురు.

విప్లవ వీరులకు, యోధులకు, కళలకు, ఘన సంస్కృతికి, అపురూప నిర్మాణాలకు, పుణ్యక్షేత్రాలకు, తీర్థాలకు నిలయమైన తెలంగాణ ఘనతను కాపాడాల్సిన బాధ్యత మనందరిది. మన చరిత్రను కీర్తించండి. ప్రగతి కాముకులై మన భాగ్య నగరాన్ని విశ్వనగరంగా, మన రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కండి. మీకు విజయోస్తు.

ఇట్లు,
తెలంగాణ అభ్యుదయ సంఘం.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 28.
‘సమాజ సేవ చేయడం మనందరి కర్తవ్యం’ అని కరపత్రం రాయండి.
జవాబు:
కొందరు ఏ పని చేసినా దీంట్లో నాకేం లాభం ? అని ఆలోచిస్తారు. ‘నాదంతా దాచుకోవాల’ను కొనేవారు కొందరైతే, “దొరికినంత దోచుకోవాలనుకొనేవారు” మరికొందరు. కాని నిస్వార్థంగా, నిజాయితీగా తన సంపదను, జ్ఞాన సంపదను సమాజాభివృద్ధికి సమర్పణ చేసే త్యాగధనులు కొందరే.

ఎవరెట్లాపోతే నాకేంటి నేను బాగుంటే చాలనుకొనేవాడు అధముడు. ముందు నేను బాగుండాలి, తర్వాత సమాజం బాగుండాలనుకొనేవాడు మధ్యముడు. నేనెట్లా ఉన్నా ఫర్వాలేదు, ముందు సమాజం బాగుండాలి అనుకొనేవాడు ఉత్తముడు. ఉత్తమ భావాలతో ప్రజలను, దేశాన్ని ముందుకు నడిపించేవాడే ఉత్తమోత్తముడు. “దైవం మానుషరూపేణా” అన్నారు. దైవం ఎక్కడోలేడు. అనాథలను, అభాగ్యులను, బాల, వృద్ధ, వ్యాధిగ్రస్తులను ఎవరైతే ఆపన్నహస్తంతో ఆదుకుంటారో అదిగో ! వారే దైవస్వరూపులు.

సమాజం అంటే ఒక్కరు కాదు, అందరు. అందుకే అరిస్టాటిల్ ‘మనిషి సంఘజీవి’ అన్నారు. నేను బాగుండాలి అనుకొనేదానికన్నా మనం బాగుండాలి అనుకోవడంలో మనిషిలోని మానవత్వం ప్రకాశిస్తుంది. ఈ మానవీయ విలువలను పాటించటం వలన జాతీయ సమైక్యత వర్ధిల్లుతుంది.

ఇట్లు,
తెలంగాణ జనజాగృతి సంఘం.

ప్రశ్న 29.
సంపాదకీయాల ప్రాధాన్యతను తెలిపే కరపత్రం రాయండి.
జవాబు:
ఒక్క సిరా చుక్క – లక్ష మెదళ్ళలో కదలిక

సమాజంలోని అన్ని విషయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించేవి పత్రికలు. ఆ వార్తలను పరిశీలించి ముద్రణకు అనుమతించే అధికారం కలిగినవారు సంపాదకుడు. “ఎడిటర్” అనే ఆంగ్ల పదానికి “సంపాదకుడు” అనే తెలుగు పదం అందించినది ఆనాటి “స్వరాజ్య” పత్రిక సంపాదకుడు శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమరావు. పత్రికలో సంపాదకుడు రాసే ప్రత్యేక వ్యాసాలను సంపాదకీయ వ్యాసాలు అంటారు.

సంపాదకీయ వ్యాసాలు సమాజానికి దిశానిర్దేశం చేస్తాయి. సమాజానికి వెలుగుదివ్వెలు వంటివి. సమాజంలోని లోపాలను ఎత్తి చూపుతాయి. దేశాన్ని అన్ని రంగాలలోనూ ఉన్నత స్థానంలో నిలుపటానికి సంపాదకీయాలు తోడ్పడతాయి.

సామాన్య వార్తలా కాకుండా ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చేవిగా ఉండే ఈ సంపాదకీయాలు, కొద్ది ప్రాంతానికో, కొంతమంది వ్యక్తులకో పరిమితం కాకుండా సామాజిక సమస్యలను ప్రతిబింబించే విధంగా ఉంటాయి.

దేశ రక్షణ, ఆర్థికరంగం పటిష్టత, అసమానతల నిర్మూలన, ప్రజా సంక్షేమం, ప్రజా జీవితం తీరుతెన్నులు, దేశ ప్రగతిని దెబ్బతీసే పోకడలు వంటివి ఎన్నెన్నో ప్రధానమైన అంశాలు సంపాదకీయాలుగా వెలువడుతుంటాయి. సమాజంలోని అస్తవ్యస్త పరిస్థితుల్ని ఎత్తి చూపే అక్షరాయుధాలు సంపాదకీయాలు, వీటి రచనలో సంపాదకుని బహుముఖీన ప్రజ్ఞ కనిపిస్తుంది. అందుకే సంపాదకుణ్ణి పత్రికారంగంలో ‘లీడర్’గా పిలిచే ఆనవాయితి ఉండేది.

ఎన్నెన్నో దురాచారాలను రూపుమాపటానికి యుగకర్త కందుకూరి వారి ‘వివేకవర్ధిని’ మున్నగు పత్రికల సంపాదకీయాలు అగ్రస్థానం అలంకరిస్తాయి. అలాగే చిలకమర్తివారి ‘దేశమాత, మనోరమ’ పత్రికలలోని సంపాదకీయాలు, ప్రజల భాషను కాపాడడానికి గిడుగువారి ‘తెలుగు’ పత్రిక సంపాదకీయాలు వ్యవహారిక భాషకు వెలుగులు పంచాయి.

భారత స్వాతంత్ర్యం కోసం జరిగిన జాతీయోద్యమాన్ని దేశం నలుమూలలకు మోసుకెళ్ళిన ఘనత పత్రికలదే. సంపాదకీయాల పరిధి విస్తృతమైనది. సాధారణ వార్తలను మాత్రమే చదివి, ఆలోచనాత్మకమైన సంపాదకీయాలను కొందరు నిర్లక్ష్యం చేయడం విచారకరం. ఇప్పటికైనా సంపాదకీయాల ప్రాధాన్యత గుర్తించి, దేశ ప్రగతికి తోడ్పడే వీటిలోని విశేషాలను గ్రహించగలరు.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 30.
“కోపం మనిషి విచక్షణను నశింపచేస్తుంది” అను విషయాన్ని కరపత్రంగా రాయండి.
జవాబు:
జ్ఞానవంతులారా !

మంచైనా, చెడైనా మనం పెంచి పోషిస్తేనే అది పెరుగుతుంది. మంచిని పెంచడం వల్ల మనిషి ఋషి అవుతాడు. చెడును పోషిస్తే సమాజం చేత తిరస్కారాన్ని పొందుతాడు. ఇది తెలిసినవాడే వివేకవంతుడు. ‘కోపం, క్రోధం, ఆవేశం, ఆగ్రహం’. ఇవన్నీ ఒకదానికొకటి పర్యాయపదాలని తెలిసినా, వాటివల్ల వచ్చే అనర్థాన్ని మాత్రం మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. కోపం అగ్నితో పోల్చబడింది. అందుకే ‘కోపాగ్ని’ అన్నారు.

బద్దెన చెప్పిన ‘తన కోపమే తన శత్రువు’ అన్న మాట మరిచారా ? కోపం మనిషిని పశువుగా మార్చి విచక్షణా జ్ఞానాన్ని నశింపజేస్తుంది. కోపాన్ని జయించిన వారికి లోకం దాసోహం అంటుంది. ఇది చరిత్ర ప్రసిద్ధం. నిప్పు కల్గిన కట్టె అగ్నిచే దహించబడినట్లు, కోపం కల్గినవాడు నాశనం పొందుతాడు. ఇంద్రియ నిగ్రహం లేనివాడు, అరిషడ్వర్గాలకు బానిసౌతాడు. తద్వారా మానసిక స్థైర్యాన్ని కోల్పోయి, ఇంటా బయటా హీనంగా చూడబడతాడు.

పురాణాలలో మహనీయులుగా చెప్పబడిన దుర్వాసుడు, పరశురాముడు, విశ్వామిత్రుడు వంటివారు సైతం కోపిష్ఠులుగా కనబడతారు. హద్దుమీరిన కోపం వ్యాసుణ్ణి కాశీపట్టణ హద్దులను దాటించింది కదా !

చిన్న చిన్న కారణాలు పెద్ద పెద్ద దేశాలను సైతం ఆవేశానికి గురిచేసి, యుద్ధ వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. ప్రజల జీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. గ్రామాల్లో సైతం కోపావేశాలకు గురై వీధి గొడవులతో చంపుకొనేవరకు దారితీస్తున్నాయి.

కోపం అదుపులో ఉంచుకోవడం చిన్ననాటి నుండి అలవర్చుకొని, విద్యాబుద్ధులు నేర్చి కన్నవారికి, ఉన్న ఊరికి కీర్తి ఇనుమడింపజేయాల్సిన బాధ్యత మనందరిది.

ఇట్లు,
తెలంగాణ జనజాగృతి సంఘం.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 31.
“రామాయణం మన జీవన పారాయణం” అంశంపై కరపత్రం రాయండి.
జవాబు:
సోదర సోదరీ మణులారా !

మానవ జీవితాన్ని సంస్కరింపగల మహాకావ్యం రామాయణం. మానవ హృదయాల నుండి ఎప్పటికి చెరగని కథ. రామాయణాన్ని చదవడమంటే జీవితాన్ని చదవడమే. రామాయణం పారాయణగ్రంథం కాదు, ఆచరణ ప్రధాన గ్రంథం. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనిషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్నందిస్తుంది.

ధర్మానికి రూపునిస్తే రాముడి రూపం వస్తుందన్నంత పవిత్రంగా జీవించాడు. చేతికి అందివచ్చిన సింహాసనం దక్కకపోయినా, స్వయంగా భరతుడే వచ్చి రాజ్యానికి రమ్మని అడిగినా, ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన సీతను రావణుడు అపహరించినా, సందర్భమేదైనా కానీ ధర్మాన్ని విడిచిపెట్టలేదు.

శక్తి ఉన్నా ఒద్దికగా ఉండటం రామతత్త్వం. అవకాశం ఉన్నా భర్త వెంట నడవడం సీతతత్త్వం. కష్టాల్లో తోడు నిల్వడం లక్ష్మణతత్త్వం. నమ్మినవారి కోసం తెగించడం ఆంజనేయతత్త్వం. ప్రతి అడుగులో మంచిని గ్రహించాలన్నదే రామాయణ పరమార్థం. సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందుతరాలవారికి స్ఫూర్తి కోసం రాయబడిన అద్భుత ఇతిహాసం రామాయణం.

మనిషికి కష్టాలు రావడం సహజం. ఆ సమయంలో కూడా సంయమనం పాటించడం ఎలా అన్నది రాముని పాత్ర చెబుతుంది. నేటి సమాజంలో యువతకు ఓర్పు, నేర్పు తగ్గిపోతున్నాయి. బాధలు ఎదురవ్వగానే భయానికి లోనవ్వడం, చుట్టుపక్కల వాళ్ళని భయభ్రాంతులకు గురిచెయ్యడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లేదా ప్రాణాలే తీసుకోవడం వంటి మూర్ఖపు ఆలోచనలు చేస్తున్నారు. రామాయణ, భారతాలు చదవడం ద్వారా మనసు స్థిరంగా ఉండడమే కాక మనం నలుగురికి ఉపయోగపడగలం. లేకపోతే మానసిక నిపుణుల చుట్టూ తిరుగుతూనే ఉండవలసివస్తుంది.

ఇట్లు,
భారతీయ ఇతిహాస పరిరక్షణ మండలి.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

ప్రశ్న 32.
‘స్వచ్ఛభారత్ ‘ను ఉద్యమంగా దేశంలో అందరూ పాటించాలని ప్రబోధిస్తూ కరపత్రం తయారుచేయండి.
జవాబు:
స్వచ్ఛభారత్ ఉద్యమం

మిత్రులారా ! గత సంవత్సరం మన ప్రధాని మోడీగారు మనదేశాన్ని పరిశుభ్రంగా, కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలని మన ప్రజలందరికీ పిలుపు ఇచ్చిన విషయము మనకందరికీ విదితమే. ఈ రోజున ముఖ్యంగా నగరాలు, నగర పరిసరాల్లో ప్రవహించే నదులు, మురికివాడలుగా, మురికి కూపాలుగా, మారిపోతున్నాయి.

మనం మన ఇంటిని, పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకున్నట్లే, మన వీధినీ, మన వాడనూ, మన నగరాన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి. ఫ్యాక్టరీలు వదలే రసాయనిక జలాలతో, గంగానది వంటి పవిత్రజలాలు సహితం, కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. మనకు త్రాగునీటినీ, సాగునీటినీ అందించే నదీజలాలనూ, కాలువలనూ పరిశుభ్రంగా ఉంచుదాము. నగరాలలో, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలను పెంచి, తద్వారా పరిశుభ్రమైన గాలిని పీలుద్దాం. ఆరోగ్యవంతులుగా పెరుగుదాం! వైద్య ఖర్చులు తగ్గిద్దాం. అకాల మరణాలను తగ్గిద్దాం.

TS 10th Class Telugu Grammar కరపత్రాలు

మన పాఠశాలలన్నిటిలో, మన గ్రామాలన్నిటిలో మరుగుదొడ్లు నిర్మిద్దాం. మనం ఈ యజ్ఞంలో పాల్గొందాం. మన వారందరినీ దీనిలో పాల్గొనమని ప్రభోదిద్దాం. స్వచ్ఛభారతమే, మన ధ్యేయం. మన తల్లిని మనము శుభ్రంగా ఉంచి, మంచి పిల్లలం అనిపించుకుందాం. స్వచ్ఛభారత్ మన దేశాన్ని తీర్చిదిద్దడమే, మనందరి కర్తవ్యం. ఇదే మనం మన తల్లికిచ్చే కానుక. కదలి రండి. ఉద్యమించండి.

తేది : x x x x.

మోడీ యువజన సంఘం,
నల్గొండ.

TS 10th Class Telugu Grammar నినాదాలు

Telangana SCERT 10th Class Telugu Grammar Telangana నినాదాలు Questions and Answers.

TS 10th Class Telugu Grammar నినాదాలు

ప్రశ్న 1.
‘స్త్రీ విద్యా ప్రాముఖ్యతను తెలియజేస్తూ మీ సొంతంగా ఐదు నినాదాలు రాయండి. (June 2017)
జవాబు:

  1. ఇల్లాలి చదువు – ఇంటికి వెలుగు
  2. స్త్రీవిద్యను ప్రోత్సహించు – ప్రగతిబాట పయనించు
  3. మహిళలు చదవాలి – స్వావలంబన సాధించాలి
  4. మహిళా చైతన్యం – సాధికారితకు సాకారం
  5. ఇల్లంతా చదివినట్లే – ఇల్లంతా చదివితే

ప్రశ్న 2.
సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా 5 నినాదాలు తయారుచేయండి. (June 2016)
జవాబు:

  1. దురాచారాలను తొలగించు – సమానతను పంచు.
  2. అంటరానితనం వద్దు – సంకుచితంగా మసలవద్దు.
  3. వరకట్నాన్ని నిర్మూలిద్దాం – ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు నింపుదాం.
  4. కులంకన్న గుణంమిన్న.
  5. అసమానతలకు దూరంగా ఉండు – అందరికి ఆదర్శంగా జీవించు.
  6. కులమతాలను దూరం చేయి – సమసమాజాన్ని అందించు.

TS 10th Class Telugu Grammar నినాదాలు

ప్రశ్న 3.
ఆడినమాట తప్పకపోవడం, దానగుణం కలిగి ఉండడం మొదలైన విశిష్ట లక్షణాల ఆవశ్యకతను తెల్పుతూ నినాదాలు, సూక్తులు వ్రాయండి. (March 2015)
జవాబు:
నినాదాలు :
ఆడి తప్పకూడదు – పలికి బొంక కూడదు
ఆడితప్పకు – ఇచ్చిదెప్పకు
ఇచ్చిన మాట నిలబెట్టండి – నీతిగా జీవించండి
రక్తదానం – ప్రాణత్యాగానికి ప్రతీక
అవయవదానం చెయ్యండి – మరణమొందిన జీవిస్తారు

సూక్తులు:
మాటకు ప్రాణం సత్యం
అభాగ్యతులకు దానం – అందిపుచ్చుకున్న మోక్షధనం
కుడి చేత్తో ఇచ్చింది – ఎడమచేతికి తెలియనిది
సత్యం వంటి సుకృతం – అసత్యం వంటి పాతకం సృష్టిలో లేవు
మానవసేవయే – మాధవసేవ
దాతలేని ఊరు – దరిద్రానికి మరోపేరు
అభిమానధనులు – మాట తప్పని ఘనులు
దానం చెయ్యని చెయ్యి – అడవిలో పెరిగిన కొయ్య
దాతలేని కొంప – దయ్యాల పెనువాడ

ప్రశ్న 4.
నగర జీవనంపై కొన్ని నినాదాలు రాయండి.
జవాబు:

  1. “నగరంలో మనిషి జీవితం – చదవదగ్గ ఒక గ్రంథం”.
  2. “నగరజీవికి తీరిక దక్కదు – నగరజీవికి కోరిక తీరదు”.
  3. “నగరంలో మనిషివి మెర్క్యూరి నవ్వులు – నగరంలో మనిషివి పాదరసం నడకలు”.
  4. “నగరంలో వాహనాల రద్దీ – అవుతాడు మనిషి రోగాల బందీ”.
  5. “నగరంలో కొందరికి సుఖాల నెలవు – కొందరికి కష్టాల కొలువు”.
  6. “విద్యా – వైద్య కేంద్రం నగరం – విలాసాల సంద్రం నగరం”.
  7. “సాంకేతికతకు పెద్దన్న నగరం – వ్యాపారాలు దండిగున్నది నగరం”.
  8. “పల్లె తల్లివంటిది – నగరం ప్రియరాలివంటిది”.

TS 10th Class Telugu Grammar నినాదాలు

ప్రశ్న 5.
ఆడపిల్లను సమానంగా చూడాలన్న అంశంపై ఐదు నినాదాలు రాయండి.
జవాబు:

  1. ఆడపిల్లే కావాలి – సౌభాగ్యం వర్థిల్లాలి.
  2. ఆడపిల్ల – ఆ ఇంటి మహాలక్ష్మి.
  3. ఆడపిల్ల పుట్టింది – అదృష్టం పట్టింది.
  4. ఆడపిల్ల చదువు – దేశానికది మలుపు.
  5. అమ్మాయైనా, అబ్బాయైనా ఇద్దరూ సమానమే.

ప్రశ్న 6.
తెలుగుభాష గొప్పతనంపై స్వంతంగా 5 నినాదాలు తయారుచేయండి. (June 2019)
జవాబు:

  1. దేశ భాషలందు తెలుగు లెస్స
  2. తెలుగుతేట, కన్నడ కస్తూరి, అరవ అధ్వాన్నం
  3. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ – తెలుగు
  4. జన్మజన్మల తపస్సు ఫలం – తెలుగు వారిగా జన్మించడం.
  5. కమ్మనైన భాష – తెలుగు భాష

ప్రశ్న 7.
స్త్రీ విద్యా ప్రాముఖ్యతను తెలియజేస్తూ మీ సొంతంగా 5 నినాదాలు వ్రాయండి. (June 2017)
జవాబు:
ఇల్లాలి చదువు – ఇంటికి వెలుగు
మహిళల చదువు – ప్రగతికి మదుపు
విద్య నేర్చిన స్త్రీ – వివేకానికి చుక్కాని
నేడు చదువుకున్న స్త్రీలు – రేపటి దేశనాయికామణులు
ఇంట్లో చదువురాని స్త్రీ ఉంటే – కళ్ళున్నా చూడలేని గ్రుడ్డివాళ్ళు.
విద్యావతియైన తల్లి – ఆయింట వెలసిన కల్పవల్లి.

TS 10th Class Telugu Grammar నినాదాలు

ప్రశ్న 8.
సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా 5 నినాదాలు వ్రాయండి. (June 2016)
జవాబు:
వైధవ్య వివాహాలు – భావిభారతకు సౌభాగ్యాలు
మత పిశాచాలను చంపు – మమతానుబంధాల్ని పెంచు
అంటరానితనము – సమాజాన్ని కూల్చే అణుబాంబు
మూఢవిశ్వాసాన్ని త్యజించు – నూత్న సత్యాన్ని ఆహ్వానించు
శకునాలు చూడడం – పిఱికితనాన్ని గౌరవించడం.

ప్రశ్న 9.
ఆడినమాట తప్పకపోవడం, దానగుణం కలిగి ఉండడం మొదలైన విశిష్ట లక్షణాల ఆవశ్యకతను తెల్పుతూ నినాదాలు, సూక్తులు వ్రాయండి. (March 2015)
జవాబు:
నినాదాలు :
ఆడి తప్పకూడదు – పలికి బొంక కూడదు.
ఆడితప్పకు – ఇచ్చిదెప్పకు
ఇచ్చిన మాట నిలబెట్టండి – నీతిగా జీవించండి
రక్తదానం – ప్రాణత్యాగానికి ప్రతీక
అవయవదానం చెయ్యండి – మరణమొందిన జీవిస్తారు.

సూక్తులు :
మాటకు ప్రాణం సత్యం
అభ్యాగతులకు దానం – అందిపుచ్చుకున్న మోక్షధనం.
కుడి చేత్తో ఇచ్చింది – ఎడమచేతికి తెలియనిది
సత్యం వంటి సుకృతం – అసత్యం వంటి పాతకం సృష్టిలో లేవు
మానవసేవయే – మాధవసేవ
దాతలేని ఊరు – దరిద్రానికి మరోపేరు
అభిమానధనులు – మాట తప్పని ఘనులు
దానం చెయ్యని చెయ్యి – అడవిలో పెరిగిన కొయ్య
దాతలేని కొంప – దయ్యాల పెనువాడ

TS 10th Class Telugu Grammar నినాదాలు

ప్రశ్న 10.
స్త్రీల పట్ల మనం ఎలా ప్రవర్తించాలో, మన బాధ్యతలు ఏమిటో తెలిపేలా నినాదాలు – సూక్తులు రాయండి.
జవాబు:
ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా – ప్రతి మానవుడు తల్లికి బిడ్డే
ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో – అక్కడ దేవతలు పూజలందుకుంటారు.
సృష్టికి మూలం స్త్రీ – ప్రేమకు పెన్నిధి స్త్రీ
స్త్రీ లేని ಇಲ್ಲು – గుండెలేని శరీరం
ఇంటిని ఇల్లాలు – కంటిని రెప్పలు కాపాడుతాయి ఇంటికి దీపం ఇల్లాలు
స్త్రీలే జాతికి మణిదీపాలు – స్త్రీలే జగతికి ఆణిముత్యాలు
స్త్రీ సమాజానికి వెన్నుముక – పల్లె సీమలు దేశానికి వెన్నుముక
అమ్మలేని జీవితం – కన్నతల్లి, తల్లిని కన్న దేశం – స్వర్గాని కన్నా గొప్పది.

ప్రశ్న 11.
నీకు తెలిసిన పల్లెసీమల అందాల్ని గూర్చి సూక్తులు రాయండి.
జవాబు:
పల్లెసీమల అందం – పసిడి పంటల నిలయం
పచ్చని చెట్లు – ప్రగతికి మెట్లు
పాడిపంటలతో పల్లెలు – పసిడి నవ్వులతో పిల్లలు
సమాజానికి మూలనిధులు
పల్లెల సీమల జగతి – దేశాభివృద్ధుల ప్రగతి.
పల్లె సీమలే మన దేశపుధాన్యాగారాలు.
రణగొణ ధ్వనులు లేని పల్లెటూళ్ళు – ప్రశాంతమైన పరుకటిళ్ళు
దేశానికి పట్టుగొమ్మలు – మన పల్లెటూళ్ళు.

TS 10th Class Telugu Grammar నినాదాలు

ప్రశ్న 12.
తెలుగు తియ్యదనాన్ని తెలిపే నినాదాలు రాయండి.
జవాబు:
తేనెలొలుకు తెలుగు పలుకు.
యాభై ఆరు రెక్కలున్న పులుగు తెలుగు.
‘కొమ్ము’ లుండి పొగరు లేని నెమ్మదైన తెలుగు.
తేనె తేటల ఊట తెలుగుమాట.
కూతకు రాతకు భేదం లేని భాష తెలుగు.
చెఱకు గడలకు లేదు తెలుగుల తియ్యదనము.
దేశభాషలందు తెలుగు లెస్స.

ప్రశ్న 13.
తెలంగాణ వైభవాన్ని తెలిపే నినాదాలు రాయండి.
జవాబు:
తెలంగాణ వీరుల గడ్డ – త్యాగాలకు అడ్డ.
కాకతీయుల కదనరంగం తెలంగాణ
కళలకు మూలస్తంభం తెలంగాణ
సర్వమానవ సమానత్వం అది తెలంగాణ తత్త్వం.
దాశరథి పద్యాలు వరద గోదావరి పరవళ్ళు.
తెలంగాణ కోటి రత్నాల వీణ.
భిన్న సంస్కృతుల సంగమం తెలంగాణ.
కలం పట్టిన కవులెందరికో కన్నతల్లి తెలంగాణ.
గలగలమని నదులు నడయాడిన నేల తెలంగాణ.

TS 10th Class Telugu Grammar నినాదాలు

ప్రశ్న 14.
పల్లె గొప్పదనాన్ని తెలిపే సూక్తులు రాయండి.
జవాబు:
దేశానికి పల్లెలు పట్టుకొమ్మలు.
పల్లెలు తల్లి వంటిది. పట్నం ప్రియురాలి వంటిది
పల్లె రమ్మంటుంది. పట్నం తెమ్మంటుంది.
పల్లెను దైవం సృష్టిస్తే, పట్నం మానవుడు నిర్మించాడు.
పల్లె గేయం, పట్నం నాటకీయం.
పల్లెల్లో దైవత్వం నిండి ఉంటుంది.

ప్రశ్న 15.
ప్రకృతి వైభవాన్ని చాటే సూక్తులు తెలపండి.
జవాబు:
ప్రకృతి మన మాతృమూర్తి.
పుస్తకాల కన్నా ప్రకృతి ఎక్కువ విషయాలను నేర్పుతుంది.
ఏదీ కోరని వారే ప్రకృతిని జయించినవారు.
తనను ప్రేమించే హృదయాన్ని ప్రకృతి ఎన్నడూ మోసగించదు.
ప్రకృతి ఒడిలో పూల హృదయం వికసిస్తుంది.
ప్రకృతి సౌందర్యానికి పర్వతాలే సర్వస్వం.
ప్రకృతి హక్కులనివ్వదు, బాధ్యతలను గుర్తు చేస్తుంది.
ప్రకృతి పుస్తకానికి రచయిత దేవుడే.
ప్రకృతికి విధేయులమై ఉన్నప్పుడే దానిని మనం ఆజ్ఞాపించగలం.
ప్రకృతిలో బహుమతులు గాని, శిక్షలు గాని లేవు, ఫలితాలు మాత్రమే ఉంటాయి.
ప్రకృతిని అధ్యయనం చేయి, ప్రకృతి సత్యానికి స్నేహితురాలు.

TS 10th Class Telugu Grammar నినాదాలు

ప్రశ్న 16.
పట్టణం / నగరం గూర్చి సూక్తులు :
జవాబు:
పట్టణాలు మనుషుల ఎదుగుదలకు దోహదపడి,
సంభాషణా చతురులుగా మారుస్తాయి.
గొప్పవారైన స్త్రీ పురుషులకు నిలయం పట్టణం.
విద్యలకు ఆటపట్టు నగరం.
కొత్తపాతల కలయిక పట్టణం..
నవ్య సంప్రదాయాలు, నూత్న ధోరణలు, విలాసవంతమైన
జీవితాలు పట్టణాలు, భిన్నత్వంలో ఏకత్వం ప్రతి పాదిస్తుంది నగరం.
ధనశక్తిని శ్రమశక్తిని బదలాయింపు చేసుకొనే నిలయాలు నగరాలు.

ప్రశ్న 17.
పద్యం, కవి విశిష్టతలను తెలిపే సూక్తులు రాయండి :
జవాబు:
శతక పద్యాలు ద్రాక్షా గుత్తుల వంటివి, దేని రుచి దానిదే.
రాజుకు కిరీటం, పద్యానికి మకుటం, దేని అందం దానిదే.
పద్య కవి ప్రజల నాల్కులపై ఆడుతుంటాడు.
శృతి, లయ ప్రధానమైన పద్యం ఎప్పుడూ హృద్యమే.
కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడు కవి.
రవి గాంచని చోటు కవి గాంచును.
అల్పాక్షరాలతో అనల్పార్థానిచ్చేదే పద్యం.
తక్కువ పదాలతో ఎక్కువ విషయాలు చెప్పేది పద్యం.
ఛందస్సు కాదు ఛందోబద్ధమైన వాదన పద్యాన్ని తయారుచేస్తుంది.

పద్యం ఒక ఔషధం వంటిది.
గన్ను పేలితే నాశనం. పెన్ను కదిలితే ప్రేరణ, చైతన్యమే.
పద్యం కొన్ని సమయాల్లో తత్త్వశాస్త్రంలా ఉంటుంది.
చరిత్ర కన్నా గంభీరంగా ఉంటుంది.
పద్యం శబ్ద, అర్థ, ఛందస్సుల త్రివేణి సంగమం.

TS 10th Class Telugu Grammar నినాదాలు

ప్రశ్న 18.
పత్రిక విశిష్టతను తెలుపుతూ సూక్తులు రాయండి.
జవాబు:
సమాజంలోని సంఘటనలను మన ముందరుంచేవి. పత్రికలు.
North + East + West + South ల కలయికయే వార్త.
వార్తల కదంబమే పత్రిక
ప్రజల్లో కొత్త భావాలను, ఆలోచనలను, చైతన్యాన్ని రగిల్చేది పత్రికలు.
పత్రికా హృదయమే సంపాదకీయం.
అక్షరరూపం దాల్చిన ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళకు మెరుపుల కదలిక.

ప్రశ్న 19.
నిస్వార్థ త్యాగం మనిషిని చరిత్రలో శాశ్వతంగా నిలుపుతుంది కదా ! ‘త్యాగం’ ఆధారంగా చేసుకొని కొన్ని సూక్తులు రాయండి.
జవాబు:
తన కోసం చేసేది స్వార్థం. ఇతరుల కోసం చేసేది త్యాగం.
ఏ దేశంలో త్యాగమనే గుణం అపారంగా ఉంటుందో,
ఆ దేశం ఉన్నత లక్ష్యాలను అందుకోవడం ఖాయం.
త్యాగం ఎంత నిస్వార్థంగా ఉంటే అభివృద్ధి అంత ఎక్కువగా ఉంటుంది.
స్వర్గ ద్వారాన్ని తెరిచే బంగారు తాళపు చెవి త్యాగం.
చిన్న చిన్న త్యాగాల ద్వారానే మనిషికి మంచితనం అబ్బుతుంది.
గొప్ప కార్యాలెప్పుడూ గొప్ప త్యాగాల వల్లనే సాధించ బడతాయి.
త్యాగం వల్ల శాంతి కలుగుతుంది.
త్యాగానికి పట్టం కడితేనే ప్రేమకు స్వాగతం పలకడానికి వీలవుతుంది.
కర్మ ఫలితాన్ని ఈశ్వరార్పణం చేయడమే త్యాగం.
‘తప్పులు అందరూ చేయగలిగితే, త్యాగాలు కొందరే చేయగలుగుతారు.
త్యాగధనులకు ఆదర్శాలుంటాయి. ఇతరులకు కోరికలుంటాయి..

TS 10th Class Telugu Grammar నినాదాలు

ప్రశ్న 20.
కోపం అనర్థదాయకం అని చెప్పే సూక్తులు రాయండి.
జవాబు:
తన కోపమే తన శత్రువు.
కోపమున ఘనత కొంచమై పోవును.
బుద్ధిగల వాళ్ళకు కోపం కొనియాడదగింది కాదు.
కోపం ఆవహిస్తే వివేకం విడాకులిస్తుంది.
క్రోధం తమోగుణ లక్షణం, క్రోధ పరవశుడైన వ్యక్తి వివేకాన్ని కోల్పోతాడు.

కోపం శాపానికి ధూపం.
కోపిష్టి నోరు తెరచి, కళ్ళు మూసుకుంటాడు.
కోపంలో చేసిన పనులకు తీరికగా పశ్చాత్తాపపడతాం.
క్రోధాన్ని అణచడమే మానవత్వం.
కంఠస్వరం పెద్దదయ్యేకొద్దీ బుద్ధి చిన్నదవుతుంది.
కోపం ధర్మకార్యాలకు ఆటంకం అవుతుంది.
క్రోధాన్ని అణగద్రొక్కిననాడే ఆనందం ప్రాప్తిస్తుంది.

ప్రశ్న 21.
సమాజం గురించి నినాదాలు రాయండి.:
జవాబు:
మనిషి నిజమైన జీవితం సమాజంలోనే ఉంది.
సమాజమే సమస్త శక్తికి మూల సదస్సు.
సమాజాన్ని కించపరుస్తూ ఎప్పుడూ మాట్లాడవద్దు,
దానిలో ఇమడలేని వాళ్ళే అలా మాట్లాడతారు.
సమాజంలో ఇమడలేని వాడికి సమాజం ద్వారా సుఖం లభించదు.
సమాజంలోని జీవించలేనివాడు పశువైనా అయి
ఉండాలి లేదా దేవుడైనా అయి ఉండాలి..
చీమలు మంచి పౌరులు. క్రమశిక్షణ కల అవి సమాజ శ్రేయస్సుకే ప్రాధాన్యమిస్తాయి.
హిందూ సంస్కృతికి మూలం సమాజం. రాజకీయాలు కాదు.

TS 10th Class Telugu Grammar నినాదాలు

ప్రశ్న 22.
సమస్యలను చూసి భయపడేవారికి ధైర్యాన్ని కలిగించే సూక్తులను రాయండి.
జవాబు:
భయపడకు నేస్తం. ఉంటుంది ఆదుకొనే హస్తం.
సమస్యల వల్ల కష్టాలు రావు.
కష్టాలే ఉంటాయనుకొంటే సమస్యలు పెరుగుతాయి.
ప్రతి సమస్యనూ కాలం పరిష్కరిస్తుంది.
సమస్యలు ఏర్పడినపుడే బుర్ర చురుకుగా పనిచేస్తుంది.
సమస్యలు లేని జీవితం పందిరి లేని పాదు వంటిది.
సమస్యలు మనుషులకు కాక మానులకొస్తాయా ?
సాధన చేస్తే సాధ్యం కానిది లేదు.
ప్రయత్నిస్తే పరమాత్మైనా కనిపిస్తాడు.
ధైర్యమే విజయం.

TS 10th Class Telugu Grammar కథలు

Telangana SCERT 10th Class Telugu Grammar Telangana కథలు Questions and Answers.

TS 10th Class Telugu Grammar కథలు

ప్రశ్న 1.
జంతువులను పాత్రలుగా ఉపయోగించి ఒక కథ వ్రాయండి.
జవాబు:
ఒక వ్యాపారి ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద, గుర్రం ఉన్నాయి. గుర్రాన్ని రోజూ బండికి కట్టేవారు. గుర్రమంటే వాళ్ళందరికీ చాలా ఇష్టం. చాలా ప్రేమగా చూసేవారు. ఒకసారి గాడిద తన పరిస్థితి గురించి గుర్రం దగ్గర బాధపడింది. నీకు గౌరవం దక్కేలా చేస్తానని గుర్రం మాట ఇచ్చింది.

మరునాడు బరువుగా ఉన్న సరుకులతో బండి కట్టారు. గుర్రం చాలా నీరసంగా ఉన్నట్లు నటించింది. జాలిగా చూసింది. గాడిద వైపు చూసింది. సరే గాడిదను ఉపయోగిద్దామను కొన్నారు. అప్పటినుండి బరువు పనులకు గాడిదను ఉపయోగిస్తూ, దానిని ప్రేమగా చూడసాగారు. గుర్రానికి గాడిద కృతజ్ఞతలు చెప్పింది.

TS 10th Class Telugu Grammar కథలు

ప్రశ్న 2.
స్నేహం గొప్పదనాన్ని తెలిపే కథలను వ్రాయండి.
జవాబు:
1. మిత్రలాభం :
‘చిత్రగ్రీవుడు’ పావురాల రాజు. అతగాడు తన పావురాలతో ఆకాశంలో తిరుగుతున్నాడు. గోదావరీ తీరంలో ఒక మర్రిచెట్టు ఉంది. ఒక బోయవాడు వచ్చి ఆ చెట్టు దగ్గరలో నూకలు చల్లి దానిమీద వల వేశాడు. “పక్షులు నూకల కోసం వల మీద వాలతాయి. వాటిని పట్టుకొని అమ్ముకుందాం” అనుకున్నాడు.

చిత్రగ్రీవుడితో ఎగురుతున్న పావురాలు ఆ నూకలను చూశాయి. అవి నేలమీద వాలి, నూకలను తిందామనుకున్నాయి. “ఇది మనుష్యుల సంచారం లేని అడవి ఈ నూకలు ఇక్కడకు ఎందుకు వస్తాయి ? కాబట్టి ఈ నూకలకు ఆశపడకండి” అని చిత్రగ్రీవుడు స్నేహితులకు సలహా చెప్పాడు. ఒక ముసలిపావురం చిత్రగ్రీవుడి మాటలు కాదంది. నూకలు తిందామంది. సరే అని పావురాలు కిందికి దిగాయి. వలలో చిక్కుకున్నాయి.

పావురాలు అప్పుడు ముసలిపావురాన్ని తిట్టాయి. చిత్రగ్రీవుడు “తిట్టకండి. మనం అంతా కలిసి ఎగిరిపోదాం. నాకో స్నేహితుడు ఉన్నాడు మనల్ని రక్షిస్తాడు” అని చెప్పింది. పావురాలు అన్నీ కలసి వల ఎత్తుకొని, చిత్రగ్రీవుడి స్నేహితుడు హిరణ్యకుడు అనే ఎలుక ఉండే కన్నం దగ్గర వాలాయి. హిరణ్యకుణ్ణి చిత్రగ్రీవుడు గొంతెత్తి పిలిచాడు. హిరణ్యకుడు స్నేహితుని మాట విని పావురాల బంధాలన్నీ తన పళ్లతో కొరికివేశాడు. పావురాలు చిత్రగ్రీవుజ్జీ, హిరణ్యకుణ్ణి మెచ్చుకున్నాయి. అందుకే మనందరికీ మంచి స్నేహితులు ఉండాలి.

2. స్నేహితుని సాయం:
ఒక చెరువులో తాబేలు ఉండేది. ఆ చెరువుకు దగ్గరలో ఉండే ఒక నక్కతో అది స్నేహం చేసింది. ఒక రోజు వారవురూ మాట్లాడుకుంటుండగా అక్కడకు ఒక చిరుతపులి వచ్చింది. అది గమనించిన నక్క తాబేలు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తమ నివాసాల వైపు పరుగెత్తాయి. నక్క మాత్రం వేగంగా పరుగెత్తి వెళ్ళి తన బొర్రెలోకి దూరిపోయింది. తాబేలు మెల్లగా నడుస్తుంది. కాబట్టి తానుండే చెరువుకు చేరుకోలేక పోయింది. చిరుతపులి తాబేలు దగ్గరకు వచ్చింది. తాబేలు చిరుతపులి బారి నుండి తప్పించుకోలేక పోయింది.

చిరుతపులి తాబేలును నోట కరచుకొని, దానిని తినడానికి ఒక చెట్టు కిందకు తీసుకువెళ్ళింది. అది ఎంత ప్రయత్నించినా తాబేలు పైనున్న పెంకును కొరకలేకపోయింది. నక్క తన బొర్రె నుండి ఇదంతా గమనిస్తూనే ఉంది. తన స్నేహితుడిని కాపాడాలని ఆలోచించింది. వెంటనే బొర్రె నుంచి చూస్తూ నక్క అమాయకంగా చిరుతపులితో – “తాబేలును నీటిలోకి విసరండి. అది కొద్దిసేపు నీటిలో నానుతుంది. దానిమీద ఉన్న పెంకు మెత్తనవు తుంది” అని చెప్పింది.

చిరుతపులి – వెంటనే పరీక్షిస్తాను’ అని తాబేలును నీటిలోనికి విసిరివేసింది. వెంటనే తాబేలు చిరునవ్వుతో చెరువు నీటిలో ఈదుకుంటూ వెళ్ళిపోయంది.

TS 10th Class Telugu Grammar కథలు

ప్రశ్న 3.
“దురాశ దుఃఖానికి కారణం” ఎలానో వివరించండి.
జవాబు:
“ఆశకు అంతే లేదు” అన్నది ఆర్యోక్తి. “ఆశాపాశము తాకడున్ నిడుపు” అంటాడు వామనావతారం ఎత్తిన శ్రీహరి. “దురాశ దఃఖము చేటు” అన్న సామెత మనం నిత్యం వింటూనే ఉంటాం. ఈ సూక్తులన్నింటి లోనూ పేరాశ పనికిరాదనే హితోక్తి మనకు స్పష్టమౌతుంది. అయితే అసలు ఆశ అనేది వుండకూడదని మాత్రం దీని అర్థం కాదు.

హద్దులు దాటని ఆశ, పరిథులు దాటని కోరిక మనిషిని ప్రయత్నశీలుణ్ణి చేసి, తాను ఆశించిన ఫలితాలను అందుకోవడానికి ప్రోత్సాహమిస్తాయి. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా భవిష్యత్తుపైన ఉన్న చిన్ని ఆశ మానవుణ్ణి ధైర్యంగా ముందుకు నడిపిస్తుంది. అయితే ఈ ఆశ అత్యాశగా మారి హద్దుల్ని అతిక్రమిస్తే, అది మనిషిపాలిట శాపంగా మారి అతడిని నరకప్రాయం చేస్తుంది. కొన్ని సందర్భాలలో ప్రాణాలకు కూడా ముప్పు తీసుకువస్తుంది.

మనలో కూడా చాలామంది ఇంకా ఇంకా సంపాదించాలని అత్యాశతో కుటుంబ సౌఖ్యాన్ని, వ్యక్తిగత ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. దుర్మార్గాలకు, దౌర్జన్యాలకు పాల్పడి మానవ మనుగడను నరకంగా మారుస్తున్న వాళ్ళూ వున్నారు. నిజానికి వీరంతా ఆ సంపాదనను అనుభవిస్తున్నారా అంటే లేదు అనేది జగమెరిగిన సత్యం.

ఇందులో చాలామంది తమ దురాశల పరుగుపందెంలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నా రన్నది పచ్చినిజం. అందుకే అత్యాశకు పోకుండా వున్నదానితో తృప్తిగా జీవించటం మనం నేర్చుకోవాలి. ప్రాప్తమైనా లేశమైనా పదివేలు అనుకొని జీవితాన్ని ఆనందంగా గడపాలి. అప్పుడు ప్రతి ఇల్లూ ఆనందాల హరివిల్లుగా మారుతుంది. ఆత్మీయతల పొదరిల్లుగా నవ్వులు కురిపిస్తుంది.

ప్రశ్న 4.
నగరం విస్తరణ – సౌకర్యాలు – వలసలు – కాలుష్యం – ప్రజల జీవనం – సమస్యలు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని నగరం మాట్లాడుతున్నట్లు ‘నగరం’ ఆత్మకథ’ ను రాయండి. (March 2019)
జవాబు:
నేను నగరాన్ని. ఒకప్పుడు నేను అంటే అందరికీ గౌరవం. ఇప్పుడు రణగొణ ధ్వనులతో నిండిపోయాను. నాలుగు రోడ్ల కూడలిలో వినిపించే ధ్వనులు, ఢంకా నాదంలా, జలపాతం హోరులా వినిపిస్తాయి. ఇవి నగరంలో నివసిస్తున్న జీవుల బతుకు పోరాటంలో నుంచి వచ్చిన ఉరుములు.

నామీద అందరికీ మక్కువ ఎక్కువ. పల్లెల్ని వదలి నా దగ్గరకు వలస వస్తారు. తలదాచుకోడానికి చోటులేక, ఇనప్పెట్టె లాంటి ఇరుకు ఇళ్ళల్లో మురికివాడలలో నివాసం ఉంటారు. ఎంతోమందికి నేను ఆశ్రయం ఇస్తాను.

నా దగ్గర ఎంతోమంది విద్యావంతులు నివసిస్తారు. నా దగ్గర పిల్లలు బస్సుల్లో, రిక్షాల్లో కాన్వెంటుకు వెడుతూ పువ్వుల్లా పేవ్మెంట్లపై సందడి చేస్తూ ఉంటారు.

నా దగ్గర పెద్ద భవంతులు, ప్రక్కనే పేదల పూర్ళిళ్ళు కూడా ఉంటాయి. ఐశ్వర్యం, దరిద్ర్యాలు, సమాంతర రేఖల్లా కనిపిస్తాయి.

నా దగ్గర వెరైటీ సమస్యలు ఉంటాయి. నా దగ్గర జీవులకు ఎవరికీ తీరిక ఉండదు. వారి కోరికలు తీరవు. ప్రజలు అసహజంగా నవ్వుతారు. వారివి పాదరసపు నడకలు. అనుక్షణం ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఎవరికి ఎవరూ కారు. అందరూ ఏకాకులు. అర్థం కాని రసాయన శాల. చిక్కువీడని పద్మవ్యూహం. నేను ఎవరికీ అంతుపట్టను. ఇది నా ఆత్మకథ.

TS 10th Class Telugu Grammar కథలు

ప్రశ్న 5.
‘కష్టపడితే విజయాన్ని సాధించవచ్చు’ అనే నీతిని తెలియజెప్పే ఒక కథను రాయండి.
జవాబు:
రామాపురం గ్రామంలో రామయ్య అనే రెండు ఎకరాల రైతు ఉండేవాడు. రామయ్య భార్య పేరు సీతమ్మ, ఈమె పేరుకు దగ్గ ఉత్తమురాలు. వీరికి ‘రమేష్’ అనే పిల్లవాడు ఉండేవాడు. రమేష్ గ్రామంలోనే హైస్కూలులో 9వ తరగతి చదువుతున్నాడు. ఇంతలో రామయ్యకు గుండెజబ్బు వచ్చి, అకస్మాత్తుగా చనిపోయాడు.

పూలరథంలా సాగే వారి కుటుంబానికి కష్టాలు వచ్చాయి. అయితే సీతమ్మ కంగారు పడలేదు. ధైర్యం తెచ్చుకొంది. రమేష్ చదువుకు ఆటంకాలు లేకుండా తాను పొలంలో కష్టపడేది. కొత్త వ్యవసాయ పద్ధతులు తెలుసుకొని, స్వయంగా రమేష్ తోడుగా మంచి పంటలు పండించింది. తల్లి సాయంతో నాలుగు గేదెలను కొని, పాడి పరిశ్రమ మొదలు పెట్టాంది.

రమేష్, తల్లికి తోడుగా ఉంటూనే యమ్.ఏ పూర్తిచేశాడు. ఎంతో శ్రద్ధగా చదివి, చిన్న పిల్లలకు పాఠాలు చెప్పి, కొంచెం డబ్బూ, మరింత జ్ఞానం గడించాడు. పబ్లిక్ సర్వీసు కమీషన్ పరీక్షలు వ్రాసి, రెవెన్యూ డివిజనల్ ఆఫీసరుగా ఎన్నికయ్యాడు. వారి కష్టాలన్నీ తీరాయి.

సీతమ్మ, రమేష్కు పెండ్లి చేసింది. వారి జీవితం ఇప్పుడు పూలరథంలా సాగిపోతోంది. దీనిని బట్టి కష్టపడితే విజయాన్ని సాధింపవచ్చు అని తెలుస్తుంది.

TS 10th Class Telugu Grammar కథలు

ప్రశ్న 6.
‘శతక మధురిమ’ పద్యాలు ఆధారంగా ఏదైనా నీతికథ రాయండి.
జవాబు:
‘ప్రజలు రాజులను ఆశ్రయించడం వ్యర్థము’ అనే నీతిని తెల్పే కాళహస్తీశ్వర శతక పద్యాన్ని, ఒక కవిపండితుడు బాగా అర్థం చేసుకొని, తన జీవితాన్ని చక్కగా మలచుకున్నాడు. ఈ నీతి కథ చదవండి.

నీతి కథ

ఒక ఊరిలో రామయ్య అనే మంచి కవిపండితుడు ఉండేవాడు. ఆయన ఎన్నో పరీక్షలు పాసైనా, ఆయనకు ఉద్యోగం దొరకలేదు. రామయ్యగారు చక్కగా పద్యాలు రాస్తాడు. పెళ్ళిళ్ళలో ఆశీర్వచన పద్యాలు చదువుతాడు. మంత్రులపై స్వాగత పత్రాలు, సన్మాన పత్రాలు బాగా రాస్తాడు.

రామయ్య గార్కి ఎవరో చెప్పారు. గ్రామంలోని ఎమ్మెల్యే కోటిరెడ్డిగార్ని ఆశ్రయించమని రామయ్యగారు ఎమ్మెల్యే గార్ని ఆశ్రయించాడు. ఆనాటి నుండి రామయ్యగార్కి, ఎమ్మెల్యేగార్ని పొగడడమే పని. ఆయనపై పద్యాలు రాసి, స్తోత్రం చెయ్యడమే పని అయ్యింది. అందువల్ల రామయ్యగారి కడుపు మాత్రం నిండలేదు.

ఇంతలో ఎవరో రామయ్యగార్కి ఒక సలహా ఇచ్చారు. చదువుకున్న పండితుడివి హాయిగా గుళ్ళో భారత, భాగవత పురాణాలు చెప్పండని. రామయ్య ఎమ్మెల్యేగారితో విసిగిపోయి, గుడిలో దేవుడిని ఆశ్రయించాడు. రామయణ భారత, భాగవతాలు గుడిలో చక్కగా పురాణం ప్రారంభించాడు. దైవం దయవల్ల భక్తుల దక్షిణలతో, రామయ్యగార్కి జీవితం హాయిగా సాగిపోసాగింది. “చేరంబోవుదు రేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వరా !” అన్న ధూర్జటి శతక పద్యం, అప్పుడు రామయ్యగార్కి గుర్తు వచ్చింది.

నీతి : అధికారులను నమ్ముకోడం కన్నా, దేవుడిని నమ్ముకోడం మంచిది.

TS 10th Class Telugu Grammar కథలు

ప్రశ్న 7.
కోపం మంచిది కాదనే నీతిని తెలిపే కథను రాయండి.
జవాబు:
పేరూరులో నాగన్న, రంగన్న అనే అన్నదమ్ములు ఉండేవారు. వారి తండ్రి తన ఆస్తిని కుమారులకు సమంగా పంచాడు. అయినా రంగన్న చీటికీ మాటికీ తమ్ముడితో పేచీ పడేవాడు. పెద్దవాడైన నాగన్న తమ్ముడు రంగన్నను కత్తితో నరకి చంపడానికి సిద్ధం అయ్యాడు.

దానితో నాగన్నను పోలీసులు జైలుకు పంపారు. రంగన్న శాంత స్వభావుడు. తాను కష్టపడి పొలంలో పనిచేసి తన పిల్లలను బాగా చదివించాడు. వారికి మంచి ఉద్యోగాలు వచ్చాయి. నాగన్న జైలుకు వెళ్ళడం వల్ల నాగన్న పిల్లలు కూలీ పనులు చేసి జీవించేవారు.

నాగన్న జైలు నుండి తిరిగి వచ్చాడు. తమ్ముడు పిల్లలు బాగుపడ్డారని గ్రహించాడు. తన కోపమే తనకు శత్రువు అయ్యిందని గ్రహించాడు. ఆనాటి నుండి తమ్ముడితో ప్రేమగా మసలు కొనేవాడు.

నీతి : కోపము శత్రువు వంటిది. ఓర్పు, ధనము వంటిది అని గ్రహించాలి.

TS 6th Class Maths Bits Chapter 5 Measures of Lines and Angles

Solving these TS 6th Class Maths Bits with Answers 5th Lesson Measures of Lines and Angles Bits for 10th Class will help students to build their problem-solving skills.

TS 6th Class Maths Bits Chapter 5 Measures of Lines and Angles

Choose the correct answer and write it in the brackets:

Question 1.
Which of the following is an obtuse angle?
A) 90°
B) 45°
C) 135°
D) 180°
Answer:
C) 135°

Question 2.
270° is an example for ________.
A) Right angle
B) Obtuse angle
C) Straight angle
D) Reflex angle
Answer:
D) Reflex angle

Question 3.
A right angle measures ________.
A) 180°
B) 90°
C) 150°
D) 360°
Answer:
B) 90°

TS Board 6th Class Maths Bits 5th Lesson Measures of Lines and Angles

Question 4.
A complete angle measures ________.
A) 180°
B) 0°
C) 360°
D) 200°
Answer:
C) 360°

Question 5.
Which of the following is an acute angle?

TS 6th Class Maths Bits 5th Lesson Measures of Lines and Angles 1

Answer:
B) TS 6th Class Maths Bits 5th Lesson Measures of Lines and Angles 2

Question 6.
From the below figure \(\overline{\mathbf{B C}}\) = ________ cm.

TS 6th Class Maths Bits 5th Lesson Measures of Lines and Angles 3

A) 2cm
B) 3cm
C) 2.5 cm
D) 3.5 cm
Answer:
C) 2.5 cm

TS Board 6th Class Maths Bits 5th Lesson Measures of Lines and Angles

Question 7.
Line segment AB is denoted by ________.
A) \(\overline{\mathrm{AB}}\)
B) \(\stackrel{\leftrightarrow}{\mathrm{AB}}\)
C) \(\overrightarrow{\mathrm{AB}}\)
D) \(\overrightarrow{\mathrm{BA}}\)
Answer:
A) \(\overline{\mathrm{AB}}\)

Question 8.
Which of the following is not an example of a line segment?
A) Edge of a door
B) Edge of a textbook
C) Edge of a celiphone
D) Curve of a ball
Answer:
D) Curve of a ball

Question 9.
What is the angle between minute and hours hand when it is 9.00 A.M?
A) 90°
B) 180°
C) 270°
D) 45°
Answer:
A) 90°

TS Board 6th Class Maths Bits 5th Lesson Measures of Lines and Angles

Question 10.
Which of the following represents an angle 180° between the hands of a clock at ________.
A) 630 P.M
B) 6.00 P.M
C) 12.00 P.M
D) 8.45 A.M
Answer:
B) 6.00 P.M

Question 11.
Which of the following represents an acute angle?

TS 6th Class Maths Bits 5th Lesson Measures of Lines and Angles 4

Answer:

C) TS 6th Class Maths Bits 5th Lesson Measures of Lines and Angles 5

Question 12.
Which of the following is an obtuse angle?

TS 6th Class Maths Bits 5th Lesson Measures of Lines and Angles 6

Answer:

A)TS 6th Class Maths Bits 5th Lesson Measures of Lines and Angles 7

TS Board 6th Class Maths Bits 5th Lesson Measures of Lines and Angles

Question 13.
Which of the following is a right angle?
A) 45°
B) 90°
C) 120°
D) 180°
Answer:
B) 90°

Question 14.
Which of the following is a straight angle?
A) 0°
B) 90°
C) 180°
D) 360°
Answer:
C) 180°

Question 15.
Which of the following is a reflex angle?
A) 175°
B) 180°
C) 360°
D) 270°
Answer:
D) 270°

TS Board 6th Class Maths Bits 5th Lesson Measures of Lines and Angles

Question 16.
Which of the following is a complete angle?
A) 90°
B) 180°
C) 270°
D) 360°
Answer:
D) 360°

Question 17.
Which of the following are perpendicular lines?

TS 6th Class Maths Bits 5th Lesson Measures of Lines and Angles 8

Answer:

A) TS 6th Class Maths Bits 5th Lesson Measures of Lines and Angles 9

Question 18.
Number of perpendicular lines can be drawn to a given lines?
A) 0
B) 1
C) 2
D) Infinite
Answer:
D) Infinite

TS Board 6th Class Maths Bits 5th Lesson Measures of Lines and Angles

Question 19.
1° = ________ part of one rotation.
A) \(\frac{1}{90^{\text {th }}}\)
B) \(\frac{1}{180^{\text {th }}}\)
C) \(\frac{1}{270^{\text {th }}}\)
D) \(\frac{1}{360^{\text {th }}}\)
Answer:
D) \(\frac{1}{360^{\text {th }}}\)

Question 20.
Which of the following are parallel line?

TS 6th Class Maths Bits 5th Lesson Measures of Lines and Angles 10

Answer:

B) TS 6th Class Maths Bits 5th Lesson Measures of Lines and Angles 11

Question 21.

Group – AGroup – B
1.  acute anglea. 360°
2. right angleb. 299°
3. obtuse anglec. 90°
4. reflex angled. 91°
e. 45°

A) 1 – a, 2 – b, 3 – c, 4 – d
B) 1 – d, 2 – e, 3 – c, 4 – a
C) 1 – e, 2 – c, 3 – d, 4 – b
D) 1 – e, 2 – c, 3 – b, 4 – d
Answer:
C) 1 – e, 2 – c, 3 – d, 4 – b

TS Board 6th Class Maths Bits 5th Lesson Measures of Lines and Angles

Question 22.

Group – AGroup – B
1. Length of line segmenta. protractor
2. measure of an (degree) angleb. compasses
3. Comparison of line segmentsc. ruler
4. to draw an arcsd. divider

A) 1 – d, 2 – c, 3 – b, 4 – a
B) 1 – c, 2 – a, 3 – d, 4 – b
C) 1 – a, 2 – c, 3 – d, 4 – b
D) 1 – c, 2 – a, 3 – b, 4 – d
Answer:
B) 1 – c, 2 – a, 3 – d, 4 – b

Question 23.
How many right angles make a complete angle?
A) 1
B) 2
C) 3
D) 4
Answer:
D) 4

Question 24.
Which of the following is not true from the given below figure ?

TS 6th Class Maths Bits 5th Lesson Measures of Lines and Angles 12

A) AC + CD + DB = AB
B) \(\overline{\mathrm{CD}}\) = AB – (AC + DB)
C) \(\overline{\mathrm{CD}}=\overline{\mathrm{AD}}-\overline{\mathrm{AC}}\)
D) \(\overline{\mathrm{CD}}=\overline{\mathrm{BD}}-\overline{\mathrm{AC}}\)
Answer:
D) \(\overline{\mathrm{CD}}=\overline{\mathrm{BD}}-\overline{\mathrm{AC}}\).

TS Board 6th Class Maths Bits 5th Lesson Measures of Lines and Angles

Question 25.
Which of the following is true from the above figure?
A) AC > AD
B) CD >BC
C) AD < BD
D) BC > AC
Answer:
D) BC > AC

Question 26.
Right angle lies between which two angles?
A) 0 – 45°
B) 0° – 89°
C) 45° – 90°
D) 0° – 99°
Answer:
D) 0° – 99°

Question 27.
Which of the following is not true ?
A) 450° is an acute angle
B) 120° is an obtuse angle
C) 181° is a straight angle
D) 360° is a complete angle
Answer:
C) 181° is a straight angle.

TS Board 6th Class Maths Bits 5th Lesson Measures of Lines and Angles

Question 28.
Which of the following is not true ?
A) Intersecting lines meet at a single point.
B) Non-intersecting lines are parallel
C) If two lines are ⊥ then the angle between them is 90°
D) A line separates a plane into 4 parts.
Answer:
D) A line separates a plane into 4 parts.

Question 29.
Statement (I) : Ruler is used to draw linesegments.
Statement (II) : Divider is used to compare lengths of linesegments
A) Both I & II are true
B) Both I & II are false
C) I is true but II is false
D) I is false but II is true
Answer:
B) Both I & II are false

Question 30.
Statement (I): Acute angle is less than 90°.
Statement (II): Right angle is 90°
Statement (III): 180° < ∠P < 360°, the P is a reflex angle
A) I, II, & III are true
B) I, II are true but III is false
C) I, III are true but II is false
D) None of these
Answer:
A) I, II, & III are true.

TS Board 6th Class Maths Bits 5th Lesson Measures of Lines and Angles

Question 31.
Statement (I): 1° = \(\frac{1}{360}\) th part of one rotation.
Statement (II): 45° + 45° = right angle
Statement (III): 120° + 90° = reflex angle
A) I, II, III are false
B) I, II are true but III is false
C) I is true but II & III are false
D) I, II, III are true
Answer:
D) I, II, III are true.

Question 32.
An angle which is less than 90° is angle called a ________.
A) Acute
B) Right
C) Obtuse
D) Reflex
Answer:
A) Acute

Question 33.
An angle which is 90° < 0 < 180° then θ is ________.
A) Acute
B) Right
C) Obtuse
D) Straight
Answer:
C) Obtuse

TS Board 6th Class Maths Bits 5th Lesson Measures of Lines and Angles

Question 34.
An angle which lies between 180 ° and 360° then it is called a ________ angle.
A) Right
B) Straight
C) Complete
D) Reflex
Answer:
D) Reflex

Question 35.
Non-intersecting lines are called ________ lines.
A) Parallel
B) Perpendicular
C) Intersecting
D) Concurrent
Answers:
A) Parallel

Question 36.
If two lines meet at 90° then they are called ________ lines.
A) Parallel
B) Perpendicular
C) Intersecting
D) Concurrent
Answer:
B) Perpendicular

TS Board 6th Class Maths Bits 5th Lesson Measures of Lines and Angles

Question 37.
A line segment has ________ end points.
A) 0
B) 1
C) 2
D) 3
Answer:
C) 2

Question 38.
An angle which is equal to 180° is called a ________ angle.
A) Straight
B) Right
C) Reflex
D) Complete
Answer:
A) Straight

Question 39.
The instrument used to compare and measure angles more precisely is ________.
A) Protractor
B) Divider
C) Ruler
D) Set squares
Answer:
A) Protractor

TS Board 6th Class Maths Bits 5th Lesson Measures of Lines and Angles

Question 40.
In the adjacent figure, ∠AOB = ________.

TS 6th Class Maths Bits 5th Lesson Measures of Lines and Angles 13

A) 0°
B) 90°
C) 360°
D) 180°
Answer:
D) 180°

Question 41.
Which letter of English alphabet is an example for perpendicular lines ?
A) V
B) T
C) M
D) P
Answer:
B) T

Question 42.
Which letter of English alphabet is an example for both perpendicular lines and parallel lines ?
A) H
B) L
C) X
D) Z
Answer:
A) H

TS Board 6th Class Maths Bits 5th Lesson Measures of Lines and Angles

Question 43.
The edges of this instrument are perpendicular to each other ?
A) Divider
B) Compass
C) Set squares
D) Protractor
Answer:
C) Set squares

Question 44.
The type of angle formed between the hands of a clock at 6 ‘O’ clock in the evening ________.
A) Straight line
B) Acute angle
C) Obtuse angle
D) Right angle
Answer:
A) Straight line

Question 45.
At what time the two hands of a clock coincide?
A) At 3′ o clock in the evening
B) At 4′ o clock in the evening
C) At 12 noon
D) At 9′ o clock in the morning
Answer:
C) At 12 noon

TS Board 6th Class Maths Bits 5th Lesson Measures of Lines and Angles

Question 46.

TS 6th Class Maths Bits 5th Lesson Measures of Lines and Angles 14

from the adjacent figure ∠AOC = ∠BOC then ∠BOC = _____ °?
A) 90°
B) 45°
C) 30°
D) 60°
Answer:
B) 45°

Identify the angle of given figures.

Question 47.

TS 6th Class Maths Bits 5th Lesson Measures of Lines and Angles 15

∠XYZ is ________ angle.
A) Acute
B) Right
C) Obtuse
D) Straight
Answer:
A) Acute

TS Board 6th Class Maths Bits 5th Lesson Measures of Lines and Angles

Question 48.

TS 6th Class Maths Bits 5th Lesson Measures of Lines and Angles 1+

∠PQR is ________ angle.
A) Acute
B) Right
C) Obtuse
D) Straight
Answer:
C) Obtuse

TS 10th Class Physical Science Important Questions Chapter 2 Chemical Equations

These TS 10th Class Physical Science Chapter Wise Important Questions Chapter 2 Chemical Equations will help the students to improve their time and approach.

TS 10th Class Physical Science Important Questions Chapter 2 Chemical Equations

1 Mark Questions

Question 1.
What are the reactants and products in a chemical reaction.
Answer:
The substances which undergo chemical changes In a reaction are called reactants and the new substances formed are called products.

Question 2.
What Is meant by balanced equation?
Answer:
A chemical equation Is said to be balanced when the number of atoms of each element is same on both reactant side and product side.

Question 3.
If you keep an iron piece in solid-state CuSO4 crystals, does it get any reaction? Guess the reason.
Answer:
Reaction will not takes place if an ¡ron piece is placed in solid state CuSO4 crystals because there will not exist separate Cu2+, SO4-2 ions in CuSO4 crystals. In aqueous solution, they exists. So iron cannot displace copper.

Question 4.
Baiancethefollowlng equations.
(1) Na + O2 → Na2O
(2) H2O2 → H2O + O2
(3) Mg(OH)2 + HCl → MgCl2 + H2O
(4) Fe + O2 → Fe2O3
Answer:
(1) 4Na + O2 → 2Na2O
(2) 2H2O2 → 2H2O + O2
(3) Mg(OH)2+ 2HCl → MgCl2 + 2H2O
(4) 4Fe + 3O2 → 2Fe2O3

TS 10th Class Physical Science Important Questions Chapter 2 Chemical Equations

Question 5.
Balance the following equations. (AS1)
(1) Al(OH)3 → Al2O3 + H2O
(2) NH3 + CuO → Cu + N2 + H2O
(3) Al2(SO4)3 + NaOH → Al(OH)3 + Na2SO4
(4) HNO3 + Ca(OH)2 → Ca(NO3)2 + H2O
(5) NaOH + H2SO4 → Na2SO4 + H2O
(6) BaCl2 + H2SO4 → BaSO4 + HCl
Answer:
(1) 2Al(OH)3 → Al2O3 + 3H2O
(2) 2NH3 + 3CuO → 3Cu + N2 + 3H2O
(3) Al2(SO4)3+ 6NaOH → 2Al(OH)3 + 3Na2SO4
(4) 2HNO3 + Ca(OH)2 → Ca(NO3)2 + 2H2O
(5) 2NaOH + H2SO4 → Na2SO4 + 2H2O
(6) BaCl2 + H2SO4 → BaSO4 + 2HCl

Question 6.
What is a chemical equation?
Answer:
Describing a chemical reaction using least possible words or symbols is called a chemical equation.
Ex : CaO + H2O → Ca(OH)2

Question 7.
MnO2 + 4HCl → MnCl2+ 2H2O + Cl2. In the given equation, name the compound which is oxidized and which is reduced?
Answer:
In the above equation Ha compound is oxidized and MnO2 is reduced.

Question 8.
What happens If the copper sulphate crystals taken into dry test tube are heated?
Answer:

  1. When copper sulphate crystals are heated, water present in crystals is evaporated and the salt turns white.
  2. Evaporated water appears as droplets on the walls of the test tube.
  3. Blue-coloured copper sulphate (CuSO45H2O) is turned into white colour beacuse 5H2O molecules are evaporated from crystals.

Question 9.
Write the equation for the chemical decomposition reaction of silver chloride In the presence of sunlight.
Answer:
TS 10th Class Physical Science Important Questions Chapter 2 Chemical Equations 1

2 Marks Questions

Question 1.
What do you observe during chemical change?
Answer:
During chemical change, we observe that

  1. The original substances have their characteristic properties. Hence these may be products with different physical states colours and different compositions.
  2. Chemical changes may be exothermic or endothermic.
  3. They may form an Insoluble substance known as precipitate.
  4. There may be gas liberation in a chemical danger.

Question 2.
How do you Write a chemical equation?
Answer:

  1. A chemical reaction, written tri the form of formula equation, shows the change of reactants to products by an arrow placed between them.
  2. The reactants are written on the left side of arrow and the final substances or products are written on the right side of the arrow.
  3. The arrowhead points towards the products and shows the direction of reaction.
  4. If there are more than one reactant or product involved in the reaction, they are separated with a plus (+) sign between them.

TS 10th Class Physical Science Important Questions Chapter 2 Chemical Equations 2

Question 3.
What are the effects of oxidation on everyday life?
Answer:
1. Combustion is the most common example for oxidation reactions.
2. Rising of dough with yeast depends on oxidation of sugars to carbon dioxide and water.
3. Metals are corroded due to oxidation.
4. Bleaching of coloured objects using moist chlorine.
Cl + H2O → HOCl + HCl
HOCl → HCl + (O)
Coloured object + (0) → Colourless object (Here O’ is known as Nascent oxygen)
5. Sometimes during rainy season the power supply to our homes from the electric pole will be interrupted due to formation of metal oxide layer on the electric wire. This metal oxide is an electrical insulator. On removing the metal oxide layer formed on the wire with sandpaper, supply of electricity can be restored.

TS 10th Class Physical Science Important Questions Chapter 2 Chemical Equations

Question 4.
What are the important characteristics of chemical reactions?
Answer:
The important characteristics of chemical reactions are

  1. Evolution of a gas
  2. Formation of a precipitate
  3. Formation of new substances,
  4. Change in colour
  5. Change in temperature
  6. Change in state

Question 5.
Write some chemical reactions occurring in our daily life.
Answer:

  1. Souring of milk
  2. Formation of curd from milk
  3. Cooking of food
  4. Digestion of food in our body
  5. Fermentation of grapes
  6. Rusting of iron
  7. Burning of fuels
  8. Burning of cooking gas
  9. Ripening of fruits.

Question 6.
What symbols do we use to indicate the physical state of reactants and products In an equation?
Answer:

  1. Solid state is indicated by the symbol (s)
  2. Liquid state is indicated by the symbol ( l )
  3. Gaseous state is indicated by the symbol (g)
  4. Aqueous solution is indicated by the symbol (aq)
  5. Precipitate Is Indicated by an arrow with head downwards (↓)

Question 7.
Comment on “C(s) + O2(g) → CO2(g) + Heat’ equation.
Answer:

  1. The burning of carbon In oxygen Is an exothermic reaction because heat is evolved in this reaction.
  2. An exothermic reaction is indicated by writing + Heat or + Heat energy or just+ Energy on product side of an equation.

Question 8.
Comment on ‘N2(g) + O2(g) + Heat → 2NO(g)” equation.
Answer:

  1. The reaction between nitrogen and oxygen to form Nitrogen Monoxide is endothermic reaction because heat is absorbed n this reaction.
  2. An endothermic reaction is usually indicated by writing + Heat or Just ‘+ Energy on the reactants side of an equation.

Question 9.
2Cu + O2 → 2CuO What information do you get from above equation?
Answer:
The above equation tells us that.

  1. Copper reacts with oxygen to form copper oxide.
  2. The formula of copper oxide.is, CuO and that of oxygen is
  3. 2 moles of copper atoms react with 1 mole of oxygen molecules (O2) to produce 2 moles of copper oxide (CuO).

Question 10.
Balance the following chemical equation and follow the steps involved in balancing a chemical equation.
Cu2S + O2 → Cu2O + SO2
Answer:
Step 1: Write the unbalanced equation using correct chemical formula for all substances
Cu2S + O2 → Cu2O + SO2
Step 2: Compare no. of atoms of each element on both sides.

AtomNo. of atoms in L.H.S.No. of atoms in R.H.S.
Cu22
S11
O23

Balancing Cu, S, O atoms both sides
2Cu2S + 3O2 → 2Cu2O + 2SO2
The equation is balanced.

Step 3: Write the co-efficient smallest ratio.
2Cu2S +3O2 → 2Cu2O + 2SO2

Step 4: Verify above equation for balancing of atom of each element on both sides.
2Cu2S + 3O2 → 2Cu2O + 2SO2

Question 11.
Observe the following balanced chemical equation and answer the given questions.
C3H8(8) + 5O2(g) → 3CO2(g) + 4H2O(g)
(i) How many molecules of Oxygen are involved In this chemical reaction?
(ii) How many moles of Propane are required to get 20 moles of Water?
Answer:
(i) In this chemical reactIon five molecules of oxygen are involved.
(ii) Five moles of propane are required to get 20 moles of water.

Question 12.
Write the products of given reactions, if any. Give reason.
FeCl2 + Zn →
ZnCl2 + Fe →
Answer:
FeCl2 + Zn → ZnCl2+Fe (Displacement reaction)
ZnCl2 + Fe → No reaction. (Low reactive metals cannot displace high reactive metals).

TS 10th Class Physical Science Important Questions Chapter 2 Chemical Equations

Question 13.
Balance the following chemical equations:
(i) Na+ H2O → NaOH+H2
(ii) K2CO3+HCl →KCl+H2O+CO2
Answer:
(i) 2Na + 2H2O → 2NaOH + H2
(ii) K2CO3 +2HCl → 2KCl + H2O+CO2

4 Marks Questions

Question 1.
What are the materials required for the experiment to show the chemical decomposition of water? Write the procedure of the experiment. Name the products which we get in this reaction.
Answer:
Material required for chemical decomposition of water:
A plastic mug, two carbon rods, two corks, two test tubes, connecting wires, 9V battery, water, and some drops of acid.

Procedure:

  1. Take a plastic mug, drill holes at the base.
  2. Fit two one-holed rubber stoppers in these holes.
  3. Insert two carbon electrodes in these rubber stoppers.
  4. Connect the electrodes to 9V battery.
  5. Fill the mug with water, so that the electrodes are immersed.
  6. Add few mops of any acid.
  7. Take two test tubes tilled with water and insert them over the two carbon electrodes.
  8. Switch or’ the circuit and leave the apparatus undisturbed for some time.
  9. We notice the liberation of bubbles at both the electrodes. These bubbles displace the water in the test tubes.
  10. After the test tubes are filled with gas, take them out and test the gases with the burning match Stick.

The products which we get in this reaction:
The gases are condensed oxygen and hydrogen.

Question 2.
Explain the steps involved in balancing a chemical equation with an example.
(or)
Why should we balance a chemical equation? Take any one chemical equation and explain the procedure of balancing it.
Answer:
A chemical equation in which the number of atoms of different elements on the reactants side are same as those on product side is called a balanced equation.
Steps involved In balancing a chemical reaction: Let us consider the combustion reaction of Propane.
Step 1: Write the unbalanced equation using correct chemical formulae for all substances.
C3H8 + O2 → CO2 + H2O (Skeleton equation)

Step 2: Compare number of atoms of each element on both sides.
TS 10th Class Physical Science Important Questions Chapter 2 Chemical Equations 3

Find the coefficients to balance the equation. In this case, there are 3 carbon atoms on the left side of the equation but only one on the right side. If we add a coefficient of 3 to CO2 on the right side the carbon atoms balance.
C3H8 + O2 → 3CO2 + H2O
Now, look at the number of hydrogen atoms. There are 8 hydrogen atoms on the left but only 2 on the right side. By adding a coefficient of 4 to the H2O on the right side, the hydrogen atoms get balanced.
C3H8+ O2 → 3CO2 + 4H2O
Finally, look at the number of oxygen atoms. There are 2 on the left side but 10 on the right side. By adding a coefficient of 5 to the 02 on the left side, the oxygen atoms get balanced.
C3H8 + 5O2 → 3CO2 + 4H2O

Step 3: Make sure the coefficients are reduced to their smallest whole number values. The above equation is already with the coefficients in smallest whole numbers. There is no need to reduce its coefficients. Hence the final equation is
C3H8 + 5O2 → 3CO2 + 4H2O

Step 4: Check the answer. Count the numbers and kinds of atoms on both sides of the equation to make sure they are the same.

Question 3.
How to make a chemical equation more informative?
Answer:
Chemical equations can be made more informative by expressing the following characteristics of the reactants and products.
(i) Physical state
(ii) Heat exchange (exothermic or endothermic change)
(iii) Gas evolved (if any)
(iv) Precipitate formed (If any)
(i) Expressing the physical state: The physical state of the substances maybe mentioned along with their chemical formulae. The different states i e., gaseous, liquid and solid states are represented by the notations(g), (I) and (s) respectively. If the substance is present as a solution in water, it Is represented as (aq).
Eg : Fe2O3(s) + 2Al(s) → 2Fe(s) +Al2O< sub>3(s)

(ii) Heat exchange: Heat is liberated in exothermic reactions and heat is absorbed in endothermic reactions.
Eg: 1. C(s) + O2(g) → CO2(g) + Q (exothermic reaction)
2. N2(g)+ O2(g) → 2NO(g) — Q (endothermic reaction)
(or) TS 10th Class Physical Science Important Questions Chapter 2 Chemical Equations 4

(iii) Gas evolved: If a gas is evolved in a reaction, it is denoted by an upward arrow ↑or (g)
Eg: Zn(s) + H2SO4(aq) → ZnSO4(aq) + H2(g)

(iv) Precipitate formed: If a precipitate is formed in the reaction, it Is denoted by a downward arrow.
Eg : AgNO3(aq) + NaCl(aq) → AgCl(s) ↓ + NaNO3(aq)

Question 4.
Balance the following chemical equations.
(a) Na2SO4 + BaCl2 → BaSO4 + NaCl
(b) Al4C3 + H2O → CH4 + Al(OH)3
(c) Pb(NO3)2 → PbO + NO2 + O2
(d) Fe2O3 + Al → Al2O3 + Fe
Answer:
(a) Na2SO4 + BaCl2 → BaSO4 + 2NaCl
(b) Al4C3 + 12H2O → CH4 + 4Al(OH)3
(c) 2Pb(NO3)2 → 2PbO + 4NO2 + O2
(d) Fe2O3 + 2Al → Al2O3 + 2Fe

TS 10th Class Physical Science Important Questions Chapter 2 Chemical Equations

Solved Problems

Question 1.
Al(s) + Fe2O3(s) → Al2O3(s) + Fe(s) (atomic masses of Al = 27U, Fe = 56U, and O = 16U)
TS 10th Class Physical Science Important Questions Chapter 2 Chemical Equations 5
Suppose that you are asked to calculate the amount of aluminum, required to get 1120 kg of iron by the above reaction.
Solution:
As per the balanced equation
Aluminium → Iron
54g → 112g
X? → (1120 x 1000)g
∴ xg = \(\frac{(1120 \times 1000) \mathrm{g} \times 54}{112 \mathrm{~g}} \) = 10000 x 54g = 540000 g (or) 540 kg.
To get 1120 kg of iron we have to use 540 kg of aluminum.

Question 2.
Calculate the volume, mass, and number of molecules of hydrogen liberated when 230 g of sodium reacts with excess of water at STP. (atomic masses of Na = 23U), O=16U, and H=1U)
The balanced equation for the above reaction is,
TS 10th Class Physical Science Important Questions Chapter 2 Chemical Equations 6
Solution:
As per the balanced equation
46g of Na gives 2g of hydro9en.
230g of Na gives …………………? g of hydrogen.
\(\frac{230 \mathrm{~g} \times 2 \mathrm{~g}}{46 \mathrm{~g}} \) = 10g of hydrogen.
I gram molar mass of any gas at STP ie, standard temperature 273K and standard pressure 1 bar occupies 22.4 liters known as gram molar volume.

2.0 g of hydrogen occupies 22.4 liters at STP.
10.0 g of hydrogen occupies…… ? litres at STP.
\(\frac{10.0 \mathrm{~g} \times 22.4 \text { litres }}{2.0 \mathrm{~g}}\) = 112 litres
2 g of hydrogen i.e, 1 mole of H2 contains 6.02 x 1023 (H2) molecules 10 g of hydrogen contain ……………………. ?
\(\frac{10.0 \mathrm{~g} \times 6.02 \times 10^{23} \text { molecules }}{2.0 \mathrm{~g}} \) = 30.10 x 1023 molecules = 3.01 × 1024 molecules

Question 3.
Calculate the volume and No. of molecules of CO2 liberated at STP if 50g of CaCO3 is treated with dilute hydrochloric acid which contains 7.3 g of dissolved HCI gas.
Solution:
The Chemical equation for the above the relation is
CaCO3(s) + 2HCl (aq) → CaCl2(aq) + H2O(l) + CO2(g)
As per the stoichiometric equation, 100 g of CaCO3 reacts with 73 kg of HCl to liberate 44 g of CO2.
In the above problem the amount of CaCO3, taken is 50 gm and HCl available is 7.3 g
100g of CaCo3, require 73g of HCl and 50 g of CaCo3 required 36.6 g of HCl but, only 7.3 g of HCI is available.
Hence the product CO2 formed depends only on the amount of HCl which Is in the the least amount but not on the amount of CaCO3 which is an excess. The reactant available in less amount Is called limiting reagent as it limits the amount of prouct formed.

Therefore, we can write
73 g of HCl → 44 g CO2
7.3g of HCl- ?
\(\frac{7.3 g \times 44 g}{73 g}\) = 4.4 g
44 g of CO2 occupies 22.4 L volume at STP
4.4 g of CO2 occupies – ?
\(\frac{4.4 g \times 22.4 L}{44 g} \) = 2,24L
44 g of CO2 contain 6.023 × 1023 mol of CO2 4.4 g Contains – ?
\(\frac{4.4 g \times 6.023 \times 10^{23}}{44 g}\) = 6.023 × 1022 mol

TS 10th Class Physical Science Important Questions Chapter 2 Chemical Equations

Question 4.
Write the equation for the reaction of Zinc with hydrochloric acid and balance the equation. Find out the number of molecules of hydrogen gas produced In this reaction, when 1 mole of HCl completely reacts at S.T.P. [Gram molar volume is 22.4 liters at S.T.P., Avogadro’s number is 6.023 x1023]
Answer:
Zn + HCl → ZnCl2+H2
Zn(s) + 2HCl(l) → ZnCl2(s)+H2(g)
From the above equation
2 moles of HCl produces 1 moIe of H2 gas
1 moIe of HCl produces \(\frac{1}{2}\) mole of H2 gas
1 mole of H2 gas at S.T.P Contains 6.023 x 1023 molecules
\(\frac{1}{2}\) mole of H2 gas contains = \(\frac{6.023 \times 10^{23}}{2}\)
= 3.0115 x 1023 molecules

TS 10th Class Telugu Grammar కవితలు

Telangana SCERT 10th Class Telugu Grammar Telangana కవితలు Questions and Answers.

TS 10th Class Telugu Grammar కవితలు

ప్రశ్న 1.
బలిచక్రవర్తికి వామనుడికి మధ్య జరిగిన సంభాషణ ఆధారంగా ఓ కవితను రాయండి. (June 2018)
జవాబు:
దాతల్లో గొప్పదాత బలి.
సత్యం తప్పనివాడు. కీర్తి కోరేవాడు.
ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం ప్రాణాలు కూడా ధారపోస్తాడు.

కవిత

దాతల్లో గొప్పవాడా ……
మాటను తప్పనివాడా …..
సాయం అనే చేతులకు దారిని చూపేవాడా
ప్రాణం పోతున్న మాటని వీడని వాడా ….
అసురుల చక్రవర్తిగా మెప్పును పొందిన వాడా …..
చివరికి విష్ణు పాదభారాన్ని మోసిన దానస్వరూపుడా….
ప్రాణాన్ని విడిచి చరిత్రలో నిలిచిన దానశీలుడా ….

TS 10th Class Telugu Grammar కవితలు

ప్రశ్న 2.
చదువుకునేవారైనా, పనిచేసేవారైనా, మరెవరైనా సరే తీవ్ర ఒత్తిడికి లోనైతే వారి వారి పనులను సరిగా చేయలేక తీవ్ర ఇబ్బందుల పాలౌతారు. ఈ విషయం చెప్పడానికి “సుఖం – దుఃఖం – విజయం – లోకం – మోదం – ఘోరం” లాంటి అంత్యానుప్రాస పదాలు వాడి ఒక కవిత చెప్పండి. (March 2018)
జవాబు:
చదువుకునేవారు :
విద్యార్జనమిస్తుంది సుఖం
సోమరితనమిస్తుంది దుఃఖం
విద్యావంతులు సాధిస్తారు విజయం
పొందుతారు జనులందరి ఆమోదం
విద్యాధికులతో భరతకు ప్రమోదం
విద్యావిహీనుల కెపుడు భేదం
ధనలేమితో ఒత్తిళ్ళ సుడిగుండాలు
దినభృతి లేక నిత్యమూ ప్రాణగండాలు
అంతం కాదిది – పునరావృతమయ్యే నిత్యాగ్ని గుండాలు
అందుకే ప్రతి జీవికి కావాలి సహనాభరణం.

పనిచేసేవారు:
కష్టార్జితం కల్గిస్తుందెపుడు సుఖం
పరభాగ్యోప జీవితం సదా దుఃఖం
శ్రమను నమ్ముకొన్నవాడికి విజయం
శ్రమను దోచు కొన్నవాడికి అపజయం
గతిలేని బడుగుల బ్రతుకులు ఘోరం
ఆకటికై తపించు శ్రామికుల లోకం
శ్రమశక్తిని ధరించు కార్మికుల ప్రపంచం
వ్యవసాయాన్ని వహించు కర్షకులలోకం
సంతృప్తే వారికి ప్రమోదం
సహజీవనమే వారి కామోదం

TS 10th Class Telugu Grammar కవితలు

ప్రశ్న 3.
‘మీకు తెలిసిన ప్రసిద్ధమైన నగర విశేషాలను’ వర్ణిస్తూ కవిత రాయండి. (June 2017)
జవాబు:
నగర జీవితం నగరవాసులకొక వరం !
సకల సదుపాయాల సమాహారం
వినోదాల విన్యాసాల కళాతోరణం
విశిష్ట వినూత్న భవన నిర్మాణ సమాహారం

విశాల రహదారుల కళాతోరణం
విద్యా వైజ్ఞాన కేంద్రాల నిలయస్థానం
సాహిత్య సమావేశాల మణిహారం
మాన్యనాయకగణా నివాస మందిరం

నివసించాలి ప్రజలందరిక్కడ
సిరిసంపదలతో తులతూగాలిక్కడ
పర్యావరణాన్ని రక్షించి కాపాడాలిక్కడ
అప్పుడే అవుతుంది సుఖమయం నగర జీవనం.

ప్రశ్న 4.
‘గోలకొండ పట్టణము’ లోని అందచందాలను ‘వచన కవిత’ రూపంలో రాయండి. (June 2016)
జవాబు:
గోలకొండ దక్షిణాపథమ్మున అలరె
జగతికి జాగృతిని కల్పించె
తెలంగాణమ్ములన మకుటాయమానమ్ముగ
నిలచె గగన తలంబుదాక !

శిల్పకళావైభవంబున కొదువలేదు
నిర్మాణ కౌశలమ్మునకు ఎదురు లేదు

ప్రకృతిరమణీయతకు తిరుగులేదు.
చూచినంతనే చూడాలనిపించు
వ్యాపార సామ్రాజ్యమునకు నెలవుగా నిలిచె
రామదాసు కీర్తనలకు ఆలవాలమాయె
పాలకుల ఏలుబడిలో జీవకారుణ్యం అలరె
సకల వసతులకు మూలకేంద్రమాయె.

TS 10th Class Telugu Grammar కవితలు

ప్రశ్న 5.
వెన్నెలను వర్ణిస్తూ చిన్నపదాలతో ఒక కవిత రాయండి.
జవాబు:
“వెన్నెలా ! కన్నెపిల్లల చిన్నారి ముద్దుల చెల్లెలా !
వెన్నెలా ! ప్రేమికుల మనసుల మల్లెచెండులా
వెన్నెలా ! చంద్రుని చిరునవ్వుల పన్నీరులా
వెన్నెలా ! పసిపాపల ముద్దుల బోసి నవ్వులా
వెన్నెలా ! కన్నతల్లులు కమనీయ రాగవెల్లిలా
వెన్నెలా ! మా చిన్నారి పొన్నారి చూపులా
వెన్నెలా ! కలువల చుట్టపు చూపులా
వెన్నెలా ఉన్నావు, చల్లావు చంద్రికలు
నయనారవిందాల నయగార మధురిమలు”

ప్రశ్న 6.
బలిచక్రవర్తికి, వామనుడికి మధ్య జరిగిన సంభాషణ ఆధారంగా ఓ కవితను రాయండి. (June 2018)
జవాబు:
ఏమి ఇది ఏమి ఇది మహాతేజం
అపురూపం – హరి రూపం,
అపురూపం – శ్రీహరి రూపం
వడివడిగా వచ్చెను ఒక వడుగు
పాపాలను పరిమార్చె పిడుగు
తడబాటు ఎరుగదు అతని అడుగు
ధన్యుల తలపై ముడవని గొడుగు.
అహో ఏమి రూపం, అఖిల లోకాలకు దీపం.   – సేకరణ

TS 10th Class Telugu Grammar కవితలు

ప్రశ్న 7.
చదువుకునేవారైనా, పనిచేసేవారైనా, మరెవరైనా సరే తీవ్ర ఒత్తిడికి లోనైతే వారి వారి పనులను సరిగా చేయ లేక తీవ్ర ఇబ్బందుల పాలౌతారు. ఈ విషయం చెప్పడానికి “సుఖం – దుఃఖం – విజయం – లోకం – మోదం – ఘోరం” లాంటి అంత్యానుప్రాస పదాలు వాడి ఒక కవిత చెప్పండి.   (March 2018)
జవాబు:
చదువుకునేవారు :
విద్యార్జనమిస్తుంది సుఖం
సోమరితనమిస్తుంది దుఃఖం
విద్యావంతులు సాధిస్తారు విజయం
అపుడందరూ తెల్పుతారు ఆమోదం
విద్యాధికులతో భరతకు ప్రమోదం
విద్యా విహీనుల కెపుడు భేదం
ధనలేమితో ఒత్తిళ్ళ సుడిగుండాల
దినభృతి లేక నిత్యమూ ప్రాణగండాలు
అంతం కాదిది-పునరావృతమయ్యే నిత్యాగ్నిగుండాలు.
అందుకే ప్రతి జీవికి కావాలి సహనాభరణం.

పనిచేసేవారు :
కష్టార్జితం కల్గిస్తుందెపుడు సుఖం
పరభాగ్యోప జీవితం సదా దుఃఖం
శ్రమను నమ్ముకొన్నవాడికి విజయం
శ్రమను దోచు కొన్నవాడికి అపజయం
గతిలేని బడుగుల బ్రతుకులు ఘోరం
ఆకటికై తపించు శ్రామికుల లోకం
శ్రమశక్తిని ధరించు కార్మికుల ప్రపంచం
వ్యవసాయాన్ని వహించు కర్షకులలోకం
సంతృప్తే వారికి ప్రమోదం
సహజీవనమే వారి కామోదం

TS 10th Class Telugu Grammar కవితలు

ప్రశ్న 8.
మీకు తెలిసిన ప్రసిద్ధమైన నగర విశేషాల్ని వర్ణిస్తూ ఒక కవితను వ్రాయండి. (June 2017)
జవాబు:
అందమైన నగరం – మన ‘భాగ్యనగరం’
అద్భుతమైన నగరం – అందాలకు నిలయం
భిన్న సంస్కృతులకాలయం – ఉన్నతమైన మేడలకావాసం
జంట నగరాలకనుసంధానం – విశాల ‘హుస్సేన్ సాగరం’
వింతవింతల మహాలయం – వినూత్న సాలార్జంగ్ మ్యూజియం
హైటెక్ సిటీల నిర్మాణం – హిందూ ముస్లిం సమైక్యతకు నిదర్శనం
చూడాలి నిలువెత్తు బుద్ధ విగ్రహం – చూసి తరించాలి బిర్లామందిరం
ఎన్నెన్నో విశ్వవిద్యాలయాలు – అన్నువైన ఉద్యానవనాలు
ఘనతకెక్కిన అసెంబ్లీ భవనం – వన్నె కెక్కిన రాజభవనాలు
ఇంకా ఎన్నెన్నో చారిత్రక విశేషాలు – త్యాగజీవులైన వారి అవశేషాలు
ఇది అందాల సుందరనగరం – భాగమతికై ఏర్పడిన భాగ్యనగరం

ప్రశ్న 9.
గోల్కొండ పట్టణంలోని అందచందాలను ‘వచన కవిత’ రూపంలో వ్రాయండి. (June 2016)
జవాబు:
గోల్కొండ నిర్మాణం – కోర్కెలకు నిలయం
గోల్కొండ వైభవం – నిజాం కీర్తికి నిదర్శనం
విశాల నగరవీధులు – వేర్వేరుగ మొహల్లాలు
సరదార్ల మేడలు – సరదాలకు నిలయాలు
నగీనాబాగ్ తోట – అందాలకు రాశులచట
రాజ హార్మ్యం సొగసుచూడ – షాహిమహలు తెరచి చూడు
దిల్ కుషా భవనం – సౌందర్య నిలయం
గోల్కొండ సొగసుపెంచే – ఉద్యానములచట మించె
`మిద్దెమీది తోటలు – శిల్పుల నేర్పుకు గీటురాళ్ళు
బాల్బోవా వృక్షం – నేత్రపర్వ దృశ్యం
అందాల గోల్కొండ – చేయును కనులవిందు.

TS 10th Class Telugu Grammar కవితలు

ప్రశ్న 10.
‘అమ్మ’ను గూర్చి వివరిస్తూ అంత్యప్రాసలతో ఒక కవిత వ్రాయండి.
జవాబు:
జన్మనిచ్చిన కన్నతల్లి – వరముల నొసగె పాలవెల్లి
కరుణలు వెదజల్లు కల్పవల్లి – కనికరించి కాచు బంగారు తల్లి
తొలి నడకలు నేర్పిన నవమల్లి – చేయూతగ నిల్చిన సిరిమల్లి.
కమ్మనైన పిలుపుకు అమ్మ – తీయనైన పలుకుకు అమ్మ
తనివితీర లాలించేది అమ్మ – పరవశించి పాలించేది అమ్మ
పేగుబంధం తెలిపేది అమ్మ – ప్రేమబంధంతో ముడిచేది అమ్మ
అమ్మ పలుకు అమృతం – అమ్మ దీవెన సుకృతం
మమకారానికి మారుపేరు అమ్మ
మమతాశలను పంచేది అమ్మ.
కంటికి రెప్పయై కాచేది అమ్మ
కడుపును కాంచుచు ప్రోచేది అమ్మ
ప్రగతికి మూలం అమ్మ
జగతికి దైవం అమ్మ

ప్రశ్న 11.
పల్లె సౌందర్యాన్ని వర్ణిస్తూ పది పంక్తుల వచన కవిత వ్రాయండి.
జవాబు:
పల్లెసీమల అందాలు
ప్రకృతి విడిన చందాలు
భరతమాతకివి మూలధనాలు
జానపదుల గీతాలు – జాగృతులొసగే ప్రభాతాలు
పల్లీయుల జీవితాలు పరిమళించే కంజాతాలు
భాసిలు ముగ్గుల వాకిల్ళు – పసిడిపంటల లోగిళ్ళు
పిల్ల కాలువల తియ్యని నీళ్ళు – తివాసీలు పరచిన పచ్చికబీళ్ళు
కోడెల గెంతుల సందళ్ళు – పామరుల యింట శోభిల్లు
కోకిలల కిలకిలారవాలు – గువ్వ పిట్టల కువకువలు
క్రేల కృతుల విన్యాసాలు – మనోహర సౌందర్య దృశ్యాలు
సొంపైన రొదరొదలతో – కమ్మటి సువాసనలతో
తియ్యటి తీపుల దినాలు – అవ్యాజ ప్రేమలిడే జనాలు

TS 10th Class Telugu Grammar కవితలు

ప్రశ్న 12.
జీవనభాష్యం గజల్స్ ని అంత్యప్రాసల ఆధారంగా సొంతంగా ఒక వచన కవితను వ్రాయండి.
జవాబు:
శాంతి సమీరం వీచితే
కోపాగ్నిభం నీరవుతుంది .
పదిమంది పెద్దలు నడిస్తే
లోకానికది దారవుతుంది
నేలను దున్ని విత్తితే
తప్పక ఆశల పైరవుతుంది.
కులమత గోడలు కూల్చితే
ఆ సమాజమే నీ ఊరవుతుంది
వాగులు వంకలు కలిస్తే
ఎడతెగని పారే ఏరవుతుంది.
సత్యం ధర్మం న్యాయం నీదయితే
జగతిలో చెరగని నీ పేరవుతుంది.
ఆపన్నుల ప్రేమను కాచితే
ఆనందం నీ సహవాసమవుతుంది.

ప్రశ్న 13.
‘భిక్ష, రక్ష, పరీక్ష, సమీక్ష, వివక్ష’ వంటి పదాలతో ఒక చక్కని భావాన్ని ప్రకటించి, ప్రశంసిస్తూ ఒక కవితను వ్రాయండి.
జవాబు:
మహాత్మా ! నీవు పురుషోత్తముడవు !
బానిసత్వంలో మగ్గిన భరతను సమీక్ష చేశావు
దక్షత కల్గిన నీ మనోధైర్యంతో ముందుకు నడిచావు
ఆంగ్లేయులు పెట్టిన పరీక్షలో నెగ్గావు
స్వాతంత్ర్య సమరంలో వివక్ష చూపక జగతిని ఒకే తాటిపై నడిపావు
సత్యాహింసల ధర్మాలే నీకురక్ష అయ్యాయి.
స్వాతంత్ర్య ఫలాల్ని మాకు భిక్షగా ఒసగినావు.
అందుకే నీవు జాతిపితవు. మా గాంధీ తాతవు.

TS 10th Class Telugu Grammar కవితలు

ప్రశ్న 14.
నగరజీవనంలోని అనుకూల అంశంపై కవిత రాయండి.
జవాబు:
నవ్య నాగరికతకు నిలయం – నగర జీవనం
భవ్య భవితకు ఆదర్శం – నగర జీవితం

ఉపాధి అవకాశాలకు నిలయం
ఉన్నత స్థితికెపుడు ఆలవాలం

దీనభత్యం ఎంతైనా లభించు నచట
కూలివానికెపుడు పర్వమే అచట

దినదినాభివృద్ధి చెందురచట
కోర్కె లీడేరు సర్వము నచట

దొరకని వస్తువు లేవీ ఉండవచట
తెలియని విద్యలేవీ ఉండవచట

సదుపాయాలు ఎన్నెన్నో కలవచట
సకల నిధులు సమకూరునచట

నిజం నిజం నగర జీవనం
సౌఖ్యాలకు మూలం నగర జీవితం

TS 10th Class Telugu Grammar కవితలు

ప్రశ్న 15.
‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది’ – ఈ అంశాన్ని గూర్చి ఒక కవిత వ్రాయండి.
జవాబు:
నవ తెలంగాణ సాధనకై నడుం బిగించి
శ్రీకారం చుట్టి;
నడిపించిరి ఉద్యమాల పోరు బాటలో
ఆవిష్కారం కావించి,
నరసింగములై దుర్మార్గుల్ని చీల్చి చెండాడి
ఘీంకారం చేసి,
ననలెత్తిన మతోన్మాదుల సైతం
అహంకారాల్ని త్రుంచి,
నవకోవిదులు శక్తియుక్తులతో నైజాం రాజుల
అహంకారాన్ని త్రుంచి,
నమ్మిన సిద్ధాంతాలలో నయవంచకుల్ని
మట్టుబెట్టి సాకారం చేసి,
ననలెత్తిన మతోన్మాదుల చీత్కారాల్ని
నశింపచేసి,
నలువంకలు విప్లవాత్మకమైన కదలికలతో
పరిష్కారం చూపించి,
కోటి రతనాల వీణల సుస్వర గీతాలకు
ఓంకారం పలికారు
పూత్కారం గొన్న నవ తెలంగాణకు
తెలంగాణ భాషానుడికారాలతో
స్వాగత చందనాలర్పించారు.
మమకారాలతో సత్కారం కావించి
నవ్యాకారం చేశారు.
నవ తెలంగాణకు శ్రీకారం నడిపించిన ఉద్యమాలకు సాకారం

TS 10th Class Telugu Grammar కవితలు

ప్రశ్న 16.
‘ఓ విద్యార్థి’ శీర్షికన జాగృతం చేస్తూ అంత్య ప్రాసలతో కవిత వ్రాయండి.
జవాబు:
ఓ విద్యార్థీ !
పొందాలి జ్ఞాన కిరణాలు
కావాలి సహనాభరణాలు
వెతకాలి నీవు కారణాలు
చేయకూడదు సదారణాలు
మహనీయుల సంస్మరణాలు
భావిపౌరులకవి తోరణాలు
కోరాలి వాగ్దేవి శరణాలు
స్మరించాలి సదా ఆ తల్లి చరణాలు

ప్రశ్న 17.
అడుగు, కడుగు, గొడుగు, బుడుగు పదాలను అంత్యప్రాసగా ఉపయోగించి వామనావతారంపై కవితను రాయండి.
జవాబు:
వామనుడైన బుడుగు
చేతబట్టెను గొడుగు
బలిని తొక్కిన అడుగు
రాక్షసత్వాన్ని కడుగు – కంచిభొట్ల ఫణిరామ్

TS 10th Class Telugu Grammar కవితలు

ప్రశ్న 18.
‘నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది’ అంటూ మాట్లాడాల్సిన విధానాన్ని వచన కవితలో రాయండి.
జవాబు:
ప్రశ్నేదైనా సరే, ప్రేమతో బదులిస్తే మనం గడిపే
ప్రతిరోజూ ఇంకొంచెం అందంగా ఉంటుంది.
నీ పరిస్థితిని ఎప్పుడూ, ఎవ్వరూ ఆలోచించరు,
నీ పలకరింపును మాత్రమే గుర్తు పెట్టుకుంటారు.
అది మనిషి సహజ స్వభావం
కాకి – కోకిల రెండూ అరుస్తాయి.
కానీ కాకిది గోలంటారు, కోకిలది పాటంటారు.
ఆలోచించు ఎందుకో !
బదులిచ్చే విధానంతోనే సగం ప్రపంచాన్ని గెలిచేయవచ్చు. – సేకరణ

ప్రశ్న 19.
చదువు చెప్పే గురువును చదువుకొనే రోజుల్లో ఒకలా, చదువు పూర్తయిన తర్వాత మరోలా భావిస్తాం. ఆ భావాలకు అక్షర రూపం ఇస్తూ ఒక వచనకవిత రాయండి.
జవాబు:
అక్షరాలు దిద్దిస్తున్నప్పుడు తెలియలేదు
నా జీవితాన్ని మలుపు తిప్పుతున్నారని
కోపగించుకున్నప్పుడు తెలియలేదు
నాపై బాధ్యతను పెంచుకుంటున్నారని
చేతిమీద కొట్టినప్పుడు తెలియలేదు
నా చేతులకి పదును పెడుతున్నారని
ప్రశ్నలడిగినపుడు తెలియలేదు
నా ఆత్మ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారని
మార్కులిస్తున్నప్పుడు తెలియలేదు
నాలో సామర్థ్యాన్ని నింపుతున్నారని
కానీ ……….

ఈ క్షణం తెలిసింది.
నాలో ఒక విశాల ప్రపంచాన్నే సృష్టించారని,
నన్ను ఒక మహాశక్తిగా మలిచారని …………
కాలం వెనక్కి వెళితే, మళ్ళీ
మీ చేతి దెబ్బలు తింటూ మీ అనురాగానికి
పాత్రులం కావాలనుందీ. – సేకరణ

TS 10th Class Telugu Grammar కవితలు

ప్రశ్న 20.
ఓటమిని చూసి భయపడాల్సిన అవసరం లేదని చెబుతూ ఒక వచన కవిత రాయండి.
జవాబు:
నడుస్తున్న కాళ్ళు మనకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పిస్తాయి.
ముందున్న కాలికి గర్వం లేదు.
వెనుకున్న కాలికి అవమానం లేదు.
ఎందుకంటే
ఆ రెండింటికి తెలుసు,
వాటి స్థానం మారటానికి ఒక్క క్షణం చాలు అని. – సేకరణ

ప్రశ్న 21.
కలాన్ని ఆయుధంగా చేసుకొని సమాజం బాగుకోసం కవిత్వాన్ని రాసిన కవులను స్మరిస్తూ ఒక వచన కవిత రాయండి.
జవాబు:
బుద్ధి బలాన్ని సిరాగా మార్చి కలం పట్టిన
కవులకు మనమేమివ్వగలం ?
విలువలకు ఛందస్సులు తొడిగిన ఘనులే !
సాహిత్యపు మాగాణంలో పండిన మణులే !
ఆలోచనలే అక్షర రూపం దాల్చగా
పథం చూపే కథనాలను అందించిన
కవులకు మనమేమివ్వగలం ?
జయంతికో, వర్థంతికో ఓ వందనం తప్ప. – కంచిభొట్ల ఫణిరామ్

TS 10th Class Telugu Grammar కవితలు

ప్రశ్న 22.
ప్రకృతిలో మమేకం అయినపుడు కలిగే భావాలను వచన కవితగా రాయండి.
జవాబు:
గురువులు శిష్యులకు కల్పతరువులు
పెద్దల మాటలు అనుభవాల పాఠాలు
ఆనందానుభూతుల చిరుజల్లులు
ఆ సంజ వెలుగులు బంగరు నెలవులు
ఆ పిల్లల నవ్వులు అరవిరిసిన పువ్వులు
అరుణ కిరణాలు ఆనంద తరంగాలు
తరువులు పచ్చదనానికి గురువులు
చెట్లు చేమలు నేలతల్లి సంతకాలు
ప్రకృతి చేవ్రాలు పక్షుల కిలకిలరావాలు
ప్రకృతి కాంత ఆశలు వసంత విలాసాలు – కంచిభొట్ల ఫణిరామ్

ప్రశ్న 23.
“పల్లెలు ప్రకృతికాంతకు పుట్టిళ్ళు” అంటూ పల్లెను గూర్చి కవిత రాయండి.
జవాబు:
విత్తనాలు ఊపిరి పోసుకుంటాయ్ పొలాల్లో
మొక్కలు పిలుస్తుంటాయ్ ప్రేమగా పల్లెల్లో
పద్మాలు కళ్ళు విప్పి చూస్తుంటాయ్ చెఱువు నీళ్ళల్లో
గంటలు మ్రోగుతుంటాయ్ వేదంలా గుళ్ళల్లో !

పల్లె హాయిగా ఉంటుంది ప్రశాంత నిలయంలా
పల్లె అన్నం పెడుతుంది అన్నపూర్ణ దరహాసంలా
పల్లె స్నేహంగా పిలుస్తుంది శాంతి నినాదంలా
పల్లెలో ఆత్మీయతలు పెనవేసుకుంటాయి పేగు బంధంలా !

మానవతా వాదం బ్రతుకుతోంది పల్లెల్లో
అందాలతో ప్రకృతి హాయిగా నవ్వుతోంది పల్లెల్లో
వాడిపోయే ప్రేమలు చిగురిస్తాయి పల్లెల్లో
పాడిపంటలు పదే పదే పలకరిస్తాయి పల్లెల్లో !

అయ్యలార ! అమ్మలార ! అన్నలార ! అక్కలార !
కలసిమెలసి మీరంతా కదలి రండి
మమతాను బంధాల్ని నిలుపుకొని
నేలతల్లికి భక్తితో ప్రణమిల్లుదామ్ ! – కంచిభొట్ల ఫణిరామ్

TS 10th Class Telugu Grammar కవితలు

ప్రశ్న 24.
బడికి తొలిసారిగా వెళ్ళే విద్యార్థి ఎలా ఫీలవుతాడో వచన కవితలో రాయండి.
జవాబు:
బడికి తొలిసారిగా బెరుకుగా, తడబడుతూ వెళ్ళా
అంతకు ముందు వరకు నేనేం చెప్పినా, చేసినా సంతోషించినవాళ్ళే.
కాని ‘అలా వద్దు, ఇలా వద్దు’ అని నియంత్రణ నా పై మొదలైంది నాడే.
ఒక్కసారిగా బడిలో భూలోక యముడిలా, దర్శనమిచ్చాడు గురువు
చేతిలో బెత్తం, పెద్ద గొంతు, ఆ అరుపులకే నోట మాట లేదు కళ్ళలో భయం తప్ప.
కొత్త కొత్త పరిచయాలు, ఏం మాట్లాడాలో ! ఎలా మాట్లాడాలో !
“మాటలు రావా ?” అన్న మాటలు చెవులను తాకుతున్నాయి ‘వచ్చు’ అని
చెప్పాలని వుంది. కానీ ఆ మాట ఎక్కడో నూతిలో ఉందేమో అని అనిపించింది.

తొందరగా బడి వదిలితే బావుణ్ణు అని అనిపించింది.
నాకోసం తొలిసారిగా భగవంతుణ్ణి తలచుకొన్నాను.
అమ్మ గారాబంగా చూస్తే మాటవినని నేను తొలిసారిగా
అమ్మను తొందరగా చూడాలనిపించింది. పలక మీద బలపం ఉంది కానీ మనసు అక్కడ లేదు.
మొత్తానికి ఇంటి గంట కొట్టారు.
పంజరం విడిచిన చిలుకలా, విల్లు వదిలిన బాణంలా
నేనూ ఒకటే పరుగు. ఎవరో పిలుస్తున్నారా. ‘జాగ్రత్తా, పడతావు’
అని. అమ్మో! ఆగితే, ఏమైనా ఉందా. ఏడుపు వస్తోంది.
ఇంటి ముందు అమ్మ నాకోసం నిలబడింది. ఆ రోజు అమ్మ నాకు వరమిచ్చే దేవతలా కనిపించింది.
అందుకే ఇంకా వేగంగా పరుగెత్తాను. – కంచిభొట్ల ఫణిరామ్

ప్రశ్న 25.
‘వీరతెలంగాణ’ పాఠంలోని కొన్ని పదాలను ఉపయోగించి తెలంగాణ స్వాతంత్ర్య ఉద్యమకారుని పోరాటాన్ని కవిత రూపంలో రాయండి.
జవాబు:
ఓ తెలంగాణ వీరుడా !

బానిస బతుకులకు కాలం చెల్లిందంటూ,
బతుకు భారంగా కాలం ఈదలేక,
మనమేం చేయగలం అని కలవరపడక,
మెరుపు తీగలా,
విల్లు విడిచిన బాణంలా,
ఉరికావా, ఉరికంబమెక్కావా ?

ప్రాణాన్ని పణంగా పెట్టిన శూరుడా !
ఓ తెలంగాణ వీరుడా !

గడ్డిపోచలన్నీ మదపుటేనుగును కట్టినట్లు
రక్తం చిందించి నిజాం నవాబును పట్టావా,
తరతరాల బూజును తరిమికొట్టిన ధీరుడా !
నీ త్యాగం వృథా కాలేదు.
భావి తరాలకు స్వేచ్ఛా వాయువులిచ్చి,
అనంత వాయువుల్లో కలసిన ఆప్తుడా !
నీ త్యాగం
మరువం, మరువం, మరువం ……. – కంచిభొట్ల ఫణిరామ్

TS 10th Class Telugu Grammar కవితలు

ప్రశ్న 26.
అంటరానితనం నిరసిస్తూ ఒక కవిత రాయండి.
జవాబు:
“అంటరాని వారెవరో కాదు మా వెంటరానివారే”
అన్న పెద్దల సుద్దులు పెడచెవిన పెట్టే బాబులారా !
ఖురాన్ గీతా బైబిల్ ఏది చెప్పినా
మనుషులంతా ఒక్కటే అన్న సత్యాన్ని మరిచారా !
నన్ను తాకకు అనేది ఓ మానసికమైన జబ్బు.
కులం పేరడిగి తక్కువ చేస్తే బాకుతో కుమ్మినట్టుంది. చెప్పడానికి తుంది.

పాషాణపు చుక్క పాలను విషం చేసినట్లు,
ఈ అస్పృశ్యత సమాజాన్ని కలుషితం చేస్తుంది.
మనిషి ప్రగతికి అడ్డుగోడ ఈ మూఢాచారం కాదా ?
బలహీన మనస్కుల మతం అంటరానితనం అన్న సంగతి మరువకు.

పైకి లేచి వచ్చిన వాడి పల్లకీ మోస్తారు,
కాలు జారిపడ్డ వాణ్ణి లేవదీయడెవ్వడూ అన్న మాటలు నిజం చెయ్యక
మానవత్వాన్ని మంటగొల్పక
సమ సమాజ స్థాపనకు సహకరించవా ?
నిద్రించే వాడిని లేపచ్చు. మేల్కొన్నవాడితో ఇబ్బందే లేదు.
నిద్ర నటించే వాడితోనే సమస్య. నీవు ఇటువంటి వాడివేనా ?
నిర్ణయించుకో ? గుండెను సముదాయించుకో ? – కంచిభొట్ల ఫణిరామ్

TS 10th Class Telugu Grammar కవితలు

ప్రశ్న 27.
తెలుగు వైభవాన్ని తెలుపుతూ ఒక కవిత రాయండి.
జవాబు:
తెలుగు తెలుగు తెలుగు అమ్మలాంటి తెలుగు
ఇది కమ్మనైన తెలుగు
యాబదారు రెక్కలున్న అద్భుతాల పులుగు
ఇది అద్వితీయ వెలుగు తెలుగు

సంస్కృతిలో భాగమైన – సంపద ఈ తెలుగు
నుదుటి బొట్టు తెలుగు – పంచకట్టు తెలుగు
వీధి మోము తొలి సిగ్గుల – ముగ్గులీ తెలుగు
పట్టు పరికిణీ బుగ్గన – మొగ్గలీ తెలుగు

పందిళ్ళకు అల్లుకున్న – పచ్చదనము తెలుగు
హరిదాసు, చిడతల – మేలుకొలుపు తెలుగు
గొబ్బెమ్మలపై నిలుపు – ముద్దబంతి తెలుగు
‘కొమ్ము’లుండి పొగరులేని – నెమ్మదైన తెలుగు
తెలుగు తెలుగు తెలుగు అమ్మలాంటి తెలుగు ఇది కమ్మనైన తెలుగు. – వలివేటి వేంకట శివరామకృష్ణమూర్తి గారు

ప్రశ్న 28.
కోపం వల్ల అనర్థాలు కవిత రూపంలో రాయండి.
జవాబు:
దరి చేరనీయరాదు కోపం.
మనసుకు హాయిని గొల్పేదే శాంతం.
ఉన్నదానితో తృప్తి చెందడం మోక్ష మార్గం.
తోటివారి పట్ల దయను చూపడం సన్మార్గం.
కట్టెను అగ్ని దహించినట్లు, కోపం కల్గిన వ్యక్తి దహించబడదా ?
ఎంతటి వారికైనా నిగ్రహమే ప్రథమ సూత్రం మరియు కర్తవ్యం. – కంచిభొట్ల ఫణిరామ్

TS 10th Class Telugu Grammar కవితలు

ప్రశ్న 29.
రైతుల కష్టాన్ని తెలుపుతూ అంత్యప్రాసగా ‘నీరు’తో కవి రాయండి.
జవాబు:
నేల తల్లి పులకరించేట్టు కురిసింది వాననీరు
తొలకరులు రైతులు పాలిట కావా పన్నీరు
మితిమీరిన వానలు మిగిల్చెను రైతులకు కన్నీరు
పండిన కొద్ది పంటకు ధరలేక విలపించె రైతు కన్నీరు మున్నీరు. – కంచిభొట్ల ఫణిరామ్

ప్రశ్న 30.
మనిషిలోని మనస్తత్వం సరిగాలేదు. ఈ విషయంపై కవి రాయండి.
జవాబు:
కరుగుతున్న కొవ్వొత్తి వెలుగునిస్తోంది,
పెరిగే వ్యక్తి చీకటినేగా ఇస్తా !
తింటుంటే కాకర లోనూ తీపే
కానీ మనిషిలో నిండా చేదే !
విధిని ఎదిరించు వెలుగును చూస్తావు.
వెక్కిరించావో విశ్వంలో కలుస్తావు ! – కంచిభొట్ల ఫణిరామ్

TS 10th Class Telugu Grammar కవితలు

ప్రశ్న 31.
నేటి తెలంగాణను వర్ణిస్తూ ఒక కవిత రాయండి.
జవాబు:
బంగారు తెలంగాణ

కష్టాల కడలిని దాటిన వీరహనుమ మా తెలంగాణ
ఉప్పొంగిన ఆవేశంతో ఏర్పడిన బంగరు కొండ మా తెలంగాణ
పెరుగుతున్న పసిపాప మా పసిమి తెలంగాణ
పచ్చ పచ్చని పైరు సీమల కనక సీమ మా తెలంగాణ
కల్లలెరుగని తేట తెలుగు చిరునామా మా తెలంగాణ
దానం, ధర్మం, నీతి, న్యాయం కలబోత మా తెలంగాణ
విశ్వ విఖ్యాతమైన విజ్ఞాన మేరువు మా తెలంగాణ
మా తెలంగాణ కోటి రత్నాల వీణ

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

Telangana SCERT 10th Class Telugu Grammar Telangana అపరిచిత పద్యాలు Questions and Answers.

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 1.
కింది పద్యమును చదవండి. ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.

అనువుగాని చోట నధికుల మనరాదు
కొంచమైన నదియు ఁగొదువ గాదు
కొండ యద్దమందు గొంచమై యుండదా!
విశ్వదాభిరామ వినురవేమ !

ప్రశ్నలు – జవాబులు :
1. ఎక్కడ అధికులము అని అనగూడదు ?
జవాబు:
అనువుగానిచోట అధికులమని అనగూడదు.

2. ఇంకా ఎక్కడెక్కడ ఒదిగి ఉండాలి ?
జవాబు:
సంపద, విద్య, అధికారములయందు ఒదిగి ఉండాలి.

3. కొండ అద్దములో ఎలా ఉంటుంది ?
జవాబు:
కొండ అద్దంలో చిన్నదిగా ఉంటుంది.

4. పై పద్యాన్ని రాసిన కవి ఎవరు ?
జవాబు:
పై పద్యాన్ని రాసిన కవి వేమన.

5. ఈ పద్యంలోని మకుటం ఏది ?
జవాబు:
ఈ పద్యంలోని మకుటం విశ్వదాభిరామ వినురవేమ

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 2.
కింది పద్యమును చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు తగు జవాబులివ్వండి.

సత్యసూక్తి ఘటించు, ధీజడిమ మాన్చు
గౌరవమొసంగు జనులకు కలుషమడచు
కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి జేయు
సాధుసంగమంబు సకలార్థ సాధనంబు.

ప్రశ్నలు – జవాబులు :
1. జనులకు కలుషమును పోగొట్టేదేది ?
జవాబు:
సాధుసంగము

2. సూక్తి అంటే ఏమిటి ?
జవాబు:
మంచిమాట

3. సాధుసంగమనగానేమి
జవాబు:
మంచివారితో స్నేహము.

4. ఈ పద్యానికి శీర్షిక ప్రకటించుము.
జవాబు:
ఈ పద్యానికి ‘సజ్జన సాంగత్యం’ అనే శీర్షిక తగినది.

5. కీర్తి ఎప్పుడు కలుగుతుంది.
జవాబు:
కీర్తి సజ్జన సాంగత్యంతో కలుగుతుంది.

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 3.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు
నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు
సజ్జ జొన్న కూళ్ళు సర్వంబులు, దేళ్ళు
పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు

ప్రశ్నలు – జవాబులు :
1. నాగులేరు ఏ సీమలో ప్రవహిస్తున్నది ?
జవాబు:
నాగులేరు పల్నాటిసీమలో ప్రవహిస్తున్నది.

2. పల్నాటిసీమ ప్రజల ఆహారం ఏది ?
జవాబు:
పల్నాటి సీమ ప్రజల ఆహారం సజ్జ, జొన్నకూళ్ళు.

3. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి ‘పల్నాటి పల్లెటూళ్ళు’ అని పేరు పెట్టవచ్చు.

4. ఈ పద్యంలోని శబ్దాలంకారమేమిటో రాయండి.
జవాబు:
ఈ పద్యంలోని శబ్దాలంకారం వృత్త్యనుప్రాసం.

5. ఈ పద్యంలోని చిల్లర దేవుళ్ళు ఎవరు ?
జవాబు:
చిన్న చిన్న రాళ్ళు ఈ పద్యంలోని చిల్లరదేవుళ్ళు.

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 4.
క్రింది గేయ ఖండికను చదవండి. క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఆలోచించి రాయండి.

“ఇది హైదరాబాదు ……………….. ఇది హైదరాబాదు
ఇది భిన్న సంస్కృతిలో ఎదిగిపూచిన పాదు
ఇట మల్కిభరాము ప్రచురితమ్మెనరించె
తెలుగు భారతి శింజినుల మంజుల స్వనము
ఇచట గోపన్న చేయించె తన బతుకు వెచ్చించి
సీతమ్మ కొక చింతాకు పతకమ్ము
ఇచట తెల్గుల వాణి ఇచట ఉర్దూ బాణి
కల్పిపోయినవి ముక్తాప్రవాళములట్లు

ప్రశ్నలు – జవాబులు :
1. ఈ గేయభాగం, ఎక్కడి సంస్కృతిని గూర్చి వర్ణిస్తున్నది ?
జవాబు:
ఈ గేయం హైదరాబాదు సంస్కృతిని గూర్చి వర్ణిస్తున్నది.

2. ముక్తా ప్రవాళాల్లా కలిసిపోయినవి ఏవి ?
జవాబు:
తెల్గులవాణి, ఉర్దూబాణి, ముక్తా ప్రవాళాల్లో కలిసి పోయాయి.

3. సీతమ్మకు చింతాకుపతకం చేయించినవారెవరు ?
జవాబు:
సీతమ్మకు గోపన్న చింతాకుపతకం చేయించాడు.

4. భిన్నసంస్కృతి అంటే ఏమిటి ?
జవాబు:
వేరు వేరు మతాల, జాతుల, భాషల, ఆచారాల సంస్కారం.

5. హైదరాబాదుకు గల మరొక పేరు ?
జవాబు:
హైదరాబాదుకు గల మరొక పేరు భాగ్యనగరం.

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 5.
ఈ క్రింది పద్యమును చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.

అనగ ననగ రాగ మతిశయిల్లుచు నుండు
తినగ తినగ వేము తీయనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ ! వినురవేమ !

ప్రశ్నలు – జవాబులు :
1. అంటూ ఉంటే అతిశయిల్లేది ఏది ?
జవాబు:
అంటూ ఉంటే అతిశయిల్లేది రాగము.

2. తింటూ ఉంటే తీయనయ్యేది ఏది ?
జవాబు:
తింటూ ఉంటే తీయనయ్యేది వేము.

3. సాధనతో సమకూరేవి ఏవి ?
జవాబు:
సాధనముతో పనులు సమకూరును.

4. ఈ పద్యానికి మకుటం ఏది ?
జవాబు:
ఈ పద్య మకుటం “వేమ”.

5. ఈ పద్యాన్ని రాసింది ఎవరు ?
జవాబు:
ఈ పద్యాన్ని రాసింది వేమన.

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 6.
ఈ క్రింది పద్యమును చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.

నీళ్ళలోని చేప నెరిమాంసమాశకు
గాలమందు చిక్కి కూలినట్లు
ఆశపుట్టి మనుజుడారీతి చెడిపోవు
విశ్వదాభిరామ ! వినురవేమ !

ప్రశ్నలు – జవాబులు :
1. చేప దేనికి ఆశపడును ?
జవాబు:
చేప మాంసమునకు ఆశపడును.

2. దేనికి చిక్కును ?
జవాబు:
గాలానికి చేప చిక్కును.

3. చేప ఏమగును ?
జవాబు:
చేప మరణించును.

4. చేపతో పోల్చబడినది ఎవరు ?
జవాబు:
ఆశగల మానవుడు చేపతో పోల్చబడినాడు.

5. ఈ పద్యంలోని మకుటం ఏది ?
జవాబు:
ఈ పద్యంలోని మకుటం విశ్వదాభిరామ! వినుర వేమ!

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 7.
ఈ క్రింది పద్యమును చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.

తలనుండు విషము ఫణికిని
వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్
లయనకయుండును
ఖలునకు నిలువెల్ల విషముగదరా సుమతీ !

ప్రశ్నలు – జవాబులు :
1. పాముకు విషము ఎక్కడుండును ?
జవాబు:
పాముకు తలయందు విషముండును.

2. తోకయందు విషము దేనికి ఉండును ?
జవాబు:
తోకయందు వృశ్చికమునకు విషము ఉండును.

3. నిలువెల్ల విషము గలవాడెవడు ?
జవాబు:
ఖలునకు నిలువెల్ల విషముండును.

4. ఈ పద్యము నందు చెప్పబడిన విషయమేది ?
జవాబు:
ఈ పద్యమునందు ఖలుని స్వభావము చెప్పబడినది.

5. ఈ పద్యంలోని మకుటం ఏది ?
జవాబు:
ఈ పద్యంలో మకుటం సుమతి.

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 8.
ఈ క్రింది పద్యమును చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.

రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు
సుకవి చేతి కలము సుధలు గురియు
అతడేల గలుగు యావత్ప్రపంచంబు
నీతడేల గలుగు ఇహము పరము

ప్రశ్నలు – జవాబులు :
1. రక్తాన్ని కురిపించునదేది ?
జవాబు:
రాజు చేతిలోని కత్తి రక్తాన్ని కురిపిస్తుంది.

2. అమృతాన్ని కురిపించునదేది ?
జవాబు:
కవి చేతిలోని కలము అమృతాన్ని కురిపిస్తుంది.

3. యావత్ప్రపంచాన్ని పాలించగలిగేదెవరు ?
జవాబు:
రాజుయావత్ప్రపంచాన్ని పాలించగలుగుతాడు.

4. ఇహమును, పరమును పాలించగలవాడెవడు ?
జవాబు:
కవి ఇహమును, పరమును పాలించగలడు.

5. ఈ పద్యంలో ఎవరి గొప్పతనం చెప్పబడింది ?
జవాబు:
ఈ పద్యంలో కవి గొప్పతనం చెప్పబడింది.

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 9.
ఈ క్రింది పద్యమును చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.

వినదగునెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
కనికల్ల నిజము దెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ !

ప్రశ్నలు – జవాబులు :
1. ఈ పద్యం ఏ శతకంలోనిది ?
జవాబు:
ఈ పద్యం సుమతీ శతకంలోనిది

2. ఏది వినదగినది ?
జవాబు:
ఎవరు ఏవిషయమును గూర్చి చెప్పినను ముందు దానిని వినదగును.

3. వినిన తర్వాత ఏమి చేయవలెను ?
జవాబు:
వినిన తర్వాత తొందరపడకుండా ఆ విషయాన్ని గూర్చి ఆలోచించాలి.

4. నీతిపరుడెవ్వడు ?
జవాబు:
విన్నదానిలో సత్యమెంతో, అసత్యమెంతో తెలిసికొన గల్గిన వాడే నీతిపరుడు.

5. ఈ పద్యంలోని మకుటం ఏది ?
జవాబు:
ఈ పద్యంలో మకుటం సుమతి.

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 10.
ఈ క్రింది పద్యమును చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.

మఱవవలెఁ గీడు నెన్నఁడు
మఱవంగా రాదు మేలు మర్యాదలలోఁ
దిరుగవలె సర్వజనములఁ
దరిఁప్రేమన్ మెలగవలయుఁ దరుణి కుమారీ !

ప్రశ్నలు – జవాబులు :
1) దేనిని మరచిపోవాలి ?
జవాబు:
కీడును మరచిపోవాలి.

2) దేనిని మరువరాదు ?
జవాబు:
మేలును మరువరాదు.

3) అందరి ఎడల ఎట్లా మెలగాలి ?
జవాబు:
అందరి యెడల మర్యాదలతోను, ప్రేమతోను మెలగాలి.

4) ఈ పద్యం ఏ శతకం లోనిది ?
జవాబు:
ఈ పద్యం ‘కుమారీ శతకం’ లోనిది.

5) ‘మేలు’ పదానికి వ్యతిరేక పదం రాయండి.
జవాబు:
మేలు × కీడు

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 11.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాన్ని గుర్తించండి.

చేతులారంగ శివుని పూజింపడేని
నోరునొవ్వంగ హరికీర్తినుడువడేని
దయయుసత్యంబులోనుగా దలపడేని
కలుగనేటికి తల్లుల కడుపుచేటు

ప్రశ్నలు – జవాబులు :
1. ‘కడుపుచేటు’ అనే మాటకు అర్థం………… ( )
ఎ) చెడ్డకడుపు
బి) పుట్టుక దండగ
సి) తల్లులకు బాధ
డి) ప్రజలకు చేటు
జవాబు:
బి) పుట్టుక దండగ

2. శివపూజ ఎలా చేయమంటున్నాడు కవి ? ( )
ఎ) ఆరు చేతులతో
బి) చేతులు నొప్పి పుట్టేటట్లు
సి) చేతులతో తృప్తి కలిగేటట్లు
డి) భక్తితో
జవాబు:
సి) చేతులతో తృప్తి కలిగేటట్లు

3. దయను, సత్యాన్ని మనిషి వేటిని తలచాలి.( )
ఎ) దయనుమాత్రమే
బి) సత్యాన్ని మాత్రమే
సి) దయను, సత్యాన్ని రెండింటిని
డి) ఈ రెండింటిని కాదు
జవాబు:
సి) దయను, సత్యాన్ని రెండింటిని

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

4. నోరారా హరి కీర్తిని …….. ( )
ఎ) పిలవాలి
బి) పలకాలి
సి) అరవాలి
డి) ఏమీ చెయ్యకూడదు
జవాబు:
బి) పలకాలి

5. ‘కీర్తి’ కి వికృతి పదం ఏది ? ( )
ఎ) కవిత
బి) కృతి
సి) కీరితి
డి) కైత
జవాబు:
సి) కీరితి

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 12.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.

పాలమీగడ మించిన పసిడి మనసు
తెలుగుభాషను మించిన తీపి పలుకు
పౌరుషంబుగ పులిపిల్ల తీరునలరు
తెలుగుబిడ్డను గాంచంగ వెలుగు జగము

ప్రశ్నలు – జవాబులు:
1. పసిడి అంటే అర్థం ఏమిటి?
ఎ) బంగారం
బి) సింగారం
సి) కంగారు
డి) వెండి
జవాబు:
ఎ) బంగారం

2. తెలుగుభాష కంటే తియ్యనిది ఏది?
జవాబు:
తెలుగు బిడ్డ పలుకు తెలుగుభాష కంటే తియ్యనిది.

3. పౌరుషం కలిగిన జంతువుగా దేనిని పేర్కొన్నారు ?
జవాబు:
పౌరుషం కలిగిన జంతువుగా పులిని పేర్కొన్నారు.

4. లోకానికి వెలుగునిచ్చేది ఎవరు ?
జవాబు:
లోకానికి వెలుగునిచ్చేది ‘తెలుగుబిడ్డ’.

5. ఈ పద్యంలో మకుటం ఏది ?
జవాబు:
తెలుగుబిడ్డను గాంచంగ వెలుగుజగము

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 13.
క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు సరియైన సమాధానాన్ని గుర్తించండి.

వాని రెక్కల కష్టంబు లేనివాడు
సస్యరమ పండి పులకింప సంశయించు
వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు
భోజనము బెట్టు వాడికి భుక్తిలేదు.

ప్రశ్నలు – జవాబులు
1. ఎవరికి భుక్తి కరువు ? ( )
ఎ) సస్యరమకు
బి) ప్రపంచానికి
సి) కష్టజీవికి
డి) దయామయుడికి
జవాబు:
సి) కష్టజీవికి

2. ‘సస్యరమ’ అంటే ? ( )
ఎ) పంట అనే లక్ష్మి
బి) లక్ష్మి అందం
సి) అందమైన పచ్చదనం
డి) చిక్కటి చీకటి
జవాబు:
ఎ) పంట అనే లక్ష్మి

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

3. రైతురెక్కల కష్టంతో పులకించేది ఏది? ( )
ఎ) పంట
బి) భూమి
సి) చెట్టు
డి) పక్షి
జవాబు:
బి) భూమి

4. ప్రపంచానికి భోజనం పెట్టేది ఎవరు ? ( )
ఎ) రాజు
బి) రైతు
సి) ఉద్యోగి
డి) కార్మికుడు
జవాబు:
బి) రైతు

5. ఈ పద్యం ఎవరిగురించి చెప్పబడింది. ( )
ఎ) రైతు
బి) కవి
సి) కర్త
డి) ధర్మ
జవాబు:
ఎ) రైతు

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 14.
గేయం చదివి ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.

తూరుపు తెలవారుతుంది ప్రతిదినం
కాలంగతి మారుతుంది ప్రతిక్షణం
మంచి మార్పు లోకానికి మంగళదాయకం
అది వికటించిందా – అభ్యుదయ వినాశకం.

ప్రశ్నలు – జవాబులు :
1. గేయాన్ని అనుసరించి మారేది ఏది ?
జవాబు:
కాలంగతి

2. మంచి మార్పువల్ల లోకానికి ఏం ప్రయోజనం కల్గుతుంది ?
జవాబు:
మంచి మార్పు లోకానికి మంగళదాయకం.

3. ప్రతిదినం జరిగేది ఏది ?
జవాబు:
ప్రతిదినం తూరుపు తెలవారుతుంది.

4. అభ్యుదయానికి ఆటంకం ఎప్పుడు ఏర్పడుతుంది ?
జవాబు:
మంచి మార్పు జరగనప్పుడు అభ్యుదయానికి ఆటంకం ఏర్పడుతుంది.

5. అభ్యుదయం ఏ సంధి ?
జవాబు:
యణాదేశ సంధి.

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 15.
గేయం చదివి జవాబును గుర్తించండి.

పైన కఠినమనిపించును
లోన వెన్న కనిపించును
జీవమున్న మనిషి కన్న
శిలలే నయమనిపించును
ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో
ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో

ప్రశ్నలు – జవాబులు :
1. ఈ గేయంలో కనిపిస్తున్న అలంకారం – ( )
A) యమకం
B) అంత్యానుప్రాస
C) రూపకం
D) వృత్త్యానుప్రాస
జవాబు:
B) అంత్యానుప్రాస

2. మనిషి కన్నా నయమనిపించేవి – ( )
A) రాళ్ళు
B) శిల్పాలు
C) గుండెలు
D) సంతువులు
జవాబు:
A) రాళ్ళు

3. బండలు మాటున ఏమున్నాయంటున్నాడు కవి ? ( )
A) వెన్న
B) గుండెలు
C) జీవం
D) జంతువులు
జవాబు:
B) గుండెలు

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

4. పైకి కఠినంగా కనిపించేది ( )
A) రాళ్ళు
B) మనిషి
C) నలుపు
D) ఇనుము
జవాబు:
A) రాళ్ళు

5. ఇందులో దేని గొప్పతనం ఉంది ? ( )
A) శిల
B) కవి
C) వల
D) శర
జవాబు:
A) శిల

ప్రశ్న 16.
ఈ పద్యంను చదివి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

కుక్కగోవు గాదు : కుందేలు పులి గాదు
దోమ గజము గాదు దొడ్డదైన
లోభి దాత గాడు లోకంబు లోపల
విశ్వదాభిరామ! వినుర వేమ!

ప్రశ్నలు – జవాబులు :
1. ఎంత పెద్దదైనప్పటికీ దోమ దేనిగా మారదు ?
జవాబు:
ఎంత పెద్దదైనప్పటికీ దోమ గజంగా మారదు.

2. ఎన్ని సాధు లక్షణాలు ఉన్నా ఏది ఆవు కాజాలదు ?
జవాబు:
ఎన్ని సాధు లక్షణాలు ఉన్నా కుక్క ఆవు కాజాలదు.

3. లోకంలో దాతగా ఎవరు కాలేరు ?
జవాబు:
లోకంలో లోభి దాతగా కాలేడు.

4. పై పద్యం ఏ శతకంలోది ?
జవాబు:
పై పద్యం వేమన శతకంలోది.

5. పై పద్యానికి శీర్షిక సూచించండి.
జవాబు:
పై పద్యానికి శీర్షిక ‘గుణం మారదు’.

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 17.
ఈ క్రింది కవితను చదివి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ఆ బక్కపలుచని రూపం గుర్తొస్తే చాలు
ఒక్కసారిగా నా జాతి యావత్తూ
స్వేచ్ఛా విహంగమై విహరిస్తుంది.
ప్రపంచ విజేతలా తలెత్తుకు నిలుస్తుంది.
ప్రతి ఒక్క ఛాతీ ఆకాశమౌతుంది.
నరాలన్నీ ఒక్కొక్కటిగా
ఉక్కు తీగల్లా మారుతాయి.
ఉప్పొంగిన స్వరంతో
మీసం కుడిచేతి మునివేళ్ళ మధ్యకొస్తుంది !
రవి అస్తమించని సామ్రాజ్యాన్ని
సరిహద్దు కావలకు తరిమి
నిరంకుశ వలసపాలనకు
పాతర వేసినవారు ఆయనే కదా!
ఎముకల గూడు కాదది
ఏనుగుల గుంపు!

ప్రశ్నలు – జవాబులు :
1. ఈ కవిత ఏ వ్యక్తి గురించి తెల్పుతున్నది ?
జవాబు:
ఈ కవిత జాతిపిత మహాత్మాగాంధీ గురించి తెలుపు తున్నది.

2. విహంగం అంటే అర్థం ఏమిటి ?
జవాబు:
విహంగం అంటే పక్షి అని అర్థం.

3. కవి, నరాలను వేటితో పోల్చాడు ?
జవాబు:
కవి నరాలను ఉక్కు తీగలతో పోల్చాడు.

4. ‘ఏనుగుల గుంపు’ అనేది దేనికి సూచన ?
జవాబు:
‘ఏనుగుల గుంపు’ అనేది ఎముకల గూడుకు సూచన.

5. ఛాతి ఆకాశం కావడం – అంటే ?
జవాబు:
‘ఛాతి ఆకాశం కావడం’ అంటే ఆకాశంలా విస్తరించడం.

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 18.
కింది పద్యం చదువండి. తప్పొప్పులను గుర్తించండి. (తప్పైతే ‘తప్పు’ అని, ఒప్పైతే ‘ఒప్పు’ అని రాయండి.)

కూరిమిగల దినములలో
నేరము లెన్నడును గలుఁగ నేరవు మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ!

ప్రశ్నలు – జవాబులు
1. కూరిమి అనగా స్నేహము.
జవాబు:
ఒప్పు

2. నేరము అనగా మిత్రుడు.
జవాబు:
తప్పు

3. ఈ పద్యం సుమతీ శతకం లోనిది.
జవాబు:
ఒప్పు

4. విరసం అంటే తప్పులని అర్థం.
జవాబు:
తప్పు

5. నిక్కము అనగా నిజము.
జవాబు:
ఒప్పు

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 19.
క్రింది పద్యాన్ని చదివి, అర్థం చేసుకుని, ఇచ్చిన ఖాళీలను పూరించండి. (March 2015)

వాక్కు వలన గలుగు పరమగు మోక్షంబు,
వాక్కు వలన గలుగు పఠలు ఘనత,
వాక్కు వలన గలుగు నెక్కుడైశ్వర్యంబు
విశ్వదాభిరామ వినురవేమ !

ఖాళీలు
1. ఈ పద్యంలో మకుటం ………………………
జవాబు:
విశ్వదాభిరామ వినురవేమ !

2. ఘనత ………………….. కలుగుతుంది.
జవాబు:
వాక్కు వల్ల

3. పద్యంలో సంపదను సూచించే పదం ………………….
జవాబు:
ఐశ్వర్య

4. విశ్వదాభిరామ పదాన్ని విడదీస్తే ……………………
జవాబు:
విశ్వదా+అభిరామ

5. ఈ పద్యాన్ని …………………. కవి రచించాడు.
జవాబు:
వేమన

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 20.
క్రింది పద్యాన్ని చదివి, అర్థం చేసుకుని, ఇచ్చిన ఖాళీలను పూరించండి. (June 2015)

తలనుండు విషము ఫణికిని
వెలయంగాఁ దోఁక నుండు వృశ్చికమునకున్
దల తోఁక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ !

ఖాళీలు – జవాబులు :
1. పాముకు విషం ………………. లో ఉంటుంది.
జవాబు:
తల

2. వృశ్చికమనగా ………………….
జవాబు:
తేలు

3. శరీరమంత విషం ……………….. ఉంటుంది.
జవాబు:
ఖలునకు

4. పై పద్య మకుటం ………………………..
జవాబు:
సుమతీ

5. పై పద్యాన్ని రచించిన కవి ……………………
జవాబు:
బద్దెన

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 21.
కింది పద్యాన్ని చదివి చేసుకోండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (March 2016)

భూమి నాదియన్న భూమి ఫక్కున నవ్వు
ధనము నాదియన్న ధనము నవ్వు
కదన భీతుఁజూచి కాలుండు నవ్వును
విశ్వదాభిరామ వినురవేమ.

ప్రశ్నలు – జవాబులు :
1. భూమి ఫక్కున ఎందుకు నవ్వుతుంది ?
జవాబు:
భూమి నాది అని అన్నందుకు.

2. ధనము నాది అంటే ధనము ఏం చేస్తుంది ?
జవాబు:
ధనము నవ్వుతుంది.

3. కదన భీతుడంటే మీకేమర్థమైంది ?
జవాబు:
యుద్ధమంటే భయపడువాడు.

4. పై పద్యంలోని మకుటం ఏది ?
జవాబు:
విశ్వదాభిరామ వినురవేమ.

5. పై పద్యాన్ని రాసిన కవి ఎవరు ?
జవాబు:
వేమన

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 22.
కింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (June 2016)

ఆకొన్న కూడె యమృతము
తాకొంచక నిచ్చువాడె దాత ధరిత్రిన్
సోఁకోర్చువాఁడె మనుజుడు
తేఁకువ గలవాడె వంశతిలకుడు సుమతీ !

ప్రశ్నలు – జవాబులు :
1. నిజమైన దానశీలి ఎవరు ?
జవాబు:
తాకొంచక ఇచ్చువాడే దాత.

2. అన్నము ఎప్పుడు రుచిగా ఉంటుంది ?
జవాబు:
ఆకలి కలిగి ఉన్నప్పుడే అన్నం రుచిగా ఉంటుంది.

3. నిజమైన మనిషి అని ఎప్పుడు అంటారు ?
జవాబు:
సోకోర్చువాడే నిజమైన మనిషి అని అంటారు.

4. ఎవరు వంశానికి వన్నె తెస్తారు ?
జవాబు:
తేకువ గలవాడే వంశానికి వన్నె తెస్తాడు.

5. ఈ పద్యానికి మకుటము ఏది ?
జవాబు:
ఈ పద్యానికి మకుటము సుమతీ.

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 23.
కింది పద్యం చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.   (March 2017)

కం. కాకేమి తన్ను తిట్టెనె
కోకిల తననేమి ధనము కో కొమ్మనెనే,
లోకము పగయగు బరుసని
వాకున;జుట్టమగు మధురవాక్యమువలనన్

ప్రశ్నలు – జవాబులు :
1. ఎట్లా మాట్లాడితే లోకము చుట్టము అవుతుంది ?
జవాబు:
మధురముగా మాట్లాడితే లోకము చుట్టము అవుతుంది.

2. ఎట్లా మాట్లాడితే లోకము శత్రువౌతుంది ?
జవాబు:
కఠినముగా మాట్లాడితే లోకము శత్రువు అవుతుంది.

3. పై పద్యంలో పరుషముగా మాట్లాడేవారికి ఉదాహ రణగా దేనిని చూపాడు ?
జవాబు:
పై పద్యంలో పరుషముగా మాట్లాడేవారికి ఉదాహరణగా కాకిని చూపాడు.

4. పై పద్యంలో కోకిలను దేనికి ఉదాహరణగా చూపాడు ?
జవాబు:
కోకిలను మధురముగా మాట్లాడేదానికి ప్రతీకగా చూపాడు.

5. పై పద్యానికి శీర్షికను పెట్టండి.
జవాబు:
పై పద్యానికి ‘మధురవచనము’ అనే శీర్షిక తగినది.

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 24.
కింది పద్యం చదువండి. తప్పొప్పులను గుర్తించండి. (June 2017)

కూరిమిగల దినములలో
నేరము లెన్నడును గలుఁగ నేరవు మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ!

ప్రశ్నలు – జవాబులు :
1. కూరిమి అనగా స్నేహము. (   )
జవాబు:
ఒప్పు (✓)

2. ‘నేరము’ అనగా మిత్రుడు. (   )
జవాబు:
తప్పు (✗)

3. ఈ పద్యం సుమతీ శతకం లోనిది. (   )
జవాబు:
ఒప్పు (✓)

4. ‘విరసం’ అంటే తప్పులని అర్థం. (   )
జవాబు:
తప్పు (✗)

5. నిక్కము అనగా నిజము. (   )
జవాబు:
ఒప్పు (✓)

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 25.
కింది పద్యం చదివి ఆ తరువాత గల ప్రశ్నలకు జవాబులు రాయండి. (March 2018)

కోపమునను ఘనత కొంచెమై పోవును
కోపమునను మిగుల గోడు గలుగు
కోపమడచె నేని కోరిక లీడేరు
విశ్వదాభిరామ వినుర వేమ!

ప్రశ్నలు – జవాబులు :
1. కోపం వలన తగ్గేది ఏది ?
జవాబు:
కోపం వలన తగ్గేది ఘనత.

2. దుఃఖం ఎప్పుడు కలుగుతుంది ?
జవాబు:
దుఃఖం కోపం ఉన్నప్పుడు కలుగుతుంది.

3. కోపం అణచివేస్తే తీరేవి ఏవి ?
జవాబు:
కోపం అణచివేస్తే తీరేవి కోరికలు.

4. ‘కొంచెమైపోవును’ అంటే మీరేమి అర్థం చేసు కున్నారు ?
జవాబు:
తగ్గిపోతుంది

5. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘కోపము’.

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

ప్రశ్న 26.
కింది పద్యం చదువండి. ఆ తర్వాత కింది వాక్యాలలోని తప్పొప్పులను గుర్తించి బ్రాకెట్లో సూచించండి. (June 2018)

పత్రికొక్కటున్న పదివేల సైన్యంబు
పత్రికొక్కటున్న మిత్రకోటి
పత్రిక లేకున్న ప్రజకు రక్షలేదు
వాస్తవమ్ము నార్లవారి మాట.

ప్రశ్నలు – జవాబులు :
1. పది వేల సైన్యానికి పత్రిక ఒకటే ఉన్నది. (   )
జవాబు:
తప్పు (✗)

2. ఒక పత్రిక కోటి మిత్రులతో సమానం. (   )
జవాబు:
ఒప్పు (✓)

3. నార్లవారి మాట అవాస్తవం. (   )
జవాబు:
తప్పు (✗)

4. పత్రికల వలన కూడా ప్రజలకు రక్షణ లభిస్తుంది. (   )
జవాబు:
ఒప్పు (✓)

TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు

5. పై పద్యం పత్రికల గొప్పతనాన్ని తెలియజేస్తుంది. (   )
జవాబు:
ఒప్పు (✓)

TS 6th Class Maths Bits Chapter 4 Basic Geometrical Ideas

Solving these TS 6th Class Maths Bits with Answers 4th Lesson Basic Geometrical Ideas Bits for 10th Class will help students to build their problem-solving skills.

TS 6th Class Maths Bits Chapter 4 Basic Geometrical Ideas

Question 1.
AB ray is denoted by _______.
A) \(\overrightarrow{\mathrm{AB}}\)
B) \(\overline{\mathrm{AB}}\)
C) \(\overleftrightarrow{\mathrm{AB}}\)
D) . A
Answer:
A) \(\overrightarrow{\mathrm{AB}}\)

Question 2.
\(\overleftrightarrow{\mathrm{AB}}\) it represents _______.
A) AB ray
B) AB line segment
C) AB line
D) AB point
Answer:
C) AB line

Question 3.
Line segment PQ is denoted by _______?
A) \(\stackrel{\leftrightarrow}{P Q}\)
B) \(\overrightarrow{\mathrm{PQ}}\)
C) \(\overrightarrow{P Q}\)
D) \(\overleftarrow{\mathrm{PQ}}\)
Answer:
B) \(\overrightarrow{\mathrm{PQ}}\)

TS Board 6th Class Maths Bits 4th Lesson Basic Geometrical Ideas

Question 4.
Which of the following is open figure/ letter?

TS 6th Class Maths Bits 4th Lesson Basic Geometrical Ideas 1

Answer:

D) TS 6th Class Maths Bits 4th Lesson Basic Geometrical Ideas 2

Question 5.
Which of the following is not a polygon ?

TS 6th Class Maths Bits 4th Lesson Basic Geometrical Ideas 3

Answer:

D) TS 6th Class Maths Bits 4th Lesson Basic Geometrical Ideas 4

Question 6.
Which of the following is a simple curve?

TS 6th Class Maths Bits 4th Lesson Basic Geometrical Ideas 5

Answer:

C) TS 6th Class Maths Bits 4th Lesson Basic Geometrical Ideas 6

TS Board 6th Class Maths Bits 4th Lesson Basic Geometrical Ideas

Question 7.
From the given figure, which of the following is an angle?

TS 6th Class Maths Bits 4th Lesson Basic Geometrical Ideas 7

A) ∠AOB
B) \(\overrightarrow{\mathrm{OA}}\)
C) \(\overrightarrow{\mathrm{AB}}\)
D) O
Answer:
A) ∠AOB

Question 8.
From the above figure, the Arms are _______.
A) \(\overrightarrow{\mathrm{OA}}\)
B) \(\overrightarrow{\mathrm{OB}}\)
C) \(\overrightarrow{\mathrm{OC}}\), \(\overrightarrow{\mathrm{OD}}\)
D) All the above
Answer:
D) All the above

Question 9.
From the above figure, ‘O’ is called _______.
A) Point
B) Angle
C) Vertex
D) Arm
Answer:
C) Vertex

TS Board 6th Class Maths Bits 4th Lesson Basic Geometrical Ideas

Question 10.
From the given figure which points lie outside of the figure?

TS 6th Class Maths Bits 4th Lesson Basic Geometrical Ideas 8

A) C, U, T
B) A, B
C) D
D) P, Q, R, S
Answer:
A) C, U, T

Question 11.
From the given figure which points are lie inside the figure?

TS 6th Class Maths Bits 4th Lesson Basic Geometrical Ideas 9

A) C, U, T
B) D
C) A, B
D) P,Q, R, S
Answer:
B) D

Question 12.
From the adjacent figure, the chord of a circle is _______.

TS 6th Class Maths Bits 4th Lesson Basic Geometrical Ideas 10

A) \(\overline{\mathrm{OX}}\)
B) \(\overline{\mathrm{XY}}\)
C) \(\overline{\mathrm{PQ}}\)
D) \(\overline{\mathrm{OA}}\)
Answer:
C) \(\overline{\mathrm{PQ}}\)

TS Board 6th Class Maths Bits 4th Lesson Basic Geometrical Ideas

Question 13.
From the above figure, the diameter is _______.
A) \(\overline{\mathrm{OX}}\)
B) \(\overline{\mathrm{XY}}\)
C) \(\overline{\mathrm{PQ}}\)
D) \(\overline{\mathrm{OA}}\)
Answer:
B) \(\overline{\mathrm{XY}}\)

Question 14.
Diameter = _______ × radius.
A) 1
B) 2
C) 3
D) \(\frac{1}{2}\)
Answer:
B) 2

Question 15.
From the given figure, the shaded portion is called _______.

TS 6th Class Maths Bits 4th Lesson Basic Geometrical Ideas 11

A) Major segment
B) Minor segment
C) Minor sector
D) Half segment
Answer:
B) Minor segment

TS Board 6th Class Maths Bits 4th Lesson Basic Geometrical Ideas

Question 16.
Match the following.

TS 6th Class Maths Bits 4th Lesson Basic Geometrical Ideas 12

A) 1 – r, 2 – q, 3 – p, 4 – s
B) 1 – q, 2 – r, 3 – p, 4 – s
C) 1 – r, 2 – q, 3 – s, 4 – p
D) None
Answer:
A) 1 – r, 2 – q, 3 – p, 4 – s

Question 17.
Which of the following is true ?
A) d = 2r
B) d = \(\frac{r}{2}\)
C) r = 2d
D) r = d2
Answer:
A) d = 2r

Question 18.
Which of the following is not true ?
A) A line has no end points
B) A line segment has two end points
C) A ray has no end points
D) A ray has one end point.
Answer:
C) A ray has no end points.

TS Board 6th Class Maths Bits 4th Lesson Basic Geometrical Ideas

Question 19.
Which of the following is true ?
A) Every figure separates the given plane into three parts.
B) Only one line can drawn through one point
C) A three sided closed polygon is called a Quadrilateral
D) Common end point of two rays is called an angle
Answer:
A) Every figure separates the given plane into three parts.

Question 20.
The length of the chord is _______ when it moves towards the centre of the circle.
A) remains same
B) increases
C) decreases
D) none
Answer:
C) decreases

Question 21.
Which of the following is not true ?
A) r = \(\frac{d}{2}\)
B) An arc is past of a circle
C) All chords are equal in length
D) All radii are equal in length
Answer:
C) All chords are equal in length.

TS Board 6th Class Maths Bits 4th Lesson Basic Geometrical Ideas

Question 22.
Statement (I) : Diameter is the longest chord in the circle.
Statement (II) : We can draw infinite number of chords in a circle.
A) both ‘I’ and ‘II’ are true
B) I is true, II is false
C) I is false but ‘II’ is true
D) Both I & II are false
Answer:
A) both ‘I’ and ‘II’ are true

Question 23.
Statement (I): A triangle is simple closed figure which formed with 3 line segments
Statement (II) : A triangle divides the plane into 4 regions Statement (III): A triangle has 3 vertices, 3 sides and 2 angles.
A) I, II, III are true
B) I is true, II & III are false
C) I & II are true, III is false
D) I & II are false, III is true.
Answer:
B) I is true, II & III are false

Question 24.
A line segment is formed by number of points are _______.
A) 1
B) 2
C) 3
D) 4
Answer:
B) 2

TS Board 6th Class Maths Bits 4th Lesson Basic Geometrical Ideas

Question 25.
Which of these following can extend infinitely on both sides is _______.
A) line
B) line segment
C) ray
D) point
Answer:
A) line

Question 26.
Common end points of two rays is called a _______.
A) arm
B) point
C) vertex
D) angle
Answer:
C) vertex

Quadrilateral 27.
Every angle divides the plane as _______ of the angle.
A) Interior
B) Exterior
C) Boundary
D) All the above
Answer:
D) All the above

TS Board 6th Class Maths Bits 4th Lesson Basic Geometrical Ideas

Quadrilateral 28.
A triangle has _______.
A) 3-sides
B) 3-angles
C) 3-vertices
D) All the above
Answer:
D) All the above

Quadrilateral 29.
A simple closed figure bounded by four line segments is called a _______.
A) quadrilateral
B) triangle
C) polygon
D) none
Answer:
A) quadrilateral

Question 30.
A Quadrilateral has _______.
A) 4 sides
B) 4 angles, 4 vertices
C) 2 – diagonals
D) All the above
Answer:
D) All the above

TS Board 6th Class Maths Bits 4th Lesson Basic Geometrical Ideas

Quadrilateral 31.
Number of lines can be drawn through one-point _______.
A) 0
B) 1
C) 2
D) infinite
Answer:
D) infinite

Question 32.
Number of lines can be drawn through two points _______.
A) 0
B) 1
C) 2
D) infinite
Answer:
B) 1

Question 33.
Which of the following has definite length ?
A) Line segment
B) Line
C) Ray
D) Vertex
Answer:
A) Line segment

TS Board 6th Class Maths Bits 4th Lesson Basic Geometrical Ideas

Question 34.
The longest chord of a circle is known as _______.
A) Diameter
B) Radius
C) Segment
D) Sector
Answer:
A) Diameter

Question 35.
The length of a-circle is called _______.
A) radius
B) circumference
C) diameter
D) segment
Answer:
B) circumference

Question 36.
Who wrote the book “the elements’ ?
A) Euclid
B) Aryabhatta
C) Pythagorus
D) Georj Contor
Answer:
A) Euclid

TS Board 6th Class Maths Bits 4th Lesson Basic Geometrical Ideas

Question 37.
A ray is a portion of _______.
A) A line
B) An arc
C) An angle
D) A sector
Answer:
A) A line

Question 38.
Which of the following has a fixed length ?
A) A ray
B) A line
C) A line segment
D) A point
Answer:
C) A line segment

Question 39.
Curves are of _______ types.
A) 3
B) 2
C) 4
D) 5
Answer:
B) 2

TS Board 6th Class Maths Bits 4th Lesson Basic Geometrical Ideas

Question 40.
Which of the following denotes a line segment ?
A) \(\overrightarrow{\mathrm{OA}}\)
B) \(\overleftarrow{\mathrm{PQ}}\)
C) AB
D) \(\overline{\mathrm{AB}}\)
Answer:
D) \(\overline{\mathrm{AB}}\)

Question 41.
The number of end points of a ray is _______.
A) 1
B) 2
C) 3
D) infinite
Answer:
A) 1

Question 42.
In the given figure, \(\overrightarrow{\mathrm{OP}}\) is called _______.

TS 6th Class Maths Bits 4th Lesson Basic Geometrical Ideas 13

A) A line
B) A line segment
C) A ray
D) An arrow
Answer:
C) A ray

TS Board 6th Class Maths Bits 4th Lesson Basic Geometrical Ideas

Question 43.
Which of the following letters is an example for open curve ?
A) B
B) D
C) O
D) C
Answer:
D) C

Question 44.
In the below figure, O is called _______.

TS 6th Class Maths Bits 4th Lesson Basic Geometrical Ideas 14

A) The vertex
B) The centre
C) The point
D) The angle
Answer:
A) The vertex

Question 45.
The number of points marked in the interior of the triangle is _______.

TS 6th Class Maths Bits 4th Lesson Basic Geometrical Ideas 15

A) 3
B) 7
C) 4
D) 1
Answer:
A) 3

TS Board 6th Class Maths Bits 4th Lesson Basic Geometrical Ideas

Question 46.
Which of the following chords does not pa$g through the centre ?

TS 6th Class Maths Bits 4th Lesson Basic Geometrical Ideas 16

A) \(\overline{\mathrm{AB}}\)
B) \(\overline{\mathrm{EF}}\)
C) \(\overline{\mathrm{GH}}\)
D) \(\overline{\mathrm{CD}}\)
Answer:
D) \(\overline{\mathrm{CD}}\)

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d)

Students must practice this TS Intermediate Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) to find a better approach to solving the problems.

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d)

I. Find the area of the region enclosed by the given curves.

Question 1.
y = cos x, y = 1 – \(\frac{2 x}{\pi}\)
Solution:
Consider the graphs of the functions
f(x) = cos x and g(x) = 1 – \(\frac{2 x}{\pi}\)

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 1

The two curves intersect at (\(\frac{\pi}{2}\), 0) and (π, -1)

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 2

∴ The area enclosed between the curves y = cos x, y = 1 – \(\frac{2 \mathrm{x}}{\pi}\) is (2 – \(\frac{\pi}{2}\)).

TS Board Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d)

Question 2.
y = cos x, y = sin 2x, x = 0, x = \(\frac{\pi}{2}\).
Solution:
Consider the graphs of the functions f(x) = cos x and g(x) = sin 2x.

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 3

Taking f(x) = cos x and g(x) = sin 2x in [0, \(\frac{\pi}{6}\)]
we have f(x) ≥ g(x) and also in \(\left[\frac{\pi}{6}, \frac{\pi}{2}\right]\) have g(x) ≥ f(x).
Hence area enclosed between f(x) = cos x and g(x) = sin 2x is

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 4

∴ Area enclosed between the curves y = cos x, y = sin 2x, x = 0, x = \(\frac{\pi}{2}\) is \(\frac{1}{2}\) sq.units.

Question 3.
y = x3 + 3, y = 0, x = – 1, x = 2. (Mar. ’12)
Solution:

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 5

Required area enclosed between y = x3 + 3, y = 0, x = – 1, x = 2 is

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 6

Question 4.
y = ex, y = x, x = 0, x = 1.
Solution:

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 7

TS Board Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d)

Question 5.
y = sin x, y = cos x, x = 0, x = \(\frac{\pi}{2}\).
Solution:

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 8

Taking f(x) = sin x and g(x) = cos x
We have sin x – cos x < 0 for x ∈ \(\left[0, \frac{\pi}{4}\right]\) and sin x – cos x > 0 for x ∈ \(\left[\frac{\pi}{4}, \frac{\pi}{2}\right]\)
Area enclosed between y = sin x, y = cos x, x = 0, x = \(\frac{\pi}{2}\) is

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 9

Question 6.
x = 4 – y2, x = 0.
Solution:
The curve x = 4 – y2 cuts Y – axis at x = 0.
Hence 4 – y2 = 0
⇒ y = ± 2
∴ Points of intersection are given by (0, 2) and (0, – 2).
∴ Area subtended by Y-axis, the curve x = 4 – y2 is given by \(A=\int_{-2}^2 x d y=\int_{-2}^2\left(4-y^2\right) d y\)

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 10

TS Board Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d)

Question 7.
Find the area enclosed with in the curve |x| + |y| = 1.
Solution:
The given equation of the curve is |x| + |y| = 1 which represents ± x ± y = 1 representing four different lines forming a square.
Consider the line x + y = 1
⇒ y = 1 – x
If the line touches the X-axis then y = 0 and one of the points of intersection with X-axis is (1, 0).
Since the curve is symmetric with respect to coordinate axes, area bounded by |x| + |y| = 1 is

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 11

II.

Question 1.
x = 2 – 5y – 3y2, x = 0.
Solution:
Solving x = 2 – 5y – 3y2 and x = 0
We get – 3y2 – 5y + 2 = 0
⇒ 3y2 + 5y – 2 = 0
⇒ 3y2 + 6y – y – 2 = 0
⇒ 3y (y + 2) – 1 (y + 2) = 0
⇒ (y + 2)(3y – 1) = 0
⇒ y = -2 or y = \(\frac{1}{3}\)
Required area subtended by the curve x = 2 – 5y – 3y2, Y-axis and y = \(\frac{1}{3}\) and y = – 2 is

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 12

TS Board Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d)

Question 2.
x2 = 4y, x = 2, y = 0.
Solution:

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 13

The given equation x2 = 4y represents parabola which is symmetric with respect to Y-axis.
When x = 2 we have
4y = 4
⇒ y = 1
Hence P(2, 1) is the point of intersection.
∴ Area bounded by x2 = 4y, and x = 0, x = 2 is
A = \(\int_0^2 y d x=\int_0^2 \frac{x^2}{4} d x\)
= \(\frac{1}{4}\left[\frac{x^3}{3}\right]_0^2=\frac{1}{4}\left(\frac{8}{3}\right)=\frac{2}{3}\) sq. units.

Question 3.
y2 = 3x, x = 3.
Solution:
y2 = 3x is a parabola which is symmetrical to X-axis;
when x = 3 then y2 = 9
⇒ y = ± 3
Hence (3, 3) and (3, – 3) are the points of intersection.

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 14

TS Board Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d)

Question 4.
y = x2, y = 2x
Solution:

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 15

Given y = x2 and y = 2x
solving these we get x2 – 2x = 0
⇒ x (x – 2) = 0
⇒ x = 0 or x = 2
∴ y = 0 or y = 4
Hence O(0, 0) and P(2, 4) are the points of intersection of (1) and (2).
∴ Required area bounded by y = x2 and y = 2x is
= \(\int_0^2\left(2 x-x^2\right) d x=2\left[\frac{x^2}{2}\right]_0^2-\left[\frac{x^3}{3}\right]_0^2\)
= \(2\left[\frac{4}{2}\right]-\left[\frac{8}{3}\right]\)
= 4 – \(\frac{8}{3}\) = \(\frac{4}{3}\) sq. units.

Question 5.
y = sin 2x, y = √3 sin x, x = 0 and x = \(\frac{\pi}{6}\).
Solution:

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 16

Given curves are y = sin 2x …….(1)
and y = √3 sin x ……..(2)
When x = \(\frac{\pi}{6}\) then y = \(\frac{\sqrt{3}}{2}\)
∴ \(\left(\frac{\pi}{6}, \frac{\sqrt{3}}{2}\right)\) is a point of intersection (1) and (2).
∴ Area enclosed between the curves

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 17

TS Board Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d)

Question 6.
y = x2, y = x3.
Solution:
Given curves are y = x2 and y = x3
By solving we get x2 = x3
⇒ x2 (x – 1) = 0
⇒ x = 0 or x = 1
∴ y = 0 or y = 1
Hence (0, 0) and (1, 1) are the points of intersection.
Also f(x) = x2 and g(x) = x3 and f(x) > g(x) in [0, 1].
∴ Area bounded by the curves

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 18

Question 7.
y = 4x – x2, y = 5 – 2x.
Solution:
The given equations of curves are denoted by
y = f(x) = 4x – x2 ……(1)
y = g(x) = 5 – 2x ……..(2)
Solving (1) and (2)
4x – x2 = 5 – 2x
⇒ x2 – 2x – 4x + 5 = 0
⇒ x2 – 6x + 5 = 0
⇒ (x – 5) (x – 1) = 0
⇒ x = 1 or 5
When x = 1, y = 3 and x = 5, y = -5
Hence P(1, 3) and Q(5, – 5) are the two points of intersection.
Now f(x) > g(x) in [1, 5].
∴ Area bounded between the curves is

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 19

TS Board Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d)

Question 8.
Find the area in sq.units bounded by the X-axis, part of the curve y = 1 + \(\frac{8}{x^2}\) and the ordinates x = 2 and x = 4.
Solution:
In [2, 4] we have the equation of the curve given by y = 1 + \(\frac{8}{x^2}\)
∴ Area bounded by the curve y = 1 + \(\frac{8}{x^2}\)
X-axis and the ordinates x = 2 and x = 4 is

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 20

Question 9.
Find the area of the region bounded by the parabolas y2 = 4x and x2 = 4y.
Solution:
Given equations of curves are
y2 = 4x ……..(1)
x2 = 4y ……..(2)
Solving (1) and (2) the points of intersection can be obtained.
y2 = 4x
⇒ y4 = 16x2
⇒ y4 = 64y
⇒ y = 4
∴ 4x = y2
⇒ 4x = 16
⇒ x = 4
Points of intersection are (0, 0) and (4, 4).

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 21

∴ Area bounded between the parabolas

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 22

Question 10.
Find the area bounded by the curve y = log x, the X-axis and the straight line x = e.
Solution:
Area bounded by the curve y = \(\log _e x\), X-axis
and the straight line x = e is \(\int_1^e \log _e x d x\)
= \([\mathrm{x} \log \mathrm{x}]_{\mathrm{1}}^{\mathrm{e}}-\int_1^{\mathrm{e}} \mathrm{dx}\) (∵ when x = e, y = loge e = 1)
= (e – 0) – (e – 1)
= 1 sq.units

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 23

TS Board Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d)

III.

Question 1.
y = x2 + 1, y = 2x – 2, x = -1, x = 2.
Solution:
Equations of given curves are
y = x2 + 1 ……..(1)
y = 2x – 2 ………(2)

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 24

Take f(x) = x2 + 1 and g(x) = 2x – 1
we find f(x) > g(x) ∀ x ∈ [- 1, 2]
Hence area bounded by y = x2 + 1 and y = 2x – 2 is

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 25

Question 2.
y2 = 4x, y2 = 4(4 – x).
Solution:
Equations of the curves are
y2 = 4x ………(1)
y2 = 4(4 – x) ………(2)
From (1) and (2)
4x = 4(4 – x)
⇒ 8x = 16
⇒ x = 2
∴ y2 = 8
⇒ y = ± 2√2
∴ The points of intersection are (2, 2√2), (2, – 2√2)

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 26

TS Board Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d)

Question 3.
y = 2 – x2, y = x2.
Solution:
The given curves are
y = 2 – x2 ………(1)
y = x2 …….(2)

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 27

Solving (1) and (2) we get
2 – x2 = x2
⇒ 2x2 = 2
⇒ x2 = 1
⇒ x = ± 1
∴ y = 1
Hence points of intersection of curves are (1, 1), (- 1, 1)
∴ Area bounded between the curves

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 28

Question 4.
Show that the area enclosed between the curves y2 = 12 (x + 3) and y2 = 20 (5 – x) is 64 \(\sqrt{\frac{5}{3}}\).
Solution:

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 29

Given curves are y2 = 12 (x + 3) …….(1)
and y2 = 20 (5 – x) ………(2)
Solving (1) and (2) we get
12 (x + 3) = 20 (5 – x)
⇒ 12x + 36 = 100 – 20x
⇒ 32x = 64
⇒ x = 2
∴ y2 = 20(5 – 2) = 60
⇒ y = ± 2√15
∴ Points of intersection are B(2, 2√15) and B'(2, – 2√5).
The given equations represent these parabolas
(y – β)2 = 4a(x – α) and
(y – β)2 = – 4a(x – α)
∴ Vertex of (1) is A(- 3, 0) and vertex of (2) is A'(5, 0).
∴ The required area is symmetrical about X-axis.
∴ Area bounded by curves is ABA’B’

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 30

TS Board Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d)

Question 5.
Find the area of the region {(x, y): x2 – x – 1 ≤ y ≤ -1}.
Solution:
Consider y = x2 – x – 1 ……(1)
and y = – 1 ……(2)

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 31

Which represents a parabola in the form (x – h)2 = 4a(y – k) where vertex \(\left(\frac{1}{2}, \frac{-5}{4}\right)\) with 4a = 1.
Also x2 – x – 1 = -1
⇒ x2 – x = 0
⇒ x (x – 1) = 0
⇒ x = 0 or 1
∴ Area subtended by the region {(x, y) : x2 – x – 1 ≤ y ≤ -1}

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 32

∴ Area of the region {(x, y); x2 – x – 1 ≤ y ≤ – 1} is \(\frac{1}{6}\).

Question 6.
The circle x2 + y2 = 8 is divided into two parts by the parabola 2y = x2. Find the area of both the points.
Solution:

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 33

Given curves are x2 + y2 = 8 ……(1)
and 2y = x2 …….(2)
Solving (1) and (2)
x2 + \(\frac{x^4}{4}\) = 8
⇒ x4 + 4x2 – 32 = 0
⇒ x4 + 8x2 – 4x2 – 32 = 0
⇒ x2 (x2 + 8) – 4(x2 + 8) = 0
⇒ (x2 – 4) (x2 + 8) = 0
⇒ x = ±2 (∵ x2 + 8 = 0 is not admissible)
∴ y = 2
Hence the points of intersection of (1) and (2) are (2, 2) (- 2, 2).
Let the area bounded between (1) and (2) be sum of two areas A1 and A2 as shown in the figure. Then

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 34

Again
A2 = π + \(\frac{2}{3}\) (Since the bounded position is symmetric)
∴ Area bounded by the curves = 2π + \(\frac{4}{3}\) sq.units
Area bounded by the circle = πr2 = 8π when r = 2√2
∴ Area of the remaining portion = 8π – (2π + \(\frac{4}{3}\)) = 6π – \(\frac{4}{3}\) sq.units.

TS Board Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d)

Question 7.
Show that the area of the region bounded by \(\frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}\) = 1 (ellipse) is πab. Also deduce the area of the circle x2 + y2 = a2. (June ’10)
Solution:

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 35

Given equation of ellipse is \(\frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}\) = 1
Since the ellipse is symmetric with respect to coordinate axes we have

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 36

∴ Area of the region bounded by \(\frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}\) = 1 is πab sq.units
Substituting b = a in the above result we have the area of circle given by πa(a) = πa2 sq.units

Question 8.
Find the area of the region enclosed by the curves y = sin πx, y = x2 – x, x = 2.
Solution:
The graphs of the given equations y = sin πx and y = x2 – x, x = 2 are shown below.

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 37

TS Board Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d)

Question 9.
Let AOB be the positive quadrant of the ellipse \(\frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}\) = 1 with OA = a, OB = b. Then show that the area bounded between the chord AB and the arc AB of the ellipse is \(\frac{(\pi-2) a b}{4}\).
Solution:

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 38

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 39

TS Board Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d)

Question 10.
Prove that the curves y2 = 4x and x2 = 4y divide the area of square bounded by the lines x = 0, x = 4, y = 4 and y = 0 into three equal parts.
Solution:

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 40

The given curves are y2 = 4x ……(1) and x2 = 4y ………(2)
Solving y4 = 16x2 = 64y
⇒ y(y3 – 64) = o
⇒ y = 0 or y = 4
When y = 4 we have 4x = 16 ⇒ x = 4
∴ Points of intersection of parabolas is P(4, 4).
∴ Area bounded by the parabolas

TS Inter 2nd Year Maths 2B Solutions Chapter 7 Definite Integrals Ex 7(d) 41

Area of the square formed = (OA)2 = (4)2 = 16
Since the area bounded by the parabolas x2 = 4y and y2 = 4x is \(\frac{1}{2}\) sq.units.
Which is one third of the area of square we conclude that the curves y2 = 4x and x2 = 4y divide the area of the square bounded by x = 0, x = 4, y = 0, y = 4 into three equal parts.

TS 10th Class Telugu Grammar లేఖలు

Telangana SCERT 10th Class Telugu Grammar Telangana లేఖలు Questions and Answers.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 1.
కోపం వల్ల కలిగే అనర్థాలను తెలుపుతూ సోదరి / సోదరుడికి లేఖ రాయండి.
జవాబు:

నల్గొండ,
ది. 10-10-2018.

ప్రియమైన సోదరి / సోదరుడు,

నీ సోదరి / సోదరుడు వ్రాయునది. ముందుగా నీకు నా శుభాకాంక్షలు. ముఖ్యంగా వ్రాయునది అరిషడ్వర్గాలలో కోపం అత్యంత ప్రమాదకరమైనది. కోపం మానవునికి అంతర్గతమైన శత్రువు. కోపం ప్రశాంతతను దెబ్బతీస్తుంది. తోటివారిని ప్రశాంతంగా ఉండనీయదు. విచక్షణా జ్ఞానం క్రమంగా తొలగుతుంది. ఆప్తులు, స్నేహితులు దూరమౌతారు. సంపదలు తొలగిపోతాయి. సంస్కారం చెడిపోతుంది. ప్రేమాభిమానాలకు దూరమౌతారు. అనారోగ్య సమస్యలు ఎదురౌతాయి. కోపం వల్ల ఎన్నో దుర్గుణాలు కూడా కలుగుతాయి. అందువల్ల మనం కోపాన్ని దూరం చేసుకోవాలి. అప్పుడే మనం సుఖమయ జీవితాన్ని గడుపుతాము. అందరికి ఆదర్శంగా ఉండగలుగుతాము.

ఇట్లు,
నీ ప్రియ సోదరి / సోదరుడు,
xxxx

చిరునామా:
XXXXXX,
10వ తరగతి, నిర్మల ఉన్నత పాఠశాల,
పాల్వంచ,
ఖమ్మంజిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 2.
మీ పాఠశాలలో జరిగిన స్వయం పాలనా దినోత్సవం గురించి మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

మిత్రునికి లేఖ

వరంగల్,
X X X X

మిత్రుడు శేఖర్కు,

నీ లేఖ చేరింది. ఉభయ కుశలోపరి. గత నెల 26.1.2017న మా పాఠశాలలో మహా వైభవంగా స్వయంపాలన దినోత్సవం జరిగింది. ఆ రోజు మేము మా పాఠశాలను రంగు కాగితాలతో, మామిడి తోరణాలతో చక్కగా అలంకరించాము. 26వ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు మా ఎమ్.పి. గారు, మా పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేశారు. మా ఎన్.సి.సి. విద్యార్థులు వందనం చేశారు. మేమంతా ఒకే కంఠంతో జెండా పాట పాడాము.

తరువాత సభ జరిగింది. ఆ సభకు స్థానిక ఎమ్.ఎల్.ఏ గారు అధ్యక్షత వహించారు. ఎమ్.పి. గారు, ఎమ్.ఎల్.ఏ. గారు, మా ప్రధానోపాధ్యాయులు స్వయంపాలన దినోత్సవం ప్రాముఖ్యతను గూర్చి మాకు వివరించారు. ఈ సందర్భంగా జరిగిన పోటీలలో గెలిచిన వారికి బహుమతులు పంచారు. నా నాయకత్వంలోని క్రికెట్ టీముకు, మొదటి బహుమతి వచ్చింది. డా. బి.ఆర్. అంబేద్కర్, పండిట్ నెహ్రూజీ, పటేల్ వంటి దేశనాయకుల సేవలను మేము గుర్తు చేసుకున్నాము.

విద్యార్థినీ, విద్యార్థులకు మిఠాయిలు పంచారు. తప్పక లేఖలు రాస్తూ ఉండు. ఉంటాను.

ఇట్లు,
నీ మిత్రుడు,
XXXXXXX

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 3.
మీ పాఠశాలలో జరిగిన వార్షికోత్సవమును గూర్చి మిత్రునకు లేఖ వ్రాయండి.
జవాబు:

నిజామాబాద్,
16-2-2018.

ప్రియమైన మిత్రునకు,

నేను కులాసాగా ఉన్నాను. నీవు క్షేమమని అనుకుంటాను. ప్రతి సంవత్సరం లాగానే మా పాఠశాల వార్షికోత్సవం 14వ తేదీన చాలా ఘనంగా జరుపుకున్నాము. వార్షికోత్సవానికి ముందే వ్యాస రచన, వక్తృత్వము, ఆటల పోటీలు జరుపబడ్డాయి. వార్షికోత్సవానికి మా పాఠశాలకు తనిఖీకి వచ్చు ఉప విద్యాశాఖాధికారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. వార్షికోత్సవం పిల్లలకు ఆనందం ఇచ్చే అంశం. కనుక మేము పాఠశాల ఆవరణను, తరగతి గదులను అందంగా అలంకరించాము.

పాఠశాల కమిటీ కార్యదర్శిగారు జాతీయ జెండాను ఎగురవేశారు. రాబోయే పరీక్షలలో మంచి మార్కులతో విద్యార్థులు ఉత్తీర్ణులు అయి పాఠశాలకు పేరు తేవాలని ముఖ్య అతిథి సందేశమిచ్చారు. సభకు ప్రధానోపాధ్యాయులు అధ్యక్షత వహించారు. పోటీలలో విజేతలకు విద్యాశాఖాధికారిగారు బహుమతులిచ్చారు. నాకు వ్యాసరచనలో ప్రథమ బహుమతిగా తెలుగు నిఘంటువు ఇచ్చారు. తర్వాత విద్యార్థులు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. మీ పాఠశాలలో వార్షికోత్సవం జరిగినదా ? జరిగినచో ఆ విశేషాలు నాకు తెలుపగలవు.

ఇట్లు,
నీ స్నేహితుడు,
X X X X X.

చిరునామా:
ఎ. సుబ్రహ్మణ్య శర్మ,
10వ తరగతి – ‘ఏ’ సెక్షన్,
రామలింగేశ్వరరావు హైస్కూల్,
శాంతినగర్, కరీంనగర్ – 12.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 4.
మీకు నచ్చిన పుస్తకాన్ని గూర్చి సోదరునికి లేఖ వ్రాయండి.
జవాబు:

చేవెళ్ళ,
10-8-2018.

ప్రియమైన సోదరుడు సాంబశివరావుకు,

నేను బాగానే చదువుతున్నాను. ఈ మధ్య నాన్నగారు బారిష్టరు పార్వతీశం అనే పుస్తకాన్ని ఎగ్జిబిషన్లో కొని తెచ్చారు. నేను దాన్ని చదివాను. పార్వతీశంలోని పల్లెటూరితనమూ, పుట్టినరోజుకు అతని మిత్రులు చేసిన హంగామా భలే బాగున్నాయి. పార్వతీశం ఆవకాయజాడీ, గొడుగు, ట్రంకు పెట్టెలతో విదేశీ ప్రయాణానికి వెళ్ళడం చదివి కడుపుబ్బ నవ్వుకున్నాను. తివాచీ తొక్కకూడదని అనుకొని ప్రక్కగా నడిచి పడటము చదువుతుంటే ఇలాంటివారు ఆ కాలంలో నిజంగా ఉన్నారా అనిపించింది. మొత్తం మీద మొక్కపాటి నరసింహ శాస్త్రిగారి ఈ నవల చదివేవారిని ఆకర్షిస్తుందనడం సత్యము. నీవు కూడా సెలవుల్లో గ్రంథాలయానికి వెళ్ళి ఈ పుస్తకం తప్పక చదవగలవు.

ఇట్లు,
నీ అన్నయ్య,
X X X X X.

చిరునామా:
ఐ. సాంబశివరావు,
10వ తరగతి,
రామకృష్ణ ఉన్నత పాఠశాల,
నల్గొండ.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 5.
రక్తదానం అవసరాన్ని తెలియజేస్తూ మిత్రునకు లేఖ వ్రాయండి.
జవాబు:

రంగారెడ్డి,
28-9-2018.

ప్రియమైన మిత్రునకు,

నీ మిత్రుడు వ్రాయునది. రక్తం యొక్క ఉపయోగాలు నీకు కూడా తెలుసుగదా ! రోగులకు రక్తం ప్రాణదాత. అనారోగ్యవంతునకు శరీరంలో రక్తం తగ్గిపోతోంది. ఆపరేషన్ల సమయంలో రోగి చాలా రక్తాన్ని కోల్పోతాడు. ఆ సమయంలో శరీరంలోకి పంపేందుకు రక్తం చాలా అవసరం. ఎవరో ఒకరు రక్తాన్ని దానం చేస్తేనే రోగి మరల బ్రతుకుతాడు. అంటే రక్తదానం చాలా గొప్పది. ఒక జీవికి ప్రాణం పోస్తుంది. ప్రతి మనిషి జీవితంలో ఒకసారైనా రక్తదానం చేయడం అవసరం అని పెద్దలు చెబుతారు. రెడ్ క్రాస్ సంస్థ, కొన్ని స్వచ్ఛంద సంస్థలు రక్తదాన శిబిరాల ద్వారా రక్తాన్ని సేకరించి ఉంచి, అవసరమైన రోగులకు ఉపయోగిస్తున్నాయి. విద్యార్థులమైన మనం ఈ విషయాలన్నీ తెలుసుకొని, ఆచరించాలని నీకు వ్రాస్తున్నాను.

పరీక్షలు కాగానే సెలవులకు ఇక్కడకు రాగలవు.

నీ మిత్రుడు,
XXXXX.

చిరునామా:
ఎ. జగదీష్ కుమార్,
10వ తరగతి,
వివేకానంద మెమోరియల్ హైస్కూల్,
ఆదిలాబాద్.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 6.
నీవు చూసిన యాత్రాస్థలమును వివరిస్తూ, ఇతర ప్రాంతములో చదువుతున్న నీ సోదరికొక లేఖ వ్రాయండి.
జవాబు:

మహబూబ్నగర్,
16-2-2018.

ప్రియమైన సోదరికి,

నీ అన్నయ్య వ్రాయునది. సంక్రాంతి సెలవులకు మా పాఠశాల ఉపాధ్యాయులు మమ్మల్ని విహార యాత్రకు తీసుకొని వెళ్ళారు. మన రాష్ట్రంలో విహారయాత్రా స్థలంగా పేరుపొందిన నాగార్జున సాగర్కు వెళ్ళాము. పూర్వము బౌద్ధ పండితుడైన నాగార్జునుడు ఇక్కడే నివసించెనట. ఈయన తత్త్వవేత్తయేగాక, ఆయుర్వేద పండితుడు కూడా. కృష్ణానదిపై ఇక్కడ నాగార్జునసాగర్ ప్రాజెక్టు కట్టబడింది. రెండు కొండల మధ్య ఇది నిర్మితము.

ఆనకట్ట వెనుక సరోవరం కలదు. సరోవరం నీటిలో చారిత్రక శిథిలాలు మునిగిపోకుండా వాటిని కొండపై నిర్మించిన మ్యూజియంలో ప్రభుత్వం భద్రపరిచింది. మ్యూజియంలో అనేక పాలరాతి శిల్పాలు, బౌద్ధవిగ్రహాలు, పనిముట్లు మొదలైనవి చాలా చూశాము. చుట్టూ గల ప్రకృతి దృశ్యాలు కూడా రమణీయంగా ఉన్నాయి. మా ఉపాధ్యాయులు అన్ని వివరాలు తెలియజేశారు. ప్రకృతి దృశ్యాలు – చారిత్రక ప్రసిద్ధి గల ఈ స్థలాన్ని నీవు కూడా తప్పక చూడాలని కోరుతున్నాను. అమ్మా, నాన్నలకు నా నమస్కారాలు చెప్పగలవు.

ఇట్లు,
నీ ప్రియమైన అన్నయ్య,
XXXX.

చిరునామా:
కె. సుజాత,
10వ తరగతి,
రామకృష్ణ మెమోరియల్ హైస్కూల్,
ఖమ్మం.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 7.
గురుపూజోత్సవం గురించి మిత్రునికి లేఖ వ్రాయండి.
జవాబు:

మెదక్,
10-9-2018.

ప్రియమిత్రుడు ఆనంద్కు,

గడచిన సెప్టెంబర్ 5న మా పాఠశాలలో గురు పూజోత్సవం బ్రహ్మాండంగా జరుపుకున్నాము. ఆ రోజు మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. ఆయన జయంతినే ప్రభుత్వం గురుపూజోత్సవ దినంగా ప్రకటించింది కదా ! ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు డా ॥ రాధాకృష్ణగారి జీవిత విషయాలను, మాకు తెలిపినారు. మేము మా పాఠశాలలోని ఉపాధ్యాయు లందరిని ఆరోజున ప్రత్యేకంగా సన్మానించాం. వారి ఆశీర్వచనాలు పొందాము. మనకు విద్య నేర్పుతున్న గురువులను గౌరవించి సన్మానించడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది.

ఇట్లు
నీ ప్రియ మిత్రుడు,
XXXXX.

చిరునామా:
ఎస్. ఆనంద్,
10వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,
ఖైరతాబాద్,
హైదరాబాదు.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 8.
మొక్కల పెంపకం ఆవశ్యకత గురించి పత్రికా సంపాదకునకు లేఖ రాయండి.
జవాబు:

హైదరాబాద్,
తేది : 10-7-2018.

ఈనాడు పత్రికా సంపాదకులకు,

ఆర్యా,

మన హైదరాబాద్ నగరం వివిధ కాలుష్యాలకు లోనవుతూ ప్రజాజీవనం చాలా దుర్భరంగా తయారయింది. పట్టణాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి, జనాభా పెరుగుదల అనేక కారణాలు ప్రకృతిని కాలుష్యానికి గురిచేస్తున్నాయి. మంచిగాలి, మంచి వాతావరణం రోజురోజుకూ కరువైపోతున్నాయి.

ప్రకృతిలోని పచ్చనిచెట్లు మనిషికి స్వచ్ఛమైన గాలిని ప్రసాదించి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఈ విషయాన్ని గ్రహించి అందరు తమ ఇండ్లలోను, పరసర ప్రాంతాలలోను, రోడ్ల ప్రక్కన మొక్కలను పెంచి నగర కాలుష్యం నుండి బయటపడునట్లు సహ కరించవలసిందిగా మీ పత్రికా ముఖమున కోరు తున్నాము.

ఇట్లు
తమ విధేయుడు,
పి. శ్రీరాం.

చిరునామా:
పత్రికా సంపాదకుడు,
ఈనాడు దినపత్రిక,
వెస్ట్ మారేడ్పల్లి, సికింద్రాబాద్.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 9.
కుటుంబంలో సమాజంలో స్త్రీల పాత్ర గురించి నీ స్నేహితురాలికి లేఖ రాయండి.
జవాబు:

వరంగల్,
తేది : 10-8-2018.

ప్రియ స్నేహితురాలు జానకికి,

నీ మిత్రురాలు రాయునది. ఇక్కడ నేను క్షేమం. అక్కడ నీవు క్షేమమని తలుస్తున్నాను. నీవు ఎలా చదువుతున్నావు ? నేను ఈ లేఖలో ‘కుటుంబంలో సమాజంలో స్త్రీల పాత్ర’ గురించి తెలుపుతాను.

భారతీయ సంస్కృతిలో స్త్రీలకు ప్రాధాన్యత ఇవ్వబడింది. ఒకనాడు మనదేశంలో మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది. కుటుంబ పెద్దగా తల్లి నిర్ణయాలు తీసుకొనేది. తల్లి విద్యావంతురాలైతే కుటుంబమంతా తీర్చిదిద్దబడుతుంది. చరిత్రలో ఎందరో తల్లులు బిడ్డలను ఉత్తములుగా తయారు చేశారు. అందుకే ‘ఇల్లాలు చదువు – ఇంటికి వెలుగు’ అని సూక్తి. తల్లిగా, భార్యగా, సోదరిగా కుటుంబాన్ని సక్రమంగా ఉంచడంలో స్త్రీల ప్రాధాన్యత ఎంతైనా ఉంది. చిన్నప్పుడే తమ పిల్లలకు నీతి పద్యాలు, పురాణ, ఇతిహాసాలు గురించి చెప్పినట్లైతే వారు సంస్కార వంతులుగా రూపొందుతారు.

సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను, దురా చారాలను, అవినీతిని రూపుమాపడానికి ఎందరో స్త్రీలు కృషిచేశారు. నేటికాలంలో కూడా అన్యాయాలకు, అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో స్త్రీలు సమర్థవంతంగా తమ బాధ్యతను నిర్వహించాలి. నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా చేసి, వారి సమస్యల పరిష్కారం కోసం కూడా విద్యా వంతులైన స్త్రీలు కృషి చేయాలి. మొత్తానికి రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో స్త్రీలు ప్రధానపాత్ర వహించి దేశాభివృద్ధికి దోహద పడతారని ఆశిస్తున్నాను.

ఇట్లు
నీ ప్రియమిత్రురాలు,
X X X X X.

చిరునామా:
బి. జానకి,
10వ తరగతి,
రామకృష్ణ స్కూల్,
మణుగూరు, ఖమ్మంజిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 10.
మీ వీధిలో పారిశుద్ధ్య పరిస్థితిని గూర్చి వివరించుచు సంబంధిత అధికారికి లేఖ రాయండి.
జవాబు:

జగిత్యాల,
తేది : 10-11-2018.

మున్సిపల్ ఆరోగ్యశాఖాధికారి గారికి నమస్కరించి వ్రాయు విన్నపము.

అయ్యా,

నేను కరణం గారి వీధిలో నివాసం ఉంటున్నాను.. మా వీధిలో ఎక్కడ చూసినా చెత్త, దుమ్ము, మురికి కనిపిస్తున్నాయి. చెత్త వెయ్యడానికి చెత్త కుండీలు లేవు. మురికినీరు కాలువలు నిండిపోయి రోడ్డుమీదే ప్రవహిస్తుంది. ఇక దుర్గంధం చెప్పడానికి వీలులేదు. ఆ మురికివల్ల దోమల బాధకూడా ఎక్కువైంది. దీనివల్ల మలేరియా సోకే ప్రమాదముంది. కాబట్టి మా వీధి పారిశుద్ధ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిందిగా ప్రార్థిస్తున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
X X X X X X X.

చిరునామా:
ఆరోగ్యశాఖాధికారి గారు,
పురపాలక సంఘ కార్యాలయం,
జగిత్యాల, కరీంనగర్ జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 11.
మరుగుదొడ్ల నిర్మాణ ఆవశ్యకతను గూర్చి జిల్లా కలెక్టరుకు ఒక వినతిపత్రం రాయండి.
జవాబు:

ఉట్నూరు,
తేది : 10-07-2018.

ఆదిలాబాద్ జిల్లా కలెక్టరుగారి దివ్యసముఖమునకు,
ఉట్నూరు గ్రామ నివాసి వ్రాయు విన్నపం.

అయ్యా,

మాది ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు గ్రామం. మా గ్రామంలో ఎంతోమంది నిరుపేదలు నివ సిస్తున్నారు. ఏ రోజుకు ఆ రోజు కాయకష్టం చేసుకొని జీవిస్తున్నారు. మా గ్రామ ప్రజలు మరుగు దొడ్ల సౌకర్యంలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడపడితే అక్కడ మలమూత్ర విసర్జన చేయడం వల్ల గ్రామంలోని వారంతా అనారోగ్యం పాలవు తున్నారు.

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు పెద్దలు. అందువల్లే ప్రభుత్వం కూడా ప్రజల ఆరోగ్య పరిరక్షణ బాధ్యతను చేపట్టి ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుంది. కాబట్టి మా గ్రామంలో హడ్కో పథకం కింద మరుగుదొడ్ల నిర్మాణం జరుగునట్లు చూడవలసినదిగా మనవి చేస్తున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
X X X X X.

చిరునామా:
జిల్లా కలెక్టరుగారు,
జిల్లా కలెక్టరు గారి కార్యాలయం,
ఆదిలాబాద్ జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 12.
స్వచ్ఛభారత్ కార్యక్రమం గూర్చి మిత్రునకు లేఖ వ్రాయండి.
జవాబు:

భద్రాచలం,
23-3-2018.

ప్రియ స్నేహితుడు రవికి,

ఇచ్చట నేను క్షేమం. అచ్చట నీవు క్షేమమని తలుస్తాను. ముఖ్యముగా మా పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నాం. ముఖ్య అతిథిగా మా ప్రాంత యం.యల్.ఎ.గారు విచ్చేసారు. మా పాఠశాల ఆవరణ పరిశుభ్రం చేసాము.

ఈ ఉద్యమం దేశమంతా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ గారి స్ఫూర్తితో విజయవంతమైంది. ఎందరో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ పాఠశాలలో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గురించి తెలుపగలవు.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
X X X X X.

చిరునామా:
పి. రవి,
10 వ తరగతి,
జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల,
మిర్యాలగూడ,
నల్గొండజిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 13.
పెద్దనోట్ల రద్దుపై నీ అభిప్రాయాన్ని తెలుపుతూ మిత్రునికి లేఖ వ్రాయండి.
జవాబు:

నిజామాబాద్,
23-3-2018.

ప్రియమైన మిత్రుడు రామచంద్రకు,

నీ మిత్రుడు వ్రాయునది, నేను బాగా చదువు తున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యంగా వ్రాయునది ఇటీవల మన ప్రధానమంత్రిగారు పెద్ద నోట్లను రద్దు చేశారు. అవినీతిపరులపై సింహస్వప్నంగా నిలిచారు. దేశంలో పేరుకుపోయిన నల్లధనాన్ని వెలికి తీయడానికి ఈ చర్య దోహదం చేస్తుంది. కొద్దిరోజులు ప్రజలు అసౌకర్యాలు పొందినది, దీర్ఘకాలికంగా ఈ చర్య సత్ఫలితాలను అందించగలదని ఆశిస్తున్నాను. ఈ విషయంలో నీ అభిప్రాయాన్ని తెలుపగలవు.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
X X X X X.

చిరునామా:
పి. రామచంద్ర,
10 వ తరగతి,
నెహ్రూ ఉన్నతపాఠశాల,
కరీంనగర్.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 14.
కోపం తగ్గించుకోవడం మంచిది అనే అంశాన్ని బోధిస్తూ, మిత్రుడికి లేఖ రాయండి. (June 2016) (June 2015)
జవాబు:

హైదరాబాదు,
X X X.

మిత్రుడు రఘునందను,

నీ లేఖ అందింది. నేనూ, మా తల్లిదండ్రులు క్షేమం. నీవు రాసిన లేఖలో నీ ప్రియమిత్రుడైన సీతారామ్తో, నీకు తగవు వచ్చిందనీ, మీరు కొట్లాడుకున్నారనీ రాశావు.

నీ ఉత్తరం చూసి, నేను చాలా బాధపడ్డాను. సహజంగా నీవు శాంత స్వభావుడవు. నీకు కోపం ఎందుకు వచ్చిందో రాశావు. అయినా దెబ్బలు తగిలేటంతగా మీ మిత్రులు దెబ్బలాడుకోవడం ఏమీ బాగాలేదు.

‘తన కోపమె తన శత్రువు’ అని సుమతీ శతక కర్త రాశాడు. “క్రోధము మనకు శత్రువు” అని భర్తృహరి కూడా చెప్పాడు. అయినా నీకు అన్ని విషయాలు తెలుసు.

కోపం వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. కోపంతో మన వివేకం నశిస్తుంది. మనం మూర్ఖులం అయిపోతాము. పశువులవలె అయిపోతాము. కాబట్టి నీవు కోపం తగ్గించుకో. నీ మిత్రుడితో నీ విరోధం విషయం, మీ తల్లిదండ్రులకు చెప్పు. వారే మీ తగవు తీరుస్తారు. కోపం తగ్గించుకొని, శాంతంగా ఉండమని నిన్ను నేను కోరుతున్నా.

త్వరలో నీవు, సీతారామ్, తిరిగి మిత్రులవుతారని నాకు నమ్మకం. ఉంటా…

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
అవసరాల యుగంధర్,
10వ తరగతి,
భాష్యం హైస్కూలు, అమీర్పేట.

చిరునామా :
కె. రఘునందన్,
S/o. కె. రాజారావు గారు,
ఇంటి నెం. 4-1-101,
వరంగల్లు, తెలంగాణ,

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 15.
మీ పాఠశాలలో జరిగిన స్వయంపాలన దినోత్సవం గురించి మిత్రునికి లేఖ రాయండి. (March 2016)
జవాబు:
మిత్రునికి లేఖ

కరీంనగర్,
X X X X X.

మిత్రుడు శేఖర్కు, / మిత్రురాలు కవితకు,

నీ లేఖ చేరింది. ఉభయ కుశలోపరి. గత నెల 26.1.2017న మా పాఠశాలలో మహా వైభవంగా స్వయంపాలన ‘దినోత్సవం జరిగింది. ఆ రోజు మేము మా పాఠశాలను రంగు కాగితాలతో, మామిడి తోరణాలతో చక్కగా అలంకరించాము. 26వ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు మా MP గారు, మా పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేశారు. మా NCC విద్యార్థులు వందనం చేశారు. మేమంతా ఒకే కంఠంతో జెండా పాట పాడాము.

తరువాత సభ జరిగింది. ఆ సభకు స్థానిక MLA గారు అధ్యక్షత వహించారు. MP గారు, MLA గారు, మా ప్రధానోపాధ్యాయులు స్వయంపాలన దినోత్సవం ప్రాముఖ్యతను గూర్చి మాకు వివరించారు. ఈ సందర్భంగా జరిగిన పోటీలలో గెలిచిన వారికి బహుమతులు పంచారు. నా నాయకత్వంలోని క్రికెట్ టీముకు, మొదటి బహుమతి వచ్చింది. డా.బి.ఆర్ అంబేద్కర్, పండిట్ నెహ్రూజీ, పటేల్ వంటి దేశనాయకుల సేవలను మేము గుర్తు చేసుకున్నాము.

విద్యార్థినీ, విద్యార్థులకు మిఠాయిలు పంచారు. తప్పక లేఖలు రాస్తూ ఉండు. ఉంటాను.

ఇట్లు,
నీ మిత్రుడు, / మిత్రురాలు,
కె. రవి / పి. నీరజ,

చిరునామా :
S. శేఖర్, / P. కవిత,
పదవ తరగతి,
నెహ్రూజీ కాన్వెంట్,
ఖమ్మం, తెలంగాణ.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 16.
పుస్తకంలోని ‘ముందుమాట’ యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ మీ మిత్రుడికి / మిత్రురాలికి ‘లేఖ’ రాయండి. (June 2019)
జవాబు:

వరంగల్లు,
X X X X X,

ప్రియమైన మణికి,

నేను క్షేమము. నీవు క్షేమమని తలుస్తాను. నేను మొన్న ఒక పుస్తకం చదివాను. అది చాలా బాగుంది. దాని ముందుమాట చాలా గొప్పగా రాశారు. పుస్తకాలు చదివితే విజ్ఞానం, వివేచనాశక్తి, ఉత్సాహం, ఆనందం, పరిశీలనా దృష్టి, జిజ్ఞాస కలుగుతాయి. పుస్తకాన్ని చదవాలంటే ఆ పుస్తక పరిచయ వాక్యాలు చదవాలి. అవి ఆసక్తిని కల్గిస్తాయి. వాటిని ముందుగా చదవాలి. పుస్తకం ఆశయం గురించి, దాని అంతస్సారాన్ని గురించి, గ్రంథనేపథ్యాన్ని గురించి రచయితగానీ, మరొకరు గానీ, విమర్శకులు గానీ రాసే పరిచయవాక్యాలు, పుస్తకాన్ని చదువాలనే ఆసక్తిని కల్గిస్తాయి.

ఉదాహరణకు బారిష్టరు పార్వతీశం, మహాప్రస్థానం, భారత రామాయణ కథలు వంటి పుస్తకాల ముందుమాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. దీనినే పీఠికని, ముందుమాట, భూమిక, ప్రస్తావన, తొలిపలుకు, మున్నుడి, ఆముఖం మొదలైన పేర్లతో పిలుస్తారు.

మెతుకును చూసి అన్నం ఉడికిందో లేదో చెప్పవచ్చు. అట్లే “పుస్తక పరిచయ వ్యాసాన్ని లేదా సమీక్షను చదివితే కూడా ‘ఆ పుస్తకం గురించి ఆమూలాగ్రంగా అర్థం చేసుకోవచ్చని” చెప్పవచ్చు.
పుస్తకం ద్వారా మనం ఏ విషయాలు తెలిసికోగలమో, ఇంకా ఏయే విషయాలు ఆ గ్రంథంలో తెలియచేస్తే బాగుండేదో, పుస్తక పరిచయంలో రాయబడుతుంది. కాబట్టి పుస్తక పరిచయ వ్యాసం, ఆ గ్రంథాన్ని మనకు చక్కగా పరిచయం చేస్తుంది. పుస్తక పరిచయం చదివితే రేఖా మాత్రంగానైనా ఆ పుస్తకాన్ని గురించి తెలుసుకోవచ్చు.

కాబట్టి పుస్తకంలోని ముందుమాట యొక్క ప్రాముఖ్యతను, దాని ప్రాధాన్యతను గురించి నాకు తెలిసిన విషయాలు తెలియచేసాను. నీకు తెలిసిన విషయాలు నీవు తెలియచేయగలవు.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
బి.యన్. రాజు.

చిరునామా :
కె. మణి
నెం : 6, 10వ తరగతి..
జిల్లా పరిషత్ హైస్కూల్, లోనికలాన్,
మెదక్ జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 17.
ప్రభుత్వోద్యోగముల కోసం వెంపర్లాడకుండా, సొంతకాళ్ళపై నిలవాల్సిన ఆవవ్యకతను తెల్పుతూ మిత్రునకు లేఖ.
జవాబు:

నిజామాబాద్,
X X X X X.

మిత్రమా రాజశేఖరా !
నమస్కారం !!

నీ లేఖ చేరింది. నీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించలేదని వ్రాశావు. నీవు ఇప్పటికే B.Sc. అగ్రికల్చరల్ డిగ్రీ పట్టాను పొందావు. మీకు ఉమ్మడి వ్యవసాయం ఉందికదా ! పైగా 50 ఎకరాల భూస్వాములు మీరు. మీ నాన్నగారు. పెద్దవారు అవుతున్నారు.

ఆధునిక పద్ధతులు తెలిసిన నీవు వ్యవసాయం చేయించడంలో అనేక మెలకువలను పాటించు. ట్రాక్టర్లను తీసుకో. నీరు లేని పొలాల్లో బోర్లు వేయించు. నీటి సౌకర్యం ఉన్నచోట అంతర పంటలుగా కూరగాయల్ని పండించు. వాణిజ్యపు పంటలు పండించు. ఇపుడు మన ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేసింది. కనుక పండిన కూరగాయల్ని రైతు బజార్లలో అమ్మి మంచి ఫలసాయం పొందవచ్చును కదా !

వ్యవసాయానికి తోడు పాడిపరిశ్రమను కూడా ఏర్పాటు చెయ్యి. నీతో మరికొందరి యువకుల్ని ప్రోత్సహించు. నీ కాళ్ళపై నీవు నిలబడటమే కాక మరికొంతమందికి ఆశ్రయం కల్పించు. చదువుకున్నవాళ్ళు ముఖ్యంగా సిరిసంపదలు కల్గిన వాళ్ళు తమ తమ సొంతకాళ్ళపై నిలబడి కుటీర పరిశ్రమల్ని, ప్రోత్సహించే పరిస్థితిని కల్పించు. నీ కారణంగా మీ గ్రామంలోనున్న యువకులకు ఆదర్శప్రాయుడివై మార్గదర్శకుడవుతావు. అంతేకాక నీ గ్రామమే ఆదర్శవంతమవుతుంది. మన ప్రభుత్వాలు నిన్ను గుర్తించి, అనేక అవార్డులతో నిన్ను సత్కరిస్తారని ఆశిస్తున్నాను.

ఇట్లు,
నీ మిత్రుడు,
X X X X X.

చిరునామా :
పొన్నం రాజశేఖర్,
S/O పొన్నం వెంకటేష్,
బెల్లంపల్లి (PO), ఆదిలాబాదు జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 18.
నీవు చూచిన ఒక నగరంలోని విశేషాలను వర్ణిస్తూ నీ మిత్రునకు లేఖ.
జవాబు:

నాగార్జున సాగర్,
X X X X X,

ప్రియమిత్రునకు నమస్కారం !
ఉభయకుశలోపరి !

నీ వద్దనుండి ఎటువంటి సమాచారం లేదు. నేను గడచిన సంక్రాంతి సెలవులకు భాగ్యనగరమైన మన రాష్ట్ర రాజధాని హైదరాబాదు వెళ్ళాను. అక్కడ గడిపిన సెలవుల రోజులలో ఎంతో విజ్ఞాన దాయకంగా గడిచింది.

హైదరాబాదు, సికింద్రాబాద్లను కలిపే ట్యాంక్ బండ్ మరింతగా అభివృద్ధి చేసింది మన ప్రభుత్వం. హుస్సేన్ సాగర్, అందులో నిలబెట్టిన బుద్ధ విగ్రహం అత్యంత మనోహరంగా ఉంది. బోటు షికారు చేశాను.

సాలార్జంగ్ మ్యూజియం, పబ్లిక్ గార్డెన్స్, అక్కడే ఉన్న అసెంబ్లీ భవనం, రవీంద్రభారతి చూశాను. మన ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన ప్రగతి భవనం చాలా బాగుంది. జంట నగరాల్లో ముఖ్యంగా కొత్తగా ప్రవేశపెట్టబడిన మెట్రోరైలు ప్రారంభించబడింది. అందులో విహరించాను. ఆ మెట్రో రైలును స్త్రీలే నడుపుతున్నారు. ఇదే ఆశ్చర్యకర విషయం.

సినిమా షూటింగ్స్, రామోజీ ఫిలింసిటీ, అన్నపూర్ణ, రామకృష్ణా స్టూడియోలు, రామానాయుడు స్టూడియోలు, సినీ తారలు నివసించే కాలనీలు, హైటెక్ సిటీలు అన్నీ చూశాను. చాలా ఆనందంగా, విజ్ఞానదాయకంగా గడిచాయి. తప్పక నీవు కూడా మన రాజధాని నగరం చూడవలసింది.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
X X X X X

చిరునామా :
బి. రామారావు, S/O దశరథుడు,
వాహనాల వీధి, భద్రాచలం,
ఖమ్మం జిల్లా, తెలంగాణరాష్ట్రం.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 19.
నగర జీవితంలోని కష్టాల్ని వివరిస్తూ నీ మిత్రురాలికి లేఖ.
జవాబు:

హైదరాబాద్,
X X X X X.

నా ప్రియ మిత్రురాలికి,
నమస్కారం !

నీ లేఖ అందింది. నేను హైదరాబాదులో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను. ఇక్కడ చదువు విషయంలో ఎటువంటి సమస్యలు లేవు. కాని స్కూలు ఫీజులు ఎక్కువ. ఇకపోతే ఈ నగరజీవితం చాలా కష్టంగా ఉంది. నగరంలో రోడ్లన్నీ వాహనాలతో నిండి యుంటాయి. ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. భయంకరమైన రణగొణధ్వనులుంటాయి. వాయుకాలుష్యం ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా వాహనాలు వదలే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై యాక్సైడ్ వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయి. చాలామందికి ఎలర్జీ ఆస్తమా ఉంటోంది.

నగరానికి వలస వచ్చిన పేదవాళ్ళు చిన్నచిన్న ఇరుకు ఇళ్ళల్లో, మురికివాడల్లో ఉంటూ ఉంటారు. ఎవరిగోలవారిది. ఎవరికివారే యమునాతీరే అన్నట్లుగా ఉంటుంది. పరస్పర సహకార సహాయాలుండవు. చాలీచాలని బ్రతుకులు. దారిద్ర్యరేఖలతో పేదవారు సతమతమవుతూంటారు. జబ్బులు చేస్తే నయం అయ్యే మార్గాలు లేవు. ఖరీదైన హాస్పటల్స్ సామాన్య మానవునికి అందుబాటులో ఉండవు.

ఎప్పుడూ వాహన ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. మమతానురాగాలుండవు. ఈ నగరం చూస్తే అర్థంకాని, రసాయనశాల వంటిది. ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి.
నువ్వు బాగా చదువుతావని తలుస్తూ ……………

ఇట్లు,
నీ ప్రియమిత్రురాలు,
X X X X X.

చిరునామా :
ఎస్. ఉష, 10వ తరగతి,
D/O వేంకటేశ్వరరావు,
ఢిల్లీ పబ్లిక్స్కూలు,
మంచిర్యాల, తెలంగాణ.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 20.
“శతక మధురిమ” పాఠం ఆధారంగా, మనం అలవర్చుకోవలసిన మంచి గుణాలను, ఉండకూడని గుణాలను, వివరిస్తూ మీ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:
మిత్రునకు లేఖ

వరంగల్లు,
X X X X X.

మిత్రుడు రాజారెడ్డికి / మిత్రురాలు రమ్యకు,

ఇక్కడ కుశలం. అక్కడ కుశలమే కదా !

మా గురువుగారు శతక మధురిమ పద్యాలు చెప్పారు. వాటిలో మనం అలవాటు చేసుకోవలసిన మంచి గుణాలూ, మనకు ఉండకూడని గుణాలనూ గూర్చి చెప్పారు.

అలవరచుకోవలసిన గుణాలు : సత్యమునే చెప్పాలి. దయ కలిగి ఉండాలి. మనము చేసే పనిలో ఏకాగ్రత కలిగి ఉండాలి. గురుభక్తి, మనస్సులో సౌజన్యమూ ఉండాలి. త్యాగదీక్ష కలిగి, దీనుల దైన్యాన్ని పోగొట్టాలి. దేశమాత గౌరవాన్ని కాపాడాలి. పెంచాలి. మంచి మిత్రులను సంపాదించాలి.

ఉండకూడని గుణాలు : భక్తులను నిందించకూడదు. దాతలను చెడగొట్టకూడదు. స్వార్థం ఉండకూడదు. మంచివారిని మోసగించకూడదు. మాయమాటలు చెప్పి, పరుల ధనాన్ని అపహరించకూడదు. లంచాలు ఇవ్వకూడదు. తల్లిదండ్రులను ఇంటి నుండి గెంటకూడదు. ఇతరుల కొంపలు ముంచకూడదు. కులగర్వం పనికిరాదు.

నీవు కూడా నీవు నేర్చిన విషయాలు, నాకు రాయి. మీ తల్లిదండ్రులకు నా నమస్కారాలు చెప్పు.

ఇట్లు,
నీ, మిత్రుడు, / నీ మిత్రురాలు,
రవికాంత్, / జ్యోత్స్న.

చిరునామా :
కె. రాజారెడ్డి, / కె. రమ్య,
10వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
వేములవాడ.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 21.
మీరు చూచిన గోలకొండ కోట విశేషాలను గూర్చి, నీ మిత్రుడికి ఒక లేఖ రాయండి.
జవాబు:
లేఖ

హైదరాబాదు,
X X X X X.

మిత్రుడు నిర్మల్క,

మిత్రమా ! ఈ లేఖలో నీకు గోల్కొండ కోటను గూర్చి రాస్తున్నా. ఈ మధ్యనే నేను, విహారయాత్రకు వెళ్ళి మిత్రులతో కలిసి గోల్కొండకోట చూసివచ్చాను.

దక్షిణభారతంలో గోలకొండ పట్టణం ప్రసిద్ధిచెందింది. గోలకొండ దుర్గం అంటే, మూడు కోటలు. ఈ దుర్గానికి ఏడుమైళ్ళ కైవారం 87 బురుజులు ఉన్నాయి. ఆజంఖాన్ అనే ఇంజనీరు ఈ గోలకొండ పట్టణాన్ని నిర్మించాడు. ఈ పట్టణంలో వీధులను, మొహల్లాలు అని పిలిచేవారు.

ఈ పట్టణంలో ‘నగీనాబాగ్’ అనే అందమైన ఉద్యానవనం ఉంది. షాహిమహలు, దిల్కషా అనే అందమైన రాజభవనాలు ఉన్నాయి. రెండు బారకాసులు ఉన్నాయి. అందమైన మిద్దెల మీద తోటలున్నాయి. పట్టణ ప్రజలకు ‘కటోరాహువుజు’ ద్వారా నీర సరఫరా చేసేవారు.

గోల్కొండ కోటను బండరాళ్ళతో కట్టారు. మొగలాయీ సైన్యం 9 నెలలు శ్రమపడి, గోల్కొండకోటలో ఒక్క బురుజును మాత్రమే కూల్చగలిగిందట. ఆ బురుజు బదులుగా మరో బురుజును ఒక్క రాత్రిలో సైనికాధికారులు కట్టారట. గోల్కొండ కోటలో కొండపై ‘బాలహిస్సారు’ అనే ప్రాసాదము ఉంది. దానికి వెళ్ళేదారిలో ద్వారం దగ్గర, ఒక రాతి గుండు ఉంది. ఆ రాతిపై నిలిచి, చప్పట్లు కొడితే ఆ శబ్దం బాలహిస్సారు భవనంలోకి వినబడేదట.

గోల్కొండ కోటను తప్పక చూడాలి. సెలవులకు నీవు వస్తే నేను చూపిస్తా. శుభాకాంక్షలు.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
X X X X X X.

చిరునామా :
పి. నిర్మల్, 10వ తరగతి,
జవహర్ కాన్వెంటు,
ఖమ్మం.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 22.
ఆడినమాట తప్పకపోవడం, దానగుణం కలిగి ఉండడం మొదలయిన విశిష్ట లక్షణాల ఆవశ్యకతను తెలుపుతూ నీ మిత్రునికి / స్నేహితురాలికి లేఖ రాయండి.
జవాబు:
లేఖ

భద్రాచలం,
X X X X X.

మిత్రుడు రామ్ పాల్కు, / మిత్రురాలు రాధికకు,

నీ లేఖ చేరింది. నిత్య జీవితంలో మనం ఎలా నడచుకోవాలో తెలుపుతూ మా రామాలయంలో ఓ సాధువుగారు మాట్లాడారు. ఆయన జీవితంలో సత్యవాక్కు, దానగుణము ఉండాలని చెప్పారు. ఆయన మాటలు నాకు నచ్చాయి.

పురాణాల్లో కర్ణుడుని దానకర్ణుడు అంటారు. తన ప్రాణానికి ముప్పు వస్తుందని తెలిసినా కర్ణుడు తన సహజ కవచకుండలాలను దానం చేశాడు. అలాగే మనం చదివిన దానశీలము పాఠంలో బలిచక్రవర్తి, గురువు గారు వద్దంటున్న మానకుండా వామనుడికి మూడు అడుగుల నేలను సంతోషంగా ధారపోశాడు. ఆ దానం వల్ల బలి చక్రవర్తి పాతాళలోకంలోకి తొక్కి వేయబడ్డాడు. అయినా ఈ భూమండలం ఉన్నంతవరకు బలిచక్రవర్తి కీర్తి శాశ్వతంగా నిలిచింది.

అలాగే శిబి చక్రవర్తి పావురాన్ని రక్షించడానికి తన శరీరాన్ని కోసి ఇచ్చాడు. వారి కీర్తి చిరస్థాయిగా నిలిచింది. మనం కూడా చీటికీ మాటికీ అబద్ధాలు ఆడడం మాని వేయాలి. సత్యవాక్యాన్ని నిలబెట్టాలి. మన మిత్రులకు అవసరం అయినప్పుడు దానం చెయ్యాలి.

నేను సత్యమే మాట్లాడతానని, ఉన్నమేరకు ఇతరులకు దానధర్మాలు చేస్తానని ప్రతిజ్ఞ చేశాను. నీవు కూడ తప్పక ఈ మంచి గుణాలను పాటించు.

ఇట్లు,
నీ మిత్రుడు, / మిత్రురాలు,
శివరావు. / సరోజ.

చిరునామా :
పి. రామ్ గోపాల్, / పి. రాధిక,
S/o వెంకట్రావు, / D/o వెంకట్రావు,
10వ తరగతి, బాపూజీ నగర్,
ఖమ్మం, తెలంగాణ.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 23.
మీ పాఠశాలలో జరిగిన వార్షికోత్సవాన్ని గూర్చి నీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:
లేఖ

ఆదిలాబాదు,
X X X X X.

మిత్రుడు ప్రశాంత్ కు, / మిత్రురాలు మాధురికి,

నీ లేఖ చేరింది. ఈ మధ్య మా పాఠశాలలో వార్షికోత్సవం జరిగింది. మా జిల్లా విద్యాశాఖాధికారి గారు ముఖ్య అతిధిగా వచ్చారు. ఉదయము మా ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను, పాఠశాల పతాకాన్ని ఎగురవేశారు.

పాఠశాలలో ఈ సందర్భంగా సాహిత్య సాంస్కృతిక పోటీలు, ఆటలు పోటీలు’ జరిగాయి. నాకు ఇంగ్లీషు, తెలుగు వ్యాసరచనలలో ప్రథమ బహుమతి వచ్చింది. సాయంత్రము 5 గంటలకు వార్షికోత్సవ సభ జరిగింది. మా పాఠశాల అన్ని రంగాలలో ముందున్నదని మా DEO గారు మెచ్చుకున్నారు. పబ్లిక్ పరీక్షలలో నూటికి నూరు శాతం కృతార్థులు కావాలని చెప్పారు.

DEO గారు మాకు బహుమతులు పంచారు. విచిత్రవేషాలు, నాటికలు ప్రదర్శించారు. బాలికలు నృత్యం చేశారు. పాటలు పాడారు. తెలంగాణ తల్లిపై మంచి పాటలు పాడారు. మీ పాఠశాలలో జరిగిన వార్షికోత్సవం గురించి తప్పక రాయి.

ఇట్లు,
నీ మిత్రుడు, / మిత్రురాలు,
రవిబాబు. / నీరజ.

చిరునామా :
K. ప్రశాంత్, / P. మాధురి,
– S/o K. రాజా, D/o P. రమణకుమార్,
వరంగల్లు, తెలంగాణ.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 24.
విహార యాత్రను వివరిస్తూ తండ్రికి లేఖ.
జవాబు:

రామగుండం,
X X X X X.

పూజ్యులైన నాన్నగారికి నమస్కారములు.

నేను క్షేమంగానే ఉన్నాను. అక్కడ అందరూ క్షేమమని తలుస్తాను. ఇటీవల నేను నా మిత్రులతో కలిసి హైదరాబాదు విహారయాత్రకు వెళ్ళి వచ్చాను. ఆ విశేషాలు ఈ లేఖలో తెలియజేస్తున్నాను.

గడచిన బుధవారం సాయంకాలం రామగుండంలో రైలు ఎక్కి తెల్లవారేసరికి హైదరాబాదు చేరాం. అక్కడ కార్యక్రమాలన్నీ ముగించుకొని నగరదర్శనానికి బయలుదేరాం.

ఆ నగర శోభను చూస్తుంటే నాకెంతో ఆశ్చర్యం వేసింది. ఎక్కడ చూసినా ఫ్లైఓవర్ బ్రిడ్జీలు చూడముచ్చటగా ఉన్నాయి. ట్యాంక్ బండ్ పై గల విగ్రహాలు చూపరులను అట్టే ఆకర్షించేలా ఉన్నాయి.

ముఖ్యంగా సాలార్జంగ్ మ్యూజియం, నెహ్రూ జంతుప్రదర్శనశాల, చార్మీనార్, బిర్లామందిర్, పబ్లిక్ గార్డెన్స్, రామోజీ ఫిల్మ్ సిటీ, గోలకొండ కోట వంటివి యాత్రికులను బాగా ఆకర్షిస్తాయి. రెండు రోజులపాటు అక్కడి దర్శనీయ స్థలాలను చూసి మరల రైలులో సరదాగా పాటలు పాడుకొంటూ జోక్స్ వేసుకొంటూ కాలం తెలియకుండా తిరుగు ప్రయాణం చేశాం. అమ్మగారికి నా నమస్కారాలు.

ఇట్లు,
తమ కుమారుడు,
రాళ్ళభండి సిద్ధార్థ.

చిరునామా :
శ్రీరాళ్ళబండి శ్రీనివాస్ గారు,
మంథని,
కరీంనగర్ జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 25.
మీ వీధిలో పారిశుధ్య పరిస్థితిని (అపరిశుభ్రతను) గూర్చి వివరించుచు సంబంధిత అధికారికి లేఖ వ్రాయుము.
జవాబు:

కరీంనగర్,
X X X X X.

మున్సిపల్ ఆరోగ్యశాఖాధికారి గారికి నమస్కరించి మోహన్ వ్రాయు విన్నపము.

అయ్యా,

నేను కరణం గారి వీధిలో నివాసం ఉంటున్నాను. మా వీధిలో ఎక్కడ చూసినా చెత్త, దుమ్ము, మురికి ప్రత్యక్షమవుతాయి. చెత్త పారెయ్యడానికి చెత్త కుండీలు లేవు. మురికినీరు కాలువలు నిండిపోయి రోడ్డుమీదే ప్రవహిస్తుంది. ఇక దుర్గంధం చెప్పడానికి వీలులేదు. ఆ మురికి వల్ల దోమల బాధకూడా ఎక్కువైంది. దీనివల్ల మలేరియా సోకే ప్రమాదముంది. కాబట్టి మావీధి పారిశుధ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవల్సిందిగా ప్రార్థిస్తున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
వి.యస్. మోహన్.

చిరునామా :
ఆరోగ్యశాఖాధికారి గారు,
పురపాలక సంఘ కార్యాలయం,
కరీంనగర్.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 26.
పుట్టినరోజుకు ఆహ్వానిస్తూ మిత్రునికి లేఖ.
జవాబు:

సిద్ధిపేట,
X X X X X.

ప్రియమిత్రుడు శ్రీనివాసు,

నేను బాగుగానే చదువుచున్నాను. నీవు కూడ బాగుగా చదువుచున్నావని తలచెదను.

వచ్చే బుధవారము నా పుట్టినరోజు. ఆ రోజున మిత్రులందరిని ఆహ్వానించి అందరి సమక్షంలో నా పుట్టినరోజు పండుగను బ్రహ్మాండముగా జరుపుకొనవలెనని నిశ్చయించుకొంటిని. నీవు ఎన్ని పనులున్నను తప్పక నా పుట్టినరోజు పండుగకు హాజరు కావలసినదిగా కోరుచున్నాను. ఆ రోజు ఉదయం నుండి సాయంకాలము వరకు వివిధ కార్యక్రమములు నిర్వహింపబడును. కనుక నీవు ఒక రోజు ముందుగానే రావలసినదిగా తెలియజేయుచున్నాను.

నీ తల్లిదండ్రులకు నా నమస్కారములు.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
వి. ప్రసాద్.

చిరునామా :
పి. శ్రీనివాస్,
10వ తరగతి,
గవర్నమెంట్ హైస్కూలు,
సికింద్రాబాదు.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 27.
నీ మాతృదేశాన్ని (భారతదేశం) గురించి పరిచయం చేస్తూ విదేశంలోని కలం స్నేహితునికి లేఖ.
జవాబు:

హైదరాబాద్,
X X X X X.

ప్రియ కలం స్నేహితుడు జాన్ డేవిడ్ పాల్కు,

నేను క్షేమంగా ఉన్నాను. నీవు కూడా క్షేమంగా ఉన్నావని తలుస్తాను. నేను ఈ లేఖలో మా భారతదేశ విశేషాలు తెలియజేస్తున్నాను.

ఆసియా ఖండంలోగల పెద్ద దేశాలలో భారతదేశం ఒకటి. దీనినే ‘ఇండియా’ అని పిలుస్తారు. మా భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రం ఎల్లలుగా ఉన్నాయి. మా దేశంలో సింధు, గంగ, యమున, కృష్ణ, గోదావరి వంటి జీవనదులెన్నో ఉన్నాయి.

భారతదేశంలో వివిధ జాతులవారు, మతాలవారు ఉన్నారు. ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనటానికి మా దేశాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సత్యం, అహింసయే ఆయుధాలుగా భావించెడి దేశం మాది. సర్వమానవులను సౌభ్రాతృత్వ దృష్టితో చూస్తూ అందరి సుఖశాంతులను కాంక్షించేదే మా భారతదేశం.

ఇట్లు,
నీ కలం స్నేహితుడు,
డి. వి. శ్యామసుందర్.

చిరునామా :
జాన్ డేవిడ్ పాల్,
డోర్ నెం. 4/159,
కెనడీ రోడ్, వాషింగ్టన్,
అమెరికా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 28.
మంచి పుస్తకాన్ని గూర్చి స్నేహితునికి లేఖ .
(లేదా)
నచ్చిన పుస్తకాన్ని పరిచయం చేస్తూ మిత్రునికి లేఖ.
జవాబు:

నిజామాబాదు,
X X X X X.

ప్రియ మిత్రుడు శేఖర్ బాబుకు,

నీ ప్రియ మిత్రుడు శశిధర్ అనేక శుభాకాంక్షలతో వ్రాయునది. ఉభయకుశలోపరి. నేను ఈ మధ్య కందుకూరి వీరేశలింగం పంతులుగారు రచించిన “రాజశేఖర చరిత్ర” చదివాను. ఈ గ్రంథములో రాజశేఖరుడు అనే బ్రాహ్మణుడు నాయకుడు. ఈ గ్రంథము ఆంధ్రభాషలో రచించిన తొలి తెలుగు నవలయని తెలిసింది. ఈ నవలను వీరేశలింగంగారు తన కాలములో ఉన్న సాంఘిక దురాచారాలను ఖండించడానికి వ్రాశారు.

ఆనాడు సంఘంలో పొగడ్తలకు లొంగి గొప్పగా కుమార్తెల పెండ్లిండ్లు చేసి అప్పుల పాలైన రాజశేఖరుడుగారి వంటి సంపన్నులు ఉన్నారు. దయ్యములు, భూతవైద్యము, జ్యోతిషం మొదలైన వానిపై ప్రజలకు నమ్మకముండేది. దానితో ఆ పేరు చెప్పుకొని సిద్ధాంతులు, దామోదరయ్య వంటి వారు తమ పొట్టపోసుకొనేవారు. పెద్దాపురం రాజా వంటి మంచి రాజాధికారులు కూడ ఉండేవారని తెలుస్తుంది. గ్రాంథిక భాషలో ఈ నవల చక్కగా వ్రాయబడినది. తెలుగు భాషలో మొదటి నవలయైన రాజశేఖరచరిత్ర తెలుగు నవలా సాహిత్యంలో మణిపూస.

నీవు కూడా ఈ మధ్య చదివిన పుస్తకం గూర్చి వ్రాస్తావని ఆశిస్తున్నాను. శుభాకాంక్షలతో.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
కె. శశిధర్.

చిరునామా :
కె. శేఖర్ బాబు,
10వ తరగతి, జిల్లా పరిషత్ హైస్కూలు,
నిజామాబాదు.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 29.
మీ వీధిలో మంచినీటి సమస్య గురించి వివరించుచు సంబంధిత అధికారికి లేఖ వ్రాయుము.
జవాబు:

నిర్మల్,
X X X X X.

మంచినీటి సరఫరాశాఖ చీఫ్ ఇంజనీర్ గారికి నమస్కరించి
గోపాలకృష్ణ వ్రాయు విన్నపము.

అయ్యా,

మా ప్రాంతంలోని ప్రజలు మంచినీటి సరఫరా సక్రమంగా లేనందువల్ల నానా ఇబ్బందులు పడుతున్నారు. సుమారు పదిరోజులుగా మా ప్రాంతంలో, అందులోను ముఖ్యంగా మా వీధిలో మంచినీటి పంపులు పనిచేయడంలేదు. ప్రజలు త్రాగేటందుకు చుక్క నీరు దొరకక అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం బావినీటితోనే కాలక్షేపం చేస్తున్నారు. కాబట్టి మీరు వెంటనే తగు చర్యలు తీసుకొని పంపులు సరిగా పనిచేయునట్లు చూడవలసిందిగా కోరుతున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
వి. గోపాలకృష్ణ.

చిరునామా :
చీఫ్ ఇంజనీర్,
మంచినీటి సరఫరాశాఖ కార్యాలయం,
నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 30.
ఉపకార వేతనాన్ని కోరుతూ జిల్లా విద్యాశాఖాధికారికి దరఖాస్తు.
జవాబు:

వరంగల్,
X X X X X.

వరంగల్ జిల్లా విద్యాశాఖాధికారి గారి దివ్య సముఖమునకు,

అయ్యా,

నేను జిల్లా పరిషత్ హైస్కూలులో పదవ తరగతి చదువుచున్నాను. నేను ఆర్థికముగా వెనుకబడిన కుటుంబమునకు చెందినవాడను. 9వ తరగతి పరీక్షలలో నాకు 600 మార్కులకు 530 మార్కులు వచ్చినవి. పై చదువులు చదువుటకు ఆర్థిక శక్తి లేకపోవుటచే మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పవలసి వచ్చుచున్నది. కనుక తమరు నాయందు దయయుంచి ఉపకార వేతనమును మంజూరు చేయవలసినదిగా ప్రార్థించుచున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
అగ్గిరాజు శ్రీహర్ష.

చిరునామా :
జిల్లా విద్యాశాఖాధికారి గారికి,
జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం,
వరంగల్, వరంగల్ జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 31.
పుస్తక విక్రేతకు లేఖ.
జవాబు:

వరంగల్,
X X X X X.

శ్రీయుతులు వి.జి.యస్. పబ్లిషర్స్
మేనేజర్ గారికి నమస్కారములు.

ఆర్యా!

ఈ దిగువ తెలియజేయబడిన పుస్తకాలను శ్రీ రామదాసు మోటారు ట్రాన్సుపోర్టు ద్వారా పార్శిలులో పంపించ ప్రార్థన. మీకు అడ్వాన్సుగా రూ.100/- (వంద రూపాయలు) పంపుచున్నాను. మిగిలిన పైకమును చెల్లించి పుస్తకముల పార్శిలు విడిపించుకొనగలవాడను. పుస్తకములపై తగిన కమీషన్ ఇవ్వవలసినదిగా కోరుచున్నాను.
పుస్తకముల వివరములు :

  1. పదో తరగతి తెలుగు క్వశ్చన్ బ్యాంకులు – 10 కాపీలు
  2. పదో తరగతి ఇంగ్లీషు క్వశ్చన్ బ్యాంకులు – 20 కాపీలు
  3. పదో తరగతి హిందీ క్వశ్చన్ బ్యాంకులు – 15 కాపీలు
  4. పదో తరగతి గణితశాస్త్రం క్వశ్చన్ బ్యాంకులు – 20 కాపీలు

ఇట్లు,
మీ విశ్వాసపాత్రుడు,
ఐ.వి. గణేష్కుమార్.

చిరునామా :
మేనేజర్,
వి.జి.యస్. పబ్లిషర్స్,
నింబోలి అడ్డ, కాచిగూడ,
హైదరాబాదు.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 32.
దొంగిలింపబడిన సైకిలును గూర్చి సంబంధిత అధికారికి లేఖ.
జవాబు:

వరంగల్,
X X X X X.

స్టేషను హౌసు ఆఫీసరుగార్కి,
ఒకటవ టౌను పోలీసు స్టేషను,
వరంగల్.

ఆర్యా,

నేను మహాత్మాగాంధీజీ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్నాను. నేను నిన్న స్కూల్ విడిచిపెట్టిన తరువాత రవీంద్ర కేఫ్ టిఫిను తినడానికి వెడుతూ నా సైకిలు హోటల్ ఎదుట పెట్టి తాళం వేశాను. నా సైకిలు హేండిల్బారుపై “కె. రవి” అని పేరు ఉంది. నాది హీరో సైకిలు. రెండేళ్ళ క్రిందట కొన్నది. ఇంకా క్రొత్త సైకిలువలె రంగు మాయకుండ ఉన్నది. నలుపురంగు, సైకిలు నెంబరు 186281. స్టీలు ఊసలుగల చక్రాలు ఉన్నాయి.

దయతో నా సైకిలును గూర్చి దర్యాప్తుచేసి నాకు దానిని నా స్కూల్ వద్ద అప్పచెప్పవలసినదిగా కోరుచున్నాను.

ఇట్లు,
కాగితాల రవి,
‘పదవ తరగతి,
మహాత్మాగాంధీజీ హైస్కూల్,
వరంగల్.

చిరునామా:
స్టేషన్ హౌస్ ఆఫీసర్,
I టౌన్ పోలీస్ స్టేషన్,
వరంగల్, వరంగల్ జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 33.
నగరంలో మొక్కల పెంపకం ఆవశ్యకత గురించి పత్రికా సంపాదకునికి లేఖ.
జవాబు:

హైదరాబాదు,
X X X X X.

ఈనాడు పత్రికా సంపాదకులకు,

ఆర్యా,

మన హైదరాబాదు నగరం వివిధ కాలుష్యాలకు లోనవుతూ ప్రజాజీవనం చాలా దుర్భరంగా తయారయింది. పట్టణాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి, జనాభా పెరుగుదల అనేక కారణాలు ప్రకృతిని కాలుష్యానికి గురిచేస్తున్నాయి. మంచిగాలి, మంచి వాతావరణం రోజురోజుకూ కరువైపోతున్నాయి. ప్రకృతిలోని పచ్చనిచెట్లు మనిషికి స్వచ్ఛమైన గాలిని ప్రసాదించి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఈ విషయాన్ని గ్రహించి అందరు తమ ఇండ్లలోను, పరిసర ప్రాంతాలలోను, రోడ్ల ప్రక్కన మొక్కలను పెంచి నగర కాలుష్యం నుండి బయటపడునట్లు సహకరించవలసిందిగా మీ పత్రికా ముఖమున కోరుతున్నాము.

ఇట్లు,
తమ విధేయుడు,
పి. శ్రీనివాస్.

చిరునామా:
పత్రికా సంపాదకుడు,
ఈనాడు దినపత్రిక,
సోమాజిగూడ, హైదరాబాద్.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 34.
నేత్రదానం చేయవలసిందిగా అందరిని ప్రోత్సహిస్తూ పత్రికలో ప్రచురించవలసిందిగా సంపాదకునికి లేఖ. (లేదా) నేత్రదానం ఆవశ్యకతను తెలియజేస్తూ పత్రికా సంపాదకుడికి లేఖ.
జవాబు:

వరంగల్,
X X X X X.

ఈనాడు పత్రికా సంపాదకునకు,

అయ్యా,

మన దేశంలో గ్రుడ్డితనంతో బాధపడేవారి సంఖ్య చాలా ఎక్కువ. ‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అన్నారు పెద్దలు. అలాంటప్పుడు కళ్ళు లేనివారి జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. వారి జీవితాలలో వెలుగు ప్రసాదింపజేయటం సాటి మానవులుగా మన కర్తవ్యం. అందుకు నేత్రదానం చేయడం ఎంతైనా అవసరం. మనిషి తాను మరణించిన తరువాత తన నేత్రాలను దానం చేయడం ద్వారా మరొకరికి చూపు ప్రసాదించిన వాడవుతాడు. కాబట్టి అన్ని దానాలలోకి నేత్రదానం చాలా గొప్పది. దీన్ని ప్రోత్సహిస్తూ మీ పత్రికలో ప్రచురించి ప్రజలు చైతన్యవంతులగునట్లు చేయవలసిందిగా కోరుతున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
ఐ. గణేష్ కుమార్.

చిరునామా :
పత్రికా సంపాదకుడు,
‘ఈనాడు’ కార్యాలయం,
వరంగల్.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 35.
రక్తదానం అవసరాన్ని తెలియజేస్తూ మిత్రునకు లేఖ.
జవాబు:

హైదరాబాదు,
X X X X X.

ప్రియ మిత్రుడు నరేంద్రకు,

నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని తలుస్తాను. ముఖ్యంగా ఈ లేఖలో రక్తదానం అవసరాన్ని గూర్చి తెలియజేస్తున్నాను.

కొన్ని పరిస్థితులలో తోటి మానవుని ప్రాణాన్ని కాపాడటానికి రక్తదానం ఎంతైనా అవసరం. అలాంటప్పుడు ఆ వ్యక్తియొక్క రక్త గ్రూపునకు సంబంధించిన రక్తాన్నే దానం చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆ వ్యక్తి ప్రాణానికే ముప్పు సంభవించవచ్చు. అప్పటికప్పుడు ఆయా రక్త గ్రూపు కలవారు దొరకటం చాలా కష్టం. కాబట్టి ముందుగానే రక్తదానం చేస్తే బ్లడ్ బ్యాంకులలో నిల్వచేసి అవసరం వచ్చినపుడు ఆయా వ్యక్తులకు ఉపయోగిస్తారు. ఇది దృష్టిలో పెట్టుకొని నేను రక్తదానం చేశాను. నీవు కూడా నాలాగే రక్తదానం అవసరాన్ని గుర్తించి అందుకు సహకరించగలవని ఆశిస్తున్నాను.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
కోట రవికుమార్.

చిరునామా :
ఆర్. నరేంద్ర, 10వ తరగతి,
మున్సిపల్ హైస్కూలు,
ఆదిలాబాద్.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 36.
గురుపూజోత్సవం గురించి మిత్రునికి లేఖ.
జవాబు:

పాల్వంచ,
X X X X X.

ప్రియమిత్రుడు ఆనందు,

గడచిన సెప్టెంబర్ 5న మా పాఠశాలలో గురుపూజోత్సవం బ్రహ్మాండంగా జరుపుకున్నాం. ఆ రోజు మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. ఆయన జయంతినే ప్రభుత్వం గురుపూజోత్సవ దినంగా ప్రకటించింది కదా ! మేము . మా పాఠశాలలోని ఉపాధ్యాయులందరిని ఆ రోజున ప్రత్యేకంగా సన్మానించాం. వారి ఆశీర్వచనాలు పొందాం. మనకు విద్య నేర్పుతున్న గురువులను గౌరవించి సన్మానించడం నా కెంతో ఆనందాన్ని కలిగించింది.

ఇట్లు,
నీ మిత్రుడు,
రాజారాం.

చిరునామా :
ఎస్. ఆనంద్, 10వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,
ఖమ్మం, ఖమ్మం జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 37.
ఉగ్రవాదం వల్ల సంభవిస్తున్న నష్టాలను వివరిస్తూ మిత్రునకు లేఖ.
జవాబు:

ఆసిఫాబాద్,
X X X X X.

ప్రియ మిత్రురాలు సాయిచంద్రికకు,

నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని తలుస్తాను. ఈ మధ్య దేశంలో ఉగ్రవాదం విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఎన్నో నష్టాలు సంభవిస్తున్నాయి. వాటిని గురించి ఈ లేఖలో తెలియజేయదలచాను.

ఉగ్రవాదం మన జాతీయ సమైక్యతకు తీవ్రభంగాన్ని, అశాంతిని కలిగిస్తున్నది. వారి పాశవిక చర్యలకు అనేకమంది తమ ప్రాణాలు కోల్పోవడం జరుగుతోంది. అంతేకాక వారు ప్రజల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు నష్టపరుస్తున్నారు. దీనివల్ల వారు సాధించేది ఏమీలేదు. కాబట్టి ఉగ్రవాదులు తమ దుష్టమైన మార్గాన్ని విడిచిపెట్టి దేశశ్రేయస్సుకు పాటుపడాలని ఆశిస్తున్నాను.

ఇట్లు,
నీ మిత్రురాలు,
హరి అపర్ణ.

చిరునామా :
గార్లపాటి సాయిచంద్రిక,
10వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,
మంచిర్యాల,
ఆదిలాబాద్ జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 38.
మరుగుదొడ్ల నిర్మాణ ఆవశ్యకతను గూర్చి జిల్లాకలెక్టరుకు వినతిపత్రం :
జవాబు:

జోగిపేట,
X X X X X.

మెదక్ జిల్లా కలెక్టరుగారి దివ్యసముఖమునకు
జోగిపేట గ్రామ నివాసి వ్రాయు విన్నపం.

అయ్యా,

మాది ఆంథోల్ మండలంలోని జోగిపేట. మా గ్రామంలో ఎంతోమంది నిరుపేదలు నివసిస్తున్నారు. ఏ రోజునకు ఆ రోజు కాయకష్టం చేసుకొని జీవిస్తున్నారు. మా గ్రామ ప్రజలు మరుగుదొడ్ల సౌకర్యంలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడపడితే అక్కడ మలమూత్ర విసర్జన చేయడంవల్ల గ్రామంలోని వారంతా అనారోగ్యం పాలవుతున్నారు.

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు పెద్దలు. అందువల్లే ప్రభుత్వం కూడా ప్రజల ఆరోగ్య పరిరక్షణ బాధ్యతను చేపట్టి ఎన్నో పథకాలు ప్రవేశపెడుతోంది. కాబట్టి మా గ్రామంలో హాడ్కో పథకం కింద మరుగుదొడ్ల నిర్మాణం జరుగునట్లు చూడవలసినదిగా మనవి చేస్తున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
అక్క పెద్ద నర్సయ్య.

చిరునామా :
జిల్లాధికారి,
జిల్లాధికారి కార్యాలయం,
మెదక్, మెదక్ జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 39.
పాఠశాలలో కావలసిన సౌకర్యాలను కోరుతూ విద్యాశాఖాధికారికి లేఖ.
జవాబు:

ఉట్నూరు,
X X X X X.

ఆదిలాబాద్ విద్యాశాఖాధికారి గారి దివ్యసముఖమునకు,

అయ్యా,

నేను ఉట్నూరు ఎస్.ఆర్.యం. హైస్కూలులో పదవతరగతి చదువుతున్నాను. మా పాఠశాలలో 900 మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థులందరికి సరిపడ తరగతి గదులు లేక ఇబ్బంది పడుతున్నాం. అలాగే మా పాఠశాలకు గ్రంథాలయ వసతి కాని, లేబరేటరి వసతికాని లేదు. వీటికి తోడు ఉపాధ్యాయుల కొరత కూడా కలదు. అందువల్ల మా కెంతో అసౌకర్యంగా ఉంది. తమరు దయయుంచి పై విషయాలను దృష్టిలో పెట్టుకొని తగిన ఏర్పాట్లు చేసి మా విద్యాభివృద్ధికి సహాయపడవలసినదిగా ప్రార్థించుచున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
ఆర్. రమేష్.

చిరునామా :
జిల్లా విద్యాశాఖాధికారి,
జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం,
ఆదిలాబాద్, ఆదిలాబాద్ జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 40.
వ్యాయామశాల స్థాపనకై పత్రికా సంపాదకునకు లేఖ.
జవాబు:

వనపర్తి,
X X X X X.

‘ఆంధ్రజ్యోతి’ సంపాదకులకు,
వనపర్తి గ్రామ నివాసి వ్రాయు విన్నపం –

ఆర్యా

మానవుని మనుగడకు ఆహారం ఎంత అవసరమో వ్యాయామం కూడా అంతే అవసరం. శరీర ఆరోగ్యం బాగా ఉండాలంటే అందరూ తప్పక వ్యాయామం చేయాల్సిందే.

కుస్తీలు పట్టుట, బస్కీలు, దండెములు తీయుట, బరువైన వస్తువులు పైకెత్తుట మొదలైన వ్యాయామ సాధనకు ఒక వ్యాయామ శాల ఉంటే అందరికీ అనుకూలంగా ఉంటుంది.

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు కదా ! అలాంటి ఆరోగ్యానికి మూలం శరీర వ్యాయామం. ఈ వ్యాయామం చేయటానికి మా గ్రామంలో ఒక వ్యాయామశాలను ప్రభుత్వం స్థాపించే విధంగా తమ పత్రికాముఖంగా సహకరించవలసిందిగా కోరుతున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
హరి బుచ్చికోటయ్య.

చిరునామా :
సంపాదకుడు,
‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక,
మహబూబ్నగర్,
మహబూబ్నగర్ జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 41.
పాఠశాలలో జరిగిన క్రీడోత్సవాలను గురించి మిత్రునకు లేఖ (ఆటల పోటీలు).
జవాబు:

హైదరాబాద్,
X X X X X.

ప్రియమిత్రుడు రాజేషు,

నేను క్షేమంగా ఉన్నాను. నీవుకూడా క్షేమంగా ఉన్నావని తలుస్తాను. ఈ లేఖలో మా పాఠశాలలో జరిగిన క్రీడోత్సవాలను గురించి తెలియజేస్తున్నాను.

గడచిన బుధవారం మా పాఠశాలలో జిల్లాస్థాయి క్రీడోత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయి. ఈ క్రీడోత్సవాలలో జిల్లా నాల్గు మూలల నుండి వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు. మా జిల్లాధికారి ఈ ఉత్సవాలను ప్రారంభించారు. కబాడి, ఖోఖో, వాలీబాల్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ మొదలైన ఆటల పోటీలు రెండురోజులపాటు జరిగాయి. మా పాఠశాల జట్టు బాస్కెట్బాల్ పోటీలో పాల్గొని విజయం సాధించింది. మీ పాఠశాలలో జరిగిన ఆటల పోటీలను గురించి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
కోట రవికుమార్.

చిరునామా :
పి. రాజేష్,
10వ తరగతి,
సెంట్రల్ పబ్లిక్ స్కూల్,
వరంగల్, వరంగల్ జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 42.
వేసవి సెలవులను గడిపే విధానాన్ని గురించి మిత్రునికి లేఖ.
జవాబు:

సంగారెడ్డి,
X X X X X.

ప్రియమిత్రుడు ఆనంద్కు,

నేను పబ్లిక్ పరీక్షలు బాగానే రాస్తున్నాను. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడను కావాలనే పట్టుదలతో బాగా చదివి పరీక్షలు ఎంతో శ్రద్ధగా రాస్తున్నాను.

పరీక్షలు అయిపోయిన తరువాత వేసవి సెలవులలో నేను కంప్యూటర్ విద్య నేర్చుకోవాలనుకొంటున్నాను. ఇంటర్మీడియట్లో కూడా నేను కంప్యూటర్ కోర్సు చదువతలచాను. అందువల్ల సెలవులు వృధా కాకుండా కంప్యూటర్ నేర్చుకోదలచాను. భవిష్యత్తులో కంప్యూటర్ ఇంజనీరు కావాలనేది నా ఆకాంక్ష. అందుకు ఎంతైనా శ్రమపడి చదవాలనుకొంటున్నాను. దీనికి తోడు ఇంగ్లీషు గ్రామర్ నేర్పే ‘కోచింగ్ సెంటర్’లో చేరి ఇంగ్లీషు భాషపై పట్టు సాధించాలనుకొంటున్నాను. ఈ విధంగా వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలనుకొంటున్నాను. నీ అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను.

ఇట్లు,
నీ మిత్రుడు,
చంద్రకాంత్.

చిరునామా :
పి. ఆనంద్, 10వ తరగతి,
విజ్ఞానభారతి విద్యాలయం,
ఆదిలాబాద్.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 43.
నిరక్షరాస్యత నిర్మూలనకు వేసుకున్న ప్రణాళికను వివరిస్తూ మిత్రునకు లేఖ.
జవాబు:

భీమ్గల్,
X X X X X.

ప్రియ మిత్రురాలు పద్మకు,

నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని తలుస్తాను. నేను ఈ లేఖలో నిరక్షరాస్యత నిర్మూలనకు వేసుకున్న ప్రణాళికను గురించి తెలియజేస్తున్నాను.

పిల్లలందరిని పాఠశాలలో చేర్పించే కార్యక్రమం చేపట్టాలి. బాల కార్మికులను గుర్తించి వారిని కూడా బడిలో చేర్పించాలి. నిరక్షరాస్యులైన వయోజనులను ప్రోత్సహించిన చదువు నేర్చేటట్లు చేయాలి. కనీసం చదవడం, వ్రాయడం, లెక్కలు చూడటమైనా వచ్చేలా చేయాలి. పాఠ్య గ్రంథాలు అందమైన చిత్రాలతో ఆకర్షణీయంగా ఉండేలా చూడాలి. పాఠ్యగ్రంథాలను అందరికీ ఉచితంగా అందజేయాలి. గ్రామాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి. అవసరమైన చోట రాత్రి పాఠశాలలు నెలకొల్పాలి.

ఈ విధంగా నిరక్షరాస్యతా నిర్మూలనకు నేను కొన్ని ప్రణాళికలను వేసుకున్నానని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఇట్లు,

ఇట్లు,
నీ ప్రియ మిత్రురాలు,
అగ్గిరాజు శ్రీవిద్య.

చిరునామా :
జి. పద్మ. 10వ తరగతి,
శ్రీగీత కాన్వెంట్ హైస్కూల్,
నందిపేట్, నిజామాబాద్.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 44.
పాఠ్య పుస్తకాలను త్వరగా విడుదల చెయ్యాలని డి.ఇ.ఓ. (జిల్లా విద్యాశాఖాధికారి) గారికి లేఖ.
జవాబు:

నిర్మల్,
X X X X X.

ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి గారికి,

అయ్యా,

నేను నిర్మల్ మున్సిపల్ హైస్కూలులో పదవ తరగతి చదువుతున్నాను. పాఠశాలలు తెరచి రెండు నెలలు గడచినా మా నిర్మల్లో 10వ తరగతి పాఠ్యపుస్తకాలు ఒక్కటి కూడా లభించడం లేదు. మా పదవ తరగతి విద్యార్థులం ఎలా చదువుకోవాలో అర్థం కాక అయోమయ స్థితిలో ఉన్నాం.

పైగా క్వార్టర్లీ పరీక్షలు కూడా సమీపిస్తున్నాయి. కాబట్టి మీరు దయయుంచి ప్రభుత్వం ప్రచురించిన పదవ తరగతి పాఠ్యపుస్తకాలను త్వరలో మా పాఠశాలకు అందునట్లు చూడవలసిందిగా ప్రార్థిస్తున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
కోట రవి కుమార్.

చిరునామా :
జిల్లా విద్యాశాఖాధికారి గారు,
జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం,
ఆదిలాబాద్, ఆదిలాబాద్ జిల్లా.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

Telangana SCERT 10th Class Telugu Grammar Telangana వ్యాసాలు Questions and Answers.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 1.
సమాజంలోని మూఢనమ్మకాల్ని నిర్మూలించ డానికి మీరిచ్చే సలహాలు, సూచనలు ఆధారంగా చేసుకుని వ్యాసం వ్రాయండి. (March 2018)
జవాబు:
సమాజం అంటే సమూహం అని అర్థం. మానవ సమాజమనగా మానవుల సమూహమని అర్థం. అనూచానంగా మనదేశంలో మానవుల మనుగడ కల్పించేందుకై మహర్షులు కొన్ని నీతి నియమాల్ని ఏర్పాటుచేశారు. అలాగే మన సమాజంలో కొన్ని మూఢాచారాలు, మూఢనమ్మకాలు నెలకొని యున్నాయి. అయితే మానవాళి ఆ మూఢాచారాల్ని, మూఢనమ్మకాల్ని గుడ్డిగా నమ్మటం వల్ల పతనానికి దారితీశాయి. మానవాళి వృద్ధి చెందలేదు.

కాలానుగతంగా నేడు మానవ సమాజంలో అనేక మార్పులు వచ్చాయి. బాల్యవివాహాలు, సతీసహగమనాలు, జీవహింస చెయ్యటం, ప్రకృతి వైద్యమంటూ మానవుల్ని వల్లకాటికి పంపడం, చేతబడులు చెయ్యటం, దుష్టశక్తుల్ని వశం చేసుకొనుట మున్నగు దురాచారాలు ఎన్నో నెలకొని యున్నాయి. అయితే వీటిని గ్రహించి కూకటి వ్రేళ్ళతో సమూలంగా నాశనం చేయుటకు కొంతమంది సంఘ సంస్కర్తలు నడుం బిగించారు.

వారిలో కందుకూరి వీరేశలింగం పంతులు, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రాజారామమోహన రాయ్ వంటి పెద్దలు ముందుగా స్త్రీలకు ప్రత్యేక పాఠశాలల్ని ఏర్పాటు చేసి స్త్రీలకు విద్య నేర్పించారు. ఆ తర్వాత బాల్య వివాహాల్ని రద్దుచేసి శాసనాలతో చట్టం చేశారు. వితంతు వివాహాల్ని పునరుద్ధ రించారు. సమాజంలో దయ్యాలు, భూతాలు లేవని నిరూపించి ప్రజల్ని జాగృతులు చేశారు. అదేవిధంగా భూతవైద్యాన్ని, చేతబడుల్ని నిర్మూలించారు. శకునాల్ని నమ్మవద్దని, అవి కేవలం మానవుల చిత్రభ్రమలని తెలియజేశారు.

ముఖ్యంగా మానవుల్లో నెలకొనియున్న అంటరానితనాన్ని నిర్మూలించారు. భగవంతుని సృష్టిలో మానవులందరూ ఒకటేయనీ, మూఢ నమ్మకాల్ని తరిమి తరిమి కొట్టండనీ హెచ్చరించారు.

కనుక మానవులందరు పరమత సహనాన్ని పాటిస్తూ, మంచిని గ్రహించాలి. సమాజంలో నెలకొనియున్న మూఢనమ్మకాల్ని తరిమికొట్టాలి.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 2.
‘విద్యావంతుడైన ఒక యువకుడు ఉద్యోగాల కోసం పాకులాడకుండా, స్వంతంగా వ్యవసాయం చేస్తూ, చక్కగా పంటలు పండిస్తూ, ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. ప్రభుత్వంచే ఆవార్డులను కూడా పొందాడు.’ అటువంటి యువకుణ్ణి పొగుడుతూ అభినందన వ్యాసం రాయండి. (March 2017)
జవాబు:
ఆధునిక సమాజంలో శాస్త్రసాంకేతిక రంగ ప్రభావం తీవ్రంగా ఉంది. విజ్ఞానశాస్త్ర ప్రభావంతో మానవుడు సమున్నత స్థాయికి చేరుకుంటున్నాడు. సాధారణం గా ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగాలు కోసం వెంపర్లాడుతారు. స్వయం ఉపాధి మార్గాలకై అన్వేషింపరు.

కాని ఈ యువకుడు విద్యావంతుడై కూడా ప్రభుత్వ ఉద్యోగాలకోసం పాకులాడలేదు. స్వయంశక్తితో ఎదగాలనుకున్నాడు. తాను బ్రతుకుతూ మరికొందరికి ఉపాధిని కల్పించాలను కున్నాడు.

వ్యవసాయంలో ప్రవేశించాడు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించాడు. అధిక దిగుబడులను పొందాడు. అందరికి ఆదర్శంగా నిలిచాడు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను పొందాడు. అందువల్ల అతడు నిజంగా అభినంద నీయుడు. అందరికి మార్గదర్శకంగా నిలిచాడు. నేటియువతరమంతా నిరుత్సాహ పడకుండా స్వయంఉపాధి మార్గాలను అన్వేషించాలి.

ప్రశ్న 3.
నేడు నగర జీవనం ఎందుకు సంక్లిష్టంగా మారిందో విశ్లేషించి వ్యాసం రాయండి. (June 2015)
జవాబు:
నేడు మనుష్యులంతా నగరాల్లోనే జీవించాలని, తాపత్రయపడుతున్నారు. నగరాల్లో ఉన్నత విద్య, ఆధునిక వైద్య సౌకర్యాలు, ఉద్యోగావకాశాలు ఉన్నాయి. అన్ని తరగతుల ప్రజలకూ అక్కడ జీవించడానికి ఉపాధి సౌకర్యాలు లభిస్తాయి. అందువల్ల గ్రామీణ ప్రజలందరూ, నగరాలకు ఎగబ్రాకుతున్నారు.

పై కారణాల వల్ల నగరాల్లో జనాభా పెరిగి పోయింది. నగరాల్లోకి వచ్చే ప్రజలకు ఉండడానికి ఇళ్ళు సరిపడ దొరకడం లేదు. నగరాల్లో ప్రజలు నడచి వెళ్ళడానికి సైతం, రోడ్లు చాలటల్లేదు. సిటీ బస్సులు ఖాళీలుండటం లేదు. తరచుగా ట్రాఫిక్కు జామ్లు అవుతున్నాయి. త్రాగడానికి నగరాల్లో సరిపడ మంచినీరు దొరకడం లేదు. నిత్యావసరాలకు సహితం, నీరు కొనవలసి వస్తోంది. ఆహారపదార్థాల ధరలు, పెరిగిపోతున్నాయి. సామాన్య మానవులు, హోటళ్ళలో ఏమీ కొని తినే పరిస్థితి లేదు. వారికి వైద్య ఖర్చులు పెరిగి పోతున్నాయి.

సామాన్యులు నగరాల్లో, మురికివాడల్లో, గుడిసెల్లో బ్రతకవలసి వస్తోంది. తక్కువ ఆదాయం వారి బ్రతుకులు నగరాల్లో కుక్కల కంటే హీనంగా ఉంటోంది. నగరాల్లో ఇండ్ల స్థలాలు, లేక, చెరువులు కప్పి ఇళ్ళు కడుతున్నారు. వర్షాలు వస్తే ఆ ఇళ్ళు మునిగి పోతున్నాయి.

నగరాల్లో ఉద్యోగాలు సహితం, తేలికగా దొరకడం లేదు. పోటీ పెరిగిపోయింది. వలసలు వచ్చినవారు, తమ పిల్లలను కాన్వెంటు ఫీజులు కట్టి చదివించలేక పోతున్నారు. వారు కార్పొరేట్ వైద్యశాలల ఫీజులు కట్టి వైద్యం చేయించుకోలేక పోతున్నారు. నగరాలలో ఏదో బ్రతకాలని వచ్చిన గ్రామీణులు, ఉభయ భ్రష్టులయి, నగరాలలో ఇలా కష్టనష్టాలకు గురి అవుతున్నారు.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 4.
“ఒక పత్రికలోని సంపాదకీయాలను చదివితే, ఆ పత్రిక ఆలోచనా ధోరణులనూ, దృక్పథాన్నీ అర్థం చేసుకో వచ్చు” దీని పట్ల మీ అభిప్రాయాన్ని సోదాహరణంగా వ్రాయండి. (March 2015)
జవాబు:
సమకాలీన సంఘటనలలో ముఖ్యమైన వాటిని తీసుకుని పత్రికల్లో వ్యాఖ్యాన రూపంతో పూర్వాపరాలను పరామర్శిస్తూ సాగే రచన సంపాదకీయ వ్యాసం. తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకుంటూ, ఆలోచింప చేయగలగడం మంచి సంపాదకీయ వ్యాసం. తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకుంటూ, ఆలోచింప చేయగలగడం మంచి సంపాదకీయ లక్షణం. ఇవి తత్కాలానికి సంబంధించినవే అయినా ఒక్కొక్క సందర్భంలో విభిన్న కాలాలకూ అనువర్తింప చేసుకోవచ్చును.

పత్రికల్లోని సంపాదకీయాలను చదివితే ఆ పత్రిక ఆలోచనా ధోరణిని, ధృక్పథాన్ని తెలుసుకోవచ్చును. తెలంగాణ రాష్ట్రంలో వెలువడే ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో సంపాదకీయం ఆ ప్రభుత్వానికి అద్దం పట్టి ప్రతి పనినీ, సమర్థిస్తూ వ్రాయబడుతుంది.

అదే ఈనాడు పత్రికైతే అందులోని సంపాద కీయాలు కాంగ్రేసు పార్టీని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా సంపాదకీయాలుంటాయి. కాని ఈనాడు పత్రికలో సంపాదకీయాలు మంచిని ప్రశంసిస్తూ, చెడును విమరిస్తూ వ్రాయబడతాయి. నిజానికి సంక్షేమ పథకాలు, ప్రకటనలు, కొత్తవేవీ కావు. గత ప్రభుత్వాలు పాలించిన కాలంలో ఎన్నెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టబడ్డాయి.

అయితే పత్రికలన్నీ సామాజిక బాధ్యతతో, నిజాయితీతో మంచిని మంచిగా, చెడ్డను చెడ్డగా విశ్లేషిస్తూ సంపాదకీయాలు వ్రాస్తే జగతి జాగృతం అవుతుంది.

ప్రశ్న 5.
పెద్దనోట్ల రద్దువల్ల కలిగే పరిణామాలను గురించి ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
స్వాతంత్య్రం వచ్చి దేశానికి 65 సం॥ దాటినా అవినీతి మాత్రం ఎక్కడా తగ్గలేదు. కొంతమంది గొప్ప ధనవంతులు అవినీతి మార్గంలో సాధించిన డబ్బును గుప్తంగా దాచుకుంటున్నారు. దేశవిదేశాల్లో నల్లకుబేరులు పెరిగిపోయారు. దొంగనోట్ల చెలామణి ఎక్కువగా ఉంది. దీంతో దేశ ఆర్థిక ప్రగతి తీవ్రంగా మందగించింది.

దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి, నల్లధనాన్ని వెలికితీయడానికి మన ప్రధానమంత్రిగారు పెద్ద నోట్లను రద్దు చేశారు. అవినీతిపరుల గుండెల్లో సింహస్వప్నంగా నిలిచారు. పారిశ్రామిక, రాజకీయ, వ్యాపారస్థుల దగ్గర మూలుగుతున్న నల్లధనాన్ని వెలికితీయడానికి ఈ చర్య సహకరిస్తుంది. అయితే కొంత ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందడంవల్ల సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చిల్లర నోట్లు దొరక్క ఇబ్బందులు పడ్డారు.

ప్రజలు కూడా ప్రధానమంత్రి తీసుకున్న సాహ సోపేత నిర్ణయాన్ని సమర్థించారు. తాత్కాలికంగా ఇబ్బందులు పడినా దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయని ప్రజలు భావించారు. రాజకీయ పార్టీలు సంకుచిత విధానాలను వీడి ప్రభుత్వానికి సహకరించాలి. అవినీతి సొమ్మును బయటకు తీసుకొనిరావడానికి సహకరించాలి.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 6.
నవసమాజంలో విద్యార్థుల పాత్ర అనే అంశంమీద వ్యాసం రాయండి.
జవాబు:
విద్యను అర్థించువారు విద్యార్థులు. సంఘమునకు చేయు సేవ సంఘసేవ. విద్యార్థులు బాల్యము నుండే సంఘమునకు సేవచేయు అలవాటును కలిగియుండ వలెను. నేటి విద్యార్థులే రేపటి పౌరులు. కనుక సంఘసేవ పట్ల ఆసక్తి గల విద్యార్థులు భవిష్యత్తులో ప్రజానాయకులై దేశమును అన్ని రంగములలోనూ అభివృద్ధిలోనికి తీసుకుని రాగలరు.

సంఘసేవలో విద్యార్థుల విధులు – పాత్ర :
విద్యార్థులలో సేవాభావమును అభివృద్ధి చేయుటకై పాఠశాలలో స్కౌట్స్ మరియు గైడ్స్, ఎన్.సి.సి. వంటి పథకములు ప్రవేశపెట్టబడినవి. ఇవేకాక కళాశాలల యందు జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్.) అను దానిని ప్రవేశపెట్టారు. వీటిలో ఉత్సాహవంతులు అయిన విద్యార్థులు సభ్యులుగా చేరవచ్చును. ఆ విద్యార్థుల్ని సేవా పథకంలో పాల్గొనచేయుటకు ఒక ఉపాధ్యాయుడు నాయకత్వము వహించును.

విద్యార్థులు అనేక విధాలుగా సంఘసేవ చేస్తూ జాతీయాభ్యుదయానికి సహకరించవచ్చును. తామున్న ప్రాంతములోను, మురికివాడలకును పోయి అక్కడివారికి పరిశుభ్రత యొక్క అవసరమును వివరించి అందరూ శుభ్రముగా ఉండునట్లు చూడవచ్చును. చదువురాని వయోజనులకు విద్య నేర్పవచ్చును. పట్టణాలలో రహదారి నిబంధనలను తప్పకుండా ఉండునట్లు చేయుటలో పోలీసువారికి విద్యార్థులు సహకరించవచ్చును. ఉత్సవాలు, సభలు జరుగునపుడు విద్యార్థులు స్వచ్ఛంద సేవకులుగా పాల్గొని అచ్చటి జనులకు అవసరమైన సేవలు చేయవచ్చును.

ముగింపు :
ఈ విధంగా విద్యార్థులు బాల్యం నుండి తమ యింటిలో అమ్మ నాన్నలకు వారు చేయు పనిలో సహకరించడంతో పాటు సంఘసేవా కార్యక్రమాలలో పాల్గొనుట వలన మంచి పనులు చేయుచున్నాము అన్న తృప్తి వారికి కలుగుతుంది. దేశానికి సేవ చేసినట్లు అవుతుంది.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 7.
‘పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు’ అనే అంశంపై వ్యాసాన్ని రాయండి.
జవాబు:
పర్యావరణ పరిరక్షణ భూగోళానికి ఎంతో ప్రముఖ మైంది. పర్యావరణ పరిరక్షణలో చెట్ల ప్రాధాన్యం విలువైంది. పచ్చని చెట్లు ప్రకృతికి మరింత అందాన్ని తెచ్చిపెడతాయి. పచ్చని చెట్లని ప్రగతికి మెట్లగా భావిస్తారు.

ఈనాడు దేశం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ‘నీరు’ యొక్క కొరత, మనకు చాలా కాలంగా మహారాజులు, దాతలు గ్రామాల్లో చెరువులు త్రవ్వించి, వర్షం నీటిని దానిలో నిల్వ చేసి ప్రజలకు నీటి సదుపాయం కల్పించారు. దేశ విస్తీర్ణంలో మూడవ వంతు అడవులు ఉంటే మంచి వర్షాలు పడతాయి. ఇప్పుడు అడవుల విస్తీర్ణం తగ్గిపోయింది. దానితో వర్షాలు లేవు. దానితో నదులు నిండుగా ప్రవహించడం లేదు.

ఇప్పుడు రోడ్లు, ఇళ్ళు అన్నీ కాంక్రీట్ అయి పోయాయి. దానితో నీరు భూముల్లోకి ఇంకడం లేదు. అందువల్ల ప్రతి ఇంటివారు ఇంకుడు గుంటలు ఏర్పాటు చేయాలి. చెరువులను బాగా త్రవ్వించి నీరు నిలువ చేయాలి. చెరువులలో, కాలువల్లో నీరు నిండుగా ఉంటే భూగర్భజలాలు పుష్కలంగా ఉంటాయి.

ప్రతి ఒక్కరు ఖాళీ ప్రదేశాల్లో చెట్లు పెంచాలి. అందువల్ల వాతావరణం చల్లబడుతుంది. పరిశుభ్ర మవుతుంది. మంచి వర్షాలు పడతాయి. ప్రభుత్వం ఇందుకే చెట్లు – నీరు పుష్కలంగా లభించేలా
చూడాలి. నీటి వనరులను కలుషితం కాకుండా కాపాడుకోవాలి.

సూచనలు :
ఈ కార్యక్రమాన్ని మొక్కుబడితోకాక, చిత్తశుద్ధితో అమలు చేయాలి. నాటిన మొక్కలను పెంచి పోషించే గురుతర బాధ్యతను కూడా మనమే స్వీకరించాలి. మొక్కల సంరక్షణ మన కర్తవ్యంగా భావించాలి. “వృక్షో రక్షతి రక్షితః”. అని అంటారు. అంటే వృక్షాలను మనం రక్షిస్తే అవి మనందరిని రక్షిస్తాయి అని చెట్లను విచక్షణా రహితంగా నరికేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. ఆ రోజే ఈ కార్యక్రమ రూపకల్పనకు ఒక అర్థం, పరమార్థం ఏర్పడుతుంది. అంతేకాదు మనం కలలుకంటున్న స్వర్ణాంధ్రప్రదేశ్ ఆచరణరూపం దాలుస్తుంది.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 8.
ప్రభుత్వాలకు – ప్రజలకు మధ్య అనుసంధానంగా వ్యవహరించే వార్తాపత్రికల గురించి ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
ప్రచారసాధనాల్లో ప్రముఖ పాత్ర వహించేవి వార్తాపత్రికలు. ఒక్కపత్రిక పదివేల సైన్యంతో సమానమని మన పెద్దలు భావించారు. ఈనాడు వార్తాపత్రికలు గొప్పగా జాతికి ఉపయోగపడు తున్నాయి. ప్రపంచంలో గల అన్ని దేశాలలోని వింతలు, విశేషాలను మనకు వెంట వెంటనే తెలియజేసేందుకు వార్తాపత్రికలు బాగా ఉపయోగ పడతాయి. వీటినే ఆంగ్లంలో “న్యూస్ పేపర్స్” అంటారు. నాలుగు దిక్కుల మధ్యగల ప్రదేశాలకు సంబంధించిన విశేషాలను వార్తలని కొందరు చమత్కరించారు.

“వెనిస్” నగరంలో 16వ శతాబ్దంలో వార్తాపత్రికలు మొదలు పెట్టబడినాయి. భారతదేశంలో తొలి వార్తాపత్రిక ఇండియా గెజిట్ అని కొంతమంది, బెంగాల్ గెజిట్ అని కొంతమంది అంటారు. వంగదేశంలో రాజారామ్మోహన్రాయ్, ఆంధ్రదేశంలో ముట్నూరి కృష్ణారావుగారు, కాశీనాథుని నాగేశ్వరరావు గారు పత్రికలను మొదట స్థాపించారు. పత్రికలను నడుపుటకు సంపాదకులు, వార్తలను సేకరించుటకు విలేకరులు పనిచేస్తూ ఉంటారు. రోదసిలోని ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ సౌకర్యంతో చాలా వేగంగా వార్తలు సేకరించబడు తున్నాయి. వెలువడే సమయాన్ని బట్టి దిన, వార, పక్ష భేదములతో ఇవి నడుస్తున్నాయి.

పత్రికలను నిత్యం చదవడం వల్ల అనేక విషయాలు తెలుస్తాయి. చదివేవారికి ప్రపంచజ్ఞానం తెలుస్తుంది. మనుష్యుల దృష్టి విశాలమవుతుంది. ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి, వాటిలోని మంచి చెడులను గురించి, అవి అమలు జరుగుతున్న తీరును గురించి. ఈ పత్రికలు వివరిస్తాయి. ఇవి ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధుల వంటివి. వీటివల్ల భాష మెరుగులు దిద్దుకుంటుంది. అయితే ఈ పత్రికలు అబద్ధపు వార్తలను, వక్రీకరించబడిన వార్తలను ప్రచురించకూడదు. ప్రజలకు సేవచేసే ఉద్దేశంతోనే వెలువడాలి. కనుక వారిని మభ్యపెట్టే రచనలు చేయకూడదు.

పత్రికలు సక్రమంగా నిర్వహించబడి, సేవా దృక్పథంతో ప్రచురించబడితే చాలా ఉపయోగకరంగా నిలిచి శాశ్వత కీర్తిని సంపాదించుకోగలవు.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 9.
నేటి ఆధునిక సమాజంలో కంప్యూటర్ల పాత్రపై ఒక వ్యాసమును వ్రాయండి.
జవాబు:
నిరంతర అన్వేషియగు మానవుడు విజ్ఞానశాస్త్ర అభివృద్ధితో టెలిఫోన్, టెలిగ్రాఫ్, రేడియో, దూరదర్శన్ వంటి అనేక సాధనాలు కనుగొన్నాడు. ఆధునిక ఆవిష్కరణల్లో “కంప్యూటర్” ఒకటి. నిత్య జీవితంలో అది ఒక భాగమయింది. కంప్యూటర్ అంటే కూడటం అని అర్థం. అన్ని రకాల గణిత సమస్యలను సాధించే యంత్రమునే కంప్యూటర్ అనవచ్చును. కంప్యూటర్లో కీబోర్డు, టెలివిజన్ స్క్రీన్ ముఖ్యమైనవి.

మనం ఏం చెపితే అది చేసే ఎలక్ట్రానిక్ యంత్రం కంప్యూటర్. అంకెలకు సంబంధించినవి డిజిటల్ కంప్యూటర్లు కాగా, పరిమాణాలకు రాసులకు చెందినవి ఎనలాగ్ కంప్యూటర్లు. ఇవి సమాచారాన్ని గ్రహిస్తాయి, నిల్వ చేస్తాయి, మనకు చెబుతాయి. చైనాలో వాడిన అబాకస్ అనే పలక కంప్యూటరుకు ఆధారం. బాబేజ్ అనే శాస్త్రవేత్త 1880లో తయారుచేసిన పలక రూపాంతరం చెంది నేటి కంప్యూటరయింది. వీటి తయారీలో అమెరికా, జపాన్ దేశాలు పోటీపడు తున్నాయి.

సున్నితమైన వీటిని దుమ్ము చేరడానికి వీలులేని ఎయిర్ కండిషన్ గదుల్లో ఉంచి వాడతారు. ఇది సమాచారాన్ని ఖచ్చితంగాను, త్వరగాను అందిస్తుంది. ఇది 1, 0 లను మాత్రమే గ్రహిస్తుంది. మనం చెప్పే విషయాన్ని 1, 0 లలోకి మార్చేందుకు ట్రాన్స్ లేటర్స్ ఉంటాయి. అవి విషయాన్ని మార్చి కంప్యూటర్ భాషలో అందిస్తాయి. జవాబును మనకు అర్థమయ్యే భాషలో అందిస్తాయి. సాధారణంగా కంప్యూటర్లు అనగానే సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అని వింటుంటాము. సాఫ్ట్వేర్ అంటే కంప్యూటర్ నడిపే విధానానికి చెందింది. హార్డ్వేర్ అనగా కంప్యూటర్కు కావలసిన సాధనాలు.

కంప్యూటర్ల ఉపయోగాలు నేడు అనేకం ఉన్నాయి. అమెరికా, జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాలు వీటి వాడకంలో చాలా ముందున్నాయి. కృత్రిమ ఉపగ్రహాల ప్రయోగం, గమనములకే గాక అణ్వస్త్రాల ప్రయోగానికి కూడా వాడడానికి సిద్ధమవుతున్నాయి.

వీటివలన నిరుద్యోగ సమస్య పెరుగుతుందనే కారణం కొంత సమంజసమే అయినా ఆధునిక విజ్ఞానాభివృద్ధిని త్రోసిపుచ్చలేము కనుక కంప్యూటర్ విజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉపాధి అవకాశాలు కల్పించుకోవడం మంచిది.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 10.
విద్యార్థికి మాతృభాషలోనే విద్యాబోధన జరగాలనే అంశం గురించి నీ అభిప్రాయాన్ని ఒక వ్యాస రూపంలో వ్రాయండి.
జవాబు:
తల్లి నుండి బిడ్డ నేర్చుకొనెడి భాషే మాతృభాష. తల్లి ఒడిలోని శిశువు మాతృస్తన్యముతో పాటే మాతృ భాషామృతాన్ని కూడా పానం చేస్తుంది. మానసిక మైన భావపరంపరను వ్యక్తులు పరస్పరం తెలియ జేసుకోవడానికి ఉపయోగించే వాగ్రూపమైన సాధనమే భాష.

తన జాతి ఆచార వ్యవహారాలను, తనవారి తీరు తెన్నులను, కట్టుబొట్టు మున్నగు సంప్రదాయాలవంటి అనేక విశేషాలను బాల్యం నుండియే తెలుసుకోవడానికి అనువైనది మాతృభాష, బాహ్య ప్రపంచాన్ని తెలుసుకోవడానికి తొలి ఆధారం మాతృభాష. అయిదేండ్ల ప్రాయంగల విద్యార్థికి మాతృభాషలోనే విద్యాభ్యాసం ప్రారంభించడం మన సంప్రదాయం. విద్యను బాల బాలికలు మాటలు వచ్చినది మొదలు ఏ భాషను ఉపయోగించు కొనుటకు అలవాటుపడతారో దానిలోనే నేర్చు కోవడం సులభం.

ప్రాచీన కాలము నుండి మన విజ్ఞానమంతయు సంస్కృతమునందే కలదు. మెకాలే విద్యావిధానం అమలు జరగడంతో ఆంగ్లభాష దేశంలో నిర్బంధ విద్య అయింది. అది ప్రపంచ భాష అయినందున, దాన్ని నేర్చుకోవాలనే తపన స్వదేశీయులలో కూడా పెరిగింది. ఆంగ్లభాష ప్రాబల్యం పెరిగి మాతృభాష నిర్లక్ష్యం కావడం జరిగింది. పానుగంటివారి ‘సాక్షి’ వ్యాసాలలోని “స్వభాష” అనే వ్యాసంలో జంఘాల శాస్త్రి మాతృభాష మాట్లాడలేని వారిని వ్యంగ్యంగా పరిహసించాడు. బోధన, పరిపాలన మాతృభాషలోనే జరగడం తల్లిపాలవంటిది అని, పరాయిభాషలో జరగడం పోతపాలవంటిదని 1913లో దేశభక్త కొండా వెంకటప్పయ్యగారు అన్న మాటలు మనం జ్ఞప్తియందుంచుకోవాలి.

1947లో దేశానికి స్వాతంత్య్రం లభించిన తరువాత ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నతస్థాయి విద్య గ అవకాశాలు ఎక్కువగా లేకపోవడమే. రష్యా వంటి పెద్ద దేశములలో భాషలనేకం ఉన్నను రష్యన్ భాషకే ప్రాధాన్యత. చైనా, జర్మన్, ఫ్రాన్సు దేశాలు ఇంగ్లీషుకు ప్రాధాన్యతనిస్తూ మాతృభాషలోనే బోధనా, పాలనలు జరుపుకొంటున్నందున అవి పురోగతిని సాధిస్తున్నా యనే సత్యాన్ని మనం గుర్తించాలి.

మాతృభాషలో భావ వ్యక్తీకరణ సులభమగును. ఎక్కువ శ్రద్ధతో నేర్చుకోవచ్చును. సంభాషణ, విషయ విశ్లేషణ చేయడం తేలిక. జ్ఞానార్జన, అవగాహన, మూర్తిమత్వ వికాసాలకు మాతృభాషా బోధన తోడ్పడుతుంది. ఆయా రాష్ట్రాల్లో మాతృభాషా విద్యాబోధన, పాలనలకు ఎక్కువ స్థానం కలిగించి, నేర్చినవారికి ఉద్యోగావకాశాలు రాష్ట్రస్థాయిలో కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిది.

అధికార భాషా సంఘం, ప్రభుత్వం, విద్యాధికులు మాతృ భాషలో విద్యాబోధనకు మరింతగా కృషి చేయాలి. మాతృభాషలో విద్యాబోధన చేయడం, ఇంగ్లీషును నిర్భందంగా ఒక స్థాయి వరకు నేర్పించడం చాలా అవసరం. మాతృభాషతో పాటు ఇతర భాషలను కూడా నేర్చే విద్యార్థికి సమాధానాలు వ్రాసే భాషను ఎన్నుకొనే స్వేచ్ఛను కల్పించాలి.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 11.
సత్వరమే ప్రపంచమంతా సమాచారాన్ని అందించుటలో దూరదర్శన్ పోషిస్తున్న పాత్రను తెలపండి.
జవాబు:
వింతలకు పుట్టినిల్లయిన 20వ శతాబ్దములో మానవుడు విద్యుత్తును, దానితో పనిచేసే వార్తా ప్రసార సాధనాలను ఎన్నింటినో తయారుచేశాడు. నిత్యజీవితములో టెలిఫోన్, టెలిగ్రాఫ్, టెలిప్రింటరు, వైర్ లెస్ రేడియో వంటి సాధనాల వాడకాన్ని గూర్చి తెలియని వారుండరు.

1925లో బ్రిటిష్ శాస్త్రవేత్తలైన జె.యల్. బయర్డు, జెనిన్సు అనేవారు దూరదర్శన్ను కనుగొన్నారు. దూరదర్శన్ లో మాట వినిపించడంతో పాటు అది పలికే వ్యక్తి కూడా మనకు కనిపించడం విశేషం. బ్రిటిష్ శాస్త్రజ్ఞులు లండనులో తొలిసారి దీనిని ప్రదర్శించారు. దూరదర్శన్ ప్రసార కేంద్రం లోని ట్రాన్స్ మిషన్ శబ్ద, చిత్ర తరంగాలను విద్యుత్త రంగాలుగా మార్చి అంతరిక్షంలోకి వదులుతుంది. ఇండ్లలోని దూరదర్శన్ల యందున్న రిసీవర్ యంత్రము వాటిని ఆకర్షిస్తుంది. అవి తిరిగి శబ్ద, చిత్ర తరంగాలుగా మార్పు చెంది మన కనుల ముందు ప్రత్యక్షమగును.

బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బి.బి.సి) వారు 1936లో దూరదర్శన్ కార్యక్రమాలను ప్రచారంలోకి తెచ్చారు. దూరదర్శన్ మన దేశంలో తొలిసారిగా 1957లో ఢిల్లీలో ప్రారంభమైంది. పిదప ముంబాయి (బొంబాయి), చెన్నై (మద్రాసు), కోల్కతా (కలకత్తా) లలోను క్రమంగా రాష్ట్ర రాజధానులలోను ఏర్పాటయింది. మన రాష్ట్రంలో హైదరాబాదులో ప్రసార కేంద్రం ఉంది. నేడు మన దేశంలో ప్రసార కేంద్రాలు 200లకు పైగా పనిచేస్తున్నాయి. “దూరదర్శన్” అనే పేరుతో ప్రభుత్వం ఒక ప్రత్యేక సంస్థను స్థాపించింది.

దూరదర్శన్ వీనులకు విందును, కనులకు పండుగను కల్పిస్తున్నది. విజ్ఞానంతోపాటు వినోదాన్ని కూడా ప్రజలకు పంచిపెట్టే సాధనం టెలివిజన్. చిత్ర గీతాలు – చలనచిత్రాలు ఇల్లు కదలకుండానే ఆబాలగోపాలం చూచి ఆనందించుటకు వీలు కలిగింది. క్రీడలు నేరుగా జరుగుతుండగానే ఇంటియందు మనం చూడవచ్చును. పిల్లలకు బాల వినోదిని, వార్తా ప్రసారములు, ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతున్నాయి. వ్యవసాయ, ఆరోగ్య, వైద్య, సాహిత్య, సంగీత, క్రీడాకార్యక్రమాల వంటివి ఆయా రంగాలలో అభిరుచి గలవారికి ఆనందాన్ని – విజ్ఞానాన్ని కలిగిస్తాయి.

చాలా కేంద్రాలు విద్యాబోధనకు కూడా దూరదర్శనన్ను వినియోగిస్తున్నాయి. పొదుపు – పెట్టుబడులు, షేర్ మార్కెట్టు మొదలైనవన్నీ దూరదర్శన్లో ప్రసారం అవుతున్నాయి. దూరదర్శన్ ప్రసారాలకై వివిధ ఛానల్స్ పనిచేస్తున్నాయి. అందువలన కార్యక్రమాల్లో వైవిధ్యము, పోటీ కనబడుతున్నాయి. మంచి విలువగల్గి ఉపయోగ కరములైన కార్యక్రమాలు మాత్రమే వచ్చేట్లు ప్రభుత్వం చూడాలి.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 12.
సంఘసేవలో విద్యార్థులు ఆచరించవలసిన విధి విధానాలను విశ్లేషణాత్మకంగా వ్యాసరూపకంగా వ్రాయండి.
జవాబు:
విద్యను అర్థించువారు విద్యార్థులు. సంఘమునకు చేయు సేవ సంఘసేవ. విద్యార్థులు బాల్యము నుండే సంఘమునకు సేవచేయు అలవాటును కలిగియుండ వలెను. నేటి విద్యార్థులే రేపటి పౌరులు. కనుక సంఘసేవ పట్ల ఆసక్తి గల విద్యార్థులు భవిష్యత్తులో ప్రజానాయకులై దేశమును అన్ని రంగములలోనూ అభివృద్ధిలోనికి తీసుకుని రాగలరు.

సంఘసేవలో విద్యార్థుల విధులు పాత్ర :
విద్యార్థులలో సేవాభావమును అభివృద్ధి చేయుటకై పాఠశాలలో స్కౌట్స్ మరియు గైడ్స్, ఎన్.సి.సి. వంటి పథకములు ప్రవేశపెట్టబడినవి. ఇవేకాక కళాశాలల యందు జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్.) అను దానిని ప్రవేశపెట్టారు. వీటిలో ఉత్సాహ వంతులు అయిన విద్యార్థులు సభ్యులుగా చేరవచ్చును. ఆ విద్యార్థుల్ని సేవా పథకంలో పాల్గొనచేయుటకు ఒక ఉపాధ్యాయుడు నాయకత్వము వహించును.

విద్యార్థులు అనేక విధాలుగా సంఘసేవచేస్తూ జాతీయాభ్యుదయానికి సహకరించవచ్చును. తామున్న ప్రాంతములోను, మురికివాడలకును పోయి అక్కడివారికి పరిశుభ్రత యొక్క అవసరమును వివరించి అందరూ శుభ్రముగా ఉండునట్లు చూడవచ్చును. చదువురాని వయోజనులకు విద్య నేర్పవచ్చును. పట్టణాలలో రహదారి నిబంధనలను తప్పకుండా ఉండునట్లు చేయుటలో పోలీసువారికి విద్యార్థులు సహకరించవచ్చును. ఉత్సవాలు, సభలు జరుగునపుడు విద్యార్థులు స్వచ్ఛంద సేవకులుగా పాల్గొని అచ్చటి జనులకు అవసరమైన సేవలు చేయవచ్చును.

ముగింపు :
ఈ విధంగా విద్యార్థులు బాల్యం నుండి తమ యింటిలో అమ్మ నాన్నలకు వారు చేయు పనిలో సహకరించడంతో పాటు సంఘసేవా కార్యక్రమాలలో పాల్గొనుట వలన మంచి పనులు చేయుచున్నాము అన్న తృప్తి వారికి కలుగుతుంది. దేశానికి సేవ చేసినట్లు అవుతుంది.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 13.
పర్యావరణ పరిరక్షణలో ప్రజలపాత్రపై ఒక వ్యాసాన్ని వ్రాయండి.
జవాబు:
భూమి, గాలి, నీరు మొదలైన వాటితో మనిషికి ఉండే అవినాభావ సంబంధమే పర్యావరణం. అందువల్ల పర్యావరణం అంటే పరిసరాల ‘వాతావరణం’ అని అంటారు. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం వల్లే మనం ఆరోగ్యంగా బతుకుతున్నాము. పరిసరాల వాతావరణం కలుషితంకాకుండా కాపాడు కోవటమే పర్యావరణ సంరక్షణ అనబడుతుంది.

విషయ ప్రస్తావన :
నీరు ప్రాణాధారతకు, దాహాన్ని తీర్చడానికి, పంటలు పండటానికి ఉపయోగపడు తోంది. చెట్లు శుభ్రమైన గాలినిస్తూ, వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తున్నాయి. అయితే రాను రాను జనాభా పెరుగుదల మూలంగాను, నాగరికత మోజు వల్లను, మన పరిసరాలను మనమే పాడు చేసు కుంటున్నాము. కర్మాగారాలు, యంత్రాలు, వాహనాలు పెరిగి’ వాతావరణం కాలుష్యంతో నిండిపోతుంది. ఉష్ణోగ్రత పెరిగిపోయి అనావృష్టి లేక అతివృష్టిని కల్గించేలా దురదృష్టకర మార్పులు ఏర్పడుతున్నాయి. అడవులను నరికివేయడం వల్ల వరదలేర్పడి జన నష్టం, పంటనష్టం ఏర్పడుతోంది.

రక్షణ చర్యలు :
పర్యావరణ పరిరక్షణకై ప్రపంచ సంస్థలు, మన ప్రభుత్వాలు ఎన్నో తీవ్ర చర్యలు తీసుకుంటున్నాయి. జన్మభూమి పథకం క్రింద మన ఇళ్ళను, గ్రామాలను, పరిశుభ్రంగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇంటిలోని చెత్తను ఇంటియందు పారవేయకుండా, వీధి చివర కుండీ ఏర్పాటు చేసుకొని అందులో పారవేయాలి. కుళాయి వద్ద, మురికి కాల్వల వద్ద చెత్త ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

మలేరియా, టైఫాయిడ్, రోగ కారకమైన దోమలు విజృంభించ కుండా డి.డి.టి. వంటి మందులు చల్లుకోవాలి. మురికివాడల వాసులకు శుభ్రత గూర్చి తెలియ జేయాలి. చెట్లను నాటాలి. పారిశుధ్య కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలి. గాలి, వెలుతురులు వచ్చేలా ఇళ్ళు నిర్మించుకోవాలి. పరిసరాల పరిశుభ్రతతోనే మనందరి అభివృద్ధి ఉందని గ్రహించాలి. దీనికై అందరూ ఉద్యమించాలి. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీ పర్యావరణ దినోత్సవంగా పాటిస్తున్నారు. పర్యావరణ వ్యవస్థ లోని సమతౌల్యాన్ని కాపాడు కోవడానికి అందరూ కృషి చేయాలి.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 14.
అవయవదానంపై ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
ఉపోద్ఘాతం : పుట్టుకతోనే అవయవ లోపాలతో కొందరు పుడుతూ ఉంటే, ప్రమాదాల్లో అవయవాలు పోగొట్టుకునేవారు కొందరు. కన్ను, ముక్కు, చెవి, కాళ్ళు, చేతులు – వీటిలో ఏ అవయవం లేకపోయినా బాధాకరమే.

విషయ విశ్లేషణ :
మన చుట్టూ ఉన్న ప్రకృతిలోని అందాలను చూసి ఆనందించాలన్నా, చక్కని సంగీతం వినాలన్నా, సుందరమైన ప్రదేశాలకు వెళ్ళాలన్నా కళ్ళు, ముక్కు, కాళ్ళు చేతులు తప్పనిసరి. ఇవేకాదు మూత్రపిండాలు ఊపిరితిత్తులు వంటి అవయవ భాగాలు ముఖ్యమైనవే. రక్తం అవయవ భాగం కాకపోయినా, అవయవమంత ప్రాముఖ్య మున్నదే.

కళ్ళు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, రక్తం వంటి వాటిని దానమిచ్చి మన చుట్టూ ఆయా అవయవాల లోపంతో బాధపడేవారిని ఆదుకోవడమే మానవజన్మకు సార్థకత.

జీవించి ఉండగానే, కళ్ళు, మూత్రపిండాలు వంటివి దానం చేయవచ్చు. మరణించాక కూడా జీవించి ఉండటానికి మార్గం అవయవదానం.

తమ మరణానంతరం, తమ కళ్ళను దానం చేస్తామంటూ, ఎంతోమంది నేటికాలంలో ముందు కొస్తున్నారు. అలా నేత్రదానంతో ఎంతోమంది అంధులకు వెలుగునిస్తూ, మరణించాక కూడా జీవించడం గొప్ప విషయం.

అలాగే ఇటీవల బెంగుళూరుకు చెందిన వ్యక్తి గుండె చెన్నైకి చెందిన మరొక వ్యక్తికి మార్పిడి చేయడం ద్వారా ఆ వ్యక్తికి ప్రాణం పోశారు. అలాగే ఇటీవల విజయవాడకు చెందిన మణికంఠ, మరొక యువకుడు దానం చేసిన గుండె, నేత్రాలు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం మరికొందరివి జీవించగలిగేటట్లు చేశాయి.

ముగింపు :
ఇలా అవయవ దానం వల్ల కొంతమంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. ఇటువంటివారు రాబోయే తరాలకు స్ఫూర్తిదాతలు.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 15.
విజ్ఞానశాస్త్ర ప్రయోజనాలు
జవాబు:
పరిచయం :
మానవుడు భూమిపై అవతరించి నప్పటి నుంచీ పంచభూతాలతో నిండిన ప్రకృతిని నిశితంగా పరిశీలించి తన సుఖజీవనానికి మలచుకొన సాగారు. జిజ్ఞాస పెరిగేకొద్దీ కాలక్రమేణ మనిషి నేల, నిప్పు, నీరు, గాలి, నింగిని పరిశోధించి వాటి తత్త్వాన్ని ఆకళింపు చేసుకున్నాడు.

ఖగోళ విజ్ఞానం, గృహ సంచారం, భూగోళ స్వరూప స్వభావాలు, పంచభూతాల శక్తులు మనిషికి లొంగసాగాయి. తాను గ్రహించిన విజ్ఞానాన్ని శాస్త్ర రూపంలో రచించి తరువాతి తరాల వాళ్ళకు అందించాడు విజ్ఞానియైన మానవుడు. క్రమంగా ఆ విజ్ఞానం పెరిగి విస్తరించి శాఖోపశాఖలైంది. దీనినే విజ్ఞానశాస్త్రం అంటున్నాం.

ఉద్దేశ్యం :
ఆధునిక యుగంలో పదార్థ విజ్ఞా ప్రధానమైంది భౌతికశాస్త్రం. ఇందులో శబ్దం, కాంతి దర్శనం వంటి అంశాల మీద విశేష పరిశోధన జరిగింది. ఇంకా జరుగుతోంది. దీని ఫలితంగా భూమి పైన, విశ్వాంతరాళంలో ఎక్కడికైనా రేడియో ప్రసారావకాశాలు, దూరదర్శన్ ప్రసారాలు, ఛాయాచిత్ర సేకరణ వంటివి సాధ్యమయ్యాయి. అణువిచ్ఛిత్తి వలన విద్యుచ్ఛక్తి ఉత్పత్తి, ఐసోటోపులు సాధ్యమై అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి.

వైద్య రంగంలో ఎక్స్, లేజర్ కిరణాల వలన, వ్యాధి నిర్ణయ విధానంలో కొత్తరీతులు సాధ్య మయ్యాయి. రకరకాల రాడార్లు తుఫాను రాకడ, వర్షా గమనం వంటి వాటిని ముందే తెలుపుతున్నాయి. యుద్ధ పరికరాలు, అస్త్రశాస్త్రాలు, ఆటంబాంబులు, హైడ్రోజన్ బాంబు, సుదూర లక్ష్యఛేదనం మరింత అభివృద్ధి చెందాయి. రసాయనశాస్త్ర పరిశోధనల వలన రకరకాల రసాయనాలు తయారై మందులకు, పరిశ్రమలకు ప్రజలకు ఉపయోగ పడుతున్నాయి.

వృక్షశాస్త్ర రంగంలో పరిశోధనల వలన రక రకాల కొత్త వంగడాలు, అధిక దిగుబడి సాధ్యమైంది. ఆహార పదార్థాల ఉత్పత్తి హెచ్చింది. ఇంజనీరింగు, సాంకేతిక శాస్త్ర రంగంలో జరుగుతున్న కృషి ఫలితంగా ఎన్నో ఖనిజాలను, సంపదను వెలికి తీయటం, రకరకాల యంత్ర, వస్తు నిర్మాణం, శీఘ్రగమనం సులభసాధ్యమైంది.

సృష్టిలో పనికిమాలినది లేదని, ప్రతిదీ ఏదో ఒక పరమ ప్రయోజనాన్ని కలిగిస్తుందని ఆధునిక విజ్ఞానశాస్త్రం నిరూపిస్తున్నది. చెత్తనుంచి, పేడనుంచి విద్యుదుత్పత్తి, తవుడు నుంచి నూనె, మురుగునీటి నుంచి మంచినీరు వంటివాటిని ఉత్పత్తి చేయటం.

సూర్యరశ్మి నుంచి విద్యుత్తును గ్రహించి మానవో పయోగానికి తేవటం, యంత్ర మానవులను సృష్టించటం, వాటితో పెద్ద పెద్ద పరిశ్రమల్ని నిర్వహించటం ఈనాడు జరుగుతున్నది. గగనంలో చాలా ఎత్తుగా, వేగంగా పయనించటం, గ్రహాంత రాలకు రాకెట్లు, ఉపగ్రహాలు పంపటం, నేలమీద గంటకు కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో పోయే రైళ్ళను నడపటం విజ్ఞానశాస్త్రం సాధించిన ఘన కార్యాలుగా పరిగణింపబడుతున్నాయి.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ముగింపు :
సృష్టికి ప్రతిసృష్టి చేస్తున్న విజ్ఞానశాస్త్రం మానవ జీవితంలో అనూహ్యమైన మార్పుల్ని తెస్తున్నది. మృత్యుముఖంలో ఉన్న మనుష్యుణ్ణి మృత్యువు నుంచి కాపాడి ప్రాణం పోస్తున్నది. దీనికి విరుద్ధంగా ఆటంబాంబులు, హైడ్రోజన్ బాంబులు, ఖండాంతర వేధులు, మృత్యుకిరణాలు, విషవా యువులు వంటివి మానవజాతి మనుగడకే సవాలుగా పరిణమించాయి. ఊపిరిపోస్తున్న విజ్ఞాన శాస్త్రమే ఊపిరి తీసివేస్తున్నది. ఇది అత్యంత విషాదకరం. మనుష్యుడు వివేకంతో విజ్ఞాన శాస్త్రాన్ని మానవాభ్యుదయానికి మాత్రమే వినియోగిస్తే సర్వ మానవాళి సుఖ శాంతులతో వర్ధిల్లుతుంది.

ప్రశ్న 16.
దేశభక్తుల వల్ల దేశ ప్రజలకు కలిగే ప్రయోజనాలు వ్యాసంగా రాయండి.
జవాబు:
దేశమును ప్రేమించుమన్నా – మంచి అన్నది పెంచమన్నా
సొంతలాభం కొంత మానుక – పొరుగువారికి తోడుపడవోయ్.

ఇది దేశభక్తుని లక్షణం. తాను, తన కుటుంబం బాగుంటే చాలనుకోడు దేశభక్తుడు. తన చుట్టూ ఉన్న వారి క్షేమంలోనే తన క్షేమం ఉందని భావిస్తాడు.

చుట్టూ ఉన్న అన్యాయాలను, అక్రమాలను చూస్తూ సామాన్యుడు తలదించుకొని వెళతాడు. నా ఒక్కడితో ఏమౌతుంది అనే నిర్వేదంలో ఉంటాడు. అలాంటి సామాన్యులను ఒక్కతాటి మీదకు తెచ్చి వారి వెనక తాను ఉన్నాననే ధైర్యాన్ని ఇస్తాడు దేశభక్తుడు. అవినీతిపై మడమతిప్పని పోరాటం చేస్తున్న అన్నా హజారే దీనికి మంచి ఉదాహరణ.

దేశభక్తుడు నిరాడంబర జీవితాన్ని గడుపుతూ దేశ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తాడు. ప్రజలు కూడా తనలాగే నిరాడంబరంగా జీవించేలా ప్రేరేపిస్తాడు. గాంధీజీ నిరాడంబర జీవనం చూసి, అలాగే నిరాడంబర జీవనం గడిపిన పొట్టి శ్రీరాములు, బులుసు సాంబమూర్తి మనకు తెలుసు.

దేశభక్తుడు క్రమశిక్షణకు, పనిపట్ల నిబద్దతకు ప్రాముఖ్యమిస్తాడు. పొదుపును పాటిస్తాడు. ప్రజల కోసం తన సుఖాన్ని త్యాగం చేస్తాడు. జాతిని నిర్వీర్యం చేసే కులమత వైషమ్యాలను పక్కన పెడతాడు. మానవతే తన మతమని చాటుతాడు.

ఇలాంటి దేశభక్తుల మూలంగా దేశప్రజలు చైతన్యవంతులౌతారు. వారి బాటలో సామాన్యులు కూడా మాన్యులవుతారు.

ప్రఖ్యాత ఇంజనీర్లు కె.యల్. రావు, మోక్ష గుండం విశ్వేశ్వరయ్య దేశ సాంకేతిక అభివృద్ధికి కృషి చేసిన దేశభక్తులు. వారానాడు నిర్మించిన ఆనకట్టల వల్ల దేశ ప్రజల ఆహార సమస్యతీరింది.

కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, కొమఱ్ఱాజు లక్ష్మణరావు వంటి సంఘసంస్కర్తల వల్ల సంఘంలోని మూఢాచారాలు తగ్గాయి.

స్త్రీలలో స్వేచ్ఛాకాంక్షను పెంచి, తమ స్థితిని బాగు చేసుకోవాలనే తపన పెంచి, స్త్రీలను చైతన్య పరచిన ఉన్నవ లక్ష్మీబాయమ్మ, కనుపర్తి వరలక్ష్మమ్మ వంటి దేశభక్తురాళ్ళెందరో!

తమ ధన, మాన, ప్రాణాలను సైతం తృణ ప్రాయంగా దేశం కోసం త్యాగం చేసే దేశభక్తుల వల్ల ప్రజల్లో విద్య, ధర్మం, నీతి, సంఘంపట్ల చైతన్యం ఏర్పడతాయి.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 17.
సమాజంలో నైతిక, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుటకు కృషి చేస్తున్న శతక కవులను అభినందిస్తూ వ్యాసం రాయండి. (May 2022) (March 2019)
జవాబు:
“లావుగల వాని కంటెను
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ” అని సుమతీ శతకకారుడు నీతి గల వానిని గురించి చెప్పాడు. చిన్న చిన్న నీతివాక్యాలే మనిషికి ప్రవర్తనా పద్ధతులు నేర్పుతాయి. స్వార్ధరహితంగా ఉండడమే అన్ని నీతులలో కెల్లా గొప్ప నీతి, నీతిని కలిగి ఉండుటే నైతికత. నీతి అంటే ఏమిటి ? ఓ సంఘటన తర్వాత నీవు ఆనందంగా, హాయిగా భావిస్తే అదే నైతికత. తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, పెద్దల పట్ల మర్యాదగా నడుచుకోవడం నైతికతలో భాగం. తోటివారి పట్ల స్నేహంగా మెలగడం కూడా దీనిలో భాగమే. అసత్యం, కులగర్వం, పరుల సొమ్ము ఆశించడం, వరుస, వావి లేకుండడం, మోసం, స్వార్థం, కుటిలత్వం మొదలైనవి లేకుండా జీవించేవారు నైతిక విలువలు పాటిస్తున్నట్లే.

ఈ నైతికతకు ఆధ్యాత్మికత తోడైతే బంగారానికి తావి అబ్బినట్లే. మనం ఈ తప్పు చేస్తే భగవంతుడు శిక్షిస్తాడు – అనే భావన తప్పు చేయనీదు. అందుకే పెద్దలు తప్పు చేస్తే నరకంలో శిక్షలు అనుభవించాల్సి ఉంటుందని చెబుతారు. భయం, భక్తి లేకపోతే సమాజం సజావుగా సాగదు. తప్పు చేద్దామనే భావం హెచ్చుమీరుతుంది. ఇక తెగించినవాడి గురించి మాట్లాడుకోవడం అనవసరం. చదువుకునేవారికి కేవలం పోటీతత్త్వమే కాకుండా తన చదువు మరొకరికి దారి చూపేదిగా ఉండాలని చెప్పినప్పుడే అతనికి, సమాజానికి మేలు జరుగుతుంది. అందుకే పెద్దలు “శీలేన శోభతే విద్యా అన్నారు.

చేసేపనిని శ్రద్ధా భక్తులతో చేయడం వల్ల పనితనం, పనిలో విజయం చేకూరతాయి. మనం సంపాదించే ధనంలో కొంత పేదా బీదలకు ఇవ్వడం నీ ఉన్నతికి కారణమౌతుంది. నైతిక విలువలు కోల్పోయిన వ్యక్తి తన సర్వస్వాన్ని కోల్పోయినట్లే. సమాజంలోని మనిషి తన నిత్య జీవితంలో ఎలా బ్రతకాలో, ఎలా బ్రతుకకూడదో తెలియజెప్పే నైతిక విలువలు పాటించడం అత్యావశ్యకం. వీటిలో సత్యం, ధర్మం, న్యాయం, మానవీయతలు ప్రకాశిస్తుంటాయి.

మన గత చరిత్రను పరిశీలిస్తే గురుకులాలలో, దేవాలయాలలో నైతిక, ఆధ్యాత్మిక విలువలను ప్రబోధించే, పెంపొందించే కార్యక్రమాలు జరుగుతుంటాయని తెలుస్తుంది. వీటి పరిరక్షణయే లక్ష్యంగా సాహిత్యం మొదలైన కళలన్నీ ఆవిర్భవించాయి. ఎందరో మహనీయులు ఈ విలువలను సుస్థాపితం చేయడానికి తమ జీవితాలు ధారపోశారు. ఈ విలువలను మనం పాటించడం వారి శ్రమను గుర్తించడమే అవుతుంది.

శతకం బ్రతుకుకు మార్గం
శతక కవులు అభినందనీయులు వారి మార్గం ఆచరణీయం
శతక కవులకు సమర్పిద్దాం ప్రణామాలు.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 18.
సమాజంలోని మూఢనమ్మకాల్ని నిర్మూలించడానికి మీరిచ్చే సలహాలు, సూచనలు ఆధారంగా చేసుకుని వ్యాసం వ్రాయండి. (March 2018)
జవాబు:
సమాజం అంటే సమూహం అని అర్థం. మానవ సమాజమనగా మానవుల సమూహమని అర్థం. అనూచానంగా మనదేశంలో ‘మానవుల మనుగడ కల్పించేందుకై మహర్షులు కొన్ని నీతి నియమాల్ని ఏర్పాటుచేశారు. అలాగే మన సమాజంలో కొన్ని మూఢాచారాలు, మూఢనమ్మకాలు నెలకొనియున్నాయి. అయితే మానవాళి ఆ మూఢాచారాల్ని, మూఢనమ్మకాల్ని గుడ్డిగా నమ్మటం వల్ల పతనానికి దారితీశాయి. మానవాళి వృద్ధి చెందలేదు.

కాలానుగతంగా నేడు మానవ సమాజంలో అనేక మార్పులు వచ్చాయి. బాల్యవివాహాలు, సతీసహగమనాలు, జీవహింస చెయ్యటం, ప్రకృతి వైద్యమంటూ మానవుల్ని వల్లకాటికి పంపడం, చేతబడులు చెయ్యటం, దుష్టశక్తుల్ని వశం చేసుకొనుట మున్నగు దురాచారాలు ఎన్నో నెలకొనియున్నాయి. అయితే వీటిని గ్రహించి కూకటి వ్రేళ్ళతో సమూలంగా నాశనం చేయుటకు కొంతమంది సంఘ సంస్కర్తలు నడుం బిగించారు.

వారిలో కందుకూరి వీరేశలింగం పంతులు, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రాజారామమోహనరాయ్ వంటి పెద్దలు ముందుగా స్త్రీలకు ప్రత్యేక పాఠశాలల్ని ఏర్పాటు చేసి స్త్రీలకు విద్య నేర్పించారు. ఆ తర్వాత బాల్య వివాహాల్ని రద్దు చేసి శాసనాలతో ‘చట్టం చేశారు. వితంతు వివాహాల్ని పునరుద్ధరించారు. సమాజంలో దయ్యాలు, భూతాలు లేవని నిరూపించి ప్రజల్ని జాగృతులు చేశారు. అదేవిధంగా భూతవైద్యాన్ని, చేతబడుల్ని నిర్మూలించారు. శకునాల్ని నమ్మవద్దనీ, అవి కేవలం మానవుల చిత్తభ్రమలని తెలియజేశారు.

ముఖ్యంగా మానవుల్లో నెలకొనియున్న అంటరానితనాన్ని నిర్మూలించారు. భగవంతుని సృష్టిలో మానవులందరూ ఒకటేయనీ, మూఢనమ్మకాల్ని తరిమి తరిమి కొట్టండనీ హెచ్చరించారు.

కనుక మానవులందరు పరమత సహనాన్ని పాటిస్తూ, మంచిని గ్రహించాలి. సమాజంలో నెలకొనియున్న మూఢనమ్మకాల్ని తరిమికొట్టాలి.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 19.
విద్యావంతుడైన ఒక యువకుడు ఉద్యోగాల కోసం పాకులాడకుండా, సొంతంగా వ్యవసాయం చేస్తూ, చక్కగా పంటలు పండిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. ప్రభుత్వంచే అవార్డులను కూడా పొందాడు. అటువంటి యువకుణ్ణి పొగుడుతూ అభినందన వ్యాసం వ్రాయండి. (March 2017)
జవాబు:
ప్రియ మిత్రమా ! రామచంద్రా ! నీకు నా ప్రత్యేక అభినందనల్ని తెల్పుచున్నాను. ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలను సంపాదించడం చాలా కష్టతరమైంది. కాని పై చదువులకు ఎక్కడకు వెళ్ళకుండా, చదివి అగ్రికల్చరల్ B.Sc. ని చదివి ఆపేశావు.

నీవు నీ గ్రామానికి వెళ్ళి, నీ తండ్రికి తోడుగా నిల్చావు. ‘గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయమని’ గాంధీగారు చెప్పినట్లు వ్యవసాయానికే నీ చదువునుపయోగించావు. ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేసి పదిమంది రైతులకు మార్గదర్శకు డవయ్యావు. వ్యవసాయం చేయుటలో మెళుకువలన్నీ సాటి రైతులకు చెప్పావు.

అధిక దిగుబడుల నిచ్చే వరి వంగడాల్ని ఎన్నుకొని నీ పొలాన్ని సాగుచేసి, సస్యశ్యామలం చేశావు. క్రిమిసంహారక మందుల్ని వాడకుండా, కంపోస్టు ఎరువుల్ని ఉపయోగించావు. రసాయనిక ఎరువుల వల్ల కలిగే నష్టాల్ని నీ గ్రామ ప్రజలకి తెలియజేశావు. ఎకరానికి 50 నుండి 60 బస్తాలు (క్వింటాళ్ళు) ధాన్యాన్ని పండించావు.

వ్యవసాయానికి తోడుగా పాడిపరిశ్రమను చేపట్టావు. నీ వల్ల పలు నగరాలకు నాణ్యమైన పాలను సరఫరా చేశావు. గోసంరక్షణ చేసి, పలు సంస్థల నుండి గౌరవ పురస్కారాన్ని పొందావు.

నీటి సమస్య లేకుండా నీ పొలంలోనే చెరువును త్రవ్వించి నీటిని నిల్వచేశావు. త్రాగునీరు, సాగునీరు సమస్య లేకుండా చేశావు. దీనికి తోడు కోళ్ళ పరిశ్రమను ఏర్పాటు చేశావు. నీవు నీ కాళ్ళపై నిలబడటమే కాకుండా దాదాపు చాలామందికి ఉపాధిని కల్పించావు.

నేడు నీవు చదివిన చదువు సార్థకమైంది. ఇంత పరిశ్రమ చేసిన నిన్ను రాష్ట్ర- కేంద్ర ప్రభుత్వాలు అవార్డులతో సత్కరించుట నీ గ్రామానికే గర్వకారణం. నిజంగా తెలుగుతల్లి ముద్దుబిడ్డవు.. నీకు నా తరఫున, నా మిత్రుల తరఫున అభినందన మందారాలనందిస్తున్నాను. ఇంకా నీవు అభివృద్ధి చెంది మరికొంతమందికి ఉపాధి కల్పిస్తావని ఆశిస్తూ. సెలవు.

ఇట్ల
నీ ప్రియమిత్రుడు,
యన్. బాలకృష్ణ.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 20.
నేడు నగర జీవనం ఎందుకు సంక్లిష్టంగా మారిందో విశ్లేషించి వ్యాసం రాయండి. (June 2015)
జవాబు:
నేడు మనుష్యులంతా నగరాల్లోనే జీవించాలని, తాపత్రయపడుతున్నారు. నగరాల్లో ఉన్నత విద్య, ఆధునిక వైద్య సౌకర్యాలు, ఉద్యోగావకాశాలు ఉన్నాయి. అన్ని తరగతుల ప్రజలకూ అక్కడ జీవించడానికి ఉపాధి సౌకర్యాలు లభిస్తాయి. అందువల్ల గ్రామీణ ప్రజలందరూ, నగరాలకు ఎగబ్రాకుతున్నారు.

పై కారణాల వల్ల నగరాల్లో జనాభా పెరిగిపోయింది. నగరాల్లోకి వచ్చే ప్రజలకు ఉండడానికి ఇళ్ళు సరిపడ దొరకడం. లేదు. నగరాల్లో ప్రజలు నడచి వెళ్ళడానికి సైతం, రోడ్లు చాలటల్లేదు. సిటీ బస్సులు ఖాళీలుండటం లేదు. తరచుగా ట్రాఫిక్కు జామ్లు అవుతున్నాయి. త్రాగడానికి నగరాల్లో సరిపడ మంచినీరు దొరకడం లేదు. నిత్యావసరాలకు సహితం, నీరు కొనవలసి వస్తోంది. ఆహారపదార్థాల ధరలు, పెరిగిపోతున్నాయి. సామాన్య మానవులు, హోటళ్ళలో ఏమీ కొని తినే పరిస్థితి లేదు. వారికి వైద్య ఖర్చులు పెరిగిపోతున్నాయి.

సామాన్యులు నగరాల్లో, మురికివాడల్లో, గుడిసెల్లో బ్రతకవలసి వస్తోంది. తక్కువ ఆదాయం వారి బ్రతుకులు నగరాల్లో కుక్కల కంటే హీనంగా ఉంటోంది. నగరాల్లో ఇండ్ల స్థలాలు లేక, చెరువులు కప్పి ఇళ్ళు కడుతున్నారు. వర్షాలు వస్తే ఆ ఇళ్ళు మునిగిపోతున్నాయి.

నగరాల్లో ఉద్యోగాలు సహితం, తేలికగా దొరకడం లేదు. పోటీ పెరిగిపోయింది. వలసలు వచ్చినవారు, తమ పిల్లలను కాన్వెంటు ఫీజులు కట్టి చదివించలేకపోతున్నారు. వారు కార్పొరేట్ వైద్యశాలల ఫీజులు కట్టి వైద్యం చేయించుకోలేకపోతున్నారు. నగరాలలో ఏదో బ్రతకాలని వచ్చిన గ్రామీణులు, ఉభయ భ్రష్టులయి, నగరాలలో ఇలా కష్టనష్టాలకు గురి అవుతున్నారు.

ప్రశ్న 21.
ఏదైనా పూర్వ పరిపాలకులు పాలించిన పట్టణం యొక్క చారిత్రక సాంస్కృతిక విశేషాల్ని వ్రాయండి. (June 2015)
జవాబు:
గోల్కొండ దుర్గాన్ని కేంద్రంగా చేసుకుని నవాబులు హైదరాబాదు రాజ్యాన్ని పాలించారు. గోల్కొండ దుర్గమంటే మూడు కోటలు. ఈ కోటలు ఒకదానిని మరొకటి చుట్టుకొని ఉంటాయి. ఈ పట్టణ నిర్మాణ పథకానికి కర్త ఆజంఖాన్ అను ఇంజనీరు. పట్టణంలోని భాగాల్ని ‘మొహల్లాలు’ అని పిలుస్తారు. వీరికి జుమ్లా మొహల్లా, మాదన్న మొహల్లా వంటి పేర్లు ఉండేవి.

‘గోల్కొండ పట్టణాన్ని అందంగా కులీకుతుబ్షా, అబ్దుల్లా కుతుబ్షా తీర్చిదిద్దారు. గోల్కొండలో ‘నగీనాబాగ్’ అనే అందమైన ఉద్యానవనం ఉండేది. ‘దిల్కుషా’ వంటి అందమైన భవనాలు ఉండేవి. గోల్కొండలో మిద్దెలతోటలు (Roof Gardence) ఉండేవి. ఈ ఉద్యానవనానికి నీరు అందించే నీటి కాలువలు జలాశయాలు ఉండేవి.

గోల్కొండలో విదేశీ వర్తకులు వర్తకం చేసేవారు. వజ్రాలకు గోల్కొండ పుట్టినిల్లు. కులీకుతుబ్షా కాలంలో తెలంగాణ ప్రపంచపు అంగడిగా ఉండేది.

గోల్కొండలో ఉన్ని పరిశ్రమ, ఇనుము పరిశ్రమ, ఆయుధ పరిశ్రమ సాగుతుండేది. ఇబ్రహీం కుతుబ్షా తెలుగు సాహిత్యాన్ని ఆదరించాడు. 1589 సంవత్సరంలో గోల్కొండలో మహామారీ పీడ వచ్చింది. ఎందరో మరణించారు. పీర్ల పంజాలు, సాధువులు భజనలతో ఊరేగారు. అప్పుడు మహామారి తగ్గింది. దానికి గుర్తుగానే హైదరాబాదులో తాబూతు ఆకారంలో నేటి చార్మినార్ నిర్మాణం జరిగింది.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 22.
“ఒక పత్రికలోని సంపాదకీయాలను చదివితే, ఆ పత్రిక ఆలోచనా ధోరణులనూ, దృక్పథాన్నీ అర్థం చేసుకోవచ్చు” దీని పట్ల మీ అభిప్రాయాన్ని సోదాహరణంగా వ్రాయండి. (March 2015)
జవాబు:
సమకాలీన సంఘటనలలో ముఖ్యమైన వాటిని తీసుకుని పత్రికల్లో వ్యాఖ్యాన రూపంతో పూర్వాపరాలను పరామర్శిస్తూ సాగే రచన సంపాదకీయ వ్యాసం. తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకుంటూ, ఆలోచింప చేయగలగడం మంచి సంపాదకీయ లక్షణం. ఇవి తత్కాలానికి సంబంధించినవే అయినా ఒక్కొక్క సందర్భంలో విభిన్న కాలాలకూ అనువర్తింప చేసుకోవచ్చును.

పత్రికల్లోని సంపాదకీయాలను చదివితే ఆ పత్రిక ఆలోచనా ధోరణిని, ధృక్పథాన్ని తెలుసుకోవచ్చును. తెలంగాణ రాష్ట్రంలో వెలువడే ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో సంపాదకీయం ఆ ప్రభుత్వానికి అద్దం పట్టి ప్రతి పనినీ, సమర్థిస్తూ వ్రాయబడుతుంది.

అదే ఈనాడు పత్రికైతే అందులోని సంపాదకీయాలు కాంగ్రేసు పార్టీని వ్యతిరేకిస్తూ, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా సంపాదకీయాలుంటాయి. కాని ఈనాడు పత్రికలో సంపాదకీయాలు మంచిని ప్రశంసిస్తూ, చెడును విమర్శిస్తూ వ్రాయబడతాయి.

నిజానికి సంక్షేమ పథకాలు, ప్రకటనలు, కొత్తవేవీకావు. గత ప్రభుత్వాలు పాలించిన కాలంలో ఎన్నెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టబడ్డాయి.

అయితే పత్రికలన్నీ సామాజిక బాధ్యతతో, నిజాయితీతో, చిత్తశుద్ధితో మంచిని మంచిగా, చెడ్డను చెడ్డగా విశ్లేషిస్తూ సంపాదకీయాలు వ్రాస్తే జగతి జాగృతం అవుతుంది.

ప్రశ్న 23.
సమాజం కోసం పాటుపడిన వాళ్ళలో ఎవరి గురించైనా ఒకరిని గురించి అభినందన వ్యాసం రాయండి.
జవాబు:
సెయింట్ మదర్ థెరీసా
దీనజన బంధువు, కరుణామయి, విశ్వశాంతి నోబెల్ బహుమతి గ్రహీత, అయిన మదర్ థెరీసా పూర్తిపేరు, “ఆగ్నస్ గోన్షా బొజాక్షువా”. ఈమె యుగోస్లోవియాలో 1910 లో జన్మించింది.

మదర్ థెరీసాకు వాటికన్ సిటీలో పోప్ పునీత (సెయింట్) అనే హోదాను ఇచ్చారు. కలకత్తాలో ఎంటలీ ప్రాంతంలో ఈమె ఒక కాన్వెంట్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయినిగా ఉండేది.

ఆ పాఠశాల ప్రక్కన ఉన్న ‘మోతీజీన్’ మురికివాడలో పాకీవారు, కూలిజనం, కార్మికులు నివసించేవారు. అక్కడ అంతా దరిద్రం తాండవించేది. ఆ ప్రజల సముద్ధరణకు, థెరీసా కంకణం కట్టుకొంది.

థెరీసా, తినడానికి తిండిలేక, కట్టుకోడానికి బట్టలు లేక, బాధపడే అన్నార్తులకు, అసహాయులను ఆదుకోడానికి, అవతరించిన మాతృమూర్తి. ఈమె, అనురాగమయి. ఈమె అనాథ పసిపాపలను ఆదరించి, పెంచి, ప్రేమను అందించిన కరుణామయి. నిస్వార్థంగా పేదలకు సేవ చేసిన త్యాగమయి.

థెరీసా, మానవసేవయే మాధవసేవగా తలచి, పేదలకు మనశ్శాంతినీ, ప్రేమనూ అందజేసిన మానవతా మూర్తి. ప్రపంచ దేశాల నుండి, అనేక విరాళాలు, బహుమతులు ఈమె స్వీకరించి, భారతదేశంలోని అనాథలకు ఖర్చు చేసిన కరుణామయి. ఈమె అభాగ్యులకు, అనాథలకు అభయహస్తం అందించిన అమృత హృదయ.

మదర్ థెరీసా అందరికీ మాత. ఈమె విశ్వమాత. నిర్మల హృదయ్, నిర్మల శిశుసదన్, శిశుసదనాలు, శాంతినగర్, ప్రేమదాన్, వంటి సంస్థల ద్వారా అనాథలకు, వృద్ధులకు, కుష్ఠు రోగులకు, శరణార్థులకు, సేవలందించి నేడు సెయింట్ అయిన మదర్ థెరీసాకు నా అభినందనలు.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 24.
‘పరిసరాల కాలుష్యం’ – అనే అంశంపై ఒక వ్యాసాన్ని వ్రాయండి.
జవాబు:
పరిసరమనగా మనచుట్టూ ఉన్నదే పరిసరమంటారు. మనచుట్టూ గాలి, నీరు, నిప్పు, నింగి, నేల మున్నగునవి ఉన్నాయి కదా ! మన ఆరోగ్యానికి ఆహారం, శరీర వ్యాయామం, పోషక పదార్థాలు ముఖ్యమైనవి. ఇవి అన్నియు పరిశుభ్రంగా ఉంటేనే మానవులకు ఆరోగ్యం కలుగుతుంది. అలాగే మానవుల చుట్టూ ఉన్న పరిసరాలు కూడా శుభ్రంగా ఉన్నప్పుడే మానవుల ఆరోగ్యం మరింత ద్విగుణీకృత ఆరోగ్యం కలుగుతుంది.

పరిసరాలు కాలుష్యానికి గురి కాకుండా చూడాలి. ముఖ్యంగా వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం, జల కాలుష్యం ఏర్పడుతున్నాయి. వీటి విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వీనివల్ల ప్రాణవాయువు (ఆక్సిజన్) తగ్గిపోతుంది. విషవాయువులు పెరుగుతున్నాయి. వీనివల్ల మానవాళికే కాక, ఇతర ప్రాణిజాలం యొక్క మనుగడకు ముప్పు ఏర్పడుతోంది.

పరిశ్రమల నుండి బయటకు వెలువడే వ్యర్థ పదార్థాల వల్ల నీరు కలుషితమౌతోంది. మురుగునీటిని శుద్ధిచేసి చెట్లకు వాడాలి. భూమి వేడెక్కకుండా రక్షించేది చెట్లు మాత్రమే. కనుక చెట్లను నరకకూడదు. చెట్ల వల్ల వర్షపాతం అధికమౌతుంది. తద్వారా భూగర్భజలాలు పెరుగుతాయి. భావితరాల వారికి కూడా పుష్కలంగా త్రాగునీరు, సాగునీరు లభ్యమౌతుంది.

నదీ జలాల్ని రక్షించాలి. ప్రభుత్వాలు కూడా చట్టాలు చేసి, అమలు చేయడంలో నిర్దాక్షిణ్యంగా, కఠినంగా వ్యవహరిస్తే తప్ప లేకపోతే మానవ మనుగడకు ముప్పువాటిల్లుతుంది. ప్రజలు కూడా వీని ఆవశ్యకతను గుర్తించి కాలుష్యాల నివారణకు నివారణ చర్యలు చేసుకొన్నచో లోకకల్యాణం జరుగుతుంది. పరిసరాలు ఆరోగ్యవంతంగా ఉంటేనే జీవకోటి సురక్షితంగా
ఉంటాయి.

ప్రశ్న 25.
‘స్వచ్ఛభారత్’ ఉద్యమంలో అందరూ పాల్గొనవలసిన ఆవశ్యకతను తెల్పుతూ ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
స్వచ్ఛము అనగా నిర్మలము, ఆరోగ్యవంతమైన, తెల్లనైన అనే అర్థాలున్నాయి. స్వచ్ఛభారత్ అనగా భారతదేశమంతా నిర్మలమైన ఆరోగ్యవంతమైన దేశమని అర్థం.

దేశమంతా ఆరోగ్యవంతమైన వాతావరణం కలగాలంటే ఏం చెయ్యాలి. ప్రజలందరు వారి వారి గ్రామాల్లోను, పట్టణాల్లోను వీధులన్నియు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి. చెత్తాచెదారాన్ని ఎత్తి ఒక కుండీలో వేయుట, వారానికి రెండు పర్యాయాలు తగులబెట్టుట వంటి పనులు చెయ్యాలి. ముఖ్యంగా డ్రైనేజివ్యవస్థను మెరుగుపరచి ప్రత్యేక కాలువల్లోకి మళ్ళించుట ఆ తర్వాత – ఆ మురుగునీరంతా సముద్రంలోకి వెళ్ళేదట్లు ఏర్పాటుచేయాలి.

దోమల బెడద లేకుండా క్రిమిసంహారక మందుల్ని పిచికారి చేయుట, ఫినాయిల్ ఎప్పటికప్పుడు చల్లుట వంటివి చేయాలి. చెట్లను నరకకుండా రక్షించాలి. ఖాళీ ప్రదేశాల్లో చెట్లను నాటాలి. పర్యావరణ పరిరక్షణకుద్యుక్తులవ్వాలి.

ధ్వని కాలుష్యం, వాయు కాలుష్యం, జల కాలుష్యం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలి. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ పదార్థాలను ప్రత్యేక ఖాళీస్థలాల్లో వేసి ఎప్పటికప్పుడు కాల్చివేయాలి. పరిశ్రమలనుంచి వెలువడు మురుగునీటిని శుద్ధిచేసి తర్వాత చెట్లకు వాడాలి.

భారతదేశమంతా పరిశుభ్రంగా ఉంచుటకై కోట్లాదిరూపాయల్ని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి. “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే నానుడిని నిజం చేసి, దేశం సస్యశ్యామలంగా తీర్చిదిద్దుట ప్రజల కర్తవ్యము. అపుడే ‘స్వచ్ఛభారత్’కు నిజమైన ఆకృతి సాకారమవుతుంది.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 26.
‘మిషన్ భగీరథ’ పథకాన్ని గురించి, సొంతంగా ఒక వ్యాసం రాయండి.
జవాబు:
ఈనాడు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరికీ త్రాగునీటిని కుళాయిల ద్వారా ఇంటింటికీ అందించడానికి నడుం బిగించింది. ఈ పథకానికి ‘మిషన్ భగీరథ’ అని నామకరణం చేసింది.

పూర్వం ఇక్ష్వాకువంశంలో పుట్టిన దిలీపుని కుమారుడు భగీరథుడు. ఇతడు తన పితృదేవతల్ని ఉద్దరించడానికి, ఆకాశంలోనున్న గంగను నేలకు దింపి పాతాళానికి గంగాజలాన్ని తీసుకువెళ్ళే గొప్ప ప్రయత్నం చేసి, ఆ కృషిలో సఫలం అయ్యాడు. భగీరథునిలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో దూరంలో నున్న మంచినీటి గొట్టాల ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి, ప్రతి నగరానికి, ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా మనిషికి 135 లీటర్లు చొప్పున అందించాలని ఈ ‘మిషన్ భగీరథ’ పథకాన్ని ప్రారంభించారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామల్లో నేడు త్రాగునీరు దొరకక ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో భూగర్భజలాలు ఫ్లోరైడ్తో కలిసి, అనారోగ్యానికి దారితీస్తున్నాయి. ఇవన్నీ గమనించి, ఎంత ఖర్చు అయినా, రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా, మంచినీటిని అందించారు, ఇక ముందు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వచ్ఛమైన మంచినీరు పుష్కలంగా లభిస్తుందని ఆశిద్దాం.

ప్రశ్న 27.
‘మిషన్ కాకతీయ’ పవిత్ర యజ్ఞం గురించి సొంతంగా ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో వెయ్యేండ్ల క్రితం కాకతీయుల కాలంలో గణపతిదేవుడు తవ్వించిన 46,445 చెరువులు నీరులేక, పూడిక తీసేవారులేక అలానే ఉండిపోయినాయి. ఆ చెరువుల్ని పునరుద్ధరించినది తెలంగాణ ప్రభుత్వం. కనుక ఈ పథకానికి ‘మిషన్ కాకతీయ’ అని పేరు పెట్టింది.

ఈ చెరువులన్నింటిలో పూడికతీయుట, నీటితో నింపుట, చెరువుకట్లన్ని బలవంతం చేయుట ముఖ్యఉద్దేశ్యం. తెలంగాణ ప్రభుత్వం చరిత్రాత్మక సంకల్పం చేసింది. ఆయువుపట్టయిన ఈ చెరువుల్ని తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయుటకు నడుంబిగించింది. 46 వేలకు పైగా ఉన్న చెరువులన్నీ మళ్ళీ జలకళ లాడించేందుకు కంకణం కట్టుకున్నది. సదాశివ నగర్లోని పాతచెరువులో పూడిక తీయడంలో ప్రారంభం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. చెరువుపై ఆధారపడిన సకల సామాజిక వర్గాల బతుకు చిత్రాన్ని మార్చేసింది. దీన్ని పవిత్ర యజ్ఞంగా భావించారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరు దీనిలో భాగస్వాములయ్యారు. ఆర్థికంగా అనేకమంది దాతలు లక్షలాది రూపాయల్ని మిషన్ కాకతీయకు దానమిచ్చారు. అనేకమంది శ్రమదానం చేశారు.

వర్షాధార పంటలకు నీటికొరత లేకుండా చెరువులు సాగునీటినిచ్చాయి. ప్రతి వర్షపుచుక్కను ఒడిసిపట్టి చెరువుల్ని నింపారు. ఈ చెరువుల క్రింద వేల ఎకరాలు సాగులోనికి వచ్చాయి. పంటలు అనుకున్నదానికంటే అధికంగా పండాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్లాదిరూపాయల్ని ఖర్చు చేస్తోంది. రాష్ట్రమంతా సస్యశ్యామలమై దరిద్రాన్ని పోగొట్టారు.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 28.
“అన్నం మెతుకును చూచి అన్నం ఉడికిందో లేదో చెప్పవచ్చు. అలాగే పుస్తక పరిచయ వ్యాసాన్ని (లేదా) పుస్తక సమీక్షను చదివితే, ఆ పుస్తకం గురించి ఆమూలాగ్రమంగా తెలుసుకోవచ్చు” ఎట్లాగో వ్రాయండి.
జవాబు:
ఒక పుస్తకం యొక్క లక్షణం, శైలి, రచనా విధానం, దాని తత్త్వం, పుస్తకం ద్వారా రచయిత లేక కవి చెప్పదలచిన అంతరార్థం, వాని దృక్పథాన్ని, వానిలో నిబిడీకృతమైయున్న సారాంశాన్ని పుస్తక పరిచయ వ్యాసం ద్వారా పాఠకులకు తెలియజేస్తాడు. దీనికే ముందుమాట, పీఠిక, తొలిపలుకు, ఆముఖం, ప్రస్తావన, మున్నుడి మున్నగు పేర్లు కలవు.

ఈ పుస్తకం యొక్క నేపథ్యాన్ని, లక్ష్యాల్ని పుస్తక పరిచయకర్త పాఠకులకు తెలియజేస్తాడు. అంతేకాక ఆ పుస్తకంలో రచయిత లేక కవి వివరించిన తీరు, అందులోని మంచిచెడ్డలు, పుస్తక పరిచయకర్త లేక సమీక్షకుడు తెలియచేస్తాడు.

ఉదాహరణకు ‘భూమిక’ అను ప్రస్తుత పాఠాన్ని చదివితే కేశవస్వామి తన కథల్ని రెండు భాగాలుగా 1969, 1981 సంవత్సరాలలో విడుదల చేశాడని తెలుస్తోంది. స్వాతంత్ర్యానికి పూర్వం నుండి, భారత్లో విలీనం అయ్యేవరకు హైదరాబాదు రాజ్యం చరిత్ర, ఈ కథలు తెలుపుతాయని తెలుస్తోంది. హైదరాబాదులోని సామాజిక పరిణామాలు, ఈ పుస్తకంలో ఉన్నట్లు తెలిసింది.

కేశవస్వామి రచనల్లో హైదరాబాదు జీవభాషను చిత్రించినట్లు కూడా తెలుస్తోంది. కేశవస్వామి కథలు చదివితే, కేశవస్వామి హృదయం వెల్లడవుతుందని తెలుస్తోంది. కేశవస్వామి కథలలోని సారాంశం, దీనివల్ల టూకీగా తెలుస్తుంది.

అందుచేత గూడూరి సీతారాం రాసిన పుస్తక పరిచయాన్ని చదవడం వల్ల, నెల్లూరి కేశవస్వామి గురించి, ఆయన రచనల గురించి, ఆ రచనలలోని కథాంశాల వైవిధ్యం గురించి, రచయిత హృదయాన్ని గురించి మనం తెలుసుకోవచ్చు.

ప్రశ్న 29.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, జాతి చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టంగా ఎందుకు అనుకుంటున్నారో వ్యాసంగా రాయండి.
జవాబు:
తెలంగాణ రాష్ట్రం, ప్రత్యేకమైన సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతి, భౌగోళిక పరిస్థితులు గల సంపన్న రాష్ట్రము. స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకడం, తెలంగాణ ప్రజలకు అలవాటు. అలాంటి రాష్ట్రం చాలాకాలం నుండి పరాయివారి పాలనలో అణగారిపోయింది. నైజాం కాలంలో ప్రజలు ఎన్నో కడకండ్లు అనుభవించారు. సామాజిక జీవనం ఛిన్నాభిన్నమయ్యింది. 1948లో పటేల్ చొరవతో తెలంగాణ ప్రాంతము ఇండియన్ యూనియన్లో ఏకమై స్వాతంత్య్రం పొందింది.

1956లో తిరిగి తెలంగాణ, ఆంధ్రప్రాంతంతో కలిసింది. ఆంధ్రప్రాంత పాలకులు, తెలంగాణ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. దానితో ప్రజలకు తెలంగాణ వేరు రాష్ట్రం కావాలనే ప్రగాఢమైన కోరిక కల్గింది.

అందుకే. కవులు, కళాకారులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు ఏకమై తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించారు. 1969 డా॥ మర్రి చెన్నారెడ్డిగారి నాయకత్వంలో ప్రత్యేక రాష్ట్ర సాధనకు మహోద్యమం నడిచింది. ఎందరో విద్యార్థులు, యువకులు ప్రాణాలు వదిలారు.

తరువాత కె.సి.ఆర్ నాయకత్వంలో సుమారు దశాబ్దంపాటు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాగింది. సకలజనుల సమ్మె జరిగింది. చివరకు 2014 జూన్ 2న, ప్రత్యేక రాష్ట్రం ప్రజల కోరిక మేరకు సిద్ధించింది. చిరకాల వాంఛ నెరవేరినందున, జాతిచరిత్రలో, దీనిని అద్భుత ఘట్టంగా అనుకుంటున్నారు.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 30.
నేటి సమాజానికి దాతృత్వం గల వ్యక్తుల ఆవశ్యకతను తెల్పండి.
జవాబు:
సమాజం అనగా సమూహమని అర్థం. మానవ సమాజం అనగా మానవాళి సమూహమని అర్థం. “పరోపకారార్థమిదం శరీరం” – అన్నట్లుగా ఈ శరీరం ఉన్నది తోటివారికి సహాయం చేయుట కొఱకేనని అర్థం. సమాజంలో నున్న మానవులు ఒకరికొకరు సహాయసహకారాలందించు కొన్నప్పుడు సమాజాభివృద్ధి జరుగుతుంది. దరిద్రం అన్న మాటలు ఆ సమాజంలో ఉండవు.

ఈనాటి సమాజంలో ధనవంతులు – దరిద్రులు ఉన్నారు. దరిద్రునికి కావలసింది తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు కావాలి. త్రాగడానికి సరియైన నీరు కూడా లభించని ప్రాంతాలనేకం ఉన్నాయి.

ధనవంతులు తమ శక్త్యానుసారం దాతృత్వం కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు పేదవానికి ఇతోధికంగా సహాయం అందించాలి. నేడు చాలామంది ధనవంతులు తమ డబ్బును ఇతర దేశాల్లో దాచుకుంటున్నారు. ప్రభుత్వానికి కట్టవలసిన ఆదాయం పన్ను ఎగకొడుతున్నారు. కాని ఒక్క విషయం ధనవంతులు గుర్తుంచుకోవాలి.

ఏ వ్యక్తి అయినా ప్రాణం పోయిన తర్వాత దాచుకొన్న ధనం అక్కరకు రాదు కదా ! ఎంతటి ధనవంతుడైన తినేది లవణమూ, అన్నమే కదా ! బంగారాన్ని, ధనాన్ని తినలేడు. ఈ నగ్న సత్యాన్ని గ్రహించి దాతృత్వాన్ని అలవాటు చేసుకొన్న యెడల ఒకరికి సహాయం చేసిన పుణ్యమే తాను మరణించిన తదుపరి వెంట వస్తుంది.

మన భారతదేశంలో చాలామంది కోట్లకు పడగలెత్తిన ధనవంతులున్నారు. వారు కనక ధర్మకార్యాలు చేస్తే మనదేశ ప్రగతి సాధిస్తుంది. బిల్ గేట్స్, విప్రో అధిపతి ప్రేమ్జీలా, తాతా బిర్లాల వలె తమ సొమ్ములో కొంత భాగాన్ని ధర్మకార్యాలకు వినియోగించాలి. దీనివల్ల ఆత్మ సంతృప్తి, పుణ్యం లభిస్తాయి. పుణ్యం కంటికి కనిపించదు. మరణించిన తదుపరి ఆ పుణ్యం గొప్పదనం కన్పిస్తుంది. పేదవాళ్ళ ముఖాల్లో నవ్వుల పువ్వులు విరబూస్తాయి.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 31.
స్త్రీ విద్యా ప్రాముఖ్యతను గూర్చి తెలియజేస్తూ నీ సొంతమాటలతో వ్యాసం వ్రాయండి.
జవాబు:
స్త్రీలు విద్యావంతులైనచో సమాజం వివేకవంతమవుతుంది. పిల్లల్ని కని, పెంచి పెద్దవారిగా చేసి తీర్చిదిద్దెడి తల్లులు విద్యావంతులైనచో సంఘానికి కలిగే ప్రయోజనం ఇంతింతయని చెప్పుటకు వీలులేదు.

అత్యంత ప్రాచీనకాలంలో స్త్రీలు బ్రహ్మ విద్యా వివరణ చేసినట్లు తెలియుచున్నది. బ్రహ్మచారిణులై ఉపనిషత్తులపై చర్చలు జరిపారు. తర్వాతి కాలమందు కవయిత్రులై పలు భాషల్లో గ్రంథాల్ని రచించారు. లీలావతి వంటి గణిత శాస్త్రజ్ఞురాలు, విదుషీమణి మనకు చరిత్ర చెబుతున్నది.

ప్రస్తుతం స్త్రీలకు అనేక సౌకర్యాలు కలిగాయి. స్త్రీలకు ప్రత్యేక కళాశాలలు, విద్యాలయాలు వెలిశాయి. స్త్రీలు చాలా ఉద్యోగాల్ని సంపాదించుకొని వన్నెకెక్కుచున్నారు.

మనదేశానికి స్వాతంత్ర్యం సంపాదించుటకై గాంధీ మహాత్ముడు తన నిర్మాణ కార్యక్రమంలో మహిళాభ్యుదయమే ప్రధానంగా చేర్చాడు. స్త్రీ విద్యకు ప్రాముఖ్యమిచ్చాడు. ఆధునికయుగంలో కందుకూరి వీరేశలింగం పంతులుగారు స్త్రీ విద్యకై మొట్టమొదట ఒక పాఠశాలను స్థాపించి కృషి చేశారు. ఆ కారణంగా క్రమక్రమంగా స్త్రీ విద్య వ్యాప్తిలోనికి వచ్చింది.

విద్యావంతురాలైన భారత మహిళ ‘విజయలక్ష్మి పండిట్’ ఐక్యరాజ్య సమితికి అధ్యక్షురాలై వన్నెకెక్కింది. శ్రీమతి ఇందిరాగాంధీ భారత ప్రధానిగా చేసి కీర్తిని సంపాదించింది. నేటి కాలంలో అనేకమంది మహిళలు పార్లమెంటు సభ్యులుగా, స్పీకర్లు, రాష్ట్రపతులుగా, ముఖ్యమంత్రులుగా, శాస్త్రజ్ఞులుగా, క్రీడాకారులుగా వివిధ పదవుల్ని అలంకరించి ఖ్యాతిని పొందారు.

స్త్రీలు తమ సంతానానికి విద్యాబుద్ధులు నేర్పుటలో శ్రద్ధ వహించి వారిని సత్పురుషులుగా తీర్చిదిద్దుచున్నారు. నేడు అధిక సంఖ్యలో స్త్రీలు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి సమర్థతతో నిర్వహించుచున్నారు. పాఠశాలల్లో N.C.C మున్నగు యుద్ధ విద్యా శిక్షణాన్ని కూడా పొంది అబలలు సబలలని నిరూపించుచున్నారు. కనుక స్త్రీ విద్యను ఇతోధికంగా ప్రోత్సహించినచో దేశానికి, సమాజానికి శ్రేయస్సు కలుగుతుందనుటలో అతిశయోక్తి లేదు.

ప్రశ్న 32.
ఈ మధ్యకాలంలో చోటుచేసుకున్న ఏదైనా సామాజికాంశం / సంఘటనలు ఆధారంగా, సంపాదకీయ వ్యాసం రాయండి.
జవాబు:
“సెల్ఫీల పిచ్చి”
ఇటీవల మన ప్రధాని నరేంద్రమోడీ, చైనాను సందర్శించినపుడు ఆ దేశ ప్రధానితో సెల్ఫీ తీసుకున్నట్లు వార్త వచ్చింది. ఈ స్మార్ట్ఫోన్ వ్యామోహంలో, ఈ సెల్ఫీలు తీసుకొనే ధోరణి, నేడు ఒక వైరస్ వ్యాపించింది. మనదేశ ప్రధానికి, సెల్ఫీ వ్యామోహం ఉండడం ఒక విచిత్రం.

నిజానికి సెల్ఫీ తీసుకోడం, తప్పుకాదు. కొత్తరకం ఫోన్లో కెమెరా సౌకర్యం ఉండడం వరకు బాగుంది. కాని నేటి యువత, ఈ సెల్ఫీల మోజులో ఎంతో సమయాన్ని దుర్వినియోగపరుస్తున్నారు. సెల్ఫీ తీసుకోవడం, దాన్ని నెట్వర్క్ పోస్టు చేయడం, దానిపై వచ్చే వ్యాఖ్యలను చూసి మురిసిపోవడం లేదా బాధపడడం జరుగుతోంది. ఒకొక్కప్పుడు కొంతమంది, ఆ బాధతో ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు.

ఈ పిచ్చి ఇలా ముదిరిపోయింది. ఒకడు వచ్చే రైలుముందు నిలబడి, ఫోటో తీసుకోవాలని, పట్టాల మీద నిలబడి ప్రాణం పోగొట్టుకున్నాడు. మరొకడు మంటలముందు హీరోయిజాన్ని ప్రదర్శించబోయి సజీవదహనం అయ్యేడు. మరొకడు కొండ ఎక్కి సెల్ఫీ తీసుకోబోయి, కొండ నుండి జారి తల పగిలి చచ్చాడు. ఒకడు ఇళ్ళు కాలి, గుండె పగిలి ఏడుస్తూంటే, సెల్ఫీ తీసుకున్నాడు.

ఇవన్నీ మనిషిలోని మనిషి మాయమయ్యాడని చెపుతున్నాయి. అతనికి ఫోటో తప్ప, మరేమి ముఖ్యం కాదు. ఈ మానసిక జాడ్యాన్ని అరికట్టాలి. సెల్ఫీ అంటే మనని మనం, సమీక్షించుకోవడం. అంతేకాని ‘సెల్ఫీ’ అంటే ఫోటో కాదని యువత గుర్తించాలి. ఆ రోజు త్వరగా రావాలని ఆకాంక్షిద్దాం.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 33.
తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల పాత్రను గూర్చి వ్యాసం రాయండి.
జవాబు:
తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజాప్రతినిధులు, అసెంబ్లీలోనూ, పార్లమెంటులోనూ, రాజకీయ వేదికలపైనా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నిర్మాణ ఆవశ్యకతను గొంతెత్తి చాటారు. ఎన్నో పర్యాయాలు అసెంబ్లీని, పార్లమెంటునూ, స్తంభింపచేశారు. సామాన్యంగా రాజకీయ నాయకులకు పదవీ వ్యామోహం ఎక్కువగా ఉంటుంది. కాని తెలంగాణ రాజకీయ నాయకులు ప్రత్యేక రాష్ట్ర సాధనకై తమ పదవులను తృణప్రాయంగా, చాలాసార్లు విడిచి పెట్టారు. అన్ని పార్టీల వారు తమకు వేరు రాష్ట్రం కావాలని కేంద్రానికి లేఖలు ఇచ్చారు.

వివిధ పార్టీల వారికి తమలో తమకు, ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్న, రాష్ట్ర సాధన విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తపరచారు. టి.ఆర్.యస్ పార్టీ తరఫున కె. చంద్రశేఖరరావుగారు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించి, అహింసా పద్ధతులలో ఉద్యమాన్ని ముందుకు నడిపించి, విజయం సాధించారు.

కె.సి.ఆర్ గారు రెండుసార్లు తమ యమ్.పి. పదవులకు రాజీనామా ఇచ్చారు. కేంద్రమంత్రి పదవిని సైతం త్యాగం చేశారు. 1969లో డా॥ మర్రి చెన్నారెడ్డిగారు తెలంగాణ ప్రజాసమితి పేరున మహోద్యమాన్ని చేపట్టారు. ఆయన నగరంలో విద్యార్థుల సహకారంతో, కేంద్రప్రభుత్వాన్ని కదలించారు. ఆనాడు ఇందిరాగాంధీకి ఎదురుగా నిలిచి ఆయన 10 మంది ఎమ్.పి.లను నెగ్గించుకున్నారు.

ఈ విధంగా ప్రత్యేక రాష్ట్ర సాధనలో, రాజకీయ నాయకులే, ప్రధానపాత్ర వహించి విజయాన్ని సాధించారు.

ప్రశ్న 34.
‘తెలంగాణ పోరాటాల పురిటిగడ్డ’ అనే వాక్యాన్ని సమర్థిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
తెలంగాణ ప్రాంతం, చాలాకాలం సుల్తానుల పాలనలో ఉంది. తరువాత ఢిల్లీ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండ కోటను ధ్వంసం చేసి, తాను ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు.

చివరి నైజాం నవాబు కాలంలో సుల్తాను రజాకార్లను పంపి తెలంగాణ ప్రజలను దోచుకున్నాడు. ఆ నవాబు కాలంలో ప్రజలు నైజాం పాలన నుండి విముక్తి కోసం పెద్ద ఎత్తున విముక్తి పోరాటం సాగించారు. తెలంగాణలోని గడ్డిపోచ కూడా కత్తి పట్టి నిజాం పాలనను ఎదిరించింది. చివరకు ఆనాటి మన ఉపప్రధాని పటేలు పోలీసు యాక్షన్తో నైజాం నవాబు తోక ముడిచాడు. అప్పుడే తెలంగాణము భారత యూనియన్లో కలిసి 1948లో స్వతంత్ర రాష్ట్రమయ్యింది.

తరువాత హైదరాబాదులోని తెలుగువారు, ఆంధ్ర ప్రాంతంలోని తెలుగువారితో కలిసి ‘మహాంధ్ర’ ఏర్పడాలని “మహాంధ్ర” ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం ఫలించి, 1956లో హైదరాబాదు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది.

తరువాత తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా విడదీయాలని మర్రి చెన్నారెడ్డి గారు 1969లో పెద్ద ఉద్యమాన్ని లేవదీశారు. 9 నెలలపాటు పాఠశాలలు, కళాశాలలు ‘బందు’ అయ్యాయి. తిరిగి 1973 లో మరోసారి ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. తరువాత మన ముఖ్యమంత్రి కె.సి.ఆర్ నాయకత్వంలో శాంతియుతంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున పొంగింది. ఉద్యోగులు, విద్యార్థులు, సకలజనుల సమ్మె చేశారు. వంటావార్పు రోడ్డు ఎక్కింది.

చివరకు 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. పై చరిత్రను చూస్తే తెలంగాణ ‘పోరాటాల పురిటిగడ్డ’ అని చెప్పవచ్చు.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 35.
‘సత్యమేవ జయతే’ అన్న మాటను వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
“ధర్మాత్ములైన వారిని సత్యం అనే నావ ఎటువంటి విపత్తుల నుంచి అయినా దరిచేర్చగలుగుతుంది.” – అని ఋగ్వేదం చెబుతోంది. అసలు సత్యం అంటే – ఏది శాశ్వతమో అదే సత్యం. “సత్పురుషుల యందు పుట్టునది సత్యము” అని శబ్ద రత్నాకరం తెలుపుతోంది. సత్యం ఒక మహావృక్షం. దానిని మనం ఎంతగా పోషిస్తే అది అంతగా ఫలాలనిస్తుంది. లోకంలో అందరూ సత్యాన్ని గురించి మాట్లాడేవారే కాని కొందరే దానిని పాటించేది. ఇది బాధాకరమైన విషయం. ప్రస్తుత సమాజంలో సత్యం ఉరికంబంపైన ఉక్కిరిబిక్కిరి అవుతుంటే, అసత్యం సింహాసనంపైన కులుకుతోంది. సంతోషానికి సద్గుణాలే ఆధారం కావాలి. సత్యం దానికి విధిగా పునాది అవ్వాలి. అప్పుడే భూమి స్వర్గం అవుతుంది. సత్యం కరదీపిక. దానిని కదిపేకొద్దీ ప్రకాశవంతమవుతుంది.

సత్యాన్ని అనుసరించడానికి కావలసింది సాహసం ఒక్కటే అంటారు గాంధీజీ. సత్యం కోసం అన్నీ త్యాగం చేయవచ్చు. కాని, సత్యాన్ని దేనికోసమూ త్యాగం చేయకూడదు. నిజం చేదుగా ఉంటుంది. అబద్దం అతిమధురంగా ఉంటుంది. కాని శాశ్వతత్వం ఉండేది నిజంతోనే.

తాత్కాలిక సుఖాలకోసం శాశ్వత కష్టాలను కోరుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. కష్టంగా కనిపించినా సుఖాన్నిచ్చేది, భూమిపై శాశ్వత కీర్తినిచ్చేది మాత్రం సత్యమే. ‘సత్యం వద – ధర్మం చర’ అని పెద్దలు ఊరికే చెప్పలేదు. సత్యమార్గం వీడక హరిశ్చంద్రుడు సత్యహరిశ్చంద్రుడనే కీర్తి పొందాడు.

సత్యం ఆధ్యాత్మికత యొక్క అతి ముఖ్య లక్షణం. నిజం చెప్పడానికి ఎంతో ధైర్యం ఉండాలి. అలాగే నిజాన్ని ఒప్పుకోవడానికి కూడా అంతకుమించిన ధైర్యం ఉండాలి. అలాగే సత్యాన్వేషి అయిన మానవుని మనస్సు భూమిపైన స్వర్గం వంటిది. “సత్యంచే సకలార్ధ సాధకమగున్…..” అని చెప్పిన బలిజేపల్లి వారి మాటలను గుర్తుకు తెచ్చుకోవాలి. అప్పుడే లోకం కృతయుగాన్ని తలపిస్తుంది. సత్యమే ఎప్పటికి యిస్తుంది. జయాన్నిస్తుంది.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 36.
భాషకు అలంకారాలు పలుకుబడులు, నుడికారాలు అని వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
మనోగత హావభావాలను తెలియజేసేది భాష, భాష వల్ల మానవుని సభ్యత, సంస్కారం, సంస్కృతి తేటతెల్లం అవుతాయి. మాట్లాడే భాష ప్రజల భావాలకు అద్దంపట్టాలి. సునిశిత హాస్యం, వ్యంగ్యోక్తి, లాలిత్యం, లోకానుభావం, విమర్శనా వైశిష్ట్యం, మార్గదర్శకత్వం మొదలైన అన్ని అంగాలనూ కలిగి ఉండి, నిత్య జీవితంలో జరిగే అతి చిన్న సంఘటననూ, సాంఘీక జీవనంలోని లోతులనూ సంపూర్తిగా ఎత్తి చూపిస్తుండాలి.

ఒక్కొక్కసారి మాట్లాడుతున్నప్పుడు ఎదుటివారి స్వభావాన్ని గానీ, మరేదైనా గానీ ముఖాముఖీ విమర్శించలేనప్పుడు నర్మ గర్భంగా, అన్యోపదేశంగా ఆ వ్యక్తి తప్పొప్పుల్ని, స్వభావాన్ని విమర్శించడం జరుగుతుంది. చెప్పదలచుకున్న భావాన్ని మనసుకు హత్తుకొనే విధంగా చెప్పడానికి మనం ‘నుడికారాలు’ ప్రయోగిస్తాం. పలుకుబడి, నుడికారం, జాతీయం అనేవి భాషకు అలంకారాన్నిస్తుంది.

పలుకుబడి అంటే ఉచ్ఛారణలో ఉండే విలక్షణత. దీన్నే ‘యాస’ అంటారు. యాసలో మాట్లాడితే, ఆ ప్రాంతం వారికి వినసొంపుగా ఉంటుంది. మాండలిక యాసతో కూడిన పలుకుబడి, వినడానికి అందంగా, అలంకారంగా ఉంటుంది. నుడికారం అంటే ‘మాట చమత్కారం’. ఈ నుడికారం ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిలోంచి,

ఆచార వ్యవహారాల్లోంచి పుడుతుంది. చెప్పదల్చుకున్న భావం మనస్సుకు హత్తుకుంటుంది. నుడికారాలు జాతీయాలుగా, సామెతలుగా ఉంటాయి. నుడికారం వల్ల చమత్కారం, దాని వల్ల ఆనందం కలుగుతాయి. అందుకే అది అలంకారం. ఇక జాతీయం అంటే విశిష్ట పదబంధం. జాతీయాలను పలుకుబళ్ళు, నుడికారాలు అని కూడా అంటాం. నుడికారం, పలుకుబడి అన్నవి ఆ భాషకు మాత్రమే సాధ్యం.

జాతీయం ఆ జాతి వాడుకలో రూపుదిద్దుకుంటుంది. జాతీయంలోని పదాల అర్థాన్ని ఉన్నదున్నట్లుగా చూస్తే వచ్చే అర్థం వేరు. ఆ పదాల పొందికతో మరో అర్థం వస్తుంది. ‘చేతికి ఎముక లేదు’ అనే జాతీయం బాగా దానాలు చేస్తాడనే భావాన్నిస్తుంది. అలాగే ‘కళ్ళలో కారం పోసుకుంటాడు”.

సామెతల విషయానికొస్తే మాట్లాడే భాషకు నవ్యత్వం, పురిపుష్టిని కల్గించేవి సామెతలు. సామెత అంటే అనుభవం నేర్పిన పాఠమే. అనుభవించిన అనుభవానికీ, అనుభూతికి అక్షరరూపం సామెత. జీవితాన్ని కాచివడపోసిన సత్యం సామెత. అనుభవం గడించిన భావావేశంలో వెలువడినవి కాబట్టే సామెతలలో ఒక విధమైన ప్రాస, లయ ఉన్నాయి. కొండంత భావం సంక్షిప్త రూపంతో వీటిలో ఇమిడి ఉంది.

అందుకే ‘తేట తేనెల ఊట తెలుగు సామెత’ అన్నారు. సామెతలను రచించిందీ, పోషించిందీ ప్రజలే. అనంతమైన భావాన్ని ముచ్చటగా మూడు ముక్కల్లో చెప్పగలిగే సామాన్య ప్రజా భాషా . ప్రక్రియ సామెత. అందుకే “సామెత లేని మాట – ఆమెత లేని యిల్లు” అనే సామెత పుట్టింది. సామెతలు చిన్నవైనా, పెద్దవైనా అర్థాన్ని విశ్లేషించి చూస్తే సూటిగా ప్రజల మనసు లోతుల్ని తాకి, ఆలోచనా స్రవంతిని కదిలించి చైతన్యవంతుల్నిగా చేసే విజ్ఞాన భాండాగారాలు. “అయిదు శిఖలున్నా ఇబ్బంది లేదు కానీ మూడు కొప్పులు చేరాయంటే ముదనష్టమే”, “అవ్వను పట్టుకొని వసంతాలాడినట్లు”, “పిట్ట కొంచెము – కూత ఘనము” వంటివి ఎన్నో తెలుగుభాషను సుసంపన్నం చేస్తున్నాయి.

పలుకుబడి, నుడికారం, జాతీయం అనేవి భాషకు అలంకారాల వంటివి అని చెప్పడంలో సందేహం లేదు.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 37.
చదువు వల్ల కలిగే ప్రయోజనాలను తెలుపుతూ వ్యాసం రాయండి.
జవాబు:
“దేనివల్ల శీల నిర్మాణం జరుగుతుందో, దేనివల్ల వ్యక్తి వికాసం పెంపొందుతుందో, మానసిక శక్తి విస్తృతమౌతుందో, సాంస్కృతిక చైతన్యం ఎక్కడైతే కలుగుతుందో, మానవుడు తన కాళ్ళపై తాను ఎప్పుడైతే నిలబడగలుగుతాడో అదే విద్య పరమావధి కావాలి” అన్న స్వామీ వివేకానంద మాటలను మనం గుర్తుచేసుకోవాలి.

చదువుకోవడం వల్ల సమాజం చైతన్యవంతం అవుతుంది. విచక్షణ కలుగుతుంది. ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. మనం చేసే పనిలో నైపుణ్యం పెరుగుతుంది. గౌరవం పెరుగుతుంది.. మూఢాచారాలు నశిస్తాయి. ప్రతి విషయాన్ని శాస్త్రబద్ధంగా ఆలోచిస్తాము. దురలవాట్ల వల్ల కలిగే అనర్థాలు తెలిసి, మానివేస్తాము. ఉపాధి దొరుకుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమస్యలను పరిష్కరించుకోగల సామర్థ్యం వస్తుంది. ఈ భావాలనే….

శ్లో॥ “విద్యాదదాతి వినయం – వినయం ద్యాతి పాత్రతామ్ |
పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాత్ ధర్మం తతః సుఖమ్ || (హితోపదేశం)

పోతన తన భాగవతంలో “చదువని వాడజ్ఞుండగు” అంటూ చదువు యొక్క పరమార్థాన్ని వివరించారు. దేశం అభివృద్ధి సాధించాలంటే, అక్షరాస్యత శాతం పెరగాలన్న గాంధీజీ మాటలను వేదవాక్కుగా భావిద్దాం.

“విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళిన్” అని ఏనుగు లక్ష్మణ కవి ; దొరలు దోచలేరు, దొంగలెత్తుకుపోరు ; భ్రాతృజనము వచ్చి పంచుకోరు ; విశ్వవర్ధనంబు విద్యాధనంబురా” అని కరుణశ్రీ విద్య విశిష్టతను తెలిపారు.

మనోధైర్యాభివృద్ధితో బుద్ధి వికాసం పొంది, మానవుడు తన కాళ్ళపై నిలువగల శీలాన్ని నిర్మించుకోగల విద్య మనకు అవసరం. విద్య అనే వృక్షంలో వేళ్ళు చేదుగా అనిపించొచ్చేమో గానీ అది అందించే ఫలాలు మాత్రం చాలా మధురం.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 38.
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న మాటను వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
‘శ్రీశైలం, కాళేశ్వరం, దాక్షారామం’ ఈ మూడు దేవాలయాల మధ్య భూభాగాన్ని కాకతీయులు పాలించారు. ఈ ప్రాంతం త్రిలింగదేశంగా పిలువబడింది. ఇదే కాలగమనంలో ‘తెలంగాణ’ అనే పదంగా మారింది. 2014 జూన్ 2 నాడు తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడింది. ఎందరో మహనీయుల కృషితో పాటుగా ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ పార్టీ ఏర్పాటు చేసిన కె. చంద్రశేఖరరావు ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా పనిచేసి విజయం సాధించారు.

ప్రాచీన కాలంలోనే తెలంగాణ ప్రాంతంలో సాహిత్యం విలసిల్లింది. 10వ శతాబ్దంలో మంథాన భైరవుడు భైరవతంత్రం, 13వ శ॥ గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం ఇలా ప్రారంభమై పోతన, దాశరథి, సి.నా.రె వంటివారు గొప్పకవిత్వం ఈ నేలలో పండించారు. రామప్పగుడి, కాకతీయ శిల్పం, చార్మినార్ వంటి అపురూప కట్టడాలతోను, భద్రాద్రి, మెదక్ చర్చి, ఎన్నో ప్రాచీన దర్గాలతో సర్వమత సమానత్వాన్ని ఈ నేల చాటుతున్నది.

అన్ని సంస్కృతులకు సంగమమైన భాగమతి ప్రేమ కానుకగా నిర్మించిన భాగ్యనగరం భారతదేశంలోనే గొప్ప నగరాలలో గొప్పది. రామదాసాది భక్తాగ్రగణ్యులు వాగ్గేయకారులుగా వెలుగొందారు. గోలకొండ కోట మన ఘనచరిత్రకు తార్కాణం. గోదావరి, కృష్ణ, మంజీరా, ప్రాణహిత, మూసీ, దిండి, పాలేరు, మున్నేరు మున్నగు నదులు ప్రవహించి ఈ నేలను సస్యశ్యామలం చేశాయి.

విప్లవ వీరులకూ, కళలకూ, ఘన సంస్కృతికీ, అపురూప శిల్పాలకూ, ప్రఖ్యాతి వహించిన సరస్వతీ దేవాలయం గల బాసర వంటి పుణ్యక్షేత్రాలకూ, తీర్థాలకూ నిలయం ఈ గడ్డ. నీలగిరి, గోలకొండ, హితబోధిని లాంటి పత్రికలు రాకతో సాహిత్యం మరింత వృద్ధి చెందింది. హైదరాబాదు సంఘసంస్కర్తగా పేరొందిన భాగ్యరెడ్డివర్మ ఇక్కడివాడే.

సరోజినీనాయుడు, మిద్దెరాములు, కొండా లక్ష్మణ్ బాపూజీ, దేవులపల్లి రామానుజరావు, పి.వి. నరసింహారావు, బిరుదురాజు రామరాజు, జమలాపురం కేశవరావు, టి.యస్.సదాలక్ష్మి, రాంజీ గోండు, సురవరం ప్రతాపరెడ్డి మొ||వారు ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖులలో కొందరు.

వచ్చింది వచ్చింది నా తెలంగాణ తెచ్చింది తెచ్చింది బంగారు నజరానా.
ఏనాటికలలో ఫలించిన శుభతరుణంలో – మురిసింది మురిసింది తెలంగాణ.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 39.
‘సమాజంలోని మూఢనమ్మకాలను పారదోలడం’ అనే అంశాన్ని వ్యాసంగా రాయండి.
జవాబు:
మన సంఘంలో ఎన్నో నమ్మకాలు ఆచారంగా వస్తున్నాయి. వాటిలో కొన్ని నమ్మకాలు దురాచారాలై పీడిస్తున్నాయి. ఇవే మూఢనమ్మకాలు. అంటే తోటి మానవులను, కొన్నిసార్లు వారినే బాధించేవి. మూఢనమ్మకాలు ఏవంటే దెయ్యాలు, చేతబడులు, శకునాలు వంటివి నమ్మడమే. ఇంకా పురుడు, మైల, పూజ, మడి, అంటు, కఠినమైన ప్రమాణాలు వంటివి కూడా మూఢనమ్మకాల జాబితాలో చేరతాయి.

పూర్వం బాల్య వివాహాలు, సతీ సహగమనం దురాచారాలు ఉండేవి. తర్వాత కాలంలో భర్త చనిపోయిన స్త్రీలకు తలవెంట్రుకలు తీయించి, తెల్లచీర కట్టించి, మంగళద్రవ్యాలు వాడనీయకుండా మూలన కూర్చోబెట్టారు. అంతేకాక వీరు ఎదురొస్తే వెళ్ళే పనికాదని, వీళ్ళు శుభకార్యాలకు రాకూడదని ఆంక్షలు విధించారు. ఇప్పటికి అవి అమలవుతూనే ఉన్నాయి.

దెయ్యాలున్నాయని కొందరు భయపడుతుంటే, చేతబడులున్నాయని మరికొందరు భయపెడుతున్నారు. పిల్లలు లేని తల్లులను లక్ష్యంగా చేసుకొని కొందరు బురిడీ బాబాలు మోసాలకు పాల్పడుతున్నారు. రాగి, ఇత్తడి, ఇనుము వంటి వాటిని బంగారం చేస్తామని ప్రజలకు ఆశ కలిగించి మోసం చేస్తున్నారు. పై వాటిలో మనం గమనించుకొంటే మనోధైర్యం లేకపోవడం అతిగా నమ్మడం, అత్యాశకు పోవడం అనేవి మనలోని బలహీనతలు. వాటిని ఆధారం చేసుకొని నమ్మకాన్ని కల్గించి వాళ్ళు మనల్ని దోచుకుంటున్నారు.

ఎందరో సంఘసంస్కర్తలు రాజారామమోహనరాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, కందుకూరి వీరేశలింగం పంతులుగారు, గురజాడ, చిలకమర్తి వంటి మహాత్ములు, ఈ మూఢ నమ్మకాలు తొలిగించడానికి కృషి చేశారు.

మంత్రాలకు చింతకాయలు రాలడం, పూజలు చేస్తే పిల్లలు పుట్టడం ఇవన్నీ వట్టి పిచ్చి నమ్మకాలు. నేటి యువత అభ్యుదయ దృష్టితో ముందుకు సాగాలి. ‘కష్టేఫలీ’ అని గుర్తించి, శ్రమ చేస్తేనే ఫలితం అన్న సంగతి మరువకూడదు. మనం మోసపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడే ఎవరైనా మోసం చేయడానికి అవకాశం. కనుక దేనికోసం ఎదురు చూడకుండా ధర్మంగా, న్యాయంగా పని చేసుకుంటూ ముందుకు నడవాలి.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 40.
భిక్షాటన ఎంతవరకు సమంజసమో వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
ఈ రోజుల్లో ‘భిక్ష’ అనే మాట ‘అడుక్కుతినడం’ అనే అల్పార్థానికి పరిమితమైంది. నిజానికి ఒకప్పుడు ‘భిక్ష’ అనేది పరమపవిత్రమైన వ్రతం. శివుడు ఆది భిక్షువుగా ప్రసిద్ధి చెందాడు. గురువులు శిష్యులకు ‘జ్ఞానభిక్ష’ పెట్టేవారు. గౌతమబుద్ధుడు భిక్షా వృత్తితోనే జీవనం సాగించాడు. గురుకులంలో చదువుకొనే రాజకుమారులు సైతం, భిక్షాటనతోనే విద్యార్థి జీవనం గడిపేవారు. భిక్షపెట్టడం అన్నది, ఒక మహాపుణ్యకార్యంగా భావించేవారు. ఎవరికి భిక్ష ఇవ్వాలో మనుచరిత్రలో ఇలా చెప్పబడింది – “బధిర పగ్వంధ, భిక్షుక, బ్రహ్మచారి జటి పరివ్రాజకా తిథి క్షపణ కావధూత కాపాలి కాద్యనాథులకు” అని.

శంకరాచార్యులు భిక్షాటనతోనే జీవించారు. భాగవతంలో రంతిదేవుని కథలో రంతిదేవుడు ఉంఛ వృత్తితో అన్నాన్ని సేకరించాడు. భారతంలో కౌశికుడు మాధుకరీయం చేసుకొని జీవించినట్లు ఉంది. ఎవరికైనా బీదలకు దానధర్మాలు చెయ్యడం కర్తవ్యమనీ మన ధర్మశాస్త్రాలు బోధిస్తున్నాయి. ఎవరైనా గతిలేనప్పుడు భిక్షకి బయలుదేరతాడు. అటువంటి వారికి భిక్షమెయ్యడం సబబు. అంగవైకల్యం, వృద్ధ, బాల, స్త్రీలకు భిక్ష వేయడం ధర్మం. వారు కష్టించి పనిచేయలేరు కనుక.

ప్రస్తుతం సమాజంలో అడుక్కోవడం ఒక వృత్తి అయ్యింది. ఆఖరికి ఆరోగ్యంగా, వయసులో ఉన్న వ్యక్తులు అయ్యప్పమాల ధరించామనో, ఇంకేదో అనో ఊరూరా, ఇంటింటికి వెళ్ళి భిక్షమెత్తుతున్నారు. ఇవ్వకపోతే సాక్షాత్ దేవుడే వచ్చి శపిస్తాడన్న ఫీలింగ్ చూపిస్తాడు. ఇంకొందరు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో తిరుగుతూ లేని రోగాలను నటిస్తూ, పిల్లకు పెళ్ళి చేయాలని, ఇల్లు కాలిపోయిందని, చెబుతూ డబ్బులు దండుకోవాలని చూస్తుంటారు. వీరిలో కొందరు నిజం చెప్పవచ్చు కూడా. ఇవన్నీ ఆధునికులైన చాలామందికి నచ్చకపోవచ్చు.

కుంటి, గ్రుడ్డి వికలాంగులై అడుక్కునే అర్హత గల బిచ్చగాళ్ళను ఒకచోటికి చేర్చి వారికి దాతలు భోజనం ఏర్పాటు చేయాలి. వారికి విరాళాలు ఇచ్చి, అన్న సత్రాల నిర్వహణను సంఘంగా ఏర్పరచి నిర్వహించాలి. నిజమైన బిచ్చగాళ్ళకు ఆదరణతో పెట్టాల్సిందే. వృత్తిగా చేసేవారికి వేయకపోవడమే మంచిది.

ఒకసారి గాంధీగారు శరీరం బాగున్న బిచ్చగాడితో “నీవు ముట్టెత్తుకోపోతే పని చేసుకోరాదా ?” అన్నారట, వెంటనే వాడు తన దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ చూపించి, అడుక్కోవడం ‘నా వృత్తి. ఇష్టమైతే పెట్టు, లేకపోతే మాను, అన్నాడట. ఇట్లాంటి వారిని చూస్తే పెట్టేవాళ్ళకి కూడా పెట్టుయ్యటం లేదు.

ప్రశ్న 41.
“అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది” అని వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అని పెద్దలమాట. ఆకలితో ఉన్నవానికి గుప్పెడు అన్నం పెడితే జీవితాంతం గుర్తు పెట్టుకొంటాడు. అదీ అన్నం విలువ. దానాలు అనేక రూపాల్లో చేయవచ్చు. విద్య, ధనం ఇలా ఏదొక రూపంలో దానాలు చేసేవాళ్ళు ఉంటారు. ఎక్కువమంది అన్నదానాన్ని ఇష్టపడతారు. కారణం మనవల్ల ఒక పేదవాడు ఒక్కపూటైనా కడుపునిండా తినగల్గుతున్నాడనే సంతృప్తి. కనుకనే “అన్ని దానాల్లోకీ అన్నదానం మిన్న” అనే భావన లోకంలో ఉంది.

దేశంలో ఏ సమస్యనైనా ఒకనాటికి కాకపోతే మరొక నాటికైనా తొలిగించవచ్చునేమో గాని ఆకలి సమస్యను ఎవరూ తీర్చలేడు. ఉన్నవాడు అజీర్తితో బాధపడుతుంటే లేనివాడు ఆకలితో అలమటిస్తున్నాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు “అన్నమో రామచంద్ర” అన్న మాటలు మన చెవులలో మారు మ్రోగుతున్నాయంటే ఆకలి ఎంతగా బాధిస్తుందో కదా ! అందుకే పెద్దలు ఎక్కడ అన్నదానం జరుగుతున్నా దానిలో వారు భాగస్వాములౌతారు. కారణం వారికి అన్నం విలువ, ఆకలి విలువ తెలుసు.

“దానం చేసే అవకాశం దక్కడం మన భాగ్యం అది తెలుసుకోవడం వల్లనే మనం పురోభివృద్ధి చెందుతున్నాం” అని స్వామి వివేకానంద దానమహిమను తెలియజేశారు. “ఆ కొన్నఁగూడెయమృతము” అన్న బద్దెన మాటలు అక్షరసత్యాలు. అన్నదానం తానే స్వయంగా స్వహస్తాలతో చేయడానికి ప్రతి ఒక్కరికీ వీలైనది. మిగతా దానాల్లో ఈ విధానం ఉండకపోవచ్చు. ఆకలిగొన్నవానికి మనం పెట్టె గుప్పెడు అన్నం వాడి గుండె చప్పుళ్ళలో మన పట్ల వాని కృతజ్ఞత వినిపిస్తుంది.

కలియుగ వైకుంఠంగా చెప్పబడే తిరుమలలో నిత్యాన్నదానంలో ఎంతోమంది కడుపునింపు కుంటున్నారు. అట్లాగే జిల్లెళ్ళమూడి అమ్మ ‘అందరిల్లు’లోని అన్నపూర్ణాలయంలోను అన్న వితరణ నిత్యము జరుగుతోంది. “కోటి విద్యలు కూటి కొరకే” అని వినలేదా ! ఎవరెన్ని పనులు చేసినా ఆకలి బాధ తీర్చుకోవడానికే. అందుకే “అన్ని దానాలలోకి అన్నదానమే మిన్న” అని చెప్పవచ్చు.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 42.
పల్లె, నగర / పట్టణ ప్రాంతాలలో ఉండే ఇబ్బందులను వ్యాసంగా రాయండి.
జవాబు:
‘పల్లెటూళ్ళు దేశానికి పట్టుకొమ్మలు’, పల్లెటూర్లు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు, ‘పల్లె తల్లి వంటిది’ – ఇలా పెద్దలు చెప్పిన మాటలు చద్దిమూటలు. బిడ్డల ఆనందమే తల్లికి పరమానందం. పల్లె ప్రజలు ఎండనక, వాననక, పగలనక, రాత్రనక చెమటోడ్చి కష్టపడతారు. ‘రెక్కాడితేగాని డొక్కాడని’ జీవితాలు వాళ్ళవి. పల్లెలు వ్యవసాయంపై ఆధారపడి ఉంటాయి. వ్యవసాయానికి పశువులను ఉపయోగిస్తూ, ఇటు వ్యవసాయం, అటు పశువులను ఒక క్రమపద్ధతిలో పోషించుకుంటూ జీవనం సాగిస్తారు.

ప్రస్తుత కాలంలో మనిషి ఆధునికతకు ఆకర్షితుడై, వ్యవసాయం పనిముట్లు వీడి, యంత్రాలను ఉపయోగిస్తున్నాడు. అలాగే సేంద్రియ ఎరువులు కన్నా రసాయనిక ఎరువులు సత్వర ఫలితం ఇస్తున్నాయని వాటిని వాడి నేలను, శరీరాన్ని గుల్ల చేస్తున్నాడు. నాగరికతకు అలవాటుపడి ‘కష్టేఫలి’ అన్నమాట మరచాడు. పల్లెల్లో సరైన విద్య, వైద్య సదుపాయాలు ఉండవు.

సరైన రవాణా వసతి, కరెంటు ఇత్యాది నిత్యావసర సదుపాయాలు ఉండవు. గ్రామోద్ధరణంటూ పత్రికల్లో రాస్తేనో, ఉపన్యాసాలిస్తేనో పనికాదు. చదువులేని పల్లె ప్రజల కష్టాన్ని దళారులు, మధ్యవర్తులు, స్వార్థపరులు దోచుకుంటున్నారు. ఇవన్నీ పక్కనబెడితే ఆప్యాయతలు, అనుబంధాలు కలగలిపి ప్రశాంత జీవితాన్ని, ప్రకృతి రమణీయతను పల్లెలు ప్రసాదిస్తాయి.

నాగరికత వృద్ధి చెందిన ప్రాంతాలను నగరాలని, పట్టణాలని అంటారు. ఆధునికమైన వస్తు వినియోగంతో విలాసవంతమైన జీవితాలు నగర, పట్టణాల్లో మనకు కానవస్తాయి. సుఖవంతమైన జీవితం గడుపుతున్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు లేకపోయినప్పటికీ పట్న వాసాలలో తెలియని అభద్రతాభావం ఉంటుంది.

మనుష్యుల మధ్య, మనసులలో దూరాలు పెరిగి, స్వార్థపు ఆలోచనలు నిండి, “ఎవరికి వారే యమునా తీరే” అన్నట్లు వారి బ్రతుకులుంటాయి. విద్యా, ఆరోగ్యం ఇలా వివిధాంశాలలో అభివృద్ధి పట్న వాసాలలో ఎక్కువగా ఉంటాయి. పట్నాల్లో ఒక రూపాయి ఒక దమ్మిడీలాగ ఖర్చు పెడతారు. ఉద్యోగాలకై దేవులాట, అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకొంటారు. సంఘం గురించి ఆలోచన చేయరు. నేను బాగుంటే చాలు. ఎవరెలా పోతే నాకెందుకు అనే ఆలోచనలు ఎక్కువమందిలో ఉంటాయి. పక్కవాడి గురించి ఆలోచించే మనసు, సమయం వారికి ఉండదు.

ఇలా భిన్న ధ్రువాల వలె పల్లె, నగర/పట్టణవాస ప్రజలు ప్రక్క ప్రక్కనే ఉన్నా దూరంగా బతుకుతుంటారు.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 43.
నేటి కాలంలో ‘కంప్యూటర్’ మన జీవితంలో ఒక భాగమైంది. అలాంటి కంప్యూటర్ను అభినందిస్తూ ఒక వ్యాసం: వ్రాయండి.
జవాబు:
కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం. కంప్యూటర్లో ‘డేటా’ (Data)ను నిల్వచేయవచ్చు. దాన్ని మళ్ళీ ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. అంతేకాకుండా కంప్యూటర్ చాలా ఖచ్ఛితంగా, త్వరగా ఫలితాన్ని ఇస్తుంది. ఇటువంటి అద్భుత సాధనమైన కంప్యూటర్ను కనిపెట్టినవాడు ఛార్లెస్ బాబ్బేజి.

కంప్యూటర్ గురించి మాట్లాడినప్పుడు మనం తరచుగా హార్డువేర్, సాఫ్ట్వేర్ అనే పదాలను వింటూ ఉంటాం. హార్డువేర్ అంటే కంప్యూటర్ పరికరాలు. సాఫ్ట్వేర్ అంటే కంప్యూటర్ పనిచేయడానికి కావలసిన పద్ధతిని తెలిపేది. కంప్యూటర్లను ఉపయోగించి ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నారు. కూడికలు, తీసివేతలు, గుణకారాలు (హెచ్చవేతలు), భాగహారాలు వంటి లెక్కలు చాలా వేగంగా చేయడానికి కంప్యూటర్ బాగా పనికివస్తుంది.

కంప్యూటర్ల ద్వారా వాతావరణ పరిస్థితిని తెలుసుకోవచ్చు. విమానాలు, బస్సులు, రైళ్ళు మొదలైన వాటి టిక్కెట్ల రిజర్వేషన్లకు కంప్యూటర్లు ఉపయోగిస్తారు. పెద్ద పెద్ద కర్మాగారాల్లో, కార్యాలయాల్లో, బ్యాంకుల్లో ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. విద్యా, వైద్య, వ్యాపార, వ్యవసాయ, సమాచార శాస్త్ర సాంకేతిక రంగాలలో ఈ కంప్యూటర్లు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. కంప్యూటర్ను ఉపయోగించి ఇంటర్ నెట్ అనే సౌకర్యం ద్వారా ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నింటిని మన ఇంట్లోని కంప్యూటర్ ముందు కూర్చొని తెలుసుకోవచ్చు.

అయితే కంప్యూటర్లని వాడటం వల్ల ఉద్యోగాలకు నష్టం వాటిల్లుతుందనీ, నిరుద్యోగ సమస్య పెరుగుతుందనీ కొందరి వాదన. ఇది కొంతవరకు నిజమే. ఆ మాత్రంచేతనే ఆధునిక విజ్ఞానాన్ని త్రోసిరాజనడం న్యాయం కాదు. కాబట్టి భావిభారత పౌరులైన విద్యార్థులు కంప్యూటర్ విద్య ఆవశ్యకతను గుర్తించి తప్పక దాన్ని అభ్యసించాలి.

ప్రశ్న 44.
మీకు నచ్చిన కవిని గురించి మీ స్వంత మాటలలో ఒక వ్యాసం రాయండి.
జవాబు:
డా॥ అందెశ్రీగారు పోతనగారు పుట్టిన వరంగల్లు జిల్లాలోని ‘రేబర్తి’ గ్రామంలో జన్మించారు. ఆయన అతి సాధారణ నిరక్షరాస్య కుటుంబంలో జన్మించారు. ఆయన ప్రత్యేకించి ఏ పాఠశాలలోను, కళాశాలలోను చదువపోయినా, సహజ సాహితీజ్ఞాన సుగంధాన్ని సంపాదించాడు.

డా॥ అందెశ్రీగారు తన పాటలతో సభలలో లక్షలాది ప్రజలను పరవశింపజేశారు. ఆయన ‘వాక్కులమ్మ’ అంటే సరస్వతికి వరపుత్రుడు. ఆయన 1995లో ‘పాటల పూదోట’ అనే లలిత గీతాల సంపుటిని వెలువరించి సాహితీ లోకంలో స్థిరమైన స్థానాన్ని సంపాదించాడు. ఆయన ‘స్వర్ణకంకణ సత్కారాన్ని పొందారు.

డా॥ అందెశ్రీగారు 21 సినిమాలకు అద్భుతమైన పాటలు రాశారు. కేవలం సినిమా కవిగానేకాక, అభిమాన ప్రేక్షక గుండెల్లో నిలిచిన కవిగా సుస్థిర స్థానాన్ని పొందారు.

డా॥ అందెశ్రీగారు వందలాది కవి సమ్మేళనాలలో పాల్గొని, శ్రోతన మెప్పుపొందారు. సింగపూర్, దుబాయి వంటి విదేశాల్లో పర్యటించి, తన కవితా వాణిని అక్కడి తెలుగువారికి వినిపించి, వారి ప్రశంసలు అందుకున్నారు.

TS 10th Class Telugu Grammar వ్యాసాలు

డా॥ అందెశ్రీగారిని కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. విజయవాడ ఆంధ్రా ఆర్ట్స్ వారు ‘జానపద వాగ్గేయబ్రహ్మ’ అనే బిరుదుతో సత్కరించారు. భాగ్యనగర్ కల్చరల్ అసోసియేషన్వారు ‘సహజ కవికోకిల’ అన్న బిరుదుతో సత్కరించారు.

డా॥ అందెశ్రీగారు తెలంగాణ ఉద్యమగీతాన్ని రచించి, తెలంగాణ ప్రాంతంలో ప్రజాకవిగా, ‘అభినవ పోతన’గా ప్రశంసలు పొందారు. వీరు రచించిన ‘మనిషి’ అన్న గేయం వేలాది సభల్లో లక్షలాది ప్రజల మనస్సులను కదిలించింది.