TS Inter 1st Year History Study Material Chapter 1 చరిత్ర, భౌగోళిక పరిస్థితులు

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 1st Lesson చరిత్ర, భౌగోళిక పరిస్థితులు Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 1st Lesson చరిత్ర, భౌగోళిక పరిస్థితులు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశపు భౌగోళిక లక్షణాలను చర్చించండి ?
జవాబు.
చరిత్రకూ భూగోళ విజ్ఞానానికి అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. ఒక దేశ చరిత్రను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ఆ దేశ భౌగోళిక స్వరూపం గురించి తెలుసుకోవడం అవసరం. భారతదేశం భౌగోళిక వైవిధ్యం కలిగిన పురాతన భూభాగం. ఎన్నో నాగరికతలు, సామ్రాజ్యాలు ఈ భూభాగంలో ఏర్పడి, అంతరించిపోయినప్పటికీ, ఒక అవిచ్ఛిన్న సంస్కృతి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. ప్రాచీన కాలంలో భారతదేశాన్ని ‘భరతవర్షం’గా పిలిచేవారు. భరతుని భూమిగా, దేశప్రజలను భరతసంతతిగా అభివర్ణించారు. భారతదేశాన్ని పురాణాల్లో జంబూద్వీపం అనేవారు. ఈ దేశానికి ‘ఇండియా’ అనేది మరొక పేరు. సింధూనది ప్రవహిస్తున్న దేశం కాబట్టి దీన్ని సింధూదేశంగా గ్రీకులు, పారశీకులు వ్యవహరించారు. క్రమంగా ‘సింధు’ పారశీకుల ఉచ్చారణలో ‘హిందు’గా, గ్రీకుల ఉచ్చారణలో ‘ఇండ్’గా మారింది. కాలగమనంలో హిండ్గా, హిందూస్తాన్ గా ఈ దేశం వ్యవహరింపబడింది.

TS Inter 1st Year History Study Material Chapter 1 చరిత్ర, భౌగోళిక పరిస్థితులు

భారత ఉపఖండానికి భౌగోళిక పరిస్థితులు సహజ రక్షణను కల్పిస్తున్నాయి. ఉత్తరాన హిమాలయ పర్వతశ్రేణి, తూర్పువైపు బంగాళాఖాతం, దక్షిణం వైపు హిందూమహాసముద్రం, పడమటివైపు అరేబియా సముద్రం సహజమైన ఎల్లలుగా ఉన్నాయి. దేశంలోని పర్వతాలు, మైదానాలు, పీఠభూములు, తీర ప్రాంతాలు దేశచరిత్ర గతిని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించాయి.

హిమాలయ పర్వత శ్రేణి పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ నుంచి తూర్పున మయన్మార్ (బర్మా) వరకు వ్యాపించి ఉంది. దాదాపు 2400 కి.మీ. పొడవు, 300 కి.మీ ఎత్తులో ఇవి ఉత్తరాన పెట్టని గోడ వలే ఉన్నాయి. వీటి విస్తీర్ణం దాదాపు ఐదు లక్షల చదరపు కిలోమీటర్లు. ఎవరెస్టు లేదా గౌరీశంకర్ (ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం). కాంచనగంగ, దౌళగిరి, నంగప్రభాత్, నందాదేవి లాంటి పర్వతశ్రేణులు హిమాలయాల్లోనే ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత పురాతన పర్వతాలుగా చెప్పబడే ఆరావళి పర్వతాలు దేశంలో వాయవ్య ప్రాంతంలో ఉన్నాయి.

దేశంలోని పీఠభూములను మాళ్వా, ఛోటానాగపూర్, దక్కన్ పీఠభూములుగా వర్గీకరించారు. మాళ్వా పీఠభూమి, దక్కన్ పీఠభూములను వింధ్య, సాత్పూరా పర్వతాలు వేరు చేస్తున్నాయి. దక్కన్ పీఠభూమికి మూడువైపులా సముద్రం ఆవరించి ఉండటం వల్ల ఇది ద్వీపకల్పంగా ఏర్పడింది.

మైదానాల్లో గంగా-సింధూ మైదానాలు ముఖ్యమైనవి. హిమాలయాలనుంచి ప్రవహించే జీవనదులు తీసుకొచ్చిన ఒండ్రుమట్టితో ఈ సారవంతమైన మైదానాలు ఏర్పడ్డాయి. సింధు, గంగ వాటి ఉపనదుల పరీవాహక ప్రాంతాలు ఈ మైదానాల్లో అంతర్భాగాలు. మరోవైపు తూర్పు, పశ్చిమ కనుమల్లో జన్మించే కృష్ణ, గోదావరి లాంటి నదులు, వాటి ఉపనదుల వల్ల దక్షిణ భారతదేశంలో కూడా మైదానాలు ఏర్పడ్డాయి. నదీపరీవాహక ప్రాంతాలతో పాటుగా దేశ వాయువ్య ప్రాంతంలో ఉన్న థార్ ఎడారిని ఒక ప్రత్యేక భౌగోళిక లక్షణంగా చెప్పవచ్చు. ఈ ప్రాంతం భారత, పాకిస్తాన్ దేశాలకు సహజ సరిహద్దుగా ఉంది.

తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన హిందూమహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రాలు భారతదేశానికి చాలా పొడవైన తీర రేఖను ఏర్పరుస్తున్నాయి. ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన దేశాలలో భారత్ ఒకటిగా నిలిచింది. ద్వీపకల్ప పశ్చిమ భాగం వైపు డామన్ నుంచి తిరువనంతపురం వరకు పశ్చిమ కనుమలు(సహ్యాద్రి) వ్యాపించి ఉన్నాయి. ఉత్తర తీరాన్ని కొంకణ తీరమని, దక్షిణాన భాగాన్ని మలబార్ తీరంగా వ్యవహరిస్తున్నారు. పశ్చిమ కనుమలు దాదాపు 1600 కిలోమీటర్ల పొడవు మేర వ్యాపించి ఉన్నాయి. వీటి సరాసరి ఎత్తు 900 నుంచి 1100 మీటర్లు. వీటికి భిన్నంగా తూర్పు కనుమలు అవిచ్ఛిన్నంగా బంగాళాఖాతం వైపు ఉన్నాయి. ఇవి ఒరిస్సాలోని మహేంద్రగిరి (గంజాం జిల్లా) నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు వ్యాపించి ఉన్నాయి. ఈ కనుమలు ఎన్నో చిన్న, పెద్ద నదులకు జన్మస్థానాలుగా ఉన్నాయి.

ప్రశ్న 2.
భారతదేశ చరిత్ర, సంస్కృతిపై భౌగోళిక పరిస్థితుల ప్రభావాన్ని వివరించండి.
జవాబు.
భారత ఉపఖండం భౌగోళిక పరిస్థితుల్లో గొప్ప వైవిధ్యం ఉంది. ఇవి భారతదేశ చరిత్రను ఎంతగానో ప్రభావితం చేశాయి. రాజకీయ సరిహద్దుల్ని, సామాజిక స్థితిగతుల్ని, జాతి విస్తరణను ఈ భౌగోళిక పరిస్థితులే నిర్దేశించాయి. ఉత్తరాన హిమాలయాలు, మిగిలిన మూడువైపులా సముద్రాలు సువిశాల భారతదేశానికి సహజ సరిహద్దులుగా ఉండటంతో ఇది ఒక ప్రత్యేక భౌగోళిక ప్రాంతంగా ఏర్పడింది. ఈ భౌగోళిక పరిధిలో ఉండటం వల్ల తామంతా ఒకటనే భావన, ఇది తమ మాతృదేశమని ప్రజలు భావించారు. భారతీయుల్లో ఐక్యతకు దోహదం చేశాయి. ఇవి భారతీయ సంస్కృతికి ఒక ప్రత్యేక స్వరూపాన్ని ఇవ్వగలిగాయి.

హిమాలయాలు దేశానికి పెట్టని కోటవలె రక్షణ సమకూర్చటమేగాక, ఉత్తర ఆర్కిటిక్ నుంచి వచ్చే అతి శీతల పవనాల తీవ్రత నుంచి దేశానికి రక్షణను కల్పిస్తున్నాయి. హిమాలయాలు లేనట్లయితే, ఉత్తర భారతదేశం ఒక శీతల ఎడారిగా మారి ఉండేది. భారతీయ మత, సారస్వతాల్లో ఈ పర్వతాలు ఒక ప్రత్యేక స్థానాన్ని పొందాయి. కాబట్టి ఇవి జాతీయ పర్వతశ్రేణిగా భారతీయుల మనస్సుల్లో ప్రత్యేక స్థానాన్ని పొందాయి. ఉత్తరాన పెట్టనిగోడ వలే ఉండి విదేశీ దండయాత్రల నుంచి దేశానికి రక్షణ కల్పిస్తున్నాయి. అయితే ఇవి బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా చేయలేదు. కైబర్, బోలాన్ లాంటి కనుమల ద్వారా పశ్చిమ, మధ్య ఆసియా దేశాలతో మనదేశానికి అనేక వేల సంవత్సరాల ద్వారా సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటి ద్వారానే విదేశీ ఆక్రమణదార్లు భారతదేశాన్ని జయించాలని చూశారు. అలెగ్జాండర్ దండయాత్ర దీనికొక ఉదాహరణ. విదేశీయులు వచ్చిన ఈ రహదార్ల ద్వారా వర్తక వ్యాపారాలు జరిగాయి. సాంస్కృతిక మార్పిడికి, ప్రభావాలకు కూడా ఇవి కారణమయ్యాయి. దీనివల్ల రహదార్ల ప్రాముఖ్యత హెచ్చి, ప్రముఖ వర్తక కేంద్రాలు ఏర్పడ్డాయి. ఈ ప్రాంతంలోని వివిధ సంస్కృతులు ఒకటయ్యాయి. భారతీయ, గ్రీకు శిల్పకళల సమ్మేళనంగా ఏర్పడిన గాంధార శిల్పకళలు దీనికి ఉదాహరణగా పేర్కొవచ్చు. ఇది కళాచరిత్ర జగత్తులో ఒక అద్భుతాన్ని సృష్టించగలిగింది.

భారతదేశ చరిత్రను ప్రభావితం చేసిన భౌగోళిక అంశాల్లో గంగా సింధూ మైదానాలు ముఖ్యమైనవి. ఈ ప్రాంతంలో అనేక సంస్కృతులు ఆవిర్భవించాయి. వైదిక, వైదికేతర మతోద్యమాలు, పట్టణీకరణ మూలాలన్నీ కూడా ఈ మైదానాల్లోనే చూడవచ్చు. మౌర్యులు, గుప్తులు లాంటి ఎన్నో సామ్రాజ్యాల విజృంభణకు ఈ ప్రాంతం నిలయమైంది. వ్యవసాయ సంపదకు ఆధారనిలయమైంది. ఈ ప్రాంతంపై ఆధిపత్యం కోసం ఎన్నో యుద్ధాలు జరిగాయి.

ప్రపంచంలోనే అత్యంత పురాతన భూభాగమైన దక్కన్ పీఠభూమి ప్రాక్ చరిత్రకు సంబంధించిన సంస్కృతులకు నిలయం. ఈ ప్రాంతం కూడా ఎన్నో సంస్కృతులకు, సంప్రదాయాలకు, భాషలకు పుట్టినిల్లు. శాతవాహనులు, కాకతీయులు, విజయనగర, బహమనీ లాంటి రాజకీయ శక్తులు ఈ ప్రాంతం నుంచే విజృంభించాయి. ఈ ప్రాంతంలో నిక్షిప్తమైన బంగారు, వజ్రాలు ఇతర అమూల్యమైన సంపదల కోసం అనేక రాజవంశాలు యుద్ధాలు చేశాయి. వింధ్య పర్వతశ్రేణి దక్షిణ, ఉత్తర భారతదేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు ఏర్పడేందుకు కారణమైంది. అందుకే దక్కన్ పీఠభూమి దక్షిణ, ఉత్తర దేశ సంస్కృతుల కలయిక ప్రదేశంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. పశ్చిమ

కనుమలు మహారాష్ట్రులకు సహజ సిద్ధమైన రక్షణ సదుపాయం కలగజేశాయి. పశ్చిమ కనుమల ఉపరితలాలు కోటల నిర్మాణానికి అనుకూలంగా ఉండి మహారాష్ట్రుల విజృంభణకు దోహదం చేశాయి. రాజస్థాన్లోని ఆరావళీ పర్వతాలు రాజపుత్రుల చరిత్రలో ప్రముఖపాత్రను నిర్వహించాయి. ఇవి రాజపుత్రులకు సహజసిద్ధమైన రక్షణ సౌకర్యాలు కలగజేయడమే కాకుండా వారిని వీరులుగా తీర్చిదిద్దాయి.

హిమాలయాల నుంచి ప్రవహించే జీవనదులు వ్యవసాయరంగ సంపద వృద్ధి చెందడానికి, రవాణా సౌకర్యాలు మెరుగుపడడానికి ఉపయోగపడ్డాయి. ఈ నదీ పరీవాహక ప్రాంతాల్లోనే నాగరికతా కేంద్రాలు వికసించాయి. అంతర్గతంగా మహానదులన్నీ సంస్కృతీ, వర్తక వ్యాపారాలు పెంపొందడానికి కారణమైతే, మూడువైపులా ఉన్న మహాసముద్రాలు మనదేశానికి మిగిలిన ప్రపంచంతో సంబంధం ఏర్పడటానికి కారణమయ్యాయి.

భారతదేశ వాతావరణ పరిస్థితుల్లో చాలా తేడాలున్నాయి. భారతదేశ దక్షిణ భాగం ఉష్ణమండలంలోను, ఉత్తర ప్రాంతం సమశీతోష్ణ మండలంలో ఉంది. ఈ ఉష్ణోగ్రతా వ్యత్యాసాలు వర్షపాతాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఉష్ణ వాతావరణం కంటే శీతల, సమశీతోష్ణ వాతావరణంలోనే దేశవాసులు ఎక్కువ సమయం శ్రమించగలుగుతారు. దీని కారణంగానే రాజపుత్రులు, శిక్కులు, మరాఠాలు తమ పరాక్రమాన్ని, ధైర్యసాహసాల్ని చూపగలిగారు.

దేశానికి సుదీర్ఘమైన సముద్రతీరం ఉండటం వల్ల దక్షిణంలో పరిపాలించిన ఆంధ్రులు, కళింగులు, చోళులు మొదలైన వారు ఆగ్నేయాసియా దేశాలతో సముద్రం మీదగా వ్యాపార సంబంధాలు ఏర్పరచుకున్నారు. కంబోడియా, థాయ్లాండ్, జావా, సుమిత్రా, బోర్నియో, బర్మా, నేపాల్ దేశాల్లో భారతీయులు స్థిరనివాసాలేర్పరచుకొని వర్తక వ్యాపారాలను పెంపొందించారు. ఈ విధంగా ఏర్పడిన వ్యాపార సంబంధాలు క్రమంగా భారతీయ సంస్కృతి వ్యాప్తికి తోడ్పడ్డాయి. ఈ విధంగానే బౌద్ధమతం ఆగ్నేయాసియాలో వ్యాపించగలిగింది. అట్లాగే హిందూమతం కూడా విస్తరించింది. సుదీర్ఘమైన తీరప్రాంతం భారతదేశానికి ఉంది కనుకనే పోర్చుగీసు, డచ్చి, ఫ్రెంచి, ఆంగ్లేయ వ్యాపారులు సముద్రం మీదుగా ఈ దేశానికి వచ్చి క్రమంగా తమ వలసలను ఇక్కడ విస్తరించుకోగలిగారు.

TS Inter 1st Year History Study Material Chapter 1 చరిత్ర, భౌగోళిక పరిస్థితులు

ప్రశ్న 3.
భారతదేశ చరిత్ర నిర్మాణంలో సాహిత్య ఆధారాల ప్రాముఖ్యత గురించి రాయండి.
జవాబు.
చారిత్రక ఆధారాలలో సాహిత్య ఆధారాలు ముఖ్యమైనవి. ఇవి సమకాలీన సమాజపు పరిస్థితులను ప్రతిబింబిస్తాయి. సాహిత్య ఆధారాలను స్థూలంగా దేశీయ సాహిత్య ఆధారాలు మరియు విదేశీ సాహిత్య ఆధారాలు అనీ రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.

A) దేశీయ సాహిత్య ఆధారాలు (Native Literary Sources): దేశీయ సాహిత్య ఆధారాలు అంటే అవి ఇక్కడే రూపుదిద్దుకొన్న ఆధారాలని అర్థం. ఈ ఆధారాలు చరిత్ర రచనకు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. ప్రాచీన భారతదేశ సాహిత్యం చాలావరకు మతపరమైన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో బాటుగా లౌకిక రచనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్రాచీన భారత దేశ చరిత్ర పునర్నిర్మాణానికి ఎంతగానో దోహదపడుతున్నాయి.

మతపరమైన సాహిత్యం: ప్రాచీన భారతదేశంలో రచనలన్నీ దాదాపుగా మతపరమైనవి. అయినప్పటికీ వీటిలో చారిత్రక వ్యక్తులు మరియు చారిత్రక సంఘటనల గురించి కూడా రాయబడ్డాయి.

బ్రాహ్మణీక గ్రంథాలు: బ్రాహ్మణీక గ్రంథాలు లేదా వేద సాహిత్యం ప్రాచీన భారతదేశ చరిత్ర పునర్నిర్మాణానికి ముఖ్యమైన ఆధారంగా ఉంది. వీటిని సంస్కృత భాషలో రాశారు. వాటిలో పేర్కొనదగ్గవి వేదాలు, వేదాంగాలు, ఉపవేదాలు, ఉపనిషత్లు, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు. ఈ సాహిత్యం అంతా కూడా నాటి సమాజాన్ని ప్రతిబింబించింది. భారతదేశంలోనే అత్యంత ప్రాచీన సాహిత్యమైన ఋగ్వేదం తొలి ఆర్యుల రాజకీయ, సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులను తెలియచేస్తోంది. మిగిలిన మూడు వేదాలైన యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం మలివేద కాలం నాటి ఆర్యుల జీవన విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఉపనిషత్లు భారతీయ తాత్విక ధోరణుల గురించి వివరిస్తాయి. ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలు మలివేద ఆర్యుల కాలం నాటి రాజ్య విస్తరణ, భౌగోళిక, సాంఘిక, ఆర్థిక మత, పరిస్థితులను తెలియచేస్తాయి. అలాగే అష్టాదశ పురాణాలు కూడా ముఖ్యమైన ఆధారాలుగా పరిగణింపబడుతున్నాయి. వీటిలో మత్స్య, వాయు, భవిష్య, విష్ణు, భాగవత పురాణాలు చారిత్రకంగా ముఖ్యమైనవి. ఈ పురాణాల వల్ల ముఖ్యంగా హర్యంక, శిశునాగ, నంద, మౌర్య, శాతవాహన మొదలగు రాజవంశాల చరిత్ర తెలుసుకోవచ్చు.

బౌద్ధ గ్రంథాలు: ఇవి బౌద్ధుల తాత్విక, మతపరమైన గ్రంథాలు. పాళీ, సంస్కృత, మిశ్రమ సంస్కృత భాషల్లో ఈ గ్రంథాలు ఉన్నాయి.

పాళీ గ్రంథాలు: హీనయాన బౌద్ధం పాళీ గ్రంథాలను అనుసరించింది. బుద్ధుడి జ్ఞాన సముపార్జనానంతరం త్రిపిటకాలు ఏర్పడ్డాయి. అవి: 1. సుత్తపీటకం, 2. వినయపీటకం, 3. అభిదమ్మ పీటకం. ఇవి బౌద్ధమత ధర్మం గురించి, ఆచార వ్యవహారాల గురించి, బౌద్ధతత్వాన్ని గురించి చెబుతాయి.

బౌద్ధ సంస్కృత గ్రంథాలు: మహాయాన బౌద్ధం సంస్కృత గ్రంథాలను అనుసరించినట్లు తెలుస్తున్నది. మహాయానంలో బుద్ధుణ్ణి దేవునిగా కొలిచారు. “వైపుల్య సూత్రం” మహాయాన బౌద్ధానికి ముఖ్య గ్రంథం. “లలిత విస్తరం” బుద్ధుని చరిత్రను, బౌద్ధ ప్రపంచాన్ని తెలియజేస్తుంది. “సధర్మ పుండరీక” మహాయానుల మరో పవిత్ర గ్రంథం.

జైనగ్రంథాలు: జైనుల మత గ్రంథాలు అర్థమాగధి, ప్రాకృత భాషల్లో రాశారు. వీటిని పన్నెండు అంగాలు, పన్నెండు ఉపాంగాలు, పరి ప్రకీర్ణాలు, ఆరు చేదసూత్రాలు, నాలుగు మూల సూత్రాలు, నాలుగు వివిధ రకాలైన గ్రంథాలుగా విభజించారు. పన్నెండు అంగాలు జైన భిక్షువులు ఉపాసించవలసిన విధానాలను, జైనమతి తత్వాన్ని, మత జ్ఞానాన్ని, కథలను, జైన గురువులను, స్వర్గ నరకాల వివరణను తెలియజేస్తున్నాయి.

చారిత్రక గ్రంథాలు (Historical Texts): పాళీభాషలో రచించిన ‘దీపవంశ’, ‘మహావంశలు’ శ్రీలంక చరిత్రను వివరిస్తాయి. భారతదేశంలోని బౌద్ధమత వ్యాప్తిని, శ్రీలంకలోని బౌద్ధమత వ్యాప్తిని ఈ గ్రంథాలు వివరిస్తాయి. ఇవి దక్షిణ భారతదేశ చరిత్రను, రాజకీయ పరిస్థితులను కూడా తెలుపుతాయి. దీపవంశం నాలుగు లేదా ఐదో శతాబ్దిలో విరచితమైనట్లు తెలుస్తున్నది. మహావంశ ఐదో శతాబ్ది చివర్లో మహానాముడు రచించాడు. సంస్కృతంలో వెలువడిన మరొక చారిత్రక గ్రంథం కల్హణుడు రచించిన “రాజతరంగిణి” (క్రీ.శ. 1148). ఇది కాశ్మీర్ దేశ రాజుల వంశావళిని వివరిస్తుంది. దీనిలోని కథల్లో చారిత్రక వాస్తవాలు కూడా ఉన్నాయి.

జీవితచరిత్రలు (Biographies): గురువుల, రాజుల జీవిత చరిత్రలను గురించి రాసిన సాహిత్యం మనకు ప్రాచీన కాలంలో చాలా కనిపిస్తుంది. వాటిలో ముఖ్యమైనవి అశ్వఘోషుడు రచించిన “బుద్ధచరితం”, బాణభట్టు రచించిన “హర్షచరితం”, ప్రాకృతభాషలో ముంజరాజు (వాక్పతి) రచించిన “గౌడవహూ” చాంద్ బర్దాయ్ రచించిన “పృధ్వీరాజ్ సో”. బుద్ధచరితం కనిష్కుని కాలానికి సంబంధించింది. హర్షచరితం హర్షుని చరిత్రను, గౌడవూ కనోజ్ రాజైన యశోవర్మని కాలానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తున్నాయి.

శాస్త్రీయ, సాంకేతిక గ్రంథాలు (Scientific and Technical Books): ఈ గ్రంథాలు ప్రాచీన భారతదేశంలోని శాస్త్ర, సాంకేతిక ప్రగతితో పాటుగా చారిత్రక విషయాలను వివరిస్తాయి. ఆనాటి ప్రపంచంలో భారతదేశం ఖగోళం, గణితం వైద్య రంగాలలో, ఏవిధమైన ప్రగతి సాధించిందనే విషయాన్ని ఇవి తెలియచేస్తాయి. వరాహమిహురుడు రాసిన ‘పంచసిద్ధాంతిక’ భారతీయ ఖగోళ శాస్త్రానికి బైబిల్ లాంటిది. అలాగే ఆర్యభట్టు దశగీతికసూత్ర, సూర్యసిద్ధాంత, రోమక సిద్ధాంత, ఆర్యభట్టీయం అనేవి రచించాడు. చరక సంహిత అనేది వైద్య రంగానికి సంబంధించిన గ్రంథం. సంగం సాహిత్యం: ప్రాచీన భారత చరిత్ర రాయడానికి మరో ముఖ్యమైన ఆధారంగా తమిళంలో విరచితమైన “సంగమ సాహిత్యం”ను చెప్పవచ్చు. సంగం సాహిత్యమనేది తమిళ కవుల సృష్టి. ఈ సాహిత్యం చేర, చోళ, పాండ్య రాజుల వంశావళిని పేర్కొంది. వీటిలో తమిళదేశ సంస్కృతి, సమకాలీన స్థితిగతులు స్పష్టంగా ప్రతిఫలిస్తున్నాయి

B) విదేశీ వాఙ్మయాధారాలు (Foreign Literary Sources): అనాది కాలం నుంచి విదేశీ యాత్రికులు భారతదేశాన్ని సందర్శించి, తమ అనుభవాలను గ్రంథస్తం చేశారు. ఈ విధంగా గ్రీకులు, చైనీయులు, ముస్లింలు, ఐరోపా వారి రచనలు మన దేశానికి సంబంధించిన ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. వీటి సహాయంలో చరిత్రను పునర్నిర్మించవచ్చు.

గ్రీక్ ఆధారాలు: ప్రాచీన భారత చరిత్ర రాయడానికి గ్రీక్ ఆధారాలు చాలా ముఖ్యమైనవి. స్కైలాక్స్ రాసిన “ది అకౌంట్ ఆఫ్ ది జర్ని ఆఫ్ స్కైలాక్స్” మనకు లభించలేదు. హెరోడోటస్ (క్రీ.పూ. 483-430) భారతదేశాన్ని గురించి తన గ్రంథంలో రాశాడు. డేరియస్ ద్వారా వాయవ్య భారతదేశం గురించి తెలుసుకొన్న సమాచారాన్ని హెరోడోటస్ గ్రంథ రూపంలో రాశాడు, ఇది మన చరిత్రకు ఆధారం అయింది.

మెగస్తనీస్ అనే గ్రీస్ దేశస్థుడు సెల్యూకస్ నికేటర్ రాయబారిగా చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి విచ్చేసి, ఆ కాలపు పరిస్థితులను వివరంగా “ఇండికా” అనే గ్రంథంలో రాశాడు. అయితే ఆ గ్రంథం ఇప్పుడు లభ్యం కావడం లేదు. ఆ గ్రంథంలోని కొన్ని ముఖ్యాంశాలను స్ట్రాబో, డియోరస్, ఆరియన్ తమ గ్రంథాల్లో పేర్కొన్నారు. అలాగే టాలమీ రాసిన “భూగోళం” (Ptolemy’s Geography), ఒక అజ్ఞాత రచయిత రాసిన “ది పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియక్ సి” (The Periplus of the Erythraean Sea)లు భారతదేశంలోని తీర ప్రాంతాల గురించి వివరించాయి. చైనా ఆధారాలు: బౌద్ధ పవిత్ర స్థలాలను చూడటానికి, బౌద్ధమత గ్రంథాలను సేకరించడానికి చైనా బౌద్ధబిక్షువులు భారతదేశం వచ్చారు. వారు తమ గ్రంథాల్లో ఆనాటి భారతదేశాన్ని గురించి వివరంగా రాస్తూ, తాము చూసిన సందర్శించిన ప్రదేశాల గురించి వివరంగా తెలిపారు. వారిలో ప్రముఖుడు ఫాహియాన్. అతను ఐదో శతాబ్దంలో “ఫో-కో-కి” (Fa kosuoki) అనే గ్రంథంలో మధ్య ఆసియా గురించి, వాయవ్య భారతదేశం, గంగాలోయ గురించి, శ్రీలంక, జావాలను గురించి వివరంగా రాశాడు. హ్యూయాన్ త్సాంగ్ అనే మరో చైనా దేశస్థుడైన బౌద్ధభిక్షువు హర్షుని కాలంలో భారతదేశానికి వచ్చి, హర్షుడి ఆస్థానాన్ని దర్శించాడు. అతడు “సి-యూ-కి” అనే గ్రంథంలో విశిష్టమైన విలువలు ఉన్న చారిత్రక విషయాలను స్పష్టంగా వివరించాడు. ఇత్సింగ్ (Itsing) అనే మరో యాత్రికుడు ఇండోనేషియా నుంచి సముద్రయానం చేసి భారతదేశాన్ని చేరాడు. సంస్కృత గ్రంథాలు, బౌద్ధుల ఆచార వ్యవహారాల గురించి తన గ్రంథంలో స్పష్టంగా తెలిపాడు.

ముస్లిం ఆధారాలు: మహ్మదీయ చరిత్రకు సంబంధించిన ఆధారాలు క్రీ.శ. 7 లేదా 8 శతాబ్దాల నుంచి లభ్యమవు తున్నాయి. అల్బెరూనీ ఇబ్బతూత, బరౌనీ, అమీర్ ఖుస్రూ, ఫెరిష్టా మొదలైనవారి రచనలు మధ్యయుగ భారతదేశ చరిత్రకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.

ప్రశ్న 4.
ప్రాచీన భారతదేశ చరిత్ర పునర్నిర్మాణానికి పురావస్తు ఆధారాలు ఏవిధంగా దోహదపడతాయో చర్చించండి ?
జవాబు.
ప్రాచీన కాలపు అవశేషాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పురాతత్త్వశాస్త్రం అని అంటారు. ఇది ప్రాచీన భారతదేశ చరిత్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోంది. తవ్వకాలు, అన్వేషణలో లభించిన శిథిలాలు, అవశేషాలు, కట్టడాలు (వాస్తు), శిల్పాలు, చిత్రాలు, శాసనాలు, నాణేలు, మట్టి పాత్రలను పురావస్తు ఆధారాలుగా పేర్కొంటారు.
భారతదేశంలో పురావస్తు పరిశోధనకు, జాతీయ స్మారక భవనాల పరిరక్షణకు, సంరక్షణకు భారత పురావస్తు శాఖ (ASI) బాధ్యత వహిస్తుంది.

భౌతిక అవశేషాలు (Material remains): భౌతిక అవశేషాలలో భాగంగా వివిధ రకాలైన మానవ, జంతు అవశేషాలు, రాతి, ఎముక పరికరాలు, ఇనుము, మృణ్యయ పాత్రలు, భవన శిధిలాలు ఉంటాయి. సింధులోయ, నర్మదాలోయ, కృష్ణ, గోదావరి తీరప్రాంతాల్లో, మధ్య భారతదేశంలోని జొహల్ పూర్, బళ్ళారి, ఛోటానాగపూర్, అస్సాం, పాండిచ్చేరి, పరిసర ప్రాంతాల్లో వీటిని కనుక్కోగలిగారు. ఇవి భారతదేశ ప్రాక్ చరిత్ర పునర్నిర్మాణానికి దోహదం చేశాయి.

కట్టడాలు (Monuments): భారతదేశం ప్రాచీనకాలం నుంచి వాస్తు సంపదకు పెట్టింది పేరు. దీన్ని హిందూ, బౌద్ధ, జైనఇండో-ఇస్లామిక్, ఆధునిక వాస్తుగా పేర్కోవచ్చు. ఈ కట్టడాలు ప్రాచీన, మధ్య, ఆధునిక కాలాలకు సంబంధించినవి. ఉపయోగించిన విధానాన్ని బట్టి వాస్తును మతపరమైన, లౌకికమైన వాస్తుగా కూడా గుర్తించవచ్చు. (Religious and Secular Architecture) ఇందుకు ముఖ్య కారణం వీటిని నిర్మించిన విధానాలే. ఇవి కూడా ఆ కాలపరిస్థితుల ప్రతిబింబాలే. వీటిని క్షుణ్ణంగా పరీక్షిస్తే వాటి లక్షణాలను బట్టి అవి ఏకాలానికి చెందినవో మనకు తెలుస్తుంది.

శిల్పాలు (Sculptures): సింధులోయ నాగరికత కాలం నుంచి నేటి వరకు, మనకు అనేక రకాలైన శిల్పాలు లభ్యమయ్యాయి. వీటిని వివిధ రకాలైన పదార్థాలతో తయారుచేశారు. శిల్పాల తయారీ విధానం, లక్షణాలు, ఆకాల పరిస్థితులను ప్రతిబింబిస్తాయి.

చిత్రాలు (Paintings): మొదటి నుంచి భారతదేశంలో చిత్రకళ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రాక్ చరిత్రకు సంబంధించిన ప్రాక్ చారిత్రక చిత్రాలు (Pre-Historic Paintings) మనకు లభించాయి. అలాగే, క్రీ.పూ. రెండో శతాబ్దం నుంచి నేటివరకు, అనేక ప్రదేశాల్లో కుడ్య చిత్రాలు, లఘుచిత్రాలు, వస్త్రంపై చిత్రాలు (Canvas paintings) మొదలైనవి లభ్యమయ్యాయి.

మట్టిపాత్రలు: మట్టిపాత్రలు కూడా తవ్వకాల్లో సింధులోయ నాగరికత నుంచి నేటి వరకు లభ్యమౌతున్నాయి. వీటిని అనేక రకాల మట్టితో చేసినట్లు తెలుస్తున్నది. కాల్చని మట్టి పాత్రలతోపాటు కాల్చిన మట్టి పాత్రలు కూడా తవ్వకాల్లో లభించాయి. వీటిపై మెరుగులు (Polish) పెట్టేవారు. కొన్ని రకాలైన మట్టిపాత్రల పై బొమ్మలను కూడా చిత్రించారు. వీటిలో కొన్నింటిమీద విదేశీ ప్రభావం కూడా కనిపిస్తున్నది. దీనికి నాగార్జున కొండ, పాండిచ్చేరిలో దొరికిన మట్టిపాత్రలే నిదర్శనం. భారతదేశంలో లభ్యమైన మట్టి పాత్రలు అనేక రూపాల్లో, పరిమాణాల్లో (చిన్న, పెద్ద) ఉన్నాయి. ఇలాగే రకరకాలైన మట్టి పూసలు అనేక రంగుల్లో, పరిమాణాల్లో లభించాయి. వీటివల్ల ఆ కాలంలో అలంకరణకు ఉన్న ప్రాముఖ్యం అర్థమౌతుంది.

శాసనాలు (Inscriptions): పురావస్తు ఆధారాల్లో అత్యంత విశ్వసనీయమైనవి మరియు ముఖ్యమైనవి శాసనాలు. ఇవి చరిత్రకు సంబంధించిన వాస్తవాలను అందిస్తాయి. శాసనాల అధ్యయనాన్ని ఎపిగ్రఫీ అని అంటారు. శాసనాలను రాళ్లపైన, స్తంభాలపైన, భవనాల గోడలపైన, దేవాలయ గోడలపైనా గమనించవచ్చు. ఇవే కాకుండా ముద్రికలపైనా, రాగి రేకులపైనా (తామ్ర శాసనాలు) కూడా శాసనాలను లిఖించడం జరుగుతుంది. వివిధ ప్రయోజనాల కోసం శాసనాలు రాయబడుతాయి. శాసనాల్లో తెలిపిన సమాచారం ఆధారంగా వాటిని వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. కొన్ని శాసనాలు వంశ వృక్షాలను, రాజ ఉత్తర్వులను, రాజులు సాధించిన ఘనతను, వారి దిగ్విజయాలను (ప్రశస్తి), మతపరంగా ఇచ్చిన దాన విశేషాలను తెలియచేస్తాయి. భారతదేశంలో సంస్కృతం, పాళీ, తమిళం, కన్నడం, తెలుగు మొదలైన వివిధ భాషల్లో శాసనాలు లభించాయి. అలాగే పురాతన లిపులైన ఖరోష్టి, బ్రహ్మీల్లో రాయబడిన శాసనాలు కూడా లభించాయి. వీటిలో కనిపించే భాషాశైలి, విషయాలు, మనకు ఆ కాలపు పరిస్థితులను స్పష్టంగా తెలియజేస్తాయి.

భారతదేశంలో మొదటిసారిగా అధికసంఖ్యలో లభ్యమైన శాసనాలు అశోకునివి. అతడు చక్రవర్తి అయినప్పటినుంచి వేయించిన రాతి శాసనాలు నేటి వరకు కూడా పదిలంగా ఉన్నాయి.

తాళపత్ర గ్రంథాలు కూడా చరిత్ర నిర్మాణానికి తోడ్పడతాయి. గుజరాత్లోని జైనతాళపత్ర గ్రంథాల్లో చిత్రాలను కూడా గీశారు. అలాగే మొగలుల కాలానికి చెందిన “అక్బర్ నామా” “బాబర్ నామా”లు గుడ్డపై రాసినవి. ముస్లిమ్ రాజులు కూడా అనేక శాసనాలను వేయించారు. ఈ విధంగా వంశ చరిత్రలను, రాజకీయ, పరిపాలన, సామాజిక, ఆర్థిక, మత విషయాలను శాసనాలు తెలియజేస్తున్నాయి.

నాణేలు (Coins): చారిత్రక ఆధారాల్లో నాణేలు ముఖ్యమైనవి. నాణేలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘న్యూమిస్మాటిక్స్’ అని అంటారు. నాణేలను భూమిలోనుంచి తవ్వకాల ద్వారా కానీ భూఉపరితలం పైనుంచి కానీ సేకరిస్తారు. నాణేలను సాధారణంగా బంగారు, వెండి, కంచు, మిశ్రమ లోహాలతో తయారుచేస్తారు. నాణేలపై అనేక రకాలైన బొమ్మలు, దేవతాప్రతిమలు, రాజుల ప్రతిమలు, వారి పేర్లు, తేదీలను కూడా ముద్రించేవారు. అవి దొరికిన ప్రదేశాన్ని ‘ బట్టి, అవి చలామణీలో ఉన్న ప్రాంతంను, పరోక్షంగా ఆ రాజ్య సరిహద్దులను కూడా సూచిస్తాయి. అవి ఏ కాలానికి చెందినవో, ఏ రాజువో అవి దొరికిన ప్రదేశాన్ని బట్టి కూడా చెప్పవచ్చు. నాణేల ముద్రణలో, వాటిపై ముద్రించిన భాష, లిపి, ప్రతిమల విషయంలో ప్రతి రాజవంశం కూడా తనదైన శైలిని అనుసరించింది. ప్రజల ఆర్థిక స్థితిగతులను తెలియచేయడంలో కూడా నాణేల ప్రాధాన్యత ఉంది. వ్యాపార, వాణిజ్య విషయాలను తెలియచేస్తూ, అనేక రాజవంశాల చరిత్రను పునర్నిర్మించడానికి నాణేలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇవే కాకుండా ఇతర ఎన్నో చారిత్రక విషయాలను వెలుగులోకి తేవడంలో నాణేలు ముఖ్యమైన పాత్ర పోషించాయి.

TS Inter 1st Year History Study Material Chapter 1 చరిత్ర, భౌగోళిక పరిస్థితులు 1
మొత్తం మీద నాణేల ద్వారా ఆ కాలంనాటి రాజకీయ, ఆర్థిక సామాజిక మరియు మత పరిస్థితులను తెలుసుకోవచ్చు.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న1.
చరిత్ర ప్రాముఖ్యతను గురించి రాయండి.
జవాబు.
చరిత్ర సామాజిక శాస్త్రాలకు తల్లి లాంటిది. చరిత్ర అంటే రాజ్యాలు, రాజవంశాలకు చెందిన సంఘటనలు, తేదీల వర్ణన మాత్రమేకాదు. అంతకన్నా సమాజం, మానవ పరిణామ క్రమాన్ని తీర్చిదిద్దిన అన్నీ అంశాలను సమగ్రంగా వివరించేదే చరిత్ర. దీని అధ్యయనం అంటే లక్షల సంవత్సరాల మానవుల గత చిహ్నాలను తెలుసుకోవడమే. ప్రజలు ఎక్కడ, ఎప్పుడు, ఏవిధంగా తమ సంస్కృతులను అభివృద్ధి పరచుకున్నారనే విషయాన్ని చరిత్ర తెలియచేస్తుంది. అనేక కారణాల దృష్ట్యా చరిత్ర అధ్యయనం అనేది ప్రాముఖ్యత కలిగిన అంశంగా చెప్పవచ్చు. ప్రస్తుత మన సాంస్కృతిక మూలాలను చరిత్ర తెలియచేస్తుంది. ఆలోచించడం, అర్థం చేసుకోవడం, పరిశోధనా వైఖరిని అలవరుచుకోవడం లాంటి జీవన నైపుణ్యాలను చరిత్ర మనకు అందిస్తుంది.

TS Inter 1st Year History Study Material Chapter 1 చరిత్ర, భౌగోళిక పరిస్థితులు

ప్రశ్న 2.
భారతదేశ భౌగోళిక లక్షణాలు.
జవాబు.
ప్రాచీన కాలంలో భారతదేశాన్ని ‘భరతవర్షం’గా పిలిచేవారు. భరతుని భూమిగా, దేశప్రజలను భరతసంతతిగా అభివర్ణించారు. భారతదేశాన్ని పురాణాల్లో జంబూద్వీపం అనేవారు. ఈ దేశానికి ‘ఇండియా’ అనేది మరొక పేరు.

సింధూనది ప్రవహిస్తున్న దేశం కాబట్టి దీన్ని సింధూదేశంగా గ్రీకులు, పారశీకులు వ్యవహరించారు. క్రమంగా ‘సింధు’ పారశీకుల ఉచ్చారణలో ‘హిందు’గా, గ్రీకుల ఉచ్చారణలో ‘ఇండ్’గా మారింది. కాలగమనంలో హిందా, హిందూస్తాన్ ఈ దేశం వ్యవహరింపబడింది.

భారత ఉపఖండానికి భౌగోళిక పరిస్థితులు సహజ రక్షణను కల్పిస్తున్నాయి. ఉత్తరాన హిమాలయ పర్వతశ్రేణికి, తూర్పువైపు బంగాళాఖాతం, దక్షిణం వైపు హిందూమహాసముద్రం, పడమటివైపు అరేబియా సముద్రం సహజమైన ఎల్లలుగా ఉన్నాయి. దేశంలోని పర్వతాలు, మైదానాలు, పీఠభూములు, తీర ప్రాంతాలు దేశచరిత్ర గతిని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించాయి.

ప్రశ్న3.
బ్రాహ్మణీక గ్రంథాలు.
జవాబు.
బ్రాహ్మణీక గ్రంథాలు లేదా వేద సాహిత్యం ప్రాచీన భారతదేశ చరిత్ర పునర్నిర్మాణానికి ముఖ్యమైన ఆధారంగా ఉంది. వీటిని సంస్కృత భాషలో రాశారు. వాటిలో పేర్కొనదగ్గవి వేదాలు, వేదాంగాలు, ఉపవేదాలు, ఉపనిషత్లు, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు. ఈ సాహిత్యం అంతా కూడా నాటి సమాజాన్ని ప్రతిబింబించింది. భారతదేశంలోనే అత్యంత ప్రాచీన సాహిత్యమైన ‘ఋగ్వేదం తొలి ఆర్యుల రాజకీయ, సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులను తెలియచేస్తోంది. మిగిలిన మూడు వేదాలైన యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం, మలివేద కాలం నాటి ఆర్యుల జీవన విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఉపనిషత్లు భారతీయ తాత్విక ధోరణుల గురించి వివరిస్తాయి. ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలు మలివేద ఆర్యుల కాలం నాటి రాజ్య విస్తరణ, భౌగోళిక, సాంఘిక, ఆర్థిక మత, పరిస్థితులను తెలియచేస్తాయి. అలాగే అష్టాదశ పురాణాలు కూడా ముఖ్యమైన ఆధారాలుగా పరిగణింపబడుతున్నాయి. వీటిలో మత్స్య, వాయు, భవిష్య, విష్ణు, భాగవత పురాణాలు చారిత్రకంగా ముఖ్యమైనవి. ఈ పురాణాల వల్ల ముఖ్యంగా హర్యంక, శిశునాగ, నంద, మౌర్య, శాతవాహన మొదలగు రాజవంశాల చరిత్ర తెలుసుకోవచ్చు.

ప్రశ్న4.
బౌద్ధ సాహిత్యం.
జవాబు.
బౌద్ధగ్రంథాలు: ఇవి బౌద్ధుల తాత్విక, మతపరమైన గ్రంథాలు. పాళీ, సంస్కృత, మిశ్రమ సంస్కృత భాషల్లో ఈ గ్రంథాలు ఉన్నాయి.
పాళీ గ్రంథాలు: హీనయాన బౌద్ధం పాళీ గ్రంథాలను అనుసరించింది. బుద్దుడి జ్ఞాన సముపార్జనానంతరం త్రిపిటకాలు ఏర్పడ్డాయి. అవి: 1. సుత్తపీటకం, 2. వినయపీటకం, 3. అభిదమ్మ పీటకం. ఇవి బౌద్ధమత ధర్మం గురించి, ఆచార వ్యవహారాల గురించి, బౌద్ధతత్వాన్ని గురించి చెబుతాయి.

సంస్కృత గ్రంథాలు: మహాయాన బౌద్ధం సంస్కృత గ్రంథాలను అనుసరించినట్లు తెలుస్తున్నది. మహాయానంలో బుద్ధుణ్ణి దేవునిగా కొలిచారు. “వైపుల్య సూత్రం” మహాయాన బౌద్ధానికి ముఖ్య గ్రంథం. “లలిత విస్తరం” బుద్ధుని చరిత్రను, బౌద్ధ ప్రపంచాన్ని తెలియజేస్తుంది. “సద్ధర్మ పుండరీక” మహాయానుల మరో పవిత్ర గ్రంథం.

ప్రశ్న5.
జైన సాహిత్యం.
జవాబు.
జైనుల మత గ్రంథాలు అర్థమాగధీ, ప్రాకృత భాషల్లో రాశారు. వీటిని పన్నెండు అంగాలు, పన్నెండు ఉపాంగాలు, పరి ప్రకీర్ణాలు, ఆరు చేదసూత్రాలు, నాలుగు మూల సూత్రాలు, నాలుగు వివిధ రకాలైన గ్రంథాలుగా విభజించారు. పన్నెండు అంగాలు జైన భిక్షువులు ఉపాసించవలసిన విధానాలను, జైనమతి తత్వాన్ని, మత జ్ఞానాన్ని, కథలను, జైన గురువులను, స్వర్గ నరకాల వివరణను తెలియజేస్తున్నాయి.

ప్రశ్న6.
సంగం సాహిత్యం.
జవాబు.
ప్రాచీన భారత చరిత్ర రాయడానికి మరో ముఖ్యమైన ఆధారంగా తమిళంలో విరచితమైన “సంగమ సాహిత్యం”ను చెప్పవచ్చు. సంగం సాహిత్యమనేది తమిళ కవుల సృష్టి. ఈ సాహిత్యం చేర, చోళ, పాండ్య రాజుల వంశావళిని పేర్కొంది. వీటిలో తమిళదేశ సంస్కృతి, సమకాలీన స్థితిగతులు స్పష్టంగా ప్రతిఫలిస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనవి “కురల్”, “శిలప్పాధికారం”, “ఎట్టుతోగై”, “పట్టుపట్టు”, “పదినెన్ కిల్ కణక్కు మొదలైనవి. ఇవి క్రీ.శ నాలుగో శతాబ్దం వరకు గల విషయాలను అందిస్తున్నాయి.

TS Inter 1st Year History Study Material Chapter 1 చరిత్ర, భౌగోళిక పరిస్థితులు

ప్రశ్న7.
గ్రీకు రచనలు.
జవాబు.
ప్రాచీన భారత చరిత్ర రాయడానికి గ్రీక్ ఆధారాలు చాలా ముఖ్యమైనవి. స్కైలాక్స్ రాసిన “ది అకౌంట్ ఆఫ్ ది జర్ని ఆఫ్ స్కైలాక్స్” మనకు లభించలేదు. హెరోడోటస్ (క్రీ.పూ. 483-430) భారతదేశాన్ని గురించి తన గ్రంథంలో. రాశాడు. డేరియస్ ద్వారా వాయవ్య భారతదేశం గురించి తెలుసుకొన్న సమాచారాన్ని హెరోడోటస్ గ్రంథ రూపంలో
రాశాడు, ఇది మన చరిత్రకు ఆధారం అయింది.

మెగస్తనీస్ అనే గ్రీస్ దేశస్థుడు ‘సెల్యూకస్ నికేటర్ రాయబారిగా చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి విచ్చేసి, ఆ కాలపు పరిస్థితులను వివరంగా “ఇండికా” అనే గ్రంథంలో రాశాడు. అయితే ఆ గ్రంథం ఇప్పుడు లభ్యం కావడం లేదు. ఆ గ్రంథంలోని కొన్ని ముఖ్యాంశాలను స్ట్రాబో, డియోరస్, ఆరియన్ తమ గ్రంథాల్లో పేర్కొన్నారు. అలాగే టాలమీ రాసిన “భూగోళం” (Ptolemy’s Geography), ఒక అజ్ఞాత రచయిత రాసిన “ది పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సి” (The Periplus of the Erythraean Sea) లు భారతదేశంలోని తీర ప్రాంతాల గురించి వివరించాయి. టాలమీ గ్రంథం ద్వారా భారతదేశంలోని నౌకాశ్రయాలు మరియు రేవు పట్టణాల సమాచారం లభ్యమవుతోంది. అయితే గ్రీకులకు ఇక్కడి భాషా, సంప్రదాయాలపై పూర్తి అవగాహన లేకపోవడం వల్ల వారి రచనల్లో కొన్ని అవాస్తవాలు, వివాదాస్పదాంశాలు చోటుచేసుకొన్నాయి.

ప్రశ్న 8.
చైనా రచనలు.
జవాబు.
బౌద్ధ పవిత్ర స్థలాలను చూడటానికి, బౌద్ధమత గ్రంథాలను సేకరించడానికి చైనా బౌద్ధబిక్షువులు భారతదేశం వచ్చారు. వారు తమ గ్రంథాల్లో ఆనాటి భారతదేశాన్ని గురించి వివరంగా రాస్తూ, తాము చూసిన సందర్శించిన ప్రదేశాల గురించి వివరంగా తెలిపారు. వారిలో ప్రముఖుడు. ఫాహియాన్. అతను ఐదో శతాబ్దంలో “ఫో-కో-కి” (Fa kosuoki) అనే గ్రంథంలో మధ్య ఆసియా గురించి, వాయవ్య భారతదేశం, గంగాలోయ గురించి, శ్రీలంక, జావాలను గురించి వివరంగా రాశాడు. హ్యూయాన్ త్సాంగ్ అనే మరో చైనా దేశస్థుడైన బౌద్ధభిక్షువు హర్షుని కాలంలో భారతదేశానికి వచ్చి, హర్షుడి ఆస్థానాన్ని దర్శించాడు. అతడు “సి-యూ-కి” అనే గ్రంథంలో విశిష్టమైన విలువలు ఉన్న చారిత్రక విషయాలను స్పష్టంగా వివరించాడు. ఇత్సింగ్ (Itsing) అనే మరో యాత్రికుడు ఇండోనేషియా నుంచి సముద్రయానం చేసి భారతదేశాన్ని చేరాడు. సంస్కృత గ్రంథాలు, బౌద్ధుల ఆచార వ్యవహారాల గురించి తన గ్రంథంలో స్పష్టంగా తెలిపాడు.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
చరిత్ర రచనాశాస్త్రం.
జవాబు.
చరిత్ర రచన గురించి తెలిపే శాస్త్రమే చరిత్ర రచనా శాస్త్రం. అంటే ఇది చారిత్రక ఆలోచనల చరిత్ర. చరిత్ర ఏ విధంగా రాయబడింది అనే విషయాన్ని తెలియజేస్తుంది. చరిత్రకారుడు యదార్థ సంఘటనలను ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ద్వారా విషయనిష్ఠత సాధించవలెను.

ప్రశ్న 2.
చరిత్ర పరిధి.
జవాబు.
క్రీ.శ. 18వ శతాబ్దం ప్రారంభం వరకు గత సంఘటనలను వివరించేందుకే చరిత్ర పరిమితమై ఉండేది. అయితే నేడు కాలం, ప్రాంతాలను ఆధారంగా చేసుకొని మానవుని కార్యక్రమాలను అధ్యయనం చేయడం వల్ల చరిత్ర పరిధి విస్తృతమైంది. మానవ ఆవిర్భావం నుంచి నేటి దాకా దీని పరిధి విస్తరించి ఉంది. యుద్ధాలు, విప్లవాలు, సామ్రాజ్య ఔన్నత్య పతనాలు, చక్రవర్తుల అదృష్ట దురదృష్టాలు, సామాజిక వ్యవస్థ పరిణామం, సామాన్యుల జీవితాలు చరిత్రకు ప్రధాన విషయాలు. చరిత్ర అన్ని విజ్ఞాన శాస్త్రాలు, పాఠ్యాంశాలను కలుపుకొని ఉన్న చరిత్ర పరిధికి హద్దులు నిర్దేశించలేం.

ప్రశ్న 3.
హిమాలయాలు.
జవాబు.
హిమాలయ పర్వత శ్రేణి పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ నుంచి తూర్పున మయన్మార్ (బర్మా) వరకు వ్యాపించి ఉంది. దాదాపు 2400 కి.మీ. పొడవు, 300 కి.మీ ఎత్తులో ఇవి ఉత్తరాన పెట్టని గోడ వలే ఉన్నాయి. వీటి విస్తీర్ణం దాదాపు ఐదు లక్షల చదరపు కిలోమీటర్లు. ఎవరెస్టు లేదా గౌరీశంకర్ (ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం). కాంచనగంగ, దౌళగిరి, నంగప్రభాత్, నందాదేవి లాంటి పర్వతశ్రేణులు హిమాలయాల్లోనే ఉన్నాయి.

ప్రశ్న 4.
ఎపిగ్రఫి.
జవాబు.
పురావస్తు ఆధారాల్లో అత్యంత విశ్వసనీయమైనవి మరియు ముఖ్యమైనవి శాసనాలు. ఇవి చరిత్రకు సంబంధించిన వాస్తవాలను అందిస్తాయి. శాసనాల అధ్యయనాన్ని ఎపిగ్రఫీ అని అంటారు. శాసనాలను రాళ్లపైన, స్తంభాలపైన, భవనాల గోడలపైన, దేవాలయ గోడలపైనా గమనించవచ్చు. ఇవే కాకుండా ముద్రికలపైనా, రాగి రేకులపైనా (తామ్ర శాసనాలు) కూడా శాసనాలను లిఖించడం జరుగుతుంది.

ప్రశ్న 5.
భారత పురావస్తుశాఖ.
జవాబు.
ప్రాచీన కాలపు అవశేషాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పురాతత్త్వశాస్త్రం అని అంటారు. ఇది ప్రాచీన భారతదేశ చరిత్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోంది. తవ్వకాలు, అన్వేషణలో లభించిన శిథిలాలు, అవశేషాలు, కట్టడాలు(వాస్తు), శిల్పాలు, చిత్రాలు, శాసనాలు, నాణేలు, మట్టి పాత్రలను పురావస్తు ఆధారాలుగా పేర్కొంటారు. భారతదేశంలో పురావస్తు పరిశోధనకు, జాతీయ స్మారక భవనాల పరిరక్షణకు, సంరక్షణకు భారత పురావస్తు శాఖ (ASI) బాధ్యత వహిస్తుంది.

ప్రశ్న 6.
న్యూమిస్ మాటిక్స్.
జవాబు.
చారిత్రక ఆధారాల్లో నాణేలు ముఖ్యమైనవి. నాణేలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘న్యూమిస్మాటిక్స్’ అని అంటారు. నాణేలను భూమిలోనుంచి తవ్వకాల ద్వారా కానీ భూఉపరితలం పైనుంచి కానీ సేకరిస్తారు. నాణేలను సాధారణంగా బంగారు, వెండి, కంచు, మిశ్రమ లోహాలతో తయారుచేస్తారు.

TS Inter 1st Year History Study Material Chapter 1 చరిత్ర, భౌగోళిక పరిస్థితులు

ప్రశ్న 7.
జీవితచరిత్రలు.
జవాబు.
గురువుల, రాజుల జీవిత చరిత్రలను గురించి రాసిన సాహిత్యం మనకు ప్రాచీన కాలంలో చాలా కనిపిస్తుంది. వాటిలో ముఖ్యమైనవి అశ్వఘోషుడు రచించిన “బుద్ధచరితం”, బాణభట్టు రచించిన “హర్షచరితం”, ప్రాకృతభాషలో ముంజరాజు (వాక్పతి) రచించిన “గౌడవ హెూ”, చాంద్బర్దాయ్ రచించిన “పృధ్వీరాజ్ సో”. బుద్ధచరితం కనిష్కుని కాలానికి సంబంధించింది. హర్షచరితం హర్షుని చరిత్రను, గౌడవ హెూ కనోజ్ రాజైన యశోవర్మని కాలానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తున్నాయి.

TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material 4th Poem దుందుభి Textbook Questions and Answers.

TS Inter 2nd Year Telugu Study Material 4th Poem దుందుభి

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
‘దుందుభి’ ప్రవాహ దృశ్యాలను వివరించండి. (V.Imp)
జవాబు:
దుందుభి ప్రవాహ దృశ్యాలను గంగాపురం హనుమచ్ఛర్మ మనోహరంగా వర్ణించాడు. తొలకరి వాన కురవగానే పెద్ద అలలతో స్నేహం చేసి, గట్లతో యుద్ధంచేసి వాటిని తాకుతూ ప్రవహిస్తుంది. గ్రామాల్లోని భూముల బాధ పోగొట్టడానికి వచ్చి, కోరికలు తీర్చే విధంగా పైరు పంటలతో మనసులను ‘ఆనందపరిచి, గోదావరి కృష్ణా నదులు అందడం లేదనే బాధను తీర్చి ప్రసిద్ధి పొందింది.

తలచుకోగానే హృదయమనే వీణ తెగలపై ఝం అనే ధ్వనులు చేస్తూ, కదలగానే అమాయకత్వము నీరుగా మారి, రాళ్లు కరిగి, హృదయంలో కీర్తించే భర్తపై ప్రేమలు గిలిగింతలు పెడుతుంటే ఆగకుండా వస్తున్నది.

దుందుభి అధికమైన కరుణతో పేదల వైపు నిలిచి, ధనమే ప్రధానమని భావించే గుణాన్ని అసహ్యించుకుంటూ, జనుమును తుంగ గడ్డిని, చాలా పొడుగ్గా పెంచి, వారు నివసించడానికి గుడిసెలను కట్టిచ్చి, తాగడానికి మంచి నీటిని ఇచ్చినందుకు కలిగిన సంతోషంతో గంతులు వేస్తున్నది.

రాయిని ఉలితో మలచి, మూసలో కరిగించి పోసిన చిత్రాల లాగా, స్వేచ్ఛగా కల్పించిన ఆకారాలకు రూపం ఇచ్చి చూసిన ప్రజలకును ఆనందపరచి, పేరుకూడా ఆశించని శిల్పకులంలోని గొప్పవారి చేతి నైపుణ్యం లాగ ఆనందింప చేయడానికి ప్రతీ వర్షాకాలంలో ప్రవహిస్తుంది.

కత్తిని, కలాన్ని సమానంగా ఉపయోగించి కావ్యాలలోను, ప్రవృత్తిలోను రౌద్ర రసాలను కోరేవారికి ఆనందాన్ని కలిగించేలా చేసిన కళాకారుడైన వీరుడు గోన బుద్ధారెడ్డి నీస్నేహం కారణంగా అపూర్వమైన చరిత్ర రంగనాథ రామాయణాన్ని రచించాడు. అటువంటి సుకుమారమైన నీ శరీరంలో వరదల సమయంలో కఠినత్వాన్ని పెంచుకుని ప్రవహిస్తుంది.

తెలియని సమయంలో కూడా శైవానికి, వైష్ణవానికి సంబంధించిన అంశాలపై నీ మనస్సులో అనాసక్తత లేదు. మంచి తులసి చెట్ల వరుసలతో, మారేడు వృక్షాల సమూహాలతో నీ రెండు తీరాలను నింపి ఉంచుతూ, తిక్కన కలము చెప్పిన హరి హరాద్వైత తత్వాన్ని తెలుసుకొని సంపన్నురాలవై ప్రవహిస్తున్నది. అందంగా ప్రవహించే ఓ దుందుభి వినసొంపైన చిన్న మాటలతో అందంగా రంగులు వేసినట్లున్న రెక్కలు ప్రకాశిస్తుండగా, గర్వంతో మంచి శకునాలను చూపించి, మా పొలాలలో కొత్తగా పండిన పంట గింజలతో ఆకలిని తీర్చుకుంటున్న పాలపిట్టల జంటలను చూస్తూ హడావిడిగా ముందుకు సాగిపోతున్నది.

హైదరాబాదుకు అతి సమీపంలో జన్మించి, మహబూబ్ నగర్ జిల్లాలో ఆనకట్టచే బంధించబడి, నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతంలోని భూములలో పంటలు పండించి, ఇంకా ముందుకు అలాఅలా ప్రవహించి, పలనాటి బ్రహ్మనాయుడు పాలించిన ప్రాంతంలో పారి కృష్ణానదికి అతి దగ్గరలో ఏలేశ్వర స్వామి పూజలు చేసి అక్కడి భక్తులకు ఆచార్య నాగార్జునుని కీర్తిని చెప్పి చరిత్ర రాయడానికి వెలుగు బాటలు చూపి, ఇక్ష్వాకులు పరిపాలించిన విజయపురాన్ని చేరి, ఆచార్య నాగార్జునున్ని చూసి ధన్యతను పొంది, తెలుగు నేలను పైరు పంటలతో నింపి, శాశ్వతంగా తెలుగు బిడ్డలకు నీ ఆశిస్సులనే అక్షతలను, మంచి నడవడిని అందించి, ఈ లోకంలో, లోకంలో అన్ని కోరికలను తీర్చి మమ్మల్ని పెంచే తల్లిగా మాకు పాలవెల్లిగా, పాల ఏరుగా ప్రవహించింది.

ప్రశ్న 2.
దుందుభి గొప్పతనాన్ని తెలుపండి. (V.Imp) (M.P)
జవాబు:
గంగాపురం హనుమచ్ఛర్మ దుందుభి నది గొప్పతనాన్ని చక్కగా వర్ణించాడు. కొంతమంది స్వార్థపరులు వారి విలాసాలకోసం ఏవో చట్టాలు చేసి ఈ భూమిని ఆక్రమించుకుని గర్వాన్ని పొంది వారి ఆనందం కోసం చేసిన ఒత్తిడి కారణంగా సమయానికి ఆహారం తీసుకోలేక బాధతో మరణించి దీనస్థితిలో ఎండిపోయిన వారి అస్థిపంజరాలు దుందుభి ఒడిలో శాశ్వతమైన శాంతిని సుఖాన్ని పొందాయన్నారు.

పట్టుకున్న ప్రతీ రాయి శిల్పంగా మారి, భూమిలో పాతిన బండలన్ని శాసనాలుగా మారి, కట్టించిన దేవాలయాల అభివృద్ధి తెలుగు జాతికి జీవనాధారంగా మారి జన్మ సార్థకం చేసుకున్న ఎందరో శ్రీ చాళుక్య చక్రవర్తులు దుందుభి తీరంలోనే రాజులుగా అదృష్టాన్ని పొందారు.

అద్దంలాగా స్వచ్ఛంగా ఉన్న నీటిలో తన రూపాన్ని చూసుకుంటున్న ఆ అందమైన చందమామ దుందుభి ఒడిలో నిద్రపోతున్నప్పుడు కీచురాయి శబ్దాలతో జోలపాటలు పాడిన విధంగా ఊగుతున్న అలలు అనే ఊయలలో ముద్దుగొలిపే విధంగా ప్రకాశవంతమైన శరత్కాలంలోని వెన్నెలలో తల్లిలాగామారి నిద్రపుచ్చుతుంది. పేదవారి ఇండ్లకోసం తమ శరీరాన్ని పెంచి, భిన్నత్వం లేని విధంగా పేర్చుచు, తాటికమ్మలతో గుడిసె కప్పును తయారు చేసి మెప్పును పొందుచు, వాటి శక్తి నశించగానే తాటి ఆకుల కుప్పతో వేసిన చలి మంటలతో పేదవారు చలిని పోగొట్టుకుంటారు. దుందుభి పెంచిన కారణంగా తాటిచెట్లపై ప్రేమలు పెరిగాయి.

లోకంలో సాగిన హింసను లేకుండా చేయడానికి పాదాల దగ్గర ఉన్న చీమలుకూడా చనిపోకుండా చూసే, నశించి పోతున్న మానవత్వాన్ని తిరిగి నిలపడానికి ప్రయత్నించిన జైన తీర్థంకరులకు కూడా తాగడానికి అనువైన జలాన్ని ఇచ్చిన కీర్తిని పొందింది. పరిశుద్ధమైన, ప్రకాశవంతమైన దుందుభి నదిని బంధించడం పిచ్చి పని. పవిత్రమైన భావాలను ఆపడం సాధ్యమా ? మిక్కిలి తీవ్రమైన అగ్నిని తీసుకొని మూటలో బంధించడం, నీటిని ఆపడం స్వేచ్ఛయే జీవితంగా కల దుందుభి విషయంలో సాధ్యపడదు.

సగం పేగును తడపడానికి సరిపోని అత్యంత తక్కువ ఆహారం కూడా లేని, రక్తాన్ని ఆవిరిగా చేసి, లోకానికి మంచి చేయడానికి ప్రయత్నం చేసి ఈ భూమిని తమ చెమటతో తడిపి కష్టాలతో బాధపడే మానవులకు అత్యంత ప్రేమతో మంచి మొదటి పంటగా సీతాఫలాలను ఇచ్చి తన కారుణ్యాన్ని చూపినందుకు కవి మెచ్చుకున్నాడు.

అలలు అనే చేతులతో ఆడే ఆటలు చూసి చెట్లు పూలతో పులకరించాయి. ఒక్కొక్క పులకరింత ఒక్కొక్క పుష్పమై వికసించింది. పుష్పించిన ఒక్కొక్క పూవు ఒక్కొక్క తేనె నిండిన పాత్రగా ఆతిథ్యం ఇచ్చింది. దుందుభి ప్రవహించి తెలుగు భూములను పవిత్రంగా మార్చింది. తెలుగు సంస్కృతులతో ప్రకాశించే దుందుభి పంట భూములకు పాలు ఇవ్వడానికి ప్రవహించింది కావున తన గొప్పతనాన్ని కావ్యంలో పెట్టాడు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి

II సంగ్రహరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
దుందుభిని తలచుకొని కవి పొందిన అనుభూతి ఏమిటి ?
జవాబు:
తొలకరి వాన కురవగానే పెద్ద అలలతో స్నేహం చేసి, గట్లతో యుద్ధంచేసి వాటిని తాకుతూ, గ్రామాల్లోని భూముల బాధ పోగొట్టడానికి వచ్చిందని గంగాపురం హనుమచ్ఛర్మ భావించాడు. తమ కోరికలు తీర్చే విధంగా పైరు పంటలతో మనసులను ఆనందపరిచిందని, గోదావరి కృష్ణా నదులు మాకు అందడం లేదనే బాధను తీర్చడమే నిజమైన ప్రసిద్ధి అవుతుందని అనుకున్నాడు. ఇంకా బంగారు రంగులు నిండిన సంధ్యా సమయాలు, మామిడి పూతను తిని ఎక్కువగా సంతోషించి కోకిలలు చేస్తున్న శబ్దాలు, తొలకరి వర్షానికి ముందు కనిపించే నల్లని మేఘాలు, ఆ మబ్బుల్లోంచి తొంగి చూసే మెరుపులు నాకు ఒక ఆలోచనను కలిగించి కొత్త గీతాలతో నిన్ను ఆనంద పరచుమన్నవని గంగాపురం హనుమచ్ఛర్మ అనుభూతిని పొందాడు.

ప్రశ్న 2.
దుందుభితో కవులకున్న సంబంధాన్ని తెలుపండి. (V.Imp) (M.P)
జవాబు:
కత్తిని, కలాన్ని సమానంగా ఉపయోగించి కావ్యాలలోను, ప్రవృత్తిలోను రౌద్ర రసాలను కోరేవారికి ఆనందాన్ని కలిగించేలా చేసిన కళాకారుడైన వీరుడు గోనబుద్ధారెడ్డి. అతని దుందుభి స్నేహం కారణంగా అపూర్వమైన చరిత్ర రంగనాథ రామాయణాన్ని రచించాడు. తెలియని సమయంలో కూడా శైవానికి, వైష్ణవానికి సంబంధించిన అంశాలపై దుందుభి మనస్సులో అనాసక్తత లేదు. మంచి తులసి చెట్ల వరుసలతో, మారేడు వృక్షాల సమూహాలతో రెండు తీరాలను నింపి ఉంచుతూ, తిక్కన కలము చెప్పిన హరి హరాద్వైత తత్వాన్ని తెలుసుకొని సంపన్నురాలుగా ప్రవహిస్తున్నదని చెప్పడం ద్వారా దుందుభికి కవులకు ఉన్న సంబంధాన్ని గంగాపురం హనుమచ్ఛర్మ వివరించాడు.

ప్రశ్న 3.
జంతువులను, పక్షులను దుందుభి ఎలా ఆదరిస్తుంది ?
జవాబు:
కదులుతున్న గడ్డిపోచకు కూడా భయపడి చెల్లాచెదరుగా పారిపోయే జింకలు, దుప్పుల సమూహాలు అడవిలో తిరిగితిరిగి అలిసిపోయి దాహంతో నీరు తాగడానికి దుందుభి దగ్గరకు వస్తాయి. కింది పెదవులు ఆనించి నీరు తాగుతుండగా చేపలు గంతులు వేస్తుంటే భయపడతాయి. దాహం తీరక కలిగే బాధతో అవి దిక్కులు పట్టుకొని పారిపోతుంటే దుందుభి ఉపాయంతో చూస్తుంది. వినసొంపైన చిన్న మాటలతో అందంగా రంగులు వేసినట్లున్న రెక్కలు ప్రకాశిస్తుండగా, గర్వంతో మంచి శకునాలను చూపించి, పొలాలలో కొత్తగా పండిన పంట గింజలతో ఆకలిని తీర్చుకుంటున్న పాలపిట్టల జంటలను చూస్తూ హడావిడిగా ముందుకు పోతుంది.

ప్రశ్న 4.
దుందుభి ఎక్కడ పుట్టి ఎక్కడెక్కడ పారింది ?
జవాబు:
హైదరాబాదుకు అతి సమీపంలో జన్మించి, మహబూబ్ నగర్ జిల్లాలో ఆనకట్ట దగ్గర కొంత ఆగుతుంది. నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతంలోని భూములలో పంటలు పండించి, ఇంకా ముందుకు అలాఅలా ప్రవహిస్తుంది. పలనాటి బ్రహ్మనాయుడు పాలించిన ప్రాంతంలో పారి కృష్ణానదికి అతి దగ్గరలో ఏలేశ్వర స్వామికి పూజలు చేస్తుంది. అక్కడి భక్తులకు ఆచార్య నాగార్జునుని కీర్తిని చెప్పి చరిత్ర రాయడానికి వెలుగు బాటలు చూపుతుంది.

ఇక్ష్వాకులు పరిపాలించిన విజయపురాన్ని చేరి, ఆచార్య నాగార్జునున్ని చూసి ధన్యతను పొంది, తెలుగు నేలను పైరు పంటలతో నింపుతుంది. శాశ్వతంగా తెలుగు బిడ్డలకు ఆశిస్సులనే అక్షతలను, మంచి నడవడిని అందించి, ఈ లోకంలో, పరలోకంలో అన్ని కోరికలను తీర్చి తల్లిగా, పాలవెల్లిగా, పాల ఏరుగా ప్రవహిస్తుంది.

III. ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
గంగాపురం హనుమచ్ఛర్మ స్వగ్రామం ఏది ?
జవాబు:
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి దగ్గర ఉన్న గూడూరు. జన్మ స్థలం వేపూరు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి

ప్రశ్న 2.
దుందుభి ఒడిలో శాంతి పొందినవి ఏవి ?
జవాబు:
దైన్య, శుష్క కంకాలములు. ఎండిన అస్థిపంజరాలు

ప్రశ్న 3.
జాతి వికాసానికి జీవగఱ్ఱ ఏది ?
జవాబు:
దేవాలయాల వికాసం

ప్రశ్న 4.
హనుమచ్ఛర్మ అముద్రిత సుప్రభాతం పేరేమిటి ?
జవాబు:
గంగాపురం చెన్నకేశవ సుప్రభాతం

ప్రశ్న 5.
దుందుభి అద్దాన్ని చూసి రూపము దిద్దుకొనేదెవరు ?
జవాబు:
చందమామ

ప్రశ్న 6.
తొలి పంటగా దుందుభి ఏ ఫలాలనిస్తుంది ?
జవాబు:
సీతాఫలాలను

ప్రశ్న 7.
విజయపురిని ఏలిన వారెవరు ?
జవాబు:
ఇక్ష్వాకులు

ప్రశ్న 8.
దుందుభి నది ఎక్కడ పుట్టింది ?
జవాబు:
భాగ్యనగరానికి అత్యంత సమీపంలో.

IV సందర్భసహిత వ్యాఖ్యలు

1. నీదు తీరమున రాచరికమ్ముల నోచిరెందరో
జవాబు:
కవి పరిచయం : గంగాపురం హనుమచ్ఛర్మ రాసిన దుందుభి కావ్యం నుండి గ్రహించిన దుందుభి అనే పాఠం నుండి తీసుకున్నది ఈ వాక్యం. హనుమచ్ఛర్మ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కవి.

సందర్భం : పట్టుకున్న ప్రతీ రాయి శిల్పంగా మారి, భూమిలో పాతిన బండలన్ని శాసనాలుగా మారి, కట్టించిన దేవాలయాల అభివృద్ధి తెలుగు జాతికి జీవనాధారంగా మారి, జన్మ సార్థకం చేసుకున్న ఎందరో శ్రీ చాళుక్య చక్రవర్తులు దుందుభి తీరంలోనే రాజులుగా అదృష్టాన్ని పొందారని కవి చెప్పిన సందర్భం లోనిది ఈ వాక్యం.

అర్థం : నీ సమీపంలోనే రాజ్య పాలన చేసే అదృష్టాన్ని పొందారు అని అర్థం.

వివరణ : దుందుభి నదీ తీరంలో ఎంతో మంది చాళుక్య రాజులు చాల ఆనందంగా రాజ్య పాలన చేశారని

2. పారెదవు తాత్వికత న్శివకేశవాఢ్యవై
జవాబు:
కవి పరిచయం : గంగాపురం హనుమచ్ఛర్మ రాసిన దుందుభి కావ్యం నుండి గ్రహించిన దుందుభి అనే పాఠం నుండి తీసుకున్నది ఈ వాక్యం. హనుమచ్ఛర్మ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కవి.

సందర్భం : ప్రాచీన కాలంలో కూడా శైవానికి, వైష్ణవానికి సంబంధించిన అంశాలపై దుందుభి మనస్సులో అనాసక్తత లేదు. విష్ణువుకు ఇష్టమైన మంచి తులసి చెట్ల వరుసలతో, శివునికి ఇష్టమైన మారేడు వృక్షాల సమూహాలతో రెండు తీరాలను నింపి ఉంచుతూ, తిక్కన కలము చెప్పిన హరి హరాద్వైత తత్వాన్ని తెలుసుకొని సంపన్నురాలిగా ప్రవహిస్తుందని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం : శివ కేశవ అద్వైత తత్వాన్ని తెలుసుకొని సంపన్నురాలిగా ప్రవహిస్తావని అర్థం.

వివరణ : దుందుభి నదికి రెండు వైపులా తులసీ, మారేడు చెట్లు ఉన్నవి కావున హరి హరాద్వైతాన్ని పాటించిందని భావం.

3. విమలభాస్వద్రూప శైవాలినీ
జవాబు:
కవి పరిచయం : గంగాపురం హనుమచ్ఛర్మ రాసిన దుందుభి కావ్యం నుండి గ్రహించిన దుందుభి అనే పాఠం నుండి తీసుకున్నది ఈ వాక్యం. హనుమచ్ఛర్మ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కవి.

సందర్భం : పరిశుద్ధమైన, ప్రకాశవంతమైన, ఓ దుందుభి నదీ ! నిన్ను బంధించారు. ఇదెక్కడి పిచ్చి తెలివి? పవిత్రమైన భావాలను ఆపడం సాధ్యమా ? మిక్కిలి తీవ్రమైన అగ్నిని తీసుకొని మూటలో బంధించడం, నీటిని ఆపడం స్వేచ్ఛయే జీవితంగా కలదానివైన నీ విషయంలో సాధ్యమవుతుందా ? అని కవి ప్రశించిన సందర్భం లోనిది ఈ వాక్యం.

అర్థం : పరిశుద్ధమైన, ప్రకాశవంతమైన, ఓ దుందుభి నదీ అని అర్థం.

వివరణ : పవిత్రమైన భావాలను ఆపడం సాధ్యం కానట్టే పవిత్రమైన దుందుభిని ఆపడం సాధ్యం కాదని భావం.

TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి

4. మముబెంచు తల్లివై మా పాలవెల్లివై
జవాబు:
కవి పరిచయం : గంగాపురం హనుమచ్ఛర్మ రాసిన దుందుభి కావ్యం నుండి గ్రహించిన దుందుభి అనే పాఠం నుండి తీసుకున్నది ఈ వాక్యం. హనుమచ్ఛర్మ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కవి.

సందర్భం : ఇక్ష్వాకులు పరిపాలించిన విజయపురాన్ని చేరి, ఆచార్య నాగార్జునున్ని చూసి ధన్యతను పొంది, తెలుగు నేలను పైరు పంటలతో నింపి, శాశ్వతంగా తెలుగు బిడ్డలకు నీ ఆశిస్సులనే అక్షతలను, మంచి నడవడిని అందించి, ఈ లోకంలో, పరలోకంలో అన్ని కోరికలను తీర్చి మమ్మల్ని పెంచే తల్లిగా, మాకు పాల వెల్లిగా ప్రవహిస్తావా ! అని దుందుభిని కవి అడుగుతున్న సందర్భం లోనిది ఈ వాక్యం.

అర్థం : మమ్మల్ని పెంచి తల్లివి, మా పాలిట పాల నదివి అని అర్థం.

వివరణ : దుందుభి తెలుగు వారందరికీ తల్లిలాగా పోషణకు కావలిసినవన్నీ ఇస్తుందని భావం.

పద్యములు – ప్రతిపదార్థ తాత్పర్యములు

1వ పద్యం :

మ॥ తొలిజల్లు ల్గురియంగ ! పేరలల పొత్తుంగొంచు పోరాడి యొ
డ్డులతో రాయుచు గ్రామసీమలకు గోడుంబాప నేతెంచి, మా
తలపు ల్ముట్టియు సస్యపాకముల నాత్మ ల్దేర్చి; గోదమ్మ
కృ స్థలు మాకందని కుందు దీర్చితి ప్రశస్తం బిద్దియౌ ! దుందుభీ !

ప్రతిపదార్థం :

దుందుభీ ! = ఓ దుందుభి నదీ!
తొలిజల్లుల్ = తొలకరి వాన
కురియం = పడగానే
పేరు + అలల = పెద్ద అలలతో
పొత్తుంగొంచు = స్నేహం చేసి
పోరాడి = పోరాటం చేసి
ఒడ్డులతో రాయుచు = గట్లను తాకుతూ
గ్రామసీమలకు = గ్రామాల్లోని భూములకు
గోడు = బాధ
బాపన్ = పోగొట్టడానికి
ఏతెంచి = వచ్చి
మా తలపులు = మా కోరికలు
ముట్టియు = తాకి, తీర్చి
సస్య = పైరు
పాకములన్ = పంటలతో
ఆత్మల్ + తేర్చి = మనసులను ఆనందపరచి
గోదమ్మ = గోదావరి నదీ
కృష్ణలు = కృష్ణా నది మొదలైనవి
మాకు + అందని = మాకు అందడం లేవు అనే
కుందున్ = “బాధ
తీర్చితి = తీర్చావు
ప్రశస్తంబు + ఇద్దియౌ ! = ఇదే నిజమైన ప్రసిద్ధి అవుతుంది

తాత్పర్యం : ఓ దుందుబి,! తొలకరి వాన కురవగానే పెద్ద అలలతో స్నేహం చేసి, గట్లతో యుద్ధంచేసి వాటిని తాకుతూ, మా గ్రామాల్లోని భూముల బాధ పోగొట్టడానికి వచ్చి, మా కోరికలు తీర్చే విధంగా పైరు పంటలతో మా మనసులను ఆనందపరిచి, గోదావరి కృష్ణా నదులు మాకు అందడం లేదనే బాధను తీర్చావు. ఇదే నిజమైన ప్రసిద్ధి అవుతుంది.

2వ పద్యం :

ఉ||
బంగరు రంగుల న్విరియఁ బారిన సంధ్యలు మావిపూత ను
ప్పొంగిన కోయిలమ్మ రుతముల్ ! తొలికారు మొయిళ్ళు ! వానిలో
వంగి చలించు చంచలలు ! నాకొక భావన నేర్పరించి ని
న్నుం గిలిగింతగొల్పుమనె నూతనగీతి మదంబ దుందుభీ !

ప్రతిపదార్థం :

మత్+అంబ దుందుభీ != మా అమ్మ వంట దుందుభి
బంగరు రంగులన్ = బంగారపు రంగులు
విరియం బారిన = వ్యాపించిన
సంధ్యలు = సంధ్యా సమయాలు (ఉదయాలు, సాయంత్రాలు)
మావి పూతన్ = మామిడి పూతతో
ఉప్పొంగిన = ఎక్కువ సంతోషించి
కోయిలమ్మ రుతముల్ = కోకిలలు చేసే శబ్దాలు, ధ్వనులు
తొలికారు మొయిళ్ళు! = తొలకరి వర్షానికి ముందు ఉండే నల్లని మబ్బులు
వానిలో = ఆ మేఘాలలో నుండి
వంగి చలించు = వంపులతో కదిలే
చంచలలు! = మెరుపులు
నాకున్ + ఒక = నాకు ఒక రకమైన
భావనన్ = ఆలోచనను, ఊహను
ఏర్పరిచి = కలిగించి
నిన్నుం = నిన్ను (దుందుభిని)
నూతనగీతి = కొత్త పాటలతో
గిలిగింత గొల్పుము+అనె = ఆనంద పరుచుమన్నవి

తాత్పర్యం : మా అమ్మ వంటి దుందుభి! బంగారు రంగులు నిండిన సంధ్యా సమయాలు, మామిడి పూతను తిని ఎక్కువగా సంతోషించి కోకిలలు చేస్తున్న శబ్దాలు, తొలకరి వర్షానికి ముందు కనిపించే నల్లని మేఘాలు, ఆ మబ్బుల్లోంచి తొంగి చూసే మెరుపులు నాకు ఒక ఆలోచనను కలిగించి కొత్త గీతాలతో నిన్ను ఆనంద పరచుమన్నవి.

3వ పద్యం :

చ||
తలచినయంతనే హృదయ తంత్రుల ఝమ్మని మ్రోతలెత్తెనో
మలచినగుండెలోపలి యమాయికత ల్జలమై స్రవించెనో
శిలలు ద్రవించెనో, యెద భజించు ప్రియుండగు స్వీయనాథుపై
వలపులు పుల్కరించుడు నభంగురతం జనుదెంతు దుందుభీ!

ప్రతిపదార్థం :

దుందుభీ! = ఓ దుందుభి
తలచిన అంతనే = మనసులో తలుచుకోగానే, అనుకోగానే
హృదయ తంత్రుల = హృదయమనే వీణ తీగలపై
ఝం + అని = ఝం అనే
మ్రోతలు+ఎత్తైన్+ఓ = ధ్వనులు వచ్చాయా ?
మలచిన = కదిలిన
అమాయికతల్ = అమాయకత్వం, తెలియనితనం
జలమై = నీరై
స్రవించెనో = కారిందా
శిలలు = రాళ్లు
ద్రవించెనో = కరిగాయా
ఎద = హృదయంలో
భజించు = కీర్తించే
ప్రియుండు + అగు = ప్రియమైన వాడైన
స్వీయ నాథుపై = భర్తపై
వలపులు = ప్రేమలు
పుల్కరించుడున్ = గిలిగింతలు పెడుతున్నాయా
అభంగురతన్ = ఆగకుండా (భంగం = ఆటంకం)
చనుదెంతు = వస్తున్నావు

తాత్పర్యం : ఓ దుందుభి ! తలచుకోగానే నీ హృదయమనే వీణ తీగలపై ఝం అనే ధ్వనులు వెలువడ్డాయా ? కదలగానే నీ అమాయకత్వము నీరుగా మారిందా ? రాళ్లు కరిగాయా ? నీ హృదయంలో కీర్తించే నీ ప్రియుడైన భర్తపై ప్రేమలు గిలిగింతలు పెడుతున్నాయా ? ఆగకుండా వస్తున్నావు ?

TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి

4వ పద్యం :

ఉ||
కూళలు కొంద రేవొ తమ కోసము శాసనముల్ సృజించి, భూ
గోళము నాక్రమించుకొని, క్రొవ్వగ వారి విలాసఘట్టనన్
వేళకు కూడుగానక తపించి గతించిన దైన్య శుష్క కం
కాళము లెన్నొ నీయొడిని గాంచె నిరంతర శాంతి సౌఖ్యముల్.

ప్రతిపదార్థం:

కొందరు = కొంత మంది
కూళలు = క్రూరులు
తమ కోసము = స్వార్థం కోసం
శాసనముల్ = చట్టాలను
సృజించి = తయారు చేసి
భూగోళమున్ = భూమిని
ఆక్రమించుకొని = వశపరచుకొని
క్రొవ్వగ = గర్వాన్ని పొంది
వారి విలాస ఘట్టనన్ = వారి యొక్క ఆనందం కోసం చేసే ఒత్తిడివల్ల
వేళకు = సమయానికి
కూడు గానక = తిండి పొందక
తపించి = బాధపడి
గతించిన = మరణించిన
దైన్య = దీనస్థితిలో
శుష్క = ఎండిన
కంకాళములు+ఎన్నో = ఎన్నో అస్థిపంజరాలు
నీయొడినిన్ = నీ ఒడిలో
నిరంతర = ఎల్లప్పుడు
శాంతి సౌఖ్యముల్ = శాంతిని సుఖాలను
కాంచెన్ = చూశాయి, పొందాయి

తాత్పర్యం : కొంతమంది స్వార్థపరులు వారి విలాసాలకోసం ఏవో చట్టాలు చేసి ఈ భూమిని ఆక్రమించుకుని గర్వాన్ని పొంది వారి ఆనందం కోసం చేసిన ఒత్తిడి కారణంగా సమయానికి ఆహారం తీసుకోలేక బాధతో మరణించి దీన స్థితిలో ఎండిపోయిన వారి అస్థిపంజరాలు నీ ఒడిలో శాశ్వతమైన శాంతిని, సుఖాన్ని పొందాయి.

5వ పద్యం :

ఉ|| మాయురె దుందుభీ! ప్రబల మైన కృపాధిషణన్ దరిద్రనా
రాయణ పక్షమై ధన పరత్వము రోయుచు ‘జమ్ము’ ‘తుంగ’ ల
త్యాయతవృత్తి బెంచి నిలయమ్ముగ బాకను గూర్చి స్వాదుపా
నీయము నిచ్చి త్రావగ జనించిన ప్రేమను చిందె దీగతిన్,

ప్రతిపదార్థం :

మాయురె దుందుభీ ! = ఆహా దుందుభి !
ప్రబలమైన = బలమైన, అధికమైన
కృపాధిషణన్ = కరుణతో
దరిద్రనారాయణ పక్షమై = పేదల వైపు ఉండి
ధన పరత్వము = ధనమే ప్రధానమనే గుణాన్ని
రోయుచు = అసహ్యించుకుంటూ
జమ్ము, తుంగ ల = జనుమును, తుంగ అనే గడ్డిని
అతి + ఆయత వృత్తి = చాలా పొడుగ్గా
బెంచి = పెంచి
నిలయమ్ముగ = నివాసంగా
పాకను గూర్చి = గుడిసెను కట్టి
స్వాదు పానీయమును = = తీయటి నీటిని
త్రావగ ఇచ్చి = తాగడానికి ఇచ్చి
జనించిన = పుట్టిన
ప్రేమను = ప్రేమతో
చిందెదు ఈ గతిన్ = ఈ విధంగా గంతులు వేస్తున్నావు

తాత్పర్యం : ఆహా! ఓ దుందుభి! అధికమైన కరుణతో పేదల వైపు నిలిచి, ధనమే ప్రధానమని భావించే గుణాన్ని అసహ్యించుకుంటూ, జనుమును తుంగ గడ్డిని, చాలా పొడుగ్గా పెంచి, వారు నివసించడానికి గుడిసెలను కట్టి ఇచ్చి, తాగడానికి మంచి నీటిని ఇచ్చినందుకు కలిగిన సంతోషంతో గంతులు వేస్తున్నావు.

6వ పద్యం :

చ||
శిల నులిమూసలోఁ గరగి చిత్తరువుంబలె స్వేచ్చ రూపురే
ఖల వరభావ మచ్చునిడి, కాంచు జగమ్ముల నేలి పేరులన్
వలవని మేటి శిల్పకుల వర్యుల మంజుల దివ్యహస్తకౌ
శలమును బోలి వర్షములు సాగెదవా మము దేర్చ వాహినీ.

ప్రతిపదార్థం :

వాహినీ = నదీ (దుందుభి)
శిలన్ = రాయిని
ఉలి = ఉలితో
మూసలో = అచ్చులో
కరగి = కరిగిన
చిత్తరువున్ బలె = చిత్రాల వంటి
స్వేచ్చన్ = స్వేచ్ఛతో
రూపురేఖలన్ = ఆకారాలను
వరభావము = గొప్ప కల్ప
అచ్చునిడి = రూపం ఇచ్చి
కాంచు = చూసే
జగమ్ములన్ = ప్రజలను
ఏలి = పాలించి, ఆనందపరచి
పేరులన్ = ప్రఖ్యాతులను
వలవని = ఆశించని
మేటి = గొప్ప
శిల్ప కుల వర్యుల = శిల్పులలో గొప్పవారి
మంజుల = అందమైన, మనోజ్ఞమైన
దివ్య = గొప్ప
హస్త కౌశలమును = చేతి నైపుణ్యం
బోలి = లాగా
మము దేర్చ = మిమ్మల్ని ఆనందపరచడానికి
వర్షములన్ = వర్షాకాలంలో, సంవత్సరాల పాటు
సాగెదవా = పారుతున్నావా

తాత్పర్యం : ఓ దుందుభి నదీ! రాయిని ఉలితో మలచి, మూసలో కరిగించి పోసిన చిత్రాల లాగా స్వేచ్ఛగా కల్పించిన ఆకారాలకు రూపం ఇచ్చి చూసిన ప్రజలను ఆనందపరచి పేరుకూడా ఆశించని శిల్పకులంలోని గొప్పవారి చేతి నైపుణ్యం లాగ మమ్మల్ని ఆనందింప చేయడానికి ప్రతీ వర్షాకాలంలో ప్రవహిస్తావా ?

7వ పద్యం :

ఉ||
కత్తిని గంటము నెదిపి కావ్యరసమ్మున రౌద్రవృత్తి రే
కెత్త రసజ్ఞచిత్త ముడికించు కళాత్మక వీరమూర్తి నీ
పొత్తున గోనబుద్ధుడు సపూర్వచరిత్ర రచించే తద్విధిన్
మెత్తనిమేనిలో బిరుసు మీరెదవా వరద ల్వరించినన్.

ప్రతిపదార్థం:

కత్తిని = కరవాలాన్ని, ఖడ్గాన్ని
గంటమున్ = గంటమును, కలమును
మెదిపి = కదిలించి, ఉపయోగించి
కావ్యరసమ్మున = కావ్యంలోని రసాలను
రౌద్రవృత్తి రేకెత్త = రౌద్రస్వభావంతో
రసజ్ఞ చిత్తము = రసాన్ని గుర్తించి ఆనందించే మనసు
ఉడికించు = తపించే విధంగా
కళాత్మక = సృజనశీలి అయిన
వీరమూర్తి = వీరుడు
నీ పొత్తున = నీ స్నేహంలో (నీ పక్కన ఉండి)
గోనబుద్ధుడున్ = గోన బుద్ధారెడ్డి అనే పేరుగల వాడు
అపూర్వ చరిత్రన్ = ముందు లేని గొప్ప చరిత్రను (రంగనాథ రామాయణాన్ని) రచించాడు
రచించే = రచించాడు
తత్ + విధిన్ మెత్తని = అటువంటి
మెత్తని = సుకుమారమైన
మేనిలో = శరీరంలో
వరదల్+వరించినన్ = వరదలు వచ్చినప్పుడు
బిరుసు = గట్టిదనాన్ని, కఠినత్వాన్ని
మీరెదవా = పెంచుకుంటావా

తాత్పర్యం : కత్తిని, కలాన్ని సమానంగా ఉపయోగించి కావ్యాలలోను, ప్రవృత్తిలోను రౌద్ర రసాలను కోరేవారికి ఆనందాన్ని కలిగించేలా చేసిన కళాకారుడైన వీరుడు గోనబుద్ధారెడ్డి. నీస్నేహం కారణంగా అపూర్వమైన చరిత్ర రంగనాథ రామాయణాన్ని రచించాడు. అటువంటి సుకుమారమైన నీ శరీరంలో వరదల సమయంలో కఠినత్వాన్ని పెంచుకుంటావా?

TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి

8వ పద్యం :

చ||
అవమతిలేదు నీయెద రహస్యపు వేళలనైన శైవవై
ష్ణవములపైన దానికిల సత్తులసీద్రుమపాళి బిల్వప
త్రవనము తీరదేశముల దాల్చుచు తిక్కన గంటమీను స
త్కవితను బోలి పారెదపు తాత్వికత నివకేశవాఢ్యవై.

ప్రతిపదార్థం:

రహస్యము+వేళలన్+ ఐనన్ = తెలియని సమయంలో కూడా (ప్రాచీన కాలంలో)
శైవ = శివునికి సంబంధించిన
వైష్ణవము = విష్ణుకు సంబంధించిన
ల పైన = అంశాలపై
దానికి = ఆ మతాలకు సంబంధించి
ఇలన్ = ఈ భూమిపై
నీ యెద = నీ మనసులో
అవమతిలేదు = అనాసక్తత లేదు
సత్ + తులసీ = మంచి తులసి
ద్రుమపాళి = చెట్ల వరుసతో
బిల్వపత్ర వనము = మారేడు పత్ర వృక్షాల సమూహంతో
తీర దేశముల = నీ రెండు అంచులు,
తాల్చుచు = నింపి ఉంచుతూ
తిక్కన = కవిబ్రహ్మ తిక్కన
గంటము + ఈను = కాలము ఇచ్చిన
సత్కవితను బోలి = మంచి కవిత తీరుగా
శివ = శివుని
కేశవ = నారాయణుని
తాత్వికతన్ = తత్వాలతో
ఆఢ్యపై = సంపన్నురాలవై
పారెదవు = ప్రవహిస్తావు

తాత్పర్యం : తెలియని సమయంలో (ప్రాచీన కాలంలో) కూడా శైవానికి, వైష్ణవానికి సంబంధించిన అంశాలపై నీ మనస్సులో అనాసక్తత లేదు. (విష్ణువుకు ఇష్టమైన) మంచి తులసి చెట్ల వరుసలతో, (శివునికి ఇష్టమైన) మారేడు వృక్షాల సమూహాలతో నీ రెండు తీరాలను నింపి ఉంచుతూ, తిక్కన కలము చెప్పిన (హరి హరాద్వైత) శివకేశవ తత్వాన్ని తెలుసుకొని సంపన్నురాలవై ప్రవహిస్తున్నావు.

9వ పద్యం :

ఉ|| పేదలయిండ్లకై తనువు బెంచి యభిన్నత బేర్చు బుద్ధి సాం
ద్రాదర భావవీచుల విధమ్మగు కమ్మల కప్పుగూర్చి; మె
ప్పూదుచు చేవ బోవ తమ ప్రోవుల మంట దరిద్రశీతముల్
ఏదెడు తాళవృక్షముల కేర్పడె ప్రేమలు నీవుబెంచుటన్.

ప్రతిపదార్థం:

పేదలయిండ్లకి + ఐ = పేదవారి ఇండ్లకోసం
తనువు బెంచి = శరీరాన్ని పెంచి
అభిన్నత = భిన్నత్వం లేని విధంగా
పేర్చు = పేర్చుచు
బుద్ది సాంద్ర = మనసులో గాఢమైన
ఆదర బావ వీచులన్ = గౌరవ భావమనే తరంగాల
విధమ్ము + అగు = విధంగా
కమ్మలన్ = తాటి ఆకులతో (తాటి ఆకులను కమ్మలు అంటారు)
కప్పు గూర్చి = కప్పును తయారు చేసి
మెప్పుదుచున్ = మెప్పును పొందుచు
చేవ బోవన్ = శక్తి నశించగా
తమ ప్రోవుల = తమ సమూహంతో (తాటి ఆకుల కుప్పతో) వేసిన
మంటన్ = చలి మంటలతో
దరిద్ర శీతముల్ = దరిద్రమైన చలినుండి
ఏదెడు = పోగొట్టుకుంటారు
నీవు బెంచుటన్ = నీవు పెంచిన కారణంగా
తాళ వృక్షములకున్ = తాటిచెట్లపై
ప్రేమలు = ప్రేమలు
ఏర్పడెన్ = ఏర్పడ్డాయి, పెరిగాయి

తాత్పర్యం : పేదవారి ఇండ్లకోసం తమ శరీరాన్ని పెంచి, భిన్నత్వం లేని విధంగా పేర్చుచు, మనసులో గాఢమైన గౌరవ భావతరంగాల వలె తాటి కమ్మలతో గుడిసె కప్పును తయారు చేసి మెప్పును పొందుచు, వాటి శక్తి నశించగానే తాటి ఆకుల కుప్పతో వేసిన చలి మంటలతో పేదవారు చలిని పోగొట్టుకుంటారు. నీవు పెంచిన కారణంగా తాటి చెట్లపై ప్రేమలు పెరిగాయి.

10వ పద్యం :

ఉ||
శంకను దక్కి లోకమున సాగిన హింసను రూపుమాపఁ బా
దాంకములందుఁ జీమలు గతాసువులై చెడకుండునట్లు క్షే
మంకరబుద్ధి మాసి చను మానవతం బ్రకటించు జైన తీ
ర్ధంకర పానయోగ్య జల దాయినివై యశము స్వహింపవా!

ప్రతిపదార్థం :

శంకను దక్కి = అనుమానం లేకుండా, భయం లేకుండా
లోకమున = లోకములో
సాగిన హింసను = నడిచిన హింసను
రూపుమాపన్ = లేకుండా చేయడానికి
పాద + అంకములందున = పాదాల దగ్గర ఉన్న
చీమలు = చీమలు
గత + అసువులు + ఐ = పోయిన ప్రాణాలు
చెడకుండునట్లు = చెడిపోకుండా ఉండేటట్లు
క్షేమంకరబుద్ధి = శుభాన్ని కలిగించే మనసుతో
మాసి = నశించి
చను = పోయె
మానవతన్ = మానవత్వాన్ని
ప్రకటించు = తెలపడానికి, నిలపడానికి
జైన తీర్థంకర = జైన తీర్థంకరులకు
పానయోగ్య = తాగడానికి అనుకూలమైన
జల దాయినివై = నీటిని ఇచ్చే దానివై
యశమున్ = కీర్తిని
వహింపవా ! = పొందవా

తాత్పర్యం : భయంలేకుండా లోకంలో సాగిన హింసను లేకుండా చేయడానికి పాదాల దగ్గర ఉన్న చీమలుకూడా చనిపోకుండా చూసే శుభాన్ని కలిగించే మనసుతో, నశించి పోతున్న మానవత్వాన్ని తిరిగి నిలపడానికి ప్రయత్నించిన జైన తీర్థంకరులకు కూడా తాగడానికి అనువైన జలాన్ని ఇచ్చిన కీర్తిని పొందవా (పొందావు అని భావం).

11వ పద్యం :

మ|
నిను బంధించి రిదేటి వెర్రితల పాండిత్యమ్ము? శక్యంబె పా
వనభావమ్ముల నిగ్రహింప కడు తీవ్రంబైన జ్వాలావళిన్
గొనిమూట న్బిగియింపగా సలిల సంకోచంబు స్వేచ్ఛెకజీ
వనవౌ నీయెడ సాగునే విమల భాస్వద్రూప శైవాలినీ!

ప్రతిపదార్థం :

విమల = పరిశుద్ధమైన
భాస్వత్రూప = ప్రకాశవంతమైన
శైవాలినీ! = ఓ నదీ
నిను బంధించిరి = నిన్ను బంధించారు
ఇది ఏటి = ఇదెక్కడి
వెర్రితల = పిచ్చెక్కిన
పాండిత్యమ్ము = తెలివి
పావన = పవిత్రమైన
భావమ్ముల = భావాలను
నిగ్రహింప = ఆపడం
శక్యంబె = సాధ్యమా
కడు = మిక్కిలి
తీవ్రంబైన = తీవ్రమైన
జ్వాల + ఆవళిన్ కొని = అగ్ని సమూహాన్ని
కొని = “తీసుకొని
మూటన్ + బిగియింపగా = మూటలో బంధించడం
సలిల = నీటిని
సంకోచంబు = ఆపడం, చిన్నగా చేయడం
స్వేచ్ఛ + ఏక జీవనవు + ఔ = స్వేచ్ఛయే జీవితముగా కలదానివి అయిన నీ విషయంలో
నీయెడ = నీ విషయంలో
సాగునే = సాధ్యమవుతుందా ?

తాత్పర్యం:పరిశుద్ధమైన, ప్రకాశవంతమైన, ఓ దుందుభి నదీ! నిన్ను బంధించారు. ఇదెక్కడి పిచ్చి తెలివి ? పవిత్రమైన భావాలను ఆపడం సాధ్యమా ? మిక్కిలి తీవ్రమైన అగ్నిని తీసుకొని మూటలో బంధించడం, నీటిని ఆపడం స్వేచ్ఛయే జీవితంగా కలదానివైన నీ విషయంలో సాధ్యమవుతుందా ?

12వ పద్యం :

ప్రతిపదార్థం :

చ||
కదలెడు పూరిపుల్లకు గకావికలై భయమొంది డప్పితో
బొదలిన జింక దుప్పి కదుపుల్ జలముల్గొన నిన్నుజేరి
బెదవుల ముట్టువేళ గని పెంపగు చేపల బల్లటీ ల్గొనం
గదిమి తృష్ణార్తతన్ వెరవు గల్గియు దిక్కుల బార జూతువా ?

ప్రతిపదార్థం :

కదలెడు = కదులుతున్న
పూరిపుల్లకు = గడ్డిపోచకు కూడా
భయమొంది = భయపడి
కకావికలై = చెల్లాచెదురై
పొదలిన = తిరిగి అలసిన
డప్పితో = దాహంతో
జింక, దుప్పి కదుపుల్ = జింకల దుప్పుల గుంపులు
జలముల్ + గొనన్ = నీరు తాగడానికి
నిన్ను + చేరి = నీ దగ్గరికి వచ్చి
క్రీ = కింది
పెదవుల = పెదవులతో
ముట్టువేళన్ = నీటిని తాకుతుండగా
కని = చూసి
కదిమి = స్వార్థంతో
పెంపు + అగు = పెరిగిన
చేపల పల్లటీల్ = చేపలు గంతులు
కొనన్ = వేస్తుంటే
తృష + ఆర్తతన్ = దాహం తీరక కలిగే బాధతో
దిక్కులన్ = దిక్కులు పట్టుకొని
వెరవు గల్గియు = ఉపాయంతో
పారన్ + చూతువా ? = వెళ్ళడం చూస్తావా ?

తాత్పర్యం : కదులుతున్న గడ్డిపోచకు కూడా భయపడి చెల్లాచెదరుగా పారిపోయే జింకల, దుప్పుల, సమూహాలు అడవిలో తిరిగి తిరిగి అలిసిపోయి దాహంతో నీరు తాగడానికి నీ దగ్గరకు వచ్చి కింది పెదవులు ఆనించి నీరు తాగుతుండగా చూసి స్వార్థంతో పెరిగిన చేపలు గంతులు వేస్తుంటే దాహం తీరక కలిగే బాధతో అవి దిక్కులు పట్టుకొని పారిపోతుంటే ఉపాయంతో చూస్తావా ?

13వ పద్యం :
మ||
అరప్రేవుం దడుపంగజాలని నిర ల్పాహారమై, రక్త మా
విరిగా, లోకహితార్థమై కడగు చుర్విం జెమ్మట న్ముంచి, క
ష్టరతిం గుందెడు మానవాళికి గరిష్ఠప్రేమ “సీతాఫలో”
త్కరమున్ మేలొలిపంటగా నొసగు నీకారుణ్యమగ్గించెదన్.

ప్రతిపదార్థం :

అర ప్రేవున్ = సగం పేగును కూడా
తడుపంగ = తడపడానికి
చాలని = సరిపోని
నిర్ + అల్పాహారము + ఐ = అల్పాహారము లేని వారై
రక్తము + ఆవిరిగా = రక్తాన్ని ఆవిరిగా చేసి
లోకహిత + అర్థమై = లోకానికి మంచి చేయడానికి
కడగుచు = ప్రయత్నం చేసే
ఉర్విన్ = ఈ భూమిని
చెమ్మటన్ = చెమటతో, స్వేదంతో
ముంచి = మునిగేలా చేసి, తడిపి
కష్టరతిం = కష్టాలతో
కుందెడు = బాధపడే
మానవాళికి = మానవులకు
గరిష్ఠప్రేమన్ = అత్యంత ఎక్కువ ప్రేమతో
మేల్ తొలిపంట గాన్ = మంచి మొదటి పంటగా
సీతాఫల + ఉత్కరమున్ = సీతాఫలాలను
ఒసగు
నీ కారుణ్యము +  = ఇచ్చే
+ అగ్గించెదన్ = నీ కరుణను స్థుతిస్తాను, మెచ్చుకుంటాను

తాత్పర్యం : సగం పేగును తడపడానికి సరిపోని అత్యంత తక్కువ ఆహారం కూడా లేని, రక్తాన్ని ఆవిరిగా చేసి, లోకానికి మంచి చేయడానికి ప్రయత్నం చేసి ఈ భూమిని తమ చెమటతో తడిపి కష్టాలతో బాధపడే మానవులకు అత్యంత ప్రేమతో మంచి మొదటి పంటగా సీతాఫలాలను ఇచ్చే నీ కారుణ్యాన్ని మెచ్చుకుంటాను.

TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి

14వ పద్యం :

తే.గీ॥ ప్రచురతర రసవాదాన బ్రభవమందు
స్వర్ణయోగం బదేమాయె ? సరవి నష్ట
సిద్ధు లేనీట మునిగె ? యజించు క్రమము
డెలియలేనట్టి జడబుద్ధి తేలివచ్చె !

ప్రతిపదార్థం:

ప్రచురతర = ప్రచారంలో గల
రసవాదాన = రసవాద విద్య (బంగారాన్ని తయారు చేసే విద్య)
ప్రభవము అందు = పుట్టు
స్వర్ణయోగంబు = బంగారు యోగము
అది + ఏమాయె ? = అది (స్వర్ణ యోగం) ఏమైనది
సరవిన్ అష్టసిద్ధులు = క్రమంగా అష్టసిద్ధులు
ఏనీట మునిగె ? = ఏ నీటిలో మునిగి పోయాయి
యజించు క్రమము = యజ్ఞాలు చేసే పద్ధతులు
తెలియలేనట్టి = తెలుసుకోలేని
జడబుద్ధి = తెలివి తక్కువతనం
తేలివచ్చె ! = ప్రకటితమైనది

తాత్పర్యం : గతంలో ప్రచారంలో ఉన్న రసవాద విద్యద్వారా బంగారాన్ని పుట్టించే స్వర్ణయోగం ఏమైనది ? వరుసగా అష్టసిద్ధులు ఏ నీటిలో మునిగి పోయాయి. యజ్ఞ యాగాలు చేసే విధానాలు తెలుసుకోలేని తెలివి తక్కువతనం ప్రకటితమయింది. (తెలివి తక్కువతనం అందరికి తెలిసింది అని భావం).

15వ పద్యం :

తే.గీ॥ ఆర్ష జీవిత పద్దతులంతరింప
నవనవోన్మేష పాశ్చాత్య నాగరకత
పెల్లుగ గమించి తుది కొక పొల్లునైతి
భారతాంబ సహింపని బరువుగానొ.

ప్రతిపదార్థం :

ఆర్ష = ఋషుల ద్వారా తెలుపబడిన
జీవిత పద్ధతులు = = జీవన విలువలు
అంతరింప = నశించగా
నవనవ + ఉన్మేష = కొత్తగా వికసించిన
పాశ్చాత్య = పశ్చిమ దేశాల
నాగరకత = నాగరికతను
పెల్లుగన్ = ఎక్కువగా
గమించి = వెంట నడిచి, ఆచరించి
తుదికి + ఒక = చివరికి ఒక
పొల్లును + ఐతి = పొల్లు గింజగా పనికి రాకుండా పోతిని
భారత + అంబ = భారతమాతకు
సహింపని = భరించలేని
బరువు గానొ = బరువుగా మారాను కదా

తాత్పర్యం : ఋషుల ద్వారా (వేదాల ద్వారా) తెలుపబడిన జీవన విలువలను పాటించక కొత్తగా వచ్చిన పాశ్చాత్య నాగరికతను ఆచరించి చివరికి ఒక పొల్లు గింజలాగా ఎందుకు పనికి రాకుండా పోయాను. భారతమాత భరించలేని భారంగా మారాను కదా !

16వ పద్యం :

ఉ||
జేనెడు పొట్టకై పరుల సేవకు కాయము నమ్మి నైచ్యసం
ధానపు జీవితమ్మున వ్యథం గొని చాల కృశించు వ్యక్తి, సం
ఘానికి జాతికౌ నొక విఘాతము మాన్పగలేడు ఎట్టిదౌ
పూనికతోడ కొల్వునకుఁ బోయిన స్వేచ్ఛ నశించు దుందుభీ !

ప్రతిపదార్థం :

దుందుభీ ! = ఓ దుందుభి !
జానెడు పొట్టకై = జానెడు ఉన్న కడుపు కోసం
పరుల సేవకు = ఇతరులక సేవచేయడానికి
కాయమును + అమ్మి = శరీరాన్ని అమ్మి
నైచ్య సంధానపు = నీచత్వంతో కూడిన
జీవితమ్మున = జీవితంలో
వ్యథన్ + కొని = జీవితంలో
చాల కృశించు = చాల బాధపడే
వ్యక్తి = మనిషి
సంఘానికి = సమాజానికి
జాతికి ఔ = జాతికి కూడా
నొక = ఒక
విఘాతము = చేటును
మాన్పగలేడు = పోగొట్టలేడు
ఎట్టిది + ఔ = ఎటువంటిది అయినా
పూనికతోడ = ప్రయత్నముతో
కొల్వునకున్ = సేవకు, ఉద్యోగానికి
పోయిన = వెళ్ళినా, వెళ్తే
స్వేచ్ఛ నశించు = స్వేచ్ఛ నశిస్తుంది.

తాత్పర్యం : ఓ దుందుభి! జానెడు పొట్టకోసం ఇతరులకు సేవ చేయడానికి శరీరాన్ని అమ్మి నీచత్వాన్ని ఇచ్చే జీవితంలో దుఃఖాన్ని పొంది చాలా బాధపడే వ్యక్తి సమాజానికి, తన జాతికి ఒక చేటును కూడా పోగొట్టలేడు. ఎటువంటిది అయినా ప్రయత్నపూర్వకంగా ఉద్యోగానికి వెళ్తే స్వేచ్ఛ నశిస్తుంది.

17వ పద్యం :

దుందుభీ ! అలల చేతుల నెత్తి నీ వాడు
నాటలన్ గని తరుపు లలరులం బులకించె
పులకపులకయు నొక్క పుష్పమై వికసించె
పుష్ప మొక మధుపాత్రబోలి విందులు వెట్ట
ప్రవహించి మాసీమ పావనమ్ముగ జేసి
తెలుగు సంస్కృతులతో తేజరిల్లెడి నీవు
మా పొలాలకు పాలు జేప బారితిగాన
నీ యుదంతము కొంత నిలిపితిని కావ్యాన.

ప్రతిపదార్థం :

దుందుభి ! = ఓ దుందుభి
అలల చేతుల నెత్తి = అలలు అనే చేతులతో
నీవు + ఆడున్ = నీవు ఆడే
ఆటలన్ గని = ఆటలు చూసి
తరువులు = = చెట్లు
అలరులన్ = పూవులతో
పులకించె = పులకరించాయి
పులక పులకయున్ = ఒక్కొక్క పులకరింత
ఒక్క = ఒక్కొక్క
పుష్పము + ఐ = పూవుగా
వికసించే = వికసించింది
పుష్పము + ఒక = ప్రతీ పూవు ఒక
మధు పాత్రన్ + బోలి = తేనె నింపిన పాత్ర లాగా
విందులు + పెట్టన్ = ఆతిథ్యమివ్వగా
ప్రవహించి = ప్రవహించి
మా సీమన్ = మా భూమిని
పావనమ్ముగ జేసి = పవిత్రంగా మార్చి
తెలుగు సంస్కృతులతో = తెలుగు వారి సంస్కృతులతో
తేజరిల్లెడి = ప్రకాశించే
నీవు = నీవు
మా పొలాలకున్ = మా పంట భూములకు
పాలు చేపన్ = పాలు ఇవ్వడానికి
పారితి కానన్ = ప్రవహించావు కావున
నీ + ఉదంతము = నీ చరిత్రను,
కావ్యాన = కావ్యంలో
కొంత = కొద్దిగా
నిలిపితిన్ = నిలిపాను, తెలిపాను

తాత్పర్యం : ఓ దుందుభి ! అలలు అనే చేతులతో నీవు ఆడే ఆటలు చూసి చెట్లు పూలతో పులకరించాయి. ఒక్కొక్క పులకరింత ఒక్కొక్క పుష్పమై వికసించింది. పుష్పించిన ఒక్కొక్క పూవు ఒక్కొక్క తేనె నిండిన పాత్రగా ఆతిథ్యం ఇచ్చింది. నీవు ప్రవహించి మా సీమను పవిత్రంగా మార్చావు. తెలుగు సంస్కృతులతో ప్రకాశించే నీవు మా పంట భూములకు పాలు (పాలవంటి బలమైన నీరు) ఇవ్వడానికి ప్రవహించావు కావున నీ చరిత్రను కొంచెం కావ్యంలో నిలిపాను.

18వ పద్యం :

భాగ్యనగరాత్యంత పరిసరమ్ముల బుట్టి
పాలమూ ర్మండలపు భాగాన బంధింప
బడి నీలగిరిసీమ బరగు దేవరకొండ
భూముల బండించి ముందు కటునటు సాగి
పలనాటి బ్రహ్మయ్య పరగణాలో బారు
కృష్ణమ్మలో గలసి కెలకుల నడయాడి
ఏలేశ్వరుని పూజ కేగి భక్తులతోడ
అట నుపాధ్యాయు కీర్త్యంశముల గొన్నింటి
వెలువరచి చరిత కొక వెలుగుబాటను జూపి

ప్రతిపదార్థం :

భాగ్యనగర = హైదరాబాదుకు
అత్యంత పరిసరమ్ములన్ = అతి సమీపములో
పుట్టి = జన్మించి
పాలమూరు మండలపు భాగాన = పాలమూరు (మహబూబ్నగర్) జిల్లా ప్రాంతంలో
బంధింపబడి = ఆనకట్టచే నిలుపబడి
నీలగిరిసీమన్ + పరగు = నీలగిరి (నల్లగొండ జిల్లా) ప్రాంతంలో ఉన్న
దేవరకొండ = దేవరకొండ
భూములన్ పండించి = పొలాలను పండే విధంగా చేసి
ముందుకు = ఇంకా ముందుకు
అటునటు = అలా అలా
సాగి = ప్రవహించి
పలనాటి బ్రహ్మయ్య = పలనాటి బ్రహ్మనాయుడు
పరగణాలో = పాలించిన ప్రాంతంలో
పారు = పారి
కృష్ణమ్మలో గలసి = కృష్ణానదిలో
కెలకుల = దగ్గరలో
నడయాడి = ప్రవహించి
ఏలేశ్వరుని పూజకు ఏగి = ఏలేశ్వర స్వామి పూజకు పోయి
భక్తుల తోడ = భక్తులతో
అటన్ = అక్కడ
ఉపాధ్యాయున్ = నాగార్జునుని
కీర్తి + అంశములన్ = కీర్తికి సంబంధించిన అంశాలను
కొన్నింటి = కొన్నిటిని
వెలువరచి = చెప్పి
చరితకు ఒక = చరిత్ర రాయడానికి ఒక
వెలుగుబాటను = కాంతి మార్గాన్ని
చూపి = చూపించి

తాత్పర్యం : హైదరాబాదుకు అతి సమీపంలో జన్మించి, మహబూబ్ నగర్ జిల్లాలో ఆనకట్టచే బంధించబడి, నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతంలోని భూములలో పంటలు పండించి, ఇంకా ముందుకు అలాఅలా ప్రవహించి, పలనాటి బ్రహ్మనాయుడు పాలించిన ప్రాంతంలో పారి కృష్ణానదికి అతి దగ్గరలో ఏలేశ్వర స్వామి పూజలు చేసి అక్కడి భక్తులకు ఆచార్య నాగార్జునుని కీర్తిని చెప్పి చరిత్ర రాయడానికి వెలుగు బాటలు చూపి,

TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి

19వ పద్యం :

ఇక్ష్వాకువంశీయు లేలిన విజయపురిం
దరిసి నాగార్జునుని దర్శించి ధన్యవై
తెలుగుభూముల సస్యఫలభరితముల జేసి
ఆచంద్రతారార్క మాంధ్రసంతతికి ఆ
శీరక్షతలను సచ్చీలంబు జేకూర్చి
ఇహపరమ్ములను సర్వేప్పితమ్ము లొసంగి
మము బెంచు తల్లివై మా పాలవెల్లివై
ప్రవహింతువా దుందుభీ !
మా సీమ
పాలయేఱుగ దుందుభీ !

ప్రతిపదార్థం :

దుందుభి! = ఓ దుందుభి
ఇక్ష్వాకువంశీయు లేలిన = ఇక్ష్వాకు వంశస్థులు పరిపాలించిన
విజయపురిన్ = విజయపురాన్ని
తరిసి = చేరి
నాగార్జునుని = ఆచార్య నాగార్జునున్ని
దర్శించి = చూసి
ధన్యవై = ధన్యతను పొంది
తెలుగు భూములన్ = తెలుగు నేలలో
సస్య ఫల భరితముల జేసి = పైరు పంటలతో నింపి
ఆ చంద్ర తార + అర్కము = నక్షత్రాలు, సూర్య చంద్రులు ఉన్నంతకాలం (శాశ్వతంగా)
ఆంధ్ర సంతతికి = తెలుగుతల్లి బిడ్డలకు
ఆశీః + అక్షతలను = ఆశీర్వదపూర్వక అక్షతలను
సత్ + శీలంబున్ = మంచి నడవడిని
చేకూర్చి = అందించి
ఇహ పరమ్ములను = ఈ లోకములో, పరలోకంలో
సర్వ + ఈప్పితమ్ములు = అన్ని కోరికలను
ఒసంగి = తీర్చి
మము బెంచు తల్లివై = మమ్మల్ని పెంచే తల్లిగా మారి
మా పాలవెల్లివి + ఐ = మాకు పాల ప్రవాహానివై
ప్రవహించువా = ప్రవహిస్తావా
మా సీమ = మా ప్రాంతాలలో
పాలయేఱుగ = పాల నదిలాగా
దుందుభీ! = దుందుభి నదీ!

తాత్పర్యం : ఓ దుందుభి ! ఇక్ష్వాకులు పరిపాలించిన విజయపురాన్ని చేరి, ఆచార్య నాగార్జునున్ని చూసి ధన్యతను పొంది, తెలుగు నేలను పైరు పంటలతో నింపి, శాశ్వతంగా తెలుగు బిడ్డలకు నీ ఆశిస్సులనే అక్షతలను, మంచి నడవడిని అందించి, ఈ లోకంలో, పరలోకంలో (బతికుండగా, చనిపోయిన తరువాత) అన్ని కోరికలను తీర్చి మమ్మల్ని పెంచే తల్లిగా మాకు పాలవెల్లిగా ప్రవహిస్తావా ! మా ప్రాంతంలో పాల ఏరుగా ప్రవహిస్తావా !

కంఠస్థం చేయవలసిన పద్యాలు, ప్రతిపదార్థ, తాత్పర్యములు :

కవి పరిచయం : ఈ పద్యం గంగాపురం హనుమచ్ఛర్మ గారు రాసిన దుందుభి కావ్యం నుంచి గ్రహింపబడినది.
(ప్రతిపదార్థ తాత్పర్యాలు రాసే ముందు కవి పరిచయం రాయాలి.)

1వ పద్యం :

ఉ||
పట్టినరాయి శిల్పమయి, పాతిన బండలు శాసనమ్ములై,
కట్టిన దేవళమ్ముల వికాసము జాతికి జీవగఱ్ఱయై,
పుట్టువు సార్ధతం బొరయ పొల్పుమిగిల్చిన శ్రీచళుక్య స
మ్రాట్టులు నీదు తీరమున రాచరికమ్ముల నోచి రెందరో.

ప్రతిపదార్థం :

పట్టినరాయి = (వారు) పట్టుకున్న ప్రతీ రాయి
శిల్పము + ఐ = శిల్పంగా మరి
పాతిన = భూమిలో నిలిపిన
బండలు = రాళ్లు అన్ని
శాసనమ్ములు + ఐ = శాసనాలుగా మారి
కట్టిన = కట్టించిన
దేవళమ్ముల = దేవాలయాల
వికాసము = అభివృద్ధి
జాతికి = తెలుగు జాతికి
జీవగఱ్ఱయై = జీవనాధారమై
పుట్టువు = జన్మ
సార్ధతంబు ఒరయ = సాఫల్యం చెందగా
పొల్పు మిగిల్చిన = స్థిరత్వాన్ని పొందిన
శ్రీచళుక్య సమ్రాట్టులు శ్రీ చాళుక్య వంశానికి చెందిన చక్రవర్తులు
నీదు = నీ యొక్క
తీరమున = తీరంలో
ఎందరో = ఎంతో మంది
రాచరికమ్ములన్ = రాజులుగా
నోచిరి = నోచుకున్నారు, అదృష్టాన్ని పొందారు

తాత్పర్యం : పట్టుకున్న ప్రతీ రాయి శిల్పంగా మారి, భూమిలో పాతిన బండలన్ని శాసనాలుగా మారి, కట్టించిన దేవాలయాల అభివృద్ధి తెలుగు జాతికి జీవనాధారంగా మారి జన్మ సార్థకం చేసుకున్న ఎందరో శ్రీ చాళుక్య చక్రవర్తులు నీ తీరంలోనే రాజులుగా అదృష్టాన్ని పొందారు.

2వ పద్యం :

ఉ||
అద్దమువంటి నీజలము లందు స్వరూపము దిద్దుచున్న యా
నిద్దపు చందమామ యొడి నిద్దుర నొందగ కీచురాళ్ళతో
దద్దయు జోలబాడిన విధమ్మున, నూగు తరంగడోలికన్
ముద్దుగ నిద్రబుచ్చెదు ప్రపుల్లశరత్తుల మాతృమూర్తివై.

ప్రతిపదార్థం:

అద్దమువంటి = అద్దం లాంటి స్వచ్ఛమైన
నీ జలముల+అందు = నీ నీటిలో
స్వరూపమున్ = తన రూపాన్ని
దిద్దుచున్న = చూసుకుంటున్న, అలంకరించుకుంటున్న
ఆ నిద్దపు = ఆ అందమైన
చందమామ = చందమామ
ఒడి నిద్దురన్ ఒందగ = నీ ఒడిలో నిద్ర పోతున్నప్పుడు
కీచురాళ్ళతో = కీచురాయి కీటకాల శబ్దాలతో
తద్దయు జోల = మంచి జోల పాటలను
పాడిన విధమ్మునన్ = పాడిన తీరుగా
ఊగు = ఊగుతున్న
తరంగ డోలికన్ = అలలు అనే ఉయ్యాలలో
ముద్దుగ = ముద్దుగొలిపే విధంగా
ప్రపుల్ల = ప్రకాశవంతమైన
శరత్తుల = శరత్కాలంలోని వెన్నెలలో
మాతృమూర్తివై = తల్లిలాగ మారి
నిద్రపుచ్చెదు = నిద్రపుచ్చుతున్నావు

అద్దంలాగా స్వచ్చంగా ఉన్న నీ నీటిలో తన రూపాన్ని చూసుకుంటున్న ఆ అందమైన చందమామ నీ ఒడిలో నిద్రపోతున్నప్పుడు కీచురాయి శబ్దాలతో జోలపాటలు పాడిన విధంగా ఊగుతున్న అలలు అనే ఊయలలో ముద్దుగొలిపే విధంగా ప్రకాశవంతమైన శరత్కాలంలోని వెన్నెలలో తల్లిలాగామారి నిద్రపుచ్చుతున్నావు.

అలతులు శ్రావ్యమౌ పలుకు లందము చిందగ రంగు దిద్దిన
ట్టులు తమరెక్క లొప్ప నుదుటుం గొని సచ్ఛకునాళిఁ జూపి మా
పొలముల క్రొత్తగింజల బుభుక్షల బాసెడు పాలపిట్ట జం
టలఁ గనుగొంచు ముందుకు హుటాహుటి సాగుము రమ్యవాహినీ !

రమ్యవాహినీ ! = అందంగా ప్రవహించేదానా!, దుందుభి !
అలతులు = అతి కానివి, చిన్నవి
శ్రావ్యము + ఔ = వినడానికి బాగున్న, విన సొంపైన
పలుకుల = మాటలతో
అందము చిందగ = అందం ఏర్పడగా
రంగు దిద్దినట్టులు = రంగులు వేసినట్లు
తమరెక్కలు + ఒప్ప = తమ రెక్కలు ప్రకాశించగా
ఉదుటుం గొని = గర్వంతో
సత్ + శకున + ఆళిన్ = మంచి శకునాల సమూహాన్ని
చూపి = చూపించి
మా పొలముల = మా పొలాలలోని
క్రొత్తగింజల = కొత్తగా పండిన పంట గింజలను
బుభుక్షల బాసెడు = ఆకలిని తీర్చుకునే
పాలపిట్ట జంటలన్ = పాలపిట్టల జంటలను
కనుగొంచు = చూస్తూ
హుటాహుటి = హడావిడిగా
ముందుకు = ముందు వైపు
సాగుము = సాగిపొమ్ము

అందంగా ప్రవహించే ఓ దుందుభి! వినసొంపైన చిన్న మాటలతో అందంగా రంగులు వేసినట్లున్న రెక్కలు ప్రకాశిస్తుండగా, గర్వంతో మంచి శకునాలను చూపించి, మా పొలాలలో కొత్తగా పండిన పంట గింజలతో ఆకలిని తీర్చుకుంటున్న పాలపిట్టల జంటలను చూస్తూ హడావిడిగా ముందుకు సాగిపొమ్ము.

TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి

దుందుభి Summary in Telugu

(‘దుందుభి ‘ కావ్యంలోనిది)

TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి 1

కవి పరిచయం

పాఠ్యాంశం పేరు దేని నుండి : దుందుభి
గ్రహింపబడినది : ‘దుందుభి’ కావ్యము నుండి గ్రహింపబడింది.
కవి పేరు : గంగాపురం హనుమచ్ఛర్మ
కాలం : జననం : 1925 మరణం : ఆగష్టు 15, 1996
స్వస్థలం : నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి దగ్గరున్న గుండూరు (జన్మస్థలం: వేపూరు)
తల్లిదండ్రులు : సీతమ్మ, రామకిష్టయ్య
చదువు : సంస్కృతాంధ్రసాహిత్యం, వ్యాకరణం, అలంకారశాస్త్రం క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. ఋగ్వేదాన్ని నేర్చుకోవడమేగాక తర్వాత కాలంలో నృసింహ దీక్షితులతో కలిసి “ఋగ్వేద విజ్ఞానం” రచించాడు.
విశేషతలు : స్వాతంత్రోద్యమం, భూదానోద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. తన స్వగ్రామంతోపాటు కల్వకుర్తి తాలూకాలో అనేక గ్రామాల్లో విద్యార్థుల కొరకు పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు కృషిచేశాడు. అన్ని కులాల వారి ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు, వ్రతాలు ఇతర పౌరోహిత కార్యక్రమాలు హనుమచ్ఛర్మ చేస్తుంటే అందరూ ఆ కాలంలో వింతగా చూసేవారు. అది అతనిలోని సామాజిక సమరసతకు నిదర్శనం. హనుమచ్ఛర్మకు బాల్యంనుంచి కవిత్వంపై కూడా ఆసక్తి ఎక్కువ.
రచనలు : హనుమచ్ఛర్మ ‘దుందుభి’ కావ్యం ముద్రితంకాగా మల్కిభరాముడు, గోపన, గంగాపురం చెన్నకేశవ సుప్రభాతం అముద్రితాలు.

పాఠ్యభాగ సందర్భం

పూర్వ పాలమూరు (మహబూబ్ నగర్) జిల్లా జీవనాధారం దుందుభి నది. ఈ నది షాబాద్ కొండల్లో పుట్టి డిండి దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. హనుమచ్ఛర్మ ఈ నదిని చూసి ఉప్పొంగి కవిత్వం రాశాడు. దుందుభిలా సాగిన హనుమచ్ఛర్మ పద్య ధార శ్రావ్యంగా ఉంటుంది. దుందుభి అందచందాలను, విశిష్టతను పరిచయం చేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం.

పాఠ్యభాగ సారాంశం

ఓ దుందుభి ! తొలకరి వాన కురవగానే పెద్ద అలలతో స్నేహం చేసి, గట్లతో యుద్ధంచేసి వాటిని తాకుతూ, మా గ్రామాల్లోని భూముల బాధ పోగొట్టడానికి వచ్చి, మా కోరికలు తీర్చే విధంగా పైరు పంటలతో మా మనసులను ఆనందపరిచి, గోదావరి కృష్ణా నదులు మాకు అందడం లేదనే బాధను తీర్చావు. ఇదే నిజమైన ప్రసిద్ధి అవుతుంది. మా అమ్మ వంటి దుందుభి ! బంగారు రంగులు నిండిన సంధ్యా సమయాలు, మామిడి పూతను తిని ఎక్కువగా సంతోషించి కోకిలలు చేస్తున్న శబ్దాలు, తొలకరి వర్షానికి ముందు కనిపించే నల్లని మేఘాలు, ఆ మబ్బుల్లోంచి తొంగి చూసే మెరుపులు నాకు ఒక ఆలోచనను కలిగించి కొత్త గీతాలతో నిన్ను ఆనంద పరచుమన్నవి.

ఓ దుందుభి ! తలచుకోగానే నీ హృదయమనే వీణ తెగలపై ఝం అనే ధ్వనులు వెలువడ్డాయా ? కదలగానే నీ అమాయకత్వము నీరుగా మారిందా ? రాళ్లు కరిగాయా ? నీ హృదయంలో కీర్తించే నీ ప్రియుడైన భర్తపై ప్రేమలు గిలిగింతలు పెడుతున్నాయా ? ఆగకుండా వస్తున్నావు ? కొంతమంది స్వార్థపరులు వారి విలాసాలకోసం ఏవో చట్టాలు చేసి ఈ భూమిని ఆక్రమించుకుని గర్వాన్ని పొంది వారి ఆనందం కోసం చేసిన ఒత్తిడి కారణంగా సమయానికి ఆహారం తీసుకోలేక బాధతో మరణించి దీనస్థితిలో ఎండిపోయిన వారి అస్థిపంజరాలు నీ ఒడిలో శాశ్వతమైన శాంతిని, సుఖాన్ని పొందాయి.

పట్టుకున్న ప్రతీ రాయి శిల్పంగా మారి, భూమిలో పాతిన బండలన్ని శాసనాలుగా మారి, కట్టించిన దేవాలయాల అభివృద్ధి తెలుగు జాతికి జీవనాధారంగా మారి జన్మ సార్థకం చేసుకున్న ఎందరో శ్రీ చాళుక్య చక్రవర్తులు నీ తీరంలోనే రాజులుగా అదృష్టాన్ని పొందారు.

ఆహా! ఓ దుందుభి! అధికమైన కరుణతో పేదల వైపు నిలిచి, ధనమే ప్రధానమని భావించే గుణాన్ని అసహ్యించుకుంటూ, జనుమును తుంగ గడ్డిని, చాలా పొడుగ్గా పెంచి, వారు నివసించడానికి గుడిసెలను కట్టిచ్చి, తాగడానికి మంచి నీటిని ఇచ్చినందుకు కలిగిన సంతోషంతో గంతులు వేస్తున్నావు.

ఓ దుందుభి నదీ! రాయిని ఉలితో మలచి, మూసలో కరిగించి పోసిన చిత్రాల లాగా స్వేచ్ఛగా కల్పించిన ఆకారాలకు రూపం ఇచ్చి చూసిన ప్రజలను ఆనందపరచి, పేరుకూడా ఆశించని శిల్పకులంలోని గొప్పవారి చేతి నైపుణ్యం లాగ మమ్మల్ని ఆనందింప చేయడానికి ప్రతీ వర్షాకాలంలో ప్రవహిస్తావా ?

కత్తిని, కలాన్ని సమానంగా ఉపయోగించి కావ్యాలలోను, ప్రవృత్తిలోను రౌద్ర రసాలను కోరేవారికి ఆనందాన్ని కలిగించేలా చేసిన కళాకారుడైన వీరుడు గోనబుద్ధారెడ్డి నీస్నేహం కారణంగా అపూర్వమైన చరిత్ర రంగనాథ రామాయణాన్ని రచించాడు.

అటువంటి సుకుమారమైన నీ శరీరంలో వరదల సమయంలో కఠినత్వాన్ని పెంచుకుంటావా ? తెలియని సమయంలో (ప్రాచీన కాలంలో) కూడా శైవానికి, వైష్ణవానికి సంబంధించిన అంశాలపై నీ మనస్సులో అనాసక్తత లేదు. (విష్ణువుకు ఇష్టమైన) మంచి తులసి చెట్ల వరుసలతో, (శివునికి ఇష్టమైన) మారేడు వృక్షాల సమూహాలతో నీ రెండు తీరాలను నింపి ఉంచుతూ, తిక్కన కలము చెప్పిన (హరి హరాద్వైత) శివకేశవ తత్వాన్ని తెలుసుకొని సంపన్నురాలవై ప్రవహిస్తున్నావు.

అద్దంలాగా స్వచ్చంగా ఉన్న నీ నీటిలో తన రూపాన్ని చూసుకుంటున్న ఆ అందమైన చందమామ నీ ఒడిలో నిద్రపోతున్నప్పుడు కీచురాయి శబ్దాలతో జోలపాటలు పాడిన విధంగా ఊగుతున్న అలలు అనే ఊయలలో ముద్దుగొలిపే విధంగా ప్రకాశవంతమైన శరత్కాలంలోని వెన్నెలలో తల్లిలాగామారి నిద్రపుచ్చుతున్నావు.

పేదవారి ఇండ్లకోసం తమ శరీరాన్ని పెంచి, భిన్నత్వం లేని విధంగా పేర్చుచు, మనసులో గాఢమైన గౌరవ భావతరంగాల వలె తాటి కమ్మలతో గుడిసె కప్పును తయారు చేసి మెప్పును పొందుచు, వాటి శక్తి నశించగానే తాటి ఆకుల కుప్పతో వేసిన చలి మంటలతో పేదవారు చలిని పోగొట్టుకుంటారు.

నీవు పెంచిన కారణంగా తాటి చెట్లపై ప్రేమలు పెరిగాయి. భయంలేకుండా లోకంలో సాగిన హింసను లేకుండా చేయడానికి పాదాల దగ్గర ఉన్న చీమలుకూడా చనిపోకుండా చూసే, శుభాన్ని కలిగించే మనసుతో, నశించి పోతున్న మానవత్వాన్ని తిరిగి నిలపడానికి ప్రయత్నించిన జైన తీర్థంకరులకు కూడా తాగడానికి అనువైన జలాన్ని ఇచ్చిన కీర్తిని పొందవా (పొందావు అని భావం)

పరిశుద్ధమైన, ప్రకాశవంతమైన, ఓ దుందుభి నదీ! నిన్ను బంధించారు. ఇదెక్కడి పిచ్చి తెలివి ? పవిత్రమైన భావాలను ఆపడం సాధ్యమా ? మిక్కిలి తీవ్రమైన అగ్నిని తీసుకొని మూటలో బంధించడం, నీటిని ఆపడం స్వేచ్ఛయే జీవితంగా కలదానివైన నీ విషయంలో సాధ్యమవుతుందా ?

కదులుతున్న గడ్డిపోచకు కూడా భయపడి చెల్లాచెదరుగా పారిపోయే జింకల, దుప్పుల, సమూహాలు అడవిలో తిరిగి తిరిగి అలిసిపోయి దాహంతో నీరు తాగడానికి నీ దగ్గరకు వచ్చి కింది పెదవులు ఆనించి నీరు తాగుతుండగా చూసి స్వార్థంతో పెరిగిన చేపలు గంతులు వేస్తుంటే దాహం తీరక కలిగే బాధతో అవి దిక్కులు పట్టుకొని పారిపోతుంటే ఉపాయంతో చూస్తావా !

సగం పేగును తడపడానికి సరిపోని అత్యంత తక్కువ ఆహరం కూడా లేని, రక్తాన్ని ఆవిరిగా చేసి, లోకానికి మంచి చేయడానికి ప్రయత్నం చేసి ఈ భూమిని తమ చెమటతో తడిపి కష్టాలతో బాధపడే మానవులకు అత్యంత ప్రేమతో మంచి మొదటి పంటగా సీతాఫలాలను ఇచ్చే నీ కారుణ్యాన్ని మెచ్చుకుంటాను. అందంగా ప్రవహించే ఓ దుందుభి ! వినసొంపైన చిన్న మాటలతో అందంగా రంగులు వేసినట్లున్న రెక్కలు ప్రకాశిస్తుండగా, గర్వంతో మంచి శకునాలను చూపించి, మా పొలాలలో కొత్తగా పండిన పంట గింజలతో ఆకలిని తీర్చుకుంటున్న పాలపిట్టల జంటలను చూస్తూ హడావిడిగా ముందుకు సాగిపొమ్ము.

గతంలో ప్రచారంలో ఉన్న రసవాద విద్యద్వారా బంగారాన్ని పుట్టించే స్వర్ణయోగం ఏమైనది ? వరుసగా అష్టసిద్ధులు ఏ నీటిలో మునిగిపోయాయి. యజ్ఞ యాగాలు చేసే విధానాలు తెలుసుకోలేని తెలివి తక్కువతనం ప్రకటితమయింది. (తెలివి తక్కువతనం అందరికి తెలిసింది అని భావం)

ఋషుల ద్వారా (వేదాల ద్వారా) తెలుపబడిన జీవన విలువలను పాటించక కొత్తగా వచ్చిన పాశ్చాత్య నాగరికతను ఆచరించి చివరికి ఒక పొల్లు గింజలాగా ఎందుకు పనికి రాకుండా పోయాను. భారతమాత భరించలేని భారంగా మారాను కదా ! ఓ దుందుభి ! జానెడు పొట్టకోసం ఇతరులకు సేవ చేయడానికి శరీరాన్ని అమ్మి నీచత్వాన్ని ఇచ్చే జీవితంలో దుఃఖాన్ని పొంది చాలా బాధపడే వ్యక్తి సమాజానికి, తన జాతికి ఒక చేటును కూడా పోగొట్ట లేడు. ఎటువంటిది అయినా ప్రయత్నపూర్వకంగా ఉద్యోగానికి వెళ్తే స్వేచ్ఛ నశిస్తుంది.

ఓ దుందుభి ! అలలు అనే చేతులతో నీవు ఆడే ఆటలు చూసి చెట్లు పూలతో పులకరించాయి. ఒక్కొక్క పులకరింత ఒక్కొక్క పుష్పమై వికసించింది. పుష్పించిన ఒక్కొక్క పూవు ఒక్కొక్క తేనె నిండిన పాత్రగా ఆతిథ్యం ఇచ్చింది. నీవు ప్రవహించి మా సీమను పవిత్రంగా మార్చావు. తెలుగు సంస్కృతులతో ప్రకాశించే నీవు మా పంట భూములకు పాలు (పాలవంటి బలమైన నీరు) ఇవ్వడానికి ప్రవహించావు కావున నీ చరిత్రను కొంచెం కావ్యంలో నిలిపాను.

హైదరాబాదుకు అతి సమీపంలో జన్మించి, మహబూబ్నగర్ జిల్లాలో ఆనకట్టచే బంధించబడి, నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతంలోని భూములలో పంటలు పండించి, ఇంకా ముందుకు అలాఅలా ప్రవహించి, పలనాటి బ్రహ్మనాయుడు పాలించిన ప్రాంతంలో పారి కృష్ణానదికి అతి దగ్గరలో ఏలేశ్వర స్వామి పూజలు చేసి అక్కడి భక్తులకు ఆచార్య నాగార్జునుని కీర్తిని చెప్పి చరిత్ర రాయడానికి వెలుగు బాటలు చూపి, ఇక్ష్వాకులు పరిపాలించిన విజయపురాన్ని చేరి, ఆచార్య నాగార్జునున్ని చూసి ధన్యతను పొంది, తెలుగు నేలను పైరు పంటలతో నింపి, శాశ్వతంగా తెలుగు బిడ్డలకు నీ ఆశిస్సులనే అక్షతలను, మంచి నడవడిని అందించి, ఈ లోకంలో, పరలోకంలో (బతికుండగా, చనిపోయిన తరువాత) అన్ని కోరికలను తీర్చి మమ్మల్ని పెంచే తల్లిగా మాకు పాలవెల్లిగా ప్రవహిస్తావా! మా ప్రాంతంలో పాల ఏరుగా ప్రవహిస్తావా ! దుందుభి !

TS Inter 1st Year History Study Material Chapter 10 మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 10th Lesson మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 10th Lesson మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మరాఠాల విజృంభణకు దారితీసిన పరిస్థితులను వివరించండి.
జవాబు.
మరాఠా ప్రజల శీలమును, వారి చరిత్ర గతిని నిర్ణయించడంలో ఆ ప్రాంతపు భౌగోళిక అంశాలు గొప్ప ప్రభావాన్ని చూపాయి. మహారాష్ట్ర ప్రాంతానికి రెండువైపుల నుంచి సహ్యాద్రి, వింధ్య, సాత్పూరా పర్వత శ్రేణులు రక్షణ కవచంలా ఉండగా, నర్మదా, తపతి నదులు మహారాష్ట్ర ప్రాంతాన్ని రక్షిస్తూ రక్షణకు ఉపకరించే పర్వత కోటల నిర్మాణానికి కారణమయ్యాయి. ఫలితంగా ఈ ప్రాంతంలో అత్యంత, వ్యూహాత్మక, సహజ రక్షణలకు అనువై, శత్రు దుర్భేద్యమైన కోటలు నిర్మించబడి, శత్రువులు వశపరచుకోవడానికి అంతగా సాధ్యపడలేదు. అత్యల్ప వర్షపాతం పైగా సారవంతం కాని భూములు వల్ల మరాఠాలు ధృడ శరీరులై కష్టపడితే తప్ప కడుపు నిండని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా మహారాష్ట్రులలో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా తట్టుకొనే లక్షణాలు స్వతహాగా ఏర్పడ్డాయి.

పైన పేర్కొన్న భౌగోళిక అంశాల ప్రభావంతోపాటుగా, మహారాష్ట్ర భక్తి ఉద్యమకారులైన తుకారాం, రామదాస్, వామన పండితుల బోధనలు మరాఠాలను చైతన్యపరిచాయి. ఫలితంగా, భగవంతుని ముందు అందరూ సమానులేనన్న భావన ప్రజల్లో బాగా పాతుకుపోయింది. వారు విభేదాలు మరిచిపోయి, ఏక జాతిగా రూపొందేందుకు దోహదపడ్డాయి. ఈ భావనను మహారాష్ట్ర సాహిత్యం మరింత పెంపొందించింది. సమర్థరామదాసు రచించిన ‘దశబోధ’ గ్రంథం శివాజీని మాత్రమే ఉత్తేజపరచకుండా, యావత్ మహారాష్ట్ర జాతిలో తమ ఆత్మ గౌరవం కాపాడుకోవడానికి స్వతంత్ర మరాఠా రాజ్యస్థాపన ఆవశ్యకతను తెలియజేసింది.

TS Inter 1st Year History Study Material Chapter 10 మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

అంతేకాకుండా బీజాపూర్, అహ్మద్ నగర్, గోల్కొండ రాజ్యాల్లో మరాఠా నాయకులు వివిధ హోదాల్లో పనిచేసి సైనిక, పాలనానుభవాన్ని గడించారు. మరాఠా సర్దారులు అందించిన సేవలకు గాను దక్కన్ సుల్తానులు వారిని నాయక్, రావ్ లాంటి బిరుదులతో సత్కరించారు. చందర్రావ్ మోరే, యశ్వంత్ రావ్, నాయక్ నింబాల్కర్, లోక్ జాదవ్వ్, షాజీ భోంస్లే లాంటి మరాఠా సర్దారులు దక్కన్ రాజ్యాల్లో మంచి కీర్తిప్రతిష్టలు సంపాదించుకొన్నారు. ఈ విధంగా పైన పేర్కొన్న కారణాలన్నీ శివాజీ నాయకత్వంలో మహారాష్ట్ర జాతి రాజ్య నిర్మాణానికి దోహదపడ్డాయి.

ప్రశ్న 2.
శివాజి సాధించిన విజయాలు, ఘనతలు చర్చించండి.
జవాబు.
మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన శివాజీ 1627లో షాజీ భోంస్లే, జిజియాబాయి దంపతులకు పూనాకు సుమారు యాభైమైళ్ల దూరంలోని ‘శివనేర్’ దుర్గంలో జన్మించాడు. షాజీభోంస్లే మేవార్ను పాలించిన సిసోడియా వంశానికి `చెందినవాడు. తల్లి జిజియాబాయి దేవగిరిని పాలించిన యాదవ వంశానికి చెందిన ఉన్నత కుటుంబీకురాలు. 1636లో షాజీ భోంస్లే శివనేర్ దుర్గాన్ని కోల్పోవడంతో, దాదాజీ కొండదేవ్ రక్షణలో శివాజీ తన తల్లితో కలసి పూనాకు మకాం మార్చడం జరిగింది. శివాజీ పూనాలో అతని తల్లి పర్యవేక్షణలో పెరిగాడు. ఆమె తన బోధనల ద్వారా, ఆచరణ ద్వారా హిందూ మత పరిరక్షణపై శివాజీకి అపరిమితమైన ఉత్సాహాన్ని కలిగించింది. సమర్థుడు, ప్రజ్ఞాశాలి అయిన దాదాజీ కొండదేవ్ శిక్షణలో శివాజీ ఆరితేరిన యోధుడుగా, దక్షుడైన పరిపాలకుడుగా తీర్చిదిద్దబడ్డాడు. తన సంరక్షకుడైన దాదాజీ కొండదేవ్ 1647లో మరణించడంతో, శివాజీ పూనా జాగీరు బాధ్యతలను స్వతంత్రంగా నిర్వహించడం మొదలుపెట్టాడు. ఇదే క్రమంలో తనకు నమ్మకమైన మావళీ తెగ నాయకులతో సంబంధాలను బలోపేతం చేసుకొన్నాడు. మావళీలే తర్వాత కాలంలో శివాజీ సైన్యంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

శివాజీ తన పంతొమ్మిదో ఏట నుంచి తన సైనిక జీవితాన్ని ప్రారంభించాడు. మొదటగా 1646లో తోరణ దుర్గాన్ని ఆక్రమించాడు. తదనంతరం వరుసగా చాకనా, కొండన, రాయఘడ్, పురంధర్ మొదలైన దుర్గాలను వశపరచుకొన్నాడు. రాయగడ్ వద్ద నూతన దుర్గాన్ని నిర్మించి, దాన్ని తన కార్యకలాపాలకు కేంద్రంగా చేసుకొన్నాడు. శివాజీ కళ్యాణ్ దుర్గాన్ని ముట్టడించినప్పుడు బీజాపూర్ సుల్తాన్ అప్రమత్తమయ్యాడు. శివాజీని లొంగదీసుకోవాలని అతని తండ్రి షాజీ భోంస్లేను బందీగా పట్టుకొన్నాడు. చివరకు శివాజీ బెంగుళూరు, కొండన దుర్గాలను బీజాపూర్ సుల్తాన్కు ఇచ్చి తన తండ్రిని విడిపించుకొన్నాడు. తర్వాత శివాజీ ఆరు సంవత్సరాలపాటు (1649-1655) తన దండయాత్రలు మానివేసి, తాను గెలిచిన ప్రాంతాలను సాధన సంపత్తిని సుస్థిర పరచుకొనే ప్రయత్నం చేశాడు.

శివాజీ బీజాపూర్ ప్రాంతంపై 1656 నుంచి మళ్లీ తన దండయాత్రలను ప్రారంభించాడు. 1656లో మొదటగా చంద్రరావ్ మోర్ను ఓడించి జావళీ దుర్గాన్ని వశపరుచుకొన్నాడు. నాటి నుంచి జావళి దుర్గం, శివాజీ సైనిక చర్యలకు కీలక స్థావరమైంది. తర్వాత ఉత్తర కొంకణ తీరాన్ని, కళ్యాణ్ దుర్గాన్ని జయించాడు. పోర్చుగీసు వారి స్థావరమైన డామన్ ఓడ రేవును దోచుకున్నాడు. శివాజీ దాడులతో అప్రమత్తమైన బీజాపూర్ సుల్తాన్ క్రీ. శ. 1659లో శివాజీని పట్టుకొని రావలిసిందిగా తన సేనాని అఫ్టలానన్ను పంపించాడు.

ఎలాగైనా రెచ్చగొట్టి శివాజీని పర్వత ప్రాంతం (ప్రతాపర్) నుంచి మైదానాల వైపుకు తీసుకురావాలనేదే అల్ఫాన్ వ్యూహం. ఎందుకంటే పర్వత ప్రాంతాలలో శివాజీ గెరిల్లా యుద్ధ తంత్రంలో ఆరితేరినవాడు, అతన్ని లొంగదీసుకోవడం చాలా కష్టం. శివాజీని మైదాన ప్రాంతానికి రప్పించడంలో విఫలమైన అఫ్ఘలాఖాన్ చివరకు కృష్ణాజీ భాస్కర్ అనే రాయబారిని శివాజీతో సంప్రదింపులకై పంపాడు. అలాన్తో జరుపబోయే సమావేశంలో శివాజీ ప్రాణాలకు హాని జరుగవచ్చనే సంకేతాలను రాయబారి వెల్లడించాడు. అలాఖాన్ కుట్రను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధమైన శివాజీ రక్షణ కవచాన్ని ధరించి, తగిన ఆయుధాలను సమకూర్చుకొని సమావేశ మందిరానికి చేరుకొన్నారు. వారిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకోవడంతో పోరు ప్రారంభమయింది. ఆత్మరక్షణకై శివాజీ బాగ్ నఖ్ (పులిగోళ్లు) అనే మారణాయుధంతో అఫ్ఘలాన్ను హతమార్చాడు. తదనంతరం శత్రుసైనిక శిబిరంపై దాడి జరిపి పూర్తిగా ఓడించాడు. భారీస్థాయిలో ధనాన్ని కొల్లగొట్టాడు. ఈ ఘనవిజయంతో శివాజీ ఖ్యాతి మరింత ఇనుమడించి, మరాఠా ప్రజానీకంలో గొప్ప పరాక్రమవంతుడిగా, పురాణ పురుషుడిగా పేరు సంపాదించుకొన్నాడు.

మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ తన మేనమామ షాయిస్తఖాన్ను 1659లో దక్కన్ ప్రాంతానికి గవర్నర్గా నియమించాడు. శివాజీని ఎలాగైనా అణచాలని ఔరంగజేబ్ షాయిస్తఖాన న్ను ఆజ్ఞాపించాడు. దీంతో షాయిస్తఖాన్ తన దండయాత్రను ప్రారంభించి చకాన్, ఉత్తర కొంకణ తీరాన్ని (1661) ఆక్రమించాడు. శివాజీ 1663 ఏప్రిల్ నెలలో పూనే చేరుకొని షాయిస్తఖాన్పై మెరుపుదాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిచాడు. తన సైనిక అవసరాల కోసం శివాజీ 1664లో అతి సంపన్నమైన సూరత్ రేవు పట్టణాన్ని కొల్లగొట్టాడు.

TS Inter 1st Year History Study Material Chapter 10 మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

నానాటికీ పెరుగుతున్న శివాజీ ప్రాబల్యాన్ని, షాయిస్తఖాన్ సంఘటనతో భీతి చెందిన ఔరంగజేబ్ పరిస్థితులను అదుపులో తెచ్చేందుకు ప్రయత్నించాడు. జైసింగ్ పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే వ్యూహాత్మకంగా వ్యవహరించి. శివాజీపై ఒత్తిడి పెంచాడు. జైసింగ్ పురంధర్ వద్ద శివాజీని ఓడించి, పురంధర్ సింధి (1665)కి ఒప్పించాడు. ఈ సంధి షరతుల ప్రకారం శివాజీ తన ఆధీనంలో ఉన్న 35 కోటల్లో ఇరవై మూడు కోటలను మొగులుల వశం చేశాడు. మొగల్ చక్రవర్తి ఆస్థానాన్ని సందర్శించాలనే సంధి షరతును కూడా శివాజీ అంగీకరించాడు.

పురంధర్ సంధిని అనుసరించి శివాజీ 1666లో ఆగ్రాకు వెళ్లి మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ను కలిశాడు. అయితే అక్కడ శివాజీ అమర్యాదకు లోనయ్యాడు. దీంతో శివాజీ ఆగ్రహించడంతో, ఔరంగజేబ్ అతన్ని నిర్బంధించాడు. 1670లో సూరత్ పట్టణంపై రెండోసారి దాడి జరిపి అరవై లక్షల రూపాయల ధనాన్ని దోచుకున్నాడు.
శివాజీ పట్టాభిషేకం 1674 జూన్ 16న రాజ్గఢ్ మిక్కిలి వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ పట్టాభిషేకాన్ని వారణాసికి చెందిన వేద పండితుడైన (విశ్వేశ్వర్) గాగ భట్టు నిర్వహించాడు. మేవార్ రాజపుత్రుల సంప్రదాయం ప్రకారం దీన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ‘శివాజీ ఛత్రపతి’, “హైందవ ధర్మోద్ధారక” అనే బిరుదులు ధరించాడు.

ప్రశ్న 3.
శివాజీ పరిపాలన గురించి రాయండి.
జవాబు.
పరిపాలన: శివాజీ కృషితో స్వతంత్ర మహారాష్ట్ర రాజ్యం ఏర్పడింది. శివాజీ గొప్ప వీరుడు. సైనిక నాయకుడే కాకుండా గొప్ప పాలకుడిగా కూడా పేరు పొందాడు.
శివాజీ పాలన సమానత్వం, న్యాయం, సహనంలపై ఆధారపడి కొనసాగింది. శివాజీ తన రాజ్యానికి ‘స్వరాజ్యం’ అని పేరు పెట్టాడు. తన రాజ్యం పరిసర ప్రాంతాల నుంచి చౌత్, సర్దేశ్ముఖి వంటి పన్నులను వసూలు చేశాడు.

శివాజీ కేంద్రీకృత పాలనావ్యవస్థను ఏర్పాటు చేశాడు. చక్రవర్తి అయిన శివాజీ సర్వాధికారి. అధికారులను నియమించే, తొలగించే అధికారం శివాజీకి ఉండేది. శివాజీ తనకు పరిపాలనలో సహకరించేందుకు ఎనిమిది మంది సభ్యులు గల అష్టప్రధానులు అనే మంత్రిమండలిని ఏర్పాటుచేశాడు. మంత్రులకు వివిధ శాఖలను కేటాయించాడు.

అష్ట ప్రధానులు:
a) పీష్వా: ప్రధానమంత్రి – సాధారణ పాలనా వ్యవహారాలను చూసేవాడు.
b) అమాత్య: ఆర్థిక మంత్రి – ఆదాయ వ్యయాలు, బడ్జెట్ చూసేవాడు.
c) మంత్రి: ఆంతరంగిక వ్యవహారాల మంత్రి.
d) సచివ: సమాచారశాఖా మంత్రి.
e) సుమంత్: విదేశీ వ్యవహారాల మంత్రి.
f) పండితరావు: దానధర్మాలు, ధర్మాదాయం.
g) సేవాపతి: సర్వసైన్యాధ్యక్షుడు.
h) న్యాయాధీశుడు: అత్యున్నత న్యాయాధికారి.

కేవలం సామర్థ్యాన్ని బట్టి మాత్రమే మంత్రిమండలిలో స్థానం లభించేది. వంశపారంపర్య హక్కు ఉండేది కాదు. మంత్రులు, పాలనా వ్యవహారాలతో పాటు అవసరమైనప్పుడు సైనిక విధులను కూడా నిర్వహించేవారు.

పరిపాలనా విభాగాలు: పరిపాలనా సౌలభ్యం కోసం శివాజీ తన స్వరాజ్యంను నాలుగు రాష్ట్రాలుగా విభజించి దాని పాలనకు వైశ్రాయ్ లేదా గవర్నర్ను నియమించాడు. రాష్ట్రాలను తిరిగి జిల్లాలుగా విభజించాడు. జిల్లాను తిరిగి గ్రామాలుగా విభజించాడు. గ్రామ పాలనకు పంచాయితి, పటేల్, కులకర్ణి అనే అధికారులు నిర్వహించేవారు.
వీటికి తోడు మొగల్ రాజ్యంలోని కొన్ని ప్రాంతాలు పరోక్షంగా శివాజీ ఆధీనంలో ఉండేవి. వారి నుంచి చౌత్ అనే పేరున పన్నులు వసూలు చేశాడు.

భూమిశిస్తు విధానం: శివాజీ జాగిర్దారీ విధానాన్ని రద్దుచేశాడు. మత సంస్థల భూములను శివాజీ స్వాధీనం చేసుకొని వాటికి నగదు చెల్లించాడు. భూమిని సర్వే చేయించి రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. పన్నులను ధన రూపంలోగాని, ధాన్య రూపంలోగాని చెల్లించే అవకాశాన్ని కల్పించాడు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు రుణాలను ఇచ్చి, వాటిని సులభ వాయిదాల్లో తిరిగి చెల్లించే ఏర్పాటు చేశాడు.

భూమి శిస్తుతోపాటు వాణిజ్య పన్నులు, నాణాల నుంచి ఆదాయం, చౌత్, సర్దేశముఖి మొదలైన వాటి ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభించేది. చౌత్ అనే 1/4 వ వంతు పన్ను యుద్ధాల నుంచి రక్షించినందున తన రాజ్య పరిసరాల్లోని వారి నుంచి వసూలు చేసేవాడు. 1/10 వ వంతు వసూలు చేసే సర్దేశముఖి రాజు పట్ల గౌరవంతో చెల్లించే పన్ను.

సైనిక పాలన: శివాజీ బలమంతా అతని సైన్యంపై ఆధారపడి ఉంది. శివాజీ ప్రతిభావంతమైన, అంకితభావం గల సైన్యాన్ని ఏర్పాటు చేసుకొన్నాడు. ముస్లిం పాలకులను మహారాష్ట్రకు దూరంగా ఉంచి హిందూ ధర్మాన్ని రక్షించడం ప్రధాన లక్ష్యంగాగల శివాజీ అందుకు అనువైన సైన్యాన్ని ఏర్పాటు చేసుకొన్నాడు. శివాజీ సైన్యంలో 45 వేల అశ్విక దళం, 60 వేల కాల్బలం, లక్షమందితో పదాతి దళం ఉండేది. వీటికి తోడు ఏనుగులు, ఒంటెలు, ఫిరంగి దళం కూడా ఉండేది. జాగీరులకు బదులు మొదటిసారిగా ధనరూపంలో వేతనాలను చెల్లించేవారు. శివాజీ కోటల రక్షణకు ప్రత్యేక చర్యలను తీసుకొన్నాడు. సమర్థులైన వారికి బిరుదులు ఇవ్వడం, ప్రతిభావంతులకు అదనపు సౌకర్యాలను కల్పించడం వంటివి శివాజీ చేశాడు. యుద్ధరంగానికి స్త్రీలను తీసుకువెళ్ళడాన్ని నిషేధించాడు. దీన్ని ఉల్లంఘించిన వారికి మరణ శిక్ష విధించేవాడు. యుద్ధంలో స్వాధీనం చేసుకొన్న సొమ్మంతా చక్రవర్తికి అప్పగించాల్సి ఉండేది.

న్యాయపాలన: న్యాయ వ్యవస్థలో శివాజీ సంప్రదాయ పద్ధతులను పాటించాడు. సమన్యాయాన్ని అనుసరించాడు. ధనవంతుడు, పేదవాడు అనే తేడాలు కానీ, మత తేడాలు కానీ చూపించేవాడు కాదు. గ్రామస్థాయిలో గ్రామ పంచాయితీలు న్యాయపాలన చేసేవి. కేంద్ర స్థాయిలో న్యాయపాలన కోసం ‘న్యాయాధీశ్’ నియమించబడ్డాడు. కేసులు విచారించడంలోనూ, తీర్పులను ఇవ్వడంలోనూ ప్రాచీన హిందూ చట్టాలను పరిగణనలోకి తీసుకొనేవారు.

దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్న మొగలులతో వీరోచితంగా పోరాడి శివాజీ విజయం సాధించాడు. గతంలో అనైక్యంగా చిన్నచిన్న భాగాలుగా ఉన్న హిందూమత శక్తులను ఉన్నతమైన ఆశయాలతో ఏకంచేశాడు.

వీటన్నింటికి తోడు శివాజీ గొప్ప రాజకీయవేత్త, చురుకైన నాయకుడు. జె.ఎన్. సర్కార్ అనే చరిత్రకారుడు అన్నట్లు “శివాజీ మహారాష్ట్రులకు వెలుగు …. మొగలుల పాలిట సింహస్వప్నం తన వారసులకు స్ఫూర్తిప్రదాతగా నిలిచాడు. శివాజీ గొప్పతనం అతని వ్యక్తిత్వంలోను ఆచరణలోనూ బయల్పడుతుంది”.

TS Inter 1st Year History Study Material Chapter 10 మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

ప్రశ్న 4.
మూడోపానిపట్టు యుద్ధం కారణాలు, గమనం, ఫలితాలను వివరించండి.
జవాబు.
ఆధునిక భారతదేశ చరిత్ర గతిని మలుపు తిప్పిన యుద్ధాల్లో మూడో పానిపట్ యుద్ధం ఒకటి. మూడో పీష్వా తమ్ముడైన రఘునాథ రావు (రఘోబా), అహ్మద్ షా అబ్దాలీ రాజ్యంలో భాగంగా ఉన్న పంజాబ్ను ఆక్రమించి, అతని రాజ్య ప్రతినిధిని తరిమివేశాడు. దీంతో అహ్మర్షి అబ్దాలీ మహారాష్ట్రులపై పెద్ద సైన్యంతో దండెత్తాడు. చారిత్రాత్మకమైన పానిపట్ యుద్ధభూమిలో 14 జనవరి, 1761వ తేదిన ఇరు సైన్యాల మధ్య తీవ్ర యుద్ధం జరిగింది.

యుద్ద విశేషాలు: మహారాష్ట్ర సైన్యాధ్యక్షుడుగా సదాశివరావు (బావో సాహెబ్), మూడో పీష్వా కుమారుడైన విశ్వాసరావు ఉపసైన్యాధ్యక్షుడుగా వ్యవహరించారు. బావో సమర్థుడైన వ్యక్తి, కానీ అతని అహంకారం, గర్వం కారణంగా తన సేనా నాయకుల మాటలను వినక పెడచెవిన పెట్టాడు. ముఖ్యంగా జాట్ల నాయకుడైన సూరజ్మల్ ప్రత్యక్ష యుద్ధం (బహిరంగ యుద్ధం) వద్దని, గెరిల్లా యుద్ధమే తమకు లభిస్తుందని చెప్పినా వినలేదు. తన మాటలు లెక్క చేయనందుకు సూరజ్మల్ తన సైన్యంతో వెనుదిరిగాడు. మరోవైపు అహ్మద్ అబ్దాలీ రోహిల్లాలు, అవధ్ నవాబ్ సహకారాన్ని సకాలంలో పొందగలిగాడు.

అబ్దాలీ తెలివిగా మరాఠా సైనిక శిబిరాన్ని చుట్టుముట్టి వారికి ఆహారపదార్థాలు అందకుండా వ్యూహం పన్నాడు. దక్కన్ నుంచి రాకపోకలను పూర్తిగా స్తంభింపచేశాడు. రెండునెలల పాటు మరాఠా సైన్యాలు తీవ్ర బాధలకు గురి అయ్యాయి. ప్రత్యక్ష యుద్ధంలో అంతగా ప్రావీణ్యం లేని మరాఠా సైన్యం చిత్తుగా ఓడిపోయింది. విశ్వాసరావు, సదాశివరావు వంటి వీరులు సైతం మరణించారు. దాదాపు రెండు లక్షలకు పైగా మరాఠా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వేలమందికి పైగా క్షతగాత్రులయ్యారు.

ఫలితాలు:

  1. మూడో పానిపట్ యుద్ధంలో ఓటమి కొంతవరకు మహారాష్ట్రుల అధికారాన్ని, ప్రాభవాన్ని అంతమొందించింది. అఖిల భారత హిందూ సామ్రాజ్య స్థాపన అనే ఆశయం నెరవేరలేదు.
  2. మహారాష్ట్రులు, ముస్లింలు బలహీనమైనందున, ఆంగ్లేయులకు తమ అధికారాన్ని విస్తరించుకొనే అవకాశం కలిగింది. పరోక్షంగా బ్రిటిష్ వారు ఈ యుద్ధం వల్ల లాభపడినట్లయింది.
  3. ఈ యుద్ధంవల్ల శిక్కులు పంజాబ్లో తమ ఆధిక్యతను స్థాపించుకొనేందుకు మార్గం సులభమైంది. శిక్కులు పఠానులను తరిమివేయడంతో వారు స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయారు.

మహారాష్ట్రుల ఓటమికి కారణాలు: మహారాష్ట్రులు ఓటమికి ప్రధాన కారణాలు ఇవి:

  1. అహ్మద్ షా అబ్దాలీ ఆరితేరిన సైన్యాధ్యక్షుడు. ఇతని సైన్యం ఆయుధాలలో, క్రమశిక్షణలో మహారాష్ట్రుల కంటే ఉత్తమమైంది.
  2. భావో గర్విష్టి. అతడు ఇతరుల సలహాలను లక్ష్యపెట్టలేదు. మహారాష్ట్రులు జాట్ల సలహాలు విననందున వారి అభిమానాన్ని, సహాయాన్ని కోల్పోయారు. మరోవైపు అహ్మద్ షా అబ్దాలీ రోహిల్లాలు, అవధ్ నవాబ్ సహకారాన్ని సకాలంలో పొందగలిగాడు.
  3. మహారాష్ట్రులు వారికి పట్టున్న గెరిల్లా యుద్ధాన్ని ఎంచుకోకుండా, అంతగా అభ్యాసనం లేని బహిరంగ యుద్ధం చేయడం.
  4. అబ్దాలి మహారాష్ట్రుల సైన్యానికి ఆహార పదార్థాలు అందకుండా చేయడంతో, వారు పస్తులు ఉండాల్సి వచ్చింది.

ప్రశ్న 5.
పీష్వాల గురించి సంక్షిప్త వ్యాసం రాయండి.
జవాబు.
శివాజీ తన పట్టాభిషేక సమయంలో ఎనిమిది మంది సభ్యులు గల మంత్రి మండలి (అష్టప్రధానులు) బాధ్యతలు, విధుల గురించి స్పష్టంగా వివరించడం జరిగింది. ఛత్రపతి తర్వాత పీష్వా చాలా ప్రధానమైన వ్యక్తి. పరిపాలనలో ఇతనిదే అగ్రస్థానం. శివాజీ కాలంలో మోరోపంత్ త్రయంబక్ మొదటి పీష్వాగా నియమించబడ్డాడు. శివాజీ వారసులు కూడా పరిపాలనలో పీష్వాలపైనే చాలా ఎక్కువగా ఆధారపడ్డారు. తారాబాయితో జరిగిన అంతర్యుద్ధంలో సాహూ విజయం సాధించి ఛత్రపతిగా సింహాసనం అధిష్టించడంలో నాటి పీష్వా బాలాజీ విశ్వనాథ్ కీలక పాత్ర పోషించాడు. ఇతని కాలం నుంచే పీష్వాలు మరాఠా సర్దారులందరిలోకి అగ్రగణ్యులయ్యారు. అష్టప్రధానులందరిపైనే కాకుండా ఛత్రపతి కంటే కూడా పీష్వా అధికుడనే భావనను బలపరిచే విధంగా పీష్వా పదవిని బాలాజీ విశ్వనాథ్ తీర్చిదిద్దాడు. మొత్తం మీద మరాఠా చరిత్రలో 1713 నుంచి 1818 వరకు ఏడుగురు పీష్వాలు పాలించారు. బాలాజీ విశ్వనాథ్ (1713 – 20): బాలాజీ విశ్వనాథ్ కొంకణ్ తీరంలోని చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. ఇతను మరాఠా సర్దారుల దగ్గర గుమస్తాగా జీవితాన్ని ప్రారంభించాడు. ‘తదనంతరం కాలంలో పూనా, దౌలతాబాద్లకు సర్ సుబేదార్ గా పనిచేసాడు. ఈ కాలంలో బాలాజీ విశ్వనాథ్ మొగల్ చక్రవర్తితో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉండడం వల్ల సాహూకి దగ్గరయ్యాడు. సాహూని ఛత్రపతి చేసే విషయమై మరాఠా సర్దారులతో దౌత్యం నెరపడంలోనూ, వారిని లొంగదీసుకోవడంలో బాలాజీ విశ్వనాథ్ విజయం సాధించాడు. అతని సేవలకు గుర్తింపుగా సాహూ అతన్ని 16 నవంబర్, 1713లో పీష్వాగా నియమించాడు. తన అత్యుత్తమ ప్రతిభా పాటవాలచే బాలాజీ విశ్వనాథ్ మరాఠా సామ్రాజ్యానికి పీష్వానే వాస్తవాధినేతగా మార్చాడు. పూనాను రాజకీయ కేంద్రంగా మార్చి, పీష్వా పదవిని వంశపారంపర్యం చేశాడు. అందుకనే బాలాజీ విశ్వనాథన్ను పీష్వా వంశ స్థాపకుడని అంటారు. మొగల్ రాజ్యంలోని అంతర్గత విభేదాలను ఆసరాగా తీసుకొని మరాఠాల ప్రాబల్యాన్ని పెంచడంలో బాలాజీ విశ్వనాథ్ విజయం సాధించాడు. కొంకణ తీరంలోని నావికాదళాధ్యక్షుడు కన్హోజీ అంగ్రేతో 1714లో చేసుకొన్న ‘లోనావాలా సంధి’ ఇతని తొలి దౌత్యవిజయం. దీని ద్వారా కన్హోజీ సాహూని ఛత్రపతిగా అంగీకరించాడు. మొదటి బాజీరావ్ (1720 40): బాలాజీ విశ్వనాథ్ తరువాత అతని 20 సంవత్సరాల కుమారుడు మొదటి బాజీగాన్ కీ ష్వాగా బాధ్యతలు చేపట్టాడు. అతడు విజ్ఞుడైన రాజనీతిజ్ఞుడు, మిక్కిలి వివేకం కలవాడు. చక్కని యోధుడు. యుద్ధ తంత్రంలో ప్రతిభాశాలి. తన తండ్రి వద్ద నుంచి రాజతంత్రాన్ని, దౌత్యాన్ని అనుభవపూర్వకంగా నేర్చుకొన్నాడు. గెంల్లా యుద్ధ తంత్రంలో శివాజీ తరువాత అంతగా ఆరితేరినవాడుగా ప్రసిద్ధి చెందాడు. ధైర్యసాహసాలు, రాజతంత్రం దృష్ట్యా అతడు పీష్వాలలో కడు సమర్థుడిగా పరిగణింపబడ్డాడు.

అఖిల భారత హిందూ సామ్రాజ్యం (హింద్పద్ పద్ షాహీ) స్థాపన అనేది బాజీరావు మహోన్నత ఆశయం. మొగల్ సామ్రాజ్య పతనాన్ని దృష్టిలో పెట్టుకొని, “చెట్టు కాండాన్ని ఛేదిస్తే కొమ్మలు వాటంతట అవే పడిపోతాయని”, అప్పుడు మరాఠా కీర్తి పతాకం సింధూ నుంచి కృష్ణా వరకు ఎగురవేయవచ్చని భావించాడు. బాజీరావు నిజాం సైన్యాలను మర్చి 6, 1728లో పాల్టేడ్ వద్ద ఓడించి అతన్ని మునిషివగావ్ సంధికి ఒప్పించాడు. దీని ప్రకారం సాహూకి వ్యతిరేకంగా రెండో శంభాజీకి నిజాం ఎటువంటి సహాయం అందించరాదనీ, దక్కన్లో పన్నులు వసూలు చేసుకొనేందుకు అధికారాన్ని ఇచ్చాడు.

మొగల్ రాజ్య అలహాబాద్ గవర్నర్ అయిన మహ్మదాఖాన్ భంగాష్ 1727లో బుందేల్ఖండ్ పై దాడి జరిపాడు. అక్కడి రాజుని, అతని కుటుంబ సభ్యులని బందీలుగా పట్టుకొన్నాడు. రాజా అభ్యర్థన మేరకు 1729లో బాజీరావు మరాఠా సైన్యాలను బుందేల్ఫండ్కు పంపి మహ్మదఖాన్ను ఓడించి రాజాను తిరిగి సింహాసనంపై నిలిపాడు. దీంతో ఈ ప్రాంతంలో మరాఠాల ప్రాబల్యం అనూహ్యంగా పెరిగిపోయింది. బాజీరావుకు బుందేలులతోనే కాకుండా అంబర్ రాజులతో కూడా స్నేహ బంధాలు బలపడ్డాయి.

బాజీరావును కట్టడి చేసేందుకు మొగల్ చక్రవర్తి నిజాంను ప్రోత్సహించాడు. దీంతో నిజాంను మరాఠా సైన్యాలు రెండోసారి భోపాల్ యుద్ధంలో (1737) ఓడించి దురైసరై సంధికి ఒప్పించాయి. దీని ప్రకారం నిజాం యుద్ధ పరిహారం కింద యాభై లక్షలు చెల్లించడమే కాకుండా నర్మద, చంబల్ ప్రాంతాల మధ్య ఉన్న ప్రాంతంపై మరాఠాల సార్వభౌమత్వాన్ని అంగీకరించాడు.

బాజీరావ్ సిద్దీలకు (జింజీ) వ్యతిరేకంగా దండయాత్ర చేపట్టి వారిని ప్రధాన భూభాగం నుంచి వెళ్లిపోయేలా చేశాడు. పోర్చుగీసు వారిని 1739లో ఓడించి సాల్సెట్టి, బేసిన్ ప్రాంతాలను ఆక్రమించాడు. దీంతో మరాఠాల ప్రతిష్ట మరింత పెరిగింది.

బాలాజీ బాజీరావ్ (1740-61): మొదటి బాజీరావు మరణం తర్వాత అతని పద్దెనిమిది సంవత్సరాల కుమారుడు బాలాజీ బాజీరావు (నానాసాహెబ్) పీష్వాగా బాధ్యతలు చేపట్టాడు. ఇతను తండ్రి అంతటి సమర్థుడు కాడు. ఇతను ఎల్లపుడూ తన బంధువైన సదాశివరావ్ బావో సలహాలపైనే ఆధారపడేవాడు. బాలాజీ బాజీరావు పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే తన తండ్రి ఆశయాన్ని పూర్తి చేయదలిచాడు. బాలాజీ బాజీరావు నాయకత్వంలోని మరాఠా సర్దారులు అనేక కొత్త ప్రాంతాలను జయించారు. రఘోజీ భోంస్లే మధ్య భారతాన్ని జయించి, బెంగాల్పై దండయాత్రలు జరిపాడు. దీంతో బెంగాల్ నవాబ్ అలీవర్ధనాఖాన్ ఒరిస్సాను దత్తం చేసి బెంగాల్ బీహార్ తో కూడిన రాష్ట్రానికి చౌత్, సర్దేశముఖి పన్నులను చెల్లించడానికి ఒప్పుకొన్నాడు.

మహారాష్ట్రులు 1757లో అహ్మద్ అబ్దాలీ ప్రతినిధి నుంచి ఢిల్లీ ప్రాంతాన్ని జయించారు. 1758లో పీష్వా తమ్ముడైన రఘునాథరావు (రఘోబా) పంజాబు వశం చేసుకొని, అక్కడి నుంచి అహ్మద్ అబ్దాలీ రాజప్రతినిధిని తరిమివేశాడు. ఈ విధంగా మూడో పీష్వా హయాంలో మరాఠాల అధికారం, భారతదేశం ఒక కొన నుంచి మరో కొన వరకు విస్తరించింది. తమ ఆధీనంలో లేని ప్రాంతాల నుంచి కూడా మరాఠాలు చౌత్, సర్దేశముఖి పన్నులను వసూలు చేశారు. ఇలాంటి సమయంలో అహ్మదా అబ్దాలీ మరాఠాలను మూడో పానిపట్ యుద్ధంలో ఓడించాడు. ఈ ఓటమి మహారాష్ట్ర అధికారానికి, ప్రాభవానికి తీవ్ర విఘాతమైంది. ఈ పరాజయంతో కృంగిపోయిన పీష్వా కొద్ది కాలానికే 1761లో మరణించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 10 మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

ప్రశ్న 6.
రంజిత్సింగ్ ఘనతను చర్చించండి.
జవాబు.
రంజిత్ సింగ్ (1792-1839): సిక్కు సామ్రాజ్య స్థాపకుడైన రంజిత్ సింగ్కు ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇతను 13 నవంబరు, 1780లో మహాన్సింగ్, రాజ్కార్ దంపతులకు గుజ్రన్వాలాలో (ప్రస్తుతం ఆధునిక పాకిస్తాన్లో ) జన్మించాడు. మహాన్ సింగ్ ‘సుకరెకియా మిజిల్కు’ అధిపతి. పంజాబ్కు పశ్చిమంగా ఉన్న ప్రాంతం ఇతని ఆధీనంలోనే ఉండేది. ఇతని రాజధాని గుజ్రన్ వాలా. చిన్నతనంలో మశూచి సోకడంతో ఇతను ఎడమ కన్నును కోల్పోయాడు. పది సంవత్సరాల చిన్న వయస్సులోనే ఇతను తండ్రితో కలిసి యుద్ధాల్లో పాల్గొన్నాడు. అతని తండ్రి 1792లో మరణించడంతో మిజిల్ నాయకత్వ బాధ్యతలు 12 సంవత్సరాల రంజిత్ సింగ్కు దక్కాయి. 1797 వరకు అతను తల్లి సంరక్షణలో పాలనాబాధ్యతలు నిర్వహించినా, తరువాత స్వతంత్రంగా వ్యవహరించాడు. నాటి రాజకీయ అస్థిర పరిస్థితుల్ని రంజిత్ సింగ్ తనకు అనుకూలంగా మలుచుకొని రాజకీయంగా ఎదీగాడు.

రంజిత్ సింగ్ తనకు అందించిన సేవలకు ప్రతిఫలంగా, తన ప్రతినిధిగా లాహోర్ను పాలించమని జమాన్షా 1789లో ప్రకటించాడు. రంజిత్ సింగ్ 12, ఏప్రిల్ 1801 నాడు పంజాబ్ మహారాజాగా ప్రకటించుకొన్నాడు. 1802లో ఇతను తన రాజధానిని గుజ్రన్వాలా నుంచి లాహోరు మార్చాడు. 1799 నుంచి 1805 మధ్యకాలంలో రంజిత్ సింగ్ లాహోర్, అమృత్సర్ ప్రాంతాలను బంగీ మిజిల్ సర్దారుల నుంచి కైవసం చేసుకొన్నాడు. తదనంతర కాలంలో లూధియానా (1806), కాంగ్రా (1809), అటక్ (1813), ముల్తాన్ (1818), కాశ్మీర్ (1819), పెషావర్ (1823)లను ఆక్రమించాడు. ఫలితంగా రంజిత్సింగ్ సట్లెజ్, జీలం నదుల మధ్య ప్రాంతంలో తన అధికారాన్ని నెలకొల్పాడు. భారతదేశంలో ఫ్రెంచ్ వారి ప్రాబల్యాన్ని నిరోధించేందుకు బ్రిటిష్ వారు 1809లో రంజిత్ సింగ్తో అమృత్సర్ సంధిని చేసుకొన్నారు. ఈ సంధి ప్రకారం సట్లెజ్ నదికి ఉత్తరాన ఉన్న భూభాగంపై రంజిత్ సింగ్ సార్వభౌమత్వాన్ని బ్రిటిష్వారు గుర్తించారు. అహ్మద్ షా అబ్దాలీ మనుమడైన షాషుజా అతని సోదరుడి వల్ల పదవీచ్యుతుడైనప్పుడు, రంజిత్ సింగ్ సహకారంతో అతను సింహాసనాన్ని తిరిగి సంపాదించుకోగలిగాడు. దీనికి ప్రతిఫలంగా రంజిత్ సింగ్కు కోహినూర్ వజ్రాన్ని తిరిగి అప్పగించాడు.

రంజిత్ సింగ్ ఖాల్సా (సైన్యం)ను ఆధునీకరించాడు. అధునాతన ఆయుధాలను సైన్యంలో ప్రవేశపెట్టాడు. ఐరోపావాసుల చేత, ముఖ్యంగా నెపోలియన్ దగ్గర పనిచేసిన సైనికాధికారులచే తన సైన్యానికి శిక్షణ ఇప్పించాడు. ఫలితంగా రంజిత్ సింగ్ సైన్యం భారతదేశంలోనే మొట్టమొదటి సుశిక్షుతులైన సైన్యంగా తీర్చిదిద్దబడింది. ఆయుధ కర్మాగారాలను ఫిరంగుల తయారీ కేంద్రాలను, మందుగుండు సామాగ్రి తయారీ కర్మాగారాలను రంజిత్ సింగ్ ఏర్పాటు చేశాడు.

రంజిత్ సింగ్ సామ్రాజ్యం లౌకికమైంది. పాలనలో మతపరమైన వివక్ష ఎక్కడా చూపలేదు. అమృత్సర్లోని శిక్కుల పవిత్ర దేవాలయాన్ని అతనే బంగారు పూతతో, చలువరాళ్లతో సుందరీకరించాడు. అప్పటి నుంచి అది స్వర్ణదేవాలయంగా ప్రసిద్ధి చెందింది. అలాగే వారణాశిలోని కాశీ విశ్వనాథుని దేవాలయ గోపురానికి బంగారు తాపడం కోసమని 820 కిలోల బంగారాన్ని రంజిత్ సింగ్ 1839లో బహుకరించాడు. రంజిత్ సింగ్ ఏనాడూ కూడా సిక్కుమత విశ్వాసాలను పాలనలో చొప్పించలేదు. శాంతి భద్రతలను అదుపులో ఉంచి, కఠిన శిక్షలను రద్దు చేశాడు.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అష్ట ప్రధానులు.
జవాబు.
శివాజీ కేంద్రీకృత పాలనావ్యవస్థను ఏర్పాటు చేశాడు. శివాజీ తనకు పరిపాలనలో సహకరించేందుకు ఎనిమిది మంది సభ్యులు గల అష్టప్రధానులు అనే మంత్రిమండలిని ఏర్పాటు చేశాడు. మంత్రులకు వివిధ శాఖలు కేటాయించాడు.

  1. పీష్వా: ప్రధానమంత్రి – సాధారణ పాలనా వ్యవహారాలను చూసేవాడు.
  2. అమాత్య: ఆర్థిక మంత్రి – ఆదాయ వ్యయాలు, బడ్జెట్ చూసేవాడు.
  3. మంత్రి: ఆంతరంగిక వ్యవహారాల మంత్రి.
  4. సచివ: సమాచారశాఖా మంత్రి.
  5. సుమంత్: విదేశీ వ్యవహారాల మంత్రి.
  6. పండితరావు: దానధర్మాలు, ధర్మాదాయం.
  7. సేవాపతి: సర్వసైన్యాధ్యక్షుడు.
  8. న్యాయాధీశుడు: అత్యున్నత న్యాయాధికారి.

ప్రశ్న 2.
బాలాజీ విశ్వనాథ్
జవాబు.
మహారాష్ట్రలో పీష్వాల రాజ్యానికి పునాదులు వేసిన బాలాజీ విశ్వనాథన్ను మహారాష్ట్ర సామ్రాజ్య రెండవ స్థాపకుడిగా పిలుస్తారు. శివాజీ మరణానంతరం మహారాష్ట్ర రాజ్యం అంతర్యుద్ధంలో మునిగి పతనావస్థకు చేరుకుంది. ఆ కల్లోల సమయంలో శివాజీ వదిలి వెళ్ళిన బాధ్యతలను, ఆశయాలను నెరవేర్చి, మహారాష్ట్ర సంస్కృతిని కాపాడిన ఘనత పీష్వాలది.

ఆ పీష్వాల వంశ మూలపురుషుడు బాలాజీ విశ్వనాథ్. ఛత్రపతి సాహూచే వంశపారంపర్య పీష్వాగా నియమింపబడ్డాడు. మరాఠా నౌకాదళాధిపతి కన్హోజీతో ఒప్పందం కుదుర్చుకుని పోర్చుగీస్, ఆంగ్లేయులను ఓడించాడు. సయ్యద్ సోదరులతో ఒప్పందం కుదర్చుకొని ఒకప్పటి శివాజీ భూములన్నీ స్వాధీనం చేసుకున్నాడు. మహారాష్ట్రులు కూటమిని ఏర్పాటు చేసి మరాఠాలలో ఐక్యత సాధించాడు. సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన యోధుడు బాలాజీ విశ్వనాథ్.

ప్రశ్న 3.
మొదటి బాజీరావు
జవాబు.
బాలాజీ విశ్వనాథ్ తరువాత అతని 20 సంవత్సరాల కుమారుడు మొదటి బాజీరావ్ పీష్వాగా బాధ్యతలు చేపట్టాడు. అతడు విజ్ఞుడైన రాజనీతిజ్ఞుడు, మిక్కిలి వివేకం కలవాడు. చక్కని యోధుడు. యుద్ధ తంత్రం ‘ప్రతిభాశాలి. తన శివాజీ తండ్రి వద్ద నుంచి రాజతంత్రాన్ని, దౌత్యాన్ని అనుభవపూర్వకంగా నేర్చుకొన్నాడు. గెరిల్లా యుద్ధ తంత్రంలో తరువాత అంతగా ఆరితేరినవాడుగా ప్రసిద్ధి చెందాడు. ధైర్యసాహసాలు, రాజతంత్రం పీష్వాలలో కడు సమర్థుడిగా పరిగణింపబడ్డాడు.

అఖిల భారత హిందూ సామ్రాజ్యం (హింద్పద్ పదాహీ) స్థాపన అనేది బాజీరావు మహోన్నత ఆశయం. మొగల్ సామ్రాజ్య పతనాన్ని దృష్టిలో పెట్టుకొని, “చెట్టు కాండాన్ని ఛేదిస్తే కొమ్మలు వాటంతట అవే పడిపోతాయని”, అప్పుడు మరాఠా కీర్తి పతాకం సింధూ నుంచి కృష్ణా వరకు ఎగురవేయవచ్చని భావించాడు. బాజీరావు నిజాం సైన్యాలను మర్చి 6, 1728లో పాల్టేడ్ వద్ద ఓడించి అతన్ని మునిషిగావ్ సంధికి ఒప్పించాడు. దీని ప్రకారం సాహూకి వ్యతిరేకంగా రెండో శంభాజీకి నిజాం ఎటువంటి సహాయం అందించరాదనీ, దక్కన్లో పన్నులు వసూలు చేసుకొనేందుకు అధికారాన్ని ఇచ్చాడు.

మొగల్ రాజ్య అలహాబాద్ గవర్నర్ అయిన మహ్మద్భన్ భంగాష్ 1727లో బుందేల్ ఖండ్ పై దాడి జరిపాడు. అక్కడి రాజుని, అతని కుటుంబ సభ్యులని బందీలుగా పట్టుకొన్నాడు. రాజా అభ్యర్థన మేరకు 1729లో బాజీరావు మరాఠా సైన్యాలను బుందేలఖండ్కు పంపి మహ్మదఖాన్ ను ఓడించి రాజాను తిరిగి సింహాసనంపై నిలిపాడు. దీంతో ఈ ప్రాంతంలో మరాఠాల ప్రాబల్యం అనూహ్యంగా పెరిగిపోయింది. బాజీరావుకు బుందేలులతోనే కాకుండా అంబర్ రాజులతో కూడా స్నేహ బంధాలు బలపడ్డాయి.

TS Inter 1st Year History Study Material Chapter 10 మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

బాజీరావును కట్టడి చేసేందుకు మొగల్ చక్రవర్తి నిజాంను ప్రోత్సహించాడు. దీంతో నిజాంను మరాఠా సైన్యాలు రెండోసారి భోపాల్ యుద్ధంలో (1737) ఓడించి దురైసరై సంధికి ఒప్పించాయి. దీని ప్రకారం నిజాం యుద్ధ పరిహారం కింద యాభై లక్షలు చెల్లించడమే కాకుండా నర్మద, చంబల్ ప్రాంతాల మధ్య ఉన్న ప్రాంతంపై మరాఠాల సార్వభౌమత్వాన్ని అంగీకరించాడు.

బాజీరావ్ సిద్దీలకు (జింజీ) వ్యతిరేకంగా దండయాత్ర చేపట్టి వారిని ప్రధాన భూభాగం నుంచి వెళ్లిపోయేలా చేశాడు. పోర్చుగీసు వారిని 1739లో ఓడించి సాల్సెట్టి, బేసిన్ ప్రాంతాలను ఆక్రమించాడు. దీంతో మరాఠాల ప్రతిష్ట మరింత పెరిగింది.

ప్రశ్న 4.
మూడోపానిపట్టు యుద్ధం
జవాబు.
ఆధునిక భారతదేశ చరిత్ర గతిని మలుపు తిప్పిన యుద్ధాల్లో మూడో పానిపట్ యుద్ధం ఒకటి. మూడో పీష్వా తమ్ముడైన రఘునాథ రావు (రఘోబా), అహ్మద్ షా అబ్దాలీ రాజ్యంలో భాగంగా ఉన్న పంజాబ్ను ఆక్రమించి, అతని రాజ్య ప్రతినిధిని తరిమివేశాడు. దీంతో అహ్మర్షి అబ్దాలీ మహారాష్ట్రులపై పెద్ద సైన్యంతో దండెత్తాడు. చారిత్రాత్మకమైన పానిపట్ యుద్దభూమిలో 14 జనవరి, 1761వ తేదిన ఇరు సైన్యాల మధ్య తీవ్ర యుద్ధం జరిగింది. యుద్ధ విశేషాలు: మహారాష్ట్ర సైన్యాధ్యక్షుడుగా సదాశివరావు (బావో సాహెబ్), మూడో పీష్వా కుమారుడైన విశ్వాసరావు ఉపసైన్యాధ్యక్షుడుగా వ్యవహరించారు. బావో సమర్థుడైన వ్యక్తి, కానీ అతని అహంకారం, గర్వం కారణంగా తన సేనా నాయకుల మాటలను వినక పెడచెవిన పెట్టాడు. ముఖ్యంగా జాట్ల నాయకుడైన సూరజ్మల్ ప్రత్యక్ష యుద్ధం (బహిరంగ యుద్ధం) వద్దని, గెరిల్లా యుద్ధమే తమకు లభిస్తుందని చెప్పినా వినలేదు. తన మాటలు లెక్క చేయనందుకు సూరజ్మల్ తన సైన్యంతో వెనుదిరిగాడు. మరోవైపు అహ్మద్ అబ్దాలీ రోహిల్లాలు, అవధ్ నవాబ్ల సహకారాన్ని సకాలంలో పొందగలిగాడు.

అబ్దాలీ తెలివిగా మరాఠా సైనిక శిబిరాన్ని చుట్టుముట్టి వారికి ఆహారపదార్థాలు అందకుండా వ్యూహం పన్నాడు. దక్కన్ నుంచి రాకపోకలను పూర్తిగా స్తంభింపచేశాడు. రెండునెలల పాటు మరాఠా సైన్యాలు తీవ్ర బాధలకు గురి అయ్యాయి. ప్రత్యక్ష యుద్ధంలో అంతగా ప్రావీణ్యం లేని మరాఠా సైన్యం చిత్తుగా ఓడిపోయింది. విశ్వాసరావు, సదాశివరావు వంటి వీరులు సైతం మరణించారు. దాదాపు రెండు లక్షలకు పైగా మరాఠా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వేలమందికి పైగా క్షతగాత్రులయ్యారు.

ప్రశ్న 5.
రంజిత్ సింగ్
జవాబు.
రంజిత్ సింగ్ (1792-1839): సిక్కు సామ్రాజ్య స్థాపకుడైన రంజిత్ సింగ్కు ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇతను 13 నవంబరు, 1780లో మహాన్సింగ్, రాజ్ ్కర్ దంపతులకు గుజ్రన్వాలాలో (ప్రస్తుతం ఆధునిక పాకిస్తాన్లో) జన్మించాడు. మహాన్సింగ్ ‘సుకరెకియా మిజిల్కు’ అధిపతి. పంజాబు పశ్చిమంగా ఉన్న ప్రాంతం ఇతని ఆధీనంలోనే ఉండేది. ఇతని రాజధాని గుజ్రన్ వాలా. చిన్నతనంలో మశూచి సోకడంతో ఇతను ఎడమ కన్నును కోల్పోయాడు. పది సంవత్సరాల చిన్న వయస్సులోనే ఇతను తండ్రితో కలిసి యుద్ధాల్లో పాల్గొన్నాడు. అతని తండ్రి 1792లో మరణించడంతో మిజిల్ నాయకత్వ బాధ్యతలు 12 సంవత్సరాల రంజిత్ సింగ్కు దక్కాయి. 1797 వరకు అతను తల్లి సంరక్షణలో పాలనాబాధ్యతలు నిర్వహించినా, తరువాత స్వతంత్రంగా వ్యవహరించాడు. నాటి రాజకీయ అస్థిర పరిస్థితుల్ని రంజిత్ సింగ్ తనకు అనుకూలంగా మలుచుకొని రాజకీయంగా ఎదిగాడు.

రంజిత్ సింగ్ ఖాల్సా (సైన్యం)ను ఆధునీకరించాడు. అధునాతన ఆయుధాలను సైన్యంలో ప్రవేశపెట్టాడు. ఐరోపావాసుల చేత, ముఖ్యంగా నెపోలియన్ దగ్గర పనిచేసిన సైనికాధికారులచే తన సైన్యానికి శిక్షణ ఇప్పించాడు. ఫలితంగా రంజిత్ సింగ్ సైన్యం భారతదేశంలోనే మొట్టమొదటి సుశిక్షుతులైన సైన్యంగా తీర్చిదిద్దబడింది. ఆయుధ కర్మాగారాలను ఫిరంగుల తయారీ కేంద్రాలను, మందుగుండు సామాగ్రి తయారీ కర్మాగారాలను రంజిత్ సింగ్ ఏర్పాటు చేశాడు.

రంజిత్ సింగ్ 27, జూన్ 1839లో మరణించాడు. అతని వారసుడిగా కరక్సింగ్ పదవీబాధ్యతలు చేపట్టాడు. అతని మరణం తర్వాత పంజాబ్ రాజ్యంలో రాజకీయ అస్థిర పరిస్థితులు, అంతర్యుద్ధం ఏర్పడింది. దీన్ని అదనుగా తీసుకొని బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ఆంగ్లో – సిక్కు యుద్ధాలకు తెరలేపింది. రెండో ఆంగ్లో – సిక్కు యుద్ధం తరువాత బ్రిటిష్ వారు దులీపింగ్ నుంచి పంజాబ్ను ఆక్రమించారు.

TS Inter 1st Year History Study Material Chapter 10 మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
దాదాజి కొండదేవ్
జవాబు.
క్రీ.శ. 1636లో ఫాజీభోంస్లే శివనేర్ దుర్గాన్ని కోల్పోవడంతో దాదాజీ కొండదేవ్ రక్షణలో శివాజీ తన తల్లితో కలిసి మకాం మార్చాడు. దాదాజీ కొండదేవ్ పర్యవేక్షణలో శివాజీ ఆరితేరిన యోధుడిగా, దక్షుడైన పరిపాలకుడిగా తీర్చిదిద్ద బడ్డాడు. శివాజీ సంరక్షకుడైన దాదాజీ కొండదేవ్ 1647లో మరణించడంతో, శివాజీ పూనా జాగీరు బాధ్యతలను స్వతంత్రంగా నిర్వహించాడు.

ప్రశ్న 2.
సమర్థ రామదాసు
జవాబు.
మహారాష్ట్ర భక్తి ఉద్యమకారుడైన సమర్థరామదాస్ క్రీ.శ. 1608 సంవత్సరంలో జన్మించారు. అణగారిపోయిన హిందూ జాతిని జాగృతం చేయడంలో ప్రత్యేకమయిన వ్యూహాత్మక ప్రణాళిక అమలు చేసాడు. శివాజీకి మత గురువు. ఛత్రపతి శివాజీ హైందవ స్వరాజ్యాన్ని ఏర్పరచడంలో వీరిది గురుతుల్య పాత్ర. సమర్థ రామదాసు రచించిన ‘దశబోధ’ గ్రంథం ‘శివాజీని ఉత్తేజపరిచింది. యావత్ మహారాష్ట్ర జాతిలో తమ ఆత్మగౌరవం కాపాడుకోవడానికి స్వతంత్ర మరాఠా రాజ్యస్థాపన ఆవశ్యకతను తెలియజేసింది.

ప్రశ్న 3.
తోరణదుర్గం
జవాబు.
తోరణ దుర్గం పూనె నగరానికి సమీపంలో ఉంది. ఈ దుర్గాన్ని ‘ప్రచండ గఢ్’ అని కూడా అంటారు. ఈ కోట చరిత్ర ప్రసిద్ధికెక్కింది. ఛత్రపతి శివాజీ తన పందొమ్మిదో ఏట అనగా క్రీ.శ. 1646లో ఈ తోరణ దుర్గాన్ని ఆక్రమించాడు. శివాజీ యొక్క విజయపదానికి, స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి తొలి అడుగుగా తోరణ దుర్గ విజయం ప్రసిద్ధికెక్కింది.

ప్రశ్న 4.
అన్జలాఖాన్
జవాబు.
శివాజీ దాడులతో అప్రమత్తమైన బీజాపూర్ సుల్తాన్ క్రీ.శ. 1659లో శివాజీని పట్టుకొని రావలిసిందిగా తన సేనాని అఫ్ఘలానన్ను పంపించాడు. శివాజీని మైదాన ప్రాంతానికి రప్పించడంలో విఫలమైన అల్ఫాన్ చివరకు కృష్ణాజీ భాస్కర్ అనే రాయబారిని శివాజీతో సంప్రదింపులకై పంపాడు. అఫ్టలాఖాన్ తో జరుపబోయే సమావేశంలో శివాజీ ప్రాణాలకు హాని జరుగవచ్చనే సంకేతాలను రాయబారి వెల్లడించాడు అఫ్ఘల్ఫాన్ కుట్రను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధమైన శివాజీ రక్షణ కవచాన్ని ధరించి, తగిన ఆయుధాల ను సమకూర్చుకొని సమావేశ మందిరానికి చేరుకొన్నారు. వారిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకోవడంతో పోరు ప్రారంమయింది. ఆత్మరక్షణకై శివాజీ బాగ్నఖ్ (పులిగోళ్లు) అనే మారణాయుధంతో అల్ఫాన్ ను హతమార్చాడు.

ప్రశ్న 5.
పురందర్ సంధి
జవాబు.
క్రీ.శ. 1665 సం॥లో మొగల్ సేనాని రాజా జైసింగ్కు, మరాఠా నాయకుడు అయిన శివాజీకి మధ్య పురంధర్ వద్ద కుదిరిన సంధిని పురంధర్ సంధి అని అంటారు. ఈ సంధి ప్రకారం:

  1. శివాజీ తన స్వాధీనంలోని సాలీనా నాలుగు లక్షల రూపాయల ఆదాయాన్ని ఇచ్చే ఇరవై మూడు కోటలను మొగలులు స్వాధీనం చేసుకున్నారు.
  2. బీజాపూర్ మొగలులు చేసే యుద్ధాలలో సహాయం చేసేందుకు శివాజీ అంగీకరించాడు.
  3. తన కుమారుడు శంభూజీని ఐదువేల మంది అశ్వికులతో మొగల్ ఆస్థానానికి పంపేందుకు శివాజీ అంగీకరించాడు.
  4. 13 సంవత్సరాల కాలంలో నలభై లక్షల పన్నులను చెల్లించేందుకు శివాజీ అంగీకరించాడు.
  5. ఐదు లక్షల పన్నులను ఇచ్చే బీజాపూర్ రాజ్యంలోని ప్రాంతాలపై శివాజీ అధికారాన్ని మొగలులు గుర్తించారు.

ఈ సంధి వల్ల మొగలులు ప్రయోజనం పొందారు. వారి ప్రాభవం వృద్ధి చెందింది. దీనితో శివాజీ అవమానానికి గురి అయినాడు. పురంధర్ సంధి ప్రకారం రాజా జైసింగ్ ప్రోద్బలంతో ఆగ్రాలోని మొగల్ దర్బారును శివాజీ దర్శించింది.

ప్రశ్న 6.
అష్ట ప్రధానులు
జవాబు.
శివాజీ కేంద్రీకృత పాలనావ్యవస్థను ఏర్పాటు చేశాడు. శివాజీ తనకు పరిపాలనలో సహకరించేందుకు ఎనిమిది మంట సభ్యులు గల అష్టప్రధానులు అనే మంత్రిమండలిని ఏర్పాటు చేశాడు. మంత్రులకు వివిధ శాఖలు కేటాయించాడు.

  • పీష్వా: ప్రధానమంత్రి – సాధారణ పాలనా వ్యవహారాలను చూసేవాడు.
  • అమాత్య: ఆర్థిక మంత్రి – ఆదాయ వ్యయాలు, బడ్జెట్ చూసేవాడు.
  • మంత్రి: ఆంతరంగిక వ్యవహారాల మంత్రి.
  • సచివ: సమాచారశాఖా మంత్రి.
  • సుమంత్: విదేశీ వ్యవహారాల మంత్రి.
  • పండితరావు: దానధర్మాలు, ధర్మాదాయం.
  • సేవాపతి: సర్వసైన్యాధ్యక్షుడు.
  • న్యాయాధీశుడు: అత్యున్నత న్యాయాధికారి.

ప్రశ్న 7.
మూడో పానిపట్టు యుద్ధం
జవాబు.
మూడవ పానిపట్టు యుద్ధం అహ్మదా అబ్దాలీ సామ్రాజ్య కాంక్ష ఫలితం. 1761 జనవరి 14న చారిత్రాత్మక పానిపట్టు వద్ద మహారాష్ట్ర, అబ్దాలీ సైనికులు తలపడ్డారు. ఈ యుద్ధంలో ఆఫ్గన్లు విజయం సాధించారు. సదాశివరావు, విశ్వాసరావు అంతటి వీరులు సైతం నేలకొరిగారు. వేలాది సైనికులు చనిపోయారు. ఈ యుద్ధం వలన నష్టపోని మహారాష్ట్ర కుటుంబం లేదు. ఈ పరాజయ వార్త విన్న పీ+3 బాలాజీ బాజీరావు కృంగి మరణించాడు.
రోహిల్లాలు, అయోధ్య నవాబు ంటి స్వదేశీయులు అబ్దాలీకి సహాయపడటం, మహరాష్ట్రులకు ఎటువంటి సహాయం అందకపోవడం మరాఠాల పరాజయానికి కారణాలయ్యాయి. దీనితో పీష్వా అధికారం క్షీణించి మహారాష్ట్ర సమాఖ్య విచ్ఛిన్నమైంది. మొగల్ సామ్రాజ్యం ఇంకా నిర్వీర్యమైపోయింది.

TS Inter 1st Year History Study Material Chapter 10 మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

ప్రశ్న 8.
అమృత్సర్ సంధి
జవాబు.
భారతదేశంలో ఫ్రెంచ్ వారి ప్రాబల్యాన్ని నిరోధించేందుకు బ్రిటిష్ వారు 1809లో రంజిత్ సింగ్తో అమృత్సర్ సంధిని చేసుకొన్నారు. ఈ సంధి ప్రకారం సట్లెజ్ నదికి ఉత్తరాన ఉన్న భూభాగంపై రంజిత్ సింగ్ సార్వభౌమత్వాన్ని బ్రిటిష్వారు గుర్తించారు.

TS Inter 2nd Year English Study Material Chapter 12 A Gift for Christmas

Telangana TSBIE TS Inter 2nd Year English Study Material 12th Lesson A Gift for Christmas Textbook Questions and Answers.

TS Inter 2nd Year English Study Material 12th Lesson A Gift for Christmas

Paragraph Questions & Answers (Section A, Q.No.5, Marks: 4)
Answer the following Questions in about 100 words

Question 1.
“Love, sacrifice and generosity are the essential elements for happy living.” Explain this statement with reference to the story “A Gift for Christmas”. (Revision Test – II)
Answer:
“A Gift for Christmas” is a well-known short story by O. Henry. The original name of the author is William Sydney Porter. This story was first published in 1905.

A Gift for Christmas” is a Christmas story, and it functions as a parable about both the nature of love and the true meaning of generosity. Della’s earnest desire to buy a meaningful Christmas gift for Jim drives the plot of the story, and Jim’s reciprocity of that sentiment is shown when he presents Della with the tortoise-shell combs. Both Jim and Della give selflessly, without expectation of reciprocity. Their sole motivation is to make the other person happy. This, combined with the personal meaning imbued in each of the gifts, conveys the story’s moral that true generosity is both selfless and thoughtful.

Della scours every store in town for two hours before finding the perfect gift for Jim. She notes the similarities between the simple yet valuable watch chain and her understated but loving husband. The watch chain is not merely a shiny trinket; instead, it represents Della’s regard for Jim, and the inherent value she sees in him. Similarly, the combs are not merely an extravagant bauble meant to impress Della; instead, they represent Jim’s commitment to Della and to their relationship. He willingly sells his most valuable possession, handed down from his father, in order to buy Della the combs, suggesting that for Jim, Della and their future family are the most important things in his life.

“ఎ గిఫ్ట్ ఫర్ క్రిస్మస్” అనేది ఓ. హెన్రీ రాసిన చిన్న కథ. రచయిత అసలు పేరు విలియం సిడ్నీ పోర్టర్. ఈ కథ మొదట 1905లో ప్రచురించబడింది.

క్రిస్మస్ కోసం ఒక బహుమతి” అనేది ఒక క్రిస్మస్ కథ, మరియు ఇది ప్రేమ యొక్క స్వభావం మరియు దాతృత్వం యొక్క నిజమైన అర్ధం రెండింటి గురించి ఒక ఉపమానంగా పనిచేస్తుంది. జిమ్ కోసం అర్థవంతమైన క్రిస్మస్ బహుమతిని కొనుగోలు చేయాలనే డెల్లా యొక్క గంభీరమైన కోరిక కథ యొక్క కథాంశాన్ని నడిపిస్తుంది మరియు డెల్లాకు తాబేలు-పెంకు దువ్వెనలను అందించినప్పుడు జిమ్ యొక్క ఆ సెంటిమెంట్ యొక్క అన్యోన్యత చూపబడుతుంది. జిమ్ మరియు డెల్లా ఇద్దరూ పరస్పరం ఆశించకుండా నిస్వార్థంగా ఇస్తారు. ఎదుటి వ్యక్తిని సంతోషపెట్టడమే వారి ఏకైక ప్రేరణ. ఇది, ప్రతి బహుమతులలో నింపబడిన వ్యక్తిగత అర్ధంతో కలిపి, నిజమైన దాతృత్వం నిస్వార్థంగా మరియు ఆలోచనాత్మకంగా ఉంటుందని కథ యొక్క నైతికతను తెలియజేస్తుంది.

డెల్లా జిమ్కి సరైన బహుమతిని కనుగొనడానికి ముందు పట్టణంలోని ప్రతి దుకాణాన్ని రెండు గంటల పాటు వెతుకుతాడు. ఆమె సరళమైన ఇంకా విలువైన వాచ్ చైన్ మరియు తన పేలవమైన కానీ ప్రేమగల భర్త మధ్య సారూప్యతలను పేర్కొంది. వాచ్ చైన్ కేవలం మెరిసే ట్రింకెట్ కాదు; బదులుగా, ఇది జిమ్ పట్ల డెల్లా యొక్క గౌరవాన్ని మరియు అతనిలో ఆమె చూసే స్వాభావిక విలువను సూచిస్తుంది. అదేవిధంగా, దువ్వెనలు కేవలం డెల్లాను ఆకట్టుకోవడానికి ఉద్దేశించిన విపరీతమైన బాబుల్ కాదు; బదులుగా, వారు డెల్లా పట్ల మరియు వారి సంబంధానికి జిమ్ యొక్క నిబద్ధతను సూచిస్తారు. అతను ఇష్టపూర్వకంగా డెల్లా దువ్వెనలను కొనుగోలు చేయడానికి తన తండ్రి నుండి అందజేసిన తన అత్యంత విలువైన ఆస్తిని విక్రయిస్తాడు, జిమ్కు డెల్లా మరియు వారి భవిష్యత్తు కుటుంబం తన జీవితంలో అత్యంత ముఖ్యమైనవి అని సూచిస్తూ.

Question 2.
Analyse the character of Della?
Answer:
A Gift for Christmas” is a well-known short story by O. Henry. The original name of the author is William Sydney Porter. This story was first published in 1905.

Della is a beautiful and fashionable women. She had so beautiful hair that it would make the jewels of Queen of Sheba look worthless. She loves her husband and sees a world in him. She is a really caring wife who would do anything for her husband. She even sold her beautiful hair to buy a present for her husband.

ఎ గిఫ్ట్ ఫర్ క్రిస్మస్” అనేది ఓ. హెన్రీ రాసిన చిన్న కథ. రచయిత అసలు పేరు విలియం సిడ్నీ పోర్టర్. ఈ కథ మొదట 1905లో ప్రచురించబడింది.

డెల్లా ఒక అందమైన మరియు ఫ్యాషన్ మహిళల. ఆమె చాలా అందమైన జుట్టును కలిగి ఉంది, అది షెబా రాణి యొక్క ఆభరణాలకు విలువ లేకుండా చేస్తుంది. ఆమె తన భర్తను ప్రేమిస్తుంది మరియు అతనిలో ఒక ప్రపంచాన్ని చూస్తుంది. ఆమె తన భర్త కోసం ఏదైనా చేసే నిజంగా శ్రద్ధగల భార్య. తన భర్తకు కానుక కొనడానికి తన అందమైన జుట్టును కూడా అమ్మేసింది.

TS Inter 2nd Year English Study Material Chapter 12 A Gift for Christmas

Question 3.
Sketch the character of Jim (Revision Test – II)
Answer:
A Gift for Christmas” is a well-known short story by O. Henry. The original name of the author is William Sydney Porter. This story was first published in 1905.

Jim is a thin man of twenty two. He does not have enough income to support his wife. He bears the burden of fulfilling everyday demands of his wife. He is a very punctual person that why he constantly looks at his watch.

ఎ గిఫ్ట్ ఫర్ క్రిస్మస్” అనేది ఓ. హెన్రీ రాసిన చిన్న కథ. రచయిత అసలు పేరు విలియం సిడ్నీ పోర్టర్. ఈ కథ మొదట 1905లో ప్రచురించబడింది.

జిమ్ ఇరవై రెండు సంవత్సరాల సన్నటి మనిషి. భార్యను పోషించేంత ఆదాయం అతనికి లేదు. అతను తన భార్య యొక్క రోజువారీ డిమాండ్లను నెరవేర్చే భారాన్ని మోస్తున్నాడు. అతను చాలా సమయపాలన ఉన్న వ్యక్తి, అతను నిరంతరం తన గడియారం వైపు చూస్తాడు.

Question 4.
‘A Gift for Christmas” is an example of O. Henry’s comic irony. Justify.
Answer:
A Gift for Christmas” is a well-known short story by O. Henry. The original name of the author is William Sydney Porter. This story was first published in1905.

A Gift for Christmas is a classic example of irony in literature. Irony is a literary tech- nique in which an expectation of what is supposed to occur differs greatly from the actual outcome. In this case, Jim and Della sacrifice their most treasured posses- sions so that the other can fully enjoy his or her gift. Jim sells his watch to buy Della’s combs, expecting her to be able to use them. Della sells her hair to buy Jim a chain for his watch. Neither expects the other to have made that sacrifice. The irony here works both on a practical and on a deeper, more sentimental level. Both Della and Jim buy each other a gift that ultimately seems financially foolish. Being poor, they can’t afford to waste money on things they can’t use. However, what they get is something they don’t expect: a more intangible gift that reminds them how much they love each other and are willing to sacrifice to make each other happy.

ఏ గిఫ్ట్ ఫర్ క్రిస్మస్” అనేది ఓ. హెన్రీ రాసిన చిన్న కథ. రచయిత అసలు పేరు విలియం సిడ్నీ పోర్టర్. ఈ కథ మొదట 1905లో ప్రచురించబడింది.

క్రిస్మస్ కోసం బహుమతి అనేది సాహిత్యంలో వ్యంగ్యానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. వ్యంగ్యం అనేది ఒక సాహిత్య సాంకేతికత, దీనిలో ఏమి జరుగుతుందనే అంచనా వాస్తవ ఫలితం నుండి చాలా భిన్నంగా ఉంటుంది. ఈ సందర్భంలో, జిమ్ మరియు డెల్లా వారి అత్యంత విలువైన ఆస్తులను త్యాగం చేస్తారు, తద్వారా మరొకరు అతని లేదా ఆమె బహుమతిని పూర్తిగా ఆనందిస్తారు. జిమ్ డెల్లా యొక్క దువ్వెనలను కొనడానికి తన గడియారాన్ని విక్రయిస్తాడు, ఆమె వాటిని ఉపయోగించగలదని ఆశించాడు. డెల్లా జిమ్ తన వాచ్ కోసం గొలుసు కొనడానికి తన జుట్టును అమ్ముతుంది. మరొకరు ఆ త్యాగం చేసి ఉంటారని ఎవరూ ఊహించరు. ఇక్కడ వ్యంగ్యం ఆచరణాత్మకంగా మరియు లోతైన, మరింత సెంటిమెంట్ స్థాయిలో పనిచేస్తుంది. డెల్లా మరియు జిమ్ ఇద్దరూ ఒకరికొకరు బహుమతిని కొనుగోలు చేస్తారు, అది చివరికి ఆర్థికంగా మూర్ఖంగా కనిపిస్తుంది. పేదవారు కావడంతో వారు ఉపయోగించలేని వస్తువులపై డబ్బును వృథా చేయలేరు. అయినప్పటికీ, వారు పొందేది వారు ఊహించనిది: ఒకరినొకరు ఎంతగా ప్రేమిస్తున్నారో మరియు ఒకరినొకరు సంతోషపెట్టడానికి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారని వారికి గుర్తుచేసే మరింత కనిపించని బహుమతి.

TS Inter 2nd Year English Study Material Chapter 12 A Gift for Christmas

A Gift for Christmas Summary in English

About Author

TS Inter 2nd Year English Study Material Chapter 12 A Gift for Christmas 1

William Sydney Porter (September 11, 1862 – June 5, 1910), better known by his pen name O. Henry, was an American writer known primarily for his short stories, though he also wrote poetry and non-fiction. His works include “The Gift of the Magi”, “The Duplicity of Hargraves”, and “The Ransom of Red Chief”, as well as the novel Cabbages and Kings. Porter’s stories are known for their naturalist observations, witty narration and surprise endings.
Porter’s legacy includes the O. Henry Award, an annual prize awarded to outstanding short stories.

A Gift for Christmas” is a well-known short story by O. Henry. The original name of the author is William Sydney Porter. This story was first published in1905.

The story narrates the life of a young married couple James who is known as Jim and Della Dillingham. The couple lives in a modest apartment. They have only two valuable possessions: Jim’s gold pocket watch that belonged to his grandfather and Della’s long hair that falls almost to her knees.

It is Christmas Eve. Della wants to buy Jim a Christmas present. But, she has only $1.87. When Della looks at herself in the mirror, she suddenly gets an idea. She sells her hair for $20.00. With that money, she buys a platinum chain for $21.00. She is very happy about the present. She thinks that the chain will add beauty to his watch.

When Jim comes home from work, he stares at Della. She prays to God that he should not find the absence of her hair at first sight. She admits that she sold her hair to buy his present. Before she can give it to him, however, Jim pulls a package out of his overcoat pocket and gives it to her. Inside, Della finds a pair of costly decorative hair combs that she admired cnce. Eut, they are now completely useless since she has cut off the hair. Hiding her tears, she holds out her gift for Jim- the watch chain. Jim tells Della that he has sold his watch to buy her present. He asks her to forget about the presents and enjoy Christmas eve saying “They’re too nice to use just at present”.

The story ends with a comparison of Jim and Della’s gifts to the gifts that the A Gift for Christmas the three wise men who visited Baby Jesus. The narrator concludes that Jim and D’ella are far wiser than the Magi because their gifts are gifts of love. Those who give out of love and self-sacrifice are truly the wisest since they know the value love. Their deed is nothing but, as the writer says, “generosity added to love”.

A Gift for Ch is mis is a classic example of irony in literature. The author ends the story with a twist which surprises the readers. Thus, O. Henry illustrates true love in the story A Gift for Christmas.

A Gift for Christmas Summary in Telugu

Note: This summary is only meant for Lesson Reference, not for examination purpose

“ఎ గిఫ్ట్ ఫర్ క్రిస్మస్” అనేది ఓ. హెన్రీ రాసిన చిన్న కథ. రచయిత అసలు పేరు విలియం సిడ్నీ పోర్టర్. ఈ కథ మొదట 1905లో ప్రచురించబడింది.

ఈ కథ జిమ్ మరియు డెల్లా డిల్లింగ్హామ్ అని పిలువబడే యువ వివాహిత జంట జేమ్స్ జీవితాన్ని వివరిస్తుంది. ఈ జంట నిరాడంబరమైన అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. వారి వద్ద కేవలం రెండు విలువైన ఆస్తులు మాత్రమే ఉన్నాయి: జిమ్ తన తాతకు చెందిన బంగారు జేబు గడియారం మరియు దాదాపు మోకాళ్ల వరకు పడిపోయే డెల్లా పొడవాటి జుట్టు.

ఇది క్రిస్మస్ ఈవ్. డెల్లా జిమ్కి క్రిస్మస్ కానుకను కొనాలనుకుంటోంది. కానీ, ఆమె వద్ద $1.87 మాత్రమే ఉంది. డెల్లా అద్దంలో తనను తాను చూసుకున్నప్పుడు, ఆమెకు అకస్మాత్తుగా ఒక ఆలోచన వస్తుంది. ఆమె తన జుట్టును $20.00కి అమ్ముతుంది. ఆ డబ్బుతో, ఆమె ప్లాటినం చైన్ని $21.00కి కొనుగోలు చేసింది. ఆమె వర్తమానం గురించి చాలా సంతోషంగా ఉంది. ఆ గొలుసు అతని వాచీకి అందం చేకూరుస్తుందని ఆమె అనుకుంటోంది.

జిమ్ పని నుండి ఇంటికి వచ్చినప్పుడు, అతను డెల్లా వైపు చూస్తూ ఉంటాడు. మొదటి చూపులో తన జుట్టు లేకపోవడం అతనికి కనిపించకూడదని ఆమె దేవుడిని ప్రార్థిస్తుంది. అతని బహుమతిని కొనడానికి తన జుట్టును అమ్మినట్లు ఆమె అంగీకరించింది. అయితే, ఆమె అతనికి ఇవ్వడానికి ముందు, జిమ్ తన ఓవర్ కోట్ జేబులోంచి ఒక ప్యాకేజీని తీసి ఆమెకు ఇచ్చాడు. లోపల, డెల్లా ఒకప్పుడు మెచ్చుకున్న ఒక జత ఖరీదైన అలంకార జుట్టు దువ్వెనలను కనుగొంటుంది. కానీ, ఆమె జుట్టు కత్తిరించినందున అవి ఇప్పుడు పూర్తిగా పనికిరావు. తన కన్నీళ్లను దాచిపెట్టి, ఆమె జిమ్- వాచ్ చైన్ కోసం తన బహుమతిని అందజేస్తుంది. జిమ్ డెల్లాకు బహుమతిగా కొనడానికి తన గడియారాన్ని అమ్మినట్లు చెప్పాడు. బహుమతుల గురించి మరచిపోయి, “ప్రస్తుతం వాటిని ఉపయోగించడం చాలా బాగుంది” అని క్రిస్మస్ సందర్భంగా ఆనందించమని అతను ఆమెను అడుగుతాడు.

జిమ్ మరియు డెల్లా యొక్క బహుమతులను, క్రిస్మస్ బహుమతిగా బేబీ జీసస్ను సందర్శించిన ముగ్గురు జ్ఞానులు బహుమతులతో పోల్చడంతో కథ ముగుస్తుంది. జిమ్ మరియు డెల్లా మాగీల కంటే చాలా తెలివైనవారని కథకుడు ముగించారు ఎందుకంటే వారి బహుమతులు ప్రేమ బహుమతులు. ప్రేమ మరియు ఆత్మత్యాగంతో ఇచ్చే వారు నిజంగా తెలివైనవారు, ఎందుకంటే వారికి ప్రేమ విలువ తెలుసు. వారి దస్తావేజు మరొకటి కాదు, రచయిత చెప్పినట్లుగా, “ప్రేమకు దాతృత్వం జోడించబడింది”.

క్రిస్మస్ కోసం బహుమతి అనేది సాహిత్యంలో వ్యంగ్యానికి ఒక అద్భుమైన ఉదాహరణ. పాఠకులను ఆశ్చర్యపరిచే ట్విస్ట్లో రచయిత కథను ముగించారు. ఈ విధంగా, ఓ. హెన్రీ ఎ గిఫ్ట్ ఫర్ క్రిస్మస్ కథలో నిజమైన ప్రేమను వివరిస్తాడు.

A Gift for Christmas Summary in Hindi

Note: This summary is only meant for Lesson Reference, not for examination purpose

‘ए गिफ़्ट ऑफ़ क्रिसमस’ एक प्रसिद्ध लघु कथा है, जो ओ. हेनवी द्वारा लिखित है । यह कहानी पहली बार 1905 में प्रकाशित हुई थी ।

यह कहानी एक युवा विवाहित जोड़े जेम्स के जीवन का वर्णन करती हैं जिसे जिम और डेला डिलिंघम के नाम से जाना जाता है । दंपति एक मामूली अपार्टमेंट में वहते हैं । उनके पास केवल मूल्यवान संपत्तियाँ हैं : जिम के सोने की जेब घड़ी जो उनके दादाजी की थी और डेला के लंबे केश जो लगभग उसके घूटनों तक गिरते हैं ।

यह क्रिस्मस की पूर्व संध्या है । डेला जिम को क्रिस्मस का उपहार खरीदना चाहती है । लेकिन उसके पास $ 1.87 है । जब डेला खुद को आईने में देखती है, तो उसे अचानक एक विचार आता है । वह अपने केशों को $ 20.00 में बेचती है। उस पैसे से वह 21.00 डॉलर में एक प्लैटिनम चेन खरीदती है । वह उपहार के लेकर बहुत खुश है । वह सोचती है कि चेन उसकी घड़ी की सुंदरता में चार चांद लगा देगी ।

जब जिम काम से घर आता है, तो वह डेली को देखता है । वह भगवान से प्रार्थना करती है कि पहली नजर में जिम डेला के केशों की अनुपस्थिति न पहचाने। वह स्वीकार करती है कि उसने अपने उपहार खरीदने के लिए अपने केश बेचे । इससे पहले कि वह उसे दे पाती, जिम अपने ओवर कोट की जेब से एक पैकेट निकालता है और उसे देता है। पैकेट के अंदर डेला को एक मूल्यवान जोड़ा मिलता हैं । पहली नजर में इसके केशों की अनुपस्थिति | वह स्वीकार करती है कि उसने अपना उपहार खरीदने के लिए अपने बाल बेचे । इसने पहले कि वह उसे दे पाती, हालांकि, जिम अपने ओवरकोट की जेब से एक पैकेज निकालता है और उसे देता है। उसके अंदर डेला को मूल्यवान केशों की सजावटी कंघी की जोड़ी मिलती है । जिसकी उसने एक बार प्रशंसा की थी । लेकिने वे अब पूवी तरह से बेकार हैं क्यों कि उसने केश काट दिए हैं |

अपने आँसुओं को छिपाते हुए, वह जिम के लिए अपना उपहार रखती है – घड़ी की चेन । जिम डेला को बताता है कि उसने उसे उपहार खरीदने के लिए अपनी घड़ी बेच दी है । वह उसे उपबरों के बारे में भूल जाने और क्रिस्मस की पूर्व संध्या का आनंद लेने के लिए कहता है, “वे अभी उपयोग करने के लिए बहुत अच्छे साथ समाप्त होती है, जो कि क्रिस्मस के हैं ।” कहानी जिम और डेला के उपहारों की तुलना के लिए एक उपहार तीन बुद्धिमान पुरुष जो बेबी जीसस का दोरा करते थे । वशकार ने निष्कर्ष निकालता है कि जिम और उपहार प्रेम के उपहार हैं। जो लोग प्रेम और आत्म – बलिदान से देते हैं, वे वास्तव में सब से बुद्धिमान हैं क्यों कि वे प्रेम का मूल्य जानते हैं । उनका काम कुछ भी नहीं है । लेकिन, जैसा कि लेखक कहते हैं, “उदारता जुड़ गई प्यार से”

‘क्रिस्मस के लिए एक उपहार’ साहित्य में बिडंबना का एक उत्कृष्ट उदाहरण है । लेखक कहानी का अंत एक ऐसे ट्विस्ट के साथ करता है जो पाठकों को हरान कर देता है । इस प्रकार ओ. हेमरी ‘ए गिफ़्ट फ़र क्रिस्मस’ कहानी में सच्चें प्यार का चित्रण रकते हैं ।

Meanings and Explanations

dollar (n) / (డాలర్) / ‘dɒl.ər : a monetary unit of the US – US: všL KIS v265 अमरिका की मौद्रिक इकाई

cent (n)/(సెంట్)/sent : a monetary unit equal to one hundredth of a dollar
-ఒక డాలర్లో వందవ వంతుకు సమానమైన ద్రవ్య యూనిట్
एक डॉलर के सौवें हिस्से के बराबर एक मौद्रिक इकाई

couch (n)/(కౌచ్) / kaʊtʃ : a long upholstered piece of furniture for several people to sit on – అనేక మంది వ్యక్తులు కూర్చోవడానికి ఒక పొడవైన అప్రోల్స్టర్డ్ ఫర్నిచర్, कई लोगों के बैटने के लिए फ़र्नीचर के सोफ़े का एक हिस्सा

furnished (adj) / (ఫ (ర్)నిష్ ట్) / ‘f3:.nɪʃt : (of accommodation) with furniture -ఫర్నిచర్తో అమర్చిన వసతి, फ़नीचिर से सुसज्जित

TS Inter 2nd Year English Study Material Chapter 12 A Gift for Christmas

dully (adv)/dalli/(డల్లి)/ ‘dʌl.li : excitement – ఉత్సాహం, निरुत्साह

looking-glass (n)/(లుకింగ్ గ్లాస్)/ ‘lʊk.ɪŋ, a mirror, ఒక అద్ధం, एक दर्पण

expenses (n-pl) / (ఎక్స్ పెన్స్)/ik’spens : money needed or used to do or buy something డబ్బు అవసరం లేదా ఏదైనా చేయడానికి లేదా కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తారు, कुछ खरीदने, या करने के लिए उपयोग किस जाता है

worthy (adj) / (వర్తి)/ ‘w3:.ði : suitable for or characteristic of something – దేనికైనా అనుకూలం లేదా లక్షణం, किसी चीज के लिए उपयुक्त था उसकी विशेषता के लिए

lost its colour (phrase) : became pale – లేతగా మారింది, पीला हो जाना

rapidly (adv)/(ర్యాపిడ్ లి)/’ræp.ɪd.li : very quickly; at a great rate a grey cat walking on a grey fence; an expression to state one is staring – చాలా త్వరగా; గొప్ప రేటుతో బూడిద కంచె మీద నడిచే బూడిద పిల్లి; ఒక వ్యక్తి తదేకంగా చూస్తున్నట్లు చెప్పడానికి ఒక వ్యక్తీకరణ बहुत तेजी से, बहुत रफ़्तार से

in a grey background : at nothing; a state of blankness or desperation ఏమీ లేదు; ఖాళీ లేదా నిరాశ స్థితి, एक अभिव्यक्ति यह बताने के लिए है कि कुछ भी नही देख रहा है । खालीपन या हताश की स्थिति

possession (n) / (పజె షన్ జ్) / pəzeʃ.ən, a thing owned-ఒక వస్తువు స్వ౦తం, स्वामित्ववाली वस्तु

pride (n) / (ఫ్రైడ్) / praɪd a feeling or deep pleasure or satisfaction derived from one’s own achievements – ఒకరి స్వ౦త విజయాల నుండి పొందిన అనుభూతి లేదా లోతైన ఆనందం లేదా సంతృప్తి एक भावना या गहरा आनंद था संतुस्ट जो स्वयं से प्राप्त होती है

faltered (v-pt)/(ఫోల్ ట (ర్)డ్)/ ‘fɒl.tər : became weaker – బలహీనంగా మారింది, कमजोर हो गया

fluttered (v-pt)/(ఫ్లట(ర్)డ్)/ ‘flʌt.ər : moved with a light irregular or trembling motion – తేలికపాటి సక్రమంగా లేదా వణుకుతున్న కదలికతో కదిలింది, एक हलकी अनिभमित या कंपन के साथ चली गई गति

cascade (n)/(క్యాస్ కె ఇడ్)/kæs’keɪd : large amount of something like hair falling down – వెంట్రుకలు రాలడం వంటి వాటి మొత్తం, बालों के गिरने जैसी किली चीज की एक बदी मात्रा

nervous (adj) / (నర్వస్)/ tense /’n3:vəs : anxious – ఆతృతగా, तनावग्रस्त स्थिति

burdened (v-pt)/(బర్డెన్ డ్)//b3:dən : loaded heavily, difficult to bear – భారంగా లోడ్ చేయబడింది, భరించడం కష్టం भारी भरी हुई, मुश्किल से सहना

stared (v-pt) /(స్టార్డ్)/ steər : looked fixedly or vacantly at someone or something with one’s eyes wide open, లేదా దేనినైనా కళ్ళు పెద్దవి చేసి చూసారు, निश्चित रूप से यारिक्त रूप से किसी को देखा गया
थार खुली आँखों से किसी को देखा गया

TS Inter 2nd Year English Study Material Chapter 12 A Gift for Christmas

strange (adj)/(స్ట్రెంజ్) / streɪndʒ : unusual or surprising – అసాధారణమైన లేదా ఆశ్చర్యకరమైన, असामान्य या आश्चर्यजनक

expression (n) / (ఎక్స్ ప్రెషన్)/ ik’spreʃ.ən : a look on someone’s face that conveys a particular emotion – ఒక నిర్దిష్ట భావోద్వేగాన్ని తెలియజేసే వ్యక్తి ముఖం, किसी के चेहरे पर एक नज़र जो बता देती है, एक विशेष भावना

cut off (phrase)/(కట్ ఆఫ్) / kʌt.ɒf : remove something using a sharp tool- పదునైన సాధనాన్ని ఉపయోగించి ఏదైనా తీసివేయండి, किसी नुकीले उपकरण का उपयोग करके किसी चीज़ को हटाना

remembered (v-pt) / remembered (రిమెంబర్డ్)/ ri’mem.bər : recalled-గుర్తుచేసుకున్నారు, कोयाद किया

TS Inter 1st Year History Study Material Chapter 5 గుప్తుల యుగం

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 5th Lesson గుప్తుల యుగం Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 5th Lesson గుప్తుల యుగం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సముద్రగుప్తుని సైనిక విజయాలను తెలపండి.
జవాబు.
గుప్త చక్రవర్తులలో సముద్రగుప్తుడు అగ్రగణ్యుడు. సముద్రగుప్తుని విజయాలను, వ్యక్తిత్వాన్ని అతడు జారీచేసిన శాసనాల ఆధారంగా తెలుసుకోవచ్చు. సముద్రగుప్తుడు మొదటి చంద్రగుప్తుడు, కుమారదేవీలకు జన్మించాడు. సైనిక విజయాలు: సముద్రగుప్తుడు గొప్ప విజేత. విదేశీదాస్యం నుంచి భారతదేశానికి విముక్తిని కలిగించి భారతదేశమంతటిని ఒకే పాలన క్రిందకు తీసుకురావాలని ఇతడు ఆశించాడు. ఇతని ఆస్థాన పండితుడు, సేనాపతి అయిన హరిసేనుడు అలహాబాద్లో అశోక స్తంభం మీద వ్రాయించిన “అలహాబాద్ ప్రశస్థి” .ద్వారా ఇతని సైనిక విజయాలను తెలుసుకోవచ్చు. దీని ప్రకారం సముద్రగుప్తుని విజయాలను మూడు భాగాలుగా విభజించవచ్చు.
అవి:

  1. మొదటి ఆర్యావర్త విజయాలు
  2. దక్షిణభారత విజయాలు
  3. రెండో ఆర్యావర్త విజయాలు.

1) మొదటి ఆర్యావర్త విజయాలు: సింహాసనాన్ని అధిష్టించిన వెంటనే సముద్రగుప్తుడు తన అధికారాన్ని ధిక్కరించిన ఉత్తర భారతంలోని రాజులను జయించి పాటలీపుత్రంలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఈ యుద్ధాల్లో సముద్రగుప్తుడు ఓడించిన రాజులు: అహిచ్ఛత్రాన్ని పాలిస్తున్న అచ్యుతుడు, గ్వాలియర్ సమీపంలో పద్మావతీపురాన్ని పాలిస్తున్న నాగసేనుడు, మధురాపురాధీశుడైన గణపతి నాగుడు, ఇంకా చంద్రవర్మ, రుద్రదేవ వంటి మొత్తం ‘ మంది రాజులను అణచి సముద్రగుప్తుడు తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇతని పరాక్రమాన్ని గుర్తించి సP రాజ్యాలైన సమతట, కామరూప, నేపాల్, దావక, కర్రిపుర మొదలైన రాజ్యపాలకులు సముద్రగుప్తుడితో మైత్రి చేసుకున్నారు. మాళవ, యౌధేయ, అభీర వంటి గణరాజ్యాలు ఇతని ఆధిపత్యాన్ని అంగీకరించాయి. ఈ విజయాల ఫలితంగా ఇతని సామ్రాజ్యం హిమాలయాల నుంచి ‘భిల్సా’ వరకు, పంజాబ్ నుంచి బెంగాల్ వరకు విస్తరించింది.

TS Inter 1st Year History Study Material Chapter 5 గుప్తుల యుగం

2) దక్షిణ భారత విజయాలు: మొదటి ఆర్యావర్త యుద్ధాల తరువాత సముద్రగుప్తుడు దక్షిణభారతంపై దండెత్తాడు. ఈ దండయాత్రలో సముద్రగుప్తుడు 12 మంది రాజ్యపాలకులను ఓడించి వారి రాజ్యాలను తిరిగి వారికే అప్పగించాడు. ఆ పాలకులు: 1) కోసల పాలకుడైన మహేంద్రరాజు 2) మహాకాంతార పాలకుడైన వ్యాఘ్రరాజు 3) ఏరండపల్లి దమనుడు 4) పిష్టపుర రాజు మహేంద్రుడు 5) కొత్తూరును పాలించే స్వామిదత్తుడు 6) దేవరాష్ట్ర పాలకుడైన కుబేరుడు 7) వేంగి పాలకుడైన హస్తివర్మ 8) పాలక్క రాజైన ఉగ్రసేనుడు 9) కేరళ రాజ్యాన్ని పాలించే మంత్రరాజు 10) కుశస్థలపురం పాలకుడు ధనంజయుడు 11) అవముక్త పాలకుడు నీలరాజు 12) కంచిని పాలించిన విష్ణుగోపుడు.
సముద్రగుప్తుని ఈ దండయాత్ర మార్గాన్ని గురించి చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

3) రెండో ఆర్యావర్త విజయాలు: సముద్రగుప్తుడు దక్షిణ భారత విజయాల్లో మునిగివున్న సమయంలో ఉత్తరభారతంలోని రాజులు వాకాటక రాజు రుద్రసేనుని నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. సముద్రగుప్తుడు వారిని “కౌశాంబి” యుద్ధంలో ఓడించి, అశ్వమేధయాగాన్ని చేసి సామ్రాట్టుగా ప్రకటించుకున్నాడు. ఈ విజయాలను గుర్తించి మధ్యభారతంలోని అనేక అటవీ రాజ్యాల అధిపతులు ఇతని ఆధిపత్యాన్ని అంగీకరించారు.

ఇట్టి విజయ పరంపరల వలన చరిత్రకారులు సముద్రగుప్తుని ఇండియన్ నెపోలియన్ అని కీర్తించారు.
ఇతర దేశాలతో సంబంధాలు: విజేతగా సముద్రగుప్తుడి కీర్తి, ప్రతిష్టలు విదేశాలకు కూడా వ్యాపించాయి. అనేకమంది విదేశీరాజులు ఇతనితో దౌత్య సంబంధాలనేర్పరుచుకొన్నారు. సింహళరాజైన మేఘవర్ణుడు క్రీ.శ. 851లో ఇతని ఆస్థానానికి రాయబారులను, కానుకలను పంపడమే కాకుండా తన దేశం నుంచి భారతదేశం వచ్చే బౌద్ధ యాత్రికుల కోసం బుద్ధగయ సమీపంలో ఒక విహారాన్ని నిర్మింపజేశాడు.

ప్రశ్న 2.
గుప్తుల పరిపాలనా ముఖ్యాంశాలను వెలికితీయండి.
జవాబు.
భారతదేశ చరిత్రలో గుప్తుల యుగం స్వర్ణయుగంగా భావించబడింది. గుప్తుల పాలనలో ప్రధానాంశాలు.

కేంద్రపాలన:
చక్రవర్తి: కేంద్రపాలనలో చక్రవర్తి అత్యున్నత అధికారి. రాజును దైవాంశ సంభూతుడిగా భావించేవారు. ‘అలహాబాద్ ప్రశస్తి’ సముద్రగుప్తుడిని దేవుడిగా వర్ణించింది. చక్రవర్తికి అపరిమిత అధికారాలున్నాయి. గవర్నర్లు, ఇతర పౌర అధికారులను అతనే నియమిస్తాడు. వారందరూ చక్రవర్తికి జవాబుదారీగా ఉండేవారు.

మంత్రులు: పాలనా వ్యవహారాలలో మంత్రుల కూటమి చక్రవర్తికి సహాయపడుతుంది. వీరిని ‘మంత్రులు’ లేదా ‘సచివులు’ అంటారు. మంత్రులు వారికి కేటాయించిన శాఖల బాధ్యతలు నిర్వర్తించేవారు.

ఇతర అధికారులు: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పరగణాలకు, జిల్లాలకు ప్రత్యేక దూతల ద్వారా తెలిపే అధికారి సర్వాధ్యక్షుడు. సైన్యంపై అధికారాలను కలిగిన మంత్రి ‘మహాసేనాపతి’. మహాదండనాయకుడు, ప్రధాన న్యాయమూర్తి, విదేశీ వ్యవహారాలు, ‘మహాసంధి విగ్రహకుడు’ నిర్వహిస్తాడు. భాండాగారాధికృత అనే అధికారి ప్రభుత్వ ఖజానాధికారి. వీరేగాక ప్రతీహారులు, రాజసన్యాసులు, కుమారామాత్యుడు, ఇలా అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించేవారు. రాష్ట్రపాలన: పరిపాలనా సౌలభ్యం కోసం గుప్తులు తమ విశాలమైన రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించారు. రాష్ట్ర విభాగాలను ‘దేశ’ లేదా ‘భుక్తి’ అంటారు. ‘భుక్తి’ పాలకుడిని ఉపరికుడు అంటారు. యువరాజుకాని, రాజకుటుంబీకులు కాని ఉపరికులుగా నియమింపబడతారు. రాష్ట్రాలను మరల జిల్లాలుగా విభజించారు. వాటిని ‘? చూలు’ అంటారు. ‘విషయ’ పాలనాధికారిని ‘విషయపతి’ అంటారు. డా॥ ఎ.యస్. ఆల్టేకర్ చెప్పినట్లు ప్రభ వికేంద్రీకరించబడింది. చాలావరకు జిల్లా పాలనకు విధులు బదిలీ చేయబడ్డాయి.

పాలనాపరంగా ప్రాంతీయ పాలన: గుప్తుల కాలంలో ప్రాంతీయ పాలన రెండు రకాలుగా అభివృద్ధి చెందింది. 1. మునిసిపల్ లేదా నగర పాలన 2. గ్రామీణ పాలన. నేటి ప్రధాన నగరాలైన పాటలీపుత్ర, తక్షశిల, మండసార్, ఉజ్జయినిలలో నగర పాలన ఉండేది. నగరపాలనను విషయపతి నిర్వహిస్తాడు. ఆరోగ్యం, పరిశుభ్రత, ప్రాథమిక విద్య మొదలైనవి ‘పరిషత్’ కున్న ప్రధాన విధులు.

గ్రామం పరిపాలనలో అతి చిన్న విభాగం. గ్రామ పాలనను నిర్వహించడానికి ‘గ్రామికుడు’లేదా గ్రామాధ్యక్షుడు నియమించబడ్డాడు. గ్రామ రక్షణ, శాంతిభద్రతలు ఇతడి ప్రధాన విధులు. గ్రామాధ్యక్షుడికి సహాయంగా ‘పంచ మండలం’ అనే సభ ఉంటుంది. గ్రామ పెద్దలతో ఈ సంఘం ఏర్పడుతుంది.

న్యాయపాలన: చక్రవర్తి అత్యున్నత న్యాయాధికారి. గ్రామస్థాయి నుంచి ఉన్నత న్యాయస్థానాల వరకు ఉండేవి. ` ప్రధాన న్యాయమూర్తిని మహాదండనాయకుడు అంటారు. ఫాహియాన్ రచనలలో న్యాయవ్యవస్థ వివరాలు ఉన్నాయి. నాడు చట్టాలు సరళంగా ఉండేవి. శిక్షలు కూడా సాధారణంగా ఉండేవి.

సైనికపాలన: గుప్త పాలకులకు బలమైన సైన్యం ఉండేది. గజబలం, అశ్వికబలం, కాల్బలం ఉండేవి. రథాలు కూడా ఉండేవి. ఎడారి ప్రాంతాల్లో ఒంటెలు కూడా వాడారు. సైన్యంలో ప్రధాన అధికారి ‘మహాసేనాధిపతి’, ‘రణభాండాగారాధికరణ’ సైనికులకు అవసరమయ్యే ఏర్పాట్లు చేసేవారు. అలహాబాద్ స్తంభ శాసనంలో వారు వాడిన ఆయుధాల వివరాలు తెలియజేయబడ్డాయి.

ప్రశ్న 3.
గుప్తులు సాహిత్యం, మతాభివృద్ధికి చేసిన సేవను వివరించండి.
జవాబు.
ప్రాచీన భారతదేశ చరిత్రలో గుప్తుల కాలాన్ని స్వర్ణయుగమంటారు. ఈ కాలాన్ని గ్రీస్ చరిత్రలోని పెరిక్లిస్ యుగంతోను, రోమన్ చరిత్రలోని అగస్టస్ యుగంతోను పోలుస్తారు. ఈ యుగంలో భారతదేశం అన్ని రంగాల్లోను అభివృద్ధిని సాధించింది.

రాజకీయ ఐక్యత: గుప్తపాలకులు ఉత్తర భారతదేశాన్ని అనైక్యత నుండి కాపాడి, దేశ సమైక్యతను సాధించారు. మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, చంద్రగుప్త విక్రమాదిత్యుడు మొదలగు పాలకులు తమ దిగ్విజయ యాత్రల ద్వారా దేశ రాజకీయ ఏకీకరణను సాధించారు.

విజ్ఞులైన చక్రవర్తులు: గుప్త చక్రవర్తులు సమర్థులు, పండితులు, శూరులు. వీరిలో సముద్రగుప్తుడు అగ్రగణ్యుడు. ఇతడు అజేయుడైన వీరుడే కాక మంచి కవి కూడా. గుప్త చక్రవర్తులందరూ మత సహనమును పాటించారు. వీరి వ్యక్తిగత ప్రతిభాసంపత్తి గుప్తయుగము స్వర్ణయుగము కావటానికి దోహదపడింది.

ఆర్థికాభివృద్ధి: గుప్తుల సమర్థవంతమైన పాలన వలన రాజ్యంలో సుఖశాంతులు ఏర్పడి ఆర్థికాభివృద్ధి జరిగింది. ప్రజలు సంపన్నులై, సంతోషంగా జీవించేవారని ఫాహియాన్ పేర్కొన్నాడు. శిక్షలు స్వల్పంగా ఉండేవి. బాటసారులకు దొంగల భయం లేకుండా ఉండేది. స్వదేశీ, విదేశీ వాణిజ్యం పురోగమించుటచే దేశసంపద పెరిగింది. పరిశ్రమలు వర్ధిల్లాయి. వ్యవసాయమునకు మంచి ప్రోత్సాహం లభించింది.

మతసామరస్యము:
ఎ) గుప్త చక్రవర్తులు హిందువులవటంతో అశ్వమేథము మొదలగు వైదిక కర్మలను ఆచరించారు. త్రిమూర్తులకు ప్రాధాన్యతనిచ్చారు. గుప్తుల ఇష్టదైవం విష్ణువు కనుక విష్ణుపురాణం, విష్ణుస్మృతి, భాగవతం మున్నగు గ్రంథములు ఆదరింపబడ్డాయి. శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి మున్నగు దేవతలను కూడా వీరు పూజించారు. ఈ కాలంలో సగుణోపాసనకు ప్రాముఖ్యం పెరిగింది.

బి) తాము వైదిక మతమును అవలంబించినప్పటికి గుప్త చక్రవర్తులు జైన, బౌద్ధమతముల యెడల అపారమైన సహనాన్ని పాటించారు. ప్రసిద్ధ బౌద్ధపండితుడైన వసుబంధుని సముద్రగుప్తుడు ఆదరించాడు. సింహళ ప్రభువు మేఘవర్ణుడు భారతదేశములో బౌద్ధవిహారము నిర్మించుటకు ఇతడు అనుమతించాడు. కుమారగుప్తుడు నలందా బౌద్ధ విశ్వవిద్యాలయమును స్థాపించాడు. నాటి బౌద్ధ, జైన ప్రతిమలు అసంఖ్యాకముగా లభించుటయే గుప్తుల మత సహనమునకు తార్కాణం. కాలక్రమేణా బౌద్ధమతం క్షీణించింది. మహాయాన బౌద్ధమతము హిందూమత శాఖవలె తోచుటయే ఇందుకు కారణం. జైనమతం మాత్రమే కొన్ని ప్రాంతాలలో కొనసాగింది. గుప్తులు ఉన్నత ఉద్యోగాలలో మత ప్రమేయం లేకుండా బౌద్ధులను, జైనులను నియమించారు.

సారస్వతాభివృద్ధి: గుప్తుల కాలంలో సంస్కృత భాష పూర్తి వికాసాన్ని పొందింది. సముద్రగుప్తుడు స్వయంగా కవి. “కవిరాజు” అను బిరుదాంకితుడు. సముద్రగుప్తుని సేనాని హరిసేనుడు అలహాదాబ్ ప్రశస్థి శాసనాన్ని వ్రాశాడు. రెండో చంద్రగుప్తుని ఆస్థానంలో ‘నవరత్నాలు’ అనే కవులుండేవారు. వారు

  1. కాళిదాసు
  2. అమరసింహుడు
  3. శంకు
  4. ధన్వంతరి
  5. క్షపణికుడు
  6. బేతాళభట్టు
  7. ఘటకర్షకుడు
  8. వరరుచి
  9. వరాహమిహిరుడు.

కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతల’మనే కావ్యం అనేక ప్రపంచ భాషల్లోకి అనువదించబడింది. ‘మృచ్ఛకటికం’ నాటకాన్ని రచించిన శూద్రకుడు ఈ కాలంవాడే. నాడు వసుబంధు, దిజ్ఞాగుడు, బుద్ధపాలితుడు, భావవివేకుడు వంటి. బౌద్ధ రచయితలు నిరుపమానమైన రచనలు చేశారు. ఈ రచనల ద్వారా ఆనాటి రాజాస్థాన జీవితం, ప్రభువర్గాల జీవన విధానం గురించి తెలుస్తుంది.

విజ్ఞాన శాస్త్రాభివృద్ధి: విజ్ఞానశాస్త్రంలో కూడా గుప్తుల కాలం అద్భుతమైన ప్రగతిని సాధించింది. ఆర్యభట్టు ‘సూర్యసిద్ధాంత’మనే గ్రంథాన్ని, వరాహ మిహిరుడు ‘బృహత్సంహిత’ అనే గ్రంథాన్ని రచించారు. బ్రహ్మ గుప్తుడు గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టి తన పుస్తకం ద్వారా దానిని లోకానికి వెల్లడి చేశాడు. వైద్యశాస్త్రాభివృద్ధికి విశేషంగా కృషిచేసిన శుశ్రుతుడు, వాగ్భటుడు, ధన్వంతరి మొదలైనవారు గుప్తుల కాలంవారే.

కళాభివృద్ధి: గుప్తుల కాలంలో కళలు కూడా పరాకాష్టనందుకొన్నాయి. ఈ కాలంలో జరిగిన నిర్మాణాలన్నీ మతం వలన ప్రేరేపితమైనవే. ఉదాహరణకు దేవఘర్లోని దశావతార దేవాలయం, తిగావా, భూమారా ఆలయాలు, సాంచి, సారనాథ్ లోని బౌద్ధాలయాలు ఈ కాలంలో వాస్తుకళ సాధించిన ప్రగతికి నిదర్శనాలు. గుప్తుల కాలంలో శిల్పకళ కూడా పరిపక్వతను పొందింది. అజంతా గుహల్లోని కొన్ని కుడ్యచిత్రాలు ఈ కాలానికి చెందినవే. లోహాలతో విగ్రహాలను, ఉక్కుతో స్తంభాలను పోతపోయడంలోను, రకరకాల అందమైన నాణాల తయారీలో కూడా గుప్తయుగం తన ప్రత్యేకతను నిలబెట్టుకొంది.

ముగింపు: గుప్తుల యుగం భారతదేశ చరిత్రలో ఒక విశిష్టయుగం. ఈ విశిష్టత ప్రధానంగా సాహిత్యం, విజ్ఞానశాస్త్రాలు కళారంగాలలో కనిపిస్తుంది.

TS Inter 1st Year History Study Material Chapter 5 గుప్తుల యుగం

ప్రశ్న 4.
హర్షవర్ధనుని అంచనా వేయండి.
జవాబు.
గుప్త సామ్రాజ్య పతనానంతరం ఉత్తర భారతదేశం అనేక చిన్న స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయింది. పాటిలో ఒకటి స్థానేశ్వర రాజ్యం. స్థానేశ్వరాన్ని పాలించిన పుష్యభూతి వంశస్థులలో హర్షుడు ప్రముఖుడు. ఇతను క్రీ.శ. 606 – 647 వరకు రాజ్యపాలన చేస్తాడు. తన దండయాత్రలతో ఉత్తర భారత రాజకీయ ఏకీకరణ సాధించాడు.

చారిత్రక ఆధారాలు: బాణుడి హర్షచరిత్ర, హుయాన్ త్సాంగ్ రచించిన సీ- యు- కి హర్షుని శాసనాలు ముఖ్య ఆధారాలు. హర్షుడు రచించిన నాటకాల ద్వారా నాటి సాంఘిక పరిస్థితిని అంచనా వేయవచ్చు.

తొలి విజయాలు: తండ్రీ, సోదరుల మరణానంతరం క్రీ.శ. 606లో హర్షుడు తన పదహారవ ఏట రాజ్య సింహాసనాన్ని రాజపుత్ర’ అనే బిరుదుతో అధిష్టించాడు. సింహాసనానికి వచ్చిన వెంటనే హర్షుడు కామరూప దేశాధిపతి భాస్కరవర్మతో మైత్రిని పొంది, తరువాత మాళవ, గౌడాధీశులను శిక్షించాడు. ఆత్మహత్య చేసుకోబోతున్న సోదరి రాజ్యశ్రీని కాపాడుకున్నాడు. కనోజ్ మంత్రివర్గ విన్నపం మేరకు స్థానేశ్వర, కనోజ్ రాజ్యాలను కలిపి ‘కనోజ్ రాజధానిగా పాలించాడు. “శీలాదిత్య” అనే బిరుదు ధరించాడు. క్రీ.శ. 606 నుండి 647 వరకు పరిపాలించాడు.

జైత్రయాత్రలు: హర్షుడు విశాల సైన్యాన్ని సమకూర్చుకుని ఆరు సంవత్సరాల పాటు చేసిన దిగ్విజయ యాత్రలలో మాళవరాజ్యం, వల్లభి, వంగ, మగధ, గంజామ్ ప్రాంతాలను జయించాడు.

ఓటమి: హర్షుని జీవితంలో చూసిన ఏకైక ఓటమి రెండవ పులకేశి చేతిలో ఓటమి ఉత్తరాపథాన్ని జయించిన హర్షవర్ధనుడు దక్షిణాపథాన్ని జయించాలనుకున్నాడు. కానీ పశ్చిమ చాళుక్యరాజైన రెండవ పులకేశి, హర్షుని నర్మదానదీ తీరంలో ఓడించి వెనుకకు మళ్ళించాడు. నర్మద రెండు రాజ్యాలకు సరిహద్దు అయిందని రెండవ పులకేశి ఐహోల్ శాసనం వలన తెలుస్తుంది. ఈ విధంగా హర్షవర్ధనుడు ఆర్యవర్తానికి చక్రవర్తిగా ఉన్నాడనీ ‘సకలోత్తరపధేశ్వరుని’గా ఐహోల్ శాసనం పేర్కొనటం వలన తెలుస్తుంది.
పాలన: హర్షుడు సమర్థుడైన పాలకుడు. ప్రజా సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపాడు. హర్షుడు విరామమెరుగక రాజ్యభారాన్ని నిర్వహించేవాడని హుయాన్ త్సాంగ్ వ్రాశాడు. పండిన పంటలో 6వ వంతును మాత్రమే పన్నుగా వసూలు చేసాడు. హర్షుని శిక్షాస్మృతి కఠినంగా ఉండేది. నేరాలు అధికంగా ఉండేవని తెలుస్తుంది.

మహామోక్ష పరిషత్: దానధర్మాలలో అశోకునికి సాటిరాగల చక్రవర్తి. ప్రయాగలో మహామోక్ష పరిషత్ ఐదేండ్లకొకసారి జరిపి తన ఖజానాలోని సర్వాన్ని దానం చేసేవాడని, తాను ఆరవ మహామోక్ష పరిషత్కు హాజరయ్యానని హుయాన్త్సాంగ్ రాసుకున్నాడు. ఇందు మొదటిరోజు బుద్ధుని, రెండవరోజు సూర్యుని, మూడవరోజు శివుని పూజించి ఐదు లక్షల జనులకు దానధర్మాలు చేసాడు.

సారస్వత పోషణ: హర్షుడు నలంద విశ్వవిద్యాలయానికి 100 గ్రామాలను దానం చేసాడు. స్వయంగా కవి. రత్నావళి, నాగానందం, ప్రియదర్శిక అనే నాటకాలు రచించాడు. బాణుడు, భర్తృహరి, మయూమడు, మతంగ దివాకరుడు ఇతని ఆస్థాన కవులు, ఉత్తర భారతదేశాన్ని పాలించిన ఆఖరు చక్రవర్తి హర్షుడు. ఇతడు బ: ముఖ ప్రజ్ఞాశాలి.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
చంద్రగుప్తు విక్రమాదిత్యుని విజయాలపై ఒక లఘు వ్యాసం రాయండి.
జవాబు.
విక్రమాదిత్యునిగా పేరుగాంచిన రెండవ చంద్రగుప్తుడు దాదాపు 35 సంవత్సరాలు పరిపాలించాడు. శకులపై ఇతడు సాధించిన విజయం, ధృవాదేవి గౌరవాన్ని కాపాడటం అనేవి ఇతనికి వీరోచిత, ప్రసిద్ధఖ్యాతిని అందించాయి. విశాఖదత్తుడు రాసిన “దేవీచంద్రగుప్తుం” అనే నాటకంపై విషయాన్ని వివరించింది. ఇతడు శకులను ఓడించి పశ్చిమ భారతదేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇతడు నాగవంశ కుటుంబానికి చెందిన కుబేరనాగను వివాహం చేసుకోగా ప్రభావతి గుప్తు అనే కూతురు పుట్టింది. ఈమెను వాకాటక రెండవ రుద్రసేనునికిచ్చి వివాహం చేయగా ఆ రాజ్యం కూడా గుప్త సామ్రాజ్యంలో అంతర్భాగమైంది. రెండవ చంద్రగుప్తుని పాలన కళా వైభవానికి, సాహిత్య పోషణకు ప్రసిద్ది చెందింది. చాలా ప్రసిద్ధి చెందిన కవి, నాటక రచయిత కాళిదాసు ఇతని ఆస్థానంలోనివాడే. ఈ కాలంలోనే ఫాహియాన్ అనే చైనా యాత్రికుడు భారతదేశాన్ని సందర్శించాడు.

ప్రశ్న 2.
గుప్త సామ్రాజ్యం పతనానికి గల కారణాలను పరీక్షించండి.
జవాబు.
పురుగుప్తుని కుమారుడైన బుధగుప్తుడు క్రీ.శ. 477లో సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడు క్రీ.శ. 500 సంవత్సరంలో చనిపోయి ఉండవచ్చు. జయనాధుడు, మహారాజ లక్ష్మణుడు తదితర సామంతరాజులు చక్రవర్తి సార్వభౌమాధికారాన్ని అంగీకరించలేదు. దక్షిణ ప్రాంతంలోని గుప్త సామ్రాజ్యాన్ని నరేంద్రసేనుని నాయకత్వంలోని వాకాటకులు ఆక్రమించారు. ఆ కాలంలో హూణుల దాడులు కూడా గుప్తు సామ్రాజ్య పతనానికి ఒక కారణం. ఈ కారణాలన్నింటివల్ల అతి పెద్దదైన గుప్త సామ్రాజ్యం చిన్న చిన్న ముక్కలుగా, స్వతంత్ర ఉపరాజ్యాలుగా చీలిపోయింది. బుధగుప్తుని మరణానంతరం ‘ గుప్తవంశం పతనమైనందున అతని తరువాత వచ్చినటువంటి రాజుల పేర్లు నిర్దిష్టంగా తెలియరాలేదు. ఆ తరువాత తోరమానుని నాయకత్వంలో హూణులు పంజాబు, పశ్చిమ భారతదేశంలోని పెద్ద భూభాగాన్ని ఎరాన్ వరకు జయించారు. గుప్త పాలకులలో చివరివారు నరసింహగుప్తుడు, కుమారగుప్తుడు, విష్ణుగుప్తుడు. అయితే, ఆనాడు రాజ్యంలో వీరి అధికారం నామమాత్రంగానే ఉండేది.

ప్రశ్న 3.
గుప్తుల కాలంనాటి శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధిని విశ్లేషించండి.
జవాబు.
గుప్తుల కాలంలో భారతీయులు గణిత, ఖగోళ శాస్త్రాలలో అద్భుత ప్రగతిని సాధించారు. ప్రపంచం ఆశ్చర్యపోయే ఆవిష్కరణలు వచ్చాయి. ఈ యుగానికి చెందిన వారే ‘సున్నా’, ‘దశాంశ’ పద్ధతులకు రూపకల్పన చేశారు. ఆర్యభట్టు, వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు నాటి ప్రసిద్ధ ఖగోళ శాస్త్రజ్ఞులు, గణితశాస్త్ర పండితులు.

ఆర్యభట్టు: క్రీ.శ. 5 – 6 శతాబ్దాల మధ్య కాలంలో ఆర్యభట్టు ‘సూర్య సిద్ధాంతం’ సూర్య, చంద్ర గ్రహణాలు వివరిస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని మొదట కనుగొన్న మేధావి అతడే. “ఆర్యభట్టీయం” అనే గ్రంథాన్ని రచించాడు. అందులో గణితశాస్త్ర అంశాలున్నాయి.

వరాహమిహిరుడు: ఇతడు బృహత్సంహిత గ్రంథం రాశాడు. అది ఖగోళశాస్త్ర గ్రంథం. భౌతిక భూగోళశాస్త్రం, వృక్షశాస్త్రం, సహజ చరిత్ర అండలో కలదు. పంచ సిద్ధాంతక బృహతాతక మొదలైన గ్రంథాలు రచించాడు. బ్రహ్మగుప్తుడు: క్రీ.శ. 6,7 శతాబ్దాలలోనే న్యూటన్ చెప్పిన అంశాలను చాలా ముందు కాలంలోనే తెలిపిన గొప్ప ఖగోళ శాస్త్రజ్ఞుడు. ప్రకృతి సూత్రం ప్రకారం అన్ని వస్తువులు భూమిపైన పడాల్సిందే. బ్రహ్మస్ఫుట, సిద్ధాంత, ఖండఖండ్యక `అనే గ్రంథాలు రాశాడు.

ఇతర విజ్ఞాన శాస్త్రాలు: వరాహమిహిరుడు, పాదరసం, ఇనుము ఉపయోగించటం, వైద్యం కోసం లోహసంబంధ తయారీలు రసాయనశాస్త్ర వృద్ధిని సూచిస్తున్నాయి. ‘నవనీతకం’ అనే వైద్య గ్రంథంలో మందుల వివరాలు, వాటి తయారీ వివరించబడింది. పశువైద్యశాస్త్రానికి చెందిన ‘హస్తాయుర్వేద’ గ్రంథాన్ని రచించింది ‘పాలకాప్య’. చరకుడు, సుశ్రుతుడు ఈ కాలానికి చెందిన ప్రసిద్ధ వైద్యులు. ధన్వంతరి కూడా ఈ కాలానికి చెందినవాడే.

ప్రశ్న 4.
గుప్తులు కళలు, శిల్పకళా వైభవానికి చేసిన సేవకై ఒక వివరణ ఇవ్వండి.
జవాబు.
నిర్మాణాలు: భారతీయ నిర్మాణాలలో గుప్తుల కాలానికి ప్రత్యేక స్థానం ఉంది. నగర, ద్రావిడ పద్ధతుల్లో గుప్తుల కళ భారతీయ నిర్మాణ చరిత్ర వైభవానికి ప్రతీకగా నిలిచింది.
గుప్తుల కళ: గుప్తుల కాలం శిల్ప కళారంగం స్వర్ణయుగంగా ప్రసిద్ధిచెందింది. భవనాలు, దేవాలయాలు, స్తంభాలు, స్తూపాలు అనేకం నిర్మించారు. వీరు నిర్మించిన అద్భుతమైన దేవాలయాల్లో హూణులు, ముస్లిం దాడుల తరువాత మిగిలినవి:

  1. ఝాన్సీ జిల్లాలోని దేవఘడ్ వద్దగల దశావతార దేవాలయం.
  2. మధ్యప్రదేశ్లోని భూమారా వద్దగల శివాలయం.

పెర్సీ బ్రౌన్ అభిప్రాయంలో భిట్టర్గావ్ దేవాలయ శిల్ప నిర్మాణం సుదీర్ఘ సంప్రదాయానికి ప్రతీకగా ఉంది. ఇంకా కొన్ని స్తూపాలు, గుహలు, విహారాలు కూడా నిర్మించబడ్డాయి. సారనాథ్ స్తూపం, అజంతా, ఉదయగిరి గుహలు ఆనాటి గొప్ప నిర్మాణాలు. అందమైన బుద్ధుని విగ్రహాలు రాతితో, లోహంతో, బంకమట్టితో చేయడంతోపాటు వివిధ పౌరాణిక బొమ్మలు రాతిపై అందంగా చెక్కారు.

శిల్ప నిర్మాణం:
a. రాతి శిల్పం: సారనాథ్ బుద్ధ విగ్రహం, ఉదయగిరి వద్దగల గుహ ప్రవేశ ద్వారం వద్దగల వరాహ ప్రతిమ చక్కటి ఉదాహరణలు. గ్వాలియర్ వద్ద ఒక నృత్యకారిణితో మహిళా సంగీత విద్వాంసుల చిత్రాలు అద్భుతమైనవి.
b. లోహ నిర్మాణం: 18 అడుగుల ఎత్తైన బుద్ధుని రాగి విగ్రహం, క్రీ.శ. 6వ శతాబ్దంలో బీహారులో నలంద వద్ద నిర్మించారు. సుల్తాన్ గంజ్లోని బుద్ధ విగ్రహం 72 అడుగుల ఎత్తు ఉంది. ఢిల్లీలో మెహరోలి వద్ద ఉన్న ఇనుప స్తంభం గుప్తుల సాంకేతిక పరిజ్ఞానానికి మచ్చుతునక.
కనిష్కుడు గొప్ప భవన నిర్మాత. కనిష్కపురం, పురుషపురం అనే రెండు నగరాలను నిర్మించాడు.

ప్రశ్న 5.
హర్షవర్థనుని పరిపాలనా విధానం గురించి రాయండి.
జవాబు.
పరిపాలన సౌలభ్యం కోసం సామ్రాజ్యాన్ని భుక్తులుగాను, భుక్తులను విషయాలుగాను, విషయాలను గ్రామాలుగాను విభజించారు. పాలనా విధానంలోను, విద్యా, సాంస్కృతిక రంగాల్లోను హర్షుడు గుప్తయుగం సంప్రదాయాలనే అనుసరించాడు. రాజుకు సలహాలిచ్చి సహాయం చేయడానికి మంత్రిపరిషత్ ఉండేది. ప్రభుత్వ విధానంలో మంత్రి పరిషత్కు గౌరవప్రదమైన స్థానం ఉంది. వారసత్వాన్ని నిర్ణయించడానికి కూడా మంత్రిపరిషత్తుకు అధికారం ఉంది. హర్షచరిత్ర నుంచి, శాసనాల నుంచి అనేకమంది ఉద్యోగుల పేర్లు తెలుస్తున్నాయి. వారిలో మహాసంధి – విగ్రహాధికృత (యుద్ధ వ్యవహారాలు), రాజస్థానీయ (విదేశీ వ్యవహారాలు), మహాబలాధికృత (సేనాపతి), ఆయుక్తక, భోగక (పన్నుల వసూలు), భాండాగారాధికృత (కోశాధికారి) మొదలైనవారు ముఖ్యులు. వీరికి జీతాలకు బదులు భూములను ఇచ్చేవారు. సైనికోద్యోగులకు మాత్రం జీతాలిచ్చేవారు.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
హరిసేనుని సేవ గురించి రాయండి.
జవాబు.
గుప్తుల చరిత్ర తెలుసుకోవడానికి ప్రధాన ఆధారాలలో ఒకటైన అలహాబాద్ స్తంభ శాసనం సముద్రగుప్తుని సర్వ సైన్యాధికారియైన హరిసేనుడు రచించాడు. ఇది సముద్రగుప్తుని సైనిక దండయాత్రలని, అతని విజయాలని, ఉత్తర, దక్షిణ భారతదేశ రాజకీయ భౌగోళికతను తెలుపుతుంది. ఇంత ప్రాధాన్యత కలిగిన ఈ శాసనం సంస్కృత భాషలో రచింపబడింది. హరిసేనుడు కవిగా కూడా గుర్తింపు పొందాడు.

TS Inter 1st Year History Study Material Chapter 5 గుప్తుల యుగం

ప్రశ్న 2.
రామగుప్తునిపై ఒక లఘుటీక రాయండి.
జవాబు.
విశాఖదత్తుని దేవీచంద్రగుప్తుం అనే గ్రంథం సముద్రగుప్తుని మరణానంతర సంఘటనల్లో భాగంగా, శకరాజు దాడులకు భయపడిన రామగుప్తుడు తన పట్టపురాణియైన ధృవాదేవిని అప్పగించాలని భావించడంతో, సహించలేని సోదరుడు రెండవ చంద్రగుప్తుడు శకులను పారద్రోలి, అసమర్థుడైన రామగుప్తుని సంహరించి, రాణిని కాపాడుతాడు.

ప్రశ్న 3.
విజ్ఞాన శాస్త్రాభివృద్ధికి ఆర్యభట్టు చేసిన సేవను పరీక్షించండి.
జవాబు.
విజ్ఞాన శాస్త్రాలు కూడా గుప్తుల కాలంలో ఎంతగానో అభివృద్ధి చెందాయి. ప్రసిద్ధిగాంచిన భారత ఖగోళ శాస్త్రవేత్తలైన ఆర్యభట్టు తన “ఆర్యభట్టీయం” అనే గ్రంథంలో గ్రీకులతో మనకు గల సంబంధాల వల్ల ఖగోళశాస్త్ర రంగంలో మనం సాధించిన అభివృద్ధిని గురించి వివరించాడు. ఇతడు ఖగోళ శాస్త్రాన్ని ఉన్నత స్థాయిలోనికి తీసుకొని వచ్చినవాడుగా గణతికెక్కాడు. ఇతడు గ్రహణాలను శాస్త్రీయ పద్ధతిలో వివరించాడు. భూమి తన అక్షంపై తిరగడం వల్ల భూమి నీడ చంద్రునిపై పడుతూందని, తత్ఫలితంగా గ్రహణం ఏర్పడుతుందని ఆర్యభట్టు అభిప్రాయపడ్డాడు. ఇతని సిద్ధాంతాలు శాస్త్రీయంగా ఉండి, మతాన్ని, సంప్రదాయాలను కలిపి ఆచరించే వారిని వ్యతిరేకించాయి. ఇంకా, ఇతడు గణితంలో దశాంశస్థాన విలువల పద్ధతిని కూడా ఆనాడే ఉపయోగించాడు.

ప్రశ్న 4.
ఫాహియాన్ గురించి రాయండి.
జవాబు.
చైనా యాత్రికుడైన ఫాహియాన్ చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో, క్రీ.శ. 405 సంవత్సరంలో భారతదేశానికి వచ్చాడు. ఇతడు బౌద్ధ సన్యాసి, బుద్ధుని జన్మభూమి అయిన భారతదేశాన్ని సందర్శించాలనే ఉత్సాహం కలిగినవాడు. రెండవ చంద్రగుప్తుని పాలనా కాలంనాటి రాజకీయ, సామాజిక, మత, ఆర్థిక పరిస్థితులను తన ‘ఫో-కు-వోకి’ అనే గ్రంథంలో వివరించాడు. గుప్తుల కాలంనాటి చరిత్రకు ఇది ప్రధాన ఆధార గ్రంథం.

ప్రశ్న 5.
అలహాబాద్ స్థంభ శాసన ముఖ్యాంశాలను తెల్పండి.
జవాబు.
అలహాబాద్ ప్రశస్థిని సముద్రగుప్తుని సేనాని హరిసేనుడు సంస్కృతభాషలో వ్రాయించాడు. ఇది ఒక శాసనం రూపంలో ఉంది. దీనిలో సముద్రగుప్తుని దిగ్విజయాలు వివరించబడ్డాయి. దీనిని కావ్యశైలిలో రచించారు. ఇది అలహాబాద్ లోని అశోక స్తంభంపై వ్రాయబడి ఉంది.

ప్రశ్న 6.
హూణుల దండ్రయాతను వర్ణించండి.
జవాబు.
హూణులు చైనా పరిసర ప్రాంతాలకు చెందిన అనాగరిక మోటుజాతి ప్రజలు. వీరిలో నల్లహూణులు, తెల్లహూణులు అను రెండు శాఖలవారున్నారు. తెల్లహూణులు భారతదేశముపై దాడిచేసి గుప్తుల సామ్రాజ్యంలో శాంతిభద్రతలకు అంతరాయం కలిగించారు. వీరిలో తోరమాణుడు, మిహిరకులుడు ముఖ్యులు. వీరి దండయాత్రల వలన గుప్త సామ్రాజ్యం బలహీనపడింది. గణతంత్ర రాజ్యాలు అంతరించాయి. బౌద్ధమతం నాశనమైంది. కాలక్రమంలో హూణులు క్షత్రియులుగా గుర్తింపు పొందారు.

ప్రశ్న 7.
హర్షుని మహామోక్ష పరిషత్ను వర్ణించండి.
జవాబు.
హర్షుడు ప్రయాగ వద్ద ప్రతి 5 సంవత్సరములకొకసారి సర్వస్వదాన కార్యక్రమాన్ని నిర్వహించేవాడు. దీనినే మహామోక్ష పరిషత్ అంటారు. ఇటువంటి పరిషత్లను హర్షుడు ఆరింటిని జరిపాడు. క్రీ.శ. 643లో జరిగిన 6వ పరిషత్కు -హుయాన్ త్సాంగ్ హాజరయ్యాడు. ఈ పరిషత్తులో హర్షుడు తన సర్వస్వాన్ని బ్రాహ్మణులకు, అనాథలకు పంచి, కట్టుగుడ్డలతో రాజధానికి తిరిగి వచ్చేవాడు.

TS Inter 1st Year History Study Material Chapter 5 గుప్తుల యుగం

ప్రశ్న 8.
హుయానా త్సాంగ్ రచనలపై ఒక వివరణ ఇవ్వండి.
జవాబు.
హర్షుని కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ (క్రీ.శ. 630 – 644). ఇతడు దేశంలోని అనేక ప్రాంతాల్లో, బౌద్ధమత పవిత్ర స్థలాల్లో నలందా విశ్వ విద్యాలయంలో గడిపి అనేక బౌద్ధ గ్రంథాలను అధ్యయనం చేశాడు. హర్షునికి సన్నిహితుడైనాడు. హర్షుడు కనోజ్, ప్రయాగలో జరిపిన మోక్ష పరిషత్లలో పాల్గొన్నాడు. భారతదేశంలో అనేక బౌద్ధ గ్రంథాలను, బుద్ధుని ధాతువులను సేకరించాడు. తన పర్యటన అనుభవాలను సి-యు-కి అను గ్రంథంగా రచించాడు. ఈ గ్రంథం హర్షుని రాజ్యంలోని రాజకీయ, సాంఘిక, మత పరిస్థితులను వివరిస్తుంది.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry

Telangana TSBIE TS Inter 1st Year Chemistry Study Material 5th Lesson Stoichiometry Textbook Questions and Answers.

TS Inter 1st Year Chemistry Study Material 5th Lesson Stoichiometry

Very Short Answer Type Questions

Question 1.
How many number of moles of glucose are present in 540 gms of glucose? [IPE ’14]
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 1

Question 2.
Calculate the weight of 0.1 mole of sodium carbonate. [AP ’16]
Answer:
No. of moles of sodium carbonate
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 2

Question 3.
How many molecules of glucose are present in 5.23 g of glucose (Molecular weight of glucose 180 u).
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 3
No. of molecules = No. of moles × Avogadro’s number
= \(\frac{5.23}{180}\) × 6.02 × 1023 = 1.75 × 1022 molecules

Question 4.
Calculate the number of molecules present in 1.12 × 10-7 c.c. of a gas at STP (c.c. – cubic centimeters = cm³).
Answer:
22400 cm³ contain 6.02 × 1023 molecules
1.12 × 10-7 cm³ contain ?
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 4
3 × 1012 molecules.

Question 5.
The empirical formula of a compound is CH2O. Its molecular weight is 90. Calculate the molecular formula of the compound. [AP ’16, Mar. ’13]
Answer:
Molecular formula = empirical formula × n
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 5
Empirical formula weight of CH2O
= 12 + 2 + 16 = 30
n = \(\frac{90}{30}\) =3
Molecular formula = (CH2O)3 = C3H6O3

TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry

Question 6.
Balance the following equation by the oxidation number method.
Cr(s) + Pb(NO3)2(aq) → Cr(NO3)3(aq) + Pb(S)
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 6

Question 7.
What volume of H2 at STP is required to reduce 0.795 g of CuO to give Cu and H2O.
Answer:
H2 reduces CuO according to the reaction
CuO + H2 → Cu + H2O
Moles of CuO = \(\frac{0.795}{79.5}\) = 0.01
Since 1 mol. of CuO can be reduced by 1 mol. of H2
0.01 mol of CuO is reduced by 0.01 mol. of H2
Volume of H2 = 0.01 × 22.4 = 0.2242 lits.

Question 8.
Calculate the volume of 02 at STP required to completely burn 100 ml. of acetylene.
Answer:
C2H2 + \(\frac{5}{2}\) O2 → 2 CO2 +H2O
To burn 22400 ml. of C2H2 the volume of O2 required is 22400 × \(\frac{5}{2}\)
For burning 100 ml. of C2H2 the volume of O2 requires
100 × 22400 × \(\frac{5}{2}\) × \(\frac{1}{22400}\) = 250 ml.

Question 9.
Now a days it is thought that oxidation is simply decrease in electron density and reduction is increase in electron density. How would you justify this?
Answer:
Oxidation involves loss of electrons whereas reduction involves gain of electrons. Thus oxidation is decrease in electron density whereas reduction is increase in electron density.

Question 10.
What is a redox concept? Give an example.
Answer:
Oxidation is the increase in oxidation number of the given species while the reduction is decrease in the oxidation number of the given species in a reaction. A chemical reaction in which both oxidation and reduction takes place simultaneously is called redox reaction.
e.g.: Na + \(\frac{1}{2}\)Cl2 → NaCl

In the above reaction oxidation number of sodium increases from 0 to +1 while the oxidation number of chlorine decreases from 0 to -1. So sodium is oxidised and chlorine is reduced.

Question 11.
Calculate the mass percent of the different elements present in sodium sulphate (Na2SO4).
Answer:
Molecular weight of Na2SO4 = 142
142 gm of Na2SO4 contain 46 gms of sodium
∴ 100 gm of Na2SO4 contain \(\frac{100\times46}{142}\) = 32.38%
142 gm of Na2SO4 contain 32 gm of sulphur
∴ 100 gm of Na2SO4 contain \(\frac{100\times32}{142}\) = 22.54%
142 gm of Na2SO4 contain 64 gm of oxygen
∴ 100 gm of Na2SO4 contain \(\frac{100\times64}{142}\) = 45.08%

Question 12.
What do you mean by significant figures?
Answer:
Significant figures are meaningful digits which are known with certainity.
Eg: If we write 11.2 ml., the 11 is certain and 2 is uncertain and the uncertainity may be ±1 in the last digit. So the significant figure is 2.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry

Question 13.
If the speed of light is 3.0 × 108 ms-1. Calculate the distance covered hy light in 2.00 ns.
Answer:
Distance = speed × time
= 3 × 108 × 2 × 10-9 = 0.6 meter
So the distance covered by light in 2 ns = 0.6 meter.

Short Answer Questions

Question 1.
The approximate production of sodium carbonate per month is 424 × 106 g. While that of methyl alcohol is 320 × 106 gm. Which is produced more in terms of moles?
Answer:
Moles of sodium carbonate produced per month = \(\frac{424\times10^6}{106}\) = 4 × 106
Moles of methyl alcohol produced per month = \(\frac{320\times10^6}{32}\) = 107
So methyl.alcohol produced in terms of moles is more.

Question 2.
How much minimum volume of CO at STP is needed to react completely with 0.112 L of O2 at 1.5 atm. pressure and 127°C to give CO2.
Answer:
Reaction between CO and O2
2 CO + O2 → 2CO2
Moles of O2 = \(\frac{PV}{RT}=\frac{1.5\times0.112}{0.0821\times400}\) = 5.11 × 10-3
According to the reaction for every one mole O2 two moles of CO reacts.
∴ The minimum volume of CO required at
STP = 5.11 × 10-3 × 2 = 10.22 × 10-3
⇒ 10.22 × 10-3 × 22400 = 229.32 ml.

Question 3.
Chemical analysis of a carbon compound gave following percentage composition by weight of the element present, carbon =10.06%, hydrogen = 0.84%, chlorine = 89.10%. Calculate the empirical formula of the compound.
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 7
∴ Empirical formula of the compound = CHCl3

Question 4.
A carbon compound on analysis gave the following percentage composition, carbon 14.5%, hydrogen 1.8%, chlorine 64.46%, oxygen 19.24%. Calculate the empirical formula of the compound.
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 8
∴ Empirical formula of the compound = C2H3Cl3O2

Question 5.
Calculate the empirical formula of a compound having percentage composition:
Potassium (IQ = 26.57; Chromium (Cr) = 35.36, Oxygen (O) = 38.07.
(Given the Atomic weights of K, Cr and O are 39, 52 and 16 respectively)
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 9
∴ Empirical formula of the compound = K2Cr2O7

Question 6.
A carbon compound contains 12.8 % Carbon, 2.1 % Hydrogen, 85.1 % Bromine. The molecular weight of the compound is 187.9. Calculate the molecular formula. [AP Mar. ’17]
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 10
Empirical formula of the compound = C1H2Br1
Empirical formula weight = 1 × C + 2 × H + 1 × Br = 1 × 12 + 2 × 1 + 1 × 80 = 94
Molecular weight = 187.9
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 11
Molecular formula = Empirical formula × n = C1H2Br1 × 2 = C1H4Br2.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry

Question 7.
0.188 g of an organic compound having an empirical formula CH2Br displaced 24.2 cc of air at 14°C and 752 mm pressure. Calculate the molecular formula of the compound. (Aqueous tension at 14°C is 12 mm)
Answer:
Pressure of dry gas = Pressure of gas – aqueous tension = 752-12 = 740 mm
According to ideal gas equation PV = \(\frac{W}{M}\) RJ.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 12
Substiuting these values in ideas gas equation
Molecular weight
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 13
Empirical formula of the compound = CH2Br
Empirical formula wt. of the compound = 12 + 2 + 80 = 94
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 14

Question 8.
Calculate the amount of 90% H2S04 required for the preparation of 420 kg HCl.
2 NaCl + H2SO4 → Na2SO4 + 2HCl
Answer:
No. of moles of HCl to be prepared = \(\frac{420\times10^3}{36.5}\) = 11.5 × 10³

According to the reaction for every two moles of HCl one mole of H2SO4 is required. Therefore the no. of moles of H2SO4 required is

\(\frac{11.5}{2}\) × 10³ = 5.75 × 10³
Wt. of H2SO4 = 5.75 × 10³ × 98 = 563.5 kg
Since the given H2SO4 contain only 90%.
The weight to be taken is \(\frac{563.5\times100}{90}\) = 627 kg.

Question 9.
An astronaut receives the energy required in his body by the combustion of 34g of sucrose per hour. How much oxygen he has to carry along with him for his energy requirement in a day?
Answer:
Wt. of sucrose required per day = 34 × 24
= 816 gm
Moles of sucrose = \(\frac{W}{M.Wt.}=\frac{816}{342}\) = = 2.385
Sucrose react with oxygen as follows.
C12H22O11 + 12O2 → 12 CO2 + 11 H2O
According to the above reaction
1 mole sucrose requires – 12 moles of O2
2.385 moles requires = \(\frac{2.385\times12}{1}\) = 28.63
Wt. of oxygen = No. of moles × Mol. Wt.
= 28.63 × 32 = 916.2 gm.

Question 10.
What volume of CO2 is obtained at STP by heating 4 g of CaCO3?
Answer:
Calcium carbonate decomposes on heating.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 15

According the reaction
1 mole of CaCO3 on heating gives 1 mole of CO2
Mol. wt. of CaCO3 = 100
∴ 100 gm of CaCO3 on heating gives 22.4 lit.
4 gm of CaCO3 on heating gives ?
\(\frac{4\times22.4}{100}\) = 0.896 lit.

Question 11.
When 50 gm of a sample of sulphur was burnt in air 4% of the sample was left over. Calculate the volume of air required at STP containing 21% oxygen by volume.
Answer:
Amount of Sulphur taken = 50 gm
Wt. of sulphur left = 4% = 2 gm
Wt. of sulphur reacted = 50 – 2 = 48 gm
Sulphur burns in air according to the reaction
S + O2 → SO2
Moles of Sulphur = \(\frac{48}{32}\) = 1.5
Moles of Oxygen required = 1.5
Volume of oxygen at STP = 22.4 × 1.5 = 33.6 lit.
Volume of air = \(\frac{33.6\times100}{21}\) =160 lit.
(∴ air is 21% O2)

Question 12.
Calculate the volume of oxygen gas required at STP conditions for the complete combustion of 10 cc of methane gas at 20°C and 770 mm pressure.
Answer:
Methane burns according to the reaction
CH4 + 2O2 → CO2 + 2H2O
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 16
Moles of O2 = 4 × 10-4 × 2 = 8 × 10-4
Vol. of O2 at STP = 8 × 10-4 × 22400
= 18.88 cc.

Question 13.
Calculate the volume of H2 liberated at 27°C and 760 mm of Hg pressure by action by 0.6g magnesium with excess of dil HCl.
Answer:
Magnesium reacts with dilute hydrochloric acid as
Mg + 2 HCl → MgCl2 + H2
No. of moles of Mg = \(\frac{0.6}{24}\) = 0.025
No. of moles of H2 = 0.025
(∴ 1 mole Mg liberates)
Ideal gas equation PV = nRT
P = 760 mm = 1 atm T = 27 + 273 = 300 K
V = ? n = 0.025
R = 0.0821
Substituting these values in ideal gas equation.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 17

Question 14.
Explain the role of redox reactions in titrimetre processes and galvanic cells.
Answer:
Role of redox reactions in titrimetric quantitative analysis:
Titrimetric analysis involves two substances. They are (1) a solution of known concentration or a standard solution and (2) a solution of unknown concentration. The first solution is also known as Titrant. The second solution is also known as Titrand. The process of adding a standard solution to the titrand till the reaction is just complete is called titration. The point at which the titrand just completely reacts with the standard solution is called “equivalence point” or “end point.”

In redox reactions the completion of the titration is detected by a suitable method like (a) observing a physical change.
Ex : The light pink colour of KMnO4 titrations.

(b) by using a reagent known as indicator which gives a clear visual change in its colour.
Ex (1) In Cr2O7-2 (dichromate) titrations, diphenyl amine is used as a reagent and at the end point it produces intense blue colour due to its oxidation by Cr2O7-2.
Ex (2) In the titration of Cu+2 with F (Iodometry)
2Cu+2(aq) + 4I(aq) → Cu2I2(S) + I2(aq)

The I2 formed in the redox reaction gives a deep blue colour with starch solution, added to the flask.

In this way redox reactions are taken as the basis for titrimetric analysis with MnO4, Cr2O-27 etc. as oxidising agents and S2O-23 etc. as reducing agents.

Role of Redox reactions in galvanic cells :
When a zinc rod is kept in copper sulphate solution then the following redox reaction takes place.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 18

In this redox reaction the transfer of electrons from Zn(s) to Cu+2(aq) takes place directly. The same transfer of electrons can also be done indirectly in a galvanic cell (Daniel cell).

Cells in which chemical energy is converted into electrical energy are called galvanic cells. Daniel cell is a best example for a galvanic cell. The Daniel cell consists of two beakers containing zinc rod dipped in ZnSO4(aq) solution in one beaker and a copper rod dipped in CuSO4(aq) solution in a second beaker. The two beakers are connected by an inverted U – tube, known as salt bridge. The two rods are connected by means of wires to the terminals of an ammeter. Redox reaction takes place in each of the beakers. Each beaker contains both oxidised and reduced forms of the respective species. The two types of species present together in each beaker is called a redox couple. Each beaker contains a redox couple. The oxidised and reduced forms are separated by a vertical line or a slash.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 19

In the above arrangement the two redox couples are represented by Zn+2/Zn and Cu+2/Cu. As the metal is in two different oxidation states at the interface (say Zn/ Zn+2), some potential is developed, which is called electrode potential’. These electrode potentials are very useful in metallurgy, electroplating etc.

In this way redox reactions play an important role in galvanic cells.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry

Question 15.
Define and explain molar mass.
Answer:
Molar mass :
The mass of one mole of any substance in grams is called its molar mass.
Ex : Molar mass of sulphuric acid = 98 g.
Molar mass of hydrogen
= one gram for a gm atomic mass.
= two grams for a gm molecular mass.

Thus molar masses are atomic weights, molecular weights, formula weights etc. expressed in grams.

Gram atomic weight is atomic weight expressed in grams. Gram molecular weight is molecular weight expressed in grams.

Gram atom :
One gram atomic weight of a substance is known as gram atom.

Gram molecule:
One gram molecular weightj of a substance is known as gram molecule.

Mole :
It is the mass of a substance which contains Avogadro number of structural units.

1 mole = 1 gram molecule
= 1 gram molecular weight
= Mass of 6.023 × 1023 molecules in grams.
1 mole = 1 gram atom
= 1 gram atomic weight
= Mass of 6.023 × 1023 atoms in grams.

Question 16.
What are disproportionate reactions? Give example. [TS ’16, ’15; Mar. ’10]
Answer:
Chemical reactions in which the same element undergoes both oxidation and reduction simultaneously are known as disproportionation reactions.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 20

Question 17.
What is comproportionation reactions? Give example.
Answer:
The reverse of disproportionation is comproportionation. In these reactions, two species with the same element in two different oxidation states form a simple product in which the element is in an intermediate oxidation state.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 21

Question 18.
Determine the empirical formula of an oxide of iron which has 69.9% iron and 30.1% dioxygen by mass.
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 22
The ratio of Fe and 0 atoms = 0.67 : 1
Multiply with 3 to make integer = 2:3
Empirical formula of oxide of iron = Fe2O3

Question 19.
Calculate the mass of sodium acetate (CH3COONa) required to make 500 ml. of 0.375 molar aqueous solution. Molar mass of sodium acetate is 82.0245 g mol-1.
Answer:
Molar mass of CH3COO Na – 82.0245 g mol-1
1 mol = 82.02459
0.375 mol = ?
0.375 × 82.0245 gm
1000 ml. contain 0.375 × 82.0245 g
500 ml. contain ?
= \(\frac{500}{1000}\) × 0.375 × 82.0245
= 15.375 gm.
∴ The mass of CH3COONa present in 500 ml
= 15.375 gm.

Question 20.
What is the concentration of sugar (C12H22O11) in mol L-1 if 20 g are dissolved in enough water to make a final volume upto 2L?
Answer:
Molarity = mole per litre
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 23

Question 21.
How many significant figures are present in the following?
i) 0.0025, ii) 208, iii) 5005, iv) 126,000 v) 500.0, vi) 2.0034
Answer:
(i) 0.0025
No. of significant figures = 2

(ii) 208
No. of significant figures = 3

(iii) 5005
No. of significant figures = 4

(iv) 1,26,000
No. of significant figures = 6

(v) 500.0
No. of significant figures = 4

(vi) 2.0034
No. of significant figures = 5

TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry

Question 22.
Round up the following upto three significant figures:
i) 34.216, ii) 10.4107, iii) 0.04597, iv) 2808
Answer:
(i) 34.216 = 34.2
(ii) 10.4107 = 10.4
(iii) 0.04597 = 0.046
(iv) 2808 = 2.81 × 10³

Question 23.
Calculate the molarity of a solution of ethanol in water in which the mole fraction of ethanol is 0.040 (assume the density of water to be one). Use the data given in the following table to calculate the molar mass of naturally occuriiig argon isotopes:

Isotope Isotopic molar mass Abundance
36Ar 35.96755 g mol-1 0.337%
38Ar 37.96272 g mol-1 0.063%
40Ar 39.9624 g mol-1 99.600 %

Answer:
(a) Mole fraction of ethanol = 0.04
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 24
Moles of ethanol n1 = 0.04
No. of moles of water = 1 – 0.04 = 0.996
Wt. of water = 0.996 × 18 gm
Vol. of water = 0.996 × 18 ml.
Molarity of ethanol
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 25

Question 24.
A welding fuel gas contains carbon and hydrogen only. Burning a small sample of it in oxygen gives 3.38 g carbon dioxide, 0.690 g of water and no other products. A volume of 10.0 L (measured at STP) of this welding gas is found to weigh 11.6 g Calculate 0) empirical formula, (ii) molar mass of the gas, and (iii) molecular formula.
Answer:
No. of moles of CO2 = \(\frac{3.38}{44}\) = 0.07682
No. of moles of H2O = \(\frac{0.69}{18}\) = 0.03833
Ratio of the moles of CO2 = H2O
= 0.07682 : 0.03833 = 2 : 1
∴ The ratio of carbon and hydrogen atoms is 1 : 1 (because 1 CO2 = H2O)
Empirical formula = CH
10.0 L at STP weigh 11.6 g
22.4 L at STP weigh ?
\(\frac{22.4\times11.6}{10}\) = 26
∴ Molecular wt. of compound = 26
Empirical formula weight = 13
= \(\frac{26}{13}\) =2
Molecular formula = (EF) × 2 = C2H2

Question 25.
Calcium Carbonate reacts with aqueous HCl to give CaCl2 and CO2 according to the reaction,
CaCO3(s) + 2 HCl(aq) → CaCl2(aq) + CO2 (g) + H2O
What mass of CaCOs is required to react completely with 25 ml of 0.75 M HCl?
Answer:
CaCO3 (s) + 2 HCl (aq) → CaCl2 (aq) + CO2 (g) + H2O (I)
Moles of HCl = \(\frac{25\times0.75}{1000}\) = 0.01875
With 2 mol. of HC/ the mole of CaCO3 react is 1 mol. with 0.01875 mol. of HCl the mole of CaCO3 that react is
\(\frac{0.01875\times1}{2}\) = 0.009375
Wt. of CaCO3 = 0.009375 × 100 = 0.9375 gm.

Question 26.
Chlorine is prepared in the laboratory by treating manganese dioxide (MnO2) with aqueous hydrochloric acid according to the reaction
HCl (aq) + MnO2(s) → 2H2O (l) + MnCl2 (aq) + Cl2(g)
How many grams of HCl react with 5.0 g of manganese dioxide?
Answer:
Moles of MnO2 = \(\frac{5}{87}\) = 0.0574
The reaction between MnO2 and HCl given is
4 HCl (aq) + MnO2(s) → 2H2O(l) + MnCl2(aq) + Cl2(g)

As per the above reaction for 1 mol. of MnO2 1 mol. of Cl2 is produced by the reaction with 4 mol. of HCl.

∴ 1 mol. of MnO2 react with 4 × 36.5 gmm HCl.
0.0574 mol. of MnO2 react with? HCl
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 26

Question 27.
To 50 ml. of 0.1 N Na2CO3 solution 150 ml. of H2O is added. Then calculate the normality of resultant solution.
Answer:
V1 = 50 V2 = 50 + 150 = 200
N1 = 0.1 N2 = ?
V1N1 = V2N2
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 27

Question 28.
Calculate the volume of 0.1 NH2SO4 required to neutralise 200 ml. of 0.2 N NaOH solution.
It is an acid base neutralisation reaction. Hence, at the neutralisation point. Number of equivalents of acid = Number of equivalents of base.
Answer:
Vol. of H2SO4 V1 = ?
Volume of NaOH V2 = 200 ml.
Normality of H2SO4 N1 = 0.1
Normality of NaOH N2 = 0.2 N
V1N1 = V2N2
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 28

Question 29.
Calculate normality of H2SO4 solutions if 50 ml of it completely neutralise 250 ml. of 0.1 N Ba(OH)2 solutions.
Answer:
Vol. of H2SO4, V1 = 50 ml.
Volume of Ba(OH)2, V2 = 250 ml.
Normality of H2SO4, N1 = ?
Normality of Ba(OH)2, N2 = 0.1
V1N1 = V2N2
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 29

Question 30.
Calculate the volume of 0.1M KMnO4 required to react with 100 ml. of 0.1 M H2C2O4. 2H2O solution in the presence of H2SO4.
Answer:
Potassium permanganate react with oxalic acid according to the reaction
2 KMnO4 + 5H2C2O4 + 3H2SO4 → K2SO4 + 2 MnSO4 + 8 H2O + 10 CO2
Vol. of KMnO4, V1 = ?
Volume of H2C2O4, V2 = 100 ml.
Molarity of KMnO4 = 0.1 M
Molarity of H2C2O4, M2 = 0.1
No. of moles of KMnO4 n1 = 2
No. of moles of H2C2O4, n2 = 5
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 30

Question 31.
Assign oxidation number to the underlined elements in each of the following species.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 31
Answer:
a) +5
b) +6
c) +5
d)+6
e) -1
f) +3
g) +6
h) +6

TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry

Question 32.
What are the oxidation number to the underlined elements in each of the following and how do you rationalise your results?
a) KI3
b) H2S4O6
c) Fe3O4
Answer:
a) KI3 → K+ + I3

I3 ion is formed by combining I-1 with I2.

The average oxidation number is \(\frac{1}{3}\) but I is in -1 oxidation state while I2 is zero oxidation state.

b) H2S4O6 has the following structure
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 32

The oxidation states of S2 and S3 are zero but the oxidation states of S1 and S4 are +5.
The average oxidation state is \(\frac{10}{4}\) = 2.5

c) Fe3O4 contain FeO and Fe2O3
In FeO oxidation state of Fe in FeO = +2
In Fe2O3 oxidation state of Fe in Fe2O3 = +3
So average oxidation of Fe
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 33

Question 33.
Justify that the following reactions are redox reactions.
a) CuO(s) + H2(g) → Cu(s) + H2O (g)
b) Fe2O3(s) + 3CO(g) → 2Fe(s) + 3CO2(g)
c) 4BCl3(g) + 3UA1H4(S) → 2B2H6 (g) + 3 LiCl (s) + 3 AIC13(S)
d) 2K(s) + F2(g) → 2K+F(s)
e) 4NH3(g) + 5O2(g) → 4NO(g) + 6H2O(g)
Answer:
a) CuO(s) + H2(g) → Cu(s) + H2O (g)
In this reaction the oxidation number of Cu decreased from +2 to 0 and the oxidation state of H2 is increased to +1.
So it is a redox reaction.

b) Fe2O3(s) + 3CO(g) → 2Fe(s) + 3CO2(g)
In this reaction the oxidation number of Fe ion Fe2O3 is decreased to zero in Fe from +3 and the oxidation number of carbon in CO is increased from +2 to +4 ion CO2. So it is a redox reaction.

c) 4BCl3(g) + 3ULiAlH4(S) → 2B2H6(g) + 3 LiCl(s) + 3 AlCl3(S)
In LiAlH4, hydrogen is present as H ion with more negative charge on H. But ion B2 H6 ; also the H atom will have some negative charge as the electronegativity of H is 2.1 ; while that of boron is 2.0.

According to the modern concept decrease in electron density is reduction nnd increase in electron density is oxidation.

Here the electron density decreases at hydrogen and increases at boron because (he bond with more electronegative atom i (B – Cl) changes to less electronegative ; atom (B – H). So it is also redox reaction.

d) 2K(s) + F2(g) → 2K+F(s)
In the formation of K+F, K loses electron (oxidation) and F gains electron (reduction) so it is redox reaction.

e) 4NH3(g) + 5O2(g) → 4NO(g) + 6H2O(g)
The oxidation of N increases from -3 to +2 in the conversation of NH3 to NO. It is oxidation.

The oxidation number of 02 changes from zero to -2.

It is reduction. So it is redox reaction.

Question 34.
Fluorine reacts with ice and results in the change.
H2O (S) + F2(g) → HF(g) + HOF(g)
Justify that this reaction is a redox reaction.
Answer:
The electron density at O – atom decreases when the O – H bond changes to O – F since electronegativity of F is more than H. The decrease in electron density is reduction.

The electron density in F2 is zero, but in HOF the electron density in F increases. The increase in electron density is reduction. So the above reaction is redox reaction.

Question 35.
Calculate the oxidation number of sulphur, chromium and nitrogen ion H2SO5, Cr2O2-7 and NO3. Suggest structure of those compounds.
Answer:
H2SO5
Oxidation number of H = +1
Oxidation number of O = -2
Oxidation number of S = x
(2 × 1) + x + 3(-2) + 2(—1) = 0
2 + x – 6 – 2 = 0
x – 6 = 0
x = + 6

i) The oxidation number of sulphur is exceeding its group number which cannot exist. So it should contain peroxy bond.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 34

ii) Cr2C2-7
Oxidation state of chromium = x
Oxidation state of oxygen = – 2
(2x) + (-2 × 7) = -2
2x = + 12
∴ x = \(\frac{+12}{2}\) = +6
The oxidation state Cr = +6
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 35

(iii) NO3
Oxidation state of N = x
Oxidation state of 0 = -2
x + (-2 × 3) = -1
x = +5
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 36

Question 36.
Write the formulae for the following compounds.
a) Mercury (II) chloride
b) Nickel (II) sulphate
c) Tin (IV) oxide
d) Thallium (I) sulphate
e) Iron (III) sulphate
f) Chromium (III) oxide.
Answer:
a) HgCl2
b) NiSO4
c) Sn2O4
d)Tl2SO4
e) Fe2(SO4)3
f) Cr2O3

TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry

Question 37.
Suggest a list of the substances where carbon exhibit oxidation states from – 4 to 4 and nitrogen from -3 to +5.
Answer:
List of carbon compounds that exhibit oxidation states from -4 to +4
The underlined carbon in the following compounds have the oxidation*state mentioned.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 37

Question 38.
While sulphur dioxide and hydrogen peroxide can act as oxidising as well as reducing |gents in their reactions, ozone and nitric acid act only as oxidants. Why?
Answer:
In sulphur dioxide sulphur is in +4 oxidation state. It can increase its oxidation number upto +6 while acting as reducing agent and can decrease its oxidation number upto either 0 or -2 while acting as oxidising agent.

Similarly in hydrogen peroxide oxidation number of oxygen is -1. It can increase its oxidation number upto zero and can decrease its oxidation number to -2.

Therefore SO2 and H2O2 can act as oxidising and reducing agents in their reactions.

In ozone the oxidation number of oxygen is zero. It can only decrease its oxidation number but cannot increase its oxidation number. This is because it is only the most electronegative atom next to fluorine.

In nitric acid oxidation state of nitrogen is +5. It cannot increase its oxidation state because it is the maximum oxidation state of nitrate. It can only decrease its oxidation number.

Because of these reasons ozone and nitric acid can act only as oxidising agents.

Question 39.
Consider the reactions
a) 6CO2(g) + 6H2O (I) → C6H12O6(aq) + 6O2(g)
b) O3(g) + H2O2 (I) → H2O (I) + 2O2 (g)
Why it is more appropriate to write these reactions as
a) 6CO2(g) + 12H2O (I) → C6H12O6 + 6H2O(I) + 6O2(g)
b) O3(g) + H2OZ (I) → H2O (I) + O2 (g) + O2(g)
Also suggest a technique to investigate the path of the above (a) and (b) redox reactions.
Answer:
Plants absorb carbon dioxide from air, water from soil and convert them into carbohydrates in the presence of sunlight and Chlorophyll. This process is known as photosynthesis.

During photosynthesis plants liberate oxygen. The oxygen will be liberated from water but not from carbon dioxide. The following reaction cannot explain the liberation of oxygen from water because in this reaction from 6H2O molecules only 3O2 can be liberated.
6CO2(g) + 6H2O → C6H12O2(aq) + 6O2(g)

But the following reaction can explain the liberation 6O2 molecules from water.
6CO2(g) + 12H2O (I) → C6H12O6 (aq) + 6H2O(l) + 6O2 (g)

The path of the reaction can be traced by taking labile 0 in H2O. The liberated oxygen contain the total labile 18O which indicates the oxygen is liberated from water.
6CO2(g) + 12H218O(l) → C6H12O6 (aq) + 6H2O(l) + 6 18O2 (g)

b) The reaction between O3 and H2O2 can be written as follows :
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 38
So it is appropriate to the equation as above instead of
O3 + H2O2 → H2O + 2O2

In the reaction O3 + H2O2 → H2O + O2 + O2

One of the O2 liberated from O3 and the another from H2O2. This can be traced by using 18O isotope in H2O2.

Question 40.
The compound AgF2 is unstable compound. However, if formed, the compound acts as a very strong oxidising agent. Why?
Answer:
AgF2 is unstable. So it dissociate into AgF and F. The fluorine liberated is a strong oxidising agent. So AgF2 is strong oxidising agent. The Ag present in AgF2 is in +2 oxidation state. This unstable Ag2+ will be reduced to stable Ag+ during this reaction.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry

Question 41.
Whenever a reaction between an oxidising agent and a reducing agent is carried out, a compound of lower oxidation state is formed if the reducing agent is in excess and a compound of higher oxidation state is formed if the oxidising agent is in excess. Justify this statement giving three illustrations.
Answer:
1) In the reaction between HgCl2 and SnCl2, HgCl2 act as oxidising agent and SnCl2 act as reducing agent. If SnCl2 is excess the product Hg is in its lower oxidation state. But if HgCl2 is excess the product , is Hg2Cl2

TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 39

2) In the reaction between phosphorous and chlorine phosphorous is reducing agent and chlorine is oxidising agent. If chlorine is in small amount the product is PC/3 but in the presence of excess chlorine PCl5 is the product.
P4 + 6Cl2 → 4 PCl3
P4 + 10Cl2 → 4 PCl4

3) When chlorine is passed into excess of liquid sulphate the product is sulphur monochloride S2Cl2. But if excess chlorine is passed until it is saturated, the product is SCl2.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 40

Question 42.
How do you count the following observations?
a) Though alkaline potassium permanganate and acidic potassium permanganate both are used as oxidants, yet in the manufacture of benzoic acid from toluene we use alcoholic potassium permanganate as an oxidant. Why? Write balanced redox equation for the reaction.
b) When concentrated sulphuric acid is added to inorganic mixture containing chloride, we get colourless pungent smelling gas HCl, but if the mixture contains bromide then we get red vapour of bromine. Why?
Answer:
a) Acidified permanganate oxidises organic compounds to carbon dioxide and water. But alkaline permanganate oxidises the organic compounds to aldehydes and acids.

So for the manufacture of benzoic acid from toluene alkaline permanganate is used instead of acidified permanganate.
2KMnO4 + H2O → 2MnO2 + 2KOH + 3(O)
C6H5CH3 + 3(O) → C6H5COOH + H2O

2KMnO4 + C6H5CH3 → C6H5COOH + 2MnO2 + 2KOH

b) Less volatile acids substitute more volatile acids from the salts. Concentrated sulphuric acid is less volatile and can substitute more volatile HCl and HBr from chlorides and bromides. But HBr is a reducing agent while HCl cannot act as reducing agent. So sulphuric acid can oxidise the colourless HBr to red vapour of bromine.
2 NaCl + H2SO4 → Na2SO4 + 2 HCl
2 KBr + H2SO4 → K2SO4 + 2 HBr
2 HBr + H2SO4 → 2H2O + SO2 + Br2

Question 43.
Identify the substance oxidised, reduced, oxidising agent and reducing agent for each of the following reactions:
a) 2 AgBr (s) + C6H6O2(aq) → 2Ag(s) + 2HBr (aq) + C6H4O2(aq)
b) HCHO (l) + 2 [Ag (NH3)2)+ (aq) + 3OH(aq) → 2 Ag(s) + HCOO (aq) + 4NH3 (aq) + 2H2O(l)
c) HCHO (l) + 2Cu2+ (aq) + 50H (aq) → Cu2O (s) + HCOO(aq) + 3H2O (l)
d) N2H4 (l) + 2H2O2 (l) → N2(g) + 4H2O (l)
e) Pb(s) + PbO2(s) + 2H2SO4(aq) → PbSO4(s) + 2H2O(l)
Answer:
A substance which undergoes oxidation acts as a good reducing agent while the one which undergoes reduction acts as a good oxidising agent.

a) Oxidising agent is AgBr and reducing agent is C6H6O2.
b) Oxidising agent is ammonical silver nitrate (Tollen’s reagent) while reducing agent is HCHO.
c) Cu2+ undergoes reduction. So it is oxidising agent HCHO undergoes oxidation. So it is reducing agent.
d) Nitrogen in N2H4 undergoes oxidation. So it is reducing agent.
H2O2 undergoes reduction. So it is oxidising agent.
e) Pb undergoes oxidation. So it is reducing agent. PbO2 undergoes reduction. So it is oxidising agent.

Question 44.
Consider the reactions
Why does the same reductant, thiosulphate react differently with iodine and bromine?
Answer:
Iodine is a weak oxidising agent while bromine is stronger oxidising reaction. So the oxidation of S2O2-3 with iodine will take place until the oxidation state of sulphur +2 in S2O2-3 changes to 2.5 in S4O2-6 only. But bromine being stronger oxidising agent can oxidise the sulphur ion S2O2-8 to its highest oxidation state +6 in S02-4.

Question 45.
Justify giving reactions that among halo-gens, fluorine is the best oxidant and among hydrohalic compounds, hydroiodic acid is the best reductant.
Answer:
Among halogens oxidation power decreases from fluorine to iodine due to decrease in electronegativities and electron gain enthalpies. This can be explained as follows.

Fluorine can displace Cl2, Br2 and I2 from the corresponding halides.
2KCl + F2 → 2KF + Cl2
2KBr + F2 → 2KF + Br2
2KI + F2 → 2KF + I2

Chlorine can displace Br2 and I2 from bromides and iodides respectively but cannot displace fluorine from fluorides
2KBr + Cl2 → 2KCl + Br2
2KI + Cl2 → 2KCl + I2

Bromine can displace I2 from iodide but cannot displace F2 from fluorides or C/2 from chlorides.
2KI + Br2 → 2KBr + I2

Iodine cannot displace any other halogen from their halides.

In the hydrogen halides the reduction power increases from HF to HI. This is because of the decrease in thermal stability of hydrogen halides with increase in bond length. Further the tendency to hold the electron decreases from HF to HI. So HF cannot be oxidised but HI can be easily oxidised. Hence HI is the best reductant.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry

Question 46.
Why does the following reaction occur?
XeO4-6 (aq) + 2 F (aq) + 6H+ (aq) → XeO3(g) + F2(g) + 3H20 (l)
What conclusion about the compound Na4XeO6 (of which XeO4-6 is a part) can be drawn from the reaction.
Answer:
The perxenate ion XeO4-6 ion is very strong oxidising agent than fluorine. So it can oxidise F ion to fluorine in acid medium. Hence the reaction occurs.
XeO4-6 (aq) + 2F (aq) + 6H+ (aq) → XeO3(g) + F2 (g) + 3H2O(l)

Question 47.
Consider the reactions:
a) H3PO2 (aq) + 4AgNO3 (aq) + 2H2O (l) → H3PO4 (aq) + 4Ag(s) + 4HNO3 (aq)
b) H3PO2 (aq) + 2CuSO4 (aq) + 2H2O (l) → H3PO4 (aq) + 2Cu(s) + H2SO4(aq)
c) C6H5CHO(l) + 2[Ag(NH3)2]+ (aq) + 3OH(aq) → C6H5COO(aq) + 2Ag(s) + 4NH3(aq) + 2H2O (l)
d) C6H5CHO (l) + 2 Cu2+ (aq) + 5OH (aq) → no change is observed.
What inference do you draw about the behaviour of Ag+ and Cu2+ from these reactions ?
Answer:
Ag+ and Cu2+ both can oxidise H3PO2 in acid medium but Ag+ oxidises H3PO2 to H3PO3. While Cu2+ is oxidising H3PO2 to H3PO4. Cu2+ is oxidising phosphorous H3PO2 from +1 to +5 oxidation state but Ag+ is oxidising +1 to +3. This indicates that Cu2+ is acting as strong oxidising agent than Ag+ in acid medium.

In alkaline medium Ag+ is oxidising benzaldehyde to benzoate but Cu2+ has no action. This indicates that in alkaline medium Ag+ is stronger oxidising agent than Cu2+.

Question 48.
Balance the following redox reactions by ion – electron method. [AP ’15; IPE ’14]
a) MnO4 + I (aq) → MnO2(s) + I2(s) (In basic medium)
b) MnO4 + SO2 (g) → Mn2+ (aq) + HSO4 (aq) (in acidic solution)
c) H2O2 (aq) + Fe3+ (aq) → Fe3+ (aq) + H2O (l) (in acidic solution)
d) Cr2O2-7 + SO2 (g) → Cr3+ (aq) + SO42- (aq) (in acidic solution) [Mar. ’18 AP]
Answer:
a) MnO4 + I (aq) → MnO2(s) + I2(s) (In basic medium)
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 81 TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 82
b) MnO4 + SO2 (g) → Mn2+ (aq) + HSO4 (aq) (in acidic solution)
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 83
c) H2O2 (aq) + Fe3+ (aq) → Fe3+ (aq) + H2O (l) (in acidic solution)
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 84
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 85
d) Cr2O2-7 + SO2 (g) → Cr3+ (aq) + SO42- (aq) (in acidic solution) [Mar. ’18 AP]
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 86

Question 49.
Balance the following equations in basic medium by ion-electron method and oxidation number methods and identify the oxidising agent and the reducing agent.
a) P4(s) + OH (aq) → PH3(g) + H2PO2 (aq)
b) N2H4(l) + ClO3 (aq) → NO (g) + Cl(g)
c) Cl2O7(g) H2O2(aq) → ClO2(aq) + O2(g) + H+
Answer:
a) P4(s) + OH (aq) → PH3(g) + H2PO2 (aq)
Ion electron method:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 41 TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 42
Note : Here P4 acts both as oxidant and reductant.

Oxidation number method:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 43
In order to balance the change in oxidation number H2PO2 is to be multiplied by 3
P4 + OH → PH³ + 3H2PO2

Since the reaction is taking place in basic medium, H2O is to be added on the side which has lesser H atoms and OH” are to be added on the side which has lesser O atoms.
P4 + 3H2O + 3OH → PH3 + 3H2PO2

b) N2H4(l) + ClO3 (aq) → NO (g) + Cl(g)
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 44

Step – III: Equalise the increase and decrease in ON by multiplying N204 with 3 and C103 with 4.
3N2O4 + 4 ClO3 → 6NO + 4 Cl

Step – IV: Balance the atoms except H and O. Here they are balanced.
Step – V : Balance O atoms by adding OH ions and H atoms by adding H20 on the sides deficient of O and H atoms respectively
3N2O4 + 4 ClO3 → 6NO + 4 Cl + 12OH

c) Cl2O7(g) H2O2(aq) → ClO2(aq) + O2(g) + H+
Ion electron method:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 45
Oxidation number methed:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 46

Step – II : Equalise the increases / decrease in ON by multipling H2O2 with 4 since in each chlorine of Cl2O7 decrease in ON is 4. For 2 Cl atoms it is 8. In H2O2 increase in ON for each 0 is 1 and for two 0 atoms it is 2.
Cl2O7 + 4H2O2 → 2ClO2 + 4H2O + 2O2

Step-III : Balance the O atoms by adding OH and H atoms by adding H20 to the sides deficient of O and H atoms respectively.
Cl2O7 + 4H2O2 + 2OH → 2ClO12 + 4H2O + 2O2

TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry

Question 50.
What sorts of informations can you draw from the following reaction?
(CN)2(g) + 2OH (aq) → CN (aq) + CNO (aq) + H2O (l)
Answer:
In the above reaction the cyanogen gas undergoes disproportionation in basic medium. Here the oxidation state of CN radical decreases to -1 in CN- and increases to +1 in CNO” in basic medium.

Question 51.
The Mn3+ ion is unstable solution and undergoes disproportionation to give Mn2+, MnO2 and H+ ion. Write balanced ionic equation for the reaction.
Answer:
Mn3+ + 2H2O → MnO2 + Mn2+ + 4H+

Question 52.
Consider the elements Cs, Ne, I and F.
a) Identify the element that exhibits only negative oxidation state.
b) Identify the element that exhibits only positive oxidation state.
c) Identify the element that exhibit both positive and negative oxidation states
d) Identify the element which neither exhibit the negative nor does the positive oxidation state.
Answer:
a) ‘F’ exhibit only negative oxidation state because it is the most electronegative atom.

b) Cs’ exhibit only positive oxidation state because it is the most electropositive element.

c) I can exhibit both positive and negative oxidation states. Ex : In ICl3 the oxidation state of I is +3 and in Nal oxidation state of I is -1.

d) Ne being inert gas do not participate in reactions. So it will not exhibit neither the negative nor the positive oxidation states.

Question 53.
Chlorine is used to purify drinking water. Excess of Chlorine is harmful. The excess of Chlorine is removed by treating with sulphur dioxide. Present a balanced equation for this redox change taking place in water.
Answer:
SO2 + Cl2 + 2H2O → H2SO4 + 2HCl

Question 54.
Refer to the periodic table given in your book and now answer the following questions.
a) Select the possible non metals that can show disproportionation reaction
b) Select the metals that can show disproportionation
Answer:
a) Phosphorous, sulphur, chlorine, bromine, iodine
b) Copper, silver, gold

Question 55.
In Ostwal’s process for the manufacture of nitric acid the first step involves the oxidation of ammonia gas by oxygen gas to give nitric oxide gas and steam. What is the maximum weight of nitric oxide that can be obtained starting only with 10.00 g of ammonia and 20.00 g of oxygen.
Answer:
The oxidation of ammonia to NO in Ostwalds process can take place as follows.
4NH3 + 5O2 → 4NO + 6H2O + energy

68 gm of ammonia react with 160 gm of Oxygen. In this reaction oxygen is limiting reagent. Since to react with 10 g of ammonia the required amount of oxygen is \(\frac{10\times160}{68}\) = 23.53 gm of oxygen is required

But there is only 20.00 g of oxygen.
160 gm of O2 can react with 68 gm of NH3
∴ 20 gm of O., can react with \(\frac{20\times68}{160}\)
= 8.5 gm NH3
For 68 gm of NH3 the wt. of NO formed is 120
For 8.5 gm of NH3 the wt. of NO formed is 15 gm.

Question 56.
i) Arrange the following metals in the order in which they displace each other from the solution of their salts. Al, Cu, Fe, Mg and Zn
ii) Calculate the molarity of sodium carbonate in a solution prepared by dissolving 5.3 g in enough water to form 250 ml of the solution. [Mar. ’13]
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 47

Long Answer Questions

Question 1.
Write the balanced ionic equation which represents the oxidation of iodide (I) ion by per manganate ion in basic medium to give iodine (I) and manganese dioxide (MnO1). [IPE ’14 AP Mar. ’19]
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 48

Question 2.
Write the balanced ionic equation for the oxidation of sulphite ions to sulphate ions in acid medium by permanganate ion.
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 49
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 50

Question 3.
Oxalic acid is oxidised by permanganate ion in acid medium of Mn2+ balance the reaction by ion-electron method. (Board Paper)
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 51

Question 4.
Phosphorus when heated with NaOH solution gives Phosphine (PH3) and H2PO2 Give balanced equation.
Answer:
a) P4(s) + OH (aq) → PH3(g) + H2PO2 (aq)
Ion electron method:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 41 TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 42
Note : Here P4 acts both as oxidant and reductant.

Oxidation number method:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 43
In order to balance the change in oxidation number H2PO2 is to be multiplied by 3
P4 + OH → PH³ + 3H2PO2

Since the reaction is taking place in basic medium, H2O is to be added on the side which has lesser H atoms and OH” are to be added on the side which has lesser O atoms.
P4 + 3H2O + 3OH → PH3 + 3H2PO2

b) N2H4(l) + ClO3 (aq) → NO (g) + Cl(g)
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 44

Step – III: Equalise the increase and decrease in ON by multiplying N204 with 3 and C103 with 4.
3N2O4 + 4 ClO3 → 6NO + 4 Cl

Step – IV: Balance the atoms except H and O. Here they are balanced.
Step – V : Balance O atoms by adding OH ions and H atoms by adding H20 on the sides deficient of O and H atoms respectively
3N2O4 + 4 ClO3 → 6NO + 4 Cl + 12OH

c) Cl2O7(g) H2O2(aq) → ClO2(aq) + O2(g) + H+
Ion electron method:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 45
Oxidation number methed:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 46

Step – II : Equalise the increases / decrease in ON by multipling H2O2 with 4 since in each chlorine of Cl2O7 decrease in ON is 4. For 2 Cl atoms it is 8. In H2O2 increase in ON for each 0 is 1 and for two 0 atoms it is 2.
Cl2O7 + 4H2O2 → 2ClO2 + 4H2O + 2O2

Step-III : Balance the O atoms by adding OH and H atoms by adding H20 to the sides deficient of O and H atoms respectively.
Cl2O7 + 4H2O2 + 2OH → 2ClO12 + 4H2O + 2O2

TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry

Question 5.
Balance the following equation.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 52
Answer:

Question 6.
Balance the following equation by the oxidation number method.
MnO2-4 + Cl2 → MnO2-4 + Cl
Answer:
Step -1: The skeleton reaction
MnO2-4 + Cl2 → MnO2-4 + Cl
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 54

Step – III: Equalise the increase / decrease in ON. Here they are equal.

Step – IV : Balance the other atoms except HandO
2MnO2-4 + Cl2 → 2MnO4 + 2Cl

Step – V : Balance H atoms and 0 atoms. Here they are balanced.
The balanced equation is
2MnO22-4 + Cl2 → 2MnO4 + 2Cl

Question 7.
Explain the different types of redox reac-tions.
Answer:
A chemical reaction in which both oxidation and reduction reactions are involved is called an oxidation – reduction reaction or simply a redox reaction.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 55

In this reaction Zn loses two electrons to form Zn+2 and undergoes oxidation. Cu+2 gains two electrons to form Cu and thus undergoes reduction.

Most of the chemical reactions are redox reactions. There are mainly four types of redox reactions. They are
(a) Chemical combination reactions
(b) Chemical decomposition reactions
(c) Chemical displacement reactions and
(d) Chemical disproportionation reactions

a) Chemical combination reactions:
Ex : Burning of coal in air.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 56

In this reaction the oxidation numbers of carbon and oxygen are zero. In C02, the oxidation number of C is + 4 and that of oxygen is – 2. As the oxidation number of carbon increases from 0 to +4, we say that carbon undergoes oxidation. Similarly the oxidation number of oxygen decreases from 0 to – 2. Hence the oxygen undergoes reduction. Since this reaction involves both oxidation and reduction, we can infer that the above chemical combination reaction is a redox reaction.

b) Chemical decomposition reactions:
Ex. : Thermal decomposition of mercuric oxide.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 57

In HgO, the oxidation number of Hg is +2 and that of oxygen is – 2. The oxidation numbers of free metallic mercury and elemental oxygen are zero. In this reaction Hg undergoes reduction from + 2 to 0 and oxygen undergoes oxidation from – 2 to 0. The decomposition of HgO involves both oxidation and reduction. Hence, we can infer that the above decomposition reaction is a redox reaction.

c) Chemical displacement reactions:
Ex. Zinc displaces copper from aqueous copper sulphate solution.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 58

In this reaction, the oxidation numbers of elemental zinc and elemental copper are each zero, and the oxidation numbers of Cu and Zn in their aq. solutions are each +2. In this reaction the conversion of Zn into ZnSO4 is oxidation and the conversion of CuSO4 into Cu is reduction. Hence, we can infer that the above displacement reaction is a redox reaction.

d) Chemical disproportionation reactions:
Ex.: Chlorine is passed into cold and dilute solution of NaOH.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 59

In this reaction the oxidation number of elemental chlorine is zero. The oxidation number of Cl in NaOCl is (+1) and in NaCl is (-1). In this reaction the same element chlorine has undergone both oxidation and reduction. Hence this is a redpx reaction.

Question 8.
State the law of definite proportions. Sug-gest one problem to understand the law by working out that problem.
Answer:
Law of definite proportions :
“A given chemical substance always contains the same elements combined in a fixed proportion by weight.”

Explanation :
SO2 can be obtained by the following two methods.
i) When mercuric sulphide is heated in air, it gives mercury and sulphur dioxide.
HgS + O2 → Hg + SO2

ii) When lead sulphide is heated strongly in air, it gives lead oxide and sulphur dioxide.
2PbS + 3O2 → 2PbO + 2SO2

Samples of SO2 obtained by the above two methods were analysed. In each of them, 100 g of SO2 was found to contain 50 g of sulphur and 50 g of oxygen.

The above observations prove that the weight composition of sulphur dioxide is always constant.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry

Question 9.
How are the end points of titrations detected in the following reactions?
a) MnO-24 oxidises Fe2+
b) Cr2O2-7 oxidises Fe2+
c) Cu+2 oxidises I
Answer:
a) In the oxidation of Fe2+ with MnO4, the permanganate itself act as self indicator. MnO4 has purple colour. The visible end point in this case is achieved after the last amount reductant (Fe2+) is oxidised and the first stable tinge of pink colour appears.

b) In the oxidation of Fe2+ with Cr2O2-2 an indicator such as diphenyl amine is used. Just after the equivalence point the excess Cr2O2-2 oxidises the diphenyl amine to intence blue colour by which the end point can be detected.

c) In the oxidation of I with Cu2+ the iodine formed will give intense blue colour with starch. This colour will be discharged with excess of hypo added after the equivalence point.

Question 10.
Calculate the amount of Carbondioxide that could be produced when
i) 1 mole of carbon is burnt in air
ii) 1 mole of carbon is burnt in 16g of dioxygen
iii) 2 moles of carbon are burnt in 16 g of dioxygen.
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 60

For burning 12g (1 mole) of carbon 32 gm of dioxygen is required. Since 16 g of dioxygen is present only 6 gm (half mole) of carbon burn producing half mole of CO2.

Thus 22 g of CO2 is formed.

(iii) Here also 22 g of CO2 is formed since there is only 16 g of oxygen.

Question 11.
Dinitrogen and dihydrogen react with each other to produce ammonia according to the following chemical equation.
N2(g) + H2(g) → 2NH3(g)
i) Calculate the mass of ammonia produced if 2.00 × 10³g dinitrogen reacts with 1.00 × 10³ g of dihydrogen.
ii) Will any of the two reactants remain unreacted?
iii) If yes, which one and what would be its mass?
Answer:
i) The balanced equation for the reaction between dihydrogen and dinitrogen is
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 61

When 28 g of N2 react with 6 g of H2 produce 34 g of NH3
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 62
1 mole of N2 can react with 3 moles of H2
71.4 moles of N, can react = \(\frac{71.4\times3}{1}\)
= 214.2 moles of H2

Here 1 mole of N2 can produce 34 g of NH3
71.4 mole of N2 can produce
71.4 × 34 = 2427.6 gm.

iii) Here No. of moles of H2 are more than required
The no. of moles of H2 unreacted = 500 – 214.2 = 285.8
The amount of hydrogen left = 285.8 × 2 = 571.6 gms

Question 12.
Assign oxidation number to the underlined elements in each of the following species.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 63
Answer:
a) +5
b) +6
c) +5
d) +6
e) -1
f) -5
g) +6
h) +6

Question 13.
What are the oxidation numbers of the underlined elements in each of the follow-ing and how do you rationalise your resuits?
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 64
Answer:
a) H2S4O6 : H2S4O6 has the following structure

The oxidation states of S2 and S3 are zero but the oxidation states of S1 and S4 are +5.

The average oxidation state is \(\frac{10}{4}\) = 2.5

b) Fe3O4 : Fe3O4 contain FeO and Fe2O3
In FeO oxidation state of Fe in FeO = +2
In Fe2O3 oxidation state of Fe in Fe2O3 = +3
So average oxidation of Fe = \(\frac{(+2)+2 \times(+3)}{3}=\frac{8}{3}=2.67\)

c) CH3CH2-OH
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 66

When atoms of the same element combine their oxidation states are taken as zero. The carbon in CH3 group is in -3 oxidation state.

The carbon in CH2OH group is in zero oxidation state.

d) CH3COOH
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 67

The carbon in CH3 is in -3 oxidation state while the carbon in COOH group is in +3 oxidation state.

Additional Questions & Answers

Question 1.
Calculate molecular mass of glucose (C6H12O6) molecule.
Answer:
Molecular mass of glucose (C6H12O6)
= 6(12.011 u) + 12.(1.008 u) + 6(16.00 u)
= (72.066 u) + (12.096 u) + (96.00 u)
= 180.162 u

Question 2.
A compound contains 4.07 % hydrogen, 24.27 % carbon and 71.65 % chlorine. Its molar mass is 98.96 g. What are its empirical and molecular formulas?
Answer:
Step 1 : Conversion of mass per cent to grams:
Since we are having mass per cent, it is convenient to use 100 g of the compound as the starting material. Thus, in the 100 g sample of the above compound, 4.07g hydrogen is present, 24.27g carbon is present and 71.65 g chlorine is present.

Step 2 : Convert into number moles of each element:
Divide the masses obtained above by respective atomic masses of various elements.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 68

Step 3 : Divide the mole value obtained above by the smallest number:
Since 2.021 is smallest value, division by it gives a ratio of 2:1:1 for H:C:Cl. In case the ratios are not whole numbers, then they may be con-verted into whole number by multiplying by the suitable coefficient.

Step 4:
These numbers indicate the rela+ tive number of atoms of the elements. Write empirical formula by mentioning the numbers after writing the symbols of respective elements :
CH2Cl is, thus, empirical formula of the above compound.

Step 5: Writing molecular formul:
(a) Determine empirical formula mass. Add the atomic masses of various atoms present in the empirical formula.
For CH2Cl, empirical formula mass is 12.1 + 2 x 1.008 + 35.453 = 49.48 g

(b) Divide molar mass by empirical formula mass
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 69

(c) Multiply empirical formula by n obtained above to get the molecular formula Empirical formula = CH2Cl,
n = 2. Hence molecular formula is C2H4Cl2.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry

Question 3.
Calculate the amount of water (g) produced by the combustion of 16 g of methane.
Answer:
The balanced equation for combustion of methane is :
CH4(g) + 2O2(g) → CO2 (g) + 2H2O (g)
(i) 16 g of CH4 corresponds to one mole.
(ii) From the above equation, 1 mol of CH4 (g) gives 2 mol of H2O (g).
2 mol of water (H2O) = 2 × (2 + 16)
= 2 × 18 = 36 g
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 70

Question 4.
How many moles of methane are required to produce 22 g CO2 (g) after combustion?
Answer:
According to the chemical equation,
CH4 (g) + 2O2 (g) → CO2 (g) + 2H2O (g)
44g CO2 (g) is obtained from 16 g CH4 (g).
[∵ 1 mol CO2(g) is obtained from 1 mol of CH4(g)].
mole of CO2 (g)
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 71
Hence, 0.5 mol CO2 (g) would be obtained from 0.5 mol CH4 (g) or 0.5 mol of CH4 (g) would be required to produce 22 g CO2(g).

Question 5.
50.0 kg of N2 (g) and 10.0 kg of H2 (g) are mixed to produce NH2 (g). Calculate the NH2 (g) formed. Identify the limiting reagent in the production of NH3 in this situation.
Answer:
A balanced equation for the above reaction is written as follows :
Calculation of moles:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 72
According to the above equation, 1 mol N2 (g) requires 3 mol H2 (g), for the reaction. Hence, for 17.86 × 10² mol of N2, the moles of H2 (g) required would be
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 73

But we have only 4.96 × 10³ mol H2. Hence, dihydrogen is the limiting reagent in this case. So NH2(g) would be formed only from that amount of available dihydrogen i.e., 4.96 × 10³ mol
Since 3 mol H2(g) gives 2 mol NH3(g)
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 74
3.30 × 10³ mol NH3 (g) is obtained.

If they are to be converted to grams, it is done as follows:
1 mol NH3 (g) = 17.0 g NH3(g)
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 75
= 3.30 × 10³ × 17 g NH3 (g)
= 56.1 × 10³ g NH3
= 56.1 kg NH3

TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry

Question 6.
A solution is prepared by adding 2 g of a substance A to 18 g of water. Calculate the mass per cent of the solute. [TS Mar. ’19]
Answer:
Mass per cent of
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 76

Question 7.
Calculate the molarity of NaOH in the solution prepared by dissolving its 4 g in enough water to form 250 mL of the solution. [Mar. ’18 (AP)]
Answer:
Since molarity (M)
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 77
Note that molarity of a solution depends upon temperature because volume of a solution is temperature dependent.

Question 8.
The density of 3 M solution of NaCl is 1.25 g mL-1. Calculate molality of the solution.
Answer:
M = 3 mol L-1
Mass of NaCl
in 1 L solution = 3 × 58.5 = 175.5 g
Mass of 1L solution = 1000 × 1.25 = 1250 g
(since density = 1.25 g mL-1)
Mass of water in solution = 1250 – 175.5
= 1074.5 g= 1.0745 kg.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 78

Often in a chemistry laboratory, a solution of a desired concentration is prepared by diluting a solution of known higher concentration. The solution of higher concentration is also known as stock solution. Note that molality of a solution does not change with temperature since mass remains unaffected with temperature.

Question 9.
Calculate the normality of oxalic acid so-lutions containing 6.3g of H2C2O4.2H2O in 500 ml of solutions.
Answer:
Weight of solute = 6.3 g
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 79

TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry

Question 10.
Calculate the mass of Na2CO3 required to prepare 250 ml of 0.5 N solution.
Answer:
Normality of required solution = 0.5 N
Volume of required solution = 250 ml
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 80

TS Inter 1st Year History Study Material Chapter 4 మౌర్య సామ్రాజ్యం – అవతరణ

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 4th Lesson మౌర్య సామ్రాజ్యం – అవతరణ Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 4th Lesson మౌర్య సామ్రాజ్యం – అవతరణ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అలెగ్జాండర్ దండయాత్ర’ కారణాలు, క్రమం, ఫలితాలను వివరించండి.
జవాబు.
క్రీ.పూ. 4వ శతాబ్దిలో ప్రపంచాధిపత్యం కోసం పర్షియన్ల, గ్రీకుల మధ్య పోరాటం మొదలైంది. అలెగ్జాండర్ గ్రీకు రాజ్యాలలోని మాసిడోనియా పాలకుడు. తమ గ్రీకు సంస్కృతిని ప్రపంచమంతా వ్యాప్తి చేయాలని, ప్రపంచ పర్షియన్ల విజేత కావాలని తన దండయాత్రను ప్రారంభించాడు. ఇదే సమయంలో పర్షియన్ల సామ్రాజ్యం క్షీణదశ ప్రారంభమైంది. ఈ సదవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నాడు అలెగ్జాండర్. ఇతడు ఈ ఈజిప్టు, సిరియా ప్రాంతాలను జయించిన తరువాత పర్షియా రాజ్యంపై దండెత్తి పర్షియన్ చక్రవర్తియైన మూడవ డేరియస్ను అరబ్ యుద్ధంలో ఓడించి, వాటిని తన రాజ్యాంలో కలుపుకొన్నాడు. ఆ తరువాత క్రీ.పూ. 327వ సంవత్సరంలో అప్పటి వరకు పర్షియన్ సామ్రాజ్యంలో భాగంగా ఉంటున్న భారతదేశ వాయువ్య ప్రాంతాల ఆక్రమణకు అలెగ్జాండర్ తన సైన్యంతో బయలుదేరాడు.

దండయాత్ర క్రమం:భారతదేశ వాయువ్య ప్రాంతంలో నెలకొన్న అప్పటి పరిస్థితులు అలెగ్జాండర్ దండయాత్రకు అనుకూలంగా మారాయి. ఈ ప్రాంతంలో నెలకొన్న చిన్న చిన్న రాజ్యాలు తమ మధ్య పోట్లాటలతో సరిహద్దు రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ప్రాంతంలో అప్పట్లో కొన్ని రాచరిక రాజ్యాలు మరికొన్ని ఆటవిక రిపబ్లిక్స్ నెలకొని ఉన్నాయి. వాటిలో తక్షశిల రాజు, అంబి – దాని సరిహద్దుల్లో ఉన్న రాజ్యాధిపతి పురుషోత్తముడు మధ్య పరస్పర శత్రుత్వం నెలకొని ఉంది. అందువల్ల అంబిరాజు తన రాయబారిని విలువైన వస్తువులతో ‘బోకారాలో ఉన్న అలెగ్జాండర్ దగ్గరకు పంపిస్తూ, అతన్ని భారతదేశంపై దండయాత్ర చేయాలని ఆహ్వానించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 4 మౌర్య సామ్రాజ్యం – అవతరణ

అలెగ్జాండర్ గాంధార రాష్ట్రం గుండా సింధూ నదిని, పంజాబును దాటుతూ బియాస్ నది వరకు చేరుకున్నాడు. తక్షశిల రాజు అంబి అలెగ్జాండర్కు లొంగిపోయాడు. అబిసార రాజ్య రాజు కూడా అతనికి సహకరించాడు. కాని పురుషోత్తముడు, పౌరవ రాజ్యాధిపతి తన స్వతంత్ర్యాన్ని రక్షించుకోవడానికి అలెగ్జాండర్తో యుద్ధానికి తలపడ్డాడు. ఈ యుద్ధం.క్రీ.పూ. 326లో జీలం నది ఒడ్డున ఇరువురి మధ్య జరిగింది. దీనిలో పురుషోత్తముడు ఓడినప్పటికి, అతని ధైర్య సాహసాలు, శక్తి సామర్థ్యాలకు ముగ్ధుడైన అలెగ్జాండర్ అతని రాజ్యాన్ని తిరిగి అతనికి ఇచ్చివేశాడు. ఆ తరువాత అతని సైన్యం సహకరించకపోవుటచే వెనుకకు మరిలాడు. కాని ఈ ప్రాంతంలోని ఆటవిక రాజ్యాలతో యుద్ధం చేసే సమయంలో గాయపడి, తద్వారా మార్గ మధ్యలోనే బాబిలోనియాలో మరణించాడు.

దండయాత్ర ఫలితాలు:ఈ దండయాత్ర ఫలితంగా భారతదేశ, ఐరోపా రాజ్యాల మధ్య సంబంధాలు పెంపొందసాగాయి. అలెగ్జాండర్ వెళ్ళిపోయిన తరువాత ఈ ప్రాంత ప్రజలలో గ్రీకు వ్యతిరేక భావం నెలకొంది. ఈ ప్రాంత విభజనలో గ్రీకు గవర్నర్ల మధ్య తగాదాలు మొదలైనాయి. ఈ పరిస్థితులలో క్రీ.పూ. 321లో చంద్రగుప్తుడు అనే మౌర్య వంశ రాజు పంజాబు, సింధూ రాష్ట్రాలను ఆక్రమించి గ్రీకు పాలనను అంతమొందించాడు. అలెగ్జాండర్ దండయాత్ర వల్ల భారతదేశ వాయువ్య ప్రాంతాలలో ఉన్న చిన్న, చిన్న రాజ్యాలు కలపబడి, రాజకీయ ఐక్యత సాధనలో మౌర్య చంద్రగుప్తునికి మార్గం సుగమనం చేసింది.

గ్రీకు దండయాత్ర వల్ల భారతదేశానికి, గ్రీసు దేశానికి మధ్య రాకపోక సౌకర్యాలు పెంపొందించాయి. గ్రీకు పాలనలో ఏర్పడిన బాక్టీరియా, ఇతర రాష్ట్రాలు గ్రీకు సంస్కృతిని వ్యాప్తి జేయుటకు ఉపకరించాయి. ఈ దండయాత్ర. వల్ల ఈ రెండు రాజ్యాల మధ్య నాలుగు రవాణా మార్గాలు వృద్ధి చెంది, వర్తక వాణిజ్యానికి తోడ్పడింది. గ్రీకు పద్ధతిలో నాణేల ముద్రణ, గ్రీకుల ఖగోళ శాస్త్రం, గ్రీకుల శిల్పకళ పద్ధతులు భారతదేశంలోకి వచ్చి చేరాయి. ప్రత్యేకంగా గ్రీకుల రచనలు ఆ కాలం నాటి భారతదేశ చరిత్ర రచనకు ఉపకరిస్తుంది. అలెగ్జాండర్ దండయాత్ర వల్ల భారతదేశ చరిత్ర కాలమాన పట్టికను స్థిరీకరించడానికి ఉపకరిస్తుంది. గ్రీకులు కూడా భారతదేశీయుల నుంచి వారి విజ్ఞానశాస్త్రం, కళలు, తత్త్వశాస్త్రం, గణితం, వైద్యశాస్త్రాల గొప్పదనాన్ని తెలుసుకున్నారు.

ప్రశ్న 2.
అశోకుని గొప్పతనాన్ని వివరించండి.
జవాబు.
భారతదేశంలోని చక్రవర్తులలోనే కాక మొత్తం ప్రపంచంలోని చక్రవర్తులలో కూడా ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్నవాడు అశోకుడు.
తొలి జీవితం:అశోకుడు బిందుసారుని కుమారుడు. తండ్రి మరణానంతరం క్రీ.పూ. 273లో మౌర్య సింహాసనాన్ని అధిష్టించాడు. తనకున్న 99 మంది సోదరులతో సింహాసనం కోసం కలహం రాగా వారిని వధించి రాజయ్యాడని బౌద్ధ సాహిత్యం పేర్కొన్నప్పటికి, ఒక శిలాశాసనంలో తన సోదరులు, బంధువుల సంక్షేమానికి తీసుకున్న చర్యలను పేర్కొనడంతో ఆ కథను నిజంకాదని విశ్వసించవచ్చు.

అశోకుని చరిత్రకు ఆధారాలు:దేశం నలుమూలలా వేయించిన శిలాశాసనాలు, బౌద్ధమత గ్రంథాలైన ‘మహావంశ’, ‘దివ్యావదాన’ అనే గ్రంథాలలో విస్తారంగా సమాచారం లభిస్తోంది. అశోకుడు తనను తాను ‘దేవానాంప్రియ’, ‘ప్రియదర్శి’ అని చాటుకున్నాడు.

కళింగ యుద్ధం:అశోకుడు క్రీ.పూ. 261లో, సామ్రాజ్య విస్తరణ కాంక్షతో కళింగపై దండెత్తాడు. ఆ యుద్ధంలో లక్ష మందికి పైగా చనిపోయినట్లు, లక్షన్నర మంది ఖైదీలుగా పట్టుబడ్డట్లు తన 13వ శిలాశాసనంలో పేర్కొన్నాడు. కానీ ఈ యుద్ధం అశోకుని యుద్ధ విముఖతను పెంచింది. ఇకముందు యుద్ధాలు చేయనని, ధర్మప్రచారం, ప్రజాసంక్షేమం కోసం పాటుపడాలని నిశ్చయించుకొన్నాడు.

బౌద్ధమత వ్యాప్తి:ఉపగుప్తుడనే బౌద్ధాచార్యుని వద్ద బౌద్ధమత దీక్షను తీసుకున్నాడు. తరువాత దేశ, విదేశాలలో బౌద్ధధర్మ ప్రచారం కోసం సంఘాలు ఏర్పాటు చేశాడు. బౌద్ధ ధర్మసూత్రాలు శాసనాల రూపంలో ప్రచారం చేశాడు. జంతుబలులు, వేట, మాంసాహార వంటకాలు నిషేధించాడు. పాటలీపుత్రంలో 3వ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేశాడు. తన జీవితాన్ని బౌద్ధధర్మ ప్రచారం కోసం అంకితం చేశాడు.

అశోకుని ధర్మం:అశోకుని ఆలోచనలు, ఆశయాలు ఆయన ప్రవచించిన ధర్మంలో కనిపిస్తాయి. ఈ ధర్మ సూత్రాలలో ప్రధానమైనవి:జీవహింస చేయరాదు. ఇతరుల విశ్వాసాలు, భావాలపట్ల సహనాన్ని చూపాలి. సర్వప్రాణుల పట్ల కరుణ, జాలి చూపాలి. బానిసలు, సేవకుల పట్ల దయగా ఉండాలి. ఇట్టి చర్యలతో నైతిక విలువలు పెంచుకోవాలి.

పాలనా విధానం:పరిపాలనలో వికేంద్రీకరణ ప్రవేశపెట్టాడు. న్యాయ విచారణలో ఆలస్యాన్ని తొలగించాడు. ప్రపంచ చరిత్రలో యుద్ధంలో జయించి యుద్ధరంగాన్ని వదిలివేసిన ఏకైక చక్రవర్తిగా అశోకుడు మానవ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు.

ప్రశ్న 3.
మౌర్యుల కాలం నాటి సామాజిక, ఆర్థిక, సంస్కృతిక పరిస్థితుల గురించి రాయండి.
జవాబు.
మౌర్యుల కాలము నాటి సాంఘిక, ఆర్థిక పరిస్థితులను తెలుసుకొనుటకు మెగస్తనీసు ఇండికా, కౌటిల్యుని అర్థశాస్త్రము, గ్రీకు బౌద్ధ రచనలు, అశోకుని శాసనములు ము॥నవి ముఖ్య ఆధారములు.

సాంఘిక పరిస్థితులు :
1. వర్ణవ్యవస్థ:మౌర్య యుగమునాటి సమాజమున వర్ణవ్యవస్థ బాగుగ పాతుకొనియున్నది. మెగస్తనీసు చెప్పిన ఏడు కులములను బట్టి బ్రాహ్మణులు, వ్యవసాయదారులు, పశుపాలకులు, సైనికులు మొ||గు వారి వృత్తులే కులములుగా .. రూపొందినట్లు తెలియుచున్నది. కాని అర్ధశాస్త్రము నాడు నాలుగు ప్రధాన వర్ణముల కలవని, వర్ణవ్యవస్థ తొలిరోజులలో క్లిష్టతరముగా నున్నదని చెప్పవచ్చును. అగ్రవర్ణములవారు ఆశ్రమధర్మమును పాటించెడివారు. ఉదా|| క్షత్రియుడైన చంద్రగుప్త మౌర్యుడు – రాజత్యాగము చేయుట, వానప్రస్థాశ్రమమునకు నిదర్శనము. సంఘములో బ్రాహ్మణులకు అధిక గౌరవము కలదు. వారు ప్రభుత్వమునకు ఎట్టి పన్ను చెల్లించనవసరము లేదు. అశోకుని బౌద్ధమతాదరణ వలన బ్రాహ్మణుల స్థితిగతులు తారుమారై, వారు పుష్యమిత్ర శుంగుని నాయకత్వములో తిరుగుబాటు చేయుటకు సంసిద్ధులైనారని కొందరి చరిత్రకారుల అభిప్రాయము.

2. బానిసత్వము:భారతదేశమున బానిసలే లేరని మెగస్తనీసు వ్రాసినను, బానిసత్వమున్నట్లు రూఢిగా తెలియుచున్నది. బానిసలు దయతో చూడబడెడివారు.

3. స్త్రీలు:స్త్రీకి సంఘమున తగు స్వాతంత్ర్యము కలదు. కొందరు స్త్రీలు వేదాంతము నభ్యసించిరి. పరదా పద్ధతిలేదు. వితంతు వివాహములు నిషేధింపబడలేదు. విడాకులిచ్చు ఆచారము కలదు. సతీసహగమనమున్నట్లు గ్రీకు రచనల వలన తెలియుచున్నది. బహుభార్యత్వము, కన్యాశుల్కము, కన్యావిక్రయమునాడున్నట్లు మెగస్తనీసు రచనల వలన తెలియుచున్నది. స్త్రీలలో అనేక మూఢవిశ్వాసమున్నట్లు అశోకుని శాసనములు పేర్కొని, వానిని ఖండించెను. వీటన్నింటికంటే ఈ యుగమునకు ముఖ్య విశేషము ప్రభుత్వము గణికావృత్తిని (వేశ్యవృత్తి) గుర్తించుట. ఈ శాఖకు గణితాధ్యక్షుడను ఉద్యోగికూడా గలడు. మౌర్య చక్రవర్తులు అందమైన వేశ్యలను పోషించి, వారినే గూఢచారిణులుగా నియమించెడివారు.

4. నైతిక ప్రవర్తనము:భారతీయులు నీతి, నిజాయితీకి పేరు మోసినవారని మెగస్తనీసు కొనియాడెను. డబ్బులిచ్చి పుచ్చుకొనుటలో ఎట్టి పత్రములు ఉపయోగించెడివారు కాదు. ఆడినమాటను తప్పరు. యజ్ఞయాగాది క్రతువులందు తప్ప తాగరు. వీరు పొదుపుగా, నిరాడంబరముగా ఉన్నప్పటికి ఉల్లాసవంతమైన జీవితమును గడిపెడివారు. చదరంగము, పాచికలాటలాడుట వారి వినోదములు. సమాజ ఉత్సవములందు ముష్టియుద్ధములు, కత్తి యుద్ధములు, రథ పందెములు జరుగుచుండెడివి.

ఆర్థిక పరిస్థితులు :
1. వ్యవసాయము:అనేక రకముల పట్టణములు వెలసినను, గ్రామమే ఆర్థికవ్యవస్థకు కీలకము. ప్రజల ముఖ్యవృత్తి వ్యవసాయము. వ్యవసాయాభివృద్ధికి మౌర్యులు కడు శ్రద్ధ వహించిరి. ఉదా॥ మౌర్య చంద్రగుప్తుని కాలమున కథియవాడ్లోని గిర్నార్ వద్ద సుదర్శన తటాకము త్రవ్వబడినది. రైతులు కష్టజీవులు, పొదుపరులు, తెలివిగలవారు, నీతివర్తనులు, రైతుల సంక్షేమమును పెంపొందించుటకు మౌర్యులు ప్రత్యేక ఉద్యోగులను . నియమించెడివారు. ఉదా॥ కోశాధ్యక్షులు, అటవి శాఖాధ్యక్షులు మున్నగు ఉద్యోగులను నియమించెడివారు.

2. పరిశ్రమలు:వ్యవసాయముగాక గనుల త్రవ్వకము, నేత, వ్యవసాయ సాధనముల ఉత్పత్తి, నౌకానిర్మాణము, మత్తుపానీయములు, యుద్ధ పరికరములు తయారీ మున్నగు పరిశ్రమలు కూడా ఆర్థికాభివృద్ధి దోహదము చేసెను. ఇట్లు తయారైన వస్తువులను తనిఖీచేయుటకే పాటలీపుత్ర నగరపాలనలో ఒక సంఘము ఏర్పాటు చేయబడెను.

3. వాణిజ్యము:మౌర్యయుగమున దేశీయ, విదేశీయ వాణిజ్యము ముమ్మరముగా సాగెను. రహదారులు, నదులు, కాలువలు, నాటి రవాణామార్గములు. దేశములోని ప్రముఖ పట్టణముల నుంచి పాటలీపుత్రమునకు రహదారులు కలవు. ఉత్తర దక్షిణ హిందూదేశముల మధ్య వాణిజ్యములు బాగుగా సాగెను. ఉత్తరదేశము నుండి ఉన్ని బట్టలు, కంబళ్ళు, గుఱ్ఱములు, దక్షిణ దేశవాసులు దిగుమతి చేసికొని; వాటికి బదులు వజ్రములు, ముత్యములు, నూలుబట్టలు ఉత్తరదేశీయులకు ఎగుమతి చేసెడివారని అర్థశాస్త్రము వలన తెలియుచున్నది. భారతదేశమునకు ఈజిప్టు, సిరియా బాక్ట్రియా మున్నగు విదేశములతో రాజ్యసంబంధములు కలవు. విదేశముల నుండి మత్తు పానీయము, అత్తిపండ్లను దిగుమతి చేసుకొనెడివారు. విదేశీ వాణిజ్యము జరుపు కొనుటకు ప్రభుత్వము అనుమతి పత్రములను మంజూరు చేసెడిది. వర్తకులు శ్రేణులుగా ఏర్పడి వాణిజ్యము సాగించెడివారు. ఈ శ్రేణులే బ్యాంకులుగా వ్యవహరించి, నిధులను సమకూర్చి దానిపై 15% వడ్డీ ఇచ్చెడివి. ఈ యుగమున అసంఖ్యాకమైన బంగారు, వెండి, రాగి చిల్లు నాణెములు వాడుకలో నున్నవి.

సాంస్కృతిక పరిస్థితులు :
మౌర్యుల కాలంలో విజ్ఞాన సాంస్కృతికాభివృద్ధి జరగడానికి రాజకీయ సమైక్యత, ఆర్థిక సమృద్ధి, విదేశీ దాడుల భయం లేకపోవడం మొ॥ కారణాలు దోహదంచేశాయి.
సాహిత్యం:విద్యాసారస్వతాలు చక్కని ఆదరణను పొందాయి. రాజకీయ, ఆర్థిక విషయాలలో ప్రామాణిక గ్రంథముగా భావించబడే ‘అర్థశాస్త్రం’ ఈ కాలంలో చంద్ర గుప్తుని ప్రధాన సలహాదారుడైన కౌటిల్యుని చేత వ్రాయబడింది. పలు విజ్ఞాన శాఖలు అధ్యయనం చేయబడి గొప్పగా అభివృద్ధి చెందినట్లు, ఆ గ్రంథ విజ్ఞాన సర్వస్వ పరిధి సూచిస్తుంది. నాడు ప్రసిద్ధ విద్యాకేంద్రంగా విలసిల్లిన తక్షశిలలో విశ్వవిద్యాలయ ముండేది. అందున్న అధ్యయన విషయాలలో ఇతిహాసాలు, రాజనీతిశాస్త్రం, అర్థశాస్త్రం, తత్త్వశాస్త్రం మున్నగునవి విశేషాదరణ పొందినవి. బౌద్ధమతతత్త్వశాస్త్రం కూడా విశేష జనాదరణ, విస్తరణ పొందింది. అశోకుని పాలనా కాలంలో జరిగిన మూడవ బౌద్ధ సంగీత పాటలీపుత్రంలో మొగాలిపుత్తతిస్స అధ్యక్షతన జరిగింది. ఇందు అతడు ఆనాటి నాస్తిక సిద్ధాంతాలను ఖండిస్తూ ‘కథావత్తు’ అనే ప్రామాణిక గ్రంథమును సంకలనం చేశాడు. ‘అభిదమ్మ పీఠిక’ కూడా ఈ సభయందే ఆవిష్కరింపబడి, ఆనాటి న్యాయ గ్రంథాలకు జోడింపబడింది. జైన వాజ్ఞ్మయం కూడా పరిష్కరింపబడి, విస్తరించింది. భద్రబాహు ‘కల్పసూత్రమ’నే గ్రంథాన్ని రాసింది ఈ కాలంలోనే. ప్రాకృతం రాజభాషగా మారింది. అశోకుని శిలాశాసనాలను బట్టి, అందలి లిపి పరిణామమును బట్టి బ్రహ్మ లిపి రచనా కౌశలాని ఉన్నతస్థాయికి చెందిన అభివృద్ధి సాధించినట్లు తెలియుచున్నది.

TS Inter 1st Year History Study Material Chapter 4 మౌర్య సామ్రాజ్యం – అవతరణ

ప్రశ్న 4.
మౌర్యుల పరిపాలన ముఖ్య లక్షణాలను గురించి రాయండి.
జవాబు.
మౌర్య సామ్రాజ్య పరిపాలనకు సంబంధించిన విషయాలకు కౌటిల్యుని అర్థశాస్త్రమే ప్రాతిపదిక. భారతదేశంలో తొలిసారిగా సశాస్త్రీయ పద్ధతిలో పరిపాలనా విధానం ఏర్పాటు చేసింది మౌర్యులే. అర్థశాస్త్రం, మెగస్తనీస్ ఇండికా గ్రంథాలు వీరి పాలనకు ప్రధానాధారాలు. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు మౌర్య చంద్రగుప్తుడు మంచి పరిపాలనా దక్షుడు. పాలనా విషయాలలో కౌటిల్యుని సహాయం పొందాడు. ఇతని వారసులు కూడా దీన్ని ఏ మార్పు లేకుండా
అనుసరించారు.

కేంద్ర ప్రభుత్వ పాలన :

రాజు:రాజ్యంలో రాజు అత్యున్నత అధికారి. అతడికి అపరిమిత అధికారాలు కలవు. అతడే ఉన్నత కార్యనిర్వహణాధికారి, సర్వసైన్యాధికారి, న్యాయాధికారి. రాజ్య వ్యవహారాలలో మంత్రి పరిషత్ సలహాలు తీసుకునేవాడు. ప్రజాసంక్షేమం కోసం పగలు, రాత్రి కృషి చేసేవారు. “ప్రజల సుఖమే తన సుఖంగా, వారి కష్టాలే తన కష్టాలుగా చక్రవర్తి భావించాలి”. అని కౌటిల్యుడు చెప్పడాన్ని బట్టి చక్రవర్తి నియంతగా ఉండకపోవచ్చని భావించవచ్చు. అశోకుడి శిలాశాసనంలో ‘ప్రజలందరు నా బిడ్డలు’ అనేది ఈ విషయాన్నే చాటుతోంది.

మంత్రి పరిషత్:మంత్రి పరిషత్ రాజు శకటంలో ఒక చక్రంలాంటిది. వీరిని రాజే నియమిస్తాడు. పరిషత్లో ప్రధాన మంత్రి, ఇతర శాఖామంత్రులు, పురోహితుడు, సేనాపతి, యువరాజు ముఖ్యులు. ప్రజాసంక్షేమం దృష్ట్యా మంత్రి పరిషత్ సలహాలు చక్రవర్తి పాటించేవాడు.

రాష్ట్ర ప్రభుత్వ పాలన:చంద్రగుప్తుని రాజ్యం విశాలమైనందున పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించారు. అవి 1) ప్రాచ్య 2) ఉత్తరాపథం 3) అవంతీ పథం, 4) దక్షిణాపథం ఈ రాష్ట్రాల పాలనకు గవర్నర్లుగా యువరాజులు కాని రాజబంధువులు గాని ఉండేవారు.

స్థానిక పాలన:స్థానిక పాలన మున్సిపల్ తరహా పాలన (నగర పాలన), గ్రామ పాలన అని రెండు రకాలుగా ఉండేది.

మున్సిపల్ పాలన:మౌర్యుల పాలనలో నగర పాలన ప్రాధాన్యం కలిగిన అంశం. నగర పాలనాధికారిని నాగరికుడు లేదా నగరాధ్యక్షుడు అంటారు. ఇండికా, అర్థశాస్త్రాలు నగర పాలనను విస్తారంగా తెలిపాయి. నగర పాలనను 30 మంది సభ్యులు కల సభ నిర్వహిస్తుంది. వీరు ఐదుగురు సభ్యుల కూటమిగా 6 శాఖలుగా ఏర్పడి 1) పరిశ్రమలు 2) విదేశీ వ్యవహారాలు 3) జనాభా వివరాలు 4) తూనికలు, కొలమానాలు 5) వస్తు విక్రయం 6) పన్నుల వసూలు అనే శాఖలుగా విధులు నిర్వహించేవారు.

గ్రామీణ పాలన:మౌర్యుల పాలన చిన్న విభాగం గ్రామం. గ్రామ అధికారిని గ్రామణి అనేవారు. పది గ్రామాలకు పెద్దగోపుడు ఉండేవాడు.

న్యాయపాలన:చక్రవర్తి ఉన్నత న్యాయాధికారి అయితే ఆస్తి తగాదాలు తదితర సివిల్ కేసుల పరిష్కారానికి ‘ధర్మస్తేయ’ అనే న్యాయస్థానం ఉండేది. అపరాధ విచారణ కోసం ‘కంటన శోధన’ అనే క్రిమినల్ న్యాయస్థానం ఉండేది. కఠినమైన శిక్షాస్మృతి అమలుతో నేరాల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. అశోకుడు తన పాలనా కాలంలో ఈ కాఠిన్యాన్ని కొంత తగ్గించాడు.

గూఢచారి వ్యవస్థ:మౌర్యుల పాలనలో అత్యంత ప్రాధాన్యం కలిగిన విభాగం గూఢచారి వ్యవస్థ. ఇది నేటి ఆధునిక కాలానికి ఏ మాత్రం తీసిపోని విధంగా అత్యంత సమర్థవంతంగా తీర్చిదిద్దబడింది. వీరు రాజ్యంలోని సమాచారం, అధికారుల ప్రవర్తనలను పరిశీలించి రహస్య నివేదికలు పంపేవారు. ‘సంతక్’, ‘సంచారం’ అనే రెండు రకాల గూఢచారులు మారువేషాలలో సంచరిస్తూ రాజుకు కన్ను, చెవులా ఉంటూ సమర్థవంతంగా పనిచేసేవారు.

సైనిక వ్యవస్థ:మౌర్య సామ్రాజ్యం విశాలమైన సైన్యం కలిగి ఉండేది. మౌర్య సైన్యంలో ఆరు లక్షల కాల్బలం, 30 వేల అశ్విక దళం, 9 వేల గజబలం, 8 వేల రథాలు ఉండేవి. సైన్యానికి అనుబంధంగా నౌకాబలం కూడా ఉండేది. సైనిక పర్యవేక్షణ 30 మంది సభ్యులు గల సైనికశాఖకు అప్పగించారు. సర్వసైన్యాధ్యక్షుడు చక్రవర్తి. క్రమం తప్పకుండా జీతాలు ఇవ్వడంతో సైనికులు హాయిగా బ్రతికేవారు.

కఠిన శిక్షలు, ఉద్యోగుల పీడనలు వంటి కొన్ని లోపాలున్నప్పటికీ, సమర్థవంతమైన నగర పాలన, స్థానిక పాలన వీరి సుగుణాలు. మౌర్యుల పాలన ఉత్తమం, ఆదర్శం. మౌర్యుల పాలన మొగలుల పాలన కంటే ఆదర్శవంతమైనదని వి.ఎ.స్మిత్ పండితుడు వ్యాఖ్యానించడం నూటికి నూరుపాళ్ళు వాస్తవమే.

ప్రశ్న 5.
కనిష్కునిపై ఒక వ్యాసం రాయండి.
జవాబు.
కనిష్కుడు:చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ‘వీమ కడఫాసిన్’ తరువాత రాజ్యానికి వచ్చినవాడని, క్రీ.శ. 78 నుంచి 102 వరకు పాలిస్తూ, నూతన శకం ప్రారంభికుడు కనిష్కుడని తెలుస్తుంది. ఇతడు కుషాను రాజులందరిలో గొప్పవాడని, గొప్ప యోధుడని తెలుస్తుంది. ఇతడు ఫామీర్ ప్రాంతంపై దండయాత్ర చేసి ‘కాసగర్’ ‘కోట’ లను ఆక్రమించి, కుషానుల గొప్పతనాన్ని చాటినాడు. ఇతడు చైనా సామ్రాజ్య చక్రవర్తితో గుర్తింపు పొందాడు. ఇతడి సామ్రాజ్యం బోకార నుంచి సింధూ వరకు, పర్షియా నుంచి బీహారు వరకు విస్తరించింది. భారతదేశాన్ని తన దక్షిణ సరిహద్దుగా చేసుకొని కనిష్కుడు కాశ్మీరు తన సామ్రాజ్యంలో కలుపుకొన్నాడు. ఇతడు కనిష్కపురం అనే పట్టణాన్ని నిర్మించాడు. కల్హనుని ప్రకారం ఇతడు మగధ వరకు దండయాత్ర చేసి అక్కడి నుంచి అశ్వఘోషుడు అనే బౌద్ధమత పండితుని తీసికొచ్చుకొన్నాడని చెప్పబడుతుంది. ఇతడు పాలించిన భూభాగం ఎక్కువ భాగం భారతదేశం అవతల ఉంది, అయినప్పటికి ఇతనిని భారతదేశ రాజుగా పరిగణిస్తున్నారు. ఇతని రాజధాని గాంధారలో ఉన్న పురుషపురం లేదా పెషావర్గా ఉండేది.

బౌద్ధమత సేవలు:కనిష్కుడు గొప్ప సామ్రాజ్య నిర్మాతయే గాక, సామాజిక సేవకుడు, అతడు బౌద్ధమతానికి చేసిన సేవ అశోకుడు ఆ మతానికి చేసిన సేవలను గుర్తింపచేస్తుంది. ఇతని ఆధ్వర్యంలో నాల్గవ బౌద్ధ సంగీతి లేదా సమావేశం, కాశ్మీర్లో ఉన్న కుందలవన విహారంలో జరిగింది. బౌద్ధమత సంఘంలో ఉన్న భేదాలను లేదా విభేదాలను తొలగించడానికి కనిష్కుడు తన ఆస్థానంలో ఉన్న గొప్ప బౌద్ధమత తాత్వికుడైన పార్శ్వనాథుని సలహాతో వీరిని సమావేశ పరిచాడు.

చైనా యాత్రికుడు హువానువాంగ్ ప్రకారం దాదాపు అయిదువందల మంది బౌద్ధ సన్యాసులు ఈ సమావేశానికి హాజరైనారు. ఇది వసుమిత్ర అధ్యక్షతన, అశ్వఘోషుని ఉపాధ్యక్షతన జరిగింది. ఇక్కడ మహాయాన బౌద్ధమతాన్ని తమ మతంగా ప్రకటించుకుంటూ ఇక్కడ హాజరైన ప్రతినిధులు తమ చర్చల ద్వారా ఆయా శాఖలలో ఉన్న ధర్మ సూత్రాలను క్రోడీకరించి, వాటిని రాగి పలకలపై చెక్కించి, ప్రత్యేకంగా నిర్మించిన స్థూపంలో భద్రపరిచారు. ఈ కామెంట్రీలను సంస్కృత భాషల్లో రాశారు. కనిష్కుడు బౌద్ధమతాన్ని పోషించినప్పటికి ఇతర మతాలను కూడా ఆదరించాడు.

సాహిత్యం:కనిష్కుని ఆస్థానంలో పార్శ్వనాథుడు, వసుమిత్రుడు అనే గొప్ప బౌద్ధమత తాత్వికులుండేవారు. వీరి ఆధ్వర్యంలో నాల్గవ బౌద్ధ సంగీతి సమావేశపరచడమే గాక, తద్వారా బౌద్ధమత ‘మహావిభాష’ అనే సంపూర్ణ జ్ఞాన గ్రంథాన్ని ఈ సమావేశంలో తయారుచేశారు. దీన్నే ‘త్రిపీటకాలకు వ్యాఖ్యలంటారు. ఇతని ఆస్థానంలో ‘బుద్ధచరిత’ గ్రంథ రచయిత అశ్వఘోషుడు, మహాయాన మత ప్రచారకుడు తాత్వికుడైన ఆచార్య నాగార్జునుడుండేవారు. సెక్యులర్ సైన్స్ గ్రంథకర్తలైన చరకుడు ‘చరక సంహితము’, మాతంగుని రాజనీతి తత్త్వం ముఖ్యమైనవి. చరకుని చరక సంహితంలో వివిధ రకాల వ్యాధులు వాటి కారణాలు గుర్తించడం, రక్త ప్రసరణ పరీక్షలు, మానవ శరీర నిర్మాణం, మెదడు పనితీరును మొదలైన వాటి గురించి వివరిస్తుంది. ఇంతటి విలువ గల విషయాల గురించి తెలిపే చరకశాస్త్రం పర్షియన్ మొదలైన ఎన్నో భాషల్లో తర్జుమా చేయబడింది.

వాస్తుకళలు:వాస్తు కట్టడాలు, కళలు, శిల్పాలు నిర్మాణాలు అశోకుని వలె కనిష్కుడు కూడా పోషించి వాటి వృద్ధికి తోడ్పడ్డాడు. కనిష్కుడు నిర్మించిన పదమూడు అంతస్తుల అతి ఎత్తైన కనిష్కపురంలోని ‘టవర్’, బౌద్ధ సన్యాసులకు నిర్మించిన విహారాలు, స్థూపాలు (గుడులు), పురుషపురంలోని గాంధార కళాకృతితో నిర్మించిన బుద్ధుని శిల్పాలు, గాంధార, మధుర ప్రాంతంలో నిర్మించిన బుద్దుని విగ్రహ శిల్పాలు మొదలైనవి అతని వాస్తు కళాపోషణకు నిదర్శనాలు. ఇతని పురుషపురంలో 400 అడుగుల ఎత్తైన గోపురం, దానిపై బుద్ధ విగ్రహ నిర్మాణాలు ముఖ్యమైనవి.

ఇతని కాలంలో గాంధార శిల్పకళ అభివృద్ధి చెంది ఉన్నత స్థితికి చేరింది. మధుర గాంధార కళకు ప్రసిద్ధి చెందింది. కనిష్కుడు విదేశీయుడైన, భారతదేశ రాజుగా ప్రసిద్ధిగాంచాడు. ఇతడు 41 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. ఇతని తరువాత హావిశ్కుడు వసిస్కిడు అను బలహీన వారసుల పాలనతో కనిష్క సామ్రాజ్యం పతనం ప్రారంభమైంది.

TS Inter 1st Year History Study Material Chapter 4 మౌర్య సామ్రాజ్యం – అవతరణ

ప్రశ్న 6.
సంగమ కాలం గురించి రాయండి.
జవాబు.
సంగమము అంటే కవుల లేదా పండితుల సమావేశం. ఇక్కడి నుంచే ప్రాచీన తమిళ గ్రంథాలు క్రోడీకరించి వెలుగులోకి వచ్చాయి. తమిళుల చరిత్ర ఈ సంగమ యుగం నుండే ప్రారంభమైనదని చెప్పబడుతుంది. ఈ సంగమ యుగం లేదా ఆ ప్రాంత కవుల సమ్మేళనం, అందులోంచి ఉద్భవించిన రచనలు క్రీ.శ. రెండు, మూడు శతాబ్దాల మధ్య కాలంలో జరిగింది. ఈ కాలంలో ఉద్భవించిన రచనల ద్వారా మనకు చేర, చోళ పాండ్యరాజుల గురించి తెలుస్తుంది. కాని పల్లవుల గురించి ఈ సాహిత్యంలో అంటే సంగమ సాహిత్యంలో పేర్కొనబడలేదు. క్రీ.శ. 7వ శతాబ్దిలోనే తమిళనాడు ప్రాంతంలో పల్లవులు ఆధిపత్యంలోకి వచ్చారు. అందువల్ల శైవ, వైష్ణవ మత ప్రచారం కూడా క్రీ.శ. 7వ, 8వ శతాబ్దిలోనే నాయనార్లు, ఆళ్వారులు అనే భక్తి సెయింట్స్లో జైన, బౌద్ధమతాలకు వ్యతిరేకంగా ఉద్భవించింది.

సంగమ సాహిత్యమే కాకుండా దానికంటే ముందు వచన రూపంలో వచ్చిన గ్రంథాల్లో కూడా తమిళుల ఆధిపత్యం కనిపిస్తుంది. సంగమ సాహిత్య పద్యాలు ప్రజల వాడుక పద్యాలకు దగ్గరగా ఉండేవి. ఇవి అన్ని కూడా తమ రాజులను పొగడుతూ రాసినట్లు గోచరిస్తాయి. సంగమ కాలం నాటి ప్రముఖ రచయితలు.

రాజకీయ చరిత్ర:చోళరాజ్యం ఆర్కాట్ నుంచి తిరుచునాపల్లి వరకు, కావేరి డెల్టా దాని పరిసర ప్రాంతాలకు విస్తరించింది. చోళరాజ్య రాజధాని ‘ఉరయూర్’ చేర రాజ్యం ఉత్తరాన కొచ్చిన్ నుంచి దక్షిణాన తిరువళ్ళూరు వరకు విస్తరించింది. దీని రాజధాని ‘పంజి’. పాండ్యరాజ్యం పుడుక్కోట నుంచి కన్యాకుమారి వరకు విస్తరించింది. మధురై పాండ్య రాజుల రాజధాని.

చేర రాజ్యం: చేర రాజుల్లో మొదటి వాడు ఉదయంజెరల్ (క్రీ.శ. 130). అతడు గొప్ప యుద్ధవీరుడు. భారీ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇతని కుమారుడు నెడుంజరల్ అడన్ మలభారు తీరంలోని శత్రువుల పైన నౌకా యుద్ధంలో గొప్ప విజయాన్ని సాధించి అనేకమంది యవన వ్యాపారులను బంధించాడు. ‘ఆధిరాజ’ అనే బిరుదుతో పాటు హిమాలయాలను సరిహద్దుగా కలిగినవాడు అనే అర్థం వచ్చే ‘ఇమయవరంబన్’ అనే బిరుదాన్ని స్వీకరించాడు.

చోళ సామ్రాజ్యం:చోళ సామ్రాజ్యం స్థాపన కరికాల చోళునితో క్రీ.శ. 190లో ప్రారంభమైంది. కరికాల అంటే శత్రువుల ఏనుగులకు కాలయముడు లాంటివాడు అని అర్థం. రెండవ దాని ప్రకారం కాలిన కాలుగలవాడు లేదా నల్లని కాలువాడు అంటే అతని చిన్నతనంలో మంటల్లో కాలుకాలినవాడని మరొక అర్థం. శత్రువుల చేతుల్లో నిర్బంధింపబడి, తప్పించుకొని చేర రాజులతో యుద్ధం చేసి తన తాతల సామ్రాజ్యాన్ని తిరిగి సాధించుకొన్నాడు. ‘పరనార్’ అనే సమకాలీన కవి ప్రకారం కరికాళుడు గొప్ప యుద్ధవీరుడు, అతడు చేర, పాండ్యుల రెండు సైన్యాలను ఓడించి, గొప్ప విజయాన్ని సాధించాడు. ఇతడు 12,000 మందిని యుద్ధ ఖైదీలుగా చేసి కావేరినదిపై ఆనకట్టను కట్టడానికి ఉపయోగించి, వ్యవసాయానికి నీటిపారుదల వసతులు కల్పించాడు. ఇతడు కావేరి పట్టణం (పూహర్) అనే నూతన రాజధాని నిర్మించాడు. వర్తక వాణిజ్యాలను ప్రోత్సహించాడు. ఇతని ‘పెన్నార్’ నీటిపారుదల కాలువ నిర్మాణం వల్ల తంజావూరు పట్టణం, దాని దక్షిణ ప్రాంతమంతా నీటి లభ్యత చేకూరింది. ఇతడు వైదిక మతాన్ని ప్రోత్సహించి యజ్ఞయాగాలను నిర్వహించాడు.

పాండ్యులు:పాండ్య రాజులలో అతి గొప్పవాడు నెడుంజలియన్. ఇతడు చిన్నతనంలోనే రాజ్యానికి రావడంతో చోళ, చేర రాజులు ఇతని రాజ్యంపై దండెత్తగా, తెలైయలంగనమ్ అనే యుద్ధంలో వారిపై విజయం సాధించాడు. ఇతని గొప్పతనాన్ని మనగుడి మరుదన్, నక్కిరార్ అనే కవులు కొనియాడారు.

మతం:ఆ కాలం నాటి ప్రజలు వైదిక మతాన్ని ఆదరించారు. వివిధ రకాల దేవతలను పూజించారు. వాటిలో ప్రకృతి ఆరాధన, శివ, విష్ణు, ఇతర దేవతలను పూజించేవారు. యజ్ఞ యాగాలను చేసేవారు. సన్యాసులకు సంఘంలో మంచి స్థానముండేది. ప్రజలు భక్తి భావంతో పాటు, పునర్జన్మ, కర్మసిద్ధాంతాలను, జ్యోతిష్యశాస్త్రం మొదలైనవి నమ్మేవారు. ఈ కాలంలో బౌద్ధమతం, జైనమతం కూడా వైదిక మతంతో పాటు సమాన గౌరవాన్ని పొందేది. తిరువల్లూవర్ అనే వాడు జైనకవి, అతడు ‘తిరుక్కురల్’ గ్రంథ రచయిత. సంగం సాహిత్యానికి ఆణిముత్యం లాంటి ‘సిలాప్పడికరం’ ‘మణిమేకలై’ అనేవి బౌద్ధుల గ్రంథాలు.

సాహిత్యాభివృద్ధి:సంగమ యుగంలో ఆర్యుల, ద్రావిడుల సంస్కృతి మిళితమైన సంగమ సాహిత్యాభివృద్ధి జరిగి,. బంగారు యుగంగా పేరొందింది. ‘తిరువల్లువార్’ అనేవాడు ‘తిరుక్కురల్’ అనే కావ్యాన్ని రాశాడు. ఇది ఆ కాలం నాటి ప్రజల జీవన విధానాన్ని, వారి నైతిక విలువల గురించి వివరించే అతి ముఖ్యమైన గ్రంథం. ఆ రోజుల్లో అగస్త్యుని శిష్యుడు తోలకప్పియార్ అనేవాడు అతి ముఖ్యమైన ‘తొలకప్పియం’ అనే వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మగధ రాజ్య విజృంభణకు గల కారణాలు పరిశీలించండి.
జవాబు.
క్రీ.పూ. 6వ శతాబ్దంలో షోడశ మహా జనపదాలనబడే 16 రాజ్యాలు ఏర్పడ్డాయి. వాటిలో మగధ రాజ్యం ఒకటి. మగధ రాజ్యం క్రమంగా శక్తివంతంగా మారి విజృంభించింది.
మగధ సామ్రాజ్య ఆవిర్భావానికి కారణాలు:క్రీ.పూ. 6వ శతాబ్దంలో గంగా, యమున మైదాన ప్రాంతంలో 16, జనపదాలు వెలిశాయి. ఈ మహాజనపదాల మధ్య ఆధిపత్యం కోసం నిరంతరం సంఘర్షణలు జరుగుతుండేవి. సార్వభౌమాధికారాన్ని పొందాలనే తలంపుతో ప్రతి జనపదం కూడా. సమర్థవంతమైన సైనిక వ్యవస్థను పోషించింది. ఈ రాజకీయ, సైనిక ప్రయోజనాల వెనుక ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతం వాయువ్య దిశ నుంచి వచ్చే విదేశీ దాడుల ప్రమాదానికి దూరంగా ఉంది. గంగానది, దాని ఉపనదులతో ఈ ప్రాంతం ఐశ్వర్యవంతమైంది. రాజకీయాధిక్యత కోసం కాశీ, కోసల, మగధ, వజ్జి రాజ్యాలు పోటీపడ్డాయి. వాటిలో మగధ విజృంభించి ఇతర రాజ్యాలపై ఆధిపత్యాన్ని నెలకొల్పి భారతదేశ చరిత్రలో ప్రప్రథమ రాజ్యంగా వెలిసింది.

మగధ రాజ్య విజృంభణకు అనేక పరిస్థితులు దోహదపడ్డాయి..

  1. మగధలో ప్రకృతిసిద్ధమైన అనేక వనరులున్నాయి. ‘గంగానది, దాని ఉపనదులైన శోణ్, గండక్, గోగ్రా నదులు మగధకు సహజ రక్షణను, రాకపోకల సౌకర్యాలను సమకూర్చాయి.
  2. ఈ ప్రాంతంలో ఇనుప ఖనిజగనులు అందుబాటులో ఉన్నందువల్ల మగధ ఆయుధ నిర్మాణంలో ముందంజ
    వేసింది.
  3. మధ్యగంగా మైదాన ప్రాంత మధ్యభాగంలో ఉన్నందువల్ల ఆ రాజ్యం సస్యశ్యామలంగా అభివృద్ధి చెందింది.
  4. ఈ ప్రాంతంలో ఏనుగులు అధిక సంఖ్యలో ఉండేవి. మగధ పెద్ద ఎత్తున ఏనుగులను సమీకరించి యుద్ధ వ్యూహంలో ముందున్నది.
  5. మగధకు రాజధాని నగరాలైన గిరివ్రజం, పాటలీపుత్రం రాజ్యానికి ప్రకృతిసిద్ధమైన రక్షణను కల్పించాయి.
  6. ఈ ప్రాంతం తరచుగా విదేశీ దండయాత్రలకు గురయ్యే వాయువ్య ప్రాంతానికి దూరంగా ఉన్నందువల్ల దండయాత్రల బెడద లేదు.
  7. పైగా కొత్తగా ఆర్య సంస్కృతి ప్రభావం కిందికి వచ్చిన మగధ ప్రజల్లో ఇతరుల కంటే సామ్రాజ్య విస్తరణ కాంక్ష అధికంగా ఉండేది. ఈ విధమైన కారణాలు ఉన్నందువల్లనే మగధ ఒక సామ్రాజ్యంగా రూపొందింది.
  8. మగధను పాలించిన రాజవంశాలు మగధ రాజ్య విజృంభణకు దోహదపడ్డాయి.

ప్రశ్న 2.
మౌర్య చంద్రగుప్తుడు.
జవాబు.
మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. ఇతడు చాణిక్యుని నేతృత్వంలో సకల విద్యాపారంగతుడై ఉత్తమ సైనికుడిగా రూపుదిద్దుకున్నాడు. చంద్రగుప్త మౌర్యుడు రెండు ఘనకార్యాలు సాధించాడు. మొదటిది వాయువ్య భారతదేశాన్ని గ్రీకుల నుంచి స్వాధీనం చేసుకోవటం కాగా, నందరాజులను ఓడించి మగధను ఆక్రమించటం రెండవది. అలెగ్జాండర్ భారతదేశమును వదిలివెళ్ళిన పిమ్మట చాణక్య, చంద్రగుప్త మౌర్యుడు మొదటగా పంజాబ్ ప్రాంతంలో ధైర్యసాహసాలకు పేరుబడ్డ జాతులవారిని చేరదీసి ఒక శక్తివంతమైన సైన్యమును సమకూర్చుకున్నారు. ఈ సైన్యం సహాయంతో చంద్రగుప్త మౌర్యుడు ప్రథమంగా గ్రీకులను పారద్రోలి పంజాబును విదేశీపాలన నుండి విముక్తి చేశాడు. ఆ తరువాత నందరాజు నిరంకుశత్వాన్ని నిర్మూలించి మగధ సింహాసనాన్ని అధిష్టించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. జైన, బౌద్ధ ఐతిహ్యాల ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు రెండుసార్లు మగధపై దండయాత్ర జరిపాడని, రెండవ దండయాత్రలో విజయం సాధించి సామ్రాజ్య స్థాపనగావించాడని తెలుస్తున్నది. క్రీ.పూ. 305లో భారతదేశముపై దండెత్తి వచ్చిన గ్రీకు సేనాని సెల్యూకస్ నికటార్ను ఓడించి అతని వద్ద నుండి కాబూల్, కాందహార్, హీరట్, బెలూచిస్థాన్లను వశపరచుకొన్నాడు. చంద్రగుప్త మౌర్యుడు 6 లక్షల సైన్యంతో భారతదేశమంతటిని జయించాడని ప్లూటార్క్ అనే గ్రీకు చరిత్రకారుడు పేర్కొన్నాడు. ఈ దండయాత్రల వలన చంద్రగుప్త మౌర్యుని మౌర్య సామ్రాజ్యం పశ్చిమాన పర్షియా నుండి తూర్పున బీహార్ వరకు, దక్షిణాన తిరునల్వేలి జిల్లా వరకు విస్తరించింది. భారతదేశంలోని అధిక భాగాలను ఒకే సామ్రాజ్య పరిధిలోనికి తీసుకొనివచ్చిన ఘనత చంద్రగుప్తు మౌర్యునికే దక్కుతుంది. అందువలన భారతదేశ చరిత్రలో చంద్రగుప్తమౌర్యుని జాతీయ పాలకుడుగా భావిస్తారు.

ప్రశ్న 3.
అశోక ధమ్మము.
జవాబు.
అశోకుని కాలంలో వివిధ మతశాఖలు సామాజిక ఉద్రిక్తతను సృష్టించాయి. నగరాల్లో వ్యాపారవర్గాలు బలపడటం వల్ల నూతన సామాజిక స్థితి ఏర్పడింది. సామ్రాజ్య సువిశాలత్వం కూడా కొన్ని సమస్యలను సృష్టించింది. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొని, దేశ సమైక్యతను సాధించటానికి ఒక క్రొత్త విధానం కావలసి వచ్చింది. అందువలననే అశోకుడు తన ధర్మాన్ని ప్రతిపాదించాడు.

అశోకుని ఆదర్శాలు, ఆలోచనలు అతనిలో కనిపిస్తాయి. బౌద్ధధర్మం, అశోకుని ధర్మం ఒకటి కాదు. ప్రజలకు సులభంగా అర్థమయ్యే ప్రాకృత భాషలో అశోకుడు తన ధర్మాన్ని శిలాశాసనాల్లో పొందుపరిచాడు. అన్ని మతాల మహోన్నత ఆదర్శాలకు ఈ ధర్మం అద్దం పడుతుంది. అశోకుని ధర్మం ముఖ్యంగా మానవుల ప్రవర్తన, నీతికి సంబంధించిన నియమావళికి వర్తిస్తుంది. ఈ ధర్మసూత్రాల్లో ప్రధానమైనవి :

  1. జీవహింస చేయరాదు.
  2. ఇతరుల విశ్వాసాలు, భావాలపట్ల సహనాన్ని చూపాలి.
  3. సర్వప్రాణుల పట్ల కరుణ, జాలి చూపాలి.
  4. బానిసలు, సేవకుల పట్ల దయతో మెలగాలి.
  5. గృహస్థులను, బ్రాహ్మణులను, సన్యాసులను దయతో సత్కరించాలి. వారికి ధన సహాయాన్ని చేయాలి.
  6. మాటలను అదుపులో పెట్టుకొని ఇతరుల మతాన్ని గౌరవించటం ద్వారా తన మతాన్ని, మత పలుకుబడిని పెంచుకోవాలి.

ఈ సార్వజనీనమైన సూత్రాలను ఆచరించినట్లయితే మానవుడు సత్ప్రవర్తన, నైతికతలను సాధించి మోక్షాన్ని పొందుతాడు. అశోకుడు కర్మకాండను, మూఢాచారాలను ఖండించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 4 మౌర్య సామ్రాజ్యం – అవతరణ

ప్రశ్న 4.
మౌర్య సామ్రాజ్య పతనానికి గల కారణాలను రాయండి.
జవాబు.
మౌర్య,సామ్రాజ్య పతనం నుంచి గుప్త సామ్రాజ్యం స్థాపన వరకు అంటే క్రీ.పూ. 200 నుంచి క్రీ.శ. 350 వరకు దాదాపు శతాబ్దాల కాలం ఏ రాజవంశంలోనూ కూడా ఉత్తర భారతదేశాన్నంతటినీ ఏకం చేసిన సామ్రాజ్యం మరొకటి లేదు.

మౌర్యుల పాలన తరువాత భారతదేశం రాజకీయంగా ముక్కలు ముక్కలుగా విభజింపబడి గంగానదికి దక్షిణంగా రాజ్యాలు ఆవిర్భవించాయి. అవి మగధ, కాశి, కౌశంబి, మధురలు. దీనికి తూర్పున విదేహా (ఉత్తర బీహార్ నుంచి కోసల (అవద్) వరకు, పశ్చిమాన పాంచాల, మధ్య భారతంలో భరహాత్, విధీష, ఉజ్జయిని రాజ్యాలు వెలిశాయి.
మౌర్యరాజ్యం కూలిపోయి పుష్యమిత్ర శుంగునితో శుంగరాజ్యం ఏర్పడే సమయంలో దక్షిణాపథంలో ఆంధ్రరాజ్యం లేదా శాతవాహనులు ఆవిర్భవించారు. ఇంకా దక్షిణంగా చోళ, చేర, పాండ్య రాజ్యాలు ఆవిర్భవించాయి. ఇదే . సమయంలో భారతదేశ వాయువ్య ప్రాంతం విదేశీయుల దండయాత్రలకు బలి అయింది. అలా భారతదేశంపై దండయాత్ర చేసిన వారిలో వరుసగా ఇండో – బాక్టీయనులు, శకులు, పార్థియనులు, కుషానులు వచ్చి వారి రాజ్యాలు స్థాపించారు.

ప్రశ్న 5.
మౌర్యుల కట్టడాలు.
జవాబు.
మౌర్యుల కళలు :
1) స్తంభాలు, శిల్ప నిర్మాణాలు: మౌర్యుల కళకు చాలా అందమైన నిర్మాణాత్మక నిదర్శనాలుగా అశోకుడు నిర్మించిన స్తంభాలు ఉన్నాయి. అశోకుని శాసనాలతో కూడిన స్తంభాలు, స్థూపాలు నగరాల్లో, కూడళ్లలో ప్రతిష్టించాడు. స్తంభాలను రెండు రకాలైన రాతితో నిర్మించారు. అవి :

  • మధుర ప్రాంతానికి చెందిన ఎరుపు, తెలుపు మచ్చలలో ఉన్న ఇసుక రాయితో కొన్ని నిర్మించబడ్డాయి.
  • బాగా పొడిచేసిన ఇసుకరాయి, బనారస్ సమీపంలోని చూనార్ వద్ద లభ్యం అవుతుంది. ఎక్కడైతే స్తంభాలు నిర్మిస్తారో అక్కడికి మధుర, చూనార్ నుంచి రాతిని రవాణాచేసి, అక్కడ శిల్పకారులు, తక్షశిల నుంచి వచ్చిన వారు తమ నైపుణ్యంతో చెక్కారు.

2) స్తూపాలు:స్తూపం అనేది ఇటుక లేదా రాయితో నిర్మించిన అర్థగోళాకార నిర్మాణం. క్రింద గుండ్రని ఆధారపీఠం ఉంటుంది. చుట్టూ గొడుగు ఆకారం సార్వభౌమాధికారానికి గుర్తుగా ఉంటుంది. అశోకుడు భారతదేశంలోను, ఆఫ్ఘనిస్థాన్లలో ఎనభై నాలుగువేల స్థూపాలు నిర్మించాడు. క్రీ.శ. 7వ శతాబ్దంలో హుయన్ త్సాంగ్ తన భారత పర్యటనలో వీటిని చాలావరకు చూశాడు. వీటిలో మంచి ఉదాహరణగా చెప్పదగింది భోపాల్ సమీపంలోని సాంచి స్తూపం.

3) గుహలు:మౌర్యుల కట్టడాల్లో ముఖ్యమైనవి గుహలు. గట్టిరాళ్ళు, చీలిన రాళ్ళతో చెక్కబడినవి. గుహల లోపలి గోడలు బాగా నునుపుగా, అద్దంలాగా ఉంటాయి. ఈ అద్భుత కట్టడాలు సన్యాసుల నివాసగృహాలు, అసెంబ్లీ గదుల వలె ఉపయోగపడ్డాయి.

ప్రశ్న 6.
గాంధార శిల్పకళ.
జవాబు.
A. గాంధార శిల్పం
1) కాలం, ప్రదేశం, పోషకులు:క్రీ.పూ. 1వ శతాబ్దం మధ్యకాలం నుండి క్రీ.శ. 5వ శతాబ్దం చివరి వరకు గాంధార ప్రాంతంలో ఉన్న అద్భుత శిల్పాలను గాంధార శిల్పాలు అంటారు. భారతీయ గ్రీకు శిల్పకళా సమ్మిళిత నిర్మాణంగా చెబుతారు. బాక్ట్రియా గ్రీకు రాజులు, వాయువ్య భారతం నుంచి ఆవిర్భవించాయి. శకులు, కుషాణులు
వీటి పోషకులు.

2) గాంధార శిల్ప లక్షణాలు:గ్రీకు, రోమన్ సంప్రదాయాల్లో బుద్ధుని విగ్రహాలు నిర్మించబడ్డాయి. మానవ శరీరాన్ని చాలా సహజంగా శిల్పులు చెక్కారు. కండరాలు, మీసాలు, ఉంగరాల జుత్తు మొదలైనవి చక్కగా ఉంటాయి.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అజాత శత్రువు.
జవాబు.
ఇతడు బింబిసారుని కుమారుడు. రాజ్య కాంక్షతో తన తండ్రిని చంపి సింహాసనాన్ని అధిష్టించాడని బౌద్ధ గ్రంథాల వల్ల తెలుస్తుంది. ఇతని 32 సంవత్సరాల పరిపాలనా కాలంలో తన తండ్రి రాజ్య పాలనా విధానాలను కొనసాగించడంతో పాటు, తన శక్తి సామర్థ్యాలతో మగధ రాజ్య ప్రతిష్టను పెంపొందించాడు. ఇతడు కోసల, కాశీ రాజ్యాలను జయించి మగధ సామ్రాజ్యంలో కలిపాడు. ఇతడు వజ్జి సమాఖ్య గణతంత్ర రాజ్యంపై 16 సంవత్సరాలు పోరాటం చేసి తన రాజ్యంలో కలుపుకొన్నాడు. ఈ పోరాట కాలంలోనే పాటలీ గ్రామంలో జలదుర్గ అనే కోటను నిర్మించాడు.

ప్రశ్న 2.
శిశునాగుడు.
జవాబు.
పర్యంక వంశ రాజుల పాలనతో విసిగిపోయిన ప్రజలు శిశునాగుని రాజుగా చేసుకున్నారు. ఈ రాజవంశీయులు మగధ రాజ్యాన్ని దాదాపు 50 సంవత్సరాలు పాలించారు. శిశునాగుడు ఈ వంశస్థాపకుడు. ఇతడు రాజధాన్ని పాటలీపుత్రం నుంచి రాజగృహకు మార్చాడు. ఇతడు అవంతి, వత్స రాజ్యాలను మగధ సామ్రాజ్యంలో కలుపుకొన్నాడు.శిశునాగుని తరువాత అతని కుమారుడు కాలాశోకుడు సింహాసనాన్ని అధిష్టించాడు.

ప్రశ్న 3.
ఇండికా
జవాబు.
చంద్రగుప్తు మౌర్యుని ఆస్థానంలో గ్రీకు రాజైన సెల్యూకస్ రాయబారి మెగస్తనీస్ భారతదేశంలో ఉన్నంతకాలం తాను చూచిన, విన్న విషయాలను ఇండికా అను పేరుతో గ్రంథస్తం చేశాడు. అయితే ఇండికాలోని కొన్ని భాగాలు మాత్రమే నేడు లభ్యమౌతున్నాయి. ఈ గ్రంథం వల్ల నాటి పాలనా విధానం, సామాజిక, ఆర్థిక పరిస్థితులు తెలుస్తున్నాయి. భారతదేశంలో బానిస వ్యవస్థ లేదని, భారతీయులలో 7 కులాలవారున్నారని మెగస్తనీస్ ఈ గ్రంథంలో పేర్కొన్నాడు. పాటలీపుత్ర నగరపాలన గురించి, సైనిక మండలుల గురించి మెగస్తనీస్ సవివరంగా వివరించాడు. అతడు విదేశీయుడు. ఇతనికి భారతీయ సంస్కృతీ పరిజ్ఞానం పూజ్యం కాబట్టి ఇతని రచనను స్వవిమర్శతో స్వీకరించవలసి ఉంటుంది.

ప్రశ్న 4.
కౌటిల్యుడు.
జవాబు.
అర్థశాస్త్ర రచయిత కౌటిల్యుడు. ఇతడే చాణక్యుడు. కుటిల నీతితో కౌటిల్యుడయ్యాడంటారు. ఇతడు చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి. మౌర్యుల చరిత్ర తెలుసుకొనుటలో అర్థశాస్త్రము ప్రధానమైనది. అర్థశాస్త్రమనగా ఆర్థికశాస్త్రం కాదు. ఇది రాజనీతి శాస్త్రము. ఇందు చక్రవర్తి విధులు, సైనిక విధానము, దండనీతి మొదలగు అంశములు పేర్కొనబడెను. అయితే రాజనీతితో పాటు ఆర్థిక విషయములు కూడా పేర్కొన్నాడు. నాటికి, నేటికీ పరిపాలకుడికి ఉండవలసిన లక్షణాలు, పరిపాలనలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఎన్నింటినో పేర్కొన్నాడు కౌటిల్యుడు.

ప్రశ్న 5.
కళింగ యుద్ధం.
జవాబు.
క్రీ.పూ. 261లో అశోకుడు పెద్ద సైన్యంతో కళింగ దేశంపై దండెత్తాడు, దాని అధికారాన్ని అణచి వేయాలనుకున్నాడు. దాంతో ఈ రాజ్యాల మధ్య యుద్ధం జరిగింది. ప్రాణనష్టం తీవ్రమైన రీతిలో జరిగింది. చివరకు అశోకుడు కళింగను ఆక్రమించాడు. ఈ యుద్ధం గురించి ఒరిస్సాలోని అతని 13వ రాతి శాసనంలో వివరంగా వివరించి ఉంది. ఈ సంఘటనతో చలించిపోయిన అశోకుడు బౌద్ధమతం స్వీకరించి, బౌద్ధ ధర్మం ప్రచారం మొదలుపెట్టాడు.

ప్రశ్న 6.
మూడవ బౌద్ధ
సంగీతి.
జవాబు.
అశోకుని ఆధ్వర్యంలో పాటలీపుత్రంలో మూడవ బౌద్ధ సంగీతి (సమావేశం) జరిగింది. దీనిలో ఏర్పడిన చీలికలు నివారించుటకై జరిపించాడు. దీనికి మొగళిపుత్త తిస్స అధ్యక్షత వహించాడు. ఈ సమావేశం నుంచి అనుకున్న ఫలితాలు రాకపోయినప్పటికి అశోకుడు బౌద్ధధర్మాన్ని దేశ, విదేశాలలో పలు విధాలుగా ప్రచారం చేయించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 4 మౌర్య సామ్రాజ్యం – అవతరణ

ప్రశ్న 7.
బృహద్రదుడు.
జవాబు.
చివరి మౌర్య రాజు బృహద్రధుడు. ఇతని అసమర్థ పాలన వలన చివరి బృహద్రధుని అతని సైన్యాధిపతియైన పుష్యమిత్ర శుంగుడు ఓడించి పాటలీపుత్ర సింహాసనాన్ని అధిష్టించాడు.

ప్రశ్న 8.
సాంచీ స్థూపం.
జవాబు.
అశోకుడు 84,000 స్థూపాలు నిర్మించాడు. వాటిలో సాంచీ, సారనాథ్, భరహాత్ స్థూపాలు ప్రఖ్యాతి గాంచినవి. వీటిలో సాంచి స్థూపం ప్రముఖమైనది. ఇది మధ్యప్రదేశ్లోని భోపాల్కు సమీపంలో ఉంది. ఈ మహాస్థూపం పరిధి (చుట్టుకొలత) 36.00 మీటర్లు, ఎత్తు 23.25 మీటర్లు. దీనికి చుట్టూ దీర్ఘ చతురస్రాకారపు 3.30 మీటర్ల ఎత్తు ఉన్న రాయితో దీర్ఘ చతురస్రాకారంలో నిర్మించిన గోడ ఉంది.

ప్రశ్న 9.
పుష్యమిత్ర శుంగుడు
జవాబు.
పుష్యమిత్ర శుంగుడు చివరి మౌర్యరాజు బృహద్రధుని సేనాని. ప్రజలలో అతనిపై వ్యతిరేకత, రాజు బలహీనతను ఆసరా చేసుకొని అతనిని చంపి రాజయ్యాడు. ఇతని సామ్రాజ్యం పాటలీపుత్రం నుంచి దక్షిణాన నర్మదానది వరకు విస్తరించింది. ఇతను హిందూమతాన్ని ఆదరించాడు. ఇతను రెండుసార్లు అశ్వమేధయాగం చేసినట్లు తెలుస్తున్నది.

ప్రశ్న 10.
నాలుగవ బౌద్ధ సంగీతి.
జవాబు.
నాల్గవ బౌద్ధ సంగీతి లేదా సమావేశం, కాశ్మీర్లో ఉన్న కుందలవన విహారంలో జరిగింది. బౌద్ధమత సంఘంలో ఉన్న భేదాలను లేదా విభేదాలను తొలగించడానికి కనిష్కుడు తన ఆస్థానంలో ఉన్న గొప్ప బౌద్ధమత తాత్వికుడైన పార్శ్వనాథుని సలహాతో వీరిని సమావేశ పరిచాడు. చైనా యాత్రికుడు హువానువాంగ్ ప్రకారం దాదాపు అయిదువందల మంది బౌద్ధ సన్యాసులు ఈ సమావేశానికి హాజరైనారు. ఇది వసుమిత్ర అధ్యక్షతన, అశ్వఘోషుని అధ్యక్షతన జరిగింది.

TS Inter 1st Year History Study Material Chapter 3 ప్రాచీన భారతదేశంలో సామాజిక, మత సంస్కరణ ఉద్యమాలు

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 3rd Lesson ప్రాచీన భారతదేశంలో సామాజిక, మత సంస్కరణ ఉద్యమాలు Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 3rd Lesson ప్రాచీన భారతదేశంలో సామాజిక, మత సంస్కరణ ఉద్యమాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జైన, బౌద్ధ మతాల ఆవిర్భావానికి దోహదం చేసిన పరిస్థితులను చర్చించండి.
జవాబు.
1) మత పరిస్థితులు: పవిత్రమైన, సామాన్య మతారాధనకు బదులుగా, సంక్లిష్టత మరియు బలులతో కూడుకొన్న వైదీక సంప్రదాయాలను సాధారణ ప్రజానీకం ఆమోదించలేదు. పైగా ఇవి ఖర్చుతో కూడుకొన్నవి. మూఢ విశ్వాసాలు మరియు మంత్రాలు ప్రజలను అయోమయానికి గురిచేశాయి. ఉపనిషత్లు లాంటివి జ్ఞానమార్గాన్ని. బోధించినా, అవి పూర్తి వేదాంత ధోరణిలో ఉండి, అవి అంత సులభంగా అందరికీ అర్థం కాలేదు. సులభంగా, సంగ్రహంగా అర్థమయి అందరికీ మోక్షాన్ని ప్రసాదించే వాటి కోసం ప్రజలు ఎదురు చూశారు. ఇలాంటి పరిస్థితుల్లో బుద్ధుడు మరియు మహావీరుని బోధనలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాయి.

2) సామాజిక పరిస్థితులు: సమాజం నాలుగు కులాలతో విభాజితమైంది. ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు నిబిడీకృతమై ఉన్నారు. చండాలురు, లేదా అంటరానివారిని గురించి, కొన్ని ప్రస్తావనలున్నాయి. సమాజంలో బ్రాహ్మణులు తమ ఆధిక్యతను నెలకొల్పుకున్నారు. వైదిక మతం, కర్మకాండలకు వారు ప్రముఖ కర్తలుగా పరిగణించుకొన్నారు. యాగాలు, కర్మకాండలను నిర్వహించడంతో పాటు, వీరు పాలకులకు ‘పురోహితులు’ లేదా మత సలహాదార్లుగా కూడా పనిచేశారు. నూతన వ్యవసాయిక ఆర్థిక వ్యవస్థ ఫలితంగా ఉద్భవించిన నూతన సామాజిక వర్గాల వల్ల సాంప్రదాయిక సామాజిక విభాగాలు, ఉద్దేశించిన రీతిలో పనిచేయలేదు. మొట్టమొదటగా, పట్టణ ప్రాంతంలో వృద్ధి చెందుతున్న వర్తక వర్గాలు, వారి కోరికలను సాంప్రదాయిక వ్యవస్థలో కోల్పోవల్సి వచ్చింది. పల్లెల్లోనూ, అదే విధంగా పట్టణాల్లోనూ, వైశ్యులు మారుతున్న ఆర్థిక లక్షణాల వల్ల అధికంగా లాభం పొందినప్పటికీ, వీరికి మూడో వర్ణస్థానం కేటాయించడం జరిగింది. పర్యవసానంగా, క్షత్రియులు బ్రాహ్మణుల ఆధిక్యతను ప్రతిఘటించారు. వైశ్యులు తమ సామాజిక హోదా, ఔన్నత్యం కోసం ఆరాటపడసాగారు. స్త్రీలు: స్త్రీ స్థానానికి సంబంధించినంతవరకు, వైదిక యుగంలో ఉన్నత స్థానాన్ని ఆమె అధిష్టించినట్లు కనిపించదు. వారు సర్వదా తమ పురుషులపై ఆధారపడేవారు. అయితే, వారు కుటుంబంలో గౌరవప్రదమైన స్థానాన్ని పొందారు.

3) ఆర్థిక పరిస్థితులు: వ్యవసాయం: వ్యవసాయం ప్రజల, ముఖ్యవృత్తి. అందువల్ల, నాటి భారతీయులు అధిక సంఖ్యలో గ్రామాల్లో నివసించేవారు. స్థానిక సమాజం, సాగునీటి కాలువలను, తూములను ఏర్పాటు చేసేది. కర్షకులు, ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, ఒంటెలు, గాడిదలు, పందులు, కుక్కలు, ఇత్యాది జంతువులపై ఆధారపడేవారు. వరి ముఖ్య ఆహార పంట. వివిధ రకాలైన ధాన్యాలు, చెరకు, పండ్లు, కూరగాయలు, పూలను పండించేవారు.

TS Inter 1st Year History Study Material Chapter 3 ప్రాచీన భారతదేశంలో సామాజిక, మత సంస్కరణ ఉద్యమాలు

గ్రామాల్లో భూమిని కలిగి ఉండడమనే విషయం, సంపద గణనలో ముఖ్యమైన పరిమాణంగా మారింది. బౌద్ధ సాహిత్యంలో అధిక భూభాగానికి యాజమాన్యం వహించిన సమూహాలను, ‘గ్రహపతు’ అని పిలిచేవారు. వీరే ప్రధానంగా కర్షక యాజమాన్యులు. ధనిక గహపతుల అభివృద్ధి, అంతకు పూర్వం నెలకొన్న రక్త సంబంధం, సమానత్వమనే తెగ ఆదర్శాలను విచ్ఛిన్నం చేసింది. అందువల్ల, అనేక ఆర్థిక అసమానతలు తలెత్తాయి.

సుమారు క్రీ.పూ. ఆరో శతాబ్ది మధ్య భాగంలో మగధ రాజ్యం, దాని పరిసర ప్రాంతంలోని ప్రజల ఆర్థిక జీవనం, అంతకు పూర్వం కన్నా, విస్తృతంగా ఇనుమును వాడటం వల్ల, మార్పుకు లోనైంది. ఇనుప పరికరాలను వ్యవసాయంలో ఉపయోగించడం వల్ల, రైతులు అదనపు ఫలసాయాన్ని, మిగులును పొందగలిగారు.

పన్నులు: నాటి ప్రభుత్వానికి ముఖ్య ఆదాయం భూమిశిస్తు నుంచి లభించేది. ‘భాగ’ లేదా రాజు వాటా అనేది, పండించిన పంటలో 1/6వ వంతు ఉండేది. ‘బలి’ అనే పన్ను ద్వారా కూడా, కొంత ఆదాయాన్ని సమీకరించేవారు. తెగ ప్రజల ప్రాణం, ఆస్తిని కాపాడే బాధ్యతను నెరవేర్చడం కోసం, రాజు లేదా ‘రాజన్’ ఆ తెగ సభ్యుల నుంచి విధిగా వసూలు చేసే పన్నే ‘బలి’.

చేతివృత్తులు: చేతివృత్తులు, కళల్లో పనివారి సామర్థ్యం, ప్రత్యేకత కనిపిస్తాయి. రాగి, ఇనుము, రాయి, మట్టితో పనిముట్లు, పాత్రలు తయారయ్యేవి. వివిధ రకాల బట్టలను, నూలు, నార, ఉన్ని, పట్టు, జనుముతో తయారు చేసేవారు. వెదురుపనివారు, కుమ్మరి, రథకారులు, వడ్రంగి, దంతపు పనివారు, మాలాకారులు ఆదిగా గల చేతి వృత్తులవారున్నారు. వీరి ఉనికి, వస్తూత్పత్తిలో పెరుగుతున్న ప్రత్యేకతను మనకు తెలియజేస్తుంది.

వ్యాపారం: మలివేదకాలంలో లోహనాణేల ఉపయోగం, వర్తకానికి ప్రోత్సాహాన్నిచ్చింది. వ్యవసాయోత్పత్తుల పెరుగుదల వర్తక వాణిజ్యాభివృద్ధికి దారితీసింది. దేశీయ, విదేశీయ వ్యాపారం అభివృద్ధి చెందింది. విదేశాలతో వర్తకం, పట్టు, మస్లిన్, కవచాలు, కంబళ్ళు, అలంకార వస్తువులు, పరిమళ ద్రవ్యాలు, దంతం, బంగారం, వెండి ఆభరణాలు, ఇత్యాది వస్తువుల్లో జరిగేది. వర్తకం నగరీకరణను వేగవంతం చేసింది. అనేక పట్టణాలు, నగరాలు వెలిశాయి. వర్తకులు శివారు పన్నును, ఇతర పన్నులను చెల్లించేవారు.

శ్రేణులు: కళాకారులు, చేతివృత్తుల వారు, తరచుగా శ్రేణులుగా ఏర్పడేవారు. తరువాతి కాలపు బౌద్ధ గ్రంథాలు 18 శ్రేణుల ఉనికిని ప్రస్తావించాయి. ప్రతి పట్టణంలో ఒక శ్రేణి ఒక భాగంలో ఏర్పాటు కావడం వల్ల పరిశ్రమల, వృత్తుల స్థానికీకరణకు దారితీసింది. శ్రేణి అధిపతి (జ్యేష్టక Jeshtaka) దాని అధ్యక్షత వహించేవాడు. కొన్ని సమయాల్లో సెట్టిలు’ (Settis) అధ్యక్షత వహించేవారు. ఈ విధంగా పట్టణాల్లో చేతివృత్తులవారు, సెట్టిలు ముఖ్యమైన సామాజిక వర్గాలుగా ఏర్పడటం కనిపిస్తూంది.

నగరాల అభివృద్ధి: వర్తక వ్యాపారాభివృద్ధి, వృత్తిపనివారు, వర్తక, శ్రామిక ప్రజానీకంతో, కేంద్రీకృత నగరాభివృద్ధిలో ఫలించింది. వైశ్యులు సంపదను సమీకరించుకొని, ఉన్నత సామాజిక హోదాను పొందారు. వారు విదేశీ వ్యాపారంలో చక్కని సౌకర్యాలను, ముఖ్యంగా వైదిక మతం అనుమతించని సముద్ర ప్రయాణానికి భిన్నమైన సామాజిక, మతపరమైన అనుమతిని వారు ఆశించారు.

కొత్తగా పరిణతి చెందిన ప్రజల సామాజిక, ఆర్థిక జీవిత లక్షణాలు, వైదిక కర్మకాండల్లో, జంతుబలుల్లో సరిగా ఇమడలేకపోయాయి. అందువల్ల, ఈ పరిణామాలు, సామాజిక, ఆర్థిక మార్పుల ఆవశ్యకతను కల్పించాయి. నగరాల్లో నూతన ధనికులుగా ఏర్పడ్డ వైశ్యులు, పాలనాధికారాన్ని, నూతన వ్యవసాయిక మిగులు నుంచి లాభాన్ని పొందుతున్న క్షత్రియులు, శూద్రులు ఈ మార్పుల పట్ల అధిక ఆసక్తిని చూపారు. పర్యవసానంగా, క్రీ.పూ. ఆరో శతాబ్దిలో ఉద్భవించిన పలు మత బోధకులు, వైదిక మత సూత్రాలకు వ్యతిరేకంగా ప్రబోధిస్తూ, నూతన సామాజిక, ఆర్థిక, మత “పరిస్థితులను ప్రతిబింబించే మతాల ఆవిర్భావానికి కారణభూతులైనారు.

ప్రశ్న 2.
జైనమత సిద్ధాంతాలు వివరించి, భారతీయ సంస్కృతికి వారి సేవలను వివరించండి.
జవాబు.
జైనమతం, బౌద్ధమతం కంటే ప్రాచీనమైనది. జైనమత ప్రబోధకులను తీర్థంకరులు అంటారు. వారు 24 మంది. వారిలో మొదటి తీర్థంకరుడు ఋషభనాథుడు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. 24వ వాడైన మహావీరుడు ఆఖరి తీర్థంకరుడు. మహావీరుడు జైనమత స్థాపకుడు కాదని, ఆ మతాన్ని సంస్కరించి చక్కని రూపాన్ని అందించినవాడని జైనుల విశ్వాసం.

వర్ధమాన మహావీరుడు: వర్ధమాన మహావీరుడు జైనమత 24వ తీర్థంకరుడు. మహావీరుని అసలు పేరు వర్ధమానుడు. అతడు క్రీ.పూ. 540వ సంవత్సరంలో వైశాలి సమీపంలోని కుంద గ్రామంలో జ్ఞాత్రిక క్షత్రియ వంశంలో సిద్ధార్థుడు, త్రిశలకు జన్మించాడు. ఇతని భార్య యశోద, కుమార్తె ప్రియదర్శిని. వర్ధమానుడు 30 ఏళ్ళు నిండకముందే జీవిత సుఖాలను వదిలి, ఇంటి నుంచి నిష్క్రమించి, సత్యాన్వేషణ కోసం బయలుదేరాడు. 12 సంవత్సరాల కఠిన తపస్సు చేసి జ్ఞానోదయాన్ని పొందాడు. పరిపూర్ణ జ్ఞానము పొందిన పిమ్మట ‘జినుడు’ అని, ధైర్యసాహసములతో తపస్సు సాగించుటచేత “మహావీరుడని”, మహాజ్ఞాని అయినందువల్ల “కేవలుడు” అని సమస్త భవబంధములను తెంచుకొనుటచే ‘నిగ్రంథుడ’ ని పిలువబడ్డాడు. మహావీరుడని “జినుడు” (జయించినవాడు) అను బిరుదు నుంచి ఈ మతానికి జైనమతమనే పేరు వచ్చింది. మానవుల మోక్షసాధన కోసం మహావీరుడు పంచవ్రతాలను, త్రిరత్నాలను, సల్లేఖన వ్రతమును బోధించాడు. వీటిని ఆచరించుట ద్వారా మానవులు మోక్షము లేదా కైవల్యావస్థను పొందగలరని బోధించాడు. తన సందేశాన్ని నిర్విరామంగా ప్రచారం చేస్తూ మహావీరుడు తన 72వ ఏట పావా అనే నగరములో హస్తిపాలుడనే రాజు గృహములో క్రీ.పూ. 468లో మరణించాడు.

మహావీరుని బోధనలు:
1) పంచవ్రతాలు: జైనమత 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు నాలుగు సూత్రములను బోధించాడు. అవి: ఎ) జీవహింస చేయరాదు. బి) అసత్యమాడరాదు. సి) దొంగతనము చేయరాదు. డి) ఆస్తిపాస్తులు ఉండరాదు. ఈ నాలుగు సూత్రాలకు లేక వ్రతాలకు 24వ తీర్థంకరుడైన మహావీరుడు బ్రహ్మచర్యము అనే ఐదవ సూత్రాన్ని జోడించాడు. ఈ ఐదు సూత్రాలను పంచవ్రతాలు లేక పంచకళ్యాణాలు అంటారు.

2) త్రిరత్నాలు: పంచవ్రతాలతోపాటు త్రిరత్నాలను కూడా మోక్ష సాధన కోసం పాటించాలని మహావీరుడు ప్రబోధించాడు. అవి: ఎ) సమ్యక్ దర్శనం లేక సరియైన విశ్వాసం. బి) సమ్యక్ జ్ఞానం లేక సరియైన జ్ఞానం. సి) సమ్యక్ చరిత్ర లేక సరియైన క్రియ. తీర్థంకరుల బోధనలకై శ్రద్ధను కలిగివుండటమే సమ్యక్ దర్శనము. వాటిలో సత్యాన్ని గ్రహించటమే సమ్యక్ జ్ఞానము. వాటిని పాటించడమే సమ్యక్ చరిత్ర. ఈ మూడింటిని త్రిరత్నాలు అంటారు. వీటిని అనుసరించుట ద్వారా దుఃఖలేశం లేని మోక్షం లేదా కైవల్యావస్థను మానవుడు పొందగలుగుతాడు.

3) సల్లేఖనా వ్రతం: పార్శ్వనాథుడు చేతన, అచేతన వస్తువులన్నింటిలో జీవముందని బోధించాడు. ఆత్మ శరీరమంతటా వ్యాపించి ఉంటుందని తపస్సు మాత్రమే కర్మ బంధాన్ని తొలగిస్తుందని చెప్పాడు. ప్రాపంచిక బంధాల నుంచి, కర్మ నుంచి విముక్తిని సాధించటమే మోక్షమని ఆయన ప్రవచించాడు. కర్మచేయటం ద్వారా కర్మఫలాన్ని అనుభవించటం కోసం పునర్జన్మను ఎత్తవలసి వస్తుందని, కనుక కర్మను నాశనం చేయటం ద్వారానే మోక్షప్రాప్తిని పొందగలమని ఆయన బోధించాడు. కనుక ఉపవాసములచేత శరీరమును శుష్కింపచేసుకొని ప్రాణత్యాగము . చేయటం ద్వారా కర్మను అణచివేయవచ్చునని ఆయన బోధించాడు. ఈ ప్రక్రియనే “సల్లేఖనా వ్రతము” అంటారు.

4) కైవల్యం: జైనమతం యొక్క అంతిమ లక్ష్యం కైవల్యం లేక మోక్షము. పంచవ్రతాలను, త్రిరత్నాలను, సల్లేఖనా వ్రతమును ఆచరించుట ద్వారా మోక్షాన్ని సాధించవచ్చునని ఆయన ప్రవచించాడు. దుఃఖరహితము, అనంత సౌఖ్యప్రదము అయినదే మోక్షము. దీనినే కైవల్యావస్థ అంటారు. కైవల్యావస్థ పొందుట ద్వారా మానవుడు కర్మ, పునర్జన్మ వలయము నుండి శాశ్వత విముక్తిని పొందగలుగుతాడు.

5) ఇతర సూత్రాలు: జైనమతం కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతుంది. దేవుడున్నాడా లేడా అనే విషయానికి ఈ మతంలో ప్రాముఖ్యత లేదు. మోక్షాన్ని పొందటం, ఆత్మశుద్ధి, భవబంధ విముక్తి అనే వైదిక మత సూత్రాలపై ఆధారపడివుంది. వర్థమాన మహావీరుడు వర్ణవ్యవస్థను ఖండించలేదు. నాటి సామాజిక అసమానతలకు ఆలవాలమైన వర్ణవ్యవస్థను వ్యతిరేకించకుండా పూర్వజన్మ సుకృతాన్నిబట్టి మానవుడు అగ్ర లేక అధమ వర్ణాల్లో జన్మిస్తాడని అభిప్రాయపడ్డాడు. జైనమతం జంతు బలులను, బ్రాహ్మణ ఆధిక్యతను, వేదాల ఆధిక్యతను నిరసించినది.

జైనమత వ్యాప్తి: జైనమత ప్రచారం కోసం మహావీరుడు జైన సంఘాన్ని స్థాపించాడు. స్త్రీ, పురుషులిద్దరు ఈ సంఘంలో సభ్యులు కావచ్చు. ఈ సంఘాలలో జైన భిక్షువులే కాక, తమ మత సూత్రాల ప్రకారం జీవితం గడుపుతూ విరాళాలు, కానుకల ద్వారా ఆ సంస్థలను పోషించే ఉపాసకులు కూడా ఉండేవారు. మహావీరుడు సంవత్సరంలో 8 నెలలు పర్యటన చేస్తూ తన బోధనలను ప్రచారం చేసేవాడు. జైనమతానికి రాజాదరణ కూడా లభించింది. మగధ పాలకులైన హర్యంక, నందవంశ రాజులు, చంద్రగుప్త మౌర్యుడు, కడపటి మౌర్యరాజైన సంప్రతి జైనమతాన్ని పోషించారు. భారతదేశంలో జైనమతం రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలలో బాగా ప్రచారంలో వుంది.

TS Inter 1st Year History Study Material Chapter 3 ప్రాచీన భారతదేశంలో సామాజిక, మత సంస్కరణ ఉద్యమాలు

ప్రశ్న 3.
బౌద్ధమత సూత్రాలు, భారతీయ సంస్కృతికి వారి సేవలను చర్చించండి.
జవాబు.
క్రీ.పూ. భారతదేశంలో జనించిన అనేక మతాలలో బౌద్ధమతం ఒకటి. దీని స్థాపకుడు గౌతమబుద్ధుడు.

గౌతమబుద్ధుని జీవితం: గౌతమబుద్ధుని అసలు పేరు సిద్దార్థుడు. ఇతడు క్రీ.పూ. 563వ సం॥లో ‘శాక్య’ వంశమునకు చెందిన శుద్ధోధనుడు, మాయాదేవీలకు లుంబినీవనమున జన్మించాడు. చిన్నతనమునే తల్లిని కోల్పోయి సవతి తల్లి ప్రజాపతి గౌతమిచే పెంచబడి ‘గౌతముడు’ అని పిలువబడ్డాడు. ఇతనికి ‘యశోధర’ అను రాకుమార్తెతో
వివాహం జరిగింది. వారి కుమారుడు ‘రాహులుడు’.

మహా పరిత్యాగము: సిద్ధార్థుడు తన 29వ ఏట ఒక ముదుసలిని, రోగిని, శవాన్ని, సన్యాసిని చూచి వైరాగ్యానికి లోనై సకల సంపదలను, భోగభాగ్యాలను, భార్యాబిడ్డలను వదిలి ఇల్లు విడిచి వెళ్ళాడు. ఈ సంఘటనతో అతని మనస్సు వికలమైంది. ప్రపంచమంతా దుఃఖమయమని, జీవితము అశాశ్వతమని గ్రహించి బవబంధములను తెంచుకొని. అడవులకు వెళ్ళి సన్యసించాడు. ఈ సంఘటననే ‘మహా పరిత్యాగము’ లేక ‘మహాభినిష్క్రమణము’ అంటారు.

జ్ఞానోదయమును పొందుట సన్యసించిన పిమ్మట సిద్ధార్థుడు సత్యాన్వేషణకై గయను చేరి అచ్చట ఒక అశ్వత్థ వృక్షము క్రింద 40 రోజులు ధ్యానము చేసి జ్ఞానమును పొందాడు. ఈ సంఘటనకే సంబోధి అని పేరు. అప్పటి – నుండి సిద్ధార్థుడు బుద్ధుడు అని పిలువబడినాడు. బుద్ధుడు అనగా జ్ఞానము పొందినవాడు అని అర్థము. బుద్ధుని శాక్యముని అని, తథాగతుడు అని పిలుస్తారు. నాటి నుండి అశ్వత్థ వృక్షము బోధి వృక్షముగాను, గయ బుద్ధగయగాను ప్రసిద్ధి చెందాయి.

ధర్మచక్ర పరివర్తనము: బుద్ధుడు గయ నుండి సారనాథ్ చేరి సమీపమున గల జింకల తోటలో తన పూర్వ సహవాసులైన బ్రాహ్మణులకు మొదటిసారిగా తాను ఆర్జించిన జ్ఞానాన్ని ఉపదేశించాడు. ఈ సంఘటననే ధర్మచక్ర పరివర్తనము అంటారు. అప్పటి నుండి అనేక సంవత్సరములు బుద్ధుడు తన బోధనలను ప్రచారం చేశాడు. తన శిష్యులలో ప్రముఖులైన వారిని సంఘంలో ఏర్పరచాడు.
నిర్వాణం: విస్తృతంగా బౌద్ధమతాన్ని ఉత్తరాపథమంతటా ప్రచారం చేసి బుద్ధుడు తన 80వ ఏట మల్ల రాజధానియైన కుశి నగరమున క్రీ.పూ. 483లో నిర్వాణం పొందాడు.

బుద్ధుని బోధనలు: బుద్ధుని బోధనల ప్రకారం మానవ జీవితం కార్యకారణ సంబంధంతో ముడిపడి ఉన్నది. మానవుడు చేసిన కర్మఫలము వలననే ఈ శరీరము మరల మరల జన్మనెత్తవలసి వస్తున్నది. కర్మ ఆచరణకు కోర్కెలే మూలము. అజ్ఞానము వలన కోర్కెలు జనించుచున్నాయి. కోర్కెల వలన మానవుడు కర్మలు ఆచరిస్తాడు. ఈ కర్మ ఫలితమే పునర్జన్మ. పునర్జన్మలేని సుఖమైన, ప్రశాంతమైన జీవనమే నిర్వాణము అని బుద్ధుడు బోధించాడు. నిర్వాణ సాధనకు మానవుడు ఆర్య సత్యములను గ్రహించి అష్టాంగ మార్గమును, దశసూత్ర నీతిని పాటించవలెను.

ఆర్య సత్యములు: గౌతమ బుద్ధుడు తన దివ్య పరిజ్ఞానము వలన నాలుగు ప్రధానమైన సత్యములను గ్రహించాడు. వీటినే ఆర్య సత్యములు అంటారు. అవి:

  1. ప్రపంచమంతా దుఃఖమయము.
  2. దుఃఖమునకు కారణము కోర్కెలు.
  3. దుఃఖమును అంతము చేయుటకు కోర్కెలను నిరోధించవలెను.
  4. కోర్కెలను నిరోధించుటకు అష్టాంగమార్గమును అవలంబించవలెను.

అష్టాంగ మార్గము: నిర్వాణమును పొందుటకు మానవుడు తన నిత్య జీవితంలో ఈ అష్టాంగ మార్గమును అనుసరించిన చాలని బుద్ధుడు బోధించాడు. అవి:

  1. సరియైన విశ్వాసము
  2. సరియైన జ్ఞానము.
  3. సరియైన వాక్కు
  4. సరియైన క్రియ
  5. సరియైన జీవనము
  6. సరియైన ప్రయత్నం
  7. సరియైన ఆలోచన
  8. సరియైన ధ్యానము.

అష్టాంగ మార్గము ద్వారా ప్రతి వ్యక్తి శీలసంపదను పెంపొందించుకొని జ్ఞాని కాగలడు. ఈ మార్గము అందరికీ అందుబాటులో ఉండుటచే దీనిని మధ్యేమార్గం అని అంటారు.
ఈ దశసూత్ర నీతి: ఆర్యసత్యములు, అష్టాంగ మార్గములతోపాటు బుద్ధుడు పది అంశములు గల దశసూత్ర నీతిని ప్రబోధించాడు. ఈ సూత్రాలు:

  1. జీవహింస చేయరాదు.
  2. అసత్యమాడరాదు.
  3. దొంగతనము చేయరాదు.
  4. ఆస్తిపాస్తులు సమకూర్చుకొనరాదు.
  5. బ్రహ్మచర్యను పాటించవలెను.
  6. మత్తు పదార్ధములు సేవించరాదు.
  7. పరుష వాక్యములు వాడరాదు.
  8. ఇతరుల ఆస్తులను కోరరాదు.
  9. అవినీతి పనులు చేయరాదు.
  10. విలాసాలను విడనాడాలి.

నిర్వాణము: ఆర్యసత్యములను గ్రహించి, అష్టాంగ మార్గమును, దశసూత్ర నీతిని ఆదరించటం వలన మానవుడు మోక్షమును పొందుటకు అర్హుడవుతాడు. మోక్షమనగా పునర్జన్మలేని జన్మరాహిత్యము. దీనినే బుద్ధుడు నిర్వాణంగా పేర్కొన్నాడు. నిర్వాణ సాధనే ప్రతి వ్యక్తి ధ్యేయం కావలెను అని బుద్ధుడు బోధించాడు.

బౌద్ధమతతత్వం: బుద్ధుడు భగవంతుని ఉనికిని గురించి, ఆత్మను గురించి మౌనం వహించాడు. హిందూ మతమందలి కర్మ, పునర్జన్మ, మోక్ష సిద్ధాంతాలను అంగీకరించాడు. మహావీరుని వలె బుద్ధుడు కూడా యజ్ఞ యాగాదులను, జంతుబలులను, బ్రాహ్మణుల ఆధికత్యను ఖండించాడు. వేదములను ప్రామాణిక గ్రంథములుగా బుద్ధుడు అంగీకరించాడు.

ముగింపు: ప్రపంచమునకు శాంతి సందేశమునందించుటకు అవతరించిన మహాపురుషులలో సుప్రసిద్ధుడు గౌతమ బుద్ధుడు. కామ,క్రోధములతో, హింసాత్మక చర్యలతో కొట్టుమిట్టాడుతున్న మానవకోటిని ధర్మం, అహింస, కరుణ, మానవత అనే మహోన్నత ఆశయాలతో తీర్చిదిద్దుటకు అవతరించిన పుణ్య పురుషుడు. అందువల్లనే ఆసియా జ్యోతియని, ప్రపంచ జ్యోతియని శ్లాఘించబడ్డాడు.

TS Inter 1st Year History Study Material Chapter 3 ప్రాచీన భారతదేశంలో సామాజిక, మత సంస్కరణ ఉద్యమాలు

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జైన ఫిలాసఫీ
జవాబు.
జైనులు వేదాల యొక్క అమోఘత్వాన్ని లేదా అధికారాన్ని ఖండించారు. ఎటువంటి కర్మ కాండలకు ప్రాముఖ్యతను ఇవ్వలేదు. వీటికి తోడు, చేతన, అచేతన వస్తువులన్నింటిలో జీవముందని వారు భావించారు. ఆత్మ, శరీరమంతటా వ్యాపించి ఉంటుందనీ, తపస్సు మాత్రమే కర్మబంధాన్ని తొలగిస్తుందని చెప్పారు. తపస్సుతో సంచిత కర్మ నాశనమౌతుంది. జైనమతంలో అహింసా దీక్షను చాలా కఠినంగా పాటించాల్సి వచ్చింది. తెలిసి చేసినా, తెలియక చేసినా హింస క్షమార్హం కాదంటారు. జైనులు సృష్టికర్త భావనను, దేవుడు ఉనికిని తోసిపుచ్చారు. వ్యక్తులు సంచిత కర్మను తొలగించుకొనేందుకు, మోక్షాన్ని పొందేందుకు త్రిరత్నాలను ఆదరించాలి. సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరిత్ర అనేవి త్రిరత్నాలు. తీర్థంకరుల బోధనల్లోని శ్రద్ధే సమ్యక్ దర్శనం. వాటిలోని సత్యాన్ని గ్రహించటమే, సమ్యక్ జ్ఞానం. వాటిని పాటించడమే సమ్యక్ చరిత్ర.

జైన మతం కొంతవరకు హిందూ మతానికి సన్నిహితంగా ఉంది. ఈ మతంలో దేవుడున్నాడా లేడా అనే విషయానికి ప్రాముఖ్యత లేదు. మోక్షాన్ని పొందటం, ఆత్మశుద్ధి, భవబంధ విముక్తి అనే వైదిక మత సూత్రాలపై, జైన మతం ఆధారపడింది. అయితే, ఈ మతంలో గమనించదగ్గ విషయం మహావీరుడు వర్ణ వ్యవస్థను ఖండించకపోవటం, నాటి సామాజిక అసమానతలకు ఆలవాలమైన దీన్ని వ్యతిరేకించకుండా, పూర్వజన్మ సుకృతాన్ని బట్టి, మానవుడు అగ్ర, అధమ వర్గాల్లో జన్మిస్తాడని అభిప్రాయపడ్డాడు.

ప్రశ్న 2.
బుద్ధుని బోధనలు.
జవాబు.
బుద్ధుడు స్థాపించిన మతం ఆధ్మాత్మిక సాధనకు సంపూర్ణమైనది. బౌద్ధమతం ప్రకారం ఈ ప్రపంచం కార్యకారణ సంబంధమైనది. అనగా ప్రతి సంఘటన ఏదో ఒక కారణము వలన జరుగుచున్నది. ఇట్టి కార్యకార్య సంబంధమైన ప్రపంచమే సత్యమని భావించినపుడు మానవునికి జీవితముపై కల్గు ‘తృష్ణ’ (కోరిక) పునర్జన్మకు కారణమవుతున్నది. అసలు మానవజన్మే ‘దుఃఖ భరితముగాను మౌలికంగా కోర్కెలే (అజ్ఞానం) దుఃఖానికి కారణమవుతున్నాయి. కాబట్టి దుఃఖమును అంతము చేయవలెనన్న ఈ ప్రపంచం అశాశ్వతమని గ్రహించాలి. ఈ ప్రపంచం అశాశ్వతమని తెలుసుకొనేందుకు బుద్ధుడు నాలుగు ఆర్య సత్యాలను ప్రబోధించాడు. అవి:

  1. ప్రపంచం దుఃఖమయం (దుఃఖ)
  2. దుఃఖానికి తృష్ణ (కోరిక) కారణం (సముదాయ)
  3. కోరికను నిరోధిస్తే, దుఃఖం నశిస్తుంది (నిరోధ)
  4. దానికి మార్గం ఉంది. (అష్టాంగ మార్గం)

అజ్ఞానం దుఃఖానికి కారణమని బుద్ధుడు ప్రబోధించాడు. అజ్ఞాన నిర్మూలనకు ఎనిమిది నీతి సూత్రాలను ప్రతిపాదించాడు. వీటికే ‘అష్టాంగమార్గ’ మని పేరు. అవి:

  1. సరైన వాక్కు
  2. సరైన క్రియ
  3. సరైన జీవనం
  4. సరైన శ్రమ
  5. సరైన ఆలోచన
  6. సరైన ధ్యానం
  7. సరైన నిశ్చయం
  8. సరైన దృష్టి

అష్టాంగ మార్గాన్ని అనుసరిస్తే, అవిద్య (అంటే పునర్జన్మకు కారణం) నశిస్తుంది. అప్పుడు ఆ వ్యక్తికి నిర్మాణం సిద్ధిస్తుంది. నిర్యాణం అంటే అనంతం, అమృతం అయిన మానసిక ప్రశాంత స్థితి.

ప్రశ్న 3.
బౌద్ధ సంగీతులు.
జవాబు.
బుద్ధుని బోధనలు సంకలనం చేయుటకు మొత్తం నాలుగు సమావేశాలు (సంగీతి) జరిగాయి.
మొదటి బౌద్ధ సంగీతి రాజగృహ ప్రాంతంలో ‘మహాకశ్యపుడి ‘ అధ్యక్షతన క్రీ.పూ. 483లో జరిగింది. ఇందులో బుద్ధుని బోధనలను గ్రంథస్థం చేసి స్థిరీకరించారు. ఆనంద, ఉపాలి చేత సుత్త, వినయ పీటికలు సంకలనం చేయబడ్డాయి. రెండవ బౌద్ధ సంగీతి వైశాలీ నగరంలో ‘సబకమి’ అధ్యక్షతన క్రీ.పూ. 383న జరిగింది. సంప్రదాయ, సంప్రదాయేతర సన్యాసుల మధ్య విభేదాలను పరిష్కరించడం ప్రధానోద్దేశ్యం. ఈ సంగీతిలో బౌద్ధులు ధీరవాదులు, స్థవిరవాదులుగా విడిపోయారు.

మూడవ బౌద్ధ సంగీతి పాటలీపుత్ర నగరంలో మొగ్గలిపుత్రతిస్స అధ్యక్షతన క్రీ.పూ. 250లో జరిగింది. ఈ సంగీతిలో అభిదమ్మ పీటిక సంకలనం చేయబడింది. నాలుగవ బౌద్ధ సంగీతి కాశ్మీర్లో, వసుమిత్రుడి అధ్యక్షతన క్రీ.శ. 100వ సంవత్సరంలో జరిగింది. ఈ సంగీతిలో బౌద్ధులు మహాయాన, హీనయాన వాదులుగా విడిపోయారు.

ప్రశ్న 4.
జైన బౌద్ధ మతాల మధ్య భేదాలు.
జవాబు.
జైనమతం

  1. మోక్షాన్ని చేరుకోవడంలో జైన మతం ఆచరణ సాధ్యం కాని విధంగా కఠినంగా చెప్పింది.
  2. జైన మతం సాధారణ వ్యక్తులకు ప్రాధాన్యత ఇచ్చింది.
  3. జైనమతం భారతదేశంలోనే ప్రచారం చేసుకొంది.
  4. జైన మతం, వైదిక మతంలో భౌతిక తాత్విక వాదానికి ప్రాధాన్యత ఇచ్చింది.

బౌద్ధమతం

  1. బౌద్ధమతం ఆచరణ యోగ్యంగా చెప్పింది.
  2. బౌద్ధమతం సంఘానికి, సన్యాసులకు ప్రాధాన్యత. ఇచ్చింది.
  3. బౌద్ధమతం విదేశాలకు వెళ్ళి భారతదేశంలో మాయమైంది.
  4. బౌద్ధమతం అటువంటి చర్యలను నిరసించింది.

TS Inter 1st Year History Study Material Chapter 3 ప్రాచీన భారతదేశంలో సామాజిక, మత సంస్కరణ ఉద్యమాలు

ప్రశ్న 5.
అజీవకులు.
జవాబు.
మక్కలి గోసలి దీని ప్రచారకుడు. ఇతడు నగ్నంగా తిరుగుతూ, తాగుతూ ఉండేవాడు. ఇతని విపరీత ధోరణి వల్ల ప్రజలు ఎక్కువగా చేరలేదు. ‘ఏదీ మానవుడి చేతిలో లేదు జరగాల్సింది జరిగి తీరుతుంది’ అని ఈ శాఖ వారి నమ్మకం. ఇతడు ఆత్మ ముందే నిర్ణయించబడి పునర్జన్మలలో చేరుతూ ఉంటుంది అని పేర్కొన్నాడు. వీరు ఒక సన్యాస వర్గంగా ఏర్పడి తమ మత ప్రచారం చేశారు. మక్కలి గోసలి గురువు పురాణ కశ్యపుడు. గోసలి పుట్టుకతో బానిస తరువాత కాలంలో బోధకుడయ్యాడు. ఇతడు హిందూ మతానికి చెందిన దేన్నీ చివరకు కర్మ సిద్ధాంతాన్ని కూడా ఒప్పుకోలేదు. అజితకేశకంబలి, పకుద కాత్యాయన ఈ మతశాఖలోని ఇతర బోధకులు.

ప్రశ్న 6.
చార్వాకులు.
జవాబు.
దేవతల గురువైన బృహస్పతి ఈ మతశాఖ స్థాపకుడుగా చెప్తారు. పాళి, సంస్కృత భాషల్లో ‘లోక’ అంటే ప్రపంచం, -ప్రజలు. లోకాయతులు భౌతిక వాదులు. తీవ్ర నాస్తికులు. వీరు ‘ఆత్మ’ సిద్ధాంతాన్ని ‘ఖండించారు. ప్రపంచంలోని ప్రతిదాని మీద వీరికి నమ్మకం ఉంటుంది. వీరి శాఖలో ప్రధాన ప్రచారకుడు చార్వాకుడు. అందువల్ల ఈ శాఖకు చార్వాక శాఖ అనే పేరు వచ్చింది. లోకాయతులు చెప్పిన వాస్తవిక భౌతికవాదమే చివరకు సామాన్య విజ్ఞానశాస్త్ర ఆవిర్భావానికి దారితీసింది.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
తీర్థంకరులు.
జవాబు.
జైనమత ప్రబోధకులను తీర్థంకరులంటారు. వీరు మొత్తం 24 మంది. మొదటి తీర్థంకరుడు ఋషభనాథుడు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు, 24వ తీర్థంకరుడు వర్థమాన మహావీరుడు.

ప్రశ్న 2.
త్రిరత్నాలు.
జవాబు.
‘సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరిత్ర’ అనేవి త్రిరత్నాలు. తీర్థంకరుల బోధనలోని శ్రద్ధే సమ్యక్ దర్శనం. వాటిలోని సత్యాన్ని గ్రహించడమే సమ్యక్ జ్ఞానం’. వాటిని పాటించటమే సమ్యక్ చరిత్ర.

ప్రశ్న 3.
సల్లేఖన వ్రతం.
జవాబు.
జైన మత ఆచారాలలో సల్లేఖన ఒకటి. కైవల్యాన్ని పొందటానికి స్వచ్ఛందంగా ఘన, ద్రవ పదార్థాలను క్రమేపి తగ్గించుకుంటూ చివరకు ఏమీ తీసుకోకుండా శరీరాన్ని త్యజించడం సల్లేఖన వ్రతం. ఈ విధంగా చేస్తూ శారీరక, మానసిక క్రియల నుంచి విముక్తి పొంది మోక్షాన్ని పొందవచ్చు అనేది వారి విశ్వాసం. మౌర్య చంద్రగుప్తుడు సల్లేఖన వ్రతం ఆదరించాడు.

ప్రశ్న 4.
సంబోధి.
జవాబు.
సన్యాసిగా మారిన తరువాత సిద్ధార్థుడు బ్రాహ్మణ గురువైన రుద్రాలి రామపుత్ర వద్ద సకల శాస్త్రాలు, వేదాంతం నేర్చుకొన్నాడు. అయితే ఇవి అతని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయాయి. తరువాత రాజగృహకు చేరుకొని కఠిన తపస్సు ఆచరించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ విధంగా ఆరు సంవత్సరాల పాటు సంచార జీవితం గడుపుతూ, చివరకు గయ వద్ద అశ్వత్థ వృక్షఛాయలో 40 రోజులు ధ్యానం చేశాక, అతనికి జ్ఞానోదయమైంది. దీన్నే సంబోధి అంటారు. గౌతముడు బుద్ధుడయ్యాడు.

ప్రశ్న 5.
ఆర్య సత్యాలు.
జవాబు.

  1. ప్రపంచం దుఃఖమయం (దుఃఖ)
  2. దుఃఖానికి తృష్ణ (కోరిక) కారణం (సముదాయ)
  3. కోరికను నిరోధిస్తే, దుఃఖం నశిస్తుంది (నిరోధ)
  4. దానికి మార్గం ఉంది (అష్టాంగ మార్గ).

TS Inter 1st Year History Study Material Chapter 3 ప్రాచీన భారతదేశంలో సామాజిక, మత సంస్కరణ ఉద్యమాలు

ప్రశ్న 6.
అష్టాంగ మార్గం.
జవాబు.
నిర్వాణము పొందడానికి మానవుడు తన నిత్య జీవితంలో ఈ అష్టాంగ మార్గాన్ని అనుసరించాలని బుద్ధుడు బోధించాడు.
అవి:

  1. సరైన విశ్వాసము
  2. సరైన జ్ఞానము
  3. సరైన వాక్కు
  4. సరైన క్రియ
  5. సరైన జీవనము
  6. సరైన ప్రయత్నం
  7. సరైన ఆలోచన
  8. సరైన ధ్యానం

అష్టాంగ మార్గం ద్వారా ప్రతి వ్యక్తి శీల సంపదను పెంపొందించుకొని జ్ఞాని కాగలడు. ఈ మార్గం అందరికీ అందుబాటులో ఉండుటచే దీనిని మధ్యేమార్గం అని అంటారు.

ప్రశ్న 7.
త్రిపీటకాలు.
జవాబు.
బుద్ధుని కాలం నుంచి రూపుదిద్దుకొన్న అసలు బౌద్ధసాహిత్యము – త్రిపీటకాలు, ఇవి పాళీ భాషలో రచించబడినది. సుత్త పీటకం – దీంట్లో బుద్ధుని బోధనలు ఉంటాయి. (ఆనందుడు రచించాడు)
వినయ పీటకం – దీంట్లో సంఘ నిర్మాణము, నియమ నిబంధనలు ఉంటాయి. (ఉపాలి రచించాడు) అభిదమ్మ పీటకం – దీంట్లో అధి భౌతికత, మనోవిజ్ఞాన శాస్త్రం (మొగలి పుత్త తిస్స).

TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material 2nd Poem భగీరథ ప్రయత్నం Textbook Questions and Answers.

TS Inter 2nd Year Telugu Study Material 2nd Poem భగీరథ ప్రయత్నం

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
‘భగీరథ ప్రయత్నం’ పాఠ్య సారాంశం రాయండి.
జవాబు:
సమస్త భూమండలాన్ని పరిపాలిస్తున్న కోసలరాజు భగీరథుడు. తన పూర్వీకులైన సగర మహారాజు పుత్రులు ఏవిధంగా కపిల మహర్షి కోపానికి భస్మం అయిన తీరును మంత్రుల ద్వారా తెలుసుకున్నాడు. వారికి మోక్షం కలిగించాలని నిశ్చయించుకున్నాడు. భగీరథునికి పుత్ర సంతానం లేని కారణంగా తన రాజ్య భారాన్ని మంత్రులకు అప్పగించి, గోకర్ణం వెళ్లి, అక్కడ వేయి సంవత్సరాలు గొప్ప తపస్సు చేశాడు.

ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ఏం వరం కావాలో కోరుకో అంటే భగీరథుడు సంతోషించి, సాగరుల భస్మరాశులపై దేవనదీ నీటిని ప్రవహింప చేయమని మొదటి వరంగా, తన వంశాన్ని ఉద్ధరించే ఒక కుమారున్ని అనుగ్రహించమని రెండవ వరంగా కోరాడు.

అలా భగీరథుడు కోరుకోగానే బ్రహ్మదేవుడు తేజస్సు కల కుమారుడు నీకు జన్మిస్తాడు. కానీ దివ్యలోకాలలో ప్రవహించే నది భూమిపై పడితే భూమండలం భరించలేదు. కావున శివున్ని మెప్పిస్తే దేవనదిని ఆయన భరిస్తాడు అని చెప్పి బ్రహ్మ అదృశ్యం అయ్యాడు. భక్తితో కాలి బొటన వేలును మాత్రమే భూమిపై మోపి, తన హృదయాన్ని పద్మంగా మార్చుకొని శంకరుని గూర్చి కఠినమైన తపస్సు చేశాడు. ఆరాజు తపస్సుకు మెచ్చిన శివుడు దేవలోకంలోని నీటి ప్రవాహాన్ని నా తలపై భరిస్తాను.

అని చెప్పగా భగీరథుడు విజయం సాధించానని సంతోషించాడు. శివుడు ఇచ్చిన మాటకు కోపగించిన గంగ తన ప్రవాహ వేగంతో శివున్ని పాతాళానికి తొక్కి వేస్తానని భావించింది. గంగాదేవి గర్వానికి అత్యంత కోప స్వభావుడైన శివుడు ఆమె గర్వాన్ని తొలగించాలని మనస్సులో అనుకున్నాడు.

దేవలోకంలో ప్రవహించే గంగానది సహింపరాని వేగంతో, మూడులోకాలకు భయాన్ని కలిగించే విధంగా శబ్దం చేస్తూ హిమాలయ పర్వతంలాగా ప్రకాశిస్తున్న శివుని తలపై పడింది. ఆ శివుని జడలనే అడవిలో ఎన్నో సంవత్సరాలు మబ్బులలో కదులుతున్న మెరుపులాగా తిరుగుతూ ఉండి పోయింది. దేవతలందరూ శంకరుని వద్దకు వచ్చి, నీ గొప్ప మహిమ తెలియక దేవనది అయిన గంగ ప్రదర్శించిన గర్వము నీ మాయచేత నశించింది. నిజభక్తుడైన భగీరథునిపై గల కరుణతో అయినా దేవనదిని విడుదల చేయవలెను. ఈ గంగా జలముతో సగరపుత్రుల ప్రేతాత్మలు శాంతిని పొందుతాయి. మానవ లోకానికి, పాతాళ లోకానికి గొప్పతనము కలుగుతుంది. అని దేవతలు వేడుకొనగా శివుడు పరమ సంతోషంతో ఆ గంగానదిని సముద్రంలోకి వదిలాడు.

శివుని జడలనుండి గంగానది ఏడు పాయలుగా ప్రవహించింది. భాసురహ్లాదినీ, పావనీ, నందినీ అనే మూడు పేర్లు గల మహానదులు ఇంద్రుడు పాలించే తూర్పు వైపుకు వెళ్ళాయి. సీతా, సుచక్షు, సింధు అనే మూడు పేర్లు గల ప్రవాహాలు పశ్చిమ దిశకు వెళ్ళాయి. ఏడవదైన ఒక ప్రవాహం భగీరథుని వద్దకు బయలుదేరింది. అలా గంగానది తనవెంట రావడం గమనించిన భగీరథుడు గొప్ప రథం ఎక్కి కదిలాడు.

అనేక ప్రదేశాలలో నివసించే ప్రజలు ఆనందంగా దేవనదీ జలాలలో స్నానాలు చేశారు. వారంతా భయాన్ని కలిగించే ప్రేత స్వభావాన్ని వదిలి శాశ్వతమైన వైభవాన్ని కలిగించే స్వర్గానికి చేరుకున్నారు. శివుని శరీరాన్ని తాకి మరింత పవిత్రంగా మారిన దేవనదీ జలములు అనుకుంటూ ఇంద్రుడు మొదలైన దేవతలు, యక్షులు, గంధర్వులు, మునుల సమూహాలు అనేకసార్లు ఆనదిలో స్నానం చేశారు.

జహ్నువు అనే మహారాజు యజ్ఞం చేస్తుండగా గంగానది అతని యాగశాలను ముంచి వేసింది. దానికి కోపించిన జహ్నువు సముద్రాన్ని మింగిన అగస్త్యుని లాగా ఆనదిని మింగినాడు. దేవతలందరూ ఆశ్చర్య చకితులై రాజర్షులలో శ్రేష్ఠుడైన జహ్నువుతో ఇలా అన్నారు. ఓ మహానుభావా నీ తపస్సు అద్భుతము. నీ మహిమతో సముద్రాన్ని తాగిన అగస్త్యున్ని మరిపింప చేశావు. గంగాదేవి గర్వం అణిగింది. ఇకపై ఈ భూమిపై గంగ నీకూతురుగా గుర్తించబడుతుంది. కావున నీవు గంగను విడువవలెను. అనగానే జహ్ను మహర్షి తన చెవుల నుండి గంగను వదిలిపెట్టాడు. ఆ రోజునుండి జహ్ను మహర్షి కూతురు కావున జాహ్నవి అనే పేరుతో గంగానది భూమిపై ప్రవహించింది.

భగీరథుని రథం వెంబడి సముద్రానికి వెళ్ళింది. ఎండిపోయిన సముద్రంలో, సాగరులు తవ్విన రంధ్రం ద్వారా, గంగ తనవెంట రాగ, భగీరథుడు పాతాళానికి వెళ్లి, సగరపుత్రుల బూడిద కుప్పలను దీనంగా చూశాడు. ఆ బూడిదకుప్పలు తడిసే విధంగా గంగ ప్రవహించింది. కావున వారు పాపములు పోయినవారై, పట్టరాని ఆనందంతో భగీరథుడు చూస్తుండగా గొప్పదైన స్వర్గానికి చేరుకున్నారు.

బ్రహ్మ దేవతలందరితో కలిసి వెళ్ళి భగీరథునితో “భూమిపై ఎప్పటివరకు ఈ సముద్రం ఉంటుందో, అస్నటి వరకు సగర పుత్రులు స్వర్గంలో నివసిస్తారు. నీవు కూడా అదేవిధంగా ఆగొప్ప లోకంలో ఉంటావు. గంగానది ఈ భూమిపై జహ్ను మహర్షి కూతురు కాబట్టి జాహ్నవి అని, నీ కూతురు కాబట్టి భాగీరథి అనే పేర్లతో ప్రవహిస్తుందని అన్నాడు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం

ప్రశ్న 2.
‘గంగా ప్రవాహం’ ఎలా కొనసాగిందో తెలుపండి.
జవాబు:
భగీరథుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మను, శివున్ని ప్రసన్నం చేసుకున్నాడు. గంగను తన తలపై భరిస్తానని శివుడు ఇచ్చిన మాట గంగకు కోపం తెప్పించింది. తన ప్రవాహ వేగంతో శివున్ని పాతాళానికి తొక్కి వేస్తానని గంగ భావించింది. గంగ గర్వాన్ని తొలగించాలని శివుడు అనుకున్నాడు. ఆ సమయంలో దేవలోకంలో ప్రవహించే గంగానది సహింపరాని వేగంతో, గెలవాలనే కోరికతో, పెద్ద శబ్దంచేస్తూ, మూడులోకాలకు భయాన్ని కలిగించే విధంగా మ్రోగుతూ హిమాలయ పర్వతంలాగా ప్రకాశిస్తున్న శివుని తలపై పడింది.

ఈ విధంగా శివుని తలపై పడి శివుని జడలనే అడవిలో ఎన్నో సంవత్సరాలు మబ్బులలో కదులుతున్న మెరుపులాగా తిరుగుతూ ఉంది. దేవతలందరూ శంకరుని వద్దకు వచ్చి, నమస్కరించి, కీర్తించి మూడు లోకాలకు పాలకుడా! నీ గొప్ప మహిమ తెలియక దేవనది అయిన గంగ ప్రదర్శించిన గర్వము నీ మాయచేత నశించింది. నిజభక్తుడైన భగీరథునిపై గల కరుణతో అయినా దేవనదిని విడుదల చేయవలెను. తమరు అనుగ్రహిస్తే ఈ గంగా జలముతో సగరపుత్రుల ప్రేతాత్మలు శాంతిని పొందుతాయి. మానవ లోకానికి, పాతాళ లోకానికి గొప్ప మేలు కలుగుతుంది అని దేవతలు వేడుకొనగా పరమశివుడు గంగానదిని సముద్రంలోకి వదిలాడు.

శివుని జడలనుండి విడువబడిన గంగానది భాసురహ్లాదినీ, పావనీ, నందినీ, సీతా, సుచక్షు, సింధు, అనే ఆరుపాయలు తూర్పు, పడమరలకు వెళ్ళాయి. ఏడవదైన ఒక ప్రవాహం ఎంతో అందంగా ఆ భగీరథుని వద్దకు బయలుదేరింది. అలా గంగానది తనవెంట రావడం గమనించిన భగీరథుడు గొప్ప రథంపై ఎక్కి పాతాళానికి కదిలాడు.

అనేక ప్రదేశాలలో నివసించే ప్రజలు ఆనందం ఉట్టిపడగా దేవనదీ జలాలలో సంతోషంగా స్నానాలు చేశారు. వారంతా భయాన్ని కలిగించే ప్రేత స్వభావాన్ని వదిలి శాశ్వతమైన వైభవాన్ని కలిగించే స్వర్గానికి చేరుకున్నారు. శివుని శరీరాన్ని తాకినందున మరింత పవిత్రంగా మారిన దేవనది జలములు అనుకుంటూ ఇంద్రుడు మొదలైన దేవతలు, యక్షులు, గంధర్వులు, మునుల సమూహాలు వారి కోరికలు తీరేలాగా అనేక సార్లు ఆనదిలో స్నానం చేశారు.

జహ్నువు అనే మహారాజు యజ్ఞం చేస్తుండగా గంగానది అతని యాగశాలను ముంచి వేసింది. దానికి కోపించిన జహ్నువు సముద్రాన్ని మింగిన అగస్త్యుని లాగా ఆనదిని మింగినాడు. దేవతలందరూ ఆశ్చర్యచకితులై రాజర్షులలో శ్రేష్ఠుడైన జహ్నువుతో ఓ మహానుభావా నీ తపస్సు అద్భుతము. నీ మహిమతో సముద్రాన్ని తాగిన అగస్త్యున్ని మరిపింప చేశావు. గంగాదేవి పొగరు (గర్వం) అణిగింది. ఇకపై ఈ భూమిపై గంగ నీకూతురుగా గుర్తించబడుతుంది. కావున నీవు గంగను విడువవలెను అని అనగానే జహ్నుమహర్షి దేవతలందరూ ఆశ్చర్యపడగా తన చెవుల నుండి గంగను వదిలిపెట్టాడు. గంగ భగీరథుని రథం వెంబడి సముద్రం వైపు వెళ్ళింది.

ఎండిపోయిన సముద్రంలో, సాగరులు తవ్విన రంధ్రం ద్వారా, భగీరథుని వెంట పాతాళానికి వెళ్ళి, సగరపుత్రుల బూడిదకుప్పలు తడిసేవిధంగా ప్రవహించింది. దానితో సాగరులకు పాపములు పోయి దివ్యరూపాలు వచ్చాయి. వారు దేవతలలాగా విమానాలలో పట్టరాని ఆనందంతో భగీరథుడు చూస్తుండగా గొప్పదైన స్వర్గాన్ని అధిరోహించారు. అప్పటి నుండి గంగానది జహ్ను మహర్షి కూతురు కాబట్టి జాహ్నవి అని, భగీరథుని కూతురు కాబట్టి భాగీరథి అనే పేర్లతో ఈ భూమిపై ప్రవహిస్తుంది.

II సంగ్రహరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
పండరీనాథుడి గురించి రాయండి.
జవాబు:
భగీరథ ప్రయత్నం అనే ఈ పాఠ్యభాగాన్ని రాసిన కవి మోతుకూరి పండరీనాథరావు. ఈయన 18వ శతాబ్దం నాటివాడు. ఓరుగల్లు పట్టణానికి సమీపాన గల మడికొండ అతని స్వగ్రామం. మోతుకూరి వంశంలో జన్మించిన పండరీనాథుడు ఆరువేల నియోగిశాఖకు చెందినవాడు. పండరీనాథరావు తల్లిదండ్రులు వేంకటాబిన్, గోపాలరావు.
శ్రీమత్ పండరీనాథ రామాయణం అనే ఆయన గ్రంథాన్ని 1810, మే ఏడవ తేదీన శంకర జయంతి రోజు శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు. పండరీనాథుడు సంస్కృతంలో “రామకథా కల్పలత” అనే గ్రంథం రాసినట్లు తెలుస్తుంది. కాని అది అలభ్యం. శివకేశవులకు సమాన ప్రాధాన్యమిచ్చి సమరసతను ప్రదర్శించాడు.

ప్రశ్న 2.
కపిల మహర్షికి కోపం ఎందుకు వచ్చింది ?
జవాబు:
సగరునికి సుమతి, కేశిని అనే ఇద్దరు భార్యలున్నారు. వారికి సంతానం కలగక పోవటంచేత, సగరుడు తన భార్యలతో భృగుశ్రవణ పర్వతం చేరి నూరు సంవత్సరాలు తపస్సు చేశాడు. భృగువు ప్రత్యక్షమై ఒక భార్య అరవై వేలమంది పుత్రులను, మరొక భార్య వంశోద్ధారకుడైన ఒక పుత్రునికి జన్మనిస్తారని దీవించాడు. సుమతి అరవై వేలమందిని, కేశిని ఒక పుత్రుణ్ణి కోరారు. తరువాత కేశిని అసమంజునునికి, సుమతి ఒక మాంసపుముద్దకు జన్మనిచ్చారు. ఆ మాంసపు ముద్దను ముక్కలు చేసి నేతికుండలలో వుంచగా అరవై వేలమంది శిశువులు జన్మించారు. వీరు పెరిగి ప్రజలను కష్టపెట్టసాగారు.

వీరి గర్వమణిచేందుకు ఇంద్రుడు సగరుని యాగాశ్వాన్ని పాతాళంలోని కపిల మహర్షి ఆశ్రమంలో దాచాడు. సగర చక్రవర్తి కుమారులైన సాగరులు యజ్ఞాశ్వాన్ని కనుగొనే ప్రయత్నంలో పాతాళానికి వెళ్ళారు. అక్కడ తమ యాగాశ్వాన్ని చూశారు. అక్కడ ఎన్నో వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తున్న కపిలమహర్షిని చూశారు. ఆ మహర్షీ తమ యాగాశ్వాన్ని అక్కడ దాచిపెట్టాడని అతని తపస్సును భగ్నం చేయ ప్రయత్నించారు. అలా కపిల మహర్షి కోపాగ్నికి భస్మమైపోయారు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం

ప్రశ్న 3.
గంగకు ‘జాహ్నవి’ అనే పేరు ఎందుకు వచ్చింది ?
జవాబు:
భగీరథుని తపస్సుకు మెచ్చి శివుడు తన తలపై గంగను నిలిపాడు. దేవతల కోరికపై శివుడు తన జటాజూటం నుండి గంగను విడిచాడు. గంగ ఏడు పాయలుగా ప్రవహించింది. అందులో ఒకటి భగీరథుని వెంట వెళుతూ జహ్నువు అనే మహారాజు యజ్ఞం చేస్తుండగా అతని యాగశాలను ముంచి వేసింది. దానికి కోపించిన జహ్నువు సముద్రాన్ని మింగిన అగస్త్యుని లాగా ఆ నదిని మింగినాడు. దేవతలందరూ ఆశ్చర్యచకితులై రాజర్షులలో శ్రేష్ఠుడైన జహ్నువుతో “ఓ మహానుభావా నీ తపస్సు అద్భుతము. నీ మహిమతో సముద్రాన్ని తాగిన అగస్త్యున్ని మరిపింప చేశావు. గంగాదేవి గర్వాన్ని అణచావు.

ఇకపై ఈ భూమిపై గంగ నీకూతురుగా గుర్తించబడుతుంది. కావున నీవు గంగను విడువవలెను అన్నారు. అలా అనగానే జహ్ను మహర్షి దేవతలందరూ ఆశ్చర్యపడగా తన చెవుల నుండి గంగను వదిలిపెట్టాడు. జహ్ను మహర్షి చెవుల నుండి పుట్టింది కావున జాహ్నవి అనే పేరుతో భూలోకంలో గంగ పిలువబడుతుంది.

ప్రశ్న 4.
గంగ ఏ పేర్లతో పాయలుగా ప్రవహించింది ?
జవాబు:
శివుడు ఇచ్చిన మాటకు కోపగించిన గంగ తన ప్రవాహ వేగంతో శివున్ని పాతాళానికి తొక్కి వేస్తానని భావించింది. శివుడు ఆమె గర్వాన్ని తొలగించాలనుకున్నాడు. దేవలోకంలో ప్రవహించే గంగానది సహింపరాని వేగంతో, గెలవాలనే కోరికతో, పెద్ద శబ్దంచేస్తూ, మూడులోకాలకు భయాన్ని కలిగించే విధంగా మ్రోగుతూ హిమాలయ పర్వతంలాగా ప్రకాశిస్తున్న శివుని తలపై పడింది. శివుని జడలనే అడవిలో ఎన్నో సంవత్సరాలు మబ్బులలో కదులుతున్న మెరుపులాగా తిరుగుతూ ఉంది. దేవతలందరూ శంకరుని వద్దకు వచ్చి, నిజభక్తుడైన భగీరథునిపై గల కరుణతో అయినా దేవనదిని విడుదల చేయవలెను.

ఈ గంగా జలముతో సగరపుత్రుల ప్రేతాత్మలు శాంతిని పొందుతాయి. మానవ లోకానికి, పాతాళ లోకానికి గొప్పతనము కలుగుతుంది అని వేడుకొనగా పరమశివుడు నవ్వి, పరమ సంతోష హృదయుడై ఆ గంగా నదిని సముద్రంలోకి వదిలాడు. శివుని జడలనుండి విడువబడిన గంగానది ఏడు పాయలుగా రూపాంతరం చెందింది. భాసురహ్లాదినీ, పావనీ, నందినీ అనే మూడు పేర్లుగల మహానదులు ఇంద్రుడు పాలించే తూర్పు వైపుకు వెళ్ళాయి. సీతా, సుచక్షు, సింధు అనే మూడు పేర్లు గల ప్రవాహాలు పశ్చిమ దిశకు వెళ్ళాయి. ఏడవదైన ఒక ప్రవాహం ఎంతో అందంగా ఆ భగీరథుని వద్దకు బయలుదేరింది.

III ఏకపద/ వాక్య సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఎవరి కోపం వల్ల సగరపుత్రులు భస్మం అయ్యారు ?
జవాబు:
కపిల మహర్షి

ప్రశ్న 2.
‘పండరీనాథ రామాయణం’ ఎవరికి అంకితం ఇచ్చారు ?
జవాబు:
శ్రీరామచంద్రునికి

ప్రశ్న 3.
భగీరథుడు ఏ క్షేత్రంలో తపస్సు చేశాడు ?
జవాబు:
గోకర్ణంలో

ప్రశ్న 4.
గంగను శిరస్సుపై ఎవరు ధరించారు ?
జవాబు:
శివుడు

ప్రశ్న 5.
‘నాకము’ అనగానేమి ?
జవాబు:
స్వర్గం

ప్రశ్న 6.
‘భగీరథ ప్రయత్నం’ ఏ కావ్యం లోనిది ?
జవాబు:
శ్రీమత్ పండరీనాథ రామాయణం

ప్రశ్న 7.
భగీరథుడిని ఎవరు ఆశీర్వదించారు ?
జవాబు:
బ్రహ్మ

ప్రశ్న 8.
సగరుల భస్మం ఏ లోకంలో ఉంది ?
జవాబు:
పాతాళం

IV. సందర్భసహిత వ్యాఖ్యలు

1. శంభుమస్తకముపైఁ బడియె గడు నద్భుతంబుగాన్
జవాబు:
కవి పరిచయం : భగీరథ ప్రయత్నం అనే ఈ పాఠ్యభాగాన్ని రాసిన కవి మోతుకూరి పండరీనాథరావు. ఈయన 18వ శతాబ్దం వాడు. ఓరుగల్లు పట్టణానికి సమీపాన గల మడికొండ అతని స్వగ్రామం. ఈ పాఠ్యాంశం శ్రీమత్ పండరీనాథ రామాయణం అనే గ్రంథంలోని బాలకాండ ద్వితీయాశ్వాసంలోనిది. దీనిని శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు.

అర్థం : శంకరుని తలపై అందంగా పడింది.

సందర్భం : శివునిపై కోపంతో శివున్ని పాతాళానికి తొక్కి వేయాలని దేవలోకంలో ప్రవహించే గంగానది హిమాలయ పర్వతంలాగా ప్రకాశిస్తున్న శివుని తలపై మిక్కిలి అద్భుతంగా పడిన సందర్భంలోనిది.

వ్యాఖ్య : భగీరథుని తపస్సుకు బ్రహ్మ, మహేశ్వరులు మెచ్చి దివిజ గంగను భువికి తేవడానికి సహకరించారు. దానికి గంగ శివునిపై కోపం పెంచుకుంది. దేవలోకంలో ప్రవహించే గంగానది సహింపరాని వేగంతో, గెలవాలనే కోరికతో, పెద్ద శబ్దం చేస్తూ, మూడులోకాలకు భయాన్ని కలిగించే విధంగా మ్రోగుతూ హిమాలయ పర్వతంలాగా ప్రకాశిస్తున్న శివుని తలపై పడి శివుని జటాజూటంలో చిక్కుకున్నది.

2. నాకంబునకుద్గమించె భయ కృత్రేతత్వ నిర్ముక్తమై (Imp)
జవాబు:
కవి పరిచయం : భగీరథ ప్రయత్నం అనే ఈ పాఠ్యభాగాన్ని రాసిన కవి మోతుకూరి పండరీనాథరావు. ఈయన 18వ శతాబ్దం వాడు. ఓరుగల్లు పట్టణానికి సమీపాన గల మడికొండ అతని స్వగ్రామం. ఈ పాఠ్యాంశం శ్రీమత్ పండరీనాథ రామాయణం అనే గ్రంథంలోని బాలకాండ ద్వితీయాశ్వాసంలోనిది. దీనిని శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు.

అర్థం : భయంకరమైన ప్రేత స్వభావాన్ని వదిలి స్వర్గానికి వెళ్ళారు.

సందర్భం : భగీరథుని తపస్సుకు బ్రహ్మ, మహేశ్వరులు మెచ్చి దివిజ గంగను భువికి తేవడానికి సహకరించారు. అల ఇలపై అడుగిడిన గంగా జలంలో సామాన్యులు స్నానం చేసి పుణ్యలోకాలకు వెళ్తున్న సందర్భంలోనిది.

వ్యాఖ్య : అనేక ప్రదేశాలలో నివసించే ప్రజలు ఆనందం ఉట్టిపడగా దేవనదీ జలాలలో సంతోషంతో స్నానాలు చేశారు. అలా పవిత్రులై తమ భయంకరమైన ప్రేతరూపాలను వదిలి శాశ్వతమైన వైభవాన్ని కలిగించే స్వర్గానికి చేరుకున్నారు.

3. నాటనుండి జహ్నునకు కూఁతురగుట
జవాబు:
కవి పరిచయం : భగీరథ ప్రయత్నం అనే ఈ పాఠ్యభాగాన్ని రాసిన కవి మోతుకూరి పండరీనాథరావు. ఈయన 18వ శతాబ్దం వాడు. ఓరుగల్లు పట్టణానికి సమీపాన గల మడికొండ అతని స్వగ్రామం. ఈ పాఠ్యాంశం శ్రీమత్ పండరీనాథ రామాయణం అనే గ్రంథంలోని బాలకాండ ద్వితీయాశ్వాసంలోనిది. దీనిని శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు.

అర్థం : ఆ రోజు నుండి జహ్ను మహర్షికి కూతురైనది.

సందర్భం : భగీరథుని వెంట వెళ్తున్న గంగ జహ్ను మహర్షి యాగశాలను ముంచి వేస్తే జహ్నువు గంగను మింగాడు. దేవతల ప్రార్థనతో మళ్ళీ చెవుల నుండి వదిలిన సందర్భంలోనిది.

వ్యాఖ్య : జహ్నువు గంగను తాగేయడాన్ని చూసిన దేవతలందరూ ఆశ్చర్యచకితులై “నీ మహిమతో సముద్రాన్ని తాగిన అగస్త్యున్ని మరిపింపచేశావు. గంగాదేవి యొక్క గర్వం అణిచివేశావు. ఇకపై ఈ గంగ నీ కూతురుగా `’గుర్తించబడుతుంది అని అన్నారు. అలా అనగానే జహ్ను మహర్షి దేవతలందరూ ఆశ్చర్యపడగా తన చెవుల నుండి గంగను వదిలిపెట్టాడు. ఆ రోజు నుండి గంగ జాహ్నవిగా పిలువబడుతున్నది.

TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం

4. నుతింపఁగా సకలదైవతకోటులకైన శక్యమే (V.Imp) (M.P)
జవాబు:
కవి పరిచయం : భగీరథ ప్రయత్నం అనే ఈ పాఠ్యభాగాన్ని రాసిన కవి మోతుకూరి పండరీనాథరావు. ఈయన 18వ శతాబ్దం వాడు. ఓరుగల్లు పట్టణానికి సమీపాన గల మడికొండ అతని స్వగ్రామం. ఈ పాఠ్యాంశం శ్రీమత్ పండరీనాథ రామాయణం అనే గ్రంథంలోని బాలకాండ ద్వితీయాశ్వాసంలోనిది. దీనిని శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు.

అర్థం : కీర్తించడానికి సమస్త దేవ సమూహాలకూ సాధ్యం కాదు

సందర్భం : ఎంతో తపస్సు చేసి, మరెన్నో అడ్డంకులను అధిగమించి, పాతాళంలో పడిఉన్న తన పితరుల భస్మ రాశులపై గంగను ప్రవహింపజేసిన భగీరథున్ని బ్రహ్మదేవు మెచ్చుకుంటున్న సందర్భంలోనిది.

వ్యాఖ్య : బ్రహ్మ భగీరథున్ని కరుణతో చూసి “కుమారా! సగరుడు మొదలైన మీ పూర్వీకులకు ఈ ప్రతిజ్ఞ అనే సముద్రాన్ని తరించడం సాధ్యం కాలేదు. దానిని సాధించిన నిన్ను, నీ తపస్సును మెచ్చుకోవడం సమస్త దేవతా సమూహాలకు కూడా సాధ్యం కాదు” అని అన్నాడు.

పద్యములు – ప్రతిపదార్థ తాత్పర్యములు :

1వ పద్యం :

ఉ||
అంత భగీరథుండు చతురంతమహీవలయంబుఁ బ్రోవుచున్
మంత్రులు చెప్ప సాగరసమాజము కాపిల కోపవహ్ని చే
నంతకు ప్రోలి కేఁగుట సమగ్రముగా విని కోసలేశుఁ డ
త్యంత విచారమగ్నమతి యయ్యెను దత్పరమార్ధసిద్ధికై.

ప్రతిపదార్థం:

అంత = అప్పుడు
చతురంత = నాలుగు వైపులా సముద్రంచే చుట్టబడిన
మహీవలయంబుఁ = భూ మండలాన్ని
బ్రోవుచున్ = పరిపాలిస్తూ
సాగరసమాజము = సగర మహారాజు పుత్రులు
కాపిల కోపవహ్ని చే = కపిల మహర్షి కోపాగ్నికి
నంతకు ప్రోలి కేఁగుట = భస్మీపటలం అయిన విధానాన్ని
సమగ్రముగా = వివరంగా
మంత్రులు చెప్ప = మంత్రులు చెప్తుండగా
కోసలేశుఁ డు = కోసల రాజ్యాన్ని పాలిస్తున్న
భగీరథుండు = భగీరథుడు
విని = ఆలకించి
తత్ + పరమార్థసిద్ధికై = ఆ పనిని పూర్తి చేయడానికి
అత్య౦త = ఎక్కువైన
విచారమగమతి = బాధతో నిండిన మనస్సు కలవాడు
యయ్యెను = అయ్యాడు

తాత్పర్యం : నాలుగు వైపులా సముద్రంచే చుట్టబడిన భూమండలాన్ని పరిపాలిస్తున్న కోసల రాజు అయిన భగీరథుడు, తన పూర్వీకులైన సగర మహారాజు పుత్రులు ఏవిధంగా కపిల మహర్షి కోపానికి భస్మం అయ్యారో మంత్రుల ద్వారా తెలుసుకొని ఆపనిని పూర్తిచేయడానికి సిద్ధపడ్డాడు.

2వ పద్యం :

అ ||
తనకు సుతులు లేమిఁ దద్రాజ్యభర మెల్ల,
మంత్రులందు నిల్పి మనుజవరుఁడు
వీఁక మెఱయఁ దాను గోకర్ణమున కేఁగి
యందుఁ జేసె ఘోరమైన తపము.

ప్రతిపదార్థం :

తనకు = భాగీరథునికి
సుతులు లేమిఁ = కొడుకులు లేని కారణంగా
తత్ రాజ్య = ఆ రాజ్య
భర మెల్ల = భారాన్ని
మంత్రులందు నిల్పి = మంత్రులకు అప్పగించి
మనుజవరుఁడు = మానవులను కాపాడేవాడు (మహారాజు)
వీఁకము + ఎరయ = ఉత్సాహము ఏర్పడే విధంగా
తాను = భగీరథుడు
గోకర్ణమునకు + ఏగి = గోకర్ణము అనే ప్రదేశానికి వెళ్లి
అందున్ = అందులో (అక్కడ)
ఘోరమైన = గొప్పదైన
తపము = తపస్సును
జేసె = చేశాడు

తాత్పర్యం : భాగీరథునికి పుత్ర సంతానం లేని కారణంగా తన రాజ్య భారాన్ని మంత్రులకు అప్పగించి, (తన పితరుల ఆత్మలకు శాంతి లభింప చేయడానికి) గోకర్ణం వెళ్లి అక్కడ గొప్ప తపస్సు చేశాడు.

3వ పద్యం :

తే ||
వాయుభక్షకుఁడై యూర్ధ్వబాహుఁ డగుచు
మహిత పంచానలంబుల మధ్యమందు
స్థాణువోయన నచలుఁడై తగ వసించి
తపము గావించె వేయువత్సరము లిట్లు.

ప్రతిపదార్థం :

వాయుభక్షకుఁడై = గాలిని ఆహారంగా తీసుకొని
యూర్ధ్వబాహుఁ డగుచు = చేతులు పైకెత్తి
మహిత = గొప్ప
పంచ = ఐదు
అనలంబుల = అగ్నుల
మధ్యమందు = మధ్యలో
స్థాణువోయనన్ = రాయి ఏమో అనగా
అచలుఁడై = కదలకుండా
తగ వసించి = నిలిచి
ఇట్లు = ఈ విధంగా
వేయువత్సరములు = వేయి యేళ్ళు
తపము = తపస్సు
గావించె = చేశాడు

తాత్పర్యం : గాలిని మాత్రమే ఆహారంగా తీసుకొని, రెండు చేతులు పైకెత్తి, ఐదు రకాల అగ్నుల మధ్య రాయి ఏమో అనేవిధంగా కదలకుండా వేయి సంవత్సరాలు గొప్ప తపస్సు చేశాడు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం

4వ పద్యం :

ఉ||
దానికి మెచ్చి యిట్లనుఁ బితామహుఁ డోమను జేశ ! యోతప
శ్రీనిధి యోభగీరథ ! విశిష్టజనస్తుతమైన నీతపం
బే నిదె మెచ్చినాఁడ భవదిష్టము వేఁడుము దాని నిచ్చెదన్
మానవనాథ యంచుఁ గడు మన్ననఁ బల్క నతండు హృష్టుఁడై.

ప్రతిపదార్థం :

దానికి మెచ్చి = ఆ తపస్సుకు మెచ్చి
పితామహుఁడు = బ్రహ్మ
యిట్లనున్ = ఈ విధంగా అన్నాడు
ఓ మనుజ + ఈ శ ! = ఓ మహారాజా !
ఓ తపశ్రీనిధి = తపస్సంపన్నుడా !
ఓ భగీరథ ! = ఓ భగీరథ !
విశిష్టజనస్తుతము + ఐన = జనులచే పొగడబడే
నీతపంబున్ = నీ తపస్సును
ఏ + ఇదె = నేను ఇప్పుడే
మెచ్చినాఁడ = మెచ్చినాను
భవత్ + ఇష్టము = నీ కోరికను కోరుకొనుము
వేడుము = కోరుకొనుము
దానిన్ + ఇచ్చెదన్ = దానిని తీర్చుతాను
మానవనాథ = మహారాజా
అనుచున్ = అంటూ
కడు = ఎక్కువైనా
మన్ననఁ బల్కన్ = గౌరవంతో పలకగా
అతండు = భగీరథుడు
హృష్టుఁడై = సంతోషించి

తాత్పర్యం : గాలిని మాత్రమే ఆహారంగా తీసుకొని, రెండు చేతులు పైకెత్తి, ఐదు రకాల అగ్నుల మధ్య రాయి ఏమో అనేవిధంగా కదలకుండా వేయి సంవత్సరాలు గొప్ప తపస్సు చేశాడు.

5వ పద్యం :

ఉ ||
అంజలి చేసి మ్రొక్కి వినయావనతాననుఁడై జగత్ప్రభున్
గంజభవుం గనుంగొని జగజ్జన గీతయశుండు భూమిభృ
త్కుంజరుఁ డిట్లనున్ మొదలు గోరెద సాగరభస్మమున్ జగ
ద్రంజన ! దేవతాసరి దుదంచిత వారిపరిఫ్లుతంబుగాన్.

ప్రతిపదార్థం :

అంజలి చేసి = రెండు చేతులు జోడించి
మ్రొక్కి = నమస్కరించి
వినయ + అవనత + ఆననుఁడై = వినయంతో తల వంచుకొని
జగత్ప్రభున్ = ఆ దేవుణ్ణి
కంజభవున్ = పద్మము నుండి పుట్టినవాడు (బ్రహ్మను)
కనుంగొని = చూసి
జగజ్జన గీతయశుండు = జనులందరిచే పొగడబడే కీర్తి కలవాడు
భూమి భృత్కుంజరుడు = మహారాజు (భగీరథుడు)
ఇట్లు + అనున్ = ఈ విధంగా పలికాడు
జగద్రంన ! = జనులకు ఆనందాన్ని కలిగించే వాడా
మొదలు = మొదట
సాగరభస్మమున్ = సాగరుల భస్మరాశులపై
దేవతాసరిత్ = దేవనది యొక్క
ఉదంచిత వారి = గొప్ప నీటిని
పరిఫ్లుతంబుగాన్ = ప్రవహించే విధంగా
గోరెదన్ = కోరుకుంటా

తాత్పర్యం : రెండు చేతులు జోడించి, నమస్కరించి, వినయంతో తల వంచుకొని అ బ్రహ్మను చూసి జనులచే పొగడబడే కీర్తి కలిగిన భగీరథుడు మొదట సాగరుల భస్మరాశులపై దేవనది యొక్క నీటిని ప్రవహింప చేయమని కోరాడు.

6వ పద్యం :

ఉ||
వెండియుఁ గోరెదన్ భువన విశ్రుతుఁడై న తనూజు సద్యశో
మండితు నప్రమేయగుణు మత్కులవర్ధను దేవదేవ ! యీ
రెండువరంబు లిచ్చి కృతకృత్యుఁగ నన్నానరింపవే ! నతా
ఖండల ! వాగధీశ ! శ్రితకల్పమహీజ ! త్రిలోకనాయకా !

ప్రతిపదార్థం :

వెండియుఁన్ = మళ్ళీ (తరువాత)
కోరెదన్ = కోరుకుంటాను
దేవదేవ ! = ఓ దేవా
నత + ఆఖండల ! = ఇంద్రునిచే నమస్కరించబడే వాడా !
వాగధీశ ! = వాక్కులకు అధిపతీ (సరస్వతికి భర్తా !)
(ఆ)శ్రితకల్పమహీజ ! = ఆశ్రయించిన వారికి కల్పవృక్షము వంటి వాడా
త్రిలోకనాయకా ! = మూడు లోకాలకు నాయకుడా!
భువన = భూమండలంలో
విశ్రుతుఁడై న = ప్రసిద్ధుడయ్యే
తనూజున్ = కొడుకును
సత్ + యశో మండితున్ = మంచి కీర్తి పొందే వాడిని ఎదురులేని గుణాలు కలిగిన వాడిని
అప్రమేయగుణున్ = ఎదురులేని గుణాలు కలిగిన వాడిని
మత్ కులవర్ధనున్ = మా వంశోద్ధారకున్ని
యీ రెండువరంబులు = ఈ రెండు కోరికలను
ఇచ్చి = ఇచ్చి
కృతకృత్యుఁగ = అనుకున్న పని పూర్తి చేసినవాడిగా
నన్నున్ + ఒనరింపవే ! = నన్ను అనుగ్రహించు

తాత్పర్యం : ఓ వాక్కులకు అధిపతి అయినవాడా!, ఇంద్రునిచే నమస్కరించబడే వాడా!, ఆశ్రయించిన వారికి లేదనక ఇచ్చే కల్ప వృక్షము వంటి వాడా, మూడు లోకాలకు నాయకుడా! భూమండలంలో ప్రసిద్ధి పొంది, మంచి గుణాలు కలిగి, మా వంశాన్ని ఉద్ధరించే ఒక కుమారున్ని రెండవవరంగా అనుగ్రహించు.

7వ పద్యం :

మ॥
అని యభ్యర్థితుఁ జేయ మెచ్చి యపు డయ్యంభోజసంభూతుఁ డి
ట్లనియెన్ వంశవివర్ధనుండు సుతుఁ డుద్యత్తేజుఁడుం గల్గు నీ
కనఘా ! దివ్య సరిత్ప్రవాహ పతనంబై నన్ భరింపంగ నో
పునె భూమిస్థలి ? దేవదేవుఁడగు శంభుం డొక్కడుం దక్కఁగాన్.

ప్రతిపదార్థం :

అని = అలా
యభ్యర్థితుఁన్ + చేయ = కోరుకొనగా
మెచ్చి = మెచ్చుకొని
అపుడు = అప్పుడు
ఆ + అంభోజ సంభూతుఁడు = కమలము నుండి పుట్టినవాడు (బ్రహ్మదేవుడు)
ఇట్లనియెన్ = ఈ విధంగా అన్నాడు.
అనఘా ! = పాపము లేని వాడా (పుణ్యాత్ముడా)
వంశవివర్ధనుండు = వంశాన్ని పెంచే తేజస్సు కల
సుతుఁడు = కొడుకు
నీకున్ + కల్గున్ = నీకు పుడుతాడు
దివ్య సరిత్ ప్రవాహ = దివ్య లోకాలలో ప్రవహించే (నది)
పతనంబై నన్ = కింద పడితే
దేవదేవుఁడగు = దేవతలకు దేవుడైన
శంభుం డొక్కడున్ = శంకరుడు ఒక్కడు
తక్కఁగాన్ = తప్ప
భూమిస్టలి ? = భూమండలం
భరింపంగన్ + ఓపునే = ఓర్చుకోగలదా ?

తాత్పర్యం : అలా భగీరథుడు కోరుకోగానే బ్రహ్మదేవుడు ఈ విధంగా అన్నాడు. “ఓ పుణ్యాత్ముడా ! నీ వంశాన్ని పెంచేవాడు, తేజస్సు కల కుమారుడు నీకు జన్మిస్తాడు. దివ్యలోకాలలో ప్రవహించే నది భూమిపై పడితే పరమ శివుడు తప్ప భూమండలం భరిస్తుందా?”

TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం

8వ పద్యం :

మ||
అని యిట్లయ్యజుఁ డానతిచ్చి మఱి దా నంతర్హితుండైన నె
క్కొను సద్భక్తి భగీరథుండు చరణాంగుష్ఠం బిలన్నిల్పి శం
భుని హృత్పద్మగుఁ జేసి దుష్కర తపంబుం జేయ నద్దేవుఁ డ
మ్మనుజాధీశు తపంబు మెచ్చి పలికెన్ మాధుర్య మేపారఁగన్.

ప్రతిపదార్థం :

యిట్లు = ఈ విధంగా
అని = చెప్పి
ఆ + అజుడు = బ్రహ్మ
ఆనతిచ్చి = చెప్పి
మఱి దాన్ = తాను
అంతర్హితుండైనన్ = అంతర్ధానం (మాయం) అయ్యాడు
ఎక్కొను = ఎక్కువైన
సద్భక్తి = భక్తి తో
భగీరథుండు = భాగీరథుడు
చరణ + అంగుష్ఠంబు = కాలి బొటన వేలును
ఇలన్ నిల్పి = భూమిపై నిలిపి
శంభుని = శంకరుని గూర్చి
హృత్ + పద్మగుఁ జేసి = హృదయాన్ని పద్మముగా చేసి
దుష్కర = కఠినమైన
తపంబున్ చేయన్ = తపస్సు చేస్తే
ఆ + దేవుడు = ఆ శివుడు
ఆ + మనుజాధీశు = రాజు
తపంబు మెచ్చి = తపస్సుకు సంతోషించి
మాధుర్యము + ఏపారఁగన్ = ఆప్యాయత నిండగా
పలికెన్ = పలికాడు

తాత్పర్యం : అని చెప్పి బ్రహ్మ అదృశ్యం అయ్యాడు. అపుడు భక్తితో కాలి బొటన వేలును మాత్రమే భూమిపై మోపి, తన హృదయాన్ని పద్మంగా మార్చుకొని శంకరుని గూర్చి కఠినమైన తపస్సు చేస్తే ఆ రాజు తపస్సుకు మెచ్చిన శివుడు ఆప్యాయతతో పలికాడు.

9వ పద్యం :

మ.కో॥
నీ తపంబున కేను మెచ్చితి నిరోదక వాహినిన్
నా తలస్ ధరియించెదన్ జననాథ! లెమ్మని పల్క ను
ర్వీతలేశుఁడు హృష్టుఁడై కనువిచ్చి శంకరుఁ జూచి సం
ప్రీతి మ్రొక్కి నుతించి తన్ గృతకృత్యుఁగాఁ దలఁచెన్ మదిన్.

ప్రతిపదార్థం:

జననాథ ! = ఓ రాజా
లెమ్ము + అని = లేవుమని
నీ = నీ
తపంబునకున్ = తపస్సుకు
ఏను = నేను
మెచ్చితి = సంతోషించాను
నిర్జర = దేవలోకంలోని
ఉదక = నీటి
వాహినిన్ = ప్రవాహాన్ని (నదిని)
నా తలన్ = నా తలపై
ధరియించెదన్ = ధరిస్తాను
పల్కన్ = చెప్పగా
ఉర్వీతలేశుఁడు = రాజు (భగీరథుడు)
హృష్టుడై = సంతోషించి
కనువిచ్చి = కన్నులు తెరిచి
శంకరుఁన్ + చూచి = శంకరుణ్ణి చూసి
సంప్రీతి మ్రొక్కి = మనస్ఫూర్తిగా మొక్కి
నుతించి = కీర్తించి
తన్ = తాను
కృతకృత్యుఁగాఁన్ = విజయము సాధించానని
మదిన్ = మనసులో
తలచెన్ = అనుకున్నాడు

తాత్పర్యం : ఓ రాజా నీ తపస్సుకు నేను సంతోషించాను. దేవలోకంలోని నీటి ప్రవాహాన్ని నా తలపై ధరిస్తాను. అని చెప్పగా రాజు సంతోషించి, కన్నులు తెరచి, శంకరున్ని చూసి, మనస్ఫూర్తిగా మొక్కి, కీర్తించి తాను విజయం సాధించిన వాడుగా మనసులో భావించాడు.

10వ పద్యం :

క ||
భూతేశు ప్రతిజ్ఞకు సం
జాతాతి క్రోధ యగుచు స్వర్గంగ నిజ
స్రోతోవేగంబున హరుఁ,
బాతాళం బంటంద్రొక్కు భావం బిడియెన్.

ప్రతిపదార్థం :

భూతేశు = శివుని
ప్రతిజ్ఞకు = మాటకు
సంజాతాతి = పుట్టిన పెద్ద
క్రోధ యగుచు = కోపంతో
స్వర్గంగ = స్వర్గంలోని గంగ
నిజస్రోతో = తన ప్రవాహ
వేగంబున = వేగంతో
హరుఁ న్ = శివున్ని
స్వర్గంగ = స్వర్గంలోని గంగ
నిజస్రోతో = తన ప్రవాహ
వేగంబున = వేగంతో
హరుఁ న్ = శివున్ని
పాతాళంబు + అంటన్ = పాతాళం చేరే విధంగా
త్రొక్కు = తొక్కేస్తాను
భావంబు + ఇడియెన్ = భావించింది

తాత్పర్యం : శివుడు ఇచ్చిన మాటకు పెద్దగా కోపగించిన గంగ తన ప్రవాహ వేగంతో శివుణ్ణి పాతాళానికి తొక్కి వేస్తాను అని భావించింది.

11వ పద్యం :
క||
హరుఁ డయ్యవలేపమునకుఁ,
బరమక్రోధాకుల స్వభావుం డగుచున్,
సరిదుత్త మయగు గంగం,
దిరోహితను జేయంగా మదిం దలపోసెన్.

ప్రతిపదార్థం :

హరుఁడు = శివుడు
ఆ + అవలేపమునకుఁ = గంగాదేవి గర్వానికి
బరమ = ఎక్కువైన
క్రోధాకులస్వభావుండు = కోపముచే నిండిన స్వభావుడు
అగుచు = అయి
సరిత్ + ఉత్తమయగు = ఉత్తమమైన నది
గంగన్ = గంగను
తిరోహితన్ చేయగా = మరుగు పరచాలి అని
మదిన్ + తలపోసెన్ = మనస్సులో అనుకున్నాడు

తాత్పర్యం : గంగాదేవి గర్వానికి అత్యంత కోప స్వభావుడైన శివుడు గంగ గర్వాన్ని మరుగుపర్చాలి అని మనస్సులో అనుకున్నాడు.

12వ పద్యం :

ఆ ||
ఇవ్విధమున వార లిరువు రొండొరుల ని
గ్రహమునకుఁ దలంపఁగా నెఱంగి
దానిఁ జూచుటకుఁ బితామహముఖదేవ,
దేవయోను లరుగుదెంచి రపుడు.

ప్రతిపదార్థం :

ఈ + విధమున = ఈ విధంగా
వారలు + ఇరువురు = గంగా, శివుడు ఇద్దరూ
ఒండొరులన్ = ఒకరిని ఒకరు
నిగ్రహమునకుఁ = ఓడించాలని
దలంపఁగాన్ = అనుకోవడం
ఎఱంగి = తెలుసుకొని
దానిఁన్ = ఆ సన్నివేశాన్ని
చూచుటకుఁన్ = చూడడానికి
పితామహముఖ = బ్రహ్మ మొదలైన
దేవయోనులు = దేవతలకు జన్మించిన వారు
అరుగుదెంచిరి = వచ్చారు
అపుడు = అప్పుడు

తాత్పర్యం : ఈ విధంగా గంగా, శివుడు ఇద్దరూ ఒకరిని మరొకరు ఓడించాలని అనుకుంటున్న విషయం తెలుసుకున్న బ్రహ్మ మొదలైన దేవతలందరూ ఆ సన్నివేశాన్ని చూడటానికి వచ్చారు. అప్పుడు

13వ పద్యం :

ఆ||
మాననీయ తద్విమానమండల సహ
స్రములతోడ నభము చాల మెఱసి
భాసమాన భూరిభానుమండల సహ
స్రములతోడ మెఱయు క్రమము దోఁప.

ప్రతిపదార్థం :

మాననీయ = గౌరవింప తగిన
సహస్రముల = వేల
తత్ విమానమండల = ఆ విమాన సముదాయం
తోడ = తో
నభము = ఆకాశం
చాల మెఱసి = చాల మెరిసింది
భాసమాన = సూర్య సమానమైన
సహస్రముల = వేల
భూరి భానుమండల = గొప్ప సూర్యలోకాల
తోడ = తీరుగా
మెఱయు = మెరుస్తున్నట్లు
క్రమము దోఁప = అనిపించింది

తాత్పర్యం : అనేకులైన దేవతలు తమ విమానాలలో వచ్చేసరికి ఆ విమానాల తేజస్సుతో ఆకాశం వేల సూర్య మండలాలుగా అనిపించింది.

14వ పద్యం :

శా||
ఈరీతిన్ జగదీశు మస్తకముపై నేపారి యగ్గంగ దు
ర్వారప్రక్రియ వ్రాలియున్ వెడలిపోవన్ లేక తన్మాయచే
వారింపంబడి తజ్జటాటవి భ్రమింపం జొచ్చెం బెక్కేండ్లుగా
సారోదార పయోదమండల చరత్ సౌదామనీ తుల్యయై.

ప్రతిపదార్థం :

ఈరీతిన్ = ఈ విధంగా
జగదీశ = శివుని
మస్తకముపైన్ + ఏపారి = తలపై పడి
ఆ + గంగ = ఆ గంగా
దుర్వార = నివారింపలేని
ప్రక్రియ = విధంగా
వ్రాలియున్ = పడి
వెడలిపోవన్ లేక = వెళ్ళలేక
తత్ + మాయచే = శివుని మాయచే
వారింపంబడి = నిలుపబడి
తత్ + జటాటవి = ఆ శివుని జడలనే అడవిలో
పక్కెండ్లుగా = ఎన్నో సంవత్సరాలు
సార + ఉదార = గొప్ప
పయోదమండల = మబ్బులలో
చరత్ సౌదామనీ = కదులుతున్న మెరుపు
తుల్యమై = లాగ
భ్రమింపన్ చొచ్చెన్ = తిరిగింది

తాత్పర్యం : ఈ విధంగా శివుని తలపై పడి బయటకి రాలేక శివుని మాయచే నిలువరింపబడి ఆ శివుని జడలనే అడవిలో ఎన్నో సంవత్సరాలు మబ్బులలో కదులుతున్న మెరుపులాగా తిరుగుతూ ఉంది.

TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం

15వ పద్యం :

ఉ||
ఆ సమయంబునన్ జలరుహాసను మున్నిడి నిర్జరుల్ జగ
ద్భాసకుఁడైన శంకరుని పాలికి వచ్చి నుతించి యంజలుల్
చేసి జగత్రయీశ! సురసింధ్వవలేపము నీదు మాయచేఁ
బాసె భవన్మహామహిమ భావమునందుఁ దలంపకుండుటన్

ప్రతిపదార్థం :

ఆ సమయంబునన్ = ఆ సమయంలో
జలరుహాసను = బ్రహ్మ
మున్నిడి = ముందుంచుకొని
నిర్జరుల్ = దేవతలు
జగత్ భా సకుఁడైన = జగానికి వెలుగును ఇచ్చే మిత్రుడైన
శంకరుని పాలికి వచ్చి = శంకరుని వద్దకు వచ్చి
నుతించి = కీర్తించి
యంజలుల్ చేసి = నమస్కరించి
జగత్రయ + ఈశ ! = మూడు లోకాలకు పాలకుడా దేవనది
సురసింధు = దేవనది
అవలేపము = గర్వము
నీదు మాయచే = నీ మాయచేత
బాసెన్ = పోయింది
భవన్ = నీ
మహా మహిమ = గొప్ప మహిమ చేత
భావమునందుఁన్ = మనసులో
తలంపక + ఉండుటన్ = గ్రహించకపోవడం చేత

తాత్పర్యం : ఆ సమయంలో బ్రహ్మను ముందుంచుకొని దేవతలందరూ జగానికి జ్ఞానమనే వెలుతురునిచ్చే శంకరుని వద్దకు వచ్చి, నమస్కరించి, కీర్తించి మూడు లోకాలకు పాలకుడా ! నీ గొప్ప మహిమ తెలియక దేవనది అయిన గంగ ప్రదర్శించిన గర్వము నీ మాయచేత నశించింది.

16వ పద్యం :

క॥ పర్వత సమభావం బీ
యుర్విం బరమాణు వొందనోపని భంగిన్
సర్వేశ! భవత్సమత సు
పర్వాపగ పొందఁ గలదె భావింపంగన్ :

ప్రతిపదార్థం :

సర్వేశ ! = సర్వమునకు ఈశుడా !
ఈ + ఉర్విన్ = ఈ భూమిపై
పర్వత సమభావంబు = పర్వతముతో సమానమైనవి కూడా
పరమాణువు = అతిచిన్న (విలువను)
ఒందనోపని = పొందలేని
భంగిన్ = తీరుగా
భవత్ + సమత = నీ సమభావం
సుపర్వ + ఆపగ = దేవనది
భావింపగన్ = మనసులో నైనా
పొందఁ గలదె = పొందగలదా

తాత్పర్యం : ఓ ‘సర్వేశ్వరా! ఈ భూమిపై (నీ సృష్టిలో) పర్వత సమాలు కూడా చిన్న పరమాణు విలువను కూడా పొందలేవు. ఆ విధంగా నీ సమభావాన్ని గంగానది మనస్సులోనైనా ఉహించగలదా ?

17వ పద్యం :

ఉ ||
పాలితసర్వలోక ! నిజభక్తు భగీరథు దీను పైఁ గృపా
శీలతఁ బూనియైన సురసింధు విమోచన మాచరింపఁగాఁ
బోలును దీనిచే సగరపుత్ర విముక్తి మనుష్యలోక సా
తాళ పవిత్రభావము లుదార భవత్కృప నుల్లసిల్లెడిన్.

ప్రతిపదార్థం:

పాలిత సర్వలోక ! = సర్వలోకాలను పాలించే వాడా
నిజభక్తున్ = నీ భక్తున్ని
భగీరథున్ = భాగీరథునిపై
దీనున్ + పైఁన్ = దీనునిపై
కృపాశీలతఁన్ = కృపతో
పూనియైన = అయినా
సురసింధు = దేవనదిని
విమోచనము = విడుదల
ఆచరింపఁగాఁన్సోలును = చేయవలెను
దీనిచే = ఈ గంగ జలముచే
సగరపుత్ర = సగరుని పుత్రుల ఆత్మలకు
విముక్తి = ప్రశాంతత
మనుష్యలోక = మానవలోకానికి
పాతాళ = పాతాళలోకానికి
పవిత్రభావముల్ = పవిత్రభావములు
ఉదార = గొప్పతనము
భవత్కృపన్ = నీ కృప కారణంగా
ఉల్లసిల్లెడిన్ = కలుగుతుంది

తాత్పర్యం : సర్వలోకాలను పాలించేవాడా ! నీ భక్తుడైన భగీరథుని, దీనునిపై గల కరుణతో అయినా దేవనదిని విడుదల చేయవలెను. ఈ గంగాజలముతో సగరపుత్రుల ప్రేతాత్మలు శాంతిని పొందుతాయి. మానవలోకానికి, పాతాళలోకానికి నీ కరుణ కారణంగా గొప్పతనము కలుగుతుంది.

18వ పద్యం :

ఆ||
అని నుతింప నవ్వి యద్దేవదేవుండు,
పరమ సుప్రసన్న భావుఁ డగుచు
గంగ నపుడు విడిచె ఘనతరంబగు బిందు,
సరమునందు సురలు సంతసిల్ల

ప్రతిపదార్థం :

అని = అని
నుతింప = వేడుకొనగా
ఆ + దేవదేవుండు = ఆ శివుడు
నవ్వి = నవ్వి
పరమ = చాలా
సుప్రసన్న భావుఁ డు + అగుచు = చాలా ఆనందంతో
గంగన్+ అపుడు = అప్పుడు గంగానదిని
సురలు = దేవతలు
సంతసిల్లను = సంతోసించగా
ఘనతరంబగు = గొప్పదైన
బిందు సరమునందు = ‘సముద్రంలోకి
విడిచె = వదిలాడు

తాత్పర్యం : అని దేవతలు వేడుకొనగా పరమశివుడు నవ్వి పరమ సంతోష హృదయుడై ఆ గంగానదిని దేవతలు సంతోషిస్తుండగా సముద్రంలోకి వదిలాడు.

19వ పద్యం :

సీ॥
అబ్బంగి హరముక్త యై గంగ సప్తప్ర,
వాహ రూపంబులు వరుసఁ దాల్చి
భాసురహ్లాదినీ పావనీ నందినీ,
నామముల్గల మహానదులు మూఁడు
సురరాజుదిక్కున కరిగి సీతాసుచ
క్షుస్సింధు నామక ప్రోతములును
బశ్చిమదిశ కేఁగెఁ బదఁపడి యేడవ,
యగు ప్రవాహం బద్భుతాభిరామ
ఆ॥ మగుచు నబ్బగీరథావరు చెంత
కరుగు దేరఁజూచి యవ్విభుండ
రమ్యమైన దివ్య రథమెక్కి కదలెన
య్యమరసింధు వెంట ననుగమింప

ప్రతిపదార్థం :

ఆ + బంగి = ఆ విధంగా
హరముక్త యై = శివునిచే విడువబడిన
గంగ = గంగానది
సప్తప్రవాహ = ఏడు పాయలుగా
రూపంబులువరుసం దాల్చి = రూపాంతరం చెంది
భాసురహ్లాదినీ, పావనీ, నందినీ = భాసురహ్లాదినీ, పావనీ, నందినీ (పేర్లు)
నామముల్గల = పేర్లు గల
మహానదులు మూఁడు = మూడు నదులు
సురరాజు = ఇంద్రుని (తూర్పు)
దిక్కునకు + అరిగి = దిక్కుకుపోయాయి
సీతా, సుచక్షు, సింధు = సీతా, సుచక్షు, సింధు (పేర్లు)
నామక ఫ్రోతములును = పేర్లు గల ప్రవాహాలు
పదపడి = అత్యంత వేగంతో
పశ్చిమదిశకు + ఏగెఁ = పశ్చిమానికి వెళ్ళాయి
యేడవయగు = ఏడవది అయిన
ప్రవాహంబు = ప్రవాహం
అద్భుత + అభిరామము = ఎంతో మనోజ్ఞం
అగుచున్ = అయి
ఆ + భగీరథావరు = గౌరవింపదగిన ఆ భగీరథుని
చెంతకున్ = వద్దకు
అరుగున్ = వెళ్ళుటను
తేరఁజూచి = పరిశీలించి
ఆ + అమరసింధు = ఆ దేవనది
వెంటన్ = తన వెంబడి
అనుగమింప = వస్తుండగా
ఆ + విభుండు + అ = ఆ రాజు
రమ్యమైన = అందమైన
దివ్య రథమెక్కి = గొప్ప రథాన్ని ఎక్కి
కదలెన్ = కదిలాడు

తాత్పర్యం : ఆ విధంగా శివుని జడలనుండి విడువబడిన గంగా నది ఏడుపాయలుగా రూపాంతరం చెందింది. భాసురహ్లాదినీ, పావనీ, నందినీ అనే మూడు పేర్లు గల మహానదులు ఇంద్రుడు పాలించే తూర్పు వైపుకు వెళ్ళాయి. సీతా, సుచక్షు, సింధు అనే మూడు పేర్లు గల ప్రవాహాలు పశ్చిమ దిశకు వెళ్ళాయి. ఏడవదైన ఒక ప్రవాహం ఎంతో అందంగా తన వద్దకు రావడం గమనించిన భగీరథుడు గంగానది తనను అనుసరించి రాగా అందమైన గొప్ప రథంపై ఎక్కి కదిలాడు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం

20వ పద్యం :

తే||
హర తనుస్రుష్టమగుటచే నతిపవిత్ర,
మయ్యె నమరాపగాతోయ మనుచు నింద్ర
ముఖ్యసురయక్షగంధర్వమునిగణములు,
కోర్కులలరంగఁ బలుమాఱుఁగ్రుంకెనందు.

ప్రతిపదార్థం :

హర = శివుని
తను = శరీరాన్ని
స్ర్పుష్టము + అగుటచేన్ = స్పర్శించినందున
అతి పవిత్రమయ్యెన్ = ఇంకా పవిత్రంగా మారింది
అమర + ఆపగ = దేవనది యొక్క
తోయము = జలము
అనుచున్ = అనుకుంటూ
ఇంద్రముఖ్యసుర = ఇంద్రుడు మొదలైన దేవతలు
యక్షగంధర్వ = యక్షులు, గంధర్వులు
మునిగణములు = మునుల సమూహాలు
కో ర్కు లలరంగఁ = వారి కోరికలు తీరేలాగా అనేకసార్లు
పలుమాఱు = అనేక సార్లు
గ్రుంకెనందు = అందులో దుమికారు

తాత్పర్యం : శివుని శరీరాన్ని తాకినందున మరింత పవిత్రంగా మారిన దేవనది యొక్క జలములు అనుకుంటూ ఇంద్రుడు మొదలైన దేవతలు, యక్షులు, గంధర్వులు, మునుల సమూహాలు వారి కోరికలు తీరేలాగా అనేకసార్లు నదిలో స్నానం చేశారు.

21వ పద్యం :

ఆ||
అంత జహ్నుఁ డను మహారాజు యజ్ఞంబు,
సేయుచుండ నమర సింధు వతని
యజ్ఞశాల ముంప నాతఁ డన్నది మ్రింగె,
జలధి మ్రింగు కుంభజన్ముఁడట్లు.

ప్రతిపదార్థం :

అంత = అపుడు
జహ్నుఁ డను = జహ్నువు అనే పేరుగల
మహారాజు = మహారాజు
యజ్ఞంబు = యజ్ఞం
సేయుచుండన్ = చేస్తుండగా
అమర సింధువు = దేవనది
అతని = ఆ జహ్నువు యొక్క
యజ్ఞశాల = యజ్ఞశాలను
ముంపన్ = ముంచి వేయగా
ఆతఁడు = ఆ జహ్నువు
జలధి = సముద్రాన్ని
కుంభజన్ముఁడట్లు = అగస్త్యుని లాగ
ఆ + నదిన్ = ఆ గంగా నదిని
మింగె = మ్రింగాడు

తాత్పర్యం : అపుడు జహ్నువు అనే మహారాజు యజ్ఞం చేస్తుండగా గంగానది అతని యాగశాలను ముంచి వేసింది. దానికి కోపించిన జహ్నువు సముద్రాన్ని మింగిన అగస్త్యునిలాగా ఆ నదిని మింగినాడు.

22వ పద్యం :

సీ|| దానికి సుర లద్భుతం బొంది రాజర్షి
వరుఁడైన జహ్ను భూవల్లభునకు
నిట్లని రో మానవేశ! తావక తపం
బత్యమోఘము గదా యవనిలోన !
నధిప ! నిప్పీతవారిధి యగస్త్యుఁడు నేఁడు,
విస్మృతుండయ్యె నీ విపుల మహిమ
గర్వ మంతయుఁ బాసె గంగకు నిఁక నీదు,
తనయయై వర్తించు ధరణిలోనఁ

ఆ|| గాన దీని విడువఁగాఁ దగు నీ వన్న,
నమ్మహానుభావుఁ డపుడు తనదు
శ్రుతుల వలననుండి సురసరిత్ప్రవరను,
విడిచె దివిజు లెల్ల విస్మితులుగ.

ప్రతిపదార్థం:

దానికి = అప్పుడు
సురలు = దేవతలు
అద్భుతం బొంది = ఆశ్చర్యం పొంది
రాజర్షివరుఁడైన = రాజ ఋషులలో శ్రేష్ఠుడైన
జహ్ను భూవల్లభునకున్ = జహ్నువు అనే రాజుతో
ఇట్లనిరి = ఈ విధంగా అన్నారు
ఓ మానవేశ ! = ఓ మానవులకు ఈశ్వరా
తావక = తమరి
తపంబు = తపస్సు
అతి + అమోఘము గదా = చాల గొప్పది కదా
అవనిలోన ! = ఈ భూమిపై
నధిప! = గొప్పవాడా!, (రాజా !)
నిష్పీతవారిధి = సముద్రాన్ని తాగిన
యగస్తుడు = అగస్త్య ముని
నేఁడు = ఈ రోజు
నీ విపుల మహిమన్ = = నీ గొప్ప మహిమ చేత
విస్మృతుండయ్యె = గుర్తు లేకుండా అయ్యాడు (మరిపించావు)
గంగకున్ = గంగాదేవి యొక్క
గర్వ మంతయుఁ బాసె = పొగరు అణిగింది
ఇక = ఇక పై
నీదు = నీ యొక్క
తనయయై = కూతురుగా
వర్తించు = గుర్తింపు పొందును
ధరణిలోనఁ = భూమిపై
గాన = కావున
దీనిన్ = ఈ గంగను
నీవు విడువఁగాఁ దగున్ = నీవు విడిచి పెట్టవలెను
అన్నన్ = అనగానే
ఆ + మహానుభావుఁడు = ఆ జహ్ను రాజర్షి
అపుడు = అప్పుడు
దివిజుల్ + ఎల్ల = దేవతలందరూ
విస్మితులుగ = = ఆశ్చర్యపడగా
తనదు = తనయొక్క
శ్రుతుల వలన నుండి = శ్రవనేంద్రియాల (చెవుల) నుండి
సురసరిత్ + ప్రవరను = దేవలోకంలో ప్రవహించే నదిని
విడిచెన్ = విడిచిపెట్టాడు

తాత్పర్యం : అప్పుడు దేవతలందరూ ఆశ్చర్యచకితులై రాజర్షులలో శ్రేష్ఠుడైన జహ్నువుతో ఇలా అన్నారు. ఓ మహానుభావా నీ తపస్సు అద్భుతము. ఓ మహారాజా నీ మహిమతో సముద్రాన్ని తాగిన అగస్త్యున్ని మరిపింప చేశావు. గంగాదేవి యొక్క పొగరు (గర్వం) అణిగింది. ఇకపై ఈ భూమిపై ఈ గంగ నీ కూతురుగా గుర్తించబడుతుంది. కావున నీవు గంగను విడువవలెను. అనగానే జహ్ను మహర్షి దేవతలందరూ ఆశ్చర్యపడగా తన చెవుల నుండి గంగను వదిలిపెట్టాడు.

23వ పద్యం :

ఆ||
నాఁటనుండి జహ్నునకు కూఁతు రగుట జా
హ్నవి యనంగ గంగ భువిఁ జరించె
నంత నబ్బగీరథావనీపతి రథం
బనుగమించి చనియె నంబునిధికి.

ప్రతిపదార్థం :

నాఁటనుండి = ఆ రోజు నుండి
జహ్నునకు = జహ్ను మహర్షికి
కూతురగుట = కూతురు కావడం వలన
జాహ్నవి = జాహ్నవి
యనగంగ = అనే పేరుతో
గంగ = గంగాదేవి
భువిఁన్ + చరించెన్ అంతన్ = భూమిపై ప్రవహించింది.
ఆ + భగీరథ + అవనీపతి = భగీరథుడు అనే పేరు గల రాజు యొక్క
రథంబు + అనుగమించి = రథాన్ని అనుసరించి
అంబునిధికి = సముద్రానికి
చనియెన్ = వెళ్ళింది

తాత్పర్యం : ఆ రోజునుండి జహ్ను మహర్షి కూతురు కావున జాహ్నవి అనే పేరుతో గంగానది భూమిపై ప్రవహించింది. భగీరథుని రథాన్ని అనుసరించి (రథం వెంబడి) సముద్రానికి వెళ్ళింది.

24వ పద్యం :

సీ||
అంత శుష్కంబైన యబ్ధిలో సాగరుల్,
ద్రవ్విన వివరంబు దరియఁ జొచ్చి
యబ్బగీరథుఁడు గంగానుగతుండైర
సాతలంబున కేఁగి సగరపుత్ర
భస్మరాసులు దీనభావుఁడై కనునంత,
నగ్గంగ తద్రాసు లన్ని దడిఁయఁ
బ్రవహించెఁ దాన నిష్పాపులై సాగరుల్
దివ్యరూపములొంది దివిజులట్లు.

ఆ||
తక్షణమ విమాన తతులతో నబ్బగీ,
రథుఁడు చూడ నమరరాజి పొగడ
బృథులమైన నాకపృష్ఠ మారోహించి,
వెలసి రతుల హర్ష వివశు లగుచు..

ప్రతిపదార్థం :

అంత = అపుడు
శుష్కంబైన = ఎండిపోయిన
అబ్ధిలో = సముద్రంలో
సాగరుల్ = సగర పుత్రులు
ద్రవ్విన వివరంబు = తవ్వినరంధ్రం (మార్గం)లో
దరియఁ జొచ్చి = తరింప చేయడానికి
ఆ + భగీరథుఁడు = ఆ భగీరథుడు
గంగాగుతుండై = గంగ వెంట రాగా
రసాతలంబునకు + ఏగి = పాతాళానికి వెళ్లి
సగరపుత్ర = సగర పుత్రుల
భస్మరాసులు = బూడిద కుప్పలను
దీనభావుఁడై = దీన భావముతో
కనునంతన్ = చూస్తుండగా
ఆ + గంగ = ఆ గంగానది
తత్ + రాసులన్ని = ఆ కుప్పలన్నిటిని
ద డియాఁ = తడిచే విధంగా
బ్రవహించెఁ = ప్రవహించింది
దాన = కావున
నిష్పాపులై = పాపము పోయిన వారై
సాగరుల్ = సగర పుత్రులు
దివ్యరూపములొంది = దివ్యమైన రూపాలు పొంది
దివిజులట్లు = దేవతలలాగా
తక్షణమ = ఆ క్షణంలో
విమాన తతులతో = విమాన వరుసలతో
ఆ + భగీరథుఁడు = ఆ భగీరథుడు
చూడన్ = చూస్తుండగా
అమరరాజి = దేవతల సమూహం
పొగడ = పొగిడే విధంగా
అతుల = అసామాన్యమైన
వివశులగుచు = పట్టరాని
హర్ష = ఆనందంతో
బృథులమైన = గొప్పదైన
నాకపృష్ఠమారోహించి
వెలసిరి = స్వర్గాన్ని చేరుకున్నారు

తాత్పర్యం : అపుడు ఎండిపోయిన సముద్రంలో సాగరులు తవ్విన మార్గంలో వారిని తరింపజేయడానికి గంగ తనవెంట రాగ భగీరథుడు పాతాళానికి వెళ్లి సగరపుత్రుల బూడిద కుప్పలను దీనంగా చూశాడు. ఆ బూడిదకుప్పలు తడిసేవిధంగా గంగ ప్రవహించింది. కావున వారు పాపములు పోయినవారై దివ్యరూపాలను పొంది, దేవతలలాగా విమానాలలో దేవతల సమూహం అభినందిస్తుండగా, అసామాన్య రీతిలో పట్టరాని ఆనందంతో భగీరథుడు చూస్తుండగా గొప్పదైన స్వర్గాన్ని అధిరోహించారు. (స్వర్గానికి చేరుకున్నారు)

25వ పద్యం :

చ||
అపుడు చతుర్ముఖుండు దివిజావృతుఁడై చని యబ్బగీరథుం
గృప దళుకొత్తఁ జూచి పలికెన్ సగరాదులచేతఁ గాని యీ
యపరిమిత ప్రతిజ్ఞ యను నబ్ధిఁ దరించితి వత్స నీవు, నీ
తపము నుతింపఁగా సకలదైవత కోటులకైన శక్యమే !

ప్రతిపదార్థం :

అపుడు = అప్పుడు
చతుర్ముఖుండు = బ్రహ్మ
దివిజ + ఆవృతుఁడై = దేవతా సమూహముచే
చనిన్ = వెళ్లి
ఆ + భగీరథున్ = ఆ భగీరథున్ని
గృపన్ + తళుకొత్తఁ = కరుణతో
చూచి = చూసి
పలికెన్ = (ఈ విధంగా) పలికాడు
సగరాదులచేతఁ గాని = సగరుడు మొదలైన వారిచే సాధ్యం కాని
ఈ + అపరిమిత = ఈ గొప్ప
ప్రతిజ్ఞ యనున్ = ప్రతిజ్ఞ అనే
అబ్ధిఁని + తరించితివి = సముద్రాన్ని దాటావు
వత్స = కుమారా
నీవు = నిన్ను
నీ తపమున్ = నీ తపస్సును
నుతింపఁగా = మెచ్చుకోవడం
సకల = అందరు
దైవత కోటులకైన = దేవతల సమూహానికైనా
శక్యమే ! = సాధ్యమా ! (సాధ్యం ‘కాదు అని భావం)

తాత్పర్యం : అపుడు బ్రహ్మ దేవతలందరితో కలిసి వెళ్ళి భగీరథున్ని కరుణతో చూసి ఈ విధంగా పలికాడు. “కుమారా! సగరుడు మొదలైన మీ పూర్వీకులకు ఈ ప్రతిజ్ఞ అనే సముద్రాన్ని తరించడం సాధ్యంకాలేదు. దానిని సాధించిన నిన్ను నీ తపస్సును మెచ్చుకోవడం సమస్త దేవతా సమూహాలకు కూడా సాధ్యం కాదు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం

26వ పద్యం :

సీ||
దేవయుగంబున దేవతాహితమున
కై కుంభజుండు ము న్నబ్ధి గ్రోలెఁ
దత్కారణంబున ధరను శుష్కీభూత
మై యుండె నిందాఁక నప్పయోధి;
నృప ! సాగరుఁడవైన నీవు నేఁ డిగ్గంగ,
నీటిచే సంభోధి నించు కతన
సాగరుండన మూఁడు జగములఁ బెంపొందు;
నయ్యబ్ధి యెందాఁక నవని మెఱయుఁ

ఆ||
బృధులమైన నాకపృష్ఠమం దందాఁక,
సంచరింపఁగలరు సగరసుతులు;
అనఘ! నీవు నట్ల యస్మ దుద్దామా ధా
మమున నుండఁగలవు మనుజనాథ !

ప్రతిపదార్థం:

దేవయుగంబున = సత్య యుగంలో
దేవతాహితమునకై = దేవతల మేలు కొరకు
కుంభజుండు = కుండనుండి జన్మించిన వాడు (అగస్త్యుడు)
మున్ను + అబ్దిన్ = మునుపు సముద్రాన్ని
గ్రోలెఁన్ = త్రాగాడు
తత్కారణంబున = ఆ కారణముతో
ధరను = భూమిపై
ఇందాఁక = ఇప్పటివరకు
ఆ + పయోధి = ఈ సముద్రం
శుషీభూతమై = ఎండిపోయి
యుండెన్ = ఉన్నది
నృప ! = రాజా
నీవున్ = నీవు
సాగరుఁడవైన = సగర వంశంలో జన్మించిన వాడవు
నేఁ డు = ఈ రోజు
ఈ + గంగ = ఈ గంగ
నీటిచే = నీటితో
అంభోధిన్ = సముద్రాన్ని
ఇంచు కతన = నింపిన కారణంగా
సాగరుండన = సాగరుడనే పేరుతో
మూఁడుజగములఁ = మూడు లోకాలలో
బెంపొందు = ప్రసిద్ధి చెందును
మనుజనాథ ! = రాజా
ఆ + అబ్ధి = ఆ సముద్రం
యెంకన్ = ఎప్పటివరకు
అవనిన్ = ఈ భూమిపై
మెఱయున్ = వెలుస్తుందో
బృధులమైన = గొప్పదైనా
నాకపృష్ఠమందు = స్వర్గ లోకంలో
అందాఁక = అప్పటిదాకా
సంచరింపఁగలరు = ఉండగలరు
సగరసుతులు = సగరుని పుత్రులు
అనఘ ! = పాపములేని వాడా
నీవున్ = నీవు కూడా
అట్ల = అదే విధంగా
అస్మ దుద్దామ = ఆ కాంతివంతమైన
ధామమునన్ = లోకంలో
ఉండఁగలవు = ఉంటావు

తాత్పర్యం : సత్య యుగంలో దేవతల మేలు కొరకు కుంభ సంభవుడైన అగస్త్యుడు సముద్రాన్ని త్రాగాడు. అప్పటి నుండి సముద్రం ఎండి పోయి ఉంది. సగర వంశంలో పుట్టిన నీవు దేవనది గంగ నీటిచే ఈ సముద్రాన్ని నింపినావు కావున సాగరుడు అనే పేరుతో సముద్రుడు మూడు లోకాలలో పిలువబడుతాడు. ఓ రాజా ఈ భూమిపై ఎప్పటివరకు ఈ సముద్రం ఉంటుందో అప్పటివరకు సగర పుత్రులు స్వర్గంలో నివసిస్తారు. నీవు కూడా అదేవిధంగా ఆ కాంతివంతమైన లోకంలో ఉంటావు.

27వ పద్యం :

ఆ||
జగతి జహ్ను తనయ యగుట నిగ్గంగ జా
హ్నవి యనంగ బరఁగు నవనిలోనఁ
ద్వత్తనూజ యగుటవలన భాగీరథి,
యనఁ జరించు లోకమున నృపాల !

ప్రతిపదార్థం:

నృపాల = ఓ రాజా!
ఈ + గంగ = ఈ గంగా నది
జగతిన్ = ఈ భూమిపై
జహ్ను = జహ్ను మహర్షి
తనయ = కూతురు
అగుటన్ = కావడం వలన
అవనిలోన = ఈ భూమిపై
జాహ్నవి = జాహ్నవి.
అనంగ = అనే పేరుతో
బరగున్ = పిలువబడుతుంది
లోకమున = ఈ లోకంలో
త్వత్ + తనూజ = నీ కూతురు
అగుటవలన = కావడం వలన
భాగీరథి = భాగీరథి
ఆనన్ = అనే పేరుతో
చరించున్ = ప్రవహిస్తుంది

తాత్పర్యం : ఓ రాజా! గంగానది ఈ భూమిపై జహ్ను మహర్షి కూతురు కాబట్టి జాహ్నవి అని, నీ కూతురు కాబట్టి భాగీరథి అనే పేర్లతో ప్రవహిస్తుంది.

కంఠస్థం చేయవలసిన పద్యాలు, ప్రతిపదార్థ, తాత్పర్యములు

కవి పరిచయం : ఈ పద్యం మోతుకూరి పండరీనాథరావు గారు రాసిన శ్రీమత్ పండరీనాథ రామాయణంలోని బాలకాండ ద్వితీయాశ్వాసము నందు భగీరథ ప్రయత్నం అనే పాఠ్యాంశం లోనిది.
(ప్రతిపదార్థ తాత్పర్యాలు రాసే ముందు కవి పరిచయం రాయాలి.)

1వ పద్యం :

చ||
గగన ధునీ నిపాతము జగత్ప్రభుఁడైన త్రిలోచనుండు స
ర్వగుఁడు సహింపఁజాలు ననవద్య తపోమహిమన్ బ్రసన్నుఁ జే
యఁగఁదగు, నాతనిం; గరుణ నాతఁడు మేలని పల్కినన్ సురా
పగ తదుదగ్ర మస్తకముపైఁ బడు దతణమంద భూవరా!

ప్రతిపదార్థం :

భూవరా ! = రాజా
గగన ధునీ = ఆకాశ నది
నిపాతము = పడితే
జగత్ + ప్రభుఁడైన = జగత్తును పాలించే
త్రి లోచనుండు = మూడు కన్నులు కలవాడు
సర్వగుఁడు = సర్వము తెలిసినవాడు
సహింపఁజాలున్ = భరిస్తాడు
అనవద్య = గొప్ప
తపోమహిమన్ = తపో మహిమ చేత
ప్రసన్నున్ + చేయగఁన్ + తగున్ = ప్రసన్నం చేసుకోవడం ఉత్తమం
ఆతని = శివుని
కరుణన్ = కరుణ చూపడంలో
నాడు మేలని = శివుడే ఉత్తముడు అని
పల్కినన్ = చెప్పగా
సుర + ఆపగ = దేవ నది
తత్ + ఉదగ్ర = అతని గొప్ప
మస్తకముపైఁన్ పడు = తలపై పడును
తత్ + క్షణమందు = ఆ క్షణంలో

తాత్పర్యం : ఓ మహారాజా! ఆకాశగంగ పడితే జగత్తుని పాలించేవాడు, మూడు కన్నులు కలవాడు, సర్వం తెలిసిన వాడు, అయిన శివుడు మాత్రమే భరించగలడు. కావున గొప్ప తపస్సుచే శివున్ని మెప్పిస్తే దేవనది అయిన అతని శిరస్సుపై పడుతుంది.

2వ పద్యం :

ఉ||
ఆ సమయంబునందు దివిజాపగ వేగము దుస్సహంబుగాఁ
జేసి మహాఘనధ్వనివిజి న్నిజనిస్వనముల్ జగత్రయ
త్రాసకరంబులై మొరయ దారుణలీల హిమాచలాభమై
భాసీలు శంభుమస్తకముపైఁ బడియెం గడు నద్భుతంబుగాన్. (V.Imp)

ప్రతిపదార్థం :

ఆ సమయంబునందు = ఆ సమయంలో
దివిజ + ఆపగ = దేవలోకంలో ప్రవహించే నది
దుస్సహంబుగా = సహింప రాని
వేగము = వేగంతో
మహాఘనధ్వని = పెద్ద శబ్దం
జేసి = చేసి
విజిన్ + నిజ = గెలవాలనే కోరికతో
నిస్వనముల్ = మ్రోత
జగత్రయ = మూడు లోకాలకు
త్రాసకరంబులై = భయం కలిగించేవిగా
మొరయు = మోగగా
దారుణలీల = భయంకరముగా
హిమాచలాభమై సిలు = హిమాలయ పర్వతము లాగ
భాసిలు = ప్రకాశిస్తున్న
శంభు = శంకరుని
మస్తకము పైఁ = తలపై
కడున్ అద్భుతంబుగాన్ = మిక్కిలి అద్భుతముగా
బడియెన్ = పడింది

తాత్పర్యం : ఆ సమయంలో దేవలోకంలో ప్రవహించే గంగా నది సహింపరాని వేగంతో, గెలవాలనే కోరికతో, పెద్ద శబ్దం చేస్తూ, మూడులోకాలకు భయాన్ని కలిగించే విధంగా మ్రోగుతూ హిమాలయ పర్వతంలాగా ప్రకాశిస్తున్న శివుని తలపై మిక్కిలి అద్భుతంగా పడింది.

3వ పద్యం :

శా||
నానాదేశ నివాసులైన జను లానందంబు సంధిల్ల సు
స్నానంబుల్ సురవాహినీ జలములన్ సంతుష్టులై చేయని
త్యానూనంబగు వైభవంబునఁ దదీయంబౌ పితృవ్రాతమున్
వే నాకంబున కుర్గమించె భయకృత్రేతత్వ నిర్ముక్తమై.

ప్రతిపదార్థం :

నానాదేశ = అనేక ప్రదేశాలలో
నివాసులైన = నివసించే
జనులు = ప్రజలు
ఆనందంబు = ఆనందం
సంధిల్ల = ఉట్టిపడగా
సురవాహినీ = దేవనది యొక్క
జలములన్ = జలములలో
సంతుష్టులై = సంతోషంతో
సుస్నానంబుల్ = స్నానములు
చేయ = చేయగా
నిత్య + అనూనంబగు = శాశ్వతమైన
వైభవంబునఁన్ = వైభవాన్ని
తదీయంబౌ = దానికి సంబంధించిన
వే = వేలమంది (అసంఖ్యాకము)
పితృవాతమున్ = పితరుల సమూహము
భయకృత్ = భయాన్ని కలిగించే
ప్రేతత్వ = ప్రేత తత్వం నుండి
నిర్ముక్తమై = విడిచిన వారై
నాకంబునకున్ = స్వర్గానికి
ఉద్గమించెన్ = వెళ్ళారు

తాత్పర్యం : అనేక ప్రదేశాలలో నివసించే ప్రజలు ఆనందం ఉట్టిపడగా దేవనదీ జలాలలో సంతోషంతో స్నానాలు చేయగా భయాన్ని కలిగించే ప్రేత స్వభావాన్ని వదిలి శాశ్వతమైన వైభవాన్ని కలిగించే స్వర్గానికి చేరుకున్నారు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం

భగీరథ ప్రయత్నం Summary in Telugu

పాఠ్యాంశం పేరు ఏ గ్రంథం నుండి గ్రహించబడినది

TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం 1

కవి పరిచయం

పాఠ్యాంశ పేరు : భగీరథ ప్రయత్నం
ఏ గ్రంధం నుండి గ్రహించబడినది : ప్రస్థుత పాఠ్యభాగం “శ్రీమత్ పండరీనాథ రామాయణం” లోని బాలకాండ ద్వితీయాశ్వాసం లోనిది.
కవి పేరు : మోతుకూరి పండరీనాథరావు
కవి కాలం : 18వ శతాబ్దానికి చెందినవాడు.
స్వస్థలం : ఓరుగల్లు పట్టణానికి సమీపాన గల మడికొండ.
కవిగారి వంశం : మోతుకూరి వంశంలో జన్మించిన పండరీనాథుడు ఆరువేల నియోగిశాఖకు చెందినవాడు.
తల్లిదండ్రులు : వేంకటాబిన్, గోపాలరావు,
తండ్రి ప్రత్యేకత : తండ్రి గోపాలరావు సంస్కృతాంధ్ర భాషలలో మంచి పండితుడు.
గ్రంథం : శ్రీమత్ పండరీనాథ రామాయణం
అంకితం : 7 మే,1810న శంకర జయంతిరోజున శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు.
రచన విశేషత : శ్రీమత్ పండరీనాథ రామాయణంలో వాల్మీకి రామాయణ ఘట్టాలతోపాటు కొన్ని స్వీయకల్పనలు చేయడం వల్ల ఆరుకాండల్లో సుమారు 7,335 పద్యగద్యాలతో రసవత్తర కావ్యంగా పండితలోకం ప్రశంసలు పొందింది.
ఇతర గ్రంథాలు : పండరీనాథుడు సంస్కృతంలో “రామకథా కల్పలత” అనే గ్రంథం రాసినట్లు తెలుస్తుంది. అది అలభ్యం.
కవి శివకేశవ భక్తుడు : శివకేశవులకు సమాన ప్రాధాన్యమిచ్చి సమరసతను ప్రదర్శించాడు.

పాఠ్యభాగ సందర్భం

శ్రీరాముని వంశంలోని పూర్వీకుడు సగరుడు. అయోధ్యను పాలించిన సూర్యవంశంలో ఇతని పూర్వీకులైన ఇక్ష్వాకు, మాంధాత, త్రిశంకు, హరిశ్చంద్రుడు, రఘువు, దశరథుడు మొదలైన వారు పేరుపొందిన చక్రవర్తులు. సగరునికి సుమతి (వైదర్భి), కేశిని (శైభ్య) అనే ఇద్దరు భార్యలున్నారు. వారికి సంతానం కలగక పోవటంచేత, సగరుడు తన భార్యలతో భృగుశ్రవణ పర్వతం చేరి నూరు సంవత్సరాలు తపస్సుచేశాడు.

భృగువు ప్రత్యక్షమై ఒక భార్య అరవై వేలమంది పుత్రులను, మరొక భార్య వంశోద్ధారకుడైన ఒక పుత్రునికి జన్మనిస్తారని దీవించాడు. సుమతి అరవై వేలమందిని, కేశిని ఒక పుత్రుణ్ణి కోరారు. తరువాత కేశిని అసమంజుసునికి, సుమతి ఒక మాంసపుముద్దకు జన్మనిచ్చారు.

వాటిని ఖండాలుగా చేసి నేతికుండలలో వుంచగా అరవై వేలమంది శిశువులు తయారయ్యారు. వీరు పెరిగి ప్రజలను కష్ట పెట్టసాగారు. వీరి గర్వమణిచేందుకు ఇంద్రుడు సగరుని యాగాశ్వాన్ని పాతాళంలోని కపిలమహర్షి ఆశ్రమంలో దాచాడు. సగర చక్రవర్తి కుమారులైన సాగరులు యజ్ఞాశ్వాన్ని కనుగొనే ప్రయత్నంలో కపిలమహర్షి కోపాగ్నికి భస్మమైపోతారు. వారికి ఊర్ధ్వగతులు కల్పించడానికి అసమంజసుడు, అంశుమంతుడు మొదలైన అనేకులు ప్రయత్నం చేశారు. కాని ఎవరూ విజయం సాధించలేదు.

దిలీప చక్రవర్తి కుమారుడైన భగీరథుడు సురగంగను భువికి దింపి, పాతాళంలో ఉన్న సాగరుల భస్మరాసులపై ప్రవహింపజేసి, ఉత్తమగతులను కల్పించడానికి చేసిన ప్రయత్నమే ఈ ‘భగీరథ ప్రయత్నం’ అనే పాఠ్యభాగం. పట్టుదలతో ప్రయత్నిస్తే అసాధ్యాలు సైతం సుసాధ్యమవుతాయనే విషయాన్ని విద్యార్థులకు తెలియజేయడమే ఈ పాఠ్యభాగ ముఖ్యోద్దేశ్యం.

పాఠ్యభాగ సారాంశం

భగీరథుడు బ్రహ్మను వరాలు కోరడం : నాలుగు వైపులా సముద్రంచే చుట్టబడిన భూమండలాన్ని పరిపాలిస్తున్న కోసలరాజు భగీరథుడు. తన పూర్వీకులైన సగర మహారాజు పుత్రులు ఏవిధంగా కపిల మహర్షి కోపానికి భస్మం అయ్యారో మంత్రుల ద్వారా తెలుసుకున్నాడు. వారికి మోక్షం కలిగించాలని సంకల్పించాడు. భగీరథునికి పుత్ర సంతానం లేని కారణంగా తన రాజ్య భారాన్ని మంత్రులకు అప్పగించి, గోకర్ణం వెళ్లి, అక్కడ గొప్ప తపస్సు చేశాడు. గాలిని మాత్రమే ఆహారంగా తీసుకొని, రెండు చేతులు పైకెత్తి, ఐదురకాల అగ్నులమధ్య రాయిలాగా కదలకుండా వేయి సంవత్సరాలు గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ “ఓ మహారాజా! జనులందరూ పొగిడే విధంగా నువ్వు చేసిన తపస్సుకు నేను సంతోషించాను.

నీకు ఏం వరం కావాలో కోరుకో. దానిని తీరుస్తాను”. అని ఎంతో గౌరవంతో అన్నాడు. భగీరథుడు సంతోషించి, రెండు చేతులు జోడించి, నమస్కరించి, వినయంతో తలవంచుకొని ఆ బ్రహ్మను. చూసి సాగరుల భస్మరాశులపై దేవనది నీటిని ప్రవహింప చేయమని మొదటి వరంగా, భూమండలంలో ప్రసిద్ధి పొంది, మంచి గుణాలు కలిగి, మా వంశాన్ని ఉద్ధరించే ఒక కుమారున్ని అనుగ్రహించమని రెండవ వరంగా
కోరాడు.

భగీరథునికి శివుడు ప్రత్యక్షం కావడం : అలా భగీరథుడు కోరుకోగానే బ్రహ్మదేవుడు “ఓ పుణ్యాత్ముడా! నీ వంశాన్ని పెంచేవాడు, తేజస్సు కల కుమారుడు నీకు జన్మిస్తాడు. దివ్యలోకాలలో ప్రవహించే నది భూమిపై పడితే భూమండలం భరించలేదు. ఆకాశగంగను శివుడు మాత్రమే భరించగలడు. కావున గొప్ప తపస్సుచే శివున్ని మెప్పిస్తే దేవనది అయిన గంగ అతని శిరస్సుపై పడుతుంది” అని చెప్పి బ్రహ్మ అదృశ్యం అయ్యాడు. అపుడు భక్తితో కాలి బొటన వేలును మాత్రమే భూమిపై మోపి, తన హృదయాన్ని పద్మంగా మార్చుకొని శంకరుని గూర్చి కఠినమైన తపస్సు చేశాడు.

ఆ రాజు తపస్సుకు మెచ్చిన శివుడు ఆప్యాయతతో “ఓ రాజా! నీ తపస్సుకు నేను సంతోషించాను. దేవలోకంలోని నీటి ప్రవాహాన్ని నా తలపై భరిస్తాను” అని చెప్పగా రాజు సంతోషించి, కన్నులు తెరచి, శంకరున్ని చూసి, మనస్ఫూర్తిగా మొక్కి కీర్తించి తాను విజయం సాధించిన వాడుగా మనసులో భావించాడు.

గంగ శివుని జటాజూటంలో చిక్కుకొనుట : శివుడు ఇచ్చిన మాటకు కోపగించిన గంగ తన ప్రవాహ వేగంతో శివున్ని పాతాళానికి తొక్కి వేస్తాను అని భావించింది. గంగాదేవి గర్వానికి అత్యంత కోప స్వభావుడైన శివుడు ఆమె గర్వాన్ని తొలగించాలి అని మనస్సులో అనుకున్నాడు. ఈ విధంగా గంగా, శివుడు ఇద్దరూ ఒకరిని మరొకరు ఓడించాలని అనుకుంటున్న విషయం తెలుసుకున్న బ్రహ్మ మొదలైన దేవతలందరూ ఆ సన్నివేశాన్ని చూడటానికి వచ్చారు. దేవతలు తమ విమానాలలో వచ్చేసరికి ఆ విమానాల తేజస్సుతో ఆకాశం వేల సూర్య మండలాలుగా వెలిగింది.

ఆ సమయంలో దేవలోకంలో ప్రవహించే గంగానది సహింపరాని వేగంతో, గెలవాలనే కోరికతో, మూడులోకాలకు భయాన్ని కలిగించే విధంగా పెద్ద శబ్దంతో మ్రోగుతూ హిమాలయ పర్వతంలాగా ప్రకాశిస్తున్న శివుని తలపై పడింది. ఈ విధంగా శివుని తలపై పడి బయటకి రాలేక శివుని మాయచే నిలువరింపబడి ఆ శివుని జడలనే అడవిలో ఎన్నో సంవత్సరాలు మబ్బులలో కదులుతున్న మెరుపులాగా తిరుగుతూ ఉంది.

దేవతలందరూ శంకరుని వద్దకు వచ్చి, నమస్కరించి, కీర్తించి మూడు లోకాలకు పాలకుడా! నీ గొప్ప మహిమ తెలియక దేవనది అయిన గంగ ప్రదర్శించిన గర్వము నీ మాయచేత నశించింది. ఓ సర్వేశ్వరా! ఈ నీ సృష్టిలో పర్వతసమాలు చిన్న పరమాణు విలువను కూడా పొందలేవు. ఈ విధమైన నీ సమతాభావం గంగానదికి తెలియదు.

శివుడు గంగను వదులుట : సర్వలోకాలను పాలించేవాడా! నిజభక్తుడైన భగీరథునిపై గల కరుణతో అయినా దేవనదిని విడుదల చేయవలెను. ఈ గంగా జలముతో సగరపుత్రుల ప్రేతాత్మలు శాంతిని పొందుతాయి. మానవ లోకానికి, పాతాళ లోకానికి గొప్పతనము కలుగుతుంది అని దేవతలు వేడుకొనగా పరమశివుడు నవ్వి, పరమ సంతోష హృదయుడై ఆ గంగా నదిని సముద్రంలోకి వదిలాడు. శివుని జడలనుండి విడువబడిన గంగానది ఏడు పాయలుగా రూపాంతరం చెందింది. భాసురహ్లాదినీ, పావనీ, నందినీ అనే మూడు పేర్లు గల మహానదులు ఇంద్రుడు పాలించే తూర్పు వైపుకు వెళ్ళాయి.

సీతా, సుచక్షు, సింధు అనే మూడు పేర్లు గల ప్రవాహాలు పశ్చిమ దిశకు వెళ్ళాయి. ఏడవదైన ఒక ప్రవాహం ఎంతో అందంగా ఆ భగీరథుని వద్దకు బయలుదేరింది. అలా గంగా నది తనవెంట రావడం గమనించిన భగీరథుడు గొప్ప రథంపై ఎక్కి కదిలాడు.

గంగ జహ్నుమహర్షి యాగశాలను ముంచుట : అనేక ప్రదేశాలలో నివసించే ప్రజలు ఆనందం ఉట్టిపడగా దేవనదీ జలాలలో సంతోషంగా స్నానాలు చేశారు. వారంతా భయాన్ని కలిగించే ప్రేత స్వభావాన్ని వదిలి శాశ్వతమైన వైభవాన్ని కలిగించే స్వర్గానికి చేరుకున్నారు. శివుని శరీరాన్ని తాకినందున మరింత పవిత్రంగా మారిన దేవనది జలములు అనుకుంటూ ఇంద్రుడు మొదలైన దేవతలు, యక్షులు, గంధర్వులు, మునుల సమూహాలు వారి కోరికలు తీరేలాగా అనేక సార్లు ఆ నదిలో స్నానం చేశారు.

జహ్నువు అనే మహారాజు యజ్ఞం చేస్తుండగా గంగానది అతని యాగశాలను ముంచి వేసింది. దానికి కోపించిన జహ్నువు సముద్రాన్ని మింగిన అగస్త్యునిలాగా ఆ నదిని మింగినాడు. దేవతలందరూ ఆశ్చర్యచకితులై రాజర్షులలో శ్రేష్ఠుడైన జహ్నువుతో ఇలా అన్నారు. ఓ మహానుభావా నీ తపస్సు అద్భుతము. నీ మహిమతో సముద్రాన్ని తాగిన అగస్త్యున్ని మరిపింప చేశావు. గంగాదేవి పొగరు (గర్వం) అణిగింది.

ఇకపై ఈ భూమిపై గంగ నీ కూతురుగా గుర్తించబడుతుంది. కావున నీవు గంగను విడువవలెనని అనగానే జహ్ను మహర్షి దేవతలందరూ ఆశ్చర్యపడగా తన చెవుల నుండి గంగను వదిలిపెట్టాడు. ఆ రోజునుండి జహ్ను మహర్షి కూతురు కావున జాహ్నవి అనే పేరుతో గంగానది భూమిపై ప్రవహించింది. భగీరథుని రథం వెంబడి సముద్రానికి వెళ్ళింది.

ఎండిపోయిన సముద్రంలో, సాగరులు తవ్విన మార్గం ద్వారా, గంగ తనవెంట రాగ, భగీరథుడు పాతాళానికి వెళ్లి, సగరపుత్రుల బూడిద కుప్పలను దీనంగా చూశాడు. ఆ బూడిదకుప్పలు తడిసేవిధంగా గంగ ప్రవహించింది. కావున వారు (సాగరులు) పాపములు పోయినవారై, దివ్యరూపాలను పొంది, దేవతలలాగా విమానాలలో దేవతల సమూహం అభినందిస్తుండగా, అసామాన్య రీతిలో, పట్టరాని ఆనందంతో భగీరథుడు చూస్తుండగా గొప్పదైన స్వర్గాన్ని అధిరోహించారు. (స్వర్గానికి చేరుకున్నారు

సగర పుత్రుల శాపవిమోచనం : బ్రహ్మ, దేవతలందరితో కలిసి వెళ్లి భగీరథుణ్ణి కరుణతో చూసి ఈ విధంగా పలికాడు. “కుమారా! సగరుడు మొదలైన మీ పూర్వీకులకు సాధ్యంకాని ప్రతిజ్ఞా అనే సముద్రాన్ని నీవు దాటావు. నిన్నూ, నీ తపస్సును మెచ్చుకోవడం సమస్త దేవతా సమూహాలకు కూడా సాధ్యం కాదు. సత్య యుగంలో దేవతల మేలు కొరకు కుంభసంభవుడైన అగస్త్యుడు సముద్రాన్ని తాగాడు.

(కాలకేయులనే రాక్షసులు దేవతలకు కనబడకుండా సముద్రంలో దాక్కున్నారు. వారిని బయటకు తీసుకురావడానికి అగస్త్యుడు సముద్రాన్ని పూర్తిగా తాగాడు. అప్పటి నుండి సముద్రం ఎండిపోయి ఉంది. సగర వంశంలో పుట్టిన నీవు దేవనది నీటిచే ఈ సముద్రాన్ని నింపినావు కావున సాగరుడు అనే పేరుతో ఈ సముద్రుడు మూడు లోకాలలో పిలువబడుతాడు. ఓ రాజా! ఈ భూమిపై ఎప్పటివరకు ఈ సముద్రం ఉంటుందో, అప్పటి వరకు సగర పుత్రులు స్వర్గంలో నివసిస్తారు.

నీవు కూడా అదేవిధంగా ఆ గొప్ప లోకంలో ఉంటావు. ఓ రాజా! గంగానది ఈ భూమిపై జహ్ను మహర్షి కూతురు కాబట్టి జాహ్నవి అని, నీ కూతురు కాబట్టి భాగీరథి అనే పేర్లతో ప్రవహిస్తుంది అని బ్రహ్మదేవుడు దీవించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 2 సింధూ నాగరికత, వేద సంస్కృతి

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 2nd Lesson సింధూ నాగరికత, వేద సంస్కృతి Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 2nd Lesson సింధూ నాగరికత, వేద సంస్కృతి

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సింధూ నాగరికత (హరప్పా నాగరికత) ముఖ్య లక్షణాలు రాయండి.
జవాబు.
హరప్పా నాగరికత ప్రపంచంలోని ప్రాచీన నాగరికతలైన మెసపటేమియా(ఇరాక్), ఈజిప్టకు సమకాలీనమైనది. వారికంటే ఉన్నతమైనది. వారి సంస్కృతిలోని ప్రధానాంశాలు.
హరప్పా లిపి : హరప్పా లిపి తొలిసారిగా క్రీ.శ. 1853లో గుర్తించారు. అయితే ఇంత వరకు దానిని ఎవరూ చదవలేకపోయారు. హరప్పా లిపి ‘చిత్రలిపి’ విభిన్న చిత్రాల రూపంలో ఉంది. కొందరు ఇది ద్రవిడమని, ఇంకొందరు ప్రోటోద్రవిడియన్ అని, సంస్కృతం అని భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. హరప్పా లిపిని చదవలేకపోవడం వలన వారు సాహిత్యానికి చేసిన సేవను, వారి ఆలోచనలను తెలుసుకోలేకపోతున్నారు.

నగర నిర్మాణ పద్ధతి : హరప్పా నాగరికత నగర నాగరికతకు ప్రసిద్ధి చెందింది. హరప్పా మొహంజోదారో నగరాల్లోని వీధులు ఉత్తరం నుంచి దక్షిణానికి ఉపవీధులను తూర్పు నుంచి పడమరకు ఒక క్రమ పద్ధతి గల ‘గ్రిడ్ పద్ధతి’లో నిర్మించారు. రహదారి సూత్రాలకనుగుణంగా విశాలమైన రహదారులు ఏర్పాటు చేసుకున్నారు.

భూగర్భ మురుగునీటి కాలువలు : ఇది హరప్పా నాగరికత యొక్క ప్రత్యేకాంశం. ప్రతి ఇంటి నుంచి మురికినీరు వీధుల్లోని భూగర్భ మురుగు కాలువలలోకి చేరేవి. ఇది నేటి ఆధునిక కాలంలోని డ్రైనేజి వ్యవస్థకు ధీటుగా ఉన్న వ్యవస్థ. ఈ మురుగునీరు అంతా ఊరి చివరకు నదిలో కలిపేవారు.

కాల్చిన ఇటుకలు : వీరు ఇటుకల తయారీలో సిద్ధహస్తులు. ఇటుకల తయారీలో మట్టిని వాడారు. స్నానపు గదులు, బావులు వంటి వాటికి ‘L’ ఆకారంలో ఉండే ఇటుకలను వాడారు. కాల్చిన ఇటుకలు తయారు చేయడం వారి సాంకేతిక ఉన్నతికి సూచిస్తుంది.

రాజకీయ వ్యవస్థ : హరప్పాలో దొరికిన ఆధారాలతో నాటి ప్రభుత్వాన్ని గురించి కాని, నాటి పాలనావ్యవస్థ గురించి స్పష్టమైన సమాచారం లభించలేదు.
వ్యవసాయం : గోధుమలు, బార్లీ, బఠాణీలు, నువ్వులు, ఆవాలు హరప్పా ప్రజల ఆహార పంటలు. లోథాల్, రంగపూర్లో వరి పండించినట్లు తెలుస్తోంది. పత్తిని తొలిసారిగా పండించింది హరప్పావాసులే.

వ్యాపారం : నాడు స్వదేశీ, విదేశీ వ్యాపారాలు సాగాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెండిని, కర్నాటకలోని కోలార్ గనుల నుంచి బంగారాన్ని, రాజస్థాన్లోని భేత్రి గనుల నుంచి రాగిని దిగుమతి చేసుకొనేవారు. వ్యాపార లావాదేవీలు వస్తుమార్పిడిలో సాగేవి.

TS Inter 1st Year History Study Material Chapter 2 సింధూ నాగరికత, వేద సంస్కృతి

ప్రశ్న 2.
సింధు నగర ప్రణాళికల గురించి చర్చించండి.
జవాబు.
నగరాలు, పట్టణాలు అభివృద్ధి చెందడమనేది హరప్పా నాగరికతలోని ప్రధాన అంశం. మిగులు వ్యవసాయ ఉత్పత్తుల వల్లనే నగరీకరణ సాధ్యమవుతుంది. మొహంజోదారో, హరప్పా, చన్హుదారో, లోథాల్ ఇతర నగరాలు మన దేశంలో తొలి పట్టణీకరణకు అద్దంపడుతున్నాయి. సింధూ నాగరికతలో నగర నిర్మాణం అనేది ఒక ప్రత్యేకమైన అంశంగా చెప్పవచ్చు. స్వల్ప తేడాలున్నప్పటికీ, సింధూ నాగరికత ప్రధాన నగరాలలో దాదాపుగా ఒకే రకమైన నగర నిర్మాణ పద్ధతులను చేపట్టారు.

కోట ప్రాంతం : హరప్పా, మొహంజోదారోలోని కట్టడాలు పెద్దగా, ఆకర్షణీయంగా ఉన్నాయి. వారి నగర ప్రణాళిక ద్వారా, నాటి నగర జీవితాన్ని గురించి కచ్చితమైన అభిప్రాయాలు ఏర్పరచుకొనేందుకు వీలవుతుంది. ఈ రెండు నగరాల్లోనూ, పశ్చిమ దిశలో కోటలు, ప్రహరీలు ఉన్నాయి. కోటలు పశ్చిమంవైపు ద్వారం కలిగి ఉండేవి. ఇవి విపత్కర సమయాల్లో ప్రజలకు రక్షణ కల్పించేవి. మిగతా సమయాల్లో సామాజిక కేంద్రాలుగా ఇవి ఉపయోగపడేవి. తవ్వకాల్లో బయల్పడిన ఈ పెద్ద కోటలవల్ల నాడు కేంద్రీకృత పరిపాలనా వ్యవస్థ ఉన్నట్లుగా భావించవచ్చు. ప్రముఖ ప్రజాసంబంధిత కట్టడాలు కోట లోపల ఉన్నాయి. ఈ రెండు నగరాల్లో కోటకు దిగువ ప్రాంతంలో తూర్పు వైపున నివాస ప్రాంతముంది. హరప్పాలోని కోట 1400 అడుగుల పొడవు 600 అడుగుల వెడల్పుతో 40 అడుగుల ఎత్తును కలిగి ఉంది. కోట గోడ పునాదుల వద్ద 45 అడుగుల వెడల్పు మేర ఇటుకలను ఉపయోగించారు. మొహంజోదారోలోని కోట పెద్ద భవనాలను కలిగి ఉంది. కొలతల్లో తేడా ఉన్నప్పటికీ మిగతా సింధూ నగరాల్లో కూడా ఇలాంటి కోట నిర్మాణ ప్రాంతాలనే చూడవచ్చు. కాలీబంగన్లో హరప్పా వలే, కోట దిగువన నివాస ప్రాంతం ఉంది. అయితే చన్హుదారోలో మాత్రం కోట లేదు.

హరప్పా, మొహంజోదారో నగరాల్లోని ప్రధాన వీధులు ఉత్తరం నుంచి దక్షిణానికి, వాటికి అనుబంధంగా ఉప వీధులను తూర్పు నుంచి పడమరకు నిర్మించారు. మొహంజోదారో, హరప్పా నగరాల్లో ఒక క్రమ పద్ధతిగల గ్రిడ్ పద్ధతిలో రహదారులను నిర్మించారు. రహదారి సూత్రాల మేరకు వాహనాలు సులభంగా తిరిగేందుకు వీలుగా రహదారులను నిర్మించారు. పశ్చిమ కూడలి ప్రాంతం తప్ప మిగతా అంతా ప్రత్యేక నివాసాలుగా ఏర్పాటుచేశారు. ఒకే పరిమాణం గల ఇటుకలను భవన నిర్మాణంలో ఉపయోగించారు. నిర్మాణాల్లో రాయి, చెక్క కూడా ఉపయోగించడమైంది. లోతట్టు ప్రాంతాల్లో ఎత్తైన వేదికలపైన నిర్మాణాలు చేశారు.

మురుగు నీటి కాలుకలు : హరప్పా నాగరికత నగర ప్రత్యేకత మురుగు నీటి కాలువల నిర్మాణం. హరప్పా సంస్కృతిలోని అన్ని నగరాలు, పట్టణాల్లో చిన్న, పెద్ద గృహాలు ప్రహరీలు, స్నానపు గదులు కలిగి ఉండేవి. ఇంట్లో ఉపయోగించిన మురుగు నీరు వీధుల్లో రహదారి పక్కన ఉన్న మురుగు కాలువకు చేరేది. ఇవి భూగర్భ మురుగు కాలువలు. వీటి మధ్యలో అక్కడక్కడా శుభ్రపరిచేందుకు మనిషి దూరేందుకు వీలుగా రంధ్రాలు ఉండేవి. వీటిపైన మూతలను ఏర్పాటు చేశారు. వీటిని బట్టి హరప్పా వాసులు పరిశుభ్రత విషయంలో గొప్ప పరిణతికలవారని చెప్పవచ్చు.

TS Inter 1st Year History Study Material Chapter 2 సింధూ నాగరికత, వేద సంస్కృతి 1
ఇటుకల తయారీలో వీరు సిద్ధహస్తులు. ఇటుకల తయారీకి మట్టిని ఉపయోగించారు. ఇటుకల తయారీ కోసం 1 : 2 : 4 నిష్పత్తుల్లో ఉన్న అచ్చులను ఉపయోగించారు. హరప్పా మరియు మొహంజోదారో ప్రాంతాల్లో కలప సమృద్ధిగా దొరకడంతో అక్కడ కాల్చిన ఇటుకలను భారీ స్థాయిలో వినియోగించారు. స్నానపు గదులు, బావిచుట్టూ ఉండే కాలువలకు ‘L’ ఆకారంలో ఉండే ఇటుకలను వాడారు. ఎక్కువ అంతస్తులు ఉన్న గృహాల్లో నిలువు మురుగు నీటి గొట్టాలను ఏర్పాటు చేశారు. స్నానాల గదులను వీధులకు ఆనుకొని నిర్మించారు. మొత్తం మీద సింధూ నగర నిర్మాణాల గురించి, ఒక సామాన్య పరిశీలకుడిని కూడా మెప్పించే విషయం. నాటి ప్రజలు పౌర, ప్రజా సంబంధ పారిశుద్ధ్య అంశాలపై చూపిన శ్రద్ధ, ప్రాధాన్యతలే.

మహా స్నానవాటిక : మొహంజోదారోలోని నిర్మాణాల్లో ‘మహా స్నానవాటిక’ ప్రధానమైంది. ఇది కోటలోపల ఉంది. ఇది గొప్ప నిర్మాణ కౌశల్యానికి నిదర్శనం. ఇది 11.88 × 7.01 మీటర్ల పొడవు, వెడల్పులను 2.4 మీటర్ల లోతును కలిగి ఉంది. కొలనుకు చుట్టూ మెట్ల మార్గం ఉంది. చుట్టూ దుస్తులు మార్చుకొనేందుకు గదులు ఉన్నాయి. స్నానవాటిక అడుగు భాగం కాల్చిన ఇటుకలతో నిర్మించబడింది. గదుల వెనక వైపున ఉన్న బావి నుంచి నీరు స్నానవాటికలోకి చేరేందుకు, ఉపయోగించిన నీరు మురుగు కాలువలోకి వెళ్ళేందుకు మార్గాలను ఏర్పాటు చేశారు. ప్రజావసరాల కోసం లేక మత అవసరాల కోసం ఉపయోగించేందుకు ఈ స్నానవాటికను నిర్మించారో కచ్చితంగా చెప్పలేం.
TS Inter 1st Year History Study Material Chapter 2 సింధూ నాగరికత, వేద సంస్కృతి 2

ప్రశ్న 3.
సింధు నాగరికత కాలంనాటి సామాజిక, ఆర్థిక, మతపరిస్థితులను వివరించండి.
జవాబు.
సామాజిక పరిస్థితులు: సింధూ నాగరికత జాతి నిర్మాతలు ఎవరనే విషయమై చరిత్రకారులు వివిధ రకాల అభిప్రాయాలను వెలిబుచ్చారు. సింధూ ప్రజల కంకాళాల (పుర్రెలు) శాస్త్రీయ పరిశోధన వల్ల సింధు ప్రజల్లో నాలుగు జాతులు ఉండేవని తెలుస్తుంది. 1. ప్రోటో-ఆస్ట్రలాయిడ్స్, 2. మెడిటరేనియన్, 3. మంగోలాయిడ్స్, 4. ‘ఆల్పైన్. ఆచార్య భాష్యం అభిప్రాయం ప్రకారం తొలుత ప్రోటో ఆస్ట్రలాయిడ్ వారు ఉండేవారు. తరువాత మెడిటరేనియన్ వారు వచ్చి చేరడంతో నాగరికతా లక్షణాలు ప్రారంభమయ్యాయి. క్రమంగా మెడిటరేనియన్లు వివిధ ప్రాంతాలకు విస్తరించి స్థానిక జాతులతో కలిసిపోవడంతో ద్రవిడ జాతి ఆవిర్భవించింది. సింధూ ప్రజల మతం, సంస్కృతీ లక్షణాలు ద్రావిడుల మత లక్షణాలను పోలి ఉండటం వల్ల సింధు ప్రజలు ద్రావిడులుగా పేర్కొనబడుతూ ఉన్నారు. సింధు ప్రజలు టర్కో ఇరానియన్లు అనీ, ద్రావిడ భాష అయిన ‘బ్రాహుయ్’ మాట్లాడారని కొందరు చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.

సింధూ నాగరికత ప్రధాన లక్షణం పట్టణీకరణ. అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాలు కూడా సామాజిక, సాంస్కృతిక అభివృద్ధిలో పాలుపంచుకొన్నాయి. ధనవంతులు, ప్రభావశీలురు పెద్ద భవనాల్లో నివసించేవారనీ, మిగిలిన వారు చిన్న ఇళ్ళలో నూ, కార్మికులు ఒకే గదిలో నివాసం ఉన్నట్లు పురావస్తు ఆధారాలు తెలియచేస్తున్నాయి. వీరు ప్రధానంగా గోధుమ, పాలు, పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకొనేవారు. వీటితోపాటుగా చేపలు, మాంసాహారం కూడా తీసుకొనేవారు. తవ్వకాల్లో బయటపడిన మేకలు, జింకలు, దున్నపోతులు, పందులు, తాబేళ్ల అవశేషాలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. నాటి జంతుబలుల ఆచారాన్ని మనం గమనించవచ్చు. అలాగే కోళ్ల పందెంను చిత్రించిన ఒక ముద్రిక కూడా దొరికింది.

పత్తిని పండించి, వస్త్రాలను నేసుకొనేవారు. వారి ఆభరణాలు ఇప్పటికీ చెప్పుకోదగిన రీతిలో తయారు చేయబడ్డాయి. బంగారం, వెండి, కంచు, ముత్యాలు, స్టియటైట్ మరియు బంకమట్టితో వీటిని తయారు చేసేవారు. వడ్డాణం, గాజులు, చెవి కమ్మలు, దండలు మొదలగు వివిధ రకాల ఆభరణాలను స్త్రీలు ధరించేవారు. ఇలాగే గృహాలంకరణ కోసం మరియు చిన్న పిల్లల ఆటల కోసం రకరకాల మట్టి బొమ్మలు తయారు చేసేవారు.

ఆర్థిక పరిస్థితులు : సింధూ నాగరికత ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం మరియు వ్యాపారంపైనే ఆధారపడింది. వీరు విరివిగా వ్యవసాయం చేశారు. సింధూ గ్రామాలు ఎక్కువభాగం నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉండి ఆహారధాన్యాలను సమృద్ధిగా పండించాయి. గ్రామస్థులు తమ అవసరాలకే కాకుండా వృత్తి పనివారు, వ్యాపారులు వంటి పట్టణాల్లో నివసించేవారి అవసరాలు తీర్చేందుకు కూడా కష్టపడి పనిచేసేవారు.

మత పరిస్థితులు : హరప్పా కాలంనాటి మత విశ్వాసాలు, ఆచారాలు తెలుసుకొనేందుకు కేవలం ఆ కాలంలో లభ్యమైన ముద్రికలు, టెర్రాకోట బొమ్మలు ఉపయోగపడుతూ ఉన్నాయి. వీటిపై చెక్కిన అమ్మతల్లి, పశుపతినాథుడు, జంతువులు మరియు వృక్షాలు తదనంతర కాలంలోని హిందూ మత విశ్వాసాలకు దగ్గరగా ఉన్నాయి. సింధూ సమాజపు మత విశ్వాసాల్లో అమ్మతల్లి ఆరాధన అనేది బాగా ప్రసిద్ధి చెందింది. తవ్వకాల్లో నగ్నంగా ఉన్న స్త్రీ మూర్తుల విగ్రహాలు చాలా వరకు లభించాయి. సింధూకాలంలో బాగా చెప్పుకోదగిన పురుష దేవత పశుపతినాథుడు లేదా పశువులను రక్షించే దేవత. ఇతనికి సంబంధించిన ప్రతిమలు ముద్రికలపై చెక్కబడ్డాయి. ఆధునిక శివునికి ఇతనికి దగ్గరి పోలికలు ఉన్నాయి. ఈ దేవుడికి కొమ్ములు ఉన్న మూడు తలలు ఉన్నాయి. ఈ కాలం నాటి ప్రజలు అగ్నిని పూజించినట్లుగా తెలిపే ఆధారాలు కాలీబంగన్, లోథాల్లో లభించాయి. ఇక్కడ దొరికిన యజ్ఞవేదికలు, ఇతర చిన్న వస్తువులు తప్ప, సింధూ కాలంలో దేవాలయాలు కానీ ఇతర ఆరాధన ప్రదేశాలు కానీ మనకు ఎక్కడా లభ్యం కాలేదు. వ్యవసాయాధారిత సమాజం కాబట్టి వారు ఎద్దులు, కోడెలు, పాములు, వృక్షాలను కూడా పూజించేవారు. “జంతు బలుల ఆచారం సమాజంలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
TS Inter 1st Year History Study Material Chapter 2 సింధూ నాగరికత, వేద సంస్కృతి 3

ఇదే కాకుండా ముఖ్యంగా మరణానంతర జీవితంలో విశ్వాసాలు కూడా ఉన్నాయి.

TS Inter 1st Year History Study Material Chapter 2 సింధూ నాగరికత, వేద సంస్కృతి

ప్రశ్న 4.
తొలివేదకాలంనాటి రాజకీయ, సామాజిక, ఆర్థిక, మతపరిస్థితులను వివరించండి.
జవాబు.
క్రీ.పూ. 1500-1000 వరకు గల కాలాన్ని తొలివేద నాగరికతా కాలం అంటారు. తొ- ప్రాంతమైన ‘సప్త సింధు’ ప్రాంతంలో నివసించారు. సింధు, జీలం (నితస్తా), చీనాబ్, రావి, బియాస్, సట్లేజ్, సరస్వతి అనేవి ఏడు నదులు. ఈ ప్రాంతంలో ఋగ్వేద ఆర్యులు నివసించేవారు.

ఈ ఆర్యులు తరచు యుద్ధాలలో మునిగితేలేవారు. ఆర్యులు దాసదాస్యులతో యుద్ధాలు చేశారని కొందరు చరిత్రకారుల భావన. కొన్నిసార్లు తమలో తాము కలహించుకునేవారు. భరత పాలక వర్గాన్ని పదిమంది రాజులు ప్రధానంగా వ్యతిరేకించారు. అప్పుడు జరిగిందే దశరాజ యుద్ధం. ఈ యుద్ధంలో సుధా అనే భరతరాజు విజయం సాధించాడు. ఈ భరతులు, పురులతో కలిసి ‘కురులు’ అనే నూతన పాలకవర్గంగా రూపొందారు.

తొలి వేదకాలం నాటి రాజకీయ వ్యవస్థ : వేదకాలంనాటి ఆర్యులు రాజ్యాలవలెకాక తెగలుగా ఏర్పడ్డారు. తెగ నాయకుడిని రాజన్ అని పిలిచేవారు. రాజు స్వేచ్ఛను సభ, సమితి అడ్డుకొనేవి. ఈ రెండు ప్రజాసభల అనుమతి లేనిదే రాజన్ అధికారం స్వీకరించలేడు. కొన్ని రాజ్యాల్లో వంశపారంపర్య పాలన ఉండేదికాదు. రాజన్కు పురోహితుడు, సేనాని పాలనలో సహకరించేవారు.

తొలి వేద ఆర్థిక వ్యవస్థ : ఆర్యుల కాలంనాటి కంచులోహ పనివారు తయారుచేసిన వివిధ పనిముట్లు, ఆయుధాలు, హరప్పా కాలానికంటే గొప్పవిగా పేరుపొందాయి. ఋగ్వేదం కంచులోహ పనివారు, వడ్రంగి, రథాలను తయారు చేసే వారిని ప్రశంసించింది.

ఆర్యుల ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం, పశువుల పాలనతో కూడిన సంయుక్త వ్యవస్థ. ఆర్థిక వ్యవస్థలో పశువులు ప్రధాన పాత్ర పోషించాయి. పశువులను వ్యాపారంలో మారకంగా కూడా ఉపయోగించారు. మనిషి విలువ వంద గోవులతో సమానం. వారి జీవన విధానంలో గుర్రాలు ప్రధాన పాత్ర పోషించాయి. వారు వ్యవసాయానికి సంబంధించిన గొప్ప పరిజ్ఞానం సంపాదించారు.

తొలి వేద కాలం నాటి సమాజం : వేదకాలం నాటి సమాజంలో పితృస్వామ్య వ్యవస్థ అమల్లో ఉండేది. కుటుంబ పెద్దను గృహపతి అనేవారు. సమాజంలో ఏకభార్యత్వం అమల్లో ఉండేది. స్త్రీలు, పురుషుడితో సమానంగా అనేక కార్యక్రమాలలో పాల్గొనేవారు. స్త్రీలకు ప్రజాసభలైన సభ, సమితిల్లో సభ్యత్వం ఉండేది. బాల్యవివాహాలు, సతీసహగమనం వంటివి ఋగ్వేద కాలంలో అమలులో లేవు.

స్త్రీ, పురుషులు నూలు, ఉన్ని దుస్తులు ధరించేవారు. వివిధ రకాల ఆభరణాలు ధరించేవారు. గోధుమ, బార్లీ, పాలు, పాల ఉత్పత్తులు, కూరగాయలు, పండ్లు వంటివి వీరి ప్రధాన ఆహారం. ఆవు మాంసం భుజించడం నిషేధింపబడింది. రథాల పోటీ, గుర్రపు స్వారీ, పాచికలు, సంగీతం, నాట్యం ప్రజలకు వినోదాలు.

వర్ణవ్యవస్థ ; ‘వర్ణం’ అనే పదానికి రంగు, అక్షరం అనే అర్థాలున్నాయి. ఆర్యుల చేతిలో ఓడిపోయిన దాసదాస్యులు బానిసలుగా, శూద్రులుగా చూడబడ్డారు అని కొందరు చరిత్రకారుల భావన. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేవి. నాలుగు వర్ణాలు. శూద్రులను గురించి ఋగ్వేద పదవ అధ్యాయంలో ప్రస్తావించబడింది. ఋగ్వేద కాలంలో వృత్తులనుబట్టి విభజన ప్రారంభమయింది. అయితే ఈ వృత్తి విభజన బలంగా లేదని తెలుస్తుంది.

మతం – దేవతలు : ఋగ్వేద ఆర్యుల ప్రధాన దేవుడు ఇంద్రుడు. ఇంద్రుడు యుద్ధ దేవుడు. మార్స్ ఇంద్రుడికి సహాయకుడు. మానవులకు దేవతలకు వారధి అగ్ని. ఇంకా అదితి, పృథ్వి, ఉష వంటివారు ఋగ్వేదంలో పేర్కొనబడ్డ ప్రధాన దేవతలు. ఈ దేవతల కృప కోసం యజ్ఞాలు చేయడం జరిగేది. దాన, దక్షిణలు పూజారులకు ఇచ్చేవారు. వైదిక ప్రజలు ఎటువంటి ఆలయాలను నిర్మించినట్లు తెలియలేదు.

ప్రశ్న 5.
మలివేదకాలంనాటి రాజకీయ, సామాజిక, ఆర్థిక, మతపరిస్థితులను వివరించండి.
జవాబు.
మలివేద కాలంనాటికి ఆర్యులు తూర్పు దిక్కుకు విస్తరించారు. ఆర్యులు తూర్పు గంగా మైదానానికి విస్తరించడాన్ని గురించి శతపద బ్రాహ్మణంలో పేర్కొనబడింది. మలివేద సాహిత్యంలో అనేక రాజ్యాలు, తెగలు ప్రస్తావించబడ్డాయి. మలివేద కాలం పురాణకాలమని, రామయణ, మహాభారతాలు ఈ కాలంలోనే రచింపబడ్డాయని కొందరు చరిత్రకారుల
భావన.

విశాలమైన రాజ్యాలు ఆవిర్భవించడం మలివేదకాలంలో ప్రధానమైన అంశం. ఈ కాలం ఆరంభంలో కురు, పాంచాల రాజ్యాలు విలసిల్లాయి. భారత యుద్ధం కురు వంశీయుల చరిత్రే. ఈ యుద్ధం క్రీ.పూ. 950 సంవత్సరంలో జరిగినట్లు తెలుస్తుంది. కురు రాజ్య పతనం తర్వాత కోసల, కాశి, విదేహ రాజ్యాలు ప్రాముఖ్యంలోకి వచ్చాయి. రాజకీయ వ్యవస్థ : మలివేద కాలంనాటికి విశాలమైన రాజ్యాలు ఆవిర్భవించాయి. జన లేదా తెగల రాజ్యాలు మలివేద కాలంలో జనపదాలు లేదా రాష్ట్రాలుగా మారాయి. విశాల రాజ్యాలతో అధికారం విస్తృతమైంది. తమ అధికారాన్ని సుస్థిరం చేసుకొనేందుకు రాజులు వివిధ యజ్ఞాలు, పూజలు నిర్వహించేవారు. రాజసూయ, అశ్వమేధ, నజపేయ యాగాలు చేసేవారు. రాజులు ‘ఏకరాట్’, ‘సామ్రాట్’ వంటి బిరుదులు ధరించేవారు. ఖజానా అధికారి, పన్ను వసూలు అధికారి మొదలైనవారు నూతన అధికారులు సభ, సమితులు పూర్వ అధికార ప్రాభవాలను కోల్పోయారు.

ఆర్థిక వ్యవస్థ : మలివేదకాలంలో ఇనుము విస్తృతంగా వాడుకలోకి వచ్చింది. ఇది అడవులను ఛేదించి విస్తృత భూభాగాలను వ్యవసాయంలోకి తెచ్చేందుకు అవకాశాన్ని కలిగించింది. వ్యవసాయం ప్రధాన వృత్తి అయింది. వ్యవసాయానికి అభివృద్ధి చెందిన నూతన పనిముట్లు వాడారు. గోధుమ, బార్లీ, వరి పంటలు పండించారు. ఎరువుల వాడకం నేర్చుకున్నారు. పారిశ్రామిక అభివృద్ధి జరిగింది. వృత్తి నైపుణ్యం పెరిగింది. లోహ, చర్మ, వడ్రంగి, కుండల తయారీ పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. దేశీయ వ్యాపారంతోపాటు విదేశీ వ్యాపారం వృద్ధి చెందింది. వంశపారంపర్య -వర్తకులు తయారయ్యారు. శతమాన, కృష్ణల అనే బంగారు, వెండి నాణాలు వాడుకలోకి వచ్చాయి.

సామాజిక వ్యవస్థ : మలివేద కాలం నాటికి చాతుర్వర్ణ వ్యవస్థ ధృఢపడింది. ఉన్నత వర్ణాలైన బ్రాహ్మణులు, క్షత్రియులు ప్రత్యేక ప్రయోజనాలు, హక్కులను అనుభవించారు. అటువంటి హక్కులు శూద్రులకు లేవు. వృత్తులను బట్టి మలివేద కాలంలో ఉపకులాలు ఏర్పడ్డాయి.

మలివేద కాలంలో ఆశ్రమ పద్ధతి అమల్లోకి వచ్చింది. కుటుంబ వ్యవస్థలో తండ్రి అధికారం బలపడింది. స్త్రీల పరిస్థితిలో మార్పు లేదు. పురుషులకు సేవకులుగా భావించారు. స్త్రీలు ప్రజాసభల్లో సభ్యులుగా ఉండే అర్హతను కోల్పోయారు. బాల్యవివాహాలు సర్వసాధారణమయ్యాయి. ఏమైనప్పటికీ పాలకవర్గాల్లోని స్త్రీలు ప్రత్యేక హక్కులు అనుభవించారు.

కులవ్యవస్థ : మలివేద కాలంలో కులవ్యవస్థ పటిష్టమైంది. సమాజం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే నాలుగు కులాలుగా విభజింపబడింది. బ్రాహ్మణులు ప్రధానమైన వారుగా గుర్తింపు పొందారు. యజ్ఞయాగాలు, పూజా సంస్కారాలు, కర్మకాండలు చేయడం బ్రాహ్మణుల ప్రధాన వృత్తి. రెండవ వారు అయిన, క్షత్రియులు యోధధర్మాన్ని నిర్వహించేవారు. మూడవ స్థానాన్ని పొందిన వైశ్యులు వ్యాపారం చేసేవారు. నాలుగు కులాల్లో శూద్రులు తక్కువ వారుగా గుర్తింపు పొందారు. మొదటి మూడు వర్ణాలవారు ద్విజులు. అంటే రెండుసార్లు జన్మించినవారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య పురుషులు శూద్ర స్త్రీలను వివాహం చేసుకోవచ్చు. కానీ వైశ్య, శూద్ర పురుషులు బ్రాహ్మణ, క్షత్రియ స్త్రీలను వివాహం చేసుకోరాదని శతపథ బ్రాహ్మణంలో చెప్పబడింది.

మతం – దేవతలు : వేదకాలం నాటి దేవతలైన ఇంద్రుడు, అగ్నిలకు ప్రాధాన్యత తగ్గింది. త్రిమూర్తులు అంటే సృష్టి, స్థితి, కర్మ. లయకారకులైన విష్ణు, బ్రహ్మ, శివులకు ప్రాధాన్యం పెరిగింది. ప్రార్థనలు తెరమరుగై కర్మకాండలు, యజ్ఞయాగాదులు అధికమయ్యాయి. పూజారి అనేది వృత్తిగా మారి వంశపారంపర్యమైంది.
కర్మకాండలు, యజ్ఞయాగాదులకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. దీన్ని ప్రజలు మరింత అధికం చేశారు. మలివేద కాలం చివర్లో పూజారులు, ఉత్సవాలు, కర్మకాండల పట్ల వ్యతిరేకత తిరుగుబాట్లు ప్రారంభమయ్యాయి. బౌద్ధ, జైన మతాలు దీనికి తార్కాణం. హిందూ ధర్మాన్ని బోధించే ఉపనిషత్తులు కర్మకాండలను వ్యతిరేకించి నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం, శాంతిని సంపాదించే మార్గంవైపు దృష్టి సారించాయి.

ప్రశ్న 6.
తొలివేదకాలం, మలివేదకాలం మధ్య తేడాలను విశ్లేషించండి.
జవాబు.
తొలి వేదకాలం

  1. తొలి వేదకాల ఆర్యులు సప్తసింధు ప్రాంతంలో నివసించారు.
  2. వేదాలు సంకలనం చేయబడ్డాయి.
  3. ‘తెగ’ నాయకుడిని ‘రాజన్’ అని పిలిచేవారు.
  4. సంచార జీవితం గడుపుతూ పశుపోషణలో ఉండేవారు.
  5. వైయక్తిక కుటుంబ వ్యవస్థ ప్రధానంగా ఉండేది.
  6. స్త్రీలు సమాజంలో అన్ని రంగాలలో సమానత్వాన్ని పొందారు.
  7. స్త్రీలు ప్రజాసభలలో ఉండేవారు.
  8. వర్ణ వ్యవస్థ బలపడలేదు.
  9. గురుకుల పద్ధతిలో విద్యావ్యవస్థ ఉండేది.
  10. గోధుమ, బార్లీ, పాలు, పాల ఉత్పత్తులు, కూరగాయలు, పండ్లు వంటివి ప్రధాన ఆహారం మరియు మాంసాహారం.
  11. ప్రకృతి శక్తుల ఆరాధన ఉండేది,
  12. ఇంద్రుడు, అగ్ని, వరుణ, సూర్యుడు వంటి దేవతలను ఆరాధించేవారు.
  13. ఆలయాలు నిర్మించబడలేదు. యుద్ధాలలో విజయా నికి, సంతానానికి ప్రార్థించేవారు.
  14. పశువులను సంపదగా భావించేవారు.
  15. బాల్యవివాహాలు లేవు.
  16. విధవా వివాహాలు జరిగేవి.
  17. కంచు వంటి వాటితో పనిముట్లు తయారు చేసేవారు.
  18. దేశీయ వ్యాపారం జరిగేది.
  19. శాస్త్ర, సాంకేతిక వృద్ధి గురించి తెలియదు.

మలి వేదకాలం

  1. మలి వేదకాల ఆర్యులు తూర్పు గంగా మైదాన ప్రాంతాలకు విస్తరించారు.
  2. మలివేదకాలం పురాణ కాలంగా పేరొందింది. ఇతి హాసాలైన రామాయణ, భారతాలు రచించబడ్డాయి.
  3. తెగలు చిన్న చిన్న రాజ్యాలుగా రూపొందాయి. రాచరికం వారసత్వమైంది.
  4. ఆర్యులు వ్యవసాయం చేస్తూ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు.
  5. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఏర్పడింది.
  6. స్త్రీల పరిస్థితి దిగజారింది.
  7. `స్త్రీలు ప్రజా:)భలలో సభ్యులుగా ఉండే అర్హత కోల్పోయారు.
  8. వర్ణ వ్యవస్థ దృఢమయ్యింది.
  9. గురుకుల వ్యవస్థ మరింత బలపడింది.
  10. మాంసాహార వినియోగం బాగా తగ్గింది.
  11. మత ఆరాధనలు మరింత సంక్లిష్టమయ్యాయి.
  12. త్రిమూర్తి ఆరాధన పెరిగింది.
  13. కర్మకాండలు, యజ్ఞాలు అధికమయ్యాయి. ఉప నిషత్తులు, కర్మసిద్ధాంతం వంటివి వికసించాయి.
  14. భూమి ప్రధాన సంపదగా మారింది.
  15. బాల్య వివాహ వ్యవస్థ ఉన్నట్లు కొందరి భావన.
  16. విధవా వివాహాలు నిషేదం.
  17. ఇనుము విస్తృతంగా వాడుకలోకి వచ్చింది.
  18. దేశీయ వ్యాపారంతో పాటు విదేశీ వ్యాపారం వృద్ధి చెందింది.
  19. జోతిష్య, ఖగోళ, ఆయుర్వేద శాస్త్రాలలో అద్వితీయ ప్రగతి సాధించారు.

TS Inter 1st Year History Study Material Chapter 2 సింధూ నాగరికత, వేద సంస్కృతి

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సింధు నాగరికత భౌగోళిక విస్తృతి.
జవాబు.
పురావస్తు శాస్త్రవేత్తలు హరప్పా, మొహంజోదారో నగరాలే కాకుండా ఈ నాగరికతకు చెందిన కొన్ని వందల చిన్న, . పెద్ద పట్టణాలను తవ్వకాల ద్వారా వెలికితీసారు. వీటిలో ఎక్కువ భాగం భారతదేశంలోని పంజాబ్, హర్యానా, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, గుజరాత్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలోనూ మరియు పాకిస్తాన్లోని సింధు, పంజాబ్ మరియు బెలూచిస్తాన్ రాష్ట్రాలలో, కొంత మేర ఆఫ్ఘనిస్తాన్లో విస్తరించి ఉన్నాయి. ఇటీవల జరిగిన తవ్వకాల వల్ల.

ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్లోని షోరుగై మొదలుకొని దక్షిణాన మహారాష్ట్రలోని దైమాబాద్ వరకు, పశ్చిమాన పాకిస్తాన్ – ఇరాన్ సరిహద్దుల్లోని సుట్కాజిందూర్ మొదలు తూర్పున ఉత్తర ప్రదేశ్లోని అలంగీర్ ప్పూర్ వరకు నాగరికత విస్తరించిందని తెలుస్తుంది. ఈ నాగరికత 12,99,600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి పాకిస్తాన్ దేశాని కంటే విశాలమైందిగానే కాకుండా ప్రాచీన ఈజిప్ట్, మెసపొటోమియా నాగరికతల కంటే విశాలమైందిగా ప్రసిద్ధి చెందింది.

ప్రశ్న 2.
మహాస్నానవాటిక.
జవాబు. మొహంజోదారోలోని నిర్మాణాల్లో ‘మహాస్నానవాటిక’ ప్రధానమైంది. ఇది కోటలోపల ఉంది. ఇది గొప్ప నిర్మాణ కౌశల్యానికి నిదర్శనం. ఇది 11.88 × 7.01 మీటర్ల పొడవు, వెడల్పులను 2.4 మీటర్ల లోతును కలిగి ఉంది. కొలనుకు చుట్టూ మెట్ల మార్గం ఉంది. చుట్టూ దుస్తులు మార్చుకొనేందుకు గదులు ఉన్నాయి. స్నానవాటిక అడుగుభాగం కాల్చిన ఇటుకలతో నిర్మించబడింది. గదుల వెనుక వైపున ఉన్న బావి నుంచి నీరు స్నానవాటికలోకి చేరేందుకు, ఉపయోగించిన నీరు మురుగు కాలువలోకి వెళ్ళేందుకు మార్గాలను ఏర్పాటు చేశారు. ప్రజావసరాల కోసం లేక మత అవసరాల కోసం ఉపయో ంచేందుకు ఈ స్నానవాటికను నిర్మించారో ఖచ్చితంగా చెప్పలేం..

ప్రశ్న 3.
సింధు లిపి.
జవాబు.
సింధూ ప్రజలు లిపిని ఉపయోగించారు. వీరి లిపిని సాధరణంగా ముద్రికలపైనా, కొన్ని రాగి పరికరాలపై, కుండలపై, కొన్ని ఆభరణాలపై మరియు గుర్తింపు బోర్డుల (Signboards) పై గుర్తించారు. ముద్రికలపై కొన్ని పదాలు లేదా చిహ్నాలు ఉన్నాయి. అయితే ఈ లిపిని ఇంతవరకు ఎవరూ పరిష్కరించలేదు. ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. చరిత్రకారుల లిపిలో భాగంగా 375 నుంచి 410 వరకు గల వివిధ రకాల చిహ్నాలను గుర్తించడం జరిగింది. ఇవి అక్షరాల సమన్వితం కాకుండా. బొమ్మల రూపంలో లేదా సంకేతాల రూపంలో ఉన్నాయి. కొన్ని ముద్రికల్లో వాటిని కుడి వైపు నుంచి ఎడమకు రాస్తే, మరికొన్నింటిలో ఎడమ నుంచి కుడి వైపుకు రాయడం జరిగింది. బహుశా ఈ ముద్రికలను వ్యాపార అవసరాల కోసం ఉపయోగించి ఉండొచ్చు. ప్రముఖ భారతీయ పురావస్తు శాస్త్రవేత్త ఎస్.ఆర్. రావు సింధూ లిపీకి బ్రహ్మీ లిపికి సంబంధం ఉందని అభిప్రాయపడ్డారు.

ప్రశ్న 4.
సింధూనాగరికత పతనానికి కారణాలు.
జవాబు.
క్రీ.పూ 1750 తర్వాత హరప్పా, మొహంజోదారో లాంటి ముఖ్య నగరాలు అదృశ్యమవ్వగా, మిగతా స్థలాల్లో ప్రత్యేకించి సింధూలోయ దక్షిణ భాగంలో అంటే రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో క్రమేణా అంతరించాయి. మొహంజోదారోలో నిరంతర వరదలు నగరాన్ని ధ్వంసం చేయగా, అక్కడి నుంచి ప్రజలు వలస పోవాల్సి వచ్చిందని భావిస్తున్నారు. సర్ మార్టిమర్ వీలర్ హరప్పా నాగరికత పతనానికి ఆర్యుల దండయాత్రలే కారణం అని పేర్కొన్నాడు. అయితే వీలర్ సిద్ధాంతాన్ని పండితులు తిరస్కరించారు. కోటి జి, కాలీబంగన్, లోథాల్లు హఠాత్తుగా అంతరించినట్లు కనిపించదు. ఇక్కడ, వరదలు తీవ్ర మార్పులను కలిగించి, మామూలు నీటి పారుదల విధానాన్ని దెబ్బతిసి, ఫలితంగా నగరాల ఆర్ధిక క్షీణతకు కారణమయ్యాయి. అయితే, థార్ ఎడారి విస్తరించడం, భూకంపాలు, అడవులు నశించడం, వరదలు, నదులు ప్రవాహ దిశను మార్చుకోవడం వంటి పర్యావరణ మార్పులే సింధూనాగరికత పతనానికి కారణమని ఈనాడు అనేకమంది చరిత్రకారులు నమ్ముతున్నారు. మొత్తం మీద వివిధ కారణాల సమ్మిళితంగా ప్రపంచంలోని పురాతనమైన సింధూ నాగరికత పతనమైంది.

ప్రశ్న 5.
వేదసాహిత్యం.
జవాబు.
‘వేద’ అనే పదం జ్ఞానం అని అర్థం ఇచ్చే ‘విద్’ నుంచి ఆవిర్భవించింది. మరోరకంగా ‘వేదం’ అనే పదానికి గొప్ప జ్ఞానం అని అర్థం చెప్పబడింది. వేదాలు నాలుగు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం. వీటిలో 1028 మంత్రాలు ఉన్న ఋగ్వేదం ప్రాచీనమైన వేదం. ఈ మంత్రాలన్నీ వివిధ దేవతలను స్తుతిస్తున్న మంత్రాలే. యజ్ఞ యాగాది క్రతువుల్లో ఉచ్ఛరించే మంత్రాలు యజుర్వేదంలో ఉన్నాయి. సామవేదం భారతీయ సంగీతానికి మూలమైందిగా చెప్పబడ్డాయి. అధర్వణ వేదంలో మంత్ర తంత్రాలు ఉన్నాయి. వేదాలతోపాటు బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు వంటివి ఈ కాలంలో ప్రధానమైన రచనలు. బ్రాహ్మణాలు వేదాల్లోని మంత్రాలను సంప్రదాయబద్ధంగా వివరిస్తాయి. ఇవన్నీ వచనంలో రచింపబడి పూజా పద్ధతిలో ఉన్నాయి. కర్మకాండలు, తత్వజ్ఞానం, కర్మత్యాగాలు వంటి వాటిని అరణ్యకాలు వివరిస్తాయి. ఆత్మ, అంతరాత్మ, ప్రపంచ ఆవిర్భావం, తాత్త్విక విషయాలను చర్చించేవే ఉపనిషత్తులు. బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు వేదాలకు అనుబంధాలు.

ప్రశ్న 6.
వేదకాలంలో స్త్రీల స్థితిగతులు.
జవాబు.
తొలివేదకాలంలో సమాజంలో ఏకపత్నీ వ్రతం అమలులో ఉండేది. ఉన్నత వర్గాలలో బహుభార్యత్వం ఉండేది. భార్య కుటుంబ బాధ్యత నిర్వర్తిస్తూ అన్ని కార్యక్రమాలలో పాల్గొనేది. పురుషులతో సమానంగా స్త్రీలకు ఆధ్యాత్మిక జ్ఞానసముపార్జన పొందేవారు. ప్రజాసభలైన సభా సమితులలో స్త్రీలకు సభ్యత్వం ఉండేది. సతీసహగమనం వంటివిలేవు. మలివేదకాలం నాటికి స్త్రీ పరిస్థితి దిగజారింది. పురుషుడి కంటే తక్కువగా, సేవకులుగా స్త్రీలను భావించారు. ప్రజా సభలలో ఉండే అర్హత కోల్పోయారు. బాల్యవివాహాలు సాధారణమయ్యాయి. ఐతరేయి బ్రాహ్మణం ప్రకారం కూతురిని భారంగా చూసేవారు. పాలకవర్గాలలోని స్త్రీలు ప్రత్యేక హక్కులు అనుభవించేవారు.

TS Inter 1st Year History Study Material Chapter 2 సింధూ నాగరికత, వేద సంస్కృతి

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సింధూ ముద్రికలు.
జవాబు.
హరప్పా ప్రజలు వివిధ రకాలైన ముద్రికలను వాడేవారు. సుమారు రెండువేల ముద్రికలు వివిధ ప్రాంతాల్లో తవ్వకాల్లో లభించాయి. ఇవి సాధారణంగా చతురస్రాకారంలో ఉండి, స్టియటైట్తో తయారు చేయబడ్డాయి. ఈ ముద్రికలపైన వివిధ రకాల జంతువుల బొమ్మలతో పాటు సింధూ లిపి గుర్తులు కూడా ఉన్నాయి. మూపురం కలిగిన ఎద్దు, దాని మెడ నుంచి కిందకి వేలాడుతున్న చర్మము, వెడల్పైన కొమ్ములుతో చెక్కబడిన ముద్రిక ప్రత్యేకతను సంతరించుకొంది. కొమ్ములున్న శిరోవేష్ఠనం ధరించిన పురుష దేవత ఉన్న ఒక ముద్రిక ప్రధానమైంది. ఈ దేవత మూడు తలలను కలిగి యోగ ముద్రలో ఆశీనమై ఏనుగు, పులి, ఖడ్గ మృగం, గేదె అనే నాలుగు జంతువులు చుట్టూ కలిగి ఉంది. దీన్ని చాలామంది చరిత్రకారులు’ ‘పశుపతి’ (శివుడు) గా భావించారు.

ప్రశ్న 2.
లోథాల్.
జవాబు.
లోథాల్లో ముఖ్యమైన నిర్మాణంగా నౌకాశ్రయంను గుర్తించారు. ఇది 223 × 35 మీటర్ల పొడవు, వెడల్పులను, 8 మీటర్ల లోతును కలిగి అతిపెద్ద నిర్మాణంగా ఉంది. దీనిలోకి తూర్పువైపు నుంచి 12.30 మీటర్ల వెడల్పు గల ఒక కాలువను ఏర్పాటు చేశారు. ఈ కాలువ దగ్గరలోని నదికి అనుసంధానించబడింది. బహుశా ఈ కాలువ ద్వారా సరుకులను లోపలి ప్రాంతాల నుంచి రేవు దాకా తీసుకొచ్చేవారు. చాలామంది పండితులు ఈ కృత్రిమ నిర్మాణాన్ని నౌకాశ్రయంగా భావించారు. ఇక్కడ నుంచే వస్తువులను నౌకలలోకి చేర్చడం, దించడం లాంటివి చేసేవారు. దీనికి సమీపంలో ఉన్న ధాన్యాగారం వద్ద అనేక ముద్రికలు లభ్యం అయ్యాయి. వీటి ఆధారంగా సింధూనాగరికతలో లోథాల్ ఒక ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఉండేదని పరిశోధకులు భావిస్తున్నారు.

ప్రశ్న 3.
సింధూకాలంనాటి ఇటుకలు.
జవాబు.
ఇటుకల తయారీలో వీరు సిద్ధహస్తులు. ఇటుకల తయారీకి మట్టిని ఉపయోగించారు. ఇటుకల తయారీ కోసం 1:2:4 నిష్పత్తుల్లో ఉన్న అచ్చులను ఉపయోగించారు. హరప్పా మరియు మొహంజోదారో ప్రాంతాల్లో కలప సమృద్ధిగా దొరకడంతో అక్కడ కాల్చిన ఇటుకలను భారీ స్థాయిలో వినియోగించారు. స్నాపు గదులు, బావిచుట్టూ ఉండే కాలువలకు ‘L’ ఆకారంలో ఉండే ఇటుకలను వాడారు.

ప్రశ్న 4.
చన్హుదారో.
జవాబు.
చన్హుదారో మొహంజోదారోకు దక్షిణంగా 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ పూసల తయారీ పరిశ్రమలు బయల్పడ్డాయి. ఈ ప్రాంతం ఎడారిలో ఉంది. సరస్వతీ నది క్రమంగా ఎండిపోవడంతో ప్రజలు ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయారని పరిశోధకులు భావిస్తున్నారు.

ప్రశ్న 5.
వేదాలు.
జవాబు.
‘వేద’ అనే పదం జ్ఞానం అని అర్థం ఇచ్చే ‘విద్’ నుంచి ఆవిర్భవించింది. మరోరకంగా ‘వేదం’ అనే పదానికి గొప్ప జ్ఞానం అని అర్థం చెప్పబడింది. వేదాలు నాలుగు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం. వీటిలో 1028 మంత్రాలు ఉన్న ఋగ్వేదం ప్రాచీనమైన వేదం. ఈ మంత్రాలన్నీ వివిధ దేవతలను స్తుతిస్తున్న మంత్రాలే. యజ్ఞ యాగాది క్రతువుల్లో ఉచ్ఛరించే మంత్రాలు యజుర్వేదంలో ఉన్నాయి. సామవేదం భారతీయ సంగీతానికి మూలమైందిగా చెప్పబడ్డాయి. అధర్వణ వేదంలో మంత్ర తంత్రాలు ఉన్నాయి.

ప్రశ్న 6.
వేదాంగాలు.
‘జవాబు.
శిక్ష, కల్ప, వ్యాకరణ, నిరుక్త, చాందస్, జ్యోతిష్య అనేవి ఆరు వేదాంగాలు. శిక్ష ఉచ్ఛారణను వివరిస్తుంది. ‘కల్ప’ కర్మకాండలకు సంబంధించింది కాగా ‘వ్యాకరణ’ వ్యాకరణానికి సంబంధించింది. ‘నిరుక్త’ శబ్దాలను గురించి వివరిస్తుంది. ‘చందస్’ ఛందస్సును గురించి వివరిస్తుంది. జ్యోతిష్య జ్యోతిష్య శాస్త్రాన్ని గురించి వివరిస్తుంది.

ప్రశ్న 7.
ఉపనిషత్తులు.
జవాబు.
ఆత్మ, అంతరాత్మ, ప్రపంచ ఆవిర్భావం, తాత్త్విక విషయాలను చర్చించేవే ఉపనిషత్తులు. ఇవి వేదాలకు అనుబంధాలు.

ప్రశ్న 8.
ఇతిహాసాలు.
జవాబు.
రామాయణ, మహాభారతాలను ఇతిహాసాలు అంటారు. ఇతిహాస ! అనగా ఇలా జరిగింది అని చెప్పేది ఇతిహాసాలు.

ప్రశ్న 9.
సభ, సమితి.
జవాబు.
సభల అనుమతి లేకుండా రాజన్ అధికారాన్ని స్వీకరించే వీలులేదు. ఎ.ఎల్. బాషం ‘పేర్కొన్నట్లు ‘సభ’లో తెగలోని ్నత వర్గాల వారు సభ్యులుకాగా, సమితిలో సామాన్య ప్రజలు సభ్యులుగా ఉండేవారు. కొన్ని రాజ్యాల్లో వంశపారంపర్య పాలకులు ఉండేవారు కాదు.

TS Inter 1st Year History Study Material Chapter 2 సింధూ నాగరికత, వేద సంస్కృతి

ప్రశ్న 10.
గవిష్ఠి.
జవాబు.
ఆర్యుల ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం, పశువుల పాలనతో కూడిన సంయుక్త వ్యవస్థ. ఆర్థిక వ్యవస్థలో పశువులు ప్రధానపాత్ర పోషించాయి. ఋగ్వేదం యుద్ధాన్ని ఆవుల కోసం అన్వేషణగా (గవిష్ఠి) పేర్కొంది.

TS Inter 1st Year History Study Material Chapter 15 జాతీయ ఉద్యమం – మలిదశ

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 15th Lesson జాతీయ ఉద్యమం – మలిదశ Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 15th Lesson జాతీయ ఉద్యమం – మలిదశ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
1920 – 22లో జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని వివరించండి.
జవాబు.
గాంధీ నాయకత్వంలో జాతీయ కాంగ్రెస్ నిర్వహించిన ఉద్యమాల్లో మొదటిది సహాయ నిరాకరణోద్యమం. ఖిలాఫత్ ఉద్యమ సందర్భంగా వ్యక్తమైన హిందూ, ముస్లిం సంఘీభావం గాంధీని సహాయ నిరాకరణోద్యమానికి పురికొల్పింది. 1920 సెప్టెంబరులో కలకత్తాలో లాలాలజపతిరాయ్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమ తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. తీర్మానం ఆమోదించడమైంది. 1920 డిసెంబర్లో విజయరాఘవాచారి అధ్యక్షతన నాగపూర్లో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశంలో దాన్ని ధృవీకరించడమైంది. రెండు సమావేశాల్లోనూ బెంగాల్ నాయకుడు చిత్తరంజన్దాస్ నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. దాస్ సూచనలను కూడా తీర్మానంలో చేర్చడం ద్వారా గాంధీ ఆయనను సమ్మతింపచేశాడు.

TS Inter 1st Year History Study Material Chapter 15 జాతీయ ఉద్యమం – మలిదశ

ఉద్యమ కార్యక్రమం: ఈ ఉద్యమానికి మూడు అంశాల కార్యక్రమం కలదు. అవి: బహిష్కరణ, నిర్మాణాత్మక కార్యక్రమాలు, శాసనోల్లంఘనం.

బహిష్కరణ:

  1. ప్రభుత్వం ఇచ్చిన బిరుదులు, పదవులను త్యజించడం.
  2. ప్రభుత్వం ఏర్పాటు చేసే సన్మానాలు, తదితర కార్యక్రమాలను బహిష్కరించడం.
  3. విద్యార్థులు ప్రభుత్వ విద్యాలయాలను బహిష్కరించడం.
  4. ప్రభుత్వోద్యోగాలకు రాజీనామా చేయడం.
  5. ప్రభుత్వ న్యాయస్థానాలను బహిష్కరించడం.
  6. విదేశీ వస్త్రాలను, వస్తువులను బహిష్కరించడం.
  7. శాసనసభలకు జరిగే ఎన్నికలను బహిష్కరించడం.
  8. 1921లో ఇంగ్లాండ్ దేశపు యువరాజు పర్యటన బహిష్కరించడం మొదలైనవి బహిష్కరణోద్యమంలో ముఖ్యమైనవి.

నిర్మాణాత్మక కార్యక్రమాలు:

  1. తిలక్ స్మారక నిధికి విరాళాలు వసూలు చేయడం.
  2. రాట్నాలపై నూలు వడికి, ఖద్దరు వస్త్రాలు తయారుచేయడం.
  3. అస్పృశ్యతను నిర్మూలించడం.
  4. మద్యపాన నిషేధానికి అనుకూలంగా ఉద్యమం నడపడం.
  5. జాతీయ విద్యాలయాలు నెలకొల్పడం.
  6. హిందూ, ముస్లిం సమైక్యతను సాధించడం అనేవి నిర్మాణాత్మక కార్యక్రమాలు.

శాసనోల్లంఘనం: పన్నులు చెల్లించటం, నిరాకరించటం ద్వారా కాంగ్రెస్ శాసనోల్లంఘనాన్ని చేపట్టాలని నిర్ణయించింది.

ఉద్యమ గమనం: 1920లో ప్రారంభించిన ఈ ఉద్యమంలో ప్రజలు తమ విభేదాలను మరిచి చురుకుగా పాల్గొన్నారు. బ్రిటిష్ విద్యాసంస్థలను బహిష్కరించి జాతీయ విద్యాసంస్థలను నెలకొల్పారు. నెహ్రూ, చిత్తరంజన్ దాస్, ప్రకాశం పంతులు మొదలైన నాయకులు న్యాయస్థానాలను బహిష్కరించి న్యాయవాద వృత్తిని త్యజించారు. సుభాష్ చంద్రబోస్ మొదలైనవారు తమ ప్రభుత్వ పదవులకు రాజీనామా చేశారు. ప్రజలు విదేశీ వస్తువులను బహిష్కరించి ఖద్దరు వాడకాన్ని ప్రోత్సహించారు. హిందువుల ఐక్యతను పెంపొందించటానికి అస్పృశ్యతా నివారణను చేపట్టారు.

ఈ ఉద్యమం ఆంధ్రాలో అద్భుత విజయాన్ని సాధించింది. చీరాల-పేరాల సత్యాగ్రహం, పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం, పల్నాడు పుల్లరి సత్యాగ్రహాలు జరిగాయి. పంజాబ్లో అకాలీలు మహంతులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వహించారు. భారతదేశ సందర్శనానికి వచ్చిన వేల్స్ యువరాజు బహిష్కరించబడ్డాడు. ఈ ఉద్యమాన్ని అణచడానికి ప్రభుత్వం దమనకాండను సాగించింది. అయినప్పటికి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇంతలోనే ఉత్తరప్రదేశ్లోని చౌరీచౌరా అనేచోట హింస చెలరేగి అది అనేకమంది పోలీసులు సజీవదహనానికి దారితీసింది. హింసను సహించలేని గాంధీజీ ప్రజలు ఇంకా అహింసా పద్ధతులకు అలవాటుపడలేదని భావించి ఉద్యమాన్ని నిలుపు చేశాడు.

ఫలితాలు: సహాయ నిరాకరణోద్యమం అనేక గొప్ప ఫలితాలనిచ్చింది.

  1. భారత ప్రజలలోను, కాంగ్రెస్ నాయకులలోను నిరాశ ఏర్పడింది. దీని ఫలితంగా కాంగ్రెస్లోలో చీలిక వచ్చింది.
  2. ఉద్యమ కాలంలో హిందూ – మహమ్మదీయుల ఐక్యత సాధించబడింది.
  3. ఈ ఉద్యమ ప్రభావం వల్ల జాతీయభావం దేశం నలుమూలలా విస్తరించింది.
  4. ప్రజలలో ప్రభుత్వమంటే భయంపోయి వారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది.
  5. కాంగ్రెస్లో వామపక్ష ధోరణులు ప్రారంభమైనాయి.
  6. ప్రభుత్వం దమననీతిని ఎదుర్కొనేందుకు భారతీయ యువత విప్లవోద్యమానికి దిగింది.
  7. ఈ ఉద్యమ విరమణ అనంతరం కాంగ్రెస్-లీగ్ మిత్రత్వం రద్దయింది. ఫలితంగా హిందువులు, ముస్లింల మధ్య మత కల్లోలాలు చెలరేగాయి.

ప్రశ్న 2.
1935 భారత ప్రభుత్వ చట్టంలోని లక్షణాలను వివరించండి.
జవాబు.
ఈ చట్టంలోని ముఖ్య అంశాలు:

  1. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించడం.
  2. కేంద్రంలో భారతీయులకు పరిమిత అధికారాలను కల్పించడం.
  3. సమాఖ్య ఏర్పాటు.
  4. ఫెడరల్ కోర్టు ఏర్పాటు.

కేంద్ర ప్రభుత్వం: 1919 చట్టం ప్రకారం రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తూ ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది.

కేంద్ర శాసనసభ: ఇందులో ఎన్నుకోబడిన సభ్యులు ఉండేవారు. ఓటర్ల సంఖ్య 10 శాతం పెంచబడింది. శాసన సభలో రాష్ట్రం శాసనసభల నుంచి 260 మంది సభ్యులు, సమాఖ్య శాసనసభలో 375 మంది ఉండేవారు. అయితే స్థానిక పాలకులు ఇందులో చేరేందుకు ఆసక్తి చూపకపోవడంతో సమాఖ్య శాసనసభ అమలులోకి రాలేదు. ఈ చట్టం భారతదేశం నుంచి బర్మాను వేరు చేసింది.

TS Inter 1st Year History Study Material Chapter 15 జాతీయ ఉద్యమం – మలిదశ

ప్రాంతీయ ప్రభుత్వం: ఈ చట్టం ప్రాంతీయ ప్రభుత్వాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని నిషేధించి ప్రాంతీయ ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తిని కల్గించింది. శాసన సభలోని అత్యధిక మెజారిటీ సాధించిన పార్టీ నుంచి గవర్నర్ మంత్రులను నియమిస్తాడు. ఈ మంత్రులు బదిలీ చేయబడిన అంశాలకు బాధ్యత వహిస్తారు. వీరు శాసన సభకు మాత్రమే బాధ్యత వహిస్తారు. గవర్నర్లు మంత్రుల సలహాలకై బద్ధులై ఉంటారు. కానీ ఆచరణలో శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తిరస్కరించేవాడు. స్థానిక ప్రభుత్వంలో 1935 చట్టం అమలు చేయడానికి రెండు సంవత్సరాలు పట్టింది.

ప్రశ్న 3.
క్రిప్స్ రాయబారాన్ని వివరించండి.
జవాబు.
1942లో జపాన్, బర్మాలోని రంగూన్ను ఆక్రమించినపుడు భయపడిన బ్రిటీష్ ప్రభుత్వం కాబినెట్ సభ్యుడు స్టాఫర్డ్ క్రిప్సన్న చర్చల నిమిత్తం భారతదేశానికి పంపింది. యుద్ధంలో బ్రిటీష్వారి పరిస్థితి ఓడిపోయే పరిస్థితిలో ఉంది. భారతదేశం అవసరం తప్పనిసరి అయింది. అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్డ్ ఇంగ్లాండ్ ప్రధాని విన్సెంట్ చర్చిల్పై భారతదేశాన్ని యుద్ధంలోకి చేర్చుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. ఫలితంగా 1947లో క్రిప్స్ రాయబారం భారతదేశానికి వచ్చి కొన్ని ప్రతిపాదనలను సూచించింది. అవి:

  1. యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశానికి అధిక దేశ ప్రతిపత్తినియ్యాలి.
  2. నూతన రాజ్యాంగం ఏర్పాటు చేయడానికి ఎన్నికైన సభ్యులతో రాజ్యాంగ రచన కమిటీని వేయాలి.
  3. కేంద్రంలో సమాఖ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. రాష్ట్రాలు అందులో చేరుతాయా లేదా అనేది వాటి నిర్ణయానికి వదిలివేయాలి.

కాంగ్రెస్ ఈ ప్రతిపాదనలను తిరస్కరించింది. గాంధీ దీన్ని దివాలా తీసిన బ్యాంకుపై రాబోయే తేదీ వేసిన చెక్కుగా వల్లించాడు. దానిలో పాకిస్థాన్ ప్రస్థావన లేనందున ముస్లింలీగ్ కూడా ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. ఫలితంగా క్రిప్స్ రాయబారం తన ఉద్దేశాన్ని నెరవేర్చడంలో విఫలమయింది.

ప్రశ్న 4.
1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహాన్ని వివరించండి.
జవాబు.
భారత స్వాతంత్ర పోరాటంలో ఉప్పు సత్యాగ్రహంతో ప్రారంభమైన శాసనోల్లంఘన ఉద్యమం ఒక ప్రధాన ఘట్టం. ఈ ఉద్యమం ద్వారా లక్షలాది ప్రజలు స్వతంత్ర పోరాటంలో భాగమయ్యారు. విదేశీ పాలనకు వ్యతిరేకంగా గాంధీ నాయకత్వంలో శాసనోల్లంఘన ఉద్యమం ఒక ప్రజా ఉద్యమంగా ఉపఖండమంతా వ్యాపించింది.

1929 డిసెంబర్లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన లాహోర్ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్యమే అంతిమ లక్ష్యంగా ప్రకటించారు. రౌండ్ టేబుల్ సమావేశాలను బహిష్కరించి శాసనోల్లంఘన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు.

గాంధీజీ నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ 1930, మార్చి 12న చారిత్రాత్మకమైన శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించింది. కాంగ్రెస్ శాసనసభ్యులందరూ తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామాలు సమర్పించాలని ఆదేశించింది. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకుల ఆవేశాలను చల్లార్చేందుకు గాంధీజీ ప్రయత్నించాడు. ఈ సందర్భంలో గాంధీజీ చివరి ప్రయత్నం చేస్తూ రాజ ప్రతినిధి ఇర్విన్ను సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నించాలని హెచ్చరించాడు. రాజ ప్రతినిధి ఇర్విన్ ఆ హెచ్చరికను పెడచెవిన పెట్టడంతో గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించేందుకు నిర్ణయించాడు.

శాసనోల్లంఘన ఉద్యమం మూడు దశలుగా జరిగింది. అవి:

  1. మొదటి దశ (1930 మార్చి 12 – 1932 జనవరి 3 వరకు)
  2. రెండో దశ (1932 జనవరి 4 – 1933 జులై 11 వరకు)
  3. మూడో దశ (1933 జులై 12 – 1934 మే వరకు)

మొదటి దశ: దీనినే ఉప్పు సత్యాగ్రహ దశగా వర్ణించవచ్చు. ఈ ఉద్యమంను గాంధీజీ 1930, మార్చి 12వ తేదీన సబర్మతీ ఆశ్రమం నుంచి 78 మంది అనుచరులతో ప్రారంభించాడు. అతడు 200 మైళ్ళ దూరంలో అరేబియా సముద్రతీరం వద్ద గల దండి గ్రామాన్ని కాలిబాటన చేరుకొని ఉప్పును తయారుచేసేందుకు ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించాడు. దీంతో దేశవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు సామూహిక ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా గాంధీజీ ప్రజలకు విజ్ఞప్తి చేసిన కార్యక్రమాలు:

  1. మద్యపాన దుకాణాలు, విదేశీ వస్త్ర విక్రయశాలల ఎదుట పికెటింగ్.
  2. రాట్నాల ద్వారా ఖద్దరు వడకటం.
  3. హిందూ-ముస్లింల మధ్య సంబంధాల పటిష్టత.
  4. అస్పృశ్యతా నివారణ.

ఉప్పు సత్యాగ్రహ పర్యవసానం:

  • బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీని నిర్బంధంలోనికి తీసుకొని ఎర్రవాడ కారాగారంలో ఉంచింది. దీంతో కోపోద్రిక్తులైన ప్రజలు దేశమంతటా హర్తాళ్ పాటించారు.
  • అనేకమంది ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేశారు.
  • 1930-32 మధ్యకాలంలో లండన్లో బ్రిటిష్ ప్రభుత్వం మూడు రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పరచింది.
  • రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీజీ పాల్గొని అల్పసంఖ్యాకుల ప్రాతినిధ్యం కంటే రాజ్యాంగ నిర్మాణమే ప్రధాన అంశమని వాదించాడు.
    కాని ఆయన వాదనలు ఆమోదయోగ్యం కాకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి.

రెండో దశ:

  1. ఈ దశలో గాంధీజీని, ఇతర నాయకులను 1932, జనవరి 14న నిర్బంధంలో ఉంచడం జరిగింది. కాని ప్రజలు పికెటింగ్ను చేపట్టడం జరిగింది.
  2. బ్రిటీష్ ప్రభుత్వం విధించిన నిషేధాజ్ఞలు ధిక్కరించి సమావేశాలు నిర్వహించడం, కరపత్రాల ముద్రణ వంటి చర్యలు అమలుచేయడం జరిగింది.
  3. బ్రిటీష్ ప్రభుత్వం అన్ని రకాల ఊరేగింపులను నిషేధించింది.
  4. ముస్లిం నాయకులు మినహా, జాతీయ నాయకులందరూ బ్రిటీష్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ 1932, ఆగస్టు 10న ప్రకటించిన “కమ్యూనల్ అవార్డు”ను వ్యతిరేకించారు.
  5. కమ్యూనల్ అవార్డును వ్యతిరేకిస్తూ ఎర్రవాడ కారాగారంలో గాంధీజీ 1932, సెప్టెంబర్ 20న ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించారు.
  6. బ్రిటీష్ ప్రభుత్వం, గాంధీజీ సంప్రదింపుల ఫలితంగా బ్రిటీష్ ప్రభుత్వం గాంధీజీ డిమాండ్లలో కొన్నింటికి ఆమోదం
    తెలిపింది.
  7. బ్రిటీష్ ప్రభుత్వం తమకు విధేయులైన నాయకులతో లండన్లో 1932, నవంబర్ 17 డిసెంబర్ 24 మధ్య మూడో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో మహిళలకు ఓటుహక్కు వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

మూడో దశ:-

  1. 1933 జులైలో గాంధీజీ, మరికొంతమంది నాయకులు వ్యక్తిగత శాసనోల్లంఘన ఉద్యమానికి ఉపక్రమించారు. వారిని బ్రిటీష్ ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది.
  2. కారాగారంలో గాంధీజీ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయనను బ్రిటీష్ ప్రభుత్వం విడుదల చేసింది.
  3. 1934 మే నెలలో పాట్నాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఉపసంహరించుకొంటున్నట్లు ప్రకటించింది.

ప్రశ్న 5.
భారత స్వాతంత్రోద్యమంలో సుభాష్ చంద్రబోస్ పాత్రను వివరించండి.
జవాబు.
భారత జాతీయోద్యమ చరిత్రలో ప్రముఖ స్థానాన్ని పొందిన దేశభక్తుడు సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ ఐ.సి.ఎస్ పరీక్ష పాసై సివిల్ సర్వెంట్గా తన జీవితాన్ని ప్రారంభించాడు. అయితే సహాయ నిరాకరణోద్యమ ప్రభావానికిలోనై తన సివిల్ సర్వీసు ఉద్యోగానికి రాజీనామా చేసి జాతీయోద్యమంలో పాల్గొన్నాడు.

కాంగ్రెస్ పాత్ర: సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ రాజకీయాల్లో పాల్గొన్నాడు. 1938లో హరిపూర్లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడయ్యాడు. 1939లో త్రిపుర కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ అభ్యర్థియైన భోగరాజు పట్టాభి సీతారామయ్యను ఓడించి పార్టీ అధ్యక్షుడిగా గెలుపొందాడు. అయితే కాంగ్రెస్ అనుసరిస్తున్న శాంతియుత విధానాల యెడల బోస్కు విశ్వాసం లేదు. అందువల్ల గాంధీజీతో బోస్కు తీవ్రమైన భేదాభిప్రాయాలు -కలిగాయి. అందువల్ల కాంగ్రెస్ నుంచి వైదొలగి ‘ఫార్వర్డ్ బ్లాక్’ అనే కొత్త పార్టీని స్థాపించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 15 జాతీయ ఉద్యమం – మలిదశ

ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపన: బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి వెళ్లగొట్టాలంటే రెండవ ప్రపంచ యుద్ధం సరైన అవకాశమని బోస్ భావించాడు. అయితే యుద్ధకాలంలో బోస్ ను ప్రభుత్వం నిర్బంధించింది. బోస్ 1941లో నిర్భంధం నుంచి తప్పించుకొని మొదట రష్యాకు, తరువాత జర్మనీకి, జపాన్కు వెళ్ళాడు. యుద్ధసమయంలో ఆ దేశాల సహాయంతో ఇంగ్లీషువారితో పోరాడి, దేశానికి స్వాతంత్య్రం సాధించవచ్చని బోస్ తలచాడు. యుద్ధంలో జపాన్కు చిక్కిన భారతీయ యుద్ధఖైదీలందరినీ కూడగట్టుకొని 1943లో సింగపూర్లో ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ లేక ‘ఇండియన్ నేషనల్ ఆర్మీ’ని స్థాపించాడు. ఐ.ఎన్.ఏ. స్థాపనలో బోస్కు రాస్ బిహారీ బోస్, మోహన్సింగ్లు సహకరించారు. ఐ.ఎన్.ఏలో చేరిన సేనలు బోసు “నేతాజీ” అని గౌరవంగా పిలిచేవారు. “జైహింద్” అనే నినాదాన్ని చేపట్టి బోస్ తన అనుచరులందరితో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి “ఛలో ఢిల్లీ” అంటూ భారతదేశంలో ఇంఫాల్ సమీపంలోని మోయిరాంగ్ వరకు వచ్చాడు. ఆయనకు తోడుగా వీరవనిత కెప్టెన్ లక్ష్మి మహిళలతో ఏర్పడిన ఝాన్సీరాణి దళనేత అయింది. ఆయన నాయకత్వంలోని ఐ.ఎన్.ఏ. సైన్యాలు దేశ స్వాతంత్ర్యానికి ప్రాణాలొడ్డి పోరాడాయి. కానీ దురదృష్టవశాత్తు 1945 సెప్టెంబర్లో జపాన్ ఓడిపోవటంతో బోస్ ప్రయత్నాలు విఫలమైనాయి. తన ప్రయత్నాలు కార్యరూపం ధరించకుండానే బోస్ 1945లో ఒక విమాన ప్రమాదంలో మరణించాడు.

ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యుల విచారణ: యుద్ధానంతరం ప్రభుత్వం ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ సేనలను ఇండియాపై దాడిచేయడానికి ప్రయత్నించినందున దేశద్రోహులుగా ప్రకటించి ఎర్రకోటలో విచారణ జరిపించింది. సైనిక నాయకులైన మేజర్ జనరల్ షానవాజ్ ఖాన్ (ముస్లిం), కల్నల్ జి.ఎస్. ధిల్లాన్ (సిక్కు), మేజర్ ప్రేమ్ సెహగల్ (హిందూ) లపై విచారణ జరిపించింది. వారి తరఫున జవహర్లాల్ నెహ్రూ, తేజబహదూర్ సప్రూ, భూలాబాయ్ దేశాయ్ు వాదించారు. అయినప్పటికీ ప్రత్యేక న్యాయస్థానం వారికి శిక్షలు విధించింది. కానీ ఆ శిక్షలకు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవటంతో ప్రజాభిప్రాయాన్ని మన్నించి, ప్రభుత్వం వారిని విడుదల చేసింది. దీనితో ప్రజలకు, సైనికులకు ప్రభుత్వం పట్ల భయభక్తులు పోయాయి. హిందూ, సిక్కు, ముస్లింల సేనలను విచారించటం వలన కాంగ్రెస్, లీగ్లు సమైక్యంగా పోరాడాయి.

ఘనత: సుభాష్ చంద్రబోస్ విజయాన్ని సాధించలేకపోయినా, ఆయన ధైర్యసాహసాలు దేశంలో చాలామందికి స్ఫూర్తినిచ్చాయి. ఆయన అచంచల దేశభక్తి, క్రమశిక్షణ, కార్యదీక్ష తరతరాల భారతీయులకు ఆదర్శప్రాయం.

ప్రశ్న 6.
జాతీయోద్యమంలో ముస్లింలీగ్ పాత్రను విశ్లేషించండి.
జవాబు.
హిందూ ముస్లింల మధ్య ఐక్యతను నాశనం చేయడానికి బ్రిటీష్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూనే ఉంది. 1905లో జరిగిన బెంగాల్ విభజన ఒక ఉదాహరణ. అయితే హిందూ, ముస్లింల ఐక్యత ఎప్పుడూ కనిపిస్తూనే ఉండేది. ముఖ్యంగా 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో ఇది బ్రిటీష్ వారిలో ఉద్రిక్తతను, ఒత్తిడిని కలుగజేసింది. దాంతో వీరి మధ్య ఐకమత్యాన్ని, సామరస్యాన్ని తొలగించడం కోసం ప్రభుత్వం ‘విభజించు పాలించు’ అనే విధానాన్ని అమలు చేసింది. విచారకరమైన విషయం ఏమిటంటే ఈ విధానంలో వారు సఫలీకృతులయ్యారు. విద్యావేత్త, సంఘసంస్కర్త సర్సయ్యద్ అహ్మద్ ఖాన్ స్వయంగా హిందూ, ముస్లింల ఐక్యతను కోరినవాడు. వారి ఐక్యతకు కృషి చేశాడు. బ్రిటీష్వారి ప్రభావంతో ముఖ్యంగా అలిఘర్ ఆంగ్లో ముస్లిం పాఠశాల ప్రిన్సిపల్ బెక్ ప్రభావానికి లోనయ్యాడు. ఆయన కాంగ్రెస్తో చేరవద్దని ముస్లింలకు విజ్ఞప్తి చేశాడు.

1906లో డైకానవాబు సలీముల్లాఖాన్, ఆగాఖాన్, మొహిసిన్ ఉలములు బ్రిటీష్వారి సహకారంతో ముస్లింలీగ్ను స్థాపించారు. ఇది ముస్లింలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం, వారికి ప్రత్యేకమత నియోజక వర్గాల కోసం, ముస్లింలకు ప్రత్యేక రక్షణ కోసం విజ్ఞప్తి చేసింది. వైస్రాయ్ మింటో ముస్లింలీగ్ను సమర్థించాడు. ఫలితంగా 1909 చట్టం ద్వారా 1909లో ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా పాకిస్తాన్ అనే ఆలోచనకు భావనకు విత్తనం వేసినట్లు అయింది. బ్రిటీష్వారు విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని అవలంబించినంత కాంగ్రెస్ హిందూ, ముస్లింల ఐక్యతకు ఎంతో కృషి చేసింది. ఫలితంగా 1916లో లక్నో ఒప్పందం జరిగింది. గాంధీ హిందూ ముస్లింల ఐక్యత కోసం ఖిలాఫత్ ఉద్యమాన్ని నడిపారు.

కానీ 1935 భారత ప్రభుత్వ చట్టం జారీ చేయబడ్డప్పుడు జరిగిన ఎన్నికల్లో ముస్లింలీగ్ను వెనుకకు నెట్టి కాంగ్రెస్ ఎన్నో చోట్ల విజయం సాధించింది. దాంతో, జిన్న కాంగ్రెస్ ముస్లింలు భాగస్వాములుగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ప్రతిపాదించాడు. కానీ కాంగ్రెస్ జిన్న ప్రతిపాదనలకు ఒప్పుకోలేదు. ఇది ఇద్దరి మధ్య దూరాన్ని పెంచింది. అంతేగాక ముస్లింలలో తాము వేరు అన్న భావాలకి పెంపొందించింది. ఫలితంగా ఇద్దరిలో మతతత్వ ద్వేషభావనలు అభివృద్ధి చెందాయి.

ప్రశ్న 7.
కాబినెట్ మిషన్ ప్రతిపాదనలను వివరించండి.
జవాబు.
రెండవ ప్రపంచ యుద్ధానంతరం బ్రిటన్ గొప్పదనం బహిర్గతమయింది. దాని సంపద హరించింది. విజయం సాధించినప్పటికీ బలహీనంగా మారింది. దాంతో భారతదేశంలో ప్రభుత్వాన్ని వారికే అప్పగించాలని నిర్ణయించింది. దానికోసం భారతదేశానికి ఒక కమిటీని పంపింది. ఈ కమిటీలో పెథిక్ లారెన్స్, స్టాఫర్డ్ క్రిప్స్, ఎ.వి. అలెగ్జాండర్లు సభ్యులు. ఈ కమిటీ భారతదేశంలో ఉన్న నాయకులతో వివిధ పార్టీలతో వివరంగా చర్యలు జరిపి ఈ కింది విష లను ప్రకటించింది.

  1. స్థానిక సంస్థానాలతో కలిపి భారతదేశాన్నంతటిని సమాఖ్యగా ఏర్పాటు చేయడం.
  2. సంస్థానాలకు స్వయం ప్రతిపత్తి నీయడం.
  3. సంస్థానాలను వివిధ వర్గాలుగా చేయడం.
  4. భారతీయులకు ఒక మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం.
  5. ప్రాంతీయ శాసన సభలకు ఎన్నికైన సభ్యులతో, సంస్థానాలతో కలిపి రాజ్యాంగ ఏర్పాటు కోసం ఒక రాజ్యాంగ సభను ఏర్పాటుచేయడం.

కాంగ్రెస్, ముస్లింలీగ్ రెండు ఈ ప్రతిపాదనలను అంగీకరించాయి. 1946లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత ప్రభుత్వం ఏర్పడింది. బ్రిటీష్ ప్రభుత్వం రక్షణ రంగంతో సహా అన్ని అధికారాలను నెహ్రూ ప్రభుత్వ హస్తగతం చేసింది. ముస్లింలీగ్ కేంద్ర కేబినెట్లో ముస్లింలీగ్చే ఎంపిక చేయబడిన ముస్లింలు మాత్రమే ఉండాలని డిమాండ్ చేసింది. దానికి నిరసనగా వారు అక్టోబరు వరకు మంత్రివర్గంలో చేరలేదు. లీగ్ రాజ్యాంగ సభను బహిష్కరించింది.

ప్రశ్న 8.
1942 క్విట్ ఇండియా ఉద్యమాన్ని వివరించండి.
జవాబు.
క్రిప్స్ రాయబారం విఫలం కాడంతో కాంగ్రెస్ మరొక ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించడానికి నిర్ణయించింది. 1942 ఆగస్టు 8న అఖిలభారత కాంగ్రెస్ కమిటీ బొంబాయిలో సమావేశమయింది. ఈ సమావేశం క్విట్ ఇండియా తీర్మానాన్ని ప్రతిపాదించింది. అది బ్రిటీష్ వారిని సత్వరమే భారతదేశాన్ని వదిలి వెళ్ళాలని డిమాండ్ చేసింది. ఇది గాంధీ ఆధ్వర్యంలో అహింసాయుత పద్ధతులలో ప్రారంభించాలని ప్రతిపాదించబడింది. ఈ ఉద్యమంలో గాంధీ ‘డూ ఆర్ డై’ ‘సాధించండి లేదా చావండి’ అనే నినాదాన్ని ఇచ్చాడు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ తీర్మానాన్ని చేసిన వెంటనే బ్రిటీష్ ప్రభుత్వం గాంధీని అరెస్ట్ చేసి పూనలోని ఆగాఖాన్ భవనంలో ఉంచింది. గాంధీతో పాటు నెహ్రూ, పటేల్, అబ్దుల్ కలాం, ఆజాద్, డా॥ పట్టాభి సీతారామయ్య, టంగుటూరి ప్రకాశం, సంజీవరెడ్డి మొదలైన నాయకులందరిని చెరసాలలో వేసింది.

క్విట్ ఇండియా ఉద్యమంలో ఫార్వర్డ్ బ్లాక్, సోషలిస్టు పార్టీ విప్లవకారులు పాల్గొన్నారు. ముఖ్యమైన నాయకులు లేకపోవటం వల్ల ఉద్యమ పగ్గాలను ప్రజలే తీసుకున్నారు. వారు ప్రభుత్వాన్ని లెక్కచేయలేదు. కొందరు అరెస్ట్ కాని యువనాయకులైన జయప్రకాష్ నారాయణ్, రామ్మోహన్ లోహియా, అరుణా అసఫలీ మొదలైనవారు ఉద్యమాన్ని కొనసాగించారు. హర్తాళ్ళు, నిరసన ప్రదర్శనలు, నిరసన సమావేశాలు దేశమంతటా కొనసాగాయి. ప్రజలు అధిక సంఖ్యలో ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ బొంబాయి నుండి రహస్య రేడియో ప్రసారాలను కూడా చేసింది. ఉత్తర ప్రదేశ్లోని బాలియాలోను, బెంగాల్లోని మిడ్నపూర్ జిల్లాలోను మహారాష్ట్రలోని సతారాలోనూ ప్రజా ప్రభుత్వాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఉద్యమంలో దేశమంతటా హింస వ్యాప్తి చెందింది. ప్రజలు ఆందోళనలు చెయ్యడమే గాక ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. రైల్వే స్టేషన్లను, పోస్టాఫీసులను, పోలీస్ స్టేషన్లను కాల్చివేశారు.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఖిలాఫత్ ఉద్యమం గురించి రాయండి.
జవాబు.
అక్టోబర్ 17, 1919 రోజును ఖిలాఫత్ దినంగా పాటించబడింది. భారతదేశమంతటా హర్తాళ్ పాటించబడింది. గాంధీజి కూడా ఈ ఉద్యమానికి తన మద్దతు తెలిపాడు. హిందూ ముస్లింల ఐక్యతకు ఇది గొప్ప అవకాశం అని భావించాడు. అంతేగాక వారి లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముస్లింలను ప్రోత్సహించాడు. ఈ విషయంలో గాంధీ సఫలీకృతుడు గావడమే గాక గొప్ప నాయకునిగా ప్రశంసించబడ్డాడు.

TS Inter 1st Year History Study Material Chapter 15 జాతీయ ఉద్యమం – మలిదశ

ప్రశ్న 2.
స్వరాజ్ పార్టీ పనిని అంచనా వేయండి.
జవాబు.
1922లో గయలో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశంలో చిత్తరంజన్ దాస్ కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీని స్థాపించాడు.ఇది కాంగ్రెస్ యొక్క శాఖ. దానికి ఆయన అధ్యక్షుడు, మోతీలాల్ నెహ్రూ కార్యదర్శి. నవంబర్ 1923లో . జరిగిన ఎన్నికలలో స్వరాజ్యపార్టీకి 101 స్థానాలకు 42 నియోజకవర్గ స్థానాలను దక్కించుకుంది. కేంద్ర శాసన సభలో ప్రవేశించి బ్రిటీష్ వారి ప్రతిపాదనలను వ్యతిరేకించాలనుకున్నారు. 1925లో విఠలాభాయి పటేల్ స్వరాజ్ పార్టీ తరుఫున కేంద్ర శాసనసభలో స్పీకర్గా ఎన్నుకోబడ్డాడు. 1925లో చిత్తరంజన్ దాస్ మరణించడంతో ఈ పార్టీ కూడా పతనమైపోయింది.

ప్రశ్న 3.
రౌండ్ టేబుల్ సమావేశంలోని అంశాలను అంచనా వేయండి.
జవాబు.
బ్రిటీష్ ప్రభుత్వం రాజ్యాంగ సంస్కరణలను అమలు చేయాలని నిర్ణయించింది. దాంతో బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్సేమాక్డోనాల్డ్, భారత ప్రతినిధులు లండన్కు ఆహ్వానించాడు. మొదటి రౌండ్ టేబుల్ సమావేశాలు నవంబర్ 1930 నుండి జనవరి 1931 వరకు జరిగాయి. దీనికి స్థానిక పరిపాలకులు, రాజకీయ పార్టీలు హాజరయ్యాయి. కానీ కాంగ్రెస్ హాజరు కాలేదు. కాంగ్రెస్ హాజరుకానందున సమావేశం విఫలమయింది. దాంతో రెండవ రౌండ్ టేబుల్ సమావేశం సెప్టెంబర్ 1931లో మొదలై, డిసెంబర్ చివరి వరకు జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ తరఫున గాంధీ అతనితోపాటు సరోజినినాయుడు హాజరయ్యారు. ఈ సమావేశంలో గాంధీ కేంద్ర, రాష్ట్రాల్లో ఇంగ్లాండు సమానమైన బాధ్యతాయుతమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాడు. ఈ సమావేశం కేవలం కేంద్రంలో సమాఖ్య ఏర్పాటు, భారతదేశంలో మైనారిటీల హక్కులను గురించి చర్చించింది. కానీ బాధ్యతాయుత ప్రభుత్వమనే అంశంపై ని ‘యం తీసుకోవడంలో విఫలమయింది.

1932 లో జరిగిన మూడవ రౌండ్డేబుల్ సమావేశాన్ని కాంగ్రెస్ బహిష్కరించింది. తరువాత 1933లో బ్రిటీష్ గ సంస్కరణల ప్రతిపాదనలతో శ్వేతపత్రం విడుదల చేసింది.

ప్రశ్న 4.
1947 భారత స్వతంత్ర చట్టంలోని నిబంధనలను వివరించండి.
జవాబు.
4 జులై 1947న బ్రిటీష్ పార్లమెంట్ లోని కామన్స్ సభలో భారత స్వాతంత్ర్య చట్టం ప్రవేశపెట్టబడింది. జులై 15న కామన్స్ సభలో బిల్లు ఆమోదించబడింది. మరుసటి రోజున ప్రభువుల సభ (లార్డ్స్ సభ) లో ఆమోదించబడింది. జులై 10 నాడు రాజు ఆమోదం పొందింది. ఈ చట్టం భారతదేశాన్ని విభజించి రెండు కొత్త అధినివేశ ప్రాంతాలను సూచించింది. అదే ఇండియా, పాకిస్తాన్. ప్రతి అధినివేశ ప్రాంతంలో రాజు చేత నియమింపబడిన గవర్నర్ జనరల్ కూడా ఉంటాడు. ఒకవేళ వారికిష్టమైతే రెండు అధినివేశ ప్రాంతాలకు ఒకే గవర్నర్ జనరల్ కూడా ఉండవచ్చు.

రెండు ప్రాంతాల్లో శాసనాలు చేయడం కోసం శాసనసభలు ఏర్పాటు చేయబడతాయి. భారతదేశంలో బ్రిటీష్ పార్లమెంట్ అధికార పరిధి 15, ఆగస్ట్ 1947 నుంచి నిలుపుచేయబడుతుంది. ఈ చట్టానికి అనుగుణంగా ఆగస్ట్ 14న పాకిస్తాన్ ఏర్పడింది. దానికి జిన్న గవర్నర్ జనరల్ అయ్యాడు. భారతదేశానికి ఆగస్టు 15న స్వాతంత్ర్యం ఇయ్యబడింది. మౌంట్ బాటిన్ గవర్నర్ జనరల్, నెహ్రూ ప్రధానిగా స్వతంత్ర భారతదేశంలో ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రశ్న 5.
స్వతంత్రోద్యమ కాలంలోని విప్లవకారులు కార్యకలాపాలను వివరించండి.
జవాబు.
కాంగ్రెస్ నిష్క్రియాత్మక విధానాలు నచ్చని కొందరు యువకులు విప్లవవాదులుగా మారారు. వారి లక్ష్యం భయోత్పాతాన్ని సృష్టించి తొందరగా బ్రిటీష్ వారి నుంచి స్వాతంత్ర్యాన్ని పొందడం. వీరు చాలా నిర్భయస్థులు. దేశం కోసం ప్రాణ త్యాగానికైనా స్థిరపడినవారు. అటువంటి వారిలో ఆంధ్రలో అల్లూరి సీతారామరాజు బ్రిటీష్వారి నియంతృత్వం నుండి గిరిజనులను దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేశాడు. 1922 నుండి 1924 వరకు ఏజెన్సీ ప్రాంతంలో బ్రిటీష్ వారి పరిపాలన దాదాపుగా అంతమయిందని చెప్పవచ్చు. ఈ పరిస్థితిని అధిగమించడానికి బ్రిటీష్ ప్రభుత్వం రూథర్ ఫర్డ్ అనే ప్రత్యేక అధికారిని నియమించింది. బెంగాల్లో సూర్యాసేన్ అతని అనుచరుడు సాహు క్రియాశీల పాత్ర వహించారు. సాహు బ్రిటీష్ అధికారి డేని చంపాడు. ఉత్తరప్రదేశ్కి చెందిన రాంప్రసాద్ బిస్మిల్ తన సహచరులతో కలిసి అలంపూర్కు వెళ్తున్న రైలును కాకోరి దగ్గర ఆపి గార్డు దగ్గర నుండి నగదు పెట్టెలను దోచాడు. ఇదే కాకోరి కుట్రకేసుగా ప్రసిద్ధి. ప్రభుత్వం రాంప్రసాద్ బిస్మిల్ను అతని అనుచరుడు అశ్వకుల్లాఖాన్ ను ఉరితీసింది. 1930 – 32లో హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీ తరఫున సూర్యాసేన్ చిటగాంగ్, ఇతర ప్రాంతాలలో దాడులను రచించాడు. అతన్ని ప్రభుత్వం ఉరితీసింది. ఉత్తరప్రదేశ్లో చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్లు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ను స్థాపించారు. తదనంతరం భగత్సింగ్ పోలీసు అధికారి సాండర్స్ను చంపాడు. బతుకేశ్వర్ దత్తో కలిసి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలోకి ఏప్రిల్ 8, 1929న బాంబులు, కరపత్రాలు విసిరారు. ప్రభుత్వం భగత్సింగ్, రాజగురు, సుఖదేవ్లను 23 మార్చి 1931న ఉరితీసింది.

ప్రశ్న 6.
వేవెల్ ప్రణాళికను వివరించండి.
జవాబు.
1943లో లిన్లిత్అ అనంతరం వేవెల్ వైస్రాయ్ అయ్యాడు. అతని పరిస్థితి చాలా క్లిష్టతరంగా మారింది. బెంగాల్ ఒకవైపు కరువుకోరలు మరియు మతపరమైన ప్రశ్నలు ఉదయించడంతో ప్రభుత్వ ప్రతిష్ఠంభన ఏర్పడింది. 1944లో వేవెల్ గాంధీని విడుదల చేశాడు. భారతదేశంలోని ఐక్యతలో ఒత్తిడిని ప్రతిష్ఠంభనను పరిష్కరించడానికి ప్రయత్నం చేశారు. అనంతరం గాంధీ జిన్నతో కలిసి ఒక పరిష్కారాన్ని కనుగొనాలని అనుకున్నాడు. కాం దీని పరిష్కారానికి 1945లో వేవెల్ లండన్ వెళ్ళాడు. రాజకీయ ప్రతిష్ఠంభనను తొలగించి భాగ లక్ష్యాన్ని సాధించడానికి తోడ్పడే ప్రణాళికతో తిరిగి వచ్చాడు.

ద్విపరిపాలనా నూతన రాజ్యాంగం ఏర్పడి భారతీయుల ఆమోదం పొందే లోపల ఒక తాత్కాలిక ఏర్పాటును ప్రణాళిక ప్రతిపాదించింది. వివిధ రాజకీయ సంస్థల ప్రతినిధులతో వైస్రాయ్ ఒక కార్య నిర్వాహక సమితిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో అధ్యక్షుడుగా వైస్రాయ్, యుద్ధ వ్యవహారాలను చూస్తున్న ముఖ్య సైన్యాధిపతి ఇద్దరు మాత్రమే ఆంగ్లేయులు ఉంటారు. మిగిలిన వారు వివిధ పార్టీల నుంచి ఎన్నుకోబడిన వాళ్ళుంటారు. వారిలో హిందూ, ముస్లింలు సమాన సంఖ్యలో ఉంటారు. కార్యనిర్వాహక సంస్థలకు ఎన్నుకోబడిన సభ్యులకు వేవెల్ ఒక సమావేశాన్ని సిమ్లాలో ఏర్పాటు చేశాడు. అయితే ఈ ఎంపికను జిన్నా అంగీకరించలేదు. దాంతో సిమ్లా సమావేశం విఫలమయ్యింది.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
చంపారన్ సత్యాగ్రహం.
జవాబు.
చంపారన్ బీహార్ రాష్ట్రంలో వెనుకబడ్డ జిల్లా. ఇక్కడి రైతులు బ్రిటీష్ వారి బలవంతంతో ‘నీలిమందు (ఇండిగో) పండించేవారు. ఈ రైతులు ఆంగ్లేయుల ఆధీనంలో ఉండేవారు. నీలిమందును ఆంగ్లేయులు పండించిన ధరకే అమ్మాలి. ఆంగ్లేయులు రైతులను ఎంతగానో పీడించేవారు.

దక్షిణాఫ్రికాలో గాంధీ నిర్వహించిన ఉద్యమాలను గురించి విన్న చంపారన్ రైతులు తమకు సహాయం చేయాల్సిందిగా గాంధీని ఆహ్వానించారు. అక్కడ గాంధీజీ సత్యాగ్రహం ఆరంభించాడు. వేలాది రైతులు జత కలవడంతో, చివరకు ప్రభుత్వం చంపారన్ వ్యవసాయ బిల్లును ఆమోదించింది. ఇది గాంధీకి, సత్యాగ్రహానికి లభించిన విజయం.

ప్రశ్న 2.
రౌలట్ చట్టం.
జవాబు.
1917లో బ్రిటీష్ ప్రభుత్వం భారతదేశంలో జరుగుతున్న విప్లవాత్మక నేరాలపై దర్యాప్తు చేయడానికి న్యాయాధికారి సిడ్నిరౌలత్ నాయకత్వంలో ఒక కమిటీని వేసింది. ఈ కమిటీ వీటన్నింటిని అణచివేయమని సిఫార్సు చేసింది. ఫలితంగా 1919లో రౌలత్ చట్టం అమలు చేయబడింది. ఈ చట్టం ప్రకారం ఎవరినైనా వారంటు లేకుండా అరెస్ట్ చేసే అధికారం, వారి ఇంటిని సోదా చేసి ఆస్తులను జప్తు చేసే అధికారాన్ని ప్రభుత్వానికి ఇచ్చింది. దీనికి వ్యతిరేకంగా భారత సాక్ష్యాల చట్టం ఆధారంగా కోర్టులో అప్పీల్ చేయడం గానీ, సాక్ష్యాలను విచారించడం మొదలైన నిబంధనలేవీ లేవు. విచారణ లేకుండా రెండేళ్ళ కంటే ఎక్కువ సమయం నిర్బంధించవచ్చు అనే నిబంధన భారత పౌరుల ప్రాథమిక హక్కులను హరించివేసింది. ఇది భారతీయులలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఈ పరిస్థితులు గాంధీ మొదటి అఖిల భారత ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. ప్రముఖ నాయకులు స్వామి శ్రద్ధానంద కూడా పాల్గొన్నారు. దేశమంతటా నిరసన ఉద్యమాలు జరిగాయి. గందరగోళాన్ని అల్లర్లను సృష్టిస్తున్నాడన్న నెపంపైన గాంధీ అరెస్ట్ చేయబడ్డాడు.

ప్రశ్న 3.
రౌండ్ టేబుల్ సమావేశాలు.
జవాబు.
1930- 32 సంవత్సరాల మధ్యకాలంలో సైమన్ కమీషన్ నివేదిక ఆధారంగా భారతదేశంలో జరపవలసిన రాజ్యాంగ సంస్కరణలను చర్చించడానికి ఆంగ్ల ప్రభుత్వం భారతదేశంలో వివిధ పార్టీలు, సంస్థానాల ప్రతినిధులతో మూడు సమావేశాలను లండన్లో ఏర్పాటు చేశారు. వీటిని రౌండ్ టేబుల్ సమావేశాలు అంటారు.

మొదటి సమావేశం: 1930లో శాసనోల్లంఘన జరిగే సమయంలో ఏర్పాటైన ఈ సమావేశాన్ని భారత జాతీయ కాంగ్రెస్ బహిష్కరించింది. 1931లో జరిగిన గాంధీ – ఇర్విన్ ఒప్పందం ఫలితంగా రాజకీయ ఖైదీలను బ్రిటీష్ వారు విడుదల చేశారు.

రెండో రౌండ్ టేబుల్ సమావేశం: రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీజీ పాల్గొన్నారు. ఈ సమావేశం ఎలాంటి సత్ఫలితాలివ్వలేదు. తిరిగి వచ్చిన గాంధీ మరల శాసనోల్లంఘన చేపట్టారు.

మూడో రౌండ్ టేబుల్ సమావేశం: ఈ సమావేశానికి పెద్దగా ప్రాధాన్యం లేదు. కాంగ్రెస్ వారు, బ్రిటీష్ లేబర్ పార్టీ కూడా దీనిని బహిష్కరించింది.
ఈ సమావేశాల ఫలితంగా 1935 భారత ప్రభుత్వ చట్టం ఏర్పడింది.

TS Inter 1st Year History Study Material Chapter 15 జాతీయ ఉద్యమం – మలిదశ

ప్రశ్న 4.
సైమన్ కమీషన్,
జవాబు.
భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణల గురించి సిఫారసు చేయాల్సిందిగా బ్రిటీష్ ప్రభుత్వం 1927లో జాన్ సైమన్ అధ్యక్షుడిగా సైమన్ కమీషన్ ను నియమించింది. ఈ సంఘంలో అందరూ ఆంగ్లేయులే ఉండటం, అందులో భారతీయులెవరికీ ఇందులో స్థానం కల్పించకపోవడం భారతీయులకు ఆగ్రహం తెప్పించింది. దాంతో దేశవ్యాప్తంగా కమీషన్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, హర్తాళ్లు జరిగాయి. సైమన్ కమీషన్ను ప్రజలు బహిష్కరించారు. ‘సైమన్ గో బ్యాక్’ నినాదాలు దేశమంతటా మార్మోగాయి. అయినప్పటికీ దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి నివేదిక రూపొందించింది.

ప్రశ్న 5.
మౌంట్ బాటెన్ ప్రణాళిక.
జవాబు.
1947లో వేవెల్ స్థానంలో మౌంట్బాటెన్ వైస్రాయ్ గా నియమింపబడ్డాడు. అట్లే ప్రభుత్వం అతనికి అధికార బదిలీ కార్యక్రమాన్ని పూర్తి చేయమని అనుజ్ఞనిచ్చింది. మౌంట్బాటెన్ కాంగ్రెస్, ముస్లిం లీగుతో చర్చించాడు. వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ఎంతో కష్టపడ్డాడు. అయినా చివరికి దేశ విభజన అనివార్యమయింది. ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతంలో పాకిస్థాన్ ను ఏర్పాటు చెయ్యాలని అతను ప్రతిపాదించాడు. వీటిలో సింధ్, బలూచిస్థాన్ వాయువ్య ప్రావిన్సులు పంజాబ్లోని కొన్ని ప్రాంతాలు, తూర్పు బెంగాల్లున్నాయి. పరిస్థితి దిగజారుతుండటంతో తప్పనిసరై కాంగ్రెస్ కూడా ఈ ప్రతిపాదనను ఒప్పుకోవలసి వచ్చింది. విభజనకు అనుగుణంగా మౌంట్బాటెన్. నిర్ణయాలు తీసుకున్నాడు.