TS 6th Class Hindi Guide 5th Lesson मेरा परिवार

Telangana SCERT 6th Class Hindi Study Material Telangana Pdf 5th Lesson मेरा परिवार Textbook Questions and Answers.

TS 6th Class Hindi 5th Lesson Questions and Answers Telangana मेरा परिवार

सुनो-बोलो :

TS 6th Class Hindi Guide 5th Lesson मेरा परिवार 3

प्रश्न 1.
गीत गाकर सुनाओ। भाव के बारे में बातचीत करो ।
उत्तर :
दादा अखबाग पढते हैं, पिताजी बाजाग जाते हैं, दादी मीठे गाने गाती है, माँ अच्छे पकवान बनाती है। मैं और भाई पढते हैं, कभी-कभी लडते हैं। मुझे अपने घर और परिवार से प्यार है।

प्रश्न 2.
तुम्हारे घर में कौन क्या-क्या काम करते हैं ?
उत्तर :
मेंरे घर में मेरी माँ खाना बनाती है। पिताजी (दफ्तर) आफिस जाते हैं। दादाजी और दादी माँ की मदद करते हैं। मैं और मेग भाई पाठशाला जाते हैं और अच्छी तरह पढते हैं।

TS 6th Class Hindi Guide 5th Lesson मेरा परिवार

प्रश्न 3.
तुम अपने घर में क्या-क्या काम करते हो ?
उत्तर :
मै अपने घर में पूजा के लिए फूल तोडता हूँ। पौधों को पानी देता हूँ। बोतलो में पानी भर कर फ्रिज़ में रखता हूँ। कभी-कभी दादा – दादी की सहायता करता हूँ।

प्रश्न 4.
तुम्हारी समझ से किसे क्या काम करना चाहिए ?
उत्तर :
मेरी नजर में हर एक को कोई न कोई काम कर्ना चाहिए । काम करते समय एक दूसरे की सहायता कर्नी चाहिए। घर के कामों में मैं, मेरे पिताजी, छोटी बहन सब मदद (सहायता) करते हैं। हमारी पढ़ाई के मामले में माता, पिता हमें पाठ सिखाना चाहिए। दादाजी और दादीजी को हमें मदन कर्नी चाहिए।

पढ़ो :

अ. प्रश्न के उत्तर बताओ ।

प्रश्न 1.
दादाजी क्या कर रहे हैं ?
उत्तर :
दादाजी अखबार पढ़ रहे हैं।

प्रश्न 2.
मीटे-मीठे गीत कौन सुनाती है ?
उत्तर :
दाही मीठे-मीटे गीत सुनाती है।

प्रश्न 3.
घर में कौन पढ़ते हैं ?
उत्तर :
घर में मैं और मेग भाई पढ़ते हैं

TS 6th Class Hindi Guide 5th Lesson मेरा परिवार

आ. शब्द पढ़ो। इनके वर्ण वर्णमाला चार्ट में पहचानो। ‘○’ लगाओ।

TS 6th Class Hindi Guide 5th Lesson मेरा परिवार 4
उत्तर :
TS 6th Class Hindi Guide 5th Lesson मेरा परिवार 10

इ. इन्हें पढ़ो।

TS 6th Class Hindi Guide 5th Lesson मेरा परिवार 5
उत्तर :
TS 6th Class Hindi Guide 5th Lesson मेरा परिवार 22

ई. नीचे दिये गये बक्से के अक्षरों में TS 6th Class Hindi Guide 5th Lesson मेरा परिवार 15, और TS 6th Class Hindi Guide 5th Lesson मेरा परिवार 16 मात्रा का अंतर समझाते हुए पढ़िए।

TS 6th Class Hindi Guide 5th Lesson मेरा परिवार 6
उत्तर :

TS 6th Class Hindi Guide 5th Lesson मेरा परिवार 23

लिखो :

अ. सुंदर अक्षरों में लिखिए।

TS 6th Class Hindi Guide 5th Lesson मेरा परिवार 7

आ. मात्रा लगाकर लिखिए। గుణింతం గుర్తులను కలిపి వ్రాయండి.

TS 6th Class Hindi Guide 5th Lesson मेरा परिवार 8
उत्तर :

TS 6th Class Hindi Guide 5th Lesson मेरा परिवार 11

इ. ‘ए TS 6th Class Hindi Guide 5th Lesson मेरा परिवार 17 मेरा परिवार 18 मात्रा वाले वर्णों को ‘ल’ के साथ जोड़कर पढ़ो और लिखो।

TS 6th Class Hindi Guide 5th Lesson मेरा परिवार 9

उत्तर :
1. खेल
2. मेल
3. तेल
4. बेल
5. रेल
6. जेल

ई. पढ़ो – लिखो।

1. पेड पर मेना थी। = చెట్టు పైన మైనా ఉన్నది.
There was a nightingale on the tree.

2. ऋषभ कृषक का साथी। = ఎద్దు రైతు స్నేహితుడు.
Ox is the friend of farmer.

TS 6th Class Hindi Guide 5th Lesson मेरा परिवार

3. पीछे – पीछे गये

4. तैराक तैर रहे थे।

5. पैसे लेकर मेला गये।

6. केले खाये।

अभ्यासकार्य :

1. निम्नलिखित कविता का वाचन कीजिए। प्रश्नों के उत्तर दीजिए :
క్రింది కవిత్వాన్ని చదవండి. ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.

और वह कंगारू देखो,
उसके पेट में है एक थैली,
उसमें देखो उसका बच्चा,
कैसा है मस्ती से बैठा।
चिडियाघर की सैर निराली,
बच्चो, बजाओ मिलकर ताली।।

प्रश्न 1.
वह ………. देखो।
1) कंगारू
2) मोर
3) शेर
उत्तर :
1) कंगारू

प्रश्न 2.
उसके पेट में क्या है?
1) एक पेड
2) एक थैली
3) एक पत्ता
उत्तर :
2) एक थैली

TS 6th Class Hindi Guide 5th Lesson मेरा परिवार

प्रश्न 3.
उसमें उसका क्या है देखो?
1) थैल्ली
2) हाथ
3) बच्चा
उत्तर :
3) बच्चा

प्रश्न 4.
चिडियाघर की क्या निराली होती है?
1) सैर
2) शेन
3) शोर
उत्तर :
1) सैर

प्रश्न 5.
बच्चो मिलकर क्या बजाते हैं?
1) शोर
2) तात्नी
3) श्तत्ती
उत्तर :
2) तात्नी

TS 6th Class Hindi Guide 5th Lesson मेरा परिवार

2. मात्रा लगाकर लिखो। గుణింతం గుర్తులను కలిపి వ్రాయండి.

TS 6th Class Hindi Guide 5th Lesson मेरा परिवार 21

उत्तर :
TS 6th Class Hindi Guide 5th Lesson मेरा परिवार 13

3. इन्हें पढ़ो। तालिका में सही जगह पर लिखो।

TS 6th Class Hindi Guide 5th Lesson मेरा परिवार 20
उत्तर :

TS 6th Class Hindi Guide 5th Lesson मेरा परिवार 14

4. चित्र वाले शब्द पर ‘○’ लगाओ।

TS 6th Class Hindi Guide 5th Lesson मेरा परिवार 19

उत्तर :
गमले में फूल खिला।
नाना ऐनक पहनते हैं।
पिताजी थैली में सामान लाते हं।
मेज पर धागा है।

सारांश-సారాంశం :

TS 6th Class Hindi Guide 5th Lesson मेरा परिवार 1

अर्थ (అర్ధములు) (Meanings) :

TS 6th Class Hindi Guide 5th Lesson मेरा परिवार 2

TS 7th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సీత ఇష్టాలు

Telangana SCERT 7th Class Telugu Guide Telangana 10th Lesson సీత ఇష్టాలు Textbook Questions and Answers.

సీత ఇష్టాలు TS 7th Class Telugu 10th Lesson Questions and Answers Telangana

బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి.

TS 7th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సీత ఇష్టాలు 2

ప్రశ్నలు

ప్రశ్న 1.
పై బొమ్మలో ఎవరెవరున్నారు?
జవాబు.
చిత్రంలో ముగ్గురు వ్యక్తులున్నారు. ఇది బుర్రకథ చెబుతున్న దృశ్యం. మధ్యలో ఉన్నవారిని కథకుడు అనీ, అటూఇటూ ఉన్నవారిని వంతలు అని పిలుస్తారు.

TS 7th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సీత ఇష్టాలు

ప్రశ్న 2.
వారు ఏం చేస్తున్నారు?
జవాబు.
వారిలో మధ్యలో ఉన్నవాడు అడుగులు కదిలిస్తూ అభినయిస్తూ బుర్రకథ చెబుతున్నాడు. అటూఇటూ ఉన్న వంతలు అతడిని అనుసరిస్తూ వంత పాడుతున్నారు.

ప్రశ్న 3.
ఇట్లాంటి ప్రదర్శనను మీరు ఎప్పుడైనా చూశారా? దీనిని ఏమంటారు?
జవాబు.
ఇలాంటి ప్రదర్శనను ఒకసారి మా స్నేహితుని బడిలో వాళ్ళ పాఠశాల వార్షికోత్సవంలో ప్రదర్శిస్తుంటే చూశాను. నాన్న నడిగితే దీనిని బుర్రకథ అంటారని, ఇది మన ప్రాచీన జానపద కళల్లో ముఖ్యమైనదని చెప్పాడు.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.95)

ప్రశ్న 1.
“కొత్త వింత-పాత రోత” సామెత ఏఏ సందర్భాలలో వాడుతారు?
జవాబు.
కొత్త విషయాలు ఎప్పుడూ ఆకర్షిస్తూ ఉంటాయి. కొత్తవి కనబడగానే అప్పటిదాకా వాడుతున్న పాతవాటిని వదిలేస్తాం. కొత్త డిజైన్లతో దుస్తులు రాగానే పాతవి వదిలేస్తాం. నాగరికత, సంస్కృతి, సంప్రదాయం ఇలాంటివన్నీ కొత్తవి బాగున్నాయని పాతరోల్ అనీ మార్చేస్తాం. ఇలా ఎన్నో సందర్భాలలో కొత్తవింత పాతరోత అనే సామెత వాడుతాం.

ప్రశ్న 2.
ఆ ఆడపిల్లలను కొంతమంది తల్లిదండ్రులు చదివించకపోవడానికి కారణాలేమిటి? మిత్రులతో చర్చించండి.
జవాబు.
1) మూఢ నమ్మకాలు
2) ఆడపిల్లమీద పెట్టే ఖర్చు వృథా అనే దురభిప్రాయం
3) ఆడపిల్లలకు అయ్యే ఖర్చు ఎక్కువ అనే అభిప్రాయం కారణాలు.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.98)

ప్రశ్న 1.
ఈ ఆడపిల్లలు ఇంటివద్ద ఏయే పనులు చేస్తూ తమ ఇష్టాలు కోల్పోతున్నారు? చర్చించండి.
జవాబు.
సాటి పిల్లలతో ఆడుకోవాలనే కోరిక, బాగా చదువుకోవాలనే కోరిక, విహారయాత్రలకు వెళ్ళాలనే కోరిక కోల్పోతుంది. + సీతను

ప్రశ్న 2.
దాచిన తల్లి మనసు ఎటువంటిది? దీనిపై మాట్లాడండి.
జవాబు.
శ్రావణి టీచర్ ఊళ్ళోకి రాగానే బడి ఈడు పిల్లలను వెతుకుతూ ఊళ్ళోకి బయలుదేరింది. సీత యింటికి రాగానే సీతను తల్లి లోపల దాచిపెట్టింది. ఇంట్లో ఎవరూ లేరని చెప్పింది. పిల్లలను బడికి పంపిస్తే తను ఇబ్బంది పడాలి. తరువాత పుట్టిన పిల్లలను చూసుకోడానికి ఎవరూ ఉండరు అని తల్లి భయపడింది. అందుకే సీతను దాచింది.

ప్రశ్న 3.
స్త్రీ గొప్పదనమేమిటి?
జవాబు.
మానవజన్మలో ఆడజన్మ చాలా గొప్పది. ఎందుకంటే స్త్రీకి ఓర్పు ఎక్కువ. అందరితో స్నేహంగా ఉంటుంది. అందరినీ ప్రేమగా చూసుకుంటుంది. అంత గొప్పతనమున్న ఆడపిల్లను చక్కగా పెంచితే ఇల్లు, ఊరు, దేశం అభ్యున్నతి పొందుతాయి.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.101)

ప్రశ్న 1.
టీచర్ ఆదర్శ మహిళల గురించి సీత తల్లికి ఎందుకు చెప్పి ఉంటుంది?
జవాబు.
బడికి పంపాల్సి వస్తుందని సీత తల్లి సీతను దాచిపెట్టి ఇంట్లో ఎవరూ లేరని అబద్ధం చెప్పింది. శ్రావణి టీచర్కు అర్థమయింది. సీత తల్లి అవసరం కోసం అలా చేసిందే కాని ఆమె చెడ్డది కాదని టీచర్ గ్రహించింది. అందుకే ఆదర్శ మహిళల గురించి చెప్పింది. అది వింటే తప్పకుండా తల్లి మనసు మారుతుందని టీచర్ అభిప్రాయం.

TS 7th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సీత ఇష్టాలు

ప్రశ్న 2.
చదువుకున్నవాళ్ళు ఎట్లా ఆలోచించాలని సీత ఇష్టాల ద్వారా తెలుసుకున్నారు?
జవాబు.
సీత ఇష్టాలు పాఠం ద్వారా చదువుకున్న వారి ఆలోచనలు ఎలా ఉండాలో మనకు కింది విధంగా తెలుస్తుంది. ఆడపిల్లలను చిన్నచూపు చూడకూడదు. అన్నింటిలోనూ వారికి అవకాశాలు కల్పించాలి. చదువుల్లోనూ పదవుల్లోనూ కూడా ఆడపిల్లలు మగవారితో సమానమే. వాళ్ళలోని ప్రతిభను అందరూ గౌరవించాలి.

ప్రశ్న 3.
సీత ఇష్టాలు తెలుసుకున్నారు కదా! సీతవలె అమ్మాయిలు ఎట్లాంటి ఇష్టాలు కలిగి ఉండాలి?
జవాబు.
అమ్మాయిలందరూ ఈ రోజులలో పెద్ద చదువులు చదవాలని, పెద్ద ఉద్యోగాలు చేయాలనీ కోరుకోవాలి. సాంకేతిక విద్యలపైన వైద్య విద్యలపైన మక్కువ చూపించాలి. మగవారితో సమంగా ఎటువంటి ఉద్యోగమైనా చెయ్యగలగాలి. అంతరిక్షంలోనూ, సముద్రంలోనూ, నేలపైనా కూడా ముందుకు దూసుకు వెళ్ళాలి. ఇలాంటి ఇష్టాలు కలిగి ఉండాలి.

ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళే. ఎందుకు ? కారణాలు చెప్పండి.
జవాబు.
ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళే. పురాణాల్లో మైత్రి గార్గి వంటి పండితులున్నారు. చరిత్రలో రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వీరవనితలు, మాంచాల, చానమ్మ వంటి వీరపత్నులు, ఆధునిక కాలంలో సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశముఖ్ వంటి స్వరాజ్య సమర యోధులూ ఉన్నారు. ఇక ప్రస్తుత కాలంలో అంతరిక్షం నుంచి జలాంతర సీమల వరకూ ప్రతి పనినీ చేయగల సమర్థులైన మహిళలు, క్రీడా రంగంలో అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన వారు ఎంతో మంది ఉన్నారు. అందుకే ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళే.

2. శ్రావణి టీచర్ గురించి తెలుసుకున్నారు కదా ! అట్లాగే మీ ఉపాధ్యాయులను గురించి మాట్లాడండి.
జవాబు.
శ్రావణి టీచర్ వంటి వారు మనకు అక్కడక్కడా కనిపిస్తుంటారు. మా పాఠశాలలో ఉపాధ్యాయులందరూ విద్యార్థులకు ఎంతో ప్రేమగా పాఠాలు చెబుతారు. ముఖ్యంగా మా తెలుగు ఉపాధ్యాయులు సమాజసేవ గురించి, మానవతా విలువల గురించి, క్రమశిక్షణ గురించి పదేపదే చెబుతారు. బడికి రాని పిల్లల తల్లిదండ్రులకు నచ్చ జెప్పి పిల్లలు బడికి వచ్చేలా చేస్తారు.

II. ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

1. ‘కొత్త వింత – పాత రోత’ అనే అర్థంవచ్చే వాక్యాలు పాఠంలో ఎక్కడ ఉన్నాయి ?
జవాబు.
“పాతంటే రోతగా ఉందా ?” “పాతలేందే కొత్తెక్కడుంది ?” “కొత్త కొత్త అంటున్నారు, కొత్త చెత్తంతా పాతలోంచే కదా వచ్చింది” “పాతంటే రోతని నేనన్నానా ?” మొదలైన వాక్యాలు “కొత్త వింత పాత రోత’ అనే అర్థాన్నిస్తాయి.

2. పాఠంలో మీకు నవ్వు పుట్టించిన అంశాలు రాయండి.
జవాబు.
రాజు – రోజా పోట్లాడుకుంటూ అనే మాటలు నాకెంతో నవ్వు తెప్పించాయి. తిక్క సన్నాసీ అని పిలవడం, కొత్త చెత్త పాతలోంచే వచ్చింది అనడం, కరెంట్ షాక్ తగిలిన కాకిలాగా అరుస్తున్నావనడం, రాజు ఒకటో తరగతిలో ఉండగానే పెద్ద లెటర్స్ 26 చదివానని అనడం, అవేంటని అడిగితే ABCD అని చెప్పడం ఇవన్నీ ఈ పాఠంలో ఎంతో నవ్వు పుట్టించిన అంశాలు.

3. కింది పేరా చదివి క్రింది పట్టికను పూరించండి.
1940 ప్రాంతంలో తెలంగాణాలో స్త్రీల చైతన్యం కొంత వికసించింది. లేడీ హైదరీల క్లబ్, సోదరీ సమాజం, ఆంధ్ర యువతీ మండలి, ఆంధ్రమహాసభ మొదలైన సమాజాలు ఏర్పడి సమావేశాల ద్వారా స్త్రీలను చైతన్యవంతులను చేశాయి. రత్నదేశాయి తన సాహిత్యం ద్వారా గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసింది. వితంతువులకోసం వసతిగృహాలు ఏర్పాటు చేసింది. అనేకమంది రచయితలు, రచయిత్రులు పత్రికల ద్వారా స్త్రీలలో చైతన్యం కలిగించారు. సుమిత్రాదేవి, ఈశ్వరీబాయి, సంగెం లక్ష్మీబాయి మొదలయిన వాళ్ళు సంఘ సంస్కరణకు కృషి చేశారు. అఘోరనాథ చటోపాధ్యాయగారి భార్య వరదసుందరీదేవి నాంపల్లిలో బాలికలకోసం పాఠశాలను ప్రారంభించింది. ఈమె సరోజనీనాయుడు గారి తల్లి.
TS 7th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సీత ఇష్టాలు 1
జవాబు.

సంఘ సంస్కర్తలు రచయిత్రులు సంస్థలు
సుమిత్రాదేవి రత్నదేశాయి లేడీ హైదరీల క్లబ్
ఈశ్వరీబాయి సోదరీ సమాజం
సంగెం లక్ష్మీబాయి ఆంధ్ర యువతీమండలి
ఆంధ్ర మహాసభ

 

TS 7th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సీత ఇష్టాలు

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. శ్రావణి టీచర్ పిల్లల అభివృద్ధికోసం చేసిన ప్రయత్నాన్ని తెలపండి.
జవాబు.
శ్రావణి టీచర్ రామాపురం అనే గ్రామంలో బడిలో టీచర్ గా చేరింది. ఆమె పిల్లల అభివృద్ధికోసం పాటుపడేది. బడిలో పిల్లలకు పాఠాలు నేర్పడమే కాకుండా మంచి మంచి కథలు చెప్పడం, ఆటలాడించడం, పాటలు పాడించడం, మంచి సూక్తులు వినిపించడం వంటివి చేశారు. పిల్లలను తన సొంత బిడ్డలలాగా చూసుకున్నారు. బడి ఈడున్న పిల్లలు ఎవరెవరు బడికి రావడం లేదో తెలుసుకొని ఒక్కొక్క ఇంటికి వెళ్ళి వాళ్ళను బడిలో చేర్పించారు.

ఆ. ‘బుర్రకథ’ ప్రదర్శన విధానం గురించి రాయండి.
జవాబు.
బుర్రకథ మన ప్రాచీన జానపద కళారూపాలలో ఒకటి. ముఖ్యమైనది కూడా. ఇందులో ఒక ప్రధాన కథకుడు ఇద్దరు వంతలు ఉంటారు. చారిత్రక విషయాలు గాని, జానపద విశేషాలు గాని వీరుల చరిత్రలు గాని ఇతివృత్తంగా పాటల రూపంలో సాగుతుంది బుర్రకథ. ఎక్కడికక్కడ గతిమారుతూ వేరు వేరు ఊత పదాలతో కథ సాగుతుంది. భళా భళి, సై, తందాన తాన వంటి ఊతపదాలుంటాయి. చిన్న చిన్న అడుగులు లయబద్ధంగా వేస్తూ అభినయం చేస్తూ సొంతంగా పాటపాడుతూ తంబుర మీటుతూ చిరుతలతో తాళం వేస్తూ బుర్రకథ చెప్పడానికి గొప్ప ప్రతిభ కావాలి.

ఇ. పాఠాన్ని ఆధారంగా చేసుకొని ఆడపిల్లల పరిస్థితులను గురించి రాయండి.
జవాబు.
ఆడపిల్లలు పుట్టారంటేనే బాధపడే రోజులవి. ఐనా పూట గడవని స్థితిలో ఉన్న పేదలు ఆడపిలను కూడా పనిలోకి పంపుతున్నారు. లేదా పెద్దవాళ్ళు పనికి పోతూ చిన్న పిల్లల బాధ్యత ఆడపిల్లలకు అప్పగిస్తున్నారు. ఆ కొంచెం ఆధారం పోతుందేమోనని వాళ్ళను దాచేసి, టీచర్లు పిలవడానికి వచ్చినా పంపడం లేదు. ఇలా ఆడపిల్లలను చదివించకపోవడం వల్ల వాళ్ల ఉజ్జ్వల భవిష్యత్తును మసి చేస్తున్నారు.

ఈ. “పెద్దలు పనికి – పిల్లలు బడికి” అనే నినాదాన్ని గురించి రాయండి.
జవాబు.
పెద్దలు తమ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పిల్లలను పనిలోకి తీసుకుపోకూడదు. పిల్లలచేత పనిచేయించడం నేరం. అలా పని చేయిస్తే చట్టరీత్యా వాళ్ళు శిక్షార్హులు. పెద్దలు పనిలోకి వెళుతూ పిల్లలను బడికి పంపించాలి. ప్రభుత్వం ఉచితంగా చదువుచెప్తూ పుస్తకాలు, మధ్యాహ్న భోజనం కూడా ఉచితంగా కల్పించింది. అలాంటప్పుడు పిల్లలను తామేమీ భరించక్కరలేదుగనుక చక్కగా బడికి పంపించాలి అని తెలియజేస్తుంది. ఈ ‘పెద్దలు పనికి పిల్లలు బడికి’ అనే నినాదం.

2. కింది ప్రశ్నకు పది వాక్యాలలో సమాధానం రాయండి.

అ. “సీత ఇష్టాలు” కథను మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు.
రామాపురం అనే పల్లెటూళ్ళో శివయ్య గౌరమ్మ అనే పేద దంపతుల కూతురు సీత. సీతకొక తమ్ముడు, ఒక చెల్లెలు. శివయ్య, గౌరమ్మ పనికిపోతూ సీతకు చిన్నపిల్లల బాధ్యత అప్పగించారు. అందుకే సీత బడికెళ్ళి చదువుకోలేక పోయింది. వాళ్ళ ఊరికి శ్రావణి అనే టీచరు వచ్చి సీతను బడికి పంపమని తల్లిదండ్రులకు నచ్చచెప్పారు. వాళ్లు ఒప్పుకొని సీతను బడికి పంపారు. సీత చక్కగా చదువుకొని అన్నిటా మొదటి స్థానం సాధించింది. పక్క ఊరికి పోయి పై చదువులు చదివి పోటీ పరీక్షలలో విజయం సాధించింది. మండల అభివృద్ధి అధికారిగా ఎంపికైంది. పిల్లల చదువుకోసం, స్త్రీలకు మేలుచేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నది.

IV. సృజనాత్మకత/ప్రశంస

1. ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా చూడాలని తెలిపే “నినాదాలు” రాయండి.
జవాబు.

  1. ఎన్నో జన్మల పుణ్యఫలం – ఆడపిల్లే శ్రేష్ఠం
  2. ఆడవాళ్ళంటే ఓర్పు – ప్రతిపనిలో వారిదే నేర్పు
  3. ఆడపిల్ల ఉన్న ఇల్లు – ఆనందాల హరివిల్లు
  4. ఆడపిల్ల తక్కువ కాదు – మగపిల్లవాడు ఎక్కువ కాదు.
  5. ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా చూడండి. – సమాజాన్ని ముందుకు నడపండి.

V. పదజాల వినియోగం

1. కింది వాక్యాలను చదవండి. ఎవరెవరిని ఏమంటారో రాయండి.

అ. మండలంలో అభివృద్ధిపనులు నిర్వహించే అధికారి
జవాబు.
మండలాధికారి

ఆ. నాయకత్వం వహించేవారు
జవాబు.
నాయకులు

ఇ. ఉపన్యాసం ఇచ్చేవారు
జవాబు.
వక్తలు

TS 7th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సీత ఇష్టాలు

ఈ. హరికథ చెప్పేవారు
జవాబు.
హరికథకులు

ఉ. శిక్షణను ఇచ్చేవారు
జవాబు.
శిక్షకులు

VI. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది పదాలలో సమాపక, అసమాపక క్రియాభేదాలు గుర్తించండి. మరికొన్ని అసమాపక క్రియలు రాయండి.

అ. వెళ్ళి, వచ్చి, తెంపి, తిని, చూసి అసమాపక క్రియలు
తిన్నది, చేసింది, అల్లింది, తెచ్చింది, తెచ్చాడు, రాశాడు – సమాపక క్రియలు
జవాబు.
ఆడి, పాడి, విని, చేసి, వండి, వడ్డించి, నడిచి, పరుగెత్తి, నిద్రించి, మేలుకొని

సమాపక, అసమాపక క్రియలను ఉపయోగించి వాక్యాలు రాయండి.

సమాపక క్రియతో వాక్యాలు అసమాపక క్రియతో వాక్యాలు
1. పాప చాక్లెట్ తిన్నది. 1. పిల్లలు బడికి వెళ్ళి, చదువుకుంటారు.
2. జ్యోతి నాట్యం చేసింది. 2. పోస్టుమాన్ వచ్చి, ఉత్తరం ఇచ్చాడు.
3. అత్త నాకోసం స్వెటర్ అల్లింది. 3. అమ్మ దారం తెంపి, పూలు కట్టింది.
4. జానకి కూరలు తెచ్చింది. 4. నాన్న అన్నం తిని, ఆఫీసుకెళ్ళారు.
5. రామారావు పద్యాలు రాశాడు. 5. తాడును చూసి, పాము అనుకున్నాను.

2. ఈ కింది వాక్యాల్లో ఆశ్చర్యార్థక, ప్రశ్నార్థక, విధ్యర్థక వాక్యాలను గుర్తించండి. తగిన విరామ చిహ్నాలను ఉంచండి.

అ. దెబ్బ ఎట్లా తగిలింది.
ఆ. అమ్మో ఎంత పెద్ద పామో
ఇ. తప్పకుండా ఇంటిపని పూర్తిచేయాలి.
ఈ. నాన్న కొనిచ్చిన సైకిల్ ఎంత బాగుందో
ఉ. పండుగ నాటికి గుడిని అలంకరించండి.
ఊ. మీది ఏ ఊరు

ఆశ్చర్యార్థక వాక్యాలు : ఆ) అమ్మో! ఎంతపెద్ద పామో! ఈ) నాన్న కొనిచ్చిన సైకిల్ ఎంత బాగుందో !
ప్రశ్నార్థక వాక్యాలు : అ) దెబ్బ ఎట్లా తగిలింది ? ఊ) మీది ఏ ఊరు ?
విధ్యర్థక వాక్యాలు: ఇ) తప్పకుండా ఇంటిపని పూర్తిచేయాలి. ఉ) పండుగ నాటికి గుడిని అలంకరించండి.

ప్రాజెక్టు పని

మీ ప్రాంతంలోని కళారూపాలను గురించి తెలుసుకొని, మీకు నచ్చిన కళారూపాన్ని గురించి రాయండి. జవాబు. మా ప్రాంతంలో సంగీతము, నాట్యము, శిల్పము, చిత్రలేఖనము మొదలైన కళారూపాలు నేర్పుతారు. కొన్ని ప్రదర్శనలు కూడా జరుగుతాయి. వాటిలో నాకు నచ్చిన కళారూపం నాట్యం, ఇందులో సాహిత్యం, సంగీతం, నృత్యం అనే మూడు సమాన ప్రాధాన్యం కలిగి ఉండి వినడానికి చూడడానికి కూడా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇందులో ఆహార్యం ఆకర్షణీయంగా ఉంటుంది.

TS 7th Class Telugu 10th Lesson Important Questions సీత ఇష్టాలు

ప్రశ్న 1.
సీతకథ విన్న తర్వాత మీకు ఏమనిపించిందో చెప్పండి. అటువంటివాళ్ళను గురించి చర్చించండి
జవాబు.
సీత కథ విన్న తరువాత మొదట్లో జాలి కలిగినా తరువాత ఆమె సాధించిన విజయాలకు ఎంతో ఆనందం కలిగింది. “ముదితల్ నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పించినన్”. అన్నట్లు ఆడపిల్లలని చులకన చేయకుండా సీత లాంటి వాళ్ళను చదివిస్తే వారికీ, వారి కుటుంబానికే గాక దేశానికి మంచి పేరు తేగలరు అనిపించింది.

ప్రశ్న 2.
‘సీత’ లాంటివాళ్ళను గురించి మీ అభిప్రాయాలు చెప్పండి.
జవాబు.
మన దేశంలో సీతలాంటి వాళ్ళెందరో ఉన్నారు. ఎందుకంటే మన దేశంలోని బడుగువర్గాల వారందరూ ఇంటిల్లిపాదీ పనిచేస్తే గాని రోజు గడవని పరిస్థితుల్లో పిల్లలను బడికి పంపించకుండా చిన్న పిల్లల సంరక్షణను కొంచెం ఎదిగిన పిల్లలకు అప్పగించడం, ఎదిగిన పిల్లల్ని పనిలోకి పంపించడం సర్వసాధారణం. దీనివల్ల ఎంతో మంది సీతలు చదువుకొనే భాగ్యం కోల్పోతున్నారు.

TS 7th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సీత ఇష్టాలు

ప్రశ్న 3.
“ఆలస్యం అమృతం విషం” అంటే మీకేమి అర్థమైంది ?
జవాబు.
ఆలస్యం = ఆలస్యం చేస్తే, అమృతం = అమృతము కూడా, విషం = విషంగా మారిపోతుంది. ఏ పని ఎప్పుడు చెయ్యాలనుకున్నామో ఆ సమయానికి చేసెయ్యాలి. అలా చెయ్యకపోతే పని అనుకున్నట్లు జరగక పోవడం కష్ట నష్టాలు వాటిల్లడం జరుగుతుంది. అందుకే ఆలస్యం అమృతం విషం అన్నారు. మన పాఠంలో ఇద్దరు బిడ్డలతో సరిపెట్టుకుందామా మూడవబిడ్డ కోసం చూద్దామా అని ఆలోచించే లోపలే ఆలస్యం అయిపోయి మూడవ బిడ్డ పుట్టింది.

ప్రశ్న 4.
మీరు చదువుకొని ఏం కావాలనుకొంటున్నారు ? ఎందుకు ?
జవాబు.
నేను చదువుకొని టీచర్ కావాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక డాక్టరునైనా, ఇంజనీరునైనా, శాస్త్రజ్ఞుణ్ణనా, మరే ఉన్నతాధికారినైనా తయారుచేసేది ఉపాధ్యాయులే. ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేస్తే సమాజానికి చక్కని పౌరులనందించి దేశాన్ని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర వహిస్తారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. తాము నేర్చుకున్నది ఇతరులకు అందిస్తారు. అందుకే నాకు ఉపాధ్యాయుణ్ణి కావాలని ఉంది.

ప్రశ్న 5.
ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ సమానమే ! ఎందుకు ? మీ అభిప్రాయాలు రాయండి
జవాబు.
మన సమాజంలో మగపిల్లలు ఎక్కువ, ఆడపిల్లలు తక్కువ అనే అపోహ ఉంది. కానీ అది నిజం కాదు. ఆడపిల్లలు మగపిల్లలు అందరూ సమానులే. మగపిల్లల కంటే బాగానే ఆడపిల్లలు చదవగలరు. అన్ని పనులు సమర్థవంతంగా నెరవేర్చగలరు. ఏ ఉద్యోగంలోనైనా రాణించగలరు. రాజ్యాలైనా ఏలగలరు. ఆడపిల్లలకు ఓర్పు, ఇతరులపట్ల స్నేహభావం, ప్రేమ ఎక్కువ. ఏ విషయంలోనూ ఆడపిల్లలు మగ పిల్లలకు తీసిపోరు. కనుక ఆడపిల్లలు, మగ పిల్లలు అందరూ సమానమే.

ప్రశ్న 6.
బుర్రకథలోని ముఖ్యాంశాలను రాయండి.
జవాబు.
బుర్రకథలో ఒకరు కథ చెపుతూ ఉంటారు. కథ చెప్పే వారికి చెరోపక్కా ఇద్దరు వంత పాడుతూ ఉంటారు. కథ చెప్పేవారిని కథకుడు అనీ, ఆయనకు రెండు పక్కలా నిలబడి గొంతు కలిపే వాళ్ళను ‘వంతలు’ అని అంటారు. కథకుడు తంబూరా వాయిస్తూ కథ చెబుతాడు. వంతలు దక్కీలు వాయిస్తూ తందానతాన, సైసై అంటుంటారు. బుర్రకథలో మొదట కథకుడు సరస్వతినీ, మహాలక్ష్మినీ, దుర్గనూ ప్రార్థిస్తారు. వంతలలో ఒకడు హాస్య సంభాషణలు చేస్తాడు. మధ్యమధ్యలో ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. బుర్ర కథ పూర్తి అయ్యాక, మంగళం పాడతారు. జానపద కళల్లో బుర్రకథకు ప్రముఖ స్థానం ఉంది. సమాజంలోని సమస్యలను చెప్పి ప్రజలను చైతన్యపరచడంలో బుర్రకథ కీలక పాత్ర వహించింది.

ప్రశ్న 7.
సీత ఇష్టాలు పాఠం ఆధారంగా మీ ఇష్టాలను వివరించండి.
జవాబు.
నాకు బాగా చదువుకోవడమంటే ఇష్టం. వార్తాపత్రికలలో వచ్చే పజిల్స్ పూర్తి చేయడమంటే ఇష్టం. బొమ్మల కథల పుస్తకాలు బాగా ఇష్టపడతాను. తల్లిదండ్రులకు సహాయపడుతూ నానమ్మ తాతయ్యకు కబుర్లు చెబుతూ సంతోషపెట్టడం ఇష్టం. బాగా చదువుకొని టీచర్నై మా టీచర్ గా ఆదర్శంగా నిలబడి సమాజాన్ని తీర్చిదిద్దడం విద్యార్థులను మంచి పౌరులుగా తయారుచెయ్యటం ఇష్టం. అందరితో స్నేహంగా ఉంటూ సమాజసేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఇష్టం. ఆటలాడడం, పాటలు పాడడం, బొమ్మలు గీయడం, బొమ్మలు తయారు చేయడం కూడా ఇష్టమే.

అర్థాలు

  • దంపతులు = భార్యాభర్తలు / ఆలుమగలు
  • పైడి = బంగారము
  • బీజము = విత్తనము
  • మేలు = మంచి / ఉపకారము
  • శ్రీలు = సంపదలు
  • సంగ్రామము = యుద్ధము
  • సమరము = యుద్ధము

పర్యాయపదాలు

  • దంపతులు – భార్యాభర్తలు / ఆలుమగలు
  • ఇష్టము = వాంఛ,కోరిక
  • సంగతి = విషయము, సమాచారము
  • మేలు = మంచి, శుభము
  • పైడి = పుత్తడి, బంగారము

వ్యతిరేక పదాలు

  • కొత్త × పాత
  • చైతన్యము × జడత్వము
  • తొలి × చివరి
  • జయము × అపజయము, పరాజయము
  • ఉత్తముడు × అధముడు
  • మంచివాడు × చెడ్డవాడు
  • కష్టము × సుఖము
  • ఇష్టము × అనిష్టము
  • ముందు × వెనుక / తర్వాత
  • బలము × దుర్బలం / బలహీనము

TS 7th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సీత ఇష్టాలు

ప్రకృతులు – వికృతులు

ప్రకృతి – వికృతి

  • రూపము – రూపు
  • కథ – కత, కద
  • ప్రయాణము – పయనము, పైనము
  • రత్నము – రతనము
  • కష్టము – కస్తి,కసటు
  • భారము – బారకము
  • శాస్త్రము – చట్టము
  • స్వతంత్రము – సొంతము
  • భరము – బరువు
  • సూక్తులు – సుద్దులు
  • పుణ్యము – పున్నెము, పున్నియము
  • రాజు – రాయలు
  • రాట్టు – ఱేడు
  • అక్షరము – అక్కరము, అచ్చము
  • విజ్ఞానము – విన్నాణము, విన్ననువు

సంధులు

  • దినోత్సవము – దిన + ఉత్సవము – గుణ సంధి
  • విద్యార్థిని – విద్యా + అర్థిని – సవర్ణదీర్ఘ సంధి
  • కొత్తెక్కడ – కొత్త + ఎక్కడ – అత్వ సంధి
  • చెత్తంతా – చెత్త + అంత – అత్వ సంధి
  • వద్దని – వద్దు + అని – ఉత్వ సంధి
  • కొత్తవని – కొత్త + అని – ఇత్వ సంధి
  • తగవులాడు – తగవులు + ఆడు – ఉత్వ సంధి
  • తమ్ముడన్నట్లు – తమ్ముడు + అన్నట్లు – ఉత్వ సంధి
  • దంపతులున్నారు – దంపతులు + ఉన్నారు – ఉత్వ సంధి
  • ఎక్కువాయె – ఎక్కువ + ఆయె – అత్వ సంధి
  • అంకితమై – అంకితము + ఐ – ఉత్వ సంధి
  • వాళ్ళెందుకు – వాళ్ళు + ఎందుకు – ఉత్వ సంధి
  • అనుకున్నంత – అనుకున్న + అంత – అత్వ సంధి
  • సాధ్యమవుతుంది – సాధ్యము + అవుతుంది
  • ఈడున్న – ఈడు + ఉన్న – ఉత్వ సంధి
  • ఒక్కొక్క – ఒక్క + ఒక్క – ఆమ్రేడిత సంధి
  • వాళ్ళింటికి – వాళ్ళ + ఇంటికి – అత్వ సంధి
  • అభ్యున్నతి – అభి + ఉన్నతి – యణాదేశ సంధి
  • మాటలన్ని + మాటలు + అన్ని – ఉత్వ సంధి
  • ప్రభావితులైన – ప్రభావితులు + ఐన – ఉత్వ సంధి
  • చిన్నక్క – చిన్న + అక్క – అత్వ సంధ
  • ప్రధానోపాధ్యాయులు – ప్రధాన + ఉపాధ్యాయులు – గుణ సంధి
  • చేయాలని – చేయాలి + అని – ఇత్వ సంధి
  • ఎంపికయింది – ఎంపిక + అయింది – అత్వ సంధి
  • చక్కనమ్మ – చక్కని + అమ్మ – ఇత్వ సంధి
  • సీతమ్మ – సీత + అమ్మ – అత్వ సంధి
  • జరిగిందక్కా – జరిగింది + అక్కా – ఇత్వ సంధి
సమాస పదం విగ్రహ వాక్యం సమాసం పేరు
1. పుణ్య ఫలము పుణ్యము యొక్క ఫలము షష్ఠీ తత్పురుష సమాసము
2. మానవ జన్మ మానవుల యొక్క జన్మ షష్ఠీ తత్పురుష సమాసము
3. నలుగురు గొప్పవాళ్ళు నలుగురు సంఖ్య గల గొప్పవాళ్ళు ద్విగు సమాసము
4. స్వరాజ్య సమరము స్వరాజ్యము కొరకు సమరము చతుర్థీ తత్పురుష సమాసము
5. మహిళల మార్గము మహిళల యొక్క మార్గము షష్ఠీ తత్పురుష సమాసము
6. పదహారేళ్ళు పదహారు సంఖ్యగల ఏళ్ళు ద్విగు సమాసము
7. ఇంటిపనులు ఇందలి పనులు సప్తమీ తత్పురుష సమాసము
8. చదువుల తల్లి చదువులకు తల్లి షష్ఠీ తత్పురుష సమాసము
9. నాలుగురాళ్ళు నాలుగు సంఖ్య గల రాళ్ళు ద్విగు సమాసము
10. శత్రువినాశము తల్లియు, తండ్రియు ద్వంద్వ సమాసము
11. రామకథ శత్రువుల యొక్క వినాశము షష్ఠీ తత్పురుష సమాసము

 

1. అ. క్రింది అంశాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

జానపద కళల్లో ఎంతో ప్రాచుర్యం పొందినది బుర్రకథ. తరతరాలుగా ప్రజాచైతన్యంలో ఈ కళారూపం కీలకపాత్ర పోషించింది. ఇందులో ఒకరు కథ చెబుతుంటే వారికి చెరో పక్కా ఇద్దరు వంత పాడుతూ ఉంటారు. కథ చెప్పే వారిని “కథకుడు” అనీ, ఆయనకు రెండుపక్కలా నిలబడి గొంతు కలిపేవాళ్ళను “వంతలు” అని అంటారు. కథకుడు తంబూరా వాయిస్తాడు కాబట్టి కథకు బుర్రకథ అని పేరు వచ్చింది. ఈనాటి బుర్రకథను కృష్ణవేణి చెబుతుంది. రోజా, రాజు వంతలుగా వస్తున్నారు.

ప్రశ్నలు:

1. బుర్రకథ ఎటువంటి కళారూపం ?
జవాబు.
జానపద కళారూపం

2. బుర్రకథలో ఎన్ని పాత్రలు ఉంటాయి ?
జవాబు.
మూడు పాత్రలుంటాయి.

TS 7th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సీత ఇష్టాలు

3. కథ చెప్పేవారిని ఏమంటారు ?
జవాబు.
ప్రధాన కథకుడు

4. ప్రక్కలనున్నవారిని ఏమంటారు ?
జవాబు.
వంతలు

5. బుర్రకథ చెప్పిన వారి పేరేమిటి ?
జవాబు.
కృష్ణవేణి

ఆ. క్రింది అంశాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

పరమానందయ్యగారు శిష్యులను తన వద్దనే ఉంచుకొని చదివిస్తారు. వారిమీద ఆయనకు ఎంతో అభిమానం. శిష్యులకు గురువు అంటే ఎంతో గౌరవం, చనువు. వారి మధ్య సంబంధం తండ్రీబిడ్డల సంబంధం కంటె గొప్పది. ఆయన వారి తప్పులను ఎప్పుడూ క్షమిస్తూనే ఉంటారు.

ప్రశ్నలు:

1. ఈ పేరాలో గురువుగారి పేరేమిటి ?
జవాబు.
పరమానందయ్య

2. గురు శిష్యుల బంధాన్ని ఏ బంధంతో పోల్చారు ?
జవాబు.
తండ్రీబిడ్డల బంధంతో

3. గురువు శిష్యులను ఎలా చూసేవారు ?
జవాబు.
ఎంతో అభిమానంగా

4. శిష్యులకు గురువుపై ఎటువంటి భావం ఉండేది ?
జవాబు.
గౌరవం, చనువు

5. శిష్యులు ఎక్కడ ఉండేవారు ?
జవాబు.
గురువుగారి దగ్గర

2. కింది వాక్యాలను సరైన వరుసలో పేరాగా రాయండి.

1. ఆ తెలుగు నాట రామాపురమనేది ఒక పల్లెటూరు.
2. ఆ దంపతులకు కలిగిన తొలి సంతానమే సీత.
3. ఆ పల్లెలో శివయ్య, గౌరమ్మ అనే పేద దంపతులున్నారు.
4. శ్రీలు విలసిల్లిన భారత భూమిలో, రాజనాలు పండే రతనాల నేల తెలుగు నేల.
5. సీతను బడికి పంపాలనుకుంటూండగానే వాళ్ళకు మరో అబ్బాయి పుట్టాడు.
జవాబు.
శ్రీలు విలసిల్లిన భారత భూమిలో, రాజనాలు పండే రతనాల నేల తెలుగు నేల. ఆ తెలుగు నాట రామాపురమనేది ఒక పల్లెటూరు. ఆ పల్లెలో శివయ్య, గౌరమ్మ అనే పేద దంపతులున్నారు. ఆ దంపతులకు కలిగిన తొలి సంతానమే సీత. సీతను బడికి పంపాలనుకుంటూండగానే వాళ్ళకు మరో అబ్బాయి
పుట్టాడు.

3. ఈ క్రింది పేరాలు చదివి వాటికి ఐదేసి ప్రశ్నలు రాయండి.

అ. అంగవైకల్యం తప్పుకాదు. అది ఆయాపరిస్థితులలో వెనుకపడడమే. వారికి చేయూతనిచ్చి పైకి తీసుకురావలసిన బాధ్యత మనందరిదీ. ఒక చల్లని మాట, ప్రేమతో కూడిన చల్లని స్పర్శ వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అందుకే మన చేతనైనంతలో వారిలో ధైర్యాన్ని నింపుదాం.

1. అంగవైకల్యం అంటే ఏమిటి?
2. ఆత్మవిశ్వాసం ఎలా పెరుగుతుంది?
3. మనం వారిలో ఏం కలిగించాలి?
4. మన బాధ్యత ఏమిటి?
5. ఈ పేరాకు శీర్షిక రాయండి.

TS 7th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సీత ఇష్టాలు

ఆ. ఉత్తానపాద మహారాజు పెద్ద భార్య సురుచి, చిన్న భార్య వినీత. పెద్ద భార్య కుమారుడు ధ్రువుడు. రాజు చిన్న భార్యను, ఆమె కుమారుడు ఉత్తముడిని ఎక్కువ ప్రేమించేవాడు. పక్షపాతం కలిగి ఉండేవాడు. సురుచిని, ధ్రువుని అవమానించేవాడు. అందుకే ధ్రువుడు శ్రీమహావిష్ణువు గురించి తపస్సు చేశాడు.

1. రాజుకు ఎంతమంది భార్యలు ?
2. ఉత్తముడు ఎవరి కుమారుడు ?
3. రాజుకు ఎవరియందు పక్షపాతం ?
4. ధ్రువుని తల్లి ఎవరు ?
5. ధ్రువుడు ఎవరిని గురించి తపస్సు చేశాడు ?

4. క్రింది వాక్యాలలో గీతగీసిన పదాలకు వ్యతిరేకపదాలు రాయండి.

అ. కొత్త నీరొచ్చి ……………………….. నీటిని కొట్టేసింది.
జవాబు.
కొత్త × పాత

ఆ. పట్టణాల కంటె ……………………….. అందంగా ఉంటాయి.
జవాబు.
పట్టణాలు × పల్లెలు / పల్లెటూళ్ళు

5. ప్రకృతి వికృతులను మార్చి రాయండి.

అ. మీరు కథలు చెప్పుకోడమేనా ? నాక్కూడా ……………………….. చెబుతారా ?
జవాబు.
కథలు (ప్ర) – కతలు (వి)

ఆ. నాన్న పుస్తకంలో ఎన్నో సూక్తులు చదివి, ఆ ……………………….. అన్నీ నాకు చెబుతారు.
జవాబు.
సూక్తులు (ప్ర) – సుద్దులు (వి)

6. గీతగీసిన పదానికి అదే అర్థం ఇచ్చే పదం ఖాళీలో రాయండి.

అ. ఉత్తములు కార్యసాధకులు. ఆ ……………………….. మనకు ఆదర్శం.
జవాబు.
ఉత్తములు = గొప్పవాళ్లు

ఆ. సంఘానికి సేవచేసిన సంస్కర్తలను చూసి నేను కూడా ……………………….. సేవ చేయాలనుకున్నాను.
జవాబు.
సంఘానికి = సమాజానికి

7. సమాసాల పేర్లు రాయండి.

అ. పూటగడవని తల్లిదండ్రులకు పాటులెక్కువాయె.
జవాబు.
తల్లిదండ్రులు = తల్లియు, తండ్రియు – ద్వంద్వ సమాసము

ఆ. అక్షరమాల లోని అక్షరాల సంఖ్య ఎంత ?
జవాబు.
అక్షరమాల = అక్షరముల యొక్క మాల – షష్ఠీ తత్పురుష సమాసము

8. సంధులు గుర్తించండి.

అ. అమ్మా నేను ఎక్కాలన్నీ చదివాను.
జవాబు.
ఎక్కాలు + అన్నీ = ఉత్వసంధి

ఆ. తల్లిదండ్రులు పిల్లల అభ్యున్నతి కోసం ప్రయత్నిస్తారు.
జవాబు.
అభి + ఉన్నతి = యణాదేశ సంధి

ఇ. రమ తెలివితేటలకు ప్రధానోపాధ్యాయుడు ముగ్ధుడైనాడు.
జవాబు.
ప్రధాన + ఉపాధ్యాయుడు = గుణసంధి

TS 7th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సీత ఇష్టాలు

9. గీత గీసిన పదాల ఆధారంగా వ్యతిరేక వాక్యాలు రాయండి.

అ. నీవు చెప్పినది కొంతవరకే అర్థమయింది.
జవాబు.
అర్థమయింది × అర్థం కాలేదు
నీవు చెప్పినది పూర్తిగా అర్థం కాలేదు.

ఆ. ఇవాళ నాతో సినిమాకు వస్తావా ?
జవాబు.
వస్తావా × రావా
ఇవాళ నాతో సినిమాకు వస్తావా ? రావా ?

పాఠం ఉద్దేశం

ఆడపిల్లల పట్ల వివక్ష లేకుండా ప్రోత్సహిస్తే అన్ని రంగాలలో రాణిస్తారు. స్త్రీవిద్య కుటుంబానికే కాక ప్రపంచానికే వెలుగునిస్తుందని చెప్పడం ఈ పాఠం ఉద్దేశం. అట్లే జానపద కళారూపాలపట్ల అభిరుచి పెంచుకొని ఆదరించాలని, “బుర్రకథ”వంటి కళారూపాల వలన ప్రయోజనాలున్నాయని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం “బుర్రకథ ప్రక్రియకు చెందినది. జానపద కళారూపాల్లో బుర్రకథ ఒకటి. ఇందులో ఒక కథకుడు, ఇద్దరు వంతపాడేవాళ్ళు ఉంటారు. వచన గేయరూపంలో కథను చెపుతూ, అభినయిస్తూ ప్రేక్షకులను రంజింపచేస్తారు.

ప్రవేశిక

గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలలో బాలికలను ఇంటికే పరిమితం చేసి, విద్యకు దూరం చేస్తున్నారు. బాలికలను పసిపిల్లల సంరక్షణకు, తల్లికి సాయపడటానికి, వ్యవసాయ కూలీ పనులకు కొందరు తల్లిదండ్రులు ఉపయోగిస్తున్నారు. చదువుకోవాలనే కోరిక వీరికీ ఉంటుంది. ఇట్టి వారికి ప్రోత్సాహం కలిగిస్తే వారు చదువుకొని, ముందడుగువేస్తారు. అట్లాంటి ఒక సీతకథను పాఠం చదివి తెలుసుకుందాం

నేనివి చేయగలనా?

TS 7th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సీత ఇష్టాలు 3

TS 8th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson Telangana పి.వి.నరసింహారావు

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download ఉపవాచకం 6th Lesson పి.వి.నరసింహారావు Textbook Questions and Answers.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson పి.వి.నరసింహారావు

కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

1. పి.వి. నరసింహారావు గుణగుణాలను తెల్పండి.
జవాబు.
పి.వి. నరసింహారావు స్థితప్రజ్ఞుడు. సంస్కరణ శీలుడు. అపర చాణక్యుడు. న్యాయ శాస్త్రజ్ఞుడు. బహుభాషాకోవిదుడు. అందరికీ అయినవాడు. తెలంగాణ మహనీయుడు. దక్షిణ భారతం నుండి ప్రధానియైన మొదటివాడు. గొప్ప సాహితీ వేత్త. పద్నాలుగు భాషలు అనర్గళంగా మాట్లాడగలిగిన పండితుడు. దానకర్ణుడు. ఆటల్లో ఆరితేరినవాడు. సంగీతంలోనూ ఆయనకు ప్రవేశమున్నది. దేశహితాన్ని కోరిన మహామనీషి.

2. పి.వి. నరసింహారావు బాల్య విశేషాలు తెల్పండి.
జవాబు.
పి.వి. నరసింహారావు స్వగ్రామం కరీంనగర్ జిల్లా భీందేవరపల్లి మండలంలోని వంగర. వరంగల్లు జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో ఆయన 28 జూన్ 1921న జన్మించాడు. తల్లిదండ్రులు రుక్మాబాయమ్మ, సీతారామారావు. వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రత్నాబాయి దంపతులు ఆయనను దత్తత చేసుకున్నారు.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson Telangana పి.వి.నరసింహారావు

3. పి.వి. విద్యాభ్యాసాన్ని వివరించండి.
జవాబు.
పి.వి.కి బాసరలో అక్షరాభ్యాసం జరిగింది. వంగరలో చదువు ప్రారంభించి హుజూరాబాద్లో 3, 4, తరగతులు చదివాడు. ఎప్పుడూ క్లాసులో ఫస్టుగా వచ్చేవాడు. గణితం ఆయనకు ఇష్టమైన విషయం. టెన్నిస్ బాగా ఆడతాడు. లలిత సంగీతం, భజనలు, శాస్త్రీయ సంగీతం పాడతాడు. హనుమకొండలో డిస్టింక్షన్ మార్కులతో మెట్రిక్యులేషన్ పాసయ్యాడు. మహారాష్ట్రలోని పూణేలో బి.యస్సి. నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.బి. పట్టాపొందాడు.

4. పి.వి. నరసింహారావు సాహిత్య సేవను తెల్పండి.
జవాబు.
పి.వి. నరసింహారావు 1948లో కాకతీయ పత్రికను స్థాపించాడు. జయ అనే మారు పేరుతో అనేక రచనలు చేశాడు. తెలంగాణా సాయుధ పోరాట నేపథ్యంలో విజయ అనే కలం పేరుతో ‘గొల్లరామవ్వ’ కథను కాకతీయ పత్రికలో రాశాడు. విశ్వనాథవారి ‘వేయిపడగలు’ నవలను ‘సహస్రఫణ్’ అనే పేరుతో హిందీలోకి అనువదించి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందాడు. ‘పన్లక్షత్ కోనతో’ అనే మరాఠీ పుస్తకాన్ని ‘అబల జీవితం’ అనే పేరుతో అనువదించాడు. తన రాజకీయ సాహిత్య అనుభవాలతో ఆయన రాసిన ‘ది ఇన్ సైడర్’ నవల బాగా ప్రసిద్ధి పొందింది.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson Telangana పి.వి.నరసింహారావు

5. పి.వి. బహుముఖ ప్రతిభను వివరించండి.
జవాబు.
పి.వి. నిజాం వ్యతిరేక పోరాటంలో రాటుదేలిన నాయకుడు. అనేక భాషలలో పండితుడు. రాజకీయరంగంలో శాసన సభ్యుడి నుండి ప్రధానమంత్రి వరకు అనేక పదవులు సమర్థవంతంగా నిర్వహించాడు. దేశాన్ని ప్రగతిబాటలో నడిపించాడు. పాత్రికేయునిగా కాకతీయపత్రికను స్థాపించి అనేక రచనలు చేశాడు. ఎన్నో నవలలకు అనువాదాలు రాశాడు. అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్ భాషలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చదువులోను ఆటపాటలలోనూ ఆరితేరినవాడు.

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

1. పి.వి. నరసింహారావు జీవిత విశేషాలను సంగ్రహించండి.
జవాబు.
పి.వి. నరసింహారావు సీతారామారావు, రుక్మాబాయమ్మల కుమారుడు. పాములపర్తి రంగారావు, రత్నాబాయిలు దత్తత చేసుకున్నారు. పి.వి. చదువులోను ఆటపాటల్లోనూ నిష్ణాతుడు. ఎల్.ఎల్.బి. పట్టా పొంది హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్ ప్లీడర్గా పనిచేశాడు. రాజకీయ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎన్నో శాఖలలో మంత్రిగా పనిచేస్తూ పలు సంస్కరణలు చేసి అందరి ప్రశంసలు పొందాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటూ పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం తెచ్చాడు.

దీనివల్ల పేదలకు ఎంతో మేలు జరిగింది. తన రాజకీయ చతురతతో మిత్ర పక్షాలను కూడగట్టుకొని తాను ప్రధానమంత్రిగా మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటుచేసి ఐదు సంవత్సరాలు చక్కని పరిపాలన నందించాడు. సాహితీవేత్తగా అనువాద గ్రంథాలు నవలలు రచించాడు. కాకతీయ పత్రికను స్థాపించి సమర్థవంతంగా నిర్వహించాడు. ఆచితూచి మాట్లాడడమే కాదు. రచనలోనూ పి.వి.ది అదే గాంభీర్యం, పరిణతి, దేశభక్తి కనిపిస్తుంది. సమున్నత వ్యక్తిత్వం కలవాడు పి.వి. నరసింహారావు.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson Telangana పి.వి.నరసింహారావు

2. పి.వి. నరసింహారావు రాజకీయ జీవిత విశేషాలు సంగ్రహించండి.
జవాబు.
పి.వి. నరసింహారావు రాజకీయ జీవితం 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికలలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఓటమితో ప్రారంభమైంది. తరువాత నాలుగు సార్లు మంథని శాసనసభ నియోజక వర్గంలో గెలిచాడు. రెండవసారి ఎన్నికైనపుడు రాష్ట్ర జైళ్ళు, ప్రజాసంబంధాలు, విద్యాశాఖ, ఆరోగ్యశాఖల మంత్రిగా పనిచేశాడు. ఆయాశాఖలలో సంస్కరణలు తెచ్చాడు. మూడవసారి ఎన్నికైనపుడు ముఖ్యమంత్రియైనాడు.

పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం తెచ్చాడు. 1977లో హనుమకొండ నుండి లోక్సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. శ్రీమతి ఇందిరాగాంధీకి అత్యంత విశ్వసనీయుడుగా ఉంటూ హెూం, విదేశాంగ శాఖల మంత్రియైనాడు. రాజీవ్ గాంధి మంత్రి వర్గంలో మానవ వనరుల శాఖ, హెూంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. రాజీవ్ గాంధీ మరణానంతరం 1991లో ఏర్పడిన రాజకీయ అనిశ్చిత స్థితిని తొలగించాడు. మిత్ర పక్షాలను కూడ గట్టుకొని తాను ప్రధాన మంత్రిగా మైనారిటీ ప్రభుత్వం ఏర్పరచాడు. ఐదు సంవత్సరాలు చక్కనిపాలన నందించి రాజకీయ పండితులను ఆశ్చర్యపరచాడు.

పరిచిత గద్యభాగాలు

1. కింది పేరాను చదివి ఐదు ప్రశ్నలు రాయండి.
భారతదేశంలో సాహితీ పరిమళాలు వెదజల్లిన అతి కొద్ది మంది రాజకీయ వేత్తలలో పి.వి. అగ్రతాంబూలానికి అర్హుడు. 1948లో ‘కాకతీయ’ పత్రికను స్థాపించి తొలితరం పత్రికా రచయితలలో ఒకడయ్యాడు. ‘కాకతీయ’ పత్రికలో ‘జయ’ అనే మారుపేరుతో అనేక రచనలు చేశాడు.

తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో “గొల్లరామవ్వ” కథను ‘విజయ’ అనే కలం పేరుతో కాకతీయ పత్రికలో రాశాడు. విశ్వనాథ సత్యనారాయణ రాసిన వేయిపడగలు నవలను హిందీలోకి ‘సహస్రఫణ్’ పేరుతో అనువదించాడు. ఈ రచనకు పి.వి. కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు పొందాడు. ‘పన్లక్షత్ కోన్ఘతో’ అనే మరాఠీ పుస్తకాన్ని ‘అబల జీవితం’ అనే పేరుతో అనువదించాడు.
జవాబు.
1. పి.వి. స్థాపించిన పత్రిక ఏది ?
2. ఆయన మారుపేర్లు తెల్పండి.
3. తెలంగాణా పోరాటంలో ఆయన చేసిన రచన ఏది ?
4. ‘అబల జీవితం’ ఏ భాషలోని పుస్తకానికి అనువాదం ?
5. వేయి పడగలు తెలుగులో రాసిందెవరు ?

2. కింది వాక్యాలను సరైన క్రమంలో అమర్చండి.

1998లో ది ఇన్ సైడర్ గ్రంథం వెలువడింది. 1921లో పి.వి. నరసింహారావు జన్మించాడు. 1977లో కేంద్ర రాజకీయాలలో ప్రవేశించాడు. 1948లో కాకతీయ పత్రికను స్థాపించాడు. 1991లో ప్రధానమంత్రియైనాడు.
జవాబు.

  1. 1921లో పి.వి. నరసింహారావు జన్మించాడు.
  2. 1948 పి.వి. కాకతీయ పత్రికను స్థాపించాడు.
  3. 1977 కో కేంద్ర రాజకీయాలలో (పవేశించాడు.
  4. 1991లో ప్రధానమంత్రియైనాడు.
  5. 1998లో ఇన్ సైడర్ గ్రంథం వెలువడింది.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson Telangana పి.వి.నరసింహారావు

3. కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

1924లో బాసరలో కొలువైన జ్ఞాన సరస్వతి సన్నిధిలో పి.వి తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయించారు. వంగర ప్రభుత్వ పాఠశాలలో ఓనమాలు దిద్దాడు. 1928 నుండి 1930 వరకు హుజూరాబాద్ పాఠశాలలో మూడు, నాలుగు తరగతులు చదివాడు. వంగర నుండి హుజూరాబాద్కు దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరం రోజూ సవారీ కచ్చడం (ఎడ్లబండి)లో వెళ్ళి వచ్చేవాడు. చదువుకునే రోజుల్లో పి.వి. ఎప్పుడూ క్లాస్ ఫస్టే. తానెప్పుడూ క్లాస్లో సెకెండ్ రావడం ఎరుగనని ‘ఐ విట్నెస్’ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకసారి పి.వి. చెప్పాడు. చిన్నప్పుడు గణితం సబ్జెక్టు అంటే అమితంగా ఇష్టపడేవాడు. చదువులోనే కాదు ఆటల్లోనూ ఆరితేరినవాడే. టెన్నిస్ క్రీడను బాగా ఆడేవాడు. పి.వి.కి చిన్నప్పటి నుండి సంగీతంలోనూ ప్రవేశం ఉంది. లలిత సంగీతం, భజనలు, శాస్త్రీయ సంగీతంతో కూడిన కీర్తనలు శ్రావ్యంగా పాడేవాడు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
బాసరలో ఉన్న దైవం ఎవరు ?
జవాబు.
జ్ఞాన సరస్వతి.

ప్రశ్న 2.
పి.వి. మూడు నాలుగు తరగతులు ఎక్కడ చదివాడు ?
జవాబు.
హుజూరాబాద్లో

ప్రశ్న 3.
ఆయన ఏ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు ?
జవాబు.
ఐ విట్నెస్

ప్రశ్న 4.
ఆయనకు ఇష్టమైన ఆట ఏది ?
జవాబు.
టెన్నిస్

ప్రశ్న 5.
పి.వి. వంగర నుండి హుజూరాబాద్ ఎలా వెళ్ళేవాడు ?
జవాబు.
సవారీ కచ్చడం (ఎడ్లబండి)లో

TS 6th Class Hindi Guide 6th Lesson चिड़ियाघर

Telangana SCERT 6th Class Hindi Study Material Telangana Pdf 6th Lesson चिड़ियाघर Textbook Questions and Answers.

TS 6th Class Hindi 6th Lesson Questions and Answers Telangana चिड़ियाघर

सुनो-बोलो :

TS 6th Class Hindi Guide 6th Lesson चिड़ियाघर 1

प्रश्न 1.
तुम्हें चिड़ियाघर कैसा लगता है ?
उत्तर :
मुझे चिड़ियाघर बहुत अच्छा लगता है ।
I like zoo very much.

प्रश्न 2.
जंगल में कौन-कौन से जानवर दिखाई देते हैं ?
उत्तर :
चिड़ियाघर में गैडडा, मगग, कछुआ, बन्दर, जिगफ़, हिरण, भालू, हाथी, शेर दिखाई दे रहे हैं।
Rhinoceros, crocodile, tortoise, monkey, giraffe, deer, bear, elephant and lion are seen in zoo.

TS 6th Class Hindi Guide 6th Lesson चिड़ियाघर

प्रश्न 3.
चिड़ियाघर में जानवरों को क्यों रखा जाता है ?
उत्तर :
जानवर जंगल में रहते हैं। लेकिन सब लोग जंगल जाकर जानबगों को देख नहीं सकते। बच्चों को भी जानवर अच्छे लगते हैं। बच्चों को जानवरों के बारे में जानना भी जरूरी है । इसलिए जानवरों को चिड़ियाघर में रखा जाता है ।
Animals live in forest. Everyone cannot go to zoo and see these animals. Animals are liked by children. It is important to know about animals. That is why animals are kept in zoo.

पढ़ो :

अ. चित्र देखिए। शब्द पढ़िए।

TS 6th Class Hindi Guide 6th Lesson चिड़ियाघर

आ. चित्र वाले शब्द पर ‘○’ लगाइए।

TS 6th Class Hindi Guide 6th Lesson चिड़ियाघर 4
उत्तर :
TS 6th Class Hindi Guide 6th Lesson चिड़ियाघर 3

इ. चित्र देखिए। शब्द पढ़िए। वर्ण पढ़िए। इन वर्णों को वर्णमाला चार्ट में पहचानिए।

TS 6th Class Hindi Guide 6th Lesson चिड़ियाघर 6
उत्तर :
TS 6th Class Hindi Guide 6th Lesson चिड़ियाघर 5

ई. इन्हें पढ़िए।

TS 6th Class Hindi Guide 6th Lesson चिड़ियाघर 7

उत्तर :

TS 6th Class Hindi Guide 6th Lesson चिड़ियाघर 8

ई. नीचे दिये गये बक्से के अक्षरों में TS 6th Class Hindi Guide 6th Lesson चिड़ियाघर मात्रा के अंतर समझते हुए पढ़िए।

TS 6th Class Hindi Guide 6th Lesson चिड़ियाघर 9
उत्तर :
TS 6th Class Hindi Guide 6th Lesson चिड़ियाघर 15

लिखो :

अ. शब्द पढ़ो। लिखो।

TS 6th Class Hindi Guide 6th Lesson चिड़ियाघर 10

आ. मात्रा जोडिए और लिखिए।

TS 6th Class Hindi Guide 6th Lesson चिड़ियाघर 11
उत्तर :
TS 6th Class Hindi Guide 6th Lesson चिड़ियाघर 14

इ. पढ़िए और लिखिए।

TS 6th Class Hindi Guide 6th Lesson चिड़ियाघर 12
उत्तर :

1. चौराहे पर पुलीस है। = నాలుగు వీధులు కలియు కూడలిలో పోలీసు ఉన్నాడు.
(చౌరాహే పర్ పులీస్ హై) There is a police at square ground.

2. औरत खाना बना रही है। = స్త్రీ భోజనము తయారుచేయుచున్నది.
(ఔరత్ ఖానా బనా రహీ హై।) The woman is preparing food.

TS 6th Class Hindi Guide 6th Lesson चिड़ियाघर

ई. अपने मनपसंद पशु-पक्षियों के नाम लिखिए।

TS 6th Class Hindi Guide 6th Lesson चिड़ियाघर 13

उत्तर :

पशु पक्षी
हाथी कोयल
हिरण तोता
शेर मैना
कछुआ कबूतर
बन्दर चिड़ियाँ
कुत्ता कौआ

TS 7th Class Telugu 1st Lesson Questions and Answers Telangana చదువు

Telangana SCERT 7th Class Telugu Guide Telangana 1st Lesson చదువు Textbook Questions and Answers.

చదువు TS 7th Class Telugu 1st Lesson Questions and Answers Telangana

చదవండి ఆలోచించండి – చెప్పండి

తే॥గీ॥ ఆటలాడు వేళలయందు నాడవలయును
జదువుకొనఁదగు వేళలఁ జదువ వలయు
నట్లుకాకున్న నారోగ్య మంతరించు
దాన, మేధస్సు బలహీన మౌను సుమ్ము.

ప్రశ్న 1.
ఆటలు ఎందుకు ఆడుకోవాలి? ఎప్పుడు ఆడుకోవాలి?
జవాబు.
ఆటలు ఆడుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే మేధస్సు చురుకుగా ఉంటుంది. అందుకనే ఉదయం సాయంత్రం కొంతసేపు ఆటలాడుకోవాలి.

ప్రశ్న 2.
ఏ సమయంలో చదువుకోవాలి? ఎందుకు?
జవాబు.
చదువుకుంటే తెలివితేటలు పెరుగుతాయి. బుద్ధి చురుకుగా ఉంటుంది. అందుకే తెల్లవారుజామున తప్పక చదువుకోవాలి. మిగతా సమయాలలో అవసరమైనపుడల్లా చదువుకోవాలి.

TS 7th Class Telugu 1st Lesson Questions and Answers Telangana చదువు

ప్రశ్న 3.
ఆటలు ఆడకుండా టీవీ చూస్తూ కూర్చుంటే ఏమౌతుంది?
జవాబు.
ఆటలు ఆడకుండా టీవీ చూస్తూ కూర్చుంటే సోమరితనం పెరిగిపోతుంది. శరీరానికి వ్యాయామం లేక ఒళ్ళు బరువెక్కి అనారోగ్యం పాలౌతారు. ఎక్కువ సేపు చూస్తూ ఉండటం వల్ల కళ్ళు దెబ్బతింటాయి.

ప్రశ్న 4.
చదువు సరిగ్గా చదువుకోకుంటే ఏమౌతుంది?
జవాబు.
చదువు సరిగ్గా చదువుకోకుంటే తెలివితేటలు పెరగవు.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
అవివేకి లక్షణాలు ఏమై ఉంటాయి?
జవాబు.
అవివేకి చుట్టాలకు గాని తల్లిదండ్రులకు గాని ఏ విధంగానూ సహాయం చేయడు. సంతోషం కలిగించడు. చదువు సంధ్యలు నేర్వడు. పైకి ఆకారం బాగానే ఉన్నా సంస్కారం లేనివాడు. అడవిలోని మోదుగుపూల వంటివాడు.

ప్రశ్న 2.
కవి కమలాకరుడిని జడాశయుడు అన్నాడు కదా! ఇట్లా అనడం తగినదేనా? ఎందుకు?
జవాబు.
కవి కమలాకరుడిని జడాశయుడు అన్నాడు. ఇది సరియైనదే. ఎందుకంటే చదువు సంధ్యలు, సంస్కారం ఏమీ లేకుండా, ఎవ్వరికీ ఉపయోగపడకుండా కులానికి చెడ్డపేరు తెచ్చిపెట్టేట్లు జడాశయుడు ఉన్నాడు. వట్టి మూర్ఖునిలా ప్రవర్తిస్తున్నాడు. అందుకే కవి అతడిని జడాశయుడు అన్నాడు. కమలాకరం అంటే జలాశయం లేదా నీటిమడుగు. నీటిమడుగు ఎటువంటి కదలిక లేకుండా ఉంటుంది. కమలాకరుడు కూడా ఎటువంటి అభివృద్ధి లేకుండా ఉన్నాడు. అందుకే ‘జడాశయుడు’ అని కవి అన్నాడు.

ప్రశ్న 3.
“చదువురాని పిల్లలు వంశానికి తెగులు” అన్నాడు కవి. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు.
చదువుకున్నవాడు వివేకి అవుతాడు. తల్లిదండ్రులకు బంధువులకు సంతోషం కలిగిస్తాడు. సత్ప్రవర్తన కలిగి సంస్కారవంతుడై ఉంటాడు. అదే చదువుకోకపోతే పై లక్షణాలేవీ ఉండవు. పదిమందిలో నవ్వులపాలౌతాడు. దానివల్ల ఆ కుటుంబానికి వంశానికి చెడ్డపేరు వస్తుంది. అందుకే చదువురాని పిల్లలు వంశానికి తెగులు అన్నాడు కవి.

TS 7th Class Telugu 1st Lesson Questions and Answers Telangana చదువు

ప్రశ్న 4.
తాను నేర్చిన చదువు ఇతరులకు పంచితే కోటిరెట్లు పెరుగుతుంది. దీనిని ఎట్లా సమర్థిస్తారు?
జవాబు.
చదివే కొద్దీ విజ్ఞానం పెరుగుతుంది. తను చదివింది ఇతరులతో పంచుకుంటే మరింత బాగా మనసుకెక్కుతుంది. ఎంత ఎక్కువమందికి ఆ చదువు పంచితే అంత ఎక్కువగా అది పెరుగుతుంది. అంతేగాక ఇతరులతో పంచుకోవడం వల్ల కొత్త ఆలోచనలు, కొత్తభావాలు కలిగి మరింత బాగా అర్థమౌతుంది. కనుక తాను నేర్చిన చదువు ఇతరులకు పంచితే కోటిరెట్లు పెరుగుతుంది అనే మాట నిజం.

ప్రశ్న 5.
“చదువు దొంగలకు కనిపించదు” చర్చించండి.
జవాబు.
చదువు బుద్ధికి సంబంధించినది. నేర్చుకున్న విషయాలు నేరుగా మెదడుకు చేరతాయి. మనం ఆరోగ్యంగా ఉన్నంతసేపూ ఆ విషయాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్ఞాపకం వస్తాయి. మనం బుద్ధిపూర్వకంగా చెబితే తప్ప ఎవరికీ తెలియవు కనిపించవు. కనిపించని వస్తువును ఎవరు కాజేయగలరు? కాబట్టి చదువు దొంగలకు కనిపించదు.

ప్రశ్న 6.
అందరూ మెచ్చుకోవాలంటే మనం ఏయే చదువులు చదవాలి?
జవాబు.
అందరూ మెచ్చుకోవాలంటే మనం మంచి చదువులు చదవాలి. విజ్ఞానం పెంచే చదువులు చదవాలి. నలుగురితో ఎట్లా మెలగాలో నేర్పే చదువులు చదవాలి. ఏది మంచో ఏది చెడో తెలుసుకొనడానికి ఉపయోగపడే చదువు చదవాలి. నలుగురికి ఉపయోగపడే చదువు, మన గౌరవం పెంచే చదువు చదవాలి. మనం ఒకరికి భారం కాకుండా, ఆదర్శంగా బతకడానికి అవసరమైన చదువు చదవాలి.

ప్రశ్న 7.
పశువులకు, మనుషులకు తేడాలేమిటి?
జవాబు.
పశువులకు భాష తెలియదు. మాట్లాడలేవు. మనిషి మాట్లాడగలడు. ఆలోచించగలడు. ఏది మంచో ఏది చెడో నిర్ణయించగలరు. దాన్నే విచక్షణాజ్ఞానం అంటారు. అది పశువులకు ఉండదు. పశువులు మాట్లాడలేవు. మనుషులు తమ భావాలను చెప్పడానికి మాట్లాడగలరు.

ప్రశ్న 8.
కమలాకరుని తీరుగా మీరెప్పుడైనా ప్రతిన పూనారా? ఎందుకు?
జవాబు.
కమలాకరుని తీరుగా నేను ఒకసారి ప్రతిన పూనాను. నాకు బడిలో అన్ని విషయాలలో మంచి మార్కులతో తరగతిలో మొదటి స్థానం వచ్చేది. కాని లెక్కల్లో మాత్రం చాలా తక్కువ మార్కులు వచ్చేవి. నేను 9వ తరగతిలో ఉండగా ఒకసారి మా ఇంగ్లీషు టీచరు మా నాన్నగారిని పిలిచి ” మీ అమ్మాయి తెలివి తేటలకు పదవతరగతి పరీక్షలకు పంపినా ఫస్టు మార్కులు తెచ్చుకుంటుంది. కాని ఆ లెక్కల మూలంగా చాలా వెనకబడుతోంది” అని చెప్పారు. అంతే వెంటనే నాకు పట్టుదల వచ్చింది. స్నేహితులతో కలిసి ఎక్కువ సమయం లెక్కలు అభ్యాసం చేసి మంచి మార్కులు సాధించాను.

TS 7th Class Telugu 1st Lesson Questions and Answers Telangana చదువు

ప్రశ్న 9.
కమలాకరుడు గురువు సేవచేస్తూ విద్యను నేర్చుకున్నాడు. మీరు మీ ఉపాధ్యాయులకు ఏయే సేవలు చేస్తారు?
జవాబు.
నేను గురువులకు ఎలా సేవ చేస్తానంటే – ప్రతిరోజూ మానకుండా బడికి వెళుతూ శ్రద్ధగా పాఠాలు వింటాను. క్రమశిక్షణతో ప్రవర్తిస్తాను. ఏ రోజు ఇచ్చిన హోంవర్కు ఆ రోజు చేస్తాను. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నిస్తాను. నా ప్రవర్తనతో వినయవిధేయతలతో గురువులకు ఆనందం కలిగిస్తాను. గురువులను బాధపెట్టకుండా ఉండడమే పెద్దసేవ.

ఇవి చేయండి

1. విని, అర్ధం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. అందరికీ చదువు అవసరం అని తెలుసుకున్నారు కదా! అయినప్పటికీ ఇంకా మన సమాజంలో కొంతమంది పిల్లలు చదువుకోవడంలేదు. దీనివల్ల వాళ్ళు ఏం కోల్పోతున్నారు? వాళ్ళుకూడా చదువుకోవాలంటే మనమేం చేయాలి?
జవాబు.
అందరికీ చదువు అవసరం. ఒకప్పుడు ఆడపిల్లలను బడికి పంపేవారుకాదు. మగవారిలో కూడా చదువుకొనేవారు తక్కువ. ఇప్పుడు చదువు అవసరం తెలిసి ప్రతివారూ పై చదువులు చదువుతున్నారు. కాని ఇంకా పనిపాట్లు చేసుకొనేవారూ పిల్లలను పనికి పంపి ఇల్లు గడుపుకొనేవారూ కనిపిస్తూనే ఉన్నారు. దీనివల్ల వారు విలువైన బాల్యం కోల్పోతున్నారు. చదువుకోకపోతే వారు ధనవంతుల చేతిలోనూ మోసగాళ్ళ చేతిలోనూ అన్యాయమై పోతారు. కాబట్టి అందరూ చదువుకోవాలి. బడిఈడు పిల్లలు బడిలోనే ఉండాలి. మనందరం బాలకార్మికులు లేకుండా చేయడానికి కృషి చెయ్యాలి. మన ఇళ్ళలో పిల్లలను పనిలో పెట్టుకోకూడదు. ఇలా అందరూ కృషిచేసి అందరూ చదువుకొనేట్లు చూడాలి.

II. ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం.

1. కింది భావం వచ్చే పాదాలు పద్యాల్లో ఎక్కడ ఉన్నాయో చూసి రాయండి.

(అ) చదువు నేర్చుకోని కొడుకు వంశానికి తెగులు కలిగిస్తాడు.
జవాబు.
చదువుల్ గట్టిగ నెరుగని పుత్రుడు పుట్టుట కులమునకు తెవులు పుట్టుట చుమ్మీ!

(ఆ) విద్య ఎవ్వరికిచ్చినా కోటిరెట్లు వృద్ధి చెందుతుంది.
జవాబు.
తానెవ్వరికిచ్చినఁగోటి గుణోత్తర వృద్ధి భజించు విద్య

(ఇ) ఈ భూమిపై విద్యతో సమానమైన ధనం ఉందా?
జవాబు.
ధరలో మరి విద్యబోల ధనములు గలవే?

(ఈ) ఏ చదువూ నేర్వనివాడు పశువుతో సమానం.
జవాబు.
సంగీతంబు కవిత్వ తత్త్వమును సౌజన్యంబు భావంబు సత్సాంగత్యంబు నెరుంగడేని భువి నాశ్చర్యంబుగా వాలమున్ శృంగ ద్వంద్వము లేని యెద్దతడనం జెలున్.

(ఉ) కష్టపడి సంగీతం సాహిత్యం వంటి కళలు నేర్చుకొని
జవాబు.
తివిరి కలయ సంగీత సాహిత్య కళలు నేర్చి.

(ఊ) ఆ పశువుల అదృష్టం కొద్దీ అతడు గడ్డి తినడు.
జవాబు.
తృణం బాతడు య్యాంగీకంబున మేయడా పసుల భాగ్యం బిచ్చటన్ కల్గుటన్.

2. కింద పద్యాన్ని చదువండి. భావం రాయండి.

చదువని వాడజ్ఞుండగు
చదివిన సదసద్వివేక చతురత గల్గున్
చదువగ వలయును జనులకు,
చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రీ! – (పోతన భాగవతం)
జవాబు.
“చదువుకోనివాడు అజ్ఞాని యౌతాడు. చదువుకుంటే మంచి చెడు తెలుసుకొనే తెలివితేటలు కలుగుతాయి. కాబట్టి జనులు తప్పక చదువుకోవాలి. నాయనా! నిన్ను చదివిస్తాను. గురువుల వద్ద చదువుకో”. అని ఈ పద్య భావం.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

(అ). చదువు నేర్వని వారిని కవి వేటితో పోల్చాడు?
(లేదా)
చదువురాని వారికి పశువులకు తేడాలేదని కవి ఎందుకన్నాడు?
జవాబు.
చదువు నేర్వని వారిని కవి పశువుతో పోల్చాడు. ఎందుకంటే పశువులకు మాటలు రావు. భాషరాదు. అవి చదవలేవు. రాయలేవు. ఎక్కడ కట్టేస్తే అక్కడే పడి ఉంటాయి. మనిషి చదువుకోకపోతే చదవలేడు. రాయలేడు. సరిగా మాట్లాడలేడు. పశువుకెంత గౌరవం ఉంటుందో అతనికీ అంతే. పశువులు గడ్డి తింటాయి. అతడు అన్నం తింటాడు. పశువుకున్న తోక, కొమ్ములు అతడికి లేవు. అంతకు మించి చదువురాని వాడికీ, పశువుకూ ఏమీ తేడాలేదు.

(ఆ). త్రివిక్రమునికి చదువు పట్ల గల భావాలు ఎట్లాంటివి?
(లేదా)
చదువును గురించి త్రివిక్రముడు ఎలా ఆలోచించాడు?
జవాబు.
చదువు పట్ల త్రివిక్రమునికి గల భావాలు : చదువు ఎవరికీ కనిపించని ఎవరూ దోచుకోలేని గొప్ప సంపద. వేరే దేశాలకు వెళ్ళినప్పుడు మనకు సహాయపడుతుంది. అందరినీ మనకు ఆప్తులుగా చేస్తుంది. చదువుకు సమానమైన సంపద మరేదీలేదు. మంచి కావ్యాలు చదవాలి. లలితకళలు నేర్చుకోవాలి. మంచివారితో మంచి మాటలతో కాలం గడపాలి. లోకజ్ఞానం సంపాదించాలి. అలా చదువులు నేర్వని వాళ్ళు పశువులతో సమానం.

TS 7th Class Telugu 1st Lesson Questions and Answers Telangana చదువు

(ఇ). కమలాకరుని స్వభావం ఎటువంటిది?
(లేదా)
కమలాకరుడు ఎలాంటివాడు?
జవాబు.
కమలాకరుడు జడాశయుడు. అంటే ఏ ఆలోచనలు, ఆశయాలు లేకుండా కాలం గడిపేవాడు. చదువు సంధ్యలు లేనివాడు. ఎవరితోనూ కలవడు మాట్లాడడు. స్నేహితులు లేరు. తల్లిదండ్రులకు బంధువులకు ఏనాడూ సంతోషం కలిగించలేదు. అందమైన మోదుగపువ్వు అడవిలోపడి ఉంటే దాన్ని చూసి ఆనందించేవారెవ్వరూ ఉండరు. అలాంటి మూర్ఖుడే కమలాకరుడు.

(ఈ). చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయో ఊహించి రాయండి.
(లేదా)
“చదువు లేకపోవడమే కష్టాలన్నిటికీ మూలం” ఎలా? వివరించండి.
జవాబు.
చదువు రాకపోతే అన్నీ కష్టాలే. మహాపండితుడు పురోహితుడు అయిన త్రివిక్రముని కుమారుడు కమలాకరుడు. కాని అక్షరం నేర్వలేదు. అందుకే అతన్నెవరూ ఆదరించలేదు. అతనికి స్నేహితులు లేరు. తల్లిదండ్రులు, బంధువులు ఎవ్వరూ అతనివల్ల సంతోషించలేదు. చివరికి కమలాకరుడు ఒంటరిగా ఏ తోడూ లేకుండా మిగిలిపోయాడు. తండ్రిచేత మాటలు పడ్డాడు. చదువు గొప్పదనం తెలిసికొని చదువుకొని మనిషిలా మారాడు. కాబట్టి చదువుకోకపోతే అన్నీ కష్టాలే.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

1. చదువు పాఠ్య సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి.
జవాబు.
పరిచయం : కొఱవి గోపరాజు ‘చదువు’ పాఠంలో చదువు అవసరాన్ని చాలా చక్కగా చెప్పాడు.

నేపథ్యం : విక్రమార్కుని ఆస్థానంలో పురోహితుడుగా ఉన్న త్రివిక్రముని కుమారుడు కమలాకరుడు. అతడు చదువులేక జడపదార్థంగా ఉండటం వలన అతడిలో మార్పు తేవడానికి తండ్రి కుమారుని సున్నితంగా మందలించాడు. ఆ మందలింపులో భాగంగా చదువు అవసరాన్ని వివరించాడు.

ఎటువంటి చదువు? : చుట్టాలకు తల్లిదండ్రులకు సంతోషం కలిగించే చదువులు పిల్లలు చదవాలి. అటువంటి చదువు చదవకపోతే ఆ పిల్లలు వంశానికి తెగులువంటివారు.

మూర్ఖులు : ఎంత మంచి రూపం కలిగి ఉన్నా, ఉత్తమ వంశంలో జన్మించినా మూర్ఖుడు కుటుంబానికి వెలుగునివ్వలేడు.

చదువు గొప్పతనం : మన అధీనంలో విద్యను దొంగలు దోచుకోలేరు. అన్నదమ్ములు, రాజులు తీసుకోలేరు. ఎంతమందికి దానం చేసినా ఆ చదువు కోటిరెట్లు పెరుగుతుంది. అందుకే విద్య మన సొంత ధనం. ఎక్కడికి వెళ్ళినా మనతోనే ఉంటుంది. అది భారమేమి కాదు. అందరినీ మనకు హితులను చేస్తుంది. అందువల్ల ఈ భూమిపై విద్యకు సమానమైన ధనం వేరేదీ లేదు.

చదువుకోనివాడు? : ఏ చదువులూ నేర్చుకోనివారు పశువుల వంటివారు. వచన, పద్య కావ్యాలు చదవాలి. సంగీత నాట్య సాహిత్య జ్ఞానం పొందాలి. మంచి మాటలు మాట్లాడుతూ పొద్దు గడపాలి. లోకజ్ఞానం పొందాలి. ఇవేవీ చేయనివాడు తోక, కొమ్ములు లేని పశువు అని చెప్పవచ్చు.

ముగింపు : తండ్రి మాటలకు కమలాకరుడు అభిమానపడ్డాడు. చదువు గొప్పదనం గ్రహించాడు. కాశ్మీరదేశం వెళ్ళి అక్కడ చంద్రకేతుడు అనే పండితుని ద్వారా వేదవేదాంగాలు, నీతిశాస్త్రాలు, దర్శనాలు, కావ్యనాటకాలు, సంగీతసాహిత్య కళలు నేర్చుకున్నాడు.

IV. సృజనాత్మకత/ప్రశంస

(అ) బాగా చదివేటట్లు మిమ్ములను ప్రేరేపించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాయండి.
(లేదా)
(ఆ) చదువు ఆవశ్యకత తెలిసేటట్లు కొన్ని నినాదాలు రాయండి.

లేఖ

కోదాడ,
తేది : XXXX

ప్రియమైన అన్నయ్యా !
ఇక్కడ అంతా క్షేమం. నీవు అక్కడ క్షేమమని తలుస్తాను. మా పరీక్ష ఫలితాలు వచ్చాయి. నాకు తరగతిలో రెండవ స్థానం లభించింది.
అన్నయ్యా ! ఇదంతా నీ ప్రేరణ వల్లనే జరిగింది. క్లాసులో ఎప్పుడూ తక్కువ మార్కులు తెచ్చుకుంటూ అందరూ ఎగతాళి చేస్తే ఏడుస్తూ కూర్చునేవాణ్ణి. నువ్వు చెప్పిన మంచిమాటలు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. చదువుపట్ల ఆసక్తిని పెంచాయి. ఏమైనా సరే మంచిమార్కులు సాధించి తీరాలని పట్టుదల నాలో పెరిగింది. గట్టిగా కృషిచేశాను. తగిన ఫలితం లభించింది. ఇదంతా నీ వల్లనే సాధ్యపడింది. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. సగౌరవంగా నేను చెప్పే ధన్యవాదాలు స్వీకరించు. ఉంటాను.

ఇట్లు
నీ ప్రియమైన తమ్ముడు,
కార్తికేయ.

చిరునామా :
ఎ.వి.కె. ప్రసాద్,
బి.టెక్. ఫైనలియర్,
రీజనల్ ఇంజినీరింగ్ కాలేజి, వరంగల్లు.

(ఆ) చదువు ఆవశ్యకతపై నినాదాలు :
జవాబు.

  • చదువుకుంటే కలదు లాభం.
  • ఎంత చదివితే అంత జ్ఞానం.
  • అభ్యాసము కూసు విద్య.
  • చదువుకుంటే నీకు సౌఖ్యమబ్బేను.
  • ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు.
  • చదువు వల్ల సంస్కారం కలుగును.
  • రాజుకు తన దేశంలోనే గౌరవం. పండితుని ప్రపంచమంతా గౌరవిస్తుంది.
  • చదువు అంటిపెట్టుకొని ఉండే స్నేహితుడు.
  • చదువు లేకపోవటమే అసలైన గుడ్డితనం.

V. పదజాల వినియోగం

1. కింది వాక్యాల్లో గీతగీసిన పదాలకు సరైన అర్థాలు రాయండి.

(అ) పశువులు శృంగాలతో పొడుస్తాయి. – కొమ్ములు
(ఆ) గణపతి వక్త్రమున తొండము ఉంటుంది. – ముఖాన
(ఇ) తృణము తిని ఆవు పాలిస్తుంది. – గడ్డి
(ఈ) ఉత్తమమైన పుత్రుడు తల్లిదండ్రులకు కీర్తి తెస్తాడు. – కుమారుడు, కొడుకు

2. కింది పదాలను వివరిస్తూ రాయండి.

(అ) మృదుభాషలు
జవాబు.
మృదు అంటే మెత్తని. భాషలు అంటే మాటలు. మృదుభాషలు అంటే మెత్తనైన మాటలు. అంటే అందరికీ నచ్చేమాటలు.

(ఆ) ప్రబంధ సంపద
జవాబు.
ప్రబంధములు అంటే కావ్యాలు. ప్రబంధముల యొక్క సంపద. అంటే కావ్యాలు అధికంగా ఉండటం.

(ఇ) సౌజన్యభావం
సౌజన్యం అంటే మంచితనం. సౌజన్యభావం మంచి ఆలోచనలు కలిగి ఉండటం.

(ఈ) సత్సాంగత్యం
జవాబు.
సాంగత్యం అంటే సమీపం. మంచివారితో కలిసి ఉండటమే సత్సాంగత్యం.

TS 7th Class Telugu 1st Lesson Questions and Answers Telangana చదువు

3. కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి.

పర్యాయ పదాలు

(అ) ధర = ఇల, భూమి
(ఆ) ఆత్మజుడు = కుమారుడు, పుత్రుడు
(ఇ) వనం = అడవి, అరణ్యం
(ఈ) శోకం = దుఃఖం, వ్యథ

VI. భాషను గురించి తెలుసుకుందాం

కింది పేరాను చదవండి. అందులోని భాషాభాగాలను గుర్తించి పట్టికను పూరించండి.

మా ఊరి చెరువుగట్టున సంగమేశ్వర దేవాలయం ఉన్నది. పచ్చని ప్రకృతిలో పక్షుల కిలకిలారావాలతో అలరారే ఆ ప్రాంతమంతా శోభాయమానంగా ఉంటుంది. అక్కడి వనంలో జింకలు, కుందేళ్ళు తిరుగాడుతుంటే సుందరంగా ఉంటుంది. సూర్యోదయ సమయంలో ఎర్రని సూర్యకిరణాలు నీటి అలలపై ప్రతిబింబిస్తున్నప్పుడు ఆ అద్భుతదృశ్యాన్ని చూడటానికి రెండుకండ్లు చాలవు. అబ్బో! ఈ సౌందర్యాన్ని వర్ణిస్తూ పత్రికల్లో, ఎన్నో కథనాలు వచ్చాయి. ఆ కథనాలు చదువుతూంటే మనస్సు ఆహా! అంటూ ఆనందడోలికల్లో తేలిపోతుంది కదా!

నామవాచకం సర్వనామం విశేషణం క్రియ అవ్యయం
జింకలు మా సుందరంగా ఉన్నది అబ్బో
కుందేళ్ళు ఎర్రని అలరారే ఆహా
కండ్లు అద్భుత ఉంటుంది కిలకిల
సంగమేశ్వర పచ్చని చాలవు అక్కడి
సూర్యుడు శోభాయమానంగా వర్ణిస్తూ

ప్రాజెక్టు పని:

చదువు ప్రాముఖ్యత తెలిపే పద్యాలు / పాటలు సేకరించి, వాటిని చదివి వినిపించండి.

పద్యాలు

1. హర్తకుడుగాదు గోచరమహర్నిశమున్ సుఖపుష్టి సేయుస
త్కీర్తి ఘటించు విద్యయను దివ్యధనంబఖిలార్థికోటికిం
బూర్తిగ నిచ్చినన్ పెరుగు పోదు యుగాంతపువేళనైన భూ
భర్తలు తద్ధనాధికుల పట్టున గర్వము మానుటొప్పగున్.

2. అక్షరంబు వలయు కుక్షి జీవనులకు
అక్షరంబు జిహ్వ కిక్షురసము
అక్షరంబు నిన్ను రక్షించు గావున
నక్షరంబు లోకరక్షితంబు.

విశేషాంశాలు:

సారస్వతం : సరస్వతీ సంబంధమైన సారస్వతం. చదువును, జ్ఞానాన్ని, పాండిత్యాన్ని, సాహిత్యాన్ని సారస్వతమని వ్యవహరిస్తున్నాం.

ధ్రువా ప్రబంధం : ప్రబంధ విశేషం, గీత ప్రబంధ కావ్యం (సంగీత నాట్య సాహితీ విశేషం)

కళలు : మానవ జీవన పరిణామంలో నైపుణ్యంతో, సౌందర్యదృష్టితో సాధించిన ప్రజ్ఞావిశేషమే కళ. ఇది మానసిక ఆనందాన్నిస్తుంది. కళలు అరవైనాలుగు.

TS 7th Class Telugu 1st Lesson Important Questions చదువు

ప్రశ్న 1.
కష్టపడి సంగీతం సాహిత్యం వంటి కళలు నేర్చుకొని
జవాబు.
తివిరి కలయ సంగీత సాహిత్య కళలు నేర్చి.

ప్రశ్న 2.
ఆ పశువుల అద్షష్టం కొద్దీ అతడు గడ్డి తినడు.
జవాబు.
తృణం బాతడు య్యాంగీకంబున మేయడా పసుల భాగ్యం బిచ్చటన్ కల్గుటన్.

ప్రశ్న 3.
‘బడి ఈడు పిల్లలు బడిలోనే’ – చదువుల పండుగ పై 12 లైన్ల వ్యాసం రాయండి.

శీర్షిక : చదువుకోవలసిన వయసులో ఉన్న పిల్లలు ఉండవలసింది బడిలోనే కాని ఇంటిలోనో, పనిలోనో కాదు అని ఈ శీర్షిక తెలుపుతుంది.

ప్రవేశిక : మనదేశంలో చాలామంది బీదరికంలో జీవించేవారున్నారు. వారు పనిపాట్లు చేసుకొని ఎలాగో కాలం గడుపుతున్నారు. ఎక్కువమంది పిల్లలను కనటం, వారందరినీ పనికి పంపించితే డబ్బు ఎక్కువగా వచ్చి కాలం గడపటం సుఖంగా ఉంటుందని అనుకుంటున్నారు. అందువల్ల చదివించటానికి బడికి పంపటంలేదు. చదువు పిల్లల హక్కు వారి హక్కు వారికి దక్కాలి.

ప్రస్తుత స్థితి : బడికిపోయి చదువుకోవలసిన తియ్యని బాల్యంలో పిల్లలు తమలేత శరీరంతో కాయకష్టం చేస్తున్నారు. ధనికుల దుర్మార్గానికి బలియై గనుల్లోనూ, కార్ఖానాల్లోనూ కూడా పనిచేస్తున్నారు. వారిని చదువుకోడానికి బడికి పంపడం మనందరి కర్తవ్యం.

ప్రయోజనాలు : పిల్లలు బడికి వెళ్ళి చదువుకోవడం వల్ల వారికి జ్ఞానం కలుగుతుంది. మంచిచెడు తెలుసుకోగలుగుతారు. బడిలో చదువుతోపాటు ఆటలు, పాటలు, ఇతర కార్యక్రమాలు ఉంటాయి. వాటిలో పాల్గొని మానసిక ఆనందం పొందగలుగుతారు. మంచి వ్యక్తులుగా తయారౌతారు. తమ కాళ్ళమీద తాము నిలబడగలుగుతారు.

ముగింపు : బడి ఈడు పిల్లలను బడిలోకి పంపించే బాధ్యత సమాజంలోని పౌరులుగా మనందరిపైన ఉన్నది. పిల్లలను పనిలో పెట్టుకోగూడదని అలాచేసే వారికి బోధించడం ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేయటం మనకర్తవ్యం.

TS 7th Class Telugu 1st Lesson Questions and Answers Telangana చదువు

పర్యాయ పదాలు:

  • ఆత్లజుడు = కుమారుడు, పుత్రుడు
  • కమలం = తామర, పద్మం
  • శోకము = దుఃఖము, వ్యథ, ఏడుపు
  • వివేకము = తెలివి, జ్ఞానము
  • దూఱ్ల = తిట్టు, నిందించు
  • తండ్రి = నాన్న, పిత, జనకుడు
  • వనము = అరణ్యం, అడవి,కోన
  • భవనము = మేడ, సౌధము
  • భూవరులు = రాజులు, భూపతులు
  • తస్కరుడు = దొంగ, చోరుడు
  • (వ్రేగు = భారము, బరువు

నానార్థాలు:

  • వాసన – పరిమళము
  • సంజ్ఞ – పేరు, గుర్తు
  • దూఱు – నిందించు, ప్రవేశించు
  • వనము – అడవి, నీరు
  • గుణము – స్వభావము, అల్లెత్రాడు, రెట్టించు
  • ధర – భూమి, వెల
  • ప్రియము – ఇష్టము, ఎక్కువ ఖరీదు

ప్రకృతి – వికృతులు:

  • సంజ్ఞ – సన్న
  • రూపము – రూపు
  • మూర్ఖుడు – మొఱకు
  • బ్రధ్నుడు – ప్రొద్దు
  • భాష – బాస
  • పద్యము – పద్దెము, పద్దియము
  • పశువు – పసువు, పసరము
  • ఆశ్చర్యము – అచ్చెరువు
  • భాగ్యం – బాగ్గెం
  • విద్య – విద్దె, విద్దియ
  • శాస్త్రము – చట్టము
  • కావ్యము – కబ్బము
  • ఆజ్ఞప్తి – ఆనతి

I. కింద పద్యానికి భావం రాయండి. (ఈ ప్రశ్న కంఠస్థ పద్యాల నుండే అడుగబడుతుంది)

పరులకు సోదరులకు భూ
వరులకుఁ గొనరాదు సర్వవశ్యము తానె
వ్వరి కిచ్చినఁ గోటి గుణో
త్తర వృద్ధి భజించు విద్య తన ధనమెపుడున్.
భావం:
పూర్తిగా తన అధీనమైన విద్యను ఇతరులు, అన్నదమ్ములు, రాజులు తీసుకోలేరు. మనం ఎవ్వరికిచ్చినా కోటిరెట్లు పెరుగుతుంది. అందుకే విద్య ఎప్పూడూ మన సొంత ధనం.

II. పదజాలం

(అ) కింది పదాలను సొంతవాక్యాల్లో ఉపయోగించండి.

అ) 1. పరఘూమి : పరభూమిని తనదిగా చెప్పుకోవడం గొప్ప అనిపించుకోదు.
2. జడాశయుడు : జడాశయుడికి ఎన్ని మంచి మాటలు చెప్పినా ప్రయోజనం లేదు.
3. కమలాకరము : కమలాకరములతో నిండిన సరస్సును చూస్తుంటే మనసు ఆనందంతో సిండిపోతుంి.
4. లోకోద్యమ లక్షణం : లోకోద్యమ లక్షణం ఉన్నవాడే ఉన్నతిని సాధిస్తాడు.

(ఆ) సరైన జవాబు గుర్తు (A/B/C/D) బ్రాకెట్లలో రాయండి.

5. పరుల మేలు కోరేవాడు సజ్జనుడు. – గీతగీసిన పదానికి అర్థం
(A) గొప్పవాళ్ళు
(B) మేలు చేసేవాళ్ళు
(C) ఇతరులు
(D) స్నేహితుల
జవాబు.
C (ఇతరులు)

6. భూవరులు ప్రజలను కన్నబిడ్డల్లా పాలిస్తారు. ‘భూవరులు’ అంటే …………
(A) తల్లులు
(B) తండ్రులు
(C) గొప్పవాళ్ళు
(D) రాజులు
జవాబు.
D (రాఖులు)

TS 7th Class Telugu 1st Lesson Questions and Answers Telangana చదువు

7. మనం మాట్లాడే మాటలు అందరికీ ప్రియంగా ఉండాలి. – ప్రియం అంటే ……….
(A) ఇష్ట
(B) తీపి
(C) నచ్చడం
(D) సుందరం
జవాబు.
A (ఇష్టం)

8 దేశభక్తి లేనివారి ‘పుట్టువు’ వ్యర్థం. – గీతగీసిన పదానికి అర్థం
(A) పుట్టుక
(B) ధనం
(C) గతం
(D) పట్టు
జవాబు.
A(పుట్టుక)

9. ‘దూఱు’ కు పర్యాయపదాలు
(A) దూది, పత్తి
(B) దూరం, దవ్వు
(C) దొర, రాజు
(D) ప్రవేశించు, చొరబడు
జవాబు.
D (ప్రవేశించు, చొరబడు)

10. దొంగ, చోరుడు అనే అర్థాలనిచ్చే పదం
(A) సత్కరుడు
(B) తస్కరుడు
(C) గూండా
(D) విపత్కరుడు
జవాబు.
B (తస్కరుడు)

11. మామిడిపండ్ల వ్రేగు ఎక్కువయ్యి గున్నమామిడి వంగింది. ‘వ్రేగు’ అనే పదానికి సమానార్థక పదాలు
(A) కరువు, పెద్ద
(B) ఎక్కువ, అధికం
(C) బరువు, భారం
(D) కొమ్మలు, శాఖలు
జవాబు.
C (బరువు, భారం)

TS 7th Class Telugu 1st Lesson Questions and Answers Telangana చదువు

12. అది పురాతన భవనం. ఆ మేడంటే కొందరికి భయం. అది ఆ ఊరిలో ఎత్తైన సౌథం – ఈ వాక్యాల్లోని సమానార్థక పదాలు

(A) అది, ఆ, ఊరు
(B) భవనం, భయం, మేడ
(C) సౌథం, భవనం, మేడ
(D) పురాతన, భయం, సౌథం
జవాబు.
C (సౌథం, భవనం, మేడ)

వ్యాకరణం :

13. దధీచి గొప్ప తపశ్శక్తి గలవాడు. ఇందులోని విశేషణం …………….
(A) తపశ్శక్తి
(B) దధీచి
(C) కలవాడు
(D) గొప్ప
జవాబు.
D (గాప్ప)

14. రాక్షసులు దేవతల అస్త్రాలు లాక్కొనిపోయారు. – గీతగీసిన పదం
(A) నామవాచకం
(B) సర్వనామం
(C) క్రియ
(D) విశేషణం
జవాబు.
A (నామవాచకం)

15. కిందివానిలో అవ్యయం
(A) భద్రం
(B) తమ
(C) దధీచి
(D) ఆహా !
జవాబు.
D (అహా!)

16. ఆయుధాలు దధీచి వద్ద భద్రంగా దాచారు. ‘దాచారు’ అనేది
(A) సర్వనామం
(B) క్రియ
(C) విశేషణం
(D) అవ్యయం
జవాబు.
B (కిరియ)

17. వాళ్ళు తమ ఆయుధాలను కాపాడమని దధీచిని ప్రార్థించాడు. ఈ వాక్యంలో ‘వాళ్ళు’ అనే పదం భాషా భాగం ?
(A) సంస్కృతం
(B) నామవాచకం
(C) సర్వనామం
(D) అవ్యయం
జవాబు.
C (సర్వనామం)

పద్యాలు – ప్రతిపదార్థాలు – తాత్పర్యాలు

1. ఆ॥వె॥ భట్టి మంత్రి; సైన్యపాలి గోవింద చం
ద్రుఁడు; త్రివిక్రముడు పురోహితుండు;
నప్పురోహితునకు నాత్మజుండగు కమ
లాకరుండను నవివేకి గలఁడు.

ప్రతిపదార్థం:

మంత్రి = విక్రమార్క మహారాజు యొక్క మంత్రి
భట్టి = భట్టి అను పేరుగల వాడు
సైన్యపాలి = సైన్యాధిపతి
గోవింద చంద్రుడు = గోవింద చంద్రుడు అనువాడు
పురోహితుండు = బ్రాహ్మణుడు
త్రివిక్రముడు = త్రివిక్రముడనే పేరు గలవాడు
ఆ+పురోహితునకు = ఆ పురోహితునికి
కమలాకరుండు + అనన్ = కమలాకరుడను పేరుగల
అవివేకి అగు = మూర్ఖుడైన
ఆత్మజుండు = కుమారుడు
కలడు = ఉన్నాడు

తాత్పర్యం: విక్రమార్క మహారాజు యొక్క మంతిత్ భట్టి. ఆ రాజు వద్ద గోవిందచంద్రుడనే సైన్యపాలకుడున్నాడు. విక్రమార్కుని పురోహితుడే త్రివిక్రముడు. ఆ పురోహితునికి కమలాకరుడనే కొడుకున్నాడు. అతడు అవివేకి.

2. కం. ఆ కమలాకరుఁ డా కమ
లాకర సాదృశ్యముగ జడాశయుఁడైనన్
శోకము మదిఁ బొదలంగ వి
వేకము పుట్టింపఁ దండ్రి వెరవున దూతెన్.

ప్రతిపదార్థం

ఆ కమలాకరుడు = ఆ కమలాకరుడనేవాడు
ఆ కమల + ఆకర = తామరలకు నిలయమైన నీటిమడుగుతో
సాదృశ్యముగ = సమానముగ
జడ + ఆశయుడు + ఐనన్ = ఏ ఆశయాలు లేకుండా మంద బుద్ధిగా ఉండేసరికి
తండ్రి = తండ్రియైన త్రివిక్రముడు
శోకము = దుఃఖము
మదిన్ = మనసులో
పొదలగ = వ్యాపించగా
వెరపున = భయముతో
వివేకము = తెలివితేటలను
పుట్టింపగన్ = కలిగించాలని
దూఱెన్ = మందలించాడు

తాత్పర్యం: కమలాకరం అంటే జలాశయం. అది నిశ్చలంగా ఉంటుంది. ఆ విధంగానే కమలాకరుడు జడాశయుడు. ఎటువంటి ఆశయం లేకుండా స్తబ్దంగా ఉన్నాడు. కొడుకుని చూసి తండ్రి మనసులో దుఃఖించాడు. కొడుకును వివేకిని చేయాలని ఈ విధంగా మందలించాడు.

3. కం॥ చుట్టములకుఁ దలిదండ్రుల
కెట్టి యెడం బ్రియము నెఱపనెడపని చదువుల్
గట్టిగ నెఱుఁగని పుత్రుఁడు
పుట్టుట కులమునకుఁదెవులు పుట్టుటచుమ్మీ.

ప్రతిపదార్థం

చుట్టములకు = బంధువులకు
తలిదండ్రులకు = అమ్మానాన్నలకు
ఎట్టి+ఎడన్ = ఎప్పుడూ కూడా
ప్రియంబు = సంతోషాన్ని
నెఱపనెడపన = కలిగించనివాడు
చదువుల్ = విద్యలను
గట్టిగన్ = క్షుణ్ణంగా
ఎఱుగని = నేర్వని
పుతుడు = కుమారుడు
పుట్టుట = కలుగుట
కులమునకు = వంశానికి
తెవలు = చీడ
పుట్టుట సుమ్మీ = పుట్టినట్లే కదా!

తాత్పర్యం: చుట్టాలకు, తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించే చదువులు పిల్లలు నేర్చుకోవాలి. అటువంటి చదువులు నేర్వని కొడుకులు వంశానికి తెగులువంటివారు.

4. కం|| విను ముత్తమమగు పుట్టువు
గనుపట్టెడు నట్టిరూపు గల మోదుగుఁ బూ
వును మూర్ఖుండును బ్రబలెడు
వనమున భవనమునఁ దగిన వాసన గలదే.

ప్రతిపదార్థం

వినుము = నేను చెప్పేది విను
ఉత్తమము+అగు = (శేష్ఠమైన
పుట్టువు = జన్మము
కనుపట్టెడు+అట్టి = చక్కగా కనిపించే
రూపు+కల = ఆకారం గల
మోదుగు+పూవును = ఎర్రగా ఉండే మోదుగు చెట్టు పువ్వు
మూర్జుండును = అవెవేకియు
వనమున = అడవిలోను
భవనమునన్ = మేడలోను
ప్రబలెడున్ = పెరుగుతారు
తగిన = కాపలసిన
వాసన = సుగంధము / సంస్కారము
కలదు + ఏ = ఉన్నదా? (లేదు)

తాత్పర్యం : చక్కని రూపం ఉన్నా కూడా మోదుగు పువ్వు సువాసనలు వెదజల్లలేదు. అట్లాగే ఉత్తమమైన జన్మ, ఎంత మంచి రూపమున్నవాడైనప్పదికీ మూర్ఖడు కుటుంబంలో వెలుగును నింపలేడు.

5. కం|| పరులకు సోదరులకు భూ
వరులకుఁ గొనరాదు సర్వవశ్యము తానె
వ్వరి కిచ్చినఁ గోటి గుణో
త్తర వృద్ధి భజించు విద్య తన ధనమెపుడున్.

ప్రతిపదార్థం

విద్య – చదువు
ఏపుడున్ – ఎల్లప్సం
తన ధనము – తన సంపద
పరులకు – ఇతరులకు
సోదరులకు – అన్నదమ్ములకు
భూవరులకున్ – రాజులకు
కొనరాదు – తీసుకోడానికి సాధ్యంకాదు
సర్వ – సమస్తముగా
వశ్యము – తన అధీనంలో ఉంటుంది
తాను – స్వయంగా
ఎవ్వరికి + ఇచ్చినన్ – ఎవరికైనా ఇచ్చినా
కోటిగుణ + ఉత్తర – కోటిరిట్లు కంటె ఎక్కువగా
వృద్ధి భజించు – అభివృద్ధి చెందుతుంది

తాత్పర్యం: పూర్తిగా తన అధీనమైన విద్యను ఇతరులు, అన్నదమ్ములు, రాజులు తీసుకోలేరు. మనం ఎవ్వరికిచ్చినా కోటిరెట్లు పెరుగుతుంది. అందుకే విద్య ఎప్పుడూ మన సొంత ధనం.

6. కం|| పరభూమికిఁ జనుచోఁ ద
స్కరులకు నగపడదు వ్రేగుగా దెచ్చట నె
వ్వరినైన హితులఁ జేయును
ధరలో మఱి విద్యఁ బోల ధనములు గలవే.

ప్రతిపదార్థం

పరభూమికిన్ = ఇతర దేశములకు
చనుచోన్ = వెళ్ళినప్పుడు
తస్కరులకున్ = దొంగలకు
అగపడదు = కనిపించదు
(వ్రేగుకాదు = బరువుకాదు
ఎచ్చటన్ = ఎక్కడైనా సరే
ఎవ్వరిన్ + ఐనన్ = ఎవరినైనా సరే
హితులన్ + చేయును = మనకు మంచివారిగా (స్నేహితులుగా) చేస్తుంది
ధరలో = భూమిపైన
విద్యన్ + ఏోల = చదువు వంటి
ధనములు = సంపదలు
మరి = ఇంకేవైనా
కలవు + ఏ = ఉన్నాయా? (లేవు)

తాత్పర్యం: వేరే ప్రాంతాలకు వెళ్ళినపుడు విద్యాధనం దొంగలకు కనబడదు. అది మనకు భారం కూడా కాదు. ఎక్కడనైనా, ఎవ్వరినైనా మనకు హితులను చేస్తుంది. అందువల్ల ఈ భూమిపై విద్యకు సమానమైన ధనం మరొకటిలేదు.

7. ఉ॥ గద్యముఁ బద్యముం బెనుపఁ గైకొను టొండె, ధ్రువాప్రబంధసం
పద్యుతుఁ డౌట యొండె, మృదుభాషలఁ బ్రొద్దులు పుచ్చుటొండె,లో
కోద్యమ లక్షణం బెఱుఁగు టొండె, గడున్భజియించుఁగాక యే
విద్యలు నేరఁడేనిఁ పశువే యగుఁ గాదె గణించి చూచినన్.

ప్రతిపదార్థం

గద్యమున్ – వచన కావ్యాలు
పద్యమున్ – పద్య కావ్యాలు
పెనుపన్ – ఎక్కువగా
కైకొనుట + ఒండు + ఎ – చదవటం ఒకటి
ధ్రువా (పబంధ = సంగీత, సాహిత్య, నాట్యప్రబంధాల
సంపత్ యుతుడు + ఔట + = సంపదతో
ఒండు + ఎ = గడుపుట ఒకటి
లోక + ఉద్యమ = ప్రజల పనిపాటుల యొక్క
లక్షణంబు = పద్ధతి
ఎఱుగుట + ఒడడు + ఎ = తెలిసికొనుట ఒకటి (ఈ పద్ధతులు)
కడున్ = మిక్కిలి
భజియించున్ = అందరికీ ఇష్టమౌతాయి
కాక = అంతే తప్ప
ఏ విద్యలు = ఏ విధమైన చదువులు
నేరడు + ఏని = సేర్చుకోకపోతే
గణించి చూచిన = ఎంచి చూస్తే
పశువు + ఏ + అగున్ = (అతడు) జంతువుతో సమానము

తాత్పర్యం: వచనకావ్యాలు, పద్యకావ్యాలు చదువాలి. లేదా ధ్రువాప్రబంధ సంపదను (సంగీత నాట్యసాహిత్య జ్ఞానాన్ని) పొందాలి. లేదా మంచి మాటలు మాట్లాడుతూ పొద్దు గడపాలి. లేదా లోకజ్ఞానమైనా పొందాలి. ఇవి ఏవీ చేయకుండా ఎవరిని ఎంత సేవించినా ఏ చదువులూ నేర్చుకోనివారు పశువుల వంటివారే.

8. శా॥ సంగీతంబుఁ గవిత్వ తత్త్వమును సౌజన్యంబు భావంబు స
త్సాంగత్యంబు నెఱుంగడేని భువి నాశ్చర్యంబుగా వాలమున్
శృంగ ద్వంద్వము లేని యెద్దతఁడనం జెల్లుం దృణం బాతఁడ
య్యాంగీకంబున మేయఁ డాపసుల భాగ్యం బిచ్చటం గల్గుటన్.

ప్రతిపదార్థం

సంగీతంబున్ – సంగీతమును
కవిత్వ తత్త్వమును – కవిత్వంలోని సారమును
సౌజన్యంబు – మంచితనము
భావంబ – మంచి ఆలోచనలు
సత్సాంగత్యంబున్ – మంచివారితో స్నేహమున్
ఎఱంగడు+ఏని – లేకపోయినట్లైతే
ఆశ్చర్యంబుగా – ఆశ్చర్యకరముగా
భువిన – ఈ లోకంలో
అతడు – ఆ మనిషి
హాలమన్ – తోకయు
శృంగద్వంద్వంబులేని – రెండు కొమ్ములును లేని
ఎద్దుఅనన్ – ఎద్దు అని పిలవడం
చెల్లున్ – తగియున్నది
ఆ+ఆంగీకంబున – ఆ శరీరముతో
ఆతడు – ఆ మనిషి
వాలమున్ – తోకయు
శృంగద్వంద్వంబులేని – రెండు కొమ్ములును లేని
ఎద్దుఅనన్ – ఎద్దు అని పిలవడం
చెల్లున్ – తగియున్నది
ఆ+ఆంగీకంబున – ఆ శరీరముతో
ఆతడు – ఆ మసిషి
తృణంబు – గడ్డి
మేయడు – తినడు
ఇచ్చటన్ – ఈ విషయంలో
ఆ పసుల – ఆ జంతువులు
భాగ్యంబు – అదృష్టము
కల్గుటన్ – కలిగియుండుట వలన

తాత్పర్యం : సంగీతం, కవిత్వంలోని సారం, మంచితనం, మనసులోని భావం, సజ్జనులతోడి స్నేహం వీటిని గ్రహించలేని వాడిని భూమిపై తోక, కొమ్ములు లేక తిరుగాడే ఎద్దు అని అనవచ్చు. అటువంటివాడు గడ్డిమేయకపోవడం అనేది పశువుల పాలిటి అదృష్టమని చెప్పాలి.

9. సీసః అనుచు నెగ్గించిన నా కమలాకరుం
డభిమానియై తన యాత్మలోన
విద్యలు నేర్చి వివేకినై కాని యీ
జనకు వక్త్రము చూడననుచు వెడలి
కాశ్మీర దేశంబు కడ కేఁగి యొక యోర
జంద్రకేతుండను సంజ్ఞఁ బరఁగు
నుత్తమ ద్విజుఁ గొల్చియుండగా నాతండు
క్రమమున సిద్ధ సారస్వతంబు
తే.గీ॥ కరుణ నొసఁగిన నతఁడు సాంగంబు గాఁగ

నాల్గు వేదములును గావ్య నాటకములు
దర్శనంబులు నీతిశాస్త్రములు దివిరి
కలయ సంగీత సాహిత్య కళలు నేర్చి

ప్రతిపదార్థం

అనుచున్ – ఇలా పలుకుతూ
ఎగ్గించినన్ – తండడడి మందలించగా
ఆ కమలాకరుండు – కుమారుడైన ఆ కమలాకరుడు
అభిమాని + ఐ – రోషము కలవాడై
తన ఆత్మలోన = తన మససులోనే
విద్యలు నేర్చి = చదువు నేర్బుకొని
వివేకిని+ఐ కాని = పండితుడనైతేనే తప్ప
జనకు = తండ్డి యొక్క
వక్త్రము = ముఖము
చూడను = చూడను
అనుచు = అనుకుంటూ
కాశ్మీరదేశంబు కడకు = కాశ్మీరదేశం సమీపానికి
ఏగి = వెళ్ళి
ఒక+ఓరన్ = ఒకవైపు
చంద్రకేతుండు+అను = చంద్రకేతుడు అనే
సంజ్ఞన + పరగు = పేరుతో (ప్రసిద్ధి పొందిన
ఉత్తమ ద్విజున్ = గొప్ప బాహ్మణుని
కొల్చి+ ఉండగా = సేవించుచుండగా
ఆతండు = ఆ చంద్రకేతుడు
క్రమమున = వరుసగా
సిద్ధసారస్వతంబు = తనకు సిద్ధించిన సాహిత్యాన్ని
కరుణన్ = దయతో
ఒసగిన = ఇవ్వగా
అతడు =కమలాకరుడు
స+అంగంబు కాగ = వేదాంగములతోసహా
నాల్గు వేదములు = నాలుగైన వేదాలను
కావ్యనాటకములు = కావ్యాలను సాటకాలను
దర్శనంబులు = దర్శనాలు
నీతిశాస్త్రములు = నీతిశా[శాత్రాలను
కలయ = చకగ్రా
సంగీత, సాహిత్య కళలు = సంగీతము సాహిత్యము మొదలైన కళలను
తివిరి = చక్కని ప్రయత్నంతో
నేర్చి= నేర్చుకొని

తాత్పర్యం : తండడడి వ్యంగ్యపు మాటలకు కమలా కరుడు అభిమానపడ్డాడు. విద్య నేర్చుకొని వివేకియైన తరువాత కాని తండ్డి ముఖం చూడనని మనసులో అనుకున్నాడు. కాశ్మీరదేశంలోని చంద్రకేతుడు అనే ఉత్తమ బ్రాహ్మణ గురువును చేరి సేవ చేశాడు. ఆ పండితుని ద్వారా క్రమంగా నాలుగు వేదాలు, వేదాంగాలు, కావ్యనాటకాలు, దర్శనాలు, నీతిశాస్త్రాలు, సంగీత సాహిత్యకళలు నేర్చుకున్నాడు.

10. వ. అఖిజ్ఞుండై గురునానతి వడసి తిరిగి
దేశవిశేషంబులం జూడం జరియించుచు….

ప్రతిపదార్థం

అభిజ్ఞుండు+ఐ = అన్నియు నేర్చినవాడై
గురు + ఆనతి = గురువుగారి అనుమతిని
పడసి = పొంది
తిరిగి = మరల
దేశవిశేషంబలన్ = దేశంలోని విశేషాలను
చూడన్ = చూడటానికి
చరియించుచు = తిరుగుతూ

తాత్పర్యం: ఆ తర్వాత గురువుగారి అనుమతితో దేశంలోని విశేషాలు చూడాలని బయలు దేరాడు. (ఈ విధంగా తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు, ఎవ్వరు నిందించినా కోపాన్ని తెచ్చుకోరాదు. దానిని (పేరణగా తీసుకొని ఎదగాలి అని పాఠ్యాంశ భావం).

పాఠం నేపథ్యం /ఉద్దేశం:

ఒకప్పుడు ఉజ్జయిని రాజ్యానికి రాజు విక్రమార్కుడు. అతని తర్వాత కాలంలో థోజరాజు రాజ్యాన్ని పరిపాలించాడు. భోజరాజు విక్రమార్కుని కథలు అనేకంగా వినేవాడు. ఆ కథల్లో కమలాకరుని కథ ఒకటి. కమలాకరునికి చదువుపట్ల ఎటువంటి ఆసక్తి లేదు. తండ్రి తతివి(క్రముడు చదువు గొప్పతనాన్ని తెలుపుతూ కొడుకును మందలిస్తాడు. కమలాకరుడు మారిన పద్ధతి, తండడడి మందలించిన విధానం, ఈ పాఠంలో చూడగలం. చదువు ఆవశ్యకతను తెలియజెప్పడం ఈ పాఠం ఉద్దేశం.

ఈ పాఠం “కథాకావ్యం” (ప్రక్రియకు చెందినది. వివిధ కథల సమాహారకావ్యం కథాకావ్యం. దీనిలో వస్తువు ట్రధానం. రమణీయ కథన విధానం కలిగిన కావ్యమే కథాకావ్యం. నీతిని, వ్యవహార దక్షతను కార్యకుశలతను, ఉత్తమ గుణాలను పెంపొందించే కథలు ఇందులో ఉంటాయి. కొఱవి గోపరాజు రచించిన సింహాసన ద్వా(తింశిక చతుర్థాశ్వాసంలోనిదీ కథ. భోజరాజుకు తొమ్మిదవ సాలభంజిక ఈ కథను చెప్పింది.

కవి పరిచయం:

కవిపేరు : కొఱవి గోపరాజు
పాఠ్యభాగం పేరు : చదువు
కాలం : 15వ శతాబ్దం
జన్మస్థలం : నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ ప్రాంతం
రచన : సింహాసన ద్వాత్రింశిక
తల్లిదండ్రులు : తండ్రిపేరు కొఱవి కసవరాజు, తల్లిపేరు కామాంబిక
విశేషాంశాలు : నాటి పల్లికొండ సంస్థానాధీశుడు, మహారాజు రాణా మల్లన ఆస్థాన పండితుడు. సాహిత్యంతోపాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిషం మొదలైన శాస్త్రాలలో ప్రవీణుడు. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం ఈయన ప్రత్యేకత.

ప్రవేశిక:

చదువు మనిషిలో వివేకాన్ని మేల్కొలిపి విజ్ఞానవంతుడిని చేస్తుంది. విజ్ఞానం వల్ల వినయం, ఇతరులకు సహాయం చేసే బుద్ధి, లౌక్యం, ధర్మనిరతి, ఆదర్శజీవనం వంటి ఉత్తమగుణాలు అలవడుతాయి. తమ పిల్లలు ఉత్తమ పౌరులుగా మారాలని తల్లిదండ్రులంతా కోరుకుంటారు. చదువుపట్ల నిర్లక్ష్యం వహించే పిల్లల గురించి ఎంతో బాధపడతారు. విక్రమార్క మహారాజు పురోహితుడైన త్రివిక్రముడు తన కొడుకు కమలాకరుడు సరిగ్గా చదువుకోవడం లేదని మధన పడ్డాడు. కొడుకుకు ఎట్లా హితవు పలికాడో పాఠం ద్వారా తెలుసుకుందాం!

TS 7th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana నాయనమ్మ

Telangana SCERT 7th Class Telugu Guide Telangana 2nd Lesson నాయనమ్మ Textbook Questions and Answers.

నాయనమ్మ TS 7th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana

బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి.

TS 7th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana నాయనమ్మ 1

ప్రశ్న 1.
పై బొమ్మలో ఎవరెవరున్నారు?
జవాబు.
పై బొమ్మలో ముసలవ్వ, ఆమె కొడుకు, కోడలు, మనుమడు, మనుమరాలు ఉన్నారు.

ప్రశ్న 2.
బొమ్మలో ఏం జరుగుతున్నది?
జవాబు.
బొమ్మలో ముసలవ్వకు కోడలు బువ్వ తినిపిస్తున్నది. కొడుకు సహాయం చేస్తున్నాడు.

TS 7th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana నాయనమ్మ

ప్రశ్న 3.
ముసలవ్వకు సేవలు చేస్తున్నవారు ఎవరై ఉంటారు?
జవాబు. ముసలవ్వకు సేవలు చేస్తున్నవారు ఆమె కొడుకు, కోడలు అయి ఉంటారు.

ప్రశ్న 4.
మీ ఇంట్లో ఉండే వృద్ధులకు మీరు ఎలాంటి సేవలు చేస్తారు?
జవాబు.
మా ఇంట్లో ఉండే వృద్ధులకు మేము త్రాగడానికి నీరిస్తాము. తినడానికి భోజనము అందిస్తాము. తినలేనివారికి తినిపిస్తాము. లేవలేని మా అవ్వను చేయి పట్టుకొని నడిపిస్తాము. వీధిలో అటుఇటు తిప్పుతాము. ఆరోగ్యం సరిగాలేనప్పుడు మరింత జాగ్రత్తగా చూసుకుంటాము. మందులు టైం ప్రకారం వేస్తాము. వారికి అవసరమైన వాటిని విసుగులేకుండా సమకూరుస్తాము.

ఆలోచించండి – చెప్పండి (TextBook page No.12)

ప్రశ్న 1.
“సాధారణంగా పిల్లలు నాయనమ్మను ఇష్టపడతారు” ఎందుకు?
జవాబు.
నాయనమ్మ పక్కన పడుకోబెట్టుకొని కథలు చెబుతుంది. ఉదయాన్నే లేవగానే శుభ్రంగా స్నానం చేయించి బడికి పంపుతుంది. కొనుక్కొని తినడానికి డబ్బులిస్తుంది. ఇంట్లో చేసిన పిండివంటలు దాచిపెట్టి మళ్ళీ మళ్ళీ ఇస్తుంది. అందువల్ల పిల్లలకు నాయనమ్మ అంటే ఇష్టం.

ప్రశ్న 2.
“ఏంకాదులే అవ్వా! అన్నింటికీ ఆ దేవుడున్నాడు” అని ఇంటికి వచ్చినవారు అనటంలో ఆంతర్యమేమిటి?
జవాబు.
నాయనమ్మను బిడ్డలు సుఖంగా చూసుకుంటున్నారు. ఏలోటూ లేదు. కానీ ఆమెకు కళ్ళు కనిపించవు. నడవలేదు. మంచం మీదనే ఉండడం ఆమెకు ఇబ్బందిగా ఉండేది. అందుకే వచ్చిన వారితో ‘ఎవళ్ళకూ పనికిరాని బతుకు’ అనేది. అందుకు వారు “నీవు కష్టపడకుండా ఇలాంటి సమయంలో కూడా బాగా చూసుకునే బిడ్డలున్నారు. సంతోషంగా ఉన్నావు. కొన్నిచోట్ల అలాలేదు. వారితో పోల్చితే నీవే ఎంతో మేలు” అన్నారు. అందుకే ‘ఎవరు ఎలా జీవించాలో ఆ దేవుడు నిర్ణయిస్తాడు’ అని అన్నారు.

ప్రశ్న 3.
“సల్లంగుండు బిడ్డా” అని ఏయే సందర్భాలలో అంటారు?
జవాబు.
పెద్దలకు మొక్కినపుడు, పుట్టినరోజునాడు, ఎవరినైనా ప్రమాదంలో కాపాడినపుడు, మంచిగ మాట్లాడినపుడు, ఆడపిల్లను అత్తవారింటికి సాగనంపేటపుడు, బాగా చదువుచున్నపుడు, అందరిచే పొగడబడినపుడు ‘సల్లంగుండు బిడ్డా’ అని దీవిస్తారు.

TS 7th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana నాయనమ్మ

ప్రశ్న 4.
మీరు ఏయే ఆటలు ఆడుతారు?
జవాబు.
క్రికెట్టు, కబడ్డి, హాకీ, ఖోఖో, బంతాట, దాగుడుమూతలు, చిర్రగోనె, మేకపులి, వామనగుంటలు మొదలైన ఆటలు మేము ఆడుతాము.

ప్రశ్న 5.
ఈ మీతో ఆడడానికి వస్తానని స్నేహితుడు రాకపోతే మీకేమనిపిస్తుంది?
జవాబు.
ఆడడానికి వస్తానని రాకపోతే స్నేహితునిపై కోపం వస్తుంది. ఎంతో ఆనందంగా ఆడుకోవడానికి వచ్చినపుడు ఆ ఆనందాన్ని దూరం చేస్తూ అతడు రానప్పుడు అతనితో ఎప్పటికీ మాట్లాడకూడదనిపిస్తుంది.

ప్రశ్న 6.
కలసి ఆడడంలో ఉన్న ఆనందం ఎటువంటిది?
జవాబు.
కలసి ఆడడం వల్ల ఉరుకులు, పరుగులు, కేరింతలు, గెలుపు ఓటములు, వెక్కిరింతలు, పొగడ్తల మధ్య సంభాషణలతో కలిగే మానసికోల్లాసం మాటల్లో చెప్పలేనిది.

ప్రశ్న 7.
మీరు ఎవరికైనా ఎప్పుడైనా సహాయం చేశారా? ఎట్లాంటి సహాయం చేశారో చెప్పండి?
జవాబు.
నేను ఒక ముసలాయనకు సహాయం చేశాను. బడికి వెళ్ళేదారిలో ఒక వ్యక్తి స్కూటరుపై వెళ్తూ అటుగా పోతున్న పెద్దాయనను ఢీకొట్టి వెళ్ళిపోయాడు. అతనికి దాదాపు 65 సంవత్సరాలు ఉంటాయి. మోచేతిపై రక్త గాయం అయింది. కాలువలో పడిపోయాడు. అక్కడ ఎవరూలేరు. నేను పరుగెత్తుకెళ్ళి అతన్ని లేవదీసి, శుభ్రపరచి, ఇటుకల బట్టీ వద్దకు వెళ్ళి వారికి చెప్పి 108కి ఫోను చేయించి, త్రాగడానికి నీరు తెచ్చి తాగించాను. అతనిని ఆసుపత్రికి తీసుకు వెళ్ళేవరకు అక్కడే ఉండి సేవలు చేశాను.

ప్రశ్న 8.
జ్వరం వచ్చినపుడు ఇంట్లో అందరూ నాయనమ్మతోనే ఉన్నారు కదా! దీనివల్ల నీవేమి గ్రహించావు?
జవాబు.
నాయనమ్మకు జ్వరం వచ్చినపుడు అందరూ ఆమెతోనే ఉన్నారు. దీనినిబట్టి ఆమెపై అందరికీ ప్రేమాభిమానాలు ఎక్కువని, అందరికీ ఆమె అంటే ఇష్టం అనీ, అనారోగ్యముతో ఉన్న వారి దగ్గర మనుషులుంటే వారు ధైర్యంగా ఉండి తొందరగా కోలుకుంటారని నేను గ్రహించాను.

TS 7th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana నాయనమ్మ

ప్రశ్న 9.
శేఖర్ నాయనమ్మపై ఎందుకు ద్వేషం పెంచుకున్నాడు?
జవాబు.
శేఖర్తో రవి ఎక్కువ సమయం ఆడడంలేదు. దానికి కారణం రవి నాయనమ్మకు సేవ చేయడమే. అందుకే నాయనమ్మపై శేఖర్ ద్వేషం పెంచుకున్నాడు.

ప్రశ్న 10.
ఆ నీకు ఎప్పుడైనా ఎవరిమీదైనా కోపం వచ్చిందా? ఏ సందర్భంలో వచ్చిందో తెలపండి.
జవాబు.
మా పక్కింటి రంగన్న అతని 55 సంవత్సరాల తల్లిని పట్టుకొని వీధిలో కొడుతుంటే అతన్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది.

ప్రశ్న 11.
శేఖర్ పశ్చాత్తాప పడ్డాడుకదా! మీరు ఏయే సందర్భాలలో పశ్చాత్తాప పడ్డారో చెప్పండి?
జవాబు.

  1. మా ఇంట్లో పిండివంటలు చేసినపుడు నాకు లేకుండా మా అన్న తినగా నేను ఏడ్చాను. మా అమ్మ అన్నను కొట్టింది. అతను బాధపడుతున్నప్పుడు,
  2. బడిలో నేను మాట్లాడినందుకు టీచరు నా పక్కన అబ్బాయిని కొట్టినప్పుడు నేను పశ్చాత్తాప పడ్డాను.

ప్రశ్న 12.
శేఖర్ అందరితో మాట్లాడడం తగ్గించి ముభావంగా ఉండిపోవడానికి కారణాలు వివరించండి.
జవాబు.
శేఖర్ చేసిన పని వల్ల నాయనమ్మ కాలు విరిగింది. దానివల్ల అందరూ బాధపడుతున్నారు. దాన్ని చూసి తాను చేసిన తప్పువల్ల ఇంతమంది బాధకు నేను కారణమయ్యానని భావించి శేఖర్ ముభావంగా ఉన్నాడు.

TS 7th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana నాయనమ్మ

ప్రశ్న 13.
నాయనమ్మ క్షమించినా శేఖర్ ఎందుకు ఏడ్చాడు?
జవాబు.
శేఖర్ తాను చేసిన తప్పును చెప్తే నాయనమ్మ కోపపడుతుందని, కొడుతుందని భావించి ఉంటాడు. కానీ నాయనమ్మ అలా చేయలేదు. ఏమీ అనకపోగా బుజ్జగించడం, ఆప్యాయతతో వీపుపై నిమరడం చేసింది. దానితో పశ్చాత్తాప భావం ఎక్కువై శేఖర్ భోరున ఏడ్చాడు.

ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. రవి శేఖర్ ఇద్దరిని గురించి తెలుసుకున్నారుగదా! ఎక్కువమంది పిల్లలు ఎవరివలె ఉంటారు? ఎందుకు?
జవాబు.
సాధారణంగా ఎక్కువమంది పిల్లలు శేఖర్ వలె ఉంటారు. ఎందుకంటే పిల్లలు తన ఈడు వారితో కలసి ఆడుకోవడానికి, ఆనందంగా తిరగడానికి ఇష్టపడతారు. దానికి ఇబ్బంది ఏర్పడినపుడు తీవ్ర అసహనానికి లోనవుతారు. కోపంతో ఆ ఇబ్బందికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అది పిల్లల మనస్తత్త్వం.

2. నాయనమ్మ కథను మీ సొంతమాటల్లో చెప్పండి.
జవాబు.
ఒక ఊరిలో రవి కుటుంబం ఉండేది. ఆ ఇంట్లో రవి అమ్మానాన్నలు, తమ్ముడు, చెల్లెలు, నాయనమ్మ ఉండేవారు. నాయనమ్మకు వయసు అధికమై కళ్ళు కనిపించక, నడవలేక మంచం పట్టింది. ఆ ఇంట్లో అందరూ ఆమెకు సేవలు చేస్తుండేవారు. కొన్ని కొన్ని పనులలో ఇతరులపై ఆధారపడకుండా మంచానికి ఇరువైపులా ఆయా వస్తువులను పెట్టమని చేతితో తడిమి అవ్వే తీసుకొనేది.

ఒకసారి రవి చుట్టాలబ్బాయి శేఖర్ అమ్మానాన్నలతో కలిసి వీరింటికి వచ్చాడు. శేఖర్కు రవితో ఆడుకోవడం ఇష్టం. అవ్వకు జ్వరం రావడంతో రవి ఎక్కువ సమయం శేఖర్తో ఆడలేదు. అందుకు కోపించిన శేఖర్ అవ్వపై ద్వేషం పెంచుకున్నాడు. మంచంపక్కన వస్తువులను తారుమారు చేశాడు. అవ్వ మంచం దిగబోయి చెప్పులనుకొని నీళ్ళబిందెలో కాలుపెట్టింది. అవ్వకాలు విరిగింది. అవ్వ కిందపడింది. నెలరోజులు ఆసుపత్రిలో ఉండింది.

ఆ కుటుంబ సభ్యులు, అవ్వ బాధపడడం చూసి తనవల్లనే ఇదంతా జరిగిందని శేఖర్ పశ్చాత్తాప పడ్డాడు. ఎవరూలేని సమయంలో తాను చేసిన పనివల్లనే నీకీ కష్టం వచ్చిందని చెప్పి భోరున ఏడ్చాడు. నాయనమ్మ అతన్ని హత్తుకొని కన్నీళ్ళు తుడిచి, నవ్వింది. “నేను కష్టపడడం చూసి నీలో మార్పు వచ్చింది. “అందరితో కలిసి ఆడుకుంటూ సంతోషంగా ఉండు” అంటూ వీపుపై నిమిరింది.

II. ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

1. కిందిపేరా చదవండి. ముఖ్యమైన పదాలు రాయండి.

ఒక శివరాత్రినాడు శివుడిని దర్శించడానికి జనం సముద్రంలాగ వచ్చారు. ఆ జనసమ్మర్థంలో కండ్లు సరిగా కనపడని ఒక వృద్ధురాలు కాలుజారి పడిపోయింది. ఆమె చేతిలోని గిన్నె గోతిలో పడింది. నుదిటిమీద దెబ్బతోని అవ్వ స్పృహ తప్పింది. ఎవ్వరూ ఆ ముసలమ్మను పట్టించుకోలేదు. శివుడిని చూడడానికి ఎగబడ్డారు. ఇద్దరు ఆడపిల్లలు అది చూశారు. అవ్వను లేవదీసి కూర్చోబెట్టారు. దుమ్ముధూళి దులిపి గాయానికి కట్టుకట్టారు. అవ్వకు చల్లని నీళ్ళు తాగించారు. శివపూజకు తెచ్చిన అరటిపండ్లను తినిపించారు. “బంగారు తల్లులారా! సేవచేసి నా ప్రాణం కాపాడారు” అని అవ్వ ఆనందభాష్పాలు రాలుస్తూ ఆ పిల్లల్ని దీవించింది. ఉదా : జనసమ్మర్ధం, దీవించటం.
జవాబు.

  1. దర్శించటం
  2. శివరాత్రి
  3. జనసమ్మర్ధం
  4. కాలుజారి పడిపోవడం
  5. స్పృహతప్పడం
  6. పట్టించుకోకపోవడం
  7. దుమ్ముదులపడం
  8. గాయానికి కట్టుకట్టడం
  9. నీరుతాగించడం
  10. అరటిపండ్లు తినిపించడం
  11. దీవించడం
  12. ఆనందబాష్పాలు

2. కింది వాక్యాలు చదవండి. వీటిలో మీరు చేసేవాటికి ‘✓’ లేకుంటే ‘X’ గుర్తు పెట్టండి.

(అ) నాకు ముసలివాళ్ళంటే బాగా ఇష్టం. (√)
(ఆ) నేను ముసలివాళ్ళకు ఎప్పుడైనా పనులు చేసిపెడతాను. (√)
(ఇ) ఎవరి వస్తువులైనా నాకిష్టమైతే తీసుకుంటాను. (X)
(ఈ) ఇంటికి వచ్చిన చుట్టాలు పిల్లలతో ఎప్పుడూ కలిసి ఆడుకుంటాను. (√)
(ఉ) ముసలివాళ్ళకు మంచినీళ్ళివ్వడం, మందులు ఇవ్వడం వంటివి చేస్తాను. (√)
(ఊ) అమ్మానాన్నలకు పనులలో సహాయం చేస్తాను. (√)
(ఎ) ఎవరైనా నాతో ఆడుకోకుంటే నాకు కోపం వస్తుంది. (√)
(ఏ) నావల్ల ఎవరికైనా బాధ కలిగితే నేను కూడా బాధపడతాను. (√)
(ఐ) నేను చేసిన తప్పులను ఒప్పుకుంటాను. (√)

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

(అ) రవి, శేఖర్ మంచిమిత్రులు కదా! నీకున్న మంచి మిత్రుడెవరు? ఎందుకు?
జవాబు.
నాకున్న మంచి మిత్రుడు మధు. ఆతడు వరంగల్లులో ఉంటాడు. నాఈడు వాడే. అతడు అందరివలె తుంటరి కాదు. నేను చేసే తప్పులను సరిదిద్దుతాడు. చదువు విషయంలో సహాయం చేస్తాడు. పెద్దలతో ఎలామెలగాలో చెబుతాడు. అతనివల్ల నేనెంతో పరివర్తన చెందాను. అందుకే అతడు నాకు మంచిమిత్రుడు.

(ఆ) మీరు వృద్ధులకు ఎటువంటి సేవచేస్తారో తెలుపండి?
జవాబు.
మేము వృద్ధులకు రోడ్డుదాటటంలో సహాయం చేస్తాము. ఆరోగ్యం సరిగాలేనివారిని దవాఖానాకు తీసుకెళ్తాము. స్పృహ కోల్పోయేస్థితిలో ఉంటే ప్రథమచికిత్సగా వారికి సపర్యలు చేసి నీరు తాగించి, తినడానికి ఏదైనా ఇచ్చి తినిపిస్తాము. వారికి మా చేతనైనంత వరకు సేవ చేస్తాము. అవసరమైతే పెద్దల సహాయం తీసుకుంటాము.

TS 7th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana నాయనమ్మ

(ఇ) “కుటుంబంలో తాత, నాయనమ్మ ఇట్లా అందరూ కలిసి ఉండాలి” ఎందుకో రాయండి.
జవాబు.
కుటుంబంలో అవ్వ, తాత, అమ్మ, నాన్న, అన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, పినతండ్రి, పిన్నమ్మ, వారి పిల్లలు అందరూ కలిసి ఉండాలి. ఎంత చదివినా జీవితంలో కొన్ని పెద్దల ద్వారా అనుసరించి నేర్చుకోవాలి. అలవాట్లు, ఆచారాలు, సంప్రదాయాలు అనుకరణ ద్వారానే నేర్చుకుంటాము. పిల్లలు చేసే తప్పులను సరిదిద్దుతారు. దండనలు, బుజ్జగింపులు, కీచులాటలు, అన్యోన్యతలు, ప్రేమాభిమానాలు సమిష్టికుటుంబంలోనే ఉంటాయి. స్వార్థంతో విడిపోయి ఇలాంటి అనుభూతులకు దూరంగా బతకడంలో ఏ మాత్రము సుఖసంతోషాలుండవు.

(ఈ) “ఈర్ష్య అనేది మనిషి మనసుకు విషంవంటిది” దీన్ని సమర్థిస్తూ రాయండి.
జవాబు.
విషం మనిషి నాడీవ్యవస్థపై తీవ్రప్రభావాన్ని చూపి తొందరగా మనిషిని చంపేస్తుంది. ఈర్ష్యకూడా అలాంటిదే. ఈర్ష్య మనసుకు సంబంధించినది. ఓర్వలేనితనంవల్ల మనిషి మంచి ఆలోచన చేయడు. మంచి పనులు చేయడు. ప్రతీకారంతో చెడు ఆలోచనలు, చెడుపనులు చేస్తాడు. చెడు ఫలితాలను పొందుతాడు. సమాజంలో చెడ్డవానిగా గుర్తింపు పొందుతాడు. గౌరవ మర్యాదలు కోల్పోయి, అందరిచే దూషింపబడతాడు. అంటే ఈర్ష్యకలవాడు నైతికంగా చచ్చిపోతాడన్నమాట. అందుకే ఈర్ష్య మనసుకు విషం.

2. కింది ప్రశ్నకు పది వాక్యాలలో జవాబు రాయండి.

శేఖర్ మార్పురావడానికి కారణాలేమిటి? నేటికాలంలో ఎక్కువమంది వృద్ధులు వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు? దుస్థితికి కారణాలు వివరించండి ?
జవాబు.
శేఖర్ రవి తనతో ఎక్కువ సమయం ఆడుకోలేదనే కోపంతో నాయనమ్మ కాలు విరగడానికి కారణమయ్యాడు. తర్వాత అవ్వ బాధపడడం చూచి అవ్వ స్థానంలో అమ్మను ఊహించుకొని తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాప పడ్డాడు.
నేటి కాలంలో వృద్ధులు చాలామంది వృద్ధాశ్రమాల్లో గడుపుచున్నారు. దానికి కారణం ఉమ్మడి కుటుంబాలు విడిపోయి చిన్నకుటుంబాలుగా మారడం.

జీవన విధానంలో డబ్బుసంపాదనే ధ్యేయంగా భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. పిల్లలు బాగా చదువుకోవాలని హాస్టళ్ళలో విడిచిపెడుతున్నారు. దీంతో వృద్ధులు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. ఉద్యోగం నుండి ఇంటికి వచ్చిన దంపతులు విశ్రాంతి తీసుకోవాలి. వారికి వృద్ధులను పట్టించుకునే తీరిక లేదు కనుక వృద్ధాశ్రమాల్లో వదిలి వస్తున్నారు. ఇంకనూ వృద్ధుల వద్ద సంపద లేకపోవడం, వారి పనులు వారు చేసుకోలేకపోవడం నాగరికత పేరుతో నాజూకు అధికమై పరిశుభ్రత పేరుతో వృద్ధులను అసహ్యించుకోవడం వంటి కారణాలు నేటి దుస్థితికి తోడై వృద్ధాశ్రమాలను పెంచుతున్నాయి.

IV. సృజనాత్మకత/ప్రశంస

1. వృద్ధులకు సేవ చేయవలసిన అవసరాన్ని వివరిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు.

హన్మకొండ
తేది : XXXX

ప్రియమిత్రుడు మధుకు,

రాజు రాయులేఖ. ఉభయ కుశలోపరి. మీ నాయనమ్మ బాగుందా? లేచి తిరుగుతుందా? అవ్వను బాగా చూసుకో? కావలసినవి అన్నీ తెచ్చిఇవ్వు. పెద్దలకు ఏ ఇబ్బంది లేకుండా చూచుకోవడం మన ధర్మం. వృద్ధులు చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉంటారు. వయసు పెరిగే కొద్ది మరీ చిన్నపిల్లల వలే మారాం చేస్తారు. వారు మనం పిల్లలుగా ఉన్నపుడు మన  తల్లిదండ్రులకంటె ఎక్కువగా మనకు సేవ చేసి ఉంటారు.

చిన్నపిల్లలు ఏ విధంగా పనులు చేసుకోలేక తల్లిదండ్రుల మీద ఆధారపడుతారో అదేవిధంగా ముసలివాళ్ళు వారి పిల్లలపై ఆధారపడతారు. మనం మారాం చేసినపుడు అమ్మానాన్నలు విసుగుచెందకుండా మనల్ని బుజ్జగించి మన అవసరాలు తీర్చినట్లే మనం కూడా వృద్ధుల అవసరాలు తీర్చాలి. అదే మనకు శ్రీరామరక్ష. మరచిపోవు కదా! మీ అవ్వాతాతలను సుఖంగా చూసుకో. మీ అమ్మానాన్నలను అడిగినట్లు చెప్పు. మీ తమ్మునికి నా ముద్దులు. ఇంతే సంగతులు.

ఇట్ల
నీ ప్రియమైన తమ్ముడు
యం. మధు,
ఏడవ తరగతి,
జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల,
హన్మకొండ,
వరంగల్ జిల్లా.

చిరునామా :
బి. రాజు
ఏడవ తరగతి,
జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల,
సిద్దిపేట, మెదక్ జిల్లా.

V. పదజాల వినియోగం

1. ఈ కింది పదాలకు అర్థాలు పట్టికలో వెతికి రాయండి.

(అ) అంధులు, ద్వేషం, జ్ఞాపకం, తుంటరి, జపమాల, ఆతృత

పగ గుర్తు గుడ్డివారు
జపంచేసుకునే మాల అల్లరిచేసేవాడు తొందరపడు

జవాబు.
అంధులు = గుడ్డివారు
ద్వేషం = పగ
జ్ఞాపకం = గుర్తు
తుంటరి = అల్లరిచేసేవాడు
జపమాల = జపం చేసుకునే మాల

2. పాఠాన్ని చదవండి. పట్టికలో సూచించిన పదాలను వెతికి రాయండి.

ఆటకు సంబంధించినవి ఆసుపత్రికి సంబంధించినవి కుటుంబ పదాలు కుటుంబ పదాలు అన్యభాషా పదాలు
చిర్రగోనె దవాఖానా ఇల్లు బీరువా
దాగుడుమూతలు మందులు అమ్ల్, నాన్న డాక్టరు
ఈబడ్డి డాక్టరు తమ్ముడు ఎక్స్-రే
ఎక్స్-రే చెల్లెలు ఆపరేషన్
ఆపరేషన్ నాయసమ్మ
అవ్న

VI. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది వాక్యాలను సరియైన విభక్తి ప్రత్యయాలతో పూరించండి.

(అ) నాయనమ్మ కు మందులు వేసుకోవడం చాతనవుతుంది.
(ఆ) కోపం వలన ఇట్లా జరిగింది.
(ఇ) శేఖర్ కొరకు (కోసం) రవి ఎదురు చూశాడు.
(ఈ) అందరి తో కలసి ఆడుకో!
జవాబు.
(అ) నాయనమ్మ కు మందులు వేసుకోవడం చాతనవుతుంది.
(ఆ) కోపం వలన ఇట్లా జరిగింది.
(ఇ) శేఖర్ కొరకు (కోసం) రవి ఎదురు చూశాడు.
(ఈ) అందరి తో కలసి ఆడుకో!

2. ఈ కింది వాక్యాలలో క్రియలను గుర్తించి పక్కనే రాయండి.

(అ) రాజు ఆసుపత్రికి వెళ్ళాడు.
జవాబు.
వెళ్ళాడు.

(ఆ) శ్రావ్య పుస్తకం చదివి నిద్రపోయింది.
జవాబు.
చదివి నిద్రపోయింది.

(ఇ) మధు మైదానంలో పరిగెత్తుతున్నాడు.
జవాబు.
పరిగెత్తుతున్నాడు.

(ఈ) సంతోష్ భోజనం చేసి సినిమాకు వెళ్ళాడు.
జవాబు.
చేసి, వెళ్ళాడు.

పై వాక్యాలలో రెండు క్రియలున్న వాక్యాలు ఏవి? ఈ రెండు క్రియల్లో భేదం గమనించారా?
(ఆ) చదివి, నిద్రపోయింది.
(ఈ) చేసి, వెళ్ళాడు.

పనిని తెలిపే పదాలను ‘క్రియలు’ అంటారు. సాధారణంగా తెలుగులో క్రియలు వాక్యాల చివర ఉంటాయి. ఇవి అసమా పక క్రియలు, సమాపక క్రియలు అని రెండు విధాలు. వాక్యం చివర ఉన్న క్రియలు పని పూర్తయినట్లుగా తెలుపుతాయి. వాటిని “సమాపక క్రియలు” అంటారు. పని పూర్తి కానట్లు తెలిపే క్రియలను “అసమాపక క్రియలు” అంటారు.
ఉదా:

అసమాపక క్రియలు సమాపక క్రియలు
వచ్చి వచ్చాడు, వచ్చారు, వచ్చింది
చేసి చేశారు, చేశాడు, చేసింది
తిని తిన్నాడు. తిన్నది
చూచి చూచాడు, చూచింది.
చదివి చదివాడు, చదివింది


3. కిందివాక్యాల్లో సమాపక, అసమాపక క్రియలు గుర్తించండి.

(అ) చెంబుతో నీళ్ళుముంచుకొని, తాగుతుంది.
జవాబు.
అసమాపక క్రియ : ముంచుకొని

(ఆ) ఆటను ఆపివేసి నాయనమ్మ వద్దకు వెళ్ళిపోయాడు.
జవాబు.
అసమాపక క్రియ : ఆపివేసి

(ఇ) పరీక్షచేసి, కాలువిరిగిందని చెప్పాడు.
జవాబు.
అసమాపక క్రియ : చేసి

(ఈ) దగ్గరకు తీసుకొని, కన్నీళ్ళు తుడిచింది.
జవాబు.
అసమాపక క్రియ : తీసుకొని
సమాపకక్రియ : తాగుతుంది.

ప్రాజెక్టు పని:

1. మీ ప్రాంతంలోని ఒకరిద్దరు వృద్ధులను కలవండి. ఏమేమి పనులవల్ల సంతోషం కలుగుతుందో తెలుసుకొని రాయండి.
జవాబు.
నా పేరు మధు. 7వ తరగతి చదువుచున్నాను. మాది వరంగల్లు పక్కనే ఉన్న హన్మకొండ. నేను ఒకరోజు అనుకోకుండా మా యింటి ప్రక్కనున్న రంగస్వామి, లక్ష్మక్క దంపతులను కలిశాను. వారికి దాదాపు 85 సంవత్సరాలు ఉంటాయి. అసలు నేను వాళ్ళింటికి వెళ్ళింది వాళ్ళ మనుమడు కుప్పుస్వామితో ఆడుకోవాలని. అతడు లేకపోయేసరికి వారితో పిచ్చాపాటి మాట్లాడాను. వారు చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. వాటిలో వారికి సంతోషం కలిగించేవి కొన్ని తెలియజేస్తాను.

  1. తమ బిడ్డలు ఎలాంటి మనస్పర్థలు లేకుండా ఉమ్మడికుటుంబంగా జీవిస్తుండడం.
  2. ఇప్పటికీ వీరి సలహాలు తీసుకొని, వాటి ప్రకారం పనులు చేయడం.
  3. వారు అధిక పని ఒత్తిడితో ఉన్నప్పటికీ తమని ఇంట్లోనుండి బయట కాలుపెట్టకుండా సుఖంగా చూసుకోవడం.
  4. వారి ఆలనాపాలనా ప్రతినిత్యం పర్యవేక్షించడం.
  5. మనుమళ్ళు, మనుమరాళ్ళు, మునిమనమళ్ళతో ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉండడం. అవ్వాతాతలు వారితో ఆడుకోవడం.
  6. ఇరుగు పొరుగు వారితో తగాదాలు లేకుండా ఉండడం.
  7. వయసులో పెద్దవారు కనుక వీధిలోవారు, చుట్టాలు వీరి వద్ద తగిన సూచనలు తీసుకోవడం.
  8. సాయంకాలం అందరూ కలసి ఆరుబయట పురాణకాలక్షేపం చేయడం.
  9. అందరు కలసి భోంచేయడం.
  10. ఇంత వయసు వరకు ఆరోగ్యంగా ఉండడం, దానికోసం చిన్నచిన్న వ్యాయామాన్నిచే ఇంటి పనులు చేసుకోవడం వంటి విషయాలు వృద్ధులకు సంతోషాన్నిస్తాయని వారి మాటలవల్ల తెలిసింది.

(లేదా)

మీ ప్రాంతంలోని తాత, నాయనమ్మలతో కలసి ఒకే ఇంట్లో ఉంటున్న కుటుంబాన్ని కలిసి, వారితో మాట్లాడండి. మీ కెట్లా అనిపించిందో రాయండి.
జవాబు.
నాపేరు మధు. 7వ తరగతి చదువుచున్నాను. మాది వరంగల్లు సమీపంలో హన్మకొండ. నేనీవేసవి సెలవుల్లో మా అమ్మమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళఊరు సిద్ధిపేట. అక్కడ నా మిత్రుడు రాజు ఇంటికి వెళ్ళాను. వాళ్ళింటిలో తాత, నాయనమ్మ, వారి ఇరువురు కుమారులు, వారి పిల్లలు ఆరుగురు మొత్తం పన్నెండుమంది ఉంటారు. వారు చాలా అనందంగా ఉన్నారు. ఒకరికొకరు పనులలో సహాయం చేసుకుంటూ, మాట్లాడుకుంటూ ఎవరి పనులు వారు చేసుకుంటూ ఉత్సాహంగా, ఉల్లాసంగా జీవిస్తున్నారు.

వారి మాటల్లో సంతృత్తి, ఆనందం మాటల్లో చెప్పలేనిది. వారితో మాట్లాడిన తర్వాత మా కుటుంబంలో కూడా అవ్వాతాతలు, చిన్నాన్న చిన్నమ్ములు, వారి పిల్లలు అందరూ మాతో కలిసి ఒకే ఇంట్లో ఉంటే బాగుండేదనిపించింది. మా తల్లిదండ్రులు అవ్వాతాతలతో ఎప్పుడో విడిపోయారు. ఇప్పుడు వారు మాకు చుట్టాలే. అందరం కలిసి ఉండుంటే రాజువలె నేను కూడా పురాణకథలు చెప్పించుకునేవాడిని. అనేక నీతి, ధర్మం, జీవనసత్లాలకు సంబంధించిన విషయాలు తెలిసేవి. ఒంటరితసంతో బాధపడేవాడినికాదు అనిపించింది. మా నాన్నతో చెప్పి వెంటనే మా అవ్నాతాతలను మా ఇంట్లోసే ఉండమని బ్రతిమిలాడుతాను. అందరూ కలసి ఉంటే ఆ ఆనందమే వేరు.

TS 7th Class Telugu 2nd Lesson Important Questions నాయనమ్మ

అర్థాలు:

  • దవాఖానా = ఆసుపత్రి
  • బుగులైంది = బాధ కలిగింది
  • తీరు = విధము
  • ఈర్ష్య = ఓర్వలేనితనము
  • మాల = దండ
  • డూస్తూ = దువ్వుతూ
  • మందుగోలీలు = మాత్రలు
  • నయం = బాగుకావడం

సమానార్థక పదాలు ( పర్యాయపదాలు):

  • కన్ను = నేత్రము, అక్షి, లోచనం, చక్షువు
  • అమ్మ = తల్లి, మాత, జనని
  • ఈర్య్య = అసూయ, ఈసు, ఈసరము
  • ఆట = తాండవము, నాట్యము, లాస్యము
  • చీకటి = అంధకారము, తిమిరము, ధ్వాంతము

TS 7th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana నాయనమ్మ

నానార్థాలు:

  • అవ్వ = తల్లితల్లి, తం(డ్డితల్లి, పూజ్యురాలు
  • కన్ను = నేత్రము, వలరంధ్రము
  • మాల = పూలదండ, వరుస, జాతివిశేషము
  • మెత్త = పరుపు, మృదువైనది

ప్రకృతి – వికృతి:

  • ఈర్య – ఈసు, ఈసము
  • సహాయం – సాయం
  • వృద్దులు – పెద్దలు
  • గౌరవం – గారవం
  • రాత్రి – రాతిరి, రేయి
  • అంబ – అమ్మ
  • మంచము – మంచె
  • ఆశ – ఆస
  • సంతోషము – సంతసము
  • స్నేహము – నెయ్యము
  • పయత్రము – జతనము
  • నిటలము – నొసలు
  • విషం – విసం

వ్యతరేక పదాలు:

  • కష్టం × సుఖం
  • కోపం × శాంతం
  • సంతోషం × దుఃఖం, బాధ
  • నవ్వు × ఏడుపు
  • (పేమ × పగ, ద్వేషం
  • తప్ప × ఒప్పు
  • కొద్ది × చాలా

సంధులు:

నాయనమ్మ = నాయన + అమ్మ = అకారసంధి
పెట్టినపుడు = పెట్టిన + అపుడు = అకారసంధి
సూత్రము : అత్తునకు సంధి బహుళము.

తినుమని = తినము = ఉకారసంధి
వినడమన్నా = వినడము = ఉకారసంధి
వస్తాడేమో = వస్తాడు = ఉకారసంధి
సూత్రము : ఉత్తునకు అచ్చుపరమగునపుడు సంధి నిత్యము.

సమాసములు విగ్రహావాక్యం సమాసం పేరు
సమాసపదం రెండు సంఖ్యగల దిక్కులు ద్విగుసమాసం
రండు దిక్కులు రెండు సంఖ్రగల రోజులు ద్విగుసమాసం
రెండు రోజులు అమ్మయును, నాన్నయును ద్వంద్వసమాసం
అమ్మానాన్నలు విగ్రహావాక్యం సమాసం పేరు

కింది వాక్యాలను సరయఝైన విభక్తి ప్రత్యయాలతో పూరంచండి.

(అ) నాయనమ్మ శేఖర్ ను దగ్గరకు తీసుకున్నది.
(ఆ) నీతో ఎన్నో ఆటలు ఆడుకోవాలని ఉంది.
(ఇ) శేఖర్ రవి కి దగ్గరి చుట్టం.
(ఈ) నాయనమ్మ తో నే ఉన్నాడు రవి.
(ఉ) పెద్ద వయసులో పెద్ద (పమాదం జరిగింది.
(ఊ) శేఖర్కి రవి కంటె అవ్వపై కోపం పెరిగింది.
(ఎ) స్నేహితులతో కలిసి ఆడుకుంటే ఆనందం.
(ఏ) ఆడుకోవాలని ఎంతో ఆశత్తో ఉన్నారు.
(ఐ) నాయనమ్మ తనను (పేమగా చూస్తున్నది.

TS 7th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana నాయనమ్మ

1. కింది గద్యాన్ని చదవండి. ఐదు ప్రశ్నలు రాయండి.

రవి నాయనమ్మకు మందులిస్తూ సేవలు చేస్తూ ఉండేవాడు. రవి సేవలు చూస్తున్నకొద్దీ శేఖర్కు కోపం పెరిగిపోయింది. ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. ఒకరోజు పగటిపూట నాయనమ్మ నిద్రపోయింది. చుట్టుపక్కల ఎవరూలేకుండా చూసి నాయనమ్మ మంచానికి రెండుదిక్కులా ఉన్న వస్తువులను మార్చాడు. బిందె, చెంబు ఉన్న దిక్కు చెప్పులను, చెప్పులు ఉన్న దిక్కున బిందెను ఉంచాడు. తర్వాత ఏమి తెలియనట్లు దూరంగ కూచుని నాయనమ్మనే చూడసాగాడు.
ప్రశ్నలు :
1. రవి ఏమి చేస్తున్నాడు?
2. శేఖర్కు కోపం ఎందుకు కలిగింది?
3. నాయనమ్మ ఎప్పుడు నిద్రపోయింది?
4. శేఖర్ ఏమి చేశాడు?
5. శేఖర్ కోపంతో ఏమి అలోచించాడు?

2. క్రింది గద్యాన్ని చదవండి. దిగువ ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ఒకరోజు రవి వాళ్ళింటికి కరీంనగర్ నుండి చుట్టాలు వచ్చారు. వాళ్ళు దగ్గరి చుట్టాలు. వాళ్ళకొడుకు శేఖర్, రవి ఒకే ఈడువాళ్ళు. ఒకరితో ఒకరు కలసి ఆడుకోవడమంటే వాళ్ళకు చాలా ఇష్టం. కలిసి ఎగురుతారు, దుంకుతారు, ఆడుతారు, ప్రపంచం మొత్తం మర్చిపోతారు. శేఖర్ వస్తున్నాడని రవి ఎగిరి గంతులు వేశాడు. శేఖర్ అయితే ఎప్పుడు రవి దగ్గరకు పోదామా, ఎప్పుడు రవితో కలసి ఆడుకుందామా అని ఆతృతతో ఉన్నాడు.
ప్రశ్నలు :

ప్రశ్న 1.
ఈ గద్యం ఏ పాఠంలోనిది ?
జవాబు.
ఈ గద్యం నాయనమ్మ పాఠంలోనిది.

ప్రశ్న 2.
శేఖర్ ఎందుకు ఆతృతతో ఉన్నాడు?
జవాబు.
రవితో కలిసి ఆడుకోవాలని శేఖర్ ఆతృతతో ఉన్సు.

ప్రశ్న 3.
చుట్టాలు ఎక్కడివారు?
జవాబు.
చుట్టాలు కరీంసగర వారు.

ప్రశ్న 4.
రవి, శేఖర్లు ఎప్పుడు ప్రపంచం మొత్తం మర్చిపోతారు?
జవాబు.
ఆద్దరు కలిసి ఆడుకునేటపుడు ర్రపంచం మొత్తం మర్చిటోశారు.

TS 7th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana నాయనమ్మ

ప్రశ్న 5.
ఎవరెవరు సమ ఈడువారు?
జవాబు.
రవ, శేఖర్ సమ ఊడువారు,

ప్రశ్న 6.
శేఖర్ నచ్చని విషయం ఏది?
జవాబు.
రవి నాయనమ్మకు సేవచేస్తూ తనతో ఆడుకోవడం శేఖర్ నచ్చని విషయం.

3. క్రింది గద్యాన్ని చదివి ఐదు ప్రశ్నలు రాయండి.

నాయనమ్మ ఏమనలేదు. “నాయనమ్మా! నాకు రవితో ఆడుకోవడమంటే బాగా ఇష్టం. కాని రవి ఎప్పుడూ నన్ను విడిచిపెట్టి నీతోనే ఉంటే నాకు కోపం వచ్చింది. అందుకే అట్లాచేసిన. ఇంక నువ్వు కొట్టినా నాకేం బాధలేదు” అన్నాడు ఏడ్చుకుంట. నాయనమ్మ శేఖర్ను దగ్గరకు తీసుకున్నది. అతని కన్నీళ్ళు తుడిచి నవ్వింది. నాయనమ్మ నవ్వంగనే శేఖర్ ఏడువడం ఆపాడు.

“అంతా మంచే జరిగిందిరా నేను కష్టపడడం చూసి నీలో మార్పువచ్చింది. రవి నాతోనే ఉండడంతో నీకు నామీద ఈర్ష్య కలిగింది. ఇప్పుడా ఈర్ష్య పోయింది. ఈర్ష్య అనేది మనిషి మనసుకు విషం వంటిది. నువ్వింక అందరితో కలిసి ఆడుకో సంతోషంగ ఉండు” అంటూ శేఖర్ వీపుమీద తన అరచేత్తో రాస్తూ ఓదార్చింది.

1. శేఖర్ బాగా ఇష్టమైనదేది?
2. రవికి కోపం ఎందుకు వచ్చింది?
3. ఈర్జ్య ఎటువంటిది?
4. నాయనమ్మ శేఖర్ని ఎలా ఓదార్చి౦ది?
5. ఎవరు ఎవరికి కన్నీళ్ళు తుడిచారు?

4. (అ) క్రింది వాక్యాలలో గీతగీసిన పదాలకు అర్థాలను రాయండి.

ప్రశ్న 1.
పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు ఆతృతతో ఎదురుచూశారు.
జవాబు.
త్తొందరపాటు

ప్రశ్న 2.
ఈర్ష్య మనసుకు విషం వంటిది.
జవాబు.
ఓర్వతేనితనం

ప్రశ్న 3.
దవాఖానాలు ఆరోగ్య ప్రదాయినిలు.
జవాబు.
ఆసుపత్తి

ప్రశ్న 4.
విద్యార్థుల ప్రవర్తనాతీరులో పరివర్తన కలిగించేదే విద్య.
జవాబు.
విధము

ప్రశ్న 5.
రుద్రాక్షలతో జపమాలను చేస్తారు.
జవాబు.
జపం చేసుకొనే మాల

TS 7th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana నాయనమ్మ

(ఆ) క్రింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

ప్రశ్న 1.
ఈర్ష్య
జవాబు.
రాజకీయనాయకులు ఒకరిపై ఒకరు ఈర్జత్తో సందించుకుంటారు.

ప్రశ్న 2.
మూలుగుట
జవాబు.
దెబ్బలు తగిలన వ్యక్తి బాధతో మూలుగు తున్నాడు.

ప్రశ్న 3.
అవసరం
జవాబు.
ఏద్యార్దుకు క్రమశిక్షణ అవసరం.

5. (అ) క్రింది పదాలను విడదీసి సంధిపేరు రాయండి.

1. మందులుంటాయి
జవాబు.
మందులు + ఉంటాయి (ఉకార సంధి)

2. నాయనమ్మ
జవాబు.
నాయన + అమ్మ (అకార సంధి)

(ఆ) క్రింది పదాలకు విగ్రహవాక్యాలు రాయండి.

1. కూరగాయలు
జవాబు.
కూరయును, కాయయును

2. రెండుదిక్కులు
జవాబు.
రెండు సంఖ్యగల దిక్కులు

(ఇ) కింది ఖాళీలలో సరియైన విభక్తి ప్రత్యయాలను గుర్తించండి.

శేఖర్ అమ్మానాన్నలు తమ్ముని ……….. కలిసి ఇంటికి రాగానే రవి ……….. ఎంతో సంబరమైంది. ఆడుకుంటూ రవి నాయనమ్మదగ్గర ………… వెళ్ళాడు. దానిని చూసిన శేఖర్కు రవి …………. నాయనమ్మపై కోపం కలిగింది. దానితో శేఖర్
చెడు ఆలోచన …………. మంచం పక్కన వస్తువులను తారుమారు చేశాడు.
జవాబు.
శేఖర్ అమ్మానాన్నలు తమ్ముని తో కలిసి ఇంటికి రాగానే రవి కి ఎంతో సంబరమైంది. ఆడుకుంటూ రవి నాయనమ్మదగ్గర కు వెళ్ళాడు. దానిని చూసిన శేఖర్కు రవి కంటె నాయనమ్మపై కోపం కలిగింది. దానితో శేఖర్
చెడు ఆలోచన తో మంచం పక్కన వస్తువులను తారుమారు చేశాడు

(ఈ) కిందివాక్యాలలో అసమాపక క్రియలు, సమాపక క్రియలు వేరు చేసి రాయండి.

1. సమ్మక్క సారక్క జాతరకు ముఖ్యమంత్రిగారు వచ్చి, జనంతో కలిసి ఆడి, పాడి, గంతులు వేశారు.
జవాబు.
అసమాపక క్రియలు : వచ్చి, ఆడి, పాడి
సమాపక క్రియ : వేశాడు

2. ఖమ్మంజిల్లాలోని కొన్ని గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో చేరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
జవాబు.
అసమాపక క్రియలు : చేరుస్తూ
సమాపక క్రియ : చేసింది

3. నీవు బడికి వచ్చి, పాఠం చదివి, జ్ఞానాన్ని పెంచుకున్నావు.
జవాబు.
అసమాపక క్రియలు : వచ్చి, చదివి
సమాపక క్రియ : పెంచుకున్నావు

TS 7th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana నాయనమ్మ

4. ఆటలు ఆడి, శారీరక వ్యాయామం చేసి, మానసిక ఆనందం పొందావు.
జవాబు.
అసమాపక క్రియలు : ఆడి, చేసి
సమాపక క్రియ : పొందావు

5. సీతమ్మ వంటచేసి, బట్టలు ఉతికి, విశ్రాంతి తీసుకున్నది.
జవాబు.
అసమాపక క్రియలు : చేసి, ఉతికి
సమాపక క్రియ : తీసుకున్నది

పాఠం ఉద్దేశం:

వృద్ధుల పట్ల సానుకూల వైఖరిని పెంపొందించుకొని వారిని వెక్కిరించకుండా అవమానించకుండా జాగ్రత్తగా సేవలు చేయాలి. వారిపట్ల మన వల్ల తప్పు జరిగితే పశ్చాత్తాపముతో క్షమాపణ అడగాలి. పిల్లలు ఈర్ష్యభావాన్ని విడిచిపెట్టి మానసిక పరివర్తన కలిగి పెద్దలకు ఎటువంటి అపకారం చేయకుండా వారితో గౌరవ భావంతో మెలగాలని తెలియజెప్పడమే ఈ ‘నాయనమ్మ’ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠం ‘కథానిక’ (ప్రక్రియకు చెందినది. క్లుప్తత, సరళత, పాత్రలు తగిన సంభాషణలు, ఆకట్టుకునే కథనం కథానిక (ప్యేయత. మానవతా ఏలువలను తెలియజెప్పే కథానిక ఇది.

ప్రవేశిక:

కాలాలు మారినా, ఏళ్ళు గడిచినా భారతదేశంలో ఇప్పటికీ కుటుంబ వ్యవస్థ నిలిచి ఉన్నది. “అందరి సుఖంలో నా సుఖం ఉన్నది. వారికోసమే నా జీవితం” అనే భావన భారతీయ కుటుంబానికి (ప్రాతిపదిక. అమ్మానాన్నలు, అక్కాచెల్లెళ్ళు, అన్నాతమ్ముళ్ళు, తాతయ్యనాయనమ్మ… ఇదే కుటుంబం. ఇది సుఖసంతోషాల వాకిలి. ఆనందాల లోగిలి. అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యల ఒడిలో ఒదిగిపోవడం చిన్నపిల్లలకైతే మహాసరదా. వారికి ఆత్మీయంగా సేవలు చేసి దీవెనలు పొందాలి. పలల్లలు పరస్పరం అభిమానాన్ని, ఆప్యాయతను పంచుకుంటూ సేవాభావంతో ఉండాలనే స్భూర్తి ఈ పాఠం చదివి పొందుదాం.

TS 6th Class Hindi Guide 3rd Lesson रेलवे स्टेशन

Telangana SCERT 6th Class Hindi Study Material Telangana Pdf 3rd Lesson रेलवे स्टेशन Textbook Questions and Answers.

TS 6th Class Hindi 3rd Lesson Questions and Answers Telangana रेलवे स्टेशन

सुनो-बोलो :

TS 6th Class Hindi Guide 3rd Lesson रेलवे स्टेशन 1

प्रश्न 1.
चित्र में क्या-क्या दिखायी दे रहे हैं ?
उत्तर :
चित्र में रेलगाडी, पटरियाँ, घडी, टेलीविजन, कूडेदान, कुली, टिकट कलक्टर, दो औरतें, एक लड़की, दो सूटकेस, 10 रूपये का नोट, चायघर, छः कप, दो गिलास, दो जार, छतरी दिखाई दे रहे हैं।

प्रश्न 2.
यातायात के साधनों के नाम बताओ।
उत्तर :
रेलगाडी, बस, कार, लॉरी, नाव, जहाज, हवाईजहाज आदि।

TS 6th Class Hindi Guide 3rd Lesson रेलवे स्टेशन

प्रश्न 3.
गीत के बारे में बातचीत करो।
उत्तर :
रेलगाडी छुक छुक करती हुई आती है। घड-घड करती हुई जाती है। टन-टन घंटी बजने पर रेलगाडी स्टेशन में आती है। लोहे की पटरी पर यह चलती है। सब को इधर – उधर ले जाती है। इस प्रकार रेलगाडी सबकी सेवा करती है।

पढ़ो :

अ. चित्र देखिए। शब्द पढ़िए। इनके वर्ण वर्णमाला चार्ट में पहचानिए। ‘○’ लगाइए।

TS 6th Class Hindi Guide 3rd Lesson रेलवे स्टेशन 2
उत्तर :
TS 6th Class Hindi Guide 3rd Lesson रेलवे स्टेशन 11

आ. नीचे दिये गये बक्से में TS 6th Class Hindi Guide 3rd Lesson रेलवे स्टेशन 15 की मात्रा के अंतर पहचानते हुए पढ़िए।

TS 6th Class Hindi Guide 3rd Lesson रेलवे स्टेशन 3

इ. इन्हें पढ़ो।

TS 6th Class Hindi Guide 3rd Lesson रेलवे स्टेशन 4

ई. समान शब्दों की जोड़ी बनाइए।

TS 6th Class Hindi Guide 3rd Lesson रेलवे स्टेशन 5
उत्तर :
TS 6th Class Hindi Guide 3rd Lesson रेलवे स्टेशन 12

लिखो :

अ. मात्रा जोड़िए और लिखिए।

TS 6th Class Hindi Guide 3rd Lesson रेलवे स्टेशन 6
उत्तर :
TS 6th Class Hindi Guide 3rd Lesson रेलवे स्टेशन 13

आ. सुंदर अक्षरों में लिखिए।

TS 6th Class Hindi Guide 3rd Lesson रेलवे स्टेशन 7

इ. खाली स्थान भरो।

TS 6th Class Hindi Guide 3rd Lesson रेलवे स्टेशन 8
उत्तर :
1. यह ऊन है।
2 . यह आलू है।

ई. रंग भरो। नाम लिखो।

TS 6th Class Hindi Guide 3rd Lesson रेलवे स्टेशन 9
उत्तर :
नाम : छतरी

अभ्यासकार्य :

1. निम्नलिखित कविता का वाचन कीजिए। प्रश्नों के उत्तर दीजिए :
క్రింది కవిత్వాన్ని చదవండి. ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
बादल आए, बादल आए,
काले-काले बादल आए।
बिजली चमकी चम-चम-चम,
पानी बरसा छम-छम-छम,
छाता लेकर चलते हैं हम।।

प्रश्न 1.
कैसे बादल आए है?
1. नीला
2. लाल
3. काला
उत्तर :
3. काला

TS 6th Class Hindi Guide 3rd Lesson रेलवे स्टेशन

प्रश्न 2.
क्या आए?
1. पानी
2. बादल
3. सूर्य
उत्तर :
2. बादल

प्रश्न 3.
क्या चम-चम-चम चमकी?
1. बिजली
2. धर्ता
3. आसमान
उत्तर :
1. बिजली

प्रश्न 4.
छम-छम-छम कर क्या बरसा?
1. खून
2. पसीना
3. पानी
उत्तर :
3. पानी

प्रश्न 5.
हम क्या लेकर चलते हैं?
1. घडी
2. छाता
3. किताब
उत्तर :
2. छाता

TS 6th Class Hindi Guide 3rd Lesson रेलवे स्टेशन

सारांश-సారాంశం :

छुक- छुक – छुक – छुक आती रेल,
घड़ – घड़ – घड़ – घड़ जाती रेल ।
टन – टन – टन – टन घंटी बजती,
तब स्टेशन आती रेल।
लोहे की है पटरी इसकी,
जिसके ऊपर चलती रेल ।
इधर – उधर सबको ले जाती,
सबकी सेवा करती रेल।

Train comes with chuk – chuk – sound
Train goes with ghad – ghad – sound
Bell rings tun – tun – tun
Then comes train to station.
Its tracks are made of iron
On which the train moves
It takes every one here and there
Train serves all.

భావం : రైలు బండి ఛుక్ – ఛుక్ – ఛుక్ – ఛుక్ మంటూ వస్తుంది.
ఘడ – ఘడ – ఘడ – ఘడ మని వెళ్తుంది.
టన్ – టన్ – టన్ – టన్ మని గంట ద్రోగుతుంది.
అప్పుడు రెలలు బండి స్టేషన్లో కొస్తుంది.
ఇనుప పట్టాలపై ఇది నడుస్తుంది.
అక్కడికీ ఇక్కడికీ అందరినీ తీసుకువెళ్తుంది.
రైలు బండి అందరికీ సేవ చేస్తుంది.

TS 6th Class Hindi Guide 3rd Lesson रेलवे स्टेशन

अर्थ (అర్ధములు) (Meanings) :

TS 6th Class Hindi Guide 3rd Lesson रेलवे स्टेशन 10

TS 7th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అమ్మ జ్ఞాపకాలు

Telangana SCERT 7th Class Telugu Guide Telangana 4th Lesson అమ్మ జ్ఞాపకాలు Textbook Questions and Answers.

అమ్మ జ్ఞాపకాలు TS 7th Class Telugu 4th Lesson Questions and Answers Telangana

బొమ్మను చూడండి – ఆలోచించండి మాట్లాడండి.

TS 7th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అమ్మ జ్ఞాపకాలు 1

ప్రశ్న 1.
పై బొమ్మలో ఎవరెవరున్నారు?
జవాబు.
పై బొమ్మలో తల్లి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆకాశంలో చందమామ ఉన్నాడు.

ప్రశ్న 2.
అమ్మ ఏం చేస్తున్నది?
జవాబు.
అమ్మ ప్రేమతో పిల్లలకు చందమామను చూపి, గోరుముద్దలు తినిపిస్తున్నది.

TS 7th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అమ్మ జ్ఞాపకాలు

ప్రశ్న 3.
పిల్లల కోసం అమ్మ ఏయే సేవలు చేస్తుంది?
జవాబు.
పిల్లల కోసం అమ్మ అన్ని సేవలు చేస్తుంది. స్నానం చేయించడం, అన్నం వండడం, బట్టలు ఉతకడం, అన్నం పెట్టడం, నిద్ర పుచ్చడం వంటి సేవలను ఎంతో ప్రేమగా చేస్తుంది.

ప్రశ్న 4.
మీరు మీ అమ్మకోసం ఎప్పుడెప్పుడు ఎటువంటి సేవలు చేశారు?
జవాబు.
మేము అమ్మకోసం గిన్నెలు సర్దడం, ఇల్లుశుభ్రం చెయ్యడం, బట్టలు మడత పెట్టడం వంటి పనులలో సేవలు చేశాము.

ప్రశ్న 5.
మీరు మీ అమ్మకోసం ఏమైనా చేసినపుడు ఎట్లా అనిపించింది?
జవాబు.
అమ్మ నాకోసం అన్నీ చేస్తున్నప్పుడు నేను కూడ ఇంటి పనులలో అమ్మకు సాయం చేయాలనిపించింది. అమ్మ నా పనులు చూచి వద్దన్నా నేను కూడా అమ్మకు సేవలు చేయడం నా బాధ్యత అనిపించింది.

ప్రశ్న 1.
“అమ్మ ముగ్గులేస్తే వాకిలి అద్దకపు చీరలా ఉందనడంలో” కవి ఆంతర్యమేమిటి?
జవాబు.
అమ్మ ముగ్గువేస్తే వాకిలి (ముందరిభాగం) రంగవల్లితో చేనేత వారు చీరమీద వేసిన అద్దకం వలే ఇంటి ముందరి భాగం అందంగా అలంకరిస్తుందని ఆంతర్యం.

ప్రశ్న 2.
అమ్మను నర్సు అని కవి ఎందుకన్నాడు?
జవాబు.
తన బిడ్డలకు జలుబు, వాంతులు, జ్వరం వస్తే అమ్మ చిన్నిచిన్ని చిట్కాలతో వాటిని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. తన ఒడినే తన పిల్లలకు వెచ్చని పక్కలా మార్చుతుంది. అందుకనే అమ్మను నర్సు అన్నారు.

TS 7th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అమ్మ జ్ఞాపకాలు

ప్రశ్న 3.
ఈ ఇంటిని హాస్పిటల్గా మార్చటం అంటే మీకేమర్థమైంది?
జవాబు.
ఇంటిలోని వారికి ఆరోగ్యం బాగాలేకపోతే తల్లి చుట్టుప్రక్కల పరిసరాలను హాస్పటల్ కంటే పరిశుభ్రంగా ఉంచుతుంది. తడిగుడ్డతో తుడవడం, పిల్లలకు వేడినీటిని కాచి ఇవ్వడం, మందులు సకాలంలో వేయడం వంటివి చేయడం వలన ఇంటిని హాస్పటల్గా మార్చటం అని అర్థమైంది.

ప్రశ్న 4.
ఆస్థానపు తెల్లకుందేళ్ళు అని కవి ఎవరిని ఉద్దేశించి అన్నాడు? ఎందుకు?
జవాబు.
బర్లెపాలను దూడలను తాగనివ్వకుండా దొరల బిడ్డలకు ఇవ్వడం వల్ల వారిని తెల్లకుందేళ్ళతో పోల్చాడు.

ప్రశ్న 5.
అమ్మ పొద్దంతా ఎవరి కోసం కష్టపడుతుంది? మీకెట్లాంటి సేవలు చేస్తుంది?
జవాబు.
అమ్మ పొద్దంతా తన బిడ్డల కోసం కష్టపడుతుంది. మా కోసం ఉదయం నుండి రాత్రి వరకు అన్ని సేవలు చేస్తుంది. పాలు, టిఫిన్, భోజనం, మరలా ఆకలైతే తినడానికి పల్లికాయల్లాంటివి, సాయంత్రం ఇంటికెళ్ళేసరికి మళ్ళీ ఏదో ఒకటి
పెడుతుంది. బట్టలుతకడం, పుస్తకాలు సర్దడం లాంటి అన్ని సేవలు చేస్తుంది.

ప్రశ్న 6.
మీరు కేరింతలు కొడుతూ ఏయే సందర్భాల్లో ఆనందంగా ఉంటారు?
జవాబు.

  1. మేము స్నానం చేసేటపుడు కేరింతలు కొడుతూ ఉంటాం.
  2. చెరువుల్లో, కాలువల్లో స్నేహితులతో కలిసి వెళ్ళినప్పుడు కేరింతలు కొడతాం.
  3. పుట్టినరోజున, హాయిగా ఉన్నప్పుడు, సంతోషం కలిగేవార్త విన్నపుడు కేరింతలు కొడతాం.

TS 7th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అమ్మ జ్ఞాపకాలు

ప్రశ్న 7.
“అమ్మ జ్ఞాపకాలు తేనెటీగల్లా ముసురుతాయి” అనడంలో కవి ఆంతర్యమేమిటి?
జవాబు.
తేనెటీగలు ముసిరితే ఆగకుండా శబ్దం చేస్తాయి. అమ్మ కనబడే దేవత. తన కోసం ఏమీ చేసుకోదు. అన్నీ పిల్లలకోసమే ఆలోచిస్తుంది. ఆ పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత ఒకసారి తన తల్లిని గుర్తుకు చేసుకుంటే, అమ్మ చేసిన పనులన్నీ మనసారా తలచుకుంటే, మనసున్న మనిషికి అమ్మ జ్ఞాపకాలు తేనెటీగల్లా ఆగకుండా ముసురుతాయి అని కవి ఆంతర్యం.

ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

ప్రశ్న 1.
అమ్మ జ్ఞాపకాలను కవి గుర్తుకు తెచ్చుకున్నాడు కదా! మీరు మీ అమ్మ గురించి చెప్పండి.
జవాబు.
మా అమ్మ నా బాల్యంలో నాకు నీళ్ళు పోసేది. పాలిచ్చేది. ఆకలివేస్తే అన్నంకాని ఏదో ఒకటిగాని పెట్టేది. దెబ్బ లేదా బాధ పడి వెళ్ళి ‘అమ్మా!’ అంటే ఓదార్చేది. నొప్పి వెంటనే పోయేది. జ్వరం, జబ్బు చేస్తే నిద్రపోయేదికాదు. రాత్రి, పగలు నావెంటే ఉండేది. అమ్మ పక్కనే ఉంటే ఎంతో హాయిగా ఉండేది. అమ్మ ఉన్నప్పుడు విలువ తెలియదు. అమ్మ లేనపుడే అమ్మ విలువ తెలుస్తుంది. మేమెప్పుడూ మా అమ్మను మరచిపోము.

ప్రశ్న 2.
మీరు మీ అమ్మను సంతోషపెట్టడానికి ఏమేమి చేస్తారు?
జవాబు.
మేము మా అమ్మను సంతోషపెట్టడానికి మంచి పనులు చేస్తాము. మంచి ప్రవర్తనతో ఉంటాము. బాగా చదువుకొంటాము. ఇతరులతో తగాదాలకు వెళ్ళము. అమ్మ చెప్పిన పనులు చేస్తే అమ్మకు చాలా ఇష్టం కదా! అవే చేస్తాము. మా అమ్మ ఇంటి పనులలో సహాయపడతాము. అమ్మ కోరుకున్నది సాధించడానికి ఏమి చేయడానికైనా సిద్ధపడతాము.

II. ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం.

1. పాఠం చదవండి. వివిధ అంశాలను కవి ఎట్లా పోల్చాడో పట్టికలో రాయండి.

అంశం పోలిక
ముగ్గులేసిన ప్రాంగణం అద్దకపు చీర
పండ్లు పాల బలపాలు
ఇల్లు దవాఖానా
దొరలబిడ్డలు తెల్లకుందేళ్ళు
ముక్కుపోగు నెలవంకలా అర్ధచంద్రాకారం
వడ్లు దంచే చప్పుడు మద్దెల మోత
ముక్కు పుల్ల విష్ణువు ముట్టెమీద ఎత్తిన భూగోళం
గంటీలు గడియారంలోని లోలకం
అమ్మ ఒడి గుమ్మి


2. కింది పేరా చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ధర్మం మూర్తీభవించిన శ్రీరాముణ్ణి తీర్చిదిద్దింది తల్లి కౌసల్యే. లవకుశులు వీరులుగా, శూరులుగా, పరాక్రమశీలురుగా తయారైంది తల్లి సీతమ్మ శిక్షణలోనే. కాలినడకన ఆసేతు హిమాచలం పర్యటించి, అద్వైత సిద్ధాంతాన్ని బోధించి, దేశసమైక్యతను, సమగ్రతను కాపాడిన ఆదిశంకరులు కూడా తల్లి ఆర్యాంబ ఒడిలోనే పెరిగి పెద్దవాడయ్యాడు.

భారతజాతికి గర్వకారణమైన వీరుడుగా, శూరుడుగా, పేరు ప్రఖ్యాతులనందుకొనిన వీరశివాజీ తన తల్లి జిజియాబాయి చేతులలోనే పెరిగి పెద్దవాడయ్యాడు. ఒక సామాన్య బాలునిలో నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, దేశభక్తి భావాలను నాటి, పెంచి, పోషించి గాంధీని మహాత్మునిగా రూపొందించగలిగింది ఆయన మాతృమూర్తి పుతిలీబాయి. ప్రపంచ చరిత్రను సునిశితంగా పరిశీలిస్తే ఒక వాస్తవం తేటతెల్లమౌతుంది. జాతి గర్వించదగిన వీరులను, శూరులను, మహనీయులను, మహాపురుషులను, ప్రవక్తలను, సంఘసంస్కర్తలను, జ్ఞానులను, యోగులను రూపుదిద్దగల్గిన శిల్పులు మాతృమూర్తులేనని స్పష్టమవుతున్నది.

(అ) సీతమ్మ లవకుశులను ఎట్లా తీర్చిదిద్దింది?
జవాబు.
సీతమ్మ లవకుశులను వీరులుగా, శూరులుగా, పరాక్రమశీలురుగా తీర్చిదిద్దింది.

(ఆ) ఆదిశంకరుల తల్లి పేరేమిటి?
జవాబు.
ఆదిశంకరుల తల్లిపేరు ఆర్యాంబ.

(ఇ) శివాజీని జిజియాబాయి ఎట్లా పెంచింది?
జవాబు.
శివాజీని జిజియాబాయి వీరుడిగా, శూరుడిగా పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్లు పెంచింది.

(ఈ) గాంధీ మహాత్ముడుగా రూపుదిద్దుకోవడానికి కారణం ఎవరు?
జవాబు.
గాంధీ మహాత్ముడుగా రూపుదిద్దుకోవడానికి కారణం అతని తల్లి పుతిలీబాయి.

(ఉ) జాతి గర్వించదగిన మహనీయులను రూపుదిద్దిన మహాశిల్పులు ఎవరు?
జవాబు.
జాతి గర్వించదగిన మహనీయులను రూపుదిద్దిన మహాశిల్పులు అంతా ఆ మహనీయుల తల్లులే!

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. కవి రచనా శైలిని సొంతమాటల్లో రాయండి.
(లేదా)
ఈ కవితలోని రచయిత రచనాపద్ధతి ఎట్టిది?
జవాబు.
కవి ఈ గేయాన్ని వచనకవితా ప్రక్రియలో రాశాడు. గేయాన్ని ఎలాంటి ఛందో నియమాలను పట్టించుకోకుండా భావానికి ప్రాధాన్యత నిస్తూ రాశాడు. ‘అమ్మ’ను కవితా వస్తువుగా తీసుకొని ప్రతి వాడి మనసులో అమ్మ స్థానాన్ని, విలువను నింపాడు. సరళమైన భాషతో, తేలికైన పదాలతో చెప్పదలచుకొన్న అభిప్రాయాన్ని చక్కగా తెలిపాడు. తెలంగాణ భాషలో, యాసలో వచన కవిత రాసిన వాడుగా గుర్తింపు పొందాడు.

TS 7th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అమ్మ జ్ఞాపకాలు

ఆ. కాలుష్య నిర్మూలన కార్యకర్తగా అమ్మ పనిచేసింది’ అని అనడంలో కవి ఉద్దేశం ఏమిటి?
(లేదా)
అమ్మ కుటుంబంలో పరిశుభ్రతను ఎలా పాటిస్తుంది ?
జవాబు.
కవి తన రచనలో అమ్మను స్వచ్ఛభారత్లో కాలుష్య నిర్మూలనా కార్యకర్తగా చూపాడు. ఇంటి ముందరి ముగ్గులో రంగులద్దిన చీరను చూపాడు. అమ్మ పళ్ళను తెల్లని పాలబలపాలుగా చిత్రీకరించాడు. పిల్లలకు జ్వరం వస్తే ఇంటినే దవాఖానాగా మార్చాడు. దొరల కొట్టంలో బర్లను శుభ్రంచేసి, పెండను తీసే కార్యకర్తగా వర్ణించాడు. అమ్మ పిల్లల పెంపకంలో ఆరోగ్య కార్యకర్తగా చూపాడు.

ఇ. మీ అమ్మ ఇష్టాలను గురించి మీ సొంత మాటలో రాయండి.
(లేదా)
మీ అమ్మ ఆలోచనలను, కోరికలను గూర్చి వ్రాయండి.
జవాబు.
మా అమ్మకు తన పిల్లలంటే చాలా ఇష్టం. తన బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని, బాగా ఎదగాలని కోరేది. తన పిల్లలు అందరికంటే బాగా చదివితే ఇష్టం. తన పిల్లలు తన ముందే ఆటలలోను, పాటలలోను బాగా రాణిస్తే ఇష్టం. తన బిడ్డలు తన కళ్ళముందే ఎదుగుతుంటే లోలోపల ఆనందంతో మురిసిపోవడం తన కిష్టం. అమ్మ ఇష్టాలను తీర్చడం కష్టమైనా మా కిష్టం.

ఈ. అమ్మచేసే పనుల్లో మనం కూడా ఎందుకు సహాయం చేయాలి.
(లేదా)
మీ ఇంట్లో నీ తల్లికి సాయం చేయడంలో నీ పాత్ర ఏమిటి?
జవాబు.
అమ్మ తన బిడ్డలు కష్టపడకూడదని అన్ని పనులు తనే చేసుకుంటుంది. పిల్లలు పెద్దయిన తర్వాత వారే నేర్చుకుంటారని ఏ పనీ మనకు చెప్పదు. మనం ఇంట్లో అన్ని పనుల్లోను ఎంతో కొంత అమ్మకు సాయం చేయాలి. అమ్మకు సాయం చేస్తే అందులో మనకు కూడా పనులు అలవాటవుతాయి. నేర్చుకుంటాము. తృప్తి మిగులుతుంది. అమ్మ శిక్షణలో చేసేపనుల వలన పెద్దయిన తర్వాత మన పనులు మనమే చేసుకోగలుగుతాం. ఒక పని అందరూ చేస్తే ఎవరికీ ఎక్కువ శ్రమ, ఆయాసం ఉండదు. త్వరగా కూడా పూర్తవుతుంది.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

ప్రశ్న 1.
అమ్మ గొప్పతనాన్ని మీ సొంత మాటల్లో రాయండి.
జవాబు.
అమ్మ పరిశుభ్రత : అమ్మ వాకిట్లో ముగ్గులేస్తే రంగులు అద్దిన చీరలా కనిపించేది. నవ్వితే పళ్ళు బలపాల్లా ఉండేవి. పిల్లలకు జలుబుచేస్తే, జ్వరం వస్తే ఇంటినే దవాఖానా (హాస్పటల్)గా మార్చేది. ఒక నర్సులాగా మందు బిళ్ళలు వేసేది. అమ్మ కష్టం : అయ్య పాలు పిండితే అమ్మ దొర కొట్టంలో పెండ తీసేది. భూస్వాముల ఇళ్ళముందు కుందీలో పోసి వడ్లను దంచేది.

అమ్మ అందం : అమ్మ ముక్కు పోగు ఆకాశానికి హత్తుకొన్న నెలవంకలాగా అందంగా ఉంది. అమ్మ ముక్కుపుల్ల ముట్టె మీద ఎత్తిన భూగోళంలా ఉంది. గంటలు గడియారంలోని లోలకంలాగా ఊగేవి. అమ్మకు కాళ్ళకు కడియాలు వేసుకోవడం, మట్టెలు తొడుక్కోవడం చాలా ఇష్టం.

అమ్మ ప్రేమ : అమ్మ రోజంతా పనిచేసి సోలెడు నూకలను చీరకొంగున మూటగట్టి తెచ్చేది. అమ్మ పిల్లలు ఎదురు చూస్తారని ఒడిలో పల్లికాయలు, పెసరకాయలు తెచ్చి పెట్టేది. అమ్మ ఒడి నుండి ఎన్ని తీసుకొన్నా ఇంకా మిగిలే ఉంటాయి. అమ్మ గొప్పదనాన్ని చెప్పడం ఎవరికీ సాధ్యంకాదు.

IV. సృజనాత్మకత/ప్రశంస

1. మీ అమ్మ బొమ్మ గీయండి. అమ్మ గొప్పతనం తెలిపేటట్లు చిన్న కవిత రాయండి.

అమ్మ ప్రేమ చాలా మధురం
తీయని మాటల సమూహం
చక్కని అందాల సమస్తం
తన పలుకులతో పిల్లలను
ఉత్తమ రత్నాల్లా తీర్చేది అమ్మ
తన శ్రమనంతా కూర్చి
వారి కెలాంటి బాధ, వ్యధ లేకుండా చేసేది అమ్మ
తన శరీరాన్ని స్థానంగా చేసి, అమృత ధారలను పంచి
హాయినీ, ఆనందాన్ని కుటుంబానికిచ్చేది అమ్మ

2. పాఠ్యభాగం ఆధారంగా క్రింది ఖాళీలను పూర్తిచేయండి. (అదనపు ప్రశ్న)

1. అమ్మ ముగ్గులేస్తే ప్రాంగణం …………………. లా కన్పించేది.
2. దూడల నోళ్ళు కట్టి పితికిన పాలు ఆస్థానపు …………….తాగేవి.
3. గోవుల ప్రక్కన ……………. ఇంటిముందు ఆడుకొనేవాళ్ళు.
4. చెవుల గెంటీలు గడియారంలోని ……………….. లా ఊగేవి.
5. ……………… అమ్మ జ్ఞాపకాలు నా చుట్టూ ముసురుతాయి.
జవాబు.
1. అమ్మ ముగ్గులేస్తే ప్రాంగణం అద్దకపు చీర లా కన్పించేది.
2. దూడల నోళ్ళు కట్టి పితికిన పాలు ఆస్థానపు తెల్ల కుందేళ్ళు తాగేవి.
3. గోవుల ప్రక్కన ల్యాగల్లా ఇంటిముందు ఆడుకొనేవాళ్ళు.
4. చెవుల గెంటీలు గడియారంలోని పెండ్యులం లా ఊగేవి.
5. తేనెటీగల్లా అమ్మ జ్ఞాపకాలు నా చుట్టూ ముసురుతాయి.

3. అమ్మ ప్రేమ గొప్పతనాన్ని గూర్చి నీ స్నేహితురాలికి లేఖ వ్రాయుము.
జవాబు.

ఆదిలాబాద్,
తేది : XXXX.

ప్రియమైన స్నేహితురాలు సరళకు,
నేనిక్కడ కుశలం. నీ కుశలములు తెలుపుము. మా పాఠశాల తెరచి నెలరోజులైంది. బాగా చదువుకుంటున్నాను. నేను నీకు ఈ లేఖలో అమ్మ గొప్పతనాన్ని చెప్పదలచుకున్నాను. అమ్మ జ్ఞాపకాలు పాఠం మా మాష్టారుగారు చెప్పారు. నేను మా అమ్మ గూర్చి చాలా రకాలుగా ఆలోచించాను. అమ్మ ఇంట్లో చాలా ముఖ్యమైన వ్యక్తి. అందరి అవసరాలు తీర్చేది. ఎవరికీ బాధ కలగకుండా, ఏమీ మన నుండి కోరకుండా తన పని తానే చేసుకుంటూ పోతుంది. అమ్మ లేకపోతే ఒక నిముషం గడవదు. అన్నిరకాలా, అందరికీ అవసరమైన వ్యక్తి. మనమంతా అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మ విలువ తెలుసుకొని మెలగాలి.  అక్కడి విశేషాలతో నీవు గూడా లేఖ వ్రాయాలి సుమా!

ఇట్ల
నీ మిత్రురాలు
విమల,
7వ తరగతి,
జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల,
ఆదిలాబాద్.

చిరునామా :
కరణం సరళ
జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల,
వరంగల్.

4. కింది ప్రశ్నలకు ఇవ్వబడిన జవాబులలో సరైనదానిని గుర్తించండి.

1. అమ్మ ఇంటిని ఇలా మార్చింది
(అ) కుంపటి
(ఆ) హాస్పిటల్
(ఇ) వంటశాల
(ఈ) పాఠశాల
జవాబు.
(ఆ) హాస్పిటల్

2. అమ్మ ముక్కుపోగు ఇలా ఉంది
(అ) రత్నం
(ఆ) వజ్రం
(ఇ) నెలవంక
(ఈ) కంఠాభరణం
జవాబు.
(ఇ) నెలవంక

3. చెవుల గెంటీలు ఇలా ఊగేవి
(అ) గడియారంలోని పెడ్యులంలా
(ఆ) ఆకాశంలో నక్షత్రాల్లా
(ఇ) ఎద్దు మెడలోని గంటల్లా
(ఈ) మెడలోని రత్నాలహారాల్లా
జవాబు.
(అ) గడియారంలోని పెడ్యులంలా

TS 7th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అమ్మ జ్ఞాపకాలు

4. అమ్మ జ్ఞాపకాలు ఇలా ముసురుతాయి
(అ) సినిమా కథల్లాగా
(ఆ) నిద్రలో కలలా
(ఇ) చందమామ బొమ్మల్లాగా
(ఈ) తేనెటీగల్లా
జవాబు.
(ఈ) తేనెటీగల్లా

5. అమ్మ ముగ్గులేస్తే ప్రాంగణం ఇలా ఉంటుంది
(అ) రంగవల్లిలా
(ఆ) ముగ్గుల తోరణంలా
(ఇ) అద్దకపు చీరలాగా
(ఈ) రత్నాల హారంలా
జవాబు.
(ఇ) అద్దకపు చీరలాగా

V. పదజాల వినియోగం

1. కింది వాక్యాల్లో గీతగీసిన పదాలకు సరైన అర్థాలు రాయండి.

1. జెండావందనం రోజు మా పాఠశాల ప్రాంగణాన్ని ముగ్గులతో అలంకరిస్తాం.
(అ) బయట
(ఆ) లోపల
(ఇ) ముంగిలి
(ఈ) ఇంటిలో
జవాబు.
(ఇ) ముంగిలి

2. మా ఊరిలో వస్త్రాలపై అద్దకం చేసేవారు ఉన్నారు.
(అ) గోడకు వేసే సున్నం
(ఆ) బట్టలకు రంగు వేసే విధానం
(ఇ) రంగు వేయడం
(ఈ) రంగు తీసివేయడం
జవాబు.
(ఆ) బట్టలకు రంగు వేసే విధానం

TS 7th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అమ్మ జ్ఞాపకాలు

3. బాసర పుణ్యక్షేత్రం గోదావరి గట్టున ఉంది.
(అ) కట్ట
(ఆ) గోడ
(ఇ) తీరం
(ఈ) దూరం
జవాబు.
(ఇ) తీరం

2. కింద గీతగీసిన పదాలకు పర్యాయ పదాలు రాయండి.

(అ) కంచు మోగునట్టు కనకంబు మోగునా?
జవాబు.
కంచం, కాంస్యం

(ఆ) కుందేలు ఉపాయంతో అపాయాన్ని జయించింది.
జవాబు.
చెవులపిల్లి, శశం, శరభం

(ఇ) అంబా అని తల్లి పిలిస్తే దూడ గంతులు వేసుకుంటూ వచ్చింది.
జవాబు.
అమ్మ, తల్లి, మాత

3. కింద గీతగీసిన ప్రకృతి పదాలకు వికృతిపదాలు, వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయండి.

(అ) కుల్యలో కాగితపు పడవలు వేసి పిల్లలు ఆడుకుంటున్నారు.
జవాబు.
కాలువ / కయ్య

(ఆ) ఆకాశంలో పక్షులు స్వేచ్ఛగా ఎగురుతున్నాయి.
జవాబు.
ఆకసం

(ఇ) శ్రావ్య మొగము ఎంతో అందంగా ఉంది
జవాబు.
ముఖం

VI. భాషను గురించి తెలుసుకుందాం

ఈ కింది పదాలను విడదీయండి.
(అ) అతడెక్కడ = అతడు + ఎక్కడ
(ఆ) బొమ్మనిచ్చెను = బొమ్మను + ఇచ్చెను
(ఇ) మనిషన్నవాడు = మనిషి + అన్నవాడు

2. ఈ క్రింది పదాలను కలపండి.
(అ) మేన + అల్లుడు = మేనల్లుడు
(ఆ) పుట్టిన + ఇల్లు = పుట్టినిల్లు
(ఇ) ఏమి + అంటివి = ఏమంటివి

ఈ క్రింది పదాలను గమనించండి.
(అ) రాముడు + అతడు = రాముడతడు = ఉ + అ = అ
(ఆ) సోముడు + ఇతడు = సోముడితడు = ఉ + ఇ = ఇ
(ఇ) మనము + ఉంటిమి = మనముంటిమి = ఉ + ఉ = ఉ
(ఈ) అతడు + ఎక్కడ = ఉ + ఎ = ఎ = అతడెక్కడ

మొదటి పదంలోని చివరి అచ్చు ‘ఉ’, రెండవ పదంలోని మొదటి అచ్చుతో కలిసినపుడు మొదటి పదంలోని అచ్చు (ఉ) లోపిస్తుంది. రెండో పదంలోని మొదటి అచ్చు అట్లాగే నిలిచి ఉంటుంది. అనగా ఉకారం మీద ఏదైనా అచ్చు వచ్చి చేరితే సంధి తప్పక జరుగుతుంది. దీనినే ‘ఉత్త్వసంధి’ అంటాం. ‘ఉ’ కారాన్ని ఉత్తు అంటారు. ఉత్తునకు అచ్చుపరమైతే సంధి తప్పక జరుగుతుంది.

TS 7th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అమ్మ జ్ఞాపకాలు

4. ఈ కింది పదాలను కలిపి రాయండి.
(అ) చెట్టు + ఎక్కి= చెట్టెక్కి
(ఆ) వాడు+ఎక్కడ = వాడెక్కడ
ఇ) ఎదురు + ఏగి = ఎదురేగి

5. ఈ క్రింది పదాలను విడదీయండి.
(అ) నూకలేసుకొని = నూకలు + ఏసుకొని
(ఆ) చూరెక్కి = చూరు + ఎక్కి
(ఇ) ఎట్లున్నది = ఎట్లు + ఉన్నది

ప్రాజెక్టు పని:

1. ఒకరోజు ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు అమ్మను గమనించండి. ఏమేమి పనులు చేసింది? ఆయా పనులు చేసేటప్పుడు ఆమె ఎట్లా ఉన్నది? మీకేమనిపించింది? ఈ వివరాలతో నివేదిక రాయండి.
జవాబు.
ఉదయం : అమ్మ ఉదయం 5 గంటలకే నిద్రలేచింది. తన పనులు చేసుకొన్న తర్వాత పిల్లలకు, భర్తకు ఆ రోజు ఏయే పనులు చేయాలో నిర్ణయించుకొన్నది. ఉదయం పిల్లలకు పాలిచ్చింది. ఆకలికి ఉండలేరని చద్ది అన్నంలో పచ్చడి/పెరుగు కలిపి పిల్లలకు ఆహారంగా పెట్టింది. వంటలో ఏమేమి వండాలో నిర్ణయించి తరిగింది. భర్తకు అల్పాహారం తయారుచేసి పెట్టింది. ఉతకవలసిన బట్టలు ఉతికి ఆరవేసింది. ముందరిరోజు అంట్లు తానే తోముకుంది. పిల్లలకు ఉతికిన బట్టల వేసి పాఠశాలకు పంపింది.

మధ్యాహ్నం : 1గంటకు ఆ రోజు మధ్యాహ్నం భోజనానికి కావలసిన ఆహార పదార్థాలు వండి సిద్ధం చేసింది. కొంచెంసేపు విశ్రాంతి తీసుకొంది. మధ్యాహ్నం పిల్లలు, భర్త రాగానే వారికి అందరికీ ప్రేమతో పెట్టి పంపించింది. అన్ని పనులు తానే చేసుకోవడం వలన కొంత అలసిపోయింది.

సాయంత్రం : గం 5.30లకు బడి నుండి పిల్లలు, ఆఫీసు నుండి భర్త రావడానికి ముందే వారి ఆకలి తీర్చడానికి అల్పాహారం తయారుచేసింది. ఉతికిన బట్టలు మడతపెట్టింది. సాయంత్రం వారిని కొంతసేపు ఆడుకొనిన తర్వాత వారిని పాఠశాల ఇంటిపని చేయడానికి సిద్ధం చేసింది. వారితో పాఠాలు చదివించింది.

రాత్రి : 8.30లకు పిల్లలకు, భర్తకు మరల కావలసిన పదార్థాలు సిద్ధం చేసి వారికి పెట్టి తాను తిని, పిల్లలు, భర్త ముఖంలోని తృప్తిని చూచి తాను ఆనందంతో, అలసిన దేహంతో చక్కగా నిద్రపోయేది. మాకోసం శ్రమపడే మా అమ్మను చూస్తే మా కెంతో ఇష్టం.

విశేషాంశాలు:

ఆయుర్వేదం : వనమూలికల ఔషధాల ద్వారా చికిత్సచేసి ఆయుష్షును పెంచే వైద్యవిధానం ఇది.

జమీందారు : జమీన్ అంటే ఉర్దూభాషలో భూమి అని అర్థం. భూమితోపాటు పాలనాధికారాలు కూడా వీరి సొంతం. వీరినే భూస్వాములు అంటారు.

వరాహావతారం : దశావతారాల్లో మూడో అవతారం. హిరణ్యాక్షుడనే రాక్షసుణ్ణి వధించడానికి విష్ణుమూర్తి ఎత్తిన అవతారమే వరాహావతారం.

TS 7th Class Telugu 4th Lesson Important Questions అమ్మ జ్ఞాపకాలు

ప్రశ్న 1.
‘అమ్మ జ్ఞాపకాలు’ పాఠం ద్వారా నీవేం తెలుసుకున్నావు?
జవాబు.
‘అమ్మ జ్ఞాపకాలు’ పాఠం ద్వారా అమ్మ ప్రేమ, ఆప్యాయత, అనురాగం, తన సేవలను కుటుంబం కోసం ఎలా చేస్తుందో తెలుసుకొన్నాను. దేవుడు తనరూపం అంతటా ఉండాలని అమ్మను సృష్టించాడు. చిన్నతనంలో అమ్మపట్ల ప్రేమను, విలువను పెంచే విధానాన్ని మాకు తెలిపాడు. తల్లికి కుటుంబంలో విలువను, స్థానాన్ని తెలిపాడు. పిల్లల అవసరాలను తీర్చడంలో తల్లి ఎంత తపన పడుతుందో వారికి తేనెవంటి తీయని మాటలు, ప్రవర్తన, స్పర్శ మొ॥ విషయాలు మాకు జీవితమంతా గుర్తుండేటట్లు, మనసులలో నాటుకొనేటట్లు చెప్పాడు.

లోకంలోని గొప్పవారైన సీతమ్మ, ఆదిశంకరులు శివాజి, గాంధీజీ మొ॥ వారంతా తల్లి ఇచ్చిన స్ఫూర్తితో గొప్పవారైన వారే! తల్లి ఎలాంటి ప్రేరణ ఇస్తుందో పిల్లలు అలా తయారౌతారని ఈ పాఠం నేర్పుతోంది. ఆణిముత్యాల వంటి రత్నాలు ప్రపంచంలోకి రావాలంటే తల్లి ప్రత్యేకత ఈ కవిత తెలుపుతోంది. అమ్మ గొప్పతనం మాటలకు అందనిది. అమ్మ విలువ ఉన్నప్పటి కంటే, లేనప్పుడు ఇంకా తెలుస్తుంది. తేనెటీగలు తేనెకోసం పూల చుట్టూ తిరిగినట్లు అమ్మజ్ఞాపకాల మాధుర్యం మన జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది.

పర్యాయపదాలు:

  • అమ్మ = మాత, తల్లి, జనని
  • దూడ = లేగ, (కేపు, పెయ్య)
  • పాలు = క్షీరము, పయస్సు, దుగ్ధము
  • అయ్య = తండి, నాన్న, పిత
  • ముక్కు = నాసిక, ఘ్ణము
  • ఇల్లు = గృహము, నివాసము
  • గోవు = ఆవు, ధేనువు
  • ఆనందం = సంతోషం, హాయి, సుఖం
  • పొద్దున = ఉదయం, ఉషఃకాలం
  • కుందేలు = చెవులపిల్లి, శశం

ప్రకృతి – వికృతి:

  • (ప్రకృతి – వికృతి
  • ధర్మము – దమ్మము
  • కుడ్యము – గోడ
  • పక్షి – పక్కి
  • ముఖం – మొగం
  • ఆకాశం – ఆకసం
  • రాత్తి – రేయి, రాతిరి
  • సంతోషం – సంతసం
  • కవిత – కైత

సంధులు:

నవ్వుతున్నప్పుడు నవ్వుతు + ఉన్నప్పుడు ఉత్వసంధి
మీకేమి మీకు + ఏమి ఉత్వసంధి
నూకలేసుకొని నూకలు + ఏసుకొని ఉకారసంధి
చంద్రాకారము చంద్ర + ఆకారము సవర్ణదీర్ఘసంధి
మహాత్ముడు మహా + ఆత్ముడు సవర్ణదీర్ఘసంధి
చూరెక్కి చూరు + ఎక్కి ఉకారసంధి
జె్టై చెట్టు + ఎక్కి ఉకారసంధి
ఎదురేగి ఎదురు + ఏగి ఉకారసంధి
అతడెక్కిన అతడు + ఎక్కిన ఉకారసంధి
రామయ్య రామ + అయ్య అత్వసంధి
మాటలకందనిది మాటలకు + అందనిది ఉత్వసంధి


సమాసాలు:

ఉచ్ఛ్రాస నిశ్వాసాలు ఉచ్ఛ్రాసము మరియు నిశ్వాసము ద్వంద్వ సమాసం
పదాలు అర్థాలు పదాలు మరియు అర్థాలు ద్వంద్వ సమాసం
లవకుశులు లవుడు మరియు కుశుడు ద్వంద్వ సమాసం
పేరు ప్రఖ్యాలులు పేరు మరియు ప్రఖ్యాతి ద్వంద్వ సమాసం
వీరులు, శూరులు వీరులు మరియు శూరులు ద్వంద్వ సమాసం
మూడడుగులు మూడు అను సంఖ్యగల అడుగులు ద్విగు సమాసం

ద్వంద్వ సమాసం :
సూత్రం : సమాసపదంలో రెండు పదాలు ప్రధానమై ఉన్న ఆ సమాస పదం ద్వంద్వ సమాసం అవుతుంది.

ద్విగుసమాసం :
సూత్రం : సమాసపదంలో మొదటి పదం అంకెను తెలుపు పదం ఉంటే అది ద్వీగు సమాసం ఔతుంది.

1. క్రింది వాక్యాలలోని పర్యాయపదాలు గుర్తించి రాయండి.

(అ) ఆవు సాధుజంతువు. గోవుపాలు పిల్లలకు చాలా మంచిది. ధేనువులను హిందువులు పూజిస్తారు.
జవాబు.
ఆవు, గోవు, ధేనువు

(ఆ) మా నాన్నగారు మాకు పూజనీయులు. తండ్రి ఇంటిలోని వారికి అన్నీ సమకూరుస్తాడు. మా అయ్యను విడచి ఉండలేము.
జవాబు.
నాన్న, తండ్డి, అయ్య

TS 7th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అమ్మ జ్ఞాపకాలు

(ఇ) ప్రతివారికి ఇల్లు చాలా అవసరం. గృహం కొనాలంటే చాలా డబ్బు కావాలి. నివాసం శాంతంగా ఉండాలంటే అందరూ కలసి ఉండాలి.
జవాబు.
ఇల్లు, గృహము, నివాసం

(ఈ) గాలి ముక్కుతోనే పీల్చాలి. నాసికలోని నరాలు సున్నితంగా ఉంటాయి. మనం ఎలాంటి వాసననైనా పసికట్టడానికి ఘ్రాణం అవసరం.
జవాబు.
ముక్కు, నాసిక, ఘాణం

(ఉ) నా పుట్టిన రోజున ఆనందంగా గడుపుకొంటాను. సంతోషాన్ని నల్గురితోను పంచుకోవాలి. మనం సుఖంగా ఉండాలంటే ఇతరులను గూడా హాయిగా ఉంచాలి.
జవాబు.
ఆనందం, సంతోషం, సుఖం

2. క్రింది వాక్యాలలోని ప్రకృతి వికృతులను గుర్తించి వేరుగా వ్రాయండి.

(అ) రాముడు ధర్మమును ఆచరించెను. దమ్మము తప్పనివారు ఎపుడూ గెలుస్తారు.
జవాబు.
ధర్మము – దమ్మము

(ఆ) పక్షి రెక్కల సాయంతో ఎగురును. పక్కి తన పిల్లలకు ముక్కుతో ఆహారాన్ని అందించును.
జవాబు.
పక్షి – పక్కి

(ఇ) ఆకాశంలో విమానం ఎగురుతోంది. ఆకసంలో ఇంద్రధనుస్సు ఏర్పడును.
జవాబు.
ఆకాశం – ఆకసం

(ఈ) కవులు కవితలు రాస్తారు. కైతలో విషయం ఉంటేనే అందరూ చదువుతారు.
జవాబు.
కవిత – కైత

TS 7th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అమ్మ జ్ఞాపకాలు

(ఉ) రాత్రిళ్ళు బయట తిరగరాదు. అడవిలో రాతిరిపూట అంతా చీకటిగా ఉంటుంది.
జవాబు.
రాత్తి – రాతిరి

3. క్రింది వాక్యాలలోని గీతగీసిన సంధిపదాలను విడదీసి, సంధి పేరు గుర్తించండి.

(అ) సీత ముఖం చంద్రాకారం లో ఉంది.
జవాబు.
చంద్రాకారం = చంద్ర + ఆకారం – సవర్ణదీర్ఘసంధి

(ఆ) కమల నవ్వుతున్నపుడు అందంగా ఉంటుంది.
జవాబు.
నవ్వుతున్నపుడు = నవ్వుతు + ఉన్నపుడు- ఉత్వసంధి

(ఇ) మహాత్ముల రచనలు చదవాలి.
జవాబు.
మహాత్ములు = మహా + ఆత్ములు – సవర్ణదీర్ఘసంధి

(ఈ) పెద్దవారు వచ్చినపుడు ఎదురేగి గౌరవించాలి.
జవాబు.
ఎదురేగి = ఎదురు + ఏగి – ఉత్వ సంధి

(ఉ) గోపి చెట్టెక్కి కాయలు కోస్తున్నాడు.
జవాబు.
చెట్టెక్కి = చెట్టు + ఎక్కి – ఉత్వ సంధి

(ఊ) రామయ్య మాటలు చాలా వినాలనిపిస్తుంది.
జవాబు.
రామయ్య = రామ + అయ్య – అత్వసంధి

4. క్రింది వాక్యాలలోని గీతగీసిన పదాలకు విగ్రహవాక్యాలు వ్రాసి సమాసాలు గుర్తించండి.

(అ) సీతారాముల పిల్లలు లవకుశులు
జవాబు.
లవకుశులు – లవుడు మరియు కుశుడు – ద్వంద్వ సమాసం

(ఆ) మా ఇల్లు పదిగజాల దూరంలో ఉంది.
జవాబు.
పదిగజాలు – పది అను సంఖ్య గల గజాలు – ద్విగు సమాసం

(ఇ) వేసవిలో కూరగాయల ధర ఎక్కువ.
జవాబు.
కూరగాయలు – కూర మరియు కాయలు – ద్వంద్వ సమాసం

TS 7th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అమ్మ జ్ఞాపకాలు

(ఈ) తల్లిదండ్రులను గౌరవించాలి.
జవాబు.
తల్లిదండ్డులు – తల్లి మరియు తండ్డి – ద్వంద్వ సమాసం

(ఉ) బ్రహ్మవిష్ణుమహేశ్వరులను త్రిమూర్తులు అంటారు.
జవాబు.
త్రిమూర్తులు – త్రి అను సంఖ్యగల మూర్తులు – ద్విగు సమాసం

5. కింది పేరాను చదివి, ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.

అమ్మ జ్ఞాపకాలు పాఠం వచన కవిత ప్రక్రియకు చెందినది. ఆంగ్లంలో దీనిని ‘Free Verse’ అంటారు. వచన శైలిలో రాసే ఈ విధానాన్ని వచన కవితగా పిలుస్తున్నాం. ఈ పాఠం కృష్ణమూర్తి యాదవ్ రచించిన ‘శబ్నం’ కవితా సంపుటిలోనిది. సామాన్యుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అక్షరాల్లోకి పొదిగి, సామాన్య ప్రజల భాషలో కవిత్వం రచించిన సామాజిక కవి టి.కృష్ణమూర్తి యాదవ్. కరీంనగర్ జిల్లాకు చెందినవాడు. తన తొలి కవితా సంపుటి “తొక్కుడుబండ”తో సాహితీక్షేత్రంలో ప్రవేశించాడు. “శబ్నం” వీరి రెండవ కవితా సంపుటి.

(అ) అమ్మ జ్ఞాపకాలు రచయిత పేరు ?
జవాబు.
టి. కృష్ణమూర్తి యాదమ్

(ఆ) వచన కవితను ఆంగ్లంలో ఏమంటారు ?
జవాబు.
Free Verse

(ఇ) అమ్మ జ్ఞాపకాలు ఏ కవితా సంపుటి నుండి గ్రహించబడింది ?
జవాబు.
శబ్నం

(ఈ) కవి తొలి కవితా సంపుటి పేరేమి?
జవాబు.
తొక్కుడుబండ

TS 7th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అమ్మ జ్ఞాపకాలు

(ఉ) పాఠ రచయిత ఏ జిల్లాకు చెందినవాడు?
జవాబు.
కరీంనగర్

6. క్రింది అపరిచిత గద్యాన్ని చదివి 5 ప్రశ్నలు తయారుచేయండి. (అదనపు ప్రశ్న)

ఏకశిలా నగరాన్ని రాజధానిగా చేసుకొని తెలుగు నేలను గొప్ప స్థితిలో ఉంచిన కాకతీయ రాజులలో చివరివాడు రెండవ ప్రతాపరుద్రుడు. అతడు మంచి పరిపాలకుడేకాదు. మానవ ధర్మం, కళాధర్మం తెలిసిన సాహితీవంతుడు. తెలుగు, సంస్కృత భాషలలో పండితుడు. సంగీతం, సాహిత్యం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పకళలకు గౌరవమిచ్చాడు. అతడికి ఉన్న బలహీనత జంతువులను వేటాడం.

1. కాకతీయ రాజులలో చివరివాడు ఎవరు?
2. రెండవ ప్రతాపరుద్రుని సా|మాజ్యానికి రాజధాని నగరం ఏది?
3. ప్రతాపరుద్రునికి ఏ భాషలలో పాండిత్యం ఉంది?
4. పతరపరరుద్రుడు గౌరవించే కళలు ఏవి?
5. అతని బలహీనతలు ఏవి?

కవిత – అర్దాలు

1. అమ్మ ముగ్గులేస్తే
ప్రాంగణం అద్దకపు చీరలా కన్పించేది
చాయ నలుపు కోలముఖం అమ్మ నవ్వుతున్నప్పుడు
పండ్లు పాలబలపాల్లా కన్పించేవి
మాకు పడిషంపట్టి జ్వరమొచ్చినపుడు
అమ్మ ఇంటినే హాస్పిటల్గా మార్చేది
తానే నర్సయి మంచాల చుట్టూ తిరుగుతూ
ఆయుర్వేదపు మందుబిళ్ళలేస్తూ ఉండేది
పొద్దున్నే అయ్య
దొరల బర్లపాలు పిండేవాడు
కాలుష్య నిర్మూలన కార్యకర్తలా
అమ్మ కొట్టంలో పెండకళ్ళు తీసేది
దూడల నోళ్ళుకొట్టి పితికినపాలు
ఆస్థానపు తెల్లకుందేళ్ళు తాగేవి
అమ్మ ముక్కుకు ముక్కుపోగు
ఆకాశానికి అత్తుకున్న నెలవంకలా ఉండేది.

అర్దాలు

ప్రాంగణం = ఇంటి ముందరి భాగం
పడిషం = జలుబు
దొరలు = డబ్బున్నవారు
బర్లు = పాడిఆవులు, గేదెలు
పెండకళ్ళు = పేడ
నెలవంక = చందమామ

II. జమీందారు ఇండ్లముందు కుందెనలో వడ్లు పోసి
రోకలితో దంపుతున్నప్పుడు మద్దెల దరువులిన్పించేది
అమ్మ ఒడిలో సోలెడు నూకలేసుకొని ఇంటికి వచ్చేది
గోవుల పక్కన ల్యాగల్లా ఇంటిముందు ఆడుకునేవాళ్ళం
అమ్మ ముక్కుపుల్ల వరహావతారం
ముట్టెమీద ఎత్తిన భూగోళంలా కన్పించేది
చెవుల గెంటీలు
గడియారంలోని పెండ్యూంలా ఊగేవి
అమ్మ అంబలి తాగి కొడవలి పట్టుకొని కోతలకు పోయేది
కాల్వగట్ల పొంటి కాళ్ళు కడుక్కొని
(శమను మరచి ఊళ్ళోకి వచ్చే అమ్మకు
కేరింతలు కొడ్యూ ఎదురేగేహ్ళ్రం
గుమ్ముల్లో వడ్లున్నట్టే మాకోసం
అమ్మ ఒడిలో పల్లికాయలు, పెసరకాయలు దొరకేవి
అమ్మకు కాళ్ళకడియా లేసుకోవడం
కంచు మట్టెలు తొడుక్కోవడమంటే చాల ఇష్టం
అమ్మ ఎప్పుడూ పట్టుచీరలు కట్టుకోనూలేదు
పరుపుల్లో నిదపోనూ లేదు
నులక మంచంమీద నిద్ర
చేనేత చీరలతోనే కాలం గడిపేది
సెలవుల మీద ఊళ్ళోకి వచ్చినపుడు
తేనెటగల్లా అమ్మ జ్ఞాపకాలు
నా చుట్టూ ముసురుతాయి.

అర్దాలు

కుందెన = కుంది (రోలు లాంటిది)
వడ్లు = బియ్యం మొదటి ఆకారం
దరువులు = శబ్దాలు
ల్యాగ = లేగదూడ
సోల = పూర్వకాలపు కొలమానం
ముట్టె = పందిముక్కు
వరాహం = పంది
పెండ్యాలం = ముల్లు
అంబలి = = రాగులపిండితో వండిన ద్రవాహారం
మట్టె = పెళ్ళి అయినవారు కాలి రెండవ వేలికి ధరించే ఆభరణం
గుమ్మి = ఎపుడూ ఖాళీ కాని రాశి (అమ్మ ఒడి)

పాఠ్యభాగ ఉద్దేశం:

అమ్మంటే (పేమ. అమ్మంటే ఆప్యాయత. అమ్మంటే అనురాగం. అమ్మ నిరంతరం తన కుటుంబం కోసం సేవలు చేస్తుంది. దేవుడు అంతటా ఉన్నాడని చాటడానికి అమ్మను స్ష్టించాడు. అనురాగమూర్తి అయిన అమ్మ జ్ఞాపకాలు నెమరేసుకుంటూ, అమ్ము సేవలను, అమ్మ (ప్రాధాన్యతను, విలువలను తెలుపడమే ఈ పాఠం ఉద్దేశం.

TS 7th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అమ్మ జ్ఞాపకాలు

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠం వచన కవిత (ప్రక్రియకు చెందినది. తెలుగులోనికి వచన కవిత ఆంగ్ల సాహిత్య (ప్రభావంతో వచ్చింది. ఆంగ్లంలో దీనిని ‘Free Verse’ అంటారు. పద్యగేయాల్లో ఉండే ఛందస్సు, మాత్రాగణాల నియమం లేకుండా స్వేచ్ఛగా భావయుక్తంగా వాక్యాలతో ఉంటుంది. వచనశైలిలో రాసే ఈ విధానాన్ని వచన కవితగా పిలుస్తున్నాం. ఈ పాఠం కృష్ణమూర్తి యాదవ్ రచించిన ‘శబ్నం’ కవితా సంపుటిలోనిది.

కవి పరిచయం:

కవి : టి. కృష్ణమూర్తి యాదవ్.
కాలం : 1914 – 1985.
జన్మస్థలం : వరంగల్ అర్బన్ జిల్లా, భీమదేవరపల్లి.
రచనలు : ఈయన తన తొలి కవితా సంపుటి “తొక్కుడు బండ”తో సాహితీ క్షేత్రంలో ప్రవేశించాడు. ‘శబ్నం’ వీరి రెండవ కవితాసంపుటి. గ్రామీణ జీవితానుభవాలు, మధ్యతరగతి జీవన చిత్రణ తన కవిత్వంలో ప్రధానంగా కనిపిస్తాయి.
రచనా శైలి : సరళమైన వచనాభివ్యక్తి, నిరాడంబరమైన శైలి ఈయన ప్రత్యేకత.

ప్రవేశి :

అమ్మంటే ఆత్మీయత అనురాగాల కలబోత. అమ్మ మంకు చేసే పిల్లవాడికి చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తుంది. అమ్మ గొప్పతనం మాటలకందనిది. కుటుంబంకోసం అమ్మ పడే తపన, ఆరాటం అనితరసాధ్యం. అమ్మ జ్ఞాపకాలను హృదయానికి హత్తుకునే విధంగా కవి ఎట్లా వర్ణించాడో చూద్దాం.

TS 7th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana శతక సుధ

Telangana SCERT 7th Class Telugu Guide Telangana 3rd Lesson శతక సుధ Textbook Questions and Answers.

శతక సుధ TS 7th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana

బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి.

TS 7th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana శతక సుధ 1

ప్రశ్న1.
పై బొమ్మలో ఎవరెవరున్నారు? ఏమి చేస్తున్నారు?
జవాబు.
పై బొమ్మలో గురువు, విద్యార్థులు ఉన్నారు. గురువు బోధిస్తున్నారు. విద్యార్థులు వింటున్నారు.

ప్రశ్న 2.
శిష్యులు ఏమి అడిగి ఉండవచ్చు?
జవాబు.
శిష్యులు తమకు తెలియని విషయాలపై ప్రశ్నలు అడిగి ఉండవచ్చు.

TS 7th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana శతక సుధ

ప్రశ్న 3.
గురువుగారు ఏం చెప్తుండవచ్చు?
జవాబు.
గురువుగారు విద్యార్థులకు అర్థం అయ్యేలా సందేహాలు తీర్చుచూ ఉండవచ్చు.

ప్రశ్న 4.
మీకు తెలిసిన కొన్ని నీతివాక్యాలు చెప్పండి.
జవాబు.

  1. కలసి ఉంటే కలదు సుఖం.
  2. నిజాన్ని మాట్లాడండి.
  3. ధర్మాన్ని ఆచరించండి.
  4. తల్లిదండ్రులను మించిన దేవతలు లేరు.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.23)

ప్రశ్న 1.
ఈ వంశానికి కీర్తి తేవడమంటే మీకేమర్దమైంది?
జవాబు.
వంశం అంటే తన కుటుంబం. దానికి కీర్తి తేవడం అంటే తనకు తాను ఏదేని సాధించాలనే పట్టుదల ఉండాలి. చిన్నతనం నుండే తన ఆలోచనలు, ఆశయాలు, సాధించదలచిన వాటిని నిర్ణయించుకొని పట్టుదలతో కృషి చేస్తే కీర్తి తేవడానికి తనే కారణం కాగలడు అని అర్థమైంది.

ప్రశ్న 2.
చెడు అలవాట్లకు లొంగిపోతే ఏం జరుగుతుంది?
జవాబు.
చెడు అలవాట్లకు లొంగిపోతే అన్నీ పోగొట్టుకుంటాము. దేనినీ సాధించలేము. పరువు పోతుంది. గౌరవము ఉండదు. ఎవరూ ఆదరించరు. అందరికీ దూరంగా ఒంటరిగా సంపదలు పోయి, బికారిగా జీవించాల్సి వస్తుంది.

ప్రశ్న 3.
‘భిక్షుకులకు శత్రువు లోభి’ అన్న కవి అభిప్రాయాన్ని మీరు ఏకీభవిస్తున్నారా? ఎందుకు?
జవాబు.
నేను యాచకులకు పిసినారి శత్రువు అనే అభిప్రాయాన్ని ఏకీభవిస్తున్నాను. పిసినారి యాచకులకు తన చేతితో భిక్షం పెట్టడు. ఇతరులు పెట్టినా చూసి ఓర్వలేడు. దాత వద్దకు పోయి తన సొమ్ము పోయినట్లు చాడీలు చెబుతాడు. దాత దానం చేయకపోతే తాను ఆనందిస్తాడు. ఇతరులకు మేలు కల్గితే బాధపడతాడు.

ప్రశ్న 4.
ఈ చాడీలు చెప్పడం మంచి అలవాటు కాదు. ఎందుకో చెప్పండి?
జవాబు.
చాడీలు చెప్పడం అంటే ఇతరులు చేసేపనులను గూర్చి వేరే వాని వద్ద అనవసరపు మాటలు మాట్లాడుట. చాడీలు చెప్పేవానికి విలువ ఉండదు. అతని మాటలను ఎవరూ నమ్మరు. ఉపయోగం లేని మాటలు మాటలాడుట మంచి అలవాటుకాదు.

TS 7th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana శతక సుధ

ప్రశ్న5.
ఏయే గుణాలు అలవరచుకుంటే మనలోని కపటం తొలగిపోతుంది?
జవాబు.
మన మనసును ఎపుడూ నిర్మలంగా ఉంచుకోవాలి. ఇతరులకు మంచి జరగాలని కోరుకోవాలి. మోసపు ఆలోచనలు విడచిపెట్టాలి. మంచివారితో స్నేహం చెయ్యాలి! అప్పుడే మనలోని కపటం తొలగిపోతుంది.

ప్రశ్న 6.
ఆ సజ్జనుని లక్షణాలు ఏమిటి?
జవాబు.
సజ్జనుడు ఇతరులకు మంచి జరగాలని కోరుకుంటాడు. ఇతరులలోని మంచిని తానూ ఆచరిస్తాడు. తనకు ఎవరైనా ఆపద చేయదలపెట్టినా వారికి మంచే జరగాలని కోరుకుంటాడు. ఏనుగు వెనుక కుక్కలు ఎంత మొరిగినా వెనుతిరిగి తరమదు. సజ్జనుడు తననెవరైనా గేలి చేసినా వాదములు ఆడడు.

ప్రశ్న 7.
ఈ గేలి చేయడమంటే మీకేమర్దమైంది?
జవాబు.
గేలి చేయడమంటే ఎగతాళి చేయడం. అవమానించడం. మంచితనం గల వ్యక్తి ఎదురుగా గాని, మరొకచోటగాని, వెనుక కాని, అతనిని ఎక్కిరించేటట్లు పిచ్చి మాటలు, పనులు చేయుట ద్వారా అతనికి బాధ కలిగించడం అని అర్థమైంది. ధనము, దమ్ము ఇట్లా ఏయే

ప్రశ్న 8.
గుణాలు కలిగి ఉంటే దానవులౌతారు?
జవాబు.
ధనము, దమ్ము, అధికారము, పొగరుతనము, కారణంలేని కోపము, వినయం లేకపోవుట మొదలగు గుణాలు ఉంటే దానవులు (రాక్షసులు) ఔతారు.

ప్రశ్న 9.
జన ‘విజ్ఞానము విశ్వశాంతికొరకు’ దీనిపై మీ అభిప్రాయాలు చెప్పండి?
జవాబు.
ప్రపంచంలో ఎన్ని కొత్త వస్తువులు కనుక్కొన్నా వాటిని ప్రజల శాంతి కొరకు ఉపయోగించాలి. మానవ జీవనానికి హాని కల్గించే వాటిని దుర్వినియోగపరిస్తే అవి మానవ వినాశనానికి దారిలొస్తాయి. ఏ వస్తువునైనా ఉపయోగించే మనిషి మనసుపైన ‘విజ్ఞానము విశ్వశాంతి కొరకు’ అనేది ఆధారపడి ఉంటుంది.

TS 7th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana శతక సుధ

ప్రశ్న 10.
జన ‘జనని, జన్మభూమి స్వర్గం కన్న మిన్న’ అని కవి ఎందుకన్నాడు?
జవాబు.
ప్రతి జీవికి తల్లి, జన్మభూమి చాలా విలువైనవి. అవి లేనిదే వారి జీవనము వృద్ధి కాబట్టి తల్లిని, జన్మభూమిని గౌరవించలేనివాడు ఎవరినీ గౌరవించలేడు. వారిని గౌరవించగలిగితే అందరినీ గౌరవించ గలుగుతాడు.

ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. పాఠ్యాంశంలోని పద్యాలలో ఏయే మంచి అలవాట్ల గురించి కవులు చెప్పారు? వాటిని అలవరచుకోవాలంటే మనం ఏం చేయాలి?
జవాబు.

  1. కష్టాన్ని ఓర్చుకొనగలవాడే దేనినైనా సాధిస్తాడు.
  2. అరిషడ్వర్గాలను (కామము, కోపము, లోభము, మదము, మోహము, మాత్సర్యాలు) జయించిన వాడే దేనినైనా సాధిస్తాడు.
  3. పిసినారి తాను దానం చేయక, దాతను దానం చేయకుండా చేస్తాడు. లోభిని దూరంగా ఉంచాలి.
  4. తనను ఎవరేమన్నా, గేలి చేసినా సజ్జనుడు పట్టించుకోడు.
  5. మోసం చేసేవాడికి అందరూ మోసగాళ్ళలాగానే కనబడతారు. పై మంచి అలవాట్లు రావాలంటే ఓపికగా సాధన చేయాలి.

శతక పద్యాలు ఎందుకు నేర్చుకోవాలో చెప్పండి.

  1. శతకం అనగా నూరు పద్యాలు కలది. చివరి పాదంలో మకుటం ఉంటుంది.
  2. శతకాల వలన అనేక నీతులు తెలుస్తాయి.
  3. మంచి భాష, పదజాలము, ధారణ అలవాటు అవుతుంది.
  4. శతకాలు నేర్వడం వలన మనలో ఆత్మనిగ్రహం, మంచితనం అలవడుతుంది.
  5. తర్వాత తరాల వారికి మంచి సంస్కృతి సంప్రదాయాలు అందించవచ్చు.

III. ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం 

1. కింద ఇచ్చిన పద్యం చదవండి. అర్థం చేసుకోండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండు బల్కుఁ జల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
విశ్వదాభిరామ వినురవేమ!

(అ) సజ్జనుని మాట ఎట్లా ఉంటుంది?
జవాబు.
సజ్జనుని మాట చల్లగా ఉంటుంది.

(ఆ) ఏది మోగితే ఎక్కువ ధ్వని వినిపిస్తుంది?
జవాబు.
కంచు మోగితే ఎక్కువ శబ్దం వినిపిస్తుంది.

(ఇ) అల్పుడు మాట్లాడుతాడు.
జవాబు.
అల్పుడు ఆడంబరంగా మాట్లాడతాడు.

(ఈ) ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు.
అల్పుని స్వభావం.

(ఉ) పై పద్యంలో ఎవరెవరిని వేటితో పోల్చారు?
జవాబు.
అల్పుడు – కంచు
సజ్జనుడు – కనకం (బంగారం)

2. కింది వాకాలను చదవండి. సరైన సమాధానాలు అనుకునేవాటిపై ‘✓’ అనే గుర్తును పెట్టండి.

(అ) నేను పక్షులపై / జంతువులపై దయ …..
✓ఎప్పుడూ కలిగి ఉంటాను / అప్పుడప్పుడు కలిగి ఉంటాను / అసలు కలిగి ఉండను.

(ఆ) నేను యాచకులకు భిక్ష …..
✓ఎప్పుడూ పెడుతాను / అప్పుడప్పుడు పెడుతాను / అసలు పెట్టను

(ఇ) నాకు మనసులో మోసపు ఆలోచనలు
ఎప్పుడూ వస్తాయి / అప్పుడప్పుడు వస్తాయి / అసలు రావు ✓

(ఈ) నేను మంచి దృష్టితో
✓ఎప్పుడూ ఉంటాను / అప్పుడప్పుడు ఉంటాను / అసలు ఉండను

(ఉ) నేను మంచి వారితోనే స్నేహం
✓ఎప్పుడూ చేస్తాను / అప్పుడప్పుడుచేస్తాను / అసలు చేయను

(ఊ) నేను ఓర్పుతో
✓ఎప్పుడూ ఉంటాను / అప్పుడప్పుడు ఉంటాను / అసలు ఉండను

(ఋ) నేను అమ్మను, ఉరును …….
✓ఎప్పుడూ గౌరవిస్తాను / అప్పుడప్పుడు గౌరవిస్తాను / అసలు గౌరవించను

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

(అ) ‘సత్పురుషుల స్నేహం అవసరం’. ఎందుకు?
జవాబు.

  1. మంచి వారితో స్నేహం ఎప్పుడూ మంచినే కల్గిస్తుంది.
  2. గంధం చెట్టు అడవిని గంధపు వాసనతో వ్యాప్తి చేసినట్లు మంచివారు తన మంచితనాన్ని వ్యాప్తి చేస్తారు.
  3. మంచివారితో స్నేహం వలన ధైర్యము కలుగుతుంది.
  4. చక్కగా మాట్లాడే నైపుణ్యం వస్తుంది.
  5. మనలోని బుద్ధిమాంద్యం తొలగుతుంది.
  6. అన్యాయం, అధర్మం, అసత్యములకు దూరంగా ఉంచుతుంది.
  7. మనకు మంచి కీర్తి లభిస్తుంది.
  8. మంచివారి స్నేహం వలన లోకంలో సాధించలేనిది లేదు.

(ఆ) ఉన్న ఊరు, కన్నతల్లి స్వర్గం వంటివి. ఎందుకు?
జవాబు.

  1. జననీ, జన్మభూమి స్వర్గం కంటే విలువైనవి.
  2. తల్లి తన పొట్టలో 9 నెలలు తన శరీరం నుండి అన్ని అవయవాలను తయారుచేసి, మోసి చాలా జాగ్రత్తగా పెంచుతుంది. ఆమె చూపే సహనం, ఓపిక, ప్రేమ ఎవరూ చూపలేరు.
  3. అందరికంటే తన బిడ్డ అందమైనదిగా భావించి జీవితం చివరి వరకు ప్రేమను ఇచ్చేది తల్లి కాబట్టి చాలా విలువైనది తల్లి.
  4. పుట్టిన నేల స్వర్గం కంటే చాలా గొప్పది.
  5. ఎక్కడికెళ్ళినా తన జన్మస్థానంలో ఉన్నన్ని విశేషాలనే ఎప్పుడూ గొప్పగా చెప్పాలి! అందుకే స్వర్గంతో సమానం.

TS 7th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana శతక సుధ

(ఇ) ధనం బాగా ఉంటే ఏమేం మంచిపనులు చేయవచ్చు?
జవాబు.

  1. ధనం బాగా ఉంటే చాలా మంచిపనులు చేయవచ్చు.
  2. పేదవారికి ప్రతినిత్యము అన్నదానము చేయవచ్చు.
  3. పేదవారికి ఇళ్ళు వాకిళ్ళు నిర్మించి ఇవ్వవచ్చు.
  4. సమాజంలో పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు.
  5. పాఠశాలలను నెలకొల్పి అందరికి చదువు చెప్పించవచ్చు.
  6. సమాజంలో ఎక్కువ మందికి ఉపయోగపడే అనేక మంచి కార్యాలు చేయవచ్చు.
  7. నీటివసతి, రవాణా వసతులను కల్పించవచ్చు.
  8. వైద్యం చేయించుకోలేని వారికి వైద్యశాలలు నెలకొల్పవచ్చు.
  9. మనసుంటే ఎన్ని పనులైనా చేయవచ్చును.

(ఈ) ‘లోభి ఎప్పుడూ సంతోషంగా ఉండడు’. ఎందుకు?
జవాబు.

  1. లోభి (పిసినారి) తాను సంపాదించిన దానిని తాను అనుభవించడు, ఎవరినీ అనుభవించనివ్వడు. అందుకనే సంతోషంగా ఉండలేడు.
  2. లోభికి ఎప్పుడూ దానగుణము లేకపోవడం వలన ఆ దాచిన ధనము తేనెటీగ తాను పెట్టిన తేనె వలె చివరకు ఇతరుల పాలగును.
  3. దాత దానము చేసినా తన సొమ్ము పోయినట్లుగా బాధపడతాడే కాని సంతోష పడడు.
  4. లోభి ఇతరులకు మేలు జరిగితే దుఃఖ పడతాడు.
  5. లోభికి ఎప్పుడూ విచారమే ఎందుకనగా ఎవరూ అతని పిసినారితనాన్ని ఇష్టపడరు.
  6. లోభి ఎంతకూడబెట్టినా సంతృప్తి లేకపోవడం వలన, ఇంకా కూడబెట్టాలనే కోరికతో ఎప్పుడూ దిగులుపడుతూ విచారంగా ఉంటాడు.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

1. పాఠంలోని శతకపద్యాల ఆధారంగా మన ప్రవర్తన, నడవడిక ఎట్లా ఉండాలో వివరించండి?
జవాబు.

(అ) నిజమైన వ్యక్తి :
1. మనము దానగుణము కలిగి ఉండాలి.
2. కష్టాలను ఓర్చుకొనే గుణాన్ని అలవరచుకోవాలి.
3. ధైర్యంతో ముందుకు వెళితేనే దేనినైనా సాధించగలం.

(ఆ) స్థిరమైన బుద్ధి :
1. ఏనుగు, చేప, పాము, జింక, తుమ్మెదలు తమ బలహీనత వలన ఇతరులకు దొరికి పోతున్నాయి.
2.మానవుడు తనలోని ఆరు శత్రువులను (కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాల) జయించినపుడే దేవతగా గౌరవించబడతాడు.

(ఇ) దాత :
1. లోభి తాను తన సొమ్ము దానం చేయడు.
2. దాత తన సొమ్ము దానం చేస్తున్నా చెయ్యనివ్వడు.
3. అట్టి పిసినారిని మనం దూరంగా ఉంచాలి.

(ఈ) సజ్జన స్వభావం :
1. మంచి స్వభావాన్ని కలిగి ఉండాలి.
2. మంచి పవర్తన అందాన్నిస్తుంది.
3. గౌరవాన్ని కలిగిస్తుంది.
4. కీర్తి పెంపొందింపచేస్తుంది.

(ఉ) స్నేహశీలత :
1. మంచివారి స్నేహం చెయ్యాలి.
2. మంచి స్నేహం మానవతను పెంచుతుంది.
3. అనేక మంచి గుణాలను కలిగిస్తుంది.

IV. సృజనాత్మకత/ప్రశంస

1 పద్యాల ఆధారంగా నీతిని తెలిపే సూక్తులను తయారుచేయండి. రాయండి. ప్రదర్శించండి.
జవాబు.

  1. ఆకలి రుచి ఎరుగదు.
  2. విసుగు లేకుండా ఇచ్చేవాడే దాత.
  3. కష్టాలను ఓర్చుకొన్నవాడే మనిషి.
  4. ధైర్యసాహసాలు కలవాడే వీరుడు.
  5. మనస్సును అదుపు చేయగలిగేవాడే గొప్పవాడు.
  6. కష్టపెట్టువాడు కలకాలం ఉండడు.
  7. మంచి వారితో స్నేహం చేయాలి.

2. శతకసుధ అనే పాఠం ద్వారా నీవు గ్రహించిన నీతిని తెలుపుతూ మిత్రునికి లేఖ వ్రాయి.
జవాబు.

కరీంనగర్,
తేది : XXXX

ప్రియమైన మిత్రునికి అభినందనలు.

నేనిక్కడ కుశలం. అక్కడి నీ కుశలములు తెలుపుము. మాకు ఈ నెలలో మా తెలుగు మాష్టారుగారు ‘శతకసుధ’ అనే నీతిపద్యాల పాఠాన్ని బోధించారు. అవి నేను ఈ లేఖలో కొన్ని తెలుపుతాను. శతక పద్యాలు చదవడానికి ఎంతో వీలుగా నీతులతో కూడి ఉన్నాయి. రాగవంతంగా పాడాము. ఉన్నదానిలో ఎంతో కొంత దానం చెయ్యాలి. మనలో ఉన్న పిసినారితనం, కోపం, మోహం వంటి చెడ్డ గుణాలను వదలి వెయ్యాలి. లోభి మాటలను వినకుండా మనం ఇతరకులకు దానం చెయ్యాలి. ఇతరులు నిన్ను గేలి చేసినా వాదమునకు దిగవద్దు. పేదవారిని అనవసరంగా బాధలకు గురిచేయవద్దు. నీవుగూడ ఇటువంటి మంచి విషయాలు నేర్చుకొన్న వాటిని నాకు తెలియచెయ్యి! ఉంటాను.

నీ మిత్రుడు
కె. రమేష్,
7వతరగతి, జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల,
కరీంనగర్.

చిరునామా :
సురేష్,
7వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల,
ఖమ్మం.

V. పదజాల వినియోగం:

1. కింద ఇచ్చిన పదాల అర్థాలను జతపరచండి.

మకుటాలు (3) 1. అపహాస్యం
(అ) నరుడు (1) 2. మోసం
(ఆ) గేలి (5) 3. మానవుడు
(ఇ) జిహ్వ (2) 4. భూమి
(ఈ) కపటము (4) 5. నాలుక
(ఉ) ధరిత్రి (3) 1. అపహాస్యం


2. కింది వాక్యాలను చదవండి. ఇచ్చిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలను గుర్తించండి.

(అ) ధరిత్రి : భూమిపై కాలుష్యం పెరిగింది. నేల కోతవల్ల పంటలు పండటం లేదు. అవనిని తల్లిగా పూజిస్తాం. జవాబు. భూమి, నేల, అవని

(ఆ) తావి : పువ్వుకు తావి వల్ల కీర్తి వస్తుంది. పరిమళం ఆఘ్రాణించాలని ఎవరికుండదు? సువాసనలు సంతోషాన్నిస్తాయి.
జవాబు.
తావి, పరిమళం, సువాసన

TS 7th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana శతక సుధ

3. కింది వాక్యాలలో నానార్థాలను గుర్తించండి.

(అ) శ్రీ : సాలెపురుగు తన గూడును అద్భుతంగా కడుతుంది. పాము కోరల్లో విషం ఉంటుంది. సంపద శాశ్వతం కాదు. బుద్ధిబలం అవసరం.
జవాబు.
శ్రీ : సాలెపురుగు, సంపద

(ఆ) ధనము : గోపాలుడు విత్తము తీసికొని అంగడికి వెళ్ళాడు. పాడిసంపదను పెంచడానికి ఆవుల మందను కొన్నాడు.
జవాబు.
ధనము : విత్తము, సంపద

4. కింది పేరాను చదవండి. ఖాళీలలో తగిన పదాలను రాయండి.

(నిజం, ఓర్పు, బాధ, చాడీలు, నీతి)

సిరి, శాంతిది ఒకే తరగతి. సిర రోజూ బడిలో చెప్పిన పాఠాలను ఎప్పటికప్పుడు రాసుకోవడం, చదువుకోవడం చేసేది. శాంతి బడికి సరిగ్గా వచ్చేది కాదు. అందరినీ తన అల్లరితో ……….. (1) పెట్టేది. ….(2) చెప్పేది. ఒకరోజు శాంతి, సిరి నోట్బుక్ను దాచింది. ఈ విషయం తెలిసినా శాంతిని ఏమీ అనలేదు. ఉపాధ్యాయిని నోట్బుక్లను పరిశీలించడానికి తీసుకుంది. సిరి నోట్బుక్ లేదు. ఉపాధ్యాయిని సిరిని అడిగింది. సిరి మౌనంగా ఉండిపోయింది.

ఉపాధ్యాయిని ………………….. (3) తెలుసుకుంది. ఆ తర్వాత పిల్లలకు ………………… (4) కథలను ఉదహరిస్తూ శతక పద్యాల్లో ఉండే మానవతా విలువలను గురించి చెప్పి, నిజజీవితంలో ఎట్లా ఆచరించాలో తరగతిలో చర్చించారు. శాంతిలో పరివర్తన వచ్చింది. సిరికి, శాంతి క్షమాపణలు చెప్పింది. అందరూ సిరి ………….. (5) ను ప్రశంసించారు.
జవాబులు :
సిరి, శాంతిది ఒకే తరగతి. సిర రోజూ బడిలో చెప్పిన పాఠాలను ఎప్పటికప్పుడు రాసుకోవడం, చదువుకోవడం చేసేది. శాంతి బడికి సరిగ్గా వచ్చేది కాదు. అందరినీ తన అల్లరితో బాధ పెట్టేది. చాడీలు చెప్పేది. ఒకరోజు శాంతి, సిరి నోట్బుక్ను దాచింది. ఈ విషయం తెలిసినా శాంతిని ఏమీ అనలేదు. ఉపాధ్యాయిని నోట్బుక్లను పరిశీలించడానికి తీసుకుంది. సిరి నోట్బుక్ లేదు.

ఉపాధ్యాయిని సిరిని అడిగింది. సిరి మౌనంగా ఉండిపోయింది. ఉపాధ్యాయిని నిజం తెలుసుకుంది. ఆ తర్వాత పిల్లలకు నీతి కథలను ఉదహరిస్తూ శతక పద్యాల్లో ఉండే మానవతా విలువలను గురించి చెప్పి, నిజజీవితంలో ఎట్లా ఆచరించాలో తరగతిలో చర్చించారు. శాంతిలో పరివర్తన వచ్చింది. సిరికి, శాంతి క్షమాపణలు చెప్పింది. అందరూ సిరి ఓర్పు ను ప్రశంసించారు.

VI. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది వాక్యాల్లో భాషాభాగాలను గుర్తించండి. పట్టికలో రాయండి.

(అ) మామిడిపండు తియ్యగా ఉంది.
(ఆ) అయ్యో! రమ చదువు ఆగిపోయిందా?
(ఇ) పిల్లలు శతక పద్యాలను చదువుతున్నారు.
(ఈ) ఆమె మహాసాధ్వి.
(ఉ) కాంచీపురంలో అనేక దేవాలయాలు ఉన్నాయి.
(ఊ) అరుణ భానుడు తూర్పున ఉదయిస్తాడు.
(ఋ) రాముడు మంచిబాలుడు.

నామవాచకం సర్వనామం విశేషణం (కియ అవ్యయం
మామిడిపండు తియ్యగా ఉంది
(ఆ) రమ, చదువు ఆగిపోయిందా? అయ్యో !
(ఇ) పిల్లలు, శతకపద్యాలు చదువుతున్నరరు.
(ఈ) ఆమె మహాసాధ్వి
(ఉ) కాంచీపురం దేవాలయాలు అనేక ఉన్నయి
(ఊ) అరుణభానుడు తూర్పున ఉదయిస్తాడు
(ఋ) రాముడు బాలుడు మంచి

కింది పదాలను కలిపిన విధానాన్ని పరిశీలించండి.

నేడు + ఇక్కడ = నేడిక్కడ (డ్ + ఉ + ఇ) = ఇ (డి)
వారు + ఇచ్చట = వారిచ్చట (ర్ + ఉ + ఇ) = ఇ (రి)
పై మొదటిపదంలో (నేడు) చివరి అచ్చు (పూర్వస్వరం) ‘ఉ’, రెండవ పదం (ఇక్కడ)లో మొదటి అచ్చు (పరస్వరం) ‘ఇ’ ‘ఉ’కారానికి ‘ఇ’ కారం కలిపినప్పుడు ‘ఇ’ కారమే నిలబడుతుంది. అంటే సంధి జరిగిందన్నమాట. పూర్వస్వరానికి పరస్వరం వచ్చి చేరినప్పుడు పరస్వరమే నిలుస్తుంది. దీనినే ‘సంధి’ అంటాం.

పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశమగుట సంధి.
(ఏకాదేశమంటే ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడం.)

కింది పదాలను కలిపి రాయండి.

(అ) దానము + ఒసంగి =
(ఆ) కవితలు + అల్లిన =
(ఇ) విఘ్నంబు + ఐన =
(ఈ) కపటము + ఉండు =
(ఉ) బదులు + ఆడునె =
జవాబు:
(అ) దానము + ఒసంగి = దానమొసంగి
(ఆ) కవితలు + అల్లిన = కవితలల్లిన
(ఇ) విఘ్నంబు + ఐన = విఘ్నంబైన
(ఈ) కపటము + ఉండు = కపటముండు
(ఉ) బదులు + ఆడునె = బదులాడునె

ప్రాజెక్టు పని:

పాఠశాల గ్రంథాలయం నుండి వివిధ శతకాలను సేకరించి, పరిశీలించి అంశాలవారీగా కింది పట్టికలో రాయండి. ప్రదర్శించండి.
జవాబు.

శతకం మకుటం కవిపేరు
దాశరథీ శతకం దాశరథీ!కరుణాపయోనిధీ! కంచెర్ల గోపన్న
సుమతీ సుమతీ! బద్దెన
భాస్కర భాస్కరా! మారద వెంకయ్య
శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తీశ్వరా! ధూర్జటి
నారాయణ నారాయణా! బమ్మెరపోతన
సర్వేశ్వర సర్వేశ్వరా! యథావాక్కుల అన్నమయ్య


విశేషాంశాలు:

“జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ” అని శ్రీరాముడు చెప్పాడు అని ప్రతీతి. కన్నతల్లి, జన్మభూమి స్వర్గం కన్నా మిన్న అని భావం.

TS 7th Class Telugu 3rd Lesson Important Questions శతక సుధ

క్రింది శతకాలసు రచయితలతో జతపరచండి.

శతకాలు (ఊ) (అ) వేమన
1. దాశరథి (ఋ) (ఆ) ఆడెపు చంద్రమౌళి
2. సుమతి (అ) (ఇ) ధూపాటి సంపత్కుమారాచార్య
3. వేమన (ఉ) (ఈ) రావికంటి రామయ్య గుప్త
4. నరసింహ (ఇ) (ఉ) కాకుత్థ్సం శేషప్ప కవి
5. శ్రీ యాదగిరి లక్ష్మీనృసింహ (ఈ) (ఊ) కంచెర్ల గోపన్న (రామదాసు)
6. నగ్న సత్యాలు (ఆ) (ఋ) బద్దెన
7. శ్రీ శ్రీనిహాస దామ్మల (ఊ) (అ) వేమన


క్రింది మకుటాలను శతకాలతో జతపరచండి.

మకుటాలు (ౠ) శతకాలు
1. సుమతీ! (ఈ) (అ) దాశరథీ శతకం
2. యాదగిరి వాస! నృసింహ! రమావిభో ప్రభో! (ఉ) (ఆ) నరసింహ శతకం
3. చిద్విలాస భాస! శ్రీనివాస! (ఊ) (ఇ) నృకేసరి శతకం
4. కల్లగాదు రావికంటి మాట! (ఋ) (ఈ) శ్రీయాదగిరి లక్ష్మీనృససంహ శతకం
5. వేమా! / విశ్వదాభిరామ వినురవేమ! (ఇ) (ఉ) శ్రీశ్రీనివాస దొమ్మల శతకం
6. ధర్మపురీ నృకేసరీ! (ఆ) (ఊ) రావికంటి శతకం
7. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహర! నరసింహ దురితదూర! (అ) (ఋ) వేమన శతకం
8. దాశరథీ కరుణా పయోనిధీ! (ౠ) (ఋూ) సుమతీ శతకం

(ఉ) మోసగాని స్వభావం ఎట్టిది?
జవాబు.

  1. మోసగాడు ఎప్పుడూ ఇతరులను ఎలా మోసం చేయాలో ఆలోచిస్తూ ఉంటాడు.
  2. మోసగాడు అన్ని సందర్భాలలో గెలవలేడు.
  3. ఏదో ఒక రోజు అతని మోసం బయటపడుతుంది.
  4. సమాజంలో మోసగాడు మాటలద్వారా, పనుల ద్వారా ఆలోచనల ద్వారా మోసం చేస్తాడు.
  5. ప్రతి ఒక్కరూ మోసగాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి.

(ఊ) ఎందుకు దానం చెయ్యాలి?
జవాబు.

  1. ప్రతి వ్యక్తి ధనం సంపాదించాలి. దానం చెయ్యాలి.
  2. దానం చేస్తే ఇతరులకు మేలు కలుగుతుంది.
  3. సంపాదించినది అనుభవిస్తే ఆనందం కలుగుతుంది.
  4. తను సంపాదించిన దానిని దానం చెయ్యడం వలన సార్థకత చేకూరుతుంది.
  5. దానం ఒక పరిమితికి లోబడి చెయ్యడం వలన ఆత్మ తృప్తి కలుగుతుంది.

TS 7th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana శతక సుధ

1. జీవితం ఆదర్శంగా ఉండాలంటే మనము ఏమి చేయాలి?
జవాబు.
1. జీవితము :
(అ) ప్రతివ్యక్తి పుట్టుకతో కొన్ని సహజ లక్షణాలను కలిగి ఉంటాడు.
(ఆ) తల్లిదండ్రులనుండి, ఇతరుల నుండి గమనించడం ద్వారా తెలుసుకుంటాడు.
(ఇ) అతనిపై అనేకమంది వ్యక్తుల, సమాజ ప్రభావం ఉంటుంది.

2. ఆదర్శము :
(ఈ) పెరుగుతున్న కొద్దీ అనుకరించడం ద్వారా ఇతర లక్షణాలను అలవరచుకొంటాడు.
(ఎ) మంచి, చెడుల విచక్షణ గూర్చి ఆలోచిస్తాడు.
(ఏ) ఏ ప్రభావం ఎక్కువగా ఉంటే అటువైపు మరలుతాడు.

3. ఆదర్శవంతమైన ప్రవర్తన :
(ఐ) ఆదర్శవంతమైన ప్రవర్తనకై మనం ఎల్లప్పుడూ మంచివైపు పయనించాలి.
(ఒ) గొప్పవ్యక్తుల జీవితాలలోని విషయాలను మనమీద ప్రభావితం అయ్యేటట్లు చూసుకోవాలి.
(ఓ) ప్రతి సందర్భంలో ఆత్మవిశ్వాసంతో, నిగ్రహంతో వ్యవహరిస్తేనే ఆదర్శవంతంగా తయారుకాగలము.

2. నీతి పద్యాలను ఎందుకు చదవాలి?
జవాబు.

  1. నీతి పద్యాలలో జీవితానికి ఉపయోగపడే నీతివాక్యాలు ఉంటాయి.
  2. మన మనసుకు హాయిని, ఆనందాన్ని ఇస్తాయి.
  3. మంచి భాష, జాతీయాలు, లోకోక్తులు తెలుసుకుంటాము.
  4. తియ్యనైన తెలుగుభాష పద్యాల ద్వారా అభ్యాసం కాగలదు.
  5. మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
  6. నీలోని నీతి నిన్నెపుడూ కాపాడుతుంది.
  7. ఇతరులకు మంచి సందేశాలను ఇవ్వగల్గుతాము.
  8. ప్రాచీన కవుల రచనాశైలి, పద్ధతులు తెలుస్తాయి.

3. పాఠంలోని పద్యాల ఆధారంగా మీరు తెలుసుకొన్న ‘నినాదాలు’ రాయండి. (అదనపు ప్రశ్న)
జవాబు.

  1. ఓర్పు, శాంతం మానవునికి ఆభరణాలు.
  2. పదుగు రాడు మాట పాడియై ధరచెల్లు.
  3. కలిమి లేములు కావడి కుండలు.
  4. లోభుల సంపద లోకుల పాలు.
  5. మోసం చేసేవాణ్ణి ఎవరూ నమ్మరు.
  6. పేదవారిని బాధపెట్టేవారు కలకాలం ఉండరు.
  7. సాధుసంగమంబు సకలార్ధ సాధనంబు.
  8. జననీ జన్మభూమి స్వర్గం కంటె మిన్న.
  9. సద్గుణాలు వజ్రాల కన్నా విలువైనవి.
  10. రాజు స్వదేశంలోను, పండితుడు అంతటా గౌరవించబడతాడు.
  11. అన్ని దానముల కంటే విద్యాదానం గొప్పది.
  12. విద్యవలన వినయం, ధనం, సుఖం అన్నీ లభిస్తాయి.
  13. విద్యలేనివాడు వింత పశువు.
  14. శ్రమయేవ జయతే!

పర్యాయపదాలు: 

  • జనని = అమ్మ, తల్లి, మాత
  • దాత = త్యాగి, వితరణశీలి, ఉదారుడు
  • ఏనుగు = కరి, హస్తి, ఇభము, గజము
  • ధరిత్రి = భూమి, నేల, అవని, వసుధ
  • దాశరథి = శ్రీరాముడు, జానకీ వల్లభుడు, రఘునందనుడు
  • సూక్తి = మంచిమాట, సుభాషితము
  • నరుడు = మానవుడు, మనుజుడు
  • మది = మనసు, అంతరంగము
  • దానవుడు = రాక్షసుడు, అసురుడు
  • నవ్యము = నూతనము, కొత్తది

నానార్థాలు:

  • ధర = భూమి, వెల
  • కేసరి = సింహం, గుర్రము, (శేష్ఠుడు
  • ధనం = విత్తం, ఆస్తి, ఆవులమంద, ధనియం, ధనిష్రా నక్షత్రం
  • పాదము = కాలి అడుగు భాగం, కిరణం, పాతిక భాగం
  • శ్రీ = సాలెపురుగు, బుద్దిబలం, సరస్వతి, లక్ష్మి
  • ఫలము = ఫలితము, పండు
  • తగవు = జగడం, పద్ధతి, మేలు, న్యాయం
  • తెంపు = తెంచుట, ధైర్లము
  • విభవము = సంపద, గొప్పతనము
  • కాంచు = చూచు, సంపద పొందుట

TS 7th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana శతక సుధ

ప్రకృతి – వికృతి:

  • శ్రీ – సిరి
  • సింహం – సింగం
  • ధర్మం – దమ్మం
  • సత్యం – సత్తెం
  • దిశ – దెస
  • సంతోషం – సంతసం
  • విజ్ఞానం – విస్నాణం
  • భూమి – భువి
  • వంశం – వంగడం
  • వర్ణము – వన్నె
  • నిజం – నిక్కం

పాఠంలో వచ్చిన సంధులు:

సోకోర్చు సోకు + ఓర్చు ఉత్వసంధి
మానవుడున్న మానవుడు + ఉన్న ఉత్వసంధి
భిక్షమర్థికి భిక్షము + అర్థికి ఉత్వసంధి
చెప్పుచుండు చెప్పుచు + ఉండు ఉత్వసంధి
శత్రువని శత్రువు + అని ఉత్వసంధి
తనకెవ్వడు తనకు + ఎవ్వడు ఉత్వసంధి
సూక్తి సు + ఉక్తి సవర్ణదీర్ఘ సంధి
నీవనిశము నీవు + అనిశము ఉత్వసంధి
ఘనములన్న ఘనములు + అన్న ఉత్వసంధి
కపటముండు కపటము + ఉండు ఉత్వసంధి
విద్యార్థి విద్య + అర్థి సవర్ణదీర్ఘ సంధి
ముక్తావళి ముక్త + ఆవళి సవర్ణదీర్ఘ సంధి
గీతామృతం గీత + అమృతం సవర్ణదీర్ఘ సంధి
మరింకెందుకు మరింక + ఎందుకు అకార సంధి


విగ్రహా వాక్యాలు / సమాసాలు:

ఐదు సాధనములు – ఐదు అను సంఖ్యగల సాధనములు = ద్విగు సమాసము
తల్లిదండడులు – తల్లి మరియు తండ్రి = ద్విగు సమాసము

1. క్రింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి.

1. సోకోర్చు వాడె మనుజుడు
ఆకొన్న కూడె యమృతము
తేకువ గల వాడె వంశ తిలకుడు సుమతీ
తాకొంచక నిచ్చువాడె దాత ధరిత్రిన
జవాబు:
ఆకొన్న కూడె యమృతము
తాకొంచక నిచ్చువాడె దాత ధరిత్రిన
సోకోర్చు వాడె మనుజుడు
తేకువ గల వాడె వంశ తిలకుడు సుమతీ

2. కష్టపెట్టువారు కల కాల ముందురా
పేదవాడు పడెడుబాధ గనుక
కల్ల గాదు రావి కంటి మాట
ధనము దమ్ముచేత దానవుండై పోయి
జవాబు:
ధనము దమ్ముచేత దానవుండై పోయి
పేదవాడు పడెడుబాధ గనుక
కష్టపెట్టువారు కల కాల ముందురా
కల్ల గాదు రావి కంటి మాట

3. చిద్విలాస భాస శ్రీనివాస
కమలనయన నిన్ను గాంచనిమ్ము
సత్పురుషుల మైత్రి సలుపగా మనసిమ్ము
విశ్వశాంతి కోరు విజ్ఞానమే ఇమ్ము
జవాబు:
సత్పురుషుల మైత్రి సలుపగా మనసిమ్ము
కమలనయన నిన్ను గాంచనిమ్ము
విశ్వశాంతి కోరు విజ్ఞానమే ఇమ్ము
చిద్విలాస భాస శ్రీనివాస

II. క్రింది అపరిచిత పద్యాలు చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు తగిన విధంగా ఒక వాక్యంలో జవాబు వ్రాయండి.

4. ఆత్మశుద్ధిలేని ఆచార మదియేల?
భాండ శుద్ధిలేని పాకమేల
చిత్త శుద్ధిలేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ వినురవేమ!
ప్రశ్నలు :
(అ) పాకమునకు దేని శుద్ధి అవసరం?
జవాబు:
పాకమునకు భాండశుద్ధి అవసరం

(ఆ) చిత్తశుద్ధి లేకుండా దేనిని చేయరాదు?
జవాబు:
చిత్తశుద్ధి లేకుండా శివపూజ చేయరాదు.

(ఇ) ఈ పద్య సారాంశం ఏమిటి?
జవాబు:
ఏ పని చేసినా స్వచ్ఛత అవసరమని ఈ పద్య సారాంశం.

(ఈ) ఈ పద్యాన్ని వ్రాసిన కవి ఎవరు?.
జవాబు:
ఈ పద్యాన్ని వ్రాసిన కవి వేమన.

(ఉ) ఈ పద్యానికి మకుటం ఏది?
జవాబు:
ఈ పద్యానికి మకుటం ‘విశ్వదాభిరామ వినురవేమ.

TS 7th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana శతక సుధ

5. తివిరి యిసుమున తైలంబు తీయవచ్చు
తవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.
ప్రశ్నలు :
(అ) ప్రయత్నించి ఇసుక నుండి దేనిని తీయవచ్చు?
జవాబు:
(ప్రయత్నించిన ఇసుక నుండి నూనెను తీయవచ్చు.

(ఆ) ప్రయత్నిస్తే దేనినుండి నీరు త్రాగవచ్చును?
జవాబు:
(వరంత్నిస్తే ఎడారిలోని ఒయాసిస్స నీరు తతరావచ్చును.

(ఇ) ఎక్కడైనా తిరిగి సాధించ గలిగేది ఏమిటి?
జవాబు:
ఎక్కడైనా తిరిగి సాధించగలిగేది కుందేటి కొమ్ము.

(ఈ) ఎంత ప్రయత్నించినా దేనిని చేయలేము ?
జవాబు:
ఎంత (ప్రయత్నించినా మూర్ఖల వునసును మార్చలేము.

(ఉ) మృగతృష్ణ అనగా ఏమి?
జవాబు:
మృగతృష్ణ అనగా ఎడారిలోని ఒయాసిస్సు.

III. పదజాలం

1. క్రింది వాక్యాలలోని పర్యాయపదాలను గుర్తించి వేరుగా వ్రాయండి.

(అ) దేవాలయంలో దేవుడి విగ్రహాలు ఉంటాయి. పూజారులు కోవెలలో పూజలు చేస్తారు. గుడికి మనమంతా వెళ్తాము.
జవాబు:
దేవాలయం, కోవెల, గుడి

(ఆ) దేవతలు రాక్షసులు అమృతం కోసం పాలసముద్రాన్ని మధించారు. దానవులకు అమృతం దక్కలేదు. అసురులకు విచారమే మిగిలినది.
జవాబు:
రాక్షసులు, దానవులు, అసురులు

(ఇ) దశరథ మహారాజు కుమారుడు దాశరథి. శ్రీరాముడు రాజ్యాన్ని, ప్రజలను చక్కగా పాలించాడు. రఘునందనుని కీర్తి అంతటా వ్యాపించినది.
జవాబు:
దాశరథి, శ్రీరాముడు, రఘునందనుడు

(ఈ) ఈ ధరిత్రిలో అనేక జీవరాశులున్నాయి. భూమి అన్ని ఖనిజాలకు మూలము. వసుధ అన్ని ప్రాణులను తనలో ఇముడ్చుకొనును.
జవాబు:
ధరిత్రి, భూమి, వసుధ

(ఉ) అన్ని జంతువులలోను గజము పెద్దది. కరి తొండము పొడవుగా ఉండును. అడవులలో ఏనుగుల చేత బరువులు మోయిస్తారు.
జవాబు:
గజము, కరి, ఏనుగు

2. క్రింది వాక్యాలలోని ప్రకృతి, వికృతులను గుర్తించి వేరుగా వ్రాయండి.

(అ) ఎప్పుడూ సత్యమునే మాట్లాడాలి! సత్తెమునకు మంచి శక్తి కలదు.
జవాబు:
సత్వ్యము (ప్ర) – సత్తెము (వి)

(ఆ) ఇంద్రధనస్సులో అనేక వర్ణాలున్నాయి. వాటి వన్నెలు ఏడు.
జవాబు:
వర్ణము (ప్ర) – వన్నెలు (వి)

(ఇ) తూర్పుదిశలో సూర్యుడు ఉదయించును. పడమటి దెసలో అస్తమించును.
జవాబు:
దిశ (ప్ర) – దెస(వి)

(ఈ) అందరూ సంతోషంగా జీవించాలి. ప్రతివారు సంతసం గా ఉన్నపుడే అందరికీ ఆనందము.
జవాబు:
సంతోషంగా (ప్ర) – సంతసం (వి)

(ఉ) నిజము నిలకడ మీద తెలియును. నీరు పల్లమెరుగు నిక్కము దేవుడెరుగు.
జవాబు:
నిజము (ప్ర) – నిక్కము (వి)

3. క్రింది వాక్యాలలోని విభక్తులను గుర్తించి వేరుగా వ్రాయండి.

(అ) రాముని యొక్క బాణము గురి తప్పదు.
(ఆ) ప్రజలకు దొంగల వలన భయం కలదు.
(ఇ) నేను నీకొరకు ఏ పనినైనా చేస్తాను.
(ఈ) అందరి యందు దేవుడున్నాడు.
(ఉ) ఇష్టం లేని వారి చేత ఏ పనీ చేయించలేము.
జవాబు:
యొక్క – షష్డీ విభక్తి
వలన – పంచమీ విభక్తి
కొరకు – చతుర్థీ విభక్తి
అందు – సప్తమీ విభక్తి
చేత – తృతీయా విభక్తి

IV. వ్యాకరణాంశాలు :

1. క్రింది వాక్యాలలోని గీత గీసిన సంధి పదాలను విడదీసి సంధులను గుర్తించండి.

(అ) పద్యం రసానుభూతి కలిగిస్తుంది.
(ఆ) మరింకెందుకు? ఆలస్యం చేయకండి!
(ఇ) సోకోర్చువాడె మనుజుడు
(ఈ) లోభి మానవుడు భిక్షమర్థికి చేత పెట్టలేడు.
(ఉ) మానవులందు అన్ని రకాల వారున్నారు.
జవాబు:

(అ) రస + అనుభూతి = సవర్ణదీర్ఘ సంధి
(ఆ) మరింక+ఎందుకు = అకార సంధి
(ఇ) సోకు+ఓర్చువాడె = ఉకార సంధి
(ఈ)భిక్షము+అర్థికి = ఉకార సంధి
(ఉ) మానవులు+అందు= ఉకార సంధి

2. క్రింది వాక్యాలలోని సమాస పదాలను గుర్తించి విగ్రహ వాక్యాలు వ్రాసి అవి ఏ సమాసాలో గుర్తించండి.

(అ) అన్నదమ్ములంతా కలసి మెలసి ఉండాలి.
జవాబు:
అన్నదమ్ములు అన్న మరియు తమ్ముడు – ద్వంద్వ సమాసం

(ఆ) నేను రెండు పుస్తకాలు చదివాను.
జవాబు:
రెండు పుస్తకాలు – రెండు అను సంఖ్య గల పుస్తకాలు = ద్విగు సమాసం

(ఇ) సీతారాములు అందరికీ ఆదర్శమూర్తులు.
జవాబు:
సీతారాములు – సీత మరియు రాముడు = ద్వంద్వ సమాసం

(ఈ) రావణునికి పది తలలున్నాయి.
జవాబు:
పదితలలు – పది అను సంఖ్య గల తలలు = ద్విగు సమాసం

(ఉ) వేసవిలో కూరగాయల ధరలెక్కువ.
జవాబు:
కూరగాయలు – కూర మరియు కాయ – ద్వంద్వ సమాసం

TS 7th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana శతక సుధ

పద్యాలు – ప్రతిపదార్థాలు – తాత్పర్యాలు

ఆఁకొన్న కూడె యమృతము
తాఁకొందక నిచ్చువాఁడె దాత ధరిత్రిన్
సోఁకోర్చువాఁడె మనుజుఁడు
తేఁకువ గలవాఁడె వంశతిలకుఁడు సుమతీ!

ప్రతిపదార్థం

సుమతీ! = ఓ మంచి బుద్ధి కలవాడా!
ఆఁకొన్న=  బాగా ఆకలిగా ఉన్నప్పుడు
కూడె = తిన్న అన్నమే (ఆహారమే)
అమృతము = అమ్తృ వలే తియ్లగా ఉండును
ధరిత్రిన్ = భూమిపై
తాన్ = తాను
కొందగన్ = విసుగుచెందకుండా
ఇచ్చువాడు + ఎ = దానం చేసేవాడే
దాత = నిజమైన దానగుణం కలవాడు
సోకు = కష్టాన్ని
ఓర్చువాడు + ఎ = తట్టుకొనేవాడే
మనుజుడు = మానవుడు
తేకువ = సాహసం
కలవాడు + ఎ = ఉన్నవాడే
వంశ = తన వంశానికి
తిలకుడు = కీర్తి తెస్తాడు.

తాత్పర్యం : ఓ మంచి బుద్ధిగలవాడా! బాగా ఆకలి వేసినపుడు తిన్న అన్నమే అమృతం వలె చాలా రుచిగా అనిపిస్తుంది. విసుగులేకుండా దానం చేసేవాడే ఈ భూమి మీద నిజమైన దాత. కష్టాన్ని ఓర్చుకొనగలవాడే మనిషి. ధైర్యమున్నవాడే తన వంశానికి వన్నె తెస్తాడు.

2. ఉ. వనకరి చిక్కెమైనసకు, వాచవికిం జెడిపోయె మీను,తా
వినికికిఁ జిక్కెఁజిల్వ గనువేదురుఁజెందెను లేళ్ళు, తావినో
మనికి నశించెఁ దేటి, తరమా యిరు మూటిని గెల్వ, నైదు సా
ధనముల నీవె గావదగు దాశరథీ! కరుణాపయోనిధీ!

ప్రతిపదార్థం

కరుణాపయోనిధీ! = దయకు సముద్రం వంటివాడా!
దాశరథీ = దశరథుని కుమారుడా! శ్రీరామా!
వనకరి = అడవి ఏనుగు
మైనసకున్ = శరీరపు దురదకు
చిక్కై్ = ఆపదలో పడింది పట్టువడింది
వాచవికిన్-వాయి చవికిన్ = నోటి రుచికి
మీను = చేప
చెడిపోయెన్ = గాలానికి చిక్కి నశించి పోయింది
చిల్వ = పాము
తాన్ = తాను
వినికికిన్ = వినడానికి (నాదస్వరం మీది మోజుతో)
చిక్కెన్ = దొరికిపోయింది
లేళ్ళు = జింకలు
కనువేదురున్ = కంటి పిచ్చితో
చెందెను = సమీపించాయి
తేటి = తుమ్మెద
తావిన్ = సుగంధాన్ని
ఓమనికిన్ = పొందడానికి
నశించెన్ = చెడిపోయింది.
ఇరుమూడు+ని = ఐదింటిని
గెల్వన్ = జయించడం
తరము+ఆ = సాధ్యమా
ఐదుసాధనములన్ = ఐదు అవయవాలను
నీవు = నీవు మాత్రమే
కావన్+తగున్ = రక్షించగలవు

తాత్పర్యం: కరుణా సముద్రుడా! దశరథపుత్రుడా! శ్రీరామా! తన మేని దురదను పోగగొట్టుకోవడానికి ఏనుగు, నోటికి రుచి ఆశించి చేప, రాగానికి లొంగి పాము, దృష్టి భ్రమకులోనై జింక, పూలవాసనకు మైమరచి తుమ్మెదలు బందీలౌతున్నాయి. ఇట్లా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క ఇంద్రియ చపలత్వం వల్ల నళిస్తున్నాయి. ఈ పంచేంద్రియ చాపల్యం గల నేను, అరిషడ్వర్గాల (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు) నుండి ఎలా బయటపడగలను? (చాంచల్యాన్ని తొలగించి స్థిరమైన బుద్ధిని (ప్రసాదించుమని కవిభావన)

3.సీ లోకమందెవడైన లోఖిమానవుడున్న
ఖిక్షమర్థకిఁ చేతఁబెట్టలేడు
తాను బెట్టకయున్న తగవు పుట్టదుకాని
యొరులు పెట్టగఁజూని యోర్వలేడు
దాత దగ్గర జేరి తన ముల్లె వొయినట్లు
జిహ్వతోఁజాడీలు చెప్పుచుండు
ఫలము విఘ్నంబైన బలుసంతసమునందు
మేలుకల్గినఁజాల మిడుకుచుండు
ఆ॥వె॥ శ్రీరమానాథ! యిటువంటి క్రూరకును
భిక్షుకుల శత్రువని పేరుబెట్టవచ్చు
భూషణ వికాస! శ్రీరర్మపుర నివాస!
డుష్టసంహార నరసింహ దురితదూర!

ప్రతిపదార్థం

భూషణ = ఆభరణముల చేత
ఐకాస = పకాశించేవాడా
శ్రీధర్మపుర = శ్రీధర్మపురం అనే ఊరిలో
నివాస = సివసించేవాడా!
దుష్ట = దుర్మార్గులను
సంహార = చంపేవాడా!
దురిత = పాపాలను
దూర = దూరం చేసే వాడా!
నరసింహం = ఓ నరసింహావతారా!
లోకమందు = (పపంచంలో
ఎవడు+ఐన = ఎవరైనా
లోభి = పిసినారి
మానవుడు+ఉన్న = మనిషి ఉన్నచో
అర్థికిన్ = యాచకునికి
భిక్షము = ధనము లేదా ఆహారము
చేతన్ = తన చేతితో
పెట్టలేడు = పెట్టలేడు
తాను = తను
పెట్టక+ఉన్న = పెట్టకరోయిన
తగవు = ఏ ఇబ్బందీ
పుట్టదు = లేదు
కాని = కాని
ఒరులు = ఇతరులు
పెట్టగన్ = పెట్టుచుండగా
చూచి = చూస్తూ
ఓర్వలేడు = ఓర్చుకొనలేడు
దాత = దానంచేసేవాని
దగ్గరన్ + చేరి = దగ్గరగావెళ్ళి
తనముల్లు + ఎ = తన సంపద
ఒయినట్లు = పోయిన విధంగా
చాడీలు = అనవసర మాటలు
చెప్పుచు+ఉండు = చెప్తుంటాడు
ఫలము = దానం చేయడం
విఘ్నంబు+ఐన = చెడిపోయిన
పలు = చాలా
సంతసమును = సంతోషాన్ని
అందు = పొందుతాడు
మేలు = మంచి
కల్గినన్ = జరిగితే మాత్రము
మిడుకుచు+ఉండు = దుఃఖపడును
శ్రీరమానాథ = ఓ విష్ణుమూర్తీ!
ఇటువంటి = ఇలాంటి
క్రూరు = దుర్మార్గునికి
భిక్షుకుల = యాచకులకు
శత్రువు + అని = వ్యతిరేకి అని
పేరు = నామము
పెట్టవచ్చు = పెట్టవచ్చునుకదా!

తాత్పర్యం : ఆభరణాలచే ప్రకాశించేవాడా! శ్రీ ధర్మపురంలో నివసించేవాడా! దుష్టులను సంహరించేవాడా! పాపాలను దూరం చేసేవాడా! ఓ నరసింహా! పిసినారి యాచకులకు తన చేతితో భిక్షం పెట్టడు. పెట్టకపోతే ఏ గొడవలేదు. కాని ఇతరులు పెట్టినపుడు చూసి తాను ఓర్వలేడు. దానం చేసే దాత దగ్గరకు పోయి తనముల్లె (సొమ్ము) పోయినట్లుగా నోటి దురుసుతో చాడీలు చెబుతాడు. లోభి తాను అనుకున్నట్టు దానం చేయడం విఫలమైతే చాలా సంతోషిస్తాడు. ఇతరులకు మేలు కలిగితే బాధపడతాడు. ఓ శ్రీరమానాథా! ఇటువంటి వారిని భిక్షుకుల శత్రువుగా చెప్పవచ్చుకదా!

TS 7th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana శతక సుధ

*4. ఉ॥ ఏనుగుబోవఁజూచి ధ్వనులెత్తుచుఁగుక్కలు గూయసాగుచో
దాని మనస్సు కోపపడి దందడి వానిని వెంబడించునే
మానవులందు సజ్జనుడు, మత్తులు కొందరు గేలి చేయు చో
ఆ నరుడల్గి వాండ్ర బదులాడునె ధర్మపురీ నృకేసరీ!

ప్రతిపదార్థం

ధర్మపురీ = ధర్మపురి అనే ఊరిలోని
నృకేసరీ = నరసింహా!
ఏనుగు = గజము
పోవన్ = వెళ్ళుటను
చూచి = చూచిన
కుక్కలు = = శునకములు
ధ్వనులు = శబ్దములు
ఎత్తుచున్ = చేయుచూ
కూయగ = ఎంతమొరిగినా
దాని = ఆ ఏనుగు
మనస్సు = మనసు
కోపపడి = కోపంతో
దందడి = వెనుదిరిగి
వానిని = ఆ కుక్కలను
వెంబడించును+ఏ = వెంటపడునా? (వెనుతిరిగిచూడదు)
మానవులందు = మనుష్యులలో
సత్+జనుడు = మంచివాడు తనను
మత్తులు = కొందరు మూర్ఖులు
గేలిచేయుచో = అవమానించినా
ఆ నరుడు = ఆ మానవుడు
వాండ్ర = ఆ మూర్ఖులతో
బదులు = ఎదురుమాటలు
ఆడును+ఎ = చెప్తాడా? (చెప్పడని భావం)

తాత్పర్యం : ధర్మపురి నరసింహా! ఏనుగు పోతుంటే చూసిన కుక్కలు ఎంత మొరిగినా ఆ ఏనుగు వాటిపై కోపంతో వెనుదిరిగి తరుమదు. అట్లాగే ఒక సజ్జనుడిని కొందరు మూర్ఖులు గేలిచేసినా, అతడు కోపించి వారితో వాదులాడబోడు. ఇది సజ్జనుని స్వభావం.

*5. కం॥ తన మదిఁగపటము గలిగిన
తన వలెనే కపటముండుఁ దగ జీవులకున్
తన మది కపటము విడిచిన
తనకెవ్వడు కపటిలేడు ధరలో వేమా!

ప్రతిపదార్థం

వేమా = ఓ వేమనా!
తన = తన యొక్క
మదిన్ = మనసులో
కపటము = మోసముతో కూడిన ఆలోచనలు
కలిగిన = ఉన్న
తగ = ఇతర
జీవులకున్ = మానవులలో కూడా
తనవలెనె = తన లాగానే
కపటము+ఉండు = మోసం ఉన్నట్లు అగుపించును
తన = తన యొక్క
మది = మనసులో
కపటము = మోసం ఆలోచనలు
విడిచిన = విడచిపెట్టినట్లైతే
ధరలో = భూమిపై
తనకు+ఎవ్వడు = తనకెలాంటి
కపటిలేడు = మోసగాడే కనిపించడు కదా

తాత్పర్యం ఓ వేమా! తన మనసులో మోసపు ఆలోచనలు ఉంటే ఇతరుల్లో కూడా మోసమే ఉన్నట్లు కనిపిస్తుంది. తన మనస్సునుండి అట్లాంటి మోసపూరిత భావాలను తొలగించు కుంటే ఈ లోకంలో తనకు మోసగాడే కనిపించడు కదా!

6. ఆ.వె|| ధనము దమ్ముచేత దానవుండై పోయి
పేదవాడు పడెడు బాధ గనక
కష్టపెట్టువారు కలకాల ముందురా
కల్లగాదు రావికంటిమాట!

ప్రతిపదార్థం

ధనము = సంపద
దమ్ముచేత = గర్వం చేత
దానవుండైపోయి = రాక్షసుడుగా మారి
పేదవాడు = డబ్బులేనివాడు
పడెడుబాధ = బాధపడుచున్నా
కనక = లెక్కచేయకుండా
కష్టపెట్టువారు = బాధలు పెట్టేవారు
కలకాలము = చాలాకాలము
ఉందురా = ఉంటారా?
కలగాదు = ఇది అబద్ధంకాదు. నిజమే
రావికంటిమాట = ఈ మాటలు రావికంటి రామయ్య గుప్త చెప్పినవి.

తాత్పర్యం : ధనబలంతో రాక్షసులుగా మారి, పేదవారు బాధపడుతున్నా లెక్కచేయక వారిని కష్టాలపాలుచేసే మానవులు కలకాలం నిలువరు కదా! ఇది నిజం అని కవి భావన.

TS 7th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana శతక సుధ

7. ఆ.వె॥ సత్పురుషుల మైత్రి సలుపగా మనసిమ్ము
కమలనయన నిన్ను గాంచనిమ్ము
విశ్వశాంతికోరు విజ్ఞానమే యిమ్ము
చిద్విలాస భాస! శ్రీనివాస!

ప్రతిపదార్థం

శ్రీనివాస = ఓ శ్రీనివాసా!
చిద్విలాస భాస = జ్ఞానవిలాసం చేత ప్రకాశించేవాడా!
సత్పురుషుల = మంచివారితో
మైత్రి = స్నేహం
సలుపగా = చేయునట్టి
మనసు+ఇమ్ము = మంచిమనసును ఇమ్ము
కమలనయన = కమలాలవంటి కన్నులు కలవాడా!
నిన్ను = నిన్ను
కనులారా చూడనీ!
విశ్వశాంతి = ప్రపంచశాంతిని
కోర = కోరునట్టి
విజ్ఞానమే = విశేష జ్ఞానాన్ని
ఇమ్ము = ఇవ్వవలసినది

తాత్పర్యం: ఓ శ్రీనివాసా! జ్ఞానవిలాసం చేత ప్రకాశించేవాడా! మంచివారితో స్నేహం చేసే మనసును ఇవ్వు. కమలాల వంటి కన్నులు కలవాడా! నిన్ను కనులారా చూడనివ్వు. ప్రపంచశాంతిని కోరే విజ్ఞానాన్ని ఇవ్వు.

8. జననియు జన్మభూమియును స్వర్గముకన్న ఘనమ్ములన్నసూ
క్తిని వెలయింప సత్యమని దివ్యపురావిభవైక నవ్య దీ
ప్తిని కలిగింప మాతృపదపీఠి శిరంబు త్యజించు తెంపు నీ
వనిశము గూర్పు యాదగిరివాస! నృసింహ! రమావిభో! ప్రభో!

ప్రతిపదార్థం

యాదగిరివాస = యాదగిరిగుట్టపై ఉండేవాడా!
నృసింహా = ఓ నరసింహా!
రమా విభో = లక్ష్మికి భర్త అయినవాడా!
ప్రభో = ఓ ప్రభువా!
జననియు = తల్లి
జన్మభూమియు = పుట్టినభూమి
స్వర్గముకన్న = స్వర్గం కంటే
ఘనమ్ములు = గొప్పవి
అన్న = అనే
సు + ఉక్తిని = మంచిమాటను
వెలయింప = గొప్ప
సత్యము + అని = సత్యమని
దివ్య = దివ్యమైన
పురావిభవ + ఏక = ప్రాచీన వైభవాన్ని
నవ్య = నూతనమైన
దీప్తిని = కాంతిని
కలిగింప = వెలిగించడానికి
మాతృపదపీఠం = తల్లిపాదపీఠం మీద
శిరంబు = తలను ఉంచి
త్యజించు = ప్రాణాలు విడిచే
తెంపు = సాహసాన్ని
నీవు = నీవు
అనిశము = ఎల్లప్పుడు
కూర్పు = నాకు కల్గించుము

తాత్పర్యం : యాదగిరివాసా! నరసింహా! లక్ష్మీదేవికి భర్త అయినవాడా! ప్రభో! జన్మనిచ్చిన తల్లి, జన్మభూమి స్వర్గం కంటె మిన్న. ఈ సూక్తిని నిజమని చెప్పటానికి, దివ్యమైన ప్రాచీన వైభవాన్ని నూతన కాంతులతో నిరంతరం వెలిగించడానికి తల్లిపాదపీఠం మీద తల ఉంచి ప్రాణాలు విడిచే తెగువను నాకు ప్రసాదించు.

పాఠ్యభాగ ఉద్దేశం:

శతకాలు నైతికవిలువలను పెంపొందింప జేస్తాయి. సమాజ నడవడికను, లోకం పోకడలను తెల్పుతాయి. రేపటి సమాజానికి మానవతా విలువలను అందిస్తాయి. మంచి చెడుల విచక్షణను నేర్పుతాయి. భావిజీవితాన్ని తీర్చిదిద్దుతాయి. శతక పద్యాలలోని నైతిక విలువలను తెలుపుతూ, విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతకం నూరు/నూటికిపైగా పద్యాలతో ఉంటుంది. ప్రతిపద్యానికి ‘మకుటం’ ఉంటుంది. ఇవి ‘ముక్తకాలు’ అంటే ఏ పద్యానికదే స్వతంత్ర భావంతో ఉంటుంది. ప్రస్తుత పాఠంలో సుమతీశతకం, దాశరథి శతకం, నరసింహ శతకం, నృకేసరి శతకం, వేమన శతకం, నగ్నసత్యాలు శతకం, శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం, యాదగిరి లక్ష్మీనరసింహ శతకాలలోని పద్యాలున్నాయి.

TS 7th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana శతక సుధ

కవుల పరిచయాలు:

1. సుమతీ శతకం – బద్దెన :
లౌకికనీతులను అతిసులువుగా కందపద్యాలలో ఇమిడ్చి సుమతీ శతకాన్ని రాసిన కవి బద్దెన. (వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయం). ఈయన సుమతీ శతకంతో పాటు ‘నీతిశాస్త్ర ముక్తావళి’ అనే గ్రంథాన్ని రాశాడు.

2. దాశరథి శతకం – కంచెర్ల గోపన్న :
రామదాసుగా పేరు పొందిన కంచెర్ల గోపన్న “దాశరథీ కరుణాపయోనిధీ !” అన్న మకుటంతో శతకాన్ని రాసి, భద్రాచల శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన రామదాసు కీర్తనలు ఇప్పటికీ తెలుగువారి నాలుకలపై నాట్యమాడుతూనే ఉన్నాయి.

3&4. నరసింహ శతకం మరియు నృకేసరి శతకం – కాకుత్థ్సం శేషప్పకవి :
జగిత్యాల జిల్లా ధర్మపురి నారసింహునికి తన జీవితాన్ని అంకితం ఇచ్చిన సత్కవి. నరహరి శతకం, ధర్మపురి రామాయణం ఈయన రచనలు. జనవ్యవహార నుడికారాలు, పదబంధాలు, లోకోక్తులను పద్యరూపంలో వ్యక్తీకరించిన నరసింహశతకం ఈయనకు అమిత కీర్తిని తెచ్చిపెట్టింది.

5. వేమన శతకం – వేమన :
వేమన పద్యం రాని తెలుగువాళ్ళు ఉండరు. సహజకవిగా ప్రసిద్ధి పొందాడు. కడపజిల్లాకు చెందిన ఈయన పద్యాలలో – నీతి, లోకజ్ఞానం, మానవతా విలువలు ఉంటాయి. జన వ్యవహారశైలిలో, తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం వేమన ప్రత్యేకత.

6. నగ్నసత్యాలు శతకం – రావికంటి రామయ్యగుప్త :
‘కవిరత్న’ ఈయన బిరుదు. ఈయన పెద్దపల్లి జిల్లాలోని మంథనికి చెందినవాడు. గౌతమేశ్వర శతకం, గీతామృతం, వరద గోదావరి ఈయన రచనలు. వరకవిగా, మంత్రకూట వేమనగా సుప్రసిద్ధుడు.

7. శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం డా॥ ఆడెపు చంద్రమౌళి :
వరంగల్ అర్బన్ జిల్లా రంగశాయిపేట గ్రామానికి చెందిన ఈయన బిరుదు ‘కవిశశాంక’. వేములవాడ రాజరాజేశ్వర శతకం, రామాయణ రమణీయం (పద్యకావ్యం) రచించాడు. సరళమైన భాషలో, అందరికీ అర్థమయ్యే శైలిలో పద్యాలు రాయడం వీరి ప్రత్యేకత.

8. శ్రీ యాదగిరి లక్ష్మీనృసింహ శతకం – శ్రీ ధూపాటి సంపత్కుమారాచార్య :
ఖమ్మం జిల్లాకు చెందిన ఈయన “యాదగిరివాస ! నృసింహ ! రమావిభో ! ప్రభో !” అనే మకుటంతో చక్కని పద్యాలు రాశాడు. ఇవన్నీ భక్తితోపాటు నైతిక విలువలను పెంపొందింపచేస్తాయి.

ప్రవేశిక:

పద్యం రసానుభూతిని కలిగిస్తుంది. పద్యంలోని రాగయుక్త ఆలాపన (లయ) మానసిక ఆనందాన్నిస్తుంది. నైతిక విలువలను పద్యాల రూపంలో నేర్చుకొని పెంపొందించుకోవడం ద్వారా జీవితాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవచ్చు. పద్యాలను ధారణ చేయడం ద్వారా నిరంతరం ఆ నీతులను మననం చేసుకోవచ్చు. మరింకెందుకు ఆ ఆలస్యం? శతక పద్యాల తోటలోకి వెళ్లాం! నైతిక పరిమళాల్ని ఆస్వాదిద్దాం!

TS 6th Class Hindi Guide 2nd Lesson हमारा गाँव

Telangana SCERT 6th Class Hindi Study Material Telangana Pdf 2nd Lesson हमारा गाँव Textbook Questions and Answers.

TS 6th Class Hindi 2nd Lesson Questions and Answers Telangana हमारा गाँव

सुनो-बोलो :

TS 6th Class Hindi Guide 2nd Lesson हमारा गाँव 1

प्रश्न 1.
चित्र में क्या दिखायी दे रहा है ?
उत्तर :
चित्र में दो औगतें, तीन लड़कियाँ, दो आदमी, दो लड़के, नल, बाल्टी, छोटा बच्चा, ट्रेक्टर, पेड, घर, पत्ते, कौआ, ईख कुत्ता, फसल दिखाई दे रहे हैं।

प्रश्न 2.
अपने गाँव के बारे में बताओ।
उत्तर :
मेर गाँव छोटा है। इसमें हजार लोग रहते हैं। गाँव में एक पाठशाला, पुस्तकालय और अस्पताल भी हैं। मनोरंजन के लिए सिनेमा हॉल भी है। पानी का एक बडा तालाब है। यहाँ हम सब प्यार से मिलजुलकर रहते हैं।

TS 6th Class Hindi Guide 2nd Lesson हमारा गाँव

प्रश्न 3.
लड़के क्या कर रहे हैं ?
उत्तर :
एक लड़का नल के पास नहा रहा है और एक लडका पेड के नीचे बैठ कर पुस्तक पढ़ रहा है ।

प्रश्न 4.
गीत के बारे में बातचीत करो।
उत्तर :
हमारा गाँव हर – भर है। हमको बहुत अच्छा लगता है। हम नल के पास नहाते हैं। इमली और ईख़ाते हैं। किसान खेत में हल चलाता है। वह कई प्रकार के फसल उगाता है।

पढ़ो :

अ. गीत पढ़िए। TS 6th Class Hindi Guide 2nd Lesson हमारा गाँव 4 मात्रा वाले शब्दों पर ‘○’ लगाइए।

हरा भरा है गाँव हमारा,
लगता हमको प्यारा – प्यारा।
नल के पास हम नहाते,
ईख और इमली हैं खाते।
किसान खेत में हल चलाते,
तरह – तरह के अन्न उगाते।
उत्तर :
TS 6th Class Hindi Guide 2nd Lesson हमारा गाँव 5

आ. गीत पढ़िए। ‘इमली’ शब्द पर ‘○’ और ‘ईख’ शब्द पर ‘▭’ लगाइए।

हरा – भरा है गाँव हमारा,
लगता हमको प्यारा – प्यारा।
नल के पास हम नहाते,
ईख और इमली हैं खाते।
किसान खेत में हल चलाते,
तरह – तरह के अन्न उगाते।
उत्तर :
TS 6th Class Hindi Guide 2nd Lesson हमारा गाँव 6

इ. चित्र देखिए। शब्द पढ़िए। इनके अक्षर वर्णमाला चार्ट में पहचानो। ‘○’ लगाइए।

TS 6th Class Hindi Guide 2nd Lesson हमारा गाँव 13
उत्तर :
TS 6th Class Hindi Guide 2nd Lesson हमारा गाँव 7

ई. जोड़ी बनाओ।

TS 6th Class Hindi Guide 2nd Lesson हमारा गाँव 14
उत्तर :
TS 6th Class Hindi Guide 2nd Lesson हमारा गाँव 8

लिखो :

अ. मात्राएँ जोड़कर लिखिए और पढ़िए।

TS 6th Class Hindi Guide 2nd Lesson हमारा गाँव 15
उत्तर :
TS 6th Class Hindi Guide 2nd Lesson हमारा गाँव 9

आ. शब्द पढ़िए और लिखिए।

TS 6th Class Hindi Guide 2nd Lesson हमारा गाँव 16

इ. रानी को आम तक पहुँचाइए। रास्ते में मिलने वाली चीज़ों के नाम लिखिए।

TS 6th Class Hindi Guide 2nd Lesson हमारा गाँव 17
उत्तर :
TS 6th Class Hindi Guide 2nd Lesson हमारा गाँव 10

ई. रंग भरिए। नाम लिखिए।

TS 6th Class Hindi Guide 2nd Lesson हमारा गाँव 12
उत्तर :
नाम : फूलों की माल्ना

अभ्यासकार्य :

1. निम्नलिखित कविता का वाचन कीजिए। प्रश्नों के उत्तर दीजिए :
క్రింది కవిత్వాన్ని చదవండి. ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
आसमान पर चढ जाएँ हम,
चाँद सितारे ले आएँ हम।
बोल उठी कलियों की सरगम
धरती पर आना न भूलें।

प्रश्न 1.
हम कहाँ पर चढ जाएँ?
1. धरती
2. आसमान
3. पाताल
उत्तर :
2. आसमान

TS 6th Class Hindi Guide 2nd Lesson हमारा गाँव

प्रश्न 2.
हम क्या ले आएँ?
1. चाँद-सितारे
2. चाँद-धग्ती
3. चाँद-पाताल
उत्तर :
1. चाँद-सितारे

प्रश्न 3.
कौन बोल उठी?
1. तारे
2. चाँद
3. कलियाँ
उत्तर :
3. कलियाँ

प्रश्न 4.
चाँद-सितारे कौन ले आएँ?
1. हम
2. तुम
3. मैं
उत्तर :
1. हम

प्रश्न 5.
हम कहाँ पर आना न भूलें?
1. आसमान
2. धरती
3. पाताल
उत्तर :
2. धरती

TS 6th Class Hindi Guide 2nd Lesson हमारा गाँव

2. इन वर्णों और मात्राओं से शब्द लिखिए।

TS 6th Class Hindi Guide 2nd Lesson हमारा गाँव 11
उत्तर :

  1. कमल
  2. कलम
  3. नर
  4. अनार
  5. कल
  6. आम
  7. लाल
  8. साल
  9. नाक
  10. सिर
  11. नीला
  12. इमली
  13. खर
  14. मिल
  15. आग
  16. आकार
  17. नीम
  18. नाम

TS 6th Class Hindi Guide 2nd Lesson हमारा गाँव

सारांश-సారాంశం :

TS 6th Class Hindi Guide 2nd Lesson हमारा गाँव 2

अर्थ (అర్ధములు) (Meanings) :

TS 6th Class Hindi Guide 2nd Lesson हमारा गाँव 3

TS 7th Class Telugu 8th Lesson Questions and Answers Telangana గ్రామాలలోని వేడుకలు క్రీడావినోదాలు

Telangana SCERT 7th Class Telugu Guide Telangana 8th Lesson గ్రామాలలోని వేడుకలు క్రీడావినోదాలు Textbook Questions and Answers.

గ్రామాలలోని వేడుకలు క్రీడావినోదాలు TS 7th Class Telugu 8th Lesson Questions and Answers Telangana

బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి.

TS 7th Class Telugu 8th Lesson Questions and Answers Telangana గ్రామాలలోని వేడుకలు క్రీడావినోదాలు 1

ప్రశ్నలు

ప్రశ్న 1.
పై బొమ్మ దేనిని గూర్చి తెలియజేస్తున్నది?
జవాబు.
జాతర గూర్చి తెలియచేస్తోంది. గుడిముందు పండుగ వాతావరణం కనిపిస్తోంది.

TS 7th Class Telugu 8th Lesson Questions and Answers Telangana గ్రామాలలోని వేడుకలు క్రీడావినోదాలు

ప్రశ్న 2.
పై బొమ్మలో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు?
జవాబు.
పై బొమ్మలో అంగట్లో లడ్డూలు, ప్రసాదాలు అమ్మేవారు, అమ్ముతున్నారు. మెట్లగుండా బోనాలు (మహిళలు) తీసుకు వెళ్ళుతున్నారు. గాలి బుడగలు అమ్ముతున్నారు. రకరకాల తినుబండారాలు అమ్ముతున్నారు.

ప్రశ్న 3.
మీరు ఎప్పుడైనా జాతరలకు వెళ్ళారా? ఏయే జాతరులకు వెళ్ళారు?
జవాబు.
వెళ్ళాం. సికింద్రాబాద్ మహంకాళమ్మ జాతర, మేడారం (సమ్మక్క, సారక్క జాతరలకు వెళ్ళాం. ఇది వరంగల్ జిల్లాలో ఉన్నది. నాగోబా జాతర (ఆదిలాబాద్ జిల్లాలో) కొమరవెల్లి మల్లన్న జాతర (కరీంనగర్)లకు వెళ్ళాం.

ప్రశ్న 4.
మీకు తెలిసిన / చూసిన జాతర గురించి చెప్పండి.
జవాబు.
సమ్మక్క, సారక్క జాతర అనేది వరంగల్ జిల్లా తాడ్వాయ్ మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. వరంగల్లు జిల్లా కేంద్రం నుండి 110 కి.మీ. దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది. వనదేవతలుగా పూజలందుకుంటున్నారీ సమ్మక్క-సారక్కలు. సమస్త గిరిజన సమారాధ్య దేవతలను పూజించడం ఇక్కడ ప్రత్యేకత. ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇక్కడకు తరలి వస్తారు. 1996లో ఈ జాతరను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం (బెల్లం) నైవేద్యంగా సమర్పించుకుంటారు. కోటికిపైగా పాల్గొంటారు. ఆసియాలోనే అతిపెద్ద జాతర.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.75)

ప్రశ్న 1.
“ఆటలలో అందం” అంటే ఏమిటి?
జవాబు.
ఆటలు మనిషికి మానసిక ఆందోళన తగ్గిస్తాయి. అందం అంటే మనసుకు సంబంధించినది. అందమే ఆనందం అని అంటారు. ఆ ఆనందమే జీవితాన్ని నడిపిస్తుంది. మానసిక ఆనందాన్ని ఆటలలో పొందొచ్చు. కాబట్టి ఆటలలో అందం అంటే మానసికోల్లాసం అని అర్థం.

ప్రశ్న 2.
గ్రామీణులను ఎక్కువగా ఆకర్షించిన కళారూపం ఏది? అది ఎందుకు బాగా నచ్చి ఉంటుంది?
జవాబు.
గ్రామీణులను ఎక్కువగా ఆకర్షించిన కళారూపం తోలుబొమ్మలాట. ఇది తెలుగువారి ప్రత్యేక కళారూపం. అనేక సంవత్సరాల నుండి ఉపాసించిన కళ. ఒక సన్నని బట్టను తెరగా గట్టి ఆ తెర వెనుక పెద్ద దివిటీలు వెలిగింతురు. తెర వెనుక తోలుబొమ్మల కాళ్ళకూ, చేతులకూ దారాలుగట్టి బొమ్మలను నిలబెట్టి దారాలను లాగుతూ దివిటీల వెలుగులో వానిని ఆడిస్తారు. ఈ తోలుబొమ్మలాటలు ఎక్కువగా రామాయణ భారత కథలకు సంబంధించినవి. నిజానికి రామాయణమూ, భారతమూ, మన దేశీయులలో ప్రతి రక్త కణమునందును జీర్ణించిన కథలు. కాబట్టే అది బాగా నచ్చి ఉంటుంది.

ప్రశ్న 3.
మీకు నచ్చిన గ్రామీణ వినోదం ఏది? అది ఎందుకు నచ్చింది?
జవాబు.
నా(మా)కు నచ్చిన గ్రామీణ వినోదం యక్షగానాలు. దీనినే వీధి నాటకాలు అని కూడా అంటారు. ఈ నాటకాలను ఆడేవారిని జక్కులు అని పిలుస్తుంటారు. భాగవతంలోని కృష్ణలీలలు మొదలైన వానిని ఆడేవారిని భాగోతులని కూడా పిలుస్తారు. చాలా సంవత్సరాల నుండి యక్షగానాలు, తోలుబొమ్మలాటలతోపాటు, భాగోతాలు మన పల్లెటూళ్ళ ప్రజపలను రంజింపచేస్తున్న వినోదాలు, వేడుకలు. వినేవారికి అత్యంత రసానుభూతిని కల్గచేస్తుంది. కాబట్టి ఇది నాకు నచ్చింది.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.77)

ప్రశ్న 1.
స్వయంగా పాల్గొని ఆనందించే ఆటలు, పాటలు ఎందుకు ప్రజలకు నచ్చుతాయో చెప్పండి.
జవాబు.
స్వయంగా పాల్గొని ఆనందించే ఆటలు, పాటలు మన పల్లెటూళ్ళలో చాలా కనిపిస్తాయి. రంగులరాట్నము, గిల్లిదండ (చిర్రగోనె), కోడిపందెములు, బొంగరాల ఆట మొదలైనవి స్వయంగా పాల్గొని ఆనందించే ఆటలు. వీటి ద్వారా ప్రత్యక్షంగా ఆనందాన్ని పొందుతున్నారు. కాబట్టి ఇవి ప్రజలకు నచ్చుతాయి.

TS 7th Class Telugu 8th Lesson Questions and Answers Telangana గ్రామాలలోని వేడుకలు క్రీడావినోదాలు

ప్రశ్న 2.
ఈ రోజుల్లో స్త్రీలు మధ్యాహ్నవేళ పచ్చీసు మొదలైన ఆటలు ఎందుకు ఆడటం లేదో చెప్పండి.
జవాబు.
ప్రస్తుత పరిస్థితులలో విదేశీ సంస్కృతిని ప్రతిబింబించే టెలివిజన్లో సీరియల్స్ చూడటం, సినిమాలపై మక్కువ కల్గటం వల్ల ఈ మధ్యాహ్నపు వేళ ఆడే పచ్చీసు మొదలైన ఆటలు ఆడటం లేదు.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.79)

ప్రశ్న 1.
మీకు తెలిసిన జాతర గురించి చెప్పండి.
జవాబు.
సమ్మక్క, సారక్క జాతర అనేది వరంగల్ జిల్లా తాడ్వాయ్ మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. వరంగల్లు జిల్లా కేంద్రం నుండి 110 కి.మీ. దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది. వనదేవతలుగా పూజలందుకుంటున్నారీ సమ్మక్క-సారక్కలు, సమస్త గిరిజన సమారాధ్య దేవతలను పూజించడం ఇక్కడ ప్రత్యేకత. ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇక్కడకు తరలి వస్తారు. 1996లో ఈ జాతరను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం (బెల్లం) నైవేద్యంగా సమర్పించుకుంటారు. కోటికిపైగా పాల్గొంటారు. ఆసియాలోనే అతిపెద్ద జాతర.

ప్రశ్న 2.
ఈ “ముగ్గులు స్త్రీల కళాభిరుచికి ఉదాహరణలు” అనే రచయిత అభిప్రాయాన్ని సమర్థిస్తూ మాట్లాడండి.
జవాబు.
ముగ్గులు వేయడం పల్లెటూరి బాలికలకు, యువతులకు మిక్కిలి ఆహ్లాదకరమైన వేడుక. రకరకాల ముగ్గులను వేయడంలో నైపుణ్యం ప్రదర్శించే స్త్రీలు మన పల్లెటూళ్ళలో పుష్కలంగా కనిపిస్తారు. ఈ ముగ్గులు తెలుగు పడతుల సౌందర్యరక్తికి, కళాభిరుచికీ గొప్ప (మంచి) ఉదాహరణలు.

ప్రశ్న 3.
గ్రామీణ ఉత్సవాల వల్ల ప్రజలకు జరిగే ప్రయోజనం ఏమిటి?
జవాబు.

  1. గ్రామీణ ఉత్సవాల వల్ల వినోదానికి ఎంతో ముఖ్యమైన స్థానం ఇచ్చారు.
  2. ఉత్తమ సంస్కృతిని తెలుసుకోవచ్చు.
  3. సంప్రదాయాలు తెలుస్తాయి.
  4. మానసికోల్లాసాన్ని కల్గిస్తాయి.
  5. ఉత్తమ వ్యక్తిత్వం నిర్మాణం జరిగేది.
  6. క్రీడాస్ఫూర్తి కలుగుతుంది.
  7. శారీరక వ్యాయామానికి ప్రాధాన్యత తెలుస్తుంది.
  8. ఇరుగుపొరుగువారితో, సమాజంలో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి.

ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. గ్రామాలలోని కళలు, క్రీడలు నేడు మనకు కనిపించకపోవడానికి కారణాలు చెప్పండి.
జవాబు.

  1. గ్రామీణప్రాంతాలు ఆటలు, కళలు దాదాపుగా కనుమరుగైపోయాయి.
  2. ప్రస్తుతం ప్రజలు ఆడే ఆటలు గెలుపు ఓటములు లక్ష్యంగా, జూదంగా పరిణమిస్తున్నాయి.
  3. పిల్లలు మైదానాలకు దూరమైనారు.
  4. కంప్యూటర్లలో ఆటలు ఆడుతున్నారు.
  5. చరవాణి (సెల్ఫోన్)లతో ఆటలాడుతున్నారు.
  6. పాశ్చాత్య వికృత నృత్యాలు, ప్రసార మాధ్యమాలలోని విపరీత పోకడల ప్రవాహంలో కొట్టుకొని పోతున్నారు.
  7. మానవ సంబంధాలు దూరమవుతున్నాయి.

2. గ్రామీణ కళలు, క్రీడలు ప్రజలను సమైక్యంగా ఎట్లా ఉంచాయో చర్చించండి.

  1. గ్రామీణ కళలు, క్రీడలు ప్రజలను సమైక్యంగా ఉంచాయి.
  2. మైదానాలలో ఆరుబయలు ప్రదేశాలలో ఆటలవల్ల సమిష్టి తత్వం ఏర్పడేది.
  3. ఇరుగుపొరుగువారి, సంఘంలోని అందరూ ఒకటేననే భావన (వసుధైక కుటుంబ భావన) బలపడేది.
  4. ఎడ్లపందాలలో, కోలాటం మొదలగు ఆటలలో పోటీతత్వం బలపడేది.
  5. విజ్ఞానం అభివృద్ధి అయ్యేది.
  6. అలుపు, సొలుపు లేకుండా ఆడుతూ, పాడుతూ పనిచేసేవారు.
  7. కాయకష్టం విలువ తెలిసేది.
  8. రామాయణ, మహాభారత, భాగవత కథలు ప్రజలకు నీతిని తెల్పేవి. ఉదా : తోలుబొమ్మలాట, ఈ విధంగా ప్రజలను గ్రామీణ క్రీడలు, కళలు సమైక్యంగా ఉంచేవి.

II. ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

1. కింది విషయాలు పాఠంలో ఏయే పేరాలలో ఉన్నాయో వెతికి వాటికి సంబంధించిన ముఖ్యాంశాలు పట్టికలో రాయండి.

TS 7th Class Telugu 8th Lesson Questions and Answers Telangana గ్రామాలలోని వేడుకలు క్రీడావినోదాలు 2

జవాబు.

విషయం పేరా ముఖ్యాంశాలు
1. తోలుబొమ్మలాట 4 వ పేరా 1. సమస్త జనులను ఆకర్షిస్తుంది.
2. ఇది తెలుగువారి ప్రత్యేకత
3. అనేక సం॥ల నుండి ఉపాసించిన కళ
4. రామాయణ, భారత కథలకు చెందినది.
5. తెర వెనుక తోలుబొమ్మల కాళ్ళకూ చేతులకు దారాలు కట్టి లాగుతారు.
2. చిర్రగోనె ఆట 6 వ పేరా 1. దీనికి మరొక పేరు గిల్లిదండ.
2. ఇది చాలా పురాతనమైనది.
3. తెలంగాణ పల్లెటూళ్ళలో దీనిని చిర్రగోనె అంటారు.
4. భారతంలో కౌరవులు, పాండవులు ఈ ఆట ఆడారు.
5. ఇది క్రికెట్టు లాంటిదే
3. అక్ష క్రీడ 7 వ పేరా 1. ఇప్పుడు ప్రచారం తగ్గిపోయిన ఆట.
2. మన పల్లెటూళ్ళలోని ఉన్నత కుటుంబాలలో విశేష ఆసక్తితో ఆడిన ఆట.
3. పాచికల ఆట, దీనిని అక్షక్రీడ అని అంటారు.
4. తరతరాలనుండి ప్రజలను ఆకర్షించింది.
5. మన ప్రబంధాలలో రమణీయంగా మన కవులు వర్ణించారు. రుక్మిణీ శ్రీకృష్ణులు ఈ ఆటను ఆడినట్లు ఉత్తరహరివంశములో మనోహరంగా వర్ణించబడింది.

 

2. కింది పేరాను చదివి, ఐదు ప్రశ్నలను తయారు చేయండి.

మన రాష్ట్రంలో సాధనాశూరులు ఇంద్రజాల విద్యను అద్భుతంగా ప్రదర్శిస్తారు. వీరి ప్రదర్శన గ్రామం మధ్యలో ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేస్తారు. ప్రేక్షకులు చూస్తుండగానే తెల్లని వస్త్రాలతో ఒక గుడారం ఏర్పాటుచేసి, ప్రదర్శన ప్రారంభిస్తారు. గుడారం ముందు హాస్యగాడు నిలబడి తనకు వివిధ దేవతల విగ్రహాలు కావాలని ప్రధాన సాధనాశూరుని కోరతాడు వేములవాడ రాజన్న, ధర్మపురి నర్సన్న, తిరుపతి వెంకన్న, కొండగట్టు అంజన్న…. అంటూ హాస్యగాడు వివిధ దేవుళ్ళ పేర్లు చెబుతుంటాడు.

TS 7th Class Telugu 8th Lesson Questions and Answers Telangana గ్రామాలలోని వేడుకలు క్రీడావినోదాలు

ప్రధాన సాధనాశూరుడు ఒక్కొక్క రాయిని ఒక్కో దేవునిగా అభివర్ణిస్తూ, మూసి ఉన్న గుడారంలో పెడతారు. చివరకు గుడారం తెరచి చూస్తే రాళ్ళకు బదులుగా దేవతల విగ్రహాలు ధూపదీపనైవేద్యాలతోసహా ప్రత్యక్షమైతాయి. దీంతో చూపరులు ఆశ్చర్యచకితులౌతార. వీరి ప్రదర్శనలో ప్రేక్షకుని తలపై పొయ్యిపెట్టి పూరీలను కాల్చడం, నీళ్ళకుండలో మూడురంగుల ఇసుకను పోసి, విడివిడిగా మూడురంగుల ఇసుకను ముద్దలు ముద్దలుగా తీయడం, గుడారంలోని ఒక కర్రకు కట్టిన వ్యక్తి మరో కర్రకు మారడం వంటి అంశాలు అందరినీ ఆకర్షిస్తాయి.

ప్రశ్నలు :
1. మనరాష్ట్రంలో సాధనాశూరులు ఏ విద్యను అద్భుతంగా ప్రదర్శిస్తారు?
2. ఇంద్రజాల ప్రదర్శనను ఎక్కడ ఏర్పాటు చేస్తారు?
3. గుడారం ముందు నిలబడి తనకు వివిధ దేవతల విగ్రహాలు కావాలని కోరేది ఎవరు?
4. ఏ దేవుళ్ళ పేర్లను హాస్యగాడు చెబుతాడు?
5. ఇంద్రజాల విద్యలో చూపరులను ఆకర్షించే అంశాలు ఏమిటి?

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) స్త్రీల పాటల వల్ల స్త్రీలకు, పిల్లలకు ఎట్లా ఆనందం కలుగుతుందో వివరించండి.
జవాబు.
స్త్రీల పాటలు : పొలములో కలుపుతీసే పడుచులు ఎద్దులను గాసే బాలకులు, సంపన్నుల ఇండ్లలో కావల్సినంత తీరక ఉన్న బాలికలు ఈ పాటలను పాడుతూ ఉంటారు. ఈ పాటల వల్ల ఊపు వస్తుంది. సంతోషం కలుగుతుంది. సేద్యము చేస్తూ కూలీలు పాడే జాజర పాటలు ఈనాటికిని కొన్ని ప్రాంతాలలో విశేషవ్యాప్తిలో ఉన్నాయి. వరంగల్లు జిల్లా మానుకోట తాలూకాలో రైతు యువకులు మక్కువతో జాజర పాటలు పాడుతారు. దీనివల్ల ఉత్సాహం కలుగుతుంది.

ఆడుతూ పాడుతూ పనిచేస్తే ఆనందం కలుగుతుంది. అలుపు, సొలుపు ఉండదు. పెండ్లిపాటలు, అప్పగింతపాటలు, మంగళ హారతులు, మేలుకొలుపులు, ఆలపించే పాటలు మన పల్లెటూళ్ళలోని పూర్వపద్ధతి కుటుంబాలలో కనిపిస్తున్నవి. పసిపిల్లల జోలపాటలవల్ల వారికి చక్కటి నిద్ర వస్తుంది. ఈ విధంగా స్త్రీల పాటల వల్ల స్త్రీలకు, పిల్లలకు ఆనందం కలుగుతుంది.

ఆ) వినేవారి రక్తము ఉడుకెత్తునట్లు కథ చెప్పడం” అంటే మీరు ఏమనుకుంటున్నారో రాయండి.
జవాబు.
బొబ్బిలి కథ, బాలనాగమ్మ కథలను చెప్పేవారు గంటల తరబడి, ఒక్కొక్కసారి ప్రొద్దంతా, పల్లెటూరి ప్రజలను ఆకర్షించి, వినోదింపచేస్తారు. కాని ప్రస్తుత పరిస్థితులలో వీటికి వ్యాప్తి తగ్గిపోయింది. ఈ కథలను చెప్పేవారి నేర్పు చాలా గొప్పది. వినేవారి రక్తము ఉడుకెత్తునట్లుగా వీరగాథలను చెప్తారు. వీరగాథల పేరులోనే వీరరసం ఉంది. అది విన్నప్పుడు మన రక్తం ఉడుకుతుందని, మనము వాటిలో లీనమై పోతామని నేను అనుకుంటున్నాను. ఉదాహరణకు పల్నాటి వీరచరిత్ర (బాలనాగమ్మ కథలు) మొదలైనవి ఈ కోవకు చెందినవి.

ఇ) “కొన్ని వినోదాలు శ్రీమంతులకు మాత్రమే అందుబాటులో ఉండేవి” అనే వాక్యాన్ని బట్టి వినోదాలకు, ఆర్థిక స్థితికి గల సంబంధాన్ని చెప్పండి.
జవాబు.
కొన్ని క్రీడలు, వినోదాలు శ్రీమంతులకు మాత్రమే అందుబాటులో ఉండేవి. కొన్ని సార్వజనికమైన అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో ఉండేవి. జనుల ఆర్థిక స్థితిని అనుసరించి క్రీడలు, వినోదాలు తెలుగుసీమలో పుష్కలంగా ఉన్నాయి. వీటివల్ల (వినోదాలు) కొన్ని వినోదాలు ఆర్థికపుష్టి కల శ్రీమంతులకు మాత్రమే అందుబాటులో ఉండేవి. “ధనం మూలమ్ ఇదం జగత్” కదా? డబ్బే అన్నింటికి ఆధారం. డబ్బుతో ముడిపడి ఏపని అయినా సాగుతుంది. చిలుకలను పెంచి, వానికి బుద్దులు చెప్పి వినోదించుట తెలుగుసీమలోని పల్లెటూళ్ళలో (డబ్బున్న సుందరాంగులు వేడుకగా పెంచుట) మనకు కన్పించే గొప్ప విషయం.

ఈ) ఒకనాటి బాలికల ఆటలకు, నేటి బాలికల ఆటలకు గల తేడాలను చెప్పండి.
జవాబు.

ప్రాచీన బాలికల ఆటలు నేటి బాలికల ఆటలు
1. పాచికల ఆట దీనికి అక్ష క్రీడ అని పేరు. 1. స్నేక్ ఇన్ లాడర్ అనే ఆట
2. పచ్చీస్ ఆట 2. చైనీస్ చెక్కర్ ఆట
3. ఉయ్యాలలు ఆట 3. కొలంబస్ (ఆట)
4. గుర్రపు స్వారీ ఆట 4. ఇప్పుడు కూడా గుర్రపు ఆట
5. కబడ్డీ ఆట 5. కబడ్డీ ఆట ఇప్పుడు ఉన్నది.
6. శారీరక ఆటలు ఉండేవి. 6. కంప్యూటర్ ఆటలు ఎక్కువ.

 

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

1. క్రీడలు, వినోదాలు మానవ జీవితానికి ఎందుకు అవసరమో మీ అభిప్రాయం రాయండి.
జవాబు.
క్రీడలు, వినోదాలు మానవ జీవితానికి ఎంతో అవసరము.

  1. క్రీడలు, వినోదాలు మనిషిని ఉత్సాహంగా ఉండేటట్లు చేస్తాయి.
  2. ఆలోచనాశక్తిని పెంచుతాయి.
  3. జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి.
  4. చురుకుగా ఉండేటట్లుచేసి, శారీరక స్పందనలు నియంత్రిస్తాయి.
  5. మనిషి బద్దకాన్ని దూరంగా ఉంచుతాయి.
  6. మానసిక ఉల్లాసాన్ని కల్గిస్తాయి.
  7. సంస్కృతి తెలుస్తుంది.
  8. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
  9. స్నేహితులు దగ్గరౌతారు.
  10. మానవ సంబంధాలు మెరుగుపడతాయి.
  11. శారీరక, మానసిక సమస్యల నుండి బయటపడవచ్చు.
  12. పట్టుదల పెరుగుతుంది. ఆశయం ఏర్పడుతుంది.

ఈ విధంగా మానవ జీవితానికి క్రీడలు, వినోదాలు ఎంతో అవసరమని నా అభిప్రాయం.

TS 7th Class Telugu 8th Lesson Questions and Answers Telangana గ్రామాలలోని వేడుకలు క్రీడావినోదాలు

2. ఆటకు పాటకు విడరాని చుట్టరికమున్నదనే రచయిత మాటలను సమర్థిస్తూ రాయండి.
జవాబు.
ఆటకు పాటకు వీడరాని సంబంధం ఉంది. (చుట్టరికం)

  1. ఆటకు పాటకు శృతికి, లయకు ఉన్నంత సంబంధం ఉంది. పగలూ రాత్రి, గెలుపు ఓటములు, కష్టాలు సుఖాలు ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉన్నట్లు ఆటకు పాటకు చుట్టరికమున్నదని నా అభిప్రాయం.
  2. కబడ్డీ, కబడ్డీ అని కూత పెట్టితే ఉత్సాహంతో ఆడటానికి ఎదుటివాడిని గెలవటానికి ఉపయోగపడుతుంది.
  3. కో-ఆటకూడా అలాగే ఉంటుంది.
  4. బ్రతుకమ్మ (బతుకమ్మ) ఆటలో పాట ఆట కలిపి ఆడతారు. తెలంగాణాలో పెద్ద ఎత్తున జరిగే పండుగ ఇది.
  5. యక్షగానము (జక్కులు)లలో పాటలు పాడుతూ ఆడతారు.
    ఉదాహరణ : బొబ్బిలికథ, బాలనాగమ్మ మొదలగునవి.
  6. వీరగాధలను (జంగం కథలను చెపుతారు. ఈ విధంగా ఆటకు పాటకు వీడరాని చుట్టరికమున్నదని నేను నమ్ముతున్నాను.

IV. సృజనాత్మకత/ప్రశంస

మీకు తెలిసిన ఏవేని నాలుగు పద్యాలను బతుకమ్మ పాటగా మార్చి రాయండి.
ఉదా :
ఉప్పుకప్పురంబు ఉయ్యాలో ….
ఒక్క పోలికనుండు ఉయ్యాలో ….
చూడచూడరుచులు ఉయ్యాలో ….
జాడలువేరమ్మ ఉయ్యాలో….

1. ఒక్కో పూవు పూసే చందమామ (బతుకమ్మ పాట)

1. మేడిపండు చూడ ఉయ్యాలో ….
మేలిమై ఉండును ఉయ్యాలో ….
పొట్టవిప్పిచూడ ఉయ్యాలో ….
పురుగులుండ ఉయ్యాలో ….

2. అనగననగా రాగము ఉయ్యాలో….
అతిశయిల్లుచు నుండు ఉయ్యాలో ….
తినగ తినగ వేము ఉయ్యాలో ….
తియ్యనుండు ఉయ్యాలో ….
సాధనమున పనులు ఉయ్యాలో ….
సమకూరు ధరలోన ఉయ్యాలో….

3. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు ఉయ్యాలో….
కొంచెమైన నదియు కొదువగాదు ఉయ్యాలో ….
విత్తనంబు మఱి వృక్షమునకు నెంత ఉయ్యాలో ….

2. గ్రామీణ కళాకారులను ప్రశంసిస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి.

వరంగల్లు,
తేది : X X X X

ప్రియమైన మిత్రుడు రవికి,
నేను క్షేమం. నీవు క్షేమమేనా?

మన గ్రామాలు సంస్కృతికి పట్టుకొమ్మలు. మన గ్రామాలలో కళాకారులు ఆదరణ లేక ఆడేవారు, హరికథలు చెప్పేవారు, భాగోతులు ఒకప్పుడు మంచి బతుకు బతికి కాలం కలిసిరాక ఇలా ఉన్నారు. వారు తోలుబొమ్మలాటను ప్రదర్శిస్తూ ఉంటే రామాయణ భారతాలు చాలా చక్కగా అర్థం అయ్యేవి. హరికథలు పిట్టకథలతో భలేగా చెప్పేవారు. (భాగోతులు) వివరంగా కథలను చెప్పేవారు. వారు సంస్కృతి పరిరక్షకులు. కొవ్వొత్తిలాగా తను వెలుగుతూ కాంతిని ఇచ్చినట్లే మనకు వినోదాన్ని పంచుతారు. మా నాయనమ్మ, తాతయ్యలు ఈ విషయాలు చెప్పారు. వాటిని ప్రత్యక్షంగా నేను చూశాను. నీవు నీకు తెలిసిన విషయాలు రాయగలవు. ఈ విషయంలో నీ అభిప్రాయాన్ని వినాలని కోరిక. తప్పక రాస్తావు కదూ !

ఇట్లు
నీ మిత్రుడు
నాగరాజు

చిరునామా :
పి. రవి
7వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,
మధిర, ఖమ్మం(జిల్లా)
తెలంగాణ (రాష్ట్రం)

TS 7th Class Telugu 8th Lesson Questions and Answers Telangana గ్రామాలలోని వేడుకలు క్రీడావినోదాలు

2. నీవు దర్శించిన ఏదైనా పర్యాటక క్షేత్రం గురించి వర్ణిస్తూ రాయండి.
జవాబు.
నేను మా మామయ్యగారింటికి హైదరాబాద్లోని బోరబండకు వెళ్ళాను. మామయ్య హైదరాబాద్ (భాగ్యనగరం) నగరాన్ని చూపించారు. భాగ్యనగరం ఎంతో అందమైన నగరం. నన్ను ఎంతో ఆనందింప చేసింది. హైదరాబాద్ నగరం విభిన్న సంస్కృతులు, మతాలు, భాషల కలయిక కేంద్రం. మేము చార్మినార్ను చూశాము. అది ఎత్తైన 4 స్తంభాలు, వాటి నిర్మాణం నాకు నచ్చింది. జంతుప్రదర్శనశాలకు వెళ్ళాం. రంగురంగుల పక్షులు, కీటకాలు, చిన్నచిన్న ప్రాణులు నన్ను ఆనందింప చేసాయి. సాలార్జంగ్ మ్యూజియం చాలా బాగుంది. ప్రాచీనకాలపు శిల్పాలు, వస్తువులు, ఆకృతులు, ఆయుధాలు చూశాం. తెల్లపాలరాతితో కట్టిన బిర్లామందిరం అద్భుతం. ప్లానెటోరియం చాలా నచ్చింది. టాంక్బండ్, బుద్ధుని విగ్రహం, ఎన్టీఆర్ పార్కు, రామకృష్ణామిషన్(మఠం) మొదలైన అందమైన ప్రదేశాలను చూశాం. ఈ సెలవుల్లో చక్కగా సంతోషంగా గడిపాం.

V. పదజాల వినియోగం:

1. కింది పదాలకు అర్థాలను రాయండి.

ఉదా : మేలు కొలుపు : మా నాయనమ్మ మేలుకొలుపు గీతాలు చక్కగా పాడుతుంది.
అ) ఆసక్తి
ఆ) వీనుల విందు
ఇ) శోభ
ఈ) పురాతనమైన

ఉదా : మేలుకొలుపు = మా నాయనమ్మ మేలుకొలుపు గీతాలు చక్కగా పాడుతుంది.

అ) ఆసక్తి = __________
జవాబు.
ఆపేక్ష, ఆస
వాక్యప్రయోగం = ఆశలు గుర్రాల లాగా పరుగెడ్తాయి.

ఆ) వీనులవిందు = __________
జవాబు.
చెవికి ఇష్టమైనది
వాక్యప్రయోగం = సంగీతం వీనులవిందు చేస్తుంది.

ఇ) శోభ = __________
జవాబు.
వస్త్రభూషణాది ప్రయుక్తమైన కాంతి, కాంతి, ఇచ్ఛ
వాక్యప్రయోగం = తెలంగాణ సాధించాలనే ఇచ్ఛ (శోభ) నెరవేరింది.

ఈ) పురాతనమైన = __________
జవాబు.
బహుదినములనాటిది, జీర్ణించినది
వాక్యప్రయోగం : ఓరుగల్లుకోట పురాతనమైనది.

2. కింది వాక్యాలు చదివి సమాన అర్థం వచ్చే పదాలకింద గీత గీయండి.

అ) శ్రీరామనవమి పండుగ వైభవంగా జరిగింది. ఈ పర్వాన్ని చూడటానికి ప్రజలు తరలివచ్చారు. ఈ వేడుక అందరిలోనూ ఉత్సాహాన్ని నింపింది.
జవాబు.
పండుగ, పర్వం, వేడుక

ఆ) శ్రీజకు చిత్రలేఖనం పట్ల ఆసక్తి ఎక్కువ. ఇష్టం తో బొమ్మలు గీసింది. ఆమె అభిరుచిని ఉపాధ్యాయులు అభినందించారు.
జవాబు.
ఆసక్తి, ఇష్టం, అభిరుచి

ఇ) రామయ్య గృహం నిర్మించుకోవాలనుకుని, ఇల్లుకు సరిపోయే స్థలం కొని, సదనం నిర్మించాడు.
జవాబు.
గృహం, ఇల్లు, సదనం

3. కింది వికృతి పదాలకు సరిపోయే ప్రకృతి పదాలు గళ్ళలో ఉన్నాయి. వాటిని వెతికి రాయండి.
TS 7th Class Telugu 8th Lesson Questions and Answers Telangana గ్రామాలలోని వేడుకలు క్రీడావినోదాలు 3
అ) పబ్బము : __________
జవాబు.
పండుగ

ఆ) పున్నమి : __________
జవాబు.
పౌర్ణమి

ఇ) జీతం : __________
జవాబు.
జీవితం

ఈ) కర్జము : __________
జవాబు.
కార్యము

VI. భాషను గురించి తెలుసుకుందాం:

1. కింది వాక్యాల్లో “సమాపక”, “అసమాపక క్రియలేవో గుర్తించి రాయండి.

అ) శిరీష అన్నం తిని, సినిమాకు వెళ్ళింది.
జవాబు.
అసమాపక క్రియ తిని సమాపక క్రియ వెళ్ళింది.

ఆ) రమ బడికి వెళ్ళి, చదువుకున్నది.
జవాబు.
అసమాపక క్రియ వెళ్ళి సమాపక క్రియ చదువుకున్నది.

TS 7th Class Telugu 8th Lesson Questions and Answers Telangana గ్రామాలలోని వేడుకలు క్రీడావినోదాలు

ఇ) విజయ్ పుస్తకం చదివి, నిద్రపోయాడు.
జవాబు.
అసమాపక క్రియ చదివి సమాపక క్రియ నిద్రపోయాడు.

ఈ) భరత్ బొమ్మలు గీసి, ప్రదర్శనకు పెట్టాడు.
జవాబు.
అసమాపక క్రియ గీసి సమాపక క్రియ పెట్టాడు.

క్రియలనుబట్టే కాకుండా అర్థాన్నిబట్టి కూడా వాక్యాలలో తేడాలుంటాయని గమనించండి.
ఉదా :
అ) ఆహా ! ఎంత బాగుందో !
ఆ) ‘చేతులు కడుక్కో’
ఇ) మన రాష్ట్ర రాజధాని ఏది ?

పై వాక్యాలు ఒక్కో భావాన్ని సూచిస్తున్నాయి. అదెట్లాగో చూద్దాం !

1. ఆహా ! ఎంత బాగుందో ! ఇది ఆశ్చర్యానికి సంబంధించిన అర్థాన్ని సూచిస్తుంది. కాబట్టి ఆశ్చర్యాన్ని తెలియజేస్తే వాక్యం ‘ఆశ్చర్యార్థక వాక్యం’.

2. ఇక రెండో వాక్యం ‘చేతులు కడుక్కో’. ఇది ‘విధిగా చేయాలి’ అనే అర్థాన్ని సూచిస్తుంది. అంటే చేయాల్సిన పనిని విధిగా చెయ్యాలి అనే అర్థాన్ని సూచించే వాక్యం ‘విధ్యర్థక వాక్యం’.

3. ఇక మూడో వాక్యం మన రాష్ట్ర రాజధాని ఏది ? ఇది ప్రశ్నార్థకాన్ని సూచిస్తుంది. ప్రశ్నించే విధంగా ఉండే వాక్యమే ‘ప్రశ్నార్థక వాక్యం’.

2. ఈ వాక్యాలు ఏ రకమైనవో గుర్తించండి.

అ) మీరు ఏ ఊరు వెళ్తున్నారు ?
జవాబు.
(ప్రశ్నార్థకం)

ఆ) ఈ పాఠం చదువు.
జవాబు.
(విధ్యర్ధకం)

ఇ) వసంత ఎంత బాగా పాడిందో !
జవాబు.
(ఆశ్చర్యార్థకం)

ఈ) మన పాఠశాలకు ఎవరు వచ్చారు ?
జవాబు.
(ప్రశ్నార్థకం)

ఉ) చెరువులో తామరలు ఎంతో అందంగా ఉన్నాయి కదా !
జవాబు.
(ఆశ్చర్యార్థకం)

ఊ) పూలనన్నింటినీ హారంగా కూర్చండి.
జవాబు.
(విధ్యర్థకం)

ప్రశ్నార్థక వాక్యాల చివర ప్రశ్నార్థకం (?), ఆశ్చర్యార్థక వాక్యాల చివర ఆశ్చర్యార్థకం (!) ఉంటుంది.

ప్రాజెక్టు పని

మీ జిల్లాలోని ముఖ్యమైన / పెద్ద చెరువులు ఏవి? అవి ఎక్కడ ఉన్నాయి? మొదలగు విషయాలను ఒక పట్టిక ద్వారా వివరించండి. నివేదిక రాయండి. ప్రదర్శించండి.
జవాబు.
హైదరాబాద్ నగరంలోని, పరిసరాలలోని చెరువులు

చెరువు ప్రదేశం
1. ఆల్వాల్ చెరువు సికింద్రాబాదికి 8 కి.మీ. దూరం. గణేష్ నిమజ్జనానికి వాడతారు.
2. బంజార్ చెరువు హమీద్ ఖాన్ కుంట అని మరొక పేరు. బంజారాహిల్స్లో ఉంది. 1930లో నిర్మించారు.
3. దుర్గం చెరువు రంగారెడ్డి జిల్లాలో ఉంది. రహస్య చెరువు అంటారు.
4. నక్క సాగర చెరువు జీడిమెట్ల చెరువు, కొల్లా చెరువు. కొంపల్లి దగ్గర ఉంది.
5. హిమాయత్ సాగర్ 20కి.మీ.దూరంలో ఉంది. ఎక్కువ నీరు నిల్వ ఉంటుంది. మూసీనదికి ఉపనది.
6. హుస్సేన్ సాగర్ ఇది హైదరాబాద్ లో ఉంది. హజ్రత్ హుస్సేన్షాహీవాలీ 1962లో నిర్మించారు. ఇదికూడా మూసీనదికి ఉపనది.
7. మీర్ ఆలం చెరువు హైదరాబాద్కు రిజర్వాయర్. తాగునీరుగా ఉపయోగం. నెహ్రూ జులాజికల్ పార్క్ దగ్గర
8. ఉస్మాన్ సాగర్ ఇది గండిపేటలో ఉంది. 46కి. మీ. దూరంలో ఉంది. చివరి నిజాం కాలంలో నిర్మించారు.
9. రుక్నుఉద్దౌలా చెరువు ఇది హైదరాబాద్లో ఉంది. 104 ఎకరములలో ఉంది.
10. సరూర్ నగర్ చెరువు హైదరాబాద్లో ఉంది. 1626లో నిర్మించారు. 99 ఎకరాలలో ఉంది. వ్యవసాయానికి, త్రాగునీరుగా ఉపయోగపడేది.
11. షామీర్పేట ఇది కృత్రిమ చెరువు. సికింద్రాబాద్ నుండి 24కి. మీ. దూరంలో ఉంది. పక్షుల సందర్శనకు ఇక్కడకు వస్తారు.

ఈ పై పట్టిక ఆధారంగా హైదరాబాద్ నగరంలో ఉన్న చెరువులను వివరించాను. ఇవి అన్నీ చరిత్రలో ఎంతో గొప్ప చెరువులు. తెలంగాణ ప్రభుత్వం “మిషన్ కాకతీయ” పేరుతో చెరువులను పునరుద్ధరించటానికి పథకం చేపట్టింది.

(లేదా)

గ్రామీణ వేడుకలు లేదా క్రీడలకు సంబంధించిన పాట/గేయం/కథ/వ్యాసం సేకరించి తరగతిలో ప్రదర్శించండి.
జవాబు.
1వ పాట :

(పల్లవి మాత్రమే)
ఎవ్వరో ఈ బిడ్డలు నింగిగా నెలవంకలు
ఎవ్వరో ఈ కూనలు అడవి మల్లెపూలు
వాళ్ళ తూటాలు నాకు శాపమయ్యాయిరో || ఎవ్వరో ||

2వ పాట :

కట్టు కట్టర బండి కాడెడ్ల బండి || 2 ||
గుంజు గుంజర బండి కాడెడ్ల బండి
ఎత్తు ఎత్తుర బండి కాడెడ్లా బండి
ఎత్తుర పిలగో ….. నాగులయ్యా …..
(ఎడ్లబండి పాట ఇది)
ఎత్తర పిలగో రాములయ్య …..

TS 7th Class Telugu 8th Lesson Questions and Answers Telangana గ్రామాలలోని వేడుకలు క్రీడావినోదాలు

3వ పాట :

పల్లె పల్లెను లేపి గుండె గుండెను ఊపి
నిండుశక్తిని జాపి దుంకు దుంకుర దుంకో ॥
కాశ్మీరం చూడరో కథ మారిపోయెరో
అస్సామీనాడురో నెత్తురు మడుగాయరో
ముడుచుకు కూర్చుంటేరో ముక్కలేను దేశమ్మురో॥

విశేషాంశాలు

1. ఇంద్రజాలం : ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు కనికట్టు చేసి చూపే ప్రదర్శనా విద్య. ఆంగ్లంలో దీనిని మ్యాజిక్ అంటాం. మల్లయుద్ధం : దేహదారుఢ్యం కలిగిన వస్తాదులు ఒకరితో ఒకరు కలబడే బహుసంబంధ యుద్ధ విద్య.

2.యక్షగానం : జక్కులు అనే తెగవారు ఆడుతూ పాడేవి యక్షగానాలు. ఇదొక ప్రదర్శనా కళ. ఇది నాటకానికి పూర్వరూపం.

3. కొరవి జాతర : వరంగల్ జిల్లా మానుకోట సమీపంలోని కొరవి గ్రామంలో జరిగే జాతర. ఇక్కడ వీరభద్రస్వామి పూజలందుకొంటాడు.

4. ఐనవోలు జాతర : వరంగల్ జిల్లా మామునూరు సమీపంలోని ఐనవోలు గ్రామంలో ప్రతి సంవత్సరం శివరాత్రికి మల్లన్న జాతర జరుగుతుంది. ఐనవోలు మల్లన్న జాతరగా జనవ్యవహారం.

5. మేడారం జాతర : ప్రతి మూడు సంవత్సరాల కొకసారి వరంగల్ జిల్లాలో జరిగే జాతర. ఇక్కడ గిరిజన దేవతలైన సమ్మక్క, సారలమ్మలను కొలుస్తారు. భారతదేశంలో జరిగే అతిపెద్ద జాతర ఇది.

6. కోలాటం : ఇదొక బృందనాట్యవిశేషం.

TS 7th Class Telugu 8th Lesson Important Questions గ్రామాలలోని వేడుకలు క్రీడావినోదాలు

కఠిన పదాలకు అర్ధాలు

  • ఆవాసం = నివాసం
  • నిలయం = నివాసం
  • సీమ = ప్రాంతం
  • సౌందర్యం = అందం
  • గోచరించుట = కనబడుట
  • మధురము = తియ్యనైనది
  • అతిశయోక్తి = ఉన్నదానికంటె ఎక్కువగా చెప్పుట
  • అభిరుచి = కోరిక
  • ఆదరణీయం = ఆదరించదగినది
  • క్రీడలు = ఆటలు
  • రక్తి = కోరిక
  • పబ్బము = పర్వము
  • సర్వజనులు = సమస్త ప్రజలు
  • మనోరంజనం = మనస్సును సంతోషపెట్టేది
  • సేద్యము = వ్యవసాయము
  • మక్కువ = అభిమానం
  • మేలుకొలుపు = నిద్రలేపు
  • వీనులు = చెవులు
  • సుప్రసిద్ధము = బాగా ప్రసిద్ధి పొందినది
  • ఉల్లాసము = సంతోషం

పర్యాయ పదాలు

  • ఆవాసము = నివాసము, వాసము, నిలయము, నెలవు
  • భాష = పలుకు, మాట, వచనం, ఉక్తి
  • సూక్తులు = సుభాషితాలు, సుద్దులు
  • ఆనందం = సంతోషం, హర్షం, ముదం, మోదం
  • కావ్యము = కృతి, గ్రంథము, ప్రబంధం
  • క్రీడ = ఆట, కేళి, గొండ్లి, గొండిలి
  • సేద్యము = వ్యవసాయము, కృషి, కిసుక, కర్షణము
  • కత = కథ, ఆఖ్యాయిక, కథానిక, గాథ
  • వేగం = శీఘ్రం, త్వరితం, లఘువు, వేగిరం
  • జగము = జగతి, జగత్తు, లోకం, ప్రపంచం

TS 7th Class Telugu 8th Lesson Questions and Answers Telangana గ్రామాలలోని వేడుకలు క్రీడావినోదాలు

ప్రకృతులు – వికృతులు

ప్రకృతి – వికృతి

  • భాష – బాస
  • కార్యము – కర్జము
  • కావ్యము – కబ్బము
  • సీత్యము – సేద్యము
  • జగత్తు – జగము, జాగా
  • జీవితము – జీతము
  • కథ – కత, కద
  • వేగం – వేగిరం, వేగ, వే, వేగి

I. క్రింది ప్రశ్నలకు సరైన సమాధానం గుర్తించండి.

1. ఇళయరాజా సంగీతం వీనులవిందు చేస్తుంది? (దీనికి అర్థం గుర్తించండి.)
a) కి ఇష్ట
b) కంటికి ఇష్టం
c) తలకు ఇష్టం
జవాబు.
a) కి ఇష్ట

2. మేడారం జాతర వల్ల ప్రకృతికి శోభ వచ్చింది (అర్థం గుర్తించండి.)
a) చీకటి
b) కాంతి
c) నల్లన
జవాబు.
b) కాంతి

3. మితిమీరిన ఆశ ఉండకూడదు. (అర్థం గుర్తించండి.)
a) ఆరోగ్యం
b) శరీరం
c) ఆసక్తి
జవాబు.
c) ఆసక్తి

4. ఓరుగల్లు కోట శిల్పాల అందం చూడముచ్చటగా ఉంది. (అర్థం గుర్తించండి.)
a) సౌందర్యం
b) వికారం
c) సాకారం
జవాబు.
a) సౌందర్యం

5. తెలంగాణ భాష మధురం. తెలంగాణ మాట సుమధురం. తెలంగాణ వచనం మధురాతి మధురం. (పై వాక్యంలో పర్యాయ పదాలు గుర్తించండి.)
a) భాష, మాట, వచనం
b) మధురం, సుమధురం, మధురాతి మధురం
c) తెలంగాణ, వచనం, మధురం
జవాబు.
a) భాష, మాట, వచనం

6. క్రీడలు శరీరానికి ఉల్లాసం ఇస్తాయి. ఆటలు సృజనాత్మకశక్తిని ఇస్తాయి. (పర్యాయ పదాలు గుర్తించండి.)
a) ఉల్లాసం, సృజనాత్మకత
b) శరీరం, ఆటలు
c) క్రీడలు, ఆటలు
జవాబు.
c) క్రీడలు, ఆటలు

7. రవి గృహం కొత్తది. రవి ఇల్లుకు రంగులు వేసారు. రవి సదనం నగరంలో ఉంది. (పర్యాయ పదాలు గుర్తించండి.)
a) రవి, కొత్తది
b) నగరం, సదనం
c) గృహం, ఇల్లు, సదనం
జవాబు.
c) గృహం, ఇల్లు, సదనం

8. శ్రీజకు క్రీడలంటే ఆసక్తి. ఆమె అభిరుచిని మెచ్చుకున్నారు. (పర్యాయ పదాలు గుర్తించండి.)
a) ఆసక్తి, అభిరుచి
b) శ్రీజ, ఆమె
c) క్రీడలు, ఆమె
జవాబు.
a) ఆసక్తి, అభిరుచి

TS 7th Class Telugu 8th Lesson Questions and Answers Telangana గ్రామాలలోని వేడుకలు క్రీడావినోదాలు

9. తెలంగాణలో దసరా పండుగ బాగా చేస్తారు. (వికృతి గుర్తించండి.)
a) పరువం
b) పౌర
c) పబ్బం
జవాబు.
c) పబ్బం

10. కార్యములు సాధనమున సమకూరును. (వికృతి గుర్తించండి.)
a) కర్ణము
b) కావ్యము
c) సాహిత్యం
జవాబు.
a) కర్ణము

11. జీవితం అందమైనది (వికృతి గుర్తించండి.)
a) జీవితము
b) జీతం
c) గీతం
జవాబు.
b) జీతం

12. వ్యవసాయదారులు సేద్యము చేస్తారు. (ప్రకృతి రాయండి.)
a) సీత్యము
b) గీతము
c) స్వేదము
జవాబు.
a) సీత్యము

13. తెలంగాణలో ఒగ్గుకథ చెపుతారు. (వికృతి రాయండి.)
a) కావ్య
b) కత
c) కర్ణం
జవాబు.
b) కత

14. శ్రావ్య సినిమా చూసి నిద్రపోయింది. (దీనిలో అసమాపక క్రియ గుర్తించండి.)
a) చూసి
b) పోయింది
c) శ్రావ్య
జవాబు.
a) చూసి

15. శృతి పుస్తకం చదివి ఇంటికి వెళ్ళింది. (దీనిలో సమాపక క్రియ)
a) వెళ్ళింది
b) చదివి
c) శృతి
జవాబు.
b) వెళ్ళింది

16. విజయశ్రీ పాఠం చెప్పి, ఖమ్మం వెళ్ళింది. (అసమాపక క్రియ గుర్తించండి.)
a) చెప్పి
b) వెళ్ళింది
c) విజయశ్రీ
జవాబు.
a) చెప్పి

17. రవి బొమ్మలు గీసి, వాటిని అమ్మాడు. (సమాపక క్రియ గుర్తించండి.)
a) గీసి
b) అమ్మాడు
c) రవి
జవాబు.
b) అమ్మాడు

18. రాజు పరీక్ష రాసి, మంచి మార్కులు పొందాడు. (అసమాపక క్రియ గుర్తించండి.)
a) రాజు
b) పొందాడు
c) రాసి
జవాబు.
c) రాసి

19. ఆహా! ఎంత బాగుందో! (ఇది ఏ వాక్యం)
a) విధ్యర్థకం
b) ఆశ్చర్యార్థకం
c) ప్రశ్నార్థకం
జవాబు.
B) ఆశ్చర్యార్థకం

20. మన రాష్ట్ర చిహ్నం ఏది? (ఇది ఏ వాక్యం)
a) ప్రశ్నార్థకం
b) ఆశ్చర్యార్థకం
c) విధ్యర్థకం
జవాబు.
a) ప్రశ్నార్థకం

TS 7th Class Telugu 8th Lesson Questions and Answers Telangana గ్రామాలలోని వేడుకలు క్రీడావినోదాలు

21. నీవు పాఠం చదువు. (ఇది ఏ వాక్యం)
a) ప్రశ్నార్థకం
b) ఆశ్చర్యార్థక
c) విధ్యర్థకం
జవాబు.
c) విధ్యర్థకం

I. క్రింది గద్యం చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

గౌతమి, కృష్ణవేణులకు ఆవాసమై, పాడిపంటలకు నిలయమైన తెలుగుసీమలోని పల్లెపట్టులలో కళాసౌందర్యము అడుగడుగున గోచరిస్తుంది. తెలుగువారి భాష యెంత మధురమైనదో, వారి సామాజిక జీవనమంత సుందరమైనదని చెప్పితే అతిశయోక్తి ఆవంతయునుగాదు. భారతదేశమంతటిలో నున్నట్లే తెలుగుసీమలో గూడ నూటికి తొంబదిపాళ్ల జనులు పల్లెటూళ్ళలోనున్నారు. తరతరాల నుండి వ్యాప్తిలోనున్న వేడుకలు, క్రీడా వినోదాలు ఎన్నియో ఇక్కడ కలవు. ఈ క్రీడా వినోదాలలో తెలుగువారి సుకుమార అభిరుచి ప్రతిబింబిస్తున్నది.

1. తెలుగుసీమ ఏ నదులకు ఆవాసమైనది?
జవాబు.
గౌతమి, కృష్ణవేణులకు తెలుగుసీమ ఆవాసమైనది.

2. తెలుగుసీమలోని పల్లెపట్టులు దేనికి నిలయము?
జవాబు.
తెలుగుసీమలోని పల్లెపట్టులు పాడిపంటలకు నిలయం.

3. తెలుగుభాష ఎటువంటిది?
జవాబు.
తెలుగుభాష మధురమైనది.

4. (భారతదేశంలో) తెలుగుసీమలలో ప్రజలు ఎంతశాతం పల్లెటూళ్ళలో ఉన్నారు?
జవాబు.
(భారతదేశం) తెలుగు సీమలలో నూటికి తొంభైశాతం (జనులు) ప్రజలు పల్లెటూళ్ళలో ఉన్నారు.

5. క్రీడావినోదాలలో ఏమి ప్రతిబింబిస్తున్నది?
జవాబు.
క్రీడా వినోదాలలో సుకుమార అభిరుచి ప్రతిబింబి స్తున్నది.

II. క్రింది గద్యం చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ఆటలకూ పాటలకూ వీడరాని చుట్టరికమున్నది. తెలుగు పల్లెలలో రకరకాలైన ఆటలను మనము చూడవచ్చును. ఈ ఆటలు మనస్సుకు ఉల్లాసము కలిగించే వేడుకలు. ఇందులో సమస్త జనులను ఆకర్షించే తోలుబొమ్మలాట సుప్రసిద్ధమైనది. ఈ తోలుబొమ్మలాట తెలుగువారి ప్రత్యేకత. వారు అనేక సంవత్సరాలనుండి ఉపాసించిన కళ. ఒక సన్ననిబట్టను తెరగాగట్టి ఆ తెరవెనుక పెద్ద దివిటీలు వెలిగింతురు. తెరవెనుక తోలుబొమ్మల కాళ్ళకూ, చేతులకూ దారాలు గట్టి బొమ్మలను నిలబెట్టి దారాలను లాగుతూ దివిటీల వెలుగులో వానిని ఆడింతురు. ఈ ఆటను ఆడించే నిపుణులైనవారు కొందరు, మన పల్లెటూళ్ళలో తిరుగుతూ ఉంటారు. ఈ తోలుబొమ్మలాటలు ఎక్కువగా రామాయణ భారత కథలకు సంబంధించినవి. నిజానికి రామాయణమూ, భారతమూ మన దేశీయులలో ప్రతి రక్తకణము నందు జీర్ణించిన కథలు.

1. వేటికి వేటికి వీడరాని చుట్టరికమున్నది?
జవాబు.
ఆటలకూ, పాటలకూ వీడరాని చుట్టరికమున్నది.

2. ఆటలు మనకు ఏమి కల్గిస్తాయి?
జవాబు.
ఆటలు, పాటలు మనకు ఉల్లాసాన్ని కల్గిస్తాయి.

3. తెలుగువారి ప్రత్యేకత కల్గించే ఆట ఏది?
జవాబు.
తెలుగువారికి ప్రత్యేకత కల్గించే ఆట తోలుబొమ్మలాట.

4. తోలుబొమ్మలాట ఎట్లా ఆడిస్తారు?
జవాబు.
ఒక సన్నని బట్టను తెరగాకట్టి ఆ తెరవెనుక పెద్ద దివిటీలు వెలిగిస్తారు. తెరవెనుక తోలుబొమ్మల కాళ్ళకూ, చేతులకూ ‘దారాలు కట్టి బొమ్మలను నిలబెట్టి దారాలను లాగుతూ దివిటీల వెలుగులో వానిని ఆడిస్తారు.

5. తోలుబొమ్మలాటలు ఎక్కువగా వేటికి సంబంధించినవి?
జవాబు.
తోలుబొమ్మలాటలు ఎక్కువగా రామాయణ, భారత కథలకు సంబంధించినవి.

TS 7th Class Telugu 8th Lesson Questions and Answers Telangana గ్రామాలలోని వేడుకలు క్రీడావినోదాలు

III. క్రింది గద్యం చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ఈ తోలుబొమ్మలాటవలెనే బహుళ ప్రచారము పొందినవి యక్షగానాలు అనే వీధినాటకాలు. ఈ నాటకాలను ఆడేవారిని జక్కులు అని పిలుస్తుంటారు. భాగవతములోని కృష్ణలీలలు మొదలైన వానిని ఆడేవారిని భాగోతులని గూడ పిలుస్తుంటారు. కొన్ని సంవత్సరాల క్రిందటివరకు మన పల్లెటూళ్ళలో ఈ భాగోతుల ఆటలు విరివిగా జరుగుతూ ఉండేవి. ఎన్నో నూర్ల సంవత్సరాలనించి యక్షగానాలు, తోలుబొమ్మలాటలతోపాటు, భాగోతాలు మన పల్లెటూళ్ళ ప్రజలను రంజింపజేస్తున్న వినోదాలు, వేడుకలు.

ఇవన్నీ తెలుగువారి కళాభిరుచికి మంచి నిదర్శనాలు. భజనమండలులను స్థాపించి, వారానికొకసారి (ఏ శనివారమునాటి సాయంత్రమో) ప్రజలొకచోట సమావేశమై భజనలు గావించుట మన పల్లెటూళ్ళలోని వినోదాలలో ఒక ప్రత్యేకమైన వినోదము. ఇతరులు ఆడుతుండగా చూచి వినోదించే ఆటపాటలలో చేరే వినోదాలు బొబ్బిలికథ, బాలనాగమ్మకథ మొదలైనవి. ఈ కథలను చెప్పేవారు గంటలతరబడి, ఒక్కొక్కసారి ప్రొద్దంతా, పల్లెటూరి ప్రజలను ఆకర్షించి, వినోదింపజేస్తుంటారు. కాని ఈ నాటి మారిన పరిస్థితులలో వీటికన్నింటికీ వ్యాప్తి తగ్గిపోతున్నది. ఈ కథలను జెప్పేవారి నేర్పు చాలా గొప్పది. వినేవారి రక్తము ఉడుకెత్తునట్లుగా వీరగాథలను వీరు చెప్పుచుందురు.

1. ఈ తోలుబొమ్మలాటవలె బహుళ ప్రచారం పొందినవి ఏవి?
జవాబు.
ఈ తోలుబొమ్మలాట వలె బహుళప్రచారం పొందినవి యక్షగానాలు అనే వీధినాటకాలు.

2. యక్షగానాలు ఆడేవారిని ఏమంటారు?
జవాబు.
యక్షగానాలు అనే వీథి నాటకాలను ఆడేవారిని జక్కులని అంటారు.

3. ఏవి తెలుగువారి కళాభిరుచికి మంచి నిదర్శనాలు?
జవాబు.
యక్షగానాలు, తోలుబొమ్మలాటలు, భాగోతాలు మన తెలుగువారి కళాభిరుచికి మంచి నిదర్శనాలు.

4. ఆటపాటలలో చేరే వినోదాలకు రెండు ఉదాహరణలివ్వండి.
జవాబు.
ఆటపాటలలో చేరే వినోదాలకు బొబ్బిలికథ, బాల నాగమ్మకథ మొదలైనవి ఉదాహరణలు.

5. కథలను చెప్పేవారు వీరగాథలను ఎలా చెపుతారు?
జవాబు.
కథలను చెప్పేవారు వీరగాథలను వినేవారి రక్తం ఉడుకెత్తునట్లుగా చెపుతారు.

IV. గద్యం చదివి 5 ప్రశ్నలు తయారు చేయండి.

పల్లెటూళ్ళలో ఉయ్యాలలూగుట బాలబాలికలేగాక పెద్దలు గూడ మిక్కిలి మక్కువ జూపించే క్రీడ. ఏదోవిధమైన ఉయ్యాలను మనము అనేక గృహాలలో చూడవచ్చును. ఈ మధ్య యితర క్రీడల వలెనే, సన్నగిల్లిపోతున్నప్పటికినీ గుర్రపుస్వారీ మన గ్రామాలలో బాగుగా అభిమానించిన క్రీడ.

మల్లయుద్ధాలు, కుస్తీలు మొదలైనవి తరతరాలనుండి మనవారు అభిమానించి, ప్రోత్సహించిన క్రీడలు. తెలుగుదేశంలోని జమీందార్లు ఇందులో ప్రవీణులైనవారిని తమ ఆస్థానాలలోనికి చేరదీసి వారిని పోషించిరి. దసరా పండుగ సందర్భాలలో ప్రజల సమక్షాన యీ మల్లయుద్ధ ప్రదర్శనలు కుస్తీలు జరిపించి, వారికి బహూకరించే ఆచారము ఇటీవలి వరకు మన పల్లెటూళ్ళలో ఉండేది. కత్తిసాము, కట్టెసాములలో ప్రవీణులైనవారిని మన పల్లెటూళ్ళలో చూడవచ్చును.

ప్రశ్నలు
1. బాలబాలికలేగాక పెద్దలు కూడ మిక్కిలి మక్కువ జూపించే క్రీడ ఏది?
2. గ్రామాలలో బాగా అభిమానించే క్రీడ ఏది?
3. మనవారు, అభిమానించి ప్రోత్సహించిన క్రీడ లేవి?
4. ఏ పండుగ రోజు మల్లయుద్ధ ప్రదర్శనలు ఇస్తారు?
5. వేటిలో ప్రవీణులైన వారిని మన పల్లెటూళ్ళలో చూడవచ్చును?

పాఠం ఉద్దేశం

నేడు సామాన్య ప్రజానీకానికి వివిధ రకాలైన వినోద కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచమే ఒక చిన్న గ్రామమైనది. ఎక్కడ ఏం జరిగినా, ఇంట్లో కూర్చొని ప్రసార మాధ్యమాల ద్వారా వాటిని చూస్తున్నాం. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందక ముందు గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య ప్రజలకు ఏయే వినోదసాధనాలు ఉండేవో. వాటి ద్వారా గ్రామీణులు ఎట్లా ఆనందాన్ని పొందేవారో, తద్వారా ఆనాటి సంస్కృతిని తెలుసుకొని గౌరవించడం ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం “రేడియో ప్రసంగం” ప్రక్రియకు చెందినది. సిద్ధం చేసుకున్న వ్యాసం రేడియో చేయబడుతుంది. విషయ క్లుప్తత, సరళత రేడియో ప్రసంగ లక్షణాలు.
గ్రామాలలో జరిగే వివిధ వేడుకలు, క్రీడావినోదాల గురించి
దేవులపల్లి రామానుజరావు తన ప్రసంగంలో వివరించాడు.

TS 7th Class Telugu 8th Lesson Questions and Answers Telangana గ్రామాలలోని వేడుకలు క్రీడావినోదాలు

కవి పరిచయం

ద్వారా ప్రసారం ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక ఉద్యమ నిర్మాతల్లో ఒకరు, జాతీయ పునరుజ్జీవన మహెూద్యమ కార్యకర్త, తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ రచయిత దేవులపల్లి రామానుజరావు. వరంగల్ సమీపంలోని దేశాయిపేట గ్రామంలో వేంకటచలపతిరావు, ఆండాళమ్మ దంపతులకు జన్మించాడు. ప్రాథమిక విద్య దేశాయిపేటలో, హైస్కూలు విద్య హన్మకొండలో పూర్తిచేశాడు. 1939లో బి.ఏ. పట్టా, 1942-44 మధ్యకాలంలో న్యాయశాస్త్రపట్టాలను పొందాడు. 1946లో ‘శోభ’ అనే సాహిత్య మాసపత్రికను ప్రారంభించి సంపాదకుడిగా 25-08-1917 ఉన్నాడు. గోలకొండ పత్రికను కొంతకాలం నడిపించాడు. పచ్చతోరణం, సారస్వత నవనీతం, 08-06-1993 తెనుగు సాహితి, వేగుచుక్కలు, తెలంగాణ జాతీయోద్యమాలు మొదలైనవి ఈయన రచనలు. “ఏబది సంవత్సరాల జ్ఞాపకాలు” ఈయన ఆత్మకథ.

ప్రవేశిక

గ్రామీణ ప్రాంతాల ఆటలు ఈ రోజుల్లో దాదాపుగ కనుమరుగైనాయి. ప్రస్తుతం ప్రజలు ఆడే ఆటలు గెలుపు ఓటములే లక్ష్యంగా, కొన్ని సందర్భాలలో జూదంగా పరిణమించాయి. పిల్లలు మైదానాలకు దూరమై కంప్యూటర్లతో, చరవాణి (సెల్ఫోన్)లతో ఆటలాడుతూ శారీరక వ్యాయామానికి ప్రాధాన్యాతను ఇవ్వడంలేదు. పాశ్చాత్య వికృతనృత్యాలు, ప్రసారమాధ్యమాలలోని విపరీతపోకడల ప్రవాహంలో కొట్టుకపోతూ ఇరుగుపొరుగు వారి సంబంధాలకు దూరమౌతున్నారు. తద్వారా మానవ సంబంధాలు తెగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో శారీరక, మానసిక వికాసానికి దోహదపడే ఆటలు, వినోదాల గూర్చి తెలుసుకోవడం అత్యంత అవసరం. ఆటపాటలు మన సంస్కృతిలో భాగం, పూర్వం గ్రామాలలో ఎట్లాంటి ఆటలు, వినోదాలు ఉండేవో తెలుసుకుందాం.

నేనివి చేయగలనా?

TS 7th Class Telugu 8th Lesson Questions and Answers Telangana గ్రామాలలోని వేడుకలు క్రీడావినోదాలు 4