These TS 9th Class Telugu Important Questions 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి will help the students to improve their time and approach.
TS 9th Class Telugu 4th Lesson Important Questions రంగాచార్యతో ముఖాముఖి
PAPER – I : PART – A
I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)
అ) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
దాశరథి రంగాచార్యకు తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం ఉందని ఎలా చెప్పగలవు ?
జవాబు:
తెలుగు సాహిత్యంలో దాశరథి రంగాచార్యులుగారికి విశిష్ట స్థానం ఉంది. ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్య ఈయన సోదరుడు. రంగాచార్య విశిష్టమైన నవలలు రచించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసాడు. నాలుగు వేదాలను, పది ఉపనిషత్తులను తెలుగులోకి అనువదించారు. రామాయణ, భారత, భాగవతాలను సరళ వచనంలో రాసి, ప్రజలకు అందుబాటులో వాటిని తెచ్చారు.
తెలుగు నవలలో ‘పాత్రోచితయాస’ను మొదటగా ప్రవేశపెట్టి, ప్రశంసలందుకొన్నారు. వీరి రచనలు ఇతర భారతీయ భాషలలోకి అనువదించబడ్డాయి అంటే వీరి సాహిత్య విలువలు ఎలా ఉంటాయో గమనించాలి. వీరి “చిల్లర దేవుళ్ళు” నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. తెలంగాణ జనజీవనం, రైతాంగ పోరాటం వంటి అంశాల నేపథ్యంగా రచనలు చేసి, తన విశిష్ట రచనాశైలితో పాఠకుడిని ఆకట్టుకొనే రంగాచార్యకు తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం ఉందని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా ఏం కావాలి ?
ప్రశ్న 2.
వాడుకభాష వలన ప్రయోజనం ఏమిటి?
జవాబు:
తెలుగుభాష బోధనలో, వ్యాసాలూ, వార్తల రచనల్లో, కథాకథనంలో గ్రాంథికం గాక, వాడుకలో ఉన్న పదాలతో, ఎలా సామాన్యంగా మాట్లాడతామో అలా తెలుగు వాక్యాలను వ్రాయడం ద్వారా విద్య పండితులకే అన్న భావన తొలిగి విద్య అందరిదీ అన్న భావనను మహనీయులైన ఎందరో కవులు తెచ్చారు.
పూర్వం మాట్లాడే భాషకు, రాసే భాషకు అంతరం ఉండేది. దానివల్ల కవుల గ్రంథాలు కేవలం పండితులకే పరిమితం అయ్యాయి. రానురాను కవులు, రచయితల ఆలోచనలలో మార్పువచ్చి పండిత పామర రంజకంగా రాయాలంటే వాడుకభాషే సరైనదని భావించి, రచనలు చేశారు. వాడుకభాష వల్ల సామాన్యుడు సైతం తేలికగా అర్ధం చేసుకోవడానికి వీలుంటుంది. కవి ఆంతర్యం, ఆలోచన లోకానికి తొందరగా చేరుతుంది.
![]()
ప్రశ్న 3.
“సిద్ధాంతం కన్నా కర్తవ్యం గొప్పది” అంటే మీకు ఏమర్థమయ్యింది ?
జవాబు:
‘సిద్దాంతము’ అనగా అక్షర రూపు దాల్చిన స్థిరమైన విధానము. మనం ఏమి చేయాలనుకున్నామో, ఎట్లా చేయాలనుకున్నామో ఇదంతా ఒక మాటగానో, పుస్తకంగానో ఉండటమే సిద్ధాంతం. ఇక ‘కర్తవ్యం’ అంటే విధి. మనం చేయాల్సిన పనిని తెలిపేది. బాధ్యతను గుర్తుచేసేది అని చెప్పవచ్చు. మాటలకన్నా చేతల్లో చూపించడం అనేది ఎప్పుడూ గొప్పే. కనుక అక్షర (మాటలు) రూపంలోని సిద్ధాంతాలతో కూర్చోవడం కన్నా మనిషిగా మన కర్తవ్యాన్ని గుర్తించి ప్రవర్తించడం గొప్ప విషయం. ఇది పెద్దల మాట. గాంధీగారు “డూ ఆర్ డై” అన్నారు. అది ఆయన సిద్ధాంతం కాదు. కర్తవ్యం అని అర్థం చేసుకున్నాను.
ప్రశ్న 4.
ఇంటర్వ్యూ ఎన్ని రకాలు ? అవి ఏవి ?
జవాబు:
ఇంటర్వ్యూలు రెండు రకాలు. ఉద్యోగాల ఎంపికకు అభ్యర్థుల ప్రతిభను పరీక్షించడానికి చేసే ఇంటర్వ్యూలు మొదటి రకం. ప్రముఖుల జీవిత విశేషాలను తెలుసుకోడానికి చేసే ఇంటర్వ్యూలు రెండో రకం.
ఆ) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
తెలంగాణ ప్రజల జీవనాన్ని, అస్తిత్వాన్ని, పోరాటాలను దాశరథి తన రచనల్లో ప్రతిబింబించిన తీరును సొంతమాటల్లో వివరించండి.
జవాబు:
తెలుగు సాహిత్యంలో దాశరథి రంగాచార్యుల గారికి విశిష్ట స్థానం ఉంది. ఈయన తెలంగాణ పోరాటం పూర్వరంగాన్ని, తన జీవశక్తిగా మార్చుకొని, తెలుగువారి సాంస్కృతిక జీవనాన్ని అద్భుతంగా చిత్రించారు. రంగాచార్య నవలల్లో ప్రధాన విషయం ‘తెలంగాణ సాయుధ పోరాటం’. దాశరథి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ఉద్యమశీలి. తెలంగాణలో పోలీసు యాక్షన్ తరువాత రైతుల భూములను దొరలు కాజేశారు.
తరువాత వచ్చిన ఉద్యమాలు, వాటి పేరున జరిగిన మోసాలు, రాజకీయాలు, ఎంత దిగజారాయో మొదలైన విషయాలు ప్రజలకు తెలియాలి అనే భావనతో ‘జనపదం’ నవలలో వివరించారు. “మోదుగుపూలు” నవల ద్వారా ‘సిద్దాంతం కన్నా కర్తవ్యం గొప్పది. విశ్వాసం కంటే కర్తవ్యం గొప్పది’ – అని ప్రకటించారు.
కమ్యూనిస్టు ఉద్యమం దాశరథికి జీవితాన్ని నేర్పింది. సమాజం కోసం ఏదైనా చేయాలి అనే తపన కల్గించింది. “నేను రచనలు ప్రజాజీవితాన్ని చిత్రించడానికి రాశాను. నా ప్రజలకోసం రాశాను” అనడంలో దాశరథికి తెలంగాణ ప్రజలపట్ల ఉన్న అభిమానం వ్యక్తమౌతుంది. “ఆదర్శం, ఆవేశం, అక్షరం” ఇవి ఉన్నప్పుడే వ్యక్తికైనా, సమాజానికైనా కావాల్సినవి సిద్ధిస్తాయని తన రచనల ద్వారా సందేశమిచ్చిన దాశరథి ప్రాతఃస్మరణీయులు.
![]()
ప్రశ్న 2.
ప్రముఖ సాహితీవేత్త డా॥ దాశరథి రంగాచార్య చేసిన సాహిత్య సేవను వివరించండి. (లేదా) రంగాచార్యతో ముఖాముఖి ఆధారంగా ఆయన రచనల గురించి వివరించండి.
జవాబు:
మహాకవి దాశరథి రంగాచార్యగారు తెలంగాణ సాయుధపోరాటం నేపథ్యంగా చిల్లర దేవుళ్ళు, జనపదం, మోదుగుపూలు, మాయజలతారు వంటి అద్భుతమైన నవలలు రాశారు. చారిత్రాత్మకమైన తెలంగాణ పోరాట చరిత్రను తన రచనల ద్వారా భావితరాలకు వారు అందజేశారు.
ఇంతేకాక, నాలుగు వేదాలనూ, పది ఉపనిషత్తులనూ తెలుగులోకి అనువదించారు. రామాయణ, భారత, భాగవతాలను సరళవచనంలో రాశారు. తెలంగాణ జనజీవనం, రైతాంగ పోరాటం, వంటి అంశాలు నేపథ్యంగా ఈయన విశిష్టమైన నవలలు రచించి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. తెలుగు నవలలో పాత్రోచితయాసను మొదటగా ప్రవేశపెట్టారు. వీరి రచనలు ఇతర భారతీయ భాషలలోకి కూడా అనువదింపబడ్డాయి.
ఈయన నవలలు చలన చిత్రాలుగా వచ్చాయి. ఈయన రచనాశైలి, పాఠకుడిని ఆకట్టుకొంటుంది. ఈయన రాసిన “చిల్లర దేవుళ్ళు” నవలకు, రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈయనను ‘గద్య దాశరథి’ అనేవారు. ఈయన సంస్కృతాంధ్ర భాషల్లో మహాపండితుడు. ఈయన జీవిత చరిత్రను ‘మోదుగుపూలు’ నవలలో చిత్రించారు. రంగాచార్య గొప్ప రచయిత.
PAPER – I : PART – B
భాషాంశాలు – పదజాలం
1. సొంతవాక్యాలు
అ) కింది పదాలను సొంతవాక్యాల్లో ప్రయోగించండి.
1. బుగులు పడడం (కలత చెందడం)
వాక్యప్రయోగం : రాష్ట్రం విపరీతమైన ఎండలతో బుగులు పడింది.
2. బృహత్ కార్యము: (పెద్దపని)
వాక్యప్రయోగం : ముఖ్యమంత్రి రాష్ట్రమును బంగారు తెలంగాణగా రూపొందించడం అనే బృహత్ కార్యక్రమమును చేపట్టారు.
3. గర్వకారణము :
వాక్యప్రయోగం : మా పాఠశాలలో పదవతరగతి పరీక్షల్లో నూటికి నూరుశాతం పాసుకావడం, మాకు గర్వకారణం
4. సాంప్రదాయసిద్ధము :
వాక్యప్రయోగం : మేము సాంప్రదాయ సిద్ధమైన వస్త్రాలనే ధరిస్తాము.
5. వసుధైక కుటుంబం :
వాక్యప్రయోగం : ప్రపంచ ప్రజలు కులమత భేదాలు విడిచి వసుధైక కుటుంబ భావనతో జీవించాలి.
ఆ) కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు గుర్తించి, వాటి సంకేతాన్ని (A, B, C, D) రాయండి.
ప్రశ్న 1.
నా నవలలు ఆ వ్యధ, బాధ అనే తమస్సులోంచి ఆవిర్భవించాయి.
A) పుట్టడం
B) బాధపడడం
C) తపస్సు చెయ్యడం
D) రాయడం
జవాబు:
A) పుట్టడం
ప్రశ్న 2.
నీ కర్తవ్యం నీవు మరువకు.
A) మాట
B) చేయవలసిన పని
C) ఆలోచన
D) ప్రార్థన
జవాబు:
B) చేయవలసిన పని
![]()
ప్రశ్న 3.
ప్రణాళికలను బాగా అధ్యయనం చేయాలి.
A) రాయడం
B) పరిశీలించడం
C) చదవడం
D) నేర్చుకోడం
జవాబు:
B) పరిశీలించడం
ఇ) కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు సరియైన పర్యాయపదాలు గుర్తించి, వాటి సంకేతాన్ని (A, B, C, D) రాయండి.
ప్రశ్న 1.
ఈ వ్యధ బాధ ఆవేదనలోంచి పుట్టాయి.
A) విచారం, గొప్ప
B) గరువము, కావరము
C) గౌరవం
D) రంధి, కష్టం
జవాబు:
C) గౌరవం
ప్రశ్న 2.
కమ్యూనిస్టు ఉద్యమం నన్ను మనిషిని చేసింది.
A) నరుడు, మానవుడు
B) మనుజుడు, యోగ్యుడు
C) మర్త్యుడు, సరసుడు
D) నరుడు, దేవత
జవాబు:
A) నరుడు, మానవుడు
ప్రశ్న 3.
ప్రజల జీవితం నేపథ్యంగా నవలలు రాశారు.
A) బతుకు, కష్టం
B) బతుకు, సంసారం
C) బతుకు, జీవనం
D) మనికి, నడవడి
జవాబు:
C) బతుకు, జీవనం
ప్రశ్న 4.
రామప్పగుడి సోయగం వర్ణనాతీతం.
A) అందం, చందం
B) అందం, సొగసు
C) సొగసు, గొప్పతనం
D) అందం, రంగు
జవాబు:
B) అందం, సొగసు
ఈ) కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు ప్రకృతులకు వికృతులు, వికృతులకు ప్రకృతులను గుర్తించి, వాటి సంకేతాన్ని (A, B, C, D) రాయండి.
ప్రశ్న 1.
రావణుని గర్వమునకు కారణం ఏమిటి ?
A) ఖర్వం
B) గరువము, కారవము
C) గౌరవం
D) గారం
జవాబు:
B) గరువము, కారవము
ప్రశ్న 2.
ఆలస్యం ఎందుకంటే కత చెప్తావేం? గీత గీసిన పదానికి ప్రకృతి
A) కతలు
B) కొత్త
C) కథ
D) కైత
జవాబు:
C) కథ
![]()
ప్రశ్న 3.
నీ కష్టం నాకు అర్ధం అయ్యింది.
A) కస్తి
B) నష్టం
C) కలహం
D) ఇష్టం
జవాబు:
A) కస్తి
ప్రశ్న 4.
తమిళంలో ఒక్క అక్షరం రాయరాదు.
A) అక్ష
B) అవసరం
C) అక్కరం
D) అక్షయం
జవాబు:
C) అక్కరం
ప్రశ్న 5.
నాకు పద్యము చదవడం ఇష్టం.
A) పద్దెము
B) గద్యం
C) గం
D) పాట
జవాబు:
A) పద్దెము
ఉ) కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు నానార్థాలను గుర్తించి, వాటి సంకేతాన్ని (A, B, C, D) రాయండి.
ప్రశ్న 1.
తెలంగాణలో రైతుపోరాట ఉద్యమం ఉవ్వెత్తున సాగింది.
A) యత్నం, ప్రయత్నం
B) యత్నం, పోరాటం
C) కలహం, సిద్దమవడం
D) యత్నం, కృషి
జవాబు:
B) యత్నం, పోరాటం
ప్రశ్న 2.
రాష్ట్ర సాధనలో విద్యార్థుల కృషి అమోఘమైనది.
A) ప్రయత్నం, వ్యవసాయం
B) వ్యవసాయం, చేత
C) పని, నడక
D) ప్రయత్నం, సాధక
జవాబు:
A) ప్రయత్నం, వ్యవసాయం
ప్రశ్న 3.
ఈ రోజు పాఠశాలలో సభ జరిగింది.
A) జూదం, మీటింగు
B) పరిషత్తు, కొలువు
C) ఇల్లు, జూదం
D) పరిషత్తు, ఉద్యమం
జవాబు:
C) ఇల్లు, జూదం
ప్రశ్న 4.
ఈ మధ్య సమాజం పూర్తిగా, కొత్తపుంతలు తొక్కుతోంది.
A) సభ, మనుషుల గుంపు
B) మనుషుల గుంపు, సమితి
C) సమితి, జనం
D) జనం, సభ
జవాబు:
A) సభ, మనుషుల గుంపు
PAPER – II : PART – A
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
ప్రశ్న 1.
దాశరథి రంగాచార్యగారిని అభినందిస్తూ కవిత/గేయం రాయండి.
జవాబు:
కవిత
– కంచిభొట్ల ఫణిరామ్
ఎవరయ్యా అతడు ! ఎవరయ్యా !
జనపదం ఆయన పథం
మోదుగు పూలు వారి హృది పథం.
చరిత్రను చెరపలేరంటాడు
రానున్న తరాలకు అందిస్తానంటాడు.
వారి నవలలు కావా ప్రజా జీవితాలూ ?
ఎందరో యువకులకు ప్రబోధ గీతాలు.
ఎవరయ్యా ఇతడు ! ఎవరయ్యా !
సత్యం ఆయన నమ్మిన మార్గం.
కర్తవ్యానికి నిలువెత్తు దుర్గం.
తెలంగాణం అంటే అభిమానం.
తెలంగాణేతరం పట్ల లేదు దురభిమానం.
‘ఆదర్శం, ఆవేశం, అక్షరం’ నా జీవితం
బాధ్యత, విలువలు గల ఈ సమాజానికే అంకితం.
అన్నది ఇంకెవరయ్యా ఆయనే దాశరథి రంగాచార్య.
![]()
ప్రశ్న 2.
మీ తెలుగు పాఠ్యపుస్తక రచయిత మీ పాఠశాలకు వస్తే ఆయనతో ముఖాముఖికి అవసరమైన ప్రశ్నావళిని తయారుచేయండి.
జవాబు:
మా పాఠశాలకు డా॥ ఇరివెంటి కృష్ణమూర్తిగారు వస్తే, ఈ క్రింది ప్రశ్నలతో ఆయనను ఇంటర్వ్యూ చేస్తాను.
- యువభారతి అధ్యక్షా ! ‘కవి సమయములు’ అంటే ఏమిటి ? .
- విద్వత్తులేని వక్తృత్వం ఎంతోకాలం అంతటా రాణించదు అన్నారు. ఎందుకు ?
- వక్తకు జ్ఞాపకశక్తి ఉండాలా ?
- వక్త అంగాంగ విన్యాసం చెయ్యాలనే నియమం ఏదీ లేదన్నారు. ఎలా ?
- ఉపన్యాసం వ్యంగ్యార్థాన్ని ఆశ్రయించాలా ?
- ఉపన్యాసానికి ఆత్మ ఏది ?
- బాగా ఆలోచించేవాడు తక్కువ మాట్లాడతాడా ?
- శ్రోతలను శిలామూర్తులనుకోవడం ఎలా ?
ప్రశ్న 3.
మీ పాఠశాలకు వచ్చిన పదవీ విరమణ పొందిన ఒక ఉపాధ్యాయునితో ఆయన ఉద్యోగ జీవితాన్ని గురించి తెలుసుకునేందుకు ప్రశ్నావళి తయారుచేయండి.
జవాబు:
మా పాఠశాలకు ఇటీవల పదవీ విరమణ పొందిన తెలుగు ఉపాధ్యాయుడు వస్తే, కింది ప్రశ్నలతో ఆయన గూర్చి ఇలా అడుగుతా.
- నమస్కారమండి గురువుగారు! మీ ఆరోగ్యం ఎలా ఉంది ?
- మీ ఊరిలో ఉన్నప్పుడు మేము గుర్తుకొస్తామా ?
- మీకు కాలక్షేపం ఎలా అవుతోంది ?
- ఖాళీ సమయాల్లో ఏం చేస్తారు ?
- ఏవైనా పుస్తకాలు రాశారా ?
- మేమేమైనా ఇబ్బంది పెట్టి ఉన్నామా ?
- మేము మీ మనసుకు బాగా కష్టపెట్టిన సందర్భం ఏది ?
- మీరు ఎన్నో ఊళ్ళు మారి ఉంటారు. ఎందరినో విద్యార్థులను చూసి ఉంటారు. వారిలో బాగా నచ్చిన దెవరు ? బాధపెట్టిన దెవరు ?
- మీకు ఇష్టమైన కవి ఎవరు ?
- మీకు బాగా నచ్చిన పుస్తకం ఏది ?
PAPER – II : PART – B
భాషాంశాలు – వ్యాకరణం
1. సంధులు
1) మహోద్యమం = మహా + ఉద్యమం – గుణసంధి
2) మహోజ్జ్వలం = మహా + ఉజ్జ్వలం – గుణసంధి
3) అన్నయ్య = అన్న + అయ్య – అత్వసంధి
4) ప్రభావాత్మకము = ప్రభావ + ఆత్మకము – సవర్ణదీర్ఘ సంధి
5) సంస్కృతాంధ్రభాషలు = సంస్కృత + ఆంధ్రభాషలు – సవర్ణదీర్ఘ సంధి
6) వసుధైక కుటుంబం = వసుధా + ఏకకుటుంబం – వృద్ధిసంధి
7) మరొకటి = మరి + ఒకటి – ఇత్వసంధి
8) విద్యార్థులు = విద్యా + అర్థులు – సవర్ణదీర్ఘ సంధి
2. సమాసాలు
సమాస పదం – విగ్రహవాక్యం – సమాస నామం
1) మహోద్యమము – గొప్పదైన ఉద్యమం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
2) విద్యార్థులు – విద్యను అర్థించువారు – ద్వితీయా తత్పురుష సమాసం
3) ప్రజాజీవితాలు – ప్రజల యొక్క జీవితాలు – షష్ఠీ తత్పురుష సమాసం
4) పోరాటగాథ – పోరాటము యొక్క గాథ – షష్ఠీ తత్పురుష సమాసం
5) జీవనచిత్రాలు – జీవనము యొక్క చిత్రాలు – షష్ఠీ తత్పురుష సమాసం
6) భారతదేశము – భారతము అనే పేరుగల దేశము – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
7) కొత్త దృక్పధము – కొత్తదైన దృక్పధము – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
8) గర్వకారణం – గర్వమునకు కారణం – షష్ఠీ తత్పురుష సమాసం
9) చదువు రాణి – చదువులకు రాణి – షష్ఠీ తత్పురుష సమాసం
10) భగవదనుగ్రహం – భగవంతుని యొక్క అనుగ్రహం- షష్ఠీ తత్పురుష సమాసం
11) వారసత్వసంపద – వారసత్వం అనెడి సంపద – రూపక సమాసం
12) సాహిత్యకృషి – సాహిత్యమందు కృషి – సప్తమీ తత్పురుష సమాసం
13) జీవనవైభవము – జీవనము యొక్క వైభవము – షష్ఠీ తత్పురుష సమాసం
ప్రశ్న 3.
‘సభ కొఱకు భవనం’ – ఈ విగ్రహవాక్యాన్ని సమాసపదంగా మార్చి, సమాసనామం రాయండి.
జవాబు:
సభా భవనం – చతుర్థీ తత్పురుష సమాసం
ప్రశ్న 4.
‘తల్లియు బిడ్డయూ’ విగ్రహవాక్యాన్ని సమాసపదంగా మార్చి, సమాసనామం రాయండి.
జవాబు:
తల్లీ బిడ్డలు – ద్వంద్వ సమాసం
ప్రశ్న 5.
‘వసుధైక కుటుంబము’ – విడదీసి సంధి పేర్కొనండి.
జవాబు:
వసుధా + ఏక కుటుంబము – వృద్ధిసంధి.
![]()
ప్రశ్న 6.
‘భారతదేశము’ విగ్రహవాక్యం రాసి, సమాసనామాన్ని పేర్కొనండి.
జవాబు:
భారతం అనే పేరుగల దేశం- సంభావన పూర్వపద కర్మధారయం
ప్రశ్న 7.
‘వారసత్వ సంపద’ – సమాసానికి విగ్రహం రాసి, సమాసం పేరు చెప్పండి.
జవాబు:
వారసత్వం అనే సంపద – రూపక సమాసం
ప్రశ్న 8.
‘మహా + ఉద్యమం’ – సంధి కలిపి సంధి జరిగిన విధానాన్ని రాయండి.
జవాబు:
మహోద్యమము – గుణసంధి, ‘మహా’ పదం చివర ‘అ’కు, ‘ఉ’ పరమై గుణసంధి వచ్చింది.
ప్రశ్న 9.
రాముడు రావణుని చంపాడు. (కర్మణి వాక్యంగా మార్చండి.)
జవాబు:
రావణుడు రామునిచే చంపబడ్డాడు. (కర్మణి వాక్యం)
ప్రశ్న 10.
బాలురచే సెలవు తీసికోబడింది. (కర్తరి వాక్యంగా మార్చండి.)
జవాబు:
బాలురు సెలవును తీసుకున్నారు. (కర్తరి వాక్యం)