TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana పల్లె అందాలు

Telangana SCERT 7th Class Telugu Guide Telangana 5th Lesson పల్లె అందాలు Textbook Questions and Answers.

పల్లె అందాలు TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana

బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి.

TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana పల్లె అందాలు 1

ప్రశ్నలు
1. పై బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి?
జవాబు.
ఆకాశంలో సూర్యుడు, పక్షులు కనిపిస్తున్నాయి. క్రింది నుండి కొండపైకి దారి వేశారు. ఇళ్ళు, చెట్లు, పశువులుతో పల్లె కనిపిస్తోంది. పల్లె పచ్చని మొక్కలతో అందంగా ఉంది.

2. మీరు చూసిన పల్లెకు, బొమ్మలోని పల్లెకు తేడాలేమిటి?
జవాబు.
మేము చూసిన పల్లె పచ్చని పొలాలలతో నిండి ఉంది. చల్లనిగాలి, పక్షుల కిలకిలరావాలు ఎంతో ఆనందాన్నిచ్చేవి. పైబొమ్మలోని పల్లె కూడా అలానే ఉంది.

3. పల్లెలో ఏమేమి ఉంటాయి?
జవాబు.
పల్లెలో చిన్న ఇళ్ళు, పాడి ఆవులు, గేదెలు, పచ్చని పొలాలు అందరూ కలసిమెలసి ఉండే వాతావరణం ఉంటుంది. రకరకాల పండ్లు, పూలచెట్లు, చెరువులు, సెలయేళ్ళు ఉంటాయి.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
కవి చెరువును గంగాళంతో పోల్చాడు కదా! ఇంకా చెరువును వేటితో పోల్చవచ్చు?
జవాబు.
ఇంకా పెద్ద పాత్రతో, చిన్న సముద్రంతో పోల్చవచ్చు. బాగా విచ్చిన తామరపువ్వుతో పోల్చవచ్చు. హైదరాబాద్ లోని చెరువులను హుసేన్ సాగర్, నిజాంసాగర్ అని సాగరంతో పోల్చడం జరిగింది. (వనపర్తి సంస్థానంలోని 7 పెద్ద చెరువులను సప్తసముద్రాలుగా పిలిచేవారు. కావున చెరువును సముద్రంగా పోల్చవచ్చు.

ప్రశ్న 2.
పాఠంలో “చెరువును పద్మాలకు నిలయాలు” అని కవి అన్నాడు కదా! ఇప్పుడు చెరువులు వేటికి నిలయాలు ?
జవాబు.
మా పాఠంలో కవి చెరువును పద్మాలకు నిలయాలు అని చెప్పాడు. పూర్వం పరిశుభ్రత, స్వచ్ఛత ఉండడం వలన అవి అలా ఉండేవి. నేడు రసాయనాలు, మురికి, చెత్తా, చెదారంతో నిండి చెరువులు కలుషితం అవుతున్నాయి.

ప్రశ్న 3.
సూర్యోదయ సమయంలో చెరువు ఎట్లా ఉంటుంది?
జవాబు.
సూర్యోదయ సమయంలో చెరువు పరిశుభ్రంగా, నిర్మలంగా ఉంటుంది. సూర్యుని లేత కిరణాలు చెరువులో పడి, అందులోని తామరపూలు వికసించి ఎంతో అందంగా ఉంటాయి. లేత కిరణాలు పడి చెరువు స్వచ్ఛత వలన చూడ ముచ్చటగా ఉంటుంది.

TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana పల్లె అందాలు

ప్రశ్న 4.
పూవులను ఏయే సందర్భాలలో అలంకరణకు వాడుతారు?
జవాబు.
పూలను ఆడవారు తమ తలపై పెట్టుకోవడానికి ఉపయోగిస్తారు. ప్రతిరోజు దేవునికి సమర్పించడానికి, పూజలు చేయడానికి వినియోగిస్తారు. పండుగలలోను, పెళ్ళిళ్ళలోను, ఇంకా ఇతర సమయాలలో అలంకరించడానికి వాడతారు. గౌరవనీయులైన వారి మెడలో వేయడానికి పూల మాలలను వాడతారు. పూలు అలంకార సాధనం.

ప్రశ్న 5.
ఏఏ ఋతువులో ఏయే పూలు దొరుకుతాయి?
జవాబు.
వసంతఋతువు – చైత్ర, వైశాఖం
గ్రీష్మఋతువు – జ్యేష్టం, ఆషాఢం
వర్షఋతువు – శ్రావణం, భాద్రపదం
శరదృతువు – ఆశ్వయుజం, కార్తీకం
హేమంతఋతువు – మార్గళిరం, పుష్యం మాఘం, ఫాల్గుణం
శిరరఋతువు – మాఘం, ఫాల్గుణం – మోదుగ

ప్రశ్న 6.
మీ గ్రామ ప్రత్యేకతలు ఏమిటి?
జవాబు.
మా గ్రామంలో అన్ని వర్గాల వారు కలసి మెలసి ఉంటారు. ఒకరి మంచి చెడులలో అందరూ పాల్గొంటారు. ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా అందరూ వస్తారు. ఎవరికి ఎలాంటి కోపతాపాలు ఉండవు. ప్రశాంతంగా జీవిస్తారు. ఒకరిని మరొకరు గౌరవించుకొంటారు. అందరిలోను నీతి, నిజాయితి ఉంది.

ప్రశ్న 7.
పల్లె జీవితం నుండి పశుసంపద ఎందుకు దూరం అయ్యింది?
జవాబు.
ఆధునిక యంత్రాలైన ట్రాక్టర్లు, నూర్పిడి యంత్రాలు రావడం ఒక కారణం. పశుసంపదను పోషించడానికి కావలసినంత వసతి, మేత దొరకక పోవడం ఒక కారణం. పశువుల ఖరీదు ఎక్కువ కావడం ఒక కారణం. పశువుల నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడం మరొక కారణం.

TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana పల్లె అందాలు

ప్రశ్న 8.
పల్లెలోని వ్యాపారులు ఎట్లాంటి వ్యాపారం చేసేవారు? మీగ్రామంలోని వ్యాపారులకు, వీరికి భేదం తెలుపండి.
జవాబు.
పల్లెలోని వ్యాపారులు అన్ని రకాల వస్తువులు అమ్మేవారు. మా గ్రామంలోని వ్యాపారులు రైతుల వద్ద ధాన్యం, కందులు, మినుములు, పెసలు మొ॥ వాటిని కొని నిల్వ చేస్తారు. బాగా ధర వచ్చినపుడు అమ్మి లాభాలు పొందుతారు.

ప్రశ్న 9.
మీ ఊరిలో అంగ ఎట్లా జరుగుతుంది?
జవాబు.
మా ఊరి అంగడిలో అనేక వస్తువులు దొరుకుతాయి. ప్రతి వస్తువూ చౌకగా లభించడం మా అంగడి ప్రత్యేకత !

ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

ప్రశ్న 1.
పాఠంలోని పద్యాల ద్వారా ఊరి గురించి తెలుసుకున్నారు కదా! మీరు చూసిన ఊరుతో దీన్ని పోల్చి మాట్లాడండి.
జవాబు.
పాఠంలోని పద్యాలలో ఊరు చెరువులు, పూలు, పండ్లు, పంటలు, పాడి, చేనేత కార్మికుల గూర్చి చెప్పారు. మేము చూసిన ఊరు హుజూర్ నగర్. కుమ్మరి కుండలు చేస్తాడు. రైతులు పంటలు పండిస్తారు. వడ్రంగివారు చెక్కపని చేస్తారు. ఆయా ఋతువులలో అన్ని రకాల పండ్లు దొరుకుతాయి.

ప్రశ్న 2.
పాఠంలోని పద్యాలను రాగంతో చదవండి. వాటి భావాలు చెప్పండి.
జవాబు.
ముందిచ్చిన పద్యాల భావాలు చూడండి.

II. ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

1. ఈ కింది పేరా చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రకృతి అందచందాలు అమూల్య సంపదలు. గలగలపారే సెలయేరు, ఉదయించే అరుణకిరణాల సూర్యుడు, పక్షుల కిలకిలారావాలు, పచ్చని కొంగేసినట్లున్న వనసీమలు ఒకటేమిటి? ఎన్నెన్నో అందాలతో విలసిల్లే పల్లె ఆనందానికి నెలవు. పల్లె ఆశ్రయమిచ్చి అక్కున చేర్చుకునే తల్లి. ఆప్యాయతకు, అనురాగాలకు పట్టుగొమ్మ. పల్లె అమాయకత్వం, దివ్యత్వంతో ఉన్న అద్భుత శిల్పం.

(అ) అమూల్య సంపదలు అంటే ఏమిటి?
జవాబు.
అమూల్య సంపదలు అనగా చాలా విలువైన సంపదలు అని అర్థం. వాటికి విలువ కట్టలేమని భావం.

(ఆ) ఆనందానికి నెలవు అంటే ఏమిటి?
జవాబు.
ఆనందానికి నెలవు అంటే సంతోషానికి నిలయం అని అర్థం.

(ఇ) అక్కున చేర్చుకోవడం అంటే మీకేం అర్థమయింది?
జవాబు.
ప్రేమ చూపడం అని అర్థమయింది.

(ఈ) అనురాగాలకు పట్టుగొమ్మ అంటే ఏమిటి?
జవాబు.
అనురాగం అంటే ప్రేమ. పట్టుగొమ్మ అంటే స్థానము. పల్లె ప్రేమకు, అనుబంధాలకు స్థానం అని అర్థం.

(ఉ) పై పేరాకు పేరు పెట్టండి.
జవాబు.
పల్లె తల్లిప్రేమ.

2. పాఠం ఆధారంగా కింది భావం తెలిపే పద్యపాదాలను వెతికి రాయండి.

(అ) అలుగుల గడుసుదనంతో ఒకే చెరువా అని తెలుపుతున్నట్లున్నాయి.
జవాబు.
“ రెండు చెరువు లొక్కటేయని చెప్పుచునుండె నడుమ గలసి యున్నట్టి యలుగుల గడుసుదనము.”

(ఆ) సూర్యునికి అర్ఘ్యమిస్తున్నట్లున్నాయి.
జవాబు.
“అరుణ కిరణాల దేవత కర్ష్యమిచ్చు ప్రత్యుషస్సున మయూరి పద్మలతలు.”

(ఇ) దంపతులవలె మా ఊరికి కానుకలు సమర్పిస్తున్నాయి.
జవాబు.
ఊరి కుపాయనం బిడుచునుండును దంపతులట్లు నిత్యమున్.

(ఈ) జనం రాకపోకలతో మా అంగళ్ళన్నీ సందడితో ఉంటాయి.
జవాబు.
“జనగతాగత కల్లోల సాంద్రమగుచు వెలయు మా యంగడులు నన్ని వేళలందు”

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

(అ) కవి అంగడిని బహుళ వస్తుప్రధానం అన్నాడు కదా! మీ ఊరి అంగడి కూడా ఇట్లే ఉంటుందా? వివరించండి.
జవాబు.
మా ఊరి అంగడికూడా కవి ఊరి అంగడిలా అన్ని వస్తువులతో నిండి ఉంటుంది. మా ఊరి అంగడిలో అన్ని వస్తువులూ లభిస్తాయి. ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, నూనెలు ఇంటిలో ప్రతినిత్యం మనం ఉపయోగించే అన్ని వస్తువులు మా అంగడిలో లభిస్తాయి. అంగడిలోని సరుకులు తాజాగా ఉంటాయి. చౌకగా లభిస్తాయి.

(ఆ) గ్రామాల్లో కాపులు, పద్మశాలీలు కాకుండా ఇంకా ఎవరెవరు ఉంటారు? వీరివల్ల ఊరివాళ్ళకేం లాభం కలుగుతుంది?
(లేక)
గ్రామాల్లోని కులవృత్తి వారి వలన కలిగే లాభాన్ని వివరించండి.
జవాబు.
గ్రామాలలో అనేక కులాల వారు ఉంటారు. వారు వారి కులవృత్తులను చేస్తూ సమాజానికి ఎంతో సేవ చేస్తూ ఉంటారు. కాపులు, పద్మశాలీలే కాకుండా మంగలిపనివారు, కమ్మరి, కుమ్మరి, వడ్రంగం వృత్తులవారు, పశుకాపరులు ఉంటారు. ఆయా కులాల వారు వారి వృత్తులను నిర్వర్తించడం వలన ఊరివాళ్ళ అవసరాలు తీరుతాయి. అందరికీ పని దొరుకుతుంది. అసమానతలు పోతాయి.

(ఇ) ఆదర్శగ్రామం ఎట్లుండాలని నీవనుకుంటున్నావు? (లేక) ఆదర్శగ్రామానికి ఉండాల్సిన లక్షణాలు ఏవి?
జవాబు.
ఆదర్శగ్రామంలోని ప్రజలు కులమతాలకు అతీతంగా జీవించాలి. అన్ని మతాల పండుగల్లో అందరూ పాల్గొనాలి. ఎవరికి ఎలాంటి అవసరం లేదా కష్టం వచ్చినా అందరూ సాయం చేయాలి. ఒకరి అవసరాలకు వేరొకరు నిలబడాలి. పేద, ధనిక తేడా చూపకుండా కలసి మెలసి ఉండాలి. గ్రామం అభివృద్ధికి ప్రణాళికలు తయారుచేసుకొని అందరూ కలసి పూర్తి చేయాలి. మనుషులు, మనసులు వేరైనా ఒకే ఆలోచనతో ఉంటే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది. అదే ఆదర్శగ్రామం.

TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana పల్లె అందాలు

(ఈ) ఊరుకు, చెరువుకు ఉన్న బంధం ఎట్లాంటిది?
(లేక)
సమాజంలో ఊరికి, చెరువుకు దగ్గరి బంధం ఉంది. వివరించండి
(లేక)
ఊరు చెరువుల బంధం విడదీయరానిది. వివరించండి.
జవాబు.
ఊరు అంటే ప్రజలు, వారితోపాటు పశువులు, పక్షులు. వీరందరికీ నీరు కావాలి. నీరు ఒక కాలంలో దొరికి ఒక కాలంలో దొరకకపోతే కష్టం. అందుకే నీరు నిల్వ ఉంచే చెరువు ప్రతి ఊరికి అవసరం. నీరు తాగడానికే కాదు, వ్యవసాయానికీ కావాలి. ఇన్ని అవసరాలు తీరాలంటే నీరు అన్ని కాలాలలో నిల్వ ఉంచే చెరువు కావాలి. ఇలా చెరువుకు, ఊరుకు విడదీయలేని సంబంధముంది.

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
ఊరికి అందాన్నిచ్చే అంశాలేవి? ప్రస్తుతం పల్లెటూర్లలో ఇవి ఉంటున్నాయా? మీ అభిప్రాయాలను సొంతమాటల్లో రాయండి.
జవాబు.
ఊరికి అందాన్నిచ్చేవి :
తామరపూలతో, కలువపూలతో నిండిన చెరువులు, మంచినీటి బావులు. ఊరిని పండు ముత్తైదువులా చేసే బంతి, చేమంతి వంటి పూల మొక్కలు, పరిమళం వెదజల్లే గులాబీ, మొల్ల, గన్నేరు, దాసన వంటి పూల మొక్కలు. మారేడు, అల్లనేరేడు, మామిడి, రేగు, జామ, నిమ్మ, అంజూర, అరటి, దానిమ్మ మొదలైన చెట్లు. వివిధ వృత్తులవారు, పశువులను పోషిస్తూ పంటలను పండించే కాపు బిడ్డలు. జనం రాకపోకలతో సందడిగా ఉండే అంగళ్ళు. ప్రస్తుతం పల్లెటూళ్ళలో ఇవేవీ ఉండటం లేదు. చెరువులు కనబడటం లేదు. పచ్చని పొలాలు మాయమయి పోతున్నాయి. ట్రాక్టర్ల రాకతో పశువులు కనబడడం లేదు. ఇప్పుడు పల్లెలన్నీ పట్నాలలాగే ఉన్నాయి.

IV. సృజనాత్మకత/ప్రశంస

(అ). పాఠంలోని 3వ, 4వ పద్యాలలో ఊరి అందాలను కవి వర్ణించాడు కదా! మీరు చూసిన / మీకు తెలిసిన ఊరు అందాలను వర్ణిస్తూ రాయండి.
జవాబు.
నేను చూసిన పల్లె ఖమ్మం జిల్లా వైరాకు దగ్గరగా ఉన్న సిరిపురం. ఈ ఊరిలో ప్రకృతి రమణీయంగా ఉంది. ప్రధానంగా పచ్చని పంట పొలాలతో నిండి ఉంది. ఎక్కడ చూచినా మనోహరమైన దృశ్యాలతో చూడముచ్చటగా ఉంది. ఉదయం సూర్యకిరణాలు వెచ్చని స్పర్శతో నిద్ర లేపుతాయి. కొలనుగట్లపై ఏపుగా పెరిగిన గడ్డి, కొలనులోని కలువల అందాలు నా మనసును దోచుకున్నాయి. కొలనులలోని తామరపూల సౌందర్యం చూడగానే నేను ఎంతో పులకించిపోయాను. ఆ అందం వలన కలిగిన మధురానుభూతులు నా హృదయాన్ని పెనవేసుకొని పోయాయి.

(ఆ). మూడవ పద్యం ఆధారంగా చిత్రం గీసి రంగులు వేయండి. దాని గురించి చిన్న కవిత రాయండి.
జవాబు.
అర్ఘ్యం

కొలనులోని జలములలో
కదలాడే చిరుత అలల
తానమాడి సంధ్యవార్చి
ధ్యానములో కొంత మునిగి
మెత్తని తన చేతులెత్తి
దోసిళ్ళుగ వాటి జేర్చి
నిర్మలమౌ జలములతో
దోసిళ్ళను నింపుకొని
తరుణారుణ కిరణ మణికి
తరణికి ఆ తరుణీమణి
మనోహరిణి పద్మలతిక
ప్రత్యుషస్సు సమయమ్మున
అర్ఘ్యమిచ్చి అర్చించెను
కర్మసాక్షి దినకరునికి

(ఇ). నీవు చూసిన పల్లెను వివరిస్తూ స్నేహితునికి లేఖ వ్రాయుము.
లేఖ
జవాబు.

ఖమ్మం,
తేది : XXXX

ప్రియమైన స్నేహితునికి కుశలములతో నీ మిత్రుడు శంకర్ వ్రాయునది. నేనిక్కడ కుశలం. నీ కుశలములు తెలుపుము. నేను ఈ మధ్య వైరా దగ్గరలోని గోపాలపురం అనే పల్లెను చూశాను. అక్కడి నా స్నేహితులతో కలసి వేసవి సెలవులు గడిపాను.
ఆ వూరి ప్రజలు చాలా మంచివారు. అమాయకులు. అక్కడ చాలా ప్రశాంత వాతావరణం ఉంది. ఎక్కడ చూచినా చెట్లు, పూలమొక్కలు, పాడి ఆవులు, గేదెలు, పొలాలు ఎంతో అందంగా ఉన్నాయి. వారంతా కష్టజీవులు. నేను వారి వృత్తిపనులు చూసి చాలా ఆనందించాను. వడ్రంగి చేసే బొమ్మలు ఎంతో చూడముచ్చటగా ఉన్నాయి. నేత వారు నేసే వస్త్రాలు ఎంతో మన్నికగా ఉన్నాయి. వాటిపై వేసే అందమైన అద్దకాలు తనివితీరా చూడాల్సిందే! ఎలాంటి కాలుష్యం లేదు. నీవు కూడా వీలైతే ఏదైనా పల్లెకు వెళ్ళిరా. నీ అనుభూతులు రాయి.

ఇట్లు
నీ మిత్రుడు,
శంకర్.

చిరునామా :
కె. సురేష్,
7వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
ఉట్నూరు, ఆదిలాబాద్ జిల్లా.

V. పదజాల వినియోగం

1. కింద గీతగీసిన పదాలకు అదే అర్థాన్నిచే పదాలు రాయండి.

ఉదా : సంపద తో గర్వపడకూడదు.
(అ) తటాకంలో రకరకాల చేపలు జీవిస్తాయి.
(ఆ) పుట్టినరోజున కొత్త అంబరాలు ధరిస్తాం.
(ఇ) మా పురంలో చక్కని బడి ఉన్నది.
జవాబు.
ఉదా : సంపద తో గర్వపడకూడదు. – (కలిమి, ధనము)
(అ) తటాకంలో రకరకాల చేపలు జీవిస్తాయి. – (చెరువు)
(ఆ) పుట్టినరోజున కొత్త అంబరాలు ధరిస్తాం. – (వస్త్రాలు, వలువలు)
(ఇ) మా పురంలో చక్కని బడి ఉన్నది. – (పట్టణం, ప్రోలు)

TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana పల్లె అందాలు

2. కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు అర్థాలు రాయండి.

(అ) సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి.
(ఆ) చెరువు నిండితే అలుగు పారుతుంది.
(ఇ) కొట్టంలో పశువులు ఉంటాయి.
జవాబు.
(అ) సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. – (అలలు)
(ఆ) చెరువు నిండితే అలుగు పారుతుంది. – (చెరువు తూము)
(ఇ) కొట్టంలో పశువులు ఉంటాయి. – (పశువుల పాక)

3. పాఠం ఆధారంగా కారణాలు పట్టికలో రాయండి.

(అ) ఊరు పసుపు అద్దినట్లుండడానికి కారణంచేమంతి పూలతో నిండి ఉండడం
(ఆ) ఎర్రని పారాణి అద్దినట్లుండడానికి కారణంగోరింటాకు వలన పారాణి అద్దినట్లుంది.
(ఇ) కుంకుమబొట్టు పెట్టినట్లు ఉండడానికి కారణంపట్టుకుచ్చుల పూలు
(ఈ) పండు ముత్తైదువగా ఉండడానికి కారణంపై మూడింటి వలన

4. భావనాచిత్రమంటే ఒక అంశానికి సంబంధించిన భావనలన్నింటినీ వర్గీకరించుకోవడమే! ఒక గ్రామానికి చెందిన భావనాచిత్రం గీయమన్నపుడు గ్రామంలోని ప్రత్యేకతలు, గ్రామంలోని కీలక ప్రదేశాలు, ప్రజలు, వృత్తులు తదితర అంశాలన్నీ పరిగణిస్తాం.
TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana పల్లె అందాలు 2

ఇచ్చిన ఉదాహరణ అంశాలను గమనించండి. ఆయా అంశాల ఆధారంగా పై భావనా చిత్రాన్ని పూర్తిచేయండి.
TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana పల్లె అందాలు 3

VI. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది పదాలను కలిపి రాసి, సంధిని గుర్తించండి.

ఉదా : నీవు + ఎక్కడ = నీవెక్కడ – ఉత్వసంధి
(అ) భీముడు + ఇతడు = భీముడితడు – ఉత్వసంధి
(ఆ) అతడు + ఎక్కడ = అతడెక్కడ – ఉత్వసంధి
(ఇ) ఇతడు + ఒకడు = ఇతడ్కడు – ఉత్వసంధి
(ఈ) ఆటలు + ఆడు = ఆటలాడు – ఉత్వసంధి

2. కింది పదాలను కలిపి రాయండి.

(అ) ఏమి + అది = ఏమది
(ఆ) ఎవరికి + ఎంత = ఎవరికింత
(ఇ) మరి + ఇప్పుడు = మరెప్పుడు
(ఈ) అవి + ఏవి = అవేవి

పై పదాలను విడదీసిన క్రమాన్ని, కలిపిన క్రమాన్ని గమనించండి.
మొదటి పదం చివరి అచ్చు “ఇ” కారం. (ఇత్తు). రెండవ పదాల మొదట్లో అన్నీ అచ్చులే వచ్చినవి. ఈ విధంగా “ఏమి” మొదలైన పదాల ‘ఇ’కారానికి (ఇత్తుకు) అచ్చుపరమైనపుడు సంధి జరుగుతుంది. కొన్నిచోట్ల ఇట్లా సంధికార్యం జరుగదు. ఆ పదాలను చూద్దాం.
ఉదా : ఏమి + అయ్యె = ఏమయ్యె – సంధి జరిగింది
ఏమి + అయ్యె = ఏమియయ్యె – సంధి జరగక యడాగమం వచ్చింది.

ఒకసారి సంధి (నిత్యము) జరిగి, మరొకసారి సంధి జరుగక (నిషేధము) పోవడాన్ని వ్యాకరణ పరిభాషలో ‘వికల్పము’ (వైకల్పికము) అంటారు. “ఏమి” మొదలైన పదాలకు అచ్చుపరమైతే సంధి వైకల్పికము అని తెలుస్తుందికదా! దీనినే ఇత్వసంధి అంటారు. సూత్రం : ఏమి మొదలైన పదాలలో ‘ఇత్తునకు అచ్చుపరమైతే సంధి వైకల్పికంగా జరుగుతుంది.

3. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.

ఉదా : రావాలని = రావాలి + అని (ఇత్వసంధి)
(అ) చెప్పాలంటే = చెప్పాలి + అంటే – ఇత్వసంధి
(ఆ) ఒక్కటే = ఒక్కటి + ఏ – ఇత్వ సంధి
(ఇ) రానిదని = రానిది + అని – ఇత్వ సంధి
(ఈ) నీటినిసుమంత = నీటిని + ఇసుమంత – ఇత్వసంధి
(ఉ) చెప్పినదియేమి = చెప్పినది + ఏమి – ఇత్వసంధి
(ఊ) వచ్చినపుడు = వచ్చిరి + అప్పుడు – ఇత్వసంధి
(ఋ) ఎన్నియేని = ఎన్ని + ఎని – ఇత్వ సంధి

ప్రాజెక్టు పని:

ప్రశ్న 1.
మీ ఊరిలో ఉన్న చెట్లను, పూలను, జరిగే వ్యాపారాలను, చేతివృత్తులవారిని పరిశీలించండి. పట్టికలో నమోదు చేయండి.
జవాబు.

చెట్లుపూలువ్యాపారంచేతివృత్తులవారుఇతరములు
ఉదా॥ మామిడిగన్నేరుబియ్యంవడ్రంగులు
1. నిమ్మబంతికందులుకుమ్మరిసంకీర్తనలు
2. దానిమ్మచేమంతిచింతపండుమేదరిభజనలు
3. జామసన్నజాజిఉల్లిపాయలుకంసాలి
4. సపోటగులాబిబెల్లంవడ్గి
5. రావిసంపంగిమినుములురజకుడు
6. వేపకనకాంబరంపెసలుమంగలి
7. సీతాఫలంమల్లెఅల్లంచర్మకారుడు
8. బొప్పాయిమందారంబియ్యంతాపీపని


విశేషాంశాలు:

అర్ఘ్యం : చేతులు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్ళు, సూర్యునికోసం సమర్పించే నీళ్ళను కూడా అర్హ్యం అని వ్యవహరిస్తారు.

ముత్తైదువ : ముత్తలు (పసుపు కుంకుమ, మాంగల్యం, మట్టెలు, ముక్కెర, గాజులు) అయిదు కల్గిన స్త్రీ, సుమంగళి అయిన

స్త్రీగా జనవ్యవహారం. (ముక్కెరకు బదులు ‘పూలు’, ‘పాపిట సింధూరం’ అని చెప్తున్నారు.)

పద్మశాలీయులు : ప్రాచీనకాలంలో పద్మపుతూడు నుండి తీసిన నారతో వస్త్రాలు తయారుచేసే వారిని పద్మశాలీయులు అనేవారు. ఆధునిక కాలంలో వీరు అన్ని రకాల వస్త్రాలు నేస్తున్నారు.

TS 7th Class Telugu 5th Lesson Important Questions పల్లె అందాలు

ప్రశ్న 1.
పల్లె ప్రజల జీవనం గూర్చి వ్రాయండి.
జవాబు.
పల్లెలోని ప్రజలు నిరాడంబరంగా జీవిస్తారు. వారి ఆలోచనలు పట్టణ ప్రజల శైలికంటె వేరుగా ఉంటుంది. పల్లె ప్రజల మనస్సుల్లో కాలుష్యం ఉండదు. అందరూ ఒకరితో ఒకరు సంబంధాలు కలిగి ఉంటారు. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం రచ్చబండ వద్ద కలుస్తారు. అందరి కష్టసుఖాలు, సమాజం, దేశరాజకీయాలు చర్చిస్తారు. ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటారు.

ప్రశ్న 2.
నీవు చూచిన ఒక పల్లెటూరును గూర్చి, అక్కడి పరిస్థితుల గూర్చి వ్రాయుము.
జవాబు.
మా ఊరి పేరు రామాపురం. మా గ్రామానికి సర్పంచి, వార్డు మెంబర్లు ఉన్నారు. గ్రామం మొత్తానికి పెద్ద అయిన రామయ్యగారు ఉన్నారు. వారు నిజాయితీపరులు. అందరి కష్టసుఖాలను తెలుసుకుంటారు. ఎవరికి సమస్య వచ్చినా వారి వద్దనే పరిష్కారమవుతుంది. ఆయన మాటంటే అందరికీ గౌరవం. ఊరిలో దుకాణాలు, కూరగాయల మార్కెట్టు, అనేకరకాల వస్తువులమ్మే అంగళ్ళు ఉన్నాయి. మా పల్లె పచ్చని పైరులతో అలరారుతున్నది. అందుకే మా ఊరంటే మాకెంతో ఇష్టం.

TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana పల్లె అందాలు

ప్రశ్న 3.
పల్లెజీవనానికి, పట్టణ జీవనానికి పోలికలెట్టివి?
జవాబు.

పల్లెజీవనంపట్టణజీవనం
1. పల్లె తల్లి వంటిది.1. పట్టణం పెంపుడుతల్ల వంటిది.
2. పల్లె నీకేం కావాలి? అంటుంది.2. పట్టణం నా కేమిస్త్వు? అంటుంది.
3. ఒకరి అవసరాలు, కష్టాలు, సంతోషాలు మరొకరు తెలుసుకుంటారు.3. ఎవరి జీవాతాలు ఐారే గడుతుతా.
4. పల్లెల్లో కాలాలు, ఋతువులు తెలుస్తాయి.4. ఉదయం లేచినప్బటి నుండి సాయంత్రం వరకు వేగంగా జీవితం గడపడం వలన ఏమీ తెలయదు.
5. పచ్చని పొలాలతో ప్రకృతి రమణీయంగా, ప్రశాంతంగా ఉంటుంది.5. రణగాణ ధ్ననులతో విపరీతమైన కాలుష్యం ఆవరంస ఉంటుంద.
6. ఇళ్ళు విశాలంగా, ఆలోచనలు విస్తరించి ఉంటాయి.6. ఇళ్ళ ఇరుకుగ ఉంటాయి. ఆలోచనలు కూడా స్యార్థూరితంగా ఉంటాయి.
7. పల్లెల్లో సాయంత్రానికి ఒకచోట చేరి కష్టసుఖాలు పంచుకుంటారు.7. ఎవరి ఱలోచనలు, కష్టాలు, సఖాలు వారిే! ఏక్కన ఎవరున్నా కో కూడా తెలెయకుండా జీవిత వేగంగా గడుపుతారు.
8. పల్లెల్లో జీవించేవారు ఎక్కువ కాలం జీవించగల్గుతారు.8. పట్టణాల్లో గాలి, స్రు, अహరంలో కల్ ఉండి, ఎక్కువ కాలం జీవించలేరు.


పర్యాయ పదాలు

  • కోవెల = గుడి, దేవాలయం, మందిరం
  • ఆలవాలం = నిలయం, నివాసం, స్థానం
  • నీరు = జలము, పానీయము
  • అరుణుడు = సూర్యుడు, భాస్కరుడు, దినకరుడు
  • పరిమళము = సుగంధము, సువాసన
  • గోవు = ధేనువు, ఆవు
  • అంగడి = దుకాణము, దివాణము
  • సౌందర్యము = అందము, సుందరము

నానార్థాలు:

  • తరుణి = యువతి, గులాబిపువ్వు, పెద్దజీలకర్ర
  • అంబరము = ఆకాశము, వస్త్రము, కుంకుమపువ్వు
  • చిత్రము = ఆశ్చర్యము, చిత్తరువు, తిలకము

ప్రకృతులు – వికృతులు

  • నీరము – నీరు
  • స్నానము – తానము
  • భక్తి – బత్తి
  • నిత్యము – నిచ్చలు
  • పుణ్యము – పున్నెము
  • వర్ణము – వన్నె
  • పురము – (ప్రోలు
  • స్థలము – తల

సంధులు:

నాట్యమాడుతూనాట్యము + ఆడుతూఆత్యసంధి
ఇంపారఇంపు + ఆరఉత్వసంధి
దంపతులట్లుదంపతులు + అట్లుఉత్ససంధి
బావులున్నవిబావులు + ఉన్నవఉత్వసంధి
సోయగమైనసోయగము + ఐనఉత్వసంధి
సంపన్నమగుచుసంపన్నము + అగుచుఉత్వసంధి
సాంద్రమగుచుసాందము + అగుచుఉత్వసంధి
చెరువులోక్కట!చరరువు + ఒక్కటెఉత్రసంధి
పద్మాకరముపద్మ + ఆకరయసవర్ణదీర్ఘసంధి
సాగరికాంబరమునాగరిక + అంబరముసవర్ణదీర్ఘసంధి


సమాసాలు:

శాంతి సౌభాగ్యాలుశాంతి మరియు సౌభాగ్యంద్వంద్వ సమాసం
(పేమానురాగాలు(పేమ మరియు అనురాగంద్వంద్వ సమాసం
రెండు చెరువులురెండు అను సంఖ్యగల చెరువులుద్విగు సమాసం
బంతి చేమంతులుబంతి మరియు చేమంతిద్వంద్వ సమాసం
మారేడులల్లనేరుడులుమారేడులు మరియు అల్లనేరేడులుద్వంద్వ సమాసం


I. క్రింది పద్యాన్ని వరుసక్రమంలో అమర్చండి.

(అ) గలసి యున్నట్టి యలుగుల గడుసుదనము
నిండు గంగాళముల వంటి రెండు చెఱువు
ఊరిప్రక్కన గన్పట్టు నొదుగులేని
లొక్కటేయని చెప్పుచునుండె నడుమ
జవాబు.
ఊరి ప్రక్కన గన్పట్టు నొదుగు లేని
నిండు గంగాళముల వంటి రెండు చెఱువు
లొక్కటేయని చెప్పుచునుండె నడుమ
గలసి యున్నట్టి యలుగుల గడుసుదనము.

TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana పల్లె అందాలు

II. క్రింది పద్యపాదాలలోని ఖాళీలను ఇచ్చిన పదాలతో పూర్తి చేయండి.

(హాయిగ, అంగడులు, లలిత, మధురముల్, మాయూరి)
(అ) మా తటాకాలు ……………… పద్మాకరాలు.
(ఆ) పత్రత్యుషస్సున ………………. పద్మలతలు.
(ఇ) మావులున్నవి …………………. మంచినీటి బావులున్నవి.
(ఈ) వెలయు మా ………………… నన్నివేళలందు.
(ఉ) భూమిదున్నుకొని ……………….. నుందురు.
జవాబు.
(అ) మా తటాకాలు లలిత పద్మాకరాలు.
(ఆ) పత్రత్యుషస్సున మాయూరి పద్మలతలు.
(ఇ) మావులున్నవి మధురముల్ మంచినీటి బావులున్నవి.
(ఈ) వెలయు మా అంగడులు నన్నివేళలందు.
(ఉ) భూమిదున్నుకొని హాయిగ నుందురు.

III. సరియైన వాటితో జతపరచండి.

1) చెరువులు(ఎ)(అ) పారాణి అద్దినట్లు
2) బంతి, చేమంతి పూలు(ఈ)(ఆ) పండు ముత్తైదువువలే
3) ఊరు(ఆ)(ఇ) కుంకుమ పెట్టినట్లు
4) పట్టుకుచ్చులపూలు(ఇ)(ఈ) పసుపుదిద్దినట్లు
5) ఎర్రని గోరింటాకు(అ)(ఎ) గంగాళములవలె

IV. క్రింది అపరిచిత పద్యానికి 5 ప్రశ్నలు తయారు చేయండి.

“మిరపగింజ చూడ మీద నల్లగ నుండు
గొరికి చూడ లోన జురుకు మనును
సజ్జన లనెడి వారి సారమిట్లుండురా
విశ్వదాభిరామ వినురవేమ!

(1) మిరపగింజ ఎలా ఉంటుంది ?
(2) అది కొరికి చూస్తే ఎలా ఉంటుంది ?
(3) మిరపగింజలాంటి వారు ఎవరు?
(4) పైపద్యం ఏ శతకం నుండి గ్రహించబడినది ?
(5) పై పద్యానికి శీర్షిక పెట్టండి.

V. క్రింది పద్యపాదాలను చదివి వాటికి సరియైన అర్థం రాయండి.

1. అరుణ కిరణాల దేవత కర్ఘ్యమిచ్చు
బ్రత్యుషస్సున మాయూరి పద్మలతలు
జవాబు.
మా ఊరిలోని తీగవంటి పద్మాలు ఉదయాన సూర్యునికి అర్థ్యమిస్తున్నట్లున్నాయి.

2. యూరి కుపాయనం బిడుచునుండును దంపతులట్లు నిత్యమున్.
జవాబు.
దంపతులవలె మా ఊరికి కానుకలు సమర్శిస్తుంటాయి.

TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana పల్లె అందాలు

VI. క్రింది పదాలలోని పర్యాయ పదాలు గుర్తించి వేరుగా రాయండి.

(అ) హిందువులు గోవులను పూజిస్తారు. ఆవు పాలు పిల్లలకు ఉత్తమమైనవి. ధేనువు సాధుజంతువు.
జవాబు.
గోవు, ఆవు, ధేనువు

(ఆ) నేను ప్రతిరోజు కోవెలకు వెళతాను. దేవాలయం ప్రశాంతంగా ఉంటుంది. ఆ గుడి చాలా పెద్దది.
జవాబు.
కోవెల, దేవాలయం, గుడి

(ఇ) మనము ప్రతిదినము సూర్యుడు ఉదయించేటప్పటికి లేవాలి. భాస్కరుని ఉదయ కిరణాలు లేతగా ఉంటాయి. దినకరుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు.
జవాబు.
సూర్యుడు, భాస్కరుడు దినకరుడు

(ఈ) మనము నీటిని వృథాచేయరాదు. జలము లేనిదే జీవించలేము. ఉదకము ఎక్కువగా తాగుట మంచిది.
జవాబు.
నీరు, జలము, పానీయము

(ఉ) గులాబీల పరిమళం ఎంతో బావుంటుంది. ఆ సువాసనలను పీల్చడం ఆరోగ్యానికి మంచిది. శుభకార్యాలలో సుగంధాలను వెదజల్లుతారు.
జవాబు.
పరిమళము, సువాసన, సుగంధము

VII. క్రింది వాక్యాలలోని ప్రకృతి వికృతులను గుర్తించండి.

(అ) స్నానము చేయుట వలన మురికి పోవును. ప్రతివారు రోజుకు రెండుమారులు తానము చేయాలి.
జవాబు.
స్నానము – తానము

(ఆ) ప్రతివారు భక్తితో పూజచేయాలి. బత్తిలేని పూజ పనికిరానిది.
జవాబు.
భక్తి – బత్తి

(ఇ) వస్త్రములోని వర్ణములు అందంగా ఉన్నాయి. వన్నెలు బట్టి వస్త్రాలకు గిరాకీ ఏర్పడును.
జవాబు.
వర్ణము – వన్నె

(ఈ) ఆ పురమునందలి ఇళ్ళు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆకసంలో పక్షులు ఎగురుతున్నాయి.
జవాబు.
ఆకాశం – ఆకసం

(ఉ) ఈ భూమిపై అనేక జీవరాశులున్నాయి. మానవుడు బువిలో ప్రాణులు ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవిస్తున్నాయి.
జవాబు.
భూమి – బువి

VIII. క్రింది పదాలను కలిపి రాయండి.

(అ) ఇంపు + ఆర
(ఆ) పద్మ + ఆకరము
(ఇ) దంపతులు + అట్లు
(ఈ) భీముడు + అతడు
జవాబు.
(అ) ఇంపు + ఆర – ఇంపార
(ఆ) పద్మ + ఆకరము – పద్మాకరము
(ఇ) దంపతులు + అట్లు – దంపతులట్లు
(ఈ) భీముడు + అతడు – భీముడతడు

TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana పల్లె అందాలు

IX. క్రింది పదాలను విడదీసి, సంధిపేర్లు రాయండి.

(అ) నాట్యమాడుతూ –
(ఆ) సాంద్రమగుచు –
(ఇ) ఆటలాడు –
(ఈ) ఏమది –
జవాబు.
నాట్యము + ఆడుతూ – ఉత్వసంధి
సాంద్రము + అగుచు – ఉత్వసంధి
ఆటలు + ఆడు – ఉత్వసంధి
ఏమి + అది – ఇత్వసంధి

పద్యాలు – ప్రతిపదార్థాలు – తాత్పర్యాలు

1. తే.గీ. ఉరిప్రక్కన గన్పట్టు నొదుగు లేని
నిండు గంగాళముల వంటి రెండు చెఱువు
లోక్కటేయని చెప్పుచునుండె నడుమ
గలసి యున్నట్టి యలుగుల గడుసుదనము.

ప్రతిపదార్థం

ఊరిప్రక్కనన్ = ఊరి ప్రక్కన
కన్బట్టున = కనబడునట్టి
ఒదుగు = వెలితి
లోన = లేనట్టి
నిండ = నిండిన
గంగాళములవంటి = పెద్దపాత్రల వంటి
రెండు చెఱువులు = రెండు చెరువులు
నడుమ = మధ్ల భాగంలో
కలసి = కలిసిపోయి
ఉన్నట్టి = ఉన్నటువంటి
అలుగుల = తూముల
గడుసుదనము = అందము
ఒక్కటే+అని = ఒకే చెరువు అనే విధంగా
చెప్పుచున్+ఉండె = ఉన్నద

తాత్పర్యం : మా ఊరి చెరువులు నిండు గంగాళమువలె పూర్తిగా నిండి ఉన్నాయి. వాటి అలుగులు రెండూ కలువడంతో, ఆ గడుసుదనంవల్ల అవి ఒకే చెరువువలె ఉన్నాయి.

2. తే. గీ. నీటి నిసుమంత గనుపడనీక మొదటి
వరకు వ్యాపించి వలగొను పద్మలతల
సాదుకొను చుండె [పేమ రసాల నాలికి
మా తటాకాలు లలిత పద్మాకరాలు.

ప్రతిపదార్ధం

మా తటాకాలు = మా ఊరిలోని చెరువులు
నీటిని = తనలోని నీటిని
ఇసుమంత = కొంచెం కూడా
కనుపడనీక = కన్పించ నివ్వకుండా
పద్మలతల = తీగవంటి పద్మాల
మొదటివరకు = కాడల వరకు
వ్యాపించి = వ్యాప్తిచెంది
వలగొను = అల్లుకొన్నాయి
లలితపద్మాకరాలు = సున్నిత పద్మాలకు నిలయమైన చెరువులు
(పేమరసాలన్ = [పేమతో కూడిన రసాలను
ఒలికి = ఓలికించి పద్మాలను
సాదుకొనుచు + ఉండె = (పేమతో చూచుకొనుచున్నాయి

తాత్పర్యం: మా ఊరి అందమైన చెరువులు, తమలోని నీటిని కొంచెం కూడా కన్పించనీయకుండా మొదళ్ళ వరకు వ్యాపించిన పద్మాలను (ప్రేమతో సాదుకుంటున్నాయి.

TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana పల్లె అందాలు

3. తే.గీ. చిన్ని కెరటాల స్న్నాలు జేసి వార్చి
తరుణ పేశల కమల పత్లా నెత్తి
అరుణ కిరణాల దేవత కర్థ్యమిచ్చు
బృత్యుషస్సున మాయారి పద్ములతలు

ప్రతిపదార్థం

మా+ఊర = మా ఊరిలోని
పద్మలతలు = తీగవంటి పద్మాలు
చన్ని = చిన్నవైన
కెరటాల = అలలతో
స్నానాలు+చేసి = స్నానాలు చేసి
తరుణ = నిగనిగలాడె
పేశల = సున్నితమైన
కమలపత్తాలను + ఎత్తి = తమ రేకులను ఎత్తి
అరుణ = ఎర్రని
కిరణాల = కిరణముల
దేవతకు = సూర్యదేవునికి
ప్రత్యషస్సున = ఉదయకాలమున
అర్ఘ్యము+ఇచ్చు = సంధ్యా నమస్కారము చేయు చున్నావా? అన్నట్లు ఉన్నాయి

తాత్పర్యం : మా ఊరి చెరువులోని పద్మాలు ప్రతిరోజూ సూర్యోదయ సమయంలో అలలతో స్నానం చేసి, నిగనిగలాడే సుకుమారమైన తమ రేకులను ఎత్తి సూర్యునికి అర్ఖ్యమిస్తూ, సంధ్య వారుస్తున్నాయా అన్నట్లున్నాయి.

4. తే.గీ. బంతి, చేమంతి థక్తోతో బసవు దిద్ద
రంగు గోరంట జాతి పారాణులద్ద
పట్టు కుచ్చులు కుంకుమ బొట్టుఱెట్ట
నలరు మాయూరు పెద్దముల్తైదువట్లు.

మా + ఊరు = మా ఊరు
బంతి = బంతిపూలతోను
చేయుంత = చేమంతిపూలతోను
భక్తి = భక్తితో
పసవుదిద్ద = పసుపుతో దిద్దినట్లు ఉన్నాయి
గోరింట = గోరింటాకు
రంగు = రంగు
జాతి = మేలిమి (గొప్పదైన)
పారాణులు + అద్ద = మా ఊరికి పారాణి అద్దినట్లున్నది
పట్టుకుచ్చులు = పట్టుకుచ్చుల పూలు
కుంకుమ = ఎర్రని
బొట్ట్పెట్ట = బొట్టుపెట్టినట్లున్నద
మా+ఊరు = వీటి వలన మా ఊరు
పెద్ద ముత్తెదువు + అట్లు = పెద్దముత్తైదువు వలే
అలరు = ఒప్పుచున్నది

తాత్పర్యం: బంతి, చేమంతిపూలు మా ఊరికి పసుపు దిద్దినట్లున్నాయి. ఎఱ్ఱని గోరింటాకు మా ఊరికి పారాణి అద్దినట్లుంది. పట్టుకుచ్చుల పూలు మా ఊరికి కుంకుమదొట్టు పెట్టినట్లున్నాయి. వీటివల్ల మా ఊరు పండు ముత్తైదువు వలె శోభిల్లుతున్నది. (ప్రకృతి దృశ్యాల్లో సాంస్క్రతిక విలువలు దర్శించడం కవి ఊహాత్మక శక్తికి తార్కాణం).

TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana పల్లె అందాలు

5. ఉ. మారెడు లల్లనేరడులు మామిడి రేగులు జామ నిమ్మలం
జురల నంట్లు దాడిమల సోగగులాబులు మల్లె మొల్లగ
న్నేరులు దాసనల్ వెలసి నిశ్చలతన్ దమకార్తులందు నిం
పొర ఫలాల పూవులను నంచెలవారగ సంతరించి మా
యూరి కుపాయనం విడుచునుండును దంపతులట్ల్ నిత్యమున్.

ప్రతిపదార్థం

అంచెలహారిగ = ఆయా కాలములలో
మారెడులు = మారేడు
అల్లనేరడులు = అల్లనేరేడు
మామిడి = మామిడి
రేగులు = రేగు
జామ = జామ
నిమ్మలు = నిమ్మ
అంజూరలన్ = అంజూర
అంట్లు = అరటిచెట్లు
దాడిమల = దానిమ్మవంటి వృక్షాలు
సోగగులాబులు = అందమైన గులాబులు
మల్లె = మల్లె
మొల్ల = మొల్ల
గన్నేరులు = గన్నేరు
దాసనల్ = దాసన మొ॥ పూలమొక్కలు
వెలసి = వలసిల్ల
నిశ్చలతన్ = నిశ్చలముగా
తమకార్తులు+అందు = తమ కాలములలో
ఇంపార – నిండుగా
ఫలాల – పండ్లను
పూవులను – పూలను
సంతరించి – వెలయించి
మా + ఉఈకి – మా ఉరికి
నిత్యమున్ – ఎల్లప్పుడు
దంపతులు+అట్లు – దంపతుల వలె
ఉప+అయనంబు – కానుకలుగా
ఇడుచును+ఉండును – సమర్పిస్తుంటాయి.

తాత్పర్యం : ఆయా కాలాల్లో మారేడు, అల్లనేరేడు, మామిడి, రేగు, జామ, నిమ్మ, అంజూర, అరటి, దానిమ్మ మొదలైన వృక్షాలు వివిధ ఫలాలనూ; అందమైన గులాబీ, మల్ల, మొల్ల, గన్నేరు, దాసన మొదలైన మొక్కలు వివిధ పుష్పాలనూ; దంపతులవలె మా ఊరికి ఎల్లవేళలా కానుకగా సమర్పి స్తుంటాయి.

6. తే. గీ. మావులున్నవి – మధురముల్ మంచినీటి
బావులున్నవి, అందాలు పరిమళించు
తొవులున్నవి, పుణ్యాల ప్రోవులైన
యావులున్నవి, మాయూర నతిశయముగ.

ప్రతిపదార్థం

మా+ఊరన్ = మా ఊరిలో
మావులు+ఉన్నవ = మామిడి తోటలున్నవి
మధురముల్ = తీయనైన
మంచొనీటి = మంచినీటి
బావులు+ఉన్నవి = బావులు చాలా ఉన్నాయి
అందాలు = సుందరమైన
పరిమళించు = పూలతో సుహాసనలు వెదజల్లే
తావులు = ప్రదేశాలు
ఉన్నవి = ఉన్నాయి
పృణ్యాల = పుణ్యాల
(ప్రోవులు+ఐన = రాశులైన
ఆవులు = ఆవులు
అతిశయముగ = ఎక్కువగా
ఉన్నవి = ఉన్నాయి

తాత్పర్యం: మా ఊరిలో ఎన్నో మామిడి తోటలున్నాయి. తీయని మంచినీటి బావులు అనేకమున్నాయి. అందాల పూల పరిమళం వెదజల్లే (ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. పుణ్యరాశులైన అవృలు అసంఖ్యాకంగా ఉన్నాయి.

7. ఉ. నేయుదురెన్నియేని కమనీయపు నాగరికాంబరమ్మ్లులన
వేయుదు రద్దకంబులతి వేల పృరాతన చిత్రవర్ణముల్
సోయగమైన నేతపని సొంపుల నేర్పరులైన పద్మశా
లీయ కుటుంబముల్ రుచిరలీల వసించును మా పురమ్మునన్.

ప్రతిపదార్థం

మా పురమ్మునన్ = మా ఊరిలో
పద్మశాలీయ కుటుంబముల్ = పద్మశాలీ కుటుంబాల వారు
నాగరిక = నేటి నాగరికతకు సరిపడే
కమనీయపు = అందమైన
అంబరమ్ములన్ = వస్త్రములన్
ఎన్నియేన = ఎన్నో
నేయుదురు = నేతనేస్రారు
అతి = మిక్కిలి
వేల పురాతన = చాలా పూర్వకాలపు
చిత్రవర్ణముల్ = ఆకర్షణీయమైన రంగులతో
అద్దకంబులు = అద్దకం
వేయుదురు = వేస్తారు
సోయగము+ఐన = అందమైన
నేతపని = చేనేతపని
సొంపుల = అందములో
నేర్పరులు+ఐన = నైపుణ్యము గల
పద్మశాలీయ కుటుంబముల్ = పద్మశాలి కులానికి చెందిన కుటుంబాలు
రుచిరలీల = మనోహరముగా
వసించును = నివసించుచున్నాయి.

తాత్పర్యం: మా ఊర్లో ఉండే పద్మశాలీ కుటుంబాల వాళ్ళు నేటి నాగరికతకు సరిపోయే ఎన్నో అందమైన వస్త్రాలను చక్కగా నేస్తారు. చాలా పురాతనమైన బొమ్మలను కూడ ఎన్నో ఆకర్షణీయమైన రంగులతో అద్దకం వేస్తారు. అందమైన నేతపనిలో నేర్పరులైన ఈ పద్మశాలీ కుటుంబాలు మా గ్రామంలో ఎన్నో ఉన్నాయి.

TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana పల్లె అందాలు

8. ఉ. గోదలు పాడిగేదెలును కొట్టము నిండుగ దుక్కిట్ద్దులన్
భేదము లేక సాకుచును బిడ్డల బోలెను-కారుకారు కిం
పాదిక భూమి దున్నుకొని హాయిగ నుందురు పాడిపంట లా
హ్లాదము గూర్పు మాపురమునందలి కాపు కుటుంబముల్ తగన్.

ప్రతిపదార్థం

మా పురమున్ + అందలి = మా ఊరిలోని
కాపు కుటుంబముల్ = కాపు కులానికి చెందిన కుటుంబముల వారు
తగన్ = తగినట్లు
గోదలు = ఎడ్లు
పాడిగేదెలును = పాలిచ్చే ఆవులను, గేదెలను
దుక్కి+ఎద్దులన్ = పొలం దున్నే ఎద్దులను
కొట్టము నిండుగ = పశువుల పాక నిండునట్లు అన్నిటిని

భేదము లేక = తేడా లేకుండునట్లు
బిడ్డల+పోలెను = తమ సొంత పిల్లల వలె
సాకుచును = పోషించుదురు
కారు కారుకు = ప్రతి పంట కాలంలో
ఇంపాదిక = తగినట్లు
భూమి దున్నుకొని = పొలం దున్నుకొస
పాడిపంటలు = పాడి సమకూరుస్తూ, పంటలలు పండిస్తూ
ఆహ్లాదము = ఆనందం
కూర్పు = కలుగుచుండగా
హాయిగన్+ఉందురు = సంతోషంగా జీవిస్తారు

తాత్పర్యం: మా ఊరి కాపు కుటుంబాలవారు ఎడ్ల, పాలిచ్చే బర్రెలు, దున్నే ఎడ్లు అనే భేదం లేకుండా పశువుల నన్నింటిని తమ బిడ్డలవలె పోషిస్తారు. ప్రతి పంటకాలంలో భూమిని దున్ని, పంటలు పండిస్తూ, పాడిని సమకూరుస్తూ సంతోషంగా జీవిస్తారు.

9. తే. గీ. బహుళవస్తు ప్రధాన సంపన్నమగుచు
నెలమి క్రయ విక్రయార్థి సంకులమునగుచు
జనగతాగత కల్లోల సాంద్రమగుచు
జెలయు మా యంగడులు నన్నివేళలందు

ప్రతిపదార్థం

మా+అంగడులను = మా ఉరిలోని దుకాణాలు
అన్నివేళలు + అందు = అన్ని సమయాలలో
బహుళ = అనేక
వస్తు = వస్తువులతో
ప్రధాన సంపన్నము+ అగుచున్ = నిండినదై
ఎలమి = ఎక్కువైన
క్రయ = అమ్మకము
విక్రయ + అర్థి = కొనుగోలు చేయువారితో
సంకులమున్ + అగుచు = కిక్క్కిరిసినదై
జనగత + ఆగత = ప్రజల రాకపోకల వలన
కల్లోల = సందడితో
సాంద్రము+అగుచు = దట్టమైనదై
వెలయు = విలసిల్లుచున్నాయి

తాత్పర్యం: మా ఊరిలోని అంగళ్ళు అన్నివేళలా అనేక వస్తువులతో సంపన్నమై, అమ్మకానికి, కొనడానికి వచ్చిన జనంతో క్రిక్కిరిసి, జనం రాకపోకల సందడితో వెలుగొందు తాయి.

పాఠం నేపథ్యం /ఉద్దేశం:

పల్లెటూర్లు శాంతి సౌభాగ్రాలకు నిలయాలు. (పేమాసురాగాల కోవెలలు. పచ్చని ఏప్రకికి ఆలవాలం పల్లె. అటువంటి పల్లెటూరి సౌందర్యాన్ని తెలుపడే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠం పద్యప్రక్రియకు చెందినది. దీనిలో గ్రామీణ సౌందర్య చిత్రణతోపాటు, పల్లెసోయగాన్ని కవి వర్ణించాడు. ఈ పాఠ్యభాగం ఆచ్చి వేంకటాచార్యులు రచించిన ‘మా ఊరు’ లఘుకావ్యంలోనిది.

కవి పరిచయం:

కవి : ఆచ్చి వేంకటాచార్యులు.
కాలం : 1914 – 1985వ సం॥
జన్మస్థలం : నేటి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాదు మండలం, ఆవునూరు గ్రామం.
రచనలు : బుర్రకథ, రాగమాల, మా ఊరు.
విశేషాలు : ఈయన రాసిన పాటలు, హారతులు, పద్యాలు ఇప్పటికీ ప్రజల నాల్కలపై నాట్యమాడుతూనే ఉన్నాయి.

ప్రవేశిక:

పల్లెటూర్లో ఎటుచూసినా పచ్చదనం కసిప్త్రుంది. పల్లె ఆనందాన్ని కలిగిస్తుంది. పల్లేసీమలు సౌందర్య నిలయాలు, జాలువారే సెలయేళ్ళు, చెరువులు, నీటిలో తేలియాడే తాముయు, రకరకాల పుష్పాలు, వృక్షాలు, ఒకటేమిటి? అడుగకుండానే అన్నీ ఇచ్చే పల్లెతల్లి ఎంతో స్వచ్ఛమైంది. గగామసీమల సుందర దృశ్లాలు అక్కడి వ్యాపార విధానాలు, వవిధ వృత్తుల వారి జీవనం ఎంత నిష్కల్మషంగా ఉంటాయో చూద్దాం.

నేనివి చేయగలనా?

  • పద్యాలను రాగంతో, భావంతో చదువగలను. అవును,/ కాదు
  • పద్యాలను చదివి వాటి భావాలను సొంత మాటలలో చెప్పగలను. అవును /కాదు
  • ఊరి అందాలను వర్ణిస్తూ రాయగలను. అవును /కాదు
  • పల్లెటూర్ల స్థితిగతులను గురించి సొంతంగా రాయగలను. అవును/ కాదు
  • ఊరి బొమ్మగీసి రంగులు వేయగలను. అవును/ కాదు

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

Telangana SCERT 7th Class Telugu Guide Telangana 6th Lesson ప్రేరణ Textbook Questions and Answers.

ప్రేరణ TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana

చదవండి ఆలోచించండి చెప్పండి

ప్రజ్ఞ చాలా తెలివి కలది. ఆమెకు శాస్త్రవేత్త కావాలని బలమైన కోరిక ఉంది. ప్రతీదాన్ని పరిశీలన దృష్టితో చూస్తుంది. విద్యావైజ్ఞానిక ప్రదర్శనలో బహుమతులు కూడా గెల్చుకుంది. శాస్త్రవేత్తలకు సంబంధించిన పుస్తకాలను చదువుతుంది. సందేహనివృత్తికై ఉపాధ్యాయులను, పెద్దలను, సంప్రదిస్తుంది. ఒకరోజు విజ్ఞానశాస్త్ర కార్యక్రమంలో పాల్గొనడానికి వారి గ్రామానికి ఒక శాస్త్రవేత్త రాగా, ప్రజ్ఞ వెళ్ళి కలుసుకున్నది.

ప్రశ్న 1.
ప్రజ్ఞ శాస్త్రవేత్తను ఏమడిగి ఉంటుంది?
జవాబు.
ప్రజ్ఞకు అనేక సందేహాలున్నాయి. పక్షుల్లా మనుష్యులు ఎందుకు ఆకాశంలో ఎగరలేకపోతున్నారు అనీ, గబ్బిలాలు రాత్రిపూటే ఎందుకు తిరుగుతాయి అనీ ఇలా … చాలా సందేహాలున్నాయి. వాటినన్నింటినీ శాస్త్రవేత్తను అడిగి ఉంటుంది.

ప్రశ్న 2.
శాస్త్రవేత్త ప్రజ్ఞకు ఏమి చెప్పి ఉంటాడు?
జవాబు.
ప్రజ్ఞకు వచ్చిన సందేహాలన్నింటికి శాస్త్రవేత్త విసుగుకోకుండా జవాబులు చెప్పి ఉంటాడు.

ప్రశ్న 3.
ప్రజ్ఞ శాస్త్రవేత్త కావాలనుకుంది కదా! మీరేం కావాలనుకుంటున్నారు? ఇందుకోసం మీరేం చేస్తారు?
జవాబు.
నేను కూడా శాస్త్రవేత్త కావాలనుకుంటున్నాను. శాస్త్రవేత్త కావడానికి బాగా చదువుకోవడమేగాక పరిసరాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటాను. నేను చదివిన విషయాలను పరిసరాలతో అన్వయించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. దీక్షతో, కృషితో, శ్రద్ధతో బాగా చదువుకొని శాస్త్రవేత్తను అవుతాను. ప్రతి విషయాన్ని ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను.

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

ప్రశ్న 4.
అతిసామాన్య కుటుంబంలో జన్మించి, పరిశోధన సంస్థలకు ప్రాణంపోసి ‘భారతరత్న’ బిరుదు పొందిన శాస్త్రవేత్త ఎవరో తెలుసా?
జవాబు.
తెలుసు. ఆయనే డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం. మన మాజీ రాష్ట్రపతి.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
‘నువ్వు నీ విధిని కూడా తిరిగి రాయగలవు’ అంటే మీకేమర్థమైంది?
జవాబు.
నా విధిని నేనే వ్రాయగలను అనే పదానికి నా భవిష్యత్తును నేనే నిర్ణయించుకోగలను అనే విషయం అర్థమైంది. నేను భవిష్యత్తులో నా జీవితంలో సాధించాలనుకొనే లక్ష్యాలను నేను చిన్నప్పుడే నిర్ణయించుకొని ఆ దిశగా కష్టపడితే తప్పక గమ్యాన్ని చేరుకుంటాను అని తెలుసుకున్నాను.

ప్రశ్న 2.
మీరు మీ కుటుంబసభ్యులకెప్పుడైనా సహాయం చేశారా? ఏ సందర్భంలో ఏం చేశారు?
జవాబు.
నేను నా కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ సహాయం చేస్తుంటాను. ఒకసారి నా సోదరుడు, నేను ఆటలు ఆడుకొని ఇంటికి వస్తున్నాము. దారిలో నా తమ్ముడు గుంటలో పడిపోయాడు. లేపడం నావల్ల కావడం లేదు. ఒక ప్రక్క అతనిని వదలకుండానే గట్టిగా చాలాసేపు కేకలు వేశాను. చివరికి ఎవరో వచ్చి అతడిని బయటకు తీశారు. నాకెంతో భయం వేసింది. కాని నా తమ్ముడు నాకు దక్కాడని ఆనందం కల్గింది.

ప్రశ్న 3.
ఆ కోరిక, నమ్మకం, ఆశపెట్టుకోవడం అనేవి విజయాన్నిస్తాయి కదా! వీటిపై మీ అభిప్రాయమేమిటి?
జవాబు.
మనకు ఏమి కావాలో వాటిని నిర్ణయించుకొని కోరుకోవాలి. కోరికలు తీరాలంటే అదే పనిగా సాధన చేయాలి. నమ్మకం అనేది ఒకరిపై ఒకరికి కలిగే అభిప్రాయం. ఇతరులకు నమ్మకం కలగాలంటే ప్రతివారు నిజాయితీ కలిగి ఉండాలి. నిజాయితీ లేకపోతే ఎవరూ ఎవరినీ నమ్మరు. ఆశపెట్టుకోవడం అంటే మనకు భవిష్యత్తులో జరుగబోయే వాటిపై ఆశగా ఊహించడం. ప్రతివారు మంచి జరుగుతుందని ఆశగా ఊహించాలే కాని నిరాశగా ఉండకూడదు. అపుడే విజయాలు సాధించగలం.

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

ప్రశ్న 4.
మీ జీవిత లక్ష్యం ఏమిటి? అది సాధించడానికి ఏం చేస్తారు?
జవాబు.
అబ్దుల్కాలాం స్ఫూర్తితో నేను శాస్త్రవేత్త కావాలని లక్ష్యం నిర్దేశించుకున్నాను. ఆ గమ్యాన్ని చేరుకోవడానికి నేను పాఠశాల స్థాయి నుండే పాఠ్యపుస్తకాలతోపాటు ఇతర విషయాలను కూడా నేర్చుకుంటున్నాను. నిరంతరం నా జీవిత లక్ష్యాన్ని మనసులోనే తలచుకొని దానిని సాధించడానికి ఏఏ చదువులు, ఎలా చదవాలో ఆలోచిస్తాను. కలాం జీవితంలో ఎలా కష్టపడ్డారో పాఠంలో తెలుసుకొన్న వాటిని నా జీవితంలో నేను కూడా అవలంబించి నా గమ్యాన్ని తప్పక చేరుతాను.

ప్రశ్న 5.
‘తనను తాను తెలుసుకోవడం’ అంటే మీకేమర్థమైంది?
జవాబు.
తనను తాను తెలుసుకోవడం అంటే ప్రతివ్యక్తి తనలోని ఆలోచనలు, బలమైన అంశాలు, బలహీన విషయాలు గుర్తించడం. తను ఎలా జీవిస్తున్నాడు. ఇంకా మెరుగ్గా ఎలా ఉండగలడు, అనే అంశాలు గమనించడం. ఆయా వ్యక్తులు తన గురించి తాను తెలుసుకోవాలి! అపుడే వారి భవిష్యత్తును గూర్చి ఆలోచించే శక్తి వారికి ఏర్పడుతుందని అర్థమైంది.

ప్రశ్న 6.
మిమ్మల్ని మీ ఉపాధ్యాయులెట్లా ప్రోత్సహిస్తారో చెప్పండి.
జవాబు.
మమ్మల్ని మా ఉపాధ్యాయులు అన్ని అంశాలు నేర్చుకోవడానికి ప్రోత్సహిస్తారు. తెలియని విషయాలు తెలుపుతారు. మాలోని చీకటి అనే తెలియని దానిని పోగొట్టి వెలుగు అనే జ్ఞానాన్ని మాలో నింపుతారు. విద్యార్థుల శక్తిసామర్థ్యాలను అనుసరించి ఉపాధ్యాయులు మా జీవిత లక్ష్యాలను, గమ్యాలను నిర్దేశిస్తారు.

ప్రశ్న 7.
మా అందరికీ ప్రేరణ మా ఉపాధ్యాయులే. ఆ ‘స్కాలర్షిప్పే నా జీవనభాగ్యరేఖ’ అని కలాం అనడంలో ఆంతర్యమేమిటి?
జవాబు.
కలాంగారు ఇంజనీరింగ్ కోర్సు చదివే రోజులలో వారి డైరెక్టర్ ఏరోడైనమిక్ డిజైన్ బాధ్యత కలాంగారికి అప్పగించడం జరిగింది. ఆ పని నిరాశాజనకంగా ఉండడంతో ప్రొఫెసర్ గారు కలాంగారికి 3 రోజుల సమయమిచ్చి పూర్తిచెయ్యకపోతే స్కాలర్షిప్పు ఆపి వేస్తానన్నారు. కలాంగారు అప్పుడు ఆ స్కాలర్ షిప్పే తన జీవన భాగ్యరేఖ అని, ఆ పని పూర్తి చెయ్యకపోతే తన చదువు ఇబ్బందుల్లో పడుతుందని, తప్పక డిజైన్ పూర్తిచేయాలని భావించాడు. రాత్రింబవళ్ళు కష్టపడి ఆ పనిపూర్తి చేసి ఆ ప్రొఫెసర్ గారి మన్నన పొందాడు. తను కష్టపడకపోతే తాను ఇబ్బందులు పడతానని భావించడంపై వాక్యంలోని ఆంతర్యం.

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

ప్రశ్న 8.
‘దారిచూపే దీపం’ అనే మాటను ఏయే సందర్భాలలో ఉపయోగిస్తారు?
జవాబు.
చీకటిలో వెలుగు చూపేది దీపం. దీపపు కాంతులు లేనిదే చీకటిలో వేటినీ చూడలేము. జీవితంలో కూడా అనేక కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సాయం చేస్తే వారిని దారిచూపే దీపంగా భావిస్తాం. తల్లిదండ్రులు, స్నేహితులు ప్రతివారికి దారిచూపే దీపాలు అని చెప్పవచ్చు.

ప్రశ్న 9.
ప్రొఫెసర్ కలాంను ముందువరుసలో కూర్చోమన్నాడుకదా! కలాం స్థానంలో మీరుంటే ఏ విధంగా అనుభూతి చెందేవారు?
జవాబు.
కలాంగారు మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్య పూర్తి అయిన తర్వాత గ్రూప్ ఫోటో సమయంలో ప్రొఫెసర్ స్పాండర్ కలాంను తనతోపాటు ముందు వరుసలో కూర్చోమన్నారు. కలాం స్థానంలో నేనుంటే చాలా గర్వంగా, ఆనందంగా భావించే వాడిని. నన్ను అందరిముందు గుర్తించి, ప్రత్యేకంగా విలువ ఇవ్వడంగా భావిస్తాను. ఆ ప్రత్యేకత నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది.

ఇవి చేయండి

1. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

ప్రశ్న 1.
‘ప్రేరణ’ అనే పాఠం పేరు వినగానే నీకేమనిపిస్తుంది?
జవాబు.
‘ప్రేరణ’ అంటే కదిలించే వ్యక్తి. ఎవరి మనసునైనా ఆకర్షించి ఆలోచనా విధానంలో మార్పు తెచ్చి వారికి కొత్త స్ఫూర్తినిచ్చి కొత్తవిషయాల వైపు నడిపించి, కొత్తవిషయాలు కనుక్కోగలిగేటట్లు ప్రోత్సహించేటట్లు ప్రోత్సహించే శక్తిప్రేరణ.
ఈ పాఠం పేరు వినగానే తప్పకుండా ఇది ఒక గొప్ప వ్యక్తికి సంబంధించిన చరిత్ర అని నాకనిపించింది. ఆ వ్యక్తి క్రీడారంగంలో ప్రసిద్ధుడైన వ్యక్తి కానీ, కళాసాహిత్యరంగాలలో ప్రసిద్ధుడైన వ్యక్తికానీ, విద్యావైజ్ఞానిక రంగాలలో ప్రసిద్ధుడైన వ్యక్తికానీ, శాస్త్రసాంకేతిక రంగాలలో ప్రసిద్ధుడైన వ్యక్తి కానీ అయి ఉంటాడనిపించింది. ఆ వ్యక్తి గురించి త్వరగా చదివి తెలుసుకోవాలని అనిపించింది.

ప్రశ్న 2.
అబ్దుల్ కలాం చదువుకున్న రోజుల్లోని విద్యావిధానం గూర్చి మీ మిత్రులతో చర్చించండి. :
జవాబు.
ప్రవీణ్, లక్ష్మణ్ : మణి! అబ్దుల్ కలాం ఏ కాలంలో చదువుకున్నాడంటావ్?

మణి : బ్రిటిష్వారు మనదేశాన్ని పాలించే రోజులలోనే. అప్పటికింకా మనకు స్వరాజ్యం లేదు.

అంజలి, జయంత్ : అవును. ఆయన హైస్కూల్ చదువు రామనాథపురంలో జరిగింది.

శంకర్ : ఆయన పుట్టింది ధనుష్కోటిలో కదా! మరి రామనాథపురంలో చదవడమేమిటి?

అంజలి : ఇప్పటిలాగా అప్పుడు ఇన్నిన్ని పాఠశాలలు, కళాశాలలు లేవు. ఎలిమెంటరీ పాఠశాలలు కూడా చాలా తక్కువ ప్రదేశాలలో ఉండేవి. పై

చదువులు చదవాలంటే పొరుగూరుగాని, దగ్గరలో ఎక్కడ విద్యాలయం ఉంటే అక్కడికి వెళ్ళి చదువుకోవలసిందే.

మహేష్ : ఔను గాంధీగారు, పటేల్, చిలకమర్తివారు ఇలా అందరూ ఉన్న ఊరు విడిచి వెళ్ళి చదువుకున్నవారే.

రమణ : ఇప్పటిలాగా అప్పుడు కిండర్ గార్టెన్ చదువులు, ఇంగ్లీషుమీడియం చదువులు ఉండేవి కాదు. ప్రాంతీయ పాఠశాలలో ప్రాంతీయ భాషలోనే
విద్యాభ్యాసం జరిగేది.

శంకర్ : ఆంగ్లేయుల పాఠశాలలు, కళాశాలలో మాత్రం తప్పకుండా ఆంగ్లంలో చదవాల్సిందే. అంతేకాదు హయ్యర్ సెకండరీ క్లాసులలో కూడా ప్రాంతీయ భాష ఒక్కటిమాత్రం ఆ భాషలో చదవవచ్చు. తక్కిన సబ్జక్టులన్నీ ఆంగ్లంలోనే చదవాలి.

ప్రవీణ్ : అందుకనేనా ఎ.పి.జె. అబ్దుల్కాలాం అన్నిచోట్ల చదువవలసి వచ్చింది.

అంజలి : చూశారా! విద్యావిధానంలో ఆరోజుకీ ఈరోజుకీ ఎన్ని మార్పులు చోటు చేసుకున్నాయో!

II. ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

1. కింది వాక్యాలు పాఠంలో ఏ పేరాల్లో ఉన్నాయో గుర్తించండి. ఆ వాక్యాలను పూర్తిగా రాయండి.

(అ) కలామ్ తత్త్వశాస్త్ర గ్రంథాలు చదవడం
జవాబు.
నేను సెంటోసెఫ్ నా చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు ఇంగ్లీషు సాహిత్యంపట్ల మక్కువ పెంచుకున్నాను. ఇంగ్లీషులోని సర్వశ్రేష్ఠ కృతుల్ని చదువుతుండేవాణ్ణి. టాల్స్టాయ్, స్కాట్, హార్డీల పట్ల ప్రత్యేక ఆసక్తి ఉండేది. అప్పుడప్పుడు తత్త్వశాస్త్ర గ్రంథాలు చదువుతుండేవాణ్ణి. దాదాపుగా ఆ సమయంలోనే భౌతికశాస్త్రం పట్ల నాకు అమితమైన ఆసక్తి ఏర్పడింది.

(ఆ) విజయానికి సూత్రాలు మూడు
జవాబు.
నేను రామనాథపురంలో ఉన్న కాలంలో మా అనుబంధం గురుశిష్యబంధాన్ని దాటి వికసించింది. ఆయన సాహచర్యంలో ఒకరి జీవితగమనాన్ని ఎవరైనా ఏ మేరకు ప్రభావితం చేయగలరో తెలుసుకున్నాను. ఇయదురై సోలోమోన్ అంటూండేవారు, జీవితంలో విజయం పొందడానికీ ఫలితాలు సాధించడానికీ నువ్వు మూడు అంశాల మీద పట్టు సాధించాల్సి ఉంటుంది- అవి “కోరిక”, “నమ్మకం”, “ఆశపెట్టుకోవడమూ”ను.

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

(ఇ) సోదరి సహాయం
జవాబు.
ప్రవేశానికి ఎంపికైతే అయ్యానుగానీ అటువంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో చదవడమంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. దాదాపు వెయ్యి రూపాయలన్నా అవసరమవుతాయి. కానీ అది నా తండ్రికి తలకు మించిన విషయం. అప్పుడు నా సోదరి జొహారా నాకు తోడు నిలబడింది. తన బంగారుగాజులు, గొలుసు కుదువపెట్టి ఆమె నాకు సహాయం చేసింది. నేను చదువుకోవాలన్న ఆమె ఆకాంక్ష, నా సామర్థ్యంలో ఆమె నమ్మకం నన్ను గాఢంగా చలింపచేశాయి. నేను నా సొంత సంపాదన మీదనే ఆమె గాజుల్ని విడిపిస్తానని ఒట్టు పెట్టుకున్నాను. అప్పుడు నాకు డబ్బు సంపాదించడానికున్న ఏకైన మార్గం కష్టపడి చదువుకుని స్కాలర్షిప్ సంపాదించుకోవడమే.

(ఈ) ప్రొఫెసర్ పక్కన కూర్చుని ఫోటో దిగడం
జవాబు.
ఎమ్.ఐ.టికి. సంబంధించి నా ఆత్మీయమైన జ్ఞాపకం ప్రొ. స్పాండర్కి సంబంధించిందే. వీడ్కోలు సమావేశంలో భాగంగా మేము గ్రూప్ ఫోటో కోసం నిలబడ్డాము. ప్రొఫెసర్లు ముందుకూర్చొని ఉండగా గ్రాడ్యుయేట్ విద్యార్థులంతా మూడు వరుసల్లో నిల్చొన్నాము. హఠాత్తుగా ప్రొ. స్పాండర్ లేచి నిల్చొని నా కోసం కలియచూశాడు. నేను మూడో వరుసలో వెనుక నిల్చున్నాను. ‘రా నాతోపాటు ముందుకూర్చో’ అన్నాడు. నేను ప్రొ. స్పాండర్ ఆహ్వానానికి నిర్ఘాంతపోయాను. ‘నువ్వు నా బెస్టు స్టూడెంట్వి. నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకి భవిష్యత్తులో మంచి పేరు తేవడానికి ఉపకరిస్తుంది’ అన్నాడు. ఆ ప్రశంసకి సిగ్గుపడ్డాను. అదే సమయంలో నాకు లభించిన గుర్తింపుకు గర్విస్తూ నేను ప్రొ.స్పాండర్తో కలసి ఫోటోగ్రాఫ్ కోసం కూర్చున్నాను. ‘దేవుడే నీ ఆశా, ఆశ్రయమూ, మార్గదర్శి కాగలడు. భవిష్యత్తులోకి నీ ప్రయాణానికి ఆయనే దారి చూపే దీపం కాగలడు’ అన్నాడు ఆ మహామేధావి నాకు వీడ్కోలు పలుకుతూ.

2. కింది పేరా చదవండి. తప్పు ఒప్పులను గుర్తించండి.

భారతీయ జాతీయోద్యమ నాయకులలో బిపిన్చంద్రపాల్ ఒకడు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న సైచెల్లో జన్మించాడు. సహాయనిరాకరణోద్యమానికి పిలుపునిచ్చాడు. దేశ స్వాతంత్ర్యం కోసం, అభ్యుదయం కోసం పాటుపడ్డాడు. కవులనూ పండితులను, తత్త్వవేత్తలను, ప్రవక్తలను, నాయకులను, సాధారణ ప్రజలనూ అందరినీ ఆహ్వానించాడు. ఈ విధంగా దేశానికి సేవ చేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రంగాన్ని ఎంచుకొని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

(అ) బిపిన్ చంద్రపాల్ జాతీయోద్యమ నాయకుడు (ఒప్పు)
(ఆ) బిపిన్ చంద్రపాల్ సహాయ నిరాకరణోద్యమానికి వ్యతిరేకి (తప్పు)
(పై పేరాలో బిపిన్ చంద్రపాల్ సహాయ నిరాకరణోద్యమానికి పిలుపు నిచ్చాడు అని ఉన్నది. అంటే ఆయన దానిని సమర్థిస్తున్నాడు. ప్రశ్నలో వ్యతిరేకిస్తున్నాడు అని ఉన్నది కనుక ఇది (తప్పు)
(ఇ) బిపిన్ చంద్రపాల్ కవులను, పండితులను స్వాతంత్ర్యోద్యమంలోకి ఆహ్వానించాడు (ఒప్పు)
(ఈ) బిపిన్ చంద్రపాలికి స్వాతంత్రోద్యమ కాంక్ష ఉంది. (ఒప్పు)
(ఉ) బిపిన్ చంద్రపాల్ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జాతీయ నాయకుడు. (ఒప్పు)

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

(అ) ‘ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు జ్ఞాని’ ఈ వాక్యంపై మీ అభిప్రాయం రాయండి.
జవాబు.
అబ్దుల్ కలాం తండ్రి తన కుమారునితో అన్న మాటలివి. విజ్ఞానం కలిగి ఉంటేనే మనిషి అనిపించుకుంటాడు. విజ్ఞానం అంటే ఇతరులను గురించి తెలుసుకోగలిగే శక్తి. మనం అందరితోనూ స్నేహంగా సత్సంబంధాలు కలిగి ఉండాలంటే వారిని అర్థం చేసుకోగలిగి ఉండాలి. అలాగే చెడ్డవారి నుంచి దూరంగా ఉంటే ప్రమాదాలను తప్పించుకోగలుగుతాం. విజ్ఞానం కలవాడు ఇతరులను గురించి ఆలోచించగలిగినట్లే తనను గురించి తాను ఆలోచించగలుగుతాడు. అదే వివేకమంటే. వివేకవంతుడు తప్పక విజ్ఞానియై ఉంటాడు. కాని విజ్ఞానమున్నంత మాత్రాన వివేకి కావాలని లేదు. కాబట్టి తప్పకుండా వివేకం కలిగి ఉండాలని నా అభిప్రాయం.

(ఆ) ‘కోరిక, నమ్మకం, ఆశపెట్టుకోవడం’ అనే మూడు అంశాల మీద ఎందుకు పట్టు సాధించాలి ?
జవాబు.
కోరిక అనేది ప్రతివ్యక్తికీ ఉంటుంది. ఐతే కోరిక బలంగా ఉంటేనే మనిషి దాన్ని తీర్చుకోడానికి ప్రయత్నిస్తాడు. అందుకే కోరిక గట్టిదై ఉండాలి. నమ్మకం అంటే ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం. కోరికను సాధించుకోగలను అనే గట్టి పట్టుదలతో తన మీద తను నమ్మకం కలిగి ఉంటే కోరికను సాధించుకోగలడు. ఆశ పెట్టుకోవడం అంటే చేసే ప్రయత్నాలలో ఒక్కొక్కసారి విఫలమైనా నిరాశపడకుండా తప్పక సాధిస్తాను అనే ఆశతో ముందుకు సాగడం. మనిషి ఎప్పుడూ ఆశాజీవిగానే ఉండాలి. కాబట్టి ఎవరైనా తన ప్రయత్నాలలో సఫలీకృతులు కావాలంటే పై మూడు అంశాల మీద పట్టు సాధించాలి.

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

(ఇ) “తమ విద్యార్థుల జ్ఞానతృష్ణను తమ చైతన్యంతో, అకుంఠిత సంకల్పంతో సంతృప్తి పరచడమే!” ఈ మాటలు ఎవరినుద్దేశించినవి? దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
(లేదా)
కలాం ఉపాధ్యాయుల గొప్పదనాన్ని చెప్పిన సందర్భం వివరించండి.
జవాబు.
తనను ప్రోత్సహించిన ఎమ్.ఐ.టి. ఉపాధ్యాయులను ఉద్దేశించి అబ్దుల్కాలాం చెప్పిన మాటలివి. ఎమ్.ఐ.టి. లో చదివేటప్పుడు అబ్దులలాం ఆలోచనలను తీర్చిదిద్ది, కలాం సాంకేతిక ప్రతిభను ప్రోత్సహించిన ఉపాధ్యాయులు ముగ్గురు. వారు ప్రొఫెసర్ స్పాండర్, ప్రొఫెసర్ కే.ఏ.వి. పండలై, ప్రొఫెసర్ నరసింగరావుగారు. వారిలో ప్రతి ఒక్కరిదీ ఒక ప్రత్యేక వ్యక్తిత్వం. కానీ వారి ఆశయం మాత్రం ఒక్కటే. అది- తమ చైతన్యంతోనూ, అకుంఠిత సంకల్పంతోనూ, విద్యార్థుల జ్ఞాన తృష్ణని సంతృప్తిపరచడం ఒక్కటే వారందరి ఆశయం. ఇది ఆ ఉపాధ్యాయుల గొప్పదనాన్ని తెలియచేస్తోంది. తనను తీర్చిదిద్దిన అలాంటి గురువులను గుర్తుపెట్టుకొని కృతజ్ఞత చూపిన కలాం వ్యక్తిత్వం గొప్పదని తెలుస్తుంది.

(ఈ) ప్రొ. శ్రీనివాసన్ అప్పగించిన పనిని పూర్తిచేసే సమయంలో కలాం స్థానంలో మీరుంటే ఏం చేసేవారు?
జవాబు.
ప్రొ. శ్రీనివాసన్ అబ్దుల్ కలాంకు యుద్ధవిమానం మోడల్ తయారుచేసే పని అప్పగించారు. అది ఆయన స్నేహితులతో కలిసి పూర్తిచేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన వంతు పని తొందరగానే జరిగినా స్నేహితులవైపు నుండి ఆలస్యం జరిగిందని నా కనిపిస్తుంది. నేనైతే పనిచేయడానికి ముందు స్నేహితులతో పనితీరు గురించి ఎంత సమయంలో ఏ పని పూర్తిచేయాలి అనే విషయం గురించి క్షుణ్ణంగా చర్చిస్తాను. అందరూ ఒకరి పనిని మరొకరు పరిశీలిస్తూ, సమిష్టి బాధ్యతతో పని పూర్తయ్యేలా బాధ్యత తీసుకుంటాము.

ప్రతివారిని వారు చేయవలసిన పనిలోని భాగాలను ముందుగానే ప్రణాళిక తయారుచేసి సమయనిర్దేశంతో సహా సిద్ధం చేయిస్తాను. ఆ ప్రణాళికను బట్టి మొత్తం పని పూర్తికావడానికి ఎంత సమయం కావాలో ఆలోచించుకుని ఆ ప్రకారంగా పనులు జరుగుతున్నవో లేదో పర్యవేక్షిస్తూ ముందుగానే నావంతుగా ఎక్కువ సమయం పనిచేసి అనుకున్న దానికన్న ముందుగానే పని పూర్తిచేసి స్నేహితులకు ఆదర్శంగా నిలుస్తాను. వారిని ప్రోత్సహిస్తూ వారికి సాయం చేస్తూ నిర్ణీత సమయంకంటె ముందుగానే పనిపూర్తిచేసి ఉపాధ్యాయునికి అప్పగిస్తాను.

 

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

1. కలాం తన ఆశయసాధనలో ఎలా కృతకృత్యుడయ్యాడు? మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు.
అబ్దుల్ కలాం చిన్నతనంలో కొంగలూ, సముద్రపు గువ్వలూ ఎగురుతుండడం చూసి తను కూడా అలా ఎగరాలనుకొనేవాడు. ఆకాశంలోని రహస్యాలు తెలుసుకోవాలని ఆయనకు ఆసక్తి. కోరిక, నమ్మకం, ఆశపెట్టుకోవడం అనే మూడు అంశాలపై పట్టు సాధించమని గురువు ఇయదురై సోలోమోన్ ఇచ్చిన ఉపదేశం మనసులో కుదుర్చుకున్నాడు. తన ఆశయం నెరవేర్చుకోడానికి ఎంతో కష్టపడి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివాడు. ఆ రోజుల్లో కాలేజీలో ప్రదర్శన కోసం పెట్టిన రెండు పాత విమానాలను చూస్తూ ఎక్కువ కాలం గడుపుతూ తన ఆశయాన్ని బలపరచుకున్నాడు. కోర్సు పూర్తి కాగానే సహచరులతో కలిసి యుద్ధవిమానం మోడల్ తయారుచేశాడు. ప్రొఫెసర్ ఇచ్చిన అతి తక్కువ సమయంలో పూర్తిచేసి అందరి మన్ననలు పొందాడు. వ్యాసరచన పోటీలో ‘మన విమానాన్ని మనమే తయారుచేసుకుందాం’ అనే వ్యాసాన్ని తమిళంలో రాసి మొదటి బహుమతి పొందాడు. ఆ విధంగా కలాఁ తన ఆశయసాధనలో కృతకృత్యుడయ్యాడు.

(లేదా)

కలాం విద్యాభ్యాసం ఏ విధంగా కొనసాగిందో మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు.
కలాం రామనాథపురంలోని హైస్కూలులో విద్యాభ్యాసం చేశాడు. ఆ రోజుల్లో అతనిలో ఎన్నో విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగింది. ముందుముందు జీవితంలో రాబోయే అవకాశాల గురించి, ప్రత్యామ్నాయాల గురించి ఆయనకేమీ తెలియదు. అక్కడి ఉపాధ్యాయుడు ఇయదురై సోలోమోన్ ఆయనకు మార్గదర్శకుడైనాడు. కలాంకు ఆకాశపు రహస్యాలన్నా, పక్షుల ప్రయాణమన్నా చిన్నప్పటినుండి ఎంతో ఆసక్తి. పై చదువుల గురించి, ప్రొఫెషనల్ చదువులగురించి ఆయనకేమీ తెలియదు. అందుకే తిరుచినాపల్లిలో ఉన్న సెంట్ జోసఫ్ కాలేజీలో ఇంటర్మీడియెట్, బి.ఎస్.సి. చదివాడు. చివరి సంవత్సరంలో ఇంగ్లీషు సాహిత్యం మీద ఇష్టం కలిగి మంచి మంచి పుస్తకాలు, తత్త్వశాస్త్ర గ్రంథాలు చదివేవాడు. టాల్స్టాయ్, స్కాట్, హార్డీ అంటే ప్రత్యేకమైన ఆసక్తి. ఆ సమయంలోనే ఆయనకు భౌతికశాస్త్రం పట్ల ఇష్టం ఏర్పడింది.

కానీ తన కలలు నిజం చేసుకోవాలంటే ఫిజిక్స్ కాదు ఇంజనీరింగ్ చదవాలని అర్థం చేసుకున్నాడు. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో దరఖాస్తు చేసుకున్నాడు. ప్రవేశం లభించింది. కాని డబ్బు సమస్య ఎదురైంది. సుమారు 10వేల రూపాయలు కావలసి వచ్చింది. తండ్రికి శక్తి లేదు. సోదరి జొహారా తన బంగారు గొలుసు, గాజులు తాకట్టుపెట్టి డబ్బు ఇచ్చింది. ఎం.ఐ.టిలో చేరిన తరువాత స్కాలర్షిప్ సంపాదించుకొని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివాడు. చిన్నతరహా యుద్ధ విమానాన్ని చాలా తక్కువ సమయంలో తయారుచేసి ప్రొఫెసరు మన్ననలు పొందాడు. తరువాత బెంగుళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ గ్రాడ్యుయేట్ ఏరోనాటికల్ ఇంజనీర్ పనిచేశాడు. ఈ విధంగా అబ్దుల్ కలాం విద్యాభ్యాసం సాగింది.

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

2. ‘మనమే విమానాన్ని తయారుచేసుకుందాం’ అన్న వ్యాసంలో అబ్దుల్కలాం ఏమి రాసి ఉంటారు? (అదనపు ప్రశ్న)
అబ్దుల్ కలాం ప్రాజెక్టు పని పూర్తిచేస్తున్న కాలంలో ఎం.ఐ.టి. తమిళ సంఘం వారు వ్యాసరచన పోటీ నిర్వహించారు. కలాం ఆ పోటీలో పాల్గొన్నారు. “మన విమానాన్ని మనమే చేసుకుందాం” అనే అంశం మీద వ్యాసం రాశారు. ఆ వ్యాసం గొప్ప ఆసక్తిని రేకెత్తించింది. కలాం ఆ పోటీలో గెలిచి ప్రఖ్యాత తమిళ వారపత్రిక ‘ఆనంద వికటన్’కు సంపాదకుడైన దివాన్ చేతులమీదుగా మొదటి బహుమతి అందుకున్నారు. ఆ వ్యాసంలో కలాం ఇలా రాసి ఉండవచ్చు “ఆకాశంలో విహరించడమంటే ఇష్టంలేని వాళ్ళుండరు.

పక్షులైతే రెక్కలతో ఎగురుతాయి. మనిషికి రెక్కలు లేవు గనుక పక్షి ఆకారం కలిగి రెక్కలున్న వాహనంలో అదే విమానంలో కూర్చుని ఆకాశంలో ప్రయాణించవచ్చు. ఈ విమానాన్ని ఎలా తయారుచెయ్యాలంటే ఏరోనాటిక్స్ క్షుణ్ణంగా అభ్యసించాలి. స్వేచ్ఛకు – తప్పించుకోడానికీ, చలనానికీ-గమనానికీ, పక్కకి జారడానికీ – ప్రవహించడానికీ మధ్యగల తేడా తెలుసుకోవడంలోనే విజ్ఞానశాస్త్ర రహస్యాలన్నీ దాగి ఉన్నాయి. యుద్ధ విమానం తయారు చెయ్యాలంటే ఏరో డైనమిక్ డిజైనింగ్, చోదనం, నిర్మాణం, అదుపు, ఉపకరణ సామగ్రి మొదలైన అంశాలమీద దృష్టి పెట్టి తయారు చేయాలి………..” ఈ విధంగా వ్యాసం సాగి ఉండవచ్చునని నా భావన.

IV. సృజనాత్మకత/ప్రశంస

1. కలాం తన కోరికను గురించి చెప్పాడు కదా! అట్లాగే మీరు కూడా మీ కోరికను చిన్న కవిత రూపంలో రాయండి. గోపాలరావు తాతగారు మంచి మనస్సున్న వైద్యుడు
జవాబు.
బాధతో మూలుగుతూ వచ్చే ప్రతి రోగికి ఆయన ఒక సోదరుడు
నవ్వుతూ, ప్రేమతో మాట్లాడుతూ ఉంటే
వారిబాధ తెలుసుకొని, ధైర్యం చెబుతూ ఉంటే
నేను కూడా పెద్దయ్యాక డాక్టరు నవుదామనుకుంటున్నా
రోగులకు, పేదలకు సేవచేసి తరించాలనుకుంటున్నా!

(లేదా)

ఈ పాఠం స్ఫూర్తితో మీరే అబ్దుల్ కలాం అయితే నేటి విద్యార్థులకు ఏం చెపుతారు? సందేశమివ్వండి. ఏకపాత్రాభినయం
చేయండి.
మిత్రులారా! గురువు ఉత్తముడైనంత మాత్రాన సరిపోదు. గురువెట్లా ఉన్నా శిష్యుడు చురుగ్గా ఉండాలి. వీలైనంత ఎక్కువ నేర్చుకోవాలి. ఏదైనా చెయ్యాలనుకుంటే ఆ కోరిక బలంగా ఉండాలి. చెయ్యగలనన్న నమ్మకంతో సాధిస్తానన్న ఆశతో పనిచేస్తే తప్పక సాధించగలరు. మీలో విశ్వాసం గట్టిగా ఉంటే మీ భవిష్యత్తును మీరే నిర్దేశించుకోగలరు. అన్ని విషయాల మీద దృష్టి పెట్టి తెలుసుకుంటూ ఉండండి. విజ్ఞానం పొందండి. విజ్ఞానంతోపాటు వివేకం కూడా చాలా అవసరం. వివేకం లేకపోతే విజ్ఞానం వ్యర్థం. ఎప్పుడూ సకాలంలో పనులు పూర్తిచేసుకోవాలి. ఉపాధ్యాయుల మన్ననలు పొందాలి. మీరు సాధించదలచిన లక్ష్యాన్ని మనసులో చక్కగా కుదుర్చుకొని తగినంత కృషి చేసి దాన్ని చేరుకోవాలి. ఎన్ని అవాంతరాలు వచ్చినా, వైఫల్యాలు ఎదురైనా నిరాశపడకుండా లక్ష్యాన్ని చేరుకోవాలి. మీ అందరికీ నా ఆశీస్సులు, శుభాకాంక్షలు.

పదజాల వినియోగం

1. కింద గీతగీసిన పదాలకు అర్థాలను రాయండి.
(అ) ఔత్సాహికుడైన వ్యక్తి ఏ రంగంలోనైనా రాణిస్తాడు.
ఔత్సాహికుడైన = ఉత్సాహవంతుడైన
ఉత్సాహవంతుడైన వాడు మొదలు పెట్టిన పనిని తప్పక పూర్తి చేస్తాడు.

(ఆ) జిజ్ఞాసువు కొత్త విషయాలను తెలుసుకుంటాడు.
జిజ్ఞాసువు = తెలుసుకోవాలనే కోరిక కలవాడు.
దేవుని గురించి తెలుసుకోవాలనే కోరిక గల నరేంద్రుడు రామకృష్ణ పరమహంసను చేరాడు.

(ఇ) సుస్మితకు డాక్టరుగా ఎదగాలని ఆకాంక్ష
ఆకాంక్ష = కోరిక
సుజాతకు మదర్ థెరిసాలాగా సంఘసేవ చేయాలని కోరిక.

(ఈ) అభ్యర్థులు ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేస్తారు.
వాగ్దానం : మాట యివ్వడం
రోజూ ఆలస్యంగా నిద్రలేచే గౌతమి ఇకపై త్వరగా లేస్తానని తల్లికి మాట ఇచ్చింది.

(ఉ) బందు కారణంగా పనులు నిలిచిపోకుండా యాజమాన్యం ప్రత్యామ్నాయపు ఏర్పాట్లు చేసింది.
ప్రత్యామ్నాయం = బదులు / మాఱు
వరద సమయాలలో ప్రజలకు తలదాచుకోవడానికి ప్రభుత్వం సురక్షితమైన బదులు (మాఱు) ఏర్పాట్లు చేస్తుంది.

(ఊ) వివేకానందుని ఉపన్యాసాలు ఎందరినో ప్రభావితం చేశాయి.
ప్రభావితం చేయు = స్ఫూర్తి కలిగించు
గొప్పగొప్ప వ్యక్తుల బోధనల వలన స్ఫూర్తి కలవారమైన మనం కూడా గొప్పవాళ్ళం కాగలుగుతాం.

2 ఈ పాఠంలో శాస్త్ర సంబంధ పదాలున్నాయి. వాటిని పట్టికగా రాయండి.

ఉదా: ఏరోనాటికల్ ఇంజనీర్
ఈ పాఠంలోని శాస్త్ర సంబంధమైన పదాలు :

సైన్సువాయుపదార్థాలునిర్మాణం
విజ్ఞానశాస్త్రంగతిశీలత
ఫిజిక్స్ఏరోప్లేన్
ఇంజనీరింగ్యుద్ధవిమానం
సాంకేతిక విద్యఏరోడైనమిక్ డిజైన్అణుధార్మికనశ్వరత
విమానయంత్రాలుచోదనంఅర్థజీవకాలం
ఏరోనాటికల్ ఇంజనీర్

3. కింది వాక్యాలలో సమానార్థకాన్నిచ్చే పదాలున్నాయి. వాటిని గుర్తించి రాయండి.

(అ) ఆకాశంలో చుక్కలు మెరుస్తున్నాయి. ఆ గగనంలోనే చంద్రుడు కాంతులీనుతున్నాడు. అందుకే నింగి అంటే నాకెంతో ఇష్టం.
జవాబు.
ఆకాశం, గగనం, నింగి

(ఆ) భూమి మీద ఎన్నో జీవరాశులున్నాయి. వసుధలో నిధి నిక్షేపాలుంటాయి. ధరణికి వృక్షాలు అందాన్నిస్తాయి.
జవాబు.
భూమి, వసుధ, ధరణి

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

(ఇ) ఆయనకు సుమారు ముప్పై ఏళ్ళు. ఉద్యోగంలో చేరి ఇంచుమించు ఆరు సంవత్సరాలైంది. నెలకు దాదాపు పదివేలు సంపాదిస్తున్నాడు.
జవాబు.
ఇంచుమించు, సుమారు, దాదాపు

(ఈ) కిరణ్ు కలెక్టర్ కావాలని కోరిక. తన ఆకాంక్ష నెరవేరడానికి నిరంతరం శ్రమిస్తాడు. పరీక్షఫలితాలు రాగానే తన కాంక్ష ఫలించిందని సంతోషించాడు.
జవాబు.
కోరిక, ఆకాంక్ష, కాంక్ష.

VI. భాషను గురించి తెలుసుకుందాం.

1. కింది పదాలను విడదీయండి. సంధులను గుర్తించండి.
(అ) మొదలయ్యింది = మొదలు + అయింది (ఉత్వసంధి)
(ఆ) మేల్కొల్పాడంటే = మేల్కొల్పాడు + అంటే (ఉత్వసంధి)
(ఇ) ఉంటుందని = ఉంటుంది + అని (ఇత్వసంధి)
(ఈ) నాకిప్పటికీ = నాకున్ + ఇప్పటికీ (ఉత్వసంధి)
(ఉ) నైపుణ్యముందో = నైపుణ్యము + ఉందో (ఉత్వసంధి)

2. కింది వాక్యాలు చదవండి. గీతగీసిన ప్రత్యయాలు ఏ విభక్తికి చెందినవో గుర్తించండి. రాయండి.
ఉదా : (అ) ఆదిత్య మంచి బాలుడు. (ప్రథమావిభక్తి)
(ఆ) సూర్యనారాయణశాస్త్రిగారితో నడిచాను. (తృతీయావిభక్తి)
(ఇ) ఆయనను ఒప్పించలేకపోయాను. (ద్వితీయావిభక్తి)
(ఈ) ఆహారం కొరకు పక్షులు బయలుదేరుతాయి. (చతుర్థీవిభక్తి)
(ఉ) గురువుల యొక్క ప్రభావం కలాంపై బాగా ఉన్నది. (షష్ఠీవిభక్తి)
(ఊ) చెరువులయందు ఉన్న తామరలు సౌందర్యాన్నిస్తాయి. (సప్తమీవిభక్తి)
(ఋ) బాలలారా! కలలు కనండి.

ప్రాజెక్టు పని:

1. మీకు నచ్చిన శాస్త్రవేత్తను గురించి వారెట్లా ప్రేరణ పొందారో, ఏ కొత్త విషయాలు కనుక్కొన్నారో వివరాలు సేకరించి వ్యాసం రాయండి.
జవాబు.
నాకు నచ్చిన శాస్త్రవేత్త, కనుక్కొన్న విషయాలు : వ్యాసం ఢిల్లీలో జంతర్మంతర్ గురించి తెలియని వాళ్ళుండరు. ఇది అద్భుతమైన నిర్మాణం. దీని నిర్మాణం 17వ శతాబ్దిలో జరిగింది. దీని సృష్టికర్త రాజపుత్రరాజు జయసింహుడు. మొగల్ రాజు ఔరంగజేబుకు పరమ మిత్రుడు. జయసింహుడికి శాస్త్రీయ దృక్పథం ఏర్పడడానికి కారణం ఒక మహమ్మదీయ వనిత అని చెబుతారు.

ఆమె ఒక వెన్నెల రాత్రి కోట పై భాగన ఆయనతో విహారం చేస్తూ “చంద్రుడికీ మనకూ ఎంత దూరం? చంద్రుడు, సూర్యుడు, భూమి, నక్షత్రాలు- వీటి మధ్య గల సంబంధం ఎలాంటిది?” అని అడిగిందట. ఏదో ఉబుసుపోకకు అడిగిన ప్రశ్నే అయినా జయసింహుడిలో ఆలోచన రేకెత్తించింది. ఆయనలో నిద్రపోతున్న శాస్త్రజ్ఞుణ్ణి మేలు కొలిపింది.

పర్షియన్ అరబిక్ యూరోపియన్ భాషలలో ఉన్న ఖగోళ గణిత గ్రంథాలన్నీ సమగ్రంగా చదివాడు. యూరప్ న్నుంచి టెలిస్కోప్ తెప్పించాడు. స్వయంగా వాటిని రూపొందించడం మొదలుపెట్టాడు. భూభ్రమణ విధానం, భూమి వాలి ఉన్న స్థితి- వాటి కారణాలుగా దొర్లిన లోపాలు సరిచేసి మహమ్మదీయ, హిందూ పర్వదినాలను కచ్చితంగా నిర్ణయించాడు. ఈ పరిశీలనలన్నీ ‘బిజ్ మహమ్మద్ షాహి’ అనే గ్రంథంగా వెలువరించాడు.

ఖగోళ నిర్మాణాలను నిశితంగా పరిశీలించడానికే ఈయన జంతర్ మంతర్లను ఢిల్లీ, జైపూర్, వారణాసి, ఉజ్జయినీ నగరాల్లో నిర్మించాడు. ఈ జంతర్ మంతర్ల గురించి ఇప్పటికీ శాస్త్రజ్ఞులు చర్చించుకుంటూనే ఉన్నారంటే జయసింహుని శాస్త్రపరిజ్ఞానం లోతేమిటో మనకు అర్థమౌతుంది. ఆయన రూపొందించిన యంత్రాలలో సమ్రాట్ంత్ర, రాయతంత్ర, జయప్రకాశ్ చెప్పుకోదగ్గవి.

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

2. వివిధ శాస్త్రవేత్తల గురించి పత్రికల్లో వచ్చిన అంశాలను సేకరించి నివేదిక రాసి ప్రదర్శించండి.
జవాబు.
అల్జీమర్స్ గుట్టువిప్పే సరికొత్త రక్తపరీక్ష :
బెర్లిన్ (8-4-2018) : లక్షణాలు పైకి కనిపించకముందే అల్జీమర్స్ను కనిపెట్టే కొత్త రక్తపరీక్షను శాస్త్రజ్ఞులు అభివృద్ధి చేశారు. దీంతో అల్జీమర్స్ వ్యాధి ముప్పు ఎక్కువగా ఉండేవారిని గుర్తించే వీలుంది. అంతేకాదు కొత్త ఔషధాల తయారీకీ ఇది బాటలు పరుస్తోంది. అల్జీమర్స్ రోగుల మెదడులో అమిలోయిడ్-బీటా సమ్మేళనాల స్థాయిలు పెరుగుతాయి.

రక్తంలో వీటిని గుర్తించేలా తాజా పరీక్షను అభివృద్ధి చేశారు. దీనికోసం ఇమ్యునో ఇన్ఫ్రారెడ్ సెన్సర్ల సాంకేతికతను ఉపయోగించారు. అంటే భిన్న పౌనఃపున్యాల్లో పరారుణ కిరణాలను ప్రయోగించి రక్తంలో అమిలోయిడ్ బీటా స్థాయిలను గుర్తిస్తారన్నమాట. ఈ పరిజ్ఞానాన్ని 65 మంది రక్తనమూనాలపై విజయవంతంగా పరీక్షించినట్లు పరిశోధకులు తెలిపారు. మెదడు స్కానింగ్ ఫలితాలతో ఇవి చక్కగా సరిపోయాయని వివరించారు. ఇతర మేథో లోపాల నిర్ధారణకూ ఈ పరీక్ష ఉపయోగపడే అవకాశముందని చెప్పారు.

జబ్బుల బాక్టీరియా గుట్టురట్టు:
కొత్త యాంటీబయాటిక్స్ తయారీకి ఊతం! : వాషింగ్టన్, ఏప్రిల్ 9, 2018 : మనిషి శరీరంలో చాలా బాక్టీరియా ఉంటుంది… అవి రకరకాల ప్రొటీన్లను స్రవిస్తూంటాయి. అయితే జబ్బుతో బాధ పడుతున్న ఓ వ్యక్తి శరీరంలో ఆ జబ్బుకు కారకమైన బాక్టీరియా.. ఆ వ్యక్తి కణజాలాలకు అంటిపెట్టుకుని ఉండేలా చేసే ఓ విభిన్నమైన ప్రొటీన్ ను స్రవిస్తుందన్న విషయాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

“ఒక పెద్ద మాల్లో మిగిలిన అన్ని సరుకుల చేరవేతకు వివిధ దార్లున్నప్పటికీ, ఆ మాల్ సొంత అవసరాలకు ఒక ప్రత్యేక దారి ఉన్నట్లుగా శరీరంలోని మిగిలిన అన్ని రకాల పనులకూ వేరువేరు రకాల ప్రొటీన్లను స్రవించే బాక్టీరియా కేవలం జబ్బు కారకమైన బాక్టీరియా కోసం ఓ ప్రొటీన్ ను వెలువరిస్తుంది. అంటే ఈ ప్రొటీన్ ఓ రకంగా ఆ జబ్బు నయంకాకుండా యాంటీబయాటిక్స్లో పోరాటం చేస్తుంది” అని పరిశోధన జరిపిన అమెరికా హార్వర్డ్ మెడిక్ స్కూల్ ప్రొఫెసర్ టామ్ రాపోపోర్ట్ చెప్పారు. కొత్త రకాల యాంటీ బయోటిక్స్ తయారీ పరిశోధనలకు ఇది అత్యంత కీలకం కానుంది.

డీఆర్డీవో శాస్త్రవేత్తకు ప్రతిష్ఠాత్మక పురస్కారం :
హైదరాబాద్ : రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)కు చెందిన శాస్త్రవేత్త బ్రజ్నిష్ సైతరా…. ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్కు చెందిన ప్రతిష్ఠాత్మక యంగ్ ఇంజినీర్ అవార్డును అందుకున్నారు. రూర్కిలో జరిగిన ఐఎన్ఏఈ వార్షిక సమావేశంలో ఈ అవార్డుతోపాటు నగదును ఆయనకు అందజేశారు.

నిలువుగీతల చిహ్నం సృష్టికర్త ఉర్ల్యాండ్ మృతి
న్యూయార్క్ : నిలువుగీతల చిహ్నం (బార్ కోడ్) సృష్టికర్త నార్మన్ జోసెఫ్ ఉర్ల్యాండ్ 9-12-2012న మృతి చెందారు. ఈ మేరకు ఆయన కుమార్తె సుసాన్ ఉర్ల్యాండ్ ప్రకటించారు. 91 ఏళ్ళ ఈయన కొంతకాలంగా అల్జీమర్స్తో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ఈయన డిగ్రీ చదువుతున్న రోజుల్లో తన సహ విద్యార్థి బెర్నాడ్ సిల్వర్తో కలిసి ఈ చిహ్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు.

దీనికి 1940లో మేధోహక్కుల (పేటెంట్) సాధించారు. ప్రస్తుతం ఈ విధానాన్ని అన్ని ప్రముఖ ఉత్పత్తుల్లోనూ వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఒక ఉత్పత్తికి సంబంధించిన కీలక సమాచారాన్ని నిలువు గీతల సంకేత రూపంలో చెప్పడాన్ని బార్ కోడింగ్ అంటారు. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో ఉర్ల్యాండ్, సిల్వర్ కేవలం 15000 డాలర్లు మాత్రమే సంపాదించారు.

విశేషాంశాలు

ఏరోనాటికల్ ఇంజనీరింగ్ : విమానాల తయారీకి సంబంధించిన ఇంజనీరింగ్ విభాగం.
హెచ్.ఏ.యల్. : హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (భారతీయ విమానయాన నిర్మాణ సంబంధిత సంస్థ)

సైన్సువాయుపదార్థాలునిర్మాణం
విజ్ఞానశాస్త్రంగతిశీలత
ఫిజిక్స్ఏరోప్లేన్
ఇంజనీరింగ్యుద్ధవిమానం
సాంకేతిక విద్యఏరోడైనమిక్ డిజైన్అణుధార్మికనశ్వరత
విమానయంత్రాలుచోదనంఅర్థజీవకాలం
ఏరోనాటికల్ ఇంజనీర్


సమానార్ధక పదాలు

1.  గత రెండేళ్ళుగా వరదలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే పొరపాట్లు జరుగుతుంటాయి.
జవాబు.
సంభవించు, జరుగు

2. ఉదయం పూట కొంతసేపు బయట గాలిలో విహరించడం ఆరోగ్యానికి మంచిది. పిల్లలు చదువుకోకుండా అస్తమానం తిరగడం మంచిది కాదు.
జవాబు.
విహరించడం, తిరగడం

3. ఎవరేం చెప్పినా వినాలి కానీ వెంటనే విశ్వసించకూడదు. నేనింత చెప్పినా నువ్వు నా మాటలు నమ్మడం లేదెందుకని?
జవాబు.
విశ్వసించు, నమ్ము

TS 7th Class Telugu 6th Lesson Important Questions ప్రేరణ

ప్రశ్న 1.
అబ్దుల్ కలాం దారితప్పినప్పుడు ఆయన తండ్రి మాటలు అతణ్ణి దారిలో పెట్టేవికదా! ఆ మాటలు ఏవి?
(లేదా)
తండ్రి మాటలు అబ్దుల్కలాం జీవితంలో ఎలాంటి మార్పు తెచ్చాయి?
జవాబు.
మనం ఏ పనిచేసినా కొన్నిసార్లు ఆనందాలు కలుగుతాయి. కొన్నిసార్లు ఆటంకాలు కలుగుతాయి. వైఫల్యాలు కూడా ఒక్కోసారి తప్పవు. అలాగే అబ్దుల్కలాంకు గూడా అన్ని అనుభవాలూ ఎదురైనాయి. ఆశాభంగం కలిగినప్పుడు, దారితప్పినప్పుడు తన తండ్రిచెప్పిన మంచిమాటలు గుర్తుకొచ్చేవి. అవేమంటే “ఇతరుల్ని తెలుసుకున్నవాడు విజ్ఞాని. తనను తాను తెలుసుకున్నవాడు వివేకి. వివేకం లేకపోతే విజ్ఞానం ప్రయోజన శూన్యం”. అంటే ఆత్మవిమర్శ చేసుకోగలిగినప్పుడే అనుకున్న పని చక్కగా పూర్తిచెయ్యగలం. అలా ఆత్మవిమర్శ చేసుకుని కలాం తన లక్ష్యాన్ని చేరుకోగలిగాడు.

ప్రశ్న 2.
కలాం బాల్యంలో వేటిని పరిశీలించేవాడు? వాటి ద్వారా ఏ స్ఫూర్తిని పొందాడు?
(లేదా)
కలాం ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కావడానికి బాల్యంలో ఏది స్ఫూర్తినిచ్చింది?
జవాబు.
కలాం ఎం.ఐ.టి.లో చదివేటప్పుడు అక్కడ ప్రదర్శనకోసం పెట్టిన రెండు పాత విమానాలు ఆయన్ని బాగా ఆకర్షించాయి. విద్యార్థులంతా హాస్టలుకు వెళ్ళిపోయాక చాలాసేపు అక్కడే కూర్చుని పరిశీలిస్తూ ఉండేవాడు. అలా చూస్తూ చూస్తూ ఆయనకు పక్షిలాగా ఆకాశంలో ఎగరాలన్న కోరిక దృఢపడింది. ఆ స్ఫూర్తితోనే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ను ఎంచుకున్నాడు. తన లక్ష్యాన్ని పట్టుదలతో సాధించుకున్నాడు.

ప్రశ్న 3.
మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశానికి కలాంకు ఆర్థిక సహాయం చేసిందెవరు?
జవాబు.
కలాంకు ఇంజనీరింగ్ చదవటానికి మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశానికి అర్హత లభించింది. ఖర్చు దాదాపు వెయ్యి రూపాయల దాకా ఉంటుంది. కాని తండ్రి దగ్గర అంత సొమ్ములేదు. అవకాశం వదులు కోవడం కలాంకు ఇష్టంలేదు. ఆ సమయంలో ఆయన సోదరి జొహారా ఆయనకు సహాయం చేసింది. తనకున్న బంగారు గాజులు, గొలుసు కుదువబెట్టి డబ్బు అందించింది. అలా కలాం ఎం.ఐ.టి.లో చేరాడు. బాగా చదివి స్కాలర్షిప్ సంపాదించుకొని చదువు కొనసాగించాడు.

ప్రశ్న 4.
వీడ్కోలు సమావేశంలో ఏం జరిగింది?
(లేదా)
ప్రొఫెసర్ స్పాండర్ కలాంని అభినందించిన సన్నివేశం రాయండి.
జవాబు.
వీడ్కోలు సమావేశంలో భాగంగా అందరూ గ్రూప్ ఫోటో కోసం నిలబడ్డారు. ప్రొఫెసర్లు ముందు కూర్చున్నారు. గ్రాడ్యుయేట్ విద్యార్థులంతా మూడు వరుసల్లో వెనుక నుంచున్నారు. హఠాత్తుగా ప్రొ. స్పాండర్ లేచి నుంచొని కలాంను పిలిచి పక్కన కూర్చోబెట్టుకున్నారు. “నువ్వు నా బెస్ట్ స్టూడెంట్వి. నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకు భవిష్యత్తులో మంచి పేరు తెస్తుంది” అని మెచ్చుకున్నారు. ఆ గుర్తింపునకు కలాం పొంగిపోయారు.

ప్రశ్న 5.
ప్రొఫెసర్ శ్రీనివాసన్ అప్పగించిన పనిని కలాం ఎలా పూర్తి చేశాడు?
(లేదా)
ప్రొఫెసర్ శ్రీనివాసన్ కలాంలో పట్టుదలకు ఎలా కారణమయ్యాడు?
జవాబు.
ఎం.ఐ.టిలో కోర్సు పూర్తికాగానే నలుగురు సహచరులతో కలిసి ఒక చిన్న తరహా యుద్ధ విమానాన్ని డిజైన్ చేసే బాధ్యత తీసుకున్నాడు కలాం. అందులో ఏరోడైనమిక్ డిజైన్ చేయడం కలాం వంతు. చోదనం, నిర్మాణం అదుపు, ఉపకరణ సామగ్రి-వీటి తయారీ స్నేహితుల బాధ్యత. ప్రొ. శ్రీనివాసన్ వారికి డిజైనింగ్ ఉపాధ్యాయుడు. పని నెమ్మదిగా సాగుతున్నదని ప్రొ. శ్రీనివాసన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కలాం నెలరోజులు సమయం కోరారు. శుక్రవారం నుంచి సోమవారం వరకు మూడురోజులు గడువిచ్చి ఆలోగా పూర్తిచేయకపోతే స్కాలర్షిప్ ఆపేస్తానన్నారు. కలాం పట్టుదలతో నిద్రాహారాలు మాని అనుకున్న సమయానికి పని పూర్తిచేశాడు. ప్రొఫెసర్ మనసారా అభినందించారు.

పర్యాయ పదాలు:

  • మాత = తల్లి, జనని, అమ్మ
  • ఆశ = కోరిక, వాంఛ, ఇచ్ఛ
  • అకాశము = గగనము, నింగి, దివి
  • పురము = పట్టణము, నగరము, పురి
  • జీవితము = బ్రతుకు, జీవనము, మనుగడ
  • ఉపాధ్యాయుడు = గురువు, ఒజ్జ, అధ్యాపకుడు

నానార్థాలు:

  • ఆశ = కోరిక, దిక్కు
  • భగవంతుడు = దేవుడు, వష్టు, శవుడు
  • మీతుడు = స్నేహితుడు, సూర్యుడు
  • శౌఖ = చెట్టుకొమ్మ, చేయి, వేదభాగము
  • హృదయము = మనస్సు, [పేమ, అభిప్రాయము
  • కాలము = సమయము, నలుపు, చావు

వ్యుత్పత్త్యర్థాలు:

ఉపాధ్యాయడుసమీపమును పొంది ఈతని వలన అధ్యయనము చేయుదురుగురువు
గురువుఅజ్ఞానాంధకారమును ఛేదించుహాడుఉపాధ్యాయుడు
పక్షిపక్షములు (ఱెక్కలు) గలదిపిట్ట
మానవుడుమనువు సంబంధమైనవాడునరుడు
మిత్రుడు(1) సర్వభూతములయందుసూర్యుడు
(2) స్నేహయుక్తుడుస్నేహితుడు


ప్రకృతి – వికృతులు:

  • స్థిరము – తిరము
  • పంక్తి – పది, బంతి
  • విద్య – విద్దె, విద్దియ
  • బుద్ది – బుద్ది
  • శిఘ్యడు – సిసువుడు
  • గురువు – గులబవ, గుర్వు
  • కాలము – కారు
  • బంధము – బందము
  • ఆశ – ఆస
  • గాఢము – గాటము
  • అకాశము – ఆకసము
  • పక్షి – పక్కి
  • (ప్రయాణము – పయనము
  • సముద్రము – సంద్రము
  • విశ్వాసము – విసువాసము

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

సంధులు:

1. ఉత్వసంధి : సూత్రం : ఉత్తునకు అచ్చుపరమైనపుడు సంధి అవుతుంది.

  • మొదలయ్యింది = మొదలు + అయ్యింది
  • మొదలైంది = మొదలు + ఐంది
  • నువ్వింత = నువ్వు + ఇంత
  • ఆత్మీయమైన = ఆత్మీయము+ ఐన
  • రైలెక్కాడు = రైలు + ఎక్కాడు
  • పదిహేనేళ్ళు = పదిహేను + ఏళ్ళు
  • అమితమైన = అమితము + దన

2. ఉత్వసంధి : సూత్రం : ప్రథమేతర విభక్తి శత్రర్థ చు వర్ణాల్లే ఉన్న ఉకారానికి సంధి వైకల్పికముగా వస్తుంది.

  • నాకప్పుడే = నాకున్ + అప్పుడే
  • నాకేమి = నాకున్ + ఏమి
  • నేనేమి = నినున్ + ఏమి

3. ఇత్వసంధి : సూత్రం : ఏమి మొదలైన పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.

  • ఏమంత – ఏమి + అంత
  • ఇదంతా – ఇది + అంతా
  • ఒకటేమిటి – ఒకటి + ఏమిటి
  • పూర్తయ్యాక – పూర్తి + అయ్యాక

4. ఇత్వసంధి : సూత్రం : క్రియాపదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.

  • నేర్పిందిదే – నేర్పింది + ఇదే
  • కావాలనుకుంటే – కావాలి + అనుకుంటే
  • ఉందని – ఉంది + అని
  • కావాలంటే – కావాలి + అంటే

5. అత్వసంధి : సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.

  • అయినప్పటికీ = అయిన + అప్పటికీ
  • చిన్నప్పటి = చిన్న + అప్పటి
  • అన్నట్టు = అన్న + అట్టు
  • వెళ్ళినప్బండు = వెళ్ళిన + అప్పుడు

6. సవర్ణదీర్ఘసంధి : సూత్రం : అ,ఇ,ఉ,ఋులకు సవర్ణాలైన అచ్చులు పరమైనపుడు వాని దీర్లాలు ఏకాదేశమవుతాయి.

  • జీవితావకాశాలు = జీవిత + అవకాశాలు
  • అమితాసక్తి = అమిత + ఆసక్తి
  • విద్యార్థులు = విద్యా + అర్థులు
  • పరమాచార్య = పరమ + ఆచార్య

7. గుణసంధి : సూత్రం : అకారానికి ఇ,ఉ,ఋలు పరమైనప్పుడు క్రరమంగా ఏ,ఓ,అర్లు ఏకాదేశవుతాయి.

  • రామేశ్వరం = రామ + ఈశ్వరం
  • బలోపేం = బల + ఉపేతం
  • ప్రోత్సాహము = ప్ర + ఉత్సాహము
  • స్వేచ్ఛ) = స్ప + ఇచ్ఛ

8. గసడదవాదేశ సంధి సూత్రం:

(1) ద్వంద్వ సమాసంలో పదం మీది పరుషాలకు గసడదవలు వస్తాయి.
తల్లీతండ్రులు – తల్లి + తండ్రి

(2) ప్రథమమీది పరుషాలకు గసడదవలు బహుళంగా వస్తాయి.
అదిగాని – అది + కాని
అక్కడే గడపు – అక్కడే + కడపు
పసిగట్టు – పసి + కట్టు

సమాసాలు:

“సమాసములు,
1. షష్ఠీతత్పురుష సమాసం

జీవిత లక్ష్యం – జీవితం యొక్క లక్ష్యం
పనితీరు – పని యొక్క తీరు
కుటుంబ నేపథ్యం – కుటుంబం యొక్క నేపథ్యం
విద్యాభ్యాసం – విద్య యొక్క అభ్యాసం
మాతృభూమి – మాత యొక్క భూమి

2. సప్తమీతత్పురుష సమాసం
ఆకాశ రహస్యాలు – ఆకాశమందలి రహస్యాలు
త్యాగనిరతి – త్యాగమందు నిరతి

3. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
నిశిత బోధన – నిశితమైన బోధన
సాంకేతిక విద్య – సాంకేతికమైన విద్య
సూక్ష్మబుద్ధి – సూక్ష్మమైన బుద్ధి
అమితాసక్తి – అమితమైన ఆసక్తి
మహామేధావి – గొప్పవాడైన మేధావి

4. ద్విగు సమాసం
పదిహేనేళ్ళు – పదిహేను సంఖ్యగల ఏళ్ళు
మూడు అంశాలు – మూడైన అంశాలు

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

5. తృతీయా తత్పురుష సమాసం
కష్టార్జితం – కష్టము చేత ఆర్జితం
ఉద్వేగ భరితుడు – ఉద్వేగముతో భరితుడు

6. ద్వితీయా తత్పురుష సమాసం
విద్యార్థులు – విద్యను అర్థించువారు

7. ద్వంద్వ సమాసం

గురుశిష్యులు – గురువును, శిష్యుడును
తల్లీతండ్రులు – తల్లియు, తండ్రియు

8. నఞ తత్పురుష సమాసం
అనివార్యం – నివార్యం కానిది
అస్థిరం – స్థిరం కానిది / స్థిరం లేనిది
అసాధ్యం – సాధ్యం కానిది
అమితం – మితం లేనిది

9. సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
భారతదేశం – భారతము అను పేరుగల దేశం

10. బహువ్రీహి సమాసం
మందబుద్ధి – మందమైన బుద్ధి కలవాడు

11. ప్రథమా తత్పురుష సమాసం
మధ్యాహ్నము – అహ్నము యొక్క మధ్యభాగము

I. పదజాలం, వ్యాకరణాంశాలు:

అన్ని ప్రశ్నలకు సమాధానమివ్వండి.

1. జిజ్ఞాసి కొత్త విషయాలను తెలుసుకుంటాడు. గీతగీసిన పదానికి అర్థం
(అ) పరిగెత్తేవాడు
(ఆ) తెలుసుకోవాలనే కోరిక కలవాడు
(ఇ) సామాన్యుడు
జవాబు.
(ఆ) తెలుసుకోవాలనే కోరిక కలవాడు

2. ఆకాంక్ష అనే మాటకు పర్యాయపదాలు
జవాబు.
కోరిక అభిమతం, ఇచ్ఛ

3. కష్టార్జితంతో బ్రతికేవాడు గొప్పవాడు. గీతగీసిన మాటకు అర్థం రాసి ఆ పదంతో సొంతవాక్యం రాయండి.
జవాబు.
కష్టార్జితం = కష్టం చేత సంపాదించబడింది. వ్యాపారంలో నష్టం రావడంతో రవి కష్టార్జితమంతా కోల్పోయాడు.

4. అభ్యర్థులు ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేస్తారు. గీతగీసిన మాటకు అర్థం
జవాబు.
(అ) మాట ఇవ్వడం
(ఆ) చెప్పినట్లు వినడం
(ఇ) డబ్బు ఇవ్వటం
జవాబు.
(అ) మాట ఇవ్వడం

5. అది ఏమంత పెద్దది కాదు. గీతగీసిన పదం ఏ సంధి?
(అ) ఉత్వసంధి
(ఆ) గుణసంధి
(ఇ) ఇత్వసంధి
జవాబు.
(ఇత్వసంధి)

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

6. జవాబు తెలిసిన ఏకైక విద్యార్థి అతడే. గీతగీసిన మాటను విడదీయండి.
(అ) ఏ + కైక
(ఆ) ఏక + ఏక
(ఇ) ఏక + ఐక
జవాబు.
(ఆ) ఏక + ఏక

7. అతని పనితీరు బాగుంది. గీతగీసినది ఏ సమాసం?
(అ) తృతీయాతత్పురుష
(ఆ) ద్వంద్వ సమాసం
(ఇ) షష్ఠీ తత్పురుష సమాసం
జవాబు.
(ఇ) షష్ఠీ తత్పురుష సమాసం

8. ద్రోణుడు, అర్జునుడు గురుశిష్యులు, గీతగీసినది ఏ సమాసం ?
(అ) ద్వంద్వ సమాసం
(ఆ) ద్వితీయాతత్పురుష
(ఇ) బహువ్రీహి
జవాబు.
(అ) ద్వంద్వ సమాసం

9. సమాసంలోని పూర్వపదం సంఖ్య అయితే అది ఏ సమాసం?
(అ) షష్ఠీ తత్పురుష
(ఆ) ద్విగుసమాసం
(ఇ) నఇత్పురుష
జవాబు.
(ఆ) ద్విగుసమాసం

10. గొప్పవాళ్ళ జీవిత చరిత్రలు ఎంతో మందిని ప్రభావితం చేస్తాయి – ఇందులో గీతగీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
(అ) స్ఫూర్తి కలిగిస్తాయి
(ఆ) నాశనం చేస్తాయి
(ఇ) అనిశ్చితిలోకి నెడతాయి
జవాబు.
(అ) స్ఫూర్తి కలిగిస్తాయి

11. కిందివాటిలో ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలనే తీవ్రమైన కోరిక అనే అర్థం ఇచ్చే పదం ఏది?
(అ) మృగతృష్ణ
(ఆ) విరహవేదన
(ఇ) జ్ఞానతృష్ణ
జవాబు.
(ఇ) జ్ఞానతృష్ణ

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

12. ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. గగనంలో సూర్యుడి జాడలేదు. నింగి నేల కలిసిపోయినట్లు చీకటి ముసురుకొన్నది.
ఇందులో సమానార్థక పదాలు గుర్తించండి.
జవాబు.
ఆకాశం, గగనం, నింగి

13. సముద్రంలో గవ్వలు ఉంటాయి. సంద్రంలో అలలు ఎగిరెగిరి పడుతూంటాయి. – ఇందులో ఉన్న ప్రకృతి వికృతులను గుర్తించండి.
జవాబు.
సముద్రం- ప్రకృతి; సంద్రం – వికృతి

14. “విశ్వాసంతో నువ్వు విధిని కూడా తిరిగి రాయగలవు” అనే వారాయన. – దీనిని పరోక్ష కథనంలోకి మార్చండి.
జవాబు.
విశ్వాసంతో వ్యక్తి తన విధిని కూడా తిరిగి రాయ గలడు అనే వారాయన

15. పుస్తక రచనను పూర్తిచేయడానికి నెలరోజుల వ్యవధి కావాలి – దీనికి వ్యతిరేక వాక్యం రాయండి.
జవాబు.
పుస్తక రచనను పూర్తి చేయడానికి నెలరోజుల వ్యవధి అక్కరలేదు.

16. రాజు భారతాన్ని చదివాడు. – దీనికి కర్మణి వాక్యాన్ని గుర్తించండి.
(అ) రాజు భారతాన్ని చదివించాడు.
(ఆ) రాజుచే భారతం చదవబడింది
(ఇ) భారతాన్ని చదివినవాడు రాజు
జవాబు.
ఆ (రాజుచే భారతం చదవబడింది)

17. ప్రతి మనిషికీ తల్లి తొలి గురువు. గీతగీసిన పదానికి పర్యాయ పదాలు రాయండి.
జవాబు.
మాత, జనని, అమ్మ

18. అకారానికి ఇ, ఉ, ఋలు పరమైనప్పుడు క్రమంగా ఏవి ఆదేశంగా వస్తాయి?
జవాబు.
(అ) ఆ, ఈ, ఏ
(ఆ) అ, ఇ, ఉ
(ఇ) ఏ, ఓ, అర్
జవాబు.
(ఇ) ఏ, ఓ, అర్

19. వివేకం లేని విజ్ఞానం ప్రయోజన శూన్యమని కలాంతో తండ్రి అనేవారు ఈ వాక్యాన్ని ప్రత్యక్ష కథనంలోకి మార్చండి.
జవాబు.
ప్రత్యక్ష కథనం : కలాంతో తండ్రి “వివేకం లేని విజ్ఞానం ప్రయోజన శూన్యం.” అని అనేవారు.

II. పరిచిత గద్యభాగాలు

1. క్రింది పేరాను చదివి ఇచ్చిన ప్రశ్నలకు తగిన జవాబులు రాయండి.

ఒక రోజు మా డైరెక్టర్, మాకు డిజైనింగ్ ఉపాధ్యాయుడు అయిన ప్రొఫెసర్ శ్రీనివాసన్ మా పనిలో ప్రగతిని సమీక్షించి, ఏమీ పురోగతి లేదని, చాలా నిరాశాజనకంగా ఉందని తేల్చేశారు. నేను పనిలో జాప్యానికి ఓ డజను సాకులు చెప్పినా ఆయన్ని ఒప్పించలేకపోయాను. ఆ పనిని పూర్తి చెయ్యడానికి చివరికి ఒక నెలరోజుల వ్యవధి కోరాను. ఆ ప్రొఫెసర్ నా వంక కొంత సేపు చూసి, “చూడు యంగ్మేన్, ఈ రోజు శుక్రవారం మధ్యాహ్నం. నేను నీకు మూడు రోజుల టైమిస్తున్నాను. సోమవారం ఉదయానికి గానీ విమాన నిర్మాణం డ్రాయింగ్ పూర్తికాకపోతే మీ స్కాలర్షిప్ని ఆపెయ్యవలసి ఉంటుంది” అన్నాడు. నాకు నోట మాట రాలేదు. ఆ స్కాలర్షిప్పే నా జీవన భాగ్యరేఖ. అదిగాని లేకపోతే ఇక ఏ దిక్కూలేదు. చెప్పినట్టు ఆ పని పూర్తి చెయడ్యం తప్ప మరో మార్గం కనిపించలేదు.

(అ) ఈ మాటలు ఎవరివి?
జవాబు.
ఈ మాటలు ఎ.పి.జె. అబ్దుల్ కలాంగారివి

(ఆ) ప్రొఫెసర్ శ్రీనివాసన్ ఎవరు?
జవాబు.
ప్రొఫెసర్ శ్రీనివాసన్ కలాం చదువుకునే కళాశాల డైరెక్టరు, డిజైనింగ్ ఉపాధ్యాయుడు

(ఇ) రచయితకు ప్రొఫెసర్ ఎంత సమయం ఇచ్చారు?
జవాబు.
రచయితకు ప్రొఫెసర్ మూడు రోజుల సమయం ఇచ్చారు.

(ఈ) రచయితకు జీవన భాగ్యరేఖ ఏది?
జవాబు.
రచయితకు స్కాలర్షిప్పే అతని జీవనభాగ్యరేఖ

(ఉ) రచయిత ఏ పని కోసం ప్రొఫెసర్ శ్రీనివాసనన్ను నెలరోజుల వ్యవధి కోరాడు?
జవాబు.
రచయిత విమాన నిర్మాణం డ్రాయింగ్ పని పూర్తి చేయడం కోసం ప్రొఫెసర్ శ్రీనివాసన నన్ను నెలరోజుల వ్యవధి కోరాడు.

2. మా అన్నయ్య ముస్తఫా కమల్కి స్టేషన్లోడ్లో ఒక కిరాణా దుకాణముండేది. హైస్కూల్లో చదువుకునేటప్పుడు నేను రామేశ్వరం వెళ్ళినప్పుడల్లా నన్ను సాయం చెయ్యమంటూ పిలిచి, షాపులో కూచోబెట్టి ఇంక గంటలతరబడి అతను అదృశ్యమైపోయేవాడు. నేను అక్కడ ఆ షాపుని కనిపెట్టుకు కూచొని బియ్యం, నూనె, ఉల్లిపాయలు ఒకటేమిటి అన్నీ అమ్ముతూండేవాణ్ణి. వాటిలో తొందరగా చెల్లిపోయేవి సిగరెట్లూ, బీడీలూను. బీదవాళ్ళు తమ కష్టార్జితాన్ని ఎందుకట్లా పొగపీల్చేస్తుంటారని ఆశ్చర్యం కలిగేది నాకు. మా అన్నయ్య ముస్తాఫా నన్ను వదిలిపెట్టగానే మా తమ్ముడు కాశిం మహమ్మద్ నన్ను తన ఫ్యాన్సీ షాపులో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉండేవాడు. అక్కడ నత్తగుల్లలతోను, శంఖాలతోను చేసిన రకరకాల అలంకార సామగ్రి అమ్మేవారు.

(అ) రచయిత అన్నయ్యకు స్టేషన్లోడ్లో ఏమి ఉండేది?
జవాబు.
రచయిత అన్నయ్యకు స్టేషన్లోడ్లో ఒక కిరాణా దుకాణం ఉండేది.

(ఆ) ముస్తఫా కమల్ షాపులో సాయంచేసే రోజుల్లో రచయిత ఏం చేస్తుండేవాడు?
జవాబు.
ముస్తఫా కమల్షాపులో సాయం చేసే రోజుల్లో రచయిత హైస్కూల్లో చదువుకునేవాడు.

(ఇ) దుకాణంలో ఏవి తొందరగా అమ్ముడుపోయేవి?
జవాబు.
దుకాణంలో సిగరెట్లు, బీడీలూ తొందరగా అమ్ముడు పోయేవి.

(ఈ) ఫ్యాన్సీషాపు నడుపుతున్న రచయిత తమ్ముడి పేరేమిటి?
జవాబు.
ఫ్యాన్సీషాపు నడుపుతున్న రచయిత తమ్ముడి పేరు కాశీమహమ్మద్.

(ఉ) ఫ్యాన్సీషాపులో ఏవేవి అమ్మేవారు?
జవాబు.
ఫ్యాన్సీషాపులో నత్తగుల్లలతోనూ, శంఖాలతోనూ చేసిన రకరకాల అలంకార సామగ్రి అమ్మేవారు.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠం ఆత్మకథ ప్రక్రియకు చెందినది. ఒక వ్యక్తి తన జీవిత విశేషాల్ని తానే గ్రంథస్థం చేసుకుంటే అది ఆత్మకథ. ఆత్మకథనే స్వీయచరిత్ర అని కూడా అంటారు. ఇందులో సమకాలీన విశేషాలు ప్రతిబింబిస్తాయి. రచయిత అనుభవాలే కాక ఆ కాలంనాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు తెలుస్తాయి. ఇతరులకు ప్రేరణ కలిగిస్తుంది. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది.

కవి పరిచయం:

కవి : డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలామ్. పూర్తి పేరు అవుల్ ఫకీర్ జైనులాబీన్ అబ్దుల్ కలామ్.
కాలం : ఈయన 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటిలో పుట్టాడు.
రచనలు : “ఒక విజేత ఆత్మకథ” (ఇగ్నీటెడ్ మైండ్స్, ది వింగ్స్ ఆఫ్ ఫైర్ – యాన్ ఆటోబయోగ్రఫీ)
బిరుదులు : పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న
విశేషాంశాలు : సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన పట్టుదల, క్రమశిక్షణ, అధిక జిజ్ఞాసతో ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా తన సేవలను జాతికి అందించారు. దేశ, విదేశాలలోని విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో ఆయనను గౌరవించాయి.
గ్రంథము : ఈ పాఠ్యభాగం డా॥ అబ్దుల్ కలామ్, అరుణ్ తివారీతో కలిసి రాసిన “ఒక విజేత ఆత్మకథ”లోనిది.

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

ప్రవేశిక:

ఆయన అందరిలా అతి సామాన్య కుటుంబంలో జన్మించాడు. బాల్యంలో అనేక ఒడిదుడుకులు, కష్టాలను ఎదుర్కొన్నాడు. మొక్కవోని దీక్షతో ఆత్మవిశ్వాసంతో విద్యాభ్యాసం కొనసాగించాడు. చిన్నప్పుడే స్థిరమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నాడు. ఆ లక్ష్యం చేరాలని కలలు కన్నాడు. నిరంతర కఠోర సాధనతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. భారతదేశ కీర్తిని విశ్వవ్యాప్తంచేసి అందరి మన్ననలు అందుకున్న ఆ మహానుభావుడు చిన్నారులకు ప్రీతిపాత్రుడు. ఆయన జీవితమే నవతరానికి ప్రేరణ. ఆయన విద్యాభ్యాసం, లక్ష్యసాధన ఎట్లా జరిగిందో చూద్దాం.

పాఠ్యభాగ సారాంశం:

డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్కలాం రామనాథపురంలో హైస్కూలులో విద్యాభ్యాసం చేశాడు. అప్పుడే అతనికి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవాలనే కోరిక కలిగింది. అక్కడి ఉపాధ్యాయుడైన ఇయదురై సోలోమోన్ మార్గదర్శకత్వంలో కోరిక, నమ్మకం, ఆశపెట్టుకోవడం అనే అంశాలమీద పట్టు సాధిస్తే ఏ పనైనా చేయగలననే నమ్మకం కలిగింది.

కలాంకు చిన్నప్పటి నుండి ఆకాశంలో రహస్యాలన్నా, పక్షుల ప్రయాణమన్నా ఎంతో ఆసక్తి. కొంగలూ, సముద్రపు గువ్వలూ ఎగురుతున్నట్లే తానూ ఎగరాలని కోరుకొనేవాడు. హైస్కూలు చదువు పూర్తి చేసుకుని ట్రిచి సెంట్ జోసెఫ్ కాలేజీలో చేరి ఇంటర్మీడియెట్ చదివాడు. సెలవుల్లో ఇంటికొచ్చినప్పుడు అన్నదమ్ములకు వ్యాపారం, పనుల్లో సాయంచేసేవాడు.

డిగ్రీ చివరి సంవత్సరం చదివేటప్పుడు మంచి పుస్తకాలన్నీ చదివాడు. భౌతిక శాస్త్రం మీద అతనికి ఆసక్తి ఏర్పడింది. కాని తాను చదవవలసింది ఇంజనీరింగ్ అని అర్థం చేసుకున్నాడు. తన కలలు నిజం చేసుకోవడానికి మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరాడు. చదువుకు కావలసిన డబ్బు అతని సోదరి జొహారా తన నగలమ్మి ఏర్పాటు చేసింది. ఏరోనాటిక్ ఇంజనీరింగ్ చదివాడు.

కాలేజీలో ప్రదర్శనకోసం ఉంచిన పాత విమానాన్ని పరిశీలిస్తూ ఉండేవాడు. కోర్సు పూర్తికాగానే నలుగురు సహచరులతో కలిసి యుద్ధవిమానం మోడల్ తయారుచేసి ప్రొ. శ్రీనివాసన్ ప్రశంసలు పొందాడు. బెస్ట్ స్టూడెంట్ అనిపించుకున్నాడు. తరువాత బెంగుళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ట్రైనీగా చేరాడు. ఇంజన్ ఓవర్ హాలింగ్లో పనిచేశాడు.

వాయుపదార్థాల డైనమిక్స్ క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. వైమానికదళంలోను, రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేసే సాంకేతిక అభివృద్ధి ఉత్పాదక డైరెక్టరేట్ లోనూ కూడా ఉద్యోగాలకు పిలుపు వచ్చింది. అలా తమిళనాడు నుండి ఉత్తరదేశానికి వెళ్ళిపోయాడు.

కఠిన పదాలు – అర్ధలు

  • జిజ్ఞాసి = తెలుసుకోవాలనే కోరిక కలవాడు
  • ఇదమిత్థం = ఇది ఇలా
  • ప్రత్యామ్నాయం = బదులు
  • ఉదారం = ఉన్నతం
  • దృక్పథం = ఆలోచనావిధానం, దృష్టి మార్గం, చూపుమేర
  • మందబుద్ధి = తెలివితక్కువవాడు, అవివేకి
  • సంభవించటం = జరగటం
  • ఆకాంక్ష = కోరిక
  • ప్రగాఢంగా = దృఢంగా, అధికంగా
  • విశ్వసించటం = నమ్మటం
  • ఆసక్తి = కోరిక
  • విహరించటం = తిరగడం
  • కష్టార్జితం = కష్టం చేత సంపాదింపబడినది (కష్టపడి సంపాదించినది)
  • త్యాగనిరతి = దానం చేయడంలో మిక్కిలి ఆసక్తి
  • మక్కువ = ఇష్టం
  • సూక్ష్మబుద్ధి = చుఱుకైన తెలివి, కుశాగ్రబుద్ధి
  • తృష్ణ = కోరిక
  • సమగ్రవంతం = సంపూర్ణం
  • బలోపేతం = దృఢం (బలంతో కూడుకున్నది)
  • ప్రగతి = అభివృద్ధి
  • వ్యవధి = గడువు
  • జాపన్యం = ఆలస్యం
  • విరామం = విశ్రాంతి
  • మసలటం = కదలడం, విహరించడం
  • నిర్ఘాంతపోవటం = అచేతనమై పోవడం
  • ఉపాధి = ఉద్యోగం, కారణం

నేనివి చేయగలనా ?

  • కలాం విద్యాభ్యాసం గురించి మాట్లాడగలను. అవును/ కాదు
  • అపరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన వాక్యాల్లో తప్పొప్పులను గుర్తించగలను. అవును/ కాదు
  • కలాం ఆశయసాధన గూర్చి సొంతమాటలలో రాయగలను. అవును/ కాదు
  • నాలోని కోరికలను చిన్న కవిత రూపంలో రాయగలను. అవును/ కాదు

TS 7th Class Telugu 12th Lesson Questions and Answers Telangana రాణి శంకరమ్మ

Telangana SCERT 7th Class Telugu Guide Telangana 12th Lesson రాణి శంకరమ్మ Textbook Questions and Answers.

రాణి శంకరమ్మ TS 7th Class Telugu 12th Lesson Questions and Answers Telangana

బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి.

TS 7th Class Telugu 12th Lesson Questions and Answers Telangana రాణి శంకరమ్మ 1

ప్రశ్నలు

ప్రశ్న 1.
బొమ్మలో కనిపిస్తున్నదెవరు?
జవాబు.
బొమ్మలో ఒక వీర వనిత, సైనికులు యుద్ధం చేస్తూ కనబడుతున్నారు.

ప్రశ్న 2.
ఆమె ఏం చేస్తున్నది? ఎవరితో పోరాడుతున్నది? ఎందుకు పోరాడి ఉండవచ్చు?
జవాబు.
ఆమె తన కోటపై దాడికి వచ్చిన శత్రువులతో యుద్ధం చేస్తూ ఉండవచ్చు. తన కోటను ఆక్రమించాలనుకొన్న వారికి తన వీరత్వం, పోరాటం రుచి చూపి ఉండవచ్చు.

TS 7th Class Telugu 12th Lesson Questions and Answers Telangana రాణి శంకరమ్మ

ప్రశ్న 3.
యుద్ధంలో శౌర్యాన్ని చూపిన స్త్రీలను ఏమంటారు?
జవాబు.
యుద్ధంలో శౌర్యాన్ని చూపే స్త్రీలను వీరవనిత, వీరనారీమణులు అంటారు.

ప్రశ్న 4.
మీకు తెలిసిన వీరనారీమణుల పేర్లు చెప్పండి.
జవాబు.
రాణి రుద్రమదేవి, రాణిశంకరమ్మ, ఝాన్సీలక్ష్మీబాయి, నేటికాలంలో చాకలి ఐలమ్మ మొదలైనవారు.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.120)

ప్రశ్న 1.
“త్యాగాలకు, వీరత్వానికి మారుపేరు తెలంగాణ” దీన్ని మీరెట్లా సమర్థిస్తారు?
జవాబు.
తెలంగాణా వీరత్వానికి, త్యాగాలకు మారుపేరు. నిజాం ప్రభుత్వానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన పోరాటగడ్డ మన తెలంగాణ. దేశస్వాతంత్య్ర ఉద్యమంలో రావి నారాయణరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, మాడపాటి హనుమంతరావు మొ॥వారు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రసాధనలో ప్రాణత్యాగం చేసినవారు ఎంతో మంది. అందుకే తెలంగాణా త్యాగానికి, వీరత్వానికి పేరు.

ప్రశ్న 2.
ఏఏ గుణాలు కల్గి ఉంటే “సుగుణాల పట్టి” అంటారు?
జవాబు.
మంచి గుణాలు కలిగి ఉండడాన్ని సుగుణాలరాశి అంటాం. చిన్న పిల్లలను గారాబంగా పట్టి అంటారు. సుగుణాల పట్టి అంటే అనేక మంచి గుణాలతో నిండి ఉండడం. వినయం, విధేయత, సంస్కారం, చదువు, అణుకువ, నిజాయితీ, అందం మొదలైన గుణాలతో ఉన్న పిల్లలను సుగుణాల పట్టి అంటారు.

ప్రశ్న 3.
శంకరమ్మ పులితో కలబడి చంపింది కదా! మీరు కూడా ధైర్యం చూపిన సంఘటనలు చెప్పండి.
జవాబు.
నా స్నేహితుడు, నేను ఆడుకుంటున్నాము. ఇంతలో నా స్నేహితునికి కరెంటు వైరు తగిలి, షాకుకు గురయ్యాడు. వెంటనే నాకు ఒక ఆలోచన కలిగింది. చెక్కతో అతనిని కరెంటు వైరునుండి వేరుచేశాను. అతన్ని ప్రమాదం నుండి రక్షించాను. నాకు తృప్తి, ఆనందం కలిగాయి.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.122)

ప్రశ్న 1.
శంకరమ్మ యుద్ధరంగంలో ధైర్యం చూపింది. మరి స్త్రీలు ఏయే సందర్భాలలో ధైర్యం చూపాలో చర్చించండి.
జవాబు.
ఈ రోజుల్లో స్త్రీలు అన్ని రంగాల్లో ప్రవేశించారు. తన రక్షణకై తాను అన్ని సందర్భాలలో ధైర్యంగా ఉండాలి. బ్యాంకు కార్యాలయం, మార్కెట్ వంటి ప్రదేశాలలో దుర్మార్గుల బారి నుండి ఆపద వచ్చినపుడు ధైర్యంతో ఎదుర్కోవాలి. గృహహింస ఎదురైనప్పుడు, ఒంటరిగా ప్రయాణాలు చేసేటప్పుడు, ఎవరైనా దౌర్జన్యానికి దిగినప్పుడు, తమ స్వేచ్ఛకు భంగం కలిగినప్పుడు స్త్రీలు ధైర్యం చూపాలి.

ప్రశ్న 2.
శంకరమ్మ చేసిన మంచి పనికి ఉంగరం ఇస్తే తీసుకోలేదు కదా! దీనిని బట్టి మీరేం గ్రహించారు?
జవాబు.
నారసింహారెడ్డి శంకరమ్మ చేసిన మంచిపనికి ఆమెకు ఉంగరం ఇస్తే తీసుకోలేదు. నేను కూడా దీనినిబట్టి మనం ఇతరుల నుండి ప్రతిఫలం ఆశించకుండా ఉపకారం చేయాలని గ్రహించాను. మనము మంచి చేస్తే మనకూ మంచి జరుగుతుందని తలుస్తాను.

ప్రశ్న 3.
కండ్లలో సముద్రం నింపుకోవడం’ అన్న జాతీయాన్ని ఏయే సందర్భాల్లో వాడుతారు?
జవాబు.
విపరీతమైన బాధ లేక దుఃఖం కలిగినపుడు కండ్లలో సముద్రం నింపుకోవడం అన్న జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఎక్కువ దుఃఖం కలిగినపుడు ఏడుపు వస్తుంది. కన్నీరు ధారగా కారుతునే ఉంటుందని అని చెప్పే సందర్భంలో పై జాతీయాన్ని వాడతారు.

TS 7th Class Telugu 12th Lesson Questions and Answers Telangana రాణి శంకరమ్మ

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.123)

ప్రశ్న 1.
“చీకట్లో చిరుదీపం” అనడంలో ఆంతర్యమేమిటి?
జవాబు.
చీకటిలో చిరుదీపం అంటే చిమ్మచీకటిలో కాంతిరేఖవలే ఏదో ఒక ఆధారం దొరకడం అని అర్థం. బాగా కష్టాల్లో లేక ఆపదలలో చిక్కినపుడు ఎవరో ఒకరు ఆసరాగా దొరికితే ఎంతో ఊరట చెందుతాము అనేది ఆంతర్యం.

ప్రశ్న 2.
ఈ ప్రజలను కన్న బిడ్డలుగా పాలించడం అంటే మీకేమర్దమైంది?
జవాబు.
ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలను చాలా గారాబంగా, ప్రేమగా పెంచుకుంటారు. వారికి ఎలాంటి కష్టం, బాధ, విచారం కలుగనివ్వరు. అలాగే రాజు ప్రజలను తన కన్నబిడ్డలుగా చూసుకున్నాడని, ప్రజలు సుఖంగా జీవించారని అర్థమైంది.

ప్రశ్న 3.
రాణి శంకరమ్మ కథ ద్వారా మీకేమర్దమైంది?
జవాబు.
రాణి శంకరమ్మ ధైర్యం గల ఆడది. పరోపకారం కలది. ప్రజలను కన్నబిడ్డలవలే పాలించింది. భర్తకు రాజధర్మం నేర్పింది. కత్తిపట్టి యుద్ధరంగంలోకి దిగి శత్రువులను చీల్చి చెండాడింది. రాణి శంకరమ్మ వలే జీవితంలో కష్టాలెదురైతే పోరాడాలి, గెలవాలి కాని పారిపోరాదని అర్థమైంది.

ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. రాణి శంకరమ్మ కథలో మీకు నచ్చిన / ఆశ్చర్యం కలిగించిన సంఘటన ఏది? దాని గురించి మాట్లాడండి.
జవాబు.
రాణి శంకరమ్మ కథలో శంకరమ్మ గౌడిచర్ల ప్రాంతంలో చిరుతపులితో తలపడింది. గాండ్రిస్తూ పులి పంజా విసిరినా భయపడలేదు. కట్టెతో పులిని కొడ్తూ ధైర్యంగా ఎదుర్కొంది. కాళ్ళతో తొక్కింది. దానిని చంపివేసింది. ఇదీ ఆశ్చర్యం కలిగించిన సంఘటన. వీరవనిత పరాక్రమం. వేసవిలో గుర్రంమీద తిరుగుతూ ఉన్నప్పుడు ఎదురుపడ్డ నారసింహారెడ్డికి అంబలినీరు, సంకటి ఇచ్చి ఆకలి తీర్చింది.

అతడిచ్చిన ఉంగరాన్ని కూడా తీసుకోలేదు. ఇది నాకు నచ్చింది. ఇది ఆమె నిజాయితీకి నిదర్శనం. రాణి అయినా ప్రజలను కన్నబిడ్డల్లా సాకింది. శత్రువులు తనపై మత్తుమందు చల్లినా అడవిలో కోయవాడి ద్వారా నైజాం రాజు వద్దకు వెళ్ళి కుట్ర ఛేదించి మరలా అందోలుకు రాణి అయింది. రాణిశంకరమ్మ తన వీరత్వంతో, ఎన్ని ఇబ్బందులెదురైనా ఎదురొడ్డి పోరాటం చేయడం నాకు నచ్చిన అంశం.

II. ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

1. పాఠం చదవండి. రాణి శంకరమ్మ పరాక్రమాన్ని తెలిపే పదాలను గుర్తించండి.

ఉదా : బండరాళ్ళను పిండిగా జేయడం.
జవాబు.
కర్రతిప్పడం, నాగల్ని పట్టడం, బండి తోలడం, కుత్తుకలు తెగగోయడం, రక్తం పారించడం.

2. కింది గద్యాన్ని చదవండి. కింద ఇచ్చిన ప్రశ్నలకు సరైన జవాబును ఎన్నుకొని కుండలీకరణంలో రాయండి.

స్త్రీని మాతృదేవతగా భావించి, పూజించి, ఆరాధించేవారు భారతీయులు. “యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః” అన్నది ఆర్యోక్తి. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ఒక తరం నుండి మరోతరానికి వారసత్వంగా అందిస్తూ ఉంటారు మహిళలు. సభ్యత, సంస్కారాల రూపంలో జాతి జీవన శక్తిని మరింత వేళ్ళూనుకునేటట్లు చేసింది భారతీయ మహిళే. ఇటు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ, అటు సమాజ ఉన్నతికై పరిశ్రమిస్తూ తమవంతు పాత్రను పరిపూర్ణం చేసుకుంటూ, అవసరమైనప్పుడు సంస్కృతి రక్షణకై పూనుకుంటారు. అవసరమైతే మహిళలు మాతృభూమి రక్షణకోసం ప్రాణత్యాగాలు చేస్తుంటారు.

1) స్త్రీలను – భారతీయులు ఎట్లా పూజిస్తారు?
క) మాతృదేవతగా
గ) పితృదేవతగా
చ) అతిథి దేవతగా
జవాబు.
క) మాతృదేవతగా

2) మహిళలు ఒక తరం నుండి మరో తరానికి దేనిని అందిస్తూ ఉంటారు?
క) భారతీయ ఆర్థిక వ్యవస్థను
గ) భారతీయ సంస్కృతిని
చ) భారతీయ వ్యవహారాలను
జవాబు.
గ) భారతీయ సంస్కృతిని

3) జాతి జీవనశక్తి దేనివలన వేళ్ళూనుకొని ఉంటుంది?
క) సభ్యత, సంస్కారాలు
గ) కుళ్ళు కుతంత్రాలు
చ) ఎత్తుకు పై ఎత్తులు
జవాబు.
క) సభ్యత, సంస్కారాలు

TS 7th Class Telugu 12th Lesson Questions and Answers Telangana రాణి శంకరమ్మ

4) వేటి ఉన్నతికై స్త్రీలు పరిశ్రమిస్తారు?
క) సిరిసంపదలు
గ) కుటుంబం-సమాజం
చ) తమకోసం తాము
జవాబు.
గ) కుటుంబం-సమాజం

5) దేని కోసం ప్రాణత్యాగం చేయవచ్చు?
క) సంపదలకై
గ) ఆచారాలకై
చ) మాతృభూమి రక్షణకై
జవాబు.
చ) మాతృభూమి రక్షణకై

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

అ) శంకరమ్మ ధైర్యంగా పులితో పోరాడిన సంఘటనను వర్ణించండి.
జవాబు.
శంకరమ్మ ఒకసారి గౌడిచర్ల ప్రాంతంలో ఒక చిరుతపులితో కలబడింది. చిరుత పెద్దగా అరుస్తూ తన పంజా విసురుతున్నా భయపడలేదు. కట్టెతో పులిని కొడుతూ ధైర్యంగా ఎదుర్కొన్నది. కాళ్ళతో తొక్కింది. దానిని చంపివేసింది. తాను అలసిపోయినా పోరాటం వీడలేదు. అదే వీరవనిత సాహసం. తెలంగాణా పౌరుషం.

ఆ) మీరు తప్పిపోతే ధైర్యంగా ఏ విధంగా ఇంటికి చేరుకుంటారో రాయండి.
జవాబు.
నేను దారిలో తప్పిపోతే, నా తల్లిదండ్రుల పేర్లు, ఊరిపేరు, జిల్లా పేరు గుర్తుకు తెచ్చుకుంటాను. నా కుటుంబసభ్యుల చరవాణి (సెల్) నెంబర్లు నాకు ఎప్పుడూ గుర్తులో ఉంటాయి. ఆ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్కు వెళ్ళి నా విషయాన్ని వారికి తెలిపి సహాయాన్ని కోరుతాను. పోలీసు స్టేషన్లోని ప్రాంతంలో అయితే ఆ గ్రామంలో ఊరిపెద్ద ఎవరో అడిగి తెలుసుకొని వారి వద్దకు వెళతాను. వారి సాయం తీసుకొని నా యింటికి సమాచారం ఇస్తాను. ఆయా వ్యక్తుల ద్వారా ఇంటికి సుఖంగా చేరుకుంటాను. నాకు సాయం చేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాను.

ఇ) రాణి శంకరమ్మ మంచి పాలనాదక్షురాలు అనడానికి ఉదాహరణలు రాయండి.
జవాబు.
రాణి శంకరమ్మ రాజ్యపాలన బాగా చేసింది. ప్రజలను కన్నబిడ్డలవలే చూచుకొన్నది. శత్రువుల పట్ల కఠినంగా ఉండేది. తనకు సాయం చేసిన వారిని మరచిపోయేదికాదు. నారసింహారెడ్డితో పెండ్లి అయిన తర్వాత సిద్ధిఖీ సోదరులు కుట్రలు, కుతంత్రాలు పన్నారు. ప్రజలను పీడించి పన్నులు లాగారు. భర్తకు ఉలుకూ పలుకూ లేకపోతే, తనను పట్టించుకోని రాజ్యం మరచిపోవడం సరికాదని చెప్పింది. ప్రజల హితం చూడమని రాజ్యం పనులు సరిగా చేయాలని తనభర్తకు రాజధర్మం చెప్పిన ధైర్యవంతురాలు. తాను రాణి అయిన తర్వాత ప్రజలకు పన్నుల భారం తగ్గించింది. దీనిని బట్టి రాణిశంకరమ్మ మంచి పాలనాదక్షురాలు అని చెప్పవచ్చును.

ఈ) రాణి శంకరమ్మ గొప్పతనం గురించి నేటికీ పాటల రూపంలో పాడుకోవటానికి కారణాలు ఏమిటో రాయండి.
జవాబు.
రాణి శంకరమ్మ గురించి నేటికీ పాటలరూపంలో పాడుకోవడానికి కారణాలు :
అ) రాణి శంకరమ్మ ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంది.
ఆ) శంకరమ్మ ఎటువంటి ప్రయోజనమూ ఆశించకుండా ఇతరులకు సాయం చేసింది.
ఇ) శంకరమ్మ వీరవనిత. పిరికితనం తెలియదు.
ఈ) తల్లిదండ్రులంటే గౌరవం.
ఉ) శంకరమ్మ నలుగురికీ ఉపయోగపడేలా గుళ్ళు, పట్టణాలు కట్టించింది.
ఊ) శంకరమ్మ తాను జన్మించిన గడ్డ కీర్తిని అజరామరం చేసింది.

ఇలా ఎవరైతే ప్రజలకోసం జీవిస్తారో వారిని ప్రజలు ప్రేమిస్తారు. వారు మరణించినా పాటల రూపంలో, కథల రూపంలో గుర్తు చేసుకుంటూనే ఉంటారు.

2. కింది ప్రశ్నకు పది వాక్యాలలో జవాబు రాయండి.

రాణి శంకరమ్మ పరాక్రమాన్ని సొంతమాటల్లో రాయండి.
జవాబు.
1. జననం : మెదక్ జిల్లాలోని గౌడిచర్లలో సంగారెడ్డి, రాజమ్మ దంపతుల బిడ్డ శంకరమ్మ. చిన్నప్పటి నుండి ఈమె ఎంతో ధైర్యవంతురాలు.

2. పులిని ఎదిరించిన శంకరమ్మ : గౌడిచర్ల ప్రాంతంలో చిరుతపులి పంజా విసరినా కట్టెతో పోరాడి ఎదిరించి కాళ్ళతో తొక్కి చంపింది.

3. మరాఠీలను మట్టి కరిపించిన శంకరమ్మ : నైజాం రాజు కోరిక మేరకు మరాఠీలపై యుద్ధానికి వెళ్ళింది. కాళికారూపం ఎత్తి, ఎక్కడచూసినా తానే అయి, ఎత్తుకు పై ఎత్తుతో శత్రువుల పీకలు తెగగోసింది. వేలకు వేలు సైనికుల రక్తాన్ని పారించింది. పీష్వాల తోకలు కత్తిరించింది. విజయగర్వంతో నైజాం వద్దకు వెళ్ళింది. నైజాం నవాబు శంకరమ్మకు ‘రాయబాగిన్’ అనే బిరుదు ఇచ్చాడు. అందోలు రాజ్యానికి రాణిగా ప్రకటించాడు.

IV. సృజనాత్మకత / ప్రశంస

రాణి శంకరమ్మ చరిత్రను ఏకపాత్రాభినయం చేయడానికి వీలుగా తగిన అంశాలతో రచన చేయండి. ప్రదర్శించండి.

రగిలించే పౌరుషాగ్ని తెలంగాణా
వీరులకు పుట్టినిల్లు తెలంగాణా

ఇలాంటి తెలంగాణ గడ్డలోని ఒక చిన్న పల్లె గౌడిచర్లలో పుట్టిన నేను నేడు అందోలు రాజ్యానికి రాణినయ్యాను. తెలంగాణ ఆడబిడ్డల పౌరుషానికి నన్ను చెప్పుకుంటారంటారు. నిజమే. చిరుతపులి గాండ్రిస్తూ పంజా విసిరినా నేను భయపడలేదు. ధైర్యంగా ఎదుర్కొన్నా. చిరుతపులిని కట్టెతోకొట్టి, కాళ్ళతో తొక్కి చంపినా. అదీ తెలంగాణా పౌరుషం. నా మంచి గుణాలు, నా అందము చూసి అందోలు రాజు నరసింహారెడ్డి నన్ను పెళ్ళి చేసుకున్నాడు. నేను తప్ప లోకమే లేదన్నట్లు ప్రజల మంచిచెడ్డలు పట్టించుకోవడం మానేశాడు.

TS 7th Class Telugu 12th Lesson Questions and Answers Telangana రాణి శంకరమ్మ

నాకోసం కాదు, ప్రజలకోసం జీవించాలని రాజధర్మాలు చెప్పా. రాజ్యపాలన చేయించా. దురదృష్టం. విషప్రయోగంచేసి నా భర్తను చంపారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న నన్ను మరాఠా రాజుల మీదకు యుద్ధానికి వెళ్లమన్నాడు నైజాం రాజు. నేను భయపడతానా! అది నా రక్తంలోనే లేదు. కాళికలా మరాఠా పీష్వాల తోకలు కత్తిరించా.

రక్తం పారించా. విజయగర్వంతో నైజాం నవాబు దగ్గరకు వెళ్ళా. రాయబగిన్ బిరుదునిచ్చి మెచ్చుకున్నాడు. అందోలు రాజ్యానికి రాణిని చేశాడు. నేనేకాదు, ప్రతితెలంగాణా బిడ్డా పులిలాంటిదే. అన్యాయాన్ని ఎదిరించేదే. నాలా మీరు కూడా ఇతరులకు సాయం చేయండి. పిరికితనం వదలండి. మన తెలంగాణా కోసం మీ వంతు సాయం చేయండి.

జై తెలంగాణా!

V. పదజాల వినియోగం

1. గీతగీసిన పదాలకు అర్థాలు రాసి, వాటితో సొంతవాక్యాలు రాయండి.

అ) నిర్మల్ కొయ్య బొమ్మల తయారీకి ప్రసిద్ధి.
జవాబు.
ప్రసిద్ధి – పేరు పొందుట, ఖ్యాతి
హైదరాబాద్ మత సహనానికి పేరు పొందిన నగరం.

ఆ) బాగా చదువుకొని స్వప్నం నెరవేర్చుకోవాలి.
జవాబు.
స్వప్నం = కల
నా అద్భుతమైన కలలు సాధించడానికి నేనెంతో శ్రమపడతాను.

ఇ) మహాభారత సమరంలో ధర్మం గెలిచింది.
జవాబు.
సమరం = యుద్ధం
యుద్ధాల వలన ధననష్టం, జననష్టం కలుగుతుంది.

ఈ) అపాయకర సంఘటనలు ఎదురైనపుడు శౌర్యం చూపాలి.
జవాబు.
శౌర్యం = పరాక్రమం
భారత సైనికులు కార్గిల్ యుద్ధంలో పరాక్రమాన్ని చూపారు.

ఉ) సూర్యుని దీప్తి లేకపోతే లోకమంతా చీకటిమయం.
జవాబు.
దీప్తి = కాంతి
విజ్ఞానము అనే కాంతి అన్నిచోట్ల వెలగాలి.

2. కింది పదాలను వివరించండి.

అ) సాహితీ జ్యోతులు
జవాబు.
సాహితి అనే కాంతులు అని అర్థం. సాహిత్యం అంటే భాషలోని రచనలు.

ఆ) శౌర్యచంద్రికలు
జవాబు.
పరాక్రమము అనే వెన్నెలలు.

ఇ) అపరంజి బొమ్మ
జవాబు.
చాలా అందమైన బొమ్మ. అందమైన వ్యక్తులను అపరంజి బొమ్మలతో పోలుస్తారు. అపరంజి అంటే బంగారం.

ఈ) అజరామరం
జవాబు.
ముసలితనం, మరణం లేనిది.

VI. భాషను గురించి తెలుసుకుందాం.

1. కింది పదాలను విడదీయండి. సంధిని గుర్తించి సంధిపేరు రాయండి.

అ) రంగనాథాలయం = ____________
జవాబు.
రంగనాథ + ఆలయం – సవర్ణదీర్ఘ సంధి

ఆ) అమృతాన్నం = ____________
జవాబు.
అమృత + అన్నం – సవర్ణదీర్ఘ సంధి

ఇ) అజరామరం = ____________
జవాబు.
అజర + అమరం – సవర్ణదీర్ఘ సంధి

ఈ) కవీంద్రుడు = ____________
జవాబు.
కవి + ఇంద్రుడు – సవర్ణదీర్ఘ సంధి

2. కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి.

అ) చదువుసంధ్యలు : ____________
జవాబు.
చదువును మరియు సంధ్య – ద్వంద్వ సమాసం

ఆ) పామూముంగిసలు : ____________
జవాబు.
పాముయు మరియు ముంగీస – ద్వంద్వ సమాసం

TS 7th Class Telugu 12th Lesson Questions and Answers Telangana రాణి శంకరమ్మ

ఇ) ఎండావానలు : ____________
జవాబు.
ఎండ మరియు వాన – ద్వంద్వ సమాసం

ఈ) కొండాకోనలు : ____________
జవాబు.
కొండ మరియు కోన – ద్వంద్వ సమాసం

ఉ) మంత్రతంత్రాలు : ____________
జవాబు.
మంత్రం మరియు తంత్రం – ద్వంద్వ సమాసం

ఊ) తల్లిదండ్రులు : ____________
జవాబు.
తల్లియును, తండ్రియును – ద్వంద్వ సమాసం

ఋ) రామకృష్ణులు : ____________
జవాబు.
రాముడు మరియు కృష్ణుడు – ద్వంద్వ సమాసం

ౠ) కూరగాయలు : ____________
జవాబు.
కూర మరియు కాయ – ద్వంద్వ సమాసం

ద్విగు సమాసం:

ఈ పదాలను పరిశీలించండి.

  • నవరసాలు
  • చతుర్వేదములు
  • షట్చక్రవర్తులు
  • దశ దిశలు
  • పంచపాండవులు
  • ఎనిమిది బొమ్మలు

ఈ పదాలలో మొదటి (పూర్వ)పదం సంఖ్యా వాచకంగా ఉండి, రెండవపదం (పర) నామవాచకంగా ఉంది. వీటికి విగ్రహవాక్యాలు ఇట్లా ఉంటాయి.

  • నవరసాలు – తొమ్మిది సంఖ్యగల రసాలు
  • చతుర్వేదములు – నాలుగు సంఖ్య గల వేదములు
  • షట్చక్రవర్తులు – ఆరు సంఖ్యగల చక్రవర్తులు
  • పంచపాండవులు – ఐదు సంఖ్యగల పాండవులు
  • దశదిశలు – పది సంఖ్యగల దిక్కులు
  • ఎనిమిది బొమ్మలు – ఎనిమిది సంఖ్యగల బొమ్మలు

మొదటి (పూర్వ) పదం సంఖ్య అయితే తర్వాత (ఫర) పదం ఆ సంఖ్యను సూచించే నామవాచకం అయివుంటుంది.
పూర్వపదం సంఖ్యావాచకమైతే అది ‘ద్విగు సమాసం’.

3. కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి.

ఉదా : శతాబ్దం వందసంఖ్యగల – అబ్దం – ద్విగు సమాసం

అ) ముక్కుచెవులు : ____________
జవాబు.
ముక్కు మరియు చెవులు – ద్వంద్వ సమాసం

ఆ) ఏడేండ్ల : ____________
జవాబు.
ఏడు సంఖ్యగల ఏండ్లు – ద్విగు సమాసం

ఇ) ఆరువేల ఆశ్వికదళం: ____________
జవాబు.
ఆరువేల సంఖ్యగల ఆశ్వికదళం – ద్విగు సమాసం

ఈ) శౌర్యధైర్యాలు : ____________
జవాబు.
శౌర్యము మరియు ధైర్యము – ద్వంద్వ సమాసం

ప్రాజెక్టు పని

మీ ప్రాంతంలో బతుకమ్మ పాటలుగా పాడుకునే వీరగాథలను సేకరించండి. రాయండి. ప్రదర్శించండి.

వస్తాడె ఒక సర్వాయె పాపడు ఉయ్యాలో
తల్లి కొలువుకు వడిగా వెళ్ళేను ఉయ్యాలో
తల్లికి దండముగా నిలిచేను ఉయ్యాలో
కొట్టుదును గోల్కొండ పట్నము ఉయ్యాలో
ఢిల్లీకి మోజూరు నౌదును ఉయ్యాలో
మూడు గడియల బందరు కొట్టుదును ఉయ్యాలో
మూలకోట కందనూరు సూచి ఉయ్యాలో
బంగారు కడియాలు పెట్టుదును ఉయ్యాలో
మనకంతా బంట్రోతు తనమేలు ఉయ్యాలో
అడుగో పాపడు వస్తాన్నంటే ఉయ్యాలో
మన కులకాయి మానవద్దురా సర్వాయిపాప ఉయ్యాలో
కుందేళ్లు కూర్చుండపడెను ఉయ్యాలో
లేడిపిల్లలు లేవ లేవు ఉయ్యాలో
పసిబిడ్డలు పాలుతాగరు ఉయ్యాలో
నక్కలు సింహాలు తొక్కబడును ఉయ్యాలో
పావురం కోటకట్టెను ఉయ్యాలో

TS 7th Class Telugu 12th Lesson Questions and Answers Telangana రాణి శంకరమ్మ

మొగలు రాజులకు ఉయ్యాలో
పక్కలో బల్లెమై ఉయ్యాలో
కునుకులేకుండ చెసె ఉయ్యాలో
రుస్తుందిల్ ఖాన్ ఉయ్యాలో
పాపన్న నెదిరించె ఉయ్యాలో
రుస్తుందిల్ ఖాన్ను ఉయ్యాలో
నుగ్గునుగ్గుచేసె ఉయ్యాలో
ఓరుగల్లు కోటను ఉయ్యాలో
పాపన్న ముట్టడించె ఉయ్యాలో
బందీలు విడిపించె ఉయ్యాలో
గోల్కొండ కోట చేరె ఉయ్యాలో
మొగలు సైన్యాన్ని ఉయ్యాలో
మూడుచెర్ల నీళ్ళు తాగించె…ఉయ్యాలో

విశేషాంశాలు

మెతుకు సీమ : నేటి మెదక్ జిల్లా. ఒకప్పుడు ఇక్కడ (వరి అధికంగా పండించేవారు) మెతుకులు అధికంగా దొరికేవి కాబట్టి మెతుకుసీమ అన్నారు. మంజీరకదేశం, గుల్షనాబాద్ అని కూడ గతంలో పిలిచేవారు.

రాయబాగిన్ : రాయబాగిన్ అంటే రాజసహోదరి అని అర్థం. నిజాం పాలకుడు రాణీశంకరమ్మకు ఇచ్చిన బిరుదు ఇది.

అన్నపూర్ణ : కాశీలోని విశ్వనాథుని ఇల్లాలిపేరు అన్నపూర్ణ. అందరికీ ఆహారం(అన్నం) పెట్టేదే అన్నపూర్ణ.

అందోలు : గతంలో ఒక సంస్థానం. ప్రస్తుతం మెదక్ జిల్లాలో ఉన్నది.

నైజాం రాజులు : తెలంగాణను గతంలో పరిపాలించిన నిజాం వంశీయులైన మహ్మదీయ రాజులు పీష్వాలు : ఒకప్పుడు మహారాష్ట్రను పరిపాలించిన రాజులు

TS 7th Class Telugu 12th Lesson Important Questions రాణి శంకరమ్మ

ప్రశ్న 1.
పాఠం ఆధారంగా స్త్రీలను గూర్చి మీ అభిప్రాయం తెలుపండి.
జవాబు.
స్త్రీలు అబలలుకాదు సబలలే! వారు కూడా తగిన అవకాశాలు లభిస్తే వీరవనితలుగా రాణిస్తారు. చదువులలో, ఆటలలో, రాజకీయాలలో, పాలనలో ఇలా ఏ రంగంలోనైనా రాణిస్తారు. అన్ని అవకాశాలు లభించాలే కాని స్త్రీలు ముందుంటారు అనే అభిప్రాయం ఏర్పడింది.

అర్ధాలు

  • వాణి = వాక్కు
  • బాణి = పద్ధతి
  • దీప్తి = వెలుగు / కాంతి
  • స్వప్నం = కల
  • నారీమణి = వనితలలో మేటి
  • వనిత = స్త్రీ
  • సరళము = తేలిక
  • ఆరితేరు = నైపుణ్యం సంపాదించు
  • కాడికి = దగ్గరకు
  • దప్పు = దాహం
  • దిగ్గున = వెంటనే
  • కుతంత్రం = చెడు ఆలోచన
  • పెనిమిటి = భర్త
  • హితము = మేలు
  • చెంత = దిగులు / బాధ
  • సమరం = యుద్ధము
  • కుత్తుక = పీక
  • శూరత్వ = పరాక్రమం

పర్యాయపదాలు

  • వాణి = వాక్కు, పలుకు, ఉక్తి
  • పులి = శార్దూలం, వ్యాఘ్రం
  • లక్ష్మి= లచ్చి, సంపద, శ్రీ
  • అతి = మిక్కిలి, ఎక్కువ, చాలా
  • తండ్రి = పిత, జనకుడు
  • నీర = పానీయము, జలము
  • దండము = నమస్కారము, వందనము
  • దిగ్గున = వెంటనే, తటాలున
  • హితము = మేలు, మంచి
  • చెంత = దగ్గర, సమీపము
  • సముద్రము = సాగరము, కడలి, సంద్రము
  • పోరు = యుద్ధము, జగడము, తగాదా, కదనము
  • కొండ = అద్రి, గిరి, పర్వతము
  • భర్త = పతి, పెనిమిటి, నాథుడు, మగడు, మొగుడు
  • అడవి = అరణ్యము, వనము
  • పల్లె =గ్రామం, ఊరు, జనపదం

నానార్థాలు

  • దేవత = వేలుపు, దేవభావము, జ్ఞానేంద్రియము
  • దుఃఖము = బాధ, మనోవ్యధ, నొప్పించునది
  • చీకటి = అంధకారము, దుఃఖము, చీకటిగల రాత్రి
  • కాళి = పార్వతి, పాలపురుగు, బొగ్గు, రాత్రి
  • కేసరి = సింహము, గుర్రము, ఆంజనేయుని తండ్రి, శ్రేష్ఠుడు
  • గురువు = ఉపాధ్యాయుడు, తండ్రి, రాజు, బృహస్పతి
  • రాజు = ప్రభువు, ఇంద్రుడు, చంద్రుడు
  • రూపు = ఆకారము, అందము, రీతి
  • లోకము = భూలోకము, జనము, సమూహము
  • సమయము = కాలము, సిద్ధాంతము, ఒప్పుదల

TS 7th Class Telugu 12th Lesson Questions and Answers Telangana రాణి శంకరమ్మ

ప్రకృతి – వికృతులు

ప్రకృతి – వికృతి

  • భాష – బాస
  • విద్య – విద్దె
  • హృదయము – ఎద
  • లక్ష్మి – లచ్చి
  • విద్య – విద్దె
  • రోషము – రోసము
  • సంతోషము – సంతసము
  • రాజు – రాయలు
  • బాధ – బాద
  • భక్తి – బత్తి
  • బంధము – బందము
  • రూపము – రూపు
  • గర్వము – గరువము

సంధులు

  • లయాత్మకత – లయ + ఆత్మకత – సవర్ణదీర్ఘ సంధి
  • చరితార్థం – చరిత + అర్ధం – సవర్ణదీర్ఘ సంధి
  • అమృతాన్నం – అమృత + అన్న- సవర్ణదీర్ఘ సంధి
  • అజరామరం – అజర +అమరం – సవర్ణదీర్ఘ సంధి
  • గరుడాద్రి – గరుడ + అద్రి – సవర్ణదీర్ఘ సంధి
  • రంగనాథాలయం – రంగనాథ + ఆలయం – సవర్ణదీర్ఘ సంధి
  • పోరాడుతున్నది – పోరాడుతు + ఉన్న – ఉత్వ సంధి
  • నాకొద్దు – నాకు + ఒద్దు – ఉత్వ సంధి
  • పరుగెత్తె – పరుగు + ఎత్తు – ఉత్వ సంధి
  • భయమింత – భయము + ఇంత – ఉత్వ సంధి
  • ఇంతైన – ఇంత + ఐన – అత్వ సంధి

సమాసములు

  • శక్తి సామర్థ్యాలు – శక్తి మరియు సామర్థ్యం – ద్వంద్వ సమాసం
  • సంస్కృతీ సంప్రదాయాలు- సంస్కృతి మరియు సంప్రదాయం – ద్వంద్వ సమాసం
  • దారితెన్నులు – దారి మరియు తెన్ను – ద్వంద్వ సమాసం
  • కొండాకోనలు – కొండ మరియు కోన – ద్వంద్వ సమాసం
  • ధైర్యసాహసాలు – ధైర్యం మరియు సాహసం – ద్వంద్వ సమాసం
  • పాడిపంటలు – పాడి మరియు పంట – ద్వంద్వ సమాసం
  • ఆట పాటలు – ఆట మరియు పాట – ద్వంద్వ సమాసం
  • చదువు సందెలు – చదువు మరియు సందె – ద్వంద్వ సమాసం
  • అమ్మలక్కలు – అమ్మలు మరియు అక్కలు – ద్వంద్వ సమాసం

I. కింది వాక్యాలలోని పర్యాయ పదాలు గుర్తించి వేరుగా వ్రాయండి.

అ) శంకరమ్మపై పులి పంజా విసిరింది. ఆ శార్దూలాన్ని ఎదిరించింది. శంకరమ్మ కట్టెతో కొట్టి కాళ్ళతో తొక్కి ఆ వ్యాఘ్రాన్ని చంపింది.
జవాబు.
అ) పులి, శార్దూలం, వ్యాఘ్రం

ఆ) ఇతరుల హితము కోరువారికి మేలు జరుగును.
జవాబు.
ఆ) హితము, మేలు

ఇ) పోరు నష్టము పొందు లాభము. జగడమాడితే ప్రశాంతత ఉండదు.
జవాబు.
ఇ) పోరు, జగడము

ఈ) గౌడిచర్ల అనే పల్లెలో శంకరమ్మ పుట్టింది. ఆ జనపదంలో ఎదిగింది. నేడు ఆ గ్రామానికి ఎంతో పేరు తెచ్చింది.
జవాబు.
ఈ) పల్లె, జనపదం, గ్రామం

II. కింది వాక్యములలోని నానార్ధపదాలను గుర్తించి రాయండి.

అ) గురువులను గౌరవించాలి. రాజు తన ప్రజలను కన్నబిడ్డలవలే పాలించాలి.
జవాబు.
అ) గురువు – రాజు

ఆ) ఈ లోకంలో అనేక జంతురాశులున్నాయి. ఆయా రాశుల సమూహమే ఈ ప్రపంచం.
జవాబు.
ఆ) లోకం – సమూహము

ఇ) దేవతలకు రాజు ఇంద్రుడు. ఆకాశంలో చంద్రుడు వెన్నెలను కురిపిస్తాడు.
జవాబు.
ఇ) రాజు – ఇంద్రుడు, చంద్రుడు

III. కింది వాక్యాల్లోని ప్రకృతి వికృతులను గుర్తించండి.

అ) విద్యలేని వాడు వింత పశువు. విద్దె ఉన్నవాణ్ణి అందరూ గౌరవిస్తారు.
జవాబు.
విద్య (ప్ర) – విద్దె (వి)

ఆ) లక్ష్మి అంటే సంపద. చదువే నిజమైన లచ్చి. లేనివారిని ఎవరూ గౌరవించరు.
జవాబు.
లక్ష్మి (ప్ర) – లచ్చి (వి)

TS 7th Class Telugu 12th Lesson Questions and Answers Telangana రాణి శంకరమ్మ

ఇ) భక్తి లేని శివ పూజలు అనవసరం. బత్తితో చేసే పని ఆనందాన్నిస్తుంది.
జవాబు.
భక్తి (ప్ర) – బత్తి (వి)

ఈ) సంతోషమే సగం బలం. సంతసం లేనివాడు సుఖంగా ఉండడు.
జవాబు.
సంతోషము (ప్ర) – సంతసము (వి)

ఉ) రాజు చేతికత్తి రక్తం వర్షిస్తుంది. రాయలు తన ప్రజలను సుఖంగా పాలించాలి.
జవాబు.
రాజు (ప్ర) – రాయలు (వి)

IV. కింది పదాలను విడదీసి సంధులను గుర్తించండి.

అ) సువర్ణాక్షరములు
జవాబు.
సువర్ణ+అక్షరములు – సవర్ణదీర్ఘసంధి

ఆ) కాళ్ళరగ
జవాబు.
కాళ్ళు + అరగ – ఉత్వసంధి

ఇ) రాజంతట
జవాబు.
రాజు + అంతట – ఉత్వసంధి

ఈ) వాననక
జవాబు.
వాన + అనక – అత్వసంధి

ఉ) ఏడేండ్లు
జవాబు.
ఏడు + ఏండ్లు- ఉత్వసంధి

V. కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసాల పేర్లు గుర్తించండి.

అ) వాలి సుగ్రీవులు
జవాబు.
వాలి మరియు సుగ్రీవుడు – ద్వంద్వ సమాసం

ఆ) పంచపాండవులు
జవాబు.
ఐదు సంఖ్యగల పాండవులు – ద్విగు సమాసం

ఇ) టక్కుటెక్కులు
జవాబు.
టక్కు మరియు టెక్కు – ద్వంద్వసమాసం

ఈ) దశ దిశలు
జవాబు.
పది సంఖ్యగల దిశలు – ద్విగు సమాసం

ఉ) తల్లీ పిల్లలు
జవాబు.
తల్లి మరియు పిల్ల – ద్వంద్వ సమాసం

VI. కింది గద్యాన్ని చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.

“శ్రీరామునిశోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు. సీతాదేవిని తీసుకొని రావడంలో తాను తగిన సాయం చేస్తానన్నాడు. పరివారంతో సహా రావణుని చంపడానికి తన ఆలోచనలను అన్నిటిని ఉపయోగిస్తానన్నాడు. దుఃఖం మంచిదికాదు కావున ఎపుడూ విలపించవద్దన్నాడు. ఎల్లప్పుడూ దుఃఖించే వారికి సుఖము ఉండదు. తేజస్సు పోతుంది. చివరకు ప్రాణాలు కూడా పోవచ్చు. కనుక ఈ విచారస్థితి నుండి బయటపడమని ధైర్యం నూరి పోశాడు. ప్రశ్నలు :

అ) శ్రీరాముని శోకం పోగొట్టడానికి ప్రయత్నించింది ఎవరు?
జవాబు.
సుగ్రీవుడు

ఆ) శ్రీరాముడు ఎవరికోసం దుఃఖిస్తున్నాడు ?
జవాబు.
సీతకోసం

ఇ) ‘సహాయం’ అనే పదానికి పై గద్యంలో ఉపయోగించిన వికృతి పదం ఏది?
జవాబు.
సాయం

ఈ) దుఃఖము వలన ఏమేమి జరగవచ్చు ?
జవాబు.
దుఃఖం వలన తేజస్సు పోతుంది. ప్రాణాలు కూడా పోవచ్చు.

ఉ) శోకానికి పై గద్యంలో వాడిన పర్యాయ పదాలేవి?
జవాబు.
దుఃఖము, విచారము

TS 7th Class Telugu 12th Lesson Questions and Answers Telangana రాణి శంకరమ్మ

VII. కింది వచనం చదివి అయిదు ప్రశ్నలు తయారు చేయండి.

సమాజంలో మతం అంతర్భాగం. మన సమాజంలో ఎన్నో మతాలున్నాయి. ఏ మతమైనా అందరికి ప్రయోజనాన్ని చేకూర్చే సిద్ధాంతాలనే కలిగి ఉంటుంది. ఇతరుల మతం కంటే తమ మతం గొప్పదని చెప్పుకొనేవారు అవివేకులు. వారు తమ స్వార్థానికే ఇతర మతాలను దూషించుటకు ప్రయత్నిస్తారు. సర్వమతాలను సమానంగా భావించి మంచిని స్వీకరించు వారే ఉత్తములు.

ప్రశ్నలు :

అ) సమాజంలో అంతర్భాగమైనదేది?
ఆ) ప్రతి మతంలోని ప్రధాన సిద్ధాంతమేమి?
ఇ) ఎవరు అవివేకులు?
ఈ) ఉత్తములు ఎవరు?
ఉ) స్వార్థపరులు ఏం చేస్తారు?

పాఠం నేపథ్యం

తెలంగాణలో వీరనారీమణులకు కొదువలేదు. అటువంటి నారీమణులలో అందోలు సంస్థానాన్ని పాలించి, శత్రువులను గడగడలాడించిన రాణి శంకరమ్మ ధైర్యసాహసాలు కలిగిన వీరవనిత. ఈమె సంగారెడ్డి సమీపంలోని గౌడిచర్లలో 1702లో పుట్టింది. రాజమ్మ, సంగారెడ్డి దంపతులకు జన్మించిన శంకరమ్మ బాల్యం నుంచి నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్నది. ప్రజల్ని కన్నబిడ్డలుగా పరిపాలించిన రాణిశంకరమ్మ శత్రువుల పాలిట అపరకాళికవలె ధైర్యసాహసాలు ప్రదర్శించింది. చరిత్రలో తనకంటూ చెరగని స్థానం సంపాదించుకున్నది. మెదకు ప్రాంతాన్ని చరితార్థం చేసిన రాణి శంకరమ్మ గూర్చి ఈ పాఠం తెలియజేస్తుంది.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం గేయకథ ప్రక్రియకు చెందినది. కథతో కూడి, గేయరూపంలో ఉంటుంది. లయాత్మకత, ప్రాసలతోకూడి పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. సరళమైన భాషలో అలవోకగా సాగుతుంది.
సంపన్ముడుంబై రంగకృష్ణమాచార్యులు రచించిన “మెదక్ జిల్లాంతర్గత అందవోలు శౌర్య వీర్యరెడ్డి త్రయం” (వీరుల గాథలు) పుస్తకం ఆధారంగా రూపొందించిన పాఠ్యాంశమిది.

ప్రవేశిక

అవకాశం లభిస్తే మహిళలు ఏపనినైనా సాధించగలరు. తమ శక్తిసామర్థ్యాలను పదునుపెట్టుకొని, ఆత్మవిశ్వాసంతో ముందడుగువేస్తారు. ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తారు. అటువంటి కోవకు చెందిన మహిళ శంకరమ్మ. ఆమె యుద్ధరంగంలో చూపిన ప్రతిభను, ఆమె జీవిత చరిత్రను ప్రజలు పాటలుగా పాడుకుంటారు. ఇంత కీర్తిపొందిన రాణిశంకరమ్మ చరిత్రను బతుకమ్మ పాట రూపంలో తెలుసుకుందాం.

నేనివి చేయగలనా?

TS 7th Class Telugu 12th Lesson Questions and Answers Telangana రాణి శంకరమ్మ 2